kalyana Lakshmi scheme
-
కోటి మంది డ్వాక్రా మహిళలకు ధోకా
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. యావత్ ప్రపంచం మహిళల హక్కులు, ఆర్థిక స్వావలంబన, ఉన్నతి కోసం మాట్లాడుకుంటున్న తరుణంలో చంద్రబాబు సర్కారు ఏకంగా మహిళా దినోత్సవం రోజే వారి సాధికారతకు తూట్లు పొడిచింది! అక్కచెల్లెమ్మల అభ్యున్నతి కోసం ఏర్పాటైన స్త్రీ నిధి బ్యాంకును పూర్తిగా నిర్వీర్యం చేస్తూ అడుగులు వేస్తోంది. కూటమి సర్కారు కొత్త పథకాలు విద్యాలక్ష్మి, కల్యాణలక్ష్మి కోసం ఇచ్చే రుణాలను స్త్రీ నిధి బ్యాంకు నుంచి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో బ్యాంకు మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది.అదే అంతకు ముందు గత ఐదేళ్లూ మహిళా సాధికారతే ధ్యేయంగా వైఎస్ జగన్ ప్రతి అడుగూ వేశారు. అన్ని పథకాలను మహిళల పేరిటే అమలు చేసి ఆర్థిక ఆసరా కల్పించారు. ప్రతి పథకానికి బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించి చిత్తశుద్ధిని చాటుకున్నారు. వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాల ద్వారా ఏకంగా రూ.427.27 కోట్ల మొత్తాన్ని అర్హులకు పారదర్శకంగా అందించారు.సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళలకు స్త్రీ నిధి బ్యాంకు ఇచ్చే రూ.4 వేల కోట్ల రుణాల్లో రూ.1,000 కోట్ల చొప్పున కళ్యాణలక్ష్మీ, విద్యాలక్ష్మీ పథకాలకు నాలుగు శాతం వడ్డీకి రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. మొత్తం రుణాల్లో నాలుగో వంతు రుణాలను తక్కువ వడ్డీకి ఇవ్వడం వల్ల స్త్రీ నిధి సంస్థ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోనుంది. గత ఐదేళ్లలో స్త్రీ నిధికి సంబంధించి దాదాపు రూ.4 వేల కోట్లు నిరంతరం పొదుపు సంఘాల మహిళల వద్ద రుణాలు రూపంలో ఉన్నాయి. పథకాల అమలుకు చిత్తశుద్ధితో బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఇలా అడ్డదారిలో మళ్లించడం వల్ల పొదుపు సంఘాల వ్యవస్థ దెబ్బతింటుందనే ఆందోళన మహిళల్లో వ్యక్తమవుతోంది. కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా మహిళలను మోసం చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం ‘స్త్రీ నిధి’ నిధులను వాడుకోవాలని నిర్ణయించింది. కోటి మందికి పైగా ఉన్న పొదుపు మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే సంస్థ నిధులను వాడుకోవడం అంటే.. ఆ మేరకు డ్వాక్రా మహిళల రుణాల లభ్యత తగ్గించడమేననే ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యవసర సమయాల్లో ఆర్థిక తోడ్పాటు అందించే స్త్రీ నిధి బ్యాంకును నష్టాల ఊబిలోకి గెంటేస్తోందని, సర్కారు నిర్వాకాలతో సంస్థ మూతపడితే పేద మహిళల ఆర్థిక అవసరాలకు తోడ్పాటు కరువై దిక్కుతోచని పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పథకాల అమలుకు బడ్జెట్లో నిధుల కేటాయింపులు లేకుండా.. స్త్రీ నిధి ద్వారా రుణాలు ఇప్పించాలన్న కూటమి సర్కారు యోచనపై అధికారులు విస్తుపోతున్నారు. 7 శాతం వడ్డీకి అప్పులు తెచ్చి... 4 శాతం వడ్డీకి రుణాలివ్వాలట! సొంత నిధులు తక్కువగా ఉండే స్త్రీ నిధి బ్యాంకు ఇతర బ్యాంకుల నుంచి ఏడు శాతం వడ్డీకి తీసుకొచ్చిన డబ్బులనే 11 శాతం వడ్డీకి పొదుపు మహిళలకు రుణంగా ఇస్తూ ఉంటుంది. ఏడు శాతానికి పైన తీసుకొనే నాలుగు శాతం వడ్డీలో రెండు శాతం వడ్డీ డబ్బులను తిరిగి గ్రామ, మండల సమాఖ్యలకు, మిగిలిన 2 శాతం వడ్డీ డబ్బులను స్త్రీ నిధి సిబ్బంది జీతాలు, సంస్థ నిర్వహణకు వినియోగిస్తుంటారు. స్త్రీ నిధి సంస్థ ఏడు శాతం వడ్డీకి తెచ్చుకుంటున్న నిధులను ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఆలోచన చేస్తున్న కళ్యాణలక్ష్మీ, విద్యాలక్ష్మీ పథకాల లబ్దిదారులకు నాలుగు శాతం వడ్డీకే రుణాలు ఇప్పించేలా కసరత్తు చేశారు. ఈ ప్రక్రియకు సంబంధించి ప్రణాళిక ఇప్పటికే దాదాపు కొలిక్కి వచ్చింది. అంటే మూడు శాతం చొప్పున వడ్డీ డబ్బులను స్త్రీ నిధి బ్యాంకు నష్టపోవాల్సి ఉంటుంది. ఈ పథకాలు అమలు చేయడం వల్ల స్త్రీ నిధి సంస్థకు ఆర్థికంగా వాటిల్లే నష్టానికి సంబంధించి తిరిగి చెల్లింపులు, అదనపు సాయం అందించడం గురించి ఇప్పటిదాకా ప్రభుత్వ స్థాయిలో జరిగిన కసరత్తులో ఎక్కడా కనీసం చర్చ జరగలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. పూర్తిగా స్త్రీ నిధి సంస్థ నిధులతోనే ఈ పథకాలను అమలు చేసేలా అడుగులు పడుతున్నాయి. ఒకవైపు వడ్డీకి తెచ్చుకునే డబ్బులను మరోవైపు అంతకంటే తక్కువ వడ్డీకి రుణాలుగా ఇవ్వడం ద్వారా స్త్రీ నిధి సంస్థ నష్టాల ఊబిలోకి వెళ్లి మూతపడే అవకాశం ఉంటుందని మహిళా సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. స్త్రీ నిధి బ్యాంకు నిబంధనలివీ..స్త్రీ నిధి బ్యాంకు అందించే రుణాలను పేద మహిళల కుటుంబాల జీవనోపాధుల పెంపు లేదా ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల కోసమే వెచ్చించాలి. రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళల ఆదాయం పెరిగేలా తోడ్పాటునివ్వాలి. స్త్రీ నిధి నిబంధనలు గాలికి.. సాధారణంగా పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండే మహిళలు బ్యాంకు లింకేజీ కార్యక్రమంలో కమర్షియల్ బ్యాంకు ద్వారా రుణాలు పొందుతుంటారు. బ్యాంకు లింకేజీ ద్వారా మహిళలు పొందే రుణాలను మూడు నాలుగేళ్ల కాల పరిమితితో నెలవారీ కిస్తీ రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం క్యాష్ అండ్ క్రెడిట్ విధానం అమలులో ఉన్నా.. ఒక్కో సంఘం మూడు నాలుగేళ్లకు ఒకసారే బ్యాంకు లింకేజీ లోన్లు తీసుకుంటాయి. పొదుపు సంఘం ద్వారా మహిళలు ఒకసారి బ్యాంకు లింకేజీ రుణం పొందిన తర్వాత అత్యవసర సమయాల్లో స్త్రీ నిధి ద్వారా అదనపు ఆర్థిక రుణాన్ని పొందుతుంటారు. పొదుపు మహిళలకు బ్యాంకు లింకేజీ కార్యక్రమంలో రుణాలిచ్చినా, స్త్రీ నిధి ద్వారా రుణాలిచ్చినా నిబంధనల ప్రకారం ఆయా కుటుంబాల జీవనోపాధుల పెంపు లేదా ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల కోసమే వెచ్చించాలి. ఆ రుణాలను ఉపయోగించుకొని తమ ఆదాయం పెంచుకోవాలి. అయితే కూటమి సర్కారు ఆలోచన దీనికి భిన్నంగా ఉంది. స్త్రీ నిధి బ్యాంకు నిబంధనలను తుంగలో తొక్కి కొత్త పథకాలకు మళ్లిస్తోంది. జగన్ హయాంలో ప్రభుత్వమే నేరుగా సాయం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ల పాటు పేద కుటుంబాల పిల్లల చదువులకు అండగా నిలుస్తూ అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యాదీవెన పథకాల ద్వారా తిరిగి చెల్లించే అవసరం లేకుండా నేరుగా పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసింది. కళ్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాల ద్వారా రూ.427.27 కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని విధానంలో అర్హులకు అందించింది. ఎన్నికల ముందు ఎడాపెడా హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు లబ్ధిదారులంతా తప్పనిసరిగా తిరిగి చెల్లించాల్సిన రుణాల రూపంలో విద్యాలక్ష్మీ, కళ్యాణలక్ష్మీ పథకాల అమలుకు సిద్ధమైంది. ఇందుకోసం 12 ఏళ్లుగా కోటి మందికి పైగా పొదుపు మహిళల ఆర్థిక అవసరాలు తీర్చిన స్త్రీ నిధి సంస్థను బలి పెడుతోంది. స్త్రీ నిధిని నష్టాల్లోకి నెట్టి నిర్వీర్యం చేసేలా అడుగులు వేయటాన్ని మహిళా సంఘాలు, రాజకీయ వర్గాలు తప్పుబడుతున్నాయి. నిధులు మళ్లిస్తే ఊరుకోం స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాదులను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన స్త్రీ నిధి నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తే ఊరుకునేది లేదు. ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ప్రకటించిన కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలి. ఆ పథకాల అమలుకు బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం అన్యాయం. పొదుపు మహిళల అభ్యున్నతికి ఉద్దేశించిన స్త్రీ నిధిని మళ్లించేందుకు యత్నిస్తుండటం దారుణం. దీనివల్ల పొదుపు మహిళల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలి. – పి.నిర్మలమ్మ, ఐద్వా సీనియర్ నాయకురాలు, కర్నూలుస్త్రీ నిధిని మళ్లించడం దారుణం టీడీపీ కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమ పథకాలకు గండికొడుతోంది. మహిళా సాధికారిత గురించి గొప్పలు చెబుతూ కల్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవటాన్ని బట్టి పాలకులకు చిత్తశుద్ధి లేదని రుజువవుతోంది. స్త్రీ నిధి బ్యాంకు రుణాలను ఇతర పథకాలకు మళ్లించే యత్నాలు సిగ్గుచేటు. ప్రభుత్వ మోసపూరిత విధానాలను మహిళలు గమనిస్తున్నారు. – ఎం.విజయ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ప్రకాశం జిల్లా అధ్యక్షురాలు ఊరుకునేది లేదు.. కూటమి ప్రభుత్వం స్త్రీ నిధిని ఇతర పథకాలకు మళ్లిస్తే ఊరుకునేది లేదు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలతో డ్వాక్రా మహిళలకు రుణాలు తగ్గే ప్రమాదం ఉంది. బ్యాంకు నిబంధనలను తుంగలో తొక్కి అసంబద్ధ నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. – చిట్టెమ్మ, డ్వాక్రా సంఘం సభ్యురాలు, చిత్తూరు జిల్లా.నిధులు కేటాయించకపోవడం దారుణం కళ్యాణలక్ష్మీ, విద్యాలక్ష్మి పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దారుణం. డ్వాక్రా మహిళల సాధికారతకు రుణాలు సమకూరుస్తున్న స్త్రీ నిధి బ్యాంకు నిధులను ఈ పథకాలకు మళ్లిస్తే డ్వాక్రా మహిళలకు సమస్యలు తప్పవు. డ్వాక్రా నిధులతో కుటుంబాలను నెట్టుకొస్తున్న పేద వర్గాల మహిళలు మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పిస్తోంది. డ్వాక్రా మహిళలకు స్త్రీ నిధి రుణాలు అందని పరిస్థితి ఉత్పన్నం కానుంది. డ్వాక్రా మహిళలకు ద్రోహం తలపెట్టే యత్నాలను విరమించుకోవాలి. కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాలకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలి. డ్వాక్రా మహిళలకు ఇబ్బంది లేకుండా బ్యాంకు రుణాలను సక్రమంగా అందించి ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – ఇ.చంద్రావతి, శ్రామిక మహిళా సంఘాల ప్రతినిధి, కాకినాడ జిల్లా -
TS: ‘కల్యాణ’ కానుకేదీ?
నల్లగొండ జిల్లా చండూరు మండలం దోనిపాములకు చెందిన ఇప్ప లక్ష్మయ్య తన కుమార్తె వివాహం 2022 జూన్లో చేశాడు. ఆ తర్వాత కల్యాణ లక్ష్మి పథకం కింద ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించాడు. దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా కల్యాణ కానుక అందలేదు. క్రమం తప్పకుండా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అధికారులు నెలరోజుల్లో వస్తుందని చెబుతున్నా.. అలాంటి నెలలెన్నో గడిచిపోతుండటంతో లక్ష్మయ్య సాయంపై ఆశలు వదులుకునే పరిస్థితికి చేరుకున్నాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పామెన గ్రామానికి చెందిన బి.అమృత తన కుమార్తె వివాహం గతేడాది ఫిబ్రవరి 9న చేసింది. వెంటనే కల్యాణ లక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసినా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు. పథకం అర్హత, సాయం కోసం అధికారులను అడిగినప్పుడల్లా.. వివరాలను సంబంధిత అధికారులకు పంపించామని, ప్రభుత్వం నిధులు ఇచి్చనప్పుడు అందిస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో సాయం అందుతుంతో లేదో ఆమెకు అర్థం కావడం లేదు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కల్యాణ లక్ష్మి పథకం పడకేసింది. కుమార్తెల వివాహాలు చేసి ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న దరఖాస్తుదారుల్లో అయోమయం నెలకొంది. ఏడాది, ఏడాదిన్నర దాటుతున్నా ‘కల్యాణ’ కానుక జాడ లేక పోవడంతో..సమీప భవిష్యత్తులోనైనా వస్తుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి రోజు నాటికే వధువు కుటుంబానికి రూ.1,00,116 ఆర్థిక సాయాన్ని (కానుక) అందించాలనేది కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ముఖ్య ఉద్దేశం. దరఖాస్తు ప్రక్రియలో నిబంధనలు, క్షేత్రస్థాయిలో విచారణ నేపథ్యంలో అర్జీదారులంతా వివాహం తర్వాతే దరఖాస్తు సమర్పిస్తున్నారు. అలా సమర్పించిన దరఖాస్తును పరిశీలించి విచారణ పూర్తి చేసిన తర్వాత అర్హతలను ఖరారు చేసి, లబ్దిదారు కుటుంబానికి చెక్కు రూపంలో సాయం అందించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ పథకాలకు నిధుల విడుదల నిలిచిపోగా.. క్షేత్రస్థాయిలో దరఖాస్తు పరిశీలన కూడా ఆగిపోయింది. ఇప్పటికే దరఖాస్తు సమర్పించిన అర్జీదారులకు ఎలాంటి సమాచారం అందడం లేదు. దాదాపు నాలుగు నెలలుగా రాష్ట్రంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద చెక్కుల పంపిణీ జరగడం లేదు. రెండు పథకాల కింద రాష్ట్రవ్యాప్తంగా 1,04,613 దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోక వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నట్లు సంక్షేమ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విడుదల కాని నిధులు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు సంబంధించి లక్షకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉండటంతో ఆ మేరకు బకాయిలు కూడా పేరుకుపోయాయి. నిధుల విడుదలలో జాప్యం కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. 2023–24 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నెలాఖరు నాటికి రెండు పథకాలకు సంబంధించి 1,32,046 దరఖాస్తులు అందగా, 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మరో 69,715 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్ దరఖాస్తులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జత (క్యారీ ఫార్వర్డ్) చేశారు. క్యారీ ఫార్వర్డ్ చేసిన దరఖాస్తులతో 2023–24 డిసెంబర్ నెలాఖరు నాటికి వచ్చిన వాటిని కలిపితే మొత్తం దరఖాస్తులు 2,01,761. వీటిలో 97,148 దరఖాస్తులను అధికారులు విడతల వారీగా పరిష్కరించి క్లియర్ చేశారు. వీటికి సంబంధించి ప్రభుత్వం రూ.972.60 కోట్లు విడుదల చేసింది. కానీ 1,04,613 దరఖాస్తులకు సంబంధించి రూ.1,047.68 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. గత నాలుగు నెలలుగా ఎన్నికల కోడ్, ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో నిధుల విడుదల జరగక చెక్కుల పంపిణీ నిలిచిపోయింది. కాగా ప్రస్తుత బకాయిల్లో బీసీ, ఈబీసీ కేటగిరీల వారి దరఖాస్తులకు సంబంధించినవే సగానికిపైగా ఉండడం గమనార్హం. కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చా? లేదా? రాష్ట్రంలో గత డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికాకంలోకి వచ్చింది. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు గత ప్రభుత్వ హయాంలోనే అమల్లో ఉండగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్..అధికారంలోకొస్తే కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఈ పథకాలకు నిధుల విడుదల నిలిచిపోవడంతో బంగారం సంగతి సరే బకాయిల సంగతి ఏమిటనే ఆందోళన, ఆయోమయం దరఖాస్తుదారుల్లో నెలకొంది. ఏడాదిన్నరకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉండగా.. వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లింపులు చేస్తుందా? లేదా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ఈ పథకాలకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో..ఆయా పథకాలకు అర్హతలున్న వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలా? వద్దా? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కేటగిరీ వారీగా కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ బకాయిలు (రూ.కోట్లలో) సంక్షేమ శాఖ పెండింగ్ దరఖాస్తులు చెల్లించాల్సిన బకాయిలు బీసీ, ఈబీసీ 55541 556.29 మైనారిటీ 23599 236.28 ఎస్సీ 14267 142.90 ఎస్టీ 11206 112.21 మొత్తం 104613 1047.68 -
కల్యాణలక్ష్మి, షాదీముబారక్కు రూ.3210 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ‘కల్యాణ’ కానుకకు 2023– 24 బడ్జెట్లో ప్రాధాన్యత దక్కింది. క్షేత్రస్థాయి నుంచి సాయం అందుకునే వారి సంఖ్య పెరుగు తుండడంతో కేటాయింపులను సైతం రాష్ట్ర ప్రభుత్వం అమాంతం పెంచేసింది. తాజా బడ్జెట్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకా లకు రూ.3210 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్లో రూ.2750 కోట్లు కేటాయించగా... ఈసారి బడ్జెట్లో ఏకంగా రూ.460 కోట్లు పెంచింది. తాజా కేటాయింపులతో 3.20లక్షల మందికి కల్యాణ కానుక అందనుంది. -
పేదల శ్రేయస్సు కోసమే సంక్షేమ పథకాలు
ఖమ్మం మయూరిసెంటర్: పేదల శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వెల్లడించారు. ఖమ్మం వీడీవోస్ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో 64మందికి రూ.6.40కోట్ల విలువైన కల్యాణలక్ష్మి పథకం చెక్కులను మంత్రి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఇప్పటివరకు ఖమ్మం నియోజకవర్గంలో 7,515 మందికి రూ.70.21 కోట్లు పంపిణీ చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల నిధులను సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం వెచ్చిస్తోందని తెలిపారు. ఇక రైతులకు 24 గంటల విద్యుత్, సాగునీరు, పేద ఆడపడుచులకు కేసీఆర్ కిట్లు, ఆడపిల్ల జన్మిస్తే రూ.13 వేలు, మగ పిల్లవాడు జన్మిస్తే రూ.12 వేలు ప్రభుత్వం అందిస్తోందని మంత్రి వివరించారు. అనంతరం లబ్ధిదారులు, వారి కుటుంబీకులతో కలిసి పువ్వాడ సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, తహసీల్దార్ శైలజ, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులు.. ఎందుకిలా?
మలక్పేటకు చెందిన ఆటో డ్రైవర్ మస్తాన్ తన ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక సాయం కోసం షాదీముబారక్ పథకం కింద ఈ ఏడాది జనవరిలో దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు సదరు దరఖాస్తుపై విచారణ జరగలేదు. సంబందిత తహసీల్దార్ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నా సరైన సమాధానం మాత్రం లభించడం లేదు. ఇది ఒక్క మస్తాన్ సమస్య కాదు.. నగరంలో వందలాది మంది నిరుపేద కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్య. సాక్షి, హైదరాబాద్: దేవుడు వరం ఇచ్చినా... పూజారి కరుణించని చందంగా తయారైంది షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాల పరిస్థితి. ఉన్నతాధికారుల ఉదాసీనవైఖరితో నిరుపేద ఆడబిడ్డల ఆర్థిక చేయూతకు గ్రహణం పడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్కారు సాయంపై గంపెడాశతో అప్పో సప్పో చేసి ఆడబిడ్డల పెళ్లిల్లు చేస్తున్న పేద కుటుంబాలు మరింత ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఏడాది గడిస్తే కానీ ఆర్థిక సాయం అందే పరిస్థితి కానరావడం లేదు. ప్రధానంగా దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ రెవెన్యూ యంత్రాంగానికి గుదిబండగా తయారైంది. ఒకవైపు వీఆర్వోలను ఇతర శాఖలకు బదిలీ చేయడం, మరోవైపు డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏల ఆందోళన... సిబ్బంది కొరత కారణంగా మారుతోంది. ప్రస్తుతం ఉన్న సిబ్బంది ప్రభుత్వ భూముల పరిరక్షణ, ధ్రువీకరణ పత్రాల జారీ, పింఛన్లు ఇతరత్రా విధుల్లో బిజీబిజీగా ఉండటంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. ఇదిలా ఉండగా... ఇప్పటికే క్షేత్ర స్థాయి విచారణ పూర్తయినా మిగితా ప్రక్రియ కూడా నత్తకు నడక నేర్పిస్తోందనడం నిర్వివాదంశం. వెంటాడుతున్న నిధుల కొరత ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను గ్రీన్ చానల్ కింద ప్రకటించినా నిధుల కొరత వెంటాడుతోంది. బడ్జెట్లో పథకాలకు కేటాయింపులు ఘనంగా ఉన్నా.. ఆమలులో మాత్రం పథకం చుక్కలు చూపిస్తోంది. క్షేత్ర స్థాయి విచారణ అనంతం ఆర్థిక సాయం మంజూరైనా... ట్రెజరీ బిల్లుల పెండింగ్లో పడిపోతున్నాయి. ప్రభుత్వ సాయం అందితే పెళ్లికి చేసిన అప్పులు తీర్చాలని భావిస్తున్న తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతోంది. పేదింటి బిడ్డలను ఆదుకునేందుకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు ప్రభుత్వం 2014లో శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన వధువులకు రూ. 1,00,116 సాయంగా అందజేస్తున్నారు. కార్యాలయాల చూట్టూ... కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్న నిరుపేదలు సంబంధిత తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా ప్రభుత్వ సాయం అందలేదని అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. దరఖాస్తులు తమ వద్ద పెండింగ్లో లేవని అధికారులు పేర్కొంటుండటంతో స్థానిక ఎమ్మెల్యేల వద్దకు పరుగులు చేస్తున్నారు. పరిస్థితి ఇలా... హైదరాబాద్ జిల్లాలో 14 వేల పైగా షాదీముబారక్ దరఖాస్తులు 2 వేలపైగా కల్యాణలక్ష్మి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వాటి విషయంలో కనీస విచారణ జరగకపోవడం కొసమెరుపు. (క్లిక్ చేయండి: మునుగోడు ఎన్నికల బరిలో ఉంటాం) -
అప్పుడేమో పెళ్లై పిల్లలు పుట్టాక.. ఇప్పుడేమో అప్లికేషన్ పెడ్తేచాలు..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు దరఖాస్తు చేసుకున్న వెంటనే మంజూరవుతోంది. వివాహమైన ఏడాదికో రెండేళ్లకో, పిల్లలు పుట్టాక వచ్చే కల్యాణలక్ష్మి చెక్కులు.. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వెంటనే వాటికి సంబంధించిన చకచకా సాగిపోతోంది. ఉప ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిపాదనలు వేగంగా సిద్ధం చేస్తుండగా, ఇప్పుడు సంక్షేమ పథకాల మంజూరును జిల్లా యంత్రాంగం వేగంగా చేపడుతోంది. త్వరలోనే నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. నియోజకవర్గంలో దరఖాస్తుల వివరాలు.. ►ఆగస్టు నెలలో చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో కల్యాణలక్ష్మి పథకం కోసం 268 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అవి మంజూరయ్యాయని చెక్కులు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. ►చౌటుప్పల్ మండలంలో ఈ నెలలో ఇప్పటి వరకు 30 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటన్నింటి మంజూరు కోసం ఉన్నతాధికారులకు పంపించారు. ►నారాయణపూర్ మండంలో జూలై నెలలో 10 దరఖాస్తులు రాగా, ఆగస్టు నెలలో 78 దరఖాస్తులు, ఈ నెలలో ఇప్పటివరకు 12 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అవి మంజూరయ్యాయని, త్వరలోనే చెక్కుల పంపిణీకి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ►మునుగోడు మండలంలో ఆగస్టు 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 19 దరఖాస్తులు వచ్చాయి. వాటిని ప్రాసెస్ చేసిన రెవెన్యూ అధికారులు.. ఆమోదం కోసం నల్లగొండ ఆర్డీవో కార్యాలయానికి పంపించారు. త్వరలోనే చెక్కులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ►మర్రిగూడ మండలంలో జూలై నెలలో కల్యాణలక్ష్మి కోసం 25 దరఖాస్తులు రాగా, ఆగస్టు నెలలో 27 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెలలో ఇప్పటివరకు 4 దరఖాస్తులు వచ్చాయి. వాటిన్నింటిని ఆమోదం ఆర్డీవో కార్యాలయానికి పంపించారు. ►నాంపల్లి మండలంలో ఆగస్టు నెలలో 36 దరఖాస్తులు రాగా, ఈ నెలలో మరో 2 దరఖాస్తులు వచ్చాయి. వాటిని ఆమోదం కోసం ఆర్డీవో కార్యాలయానికి పంపించారు. ►చండూరు మండలం పరిధిలో జూలైలో 3 దరఖాస్తులు, ఆగస్టులో 16 దరఖాస్తులు రాగా, ఈ నెలలో ఇప్పటి వరకు 3 దరఖాస్తులు వచ్చాయి. వాటిని ఆమోదం కోసం నల్లగొండ ఆర్డీవో కార్యాలయానికి పంపినట్లు అధికారులు చెబుతున్నారు. మండల స్థాయిలో పెండింగ్ లేకుండా.. నియోజకవర్గంలోని రిజర్వాయర్ల నిర్మాణంతో నిర్వాసితులైన వారికి పెండింగ్లో ఉన్న పునరావాస ప్యాకేజీని ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. రోడ్ల మరమ్మతులు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతోంది. ఇటీవలే దాదాపు 10 వేల కొత్త పెన్షన్లను మంజూరు చేసింది. గొర్రెల పంపిణీకి కసరత్తు చేస్తోంది. చండూరు మండలంలోని గొల్లగూడెం, శేరిగూడెం, మునుగోడు మండలంలోని బీరెల్లిగూడెం, గంగోరిగూడెం, గుండ్లోరిగూడెం, రావిగూడెం గ్రామాలకు రేషన్ దుకాణాలను మంజూరు చేసింది. ఇప్పుడు కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేసే ప్రక్రియను వేగంగా చేస్తోంది. ఇందుకోసం వచ్చివ దరఖాస్తులను వెంట వెంటనే తహసీల్దార్లు ప్రాసెస్ చేస్తున్నారు. దరఖాస్తులను పెండింగ్లో పెట్టకుండా, ఎప్పటికప్పుడు పరిశీలించి ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపిస్తున్నారు. ప్రస్తుతం వాటన్నింటిని మంజూరు చేసే పనిలో జిల్లా యంత్రాంగం ఉంది. -
‘ఇలాంటి ఫథకం దేశంలో ఎక్కడా లేదు’
సాక్షి,కూకట్పల్లి(హైదరాబాద్): పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు లక్ష రూపాయలకు పైగా ఆర్థిక సాయం అందించడం దేశంలో ఎక్కడా లేదని, అది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే సాధ్యమైందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 15 వేల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందించామని, రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారన్నారు. పింఛన్ డబ్బుల్లో రూ.1900 కేసీఆర్ ప్రభుత్వం అందిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.100 మాత్రమే ఇస్తుందన్నారు. అంతా తామే ఇస్తున్నట్లు తప్పుడు ప్రచారాలతో బీజేపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అబద్ధాలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, చేతనైతే అభివృద్ధిలో పోటీ పడాలని బీజేపీ నేతలకు ఆయన సూచించారు. దేశంలో జాతీయ పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో అయినా ప్రస్తుత పరిస్థితి, తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి పరిశీలిస్తే అర్థమవుతుందని బీజేపీ నాయకులకు హితవు పలికారు. నేడు దేశం అంతా కరెంటు లేక సతమతం అవుతుంటే.. సీఎం కేసీఆర్ ముందుచూపుతో నేడు తెలంగాణలో 24గంటల విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శిరీష బాబురావు, జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్కుమార్ తదితరులు ఉన్నారు. చదవండి: దినేష్ దశ తిరిగెన్.. మోసపోయిన కంపెనీ నుంచే బంపర్ ఆఫర్ -
జరిగిందంతా తూచ్.. ఈ కేసు కథ కంచికి చేరినట్లేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్: రెవెన్యూశాఖను కుదిపేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అక్రమాల కేసు అటకెక్కినట్లేనా? ఈ కేసులో సుమారు నెల రోజులపాటు విచారణ జరిపి సమర్పించిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నివేదిక బుట్టదాఖలైనట్లేనా? విచారణలో పలువురిపై చర్యలకు రాష్ట్రస్థాయి అధికారులు చేసిన సిఫారసులు ‘షోకాజ్’లతో సరిపుచ్చారా?... అంటే రెవెన్యూ వర్గాలనుంచి అవుననే సమాధానం వస్తోంది. పేదల కోసం ఉద్దేశించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో కొందరు తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది చేతివాటం ప్రదర్శించడాన్ని ప్రభుత్వం తప్పుబట్టింది. చెక్కుల పంపిణీ కోసం భారీగా వసూళ్లకు పాల్పడిన పలువురిపై సీరియస్గా స్పందించిన ఉన్నతాధికారులు మొదట చర్యలకు సిఫారసు చేశారు. విచారణ నివేదికల ఆధారంగా షోకాజ్లు జారీ చేసి కీలక పోస్టుల నుంచి తప్పించారు. ఓ వైపు విచారణ జరుగుతుండగా.. ఇవే కేసుల్లో తప్పించబడిన పలువురికి మళ్లీ పోస్టింగ్లు ఇస్తుండడం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. విజిలెన్స్ నివేదికలు అటకెక్కినట్లేనా.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో అనర్హులకు నగదు చెల్లించడం, అర్హులనుంచి వసూళ్లకు పాల్పడ్డారన్న వివాదంలో రాష్ట్రవ్యాప్తంగా 55 మంది తహసీల్దార్లు, ఇతర ఉద్యోగులుంటే.. ఉమ్మడి వరంగల్ నుంచి 16 మంది వరకు వివిధ స్థాయి అధికారులు ఉన్నారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా ధర్మసాగర్ తహసీల్దార్ ఆఫీసు కేంద్రంగా జరిగిన వాటికి బాధ్యులుగా అప్పటి తహసీల్దార్ రాజును, మరో ఇద్దరిని జనవరి 24న అక్కడి నుంచి తప్పించారు. పరకాల ఆర్డీఓ కార్యాలయానికి అటాచ్డ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయాలపైన ఇచ్చిన నివేదికల ప్రకారం అందరికీ షోకాజ్లు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇంకా విచారణ జరుగుతున్న సమయంలో పరకాల ఆర్డీఓ కార్యాలయానికి అటాచ్డ్ చేసిన రాజును రెండు నెలలైనా కాకముందే శాయంపేట తహసీల్దార్గా బదిలీ చేశారు. శాయంపేట తహసీల్దార్ కార్యాలయంపైనా స్పెషల్ బ్రాంచ్ అధికారులు విచారిస్తుండగా, అక్కడి తహసీల్దార్ పోరిక హరికృష్ణను బదిలీ చేయడం ఇప్పుడు రెవెన్యూశాఖలో చర్చనీయాంశంగా మారింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్లలో అదుపుతప్పిన అవినీతిని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్ స్వయంగా క్షేత్రస్థాయి విచారణకు ఆదేశించారు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దింపారు. దీంతో ధర్మసాగర్, శాయంపేట తహసీల్దార్ కార్యాలయంతో పాటు పరకాల, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, నర్సంపేట, మహబూబాబాద్, గూడూ రు, కేసముద్రం, మహబూబాబాద్ తదితర తహసీల్దారు కార్యాలయాలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపారు. జయశంకర్ జిల్లా భూపాలపల్లి, ములుగులో రెవెన్యూ సిబ్బందికి తోడు కంప్యూటర్ ఆపరేటర్లు అక్రమాలకు పాల్పడ్డట్లు తేల్చారు. క్షేత్రస్థాయిలో వివిధ పార్టీల లీడర్లు, వారి అనుచరులు, మీసేవ కేంద్రాల నిర్వాహకులు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, మరికొందరు దళారులు కలిసి అక్రమాలకు పాల్పడినట్లుగా 2021 డిసెంబర్లో నిఘావర్గాలు వెల్లడించిన నివేదిక ఆధారంగా జనవరిలో చర్యలు ప్రారంభించారు. ఇంకా విచారణ పూర్తికాకపోగా, మరికొందరిపైనా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో చర్యల్లో భాగంగా లూప్లైన్లకు పంపిన వారికి మళ్లీ పోస్టింగ్లు ఇస్తున్న నేపథ్యంలో కల్యాణలక్ష్మి అక్రమాల కథ కంచికి చేరినట్లేనన్న చర్చ జోరందుకుంది. -
ఇండ్లు కట్టిస్తుండు.. పెండ్లి చేపిస్తుండు
హైదరాబాద్: ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండూ కష్టమైనవే. అలాంటిది ముఖ్యమంత్రి కేసీఆరే ఇండ్లు కట్టిస్తుండు.. పెండ్లి చేపిస్తుండు. ఇప్పటివరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో భాగంగా 10 లక్షల ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.8,421 కోట్లు ఖర్చు చేశాం. ఇగ పెళ్లి చేసుకోవడానికి, ఆ తర్వాత పిల్లల బారసాల చేసుకోవడానికి ఫంక్షన్ హాళ్ల నిర్మాణం కూడా ప్రభుత్వమే నిర్మిస్తోంది’ అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం సనత్నగర్ నియోజకవర్గంలోని బేగంపేట డివిజన్లో రూ.61 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్రావు, వాణీదేవిలతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తొలుత ఎస్పీ రోడ్డులోని ప్యాట్నీ నాలాపై రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వంతెన నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం పాటిగడ్డలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను, ఎస్ఎన్డీపీ కార్యక్రమంలో భాగంగా రూ.45 కోట్లతో చేపట్టనున్న బేగంపేట నాలా అభివృద్ధి పనులను అల్లంతోటబావి, బ్రాహ్మణవాడీలలో ప్రారంభించారు. పాటిగడ్డలో ప్రజలనుద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం నుంచి పని చేయించుకోవడం, ప్రజలకు ముందుండి లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా సనత్నగర్ నుంచే ప్రారంభిస్తున్నామన్నారు. పాటిగడ్డలో ఆర్అండ్బీకి చెందిన 1,200 గజాల స్థలంలో ఇక్కడివారికి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మించాలని తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. ఇక్కడి పేదలు బర్త్ డేలు, వివాహాలు.. ఇలా చిన్నా పెద్దా శుభకార్యాలు చేసుకోవాలంటే వేల రూపాయల కిరాయిలు చెల్లిస్తూ ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇక్కడ చక్కటి ఫంక్షన్ హాల్ నిర్మించాల్సిందిగా తలసాని శ్రీనివాస్యాదవ్ అడిగిన వెంటనే రూ.6 కోట్లు మంజూరు చేశామన్నారు. ఫంక్షన్ హాల్ నిర్మాణం పూర్తి చేసుకుని వచ్చే దసరా నాటికి ప్రారంభించుకుందామని తెలిపారు. నగరంలో ఎక్కడ చూసినా కేసీఆర్ నాయకత్వంలో రహదారులు, మంచినీటి వ్యవస్థలు బాగుపడుతున్నాయని ప్రశంసించారు. కార్యక్రమంలో తలసాని సాయికిరణ్ యాదవ్, కార్పొరేటర్లు టి.మహేశ్వరి శ్రీహరి, కొలను లక్ష్మీబాల్రెడ్డి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్లు అరుణ, తరుణి, శేషుకుమారి, రూప, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేష్కుమార్ యాదవ్, రాజయ్య, శేఖర్ ముదిరాజ్, శ్రీనివాస్గౌడ్, అఖిల్ అహ్మద్ పాల్గొన్నారు. -
50 ఏళ్ల కింద పెళ్లయిన వారికి.. ‘కల్యాణలక్ష్మి’!
సాక్షి, హైదరాబాద్: ఏదైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందాలంటే దరఖాస్తు చేసుకోవాల్సిందే. కానీ అసలు దరఖాస్తు చేయకున్నా.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆర్థిక సాయం రావడం, అదీ ఎప్పుడో 40, 50 ఏళ్ల కింద పెళ్లయిన వృద్ధుల ఖాతాల్లో పడుతుండటం విచిత్రం. ఇందులోనూ కొందరికి రెండు, మూడుసార్లు సొమ్ము జమవుతుండటం గమనార్హం. ►ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలానికి చెందిన శకుంతలబాయి వయసు 67 ఏళ్లు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పదిహేనేళ్ల కిందే పిల్లల పెళ్లిళ్లు జరిగిపోయాయి. కానీ శకుంతల బాయి బ్యాంకు ఖాతాలో రెండుసార్లు కల్యాణలక్ష్మి ఆర్థిక సాయం జమ అయింది. ►సిరికొండ మండలానికే చెందిన 65 ఏళ్ల సుమన్బాయి బ్యాంకు ఖాతాలో అయితే మూడు సార్లు కల్యాణలక్ష్మి నిధులు జమకావడం గమనార్హం. ►ఇచ్చోడ మండలం చించోలికి చెందిన గంగుబాయి వయసు 70 ఏళ్లు. ఆమె భర్త పదేళ్ల క్రితం మరణించాడు. ఆమె బ్యాంకు ఖాతాలోనూ రెండుసార్లు ఆర్థికసాయం నిధులు జమయ్యాయి. పొరపాటు కాదు.. అక్రమాలే! వృద్ధుల ఖాతాల్లో కల్యాణలక్ష్మి సొమ్ములు దఫదఫాలుగా జమకావడం కేవలం సాంకేతిక పొరపాటు కాదని.. నిధులను దారిమళ్లించే అక్రమాలేనని ఆరోపణలు ఉన్నాయి. కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఈ పథకాల సొమ్మును కాజేసేందుకు.. నకిలీ లబ్ధిదారుల పేరిట దరఖాస్తులు చేస్తున్నారని తెలిసింది. వారి ఖాతాల్లో జమ అయిన సొమ్మును ఏదో ఒక కారణం చెప్పి విత్డ్రా చేయించుకుంటున్నారని సమాచారం. అక్రమాలపై ‘నిఘా’.. ఏదీ? సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి నిఘా వ్యవస్థ బలహీనంగా ఉంది.. ముఖ్యంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంలో మరింత గందరగోళం నెలకొందని విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం తొలుత ఈ పథకాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖల ద్వారా అమలు చేసింది. తర్వాత కొత్త విధానాన్ని తెచ్చింది. దరఖాస్తుల స్వీకరణను ఆన్లైన్ చేసింది. దరఖాస్తుల పరిశీలన, మంజూరు ప్రక్రియలో రెవెన్యూ యంత్రాంగం, శాసనసభ్యులకు అధికారం ఇచ్చింది. కేవలం నిధులు విడుదల చేసే బాధ్యతను సంక్షేమశాఖలకు అప్పగించింది. ఇలా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రెండేసి శాఖలు అమలు చేస్తుండడంతో.. అక్రమాలను నివారించే బాధ్యత ఎవరికీ పట్టడం లేదు. కనీసం ఎవరికి ఫిర్యాదు చేయాలన్న దానిపైనా స్పష్టత లేదు. దీనితో మధ్యవర్తులు, అవినీతి ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.2వేల కోట్ల మేర ఈ పథకాలకు ఖర్చు చేస్తున్నా.. నిఘా వ్యవస్థపై ఇప్పటికీ దృష్టిసారించకపోవడం గమనార్హం. అర్హత నిర్ధారణలో జాప్యం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తుల పరిశీలనలో మూడు దశలు ఉంటాయి. ముందుగా ఆన్లైన్లో నమోదైన దరఖాస్తు తహసీల్దార్ లాగిన్కు చేరుతుంది. తహసీల్దార్ ఆ దరఖాస్తును తెరిచి పరిశీలిస్తారు. తర్వాత రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయి విచారణ చేపట్టి అర్హతలను నిర్ధారిస్తారు. తర్వాత ఆ దరఖాస్తు ఎమ్మెల్యేకు చేరుతుంది. అక్కడ ఆమోదం పొందాక.. రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) వద్దకు చేరుతుంది. ఆర్డీవో అర్హత నిర్ధారించి పథకాన్ని మంజూరు చేస్తారు. తర్వాత నిధులు విడుదలవుతాయి. అయితే రెవెన్యూ అధికారులపై పనిభారం కారణంగా.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరుగుతోంది. ఎమ్మెల్యే, ఆర్డీవో స్థాయిల్లోనూ నెలల తరబడి పరిశీలనకు నోచుకోవడం లేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,09,027 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో సగానికిపైగా దరఖాస్తులు గత ఏడాది లబ్ధిదారులకు సంబంధించినవే.. ఈ ఏడాదికి క్యారీ ఫార్వార్డ్ అయినవి. పెళ్లయి నెలలు గడుస్తున్నా.. సొమ్ము రావట్లే.. ఆడబిడ్డ పెళ్లి నాటికే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ఆర్థిక సాయం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ ఎక్కడా ఈ లక్ష్యం నెరవేరడం లేదు. పెళ్లయిన నెలరోజులకు సాయం అందినా కాస్త ఊరట దక్కుతుందని.. కానీ నెలలు గడుస్తున్నా ఆర్థిక సాయం అందడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. కొందరైతే ఏడాది దాటినా తమకు సాయం అందలేదంటూ సంబంధిత అధికారులను సంప్రదిస్తున్నారు. దరఖాస్తుల పరిశీలన నుంచి నిధుల విడుదల దాకా తీవ్ర జాప్యం జరుగుతుండటమే దీనికి కారణమని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు ఏటా సగటున 1.5 లక్షల నుంచి 2 లక్షల దరఖాస్తులు వస్తున్నాయి. బడ్జెట్లో ప్రభుత్వం ఈమేరకు నిధులు కేటాయిస్తున్నా.. విడుదలలో జాప్యం జరుగుతోంది. సదరు ఆర్థిక సంవత్సరం ముగిసినా బిల్లులు క్లియర్ కావడం లేదు. వాటిని మరుసటి ఏడాదికి క్యారీ ఫార్వర్ చేస్తుండడంతో.. బడ్జెట్ కేటాయింపులు సరిపోని పరిస్థితి ఎదురవుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లక్షకుపైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టు సంక్షేమశాఖల గణాంకాలు చెప్తున్నాయి. బడ్జెట్ లేకపోవడంతో వాటిని వివిధ దశల్లో ఆపినట్టు సమాచారం. వివిధ స్థాయిల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు కేటగిరీ తహసీల్దార్ ఎమ్మెల్యే ఆర్డీవో ఎస్సీ 6,082 3,831 5,665 ఎస్టీ 4,665 2,663 10,013 బీసీ 16,458 10,481 13,584 ఈబీసీ 1,905 1,031 1,671 మైనార్టీ 5,034 3,173 22,771 మొత్తం 34,144 21,179 53,704 విజిలెన్స్ గుర్తించినా చర్యలేవీ? కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్టు విజిలెన్స్ విభాగం గతంలోనే గుర్తించింది. వరంగల్, హన్మకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నల్గొండ, నిజామాబాద్, సూర్యాపేట, ఆదిలాబాద్, నాగర్కర్నూల్ జిల్లాల్లో విజిలెన్స్ విభాగం అధికారులు చేపట్టిన విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. రెవెన్యూ శాఖలో తహసీల్దార్లు మొదలు డిప్యూటీ తహసీల్ధార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, గ్రామ రెవెన్యూ సహాయకుల దాకా వసూళ్లకు తెగబడుతున్నట్టు తేల్చింది. కొన్నిచోట్ల గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లు, రాజకీయ పార్టీల నాయకులు మధ్యవర్తులుగా, ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించింది. ఈ అంశంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు కూడా చేసింది. దీనిపై స్పందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కూడా. కానీ ఇప్పటివరకు అడుగు ముందుకు పడలేదు. మ్యాన్యువల్ వ్యవహారానికి చెక్ పెడితేనే.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను పారదర్శకంగా అమలు చేసేందుకే ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. దానిని పక్కాగా అమలు చేస్తేనే అక్రమాలకు చెక్పడుతుందని లబ్ధిదారులు అంటున్నారు. వసూళ్ల కోసమే మధ్యవర్తులు, అధికారులు మ్యాన్యువల్ దరఖాస్తుల వ్యవహారాన్ని నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాము ముందుండి దరఖాస్తులను ప్రాసెస్ చేయిస్తున్నట్టు వ్యవహరించడం, తప్పులు ఉన్నాయని, సరిచేయడానికి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడం సులువు అవుతోందని అంటున్నారు. మ్యాన్యువల్గా దరఖాస్తులు తీసుకోవద్దని అధికారులకు గట్టి ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనివల్ల అక్రమాలకు చెక్పడటంతోపాటు పారదర్శకత పెరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. పెళ్లయి నెలలు గడుస్తున్నా.. సొమ్ము రావట్లే.. ఆడబిడ్డ పెళ్లి నాటికే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ఆర్థిక సాయం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ ఎక్కడా ఈ లక్ష్యం నెరవేరడం లేదు. పెళ్లయిన నెలరోజులకు సాయం అందినా కాస్త ఊరట దక్కుతుందని.. కానీ నెలలు గడుస్తున్నా ఆర్థిక సాయం అందడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. కొందరైతే ఏడాది దాటినా తమకు సాయం అందలేదంటూ సంబంధిత అధికారులను సంప్రదిస్తున్నారు. దరఖాస్తుల పరిశీలన నుంచి నిధుల విడుదల దాకా తీవ్ర జాప్యం జరుగుతుండటమే దీనికి కారణమని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు ఏటా సగటున 1.5 లక్షల నుంచి 2 లక్షల దరఖాస్తులు వస్తున్నాయి. బడ్జెట్లో ప్రభుత్వం ఈమేరకు నిధులు కేటాయిస్తున్నా.. విడుదలలో జాప్యం జరుగుతోంది. సదరు ఆర్థిక సంవత్సరం ముగిసినా బిల్లులు క్లియర్ కావడం లేదు. వాటిని మరుసటి ఏడాదికి క్యారీ ఫార్వర్ చేస్తుండడంతో.. బడ్జెట్ కేటాయింపులు సరిపోని పరిస్థితి ఎదురవుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లక్షకుపైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టు సంక్షేమశాఖల గణాంకాలు చెప్తున్నాయి. బడ్జెట్ లేకపోవడంతో వాటిని వివిధ దశల్లో ఆపినట్టు సమాచారం. దరఖాస్తుకు ఏమేం కావాలి? దరఖాస్తుదారులు ఈపాస్ వెబ్సైట్లో నేరుగాగానీ, మీసేవ కేంద్రాల ద్వారాగానీ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అందులో పెళ్లికూతురు వివరాలు, ఆధార్ కార్డు, కులధ్రువీకరణ పత్రం, వివాహ ధ్రువీకరణ పత్రం, పెళ్లికార్డు, పెళ్లి జరిగిన రుజువులతో కూడిన ఫొటో, తల్లి బ్యాంకు ఖాతా నంబర్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. మ్యాన్యువల్గా ఈ దరఖాస్తును, ఆధారాలను తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాల్సిన అవసరం లేదు. త్వరగా అందితేనే సాయానికి విలువ పేద కుటుంబాలను ఆదుకోవడానికే ప్రభుత్వం కల్యాణలక్షి్మ, షాదీ ముబారక్ పథకాలను తెచి్చంది. ఆడపిల్ల పెళ్లి నాటికి ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండాలనే లక్ష్యం నీరుగారిపోతోంది. పెళ్లి రోజే సాయం చేస్తామని ప్రకటించినా.. ఆరు నెలలు, ఏడాది దాకా కూడా ఆర్థిక సాయం అందడం లేదు. ఇది ఈ పథకాల స్ఫూర్తికే విరుద్ధం. ఈ పథకాలకు సకాలంలో నిధులు ఇవ్వకపోవడం సరికాదు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు అడ్వాన్స్గా నిధులు ఉంచి గ్రీన్ చానెల్ ద్వారా పంపిణీ చేయాలి. బకాయిలు ఉండకుండా చూడాలి. కనీసం దరఖాస్తు చేసుకున్న నెలరోజుల్లోగా పరిష్కరిస్తే పేదింటికి లాభం జరుగుతుంది. – రమ్య, కార్యనిర్వాహక అధ్యక్షురాలు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం -
కళ్యాణలక్ష్మి: కాసులిస్తేనే.. ‘కానుక’!
పేదింటి ఆడబిడ్డల పెళ్లి ఆ కుటుంబాలకు భారం కాకూడదన్న ఉదాత్త లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమల్లోకి తెచ్చింది. వీటిని పారదర్శకంగా అమలు చేసేందుకు ఆన్లైన్ విధానాన్నీ ప్రవేశపెట్టింది. కానీ కొందరు అధికారులు, సిబ్బంది మాత్రం ఆడబిడ్డలకు అందే ఆర్థికసాయంలోనూ కక్కుర్తిపడుతున్నారు. చేయి తడిపితేనే పనవుతుందంటూ వసూళ్లకు తెగబడుతున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల దాకా కమీషన్ల రూపంలో దండుకుంటున్నారు. ఈ వ్యవహారంలో కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు దళారులుగా మారి కమీషన్లు తీసుకుంటున్నారు. ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో ఇలాంటి వాస్తవాలెన్నో బయటపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉందని వెల్లడైంది. దీనిపై ప్రత్యేక కథనం. -చిలుకూరి అయ్యప్ప నల్గొండ జిల్లా నిడమనూరుకు చెందిన శ్రీలత (పేరుమార్చాం) కల్యాణలక్ష్మి పథకం కోసం మీసేవ కేంద్రంలో రూ.150 చెల్లించి దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తు ప్రింటవుట్తోపాటు ఇతర ఆధారాలు, జిరాక్సు పత్రాలతో కూడిన ఫైల్ను మండల కార్యాలయంలో సమర్పించాలని సదరు మీసేవ నిర్వాహకుడు సూచించాడు. అదే తనకు రూ.500 ఇస్తే ఫైల్ను నేరుగా సంబంధిత అధికారులకు చేరుస్తానని.. మీరు వెళితే జాప్యం అవుతుందని చెప్పాడు. దీనితో శ్రీలత సదరు మీసేవ నిర్వాహకుడికి రూ.500 ఇచ్చింది. తర్వాత ఒకరిద్దరు మధ్యవర్తులు శ్రీలత తల్లిదండ్రులను సంప్రదించారు. తహసీల్దార్ ఆఫీసులో పనిత్వరగా కావాలన్నా, దరఖాస్తు ఆమోదం పొందాలన్నా రూ.5వేలు ఖర్చవుతుందని గాలం వేశారు. చేసేదేమీ లేక శ్రీలత తల్లిదండ్రులు డబ్బులు కట్టారు. తర్వాత పరిశీలన, విచారణ వారం, పదిరోజుల్లో పూర్తయ్యాయి. కొద్దిరోజుల తర్వాత చెక్కు జారీ అయిందని, దానికి రూ.2 వేలు ఖర్చవుతుందని మధ్యవర్తులు మళ్లీ ఫోన్ చేశారు. డబ్బులు చెల్లించాక కొద్దిరోజులకు కల్యాణలక్ష్మి సొమ్ము చేతికి అందింది. నిజామాబాద్ జిల్లా భీంగల్కు చెందిన షాహీన్ (పేరుమార్చాం) షాదీ ముబారక్ పథకం కింద మీసేవ కేంద్రంలో దరఖాస్తు సమర్పించింది. తర్వాత షాహీన్ తల్లి సదరు దరఖాస్తు, ఇతర ఆధారాలను స్థానిక ప్రజాప్రతినిధి భర్తకు ఇచ్చి ఆర్థిక సాయం త్వరగా వచ్చేలా చూడాలని కోరింది. ఆయన మున్సిపల్ అధికారులు, ఆర్డీవో కార్యాలయంలోని అధికారులకు ‘చెయ్యి తడిపితే’నే పనవుతుందంటూ రూ.10 వేలు వసూలు చేశాడు. కొద్దిరోజుల తర్వాత దరఖాస్తు పరిశీలన, క్షేత్రస్థాయి విచారణ పూర్తయ్యాయని చెప్పాడు. దాదాపు ఆరేడు నెలల తర్వాత షాదీముబారక్ నగదు బ్యాంకు ఖాతాలో జమ అయింది. పేదింటి ఆడపిల్లల పెళ్లి కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయంలోనూ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధుల కాసుల కక్కుర్తికి ఈ రెండూ చిన్న ఉదాహరణలు. అక్కడ ఇక్కడ అని కాదు.. రాష్ట్రవ్యాప్తంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వం నుంచి నిధులు సరిగా విడుదలకాక లబ్ధిదారులకు సొమ్ము అందడంలో తీవ్రంగా జాప్యం జరుగుతోంది. అప్పోసొప్పో చేసి ఆడపిల్లలకు పెళ్లి చేసిన తల్లిదండ్రులు.. ప్రభుత్వ సాయం ఎప్పుడు అందుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ వ్యవహారంపై బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులను సంప్రదించగా సరిగా స్పందించలేదు. నిధులు త్వరలోనే విడుదలవుతాయని, లబ్ధిదారులందరికీ సాయం జమ అవుతుందని మాత్రం పేర్కొన్నారు. అందిన చోటల్లా వసూళ్లే.. అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో వసూళ్లకు తెగబడుతున్నారు. ఆన్లైన్లో దరఖాస్తుల నుంచి.. పత్రాల సమర్పణ, పరిశీలన, విచారణ, చెక్కుల మంజూరు దాకా.. ఒక్కోదశలో ఒక్కొక్కరు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. చాలాచోట్ల దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాక నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వకుండా.. స్థానిక ప్రజాప్రతినిధులను ఆశ్రయించాల్సి వస్తోంది. నేరుగా వెళితే పథకం సొమ్ము రాదంటూ దరఖాస్తుదారులను భయపెడుతుండటమే దీనికి కారణం. స్థానిక ప్రజాప్రతినిధులు తమవద్దకు వచ్చినవారి దరఖాస్తులను సంబంధిత కార్యాలయానికి పంపుతున్నారు. తర్వాత ఫైళ్ల పరిశీలన, క్షేత్రస్థాయి విచారణ, మంజూరు సమయంలో అధికారులు, సిబ్బందికి ఇవ్వాలంటూ.. లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని.. ఎవరివాటా వారికి ఇచ్చి, తామూ కొంత తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా ఒక్కో దరఖాస్తుదారు వద్ద రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఒక్కచోటే 86లక్షలుమింగేశారు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంగా విజిలెన్స్ అధికారులు చేసిన పరిశీలనలో దిమ్మతిరిగే అంశాలను గుర్తించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తుల పరిశీలన, ప్రాసెసింగ్ విషయంలో.. ఆదిలాబాద్ రెవెన్యూ డివిజినల్ అధికారి (ఆర్డీవో) కార్యాలయంలోని ఒక సీనియర్ అసిస్టెంట్ ఏకంగా రూ.86,09,976 దారి మళ్లించినట్టు గుర్తించారు. దీనిపై గుడిహత్నూర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి.. సదరు సీనియర్ అసిస్టెంట్ను అరెస్టు చేశారు. ఇది కేవలం ఒక్క ఆదిలాబాద్ ఆర్డీవో కార్యాలయంలో జరిగిన అక్రమాల లెక్క మాత్రమే. వరంగల్, హన్మకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, నాగర్కర్నూల్, నిజామాబాద్ జిల్లాల్లోనూ ఈ తరహా అక్రమాలు భారీగా చోటు చేసుకున్నట్టు విజిలెన్స్ వర్గాలు చెప్తున్నాయి. వివాహ ధ్రువీకరణ పత్రం జారీలోనూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులకు కులధ్రువీకరణ పత్రంతోపాటు వివాహ ధ్రువీకరణ పత్రాన్ని కూడా జత చేయాలి. కుల ధ్రువీకరణ పత్రం జారీ సాధారణంగానే జరుగుతున్నా.. వివాహ ధ్రువీకరణ పత్రం కోసం వసూళ్లు సాగుతున్నాయి. స్థానిక సంస్థలు, సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు కులధ్రువీకరణ పత్రం జారీ చేయడానికి వీలుంది. అయితే 95 శాతం మంది స్థానిక సంస్థల నుంచే పత్రాలను తీసుకుంటున్నారు. పంచాయతీల పరిధిలో కార్యదర్శి, మున్సిపాలిటీల పరిధిలో కమిషనర్లు వాటిని జారీ చేస్తున్నారు. ఈ సమయంలో రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నట్టు జనాలు చెప్తున్నారు. ఆన్లైన్.. పేరుకే.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తి పారదర్శకతతో అమలు చేసేందుకు ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. అర్హత ఉన్న లబ్ధిదారులు ఈపాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు సమర్పించవచ్చు. దానిపై అవగాహన లేనివారు సమీపంలోని మీసేవ కేంద్రంలో సర్వీసు చార్జీలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తుతోపాటు ఆధారాలను స్కాన్చేసి అప్లోడ్ చేయాలి. కానీ చాలాచోట్ల మ్యాన్యువల్గా సమర్పించిన దరఖాస్తులనే అధికారులు, సిబ్బంది పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసి.. మ్యాన్యువల్గా సమర్పించని వారి అర్జీలను నిర్దేశించిన గడువు తర్వాత తిరస్కరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మ్యాన్యువల్గా పత్రాల సమర్పణపై ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వకున్నా.. రెవెన్యూ అధికారులు, పరిశీలన సిబ్బంది అత్యుత్సాహం తీవ్ర గందరగోళానికి దారితీస్తోందని దరఖాస్తుదారులు వాపోతున్నారు. -
‘ఎన్ని కష్టాలెదురైనా.. ప్రజా ఆశీర్వాదంతో ముందుకు సాగుతాం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, ప్రజా ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి సాధించేందుకు ముందుకు సాగుతున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో రూ.1 కోటి 88 లక్షలతో నిర్మించనున్న నూతన గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా స్థానిక కుంట్ల రాంరెడ్డి గార్డెన్లో జరిగిన షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా రూ. 3కోట్ల 49 లక్షల రూపాయల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ రాష్ట్ర చైర్మన్ ఆయాచితం శ్రీధర్, జిల్లా చైర్మన్ పాండురంగారెడ్డి, హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రసంగిస్తూ.. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని, కోట్లాది రూపాయలను వెచ్చించి ప్రజా సంక్షేమాన్ని చేపడుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల 4 వేల 70 మందికి కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ చెక్కులను అందించిందని పేర్కొన్నారు. మొదటి విడతగా 6వేల కోట్లు, రెండో విడతగా 2వేల కోట్లు మొత్తం 8వేల కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. పాలనలో తెలంగాణ రాష్ట్రం భారత దేశానికి ఆదర్శం అని అన్నారు. -
కల్యాణ లక్ష్మి డబ్బుల కోసం వీఆర్వో కక్కుర్తి
సాక్షి, నల్లబెల్లి(వరంగల్): నిరుపేద కుటుంబాల్లో యువతుల వివాహానికి ప్రభుత్వం అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి పథకం దరఖాస్తు ఆమోదించేందుకు లంచం డిమాండ్ చేసిన వీఆర్వోను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు యువతి తండ్రి నుంచి రూ.3వేలు తీసుకుంటున్న వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని మేడపల్లి వీఆర్వో ఐలయ్య సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. వివరాలు.. విచారణ నివేదిక కోసం.. మేడపల్లి గ్రామానికి చెందిన దేవరాజు పద్మ – ఏకాంబ్రం దంపతుల కుమార్తె మౌనిక వివాహాన్ని ఈ ఏడాది జనవరి 6న జరిపించారు. ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి పథకం కోసం ఏకాంబ్రం మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసి పత్రాలను ఫిబ్రవరి 13న వీఆర్వో ఐలయ్యకు అందించాడు. అయితే, విచారణ నివేదికను పూర్తి చేసేందుకు వీఆర్వో ఐలయ్య రూ.10 వేలు లంచం డిమాండ్ చేయగా అంత మొత్తం ఇవ్వలేనని చెప్పడంతో రూ.5వేలైనా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశాడు. ఈమేరకు మొత్తాన్ని చెక్కు వచ్చాక ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకొన్నాడు. గత నెల 25న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారురాలి తల్లి పద్మ చెక్కు తీసుకున్నప్పటి నుంచి వీఆర్వో ఐలయ్య రూ.5వేల కోసం వేధిస్తుండగా, ఏకాంబ్రం తమ వద్ద డబ్బు లేదని చెప్పాడు. రూ.3వేలైనా ఇవ్వాలని తేల్చిచెప్పడంతో ఏకాంబ్రం శుక్రవారం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ డీఎస్పీ మధుసూదన్, సీఐలు క్రాంతికుమార్, శ్యాంసుందర్ రంగంలోకి దిగి ఏకాంబ్రం నివాసం ఉంటున్న నర్సంపేట మండలం రాజుపేటలో సోమవారం మాటు వేశారు. అక్కడకు వచ్చిన వీఆర్వో ఐలయ్య రూ.3 వేలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. అనంతరం ఆయనను నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి రికార్డులు పరిశీలించారు. అనంతరం డీఏస్పీ మధుసూదన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే 94404 46146 నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. దీంతో చైల్డ్లైన్ ప్రతినిధులు బాలిక, బాలుడితో పాటు వారి తల్లిదండ్రులపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చదవండి: ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్: సీఎం జగన్ -
వెనకబడిన తరగతులకు వెయ్యిన్నర కోట్లు పెరుగుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ వెనుకబడిన తరగతులకు కాస్త ఊరటనిచ్చింది. గత రెండేళ్లుగా అరకొర నిధులతో సరిపెట్టిన ప్రభుత్వం 2021–22 బడ్జెట్ కేటాయింపుల్లో కాస్త ప్రాధాన్యతనిచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బీసీ సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వం రూ.5,522.09 కోట్లు ఖర్చు చేయనుంది. ఈమేరకు బడ్జెట్లో కేటాయింపులు చేసింది. 2020–21 వార్షిక బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే 2021–22 వార్షిక బడ్జెట్లో రూ.1,618.51 కోట్లు అధికంగా కేటాయించింది. దీంతో బీసీ సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాలకు ఊపిరి అందించినట్లయింది. కార్పొరేషన్లకు చేయూత.. ఫెడరేషన్లకు రిక్తహస్తం.. వెనుకబడిన తరగతుల ఆర్థిక సహకార సంస్థ, అత్యంత వెనుకబడిన తరగతుల ఆర్థిక సహకార సంస్థలకు తాజా బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించారు. ఇందులో బీసీ కార్పొరేషన్కు రూ.500 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్కు రూ.500 కోట్లు దక్కాయి. ఈమేరకు నిధులు కేటాయించడంతో 2021–22 సంవత్సరంలో ఈ రెండు విభాగాల ద్వారా పథకాలను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సైతం అమలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ కులాలకు సంబంధించిన ఫెడరేషన్లకు మాత్రం ఈసారి బడ్జెట్లో నిధులు దక్కలేదు. కేవలం నిర్వహణ నిధులతో సరిపెట్టిన ప్రభుత్వం.. ప్రగతి పద్దులో మాత్రం ఎలాంటి కేటాయింపులు జరపకపోవడం గమనార్హం. కల్యాణలక్ష్మికి రూ.500 కోట్లు అదనం.. 2021–22 సంవత్సరంలో కల్యాణలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించింది. 2020–21 బడ్జెట్లో కల్యాణ లక్ష్మి కింద రూ.1,350 కోట్లు కేటాయించగా.. ఈ సారి ఆ మొత్తాన్ని రూ.1,850 కోట్లకు పెంచింది. క్షేత్రస్థాయి నుంచి బీసీ వర్గాల నుంచి దరఖాస్తుల సంఖ్య పెరగడం, లబ్ధిదారుల సంఖ్య కూడా భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేటాయింపులు చాలడం లేదు. ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ పరిధిలో దాదాపు 40 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే తాజా బడ్జెట్లో రూ.500 కోట్లు అదనంగా కేటాయించడంతో బకాయిలన్నీ పరిష్కరించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే 2021–22 ఏడాదిలో కల్యాణలక్ష్మి పథకాన్ని బకాయిలు లేకుండా అమలు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2021–22 వార్షిక బడ్జెట్లో ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖలకు పెద్దపీట వేసింది. ఈ రెండు శాఖల ద్వారా కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు సైతం అమలవుతుండగా.. వాటికి సరిపడా కేటాయింపులు చేస్తూనే మరిన్ని పథకాల అమలుకు నిధులు కేటాయించింది. వచ్చే సంవత్సరంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా రూ.5,587.97 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రూ.3,056.12 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఇక మైనార్టీ సంక్షేమ శాఖకు కూడా కేటాయింపులు కాస్త పెరిగాయి. 2020–21 వార్షికంలో రూ.1,138.45 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి రూ.1,606.39 కోట్లు కేటాయించింది. -
బోగస్ పెళ్లిళ్లు 90!
ఆదిలాబాద్ అర్బన్: జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కల్యాణలక్ష్మి స్కాంలో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు మూడేళ్లుగా వచ్చిన కల్యాణలక్ష్మి దరఖాస్తులను పరిశీలించిన తహసీల్దార్లు 90 పెళ్లిళ్లకు సంబంధించిన దరఖాస్తులు బోగస్గా ఉన్నాయని గుర్తించారు. ఒకసారి కల్యాణలక్ష్మి డబ్బులు తీసుకోగా మళ్లీ అవే ఫొటోలతో రెండోసారి దరఖాస్తు చేసినట్లుగా పరిశీలనలో తేలింది. మావల మండలానికి చెందిన మూడు బోగస్ దరఖాస్తులకు సంబంధించి డబ్బుల రికవరీ చేయగా, నాలుగు మండలాల పరిధిలోని 87 బోగస్ పెళ్లిళ్లకు సంబంధించి డ బ్బులు రికవరీ చేసే పనిలో అధికారులు నిగమ్నమయ్యారు. బోగస్ లబ్ధిదారులు, మధ్యవర్తుల బ్యాంకు ఖాతాలను నిలిపివేయాలని కలెక్టర్ ఇది వరకే ఎల్డీఎంను ఆదేశించారు. అయితే బోగస్దారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు అలానే ఉన్నాయా? లేక డ్రా చేశారా? డ్రా చేస్తే ఆ డబ్బులు ఎలా.. ఎప్పుడు రికవరీ చేయాలనే దానిపై అధికారులు సమాలోచన చేసి ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో యంత్రాంగం తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. (చదవండి: చిచ్చురేపిన క్రికెట్.. కాల్పుల కలకలం) ఈ ఏడాదిలోనే జరిగిందా? రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను 2016లో ప్రారంభించి మొదట రూ.50,116 ఆడపిల్లల పెళ్లిళ్లకు సాయంగా అందించింది. దానిని 2018 ఏప్రిల్లో రూ.1,00,116కు పెంచింది. ఏటా వేల సంఖ్యలో వివాహాలు జరగడం, పథకానికి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడం లాంటివి జరుగుతున్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా.. మూడు సెట్ల జిరాక్స్ కాపీలను తహసీల్ కార్యాలయంలో అందజేయడం తప్పనిసరి. కాని అలా జరగలేదు. అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్న వారి దరఖాస్తులు మాత్రమే మ్యానువల్గా తహసీల్ ఆఫీసులకు అందాయి. బోగస్ పెళ్లిళ్లకు సంబంధించిన మ్యానువల్ దరఖాస్తులు తహసీల్దార్ల కార్యాలయాలకు రాలేదని అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఆన్లైన్ను ఆసరాగా చేసుకొని కొందరు అక్రమార్కులు తమకు అనుకూలమైన వ్యక్తుల ఫొటోలు, బ్యాంకు ఖాతాలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జతచేసి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా సంబంధిత మండల తహసీల్దార్ల లాగిన్ నుంచి నేరుగా ఆర్డీవో కార్యాలయానికి పంపుతూ వచ్చారు. ఒకసారి కల్యాణలక్ష్మి డబ్బులు పొందిన లబ్ధిదారుల ఫొటోలు మళ్లీ పెట్టి తల్లిదండ్రుల పేర్లు, బ్యాంకు ఖాతా, ధృవీకరణ పత్రాలు మార్చి రెండోసారి కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసినట్లుగా అధికారులు గుర్తించారు. 2019లో పెళ్లి జరిగినట్లుగా దరఖాస్తులో పొందుపర్చి డబ్బులు ఈ ఏడాదిలో దండుకున్నట్లు విచారణలో తేలినట్లుగా సమాచారం. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కాలంలోనే బోగస్ పెళ్లిళ్లకు చెందిన బిల్లులు ఎక్కువ పాసయ్యాయని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, తహసీల్దార్లు లాగిన్, పాస్వర్డ్ను ఎప్పటికప్పుడు మార్చుకునే అవకాశం ఉన్నా.. ఆ సమయంలో చేంజ్ చేద్దామనే ఆలోచన రాకపోవడం గమనార్హం. (చదవండి: అయ్యో.. ఐఫోన్ అందకపాయె..! ) కొనసాగుతున్న విచారణ.. జిల్లాలోని ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో కల్యాణలక్ష్మి పథకానికి వచ్చిన దరఖాస్తుల పరిశీలన ముగిసింది. మూడేళ్లుగా వచ్చిన దరఖాస్తులను నాలుగైదు రోజుల పాటు కుప్పలు తెప్పలుగా పోసి క్షుణ్ణంగా పరిశీలించారు. 90 దరఖాస్తులు బోగస్గా తేలగా, 3 దరఖాస్తుల డబ్బులు రికవరీ చేశారు. మిగతా 87 దరఖాస్తులకు సంబంధించిన లబ్ధిదారుల నివాస ప్రాంతాలు ఉట్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, బజార్హత్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ మండలాల్లో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అయితే బోథ్, నేరడిగొండ, బజార్హత్నూర్, గుడిహత్నూర్, మావల మండలాల తహసీల్దార్ల లాగిన్ల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానంగా ఎవరు దరఖాస్తుదారు, చెక్ ఎవరి పేరిట మంజూరైంది? బ్యాంకు ఖాతా.. పెళ్లికి సంబంధించిన పత్రాలు, ఫొటో, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, తదితరవి వాటిపై ఆయా మండల కార్యాలయాల్లో విచారణ జరుగుతోంది. బోగస్గా గుర్తించినవి సరైనవేనా.? అనేది తెలుసుకునేందుకు క్షేత్రస్థాయికి వెళ్లి విచారిస్తున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. విచారణ ముగిశాక ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెబుతున్నారు. విచారణ జరుగుతోంది కలెక్టర్ ఆదేశాల మేరకు దరఖాస్తులు పరిశీలించి బోగస్గా 90 దరఖాస్తులు గుర్తించాం. ఇందులో మూడు దరఖాస్తులకు చెందిన డబ్బులు రికవరీ అయ్యాయి. మిగతా 87 దరఖాస్తులపై విచారణ జరుగుతోంది. పూర్తి చేసేందుకు కొంత సమయం పడుతుంది. అనంతరం రికవరీ చేస్తాం. – జాడి రాజేశ్వర్, ఆదిలాబాద్ ఆర్డీవో -
మోక్షమెప్పుడో..?
పాల్వంచకు చెందిన షేక్ ఆలియాకు 2019 ఏప్రిల్ 28న వివాహమైంది. ఈమెకు ప్రస్తుతం 10నెలల పాప ఉంది. కానీ ఇప్పటివరకు షాదీముబారక్ చెక్కు ఇవ్వలేదు. ఎన్నిసార్లు తిరిగినా ఫలితంలేదు. నగదు మంజూరై ఆర్డీవో పీడీ ఖాతాలో ఉన్నట్లు ఆన్లైన్లో చూపిస్తోంది. సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. చెక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సివస్తోంది. ఈ పథకాల కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ కుటుంబాల్లోని యువతులకు వివాహం చేస్తే ప్రభుత్వం రూ.1,00,116 చొప్పున అందిస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి ట్రెజరీకి, అక్కడి నుంచి ఆర్డీఓ పీడీ(పర్సనల్ డిపాజిట్) ఖాతాకు నిధులొచ్చినా లబ్ధిదారులకు ఇవ్వడం లేదు. పెళ్లయిన నెలరోజుల లోపే చెక్కులు అందించాల్సి ఉండగా, రెండేళ్లు దాటినా అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. కొందరు యువతులకు వివాహమై పిల్లలు జన్మించడంతో పాటు రెండున్నరేళ్లు దాటినప్పటికీ సదరు మొత్తం అందడం లేదు. దీంతో వివాహమై ఇతర జిల్లాలు, ప్రాంతాలకు వెళ్లిన యువతులు ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్లుగా జాప్యం.. జిల్లాలో 2019–20 సంవత్సరంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు 5,661 మంది దరఖాస్తు చేసుకోగా, 174 దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలిన 5,487 మందికి సంబంధించిన నగదు ట్రెజరీ ద్వారా ఆర్డీఓ పీడీ ఖాతాకు చేరింది. ఇందులో సుమారు 450 మందికి మాత్రం నెలల తరబడి, కొందరికి ఏడాది, మరికొందరికి ఏడాదిన్నర పైబడినప్పటికీ చెక్కులు అందించకుండా జాప్యం చేస్తున్నారు. 2020–21లో 1,909 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో తహసీల్దార్ల వద్ద 283, ఎమ్మెల్యేల వద్ద 193 పెండింగ్లో ఉన్నాయి. 3 దరఖాస్తులను తిరస్కరించారు. 1,430 ఎమ్మెల్యేల వద్ద అప్రూవల్ అయి ఉన్నాయి. వీటికి సంబంధించిన నగదు ఆర్డీవో పీడీ ఖాతాలో జమ కాలేదు. 2020–21లో కోవిడ్–19 కారణంగా ఆలస్యమైనా, 2019–20కి సంబంధించిన చెక్కులు అందకపోవడంతో లబ్ధిదారులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. 2017, 2018 వివాహమైన యువతుల్లో కొందరికి ఇప్పటికీ చెక్కులు రాలేదు. ఎమ్మెల్యేల చేతుల మీదుగా చెక్కులు ఇచ్చేందుకే జాప్యమా..? కల్యాణలక్ష్మి, షాదీముబారక్ 2015లో ప్రారంభం కాగా, మొదట్లో నేరుగా సదరు యువతి ఖాతాలో జమ అయ్యేవి. తర్వాత కాలంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చెక్కుల రూపంలో పంపిణీ చేయిస్తున్నారు. ప్రస్తుతం పలువురు లబ్ధిదారులకు సంబంధించి నగదు మంజూరై ట్రెజరీ నుంచి ఆర్డీవో పీడీ ఖాతాలోకి వచ్చినట్లు ఆన్లైన్లోనూ చూపిస్తోంది. బ్యాంకర్లు చెక్కులు ఇవ్వడంలేదనే కారణంతో వీటి పంపిణీ ఆలస్యం చేస్తున్నారు. కోవిడ్–19 సమయంలో ఎక్కువమంది గుమిగూడే అవకాశం లేనందున నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయడమో లేక వారికి నేరుగా ఇచ్చే అవకాశముంది. కానీ ఎమ్మెల్యేల చేతుల మీదుగా పంపిణీ చేసేందుకే తాత్సారం చేస్తున్నారని, ఇదంతా ఎమ్మెల్యేల ప్రచార కండూతి కోసమేననే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై ఆర్డీవో కనకం స్వర్ణలతను వివరణ కోరగా... కోవిడ్–19 కారణంగా ఆలస్యమవుతోందని తెలిపారు. మరోవైపు మంజూరైనవాటికి సంబంధించి బ్యాంకర్లు చెక్కులు ఇవ్వడంలో జాప్యం కావడంతో పంపిణీ చేయలేదన్నారు. -
కళ్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
-
‘పెళ్లి’కి నిధుల్లేవ్!
‘నగరంలోని వారాసిగూడకు చెందిన ఖాజాబీ సరిగ్గా నాలుగేళ్ల కిందట షాదీ ముబారక్ పథకం కింద ఆర్థిక చేయూత కోసం దరఖాస్తు చేసుకుంది. ఇప్పటి వరకు ఆర్థిక సహాయం అందలేదు. దీంతో ఈ నెల మొదటి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఆర్థిక సహాయం ఇప్పించాలని జాయింట్ కలెక్టర్ రవికి మొర పెట్టుకుంది. దీనిపై స్పందించిన జేసీ అక్కడే ఉన్న జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారిని పరిశీలించాలని ఆదేశించారు’’ ఇదొక ఖాజాబీ సమస్య కాదు..పాతబస్తీకి చెందిన ఎందరో ఇలా ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్’ పథకాలను నిర్లక్ష్యం, నిధుల కొరత వెంటాడుతున్నాయి. బడ్జెట్లో కేటాయింపులు ఘనంగా ఉన్నా..నిధుల మంజూరు, విడుదలలో మాత్రం నిర్లక్ష్యం పేదల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వ ఆర్థిక సహాయం అందుతుందని గంపెడు ఆశలతో అప్పోసప్పో చేసి ఆడబిడ్డల పెళ్లిళ్లు చేసిన పేద కుటుంబాలు నిరాశకు గురవుతున్నాయి. రెవెన్యూ శాఖలో ఒకవైపు దరఖాస్తులు కుప్పలు, తెప్పలుగా పెండింగ్లో పడిపోతుండగా..మరోవైపు తహసీల్దారు పరిశీలన పూర్తయి ఎమ్మెల్యే, ఆర్డీవో ఆమోదం పొంది మంజూరుతో ట్రెజరీలకు బిల్లులు వెళ్తున్నా ఆర్థిక సహాయం మాత్రం బ్యాంక్ ఖాతాలో జమ కావడం లేదు. పెళ్లిళ్లు జరిగి పిల్లలు పుట్టినా సాయం మాత్రం అందని దాక్ష్రగా తయారైంది. ఫలితంగా పేద కుటుంబాలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు. గత ఐదేళ్లుగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలకు పేదకుటుంబాల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నా..ఆర్థిక సహాయం అంతంత మాత్రంగా తయారైంది. పథకం ఇలా... ఆర్థికంగా వెనుకబడిన మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన చెందిన..18 ఏళ్లకు పైబడిన ఆడబిడ్డల వివాహాల కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. వార్షిక ఆదాయం పట్టణాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల లోపు ఉన్న ఆడబిడ్డల కుటుంబాలు ఆర్హులు..ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించే బాధ్యతలను రెవెన్యూ శాఖకు ప్రభుత్వం అప్పగించింది. ఆన్లైన్ ద్వారా రిజిష్టర్ అయిన దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రతిపాదనలు స్థానిక ఎమ్మెల్యేలకు రెవెన్యూ శాఖ నివేదిస్తుంది. ఫైనల్గా ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఎంపిక చేపట్టాక..నిధులు మంజూరు చేస్తారు. షాదీ ముబారక్ పరిస్థితి ఇదీ... ♦ హైదరాబాద్ జిల్లా పరిధిలో గతేడాదికి సంబంధించి 5100 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఈ ఏడాది మరో 9120 దరఖాస్తులు వచ్చి చేరాయి. మొత్తం 14220 దరఖాస్తులకు గాను 274 తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం మీద 10,049 దరఖాస్తులకు మంజూరు లభించగా, అందులో సుమారు 4237 దరఖాస్తుల బిల్లులు ట్రెజరీకి పంపకుండా రెవెన్యూ డివిజన్ స్థాయిలో మూలుగుతున్నాయి. ట్రెజరీ పంపిన వాటిలో 54 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. మొత్తం మీద 5758 బిల్లులకు మాత్రమే పీడీ అకౌంట్లలో డిపాజిట్ అయినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ♦ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలో సైతం గతేడాదికి సంబంధించి 671 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా ఈ ఏడాది కొత్తగా 1385 దరఖాస్తులు వచ్చాయి. 19 తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం 1587 దరఖాస్తులకు మంజూరు లభించగా, 606 బిల్లులు ట్రెజరీకు పంపలేదు. 184 బిల్లులు ట్రెజరీ వద్ద పెండింగ్లో ఉండగా, 797 బిల్లులకు సంబందించిన డిపాజిట్ మాత్రమే పీడీ అకౌంట్లలో జమ అయ్యాయి. ♦ రంగారెడి జిల్లా పరిధిలో గతేడాది 1084 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, ఈ ఏడాది కొత్తగా 1770 కుటుంబాలు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. 243 తిరస్కరణకు గురయ్యాయి. 2161 దరఖాస్తులకు మంజూరు లభించింది. 986 దరఖాస్తుల బిల్లులు ట్రెజరీ పంపకుండా పెండింగ్లో ఉండగా, కేవలం 1175 బిల్లులకు మాత్రమే నిధులు పీడీ ఖాతాలో డిపాజిట్ అయ్యాయి. కల్యాణ లక్ష్మి పరిస్థితి ఇదీ.. ♦ హైదరాబాద్ జిల్లా పరిధిలో గతేడాది 355 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, ఈ ఏదాడి ఇప్పటి వరకు కొత్తగా 923 దరఖాస్తులు వచ్చాయి. 30 తిరస్కరణకు గురయ్యాయి. 896 దరఖాస్తులు మంజూరుకు నోచుకోగా, 9 బిల్లులు ట్రెజరీకి పంపకుండా ఆర్డీవో వద్దనే ఉంచారు. ట్రెజరీ వద్ద 95 బిల్లులు పెండింగ్ ఉండగా, కేవలం 799 బిల్లులకు మాత్రమే సొమ్ము డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. ♦ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలో గతేడాది 259 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 926 దరఖాస్తులు వచ్చి చేరాయి. 16 తిరస్కరణకు గురయ్యాయి. 927 దరఖాస్తులు మంజూరుకు నోచుకోగా, 30 బిల్లులు ట్రెజరీకి పంపలేదు. ఇక ట్రెజరీ వద్ద 185 బిల్లులు పెండింగ్లో ఉండగా, 712 బిల్లులకు మాత్రమే సొమ్ము డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. ♦ రంగారెడ్డి జిల్లా పరిధిలో గతేడాది 381 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 1202 దరఖాస్తులు వచ్చి చేరాయి. 33 తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం మీద 1109 దరఖాస్తులు మంజూరుకు నోచుకోగా, 172 బిల్లులు ట్రెజరీకి పంపలేదు. ట్రెజరీ వద్ద 29 బిల్లులు పెండింగ్లో ఉండగా, మొత్తం మీద 908 బిల్లులకు మాత్రమే సొమ్ము డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. -
పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా కల్యాణలక్ష్మీ కోసం..
సాక్షి, నారాయణఖేడ్: నకిలీ ధ్రువపత్రాలతో కల్యాణలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకొని మంజూరు చేయించుకున్న కేసులో శుక్రవారం ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. నారాయణఖేడ్ సీఐ రవీందర్రెడ్డి శుక్రవారం నారాయణఖేడ్ పోలీస్స్టేషన్లో వవరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఖేడ్ మండలం కొండాపూర్ తండాలో కల్యాణలక్ష్మి పథకంలో అవకతవకలు జరిగాయని తండాకు చెందిన రాంచందర్ ద్వారా ఫిర్యాదు స్వీకరించిన ఖేడ్ తహసీల్దార్ అబ్దుల్ రహమాన్ విచారణ జరిపడంతో వాస్తవం బయటపడింది. ఈమేరకు తహసీల్దార్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. తుర్కపల్లి తండాకు చెందిన దేవిదాస్, నెహ్రూనాయక్లకు చాలా ఏళ్ల క్రితం వివాహాలు జరిగాయి. ఈ మధ్యనే వివాహాలు జరిగినట్లు ఫొటోలు, నకిలీ ఆధార్కార్డులు, నివాస, పుట్టిన తేదీ ధ్రువపత్రాలను సృష్టించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి తహసీల్దార్ విచారణ జరపకుండా ధ్రువీకరించడంతో ఇద్దరికి కల్యాణలక్ష్మి పథకం కింద చెరో రూ.1,00,116 మంజూరు అయ్యాయి. లబ్ధిదారుల జాబితాను కొండాపూర్ తండాలో అతికించడంతో ఇద్దరు తమ తండావాసులే కాదని రాంచందర్ అనే వ్యక్తి గుర్తించి తహసీల్దార్కు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు తుర్కపల్లి తండాకు చెందిన దేవిదాస్, నెహ్రూనాయక్, వారి భార్యలు కవిత, తారాబాయి, నెహ్రూనాయక్ అత్త కొండాపూర్ తండాకు చెందిన దేవులీబాయితోపాటు తారాసింగ్పై కేసు నమోదు చేశారు. శుక్రవారం వారిలో దేవిదాస్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. సమావేశంలో ఎస్ఐ సందీప్ పాల్గొన్నారు. -
బినామీ పేరుపై ‘కల్యాణలక్ష్మి’
సాక్షి, ఖానాపూర్: దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్రప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపం.. స్థానిక అధికారుల నిర్లక్ష్యం.. వెరసి పథకం అమలులో చోటు చేసుకుంటున్న లోపాలతో ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుందని పలువురు పేర్కొంటున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తన్పల్లిలో బినామి పేర్లతో కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసిన దళారులు అధికారులతో కుమ్మకై చెక్కును మంజూరు చేయించుకోవడంతో పాటు డబ్బులు స్వాహా చేసేందుకు ప్రయత్నించారనే బలమైన ఆరోపణలు ఇప్పుడు మండలంలో హాట్ టాపిక్గా మారాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాలిలా ఉన్నాయి. నలుగురు మనుషులు లేకున్నా ఉన్నట్లు సృష్టి సత్తన్పల్లి గ్రామంలోని దొమ్మటి రమ–వెంకటేశ్గౌడ్ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కూతురు లేదు. కాని కుటుంబ సభ్యులకు సంబందం లేకుండా గ్రామాలోని ఇద్దరు దళారులు ఆదంపతులకు కూతురు శ్యామల ఉన్నట్లు సృష్టించడంతో పాటు గ్రామంలో అసలే లేని పెళ్లికొడుకు, వారి తల్లిదండ్రులను కల్పితంగా సృష్టించి వివాహ ఆహ్వాన కార్డును ముద్రించారు. ఇరువురికి గ్రామంలోనే గత సంవత్సరం డిసెంబర్ 14న వివాహం జరిగినట్టు సృష్టించి కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేశారు. దీంతో గ్రామానికి చెందిన దొమ్మటి రమ పేరుపై చెక్కు మంజూరైంది. ఈ నెల 4న స్తానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చెక్కుల పంపిణీ సందర్భంగా ఈ తతంగం అధికారుల దృష్టికి వచ్చింది. అధికారులు చెక్కును ఇవ్వకుండా లోలోపల సమస్య సమసిపోయేలా గోప్యత ప్రదర్శించారనే విమర్శలొచ్చాయి. రమ–వెంకటేశ్లు మాత్రం ఇందులో తమ ప్రమేయం ఏమీలేదన్నారు. అధికారుల తీరుపైనే అనుమానం.. గ్రామస్థాయిలోరెవెన్యూ అధికారి, మండల స్థాయిలో గిరిధవార్లు క్షేత్రస్థాయిలో నిర్థారించి ప్రభుత్వానికి సిఫారసు చేస్తే చెక్కు మంజూరవుతుంది. కానీ అధికారులు మాత్రం పోర్జరీ చేసి దరఖాస్తు చేశారని, తమ ప్రమేయం లేదని దాటవేస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్ సత్యనారాయణను వివరణ కోరగా తహసీల్దార్ విజయారెడ్డి ఘటన జరిగినరోజు విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఉన్నతాధికారులకు ఇప్పటికే నివేదిక ఇచ్చామన్నారు. విధుల బహిష్కరణ సందర్భంగా ఇంకా విచారణ జరుపలేదన్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపిన తర్వాత దోషులపై చట్టపరమైన చర్యలకోసం పైఅధికారులకు నివేదిస్తామన్నారు. -
‘కల్యాణ’ కమనీయం ఏదీ.?
సాక్షి, రెబ్బెన(ఆసిఫాబాద్): పేదింటి ఆడబిడ్డల వివాహ సమయంలో ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు లబ్ధిదారుల దరి చేరడం లేదు. పెళ్లి పందిరిలోనే అర్హులైన పేదింటి ఆడపిల్లకు చెక్కులు అందిస్తామన్న ప్రభుత్వం పథకం సాగదీత పథకంగా మారింది. వివాహం జరిగి నెలలు గడుస్తున్నా డబ్బులు చేతికి అందకపోవడంతో ఆడపిల్లల తల్లిదండ్రులు నిరుత్సాహానికి గురవుతున్నారు. పెండింగ్లో వందలాది దరఖాస్తులు.. జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల కోసం గడిచిన ఏడాది నుంచి ఇప్పటి వరకూ 3771 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1361 మందికి డబ్బులు అందజేశారు. మిగిలిన వాటిలో 23 తహసీల్దార్ పరిశీలనలో తిరస్కరణకు గురయ్యాయి. తహసీల్దార్ వెరిఫికేషన్ స్థాయిలో 357 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, ఎమ్మె ల్యే పరిశీలనలో 410, ఎమ్మెల్యే ఆప్రూవల్ అనంతరం మంజూరు స్థాయిలో 1583 ఉన్నారు. ఇటీవల 37 దరఖాస్తుల డబ్బులు మంజూరై ట్రెజ రీలో పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వ ఖజానా నుంచి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలకు నిధులు మంజూరు కాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. నిధుల విడుదలలో తీవ్ర జాప్యం.. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ప్రభుత్వం వివాహ కానుకగా మొదట రూ.51వేలు అందించింది. తర్వాత కానుకను రూ.1,00, 116/– కు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులు మురిసిపోయారు. కాని చెక్కుల మంజూరులో తీవ్ర జా ప్యం జరుగుతుండడంతో నిరాశలో మునిగారు. మరోవైపు ఈ పథకాల దరఖాస్తులు తహసీల్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే వర కూ వివిధ దశల్లో పెండింగ్లో ఉంటున్నాయి. పథకంపై ఆశలు పెట్టుకుని ఆడ పిల్లల పెళ్లిలు పూర్తి చేసిన తల్లిదండ్రులు తెచ్చిన అప్పుకు వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నారు. దీనికి తోడు చెక్కుల కోసం నిత్యం తహసీల్ కార్యాల యం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డబ్బులు మంజూరు చేసి ఆదుకోవాలని కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులు కోరుతున్నారు. కళ్యాణలక్ష్మీ ఆలస్యంతో సరోజ స్పందన రెబ్బెన మండలంలోని గోలేటి పంచాయతీ పరిధి భగత్సింగ్ నగర్. జనరల్ స్టోర్స్ నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గతేడాది డిసెంబర్లో రెండో కూతురుకి వివాహం చేసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి పథకం డబ్బులు వస్తాయనే భరోసాతో అప్పు చేసి మరీ కల్యాణం జరిపించింది. వివాహ అనంతరం పథకం కోసం దరఖాస్తు చేసుకోగా నేటికీ ఒక్క పైసా కూడా రాలేదు. దాదాపు 10 నెలలుగా ఈ కానుక కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమస్య ఒక్క సరోజది మాత్రమే కాదు. జిల్లాలో గతేడాది నుంచి వివాహాలు జరిపిన అర్హులైన ప్రతి తల్లిదండ్రులది. నిధులు మంజూరు కావాల్సి ఉంది జిల్లాలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించి దరఖాస్తులు పెండింగ్లో ఉన్న మాట వాస్తమే. అయితే జిల్లాస్థాయిలో చాలా తక్కువ సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం మంజూరు చేయాల్సిన దరఖాస్తుల సంఖ్యే అత్యధికంగా ఉంది. ఇటీవల 37 మందికి బిల్లులు మంజూరు కాగా లబ్ధిదారుల ఖాతాలో జమయ్యాయి. మిగిలిన వాటి కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపాం. మంజూరు కాగానే లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమవుతాయి. – సిడాం దత్తు, ఆర్డీవో -
‘సాయం’తో సంతోషం..
సాక్షి, కొత్తగూడెం : ఒకప్పుడు ఆడ బిడ్డ పెళ్లి చేయాలంటే ఆ కుటుంబం అప్పులపాలయ్యే పరిస్థితి ఉండేది. దీంతో తల్లిదండ్రులకు కంటినిండా కునుకు పట్టకపోయేది. అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ర్వాత ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల పేరుతో ఆర్థిక సాయం అందిస్తూ నిరుపేద, మధ్య తరగతి కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతోంది. ఆడపిల్ల పెళ్లి భారంగా భావించిన తల్లిదండ్రులకు ఈ పథకం వరంగా మారింది. అమ్మాయిల పెళ్లిళ్లను వైభవంగా జరిపిస్తూ గౌరవ మర్యాదలను నిలుపుకుంటున్నారు. పెళ్లికి వచ్చిన వారికి ఏ లోటూ లేకుండా చూసుకోగలుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆడబిడ్డలకు ఇచ్చే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ మొత్తాన్ని క్రమంగా పెంచుతుండడంతో దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. జిల్లాలో ఈ ఏడాది 5036 దరఖాస్తులు... 2019–20 ఆర్థిక సంవత్సరంలో గడిచిన నాలుగు నెలల్లో జిల్లాలో 5036 మంది కల్యాణలక్ష్మి, షాదీముభారక్ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటివరకు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల స్థాయిలో పరిశీలన జరిపి 2318 మందికి మంజూరు చేశారు. వీటిలో ఇప్పటికే 1649 మందికి పంపిణీ చేశారు. ఇంకా 669 మందికి పంపిణీ చేయాల్సి ఉంది. మరో 2718 మంది దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. రూ.లక్ష దాటిన పథకం లబ్ధి... 2014 అక్టోబర్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాలను ప్రవేశపెట్టింది. మొదట ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రూ.51 వేలు మంజూరు చేశారు. 2017 ఏప్రిల్ 1 నుంచి ఈ మొత్తాన్ని రూ.75,116కు పెంచారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతోపాటు బీసీ, ఈబీసీలకు సైతం పథకాన్ని వర్తింపజేశారు. 2018 ఏప్రిల్ 1 నుంచి రూ.1,00,116కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులకు మాత్రం ఈ పథకం కింద రూ.1, 25,140 లబ్ధి చేకూరేలా ప్రణాళిక రూపొందించింది. అంతేకాక అనాథ ఆడ పిల్లలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది. వీరికి అర్బన్ ప్రాంతంలో అయితే రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు చెల్లిస్తున్నామని, విడాకులు తీసుకుని రెండో వివాహం చేసుకునే మహిళలు గతంలో కల్యాణలక్ష్మి పథకంతో లబ్ధి పొందకుంటే వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని అధికారులు వివరించారు. -
వధువుకు ఏదీ చేయూత?
సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ ’ పథకాలకు నిధుల కొరత వెంటాడుతోంది. బడ్జెట్లో కేటాయింపులు ఘనంగా ఉన్నా.. నిధుల మంజూరు, విడుదలలో మాత్రం నిర్లక్ష్యం పేదల పాలిట శాపంగా పరిణమించింది. ప్రభుత్వ ఆర్థిక సహాయం అందుతుందని గంపెడు ఆశలతో అప్పో సప్పో చేసి ఆడబిడ్డల పెళ్ళిలు చేసిన పేద కుటుంబాలు మరింత ఆర్థికంగా చితికి పోతున్నారు. రెవెన్యూ శాఖలో ఒకవైపు దరఖాస్తులు కుప్పలు, తెప్పలుగా పెండింగ్లో పడిపోతుండగా... మరోవైపు తహసీల్దారు పరిశీలన పూర్తయి ఎమ్మెల్యే, ఆర్డీవో ఆమోదం పొంది ట్రెజరీలకు బిల్లులు వెళ్తున్నా...ఆర్థిక సహయం మాత్రం బ్యాంక్ ఖాతాలో జమా కావడం లేదు. ఫలితంగా నెలల తరబడి పేదలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు. గత ఐదేళ్లుగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలకు ఆర్థిక సహాయం మాత్రం అందని ద్రాక్షగా తయారైంది. ఇదీ పరిస్ధితి.. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద వధువు చేయూత నత్తలకు నడక నేర్పిస్తోంది. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం కళ్యాణ లక్ష్మి పథకం కింద 4,480 కుటుంబాలు, షాదీముబారక్ పథకం కింద 9,504 కుటుంబాలు దరఖాస్తు చేస్తుకున్నాయి. అందులో సగానికి పైగా దరఖాస్తులకు అతీగతీ లేకుండా పోగా, మరి కొన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి పథకం అమలు తీరు పరిశీలిస్తే మొత్తం దరఖాస్తుల్లో తహసీల్ స్థాయిలో 399, ఎమ్మెల్యే అమోదం కోసం 612, రెవెన్యూ డివిజన్ అధికారి స్థాయిలో 1518, ట్రెజరీ వద్ద 288 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. షాదీముబారక్ పథకం కింద మొత్తం 9,504 దరఖాస్తులకు గాను తహసీల్ స్ధాయిలో 528 దరఖాస్తులు, ఎమ్మెల్యే స్థాయిలో 881, రెవెన్యూ డివిజన్ స్థాయిలో 3,958 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. రూ. 73.53 కోట్లు అత్యవసరం హైదరాబాద్ జిల్లాలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద రూ. 73.53 కోట్లు అత్యవసరమని అధికారం యంత్రాంగం గుర్తించింది. ఈ మేరకు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ప్రసుత్తం షాదీ ముబారక్ పథకం కింద రూ. 52,01,39,000, కళ్యాణ లక్ష్మి పథకం కింద బీసీ, ఓబీసీ లబ్ధిదారులకు రూ, 17,01,16,000, ఎస్సీ సామాజిక వర్గం లబ్ధిదారులకు 3,00,34,800లు, ఎస్టీ సామాజిక వర్గం లబ్ధిదారులకు రూ.1,50, 11, 600 నిధులు అత్యవసరం ఉన్నట్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. -
బుల్లెట్పై తిరుగుతూ.. చెక్కులు పంచుతూ..
ఎల్లారెడ్డి: పట్టణంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే జాజాల సురేందర్ లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి అందజేశారు. బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలోని 20 మంది లబ్ధిదారుల ఇంటింటికీ బుల్లెట్పై ఎమ్మెల్యే వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. పట్టణంలో బుల్లెట్పై ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లడంతో ఆయనను వింతగా చూశారు. ఎమ్మెల్యే ఏమిటి.. బుల్లెట్పై తిరగడమేంటి.. ఇంటింటికీ రావడం ఏమిటని ఒకరిని ఒకరు గుసుగులాడుకున్నారు. లబ్ధిదారులు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా తమ ఇంటికి వచ్చి అందజేయడాన్ని అందరూ చాలా సంతోషించారు. ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కుడుముల సత్యం, ఇమ్రాన్, జలందర్ రెడ్డి, పద్మారావు, రవీందర్, నర్సింలు, సతీష్, శ్రీనివాస్, తిమ్మాపూర్ సర్పంచ్ దామోదర్ ఉన్నారు. -
కల్యాణ‘లబ్ధి’ ఒక్కసారే...!
సాక్షి, హైదరాబాద్: లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఒక్కసారే వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో మొదటి పెళ్లి, రెండో పెళ్లి అనే అంశాలు అప్రస్తుతమని తేల్చి చెప్పింది. ఈమేరకు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన సోదరి రెండో వివా హం నేపథ్యంలో కల్యాణలక్ష్మి లబ్ధి పొందవచ్చా అని ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం లోతుగా పరిశీలించి ఈ ఆదేశాలు జారీ చేసింది. -
సిద్దిపేటను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చుదాం
-
కల్యాణ కానుక ఏది..?
సాక్షి, హైదరాబాద్: కల్యాణకానుక పంపిణీలో జాప్యం నెలకొంది. పెళ్లినాటికే ఇవ్వాల్సిన సాయం ఆర్నెల్లు గడుస్తున్నా అందడంలేదు. వరుస ఎన్నికలు, క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన నత్తనడకన సాగుతుండడంతో ఆలస్యమవుతోంది. పేదింటి ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తీసుకొచ్చింది. పెళ్లిరోజునాటికి లబ్ధిదారులకు ఈ పథకం కింద రూ.1,00,116 అందించాలని నిర్ణయించింది. కానీ, దరఖాస్తుల సమర్పణ, పరిశీలనతో సాయం అందజేత దాదాపు నెల రోజులు పడుతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 68 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు అధికారుల అంచనా. వీటి పరిష్కారానికి దాదాపు రూ.700 కోట్లు అవసరం. అటకెక్కిన పరిశీలన... కల్యాణలక్ష్మి, షాదీముబారక్ల కింద వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి పరిశీలిస్తారు. ఈ బాధ్యతలు రెవెన్యూ యంత్రాంగం చూస్తుంది. దరఖాస్తుదారు కుటుంబంతోపాటు సమీపంలోని వారి దగ్గర నుంచీ సమాచారం సేకరించి అర్హతను నిర్ధారిస్తారు. గతేడాది చివర నుంచి వరుసగా ఎన్నికలు జరుగుతుండటంతో రెవెన్యూ యం త్రాంగమంతా ఆ క్రతువులో నిమగ్నమైంది. అసెంబ్లీ, పంచాయతీ, పార్లమెంటు, పరిషత్ ఎన్నికలతో ఆర్నెల్లు గడిచిపోయాయి. ఓటరు జాబితా సవరణ మొదలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ఎన్నికల నిర్వహణల్లో యంత్రాంగం తలమునకలు కావడంతో దరఖాస్తులు పరిశీలనకు నోచుకోలేదు. గత బకాయిలు రూ.147.33 కోట్లు ఎన్నికల ప్రక్రియతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల బకాయిలు కుప్పలుగా పేరుకుపోయాయి. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాదాపు 14,716 దరఖాస్తులకు సంబంధించిన చెల్లింపులు చేయలేదు. దీంతో రూ.147 కోట్లు బకాయిలున్నాయి. వీటిని తదుపరి ఏడాదికి కలిపారు. 2019–20 ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే పెళ్ళిళ్లు జోరుగా జరిగాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు కూడా అదే తరహాలో దరఖాస్తులు వచ్చాయి. ఏప్రిల్, మే నెలలో దాదాపు 53 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. వీటిని వెంటవెంటనే పరిశీలించి పరిష్కరించాలి. మరోవైపు వెబ్సైట్ నిర్వహణ ఉండటంతో దరఖాస్తు ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సాంకేతిక సమస్యలు నెలకొనడంతో వెబ్సైట్ అప్గ్రేడ్ చేస్తున్నారు. దీంతో గత కొన్నిరోజులుగా దరఖాస్తు ప్రక్రియ నెమ్మదించింది. వెబ్సైట్ సమస్య పరిష్కారమైతే దరఖాస్తులు సైతం మరిన్ని పెరిగే అవకాశం ఉంది. -
షేక్పేట ఆర్ఐ వంశీ సస్పెన్షన్
బంజారాహిల్స్: కల్యాణ లక్ష్మి చెక్కును లబ్ధిదారుడికి ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేసినందుకుగాను షేక్పేట మండల కార్యాలయంలో పని చేస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ వంశీని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 19 కళ్యాణలక్ష్మి చెక్కులను తన వద్ద ఉంచుకున్న ఆర్ఐ వాటిని లబ్ధిదారులకు ఇవ్వకుండా డబ్బుల కోసం వేధిస్తుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కోడ్ కొనసాగుతున్న నేపథ్యంలో కళ్యాణలక్ష్మి చెక్కులను నేరుగా లబ్ధిదారులకు ఇవ్వకుండా తన వద్ద పెట్టుకోవడంతో పాటు దళారుల సహాయంతో డబ్బులు దండుకునేందుకు యత్నించినట్లు వాయిస్ రికార్డ్తో సహా ఫిర్యాదులు అందడంతో విచారణ చేపట్టిన షేక్పేట తహసీల్దార్ వెంకట్రెడ్డి ఇచ్చిన నివేదిక ఆధారంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మాణిక్యరాజ్ అతడిని సస్పెండ్ చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాదిగా ఆర్ఐ వంశీపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఫిలింనగర్ బస్తీల్లో విలువ చేసే ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతం చేసి భారీగా డబ్బులు దండుకున్నట్లు ఫిర్యాదులు అందాయి. తాజాగా ఉదయ్నగర్కు చెందిన రమ్య అనే యువతికి గతేడాది మే6న వివాహం జరిగింది. కల్యాణ లక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోగా చెక్కు మంజూరైనట్లు రమ్య సోదరుడు రాజ్కుమార్కు సమాచారం అందింది. దీంతో అతను చెక్కు ఇవ్వాలని కోరుతూ ఆర్ఐ వంశీని సంప్రదించగా రెండు రోజుల్లో బ్యాంకుల్లో డిపాజిట్ అవుతుందని చెప్పాడు. కార్యాలయం చుట్టూ తిరిగినా చెక్కు ఇవ్వలేదు. ఈ విషయాన్ని అదే బస్తీకి చెందిన టీడీపీ నేత బాలాజిగోస్వామికి చెప్పడంతో డబ్బులిస్తే తాను మాట్లాడి చెక్కు ఇప్పిస్తానని చెప్పాడు. బాధితుడు ఇదే విషయాన్ని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లగా, తహసీల్దార్ విచారణ చేపట్టారు. ఇటీవల 22 చెక్కులు మంజూరు కాగా అందులో మూడు చెక్కులు మాత్రమే లబ్దిదారులకు అందజేసినట్లు తేలింది. మిగిలిన చెక్కులు తన దగ్గరే ఉంచుకొని డబ్బులు డిమాండ్ చేసినట్లు వెల్లడి కావడంతోఆర్ఐ వంశీని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. -
‘కల్యాణలక్ష్మి’కి మళ్లీ బ్రేక్!
సాక్షి, ఆత్మకూర్ (ఎస్) : పేద, మధ్యతరగతి ఇళ్లలో ఆడపిల్లల పెళ్లి భారం కాకూడదని.. వారి పెళ్లి ఖర్చులకు ఆర్థికసాయం చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకానికి మళ్లీ బ్రేక్ పడింది. ఈ పథకాన్ని మొదట్లో ఎస్సీ, ఎస్టీల కోసమే ప్రవేశపెట్టి రూ.51 వేలు ఇవ్వగా.. తదనంతరం అన్ని వర్గాల్లోని పేదలకు వర్తింజేస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద ఆడపిల్ల పెళ్లికి ఇచ్చే ఆర్థికసాయాన్ని ప్రభుత్వం రూ.లక్షకు పెంచింది. అయితే ఏడాదిగా వివిధ కారణాలతో కల్యాణలక్ష్మి చెక్కులు అందకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 463 దరఖాస్తులకు 325మందికి చెక్కుల మంజూరు.. కల్యాణలక్ష్మి పథకానికి మండల వ్యాప్తంగా 2018 ఆర్థిక సంవత్సరం నుంచి నేటివరకు 463మంది దరఖాస్తు చేసుకున్నారు. బీసీ, ఈబీసీలు 250మంది, ఎస్టీలు 90, ఎస్సీలు 110, ముస్లింలు 13మంది తమ దరఖాస్తులను మండల అధికారులకు సమర్పించారు. వీటిల్లో ఇప్పటివరకు కేవలం 325మందిని ఈ పథకానికి అర్హులుగా గుర్తిస్తూ నిధులను మంజూరు చేసింది. మిగిలిన 138 దరఖాస్తులు వివిధ దశల్లో అధికారుల పరిశీలనలో ఉన్నాయి. నిధులు మంజూరైన 325 లబ్ధిదారుల్లోనూ అతికొద్ది మందికే చెక్కులను అందగా.. మిగతా వారికి మంజూరైన నిధులు ట్రైజరీ కార్యాలయాల్లోనే ఉన్నాయి. అమలులోకి ఎంపీ ఎన్నికల కోడ్ .. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడంతో కల్యాణలక్ష్మి చెక్కులు పెండింగ్లో పడినట్లు తెలుస్తోంది. ఏడాది క్రితం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు పరిశీలనలు పూర్తయి.. నిధులు విడుదలయ్యే సమయానికి ఎన్నికల కోడ్ రావడం.. మూడు నెలలపాటు ఎన్నికల వాతావారణమే ఉండడంతో భారీగా దరఖాస్తులు పెండింగ్లో ఉండి పంపిణీ ఆలస్యమైంది. దీనికి తోడుగా ఇటీవల లోక్సభ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో కోడ్ అమల్లోకి వచ్చి కల్యాణలక్ష్మికి మళ్లీకి బ్రేక్లు పడినట్లయింది. దీంతో ఏడాదిగా అప్పులు చేసి పెళ్లి చేసిన కుటుంబాలు కల్యాణలక్ష్మి చెక్కుల కోసం ఎదురు చూస్తున్నాయి. -
కల్యాణ‘లక్ష్మి’కి కోడ్ ఎఫెక్ట్!
సాక్షి, హైదరాబాద్: కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఈ ఏడాది ఇబ్బందులు తప్పేలా లేవు. పెళ్లి రోజు నాటికే ఈ నగదు సాయాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో పథకంలో పలు మార్పులు చేపట్టినప్పటికీ.. వరుసగా వస్తున్న ఎన్నికలతో పంపిణీలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. తాజాగా లోక్సభ ఎన్నికల కారణంగా రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ పరంగా లబ్ధిదారుల ఎంపిక, ఆర్థిక సాయం అందజేసే కార్యక్రమాలకు ఎన్నికల సంఘం కళ్లెం వేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంత కాలం ఈ కార్యక్రమాలను నిర్వహించొద్దని స్పష్టం చేయడంతో లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పేలా లేవు. 2018–19 వార్షిక సంవత్సరంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద మార్చి 5 నాటికి 2.43 లక్షల దరఖాస్తులొచ్చాయి. వీటిలో ఇప్పటివరకు 1.60 లక్షల దరఖాస్తులను పరిశీలించి అర్హులకు దాదాపు చెల్లింపులు పూర్తి చేశారు. మిగిలిన 83 వేల దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. ఏడాదంతా ఎన్నికల కోడ్తోనే.. 2018–19 వార్షిక సంవత్సరమంతా ఎన్నికల కోడ్తోనే గడిచిపోయింది. తొలి, రెండో త్రైమాసికాల్లో ప్రభుత్వం పెద్దగా నిధులు విడుదల చేయకపోవడంతో సంక్షేమ పథకాలన్నీ కాస్త నెమ్మదించాయి. ఆ తర్వాత అసెంబ్లీ రద్దు చేయడంతో నిధుల విడుదలకు బ్రేకులు పడ్డాయి. అందుబాటులో ఉన్న వాటితోనైనా సంక్షేమ పథకాలను నెట్టుకొద్దామని అధికారులు భావించినప్పటికీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో యంత్రాంగం ఆమేరకు సాహసించలేదు. డిసెంబర్ రెండో వారం నుంచి ఎన్నికల కోడ్ తొలగిపోయింది. అంతలోనే జనవరిలో పంచాయతీ ఎన్నికలు రావడంతో ఆ నెల కూడా కోడ్ నేపథ్యంలో పలు కార్యక్రమాలు అటకెక్కాయి. ప్రస్తుతం వార్షిక సంవత్సరం చివరకు వచ్చింది. మరో 20 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో పెండింగ్ పనులన్నీ పూర్తిచేసేలా అధికారులు హడావుడి చేశారు. ఈ నేపథ్యంలోనే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థికశాఖకు వాటిని సమర్పించాలనుకునేలోపే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. మే నాలుగో వారం వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండనుంది. దీంతో అప్పటివరకు సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక, చెల్లింపులకు ఇబ్బందేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అంతా ఆన్లైన్ అయినా.. గతేడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆన్లైన్ పద్ధతిని తీసుకొచ్చింది. సాధారణంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులకు ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో ఇస్తారు. ఈ మేరకు శాసనసభ్యులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పంపిణీ చేస్తారు. ఎన్నికల సందర్భంగా చెక్కులకు బదులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు సాయాన్ని పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇందుకు క్షేత్రస్థాయిలో రెవెన్యూ యంత్రాంగం నుంచి పెద్దగా సహకారం అందకపోవడంతో తక్కువ సంఖ్యలో లబ్ధిదారులకు మాత్రమే పంపిణీ చేశారు. తాజాగా ఎన్నికలు రావడంతో రెవెన్యూ యంత్రాంగమంతా ఎన్నికల పనుల్లో బిజీ కానుంది. దీంతో ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చినా పెద్దగా ఫలితం లేదని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
‘కల్యాణలక్ష్మి’కి రూ.144 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: కల్యాణలక్ష్మి పథకానికి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో 2018–19 వార్షిక సంవత్సరంలో 36,254 మం ది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీటిలో 22,862 దరఖాస్తుల పరిశీలన పూర్తి కావడంతో వాటికి నిధులు విడుదల చేశారు. ఇందుకు రూ.144.5 కోట్లను రెవెన్యూ డివిజనల్ అధికారులకు విడు దల చేసినట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ చెప్పారు. వారంలోపు లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత వార్షిక సంవత్సరంలో ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు పూర్తిస్థాయిలో పరిష్కారం కానున్నాయని, ఇందుకు సరిపడా నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. మిగతా దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయని, బడ్జెట్ సరిపడా అందు బాటులో ఉండటంతో పరిశీలన పూర్తయ్యాక నిధులు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది వచ్చిన దరఖాస్తుల్లో 604 దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. -
బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయండి: సీఎస్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 19 నుంచి బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. సోమవారం సచివాలయంలో బతుకమ్మ చీరల పం పిణీ, ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్, జూనియర్ గ్రామకార్యదర్శుల నియామకం, పంచా యతీ ఎన్నికల ఏర్పాట్లు, జాతీయ రహదారుల భూసేకరణ, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకుల పంపిణీ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ.. బతుకమ్మ చీరల పంపిణీలో ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు. 57 ఏళ్ల వయస్సు నిండిన వారికి ఆసరా పింఛన్లు మంజూరు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం లో భాగంగా అర్హుల ఎంపిక కోసం ఓటరు లిస్టులను వినియోగించుకోవాలని సూచించారు. రెండు, మూడు రోజుల్లోగా జిల్లాల వారీగా లబ్ధిదారుల సంఖ్యను తెలపాలని సీఎస్ ఆదేశిం చారు. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. బతుకమ్మ చీరలను ఇప్పటికే జిల్లాలకు పంపామని, ఐదారు రోజుల్లోగా పంపిణీ పూర్తయ్యేలా కార్యక్రమం రూపొందించుకోవాలన్నారు. -
మహాకూటమి కాదు.. మాయకూటమి
గాదిగూడ(నార్నూర్): ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి ఏర్పడిన కూటమి మాహాకూటమి కాదని.. అది మాయకూటమని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ విమర్శించారు. శనివారం గాదిగూడ మండలం పర్పువాడ–కే, అర్జుని, కొలాంగూడ, రాముగూడ, లోకారి–బి, ఖడ్కి, గాదిగూడ, మేడిగూడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని శాఖలను సరిదిద్దడానికే ఏడాది పట్టిందని అన్నారు. మిగతా మూడన్నర ఏళ్లలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని తెలిపారు. పేద అమ్మాయి పెళ్లి కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా రూ.1,00,116 అందిస్తున్నట్లు తెలిపారు. రైతుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రైతుబంధు పథకం ద్వారా ఏడాదికి రెండు పంటలకు రూ.8వేలు అందజేస్తుందని అన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు ఇవ్వడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎంపీపీ రాథోడ్ గోవింద్నాయక్, జెడ్పీటీసీ రూపావతిజ్ఞానోబా పుస్కర్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మేస్రం దేవురావు, మేస్రం హన్మంతరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉర్వేత రూప్దేవ్, నాయకులు మోతే రాజన్న, హైమద్, జాకురుల్లాఖాన్, మీరాబాయి, షెక్ హుస్సెన్, నర్శింగ్మెరే, సయ్యద్ఖాశీం, తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణలక్ష్మీ షాపింగ్మాల్ను ప్రారంభించిన రాశీఖన్నా, మెహారీన్
-
పేదల పెళ్లిళ్లపై ఎన్నికల పిడుగు
సాక్షి,సిటీ బ్యూరో: కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్లకు ఎన్నికల గ్రహణం పట్టింది. గత నెల రోజులుగా దరఖాస్తుల పరిశీలన పెండింగ్లో పడటంతో ఆడబిడ్డల పెళ్లిలకు ఆర్థిక సాయం అందుతుందన్న ఆశతో ముహుర్తాలు ఖరారు చేసుకున్న తల్లితండ్రులకు ఆర్థిక ఇబ్బందులు, కన్నీళ్లు తప్పడం లేదు. రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం, సవాలక్ష కొర్రీల కారణంగా వ«ధువుకు చేయూత అంతంతమాత్రంగా మారింది. కొత్త దరఖాస్తులతో పాటు పరిశీలనకు నోచుకున్న దరఖాస్తుల అమోదం, మంజూరు కూడా పెండింగ్లో పడింది. ఇప్పటికే మంజూరైన ఆర్థిక చేయూతకు ట్రెజరీ అధికారులు కొర్రీలు వేస్తున్నారు. దీంతో బిల్లులు విడుదల కావడం లేదు. ఫలితంగా ఎప్పటి మాదిరిగానే నిరుపేద తల్లిదండ్రులు అప్పులు చేసి ఇబ్బందుల పాలవుతున్నారు ఎన్నికల ప్రభావం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలపై ఎన్నికల విధుల ప్రభావం పడింది. రెవెన్యూ యంత్రాంగం ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో ఆయా పథకాల అమలును పట్టించుకోవడం లేదు. దీనికితోడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ రెవెన్యూ శాఖకు గుడిబండగా మారింది. ఇప్పటికే రెవెన్యూ శాఖ సిబ్బందికి ప్రభుత్వ భూముల పరిరక్షణ, ధృవీకరణ పత్రాల జారీ, పింఛన్లు ఇతరత్రా విధులతో పాటు ఎన్నికల డ్యూటీ పేరుతో అదనపు భారం పడింది. దీంతో కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. నత్తనడక.. హైదరాబాద్–రంగారెడ్డి– మేడ్చల్ జిల్లాలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాల అమలు నత్తలకు నడక నేర్పిస్తున్నాయి మొత్తం 8 వేల మంది కుటుంబాలు ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోగా అందులో రెండు వేల కుటుంబాలకు మాత్రమే ఆర్థిక చేయూత అందినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. షాదీ ముబారక్ పథకం కింద సుమారు రెండువేల కుటుంబాలు ఆర్థిక చేయూత కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు కేవలం ఐదు వందల కుటుంబాలకు మాత్రమే ఆర్థికసాయం అందినట్లు తెలుస్తోంది. మిగిలిన సగం దరఖాస్తులు వివిధ దశలో పెండింగ్ ఉన్నట్లు సమాచారం. మళ్లీ అప్పుల పాలు ప్రభుత్వం నిరుపేద కుటుంబాల్లో ఆడ బిడ్డల వివాహాలకు చేయూత అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు పథకాలను ప్రకటించింది. రెండేళ్ల క్రితం సంక్షేమ శాఖల ద్వారా అమలు చేసిన పథకాలను ఒక గొడుగు కిందకు తేవాలన్న లక్ష్యంతో పథకం పూర్తి స్థాయి అమలు బాధ్యతలను రెవెన్యూ శాఖకు అప్పగించింది. ఈ నేపథ్యంలో తహసీల్దార్లకు దరఖాస్తుల విచారణ బాధ్యత అప్పగించడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. అదనపు పనిభారం, బిజీ షెడ్యూల్తో దరఖాస్తులను పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా పెండింగ్లో పడటంతో ఆర్థిక చేయూత అంతంత మాత్రంగా మారింది. కొద్దిరోజుల క్రితం రెవెన్యూ శాఖ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై దృష్టి సారించి విచారణ ప్రక్రియ వేగవంతం చేసినా ఎన్నికల షెడ్యూల్ కారణంగా మూన్నాళ్ల ముచ్చటగా మారింది. తాజాగా రెండు పథకాల అమలుపై ఎన్నికల ప్రభావం పడటంతో ఇప్పట్లో ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు. -
పథకాల కన్నా కేసీఆర్కే ఆదరణ
-
‘పెళ్లిళ్ల’ పథకాలకు నిధుల్లేవ్!
సాక్షి,మేడ్చల్ జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు నిధులు లేక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. కానీ డిమాండ్కు తగినట్లుగా నిధులు మంజూరు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. దీంతో అర్హత కలిగిన లబిద్ధారులు నిధుల మంజూరు కోసం ఎమ్మెల్యేలు, రెవెన్యూ యంత్రాంగం చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సామాజిక వర్గాలకు అతీతంగా బీసీ, ఈబీసీలకు కూడా కల్యాణ లక్ష్మి పథకం వర్తింపజేయటంతో దరఖాస్తుదారుల సంఖ్య బాగా పెరిగింది. ఈ పథకంలో మార్పులు, చేర్పులు, లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకు ప్రభుత్వం అప్పగించింది. దీంతో లబ్ధిదారుల ఎంపిక, నిధుల మంజూరులో జాప్యం జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద ఆర్థిక సహాయం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ వర్గాల నుంచి 5,885 మంది దరఖాస్తు చేసుకోగా...వీటిలో 16 మండలాల పరిధిలో 5,040 దరఖాస్తులను మండల రెవెన్యూ యంత్రాంగం పరి«శీలించింది. మరోవైపు ఇందులో 4,540 దరఖాస్తులను స్థానిక ఎమ్మెల్యేలు ఆమోదించారు. అయినప్పటికీ జిల్లాలో ఇప్పటి వరకు 4,460 మంది లబ్ధిదారులకు మాత్రమే చెక్కులు పంపిణీ చేశారు. మిగిలిన 500 దరఖాస్తుల్లో 153 తిరస్కరించి...347 దరఖాస్తులను పెండింగ్లో ఉంచారు. కాగా లబ్ధిదారులకు ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున సొమ్ము మంజూరు చేశారు. పథకం తీరు ఇలా... ఆర్థికంగా బలహీనంగా ఉన్న షెడ్డ్యూల్ కులాలు, షెడ్డ్యూల్ తెగలు, బీసీ, ఈబీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 18 ఏళ్లకు పైబడిన యువతుల వివాహం కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రా>ష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల లోపు ఉండాల్సి ఉంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించే బాధ్యతలను రెవెన్యూ శాఖకు ప్రభుత్వం అప్పగించింది. ఆన్లైన్ ద్వారా రిజిష్టర్ అయిన దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రతిపాదనల్ని స్థానిక ఎమ్మెల్యేలకు రెవెన్యూ శాఖ నివేదిస్తుంది. చివరగా ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఎంపిక చేపట్టాక...నిధులు మంజూరు చేస్తారు. -
‘కల్యాణలక్ష్మి’కి దళారులు
సాక్షి, ఆసిఫాబాద్ కొమరంభీం : పేదింటి ఆడ బిడ్డ పెళ్లి చేసుకునే సమయంలో ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకంలో దళారుల తాకిడి ఎక్కువైంది. దరఖాస్తు చేసుకునేప్పుడు అందినకాడికి లబ్ధిదా రుల నుంచి దండుకుంటున్నారు. వివిధ సర్టిఫికెట్ల కోసం ఒక్కో దానికి ఓక్కో రేటు ఫిక్స్ చేసి లబ్ధి దారుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నా రు. ఈ పథకానికి దరఖాస్తు విధానం, అవసరమైన సర్టిఫికెట్లు తదితరవన్ని చాలా మందికి తెలియకపోవడంతో దళారులకు వరంగా మారింది. ఎవరైనా జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ ఆఫీసు వద్ద కల్యాణలక్ష్మి లేదా షాదీముబారక్ కోసం వచ్చిందంటే ఆ లబ్ధిదారుల చుట్టు మధ్యవర్తులు చేరి వారికి కావాల్సిన వివరాలు తీసుకుంటూ రంగంలోకి దిగి ఒక్కో సర్టిఫికెట్కు ఇంత ఖర్చు అవుతుందని చెప్పి పనులు చేస్తున్నారు. ఎక్కడ తిరిగే ఒపిక లేక లబ్ధిదారుల అవకాశాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అయితే ఒక్కోసారి అధికంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని.. జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వివి ధ మండలాల నుంచి గ్రామీణులు, నిర క్షరాస్యులు నిత్యం వస్తుంటారు. వీరిలో కల్యాణలక్ష్మి కో సం కనీసం రోజుకు ఐదు నుంచి పది మంది వర కు లబ్ధిదారులు మ్యారేజి సర్టిఫికెట్ కోసం వ స్తుంటారు. ఇలా వచ్చిన వారిలో ఎలా దరఖాస్తు చేయాలో.. సర్టిఫికెట్ ఎలా పొందాలో చాలా మం దికి తెలియదు. దీంతో ఇలా అమాయకంగా కని పించే వారి వద్దకు మధ్యవర్తులు వెళ్లి అన్ని పనులు మేం చేసి పెడతాం.. దానికి కొంత ఖర్చు అవుతుందని చెబుతూ రంగంలోకి దిగుతున్నారు. ఉదాహరణకు కల్యాణలక్ష్మికి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుల వయస్సు నిర్ధారణ తప్పనిసరి. దీనికి ఆ ధార్కార్డు లేదా చదువుకున్న వాళ్లకు పదో తరగతి మార్కుల మెమోను ఆధారంగా తీసుకుంటున్నారు. చదువుకోని వాళ్లకు వయస్సు నిర్ధారణ సర్టిఫికెట్ జత చేయాల్సి ఉంటుంది. ఇందుకు సివిల్సర్జన్ స్థాయి డాక్టర్తో వయస్సు నిర్ధారణ సర్టిఫికెట్ తీసుకురావాలి. ఈ సర్టిఫికెట్లు పొందేందుకు నేరుగా లబ్ధిదారులు అధికారుల వద్దకు వెళ్తే పనులు కావడం లేదు. అదే దళారుల ద్వారా చాలా సులువుగా అయిపోతోంది. ఒక్కో సర్టిఫికెట్కు రూ.200 వరకు వీరి నుంచి వసూలు చేస్తూ డాక్టర్ల నుంచి సర్టిఫికెట్ తీసుకొస్తున్నారు. మరో కీలక మైనది ఫస్ట్ మ్యారేజి సర్టిఫికెట్. ఇది లబ్ధిదారులు నేరుగా సబ్రిస్ట్రేషన్ ఆఫీసుకు దరఖాస్తు చేసి పంపిస్తే అధికారులు ఆ దరఖాస్తును అక్కడే నిలిపి వేస్తున్నారు. అదే మధ్యవర్తుల ద్వారా ఆఫీసుకు దరఖాస్తు వెళ్తే క్షణాల్లో సంతకం పెట్టి దరఖాస్తును ఆమోదిస్తున్నారు. దీంతో చదువుకున్న వారు సైతం మధ్యవర్తులను ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ మ్యారేజి సర్టిఫికెట్ ప్రభుత్వ ఫీజు రూ.220 వరకు ఉంటే లబ్ధిదారుల నుంచి దళారులు రూ.2 నుంచి 3వేల వరకు గుంజుతున్నారు. గెజిటెడ్ సంతకాలు, లాయర్లతో అఫిడవిట్ ఫాంలు, ఆధార్కార్డులో వయస్సు, ఇంటిపేరు తప్పులు, కుల, ఆదాయ, పెళ్లి కూతురి తల్లి బ్యాంకు అకౌంట్ వివరాలు తదితర వన్ని ఒక్కో సర్టిఫికెట్ ఒక్కో రేటు చొప్పున మొత్తంగా పెళ్లి కానుకు అందుకోవాలంటే కనీసం రూ.5వేల వరకు ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ దళారులు సంపాదించే వాటాలో అధికారులకు కూడా వాటా ఉండడంతో వాళ్లు కూడా వచ్చే సంపాదన కాదనక లేకపోతున్నారు. ‘ఎక్కడ ఏ సర్టిఫికెట్ దొరుకుతుందో ఖచ్చితంగా తెలియక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక వేళా తెలిసినా.. సంబంధిత ఆఫీసుల చుట్టు తిరగలేక విసిగిపోతున్నారు. దీంతో మధ్యవర్తులకు ఎంతో కొంత ముట్టచెబుతూ పనులు చేసుకుంటున్నారని’ రెవెన్యూ శాఖలో పని చేసే ఓ అధికారి పేర్కొన్నారు. అయితే గతంలో ఇంత అధిక మొత్తంలో మధ్యవర్తులు వచ్చేవారు కాదని, గత మార్చిలో ప్రభుత్వం రూ.75 వేల నుంచి పెళ్లి కానుక లక్ష నూట పదహారు రూపాయలకు పెంచడంతో ఈ దళారుల బెడద ఎక్కువ అయిందని చెప్పుకొచ్చాడు. కొంతమంది అధికారులు పూర్తిగా మధ్యవర్తులకు పనులు చేయడంతో లబ్ధిదారులకు తిప్పలు తప్పడం లేదు. దళారులను నమ్మొద్దు లబ్ధిదారులు మ్యారేజి సర్టిఫికెట్ కోసం ఎక్కడా అధికంగా డబ్బులు చెల్లించవద్దు. ప్రభుత్వ ఫీజు రూ.210 మాత్రమే చెల్లించాలి. దీనిపై గతంలో ఆఫీసులో సమీపంలో ఓ బోర్డు కూడా ఏర్పాటు చేశాం. లబ్ధిదారులు స్థానికంగా పంచాయతీ ఈవో, మున్సిపాలిటీ కమిషనర్లో మ్యారేజి సర్టిఫికెట్ పొందితే చాలు. మళ్లీ రిజిస్ట్రేషన్ ఆఫీసులో సర్టిఫికెట్ అవసరం లేదు. అక్కడ చేసుకోలేని వారు మా వద్దకు రావాలి. – విజయకాంత్, సబ్రిజిస్ట్రార్ ఆసిఫాబాద్ -
పేదింటి వధువు.. చేయూత కరువు
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వం పేద యువతుల వివాహాల ఆర్థిక తోడ్పాటు కోసం మూడేళ్ల క్రితం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలు బాలారిష్టాలు దాటడంలేదు. బడ్జెట్లో పథకాలకు కేటాయింపులు ఘనంగా ఉన్నా.. ఆచరణలో మాత్రం ప«థకం చుక్కలు చూపిస్తోంది. ఆడబిడ్డల పెళ్లీలకు ఆర్థిక సహాయం అందుతుందన్న గంపెడు ఆశతో పెళ్లి ముహూర్తాలు ఖరారు చేసుకుంటున్న తల్లితండ్రులకు ఆర్థిక కష్టాలు, కన్నీళ్లు తప్పడం లేదు. ప్రభుత్వ ఉదాసీన వైఖరితో రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం, సవాలక్ష కొర్రీలతో వ«ధువుకు చేయూత అంతంత మాత్రంగా మారింది. దరఖాస్తులు పరిశీలనకు నోచుకోకుండా పెండింగ్లో మగ్గుతున్నాయి. మరోవైపు పరిశీలన నోచుకున్న దరఖాస్తులు తహసీల్దార్, ఎమ్మెల్యే ఆమోదం, మంజూరు కూడా ఎదురు చూస్తున్నాయి. ఆర్థిక సహాయం మంజూరైనప్పటికీ ట్రెజరీ శాఖ ప్రతి నెలా 5 నుంచి 17 వరకు మాత్రమే బిల్లుల పాస్, ఆ తర్వాత బిజీబిజీగా ఉంటే ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కుల పంపిణీ ప్రక్రియలతో పుణ్యకాలం కూడా గడిచిపోతోంది. దీంతో పేద కుటుంబాలకు ఆర్థిక చేయూత ఆలస్యంగా అందుతోంది. దీంతో ఎప్పటి మాదిరిగా నిరుపేద కుటుంబాలు అప్పులు చేసి ఇబ్బందుల పాలవుతున్నారు. రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా స్పందించి పెండింగ్లో ఉన్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులను పరిశీలించి ఆర్థిక చేయూత అందించాలని ఆయా కుటుంబాలు కోరుతున్నారు. నత్తనడకన.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద నిరుపేద కుటుంబాలకు వివాహాల కంటే ముందు రూ. 1,00,116 ఆర్థిక చేయూత అందే పరిస్థితి కానరావడం లేదు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ రెవెన్యూ శాఖకు గుదిబండగా తయారైంది. రెవెన్యూ శాఖ సిబ్బంది ప్రభుత్వ భూముల పరిరక్షణ, ధ్రువీకరణ పత్రాల జారీ, పింఛన్లు ఇతరత్రా విధుల్లో బిజీబిజీగా ఉండటంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. క్షేత్ర స్థాయి విచారణ పూర్తయినా ఆ తర్వాత ప్రక్రియ కూడా నత్తలకు నడక నేర్పిస్తోంది. ఇదీ పరిస్థితి.. హైదరాబాద్ జిల్లాలో కల్యాణలక్ష్మి పథకం కింద మొత్తం 3,680 కుటుంబాలు తమ బిడ్డల పెళ్లీలకు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు చేసుకోగా అందులో 1,745 కుటుంబాలకు మాత్రమే ఆర్థిక చేయూత అందినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. షాదీ ముబారక్ పథకం కింద 8,205 కుటుంబాలు ఆర్థిక చేయూత కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు కేవలం 4,816 కుటంబాలకు మాత్రమే చేయూత అందినట్లు తెలుస్తోంది. మిగిలిన సగం దరఖాస్తులు వివిధ దశలో పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. అదనపు పనిభారం, బిజీ షెడ్యూలుతో రెవెన్యూ దరఖాస్తులను పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు పథకాల కింద సుమారు ఆరు వేలకు పైగా దరఖాస్తులు రాగా, అందులో విచారణ అనంతరం మూడువేల దరఖాస్తులకు ఎమ్మెల్యేల ద్వారా ఆమోదం పొందినట్లు అధికార యంత్రాంగం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి -
ఆడపడుచులకు కాలం చెల్లిన చెక్కులు!
తాండూరు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అధికారుల నిర్లక్ష్యంతో అభాసుపాలవుతున్నాయి. గతంలో జరిగిన మాదిరిగానే తాండూరులో మరోసారి లబ్ధిదారులకు కాలంచెల్లిన చెక్కులు పంపిణీ చేశారు. తాండూరు పట్టణంతోపాటు నియోజకవర్గంలోని యాలాల, బషీరాబాద్, తాండూరు, పెద్దేముల్ మండలాలకు చెందిన వారికి గత 2వ తేదీన మున్సిపల్ కార్యాలయంలో మంత్రి మహేందర్రెడ్డి చేతుల మీదుగా 149 చెక్కులు అందజేశారు. ఇందులో 63 కల్యాణలక్ష్మి, 86 షాదీముబారక్ చెక్కులు ఉన్నాయి. వీటిని పొందిన లబ్ధిదారులు బ్యాంకుకు వెళ్లి డబ్బులు ఇవ్వాలని కోరగా.. చెక్కుల గడువు ముగిసిందని చెప్పడంతో ఖంగుతిన్నారు. దీంతో చేసేదేమీ లేక మళ్లీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆడపడుచులకు కట్నంగా సీఎం కేసీఆర్ అందిస్తున్న ఆర్థిక సాయం.. కేవలం అధికారుల నిర్లక్ష్యంతో అపహాస్యమవుతోందని మండిపడుతున్నారు. -
బాల్యం బాగుంటేనే భవిష్యత్తు
బాల్యం అమూల్యం, ఆ అమూల్యమైన బాల్యం దృఢంగా ఉంటేనే దేశ భవిష్యత్తు బాగుం టుంది. బాల్యం బాగా లేకపోతే పౌరులు కూడా ఊసురోమని తయారౌతారు. మన నాయకులు స్వచ్ఛ భారత్ అంటున్నారు. బేటీ బచావ్– బేటీ పడావ్ అంటున్నారు. ఇంకా చాలా నినాదాలిస్తున్నారు. కానీ ఈ నినాదాలు నిజరూపం దాల్చడం లేదు. 28 శాతం మంది పిల్లలు బాల కార్మికులుగా బతుకు బండిని లాగుతున్నారనీ, అమ్మాయిల్లో 31 శాతం మందికి బాల్య వివాహాలు జరుగుతున్నాయనీ, పుట్టిన ప్రతి ఐదుగురిలో ఒకరు మొదటి జన్మదినం చూడకుండానే కన్నుమూస్తున్నారనీ, 11 శాతం మంది పిల్లలు మాఫియా చేతుల్లో మగ్గిపోతున్నారనీ, సర్కారు వారి గణాం కాలే సెలవిస్తున్నాయి. పరిస్థితి ఈ విధంగా ఉంటే పెద్దలు నినాదాలకే పరిమితమైతే పిల్లలు బాగుపడేదెన్నడు? సత్పౌరులుగా ఎదిగేదెన్నడు? ఈ దేశం బాగుపడేదెప్పుడు అనే ప్రశ్న ప్రతి వారినీ పీడించేదే. స్వచ్ఛ భారత్ అని సెలవిస్తూ కోట్లు తగలేస్తున్నవారు, ఉత్తరప్రదేశ్లోని నూర్పూర్లో చెత్తకుప్పల దగ్గర విషాహారం తిని ఐదుగురు అమాయక పిల్లలు చనిపోవడం స్వచ్ఛభారత్కి మచ్చకాదా? మున్సిపాలిటీ చెత్త బళ్లు లాగుతున్న బాల, బాలికలు అనునిత్యం దర్శనమిస్తుంటారు. మీ స్వచ్ఛ భారత్ పిల్లల్ని పక్కనబెట్టి పెద్దలకు పరిమితమైందా? ఇక బేటీ పడావ్– బేటీ బచావ్ అన్న నినాదానికి వస్తే ఉన్న స్కూళ్లను మూసేస్తుంటే పిల్లలు ఎక్కడ చదువుకుంటారు. బేటీ బచావ్ అనే మీ నినాద తీవ్రత ఎంతవరకు వెళ్లిందంటే 2014 నుంచి నేటి వరకు బాలికలపై 7 లక్షలకు పైగా అత్యాచారాలు జరిగాయి. ఇవి కేవలం పోక్సో చట్ట ప్రకారం నమోదైన లెక్కలు మాత్రమే. బాలికలపై అత్యాచారాలు చేసి చెరపట్టిన వారిలో ప్రజా ప్రతినిధులు సహితం ఉన్నారంటే ఇది ఎంత సిగ్గుచేటు. ప్రజల కోసమే పుట్టానని ప్రగల్భాలు పలికే ఓ ముఖ్యమంత్రి గారి ఏలుబడిలో ఒకే జిల్లాలో రెండు నెలల వ్యవధిలో 18 అత్యాచారాలు జరిగాయి. ఇది సిగ్గు చేటైన విషయం కాదా? అమ్మాయిల చదువును ప్రోత్సహిస్తారా లేక షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి అని పెళ్లి చేసుకొని పరాన్నభుక్కుగా వర్ధిల్లమని దీవిస్తారా? అర్ధరాత్రి పెద్దనోట్ల రద్దు అని ప్రకటన చేసి ప్రజల్ని పరుగులు పెట్టించిన పెద్దలు, బాల కార్మిక వ్యవస్థ రూపు మాపడానికి అలాంటి ప్రకటన చేసి ఓ గడువు విధించి అనంతరం మీ వద్ద బాల కార్మికులుంటే కఠినంగా శిక్షిస్తామని ప్రకటన చేస్తే బాల కార్మిక సమస్య తీరిపోదా, కేవలం ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ అని కోట్లు ఖర్చు చేసి తద్దినాల్లా తంతు ముగిస్తే సరిపోతుందా. పిల్లలు విద్య, వైద్యం, గౌరవప్రదమైన జీవనం, ఆటపాటలు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఆట–పాటల సౌకర్యాలు కల్పించి బాల బాలికలను భావి పౌరులుగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత నుంచి తప్పించుకుంటే భావి తరం మిమ్మల్ని క్షమిస్తుందా, పిల్లలను అనేక వ్యాధుల నుంచి దూరం ఉంచే పౌష్టికాహారం, కనీసం రక్షిత మంచినీరు అందించలేని మీరు చిన్నారుల ముందు దోషులు కాక మరేమౌతారు అని ప్రశ్నిస్తున్నది. బాలల హక్కుల కమిషన్లను సహితం నీరుకారుస్తూ, పిల్లల హక్కులని ఎందుకు కాలరాస్తున్నారు? దీనికి సంబంధించి మీ వద్ద ఏదైనా సమాధానం ఉందా? దోషులుగా నిలబడతారో? బాలవీరులుగా పిల్లలను తీర్చిదిద్ది చరిత్రలో వీరులుగా నిలిచిపోతారో కేంద్ర, రాష్ట్ర పాలకులు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రచయిత: అచ్యుతరావు, గౌరవ అధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం మొబైల్ : 93910 24242 -
నూతన వధూవరులకు సీఎం కేసీఆర్ సర్ఫ్రైజ్
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు కార్యక్రమంలో పాల్గొనడానికి కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వెళ్లుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మార్గమధ్యంలో తాడికల్ వద్ద వివాహ వేడుకను చూశారు. వెంటనే బస్సు దిగి నూతన వధూవరులు కావ్య, మనోహర్లను పలకరించి, అక్షితలు చల్లి ముఖ్యమంత్రి ఆశీర్వదించారు. కళ్యాణలక్ష్మి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అనుకోని అతిథిలా ముఖ్యమంత్రి స్వయంగా రావడంతో వధూవరుల బంధువులు ఆనంద,ఆశ్చర్యాలకు గురయ్యారు. ముఖ్యమంత్రికి, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
బాల్యానికి మూడు ముళ్లు
నిర్మల్అర్బన్ : బాల్య వివాహాలు అరికట్టేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చాపకింద నీరులా పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ వంటి పథకాలు అమలు చేస్తున్నా పూర్తిస్థాయిలో వీటికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఓ వైపు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా.. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్లు ఇస్తున్నా.. బాల్య వివాహాలు మాత్రం ఆగటం లేదు. మైనర్లు అయినప్పటికీ చాటుమాటుగా పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. అభద్రత భావం, పేదరికం, నిరక్షరాస్యత, మేనరికం, డ్రాపవుట్, అజ్ఞానం, సామాజిక తదితర కారణాల వల్ల బాల్య వివాహాలను జరిపిస్తున్నారు. రక్షణ లేని సమాజంలో అమ్మాయికి పెళ్లి చేస్తే రక్షణలోకి వెళుతుందన్న భావన అమ్మాయిల తల్లిదండ్రుల్లో ఉంటే, పెళ్లి చేయకపోతే బాధ్యత లేకుండా చేతికందకుండా పోతాడేమోనన్న అనుమానం అబ్బాయిల తల్లిదండ్రుల్లో ఉండటం, పెళ్లి చేస్తే దారితప్పిపోకుండా ఉంటారన్న ఆలోచనతో మరికొంత మంది వివాహాలు జరిపించేస్తున్నారు. బాల్య వివాహాల గురించి సమగ్ర సమాచారం అందితేనే అధికారులు స్పందిస్తున్నారు. పూర్తి సాక్షాలు లేకుంటే తమకెందుకులే అని వదిలేస్తున్నారు. ఎక్కువ మందయితే బాల్య వివాహాలను గుట్టు చప్పుడు కాకుండా జరిపించేస్తున్నారు. ఫోక్సో లాంటి చట్టాలు అనేకం ఉన్నా బాల్య వివాహాలు మాత్రం అడ్డుకోలేకపోవడం విచారకరం. తాజాగా నిర్మల్ జిల్లా కేంద్రంలో బాల్య వివాహాన్ని పోలీసు, ఐసీడీఎస్ అధికారులు నిలిపివేశారు. చాపకింద నీరులా... జిల్లాలో బాల్య వివాహాలు చాపకింద నీరులా జరుగుతున్నాయి. మంచి సంబంధమైతే దొరికితే చాలు.. ఇక ఆలస్యం ఎందుకు అని తొందరగానే వివాహాలు చేస్తున్నారు. ఇలాంటి వారు అబ్బాయి, అమ్మాయిల వయస్సులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం సూచించిన విధంగా అయితే అబ్బాయికి 21, అమ్మాయికి 18 ఏళ్లు నిండి ఉండాలి. కానీ కొందరు అబ్బాయికి 21 ఏళ్లు, అమ్మాయికి 18 ఏళ్లు పడగానే పెళ్లిళ్లు చేస్తున్నారు. ఇంకొందరు అంతకు లోపున్నా పెళ్లి తంతు జరిపిస్తున్నారు. మంచి సంబంధం మళ్లీ దొరకదనో.. ఆలస్యమైతే మనసులు మారతాయనో.. ఓ బాధ్యత తీరుతుందనో ఇలా రకరకాల కారణాలతో పెళ్లి ముచ్చట కానిచ్చేస్తున్నారు. అధికారుల దృష్టికి వస్తే ఎక్కడ పెళ్లి ఆగిపోతుందోనని గోప్యత పాటిస్తున్నారు. పెళ్లిళ్లు ఇష్టం లేకనో, ఇంకా ఇతరత్రా కారణాల వల్ల సమాచారం బయటకు వస్తే తప్ప అధికారులకు విషయం తెలియడం లేదు. పక్కంటి వారికో, బంధువులకు, స్నేహితులకో తెలిసినా పెళ్లి ఆపడం ఎందుకులే అని.. పెళ్లివారు ఇబ్బంది పడతారని విషయాన్ని బయటకు రానివ్వడం లేదు. దీంతో గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహాలు జరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో చాలానే జరిగాయి. అధికారుల దాకా వచ్చి నిలిచిపోయినవి కొన్ని మాత్రమే ఉంటాయనడంలో సందేహం లేదు. తొమ్మిదింటికి అడ్డుకట్ట.. జిల్లాలో రెండేళ్లుగా అధికారులు తొమ్మిది బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయగలిగారు. 1098కు సమాచారం రావడం, అధికారులకు ఫిర్యాదులు అందటంతో జిల్లాలో తొమ్మిది చోట్ల వివాహాలు నిలిపివేశారు. సోన్ మండలం పాక్పట్ల, సారంగాపూర్ మండలం తాండ్ర, మామడ, మామడ మండలం అనంతపేట్, సోంపేట్, ముథోల్, తానూర్, భైంసాలలో బాల్య వివాహాలపై సమాచారం అందటంతో అధికారులు అడ్డుకున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని నాయిడి వాడకు చెందిన బాలుడికి, నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలానికి చెందిన బాలికలకు ఆదివారం (ఈనెల 22) వివాహాం జరగాల్సి ఉంది. ఇద్దరు మైనర్లు కావడంతో పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ చేసి పెళ్లిని నిలిపివేశారు. బాల్య వివాహాలు చట్టరీత్యానేరం.. సమాజంలో ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఇది చట్టరీత్యానేరం. బాల్య వివాహాల నిరోధక చట్టం– 2006 ప్రకారం 18 ఏళ్లు నిండి 19వ ఏట అడుగుపెట్టిన అమ్మాయి, 21 పూర్తయి 22 ఏళ్లకు చేరిన అబ్బాయి పెళ్లికి అర్హులు. అలాగే 2012 వచ్చిన పోక్సోచట్టం(పీవోసీఎస్వో) ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సీస్ లైంగిక దాడి నుంచి పిల్లల రక్షణ ప్రకారం 18 ఏళ్ల లోపు అమ్మాయికి గానీ, 21 ఏళ్లలోపు అబ్బాయికి వివాహం జరిగితే ఈ చట్టం ప్రకారం అత్యాచార కేసు నమోదు చేయబడుతుంది. అలాగే ప్రతీ ఒక్కరూ బాల్య వివాహాలపై అవగాహన కలిగి ఉండాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు.. వివాహ వయసు రాకముందే చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేయడం ఏమాత్రం సరికాదు. ఇలా చేయడం వల్ల పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. మానసికంగానూ వారు దెబ్బతింటారు. కనీసం 18ఏళ్లు నిండిన తర్వాతే అమ్మాయికి, 21ఏళ్లు నిండిన తర్వాతే అబ్బాయికి పెళ్లి చేయాలి. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునైనా బాల్యవివాహాలను చేయడం మానుకోవాలి. డాక్టర్ శోభాసుభాష్రావు, గైనకాలజిస్ట్ -
ఒకే ముహూర్తాన 131 పెళ్లిల్లు
సాక్షి, ఆసిఫాబాద్: ఒకే ముహూర్తాన 131 జంటలు మూడు ముడులు, ఏడు అడుగుల బంధంతో ఏకమయ్యాయి. ఇందులో 91 ఆదివాసీ జంటలున్నాయి. ఈ అపూర్వ ఘట్టానికి కుమురంభీం జిల్లా కాగజ్నగర్లోని ఎస్పీఎం గ్రౌండ్ వేది కైంది. బుధవారం సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వివిధ వర్గాల యువతీ యువకుల వివాహాలను ఘనంగా జరిపించారు. ఈ వేడుకలకు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ గెడం నగేశ్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నూతన జంటలకు కోనేరు ట్రస్టు ద్వారా ఉచితంగా పుస్తె మట్టెలు, వస్త్రాలు, ఫ్యాను, బీరువా తదితర సామగ్రిని కోనప్ప అందజేశారు. జంటలకు కల్యాణలక్ష్మి ద్వారా రూ.లక్షా నూటపదహార్లు అందజేస్తామన్నారు. -
‘పెళ్లి కానుక’లో తీవ్ర జాప్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఇచ్చే ఆర్థిక సాయం పంపిణీ గాడితప్పుతోంది. పెళ్లి నాటికి వధువు చేతికి అందాల్సిన నగదు సాయం ఏడాది గడిచినా అందని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ పథకంపై గంపెడాశలు పెట్టుకున్న దరఖాస్తుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాల కింద లబ్ధిదారులకు తొలుత రూ. 51 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించిన సర్కారు...గతేడాది నగదు సాయాన్ని రూ. 75,116కు, తాజా బడ్జెట్లో ఏకంగా రూ. 1,00,116కు పెంచేసింది. ఈ నెల ప్రారంభం నుంచి పెంచిన మొత్తం అమల్లోకి రానుంది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద నగదు సాయం భారీగా ఉండటంతో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. కానీ దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల నిర్ధారణ ప్రక్రియలో అధికారులు తాత్సారం చేస్తుండటంతో లబ్ధిదారులకు ఆర్థిక సాయం సకాలంలో అందడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 57 వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలు బాధ్యత తొలుత సంక్షేమశాఖలే నిర్వహించగా పారదర్శకత కోణంలో వాటి అమలు, పర్యవేక్షణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగానికి అప్పగించింది. అంతేకాకుండా లబ్ధిదారుల అర్హత నిర్ధారణలో శాసనసభ్యులను భాగస్వాములుగా చేసింది. దీంతో ఈ రెండు కేటగిరీల్లో పరిశీలన పూర్తయితేనే అర్హత తేలనుంది. ఈ నిబంధన పంపిణీ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. మీ–సేవా కేంద్రాల ద్వారా వచ్చే దరఖాస్తులు నేరుగా సంబంధిత తహసీల్దార్ యూజర్ ఐడీలోకి చేరతాయి. అనంతరం వాటిని సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించాలి. ధ్రువపత్రాలు, పెళ్లి జరిగిన తీరును నిర్ధారించి తహసీల్దార్కు నివేదిక ఇవ్వాలి. ఆ వివరాలను సంబంధిత శాసనసభ్యులకు పంపాక అర్హుల ఎంపిక పూర్తవుతుంది. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న దరఖాస్తుల్లో ఎక్కువ భాగం తహసీల్దార్ల వద్దే ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. నెలలకొద్దీ నిరీక్షణే... : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారుల ఎంపిక విషయంలో వీఆర్వోల నుంచి నివేదికలు అందుతున్నప్పటికీ భూ రికార్డుల ప్రక్షాళన నిర్వహణలో తహసీల్దార్లు తీరిక లేకుండా ఉండటంతో దరఖాస్తులు పెండింగ్లో పడుతున్నాయి.ఈ పథకాల కింద అర్హత సాధించినప్పటికీ ఖజానాపై ఆంక్షలుండటంతో లబ్ధిదారులకు సాయం అందడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 57 వేల పెండింగ్ దరఖాస్తులకు గాను రూ. 372.25 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు అంచనా. ఖజానాశాఖ నిధులు విడుదల చేసినప్పటికీ చెక్కుల పంపిణీలోనూ ఆలస్యమవుతోంది.ఎమ్మెల్యేలకు సమయం లేకపోవడంతో పంపిణీ వాయిదా వేస్తున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో లబ్ధిదారులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. -
పెళ్లి రోజే ‘లక్ష్మీ’ కటాక్షం
జగదేవ్పూర్(గజ్వేల్): అసెంబ్లీ సమావేశాల్లో కళ్యాణ లక్ష్మి పథకం కానుక రూ75 వేల నుంచి రూ.1,00,116 పెంచుతున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. పెళ్లి రోజే చెక్కును అందిస్తామని చెప్పారు. పెంచింది ఆలస్యమే లేదు అమలు చేశారు. ముందుగా సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో బుధవారం జరిగినా పెళ్లిలో కళ్యాణలక్ష్మి చెక్కును ఆర్డీసీ చైర్మన్ నర్సారెడ్డి, గఢా అధికారి హన్మంతరావులు వ« దువు కుటుంబానికి అందించి లాంఛనం గా ప్రారంభించారు. ఎర్రవల్లి గ్రామానికి చెందిన చెవేళ్ల చంద్రయ్య, పోచమ్మ దంపతుల కూతురు అశ్వినికి ఇటీవల యాదాద్రి జిల్లా రాజాపేట మండలం పారుపల్లి గ్రామానికి చెందిన శేఖర్తో నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా వారు కల్యాణలక్ష్మి కి దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం స్వయంగా ఎర్రవల్లి ఫంక్షన్హాల్లో పెళ్లి జరుగుతున్న క్రమంలోనే గఢా అధికారి హన్మంతరావు, ఆర్డీసీ చైర్మన్ తూంకుంట నర్సారెడ్డిలు పెళ్లి హాజరై కళ్యాణ లక్ష్మి ప థకం మంజూరైన రూ.1,00,116 చెక్కు ను వధువు తల్లి పోచమ్మ పేరు మీద అం దించి లాంఛనంగా పథకాన్ని ప్రారంభిం చారు. దేశంలోనే నంబర్వన్.. పేదోళ్లను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి పథకానికి శ్రీకారం చు ట్టారని, ఇటివల్లనే రూ.75 వేల నుంచి రూ.1,00,116 పెంచారని, ఇది పేదోళ్లకు వరమని ఆర్డీసీ చైర్మన్ నర్సారెడ్డి, గఢా అ ధికారి హన్మంతరావులు అన్నారు. ఎర్రవల్లిలో కళ్యాణలక్ష్మి చెక్కును అందించారు. అశ్విని ఆనందం... ఇన్నాళ్లు కళ్యాణలక్ష్మి పథకం చెక్కు అందలాంటే పెళ్లి అయి నెలలు గడిచిన రాలేని పరిస్థితి ఉండేవి. ప్రస్తుతం అలాంటి కష్టాలకు అశ్విని లగ్గంతోనే చెక్ పడింది. పెళ్లి రోజు కళ్యాణలక్ష్మి చెక్కును అందించడంతో అశ్విని ఆనందంతో మురిసిపోయింది. కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాగ్యబాల్రాజ్, జెడ్పీటీసీ రాంచంద్రం, ఎంపీటీసీ భాగ్యమ్మ, వీడీసీ అధ్యక్షులు కిష్టారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా పరిశీలకుడు పన్యాల భూపతిరెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా మాజీ అధ్యక్షుడు మదాసు శ్రీనివాస్, జగదేవ్పూర్ మండలాధ్యక్షుడు గుండా రంగారెడ్డి, గోపాల్రెడ్డి పాల్గొన్నారు. -
గిరి పుత్రిక.. ప్రోత్సాహం అందక.
కర్నూలు(అర్బన్):రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన గిరి పుత్రిక కల్యాణ పథకానికి సంబంధించిన బిల్లులు ట్రెజరీలో ఆగిపోయాయి. దీంతో ప్రభుత్వ ప్రోత్సాహకం కోసం గిరిజన సామాజిక వర్గానికి చెందిన కొత్త జంటలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాయి. 2015 ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత వివాహం చేసుకున్న గిరిజన యువతులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఒక్కో జంటకు ఏకమొత్తంలో రూ.50 వేల ప్రోత్సాహకాన్ని అందిస్తారు. ట్రైబల్ సబ్ప్లాన్ నుంచి నిధులను విడుదల చేసేందుకు వీలుగా ప్రభుత్వం జీఓ–12 జారీ చేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 106 గిరిజన జంటలు ప్రభుత్వ ప్రోత్సాహకం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ దరఖాస్తులను గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో విచారించారు. ఆ తర్వాత ప్రోత్సాహకం అందించేందుకు బిల్లులు సిద్ధం చేసి ట్రెజరీకి పంపారు. అలాగే ఇతర కులాల వారు ఎవరైనా గిరిజనులను వివాహం చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో జంటకు రూ.50 వేల ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. ఇందుకోసం జిల్లాలో ఐదు జంటలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇప్పటికి ఆరు నెలలు గడిచిపోయింది. వీరికి రూ.2.50 లక్షలు విడుదల చేయాలంటూ అధికారులు ట్రెజరీకి బిల్లులు పెట్టారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి బిల్లులు మంజూరు చేయకుండా ట్రెజరీలో ఫ్రీజింగ్ విధించింది. దీంతో గిరిజన సంక్షేమ శాఖకు చెందిన పలు బిల్లులు కూడా ఆగిపోయాయి. ఈ నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో తక్షణమే బిల్లులు మంజూరు కాకుంటే మరో నెల రోజులు ఎదురు చూడాల్సిందే. విద్యుత్ బిల్లులదీ ఇదే తీరు.. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ అమల్లోకి వచ్చిన తర్వాత 0 నుంచి 75 యూనిట్లలోపు గిరిజనుల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తోంది. జిల్లాలో 20,117 విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి రూ.41 లక్షల బిల్లులను ఆ శాఖకు చెల్లించేందుకు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ట్రెజరీకి పంపారు. అవి కూడా ఫ్రీజింగ్లో పడ్డాయి. ఈ నెలాఖరు నాటికి బిల్లులు చెల్లించాలని, లేని పక్షంలో కనెక్షన్లు కట్ చేస్తామని విద్యుత్ శాఖ హెచ్చరించే ప్రమాదముంది. గతంలోనూ ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా పలు ఎస్టీ కాలనీలు, తండాల్లో నేరుగా వినియోగదారుల నుంచి వసూలు చేశారు. ఫ్రీజింగ్ వెంటనే ఎత్తేయాలి ఏడాది క్రితం వివాహం చేసుకున్న గిరిజన వర్గాలకు చెందిన దంపతులు ప్రభుత్వ ప్రోత్సాహకం కోసం ఎదురు చూస్తున్నారు. ఇచ్చే రూ.50 వేలకు కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించడం బాధాకరం. విద్యుత్ వినియోగానికి సంబంధించిన బిల్లులను కూడా వెంటనే ఇవ్వాలి. లేదంటే గిరిజనులు ఇబ్బంది పడే అవకాశముంది.– ఆర్.యోగేష్నాయక్, లంబాడీ హక్కుల పోరాట సమితి యువజన విభాగం అధ్యక్షుడు మంజూరయ్యే అవకాశాలున్నాయి జిల్లా ట్రెజరీలో ఫ్రీజింగ్ కారణంగా ఆగిన పలు బిల్లులు త్వరలోనే మంజూరయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా గిరిపుత్రిక కల్యాణ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 30 మందికి మాత్రమే ప్రోత్సాహకం అందించాలనే లక్ష్యం ఉంది. అయినప్పటికీ అదనంగా బడ్జెట్ తెప్పించుకున్నాం. ఎస్టీ సబ్ప్లాన్ బడ్జెట్ బిల్లులు కూడా త్వరలోనే మంజూరవుతాయి. – హెచ్.సుభాషణరావు, జిల్లా గిరిజన సంక్షేమాధికారి -
మార్ఫింగ్ ఫొటోలతో కల్యాణలక్ష్మికి దరఖాస్తు
మెదక్ జోన్: డబ్బు కోసం కొందరు కల్యాణలక్ష్మి పథకాన్ని అభాసుపాలు చేస్తున్నారు. పెళ్లి ఫొటోలను మార్ఫింగ్ చేయించి దరఖాస్తు చేసుకొని అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. వేరే దంపతుల ఫొటోలకు తలలను మార్చి దర ఖాస్తు చేసుకుంటున్నారు. ఇటీవల మెదక్ రెవెన్యూ కార్యాలయంలో మార్ఫింగ్ చేసిన పెళ్లి ఫొటోను అధికారులు గుర్తించారు. మెదక్ తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వ హించే లక్ష్మణ్ అనే ఉద్యోగి అన్న కూతురు సౌజన్య పెళ్లిని 2017లో జోగిపేట మండలం చిన్నచింతకుంట గ్రామంలో వివాహం జరిపించారు. ఆ దంపతుల ఫొటోలోని తలలను మార్ఫింగ్ చేసి ఆ ఫొటోతో ఇటీవల మెదక్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కల్యాణలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అక్కడే విధులు నిర్వహించే లక్ష్మణ్ ఆ ఫొటోలో దంపతుల వెనకాల ఉన్న తన ఫొటోను చూసి అవాక్కయ్యాడు. ఆ ఫొటోలోని బంధువులు, ఆ దంపతులు తన అన్న కూతురు, అల్లుడిగా గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. మెదక్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన బొమ్మర్ది బాలయ్య తన కూతురు లక్ష్మిని దుబ్బాక గ్రామానికి చెందిన రాజుకి ఇచ్చి చర్చిలో వివాహం జరిపించినట్లు సమాచారం. క్రిస్టియన్లకు కల్యాణలక్ష్మి పథకం వర్తించదనే ఆలోచనతో మెదక్లోని ఓ ఫొటో స్టూడియోలో సౌజన్య దంపతుల పెళ్లి ఫొటోకు లక్ష్మి, రాజుల తలలను మార్ఫింగ్ చేయించి కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసుకున్నాడు. మెదక్లోని పలు ఫొటో స్టూడియోల్లో ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్నారు. అలాంటివారిపై చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఫ్లెక్సీలను నిషేధించినా మెదక్లో మాత్రం య«థావిధిగా తయారు చేస్తున్నారు. విచారణ జరుపుతున్నాం... ఈ విషయంపై విచారణ జరుపుతున్నాం. పెళ్లి ఫొటోలను ఎందుకు మార్ఫింగ్ చేయాల్సి వచ్చిందో విచారించి చర్యలు తీసుకుంటాం. – యాదగిరి, తహసీల్దార్, మెదక్ -
మన పథకాలు దేశంలోనే ఆదర్శం
బాన్సువాడ: రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పథకాలను ప్రవేశపెట్టి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంద ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన స్వగృహంలో వర్ని మండలం ఘన్పూర్ గ్రామస్తులు సర్పంచ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎకరాకు రూ. 4వేల చొప్పున ఇవ్వడం దేశంలో ఎక్కడా లేదని, కర్ణాటక ప్రభుత్వం దీన్ని ఆదర్శంగా తీసుకొని అక్కడ ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. తమ ప్రభు త్వం గ్రామాల అభివృద్ధితో పాటు వ్యక్తిగతంగా ప్రతిఒక్కరికి సంక్షేమ ఫలాలను అందజేస్తోందని పేర్కొన్నారు. షాదీముబారక్, కల్యాణ లక్ష్మి, వృద్ధాప్య, వికలాంగ, ఒంటరి మహిళా పింఛన్లు అందిస్తోందన్నారు. ప్రతి ఒక్క గ్రామంలో మిషన్ కాకతీయ పేరుతో చెరువుల అభివృద్ధి, సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం, వైకుంఠధామం నిర్మాణం చేపట్టామన్నారు. కాంగ్రెస్ సర్పంచ్ సహా 300 మంది చేరిక వర్ని మండలం ఘన్పూర్ సర్పంచ్ చందర్నాయక్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది గ్రామస్తులు ఆదివారం మంత్రి పోచారం సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ నిర్మాణానికి రూ. 16లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. డ్రెయినేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. కాగా పార్టీలో చేరిన వారిలో సర్పంచ్ చందర్నాయక్, ఉపసర్పంచ్ సాయగొండ, మాజీ సర్పంచ్ నర్సయ్య ఉన్నారు. కార్యక్రమంలో దేశాయిపేట సొసైటీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, వర్ని ఏఎంసీ చైర్మన్ నారోజి గంగారాం, పార్టీ మండలాధ్యక్షుడు వీర్రాజు, సొసైటీ చైర్మన్ వీర్రాజు, ఎంపీపీ బజ్యానాయక్, నాయకులు బద్యానాయక్, కిషోర్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, మహ్మద్ ఎజాస్, అంజిరెడ్డి, పోతురెడ్డి పాల్గొన్నారు. సమర్థమైన పాలన బీర్కూర్: సమర్థ, సుస్థిర పాలన అందించడంలో సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన బీర్కూర్ మండలంలో పలువురు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు తాము అందించనున్న పెట్టుబడి సాయం పథకం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సహా కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించిందన్నారు. బాన్సువాడ నియోజకవర్గాన్ని ఆదర్శంగా మార్చడానికి ఎంతో కృషి చేస్తున్నాని పేర్కొన్నారు. అనంతరం మాజీ ఎంపీపీ విజయ్ప్రకాశ్, కాంగ్రెస్ నాయకులు సాహెబ్రావు, ఐదుగురు వార్డు సభ్యులు, కులసంఘాల నాయకులకు, వందలాది మంది కార్యకర్తలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భారీ బైక్ ర్యాలీ దామరంచ నుంచి బీర్కూర్ వరకు ఆదివారం మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి తనయులు సురేందర్రెడ్డి, భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. దామరంచ, అన్నారం, చించోలి, కిష్టాపూర్, బీర్కూర్లో మంత్రి టీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించారు. బీర్కూర్లోని బారడిపోచమ్మ, కామప్ప, హనుమాన్ మందిరాల్లో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్లు పెర్కశ్రీనివాస్, నార్లసురేష్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ద్రోణవల్లి సతీశ్, నాయకులు బద్యానాయక్, మహ్మద్ ఎజాస్, ద్రోణవల్లి అశోక్, అప్పారావు, పల్లికొండ సాయిబాబా, రాజప్ప తదితరులు పాల్గొన్నారు. -
ఆడబిడ్డకు మేనమామ కేసీఆర్
యాదగిరిగుట్ట(ఆలేరు) : ఆడబిడ్డల పెళ్లీలకు ఈ రోజులలో సొంత మేనమామ కూడా ఆదుకోలేని పరిస్థితిల్లో, తెల్లరేషన్కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి కల్యాణలక్ష్మి ద్వారా రూ.75,116లు ఇచ్చి ఆడపిల్లల మన్ననలను సీఎం కేసీఆర్ పొందుతూ, వారికి మేనమామగా ఉంటున్నాడని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. గురువారం యాదగిరిగుట్ట మండలంలో కల్యాణలక్ష్మి పథకంలో అర్హులైన 63 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఆమె అందజేశారు. ఇందులో రూ.75,116 చెక్కులు 57 మందికి, రూ.51వేయ్యి 6 మందికి అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దేశంలో ఏ ప్రభుత్వం అందించని విధంగా ప్రతి పేదింటి ఆడపిల్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద వారి వివాహాలకు రూ.75,116లు అందించి ఆదుకుంటున్నారన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు చేసుకుంటే కేసీఆర్ కిట్టు కింద ప్రతీ మహిళకు రూ.15వేలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారన్నారు. అంతే కాకుండా బాలింతలకు, గర్భిణులకు అంగన్వాడీ కేంద్రాల్లో బాలామృతం పేరుతో పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యానికి సీఎం రక్షణగా నిలుస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ, డిప్యూటీ తహసీల్దార్ సలీమొద్దిన్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కసావు శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, ఉపాధ్యక్షుడు నువ్వుల రమేష్, యువజన విభాగం కన్వీనర్ గడ్డమీది రవీందర్గౌడ్, నాయకులు కవిడే మహేందర్, బీర్ల మహేష్, కాంటేకార్ పవన్కుమార్ తదితరులున్నారు. -
కల్యాణ కానుకకు రూ.1,000 కోట్లు
సాక్షి, హైదరాబాద్: పేదింటి ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో తలపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో భారీ నిధులు కేటాయించనుంది. ప్రస్తుతం ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి రూ.75వేల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. తాజాగా ఈ సాయాన్ని ఏకంగా రూ.లక్షకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా 2018–19 వార్షిక సంవత్సరంలో బడ్జెట్ కింద ఏకంగా రూ.1,000 కోట్లు కేటాయించబోతోంది. ఈ మేరకు పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు దరఖాస్తులు, పంపిణీ తదితర వివరాలను సమర్పించాలని సంక్షేమ శాఖలకు ప్రభుత్వంఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో శాఖల వారీగా లబ్ధిదారులు, పంపిణీ చేసిన సాయం వివరాలను అధికారులు సమర్పించారు. ఈ రెండు పథకాల కింద ఇప్పటివరకు 3.25 లక్షల దరఖాస్తులు రాగా... వీటిలో 3లక్షల మందికి ఆర్థిక సాయాన్ని మంజూరు చేశారు. 2018–19 వార్షిక సంవత్సరానికి లక్ష దరఖాస్తులు రావొచ్చని అంచనా. ఈ నేపథ్యంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు వార్షిక బడ్జెట్ కింద రూ.వెయ్యి కోట్లకు సంక్షేమ శాఖలు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించాయి. కల్యాణలక్ష్మి పథకాన్ని ఈబీసీ(ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు)లకూ వర్తింపచేయాలని ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించింది. -
టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్
దౌల్తాబాద్(కొడంగల్): మండల పరిధిలోని కుదురుమళ్లలో మంగళవారం నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ గందరగోళంగా మారింది. ఓ దశలో కార్యకర్తలు కొట్టుకునే స్థాయికి చేరుకుంది. చివరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. వివరాలు.. కుదురుమళ్లలో కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీకి మహబూబ్నగర్ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్సీ పట్నం నరేందర్రెడ్డి వచ్చారు. తహసీల్దార్ అతిథులుగా జెడ్పీ చైర్మన్తోపాటు ఎమ్మెల్సీ, జెడ్పీటీసీ, ఎంపీపీని ప్రోటోకాల్ ప్రకారం వేదికపైకి ఆహ్వానించారు. దౌల్తాబాద్ ఎంపీపీ నర్సింగ్భాన్సింగ్ స్థానిక ఎమ్మెల్యే రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిని స్టేజీపైకి ఆహ్వానించాలని తహసీల్దార్ను కోరారు. అంతలోనే జెడ్పీ చైర్మన్ కల్పించుకుని ఆయన ఎవరు..? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సోదరుడని ఎంపీపీ చెప్పడంతో ప్రొటోకాల్ ప్రకారం ఆయన స్టేజీపైకి అవసరం లేదన్నారు. దీంతో ఒక్కసారిగా టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు తోపులాటకు దిగారు. దాదాపు గంటసేపు ఆందోళనగా మారడంతో ఉత్కంట చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని తిరుపతిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు జై తెలంగాణ...రేవంత్రెడ్డి డౌన్...డౌన్ అంటూ.. కాంగ్రెస్ కార్యకర్తలు నరేందర్రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో పరిస్థితి అదుపుతప్పింది. పోలీసులు తిరుపతిరెడ్డితోపాటు ఎంపీపీ నర్సింగ్భాన్సింగ్, నాయకులను సమావేశం నుంచి బయటకు పంపించారు. కార్యకర్తలు నినాదాలు చేయడంతో వారిని చెదరగొట్టారు. అనంతరం ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతుంటే ఇలా దౌర్జాన్యం చేసి గొడవలు దిగడం సరికాదన్నారు. వారికి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు సూచించారు. ఎమ్మెల్సీ నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటే రానున్న రోజుల్లో ప్రజలే తరమికొడతారన్నారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. -
‘చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు’
సాక్షి, పెద్దపల్లి : చట్టసభల్లో బీసీలకు తగిన స్థానాలు లేవని, రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు బీసీలకు సముచిత స్థానం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఇక్కడ మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బీసీ సంఘాల ఫెడరేషన్లకు బడ్జెట్లో రూ.500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల వరకు కేటాయించాలని కోరారు. బీసీ కార్పొరేషన్కు రూ. 2 వేల కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్కు రూ. 2 వేల కోట్ల నిధులు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మీ పథకం కింద బీసీలకు రూ. 2 లక్షలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
మహిళా సంక్షేమమే లక్ష్యం
మిర్యాలగూడ రూరల్ : రైతు, మహిళల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. ఆదివారం మండలం పరిధిలోని పలు గ్రామాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. వెంకటాద్రిపాలెం, జప్తివీరప్పగూడెం, తుంగపహాడ్, బాదలాపురం, ఆలగడప, రాయినిపాలెం, గూడూరు, రుద్రారం, కొత్తగూడెం, ఉట్లపల్లి, తక్కెళ్లపహాడ్, తడకమళ్ల గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 359 మందికి రూ.1,83,09,000 కల్యాణలక్ష్మి పథకం ద్వారా అందజేస్తున్నట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. పేదలకు ఆడపిల్ల భారం కాకూడదని వారి పెళ్లికి రూ.75,016 అందజేస్తున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాడని అన్నారు. మార్చిలో రైతుకు నూతన పాస్ పుస్తకాలు జారీ, మేలో రైతులకు ఎకరాకు రూ.4వేలు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మాలి కృష్ణారెడ్డి, ఎంపీపీ ఒగ్గు జానయ్య, వైస్ఎంపీపీ నూకల సరళహన్మంతరెడ్డి, జెడ్పీటీసీ మట్టపల్లి నాగలక్ష్మీసైదులు యాదవ్, నాయకులు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, మేడ సురేందర్రెడ్డి, రవీందర్రెడ్డి, సర్పంచ్లు మంజులవెంకటేశ్వర్లు, శశికళ శ్రీనివాసరెడ్డి, వీరమ్మ, ఎంపీటీసీ లలిత, చిట్టిబాబు, చౌగాని భిక్షంగౌడ్, యదగిరి, సైదులు, అశోక్రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఇక ‘లక్ష’ణంగా ఆడపిల్ల పెళ్లి!
సాక్షి, హైదరాబాద్: పేదింటి ఆడపిల్లకు ప్రభుత్వం త్వరలో తీపికబురు అందించనుంది. పెళ్లి కానుకగా అందిస్తున్న ఆర్థిక సాయాన్ని పెంచాలని నిర్ణయించింది. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పేరుతో ప్రభుత్వం గత నాలుగేళ్లుగా ఈ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీలకు చెందిన నిరుపేద కుటుంబాల్లోని ఆడ పిల్లలకు పెళ్లి కోసం ప్రభుత్వం రూ.75,116 అందిస్తోంది. త్వరలోనే ఈ సాయాన్ని రూ.లక్షకు పెంచనుంది. వచ్చే బడ్జెట్లో అందుకు తగిన నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత సీఎం అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ముస్లిం కుటుంబాలకు షాదీ ముబారక్, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు కల్యాణలక్ష్మి పేరుతో అమలు చేసింది. 2016–17 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకాన్ని బీసీలు, అగ్ర కులాల్లోని పేదలకూ విస్తరించింది. తొలుత రూ.51 వేల ఆర్థిక సాయా న్ని ఆడపిల్లల తల్లి పేరుతో చెక్కు రూపంలో అందించారు. 2017–18 బడ్జెట్లోనే ఈ ఆర్థిక సాయాన్ని రూ.75,116 కు పెంచింది. 3 లక్షల మందికి కానుక.. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 3,02,856 మంది ఆడపిల్లలు పెళ్లి కానుక అందుకున్నారు. తొలి ఏడాది బడ్జెట్లో రూ.70 కోట్లతో ప్రారంభించిన ఈ పథకానికి ప్రభు త్వం లబ్ధిదారులు పెరిగిన కొద్దీ సరిపడా నిధులు కేటాయించింది. 2015–16లో రూ.388.66 కోట్లు, 2016–17లో రూ.530. 17 కోట్లు, 2017–18లో ఇప్పటి వరకు రూ.818.5 కోట్లు ఖర్చు చేసింది. మొత్తం రూ.1807.33 కోట్లు వెచ్చించింది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి ఈ పథకం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నారు. రాజకీయంగా కూడా ప్రయోజనకరంగా ఉందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అందుకే సాయాన్ని రూ.లక్షకు పెంచేందుకు సీఎం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. -
బిడ్డతో వచ్చి.. కల్యాణలక్ష్మి చెక్కు
జగిత్యాల రూరల్: పేదింటి ఆడపిల్ల పెళ్లి ఖర్చుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం అధికారుల తీరుతో అపహాస్యానికి గురవుతోంది. జగిత్యాల జిల్లాలో పెళ్లి సమయంలో పథకానికి దరఖాస్తు చేయగా.. వారికి పిల్లలు పుట్టిన తర్వాత చెక్కు రావటం.. ఆ దంపతులు తమ పిల్లలతో వచ్చి చెక్కు తీసుకోవటం చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల మండలం కండ్లపల్లికి చెందిన కత్తి అనూషకు మెట్పల్లి మండలం కోనరావుపేటకు చెందిన పుల్ల సాగర్తో వివాహం జరిగింది. 16 నెలల క్రితం కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అనూషకు నాలుగు నెలల క్రితం పాప జన్మించింది. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కులు ఇస్తున్నారని వారికి సమాచారం అందగా.. తమ పాపతో సహా వచ్చారు. అయితే, లబ్ధిదారులందరికీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి చెక్కులు పంపిణీ చేయగా, అనూష దంపతులతో పాటు మరో మూడు జంటలను అధికారులు పక్కకు తీసుకెళ్లి చెక్కులు ఇవ్వటం గమనార్హం. ఆ ముగ్గురూ కూడా పిల్లలతో వచ్చిన వారే కావడం కొసమెరుపు. -
చెల్లని ‘షాదీ’ చెక్కులు
తాండూరు: షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి పథకాల ద్వారా ఆడపడుచులకు ప్ర భుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఇం దులో భాగంగా తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్, యాలాల, పెద్దే ముల్, తాండూరు మండలాలకు చెంది న ఆడపడుచుల వివాహాల అనంతరం ఈనెల 5న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మ హేందర్రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. యాలాల మండలానికి చెందిన 30 మం ది, తాండూరు మండలం 32, పెద్దేముల్ 13, బషీరాబాద్ 17 చెక్కులను మొత్తం 92 మంది రూ.58 లక్షల చెక్కులను పం పిణీ చేశారు. మంత్రి చేతుల మీదుగా కొంత మందికి అందించిన అనంతరం ఆయా మండలాల్లోని తహసీల్దార్లు లబ్ధిదారులకు సోమవారం పంపిణీ చేశా రు. అయితే మంత్రి, అధికారులు పంపి ణీ చేసిన చెక్కులను తీసుకొని లబ్ధిదారులు తమ ఖాతాల్లో వేసేందుకు వెళితే.. చెక్కులు చెల్లవని బ్యాంకు అధికారులు చెప్పారు. ఈ విషయాన్ని పలువురు లబ్ధిదారులు తాండూరు సబ్ కలెక్టర్ కార్యా లయంలో చెప్పుకొనేందుకు వెళ్లగా అక్క డి ఉద్యోగి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. స్థానిక విలేకరులకు తమ గోడును విన్నవించుకున్నారు. – యాలాల మండలం ముకుందాపూర్కు చెందిన లావణ్యకు పెద్దేముల్ మండలం జనగాం గ్రామానికి చెందిన వెంకటప్పతో గతేడాది వివాహం జరిగింది. కల్యాణలక్ష్మి పథకం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం రూ.51 వేలు చెక్కును మంజూరు చేసింది. మంత్రి మహేందర్రెడ్డి చేతుల మీదుగా ఇటీవల చెక్కును అందుకున్నారు. మంగళవారం ఏడీబీ బ్యాంకులో చెక్కు వేసేందుకు వెళితే చెల్లదన్న సమాధానం అధికారుల నుంచి రావడంతో చేసేది లేక వెనుతిరిగారు. – యాలాల మండలం ముద్దాయిపేట్కు చెందిన వాసిద్ఖాన్, నసామా దంపతుల కుమార్తె నజ్నిన్ఖాతూన్ను పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన ముబీన్తో వివాహం అయ్యింది. షాదీ ముబారక్ కింద జనవరిలో దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 5న చెక్కును ప్రభుత్వం నుంచి అందుకున్నారు. తీరా బ్యాంకుకు వెళితే చెక్కు చెల్లదంటూ అధికారులు చెప్పడంతో వారు ఆందోళన చెందారు. బ్యాంకర్లతో మాట్లాడతా.. షాదీముబారక్, కల్యాణలక్ష్మి లబ్ధిదారులు సబ్కలెక్టర్ కార్యాలయానికి వచ్చినట్లు సమాచారం లేదు. ఈ పథకానికి సంబంధించిన చెక్కులు చెల్లవన్న బ్యాంకర్లతో మాట్లాడుతా. ఈవిషయమై పూర్తి స్థాయిలో విచారణ చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతా. పథకాలకు సంబంధించి అందించిన చెక్కులనన్నీ.. డివిజన్ పరిధిలో పంపిణీ చేశాం. ఎక్కడ పొరపాటు జరిగిందనే విషయమై విచారణ చేసి లబ్ధిదారులకు న్యాయం చేస్తాము. – అశోక్కుమార్, డీఏఓ, సబ్ కలెక్టర్ కార్యాలయం, తాండూరు -
పేదల కష్టం తెలిసినోడు కేసీఆర్
► డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి ► కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ మెదక్ మున్సిపాలిటీ: మన కడుపునొప్పి తెలిసినోడు కేసీఆర్ అని డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం మాయ గార్డెన్లో నియోజకవర్గంలోని 214మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడ పిల్లల తల్లిదండ్రులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషిచేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 45వేల చెరువులను గుర్తించి మిషన్కాకతీయ ద్వారా పునరుద్ధరిస్తోందన్నారు. చెరువులకు జలకళ రావడంతో ఊర్లు బాగుపడుతాయన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పటికే పైప్లైన్ల నిర్మాణం పూర్తైందని, డిసెంబర్లోగా ఇంటింటికీ తాగునీరు అందిస్తామని చెప్పారు. మెదక్ నియోజకవర్గానికి రెండు వేల డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరయ్యాయని, అర్హులకు వాటిని కేటాయిస్తామని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం విద్యుత్ కొరత లేకుండా సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారన్నారు. రైతులకు వ్యవసాయ పెట్టుబడుల కోసం ఎకరాకు రూ. నాలుగు వేలు అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం అందిస్తోందన్నారు. ఆసరా పింఛన్లతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు చేయూతనిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ మెంచు నగేశ్, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, రామాయంపేట ఎంపీపీ విజయలక్ష్మి, పాపన్నపేట జెడ్పీటీసీ స్వప్న, పాపన్నపేట ఎంపీపీ పవిత్ర, తహసీల్దార్ యాదగిరి, మున్సిపల్ వైస్చైర్మన్ రాగి అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
బడ్జెట్ బాట.. వరాల మూట
గ్రామీణ ఆర్థిక ప్రగతి లక్ష్యంగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి.. భారీగా వరాల జల్లు కురిపించింది. అందులోని ముఖ్యాంశాలివీ... ♦ రెండేళ్లలో 4 లక్షల యాదవ కుటుంబాలకు 84 లక్షల గొర్రెల పంపిణీ. అర్హత గల కుటుంబానికి 20 గొర్రెలు, ఒక పొట్టేలు 75 శాతం సబ్సిడీతో పంపిణీ. పొరుగు రాష్ట్రాల నుంచి గొర్రెల కొనుగోలు. గొర్రెల మేతకు అనువుగా అటవీ భూముల్లో స్టైలో గ్రాస్ పెంపకం. ♦ రాష్ట్రవ్యాప్తంగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల అభివృద్ధి. పెంపకంతోపాటు నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. మార్కెటింగ్ సౌకర్యాలతోపాటు రిటైల్ మార్కెట్లను నిర్మిస్తుంది ♦ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడపిల్లల పెళ్లికి ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం రూ.51 వేల నుంచి రూ.75,116కు పెంపు ♦ ఎంబీసీలకు (అత్యంత వెనుకబడిన కులాలు) ప్రత్యేక కార్పొ రేషన్. ఎంబీసీల అభివృద్ధి, సంక్షేమానికి రూ.1000 కోట్లు ♦ రజక, నాయి బ్రాహ్మణుల పథకాలకు రూ.500 కోట్లు. నాయిబ్రాహ్మణులు ఆధునిక క్షౌరశాలలు ఏర్పాటు చేసుకు నేందుకు ప్రభుత్వ పెట్టుబడి. రజకులకు వాషింగ్ మెషీన్లు, డ్రైయర్లు, ఐరన్ బాక్సుల పంపిణీ. దోబీఘాట్ల నిర్మాణం ♦ విశ్వకర్మలుగా పిలిచే ఔసల, కమ్మరి, కంచరి, వడ్రంగి, శిల్పకారులకు అవసరమైన ఆర్థిక సహకారం. రూ.200 కోట్లు కేటాయింపు. బట్టలు కుట్టే మేర, గీత కార్మికులకు, కుమ్మరి పనివారికి పరికరాల పంపిణీ ♦ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు రూ.100 కోట్లు ♦ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు మూడు విడతలుగా మొత్తం రూ.12 వేల ప్రోత్సాహకం. ఆడపిల్లను కన్న మహిళలకు ప్రత్యేకంగా మరో రూ.వెయ్యి ప్రోత్సాహకం ♦ పుట్టిన బిడ్డల సంరక్షణకు అవసరమయ్యే 16 వస్తువులతో ‘కేసీఆర్ కిట్’ పంపిణీ. తల్లీబిడ్డకు ఉపయోగపడే సబ్బులు, బేబీ ఆయిల్, చిన్న పిల్లల పరుపు, దోమ తెర, డ్రెస్సులు, చీరలు, హ్యాండ్ బ్యాగ్, టవళ్లు, నాప్కిన్స్, పౌడర్, డైపర్లు, షాంపు, పిల్లల ఆట వస్తువులు ఇందులో ఉంటాయి. ‘కేసీఆర్ కిట్’కు బడ్జెట్లో రూ.605 కోట్లు కేటాయింపు ♦ అంగన్వాడీ కేంద్రాలకు సన్నబియ్యం పంపిణీ ♦ ఒంటరి మహిళలకు నెలకు వెయ్యి రూపాయల ఆసరా ఫించన్లు. ఏప్రిల్ నుంచి అమలు ♦ సైనికుల సంక్షేమ చర్యలకు సంక్షేమ నిధి ♦ జర్నలిస్టుల సంక్షేమానికి రూ.30 కోట్లు ♦ మూసీ నదీ తీర ప్రాంత అభివృద్ధికి రూ.350 కోట్లు ♦ ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు.. సెంటినరీ బ్లాక్ నిర్మాణానికి రూ.200 కోట్లు ♦ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడు ఎస్సీ కాలేజీలు, కొత్త స్టడీ సర్కిళ్లు. ఒక్కో ♦ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బీసీ గురుకుల పాఠశాలల ప్రారంభం. మైనారిటీలకు 130 రెసిడెన్షియల్ స్కూళ్లు ♦ వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలకు 330 గోదాంల నిర్మాణం ♦ కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాం దిగువన రూ.506 కోట్లతో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు. ఈ ఏడాది రూ.193 కోట్ల కేటాయింపు ♦ వరంగల్లో టెక్స్టైల్ పార్కు, సిరిసిల్లలో అపరెల్ పార్కు ఏర్పాటుకు నిర్ణయం. నేత కార్మికులకు రూ.1,200 కోట్లు . ♦ ఇమామ్లు, మౌజాములకు ఇచ్చే రూ.వెయ్యి గౌరవ వేతనం రూ.1500కు పెంపు ♦ అంగన్వాడీ టీచర్ల జీతం రూ.10,500కు పెంపు. హెల్పర్ల జీతం రూ.6,000కు పెంపు ♦ వీఆర్ఏల జీతం రూ.10,500కు పెంపు. దీనికి అదనంగా రూ.200 తెలంగాణ ఇంక్రిమెంట్. విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు రూ.5 వేల జీతం ♦ కొత్త జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణానికి రూ.600 కోట్లు. కొత్త సచివాలయం నిర్మాణానికి రూ.50 కోట్లు ♦ హైదరాబాద్లో మూడు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం. కరీంనగర్లో ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించే ప్రతిపాదన ♦ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణించిన వారి మృతదేహాల తరలింపునకు మరో 50 వాహనాల కొనుగోలు ♦ జీహెచ్ఎంసీకి రూ.వెయ్యి కోట్లు. గ్రేటర్ వరంగల్కు రూ. 300 కోట్లు. మిగతా మున్సిపల్ కార్పొరేషన్లకు రూ.400 కోట్లు. -
కల్యాణానికి అందని లక్ష్మి
ఆర్నెల్లు దాటినా అందని సాయం పెండింగ్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులు 95,579 దరఖాస్తుల్లో 30,390 మందికే సాయం.. దరఖాస్తుల పరిశీలనలో రెవెన్యూ అధికారుల ఉదాసీనత ఆడబిడ్డ తల్లిదండ్రుల ఎదురుచూపులు ఆసిఫ్నగర్కు చెందిన సంద పూజ వివాహం యాచారం గ్రామానికి చెందిన శ్రీనివాస్తో గతేడాది ఏప్రిల్29న జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన పూజ కుటుంబం ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకుంది. పెళ్లై 9 నెలలు గడిచినా దరఖాస్తు మాత్రం తహశీల్దారు వద్దే పెండింగ్లో ఉంది. పెళ్లిరోజు అందాల్సిన ఆర్థిక సాయం ఇప్పటికీ అందకపోవడంతో ఆ కుటుంబం సాయం కోసం ఎదురు చూస్తోంది. సాక్షి, హైదరాబాద్: పేదింటి ఆడబిడ్డ పెళ్లి.. భారం కాకుండా ప్రభుత్వమే ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో తలపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. వాస్తవానికి పెళ్లిరోజు నాటికి లబ్ధిదారులకు రూ.51వేల ఆర్థిక సాయం అందాలి. అయితే సర్కారు లక్ష్యం ప్రస్తుతం గాడితప్పుతోంది. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలోనే జాప్యం వల్ల పెళ్లై ఆర్నెళ్లు గడిచినా అర్హులకు ఆర్థిక సాయం అందట్లేదు. దీంతో నెలల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. పెండింగ్లో దరఖాస్తులు.. ప్రస్తుత వార్షికంలో అన్ని కేటగిరీలకు సంబంధించి ఇప్పటివరకు 95,579 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఇప్పటివరకు 59,593 దరఖాస్తులను అర్హులుగా నిర్ధారించారు. వీటిలో 30,390 మందికే ఖాతాల్లో ఆర్థికసాయాన్ని జమచేశారు. మిగతా లబ్ధిదారులకు చెల్లింపులు ట్రెజరీల్లో పెండింగ్లో ఉన్నాయి. వేలాది దరఖాస్తుల పరిశీలన ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో వెబ్సైట్ దాదాపు నెలరోజుల పాటు నిలిచిపోవడంతో ఆ సమయంలో దరఖాస్తుల పరిశీలన అటకెక్కింది. తర్వాత వెబ్సైట్ పునరుద్ధరించినప్పటికీ దరఖాస్తుల పరిశీలన ఊపందుకోలేదు. మరోవైపు గత నెలరోజులుగా మంచి ముహూర్తాలు లేకపోవడంతో పెళ్లిళ్లు పెద్దగా జరగలేదు. ఈ నేపథ్యంలో కొత్త దరఖాస్తులు రాకున్నా, పాతవాటి పరిశీలన నత్తనడకన సాగడంతో దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడంలేదు. బాధ్యతల బదిలీతో.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల పర్యవేక్షణ సంక్షేమ శాఖలు నిర్వహించేవి. కానీ ఈ పథకాల్లో అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం ఆ బాధ్యతల్ని రెవెన్యూ శాఖకు బదిలీ చేసింది. ప్రస్తుతం ఆర్డీవో, తహశీల్దార్ గ్రామ రెవెన్యూ అధికారుల స్థాయిలో ఈ పథకం పర్యవేక్షణ జరుగుతోంది. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుడి స్థితిగతులు పరిశీలించిన తర్వాత తహశీల్దార్ నివేదిక ఆధారంగా ఆర్డీవోలు అర్హులను ఎంపిక చేసి లబ్ధిదారులకు ఆర్థికసాయం అందిస్తారు. అయితే రెవెన్యూ అధికారులకు శాఖపరమైన పనులతో బిజీగా ఉండడంతో వీటి పరిశీలనపై దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలున్నాయి. గతవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో దరఖాస్తుల పరిశీలన విషయంలో ఉన్నతాధికారులు ఆర్డీవోలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
బీసీ కులాలకు బడ్జెట్ భరోసా
ప్రజాకర్షక పథకాలు ప్రకటించనున్న ప్రభుత్వం కొత్త పథకాలపై ముమ్మరంగా శాఖల కసరత్తు సాక్షి, హైదరాబాద్: నాలుగో వార్షిక బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకాలకు తోడు పలు కొత్త పథకాలకు ఈ బడ్జెట్లో చోటు కల్పించనుంది. మానవీయకోణంతోపాటు సంక్షేమానికి పెద్దపీట వేసే సంకల్పంతో వీటికి రూపకల్పన చేస్తోంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటు బ్యాంకును తెచ్చి పెట్టే వర్గాలను ఈసారి లక్ష్యంగా ఎంచుకుంటోంది. ప్రధానంగా బీసీ సామాజిక వర్గాలపై వరాల జల్లు కురిపించే అవకాశాలున్నాయి. సామాజికంగా, వ్యక్తిగ తంగా లబ్ధి చేకూర్చటంతోపాటు ప్రభుత్వానికి పేరు తెచ్చిపెట్టే బహుళ ప్రయోజనాలుండేలా ఆకర్షణీయంగా కొత్త పథకాలు రూపొందించా లని భావిస్తోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సన్నిహిత మంత్రులతోపాటు అధికా రులకు ఈ మేరకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన మూడేళ్ల లో బడ్జెట్లో భారీ ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యమిచ్చింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతోపాటు సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అయితే భారీ పథకాలు, సాగునీటి ప్రాజెక్టుల నత్తనడక, వరుసగా ఎదురవుతున్న అవాంతరాలపై సీఎం అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో 2017ృ18 బడ్జెట్లో ఆకర్షణీయమైన చిన్న పథకాలకు చోటు కల్పించాలని.. ఎక్కువ మందికి తక్షణ ప్రయోజనం కల్పించేలా వాటిని డిజైన్ చేయాలని నిర్దేశించారు. ఇందులో భాగంగా కల్యాణలక్ష్మి పథకానికి నగదు పెంపు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు రూ.15 వేల ప్రోత్సాహకం, బాలింతల సంక్షేమానికి కేసీఆర్ కిట్, భారీ సబ్సిడీతో గొర్రెల పెంపకం యూనిట్లు, మత్స్యకారులకు లాభాల పంట పండేలా చేపల పెంపకం.. తదితర అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఇప్పటికే ఉన్నత స్థాయిలో జరిగిన సమాలోచనల మేరకు వివిధ శాఖలు వీటిపై కసరత్తు ప్రారంభించాయి. 75 శాతం సబ్సిడీతో గొర్రెలు వ్యవసాయానికి అనుబంధంగా ఉండే గొర్రెల పెంపకానికి ఈ బడ్జెట్లో ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇవ్వనుంది. ఏడాదికి లక్ష యూనిట్లు లక్ష్యంగా.. రెండేళ్లలో రెండు లక్షల యూనిట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం యోచి స్తోంది. ఒక్కో యూనిట్లో 22 గొర్రెలుం టాయి. 50 శాతం నుంచి 75 శాతం వరకు భారీ సబ్సిడీతో ఈ పథకానికి రూపకల్పన చేసేందుకు కసరత్తు మొదలైంది. దీంతో రెండు లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని యోచిస్తోంది. మత్స్యకారులకు రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్... చేపల పెంపకాన్ని ప్రోత్సహించి మత్స్య కారులకు లాభాల పంట పండించేలా ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్ను ఏర్పాటు చేసి తెలంగాణలోని మత్స్యకారులందరినీ అందులో సభ్యులుగా చేర్చాలని యోచి స్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రిజర్వాయర్లు, చెరువుల్లో చేపల పెంపకంతో పాటు విక్రయాలతో వచ్చిన లాభాలను వాటా లుగా పంపిణీ చేసేలా సన్నాహాలు చేస్తోంది. ప్రతి కుటుంబానికి నిర్ణీత ఆదాయం సమకూరేలా విధివిధానాలు రూపొం దిస్తోంది. కల్యాణలక్ష్మి సాయం పెంపు కల్యాణలక్ష్మి పథకం కింద ప్రస్తుతం ప్రభుత్వం రూ.51 వేలు ఆర్థిక సాయంగా అందిస్తోంది. ‘షాదీ ముబారక్’పేరిట మైనారిటీలకు ఇదే పథకాన్ని వర్తింపజేస్తోంది. పెరుగుతున్న పెళ్లిళ్ల ఖర్చుల దృష్ట్యా నిరుపేద కుటుంబాలకు అండగా ఉండేందుకు ఈ ఆర్థిక సాయాన్ని మరింత పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఆర్థిక సాయాన్ని రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు పెంచే ప్రతిపాదనలున్నాయి. గడిచిన మూడేళ్లలో ఈ పథకం ద్వారా దాదాపు 1.30 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలకు రూ.15 వేలు ఇప్పటివరకు అమల్లోకి తెచ్చిన పథకాలకు ప్రభుత్వం లక్ష్యాత్మకంగా, సందే శాత్మకంగా పేర్లు పెట్టింది. తొలిసారిగా ‘కేసీఆర్’పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంపొం దించాలని లక్ష్యంగా ఎంచుకుంది. ప్రసూతి సమయంలో అవసరం లేకున్నా ఆప రేషన్లు చేసే ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ దందాకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయిం చింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు ఇప్పుడిస్తున్న ఆర్థిక సాయాన్ని తమిళనాడు తరహాలో రూ.15 వేలకు పెంచాలని యోచిస్తోంది. దీంతోపాటు మూడు నెలల పాటు బాలింతలు, శిశువుల సంరక్షణ బాధ్యతగా ‘కేసీఆర్ కిట్’ను కానుకగా అందించనుంది. తల్లులు, పిల్లలకు అవసరమయ్యే మందులు, సబ్బులు, షాంపూలతో ఈ కిట్ను అందించాలని యోచిస్తోంది. -
పేదల పాలిట వరం కళ్యాణలక్ష్మి
జనగామ ఎమ్మెల్యేముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పలువురికి కళ్యాణలక్ష్మి, రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత జనగామ : రాష్ట్రంలోని పేదలు తమ పిల్లల పెళ్లిళ్లు చేయడంలో ఇబ్బంది పడొద్దనే భావనతోనే సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆర్డీఓ వెంకట్రెడ్డి అధ్యక్షతన జరిగిన బచ్చన్నపేట, జనగామ టౌన్, రూరల్ పరిధిలోని లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతో పాటు పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను యాదగిరిరెడ్డి పంపిణీ చేసి మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం ఆలోచిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్లు చెన్నయ్య, విజయభాస్కర్, వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ బండ పద్మ, ఎంపీపీ బైరగోని యాదగరి, పస్తం మహేష్, జెడ్పీటీసీలు బాల్దె విజయ, వేముల స్వప్నతో పాటు నాగారపు వెంకట్, ఎండీ.అన్వర్, కొణ్యాల జనార్దన్రెడ్డి, దేవరాయ ఎల్లయ్య, కన్నారపు ఉపేందర్, మేడ శ్రీనివాస్, వెన్నెం శ్రీల త, గజ్జెల నర్సిరెడ్డి, వేమెళ్ల పద్మ, ఎజాజ్, బండ యాదగిరిరెడ్డి, బాల్దె సిద్దులు, కలింగరాజు, నల్లగోని బాలకిషన్, ఇర్రి రమనారెడ్డి, బోడిగం చంద్రారెడ్డి, వడ్డెపల్లి మల్లారెడ్డి, కనకయ్య, కొండయ్య, చొక్కం నర్సింహులు, వేముల విద్యాసాగర్, జావీద్, షబ్బీర్, వీఆర్వో రమేష్ ఉన్నారు. పెళ్లి రోజే కళ్యాణలక్ష్మి కానుక : ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. రఘునాథపల్లి/ లింగాల ఘణపురం (స్టేషన్ఘన్పూర్) : ఇక నుంచి పెళ్లి రోజే కళ్యాణలక్ష్మి కానుక అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. మండల కేంద్రంలోని తహసీల్ కా ర్యాలయంలో కళ్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్న 49 మంది లబ్ధిదారులకు గురువారం ఆయన చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. నిశ్చితార్థం జరిగిన తర్వాత ఆ పోటోలు అమ్మాయి తరపు పెద్దల సంతకాలతో తహసీల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే ముహుర్తం నాటికి కళ్యాణలక్ష్మి చెక్కు అందజేస్తామన్నారు. కాగా, కళ్యాణలక్ష్మి పథకంలో ధరఖాస్తు చేసుకున్న పలువురు ఎస్టీలకు చెక్కులు మంజూరు కాకపోవడం పట్ల ఆ వర్గానికి చెందిన నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే, లింగాలఘణపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంలో 55 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాజయ్య చెక్కు లు అందజేసి మాట్లాడారు. కార్యక్రమాల్లో జెడ్పీటీసీలు బానోతు శారద, రంజిత్రెడ్డి, తహసీల్దార్లు కె.నారాయణ, రాజేందర్, ఎంపీపీ దాసరి అనిత, ఎంపీడీఓలు బానోతు సరిత, రవితో పాటు మల్కపురం లక్ష్మయ్య, రా జేందర్, సూర్య, జ్యోతి, రంజిత్, సుధాకర్, రాములు, శ్రీహరి, కొంరయ్య, నర్సింహ్మ, నాగేశ్వర్, యమున, రమాదేవి, స్వర్ణలత, కుమార్, పెండ్లి మల్లారెడ్డి, దొంగ అంజిరెడ్డి, సత్యనారాయణ, వెంకటయ్య, రాంబాబు, చెంచు రమేష్, లక్ష్మీనారాయణ, యాదయ్య, శ్రీనువాస్, మల్లారెడ్డి, సోమయ్య, విజయ్భాస్కర్, మదార్, స త్తమ్మ, మధు, రేగు అంజయ్య, చిట్ల ఉపేందర్రెడ్డి, భాస్కర్రెడ్డి, భాగ్యలక్ష్మి, మోహన్, రాజు పాల్గొన్నారు. -
వారికీ కల్యాణలక్ష్మి వర్తింపజేయాలి
సాక్షి, హైదరాబాద్: అగ్రకులాల్లోని పేదలకూ కల్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలని ఎమ్మెల్యే చల్లా వంశీచంద్రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియాపాయింట్ వద్ద మాట్లాడుతూ.. జీవో 5 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షలు, పట్టణప్రాంతాల్లో 2 లక్షల ఆదాయం కన్నా తక్కువ ఉన్న ఈబీసీలకు కల్యాణ లక్ష్మి వర్తిస్తుందన్నారు. అయితే ఈబీసీ ధ్రువీకరణ ఉన్నవారికే ఈ పథకం వర్తిస్తుందని చెప్పడం వల్ల తెలంగాణలో ఎక్కువ జనాభా ఉన్న రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య, వెలమ కులాల్లోని పేదలకు కల్యాణలక్ష్మికి నోచుకోవడం లేదన్నారు. జీవో 231 ప్రకారం 13 కులాలకే ఈబీసీ ధ్రువపత్రాలు ఇస్తున్నారని, రెడ్డి, బ్రాహ్మణ, వెలమ, వైశ్య కులాలకు ఇవ్వడం లేదన్నారు. జీవో 5 ప్రకారం తక్కువ ఆదాయం ఉన్న అగ్రకులాలకు కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. -
ఇంట్లో ఎందరున్నా ‘కల్యాణ లక్ష్మి’
• అసెంబ్లీలో మంత్రి జగదీశ్రెడ్డి • లబ్ధిదారులకు వివాహం రోజే రూ.51 వేల ఆర్థిక సాయం సాక్షి, హైదరాబాద్: కల్యాణలక్ష్మి పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ వివాహం రోజే రూ.51 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని విద్యుత్, షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. ఒక ఇంట్లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నా అందరికీ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. బుధవారం శాసనసభలో టీఆర్ఎస్ సభ్యురాలు కొండా సురేఖ, బీజేపీ పక్షనేత జి.కిషన్రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. కల్యాణలక్ష్మి పథకం తెచ్చేందుకు కారణమైన ఉదంతాన్ని మంత్రి ఈ సందర్భంగా సభకు వివరించారు. ‘‘చెత్తకుండీ వద్ద పసికందును పందులు పీక్కుతిన్నాయన్న వార్తను పత్రికల్లో చదివి ముఖ్య మంత్రి చలించిపోయారు. దీనిపై అధికా రులతో రోజంతా చర్చించారు. ఆడపిల్లలను గర్భంలోనే ఎందుకు తీసేస్తున్నారన్న దానిపై సమీక్షించారు. ఆడపిల్లల పెళ్లిళ్లు భారం అవుతాయన్న కారణంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని గుర్తించారు. ఆడపిల్లల వివాహాలు మనమే చేద్దామని నిర్ణయించి పథకం తీసుకొచ్చారు. ఈ పథకానికి కల్యాణలక్ష్మి పేరు పెట్టింది మంత్రి కేటీఆర్..’’ అని తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటికే 81 వేలకుపైగా అర్హులకు లబ్ధి చేకూరిందని, పెండింగ్లో ఏవైనా దరఖాస్తులు ఉంటే నెల రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. ఆర్యస మాజ్లో వివాహం చేసుకున్న వారికి కళ్యాణలక్ష్మి వర్తింప జేయాలని టీడీసీ సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య కోరగా.. పెళ్లి ఎక్కడ చేసుకు న్నా ఆధారాలు చూపితే పథకం వర్తిస్తుందని మంత్రి వివరణ ఇచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ సభ్యుడు జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ... స్పీకర్, మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, ఇంద్రకరణ్రెడ్డి నియోజకవర్గాల్లో తక్కువ మంది లబ్ధిదారులు ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. దీనిపై అధికార పక్షం నేతలు స్పందిస్తూ.. అక్కడ పెళ్లిళ్లు జరగడం లేదని సమాధానం రావడంతో అంతా నవ్వుకున్నారు. -
పెళ్లి రోజే ‘కళ్యాణలక్ష్మి’
హైదరాబాద్: రాష్ట్రంలోని పేద యువతుల పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను తీసుకొచ్చిందని.. ఎవరో బలవంత పెడితేనో.. డిమాండ్ చేస్తేనో.. తేలేదని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఇక మీదట కళ్యాణ లక్ష్మి నుంచి అందే సాయాన్ని వీలైతే పెళ్లి రోజే అందే విధంగా చూస్తామని మంత్రి తెలిపారు. బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాగంగా ప్రతిపక్ష సభ్యులు కళ్యాణలక్ష్మి పథకం అమలుపై అడిగిన ప్రశ్నలకు మంత్రి జగదీశ్రెడ్డి సమాధానమిస్తూ.. పేద యువతుల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేయడం కోసం సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తీసుకొచ్చారన్నారు. ఈ పథకాల కింద అందిస్తున్న రూ. 51 వేలను ఇక నుంచి పెళ్లి రోజే అందేవిధంగా చర్యలు తీసుకుంటమన్నారు. -
కల్యాణలక్ష్మికి నిధుల మోక్షం
రూ. 34.15 కోట్లు విడుదల చేసిన సాంఘిక సంక్షేమ శాఖ సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత తొలిసారిగా కల్యాణలక్ష్మి పథ కానికి నిధులు విడుదలయ్యా యి. రాష్ట్రవ్యాప్తంగా 68 రెవెన్యూ డివిజినల్ అధికా రుల ఖాతాలకు రూ.34.15 కోట్లు విడుదల చేస్తూ ఎస్సీ అభివృద్ధి శాఖ రాష్ట్ర సంచాలకులు పి.కరుణా కర్ ఉత్తర్వులు జారీ చేశారు. కల్యాణలక్ష్మి పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ బాధ్యత ను ప్రభుత్వం ఆర్డీవోకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఆర్డీవోలు పీడీ అకౌంట్ ద్వారా లబ్ధిదారులకు నిధులు విడుదల చేస్తారు. ప్రస్తుతం నిధులు విడుదల చేసినప్పటికీ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మాత్రం నత్తనడకన సాగుతోంది. దీంతో ఈ నిధులను లబ్ధిదారులకు ఇప్పట్లో పంపిణీ చేసే అవకాశం లేదు. రాష్ట్రవ్యాప్తంగా కల్యాణలక్ష్మి పథకానికి సంబంధించి 40 వేల దరఖాస్తులు పెండిం గ్లో ఉన్నాయి. వీటి పరిశీలన పూర్తికి కనిష్టంగా రెండు నెలలు పడుతుందని అధికారులు చెబుతు న్నారు. ఈలోపు నిధుల పంపిణీ మరింత నెమ్మదిం చనుంది. దీంతో ఆర్థిక సాయం కోసం లబ్ధిదారులు రెండు నెలలపాటు వేచిచూడాల్సిందే. -
కల్యాణలక్ష్మి దరఖాస్తులకు లైన్ క్లియర్
♦ అందుబాటులోకి ‘ఈపాస్’ సేవలు... ♦ ఉపకార వేతన దరఖాస్తుకు 30 వరకు గడువు సాక్షి, హైదరాబాద్: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల దరఖాస్తులకు మార్గం సుగమమైంది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో గత నెల పన్నెండో తేదీ నుంచి ఈపాస్లో సేవలు నిలిచిపోవడంతో విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్తోపాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర పథకాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ స్తంభించిన విషయం తెలిసిందే. కొత్తగా జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కావడం, వాటి పరిధిలోని గ్రామాలు, విద్యాసంస్థల వివరాలను వెబ్సైట్లో విభజించేందుకు ప్రభుత్వం సేవల్ని నిలిపివేసింది. తాజాగా ‘ఈపాస్’ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు నెల రోజులపాటు కసరత్తు చేపట్టిన సాంకేతిక బృందం తాజాగా ప్రక్రియను పూర్తి చేసింది. 2016–17 విద్యాసంవత్సరంలో పోస్టు మెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఫ్రెషర్స్తోపాటు రెన్యువల్(సీనియర్) విద్యార్థులు ఈపాస్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 2014–15, 2015–16 విద్యాసంవత్సరానికి సంబంధించిన దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులకు కూడా అధికారులు అవకాశం కల్పించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు సంబంధించి ఈపాస్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మధ్యకాలంలో కొందరి పెళ్లిళ్లు జరిగాయి. నిబంధనలకు లోబడి ఉన్నవారు ప్రస్తుతం దరఖాస్తు చేసుకునే వీలుంది. దరఖాస్తు ప్రక్రియలో పెళ్లికూతురు తల్లి బ్యాంకు ఖాతా నంబర్ను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలి. లేకుంటే వాటిని పరిగణనలోకి తీసుకోమని అధికారులు చెబుతున్నారు. ఈ పథకం కింద పంపిణీ చేసే నగదును నేరుగా ఆ ఖాతాలో జమ చేయనున్న నేపథ్యంలో బ్యాంకు ఖాతా నంబర్ను ప్రభుత్వం అనివార్యం చేసింది. -
తల్లి లేకుంటే తండ్రి పేరిట చెక్కు
సాక్షి, హైదరాబాద్: కల్యాణలక్ష్మి పథకం ద్వారా అందించే రూ.51 వేల ఆర్థికసాయాన్ని వధువు తల్లి జీవించి లేకపోతే, ఆమె తండ్రి పేరిట ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. బీసీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల లబ్ధిదారులకూ ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొన్నారు. -
తల్లిలేని పక్షంలో తండ్రి పేరు మీద కల్యాణలక్ష్మీ చెక్
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఆడపిల్లల పెళ్లికి ‘కళ్యాణలక్ష్మి’ పథకం కింద ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వ సాయం విషయంలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. ఇప్పటి వరకు పెళ్లికూతురు తల్లి పేరు మీద రూ. 51వేల కళ్యాణల క్ష్మి చెక్ను ఇచ్చేవారు. అయితే పెళ్లికూతురు తల్లి జీవించి లేని పక్షంలో తండ్రి పేరు మీద చెక్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ కార్యదర్శి బెన్హర్ మహేష్దత్ ఎక్కా ఉత్తర్వులు జారీ చేశారు. -
స్తబ్ధతలో కల్యాణ లక్ష్మీ..
-పరిశీలనకు నోచుకోని దరఖాస్తులు -పెండింగ్లో 1372 దరఖాస్తులు -బీసీ,ఈబీసీలపై మొదలు కాని ప్రక్రియ సాక్షి,సిటీబ్యూరో కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల అమల్లో స్తబ్దత నెలకొంది. లబ్ధిదారుల ఎంపిక స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించటంతో దరఖాస్తులు పరిశీలనకు నోచుకొనని పరిస్థితి నెలకొంది. ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలకు అమలు చేస్తున్న ఈ పథకాలు తాజాగా ఏఫ్రిల్ నుంచి బీసీ, ఈబీసీలకు కూడా వర్తింప చేస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్లో కళ్యాణలక్ష్మీకి సంబంధించిన దరఖాస్తులు 1372 పరిశీలన దశ( పెండింగ్)లో ఉన్నాయి.ఆర్థికంగా బలహీనంగా ఉన్న షెడ్డ్యూల్ కులాలు, షెడ్డ్యూల్ తెగలు, ఈబీసీ వర్గాలకు చెందిన 18 ఏళ్లకు పైబడిన యువతుల వివాహాము కోసం కళ్యాణ లక్ష్మీ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణాల్లో రూ.2లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల లోపు ఉండాల్సి ఉంది. గ్రేటర్ కళ్యాణలక్ష్మీ పథకం కింద ఆర్థిక సహాయం కోసం ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఈబీసీ వర్గాల నుంచి 2016-17 సంవత్సరంలో 4,200 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఇప్పటి వరకు 3,288 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన నిధులు కూడా నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. అయితే... ఇటీవల పథకంలో మార్పులు చోటుచేసుకోవటంతో రిజిష్టరై పెండింగ్లో ఉన్న 1372 దరఖాస్తుల పరిశీలన,ఎంపికలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఇందులో బీసీ,ఈబీసీ వర్గాలకు సంబంధించిన 280 దరఖాస్తులు ఉన్నాయి. ఇవే కాక మిగతా జిల్లాల్లో కూడా ఈబీసీ దరఖాస్తుల పని అదే విధంగా ఉన్నాయి. మారిన విధానంతో చిక్కులు... గతంలో ఎస్సీ,ఎస్టీల దరఖాస్తులను ఆయా శాఖల జిల్లా అధికారులే పరిశీలించి నేరుగా వధువు బ్యాంక్ ఖాతాలోకి ఆన్లైన్లో రూ.51 వేలు బదిలీ చేసేవారు. మైనారిటీలకు సంబంధించి జిల్లాల్లో సొంత యంత్రాంగం లేనందున రెవెన్యూశాఖ (ఎమ్మార్వోలు) ద్వారా దరఖాస్తులను పరిశీలించేవారు. ఇప్పుడు ఈ పథకాల అమల్లో స్థానిక ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ లబ్దిదారుల దరఖాస్తుల ఎంపిక బాధ్యత మొదలుకుని, వధువు తల్లి పేరిట ఆమెకే డమ్మీ చెక్కులను అందజేసే వరకు ఎమ్మెల్యేల పాత్ర ఉంటుంది. ఇక్కడే ఆయా శాఖల అధికారులకు చిక్కులు మొదలయ్యాయి. ఎమ్మెల్యేలకు ఆయా దరఖాస్తులను అందజేయడం, వాటిపై వారు సంతకం చేశాక కేవలం తహసీల్దార్ల ద్వారా పరిశీలన జరిపించి, వధువు తల్లి పేరిట చెక్కును సిద్ధం చేసి, డమ్మీ చెక్కును తయారు చేయించి, ఎమ్మెల్యేల పర్యటన వివరాలు తెలుసుకుని వారి ద్వారా నియోజకవర్గ లేదా మండల కేంద్రంలో చెక్కుల పంపిణీకి చర్యలు తీసుకోవడం తలకు మించిన భారంగా మారుతోంది. బీసీ,ఈబీసీలపై అందని ఆదేశాలు... ఎస్సీ,ఎస్టీ,మైనారిటీల దరకాస్తులను పరిశీలిస్తున్న విధంగానే బీసీ,ఈబీసీలవి కూడా ఎమ్మార్వోలే పరిశీలించాల్సి ఉండగా ఇప్పటివరకు రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలు అందలేదు. తమ శాఖ పరిధిలోని దరఖాస్తులను పరిశీలించాలని సీసీఎల్ఏను బీసీసంక్షేమశాఖ సంప్రదించి లేఖను కూడా అందజేసింది. అయితే సీసీఎల్ఏ నుంచి ఎమ్మార్వోలకు ఇంకా ఉత్తర్వులు అందలేదు. అంతేకాకుండా ఎమ్మార్వోలు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) అధికారులకు ఆన్లైన్లో దరకాస్తుల పరిశీలనకు ఇంకా లాగిన్లు ఇవ్వలేదు. ఈ పథకం కింద ప్రయోజనం కోసం తమకు వచ్చిన దరకాస్తుల జాబితాను ఎమ్మెల్యేలకు పంపించాలని ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొన్నారు. దీనితో ఎమ్మెల్యేలకు దరకాస్తులను పంపించి, వాటిపై ఆమోదం తీసుకోవడం కూడా మొదలు కాలేదు. ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో తమకు కల్యాణ లక్ష్మీ పథకం కింద డబ్బులు వస్తాయో రావోనని ఈబీసీలు ఆందోళనలో ఉన్నారు. -
కల్యాణలక్ష్మి మార్గదర్శకాల మార్పుతో చిక్కులు
* స్పష్టత లేక లబ్ధిదారుల్లో అయోమయం * పాత విధానమేమేలంటున్న లబ్ధిదారులు సాక్షి, హైదరాబాద్: కల్యాణలక్ష్మి పథకం మార్గదర్శకాల మార్పుతో లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు సంబంధించి కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనితో పాటు ఈ దరఖాస్తుల పరిశీలన బాధ్యతను కేవలం తహసీల్దార్లకే అప్పగిస్తూ గతంలోని మార్గదర్శకాలను మార్పు చేయడంతో కొంత గందరగోళం నెలకొంది. తహసీల్దార్లు దరఖాస్తులను పరిశీలించి ఆమోదముద్ర వేయడంలో జాప్యం జరుగుతోంది. మార్గదర్శకాల్లో అస్పష్టత.. గందరగోళం పాత విధానంలో నేరుగా వధువు బ్యాంక్ ఖాతాలోకి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా రూ.51 వేల మొత్తం జమయ్యేది. ఇప్పుడు దానిని మార్చి పెళ్లి కూతురు తల్లి పేరిట చెక్కును ఇవ్వాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో మార్పుచేసింది. ఒకవేళ వధువుకు తల్లి లేని పక్షంలో ఏం చేయాలనే దానిపై స్పష్టత కొరవడింది. ఇప్పటివరకు అనుసరించిన విధానం బాగానే ఉన్నందున దానిని మార్చాలనే నిర్ణయం సరైందికాదని అంటున్నారు. రాజకీయ జోక్యం పెరిగేలా ప్రజాప్రతినిధులకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను అప్పగిస్తే పరోక్షంగా అవినీతి, అక్రమాలకు ఊతం ఇచ్చినట్లవుతుందని వివిధ సంక్షేమశాఖల అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యేల ద్వారా పంపిణీ ఎలా.. స్థానిక ఎమ్మెల్యేలకు ఎంపిక అవకాశం కల్పించడం వల్ల అనర్హులు లబ్ధిపొందడంతో పాటు, పథకం లక్ష్యాలు దెబ్బతిని .. అవినీతిమయమవుతుందనే హెచ్చరికలు సైతం వస్తున్నాయి. వారానికి ఒకసారి నియోజకవర్గ లేదా మండల కేంద్రంలో ఎమ్మెల్యేల ద్వారా వధువు తల్లికి చెక్కులు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయాలని సవరించిన మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే కచ్చితమైన తేదీ, సమయమేది నిర్ణయించకపోవడంతో ఎమ్మెల్యేలు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, ఎక్కడ నుంచి చెక్కులు తీసుకోవాలన్న దానిపై గందరగోళం నెలకొంది. అందులోనూ పెళ్లి సమీపిస్తున్నపుడు చెక్కు కోసం సమయం కేటాయించడం కూడా కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 5 నాటికి మొత్తం 55,936 దరఖాస్తులు రాగా, 31,479 దరఖాస్తులు ఇంకా పరిశీలన కోసం పెండింగ్లోనే ఉన్నాయి. అందులో బీసీ, ఈబీసీలవే 10,466 కాగా ఇంతవరకు ఒక్కరికి కూడా ఈ పథకం కింద లబ్ధి చేకూరలేదు. -
కల్యాణలక్ష్మీ పథకం ద్వారా డబ్బులు వస్తాయని..
కల్యాణ లక్ష్మీ పధకం ద్వారా డబ్బులు వస్తాయనే ఆశతో నకిలీ పెళ్లి కార్డులు సృష్టించి కటకటాలు పాలయ్యాడో వ్యక్తి. ఈ సంఘటన జగదేవ్పూర్ మండలం ధర్మారంలో చోటుచేసుకుంది. వివరాలు..ధర్మారం గ్రామానికి చెందిన క్రి ష్ణయ్య కూతురు భవానీకి ఇదే సంవత్సరం మార్చి 16న నల్గొండ జిల్లాకు చెందిన రాము అనే వ్యక్తితో పెళ్లి అయింది. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం బీసీలకు ఈ సంవత్సరం ఏప్రిల్ 1 తర్వాత జరిగే వివాహాలకు కల్యాణలక్ష్మీ పథకం వర్తిస్తుంది. దీంతో ఏమి చేయాలో తోచక..ఏప్రిల్ 27న కూతురి వివాహం జరిగినట్లు నకిలీ పెళ్లి కార్డు సృష్టించి ఆన్లైన్లో అఫ్లై చేశాడు. స్థానిక తహశీల్దార్కు అనుమానం వచ్చి గ్రామంలో విచారణ జరపగా మార్చి 16న పెళ్లయినట్లు తేలింది. ఈ విషయం తహశీల్దార్ పోలీసులకు తెలిపారు. పోలీసులు పెళ్లి కార్డు ప్రింటింగ్ చేసిన వేణుగోపాల్ను, వధువు తండ్రి క్రిష్టయ్యను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
60వేల మంది బీసీలకు కల్యాణలక్ష్మి
హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది 60 వేల మంది బీసీలకు కల్యాణ లక్ష్మి పథకం వర్తింపజేయనున్నట్లు బీసీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గంగాధర్ తెలిపారు. సోమవారం ఆయన నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో బీసీ సంక్షేమ సంఘాల వారితో సమావేశమయ్యారు. కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారిని కోరారు. అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని చెప్పారు. బీసీల అభ్యున్నతికి తెలంగాణ సర్కారు కట్టుబడి ఉందని అన్నారు. -
కల్యాణలక్ష్మి ఏదీ?
- బీసీలకు దక్కని పథకం ఫలాలు - జిల్లా వ్యాప్తంగా1,338 దరఖాస్తుల రిజిస్ట్రేషన్ - విచారణపై కానరాని స్పష్టత - వార్డెన్లు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ దరఖాస్తుదారుల ప్రదక్షిణలు - మార్గదర్శకాలు మళ్లీ మారే అవకాశం ఉందంటున్న అధికారులు నల్లగొండ: వెనకబడిన తరగతుల వారిపై కల్యాణ‘లక్ష్మి’ ఇంకా కనికరించలేదు. రాష్ట్రప్రభుత్వం 2014లో ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల కోసం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి బీసీలు, ఈబీసీ అమ్మాయిలకు కూడా కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేసింది. ఏప్రిల్1, 2016 నుంచి వివాహం చేసుకున్న వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1338 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేయాల్సి ఉంది. కానీ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు తరచు మారుస్తుండడంతో సంబంధిత అధికారులు ఎటూ తేల్చు కోలేకపోతున్నారు. ఆన్లైన్ దరఖాస్తులను పరిశీలించే బాధ్యతను తొలుత సంక్షేమ హాస్టళ్ల వారెన్లు, ఏబీసీడబ్ల్యూఓలకు అప్పగించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు కల్యాణ లక్ష్మి దరఖాస్తులను వార్డెన్లు విచారణ చేయొద్దంటూ ఉన్నతాధికారుల నుంచి జిల్లా అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. అప్పటికే దరఖాస్తుల విచారణ కార్యక్రమాన్ని ప్రారంభించిన వార్డెన్లు అధికారుల ఆదేశాలతో ఆ ప్రక్రియను నిలిపేశారు. సంక్షేమ అధికారులను తప్పించి దరఖాస్తులను విచారించే బాధ్యత ను తహసీల్దార్లకు కట్టబెడుతున్నట్లు చెప్పారు. కానీ ఇప్పటి వరకు లిఖిత పూర్వక ఆదేశాలు రాలేదు. ఇవేమీ తెలియని దరఖాస్తుదారులు అటు వార్డెన్ల దగ్గరికి.. మరో వైపు తహసీల్దారు కార్యాలయాల చుట్టూ ప్రదక్షి ణలు చేస్తున్నారు. వార్డెన్ల వద్దకు వెళ్లిన దరఖాస్తుదారులను తహసీల్దారు కార్యాలయాలకు వెళ్లమని చెప్పి పంపిస్తున్నారు. దీంతో తహసీల్దారు కార్యాలయాలకు వెళ్లిన దరఖాస్తుదారులకు అక్కడా చేదు అనుభవమే ఎదురవుతోంది. మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులు.. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను నిర్దేశించిన గడువులోగా విచారణ చేసి వధువు ఖాతాలో రూ.51 వేలు జమ చేయాలి. కానీ ఇప్పటి వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు తప్ప విచారణ జోలికి వెళ్లలేదు. 1338 దరఖాస్తులకు గాను ఒక్కొక్కరికి రూ.51 వేల చొప్పున రూ.63.23 కోట్లు లెక్కకట్టారు. దీంట్లో అర్హులైన వారిని ఎంపిక చేసిన అనంతరం ప్రభుత్వం నగదు ప్రోత్సాహాన్ని అందజేయనుంది. మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులు... ఆలేరు-15, అనుముల-21, ఆత్మకూరు (ఎం)-29, ఆత్మకూరు (ఎస్)-19, భువనగిరి అర్బన్-13, భువనగిరి-35, బీబీనగర్ 16, బొమ్మలరామారం 9, చందంపేట 12, చండూరు 29, చిలుకూరు 27, చింతపల్లి1, చిట్యాల 38, చివ్వెంల 13, చౌటుప్పుల్ 20, దామరచర్ల 29, దేవరకొండ23, దేవరకొండ అర్బన్ 4, గరిడేపల్లి 31, గుండాల 20, గరిడేపల్లి 9, గుర్రంపోడు 28, హుజూర్నగర్ 18, అర్వపల్లి 33, కనగల్ 20, క ట్టంగూరు 12, కేతేపల్లి 16, కోదాడ 31, మర్రిగూడ 21, మఠంపల్లి 13, మేళ్లచెర్వు 22, మిర్యాలగూడ 28, మిర్యాలగూడ అర్బన్ 4, మోతె 16, మోత్కూరు 25, తుర్కపల్లి 6, మునగాల 31, మునుగోడు 35, నడిగూడెం 17, నకిరేకల్ 25, నల్లగొండ 56, నల్లగొండ అర్బన్ 6, నాంపల్లి 13, సంస్థాన్ నారాయణ్ పూర్ 16, నార్కట్పల్లి 18, నేరేడుచర్ల 14, నిడమనూరు 23, నూతనకల్ 18, పీఏపల్లి 15, పెద్దవూర 9, పెన్పహాడ్ 15, పోచంపల్లి 12, రాజాపేట 13, రామన్నపేట 28, శాలిగౌరారం 31, సూర్యాపేట 37, సూర్యాపేట అర్బన్ 8, తిప్పర్తి 30, తిరుమలగిరి 27, త్రిపురారం 12, తుంగతుర్తి 32, వలిగొండ 35, వేములపల్లి 17, యాదగిరిగుట్ట 29. తహసీల్దార్లకే విచారణ బాధ్యతలు కల్యాణ లక్ష్మి దరఖాస్తుల విచారణ బాధ్యతలు వార్డెన్లు, ఏబీసీడబ్ల్యూఓలు చేయొద్దని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆ ప్రక్రియను నిలిపేశాం. తహసీల్దార్లకు ఆ బాధ్యతలు అప్పగిస్తారని ఉన్నతాధికారులు చెప్పారు. దీనికి సంబంధి ంచిన ఉత్తర్వులు రెండు, మూడు రోజుల్లో జారీ కానున్నాయి. అందువల్ల దరఖాస్తుదారులు ఆందోళన చెందకూడదని కోరుతున్నాం. - రాజశేఖర్, బీసీ కార్పొరేషన్ డీడీ -
ఎస్సీ, ఎస్టీ ‘కల్యాణలక్ష్మి’ ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకే
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేల కౌంటర్ సంతకంతో జాబితా సిద్ధం చేసి, వారి ద్వారానే ప్రీ ప్రింటెడ్ చెక్కులను అందజేసేలా మార్పులు చేసింది. వారంలో ఒకరోజు మండల/ తాలుకా కేంద్రాల్లో వీటిని పంపిణీ చేసేలా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు వధువు బ్యాంకు ఖాతాలోకి రూ.51 వేలను నేరుగా జమ చేస్తుండగా, మార్పు చేసిన విధానాల ప్రకారం పెళ్లి కుమార్తె తల్లి పేరిట చెక్కును అందజేస్తారు. ఈ దరఖాస్తులను ఎమ్మార్వోలు మాత్రమే పరిశీలించేలా మార్పు చేశారు. ప్రస్తుత విధానం ప్రకారం వధూవరుల ఆధార్కార్డులను స్కాన్చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయడం తప్పనిసరి చేశారు. ఈ పథకం విధివిధానాల్లో మార్పులు చేస్తూ శుక్రవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. దరఖాస్తుల పరిశీలనలో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు, ట్రెజరీలో బిల్లులను సిద్ధం చేసి మంజూరు ఇచ్చాక వధువు బ్యాంక్ అకౌంట్లోకి నగదు బదిలీ చేయడం వంటి విషయాల్లో ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానం వల్ల ఇబ్బందులు తలెత్తడాన్ని ప్రభుత్వం గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) కింద సహాయాన్ని అందిస్తున్న మాదిరిగా ప్రీప్రింటెడ్ చెక్కులను జిల్లా సంక్షేమశాఖల అధికారులు ట్రెజరీ నుంచి తీసుకుంటారు. లబ్ధిదారుల పేరిట చెక్కును జారీ చేస్తారు. ఈ-పాస్ వెబ్సైట్ లాగిన్ సౌకర్యాన్ని తహసీల్దార్లకు కల్పించేందుకు, ఎస్సీ, ఎస్టీ శాఖల డెరైక్టర్లను సంప్రదించి కల్యాణలక్ష్మి దరఖాస్తులన్నింటినీ క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డెరైక్టర్ జనరల్ను ఆదేశించారు. ఈ ఉత్తర్వులను ఠీఠీఠీ.జౌజీట.్ట్ఛ్చజ్చ్చ. జౌఠి.జీ. వెబ్సైట్లో పొందుపరిచారు. ఎస్టీల విదేశీవిద్యకు రూ.20 లక్షల సాయం విదేశాల్లో ఉన్నతవిద్యను అభ్యసించే ఎస్టీ విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతూ ఎస్టీ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఇచ్చే సహాయాన్ని పెంచాలని ఎస్టీ సంక్షేమశాఖ ప్రతిపాదనలు పంపడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. -
పథకాల అమల్లో రాజకీయ జోక్యం వద్దు
సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాల అమల్లో ప్రత్యక్ష రాజకీయ జోక్యం ఉండకూడదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. కల్యాణలక్ష్మి పథకం మార్గదర్శకాలను మార్చి రాజకీయ జోక్యాన్ని పెంచాలనే నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని సీఎంకు రాసిన లేఖలో ఆయన కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలే పరోక్ష పెత్తనం చేస్తున్నారన్నారు. పథకాల విధివిధానాలను ప్రభుత్వం రూపొందిస్తే, వీటిని అధికార యంత్రాంగం అమలు చేయాలన్నారు. కానీ రెండింట్లోనూ ప్రజాప్రతినిధులు ప్రధాన పాత్ర పోషించడం వల్ల ప్రభుత్వ యంత్రాంగం నిర్వీర్యమైపోతోందన్నారు. -
కల్యాణ లక్ష్మితో సామాజిక మార్పు
ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ర్టంలో అమలవుతున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంతో బాల్య వివాహాలు తగ్గి సామాజిక మార్పునకు దోహద పడుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం అమలుపై సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ఆడపిల్లల వివాహానికి కూడా ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించామన్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పథకం అమలుకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.738 కోట్లు కేటాయించామన్నారు. పేదింటి ఆడపిల్లలందరికీ పథకం వర్తించేలా అవసరమైతే మరిన్ని నిధులు సమకూరుస్తామన్నారు. వివాహానికి ముందే లబ్ధిదారులకు చెక్కు అందేలా పారదర్శకంగా పథకం అమలు చేయాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అమలవుతున్న ఈ పథకం లక్ష కుటుంబాల్లో వెలుగులు నింపి రికార్డు సృష్టించిందన్నారు. 2014 సెప్టెంబర్ 24న పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 1,04,057 మందికి లబ్ధి చేకూరిందన్నారు. ఇందులో ఎస్సీలు 44,351, ఎస్టీలు 25,793, మైనార్టీలు 33,913 మందికి రూ.51వేల చొప్పున ఆర్థిక సాయం అందిందన్నారు. పథకం అమలుకు ఇప్పటి వరకు రూ.530 కోట్లు ఖర్చు చేశామన్నారు. సీఎం ప్రత్యేక సీఎం కార్యదర్శి కె.భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'కల్యాణలక్ష్మి' పథకంపై సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్ : పేద యువతుల వివాహాలకు ఆర్థికంగా తోడ్పాటునిచ్చే ఉద్దేశంతో తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకంపై సీఎం కేసీఆర్ గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పథకం అమలుపై ఆరా తీశారు. బీసీలకు, ఆర్థికంగా వెనుకబడినవారికి కూడా కల్యాణ లక్ష్మి పథకం అమలు చేయాల్సిందిగా తెలిపారు. దానికి సంబంధించిన మార్గదర్శకాలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఇప్పటివరకు 1,04,057 మంది యువతులకు ఆర్థిక సాయం అందిందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తెలిపారు. -
కల్యాణమైంది.. ‘లక్ష్మి’ రాలేదు..!
♦ బీసీలకు అందని ద్రాక్షలా కల్యాణలక్ష్మి ♦ దరఖాస్తులకే పరిమితం ♦ రెండునెలలైనా కాసులు ఇవ్వని సర్కారు ♦ లబ్ధిదారుల నిరీక్షణ చిత్రంలో కనిపిస్తున్న వధువు, వరుడి పేర్లు సంగీత, గంగాధర్. వధువుది సిరికొండ మండలం హుస్సేన్నగర్ గ్రామ పరిధిలోని లొంకతండా కాగా, వరుడిది కమ్మర్పల్లి మండలం మానాల. ఫిబ్రవరిలో వీరి వివాహమైంది. కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు విచారణ కూడా చేశారు. మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు డబ్బులు రాలేదు. - సిరికొండ ఇందూరు : ఎస్సీ, ఎస్టీలకే పరిమితమైన కల్యాణలక్ష్మి పథకాన్ని ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీసీలకు కూడా వర్తింపజేస్తున్నామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అమలులో విఫలం అవుతోంది. దరఖాస్తులు చేసుకోవాలని రెండు నెలల క్రితం బీసీ సంక్షేమ శాఖకు జీవోఎంఎస్ నంబరు 5ను జారీ చేసింది. ఇందుకు వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చారుు. కానీ.. ఇంతవరకు సర్కారు ఒక్కరికి కూడా నయాపైసా అందజేయలేదు. పెళ్లి సమయంలో కాదు కదా.. పెళ్లి అయిన రెండు నెలల తర్వాత కూడా డబ్బులు రాకపోవడంతో దరఖాస్తులు చేసుకున్న పేదింటి ఆడ్డబిడ్డలు ఆందోళన చెందుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు వెంటనే నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం నిధుల లేమి సాకుతో బీసీలకు ‘లక్ష్మి’ని దూరం చేస్తుంది. దరఖాస్తులు 726 జిల్లాలో బీసీ జనాభా 13,00,174 ఉంది. ఇందులో 70 శాతం మంది పేదలు ఉన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి పెళ్లిళ్లు చేసుకున్న పేదింటి బీసీలకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించింది. ఇందుకు ఏప్రిల్ నెల నుంచి ఇప్పటివరకు బీసీలు 671, ఓబీసీలు 55 మొత్తం కలిపి 726 మంది ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఇంకా చేసుకుంటూనే ఉన్నారు. అయితే వీటిని పరిశీలన జరిపి మంజూరు చేయాల్సి ఉంది. అయితే పరిశీలన అనంతరం పక్షం రోజుల్లో ప్రభుత్వం నుంచి నేరుగా వధువు ఖాతాలో డబ్బులు జమ కావాలి. కానీ.. దరఖాస్తులు చేసుకుని రెండు నెలలవుతున్నా ఇంతవరకు పరిశీలన జరగలేదు. నిధులూ జమ కాలేదు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. తమ బిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం అందించే నిధులు ఆర్థికంగా దోహదపడుతాయని అనుకున్న తల్లిదండ్రులకు అందని ద్రాక్షలా మారాయి. 726 మంది దరఖాస్తు దారులకు ఒక్కొక్కరికి రూ.51,000 చొప్పున మొత్తం జిల్లాకు రూ.3.70 కోట్ల నిధులు అవసరం ఉన్నాయి. పరిశీలన బాధ్యతలు తహసీల్దార్లకు అప్పగింత కల్యాణలక్ష్మి పథకం బీసీ, ఓబీసీలకు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తుల పరిశీలన బాధ్యతలు తొలుత సహాయ సంక్షేమాధికారులు (ఏబీసీడబ్ల్యూఓ), వసతిగృహ వార్డెన్లకు అప్పగించింది. బీసీ సంక్షేమలో వార్డెన్లు తక్కువగా ఉండటంతో పరిశీలన ఆలస్యం జరుగుతుందనే ఉద్దేశంతో పరిశీలన బాధ్యతలను మండలాల తహసీల్దార్లకు అప్పగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఉత్తర్వులు రావాల్సి ఉంది. జిల్లాలో నమోదైన 726 దరఖాస్తులు ఇంత వరకు పరిశీలనకే నోచుకోలేదు. ఫలితంగా లబ్ధిదారులకు మరింత ఆలస్యం కానుంది. ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆన్లైన్లో దరఖాస్తుల నమోదు జరుగుతుంది. ఇప్పటి వరకు 726 దరఖాస్తులు నమోదయ్యాయి. అయితే పరిశీలన బాధ్యతలు వార్డెన్లకా? తహసీల్దార్లకా? అనే విషయంపై స్పష్టత రావాలి. పరిశీలన తరువాత మంజూరు చేస్తాం. ఆ తరువాత ప్రభుత్వం నిధులు విడుదల చేయడమే తరువాయి. - విమలాదేవి, జిల్లా బీసీ సంక్షేమాధికారిణి -
‘కల్యాణలక్ష్మి’కి దరఖాస్తుల కళ
► 23 రోజుల్లోనే 4,709 దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ► తహసీల్దార్ల ద్వారా పరిశీలనకు బీసీ సంక్షేమ శాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతులు(బీసీ), ఆర్థికంగా వెనుకబడిన తరగతులు(ఈబీసీ)ల కల్యాణలక్ష్మి పథకానికి మంచి స్పందన వ్యక్తమవుతోంది. ఈ పథకం లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అధికారికంగా వెబ్సైట్ను ప్రారంభించిన 23 రోజుల్లోనే 4,700 పైచిలుకు దరఖాస్తులు నమోదయ్యాయి. బీసీ, ఈబీసీ లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తులను నమోదు చేసుకునేందుకు ఒక వెబ్ సైట్ను గత నెల 13న బీసీ సంక్షేమ శాఖ ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీల కల్యాణలక్ష్మి, మైనారిటీల షాదీముబారక్, బీసీ, ఈబీసీల కల్యాణలక్ష్మి పథకాలు కలుపుకుని ఈ శనివారం వరకు 33,345 దరఖాస్తులు నమోదయ్యాయి. ఎస్సీల అభివృద్ధి శాఖ 13,348, ఎస్టీ సంక్షేమ శాఖ 9,421, మైనారిటీ శాఖ పరిధిలో 5,907 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. బీసీ, ఈబీసీ కల్యాణలక్ష్మిలో భాగంగా 2016-17లో రూ.300 కోట్లతో 58,820 మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో ముందుగా దరఖాస్తు చేసుకున్నవారికి నిర్ణీత సంఖ్య మేరకు దీని కింద సహాయం అందించనుంది. దీనితోపాటు దరఖాస్తుల రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు తేదీ, సమయం రికార్డు అయ్యేలా ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు ద్వారా సీనియారిటీని నిర్ధారించి చెల్లింపులు చేస్తారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఆయా జిల్లాల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నట్లు అవినీతి నిరోధకశాఖ తనిఖీల్లో బయటపడింది. ఈ నేపథ్యంలో తమకు ఇచ్చే దరఖాస్తుల పరిశీలన బాధ్యతను ఎమ్మార్వోలకే అప్పగించాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు సీసీఎల్ఏకు కూడా లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు దరఖాస్తుదారులు ఇంకా కొంత కాలం వేచిచూడాల్సి ఉంటుంది. 2016 ఏప్రిల్ 1, ఆ తర్వాత వివాహం అయిన వాళ్లందరికీ ఈ పథకం కింద రూ.51 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు బీసీ శాఖ గతంలోనే ప్రకటించింది. -
‘కల్యాణలక్ష్మి’ అక్రమార్కులపై కొరడా
► ఏడుగురు నిందితులకు రిమాండ్ ► పరారీలో కార్యదర్శి, హెచ్డబ్ల్యూఓ అమ్రాబాద్ : కల్యాణలక్ష్మి పథకంలో అక్రమాలకు పాల్పడిన వారిపై మూడు కేసులు నమోదు కాగా ఏడుగురు నిందితులను రిమాండ్కు తరలించారు. ఈ వివరాలను బుధవారం ఇక్కడ ఎస్ఐ శ్రీనివాసులు వెల్లడించారు. అమ్రాబాద్ మండలంలోని ఈదులబావికి చెందిన రామానుజమ్మ, అన్న ఆంజనేయులు, ఎమిరెడ్డిపల్లికి చెందిన ఎనుపోతుల శ్రీదేవి, భర్త మన్నెం వెంకటయ్య, కుమార్ (శ్రీదేవి అన్న), తిర్మలాపూర్ (బీకే) కు చెందిన పెర్ముల అరుణమ్మ, భర్త చక్రపాణిలపై గతంలోనే కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వీరందరినీ బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వాస్తవానికి రామనుజమ్మకు 2009లో కుమ్మరోనిపల్లి వాసి చంద్రయ్యతో వివాహం కాగా 2014 అక్టోబర్ 26న జరిగినట్టు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి కల్యాణలక్ష్మి కింద లబ్ధి పొందారు. శ్రీదేవికి ఎనిదేళ్లక్రితమై వివాహమై ముగ్గురు పిల్లలు ఉండగా 2015 ఫిబ్రవరి 22న జరిగినట్టు చూపించారు. అరుణమ్మకు మూడేళ్ల క్రితమే పెళ్లికాగా 2014 నవంబర్ 3న జరిగినట్టు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి ఒక్కొక్కరు ఈ పథకానికి సంబంధించి రూ.51 వేలు తీసుకున్నట్లు తేలింది. ఈ ధ్రువపత్రాలన్నీ అచ్చంపేట పట్టణం లింగాల రోడ్డులోని వెంకటరమణ ప్రింటింగ్ ప్రెస్లో మార్పిడి చేసినట్లు బయటపడింది. ఈ వ్యవహారంలో దళారీలతో అధికారులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారని ఏసీబీ అధికారుల సమాచారం అందింది. దీనిపై ఏఎస్డబ్ల్యూఓ శ్రీకర్రెడ్డి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి తాజాగా ఏడుగురు నిందితులను రిమాండ్కు తరలించారు. ఈ కేసుల్లో నిందితులైన అమ్రాబాద్ గ్రామ కార్యదర్శి అంజనేయులు, విచారణ అధికారి (హెచ్డబ్ల్యూఓ) హన్మంత్రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. -
కటకటాల్లోకి ‘కళ్యాణలక్ష్మి’ అక్రమార్కులు
► ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు ► పరారీలో మరికొందరు నర్సింహులపేట : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి పథకంలో అవకతవకలకు పాల్పడి, ప్రభు త్వ సొమ్మును దుర్వినియోగం చేసిన ఏడుగురిని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తొర్రూరు సీఐ శ్రీధర్రావు తెలిపారు. నర్సింహులపేట పీఎస్లో మంగళవారం సాయంత్రం కళ్యాణలక్ష్మి పథకంలో అవకతకలకు పాల్పడిన నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. 2014 అక్టోబర్ 2వ తేదీ తర్వాత వివాహ మైన ఎస్సీ, ఎస్టీ నిరుపేద యువతులకు కళ్యాణలక్ష్మి పథకం వర్తిస్తుంది. అయితే కొందరు 2014 అక్టోబర్ కంటే ముందుగానే వివాహం చేసుకొని తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి రూ.51 వేలు స్వాహా చేశారు. ఇలా కొమ్ములవంచకు చెందిన రెండు జంట లు, కౌంసల్యదేవిపల్లిలో ఒక జంటతోపాటు తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. వారిలో కొమ్ములవంచకు చెందిన గుగులోతు జ్యోతి - జాటోత్ సుమన్, జాటోత్ పద్మ - వాంకుడోత్ వీరన్న, కౌంసల్యదేవిపల్లికి చెందిన బూరగుండ్ల ఏలేంద్ర -ఏర్పుల కృష్ణ దంపతులతోపాటు నర్సింహులపేటలో ఫొటో స్టూడియో నిర్వహిస్తూ నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి న జాటోతు సంతోష్ ఉన్నారు. అలాగే కళ్యాణలక్ష్మికి దరఖాస్తు చేసుకున్న వారికి పెళ్లి ఇటీవల అయ్యిందా ? అంతకు ముందే అయ్యిందా అనే విషయాన్ని ఇంటికి వెళ్లి పరిశీలించి సర్టిఫికెట్లపై సంతకం చేయాల్సి ఉండ గా వీఆర్ఓ యాకయ్య, హెచ్డబ్ల్యూఓ సుమన్, ఏటీడబ్ల్యూఓ రమాదేవి అలా వెళ్లకుండానే వారిని చూడకుండానే సంతకం చేసి పంపినందుకు వారిపై కూడా కేసు నమోదు చేశామన్నారు. ఈ ముగ్గురు అధికారులు పరారీలో ఉన్నారని తెలిపారు. స్టూడియో నడుపుతున్న సంతోష్ నుంచి 2 మానిటర్లు, 2 ప్రింటర్లు, 2 సీపీయూలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇంకా కళ్యాణ లక్ష్మి పథకంపై విచారణ జరుగుతోందని, ఇం దులో నిందుతులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని సీఐ వెల్లడించారు. సమావేశంలో ఎస్సై ఎల్లావుల వెంకటప్రసాద్, హెచ్సీలు రవీందర్, వెంకటేశ్వర్లు, పీసీలు సాగర్, శివ, కృష్ణమోహన్, శేఖర్, బుచ్చిరాజు, హెచ్జీ నహీంపాషా తదితరులు పాల్గొన్నారు. -
షాదీ ముబారక్, కల్యాణలక్ష్మీలో భారీగా అక్రమాలు
- అనర్హులకూ ఆర్థిక సాయం - దరఖాస్తుదారుల ఇళ్లకు అధికారులు - ఇప్పటికే షాదీ ముబారక్లో 11 కేసులు నమోదు - తూర్పున విస్తృత విచారణ - అక్రమార్కుల్లో వణుకు మంచిర్యాల సంక్షేమ ఫలాలు అక్రమార్కుల పాలయ్యాయి. పేదలకందాల్సిన ఆర్థిక సాయం పక్కదారి పట్టింది. పెళ్లి చేసుకోకుండానే కొందరు.. పెళ్లయి ఏళ్లు గడిచిన తర్వాత ఇంకొందరు.. ఇలా ప్రభుత్వం కళ్లకు గంతలు కట్టి డబ్బులు కాజేశారు. మరోపక్క పెళ్లి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి చేరాల్సిన ఆర్థిక సాయాన్నీ కొందరు కాజేశారు. ఎంతోమంది దళారులు, కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులు అందినకాడికి దోచుకున్నారు. జిల్లాలో షాదీ ముబారక్, కల్యాణలక్ష్మీ పథకంలో చోటు చేసుకున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రెండు నెలల్లోనే షాదీ ముబారక్ పథకంలో అవినీతి నిరోధక శాఖ 11 కేసులు నమోదు చేసింది. తాజాగా.. నిరుపేద ఎస్సీ, ఎస్టీ యువతీ, యువకుల వివాహాలకు సంబంధించిన కల్యాణలక్ష్మీ పథకంపైనా దృష్టి సారించిన ఏసీబీ అధికారులు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి విచారణ చేపట్టేందుకు నిర్ణయించారు. ఇప్పటికే ఉట్నూరు, జైనూర్, నార్నూర్, మంచిర్యాల, మందమర్రి, కాసిపేట మండలాల్లో విచారణ పూర్తి చేశారు. మరో రెండ్రోజుల్లో తూర్పు ప్రాంత పరిధిలోని అన్ని మండలాల్లో ఉన్న దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి విచారణ చేపట్టనున్నారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మీలో వెలుగులోకి వస్తున్న అక్రమాలతో అక్రమార్కుల్లో వణుకుపుడుతోంది. దళారులు, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఈ రెండు పథకాల్లో అనర్హులకూ లబ్ధి చేకూర్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో అక్రమార్కుల్లో వణుకు పుడుతోంది. క్షుణ్ణంగా విచారణ..! జిల్లాలో కల్యాణలక్ష్మీ పథకం కింద 3,800 దరఖాస్తులు రాగా.. కేవలం మంచిర్యాల పరిధిలోని నస్పూర్, తీగల్పహాడ్, క్యాతన్పల్లి ప్రాంతాల నుంచే సుమారు 1500, మంచిర్యాల పట్టణం నుంచి కేవలం నాలుగు దరఖాస్తులున్నాయి. ఇందులో విశేషమేమిటంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన ప్రాంతాలన్నీ సింగరేణి కార్మికులవే కావడం. ఇటు షాదీ ముబారక్ పథకం కింద జిల్లా వ్యాప్తంగా 2,800 దరఖాస్తులొచ్చాయి. వీటిలోనూ అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఏళ్ల క్రితం పెళ్లయిన జంటలూ ఈ పథకం కింద లబ్ధిపొందారు. ఈ రెండూ పథకాల్లో లబ్ధిపొందిన సగానికి పైగా దరఖాస్తులపై ఏసీబీ అధికారులకు అనుమానాలున్నాయి. ఇప్పటికే షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ పథక దరఖాస్తులు, లబ్దిదారుల జాబితాను డివిజన్, నియోజకవర్గం, మండలాల వారీగా సేకరించిన ఏసీబీ అధికారులు సమగ్ర విచారణలో నిమగ్నమయ్యారు. లబ్ధిదారుడు సంబంధిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తా..? కాదా..? కుటుంబ ఆర్థిక పరిస్థితి..? వివాహం జరిగిన తేదీ ? సంబంధిత ధ్రువీకరణ పత్రాలపై విచారణ చేపడుతున్నారు. నిబంధనల ప్రకారం ఈ పథకంలో లబ్ధిపొందాలంటే ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన దరఖాస్తుదారుడి కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించరాదు. అయినా ఎంతోమంది ఆదాయానికి మించి ఆస్తులున్నా పథకం ద్వారా లబ్ధిపొందారు. అక్రమార్కులను వదిలిపెట్టేది లేదు: పాపాలాల్, ఏసీబీ డీఎస్పీ నిరుపేద యువతీ, యువకుల వివాహాల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా అనర్హులూ లబ్ధిపొందినట్లు మా ప్రాథమిక విచారణలో తేలింది. నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులకు లబ్ధి చేకూర్చారు. కొందరు ప్రజాప్రతినిధులు, దళారులు ప్రభుత్వాన్ని మోసం చేసి పేదలకందాల్సిన నిధులు కాజేశారు. అలాంటి వారి భరతం పడతాం. రెండు పథకాల లబ్ధిదారుల జాబితాను తీసుకున్నాం. మేమే స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి విచారణ చేపడతాం. అనర్హులు పథకాల ద్వారా లబ్ధిపొందినట్లు తెలిస్తే మా దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందిస్తాం. -
లక్ష్మీ.. రావే మా ఇంటికి!
♦ బీసీలకు కల్యాణలక్ష్మి పథకం వర్తింపు ♦ ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్ ♦ సంబురాల్లో వెనుకబడిన వర్గాలు ♦ జిల్లాలో బీసీ జనాభా 18.54లక్షలు ♦ దరఖాస్తుల పరిశీలన బాధ్యత బీసీ సంక్షేమ శాఖకే ♦ పారదర్శకంగా అమలు చేయాలంటున్న ప్రజాప్రతినిధులు, నేతలు జోగిపేట : బీసీలకూ కల్యాణలక్ష్మి పథకం వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వెనుకబడిన వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఏప్రిల్ 1 నుంచి బీసీలు, ఓబీసీలకు కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు జీఓ ఎంఎస్ నం. 5ను జారీ చేసింది. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రూ.51 వేల ఆర్థిక సాయం అందుతుంది. ప్రారంభంలో ఎస్సీ, ఎస్టీలకే ఈ పథకాన్ని వర్తింపజేసిన ప్రభుత్వం తాజాగా బీసీలకు వర్తింపజేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఇక నుంచి బీసీలు, ఓబీసీలు, తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుంది. జిల్లాలో బీసీ జనాభా 18.54 లక్షలు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ మైనార్టీల కంటే బీసీలే అధికంగా ఉన్నారు. జిల్లాలో మొత్తం బీసీ జనాభా 18,54,073 లక్షలు. వీరిలో 70 శాతానికిై పెగా నిరుపేద వర్గాలకు చెందిన వారే ఉన్నారు. వీరిలో చాలామంది ఆడబిడ్డల పెళ్లిళ్లు చేయలే క సతమత మవుతున్నారు. బీసీలకు, ఓబీసీలకు కల్యాణలక్ష్మి పథకం వర్తించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో చాలా మంది తల్లిదండ్రులకు ఇది వరంగా మారింది. కల్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేయడంతో బీసీలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిశీలన బాధ్యత ఆ శాఖ అధికారులకే.. దరఖాస్తుల పరిశీలన బాధ్యతలను ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించింది. సహయ బీసీ సంక్షేమ అధికారులు (ఏబీసీడబ్ల్యూఓ) వసతి గృహ వార్డెన్లకు ఈ బాధ్యతలను కట్టబెట్టింది. దరఖాస్తులు చేసుకునే వారు ఆయా మండల ప్రాంతాల వార్డెన్లకు దరఖాస్తులు అందజేస్తే సరిపోతుంది. దరఖాస్తు చేసే విధానం.. ♦ సమీపంలోని మీ-సేవ కార్యాలయంలో గాని, ఏదైనా ఇంటర్నెట్ సెంటర్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో, హాస్టల్ వార్డెన్లకూ దరఖాస్తులు సమర్పించవచ్చు. ♦ వధూవరుల వయస్సు ధ్రువీకరణ పత్రం లేదా టెన్త్ మెమో, బోనఫైడ్, టీసీ ♦ వధూవరుల కుల ధ్రువీకరణ పత్రం ♦ వధూవరుల ఆధార్ కార్డులు ♦ వధువు బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్ ♦ వివాహ ప్రతిక, మొదటి వివాహ ధ్రువపత్రం (గెజిటెడ్ అధికారి సంతకం చేసినది) ♦ సంబంధిత గ్రామ పంచాయతీ నుంచి వివాహ ధ్రువపత్రం. పథకం పక్కదారి పట్ట కుండా చూడాలి ♦ పేద బీసీ వర్గాల కోసం ప్రవేశ పెట్టిన పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే. పేద బీసీ ఆడపడుచుల వివాహానికి ప్రభుత్వం మంజూరు చేసే రూ.51వేలు కొంత మేరకు ఉపయోగపడతాయి. ♦ నిబంధనల పేరిట పేదలను ఇబ్బంది పెట్టొద్దు. బీసీలు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. - కవిత, చైర్పర్సన్, జోగిపేట నగర పంచాయతీ వివాహ రిజిస్ట్రేషన్ పత్రం.. ఏప్రిల్ 1నుంచి పెళ్లిళ్లు చేసుకున్న బీసీ యువతులు, కల్యాణలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కల్గిన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అనంతరం ఏబీసీడబ్ల్యూవోలు, వార్డెన్లు వాటిని పరిశీలిస్తారు. ఆ వెంటనేవధువు ఖాతాల్లోకి ట్రెజరీ ద్వారా నిధులు జమ అవుతాయి. ఆశన్న, - బీసీ సంక్షేమ శాఖ అధికారి సంగారెడ్డి పథకం కింద అర్హత పొందాలంటే .. ♦ వివాహం కానివారై ఉండాలి, వధూవరులు ఒకే కులానికి చెందిన వారై ఉండాలి. ♦ పెళ్లి నాటికి వధువుకి 18, వరుడికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ♦ తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలకు మించరాదు. ♦ {పతి వధువుకు ఒకసారి మాత్రమే వర్తిస్తుంది. ♦ ఏప్రిల్ 1 తర్వాత వివాహం చేసుకున్న బీసీ యువతులందరూ అర్హులే. -
కల్యాణలక్ష్మి ఆదాయ పరిమితిలో మార్పు
సాక్షి, హైదరాబాద్: బీసీ, ఈబీసీల కల్యాణలక్ష్మి పథకంలో ఆదాయపరిమితిలో మార్పులు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. పట్టణాల్లో ఉండే వారి కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి వార్షికాదాయం రూ.లక్షన్నర లోపు ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మైనారిటీలకు వర్తించే ‘షాదీ ముబారక్’ పథకానికి కూడా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి ఆదాయ పరిమితులు వేర్వేరుగా ఉన్నాయి. ఇదే తరహా నిబంధనను బీసీ, ఈబీసీలకు అమలయ్యే తీరుగా ఈ మార్పులు చేశారు. -
పేదింట కల్యాణలక్ష్మి
♦ ఆడపిల్లల కుటుంబాలను ఆదుకుంటున్న పథకం ♦ పెళ్లినాటి ఖర్చులో సగానికి తగ్గుతున్న భారం ♦ జిల్లాలో ఇప్పటివరకు 2,760 మందికి మంజూరు ♦ ఎదురుచూస్తున్న 1,179 మంది దరఖాస్తుదారులు ♦ వచ్చేనెల 1వ తేదీ నుంచి బీసీ, ఈబీసీలకూ వర్తింపు ఈరోజుల్లో ఆడపిల్ల పెళ్లి ఆషామాషీ కాదు. సంబంధం కుదిరిన దగ్గరి నుంచి డబ్బులు మంచినీళ్లలా ఖర్చుచేయాల్సిన రోజులు. కలిగిన కుటుంబాలకైతే ఏ ఇబ్బందీ ఉండదు. మధ్యతరగతి కుటుంబమైతే కాస్త చూసి ఖర్చు చేసుకుంటుంది. మరి నిరుపేద కుటుంబమైతే అప్పు చేయడం తప్పనిసరి. పెళ్లి చేసిన నాలుగైదు ఏళ్ల వరకు తల్లిదండ్రులు వడ్డీలకు తెచ్చిన డబ్బులకు మిత్తీలు కట్టుకుంటూ పోవాల్సిందే. ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం పేదల ఇంట్లో పెళ్లికి కానుకగా అందిస్తున్న పథకం ‘కల్యాణలక్ష్మి’. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు జిల్లాలో ఇప్పటివరకు 3,439 మంది దరఖాస్తు చేసుకోగా 2,760 మందికి డబ్బులు మంజూరయ్యాయి. - చేవెళ్ల పేదింటి ఆడబిడ్డల వివాహ సమయంలో ఆదుకోవాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం.. 2014 మహాత్మాగాంధీ జయంతి రోజున కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి అందులో భాగంగా వారి కుటుంబాలకు రూ. 51 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. ముందుగా ఈ పథకాన్ని దళిత, గిరిజనులకు మాత్రమే వర్తింపజేసింది. ఈ పథకం కింద వివాహం చేసే అమ్మాయి వయస్సు 18 సంవత్సరాల వయసు కలిగి ఉండాలని, మొదటి వివాహం అయి ఉండాలని ప్రభుత్వం నిబంధన విధించింది. అంతేగాక ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అమ్మాయి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 2 లక్షలకు మించరాదని పేర్కొంది. ప్రభుత్వం ఇచ్చే ఈ మొత్తంతో సగం పెళ్లి ఖర్చుల నుంచి బయట పడ వచ్చని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా షాదీముబారక్ పేరుతో ముస్లిం మైనారిటీలకు కూడా ఈ పథకం ప్రభుత్వం వర్తింపజేసింది. 2015 నుంచి ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల్లోని పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లలకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేస్తూ ప్రభుత్వం ప్రకటించింది. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 3,439 మంది దరఖాస్తు చేసుకోగా 2,760 మందికి మంజూరు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. వచ్చేనెల 1వతేదీ నుంచి బీసీ, ఈబీసీలకు వర్తింపు సమాజంలోని పలు వర్గాల డిమాండ్ మేరకు కల్యాణలక్ష్మి పథకాన్ని వచ్చేనెల ఒకటవ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వెనుకబడిన తరగతులు (బీసీ), ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈబీసీలకు) సైతం వర్తింపజేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. దీంతో ఈ పథకం ద్వారా బీసీలు, ఈబీసీలు కూడా లబ్ధిపొందనున్నారు. ఎదురుచూపులు రంగారెడ్డి జిల్లాలో ఈ పథకం కింద 3,439 మంది దరఖాస్తులు చేసుకోగా వీరిలో కేవలం 2,760 మందికి మాత్రమే మంజూరు చేశారు. దీంతో కల్యాణలక్ష్మిలో దరఖాస్తు చేసుకున్న వారిలో ఇంకా 1,179 మంది ఎదురుచూస్తున్నారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న తరువాత సంబంధిత అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి మం జూరు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సంబంధిత అధికారులు పరిశీలనలో జాప్యం చేస్తుండడంతో దరఖాస్తుదారులు ఎదురుచూడాల్సిన దుస్థితి నెల కొంది. పెళ్లి ఖర్చులకు పనికి వచ్చాయి మాది సామాన్య పేద కుటుంబం. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి పథకం గురించి తెలుసుకుని పెళ్లి ముందే దరఖాస్తు చేసుకున్నాం. దీంతో వివాహ సమయానికి ముందే రూ. 51 వేలు అధికారులు అందించారు. ఈ డబ్బు ఎంతో ఉపయోగపడింది. - అండాలు, చేవెళ్ల గ్రామం తల్లిదండ్రులకు భారం తగ్గుతుంది ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం పేద తల్లిదండ్రులను ఆదుకుంటోంది. వివాహ సమయంలో బంధుమిత్రులు, తెలిసిన వారు కూడా అప్పు ఇచ్చేందుకు వెనకాడతారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రూ. 51 వేలతో సగం వివాహం పూర్తి అయినట్లే. ఇంతకన్నా ఏం కావాలి. - అరుణ, చేవెళ్ల పెళ్లికి చేసిన.. అప్పులు తీరాయి మాది నిరుపేద కుంటుంబం. నేను చిన్నగా ఉన్నప్పుడే నాన్న చనిపోయాడు. అమ్మ కూలీనాలీ చేసి పెంచింది. నా పెళ్లికి రూ.లక్ష వరకు అప్పు చేసింది. అందులో క ల్యా ణ లక్ష్మి కింద రూ. 51 వేలు ప్రభుత్వం మంజూరు చేసింది. వాటితో సగం అప్పులు తీర్చుకున్నాం. - సునంద, నారెగూడ, నవాబ్పేట మండలం -
ఇక పేదలందరికీ 'కల్యాణ లక్ష్మి'
హైదరాబాద్: పేద యువతుల వివాహాలకు ఆర్థికంగా తోడ్పాటునిచ్చే ఉద్దేశంతో తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. వెనుకబాటు తనమే ప్రామాణికంగా ఇకపై అన్ని పేద కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సామాజికంగా, ఆర్థికంగా, విద్యా పరంగా వెనుకబడిన కుటుంబాల్లోని యువతులకు కూడా వివాహ సమయంలో రూ.51 వేల రూపాయల ఆర్థిక సాయం అందించేలా పథకం నిబంధనల్లో సవరణ చేశారు. తల్లిదండ్రుల ఇద్దరి ఆదాయం కలిపి గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకుండా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. -
ఇక బీసీలకు కల్యాణలక్ష్మి పథకం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు కల్యాణలక్ష్మి పథకం వర్తింపుచేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు మైనారిటీలకు షాదీముబారక్, గిరిజనులకు కల్యాణలక్ష్మీ పథకం పేరుతో ఉన్న ఇస్తున్న ఈ పథకాన్ని ఇక బీసీలకు ఇవ్వనున్నారు. ఏడాది ఆదాయం రూ.2 లక్షలకు లోబడి ఉన్న వెనకబడిక కులాలకు చెందిన కుటుంబాలకు కల్యాణలక్ష్మీ పథకం వర్తింపు చేస్తారు. 18 సంవత్సరాలు నిండి వివాహం చేసుకోబోయే బీసీ యువతులకు ఈ పథకాన్ని అందిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వివాహం చేసుకునే వారికి ప్రభుత్వం పథకాన్ని వర్తింపు చేయనున్నారు. కల్యాణలక్ష్మీ పథకం కింద ప్రభుత్వం రూ.51 వేలను అందిస్తున్న విషయం తెలిసిందే. -
బీసీల ‘కల్యాణలక్ష్మి’ మార్గదర్శకాలు సిద్ధం
♦ సీఎం వద్దకు ఫైలు.. ♦ సంతకం కాగానే ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గా ల కల్యాణలక్ష్మి పథకానికి మార్గదర్శకాలు సిద్ధమయ్యా యి. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ఆమోదముద్ర వేసిన ఫైలును ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్ సీఎంకు పంపారు. సీఎం సంతకం చేయగానే మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు ప్రభుత్వం విడుదల చేస్తుంది. నిర్ణీత తేదీ (ఏప్రిల్ 1,2016) తర్వాత వివాహాలు చేసుకునేవారికే ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకం కింద 2016-17 బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. దీని కింద బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన దాదాపు 60 వేల మందికి ప్రయోజనం కలగనుంది. ఆర్థికసాయం కోసం వచ్చే దరఖాస్తులను బట్టి అదనపు బడ్జెట్ను ప్రభుత్వం కేటాయించే అవకాశముంది. పేదింటి వధువు బ్యాంక్ అకౌంట్లో రూ.51 వేలు నేరుగా జమ చేసేలా ఎస్సీ, ఎస్టీల కోసం కల్యాణలక్ష్మి, మైనారిటీల కోసం షాదీముబారక్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకాల మార్గదర్శకాలనే కొంచెం అటుఇటుగా అమలు చేయనున్నారు. ఈ పథకం కింద ఆన్లైన్లో దరఖాస్తులు అందిన తర్వాత జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి, క్షేత్రస్థాయి సిబ్బందితో ఆయా వివరాలు, సమాచారాన్ని పరిశీలించి డబ్బును మంజూరు చేస్తారు. అనంతరం పెళ్లి కుమార్తె బ్యాంక్ అకౌంట్లో రూ.51 వేలు జమ అవుతాయి. కావాల్సిన అర్హతలు ♦ తెలంగాణకు చెందిన బీసీ, ఈబీసీ అవివాహిత అమ్మాయిలై ఉండాలి. ♦ వధూవరులిద్దరికీ 18 ఏళ్ల వయస్సు నిండాలి ♦ కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షల లోపు ఉండాలి. ళీ ఏప్రిల్ 1, 2016 తర్వాత పెళ్లిళ్లు చేసుకునేవారికే వర్తింపు ళీ మొదటిసారి వివాహం చేసుకున్నవారే అర్హులు. జత చేయాల్సిన పత్రాలు ♦ పుట్టిన తేదీ సర్టిఫికెట్, ళీ కుల,కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ♦ వధూవరుల ఆధార్కార్డులు ళీ పెళ్లికూతురు ఫొటోతో ఆమె పేరిట బ్యాంక్ ఖాతా వివరాలు ళీ గ్రామ పంచాయతీ/ఎమ్మార్వో/మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన పెళ్లి ధ్రువీకరణపత్రం ళీ ఆన్లైన్లో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి -
మళ్లీ మళ్లీ.. పెళ్లి!
♦ కల్యాణలక్ష్మి, షాదీముబారక్లో బయటపడుతున్న లీలలు ♦ అధికారులు, దళారుల మిలాఖత్ ♦ సరూర్నగర్ మండలంలోనే 100కుపైగా నకిలీలు ♦ ఓ మధ్యవర్తి మూడు దరఖాస్తుల్లో పెళ్లికొడుకు ♦ రెండు గంటల్లోనే కుల, ఆదాయ సర్టిఫికెట్లు ♦ తీగలాగుతున్న అవినీతి నిరోధక శాఖ ♦ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ సరూర్నగర్ మండలానికి సంబంధించి దాదాపు వందకుపైగా నకిలీ లబ్ధిదారులున్నట్లు ఏసీబీ చెబుతోంది. ఈ క్రమంలో 16 మంది నకిలీల బాగోతాన్ని బయటపెట్టింది. ఇప్పటివరకు నకిలీలుగా గుర్తించిన దరఖాస్తుల్లో ఎజాజుల్లాఖాన్ అనే మధ్యవర్తి తానే మూడు చోట్ల పెళ్లికొడుకు స్థానంలో ఉన్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో అక్రమాల డొంక కదులుతోంది. ఈ పథకాల సొమ్ము లబ్ధిదారులు కాకుండా మధ్యవర్తులకు దక్కుతోందని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే పదిరోజుల క్రితం అక్రమాలు జరుగుతున్న తీరును బయటపెట్టిన ఏసీబీ.. తాజాగా సర్కారు సొమ్ము దారిమళ్లిందన్న విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఈ వ్యవహారంలో సూత్రధారుల బాగోతాన్ని బహిర్గతం చేస్తూ.. అందుకు సంబంధించి నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ ముమ్మరం చేసింది.- సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా : నిరుపేద దళిత, మైనార్టీల కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక లబ్ధి చేకూర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది. అయితే ఈ ప్రక్రియను సాజావుగా సాగించి లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించాల్సి ఉండగా.. కొందరు అధికారులు ధనార్జనే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ.. షాదీముబారక్ పథకంలో చోటుచేసుకున్న అక్రమాలను వెలుగులోకి తెస్తోంది. ఈ క్రమంలో తవ్వేకొద్ది అక్రమాలు బయటపడుతున్నాయి. పది రోజుల క్రితం సరూర్నగర్ మండలానికి చెందిన సుల్తానాబేగం పేరిట మంజూరైన షాదీముబారక్ నగదును ఇతరులు కాజేసిన వైనాన్ని ఏసీబీ బయటపెట్టింది. అయితే ఈ మొత్తాన్ని ఎవరు తీసుకున్నారు.. ఎలా చెల్లింపులు జరిగాయి.. సుల్తానాబేగం పేరిట దరఖాస్తు చేసిన తీరును పూర్తిగా అధ్యయనం చేసిన ఏసీబీ పలు ఆసక్తికర విషయాల్ని మంగళవారం మీడియాకు వెల్లడించింది. మైనార్టీ శాఖలో దళారుల రాజ్యం.. ప్రస్తుతం షాదీముబారక్ పథకంలో అక్రమాలను వెలికితీసే క్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్ తాహెరుద్దీన్ను ఏసీబీ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది. షాదీముబారక్ పథకం కింద నకిలీ దరఖాస్తులను సృష్టిస్తూ.. వాటిని శాఖపరంగా ఓకే చేయించే క్రమం లో తాహెరుద్దీన్ చురుకైన పాత్ర పోషిం చినట్లు ఏసీబీ ప్రాథమికంగా తేల్చింది. అదేవిధంగా అన్ని అర్హతలున్న ఒక్కో లబ్ధిదారుడి నుంచి కూడా కనిష్టంగా రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేసి వారికి మంజూరు పత్రాన్ని అందిస్తున్నట్లు గుర్తించింది. మైనార్టీ శాఖ ఉద్యోగిలా కాకుండా.. బయటివ్యక్తిలా మాట్లాడుతూ లబ్ధిదారులతో బేరసారాలు చేయడం, అనర్హుల నుంచి దరఖాస్తు చేయించడంలో ఒక ముఠాను ఏర్పాటు చేసి చక్రం తిప్పుతున్న తీరును కూడా ఏసీబీ నిగ్గుతేల్చింది. ఇలా దరఖాస్తు.. అలా సర్టిఫికెట్.. సరూర్నగర్ మండలానికి సంబంధించి దాదాపు వందకుపైగా నకిలీ లబ్ధిదారులున్నట్లు ఏసీబీ చెబుతోంది. ఈ క్రమంలో 16 మంది నకిలీల బాగోతాన్ని బయటపెట్టింది. వీరికి సంబంధించి దరఖాస్తు చేసుకునే తీరు మొదలు.. నగదు మంజూరయ్యే వరకు ప్రతిచోట దళారులు చురుకైన పాత్ర పోషించారు. సరూర్నగర్ మండలంలో ఎజాజుల్లాఖాన్ అనే మధ్యవర్తి మీసేవా కేంద్రం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేస్తాడు. అనంతరం వారికి సంబంధించి కుల, ఆదాయ సర్టిఫికెట్లను చంద్రాయణగుట్టలోని క్లిక్ నెట్ సెంటర్ ద్వారా దరఖాస్తు చేసిన తర్వాత.. సరూర్నగర్ తహసీల్దార్ కార్యాలయంలో మరో మధ్యవర్తిని ఆశ్రయించి కుల, ఆదాయ సర్టిఫికెట్లను రెండు మూడు గంటల్లో పొందుతాడు. ఆ తర్వాత పహడీషరీఫ్లోని ఇండియన్ బ్యాంకులోనూ ఎలాంటి పరిచయస్తులు, ఆధారాలు లేకుండా బ్యాంకు ఖాతాను తెరిచి ఒక రోజులోనే ఈ వివరాలను మైనార్టీ శాఖలోని తాహెరుద్దీన్కు అందిస్తాడు. ఇక శాఖాపరంగా జరిగే పరిశీలన.. ఫైల్ మూవ్మెంట్ అంతా అక్కడ చకచకా సాగిపోతుంది. ఈ ప్రక్రియకోసం తాహెరుద్దీన్ సగటున రూ.5 నుంచి రూ.10వేలు తీసుకుంటాడని, క్షేత్రస్థాయిలో పని పూర్తిచేసేందుకు ఎజాజుల్లాఖాన్ రూ.వెయ్యి రూపాయలు తీసుకుంటాడని ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్, ఇన్స్పెక్టర్ లక్ష్మి విలేకర్లకు వివ రించారు. నకిలీలుగా గుర్తించిన 16 దరఖాస్తుల్లో ఎజాజుల్లాఖాన్ మూడు చోట్ల పెళ్లికొడుకు స్థానంలో ఉన్నట్లు వారు తెలిపారు. ఇప్పటికే తాహెరుద్దీన్, ఎజాజుల్లాఖాన్లను అదుపులోకి తీసుకోగా.. తహసీల్దార్ కార్యాలయం, ఇండియన్బ్యాంకులో వీరికి సహకరించినవారిని త్వరలో పట్టుకోనున్నట్లు పేర్కొన్నారు. -
కర్ణాటక యువతికి 'కళ్యాణలక్ష్మి' డబ్బులు
పెద్దేముల్ (రంగారెడ్డి) : కళ్యాణలక్ష్మి పథకంలో భాగంగా కర్ణాటకకు చెందిన యువతికి డబ్బులు ఇచ్చారంటు ఓ వ్యక్తి సబ్కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలంలో మంగళవారం వెలుగుచూసింది. ఓ వైపు కళ్యాణ లక్ష్మి పథకం పక్కదారి పడుతోందని ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తుంటే.. మరో వైపు కొందరు నకిలీ ధృవ పత్రాల సాయంతో కళ్యాణ లక్ష్మి డబ్బులు స్వాహా చేస్తున్నారని ఆత్కూర్ తండాకు చెందిన రాందాస్ వికారాబాద్ సబ్కలెక్టర్ శృతి ఓజకు పిర్యాదు చేశారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా మగ్ధల్ గ్రామానికి చెందిన ఓ అమ్మాయికి స్థానిక తండాకు చెందిన యువకుడితో వివాహం జరిగింది.ఆ అమ్మాయి తెలంగాణ రాష్ట్రంలో జన్మించిందని దొంగ సర్టిఫికెట్లు సృష్టించి కళ్యాణ లక్ష్మి డబ్బులు తీసుకున్నారంటు రాందాస్ మంగళవారం పెద్దేముల్కు వచ్చిన సబ్కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సబ్కలెక్టర్ బుధవారంలోగా పూర్తి నివేదిక అందజేయాలని తహశీల్దార్కు ఆదేశాలు జారీ చేశారు. -
మధ్యవర్తుల మాటలు నమ్మకండి
ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ సాక్షి, రంగారెడ్డి జిల్లా: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద డబ్బులిప్పిస్తామని చెప్పే మధ్యవర్తుల మాటలు నమ్మొద్దని ఏసీబీ డీఎస్పీ ఎం.ప్రభాకర్ సూచించారు. ఈ పథకాల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఏసీబీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పేద దళిత, మైనార్టీ కుటుంబాల్లో పెళ్లికి ప్రభుత్వం ఆర్థిక సాయం ఇచ్చే ప్రక్రియలో మధ్యవర్తులు చలామణీ అవుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో సరూర్నగర్ మండలం నుంచి షాదీ ముబారక్ కింద లబ్ధిపొందిన సుల్తానాబేగం దరఖాస్తును పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అవకతవకలను పసిగట్టినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ తాహెరుద్దీన్ను అదుపులోకి తీసుకొని అతడిపై క్రిమినల్ మిస్ కండక్ట్ కింద సెక్షన్ 13-1-డి, ఐపీసీ 471 కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. హయత్నగర్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు, రాజేంద్రనగర్, బాలానగర్, మల్కాజిగిరి, సరూర్నగర్ మండలాలకు సంబంధించి 76 దరఖాస్తులు విచారణలో ఉన్నాయని చెప్పారు. త్వరలో వాటిని నిగ్గు తేలుస్తామని స్పష్టం చేశారు. కల్యాణలక్ష్మి పథకానికి సంబంధించి కూడా పూర్తిస్థాయి విచారణ చేపడతామన్నారు. సంక్షేమ పథకాల్లో అవకతవకలు, మధ్యవర్తుల జోక్యం ఉన్నట్లు గుర్తిస్తే తమను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో ఇన్స్పెక్టర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణంలో కక్కుర్తి!
♦ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్లో భారీగా అక్రమాలు ♦ లబ్ధిదారులకు తెలియకుండా మధ్యవర్తుల స్వాహా ♦ అధికారులూ సూత్రధారులే.. పసిగట్టిన నిఘా విభాగం ♦ ఏసీబీ విచారణలో వెలుగు చూస్తున్న వాస్తవాలు సాక్షి, రంగారెడ్డి జిల్లా: నిరుపేద దళిత, మైనార్టీల కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక లబ్ధి కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పక్కదారి పట్టాయి. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలు.. వారికి ఇచ్చే ఆర్థిక చేయూత వరకూ అంతా మధ్యవర్తుల కనుసన్నల్లోనే నడుస్తున్నట్టు తేలింది. కొన్ని సందర్భాల్లో అర్హత ఉన్న వారికి సైతం కనీస సమాచారం లేకుండానే నిధులు స్వాహా చేస్తున్నారు. ఈ వ్యవ హారంలో అధికారులు కూడా సూత్రధారులు కావడం గమనార్హం. ఈ పథకాల్లో అవకతవకలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాల్సిందిగా అవినీతి నిరోధక శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈక్రమంలో రంగంలోకి దిగిన ఏసీబీ అక్రమాల డొంకను కదిలిస్తోంది. 2015-16 వార్షిక సంవత్సరంలో జిల్లాలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 8,396 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కళ్యాణ లక్ష్మికి సంబంధించి 3,146, షాదీముబారక్ కింద 5,250 మంది దరఖాస్తులు సమర్పించగా.. వీరిలో దాదాపు మెజారిటీ దరఖాస్తులను అర్హతకు ఎంపిక చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జిల్లాకు రూ.34.18 కోట్లు కేటాయించింది. ఈ దరఖాస్తుదారుల పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించి అనంతరం అర్హతను నిర్ధారించా లి. కానీ ఈ ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. అన్నీ డూప్లికేట్లే.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు సంబంధించి ముందుగా ఈ సేవ, మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు పెళ్లి కూతురు ఫొటో, ఆధార్ కార్డు, పెళ్లి పత్రిక, ముస్లిం మైనార్టీలైతే నిఖానామా, ఆదాయం, కుల ధ్రువీకరణ, బ్యాంకు పాసుపుస్తకం తదితర వివరాలన్నీ సమర్పించాలి. పెళ్లికి ముందు దరఖాస్తు చేసుకున్న సందర్భంలో విచారణకు వచ్చిన అధికారులకు పై వివరాలు చూపాల్సి ఉంటుంది. అయితే ఈ వ్యవహారంలో కొందరు అక్రమార్కులు రంగప్రవే శం చేశారు. పెళ్లైన దంపతుల ఫొటో, ఆధార్ వివరాలు సంపాదించి.. మిగతా వివరాలకు డూప్లికేట్లను తయారుచేసి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. అనంతరం వాటిని ఆయా శాఖల అధికారులతో బేరం కుదుర్చుకుని నిధులు మంజూరయ్యాక పంచుకుంటున్నారు. వెలుగులోకి వచ్చిందిలా.. నిరుపేదలకు అందాల్సిన ఆర్థిక సాయంలో అక్రమార్కులు చొరబడిన అంశాన్ని ఏసీబీ పసిగట్టింది. ముందుగా మైనార్టీ సంక్షేమ శాఖ, ఎస్సీ అభివృద్ధి విభాగాల నుంచి ఈ రెండు పథకాలకు సంబంధించి లబ్ధిపొందిన వారి వివరాలను సేకరించింది. అందులో పేర్కొన్న ఆధారాల ప్రకారం క్రమపద్ధతిలో మండలాల వారీగా విచారణకు దిగింది. ఈ క్రమంలో షాదీముబారక్ పథకం కింద సరూర్నగర్ మండలం నుంచి సుల్తానాబేగం అనే లబ్ధిదారురాలి ఇంటికి ఏసీబీ అధికారులు వెళ్లారు. చిరునామా తప్పుగా ఉందని గ్రహించిన ఏసీబీ అధికారులు సయ్యద్నగర్లో చిరునామాను పసిగట్టి వారిని విచారించగా.. తన వివాహం జూన్ 9, 2013లో జరిగిందని, దీంతో తనకు అర్హత లేనందున దరఖాస్తు చేసుకోలేదని నిఖానామాను చూపింది. దీంతో ఖంగుతిన్న అధికారులు మరింతలోతుగా పరిశీలన చేపట్టారు. దరఖాస్తు ఫారంతో ఉన్న వివరాల్లో సంతకాలు ఒకేలా ఉన్నప్పటికీ.. పెళ్లి కుమారుడి ఓటరు కార్డులో నకిలీ ఫొటో, నిఖానామాలో ఫోర్జరీ, తప్పుడు ఆదాయపత్రం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయం పహడీషరీఫ్లోని ఇండియన్ బ్యాంకు ఖాతాలో జమైంది. అయితే ఈ నిధులను డ్రా చేసిన విత్డ్రా ఫాంలోనూ సరైన సంతకం ఉంది. కానీ ఈ ఖాతా తెరిచిన వ్యక్తికి పరిచయస్తుడైన ఖాతా దారుడు సంతకం పెట్టకపోవడం గమనార్హం. -
తెల్లకార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ‘కల్యాణలక్ష్మి’
జెడ్పీ చైర్మన్ బండారిభాస్కర్ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): అన్ని వర్గాల అభివృద్ధే టీఆర్ఎస్ లక్ష్యమని తెల్ల రేషన్కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ కల్యాణలక్ష్మి అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ అన్నా రు. సోమవారం తన చంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అగ్రకులాల్లో ఉండి తెల్లరేషన్ కార్డు ఉన్నవారికీ ఈ పథకం అమలవుతుంద సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించినట్లు చెప్పారు. అందులో భాగంగానే జిల్లాకు రూ.35 వేల కోట్లతో పెద్ద ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతలను నిర్మించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో జిల్లాలో సుమారు 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. వర్షాభావం కారణంగా నెలకొన్న నీటి కొరతను తీర్చేందుకు ముందస్తు చర్యలు చేపట్టనున్నుట్లు తెలిపారు. రైతులకు పగడి పూట 9 గంటల నిరంతరం విద్యుత్ను సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. -
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్లపై ఏసీబీ నిఘా
హైదరాబాద్ : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల నిర్వహణపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిరంతరం నిఘా ఉండేలా చర్యలు చేపడుతోంది. ఈ పథకాలలో దళారుల ప్రమేయం లేకుండా, ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టనుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలలో అవకతవకలు జరుగుతున్నట్లు ఇటీవలి కాలంలో వెలుగు చూశాయి. దీంతో అక్రమార్కుల ఆట కట్టించేందుకు ఏసీబీని రంగంలోకి దించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాల్లో లబ్ధిదారుల వివరాలను పరిగణలోకి తీసుకొని దర్యాప్తు చేయగా భారీగా అవకతవకలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించి కేసులు సైతం నమోదు చేశారు. పథకాలలో చోటు చేసుకుంటున్న అవకతవకలపై ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి ఒక నివేదికను అందజేశారు. దీనిపై లోతుగా చర్చించిన ప్రభుత్వ వర్గాలు పథకాలలో మునుముందు అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఏసీబీ గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక నుంచి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఏసీబీ నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడంతో పాటు త్వరలో టోల్ఫ్రీ నెంబర్ను ప్రజల అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏసీబీ డీజీ ఏకే ఖాన్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
సంక్షేమ పథకాలపై ఏసీబీ నజర్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పథకాల్లో అవకతవకలకు పాల్పడిన వారిని ఇకపై కటకటాల్లోకి నెట్టేందుకు అవినీతి నిరోధక శాఖ రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో అవకతవకలు చోటుచేసుకుం టున్నట్టు ఆరోపణలు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ప్రభుత్వాదేశాలతో ఈ పథకాల కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల జాబి తాను ఆయా శాఖల నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దరఖాస్తుదారులను, విడుదలైన నిధుల చిట్టాపద్దులను పరిశీలించగా భారీ అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దళారులు, అధికారులు కుమ్మక్కై ప్రభుత్వ నిధులను కొల్లగొట్టినట్లు ఏసీబీ విచారణలో బయటపడుతోంది. మంగళవారం ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 కేసులు నమోదు చేసింది. మరో 20 కేసులు నమోదు చేసేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తోంది. -
'కల్యాణలక్ష్మి' అక్రమాలపై ఏసీబీ విచారణ
మల్దకల్ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క ల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో కొంతమంది అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడంతో ఏసీబీ డీఎస్పీ రాందాస్తేజ మండలంలో విచారణ చేపట్టారు. శనివారం మధ్యాహ్నం మల్దకల్లో పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడారు. అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయంకు చేరుకుని దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు సేకరించారు. అందులో ఏ అధికారి ఎక్కడ సంతకాలు పెట్టారో నోట్ చేసుకున్నారు. బోగస్ లబ్ధిదారులే.. విచారణ సమయంలో మల్దకల్ వీఆర్ఓ ప్రదీప్కుమార్ అందుబాటులో లేకపోవడంతో ఏసీబీ అధికారులు బృందంగా విడిపోయి ఇంటింటికి తిరిగి పూర్తి సమాచారం సేకరించారు. కొందరు లబ్ధిదారులు కల్యాణలక్ష్మా.. అదేంటీ.. అని ఆశ్చర్యం వ్యక్తం చేయగా, మరికొందరు దరఖాస్తు చేసుకున్న విషయం తమకు తెలియదన్నారు. మా పెళ్లయి ఆరేళ్లయిందని కొందరు.. మాకు పిల్లలున్నారని మరికొందరు ఏసీబీ అధికారులకు వివరించారు. అటునుంచి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వెళ్లి రికార్డులు పరిశీలించారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలు బ్యాంకు మేనేజర్కు తెలపడంతో జాబితా అందజేశారు. అక్రమాలపై ఇంకా లోతుగా విచారణ జరిపి త్వరలో వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ రాందాస్తేజ తెలిపారు. -
బీసీ సంక్షేమంలోకి బీసీ, ఈబీసీ ‘కల్యాణలక్ష్మి’
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతులతో (బీసీలు) పాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర కులాలకు (ఈబీసీలు) చెందిన వారికి వర్తింపజేసే కల్యాణలక్ష్మి పథకాన్ని బీసీ సంక్షేమశాఖ పర్యవేక్షణలోకి తీసుకురానున్నారు. ఎస్సీ, ఎస్టీలకు కల్యాణలక్ష్మి పథకాన్ని ఎస్సీ, ఎస్టీశాఖలు, మైనారిటీలకు షాదీ ముబారక్ పథకాన్ని మైనారిటీశాఖ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆర్థిక స్థోమత లేని కారణంగా అమ్మాయిల పెళ్లిళ్లు జరిపించడంలో పేద ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు పడుతున్న ఇబ్బందులను దూరం చేసేందుకు రూ.51 వేల ఆర్థిక సహాయాన్ని అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలుచేస్తోంది. వెనుకబడిన తరగతులకు చెందిన అనేక కులాల్లోని పేదలు కూడా తమ పిల్లల పెళ్లిళ్లు చేయడంలో ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో బీసీలకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. దీనిపై బీసీ సంక్షేమశాఖ కూడా గతంలోనే సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్ నుంచి ఈ పథకాన్ని బీసీలకు కూడా వర్తింపజేస్తున్నట్లు ఆ శాఖ మంత్రి జోగురామన్న ప్రకటించారు. కాగా, బీసీలతో పాటు అన్నికులాల్లోని పేదలకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది బడ్జెట్లో బీసీలకోసం ఈ పథకానికి రూ. 50 కోట్లు కేటాయించి, ముందుగా పదివేల మందికి ప్రయోజనం కల్పించనున్నారని సమాచారం. కులాలు, మతాలతో సంబంధం లేకుండా ఆర్థికంగా వెనుకబడిన వారందరికీ (అగ్రకులాల పేదలతో సహా) ఈ పథకాన్ని వర్తింపచేస్తారు. ఈసీబీల్లో సుమారు 25వేలమంది వరకు లబ్ధికల్పించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించనున్నారని సమాచారం. తెల్ల రేషన్కార్డు ఉండడంతోపాటు పట్టణప్రాంతాల్లో కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షలకు మించకుండా, గ్రామీణప్రాంతాల్లో రూ.లక్షన్నరకు లోబడి ఆదాయం ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. -
బీసీలకూ కల్యాణలక్ష్మి
అచ్చంపేట రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకాన్ని ఏప్రిల్ నుంచి బీసీలకూ వర్తింపజేయనున్నట్లు భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అచ్చంపేట నగరపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని ఇందిరానగర్, పదో వార్డులో మంత్రి ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ మాటకు కట్టుబడి ఉండే మనిషని, అచ్చంపేటకు ఎమ్మెల్యే బాలరాజు కృషి వల్లే వెయ్యి ఇళ్లు అదనంగా మంజూరయ్యాయని తెలిపారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూం అందజేస్తామని, వచ్చే విద్యాసంవత్సరం నుంచే కేజీ టూ పీజీ విద్యను ప్రారంభిస్తామన్నారు. అర్హులైన మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చేయిస్తామన్నారు. ప్రచారంలో జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నర్సింహగౌడ్, ఉస్సేన్, గణేష్, మాధవి, మల్లేశ్వరీ, శివ పాల్గొన్నారు. -
కల్యాణమస్తు తరహాలో మరో పథకం
సాక్షి, తిరుమల: కల్యాణమస్తు పథకం తరహాలోనే మరో కొత్త పథకానికి నాంది పలకాలని టీటీడీ ఈవో సాంబశివరావు సంకల్పించారు. పెళ్లి వేడుకల పేరుతో పేద కుటుంబాలకు తిరుమల కల్యాణ వేదిక చేయూత అందించాలని భావిస్తున్నారు. ఇటీవల కల్యాణ వేదికను సందర్శించిన సాంబశివరావు మౌలిక వసతులు పెంచాలని అధికారులను ఆదేశించారు. ‘కల్యాణ వేదికలో పెళ్లి చేసుకునే జంటలకు చేయూత నివ్వాలని భావిస్తున్నాం. ఇప్పటికే కల్పిస్తున్న సౌకర్యాలను పెంచనున్నా’ మని ఆయన తెలిపారు. త్వరలోనే వివాహాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వివరాలను కూడా వెల్లడిస్తామని తెలిపారు. -
తిరుమలలో పెళ్లిళ్లకు కొత్త ‘కల్యాణ’ స్కీం
♦ ఆన్లైన్లోనూ కల్యాణ వేదిక బుకింగ్ ♦ టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు వెల్లడి సాక్షి, తిరుమల: తిరుమలలో పెళ్లిళ్లు చేసుకునే భక్తులకు కొత్తగా స్కీం ప్రారంభిస్తామని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు తెలిపారు. గురువారం రాత్రి ఆయన కల్యాణవేదికలో సామూహిక వివాహ కార్యక్రమాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుమలలోని టీటీడీ పౌరోహిత సంఘం కల్యాణవేదికలో ఏటా సుమారు 5వేలకు పైగా వివాహాలు జరుతున్నాయని, వీటి నిర్వహణకోసం కొత్తగా ఆన్లైన్ బుకింగ్ సౌకర్యాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇందులో భాగంగానే గది, అన్నప్రసాదం, పెళ్లి రిజిస్ట్రేషన్, లడ్డూ ప్రసాదాలు వంటి సౌకర్యాలు కొత్త స్కీములో కల్పిస్తామన్నారు. భక్తులు సులభంగా, సౌకర్యవంతంగా తిరుమలలో పెళ్లి చేసుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. అవసరమైతే పెళ్లికి అవసరమైన పూజా సామగ్రి కూడా టీటీడీనే సమకూర్చే విషయంలో సాధ్యాసాధ్యాల్ని పరిశీలిస్తామన్నారు. -
తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతివారీకీ కల్యాణలక్ష్మి
తెల్లరేషన్కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ కళ్యాణలక్ష్మి పథకాన్ని మార్చి 31 నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి వెల్లడించారు. ఆదివారం నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని పీకేమల్లేపల్లి గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తోందన్నారు. ఆగస్టులో జరగనున్న కృష్ణా పుష్కరాల కోసం ఘాట్ల ఏర్పాటుకు రూ. 8 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ - నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారి వెడల్పునకు రూ. 107 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ సమావేశంలో నల్లగొండ జెడ్పీ చైర్మన్ బాలునాయక్ పాల్గొన్నారు. -
పేదలందరికీ కల్యాణలక్ష్మి
వరంగల్ జిల్లా బహిరంగసభలో సీఎం కేసీఆర్ ♦ మార్చి నుంచి తెల్లకార్డుదారులందరికీ కల్యాణలక్ష్మి వర్తింపు ♦ కాంట్రాక్టు జూనియర్ లైన్మన్లను రెగ్యులరైజ్ చేస్తాం ♦ విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతాం ♦ సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ సకాలంలో పూర్తి చేస్తాం ♦ ప్రతిపక్షాలు అవాకులు చెవాకులు పేలుతున్నాయి ♦ వరంగల్ ఉప ఎన్నికలో ప్రజలు బుద్ధి చెప్పినా మారడం లేదు ♦ హైదరాబాద్లోనూ అవే ఆరోపణలు చేస్తున్నారని మండిపాటు ♦ కేటీపీపీ రెండో దశ ప్లాంట్ను జాతికి అంకితం చేసిన సీఎం సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలోని పేదలందరికీ కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తామని, వచ్చే మార్చి నుంచి దీనిని అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. కులాలతో సంబంధం లేకుండా తెల్లకార్డు ఉన్న అందరికీ వచ్చే మార్చి నుంచి ఈ పథకం వర్తిస్తుందని, వివాహానికి ముందే ఈ సహాయం సొమ్మును అందిస్తామని చెప్పారు. కాంట్రాక్టు పద్ధతిలో జూనియర్ లైన్మెన్ (సీజేఎల్ఎం)గా పనిచేస్తున్న అందరినీ రెగ్యులరైజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని, దీనిపై త్వరలోనే ప్రకటన చేస్తామని చెప్పారు. వరంగల్ జిల్లా గణపురం మండలం చెల్పూరులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ)లో 600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన రెండోదశ ప్లాంట్ను సీఎం కేసీఆర్ మంగళవారం జాతికి అంకితం చేశారు. అనంతరం కేటీపీపీ ఆవరణలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రసంగం సీఎం కేసీఆర్ మాటల్లోనే.. ‘‘సమైక్య రాష్ట్రంలో ఒకాయన ఉండె. ముఖ్యమంత్రిగా చాన చెప్తుండే. తెలంగాణ వస్తే చిమ్మ చీకటైపోతది, అంధకారమైతదని మాట్లాడిండు. తెలంగాణ వస్తే ఈ రోజు ఏమైందో, ఇతర రాష్ట్రాల కంటే మనం ఎంత ముందున్నమో తెలుస్తోంది. విద్యుత్ అధికారులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నరు. రైతులకు వచ్చే ఖరీఫ్ నుంచి పగటి పూటనే తొమ్మిది గంటల కరెంటు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎన్నికల సందర్భంలనే చెప్పిన. 2018 నుంచి త్రీఫేజ్ గానీ, సింగిల్ఫేజ్ గానీ రెప్పపాటు కూడా పోకుండా 24 గంటల పాటు కరెంటు వస్తది. ప్రాజెక్టుల కల సాకారమవుతోంది.. సమైక్య రాష్ట్ర పాలకులు ఎన్ని ప్రాజెక్టులు తలపెట్టినా.. మనకు నీళ్లు వచ్చేటట్టు కట్టలే. ఇదే జిల్లా (వరంగల్) నుంచి ఓ పుణ్యాత్ముడు అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉండె.. దేవాదుల ప్రాజెక్టుకు 170 రోజులు నీళ్లు తోడుకోవాలి.. కానీ ఇప్పుడు 60, 70 రోజులు కూడా తోడుకునే పరిస్థితి లేదు. ప్రాజెక్టు కట్టిండ్రుగాని బ్యారేజీని వదిలిపెట్టిండ్రు. ఈ రోజు మనం బ్యారేజీ కట్టుకోబోతున్నం. దేవాదుల మూడో దశ రామప్ప వరకు పూర్తయింది. రూపాయి ఖర్చు లేకుండా గణపురం, లక్నవరం చెరువులను నింపే అవకాశముంది. కాళేశ్వరం వద్ద బ్యారేజీ నిర్మించి ఐదారు జిల్లాలకు నీరు తీసువచ్చేందుకు ప్రణాళికలు రూపొందించినం. ఈసారి నుంచి ఏటా రూ.25 వేల కోట్లు ఇరిగేషన్ కోసం కేటాయిస్తున్నం. దేవాదుల పూర్తయితే భీంఘన్పూర్, రామప్ప, లక్నవరం చెరువులు 365 రోజులు నిండే ఉంటయి. తెలివిగల రైతులు మూడు పంటలు పండించేందుకు అవకాశం ఉంది.. పేదలను ఆదుకుంటం.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కార్యక్రమం ఏదైనా.. బీసీ వర్గాలకు కూడా కావాలని కోరుతున్నరు. బీసీ, ఓసీ కాదు.. తెల్లరేషన్కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి మార్చి నెల నుంచి కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తమని హామీ ఇస్తున్న. కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకం కింద అందే డబ్బులు పెళ్లికి ముందే అందిస్తాం. పెళ్లి చేసే ఆడపిల్ల తల్లికి ఈ డబ్బులు అందేవిధంగా అధికారులు చూడాలె. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూడాలె. పేదల సంక్షేమంలో నంబర్ వన్గా ముందుకు పోతున్నాం. సమైక్య రాష్ట్రంలో ఉద్యోగులను కూడా బానిసలుగా చూసిండ్రు. వారి శ్రమ దోపిడీ చేసిండ్రు. కాంట్రాక్టు ఉద్యోగులను రాచిరంపాన పెట్టారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బాధలను పట్టించుకోలేదు. ఇప్పుడు మానవత్వంతో పనిచేసే ప్రభుత్వం కాబట్టి... కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించేలా ఆదేశాలు ఇచ్చింది. ఔట్సోర్సింగ్ వాళ్ల కడుపు నింపేం దుకు దాదాపు రెండు రెట్లు వేతనాలు పెంచి నం. కరెంటు శాఖలో ఉన్న సీజేఎల్ఎం (కాం ట్రాక్టు జూనియర్ లైన్మెన్)లు రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నరు. రేపటి నుంచి వారం తా రెగ్యులర్ జూనియర్ లైన్మెన్లు అవుతరు. విద్యుత్ శాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు కూడా పెరగాల్సిన అవసరం ఉంది. ఆ శాఖ అధికారులు, మంత్రితో మాట్లాడి దీనిపై త్వరలోనే తీపి వార్త చెబుతాం.. బంగారు తెలంగాణ సాధిస్తం.. అన్ని వర్గాలను కలుపుకొనిపోతూ, అన్ని వర్గాలను ఆదరిస్తూ ముందుకు పోతున్నం. దసరా, బతుకమ్మలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించాం. ముస్లిం సోదరులు రంజాన్ జరుపుకొంటే చరిత్రలో లేనివిధంగా లక్షల మందికి వస్త్రాలు పంచినం. క్రిస్మస్ పండుగకు లక్షల మంది పేద క్రిస్టియన్లకు వస్త్రాలు పంపిణీ చేసినం. ప్రజలందరూ సుఖసంతోషాలతో బతకాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం. రాబోయే రోజుల్లో దళిత, మైనారిటీ విద్యార్థుల కోసం దాదాపు 200 గురుకుల పాఠశాలలు ప్రారంభించబోతున్నం. ప్రజల దీవెనలతో బంగారు తెలంగాణను వంద శాతం సాధిస్తామని తెలియజేస్తున్నా.. ప్రతిపక్షాలను చూస్తే జాలివేస్తోంది.. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఉండలె, వాటి మధ్య పోటీ ఉండాలె. కానీ ఇవాళ ప్రతిపక్షాలనేటి కొన్ని పార్టీలు ఉన్నయి. వారిని చూస్తే జాలి కలుగుతున్నది. మొన్ననే మీరిక్కడ వారికి బుద్ధి చెప్పి పంపిండ్రు. కానీ వాళ్లు హైదరాబాద్లో మళ్లా అదే మాదిరిగా, ఇక్కడ మాట్లాడిన మాటలే మాట్లాడుతున్నరు. అన్నీ వ్యక్తిగత నిందలు, విమర్శలే తప్ప.. ఒక్క నిర్మాణాత్మక, గుణాత్మక సూచనగానీ, ప్రకటనగానీ చేసే సంస్కారం లేదు. నేను చేస్తున్నది తప్పయితే శిక్షించండి అని వరంగల్ బహిరంగ సభలోనే చెప్పిన. లేకపోతే అవాకులు చెవాకులు పేలేటోళ్లను శిక్షించాలని చెప్పినం. మాకు ప్రజలే దేవుళ్లు. మీ దీవెనలు, సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు అహోరాత్రులు కష్టపడ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న...’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. వరంగల్ ప్రజలకు ధన్యవాదాలు వరంగల్ జిల్లా ప్రజలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఆనాడు ఉద్యమంలో, ఈనాడు ఉప ఎన్నికల్లో మీరు ఇచ్చిన ప్రేమ గొప్పది. ఈ జన్మలో ఏమిచ్చినా నేను తీర్చుకోలేను. ఎందరో ఎన్నో అవాకులు చవాకులు పేలారు. ఎన్నో మాట్లాడారు. కానీ ప్రభుత్వం సరైన మార్గంలో వెళుతోంది. ఇంకా బాగా పనిచేయండని చెప్పి వరంగల్ ఉప ఎన్నికల్లో మంచి తీర్పు ఇచ్చారు. వరంగల్ జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా..’’ అన్నారు. స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు జగదీశ్రెడ్డి, పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. స్పీకర్ గింత హుషారనుకోలే! భూపాలపల్లి నియోజకవర్గం అభివృ ద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనచారి పలు ప్రతిపాదనలను సీఎం కేసీఆర్కు సభలో తెలిపారు. దీనిని కేసీఆర్ తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ... ‘‘మధుసూదనాచారి హుషారేనని తెలుసుగానీ ఇంత హుషారని తెల్వది. ఒక ఊర్లో ఒక ఇంటికి ఆదుర్దా సుట్టమచ్చిండట. జరసేపుండి ఇగ పోతాపోతా అంటుంటే.. ఆ ఇంట్ల ఉన్న పెద్ద మనిషి.. ‘దూరం పోవాలె గదా బిడ్డా.. ఇంట్లో సల్లన్నం ఉన్నది తిని పో’ అన్నది. దానికా సుట్టం ‘ఎందుకవ్వా సల్లన్నం పెట్టు తింట, ఉడుకన్నమయ్యేదాక కూడ ఉంట’ అన్నడు. అట్లనే మధుసూదనాచారి.. పోయినసారి వచ్చినప్పుడు బాగనే ఇచ్చినవ్గానీ ఇప్పటి సంగతేంది చెప్పాలని అంటున్నడు. లేకపోతే ఇక్కడే కట్టెస్తం అంటున్నడు. ఇది వెనకబడ్డ ప్రాంతం కాబట్టి తప్పకుండా డెవలప్మెంట్ కావాల్సిందే. బాగుపడాల్సిందే. బాగుపడి తీరుతది కూడా. అది చేసి చూపిస్తా..’’ అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. -
‘కల్యాణలక్ష్మి’ డబ్బులు ఇంకెప్పుడు..!
డయల్ యువర్ జేసీలో ఫిర్యాదు సంగారెడ్డి క్రైం : కల్యాణలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదని దుబ్బాక మండలం రామక్కపేటకు చెందిన దళితుడు నవీన్కుమార్ వాపోయారు. డయల్ యువర్ జేసీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కలెక్టరేట్లో డీఎస్ఓ కార్యాలయ డిప్యూటీ తహశీల్దార్ బాల్రాజ్ ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా సదాశివపేటకు చెందిన నసీర్ మాట్లాడుతూ సదాశివపేటలోని షాపు నంబర్ 6,14 రేషన్ దుకాణాల్లో డీలర్లు సరుకులను సక్రమంగా పంపిణీ చేయడం లేదన్నారు. సమగ్ర విచారణ చేపట్టి వినియోగదారులకు సకాలంలో సరుకులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. హత్నూర మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన రంగారెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నం. 33లోని ఆరు ఎకరాల 9 గుంటల భూమిలో సర్వే చేయాలన్నారు. సదాశివపేట మండలం పెద్దాపూర్కు చెందిన కుమార్ మాట్లాడుతూ గ్రామంలో మద్యం బెల్టు షాప్ నిర్వహిస్తున్నారని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దౌల్తాబాద్ మండలం దొమ్మాటకు చెందిన గంగాధర్రావు మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నం. 649/1లోని భూమిని సర్వే చేయాలని కోరారు. నారాయణఖేడ్కు చెందిన ఎండీ మినాజొద్దీన్ మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకున్నప్పటికీ ఇప్పటివరకు బిల్లు మంజూరు కాలేదన్నారు. దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్కు చెందిన నాగరాజు మాట్లాడుతూ గ్రామంలోని అసైన్మెంట్ భూమిని సర్వే చేయాలన్నారు. తూప్రాన్ మండలం మనోహరాబాద్కు చెందిన బాబురావు మాట్లాడుతూ గ్రామ శివారులోని ఎల్లమ్మ చెరువు హద్దులను నిర్దేశించాలని కోరారు. -
కేసీఆర్కు ఎన్నికల కమిషన్ అక్షింతలు
-
‘కల్యాణలక్ష్మి’పై హామీ కోడ్ ఉల్లంఘనే
సీఎం కేసీఆర్ ప్రకటనను తప్పుబట్టిన కేంద్ర ఎన్నికల సంఘం సాక్షి, న్యూఢిల్లీ: కల్యాణలక్ష్మి పథకాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బీసీలకూ వర్తింపజేస్తామంటూ నవంబర్ 17న వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను కేంద్ర ఎన్నికల సంఘం తప్పుబట్టింది. కేసీఆర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ అందిన ఫిర్యాదులను పరిశీలించిన ఎన్నికల సంఘం సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ తపస్ కుమార్...కేసీఆర్ ప్రకటనను కోడ్ ఉల్లంఘనగా తేల్చారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ‘‘వరంగల్ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా అధికార టీఆర్ఎస్ బట్టల పంపిణీ, క్రిస్మస్ విందు ఏర్పాట్లు, మెస్ చార్జీల రీయింబర్స్మెంట్, పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచినట్లు మాకు పలు పార్టీలు, అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు అందాయి. అయితే వీటిని రాష్ట్రం మొత్తానికి వర్తించేవిగా పరిగణించి ఏ చర్యకూ ఉపక్రమించడం లేదు. అయితే కల్యాణ లక్ష్మి పథకాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బీసీలకూ వర్తింపజేస్తామని నవంబర్ 17న ఉప ఎన్నిక ప్రచారంలో మీరు ప్రకటించడం ఎన్నికల కోడ్లోని పేరా ఏడు నిబంధనలను ఉల్లంఘించినట్టుగా పరిగణనలోకి తీసుకున్నాం. ఉప ఎన్నిక ముగిసినప్పటికీ మీ చర్యను ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినట్టుగానే ఉత్తర్వు జారీచేస్తున్నాం. భవిష్యత్తులో మీరు ఇలాంటి చర్యలను పునరావృతం కానివ్వకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సలహా ఇస్తున్నాం..’’ అని తపస్ కుమార్ పేర్కొన్నారు. -
కేసీఆర్కు ఎన్నికల కమిషన్ అక్షింతలు
ఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎన్నికల కమిషన్ అక్షింతలు వేసింది. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్టు ఈసీ పేర్కొంది. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని సూచించింది. కల్యాణలక్ష్మీ పథకాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బీసీలకు వర్తింప చేస్తామని వరంగల్ ఎన్నికల్లో ప్రకటించడం ఎన్నికల నియమావళి ఉల్లంఘనేనని ఈసీ తెలిపింది. -
కల్యాణలక్ష్మి అక్రమాలపై కొరడా
♦ అక్రమాలకు పాల్పడ్డ అధికారులు, సిబ్బందిపై చర్యలకు సర్కారు ఆదేశం ♦ మహబూబ్నగర్ జిల్లాలో ఐదుగురు అనర్హులకు లబ్ధి ♦ తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చిన కిందిస్థాయి అధికారులు ♦ శాఖాపర విచారణలో వెల్లడి ♦ తప్పుడు పత్రాలిస్తే క్రిమినల్ చర్యలు: ఎస్సీశాఖ డెరైక్టర్ ఎం.వి.రెడ్డి సాక్షి, హైదరాబాద్: నిరుపేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహానికి తోడుగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘కల్యాణలక్ష్మి’ పథకంలో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో ఈ పథకానికి సంబంధించి పలు అవినీతి ఉదంతాలు బయటపడడంతో శాఖాపరంగా విచారణ జరిపింది. మహబూబ్నగర్ జిల్లాలో ఐదుగురు అనర్హులు లబ్ధి పొందారని గుర్తించి, చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. ఈ 5 కేసుల్లో చట్టాలకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది, నకిలీ లబ్ధిదారులపై చర్య లు తీసుకోవాలని ఎస్సీ డెవలప్మెంట్ శాఖ డెరైక్టర్ ఎం.వి.రెడ్డి కలెక్టర్కు సూచించారు. తప్పుడు పత్రాలతో..: ‘కల్యాణలక్ష్మి’ పథకం కింద వివాహ సమయంలో ఆడపిల్లలకు రూ. 51 వేలు అందిస్తారు. నిరుపేద కుటుంబాల్లోని యువతుల వివాహాలకు సహాయపడటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. కానీ కిందిస్థాయిలో అధికారులు, సిబ్బంది కలసి బోగస్ లబ్ధిదారులతో ఈ సొమ్మును స్వాహా చేస్తున్నారు. అప్పటికే పెళ్లయిన వారు, పిల్లలున్న వారు, రెండో వివాహం చేసుకున్న వారితో దరఖాస్తులు చేయిస్తున్నారు. ఇందుకోసం గ్రామస్థాయిలో అధికారులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి సహకరిస్తున్నారు. వచ్చిన సొమ్మును పంచుకుంటున్నారు. ‘కల్యాణలక్ష్మి’లో అనర్హులు లబ్ధిపొందుతున్నారని, దీనికి అధికారులు సహకరిస్తున్నారని ఎస్సీ అభివృద్ధి శాఖ డెరైక్టర్ కార్యాలయం దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన డెరైక్టర్ ఎం.వి.రెడ్డి విచారణ జరిపించారు. వీఆర్వోలు, వీఏవోలు, వార్డెన్లు ఇచ్చే తప్పుడు ధ్రువపత్రాల ద్వారా అక్రమాలకు అవకాశం ఉండడంతో... పకడ్బందీగా వెరిఫికేషన్ పూర్తిచేయాలని ఆదేశించారు. నల్లగొండ జిల్లాలో ఒకరు ఈ పథకం ద్వారా అక్రమంగా లబ్ధి పొందారని కొద్దిరోజుల క్రితం తేలింది. మహబూబ్నగర్ జిల్లాలో బయటపడిన 5 కేసులపై శాఖాపర విచారణ జరిపి, ఆయా అంశాలను తేల్చింది. అధికారులపైనా చర్యలు మహబూబ్నగర్ జిల్లాలో 5 కేసులపై విచారణ జరిపి, అక్రమాలు గుర్తించాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ప్రయోజనం పొందిన అనర్హుల నుంచి సొమ్మును రెవెన్యూ యాక్ట్ ప్రకారం తిరిగి వసూలు చేస్తాం. కొన్నికేసుల్లో నిధులు విడుదల చేయకుండా నిలిపేశాం. కల్యాణలక్మి పథకం కింద లబ్ధిపొందేందుకు తప్పుడు సర్టిఫికెట్లు సమర్పిస్తే క్రిమినల్ చర్యలు తప్పవు. సంబంధిత వెరిఫికేషన్ అధికారులపైనా క్రమశిక్షణ చర్యలు చేపడతాం. - ఎం.వి.రెడ్డి, ఎస్సీశాఖ డెరైక్టర్ -
మందకొడిగా వివాహ పథకాలు
* పెరుగుతున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులు... * 10వేలకు పైగా పెండింగ్ సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన పేదింటి అమ్మాయిలకు వివాహ సమయంలో రూ.51 వేలు అందించేందుకు ఉద్దేశించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు మందకొడిగా సాగుతున్నాయి. ఈ పథకాల కింద పెట్టుకున్న దరఖాస్తులను అధికారులు చాలా సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు. కొందరు అనర్హులు లబ్ధిపొందారన్న వార్తల నేపథ్యంలో పరిశీలనలో జాప్యం జరుగుతోంది. దాదాపు 1500 దరఖాస్తులను తిరస్కరించారు. అత్యధికంగా ఎస్టీశాఖ పరిధిలో 697, ఎస్సీశాఖ 684, మైనారిటీ శాఖకు సంబంధించి 107 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. సరైన అర్హతలు లేకపోయినా, ఆయా ధ్రువీకరణ పత్రాలను సమర్పించకపోవడంతో అధికారులు తిరస్కరిస్తున్నారు. ఇటీవల దరఖాస్తుల పెండింగ్ సంఖ్య కూడా పెరిగిపోయింది. ఇప్పటివరకు 10 వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో ఆరు నెలల్లో ఈ మూడు శాఖలకు 59,428 దరఖాస్తులు రాగా... 47,728 దరఖాస్తులను ఆమోదించారు. -
కల్యాణలక్ష్మికి ప్రాచుర్యమేది?
ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన బంగారు తల్లి పథకంలో భాగంగా అన్ని కులాల్లో ఉన్న పేద వర్గాలకు పెళ్లి చేసుకునే సమయంలో ప్రభుత్వం నుండి కొద్దిమేర ఆర్థిక సహాయం లభించేది. రాష్ట్రాల విభజనతో తెలంగాణలో కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం ఏర్పడి పాత పథకాలను రద్దు చేసి కొన్ని కులాలకే పరిమితమయ్యే కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. రూ.2,00,00 ఆదాయం లోపు ఉన్న పేద వర్గాలకు మైనార్టీ వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు రూ.51,116లు నజరానాగా అందించాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు కానీ, ఈ పథకానికి సరైన ఆదరణ లభించడంలేదు. వేల మంది దరఖాస్తు చేసుకున్నా సరైన సమయంలో వారికి అందడంలేదు. కొందరి ‘0’ బ్యాలెన్స్ ఖాతాలకు ఇవి పడటంలేదు. సేవింగ్ ఖాతాలున్న వారికే ఈ స్కీం వర్తిస్తుందని అధికారులు మెలికలు పెడుతున్నారు. బడ్జెట్లో ఈ పథకానికి డబ్బులు కేటాయించినా శాఖల నిర్వాహకులు, అధికారుల మధ్య సమన్వయం లేక ఈ పథకానికి కేటాయించిన డబ్బులు మురిగిపోతున్నాయి. ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి ఈ పథకానికి సరైన అధికారులను కేటాయించి, దరఖాస్తు చేసుకున్న వారికి సరైన సమయంలో డబ్బులు అందేలా ఈ పథకాన్ని అన్ని కులాల పేద వర్గాలకు విస్తరించేలా, ఈ పథకాన్ని అన్ని మండల, మున్సిపల్ కేంద్రాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. అప్పుడే ఈ పథకానికి సరైన అవకాశం ఇచ్చినట్లవుతుంది. - జైని రాజేశ్వర్గుప్త కాప్రా, హైదరాబాద్ -
త్వరలో బీసీలకూ కల్యాణలక్ష్మి: కేసీఆర్
కరీంనగర్: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ములకనూరులో తెలంగాణతల్లి విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలోని పలు నియోజకవర్గాలలో శనివారం పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సర్కార్ త్వరలోనే బీసీలకూ కల్యాణలక్ష్మి పథకాన్ని అమలుచేస్తుందని తెలిపారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. -
పుంజుకుంటున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీలకోసం కల్యాణలక్ష్మి, ముస్లింల కోసం షాదీముబాకర్ పథకాలు ప్రకటించింది. పథకాల ద్వారా నిరుపేద ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ కుటుంబాలకు చెందిన అమ్మాయిల వివాహాలకు రూ. 51 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. కఠినమైన నిబంధనల కారణంగా 2014-15లో పథకం గురించి అవగాహన, ప్రచారం కల్పించడంలో ఇబ్బందులు తలెత్తాయి. అయితే 2015-16లో నిబంధనలు సరళతరం చేయడం, లబ్ధిదారులకు సరైన అవగాహన కల్పించడంతో పథకం పుంజుకుంది. ఎస్సీ, మైనారిటీలో ప్రస్తుతం పురోగతి ఉండగా, ఎస్టీ శాఖలో వేగం పుంజుకోవాల్సి ఉంది. -
బీసీలకూ కల్యాణలక్ష్మి: మంత్రి ఈటెల
కరీంనగర్: బీసీ వర్గానికి చెందిన నిరుపేద ఆడబిడ్డల వివాహానికి కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో శనివారం జరిగిన తెలంగాణ అవతరణ ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు కల్యాణలక్ష్మి, మైనారిటీలకు షాదీ ముబారక్ పేరిట రూ.51 వేలు పెళ్లి ఖర్చులకు ఇస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. బీసీ వర్గంలోని కులాల్లో కూడా చాలా మంది నిరుపేదలు ఉన్నారని, ఇలాంటి వారి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. వారికి కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. -
కల్యాణలక్ష్మికి నిధుల వరద
ఇందూరు : కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిధుల కొరతతో అబాసుపాలు కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పేద దళిత, గిరిజన యువతుల పెళ్లిళ్లకు ఆపన్న హస్తంగా మారిన ఈ రెండు పథకాలకు నిధులను పుష్కలంగా కేటాయించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం మార్చినెలతో ముగిసి పోవడంతో, ఆ తరువాత దరఖాస్తుచేసుకున్న లబ్ధిదారులకు 2015-16 ఆర్థిక సం వత్సరంలో నిధుల వరదను పారించింది. సాంఘిక, మైనారిటీ సంక్షేమ శాఖలకు రూ. ఐదు కోట్ల చొప్పున మంజూరు చేసి వెయ్యి మంది చొప్పున లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఈ మేరకు మూడు రోజుల క్రితం ఉత్తర్వులు విడుదల చేసింది. అధికారుల హడావుడి 2015-16 సంవత్సరానికి సంబంధించిన కొత్త బడ్జెట్ రావడానికి కాస్త ఆలస్యం కావడంతో లబ్ధిదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. సకాలంలో నిధులు అందకుండానే పెళ్లిళ్లు చేసుకున్నారు. మరి కొందరు పెళ్లి తేదీ దగ్గర పడటంతో నిధుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం నిధులు రావడంతో వందల సంఖ్యలో ఉన్న లబ్దిదారుల ఖాతాలలో ట్రెజరీ నుంచి బ్యాంకు ద్వారా నిధులు వేసేందుకు అధికారులు హడావుడి చేస్తున్నారు. అర్హులను గుర్తించేందుకు తర్జనభర్జన పడు తున్నారు. వచ్చిన దరఖాస్తులను వెంట వెంటనే పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు. రెండు మూ డు రోజులలో బ్యాంకు ఖాతాల్లో నిధులు వేస్తామని లబ్ధిదారులకు సర్ది చెబుతున్నారు. మొత్తానికి ఈసారి నూతన వధువులకు మేలు జరిగినట్టే. గిరిజన సంక్షేమ శాఖకు తక్కువ నిధులు రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకం కింద ఎస్సీ సంక్షేమ శాఖకు రూ. ఐదు కోట్లు, షాదీ ముబారక్ పథకం కింద మైనార్టీ సంక్షేమ శాఖకు రూ.ఐదు కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖకు పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వలేదు. ప్రస్తుతానికి రూ.75 లక్షలను మాత్రమే విడుదల చేసిం ది. విడుతలవారీగా నిధులు వస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు. -
‘కల్యాణలక్ష్మి’ నిబంధనల సడలింపు: చందూలాల్
సాక్షి,హైదరాబాద్: కల్యాణలక్ష్మి పథకంలో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి నిబంధనలను సడలిస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. షాదీముబారక్ నిబంధనలే ఈ పథకానికి వర్తింపజేయనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం జిల్లాస్థాయి అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో మాదిరి రెవెన్యూ, పంచాయతీ అధికారుల ధ్రువీకరణ అవసరం లేదని, ఓటరు గుర్తింపు కార్డు ఉన్న వారిని అర్హులుగా పరిగణించాలని సూచించారు. కాగా, వేసవి సెలవుల్లో హాస్టళ్లు తెరిచి బ్రిడ్జి కోర్సులు నిర్వహిస్తామని చందూలాల్ వెల్లడించారు. డ్రాపవుట్లను గుర్తించి పాఠశాలల్లో చేర్పిం చేలా ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ల సక్రమంగా పంపిణీ జరగకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కల్యాణలక్ష్మి పథకాన్ని బీసీలకు వర్తింపచేయాలి : కృష్ణయ్య
ముషీరాబాద్ : ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకాన్ని బీసీలకు కూడా వర్తింపచేయాలని, ఇందుకు గాను ప్రస్తుత బడ్జెట్లోరూ.3 వేల కోట్లను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. మంగళవారం విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు శారదా గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర ్భంగా మాట్లాడుతూ పథకాన్ని బీసీలకు వర్తింపజేయకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. బీసీ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో కూడా బీసీలు ప్రధాన భూమిక పోషించారన్నారు. బీసీ మహిళలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించకుండా అన్యాయం చేశారన్నారు. పథకం వర్తింప చేస్తామని రాష్ట్రమంత్రి ఈటెల రాజేందర్ హామీ ఇచ్చి మూడు నెలలు గడిచినా పట్టించుకోలేదని, వెంటనే పథకం అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు శారదగౌడ్, గుజ్జకృష్ణ, లాల్కృష్ణ, భద్ర, కుల్కచర్ల శ్రీను, అరుణ్, మారేష్, సత్తి పాల్గొన్నారు. -
‘పేద బ్రాహ్మణులకూ కల్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టాలి’
హైదరాబాద్: పేద బ్రాహ్మణులకు కూడా ‘కల్యాణ లక్ష్మి’ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టాలని తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం హైదర్గూడ ఎన్ఎస్ఎస్లో సంఘం అధ్యక్షుడు గంగు భానుమూర్తి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం బ్రాహ్మణులను అగ్రకులంగా పరిగణిస్తూ నిర్లక్ష్యం చేస్తోందన్నారు. బ్రాహ్మణుల్లో సైతం పేద వారున్నారని... వారికి కల్యాణ లక్ష్మి వంటి పథకాలు అమలు చేయాలని ఆయన కోరారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కె.దేవిప్రసాద్, పల్ల రాజేశ్వర్రెడ్డిలకు సంపూర్ణ మద్దతు తెలిపుతున్నామని ఆయన వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన యువతుల వివాహం కోసం సాయం అందించేందుకు కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. -
కల్యాణలక్ష్మి పై ఆరా తీసిన ఎమ్.వి.రెడ్డి
హైదరాబాద్ : సోషల్ డెవలప్మెంట్ అధికారి ఎమ్.వి.రెడ్డి మంగళవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆళ్లూరు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కల్యాణలక్ష్మీ పథకం తీరుతెన్నులు గురించి ఆరా తీశారు. అంతేకాకుండా గ్రామంలో నూతనంగా వివాహం చేసుకున్న జంటకు కల్యాణలక్ష్మీ పథకం గురించిన పూర్తి వివరాలను తెలిపారు. ఈ పథకం గురించి అధికారులు ప్రజలకి అవగాహన కల్పిస్తున్నారా లేదా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ ను సందర్శించారు. (చేవెళ్ల) -
‘కల్యాణ లక్ష్మి’కి దరఖాస్తు ఇలా..
నిర్మల్ అర్బన్ : పెళ్లి వేడుకలు నేడు ఖరీదయ్యాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా వ్యయాలు పెరిగిపోయాయి. ఫంక్షన్ హాళ్లు, కార్డుల పంపిణీ, బట్టల కొనుగోలు, సామగ్రి, నిత్యావసర సరుకులు.. ఇలా అన్ని ధరలు పెరిగిపోయాయి. దీంతో నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీలు వివాహ ఖర్చులకు అప్పుల పాలయ్యేవారు. మరి కొందరు ఆర్థిక భారాన్ని భరించే స్థోమత లేక పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాల్సి వచ్చేది. ఇలాంటి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘కల్యాణ లక్ష్మి’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీల వివాహానికి ప్రభుత్వం రూ.51వేల ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఇది కాస్తా ఊరటనివ్వడంతో పాటు కొందరికి వరంగా మారింది. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ.. ‘కల్యాణలక్ష్మి’ పథకం ద్వారా లబ్ధి పొందే వారు ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వధూవరుల పూర్తి వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అనంతరం దాని ప్రతిని సమీపంలోని సాంఘిక సంక్షే మ శాఖ కార్యాలయంలో అందజే యాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న పత్రాలతో పాటు వధువుకు సంబంధించిన కులం, ఆదాయం, నివాసం, ఆధార్కార్డు, బ్యాంక్ అకౌంట్, మొదటి వివాహంగా వీఆర్వో, గజిటెడ్ అధికారులతో వేర్వేరుగా ధ్రువీకరించిన పత్రాలు, అబ్బాయికి సంబంధించిన ఆధార్కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం తదితర పూర్తి వివరాల జిరాక్స్ ప్రతులతో దరఖాస్తులు అందజేయాలి. అలాగే వెడ్డింగ్ కార్డును జతపరిచి పెళ్లికి ముందే అధికారులకు అప్పగించాలి. రూ.2లక్షల వార్షికాదాయం ఉన్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. 2014 అక్టోబర్ 2వ తేదీ తర్వాత పెళ్లి చేసుకున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు తమ పెళ్లి ఫొటో, పెళ్లి పత్రికను దరఖాస్తుతో జతపరచాల్సి ఉంటుంది. పరిశీలన పూర్తయిన వెంటనే మంజూరు.. సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు దరఖాస్తులు అందిన వెంటనే క్షేత్ర స్థాయిలో పూర్తి పరిశీలన చేపడతారు. అందించిన వివరాలు సరియైనవో.. కాదో.. తేల్చుకుని ఉన్నతాధికారులకు నివేదిస్తారు. అనంతరం జిల్లా కార్యాలయం నుంచి నిధులు మంజూరవుతాయి. నేరుగా రూ.51 వేలు వధువు బ్యాంక్ అకౌంట్లో జమవుతాయి. ఈ పథకం అమలుకు నిధుల కొరత ఏమీ లేదని.. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారందరికి పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం జిల్లాకు సుమారు రూ.6 కోట్ల బడ్జెట్ కేటాయింపు జరిగిందని పేర్కొన్నారు. అవగాహన కల్పిస్తే మేలు.. పేద, నిరుపేదలైన దళితుల కోసం ప్రవేశపెట్టిన ‘కల్యాణ లక్ష్మి’ పథకంపై ప్రజల్లో అవగాహన కొరవడింది. ఎవరికి దరఖాస్తులు అందించాలో.. ఎక్కడ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. దరఖాస్తులను తహశీల్దార్ కార్యాలయాల్లో అందజేయడంతో అవి సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయానికి చేరడానికి, దరఖాస్తుల పరిశీలనకు తీవ్ర జాప్యం జరుగుతుందనే ఆరోపణలున్నాయి. ‘కల్యాణ లక్ష్మి’ పథకంపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను చేపడితే ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. దళితుల్లో ఎక్కువ మంది నిరక్ష్యరాస్యులుండడం, దరఖాస్తులను ఆన్లైన్లో అందించలేక పోవడం, ఏయే పత్రాలు జతపర్చాలన్న విషయాలు తెలియకపోవడంతో పథకాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారనే విమర్శలున్నారుు. ప్రభుత్వ ఆశయం నెరవేరాలంటే అధికారులు దళితులను మరింత చైతన్యపరచాల్సిన అవసరముందని పలువురు పేర్కొంటున్నారు. 51 దరఖాస్తులు అందాయి - మహ్మద్ అబ్దుల్ అలీం, అసిస్టెంట్ సాంఘిక సంక్షేమశాఖ అధికారి, నిర్మల్ ఇప్పటివరకు 51 దరఖాస్తులు అందగా 38 పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించాం. మిగిలిన వాటికి సంబంధించి దరఖాస్తుదారుల నుంచి మరికొన్ని వివరాలు, పత్రాలు అందాల్సి ఉంది. అవి అందిన వెంటనే క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తాం.అన్ని పత్రాలు అందజేసిన వారికి ఇప్పటికే ఆర్థికసాయం మంజూరైంది. -
కల్యాణమైంది లక్ష్మిరాలేదు !
హన్మకొండ అర్బన్ : ‘దేవుడు వరమిచ్చినా.. పూజారి కనికరించడం లేదు’ అన్నట్లు తయూరైంది జిల్లాలో కల్యాణలక్ష్మి పథకం అమలు తీరు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం అధికారుల నిర్లక్ష్యం మూలంగా వారికి సకాలంలో అందని పరిస్థితులు నెలకొన్నారుు. పథకం ప్రారంభ సూచికగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో ఇటీవల పర్యటించిన సమయంలో స్వయంగా లబ్ధిదారులకు రూ.51వేలు మంజూరు చేస్తున్నట్లు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. పెళ్లి సమయానికి 10 రోజుల ముందు డబ్బులు వివాహ కుటుంబానికి అందజేయూలని అధికారులకు సైతం సూచించారు. ఇక్కడివరకు బాగానే ఉన్నా... ముఖ్యమంత్రి జిల్లా నుంచి వెళ్లిన తర్వాత అధికారులు ఈ విషయూన్ని మరిచిపోయూరు. ఇందుకు ప్రత్యక్ష సాక్షే హన్మకొండ మండలం ఒండపర్తికి చెందిన మాదాసు కుమారస్వామి ఉదంతం. ఆయన కూతురి వివాహమై నెల రోజులైంది. ముఖ్యమంత్రి స్వయంగా ఆయనకు మంజూరు ఉత్తర్వుల కాపీ ఇచ్చినా... అవి ఇప్పటికీ అమలుకు నోచుకాలేదు. అధికారులు షరామామూలుగా ఇదిగో... అదిగో... అంటూ దళిత సంక్షేమ కార్యాలయం చుట్టూ తిప్పకుంటూనే ఉంటున్నారు. చివరకు ఆన్లైన్లో తప్పు దొర్లినట్లు తేల్చారు. వధువు ఫొటో కాకుండా భర్త ఫొటో కనిపిస్తున్నందున డబ్బులు మంజూరు కావడంలేదని తేల్చారు. వివాహమై నెల అయినా... సమస్యను పరిష్కరించడంలో మాత్రం శ్రద్ధ చూపకపోవడం గమనార్హం. దీనిపై కుమారస్వామిని ‘సాక్షి’ సంప్రదించగా... ‘సమస్య పరిష్కారం కోసం దళిత సంక్షేమ శాఖ కార్యాలయానికి పలుమార్లు తిరిగిన. తాము ఒక లెటర్ ఇస్తామని, దాన్ని తీసుకుని హైదరాబాద్ కమిషర్ను కలిసి సమస్య చెప్పుకోమని అధికారులు సలహా ఇచ్చారు. అని ఆవేదనగా చెప్పారు. దీన్ని బట్టి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందజేసిన ఉత్తర్వులు అమలు కాకపోతే... ఇక సామాన్యుల విషయంలో పరిస్థితి ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చని కళ్యాణలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ సమస్యలు ప్రస్తుతం కళ్యాణలక్ష్మి దరఖాస్తు సమయంలో చాలావరకు జన్ధన్ వంటి జీరో ఖాతాల నంబర్లు అధికారులకు ఇచ్చారు. సాంకేతిక సమస్య కారణంగా జీరో అకౌంట్లో రూ.51వేలు జమచేయడం కుదరడం లేదు. జిల్లాలో తాజా సమాచారం ప్రకారం ఈ పథకం కింద మొత్తం 430వరకు దరఖాస్తులు అందాయి. వీటిలో అధికారులు 170మంది వరకు అర్హులని గుర్తించి ప్రభుత్వానికి పంపారు. వీరిలో 100మందికి నిధులు మంజూరైనట్లు అధికారులు చెబుతున్నా... ఎంత మందికి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యూయో చెప్పలేమని వారు అంటున్నారు. ఫిబ్రవరి 25 వరకు.. దరఖాస్తులు 430 అర్హులు 170 మంజూరు 100 పెండింగ్ 70 సాంకేతిక సమస్యలను పరిష్కరించాల్సి ఉంది కళ్యాణలక్ష్మి పథకం అమలు విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరిస్తే పనులు సక్రమంగా, సకాలంలో ముందుకు సాగుతాయి. ఈవిషయం ఉన్నతాధికారులకు తెలిపాం. ఇక కుమారస్వామి విషయంలో అమ్మాయి ఫొటో చోట అబ్బాయి ఫొటో వస్తోంది. అందుకే మంజూరు విషయంలో ఇబ్బందులు వచ్చాయి. పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. దరఖాస్తు సమయంలో జీరో ఖాతాలు కాకుండా సేవింగ్ ఖాతాల ఇస్తే మంచింది. త్వరలో సమస్యలు పరిష్కరించి అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటాం. - కృష్ణవే ణి, దళిత సంక్షేమ శాఖ డీడీ -
‘కల్యాణలక్ష్మి’కి కష్టాలు
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వధువులకు సరిగా అందని ఆర్థిక సాయం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు దరఖాస్తు చిక్కులు ధ్రువపత్రాలు సంపాదించేందుకే నెలలకొద్దీ సమయం సాక్షి నెట్వర్క్: పేద కుటుంబాల యువతుల వివాహాల కోసం ఉపయోగపడాల్సిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అడ్డగోలు నిబంధనల చట్రంలో చిక్కుకుపోయాయి. సవాలక్ష పత్రాలు సమర్పించాల్సి రావడం, తనిఖీ పేరిట జరుగుతున్న జాప్యంతో పథకాలు గందరగోళంగా మారాయి. దరఖాస్తులపై వెరిఫికేషన్ను పూర్తిచేసి, ఆర్థిక సాయాన్ని అందించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. దీంతోపాటు జనన ధ్రువీకరణ పత్రం నుంచి ఇదే మొదటి పెళ్లి అని నిర్ధారించేదాకా... కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాల నుంచి పెళ్లి కుమారుడి సర్టిఫికెట్ల దాకా 20 వరకు ధ్రువపత్రాలు సమర్పించాల్సి రావడం దరఖాస్తుదారులకు ఇబ్బందిగా మారింది. అసలు ఈ పథకాలపై అవగాహన లేకపోవడం, ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి రావడం వంటివాటి కారణంగా అర్హులైన పేద కుటుంబాలకు లబ్ధి కలగడం లేదని ప్రభుత్వాధికారులే అంటుండడం గమనార్హం. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా కల్యాణ లక్ష్మి పథకానికి ఇప్పటివరకు 2,222 మంది దరఖాస్తు చేసుకుంటే... అందులో బ్యాంకు ఖాతాలో నగదు జమ అయింది మాత్రం 503 మందికే. షాదీ ముబారక్ పథకానికి 2,173 మంది దరఖాస్తు చేయగా... నిధులు జమ అయింది 1,045 మందికే. దరఖాస్తు తంటాలు:ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుపేద కుటుంబాల యువతుల వివాహాలకు రూ. 51 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేర్లతో రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకాల ఉద్దేశం బాగానే ఉన్నా... దరఖాస్తు చేసుకోవాలంటే చుక్కలు కనిపిస్తున్నాయని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. లబ్ధిపొందే వధువు తెలంగాణ రాష్ట్ర నివాసితురాలిగా ఉండాలని, వధూవరుల నివాస, కుల, ఆదాయ, వయసు, ఆధార్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ప్రతులతోపాటు ఇదే మొదటి వివాహమని రుజువు చేసే పత్రాలను, విద్యార్హత పత్రాలను సమర్పించాలి. వధూవరుల పెళ్లి తేదీ ఖరారును ధ్రువీకరిస్తూ వీఆర్వో లేదా పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. అయితే చాలామందికి దీనంతటిపై అవగాహన లేదు. అవగాహన ఉన్నవారికి ఈ పత్రాలన్నీ సమర్పించాల్సి రావడం కష్టతరమవుతోంది. ఈ పత్రాలన్నీ తెచ్చుకునేందుకే చాలా సమయం పడుతుండడంతో పాటు ఖర్చూ పెట్టాల్సి వస్తోందని దరఖాస్తుదారులు వాపోతున్నారు. ఆచరణ ఏదీ..? ఈ పథకాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఒక్కో జిల్లాకు రూ. 3 కోట్లను కేటాయించింది. కానీ రూ. 50 లక్షలైనా ఖర్చుచేయలేదని తెలుస్తోంది. నిబంధనలను సరళతరం చేస్తేనే లబ్ధిదారులకు త్వరగా సహాయం అందించగలమని అధికారులే చెబుతుండడం గమనార్హం. ఈ పథకాలకు ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను అధికారులు చెక్లిస్ట్తో జత చేసి తహసీల్దార్ కార్యాలయాలకు పంపాలి. వాటిని తహసీల్దార్లు పరిశీలించాలి. తర్వాత వధువు ఇంటికి వెళ్లి వీఆర్వో విచారించాలి. ఈ క్రమంలో తీవ్ర ఆలస్యం జరుగుతోంది. మంత్రి చెప్పినా సరే.. మంత్రి కేటీఆర్ ఇటీవల మహబూబ్నగర్లో పర్యటించిన సందర్భంగా... గ్రామీణ ప్రాంత ప్రజలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం కష్టమని, మాన్యువల్గా దరఖాస్తులు ఇచ్చినా తీసుకుని వాటిని ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు. కానీ అధికారులు అదేమీ పట్టించుకోవడం లేదు. చదువుకున్నా.. లేనట్లయింది నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం పేర్వాలకు చెందిన షేక్ సయ్యద్ కుమార్తె సమీనాబేగం వివాహం గత జనవరి నెలలో జరిగింది. 2008కి ముందు బీసీ ‘బీ’లో ఉన్నవారి కులాన్ని.. తర్వాత ప్రభుత్వం బీసీ ‘ఈ’ జాబితాలో చేర్చింది. కానీ అప్పటికే చదువుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లో మాత్రం బీసీ ‘బీ’గా పేర్కొంటుండగా ప్రస్తుతం బీసీ ‘ఈ’ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పిస్తే అధికారులు అంగీకరించడం లేదు. దీంతో పెద్ద తంటా వచ్చి పడింది. పదవ తరగతి ఉత్తీర్ణురాలైన సమీనాబేగం చివరకు షాదీ ముబారక్ పథకానికి అర్హురాలిగా మారేందుకు.. తానేమీ చదువుకోలేదన్న ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి వచ్చింది. -
నెల ముందే ‘కల్యాణలక్ష్మి’కి దరఖాస్తు
సాక్షి,హైదరాబాద్: ‘కల్యాణలక్ష్మి’ కింద ప్రభుత్వ ఆర్థికసహాయం అందాలంటే పెళ్లికి దాదాపు నెల రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమ శాఖ డెరైక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. పెళ్లికూతురు బ్యాంకు అకౌంట్లో రూ.51 వేలను జమచేస్తారని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని పెళ్లిచేసుకోబోయే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతులు ఉపయోగించుకోవాలని సూచించారు. వివరాలకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ, ఐటీడీఏ, మైనారిటీ సంక్షేమశాఖ అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు. -
‘కల్యాణ లక్ష్మి’లో
స్వల్ప మార్పులు మంత్రి అజ్మీరా చందూలాల్ ములుగు: నిరుపేద యువతుల పెళ్లికి ఉద్దేశించిన కల్యాణలక్ష్మి పథకంలో స్వల్పమార్పులు చేసినట్లు గిరిజన సంక్షేమ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లారు. చదువుకోని యువతల పుట్టిన తేదీ, వయసు నిర్ధారిత సర్టిఫికెట్లు పొందడంలో ఉన్న ఇబ్బందులను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి స్వల్ప మార్పులు చేసినట్లు వివరించారు చదువుకోని యువతులకు వారి తల్లిదండ్రులు ఇచ్చే అఫిడవిట్లే ప్రామాణికంగా నిర్ణయించి నట్లు పేర్కొన్నారు. సదరు అఫిడవిట్లను సం బంధిత ఏటీడట్ల్యూవోలు ధ్రువీకరించాల్సి ఉంటుందన్నారు. త్వరలో ఈ మేరకు నూతన మార్పుల ప్రకారం పథకం అమలు చేస్తామన్నారు. పథకం అమలులో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే నేరుగా తనను సంప్రదించవచ్చుని సూచించారు. అధికారులు నిర్లక్ష్యం వహించకుండా, వివాహానికి మూడు రోజుల ముందు కల్యాణ లక్ష్మి పథకం డబ్బులు లబ్ధిదారుకు అందేలా చూడాలని ఆదేశించారు. -
'కల్యాణ లక్ష్మి'కి నిబంధనాలు
- ధువీకరణ పత్రాల పేరిట మెలిక - మొదటి పెళ్లి అని గజిటెడ్ అధికారి ధ్రువీకరించాల్సిందే.. - ఏ ఒక్క ఎస్సీ లబ్ధిదారు ఖాతాలోనూ జమకాని ఆర్థికసాయం - అభాసుపాలవుతున్న పథకం ఆదిలాబాద్: ‘కల్యాణ లక్ష్మి’.. నిరుపేద ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతుల పెళ్లికి ఆర్థిక చేయూతనందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం. కానీ జిల్లాలో బాలారిష్టాలు దాటడం లేదు. ధ్రువీకరణ పత్రాల పేరుతో కఠినతరమైన నిబంధనలు ఓ వైపు.. పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించకపోవడం మరోవైపు వెరసి పథకం జిల్లాలో అభాసుపాలవుతోంది. దీనికి తోడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉండడం.. ఈ దరఖాస్తుల పరిశీలనలో అధికారులు వారాల తరబడి జాప్యం చేస్తుండడంతో అన్ని పత్రాలు సమర్పించిన లబ్ధిదారులకు కూడా ఆర్థిక సహాయం అందడం గగనమవుతోంది. పెళ్లి చేసుకుంటున్న యువతికి ఈ పథకం కింద ప్రభుత్వం రూ.51వేల ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమచేస్తుంది. ధ్రువీకరణ పత్రాలు.. ఈ పథకం కింద లబ్ధిపొందే యువతులు వారికి జరిగేది ‘మొదటి పెళ్లి’ అంటూ ఎవరైనా గజిటెడ్ అధికారితో ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. స్థానిక వీఆర్ఓ కూడా ఆ యువతికి ‘గతంలో పెళ్లి కాలేదు..’ అని ధ్రువీకరించాలి. వీటితోపాటుగా వధూవరుల పుట్టిన తేదీ, కుల, ఆదాయ ధ్రువపత్రాలు, ఆధార్కార్డులతో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం గిరిజనులకు ఇబ్బందిగా మారింది. ఈ దరఖాస్తులను ఎస్టీ లబ్ధిదారులు ఏటీడబ్ల్యూవోలకు, ఎస్సీ లబ్ధిదారులు ఏఎస్డబ్ల్యూఓలకు ఇవ్వాల్సి ఉంటుంది. మైనార్టీలు మాత్రం సంబంధిత తహశీల్దార్లకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల పరిశీలన కూడా సదరు అధికారులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇదీ ప్ర‘గతి’.. ఈ పథకం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ జిల్లాలో ఏ ఒక్క ఎస్సీ లబ్ధిదారురాలికి కూడా ఇంతవరకు ఆర్థిక సహాయం వారి బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. జిల్లాలో ఇప్పటి వరకు 157 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 66 మందికి అధికారులు ఆర్థిక సహాయం మంజూరు చేశారు. కానీ ఒక్కరికి కూడా ఈ ఆర్థిక సహాయం జమ చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఎస్టీ లబ్ధిదారుల్లో ఇద్దరికి మాత్రమే ఈ ఆర్థిక సహాయం అందింది. మొత్తం 45 మంది పెళ్లి చేసుకునే గిరిజన యువతులు దరఖాస్తు చేసుకోగా.. ఇద్దరికి మాత్రమే ఆర్థిక సహాయం వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకంపై గిరిజనుల్లో సరైన అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతుండడంతో అర్హులైన నిరుపేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. షాదీముబారక్ పథకం అమలు తీరు గుడ్డిలో మెల్ల అన్న చందంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 167 మంది లబ్ధిదారులు ‘షాదీముబారక్’కు దరఖాస్తు చేసుకోగా, అధికారులు 141 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.71.91 లక్షలు ఆర్థిక సహాయాన్ని జమ చేయగలిగారు. మూలుగుతున్న రూ.ఐదు కోట్ల నిధులు.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో జిల్లా అధికార యంత్రాంగం విఫలమవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు పథకాలకు కలిపి ఇప్పటివరకు జిల్లాకు రూ.ఐదు కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో సాంఘిక సంక్షేమ శాఖకు రూ.కోటి, మైనార్టీ సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖలకు రూ.రెండు కోట్ల చొప్పున నిధులు వచ్చాయి. ఇందులో సుమారు రూ.నాలుగు కోట్లపైగా నిధులు ట్రెజరీల్లో మూలుగుతుండడం గమనార్హం. -
చిన్నబోతున్న కల్యాణలక్ష్మి
కరీంనగర్కు చెందిన దళితయువతి రజిత(19)కు ఈనెల 31న పెళ్లి కుదిరింది. నెలరోజుల ముందే కళ్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకుంది. తీరాచూస్తే పెళ్లికొడుకు కుల, నివాస, ఆదాయ వివరాలు, ఆధార్ నెంబర్ లేవనే కారణంతో దరఖాస్తును పక్కనపెట్టినట్లు తెలిసింది. పెళ్లికొడుకు కుటుంబసభ్యులను కలిసి ఆ వివరాలివ్వాలని అడిగితే ‘పెళ్లికి ముందు ఇస్తే మాకేం లాభం? వచ్చిన డబ్బులు మీరే ఖర్చు చేస్తారు. పెళ్లయ్యాక ఇస్తే కోడలు మా ఇంటికే వస్తుంది. అప్పుడు దరఖాస్తు చేసుకుంటే ఆ డబ్బులు మాకే వస్తాయి’ అని కరాఖండిగా చెప్పారు. పెళ్లికి ముందు డబ్బులొస్తే కొంత ఆర్థిక భారం తగ్గుతుందని ఆశపడ్డ రజిత తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. బయట అప్పుజేసి పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. మంథని డివిజన్కు చెందిన గిరిజన యువతి శ్రీలక్ష్మి(21)కి అక్టోబర్లో పెళ్లయింది. ఆన్లైన్లో కళ్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వం అందించే రూ.51వేల నగదు ఆమెకు ఇప్పటికీ అందలేదు. అధికారులను కలిసి అడిగితే ‘మీకు ఇదే మొదటి పెళ్లి అని రుజువు చేసేలా సర్టిఫికెట్ ఇవ్వలేదు. మ్యారేజీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేదా గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ పత్రాన్ని జతచేస్తేనే పరిశీలనకు వస్తాం’ అని చెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోని రజిత, ఆమె కుటుంబసభ్యులు మిగిలిన పత్రాన్ని తెచ్చే పనిలో పడ్డారు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద లబ్ది పొందాలని దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరిదీ ఇదే పరిస్థితి. ఈ పథకాల ద్వారా లబ్ది పొందాలంటే సవాలక్ష పత్రాలు సమర్పించాల్సి రావడం, వెరిఫికేషన్ పేరిట పుణ్యకాలం గడిపోతుండటంతో నెలలు గడుస్తున్నా వధువు బ్యాంకు ఖాతాలో డబ్బు జమకావడం లేదు. వాస్తవానికి ఈ పథకాల విషయంలో ప్రభుత్వ ఆలోచన వేరు. నిరుపేద దళిత, గిరిజన, మైనారిటీ కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు వారి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది. ఆయా సామాజికవర్గాల ఆడపిల్లలకు పెళ్లి నాటికే ప్రభుత్వం తరపున రూ.51వేల నగదును అందజేయాలనే భావనతో ప్రవేశపెట్టిన ఈ పథకం పెళ్లికి ముందు కాదు కదా... పెళ్లయి నెలలు గడుస్తున్నా లబ్దిదారులను గుర్తించే పరిస్థితి లేకపోవడం గమనార్హం. 10 శాతానికి మించని దరఖాస్తులు కరీంనగర్ జిల్లా విషయానికొస్తే... దళిత, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా లబ్ది పొందాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు 563 మంది దరఖాస్తు చేసుకున్నారు. సామాజికవర్గాల వారీగా చూస్తే ఎస్సీలు 365, ఎస్టీలు 27, మైనారిటీలు 171 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవనికి గడిచిన నాలుగు నెలల కాలానికి జిల్లాలో ఆయా సామాజికవర్గాలకు సంబంధించి ఆరువేల పైచిలుకు పెళ్లిళ్లు జరిగినట్లు అధికారుల అంచనా. అందులో నూటికి తొంభై శాతం కుటుంబాలకు తెల్లకార్డులున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సంవత్సరాదాయం రూ.రెండు లక్షలోపు కలిగి ఉన్న కుటుంబాలు తెల్లకార్డులకు అర్హులే కాబట్టి వీరంతా కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు అర్హులుగానే పరిగణించవచ్చు. అయినప్పటికీ అందులో పది శాతం కూడా దరఖాస్తులు రాకపోవడం విశేషం. దరఖాస్తు దారులు ముప్పుతిప్పలు ఈ పథకాల కింద దరఖాస్తు చేసుకున్న వారందరికీ రూ.51వేల నగదు ప్రోత్సహకాన్ని అందించారా అంటే అదీలేదు. 563 దరఖాస్తులకు 101 మంది ఖాతాల్లోకే నగదు వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన వాటిలో కొన్ని పరిశీలన దశలో, మరికొన్ని అన్ని పత్రాలు లేవనే కారణంతో పెండింగ్లో పెట్టినట్లు పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ శాఖ పరిస్థితి మరీ దారుణం. ఇప్పటివరకు 27 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోగా, అందులో ఒకరిని మాత్రమే అర్హురాలిగా గుర్తించి గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా పత్రాన్ని అందజేశారు. ఇంతవరకు సదరు అర్హురాలి బ్యాంక్ ఖాతాలో డబ్బు జమకాలేదని తెలుస్తోంది. సవాలక్ష పత్రాలు సమర్పిస్తేనే...! కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటేనే చుక్కలు కన్పిస్తున్నాయి. మీ సేవ లేదా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి రావడం, ఆ సమయంలోనే దాదాపు ఇరవైకిపైగా పత్రాలు సమర్పించాల్సి వస్తోంది. వధువు తెలంగాణ రాష్ట్ర నివాసితురాలిగా ఉండాలని, వధూవరుల నివాస, కుల, ఆదాయ, వయసు, ఆధార్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ప్రతులతోపాటు ఇదే మొదటి వివాహమని రుజువు చేసే పత్రాలను, విద్యార్హతల పత్రాలను సమర్పించాలి. వధూవరుల పెళ్లి తేదీ ఖరారును ధ్రువీకరిస్తూ వీఆర్ఓ లేదా పంచాయతీకార్యదర్శి ధ్రువీకరణపత్రం తప్పనిసరి. చాలా మందికి ఈ పథకాల పట్ల అవగాహన లేకపోవడం ఒక ఎత్తయితే అవగాహన ఉన్నవారికి సైతం పైన పేర్కొన్న పత్రాలన్నీ సమర్పించాల్సి రావడం కష్టతరమవుతోంది. మరోవైపు సంబంధిత పత్రాలను జారీ చేసే అధికారుల వద్దరకు వెళితే సమయానికి ఉండకపోవడం, ఒకవేళ ఉన్నా రేపు, మాపంటూ పదేపదే తిప్పుతుండటం, కొందరైతే ఁఅమ్యామ్యా*లిస్తేనే ధ్రువీకరణ పత్రాలిస్తామంటూ ఇబ్బంది పెడుతుండటం వంటి అనేక కారణాలవల్ల ఆయా పత్రాలను సకాలంలో సమర్పించడం తలకుమించిన భారమవుతోంది. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఒక్కో జిల్లాకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు రూ.కోటి చొప్పున మొత్తం రూ.మూడు కోట్లు విడుదల చేసినప్పటికీ, రూ.అరకోటికి మించి ఖర్చు కాలేదని తెలుస్తోంది. మైనారిటీ శాఖ విషయానికొస్తే జిల్లాలో 1078 మందికి షాదీ ముబారక్ పథకాన్ని వర్తింపజేసేందుకు నిధులు మంజూరయ్యాయని మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు ప్రకటించారు. పథకం ల క్ష్యాలు ఘనంగా ఉన్నా, నిధులు దండిగా ఉన్నా ఆచరణలో మాత్రం అనేక ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఆశించిన ఫలితాలు కన్పించడం లేదు. నిబంధనలను సరళతరం చేస్తేనే లబ్దిదారులకు తొందరగా న్యాయం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ప్రగతి ఇలా 1. ఎస్సీలకు సంబంధించి..... వచ్చిన దరఖాస్తులు -365 పరిశీలనలో ఉన్నవి -243 మంజూరైనవి -122 ట్రెజరీ శాఖకు వెళ్లినవి -102 లబ్దిదారుల ఖాతాల్లో జమ అయినవి : 50 (మంజూరైన వాటన్నింటికీ సంబంధించిన నగదును ఈ నెలాఖరులోగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు) 2. ఎస్టీలకు సంబంధించి.... వచ్చిన దరఖాస్తులు -27 పరిశీలనలో ఉన్నవి -18 మంజూరైనవి -1 లబ్దిదారుల ఖాతాల్లోకి వెళ్లినవి -0 3. మైనారిటీలకు సంబంధించి... వచ్చిన దరఖాస్తులు -171 పరిశీలనలో ఉన్నవి -98 మంజూరైనవి -73 లబ్దిదారుల ఖాతాల్లోకి వెళ్లినవి -50 -
అన్ని వర్గాలకు కళ్యాణలక్ష్మే లక్ష్యం
హైదరాబాద్: తెలంగాణ విద్యావంతుల వేదిక 5వ రాష్ట్ర మహాసభలు ముగిశాయి. వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా గురజాల రవీందర్ ఎన్నికయ్యారు. ఈ వేదికలో15 అంశాలపై తీర్మాణాలు చేశారు. వీటిలో మిషన్ కాకతీయను అభినందిస్తూ, ఫిలింసిటీని ఏర్పాటు చేయడం, కళ్యాణ లక్ష్మి పథకం ప్రముఖమైనవి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "కళ్యాణలక్ష్మి'' పథకాన్ని అన్ని వర్గాల పేదలకు వర్తింపజేయాలని తీర్మానించారు. -
కల్యాణ ‘లక్షి’ ఏదీ?
డిప్యూటీ స్పీకర్ ఆగ్రహించినా.. సామాన్యుడి ఆవేదన చెందినా అధికారులు మాత్రం ఏమాత్రం లెక్కచేయడం లేదు. అందువల్లే సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కల్యా ణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలు జిల్లా దయనీయంగా ఉంది. పథకం ప్రారంభించి మూడు నెలలైనా జిల్లాలో ఏ ఒక్కరూ లబ్ధిపొందలేకపోయారంటే మన అధికారుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. * జిల్లాలో అమలుకాని పథకం * అయోమయంలో దరఖాస్తుదారులు * డిప్యూటీ స్పీకర్ ఆగ్రహించినా స్పందించని అధికారులు ‘నలుగురు నిరుపేద ముస్లింల దరఖాస్తులను నేనే స్వయంగా నింపాను..పెళ్లికి నెల రోజుల ముందే వాళ్లు దరఖాస్తు చేసుకున్నారు. పెళ్లి రోజు నాటికి పథకం డబ్బు అందేలా చూడాలని జేఏసీ మూర్తికి నేను ఫోన్ చేసి మరీ చెప్పాను. పెళ్లి అయిపోయింది కానీ పథకం సర్కార్ సాయం మాత్రం అందలేదు. తీరా నేను వచ్చి చూస్తే దరఖాస్తుల వివరాలను కూడా రికార్డుల్లో పొందుపరచలేదు. మీరు (అధికారులు) అనుసరిస్తున్న తీరు ఆందోళనకరం’ -నవంబర్ 15న సంక్షేమ పథకాల సమీక్షలో అధికారులపై డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ఆగ్రహం ‘‘సర్కార్ పైసలిస్తుందన్న ధీమాతో అప్పుజేసి పిల్ల పెండ్లి జేసిన. రోజులు గడుస్తుండటంతో అప్పులొళ్లు రోజూ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. నేనుకూడా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా, నా ఇంటి లక్ష్మి వెళ్లిపోయింది. సర్కారు పెట్టిన కల్యాణ లక్ష్మి వెక్కిరిస్తోంది’’ ‘కల్యాణ లక్ష్మి’కి దరఖాస్తు చేసుకున్న దుబ్బాక మండలం చెల్లాపూర్కు చెందిన పరశురాములు ఆవేదన ఇది సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ సర్కార్ కల్యాణ ‘లక్ష్మి’ పథకం ప్రారంభించి మూడు మాసాలు కావొస్తున్నా ఇంకా బాలారిష్టాలు మాత్రం దాటలేదు. ఎస్సీ, ఎస్టీ, యువతులకు వివాహాలకు ఆర్థిక తోడ్పాటుకు ‘కల్యాణ లక్ష్మి’, మైనార్టీ యువతుల కోసం షాదీ కోసం ‘షాదీముబారక్’ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. రూ. 10 కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టి, అక్టోబర్ 21న ఉత్తర్వులు జారీ చేసినా.. జిల్లాలో ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా పథకం అందలేదు. డబ్బులొస్తాయన్న నమ్మకంతోనే కానుకలు ఇచ్చేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోవడం... ఇంతవరకూ సర్కార్ సాయం అందకపోవడంతో బంగారు తల్లులకు మెట్టినింట్లో తిప్పలు తప్పడం లేదు. దీంతో ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా, అధికారులు నుంచి ‘రేపు రాపో... మాపు రాపో’ అన్న సమాధానం తప్ప మరొక్కటి రావటం లేదని వినోద ఆవేదన వ్యక్తం చేశారు. షాదీముబారక్ పథకం కింద 117 మంది, కల్యాణ లక్ష్మి పథకం కింద 11 మంది గిరిజన మహిళలు, 25 దళిత యువతులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు 90 శాతంపెళ్లిళ్లు కూడా జరిగిపోయాయి. కానీ పథకం కింద అందాల్సిన సొమ్ములు మాత్రం ఇంతవరకు అందలేదు. జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. కానీ ఆచరణలో అది సాధ్యం కావడం లేదు. వరం ఊరిస్తోంది... నిజానికి పేద కుటుంబాలకు రూ.51 వేల ఆర్థిక సహాయం అనేది పెద్ద వరం. వధువు తల్లిదండ్రులు ఇప్పుడు పెళ్లి పనుల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకోవడం కూడా ఓ ముఖ్య తంతుగా పెట్టుకున్నారు. ప్రభుత్వం కోరినట్టు నెల రోజుల ముందుగానే అన్ని ఆధారాలతో, అధికారులు కోరిన సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ పెళ్లి ముగిసిపోయి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పథకం మాత్రం అందకపోవడం గమనార్హం. ఇటీవలే కూతురు పెళ్లి చేసిన జహీరాబాద్ మండలం గౌసాబాద్ తండాకు చెందిన జాబిబాయి, తిస్రాం పవార్ల దంపతులను పలకరిస్తే...‘పథకం ఉంటదని టీవీ చేప్తే బిడ్డ పెళ్లి పెట్టుకున్న. రూ.51 వేలు సిన్న మాట కాదు. 2014 డిసెంబర్ 3న లగ్గం పెట్టుకున్నాం. నా బిడ్డపేరు అంజన. అల్లుని పేరు మిథున్ రాథోడ్. ఆయనది బీదర్ దగ్గర చించోళి తాలూకా సూర్యానాయక్ తాండ. పెండ్లికి నెల ముందే దరఖాస్తు చేసినం...పెండ్లి అయిపోయి నెల దాటుతోంది. డబ్బులు మాత్రం రాలేదు. రూ.2 లక్షలకు పైగా అప్పుజేసిన. నా బిడ్డ పెండ్లికి నేను అప్పు చేసుకున్న కానీ ప్రభుత్వం చెప్పినట్టు రూ. 51 వేలు ఇస్తే వేడి నీళ్లకు చన్నీళ్లు తోడు అయినట్టు ఉండేది’. అని చెప్పారు. మంజూరితోనే సరి.... కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో రెండు గిరిజన కుటుంబాలు కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నాయి. సీతారాం తండాకు చెందిన ధర్మవ్వ తన కూతురు రమావత్ మీన వివాహం గత డిసెంబర్ 18న చేసింది. నవంబర్ నెలలో కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 31న పథకం మంజూరు పత్రం ఇచ్చారు. డబ్బులు బ్యాంక్ అకౌంట్లో వేస్తామని అధికారులు చెప్పారట. ఎకౌంట్ తీసి 20 రోజులు దాటినా ఇప్పటి వరకు డబ్బులు మాత్రం జమ కాలేదంటోంది ధర్మవ్వ. ఇదే గ్రామ పంచాయతీ పరిధిలోని చందర్తండాలో నాన్గోత్ బద్య, మంగమ్మకు ఇద్దరు కూతుళ్లు. అందులో మొదటి కూతురు మంజూలకు డిసెంబర్ 12న పెళ్లి చేశారు. నానా తంటాలు పడి తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి వివాహానికి 15 రోజుల ముందే పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 31న పథకం మంజూరు పత్రాలను అందజేసిన అధికారులు డబ్బు మాత్రం ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇంటి లక్ష్మి వెళ్లిపోయింది.. దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామానికి చెందిన వనమ కనకవ్వ, పరుశురాములు ఏకైక కూతురు చంద్రకళ. చంద్రకళను చిన్నకోడూరు మండలం పెద్ద కోడూరు గ్రామానికి చెందిన సుల్తాన్ మల్లయ్య కుమారుడు కనకరాజుకిచ్చి డిసెంబర్ 17న వివాహం జరిపించారు. నవంబర్ మాసంలోనే పరుశురాములు తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. పథకం మీద నమ్మకంతో అయినోళ్ల దగ్గర డబ్బు చేబదులు తీసుకొచ్చి పెళ్లి తంతు ముగించారు. కానీ ఇంతవరకూ పరుశురాములు సర్కార్ సాయం అందలేదు. గజ్వేల్లోనూ గదే తీరు గజ్వేల్...సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం. అందుకే ఇప్పుడు ఉన్నత, అత్యున్నత స్థాయి అధికార గణం అంతా గజ్వేల్ నియోజకవర్గంలోనే చెక్కర్లు కొడుతోంది. కనీసం ఇక్కడైనా పథకం అమలు తీరు అద్భుతంగా ఉంటుందేమోనని పరిశీలిస్తే... అక్కడ కూడా ఇదే పరిస్థితి. నియోజకవర్గంలోని గజ్వేల్ మండలంలో కల్యాణ లక్ష్మి పథకానికి 2, షాదీ ముబారక్ పథకానికి మరో రెండు, తూప్రాన్లోనూ రెండు పథకాలకు రెండు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. ములుగులో రెండు పథకాలకు కలుపుకొని 11, వర్గల్లో రెండు, జగదేవ్పూర్ మండలంలో మూడు దరఖాస్తులు మాత్రమే అందాయి. జగదేవ్పూర్ మండలంలోని మునిగడప గ్రామంలో కల్యాణ లక్ష్మి పథకం అమలు తీరుపై పరిశీలన జరపగా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలనే నిబంధన ఎన్నో ఇబ్బందులు పడ్డామని గ్రామానికి చెందిన బొమ్మల లింగయ్య తెలిపారు. సంక్రాంతి తర్వాత పెళ్లి చేయాలనుకుంటున్నా...ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయి అనేది అధికారులు చెప్పలేదని లింగయ్య వాపోయాడు. చేబర్తి గ్రామానికి తెడ్డు కిష్టయ్య,కిష్టమ్మ దంపతులు కూతురు అరుణ పెండ్లి కోసం కల్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 12న ఆరుణ పెళ్లి చేసినా, ఇంత వరకు డబ్బులు రాలేదని చెప్పారు. ‘‘అప్పులు జేసి పెండ్లి జేసినం.. సర్కార్ సాయం అందుతదనుకుంటే ఇంకా అందకపాయే’’ అంటూ లింగయ్య అందోళన చెందారు. -
బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు
* 2, 3 ఏళ్లలో పూర్తి * బీసీ సంక్షేమ శాఖ సమీక్షలో మంత్రి జోగు రామన్న * విద్యార్థులతో ప్రేమగా వ్యవహరించాలని సూచన * సీఎం దృష్టికి చివరి ఏడాది విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ * బీసీల్లో బాగా వెనుకబడిన కులాలకు ‘కళ్యాణలక్ష్మి’ వర్తింపు! సాక్షి, హైదరాబాద్: రాబోయే 2, 3 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సంక్షేమ హాస్టళ్లన్నింటికీ సొంత భవనాలు నిర్మించనున్నట్లు ఆ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఇందు కోసం వచ్చే బడ్జెట్లో రూ.360 కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 10వ తరగతి వరకు ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్లను ఇంటర్ వరకు పెంచడం ద్వారా డ్రాపౌట్లను తగ్గించేలా చూస్తామని తెలిపారు. సోమవారమిక్కడ సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య కార్యదర్శి టి.రాధ, బీసీ కమిషన్ మెంబర్ సెక్రటరీ జైస్వాల్, డెరైక్టర్ కె.ఆలోక్కుమార్, మల్లయ్యభట్టు, మల్లిఖార్జున్, సీఈ మల్లేశం, జిల్లా సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం విషయంలో ఏ స్థాయి అధికారి, ఉద్యోగి అయినా నిర్లక్ష్యధోరణితో వ్యవహరించినా.. విధి నిర్వహణలో లోపాలున్నా ఉపేక్షించబోమని హెచ్చరించారు. హాస్టళ్లు, పాఠశాలల్లోని విద్యార్థుల పట్ల మానవతా దృక్పథం, ప్రేమ, కరుణతో వ్యవహరించాలని సూచించారు. ఫీజుల చెల్లింపుపై సానుకూలత.. వృత్తివిద్యా కోర్సులు, డిగ్రీలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు(దాదాపు రూ.250 కోట్లు) చెల్లిస్తే బాగుంటుందని కొందరు అధికారులు చేసిన సూచనపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఫీజులు, ఇతరత్రా అంశాల పరిశీలనకు బీసీ సంక్షేమ శాఖకు సంబంధించి ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్(పీఎంయూ)ను ఏర్పాటుచేయాలని అధికారులు కోరగా, వెంటనే దీనిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నట్లు సమాచారం. కొన్ని హాస్టళ్లకు పెద్దమొత్తంలో కరెంట్ చార్జీలు వస్తున్నాయని, వాటిని డొమెస్టిక్ కనెక్షన్గా కాకుండా కమర్షియల్గా చూడడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమవుతోందని కొన్ని జిల్లాల అధికారులు ప్రస్తావించగా.. దీనిపై జీవో ఉన్నందున తదునుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఆధార్ కార్డులు లేనందు వల్ల వేల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయని ఒకరిద్దరు అధికారులు పేర్కొనగా, ఈ పథకానికి ఆధార్కార్డుల లింక్ లేకపోవడం అనేది సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం. సమీక్ష అనంతరం సచివాలయం మీడియా పాయింట్ వద్ద జోగు రామన్న మీడియాతో మాట్లాడుతూ.. బీసీ కార్పొరేషన్లోని 12 ఫెడరేషన్లకు తగు నిధులు, సదుపాయాలు కల్పించడం ద్వారా వాటిని బలోపేతం చేస్తామన్నారు. ‘వచ్చే బడ్జెట్లో వృత్తుల వారీగా ఆయా సమాఖ్యల ద్వారా కేటాయింపులు చేస్తాం. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వచ్చే బడ్జెట్ సమావేశాలకు ముందే అఖిలపక్ష భేటీని నిర్వహించి రాష్ట్రంలోని 113 వెనుకబడిన కులాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. తమ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీని చేపడతామన్నారు. కళ్యాణలక్ష్మి పథకాన్ని బీసీల్లో అందరికీ కాకపోయినా బాగా వెనుకబడిన కులాలకు, సంచార జాతుల(ఏ,బీ,సీ,డీ గ్రూపులు) వారిని గుర్తించి ఇస్తామన్నారు. చలికాలంలో బీసీ హాస్టళ్లలోని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నందున, వచ్చే ఏడాదినుంచి రూ.500 వ్యయంతో ఒక్కొక్కరికి బ్లాంకెట్లను అందిస్తామని మంత్రి జోగురామన్న వెల్లడించారు. అడవిదొంగలకు ఇక కఠిన శిక్షలు అటవీ సంపద కొల్లగొడుతున్న స్మగ్లర్లపై కొరడా ఝళిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అడవిదొంగలకు కఠినమైన శిక్షలను విధించేలా అటవీ చట్టంలో మార్పులు తేనున్నారు. సాదాసీదా చట్టాల కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో 1.50 లక్షల హెక్టార్ల అటవీ భూములు అన్యాక్రాంతం అయినట్టు అధికారులు గుర్తించారు. ఇక అక్రమంగా తరలిస్తున్న అటవీ సంపదకు లెక్కలేదు. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం అడవుల్లో నిత్యం వేలాది టన్నుల టేకు అడవి దొంగల పాలవుతోంది. ఒకప్పుడు విస్తృతంగా విస్తరించిన రోజ్వుడ్ వృక్షాలు వెతికితే తప్ప కనిపించడం లేదు. అడవిదొంగలకు నామ మాత్ర శిక్షలే పడుతున్నాయి. పట్టుబడిన వారికి రూ. 2 వేల జరిమానా, ఏడాది జైలు శిక్ష మాత్రమే విధిస్తున్నారు. వెంటనే బెయిల్ లభిస్తుండడంతో స్మగ్లర్లు దోపిడీ కొనసాగిస్తూనే ఉన్నారు. దీన్ని అరికట్టేందుకు అటవీ దొంగలపై నాన్బెయిల్బుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టేలా చట్టంలో మార్పులు చేసే విషయమై మంత్రి జోగు రామన్న సోమవారం ఉన్నతాధికారులతో చర్చించారు. స్మగ్లర్లకు కనిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష, రూ. 30 వేల జరిమానా , దొంగతనం తీవ్రతను బట్టి జైలు శిక్ష, జరిమానాను పెంచేలా విధానాలు రూపొందించనున్నారు. ఇతరరాష్ట్రాల చట్టాలు అధ్యయనం... పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడులో మన కంటే కఠిన శిక్షలు అమలవుతున్నాయి. వాటిని అధ్యయనం చేసి చట్టంలో నిబంధనలు పొందుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. విజిలెన్స్ వ్యవస్థను బలోపేతం చేసి, జీపీఎస్, వైర్ లెస్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఎకో టూరిజం ద్వారా అడవుల సంరక్షణతోపాటు, ఆదాయం కూడా పొందచ్చని, ఆ దిశగా విధానాలు రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, అటవీ ముఖ్య సంరక్షణాధికారి ఎస్బీఎల్ మిశ్రా, వైల్డ్లైఫ్ సంరక్షణాధికారి పీకే శర్మ తదితరులు పాల్గొన్నారు. -
‘కల్యాణా’నికి రూ.280 కోట్లు
నిజామాబాద్కల్చరల్ : షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాల కోసం ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రూ. 280 కోట్లు కేటాయించిందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని తిలక్గార్డెన్ ప్రాంగణంలో గల న్యూ అంబేద్కర్ భవన్లో జిల్లాలో షాదీ ముబారక్ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా షాదీ ముబారక్ పథకం కింద ఎంపికైన 15 మందికి మంత్రితోపాటు కలెక్టర్ రొనాల్డ్రోస్, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, మేయర్ సుజాత, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్ మంజూరు ఉత్తర్వులను అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పేద ఎస్సీ, ఎస్టీల కోసం కల్యాణలక్ష్మి, మైనారిటీల కోసం షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించామన్నారు. ఈ పథకం కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు వివాహం నిమిత్తం రూ. 51 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ఎస్సీలు, మైనారిటీలకు రూ. 100 కోట్ల చొప్పున, ఎస్టీలకు రూ. 80 కోట్లు కేటాయించామన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చక్కటి నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటికే 2.15 లక్షల మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేశామన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. పేదవారికి రూ. 3.50లక్షలతో ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. ఒకటో తేదీ నుంచి ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల బియ్యం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. వసతిగృహాలు, మధ్యాహ్న భోజన పథకాలకు సన్న బియ్యం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఫయీమ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగగంగారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి దాదాన్నగారి విఠల్రావు, టీఆర్ఎస్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు తారిక్ అన్సారి, నాయకులు రహమాన్,అక్తార్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఓడిపోతున్న అమ్మతనం
వంశోద్ధారకుడు కావాలన్న ఆరాటం.. ఆడపిల్లను సాకలేమన్న నిస్సహాయత.. ఏదైతేనేమీ.. జిల్లాలో శిశు విక్రయాల దుష్ట సంప్రదాయం కొనసాగుతుండడం దురదృష్టకరం. పుట్టింది ఆడశిశువైతే ఏదోరకంగా వదిలించుకునే అనాచారం తండాలను వీడడం లేదు. ఇక..ఆధునికతకు పేరొందిన పట్టణ ప్రాంతాల్లో ‘కని’కరం లేకుండా ఆడశిశువులను రోడ్డు పక్కన, చెత్తకుప్పల్లో.. మురుగు కాల్వల్లో వేస్తున్న సంఘటనలు అనేకం.. ఆడశిశువులను ‘కని’కరం లేకుండా వదిలించుకుంటున్న విషాదాలకు జిల్లాలో ఇక.. ముగింపు లేదా...? విషసర్పాలైన పాములు కూడ గత్యంతర లేని పరిస్థితుల్లో మాత్రమే తాము కన్న పిల్లలను వధిస్తాయని తెలిసిందే. పేదరికం, అధిక సంతానం మనుషులను కూడ కర్కోటకులుగా మారుస్తోంది. నవమాసాలు మోసి కన్న మాతృమూర్తి సైతం ప్రేమను త్వజించి పేగు తెంచుకుపుట్టిన పసిగుడ్డును పాషాణంగా వదిలేస్తోంది. ⇒ పసిగుడ్డులను పడేస్తున్న కొందరు.. ⇒ దత్తత పేరుతో విక్రయిస్తున్న మరికొందరు ⇒ జిల్లాలో ఇంకా కొనసాగుతున్న దుష్ట సంప్రదాయం నల్లగొండ అర్బన్: రోజులు, నెలలు, సంవత్సరాలతోపాటు క్యాలెండర్లు మారుతున్నాయి. కానీ అడశిశువులను వదిలించుకునే అనాచారం నుంచి గిరి‘జనం’ బయటపడలేకపోతోంది. ప్రభుత్వాలు ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించినా, బంగారుతల్లి, కల్యాణ లక్ష్మి తదితర పథకాలను ప్రవేశపెట్టినా ఈ దుష్ట సంప్రదాయాన్ని నిలువరించలేకపోతున్నారు. పుట్టింది ఆడశిశువైతే ఏదోరకంగా వదిలించుకునే అనాచారం గిరిజన తండాలను వీడడం లేదు. శిశు విక్రయాలతో దశాబ్దన్నర క్రితమే పత్రికల్లో పతాక శీర్షికల్లోకెక్కిన దేవరకొండ ప్రాంతంలో తరచు ఇలాంటి అనాచారపు ఆనవాళ్లు మెదలుతూనే ఉండగా, దుష్ట సంస్కృతి తాజాగా జిల్లా కేంద్రమూ మినహాయింపుకాదనే సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. రైల్వేస్టేషన్కు వెళ్లేదారిలో అవాంఛిత మృతశిశువు ఉదంతం వెలుగులోకిచ్చి పదిరోజులైనా కాకముందే దత్తత ముసుగులో శిశు విక్రయ సంఘటన కలకలం రేపడం చర్చనీయాంశమైంది. వదిలించుకుంటున్న శిశువులు రోజుల వయస్సు వారు కావడంతో తల్లిపాలు పొందడం, తల్లిదండ్రుల వద్ద సహజ వాతావరణంలో పెరగడంలాంటి ప్రాథమిక హక్కులు కోల్పోతున్నారు. 1999 నుంచి.. 1999 మార్చిలో దేవరకొండ మండలం కొండమల్లేపల్లి శివారు గౌరికుంట తండాలో ఇంద్రావత్ మంగ్లి అనే గిరిజన మహిళ 3 నెలల పసికందును భర్తకు తెలియకుండా అమ్మిన సంఘటన అప్పట్లో సంచలనం కలిగించింది. ఆ తర్వాత ఐదేళ్ల కాలంలో దాదాపు 75 మంది శిశు విక్రయాలు జరిగాయని పరిశోధనల్లో తెలింది. ‘‘ఆడశిశువులను అమ్ముకుంటే ఎంతో కొంతలాభం...లేకుంటే పెంచి పెద్దచేసి పెళ్లిచేస్తే లక్షలవుతది. అందుకే అమ్ముకుంటున్నాం’’ అని పలువురు గిరిజన మహిళలు పేర్కొనడం వారి పరిస్థితులకు అద్దంపట్టింది. అత్యధికంగా చందంపేట మండలంలో ఆ తర్వాత డిండి, చింతపల్లి, పీఏపల్లి మండలాల్లో విక్రయాలు జరిగినట్లు తేలాయి. ప్రత్యేక ప్యాకేజీ అనంతరం కొంతమేర తగ్గడం, ఆతర్వాత ‘ఊయల’ పేరుతో శిశుగృహలకు తరలించే ఏర్పాటు చేయడంతో మరికాస్త చైతన్యం వచ్చినా, దత్తత పేరుతో అడపాదడపా శిశు విక్రయాల ఉదంతాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. సాటుమాటుగా కొనసాగుతున్న విక్రయాలు.. పెంపకానికనో, దత్తత ఇచ్చామనే సాకులతో శిశు విక్రయాలు సాటుమాటుగా కొనసాగుతూనే ఉన్నాయి. వెలుగుచూసేవి కొన్నైతే...వెలుగులోకి రానివి ఇంకొన్ని. చందంపేట మండలం పోలేపల్లి శివారు ఫకీర్నాయక్ తండాకు చెందిన గిరిజన దంపతులు మూడో సంతానమైన నెలవయస్సు దాటని ఆడశిశువును మూడు నెలల క్రితం హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్కు రూ. 15వేలకు కొండమల్లేపల్లి విద్ద విక్రయించారు. విషయం పోలీసులకు తెలియడంతో శిశువును స్వాధీనం చేసుకుని దేవరకొండలోని శిశు గృహకు తరలించిన సంఘటన తెలిసిందే. తాజాగా హాలియా మండలంలోని రంగుండ్ల తండాకు చెందిన గిరిజన దంపతులు మూడో సంతానంలో జన్మిం చిన ఆడశిశువును మునుగోడు మండలానికి చెందిన ఓవ్యక్తి అప్పగించడం.. నల్లగొండలో జరిగిన వాగ్వివాదంతో విషయం అధికారుల దాకా వెళ్లి పాపను శిశుగృహకు తరలించారు. ఒకప్పుడు గొంతులో వడ్లగింజవేసి అక్కడిక్కడే అవాంఛిత శిశువుల ఉసురు తీసిన సంఘటనల నుంచి శిశు విక్రయాలు, దత్తత ముసుగులో వ్యాపారాలు చేస్తున్న ఉదంతాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ‘కల్యాణలక్ష్మి’తోనైనా ఆగేనా... ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చేందుకు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో బంగారు తల్లి పథకాన్ని ప్రారంభించారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వం ఏటా కొంత నగదును ఇస్తూ మొత్తంగా రూ.2.16లక్షలను అందజేయడం ఈ పథకం లక్ష్యం. కానీ ప్రస్తుతం ఈ పథకం కొనసాగింపు అస్పష్టంగానే ఉంది. మరోవైపు ఎస్సీ, ఎస్టీ కుటుంబాల వారి ఆడపిల్లల కోసం కల్యాణలక్ష్మి పథకాన్ని తెలంగాణప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారానైనా ఆడపిల్లల జీవితాలకు భరోసా కలగాలని ఆశిద్దాం. ఆడశిశువైతే వీడాల్సిందే...! వంశోద్ధారకుడు కావాలనే తాపత్రయంతో రెండు, మూడు కాన్పుల వరకు చూసి ఆపై కూడ ఆడ సంతానమే కలిగితే వదిలించుకుంటున్న సంఘటనలే ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. ఆస్తి, యాజమాన్యత, దారిద్య్రం, లింగవివక్షలు, వరకట్న సమస్యలు ప్రధానంగా కనిపిస్తున్న విపత్కర పరిస్థితుల ప్రేరేపణతో నవమాసాలు మోస్ఙికన్న’ ఆ పేగే బరువైపోతోంది. ఈ అనాచారం విశృంఖలంగా మారి పరిస్థితి ఘోరంగా తయారవ్వడంతో జాతీయ మహిళా కమిషన్ మొదలు అసెంబ్లీ కమిటీల వరకు గిరిజన తండాల్లో పర్యటించి శిశు విక్రయ నిరోధానికి సలహాలు, సూచనలిచ్చాయి. రూ.26 కోట్ల ప్యాకేజీతో కొంతతగ్గినా... శిశు విక్రయాల సంఘటనలను తీవ్రంగా పరిగణించిన అప్పటి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ 2001లో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ పర్యటన తర్వాత..దాని నివేదిక ప్రకారం 2004 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దేవరకొండ నియోజకవర్గానికి 26 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. పేదరికంలో మగ్గుతున్న గిరిజన కుటుంబాలను ఆదుకునేందుకు ఉపాధి పథకాలను ప్రవేశపెట్టి మరికొంత ఆర్థిక సాయం అందించింది. దీంతో కొన్నాళ్లపాటు ఈ అనాచార, ఉదంతాలు తగ్గుముఖం పట్టాయి. ఆ తర్వాత యథాతధమయ్యాయి. -
‘బంగారు తల్లి’పై దుమారం
* పథకం కొనసాగింపుపై స్పష్టత కోరిన ప్రతిపక్షం * ఇంకా దృష్టి పెట్టలేదని ఆర్థికమంత్రి సమాధానం.. కాంగ్రెస్ నిరసన * ‘కళ్యాణ లక్ష్మి’ కింద పెళ్లి రోజే రూ. 51 వేలు అందిస్తామన్న ఈటెల సాక్షి, హైదరాబాద్: మైనారిటీ తీరిన (18 ఏళ్లు నిండిన) ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతులకు కళ్యాణ లక్ష్మి పథకం వర్తిస్తుందని, డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చే కుల, ఆదాయ పరిమితి సర్టిఫికెట్ తో పెళ్లికి నెల రోజుల ముందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ పథకానికి రూ. 2 లక్షల ఆదాయ పరిమితి విధించామని, దరఖాస్తు చేసుకున్న వారికి పెళ్లి రోజే కట్నంగా రూ. 51 వేలు అందజేస్తామని చెప్పారు. అక్టోబర్ 2 నుంచే పథకాన్ని ప్రారంభించామని, ఇప్పటికే ప్రభుత్వానికి దరఖాస్తులు కూడా అందుతున్నాయని తెలిపారు. పథ కం కింద అర్హులైన వారు గుడిలో, చర్చిలో లేదా ఎక్కడపెళ్లి చేసుకున్నా పథకం వర్తిస్తుందన్నారు. అర్హత కలిగిన వధువు కులాంతర వివాహం చేసుకున్నా పథకం వర్తిస్తుందన్నారు. ప్రభుత్వం తరఫున సామూహికంగా వివాహాలు జరిపించే ఆలోచన ఉందన్నారు. మైనార్టీ జనాభాపై స్పష్టత వచ్చిన అనంతరం ఈ పథకాన్ని బీసీ, సంచార జాతులకు సైతం అమలు చేసే విషయమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి సహా ప్రజాప్రతినిధులందరూ పెళ్లి పందిట్లోకి వెళ్లి నేరుగా డబ్బును అందజేసేలా కార్యాచరణ ఉంటుందన్నారు. అంతకుముందు ఆడబిడ్డల సంక్షేమం కోసం కాంగ్రెస్ హయాం లో చేపట్టిన ‘బంగారుతల్లి’ పథకం కొనసాగింపుపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేసింది. బంగారు తల్లి పథకం గత ప్రభుత్వం తోనే పోయిందని ఒకమారు, ఆ పథకంపై ప్రభుత్వం దృష్టి సారించలేదంటూ ఇంకోమారు ఆర్థిక మంత్రి ఇచ్చిన సమాధానంపై కాంగ్రెస్ నిరసన తెలియజేసింది. ఈ పథకంపై మరింత స్పష్టత ఇవ్వాలని, మార్గదర్శకాలను సరళీకృతం చేయాలని, కులాంతర వివాహాలకు ఎలాంటి ప్రోత్సాహం ఇస్తారో తెలియజేయాలని ఆపార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. కళ్యాణలక్ష్మి పథకానికి తాము మద్దతిస్తున్నామని, అయితే బాలికల అభివృద్ధి కోసం తెచ్చిన బంగారుతల్లి మాటేమిటని కాంగ్రె స్ ఎమ్మెల్యే డీకే అరుణ ప్రశ్నించారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని ప్రతిపక్షనేత జానారెడ్డి కోరా రు. కళ్యాణలక్ష్మి కన్నా బంగారు తల్లి మంచి పథకమని, దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఎర్రబెల్లి దయాకర్రావు(టీడీపీ) డిమాండ్ చేశారు. దీనికి ఈటెల సమాధానమిస్తూ.. ‘బంగారు తల్లి పథకంపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. అది కొనసాగుతున్నట్లుగా ఉంది. అలా ఏమైనా ఉంటే దాన్ని మరింత మెరుగ్గా అమలు చేస్తాం’ అని చెప్పారు. మంత్రి సమాధానం అసంబద్ధంగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపించడంతో మంత్రి హరీశ్రావు స్పందించారు. ఈ అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికిప్పుడే సమాధానం చెప్పడమంటే సాధ్యం కాదని అన్నారు. దీనికి జానారెడ్డి స్పందిస్తూ.. ‘కళ్యాణలక్ష్మి పథ కం పెట్టి బంగారుతల్లి పథకాన్ని తొలగిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వనందుకు మా నిరసన తెలుపుతున్నాం. ఈఅంశాన్ని మరోరూపంలో ప్రస్తావి స్తాం’ అని చెప్పారు. కాంగ్రెస్ నిరసనపై మంత్రి హరీశ్రావు, ఈటెల తమ అభ్యంతరాన్ని తెలియజేశారు. -
కళ్యాణ లక్ష్మి పధకం పై అసెంబ్లీలో చర్చ
-
‘కల్యాణలక్ష్మి’ కోసం టీ-బీసీఎఫ్ దీక్ష
ఖమ్మం మామిళ్లగూడెం : కల్యాణలక్ష్మి పథకాన్ని బీసీలకు కూడా వర్తింపజేయాలన్న డిమాండుతో తెలంగాణ బీసీ ఫ్రంట్ (టీ-బీసీఎఫ్) ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నాచౌక్లో 48 గంటల నిరాహార దీక్ష బుధవారం ప్రారంభమైంది. దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి ఫ్రంట్ జిల్లా అధ్యక్షురాలు కొత్తకొండ్ల శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. బీసీ కులాల్లో ఆర్థిక స్థోమత లేక, కుల వృత్తులు కునారిల్లడంతో తట్టుకోలేక అనేకమంది ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతోమంది బీసీ నిరుపేదలు తమ బిడ్డలకు వివాహం చేయలేని దుర్భర దారిద్య్రంలో ఉన్నారని ఆవేదన వెలిబుచ్చారు. వీరందరికీ చేయూతనిచ్చేలా బీసీలకు కూడా కల్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింప జేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఉద్యమంలో బీసీల పాత్ర చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ ఉద్యమ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ నుంచి ఆత్మాహుతి చేసుకున్న శ్రీకాంతాచారి వరకు వందలమంది బీసీలు అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరేలా బీసీలకు కూడా వెంటనే కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేయూలని కోరారు. ‘‘బీసీలకు ఈ పథకాన్ని వర్తింపజేసే విషయూన్ని పరిశీలిస్తామని చెప్పడం కాదు. అమలు చేస్తున్నట్టుగా ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించాలి’’ అని విజ్ఞప్తి చేశారు. ఫ్రంట్ జిల్లా గౌరవాధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వరావు మాట్లాడుతూ.. సమాజంలో అణచివేయబడిన బీసీలు తమ హక్కుల సాధన కోసం ఉద్యమించాలని కోరారు. పోరుబాటతోనే బీసీలకు రాజ్యాధికారం సిద్ధిస్తుందన్నారు. ఈ దీక్ష శిబిరంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పట్ల నర్సింహారావు, నాయకులు నాగేశ్వరావు, హనుమంతరావు, గడ్డం ఉపేందర్, వేలాద్రి, అరుణకుమారి, కొండలు, సైదులు, అరుణ, కృష్ణవేణి, వసంత, కె.ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. పమ్మి రవి కళాబృందం ధూం-ధాం అలరించింది. పలువురి సంఘీభావం ఈ దీక్ష శిబిరాన్ని టీఎన్జీవోస్ అసోసియేషన్ జి ల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, నాయకు లు నందగిరి శ్రీనివాస్, వల్లోజి శ్రీనివాస్, సాగర్; ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నల్లమోతు వి జయరాజు మాదిగ, రాంబాబు, రాంప్రసాద్; సీపీఐ నాయకుడు మేకల సంగయ్య; టీఎంఆర్పీఎస్ నాయకులు నాగభూషణం, సావిత్రిబాయి; పూలే సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సయ్య సందర్శించి సంఘీభావం తెలిపారు. -
‘కల్యాణ లక్ష్మి’కి ‘కల్యాణ లక్ష్మి’కి ఇలా దరఖాస్తు
ఇలా దరఖాస్తు చేసుకోండి.. మైనార్టీ వర్గానికి చెందిన వారైతే.. తెలంగాణ నివాసి అయి ఉండాలి. అమ్మాయి, అబ్బాయి తల్లి,దండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించరాదు. దరఖాస్తుకు సంబంధిత ధ్రువపత్రాలతో పాటు నేరుగా జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో అందించాలి. దరఖాస్తుకు కుల, ఆదాయ, జనన, స్థానిక ధ్రువపత్రాలు తప్పనిసరిగా జత చేయాలి. అధికారులకు ఇచ్చే ధ్రువపత్రాలు ఆరు నెలల లోపు తీసుకున్నవై ఉండాలి. జత చేయాల్సిన పత్రాలతో పాటుగా వధువు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కాపీని సైతం ఇవ్వాలి. www.epasswebsite.cgg.gov.in వెబ్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ధ్రువపత్రాలు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పథకానికి ఇతర పథకాలకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటికే కొత్తగా వివాహం అయినవారు అయితే మ్యారేజ్ సర్టిఫికెట్ లేదా, మసీదు నుంచి పొందిన వివాహ ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతరులు ఇలా.. పెళ్లి కాని షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల కుటుంబాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ పథకానికి కూడా పైన పేర్కొన్న విధంగానే దరఖాస్తు చేసుకోవాలి. ఈ విభాగానికి పూర్తిగా ఆన్ లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. వీరికి కూడా ప్రభుత్వం రూ. 51000 నగదును బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది. పెళ్లి నెల రోజులు ఉందనగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు పెళ్లి శుభలేఖ జత చేయాల్సి ఉంటుంది. నోట్ : ఇటీవ లే ఈ పథకానికి చిన్న మార్పు చేశారు. వరుడి ‘ఆధార్’ నంబర్ కూడా తప్పకుండా సమర్పించాలి. -
అన్ని కులాలకూ ‘కల్యాణలక్ష్మి’
గురునానక్ జన్మదినోత్సవం సందర్భంగా గురుద్వారాకి వెళ్లి సిక్కుల తలపాగా ధరించి, సిక్కులను కూడా కల్యాణలక్ష్మి పథ కంలో చేర్చడానికి తెలంగాణ సీఎం అంగీకరించారు. అయితే పేద, మధ్యతరగతికి చెందిన వారందరినీ, కులాల ప్రస్తావన లేకుండా, కల్యాణలక్ష్మి పథకంలో చేర్చి, వివా హం చేసుకోబోతున్న మహిళలను సీఎం ఆదు కోవాలి. ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలకు 25,000 రూపాయల ఆర్థిక సాయం అందిం చాలి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి.. టీటీడీ సహకారంతో కల్యాణమస్తు కార్యక్రమం ప్రారంభించి ఎందరో సోదరీమణులకు తాళి భాగ్యాన్ని ప్రసాదిం చిన విషయం ఉమ్మడి రాష్ట్ర ప్రజల జ్ఞాపకాల్లో మిగిలే ఉంది. కల్యాణమస్తు కార్యక్రమంతో ఆయన ప్రభుత్వ ఖర్చుతో వివాహా లు జరిపించారు. తెలంగాణ సీఎం కూడా కులమతాలకు అతీ తంగా కల్యాణలక్ష్మి పథకం ద్వారా వివాహాలు జరిపించాలి. రాష్ట్రంలోని సిక్కుల కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. హైదరాబాద్లో అమృత్సర్ తరహా దేవాలయాన్ని నిర్మించి, నగరాన్ని సర్వమత సమ్మేళన కేంద్రంగా మార్చాలి. -కె.అమన్ రాజీవ్ కుత్బుల్లాపూర్, హైదరాబాద్ -
సిక్కులకూ ‘కల్యాణ లక్ష్మి’
♦ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి ♦ ప్రభుత్వ సెలవు దినంగా గురునానక్ జయంతి ప్రకటన హైదరాబాద్: ఇక నుంచి సిక్కు కుటుంబాల్లోని ఆడపిల్లలకూ ‘కల్యాణలక్ష్మి’ పథకం కింద ఆర్ధిక సహాయాన్ని అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలలోని అమ్మాయిల పెళ్లి ఖర్చుల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని సిక్కులకు కూడా విస్తరించనున్నామన్నారు. ఈ మేరకు శుక్రవారం అధికారులను ఆదేశించనున్నట్లు చెప్పారు. సిక్కుల గురువు గురునానక్దేవ్జీ మహారాజ్ 545(ప్రకాష్ ఉత్సవ్)వ జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అఫ్జల్గంజ్ అశోక్బజార్లోని గురుద్వారా శ్రీ గురు సింగ్ సభ, గురుద్వారా సాహెబ్ సికింద్రాబాద్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జయంత్యుత్సవాల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన విశాల్దివాన్(ఆధ్యాత్మిక సభ)లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ,మూడు వందల ఏళ్లుగా నగరంతో అనుబంధం ఉన్న సిక్కులు సామూహిక ప్రార్థనలు నిర్వహిం చుకునేందుకు, సభలు, సమావేశాల ఏర్పాటుకు కమ్యూనిటీ భవనం, ప్రార్ధనామందిరం కోసం మూడెకరాల స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కమ్యూనిటీహాల్ నిర్మాణానికి రూ. కోటి నిధులను అందజేయనున్నట్లు వెల్లడిం చా రు. దక్షిణ భారత్లోనే అతి పెద్ద గురుద్వారా నగరంలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. సెలవు దినంగా నానక్ జయంతి గురునానక్ జయంతి రోజును ఇక నుంచి ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించనున్నట్లు చెప్పారు.అపారమైన ధైర్య సాహసాలతో పాటు ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవంతో, కష్టపడేతత్వం గల సిక్కుల జీవన విధానం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. అనంతరం కేసిఆర్ తన కుటుంబం తరపున రూ.1.16 లక్షల చెక్కును గురుద్వారా నిర్మాణం నిమిత్తం నిర్వాహకులకు విరాళంగా అందజేశారు. ఉదయం 11గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో సుమారు 30వేలమంది సిక్కులు కుటుంబాల సమేతంగా పాల్గొని భక్తి, శ్రద్ధలతో పూజలు జరిపారు. ఈ సందర్భంగా సిక్కు మతగురువులు భక్తి, భజన కీర్తనలు ఆలపించడంతో పాటు గురునానక్ దేవ్జీ మహరాజ్ ఆధ్యాత్మిక ప్రవచనాలను, సందేశాలను బోధించారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ప్రసాద వితరణ, అల్పాహారం, భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా గురుద్వారాల ఛైర్మన్ గురుచరణసింగ్బగ్గా, టీఆర్ఎస్ పార్టీ గోషామహల్, అంబర్పేట్ నియోజకవర్గాల ఇంచార్జిలు ప్రేమ్కుమార్ధూత్, ఎడ్ల సుధాకర్రెడ్డి, అశోక్బజార్ గురుద్వారా శ్రీ గురుసింగ్సభ అధ్యక్షుడు కుల్దీప్సింగ్బగ్గా, గురుద్వారా సాహెబ్ సికింద్రాబాద్ అధ్యక్షుడు బల్దేవ్సింగ్ బగ్గా, కార్యదర్శులు ఇంద్రజిత్సింగ్ టుటేజా, అవతార్సింగ్ కనూజా, గురుద్వారాల ప్రబంధక్ కమిటీ ప్రతినిధులతో పాటు పెద్దసంఖ్యలో సిక్కుసోదరులు పాల్గొన్నారు. -
'కాకులను కొట్టి గద్దలకు వేసినట్టుగా ఉంది'
గత ప్రభుత్వం బీసీలకు ఏ విధంగా అన్యాయం చేసిందో ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అదే విధానాన్ని అవలంభిస్తోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. తెలంగాణ బడ్జెట్ కాకులను కొట్టి గద్దెలకు వేసినట్టుగా ఉందని ఆయన ఎద్దెవా చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్కదాన్నీ అమలు చేయడం లేదన్నారు. కేజీ టూ పీజీ అనేదాన్ని ప్రస్తావనలోకి తీసుకరాలేదని చెప్పారు. కల్యాణ లక్ష్మి స్కీమ్ అన్ని వర్గాల వారికి వర్తింపచేయాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
'బడ్జెట్'లో కళ్యాణలక్ష్మీకి ప్రత్యేక నిధులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో కళ్యాణలక్ష్మీ పథకానికి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రత్యేకంగా నిధులను కేటాయించారు. కళ్యాణ లక్ష్మీ పథకంలో ఎస్సీలకు 150 కోట్లు, ఎస్టీలకు 80 కోట్లు కేటాయించారు. 2014-19 వరకు ఎస్సీల అభివృద్ధి కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని ఈటెల తన ప్రసంగంలో తెలిపారు. ఎస్సీల సబ్ ప్లాన్ కు 7579 కోట్లు, ఎస్టీల సబ్ ప్లాన్ కు 4559 కోట్లు, బీసీల సంక్షేమానికి 2022 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 1030 కోట్ల కేటాయింపు జరిగింది. -
నిరుపేద యువతులకు వరం.. ‘కల్యాణ లక్ష్మి’
వరకట్న దురాచారం రాజ్యమేలుతున్న ప్రస్తుత సమాజంలో ఆడపిల్ల పెళ్లిళ్లు చేసిన కుటుంబం అప్పులపాలవుతున్న పరిస్థితి ఉంది. ఉన్నత చదువులు చదివిస్తే కట్నం ఇచ్చుకోలేమని తల్లిదండ్రులు తమ కూతుళ్లను మైనార్టీ తీరకముందే వివాహాలు చేస్తున్నారు. ఆడపిల్లలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన నిరుపేద ఎస్సీ, ఎస్టీ యువతుల కోసం ‘కల్యాణ లక్ష్మి’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆర్థికంగా వెనకబడిన నిరుపేద ఎస్సీ, ఎస్టీ యువతులకు ‘కల్యాణ లక్ష్మి’ పథకం వరం కానుంది. ఆడపిల్లలకు పెళ్లి భారంగా మారిన ప్రస్తుత తరుణంలో, వారి పెళ్లికి ఆర్థికంగా చేయూతనివ్వాలని ప్రారంభించిన ఈ పథకం నిరుపేద తల్లిదండ్రులకు ఎంతో ఊరట కలిగించనుంది. కల్యాణలక్ష్మి పథకానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం తహసీల్దార్, ఎంపీడీఓలకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. మరో రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు రానున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పథకం కేవలం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన పెళ్లికాని యువతులకు మాత్రమే వర్తిస్తుంది. రెండు విడతలుగా ఆర్థికసాయం.. కల్యాణలక్ష్మి పథకానికి అర్హులైన వారు స్థానిక తమసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు స్టడీ సర్టిఫికెట్లు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రా లు, బ్యాంక్ ఖాతా బుక్ జతచేయాలి. దరఖాస్తులను తహసీల్దార్, ఎంపీడీఓలు పరి శీలించి అర్హులను ఎంపిక చేస్తారు. పథకానికి ఎంపికైన వారికి ప్రభుత్వ ప్రోత్సాహకం గా రూ.53వేలను పెళ్లి రోజు సగం, తర్వాత సంగం పెళ్లి కూతురు ఖాతాలో జమ చేస్తారు. ఇందు కోసం జిల్లాకు సుమారు రూ.25 కోట్లు మంజూరయ్యాయి. -
వికలాంగులకు రూ.1500 ఫించన్: పోచారం
నిజామాబాద్: దసరా నుంచి వితంతువులు, వృద్ధులకు నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. వికలాంగులకు రూ.1500 ఫించన్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ బడుగు వర్గాల ఆడపిల్లల వివాహానికి రూ. 50 వేలు అందిస్తామని చెప్పారు. కల్యాణలక్ష్మీ పథకం దసరా నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపారు. రైతులకు రుణమాఫీ అవసరం రానప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు అని అంతకుముందు పోచారం వ్యాఖ్యానించారు. ఖరీఫ్ సీజన్ ముగుస్తున్న నేపథ్యంలో రైతులకు కొత్త రుణాలు ఇప్పించేందుకు బ్యాంకులను ఒప్పించే యత్నం చేస్తున్నామని మంత్రి చెప్పారు. -
దళిత యువతుల పెళ్లి మేమే చేస్తాం
-
ప్రజల నిర్ణయాల మేరకే అసెంబ్లీలో తీర్మానాలు
కమాన్పూర్: నవ తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజల నిర్ణయూల మేరకే అసెంబ్లీలో తీర్మానాలు చేసినట్లు డెప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం ఆమె ఆర్జీ-3 డివిజన్ ఓసీపీ-1 ఫేస్-2లోని భద్రకాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ సస్యశ్యామలం కోసం అందరూ కృషిచేయూలన్నారు. ఆమేరకు ప్రభుత్వం నిధుల కేటారుుంపూ చేపడుతుందన్నారు. ఇప్పటికే 42 అంశాలపై తీర్మానం చేసినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఆడబిడ్డల సౌభగ్యం కోసం ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టిందని తెలిపారు. ప్రతిపక్ష పార్టీన్నీ తెలంగాణ పునఃనిర్మాణానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పుట్ట మధు, రామగుండం డెప్యుటీ మేయర్ సాగంటి శంకర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు కటారి రేవతిరావు, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గంట వెంకటరమణారెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు భూక్య ఆశాకుమారి, వకులా దేవి, నాగరాజ కుమారి, రమాదేవి, చంద్రకళా, కాపురబోయిన భాస్కర్, కిషన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా తొలిసారిగా వచ్చిన డెప్యూటీ స్పీకర్ను సెంటినరీకాలనీ పార్టీ కార్యాలయంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. -
అన్నిటికీ ఆధార్
సంక్షేమ పథకాలకు తప్పనిసరి చేయాలని టీ సర్కారు యోచన అక్రమాలకు చెక్ పెట్టేందుకు ‘ఆధారే’ ఆధారమని భావన పెన్షన్లు, ‘కల్యాణ లక్ష్మి’ లబ్ధిదారులకు వర్తింపజేసేందుకు కసరత్తు కొత్త పెన్షన్ కార్డుల జారీసమయంలోనే వివరాల సేకరణ ‘కల్యాణ లక్ష్మి’ కింద వధువుపేరిటే రూ. 50 వేల నగదు డిపాజిట్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ పథకాలన్నింటికీ ఆధార్తో లంకె పెట్టాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. ప్రభుత్వ ప్రయోజనాలు పొందాలంటే విధిగా ఆధార్ కార్డు వివరాలు సమర్పించాలన్న నిబంధన పెట్టే యోచన చేస్తోంది. మార్గదర్శకాల జారీ సమయంలోనే ఈ విషయాన్ని స్పష్టం చేయనుంది. ఇప్పటికే సామాజిక పెన్షన్లకు దీన్ని అమలు చేసే కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్రమాలకు తావు లేకుండా పథకాలను అమలు చేసేందుకు ఆధార్ వివరాలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే రాష్ర్టంలోని పింఛన్దారులంతా విధిగా ఆధార్ కార్డుల వివరాలు సమర్పించాల్సి ఉంటుందని కూడా చెబుతున్నాయి. దసరా-దీపావళి మధ్య కాలంలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్దారులకు తెలంగాణ ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పెన్షన్ కార్డులు జారీ చేసి.. పింఛన్ మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలోనే వేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త కార్డుల జారీ సమయంలోనే పింఛన్దారులు విధిగా వారి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని, లేదంటే వారికి పెన్షన్ అందదని అధికారులు పేర్కొంటున్నారు. ఒకవేళ లబ్ధిదారులు కొత్తగా ఆధార్ కార్డు పొందే క్రమంలో ప్రభుత్వానికి వివరాలు సమర్పించడానికి ఆలస్యమైతే.. ఆ వివరాలు అందిన తర్వాత అప్పటి వరకు ఇవ్వాల్సిన బకాయిలను కూడా కలిపి పింఛన్ మొత్తాన్ని ఒకేసారి చెల్లించనున్నట్లు ఓ ఉన్నతాధికారి వివరించారు. తెలంగాణలో అన్ని వర్గాలకు చెందిన దాదాపు 30.85 లక్షల మంది పింఛన్దారులు ఉన్నారు. బ్యాంకు అకౌంట్లు, ఆధార్ కార్డు, బయోమెట్రిక్ వివరాలు లేని కారణంగా దాదాపు ఐదున్నర లక్షల మందికి రెండు నెలలుగా పెన్షన్ చెల్లించడం లేదు. వీరంతా తప్పుడు పత్రాలతో పెన్షన్ పొందుతున్నారని అధికారవర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రస్తుత మున్న పింఛన్ మొత్తాన్ని భారీగా పెంచుతున్న నేపథ్యంలో ఒక్క పైసా కూడా దుర్వినియోగం కారాదని సీఎం కేసీఆర్ నొక్కి చెబుతున్నారు. దీంతో ప్రధానంగా అక్రమాలను అరికట్టడానికే ఈ కొత్త కార్డుల జారీ కార్యక్రమాన్ని రాష్ర్ట ప్రభుత్వం చేపడుతోంది. దీన్ని పూర్తి పారదర్శకంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ ఆధార్కార్డులు జారీ కాని గ్రామ పంచాయతీలు తమకు సమాచారమిస్తే ఆధార్ నమోదు కోసం సిబ్బందిని ఆయా గ్రామాలకు పంపిస్తామని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ‘కల్యాణ లక్ష్మి’కి కూడా వర్తింపు దళిత, గిరిజన అమ్మాయిల వివాహానికి రూ. 50 వేల చొప్పున నగదు సాయం అందించేందుకు ముఖ్యమంత్రి తాజాగా ప్రకటించిన ‘కల్యాణ లక్ష్మి’ పథకానికి కూడా ఆధార్నే ఆధారంగా తీసుకోనున్నట్లు సమాచారం. వధూవరులకు విధిగా ఆధార్కార్డు ఉండాలని, అమ్మాయి పేరిట బ్యాంకు అకౌంట్ ఉండాలని నిబంధనలు విధించనున్నారు. పెళ్లి ఫొటోలు, ఆధార్ కార్డు, ఇతర వివరాలతో ‘ఆన్లైన్’లోనే దర ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే రూ. 50 వేల నగదును పెళ్లి కూతురు పేరిట బ్యాంకులో జమ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ డబ్బును ఎవరికి ఇవ్వాలన్నది వధువు ఇష్టమని ఓ అధికారి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏటా దాదాపు లక్ష వరకు ఎస్సీ, ఎస్టీ అమ్మాయిల పెళ్లిళ్లు జరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ‘ఆధార్’ వల్లే ఉపాధి నిధులు భద్రం! ఉపాధి హామీ పథకాన్ని ఆధార్ కార్డుతో అనుసంధానించడం వల్ల భారీగా నిధులు పక్కదారి పట్టకుండా అడ్డుకోగలిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇందుకు నిదర్శనంగా ఇటీవల బయటపడిన ఓ విషయాన్ని వెల్లడించారు. ఉపాధి హామీలో పని చేసినట్లు రికార్డులు సృష్టించి కోట్ల నిధులు మింగేయడానికి క్షేత్రస్థాయిలో జరిగిన యత్నం ఆధార్ లంకె వల్ల బయటపడిందని పేర్కొన్నారు. తప్పుడు రికార్డులతో పెట్టుకున్న బిల్లులకు సంబంధించిన రూ. 78 కోట్ల నిధులు ప్రస్తుతం పోస్టాఫీసుల్లోనే మూలుగుతున్నాయి. వాటిని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. నిజమైన కూలీలైతే తమ ఆధార్ కార్డును చూపించి నిధులు తీసుకెళ్లేవారని అభిప్రాయపడుతున్నారు. -
'అందరు దొంగల్లా కనబడుతున్నారేమో'
హైదరాబాద్: తెలంగాణలో ఖరీఫ్ రుణప్రణాళికను వెంటనే అమలుచేయాలని జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. రుణాలు మాఫీ అయ్యేలోగా రైతులు వడ్డీ వ్యాపారుల బారీనపడి నష్టపోయే ప్రమాదముందని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ దృష్టిలో టీఆర్ఎస్ నేతలు తప్పా, అందరూ దొంగల మాదిరిగానే కనబడుతున్నారేమోనని అన్నారు. రేషన్కార్డులు, ఫీజురీయింబర్స్మెంట్, హౌసింగ్ పథకాలను అవినీతి పేరుతో నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కల్యాణలక్ష్మి పథకాన్ని తెలంగాణ కేబినెట్ కేబినెట్ ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. పేద బీసీలకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేస్తే మంచిదని జీవన్రెడ్డి అభిప్రాయపడ్డారు. -
వంటకీ...వొంటికీ...
చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు. చక్కనమ్మ కాకపోతే మాత్రం? చిక్కితే అందంగా ఉండరా ఏంటి?! ఉంటారు. కానీ, చిక్కడం అంత ఈజీనా చెప్పండి. వాకింగ్లు, వర్కవుట్లు, డైటింగులు... ఎన్ని చెయ్యాలి!! చెయ్యగలితే ఓకే... చెయ్యలేకపోతే మాత్రం.... ఈ సీజనంతా... సంక్రాంతి వరకు... చిక్కుడు ఐటమ్స్ని లాగించేయండి! చిక్కుడు వంకాయ, చిక్కుడి పచ్చడి, చిక్కుడు తీపి కూర... చిక్కుడు కారం, చిక్కుడు ఫ్రై... మీ ఇష్టం. చిక్కుడు ఎందులోనైనా చక్కగా కలిసిపోతుంది. అంతేకాదు, మిమ్మల్ని అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. చిక్కుడులో ఒక ఫిట్నెస్ గురు ఉన్నారు. ఒక ఫిజీషియన్ ఉన్నారు. ఇద్దరినీ మించి... ఓ మంచి వంట మాస్టర్ కూడా!! చిక్కుడు ఆవకాయ కావలసినవి: చిక్కుడుకాయలు - కిలో; పప్పు నూనె - పావు కిలో; కారం - 100 గ్రా; ఉప్పు - 100 గ్రాములకు కొద్దిగా తక్కువ; ఆవపిండి - 100 గ్రా; మెంతులు - టేబుల్ స్పూను; చింతపండు - పావుకిలో తయారి: చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి, ఈనెలు తీయాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, చిక్కుడుకాయలను అందులో వేసి బాగా వేయించి తీసేయాలి ఒక పాత్రలో ఆవపిండి, ఉప్పు, కారం, మెంతులు, చింతపండు, కొద్దిగా నూనె వేసి కలపాలి వేయించి ఉంచుకున్న చిక్కుడుకాయలను జతచేసి బాగా కలపాలి చివరగా నూనె పోసి గాలిచొరని పాత్రలో ఉంచి, మూడవ రోజు తిరగ కలపాలి ఇది అన్నంలోకి రుచిగా ఉంటుంది (ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కనుక, తగు పరిమాణంలో తయారుచేసుకుంటే మంచిది) పచ్చికారం కూర కావలసినవి: చిక్కుడుకాయలు - పావు కిలో; అల్లం - చిన్న ముక్క; పచ్చిమిర్చి - 4; ఎండుమిర్చి - 2; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; పసుపు - కొద్దిగా; ఉప్పు - తగినంత; నూనె - టేబుల్ స్పూను; కరివేపాకు - ఒక రెమ్మ; కొత్తిమీర - కొద్దిగా; మిరప్పొడి - టీ స్పూను తయారి: ముందుగా చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి ఈనెలు తీసి రెండు ముక్కలుగా చేసుకోవాలి బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వరుసగా వేసి వేయించాలి చిక్కుడుకాయ ముక్కలు వేసి బాగా కలిపి, ఉప్పు జత చేసి మూత పెట్టాలి (మూత పెట్టడం వల్ల కూర మెత్తగా ఉంటుంది) బాగా ఉడుకు పట్టిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలపాలి చివరగా మిరప్పొడి, కొత్తిమీర వేసి కలిపి దించేయాలి. చిక్కుడుకాయ బంగాళదుంపకూర కావలసినవి: చిక్కుడుకాయలు - అరకిలో; బంగాళదుంపలు - పావుకిలో; ధనియాల పొడి - అర టీ స్పూను; జీలకర్ర పొడి - అర టీ స్పూను; పల్లీలపొడి - 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత; కారం - టేబుల్ స్పూను; నూనె - 3 టేబుల్స్పూన్లు తయారి: ముందుగా చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి, ఈనెలు తీసి ముక్కలు చేయాలి బంగాళదుంపలను ఉడికించి, పైన పొట్టు తీసి ముక్కలు చేయాలి బాణలిలో నూనె వేసి కాగాక బంగాళదుంపముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు వేసి, ఉప్పు జతచేసి బాగా కలిపి మూత ఉంచాలి పది నిముషాలయ్యాక ధనియాల పొడి, జీలకర్ర పొడి, పల్లీలపొడి, కారం వేసి బాగా కలిపి ఐదు నిముషాలుంచి దించేయాలి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే రుచిగా ఉంటుంది. చిక్కుడు కాయ పచ్చడి కావలసినవి: చిక్కుడుకాయలు - పావుకిలో; చింతపండు- కొద్దిగా; ఎండుమిర్చి - 4; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; మెంతులు - అర టీ స్పూను; పసుపు - కొద్దిగా; ఇంగువ - చిటికెడు; ఉప్పు - తగినంత; కొత్తిమీర - కొద్దిగా; నూనె - 2 టీ స్పూన్లు తయారి: బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వరసగా వేసి దోరగా వేగాక తీసి పక్కన ఉంచాలి అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక చిక్కుడుకాయముక్కలు (చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి ఈనెలు తీసి, ముక్కలుగా చేయాలి) వేసి కొద్దిగా వేగిన తర్వాత, ఉప్పు, చింతపండు, పసుపు, ఇంగువ వేసి బాగా కలిపి మూత పెట్టాలి ముక్కలు బాగా మెత్తబడ్డాక బాణలి దించేయాలి మిక్సీలో ముందుగా పోపు వేసి మెత్తగా చేయాలి చిక్కుడుకాయ ముక్కలు, కొత్తిమీర జతచేసి మరోమారు మిక్సీ పట్టి తీసేయాలి. వంకాయ చిక్కుడుకాయ కూర కావలసినవి: వంకాయలు - పావుకిలో; చిక్కుడుకాయలు - అరకిలో; అల్లం - చిన్నముక్క; పచ్చిమిర్చి - 6; ఎండుమిర్చి - 5; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; శనగపప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; పసుపు - చిటికెడు; ఉప్పు - తగినంత; నూనె - 2 టీ స్పూన్లు; కొత్తిమీర - కొద్దిగా; కరివేపాకు - 2 రెమ్మలు; పాలు - 2 టేబుల్ స్పూన్లు తయారి: వంకాయలను శుభ్రంగా కడిగి ముక్కలు చేయాలి చిక్కుడుకాయలను కడిగి ఈనెలు తీసి, పెద్ద ముక్కలు చేయాలి బాణలి లో నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వరుసగా వేసి వేయించాలి కరివేపాకు వేసి వేగాక, వంకాయముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, వేసి కలిపి మూత పెట్టాలి కూర దగ్గర పడిన తర్వాత పాలు జత చేసి మరోమారు కలిపి కొద్దిగా మగ్గించాలి అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. చిక్కుడుకాయ వేపుడు కావలసినవి: చిక్కుడుకాయలు - పావు కిలో; ఉప్పు - తగినంత; మిరప్పొడి - టేబుల్ స్పూను; నూనె - రెండు టేబుల్ స్పూన్లు తయారి: ముందుగా చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి ఈనెలు తీయాలి బాణలిలో నూనె వేసి కాగాక చిక్కుడుకాయలను వేసి బాగా కలిపి మూత ఉంచాలి. (మధ్యమధ్యలో కలుపుతుండాలి) పావు గంట తర్వాత ఉప్పు, కారం వేసి కలిపి రెండు నిముషాలు ఉంచి దించేయాలి. చిక్కుడుకాయ తీపికూర కావలసినవి: చిక్కుడుకాయలు - అర కిలో; శనగపప్పు - టేబుల్ స్పూను; మినప్పప్పు - టేబుల్ స్పూను; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; ఎండుమిర్చి - 8; చింతపండుగుజ్జు - టేబుల్ స్పూను; బెల్లం తురుము - 2 టేబుల్ స్పూన్లు; బియ్యప్పిండి - టేబుల్ స్పూను; పసుపు - చిటికెడు; నూనె - 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - కొద్దిగా తయారి: చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి ఈనెలు తీసి పెద్దపెద్ద ముక్కలు చేయాలి బాణలిలో నూనె వేసి స్టౌ మీద ఉంచి కాగాక, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వరసగా వేయాలి చిక్కుడుకాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి బాగా ఉడుకుపట్టాక బెల్లం తురుము, చింతపండు గుజ్జు, బియ్యప్పిండి, పసుపు వేసి కలిపి ఐదు నిముషాలు ఉంచి దించేయాలి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. కర్టెసీ: కల్యాణలక్ష్మి, హైదరాబాద్ సేకరణ: డా.వైజయంతి ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ పందిరి చిక్కుడును ప్రాచీనకాలం నుంచి పండిస్తున్నారు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో దీన్ని విస్తారంగా పండిస్తున్నారు. ఇప్పుడిప్పుడే చిక్కుడు ఉత్తరభారతదేశంలోకి కూడా వ్యాపించింది ప్రతి వంద గ్రాముల చిక్కుడు కాయలలో 48 క్యాలరీల శక్తి ఉంటుంది చిక్కుడును ఆహారంలో ఎక్కువ తీసుకుని, వరి అన్నం తక్కువ తీసుకుంటే డయాబెటిస్ను 25 శాతం నియంత్రించవచ్చని కోస్టారికా అధ్యయనంలో తెలిపింది వారంలో కనీసం మూడు కప్పుల చిక్కుడు తినగలిగితే ఆరోగ్యానికి ఎంతో మేలు అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇందులో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో తయారయ్యే క్యాన్సర్ కారకాలతో పోరాడ తాయి. గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా చూస్తాయి సన్నబడాలని డైటింగ్ చేసేవాళ్లు చిక్కుడును అధికంగా తింటే మంచిది అరకప్పు చిక్కుళ్లలో 7 గ్రాముల ప్రొటీన్లు లభ్యమవుతాయి. వీటిని కూరలలోనే కాదు సూపులూ, ఇతర టిఫిన్ల తయారీలోనూ ఉపయోగించవచ్చు బీకాంప్లెక్స్లోని ఎనిమిది రకాల విటమిన్లు వీటిలో లభిస్తాయి కాలేయం, చర్మం, కళ్లు, వెంట్రుకలు వంటి అనేక భాగాలకు చిక్కుడు నుంచి శక్తి అందుతుంది.