concern
-
మమ్మల్ని హింసిస్తున్నారు.. ఇంటికి పంపించేయండి
ఆరిలోవ: జాతీయ రహదారిని ఆనుకుని విశాఖ వ్యాలీ స్కూల్కు సమీపంలోని ప్రభుత్వ బాలికల వసతిగృహంలో బుధవారం సాయంత్రం ఐదుగురు బాలికలు కలకలం సృష్టించారు. తమను హింసిస్తున్నారని, నిద్రమాత్రలు ఇచ్చి మానసిక రోగులుగా మారుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ గోడదూకి రోడ్డుపైకి వచ్చారు. హాస్టల్ పర్యవేక్షణాధికారి ఎ.వి. సునీత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ద్వారకా ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి, ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు అక్కడకు చేరుకుని బాలికలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు లోపలికి వెళ్లేందుకు నిరాకరించారు. విషయం తెలుసుకున్న రూరల్ తహసీల్దార్ పాల్కిరణ్ అక్కడకు చేరుకుని, సూపరింటెండెంట్ నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన ఏసీపీ, ఆరిలోవ సీఐతో చర్చించారు. వీరంతా బాలికలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు శాంతించలేదు. మరోపక్క.. తహసీల్దార్, చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు, బాలుర పరిశీలన గృహం సూపరింటెండెంట్ వచ్చి బతిమాలినా ఆ బాలికలు ససేమిరా అన్నారు. దీంతో.. వారిని ఏయే జిల్లాల సీడబ్ల్యూసీల నుంచి తీసుకొచ్చారో.. వారితో సంప్రదించి ఆయా జిల్లాలకు తీసుకెళ్లిపోవాలని అధికారులు కోరారు. బాలికల తల్లిదండ్రులకు ఫోన్చేసి, వారిని ఇళ్లకు తీసుకుపోవాలని సూచించారు. దీంతో బాలికలు శాంతించారు. అనంతరం ఉమెన్ డెవలప్మెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ జయదేవి వసతిగృహానికి చేరుకుని సంఘటనపై ఆరా తీశారు. మమ్మల్ని ఇంటికి పంపించేయండి.. తమకు మైనార్టీ తీరిపోయినా బయటకు పంపడంలేదని.. వసతిగృహంలో కుమారి అనే సహాయకురాలు తమను ఇబ్బంది పెడుతున్నట్లు బాలికలు వాపోయారు. తమను మానసిక రోగులుగా చిత్రీకరించి, నిద్రమాత్రలు ఇస్తున్నారని ఆరోపించారు. తమను వెంటనే ఇంటికి పంపించేయాలని కోరారు. దీనిపై గృహం సూపరింటెండెంట్ సునీత మాట్లాడుతూ.. బాలికలందర్నీ ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు తెలిపారు. మైనారిటీ తీరిన తర్వాత కూడా సీడబ్ల్యూసీ అనుమతితోనే బయటికి పంపిస్తామని, తమకు తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమన్నారు. ఐదుగురిలో నలుగురు బాలికలకు కొద్దిరోజులుగా మెంటల్ కేర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వారి తల్లిదండ్రులకు ఫోన్చేశామని, వారొస్తే బాలికలను అప్పగిస్తామని వెల్లడించారు. మరోవైపు.. ఈ సంఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా తీసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్, సీపీని కోరారు. -
HMPV Virus : ఆందోళన అవసరంలేదంటున్నభారత హెల్త్ ఏజెన్సీ
ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్కు పుట్టినిల్లుగా భావించే డ్రాగన్ దేశం చైనాలో మరో ప్రాణాంతక వైరస్ భయందోళన సృష్టిస్తోంది. హ్యూమన్ మెటాపిన్యూమో వైరస్(HMPV) పంజా విసురుతోంది. వందలాది మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారియి. గత ఏడాది ఏప్రిల్ నుంచే హెచ్ఎంపీవీ కేసులు నమోదవుతున్నాయి.హెచ్ఎంపీవీని చైనా ప్రభుత్వం ఇంకా మహమ్మారిగా గుర్తించలేదు.ఇటీవల చలికాలం ప్రారంభం కావడంతో వైరస్ వ్యాప్తి ఉధృతమవుతోందని, ఎక్కువగా పిల్లలు, వృద్ధులు దీని బారినపడుతున్నారని, నిత్యం వందలాది కేసులు బయటపడుతున్నాయని స్థానిక మీడియా చెబుతోంది. బాధితులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయని, పెద్ద సంఖ్యలో మరణాలు సైతం సంభవిస్తున్నాయని చైనా ప్రజలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో కరోనా లాంటి వైరస్ వ్యాప్తి చెందుతోందని, ఇండియాలో కూడా ఇవి వ్యాపించే అవకాశం ఉందనే భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై భారత హెల్త్ ఏజెన్సీ డీజీహెచ్ఎస్ స్పందించింది.ఇండియాలో ఆందోళన అవసరం లేదుహ్యూమన్ మెటానిమోవైరస్ వ్యాప్తి పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(డీజీహెచ్ఎస్) డాక్టర్ అతుల్ గోయల్ విజ్ఞప్తి చేశారు. శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకొనేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల గురించి మాత్రం భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిని నిశితంగా పరిశీలిస్తున్నామని భారత ప్రభుత్వ అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. మన దేశంలో ఈ వైరస్ ఆనవాళ్లు ఇప్పటిదాకా బయటపడలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించాయి. చలికాలంలో తలెత్తే శ్వాస సంబంధిత అనారోగ్యానికి తగిన చికిత్స, సదుపాయాలు మన దేశంలో అందుబాటులో ఉన్నాయని గోయల్ చెప్పారు. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే ఆసుపత్రిలో చేరి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇవీ చదవండి: చైనాలో విజృంభిస్తోన్న హెచ్ఎంపీవీ : లక్షణాలు, నివారణ చర్యలుమహారాణిలా పీవీ సింధు : బ్యాడ్మింటన్-ప్రేరేపిత డిజైనర్ లెహంగా విశేషాలు -
బంధించేశారు, ఒక్కపూటే భోజనం..రక్షించండి: కువైట్లో ఏపీ మహిళ ఆవేదన
ఉపాధి కోసం కువైట్ వెళ్లి పనిప్రదేశంలో ఇబ్బందులు పడుతున్నమహిళ తనను కాపాడ్సాలిందిగా వేడుకుంటున్న సెల్ఫీ వీడియో ఒకటి ఆందోళన రేపుతోంది. తిరుపతి శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ చెందిన ఎల్లంపల్లి లక్ష్మి తన కుమార్తెను ఉద్దేశించి ఈ వీడియో చేసింది. కువైట్ లో తనను ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.మతిస్థిమితం లేని పిల్లవాడి సంరక్షణ కోసం కువైట్ వచ్చిన తనకు కనీసం కడుపు నిండి తిండి పెట్టకుండా, వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయింది. పిల్లవాణ్ని సరిగ్గా చూడటం లేదని ఆరోపిస్తూ తనను బాగా కొట్టిన యజమానులు గదిలో నిర్బంధించారని కన్నీళ్లు పెట్టుకుంది. తిండీ, తిప్పలు లేక, అనారోగ్యంతో బాధలు పడుతున్నట్టు వెల్లడించింది. అంతేకాదు రక్షించాలని ఎజెంటుకు విన్నవించుకుంటే 2.50 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితులో ఉన్నానని దయచేసిన తనను ఈ నరకంనుంచి రక్షించాలని సెల్ఫీ వీడియోలో కుమార్తెను వేడుకుంది. దీంతో లక్ష్మి కుమార్తె సుచిత్ర ఆందోళనలో మునిగిపోయింది. తల్లిని కాపాడాలని కోరుతూ స్టానిక శ్రీకాళహస్తి ఎమ్మెల్యేకు విజ్ఞపి చేసింది. కువైట్ నుండి తన తల్లిని త్వరగా ఇండియాకు తీసుకురావాలని కోరూతూ ఏమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి కుమార్తె సెల్ఫీ వీడియో ద్వారా వేడుకుంది. -
ముంబై పడవ ప్రమాదం: అమ్మను కాపాడుకోలేక పోయా.. గౌతమ్ గుప్తా
సాక్షి, ముంబై: ముంబై గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో జరిగిన పడవ ప్రమాదం ఘటనలో అనేక మంది తమ ఆతీ్మయులను బంధుమిత్రులను కోల్పోగా మరికొందరు సురక్షితంగా బయటపడ్డారు. పర్యాటకులతో బయల్దేరిన నీల్కమల్ అనే పడవను నేవీ బోట్ ఢీ కొట్టిన ఘటనలో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులతోపాటు మొత్తం 13 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన ముంబైతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో బయటపడ్డ కొందరు మీడియాకు తెలిపిన వివరాలు అక్కడి పరిస్థితి ఎంత హృదయవిదారకంగా ఉన్నాయో చెబుతున్నాయి. చావు దగ్గరికి వెళ్లి బయటిపడిన వారు చెప్పిన వివరాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రమాదంలో 14 నెలల చిన్నారి.. పడవ ప్రమాదంలో వైశాలి అడకణేతోపాటు వారి కుటుంబీకులు సురక్షితంగా బయటపడ్డారు. ముంబై కుర్లాలో నివసించే వైశాలి తన 14 నెలల కుమారుడిని రక్షించుకునేందుకు ప్రయతి్నంచింది. అనంతరం ఆమె సోదరుడు అంటే చిన్నారి మేనమామ తన భుజంపై ఆ పాపను సుమారు 30 నిమిషాలపాటు సముద్రం నీటిలో ఈదుతూ బయటపడ్డట్టు తెలిపింది. ‘నాతోపాటు మొత్తం ఎనిమిది మంది పడవలో ఎలిఫెంటా బయల్దేరాం. అయితే పడవలో బయల్దేరిన కొద్ది సేపటికి ఒక్కసారిగా ఓ నేవీ స్పీడ్ బోట్ వేగంగా చక్కర్లు కొడుతూ మా పడవను వేగంగా ఢీ కొట్టింది. ఢీ కొట్టిన తర్వాత అసలేం జరుగుతుందనేది ఎవరికీ అర్థం కాలేదు. పడవ నడిపేవారు వెంటనే వారి వద్ద ఉన్న లైవ్జాకెట్లను అందరికీ అందించారు. కానీ చాలామంది ఉండటంతో కొందరికి మాత్రమే జాకెట్లు అందాయి. ఇది జరిగిన కొంత సమయానికి ఒకవైపు పడవ సముద్రంలోకి ఒరగడం ప్రారంభమైంది. దీంతో పడవ క్రమంగా మునగసాగింది. అరుపులు పెడ»ొబ్బలతో పడవలోని పరిసరాలు భయాందోళనలు రేకేత్తించాయి. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే మేమందరం సముద్రంలో పడిపోసాగాం. కొందరు పడవలోనే ఉండిపోయారు. అయితే తాము సముద్రంలో పడిపోగానే పడవను పట్టుకున్నాం. చావు ముందు ఉన్నాం. ఏం చేయాలో తెలియడంలేదు. నా చేతిలో 14 నెలల బాబు ఉన్నాడు. ఎలాగైనా బాబును బతికించుకోవాలని మనసులో అనుకున్నాను. అంతలోనే నా అన్న బాబుని తన భుజం పైకెత్తుకున్నారు. నీళ్లలో ఉండి ఒక చేత్తో పడవను మరో భుజంపై నా బాబును ఇలా సుమారు 30 నిమిషాలపాటు అలాగే ఉన్నాడు. ఇక మా మరణం తప్పదని అనుకునే సమయంలోనే రెండు మూడు పడవలు మావైపు వచ్చాయి. అనంతరం ఆ బోటులోని వారు మమ్మల్ని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఇంకా ఐదు నిమిషాలు ఆలస్యమై ఉంటే మేమంతా చనిపోయేవాళ్లం’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. మరోవైపు ఈ ఘటనలో ఓ ఇద్దరు విదేశీయులు కూడా తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పలువురిని కాపాడినట్టు వైశాలి మీడియాకు తెలిపారు. అమ్మను కాపాడుకోలేక పోయా: గౌతమ్గుప్తా ఈ పడవ సంఘటన సమయంలో అసలేం జరిగిందనేది ఈ ఘటనకు సంబంధించిన వీడియో తీసిన గౌతమ్గుప్తా మీడియాకు తెలిపారు. ఈ ఘటన అనంతరం ఆయన తీసిన వీడియో ద్వారానే అందరికీ ప్రమాదం విషయం తెలిసింది. ముంబైలో నివసించే గౌతమ్ గుప్తా తన తల్లి రామాజీదేవి, చెల్లి రీతాలతో కలిసి ఎలిఫెంటా వెళ్లేందుకు నీల్కమల్ పడవలో బయల్దేరారు. పడవ పైభాగంలో కూర్చున్న గౌతమ్ పడవలో నుంచి సముద్ర ప్రయాణం దృశ్యాలని వీడియోతోపాటు ఫొటోలు తీశారు. అంతలోనే ఓ స్పీడ్ బోట్ సముద్రంలో చక్కర్లు కొట్టడం గమనించారు. ఆ స్పీడ్ బోటును వీడియో తీయసాగారు. ‘ఒక్కసారిగా వేగంగా ఆ పడవవైపు బోట్ రావడం చూశాను. కానీ అసలు ఊహించలేదు. ఆ స్పీడ్ బోటు వేగంగా మేమున్న పడవనే వేగంగా ఢీ కొడుతుందను కోలేదు. ఈ సంఘటన అనంతరం మేం ముగ్గురం నీటిలో పడిపోయాం. అనంతరం ఇతర బోటులోని కొందరు నన్ను మా చెల్లి రీతాను సురక్షితంగా బయటికి తీశారు. కానీ మా అమ్మ గురించి మాత్రం తెలియరాలేదు’ అంటూ బోరుమన్నారు. ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి పడవ ప్రమాదంలో కొందరు తెలుగువారు కూడా ఉన్నారని తెలిసింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అందించిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్కు చెందిన నేవీ ఉద్యోగి ప్రవీణ్కుమార్ శర్మ (34) మృతి చెందారు. ప్రవీణ్ కుమార్ శర్మ నేవీలో బోట్ మెకానిక్గా 14 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. జీవితంలో పడవ ఎక్కను ఘటనలో పలువురు తెలుగువారు మరణం అంచుల దాకా వెళ్లొచ్చి..ఎలిఫెంటా గుహలకు వెళ్లడానికి బోట్ ఎక్కాను. కానీ అదృష్టవశాత్తు బయటపడ్డానని అనిల్కుమార్ (35) ఓ మరాఠీ పత్రికకు తెలిపారు. ముంబైలో ఓ పని ఉండటంతో వచ్చానని, ఈ సందర్భంగా ఎలిఫెంటా కేవ్స్ చూద్దామని బయల్దేరినట్లు చెప్పారు. పడవ బయల్దేరిన కొద్ది సేపటికే ప్రమాదం జరిగిందని, అయితే అదృష్టం కొద్దీ బయటపడ్డానన్నారు. ఇక భవిష్యత్లో తానెప్పుడూ పడవ ఎక్కనని చెప్పారు. -
స్వార్థం- దైవ చింతన
మానవుడు ప్రధానంగా స్వప్రయోజనా దృష్టి గల జీవి. అది అతన్ని జీవితాంతం వెన్నంటే ఉంటుంది. దీనికి తోడు ఇతర ప్రాణులకు లేని బుద్ధి బలం కూడా మనిషికి ఉంది. మనిషి లోని సహజ లక్షణమైన ఈ స్వార్థ గుణాన్ని గురించి ఉపనిషత్తులు కూడా వివరించాయి. యాజ్ఞ వల్క్య మహర్షి తన భార్య మైత్రేయితో... ‘భార్య భర్తను ప్రేమిస్తున్న దంటే అది తన ఆనందం కోసమే. భర్త భార్యను ప్రేమిస్తున్నాడన్నా అతని ఆనందం కోసమే. ఇంకా పుత్రుల మీద, దేశం మీద, మానవులకున్న ప్రేమ వారి ఆనందం కోసం కాదు తన ఆనందం కోసమే’ అని చెపుతాడు. తన స్వార్థం కోసం ఉపయోగ పడేంతవరకు మానవుడు సమాజంతో సంబంధం పెట్టుకుంటాడు. మనిషిలో సహజంగా ఉండే ఈ స్వార్థాన్ని నియంత్రణ లేకుండా వదిలిపెడితే భూమిపై సుఖ శాంతులు పూర్తిగా కరువైపోతాయి. తన స్వార్థ ప్రయోజనాలకు బలహీనులను పట్టి పీడిస్తాడు. పెద్ద చేప చిన్న చేపను మింగినట్లు ప్రవర్తిస్తాడు. కొన్నాళ్ళకు తనూ తన కంటె బలవంతుని చేతిలో బలవుతాడు. లోక నాశనానికి దారి తీసే ఈ స్వార్థ గుణాన్ని అణిచి వేసి, మనిషి మనసులో గొప్ప మార్పు దైవ చింతన తీసుకు రాగలదు. మానవులకు శాంతి మయ జీవితాన్ని ఇవ్వటానికి భగవంతుడు వివిధ రూపాలలో అవత రిస్తుంటాడు.ఇహ లోకంలో ప్రశాంత జీవితం గడపటానికి, పరంలో శాశ్వతా నందాన్ని పొందటానికి తగిన ఉపదేశాన్ని మానవాళికి అందజేసిన గ్రంథ రాజం భగవద్గీత. రోజుకొక శ్లోకం చదివినా, నేర్చుకున్నా ఆలోచనలు భగవంతునిపై నిలుస్తాయంటారు పెద్దలు. ‘భక్తుడు ఏ దేవతా రూపాన్ని శ్రద్ధగా పూజిస్తాడో అతనికి ఆ రూపంపై శ్రద్ధ నిలిచేటట్లు చేస్తాను’ అంటాడు భగవంతుడు. అలా పూజించినందుకు తగిన ఫలాన్ని అందజేస్తాడు. భగవంతుని చింతనలో మనసు పునీతమై, మనిషి నిస్వార్థ జీవిగా మారి, విశాల దృక్పథాన్ని అలవరచుకుంటాడు. – డా. చెంగల్వ రామలక్ష్మి -
నీళ్ల కోసం రోడ్డెక్కిన రైతులు
కందుకూరు/లింగసముద్రం: సాగునీటి కోసం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని రాళ్లపాడు ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఆందోళనకు దిగారు. ఆదివారం ప్రాజెక్టు వద్ద బైఠాయించి నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని నినదించారు. ఈ ఏడాది రాళ్లపాడు ప్రాజెక్టులోకి పూర్తి స్థాయిలో నీళ్లు వచ్చాయి. దీంతో ప్రాజెక్టు కుడి కాలువ కింద ఉన్న లింగసముద్రం, కొండాపురం మండలాల రైతులు నెల రోజులుగా పెద్ద ఎత్తున నార్లు పోశారు. వారం కిందట కుడికాలువ గేటు ఊడి కింద పడిపోవడంతో నీటి విడుదల నిలిచిపోయింది. గేటుకు మరమ్మతులు చేసి పైకి లేపడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో నీరు రాక నారు ఎండిపోతోంది. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఒక్కసారిగా రెండు మండలాల రైతులు ఆందోళనకు దిగారు. ప్రాజెక్టుపై రోడ్డు మీద బైఠాయించి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆయకట్టు రైతులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రాజెక్టులో చేపల పెంపకంపై ఉన్న శ్రద్ధ... రైతులపై లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాజెక్టులో పది రోజుల కిందట చేప పిల్లలను వదిలారని, అవి పెరిగేందుకు నీరు అవసరం కావడంతో కావాలనే కొందరు నాయకులు నీటి విడుదల కాకుండా జాప్యం చేయిస్తున్నారని ఆరోపించారు.ధర్నా చేయడానికి వీల్లేదంటూ గొడవఈ ఏడాది ప్రాజెక్టులో చేపలు వేసిన టీడీపీ నాయకుడు మద్దెల రామారావు వచ్చి ఇక్కడ ధర్నా చేయడానికి వీల్లేదని రైతులతో వాగ్వాదానికి దిగారు. రామారావుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ప్రాజెక్టులో చేపలు వేసి గేట్లు పైకి లేవకుండా మీరే చేస్తున్నారా...’ అని మండిపడ్డారు. దీంతో కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నంఈ తరుణంలో చినపవని గ్రామానికి చెందిన తూమాటి బాలకోటయ్య అనే రైతు పురుగు మందు తాగేందుకు ప్రయత్నించగా, వెంటనే తమకు న్యాయం జరగకపోతే ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకుంటానని మరోరైతు సిద్ధమయ్యారు. మిగిలిన రైతులు వారిని అడ్డుకుని సమస్య పరిష్కారం కోసం పోరాటం చేద్దామని సర్ది చెప్పారు. అదే సమయంలో అక్కడి చేరుకున్న వలేటివారిపాలెం ఎస్ఐ మదిరినాయుడు, గుడ్లూరు ఎస్ఐ వెంకట్రావ్, ప్రాజెక్టు ఈఈ వెంకటేశ్వర్లు రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా, నీరు ఇచ్చే వరకు ధర్నాను విరమించే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. చేతులెత్తేసిన నిపుణుడు బాషా ఊడిపడిపోయి కిందకు చేరిన గేటును పైకి లేపేందుకు నాలుగైదు రోజులుగా ప్రయత్నం చేస్తున్న నరసరావుపేటకు చెందిన నిపుణుడు, మెకానిక్ బాషా ఆదివారం పూర్తిగా చేతులెత్తేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు ఉండడం వల్ల మరమ్మతులు చేయడం సాధ్యంకాని, ఇక తాము ఏమీ చేయలేమని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే ప్రచార ఆర్భాటంపై రైతుల ఆగ్రహంకాలువకు నీరు రాక తాము అల్లాడుతుంటే ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాత్రం నీటిని విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నీరు విడుదలయ్యాయో... లేదో.. మా పొలాల వద్దకు వచ్చి చూస్తే తెలుస్తుందని మండిపడ్డారు. 25 ఎకరాల్లో వరినారు పోశానుప్రాజెక్టులోకి పూర్తి స్థాయిలో నీరు వచ్చాయని తెలియడంతో 25 ఎకరాల్లో వరి నారుమడులు పెట్టాను. తుపాను కారణంగా కురిసిన వర్షాలకు దుక్కులు కూడా దున్నాను. కుడికాలువకు నీరు విడుదల చేస్తారని 10 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నీరు విడుదల కాకపోవడం వరినారు ఎండిపోయింది. – ఇనుకొల్లు సతీష్, ఆయకట్టు రైతు, చినపవని, లింగసముద్రం మండలం చేపల కోసమే నీరు విడుదల చేయడం లేదుకొందరు నేతలు రాళ్లపాడు ప్రాజెక్టులో చేపలు వదిలారు. చేపలకు నీరు ఉంచుకోవాలనే ఉద్దేశంతో సాగుకు సక్రమంగా నీటిని విడుదల చేయడం లేదు. ఈ ఏడాది పుష్కలంగా ప్రాజెక్టులో నీరు ఉండడంతో 10 ఎకరాల్లో వరినార్లు పోశాను. నీరు విడుదల కాకపోవడంతో నార్లు ఎండిపోతున్నాయి. – టి.కమలాకర్రెడ్డి, పెదపవని, లింగసముద్రం మండలం -
మళ్లీ మళ్లీ వెలుస్తున్న అక్రమ ఫ్లెక్సీలు, బ్యానర్లు : అడ్డుకట్ట వేసేదెలా?
దాదర్: ముంబై రహదారులపై ఎక్కడ చూసినా అక్రమ బ్యానర్లు, ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. తొలగించిన కొద్ది రోజులకే మళ్లీ వెలుస్తున్నాయి. దీంతో ఇలాంటి అక్రమ బ్యానర్లు, ప్లెక్సీలు, కటౌట్లు, ప్రవేశ ద్వారాలు, పార్టీ జెండాలపై ఉక్కుపాదం మోపాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిర్ణయించింది. ఇందుకు బాధ్యులైనవారికి భారీ జరిమానా విధించడంతోపాటు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తమ ప్రియనేతలకు శుభాకాంక్షలు తెలిపేందుకు అక్రమంగా ఏర్పాటు చేసిన సుమారు రెండు వేల బ్యానర్లు, ఫ్లెక్సీలను బీఎంసీ సిబ్బంది తొలగించారు. వీటిలో వేయికిపైగా రాజకీయ పార్టీలకు సంబంధించినవి కాగా మిగిలినవి వివిధ ధార్మిక, మత, ప్రవచన కార్యక్రమాలు, విద్యా సంస్ధల ప్రకటనలకు సంబంధించినవి. ఈ అక్రమ బ్యానర్లు, ప్లెక్సీలు తొలగించిన కొద్దీ మళ్లీ వెలుస్తున్నాయి.ప్రధాన రహదారులు, జంక్షన్లు మొదలుకుని గల్లీలను సైతం వదలకుండా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ తొలగించినా మరుసటి రోజు మళ్లీ ప్రత్యక్షమవుతున్నాయి. ఎవరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు..? ఎవరి పేరిట, ఏ పార్టీ పేరుతో ఏర్పాటు చేస్తున్నారో బ్యానర్ను చూసి తెలుసుకోవచ్చు. కానీ వాటిని ఎవరు ఏర్పాటు చేస్తున్నారో మాత్రం తెలియడం లేదు. గిట్టని వారు లేదా ప్రతిపక్ష పార్టీలు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేందుకు వీటిని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసినవారు రెడ్ హ్యాండెడ్గా దొరికితే తప్ప చర్యలు తీసుకోలేని పరిస్ధితి. దీంతో ఏంచేయాలో దిక్కుతోచక బీఎంసీ సిబ్బంది తలపట్టుకుంటున్నారు. అక్రమమా? సక్రమమా? ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముంబైలో రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధుల ప్లెక్సీలు, బ్యానర్లు, బోర్డులు, పార్టీ జెండాలు విపరీతంగా వెలిశాయి. ఎన్నికలకు రెండు రోజుల ముందు ప్రచారాన్ని నిలిపివేయాల్సి రావడంతో వాటన్నింటిని తొలగించారు. పదుల సంఖ్యలో ట్రక్కుల్లో వాటిని డంపింగ్ గ్రౌండ్లకు తరలించారు. కాగా ఫలితాలు వెలువడిన తరువాత గెలిచిన పార్టీ అభ్యర్ధి లేదా ఇండిపెండెంట్ అభ్యర్ధుల అభిమానులు, కార్యకర్తలు, శుభాకాంక్షలు తెలియజేసే ప్లెక్సీలు, బ్యానర్లను మళ్లీ ఏర్పాటు చేశారు. వీటిలో 30 శాతం అనుమతి తీసుకుని ఏర్పాటు చేయగా 70 శాతం అక్రమంగా ఏర్పాటు చేసినవి. దీంతో ముంబై రోడ్లన్నీ వికారంగా తయారయ్యాయి. వీటిలో అనుమతి తీసుకుని ఏర్పాటుచేసినవేవో, అక్రమమైనవేవో గుర్తించడం బీఎంసీ సిబ్బందికి కష్టతరమవుతోంది. వందలాది ట్రక్కులు, టిప్పర్ల వినియోగం... ఇదిలాఉండగా ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ శిందే, అజీత్ పవార్లు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో శుభాకాంక్షలు తెలియజేసే బ్యానర్లు, ఫ్లెక్సీలను మళ్లీ విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. ప్రమాణస్వీకారానికి ముందే కాబోయే ముఖ్యమంత్రి ఏక్నాథ్ అంటూ కొందరు, అజిత్ పవార్ అంటూ మరికొందరు బ్యానర్లు ఏర్పాటుచేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే. కానీ ఢిల్లీ అధిష్టానం అధికారికంగా ఫడ్నవీస్, శిందే, అజిత్ పవార్ల పేర్లు ఖరారు చేయడంతో మూడు పారీ్టల కార్యకర్తలు, అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ శుభాకాంక్షలు తెలియజేసే బ్యానర్లు, ఫ్లెక్సీలు, రోడ్ల మధ్యలో విద్యుత్ పోల్స్, రెయిలింగ్స్కు పార్టీ జెండాలను ఏర్పాటు చేశారు. దీంతో వీటిని తొలగించి డంపింగ్ గ్రౌండ్లకు తరలించాలంటే బీఎంసీ సిబ్బందికి వందల సంఖ్యలో ట్రక్కులు, టిప్పర్లను వినియోగించాల్సిన పరిస్ధితి వచ్చింది. అక్రమంగా ఏర్పాటుచేసే బ్యానర్లు, ప్లెక్సీలు, కటౌట్లు, ప్రవేశ ద్వారాలవల్ల బీఎంసీ ఆదాయానికి కూడా గండిపడుతోంది. -
అన్నీ కోతలే.. కొన్నది ఏదీ!
అవనిగడ్డ/సాక్షి ప్రతినిధి, బాపట్ల/బండి ఆత్మకూరు: రాష్ట్రంలో ధాన్యం రైతుల విషయంలో ప్రభుత్వం చెబుతున్నది ఒకటి.. వాస్తవంగా క్షేత్ర స్థాయిలో జరుగుతున్నది మరొకటి. ఏ ఒక్క రైతుకూ పూర్తి స్థాయిలో కనీస మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వమే ధాన్యం దళారీగా మారి.. రైతులకు, మిల్లర్లకు మధ్య మధ్యవర్తిత్వం నడుపుతుంటే అన్నదాతలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? మిల్లర్లు చెప్పిన ధరకే ధాన్యం ఇచ్చేయాలని ఒత్తిడి తీసుకు రావడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా, ఎక్కడైనా జరిగిందా.. అని రైతులు మండిపడుతున్నారు. రెండు మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. ‘మొన్నటి ఇబ్బందులు చెప్పొద్దు. ఈ రోజే మీ సమస్యను పరిష్కరిస్తాం. ఎన్ని సంచులు కావాలంటే అన్ని... ఎన్ని లారీలు కావాలంటే అన్ని లారీలు పంపిస్తాం. దళారులకు ధాన్యం అమ్మొద్దు. ఈ రోజు సాయంత్రానికే మీ ధాన్యం కొనుగోలు చేసి తీరతాం’ అని మంత్రి మనోహర్ బుధవారం అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని మాజేరు, లంకపల్లి, లక్ష్మీపురం, చల్లపల్లి, కప్తానుపాలెం, పెదప్రోలు గ్రామాల్లో ధాన్యం రాశులను పరిశీలించి రైతులకు హామీ ఇచ్చారు.గురువారం రాత్రి వరకు కూడా అటు వైపు ఏ అధికారీ కన్నెత్తి చూడక పోవడం గమనార్హం. చేత కానప్పుడు ఇలాంటి వాగ్దానాలు చేయకూడదని రైతులు హితవు పలుకుతున్నారు. ‘15 రోజుల క్రితం కోత కోయించి ధాన్యం తీసుకొచ్చి రోడ్డు పక్కన ఆరబెట్టుకుంటున్నాం. వర్షం వచ్చి ధాన్యం తడిస్తే ఎందుకూ పనికిరావు. ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని చేతులెత్తి మంత్రిని వేడుకున్నా. బుధవారం సాయంత్రానికి కొనేస్తామన్నారు. గురువారం సాయంత్రం వరకు ఎవరూ పత్తాలేరు. రైతులపై కనీస కనికరం లేదు’ అని లంకపల్లికి చెందిన మోటుపల్లి జయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. బిత్తరపోయిన మంత్రులుబాపట్ల జిల్లా కొల్లూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం పరిశీలించేందుకు వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి, మంత్రి గొట్టిపాటి రవికుమార్కు ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా దోపిడీకి గురవుతున్న తీరును స్థానిక రైతులు ఏకరువు పెట్టారు. ‘ఏం బాబూ.. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయా’ అని మంత్రి కొలుసు పార్థసారథి ఆరా తీశారు. దీనికి కౌలు రైతు ప్రసాదరావు సమాధానమిస్తూ.. ‘ఏంటండీ కొనేది? పండించిన పంటను కొనడానికి ముప్ప తిప్పలు పెడుతున్నారు. మిల్లర్లే దళారులుగా మారి తక్కువ ధరకు ధాన్యం తీసుకుని రైతులను నట్టేట ముంచుతున్నారు. కొల్లూరులో 6 ఎకరాల్లో పండించిన ధాన్యాన్ని మిల్లుకు తెచ్చాం. ధాన్యం కొనాలని కోరుతూ తిరగని రోజు లేదు. ఈకేవైసీ చేయించిన పత్రాలు చూపెట్టా. తేమ శాతం 21 ఉన్నా.. మిల్లర్లు వారి కింద పనిచేసే బ్రోకర్లను అడ్డం పెట్టుకుని బస్తా (75 కిలోలు) రూ.1,200కే అడుగుతున్నారు’ అని అవస్థలను ఏకరువు పెట్టాడు. దీంతో బిత్తరపోయిన మంత్రులు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో తీవ్రంగా నష్టపోతున్నామంటూ రైతులు గురువారం నంద్యాల జిల్లా సంతజూటూరు గ్రామంలో రోడ్డెక్కారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజశేఖర్, రైతు సంఘం నాయకులు వెంకట కృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్రీనివాసులు ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం సన్న రకం వడ్లు బస్తా రూ.1,300 నుంచి రూ.1,400 ధర పలుకుతోందని, గత ప్రభుత్వం క్వింటాకు రూ.2,600 మద్దతు ధర ప్రకటించడంతో రూ. 2,500 నుండి రూ.2,900 వరకు ధర పలికిందన్నారు. గత ప్రభుత్వంలోనే మేలు జరిగిందని గుర్తు చేశారు. -
రోడ్డెక్కిన పత్తి రైతు
నాదెండ్ల: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రంలో రైతులకు మద్దతు ధర లభించటం లేదని, సాకులు చెబుతూ పత్తిని కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారంటూ సోమవారం రైతులు రోడ్డెక్కారు. పల్నాడు జిల్లా గణపవరంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న వెంకటకృష్ణ ఎంటర్ప్రైజెస్లో ఇటీవల సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. నిబంధనల పేరుతో 90 శాతం పత్తి లోడులను తిరస్కరిస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై బైఠాయించి.. పత్తి లోడు ట్రాక్టర్లను జాతీయ రహదారికి అడ్డంగా నిలిపి దిగ్బంధనం చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తేమ 12 శాతం మించిందని, పత్తిలో కాయ ఉందని, తడిసిపోయిందంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి కొనుగోలు ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజు కూడా రైతులకు న్యాయం జరగలేదని వాపోయారు. గత ప్రభుత్వంలో సీసీఐ కొనుగోలు కేంద్రంలో రైతులకు పూర్తిగా న్యాయం జరిగిందని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షానికి ఎకరాకు 2–3 క్వింటాళ్ల మేర దిగుబడి నష్టపోయామని, కూలి ధరలు పెరిగి సాగు భారంగా మారిందన్నారు. రైతులు ఆందోళనకు దిగారన్న సమాచారంతో రూరల్ సీఐ సుబ్బానాయుడు సిబ్బందితో చేరుకుని రైతులతో మాటా్లడారు. సీఐ తాను ఉన్నతాధికారులతో మాట్లాడతానని సర్దిచెప్పి ఆందోళన విరమింపచేశారు. అనంతరం సీసీఐ బయ్యర్ రమే ష్ బాబు, రైతులతో సంప్రదింపులు చేశారు. -
ఈ ‘శిక్ష’ణ మాకొద్దు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను పెంచేందుకు ఉపాధ్యాయులకు ఇస్తున్న ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) రెసిడెన్షియల్ శిక్షణపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. తమకు స్థానికంగా శిక్షణ ఇవ్వాలని చెప్పినా విద్యాశాఖ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బుధవారం ఆగిరిపల్లిలో శిక్షణ కోసం వచ్చిన ఉపా«ద్యాయుడు మృతి చెందడం, చీరాలలో మరో ఉపాధ్యాయుడు అస్వస్తతకు గురవడంతో ఈ శిక్షణను పూర్తిగా బహిష్కరించాలని భావిస్తున్నాయి.ఉపాధ్యాయులపై ఉన్న భారాన్ని తొలగిస్తామని, యాప్స్, శిక్షణ అంశాలను తొలగిస్తామని ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులు హామీలు ఇచ్చారని, కానీ గతం కంటే ఇప్పుడు పని ఒత్తిడి అధికంగా పెంచారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రపంచ బ్యాంకు నిబంధనలను తమపై బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపిస్తున్నారు. 50 ఏళ్ల వయసు పైబడిన వారికి శిక్షణ నుంచి మినహాయించాలన్నా విద్యాశాఖ పట్టించుకోవడం లేదని, దీనిపై ఒకటి రెండు రోజుల్లో పాఠశాల విద్య డైరెక్టర్కు విజ్ఞప్తి చేసి తమకు అనుకూలంగా నిర్ణయం రాకుంటే శిక్షణను బహిష్కరిస్తామని ఉపాధ్యాయ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. విద్యా ప్రమాణాల పెంపునకు శిక్షణవిద్యాబోధనలో ప్రమాణాలు పెంచాలంటే ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఉండాలని జాతీయ విద్యా విధానానికి, నిపుణ్ భారత్ ప్రోగ్రామ్కు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ ఎఫ్ఎల్ఎన్ శిక్షణను ప్రారంభించింది. ఈ శిక్షణ ద్వారా 1, 2 తరగతులపై దృష్టి సారించి, 3 నుంచి 8 సంవత్సరాల వయసు పిల్లలకు నాణ్యమైన విద్యను అందచడమే లక్ష్యంగా కోర్సుకు రూపకల్పన చేశారు. మొత్తం 34 వేల మంది గ్రేడ్–1, 2 కేటగిరీ ఉపాధ్యాయులకు 14 విడతల్లో ఈ శిక్షణ ఇవ్వాలని విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. గతేడాది కూడా ఇదే తరహా శిక్షణను రాష్ట్ర వ్యాప్తంగా 9 కేంద్రాల్లో దాదాపు 4 వేల మందికి, ఈ ఏడాది తొలివిడత 1,700 మందికి శిక్షణ ఇచ్చారు.అయితే, అప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. గతేడాది పిల్లలను బడిలో చేర్పించడం, బడి బయటి పిల్లలను సర్వే చేయడం, వారిని బడికి తీసుకొచ్చే బాధ్యతను వలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది తీసుకున్నారు. అయితే, ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల చేరికల కోసం ఇంటింటి సర్వే ఉపాధ్యాయులే చేయాల్సి వచ్చింది. దీంతోపాటు పదో తరగతి విద్యార్థుల నామినల్ రోల్స్ సిద్ధం చేయడం, కొత్తగా అపార్ ఐడీల నమోదు వంటి అదనపు భారం తమపై పడిందని, దీంతో తీవ్రమైన పని ఒత్తిడికి గురవుతున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. -
డీఎస్సీ పోస్టులు పెంచాలంటూ అభ్యర్థుల ఆందోళన
అనంతపురం అర్బన్: డీఎస్సీలో పోస్టుల సంఖ్య పెంచాలంటూ అనంతపురంలో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. అనంతపురం జిల్లాలో దాదాపు 30 వేల మంది ఎస్జీటీ పోస్టులకు పోటీపడుతుండగా.. అత్యల్పంగా పోస్టులు కేటాయించి అన్యాయం చేస్తారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. పోస్టుల సంఖ్య పెంచాలంటూ సోమవారం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు అనంతపురం ఆర్ట్స్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. రాస్తారోకో విరమించాలని కోరిన పోలీసులతో అభ్యర్థులు వాగ్వాదానికి దిగారు.అధికారులే స్వయంగా వచ్చి తమ గోడు వింటేనే ఆందోళన విరమిస్తామని భీష్మించారు. పోలీసు అధికారుల అభ్యర్థన మేరకు డీఆర్ఓ వారి వద్దకు వచ్చారు. అభ్యర్థులు వారి సమస్యలను డీఆర్వోకు వివరించి, వినతిపత్రం ఇచ్చారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఆందోళన కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సంతోష్కుమార్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నూరుల్లా, డీఎస్సీ అభ్యర్థులు ముజీబ్, రాము తదితరులు మాట్లాడారు.అనంతపురం జిల్లాకు ఈ డీఎస్సీలో కేవలం 181 ఎస్జీటీ పోస్టులే కేటాయించి వేలమంది నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని విమర్శించారు. నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కనీసం వెయ్యి ఎస్జీటీ పోస్టులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జీఓ 117ను రద్దు చేయాలని కోరారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ద్వితీయ ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలన్నారు. జిల్లా మొత్తానికి ఒకేరకమైన పరీక్ష పత్రంతో పరీక్ష నిర్వహించాలన్నారు. -
డిప్యూటీ సీఎం కార్యాలయం ఎదుట చిరుద్యోగుల ఆందోళన
సాక్షి, అమరావతి: ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్లలో పనిచేసే చిరుద్యోగులు శుక్రవారం మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం ఎదుట మరో విడత ఆందోళన చేపట్టారు. 15–20 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని తొలగించి.. వారి స్థానంలో తాము చెప్పిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ కూటమి ఎమ్మెల్యేలు ఒత్తిళ్లు తీసుకొస్తుండటంతో చిరుద్యోగులు ఇప్పటికే సెపె్టంబర్ 13, అక్టోబర్ 6 తేదీల్లో డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళనలు నిర్వహించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. చిరుద్యోగుల ఆందోళన విషయాన్ని కార్యాలయ అధికారులు చిరుద్యోగుల సంఘ ప్రతినిధులను పిలిచి మాట్లాడారు. ఉద్యోగులెవరినీ తొలగించకుండా శాఖాపరంగా చర్యలు చేపడతామని పవన్కళ్యాణ్ తన కార్యాలయ అధికారుల ద్వారా హామీ ఇచ్చినట్టు ఏపీ ఆర్డబ్ల్యూఎస్ ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మోనిటరింగ్ లే»ొరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు డి.మూర్తిరెడ్డి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ చోట్ల తొలగించిన ఉద్యోగుల వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారని.. రెండు మూడు రోజుల్లో ఉద్యోగుల పెండింగ్ బకాయిల విడుదలకు ఆదేశాలు ఇవ్వనున్నట్టు చెప్పారని ఆయన తెలిపారు. -
తొలగిస్తే సహించం.. ఉక్కు కార్మికుల హెచ్చరిక
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు కార్మికులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. స్టీల్ప్లాంట్ బీసీ గేట్ ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే ఊరుకునేది లేదని కార్మిక నేతలు హచ్చరించారు. స్టీల్ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే ఊరుకునేది లేదని కార్మికులు అంటున్నారు.నిన్న(ఆదివారం) సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మహా పాదయాత్ర చేపట్టారు. స్టీల్ప్లాంట్ నుంచి వడ్లపూడి, కణితి, శ్రీనగర్, పాత గాజువాక, పెద గంట్యాడ వరకు పాదయాత్ర నిర్వహించారు.మరోవైపు, ప్లాంట్ను కాపాడతామని గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ప్లాంట్ నిర్వీర్యం అవుతుంటే చేష్టలుడిగి చూస్తోంది. స్ట్రాటజిక్ సేల్ పేరిట ప్లాంట్ను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్రం వేస్తున్న అడుగులకు రాష్ట్ర ప్రభుత్వం మడుగులొత్తుతోంది. నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ రచ్చరచ్చ కావడంతో ఉక్కు యాజమాన్యం వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయం తాత్కాలికమేనని, భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగ కోతలు జరగొచ్చనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.ఇదీ చదవండి: ‘స్టీల్’ కాంట్రాక్ట్ కార్మికుల నెత్తిన పిడుగుదీని వెనక కూటమి ప్రభుత్వం కుయుక్తి ఉందని తెలుస్తోంది. ఒకే సారి తొలగిస్తే ఉద్యమాలు ఉధృతమవుతాయని.. విడతల వారీగా తొలగించాలని సూచించినట్లు సమాచారం. ఒకవైపు కార్మిక సంఘాలు, కార్మికులను మభ్యపెడుతూ.. మరోవైపు ప్రైవేటీకరణ చర్యలను ముమ్మరం చేసిన కేంద్ర ప్రభుత్వానికి అడ్డు చెప్పకూడదని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు ప్రస్తుత పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. -
విద్యార్థిని మృతిపై అనుమానాలు నివృత్తి చేయండి
తాడికొండ: రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్న వీఐటీ–ఏపీ యూనివర్సిటీలో విద్యార్థిని సాయిశ్రేయ మృతిపై కుటుంబ సభ్యుల అనుమానాలను నివృత్తి చేయాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సాయి శ్రేయ తల్లి మంజుల, కుటుంబ సభ్యులతో కలిసి యూనివర్సిటీ గేటు ఎదుట ఆందోళన చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి లోపలికి వెళ్లేందుకు యత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. సాయిశ్రేయ మృతికి కారణాలు తెలియజేయాలని రెండు రోజులుగా కోరుతున్నా వీసీని కలిసేందుకు తమకు అనుమతి ఇవ్వడం లేదని మంజుల ఆవేదన వ్యక్తంచేశారు. వీసీ వచ్చి సమాధానం చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి గేటు ఎదుట బైఠాయించారు. విట్ వద్ద గొడవ గురించి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ వచ్చి మంజులను లోపలికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా, సెక్యూరిటీ అడ్డుకున్నారు.దీంతో యూనివర్సిటీ యాజమాన్యంతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి సాయి శ్రేయ తల్లి మంజుల, కుటుంబ సభ్యులను లోపలికి తీసుకువెళ్లి వీసీ, ఇతర అధికారులను కలిశారు. ఈ నెల 17న తన కుమార్తె చనిపోయిందని, దానికి కారణాలు చెప్పాలని కోరుతున్నా పట్టించుకోకుండా యాజమాన్యం తమను ఇబ్బంది పెట్టిన తీరును వివరిస్తూ మంజుల కన్నీటిపర్యమంతమయ్యారు. ‘విద్యార్థిని చనిపోతే మాకేం సంబంధం లేదని వదిలేస్తారా...? ఆ కుటుంబ సభ్యులను పిలిచి మాట్లాడి న్యాయం చేయాలి. లేకపోతే నేను సహించను..’ అని విట్ వీసీ, సిబ్బందిని ఎమ్మెల్యే హెచ్చరించారు. -
Guidance for parents: మా అమ్మాయి సేఫ్గా ఉందా?
కోల్కతాలో హత్యాచార ఘటన జరిగాక స్కూలుకెళ్లే ఆడపిల్లల తల్లిదండ్రులు... ఉద్యోగం కోసం, ఇంటి పనుల కోసం బయటకు వెళ్లే ఆడపిల్లల తల్లిదండ్రులు ఆ పిల్లల క్షేమం గురించి ఆందోళన పెంచుకున్నారు. గంట గంటకూ ఫోన్ చేసి ‘ఎక్కడున్నావ్’ అంటున్నారు. సాయంత్రం ట్యూషన్లు మాన్పిస్తున్నారు. కాని అంత భయపడాల్సిన అవసరం భయపెట్టాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు ఏం తీసుకోవాలో చెప్తే చాలు.ఒక పెద్ద ఘటన జరిగినప్పుడు చుట్టూ ఉన్న వాతావరణం మొత్తం గాయపడుతుంది. గాయం తీవ్రంగా ఉన్నప్పుడు అయోమయం, ఆందోళన, భయం, అభద్రత అన్నీ చుట్టుముడతాయి. ఇవన్నీ పిల్లల గురించి, ఆడపిల్లల గురించి అయినప్పుడు ఆ ఆందోళనకు అంతు ఉండదు. ఇప్పుడు కోల్కతాలోని స్కూళ్లు చైల్డ్ సైకాలజిస్ట్లు, కౌన్సెలర్లతో కిటకిటలాడుతున్నాయి.అక్కడ ఏం జరిగింది?పిల్లలకు సహజంగానే కుతూహలం అధికం. కోల్కతాలోని ఆర్.జి.కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్పై దారుణకాండ జరిగిన సంగతి దేశాన్ని కుదిపేస్తే కోల్కతా హోరెత్తింది. ఇంటా బయట ఆ సంఘటన గురించే చర్చలు. పిల్లల చెవుల్లో ఆ మాటలు పడనే పడతాయి. అదొక్కటే కాదు... వారికి ఆ సంఘటన గురించి దాచి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. స్కూళ్లు కొన్ని తన విద్యార్థులతో స్వచ్ఛందంగా నిరసనల్లో పాల్గొని ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకున్నాయి కూడా. వీటన్నింటి దరిమిలా పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు ప్రశ్నలతో ముంచెత్తసాగారు టీచర్లని, తల్లిదండ్రులను. డాక్టర్కు ఏం జరిగింది? ఆమె ఎలా చనిపోయింది? చేసిన వారిని పట్టుకున్నారా? అలాంటివి మాక్కూడా జరుగుతాయా?... ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక టీచర్లు అవస్థ పడి కౌన్సెలర్లను స్కూళ్లకు పిలుస్తున్నారు.రెండు విధాలా...ఇప్పుడు స్కూలు పిల్లలు, ఇంటర్ స్థాయి పిల్లలకు బయట దారుణమైన మనుషులు ఉంటారనే భయంతో వేగడం ఒక సమస్య అయితే అంత వరకూ కొద్దో గొ΄్పో స్వేచ్ఛ ఇస్తూ వచ్చిన తల్లిదండ్రులు స్కూల్ నుంచి లేట్గా వచ్చినా, ట్యూషన్కు వెళ్లినా, ఇంటి పనుల కోసం బయటకు వెళ్లినా పదే పదే ఫోన్లు చేసి వెంటపడటం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొందరు తల్లిదండ్రులు పెప్పర్ స్ప్రేలు కొనిస్తుండటంతో పిల్లలు మరింత బెంబేలు పడుతున్నారు.పిల్లలకు ధైర్యం చెప్పాలిఇప్పుడు జరగాల్సినది... పిల్లలకు ధైర్యం చెప్పడమే కాకుండా రక్షణ గురించి తల్లిదండ్రులు కూడా అవగాహన కల్పించుకోవాలి. నిర్లక్ష్యం అసలు పనికిరాదని కోల్కతా ఘటన తెలియచేస్తోంది. ఎవరూ లేని హాల్లో ఒంటరిగా నిద్రపోవడం ఎంత సురక్షితమో ఆ డాక్టర్ అంచనా వేసుకోలేకపోయింది. తల్లిదండ్రులు కూడా నైట్ డ్యూటీ సమయంలో వీడియో కాల్స్ చేసి ఆమె తిరుగాడక తప్పని పరిసరాలను గమనించి ఉంటే తగిన సూచనలు చేసి ఉండేవారు. అందుకే తల్లిదండ్రులు, పిల్లలు ఇద్దరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.⇒ పిల్లల రాకపోకల సమయాలను నిర్దిష్టంగా తల్లిదండ్రులు తెలుసుకుని ఉండాలి ⇒ స్కూల్కు వెళ్లే సమయం వచ్చే సమయం వారు వచ్చి వెళ్లే దారి, రవాణ వ్యవస్థ, ఎవరైనా కొత్త మనుషులు కలుస్తున్నారా... వంటివి ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి ⇒ ర్యాపిడో వంటి వాహనాలు ఎక్కి రావాల్సి ఉంటే ఎక్కే ముందు ఆ డ్రైవర్తో మాట కలిపించి, అతని నంబర్ తీసుకోవాలి లేదా తల్లిదండ్రులే ఫోన్పే చేస్తే అతని నంబర్ వచ్చేసినట్టే. ⇒ కొత్త ్రపాంతాలకు వెళ్లేటప్పుడు అవి ఏ మేరకు సురక్షితమో తెలుసుకుని పంపాలి. ⇒ పిల్లలు బయట ఉన్నప్పుడు తప్పకుండా ఫోన్ ఉండేలా చూసుకోవాలి. అది సైలెంట్ మోడ్లో లేకుండా పెట్టమని చెప్పాలి. ⇒ పిల్లలను ఊరికే కాల్ చేసి విసిగించకుండా ప్రతి గంటకూ ఒకసారి మెసేజ్ పెడితే చాలని చెప్పాలి. ⇒ పోలీసులకు కాల్ చేయడానికి భయపడకూడదని తెలియజేయాలి. ⇒ ఇంటి బయట, స్కూల్ దగ్గర, బంధువులుగాని, స్కూలు సిబ్బందిగాని ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తుంటే వెంటనే తమకు చెప్పాలని భయపడకూడదని తెలియజేయాలి. ⇒ చట్టం చాలా శక్తిమంతమైనా, ఆపదలో చిక్కుకున్నప్పుడు దూసుకొచ్చే సాటి మనుషులు ఉంటారని, గట్టిగా సాయం కోరితే అందరూ కాపాడతారని పిల్లలకు చెబుతుండాలి. ⇒ అపరిచిత కాల్స్, మెసేజ్లకు స్పందించవద్దని ఊరికే భయపెట్టే విషయాలను ఆలోచిస్తూ కూచోవద్దని చెప్పాలి. ⇒ ధ్యాస మళ్లించే మంచి స్నేహాలలో ఉండేలా చూసుకోవాలి. -
మా పొట్ట కొట్టొద్దు
అమలాపురం టౌన్/తిరుపతి అర్బన్: కొత్త మద్యం పాలసీని రూపొందిస్తున్న కూటమి ప్రభుత్వం, ప్రభుత్వ మద్యం దుకాణాలను తొలగించే ప్రయత్నంలో ఉందని తెలిసి ఆ దుకాణాల్లో పనిచేస్తున్న సేల్స్మెన్, నైట్ వాచ్మెన్, సూపర్వైజర్లు ఆందోళన బాట పట్టారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని ఏపీ బ్రూవరీస్ లిమిటెడ్ లిక్కర్ డిపో పరి«ధిలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బంది ఆదివారం రోడ్డెక్కి నిరసన చేపట్టారు.ముమ్మిడివరం, మలికిపురం, అంబాజీపేట మండల కేంద్రాల్లో నిరసనలకు దిగి తమ పొట్ట కొట్టవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొత్త మద్యం పాలసీ వల్ల తాము ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోయారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అమలాపురం డిపో పరిధిలో ఉన్న సుమారు వంద ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దాదాపు 350 మంది వరకూ సేల్స్మెన్, సూపర్వైజర్లు, నైట్ వాచ్మెన్గా పనిచేస్తున్నామన్నారు. ముమ్మిడివరం, లంకతల్లమ్మ గుడి సెంటర్ నుంచి పోలమ్మ చెరువు వరకూ ఆందోళనకారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మలికిపురం గాంధీ సెంటర్, అంబాజీపేటల్లో ధర్నా చేశారు. అనంతరం నిరసన ప్రదర్శన చేపట్టారు. రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక దర్నాలో పాల్గొని మద్దతు తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించండి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ మద్యం పాలసీ పద్ధతిలో 2019 నుంచి పనిచేస్తున్న కారి్మకులు డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి ఎస్వీ హైసూ్కల్ గ్రౌండ్ నుంచి టౌన్ క్లబ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. పలువురు కారి్మకులు మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ పేరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనున్నట్లు తెలుస్తోందని చెప్పారు. తమను మద్యం షాపుల్లో అవకాశం లేకుంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. లేనిపక్షంలో సెపె్టంబర్ 7 నుంచి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
PM Narendra Modi: కలిసి పనిచేద్దాం.. సవాళ్లను ఎదిరిద్దాం
న్యూఢిల్లీ/ఢాకా: ప్రపంచవ్యాప్తంగా అనిశి్చత పరిస్థితులు ఏర్పడుతుండడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార, ఇంధన భద్రత విషయంలో సంక్షోభాలను ఎదుర్కోవడానికి కలిసికట్టుగా పనిచేద్దామని గ్లోబల్ సౌత్ దేశాలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి శత్రువైన ఉగ్రవాదాన్ని అరికట్టడానికి చేతులు కలుపుదామని సూచించారు. శనివారం వర్చువల్గా నిర్వహించిన ‘వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ శిఖరాగ్ర సదస్సు’లో ప్రధాని మోదీ ప్రసంగించారు. గ్లోబల్ సౌత్ దేశాల్లో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం ‘సోషల్ ఇంపాక్ట్ ఫండ్’కు 25 మిలియన్ డాలర్లు అందజేయబోతున్నట్లు ప్రకటించారు. పరస్పర వాణిజ్యం, సమగ్రాభివృద్ధిని ప్రోత్సహించడంతోపాటు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించడమే లక్ష్యంగా తమ శక్తిసామర్థ్యాలను అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. ఐకమత్యంతోనే మన బలం కోవిడ్–19 మహమ్మారి ప్రభావం నుంచి ప్రపంచ దేశాలు ఇంకా పూర్తిగా బయటపడలేదని, ఇంతలో యుద్ధాలు ముంచుకొచ్చాయని మోదీ విచారం వ్యక్తంచేశారు. అబివృద్ధికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. వాతావరణ మార్పులు, ఆరోగ్య భద్రత, ఆహార భద్రత, ఇంధన భద్రత వంటి సవాళ్లు ఇప్పటికే ఉండగా, టెక్నాలజీకి సంబంధించి కొత్తగా ఆర్థిక, సామాజిక సవాళ్లు మొదలయ్యాయని తెలిపారు. గత శతాబ్దంలో ఏర్పాటైన పాలనా వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థలు ఈ శతాబ్దపు సవాళ్లను పరిష్కరించలేకపోతున్నాయని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ ఒక్కటి కావాలన్నారు. ఒకే గళం వినిపించాలని, ఒకరికొకరు తోడుగా నిలవాలని సూచించారు. ఒకరి అనుభవాలను మరొకరు పాఠాలు నేర్చుకోవాలన్నారు. మన ఐకమత్యంలోనే మన బలం దాగి ఉందన్నారు. ఈ ఐకమత్య బలంతో నూతన దశలో ప్రయాణం సాగించాలని పిలుపునిచ్చారు. ‘గ్లోబల్ డెవలప్మెంట్ కాంపాక్ట్’ గ్లోబల్ సౌత్ దేశాల ప్రగతి కోసం మానవ కేంద్రీకృత ‘గ్లోబల్ డెవలప్మెంట్ కాంపాక్ట్’ ఏర్పాటు చేద్దామని ప్రధాని మోదీ ప్రతిపాదించారు. భారతదేశ అభివృద్ధి యాత్ర, అభివృద్ధి భాగస్వామ్య అనుభవాలను స్ఫూర్తిగా తీసుకొని వ్యాపారం–వాణిజ్యంతోపాటు సాంకేతికతను పంచుకోవడానికి, అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించుకోవడానికి ఈ వేదిక దోహదపడుతుందని వెల్లడించారు. భాగస్వామ్య దేశాల సమతుల, సుస్థిరాభివృద్ధికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాలపై మరింత అప్పుల భారం పడకుండా ఇలాంటి చర్యలు అవసరమని పేర్కొన్నారు. ట్రేడ్ ప్రమోషన్ కార్యకలాపాలను బలోపేతం చేయడానికి 2.5 మిలియన్ డాలర్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయబోతున్నామని నరేంద్ర మోదీ ప్రకటించారు. అంతర్జాతీయంగా నెలకొన్న పలు సంఘర్షణలు, ఉద్రిక్తతలకు పరిష్కార మార్గాలు సమగ్ర ప్రపంచాభివృద్ధి, సుస్థిర పాలనలోనే ఉన్నాయని తేలి్చచెప్పారు. -
అక్రమంగా తొలగిస్తున్నారు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉపాధి హామీ పథకం అమలుకు క్షేత్రస్థాయిలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లను రెండు నెలలుగా రాజకీయ కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా తొలగిస్తోందంటూ ఫీల్డ్ అసిసెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా 2,360 మందిని తొలగించినట్లు తెలిపారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు శుక్రవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడుగంటల వరకు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ గౌరవాధ్యక్షుడు కె.ఉమామహేశ్వరరావు, అధ్యక్షుడు ఎం.పరంధామయ్య, ప్రధాన కార్యదర్శి బి.నరసింహులు, కోశాధికారి ఖాదర్బాషా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2,360 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం తొలగించిందని చెప్పారు. 17 సంవత్సరాలుగా కేవలం గౌరవ వేతనంతో పనిచేస్తున్నవారిని అక్రమంగా తొలగిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో ఇంకా అనేకమందిని తొలగించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు చెప్పారు. అక్రమ తొలగింపులు, రాజకీయ బెదిరింపుల కారణంగా రాష్ట్రంలో నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు తీసుకోదని, ఉద్యోగాల నుంచి తొలగించదని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ చెబుతున్నా.. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లపై రాజకీయ బెదిరింపులు, అక్రమ తొలగింపులు కొనసాగడం విచారకరమని చెప్పారు. అక్రమంగా తొలగించిన వారందరినీ ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ బెదిరింపులతో ఆత్మహత్య చేసుకున్న నలుగురి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, ఆ కుటుంబాల్లో వారికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగభద్రత కల్పించడంతో పాటు కనీస వేతనం రూ.20 వేలకు పెంచాలని వారు కోరారు.డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళతా: డైరెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల ప్రతినిధులు కొందరిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కృష్ణతేజ తన చాంబర్కు పిలిపించుకుని మాట్లాడారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల అక్రమ తొలగింపులపై డ్వామా పీడీలతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించి వివరాలు తెప్పించుకుంటానని కృష్ణతేజ హామీ ఇచ్చారని ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ ప్రధాన కార్యదర్శి బి.నరసింహులు తెలిపారు.ఫీల్డ్ అసిస్టెంట్లు తెలిపిన వివరాలను ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్కుమార్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపడతామన్నారని చెప్పారు. ఈ ఆందోళనలో శ్రామిక మహిళా కన్వీనర్ కె.ధనలక్ష్మి, ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ రాష్ట్ర నాయకులు వీరే‹Ùగౌడ్, మహే‹Ù, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మన సభలకు జనం రారేంటి!
సాక్షి, అమరావతి: ఓ పక్క ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర అశేష ప్రజానీకంతో సాగుతోంది. అంతకు ముందు సీఎం జగన్ పాల్గొన్న సిద్ధం సభలూ ఘన విజయం సాధించాయి. మరి మన బాబు సభలేమిటి ఇంతగా తేలిపోతున్నాయి.. టీడీపీ నేతల్లో అంతర్మథనమిది. 14 ఏళ్లు సీఎంగా చేసిన బాబు నిర్వహిస్తున్న ప్రజాగళం సభలకు కనీస స్థాయిలో జనం రావడంలేదు. బాబు సభలకు ప్రజల నుంచి స్పందన లేదని పవన్ కళ్యాణ్ని తీసుకువచ్చినా ఫలితం సున్నా. నాలుగు రోజులక్రితం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన కూటమి సభలో చంద్రబాబు, పురందేశ్వరితోపాటు పవన్ కూడా పాల్గొన్నారు. అయినా ఈ సభకు నాలుగైదు వేల మంది కూడా రాలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు. అంతకు ముందు తణుకు సభకూ జనం ఆశించిన స్థాయిలో రాలేదు. మూడు పార్టీల నేతలు వస్తుండడంతో జన సమీకరణ భారీగా చేయాలని ఆ జిల్లా నాయకులపై ఒత్తిడి తెచ్చారు. జిల్లా నాయకులు ఎంతగా ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. తమ పార్టీ సభలకి ప్రజల్ని తీసుకురావడం కష్టంగా మారిందని, ఎంత చెప్పినా, ప్రలోభపెట్టినా రావడంలేదని స్థానిక నేతలు వాపోతున్నారు. బాబు ఒక్కడే విడిగా పెడుతున్న సభల పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంటోందని చెబుతున్నారు. రోజుకి రెండు, మూడు సభలు పెడుతున్నా, ఒక్క చోట కూడా అనుకున్న స్థాయిలో ప్రజలు రావడంలేదని టీడీపీ నేతలే చెబుతున్నారు. పలుచగా ఉన్న సభల్ని చూసి మిగిలిన ప్రాంతాల్లోని కేడర్ నీరుగారిపోతుందనే ఉద్దేశంతో ఎక్కువ మంది వచ్చినట్లుగా కనిపించేందుకు చిన్న సెంటర్లు, చిన్న రోడ్లను ఎంచుకుని సభలు పెడుతున్నారు. అక్కడికి అతి కష్టం మీద కొద్దిపాటి జనాన్ని తీసుకువచ్చి ఫొటోలు, వీడియోలతో వాటినే గొప్పగా ఉన్నట్లు చూపిస్తున్నారు. బాబు స్పీచ్ మొదలైతే.. జనమూ జంపే... మరోవైపు సభలకు వచ్చిన కొద్దిపాటి జనం కూడా బాబు ప్రసంగం మొదలవగానే వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. బాబు ప్రసంగం అంటేనే గంటా గంటన్నరపాటు ఊకదంపుడు స్పీచ్ ఉంటుంది. అందులోనూ విషయం లేకపోవడంతో వినేందుకు ఎవరూ ఇష్టపడటంలేదు. వైఎస్ జగన్పై అదే పనిగా అక్కసు వెళ్లగక్కుతుండడంతో ప్రజలు పట్టించుకోవడంలేదు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జరిగిన నాలుగు సభలను చూస్తే బాబు మాట్లాడుతున్నప్పుడు వింటున్నవారి సంఖ్య చాలా స్వల్పం. ఆయన మాటలను ప్రజలు నమ్మడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ను తిట్టడం, ఈర‡్ష్య, ద్వేషాలను బయటపెట్టుకోవడం తప్ప బాబు ప్రసంగాల్లో కొత్తదనం కనిపించడంలేదని చెబుతున్నారు. దానివల్లే జనం ఏమీ పట్టించుకోవడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాబు మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన కడుపు మంటనంతా వెళ్లగక్కి, కళ్లు మూసుకుని గంటల తరబడి అబద్ధాలను చెబుతూ వాటినే గొప్ప ప్రసంగాలుగా ఫీల్ అవుతున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈసారి ఎలాగైనా జనాన్ని తీసుకురండి.. నేతలకు హెచ్చరికలు గత నెలలో చిలకలూరిపేటలో ప్రధాని నరేంద్ర మోడీతో నిర్వహించిన సభను కూడా టీడీపీ విజయవంతం చేయలేకపోయింది. ఎన్నో ఆశలతో నిర్వహించిన ఆ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను మోదీ పెద్దగా పట్టించుకోకపోవడం, సభ కూడా అట్టర్ఫ్లాప్ అవడంతో బాబుకు షాక్ తగిలినట్లయింది. ఆ తర్వాత నుంచి ‘ప్రజా గళం’ పేరుతో నిర్వహించిన సభలేవీ జనాన్ని ఆకర్షించలేదు. అంతకుముందు ‘రా కదలిరా’ పేరుతో పార్లమెంటు నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలూ తేలిపోయాయి. దీంతో ఏం చేయాలనే దానిపై కూటమి అగ్ర నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. శుక్రవారం చంద్రబాబు నివాసంలో జరిగిన కూటమి నేతల సమావేశంలో సభలు విఫలమవడంపైనా చర్చించారు. ఈసారి ఎలాగైనా కొన్ని సభలకు జనాన్ని భారీగా తరలించాలని పార్టీ సీనియర్ నేతలకు చంద్రబాబు చెప్పారు. రాబోయే వారం రోజుల్లో వరుసగా 13 సభలకు ప్రణాళిక రూపొందించి అక్కడి నేతలకు ముందుగానే హెచ్చరికలు చేశారు. జన సమీకరణ బాగా ఉండాలని, లేకపోతే బాబు గారు తిడతారని పరిశీలకులు అక్కడి ఇన్ఛార్జిలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నియోజకవర్గాల నేతలు మాత్రం జనం రాకపోతే తామేం చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. -
వ్యవసాయ మార్కెట్లలో రైతుల పడిగాపులు
తిరుమలగిరి (తుంగతుర్తి)/జనగామ: వానల్లేక, సాగునీరు అందక చాలా చోట్ల వరి పంట దెబ్బతి న్నది. మిగిలిన చోట రైతులు వరికోతలు పూర్తి చేసి.. వ్యవసాయ మార్కెట్లకు తెస్తున్నారు. కానీ మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోళ్లు చేస్తుండటం, అదీ సరిగా సాగకపోవడంతో.. పడిగాపులు పడుతున్నారు. శనివారం సూర్యాపేట జిల్లా తిరు మలగిరి, జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఇదే పరిస్థితి కనిపించింది. భారీగా పోటెత్తిన ధాన్యం: శనివారం తిరుమ లగిరి వ్యవసాయ మార్కెట్ యార్డుకు 47,660 బస్తాల ధాన్యం వచ్చింది. యాసంగి సీజన్ మొదలై నప్పటి నుంచి ఇంత భారీగా ధాన్యం రావడం ఇదే మొదటిసారి. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నా.. వాతావరణంలో మార్పులతో రైతులు యార్డుకే ధాన్యాన్ని తీసుకొస్తున్నారని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచే మార్కెట్లోకి ధాన్యం ట్రాక్టర్లను అనుమతించాల్సి ఉండగా.. శనివారం తెల్లవారు జాము వరకు పంపలేదు. దీనితో రోడ్డు పైనే వందలకొద్దీ ట్రాక్టర్లు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. కాగా ట్రేడర్లు ధాన్యానికి క్వింటాల్కు కనిష్టంగా రూ.1,700, గరిష్టంగా రూ.1,980 ధర చెల్లించారు. జనగామలో కొనుగోళ్లు నిలిపేసిన ట్రేడర్లు తక్కువ ధరకు ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఆందోళ న, ముగ్గురు ట్రేడర్లపై కేసుల నమోదు నేపథ్యంలో.. జనగామ వ్యవసాయ మార్కెట్లో ట్రేడర్లు కొనుగోళ్లు నిలిపివేశారు. దీనితో మార్కెట్కు వరి ధాన్యం, మక్కలు, చింతపండు, ఇతర వ్యవసాయ ఉత్పత్తు లను తీసుకువచ్చిన రైతులు వాటిని అమ్ముకో వడా నికి పడిగాపులు పడుతున్నారు. ఇక మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ రాజునా యక్ శనివారం జనగామ మార్కెట్ కార్యాలయంలో.. ట్రేడర్లు, అడ్తిదారులతో రెండు గంటల పాటు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రైవేట్ మార్కె ట్లోనూ మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయాలని రాజునాయక్ కోరగా.. అది సాధ్యం కాదని ట్రేడర్లు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లేని నిబంధనలను జనగామ మార్కెట్పై ఎందుకు రుద్దుతున్నారని ప్రశ్నించారు. తమపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. మరోవైపు ఈ మార్కెట్లో కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభమవుతాయా? అని రైతులు ఎదురు చూస్తున్నారు. -
మే ఆఖరుకి సాధారణ స్థితికి కార్యకలాపాలు
న్యూఢిల్లీ: పైలట్ల ఆందోళనలతో ఫ్లయిట్ సర్విసులకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో మే నెలాఖరుకల్లా అంతా సద్దుమణుగుతుందని, పరిస్థితులు సాధారణ స్థితికి తిరిగొస్తాయని విమానయాన సంస్థ విస్తార సీఈవో వినోద్ కణ్ణన్ తెలిపారు. పైలట్లు లేవనెత్తిన సమస్యలపై దృష్టి పెట్టామని, వాటి పరిష్కార మార్గాలపై చర్చిస్తున్నామని ఆయన వివరించారు. ఫ్లయిట్ల సంఖ్య తగ్గవచ్చు గానీ ఈ వారాంతం నుంచి ఫ్లయిట్లను అప్పటికప్పుడు రద్దు చేసే పరిస్థితి ఉండబోదని కణ్ణన్ పేర్కొన్నారు. కార్యకలాపాలను కుదించుకునే క్రమంలో 20–25 రోజువారీ ఫ్లయిట్స్ను తగ్గించినట్లు ఆయన వివరించారు. విమానాలు రద్దు కావడం వల్ల ఇబ్బందిపడిన ప్రయాణికులకు తమ సిబ్బంది తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు కణ్ణన్ తెలిపారు. విస్తారాలో 6,500 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 1,000 మంది పైలట్లు, 2,500 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. -
ఎగిసిపడుతున్న నిరసన జ్వాలలు
తణుకు అర్బన్/ భీమవరం/ కాకినాడ క్రైం/ విజయవాడస్పోర్ట్స్/ కడప/ సాక్షి,నెట్వర్క్:గీతాంజలి మృతిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాలలు తగ్గడం లేదు. బుధవారం నాడు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు టీడీపీ రాక్షస మూకలు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు. సోషల్ మీడియా హంతకులు ఇద్దరు పిల్లల తల్లిని నిర్థాక్షిణ్యంగా చంపేశారని ధ్వజమెత్తారు. కక్షగట్టి ఆమె ప్రాణాలను బలిగొన్నారని, రాజకీయ లబ్ధే పరమావధిగా క్షోభకు గురిచేస్తూ పైశాచిక ఆనందాన్ని అనుభవించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చదొంగలే పొట్టన పెట్టుకున్నారు. గీతాంజలిని టీడీపీ పచ్చ దొంగలే పొట్టనపెట్టుకున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన తణుకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీపీ దొంగలు తీవ్రవాదుల కంటే ప్రమాదకరంగా మారారని దుయ్యబట్టారు. మహిళలు, బాలికలను వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి వాటిల్లో వే«ధించే వారికి కఠిన శిక్షలు తప్పవని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన న్యాయవాది ఎం.చిత్రభాను స్పష్టంచేశారు. మహిళలు మానసికంగా ధైర్యంతో అన్ని సమస్యలను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో మహిళల వేధింపుల పట్ల ధైర్యంగా 111పోలీసులకు ఫిర్యాదు చేయాలని భీమవరానికి చెందిన వైద్యురాలు మాదిరెడ్డి స్వరాజ్యలక్ష్మి అన్నారు. టీడీపీలో మహిళలకు గౌరవం ఎన్టీఆర్తోనే పోయింది టీడీపీపి స్థాపించిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలోనే ఆ పార్టీలో మహిళలకు గౌరవం ఉండేదని డాక్టర్ నూరి పరి అన్నారు. ఆయన్ని వెన్ను పోటు పొడిచి ఈ లోకం నుంచి పంపించేసిన వ్యక్తులే ప్రస్తుతం ఆ పార్టీకి ఆధిపత్యం చెలాయిస్తూ ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారన్నారు. పదో తరగతి విద్యార్ధిని మేఘనని, ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడుతున్న మరో విద్యార్ధినిని ఇదే విధంగా ట్రోల్ చేసి మానసిక హింసకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గీతాంజలికేసులో అజయ్ సత్య అనే టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తపై రాష్ట్రప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ముంబయి) కోస్తాంధ్ర అధ్యక్షుడు పల్నాటి నాగరాజు డిమాండ్ చేశారు. గీతాంజలి మృతికి కారకులైన వారిని శిక్షించాలని అన్నమయ్య జిల్లా పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. గీతాంజలి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి సతీమణి శిల్పా నాగినిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా కోరారు. వందలాది మంది మహిళలతో కలిసి ఆమె బుధవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎస్వీయూ విద్యార్థుల ఆధ్వర్యంలో బుధవారం అంబేడ్కర్ విగ్రహం వరకు విద్యార్థినులతో కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. రాక్షసుల వేధింపులకు బలైపోయిన ఆడబిడ్డ గీతాంజలి ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా రాక్షసుల వేధింపులకు బలైపోయిన విశ్వబ్రాహ్మణ జాతి ఆడ బిడ్డ గీతాంజలిని బలి తీసుకున్న టీడీపీ, జనసేన పార్టీలకు రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణులందరూ తగిన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. గీతాంజలికి పట్టిన దుర్గతి భవిష్యత్లో మరొకరికి జరగకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తనకు లబ్ది జరిగిన సంతోషాన్ని పంచుకుంటేనే టీడీపీ జనసేన నేతలు ఓర్వలేకపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మదనపల్లెలో కొవ్వొత్తుల ప్రదర్శన టీడీపీ, జనసేన స్వార్థ రాజకీయాలకు, ఆయా పార్టీల సోషల్ మీడియా రాబందుల వికృతచేష్టలకు నిండుప్రాణం బలికావడం విచారకరమని అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిసార్అహ్మద్ అన్నారు. వుయ్ స్టాండ్ విత్ గీతాంజలి కార్యక్రమంలో ఆమెకు ఆత్మశాంతి కలగాలని కోరుతూ బెంగళూరు బస్టాండులో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలోని హెడ్పోస్టాఫీసు వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. తెనాలిలో స్వర్ణకార దుకాణాల బంద్ గీతాంజలి మృతికి సంతాపంగా బుధవారం తెనాలిలో స్వర్ణకారులు బంద్ పాటించారు. పట్టణ నడిబొడ్డులోని వెయ్యికి పైగా స్వర్ణకార దుకాణాలను మూసివేశారు. శ్రీకామాక్షీ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో వందలాది కార్మికులు మాజేటి నాగేశ్వరరావు వీధిలోని అసోసియేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. గీతాంజలి జోహార్ అంటూ నినాదాలు చేశారు. సోషల్ మీడియా దౌర్జన్యానికి బలైన గీతాంజలి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించటంపై హర్షం వ్యక్తంచేశారు. -
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
నాంపల్లి (హైదరాబాద్): సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులపై ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాలక, ప్రతిపక్షాలు నోరు మెదపకపోవడం బాధాకరమని తెలంగాణ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు సుర్వి యాదయ్య ధ్వజమెత్తారు. గురువారం నాంపల్లిలోని గన్పార్కు వద్ద తెలంగాణ సర్పంచ్ల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన తాజా మాజీ సర్పంచ్లు ముందుగా పబ్లిక్గార్డెన్స్కు చేరుకున్నా రు. అక్కడి నుంచి ర్యాలీగా గన్పార్కుకు వచ్చారు. నిరసన సభ ఉద్రిక్తతకు దారితీయకుండా పోలీసులు భారీగా మోహరించారు. గన్పార్కు వద్ద మాజీ సర్పంచ్లు నిరసన వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడికక్కడే అరెస్టు చేసి, నాంపల్లి పీఎస్కు తరలించారు. ఈ సందర్భంగా సుర్వి యాదయ్య విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం సర్పంచ్లను మోసం చేస్తే...అధికారంలోకి రాగానే సర్పంచ్లను ఆదుకుంటామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డిని రెండు పర్యాయాలు కలిసి వినతిపత్రం అందజేశామని చెప్పా రు. పార్లమెంట్ ఎన్నికలలోపు సర్పంచ్లకు అందాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశా రు. లేకపోతే ఒక్కో లోక్సభ సెగ్మెంట్ పరిధిలో వందకు పైగా నామినేషన్లు దాఖలు చేసి ప్రజాప్రతినిధులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో సర్పంచ్ల సంఘం నేతలు కొలను శ్రీనివాస్రెడ్డి, మధుసూదన్రెడ్డిలు పాల్గొన్నారు. -
ఎర్ర సముద్ర ఘటనలపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్
న్యూఢిల్లీ : ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అది చాలా ముఖ్యమైన నౌకామార్గం అయినందున ఎర్ర సముద్రంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి రన్ధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ విషయమై గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘మాకు వాణిజ్య స్వేచ్ఛ, రవాణా స్వేచ్ఛ రెండూ ముఖ్యమే. ఎర్ర సముద్రంలో జరుగుతున్న ఘటనలు కేవలం మమ్మల్నే కాదు. ప్రపంచంలోని చాలా దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి’అని జైస్వాల్ అన్నారు. డ్రోన్ దాడి కారణంగా గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో చిక్కుకున్న భారత్కు చెందిన వాణిజ్య నౌకలోని సిబ్బందిని భారత నేవీకి చెందిన ఐఎన్ఎస్ విశాఖపట్నం బుధవారం రాత్రి కాపాడింది. ఈ నేపథ్యంలో ఎర్ర సముద్ర ఘటనలపై భారత్ స్పందించడం గమనార్హం. గాజాపై ఇజ్రాయెల్ దాడికి నిరసనగా గత కొద్ది రోజులుగా ఎర్ర సముద్రం నుంచి వెళుతున్న వాణిజ్య నౌకలపై హౌతీ మిలిటెంట్లు డ్రోన్లు, మిసైళ్లతో దాడి చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆసియా నుంచి యూరప్, ఆసియా వెళ్లే వాణిజ్య నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కంపెనీలకు షిప్పింగ్ ఖర్చు ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇదీచదవండి.. ట్రంప్ చేతిపై ఎర్రమచ్చలేంటి.. ఫ్యాన్స్లో జోరుగా చర్చ -
పత్తి రైతుల ఆందోళన
సాక్షి, ఆదిలాబాద్: సీసీఐ, వ్యాపారులు పత్తి కొనుగోళ్లు చేయకపోవడంతో కొన్ని గంటలపాటు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ స్తంభించింది. జిన్నింగ్ మిల్లుల్లో స్థలం లేకపోవడంతో తాము పత్తి కొనలేమంటూ వారు చేతులెత్తారు. దీనిపై రైతులకు ఏ సమాచారం లేకపోవడంతో శుక్రవారం మార్కెట్కు పెద్ద ఎత్తున రైతులు పత్తి బండ్లతో వచ్చారు. ఉదయం కొద్దిమంది నుంచి పత్తి కొనుగోలు చేసి, ఆపై నిలిపివేశారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ట్రాన్స్పోర్టర్లు, వ్యాపారులతో అధికారులు సమావేశమై సయోధ్య కుదర్చడంతో మధ్యాహ్నం నుంచి తిరిగి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. సమ్మెను సాకుగా చూపుతూ ఆదిలాబాద్లో ఇప్పటివరకు వ్యాపారులు 3 లక్షల క్వింటాళ్లకు పైగా, సీసీఐ 8 లక్షల క్వింటాల పత్తిని కొనుగోలు చేసింది. జిన్నింగ్ మిల్లుల్లో పత్తిని బేళ్లుగా మార్చి భారీ వాహనాల ద్వారా తమిళనాడుకు తరలిస్తారు. అయితే ఆదిలాబాద్లో నాలుగు రోజులుగా ట్రాన్స్పోర్టర్లు పత్తి బేళ్లు లిఫ్ట్ చేయడం లేదని సీసీఐ, వ్యాపారులు ఆరోపిస్తున్నారు. నూతన రవాణా చట్టాన్ని నిరసిస్తూ సమ్మెలో భాగంగా తాము ట్రాన్స్పోర్ట్ చేయడం లేదని అసోసియేషన్ నేతలు చెబుతున్నారు. దీంతో జిన్నింగ్ మిల్లుల్లో పెద్ద ఎత్తున నిల్వలు పేరుకపోయాయి. ఈ పరిస్థితుల్లో పత్తి కొనుగోళ్లు నిలిపివేయడమే రైతుల ఆందోళనకు దారితీసింది. సయోధ్య కుదిర్చినా.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ట్రాన్స్పోర్టర్లు, వ్యాపారులను చర్చలకు పిలిచారు. రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. దీంతో మధ్యాహ్నం నుంచి పత్తి కొ నుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే ఈనెల 14 నుంచి 17 వరకు పత్తి కొనుగోళ్లు చేయమని సీసీఐ ప్రకటించింది. జిన్నింగ్ మిల్లుల్లో నిల్వలు పేరుకుపోవడంతోనే తాము కొనుగోలు చేయలేమని మార్కెటింగ్ అధికారులకు వారు స్పష్టం చేశారు. దీంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. -
న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే!
లక్డీకాపూల్: వేలాది మంది అభ్యర్ధులకు అన్యాయం జరిగి, వారిలో కొందరి చావుకి కారణమైన పోలీస్ నోటిఫికేషన్ను తక్షణమే రద్దు చేయాలని, లేనిపక్షంలో మూకుమ్మడి ఆత్మహత్యలే తమకు శరణ్యమని పోలీసు ఉద్యోగాల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్లోని ‘ప్రజావాణి’లో నష్టపోయిన ఎస్.ఐ, కానిస్టేబుల్ అభ్యర్ధులు అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా పోరాట సమితి ప్రతినిధి ఆకాష్ మాట్లాడుతూ.. తప్పుడు ప్రశ్నలను తొలగించి మళ్లీ ఫలితాలను ఇవ్వాలని, హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరారు. యాసం ప్రదీప్ మాట్లాడుతూ పోలీస్ నోటిఫికేషన్ను తక్షణమే రద్దు చేసి.. ప్రిలిమ్స్ నుంచి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అదనంగా 2 సంవత్సరాల వయోపరిమితిని పెంచి ఇప్పటివరకు మిగిలి ఉన్న పోస్టులన్నీ కలిపి ఒక మెగా రిక్రూట్మెంట్ని విడుదల చేయాలని కోరారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తిరిగిపాలిటెక్నిక్ కాలేజీలకే బదిలీ చేయాలి రేషనలైజేషన్ చేసి దూర ప్రాంతాలకు బదలీ చేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను య«థావిధిగా పాత పాలిటెక్నికల్ కళాశాలలకే బదిలి చేయాలని తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నికల్ అండ్ కమిషనరేట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మారెపల్లి సుధాకర్ ప్రభుత్వాన్ని కోరారు. జీవో నెం.317తో స్ధానికతను కోల్పోయి నష్టపోయిన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని స్ధానికత సాధన సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి. శ్రీనివాసరావు, కె. శ్రీశైలం డిమాండ్ చేశారు. మల్లారెడ్డి నుంచి మా భూములు మాకిప్పించండి.. సూరారంలోని రూ.190 కోట్ల విలువైన సర్వే నెం.95, 96, 97, 98లకు చెందిన 9.1 గుంట పట్టా భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారని.. అదేమంటే తమపై పోలీసు కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కుద్బుల్లాపూర్కి చెందిన నర్సిమ్మ తనయుడు కృష్ణ ఆవేదన చెందారు. సర్వే నెం.107లోని ప్రభుత్వ భూమిని సైతం కబ్జా చేసి తమ బినామీలు మహేంద్రరెడ్డి, సుధీర్రెడ్డి, ప్రవీణ్ కుమార్, చెన్నారెడ్డిల పేర్లపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ఈ విషయంలో సీఎం రేవంతన్న న్యాయం చేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పేద సినీ కళాకారులను పట్టించుకోవాలి తెలంగాణ సినీ కార్మికుల కష్టాలను ఆలకించి.. పేద కళాకారులను పట్టించుకోవాలని నటుడు నాని వెంకట్ జైరాజ్ కోరారు. ధరణి తప్పిదాల వల్ల తమ ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేయలేకపోతున్నానని రంగారెడ్డి జిల్లాకి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆందోళన వ్యక్తం చేశారు. ముౖఫై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ పట్టా భూమికి అధికారులు సర్వే సర్టిఫైడ్ కాపీ ఇవ్వడం లేదని ములుగు జిల్లా నల్లగుంటకు చెందిన పబ్బ వెంకటరమణయ్య వాపోయారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం: ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని నోడల్ అధికారి హరిచందన తెలిపారు. ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల సమస్యలను తెలుసుకుని, దరఖాస్తులు స్వీకరించారు. 12 కౌంటర్ల ద్వారా 24 మంది అధికారులు అర్జీదారుల నుండి 2,445 దరఖాస్తులు స్వీకరించారు. -
కృత్రిమ మేధపై మథనం
సృష్టిలో నూతనత్వాన్ని ఆహ్వానించటం, హత్తుకోవటం, తలకెత్తుకోవటం మనిషి సహజ లక్షణం. అదే లేకుంటే ప్రపంచంలో ఇంత అభివృద్ధి సాధ్యమయ్యేది కాదు. కానీ కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) విషయంలో మొదటినుంచీ అనుమాన దృక్కులు తప్పడం లేదు. ఆరంభంలో టెక్ సిబ్బందిని మాత్రమే వణికించిన ఏఐ ఇప్పుడు సమస్త జీవన రంగాల్లోకి చొచ్చుకొస్తూ అందరినీ భయపెడుతోంది. ఈ వారం చోటుచేసుకున్న రెండు పరిణామాలు ఈ భయసందేహాలు కేవలం అపోహల పర్యవసానం మాత్రమే కాదనీ, చేదు వాస్తవమనీ రుజువు చేస్తున్నాయి. వ్యూహాత్మకమైన అణుబాంబుల వ్యవస్థలోకి కూడా అది చొరబడితే ఏమవుతుందన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఏఐకి కళ్లెం బిగించేందుకు ఉద్దేశించిన ఉత్తర్వులపై ఈ వారం మొదట్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేయగా, బ్రిటన్లో ఈ విషయమై అమెరికా, చైనా, భారత్ సహా 28 దేశాలు పాల్గొన్న రెండు రోజుల శిఖరాగ్ర సదస్సు గురువారం ముగిసింది. ఇందులో ప్రభుత్వాల ప్రతినిధు లతోపాటు కంప్యూటర్ శాస్త్రవేత్తలు, టెక్ దిగ్గజాల ప్రతినిధులు కూడా పాల్గొనటం సమస్య తీవ్రతను తెలియజెబుతోంది. ఏఐతో ఏర్పడే అవకాశాలతోపాటు, అందులో చోటుచేసుకుంటున్న నూతన ఆవిష్కరణలు మానవాళికి పెనుముప్పు కలిగించే ఆస్కారం ఉందన్న అంశంలో అన్ని దేశాల మధ్యా ఏకాభిప్రాయం కుదిరింది. శిఖరాగ్ర సదస్సుకు ఎంచుకున్న బ్లెచ్లీ పార్క్ చరిత్రాత్మకమైనది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ రూపొందించి, దేశదేశాల్లోని తన సైనిక బలగాలకూ పంపే ‘నిగూఢ సంకేతాన్ని’ ఛేదించింది అక్కడే. అది పంపే సందేశాలేమిటో తెలియక కాకలు తీరిన నిపుణులే తలలు పట్టుకున్న తరుణంలో ఈ పరిణామం జర్మనీ కట్టడికి, రెండో ప్రపంచ యుద్ధ ముగింపునకు కారణమైంది. ‘ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి’ అన్న చందంగా ఏఐ తయారవటం వాస్తవం. అంతక్రితం మాటెలావున్నా ఏడెనిమిది నెలల క్రితం రంగంలోకొచ్చిన చాట్జీపీటీ అంద రినీ ఒక్కసారి దిగ్భ్రమపరిచింది. దాన్నుంచి తేరుకునే లోగానే చాట్జీపీటీ–4 కూడా అందుబాటు లోకొచ్చింది. దాని సాయంతో పాఠశాల, కళాశాలల విద్యార్థులు గణిత శాస్త్ర సమస్యలను క్షణాల్లో ఛేదిస్తున్నారనీ, మెదడుకు పదును పెట్టడం మానేశారనీ మొదట్లో వినగా... అమెరికావంటి దేశాల్లో ఏఐని ఉపయోగించి పరిశోధక పత్రాలు కూడా తయారు చేశారని తర్వాత బయటపడింది. లక్షల మంది బుర్రలు బద్దలుకొట్టుకునే జటిలమైన సమస్యకు ఏఐ క్షణంలో పరిష్కారం చూపుతుందనీ, దాని సాయంతో భారీ సొరంగాల తవ్వకాల్లో ఎదురయ్యే కష్టాలను అవలీలగా అధిగమించవచ్చనీ రుజువవుతూనే వుంది. ప్రయోజనాల సంగతి తేలినా పూర్తి స్థాయిలో వినియోగంలోకొస్తే ఏమవు తుందోనన్న బెంగ అందరిలోనూ గూడుకట్టుకుని వుంది. ఆ మధ్య స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులను సర్వే చేయగా, వారిలో మూడోవంతుకు మించి ఏఐ వల్ల అనర్థాలున్నాయని అభిప్రాయపడ్డారు. మొన్న మార్చిలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్, యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వాజ్నిక్ సహా 1,300 మంది ఏఐ పరిశోధనలను ఆర్నెల్లపాటు నిలిపివేయాలని పిలుపునిచ్చారు. ఎవరు ఏం చెప్పినా వేలంవెర్రి ఆగదు. ఏఐ విషయంలో జరిగింది అదే. దానివల్ల కలిగే ముప్పేమిటో దాదాపు అన్ని దేశాల్లోనూ రుజువవుతూనే వుంది. క్షణాల్లో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపి మాయ చేయటం ఏఐకి చాలా సులభమని తేలిపోయింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్సీ్క రష్యా అధ్యక్షుడు పుతిన్ సేనలకు దాసోహమంటున్న వీడియో కొన్నాళ్లు హల్చల్ చేసింది. ‘నన్ను అడగకుండా, నా ప్రమేయం లేకుండా, నాకు అసలు తెలియకుండా ఏదో ఒకరోజు నన్ను ఏఐ ద్వారా దృశ్యబద్ధం చేసే ప్రమాదమున్నద’ని పేర్కొంటూ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ న్యాయస్థానం తలుపుతట్టాడు. ఉత్తర్వులు కూడా పొందాడు. దేనికైనా అనుకూల, ప్రతికూల అంశాలు రెండూ వుంటాయి. సాంకేతికత అనేది ఎప్పుడూ రెండువైపులా పదునున్న కత్తి. ఏఐతో ఒక మనిషికి జీవం పోయొచ్చు. వేలాదిమంది కుత్తుకలు తెగ్గొట్టవచ్చు. తులనాత్మకంగా చూస్తే మొదటి అంశంలో ఏఐ పురోగతి నత్తనడకన వుండగా... ఉద్దేశపూర్వకంగా, సమాజానికి నష్టం కలిగించే రీతిలో దాన్ని ఉపయోగించుకునే ధోరణులు వేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వాల నియంత్రణలు సృజనాత్మకతకు అవరోధమవుతాయని, కట్టడిలో మనుగడ సాగించే సమాజాలు ఎదగవని ఒకప్పుడు నమ్మేవారు. సామాజిక మాధ్యమాల రాకతో కాలం మారింది. ఇప్పుడు ప్రభుత్వాలే చడీచప్పుడూ లేకుండా వాటి సాయంతో జనంలో ఆమో దాన్ని సృష్టించుకుంటూ బతకనేరుస్తున్న వైనాన్ని చూస్తున్నాం. లాభార్జనే తప్ప మరేం పట్టని కార్పొ రేట్ సంస్థల తీరు కూడా కళ్లముందే వుంది. కనుక ఏఐ నియంత్రణలో పాటించాల్సిన ధర్మాలేమిటో, పౌరుల గోప్యత పరిరక్షణకు ఏం చేయాలో, స్వీయభద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త లేమిటో నిర్ణయించటం అంత సులభం కాదు. అమెరికా వరకూ తీసుకుంటే బైడెన్ ఉత్తర్వులిచ్చారు గానీ, వాటిని పెద్దగా బలంలేని ప్రతినిధుల సభలో ఆమోదింపజేసుకోవటం కష్టమే. బ్రిటన్ కూడా సొంతానికి ఒక నిబంధనావళి రూపొందించుకుంది. చైనా, యూరోపియన్ యూనియన్లు సైతం అంతే. మన దేశం ఇంకా ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. ఏదేమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం నుంచి బయటికొచ్చిన భూతాన్ని తెలివిగా వినియోగించుకోవటమెలాగో, అదుపు చేయటమెలాగో గ్రహించటం ప్రపంచానికి పెను సవాలే. దీన్ని మానవాళి ఎలా అధిగమిస్తుందో చూడాలి. ఇదీ చదవండి: అఫిడవిట్లతో జాగ్రత్త -
చైనా శాస్త్రవేత్తల కంటికి ఎనిమిది వైరస్లు.. మహమ్మారులుగా మారనున్నాయా?
ప్రపంచాన్ని 2019లో తాకిన కరోనా వైరస్ భయం అందరినీ నేటికీ వెంటాడుతూనే ఉంది. అ తరువాత కరోనా వైరస్ ఆల్పా, బీటా, ఓమిక్రాన్.. ఇలా పలు రూపాలను మార్చుకుని జనంపై దాడి చేస్తూనే వస్తోంది. కరోనా వైరస్ తొలిసారిగా చైనా నగరమైన ఊహాన్లో బయటపడింది. అనంతరం నెమ్మదిగా ప్రపంచం అంతటా విస్తరించింది. కోవిడ్-19కి వ్యాక్సిన్ కనుగొన్న తరువాత కూడా కరోనా ప్రభావం కనిపిస్తూనే ఉంది. ఇదిలావుండగా చైనా దక్షిణ తీరంలోని ఉష్ణమండల ద్వీపమైన హైనాన్లో గతంలో ఎన్నడూ చూడని ఎనిమిది రకాల వైరస్లను చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎలుకల్లో ఈ వైరస్లను గుర్తించారు. ఎప్పుడైనా ఈ వైరస్లు ఎలుకల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ వైరస్లు మరో మహమ్మారి ముప్పుపై ఆందోళనను సూచిస్తున్నాయి. కాగా భవిష్యత్ మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రపంచ ప్రజలను సిద్ధం చేసే దిశగా పరిశోధకులు ఈ ఆవిష్కరణలు సాగిస్తున్నారు. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా 700 ఎలుకల నమూనాలను సేకరించారు. వీటిలో ఎనిమిది కొత్త వైరస్ లను కనుగొన్నారు. ఇందులో ఒకటి సార్స్-కోవ్-2, కోవిడ్-19కి కారణమైన వైరస్ కుటుంబానికి చెందినదని గుర్తించారు. గబ్బిలాలపై పలు పరిశోధనలు చేసి ‘బ్యాట్ ఉమెన్’గా పేరు తెచ్చుకున్న శాస్త్రవేత్త డాక్టర్ షి జెంగ్లీ నూతన వైరస్లకు సంబంధించి అందించిన వివరాలను వైరోలాజికా సినికా జర్నర్లో ప్రచురించారు. కాగా ఈ వైరస్ లు మనుషులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు చేయాల్నిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. వైరోలాజికా సినికా అనేది చైనీస్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ(సీఎస్ఎం)కి చెందిన ప్రచురణ విభాగం. ఇది చైనా ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఎఫైర్స్కి చెందినది. శాస్త్రవేత్తలు 201-2021 మధ్య కాలంలో హైనాన్ లో ఎలుకల గొంతు నుంచి 682 నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను ఎలుకల జాతులు, అవి ఉంటే ద్వీపాల ఆధారంగా వర్గీకరణ చేశారు. ఈ నేపధ్యంలో జరిగిన పరిశోధనల్లో వాటిలోని వైరస్లు వెలుగు చూశాయి. వీటిలో కొన్ని మనిషి ఆరోగ్యానికి ముప్పు తెచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది కూడా చదవండి: యద్ధానికి ముందే హమాస్కు ఇరాన్ శిక్షణ: ఇజ్రాయెల్ ఆరోపణ -
తగ్గిన పప్పు ధాన్యాల సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో పప్పుధాన్యాల సాగు గణనీయంగా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. నేటి(శనివారం)తో వానాకాలం సీజన్ ముగియనుంది. ఆదివారం నుంచి యాసంగి సీజన్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ ఒక నివేదిక విడుదల చేసింది. వానాకాలం సీజన్లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, గతేడాది ఇదే సీజన్లో 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది మాత్రం 1.26 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా వరి సాగు విస్తీర్ణం ఆల్ టైం రికార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలు కాగా, ఏకంగా 65 లక్షల ఎకరాల్లో (130.37 శాతం) సాగైంది. ఇక సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.13 లక్షల ఎకరాలు కాగా, 4.67 లక్షల (113%) విస్తీర్ణంలో సాగైంది. వరి మినహా పెరగని ప్రధాన పంటల విస్తీర్ణం వరి, సోయాబీన్ మినహా ఇతర ముఖ్యమైన పంటల విస్తీర్ణం పెరగలేదు. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలు కాగా, 44.77 లక్షల (88.51 శాతం) విస్తీర్ణంలోనే సాగైంది. ఇక పప్పు ధాన్యాల సాగు మాత్రం గణనీయంగా తగ్గిందని నివేదిక వెల్లడించింది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం ఈ వానాకాలం సీజన్లో 9.43 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 5.51 లక్షల ఎకరాల్లోనే సాగైంది. అంటే 58.46 శాతానికే పరిమితమైంది. అందులో కంది సాధారణ సాగు విస్తీర్ణం 7.69 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.74 లక్షల (61.62 శాతం) ఎకరాల్లోనే సాగైంది. జొన్న సాధారణ సాగు విస్తీర్ణం 81,389 ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 31,107 ఎకరాల్లో (38.22 శాతం) సాగైంది. రాగులు దాని సాధారణ సాగు విస్తీర్ణంలో కేవలం 19.70 శాతం, కొర్రలు, సామలు, కోడో వంటి మిల్లెట్ల సాగు 16.15 శాతానికే పరిమితమైంది. -
గృహ లక్షలే లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముంగిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న గృహలక్ష్మి పథకానికి భారీపోటీ నెలకొంది. సొంత జాగాలో ఇల్లు కట్టుకోవటానికి పేదలకు రూ.3 లక్షల ఆర్థికసాయం అందజేసేందుకు గృహలక్ష్మి పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇటీవలే జిల్లా కలెక్టర్లు ఆ పథకానికి దరఖాస్తులు ఆహ్వానించగా, దాదాపు 15.04 లక్షలు అందాయి. వాటిల్లో ప్రాథమిక స్రూ్కటినీతో 10.20 లక్షల దరఖాస్తులు అర్హమైనవిగా తేల్చారు. గతంలో ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంలో నెలకొన్న గందరగోళం, నిధుల సమస్య కారణంగా ప్రభుత్వం ఆ ఇళ్ల నిర్మాణంలో కొత్తవి చేపట్టడం లేదు. ఉన్నవి పూర్తి చేయటమే కష్టంగా మారిన తరుణంలో ‘గృహలక్ష్మి’అర్హులను ఎలా ఎంపిక చేస్తారా చూడాల్సిందే. ఎమ్మెల్యేలదే హవా.. గృహలక్ష్మి పథకాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో అధికార పక్షం ఉంది. ఇళ్లు కేటాయించేందుకు రూపొందించే జాబితా వారి కనుసన్నల్లోనే సిద్ధం కానుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం జాబితా సిద్ధం చేస్తున్నా, స్థానిక ఎమ్మెల్యే సూచించిన గ్రామాలు, ప్రజలకు ప్రాధాన్యం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే పారీ్టలకతీతంగా ఈ ఎంపిక జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అలాగే ఎంపికలు ఉంటాయని నేతలు చెబుతున్నారు. జాబితా రూపొందించిన తర్వాతగానీ అది ఎంతవరకు అమలైందో తెలుస్తుంది. ఎంపికలు ఎలా ఉన్నా.. పోటీ తీవ్రంగా ఉన్న తరుణంలో ఇళ్ల కేటాయింపు పెద్ద సవాల్గానే మారే అవకాశం కనిపిస్తోంది. డబుల్బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో, గృహలక్ష్మి లబ్దిదారుల ఎంపికలోనూ వివాదాలు తప్పేలా లేవు. ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకుంటే వివాదాలు చెలరేగే ప్రమాదం నెలకొంది. ఇది నేతలకు కూడా ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు అధికారులు పక్కన పెట్టిన దరఖాస్తుల్లోనూ అర్హులున్నారంటూ కొందరు ఆరోపిస్తున్నారు. వాటిని కూడా పద్ధతిగా పరిశీలిస్తే కనీసం మరో 2 లక్షల వరకు దరఖాస్తులు అర్హమైనవిగా తేలుతాయని అంటున్నారు. తహసీల్దార్ల ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి ఎంపిక ప్రక్రియ జరపాలని, తూతూ మంత్రంగా గ్రామ కార్యదర్శుల ఆధ్వర్యంలో నిర్వహించారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నవి 4 లక్షల ఇళ్లే.. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు మంజూరు చేసింది. ఈ లెక్కన 3.57 లక్షల ఇళ్లు కేటాయిస్తుంది. ముఖ్యమంత్రి పరిధిలో 43 వేల ఇళ్లు రిజర్వ్ చేశారు. వెరసి మొత్తంగా 4 లక్షల ఇళ్లు అర్హులకు కేటాయిస్తారు. ఇప్పుడు 10.20 లక్షల దరఖాస్తులు అర్హమైనవిగా తేల్చటంతో, వీటిల్లో ఎవరికి ఇళ్లు దక్కుతాయోనన్న ప్రశ్న ఉదయిస్తోంది. దీంతో ఇళ్లు దక్కించుకునేందుకు ముమ్మరపోటీ నెలకొంది. ఇప్పటి నుంచి దరఖాస్తుదారులు తమకు అందేలా చూడాలంటూ నేతల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నికలకు ఇంకా ఎక్కువగా సమయం లేనందున వీలైనంత తొందరలో పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
అశ్వాలు ఆందోళన తగ్గిస్తాయి
సాక్షి, హైదరాబాద్: ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక సమస్యలతో బాధపడేవారు వాటి నుంచి బయట పడేందుకు వివిధ రకాల చికిత్సా పద్ధతులను పాటించే ఉంటారు. అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఇప్పుడు మరో కొత్త తరహాలో సాంత్వన అందించవచ్చని సైకాలజిస్ట్ నిమ్రా మీర్జా చెబుతున్నారు. దాని పేరు ‘ఈక్వైన్ అసిస్టెడ్ థెరపీ’... అంటే గుర్రాలతో స్నేహం చేయడం, వాటితో సహవాసం వల్ల కూడా మానసిక సమస్యలకు చికిత్స అందించవచ్చు. యూరోపియన్ దేశాల్లో ఇప్పటికే దీనికి గుర్తింపు ఉండగా, మన దేశంలో బెంగళూరు, చెన్నైల్లో ఈ పద్ధతి వచ్చేసింది. ఇక తెలంగాణలో తొలిసారి ఈ థెరపీని నిమ్రా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వృత్తిరీత్యా సైకాలజిస్ట్ అయిన నిమ్రా ఒక స్వచ్ఛంద సంస్థను నడిపిస్తున్నారు. ఈ థెరపీలోనూ లోతైన అధ్యయనం చేశారు. ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ (ఈఎఫ్టీ)లో కూడా పట్టా పొందిన ఆమె హార్స్ రైడర్గా పలు పోటీల్లో పాల్గొన్నారు. తొలిసారి రానున్న ‘ఈక్వైన్ అసిస్టెడ్ థెరపీ’పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం శనివారం నగరంలో జరిగింది. అజీజ్ నగర్లోని హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ (హెచ్పీఆర్సీ)లో నిమ్రా మీర్జా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హార్స్ రైడింగ్కు సంబంధించి ప్రాథమికాంశాలు, గుర్రాల మానసిక స్థితిని అర్థం చేసుకుంటూ మంచి రైడర్గా మారేందుకు అవసరమైన సూచనలతో పాటు థెరపీకి సంబంధించిన పలు అంశాలను నిమ్రా వివరించారు. ‘హార్స్ రైడింగ్ అంటే చాలా మంది ఒక ఆటగా మాత్రమే చూస్తారు. తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలను కరిగించి శారీరకంగా మంచి ఫలితాలు అందించడం రైడింగ్లో సహజంగా కనిపించే ప్రయోజనం. కానీ రైడింగ్తో పాటు గుర్రాలను మచ్చిక చేసుకోవడం ద్వారా మానసిక సమస్యలకూ పరిష్కారం లభిస్తుంది. తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న వారిపై, కొన్ని రకాల మానసిక వ్యాధులతో బాధడుతున్నవారిపై కూడా ఈ థెరపీ బాగా పని చేస్తుంది. ఒకదశలో ఆత్మహత్య చేసుకోవాలని భావించిన వారు సైతం ఈ ఈక్వైన్ అసిస్టెడ్ థెరపీతో కోలుకున్న అనుభవం నా ముందుంది. కొత్తగా వచ్చిన ఈ చికిత్స ఎక్కువ మందికి చేరాలనేదే మా ప్రయత్నం’అని నిమ్రా వివరించారు. మున్ముందు కూడా హెచ్పీఆర్సీ కేంద్రంగా ఈ చికిత్స అందిస్తామని ఆమె వెల్లడించారు. -
మా భూములు మాకివ్వండి
ఆదిలాబాద్ రూరల్: సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభమయ్యే వరకు తమ భూములు తిరిగి ఇవ్వాలంటూ భూనిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలంలోని రామాయి శివారులో గల రేణుకా సిమెంట్ పరిశ్రమకు సంబంధించిన స్థలం వద్ద బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసినీరెడ్డి ఆదివాసీలతో కలిసి భూముల వద్దకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను అరెస్టు చేయడంతో మిగతావారు పోలీసుల వాహనానికి అడ్డుతగిలారు. ఈ క్రమంలో ఓ మహిళ తమను అడ్డుకోవద్దని సీఐ కాళ్లు పట్టుకొని వేడుకుంది. అనంతరం వారందరినీ అరెస్టు చేస్తున్న క్రమంలో కొందరు మహిళలు పోలీసు వాహనంపైకి ఎక్కారు. పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో వారిని కిందకు దించి ఆదిలాబాద్ రూరల్, బేల, జైనథ్, భీంపూర్, తదితర స్టేషన్లకు తరలించారు. ఇంకొందరు మహిళలు పురుగుమందు డబ్బాలతో వచ్చారు. కొంతమంది రైతులు నాగలితో భూములు దున్నేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఉపాధికి దూరమయ్యాం... సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు కోసం 2018లో తమ పంట భూములు ఇస్తే ఇప్పటివరకు పరిశ్రమ ప్రారంభం కాలేదని, ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని భూనిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లలోనే పూర్తి చేస్తామని చెప్పి పరిశ్రమ యజమానులు మాట తప్పారని ఆరోపించారు. మొత్తం 107 ఎకరాల భూమి తీసుకుని ఐదేళ్లవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. తాము ఉపాధి కరువై కూలీలుగా మారామని, కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ కోసం నిరసన చేపడుతున్న క్రమంలో పోలీసులు కనీసం మహిళలని కూడా చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. నిర్వాసితుల ఆందోళన నేపథ్యంలో ఈ ప్రాంతంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ప్రభుత్వ ఉద్యోగాలున్నయ్.. కానీ జీతాల్లేవ్!
కోరుట్ల: పేరుకి ప్రభుత్వోద్యోగమే అయినా ఆర్నెల్లుగా నయాపైసా జీతం లేక అల్లాడిపోతున్నారు కొత్త మండలాల్లోని రెవిన్యూ ఉద్యోగులు. గతేడాది సెప్టెంబర్ 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 13 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ జీవో నంబరు 97 జారీచేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత తహసీల్దార్ కార్యాలయాలకు రూపునిచ్చారు. ఆయా జిల్లాల్లోని వివిధ మండలాల్లో పనిచేసే సిబ్బందికి వాటిలో పోస్టింగ్లు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉందికానీ.. కొత్త మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది వేతనాల మంజూరు కోసం సీసీఎల్ఏ నుంచి ’క్యాడర్ స్ట్రెంత్’సర్కులర్ జారీచేయాల్సి ఉంటుంది. ఈ జీవో జారీ ఆరు నెలలుగా జాప్యమవుతోంది. దీంతో సిబ్బందికి వేతనాలు అందడంలేదు. ♦ 13 మండలాలు.. 240 మంది సిబ్బంది.. ♦ కొత్త మండలాల జీవో జారీ కాగానే తహసీల్దార్ కార్యాయాలు ఏర్పాటు చేశారు. ♦ నిబంధనల ప్రకారం తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఇద్దరు గిర్దావర్లు(ఆర్ఐలు), ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, సర్వేయర్, అటెండర్, చైన్మన్తోపాటు గ్రామాల సంఖ్యను బట్టి 15–25 మంది వీఆర్ఏలను నియమించారు. ♦ జీవో 97 ప్రకారం ఇతర మండలాల్లోని సిబ్బందిని కొత్త మండలాల్లో నియమిస్తూ జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకున్నారు. ♦ ప్రస్తుతం కొత్తగా ఏర్పాటైన 13 మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో సుమారు 240 మంది ఉద్యోగులు వివిధ క్యాడర్లలో పనిచేస్తున్నారు. ఆర్నెల్లుగా అరిగోస.. విధులు నిర్వర్తిస్తున్నా.. తమకు జీతాలు రాకపోవడంపై సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యాడర్ స్ట్రెంత్ జీవో జారీకోసం కొందరు జిల్లా కలెక్టర్లు సీసీఎల్ఏకు మొరపెడుతూ లేఖలు రాసినా పట్టించుకునే వారులేరు. జీవో జారీ కాకపోవడంతో ఉద్యోగుల వివరాలు, బ్యాంకు ఖాతాలు, వేతనాల విడుదల వంటి అంశాల వివరాలు జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లో నమోదు కాలేదు. ఫలితంగా ఆరు నెలలుగా జీతాలు లేక కొత్త మండలాల్లో పనిచేస్తున్న సుమారు 240 మంది రెవెన్యూ ఉద్యోగులు నానాతిప్పలు పడుతున్నారు. ఏమిటీ క్యాడర్ స్ట్రెంత్? కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ కార్యాలయాల్లో హోదాల ప్రకారం ఉండాల్సిన సిబ్బంది, వేతన వివరాలు, ఆర్థికపరమైన అనుమతులను రెవెన్యూ పరిభాషలో క్యాడర్ స్ట్రెంత్ అంటారు. ఈ క్యాడర్ స్ట్రెంత్ జీవో విడుదల అయితేనే కొత్త మండలాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, వేతనాలు నేరుగా సంబంధిత జిల్లా ట్రెజరీ కార్యాలయాకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ జీవోను సీసీఎల్ఏ జారీ చేయాల్సి ఉంటుంది. -
మక్కలు ఇంకెప్పుడు కొంటరు?
సాక్షి, కామారెడ్డి: మక్కల కొనుగోలుపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దళారులు చెప్పిందే ధర అవుతోంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, మార్కెట్లో మక్కల ధర రోజురోజుకూ పతనం అవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగి సీజన్లో రాష్ట్రంలో 6,48,446 ఎకరాల్లో మక్క పంట సాగైంది. ఈసారి పంట ఆశాజనకంగా ఉండటంతో దిగుబడి కూడా ఎక్కువగా వస్తుందని భావిస్తున్నారు. సగటున ఎకరాకు 29 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఈ లెక్కన మొత్తంగా దాదాపు 2 కోట్ల క్వింటాళ్ల మక్కల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. కాగా మక్కల కొనుగోలు వ్యవహారాన్ని మార్క్ఫెడ్ చూస్తుంది. అయితే ప్రభుత్వం మార్క్ఫెడ్కు అనుమతి ఇవ్వడంతో పాటు అవసరమైన బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే మార్క్ఫెడ్ మక్కల కొనుగోలు ప్రక్రియ మొదలుపెడుతుంది. కానీ సర్కారు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మక్కల కొనుగోలు వ్యవహారం ముందుకు సాగడం లేదు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మక్క పంట కోసి, జూళ్లు వేశారు. కొన్ని ప్రాంతాల్లో జూడు తీసి, మక్కలు ఒలిచి ఆరబెడుతున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మక్క కోయాల్సి ఉంది. తగ్గుతున్న ధర.. మక్క పంట చేతికి అందే సమయంలో తొలుత బహిరంగ మార్కెట్లో క్వింటాలుకు రూ.2,400 వరకు ధర పలికింది. కానీ పక్షం రోజులుగా ధర తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో రూ.1,800 మాత్రమే చెల్లిస్తున్నారు. గతంలో పౌల్ట్రీ పరిశ్రమలో కోళ్లకు దాణాగా మక్కలను వాడేవారు. ప్రస్తుతం మక్కల కన్నా బియ్యం నూకలు తక్కువ ధరకు లభిస్తుండటంతో పౌల్ట్రీ రంగం మక్కల కొనుగోలుపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో స్థానికంగా మక్కలకు డిమాండ్ పడిపోతోంది. మార్క్ఫెడ్ కొనుగోలు చేస్తే తప్ప తమకు మద్దతు ధర లభించే అవకాశం లేదని రైతులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తుందా అని వారు ఎదురుచూస్తున్నారు. మార్క్ఫెడ్ కొనాలి.. నేను మూడు ఎకరాల్లో మక్క పండించిన. ఈసారి పంట మంచిగనే వచ్చింది. అయితే మార్కెట్లో మద్దతు ధర లభించడం లేదు. మొదట్లో క్వింటాలుకు రూ. 2,400 ధర పలికింది. ఇప్పుడు అమ్ముదామనే సమయానికి రూ.1,800లకు పడిపోయింది. మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి. –గడ్డం బాల్రెడ్డి, రైతు, మోతె, లింగంపేట మండలం, కామారెడ్డి జిల్లా కేంద్రాలు తెరవకుంటే ఇబ్బందే ప్రభుత్వం మక్కల కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేస్తేనే మాకు నాలుగు పైసలు మిగులుతయి. లేకుంటే ఏం లాభం ఉండదు. ఇప్పుడు మార్కెట్లో ఉన్న ధరకు అమ్ముకుంటే అప్పులే మిగులుతయి. కేంద్రాల ఏర్పాటు ఇప్పటికే ఆలస్యమైంది. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలి. – బండారి లింగం, రైతు, తాడ్వాయి మండలం, కామారెడ్డి జిల్లా -
శ్రీదేవి వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ శ్రేణుల ఫైర్
తాడికొండ (గుంటూరు): తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యలు వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఆగ్రహాన్ని కలిగించాయి. ఆదివారం తుళ్లూరు తులసీ థియేటర్ ఎదుట నాయకులు, కార్యకర్తలు శ్రీదేవి వ్యాఖ్యలకు నిరసనగా ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సవాల్ను స్వీకరిస్తున్నాం. దమ్ముంటే అమరావతి గడ్డపై అడుగుపెట్టు. నిన్ను నమ్మి ఓట్లేసిన నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పు’ అంటూ నిలదీశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని అమరావతి గడ్డపై ప్రమాణం చేస్తానంటున్న శ్రీదేవి హైదరాబాద్ వెళ్లి ఎందుకు ప్రెస్మీట్ పెట్టాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. తాడికొండ నియోజకవర్గంలో దళితుల ఆత్మగౌరవానికి శ్రీదేవి భంగం కలిగించారని మండిపడ్డారు. ‘భర్తను గన్మెన్లతో కొట్టించిన ఘనురాలు’ పార్టీ నాయకుడు మేకల రవి మాట్లాడుతూ.. తనకు శ్రీదేవి రూ.1.40 కోట్లు ఇవ్వాలన్నారు. ఇదే విషయాన్ని గతంలో విలేకరుల సమావేశం ద్వారా అందరికీ చెప్పినా కనికరించలేదన్నారు. శ్రీదేవికి ముగ్గురు కుమార్తెలు ఉండగా.. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో ఇద్దరు అని నమోదు చేసిందన్నారు. భర్త శ్రీధర్ను గన్మెన్లతో కొట్టించిన ఘనురాలు అన్నారు. శ్రీదేవి అక్రమాలపై ఒక ఫైల్ తయారు చేసిన ఆమె భర్త శ్రీధర్ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరకు వెళ్లలేదా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ప్రజల నుంచి రూ.100 కోట్లు వసూలు చేసిన శ్రీదేవికి ప్రజల్లో ప్రాధాన్యత తగ్గడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అమ్ముడుపోయి నీతులు చెబుతోందన్నారు. ‘ఏబీఎన్ రాధాకృష్ణ మధ్యవర్తిత్వంతో టీఎస్09 ఎఫ్ఎస్ టీఎల్ఆర్ 8876 కారులో నీ కూతురు చంద్రబాబు ఇంటికి వెళ్లలేదా? కిషోర్రెడ్డి, బొల్లినేని రామారావు, సుజనా చౌదరి నేతృత్వంలో చంద్రబాబు ఇంటివద్ద రూ.4.50 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నది నిజం కాదా? అని మేకల రవి నిలదీశారు. శ్రీదేవి అమ్ముడు పోయిందనడానికి తనవద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని.. ఫొటోలు, సీసీ ఫుటేజి ఆధారాలను త్వరలో డీజీపీకి, మీడియాకు అందజేస్తానని తెలిపారు. -
సంజయ్ వ్యాఖ్యలపై మంటలు!
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణంలో విచారణను ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సంజయ్ అనుచిత వ్యాఖ్యలపై శనివారం బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల సంజయ్ దిష్టి బొమ్మల దహనం, ధర్నాలతో నిరసన వ్యక్తం చేశాయి. హైదరాబాద్తోపాటు నిజామాబాద్, సంగారెడ్డి, బంజారాహిల్స్, సూర్యాపేట తదితర ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్లలో కేసులు పెట్టాయి. బండి సంజయ్కు మహిళలను గౌరవించే సంస్కారం లేదని, ఆయన తీరు మార్చుకోలేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాయి. రాజ్భవన్ వద్ద ఆందోళన సంజయ్ వ్యాఖ్యల విషయంగా గవర్నర్ తమిళిసైను కలసి ఫిర్యాదు చేయడానికి ప్రభుత్వ విప్ సునీత, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, పలువురు కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు రాజ్భవన్కు వెళ్లారు. అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో గేటు వద్దే ధర్నాకు దిగారు. బారికేడ్లు నెట్టుకుని లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో బీజేపీకి, మోదీకి, సంజయ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్భవన్ ఎదుట రాస్తారోకో చేశారు. దీనితో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరికి మహిళా నేతలు రాజ్భవన్ ప్రహరీకి, బారికేడ్లకు వినతిపత్రాలు అంటించి నిరసన తెలిపారు. ఎవరికి ఏ ఇబ్బందులున్నా రాజ్భవన్ గేట్లు తెరిచే ఉంటాయని గవర్నర్ గతంలో చెప్పారని.. ఓ మహిళగా తమ బాధ అర్థం చేసుకుంటారని వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చామని చెప్పారు. ఇద్దరు, ముగ్గురిని లోనికి అనుమతించినా బాగుండేదని, కనీసం గవర్నర్ ఓఎస్డీ వచ్చి వినతిపత్రం తీసుకుని ఉండాల్సిందని పేర్కొన్నారు. గవర్నర్ ఇప్పటికైనా స్పందించి సంజయ్తో క్షమాపణ చెప్పించాలనర్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తలసాని శ్రీనివాస్యాదవ్ కుమారుడు సాయి కిరణ్యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఈడీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ మహిళా నేతలు, కార్యకర్తలు బండి సంజయ్ దిష్టి»ొమ్మను దహనం చేశారు. బాల్కొండలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో బండి సంజయ్కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. వరంగల్లో మంత్రి ఎర్రబెల్లి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. కాజీపేట, సుబేదారి పోలీస్స్టేషన్లలో సంజయ్పై ఫిర్యాదులు చేశారు. నకిరేకల్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో, సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మంచిర్యాల, నర్సాపూర్, బెల్లంపల్లి, దేవరకొండ, నారాయణపేటలలో ఎమ్మెల్యేలు దివాకర్రావు, మదన్రెడ్డి, చిన్నయ్య, రవీంద్రకుమార్, రాజేందర్రెడ్డిల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వ్యక్తిగతంగా హాజరు కావాలి! సంజయ్కి మహిళా కమిషన్ నోటీసులు బండి సంజయ్ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ అంశాన్ని సూమోటోగా తీసుకుని.. బండి సంజయ్కు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ వ్యాఖ్యలను కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోందని, వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆయనను ఆదేశించనున్నట్టు తెలిపారు. సంజయ్ వ్యాఖ్యలపై విచారణ చేయాలని డీజీపీని ఆదేశించారు. సంజయ్పై కేసు నమోదు బంజారాహిల్స్ (హైదరాబాద్): బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై హైదరాబాద్లోని బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. జీహెచ్ఎంసీ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి ఫిర్యాదు మేరకు ఐపీసీ 354ఏ, 504, 509 సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు. ఇదే అంశంపై బీఆర్ఎస్ నాయకుడు చెట్లపల్లి రాంచందర్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్, పలువురు మహిళా నేతలు, బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున నల్లగొండ టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
చైనా గురించి... భారత్- యూఎస్ల మధ్య సీరియస్ చర్చలు
చైనా అందిస్తున్న రుణాల గురించి దక్షిణ, మధ్య ఆసియా సహాయ కార్యదర్శి డొనాల్డ్ లూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక వంటి దేశాలు తమ ఆర్థిక అవసరాల కోసం చైనా రుణాలపై ఆధారపడటం ఆందోళన కల్గిస్తుందన్నారు. ఆ రుణాలను బలవంతపు పరపతి కోసం, ఇతర అవసరాల తీర్చుకోవడానికి చైనా ఉపయోగించుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆయా దేశాలు తమ సొంత నిర్ణయం తీసుకోవటానికి బయటి దేశాల ప్రభావానికి గురి కావద్దని ఒక మీడియా సమావేశంలో డొనాల్డ్ లూ స్పష్టం చేశారు. ఈ చైనా సమస్యపై భారత్- అమెరికాల మధ్య తీవ్రమైన సంభాషణ జరిగిందని కూడా చెప్పారు డొనాల్డ్ లూ. కాగా, అంతకుముందు రోజే పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ బోర్డ్ ఆఫ్ చైనా డెవలప్మెంట్ బ్యాంక్ (సీడీబీ) దేశానికి 700 మిలియన్ డాలర్ల క్రెడిట్ సదుపాయాన్ని ఆమోదించినట్లు ప్రకటించారు. ఐతే క్వాడ్ కూటమి ఏ ఒక్క దేశం లేదా దేశాల సముహానికి విరుద్ధమైన సంస్థ కాదని చెప్పారు. ఓపెన్ ఇండో ఫసిఫిక్కు మద్దతు ఇచ్చే కార్యకలాపాలు, విలువలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుందని డొనాల్డ్ లూ అన్నారు. అలాగే రష్యాతో భారత్ సైనిక సంబంధం గురించి అడిగినప్పుడూ సైనిక ఒప్పందాల విషయంలో రష్యా పరిస్థితి కాస్త కష్టంగా ఉందన్నారు. (చదవండి: తప్పట్లేదు.. బిజినెస్ క్లాస్లో ప్రయాణం, ఫైవ్ స్టార్ హోటళ్లలో బస వద్దు’) -
గుడ్న్యూస్: ఎఫ్ఎంసీజీపై తగ్గుతున్న ఒత్తిడి, దిగిరానున్న ధరలు!
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ రంగంపై ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిడి కొద్దిగా తగ్గుతోందని ఐటీసీ సీఎండీ సంజీవ్ పురి తెలిపారు. ప్రస్తుతం భారీ ద్రవ్యోల్బణం కారణంగా గ్రామీణ మార్కెట్లలో అమ్మకాలు ఒక మోస్తరుగా ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో మరింత మెరుగుపడనున్నాయని ఆయన చెప్పారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన గ్లోబల్ ఎకనామిక్ పాలసీ సమ్మిట్ 2022లో కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పురి ఈ విషయాలు వివరించారు. (వర్క్ ఫ్రం హోం: వచ్చే ఏడాది దాకా వారికి కేంద్రం తీపి కబురు) ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థానంలోనే ఉందని పురి చెప్పారు. గతంలో దాదాపు అయిదేళ్లలో పెరిగేంత స్థాయిలో ప్రస్తుతం చాలా మటుకు ఉత్పత్తుల ధరలు పెరిగిపోయాయని, వినియోగ ధోరణులపై ఇవి ప్రభావం చూపిస్తున్నాయని ఆయన తెలిపారు. అయితే, వర్షపాత ధోరణులను బట్టి గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మెరుగ్గానే ఉండబోతోందని చెప్పారు. మరోవైపు, పెట్టుబడులకు ప్రస్తుతం స్థూల ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని పురి తెలిపారు. (సరికొత్త అవతార్లో, టాటా నానో ఈవీ వచ్చేస్తోంది..?) నిధుల లభ్యత, కార్పొరేట్ల ఆదాయాలు మొదలైనవన్నీ బాగున్నాయన్నారు. సామర్థ్యాల వినియోగం కూడా పుంజు కుంటోందని చెప్పారు. అయితే, అంతర్జాతీయ అనిశ్చితి నెలకొనడమనేది ఎగుమతులపరంగా ప్రతికూలాంశంగా ఉంటోందని పురి తెలిపారు. ప్రధానంగా దేశీ మార్కెట్పైనే ఎక్కువగా దృష్టి పెట్టే తమ కంపెనీల్లాంటివి ప్రైవేట్ పెట్టుబడులను యథాప్రకారం కొనసాగిస్తున్నాయన్నారు. తయారీ రంగం కీలకమైనదే అయినప్పటికీ మిగతా రంగాల్లోనూ భారత్ పుంజుకోవాలని పురి చెప్పారు. ఆదాయాల స్థాయిలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఆర్థిక అభద్రతలో పట్టణ భారతం..
న్యూఢిల్లీ: గడిచిన ఏడాది కాలంగా బీమాపై అవగాహన పెరిగినప్పటికీ .. పట్టణ ప్రాంతాల ప్రజల్లో ఆర్థిక అభద్రత భావం తగ్గలేదు. రోజువారీ వైద్యం ఖర్చులు, జీవన విధానాన్ని కొనసాగించేందుకు అయ్యే వ్యయాలపై యువత మరింత ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. బీమా సంస్థ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2019 డిసెంబర్ నుంచి 2020 జనవరి మధ్యకాలంలో 25 నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 7,014 మంది తమ అభిప్రాయాలు తెలియజేశారు. వీటిలో 6 మెట్రో నగరాలు, 9 ప్రథమ శ్రేణి నగరాలు, 10 ద్వితీయ శ్రేణి నగరాలు ఉన్నాయి. 25–55 ఏళ్ల మధ్య, సగటున రూ. 2 లక్షల పైగా కుటుంబ వార్షికాదాయం గలవారు, ఆర్థిక సాధనాలపై ఇతరులను ప్రభావితం చేయగలవారి అభిప్రాయాలను ఇందులో పరిగణనలోకి తీసుకున్నారు. దీని ప్రకారం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య 700 బేసిస్ పాయింట్లు పెరిగి 28 శాతానికి చేరింది. టర్మ్ పాలసీల గురించి అవగాహన 1,000 బేసిస్ పాయింట్లు ఎగిసి 57 శాతానికి పెరిగింది. అత్యధికంగా బీమా భద్రతపై అవగాహన ఉన్న వారు, జీవిత బీమా పాలసీదారులతో దక్షిణాది అగ్రస్థానంలో ఉంది. ఈ విషయంలో 47 పాయింట్లతో ఢిల్లీ, 46 పాయింట్లతో హైదరాబాద్ టాప్లో ఉన్నాయి. మరోవైపు, అనేక అంశాల్లో పురుషులతో పోలిస్తే మహిళల్లో ఆర్థిక అభద్రతా భావం ఎక్కువగా ఉంది. ద్వితీయ శ్రేణి నగరాల్లో బీమా భద్రతకన్నా ఎక్కువగా పొదుపునకే ప్రాధాన్యమిస్తున్నారు. టర్మ్ పాలసీల కన్నా ఎండోమెంట్ పాలసీల వైపే మొగ్గు చూపుతున్నారు. -
కోల్ కతాలో విద్యార్థి సంఘాల ఆందోళన
-
జీడీపీపై ఫిక్కీ తీవ్ర ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశ ఆర్థిక వృద్ధి (ఏప్రిల్-జూన్ 2019) ఆరేళ్ల కనిష్టానికి పడిపోవడంపై పరిశ్రమ సంస్థ ఫిక్కీ ఆందోళన వ్యక్తం చేసింది. పెట్టుబడులు, వినియోగదారులు డిమాండ్లో గణనీయమైన క్షీణతను ఇది సూచిస్తుందని వ్యాఖ్యానించింది. అయితే ఈ పరిస్థితిని ఎదుర్కొంనేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకుంటున్నచర్యలు తరువాతి త్రైమాసికంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడానికి సహాయపడతాయని ఫిక్కీ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో అభిప్రాయపడింది. ఆర్థికవృద్ధి వేగం మందగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఫిక్కీ అధ్యక్షుడు సందీప్ సోమనీ తాజా జీడీపీ గణాంకాలు అంచనాలకు మించి బలహీనంగా వున్నాయన్నారు. అయితే విస్తృత చర్యలు, ఆయా రంగాల్లో నిర్దిష్ట జోక్యాల మేళవింపుతో భారత ఆర్థిక వ్యవస్థ ఈ సంక్షోభం నుంచి త్వరలో బయటకు వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల ప్రభుత్వం మరియు ఆర్బిఐ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశంలో జీడీపీ వృద్ధి రేటును పునరుజ్జీవింపజేస్తాయని చెప్పారు. మెగా బ్యాంకుల విలీనం, ఎఫ్డీఐ నిబంధనల సరళీకరణ, బ్యాంకులకు ఉద్దీపన ప్యాకేజీ లాంటివి కీలకమన్నారు. సీహెచ్డీసీసీఐ అధ్యక్షుడు రాజీవ్ తల్వార్ మాట్లాడుతూ. "ప్రభుత్వ రంగ బ్యాంకుల రీకాపిటలైజేషన్, విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులపై మెరుగైన సర్చార్జిని రోల్బ్యాక్ చేయడం, పెండింగ్లో ఉన్న అన్ని జీఎస్టీ రిఫండ్స్ను ఎంఎస్ఎంఇలకు చెల్లించడం లాంటివి వృద్ధిని స్థిరపరుస్తాయన్నారు. అలాగే స్థిరకాల ఉపాధి, నియామకాలలో వెసులుబాట్లులాంటి కార్మిక చట్టాల సంస్కరణలతో పాటు, చిన్న,మధ్య తరహా వ్యాపారాలలో సంస్కరణలు కీలకమని తద్వారా ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేయాలని ఆయన సూచించారు. కాగా భారత ఆర్థిక వృద్ధి వరుసగా ఐదవ త్రైమాసికంలో క్షీణించి, జూన్ నెలతో ముగిసినమొదటి త్రైమాసికంలో ఆరేళ్ల కనిష్టం వద్ద 5 శాతానికి పడిపోయింది. ప్రపంచ ప్రతికూల సంకేతాలకు తోడు ప్రైవేటు పెట్టుబడులు, వినియోగదారుల డిమాండ్ మందగించడం ఈ పరిణామానికి దారితీసింది. కాగా ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అనే ట్యాగ్ను ఈ ఏడాది ప్రారంభంలోనే కోల్పోయిన భారత జీడీపీ వృద్ధి ఏప్రిల్-జూన్లో చైనా 6.2 శాతంతో పోలిస్తే బాగా వెనుకబడి ఉంది. గత 27 సంవత్సరాలలో ఇదే బలహీనం. -
నెల్లూరు జిల్లాలో ఎస్బీఐ వద్ద మహిళల ఆందోళన
-
CPS రద్దు కోసం విజయవాడలో ఉద్యోగుల ఆందోళన
-
కర్నూలు కలెక్టరెట్ ఎదుట జర్నలిస్టు సంఘాల ఆందోళన
-
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇండిగో ప్రయాణికుల ఆందోళన
-
గాందీభవన్ వద్ద యాదవసంఘాల ఆందోళన
-
కర్నూలు కలెక్టరేట్ ఎదుట విద్యార్ధి జేఏసీ ఆందోళన
-
బెంగాల్లో మరో హత్య!
పురూలియా / న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో మరో వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. పురూలియా జిల్లా బలరామ్పూర్కు చెందిన దులాల్ కుమార్(35) మృతదేహం శనివారం దేవా గ్రామ సమీపంలోని ఓ విద్యుత్ హైటెన్షన్ టవర్కు వేలాడుతూ కన్పించింది. దీంతో దోషుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు బలరామ్పూర్ పోలీస్స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. కాగా, తమ పార్టీ కార్యకర్త అయినందునే దులాల్ కుమార్ను హత్యచేశారని బీజేపీ నేతలు విమర్శించారు. నాలుగు రోజుల్లో ఇద్దరు కార్యకర్తలు మృతి చెందడంపై విచారం వ్యక్తంచేసిన బీజేపీ చీఫ్ అమిత్ షా.. బెంగాల్లో శాంతిభద్రతల పరిరక్షణలో మమత ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. మరోవైపు ఈ రెండు హత్యలపై సీఐడీ విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం.. పురూలియా సూపరింటెండెంట్(ఎస్పీ) జోయ్ బిశ్వాస్పై బదిలీ వేటువేసింది. -
సూర్యపేట మార్కెట్ యార్డు వద్ద అన్నదాత ఆందోళన
-
సారీ.. సారీ.. సారీ.. నాలుగోసారీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో మరోసారి అదే దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పట్టుదలగా పోరాడుతున్నా సభ సజా వుగా లేదంటూ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు లోక్సభాపతి సుమిత్రా మహాజన్ అనుమతించలేదు. వెల్లో ఆందోళన నిర్వహిస్తున్న అన్నాడీఎంకే, టీఆర్ఎస్లకు మరో పార్టీ జతకలవటంతో సభలో గందరగోళ పరిస్థి తులు నెలకొన్నాయి. ఆర్జేడీ నుంచి గెలిచి జన్ అధికార్ పేరుతో వేరుకుంపటి పెట్టుకున్న పప్పూయాదవ్ బిహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్లోకి దూసుకొచ్చారు. దీంతో సభ సజావుగా లేదంటూ వైఎస్సార్ సీపీ, టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నాలుగోసారీ అనుమతిం చలేదు.తీర్మానాన్ని బుధవారం నాటి సభాకార్యక్రమాల జాబితాలో చేర్చాలం టూ వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ తోట నరసింహం మంగళవారం సెక్రటరీ జనరల్ స్నేహలతా శ్రీవాస్తవకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సభ ప్రారంభం కాగానే లోక్సభ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే అన్నాడీఎంకే, టీఆర్ఎస్ పక్షాలు వెల్లోకి వెళ్లి ఆందోళన చేయడంతో అప్పటికే ప్రశ్నోత్తరాలను ప్రారంభించిన స్పీకర్ కొద్ది క్షణాల్లోనే సభను వాయిదా వేశారు. తిరిగి 12 గంటలకు ప్రారంభం కాగానే వివిధ శాఖలకు చెపందిన పత్రాలను పలువురు మంత్రులు పార్లమెం ట్కు సమర్పిం చారు. సభ్యులంతా తమ స్థానా ల్లోకి వెళ్లాలని, అవిశ్వాస తీర్మానం సహా అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్కు మార్ పేర్కొ న్నారు. ఈ సమయంలో బిహార్కు ప్రత్యేక హోదా కావాలంటూ పప్పూయాదవ్ ప్లకార్డులు ప్రదర్శించారు. 12.05 గంటలకు సభాపతి తనకు అందిన అవిశ్వాస తీర్మానం నోటీసుల ను ప్రస్తావించారు. కేంద్ర మంత్రి మండలిపై అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు వైవీ సుబ్బారెడ్డి, తోట నరసింహంనుంచి నోటీసు లు అందాయని చెప్పారు. ‘వీటిని సభ ముం దుంచడం నా బాధ్యత. ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు అవసరమైన 50 మంది సభ్యులు వారి స్థానాల్లో లేచి నిలుచుంటే లెక్కించేందుకు వీలుగా సభ సజావుగా నడవాలి. వారిని లెక్కించాక తీర్మానం ప్రవేశపె ట్టటంపై నిర్ణ యించగలను. సభ్యులంతా తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలి..’ అని సూచించారు. తీర్మానానికి మద్దతుగా నిలుచున్న ఎంపీలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రస్తావన రాగానే వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, సమాజ్వాదీ, ఆర్జేడీ, ఎన్సీపీ, జేఎంఎం, ఎంఐఎం, ఆమ్ ఆద్మీ, తదితర విపక్షాలకు చెందిన సభ్యులంతా మద్దతుగా నిలుచున్నారు. అయితే సభ సజావుగా లేనందున అవిశ్వాస తీర్మానాలను సభ ముందుకు తీసుకురాలేకపోతున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ వైఎస్సార్ సీపీ ఆందోళన ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబడుతూ వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి బుధవారం రాజ్యసభలో ఆందోళన నిర్వహిం చారు. ప్రత్యేక హోదా ప్లకార్డును ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. అయితే రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు కొద్ది క్షణాల్లోనే సభను గురువారానికి వాయిదావేశారు. ఐదోసారి అవిశ్వాసం నోటీసులు కేంద్రంపై అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ తోట నరసింహం బుధవారం మధ్యాహ్నం లోక్సభ సెక్రటరీ జనరల్ స్నేహలతా శ్రీవాస్తవకు ఐదో సారి నోటీసులను అందజేశారు. పార్లమెంట్ వద్ద ధర్నా అంతకుముందు ఉదయం 10.30 గంటలకు వైఎస్సార్ సీపీ ఎంపీలు పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగప ల్లి వరప్రసాదరావు, వైఎస్ అవినాష్రెడ్డి, పి.వి.మిథున్రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. ద్రోహివి నువ్వే సీఎం వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎంపీలు రాష్ట్రానికి ద్రోహం చేసిన వారికి ప్రజలు బుద్ధి చెప్పాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు ఆయనకే వర్తిస్తాయని వైఎస్సార్ సీపీ ఎంపీలు పేర్కొన్నారు. నాలుగేళ్లపాటు ప్రత్యేక హోదా అడగకుండా, హోదా అవసరం లేదని మంత్రివర్గంలో నిర్ణయించిన చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం చేసినవారిలో మొదటి వ్యక్తని మండిపడ్డారు. బుధవారం లోక్సభ వాయిదా పడిన అనంతరం వైఎస్సార్ సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వరప్రసాద రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన వారికి బుద్ధి చెప్పాలని వ్యాఖ్యానించిన బాబుకే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఇన్నేళ్లుగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడని చంద్రబాబు ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నారని చెప్పారు. రాష్ట్రానికి ఎవరు ద్రోహం చేశారో ప్రజలకు బాగా తెలుసన్నారు. -
కోటా పెంపుపై టీఆర్ఎస్ పోరు
సాక్షి, న్యూఢిల్లీ: జనాభా దామాషా ప్రకారం ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ల కోటా పెంచాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆయా రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలంటూ శుక్రవారం పార్లమెంట్లో టీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలన్నీ బలాన్ని సమకూర్చగా టీఆర్ఎస్, ఏఐఏడీఎంకే మాత్రం వెల్లో ఉండి తమ పోరాటాన్ని కొనసాగించాయి. 50 శాతానికి మించి రిజర్వేషన్లను పెంచుకునేందుకు రాష్ట్రాలకు అధికారం కట్టబెట్టాలని, ఒక దేశంలో ఒకే విధానం ఉండాలని టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. అంతకుముందు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. ఎంపీలు కె.కేశవరావు, జితేందర్రెడ్డి, కవిత, బి.వినోద్కుమార్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, బాల్క సుమన్, కొత్త ప్రభాకర్రెడ్డి, పసునూరి దయాకర్ పాల్గొన్నారు. జితేందర్రెడ్డి మాట్లాడుతూ.. ‘ఒక దేశంలో ఒకే విధానం ఉండాలి. తమిళనాడులో రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చి వేరే రాష్ట్రాల రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో ఎందుకు పెట్టరు. ఉపాధి హామీ పథకంలో కోట్లాది రూపాయలు వ్యర్థంగా పోతున్నందున ఈ పథ కాన్ని రైతులతో అనుసంధానం చేయండి. గిట్టుబాటు ధర కోసం రెండు వారాలుగా మేం పట్టుబడుతున్నాం. కానీ ప్రభుత్వం స్పందించట్లేదు’అని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడటమే తప్పు అన్నట్లు అశోక్గజపతి రాజు, వై.ఎస్.చౌదరి గురువారం సభలో మాట్లాడటం నచ్చలేదని వినోద్ కుమార్ అన్నారు. -
ప్యాకేజీకి ఒప్పుకున్నప్పుడే విశ్వాసం కోల్పోయారు
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఆంధ్రప్రదేశ్కు దక్కాల్సిన ప్రయోజనాలను దక్కకుండా చేసి ఇప్పుడు చంద్రబాబు తన మంత్రులను ఉపసంహరించుకోవడం వల్ల ప్రజల మనసులు గెలవలేరు. ప్యాకేజీకి ఒప్పుకొన్నప్పుడే ప్రజల విశ్వాసం కోల్పోయారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ధ్వజమెత్తారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, వైఎస్ అవినాష్రెడ్డి, పి.వి.మిథున్రెడ్డి గురువారం ఉదయం పదిన్నరకు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద ఆందోళన నిర్వహించారు. ‘ఏపీకి న్యాయం చేయాలి’, ‘ప్రత్యేక హోదా ఇవ్వాలి’ అంటూ నినదించారు. ఈ సందర్భంగా వారంతా మీడియాతో మాట్లాడారు. ‘‘మంత్రులు రాజీనామా చేయడమే కాదు. మేం పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలి. లేదంటే వారే అవిశ్వాస తీర్మానం పెట్టాలి. తదుపరి ఏపీకి చెందిన ఎంపీలంతా రాజీనామా చేయాలి. అంతేతప్ప మంత్రుల్ని ఉపసంహరించుకుంటాం.. ఎన్డీయేలో కొనసాగుతాం వంటి మాటలు వద్దు’’ అని స్పష్టం చేశారు. అనంతరం ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమవగానే ఎంపీలు సభలో ఆందోళన కొనసాగించారు. వెల్లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. ఇదే సమయంలో టీడీపీ, టీఆర్ఎస్, ఏఐఏడీఎంకే, కాంగ్రెస్లకు చెందిన సభ్యులు వేర్వేరు అంశాలపై ఆందోళన కొనసాగించడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేశారు. తిరిగి 12 గంటలకు ప్రారంభమైనప్పటికీ ఆందోళన కొనసాగడంతో సభను శుక్రవారానికి వాయిదావేశారు. జేసీ సవాలును తిప్పికొట్టిన వైఎస్సార్సీపీ ఎంపీలు.. ఇదిలా ఉండగా పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద గురువారం ఆందోళన చేస్తున్న వైఎస్సార్సీపీ సభ్యుల వద్దకొచ్చిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి మీసం మెలేస్తూ.. తొడ కొడుతూ.. ‘మీకు మగతనముంటే బయటకు రండి.. మేం వచ్చేశాం.. మా మంత్రులు రాజీనామా చేశారు..’ అంటూ సవాలుకు దిగారు. వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రతిస్పందిస్తూ.. ‘మేం ఎన్డీయేలో లేం బయటకు రావడానికి... ఏప్రిల్ 6న రాజీనామా చేస్తున్నామని మేం ముందే ప్రకటించాం..’ అంటూ తిప్పికొట్టారు. ప్రత్యేక హోదా కోసం నినదిస్తూ ఆయనకు బదులిచ్చారు. -
‘డబుల్’ ఇళ్ల కోసం ఆందోళన
గంగాధర(చొప్పదండి) : తమ గ్రామ సమీపంలోని ప్రభుత్వ స్థలాన్ని తమకే కేటాయించి డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించివ్వాలని డిమాండ్ చేస్తూ గంగాధర పంచాయతీ మంగపేట గ్రామస్తులు సోమవారం గంగాధర చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. నారాయణపూర్ రిజర్వాయర్ నిర్మాణం ద్వారా గంగాధర ఎల్లమ్మ చెరువు నిండి తమ గ్రామంలోకి నీరు వస్తుందన్నారు. నీరుండడంతో ఇళ్లకు ప్రమాదంతోపాటు క్రిమికీటకాలతో తిప్పలుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామాన్ని నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ వైధ రామానుజం, ఎంపీటీసీ పెరుక శ్రావణ్ సంఘీభావం ప్రకటించారు. పోలీసులు వారి రాస్తారోకోను విరమింపజేశారు. -
ఎమ్మార్పీఎస్ ర్యాలీ ఉద్రిక్తం
హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఆదివారం రాత్రి భారతి సంస్మరణ సభ తరువాత సికింద్రాబాద్ నుంచి ట్యాంక్బండ్ వైపు భారీ ర్యాలీగా బయలుదేరిన ఎమ్మార్పీఎస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయినా ఆందోళనకారులు కొంతదూరం వరకు ముందుకు వెళ్లారు. ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. చివరికి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టాయి. పోలీసులు మంద కృష్ణ సహా పలువురు ఎమ్మార్పీఎస్ నేతలను అరెస్టు చేసి, పోలీస్స్టేషన్కు తరలించడంతో ఆందోళన సద్దుమణిగింది. ఒక్కసారిగా ర్యాలీ చేపట్టి.. ఇటీవల హైదరాబాద్లోని మడ్ఫోర్ట్ వద్ద ఎమ్మార్పీఎస్ నిర్వహించిన ఆందోళనలో ఎమ్మార్పీఎస్ నాయకురాలు భారతి మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిక్విలేజ్ గ్రౌండ్లో భారతి మాదిగ సంస్మరణ సభను నిర్వహించారు. దీనికి తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో మాదిగలు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతి చిత్రపటం వద్ద క్యాండిళ్లతో శ్రద్ధాంజలి ఘటించారు. మాదిగ కళా మండలి ఆధ్వర్యంలో భారతిని స్మరించుకుంటూ పాటలు పాడి జోహార్లు అర్పించారు. అనంతరం మంద కృష్ణ మాదిగ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగలను మోసం చేశాయని ఆరోపించారు. సభ అనంతరం ట్యాంక్బండ్ వరకు ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీంతో రాత్రి 10.40 గంటల సమయంలో వేలాది మంది కార్యకర్తలతో కలసి ట్యాంక్బండ్ వైపు బయలుదేరారు. సభా ప్రాంగణం వద్ద ఉన్న పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా వీలుకాలేదు. తర్వాత కూడా పలుచోట్ల పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ప్యారడైజ్ సర్కిల్ వద్ద బారికేడ్లు, ఫెన్సింగ్ ఏర్పాటు చేసినా.. ఆందోళనకారులు తమతో తెచ్చుకున్న కర్రలతో వాటిని తోసేసి ముందుకు కదిలారు. లారీలను అడ్డుపెట్టినా నిలువరించలేకపోయారు. చివరికి ఎంజీ రోడ్లోని రాంగోపాల్పేట్ పాత పోలీస్స్టేషన్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించి.. ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంతసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు మంద కృష్ణ, మరికొందరు ఎమ్మార్పీఎస్ నేతలను అరెస్టు చేశారు. మిగతా ఆందోళనకారులను చెదరగొట్టారు. కాగా.. ఆందోళనకారులు దాడులు చేయడంతో పోలీసులకు చెందిన రెండు వాహనాలు స్వల్పంగా ధ్వంసమ య్యాయి. ఇక ర్యాలీగా వస్తున్న వారిలో ఇద్దరు మహిళలు సొమ్మసిల్లి పడిపోవడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. వర్గీకరణపై మోసం చేశారు: మందకృష్ణ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట తప్పారని, మాదిగలను మోసం చేశారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణపై ప్రధాని అపాయింట్మెంట్ తీసుకోవడంలో కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దాని మూలంగానే భారతి చనిపోయారని పేర్కొన్నారు. వర్గీకరణ ఉద్యమంలో 8 మంది అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 1న అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. లంబాడీలు, ఆదివాసీల గొడవలకు అధికారులను బలి పశువులను చేయడం తగదని.. సమస్యను పరిష్కరించకుండా వదిలేయడంతో ఉగ్రరూపం దాల్చిందన్నారు. -
ఆరని ‘జెరూసలేం’ ఆగ్రహజ్వాలలు
జెరూసలేం: ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేంను గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. శుక్రవారం వివిధ దేశాల్లో ముస్లింలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. పాలస్తీనాలోని గాజా, వెస్ట్బ్యాంక్లో భారీ సంఖ్యలో నిరసన కారులు రోడ్లపైకి వచ్చారు. ట్రంప్ చిత్రాలను, ఇజ్రాయెల్, అమెరికా జాతీయ పతాకాలను దహనం చేయటం వంటి చర్యలతో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెస్ట్బ్యాంక్లో ఆందోళనకు దిగిన నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయుగోళాలు, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. గాజా, ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఆందోళన కారులు భద్రతా దళాలతో తలపడ్డారు. ఇరాన్, ఇండోనేసియా, మలేసియా, పాక్, జోర్డాన్లలో ప్రదర్శనలు నిర్వ హించారు. అమెరికా ముస్లింలను అణచివేస్తోందంటూ తీవ్రవాద సంస్థ అల్కాయిదా ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా, దాని మిత్ర దేశాలు, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పవిత్ర యుద్ధం చేయాలని ముస్లిం ప్రపంచానికి పిలుపునిచ్చింది. మరో సాయుధ పోరాటానికి సిద్ధం కావాలని పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ ప్రజలను కోరింది. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, తీవ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా(జేయూడీ)నేత హఫీజ్ సయీద్ లాహోర్లో భారీ ర్యాలీ చేపట్టాడు. శ్రీనగర్తోపాటు కశ్మీర్వ్యాప్తంగా శాంతియుత ప్రదర్శనలు జరిగాయి. నిరసనకారులు అమెరికా వ్యతిరేక నినాదాలు చేశారు. మధ్య ఆసియా ప్రాంతం మరింత అస్థిరతకు గురి కానుందని పలువురు యూరోపియన్ యూనియన్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి ప్రక్రియకు ఈ నిర్ణయం విఘాతం కలిగిస్తుందని, ఈ ప్రాంత సుస్థిరతకు మరో సవాలుగా మారనుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మేక్రాన్ తెలిపారు. వాస్తవాల ఆధారంగానే నిర్ణయం: వైట్హౌస్ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా ప్రకటించామని అమెరికా అధ్యక్ష భవనం ప్రకటించింది. అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం సబబేనని, మధ్య ఆసియాలో శాంతి స్థాపనకు అమెరికా కట్టుబడి ఉంటుందని తెలిపింది. కాగా, మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, జార్జ్బుష్ చేయలేకపోయిన పనిని తాను ధైర్యంగా చేశానని ట్రంప్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి జార్జ్బుష్, బిల్క్లింటన్లు చేసిన ఉపన్యాసాల వీడియోలను విడుదల చేశారు. ఒబామా ఇజ్రాయెల్ రాజధానిగా పలుమార్లు పేర్కొన్నారని ఉదహరించారు. -
కొనసాగుతున్న సంగీత ఆందోళన
-
పాత జ్ఞాపకాలు వేధిస్తున్నాయా?
సెల్ఫ్ చెక్ గతానుభవాలు మిమ్మల్ని వేధిస్తున్నాయా లేక ఆనందంగానే గడుపుతున్నారా? ఈ సెల్ఫ్చెక్ ద్వారా గుర్తు చేసుకోండి. 1. గత అనుభవాలు గుర్తుకురాకుండా ఏదో పని చేస్తూ కాలం గడుపుతారు. ఎ. అవును బి. కాదు 2. భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒంటరిగా కూర్చుని పెద్దగా ఏడ్చి తర్వాత సాధారణæ స్థితికొచ్చేస్తారు. ఎ. అవును బి. కాదు 3. చేదు జ్ఞాపకాలను పదేపదే గుర్తుచేసుకునే అలవాటుంది. ఎ. కాదు బి. అవును 4. స్నేహితులతో ఎక్కువసేపు గడపటంతో పాటు కొత్త స్నేహితులను ఏర్పరుచుకోవటానికి ప్రయత్నిస్తారు. ఎ. అవును బి. కాదు 5. గతం కన్నా భవిష్యత్ గురించిన ఆలోచనలే మనసులో మెదులుతుంటాయి. ఎ. అవును బి. కాదు 6. పాటలు, డ్యాన్స్ వంటి వాటితో ఎక్కువసేపు కాలక్షేపం చే స్తుంటారు. ఎ. అవును బి. కాదు 7. చిన్నచిన్న విషయాలకే కోపం తెచ్చుకోకుండా ఓర్పుగా ప్రవర్తిస్తారు. ఎ. అవును బి. కాదు 8. గత రిలేషన్ ద్వారా లభించిన బహుమతులు, జ్ఞాపికలలాంటి వాటికి ఇంట్లో స్థానం లేకుండా చేస్తారు. ఎ. అవును బి. కాదు 9. దుఃఖం పొంగిపొర్లే సమయంలో చిరునవ్వుతో మరో విషయంపై మనసును మరల్చుకుంటారు. ఎ. అవును బి. కాదు 10. రాత్రిళ్లు నిద్ర రాకుంటే నిద్రమాత్రలు అలవాటు చేసుకోకుండా మంచి పుస్తకాలు చదవడం, టీవీ చూడటం ద్వారా ఎంటర్టైన్ అవుతారు. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘బి’లు 7 దాటితే మీరు గతకాలపు చేదు అనుభవాల వల్ల ఇంకా ఆందోళన చెందుతున్నారనే చెప్పాలి. ఇది మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. కాబట్టి వెంటనే ఇలాంటి ఆలోచనలను పక్కన పెట్టండి. ‘ఎ’లను సూచనలుగా భావించి అలా చేయటానికి ప్రయత్నించండి. ‘ఎ’లు 6 దాటితే మీకు జరిగిన చేదు జ్ఞాపకాలను వీలైనంత త్వరగా మర్చిపోవటానిక ప్రయత్నిస్తుంటారు. కొత్త జీవితానికి స్వాగతం పలకటానికి మీరు సిద్ధంగా ఉన్నారని అర్థం. ప్రాక్టికల్గా ఆలోచించే వారు ఎప్పుడూ ఆనందంగా ఉండగలరు. -
తాగుబోతులు తలుపులు కొడుతున్నారు
►కారప్పచ్చడి పెట్టాలంటూ కేకలు వేస్తున్నారు ►మద్యం రాయుళ్లతో మనశ్శాంతి కరవైంది ►మా కాలనీల్లో మద్యం దుకాణాల్ని తొలగించండి ►అధికారులకు బాధితుల వేడుకోలు ►కలెక్టరేట్ వద్ద మహిళల ధర్నా ఒంగోలు టౌన్: ‘ఇళ్లల్లో పడుకొని ఉంటే మందు తాగినోళ్లు పెద్దగా కేకలు పెడుతూ తలుపులు దబాదబా కొడుతున్నారు. వారి గోల భరించలేక తలుపులు తెరిస్తే.. కారం పచ్చడి పెట్టాలంటూ దబాయిస్తున్నారు. నీళ్లు కావాలంటూ గోల చేస్తున్నారు. కాదంటే ఏం చేస్తారోనన్న భయంతో పెడుతున్నాం. ఒకరిని చూసి మరొకరు పగలు, రాత్రి తేడాలేకుండా ఇలా ఇళ్ల పైబడి తలుపులు కొడుతూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు’ అని వలేటివారిపాలెం మండలం పోకూరు, మద్దిపాడు గ్రామాలకు చెందిన మహిళలు వాపోయారు. వారం రోజుల క్రితం ఏర్పాటు తమ కాలనీల్లో చేసిన మద్యం దుకాణాల్ని తొలగించాలని కోరుతూ ఆయా గ్రామాల ఎస్సీ, బీసీ కాలనీల మహిళలు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. రహదారుల పక్క నుంచి జనావాసాల్లోకి వచ్చిన మద్యం దుకాణాలతో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు వీరి ఆందోళన అద్దం పట్టింది. పోకూరు బీసీ కాలనీకి చెందిన మహిళలు తెలిపిన వివరాల ప్రకారం.. పోకూరు గ్రామం వారం రోజుల కిందటి వరకు ప్రశాంతంగా ఉండేది. మద్యం దుకాణాలు హైవేలకు 500 మీటర్ల దూరంలో ఉండాలనే సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం అవన్నీ జనావాసాల్లోకి వచ్చి చేరాయి. ఈక్రమంలో పోకూరు బీసీ కాలనీలో జనావాసాల మధ్య ఓ మద్యం దుకాణం ఏర్పాటైంది. దీంతో ఇక పగలు, రాత్రి తేడా లేకుండా మందు తాగినోళ్లు రోడ్లపైకి చేరి అరుపులు, కేకలతో నానా రభస చేస్తున్నారు. కొంతమంది ఆటోలు, బండ్లపై వచ్చి కొత్తగా ఇక్కడ మద్యం దుకాణం ఎక్కడ పెట్టారంటూ ఇళ్లలో వారిని పిలిచి మరీ విచారిస్తున్నారు. ఈ దుకాణం సమీపంలో వాటర్ ప్లాంటుతోపాటు అంకమ్మ తల్లి గుడి, చర్చి ఉంది. మహిళలు బహిర్భూమికి అటువైపుగా వెళ్తుంటారు. మద్యం రాయుళ్లకు భయపడి పగలు అటువైపుగా వెళ్లాలంటేనే మహిళలు, బాలికలు భయపడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ ఇబ్బందులు భరించలేని కాలనీకి చెందిన మహిళలు సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చారు. కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికైనా స్పందించి తమ గ్రామంలో మద్యం దుకాణం తొలగించాలని వేడుకున్నారు. -
మీ దుఃఖానికి కారణం మీరేనా?
సెల్ఫ్చెక్ మానసికంగా, శారీరకంగా బలంగా ఉండాలంటే సంతోషంగా ఉండాలి. మీప్రవర్తనే మీలో ఆనందాన్నైనా, దుఃఖాన్నైనా కలిగిస్తుంది. ఇతరులని అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. దీని ద్వారానే అపోహలైనా, కలహాలైనా, మంచి సంబంధాలైనా కలుగుతాయి. వివిధ రకాల ప్రవర్తనలు మీలో సంతోషాన్ని నింపుతున్నాయా? ఆందోళనను కలిగిస్తున్నాయా? ఈ సెల్ఫ్చెక్ ద్వారా మీ భావాలను తెలుసుకోండి. 1. ఎవరైనా మిమ్మల్ని అభినందిస్తే చాలా తేలికగా తీసుకొని పెద్దగా స్పందించరు. ఎ. అవును బి. కాదు 2. మీ స్నేహితులు మీ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటే వాళ్లని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఎ. అవును బి. కాదు 3. నిరాశావాదం మిమ్మల్ని వెంటాడుతుంది. ఎ. అవును బి. కాదు 4. తప్పు జరిగిందని గ్రహించినా మళ్లీమళ్లీ అలాంటి పొరపాటునే చేస్తుంటారు. ఎ. అవును బి. కాదు 5. మీకెవరైనా గిఫ్ట్ ఇస్తే చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎ. అవును బి. కాదు 6. ఖరీదైన వస్తువులు కొన్నప్పుడు చాలా దిగులు చెందుతారు. ఎ. అవును బి. కాదు 7. మీకు రావలసిన ప్రమోషన్ వివిధ కారణాలవల్ల రాకపోతే తీవ్ర నిరాశకు గురవుతారు. ఎ. అవును బి. కాదు 8. అర్థంలేని అనుమానాలు, అపోహలు మిమ్మల్ని వేధిస్తుంటాయి. ఎ. అవును బి. కాదు 9. పార్టీలో సూప్ మీపై పడితే పెద్ద అవమానంగా భావిస్తారు. ఎ. అవును బి. కాదు 10. సమాజంలో చాలామంది మంచివారు కారని మీ విశ్వాసం. ఎ. అవును బి. కాదు ‘ఎ’ సమాధానాలు 7 దాటితే మీ ఆలోచనలతో మీకై మీరే అసంతృప్తిని, దుఃఖాన్ని కలిగించుకుంటారు. ఎప్పుడూ దిగాలుగా ఉంటూ నిరాశావాదంతో, అభద్రతా భావంలో ఉండిపోతారు. ఇలాంటి ఆలోచనలను, ప్రవర్తనను మీరు వెంటనే వదిలిపెట్టాల్సి ఉంటుంది. ‘బి’ సమాధానాలు ‘ఎ’ కంటే ఎక్కువగా వస్తే మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. నెగెటివ్ ఆలోచనలకు దూరంగా ఉంటారు. పదిమందితో కలిసిపోయి హాయిగా ఉంటారు. -
అన్నాడీఎంకే ప్రభుత్వ పతనం తప్పదు
► ఎంకే స్టాలిన్ ► పుదుక్కోట్టైలో ఆందోళన టీనగర్: అన్నాడీఎంకే ప్రభుత్వ పతనం తప్పదని, అది తనంత తానుగా కూలిపోతుందని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. స్టాలిన్ చెన్నై నుంచి విమానం ద్వారా తిరుచ్చికి బయలుదేరి వెళ్లారు. ముందుగా ఆయన చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు మీరు ప్రయత్నిస్తున్నట్లు పాలకులు ఆరోపిస్తున్నారన్న విలేకరి ప్రశ్నకు స్టాలిన్ స్పందిస్తూ తాను అటువంటి ప్రయత్నాలు చేయడం లేదని, వారి ప్రభుత్వాన్ని వాళ్లే కూల్చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. రాష్ట్రంలో ప్లాస్టిక్ బియ్యం వంటి కల్తీ వస్తువులు పెరగడంపై ప్రశ్నించగా స్టాలిన్ బదులిస్తూ రాష్ట్రంలో ఇదివరకే పాలలో కల్తీగా పేర్కొన్నారని, అయితే దాన్ని కనుగొని తగిన పరిష్కారం ఇంకా సూచించలేదని తెలిపారు. ఒకే విమానంలో స్టాలిన్, నిర్మలా సీతారామన్: పుదుక్కోటై్టలో జరిగే ఆందోళనలో పాల్గొనేందుకు ఎంకే స్టాలిన్ చెన్నై నుంచి ఆదివారం ఉదయం జెట్ ఎయిర్వేస్ విమానంలో తిరుచ్చి చేరుకున్నారు. అదే విమానంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రయాణించారు. ఆమె పుదుక్కోట్టై, తిరుచ్చిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చారు. పుదుక్కోట్టైలో డీఎంకే ఆందోళన: డీఎంకే ఎమ్మెల్యేల అరెస్టును ఖండిస్తూ పుదుక్కోట్టైలో ఆదివారం సాయంత్రం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. పుదుక్కోట్టై చిన్నప్ప పార్కు దీనికి వేదికగా నిలిచింది. ఇందులో డీఎంకే నేతలు పాల్గొన్నారు. ఇందులో స్టాలిన్ మాట్లాడుతూ అన్నాడీఎంకే ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, డీఎంకే ఎమ్మెల్యేల అరెస్టు ఇందుకు నిదర్శనమన్నారు. ఇలావుండగా పుదుక్కోట్టైలో ఆందోళన జరిపేందుకు స్టాలిన్కు మదురై హైకోర్టు అనుమతి నిచ్చింది. అంతర్జాతీయ విచారణ జరపాలి: శ్రీలంక తమిళులపై సైనికులు జరిపిన ఊచకోత గురించి స్వేచ్ఛగా అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ జరపాలని కోరారు. దీనిగురించి ఐక్యరాజ్య సమితి హక్కుల కమిషన్ అధికారి కేట్ గిల్మోర్కు రాసిన లేఖలో ఈ విధంగా ప్రస్తావించారు. -
లండన్లో బెలూచిస్థాన్ ప్రజల ఆందోళన
-
ఏపీలో ఆశా వర్కర్ల ఆందోళన
-
ఎటాక్
► చెన్నైకి చేరిన అన్నదాతల ఆందోళనల సెగ ► కత్తిపార ఫ్లైవోర్ దిగ్బంధం ► అర్ధ్దనగ్న ప్రదర్శన – రాస్తారోకో ప్రశాంతంగా సాగిపోతున్న జనజీవనం అకస్మాత్తుగా స్తంభించిపోయింది. వేగంగా పరుగులు తీసే వందలాది వాహనాలకు ఉన్నట్లుండి బ్రేక్ పడింది. రాస్తారోకోలతో అన్నాసాలై, అర్ధనగ్న ఆందోళనకారులతో శాస్త్రిభవన్ అట్టుడికింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: కరువు కోరల నుంచి కాపాడాలని కోరుతూ తమి ళనాడు రైతులు నెలరోజులకుపైగా ఢిల్లీలో సాగిస్తున్న ఆందోళనల సెగ గురువారం చెన్నైని తాకి ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అష్టకష్టాలను ఎదుర్కొంటున్న అన్నదాతలను ఆదుకోవాలని కోరుతూ ఢిల్లీలో తమిళనాడు రైతులు చేపట్టిన ఆందోళన గురువారానికి 31వ రోజుకు చేరుకుంది. ఢిల్లీలో రోజుకో రీతిలో నిరసన ప్రదర్శనలు చేస్తున్న రైతులు గురువారం నాడు మండుటెండలో నడిరోడ్డుపై పల్టీలు కొడుతూ ర్యాలీగా ముందుగా సాగారు. అలాగే తంజావూరు జిల్లాలో రైతులు సాగిస్తున్న ఆందోళనలు 17వ రోజుకుచేరుకున్నాయి. వ్యవసాయ మంత్రి దురైకన్ను రైతన్నలతో జరిపిన చర్చలు విఫలమైనాయి. రైతుల అండగా త్వరలో ఆందోళనకు దిగుతున్నట్లు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తిరునావుక్కరసర్ ప్రకటించారు. డిల్లీలో గురువారం తమిళ రైతులను పరామర్శించిన టీఎన్సీసీ మాజీ అధ్యక్షులు ఇళంగోవన్ మీడియాతో మాట్లాడుతూ, రైతుల ఆవేదనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. కత్తిపార ఫ్లైవోర్ దిగ్బంధనం : అక్కడి అన్నదాతలకు ఇక్కడి విద్యార్ది, యువజన సంఘాలు గత కొన్నిరోజులుగా సంఘీభావం ప్రకటిస్తూనే ఉన్నాయి. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదు. దీంతో ఇక లాభం లేదను అనుకున్న యువజన, విద్యార్ది సంఘాల ప్రతినిధులు ఒక పథకం ప్రకారం నగరం నలుమూలలకు రహస్యంగా ప్రవేశించారు. తమిళ సినీ దర్శకుడు గౌతమన్ నేతృత్వంలో వందలాది మంది యువకులు ఉదయం 9.30 గంటల సమయంలో గిండీలోని కత్తిపార ఫ్లయివోవర్కు చేరుకున్నారు. రోడ్డు రెండువైపులను కలుపుతూ బలమైన భారీ గొలుసులను అమర్చి తాళాలు వేశారు. సహజంగా ఫ్లయివోవర్లపై పోలీసులు ఉండరు. దీంతో అందోళనకారుల పని సులువుగా పూర్తయింది. అంతే ఒక్కసారిగా అటువైపు తాంబరం, ఇటువైపు అశోక్ పిల్లర్, అన్నాశాలై వైపు సైదాపేట వరకు కిలోమీటర్ల పొడవునా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ప్రజలు, పోలీసులు ఏమైందోనని బిత్తరపోయారు. ట్రాఫిక్ పోలీసులు షాక్ నుండి తేరుకునేలోపే ఉద్యమకారులు ప్లకార్డులతో ఫ్లైవోవర్పై బైఠాయించారు. ఉరుకులు పరుగులతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనాకారులను చెదరగోట్టే ప్రయత్నం చేయగా స్వల్పఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులను బలవంతంగా రోడ్డుపై నుండి లాగివేసి గుంపులు గుంపులుగా అరెస్ట్ చేశారు.. వాహనాల రాకపోకలకు అడ్డంగా నాలుగు వైపు రోడ్డుల్లో కట్టిన గొలుసులను తొలగించేందుకు పోలీసులు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. గొలుసులకు రెండువైపులా వేసిన తాళాలను పగులగొట్టలేక పడరాని పాట్లు పడ్డారు. ఇదిలా ఉండగా, తమిళర్ ఎళుచ్చి ఇయక్కం కార్యకర్తలు చెన్నై అన్నాశాలైలోని ప్రధాన తపాలా కార్యాలయం ముందు ప్రధాని మోదీ మాస్క్లు నిరసన ప్రదర్శన చేశారు. పలువురు కార్యకర్తలు ఒంటికి గొలుసులు చుట్టుకుని ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. అలాగే నుంగంబాక్కంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయమైన శాస్త్రిభవన్ ముందు తందై పెరియార్ ద్రావిడర్ కళగంకు చెందిన 30 మందికి పైగా కార్యకర్తలుల అర్దనగ్న ప్రదర్శనకు దిగారు. అకస్మాత్తుగా రాస్తారోకోకు పూనుకోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని అందరినీ అరెస్ట్ చేశారు. ఒక్కసారిగా నగరం నలుమూలల నుండి ఆందోళనకారులు విరుచుకుపడటంతో ప్రజలు, పోలీసులు ఉక్కిరిబిక్కిరై పోయారు. -
ఒంటిపై రాతలతో నిరసన
► ఢిల్లీలో తమిళ రైతుల ఆందోళన ► 30వ రోజుగా డిమాండ్ల పరిష్కారానికి పట్టు టీనగర్: ఢిల్లీలో తమ డిమాండ్ల కోసం ఆందోళన జరుపుతున్న తమిళ రైతులు బుధవారం ఒంటిపై రాతలతో నిరసన చేపట్టారు. ప్రస్తుతం ఈ ఆందోళన 30వ రోజుకు చేరుకుంది. ఇందులో ఎలాగైనా తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆం దోళన కొనసాగిస్తామని పట్టుబట్టారు. ఇంతవరకు అనేక వినూత్న పద్ధతుల్లో ఆందోళన జరుపుతున్న రైతులు బుధవారం తమ ఒంటిపై ‘బ్యాంకు రుణాలు మాఫీ చేయాలి, కావేరి మేనేజ్మెంట్ బోర్డు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేయా లి’ అంటూ తమ ఒంటిపై డిమాండ్లను రాసి ఆందోళన జరిపారు. ఇందులో ఓపీఎస్ వర్గం, శశికళ వర్గానికి చెందిన పలువురు ఎంపీలు పాల్గొన్నారు. అంతేకాకుండా కేంద్ర మంత్రులు పాల్గొన్నట్లు సమాచారం అందింది. ఇలాఉండగా మంగళవారం బీజేపీ కేంద్ర మంత్రి పొన్రాధాకృష్ణన్ను కలిసి రైతు సంఘాల అధ్యక్షుడు అయ్యాకన్ను చర్చలు జరిపా రు. అందులో కొంత అనుకూలత ఏర్పడినందున బుధవారం మళ్లీ ఆయన కార్యాలయంలో రాతపూర్వకంగా తమ డిమాండ్లను తెలిపారు. ఈ సందర్భంగా పొన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతు సంఘాల అధ్యక్షుడు అయ్యాకన్ను సహా ఐదుగురు బు«ధవారం ఉదయం పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురైను కలిశారు. దీనిగురించి తంబిదురై మాట్లాడుతూ రాష్ట్ర రైతుల కోర్కెల గురించి ప్రధానికి పిటిషన్ అందజేశానని, దీన్ని స్వీకరించిన ప్రధాని రైతుల బ్యాంకు రుణాలు, కావేరి మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు, కరువుసాయం అందజేత తదితర పరిష్కారాల గురించి అతిత్వరలో చర్యలు తీసుకుంటామని లేఖ ద్వారా తెలిపారన్నారు. ఈ లేఖను రైతుల పోరాటంలో పాల్గొననున్న సమయంలో వారికి చూపుతామన్నారు. ఇలాఉండగా పొన్రాధాకృష్ణన్ నేతృత్వంలో రాష్ట్ర పంచాయతీ అధ్యక్షుడు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. పరిశుభ్రమైన మంచినీటి సరఫరా, 100 శాతం మరుగుదొడ్ల కల్పన, తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం పంచాయతీ అధ్యక్షులకు అవార్డులను అందజేసి ప్రోత్సహిస్తోంది. ఈ అవార్డులను అందుకునేందుకు కొందరు మాజీ పంచాయతీ అధ్యక్షుడు ఢిల్లీకి సోమవా రం చేరుకున్నారు. వీరంతా బుధవారం ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఇందులో కేంద్ర మంత్రి పొన్రాధాకృష్ణన్ పాల్గొన్నారు. 25 నుంచి రాస్తారోకో :రైతుల సంఘం ప్రకటన వ్యవసాయ రుణాలు రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 25వ తేదీ నుంచి రాస్తారోకోలు జరపనున్నట్లు రైతుల సంఘం ప్రకటించింది. రాష్ట్ర రైతుల సంఘం కార్యవర్గ సమావేశం సేలంలో మంగళవారం జరిగింది. ఇందులో రాష్ట్ర అధ్యక్షుడు చిన్నస్వామి పాల్గొన్నారు. ఇందులో వ్యవసాయ రుణాలను రద్దు చేయాలని కోరుతూ ఈనెల 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకో ప్రదర్శనలు జరిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. నారాయణస్వామి డిమాండ్ : రైతుల రుణాలను మాఫీ చేయాలని కోరుతూ పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు కుటుంబానికి రూ.20 వేల సాయం రైతు భధ్రతా పథకంలో సభ్యునిగా ఉన్న రైతు సహజ మరణం పొందితే ఆయన కుటుంబానికి ఆర్థికసాయాన్ని రూ.20 వేలుకు పెంచుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఉత్తర్వులు జారీ చేశారు. -
ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ సిబ్బంది ఆందోళన
-
మేం మోసపోయాం..!
► తిరిపుర చిట్ఫండ్ కార్యాలయం ఎదుట ఆందోళన ► గడువు దాటినానగదు ఇవ్వలేదంటున్న బాధితులు రాయచోటి రూరల్: రాయచోటిలోని తిరిపుర చిట్స్ కార్యాలయం వద్ద మంగళవారం సుమారు 40 మంది బాధితులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన చేపట్టారు. చిట్స్ వేసే సమయంలో 5నెలలకే నగదు చెల్లిస్తామన్న చిట్స్ కార్యాలయ మేనేజర్, సిబ్బంది ఏడాది, 14నెలలు దాటినా కూడా రోజుల తరబడి వాయిదాలు వేస్తూ , కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారే తప్ప నగదు ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఈ మేరకు మంగళవారం తిరిపుర కేంద్ర కార్యాలయం చెన్నై నుంచి పలువురు అధికారులు రాయచోటి కార్యాలయానికి వచ్చారనే విష యం తెలుసుకున్న బాధితులు వారికి సంబం ధించిన చిట్స్ నోట్స్ తీసుకొని కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వకుం డా, రెండు రోజులు, 10రోజుల లోపు అందరికీ నగ దు ఇచ్చేస్తామంటూ గతంలో చెప్పిన విధంగానే చెప్పడంతో బాధితులు సి బ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిట్స్ వేసుకునే సమయంలో అందరికీ 5నెలలు ప్రీమియం చెల్లించిన తరువాత 6 నెలల్లోనే వారు ఎంచుకున్న చిట్ఫండ్ మొత్తం ఇస్తామన్నారని, ఇప్పుడు ఆ వి ధంగా చేయడం లేదని బాధితులు అం టున్నారు. కొందరికైతే ఇదిగో, అదిగో చెక్కులు ఇస్తామంటూ కాలం వెల్లదీస్తున్నారని వాపోతున్నారు. ఈ చిట్స్ను నమ్ముకుని తమ సొంత అవసరాలు, పనులు జరగక పూర్తిగా ఇబ్బందులకు గురవుతున్నామని పలువురు మహిళలు, బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరూ ఆందోళన చెందాలి్సన అవసరం లేదు కొందరు వ్యక్తులు వారి చిట్ఫండ్ గురించి ఆందోళనతో కార్యాలయానికి వచ్చారు. అందరితో మాట్లాడాము. కొందరికి నగదు ఇచ్చాము. ఎవరూ ఆందోళన చెందాలి్సన అవసరం లేదు. అందరికీ న్యాయం జరుగుతుంది. –జగదీష్రెడ్డి, రాయచోటి తిరిపుర బ్రాంచ్ మేనేజర్ -
డీసీఐలో వాటాలు అమ్మకండి
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంపెనీ (డిసిఐ) ఈక్విటీలో మెజారిటీ వాటా వ్యూహాత్మక అమ్మకాలకు ప్రభుత్వం నిర్ణయించిందన్న వార్తలపై వైఎస్ఆర్ సీపీ పార్టీ ఎంపీ (రాజ్యసభ్యుడు) వి. విజయ సాయి రెడ్డి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లోని తన విశాఖ నోడల్ జిల్లాలో, ప్రపంచంలో టాప్ టెన్ కంపెనీల్లో ఒకటిగా వెలుగొందుతున్న డీసీఐ లో 51శాతం ప్రభుత్వ వాటా విక్రయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన రాజ్యసభలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. శాశ్వతంగా నష్టాల్లో కూరుకుపోయిన సంస్థకు బదులుగా లాభాలతో ఆదాయాన్ని ఆర్జిస్తున్న కంపెనీలో వాటా విక్రయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో మినీ రత్నగా, నావీ రంగంలో, పోర్ట్ సెక్టార్ లో డ్రెడ్జింగ్ అవసరాలను తీరుస్తున్న డీసీఐలో పెట్టుబడుల ఉపసంహరణపై విజయ సాయి రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ మరియు అంతర్జాతీయ ఒప్పందాలు ద్వారా లాభాలను గడిస్తున్న సంస్థ తాజాగా బంగ్లాదేశ్ మంగోలా ఓడరేవుతో ఒప్పందాన్ని కుదుర్చుకుందన్నారు. ప్రభుత్వ వాటా విక్రయ వార్తలతో కంపెనీ షేరు 26.53శాతం పతనానికి దారి తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1976 లో విశాఖలో ఏర్పాటైన డీసీఐ ప్రస్తుతం రూ.680 కోట్ల టర్నోవర్ తో గత ఏడాది రూ. 80 కోట్ల లాభాలను సాధించిందని చెప్పారు. అత్యంత లాభాలతో నడుస్తున్న కంపెనీని ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టడం సరైందికాదన్నారు. దీంతో త్రవ్వకాల ధరలు భారీగా పెరగడంతోపాటు, 600 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కూడా రోడ్డుపడతారన్నారు. ఈ విషయాలను పరిశీలించి బలమైన, లాభాలతో నడుస్తున్న కంపెనీలో పెట్టుబడుల ఉపసంహరణపై ఇకనైనా ప్రభుత్వం పునరాలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
నకిలీ నోట్లు అక్కడక్కడే...
ఆందోళన అక్కర్లేదు: ఆర్బీఐ ముంబై: దేశంలో నకిలీ నోట్ల సమస్య చాలా చిన్నదని, ఇది అక్కడక్కడా వెలుగుచూస్తున్న అంశమని, దీనిపై ఆందోళన చెందాల్సింది ఏదీ లేదనీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ పేర్కొన్నారు. అయితే ఇలాంటి సమస్యలనూ పూర్తిగా నిరోధించడానికి ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటుందనీ, ఔట్సోర్డ్స్ క్యాష్ మేనేజ్మెంట్ ఏజెన్సీలకు మార్గదర్శకాలను పునఃపరిశీలించనుందని గాంధీ తెలిపారు. గడచిన వారంరోజుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్లలోని పలు ఏటీఎంలలో నకిలీ నోట్లు వచ్చాయన్న వార్తల నేపథ్యంలో గాంధీ ఈ ప్రకటన చేశారు -
రాములోరిని వెళ్లగొట్టారు !
పురాతన ఆలయం, విగ్రహాల తొలగింపు మధనపడుతున్న మాదనపాళెం గ్రామస్తులు ‘ ఊళ్లోని దేవుడిని ఊరికి దూరంగా సాగనంపారు. గ్రామస్తులు కొందరిని జైలుపాలుచేశారు’ అంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు మాదనపాళెం గ్రామస్తులు. శతాబ్ద కాలంగా పూజలు అందుకున్న శ్రీరాములుగుడి తొలగింపుపై మధనపడుతున్నారు. మాదనపాళెం(సత్యవేడు) : మండలంలోని చెరివి పంచాయతీలోగల మాదనపాళెంలోని శ్రీరాములు గుడికి ఆ రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబరు–1లో 630 ఎకరాల మా న్యం భూములు ఉన్నాయి. 120 ఏళ్లకు మునుపు సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయుని విగ్రహాలు ఆ గుడిలో ప్రతిష్ఠించినట్లు గ్రామపెద్దల సమాచారం. అప్పటి నుంచి నిత్యపూజలు, శ్రీరామ నవమికి విశేషపూజలు నిర్వహిస్తున్నారు. పూజారికి వాయనం కూడా గ్రామస్తులంతా కలిసి ఇస్తున్నారు. ఇరవై ఏళ్ల కిందట విగ్రహాలు చోరీ అయితే, గ్రామస్తులు మళ్లీ విగ్రహాలు తయారుచేయించి ప్రతిష్ఠిం చారు. ఈ గుడికే ప్రత్యేకంగా 3–14 ఎకరాలు, సర్వే నంబరు 3లో 5.50 ఎకరాల గ్రామనత్తం ఉంది. శ్రీరామ నవమి ఉత్సవాల నిర్వహణకు ఈ స్థలాన్ని వినియోగించుకుంటున్నారు. ఏపీఐఐసీకి భూముల కేటాయింపుతో... మాదనపాళెం సర్వే నంబరు–1లోని 630 ఎకరాల భూములను ప్రభుత్వం ఏపీఐఐసీకి కేటాయించింది. ఏపీఐఐసీ హీరో మోటార్స్కు ఈ స్ధలాన్ని కేటాయించింది. ఆరు కోట్ల రూపాయలతో ఆ భూముల చుట్టూ ప్రహరీగోడ నిర్మాణానికి పూనుకున్నారు. దేవాలయానికి ప్రత్యేకంగా ఉన్న భూమి 3–14 ఎకరాలు, గ్రామనత్తం 5–50 ఎకరాలు వదిలి మిగతా భూములు హీరో కంపెనీకి కేటాయిం చాలని తొలి నుంచి గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఆందోళనను పట్టించుకున్న పాపానపోలేదు. కేసులు. అరెస్టులు ఏటాలాగే ఈసారీ శివరాత్రి పూజలు నిర్వహించేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంలో ప్రభుత్వం దేవాలయానికి వెళ్లే మార్గం మూసివేసే పనులు చేపట్టింది. దీంతో ఆగ్రహించిన ప్రజలు దేవాలయదారికి అడ్డంగా ఉన్న గోడను తొలగించారు. శివరాత్రి పూజలు నిర్వహిం చారు. భక్తిశ్రద్ధలతో జాగారం ఉన్నారు. పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేశారంటూ పోలీసులు తొలుత గ్రామస్తులు 25 మందిపై, ఆపై మరో పది మందిపై కేసులు బనాయించారు. అందులో 13 మందిని మూడు రోజులకు మునుపు జైలుకు పంపారు. విగ్రహాల తొలగింపులో అపశ్రుతి : ఇద్దరికి గాయాలు ఆదివారం అమావాస్య రోజున గుడిలో విగ్రహాలను దేవాదాయశాఖ అధికారులు, స్ధానిక రెవెన్యూ అధికారులు, పోలీసు బందోబస్తుతో తొలగించారు. నూతనంగా నిర్మిస్తు న్న మరో దేవాలయం వద్ద గదిలో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. విగ్రహాలను మరోచోటికి తరలించిన అధికారు లు దేవాయలం ముందు ఉన్న శక్తిపీఠాన్ని తొలగించేం దుకు ప్రయత్నించారు. జేసీబీ తొట్టె విరిగిపడింది. ఇద్దరు గాయలపాలయ్యారు. జేసీబీ డ్రైవర్ శక్తి పీఠాన్ని తొలగించేందుకు భయపడి వెళ్లిపోయాడని సమాచారం. అంతా దేవుడే చూస్తాడు తరతరాలుగా గ్రామస్తులు పూజించుకుంటున్న సీతారాముల గుడిని తొలగించేందుకు పూనుకున్న ప్రభుత్వంపై స్థానికులు మండిపడుతున్నారు. తమకు దేవుడిని దూరం చేసిన పెద్దలకు భగవంతుడు పదవులు దూరం చేయకుం డా వదలడని శాపనార్థాలు పెడుతున్నారు. -
విశ్వవిద్యాలయాల్లో భయానక వాతావరణం ప్రమాదకరం
నోబెల్ బహుమతి గ్రహీత ఆమర్త్యసేన్ న్యూఢిల్లీ: విశ్వవిద్యాలయాల్లో భయానక వాతావరణం ప్రజాస్వామ్యానికే ప్రమాదమని ప్రముఖ ఆర్థికవేత్త , నోబెల్ బహుమతి గ్రహీత ఆమర్త్యసేన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలపై విమర్శనాత్మక ప్రసంగాలు చేసే ప్రొఫెసర్లు తదితరులపై చర్యలు తీసుకోవడం సమకాలీన భారత్లో స్వేచ్ఛపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. తాను రచించిన ‘సోషల్ చాయిస్ అండ్ సోషల్ వెల్ఫేర్’ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా ఢిల్లీలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సేన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యనిర్వాహక హక్కులు ఉన్నంత మాత్రానా ప్రభుత్వమే అన్నీ తానై వ్యవహరించరాదని సూచించారు. విధాన రూపకల్పనల్లో సమానత్వం కోసం చేయాల్సిన ప్రయత్నాలు నీరుగారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మైనారిటీలు భయాందోళనలకు గురవుతున్నారని, దీని వల్ల సోదరభావం పెంపొందించడం అవరోధంగా మారిందన్నారు. ఆరోగ్యరంగం వృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందన్న నమ్మకం తనకు లేదన్నారు. చైనా తన జీడీపీలో 2 శాతం ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తుంటే భారత్లో మాత్రం 1 శాతం కన్నా తక్కువ వెచ్చిస్తున్నారని ఆమర్త్యసేన్ తెలిపారు. -
స్వైన్ ఫ్లూపై విజయసాయిరెడ్డి ఆందోళన
న్యూఢిల్లీ: దేశంలో స్వైన్ఫ్లూ వ్యాధి విస్తరిస్తుండటంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మధ్యాహ్నం జీరోఅవర్లో ఆయన మాట్లాడారు. ఏపీలో 2016 సంవత్సరంలో 12 మంది స్వైన్ఫ్లూ వైరస్ సోకగా ఐదుగురు చనిపోయారని తెలిపారు. అదేవిధంగా ఈ ఏడాది జనవరిలో 26 మంది స్వైన్ఫ్లూ బాధితులకు గాను ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. స్వైన్ఫ్లూ వ్యాప్తిని అరికట్టటంలో యంత్రాంగం విఫలమయిందని ఆరోపించారు. వ్యాధి తీవ్రతను గుర్తించలేకపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని ఆరోగ్య కుటుంబసంక్షేమ శాఖ మంత్రిని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. -
మైగ్రేన్కు మందులున్నాయా?
హోమియో కౌన్సెలింగ్ నాకు విపరీతమైన తలనొప్పి వస్తోంది. వారంలో ఒకటి, రెండు సార్లు తీవ్రంగా వస్తోంది. ఎన్నో రక్తపరీక్షలు, ఎక్స్–రే, స్కానింగ్ పరీక్షలు చేయించాను. డాక్టర్లు దీన్ని మైగ్రేన్గా నిర్ధారణ చేశారు. జీవితాంతం వస్తుంటుందని చెప్పారు. హోమియోపతిలో దీనికి చికిత్స ఉందా? – శ్రీరామ్మూర్తి, నిడదవోలు నేటి ఆధునికయుగంలో శారీరక, మానసిక ఒత్తిడి, అనిశ్చితి, ఆందోళనలు తలనొప్పికి ముఖ్యమైన కారణాలు. ఇంకా రక్తపోటు, మెదడు కణుతులు, మెదడు రక్తనాళాల్లో రక్తప్రసరణల్లో మార్పులు, సైనసైటిస్ మొదలైన వాటివల్ల తలనొప్పి వచ్చేందుకు ఆస్కారం ఉంది. తలనొపి ఏ రకానికి చెందినదో నిర్ధారణ తర్వేత ఖచ్చితమైన చికిత్స చేయడం సులువవుతుంది. కారణాలు, అది ఏరకమైనది అయినప్పటికీ తరచూ తలనొప్పి వస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. మైగ్రేన్ తలనొప్పిని పార్శ్వపు తలనొప్పి అంటారు. మానసిక ఆందోళన, ఒత్తిడి, జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, డిప్రెషన్, నిద్రలేమి, అధికప్రయాణాలు, సూర్యరశ్మి, స్త్రీలలో హార్మోన్ సమస్యల వల్ల ఈ పార్శ్వపు తలనొప్పి వస్తుంటుంది. పురుషులతో పోలిస్తే ఇది స్త్రీలలోనే ఎక్కువ. మైగ్రేన్లో దశలూ, లక్షణాలు : సాధారణంగా మైగ్రేన్ వచ్చినప్పుడు 24 గంటల నుంచి 72 గంటలలోపు అదే తగ్గిపోతుంది. ఒకవేళ 72 గంటలకు పైనే ఉంటే దాన్ని స్టేటస్ మైగ్రేన్ అంటారు. దీంతోపాటు వాంతులు కావడం, వెలుతురునూ, శబ్దాలను అస్సలు భరించలేకపోవడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. వ్యాధి నిర్ధారణ: రక్తపరీక్షలు, రక్తపోటును పరీక్షించడం, సీటీస్కాన్, ఎంఆర్ఐ పరీక్షల ద్వారా మైగ్రేన్ను నిర్ధారణ చేయవచ్చు. నివారణ: మైగ్రేన్ రావడానికి చాలా అంశాలు దోహదపడతాయి. ఉదాహరణకు మనం తినే ఆహారంలో మార్పులు, మనం ఆలోచించే విధానం, మానసిక ఒత్తిడి, వాతావారణ మార్పులు, నిద్రలేమి, మహిళల్లో రుతుసమస్యలు వంటి కారణాలతో వచ్చినప్పుడు జీవనశైలిలో మార్పులతో దీన్ని కొంతవరకు నివారించవచ్చు. ఇక మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయాలి. చికిత్స: మైగ్రేన్ను పూర్తిగా తగ్గించడానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. శారీరక, మానసిక, కుటుంబ, అనువంశీక, వాతావరణ, వృత్తిసంబంధమైన కారణాలను అంచనా వేసి, వాటిని అనుగుణంగా మందును ఎంపిక చేయాల్సి ఉంటుంది. వారి జెనెటిక్ కన్స్టిట్యూటషన్ సిమిలియమ్ వంటి అంశాలన పరిగణనలోకి తీసుకొని బెల్లడోనా, ఐరిస్, శ్యాంగ్యునేరియా, ఇగ్నీషియా, సెపియా వంటి కొన్ని మందులు మైగ్రేన్కు అద్భుతంగా పనిచేస్తాయి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ ఏడాదిలో నాలుగుసార్లు యూరినరీ ఇన్ఫెక్షన్ పీడియాట్రిక్ నెఫ్రాలజీ కౌన్సెలింగ్ మా అబ్బాయి వయసు రెండేళ్లు. వాడికి తరచూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తోంది. గత ఏడాదిలో నాలుగు సార్లు వాడికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. తరచూ వాడికి ఇలా ఇన్ఫెక్షన్ రావడం మమ్మల్ని ఆందోళనలో పడేస్తోంది. దయచేసి వాడి విషయంలో మాకు తగిన సలహా ఇవ్వండి.– ప్రవీణ్కుమార్, వరంగల్ మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్ను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటారు. ఇది మూత్ర విసర్జన వ్యవస్థలో ఎక్కడైనా రావచ్చు. అంటే మూత్రం తయారయ్యే మూత్రపిండాల వద్ద గానీ లేదా మూత్రపిండాల నుంచి మూత్రాశయానికి (బ్లాడర్కు) తీసుకువచ్చే నాళాల్లో (యురేటర్స్లో) గానీ లేదా మూత్రాశయం నుంచి మూత్రాన్ని బయటకు విసర్జించేందుకు ఉపయోగపడే నాళమైన యురెథ్రాలో గానీ... ఇలా ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్గా చెబుతారు. అంటే... ఇన్ఫెక్షన్కు కలగజేసే సూక్ష్మక్రిములు ఈ మూత్రవిసర్జన వ్యవస్థలోకి చేరి ఎక్కడైనా ఇన్ఫెక్షన్ కలిగిస్తాయన్నమాట. కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్ కలిగించే జీవులు బ్లాడర్ నుంచి పై వైపునకు ప్రసరించి మూత్రపిండాలకు (కిడ్నీలకు) హాని చేయవచ్చు. కిడ్నీలలో అబ్నార్మాలిటీ ఉన్న పిల్లల్లో (ఉదాహరణకు అబ్స్ట్రక్షన్, విసైకో యురెటెరిక్ రిఫ్లక్స్), కిడ్నీలలో రాళ్లు, మూత్రాశయం (బ్లాడర్) పూర్తిగా ఖాళీ కాకుండా అక్కడ కొంత మూత్రం మిగిలిపోవడం, మలబద్దకం వంటి సమస్యలు ఉన్న పిల్లల్లో మిగతావారి కంటే ఎక్కువగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కు గురైన పిల్లల్లో తీవ్రమైన జ్వరం మొదలుకొని అనేక లక్షణాలు కనిపిస్తాయి. వాంతులు, కడుపునొప్పి వంటివి కనిపించవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ కిడ్నీకి పాకి అక్కడ కిడ్నీని దెబ్బతీయడం జరిగితే అది కిడ్నీని శాశ్వతంగా దెబ్బతీయవచ్చు. అందుకే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. పిల్లల్లో మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ కనిపిస్తే... అందునా అది దీర్ఘకాలికంగా ఉండే వెంటనే డాక్టర్ను సంప్రదించి తగిన మందులు తీసుకోవాలి. డాక్టర్లు ఈ సమస్యను అదుపు చేయడానికి నోటి ద్వారా తీసుకునేవి లేదా నరం (రక్తనాళం) ద్వారా ఇచ్చే యాంటీబయాటిక్స్ను ఇస్తారు. ఒకవేళ తగినంత మెరుగుదల కనిపించనప్పుడు గానీ లేదా వైద్య పరీక్షల తర్వాతగానీ అవసరాన్ని బట్టి డాక్టర్లు 48 నుంచి 72 గంటల్లో యాంటీబయాటిక్స్ను మార్చి ఉపయోగిస్తారు. ఇలా మార్చి మార్చి యాంటీబయాటిక్స్ను ఉపయోగిస్తూ, వాటి కోర్సు పూర్తయ్యాక మళ్లీ వైద్య పరీక్షలు చేయిస్తూ ఫలితాలను సమీక్షిస్తూ, చికిత్సను కొనసాగిస్తుంటారు. మీ బాబు విషయంలో మీరు పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ వి.వి.ఆర్. సత్యప్రసాద్, కన్సలెట్ పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్, రెయిన్బో చిల్డ్రెన్స్ హాస్పిటల్, హైదరాబాద్ గుండె జబ్బులున్నవారు పాటించాల్సిన జాగ్రత్తలివి! కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 36 ఏళ్లు. మా దూరపు బంధువుల్లో ఇద్దరుముగ్గురు చాలా కొద్దికాలంలోనే గుండెజబ్బుతో చనిపోయారు. దాంతో నాకు ఆందోళన పెరిగింది. గుండెజబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయగలరు. – వెంకటరామ్, మహబూబ్నగర్ గుండెజబ్బులు ఉన్న కుటుంబ చరిత్ర గలవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ప్రధాన సూచనలివి... ► మీలా చిన్న వయసు వారైనప్పటికీ ఇప్పట్నుంచే తరచూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయిస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ ఉండటం మేలు. డాక్టర్ సలహాల మేరకు కొన్ని మందులు తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ను నియంత్రించుకుంటూ ఉండాలి. ►గుండెపోటు రావడానికి డయాబెటిస్ ఒక ప్రధాన కారణం. అందుకే ఆ సమస్య ఉన్నవారు రక్తంలోని చక్కెరను పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవడం తప్పనిసరి. రోజూ క్రమం తప్పకుండా మందులు వాడుతూ, డాక్టర్ సూచన మేరకు వారు సూచించిన వ్యవధిలో క్రమం తప్పకుండా రక్తంలోని చక్కెరలను పరీక్షించుకుంటూ ఉండాలి. ►కొవ్వు పదార్థాలు ఉండే ఆహారాన్ని బాగా తగ్గించాలి. ► పొగ తాగే అలవాటును పూర్తిగా వదిలేయాలి. అలాగే పొగాకుకు సంబంధించిన ఉత్పాదనలు, వస్తువులను పూర్తిగా మానేయాలి. గుండెజబ్బుల నివారణలో ఇది చాలా ప్రధానం. ► డాక్టర్ సూచనల మేరకు శరీరానికి మరీ శ్రమ కలిగించకుండా చేసే వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాలి. ► మన ఒంటి బరువును పెరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ► రక్తపోటును అదుపులో పెట్టుకోవాలి. ► మనం తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు ఒంటికి అందేలా సమతులాహారం తీసుకోవాలి. ►ఆరోగ్యకరమైన జీవనశైలిని తప్పనిసరిగా పాటించాలి. ఈ కొన్ని జాగ్రత్తలతోనే చాలావరకు గుండెజబ్బులను నియంత్రించవచ్చు. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు తమ డాక్టర్లు సూచించిన మందులను తప్పక వాడుతుండాలి. ఆరోగ్యంలో ఏమాత్రం తేడా ఉన్నట్లు అనిపించినా డాక్టర్ను తప్పక సంప్రదించాలి. ఈ కొద్దిపాటి సూచనలు పాటిస్తే గుండెపోటు వంటి ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులను నివారించడం చాలావరకు నివారించవచ్చు. డాక్టర్ హేమంత్ కౌకుంట్ల కార్డియోథొరాసిక్ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. -
పరిహారం కోసం వంశధార నిర్వాసితుల ఆందోళన
-
గురుగ్రామ్లో జాట్ వర్గీయుల ఆందోళన
-
కొర్రపాడు’ను చుట్టుముట్టిన గండికోట జలాలు
కడప రూరల్ : గండికోటకు 12 టీఎంసీల నీరు రాకముందే ముద్దనూరు మండలం కొర్రపాడు గ్రామాన్ని జలాలు చుట్టుముట్టాయి. ఫలితంగా ఆ గ్రామంలో ఉన్న దాదాపు 500 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ప్రధానంగా తాగునీరు కలుషితమైంది. దీంతో వారికి కాస్త స్వచ్ఛ నీరైనా తాగే వెసులుబాటు లేకపోయింది. ఫలితంగా ఆ గ్రామస్తులు చాలా మంది తట్టు, విష జ్వరాలు తదితర వ్యాధులతో మంచాన పడ్డారు. అలాగే చుట్టుముట్టిన నీళ్ల కారణంగా రాకపోకలు దాదాపుగా స్తంభించినట్లైంది. కాగా ఎక్కువ మంది ఇంటికి ఒకరిద్దరు చొప్పున విషజ్వరాల బారిన పడగా, అలాగే తట్టు బారిన పడిన వారు కూడా చాలా మందే ఉన్నారు. ఇటీవల ఈ గ్రామాన్ని మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ, సాగునీటి సాధన సమితి జిల్లా నాయకులు చంద్రమౌళీశ్వర్రెడ్డి సందర్శించారు. గ్రామస్తుల ఆరోగ్య స్థితిగతులపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు విన్నవించారు. ఆ మేరకు ముద్దనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ముగ్గురు నర్సులు, ఒక వైద్యుడు వచ్చి వైద్య సేవలు అందించారు. అయితే వారి దగ్గర సరిపడ మందులు లేకపోవడంతో ఉన్న వాటినే సర్దుబాటు చేశారు. అలాగే 11 మందికి తట్టు ఉన్నట్లుగా నమోదు చేసుకున్నారు. అయితే ఆ సంఖ్య ఎక్కువగానే ఉందని గ్రామస్తులు అంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆ గ్రామాన్ని మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ, సాగునీటి సాధన సమితి జిల్లా నాయకుడు చంద్రమౌళీశ్వర్రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వారి వద్ద తమ ఇబ్బందులను వివరించారు. తమకు తక్షణమే తాగునీటిని అందించాలని కోరారు. అలాగే వైద్య పరీక్షలు సత్వరమే అందేలా చూడాలని విన్నవించారు. కాగా, గండికోటకు 12 టీఎంసీలు వస్తేనే కొర్రపాడు గ్రామానికి జలాలు రావాలి. అయితే ఇప్పుడే ఆ గ్రామాన్ని ఆ జలాలు చుట్టుముట్టడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అధికారులు నష్టపరిహారం కోసం సర్వే చేపడుతున్న తరుణంలో ఇలా జలాలు రావడం ఏమిటని గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి కొర్రపాడు గ్రామస్తులను అన్ని విధాలా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. -
కలకలం
► అల్లర్ల వెనుక అదృశ్య శక్తులు ► పోలీసులపై అనుమానాలు ► వాట్సాప్ వీడియోలో దృశ్యాలు ► మెరీనాలో మళ్లీ ఆందోళనకారులు ► జల్లికట్టు ఎద్దుదాడిలో ఇద్దరు మృతి జల్లికట్టు ఉద్యమం అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లిందా? అల్లర్లను సృష్టించేందుకు పోలీసులే ప్రత్యేక పాత్ర పోషించారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియా వాట్సాప్ ద్వారా ప్రచారంలోకి రావడం కలకలాన్ని రేపింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: జల్లికట్టుకు అనుమతి కోరుతూ చెన్నై మెరీనాబీచ్ తీరంలో ఈనెల 17వ తేదీన ఆందోళనలు ప్రారంభమయ్యాయి. 20వ తేదీన జల్లికట్టు ఉద్యమకారులు చేపట్టిన బంద్ అనూహ్యరీతిలో సక్సెస్ అయింది. బంద్లో రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా. అయినా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. 21వ తేదీన ఆర్డినెన్స్ను తీసుకొచ్చిన తరువాత ఆందోళన విరమించాల్సిందిగా సీఎం పన్నీర్సెల్వం కోరారు. అయితే శాశ్వత చట్టం తెచ్చేవరకు ఆందోళన విరమించబోమని ఉద్యమకారులు స్పష్టం చేశారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఉద్యమకారులతో చర్చలు జరిపారు. అయినా వారు ససేమిరా అనడంతో సోమవారం నాడు బలవంతంగా వారిని పంపివేసే ప్రయత్నం చేశారు. దీంతో మెరీనాతీరంలో స్వల్పంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే క్రమేణా పరిస్థితి తీవ్రరూపం దాల్చగా చెన్నై ఐస్ హౌస్ పోలీస్స్టేషన్ కు నిప్పు, వందలాది వాహనాల దగ్ధం, పోలీసులపై పెట్రో బాంబులు విసరడం వంటి చర్యలతో నగరం రణరంగంగా మారిపోయింది. పోలీసులు గాల్లోకి కాల్పులు, భాష్పవాయువు ప్రయోగాలు చేయాల్సివచ్చింది. కాగా, సుమారు వందమందికి పైగా యువకులు సోమవారం రాత్రి వడపళని పోలీస్స్టేషన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపి చెదరగొట్టారు. అలాగే మరికొంత మంది అసాంఘిక శక్తులు ఆరంబాక్కం మెట్రో రైల్వేస్టేషన్ లోకి చొరపడి సీసీ కెమెరా, కిటికీలను పగులగొట్టారు. అలాగే ఆరుంబాక్కంలోని ఒక ప్రముఖ హోటల్కు స్వల్పంగా ఆస్తినష్టం కలిగించారు. రెండు ఏటీఎం సెంటర్లలోకి చొరబడి మెషిన్లను ధ్వంసం చేశారు. ఏటీఎంలలో నగదు లేకపోవడంతో చోరీ చేసే ప్రయత్నం చేయలేదు. అలాగే ఆర్కాడు నుంచి వేలూరుకు వెళుతున్న ప్రభుత్వ బస్సును సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కొందరు విద్యార్థులు పెట్రో బాంబులు విసిరి పారిపోయారు. అయితే బాంబులు పేలక పోవడంతో బస్సులోని 20 మంది ప్రయాణికులు సురక్షితంగా బైటపడ్డారు. అయితే బస్సు కండక్టర్ తలకు బలమైన గాయాలయ్యాయి. ఆందోళనకారులతో పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి చర్చలు ఫలించగా జల్లికట్టు ఉద్యమాన్ని విరమించారు. తమిళనాడు అసెంబ్లీలో సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించిన జల్లికట్టు ఆర్డినెన్స్ ను గవర్నర్ విద్యాసాగర్రావు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. మదురై జిల్లా అలంగానల్లూరు, పాలమేడు, అవనియాపురంలలో వరుసగా వచ్చేనెల 1,2, 5వ తేదీల్లో జల్లికట్టు క్రీడను జరుపుతున్న దృష్ట్యా పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. పోలీసులే పాత్రధారులా: సోమవారం నాటి అల్లర్లకు పోలీసులే తెరవెనుక పాత్రధారులనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో పార్క్చేసి ఉన్న ఆటోలకు ఒక పోలీస్ కానిస్టేబుల్ నిప్పుపెడుతున్న వీడియో రాష్ట్రంలో హల్చల్ చేసింది. ప్లాస్టిక్ సంచుల్లో పెట్రోలు తీసుకుని పోలీసులే స్వయంగా ఆటోపై చల్లి నిప్పుపెడుతున్నట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనపడుతోంది. సమీపంలోని ఒక మిద్దెపై నుంచి తన సెల్ఫోన్ లో వీడియో చిత్రీకరిస్తున్న వ్యక్తి ‘ పోలీసులే తగులబెడతారా, రాష్ట్రంలో ఏమి జరుగుతోంది’ అంటూ ఆంగ్లంలో ఆందోళన వ్యక్తం చేస్తున్న మాటలు వినపడుతున్నాయి. ప్రశాంతంగా సాగుతున్న జల్లికట్టు ఉద్యమాన్ని ఉద్రిక్తతల వైపు మళ్లించేందుకు పోలీసులే పథకం వేశారా అనే అనుమానాలు నెలకొన్నాయి. అంతేగాక విద్యార్థుల ముసుగులో కొన్ని అ సాంఘిక శక్తులు విధ్వంసక చర్యల్లో పాల్గొన్నట్లు సందేహిస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పోలీసులే పాల్పడడం దురదృష్టకరమని సదరు వీడియోను ఉద్దేశించి డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ వ్యాఖ్యానించారు. నటుడు కమల్హాసన్ సైతం ఆ వీడియోను చూశానని పేర్కొం టూ పోలీస్ చర్యల పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. సోమవారం నాటి అల్లర్లపై సీబీఐ విచారణ జరిపించాల్సింది గా పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యులు అన్బుమణి రాందాస్ డిమాండ్ చేశారు. మెరీనాలో అదే సీన్ : చెన్నై మెరీనా బీచ్లో వందల సంఖ్యలో జల్లికట్టుపై ఉద్యమకారులు మంగళవారం కూడా ఆందోళనను కొనసాగించారు. సోమవారం నాటి అల్లర్ల నేపథ్యంలో అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడిచిపెట్టాలని, వారిపై పెట్టిన కేసులను వాపసు తీసుకోవాలని డిమాండ్లపై ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం హామీ ఇచ్చేవరకు కదిలేది లేదని వారు చెప్పారు. అంతేగాక ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి ఆమోదముద్ర పడిన తరువాతనే ఆందోళన విరమిస్తామని స్పష్టం చేశారు. ఆందోళకారులను అదుపుచేసేందుకు వందమందికి పైగా పోలీసులను బందోబస్తు పెట్టి చర్చలు జరుపుతున్నారు. వంద మందికి పైగా అరెస్ట్: జల్లికట్టు ఉద్యమంలో భాగంగా ఉద్రిక్తతలు సృష్టించారనే ఆరోపణలపై చెన్నై నగరానికి చెందిన వందమందికి పైగా యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎగ్మూరు, అన్నాసమాధి, ఐస్హౌస్, అన్నాశాలై, మైలాపూర్, ట్రిప్లికేన్, వడపళని, కీల్పాక్, కొట్టూరుపురం తదితర 15 ప్రాంతాలకు చెందిన వారు అరెస్టయిన వారిలో ఉన్నారు. అలాగే పోలీసులపై దాడి చేసిన ఆరోపణలపై మరో 11 మందిని అరెస్ట్ చేశారు. చెన్నైలో సోమవారం నాటి అల్లర్లలో 232 వాహనాలు ధ్వంసంకాగా, 160 చోట్ల రాస్తారోకోలు జరిగాయని, అదనపు కమిషనర్ సహా 96 మంది పోలీసులు గాయపడ్డారు. పోలీస్స్టేషన్ కు నిప్పుపెట్టిన 9 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ మైలాపూరు పోలీస్స్టేషన్ ను ఆందోళనకారలు మంగళ వారం ముట్టడించారు. అసాంఘిక శక్తుల నుంచి పోలీ సులను రక్షించేందుకు చెన్నై ఎమ్కేపీ నగర్కు చెందిన ప్రజలు వారికి సాధారణ వస్రా్తలు ఇచ్చి ప్రజల్లో కలిసిపోయేలా చేసి ఆదుకున్న సంగతి వెల్లడైంది. పోలీస్ సహా ఇద్దరు మృతి: విరుదునగర్ జిల్లా కాన్సాపురంలో సోమవారం జరిగి న జల్లికట్టు ఒక పోలీసు ప్రాణాలను హరించింది. 50కి పైగా ఎద్దులను వాడివాసల్ గుండా వదిలారు. వందమందికి పైగా జల్లికట్టు వీరులు ఆ ఎద్దులను తమ అదుపులోకి తీసుకునేందుకు వాటి వెంట పరుగులు పెట్టా రు. పుదుపట్టికి చెందిన ఒక ఎద్దు అకస్మాత్తుగా జనంలోకి చొచ్చుకుని వచ్చి తోసేయడం ప్రారంభించింది. అక్కడే బందోబస్తులో ఉన్న అదే గ్రామానికి చెందిన ఏఆర్ పోలీసు జయశంకర్ (26)ను కొమ్ములతో ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలకు గురైన అతడిని ప్రభు త్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం మదురైకి తరలిస్తుండగా సోమవారం రాత్రి మృతి చెందాడు. జయశంకర్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే పుదుక్కోట్టై జిల్లా రాపూసల్లో జల్లికట్టు సమయంలో కరుప్పయ్య (30)ను ఎద్దు పొడవడంతో తిరుచ్చిరాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందు తూ సోమవారం రాత్రి ప్రాణాలు విడిచాడు. -
కార్పొరేషన్ అవినీతిపై ఆందోళన
= వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అఖిలపక్షం నిర్ణయం = రూ.కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారు : మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ధ్వజం అనంతపురం సప్తగిరి సర్కిల్ : అనంతపురం నగర పాలక సంస్థలో జరుగుతున్న అవినీతిపై పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని అఖిలపక్ష నేతలు తెలిపారు. అనంతపురం ప్రెస్క్లబ్లో సోమవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ అవినీతి కారణంగా నగర పాలక సంస్థ నవ్వులపాలు అవుతోందన్నారు. దీనిపై ప్రముఖ దినపత్రికలలో వార్తా కథనాలు వస్తున్నా వారి తీరులో ఎటువంటి మార్పూ లేదన్నారు. గడిచిన మూడేళ్లలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. ఉద్యోగులపై దౌర్జన్యాలకు కూడా పాల్పడుతున్నారన్నారు. కార్పొరేటర్లే కాంట్రాక్టర్లుగా మారి అవినీతి చేస్తున్నా ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. పాలకవర్గం గ్రూపులుగా విడిపోయి ‘మూడు ముక్కలాట’ ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి పనిలోనూ ఒక వర్గం చేపట్టాలని, మరో వర్గం వద్దంటూ అభివృధ్ధిని అడ్డుకుంటున్నారన్నారు. అవినీతిలో అందరూ భాగస్వాములుగా మారారని దుయ్యబట్టారు. అధికారులను నిర్బంధించి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారన్నారు. మేయర్ సమక్షంలోనే ఉన్నతాధికారిపై దాడి జరిగిందనే వాస్తవం తెలుస్తోందని, ఇలాంటి చర్యల ద్వారా నగర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. మాజీ మేయర్ రాగే పరశురాం మాట్లాడుతూ నేడు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా నగర పాలక సంస్థ అవినీతి అక్రమాలపైనే ప్రధాన చర్చ నడుస్తోందన్నారు. పాలకవర్గం అనుసరిస్తున్న తీరుతో కార్పొరేషన్ మొత్తం దివాళా తీసే పరిస్థితి ఉందన్నారు. గడిచిన మూడేళ్లలో రూ.15 కోట్ల నిధులను డ్రా చేశారన్నారు. వారికి ప్రజలు, మీడియా, విజిలెన్స్ అంటే భయం లేకుండా పోయిందన్నారు. కమిషనర్పై దాడి ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను మేయర్, ఎమ్మెల్యే ఖండించినప్పటికీ ఈ విషయంలో అసలు దొంగలు ఎవరని ప్రశ్నించారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు దాదాగాంధీ మాట్లాడుతూ కార్పొరేషన్ లో పెత్తందారీ వ్యవస్థ రాజ్యమేలుతోందన్నారు. సీపీఐ నగర కార్యదర్శి లింగమయ్య మాట్లాడుతూ కొన్ని నెలల వ్యవధిలోనే ఏడుగురు కమిషనర్లు బదిలీపై వెళ్లిపోవడం ఇక్కడి పరిస్థితికి అద్దంపడుతోందన్నారు. డివైడర్ల పేరుతో రూ.43 లక్షల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. సీపీఎం మొదటి జోన్ కార్యదర్శి రామిరెడ్డి మాట్లాడుతూ నగర పాలక సంస్థ విచ్ఛలవిడి తనానికి అడ్డాగా మారిందన్నారు. ఈ అవినీతిలో సీఎంకూ భాగముందని ఆరోపించారు. కార్పొరేటర్ జానకి మాట్లాడుతూ కార్పొరేషన్ అవినీతిపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు విన్నవించినా వారు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. పైగా కార్పొరేటర్లపై అక్రమ కేసుల ను బనాయించి అరెస్టులు చేస్తున్నారన్నారు. కార్పొరేషన్ అవినీతిపై మంగళ వారం అఖి లపక్షం ఆధ్వర్యంలో విచారిస్తామని నేతలు తెలిపారు. విచారణ అనంతరం నగరపాలక సంస్థ కార్యాల యం ముందు మహాధర్నా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మల్లికార్జున, సరోజమ్మ, బాలాంజినేయులు, గిరిజమ్మ, పక్కీరమ్మ, వెంకటరమణమ్మ, పోతులయ్య పాల్గొన్నారు. -
చేపలు పట్టే హక్కు కల్పించండి
► సింగసముద్రం, జక్కులచెరువుల్లో అవకాశం కల్పించడి ► రాచర్లబొప్పాపూర్ ముదిరాజ్ల డిమాండ్ ► కలెక్టరేట్ ఎదుట ఆందోళన సిరిసిల్ల : సింగసముద్రం, జ క్కుల చెరువుల్లో చేపలు పట్టే హక్కులు కల్పించాలనే డిమాం డ్తో ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ ముదిరాజ్ లు సోమవారం కలెక్టరేట్ ఎ దుట ధర్నా చేశారు. బొప్పాపూర్లో 250 కుటుంబాలు ఉన్నాయని, తమకు ఎలాంటి అడవు లు అందుబాటులో లేవన్నారు. దీంతో ఉపాధి లభించక దిక్కు లు చూస్తున్నామని ఆవేదన చెందారు. వ్యవసాయ భూము లు లేక కూలీ పనులు చేసుకుం టున్నామని తెలిపారు. కులవృత్తి సరిగా లేక మరికొం దరు వలస పోతున్నారని చెప్పారు. జక్కుల చెరువు, సింగసముద్రంలో చేపలు పట్టేందుకు హక్కులు కల్పిస్తే జీవనోపాధికి అవకాశం ఉంటుందని వారు వివరించారు. ఈమేరకు కలెక్టర్ కృష్ణభాస్కర్ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు రెడ్డబోయిన గోపి, నర్సయ్య, మల్లేశం, శ్రీనివాస్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అయ్యప్పస్వాముల నిరసన
28 గంటలపాటు వరంగల్ రైల్వేస్టేషన్ లో అవస్థలు రైల్వేగేట్(వరంగల్): వరంగల్ రైల్వే స్టేషన్ లో అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. శబరి మలకు వెళ్లడానికి శుక్రవారం వరంగల్ రైల్వే స్టేషన్ కు సుమారు 300 మంది అయ్యప్ప భక్తులు వచ్చారు. ఉదయం 11 గంటలకు రావాల్సిన కేరళ ఎక్స్ప్రెస్ 24 గంటలు దాటినా రాకపోవడంతో ఓపిక నశించి ఆందోళనకు దిగారు. రైళ్ల రాకపోకలకు అంతరాయ కలిగేలా నిరసన తెలిపారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు మధ్యాహ్నం 3.30 గంటలకు వచ్చిన రైలులో స్వాములు వెళ్లిపోయారు. -
ఎఫ్డీఐ నిబంధనలపై ఎయిర్లైన్స్ ఆందోళన
న్యూఢిల్లీ: భారత విమానయాన సంస్థల్లో విదేశీ ఎయిర్లైన్స్యేతర సంస్థలకు 100% యాజ మాన్య హక్కులు ఇచ్చే నిబంధనపై వివిధ విమానయాన సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇది భద్రతాపరమైన సమస్యలు సృష్టించవచ్చని విమానయాన సంస్థలు స్పైస్జెట్, ఇండిగో ఆందోళన వ్యక్తం చేశాయి. వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ఇటీవల జరిగిన సమావేశంలో స్పైస్జెట్ సీఎండీ అజయ్ సింగ్, ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఏవియేషన్ చాలా కీలకమైన రంగం కావడంతో ఈ విధమైన ఎఫ్డీఐ నిబంధనల సడలింపు వల్ల భద్రతపరమైన సమస్యలు తలెత్తవచ్చని వారు చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
వెనిజులాలో నోట్లురద్దు: ఉద్రిక్త వాతావరణం
-
సబ్సిడీ సొమ్ము కాజేశారని ధర్నా
ఐసీఐసీఐ బ్యాంకు ఎదుట రైతుల ఆందోళన జహీరాబాద్ టౌన్: సబ్సిడీ సొమ్ము కాజేశారని ఆరోపిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని ఐసీఐసీఐ బ్యాంకు ఎదుట రైతులు గురువారం ఆందోళనకు దిగారు. జహీరాబాద్ మండలం హుగ్గెల్లికి చెందిన పద్మ, కొత్తూర్(బి) గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మితోపాటు మరో ఇద్దరు రైతులు ట్రాక్టర్ల కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నారు. సదరు రైతులు ఈఎంఐలు కట్టగా మిగతా మొత్తానికి కార్పొరేషన్ నుంచి సబ్సిడీ మంజూరైంది. దీంతో వారి నుంచి బ్లాంక్ చెక్కులు కూడా తీసుకున్నారు. రుణ బకా రుులు వెంటనే చెల్లించాలంటూ బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి ఎస్ఎంఎస్, ఫోన్లు రావ డంతో బాధిత రైతులు మూడు రోజుల క్రితం బ్యాంకు మేనేజర్ను కలసి ఆరా తీశారు. హుగ్గెల్లికి చెందిన పద్మకు రూ.2,22,357, కొత్తూర్(బి)కి చెందిన భాగ్యలక్ష్మికి కార్పొరేషన్ నుంచి వచ్చిన రూ.3.75 లక్షల సబ్సిడీ నిధులు వారి ఖాతాలో జమ కాలేదని తెలిసింది. దాదాపు రూ.6 లక్షల నిధులను మరొకరి ఖాతాల్లోకి మళ్లించినట్టు స్పష్టమైంది. ఈ విషయమై ఇద్దరు బాధితులు బ్యాంకు మేనేజర్ను నిలదీశారు. తప్పిదం ఎలా జరిగిందో పరిశీలించి న్యాయం చేస్తానని మేనేజర్ హామీ ఇచ్చినా, ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ బాధిత రైతులు రైతు సంఘం నాయకులతో కలసి బ్యాంకు ఎదుట బైఠారుుం చారు. కాగా మరో ఇద్దరు లబ్ధిదారులు కూడా ఇలాంటి మోసానికే గురైనట్టు సమాచారం. -
వినూత్న నిరసన!
టెక్కలి : గ్రానైట్ పరిశ్రమలపై ప్రభుత్వం పెంచిన సీనరేజ్ ధరల తగ్గించాలంటూ యజమానులు, కార్మికులు చేపట్టిన ఆందోళన శనివారం కొత్త పుంతలు తొక్కింది. ఓ వైపు శాంతియుత ఉద్యమం చేస్తూనే ఉధృతం చేయాలని కొందరు చేసిన సూచనల నేపథ్యంలో యజమానుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...సీనరేజ్ తగ్గించాలంటూ టెక్కలి మైన్ కార్యాలయం ఎదుట ఉత్తరాంధ్ర గ్రానైట్ అసోసియేషన్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం ఆరో రోజుకు చేరుకున్నాయి. ఈ క్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు కోత మురళీధర్, శ్రీనివాస్, రామకృష్ణతో పాటు కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపేందుకు పాత జాతీయ రహదారిపై వాహనాలను తుడిచేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో అంతా రోడ్డుపైకి వచ్చి ఓ బస్సును ఆపి తుడిచేందుకు సిద్ధం కాగా అసోసియేషన్ ప్రతినిధి చింతాడ గణపతితో పాటు కొందరు కార్మికులు రోడ్డుపై బైఠాయించి వాహనాలను నిలిపేందుకు యత్నించారు. దీంతో నిరసన ఉధృత రూపం దాల్చింది. పెంచిన సీనరేజ్ ధరలు తక్షణమే తగ్గించాలని, ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలని చింతాడ గణపతితో పాటు పలువురు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తే మన సమస్యలు పరిష్కారం కావని తీవ్ర స్థాయిలో నిరసన తెలియజేయాలని గణపతి పట్టుబట్టారు. కార్మికులంతా రోడ్డున పడి ఇబ్బందులు పడుతుంటే కార్మిక మంత్రి కనీసం స్పందించకపోవడం ఆయన చేతకానితనమని గణపతి మండిపడ్డారు. శాంతియుత నిరసనలో ఎటువంటి ఉద్రిక్తతకు అవకాశం ఇవ్వొద్దంటూ కొందరు అడ్డుతగిలారు. దీంతో వారి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఈ సమయంలో గణపతి, మరో ప్రతినిధి నగేష్కు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో తోటి సభ్యులు సర్ది చెప్పే ప్రయత్నాలు చేశారు. మిగిలిన ప్రతినిధులు వారికి సర్దిచెప్పి దీక్షా శిబిరంలోకి తీసుకువెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం అధ్యక్షుడు కోత మురళీధర్ మాట్లాడుతూ గ్రానైట్ అసోసియేషన్ ప్రతినిధులంతా శాంతియుతంగా పోరాటం చేయాలని సూచించారు. -
బెంగళూరులో బీజేపీ ఆందోళన
-
పశ్చిమగోదావరి జిల్లాలో రైతుల ఆందోళన
-
జోగులాంబ జిల్లా ఏర్పాటు చేయాలి
సాక్షి, హైదరాబాద్: గద్వాల కేంద్రంగా జోగులాంబ జిల్లాను ఏర్పాటు చేయాలని మహబూబ్నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. గద్వాల జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో కొందరు ఎంసీఆర్హెచ్ఆర్డీలో ధర్నా చేశారు. కొత్త జిల్లాలకు ఏర్పాటు చేసిన సబ్ కమిటీ ఎదుట తమ అభిప్రాయాలను వెల్లడించారు. వరంగల్లో జనగామను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రతిపాదించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఆదివారం మహబూబ్నగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధుల నుంచి సబ్కమిటీ అభిప్రాయాలను స్వీకరించింది. నల్లగొండను మూడు జిల్లాలుగా విభజించడం పట్ల ఆ జిల్లా నేతలు అభ్యంతరం పెట్టనప్పటికీ, వరంగల్ జిల్లాలోని కొన్ని మండలాలను యాదాద్రి జిల్లాలో కలపవద్దని సూచించారు. గద్వాలకు లేనిదేంటీ.. వనపర్తిలో ఉన్నదేంటి! మహబూబ్నగర్ జిల్లాలో గద్వాల జిల్లా కేంద్రంగా జోగులాంబ జిల్లాను ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి డీకే అరుణ సబ్కమిటీకి విన్నవించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వనపర్తి జిల్లాను ప్రభుత్వం ప్రతిపాదించిందని, గద్వాలలో లేని ప్రత్యేకతలు వనపర్తిలో ఏమున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం తనలక్కీ నంబరు కోసమని రాష్ట్రాన్ని 24 జిల్లాలుగా చేయడం సరికాదని, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మొత్తం 17 జిల్లాలు చేస్తే సరిపోతుందని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి అన్నారు. తక్కువ దూరంలో ఉన్న నాగర్ కర్నూల్, వనపర్తిలను కొత్త జిల్లాలకు కేంద్రాలుగా ప్రతిపాదించడం సరికాదని ఎమ్మెల్యే వంశీచందర్రెడ్డి అన్నారు. కొత్త జిల్లాలు ప్రజలకు సౌలభ్యంగా ఉండాలని, రాజకీయ ప్రయోజనాల కోసం పొరపాట్లు చేస్తే ప్రజలు క్షమించరని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్కుమార్ చెప్పారు. మరోవైపు జనగామను జిల్లా చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య కోరారు. ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎర్రబెల్లి, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, పల్లా రాజేశ్వర్రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అఖిలపక్ష సమావేశం వాయిదా జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా మంగళవారం జరగాల్సిన అఖిలపక్ష సమావేశాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. సోమవారం అన్ని పార్టీల నేతలు స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొనేందుకు తమ నియోజకవర్గాలకు వెళ్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సబ్కమిటీతో 17న జరగాల్సిన జిల్లా కలెక్టర్ల భేటీ యథావిధిగా నిర్వహించనున్నారు. -
స్థానిక ఉద్యమాల దిశగా సీపీఐ
పలు తీర్మానాలను ఆమోదించిన పార్టీ హైదరాబాద్: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మం డల, గ్రామస్థాయి వరకు స్థానిక ఉద్యమాలను నిర్మించాలని సీపీఐ నిర్ణయించింది. ప్రధానమైన సమస్యలపై జిల్లాస్థాయిలో దీర్ఘకాలిక ఆందోళనలను నిర్వహించాలని తీర్మానించింది. ఈ నెల 25,26 తేదీల్లో మల్లన్నసాగర్, నారాయణఖేడ్, కొడంగల్ ప్రాజెక్టులను సందర్శించి, వాటి అలైన్మెంట్, రీడిజైన్లను పరిశీలించాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో నిర్ణయించారు. నిత్యావసరాల ధరల పెరుగుదల, రక్షణ, రైల్వే, చిల్లర వ్యాపారంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 17న సైకిల్ యాత్రలు, జీపు జాతాల ద్వారా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించింది. సెప్టెంబర్లో సాయుధ పోరాట వారోత్సవాలు సెప్టెంబర్లో 11నుంచి 17 వరకు తెలంగాణ సాయుధపోరాట వారోత్సవాలను నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. రాష్ర్టకార్యవర్గభేటీలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. సెప్టెంబర్ 2న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెకు మద్దతునిస్తున్నట్లు తెలియజేశారు. ఈ మేరకు ఇతర వామపక్షాలతో చర్చించి, ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందిస్తామన్నారు. నవంబర్ 18నుంచి వరంగల్లో రాష్ట్రపార్టీ నిర్మాణ మహాసభను నిర్వహించాలని కార్యవర్గభేటీ నిర్ణయించిందన్నారు. కాగా గ్యాంగ్స్టర్ నయీం ఆగడాలు, అక్రమాలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జీతో విచారణకు చాడ వెంకటరెడ్డి డి మాండ్చేశారు. -
ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నాం: టీడీపీ ఎంపీలు
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాపై పార్లమెంటులో రెండ్రోజులుగా చేస్తున్న ఆందోళనకు తాత్కాలిక విరామం ఇచ్చినట్లు టీడీపీ ఎంపీలు మురళీమోహన్, రామ్మోహన్ నాయుడు, అవంతి శ్రీనివాస్ బుధవారమిక్కడ తెలిపారు. విభజన చట్టంలోని హామీల అమలుపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సభలో హామీ ఇచ్చినందున.. అమలుకు కొంత సమయం ఇవ్వాలనే ఆందోళనకు విరామం ప్రకటించామన్నారు. ప్రత్యేక హోదాపై లోక్సభలో చర్చకు పట్టుపడతామని పేర్కొన్నారు. హోదా అంశంపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై సీఎం చంద్రబాబు సూచనలిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే హోదా ఇచ్చే వరకు.. పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టే ఏ బిల్లుకూ మద్దతు ఇవ్వకూడదని సవాల్ విసిరారు. -
ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు
లోక్సభలో వైఎస్సార్సీపీ ఎంపీల నినాదాలు సమావేశానికి ముందు గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిరసన తెలుపుతున్న ఎంపీలను అభినందించిన జేసీ న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అమలుచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు పట్టుసడలని దీక్షతో పార్లమెంటు వెలుపల, లోక్సభలో మూడో రోజు తమ ఆందోళన కొనసాగించారు. తొలుత ఉదయం 10.30 గంటలకు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్రత్యేక హోదా నినాదాలతో తమ నిరసన తెలిపారు. ప్రత్యేక హోదా కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి నేతృత్వంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, బుట్టా రేణుక, వై.ఎస్.అవినాష్ రెడ్డి ఈ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ధర్నా వద్దకు వచ్చి ఎంపీలందరితో కరచాలనం చేసి అభినందించడం విశేషం. అనంతరం లోక్సభ సమావేశం ప్రారంభం కాగానే సభాపతి సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు వెల్లోకి వెళ్లి ‘ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు- కేంద్రం బాధ్యత’, ‘ప్రత్యేక హోదా- ఆరు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు’, ‘ఢిల్లీ మేల్కోవాలి- ఏపీని రక్షించాలి’ అన్న నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రధాని ఎదురుగానే ఎంపీలు తమ నిరసన కొనసాగించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు సభాపతి ప్రకటించిన తరువాత వైఎస్సార్సీపీ ఎంపీల నిరసన సభను హోరెత్తించింది. ‘కావాలి.. కావాలి.. ప్రత్యేక హోదా కావాలి..’ అంటూ తెలుగులో నినాదాలు చేశారు. మధ్యాహ్నం 1.20 గంటలకు సభ వాయిదా పడేంతవరకు వారు వెల్లో నిల్చొని గొంతులు పగిలేలా ప్రత్యేక హోదా కోసం నినదించారు. దాదాపు రెండున్నర గంటలపాటు విరామం లేకుండా నినదించారు. పలు పార్టీల సంఘీభావం..: వైఎస్సార్సీపీ ఎంపీల మొక్కవోని పట్టుదలను చూసి పలు పార్టీలు సంఘీభావం తెలిపాయి. కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే ఒంటి గంట సమయంలో లేచి వైఎస్సార్సీపీ ఎంపీలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఆర్థిక మంత్రి ఇప్పటికే ప్రకటన చేశారు కాబట్టి అవకాశం ఇవ్వలేనని స్పీకర్ చెప్పారు. నిరసన కొనసాగుతున్న సమయంలో సమాజ్వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్, పలువురు ఇతర పార్టీల ఎంపీలు వైఎస్సార్సీపీ ఎంపీలను పలుకరిస్తూ సంఘీభావం తెలిపారు. వెల్లో ధర్నా చేస్తున్నంతసేపు కనబడలేదా? ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశానికి త్వరలోనే పరిష్కార మార్గం చూపనున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం మధ్యాహ్నం ప్రకటన చేసేటప్పుడు సభలో వైఎస్సార్సీపీ ఎంపీలు లేరని టీడీపీ విమర్శించడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేక పాటి రాజమోహన్ రెడ్డి తప్పుబట్టారు. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం సభ వాయిదా పడేవరకు వైఎస్సార్సీపీ ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు, టీడీపీ ఎంపీలకు కనబడలేదా? అని ప్రశ్నించారు. మధ్నాహ్నం సభ వాయిదా పడగానే బయట మీడియాతో మాట్లాడి వచ్చేలోపే సభ ప్రారంభమైందని, ఆ వెంటనే హోదా అంశాన్ని పరిశీలిస్తున్నామని అరుణ్ జైట్లీ ప్రకటన చేశారని తెలిపారు. దీన్ని పట్టుకుని వైఎస్సార్సీపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదని విమర్శించడం తగదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలని చిత్తశుద్ధి ఉంది కాబట్టే గత రెండున్నరేళ్లుగా తమ పార్టీ, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారని చెప్పారు. హోదాపై ముందు నుంచి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నది టీడీపీయేనని విమర్శించారు. ఇప్పుడు కూడా హోదా సాధనకు టీడీపీ చేపట్టిన ఆందోళనకు రెండు రోజులకే విరామం ప్రకటించిందని చెప్పారు. డ్రామాలు ఆపి హోదా సాధనకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మేకపాటి హితవు పలికారు. -
కశ్మీర్లో మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు
శ్రీనగర్: కశ్మీర్ లోయలో మంగళవారం రాత్రి ఒక ఆస్పత్రి బయట యువకుడి మృతదేహం లభించటంతో మళ్లీ గొడవలు చెలరేగాయి. ఈ ప్రాంతంలో మంగళవారం ఎటువంటి గొడవలూ జరగలేదు. కానీ మృతుని పొట్టలో 300 పెల్లెట్లు ఉన్నట్లు తేలడంతో భద్రతా బలగాలే చంపి ఉంటాయని భావిస్తూ పోలీసులు హత్యారోపణలతో కేసు నమోదు చేశారు. యువకుడి మృతితో ఆందోళన కారులు మళ్లీ రెచ్చిపోయారు. గొడవల్లో జవాన్లు సహా 70 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. అధికారులు కర్ఫ్యూను మరిన్నిప్రాంతాలకు విస్తరించారు. -
కంటితుడుపు ప్రకటనైనా చేయండి..
• బంద్ విజయవంతం కావడంతో కేంద్రం కాళ్లావేళ్లా పడ్డ టీడీపీ • ఏదోలా తమను గట్టెక్కించాలని జైట్లీకి చంద్రబాబు వేడుకోలు • సత్వర పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని జైట్లీ ఏకవాక్య ప్రకటన • ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీ సరికొత్త డ్రామా • అంతకుముందు లోక్సభలో వైఎస్సార్సీపీ ఆందోళన • బీఏసీలో నిర్ణయం తీసుకుందామని స్పీకర్ విజ్ఞప్తి • ప్రకటన వచ్చేవరకూ ఆందోళన ఆగదన్న మేకపాటి సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదాకోసం ఆంధ్రప్రదేశ్ బంద్ విజయవంతం కావడంతో అధికార తెలుగుదేశం పార్టీ లోక్సభలో సరికొత్త డ్రామాకు తెరలేపింది. తమ ఆందోళన కారణంగానే కేంద్రం ప్రకటన చేసిందని చెప్పుకునేందుకు వీలుగా మంగళవారం మిత్రపక్షం బీజేపీతో కలిసి నాటకాన్ని రక్తి కట్టించింది. బంద్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడంతో ఆందోళనకు లోనైన చంద్రబాబు... కంటితుడుపు ప్రకటనైనా చేసి తమను గట్టెక్కించాలంటూ కేంద్రం కాళ్లావేళ్లా పడ్డారు. ప్రత్యేక హోదా విషయమై మేం నినాదాలు చేస్తే.. మీరు హామీ ఇచ్చినట్టుగా ఓ ప్రకటన చేయాలంటూ ప్రాధేయపడ్డారు. చివరకు ప్రత్యేక హోదా ప్రస్తావనే లేకుండా... హామీలను త్వరగా పరిష్కరించేందుకు గల మార్గాన్ని వెతుకుతున్నామన్న జైట్లీ ఏకవాక్య ప్రకటనతో సరిపెట్టుకున్నారు. మిత్రలాభం కోసం మిత్రపక్షాలు ఇలా ప్రత్యేక హోదా అంశానికి మరోసారి విరామం ప్రకటించాయి. వైఎస్సార్సీపీకి మైలేజీ రాకుండా ఉండేందుకు తన అనుకూల మీడియాను రంగంలోకి దించడం... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రెస్మీట్ సమయంలోనే సుజనా చౌదరి ప్రెస్మీట్, ఆ తర్వాత ముఖ్యమంత్రి విలేకరులు సమావేశం కూడా టీడీపీ డ్రామాలో భాగమే. జైట్లీతో చంద్రబాబు మంతనాలు... ప్రజల స్వచ్ఛంద భాగస్వామ్యంతో రాష్ట్ర బంద్ విజయవంతమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ఫోన్లో మాట్లాడారు. ప్రత్యేక హోదా అంశంపై సభలో ఏదో ఒక ప్రకటన చేయాలని, అప్పుడే తాము ఈ సమస్య నుంచి బయటపడే పరిస్థితి ఉంటుందని కోరారు. అందుకు జైట్లీ సమ్మతించడంతో చంద్రబాబు తమ పార్టీ ఎంపీలకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో టీడీపీ లోక్సభాపక్ష నేత తోట నర్సింహులు సభలోకి చేరుకుని జైట్లీతో మాట్లాడారు. ఆ వెంటనే అందుబాటులో ఉన్న ఎంపీలను సభలోకి పిలిచారు. వెంటనే అరుణ్ జైట్లీ లేచి... ‘ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటుందని నేను చాలాసార్లు చెప్పాను. ఈరోజు కూడా నేను ఏపీ ముఖ్యమంత్రితో మాట్లాడాను. ఈ అంశాలను త్వరగా పరిష్కరించేందుకు గల మార్గాన్ని వెతుకుతున్నాం..’ అని ఏకవాక్య ప్రకటన చేశారు. మిత్రపక్షాలు రెండూ కూడబలుక్కుని ప్రత్యేకహోదా అంశంపై మరోసారి ప్రజలను మభ్యపెట్టే ప్రకటనతో సరిపెట్టారు. ‘హోదా’ ఆందోళనకు టీడీపీ విరామం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధనకు పార్లమెంటులో టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు విరామం ప్రకటించింది. విభజన చట్టంలోని హామీల అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి హామీ లభించడంతో... లోక్సభలో రెండు రోజులుగా చేస్తున్న ఆందోళనకు తాత్కాలిక విరామం ప్రకటించినట్టు కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. మంగళవారం ఆయన టీడీపీ ఎంపీలతో కలసి ఇక్కడి ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చినట్టు తెలిపారు. సభా వ్యవహారాలను అడ్డుతగలవద్దని జైట్లీ చేసిన విజ్ఞప్తి మేరకు ఆందోళన విరమిస్తున్నామని చెప్పారు. విలేకరుల సమావేశంలో టీడీపీ ఎంపీలు తోట నరసింహం, రామ్మోహన్ నాయుడు, నిమ్మల కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు. హోదా కోసం వైఎస్సార్సీపీ పట్టు... మంగళవారం ఉదయం పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందే వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ఆ పార్టీ పార్లమెంటరీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి నేతృత్వంలో పార్లమెంటు ఆవరణలోని మహాత్ముడి విగ్రహం వద్ద నిరసనకు దిగారు. ఈ నిరసనలో పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వి.వరప్రసాదరావు, బుట్టా రేణుక, వై.ఎస్.అవినాష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక హోదా కోసం ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సభాకార్యక్రమాలు ప్రారంభం కాగానే సభాపతి సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని రెండో రోజు తమ ఆందోళనను కొనసాగించగా... టీడీపీ ఎంపీలు మాత్రం తమ సీట్ల వద్దే నిలబడ్డారు. జీరో అవర్లో అవకాశమిస్తానని స్పీకర్ చెప్పినా వైఎస్సార్సీపీ ఎంపీలు ఆందోళన విరమించలేదు. జీరోఅవర్లోనూ ఆందోళన కొనసాగడంతో స్పీకర్ సభను 12.15 గంటలకు పావుగంట పాటు వాయిదావేశారు. అనంతరం అన్ని పార్టీల నేతలతో సమావేశమయ్యారు. ప్రత్యేక హోదా అంశంపై చర్చించేందుకు బుధవారం నాటి బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుందామని, అప్పటివరకు నిరసనలు ఆపాలని కోరగా... వైఎస్సార్సీపీ నేత మేకపాటి రాజమోహన్రెడ్డి తిరస్కరించారు. హోదా ఇస్తామని చెప్పి, ఇన్నిసార్లు చర్చించాక ఇంకా చర్చలు ఎందుకని, హోదా వర్తింపజేస్తూ ప్రకటన వచ్చేంతవరకు తమ ఆందోళన కొనసాగుతుందని తేల్చిచెప్పారు. నిరసనల మధ్యే సభ మధ్యాహ్నం 1.35 వరకు నడిచింది. -
టర్కీ పరిస్థితిపై అమెరికా ఆందోళన
వాషింగ్టన్: టర్కీలో కొనసాగుతున్న సైనికతిరుగు బాటు, చెలరేగుతున్న హింస పట్ల అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. టర్కీలో ఎన్నికైన ప్రభుత్వానికి మద్ధతు ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశంలోని అన్ని రాజకీయ పక్షాలకు సూచించారు. టర్కీ ఈ పరిస్థితిని త్వరగా అధిగమించాలని ఆయన ఆకాక్షించారు. హింసాయుత చర్యలకు చరమగీతం పాడాలని కోరారు. పరిస్థితిపై ఒబామా అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీతో ఫోన్ లో చర్చించారు. టర్కీలోని తమ దేశ పౌరుల భద్రత గురించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు కెర్రీ ఒబామాకు తెలిపారు. టర్కీలో సైనిక తిరుగుబాటు మూలంగా ఇప్పటి వరకు 40 మందికి పైగా మృతి చెందారు. . -
కర్షకుడి కన్నెర్ర
కొంతమూరు (రాజమహేంద్రవరం రూరల్): కళ్లముందే ఆకు మడులు ఎండిపోతున్నాయి ... వెంకటనగరం పంపింగ్ స్కీమ్ ద్వారా నీరు సకాలంలో విడుదల చేయకపోవడంతో ఒక్కసారిగా ఆ ప్రాంత రైతుల్లో అసహనం పెల్లుబికింది. సుమారు గంటపాటు రైతులు ఆందోళన చేపట్టడంతో ఇరు వైపులా 20 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయిది. ఆదివారం నీటిని విడుదల చేస్తామని ఇరిగేషన్ అధికారులు హామీ ఇవ్వడంతో శాంతించి ఆందోళన విరమించారు. వివరాలు ఇలా ఉన్నాయి... కొంతమూరు గ్రామంలోని రైతులకు వెంకటనగరం పంపింగ్ స్కీమ్ ద్వారా నీటిని విడుదల చేయకపోవడంతో వేసిన ఆకుమడులు ఎండిపోతున్నాయి. ఇరిగేషన్ అధికారులకు రైతులు పలుమార్లు ఈ పరిస్థితిని వివరించినా పట్టించుకోకపోవడంతో శుక్రవారం ఉదయం నాలుగో వంతెన రహదారిపై ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసిన నారు ఎండిపోకుండా వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ ద్వారా కృష్ణానదికి నీరు విడుదల చేసినప్పుడే వెంకటనగరం పంపింగ్ స్కీమ్కు కూడా నీరు విడుదల చేసి ఉంటే రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. గోదావరిలో పుష్కలంగా నీరు ఉంచుకుని ఇలా చేయడం ప్రభుత్వం నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. అర్బన్ జిల్లా తూర్పు మండల డీఎస్పీ రమేష్బాబు సంఘటనా స్థలానికి వచ్చి ఆందోళనను విరమించాలని రైతులను కోరారు. ఇరిగేషన్ అధికారులు వచ్చి రైతులతో చర్చించి నీరు విడుదల చేసే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. ఇరిగేషన్ ఈఈ వాసుదేవ్, ఏఈలు రైతులతోను, ఆకులవీర్రాజు, గ్రామ పెద్దలు దండమూడి ప్రసాద్, చెరుకూరి రత్నాజీ, చెరుకూరి బాలాజీలతో మాట్లాడారు. కొన్ని సాంకేతిక సమస్యలున్నాయని, వాటిని సరిదిద్ది రెండు రోజుల్లో నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం నీటిని విడుదల చేస్తామని లిఖిత పూర్వకంగా ఇవ్వాలని రైతులు పట్టుబట్టగా అధికారులు అదే పని చేయడంతో ఆందోళన విరమించారు. వైఎస్సార్ సీపీ నాయకులు యామనరామకృష్ణ, నెరుసు వెంకట్రావు,వంకా సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. -
మిస్టరీ వీడని విద్యార్థినుల అదృశ్యం కేసు
తిరువూరు : పట్టణానికి చెందిన ఇరువురు విద్యార్థినులు 15 రోజుల క్రితం అదృశ్యమైన ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నింపింది. ఈ కేసు మిస్టరీ ఇంతవరకూ వీడలేదు. తిరువూరు రాజుపేటకు చెందిన ధర్మపురి రాంబాబు కుమార్తె ఉమామహేశ్వరి జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో 9వ తరగతి, రోలుపడి శివారు సూరవరానికి చెందిన గోసు శ్రావణి స్థానిక ప్రైవేటు జూనియర్ కళాశాలలో ద్వితీయ ఇంటర్ చదువుతున్నారు. వారిద్దరు స్నేహితులు. ఈ నెల 4 నుంచి కనిపించడంలేదని వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికల కోసం తాము బంధువుల ఇళ్లలో, తెలిసిన ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేదని పేర్కొన్నారు. తిరువూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారి దర్యాప్తులో బాలికలు ఇద్దరు మహిళలతో ఫోనులో మాట్లాడినట్టు గుర్తించారని పేర్కొన్నారు. బాలికల ఆచూకీ లభ్యం కాలేదని ఏఎస్ఐ మోహనరావు తెలిపారు. -
రుణం.. రణం..
♦ రైతులకందని ఖరీఫ్ రుణాలు ♦ బ్యాంకుల చుట్టూ చక్కర్లు ♦ అయినా కనికరించని బ్యాంకర్లు ♦ రుణ లక్ష్యం రూ.1,763 కోట్లు ♦ ఇచ్చింది రూ.261 కోట్లే ఆందోళనలో రైతాంగం రైతులపై బ్యాంకర్లకు కనికరం లేకుండా పోయింది. ఖరీఫ్లో పంట సాగుకు సమయం మించిపోతున్నా రుణాలివ్వడం లేదు. రైతన్నలు బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా రేపు, మాపు అంటూ కాలం గడుపుతున్నారు. రుణాల కోసం ప్రజాప్రతినిధులను సైతం ఆశ్రయిస్తున్నారు. దిక్కులేక ప్రైవేట్ అప్పులు చేస్తూ అవస్థల పాలవుతున్నారు. అయితే ఈ ఏడాది పంటల రుణ మంజూరు లక్ష్యం రూ.1,763 కోట్లుగా నిర్ణయించుకున్న బ్యాంకర్లు ఇప్పటివరకు ఇచ్చింది కేవలం రూ.261 కోట్లు మాత్రమే. లక్ష్యం బారెడు.. మంజూరు మూరెడు అన్నట్టుగా ఉంది వారి తీరు. సాక్షి, సంగారెడ్డి: సారూ.. పంటల కాలం షురూ అయ్యి నెలదాటిపాయే.. అప్పు కోసం బ్యాంకోళ్ల కాడికి పోతే రేపిస్తం మాపిస్తం అని తిప్పుకుంటున్నరు.. పైసలు లేకపోతే పంటలు ఎలా యేసుకోవాలే.. జర బ్యాంకోళ్లకు జెప్పి పైసల్ ఇప్పింయ్యుండ్రి సారూ... ఇదీ అందోలు ఎమ్మెల్యే బాబూమోహన్కు బుధవారం అందోలు మండలం పోతిరెడ్డిపల్లి రైతుల నుంచి ఎదురైన అనుభవం. ఏం చేయాలే బ్యాంకోళ్లు అప్పు ఇయ్యమంటే ఇస్తలేరు.. లాగోడి పైసల కోసం సావుకారి దగ్గరకు పోయి అప్పుదెచ్చుకున్న ఇది సంగారెడ్డి మండలం కలివేముల గ్రామానికి చెందినఓ రైతు ఆవేదన. జిల్లాలో ఖరీఫ్ పంటరుణాల పంపిణీ ఆశాజనకంగా లేదు. ఖరీఫ్ కాలం ప్రారంభమై నెల గడుస్తున్నా రుణాల పంపిణీ ఇంకా మందకొడిగానే సాగుతోంది. దీంతో రైతులు ఇబ్బందులు పడాల్సివస్తోంది. కొత్త రైతులకు రుణాల మంజూరులో జాప్యం జరగటంతోపాటు రుణాల రీషెడ్యూల్ కూడా ఆశించిన స్థాయిలో సాగటంలేదన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలో ఖరీఫ్ 2016-17 సీజన్కు రూ.1,763 కోట్ల మేర రుణాలు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు 44,334 మంది రైతులకు రూ.261.9 కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చారు. వీటిలో బ్యాంకర్లు 5,079 మంది కొత్త రైతులకు రూ.79.12 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. అలాగే 39,255 మంది రైతులకు సంబంధించి రూ.182.78 కోట్ల రుణాలు రీషెడ్యూల్ చేశారు. ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభంగానే రైతులు రుణ సహాయం కోసం బ్యాంకుల వైపు చూస్తారు. ఇందుకు అనుగుణంగానే జిల్లా యంత్రాంగం, బ్యాంకర్లు రుణ ప్రణాళికను ప్రకటించి అందుకు అనుగుణంగా రుణాలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. లక్ష్యానికి దూరంగా బ్యాంకర్లు... జిల్లాలో రెండు, మూడేళ్లుగా బ్యాంకర్లు లక్ష్యానికి అనుగుణంగా ఖరీఫ్ రుణాలు పంపిణీ చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది సైతం ఖరీఫ్ రుణాల పంపిణీ మందకొడిగా సాగుతోంది. వర్షాలు కురుస్తుండటంతో రైతులు పంటల సాగుపై దృష్టి సారించారు. వ్యవసాయ పనులు, ఎరువులు, విత్తనాలు కొనుగోలు కోసం పెట్టుబడి అవసరం. ఇందుకోసం రైతులు బ్యాంకు రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేయకుండా బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. రుణమాఫీ సొమ్ము జమకాకపోవటం, రుణ బకాయిలను సాకుగా చూపుతూ బ్యాంకుర్లు రుణాల రీషెడ్యూల్ చేయటంలోనూ జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో విధిలేక రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలకు డబ్బులు అప్పులు తెచ్చుకుని వ్యవసాయ పనులు కొనసాగించాల్సి వస్తోంది. బ్యాంకర్లు రైతుల అవస్థలను గుర్తించి విరివిగా రుణాలు ఇవ్వాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. మంజూరు చేయని బ్యాంకులు 13... ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 31 బ్యాంకులు రైతులకు రుణాలు రూ.1763.58 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. లీడ్బ్యాంకు సేకరించిన వివరాలను అనుసరించి ఇప్పటి వరకు 13 బ్యాంకులు రుణాల మంజూరు, రుణాల రీషెడ్యూల్ ప్రారంభించలేదు. ఇప్పటివరకు రూ.261.9 కోట్ల రుణాలు పంపిణీ చేయగా ఇందులో ప్రధానంగా ఏపీ గ్రామీణవికాస్ బ్యాంకు రూ.179 కోట్ల రుణాలు పంపిణీ చేసింది. ఎస్బీఐ, ఎస్బీహెచ్తోపాటు ఇతర వాణిజ్య బ్యాంకులు మందకొడిగానే మంజూరు చేస్తున్నాయి. లీడ్ బ్యాంకు ఇన్చార్జి మేనేజర్ రఘురాం మాట్లాడుతూ... వచ్చే రెండు వారాల్లో ఖరీఫ్ రుణాల మంజూరులో వేగం పుంజుకుంటుందని తెలిపారు. ఖరీఫ్లో లక్ష్యం మేరకు బ్యాంకులు రుణాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
పాపం... సానియా..
-
పాపం... సానియా..
- రోజంతా కోర్టుల్లో హైడ్రామా - తల్లిదండ్రులకు దూరమై ఒంటరైన చిన్నారి సాక్షి, హైదరాబాద్ : నాన్న చేతిలో కాలి బూడిదైన అమ్మ... ఆ హత్యానేరంతో జైలుకెళ్లిన నాన్న... తమకే కావాలని తల్లి వైపు... తండ్రి వైపు బంధువులు పటబట్టడంతో... ఎవరికీకాక ఒంటరైన బుజ్జితల్లి కంటనీరు కట్టలు తెగుతోంది. ఎనిమిదేళ్ల చిన్నారి సానియా శుక్రవారమంతా కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. గచ్జిబౌలిలో ఉండే రూపేశ్కుమార్ తన భార్య సింథియాను గత ఆదివారం హత్య చేసిన విషయం తెలిసిందే. దీంతో వీరి ఏకైక కుమార్తె సానియా(8) పరిస్థితి దైన్యంగా మారింది. చిన్నారిని తామే పెంచుతామని నానమ్మ లలిత చెబుతుండగా, తమదేశం కాంగోకు తీసుకెళ్తామంటూ మేనమామ పట్టుబడుతున్నారు. కాంగో రాయబారి కూడా సానియాను తమకు అప్పగించాలని కోరినట్లు తెలిసింది. కనిపించని బంధువులు... ఈ వివాదంతో నింబోలిఅడ్డాలోని రెస్క్యూ హోంలో ఉన్న సానియాను ఎవరికి అప్పచెప్పాలో తేల్చుకోని పోలీస్లు తొలుత రాజేంద్రనగర్ ఉప్పరపల్లిలోని 8ఎంఎం కోర్టు న్యాయమూర్తి రాధిక జేస్వాల్ ఎదుట హాజరుపరిచారు. ఈ కేసు తమ పరిధిలోకి రాదని ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా ఫ్యామిలీ కోర్టుకు న్యాయమూర్తి బదిలీ చేశారు. సానియాను అక్కడికి తీసుకువెళ్లగా... తమ పరిధిలో లేదని ఫ్యామిలీ కోర్టు జడ్జి రమేష్బాబు వెల్లడించారు. దీంతో మళ్లీ రాజేంద్రనగర్ 8ఎంఎం కోర్టుకు తీసుకెళ్లగా... పొద్దుపోయే వరకు విచారణ కొనసాగింది. అయితే... సానియా మాక్కావాలంటే మాక్కావాలన్న బంధువులు ఒక్కరు కూడా కోర్టులో పిటిషన్ వేయలేదు. దీంతో న్యాయమూర్తి ఆదేశాల మేరకు చిన్నారిని హైదర్షాకోటలోని కస్తూర్బా ట్రస్ట్కు తరలించారు. సోమవారం వరకు అక్కడే చిన్నారి యోగక్షేమాలు చూసుకోవాలన్నారు. బంధువులు పిటిషన్ దాఖలు చేస్తే తిరిగి ఈ కేసుపై విచారణ జరుగుతుంది. -
సానియా వ్యవహారంపై తేలని వివాదం
-
సానియా వ్యవహారంపై తేలని వివాదం
హైదరాబాద్ : దారుణంగా హత్యకు గురైన తల్లి... ఓవైపు జైల్లో తండ్రి.. ఇంకోవైపు తమకు అప్పగించాలంటూ తల్లి తరఫు బంధువులు, మరోవైపు సానియా తమతోనే ఉంటుందని తండ్రి కుటుంబసభ్యలు డిమాండ్తో చిన్నారి సానియా పరిస్థితి అయోమయంగా మారింది. ఈ నేపథ్యంలో వారి కూతురు సానియా ఎక్కడ ఉండాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయిదు రోజుల క్రితం కాంగో దేశస్తురాలు అయిన సింథియాను అతి కిరాతకంగా హత్య చేసి, ముక్కలు ముక్కలుగా నరికి మృతదేహాన్ని దహనం చేసిన రూపేశ్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆమె సోదరుడు డానీస్తోపాటు అతడి బంధువులు రెండురోజులుగా పోలీస్స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు సానియాను పోలీసులు గురువారం రాజేంద్ర నగర్ కోర్టులో హాజరుపరిచారు. అయితే కేసు తమ పరిధిలోకి రాదని, రంగారెడ్డి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచించింది. దీంతో పోలీసులు రంగారెడ్డి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించనున్నారు. కాగా తల్లి హత్య అనంతరం సానియా తన నాయనమ్మ లీలావతి వద్ద ఉండగా, ఆ చిన్నారిని పోలీసులు గురువారం నాడు రెస్క్యూ హోంకు తరలించారు. ఆ ప్రదేశాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. -
సానియాను అప్పగించండి
సింథియా బంధువుల ఆందోళన శంషాబాద్ : భర్త చేతిలో హత్యకు గురైన ఆఫ్రికాలోని కాంగోవాసి సింథియా కూతురు సానియాను తమకప్పగించాలని ఆమె బంధువులు, స్నేహితులు రెండోరోజూ ఆందోళనకు దిగారు. గురువారం శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. సింథి యాను హత్య చేసిన రూపేష్ను నడిరోడ్డుపై ఉరి తీయాలని డిమాండ్ చేశారు. హత్య చేసి న వ్యక్తులను హతమార్చడమే కఠిన శిక్షంటూ నినాదాలు చేశారు. హంతకుడికి ముసుగు వేసి తీసుకురావాల్సిన అవసరం ఏంటని, అతడిని ముసుగు లేకుండా చూపించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. భారతదేశంతోపాటు తెలంగాణ రాష్ట్రంపై తమకు అపారమైన గౌరవముందని, తమకు న్యాయం చేయాలని నినదించారు. పోలీస్స్టేషన్ పరిసరాలతోపాటు పక్కనే ఉన్న సర్వీసు రోడ్డుపై వారు ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పోలీసులు వారికి నచ్చచెబుతుండగా వారితో కూడా వాగ్వాదానికి దిగారు. ఇదే సమయంలో పోలీసులతో చర్చించేందుకు వచ్చిన దక్షిణాఫ్రికా ఎంబసీ అధికారులతోనూ వారు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కొందరు యువకులు చొక్కాలు విప్పి రోడ్డుపై బైఠాయిం చారు. సానియాను తమకే అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు పలుమార్లు సముదాయించడంతో వారు అక్కడి నుంచి సైబరాబాద్ కమిషనరేట్కు వెళ్లిపోయారు. -
భయపడొద్దు: రాజన్
న్యూఢిల్లీ: బ్రెగ్జిట్ నేపథ్యంలో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటుందని గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. తొలుత ఇన్వెస్టర్లలో ఆందోళన ఉన్నా... భారత్ మూలాలు పటిష్ఠంగా ఉన్న దృష్ట్యా తిరిగి దేశానికి పెట్టుబడులు వస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇతర దేశాలతో పోటీపడేందుకు ఏ దేశమూ తమ కరెన్సీ విలువను తగ్గించకూడదని సూచించారు. ‘‘కీలక పరిస్థితుల్లో ఏ దేశమూ రక్షణాత్మక చర్యలు తీసుకోకూడదు. మేమైతే అంతర్జాతీయ, దేశీ మార్కెట్లన్నిటినీ పరిశీలిస్తున్నాం. లిక్విడిటీ సమస్య రాకుండా చూస్తాం’’ అని బాసెల్ నుంచి ఒక టీవీ ఛానెల్తో మాట్లాడుతూ రాజన్ చెప్పారు. ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్ నుంచి విదేశాలకు తరలిపోయే నిధులు తక్కువే ఉంటాయని పేర్కొన్నారు. -
ఇక.. అమీ తుమీ!
♦ ఎమ్మెల్యేల చేరికతో టీడీపీలో ఇంటిపోరు ♦ కొత్తవారికే ప్రాధాన్యం అంటూ జోరుగా ప్రచారం ♦ అంగీకరించేది లేదంటున్న పాత నేతలు ♦ ఎటూ తేల్చని అధిష్టానం.. ఇన్చార్జిలెవరో చెప్పని వైనం ♦ నెలాఖరుకు క్లారిటీ ఇస్తామంటూ సంకేతాలు ♦ పాత నేతల్లో ఉత్కంఠ.. కార్యకర్తల్లో ఆందోళన సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కొత్తగా అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్యతనిస్తారని ప్రచారం జోరుగా సాగుతుండటంతో ఆ పార్టీ పాత నేతలు అమీ..తుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. దశాబ్దాలుగా పార్టీ కోసం జెండాలు మోసిన వారిని కాదని కొత్త నేతలను అక్కున చేర్చుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెబుతున్నారు. దీంతో జిల్లా పచ్చ పార్టీలో విభేదాలు పతాకస్థాయికి చేరాయి. ఇరువర్గాలు క్లారిటీ కోసం అధిష్టానంపై ఒత్తిడి పెంచాయి. నెలాఖరు నాటికి స్పష్టత ఇస్తామని అధిష్టానం ఇప్పటికే సంకేతాలు పంపింది. ఈ పరిస్థితుల్లో అధిష్టానం పాత నేతలకు ప్రాధాన్యతనిస్తుందా... కొత్త ఎమ్మెల్యేలకు పెద్ద పీట వేస్తుందా... అన్న అంశంపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. పెత్తనం కోసం పోరు.. రాజ్యసభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీని ఇరుకున పెట్టేందుకే ఆ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నట్లు మొదట్లో చంద్రబాబు పాత నేతలకు నచ్చజెప్పారు. ఎమ్మెల్యేలకు భారీ ఎత్తున ప్యాకేజీ ముట్టజెప్పిన నేపథ్యంలో వారిని అంత వరకే పరిమితం చేస్తారని పాత నేతలు భావించారు. మొదటి నుంచి ఉన్న వారికే ప్రాధాన్యం ఉంటుందనుకున్నారు. నియోజకవర్గ ఇన్చార్జులుగా తమనే కొనసాగిస్తారని భావించారు. పెత్తనం తమదేననుకున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు అధికారుల బదిలీ వ్యవహారం తమ చేతుల మీదుగానే జరుగుతుందనుకున్నారు. 30 ఏళ్లుగా జెండాలు మోసిన వారికి బాబు అన్యాయం చేయడని నమ్మారు. పాత నేతలకు మింగుడు పడని సీఎం తీరు.. కొత్తగా పార్టీలో చేరిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్రాజుల రాకను ఆయా నియోజకవర్గాల పాత నేతలు బహిరంగంగానే వ్యతిరేకించారు. వారిపై బహిరంగ విమర్శలకు దిగారు. దీంతో ముఖ్యంగా గిద్దలూరు, అద్దంకిలలో వర్గవిభేదాలు పతాకస్థాయికి చేరాయి. ఒంగోలులో జరిగిన జిల్లా మినీ మహానాడులో కరణం, గొట్టిపాటి వర్గాలు ఏకంగా దాడులకు దిగడం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే గిద్దలూరు నియోజకవర్గంలో అన్నా రాంబాబు, ముత్తుముల అశోక్రెడ్డి వర్గాలు పరస్పర దాడులకు దిగి కేసులు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇరువర్గాలు అధిష్టానంకు ఫిర్యాదు సైతం చేసుకున్నారు. పచ్చ పార్టీ వర్గవిభేదాలు పతాకస్థాయికి చేరిన నేపథ్యంలో రాబోయే కాలంలో పాత వారిని పక్కన పెట్టి చంద్రబాబు ఎమ్మెల్యేలకే ప్రాధాన్యతనిస్తారన్న ప్రచారం జోరందుకుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మద్ధతు పలుకుతున్న ఓ వర్గం దీనికి విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో పాటు అధికారుల బదిలీల్లోనూ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారు. ఇది పాత నేతలకు మింగుడు పడటం లేదు. వారు దీన్ని అంగీకరించే పరిస్థితి లేదు. ఇదే జరిగితే టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం అమీతుమీకి సిద్ధపడతారన్న ప్రచారం జరుగుతోంది. బలరాంకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టి గొట్టిపాటికి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ సాగుతుంది. ఇదే జరిగితే ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న కరణం వెంకటేష్ను పక్కన పెట్టినట్లే. దీనికి కరణం అంగీకరిస్తారా.. అన్నది ప్రశ్న. సీఎం, చినబాబుపై ఒత్తిళ్లు.. ఇక గిద్దలూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబును పూర్తిగా పక్కన పెట్టి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డికి అన్ని అధికారాలు అప్పగిస్తారన్న ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే అన్నా రాంబాబు సైతం అటు ఇటు తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు కందుకూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పోతుల రామారావుకు ప్రాధాన్యతనిచ్చే క్రమంలో సీనియర్ నేత దివి శివరాం చేతులు ముడుచుకొని కూర్చొనే పరిస్థితి కనిపించటం లేదు. శివరాం సైతం అమీతుమీకి సిద్ధంగా ఉన్నట్లు ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గ ఇన్చార్జులు ఎవరో.. అధికారాలు ఎవరివో.. తేల్చాలంటూ పాత, కొత్త నేతలు అటు ముఖ్యమంత్రి, ఇటు చినబాబు లోకేష్లపై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. ఈ నెల చివరి నాటికి క్లారిటీ ఇస్తామని అధిష్టానం చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే..! -
కొడుకు, అల్లుడి కోసమే కొత్త జిల్లాలు
► విభజనతో ప్రజలకు తీరని నష్టం ► మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కొడుకు, అల్లుడి కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటు తెరపైకి తెచ్చారని టీపీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడు, మాజీమంత్రి దుద్ధిళ్ల శ్రీధర్బాబు ఆరోపించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్న జిల్లాల విభజనతో ప్రజలకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయం వద్ద శ్రీధర్బాబు మీడియాతో మాట్లాడుతూ ‘బిడ్డ కోసం నిజామాబాద్ జిల్లా ఉంది. ఇప్పుడు కొడుకు కోసం సిరిసిల్ల, అల్లుడి కోసం సిద్దిపేటను జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారు. శాస్త్రీయంగా జిల్లాల విభజన జరిగితే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని జిల్లాలను విభజిస్తున్నారు. కరీంనగర్కు సమీపంలోనున్న గంగాధర మండలాన్ని సిరిసిల్లలో కలపడం వారి స్వార్థ రాజకీయాలకు నిదర్శనం. ప్రజాభీష్టానికి భిన్నంగా జిల్లాలను ఏర్పాటు చేస్తే సహించబోం’ అని హెచ్చరించారు. -
పాల బిల్లు ఇవ్వలేదని ధర్నా
రాయచోటిటౌన్: సుమారు రెండు నెలలకుపైగా అంటే నాలుగు బిల్లులు ఇవ్వలేదని దీంతో తమ కాపురాలు నడవడం కష్టంగా మారిందని పాడి రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం రాయచోటి విజయా పాలడెయిరీకి పాలు పోసే రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. విజయా పాల డెయిరీ అధికారుల నిర్లక్ష్యంతో ప్రతి 15రోజులకు ఒకసారి చెల్లించాల్సిన బిల్లులు సక్రమంగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులను అడిగినా వారి నుంచి నిర్లక్ష్యపు సమాధానాలు వస్తున్నాయని తెలిపారు. విజయా డెయిరీ యజమాన్యానికి వ్యతిరేకంగా పా లక్యాన్లు తెచ్చి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నేలపై పారబోసి తమ నిరసను వ్యక్త పరిచారు. అలాగే గ్రామాల్లో పాలు కొలిచే ఏజెంట్లు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. నాలుగు బిల్లుల నుంచి డ బ్బులు చెల్లించడం లేదని,రైతులకుఏం సమాధానం చెప్పాలో తెలియక తాము తీవ్ర వత్తిడి గురవుతున్నామని ఏజెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తమకు సకాలంలో బిల్లులు వచ్చే విధంగా చేయాలని తహసీల్దార్ దా మోదర్రెడ్డికి రైతులు వినతిపత్రాని సమర్పించారు. -
ముద్రగడకు మద్దతుగా కాంగ్రె స్ నాయకుల దీక్ష
మచిలీపట్నం టౌన్ : కాపులను బీసీలుగా గుర్తించాల ని కోరుతూ ఆందోళన చేస్తున్న ముద్రగడ పద్మనాభం మద్దతుగా కాంగ్రెస్ నాయకులు బుధ వారం డీసీసీ కా ర్యాలయం వద్ద రిలే నిరాహారదీక్షను నిర్వహించారు. వారు మాట్లాడుతూ టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కాపు రిజర్వేషన్ను క్లాజ్ 9 ప్రకారం బీసీలకు ఏ మాత్రం హాని కలగకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముద్రగడ దీక్ష వివరాలను తెలుపుతున్న మీడియాపై ఆంక్ష లు విధించడం అప్రజాస్వామికమన్నారు. ఈ రిలేదీక్ష లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్మతీన్, అవని గడ్డ నియోజక వర్గ ఇన్చార్జి మత్తి వెంకటేశ్వరరావు, నాయకులు డాక్టర్ ఎన్.రాధికామాధవి, దాదాసాహెబ్, ఆర్.ప్రసాద్, పి.నాగరాజు, షేక్ రబ్బానీ, కె.వెంకటేశ్వరరావు, ఎండీ మెహసీన్, బి.ఎర్రబాబు, అఖ్తర్, గౌస్షరీఫ్, ఖదీర్ పాల్గొన్నారు. నేడు కాపు జేఏసీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ కోనేరుసెంటర్ : కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపుల పక్షాన ప్రభుత్వంపై చే స్తున్న పోరాటానికి మద్దతుగా గురువారం మచిలీపట్నంలో కొవ్వొత్తుల ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు మ చిలీపట్నం కాపు జేఏసీ బుధవారం తెలిపింది. గురువారం సాయంత్రం 4 గంటలకు రేవతిసెంటర్లోని రంగా విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ప్రభుత్వానికి కా పుల నిరసన తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాపు సోదరులంతా హాజరుకావాలని జేఏసీ పిలుపునిచ్చింది. -
గులాబీ నేతల్లో ‘ఆకర్ష్’ గుబులు!
♦ టీఆర్ఎస్లో కిక్కిరిసిపోతున్న కొత్త నేతలు ♦ ఈ చేరికలతో ఎవరికి ఎసరు వస్తుందోననే ఆందోళన సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ నేతల్లో గుబులు మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరుతున్న నేతలతో గులాబీ పార్టీ కిక్కిరిసిపోతుండడం వారిని కలవరానికి గురిచేస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా టీఆర్ఎస్ బాట పడుతున్నారన్న వార్తలతో మరింతగా బెంబేలు పెట్టిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఎవరికి ఎసరు వస్తుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఆయా పార్టీల నుంచి వచ్చి చేరిన వారితో తమకు అవకాశాలు తగ్గిపోయాయన్న అభిప్రాయంలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. టీటీడీఎల్పీ, వైఎస్సార్సీపీ ఎల్పీలను విలీనం చేసుకున్న టీఆర్ఎస్ దాదాపు అన్ని పార్టీల నుంచి వివిధ స్థాయిల నేతలను చేర్చుకుంది. తాజాగా కాంగ్రెస్ నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి చేరిక దాదాపు ఖాయం కాగా.. మాజీ ఎంపీ వివేక్, ఆయన సోదరుడు వినోద్ కూడా గులాబీ గడప తొక్కనున్నారన్న ప్రచారం జరుగుతోంది. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు, మాజీ స్పీకర్ ఆర్.సురేశ్రెడ్డిల పేర్లూ ప్రచారంలో ఉన్నాయి. నియోజకవర్గాల్లో గందరగోళం.. వివిధ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పాత, కొత్త నేతల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట విపక్ష ఎమ్మెల్యేలను, పార్టీ ఎమ్మెల్యేలున్న కొన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల సీనియర్లను చేర్చుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ముథోల్ ఎమ్మెల్యే గడ్డం విఠల్రెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. ఆయనకు, అక్కడ ఓటమి పాలైన టీఆర్ఎస్ నేత వేణుగోపాలాచారి వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. వరంగల్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్యానాయక్ గులాబీ కండువా కప్పుకోగా... ఆయన వర్గానికి, అక్కడ ఓటమి పాలైన సత్యవతి రాథోడ్ వర్గానికి పొసగడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఒక్క ఖమ్మం జిల్లా మినహా చేరికలు జరిగిన మెజారిటీ నియోజకవర్గాల్లో ఇదే తరహా పరిణామాలు జరుగుతున్నాయని నేతలు పేర్కొంటున్నారు. మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేటలో పార్టీ ఎమ్మెల్యే ఉన్నా అక్కడ టీడీపీ సీనియర్ నేత రాములును టీఆర్ఎస్లోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఎమ్మెల్యే యాద య్యకు, అక్కడ ఓటమి పాలైన రత్నంకు మధ్య సయోధ్య కుదరనే లేదు. మాజీ ఎంపీ వివేక్ గులాబీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమైతే.. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ రాజకీయం రసకందాయకంగా మారినట్లేనని నేతలు అంటున్నారు. రాజకీయ భవిష్యత్పై బెంగ టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న వారు సైతం తమ రాజకీయ భవిష్యత్పై బెంగతో ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని, ఏ నాయకులను చేర్చుకున్నా ఇబ్బంది ఉండదని అధికార పార్టీ నేతలు చెబుతూ వస్తున్నారు. కానీ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ఇప్పటిదాకా ఎలాంటి స్పష్టతా ఇవ్వని నేపథ్యంలో ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఖేడ్ లో ‘పునర్విభజన’ చిచ్చు..
♦ సంగారెడ్డి జిల్లాలో కలపాలని డిమాండ్ ♦ మెదక్ జిల్లాలో విలీనం చేస్తే ఆందోళన బాట నారాయణఖేడ్: జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం సిద్ధమవుతుండడం, నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని మెదక్ జిల్లాలో కలుపుతారనే వార్తలు రావడంతో నియోజకవర్గంలో స్థానికుల్లో ఆందోళనలు మొదలయ్యాయి.ప్రస్తుతం ఉన్న జిల్లాను మూడు జిల్లాలుగా చేస్తారనే వార్తల నేపథ్యంలో ఖేడ్ నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పడే సంగారెడ్డి జిల్లాలో ఉంచాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీతోపాటు అన్ని రాజకీయపార్టీలు ఖేడ్ను మెదక్లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఖేడ్ను సంగారెడ్డి జిల్లాలోనే కలపాలని, లేకుంటే ఆందోళనలు చేస్తామని ప్రతిపక్ష పార్టీలు హెచ్చరిస్తున్నాయి. కొన్నేళ్లుగా ఖేడ్ను డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ సైతం ఉంది. మంత్రి హరీశ్రావు ఇటీవల ఖేడ్ను డివిజన్ కేంద్రం చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హామీతో ఖేడ్ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. అనంతర పరిణామాల్లో ఖేడ్ను మెదక్ జిల్లాలో విలీనం చేస్తారనే పిడుగులాంటి వార్తను మాత్రం ప్రాంత వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. సంగారెడ్డితోనే సంబంధాలు.. ఏళ్లుగా నారాయణఖేడ్ వాసులకు సంగారెడ్డితోనే సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజలు చాలామంది సంగారెడ్డిలో నివాసమేర్పరుచుకోవడమే కాకుం డా అక్కడే స్థలాలను కూడా కొనుగోలు చేశారు. వ్యాపారం, ఆస్పత్రులు, తదితర పనులన్నింటీకీ ప్రధానంగా హైదరాబాద్పై ఆధారపడతారు. ఖేడ్ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంమధ్యలోనే సంగారెడ్డి ఉంటుంది. దీంతో సంగారెడ్డికి, రాజధానికి వెళ్లేందుకు అన్ని విధాలుగా అనువుగా ఉంది. అన్ని కార్యాలయాలు సంగారెడ్డిలో ఉండడంతో సంగారెడ్డి పట్టణంతోనే మేకమయ్యారు. మెదక్ ప్రాంతం తో ఈ ప్రాంత ప్రజలకు అంతగా సంబంధాలు లేవు. కేవలం పోలీసు డివిజన్ మాత్రమే మెదక్లో ఉండడంతో ఆ పనులపై వెళ్లివచ్చేందుకే నానా తంటాలు పడతారు. మెదక్ వెళ్లేందుకు సరియైన రవాణా సదుపాయాలు కూడా లేవు. ఖేడ్ నుంచి సంగారెడ్డికి రోజులో రెండు మూడు మార్లు వెళ్లివచ్చే వీలుంది. అదే మెదక్ వెళ్లాలంటే ఒక రోజంతా పడుతుంది. సంగారెడ్డికి నారాయణఖేడ్ నుం చి 80 కిలోమీటర్లు. మెదక్కు 45 కిలోమీటర్ల దూరం ఉన్నా ఆ ప్రాంతంలో ఎలాం టి ప్రయోజనంలేదు. అవసరమైతే ఖేడ్ వాసులు బీదర్ ప్రాంతానికి వెళ్తారు కానీ మెదక్ వెళ్లరు. అలాంటి మెదక్లో ఖేడ్ను విలీనం చేస్తామనడంతో అన్ని వర్గాల వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇంకొందరు ఇప్పటికే జిల్లా కేంద్రంగా ఖేడ్ను చేయాలని కోరుతున్నారు. -
మోదీ పాలనలో హక్కులు హరీ!
అంతర్జాతీయ మానవహక్కుల కార్యకర్తల ఆందోళన వాషింగ్టన్/న్యూఢిల్లీ: రెండేళ్ల మోదీ పాలనలో భారత్లో మానవహక్కులు, మత స్వేచ్ఛ నానాటికీ దిగజారుతున్నాయని అంతర్జాతీయ మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్తో జరిపే ద్వైపాక్షిక చర్చల్లో ఈ అంశాన్ని చేర్చాల్సిందిగా వారు అమెరికాను కోరారు. హాని జరిగే ప్రమాదం ఉన్న వర్గాలకు రక్షణ కల్పించడంతో పాటు ప్రజలకు సమన్యాయం, జవాబుదారీతనం అందించడంలో మోదీ ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని హ్యూమన్ రైట్ వాచ్ సంస్థకు ఆసియా అడ్వొకసీ డెరైక్టర్గా వ్యవహరిస్తున్న జాన్ షిఫ్టన్ అభిప్రాయపడ్డారు. చట్టాలను సమర్థవంతంగా అమలు చేయకపోవడంతో ఇది నిరంతర సవాల్గా కొనసాగుతోందన్నారు. ప్రభుత్వాధికారుల్లో జవాబుదారీతనం లోపించడం, పోలీసులు, భద్రతాధికారుల నిర్లక్ష్యం కారణంగా తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడినవారు కూడా చట్టం నుంచి సులువుగా తప్పించుకుంటున్నారన్నారు. శాసన వ్యవస్థను కోర్టులు నిర్ణయించలేవు శాసన వ్యవస్థ నిర్ణయాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవటం సరికాదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ పునరుద్ఘాటించారు. శాసన, న్యాయ వ్యవస్థలకు ఎవరికి వారికి స్వతంత్ర అధికారాలున్నందున ఇతర వ్యవస్థల్లో జోక్యం చేసుకోకూడదన్నారు. ఢిల్లీలో జరిగిన ‘ఇండియన్ ఆఫ్ ద ఇయర్-2015’ కార్యక్రమంలో జైట్లీ మాట్లాడారు. -
కమీషన్లలో కాకిలెక్కలు !
► రూ.17.50 లక్షలు మింగారని ఆందోళన ► కమలాపూర్ పంచాయతీ ఎదుట మహిళల నిరసన ► రుణాలు చెల్లించబోమంటున్న సభ్యులు ఐకేపీ కొనుగోలు కేంద్రాల కమీషన్పై నిర్వాహకులు కక్కుర్తిపడ్డారంటూ మహిళా సంఘాల సభ్యులు ఆందోళనకు దిగారు. అందినకాడికి దోచుకునుడే లక్ష్యంగా వచ్చినది వచ్చినట్టే మాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.17.50లక్షల కమీషన్ స్వాహా చేశారని.. మింగిన పైసలు చెల్లించాలని ధర్మపురి మండలం కమలాపూర్పంచాయతీ ఎదుట ఆ గ్రామానికి చెందిన మహిళా సంఘాల సభ్యులు గురువారం ఆందోళనకు దిగారు. వివరాలు వారి కథనం ప్రకారం. - కమలాపూర్(ధర్మపురి) ధర్మపురి మండలం కమాలాపూర్లో 2011 నుంచి 2015 వరకు ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు వరికొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలను సీఏలు చూశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యంపై వచ్చిన కమీషన్ను ఖర్చులు పోనూ మిగిలిన డబ్బును సంఘాల ఖాతాల్లో జమ చేయాలి. గ్రామంలో మొత్తం 34 మహిళా సంఘాలు ఉన్నాయి. 2011 నుంచి 2015 వరకు చేపట్టిన కొనుగోళ్లలో రూ.17లక్షలకు పైగా కమీషన్ రాగా ఖర్చులు పోనూ దాదాపు రూ.10 లక్షలకు పైగా అక్రమాలు జరిగాయని పేర్కొంటూ మహిళా సంఘాల సభ్యులు పంచాయతీ ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. కొనుగోళ్లకు సంబంధించిన లెక్కలపై గురువారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఒక సీఏతోపాటు నిర్వాహకులు కాకి లెక్కలు చూపించి మమా అనిపించడానికి ప్రయత్నించారని ఆరోపించారు. వారు గ్రామపంచాయతీ నుంచి నిర్వాహకురాలు ఇంటి వద్ద సమావేశం పెట్టి లెక్కలు చూశారు. కొనుగోళ్లకు సంబంధించిన రికార్డు బుక్కులను తూతూ మంత్రంగా పరిశీలించారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.17.50 లక్షల కమీషన్ గతంలో చేపట్టిన మొత్తం ఏడు క్రాప్లలో కొనుగోళ్ల ద్వారా వచ్చిన మొత్తం కమీషన్ రూ.17.50 లక్షలు ఉంటుందని సభ్యులు తెలిపారు. ఇందులో రూ. 2.50లక్షలు నిర్వాహకుల వేతనాల కింద ఖర్చు చూ పగా.. మిగతా రూ.15 లక్షల్లో రూ.7.50 లక్షలు అనామతు ఖర్చుల కింద చూపారు. మిగిలిన మరో రూ.7.50 లక్షలకు ఎలాంటి ఖర్చులు చూపక నిర్వాహకులు మింగేశారని వారు పేర్కొంటున్నారు. ఏదేమైన కమీషన్లలో అవకతవకలు పాల్పడిన వారిపై జిల్లా అధికారులతో విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. లెక్కలు తేలే వరకు రుణాలు చెల్లించబోమని మహిళా సంఘాల సభ్యులు స్పష్టం చేశారు. -
మల్లన్నా దారెటు..?
♦ వివాదాస్పదంగా భూసేకరణ అంశం ♦ గగ్గోలు పెడుతున్న బాధితులు ♦ సర్కార్పై ప్రతిపక్షాల ముప్పేట దాడి ♦ దీటుగా స్పందిస్తున్న అధికార పక్షం కొమురవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్ భూసేకరణ అంశం గందరగోళంగా మారింది. భూములు గుంజుకుంటున్నారని, ఊరంతా ఖాళీ చేయాల్సి వస్తుందని బాధితులు ఆందోళన చెందుతున్నారు. భూములు, ఊరిని వదిలితే బతుకుదెరువు ఏమిటని బెంగపెట్టుకున్నారు. ఇన్నేళ్లు ఉన్న బంధం ఒక్కసారిగా తెగిపోతుందంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు బాధితులకు అండగా నిలుస్తున్నారు. వారి పక్షాన ఉద్యమిస్తున్నారు. ఇదిలావుంటే దేశంలోనే నంబర్ వన్ ప్యాకేజీ ప్రకటించా మని సర్కార్ దీటుగా జవాబిస్తోంది. భూ బాధితులు, ప్రతిపక్షాలు ఒకవైపు.. సర్కార్ మరోవైపు అన్నట్టుగా వ్యవహారం సాగుతోంది. రాజకీయ రంగు పులుమునుకున్న మల్లన్న సాగర్ అంశం ఎలా కొలిక్కివస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. - సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కింద 1.5 టీఎంసీల సామర్థ్యంతో దుబ్బాక-గజ్వేల్ నియోజకవర్గాల మధ్య మల్లన్నసాగర్ను నిర్మించడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసింది. జిల్లాకు ఒక్క ఘణపురం ఆనకట్ట తప్ప మరో సాగునీటి ప్రాజెక్టు లేకపోవడంతో సీఎం కేసీఆర్ మల్లన్న సాగర్ సామర్థ్యం పెంపు ప్రతిపాదన చేశారు. దీంతో ప్రాజెక్టు రీ-ఇంజినీరింగ్ చేసేందుకు నిర్ణయించారు. 21 వేల ఎకరాల్లో 52 టీఎంసీల నీళ్లు నిల్వ చేసే రిజర్వాయర్ను తొగుట-కొండపాక మండలాల మధ్య నిర్మించవచ్చని వాస్కోప్ సంస్థ ఇచ్చిన నివేదికతో తెలంగాణ ప్రభుత్వం మల్లన్న సాగర్ నిర్మాణానికి పూనుకుంది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పరిధిలో నిర్మితమవుతున్న రిజర్వాయర్, పైప్లైన్లు మొదలగు వాటి కోసం మొత్తం గ్రామాల్లో 20,079.16 ఎకరాల భూమి సేకరించడానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో 5 గ్రామాల్లో పూర్తిగా ఇళ్లు, భూములు ముంపునకు గురవుతున్నాయి. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం అందించడానికి ముంపు ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు సదస్సులు కూడా నిర్వహించారు. భూ సేకరణ కోసం జూలై 30న జీఓ 123ను జారీ అయ్యింది. దీనిలో స్వల్ప మార్పులు చేస్తూ జీఓ 214 ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం పాత జీఓలోని.. పునరావసం, మరో చోట నివాసానికి చెల్లింపు.. తదితర పదాలను ప్రభుత్వం తొలగించింది. ముంపు బాధితుల డిమాండ్లు ♦ ఎకరానికి మార్కెట్ ధర మీద కనీసం నాలుగు రెట్లు అధికంగా చెల్లించాలి. ♦ మల్లన్న సాగర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించాలి ♦ భూమికి భూమి, ఇంటికి ఇల్లు నిర్మించి ఇవ్వాలి ♦ ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి. దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాలకు సాగు నీరందించడానికి చేపడుతోన్న 52 టీఎంసీల సామర్థ్యం గల మల్లన్న సాగర్ రిజర్వాయర్కు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈక్రమంలో 20,079.16 ఎకరాలను సేకరించే పని మొదలైంది. ముంపునకు గురవుతున్న ఊళ్లు, ఎకరాలు, ఇళ్ల వివరాలు... ♦ పైప్లైన్ల నిర్మాణానికి తుక్కాపూర్లో 972.10 ఎకరాలు, తొగుట, బ్రాహ్మణ బంజేరుపల్లిలో 2,703 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 142.30 ఎకరాల భూమి పోతోంది. ♦ గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండలం పల్లెపహాడ్ రెవెన్యూ పరిధిలో 1,199 ఎకరాలు, 320 ఇళ్లు, దస్తగిరి నగరంలో 162 ఇళ్లు కోల్పోతున్నారు. తిప్పారంలో 2,344.1 ఎకరాలు, 250 ఇళ్లు, మదిర గ్రామమైన సింగారంలో 120 ఇళ్లు ముంపునకు గురవుతున్నాయి. ♦ ఎర్రవల్లిలో 2,297 ఎకరాలు 348 ఇళ్లు, మంగోల్లో 1851.36 ఎకరాలు 450 ఇళ్లు, కాశీ గుడిసెలులో 20 ఇళ్లు, కోనాయిపల్లిలో 444 ఎకరాలు 105 ఇళ్లు, వడ్డెర కాలనీలో 15 ఇళ్లు కోల్పోతున్నారు. మాత్పల్లి గ్రామంలో 44 ఎకరాలు, మేదినీపూర్లో 117 ఎకరాలు, ముద్దారం గ్రామంలో 40.19 ఎకరాల సాగు భూమి పైప్లైన్ల నిర్మాణం కోసం సేకరిస్తున్నారు. జీఓనా... చట్టమా..? 123 జీఓ అంటే మ్యూచివల్ కాన్సెంట్ అవార్డు. రైతు ఒప్పుకుంటేనే వారితో ప్రభుత్వం ఒప్పదం చేసుకునే జీవో ఇది. 123 ప్రకారం ఎకరానికి దాదాపు రూ.6 లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. బోరు, చెట్టు, బావి, పైప్లైన్లు ఇలా ఉన్నవాటికి కూడా అదనంగా నష్టపరిహారం కట్టిస్తారు. ఈ లెక్కన సగటున ఒక్కో ఎకరానికి రూ.7.5 నుంచి రూ.8 లక్షల చొప్పున పరిహారం అందుతుంది. ఈ డబ్బు కూడా రైతులు భూములు రిజిస్ట్రేషన్ చేసిన 15 నుంచి 20 రోజుల్లోనే అవకాశం ఉంది. ఇళ్లు కోల్పోతున్న వారికి రూ. 5.4 లక్షల నష్టపరిహారంతో(డబుల్ బెడ్రూంకు అయ్యే ఖర్చు) పాటు, కొత్త ఇళ్లు కట్టుకోవడానికి మరో రూ.5.4 లక్షల ఆర్థిక సహకారం అందిస్తారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ విలువకు రెండింతలు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. మరో నిబంధన ప్రకారం ముంపునకు గురై, భూములు పోగొట్టుకున్నవారికి దానికి సమానమైన భూములు ఇవ్వాలనే నిబంధన ఉంది. నష్టపరిహారం చెల్లించడానికి ప్రభుత్వానికి 6 నుంచి 8 నెలల సమయం తీసుకునే వెసులుబాటు ఈ చట్టంలో ఉంది. ఈ చట్టాన్ని గతంలో సింగూరు ప్రాజెక్టు కింద రైతులకు అమలు చేశారు. ఈక్రమంలో పుల్కల్, అందోల్ మండలాల్లో 24 గ్రామాల్లో రైతులు భూములు కోల్పోయారు. కానీ, రైతులకు చేతికి ఇప్పటి వరకు డబ్బులు అందలేదు. మల్లన్న సాగర్తో లాభాలు మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వారా 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. మల్లన్న సాగర్ నుంచి విడుదలయ్యే నీటితో మిషన్ కాకతీయ కింద మరమ్మతులు చేపట్టిన చెరువులను నింపుతారు. భూగర్భ జలాలు సమృద్ధిగా పెరుగుతాయి. బీళ్లుగా మారిన భూములు సాగులోకి వస్తాయి. దీంతో ప్రతి ఒక్కరికి చేతి నిండా పని దొరుకుతుంది. వర్షాధార పంటల అవసరమే ఉండదు. ఏడాదిలో రెండు పంటలకు సరిపోయేంత సాగు నీరందిస్తోంది. బోరు బావుల్లో పుష్కలంగా నీళ్లు ఉంటాయి. రైతులకు అదనపు ఖర్చులు తగ్గుతాయి. ముంపు గ్రామాల ప్రజల సమస్యలు, కోరికలను ప్రభుత్వం తీరిస్తే మల్లన్న సాగర్ రిజార్వాయర్తో నష్టం కన్నా లాభాలే అధికంగా ఉంటాయని మేథావుల అభిప్రాయం. ముంపు బాధితుల కష్టాలు 20,079.16 వేల ఎకరాల సాగుకు అనుకూలమైన సారవంతమైన భూమిని రైతులు కోల్పోతున్నారు. 3,112 ఇళ్లు ముంపునకు గురవుతున్నాయి. ఇళ్లను ఎక్కడ నిర్మించుకోవాలో? ఎక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవాలో? ఎక్కడ సాగు భూములను కొనుగోలు చేసుకోవాలో? తెలియని ఆందోళన ముంపు గ్రామాల ప్రజల్లో నెలకొంది. బాధితుల బతుకులే చిందర వందరమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. నా దగ్గర మంచి స్కీం ఉంది: సీఎం కేసీఆర్ ‘ప్రతి నియోజకవర్గానికి 1.20 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తాం. రిజర్వాయర్లో సాగు భూములు, ఇళ్లను కోల్పోతున్నవారు ఆధైర్య పడొద్దు. పోయినదానికంటే రూపాయి ఎక్కువే ఇస్తా. మీరు ఏం చేయాలో.. నా దగ్గర మంచి స్కీం ఉంది. నా దగ్గరకు మీరు వంద... నూటయాభై మంది కలిసి రండి. మీరు ఎక్కడెక్కడ భూములు కొనుక్కోవాలో చెప్తా.’ జనవరి 11న దుబ్బాకలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కేసీఆర్ అన్న మాటలివి. -
నిలిచిన కేబుల్ ప్రసారాలు
కేబుల్ ఆపరేటర్ హత్య ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని బీరంగూడలో కేబుల్ ఆపరేటర్ రమేశ్ హత్యను నిరసిస్తూ కేబుల్ ఆపరేటర్లు ఆందోళనకు దిగారు. సోమవారం సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రసారాలను నిలిపివేసి నిరసన తెలిపారు. కొందరు మాఫియాగా ఏర్పడి ఆపరేటర్లపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజుగౌడ్, గౌరవాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు లింగాల హరిగౌడ్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా తమ నిరసన విజయవంతమైందని తెలిపారు. -
ఒక్క బుక్కు వచ్చింటే ఒట్టు
♦ బుధవారం నుంచి కళాశాలలు ప్రారంభం ♦ అందని పాఠ్యపుస్తకాలు ఆందోళనలో విద్యార్థులు కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వం విద్యార్థుల కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్నా.. సకాలంలో వారికి పాఠ్యపుస్తకాలు అందించలేకపోతున్నారు. ఫలితంగా విద్యార్థులు అనుకున్న స్థాయిలో ఫలితాలను సాధించలేకపోతున్నారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ప్రైవేట్ విద్యార్థులతో పోటీపడలేక వెనుకబడిపోతున్నారు. ఇంటర్కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలతోపాటు ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలలు తెరుచుకున్నాయి. కానీ అవసరమైన పాఠపుస్తకాలు మాత్రం ఇంత వరకు జిల్లాకు చేరుకోలేదు. ఎప్పుడు వస్తాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా ఎన్ని పుస్తకాలు కావాలంటే జిల్లావ్యాప్తంగా ఇంటర్కు సంబంధించి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు గాను 1,00,118 పుస్తకాలు అవసరమని అధికారులు ఇంటర్మీడియట్ బోర్డుకు నివేదికిచ్చారు. అక్కడి నుంచి ఇంతవరకు అతీగతీ లేదు. నేరుగా గోడౌన్కు ప్రభుత్వం నుంచి వచ్చే ఇంటర్కు సంబంధించిన పాఠ్యపుస్తకాలు నేరుగా ప్రభుత్వ పాఠ్యపుస్తకాల గోదాంకు చేరుకుంటాయి. సంబంధిత పుస్తకాలను అక్కడి నుంచి ఆర్ఐవో కార్యాలయానికి తరలించుకుని ఇక్కడ నుంచి కళాశాలల వారికి పంపిణీ చేయనున్నారు. ఈ తతంగమంతా జరగాంటే కొంత సమయం పడే అవకాశాలున్నాయి. రాగానే పంపిణీ చేస్తాం ప్రభుత్వం నుంచి పాఠపుస్తకాలు రాగానే కళాశాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటాం. దాదాపుగా వారంలోపే పుస్తకాలు వచ్చే అవకాశం ఉంది. పాఠ్యపుస్తకాలు రాగానే అలస్యం లేకుండా కళాశాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటాం. - చంద్రమౌళి, డివీఈవో, కడప. -
సారూ.. సదువు ఆగమైంది
♦ మూతపడిన బడులను తెరిపించండి ♦ పిల్లలు లేరని మూసివేయొద్దు ♦ పోరగాళ్లు మండుటెండల్లో నడిచి వెళుతుండ్రు ♦ సుప్రీం కోర్టు బృందం ఎదుట తల్లిదండ్రుల ఆవేదన సాక్షి టాస్క్ఫోర్స్: ‘సారూ...! మా ఊళ్లో 15మంది పోరగాళ్లు సదువు కోసం రెండు కిలోమీటర్ల దూరంలో గల బూర్గుపల్లికి మండుటెండలో నడిచి పోతున్నరు. మండే ఎండలను భరించలేక ఎండకాలంలో పెడుతున్న మధ్యాహ్న భోజనానికి సైతం వెళ్లడం లేదు. బడీడు ఉన్నోళ్లు 10 నుంచి 15 మంది ఉన్నరు. ఇంతకుముందున్న టీచర్ను మార్చి.. మూతపడ్డ బడిని మళ్లా తెరిపించండి’ అంటూ సిద్దిపేట మండలం ఎన్సాన్పల్లి మధిర తిప్పరబోయిన కాలనీ కి చెందిన తల్లిదండ్రులు సుప్రీంకోర్టు అధ్యయన బృందం ఎదుట తమగోడు వెళ్లబోసుకున్నారు. విద్యార్థులు లేక జిల్లాలో గత ఏడా ది 24 పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో తెలంగాణ పేరెంట్స్ ఫెడరేషన్ తరఫున సాగర్రావు అనే వ్యక్తి సుప్రీం కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు అధ్యయన బృందాన్ని సోమవారం మెదక్ జిల్లాకు పంపింది. ఈ బృందంలో అశోక్ గుప్తా, రత్నం, వెంకటేశ్వర్రావు ఉన్నారు. వీరు సిద్దిపేట మండలం ఎన్సాన్పల్లి మధిర తిప్పరబోయిన కాలనీ, నంగనూర్ మండలం తిమ్మాయిపల్లి మదిర భాషాగూడెం, గట్ల మల్యాల మధిర సీతారంపల్లి, హనుమాన్ నగర్, రాజగోపాల్పేట మదిర ఫకీర్ కాలనీల్లో పర్యటించి పాఠశాలలను పరిశీలించారు. ఈ పాఠశాలల మూసివేతకు గల కారణాలను తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తిప్పరబోయిన కాలనీ వాసులు సుప్రీంకోర్టు బృందంతో మాట్లాడుతూ గత ఏడాది ఆరుమంది విద్యార్థులే ఉన్నారన్న కారణంతో పాఠశాలను మూసివేసి, అక్కడి టీచర్ను డిప్యూటేషన్పై పంపినట్లు తెలిపారు. ప్రస్తుతం రెండు కిలోమీటర్ల దూరంలో గల బూర్గుపల్లికి పిల్లలు నడిచి వెళ్తున్నారన్నారు. ఎండాకాలం, వానకాలం వస్తే అనేక తిప్పలు పడుతున్నారని వాపోయారు. ఇంతకు ముందున్న సార్ను మార్చి కొత్త టీచర్తో బడి మళ్లా తెరిపించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. నంగునూరు మండలం భాషాగూడెంలో సైతం గత ఏడాది కేవలం ఆరుగురు పిల్లలే ఉండటంతో పాఠశాలను మూసివేశారు. సీతారాంపల్లిలో నలుగురు, హనుమాన్ నగర్లో 5మంది, ఫకీర్ కాలనీలో 5మంది విద్యార్థులుండటంతో ఆ పాఠశాలలను మూసివేశారు. దీంతో విద్యార్థులంతా సమీప గ్రామాల్లో గల పాఠశాలలకు సుమారు 2,3 కిలో మీటర్లునడిచి వెళ్తున్నారని తల్లిదండ్రులు సుప్రీం బృందానికి నివేదించారు. ఈ బృందం వెంట మెదక్ డీఈఓ నజీమొద్దీన్, సిద్దిపేట డిప్యూటీఈఓ శ్యాంప్రసాద్రెడ్డిలు ఉన్నారు. నంగునూర్ ఎంఈఓ దేశిరెడ్డి, సిద్దిపేట ఎంఈఓ ప్రసూనదేవి, న్యాయవాది శ్రవన్ తదితరులు ఉన్నారు. భారమవుతున్న మధ్యాహ్న భోజనం: ఆవాస ప్రాంతానికో పాఠశాల ఉండాలని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు 100-150 జనాభా గల పల్లెల్లో సైతం పాఠశాలలను ఏర్పాటు చేశారు. దీంతో ఒక్కో పాఠశాలలో 10 నుంచి 15మందికంటే ఎక్కువగా విద్యార్థులు లేకుండా పోయారు. ఉపాధ్యాయుల నిర్లక్ష ్యం, అరకొర వసతుల కారణంగా అందులో కొంతమంది ప్రైవేట్ పాఠశాలలవైపు వెళ్ళారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో విద్యార్థుల సంఖ్య 5నుంచి 6కే పడిపోయింది. అయితే ఆరుమంది విద్యార్థులకు వండిపెట్టడం ఏజెన్సీ మహిళలకు గిట్టుబాటు కాకపోవడంతో మధ్యాహ్న భోజనం నడిపించలేని పరిస్థితి నెలకొంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఉపాధ్యాయులు కూడా మొక్కుబడిగా పాఠశాలకు వెళ్లిరావడం ఒక తంతుగామారిందన్న ఆరోపణలున్నాయి. ఉన్న ఒక్క ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్లినా.. మీటింగ్కు వెళ్లినా.. శిక్షణ కార్యక్రమానికి వెళ్లినా..ఇతర బోధనేతర కార్యక్రమాలకు వెళ్లినా...పాఠశాలలు తెరువలేని పరిస్థితి. దీంతో రోజు రోజుకు పాఠశాలల నిర్వహణ భారంగా మారడంతో ఆ పాఠశాలలను మూసివేసి అక్కడి టీచర్లను ఇతర పాఠశాలలకు డిప్యూటేషన్పై పంపినట్లు విద్యాధికారులు చెబుతున్నారు. 13న సుప్రీంకోర్టులో విచారణ: ప్రభుత్వ పాఠశాలలో వసతుల లేమి, లోపించిన ఉపాధ్యాయుల జవాబుదారితనం, కానరాని అధికారుల పర్యవేక్షణ తదితర కారణాల వల్ల ప్రభుత్వ పాఠశాలలు మూతపడి నిరుపేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆరోపిస్తూ తెలంగాణ పేరెంట్ ఫెడరేషన్ తరపున సాగర్రావు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ఫిర్యాదుచేయగా, న్యాయవాది శ్రవణ్ కేసును వాదిస్తున్నారు. జూన్ 13న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి సుప్రీం కోర్టు అధ్యయన బృందం ముగ్గురు సభ్యులను జిల్లాకు పంపింది. ఈ బృందం జూన్ మొదటి వారంలో క్షేత్రస్థాయి నివేదికను అందించనుంది. -
దీక్షపై దిగులు
► నవనిర్మాణ దీక్షకు జనసమీకరణపై కసరత్తు ► తహసీల్దార్లు, ఎంపీడీవోలకు టార్గెట్లు ► ఖర్చుపై ఆందోళన చెందుతున్న అధికారులు విజయవాడ: వచ్చే నెల రెండో తేదీన ప్రభుత్వం తలపెట్టిన నవనిర్మాణ దీక్ష విజయవంతం చేయాలని ప్రభుత్వం నుంచి అధికారులకు ఒత్తిళ్లు పెరిగాయి. నాలుగు రోజులుగా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జనసమీకరణకయ్యే ఖర్చులపై అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద చేపట్టిన దీక్షకు భారీగా జన సమీకరణ చేయించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రసన్నం చేసుకునేందుకు జిల్లా ఉన్నతాధికారులు నానా తంటాలు పడుతున్నారు. దాదాపు 30, 40 వేల మందికిపైగా జనాన్ని దీక్షలకు తరలించాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు అందినట్లు సమాచారం. మండలానికి ఆరు వందల మంది చొప్పున తరలించాలని లక్ష్యం విధించారు. ఇప్పటికే జిల్లాలో 49 మండలాల్లో ఎంపీడీవోలకు టార్గెట్లు నిర్దేశించారు. సోమవారం ఎంపీడీవోలు అన్ని మండల కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహించి గ్రామ కార్యదర్శులకు జన సమీకరణ కోసం మౌఖిక అదేశాలిచ్చారు. టీచర్లు, డ్వాక్రా మహిళలు, ఉపాధి కూలీలను తరలించాలని నిర్ణయించినట్లు తెలిసింది. జన సమీకరణకు వాహనాలు సమకూర్చే బాధ్యతను రవాణా శాఖకు అప్పగించారు. ఒక్కో మండలానికి 16 బస్సులు కేటాయించాలని ఇప్పటికే జిల్లా యంత్రాంగం రవాణా శాఖకు తాఖీదు ఇచ్చింది. దీంతో ప్రైవేటు పాఠశాలల బస్సులను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. వీటిని ఎంపీడీవోలకు అప్పగించనున్నారు. వారు ఆ బస్సులకు డీజిల్ కొట్టించి గ్రామాలకు రూట్ ప్రకారం పంపాలి. డీజిల్ ఖర్చులపై ఎలాంటి హామీ రాకపోవడంతో ఎంపీడీవోలు ఆందోళన చెందుతున్నారు. గతంలో అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో జనాన్ని తరలించేందుకు వెచ్చించిన డబ్బులు సక్రమంగా రాలేదని ఎంపీడీఓలు చెబుతున్నారు. దీక్షకు హాజరయ్యే వీఐపీలు, బందోబస్తుకు కాన్వాయ్ కోసం కార్లు ఏర్పాటు చేసే బాధ్యత రవాణా శాఖపై పడింది. దీక్షలో ఉద్యోగులు, అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. పోలీసు అధికారులు ట్రాఫిక్ మళ్లింపు తదితర సమస్యలపై దృష్టి సారించారు. ఏర్పాట్లు పరిశీలించిన సీపీ నవనిర్మాణ దీక్షకు సంబంధించి ట్రాఫిక్ క్ర మబద్ధీరణపై పోలీసు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం నగర పోలీసు కమిషనర్ డీ గౌతమ్ సవాంగ్, ట్రాఫిక్ అధికారులు బెంజిసర్కిల్కు వెళ్లి ట్రాఫిక్ మళ్లింపుపై పరిశీలించారు. -
సెల్ టవరెక్కి నిరసన..
♦ తన వ్యవసాయ భూమిని ఇతరులు ♦ ఆక్రమించుకున్నారంటూ ♦ బాధితుడు నర్సింలు ఆవేదన ♦ అధికారులు పట్టించుకోనందునే ♦ మూడుసార్లు టవరెక్కాల్సి వచ్చిందన్న బాధితుడు కేసు నమోదు రామాయంపేట: తన వ్యవసాయ భూమిని ఇతరులు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ రామాయంపేట గ్రామ పంచాయతీ ప రిధిలోని గొల్పర్తి గ్రామానికి చెందిన సాదుల నర్సింలు అనే యువకుడు మంగళవారం రామాయంపేటలో సెల్ టవరెక్కి హల్చల్ సృష్టించారు. కాగా బాధితుడు నర్సింలు ఈ సమస్యపై సెల్ టవరెక్కడం ఇది మూడోసారి. వివరాల్లోకి వెళితే నర్సింలుకు సంబంధించిన భూమి విషయంలో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్థాపం చెందిన నర్సింలు నేరుగా రామాయంపేట వచ్చి సెల్ టవరెక్కి సుమారు 2గంటలపాటు హల్చల్ సృష్టించారు. దీంతో పోలీసులతోపాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, దిగిరావాలని బంధువులతోపాటు పోలీసులు నచ్చజెప్పినా నర్సింలు వినలేదు. స్థానిక ఫైర్ సిబ్బంది టవరెక్కి నర్సింలుకు నచ్చజెప్పి కిందకు దించారు. అనంతరం నర్సింలు మాట్లాడుతూ తన వ్యవసాయ భూమితోపాటు ఇంటి స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నా..రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు.టెవరెక్కి న్యూసెన్స్ సృష్టించిన నర్సింలుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మూడో వంతు ఏటీఎంలు పనిచేయడం లేదు
ముంబై: దేశంలో 3వ వంతు ఏటీఎంలు పనిచేయడం లేదంటూ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్.ఎస్.ముంద్రా ఆందోళన వ్యక్తంచేశారు. బ్యాంకులు తక్షణం ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మంగళవారమిక్కడ ఒక బ్యాంకింగ్ కార్యక్రమంలో మాట్లాడారు. ఏటీఎంలకు సంబంధించి ఆర్బీఐ రూపొందించిన నిబంధ నలను కూడా బ్యాంకులు సక్రమంగా అవలంభించడం లేదని, దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవల ఆర్బీఐ బృందం దేశవ్యాప్తంగా, పలు బ్యాంకులకు సంబంధించిన 4,000 ఏటీఎంలపై ఒక సర్వే నిర్వహించింది. దీన్లో మూడో వంతు పనిచేయడం లేదని బయటపడింది. -
డబుల్’ లొల్లి
► చిన్నముల్కనూర్లో గ్రామసభ రసాభాస ► అనర్హులను ఎంపిక చేశారని నిలదీత ► అధికారులతో గంటసేపు వాగ్వాదం ► వాహనాన్ని అడ్డుకుని ఆందోళన.. ధర్నా ► పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన గొడవ చిగురుమామిడి : సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన మండలంలోని చిన్నముల్కనూర్లో డబుల్బెడ్రూమ్ ఇండ్ల గొడవ ముదిరింది. లబ్దిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయంటూ పలువురు గ్రామస్తులు అధికారులను నిలదీశారు. అర్హులకు అన్యాయం చేశారంటూ తీవ్రస్థారుులో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా.. పోలీసుల జోక్యం చేసుకోవడంతో సద్దుమణిగింది. చిన్నముల్కనూర్లో డబుల్బెడ్రూమ్ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక కోసం శుక్రవారం కరీంనగర్ ఆర్డీఓ చంద్రశేఖర్, ట్రెరుునీ అసిస్టెంట్ కలెక్టర్ గౌతమ్, తహసీల్దార్ రాజు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామస్తులంతా గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ముందుగానే సమావేశమై అధికారుల రాకకోసం ఎదురుచూశారు. అధికారులు మధ్యాహ్నం 3గంటలకు అక్కడికి చేరుకున్నారు. ఆర్డీవో చంద్రశేఖర్ డబుల్బెడ్రూమ్ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక జాబితాను చదివి వినిపించారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఒక్కసారిగా లేచి అధికారులను నిలదీశారు. సర్పంచ్ మకుటం రాజయ్య మినహా గ్రామంలోని ప్రజాప్రతినిధులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులందరూ మూకుమ్మడిగా అధికారులను నిలదీశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సభావేదికపై ఉన్న అధికారులపై దూసుకొచ్చి వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఎంతనచ్చజెప్పినా గ్రామస్తులు వినలేదు. గుంపులు గుంపులుగా వచ్చిపోతూ దాదాపు గంటసేపు అధికారులను నిలదీశారు. అవసరమైతే మళ్లీ ఎంపిక ప్రక్రియను చేపడతామని చెప్పినా వారు వినలేదు. విసిగివేసారిన అధికారులు చివరికి నిస్సహాయులై కూర్చున్నారు. 187 మందిలో 40 మందిని ఎలా ఎంపిక చేస్తారు...? చిన్నముల్కనూర్లో మొదటి విడతగా మంజూరైన 247 డబుల్బెడ్రూమ్ ఇండ్లు కాకుండా సీఎం కేసీఆర్ అదనంగా మరో 200 ఇండ్లను మంజూరు చేస్తానని హామీ ఇవ్వగా.. స్థానిక అధికారులు గ్రామంలో 187 మంది అర్హులున్నారని నివేదిక పంపారు. దీనిపై ఆర్డీఓ, తహసీల్దార్ లోతుగా పరిశీలించి వడబోయగా 40 మంది అర్హులు తేలారు. వారికి ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు గ్రామసభలో చదివి వినిపించారు. దీంతో అలజడి ప్రారంభమైంది. ఎస్సీలకు సరైన న్యాయం జరగలేదని, డబ్బులు ఇచ్చినవారికే ఇండ్లు మంజూరు చేస్తున్నారని, అర్హులైన బీసీలు ఉన్నా సర్పంచ్ పట్టించుకోవడంలేదని, తమపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారులను ఘెరావ్ చేసిన గ్రామస్తులు గ్రామసభను ఇక నడవనీయరని భావించిన అధికారులు వాహనంలో కూర్చుని వెళ్తుండగా ఉపసర్పంచ్ సాంబారి బాబు నేతృత్వంలో గ్రామస్తులు వాహనానికి అడ్డుకున్నారు. వాహనం ముందు పడుకుని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అధికారులు వాహనం వెనుకకు వెళ్లేందుకు ప్రయత్నించగా వెనుకభాగాన కూడా బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు వాహనం దిగి గ్రామపంచాయతీ కార్యాలయంలోకి వెళ్లారు. సమాచారం తెలుసుకున్న హుస్నాబాద్ సీఐ దాసరి భూమయ్య తన సిబ్బందితో చిన్నముల్కనూర్కు చేరుకుని గ్రామస్తులను శాంతింపజేశారు. దీంతో అధికారులు వెళ్లిపోయారు. అధికారులను అడ్డగిస్తే కేసుల పాలవుతారని, ఇది మంచిదికాదని హెచ్చరించడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటారుుంపులో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు చేసిన తప్పిదానికి సీఎంను నిందించడం సరైందికాదని టీఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడ్డారు. గ్రామస్తుల ఆందోళన విరమించిన తర్వాత కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వీరమల్ల చంద్రయ్య, సర్పంచ్ మకుటం రాజయ్య, ఎంపీటీసీ సంగీత, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ ముప్పిడి దేవేందర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ సాంబారి కొంరయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఎక్సైజ్ అధికారులపై ‘నీలిషికారీ’ల తిరుగుబాటు
► మహిళల రాళ్ల వర్షం ► దాడిలో ఇద్దరికి గాయాలు ► వాహనాల అద్దాలు ధ్వంసం ► టూటౌన్ స్టేషన్లో ఎక్సైజ్ అధికారుల ఫిర్యాదు కర్నూలు: స్తానిక బంగారుపేటలోని సారా స్థావరంపై మంగళవారం రాత్రి రైడింగ్కు వెళ్లిన ఎక్సైజ్ పోలీసులకు నీలిషికారీల నుంచి తిరుగుబాటు ఎదురైంది. వాళ్లు రాళ్ల వర్షం కురిపించడంతో ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ ఆర్.సుధాకర్, కానిస్టేబుల్ జగన్నాథం, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు.డీటీఎఫ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు ఏఈఎస్ సుధాకర్, కర్నూలు ఎక్సైజ్ స్టేషన్ సీఐ పద్మావతి, డీటీఎఫ్ సీఐ కృష్ణకుమార్, ఎస్ఐలు హరికృష్ణ, కిశోర్కుమార్, పత్తికొండ, ఆలూరు సీఐలు చంద్రశేఖర్, మంజుల, ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐలు రమణారెడ్డి, శ్రీరాములు, సుమారు 30 మంది పోలీసులు సారా స్థావరంపై తనిఖీలకు వెళ్లగా నీలిషికారీ మహిళలు వారిని చుట్టు ముట్టి గొడవకు దిగారు. ఈలోగా నీలిషికారీకి చెందిన శేఖర్ మద్యం సీసాను పోలీసులపై విసరడంతో ఉద్రిక్తత నెలకొంది. కొందరు మహిళలు కూడా రాళ్లు విసరడంతో పోలీసులు అడ్డదారిలో రోడ్డుపైకి రావాల్సి వచ్చింది. తోపులాటలో షికారి మహిళ తలకు గాయాలు కావడంతో వారు మరింత రెచ్చిపోయారు. ఎక్సైజ్ పోలీసులపై రాళ్లు విసురుతూ రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. కొంతమంది నీలిషికారీ యువకులు ఎక్సైజ్ వాహనాలపై రాళ్లతో దాడి చేయడంతో వాటి అద్దాలు ధ్వంసమయ్యాయి. కొంతమంది కానిస్టేబుళ్లకు కూడా రాళ్లు తగిలి గాయాలయ్యాయి. దీంతో వెనక్కు తగ్గిన ఎక్సైజ్ పోలీసులు రెండో పట్టణ పోలీసుల సాయంతో మరోసారి రైడింగ్కు వెళ్లారు. అప్పుడు కూడా షికారీ మహిళలంతా చుట్టుముట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు గంటల పాటు వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి. షికారీ మహిళలు శాపనార్థాలు పెడుతుం డడంతో చేసేదేమీ లేక పోలీసులు అక్కడినుంచి వెళ్లిపోయారు. అయితే మహిళలు మాత్రం గంటకు పైగా రోడ్డుపైనే ఆందోళన కొనసాగించారు. ఇందుకు సంబంధించి ఏఈఎస్ సుధాకర్, స్టేషన్ ఎస్ఐ, సిబ్బంది రెండో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
‘మా పోస్టులు మాకే కావాలి’
జెడ్పీ ఖాళీల్లో ఇతర విభాగాల వారిని నియమిస్తున్నారంటూ నిరసన జెడ్పీ ఉద్యోగుల పెన్డౌన్ నేడు మహా ధర్నా హన్మకొండ : జిల్లా పరిషత్ పోస్టులలో పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులను నియమించడాన్ని నిరసిస్తూ జెడ్పీ ఉద్యోగులు మంగళవారం ఆందోళనకు దిగారు. నల్లబ్యాడ్జీలు ధరించి పెన్డౌన్ చేసి నిరసన తెలిపారు. హన్మకొండలోని జెడ్పీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దీంతో జిల్లా పరిషత్లో సేవలు నిలిచిపోయాయి. ఈసందర్భంగా జెడ్పీ ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడారు. పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్డబ్ల్యూఎస్)ల పరిధిలో డివిజన్, సబ్ డివిజన్ కార్యాలయాల్లోని మినిస్టీరియల్ పోస్టులన్నీ జెడ్పీ ఉద్యోగులతోనే భర్తీ చేయాలనే నిబంధనలను పర్యవేక్షక ఇంజినీర్లు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. వారి విభాగాలకు చెందిన సిబ్బందినే జెడ్పీ పోస్టులలో నియమిస్తుండటంతో తమకు అన్యాయం జరుగుతోందన్నారు. ఉన్నతాధికారుల వైఖరిని నిరసిస్తూ బుధవారం(నేడు) జెడ్పీ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నాయకులు వేణుగోపాల్రెడ్డి, సాదుల ప్రసాద్, నయూముద్దీన్, సీ.హెచ్.రమేష్, రవికుమార్, అబ్దుల్లా, మోహనకృష్ణ పాల్గొన్నారు. -
జర్నలిస్టుల భూమి కబ్జాకు యత్నం
తెరచాటున యూనియన్ నాయకులు? పాత హద్దులు మాయం.. కొత్తవి ఏర్పాటు భీమారం : సొంతింటి కలను నిజం చేసుకోవాలన్న ఆశతో దాచుకున్న సొమ్ముతో జర్నలిస్టులు కొనుగో లు చేసి భూమి కబ్జాకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ పట్టాదారుడి నుంచి ఖరీదు చేసిన ఈ భూమి కబ్జాకు యత్నాలు జరుగుతుండడంతో జర్నలిస్టుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీని వెనుక కొందరు యూనియన్ నాయకుల హస్తం ఉన్నట్లు తెలుస్తుండ డం వారి ఆందోళనను రెట్టింపు చేస్తోంది. భీమారం శివారులోని(చింతగట్టు క్యాంప్ సమీపం) 2002లో జర్నలిస్టులు సుమారు ఏడు ఎకరాల భూమి కొనుగోలు చేశారు. వివిధ దినపత్రికల్లో పనిచేస్తున్న విలేకరులు(కంట్రిబ్యూటర్, స్టాపర్లు, సబ్ఎడిటర్లు) 171 మంది వీరిలో ఉండగా.. 2006లో ఒక్కొక్కరికి 150గజాల చొప్పున కేటాయించారు. తాజాగా ఇం దులో రెండున్నర ఎకరాల భూమికి సంబంధించిన హద్దులు తొలగింపునకు గురయ్యాయి. దీంతో విలేకరులు ఆరాతీయగా దీని వెనుక శంకర్రెడ్డి అనే వ్యక్తి ఉన్నట్లు తేలింది. ఆయనతో ఫోన్లో మాట్లాడగా... యూనియన్కు చెందిన ఇద్దరు పేర్లను ప్రస్తావిం చాడు. ఆ నాయకులకు సమాచారం ఇచ్చే భూమిని చదును చేశానని ఆయన చెప్పడంతో విలేకరులు కంగుతిన్నారు. అయితే, స్థలాన్ని చదును చేయడం పక్కన పెడితే.. పాత హద్దులు తొలగించి కొత్తగా రాళ్లు పాతించడం గమనార్హం. అయితే, యూనియన్ నేతల పేర్లను శంకర్రెడ్డి చెబుతుండడంతో... వారు ఈయనకు సహకరించారా, వెనుక ఉన్న భూమిలో జర్నలిస్టుల భూమి కలుపుకునేందుకు యత్నాలు జరుగుతున్నాయా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. హద్దులు తొలగించారన్న సమాచారంతో శనివారం పెద్దసంఖ్యలో విలేకరులు పరిశీలించారు. ఈ విషయంలో శంకర్రెడ్డిపై వారు పోలీస్స్టేషన్లో ఫిర్యా దు చేయాలని నిర్ణయించుకున్నారు. -
సమస్యల్ని తొక్కిపెట్టొద్దు
⇒పద్ధతి ప్రకారం పరిష్కరించకపోతే మునిగిపోతాం ⇒అవగాహన సమావేశంలో రాజధాని రైతుల ఆందోళన ⇒రైతుల ప్లాట్ల కేటాయింపు విధానాన్ని వివరించిన సీఆర్డీఏ అధికారులు విజయవాడ బ్యూరో : రాజధాని గ్రామాల్లో ఇబ్బందికరంగా మారిన సమస్యల్ని తొక్కిపెట్టడం వల్ల చివరి నిమిషంలో వాటిని పరిష్కంచుకోవడం సాధ్యం కాదని పలువురు రైతులు మంత్రి పుల్లారావు, సీఆర్డీఏ అధికారులను నిలదీశారు. ఇబ్బందులు వస్తున్నాయని కొన్ని అంశాలను కావాలని బయటకు రాకుండా చేస్తున్నారని, అంతా అయిపోయిన తర్వాత వాటిని ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. బుధవారం సబ్కలెక్టర్ కార్యాలయంలో రైతులకు పంపిణీ చేయాల్సిన ప్లాట్లు, మాస్టర్ప్లాన్పై తుళ్లూరు మండలంలోని రాజధాని గ్రామాల రైతులకు సీఆర్డీఏ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు రైతులు రాజధాని గ్రామాల్లో నెలకొన్న అనేక సమస్యల్ని ప్రస్తావించి వాటికి సమాధానం చెప్పాలని మంత్రి పుల్లారావును గట్టిగా అడిగారు. సులువుగా ఉన్న అంశాలపై ముందుకెళుతూ క్లిష్టమైన అంశాలను పెండింగ్లో పెడుతూ వెళ్లడం వల్ల రైతులు వాటిని ఎలా పరిష్కరించుకోగలుగుతారని కొందరు ప్రశ్నించారు. ఒక క్రమపద్ధతి ప్రకారం అన్ని సమస్యలను పరిష్కరించాలన్నారు. తమ అనుమానాలన్నింటినీ నివృత్తి చేసిన తర్వాతే తమకిచ్చే ప్లాట్ల లేఅవుట్లను ఖరారు చేయాలని, అన్ని విషయాలను తెలుగులోనే తమకు తెలిసేలా ఏర్పాట్లు చేయాలని పలువురు కోరారు. ప్లాట్లకు సంబంధించి తమ అభిప్రాయాలను తెలిపే 9.18 పత్రాల గురించి అవగాహన కల్పించాలని, న్యాయపరమైన ఇబ్బందులు వస్తే ఎలా ఎదుర్కోవాలో సూచించాలని చెప్పారు. తమకిచ్చే ప్లాట్లలో హైటెన్షన్ వైర్లు, గుంతలు ఉంటే తామేం చేయాలని ఒక రైతు ప్రశ్నించారు. మెట్ట రైతులకు 50 చదరపు గజాలు పెంచి ఇస్తామంటూ గతంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని మరికొందరు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగాలు, ఉపాధి, విద్యా సౌకర్యాలు, అసైన్డ్ భూముల సమస్యలతో పాటు భూములిచ్చే సమయంలో తమకిచ్చిన అనేక హామీల గురించి రైతులు అధికారులను ప్రశ్నించారు. అధికారులు కొన్నింటికి సమాధానం చెప్పి మిగిలిన వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన ముక్కలకు ఏకమొత్తంలో వేలం తొలుత ప్లాట్ల కేటాయింపు విధానం గురించి అధికారులు వివరించారు. రైతులకు కేటాయించే ప్లాట్లకు కనీసం 50 అడుగుల రోడ్డు ఉంటుందని, 60, 80 అడుగుల రోడ్లు వేసే ప్రతిపాదన సైతం ఉందని సీఆర్డీఏ అదనపు కమిషనర్ శ్రీధర్ చెప్పారు. నివాస ప్లాట్ల కనీస విస్తీర్ణం 125 చదరపు మీటర్ల నుంచి నాలుగు వేల చదరపు మీటర్లు, వాణిజ్య ప్లాట్ల కనీస సైజు 25 చదరపు మీటర్ల నుంచి నాలుగు వేల చదరపు మీటర్ల వరకు ఉంటాయని తెలిపారు. రైతులకు కేటాయించగా మిగిలిన చిన్న ముక్కలను రైతు కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిపి తీసుకోవచ్చన్నారు. అలా తీసుకున్న తర్వాత ఇంకా మిగిలిన ముక్కలన్నింటినీ కలిపి ఏకమొత్తంలో వేలం నిర్వహిస్తామని తెలిపారు. రైతులు జాయింటు ప్లాట్లు తీసుకోవాలంటే 9.18 ఫారం ద్వారా అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. నేలపాడు గ్రామం కోసం రూపొందించిన లేఅవుట్ను రైతులకు చూపించారు. గ్రామాల పరిధిలో ప్రతి కిలోమీటరుకు 165 అడుగుల రోడ్డు ఉంటుందని, ఆరు ప్రధాన రహదారులు 160 అడుగుల వెడల్పుతో ఉంటాయని తెలిపారు. ఈ విధానానికి రైతులు అంగీకారం తెలిపితే ప్రతి గ్రామానికి ఇదే విధానాన్ని రూపొందిస్తామన్నారు. మంత్రి పుల్లారావు మాట్లాడుతూ ఈ విధానం ప్రకారం ప్లాట్లను మేలో పంపిణీ చేయడం ప్రారంభించి జూన్, జూలై కల్లా ఇస్తామని తెలిపారు. కచ్చా డ్రెయిన్లు, రోడ్లు కూడా వేసి ఇవ్వాలంటే రెండు, మూడు నెలల సమయం పడుతుందన్నారు. ఈ విధానం గురించి ప్రతి గ్రామంలోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. గురువారం మంగళగిరి నియోజకవర్గంలోని రాజధాని గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించి ఈ విధానాన్ని వివరిస్తామని తెలిపారు. -
వైఎస్సార్ సీపీ పోరుబాట
రైల్వే జోన్ కోసం చాన్నాళ్ల నుంచి ఆందోళనలు, ఉద్యమాలు జరుగుతున్నాయి. తాజాగా వైఎస్సార్సీపీ ఆందోళనను తీవ్రతరం చేస్తోంది. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విశాఖలో ఈ నెల 14 నుంచి నిరవధిక నిరాహారదీక్ష చేపట్టనున్నారు. అమర్నాథ్ దీక్షకు ఆ పార్టీ అధిష్టానం కూడా మద్దతు తెలిపింది. అలాగే ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల నేతలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని సంఘీభావం తెలపనున్నారు. దీనిపై అమర్నాథ్ అన్ని పార్టీల నేతలను కలిసి మద్దతు కోరారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు నగరంలోని జిల్లాపరిషత్ వద్ద ఉన్న అంకోసా హాలులో అఖి లపక్ష నాయకులతో రౌండ్టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. విశాఖకు రైల్వే జోన్ ఆవశ్యకతను ఈ సమావేశంలో వివరించనున్నారు. జోన్ కోసం ఇంకేమి చేయాలన్న దానిపై చర్చించనున్నారు. రైల్వేజోన్ కోసం ఈ తరహా సమావేశం జరగడం ఇదే తొలిసారి. -
భూమిని కాపాడుకుంటేనే బతుకు
♦ రైతుల బతుకు మారడం లేదు ♦ రైతుల స్థితిగతులపై సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆందోళన సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు. భూమిని కాపాడుకుంటేనే రైతులు బతుకు నిలుపుకొంటారన్నారు. పటిష్ట రెవెన్యూ వ్యవస్థ లేకపోవడం వల్ల రైతులు భూ వివాదాలను ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. ఈ సమస్యను అధిగమించేందుకు రెవెన్యూ రికార్డుల్లో పక్కాగా పేర్లు నమోదయ్యేలా చూసుకోవాలని రైతులకు సూచించారు. రెవెన్యూ చట్టాలను సరళంగా మార్చి స్థానిక భాషల్లోకి తీసుకొస్తే భూ వివాదాలకు సంబంధించి రైతుల పరిస్థితి కొంత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు రైతులకు పూర్తి సహాయ, సహకారాలు అందించాలని నల్సార్-ల్యాండెస్సాలను కోరారు. ఇప్పటికే ఈ రెండూ చేస్తున్న యత్నాలు, సాధించిన ఫలితాలు అత్యద్భుతమని ప్రశంసించారు. వాటిని కొనసాగించాలని సూచించారు. ల్యాండెస్సా రాష్ట్ర డెరైక్టర్ సునీల్కుమార్ను అభినందించారు. ‘పేదలకు అవసరమైన భూ సంబంధిత సేవలు-అనుభవాలు, అంచనాలు, కొత్త ఆలోచనలు’ అనే అంశంపై నల్సార్ విశ్వవిద్యాలయం, ల్యాండెస్సా సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రెండురోజుల సదస్సు శనివారం హైదరాబాద్లోని నల్సార్ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది. సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ రమేష్ దవే, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎన్.వి.రమణ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, నల్సార్ వైస్ ఛాన్సలర్ ఫైజన్ ముస్తఫా, రిజిస్ట్రార్ వి.బాలకష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జస్టిస్ దవే ప్రధానోపన్యాసం చేస్తూ.. భూమితో రైతుకు విడదీయరాని బంధం ఉందన్నారు. వ్యవసాయమే రైతుకు జీవన గీతమని తెలిపారు. భూమిని కాపాడుకుంటేనే వారికి బతుకు సాధ్యమవుతుందన్నారు. భూమి మన స్వాధీనంలో ఉన్నంత మాత్రాన అది మనదైపోదని, రెవెన్యూ రికార్డుల్లో పేర్లు నమోదైతేనే దానికి విలువ ఉంటుందని చెప్పారు. పేదరికం, నిరక్షరాస్యత వల్లే... సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ మాట్లాడుతూ పేదరికం, నిరక్షరాస్యత, భౌగోళిక పరిస్థితుల వల్ల రైతులు న్యాయం పొందలేకపోతున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా రైతుల పరిస్థితి ఇలానే ఉందని తెలిపారు. ఆత్మహత్య చేసుకుంటే తప్ప బీమా అందడం లేదన్నారు. పంట బీమా పథకాల గురించి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ల్యాండెస్సాను కోరారు. ఎన్టీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో పట్వారీ వ్యవస్థను రద్దు చేశారని, అందుకు ప్రత్యామ్నాయంగా పటిష్ట రెవెన్యూ వ్యవస్థ తయారు కాలేదని చెప్పారు. అంతకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతో కలసి న్యాయమూర్తులు నల్సార్ విశ్వవిద్యాలయ ఆడిటోరియంను ప్రారంభించారు. పేదల భూములు తీసుకోవడం ఎందుకు? సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా మాట్లాడుతూ చూపు లేని కళ్లు ఉండి ప్రయోజనం లేదని, అలాగే హక్కులేని భూమి ఉన్నా ప్రయోజనం ఉండదని చెప్పారు. తగిన రికార్డులు లేకుంటే భూమికి భద్రత లేదని తెలిపారు. రైతు తన భూమి జోలికి వచ్చిన వ్యక్తిని ఏమాత్రం క్షమించడని పేర్కొన్నారు. రైతుకు భూమి ఆత్మ వంటిదని, ఆత్మ జోలికి వస్తే సహించడని చెప్పారు. వివిధ అవసరాల పేరిట పేదల భూములను ఇష్టారాజ్యంగా తీసుకోవడం ఏమాత్రం సరికాదని అన్నారు. ప్రభుత్వ భూములతోనే ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇష్టారాజ్యంగా పేదల భూములను, ముఖ్యంగా రైతుల భూములను తీసుకుంటే వారు పడే బాధను ఆయన వివరించారు. -
మృతదేహాల కోసం నిరీక్షణ
బంధువులకు అప్పగింతపై హైడ్రామా భద్రాచలం: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బొట్టెంతోగు ఎన్కౌంటర్ లో మృతిచెందిన ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలు ఖమ్మం జిల్లా భద్రాచలం ఏరియా ఆస్పత్రిలోనే ఉన్నాయి. ఎన్కౌంటర్ జరిగి గురువారం నాటికి మూడు రోజులైనా మృతదేహాలను బంధువులకు అప్పగించే విషయమై హైడ్రామా కొనసాగుతోంది. ఈ ఎన్కౌంటర్పై మానవ హక్కుల సంఘం కోర్టును ఆశ్రయించింది. దీంతో మృతదేహాలను వారి బంధువులకు అప్పగించే విషయంలో పోలీసులు ఆచితూచి అడుగులేస్తున్నారు. ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతిచెందగా.. ఇప్పటికే ధనసరి సారక్క, సోనీ మృతదేహాలను వారి బంధువులు తీసుకెళ్లారు. కొత్తకుండ సృజన, మడకం బండి మృతదేహాల కోసం వచ్చిన వారి బంధువులు భద్రాచలం ఏరియా ఆస్పత్రి మార్చురీ వద్దే పడిగాపులు కాస్తున్నారు. కాగా, హైకోర్టు ఉత్తర్వులకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి తగిన ఆదేశాలు లేకపోవటంతో మృతదేహాలను అప్పగించలేదని ఏఎస్పీ భాస్కరన్ తెలిపారు. మరోవైపు మృతుల్లో ఒకరైన మడకం బండి తూర్పుగోదావరి జిల్లా గొల్లగుప్ప గ్రామానికి చెందిన వాడని గుర్తించినప్పటికీ గురువారం కథ అడ్డం తిరిగింది. మడకం బండి తమ కొడుకని ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లా బాసగూడెం మండలం బట్టిగూడెంనకు చెందిన పద్దల లక్మా, ఇతర కుటుంబ సభ్యులు వచ్చారు. బండి తాము పెంచుకున్న కొడుకని గొల్లగుప్పకు చెందిన మడకం నందయ్య ఆధారాలు చూపిస్తుండగా, లక్మా కూడా అతను తమ కుమారుడేనని చెబుతుండటంతో పోలీసులు తర్జన భర్జన పడుతున్నారు. కాగా, మృతిచెందిన మహిళా మావోయిస్టు మడివి దేవి ఛత్తీస్గఢ్లోని పామేడు మండలం మిట్టగూడెం గ్రామానికి చెందినది కాగా, ఛత్తీస్గఢ్కే చెందిన నూప రామి ఊసూరు మండలం నర్సాపురానికి చెందినట్లుగా గుర్తించారు. మృతదేహాల అప్పగింతను రికార్డు చేయాలి పోలీసులకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన వారి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించే ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేయాలని గురువారం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మృతదేహాలను తీసుకునేందుకు ఎవరూ రాకపోతే తగు సౌకర్యాలున్న ఆసుపత్రిలో భద్రపరచాలని పేర్కొంటూ తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మృతదేహాలకు ఉస్మానియా ఆస్పత్రిలో రీపోస్టుమార్టం చేయించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పౌర హక్కుల కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ గడ్డం హైకోర్టులో పిల్ దాఖలు చేసిన వియం తెలిసిందే. గురువారం ఈ పిల్ విచారణ సందర్భంగా అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు స్పందిస్తూ మృతదేహాలను భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో భద్రపరిచామని, ఇద్దరి మృతదేహాలను అప్పగించామని తెలిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది రఘునాథ్ మాట్లాడుతూ.. మృతదేహాలకు రీ పోస్టుమార్టం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ రీ పోస్టుమార్టం విషయంలో ఛత్తీస్గఢ్ హైకోర్టును ఆశ్రయించాలని పేర్కొంది. -
ఏం జరుగుతుందో?
ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న మావోలు ఆదివాసీ గూడేలపై పోలీసుల డేగ కన్ను అధికారపార్టీ నేతల్లో టెన్షన్...టెన్షన్ భద్రాచలం : తెలంగాణ- ఛత్తీస్గఢ్- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళన సర్వత్రా నెలకొంది. చర్ల సమీపంలోని బొట్టెంతోగు అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఎనిమిది మంది సహచరులను కోల్పోరుున మావోరుుస్టులు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. మృతుల్లో ఇద్దరు పొరుగునే ఉన్న వరంగల్ జిల్లాకు చెందిన వారు కాగా, మడకం బండి భద్రాచలం పట్టణానికి సమీపంలోని గొల్లగుప్ప గ్రామానికి చెందిన వ్యక్తి. ఎన్కౌంటర్లో తప్పించుకున్న మావోరుుస్టు అగ్రనేతలు, ఇతర దళసభ్యులు, మిలీషియూ సభ్యులు తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దులోనే ఎక్కువగా సంచరించే అవకాశముందని భావిస్తున్న పోలీస్బలగాలు వారిని పట్టుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారుు. ఇదే క్రమంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు మావోరుుస్టులు సైతం ప్రతివ్యూహాలు రచించే అవకాశాలు లేకపోలేదని ఈ ప్రాంతవాసులు అంటున్నారు. భారీ ఎన్కౌంటర్లు జరిగిన తర్వాత అనేక సందర్భాల్లో మావోరుుస్టులు కోవర్టు ఆపరేషన్ పేరిట అనేకమందిని హతమార్చిన ఘటనలను ఉదహరిస్తున్నారు. మావోరుుస్టులు విధ్వంసకర చర్యలకు పాల్పడే అవకాశముందన్న నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఆదివాసీ గూడేల్లో ఆందోళన నెలకొంది. అధికార పార్టీల నేతల్లో గుబులు ఎన్కౌంటర్ పరిణామాల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ నేతలకు గుబులు పట్టుకుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎన్కౌంటర్ జరిగినా, తెలంగాణ పోలీసుల పాత్ర ఉండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రభావంతో గూడేల్లో టీఆర్ఎస్ నేతలు తిరిగే పరిస్థితి ఉండదని, ప్రధానంగా భద్రాచలం డివిజన్లో ఉండే నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మానె రామకృష్ణతోపాటు డివిజన్లోని పలు మండలాల ఆ పార్టీ బాధ్యులను ఇటీవల మావోయిస్టులు కిడ్నాప్ చేసిన విషయం విదితమే. తాజా పరిణామాలతో మళ్లీ అటువంటి ఘటనలు మళ్లీ పునరావృతమైతే ఎలా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇసుక రీచ్ల్లో అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉందనే ప్రచారం కూడా సాగుతుండటంతో మావోయిస్టులు ఎవరిని టార్గెట్ చేస్తారోననే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. పోలీసుల డేగకన్ను ఎన్కౌంటర్ తర్వాత జరిగే పరిణామాలపై పోలీసులు నిశితంగా పరిశీలన చేస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులోని మావోయిస్టులను ఏరివేయాలని లక్ష్యంతో మూడు రాష్ట్రాల పోలీసులు జాయింట్ ఆపరేషన్కు సిద్ధమయ్యారు. మావోయిస్టులకు కొరియర్గా వ్యవహరిస్తున్న వారిపై దృష్టి సారించారు. సరిహద్దుల్లో ఉన్న గిరిజనగూడేలపై డేగకన్ను వేసిన పోలీసులు ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ మావోయిస్టుల కదలికలపై ఆరా తీస్తున్నారు. -
విద్యార్థినిపై లైంగిక వేధింపులు
ఆందోళనకు దిగిన గ్రామస్తులు దుమ్ముగూడెం: మండలంలోని గౌరారం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థినిపై ఆ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో శనివారం గ్రామస్తులు ఆశ్రమ పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగడంతో పాటు పంచాయతీ నిర్వహించారు. ఇందుకు సంబందించి వివరాలు ఇలా ఉన్నాయి. గౌరారం ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికను పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు రకరకాల ప్రలోభాలకు గురిచేస్తూ లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బాలికల పాఠశాలలో పురుష ఉపాధ్యాయులు ఉండటంతోనే ఇటువంటి లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత పది రోజుల క్రితం బాలిక మేడారం జాతరకు వెళుతుండగా మార్గమధ్యలో ఆ ఉపాధ్యాయుడు మోటారుసైకిల్పై ఎక్కించుకుని పెదనల్లబల్లి అడ్డ రోడ్డు వరకు తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ విషయం మూడు రోజుల క్రితం బయటకు పొక్కింది. దీంతో గ్రామస్తులు స్థానిక ఎంపీటీసీ, సర్పంచ్కి వివరాలు సేకరించి హెచ్ ఎం రమేష్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులు మల్లేశ్వరరావు, జుంకిలాల్లను హెచ్ఎం శుక్రవారం సాయంత్రం తీవ్రంగా మందలించి అటువంటి చర్యలకు పాల్పడితే సరిదిద్దుకోవాలని మరోసారి ఇటువంటి ఆరోపణలు వసే ్త ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయం కాస్తా బయటకు పొక్కడంతో విద్యార్థి సంఘాల నాయకులు, గ్రామస్తులు పాఠశాలకు చేరుకొని ఆందోళన చేపట్టారు. గ్రామ పెద్దలు అక్కడికి చేరుకొని పంచాయతీ నిర్వహించారు. అయితే పదో తరగతి బాలికలను సందేహాల నివృత్తి పేరుతో వారి గదులకు పిలిపించుకొని వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. సమాచారం సేకరించేందుకు వెళ్లిన విలేకరులను పంచాయతీ జరిగే సమయంలో అక్కడ ఉండవద్దని గ్రామస్తులు కోరారు. కాగా పాఠశాలకు చెందిన వర్కర్లు ఉపాధ్యాయుల మెప్పు పొందేందుకు బాలికలను లైంగిక దాడులకు ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏటీడబ్ల్యూఓ విచారణ గౌరారం ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న పరిణామాలపై ఏటీడబ్ల్యూ బాబూరావు శనివారం సాయంత్రం విచారణ చేపట్టారు. విద్యార్థి సంఘాల ఫిర్యాదు మేరకు ఆయన పాఠశాలకు చేరుకుని వివరాలు సేకరించారు. విద్యార్థినులను, ఉపాధ్యాయులతో వేరువేరుగా మాట్లాడి సమాచారం సేకరించి ఆ నివేదికను ఉన్నతాధికారులకు పంపారు. డీడీకి ఫిర్యాదు ఈ విషయంపై గిరిజన సంఘాల నాయకుడు చలపతి, స్థానిక సర్పంచ్ రాముడు డీడీ అబ్రహంకు ఫిర్యాదు చేశారు. బాలిక ఇచ్చిన సమాచారం ఆధారంగా వారు ఫిర్యాదు చేయడంతో పాటు పాఠశాలలో మహిళా టీచర్లను నియమించాలని కోరారు.తక్షణమే కీచక ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఎటువంటి లైంగిక దాడులు జరగలేదు గౌరారం ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులు బాలికలపై లైంగిక దాడులకు పాల్పడ్డారనే వదంతులు నిరాధారమైనవి. కొందరు గిట్టని వారు తప్పుడు ప్రచారం సాగిస్తున్నారు. -హెచ్ఎం రమేష్ నాకే పాపం తెలియదు లైంగిక వేధింపులు చేస్తున్నారని ఆరోపణలు అవాస్తవం. పదో తరగతి విద్యార్థిని గౌరారం నుంచి పెదనల్లబల్లికి వెళుతుండగా మార్గమధ్యలో కనబడితే వాహనంపై ఎక్కించుకొని పెదనల్లబల్లి అడ్డరోడ్డులో దించాను. లైంగి క వేధింపులకు నాకు ఎటువంటి సంబంధం లేదు. - ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడు -
డీన్, ప్రిన్సిపల్ వేధిస్తున్నారు...
కళాశాల వద్ద మహిళ ప్రిన్సిపల్, లెక్చరర్ల ఆందోళన హిమాయత్నగర్: నారాయణగూడలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో తమను వేధిస్తున్నారని మహిళా ప్రిన్సిపల్తో పాటు నలుగురు జూనియర్ లెక్చరర్లు శుక్రవారం ఆందోళనకు దిగారు. వీరికి టీఆర్ఎల్ఎస్, టీఎస్ఎల్, టీసీఈపీఎస్ నాయకులు మద్దతుగా నిలిచి డీన్, ప్రిన్సిపల్లు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో స్థానికంగా కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. బాధితుల కథనం ప్రకారం... నారాయణగూడలోని చైతన్య జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్గా జ్యోతిర్మయి, జూనియర్ లెక్చరర్లుగా ప్రవీణ్, మధు, శ్రీనివాస్, రాజేష్ పని చేస్తున్నారు. వీరిని కొంతకాలంగా డీన్ కుమార్, ప్రిన్సిపల్ స్వామిరావు పలు రకాలుగా వేధిస్తున్నారు. ప్రిన్సిపల్ జ్యోతిర్మయిని డీన్ కుమార్, తోటి ప్రిన్సిపల్ స్వామిరావు, ఆరు నెలలుగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. ఆమెను ఏదో ఒక కారణంతో తరచూ వేరే క్యాంపస్లకు బదిలీ చేస్తున్నారు. వారం క్రితం కెమిస్ట్రీ లెక్చరర్ ప్రవీణ్కు కుమారుడు పుట్టడంతో యాజమాన్యం అనుమతితో మూడు రోజుల పాటు సెలవు తీసుకున్నాడు. నాలుగో రోజు కళాశాలకు వచ్చిన ప్రవీణ్ను ప్రిన్సిపల్ స్వామిరావు.. ‘ఎందుకు వచ్చావ్..కాలేజీ నుంచి పొమ్మని’ దుర్భాషలాడాడు. దీంతో బాధితుడు టీఆర్ఎల్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సైదులు, టీసీపీఎఫ్ చైర్మన్ సునీల్కుమార్, టీఎల్ఎస్ అధ్యక్షుడు మహేందర్లను ఆశ్రయించాడు. దీంతో బాధిత లెక్చరర్లకు మద్దతుగా వీరంతా శుక్రవారం కళాశాలలో ఆందోళన చేపట్టారు. సుమారు గంటన్నరపాటు కళాశాల యాజమాన్యానికి వీరికి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు వచ్చి సర్ధిచెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా, ప్రిన్సిపల్ జ్యోతిర్మయి, జూనియర్ లెక్చరర్లు తమపై చేసిన ఆరోపణలను డీన్ కుమార్, ప్రిన్సిపల్ స్వామిరావు ఖండించారు. తాము ఎవరినీ ఏ విధంగా వేధించడంలేదన్నారు. పర్మిషన్ తీసుకుండా సెలవులు తీసుకోవడంపై ప్రశ్నించినందుకు తమపై తప్పుడు ఆరోపణలు, చేసి దాడికి యత్నించారన్నారు. -
కాపు ఉద్యమానికి ఊపు
ఉధృతమవుతున్న ఆందోళన పలుచోట్ల ర్యాలీలు, దీక్షలు విశాఖపట్నం: జిల్లాలో కాపు ఉద్యమం రోజు రోజుకూ ఊపందుకుంటోంది. కాపులకు రిజర్వేషన్ కల్పించాలంటూ ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ దీక్షకు సర్వత్రా మద్దతు పెరుగుతోంది. పాయకరావుపేట, నక్కపల్లి, యలమంచిలి, బుచ్చయ్యపేట, నర్సీపట్నం, గొలుగొండ తదితర మండలాల్లో నిరాహారదీక్షలు, ర్యాలీలు, అర్ధ నగ్న ప్రదర్శనలు, మధ్యాహ్న భోజన సమయంలో కంచాలను గరిటెలతో వాయిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కాపులను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు కొమ్ముకాస్తున్న వలస కాపు నేతలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పాయకరావుపేట మండలం అర ట్లకోటలో న ల్లల రాజు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఆదివారం అధికారులు ఆయనకు వైద్య పరీక్షలకు యత్నించగా నిరాకరించాడు. అరట్లకోటలో రాజు ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మరోవైపు జిల్లాలో కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దీక్షల్లో పాల్గొంటున్నారు. పాయకరావుపేట మండలం శ్రీరాంపురంలో చేపట్టిన నిరాహారదీక్షల్లో టీడీపీ కాపు నేతలు పాల్గొన్నారు. జిల్లా టీడీపీ నాయకుడు గెడ్డం బుజ్జి పాయకరావుపేట దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. నక్కపల్లి మండల కేంద్రంలో కాపులు మోకాళ్లపై నిల్చుని నిరసన వ్యక్తం చేశారు. అక్కడ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, సీఈసీ సభ్యుడు వీసం రామకృష్ణ తదితరులు వారికి మద్దతు పలికారు. చినదొడ్డిగల్లులో నిరాహారదీక్షా శిబిరంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. య లమంచిలి పట్టణంలో కాపు నాయకులు పెద్దసంఖ్యలో నిరసనదీక్షలు చేపట్టారు. వీరికి మాజీ ఎంపీపీ బొద్దపు యర్రయ్యదొర తదితరులు సంఘీభావం తెలిపారు. నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం ఎదుట మీసాల సుబ్బన్న నే తృత్వంలో దీక్షలు కొనసాగుతున్నాయి. బు చ్చయ్యపేట మండలం వడ్డాదిలో పలువురు కాపు నా యకులు అర్ధ నగ్న ప్రదర్శన నిర్వహించారు.గ్రా మంలో ర్యాలీ తీ శారు. కాపు నేత దొండా నారాయణమూర్తి మద్దతు తెలిపారు. -
ఔషధ ముడి సరుకు దిగుమతులు ఆందోళనకరం
♦ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ♦ గ్లోబల్ బయోటెక్నాలజీ సదస్సు ప్రారంభం న్యూఢిల్లీ: ఔషధ ముడి సరకు (ఏపీఐ- యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్) దిగుమతులు భారీగా పెరిగిపోతుండడం పట్ల వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు. దిగుమతులపై ఆధారపడని వ్యవస్థ దిశగా నడవడానికి నిపుణులు, ఫార్మా పరిశ్రమ వర్గాలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ‘‘మనం ఫార్మా, బయోటెక్నాలజీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. అయినా ఏపీఐ దిగుమతులు భారీగా పెరుగుతుండడం పట్ల నాకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ’’ అని ఇక్కడ జరిగిన గ్లోబల్ బయోటెక్నాలజీ సదస్సులో ఆమె పేర్కొన్నారు. జనరిక్ మందులకు కేంద్రంగా ఉంటూ... బయోటెక్నాలజీలో ఎంతో విజయం సాధించిన భారత్కు ఈ రంగంలో అపార అనుభవం ఉందన్నారు. ఇలాంటి దేశం దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితులు అధికమవరాదని అన్నారు. 2010-11లో 3 బిలియన్ డాలర్ల ఏపీఐ దిగుమతులు జరిగితే ఇందులో చైనా వాటానే 1.88 బిలియన్ డాలర్లు ఉండడం గమనార్హం. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు చౌక ధరకు లభించే జనరిక్ మందులకు భారత్పై ఆధారపడుతున్నాయని ఆమె ఈ సందర్భంగా వివరించారు. స్పెషల్ ఎకనమిక్ జోన్లలో ఫార్మా సంబంధ యూనిట్లకు అదనపు రాయితీలు ఇవ్వాలని రాష్ట్రాలను వాణిజ్యమంత్రిత్వశాఖ కోరుతున్నట్లు తెలిపారు. ఐటీ, ఈ-కామర్స్ రంగాల్లోనే కాకుండా బయోటెక్నాలజీ విభాగంలో కూడా స్టార్టప్స్కు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందని అన్నారు. రానున్న ఐదేళ్లలో బయోటెక్నాలజీ రంగంలో 1,000 నుంచి 1,500 వరకూ స్టార్టప్స్ వస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయమంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ, ఐటీ రంగం విప్లవం వచ్చిన 25 సంవత్సరాల తర్వాత వచ్చే దశాబ్దంలో దేశంలో బయోటెక్నాలజీ విప్లవం రాబోతోందని అన్నారు. ఈ రంగం అభివృద్ధిలో కేంద్రం, రాష్ట్రాలు, పరిశ్రమ, ఎన్జీఓల సహకారం అవసరం అని పేర్కొన్నారు. -
డ్వాక్రా మహిళల ఆందోళన
కంచికచర్ల(కృష్ణా జిల్లా) :కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటిపల్లె గ్రామంలో డ్వాక్రా మహిళలు మంగళవారం మధ్యాహ్నం ఆందోళన చేశారు.ఇసుక రీచ్లను టీడీపీకి చెందిన డ్వాక్రా మిహళ లకే కేటాయిస్తున్నారని , న్యాయబద్ధంగా తమకు దక్కాల్సిన వాటాలు రావట్లేదని వైఎస్సార్సీపీకి చెందిన డ్వాక్రా మహిళలు ఆరోపించారు. వీరి ఆందోళనతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. -
నిరసనల హోరు
రోహిత్ మృతిపై కొనసాగుతున్న ఆందోళనలు మదనపల్లెలో మానవహారం, రిలేదీక్షలు ఎమ్మెల్యే మద్దతు మహిళా వర్సిటీలో తరగతులు బహిష్కరించిన విద్యార్థులు చిత్తూరులో గాంధీ విగ్రహం వద్ద ధర్నా యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి)/మదనపల్లె/చిత్తూరు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం కూడా జిల్లాలో నిరసనలు కొనసాగాయి. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, శ్రీపద్మావతి మహిళా డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులు గురువారం ఆందోళనలు నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థినులు తరగతులను బహిష్కరించారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఎన్టిఆర్ విగ్రహం వద్ద విద్యార్థినులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రోహిత్ మరణం బాధాకరణమని, కారకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రార్ పి.విజయలక్ష్మి, అధ్యాపక సంఘం అధ్యక్షురాలు కృష్ణకుమారిలు విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికారు. రోహిత్కు నివాళులర్పించారు. మహిళా డిగ్రీ కళాశాలలో.. శ్రీపద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో రోహిత్ ఆత్మహత్యపై విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు. కళాశాల ఆవరణలోని పద్మావతి విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. రోహిత్ విశ్వవిద్యాలయాల్లో ఎదుర్కొన్న దీనపరిస్థితులవల్లే ఆత్మహత్య చేసుకున్నారని విద్యార్థినులు వాపోయారు. ఇలాంటి సంఘటనలు ఏ విద్యాసంస్థల్లో జరగకూడదని నినదించారు. సంఘటనపై బాధ్యులను శిక్షించాలని కోరారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ఓబుల్రెడ్డి, టీఎస్ఎఫ్ నాయకులు అక్కులప్ప, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘనాయకులు మురళీధర్, ప్రభు, వెంకటస్వామి తదితరులుపాల్గొన్నారు. దళిత సంఘాల నివాళి రోహిత్ మృతికి సంతాపంగా తిరుపతిలో గురువారం రాత్రి దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శనతో ఘనంగా నివాళులు అర్పించారు. -
మార్కెట్లు అతలాకుతలం
అంతర్జాతీయ వృద్ధిపై ఆందోళన ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాల్లో ఐఎంఎఫ్ కోత ► కొనసాగుతున్న ముడి చమురు ధరల పతనం ► కరెన్సీ క్రాష్.. బంగారం వైపు పరుగులు ► సెన్సెక్స్ 418 పాయింట్లు డౌన్.. 24,062 వద్ద క్లోజ్ ► 126 పాయింట్ల నష్టంతో 7,309కు నిఫ్టీ అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఆందోళన కారణంగా ప్రపంచ మార్కెట్లు బుధవారం అతలాకుతలమయ్యాయి. స్టాక్ మార్కెట్లు. ముడి చమురు ధర నిలువునా పతనం కాగా, బంగారం భగ్గుమంది. మరోవైపు ఇతర వర్థమాన దేశాల కరెన్సీల్లానే రూపాయి విలవిలలాడంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి వృద్ధి అంచనాల్లో కోత విధించడం, చైనా ఆర్థికాభివృద్ధి 25 సంవత్సరాల కనిష్టస్థాయికి పడిపోవడం ఇన్వెస్టర్లను భయాందోళనలకు లోనుచేసింది. దాంతో వారు ఈక్విటీలను విక్రయించి, సురక్షిత సాధనంగా భావించే పుత్తడివైపు పరుగులు తీసారు. ఆసియా, యూరప్, అమెరికా మార్కెట్లు భారీ స్థాయిలో పతనమయ్యాయి. అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు బుధవారం ప్రపంచ మార్కెట్లతో పాటే భారత స్టాక్ మార్కెట్ను కుప్పకూల్చాయి. స్టాక్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 24వేల పాయింట్ల దిగువకు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 7,300 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. ఒకదశలో బీఎస్ఈ సెన్సెక్స్ 640 పాయింట్లకు పైగా పతనమైంది. చివరిలో కొంత కొనుగోళ్లు జరగడంతో 418 పాయింట్లు నష్టపోయి 24,062 పాయింట్ల వద్ద ముగి సింది. మోదీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన నాటి(2014,మే 16) నుంచి చూస్తే ఇదే అత్యంత బలహీన స్థాయి. నిఫ్టీ 126 పాయింట్ల నష్టంతో 7,309 పాయింట్ల వద్ద ముగిసింది. అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. బ్యాంక్, లోహ, రియల్టీ షేర్లు బాగా నష్టపోయాయి. ఈ ఏడాది ఇప్పటివరకే నిఫ్టీ 20% పతనమైంది. మరింత పతనం: డాలర్తో రూపాయి మారకం కూడా భారీగా క్షీణించడం ప్రభావం చూపించింది. రూపాయి ఇంట్రాడేలో 68 మార్క్ దిగువకు పడిపోయింది. ముడి చమురు సరఫరా మరింతగా పెరుగుతుందని, దరలు మరింతగా తగ్గుతాయనే ఆందోళనకు చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం భయాలు కూడా తోడవుతుండటంతో మార్కెట్లు మరింత పతనమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు, రూపాయి క్షీణత ఇన్వెస్టర్ల ఆందోళనను మరింత అధికం చేస్తున్నాయని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ వ్యాఖ్యానించారు. ప్రపంచ మార్కెట్లు సమీప భవిష్యత్తులో కోలుకునే అవకాశాల్లేవని రోబొబ్యాంక్కు చెందిన మైఖేల్ ఇవ్రీ వ్యాఖ్యానించారు. అయితే లార్జ్ క్యాప్ షేర్లు కొనుగోలు చేయడానికి ఇదే సరైన తరుణమని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ఎస్. నరేన్ పేర్కొన్నారు. చైనా మందగమనం, ముడి చమురు ధరల పతనం, ప్రపంచ వృద్ధిపై ఆందోళనలు..మార్కెట్ పట్ల ఇన్వెస్టర్ల ప్రాధాన్యతను తగ్గిస్తున్నాయని బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ అంటున్నారు. రోజంతా నష్టాలే.. సెన్సెక్స్ 24,326 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ప్రపంచ వృద్ధి అంచనాల తగ్గింపుతో ఆసియా మార్కెట్లు పతనంతో నష్టాలు మరింత పెరిగాయి. ఇంట్రాడేలో 23,840 పాయింట్ల కనిష్ట స్థాయిని(మంగళవారం నాటి ముగింపుతో పోల్చితే 640 పాయింట్లు నష్టం) తాకింది. ఇక నిఫ్టీ 7,242-7,471 పాయింట్ల మధ్య కదలాడింది. బీఎస్ఈలో 400 కంపెనీల షేర్లకు కొనుగోలుదారులే కరువయ్యారు. మొత్తం 411కు పైగా కంపెనీలు లోయర్ సర్క్యూట్ బ్రేకర్ను తాకాయి. మూడు సెన్సెక్స్ షేర్లకే లాభాలు.. తాజా డిసెంబర్ క్వార్టర్లో అంచనాలను మించిన ఫలితాలను వెల్లడించినప్పటికీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 3.7 శాతం క్షీణించి రూ.1,004 వద్ద ముగిసింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,613 కోట్లు ఆవిరైంది. 30 సెన్సెక్స్ షేర్లలో 3 షేర్లు (బజాజ్ ఆటో, హీరో మోటొకార్ప్, విప్రో)మాత్రమే స్వల్పంగా లాభపడ్డాయి. మిగిలిన 27 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్ 5.5 శాతం నష్టపోయింది. ఎస్బీఐ 5.1%, కోల్ ఇండియా 3.45%, మారుతీ3.4%, టాటా మోటార్స్ 3.3% చొప్పున నష్టపోయాయి. 1.94 లక్షల కోట్లు ఆవిరి సెన్సెక్స్ భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపద బుధవారం ఒక్క రోజే రూ.1.84 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టైన్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.90,64,734 కోట్లకు తగ్గిపోయింది. పుత్తడి వెలుగులు... సురక్షిత మదుపు సాధనంగా పుత్తడికి ప్రాధాన్యత పెరుగుతోంది. బంగారం ధరలు రెండు నెలల గరిష్ట స్థాయికి ఎగిశాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.340 పెరిగి రూ.26,690కు చేరింది. అంతర్జాతీయంగానూ పుత్తడి మెరుపులు మెరిపిస్తోంది. న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర కడపటి సమాచారం అందేసరికి 1.5% ఎగసి 1,107 డాలర్లకు పెరిగింది. పాతాళానికి ప్రపంచ సూచీలు ఐఎంఎఫ్ వృద్ధి అంచనాల్లో కోత, ముడి చమురు ధరల పతనం కారణంగా ప్రపంచ మార్కెట్లు భారీగా నష్టాల పాలయ్యాయి. ఆసియా మార్కెట్లు 1-4 శాతం, యూరప్ మార్కెట్లు 3-6 శాతం నష్టపోయాయి. ముఖ్యంగా జపాన్, హాంకాంగ్ 3%పైగా పడిపోయాయి. కడపటి సమాచారం అందేసరికి అమెరికా మార్కెట్లు దాదాపు 3% నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఈ పతనం మరింతగా కొనసాగుతుందని, మరో రెండు, మూడు నెలల వరకూ బేర్ మార్కెట్ తప్పదని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకీ పతనం... వృద్ధి అంచనాల్లో కోత: అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ ప్రపంచ వృద్ధి అంచనాలు తగ్గించడంతో ఆసియా, యూరప్ మార్కెట్లు భారీ నష్టాలపాలయ్యాయి. ఈ ఏడాది ప్రపంచ వృద్ధి 3.6 శాతంగా ఉండొచ్చని గతంలో పేర్కొన్న అంచనాలను ఐఎంఎఫ్ తాజాగా 3.4 శాతానికి తగ్గించింది. వచ్చే ఏడాది వృద్ధి అంచనాలను 3.8 శాతం నుంచి 3.6 శాతానికి తగ్గిం చింది. దీంతో అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం తలెత్తుతుందేమోనన్న ఆందోళన, రుణ ఎగవేతలు పెరిగిపోతాయని, మరో మందగమనం తప్పదేమోనన్న భయాలు ఇన్వెస్టర్లను వణికించాయి. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. 27 డాలర్ల దిగువకు క్రూడ్: అధిక సరఫరాల కారణంగా ముడి చమురు ధరలు మరింత పతనమవుతాయని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఈఏ) హెచ్చరించడం ముడి చమురు ధరలను మరింత క్షీణింప జేసింది. కడపటి సమాచారం అందేసరికి న్యూయార్క్ లైట్స్వీట్, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధరలు 12 ఏళ్ల కనిష్ట స్థాయిలో 27 డాలర్ల దిగువకు దిగజారాయి. తరలుతున్న విదేశీ నిధులు: విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి పెట్టుబడులను ఉపసంహరిస్తున్నారు. వీరి నికర అమ్మకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చైనా మందగమనం: చైనా తాజా జీడీపీ గణాంకాలు ఆ దేశ మందగమనాన్ని సూచిస్తుండటంతో ప్రపంచ మార్కెట్లపైనా ప్రభావం చపుతోంది. 28 నెలల కనిష్టానికి రూపాయి: మార్కెట్ల పతనంతో డాలర్తో రూపాయి మారకం 28 నెలల కనిష్టానికి పడిపోయింది. దిగుమతిదారుల నుంచి డా లర్లకు డిమాండ్ పెరగడంతో 23 పైసలు నష్టపోయి 67.95 వద్ద ముగిసింది. -
కన్నీరే మిగిలింది!
కూకట్పల్లి: ఉద్యమ కాలం నుంచి పార్టీని నమ్ముకొని పని చేస్తున్న తనను కాదని.. కొత్తగా వచ్చిన వారికి టికెట్ కేటాయించడంపై టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మల్లేష్ యాదవ్ కన్నీటి పర్యంతమయ్యారు. టీఆర్ఎస్కు మూడుసార్లు నాయకత్వం మారినప్పటికీ తాను మాత్రం పార్టీని, ఉద్యమాన్ని నమ్ముకొని జెండాలను మోశానని ఆవేదన వ్యక్తం చేశా రు. అంకిత భావంతో పనిచేసిన వారిని కాదని... డబ్బుతో రాజకీయాల్లోకి వచ్చిన వారికి సీట్లను కేటాయించడంపై ఆందోళన వ్యక్తం చేశా రు. కూకట్పల్లి టీఆర్ఎస్ లో క్రియాశీలకంగా పని చేయడంతో ఉద్యమ సమయంతో తనపై ఎన్నో కేసులు నమోదయ్యాయని తెలిపారు. పార్టీ కోసం పని చేసిన వారిని గుర్తించి బి-ఫారం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరారు. -
ఎన్టీఆర్ భవన్ వద్ద ‘తమ్ముళ్ల’ ఆందోళన
-
ఎన్టీఆర్ భవన్ వద్ద ‘తమ్ముళ్ల’ ఆందోళన
హైదరాబాద్: టీడీపీ-బీజేపీ పొత్తు టీడీపీలో చిచ్చు రేపుతోంది. ఈ పొత్తును తీవ్రంగా వ్యతి రేకిస్తూ తెలుగు తమ్ముళ్లు శనివారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఆందోళనకు దిగారు. బీజేపీ తమపై సవతితల్లి ప్రేమ చూపిందని ఆగ్రహిస్తూ బైఠాయించారు. గెలిచే సీట్లను తమకివ్వకుండా ఒంటెత్తు పోకడ పోయిందన్నారు. నగరం నలుమూలల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలతో ట్రస్ట్ భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీట్ల పంపకంపై జూబ్లీహిల్స్ రోడ్ నంబర్10లోని టీడీపీకి చెంది న కేంద్ర మంత్రి సుజనాచౌదరి కార్యాలయం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, టీడీపీ గ్రేటర్ అధ్యక్షుడు మాగంటి, సుజనాచౌదరి, ఎమ్మెల్యే వివేకానంద్ సమావేశమైనట్టు తెలుసుకున్న కార్యకర్తలు అక్కడికి కూడా వెళ్లి ఆందోళనకు దిగారు. తమకు అన్యాయం జరిగిందంటూ బైఠాయించారు. పూలకుండీలు ఎత్తి పడేశారు. ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్ఎస్కు బీజేపీ అమ్ముడుపోయిం దని నినాదాలు చేస్తూ నేతలను ఘెరావ్కు యత్నించారు. బీజేపీతో పొత్తు తెంచుకోకపోతే గ్రేటర్లో టీడీపీ ఒక్క సీటు కూడా గెలవలేదంటూ నినాదాలు చేశారు. వారి ఆందోళన మధ్యనే సుజనా చౌదరితో పాటు బీజేపీ, టీడీపీ నేతలు అక్కడినుంచి వెళ్లిపోయారు. టీఆర్ఎస్కు బీజేపీ అమ్ముడుపోయిందని జూబ్లీహిల్స్ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఆకుల వెంకటేశ్వర్రావు ఆరోపించారు. జూబ్లీహిల్స్ టికెట్ను బీజేపీకి కేటాయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. అక్కడినుంచి రెబల్ గా పోటీ చేస్తానని హెచ్చరించారు. ఖైరతాబాద్ బీజేపీ ఎమ్మెల్యే చింతల సీఎం కేసీఆర్ వద్ద రూ.50 కోట్లు ముడుపులు తీసుకొని నగరమంతటా వారి పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థులను పెట్టారని ఆరోపించారు. జంటనగరాల్లో టీడీపీ లేకుండా చేయడానికే బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారన్నారు. -
ఉద్యమకారుల తిరుగుబాటు
రోడ్డుపై బైఠాయింపు టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపణ మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం సొమ్మసిల్లిన శేర్ మణెమ్మ కంటతడి పెట్టిన కాసం ఏఎస్రావునగర్: తెలంగాణ ఉద్యమకారులు తిరగబడ్డారు. ఏఎస్రావు నగర్ జనరల్ మహిళ స్థానానికి ఇటీవల పార్టీలో చేరిన పజ్జూరి పావనీ రెడ్డికి టీఆర్ఎస్ టిక్కెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ శుక్రవారం రాత్రి కాప్రా సర్కిల్ అధ్యక్షుడు భేతాళ బాలరాజు ఇంటి ఎదుట బైఠాయిం చారు. ఏఎస్రావునగర్ డివిజన్ కమలానగర్లోని బాలరాజు ఇంట్లో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడు వేణుగోపాలాచారి ఉన్న విష యం తెలుసుకున్న ఆశావహులు అనుచరులతో కలసి ఇంటి ఎదుట బైఠాయించారు. రెండు గంటల పాటు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అసలు పావనీరెడ్డి ఎవరంటూ ఆందోళనకారులు ఆయనను నిలదీశారు. పార్టీ సర్కిల్ అధ్యక్షుడు బాలరాజు, డివిజన్ అధ్యక్షుడు పులి చెరాల తీరుపై విరుచుకుపడ్డారు. ఉద్యమకారులను విస్మరించి టిక్కెట్లు అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. ఉప్పల్ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి బేతి సుభాష్రెడ్డి అమ్ముడుపోయారని విమర్శించారు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. తీవ్ర వాదోపవాదాల నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకులు శేర్ మణెమ్మ సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో కొద్దిసేపు బాలరాజు ఇంటి ఎదుట రోడ్డుపై బైఠాయించారు. పార్టీ నాయకులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశా రు. పావనీరెడ్డికి టిక్కెట్టును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల్లో ఎవరికి టిక్కెట్ కేటాయించినా గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వేణుగోపాలాచారి ఫోన్లో ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావుకు గొడవ విషయా న్ని తెలియజేశారు. శనివారం ఉదయం తన వద్దకు రావాలని ఆదేశించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కొత్త రామారావు, కాసం మహిపాల్రెడ్డి, శేర్ మణెమ్మ, తాడురి భాగ్య, ఏనుగు సీతారాంరెడ్డి, కందాడి సుదర్శన్రెడ్డి, అర్చన, రాజేశ్వరి పాల్గొన్నారు. కాసం కంట తడి ఏఎస్రావునగర్ డివిజన్ జనరల్ మహిళ స్థానంలో తన సతీమణి కాసం పద్మను పోటీకి నిలపాలని ఆశించిన టీఆర్ఎస్ కాప్రా సర్కిల్ ప్రధాన కార్యదర్శి కాసం మహిపాల్రెడ్డి టికెట్ను పావనీరెడ్డికి కేటాయించిన విషయం తెలుసుకుని బోరున విలపించారు. గత 12 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అనేక కేసుల్లో ఇరుక్కున్న తనను అధిష్టానం గుర్తించలేదని వాపోయారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓదార్చినప్పటికీ లాభం లేకుండా పోయింది. -
రక్తచరిత్ర
ఎరుపెక్కిన మన్యం.. రక్తమోడిన రహదారులు రోడ్డు ప్రమాదాల్లో 684 మంది దుర్మరణం 63 హత్యలు, 125 లైంగిక దాడులు ఏడాదిలో తొమ్మిది ఎదురుకాల్పులు 85 మంది మావోయిస్టు దళ సభ్యుల అరెస్ట్ విశాఖపట్నం: కాలగమనంలో మరో ఏడాది గడిచిపోయింది. విభిన్న జ్ఞాపకాలను మిగుల్చుతూ 2015 వీడ్కోలు చెప్పింది. ఈ నేపథ్యంలో గడిచిన ఏడాదిలో నేరాలు, ఘోరాలను గమనిస్తే, బోలెడు ఆందోళన.. కొద్దిగా స్వాంతన కలుగుతాయి. గడిచిన సంవత్సరం విశాఖ రూరల్, సిటీ పరిధిలో రక్తం చిందించిన జాడలు కనిపిస్తాయి. గడిచిన ఏడాదిలో 63 మంది హత్యకు గురయ్యారు. వాటిలో రూరల్ పరిధిలో నేరాలు ఎక్కువగా జరిగాయి. మహిళలపై లైంగిక దాడులు మాత్రం నగర పరిధిలో ప్రమాదకర స్థాయిలో పెరిగాయి. మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిని తనిఖీలు చేసేందుకు బ్రీత్ అనరైజర్స్ రావడంతో ఈ ఏడాది ఆ కేసులు ఎక్కువగా పట్టుకున్నారు. ఈ ఏడాది కొత్తగా కాల్ మనీ కేసులు నమోదయ్యాయి. మన్యంలో మావోయిస్టుల కార్యకలాపాలు జోరందుకున్నాయి. పోలీసులకు మావోయిస్టులకు మధ్య తొమ్మిది సార్లు ఎదురుకాల్పులు జరిగాయి. 85 మంది దళ సభ్యులు అరెస్టయ్యారు రోడ్డు ప్రమాదాల్లో 684 మంది దుర్మరణం పాలయ్యారు. నేరాలు వెనకడుగు నగరంలో నేరాల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. 2015లో 5305 కేసులు నమోదుకాగా గతేడాది వాటి సంఖ్య 5378గాఉంది. సీసీటీఎన్ ప్రాజెక్టు, వెహికల్ ట్రాకింగ్ సిస్టం, పాస్పోర్ట్ వెరిఫికేషన్ సిస్టం, జైల్ రిలీజ్ మోనటరింగ్ సిస్టం, చలానా సిస్టంలను ఈ ఏడాది అమలులోకి తీసుకువచ్చారు. 43 కాల్మనీ కేసులు నమోదయ్యాయి. 2014లో 345 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతే 2015లో ఆ సంఖ్య 355కు చేరింది. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం 2015లో 4,91,522 కేసులు నమోదు చేసి రూ.9.06 లక్షల జరిమానా వసూలు చేశారు. 35 భూ కబ్జా కేసులు నమోదు చేసి 198 మందిని అరెస్ట్ చేశారు. గంజాయి ముఠాలపై 13 పర్యాయాలు దాడులు చేసి 36 మందిని, ఆర్గనైజింగ్ గ్యాంబ్లింగ్పై 107 దాడులు చేసి 722 మందిని అరెస్ట్ చేశారు.క్రికెట్ బెట్టింగ్లు, డ్రగ్స్, ఆయిల్మాఫియా, రైస్పుల్లింగ్, వ్యభి చార ముఠాలపై కేసులు నమోదు చేశారు. నగరంలో అంతర్రాష్ట ముఠాలు హల్చల్ చేశాయి. వరలక్ష్మీ వ్రతం రోజు ఏకంగా తొమ్మిది చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. రగిలిన మన్యం 2015లో మన్యం మళ్లీ ఎరుపెక్కింది. తొమ్మిది సార్లు మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టు దళ సభ్యుడు కొప్పాతి సూర్యం ఈ ఎన్కౌంటర్లో మరణించాడు. ఆయుధాలు కూడా భారీగా పట్టుబడ్డాయి. 303 రైఫిల్స్, ఏడు గన్స్, మూడు ల్యాండ్మైన్స్, 50 డిటోనేటర్లు, 4 గ్రెనేడ్లు, కిట్ బ్యాగులు, ఇతరత్రా సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు దళ సభ్యులు పాంగి భాస్కరరావు అలియాస్ సూర్యం, పాంగి అప్పన్న అలియాస్ రామన్న, కొర్రా శ్రీరాములుతో పాటు 64 మంది మిలీషియా సభ్యులు, 18 మంది సానుభూతి పరులను అరెస్ట్ చేశారు. 9 మంది దళ సభ్యులతో పాటు ఒక ఏసీఎం, 91 మంది మిలీషియా సభ్యులు లొంగిపోయారు. మావోయిస్టులు కూడా ఈ ఏడాది తమ ఉనికిని చాటుకున్నారు. పోలీస్ ఇన్ఫార్మర్లనే కారణంతో ముగ్గురు గిరిజనులను హతమార్చారు. ముగ్గురు గిరిజన నాయకులను కిడ్నాప్ చేశారు. 13 సార్లు దాడులు జరిపారు. బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వం జీఓ విడుదల చేయడంతో మావోయిస్టులు దానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు ముమ్మరం చేస్తూ, కేడర్ను పెంచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక ఇతర నేరాలు మాత్రం ఈసారి కాస్త తక్కువ నమోదయ్యాయి. 2014లో మొత్తం 5846 కేసులు నమోదు కాగా 2015లో 4899 కేసులు నమోదయ్యాయి. ఏడాది చివరిలో కాల్మనీ-సెక్స్ రాకెట్ కలకలం రేగింది. వడ్డీ వ్యాపారులపై దాడులు చేసి 11 కేసులు నమోదు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్,అక్రమంగా ఇసుక రవాణా, పేకాట వంటి నేరాలపై పోలీసులు ఎక్కువగా దృష్టి సారించారు. నెత్తుటి చారికలు గత ఏడాది రోడ్లు రక్తమోడాయి. మొత్తం 329 మంది చనిపోయారు. గతేడాది (325)తో పోల్చితే ప్రమాదాల సంఖ్యతో పాటు మరణాలు కూడా పెరిగాయి. మహిళపై నేరాలు కూడా తగ్గాయి. ఈ ఏడాది 337 కేసులు నమోదైతే గతేడాది 371 కేసులు నమోదయ్యాయి. గతేడాది గంజాయి స్మగ్లర్లపై 198 కేసులే నమోదు కాగా, 2015లో 251 కేసులు పెట్టారు. మోటార్ వాహనాల తనిఖీలు బాగా పెరిగాయి. 2014లో కేవలం 146 మంది మందు బాబులను మాత్రమే పట్టుకున్నారు. 2015లో ఆ సంఖ్య ఐదు వేలు దాటింది. ఇసుక అక్రమ రవాణాపై 2014లో 280 కేసులు నమోదు చేస్తే 2015లో ఆ సంఖ్య మూడింతలయ్యింది. గేమింగ్ యాక్ట్ ప్రకారం ఈ ఏడాది 1540 మందిని అరెస్ట్ చేశారు. దాదాపు రూ. 22 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అవినీతి తిమింగలాలు నగరంలో గడిచిన ఏడాదిలో ఏసీబీ దాడుల్లో బోలెడు అవినీతి తిమింగాలు చిక్కడం చర్చనీయాంశమైంది. అర్బన్ డిప్యూటీ తహశీల్దార్ డి.శేఖర్, ఎంవీ ఇన్స్పెక్టర్ సంపదరావు, శ్రీకాకుళం మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ బాలా నాయక్, తదితరులు కోట్ల ఆస్తులు కూడబెట్టిన వైనం దిగ్భ్రాంతి కలిగించింది. విషాద వీచికలు గడిచిన సంవత్సరంలో విశాఖ ప్రజానీకాన్ని విషాదంలో ముంచెత్తిన సంఘటనలు కొన్ని చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా సీతమ్మధారకు చెందిన చిన్నారి అదితి ట్యూషన్కు వెళ్లివస్తూ, డ్రైనేజీ కాలువలో వరద నీటిలో కొట్టుకుపోయిన సంఘటన అందరినీ ఆవేదనలో ముంచెత్తింది. అచ్యుతాపురం మండలం మోసయ్యపేట వాస్తవ్యులైన 22 మంది కుటుంబ సభ్యులు గోదావరిలో పడి ప్రాణాలు కోల్పోవడం కూడా కన్నీరు పెట్టించింది. మారికవలస వద్ద ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టి ఈడ్చుకు పోయిన ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం నివ్వెరపరిచింది. ఎస్.రాయవరం గోకులపాడులో బాణసంచా ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందడం, జోడుగుళ్ల పాలెం తీరంలో ముగ్గురు యువకులు, ఉక్కు నగరానికి చెందిన ముగ్గురు విద్యార్థులు వేరువేరు ఘటనల్లో సముద్రం అలలకు బలికావడం ఆవేదన కలిగించింది. పద్మనాభం మండలం, నరసాపురం గ్రామానికి చెందిన నలుగురు విద్యార్ధులు క్రికెట్ ఆడుకుంటూ చెరువులో మునిగిపోయి కన్నుమూయగా, నగరం నడిబొడ్డులో కుక్కల దాడిలో ఓ చిన్నారి బాలుడు మృతి చెందడం నివ్వెరపరిచింది. తాటిచెట్లపాలెం దరి సంజీవయ్యనగర్లో కొండ చరియలు విరిగి ఒక ఇంటిమీద పడటంతో నలుగురు మృతి చెందడం కూడా వేదన మిగిల్చింది. -
పెట్టుబడులు పడిపోవడం ఆందోళనకరం
ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ హాంకాంగ్: ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ శుక్రవారం పేర్కొన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అంశంగా పేర్కొన్నారు. ‘‘వృద్ధికి సంబంధించి ఆందోళన కలిగిస్తున్న అంశం పెట్టుబడులు. ప్రైవేటు పెట్టుబడులు తగ్గుతున్నాయి. ప్రభుత్వ పెట్టుబడుల సంగతీ అంతే’’ అని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో రాజన్ అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, మౌలిక రంగం అభివృద్ధి ఆర్థిక వ్యవస్థకు ఉత్సాహాన్ని అందిస్తున్న అంశాలుగా వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత వారం బ్రిటన్లో మాట్లాడుతూ, దేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 40 శాతం పెరిగాయని, ప్రపంచానికి భారత్ పట్ల పెరిగిన విశ్వాసానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాను ఆర్బీఐ 7.6 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. వృద్ధికి ఊతం అందించే క్రమంలో సెప్టెంబర్లో ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో బ్యాంకులకు తానిచ్చే (ఆర్బీఐ) స్వల్పకాలిక రుణాలపై వడ్డీరేటు రెపో 6.75 శాతానికి తగ్గింది. -
అగ్రహా జ్వాల
ఆర్టీసీ చార్జీల పెంపుపై వైఎస్సార్సీపీ ఆందోళన జిల్లా అంతటా బస్టాండ్ల ఎదుట ధర్నాలు, రాస్తారోకోలు స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలు పట్నంబజారు(గుంటూరు): సామాన్యులపై పెనుభారాన్ని మోపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచడంపై జిల్లా అంతటా ఆగ్రహ జ్వాలలు రగిలాయి. చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. పెద్దఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని కదం తొక్కారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఉద్యమించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు మంగళగిరి బస్టాండ్ ఎదుట ధర్నా చేపట్టి, నిరసన ప్రదర్శన నిర్వహించారు. గుంటూరు బస్టాండ్ వద్ద గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహిస్తూ బస్టాండ్ వద్దకు చేరుకుని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పొన్నూరులో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రావి వెంకటరమణ నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించారు. సత్తెనపల్లిలో పార్టీ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు సయ్యద్మాబు, కె.ప్రభాకర్ తదితర నేతల ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కౌన్సిలర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చిలకలూరిపేటలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏవీఎం సుభాని ఆధ్వర్యంలో పార్టీ కౌన్సిలర్లు, పలు విభాగాల నేతలు బస్స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. వినుకొండలో వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి పార్టీ నేతలు, కౌన్సిలర్, మండలాధ్యక్షులు ప్రదర్శన నిర్వహిస్తూ బస్టాండ్ వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. తెనాలి నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమాల అనంతరం నేతలు ఆర్టీసీ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. నిరసన కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. -
18న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ఆందోళన
రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద కార్యక్రమానికి పొంగులేటి: శివకుమార్ సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తి చూపేందుకు ఈ నెల 18 తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని రైతులు తీవ్ర సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. ప్రభుత్వం వైపు నుంచి రైతులను ఆదుకోవాలన్న ఆలోచన కనిపించడం లేదని చెప్పారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ నిద్రావస్థలో ఉన్న ప్రభుత్వాన్ని తట్టి లేపాలని వైఎస్సార్ సీపీ సంకల్పించిందన్నారు. అందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు, ఖమ్మం జిల్లా ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ నెల 18న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించే కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారన్నారు. ఆరు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను ఆయా జిల్లాల కలెక్టర్లకు రైతులతో కలిసి అందజేస్తారని చెప్పారు. కాగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉదయం పది గంటలకు వెయ్యి మంది రైతులతో జరగనున్న కార్యక్రమంలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొంటారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు తప్పకుండా పాల్గొనాలని శివకుమార్ కోరారు. డిమాండ్లు ఇవే: 1. తక్షణమే కరువు మండలాలను ప్రకటించాలి. 2. కరువు సహాయక చర్యలు చేపట్టాలి. రైతు రూణమాఫీ ఏకమొత్తంగా చేయాలి. 3. ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాలకు రూ.5 లక్షలు ఆర్థిక సాయం తక్షణమే అందించాలి. 4. కరువులో రైతులకు కరువు పింఛన్లు రూ.5000 వంతున ఇవ్వాలి. 5. పశువులకు పశుగ్రాసాన్ని, పాడి పశువులకు దానాను ఉచితంగా అందించాలి. 6. జిల్లాలో గల పెండింగ్ ప్రాజెక్ట్లు వెంటనే పూర్తి చేసి కరువు నివారణ చర్యలు చేపట్టాలి. -
పారిశుధ్య లోపంపై నిరసన
- కడెంలో ప్రజల రాస్తారోకో - సందర్శించిన ఎమ్మెల్యే రేఖ కడెం : పారిశుధ్య లోపం కారణంగా కడెంలో విషజ్వరాలు, డెంగీ ప్రబలుతున్నా అధికారులు పట్టించుకోవ డం లేదని ఆరోపిస్తూ స్థానికులు గురువారం ఆందోళనకు దిగారు. దాదాపు వంద మందికి పైగా స్థానికులు జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో నిర్మల్-మంచి ర్యాల ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డ్రెయినేజీలను శుభ్రం చేయించాలని, పందులను గ్రామానికి దూరంగా తరలించడంతో పాటు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో సరిపడా సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. కాగా, రాస్తారోకో కారణంగా వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. కలెక్టర్తో మాట్లాడిన ఎమ్మెల్యే కడెంలో స్థానికులు రాస్తారోకో చేస్తున్నారన్న సమాచా రం తెలుసుకున్న ఎమ్మెల్యే రేఖానాయక్ వ చ్చారు. గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితు లు తెలుసుకున్న ఆమె.. ఫోన్లో కలెక్టర్కు పరిస్థితిని వివరించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది నియామకం, పారి శుధ్య పరిస్థితిపై తెలిపారు. పారిశుధ్య ప నులు చేపట్టడంతో పాటు పందుల తరలింపు చర్యలు చేపట్టాలని తహశీల్దార్ నర్సయ్య, ఎంపీడీవో విలాస్ను ఆదేశిం చారు. అనంతరం ఎమ్మెల్యే స్థానికులతో కలిసి ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించగా, డ్యూటీ డాక్టర్ లేరు. ఈ మేరకు ఎమ్మెల్యే రేఖ మాట్లాడుతూ ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తక్కళ్ల సత్యనారాయ ణ, రఫీఖ్, మీనాజ్, సయ్యద్ ఆశాం, కలీం తదితరులు పాల్గొన్నారు. -
ఇక లాక్కోవటమే
-
ఇక లాక్కోవటమే
భూ సేకరణ చట్ట ప్రయోగానికి రంగం సిద్ధం * రాజధానికి 2,300 ఎకరాలు చాలన్న సింగపూరు మాస్టర్ప్లాన్ * అయినా ఇప్పటికే 33,400 ఎకరాలు సమీకరణ * తాజాగా తుళ్లూరులో 755 ఎకరాలపై కన్నేసిన సర్కారు * మొత్తం 2,200 ఎకరాల భూసేకరణకు కసరత్తు సాక్షి, హైదరాబాద్: రైతులు, రాజకీయ పక్షాలు, రైతు సంఘాల నిరసనలు, ఆందోళనలను బేఖాతరు చేస్తూ ఏటా రెండు మూడు పంటలు పండే బంగారు భూములను లాక్కోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. రాజధాని ప్రాంతంలో భూములివ్వకుంటే భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించి మరీ భూములు లాక్కుంటామని తొలి నుంచి హెచ్చరిస్తున్నట్టుగానే రైతులపై భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేస్తోంది. అవసరమైన భూముల కోసం రైతులపై భూ సేకరణ అస్త్రం ప్రయోగించాలని ఆదేశిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండేకు అనుమతిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దేశంలోనే ఎక్కడా లేని ప్యాకేజీ ఇచ్చి భూ సమీకరణ చేస్తున్నామని ప్రకటించిన ప్రభుత్వం రాజధాని పేరుతో ఇప్పటికే 33,400 ఎకరాలను సమీకరించినట్టు ప్రకటించింది. రాజధాని నిర్మాణానికి 2,300 ఎకరాలు చాలని స్వయంగా సింగపూరు అందజేసిన మాస్టర్ప్లాన్లోనే ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఇంకా భూ దాహం తీరలేదు. గుంటూరు కలెక్టర్కు ఇచ్చిన ఆదేశాల మేరకు శుక్రవారం భూ సేకరణనోటిఫికేషన్ జారీ కాబోతోంది. తొలివిడతలో 755 ఎకరాల సేకరణ భూ సేకరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనోద్యమాలు చెలరేగిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఇప్పటికే జారీ చేసిన ఆర్డినెన్స్లో సవరణలకు సిద్ధమంటూ సంకేతాలిచ్చారు. దానిపై 30 మంది పార్లమెంట్ సభ్యులతో ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. అయినా ఆంధ్రప్రదేశ్లో కనీస ప్రజాస్వామిక పద్ధతులేవీ పాటించకుండానే ఏకపక్షంగా వేలాది ఎకరాలను లాక్కుని విదేశీ కంపెనీలకు కట్టబెట్టడానికి సిద్ధం కావడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తొలుత తుళ్లూరులో 755 ఎకరాలను సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో భూసేకరణ చట్టాన్ని ప్రయోగించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే ఐదు రోజుల వ్యవధిలో మిగిలిన 1,500 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసేందుకూ రంగం సిద్ధమైంది. మొత్తం 2,200 ఎకరాల భూసేకరణకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ (డీఎన్), డ్రాఫ్ట్ డిక్లరేషన్ (డీడీ), అవార్డు జారీ చేసేందుకు రెవెన్యూ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో రైతులనుంచి ల్యాండ్ పూలింగ్ద్వారా సమీకరించిన 33,400 ఎకరాలకు అదనంగా మరో 2,200 ఎకరాలు అవసరమని మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులు అనేకసార్లు పేర్కొనడం తెలిసిందే. ఇప్పటివరకు 26,900 ఎకరాలకు సంబంధించి రైతులు అంగీకార పత్రాలిచ్చి అగ్రిమెంట్లు తీసుకున్నారు. ప్రభుత్వం రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో ల్యాండ్పూలింగ్కు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ గడువు ఆగస్టు 20 (గురువారం)తో ముగిసింది.పూలింగ్లో భూములివ్వబోమంటూ సుమారు 1,600 మంది 9.2 అభ్యంతర పత్రాలిచ్చారు. వీటికి ఇంతవరకూ ప్రభుత్వం పరిష్కారం చూపలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా చర్చలు, సంప్రదింపులకు అస్కారమే ఇవ్వలేదు. తాజాగా భూసేకరణకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో రాజధాని ప్రాంత గ్రామాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉండవల్లి, పెనుమాక గ్రామాల రైతులు గురువారం రాత్రి తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయం ఎదుట తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వ్యతిరేకిస్తున్న గ్రామాలే టార్గెట్ తొలి నుంచి సమీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని రాజధాని గ్రామాలే లక్ష్యంగా భూసేకరణ అస్త్రం ప్రయోగిస్తోంది. 29 గ్రామాల్లో మొత్తంగా 3,821 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించగా అందులో 3,066 ఎకరాలు ఈ రెండు మండలాల్లో ఉన్న ఐదు గ్రామాల్లోనివే. నాలుగురోజుల కిందట మంత్రి నారాయణ 2,200 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. తీరా నోటిఫికేషన్ జారీ చేసే సమయానికి ఈ లెక్క 3,821కి చేరింది. తాడేపల్లి మండలంలోని ఉండవల్లిలో 992 ఎకరాలు, పెనుమాకలో 522 ఎకరాలు, మంగళగిరి మండలం నవులూరులో 690, కురగల్లులో 184, నిడమర్రులో 678 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. తుళ్లూరు మండలంలో మిగిలిన 755 ఎకరాల భూములకోసం నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు సమాచారం. అర్ధరాత్రి వరకు కసరత్తు : భూసేకరణ చట్ట ప్రయోగానికి సంబంధించిన అనుమతుల జారీ, పూర్వ రంగం సిద్ధం చేసే పనిలో భాగంగా రాష్ట్ర రెవెన్యూ ఉన్నతాధికారులు గురువారం రాత్రి పొద్దుపోయేవరకూ కార్యాలయాల్లోనే గడిపారు. సీఆర్డీఏ విజ్ఞప్తి మేరకు గుంటూరు జిల్లాలో భూసేకరణ కోసం ప్రాథమిక ప్రకటన (డ్రాఫ్ట్ నోటిఫికేషన్) జారీకి అక్కడి కలెక్టరు కాంతిలాల్ దండేకి గురువారం అనుమతులిచ్చారు. ఇప్పటివరకూ భూ సమీకరణ అధికారులుగా ఉన్న 26 మంది డిప్యూటీ కలెక్టర్లను భూసేకరణ అధికారులుగా నియమిస్తూ రెవెన్యూ శాఖ గురువారం రాత్రికి రాత్రే ఉత్తర్వులు జారీ చేసింది. ఎంత విస్తీర్ణం మేరకు భూమి కావాలనే అంశాన్ని సీఆర్డీఏ స్పష్టంగా పేర్కొనలేదు.భూసమీకరణలో అంగీకార పత్రాలు ఇవ్వని, కోర్టుకెళ్లిన వారి భూములను కూడా తర్వాత సేకరణ ద్వారా తీసుకోవాలనే వ్యూహంతోనే సీఆర్డీఏ రెవెన్యూ శాఖకు పంపిన వినతిలో ఎంత భూమి అనే అంశాన్ని ప్రస్తావించలేదని విశ్వసనీయ సమాచారం. విడతల వారీగా సేకరించాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇందులో భాగంగానే భూసేకరణ ప్రాథమిక ప్రకటన (డ్రాఫ్ట్ నోటిఫికేషన్ - డీఎన్), డ్రాఫ్ట్ డిక్లరేషన్ (డీడీ), అవార్డు ప్రకటనల జారీ చేసేందుకు గుంటూరు కలెక్టరుకు అనుమతించింది. మొదట తుళ్లూరులో 755 ఎకరాల సేకరణకు ప్రాథమిక ప్రకటన (డ్రాఫ్ట్ నోటిఫికేషన్ - డీడీ) జారీ చేసి తర్వాత మరో 1500 ఎకరాలకు డీడీ జారీ చేస్తారని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అంటే... డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అంటే ముసాయిదా ప్రకటన అని అర్థం. ఏదైనా ప్రాంతంలో భూసేకణ చట్టం కింద భూమిని సేకరించాలంటే మొదట భూసేకరణ అధికారి డీఎన్ జారీ చేయాలి. ఏయే ప్రాంతం (గ్రామం/ పట్టణం)లో ఏయే సర్వే నంబర్లలో ఎవరెవరికి చెందిన ఎంతెంత భూమిని ఎందుకోసం సేకరించదలిచారో ఈ ప్రాథమిక ప్రకటనలో వివరంగా ప్రకటిస్తారు. భూసేకరణ చట్టం ప్రయోగించదలచిన భూములు, వాటి యజమానుల వివరాలన్నీ ఈ డీఎన్కు సంబంధించిన పత్రికా ప్రకటనలో వివరిస్తారు. భూ సేకరణ చేపట్టే గ్రామాలు.. సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని ప్రాంతంలో తొలిదశ భూసేకరణకు సంబంధించిన వివరాలను గురువారం రాత్రి పొద్దుపోయాక గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్దండే వెల్లడించారు. తుళ్లూరు మండలంలోని ఐదు గ్రామాల్లో మొత్తం 11.04 ఎకరాల్లో భూసేకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. ఇందులో తుళ్లూరు గ్రామంలో 4.28 ఎకరాలు, అనంతవరంలో 4.26 , బోయపాలెం 0.83, పిచకలపాలెం 0.78, అబ్బురాజుపాలెంలో 0.89 ఎకరాలు ఉన్నాయి. పవన్ను ఒప్పించి భూసేకరణ: పుల్లారావు పవన్కల్యాణ్తో తమకెలాంటి విభేదాలు లేవని, ఎలాగైనా సరే ఆయన్ను ఒప్పించి 2,200 ఎకరాలకు భూసేకరణ చేపడతామని రాష్ట్ర వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. అవసరాన్నిబట్టి మంత్రులమంతా పవన్తో మాట్లాడతామని స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో మీడియాతో మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ ల్యాండ్పూలింగ్పైనా ఢిల్లీలో ఎన్నో పోరాటాలు చేశారని... మేధాపాట్కర్, రిటైర్డ్ జడ్జీలు వచ్చారని, అయినప్పటికీ రైతులు భూసమీకరణ కింద భూములిచ్చారని చెప్పారు. సింగపూర్ ప్రభుత్వం సీడ్ కేపిటల్ ప్లాన్ ఇచ్చాక రాజధాని ప్రాంతంలో ఎకరా రూ.3.5 కోట్లు విలువ పలికిందని, ఇంకా ప్లాన్లు చూస్తే ఈ ధరలు మరింతగా పెరుగుతాయని తెలిపారు. ల్యాండ్పూలింగ్పై కోర్టుకెళ్లిన వారి భూములను భూసేకరణ కింద చేపడతామని మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. -
'చైనా డ్యామ్లతో ఎలా.. మోదీ జీ పట్టించుకోండి'
గువాహటి: బ్రహ్మపుత్ర నదిపై చైనా పెద్ద పెద్ద ఆనకట్టలు కడుతుండటం పట్ల అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో అర్ధం కావడం లేదని అన్నారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. చైనాను అలాగే అనుమతిస్తే అసోం మొత్తం ప్రమాదపుటంచుల్లోకి వెళుతుందని, ఆ డ్యాంల దిగువ ప్రాంతాలన్నీ కూడా దెబ్బతింటాయని అన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ మౌనాన్ని వీడి వెంటనే తీవ్రంగా స్పదించాలని కోరారు. -
సమ్మెపై ఉక్కుపాదం
సాక్షి ప్రతినిధి, రాజమండ్రి: మున్సిపల్ కార్మికుల సమ్మెపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆందోళన విరమించి విధులకు హాజరైతేనే చర్చలకు సిద్ధమని, లేకుంటే కఠినంగా వ్యవహరించక తప్పదని హెచ్చరించింది. రాజమండ్రి ఆర్అండ్బీ అతిథిగృహంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం మధ్యాహ్నం 2.30 గంటల వరకూ జరిగింది.రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట మృతులకు ఆత్మశాంతి కలగాలని రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఈ ఘటనపై హైకోర్టు రిటైర్డజడ్జితో న్యాయవిచారణ జరిపించాలని, నివేదిక వచ్చాక బాధ్యులపై చర్య తీసుకోవాలని నిర్ణయించారని సమాచారం. అలాగే ‘అప్పన్నకు ఐటీ నామం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం కేబినెట్లో చర్చకు వచ్చిందని తెలిసింది. సింహాద్రి అప్పన్నకు విశాఖ మధురవాడలో ఉన్న రూ.250 కోట్ల విలువైన 50 ఎకరాల భూమిని నామమాత్రపు ధరకు 99 ఏళ్ల లీజుకు ఈ-సెంట్రిక్ సొల్యూషన్ అనే ఐటీ కంపెనీకి కట్టబెట్టేందుకే మొగ్గు చూపారని తెలిసింది. నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశారని సమాచారం. కాగా, భేటీ అనంతరం సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. * కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం బాలకొలను, ఉప్పలపాడు, ఉయ్యాలవాడ పరిధిలోని సర్వే నంబర్ 433లో 2,297.13 ఎకరాలను డీఆర్డీఓ పరిధిలోని డిఫెన్స్ మిసైల్ టెస్టింగ్ సెంటర్కు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం ఎకరాకు రూ.2 లక్షల చొప్పున చెల్లిస్తారు. రూ.500 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టును 2018లోగా పూర్తి చేస్తారు. * విశాఖ జిల్లా ఆరిలోవ, భానోజినగర్లలోని ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు 80 గజాల్లోపు ఇళ్లను క్రమబద్ధీకరిస్తారు. ప్రభుత్వ స్థలాల్లో అభ్యంతరాల్లేని ఆక్రమణల్లో ఉన్న పేదలకు చెందిన ఇళ్లను క్రమబద్ధీకరిస్తారు. * అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ భూములను పరిరక్షించాలని నిర్ణయించారు. ఇందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తారు. * భూ ఆక్రమణలు, భూకబ్జాలను తీవ్రంగా పరిగణించాలి. అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను జీఓ 80 ప్రకారం తిరిగి స్వాధీనం చేసుకోవాలి. నకిలీ పట్టాదార్ పాస్పుస్తకాలపై జిల్లాల వారీగా సమగ్ర విచారణకు ఆదేశించారు.వాటి జారీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తారు. * అమరావతిలో రాష్ర్ట రాజధానిని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో అరిహంత్, ఇండో ఆఫ్రికన్ ఇన్ఫ్రాడెవలపర్స్ అండ్ బిల్డర్స్ వద్ద 22.72 ఎకరాలను మంగళగిరి మండలం నవలూరులో ప్రభుత్వం తీసుకుంటుంది. దీనికి సమానమైన స్థలాన్ని కేపిటల్ రీజియన్ వెలుపల ఇస్తారు. * విశాఖపట్నంలోని అల్ఫ్రాటెక్ ఆధీనంలో ఉన్న 1,400 ఎకరాల్లో ప్రభుత్వం ఇచ్చిన సమయంలోగా నిర్మాణం చేపట్టనందున వాటిని స్వాధీనం చేసుకుని ఐటీ, పరిశ్రమలకు ఇవ్వాలని నిర్ణయించారు. * అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మించాలని, ప్రధాని మోదీ సూచన మేరకు కజకిస్థాన్, తుర్క్మెనిస్థాన్ వంటి దేశాల్లో పర్యటిస్తారు.తొలి దశలో మం త్రులు, రెండో దశలో సీఎం పర్యటించి తుది నిర్ణయం తీసుకుంటారు. * సీడ్ కేపిటల్, కేపిటల్ సిటీ. కేపిటల్ రీజియన్ రోడ్ మ్యాప్లను మంత్రివర్గం ఆమోదించింది. సీడ్ కేపిటల్కు అక్టోబర్ 22న 3వేల ఎకరాల్లో ప్రధానిచే శంకుస్థాపన చేయిస్తారు. సీఆర్డీఏ రెగ్యులేషన్ అథారిటీగాను, సీసీడీఏ ఆపరేషన్ అథారిటీగాను ఉంటాయి. అమరావతి అభివృద్ధికి సింగపూర్, జపాన్ ప్రభుత్వాలను ఆహ్వానిస్తారు. ప్రపంచ పారిశ్రామిక రాజధానిగా ఉన్న షాంఘై మాదిరిగా ఆసియా దేశాలకు అమరావతి కేపిటల్ సిటీ నిర్మించాలని నిర్ణయించారు. * పట్టిసీమకు ఆగస్ట్ 15లోగా మొదటి దశలో నీటిని విడుదల చేయాలని, పోలవరం సకాలంలో పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. పట్టిసీమకు 266 ఎస్కులేటర్లు ఏర్పాటు చేస్తారు. * 25న పుష్కరాల ముగింపు రోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ ఇంటిలో పుష్కర దీపారాధన చేయాలని సమావేశం పిలుపునిచ్చింది. అదే రోజు గోదావరికి హారతి, లేజర్షో నిర్వహిస్తారు. సాధ్యమైనంత త్వరగా హైదరాబాద్ నుంచి మంత్రులు, అధికారుల కార్యాలయాలను మంగళగిరికి తరలించాలని, ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని తీర్మానించారు. -
‘ఔట్లుక్’ కార్టూన్పై నిరసన
ఇందిరాపార్కు వద్ద తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్ ఆందోళన హైదరాబాద్: ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పని చేస్తున్న ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్పై అసభ్యకరంగా కార్టూన్ వేసి, కథనాన్ని ప్రచురించిన ఔట్లుక్ మ్యాగజైన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్, గ్రూప్ వన్ ఆఫీసర్స్, సివిల్స్ అభ్యర్థులు శుక్రవారం హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ఆందోళన చేపట్టారు. నోటికి మాస్కులు ధరించి, ప్ల కార్డులను ప్రదర్శిస్తూ ఔట్లుక్ చర్యపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐఆర్ఎస్ అధికారి సాధు నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ స్మితా సబర్వాల్పై ఔవుట్లుక్ రాసిన కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్గా ప్రధానమంత్రి నుంచి అవార్డును అందుకున్న ఉత్తమ అధికారిణి స్మితా సబర్వాల్ అని కొనియాడారు. ప్రతికా స్వేచ్ఛ పేరిట వ్యక్తుల స్వేచ్ఛను హరించడం సరికాదని, ఇది ఎల్లో జర్నలిజం అవుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వంశీకృష్ణ (ఐపీఎస్), బలరాం, శైలజ (ఐఆర్ఎస్), రమణారెడ్డి (ఐఆర్పీస్), ఉదయనాథ్ (ఐఆర్ఎఎస్), రాహుల్ గౌలీకార్ (ఐఐఎస్), బాలలత (డిఫెన్స్), రవికుమార్ (డిఇఓ), నాగమునయ్య (ఎస్ఓ, అసెంబ్లీ), నరసింహన్ (ఎఎస్ఓ, సెక్రటేరియట్) లతో పాటు సివిల్స్ అభ్యర్థులు పాల్గొన్నారు. -
తమ్ముళ్లకు ఒళ్లు మండింది
ఎంపీ మాగంటి బాబు మాట తప్పారని ఆందోళన స్విచ్ ఆపరేటర్లుగా స్థానికులనే నియమించాలని డిమాండ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ జోక్యంతో శాంతించిన టీడీపీ నేతలు టి.నరసాపురం :ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) చర్యలను వ్యతిరేకిస్తూ తెలుగు తమ్ముళ్లు మరోసారి రోడ్డెక్కి ఆందోళనకు దిగా రు. టి.నరసాపురం మండలంలోని విద్యుత్ సబ్స్టేషన్లో స్విచ్ ఆపరేటర్ల నియామకంలో స్థానికులకు అన్యాయం జరిగిందంటూ ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం స్థానికేతరులు ఇద్దరు శ్రీరామవరం విద్యుత్ సబ్స్టేషన్లో స్విచ్ ఆపరేటర్లుగా జాయిన్ కావడంతో టీడీపీ నాయకులు గురువారం ఆందోళనకు దిగారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు తోట వీరాస్వామినాయుడు (పెదనాయుడు), మండల టీడీపీ నాయకుడు కాల్నీడి రాంబాబుల ఆధ్వర్యంలో స్థానిక సబ్స్టేషన్ను ముట్టడించారు. విద్యుత్ సరఫరాను ఉదయం 11.20 గంటలకు నిలి పివేశారు. సిబ్బందిని బయటకు పిలిచి కార్యాలయానికి తాళం వేశారు. సబ్స్టేషన్ ఎదుటే టెంట్ వేసుకుని వంటా వార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా పెదనాయుడు, రాంబాబు విలేకరులతో మాట్లాడుతూ ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ ఎన్నికల ముందు స్థానికులను స్విచ్ ఆపరేటర్లుగా నియమిస్తామని హామీ ఇచ్చి మాట తప్పడంతో ఆందోళన చేస్తున్నామన్నారు. శ్రీరామవరంలో సబ్స్టేషన్ నిర్మాణానికి 30 సెంట్ల స్థలాన్ని ఉచితంగా ఇచ్చిన స్థానికుడు కొలగాని చినవెంకటేశ్వరరావు మనుమడిని, తిరుమలదేవిపేట వ్యక్తిని నియమించాలని గతంలో హామీ పొందామని, అది అమలు కాలేదని వివరించారు. సాయంత్రం వరకు సబ్స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ ఆందోళనలో కాల్నీడి వెంకటరత్నం, తోట లక్ష్మీ నారాయణలతో పాటు శ్రీరామవరం, ఏపుగుంట తిరుమలదేవిపేట, మధ్యాహ్నపువారిగూడెం గ్రామాల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే జోక్యంతో ఆందోళన విరమణ ఆందోళన విషయం తెలిసిన ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ సాయంత్రం సబ్స్టేషన్ వద్దకు వచ్చారు. కొత్తగా జాయిన్ అయిన స్విచ్ ఆపరేటర్లను విధులకు హాజరుకాకుండా చూడాలని, ఈ సమస్యను నాలుగు రోజుల్లో పరిష్కరించాలని ఏఈ డి.శ్రీనివాస్ను ఆదేశించారు. దీంతో టీడీపీ నాయకులు శాంతించి ఆందోళన విరమించారు. -
తెలుగు వర్సిటీలో తెలంగాణ ఉద్యోగుల ఆందోళన
డిమాండ్ల సాధన కోసం వీసీ చాంబర్ వద్ద ధర్నా సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలుగు విశ్వవిద్యాలయంలో తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం చేసిన అధికారులు ప్రత్యేక రాష్ట్రంలోనూ అదే వైఖరిని కొనసాగిస్తున్నారని విమర్శిస్తూ వైస్ చాన్స్లర్ చాంబర్ ఎదుట ధర్నా చేశారు. తమకు జరుగుతున్న అన్యాయాలను గురించి వీసీ, రిజిస్ట్రార్ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని తెలుగు యూనివర్సిటీ తెలంగాణ ఉద్యోగుల సంఘం నేతలు ఆరోపించింది. కారుణ్య నియామకాలపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా, తమకు అనుకూలంగా ఉన్నవారికి పదోన్నతులు ఇచ్చారని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నియమించిన కన్సల్టెంట్లను తొలగించడంతోపాటు ఇతర ప్రాంగణాల నుంచి వచ్చిన వారిని వెనక్కి పంపాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన మినిమమ్ టైంస్కేల్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండా ఆన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సత్తిరెడ్డి, అజయ్చంద్ర, రాజ్కుమార్, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్నీ నిబంధనలకు లోబడే..: ఉద్యోగుల ఆందోళన విషయంపై ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ శివారెడ్డి, రిజిస్ట్రార్ తోమాసయ్యలను వివరణ కోరగా.. వర్సిటీలో తెలంగాణ ఉద్యోగులపై ఎలాంటి వివక్షా చూపడం లేదన్నారు. పదోన్నతుల విషయంలో నిబంధనలకు అనుగుణంగా, విభజన కమిటీ ఆమోదం మేరకు చర్యలు చేపట్టామన్నారు. ఇందులో ఎలాంటి పొరపాట్లు లేవన్నారు. తెలంగాణ వారికే తెలుగు వర్సిటీలో ప్రవేశాలు తెలుగు విశ్వ విద్యాలయంలో తెలంగాణ విద్యార్థులకే ప్రవేశాలు కల్పించేందుకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలుగు విశ్వ విద్యాలయం ఇన్చార్జి వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ శివారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకే ప్రవేశాలు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం రాతపూర్వక అనుమతి వచ్చాకే నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. మరోవైపు ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాశామని పేర్కొన్నారు. తె లుగు యూనివర్సిటీ సేవలు కావాలంటూ తెలంగాణ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవాల్సి ఉండగా, ఏపీ మాత్రం ఒప్పందం చేసుకోలేదన్నారు. దీంతో తెలంగాణలోనే ప్రవేశాలు చేపడతామని చెప్పారు. -
ముట్టడి
మద్రాసు ఐఐటీలోని అంబేద్కర్-పెరియార్ విద్యార్థి సంఘం గుర్తింపు రద్దు వ్యవహారం రాష్ట్రంలో విద్యార్థి సంఘాల ఆందోళనకు తెరతీసింది. ఇప్పటికే అనేక సంఘాలు ఆందోళన బాటపట్టగా, డీఎంకే, విడుదలై చిరుతైగళ్ కట్చి వేర్వేరుగా సోమవారం పోరాటాలకు దిగాయి. చెన్నై, సాక్షి ప్రతినిధి: మద్రాసు ఐఐటీలో అనేక రాష్ట్రాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ఉన్నతవిద్య అభ్యసిస్తున్నారు. వీరి సంఖ్యకు తగినట్లుగా అనేక విద్యార్థి సంఘాలు ఉన్నాయి. వీటిల్లో ఒకటైన అంబేద్కర్-పెరియార్ విద్యార్థి సంఘం గత నెల ఒక సమావేశాన్ని నిర్వహించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీ పరిపాలనా తీరును తప్పుపట్టింది. కరపత్రాలు ముద్రించి వ్యతిరేక ప్రచారం నిర్వహించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ విచారణ జరిపించి సదరు విద్యార్థి సంఘం గుర్తింపును రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై అనేక విద్యార్థి సంఘాలతోపాటూ వివిధ రాజకీయపార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. ఇందులో భాగంగా డీఎంకే విద్యార్థి విభాగం ఐఐటీ సమీపంలోని మధ్య కైలాష్ వద్ద ఉదయం 11 నుంచి ఆందోళన చేపట్టింది. అక్కడి నుంచి ఊరేగింపుగా ఐఐటీ వద్దకు చేరుకుని ముట్టడికి ప్రయత్నించాయి. అయితే పోలీసులు అడ్డుకుని 200 మందిని అరెస్ట్ చేశారు. తరువాత విడుదలై చిరుతైగళ్ కట్చి అధ్యక్షులు తిరుమావళవన్ నేతృత్వంలో మరో పోరాటం మొదలైంది. వీరుకూడా ఊరేగింపుగా ఐఐటీ వద్దకు చేరుకుని లోనికి చొరబడేందుకు ప్రయత్నించారు. 150 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుచ్చిరాపల్లి ప్రధాన బస్స్టేషన్ వద్ద వీసీకే నేతలు రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం రైల్వేస్టేషన్లో రైల్రోకోకు ప్రయత్నిం చారు. పోలీసులు రైల్వేస్టేషన్ ప్రవేశద్వారం వద్ద వారిని అరెస్ట్ చేశారు. తిరుచ్చిలో 200 మంది అరెస్టయ్యారు. -
సచివాలయంలో పీడీఎస్యూ ఆందోళన
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ గురువారం సచివాలయంలోని సీఎం కార్యాలయం (సమతాబ్లాక్) ఎదుట పీడీఎస్యూ మహిళా నాయకులు ఆందోళన చేశారు. బారికేడ్ దాటుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వారు సి-బ్లాక్ ఎదురుగా బైఠాయించి సీఎం డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. పీడీఎస్యూ నాయకులను అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు నానాతంటాలు పడ్డారు. మహిళా పోలీసులు లేకపోవడంతో అందుబాటులో ఉన్న ఒక మహిళా పోలీసును అక్కడికి రప్పించి ఆమె సహాయంతో ఆందోళన చేస్తున్న వారిని పోలీసుల వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. అంతకు ముందు పీడీఎస్యూ నాయకురాలు సత్య మాట్లాడుతూ ఓయూ స్థలంలో ఇళ్లను నిర్మించాలన్న నిర్ణయాన్ని సీఎం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.