manohar parrikar
-
ఇక బీజేపీకి గుడ్ బై: మాజీ సీఎం తనయుడు
పనాజీ(గోవా): తాను ఆశించిన పనాజీ అసెంబ్లీ స్థానంలో బీజేపీ సీటు ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇక తాను బీజేపీలో కొనసాగలేనంటూ శుక్రవారం తన రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. అదే సమయంలో పనాజీ స్థానం నుంచే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీగా దిగుతానని ప్రకటించారు. కాగా, గత కొన్ని రోజులుగా పనాజీ స్థానాన్ని ఆశిస్తున్న ఉత్పల్ పారికర్కు బీజేపీ గురువారమే షాక్ ఇచ్చింది. ఆ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఇవ్వడంతో ఉత్పల్కు ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. అయితే పనాజీ కాకుండా బీజేపీ అధిష్టానం సూచించిన రెండు స్థానాల నుంచి పోటీ చేయడానికి ఉత్పల్ నిరాకరించారు. అదే సమయంలో ఇక ఎంతో ముచ్చటపడుతున్న పనాజీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా దిగాలనే యోచనలోనే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ఉత్పల్ వెల్లడించారు. ఇక్కడ చదవండి: ‘ఆ సీటు వేరే వాళ్లకి ఇచ్చాం.. మరో ప్లేస్ ఎన్నుకోండి’ -
‘ఆ సీటు వేరే వాళ్లకి ఇచ్చాం.. మరో ప్లేస్ ఎన్నుకోండి’
పనాజీ: గోవా మాజీ సీఎం దివంగత మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్కు నిరాశ తప్పలేదు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రి పాత నియోజకవర్గం పనాజీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పదే పదే అభ్యర్థించినప్పటికీ ఉత్పల్ పారికర్కు ఆ సీటు దక్కలేదు. ఈరోజు(గురువారం)బీజేపీ విడుదల చేసిన గోవా అసెంబ్లీ తొలి దశ జాబితాలో పనాజీ స్థానం కూడా ఉంది. అయితే ఆ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే అటానాసియో మోన్సెర్రెట్కు కట్టబెట్టారు. 34 మందితో విడుదల చేసిన తొలి లిస్టులో పనాజీ స్థానాన్ని అటానాసియోకు ఇవ్వడంతో ఉత్పల్ పారికర్కు ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. కాగా, ఉత్పల్ పారికర్కు పనాజీ స్థానాన్ని ఇవ్వడం కుదరలేదని గోవా ఎలక్షన్ ఇన్చార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఆ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఇవ్వాల్సి వచ్చిందని, అలాగనే పారికర్ ఫ్యామిలీని వదులుకోబోమని పేర్కొన్నారు. ‘మనోహర్ పారికర్ కుటుంబం.. తమతో చాలా సాన్నిహిత్యంగా ఉంటుంది. దాంతోనే పనాజీ స్థానం కాకుండా రెండు ఆప్షన్లు ఇచ్చాం. అందులో ఒక స్థానాన్ని ఉత్పల్ నిరాకరించారు. ఇంకో ఆప్షన్ మాత్రమే ఉంది. ఈ విషయంపై మేము ఆయనతో చర్చిస్తున్నాం. అందుకు ఉత్పల్ ఒప్పుకుంటాడనే అనుకుంటున్నాం’ అని ఫడ్నవీస్ పేర్కొన్నారు. చదవండి: బీజేపీ ఇవ్వనంటోంది! పారికర్ కొడుక్కి ఇతర పార్టీల నుంచి ఆఫర్లు.. -
బీజేపీ ఇవ్వనంటోంది! ఇతర పార్టీల నుంచి ఆఫర్లు..
పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై బీజేపీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. గోవా దివంగత సీఎం మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ ఇప్పటికే ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. అయితే పనాజీ అసెంబ్లీ స్థానం ఆయనకు కేటాయించే విషయంపై బీజేపీ అధిష్టానం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఉత్పల్ పారికర్కు ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ స్పందిస్తూ.. ఉత్పల్ పారికర్ పనాజీ అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే (కాంగ్రెస్, ఆప్, తృణమూళ్)తో పాటు ప్రాంతీయ పార్టీ గోవా ఫార్వార్డ్ సైతం ఆయనకు మద్దతు ఇస్తాయని తెలిపారు. ఆయనకు పోటీగా అభ్యర్థిని కూడా నిలబెట్టవని పేర్కొన్నారు. ఇలా చేయడం మాజీ సీఎం మనోహర్ పారికర్కు నిజమైన నివాళి ఇవ్వడం అవుతుందని తెలిపారు. మరోవైపు ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఉత్పల్ ఆప్లో చేరుతానంటే స్వాగతిస్తామని పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా అందరి చూపు పానాజీ అసెంబ్లీ స్థానంపై పడింది. అయితే దివంగత సీఎం కుమారుడికి బీజేపీ.. పనాజీ టికెట్ కేటాయిస్తుందా? లేదా? అని ఇప్పటికే రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కేవలం మాజీ సీఎం తనయుడు లేదా మరో ఇతర నేతకు చెందిన వారైతే బీజేపీ టికెట్ ఇవ్వదని గోవా అసెంబ్లీ ఎన్నికల బీజేపీ ఇన్ఛార్జ్ దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు బీజేపీ అధిష్టానం సైతం టికెట్ ఇవ్వలేమని సంకేతాలు పంపించింది. If #UtpalParrikar contests Independent frm Panaji seat,I propose all non-BJP parties including @AamAadmiParty @INCIndia @AITCofficial @Goaforwardparty shd support his candidature & not field a candidate against him. This will be a true tribute to ManoharBhai!#Goa pic.twitter.com/q0w96MxZk9 — Sanjay Raut (@rautsanjay61) January 17, 2022 -
‘ఇంకా కోలుకోలేదు.. తర్వాత చూద్దాం’
పణజి : పదవిలో ఉన్న రాజకీయనాయకుడు చనిపోతే.. ఆ స్థానంలో నిర్వహించే బై ఎలక్షన్లో సదరు నాయకుడి వారసులు పోటీ చేయడం సాధరణంగా జరిగే విషయం. కానీ దివంగత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ పెద్ద కుమారుడు ఉత్పల్ పరీకర్ మాత్రం పోటీ చేసేందుకు తాను సిద్ధంగా లేనంటున్నాడు. పరీకర్ మరణం తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ఉత్పల్ ‘మా నాన్న చనిపోయిన బాధ నుంచి ఇంకా కోలుకోలేదు. రాజకీయాల గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సమయం వచ్చినప్పుడు ప్రజల ఆకాంక్షల మేరకు నిర్ణయం తీసుకుంటాను. ప్రస్తుతానికైతే దీనీ ప్రస్తుతం దీని గురించి నా మనసులో ఎలాంటి ఆలోచన లేద’ని తెలిపారు. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం పరీకర్ మరణించిన తర్వాత ఆయన కుమారులిద్దరిని పార్టీలో చేరమని కోరిందట. దేశరాజకీయాల్లో అజాతశత్రువు, మృదు స్వభావి, బీజేపీ సీనియర్ నేత, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్(63) ఈ నెల 17న కన్నుమూసిన సంగతి తెలిసిందే. గతకొంతకాలంగా ప్యాంక్రియాటిక్ కేన్సర్తో బాధపడుతున్న పరీకర్ ఆదివారం పణజిలోని డౌనాపౌలాలో ఉన్న స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. -
పరీక్షలో నెగ్గిన సావంత్
పణజి: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 20 మంది ఎమ్మెల్యేలు, వ్యతిరేకంగా 15 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. మొత్తం సభ్యుల సంఖ్య 40 మంది కాగా.. ప్రస్తుతం అసెంబ్లీలో 36 మంది ఉన్నారు. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణించగా, మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. విశ్వాస పరీక్షలో నెగ్గిన అనంతరం సావంత్ మాట్లాడుతూ.. పాజిటివ్గా ఉండాలి అనే పారికర్ ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఒక్కరు మనసులో ఉంచుకోవాలని కోరారు. విశ్వాస పరీక్ష కోసం గవర్నర్మృదులా సిన్హా ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశారు. 11 మంది బీజేపీ, ముగ్గురు చొప్పున గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్పీ), మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ), మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. 14 మంది కాంగ్రెస్, ఒక ఎన్సీపీ ఎమ్మెల్యే వ్యతిరేకంగా ఓటేశారు. -
చితి బూడిద చల్లారే వరకు కూడా ఆగలేదు..
ముంబై : గోవాలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ ఆడిన రాజకీయ క్రీడ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టివేసిందని ఆ పార్టీ మిత్రపక్షం శివసేన విమర్శించింది. అధికారం కోసం సిగ్గుమాలిన చర్యకు పాల్పడిందంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ మేరకు శివసేన అధికార పత్రిక సామ్నాలో కథనం ప్రచురించింది. ‘ మనోహర్ పరీకర్ భౌతికకాయంపై ఉంచిన పువ్వులు వాడనే లేదు. ఆయన చితాభస్మం చల్లారనూ లేదు. కానీ అదే సమయంలో బీజేపీ నీచ రాజకీయ క్రీడకు తెరతీసింది. అధికార వ్యామోహంతో అర్ధరాత్రి కొత్త సీఎంతో ప్రమాణ స్వీకారం చేయించింది. మరో నాలుగు గంటలు ఆగితే ఏం పోయేది. బీజేపీ వ్యవహరించిన విధానం ప్రజాస్వామ్య వ్యవస్థకు చాలా ప్రమాదకరం’ అని బీజేపీ తీరును ఎండగట్టింది. చదవండి : రాత్రి 2గంటలకు సీఎంగా ప్రమాణమా? బీజేపీ మాట తప్పింది.. డిప్యూటీ సీఎంల నియామకం గురించి ప్రస్తావిస్తూ... ‘నాలుగేళ్ల క్రితం బీజేపీ ఉప ముఖ్యమంత్రులుగా పదవులు ఇవ్వమని చెప్పిన బీజేపీ.. అధికారం కోసం మాట తప్పింది. కేవలం 19 ఎమ్మెల్యేలలో ఇద్దరిని డిప్యూటీ సీఎంలుగా నియమించింది. నేటికీ మనోహర్ పరీకర్ మరణాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణానికి సంతాప సూచకంగా జాతీయ జెండాను హాఫ్ మాస్ట్ చేసే ఉంచారు. కనీసం అలా ఎందుకు చేస్తారోనన్న విషయం గురించి బీజేపీ వాళ్లకు కాస్తైనా అవగాహన ఉందో లేదో’ అంటూ సామ్నాలో శివసేన వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కాగా కేంద్రం, రాష్ట్రంలో తమతో అధికారం పంచుకున్న శివసేన ఎమ్మెల్యేకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడానికి బీజేపీ నిరాకరించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మిత్రపక్షంపై విమర్శలు సంధిస్తున్న శివసేన...సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఆ పార్టీతో జట్టు కట్టడం విశేషం. ఇక పదవిలో ఉండగానే గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ అనారోగ్యంతో ఆదివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో కొనసాగుతుండగానే మరోపక్క బీజేపీ అధిష్టానం గోవా ముఖ్యమంత్రి ఎంపిక, అందుకు కావాల్సిన మద్దతును మిత్రపక్షాల నుంచి కూడగట్టేందుకు జోరుగా మంతనాలు జరిపింది. తమ పార్టీ నేత, అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి.. సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ) ఎమ్మెల్యే సుదిన్ దివాలికర్, గోవా ఫార్వర్డ్ పార్టీ ఎమ్మెల్యే విజయ్ సర్దేశాయ్లకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశమిచ్చింది. దీంతో అధికార పార్టీ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
రాత్రి 2గంటలకు సీఎంగా ప్రమాణమా?
సాక్షి, న్యూఢిల్లీ : గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పర్రీకర్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో కొనసాగుతుండగానే మరోపక్క బీజేపీ అధిష్టానం గోవా ముఖ్యమంత్రి ఎంపిక, అందుకు కావాల్సిన మద్దతును మిత్రపక్షాల నుంచి కూడగట్టేందుకు జోరుగా మంతనాలు జరపుతూ వచ్చింది. బీజేపీ నాయకుడు ప్రమోద్ సావంత్ గత రాత్రి 9 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని, అందుకు ఆయనకు మెజారిటీ సభ్యుల బలం ఉందని ప్రకటన వెలువడింది. ఇంతలో తమకు ముఖ్యమంత్రి పదవి కావాలంటే తమకే ముఖ్యమంత్రి పదవి కావాలంటూ ఇంతకాలం బీజేపీ సీఎం మనోహర్ పర్రీకర్కు మద్దతిస్తూ వచ్చిన గోవా ఫార్వర్డ్ పార్టీ ఎమ్మెల్యేలు, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. దీంతో గోవా ప్రభుత్వంలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోపక్క రాష్ట్ర అసెంబ్లీలో అత్యధిక సీట్లు కలిగిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు గవర్నర్ను కలుసుకొని ప్రభుత్వం ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇంతలో మహారాష్ట్ర గోమంతక్ పార్టీ నుంచి ఇద్దరు సభ్యులు వచ్చి బీజేపీలో చేరుతున్నారనే వార్తలు వచ్చాయి, ఆ ఇద్దరితో బీజేపీ శాసన సభ్యుల సంఖ్య 12 నుంచి 14 చేరుకుంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్యతో సమానం అవుతుంది. దాంతో మళ్లీ రాత్రి ఒంటి గంట వరకు మంతనాలు కొనసాగాయి. గోవా అసెంబ్లీలో మొత్తం 40 సీట్లకుగాను మనోహర్ పర్రీకర్, అంతకుముందు ఓ బీజేపీ సభ్యుడి మృతి, అంతకన్నా ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇద్దరు బీజేపీ శాసనసభ్యులు రాజీనామా చేయడంతో సభ్యుల సంఖ్య 36కు పడిపోయింది. కాంగ్రెస్కు 14, బీజేపీకి 12, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి మూడు, గోవా ఫార్వర్డ్ బ్లాక్కు మూడు, ముగ్గురు స్వతంత్ర సభ్యులు, ఒక్క ఎన్సీపీ సభ్యుడు ఉన్నారు. 2017లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకన్నా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ బీజేపీ త్వరగా పావులు కదిపి మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, ఫార్వర్డ్ బ్లాక్తోపాటు ముగ్గురు స్వతంత్య్ర సభ్యుల మద్దతును సేకరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ను బీజేపీ సొంత రాష్ట్రానికి తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసింది. మారిన పరిస్థితుల్లో తమకే ముఖ్యమంత్రి పదవి కావాలంటూ బీజేపీ రెండు మిత్రపక్షాలు డిమాండ్ చేయడంతో గోవాలో అనిశ్చితి పరిస్థితి ఏర్పడుతుందని, ఖాళీగా ఉన్న నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే వరకు అసెంబ్లీని సుషుప్త చేతనావస్థలో ఉంచాల్సి వస్తుందని ఊహాగానాలు చెలరేగాయి. చివరకు ఆ రెండు పార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులకు అంగీకరించడంతో సంధి కుదిరింది. దాంతో మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు బీజేపీ నాయకుడు ప్రమోద్ సావంత్ సీఎంగా ప్రమాణం చేయగా, ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులు, 11 మంది మంత్రులు ప్రమాణం చేశారు. అతి చిన్న రాష్ట్రమైన గోవాకు ఇద్దరు డిప్యూటి ముఖ్యమంత్రులు ఉండడం విశేషం. తుది లెక్కల ప్రకారం మిత్రపక్షాలను కలుపుకొని అసెంబ్లీలో బీజేపీ బలం 21కి చేరుకోగా, ఎన్సీపీ సభ్యుడిని కలుపుకొని కాంగ్రెస్ పార్టీ బలం15 వద్ద స్థిరంగా ఉంది. -
ముగిసిన మనోహర్ పారికర్ అంత్యక్రియలు
-
పరీకర్కు తుది వీడ్కోలు
పణజి: క్లోమగ్రంథి కేన్సర్తో మృతిచెందిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ అంత్యక్రియలు సోమవారం అధికారిక లాంఛనాలతో ముగిశాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొందరు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకుముందు, పణాజి వచ్చిన ప్రధాని మోదీ పరీకర్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆ తరువాత ఆయన కుటుంబ సభ్యుల్ని కలుసుకుని పరామర్శించారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పరీకర్ కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. నూతన ముఖ్యమంత్రి ఎంపిక కోసం ఆదివారం రాత్రే గోవా చేరుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ కూడా పరీకర్కు చివరిసారి నివాళి అర్పించిన వారిలో ఉన్నారు. పరీకర్ పెద్ద కొడుకు ఉత్పల్ ఆయన చితికి నిప్పంటించారు. తరలివచ్చిన అభిమానులు పణజిలోని కళా అకాడమీ నుంచి దహనసంస్కారాలు నిర్వహించిన మీరామర్ బీచ్ వరకు సాగిన అంతిమయాత్రలో వేలాది మంది పరీకర్ మద్దతుదారులు, అభిమానులు పాల్గొన్నారు. అంతకుముందు, బీజేపీ కార్యాలయంలో ఉంచిన ఆయన భౌతిక కాయాన్ని కడసారి చూసేందుకు సామాన్య ప్రజలు, బీజేపీ కార్యకర్తలు అశేష సంఖ్యలో తరలివచ్చారు. త్రివర్ణ పతాకంలో చుట్టిన పరీకర్ పార్థివ దేహాన్ని చూడగానే ఆయన అభిమానలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అంతిమయాత్రకు ముందు బీజేపీ కార్యాలయం చుట్టుపక్కల ప్రాంతాలు జనంతో రద్దీగా మారాయి. కళా అకాడమీ ముందు కూడా ప్రజలు మత విశ్వాసాలకు అతీతంగా బారులు తీరి పరీకర్కు నివాళులర్పించారు. ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పరీకర్ మృతికి సంతాపం తెలుపుతూ సోమవారం జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. అంత్యక్రియలు నిర్వహిస్తున్న పరీకర్ కొడుకు గోవా కొత్త సీఎంపై ఉత్కంఠ! రాత్రి 11 గంటలకు సీఎంగా ప్రమోద్ ప్రమాణం చేస్తారన్న బీజేపీ అంతలోనే ఆ నిర్ణయాన్ని విరమించుకుంటున్నట్లు ప్రకటన మిత్రపక్షాలతో ఇంకా చర్చలు సాగుతున్నాయని వెల్లడి పణజి: గోవాకు కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులు కానున్నారనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. కొత్త సీఎంగా అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్ సోమవారం రాత్రే 11 గంటలకు ప్రమాణంచేస్తారని బీజేపీ ప్రకటించింది. కొద్దిసేపటికే ప్రమాణస్వీకారాన్ని విరమించుకుంటున్నామని తెలిపింది. సోమవారం తెల్లవారుజామున నుంచి కేంద్రమంత్రి గడ్కరీ కొత్త సీఎం ఎంపికపై బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు సంకీర్ణ ప్రభుత్వంలోని గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్పీ) మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ)లతో చర్చలు జరిపారు. సీఎం ఎవరనే దానిపై ఏకాభిప్రాయం కుదరలేదని గడ్కరీ చెప్పారు. సోమవారం సాయంత్రం తర్వాత కొద్దిసేపటికే తదుపరి సీఎంగా అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్ ఎంపికయ్యారనీ, జీఎఫ్పీ చీఫ్ విజయ్ సర్దేశాయ్, ఎంజీపీ ఎమ్మెల్యే సుదీన్ ధవలికర్లకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తున్నామని బీజేపీ వెల్లడించింది. ఈ ఒప్పందానికి కూటమి పార్టీలు ఒప్పుకున్నందున రాత్రి 11 గంటలకు ప్రమోద్ చేత గవర్నర్ మృదులా సిన్హా కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారంది. మళ్లీ ఏమైందోగానీ, ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విరమించుకుంటున్నట్లు బీజేపీ ప్రకటించింది. మిత్రపక్షాలతో ఇంకా చర్చలు జరుగుతున్నందున రాత్రి 11 గంటలకు ప్రమాణ స్వీకారం ఉండదని డిప్యూటీ స్పీకర్ మైఖేల్ ప్రకటించారు. అంతకుముందు సోమవారం తెల్లవారుజామున గోవాకు చేరుకున్న నితిన్ గడ్కరీ, కొత్త సీఎం ఎంపికపై బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు, ఎంజీపీ, జీఎఫ్పీ నేతలతోనూ చర్చించారు. గోవా అసెంబ్లీలో మొత్తం సీట్లు 40 కాగా, 14 సీట్లతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఉంది. గవర్నర్ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గోవాకు నూతన ముఖ్యమంత్రిని బీజేపీ ప్రకటించగా, మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం గోవా అసెంబ్లీలో తమదే అతిపెద్ద పార్టీ అయినందున ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ గవర్నర్ మృదులా సిన్హాను సోమవారం కోరారు. ప్రతిపక్ష నేత చంద్రకాంత్ కావెల్కర్ నేతృత్వంలోని 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యల బృందం సోమవారం గవర్నర్ను కలిసింది. ఈ విషయంపై తర్వాత సంప్రదిస్తానని గవర్నర్ తమతో చెప్పారని చంద్రకాంత్ చెప్పారు. -
విలక్షణ వ్యక్తిత్వం
ఎన్నికల మహా సంగ్రామానికి బీజేపీ సన్నద్ధమవుతున్న వేళ ఆ పార్టీ నాయకశ్రేణిలో ముఖ్యుడ నదగ్గ గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ ఆదివారం కన్నుమూశారు. ఆయన్ను కేన్సర్ మహ మ్మారి కొంచెం కొంచెంగా ఎలా కబళిస్తున్నదో మీడియా ద్వారా అప్పుడప్పుడు ఆయన్ను చూస్తున్న వారందరికీ అర్థమవుతూనే ఉంది. పరీకర్కు తీవ్ర అనారోగ్యంగా ఉన్నా, దానివల్ల ఆయనకు ఎంతో అసౌకర్యంగా ఉంటుందని తెలిసినా బీజేపీ అధినాయకత్వం ఆయన స్థానంలో మరొకరిని ఎంపిక చేయకపోవడం... ఆయన మరణించిన 24 గంటల తర్వాత కూడా కొత్త నాయకుణ్ణి నిర్ణయించలేక పోవడం గమనిస్తే పరీకర్ ప్రాముఖ్యత తెలుస్తుంది. గర్వాతిశయాలు లేకపోవడం, అధికార దర్పం ఎన్నడూ ప్రదర్శించకపోవడం, సామాన్యులతో సైతం ఆదరణగా మాట్లాడటం పరీకర్ ప్రత్యేక తలు. ఆయన తరచుగా స్కూటర్పై రివ్వుమంటూ వెళ్లడం గోవా వాసులకు పరిచిత దృశ్యం. తాను రక్షణమంత్రిగా ఉన్న సమయంలోఒక వేడుకకు హాజరయ్యే పాత్రికేయులు బూట్లు ధరించి రావా లని తన మంత్రిత్వ శాఖ అధికారులు షరతు విధించినట్టు తెలుసుకుని, తానే ఆవేడుకకు చెప్పులు ధరించి వచ్చిన తీరు పరీకర్ వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది. పాఠశాలలో చదువుకుంటున్నప్పుడే ఆరె స్సెస్ భావాలు ఒంటబట్టించుకున్న పరీకర్ చివరివరకూ ఆ భావాలతోనే ప్రయాణించినా రాజ కీయాల్లో అందరివాడిగా, అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ఇది అసా ధారణమనే చెప్పాలి. తొలిసారి గోవా ముఖ్యమంత్రిగా 2000 సంవత్సరంలో బాధ్యతలు స్వీక రించి, వరసగా నాలుగు దఫాలు ఆ పదవిలో కొనసాగారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించాక ఆయన 2017 వరకూ రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే గోవా రాజకీయాల్లో ఆయన లేకపోవడం బీజేపీని ఎంత నష్టపరిచిందో ఆ తర్వాత పార్టీ అధినాయ కత్వానికి అర్థమైంది. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 స్థానాలతో మెజారిటీ పక్షంగా అవతరించగా, బీజేపీ 13 స్థానాలతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. ఆ వెంటనే ఆగమేఘా లమీద పరీకర్ను కేంద్ర నాయకత్వం గోవాకు పంపింది. పరీకర్ వచ్చీ రావడంతోనే రాష్ట్రంలోని చిన్న చిన్న పార్టీలతో సమావేశమై వాటిని బీజేపీ ఛత్రఛాయలోకి తీసుకొచ్చి అక్కడ కూటమి ప్రభు త్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే మెజారిటీ స్థానాలు లభించిన కాంగ్రెస్కు ప్రభుత్వాన్ని ఏర్పా టుచేసే అవకాశం ఇవ్వకపోవడంపై విమర్శలు ఎదురయ్యాయి. సీఎంగా ఆయన పనితీరు విలక్షణ మైనది. ఆయన ఆర్థిక మంత్రిత్వ శాఖ చూస్తున్నప్పుడు విమాన ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిం చడం దీనికి ఉదాహరణ. అలా తగ్గించడం వల్ల ఆదాయం పడిపోతుందని, అసలే అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని అధికారులు వారించినా ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ ఇంధనం కోసం గోవాకు రాత్రి వేళల్లో భారీగా విమానాలు రావడం మొదలై ప్రభుత్వ ఆదాయం మూడు రెట్లు పెరిగింది. గోవాలో బహుళ మతాలు, తెగలు ఉన్నాయి. అక్కడి జనాభాలో 27 శాతంమంది క్రైస్తవులు, 9 శాతం ముస్లింలు. పైగా మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ(ఎంజీపీ)వంటి బలమైన ప్రాంతీయ పార్టీ లున్నాయి. అలాంటిచోట ఆరెస్సెస్ భావాలను వ్యాప్తి చేయడం, ఆ సంస్థను పటిష్టపరచడం సులభం కాదు. కానీ పరీకర్ ఎంతో చాకచక్యంతో, నైపుణ్యంతో ఆ పని చేయగలిగారు. రాజకీ యాల్లోకి ప్రవేశించాక బీజేపీని సైతం ఆ విధంగానే తిరుగులేని రాజకీయ శక్తిగా రూపొందించారు. దాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. అంతేకాదు... బహుళ మతాలవారున్న నియోజకవర్గం నుంచి 1994 మొదలుకొని ప్రతి ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధిస్తూ వచ్చారు. ఈ కారణాలన్నిటి వల్లా జాతీయ స్థాయిలో కూడా ఆయనకు ప్రాధాన్యత పెరిగింది. 2014లో జరిగే సార్వత్రిక ఎన్ని కలకు బీజేపీ ప్రచార సారథ్యం ఎవరు స్వీకరించాలన్న ప్రశ్న తలెత్తినప్పుడు నరేంద్రమోదీ పేరును ప్రతిపాదించింది పరీకరే. బీజేపీ జాతీయ ఎన్నికల ప్రచార సంఘం చైర్మన్గా తనకొచ్చిన ఈ అవ కాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుని ఎన్నికల తర్వాత మోదీ ప్రధాని పీఠం ఎక్కారు. గోవా వంటి ఒక చిన్న రాష్ట్రం నుంచి వచ్చిన నాయకుడు కేంద్రంలో కీలకమైన రక్షణ మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వర్తించడం మాటలు కాదు. వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులతో ముడిపడి ఉండే రక్షణ కొనుగోళ్ల కారణంగా ఆ శాఖను నిర్వహించడం కత్తి మీద సాము. ఆ శాఖ బాధ్యతలు తీసుకోవడానికి ఎంతటి ఉద్దండులైనా జంకుతారు. ఒకవేళ ఎవరైనా ఉత్సాహం చూపినా ప్రధానిగా ఉన్నవారు ఎన్నో విధాల ఆలోచించిగానీ వారికి ఆ శాఖ అప్పగించరు. కానీ నరేంద్ర మోదీ ప్రధాని బాధ్యతలు చేపట్టాక రక్షణ శాఖ వ్యవహారాలు చూడటానికి మనోహర్ పరీకర్ తగినవారని నిర్ణయించారంటేనే ఆయన సచ్చీలత, నిజాయితీ వెల్లడవుతాయి. ఇప్పుడు ఎంతో వివాదా స్పదంగా మారిన రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో కూడా పరీకర్ భిన్నంగా ఆలో చించారని చెబుతారు. సుఖోయ్–30 యుద్ధ విమానాలైతే మన వైమానిక దళ తక్షణావసరాలు తీరుస్తాయని, త్వరగా సమకూర్చుకోవడం వీలవుతుందని, రఫేల్తో పోలిస్తే ఆర్థికంగా కూడా అవి మెరుగని ఆయన భావించారంటారు. రక్షణమంత్రిగా ఆయన సైనిక దళాల సంక్షేమం కోసం ఎంతగానో పాటుపడ్డారు. మన ఆయుధ సంపత్తి ఆధునీకరణకు కృషి చేశారు. సైనిక దళాలు ఎప్పటినుంచో కోరుకుంటున్న ‘వన్ ర్యాంక్–వన్ పెన్షన్’ విధానం ఆయన హయాంలోనే అమల్లోకొచ్చింది. దాదాపు మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో పరీకర్ను మైనింగ్ స్కాం వంటి వివాదాలు కూడా చుట్టుముట్టకపోలేదు. కానీ విభిన్నంగా ఆలోచించడం, వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవడం, స్వతంత్రంగా వ్యవహరించడం, ప్రత్యర్థులతో సైతం అరమరికల్లేకుండా మాట్లాడటం ఆయన విశిష్టత. కనుకనే మనోహర్ పరీకర్ స్థానాన్ని భర్తీ చేయడం ఎవరికీ అంత సులభం కాదు. -
మనోహర ‘ప్యారి’కర్
ఉక్కునరాలు... ఉక్కుకండరాలు... అతడే ఓ సైన్యం. పాలనలో అతడో చైతన్యం. నిత్యనూతన స్రవంతి. ప్రజల్లో మని షిగా ప్రజల్లో తిరుగుతూ... అతి సామా న్యుడు అసామాన్యుడిగా నిలిచాడు. ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నాడు. అస్థిరతకు చిరునామాగా నిలిచిన గోవా రాజకీ యాల్లో సుస్థిర నినాదాన్ని మార్మోగించాడు. ప్రజలకు సరికొత్త పాలనను అందించి బీజేపీ ప్రభుత్వాల్లో నవశకం పూరించాడు. ఆయనే పరీకర్. మనోహర్ పరీకర్ డిసెంబర్ 13, 1955 గోవాలోని ముపాసలో జన్మించారు. 14 ఏళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్ లో చేరి అంచలంచెలుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇన్స్ట్రక్టర్గా ప్రమోషన్ పొందారు. ఐఐటీ ముంబైలో ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే తిరిగి ఆర్ఎస్ఎస్లో సంఘ్ చాలక్గా వ్యవహరించారు. 26 ఏళ్లకే ఆర్ఎస్ఎస్లో కీలకనేతగా ఎదిగారు. గోవాలో రామజన్మభూమి ఉద్యమాన్ని ఉధృ తం చేశారు. అద్వానీ రథయాత్రకు గోవాలో నీరాజనం పలికారు. బీజేపీకి జవజీవాలు నింపారు. విభిన్న సంస్కృతుల సంగమమైన గోవాలో కాషా యం జెండా రెపరెపలాడేలా చేయడంలో పరీకర్ది ముఖ్యభూమిక. నాలుగుసార్లు గోవా సీఎంగా వ్యవహరించిన పరీకర్ 2000 సంవత్సరంలో తొలిసారి, 2017లో నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. గోవాలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క యువతి లక్ష రూపాయలు పొందేలా పథకాన్ని ప్రారంభించి... అక్కడి మహిళా లోకానికి పెద్దన్నగా నిలిచాడు. సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ పరీ కర్. ఎన్నో హంగులు, ఆర్భాటాలతో ఊదరగొడుతున్న నాయకాగణానికి భిన్నంగా పారికర్ కన్పిస్తారు. హాఫ్ హ్యాండ్ షర్ట్ ధరించి, సాధారణ దుస్తులతో సగటు భారతీయుడిని ప్రతిబింబిస్తారు. మనోహర్ పరీకర్ ముఖ్యమంత్రి అయినా, తన సొంత నివా సంలోనే ఉండేవారు. అత్యాధునిక వాహనాలు అందుబాటులో ఉన్నప్పటికీ... ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు వినియోగించే ఇన్నోవా కారునే వినియోగించేవారు. విమాన ప్రయాణాలు చేసేటప్పుడు సాధారణ ప్రయాణీకుల మాదిరిగానే ట్రావెల్ చేసేవారు. 63 ఏళ్ల వయసులో సైతం రోజుకు 16 నుంచి 18 గంటలకు పనిచేసేవారు. గోవా మిస్టర్ క్లీన్గా ఆయనను అక్కడి ప్రజలు పిలుస్తారు. అక్రమ మైనింగ్పై ఉక్కుపాదం మోపారు. ప్రధానిగా నరేంద్రమోదీని సమర్థించి... దేశానికి బలమైన నాయకత్వం అవసరమని నినదించారు. పారికర్ సింప్లిసిటీ గురించి చెప్పడానికి ఇక్కడో ఉదంతాన్ని చెప్పాల్సి ఉంటుంది. అది గోవా పనాజీ ప్రాంతం... ఒక యాభై ఏళ్ల వ్యక్తి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర హెల్మెట్ పెట్టుకొని స్కూట ర్పై గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో వెనుక నుంచి 25 ఏళ్ల యువకుడు ఆపకుండా హారన్ కొడుతున్నాడు. డీఎస్పీ కొడుకునని.. ఎందుకు నాకు దారివ్వరంటూ ప్రశ్నించాడు. అయితే ఇంతలో హెల్మెట్ తీసి ఆ వ్యక్తి ముందుకొచ్చాడు. నువ్వు డీఎస్పీ కొడుకువైతే... ఈ రాష్ట్రానికి నేను సీఎంనంటూ చెప్పడంతో తెల్లబోయాడు ఆ కుర్రాడు. గోవా ముఖ్యమంత్రి, దేశ రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ ఆ వ్యక్తి. అసెంబ్లీకి స్కూటర్ మీద వెళతారు. ప్రోటోకాల్ ఉండదు. పోలీస్ కేస్లలో జోక్యం ఉండదు. రాష్ట్ర ముఖ్యమంత్రిని కేంద్ర ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చి రమ్మంటే... యావత్ గోవా కంట కన్నీరుపెట్టింది. గోవా ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిన మనోహర్ పరీకర్... దేశ రక్షణ మంత్రిగా కూడా చరిత్ర సృష్టించారు. భారత రక్షణ దళాలకు ప్రత్యే కంగా వినియోగించే... ఒక్కో జత షూను ఇజ్రా యెల్ నుంచి 25,000కు దిగుమతి చేసుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకున్న పరీకర్... కొనుగోలు వెనుక వాస్తవాలను నిర్ధారణ చేసుకొని... ఆ తర్వాత భారత కంపెనీ నుంచి నేరుగా రూ‘‘ 2,200కు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవడంతో ప్రభుత్వ పెద్దలు ఔరా అని ముక్కున వేలేసుకున్నారు. తన కేబినెట్లో ఉన్న అరుదైన మంత్రి పరీకర్ అని, వజ్రసమానుడంటూ ప్రధాని మోడీ నుంచి కితాబు అందుకున్నారు. అందుకే తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పరీకర్కు రక్షణ మంత్రి బాధ్యతలు అప్పగించారు. అయినప్పటికీ తాను గోవాపైనే ప్రేమ చూపించారు. గోవా ప్రజలంటే అమితమైన ప్రేమ. గోవా ప్రజల సేవ లోనే ప్రాణాలు అర్పించారు. పురిఘళ్ల రఘురామ్ వ్యాసకర్త బీజేపీ సీనియర్ నాయకుడు ఈ–మెయిల్ : raghuram.delhi@gmail.com -
గోవా కొత్త సీఎంగా ప్రమోద్ సావంత్
-
ముగిసిన పరీకర్ అంత్యక్రియలు
-
గోవా కొత్త సీఎంగా ప్రమోద్ సావంత్!
పనజి : బీజేపీ సీనియర్ నేత, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్(63) అంత్యక్రియలు ముగిశాయి. గోవాలోని మిరామిర్ బీచ్లో అధికారిక లాంఛనాలతో వేలాది మంది ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు నేతలు పరీకర్ అంత్యక్రియలకు హాజరయ్యారు. కొత్త సీఎంగా ప్రమోద్ సావంత్ దేశ రాజకీయాల్లో అజాతశత్రువుగా పేరొందిన పరీకర్ మరణంతో గోవాలో రాజకీయ సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే. అతిపెద్ద పార్టీగా ఉన్న తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిగా కాంగ్రెస్ నేతలు గవర్నర్ మృదులా సిన్హాకు విఙ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అమిత్ షా, నితిన్ గడ్కరీ బీజేపీ సహా మిత్ర పక్షాల ఎమ్మెల్యేలతో సమావేశమైనట్లు సమాచారం. ఈ క్రమంలో గోవా కొత్త సీఎంగా శాసన సభాపతి ప్రమోద్ సావంత్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ) ఎమ్మెల్యే సుదిన్ దివాలికర్, గోవా ఫార్వర్డ్ పార్టీ ఎమ్మెల్యే విజయ్ సర్దేశాయ్లకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సోమవారం రాత్రి గవర్నర్ మృదులా సిన్హా వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు సమాచారం. -
గోవా కొత్త సీఎం.. ఎమ్మెల్యే కాని వ్యక్తేనా?
పనాజీ: గోవా ప్రస్తుత ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ కన్నుమూయడంతో రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేదానిపై సందిగ్ధత కొనసాగుతోంది. ప్రస్తుతం మిత్రపక్షాల మద్దతుతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ సంకీర్ణ కూటమికి చెందిన 12మంది ఎమ్మెల్యేలు ఓ ఆసక్తికరమైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఎమ్మెల్యే కాని వ్యక్తినే కొత్త సీఎంగా ఎన్నుకోవాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ 12 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు గోవా ఫార్వర్డ్ పార్టీకి చెందిన వారు కాగా, మరో ముగ్గురు మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ), ఇంకో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఇతర ముగ్గురు బీజేపీకి చెందిన వారు ఉన్నారు. ఎమ్మెల్యే కాని వ్యక్తి సీఎం అయితే.. ఆరు నెలల్లోపు శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఆరు నెలల్లోపు అంటే అప్పటికీ లోక్సభ ఎన్నికలు ముగుస్తాయి. మరోవైపు గోవా సీఎం రేసులో పలువురు ముఖ్య నేతల పేర్లు వినిపిస్తున్నాయి. నార్త్ గోవా ఎంపీ శ్రీపాద నాయక్, రాజ్యసభ సభ్యుడు వినయ్ టెండుల్కర్, గోవా అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్, ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణే తదితరులు తదుపరి సీఎం రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. పరీకర్ మృతితో గోవాలో ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా రాజకీయ పార్టీల మంతనాలు ముమ్మరమయ్యాయి. ఒకవైపు బీజేపీ ఎమ్మెల్యేలు, మిత్రపక్ష ఎమ్మెల్యేలతో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఓ హోటల్లో సమావేశమవ్వగా.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం కల్పించాలని, బీజేపీకి మిత్రపక్షాల మద్దతు లేకపోవడంతో.. ఆ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం లేదని గవర్నర్ను కోరింది. -
‘ఆ చెప్పులు ధరించడం ఇబ్బందే’
పణజి : నిరాడంబర సీఎంగా గుర్తింపు తెచ్చుకున్న బీజేపీ సీనియర్ నేత, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ ఆదివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆడంబరాలకు దూరంగా ఉండే పరీకర్ గురించి పలు ఆసక్తికర అంశాలు ప్రచారంలో ఉన్నాయి. పరీకర్ ఇతర మంత్రుల లాగా సూటు బూటు ధరించేవారు కారు. కొల్హాపూర్ చెప్పులు, సాధరణ వస్త్రధారణనే ఇష్టపడేవారు. సీఎం పదవిలో ఉండి కూడా స్కూటర్ మీదనే తిరిగేవారు. రక్షణశాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాజ్దీప్ సర్దేశాయ్కిచ్చిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ విషయాల గురించి మాట్లాడుతూ.. ‘పాశ్చత్య వస్త్ర ధారణ నాకు అంతగా నప్పదు. కానీ గత రక్షణశాఖ మంత్రలు కంటే నా వస్త్రధారణ బాగానే ఉంటుంది. ఇకపోతే డిఫెన్స్ మినిస్టర్గా ఉంటూ కొల్హాపూర్ చెప్పులు ధరించడమే కాస్తా ఇబ్బందికరంగా ఉంద’ని తెలిపారు. అంతేకాక గోవా సీఎంగా ఉన్నప్పుడు స్కూటర్ మీదనే తిరుగుతుండేవారు పరీకర్. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘‘మీరు ఎప్పుడూ స్కూటర్ మీదనే తిరుగుతారా’ అని జనాలు నన్ను అడుగుతారు. కానీ ఎల్లకాలం ఇలానే తిరగలేను. ఎందకంటే నా మైండ్లో ఎప్పడు పని గురించిన ఆలోచనలే ఉంటాయి. నేను స్కూటర్ నడిపేటప్పుడు నా మైండ్ మరో చోట ఉంటుందనుకొండి.. అప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కదా. అందుకే స్కూటర్ నడపాలంటే నాకు భయం’ అని తెలిపారు పరీకర్. మనోహర్ పరీకర్ అంత్యక్రియలను పణజిలోని మిరమార్ బీచ్లో సోమవారం సాయంత్రం 4.30 గంటలకు నిర్వహిస్తారని సీఎంఓ ప్రతినిధి ఒకరు తెలిపారు. పరీకర్ అంత్యక్రియలకు ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా హాజరయ్యే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం పరీకర్ మృత దేహాన్ని ప్రజల సందర్శనార్థం బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి పణజీ కళా అకాడమీకి తరలించారు. -
‘మానవ మేధస్సు ఏ వ్యాధినైనా జయిస్తుంది’
పణజి : నిరాండబరతకు, వృత్తిపట్ల అంకితభావానికి పెట్టింది పేరుగా నిలిచిన బీజేపీ సీనియర్ నేత, గోవా సీఎం మనోహర్ పరీకర్ ఆదివారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. క్యాన్సర్ లాంటి మహమ్మారి తన మీద దాడి చేసినప్పుడు కూడా పరీకర్ ఏ మాత్రం కుంగిపోలేదు. పైపెచ్చు చికిత్స తీసుకుంటూనే సీఏంగా రాష్ట్రానికి సేవలందించారు. బలమైన సంకల్పం ఉంటే వ్యాధి మనిషిని ఏమి చేయలేదని నిరూపించారు పరీకర్. మనిషి మేధస్సు ఏ రోగాన్నైనా జయిస్తుందంటూ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ట్వీట్ చేసిన పరీకర్ అందుకు తానే ఉదాహరణగా నిలిచారు. ఓ వైపు క్యాన్సర్కు చికిత్స తీసుకుంటూనే.. మరోవైపు తన విధులను సమర్థవంతంగా నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచారు పరీకర్. (నిరాడంబర సీఎం ఇకలేరు) Human mind can overcome any disease. #WorldCancerDay — Manohar Parrikar (@manoharparrikar) February 4, 2019 2018, ఏప్రిల్లో పరీకర్ ఆరోగ్యం తొలిసారి క్షీణించింది. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ను ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే ఆయనకు ప్యాంక్రియాటిక్ కేన్సర్ బాగా ముదిరినట్లు నిర్ధారణ అయింది. దీంతో అమెరికాకు వెళ్లిన పరీకర్ అక్కడే చికిత్స తీసుకున్నారు. అనంతరం 2018, జూన్లో జరిగిన గోవా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది జనవరి 30న గోవా బడ్జెట్ను ప్రవేశపెట్టారు పరీకర్. ఈ సందర్భంగా ‘గోవా ముఖ్యమంత్రిగా నా విధులను నిజాయతీగా, నిబద్దతో నిర్వహిస్తానని ఈ రోజు మరో సారి ప్రమాణం చేస్తున్నానం’టూ బడ్జెట్ స్పీచ్ సందర్భంగా పేర్కొన్నారు పరీకర్. -
పరీకర్ మృతి పట్ల ద్రిగ్భాంతి వ్యక్తం చేసిన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: గోవా సీఎం మనోహర్ పరీకర్ మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. దేశం ఒక నిజాయితీ గల నాయకుడిని కోల్పోయిందని తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ట్విటర్లో ఆయన తన సందేశాన్ని పోస్ట్ చేశారు. కాగా, గతకొంతకాలంగా ప్యాంక్రియాటిక్ కేన్సర్తో బాధపడుతున్న పరీకర్ ఆదివారం పణజిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దేశ రాజకీయాల్లో అజాతశత్రువు, మృదు స్వభావిగా పేరున్న పరీకర్ మృతి పట్ల రాష్ట్రపతి కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస చీఫ్ రాహుల్ గాంధీతో సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. మరోవైపు పరీకర్ మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడు(సోమవారం) జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. Deeply saddened to hear about the demise of Sri Manohar Parrikar garu. We have lost a true leader. My heartfelt condolences to the bereaved family. — YS Jagan Mohan Reddy (@ysjagan) March 18, 2019 -
పారీకర్ ఇకలేరు
-
నిరాడంబర సీఎం ఇకలేరు
పణజి/న్యూఢిల్లీ: దేశరాజకీయాల్లో అజాతశత్రువు, మృదు స్వభావి, బీజేపీ సీనియర్ నేత, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్(63) కన్నుమూశారు. గతకొంతకాలంగా ప్యాంక్రియాటిక్ కేన్సర్తో బాధపడుతున్న పరీకర్ ఆదివారం పణజిలోని డౌనాపౌలాలో ఉన్న స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. బీజేపీలో అందరివాడుగా గుర్తింపు పొందిన పరీకర్ నాలుగుసార్లు గోవా ముఖ్యమంత్రిగా, భారత రక్షణశాఖ మంత్రిగా పనిచేశారు. పరీకర్ ఆదివారం సాయంత్రం 6.40 గంటలకు కన్నుమూశారని గోవా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. పరీకర్ మృతిపై రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ సహా పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు పరీకర్ మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడుజాతీయ సంతాప దినంగా ప్రకటించింది. కాగా, సోమవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేకంగా సమావేశం కానున్న కేంద్ర కేబినెట్ పరీకర్ మృతిపై సంతాపం తెలపనుంది. అందరివాడుగా గుర్తింపు.. గోవా ముఖ్యమంత్రిగా 2000లో బాధ్యతలు చేపట్టిన పరీకర్ రాష్ట్రాన్ని బీజేపీకి కంచుకోటగా మార్చారు. ఆరెస్సెస్ నేపథ్యం ఉన్నప్పటికీ ఆధునికవాదిగా, అందరినీ కలుపుకుని ముందుకెళ్లే నేతగా ఆయన గుర్తింపు పొందారు. ప్రధాని మోదీ కేబినెట్లో రక్షణమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ హవాయి చెప్పులు, నలిగిన చొక్కాతో సామాన్యుడిలా డీ–బ్లాక్కు రావడం ఆయనకే చెల్లింది. పరీకర్ సీఎంగా ఉంటేనే బీజేపీకి మద్దతు ఇస్తామని మహారాష్టవాదీ గోమంతక్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీతో పాటు స్వతంత్రులు చెప్పడం పరీకర్ పనీతీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అధికార ఆర్భాటం లేకుండా విమానాశ్రయానికి ఆటోలో రావడం, తన లగేజ్ తానే తీసుకురావడం వంటి నిరాడంబర జీవనశైలితో పరీకర్ ఆదర్శంగా నిలిచారు. 2013లో గోవాలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ సదస్సుకు ముందు పార్టీ ప్రధాని అభ్యర్థిగా మోదీ పేరును పరీకరే ప్రతిపాదించారు. గతేడాది బయటపడ్డ కేన్సర్ 2018, ఏప్రిల్లో పరీకర్ ఆరోగ్యం తొలిసారి క్షీణించింది. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ను ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే ఆయనకు ప్యాంక్రియాటిక్ కేన్సర్ బాగా ముదిరినట్లు నిర్ధారణ అయింది. దీంతో అమెరికాకు వెళ్లిన పరీకర్ అక్కడే చికిత్స తీసుకున్నారు. అనంతరం 2018, జూన్లో జరిగిన గోవా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే గతేడాది సెప్టెంబర్లో ఆయన ఆరోగ్యం మరోసారి క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నెలరోజుల పాటు చికిత్స తీసుకున్న అనంతరం పరీకర్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఏడాది జనవరిలో గోవా బడ్జెట్ను ప్రవేశపెట్టిన పరీకర్, అనారోగ్యం కారణంగా చాలావరకూ తన ప్రైవేటు నివాసానికే పరిమితమయ్యారు. గత రెండ్రోజులుగా పరీకర్ ఆరోగ్యం విషమించడంతో వైద్యులు లైఫ్ సపోర్ట్ సిస్టమ్ను ఆయనకు అమర్చి చికిత్స అందజేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ‘రఫేల్’తో మసకబారిన ప్రతిష్ట.. 2016లో పరీకర్ రక్షణశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం ఫ్రాన్స్తో రూ.58 వేల కోట్లతో 36 రఫేల్ ఫైటర్జెట్ల కొనుగోలుకు కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంతకుముందు యూపీఏ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దుచేసింది. దీంతో కాంగ్రెస్ కేంద్రంపై విమర్శల దాడిని పెంచింది. రక్షణశాఖతో పాటు ప్రధాని కార్యాలయం కూడా రఫేల్ ఒప్పందం విషయంలో ఫ్రాన్స్ ప్రభుత్వంతో సమాంతరంగా చర్చలు జరిపిందనీ, దీన్ని రక్షణశాఖ వ్యతిరేకించిందన్న ఓ నోట్ను ఉటంకిస్తూ ‘హిందూ’ పత్రికలో కథనం రావడంతో కలకలం చెలరేగింది. పరీకర్ బెడ్రూమ్లో రఫేల్ ఫైళ్లు ఉన్నాయని గోవా మంత్రి విశ్వజిత్ రాణే మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో టేపులను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ విడుదల చేయడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. దీంతో పరీకర్ స్పందిస్తూ.. నిజాలకు మసిపూసి మారేడుకాయ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ యత్నిస్తోందని మండిపడ్డారు. నేడు పణజిలో అంత్యక్రియలు: మనోహర్ పరీకర్ అంత్యక్రియలను పణజిలోని మిరమార్ బీచ్లో సోమవారం సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తామని బీజేపీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. పరీకర్ అంత్యక్రియలకు ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా హాజరయ్యే అవకాశముందని భావిస్తున్నారు. నిజమైన దేశ భక్తుడు: పరీకర్ మృతిపై రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో నిబద్ధత, అంకితభావానికి పరీకర్ ప్రతీక అని కోవింద్ కొనియాడారు. పరీకర్ నిజమైన దేశభక్తుడని, గొప్ప పరిపాలకుడని మోదీ పేర్కొన్నారు. అసమాన నాయకుడైన పరీకర్ను పార్టీలకు అతీతంగా గౌరవిస్తారని మోదీ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ గోవా ముద్దు బిడ్డల్లో ఒకరైన పరీకర్ తీవ్ర అనారోగ్యం తో ధైర్యంగా పోరాడారని అన్నారు. దేశం ఒక గొప్ప ప్రజాసేవకుడిని కోల్పోయిందని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు అన్నారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విచారం ప్రకటించారు. కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ప్రస్తుతం గోవాలో మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ(ఎంజీపీ), గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్పీ), స్వతంత్రుల సాయంతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతోంది. తాజాగా పరీకర్ మరణం నేపథ్యంలో బీజేపీ కొత్త ముఖ్యమంత్రి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి అభ్యర్థిని శాసనసభా పక్షనేతగా ఎన్నుకుని గవర్నర్కు ఆ తీర్మానాన్ని అందజేయాలి. ఇందుకు గవర్నర్ మృదులా సిన్హా అంగీకరిస్తే కొత్త ముఖ్యమంత్రి చేత ఆమె ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఒప్పుకోకుంటే అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. రాత్రి బీజేపీ, ఎంజీపీ, జీఎఫ్పీ నేతలు అత్యవసరంగా సమావేశమై సీఎం ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. దీనికోసం కేంద్రమంత్రి గడ్కారీ పణజికి చేరుకున్నారు. 40 సీట్లున్న గోవా అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ 14 మంది సభ్యులతో అతిపెద్ద పార్టీగా ఉండగా, బీజేపీకి 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంజీపీ, జీఎఫ్పీకి చెరో ముగ్గురు సభ్యులతోపాటు ముగ్గురు స్వతంత్రులు, ఓ ఎన్సీపీ ఎమ్మెల్యే ఉన్నారు. తొలి ఐఐటీ సీఎం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) వ్యక్తిగా ముద్రపడ్డ పరీకర్(63) పోర్చుగీసు గోవాలోని మపుసా పట్టణంలో 1955, డిసెంబర్ 13న ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. పాఠశాల స్థాయిలోనే ఆరెస్సెస్ సిద్ధాంతాల పట్ట ఆకర్షితులై సంఘ్లో చేరారు. బాంబే ఐఐటీ నుంచి 1978లో మెటలర్జికల్ ఇంజనీరింగ్లో పట్టా పొందారు. ఓవైపు సొంతవ్యాపారం చేసుకుంటూనే ఉత్తరగోవాలో ఆరెస్సెస్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1990ల్లో రామజన్మభూమి ఉద్యమంపై పరీకర్ గోవాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీకర్ సమర్థత, చురుకుదనం గమనించిన ఆరెస్సెస్, బీజేపీ పెద్దలు గోవాలో వేళ్లూనుకుంటున్న మహా రాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ(ఎంజీపీ)కి చెక్ పెట్టే బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఐఐటీలో చదువుకున్న తొలిసీఎంగా పరీకర్ ఖ్యాతి గడించారు. బీజేపీకి కంచుకోటగా గోవా..: పరీకర్ రాజకీయ అరంగేట్రం అంత గొప్పగా ఏమీ జరగలేదు. లోక్సభ ఎన్నికల్లో 1991లో తొలిసారి పోటీచేసిన పరీకర్ ఓటమి చవిచూశారు. అనంతరం 1994 అసెంబ్లీ ఎన్నికల్లో పణజి నుంచి విజయం సాధించారు. పరీకర్ నాయకత్వంలో బీజేపీ గోవాలో బలీయమైన శక్తిగా ఎదిగింది. 2000లో గోవా పీపుల్స్ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతును ఉపసంహరించుకోవడంతో పరీకర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. లీటర్ పెట్రోల్ ధరను రూ.11కు తగ్గించడం, మహిళలకు ఆదాయాన్ని కల్పించడం సహా పలు సంక్షేమ పథకాలతో పరీకర్ ఇమేజ్ గోవాలో అమాంతం పెరిగిపోయింది. దీంతో 2012 గోవా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఢిల్లీ నుంచి పిలుపు..: 2014లోక్సభ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో రక్షణమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సాయుధ దళాలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న ’వన్ ర్యాంక్–వన్ పెన్షన్’ విధానం పరీకర్ హయాంలోనే అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 17 స్థానాలు రాగా, బీజేపీకి కేవలం 13 సీట్లు మాత్రమే దక్కాయి. వెంటనే రంగంలోకి దిగిన పరీకర్ ఇతర చిన్న పార్టీలు, స్వతంత్రులతో చర్చలు జరిపి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. పరీకర్ భార్య మేధా కేన్సర్తో 2000లో కన్నుమూశారు. పరీకర్ దంపతులకు ఉత్పల్, అభిజిత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. -
గోవా సీఎం పారికర్ కన్నుమూత
-
గోవా సీఎం పారికర్ కన్నుమూత
సాక్షి, పణాజీ : దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్నగోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ (63) కన్నుమూశారు. ఆదివారం రాత్రి ఆయన మరణించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. ఇవాళ సాయంత్రం పారికర్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని, డాక్టర్లు తమ శాయశక్తులా ఆయనకు వైద్యం అందిస్తున్నారని గోవా సీఎంవో ట్వీట్ చేసింది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే పారికర్ మరణవార్త వినాల్సి వచ్చింది. ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతున్న పారికర్ ఢిల్లీలోని ఎయిమ్స్, గోవా, ముంబైలోనూ చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత అమెరికాలో సుదీర్ఘ చికిత్స తీసుకున్నా అయినా ఫలితం లేకపోయింది. కొంత కాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. అలాంటి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది జనవరి 30న అసెంబ్లీలో పారికర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఇవాళ మృతి చెందారు. 1955 డిసెంబర్ 13న గోవాలో జన్మించిన పారికర్ ఐఐటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన ఆయన 1994లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1999లో గోవా అసెంబ్లీలో విపక్షనేతగా ఉన్నారు. 2000లో తొలిసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన పారికర్.... ప్రధాని మోదీ కేబినెట్లో రక్షణమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. పారికర్ హయాంలోనే ఫ్రాన్స్తో రఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం జరిగింది. ప్రముఖుల సంతాపం మరోవైపు పారికర్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్తో పాటు, బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. ఇక పారికర్ మరణంతో బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పారికర్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. దేశం ఒక గొప్ప ప్రజా సేవకుడిని కోల్పోయిందని సీఎం అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పారికర్ ఆకస్మిక మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశం ప్రజ్ఞాశాలి అయిన ఒక ప్రజా నాయకుడుని కోల్పోయిందని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
పరీకర్ నుంచే మొదలెట్టండి
జైపూర్(ఒడిశా): రఫేల్ ఒప్పంద పత్రాల మాయంపై విచారణ గోవా సీఎం మనోహర్ పరీకర్ నుంచే ప్రారంభం కావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. శుక్రవారం పణజిలో జరిగిన పార్టీ బూత్ కార్యకర్తల సమావేశంలో రాహుల్∙మాట్లాడారు. గోవాలో బీజేపీ ప్రభుత్వం ఉనికిలో లేకుండా పోయినట్టే రఫేల్ పత్రాలు కూడా మాయమయ్యానని ఎద్దేవా చేశారు. ‘ఆ పత్రాలు తన వద్దే ఉన్నాయంటూ గతంలో పరీకరే చెప్పారు. అందుకే వాటి కోసం సాగే దర్యాప్తు పరికర్ నుంచే ప్రారంభం కావాలి’ అని రాహుల్ అన్నారు. కాగా, పరీకర్ రక్షణ మంత్రిగా ఉన్నపుడే ప్రభుత్వం రఫేల్ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతోపాటు ఈ ఒప్పంద పత్రాలు కొన్ని కనిపించడం లేదంటూ ఇటీవల కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ‘రఫేల్’ డీల్ ద్వారా అనిల్ అంబానీకి లబ్ధి చేకూర్చేందుకు అధికారుల స్థాయి చర్చలను పట్టించుకోకుండానే ఒప్పందం సిద్ధం చేశారని రాహుల్ ఆరోపించారు. కొరాపుట్ జిల్లా జైపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. యూపీఏ హయాంలో కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసి, రూ.30వేల కోట్ల మేర అంబానీకి లాభం చేకూర్చేందుకు మోదీ కాంట్రాక్టు సిద్ధం చేశారంటూ ఓ ఆంగ్ల పత్రికలో కథనం వచ్చిందన్నారు. బీజేపీకి దోచిపెడుతున్నారు: మమత కోల్కతా: ప్రభుత్వ ధనాన్ని ప్రధాని మోదీ బీజేపీకి దోచి పెడుతున్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. రఫేల్ ఒప్పంద పత్రాలనే పరిరక్షించలేని ఈ ప్రభుత్వం దేశాన్ని ఎలా కాపాడగలుగుతుందని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఆమె శుక్రవారం కోల్కతాలో ప్రారంభించారు. ‘ఇంతకుముందు బీజేపీ వాళ్లకు తినడానికి తిండి కూడా ఉండేది కాదు. రఫేల్ డీల్, నోట్ల రద్దు ద్వారా ప్రజాధనాన్ని లూటీ చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు బైక్లు కొంటున్నారు’ అంటూ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో కశ్మీర్లో హింసాత్మక ఘటనలు 210 శాతం పెరిగాయంటూ ఆమె.. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైతే అక్కడ ప్రశాంతత ఏర్పడుతుందని చెప్పారు. -
మనోహర్ పరీకర్ కుమారుడికి నోటీసులు
పనజి : ఓ రిసార్టు నిర్మాణం విషయమై బాంబే హైకోర్టు- పనాజి ధర్మాసనం గోవా సీఎం మనోహర్ పరీకర్ కుమారుడు అభిజాత్ పరీకర్కు నోటీసులు జారీ చేసింది. దక్షిణ గోవాలోని నేత్రావలి వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి సమీపంలో అభిజాత్ నిర్మిస్తున్న రిసార్టు నిర్మాణంపై స్టే ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలైంది. నేత్రావలి పంచాయతీ ఉప సర్పంచి అభిజీత్ దేశాయి దాఖలు చేసిన ఈ పిటిషన్ను జస్టిస్ మహేష్ సోనక్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ క్రమంలో వచ్చే నెల 11నాటికి అభిజాత్ పరీకర్తో పాటు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి, అటవీ పరిరక్షణ ముఖ్య కార్యదర్శి ఈ విషయమై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. కాగా హైడ్అవే హాస్పిటాలిటీ ప్రమోటర్గా ఉన్న అభిజాత్ నిర్మిస్తున్న రిసార్టు కారణంగా అడవి ధ్వంసం అవుతుందని పేర్కొన్న పిటిషనర్.. ఈ నిర్మాణం అనేక చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించారు. కాగా సీఎం కుమారుడికి నోటీసులు రావడం పట్ల ప్రతిపక్ష కాంగ్రెస్ స్పందించింది. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం బంధుప్రీతితో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో... ‘ ఈ ప్రాజెక్టులో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావు లేదు. అభిజాత్ పరీకర్ ఆ భూమిని కొనుగోలు చేశారు. మనోహర్ పరీకర్, ఆయన కుమారుడిపై మాకు పూర్తి విశ్వాసం ఉంది’ అని గోవా బీజేపీ అధ్యక్షుడు వినయ్ టెండుల్కర్ వ్యాఖ్యానించారు. -
పారదర్శకత సర్కారు బాధ్యత
నాలుగేళ్లక్రితం రఫేల్ ఒప్పందంపై సంతకాలు అయింది మొదలు దాని చుట్టూ అల్లుకుంటున్న అనేకానేక ఆరోపణలకూ, సందేహాలకూ ఇప్పట్లో ముగింపు ఉండకపోవచ్చునని తాజాగా వెల్లడైన మరో అంశం నిరూపిస్తోంది. మన దేశం, ఫ్రాన్స్ మధ్య ఈ ఒప్పందంపై చర్చలు సాగుతున్న సమ యంలో ప్రధాని కార్యాలయం అధికారుల తీరుపై రక్షణ శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు ఒక ఆంగ్ల దినపత్రిక వెల్లడించడంతో ఈ వ్యవహారంలో మళ్లీ కొత్త సందేహాలు పుట్టుకొ చ్చాయి. రఫేల్ ఒప్పందంపై ఏడుగురు సభ్యులున్న రక్షణ శాఖ అధికారుల బృందం ఫ్రాన్స్తో చర్చిస్తుండగా, దానికి సమాంతరంగా అదే అంశంపై ప్రధాని కార్యాలయం (పీఎంఓ) అధికారులు కూడా ఫ్రాన్స్తో మంతనాలు జరపడాన్ని అప్పట్లో ఆ శాఖను చూస్తున్న మంత్రి మనోహర్ పారికర్ దృష్టికి రక్షణ అధికారులు దృష్టికి తీసుకొచ్చారని ఆ కథనం చెబుతోంది. ఇది సరికాదని పీఎంఓకు చెప్పమన్నా పారికర్ ఈ విషయంలో చొరవ తీసుకోలేదు. ప్రస్తుత రక్షణ మంత్రి నిర్మలా సీతారా మన్ ఏం చెప్పినా, ఎలా సమర్థించుకున్నా ఆ విషయంలో రేగిన అనుమానాలు రూపుమాసిపోవు. ఒక వ్యవహారంలో ఆరోపణలొచ్చినప్పుడు, సందేహాలు వ్యక్తమైనప్పుడు దానికి సంబంధిం చిన సమస్త అంశాలను తేటతెల్లం చేయడం పాలకుల కనీస కర్తవ్యం. ప్రభుత్వం ఆ పని చేయనంత మాత్రాన వాస్తవాలు మరుగునపడి ఉండిపోతాయనుకోవడం సరికాదు. మీడియా చురుగ్గా పని చేసేచోట ఎప్పుడో ఒకప్పుడు అవి వెల్లడవుతాయి. ప్రభుత్వ తీరును ప్రశ్నార్థకం చేస్తాయి. అప్పుడు ఆ అనుమానాలు మరింత చిక్కబడతాయి. ఒప్పందంలో ఇంతవరకూ డబ్బులు చేతులు మారింది లేదు.. రఫేల్ విమానాలు మన దేశానికి వచ్చింది లేదని బీజేపీ నేతల వాదన. కాబట్టి స్కాం కాదం టున్నారు. అలాగే ఈ విమానాల ఉత్పత్తికి భారత్లో ఏ సంస్థను భాగస్వామిగా చేర్చుకోవాలో నిర్ణ యించుకునే స్వేచ్ఛ ఒప్పందం ప్రకారం రఫేల్ విమానాలు ఉత్పత్తి చేసే డస్సాల్ట్ సంస్థకే ఉంద న్నదీ నిజమే కావొచ్చు. కానీ ఎప్పటికప్పుడు సంజాయిషీ ఇవ్వడం తప్ప సమగ్రంగా అన్నిటినీ ప్రజల ముందు ఎందుకు ఉంచరు? రఫేల్ ఒప్పందంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచా రణ సమయంలో కేంద్రం నివేదించిన వివరాల్లో పీఎంఓ పాత్ర గురించిన ప్రస్తావన ఎందుకు లేదు? ఒక్కసారి వెనక్కి వెళ్లి రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి దారితీసిన పూర్వాప రాలు తెలుసుకుంటే ఇదిలా ఎడతెగకుండా సాగడం వల్ల జరిగే నష్టమేమిటో అర్ధమవుతుంది. 2012లో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇదే డస్సాల్ట్తో యుద్ధ విమానాల గురించి చర్చలు సాగాయి. దాదాపు ఒప్పందం కుదిరే దశలో అదంతా నిలిచిపోయింది. చర్చల సందర్భంగా ఆ సంస్థ 126 యుద్ధ విమానాలు మనకు సమకూర్చేందుకు...అందులో 18 విమానాలను 2015 కల్లా అందించేందుకు అవగాహన కుదిరింది. మిగిలిన 108 విమానాలనూ అవసరమైన సాంకేతిక పరి జ్ఞానాన్ని అందించడం ద్వారా హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)లో ఉత్పత్తి చేసేం దుకు ఏడేళ్లపాటు సహకరిస్తామని చెప్పింది. అయితే డస్సాల్ట్–హెచ్ఏఎల్ మధ్య జరిగిన తదుపరి చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈలోగా రఫేల్ యుద్ధ విమానాల సామర్థ్యంపై సందేహాలు వ్యక్తమవుతూ మీడియాలో కథనాలు రావడంతో ఆ ఒప్పందం సాకారం కాలేదు. రక్షణ కొనుగోళ్లకు ఒప్పందాలు ఖరారు కావడానికి ముందో, తర్వాతో ఆరోపణలు ముసురుకోవడం మన దేశంలో రివాజుగా మారింది. రాజీవ్గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు రక్షణ శాఖను తానే చూస్తూ, తనకు అత్యంత సన్నిహితుడైన అరుణ్సింగ్ను ఆ శాఖలో సహాయమంత్రిగా నియమించారు. 1987లో బోఫోర్స్ శతఘ్నుల ఒప్పందంపై ముసురుకున్న వివాదం ఎన్ని మలుపులు తీసుకుందో, అత్యంత భారీ మెజారిటీ సాధించి అధికారంలోకొచ్చిన రాజీవ్ దాని పర్యవసానంగా రాజకీయంగా ఎంత దెబ్బతిన్నారో అందరికీ తెలుసు. దానికి విరుగుడుగా నిజాయితీపరులని పేరున్న నేతలను ఎంచు కుని వారికి రక్షణ శాఖ కట్టబెట్టడం ఆనవాయితీగా మారింది. వాజపేయి హయాంలో జార్జి ఫెర్నాండెజ్, యూపీఏ ఏలుబడిలో ఏకే ఆంటోనీ, మోదీ ప్రభుత్వం మనోహర్ పారికర్కు రక్షణ శాఖ అందుకే అప్పగించారు. కానీ వీరు కూడా ఆరోపణల భారాన్ని మోయక తప్పలేదు. కొనుగోళ్లకు సంబంధించి, వాటి పారదర్శకతకు సంబంధించి కొత్త నిబంధనలు రూపొందు తున్నాయి. దళా రుల ప్రమేయం లేకుండా చేయడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబు తున్నారు. కానీ చివరాఖరికి ఆరోపణలు మాత్రం తప్పడం లేదు. వీటి తక్షణ ఫలితమేమంటే... మన రక్షణ దళాలకు అవసరమైన యుద్ధ విమానాలు, శతఘ్నులు, ఇతర పరికరాలు సకాలంలో సమకూరడం లేదు. రఫేల్ ఒప్పందంలో లొసుగులున్నాయంటున్న విపక్షాలు దాన్ని బలంగా ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యాయి. విపక్షాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ మినహా మరెవరూ ఈ విషయాన్ని పెద్దగా మాట్లాడటం లేదు. ఆయన శక్తి అంత సరిపోతున్నట్టు లేదు. ఇతర నేతలకు రఫేల్ వ్యవహారంపై ఆసక్తి లేదో... వారికి అసలు అవగాహనే కొరవడిందో చెప్పలేం. ఈమధ్యే కోల్కతాలో జరిగిన విపక్ష ర్యాలీలో ఈ స్కాంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు విపక్షాల బలహీనతను పట్టిచూపుతుంది. బాబు గారికి రఫేల్ ఫైటర్ జెట్ విమానాలకూ, జెట్ ఎయిర్వేస్ విమానాలకూ తేడా తెలియదు. విపక్షాలు ఇలాంటి దైన్యస్థితిలో ఉండటం ప్రభుత్వానికి వరమే కావచ్చుగానీ... దాపరికం అంతిమంగా తమకే చేటు తెస్తుందని అది గుర్తించడం అవసరం. రక్షణ శాఖ బృందం చర్చిస్తుండగా ఈ ఒప్పందంలో పీఎంఓ ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందో, రక్షణ శాఖ కార్యదర్శి అభిప్రాయాన్ని ఎందుకు బేఖాతరు చేశారో వివరించడం దాని బాధ్యత. మీడియాలో వచ్చినప్పుడల్లా సంజాయిషీ ఇస్తూ, ఎదురుదాడులు చేస్తూ పోయే వ్యూహాన్ని విడిచి అన్నిటినీ పారదర్శకంగా ప్రజల ముందుంచాలి. -
‘పరీకర్ ఆరోగ్యం అస్సలు బాగోలేదు’
పణజి: క్యాన్సర్తో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ ఆరోగ్యంపై డిప్యూటీ స్పీకర్, బీజేపీ సీనియర్ లీడర్ మైఖేల్ లోబో సోమవారం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పరీకర్ ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఆయన వ్యాధి ఇంకా నయం కాలేదు. దేవుని ఆశిస్సులతోనే ఆయన ఇంకా సీఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు.’ అని వ్యాఖ్యానించారు. ఆయన పదవిలో నుంచి దిగిపోయినా లేదా కాలం చేసినా గోవాలో రాజకీయ సంక్షోభం తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలనకు దూరంగా ఉన్న పరీకర్ పదవి నుంచి దిగిపోవాలని లోబో గతంలో కూడా డిమాండ్ లేవనెత్తారు. 63 ఏళ్ల పరీకర్ గతేడాది ఫిబ్రవరిలో పాంక్రియాటిక్ క్యాన్సర్ బారినపడ్డారు. తొలుత అమెరికాలో చికిత్స చేయించుకుని ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. (రాహుల్కు పరీకర్ ఘాటు లేఖ) కాగా, డిల్లీ ఎయిమ్స్ వైద్యులు సీఎం ఆరోగ్యంపై శనివారం బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. వరల్డ్ క్యాన్సర్ డే (ఫిబ్రవరి 4) సందర్భంగా.. ‘మనిషి బుద్ధి బలం చాలా గొప్పది. ఎటువంటి వ్యాధులనైనా తట్టుకొని నిలబడగలిగేలా నడిపిస్తుంది’ అని పరీకర్ ఒక మెసేజ్లో పేర్కొన్నారు. కాగా, అనారోగ్యం కారణంగా బాగా చిక్కిపోయిన పరీకర్ గతవారం అసెంబ్లీకి వచ్చారు. ఇదిలాఉండగా బీజేపీ సీనియర్ నేత సుదీన్ ధవాలికర్ను సీఎంగా నియమించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. బీజీపీ సీనియర్ ఎల్కే అద్వానీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఇటీవల పరీకర్ను పరామర్శించిన సంగతి తెలిసిందే. జీఎఫ్పీ, ఎంజీపీ, మరో ముగ్గురు స్వతంత్ర్య ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. -
‘మనోభావాలు దెబ్బతింటే క్షమించండి’
పనజి : గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ను జీసస్తో పోల్చి.. క్రిస్టియన్ల మనోభావాలు దెబ్బతీసారంటూ తనపై కాంగ్రెస్ పార్టీ తనపై చేస్తున్న విమర్శలపై గోవా మంత్రి విజయ్ సర్దేశాయి స్పందించారు. ‘ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే నన్ను క్షమించండి. అయితే నాదొక విన్నపం. దయచేసి కాంగ్రెస్ పార్టీ పన్నిన వలలో చిక్కుకోకండి. మనుషుల మధ్య సఖ్యతకు బంధాలే వారధులని.. పరీకర్ ఆ విషయంలో విజయవంతమయ్యారని తాను అంటే.. కొందరేమో కాంక్రీటు బ్రిడ్జిల గురించి మాట్లాడి రాజకీయం చేస్తున్నారు’ అని శనివారం ఆయన వివరణ ఇచ్చారు. కాగా బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో విజయ్ సర్దేశాయి మాట్లాడుతూ.. ‘ మనుషులు నిర్మించాల్సింది బ్రిడ్జీలు. గోడలు కాదు అని బైబిల్లో ఉంటుంది. ఆ జీసస్ వారధులు నిర్మించారు. పరీకర్ కూడా అలాగే చేస్తున్నారు. అంతకు ముందు మేము బ్రిడ్జికి ఆవలివైపు(యాంటీ బీజేపీ క్యాంపులో) ఉన్నాము. అయితే పరీకర్ నిర్మించిన బ్రిడ్జీల కారణంగా ప్రస్తుతం బీజేపీతో కలిసి నడుస్తున్నాం’ అంటూ గోవా సీఎంపై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో విజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి రోహిత్ బ్రాస్ డేసా మాట్లాడుతూ.. పరీకర్ను దేవుడితో పోల్చి విజయ్ క్రిస్టియన్లను అవమానించారంటూ విమర్శించారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొందినప్పటికీ.. గోవా ఫార్వర్డ్ పార్టీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో బీజేపీని తీవ్రంగా విమర్శించిన విజయ్ సర్దేశాయి(గోవా ఫార్వర్డ్ పార్టీ)ఆ పార్టీతో చేతులు కలపడంతో.. సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత ఎదుర్కొన్నారు. -
ఇలాంటి రాజకీయాలు చేస్తారా?
పణజి: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ దుయ్యబట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసమే తనను పరామర్శించటానికి వచ్చారని ఆరోపించారు. ఈమేరకు బుధవారం రాహుల్ గాంధీకి ఆయన లేఖ రాశారు. రఫేల్ ఒప్పందం గురించి తమ మధ్య ఎటువంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ప్రాణాంతక అనారోగ్యంతో బాధ పడుతున్న తనతో ఇలాంటి రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. ‘ఐదు నిమిషాల పాటు జరిగిన మన భేటీలో రఫేల్ ఒప్పందం గురించి ఎక్కడా ప్రస్తావన రాలేదు. మన సమావేశంపై ఈ రోజు మీడియాలో వచ్చిన వార్తలు నన్ను తీవ్ర అసంతృప్తికి గురి చేశాయి. మర్యాదపూర్వక భేటీ పేరుతో వచ్చి దిగజారుడు రాజకీయాలు చేయడం సబబు కాదు. మీ పర్యటన లక్ష్యంపై అనుమానాలు కలుగుతున్నాయి. మీ నిజాయితీపై నా మదిలో ఎన్నో ప్రశ్నలు రేగుతున్నాయ’ని రాహుల్కు రాసిన లేఖలో పరీకర్ పేర్కొన్నారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో ఎటువంటి అక్రమాలు జరగలేదని, దేశ భద్రతకే పెద్దపీట వేశామని ఆయన స్పష్టం చేశారు. కాగా, రాహుల్ గాంధీ అబద్దాలకోరు అంటూ బీజేపీ నాయకులు, గోవా మంత్రులు ధ్వజమెత్తారు. వ్యక్తిగత పర్యటనలను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. (గోవా సీఎంతో రాహుల్ గాంధీ భేటీ) -
దమ్ముంటే చర్చకు రండి
న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందం సహా ఏ వ్యూహాత్మక అంశంపై అయినా దమ్ముంటే తనతో 20 నిమిషాలు ముఖాముఖి చర్చకు రావాలని ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సవాలు విసిరారు. రాహుల్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘ప్రధాని మోదీతో ముఖాముఖి చర్చ కోసం నాకు కేవలం 20 నిమిషాలు ఇవ్వండి. ఆ తర్వాత వాస్తవమేంటో మీరే నిర్ణయించుకోండి. కానీ ప్రధాని మోదీకి మీ(మీడియా) ముందు కూర్చుని మాట్లాడే దమ్ము లేదు. మీరంతా మంగళవారం ప్రధాని ఇంటర్వ్యూ చూశారా? ఆయనేమో అక్కడ నవ్వుతున్నారు. ఎదురుగా ఉన్న జర్నలిస్ట్ మాత్రం ప్రశ్నలతో పాటు ప్రధాని ఇవ్వాల్సిన జవాబులను చెప్పేస్తున్నారు’ అని విమర్శించారు. రఫేల్ ఆడియో టేపు విషయమై మాట్లాడుతూ..‘రఫేల్కు సంబంధించిన ఫైలు మొత్తం తన దగ్గర ఉందని గోవా సీఎం పరీకర్ చెప్పినట్లు ఆయన కేబినెట్ సభ్యుడు రాణే బయటపెట్టారు. తనను ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పించకుండా ఉండేందుకు పరీకర్ దీన్ని వాడుకుంటున్నారు. ఇలాంటి ఆడియో టేపులు ఇంకా చాలా ఉండొచ్చు. పరీకర్ ప్రధానిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తాం.. రఫేల్ ఒప్పందంపై తనకు ఎలాంటి ప్రశ్నలు ఎదురుకాలేదని మోదీ చెప్పడంపై స్పందిస్తూ..‘ఆయన ఏ లోకంలో జీవిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మోదీజీ.. మీకు వ్యతిరేకంగా ప్రశ్నలు వస్తున్నాయి. మీరు అనిల్ అంబానీ(ఏఏ)కు రూ.30,000 కోట్లు ఎందుకు ఇచ్చారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు’ అని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రఫేల్ ఒప్పందంపై విచారణకు ఆదేశిస్తామన్నారు. -
పరీకర్.. మోదీని బ్లాక్మెయిల్ చేస్తున్నారా ఏంటి?!
పనాజి : తాను పదవిలో కొనసాగడం కోసం గోవా సీఎం మనోహర్ పరీకర్ ప్రధాని నరేంద్ర మోదీ బ్లాక్మెయిల్ చేస్తున్నారేమో అంటూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్రెడ్డి ఎద్దేవా చేశారు. పరీకర్ అనారోగ్యం కారణంగా గోవా అభివృద్ధి కుంటుపడిందని, ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ ‘జన్ఆక్రోష్’ పేరిట ర్యాలీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం నాటి ర్యాలీలో జైపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నైతికత గురించి మాట్లాడే మనోహర్ పరీకర్ స్వప్రయోజనాల కోసం సీఎం కుర్చీని జలగలా పట్టుకున్నారని విమర్శించారు. ‘ నాకు తెలిసి ఆయన తన సీటు కోసం ప్రధాని మోదీని బ్లాక్మెయిల్ చేస్తున్నారేమో? ఇందుకోసం రఫేల్ డీల్ అంశాన్ని ఉపయోగించుకుంటున్నారేమో’ అంటూ జైపాల్రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందిన పరీకర్ అక్టోబర్లో డిశ్చార్జి అయిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న ఆయన ఆదివారం తొలిసారిగా ప్రజల మధ్యకు వచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ తీరుపై విమర్శలు ఎక్కుపెట్టింది. రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన పరీకర్ ఆ సమయంలో తాను తెలుసుకున్న విషయాల ఆధారంగా మోదీజీని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. -
‘మరి ఇంత పదవి వ్యామోహమా..?!’
పణాజి : ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి బాధ్యతలు నిర్వహిస్తోన్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ని సొంత పార్టీ నాయకులు అభినందిస్తోండగా.. విపక్షాలు మాత్రం అంత పదవి వ్యామోహం అవసరమా అంటూ విమర్శిస్తున్నాయి. వివరాలు.. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న పారికర్ అక్టోబర్లో డిశ్చార్జి అయిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న పారికర్ ఆదివారం తొలిసారి ప్రజల మధ్యకు వచ్చారు. అధికారులతో కలిసి పణాజీలోని మండోవి నదిపై నిర్మిస్తోన్న వంతెన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా సీనియర్ నాయకురాలు ప్రీతి గాంధీ.. ‘నిబద్ధతకు, అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనం’ అంటూ పారికర్ని ప్రశంసించారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం బీజేపీ అధికార దాహానికి నిలువెత్తు నిదర్శనమంటూ ఆరోపణలు చేస్తున్నాయి. ‘ఎంత అమానుషం.. పూర్తిగా కోలుకొని మనిషిని బాధ్యతలు నిర్వహించమని, ఫోటోలకు ఫోజులివ్వమని ఒత్తిడి చేయడం దారుణమం’టూ జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఓమర్ అబ్దుల్లా విమర్శించారు. He has a tube inserted through his nose into his digestive tract. How inhuman to force him to continue working & doing photo ops. Why can’t he be allowed to deal with his illness without all this pressure & tamasha? https://t.co/iq0dwXCHmE — Omar Abdullah (@OmarAbdullah) December 16, 2018 కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది కూడా ‘సీఎం ముక్కులో ట్యూబ్ ఉందా? పదవి దాహంతో ఉన్న పార్టీ(బీజేపీ) ఓ వ్యక్తి అనారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా బాధ్యతలు నిర్వహించమని కోరుతుందా? కానీ అధికారంలోకి రావడం కోసం బీజేపీ ఏమైనా చేయగలదు. సీఎం సాబ్ జాగ్రత్త.. ఇక మీ పార్టీ గిమ్మిక్కులు కొనసాగవు’ అంటూ ట్వీట్ చేశారు. Is that a tube that is inserted in his nose? Can a party be so power hungry to make a man work despite his illness? With BJP impossible is nothing....to grab power, latch on to power. Take care CM Saab, because clearly, your party won’t. https://t.co/xBwv5qXvtb — Priyanka Chaturvedi (@priyankac19) December 16, 2018 -
అయ్యో పాపం.. పరీకర్!
సాక్షి, న్యూఢిల్లీ : గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పరీకర్ తన విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారని చెప్పడానికి ఆయన అధికారులతో సమావేశమైన ఫొటోలను బీజేపీ పార్టీ నాయకత్వం విడుదల చేయడాన్ని సోషల్ మీడియా తప్పు పట్టడమే కాకుండా తీవ్రంగా దుయ్య పడుతోంది. క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన్ని విశ్రాంతి తీసుకోనీయకుండా ఇంకా విధులు నిర్వర్తింప చేయడమేమిటని ప్రశ్నిస్తోంది. ఎప్పుడూ నవ్వుతూ సంపూర్ణ ఆరోగ్యంగా కనిపించే మనోహర్ పరీకర్ బీజేపీ నాయకత్వం విడుదల చేసిన ఫొటోల్లో చిక్కి శల్యమై కనిపించడం సోషల్ మీడియాను తీవ్రంగా కదిలించింది.. కలచివేసింది. అక్టోబర్ 30, అక్టోబర్ 31వ తేదీల్లో ముఖ్యమంత్రి పరీకర్ తన నివాసంలో తోటి మంత్రులు, అధికారులతో సమావేశమైన దశ్యాలకు సంబంధించిన ఫొటోలను బీజేపీ నాయకత్వం ఆదేశం మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం మీడియాకు విడుదల చేసింది. నానాటికి ఆరోగ్యం క్షీణిస్తున్న మనోహర్ పరీకర్ ముఖ్యమంత్రిగా తన విధులను సంక్రమంగా నిర్వర్తించలేక పోతున్నారని తెలిస్తే ఎక్కడ ప్రభుత్వం పడిపోతుందోనన్నది అటు రాష్ట్ర, ఇటు కేంద్రంలోని బీజేపీ నాయకత్వాన్ని కలవర పెడుతోంది. అందుకు కారణం గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకన్నా నాలుగు సీట్లు తక్కువ సీట్లను సాధించినప్పటికీ ఎన్నికల అనంతర పొత్తుల ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే. (సీఎంకు ఓ న్యాయం.. మంత్రులకో న్యాయమా!?) ‘భయం గొలిపే ఇలాంటి ఫొటోను విడుదల చేయడం నిజంగా నీచం. దయచేసి ఆ ఫొటోను వైరల్ కానివ్వకండి. వారం చేస్తున్నారో వారికే తెలియడం లేదు. వారిని క్షమించండి. ఓ ముఖ్యమంత్రిని గౌరవప్రదంగా సాగనంపాలనే సంస్కతిని కూడా పార్టీ మరచిపోయినట్టుంది’ అని పరీకర్ ఫొటో పట్ల మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రభాకర్ టింబ్లే వ్యాఖ్యానించారు. ‘సీఎం చాలా బలహీనంగా కనిపిస్తున్నారు. ఆయనపై దయవుంచి గౌరవప్రదంగా రాజీనామా చేయనీయండి. (సీఎం పదవి నుంచి నన్ను తప్పించండి!) ఆయన జీవితం కన్నా బీజేపీ ప్రభుత్వాన్ని రక్షించుకోవడమే కావాలనుకుంటా ఢిల్లీలోని బీజేపీ పెద్దలకు’ అని సోషల్ మీడియాలో నిక్సన్ ఫెర్నాండేజ్ వ్యాఖ్యానించారు. ‘ఆ ఫొటోలో కనిపిస్తున్నది నిస్సందేహంగా గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్గారే, కాదనడం లేం, ఆయన్ని ఆ స్థితిలో చూస్తుంటే ఆయనింకేమాత్రం విధులు నిర్వర్తించేలా కనిపించడం లేదు’ అని ‘గోవన్ డెయిలీ’ పత్రిక వ్యాఖ్యానించింది. గత ఫిబ్రవరి నెల నుంచే మనోహర్ పరీకర్ గత ఫిబ్రవరి నెల నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆయన వారసుడి కోసం ఇటు పార్టీలోనూ, అటు సంకీర్ణ భాగస్వామ్య పక్షాల్లోనూ పోటీ పెరగడంతో ఇంతవరకు రాజీ కుదరలేదు. ఏ రెండు మిత్రపక్షాలు జారుకున్నా ప్రభుత్వం పడిపోతుంది. అందుకని ప్రభుత్వం పడి పోకుండా ఉండేందుకు బీజేపీ అధిష్టానం పరీకర్నే కొనసాగిస్తూ వస్తోంది. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరగుపడుతోందని ఇప్పటికి రెండు సార్లు ప్రకటించిన పార్టీ, ఆయన మాటలను తెలియజేసే వీడియో రికార్డులను విడుదల చేయలేదు. తాజాగా ఫొటోలను విడుదల చేసింది. ఆ ఫొటోలను చూస్తుంటే మాత్రం ఆయన కోలుకుంటున్న లక్షణాలు కనిపించడం లేదు. -
గోవాకు తిరిగొచ్చిన పరీకర్
పనజి: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ ఆదివారం మధ్యాహ్నం స్వరాష్ట్రానికి తిరిగొచ్చారు. ఆరోగ్యం కుదుటపడటంతో ఆయన ఆదివారం ఉదయం ఢిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గోవా చేరిన పరీకర్.. అక్కడ నుంచి అంబులెన్స్లో డోనా పౌలాలో ఉన్న నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు గోవా మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేశారు. పరీకర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయనకు మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరం అని కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ విలేకరులకు తెలిపారు. గోవా అసెంబ్లీ రద్దు వార్తలను ఆయన ఖండించారు. ఫిబ్రవరిలో అనారోగ్యానికి గురైన పరీకర్ గోవా, ముంబై, అమెరికాలో చికిత్స పొందారు. చివరికి సెప్టెంబర్ 15న ఎయిమ్స్లో చేరారు. -
సీఎంకు ఓ న్యాయం.. మంత్రులకో న్యాయమా!?
పనజి : కాబినెట్ నుంచి ఇద్దరు మంత్రులను తొలగించి వారి స్థానంలో కొత్త మంత్రులను నియమించేందుకు గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ సిద్ధమయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా, విద్యుత్ శాఖ మంత్రి పాండురంగ్ మద్కైకర్లను కాబినెట్ నుంచి తొలగించారు. అనారోగ్యం కారణంగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వీరి స్థానంలో మిలింద్ నాయక్, నీలేశ్ కార్బాల్ గవర్నర్ మృదులా సిన్హా సమక్షంలో సోమవారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనకో రూల్.. మంత్రులకో రూల్!! గత జూన్లో బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన మద్కైకర్.. ఇప్పటికీ అక్కడ చికిత్స పొందుతున్నారు. మరో మంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా కూడా పలు అనారోగ్య కారణాల వల్ల అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే వీరి గైర్హాజరీతో ఆయా శాఖల అభివృద్ధి కుంటుపడుతుందని భావించిన పరీకర్ వారిద్దరిని కాబినెట్ నుంచి తొలగించారు. దీంతో సీనియర్లను తప్పించడం కంటే కూడా దాని వెనుక ఉన్న కారణం రాజకీయ వర్గాల్లో విస్మయం కలిగిస్తోంది. ఎందుకంటే గత ఏడు నెలలుగా ప్రాంకియాటైటిస్తో బాధపడుతున్న మనోహర్ పరీకర్ ముంబై, అమెరికాల్లో చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. కాగా పరీకర్ అనారోగ్యాన్ని కారణంగా చూపి, రాష్ట్రంలో పాలన కుంటుపడిందని, తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ పట్టుపడుతోంది. అయితే గోవా సీఎంగా పరికర్ కొనసాగుతారని బీజేపీ చీఫ్ అమిత్ షా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో మంత్రులకో న్యాయం, సీఎంకి ఓ న్యాయం అన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శలు వస్తున్నాయి. -
‘ఆస్పత్రి నుంచే సీఎం బెదిరిస్తున్నారు’
పనాజి : గోవా సీఎం మనోహర్ పారికర్ ఆసుపత్రి నుంచే ప్రజలను బెదిరిస్తున్నారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడు చెల్లకుమార్ ఆరోపించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉండిఉంటారని.. నేరుగా పాలన చేయలేకపోయినా ఆసుపత్రి గది నుంచే పోన్లు చేసి ప్రజలను భయపెడుతున్నారని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పారికర్ అమెరికా, ముంబై, ఢిల్లీలో చికిత్స తీసుకున్నారని ఆయన ఆరోగ్య పరిస్థితి బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పారికర్ ఆసుపత్రిలో చేరిన దగ్గరనుంచి ఆయనను కాంగ్రెస్ తొలిసారిగా విమర్శించింది. గోవా ఫార్వార్డ్ బ్లాక్ అధ్యక్షుడు విజయ్ సర్దేశాయ్ సీఎంతో ఫోన్లో మాట్లాడిన మరుసటి రోజే కాంగ్రెస్ ఆరోపణలు చేయడం గమనార్హం. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మైనింగ్లో పారికర్కు కూడా వాటా ఉందని, దీనిపై లోకయుక్తాతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న పారికర్ త్వరలో కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కాగా పారికర్ ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన వైద్యం కోసం వెళ్లిన దగ్గర నుంచి గోవాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రభుత్వం సుప్తచేతనావస్థలో ఉందని.. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు తగిన బలం ఉన్నందును తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు ఇటీవల గవర్నర్ను కోరిన విషయం తెలిసిందే. -
ఆస్పత్రిలో సీఎం.. పావులు కదుపుతున్న ప్రతిపక్షం
పనాజీ : గోవా సీఎం మనోహర్ పారికర్ తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరడంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సీఎల్పీ నేత బాబు కవేల్కార్ నేతృత్వంలో 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం రాజ్భవన్లో గవర్నర్ మృదుల్ సిన్హాను కలిసి అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని కోరేందుకు సంసిద్ధమయ్యారు. అయితే అమె అందుబాటులో లేకపోవడంతో మంగళవారం ఆమెతో భేటీ అవుతామని కవేల్కార్ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన సంఖ్యాబలం తమకు ఉన్నందున అసెంబ్లీని రద్దు చేయవద్దని తాము గవర్నర్ను కోరతామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పనిచేయలేని పరిస్థితి నెలకొంటే తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో 16 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించింది. అసెంబ్లీలో బలం నిరూపించుకునేందుకు కాంగ్రెస్కు మరో ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. మరోవైపు సీఎం పారికర్ అస్వస్థతతో పాలనను గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యేలు, భాగస్వామ్య పక్షాలతో చర్చించేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం గోవాకు ముగ్గురు పార్టీ సీనియర్ నేతలతో కూడిన బృందాన్ని పంపింది. పారికర్ కోలుకునే వరకూ సీనియర్ మంత్రిని సీఎంగా నియమించాలనే డిమాండ్ ఊపందుకుంది. -
గోవాకు త్వరలో కొత్త సీఎం?
పణజి: ముఖ్యమంత్రి మనోహర్ పారికర్(62) ఆస్పత్రిలో చేరిన నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులను సమీక్షించేందుకు అధికార బీజేపీ కేంద్ర పరిశీలక బృందం ఆదివారం మధ్యాహ్నం గోవా చేరుకుంది. సీఎం పారికర్ తీవ్ర అనారోగ్యంతో శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం కుదుటపడే వరకు సీఎంగా మరొకరిని ఎంపికచేసే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ బృందం రాష్ట్రానికి రావడం గమనార్హం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు బీఎస్ సంతోష్, రామ్ లాల్, రాష్ట్ర ఇన్చార్జి విజయ్ పురాణిక్లతో కూడిన ఈ బృందం ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని పరిస్థితులపై పార్టీ నేతలతోపాటు సంకీర్ణ భాగస్వామ్య పక్షాలైన గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్పీ), మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీతో పాటు, స్వతం త్ర అభ్యర్థుల మనో గతం తెలుసుకుంటుం దని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వినయ్ టెండూల్కర్ తెలిపారు. 40 మంది సభ్యుల గోవా అసెంబ్లీలో బీజేపీ 14, సంకీర్ణంలోని జీఎఫ్పీ, ఎంజీపీలకు ముగ్గురు సభ్యుల బలం ఉండగా ముగ్గురు స్వతంత్రులు మద్దతిస్తున్నారు.కాంగ్రెస్కు 16, ఎన్సీపీకి ఒక్క సభ్యుడు ఉన్నారు. రాష్ట్రంలో జరిగే పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది.‘మా ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారు. అధికార పార్టీలో అంతర్గత కుమ్ము లాట మొదలైంది. అయితే, అధికారం చేపట్టాలనే ఆదుర్దా మాకు లేదు’ అని గోవా కాంగ్రెస్ కార్యదర్శి చెల్లకుమార్ తెలిపారు. -
సీఎం పదవి నుంచి నన్ను తప్పించండి!
పనాజీ : గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పర్రీకర్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుసుస్తోంది. ఆరోగ్యం కుదుటపడకపోవడంతో చికిత్స కోసం మళ్లీ అమెరికా వెళ్లాలని పర్రీకర్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చెప్పి సీఎం పదవి నుంచి తనను తప్పించమని కోరినట్లు సమాచారం. ‘వినాయక చవితి సందర్భంగా అమిత్ షాకు పర్రీకర్ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. అలాగే తన అనారోగ్య సమస్యల గురించి చెప్పి పదవి నుంచి తప్పించాలని కోరారు. దీనికి సానుకులంగా స్పందించిన అమిత్ షా కొద్ది రోజుల వరకూ పదవిలో కొనసాగాలని కోరారు. ప్రధాని మోదీ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల దిశగా పార్టీ కేంద్రం ఆలోచిస్తోంద’ని బీజేపీ నాయకుడొకరు మీడియాకు తెలిపారు. కాగా, ప్రత్యామ్నాయంపై కేంద్ర బీజేపీ దృష్టి సారించింది. ఈ మేరకు ఢిల్లీ నుంచి ఒక బృందాన్ని సోమవారం గోవా పంపనుంది. ప్రస్తుత పరిణామాలు, ప్రభుత్వ పని తీరుపై పార్టీ నాయకులతో ఈ బృందం చర్చించనుంది. మంత్రి వర్గంలోనూ మార్పులు చేయనున్నట్లు సమాచారం. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రులు పాండురంగ్ మద్కాకర్, ఫ్రాన్సిస్ డి సౌజాలను కూడా మంత్రి వర్గం నుంచి తొలగించాలని భావిస్తున్నారు. సీఎంగా పర్రీకర్ను కొనసాగమని కోరడమా, వేరే వ్యక్తిని నియమించడమా అనే అంశంపై పార్టీ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాంకియాటైటిస్తో బాధపడుతున్న పర్రీకర్ చికిత్స కోసం ఈ ఏడాది మార్చిలో అమెరికా వెళ్లారు. దాదాపు ఏడు నెలల తర్వాత సెప్టెంబరు 7న పరీకర్ భారత్కు తిరిగి వచ్చారు. కాగా మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో గోవాలోని కేండోలిమ్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స కోసం ఆయన ఇప్పటివరకూ మూడుసార్లు అమెరికా వెళ్లివచ్చారు. తాజాగా ఆయన తిరిగి చికిత్స కోసం న్యూయార్క్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పర్రీకర్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి లేకపోవడంతో రాష్ట్రంలో పాలన కుంటుపడిందని, అభివృద్ది ఆగిపోయిందని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని మార్చడమా లేదా పర్రీకర్ను కొనసాగిస్తూ బాధ్యతలను తగ్గిస్తారా అనేది కొద్ది రోజుల్లో తెలియనుంది. -
‘లోఫర్లే అలా చేస్తారు’
పనాజి : అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రవర్తించిన తీరుపై విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రధాని మోదీని కౌగిలించుకోవడం, అనంతరం తన సీట్లో కూర్చుని కన్నుగీటడం వంటి చర్యల ద్వారా రాహుల్ సభా మర్యాదను మంటగలిపారని బీజేపీ నేతలు విరుచుకు పడిన విషయం తెలిసిందే. తాజాగా గోవా బీజేపీ అధికార ప్రతినిధి దత్తప్రసాద్ నాయక్ రాహుల్ గాంధీ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. భారత ప్రజల సమస్యలను, కష్టాలను అర్థం చేసుకోలేని వ్యక్తే ఇలా ప్రవర్తిస్తారంటూ రాహుల్ గాంధీపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కొలువుదీరిన పవిత్రమైన ఆలయం(పార్లమెంటు)లో రాహుల్ చేసిన పనులు చాలా అవమానకర రీతిలో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీల్లో, రోడ్లపై అమ్మాయిలను ఏడిపించే లోఫర్లే ఇలా కన్నుగీటుతారని, రాహుల్ కూడా సభలో ఓ లోఫర్ లాగే వ్యవహరించారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గాంధీ కుటుంబం చేతుల్లో తోలుబొమ్మల్లా మారిన కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్లు చెప్పినట్టల్లా ఆడుతున్నారని విమర్శించారు. కాగా గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్.. బీజేపీ, మిత్ర పక్షాల చేతిలో తోలుబొమ్మగా మారడం వల్లే రాష్ట్రంలో ఫిష్ మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయంటూ కాంగ్రెస్ నేత చోదంకర్ విమర్శించారు. ఈ నేపథ్యంలోనే దత్తప్రసాద్ నాయక్ రాహుల్ గాంధీపై, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. -
స్త్రీలోక సంచారం
గోవా గవర్నర్ మృదుల సిన్హా.. గోవా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పట్టభద్రులైన యువతీయువకులందరి చేతా.. ‘ఎన్ని సమస్యలు ఎదురైనా వివాహాబంధాన్ని గట్టిగా నిలుపుకుంటాం’ అని.. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ సమక్షంలో ప్రతిజ్ఞ చేయించారు. నిరుడు ప్రణబ్ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా మృదుల ఇదే విధమైన ప్రతిజ్ఞ చేయిస్తూ, ‘‘చిన్న చిన్న విషయాలకు గొడవపడి, దాంపత్య బంధం నుంచి బయటికి వచ్చేయకండి. చివరి వరకు కలిసి మెలిసి ఆనందంగా జీవించండి. పెళ్లికి ముందు మ్యారేజీ కౌన్సిలింగ్ తీసుకుంటే, పెళ్లి తర్వాత కౌన్సెలింగ్ తీసుకునే అవసరం రాదు’’ అని హితవు చెప్పారు ::: హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ రెండో వర్ధంతి సందర్భంగా కశ్మీర్లో అల్లర్లు చెలరేగి, రాళ్లు విసురుతున్న మూకలను అదుపుచేయడం కోసం భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఒక టీనేజ్ బాలికతో పాటు ముగ్గురు పౌరులు మరణించారు. సున్నితమైన ప్రాంతాలలో సైనికులు ‘ఏరియా డామినేషన్ పెట్రోలింగ్’ జరుపుతున్నప్పుడు భవనాలపైకి ఎక్కి సైన్యంపై రాళ్లు రువ్వుతున్న వారిని నియంత్రించడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరిపినప్పుడు అద్లీబ్ జాన్ అనే 16 ఏళ్ల బాలిక మరణించిన మాట నిజమేనని రక్షణశాఖ ప్రతినిధి ఒకరు అంగీకరించారు ::: త్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా ఉద్యమించిన సామాజిక హక్కుల కార్యకర్త షయార బానో భారతీయ జనతా పార్టీలో చేరారు. మూడుసార్లు తలాక్ చెబితే చాలు, వివాహబంధం నుంచి తప్పుకోవచ్చనే వెసులుబాటును రద్దు చేయాలని 2016లో కోర్టును ఆశ్రయించి తొలిసారిగా దేశప్రజల దృష్టిలో పడిన ఉథమ్సింగ్నగర్ జిల్లా (ఉత్తరాఖండ్) కాశీపూర్ నివాసి షయార.. త్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమైనదని 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ముస్లిం మహిళాహక్కుల పోరాటయోధురాలిగా గుర్తింపు పొందారు ::: తెలంగాణలో ‘షీ టీమ్’లు ఈవారంలో రెండు బాల్య వివాహాలను అడ్డుకుని, బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇప్పించాయి. భువనగిరి పోలీస్స్టేషన్ పరిధిలో 16 ఏళ్ల బాలికకు 22 ఏళ్ల యువకుడితో, చౌటుప్పల్ పరిధిలో 15 ఏళ్ల బాలికకు 26 ఏళ్ల పురుషుడితో జరగబోతున్న వివాహాలను షీ టీమ్లు సమర్థంగా నివారించి, బాలికలను రక్షించాయి ::: ఈ ఏడాది మే 21న తొమ్మిదేళ్ల బాలికపై లైంగికదాడి జరిపిన వ్యక్తికి మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. పన్నెండేళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడినవారికి మరణశిక్ష విధించాలని గత ఏడాది డిసెంబరులో మధ్యప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ చేసిన ప్రతిపాదన అసెంబ్లీ ఏకగ్రీవ సమ్మతిని పొంది, రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ 21న అమలులోకి వచ్చాక, ఆ చట్టం కింద న్యాయస్థానం విధించిన తొలి మరణశిక్ష ఇదేనని అంటూ, ఈ మరణశిక్ష నేరస్తులకు ఒక బలమైన భయ సంకేతం అవుతుందని ఆ రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి భూపేంద్ర సింగ్ అన్నారు. రాజకీయ చర్చల్లో ట్విట్టర్ ఒక శక్తిమంతమైన వేదికగా అవతరించాక, ఆ చర్చల్లోకి మహిళా జర్నలిస్టులను రానివ్వకుండా పురుష జర్నలిస్టులు తమకు తామే ప్రత్యేక గ్రూపులుగా ఏర్పడుతున్నారని ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ప్రెస్/పాలిటిక్’లో వచ్చిన ఒక అధ్యయన ఫలితం వెల్లడించింది. ఒకవేళ మహిళా జర్నలిస్టులు ఎవరైనా పురుష జర్నలిస్టుల చర్చలకు రీ ట్వీట్ చేసినా, పురుషులు స్పందించడం లేదని, ఆ కారణంగా.. ట్విట్టర్లో రాజకీయ వేదికలపై మహిళా జర్నలిస్టులు తీవ్రమైన వివక్షకు గురవుతున్నారని, ఇది ఆరోగ్యవంతమైన పరిణామం కాబోదని.. అధ్యయ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది ::: స్త్రీవాదిగా ప్రసిద్ధుడైన కెనడా యువ ప్రధాని జస్టిన్ ట్రూడో రాజకీయాలలోకి రాకముందు రెండు దశాబ్దాల క్రితం ఒక మహిళా జర్నలిస్టు ఒంటిపై ఒకట్రెండు చోట్ల ఉద్దేశపూర్వకంగా చేతులతో తాకినట్లు (గ్రోపింగ్) అప్పటి ఒక పత్రిక తన సంపాదకీయంలో రాసిన విషయం.. మళ్లీ ఇప్పుడు కాలగర్భంలోంచి పైకి లేచిన నేపథ్యంలో ‘ఆ మహిళా రిపోర్టర్ను నేనే’ అంటూ రోజ్ నైట్ అనే జర్నలిస్టు ఒక ప్రకటన ఇచ్చారు. ‘‘నేనెందుకు ఆమెను తాకానో తెలియదు కానీ, మీరు అనుకుంటున్న ఉద్దేశంతోనైతే మాత్రం తాకి ఉండను’ అని జస్టిన్ ట్రూడో స్టేట్మెంట్ ఇచ్చిన మర్నాడే రోజ్ నైట్ ఇలా బహిర్గతం అయ్యారు ::: ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కుమార్తె.. పదిహేనేళ్ల గాయత్రి.. అండర్–19 గర్ల్స్ సింగిల్ టైటిల్ గెలుచుకుని ఏషియన్ గేమ్స్కి ఎంపిక అయింది. కొచ్చిలో జరిగిన ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ ఫైనల్ పోటీలలో ‘అన్ సీడెడ్’ అయిన గాయత్రి తన ప్రత్యర్థి, నాలుగో సీడ్ ప్లేయర్ అశ్వినీభట్పై విజయం సాధించింది ::: -
సీఎంకు సమస్యల సవాళ్లు
పనాజి: మూడు నెలల విరామం తరువాత విధి నిర్వహణకు హాజరైన గోవా సీఎం మనోహర్ పారికర్కు సమస్యలు సవాళ్లు విసురుతున్నాయి. అనారోగ్యం కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి అమెరికాలో చికిత్స తీసుకున్నారు. కోలుకోవటంతో ఇటీవల రాష్ట్రానికి తిరిగి వచ్చిన విషయం విదితమే. అయితే పారికర్ స్థానంలో రాష్ట్ర పరిపాలన.. వ్యవహారాలను పర్యవేక్షించిన ముగ్గురు మంత్రుల కమిటీ అన్ని రకాలుగా విఫలమైనట్లు తెలుస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలో మైనింగ్ పరిశ్రమపై పెద్ద ఎత్తున్న ప్రభావం పడింది. 88 మైనింగ్ లీజులపై సుప్రీంకోర్టు స్టే విధించటంతో మైనింగ్ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతోపాటు పలు సమస్యలు పరిష్కరించటంలో మంత్రుల కమిటీ విఫలమైంది. ఇదే అదనుగా ప్రతిపక్ష కాంగ్రెస్.. ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడింది. కర్ణాటక పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీలో పెద్ద పార్టీగా ఉన్న తమకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ గవర్నర్ను డిమాండ్ చేస్తోంది. మొత్తానికి మూడు నెలలపాటు అధికారానికి దూరంగా ఉన్న పారికర్కు, సమస్యలు స్వాగతం పలకటం.. వాటిని పరిష్కరించే పనిలో ఆయన తలమునకలయ్యారు. -
అమెరికా నుంచి జర్నలిస్టులకు సీఎం ఫోన్
పనాజీ: అనారోగ్యం కారణంగా గత నాలుగు నెలలుగా అమెరికాలో చికిత్స పొందుతోన్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ రాష్ట్ర పరిస్థితులపై ఆరాతీశారు. తనకు సన్నిహితంగా ఉన్న జర్నలిస్టులకు ఫోన్ చేసి రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి చర్చించారు. కాగా గత కొద్దికాలంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీకర్ విలేకరులతో మాట్లాడి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థిల గురించి అడిగి తెలుసుకున్నారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని కొద్ది రోజుల్లో రాష్ట్రానికి తిరిగి రానున్నట్లు ముఖ్య మంత్రి పేర్కొన్నారు. సీఎంతో ఫోన్లో మాట్లాడిన ఓ సీనియర్ జర్నలిస్టు మీడియాతో మాట్లాడుతూ... కొద్దిరోజుల్లో గోవాకు వస్తున్నట్లు పరీకర్ చెప్పారన్నారు. ‘ప్రతిరోజు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నాను. ప్రొటోకాల్ ప్రకారం విధులు నిర్వర్తిస్తున్నాం. ప్రభుత్వ ఫైళ్లు స్కాన్ చేసి నాకు మెయిల్ చేస్తున్నారు. టెక్నాలజీ యంత్రాల ద్వారా ప్రతీది ఇక్కడే నుంచే తెలుసుకుంటున్నాను. డాక్టర్స్ని సంప్రదించి కొద్ది రోజుల్లో రాష్ట్రానికి తిరిగి వస్తా’ అని ముఖ్యమంత్రి చెప్పినట్లు పేర్కొన్నారు. కాగా, గతవారం ముఖ్యమంత్రి ఖాతాలోని డబ్బును దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పాలన కుంటుపడింది. రాష్ట్రానికి మరో ముఖ్యమంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రాంకియాటైటిస్తో బాధపడుతున్న పరీకర్ మార్చి 7 నుంచి అమెరికాలో చికిత్స పొందుతున్నారు. అప్పటి నుంచి రాష్ట్ర పరిపాలన వ్యవహారాలను ముగ్గురు మంత్రుల బృందం పర్యవేక్షిస్తోంది. -
‘త్వరలోనే రాష్ట్రానికి సీఎం’
పనాజి: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ జూన్ చివరిలోపు రాష్ట్రానికి తిరిగి వస్తారని ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి సుధీన్ దవలీకర్ తెలిపారు. అనారోగ్య కారణంగా మార్చి 7 నుంచి పారికర్ అమెరికాలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి రాష్ట్ర పరిపాలన వ్యవహారాలను ముగ్గురు మంత్రుల బృందం పర్యవేక్షిస్తోంది. జాన్తో పారికర్ ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటారని దవిలీకర్ తెలిపారు. తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని గతంలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తనకు సీఎం పదవిపై అశాలేదని, పనితీరు బాగుంటే భవిషత్తులో ప్రజలే ఆ పదవి కట్టబెడతారని వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నియమించండని ప్రతిపక్ష కాంగ్రెస్ గతకొంత కాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. -
‘త్వరలోనే తిరిగి వస్తా’
పనాజి: తమ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నియమించాలంటూ గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్వహించిన ధర్నాకు అధికార బీజేపీ స్పందించింది. ధర్నాకు వివరణగా అమెరికాలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ వీడియోను ఆదివారం విడుదల చేసింది. వీడియోలో పారికర్ మాట్లాడుతూ.. తాను పూర్తిగా కోలుకున్నానని, కొన్ని వారాల్లో రాష్ట్రానికి తిరిగి వస్తానని పారికర్ పేర్కొన్నారు. ఈ వీడియోను బీజేపీ కార్యకర్తల సమావేశంలో జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రదర్శించారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న అమిత్షాకు వ్యతిరేకంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నియమించాలని శనివారం పనాజిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం పారికర్ అనారోగ్యంతో అమెరికాలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ముగ్గురు మంత్రుల బృందం రాష్ట్ర పరిపాలన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. -
‘మా రాష్ట్రానికి సీఎం కావాలి’
పనాజి: గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ రాష్ట్రానికి శాశ్వత సీఎంను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం మనోహర్ పారికర్ అనారోగ్యం కారణంగా గత రెండు నెలలుగా అమెరికాలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర పరిపాలన వ్యవహారాలను ముగ్గురు మంత్రుల బృందం పరిశీలిస్తోంది. దీనిని నిరసిస్తూ శనివారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పనాజిలోని మాజీ సీఎం దయానంద్ బందోద్కర్ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిరీష్ చోదన్కర్ మాట్లాడుతూ... మూడు నెలలుగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేరని, ముగ్గురు మంత్రుల బృందాన్ని వెంటనే తొలగించి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. గత మూడు నెలలుగా రాష్ట్ర పరిస్థితిని గవర్నర్కి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నా ఏలాంటి స్పందన లేదని విమర్శించారు. త్వరలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో కాంగ్రెస్ తన పోరాటాన్ని తీవ్రతరం చేయాలని భావిస్తోంది. దయానంద్ బందోద్కర్ విగ్రహం ఎదుట కాంగ్రెస్ ధర్నా నిర్వహించడం గమనార్హం. బందోద్కర్ స్థాపించిన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. -
వదంతులు నమ్మకండి : పరీకర్
పనాజి : మాజీ రక్షణ శాఖ మంత్రి, గోవా సీఎం మనోహర్ పరీకర్ తన ఆరోగ్యం బాగానే ఉందని.. వదంతులను నమ్మవద్దని గోవా ప్రజలకు విఙ్ఞప్తి చేశారని స్పీకర్ ప్రమోద్ సావంత్ తెలిపారు. చికిత్స కోసం అమెరికా వెళ్లిన.. పరికర్ తనతో ఫోన్లో మాట్లాడారని, రెండవ దశ చికిత్స ప్రారంభమైందని చెప్పారని సావంత్ పేర్కొన్నారు. పాలనా అంశాల గురించి అడిగి తెలుసుకున్నారని చెప్పారు. పరీకర్ ఆరోగ్యంపై ఆందోళన వద్దని కోరారు. ప్రాంకియాటైటిస్తో బాధ పడుతున్న పరీకర్ మొదట ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. గత నెల 17న బడ్జెట్ సమావేశం ఉన్నందున గోవాకు వెళ్లిన పరీకర్ ఆరోగ్యం మళ్లీ దెబ్బతినడంతో ముంబైకి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో అధునాతన చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్లారు. -
ఆయన కోలుకుంటున్నారు: కేంద్రమంత్రి ట్వీట్
పనాజి : తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహార్ పారికర్ ప్రస్తుతం కోలుకుంటున్నారని కేంద్రమంత్రి సురేష్ ప్రభు ట్విట్ చేశారు. ప్యాంక్రియాటిక్ సమస్యతో గతకొంత కాలంగా ఇబ్బంది పడుతున్న పారికర్ అమెరికాలో వైద్యం తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పారికర్ ఆరోగ్యంపై వాకాబు చేసిన సురేష్ ప్రభు.. ‘ప్రస్తుతం పారికర్ వైద్యానికి స్పందిస్తున్నారు, వేగంగా కోలుకుని, త్వరలోనే రాష్ట్రానికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను’ అని తన ట్వీటర్లో పేర్కొన్నారు. ప్యాంక్రియాటిక్ సమస్యతో పారికర్ ఫిబ్రవరి 14న ముంబాయిలోని లీలావతి హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రోజునే ఆయన రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశాలు ముగిసిన అనంతరం సమస్య తీవ్రం కావడంతో పారికర్ పనాజీలోని గోవా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ చేరారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మార్చి మొదటి వారంలో ఆయనను అమెరికా తీసుకెళ్లారు. కాగా సీఎం రాష్ట్రంలో లేని కారణంగా ముగ్గురు మంత్రుల బృందం రాష్ట్ర పరిపాలన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. -
అమెరికా నుంచే పరీకర్ పాలన
సాక్షి, న్యూఢిల్లీ : గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లారు. అయితే ఆయన ఎలాంటి జబ్బుతో బాధ పడుతున్నారో వెల్లడించలేదు. వైద్య చికిత్స కోసం ఆయన ఆరు వారాలపాటు అమెరికాలో ఉంటారని అటు ప్రభుత్వ వర్గాలు, ఇటు బీజేపీ వర్గాలు ప్రకటించాయి. ఆయన గైర్హాజరీలో ఆయన తరఫున సీఎం బాధ్యతలను మనోహర్ పరీకర్ ఎవరికీ అప్పగించలేదు. ఆయన ముఖ్యమంత్రి సహా దాదాపు 20 కేబినెట్ శాఖలను ఆయనే నిర్వహిస్తున్నారు. తన ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా తానే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలను నిర్వహిస్తానంటూ మనోహర్ పరీకర్ అమెరికా వెళ్లే ముందు రాష్ట్ర గవర్నర్ మధుల సిన్హాకు ఓ లేఖను అందజేసి వెళ్లారు. తాను నిర్వహిస్తున్న హోం, ఆర్థిక, సాధారణ పరిపాలన వ్యవహారాలు తదితర శాఖల సమావేశాలను ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా నిర్వహిస్తానని, అది సాధ్యంకాని సందర్భాల్లో తాను ప్రతిపాదించిన వ్యక్తి సమావేశాలను నిర్వహిస్తారని ఆ లేఖలో పరీకర్ స్పష్టం చేశారు. ఆయన అమెరికా బయల్దేరి వెళ్లే ముందు ఓ ముగ్గురు సభ్యులతో కలిసి ఓ కేబినెట్ సలహా సంఘాన్ని ఏర్పాటు చేశారు. కీలక సమయాల్లో మాత్రం ముఖ్యమంత్రినే తుది నిర్ణయం తీసుకుంటారు. గోవాలో సంకీర్ణ ప్రభుత్వం ఉండటం వల్ల భారతీయ జనతా పార్టీ నుంచి ఫ్రాన్సిస్ డిసౌజా, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ నుంచి రామకష్ణ సుధీన్, గోవా ఫార్వర్డ్ పార్టీ నుంచి విజయ్ సర్దేశాయ్లను సలహా సంఘంలోకి తీసుకున్నారు. అయితే రాజ్యాంగం నిబంధనల ప్రకారం కే బినెట్కు సలహా సంఘాన్ని ఏర్పాటు చేసుకునే హక్కులే దని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. పరీకర్ తన కేబినెట్ మంత్రులపై నమ్మకం లేకపోవడం వల్లనా లేదా సమర్థులైన వ్యక్తులు లేనందున సీఎం బాధ్యతలు ఇతరులకు అప్పగించడం లేదని ప్రశ్నించగా, సమర్థులైన నాయకులు లేకనే అని సమాధానం వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లకుగాను కాంగ్రెస్ పార్టీకి 17 సీట్లు రాగా, బీజేపీకి 13 సీట్లు వచ్చాయి. ఇతర పార్టీల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు జరుగకుండా ఉండేందుకు పరీకర్ ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
చికిత్స కోసం విదేశాలకు వెళ్లనున్న పరీకర్
పనాజీ: కొంతకాలంగా క్లోమ గ్రంధి సమస్యతో బాధపడుతోన్న గోవా సీఎం మనోహర్ పరీకర్ ముంబైలోని ఆస్పత్రిలో చేరారు. అక్కడి వైద్యుల సూచన మేరకు విదేశాలకు వెళ్లనున్నట్లు సీఎంవో కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. చికిత్స నిమిత్తం ఆయన అమెరికా వెళ్లనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సీఎం రాష్ట్రంలో లేని సమయంలో పాలనాపరమైన సూచనలిచ్చేందుకు ‘కేబినేట్ సలహా కమిటీ’ఏర్పాటైంది.పరీకర్ నేతృత్వంలో సోమవారం ఇక్కడ జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయించారు. బీజేపీకి చెందిన సీనియర్ మంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా, గోవా ఫార్వార్డ్ పార్టీ(జీఎఫ్పీ)కి చెందిన విజయ్ సర్దేశాయ్, మహారాష్ట్రవాదీ గోమంత్రక్ పార్టీ(ఎమ్జీపీ)కి చెందిన పలువురు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. సీఎం పలువురు పోలీసు ఉన్నతాధికారులతో కూడా సమావేశమయ్యారు. -
'పారికర్కు కూడా ఆ విషయం తెలియదు'
సౌందట్టి (కర్ణాటక) : రాఫెల్ ఒప్పందంలో మార్పు చేస్తున్న విషయం అప్పుడు రక్షణశాఖ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్కు కూడా తెలియదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. పారికర్కు తెలియకుండానే ప్రధాని నరేంద్రమోదీ ఈ పనిచేశారని చెప్పారు. ఆ సమయంలో గోవాలో పారికర్ చేపలు కొనుగోలు చేస్తున్నారంటూ చమత్కరించారు. 'మాజీ రక్షణ శాఖమంత్రి గోవాలోని ఫిష్ మార్కెట్లో చేపలు కొనుగోలు చేస్తున్నారు. ప్రధాని మోదీ రాఫెల్ కాంట్రాక్టును పూర్తిగా మార్చేసిన విషయం ఆయనకు తెలియదు' అని రాహుల్ అన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి మూడు ప్రశ్నలు ప్రధాని మోదీకి మీడియా ప్రతినిధులు సంధించాలని విజ్ఞప్తి చేశారు. అసలు రాఫెల్ జెట్ల ఖరీదు ఎంత? ఆ కాంట్రాక్టును ఎందుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) నుంచి తొలగించారు? ఎందుకు ఓ వ్యాపార వేత్తకు ఆ కాంట్రాక్టు అప్పగించారు? ఈ ప్రశ్నలు నేను గతంలో కూడా ప్రధానికి వేశాను. కానీ, ఒక్క సమాధానం లభించలేదు. మీకు దొరుకుతుందేమో ప్రశ్నించండి?' అని రాహుల్ అన్నారు. కర్ణాటకలో ఎన్నికలు ఏప్రిల్ లేదా మే నెలలో జరగనున్న నేపథ్యంలో రాహుల్ ప్రచార వేడిని పెంచారు. అందులో భాగంగా జరిగిన బహిరంగ సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. -
మళ్లీ ఆస్పత్రిలో చేరిన ముఖ్యమంత్రి!
పనాజీ : కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్ మరోసారి ఆస్పత్రిలో చేరారు. డీహైడ్రేషన్, రక్తపోటు (బీపీ) పడిపోవడంతో ఆయన ఆదివారం రాత్రి గోవా మెడికల్ కాలేజీలో చేరారు. కొంతకాలంగా అస్వస్థతతో ఉన్న పారీకర్ (62)ను అమెరికా తరలించి చికిత్స అందించే అవకాశముందని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కథనాలను పారీకర్ను చికిత్స అందిస్తున్న ఆస్పత్రి తోసిపుచ్చింది. ప్రస్తుతం సీఎం కోలుకుంటున్నారని తెలిపింది. ‘డీహైడ్రేషన్ కారణంగా సీఎం వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరారు. ఆయన త్వరితగతిన కోలుకుంటున్నారు’ అని గోవా సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. స్పెషలిస్ట్ డాక్టర్లు సీఎం ఆరోగ్యపరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని గోవా ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణే మీడియాకు తెలిపారు. వీల్చైర్ మీద సీఎం పారీకర్ను ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ సమయంలో ఆయన వెంట కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. ఫిబ్రవరి 15న అనారోగ్యం కారణంగా ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో పారీకర్ చేరిన సంగతి తెలిసిందే. పాన్క్రియాటిస్ (క్లోమ సంబంధ) అస్వస్థతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 22న ఆస్పత్రి నుంచి డిశార్జ్ అయి.. గోవా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. -
క్షేమంగా ఇంటికి వెళ్లిన సీఎం..
సాక్షి, పనాజీ : గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ డిశ్చార్జ్ అయ్యారు. ఆయన చికిత్స పొందుతున్నలీలావతి ఆస్పత్రి నుంచి గురువారం ఇంటికి పంపించారు. దీంతో ఆయన అక్కడ నుంచి నేరుగా గోవాకు చేరుకున్నారు. ఈ విషయాన్ని గోవా డిప్యూటీ స్పీకర్ మైఖెల్ లాబో స్పష్టం చేశారు. ఈ నెల (ఫిబ్రవరి) 15 నుంచి ప్యాంక్రియాటిస్ సమస్య కారణంగా లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై దుష్ప్రచారం కూడా జోరుగా సాగింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే, పారికర్ చనిపోతే మరొకరు ముఖ్యమంత్రి అవుతారు అందులో అనుకోవడానికి ఏముందంటూ పెట్టి కలకలం రేపారు. ఈ వార్తలతో అసలు పారికర్కు ఏమైందంటూ పెద్ద స్థాయిలో చర్చ జరిగింది. అయితే, అవన్నీ కూడా ఊహాగానాలే అని పారికర్ డిశ్చార్జి కావడంతో స్పష్టమైంది. 'పారికర్ గోవా చేరుకున్నారు. ఆయన ఆస్పత్రి నుంచి విడుదల కావడం మంచి శుభవార్త. అయితే, ఆయన ఎప్పుడు బడ్జెట్ను ప్రవేశ పెడతారనే విషయం ఇప్పుడే తెలియదు' అని మైఖెల్ చెప్పారు. పారికర్కు ఉన్న పట్టుదల సామర్థ్యమే ఆయనను కోలుకునేలా చేసిందని, ఆయనే బడ్జెట్ బిల్లు ప్రవేశ పెట్టాలని అనుకుంటే కచ్చితంగా త్వరలోనే పెడతారని స్పష్టం చేశారు. ప్రస్తుతం పారికర్ పనాజీలోని తన నివాసానికి వెళ్లారు. -
'పారికర్ను అమెరికాకైనా తరలిస్తాం..'
సాక్షి, పనాజీ : అవసరం అయితే మెరుగైన వైద్యం కోసం గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ను అమెరికా తరలిస్తామని బీజేపీ నేత, గోవా డిప్యూటీ స్పీకర్ మైఖెల్ లాబో చెప్పారు. క్లోమం (ప్యాంక్రియాస్) సంబంధించిన సమస్య ఏర్పడిన కారణంగా కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురైన పారికర్ ప్రస్తుతం ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ప్రధాని మోదీ కూడా ఆయనను పరామర్శించి రావడంతో అంతలా పారికర్కు ఏమైందంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. అయితే, వాటన్నింటిని ఆస్పత్రి వర్గాలు కొట్టి పారేశాయి. ఆయన కోలుకుంటున్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మైకెల్ కూడా సోమవారం ఓ ప్రకటన చేశారు. 'ఆయన మాకు కావాలి. మేం చేయగలిగిందంతా చేస్తాం. అవసరం అయితే, ఆయనను అమెరికాకు కూడా తరలిస్తాం' అని మీడియా ప్రతినిధులతో అసెంబ్లీ ప్రాంగణంలో చెప్పారు. ప్యాంక్రియాస్కు సంబంధించిన సమస్య కారణంగా పారికర్ ఈ నెల (ఫిబ్రవరి) 15న లీలావతి ఆస్పత్రిలో చేరి వైద్యంసేవలు పొందుతున్నారు. ఆయనకు ఓ సర్జరీ కూడా చేయగా ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆస్పత్రి వర్గాలు ఇప్పటికే చెప్పాయి. -
సీఎం ఆరోగ్యంపై వదంతులు.. ఖండన!
సాక్షి, ముంబై : గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను ఆయనకు చికిత్స అందిస్తున్న ముంబైలోని ప్రఖ్యాత లీలావతి ఆస్పత్రి ఖండించింది. పారికర్ ఆరోగ్యం విషయమై మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, రూమర్లు అన్ని అవాస్తవమేనని, ఆయన చక్కగా చికిత్సకు స్పందిస్తున్నారని ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. సీఎం పారికర్ ఆరోగ్యం గురించి దురుద్దేశంతోనే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, ఆయన ఆరోగ్యం విషయంలో వస్తున్న కథనాలు బూటకమని ఆస్పత్రి తీవ్రంగా పేర్కొంది. ‘మాగ్నెటిక్ మహారాష్ట్ర’ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో పాల్గొనేందుకు ముంబై వచ్చిన ప్రధాని మోదీ ఆదివారం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పారికర్ను పరామర్శించిన సంగతి తెలిసిందే. అనారోగ్యంబారిన పడటంతో ఈ నెల 15న పారికర్ లీలావతి ఆస్పత్రిలో చేరారు. త్వరలోనే ఆయన కోలుకుంటారని, అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారని గోవా సీఎంవో ఇప్పటికే ప్రకటించింది. -
గోవా సీఎం వ్యాఖ్యలపై నెటిజన్ల ఆగ్రహం!
సాక్షి, హైదరాబాద్ : అమ్మాయిలు కూడా బీర్లు తాగడం మొదలుపెట్టేశారని.. వారిని చూస్తుంటే తనకి భయమేస్తోందని గోవా సీఎం మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పలువురు 'గర్ల్స్ హూ డ్రింక్ బీర్' హ్యాష్ ట్యాగ్ జోడిస్తూ, పారికర్ వ్యాఖ్యలకు నిరసనగా బీరు తాగే ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. అమ్మాయిలు బీరు తాగడాన్ని మాత్రమే చూశానని పారికర్ చెబుతున్నారని, మహిళలు పోర్న్ చూస్తారని, సిగరెట్లు తాగుతారని ఆయనకు తెలిస్తే నెలల తరబడి నిద్రపోరేమోనని ఒకరు, ప్రధాని మహిళను చూసి నవ్వుతారు, పారికర్ అమ్మాయిలను చూసి భయపడతారు, యోగి మహిళలను ఇంటికే పరిమితం చేయాలంటారు... వీరా మన పాలకులు అని ఇంకొకరు ప్రశ్నిస్తున్నారు. పారికర్ కు ఎనిమిది నెలల పాటు అత్యాచారనికి గురైన అమ్మాయి విషయం తెలియదా? పరువు హత్యలు కనిపించడం లేదా? పట్టపగలు బస్సుల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు తెలియవా అని నిలిదీస్తున్నారు. ఇవన్నీ పారికర్ ను భయపెట్టలేదా అని ట్రోల్ చేస్తున్నారు. ఓ అమ్మాయిగా బీరు తాగడం నాకిష్టం అంటూ పలువురు అమ్మాయిలు బీరు తాగుతున్న ఫొటోలను పోస్టు చేస్తున్నారు. ఇంకొందరు యువతులైతే తండ్రితో బీరు తాగిన ఫొటోలను పోస్ట్ చేయండని సూచిస్తున్నారు. To Sir, With Love. Cheers from Goa, Mr Parrikar! #GirlsWhoDrinkBeer C’mon good ladies, let’s make this weekend worth it. Use the hashtag and share your beer 🍻 pics on my timeline. The one with the best pic, your beer is on me. pic.twitter.com/6AX3jejIIV — Nishtha Gautam (@TedhiLakeer) 10 February 2018 -
‘అలాంటి అమ్మాయిలను చూస్తే భయమేస్తోంది’
సాక్షి, పనాజీ : భారత్లో మద్యం సేవించే యువతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని సర్వేలో స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోవా ముఖ్యమంత్రి మనోహర్పారికర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు కూడా బీర్లు తాగటం మొదలుపెట్టేశారని.. వారిని చూస్తుంటే తనకి భయమేస్తోందని ఆయన అంటున్నారు. ‘‘అమ్మాయిల్లో ఆల్కహాల్ సేవించే అలవాటు పెరిగిపోయింది. అది పరిమితి ఎప్పుడో దాటి పోయింది. బీర్లు ఎగబడి తాగేస్తున్నారు. ఇది నాకు ఎంతో భయాన్ని కలగజేస్తోంది’ అని పారికర్ పేర్కొన్నారు. గోవాలో జరిగిన స్టేట్ యూత్ పార్లమెంట్ కు హాజరైన యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈ మాట అమ్మాయిలందరినీ ఉద్దేశించి నేను అనటం లేదు. ఇక్కడున్న వాళ్లలో ఆ అలవాటు లేకపోలేదు. కానీ, గోవాలో గత రెండేళ్లలో మద్యం సేవిస్తున్న అమ్మాయిల సంఖ్య మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. దీనికి అడ్డుకట్ట పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని పారికర్ అభిప్రాయపడ్డారు. ఇక గోవాలో మాదకద్రవ్యాల వ్యాపారంపై ఆయన మాట్లాడుతూ.. డ్రగ్ నెట్ వర్క్ ను అంతమొందించే ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. కాలేజీలో డ్రగ్స్ సంస్కృతి ఎక్కువగా ఉందని తాను భావించడం లేదని.. కానీ, మొత్తానికి లేదన్న వాదనతో మాత్రం తాను ఏకీభవించబోవని చెప్పారు. ఇప్పటి వరకు 170 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. చట్టంలోని లోపాలతో నిందితులు త్వరగతిన బయటపడుతున్నారని.. అందుకే శిక్షాస్మృతిని సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక నిరోద్యోగ సమస్యపై స్పందిస్తూ... గోవా యువత కష్టపడి పని చేయడానికి ఇష్టపడటం లేదని... సింపుల్ వర్క్ వైపే మొగ్గుచూపుతున్నారని చెప్పారు. గవర్నమెంట్ జాబ్ అంటే పని ఉండదనే భావంతో ఉన్నారని పారికర్ అసహనం వ్యక్తం చేశారు. -
గోవాలో అలా మద్యం సేవిస్తే జైలుకే!
పణజి : భారత్లో అత్యధికులు సందర్శించే ప్రాంతంగా.. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తలసరి ఆదాయంలో అగ్రగామిగా ఉన్న గోవాకు పర్యాటకమే ప్రాణవాయువన్న సంగతి తెలిసిందే. అందమైన బీచ్లు, నైట్లైఫ్తోపాటు మద్యసేవనానికి కూడా చాలా మంది పర్యాటకులు ఓటేస్తారు. అయితే ఇక నుంచి గోవాలో.. ఎక్కడపడితేఅక్కడ మందు తాగడం కుదరదు. ఎందుకంటే బహిరంగ మద్యసేవనాన్ని నేరంగా పరిగణించాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తున్నది, ఆ మేరకు రూపొందించిన చట్టాన్ని అతిత్వరలోనే అమలుచేయనుంది. రెండు కఠిన చట్టాలు : గురువారం పణాజిలో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘గోవాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని నిషేధించబోతున్నాం. దానికి సంబంధించిన చట్టానికి ఫిబ్రవరి చివర్లో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఆమోదిస్తాం. దీనితోపాటు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడాన్ని కూడా నేరంగా పరిగణించేలా చట్టాల్లో మార్పులు చేస్తాం. ఈ రెండూ కఠినంగా అమలైతే గోవా పరిశుభ్రంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహంలేదు’ అని చెప్పారు. మందుబాబులకు షాకిచ్చిన కేరళ సర్కార్ : రాష్ట్రంలో తయారయ్యే విదేశీ మద్యంపై పన్నులు భారీగా పెంచుతూ కేరళ సర్కార్ నిర్ణయం తీసుకుంది. తద్వారా మందుబాబులకు షాకిచ్చింది. రూ.400లోపు విదేశీ మద్యంపై 200 శాతం, బీర్లపై 100 శాతం ట్యాక్స్ విధిస్తున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. -
బీజేపీలో వింత పరిస్థితి
లక్నో: కేంద్రంలోనూ, 19 రాష్ట్రాల్లోనూ అధికారాన్ని చెలాయిస్తున్న కమలం పార్టీలో వింత పరిస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ సీటును దక్కించుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మాజీ రక్షణ మంత్రి, ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ రాజీనామాతో ఖాళీ అయిన పెద్దలసభ సీటును బీజేపీలో ఎవరూ ఆశించకపోవడం వెనుక మరో కారణం ఉంది. పరీకర్ రక్షణమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయనను యూపీ నుంచి రాజ్యసభకు నామినేట్ చేశారు. మళ్లీ తన సేవలు అవసరం పడటంతో ఆయన తన సొంత రాష్ట్రానికి వెళ్లిపోయారు. ఆశావహుల నిరాసక్తత పార్టీలో ఏదైనా పదవి ఖాళీగా ఉందంటే ఆశావహులు భారీగా పైరవీలకు దిగుతుంటారు. కానీ పరీకర్ వదిలివెళ్లిన రాజ్యసభ సీటు దక్కించుకునేందుకు ఎవరూ ముందుకురావడం విస్తుగొల్పుతుంది. ఈ సీటుకు గడువు 2020, నవంబర్ వరకు ఉంది. రెండున్నరేళ్లలో గడువు ముగియనుండటంతో దీనిపై బీజేపీ నేతలెవరూ ఆసక్తి చూపడం లేదు. పూర్తికాలం కొనసాగే పదవులు చేపట్టే అవకాశముండగా స్వల్పకాలిక పోస్ట్ ఎందుకున్న భావనతో ఆశావహులు ఉన్నట్టు కనబడుతోంది. ఎనిమిది సీట్లపైనే గురి ఈ ఏడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. 403 సీట్లున్న శాసనసభలో కమలదళం బలం 325కు పెరగడంతో రాష్ట్రంలో 8 రాజ్యసభ సీట్లు ఈ పార్టీకి దక్కనున్నాయి. మరో ఆరు నెలల్లో ఈ సీట్లను భర్తీ చేస్తారు. ఈ ఆరు మాసాలు ఓపిక పడితే ఆరేళ్ల పదవి సొంతమవుతుందన్న భావనతో పరీకర్ సీటును ఎవరూ ఆశించడం లేదు. ‘రెండేళ్ల రాజ్యసభ సీటు పట్ల ఆశావహులు ఆసక్తి చూపడం లేదు. వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్న యూపీలోని పది రాజ్యసభ సీట్ల కోసమే పైరవీలు చేస్తున్నార’ని బీజేపీ అంతర్గత వర్గాలు వెల్లడించాయి. అల్ఫోన్స్కు ఛాన్స్ అయితే ఈ ప్రచారాన్ని బీజేపీ ప్రధాన కార్యదర్శి విజయ్ బహదూర్ పాఠక్ తోసిపుచ్చారు. ఖాళీ అయిన సీటును ఎవరికి కేటాయించాలనేది తమ పార్టీ పార్లమెంటరీ సెంట్రల్ బోర్డు నిర్ణయిస్తుందని చెప్పారు. త్వరలోనే అభ్యర్థిని ఎంపిక చేస్తుందని తెలిపారు. పరీకర్ సీటు కోసం తమ పార్టీ నేతలు ఎందుకు పైరవీలు చేయడం లేదనే దానికి కారణం లేదన్నారు. ఈ సీటును కేంద్ర పర్యాటక శాఖ సహాయమంత్రి కె. అల్ఫోన్స్కు కేటాయించే అవకాశముందని లక్నో రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో ఎన్నిక జరగనున్న ఈ స్థానంలో అభ్యర్థిని నిలిపేందుకు ప్రతిపక్షం సిద్ధమవుతోంది. పదో సీటు ఎవరిదో..? యూపీలో వచ్చే ఏడాది ఖాళీ కానున్న 10 రాజ్యసభ సీట్లలో బీజేపీ సొంత బలంతో కనీసం ఎనిమిదింటిని దక్కించుకుంటుంది. 47 మంది ఎమ్మెల్యేలు కలిగిన సమాజ్వాదీ పార్టీ ఒక సీటు గెలిచే అవకాశముంది. పదో సీటును ప్రతిపక్షాలు దక్కించుకోవాలంటే సమాజ్వాదీ పార్టీకి బీఎస్పీ(19), కాంగ్రెస్(7), ఆర్ఎల్డీ(1) మద్దతు అవసరమవుతుంది. యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావాలంటే 37 ప్రథమ ప్రాధాన్య ఓట్లు అవసరం. -
ముందు చరిత్ర చదవండి!
పనాజీ: బీజేపీ ప్రభుత్వాన్ని నాజీ పాలనతో పోల్చే వారు ముందుగా యూరోప్ చరిత్ర చదవాలని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ హితవు పలికారు. పోర్చుగీసు హయాంనాటి భారత వ్యతిరేక భావజాలం మళ్లీ గోవాలో తలెత్తుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన గోవా లిబరేషన్ డే వేడుకల్లో పారికర్ పాల్గొని ప్రసంగించారు. కొంతమంది కావాలనే తమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. బీజేపీ పాలనను నాజీ పాలనతో పోల్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల చరిత్రను చదివి అప్పుడు తమ ప్రభుత్వాన్ని విమర్శించాలని సూచించారు. అలాంటి వారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మనం ఇతరుల తప్పులను ఒక వేలుతో సూచిస్తే మిగతా నాలుగు వేళ్లు మన వైపు సూచిస్తాయన్నారు. ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రోమన్ క్యాథలిక్ చర్చ్ వెలువరించే ఒక మేగజైన్లో బీజేపీ పాలనను నాజీ పాలనతో పోలుస్తూ వ్యాసం వచ్చింది. ఆ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. దుష్ప్రచారం చేస్తున్న వారిని పట్టించుకునే సమయం ప్రభుత్వానికి లేదన్నారు. గోవా అభివృద్ధే తమ ధ్యేయం అని తెలిపారు. పోర్చుగీసు వారి ఆధీనంలో ఉన్న గోవాను భారత సాయుధ బలగాలు 19 డిసెంబర్ 1961న స్వాధీనం చేసుకొన్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. -
రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రాలు.. విమర్శలు!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత రాహుల్గాంధీ ఎదురైన తొలి ఫలితాల్లో నిరాశ ఎదురైందని చెప్పవచ్చు. రాహుల్గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడైన తర్వాత వెలువడిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమిపాలైంది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఊహించినదే అయినా.. మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్లో హస్తం ఓడినప్పటికీ.. గట్టిపోటీ ఇచ్చింది. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టిపోటీ ఇవ్వడం.. అసెంబ్లీ సీట్లపరంగా కూడా మెరుగవ్వడం సానుకూల పరిణామమని పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్గాంధీకి ఇది శుభారంభమేనని చెప్తున్నారు. అయితే, బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు మాత్రం రాహుల్పై వ్యంగ్యాస్త్రాలు, విమర్శలు సంధిస్తున్నారు. ఆదిలోనే హంసపాదు అన్న తరహాలో రాహుల్కు ఆరంభంలోనే పరాజయాలు పలుకరించాయని ఎద్దేవా చేశారు. రాహుల్ అధ్యక్షుడు కాగానే దురదృష్టం వెంటాడినట్టు ఆయనను ఈ ఫలితాలు పలుకరించాయని కేంద్ర హోంమంత్రి రాజ్నాత్ సింగ్ విమర్శించారు. రాహుల్ తన ఓపెనింగ్ ఇన్నింగ్స్ జీరో కొట్టారని గోవా సీఎం మనోహర్ పారికర్ ఎద్దేవా చేశారు. రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడైతే.. తమ పని సులువు అవుతుందని తాను చెప్పానని, అదే ఈ ఫలితాల్లో రుజువైందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. -
మందు కొడితే.. అత్తారిల్లే..!?
సాక్షి, పనాజీ: రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యపానాన్ని నిషేధిస్తున్నట్లు గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారేకర్ ఆదివారం ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లోనూ, రహదారులమీద మద్యం సేవించిన వ్యక్తులు సృష్టించే ఆగడాలకు అంతు ఉండడంలేదని చెప్పారు. ఇలా కొంతమంది తాగుబోతులు చేసే వికృతచేష్టల వల్ల ఇక్కడకు వచ్చే పర్యాటకులు ఇదోక తాగుబోతుల రాష్ట్రంగా భావించే అవకాశం ఉందన్నారు. బహిరంగ మద్యపాన నిషేధానికి సంబంధించిన ఎక్సైజ్ చట్టానికి సవరణలు చేసి అమలు చేస్తామని ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యనిషేధానికి సంబంధించిన నోటిఫికేషన్ను వచ్చే నెల్లో విడుదల చేస్తామని పారేకర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లఘించిన వారిని ఎక్సైజ్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని చెప్పారు. -
రాజీనామా చేసి, ఇంట్లో కూర్చుంటా: సీఎం
సాక్షి, పనాజీ : ‘నాది రాజకీయ నేపథ్య కుటుంబం కాదు. ఇంకా చెప్పాలంటే రాజకీయాల్లోకి వస్తానని కలలో కూడా అనుకోలేదు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం 10 ఏళ్ల కాలానికే రాజకీయాలకు గుడ్ బై చెబుతానని భావించాను. ఒకవేళ నేను రాజకీయాలకు తగిన వాడిని కాదని ఆలోచన వస్తే మాత్రం క్షణం కూడా ఆలోచించకుండా నా పదవికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చునేవాడినని’ కేంద్ర మాజీ మంత్రి, గోవా సీఎం మనోహర్ పారికర్ అన్నారు. ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ అయిన తాను తనకు ఇష్టం లేకున్నా రాజకీయ జీవితం ప్రారంభించాల్సి వచ్చిందని ఇటీవల ఓ కార్యక్రమంలో వెల్లడించారు. ’గతంలో కేంద్రం సూచన మేరకు సీఎం పదవికి రాజీనామా చేసి అక్కడ మంత్రి పదవి చేపట్టాను. అయితే గోవా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మళ్లీ మీ కోసం తిరిగొచ్చేశాను. ఈసారి ఏం జరిగినా సరే.. ఎలాంటి ఆపద వచ్చినా తట్టుకుని నిలబడతాను. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో విడిచి వెళ్లిపోను. సీఎంగా పూర్తికాలం పదవిలో కొనసాగుతాను. మా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకాలేదు. నాది రాజకీయ నేపథ్య కుటుంబం కాదు. ఒకవేళ పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టినవాడినైతే ఢిల్లీ రాజకీయాలకు అనుగుణంగా మారేవాడినని’ ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల గోవాలోని పనాజీ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో పోటీచేసిన సీఎం పారికర్ ఘన విజయం సాధించారు. -
సైనికులకు ఇక ఏసీ జాకెట్స్
న్యూఢిల్లీ: ఉష్ణోగ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో సేవలందించే స్పెషల్ ఫోర్స్ సైనికులకు ఎయిర్ కండిషన్ (ఏసీ) జాకెట్లను సరఫరా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఈ జాకెట్లను ఏ మెటీరియల్, టెక్నాలజీతో రూపొందిస్తారనే వివరాలు వెల్లడికాకపోయినా ఈ తరహా జాకెట్లను సైనికులకు సమకూర్చే ప్రతిపాదనను రక్షణ శాఖ మాజీ మంత్రి మనోహర్ పారికర్ నిర్ధారించారు. ప్రత్యేక బలగాల ఆపరేషన్ సుదీర్ఘంగా సాగే ప్రక్రియ కావడంతో సైనికుల శరీరం వేడెక్కే అవకాశం ఉండటంతో వారికి తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. ఆ సమయంలో సైనికులు ఏసీ జాకెట్ ధరిస్తే వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని పారికర్ పేర్కొన్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ప్రస్తుత గోవా సీఎంగా ఉన్న పారికర్ ఆదివారం పనాజీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. అమెరికన్ సైనికులు ఇప్పటికే ఇలాంటి జాకెట్స్ వాడుతున్నారు. దుస్తుల్లో చిన్న బ్యాటరీని అమర్చడం ద్వారా సైనికుల శరీరం వేడెక్కకుండా ఈ జాకెట్లను అమెరికా రక్షణ శాఖ సైనికులకు సమకూర్చింది. -
ఓడిపోయినా తిరిగి మంత్రిని అవుతా!
ముంబై: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పై బీజేపీ మిత్రపక్షం శివసేన మండిపడింది. తాను పనాజీ ఎన్నికలో ఓడిపోయినా ఫర్వాలేదని, కేంద్ర రక్షణ మంత్రి పదవి తన కోసం తిరిగి ఎదురు చూస్తోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో కూడిన ఓ వీడియో ఈ మధ్య వైరల్ అవుతోంది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతుండగా, శివసేన తన పత్రిక సామ్న సంపాదకీయంలో పారికర్ను ఏకీపడేసింది. "పారికర్ రాజకీయ ధురంధరుడు, నిజాయితీ పరుడు అన్న మాట ఈ ప్రకటనతో అబద్ధమని తేలింది. ఓ ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఆయన చేయాల్సిన వ్యాఖ్యలు కావు. దేశ అత్యున్నత పదవిని కూడా హేళన చేస్తూ ఆయన మాట్లాడారు. తనపై నమ్మకంతో రక్షణ మంత్రి బాధ్యతలు అప్పజెప్పిన ప్రధాని మోదీని కూడా ఆయన అవమానించారు" అని సామ్న వ్యాసంలో పేర్కొంది. ఇలాంటివి ప్రజల్లో నేతలపై నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తాయని తెలిపింది. అంతేకాదు సరిహద్దులో ఓ పక్క ఉద్రిక్తత పరిస్థితి ఉన్న సమయంలో, పారికర్ సెలవుపై గోవాకు వెళ్లి చేపల కూర వండుకుని తిన్న ఉదంతంను కూడా సామ్న ప్రస్తావించింది. అయితే బీజేపీ మాత్రం పారికర్ వ్యాఖ్యలతో కూడిన టేప్ను ఓ అబద్ధంగా తేల్చేసింది. ఈ విషయంపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన పార్టీ అబద్ధపు ప్రచారంతో ఎన్నికల కోడ్ ను ఉల్లఘిస్తున్నారంటూ పేర్కొంది. రక్షణ మంత్రిగా రాజీనామా చేసిన పారికర్, గోవాలో తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తిరిగి ప్రత్యక్ష ఎన్నిక సమరానికి సిద్ధమైపోతున్న విషయం తెలిసిందే. ఆగష్టు 23న పనాజీ, వల్పోయి నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరగనున్నాయి. నేనేం ఢిల్లీ వెళ్లట్లేదు... ఫడ్నవిస్ మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు కోసం బీజేపీ అధిష్ఠానం కసరత్తు చేస్తుందన్న వార్తలపై సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ఆ వార్తలో నిజం లేదని ఆయన తేల్చేశారు. కేంద్ర మంత్రి పదవిపై తనకు ఎలాంటి ఆసక్తి లేదని, అధిష్ఠానం నుంచి అలాంటి సంకేతాలు కూడా అందలేదని ఆయన తెలిపారు. 2019 వరకు తాను ముఖ్యమంత్రిగా, రావ్ సాహెబ్ దన్వే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగుతారని ఫడ్నవిస్ స్పష్టం చేశారు. -
సర్జికల్ స్ట్రైక్స్ పై ‘ఆయన’కు నో ఐడియా
సాక్షి, పనాజీ: యూరీ దాడికి ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి ముష్కరులను మట్టుపెట్టింది భారత సైన్యం. ఆ సమయంలో రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ నేతృత్వంలోనే ఈ మెరుపు దాడి జరిగిందన్న విషయం విదితమే. అయితే దీనిపై గొప్పలు చెప్పుకున్న పారికర్కు, సర్జికల్ స్ట్రైక్స్పై కనీస అవగాహన కూడా లేదంటోంది కాంగ్రెస్. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన గోవా ముఖ్యమంత్రిగా తిరిగి పగ్గాలు చేపట్టి, త్వరలో జరగబోయే పనాజీ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీచేయబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు శాంతారామ్ నాయక్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పారికర్పై మాటల తూటాలు పేల్చారు. ‘సర్జికల్ దాడుల గురించి పారికర్కు ఏం తెలీదు. జాతీయ భద్రతా విభాగం, ప్రధాని కార్యాలయ సిబ్బంది మాత్రమే అందులో పాల్గొన్నారు. తర్వాతే పారికర్కు ఆ విషయం తెలిసింది. అయినప్పటికీ ఆ గొప్పతనం అంతా తనది, మోదీది, వాళ్లను తీర్చిదిద్దిన ఆర్ఎస్ఎస్దంటూ పారికర్ చెప్పుకుని తిరిగాడు. ఇక్కడి రాజకీయాలకు భయపడే కేంద్రానికి వెళ్లాడు. అక్కడా రక్షణ మంత్రిగా విఫలం కావటంతో తిరిగి రాష్ట్రానికి పంపించేశారు. కానీ, అసలు ఆయన గమనించాల్సిన విషయం ఏంటంటే రాజకీయాలకే పారికర్ అనర్హుడు’ అని నాయక్ పేర్కొన్నారు. గతంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పారికర్ ఆగస్టు 23న జరగబోయే పనాజీ ఉప ఎన్నిక బరిలో దిగుతున్నారు. ప్రత్యర్థులుగా కాంగ్రెస్ నుంచి గిరీశ్ చోదంకర్, గోవా సురక్ష మోర్చా పార్టీ తరపున ఆనంద్ శిరోద్కర్ పోటీ చేస్తున్నారు. -
రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే యోగి రాజీనామా
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గోవా సీఎం మనోహర్ పరీకర్లు రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఎంపీ పదవులకు రాజీనామా చేయనున్నారు. అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతి ఓటు ముఖ్యమైనది కావడంతో ఎన్నికల తర్వాతే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే లోక్సభకు రాజీనామా చేయనున్నారు. ఆదిత్యానాథ్, కేశవ్ ప్రసాద్ మౌర్య లోక్సభ ఎంపీలు కాగా, మనోహర్ పరీకర్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. గోవా ముఖ్యమంత్రిగా మార్చి 14న పరీకర్ ప్రమాణస్వీకారం చేశారు. మార్చి 19న యోగి, మౌర్య ప్రమాణం చేశారు. ఆరు నెలల్లో వీరు ముగ్గురు తమ రాష్ట్రాల లెజిస్లేటర్ సభ్యులుగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఎంపీ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే వీరు ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్నారు. -
వీఐపీ కల్చరనేది మంచిది కాదు: పారికర్
పనాజీ: వీఐపీ సంస్కృతి అంత మంచిది కాదని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అన్నారు. దేశంలో ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రపతి, ప్రధానికి తప్ప దేశంలో వీఐపీ భద్రత కల్పించాల్సిన అవసరం పెద్దగా లేదని చెప్పారు. ఎర్రబుగ్గలను తొలగించిన అంశంపై మీడియా ప్రతినిధులు పారికర్ను ప్రశ్నించగా ఆ విషయం తెలియదని, ఒక వేళ కేంద్రం ఆ నిర్ణయం తీసుకుంటే తన కారుకు ఉన్న ఎర్రబుగ్గను తీసి ఇప్పుడే మీకు ఇస్తానంటూ సరదాగా అన్నారు. ‘వీఐపీ కల్చర్ తగ్గించాలని నేను అనుకుంటాను. వాస్తవానికి నేనొకటి క్లియర్గా చెప్పాలని అనుకుంటున్నాను. వీఐపీ సంస్కృతి అంతమంచిది కాదు. కానీ, ఇదే మన దేశంలో పెరుగుతోంది. భద్రత అనేది కేవలం మానసిక భావన. ఇద్దరు, లేదా ముగ్గురు లేదా నలుగురు నుంచి భద్రతను పొందవచ్చు. రాష్ట్రపతి, ప్రధానిని మినహాయిస్తే వీఐపీ భద్రత పేరిట మనం ఎక్కువ సమయం వృధా చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా ఉన్నాను’ అని పారికర్ చెప్పారు. -
‘భారత్తో పాక్ డేంజర్ గేమ్.. తట్టుకోలేదు’
గోవా: భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ విషయంలో పాకిస్థాన్ చాలా ఆపాయకరమైన ఆట ఆడుతోందని రక్షణశాఖ మాజీ మంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ఒక్కసారి భారత్ యాక్షన్కు దిగితే ఎలా ఉంటుందో పాకిస్థాన్ అర్థం చేసుకుంటే మంచిదని సూచించారు. తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డాడంటూ సరైన ఆధారాలు చూపించకుండానే కులభూషణ్కు పాక్ ఉరి శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో రక్షణశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంతో పారికర్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘కులభూషణ్ యాదవ్ పేరిట భారత్తో పాక్ చాలా డేంజర్ గేమ్ ఆడుతోంది. భారత్ తిరుగుబాటుకు దిగితే తిరిగి పోరాడే శక్తి పాక్కు లేదు. వారిని వారు ఏ విధంగా రక్షించుకోలేరు. కానీ, మేం శాంతిని కోరుకుంటున్నాం. రెచ్చగొట్టాలని అనుకోవడం లేదు. ఈ విషయం అర్ధం చేసుకొని జాదవ్ను తిరిగి పంపిస్తే ఆ దేశానికే మంచిది. ముందుగా ఒక విషయం చెప్పాలి. పాకిస్థానే ఇరాన్లో ఉన్న జాదవ్ను ఎత్తుకెళ్లింది. అరెస్టు సమయంలో పాక్లో లేడు. ఓ తాలిబన్ జాదవ్ను కిడ్నాప్ చేసి పాక్ తీసుకెళ్లినట్లు మాకు ఇరాన్ స్పష్టం చేసింది. ఇలాంటి దుశ్చర్యలు చేస్తుండటం పాక్కు అలవాటు. అవసరం అయితే ఆ దేశం ఇంకోలాగ కూడా చేస్తుంది. ఏదేమైనా జాదవ్ను ఉరి తీస్తే చూస్తూ ఊరుకోం. బదులిచ్చి తీరుతాం. ఈ విషయాన్ని ఇప్పటికే విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు కూడా’ అని పారికర్ అన్నారు. -
దిగ్విజయ్ వల్లే సీఎం అయ్యా: పారికర్
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించినా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా.. తనకు అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్కు గోవా సీఎం, రక్షణ శాఖ మాజీ మంత్రి మనోహర్ పారికర్ కృతజ్ఞతలు తెలిపారు. మార్చి మొదటి వారంలో రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసిన పారికర్.. శుక్రవారం నాడు జీరో అవర్ సందర్భంగా రాజ్యసభకు వెళ్లారు. అక్కడి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అందరినీ గోవాకు స్వాగతించారు. చైర్మన్, డిప్యూటీ చైర్మన్, సభ్యులు అందరూ తాను రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు తనకు ఎంతగానో సహకరించారని, వాళ్లంతా ఎప్పుడు గోవా రావాలనుకున్నా అందరికీ స్వాగతమని అన్నారు. ఆ తర్వాత.. గోవాలోనే ఉన్నా, ఏమీ చేయకుండా కూర్చున్నందుకు దిగ్విజయ్ సింగ్కు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నానని, ఆయన వల్లే తాను ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగానని వ్యాఖ్యానించారు. దాంతో కాంగ్రెస్ సభ్యులు ఒక్కసారిగా సీట్లలోంచి లేచి పోడియం వద్దకు వచ్చి తీవ్రస్థాయిలో నిరసన, అభ్యంతరం తెలియజేశారు. మార్చి 11వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాల్లో గోవాలో ఏ పార్టీకీ పూర్తిస్థాయి మెజారిటీ రాలేదు. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 17, బీజేపీకి 13 రాగా.. ఇతర చిన్న పార్టీలు మిగిలిన స్థానాలను పంచుకున్నాయి. కాంగ్రెస్ ముందుగా స్పందించకపోవడంతో బీజేపీ పావులు కదిపి, చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. మనోహర్ పారికర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో కాంగ్రెస్ తరఫున పరిశీలకుడిగా సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ గోవాలోనే మకాం వేశారు. అయినా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోగా.. సీనియర్ నాయకుడు విశ్వజిత్ రాణే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీలో బల నిరూపణకు కొద్ది సేపటి ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం దిగ్విజయ్కు షాకిచ్చింది. తర్వాత మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేశారు. దిగ్విజయ్ సింగ్ వల్లే గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాలేదని వాళ్లిద్దరూ వ్యాఖ్యానించారు. -
రాజ్యసభలో కలకలం రేపిన సీఎం
న్యూఢిల్లీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ శుక్రవారం రాజ్యసభలో అడుగు పెట్టడంతో గందరగోళం రేగింది. ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభలో వెల్ లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు. గోవా ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన పరీకర్ జీరో అవర్ లో సభలోకి అడుగుపెట్టారు. పరీకర్ రాకను గమనించిన కాంగ్రెస్ సభ్యులు దిగ్విజయ్ సింగ్, బీఏ హరిప్రసాద్ తదితరులు తమ స్థానాల్లో నిలబడి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరీకర్ కు మద్దతుగా బీజేపీ సభ్యులు కూడా నిలబడి నినాదాలు చేయడంతో సభలో గందరగోళం రేగింది. సభ్యులకు డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో రాజీవ్ గౌడ, హుస్సేన్ దాల్వాయ్ తదితర కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చి పరీకర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో కేంద్ర మంత్రి ముఖ్తాస్ అబ్బాస్ నఖ్వి చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు విపక్ష సభ్యులకు మరింత ఆగ్రహం కలిగించాయి. గోవా కాంగ్రెస్ ఇంచార్జిగా ఉన్న దిగ్విజయ్ సింగ్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పేందుకు పరీకర్ సభకు వచ్చారని నఖ్వి వ్యంగ్యంగా అనడంతో బీజేపీ బల్లలు చరుస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. రక్షణ మంత్రి పదవికి పరీకర్ రాజీనామా చేసిన గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కాగా, ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ్యకు పరీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. -
ప్రధానితో పారికర్ భేటీ
న్యూఢిల్లీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఢిల్లీలోకి అడుగుపెట్టి తొలిసారి ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. ముఖ్యమంత్రి బాధ్యతలతోపాటు ఆర్థికశాఖను కూడా తన వద్దే ఉంచుకున్న పారికర్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) కౌన్సిల్ సమావేశానికి కూడా హాజరుకానున్నట్లు గోవా ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. ‘గోవా ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్రమోదీని ఈ రోజు కలిశారు’ అని వారు వెల్లడించారు. గోవా ఎన్నికల తర్వాత అంతకుముందు రక్షణశాఖ బాధ్యతలు నిర్వహించిన మనోహర్ పారికర్ ఆ బాధ్యతలు వదిలేసి గోవా పరిపాలన పగ్గాలు అందుకున్న విషయం తెలిసిందే. -
బల పరీక్ష నెగ్గిన పరీకర్
-
మోదీ వేవ్
-
బల పరీక్ష నెగ్గిన పరీకర్
⇒ గోవాలో 22–16 ఓట్ల తేడాతో విజయం ⇒ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా పణజి: గోవాలో మనోహర్ పరీకర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గురు వారం బల నిరూపణ పరీక్షలో నెగ్గింది. 22 మంది ఎమ్మెల్యేల మద్దతుతో 40 మంది సభ్యులు ఉన్న గోవా అసెంబ్లీలో బీజేపీ బలం నిరూపించు కుంది. బీజేపీ నుంచి 12 మంది, గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్పీ), ఎంజీపీల నుంచి ముగ్గురు చొప్పున, ముగ్గురు ఇండిపెండెంట్లు, ఒక ఎన్సీపీ సభ్యుడు కలిపి మొత్తం 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. బీజేపీ ఎమ్మెల్యే సిద్ధార్థ్ ప్రొటెమ్ స్పీకర్గా వ్యవహరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వజిత్ రాణె గైర్హాజరీతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా 16 ఓట్లు పడ్డాయి. దీంతో 17 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించి అధికారం కోసం చివరి వరకు ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్కు భంగపాటు తప్పలేదు. బీజేపీ బల పరీక్ష నెగ్గిన కొద్దిసేపటికే విశ్వజిత్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా కాంగ్రెస్ గోవా ప్రజలకు ద్రోహం చేసిందని విమర్శించారు. బల పరీక్ష నెగ్గిన అనంతరం పరీకర్ మాట్లాడుతూ.. మొదటి నుంచీ కాంగ్రెస్కు సరిపడా మెజారిటీ లేక పోయినా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ హడావిడి చేసిందని విమర్శిం చారు. గోవాలో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా వ్యవహరించిన దిగ్విజయ్ సింగ్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్లు వస్తుండటంతోనే ఈ హడావిడి జరిగిందని పేర్కొన్నారు. -
'దేశ ప్రజల ముందు మేం నిరూపించుకున్నాం'
-
'దేశ ప్రజల ముందు మేం నిరూపించుకున్నాం'
పణజి: 'మాకు 23 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అసెంబ్లీ సాక్షిగా జరిగిన బలపరీక్షలో ఇదే విషయాన్ని మేం దేశ ప్రజలకు చాటాం' అని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అన్నారు. గురువారం గోవా అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో విజయం సాధించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 'కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ తమకు మెజారిటీ ఉందని చెప్తున్నారు. కానీ అది ఉత్తిమాటేనని తేలిపోయింది. మొదటినుంచి వారి వద్ద ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ లేదు' అని పారికర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా దిగ్విజయ్ సింగ్ దిగిపోవాలన్న డిమాండ్ ఊపందుకోవడం వల్లే ఆయన తమ వద్ద సంఖ్యాబలముందనే ఊహాగానాలను తెరపైకి తెచ్చిఉంటారని విమర్శించారు. తమది సంకీర్ణ ప్రభుత్వమని, కాబట్టి సంకీర్ణ పక్షాలతో చర్చించి.. ఉప ముఖ్యమంత్రి నియమాకంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని, పచ్చకామర్లు వచ్చినవాడికి లోకమంత పచ్చగా కనిపించినట్టు ప్రత్యర్థులు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఎమ్మెల్యేలపై తాము ఎటువంటి ఒత్తిడి పెట్టలేదని, ప్రతిపక్షాల తరహాలో వారిని హోటళ్లలో ఉంచడం, గుర్తుతెలియని ప్రదేశాలకు తీసుకెళ్లడంలాంటివి చేయలేదని, ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేశారని పారికర్ పేర్కొన్నారు. -
బలపరీక్షలో నెగ్గిన పారికర్!
-
బలపరీక్షలో నెగ్గిన పారికర్!
గోవాలో ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం బలపరీక్షలో విజయం సాధించింది. గురువారం గోవా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో నిర్వహించిన బలపరీక్షలో మెజారిటీని నిరూపించుకుంది. మనోహర్ ప్రభుత్వానికి అనుకూలంగా 22 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 16 ఓట్లు పడ్డాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 21. 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న గోవాలో బీజేపీ గెలిచింది 13 స్థానాలే. ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతు పలుకడంతో మెజారిటీతో బలపరీక్ష గండాన్ని బీజేపీ అధిగమించింది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17, బీజేపీ 13, ఇతరులు పది స్థానాలు గెలుపొందారు. ఇందులో గోవా ఫార్వర్డ్ పార్టీ, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ, ఇతర స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు పలుకడంతో బీజేపీకి 22 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ కన్నా తక్కువ స్థానాలు గెలుపొందినప్పటికీ, కేంద్ర రక్షణమంత్రిగా ఉన్న పారికర్ను ముఖ్యమంత్రిగా బరిలో నిలిపి.. వ్యూహాత్మకంగా పావులు కదిపిన బీజేపీ ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతును కూడగట్టింది. దీంతో బిత్తరపోయిన కాంగ్రెస్ పార్టీ సీఎంగా పారికర్ ప్రమాణాన్ని నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పారికర్ ప్రమాణంపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. గురువారమే అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలంటూ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఎట్టిపరిస్థితుల్లో ఈ బలపరీక్షలో పారికర్ ప్రభుత్వాన్ని ఓడించి తీరుతామని గురువారం కాంగ్రెస్ నేత దిగ్విజయ్సింగ్ వ్యాఖ్యానించారు. -
ఆ సీఎం ప్రధాని అవుతారని అద్వానీ భావించారు!
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొందరు నేతలు కేంద్రం నుంచి రాష్ట్రానికి తిరిగి వస్తుండగా, మరికొందరు కేంద్రంలో చోటు దక్కించుకునే పనిలో ఉన్నారు. యూపీ, ఉత్తరాఖండ్లో బీజేపీ భారీ విజయం సాధించడం, ఆపై మెజార్టీ పార్టీగా అవతరించకున్నా.. గోవా, మణిపూర్లలో చక్రం తప్పి అధికారాన్ని హస్తగతం చేసుకుంటోంది బీజేపీ. ఈ క్రమంలో మనోహర్ పారికర్ రక్షణమంత్రి పదవికి రాజీనామా చేసి, తన సొంత రాష్ట్రానికి తిరిగొచ్చేశారు. గోవా సీఎంగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే తరహాలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు కేంద్రం నుంచి పిలుపొచ్చిందని, ఆయనకు రక్షణశాఖ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై మీడియా ఆయనను ప్రశ్నించగా.. ఆ వదంతులను సీఎం శివరాజ్ ఖండించక పోవడంతో అది నిజమై ఉండొచ్చునని భావిస్తున్నారు. ఒకానొక దశలో బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ.. శివరాజ్ చౌహన్ ప్రధాని అవుతారని, ఆ పదవికి ఆయన సమర్ధుడని భావించారట. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలతో కన్నా అద్వానీతో శివరాజ్కు సత్సంబంధాలు ఉండేవి. 2005 నవంబర్ 28న తొలిసారిగా శివరాజ్ చౌహాన్ మధ్యప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. వ్యాపమ్ కుంభకోణం, అక్రమ మైనింగ్, డంపర్ స్కామ్ లాంటి సమస్యలను ఆయన ఎదుర్కొని నిలబడ్డారు. ప్రస్తుతం రక్షణశాఖ అదనపు బాధ్యతలను అరుణ్ జైట్లీకి అప్పగించారు. బీజేపీ సీనియర్ నేత హితేష్ బాజ్పాయ్ మాత్రం ఈ వదంతలును కొట్టిపారేశారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లోనూ శివరాజ్ నేతృత్వంలోనే బీజేపీ బరిలోకి దిగుతుందని చెబుతున్నారు. శివరాజ్ కేంద్రానికి వెళ్లాలనుకుంటే ఇదే సరైన సమయమని, లేని పక్షంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి విజయాన్ని అందించయినా కేంద్రానికి షిఫ్ట్ అవుతారని పార్టీ సీనియర్ నేతలు విశ్వసిస్తున్నారు. -
గోవా సీఎంగా పరీకర్ ప్రమాణం
మరో 9 మంది మంత్రులుగా ప్రమాణం ⇒ రేపు అసెంబ్లీలో బలపరీక్షకు సుప్రీంకోర్టు ఆదేశం పణజి: గోవా పాలనా పగ్గాలు చేపట్టేందుకు రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసిన మనోహర్ పరీకర్ మంగళవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణంచేశారు. సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించనున్న ఆయనతో రాజ్భవన్లో గవర్నర్ మృదులా సిన్హా ప్రమాణం చేయించారు. పరీకర్తోపాటు 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో బీజేపీ నుంచి ఇద్దరు, గోవా ఫార్వర్డ్ బ్లాక్(జీఎఫ్పీ) నుంచి ముగ్గురు, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ(ఎంజీపీ) నుంచి ఇద్దరు, ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు. బాంబే ఐఐటీలో చదివిన 61 ఏళ్ల పరీకర్ గోవా సీఎం కావడం ఇది నాలుగోసారి. పరీకర్ ప్రమాణంపై స్టే విధించాలన్న కాంగ్రెస్ పిటిషన్ను సుప్రీం కోర్టు మంగళవారం కొట్టేసి, గురువారం బలపరీక్షకు ఆదేశించడం, ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గవర్నర్ను కలసినా ఫలితం లేకపోవడంతో పరీకర్ సీఎంకావడానికి మార్గం సుగమమైంది. ప్రమాణ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కారీ, వెంకయ్య తదితరలు, ప్రముఖులు హాజరయ్యారు. మెజారిటీ నిరూపించుకుంటా: పరీకర్ బలపరీక్షలో మెజారిటీ నిరూపించుకుంటానని, తమవైపు 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని పరీకర్ తర్వాత విలేకర్లతో చెప్పారు. గోవాతనాన్ని నిలుపుకోవడం నా ప్రాధాన్యం. నెలలోపు ప్రభుత్వ కనీస ఉమ్మడి కార్యక్రమంపై ప్రకటన చేస్తాం’ అని చెప్పారు. కాంగ్రెస్ చివరి యత్నం.. పరీకర్ ప్రమాణానికి ముందు.. అధికారం కోసం చివరిక్షణంలోనూ కాంగ్రెస్ విఫలయత్నం చేసింది. పెద్ద పార్టీ అయిన తమకు ప్రభుత్వ ఏర్పాటు కోసం అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ఎల్పీ నేత కవ్లేకర్ సహా 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గవర్నర్ను కలసి విజ్ఞప్తి చేశారు. తమకు మెజారిటీ ఉందన్నారు. తన విచక్షణ ప్రకారం నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ చెప్పారని పార్టీ నేత లుయిజిన్హో ఫలేరియో విలేకర్లతో చెప్పారు. మీకు మెజారిటీ ఉందా అని ప్రశ్నించగా.. బలపరీక్షలో తేలుతుందని చెప్పారు. 40 స్థానాల గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా, 13 సీట్లతో బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా నిలవడం తెలిసిందే. మనోహర్ పరీకర్ ప్రస్థానం.. ఉత్తర గోవాలోని మపుసాలో మధ్యతరగతి వర్గానికి చెందిన వ్యాపార కుటుంబంలో పరీకర్ జన్మించారు. పరీకర్ 1994లో తొలిసారి గోవా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయంతోమోదీ ఏరికోరి పరీకర్ను మంత్రివర్గంలో చేర్చుకుని రక్షణ మంత్రి పదవిని అప్పగించారు. పరీకర్ ఆధ్వర్యంలోనే గోవా బాగా అభివృద్ధి చెందిందని..రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత ఏర్పడిందని రాష్ట్ర ప్రజలకు నమ్మకం కుదిరింది. బలపరీక్షే పరిష్కారం న్యూఢిల్లీ: పరీకర్ ప్రమాణ స్వీకారంపై స్టే విధించాలని కాంగ్రెస్ వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. గురువారం అసెంబ్లీలో బలపరీక్ష జరపాలని గవర్నర్ను కోరింది. పరీక్షతో కాంగ్రెస్ లేవనెత్తిన అభ్యంతరాలన్నింటికి పరిష్కారం లభిస్తుందని చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. మంగళవారం హోలీ సెలవు దినమైనా కోర్టు ప్రత్యేకంగా సమావేశమై గోవా కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత చంద్రకాంత్ కవ్లేకర్ వేసిన పిటిషన్ను విచారించింది. ఈ విషయంలో కాంగ్రెస్ తీరు సరిగ్గాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్యపై గవర్నర్కు చెప్పని కాంగ్రెస్దే తప్పు. ప్రాంతీయ పార్టీల, స్వతంత్రుల మద్దతు అఫిడవిట్లను ఆ పార్టీ కోర్టుకు తీసుకురాలేదు.. ఇదంతా 30 సెకన్ల పని. రెండు రోజులుగా ఏం జరుగుతోందో తెలిసినా కాంగ్రెస్ పరీకర్ను కేసులో ఇంప్లీడ్ చేయలేదు. అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడమనేది సంఖ్యాబలానికి సంబంధించిన విషయం’ అని పేర్కొంది. పరీకర్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్ నిర్ణయంపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. తమకు 21 మంది సభ్యుల మద్దతుందన్న బీజేపీ వాదనను పరిగణనలోకి తీసుకుంటూ గవర్నర్.. పరీకర్కు రాసిన లేఖను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ నెల 16(గురువారం) ఉదయం 11 గంటలకు బలపరీక్ష నిర్వహించేందుకు అసెంబ్లీని సమావేశపరచాలని, సభ్యుల ప్రమాణం తర్వాత బలపరీక్ష జరపాలని గవర్నర్ను కోరింది. అత్యంత సీనియర్ సభ్యుణ్ని ప్రొటెమ్ స్పీకర్గా నియమించాలని సూచించింది. అంతకుముందు కవ్లేకర్ తరపున సీనియన్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తూ.. అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ను కాకుండా పరీకర్ను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం అత్యంత వివాదాస్పదం, వాస్తవ విరుద్ధమని ఆక్షేపించారు.ఆమె రాజ్యాంగ సంప్రదాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలన్న కాంగ్రెస్ లేఖకు కనీస మర్యాద ఇవ్వలేదని ఆరోపించారు.