Mitchell Starc
-
ఛాంపియన్స్ ట్రోఫీకి గాయాల బెడద.. ఒక్కొక్కరుగా దూరమవుతున్న స్టార్ పేసర్లు
ఛాంపియన్స్ ట్రోఫీకి (Champions Trophy-2025) గాయాల బెడద పట్టుకుంది. మెగా టోర్నీకి స్టార్ పేసర్లు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. ఇప్పటికే అన్రిచ్ నోర్జే, కెమరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్, పాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్, క్రిస్ వోక్స్, లోకీ ఫెర్గూసన్, గెరాల్డ్ కొయెట్జీ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం కాగా.. తాజాగా జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), మిచెల్ స్టార్క్ (Mitchell Starc) వైదొలిగారు.వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లంతా దూరమైతే మెగా టోర్నీ కళ తప్పే ప్రమాదముంది. అన్ని జట్ల కంటే గాయాల సమస్య ఆస్ట్రేలియాను (Australia) ఎక్కువగా వేధిస్తుంది. ఆ జట్టులో ఏకంగా ఐదుగురు స్టార్ ఆటగాళ్లు గాయపడ్డారు. ఒకరు (Marcus Stoinis) ఏకంగా వన్డే క్రికెట్కే రిటైర్మెంట్ ప్రకటించారు. జట్టులో సగానికి పైగా రెగ్యులర్ ఆటగాళ్లు దూరం కావడం ఆస్ట్రేలియా విజయావకాశాలను దెబ్బతీస్తుంది. అసలే గత రెండు ఎడిషన్లలో ఆస్ట్రేలియాకు మంచి ట్రాక్ రికార్డు లేదు. 2013, 2017 ఎడిషన్లలో ఆ జట్టు ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేదు.పేలవ బ్యాక్గ్రౌండ్ కలిగిన ఆస్ట్రేలియా, అనుభవం లేని జట్టుతో బరిలోకి దిగి ఏ మేరకు విజయాలు సాధిస్తుందో వేచి చూడాలి. ప్రస్తుత ఎడిషన్లో ఆస్ట్రేలియాకు స్టీవ్ స్మిత్ సారథ్యం వహించనున్నాడు. ఆసీస్ సెలెక్టర్లు కీలక ఆటగాళ్లకు ప్రత్యామ్నాయాలను ప్రకటించారు. బెన్ డ్వార్షుయిష్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, స్పెన్సర్ జాన్సన్, తన్వీర్ సంఘా, సీన్ అబాట్ కొత్తగా జట్టులోకి వచ్చారు. వీరికంతా అనుభవం అంతంతమాత్రమే.బుమ్రాకు ప్రత్యామ్నాయంగా హర్షిత్ రాణాబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా గాయపడిన జస్ప్రీత్ బుమ్రాకు ప్రత్యామ్నాయంగా హర్షిత్ రాణాను ఎంపిక చేశారు భారత సెలెక్టర్లు. హర్షిత్ ఇటీవలే వన్డే అరంగ్రేటం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో మహ్మద్ షమీ ఒక్కడే అనుభవజ్ఞుడు. అర్షదీప్ సింగ్ ఉన్నా, అతను ఆడింది కేవలం 8 వన్డేలే. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ముందుగా ప్రకటించిన జట్టులో భారత్ మరో మార్పు చేసింది. యశస్వి జైస్వాల్ స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జట్టులోకి వచ్చాడు.ఆఫ్ఘనిస్తాన్నూ వదలని గాయాల సమస్యఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గాయాల సమస్య ఆఫ్ఘనిస్తాన్ను కూడా వదల్లేదు. గాయం కారణంగా ఆ జట్టు స్పిన్ సంచలనం అల్లా ఘజన్ఫర్ మెగా టోర్నీకి దూరమయ్యాడు. 18 ఏళ్ల ఘజన్ఫర్ గత నెలలో జింబాబ్వేతో జరిగిన సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. ఘజన్ఫర్కు వెన్నుపూసలో పగుళ్లు వచ్చినట్లు డాక్టర్లు నిర్దారించారు. దీని కారణంగా ఘజన్ఫన్ నాలుగు నెలలు క్రికెట్కు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఘజన్ఫర్ ఐపీఎల్ 2025లో పాల్గొనేది కూడా అనుమానమే అని తెలుస్తుంది.ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ ఘజన్ఫర్ను రూ. 4.8 కోట్లకు సొంతం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఘజన్ఫర్కు ప్రత్యామ్నాయంగా నంగేయాలియా ఖరోటేను ఎంపిక చేశారు ఆఫ్ఘన్ సెలెక్టర్లు.కాగా, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగనున్నాయి. మిగతా మ్యాచ్లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19న జరిగే టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. అనంతరం ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్లో భారత్, బంగ్లాదేశ్ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది.ఈ టోర్నీలో ఆసీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు గ్రూప్-బిలో ఉండగా.. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు పోటీపడతాయి. -
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా జట్టులో మరో బిగ్ వికెట్ డౌన్
ఛాంపియన్స్ ట్రోఫీకి (Champions Trophy) ముందు ఆస్ట్రేలియా జట్టులో పెద్ద మరో వికెట్ పడింది. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) వ్యక్తిగత కారణాల చేత మెగా టోర్నీ మొత్తానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. స్టార్క్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ తెలిపాడు. స్టార్క్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు శ్రీలంకతో జరిగే రెండు వన్డేల్లో కూడా పాల్గొనడని బెయిలీ ప్రకటించాడు. స్టార్క్కు ముందు గాయాల కారణంగా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ (Mitchell Marsh), కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins), పేసర్ జోష్ హాజిల్వుడ్ (Josh Hazzlewood) ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే. ఈ మధ్యలో మరో ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ (Marcus Stoinis) వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. స్టార్క్తో కలుపుకుని ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ముందుగా ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టులో మొత్తం ఐదు ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని బెన్ డ్వార్షుయిష్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, స్పెన్సర్ జాన్సన్,తన్వీర్ సంఘా, సీన్ అబాట్లతో భర్తీ చేస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. కూపర్ కన్నోలీ ట్రావెలింగ్ రిజర్వ్గా ఉంటాడని పేర్కొంది. మార్పులు చేర్పుల తర్వాత ప్రకటించిన 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ (Steve Smith) సారథ్యం వహిస్తాడు.కాగా, ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తుంది. ఇవాళ (ఫిబ్రవరి 12) ఆ జట్టు లంకతో వన్డే మ్యాచ్ ఆడుతుంది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈ వన్డే జరుగుతుంది. రెండో వన్డే ఫిబ్రవరి 14న జరుగుతుంది. ప్రస్తుత లంక పర్యటనలో ఆస్ట్రేలియా రెండు టెస్ట్లు కూడా ఆడింది. ఈ రెండు మ్యాచ్ల్లో ఆ జట్టే జయభేరి మోగించింది. రెండు వన్డేల సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా పాకిస్తాన్కు (ఛాంపియన్స్ ట్రోఫీ కోసం) బయల్దేరుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ఫిబ్రవరి 22న తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. లాహోర్లో జరిగే ఆ మ్యాచ్లో ఆసీస్.. ఇంగ్లండ్ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో ఆసీస్.. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లతో కలిసి గ్రూప్-బిలో ఉంది. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు పోటీపడతాయి.2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగనున్నాయి. మిగతా మ్యాచ్లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19న జరిగే టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. అనంతరం ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్లో భారత్, బంగ్లాదేశ్ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు..స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, బెన్ డ్వార్షుయిష్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషన్, గ్లెన్ మాక్స్వెల్, తన్వీర్ సంఘ, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా. [ట్రావెలింగ్ రిజర్వ్: కూపర్ కొన్నోలీ]శ్రీలంకతో రెండు వన్డేల కోసం ఆస్ట్రేలియా జట్టు..స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, బెన్ డ్వార్షుయిష్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, ఆరోన్ హార్డీ, కూపర్ కన్నోలీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషన్, గ్లెన్ మాక్స్వెల్, తన్వీర్ సంఘ, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా. -
SL vs Aus: చరిత్ర సృష్టించిన నాథన్ లియోన్
ఆస్ట్రేలియా వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్(Nathan Lyon) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆసియాలో టెస్టు ఫార్మాట్లో 150కి పైగా వికెట్లు తీసిన తొలి నాన్- ఆసియన్ బౌలర్గా రికార్డులకెక్కాడు. కాగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు రెండు టెస్టులు, రెండు వన్డేలు ఆడేందుకు ప్రస్తుతం శ్రీలంక(Sri Lanka vs Australia)లో పర్యటిస్తోంది.తొలిరోజే తొమ్మిది వికెట్లుఇందులో భాగంగా తొలుత గాలె(Galle) వేదికగా టెస్టు సిరీస్ మొదలుకాగా.. తొలి మ్యాచ్లో లంకను ఆసీస్ మట్టికరిపించింది. ఏకంగా ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. అనంతరం ఇరుజట్ల మధ్య గురువారం రెండో టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.లంక బ్యాటర్లలో దినేశ్ చండిమాల్ (163 బంతుల్లో 74; 6 ఫోర్లు, 1 సిక్స్), వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (107 బంతుల్లో 59 బ్యాటింగ్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న సీనియర్ బ్యాటర్ దిముత్ కరుణరత్నే (83 బంతుల్లో 36; 3 ఫోర్లు) కాసేపు పోరాడినా... భారీ స్కోరు చేయలేకపోయాడు. ఇతరులలో పతుమ్ నిశాంక (11), ఏంజెలో మాథ్యూస్ (1), కమిందు మెండిస్ (13), కెప్టెన్ ధనంజయ డిసిల్వ (0) దారుణంగా విఫలమయ్యారు. చండిమాల్, కుశాల్ మెండిస్ కాస్త పోరాడటంతో లంక జట్టు ఆమాత్రం స్కోరు చేయగలిగింది.నాన్- ఆసియన్ బౌలర్గా చరిత్రఇక ఆసీస్ బౌలర్లలో పేసర్ మిచెల్ స్టార్క్తో కలిసి ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్ మూడు వికెట్లతో చెలరేగాడు. ఈ క్రమంలో నాథన్ లియోన్ అరుదైన ఘనత సాధించాడు. ఆసియా ఖండంలో టెస్టుల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ నమోదు చేసిన తొలి నాన్- ఆసియన్ బౌలర్గా చరిత్ర సృష్టించాడు.అంతకు ముందు ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఆసియాలో 127 వికెట్లు తీయగా.. న్యూజిలాండ్ మాజీ స్టార్ డేనియల్ వెటోరి 98, ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ 92 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.ఆసియాలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన నాన్-ఆసియన్ బౌలర్లు👉నాథన్ లియోన్- 30 టెస్టుల్లో 150👉షేన్ వార్న్- 25 టెస్టుల్లో 127👉డేనియల్ వెటోరి- 21 టెస్టుల్లో 98👉జేమ్స్ ఆండర్సన్- 32 టెస్టుల్లో 92.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు స్టార్క్, నాథన్ లియోన్ మూడేసి వికెట్లు తీయగా.. మాథ్యూ కూహ్నెమన్ రెండు, ట్రవిస్ హెడ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో 229/9 ఓవర్నైట్ స్కోరుతో శుక్రవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన శ్రీలంక.. 257 పరుగులకు ఆలౌట్ అయింది. చదవండి: తుదిజట్టులో నాకసలు స్థానమే లేదు.. రోహిత్ కాల్ తర్వాత..: శ్రేయస్ అయ్యర్ -
ఇంగ్లండ్తో తొలి వన్డే.. ప్రపంచ రికార్డుపై గురి పెట్టిన షమీ
ఫిబ్రవరి 6న ఇంగ్లండ్తో జరుగబోయే తొలి వన్డేలో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) ఓ వరల్డ్ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్లో షమీ ఐదు వికెట్లు తీస్తే.. వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్గా వరల్డ్ రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఆసీస్ స్పీడ్స్టర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) పేరిట ఉంది. స్టార్క్ 102 మ్యాచ్ల్లో 200 వికెట్లు పూర్తి చేశాడు. షమీ ప్రస్తుతం 100 ఇన్నింగ్స్ల్లో 195 వికెట్లు కలిగి ఉన్నాడు.వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు..మిచెల్ స్టార్క్-102 మ్యాచ్లుసక్లయిన్ ముస్తాక్-104 మ్యాచ్లుట్రెంట్ బౌల్ట్-107 మ్యాచ్లుబ్రెట్ లీ-112 మ్యాచ్లుఅలన్ డొనాల్డ్-117 మ్యాచ్లుకాగా, 2023 వన్డే ప్రపంచ కప్ సందర్భంగా గాయపడిన షమీ.. తాజాగా ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఫిబ్రవరి 6 నుంచి స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్తో షమీ వన్డేల్లోకి కూడా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. షమీ చివరిగా ఆడిన వన్డే వరల్డ్కప్లో కేవలం ఏడు ఇన్నింగ్స్ల్లోనే 24 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు ఐదు వికెట్ల ఘనతలు ఉండటం విశేషం. షమీ చెలరేగడంతో భారత్ ఆ వరల్డ్కప్లో ఫైనల్ వరకు అజేయంగా చేరింది. అయితే తుది పోరులో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో పరాభవాన్ని ఎదుర్కొంది.34 ఏళ్ల షమీ రీఎంట్రీ ఇచ్చాక ఇంగ్లండ్తో జరిగిన మూడో టీ20లో వికెట్లేమీ తీయలేదు. దీంతో అతన్ని నాలుగో టీ20లో పక్కన పెట్టారు. నాలుగో టీ20తో భారత్ సిరీస్ను కైవసం చేసుకోవడంతో షమీకి తిరిగి చివరి టీ20లో అవకాశం దక్కింది. ఈ సారి షమీ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో షమీ 3 వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలకప్రాత పోషించాడు.షమీ.. త్వరలో జరుగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపికయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ షమీపై భారీ అంచనాలే పెట్టుకుంది. ఈ టోర్నీలో షమీ రాణిస్తే పూర్వవైభవం సాధిస్తాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత ప్రయాణం ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్తో మొదలవుతుంది. ఈ టోర్నీలో భారత్, పాక్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగనున్నాయి. దీనికి ముందు ఫిబ్రవరి 6న భారత్ నాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్తో తొలి వన్డే ఆడుతుంది. అనంతరం ఫిబ్రవరి 9, 12 తేదీల్లో రెండు, మూడు వన్డేలు జరుగనున్నాయి. ఈ మ్యాచ్లకు కటక్, అహ్మదాబాద్ వేదికలు కానున్నాయి. ఈ మూడు మ్యాచ్లు మధ్యాహ్నం 1:30 గంటల నుంచి ప్రారంభమవుతాయి. -
శ్రీలంకతో తొలి టెస్ట్.. మిచెల్ స్టార్క్ మరో రికార్డు
శ్రీలంకతో (Sri Lanka) తొలి టెస్ట్లో ఆస్ట్రేలియా (Australia) భారీ ఆధిక్యంలో కొనసాగుతుంది. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 654 పరుగుల రికార్డు స్కోర్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. వరుణుడు మూడో రోజు ఆటకు పలు అంతరాయాలు కలిగించాడు. ఈ రోజు కేవలం 27 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. 44/3 స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక ఇవాళ మరో 92 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. దినేశ్ చండీమల్ (63), కుసాల్ మెండిస్ (10) క్రీజ్లో ఉన్నారు. లంక ఇన్నింగ్స్లో ఒషాడో ఫెర్నాండో, దిముత్ కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్ తలో 7 పరుగులు చేయగా.. కమిందు మెండిస్ 15, కెప్టెన్ ధనంజయ డిసిల్వ 22 పరుగులు చేసి ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ (Mitchell Starc), మాథ్యూ కుహ్నేమన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. నాథన్ లయోన్ ఓ వికెట్ తీశాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు శ్రీలంక ఇంకా 518 పరుగులు వెనుకపడి ఉంది.అంతకుముందు ఉస్మాన్ ఖ్వాజా (232) డబుల్ సెంచరీ.. స్టీవ్ స్మిత్ (141), జోస్ ఇంగ్లిస్ (102) సెంచరీలతో కదంతొక్కడంతో ఆస్ట్రేలియా అతి భారీ స్కోర్ చేసింది. ఓపెనర్గా బరిలోకి దిగిన ట్రవిస్ హెడ్ (57) మెరుపు అర్ద సెంచరీతో ఆకట్టుకున్నాడు. లబూషేన్ 20, అలెక్స్ క్యారీ 46 (నాటౌట్), వెబ్స్టర్ 23, మిచెల్ స్టార్క్ 19 (నాటౌట్) పరుగులు చేశారు. శ్రీలంక బౌలరల్లో ప్రభాత్ జయసూర్య, జెఫ్రీ వాండర్సే తలో 3 వికెట్లు పడగొట్టారు.రికార్డుల మోత మోగించిన ఆసీస్ బ్యాటర్లుఈ మ్యాచ్లో ఆసీస్ బ్యాటర్లు రికార్డుల మోత మోగించారు. ఈ మ్యాచ్లో తొలి పరుగుతో స్టీవ్ స్మిత్ టెస్ట్ల్లో 10000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో స్టీవ్ స్మిత్ టెస్ట్ల్లో 35వ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న ప్లేయర్లలో జో రూట్ (36) మాత్రమే స్టీవ్ స్మిత్ కంటే అత్యధిక సెంచరీలు చేశాడు. ఈ మ్యాచ్లో ఉస్మాన్ ఖ్వాజా లేటు వయసులో (38 ఏళ్ల 43 రోజులు) డబుల్ సెంచరీ చేశాడు. టెస్ట్ల్లో అతనికి ఇది తొలి డబుల్ సెంచరీ. ఈ మ్యాచ్తో టెస్ట్ అరంగేట్రం చేసిన జోస్ ఇంగ్లిస్.. అరంగేట్రంలోనే సెంచరీ చేసిన 21వ ఆస్ట్రేలియన్ బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. జట్టు స్కోర్ పరంగానూ ఆసీస్ ఈ మ్యాచ్లో రికార్డు సృష్టించింది. ఆసియా పిచ్లపై ఆసీస్కు ఇదే అత్యధిక స్కోర్.మిచెల్ స్టార్క్ మరో రికార్డుఈ మ్యాచ్లో ఇప్పటివరకు రెండు వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్ తొలి వికెట్తో అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో కలిపి) 700 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్లో రెండో వికెట్తో స్టార్క్ మరో రికార్డు సాధించాడు. శ్రీలంక గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక పేసర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్క్ శ్రీలంకలో ఇప్పటివరకు 16.77 సగటున 31 వికెట్లు తీశాడు. గతంలో లంక గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక పేసర్గా వసీం అక్రమ్ ఉన్నాడు. అక్రమ్ లంకలో 20.43 సగటున 30 వికెట్లు తీశాడు.శ్రీలంకలో అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక పేసర్లు..మిచెల్ స్టార్క్-31వసీం అక్రమ్-30రిచర్డ్ హ్యాడ్లీ-27వకార్ యూనిస్-27ఇషాంత్ శర్మ-26 -
శ్రీలంకతో తొలి టెస్ట్.. 700 వికెట్ల క్లబ్లో మిచెల్ స్టార్క్
ఆస్ట్రేలియా పేస్ గన్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన మైలురాయికి తాకాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్లో దిముత్ కరుణరత్నే వికెట్ పడగొట్టిన స్టార్క్.. 700 వికెట్ల క్లబ్లో (మూడు ఫార్మాట్లలో కలిపి) చేరాడు. అంతర్జాతీయ క్రికెట్లో కేవలం 17 మంది మాత్రమే 700 వికెట్ల మైలురాయిని చేరుకున్నారు. స్టార్క్కు ముందు ముత్తయ్య మురళీథరన్ (1347), షేన్ వార్న్ (1001), జేమ్స్ ఆండర్సన్ (991), అనిల్ కుంబ్లే (956), గ్లెన్ మెక్గ్రాత్ (949), వసీం అక్రమ్ (916), స్టువర్ట్ బ్రాడ్ (847), షాన్ పొలాక్ (829), వకార్ యూనిస్ (789), టిమ్ సౌథీ (776), రవిచంద్రన్ అశ్విన్ (765), చమింద వాస్ (761), కోట్నీ వాల్ష్ (746), బ్రెట్ లీ (718), షకీబ్ అల్ హసన్ (712), హర్భజన్ సింగ్ (711), డేనియల్ వెటోరీ (705) మాత్రమే ఈ ఘనత సాధించారు.కెరీర్లో 94 టెస్ట్లు ఆడిన స్టార్క్ 377 వికెట్లు తీశాడు. 127 వన్డేల్లో 244, 65 టీ20ల్లో 79 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా స్టార్క్ తన కెరీర్లో 286 మ్యాచ్లు ఆడి 700 వికెట్లు తీశాడు. ఇందులో 24 ఐదు వికెట్ల ఘనతలు, 2 పది వికెట్ల ఘనతలు ఉన్నాయి.శ్రీలంకతో మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు రెండో రోజు టీ సెషన్ వరకు బ్యాటింగ్ చేసి 654/6 స్కోర్ వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (232) కెరీర్లో తొలి డబుల్ సెంచరీతో కదంతొక్కగా.. స్టీవ్ స్మిత్ (141), జోస్ ఇంగ్లిస్ (102) సెంచరీలతో సత్తా చాటారు. స్టీవ్ స్మిత్కు ఇది టెస్ట్ కెరీర్లో 35వ సెంచరీ కాగా.. ఇంగ్లిస్ తన అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. వీరితో పాటు ట్రవిస్ హెడ్ (57), అలెక్స్ క్యారీ (46 నాటౌట్) కూడా రాణించడంతో ఆస్ట్రేలియా శ్రీలంక గడ్డపై తొలిసారి 600 పరుగుల మార్కును దాటింది. ఆసీస్ ఇన్నింగ్స్లో లబూషేన్ 20, వెబ్స్టర్ 23 పరుగులు చేసి ఔట్ కాగా.. మిచెల్ స్టార్క్ 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య, జెఫ్రీ వాండర్సే తలో మూడు వికెట్లు పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది.లంక బ్యాటర్లు ఒషాడో ఫెర్నాండో, దిముత్ కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్ తలో ఏడు పరుగులు చేసి ఔటయ్యారు. చండీమల్ (9), కమిందు మెండిస్ (13) క్రీజ్లో ఉన్నారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోర్కు శ్రీలంక ఇంకా 610 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్, రెండు మ్యాచ్ల వన్డే సిరీస్ల కోసం ఆస్ట్రేలియా శ్రీలంకలో పర్యటిస్తుంది. -
వరల్డ్ రికార్డుపై కన్నేసిన షమీ.. ఆ మ్యాచ్లో ఐదు వికెట్లు తీశాడంటే..
టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) అరుదైన ప్రపంచ రికార్డు ముంగిట నిలిచాడు. ఇంగ్లండ్తో తొలి వన్డేలో గనుక అతడు రాణిస్తే.. మిచెల్ స్టార్క్ పేరిట ఉన్న అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంటాడు. కాగా వన్డే ప్రపంచకప్-2023లో షమీ అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే.కాస్త ఆలస్యంగా ఈ మెగా టోర్నీలో ఎంట్రీ ఇచ్చినా.. వికెట్ల వేటలో మాత్రం దూసుకుపోయాడు షమీ. సొంతగడ్డపై జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్లో ఏకంగా 24 వికెట్లు కూల్చి.. లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. అయితే, వరల్డ్కప్ మధ్యలోనే చీలమండ నొప్పి వేధించినా లెక్కచేయని షమీ.. టోర్నీ ముగిసిన తర్వాత మాత్రం శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు ఎంపికఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన షమీ.. పూర్తి ఫిట్నెస్ సాధించడానికి దాదాపు ఏడాది కాలం పట్టింది. అయితే, ఇప్పటి వరకు అతడు టీమిండియాలో పునరాగమనం చేయలేకపోయాడు. తొలుత దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీలో బెంగాల్ తరఫున బరిలోకి దిగిన ఈ పేస్ బౌలర్.. పదకొండు వికెట్లతో సత్తా చాటాడు.అనంతరం దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆడి తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో షమీ స్థానం దక్కించుకున్నాడు. సొంతగడ్డపై జరిగే ఈ సిరీస్ సందర్భంగా అతడు రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక ఇంగ్లండ్తో వన్డేల్లోనూ షమీ చోటు దక్కించుకోవడం దాదాపు ఖాయమైంది.ఈ నేపథ్యంలో షమీని ఓ వరల్డ్ రికార్డు ఊరిస్తోంది. ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో అతడు ఐదు వికెట్లు తీస్తే చాలు.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వన్డేల్లో 200 వికెట్ల క్లబ్లో చేరిన మొదటి క్రికెటర్గా నిలుస్తాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉంది.షమీ ఇప్పటికి 100 ఇన్నింగ్స్లోస్టార్క్ 102 ఇన్నింగ్స్లో 200 వికెట్ల మార్కును అందుకున్నాడు. అయితే, షమీ ఇప్పటికి 100 ఇన్నింగ్స్లో 195 వికెట్లు పడగొట్టాడు. కాబట్టి తదుపరి ఆడబోయే వన్డేలో షమీ ఐదు వికెట్లు తీశాడంటే.. స్టార్క్ వరల్డ్ రికార్డును అతడు బద్దలుకొడతాడు. ఇక భారత్ తరఫున అత్యంత వేగంగా వన్డేల్లో 200 వికెట్ల క్లబ్లో చేరిన బౌలర్గా.. టీమిండియా ప్రస్తుత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కొనసాగుతున్నాడు. అతడు 133 ఇన్నింగ్స్లో ఈ ఫీట్ అందుకున్నాడు.కాగా టీమిండియా ఇంగ్లండ్తో జనవరి 22- ఫిబ్రవరి 2 వరకు ఐదు టీ20లు ఆడనుంది. అనంతరం.. ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్ మొదలుకానుంది. ఫిబ్రవరి 6న నాగ్పూర్లో తొలి వన్డే, ఫిబ్రవరి 9న కటక్లో రెండో వన్డే, ఫిబ్రవరి 12న మూడో అహ్మదాబాద్లో మూడో వన్డే జరుగనున్నాయి.వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్ల క్లబ్లో చేరిన బౌలర్లు వీరే1. మిచెల్ స్టార్క్- 102 మ్యాచ్లలో2. సక్లెయిన్ ముస్తాక్- 104 మ్యాచ్లలో3. ట్రెంట్ బౌల్ట్- 107 మ్యాచ్లలో4. బ్రెట్ లీ- 112 మ్యాచ్లలో5. అలెన్ డొనాల్డ్- 117 మ్యాచ్లలో.చదవండి: భారత జట్టు ప్రకటన.. షమీ రీఎంట్రీ, సూపర్స్టార్పై వేటు! -
వారెవ్వా!.. యశస్వి జైస్వాల్ ప్రపంచ రికార్డు
సిడ్నీ టెస్టు సందర్భంగా టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో తొలి ఓవర్లో అత్యధిక పరుగులు రాబట్టిన భారత్ బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు. అంతేకాదు ఓ ప్రపంచ రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు.ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)తో టీమిండియా ప్రస్తుతం బిజీగా ఉంది. ఈ సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా తొలి టెస్టులో గెలిచిన భారత్.. అనంతరం అడిలైడ్లో ఓడి, బ్రిస్బేన్లో మ్యాచ్ను డ్రా చేసుకుంది. అనంతరం మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 184 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి.. 1-2తో వెనుకబడింది.ఈ క్రమంలో చావో రేవో తేల్చుకునేందుకు సిడ్నీ వేదికగా ఆసీస్తో ఈ సిరీస్లో ఆఖరిదైన ఐదో టెస్టు శుక్రవారం మొదలుపెట్టింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌట్ అయింది. శనివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా కంగారూలను 181 పరుగులకే కట్టడి చేసి.. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.స్టార్క్కు చుక్కలు చూపించిన జైసూఇక వచ్చీ రావడంతో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc)కు చుక్కలు చూపించాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన అతడి బౌలింగ్లో చితకబాదాడు. మొదటి బంతికి పరుగులేమీ రాబట్టలేకపోయిన జైసూ.. తర్వాత వరుసగా మూడు బంతులను బౌండరీకి తరలించాడు. తద్వారా పన్నెండు పరుగులు పించుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఐదో బంతిని వదిలేశాడు.మళ్లీ ఓవర్లో ఆఖరి బంతికి మాత్రం జైస్వాల్ తన ప్రతాపం చూపించాడు. వైడ్ ఆఫ్ దిశగా వచ్చిన బంతిని ఎక్స్ ట్రా కవర్ వేదికగా ఫోర్ బాదాడు. ఈ క్రమంలో మొదటి ఓవర్లోనే జైస్వాల్ పదహారు పరుగులు రాబట్టాడు. తద్వారా టెస్టుల్లో తొలి ఓవర్లో అత్యధిక పరుగులు(ఆరు బంతుల్లో 16 పరుగులు) చేసిన తొలి భారత బ్యాటర్గా చరిత్రకెక్కాడు.ఆల్టైమ్ రికార్డు బ్రేక్అంతకుముందు 2005లో వీరేంద్ర సెహ్వాగ్ తొలి ఓవర్లో 13 పరుగులు రాబట్టాడు. అనంతరం.. 2023లో రోహిత్ శర్మ సెహ్వాగ్ రికార్డును సమం చేశాడు. అయితే, సిడ్నీ టెస్టు సందర్భంగా జైస్వాల్ వీరిద్దరి పేరిట సంయుక్తంగా ఉన్న ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.అంతేకాదు ఓ ప్రపంచ రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు జైస్వాల్. టెస్టుల్లో తొలి ఓవర్లోనే నాలుగు ఫోర్లు బాదిన క్రికెటర్గా మైకేల్ స్లాటర్, క్రిస్ గేల్ సరసన నిలిచాడు.టెస్టుల్లో తొలి ఓవర్లోనే అత్యధిక ఫోర్లు బాదిన క్రికెటర్లుగా ప్రపంచ రికార్డు👉మైకేల్ స్లాటర్- 2001లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- బర్మింగ్హామ్- నాలుగు ఫోర్లు- 18 పరుగులు👉క్రిస్ గేల్- 2012లో వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్, ఆంటిగ్వా- నాలుగు ఫోర్లు- 16 పరుగులు👉యశస్వి జైస్వాల్- 2024లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, సిడ్నీ- నాలుగు ఫోర్లు- 16 పరుగులు.పంత్ దూకుడు.. రెండో రోజు పరిస్థితి ఇదీఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో రెండో రోజు ఆట పూర్తయ్యే సరికి టీమిండియా 32 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో వచ్చిన నాలుగు పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని ఓవరాల్గా 145 పరుగుల లీడ్లో ఉంది. జైస్వాల్ 35 బంతుల్లో 22 పరుగులు సాధించగా.. కేఎల్ రాహుల్(13), శుబ్మన్ గిల్(13), విరాట్ కోహ్లి(6) మరోసారి విఫలమయ్యారు.ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న రిషభ్ పంత్ ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 29 బంతుల్లోనే యాభై పరుగులతో మెరుపు అర్ధ శతకం సాధించాడు. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో చెలరేగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 61 పరుగులు చేశాడు. కమిన్స్ బౌలింగ్లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.ఇక పంత్ అవుటైన తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ నెమ్మదించింది. నితీశ్ రెడ్డి నాలుగు పరుగులకే నిష్క్రమించగా.. రవీంద్ర జడేజా(39 బంతుల్లో 8), వాషింగ్టన్ సుందర్(17 బంతుల్లో 6) పరుగులతో అజేయంగా ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ నాలుగు, కమిన్స్, బ్యూ వెబ్స్టర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. చదవండి: IND vs AUS: పంత్ సరి కొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా రికార్డుSometimes JaisWall, sometimes JaisBall! 🔥Another #YashasviJaiswal 🆚 #MitchellStarc loading? 🍿👀#AUSvINDOnStar 👉 5th Test, Day 2 | LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/W4x0yZmyO9— Star Sports (@StarSportsIndia) January 4, 2025 -
బెయిల్స్ మార్చిన స్టార్క్.. ఇచ్చిపడేసిన యశస్వి జైశ్వాల్! వీడియో వైరల్
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. 340 పరుగుల లక్ష్య చేధనలో భారత్ పోరాడుతోంది. ఆఖరి రోజు తొలి సెషన్లో ఆస్ట్రేలియా బౌలర్లు పైచేయి సాధించగా.. రెండో సెషన్లో మాత్రం టీమిండియా అద్బుతంగా తిరిగి పుంజుకుంది.యశస్వి జైశ్వాల్, రిషబ్ పంత్ ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నారు. అయితే ఆఖరి రోజు ఆటలో యశస్వి జైశ్వాల్, ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ మధ్య ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.ఏమి జరిగిందంటే?అద్భుతంగా ఆడుతున్న జైశ్వాల్ ఏకాగ్రతని దెబ్బతీసేందుకు స్టార్క్ నాన్-స్ట్రైకర్ ఎండ్లో వికెట్లపై ఉన్న బెయిల్స్ను మార్చాడు. ఈ క్రమంలో జైస్వాల్ అసంతృప్తికి గురయ్యాడు. స్టార్క్ తన రన్ ఆప్ను తీసుకునేందుకు వెళ్లిన వెంటనే యశస్వి బెయిల్స్ను తిరిగి మార్చాడు.దీంతో బంతి వేసిన తర్వాత జైశ్వాల్ను స్టార్క్ ఏదో అన్నాడు. జైశ్వాల్ కూడా అందుకు ధీటుగా బదులిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా 50 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది.క్రీజులో జైశ్వాల్(61 నాటౌట్), పంత్(22) పరుగులతో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 236 పరుగులు అవసరమవ్వగా.. ఆసీస్కు 7 వికెట్లు కావాలి.అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే భారత్ డ్రా కోసం ఆడుతున్నట్లు అన్పిస్తోంది.చదవండి: IND vs AUS: 'ఇక ఆడింది చాలు.. రిటైర్ అయిపో రోహిత్'..Back-to-back half-centuries for Yashasvi Jaiswal!#AUSvIND | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/Vqr1VqMp2C— cricket.com.au (@cricketcomau) December 30, 2024 Back-to-back half-centuries for Yashasvi Jaiswal!#AUSvIND | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/Vqr1VqMp2C— cricket.com.au (@cricketcomau) December 30, 2024 -
అతడు పింక్ బాల్ మాంత్రికుడు: మాథ్యూ హేడెన్
అడిలైడ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ నిప్పులు చెరిగాడు. తొలి ఇన్నింగ్స్లో గులాబీ బంతితో స్టార్క్ మాయ చేశాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే జైశ్వాల్ ఔట్ చేసిన స్టార్క్.. ఆ తర్వాత ఆఖరి వికెట్ వరకు తన జోరును కొనసాగించాడు.మొత్తంగా 6 వికెట్లు పడగొట్టి టీమిండియాను దెబ్బతీశాడు. అతడి బౌలింగ్ ధాటికి భారత్ కేవలం 180 పరుగులకే ఆలౌటైంది. ఈ నేపథ్యంలో మిచెల్ స్టార్క్పై ఆసీస్ దిగ్గజం మాథ్యూ హేడెన్ ప్రశంసల వర్షం కురిపించాడు. స్టార్క్ను 'పింక్ బాల్ మాంత్రికుడు' అని అతడు కొనియాడాడు."స్టార్క్ కుడి చేతి వాటం బ్యాటర్లకు అద్బుతంగా బౌలింగ్ చేశాడు. అతడు తన సీమ్ డెలివరీలతో రైట్ హ్యాండ్ బ్యాటర్లను బెంబెలెత్తించడం చూసి నేను ఆశ్చర్యపోయాను. పింక్ బాల్తో 40వ ఓవర్లో కూడా స్వింగ్ చేయడం ఇప్పటివరకు నేను చూడలేదు. కానీ అది స్టార్క్కే సాధ్యమైంది. బంతి పాతపడినప్పటకి అద్భుతంగా స్వింగ్ చేసాడు. అతడు ఈ మూమెంట్ కోసమే ఎదురుచూస్తున్నాడు. తనకు లభించిన ఆరంభాన్ని అందిపుచ్చుకున్నాడు. జీవితంలోనైనా ఆటలోనైనా కమ్బ్యాక్ ఇవ్వడం అంత సులువు కాదు. తిరిగి రావడానికి కొన్ని అవకాశాలు మనకు లభిస్తాయి.వాటిని అందుపుచ్చుకుంటే ముందుకు వెళ్లగలము. స్టార్క్ అదే చేసి చూపించాడు. తొలి టెస్టులో భారీగా పరుగులిచ్చినప్పటికి అడిలైడ్లో సూపర్ కమ్బ్యాక్ ఇచ్చాడు. ఫ్లడ్ లైట్ల వెలుగులో బంతితో మాయ చేశాడు. అతడు పింక్ బాల్ మాంత్రికుడులా కన్పించాడని ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హేడెన్ పేర్కొన్నాడు. -
‘గులాబీ’ గుచ్చుకుంది!
నాలుగేళ్ల క్రితం తమకు అచ్చిరాని అడిలైడ్ మైదానంలో అదే డే అండ్ నైట్ టెస్టులో మరోసారి గులాబీ బంతిని సమర్థంగా ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. ‘పింక్ బాల్’ స్పెషలిస్ట్ స్టార్క్ పదునైన బంతులతో చెలరేగడంతో రెండు సెషన్లకే భారత బ్యాటర్లు తమ ఇన్నింగ్స్ను ముగించారు. ఒక్క నితీశ్ కుమార్ రెడ్డి మాత్రమే తన దూకుడుతో ఆకట్టుకోగలిగాడు. గత టెస్టులో కుప్పకూలిన ఆస్ట్రేలియా టాపార్డర్ ఇప్పుడు కాస్త పట్టుదల కనబర్చడంతో తొలి రోజు ఆధిపత్యం ఆతిథ్య జట్టు ఖాతాలో చేరింది. పెర్త్ టెస్టు తరహాలోనే మన బౌలర్లు ప్రత్యర్థిని పడగొడతారా లేక రెండో రోజు బలమైన బ్యాటింగ్తో ఆ్రస్టేలియా పటిష్ట స్థితికి చేరుతుందా చూడాలి. అడిలైడ్: ఆ్రస్టేలియాతో రెండో టెస్టులో భారత బ్యాటింగ్ తడబడింది. గత మ్యాచ్ తరహాలోనే తొలి ఇన్నింగ్స్లో తక్కువ స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 44.1 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ కుమార్ రెడ్డి (54 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలవగా... రాహుల్ (64 బంతుల్లో 37; 6 ఫోర్లు), గిల్ (51 బంతుల్లో 31; 5 ఫోర్లు) కీలక పరుగులు సాధించారు.మిచెల్ స్టార్క్ (6/48) తన కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో భారత్ను దెబ్బ కొట్టాడు. అనంతరం ఆ్రస్టేలియా ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో ఒక వికెట్ నష్టపోయి 33 ఓవర్లలో 86 పరుగులు చేసింది. మెక్స్వీనీ (38 బ్యాటింగ్; 6 ఫోర్లు), లబుషేన్ (20 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఆ్రస్టేలియా మరో 94 పరుగులు వెనుకబడి ఉంది. ఈ ఆసక్తికర పోరుకు తొలి రోజు రికార్డు స్థాయిలో 50,186 మంది ప్రేక్షకులు హాజరు కావడం విశేషం. పదేళ్ల క్రితం మైదానంలో గాయపడి మృతి చెందిన ఫిల్ హ్యూస్, ఇటీవల కన్నుమూసిన మాజీ ఆటగాడు ఇయాన్ రెడ్పాత్ స్మృతిలో ఆసీస్ ఆటగాళ్లు భుజాలకు నలుపు రంగు బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. కీలక భాగస్వామ్యం... భారత ఇన్నింగ్స్ అనూహ్య రీతిలో మొదలైంది. మ్యాచ్ తొలి బంతికి యశస్వి జైస్వాల్ (0)ను అవుట్ చేసి స్టార్క్ దెబ్బ కొట్టాడు. 140.4 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతికి జైస్వాల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత గిల్ ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయగా, రాహుల్ కాస్త జాగ్రత్త ప్రదర్శించాడు. బోలండ్ తొలి ఓవర్లో రాహుల్ కొంత ఉత్కంఠను ఎదుర్కొన్నాడు. తొలి బంతికి అతను కీపర్కు క్యాచ్ ఇవ్వగా అది ‘నోబాల్’ అయింది.అయితే ఆ తర్వాత రీప్లేలో బంతి బ్యాట్కు తాకలేదని కూడా తేలింది. అదే ఓవర్లో రాహుల్ ఇచ్చిన సునాయాస క్యాచ్ను ఖ్వాజా వదిలేశాడు. అయితే కొద్ది సేపటి తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. 12 పరుగుల వ్యవధిలో భారత్ 3 కీలక వికెట్లు కోల్పోయింది. రాహుల్, కోహ్లి (7)లను స్టార్క్ అవుట్ చేయగా... గిల్ వికెట్ బోలండ్ ఖాతాలో చేరడంతో తొలి సెషన్ ముగిసేసరికి స్కోరు 82/4కు చేరింది. బ్రేక్ తర్వాత కూడా పరిస్థితి మారలేదు. ఆరో స్థానంలో ఆడిన రోహిత్ శర్మ (3) విఫలం కాగా... రిషభ్ పంత్ (21; 2 ఫోర్లు), అశ్విన్ (22; 3 ఫోర్లు) ఎక్కువ సేపు నిలవలేకపోయారు. హర్షిత్ రాణా (0)ను అవుట్ చేసి స్టార్క్ ఐదో వికెట్ను తన ఖాతాలో వేసుకోగా, స్టార్క్ బౌలింగ్లోనే భారీ షాట్ ఆడే క్రమంలో నితీశ్ చివరి వికెట్గా వెనుదిరిగాడు. రెండో సెషన్లో భారత్ 21.1 ఓవర్లలో 98 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. వికెట్ కాపాడుకుంటూ... తొలి టెస్టులో ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి ఓటమికి బాటలు పడటంతో ఈసారి ఆసీస్ ఓపెనర్లు జాగ్రత్తగా ఇన్నింగ్స్ను ఆరంభించారు. అయితే 2 పరుగుల వద్ద మెక్స్వీనీ ఇచ్చిన క్యాచ్ను పంత్ వదిలేయం కూడా కలిసొచ్చి0ది. పంత్ అడ్డుగా రాకపోతే బంతి నేరుగా రోహిత్ చేతుల్లోకి వెళ్లేది! తొలి 10 ఓవర్లలో ఆసీస్ వికెట్ కోల్పోలేదు. అయితే బుమ్రా వేసిన తర్వాతి ఓవర్లో ఉస్మాన్ ఖ్వాజా (13; 2 ఫోర్లు) పెవిలియన్ చేరాడు. వరుస వైఫల్యాలతో జట్టులో స్థానం కోల్పోయే స్థితిలో క్రీజ్లోకి వచ్చిన లబుషేన్ ఈ సారి కూడా ఆరంభంలో బాగా తడబడ్డాడు. ఎట్టకేలకు 19వ బంతికి అతను ఖాతా తెరిచాడు. మరోవైపు క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత మెక్స్వీనీ కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. 22 ఓవర్ల పాటు ఈ జోడీని విడదీయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (ఎల్బీ) (బి) స్టార్క్ 0; రాహుల్ (సి) మెక్స్వీనీ (బి) స్టార్క్ 37; గిల్ (ఎల్బీ) (బి) బోలండ్ 31; కోహ్లి (సి) స్మిత్ (బి) స్టార్క్ 7; పంత్ (సి) లబుõÙన్ (బి) కమిన్స్ 21; రోహిత్ (ఎల్బీ) (బి) బోలండ్ 3; నితీశ్ కుమార్ రెడ్డి (సి) హెడ్ (బి) స్టార్క్ 42; అశ్విన్ (ఎల్బీ) (బి) స్టార్క్ 22; హర్షిత్ (బి) స్టార్క్ 0; బుమ్రా (సి) ఖ్వాజా (బి) కమిన్స్ 0; సిరాజ్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 13; మొత్తం (44.1 ఓవర్లలో ఆలౌట్) 180. వికెట్ల పతనం: 1–0, 2–69, 3–77, 4–81, 5–87, 6–109, 7–141, 8–141, 9–176, 10–180. బౌలింగ్: స్టార్క్ 14.1–2–48–6, కమిన్స్ 12–4– 41–2, బోలండ్ 13–0–54–2, లయన్ 1–0–6– 0, మార్‡్ష 4–0–26–0. ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) రోహిత్ (బి) బుమ్రా 13; మెక్స్వీనీ (బ్యాటింగ్) 38; లబుషేన్ (బ్యాటింగ్) 20; ఎక్స్ట్రాలు 15; మొత్తం (33 ఓవర్లలో వికెట్ నష్టానికి) 86. వికెట్ల పతనం: 1–24. బౌలింగ్: బుమ్రా 11–4–13–1, సిరాజ్ 10–3–29–0, హర్షిత్ 8–2–18–0, నితీశ్ 3–1–12–0, అశ్విన్ 1–1–0–0.3 ఆసీస్ ఓపెనర్ ఖ్వాజాను అవుట్ చేయడంతో బుమ్రా ఈ ఏడాది టెస్టుల్లో 50 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఒకే ఏడాది 50 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన మూడో భారతీయ పేసర్గా బుమ్రా గుర్తింపు పొందాడు. గతంలో కపిల్ దేవ్ రెండుసార్లు (1983లో 18 టెస్టుల్లో 75 వికెట్లు; 1979లో 17 టెస్టుల్లో 74 వికెట్లు), జహీర్ ఖాన్ (2002లో 15 టెస్టుల్లో 51 వికెట్లు) ఒకసారి ఈ ఘనత సాధించారు. నితీశ్... తగ్గేదేలే పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత టాప్ స్కోరర్గా నిలిచిన ఆంధ్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్లోనూ దానిని పునరావృతం చేశాడు. ఈసారి బ్యాటింగ్ ఆర్డర్లో ఏడో స్థానంలో బరిలోకి దిగిన అతని ఆట వల్లే భారత్ ఈమాత్రం స్కోరు చేయగలిగింది. భారత్ ఇన్నింగ్స్లో 3 సిక్స్లూ అతని ద్వారానే వచ్చాయి. స్టార్క్ బౌలింగ్లో ఎక్స్ట్రా కవర్ మీదుగా అద్భుత సిక్స్ కొట్టిన అతను... బోలండ్ ఓవర్లో 2 సిక్స్లు, ఒక ఫోర్తో ధాటిని ప్రదర్శించాడు. ఇందులో స్లిప్ కార్డన్ మీదుగా ‘రివర్స్ స్కూప్’తో అతను కొట్టిన సిక్సర్ ఆట మొత్తానికే హైలైట్గా నిలిచింది. ఆస్ట్రేలియా గడ్డపై పేసర్ల బౌలింగ్లో అత్యధిక (5) సిక్స్లు కొట్టిన భారత బ్యాటర్గా తన రెండో టెస్టులోనే నితీశ్ గుర్తింపు సాధించడం విశేషం. -
IND vs AUS 2nd Test: తొలి రోజు ఆసీస్దే..!
అడిలైడ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్లో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్.. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు 94 పరుగులు వెనుకపడి ఉంది. ఉస్మాన్ ఖ్వాజా (13) ఔట్ కాగా.. మార్నస్ లబుషేన్ (20), నాథన్ మెక్స్వీని (38) క్రీజ్లో ఉన్నారు. ఉస్మాన్ ఖ్వాజా వికెట్ బుమ్రాకు దక్కింది.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 180 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ స్టార్క్ (6/48) టీమిండియాను దెబ్బకొట్టాడు. కమిన్స్, బోలాండ్ తలో రెండు వికెట్లు తీశారు. భారత ఇన్నింగ్స్లో నితీశ్ కుమార్ రెడ్డి (42) టాప్ స్కోరర్గా నిలువగా.. కేఎల్ రాహుల్ (37), శుభ్మన్ గిల్ (31), అశ్విన్ (22), రిషబ్ పంత్ (21) రెండంకెల స్కోర్లు చేశారు. కోహ్లి 7, రోహిత్ శర్మ 3 పరుగులకే ఔటై నిరాశపర్చగా.. యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా, బుమ్రా డకౌట్ అయ్యారు. కాగా, పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా 295 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. -
టీమిండియాను ఉతికి 'ఆరే'సిన స్టార్క్
అడిలైడ్ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్లో ఆసీస్ స్పీడ్స్టర్ మిచెల్ స్టార్క్ కెరీర్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో స్టార్క్ 48 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. స్టార్క్ కెరీర్లో అత్యుత్తమ గణంకాలు గతంలో 6/50గా ఉండేవి. స్టార్క్ తన కెరీర్లో మొత్తం 15 ఐదు వికెట్ల ఘనతలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో స్టార్క్ 350 వికెట్ల అరుదైన క్లబ్లో చేరాడు.ఈ మ్యాచ్లో స్టార్క్ యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, నితీశ్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, హర్షిత్ రాణా వికెట్లు తీశాడు. స్టార్క్ ఇన్నింగ్స్ తొలి బంతికే భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ను పెవిలియన్కు పంపాడు. ఇలా టెస్ట్ల్లో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీయడం స్టార్క్కు ఇది మూడో సారి. స్టార్క్కు ముందు విండీస్ బౌలర్ పెడ్రో కాలిన్స్ కూడా టెస్ట్ల్లో మూడు సార్లు ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. స్టార్క్ దెబ్బకు భారత్ తొలి ఇన్నింగ్స్లో 180 పరుగులకే ఆలౌటైంది. కమిన్స్, బోలాండ్ తలో రెండు వికెట్లు తీశారు. భారత ఇన్నింగ్స్లో నితీశ్ కుమార్ రెడ్డి (42), కేఎల్ రాహుల్ (37), శుభ్మన్ గిల్ (31), అశ్విన్ (22), రిషబ్ పంత్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కోహ్లి 7, రోహిత్ శర్మ 3 పరుగులకే ఔటై నిరాశపర్చగా.. యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా, బుమ్రా డకౌట్ అయ్యారు. -
IND Vs AUS: స్టార్క్ మ్యాజిక్ బాల్.. విరాట్ కోహ్లి మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తన మార్క్ చూపించలేకపోయాడు. తనకు ఇష్టమైన వేదికలో మొదటి ఇన్నింగ్స్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి కోహ్లి ఔటయ్యాడు.ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన బంతితో విరాట్ను బోల్తా కొట్టించాడు. కోహ్లి తన ఇన్నింగ్స్ ఆరంభంలోనే సూపర్ కవర్ డ్రైవ్ షాట్ ఆడి మంచి టచ్లో కన్పించాడు. అయితే భారత ఇన్నింగ్స్ 21వ ఓవర్లో తొలి బంతిని షార్ట్ ఆఫ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు.అయితే తొలుత ఆ డెలివరీని ఢిపెన్స్ ఆడాలని భావించిన కోహ్లి.. ఆఖరి నిమిషంలో తన మనసు మార్చుకుని బంతిని వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే కోహ్లి తన బ్యాట్ను వెనక్కి తీయడంలో కాస్త ఆలస్యమైంది.దీంతో బంతి కోహ్లి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్లో ఉన్న స్టీవ్ స్మిత్ చేతికి వెళ్లింది. క్యాచ్ అందుకోవడంలో స్మిత్ ఎటువంటి పొరపాటు చేయలేదు. దీంతో కోహ్లి నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లి అద్భుతమైన సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే.@Ro45Kuljot_ pic.twitter.com/Qt3QfgL2hI— " (@Beast__010) December 6, 2024 -
తొలి బంతికే ఔట్.. జైశ్వాల్ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు
అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్లో మొదటి బంతికే జైశ్వాల్ పెవిలియన్కు చేరాడు. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయిన జైశ్వాల్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో జైశ్వాల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియా గడ్డపై తొలి బంతికే ఔటైన నాలుగో ప్లేయర్గా జైశ్వాల్ నిలిచాడు. ఈ చెత్త రికార్డు నమోదు చేసిన జాబితాలో యశస్వి కంటే ముందు ఆర్చీ మాక్లారెన్ (ఇంగ్లండ్), స్టాన్ వర్తింగ్టన్ (ఇంగ్లండ్), రోరీ బర్న్స్ (ఇంగ్లండ్) ఉన్నారు.ఓవరాల్గా ఓ టెస్టు మ్యాచ్లో తొలి బంతికే ఔటైన ఏడో భారత బ్యాటర్గా జైస్వాల్ నిలిచాడు. చివరగా జైశ్వాల్ కంటే ముందు కేఎల్ రాహుల్ 2017లో గోల్డెన్ డకౌటయ్యాడు. కాగా జైశ్వాల్ తొలి టెస్టులో కూడా మొదటి ఇన్నింగ్స్లో డకౌటయ్యాడు. కానీ తర్వాత రెండో ఇన్నింగ్స్లో మాత్రం అద్భుమైన సెంచరీతో చెలరేగాడు.టెస్టుల్లో గోల్డెన్ డకౌటైన భారత ఆటగాళ్లు వీరే..సునీల్ గవాస్కర్, 1974 vs ఇంగ్లండ్ఎస్ నాయక్, 1974 vs ఇంగ్లండ్సునీల్ గవాస్కర్, 1983 vs వెస్టిండీస్సునీల్గవాస్కర్, 1987 vs పాకిస్తాన్వి రామన్, 1990 vs న్యూజిలాండ్ఎస్ దాస్, 2002, వెస్టిండీస్వసీం జాఫర్, 2007 vs బంగ్లాదేశ్కేఎల్ రాహుల్, 2017 vs శ్రీలంకచదవండి: IND vs AUS: ఏంటి రాహుల్ ఇది?.. ఒకే ఓవర్లో రెండు ఛాన్స్లు వచ్చినా! వీడియో -
ఆ రోజు జైశ్వాల్ ఏమన్నాడో వినలేదు.. కానీ అతడికి అస్సలు భయం లేదు: స్టార్క్
పెర్త్ వేదికగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో ఆసీస్ స్టార్ పేసర్ మిచిల్ స్టార్క్ను భారత యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ స్లెడ్జింగ్ చేసిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ సందర్భంగా "నువ్వు చాలా నెమ్మదిగా బౌలింగ్ చేస్తున్నావు" అని స్టార్క్ అన్నాడు. ఇదంతా స్టంప్ మైక్లో రికార్డు అయింది. అయితే ఆ సమయంలో స్టార్క్ నుంచి మాత్రం ఎటువంటి సమాధానం ఇవ్వకుండా, నవ్వుతూ వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తాజాగా ఇదే విషయంపై మిచిల్ స్టార్క్ స్పందించాడు. ఆ సమయంలో యశస్వి అన్న మాటలను తను వినలేదని స్టార్క్ చెప్పుకొచ్చాడు.వాస్తవానికి ఆ రోజు నేను చాలా నెమ్మదిగా బౌలింగ్ చేస్తానని జైశ్వాల్ చెప్పడం నేను వినలేదు. ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడలనుకోవడం లేదు. కానీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరముంది. మూడో రోజు ఆటలో ఓ షార్ట్ పిచ్ డెలివరీని జైశ్వాల్ ప్లిక్ షాట్ ఆడాడు.ఆ బంతిని అతడు సిక్సర్గా మలిచాడు. మరోసారి దాదాపుగా అలాంటి బంతినే వేశాను. కానీ ఈసారి అతడు డిఫెన్స్ ఆడాడు. వెంటనే అతడి వద్దకు వెళ్లి ఫ్లిక్ షాట్ ఎక్కడ? అని అడిగాను. అతడు నన్ను చూసి నవ్వాడు. దీంతో ఆ విషయాన్ని ఇద్దరం అక్కడితో వదిలేశామని" స్టార్క్ క్రికెట్ ఆస్ట్రేలియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అదేవిధంగా జైశ్వాల్పై స్టార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత తరంలో భయంలేని బ్యాటర్లలో జైశ్వాల్ ఒకడిని, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడుతున్నాడని స్టార్క్ కొనియాడాడు.చదవండి: SA vs SL 2nd Test: రికెల్టన్ సెంచరీ.. తొలి రోజు సఫారీలదే -
ఐపీఎల్లోకి అడుగుపెట్టిన సిక్కోలు తేజం.. ఇదో సువర్ణావకాశం
కేఎల్ రాహుల్ క్లాసిక్ షాట్లను దగ్గరుండి చూడొచ్చు. మిచెల్ స్టార్క్ బులెట్ యార్కర్ల గుట్టు తెలుసుకోవచ్చు. హ్యారీ బ్రూక్ పరుగుల దాహం వెనుక రహస్యం తెలుసుకోవచ్చు. ఫాఫ్ డూప్లెసిస్ అనుభవాలను తెలుసుకుని పునాదులు పటిష్టం చేసుకోవచ్చు. జిల్లా స్టార్ క్రికెటర్ త్రిపురాన విజయ్కు బంగారం లాంటి అవకాశం తలుపు తట్టింది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి అడుగుపెట్టబోతున్న విజయ్కు అనుభవజు్ఞల ఆటతీరు మార్గదర్శకం కాబోతోంది. టీమిండియాలోకి ప్రవేశించేందుకు ఇది తొలి అడుగు కానుంది. శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా స్టార్ క్రికెటర్ త్రిపురాన విజయ్ ఐపీఎల్లో అడుగుపెట్టబోతున్నాడు. రూ.30 లక్షల బేస్ ప్రైజ్తో రిజిస్టర్ చేసుకున్న విజయ్ను ఢిల్లీ డేర్ క్యాపిటల్స్ జట్టు అదే ధరకు కొనుగోలు చేసింది. సౌదీ అరేబియాలో ఈ ఐపీఎల్ వేలం జరిగింది. వేలంలో డీసీ జట్టు కొనుగోలు చేసిందని తెలిశాక క్రికెట్ తల్లిదండ్రులు, జిల్లా క్రికెట్ సంఘ పెద్దలు పట్టరాని సంతోషం వ్యక్తం చేశారు. మూడేళ్లుగా నిలకడగా రాణింపు.. విజయ్ పదేళ్లుగా క్రికెట్ ఆడుతున్నా.. గత మూడే ళ్లుగా నిలకడ చూపిస్తున్నాడు. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి వచ్చిన పిలుపు మేరకు సెలెక్షన్స్ ట్రయల్స్లో కూడా పాల్గొన్నాడు. కుచ్బిహార్ ట్రోఫీ, విజయ్హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ ఆలీ క్రికెట్ టోరీ్నలు, రంజీల్లో రాణించడంతో బీసీసీఐ పెద్దల దృష్టిని ఆకర్షించడంతో ఐపీఎల్ ఎంపిక కచ్చితంగా జరుగుతుందని తల్లిదండ్రులతోపాటు జిల్లా క్రికెట్ సంఘ పెద్దలు ఆశించారు. వారి ఆశలు నిజమయ్యాయి.శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక క్రికెటర్ ఐపీఎల్కు చేరువ కావడం గర్వంగా ఉందని జిల్లా క్రికెట్ సంఘ అధ్యక్షులు పెద్దలు పుల్లెల శాస్త్రి, కార్యదర్శి హసన్రాజా, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాదికి మరో ముగ్గురు నలుగురు క్రికెటర్లను తయారుచేస్తామని వారు చెబుతున్నారు. జిల్లా నుంచి ఒకే ఒక్కడు..జిల్లా నుంచి ఐపీఎల్ వరకు వెళ్లిన మొదటి క్రికెటర్గా త్రిపురాన విజయ్ గుర్తింపు అందుకున్నాడు. టెక్కలిలోని అయ్యప్పనగర్లో నివాసం ఉంటున్న త్రిపురాన వెంకటకృష్ణరాజు, లావణ్యలు విజయ్ తల్లిదండ్రులు. తండ్రి సమాచారశాఖలో ఉద్యోగిగా పనిచేస్తుండగా తల్లి గృహిణి. ప్రస్తుతం విజయ్ టెక్కలిలోని ఓ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. పాఠశాల దశలో క్రికెట్పైన మక్కువతో త్రిపురాన విజయ్ 2013–14లో అరంగ్రేటం చేశాడు. అంతర్ జిల్లాల నార్త్జోన్ అండర్–14 జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఉత్తమ ప్రదర్శనతో రాణించడంతో కడప క్రికెట్ అకాడమీకి ఎంపికయ్యాడు. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటింగ్తోపాటు ఆఫ్స్పిన్ మ్యాజిక్తో విశేషంగా ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ట్రాక్ రికార్డ్2022–23, 2024–25 రెండు సీజన్లలో ప్రతిష్టాత్మక రంజీ పోటీల్లో పాల్గొనే ఆంధ్రా పురుషుల జట్టుకు ఎంపికయ్యాడు. అండర్–19 విభాగంలో ఏసీఏ నార్త్జోన్ పోటీల్లో 6 మ్యాచ్లు ఆడి 19 వికెట్లు తీయడంతోపాటు 265 పరుగులు సాధించి ఉత్తమ ఆల్రౌండర్గా గుర్తింపు పొందాడు. అంతర్ రాష్ట్ర అండర్–25 వన్డే క్రికెట్ టో రీ్నలో హైదరాబాద్పై జరిగిన మ్యాచ్లో 4.4 ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి సెలెక్టర్లను ఆకర్షించాడు. 2021–22లో అంతర్రాష్ట్ర అండర్–23 క్రికెట్ టోరీ్నలో మెరుగ్గా రాణించడంతో బీసీసీఐ నిర్వహిస్తున్న బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీకి ఎంపికై శిక్షణ పొందారు. ఆంధ్ర ప్రీమియం లీగ్(ఏపీఎల్) టీ–20 క్రికెట్ పోటీల్లో మూడు సీజన్లలోనూ రాణించా డు. రాయలసీమ కింగ్స్పై జరిగిన మ్యాచ్లో 25 బంతుల్లో 63 పరుగులు సాధించి అజేయంగా నిలిచి విశేషంగా ఆకట్టుకున్నాడు. బౌలింగ్లోను సత్తాచాచడంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నారు. ఏపీఎల్ టీ–20 క్రికెట్ మ్యాచ్ల్లో బెస్ట్ ఫీల్డర్గా మరో రూ.50వేల నగదు బహుమతిని ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ చేతులమీదుగా అందుకున్నాడు. గత సీజన్లో నాగ్పూర్లో జరిగిన విదర్భపై తన మొదటి మ్యాచ్లోనే నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. తాజాగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీశాడు.చాలా సంతోషంగా ఉంది మా కుమారుడు విజయ్ ఐపీఎల్కు ఎంపిక కావడం నిజంగా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులుగా మేము గర్వపడుతున్నాం. ఐపీఎల్లో మ్యాచ్లు ఆడే అవకాశం వస్తే తన ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. గత దశాబ్ద కాలంగా క్రికెట్టే శ్వాసగా ఉంటున్నాడు. భగవంతుడు శ్రమకు తగిన ఫలితాన్ని అందించాడని నమ్ముతున్నాం. –వెంకట కృష్ణంరాజు, లావణ్య త్రిపురాన విజయ్ తల్లిదండ్రులుచాలా గర్వంగా ఉంది.. చాలా గర్వంగా, చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఐపీఎల్కు ఎంపిక కావాలన్న నా కల సాకారమైంది. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ సెలక్షన్ ట్రయల్స్ పాల్గొన్నప్పుడే నమ్మకం కలిగింది. నా బేస్ ప్రైస్ రూ.30లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి, ప్రతినిధులకు థాంక్స్ చెప్పుకుంటున్నాను. అవకాశం లభించిన మ్యాచుల్లో సత్తా చాటేందుకు ప్రయతి్నస్తాను. ఈ నాలుగు నెలలపాటు కఠోర సాధన చేస్తాను. నన్ను నిరంతరం ప్రోత్సహిస్తున్న నా తల్లిదండ్రులకు, జిల్లా క్రికెట్ సంఘం, ఆంధ్రా క్రికెట్ సంఘ పెద్దలకు కృతజ్ఞతలు. త్రిపురాన విజయ్ -
కేఎల్ రాహుల్ అవుట్పై రగడ.. స్పందించిన స్టార్క్
ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్(26) అవుటైన తీరుపై మిచెల్ స్టార్క్ స్పందించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంలో తనకు తప్పేమీ కనిపించడం లేదని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. కాగా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన 22వ ఓవర్ రెండో బంతికి.. రాహుల్ సందేహాస్పద రీతిలో పెవిలియన్ చేరాడు.రివ్యూల్లో స్పష్టత రాకపోయినా...ఫీల్డ్ అంపైర్ మొదట నాటౌట్గా ప్రకటించగా... క్యాచ్ అవుట్ కోసం ఆసీస్ డీఆర్ఎస్కు వెళ్లింది. పలుమార్లు రీప్లేలు పరిశీలించిన థర్డ్ అంపైర్ రాహుల్ను అవుట్గా ప్రకటించాడు. అయితే రివ్యూల్లో స్పష్టత రాకపోయినా... థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్వర్త్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని మార్చడం వివాదాస్పదమైంది.తగిన రుజువు లేకుండా ఇలా చేయడం సరికాదుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి స్పందిస్తూ.. ‘బంతి బ్యాట్ను సమీపించిన సమయంలో అవుట్ సైడ్ ఎడ్జ్పై స్పైక్ కనిపించింది’ అని థర్డ్ అంపైర్ పేర్కొనడం... సరైన నిర్ణయం కాకపోవచ్చు’’ అని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు.. నిర్దిష్టమైన రుజువు లేకుండా ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టడం సరైంది కాదని వ్యాఖ్యానించాడు. ‘ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని మార్చే ఆధారాలేవీ రీప్లేలో కనిపించలేదు. నా వరకైతే తగిన రుజువు లేకుండా నిర్ణయాన్ని సమీక్షించడం సరైంది కాదు’ అని అన్నాడు.మరోవైపు.. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్ హస్సీ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశాడు. ‘ఇది వివాదాస్పద నిర్ణయం. స్నికోపై స్పైక్ రావడం వాస్తవమే కానీ అది బంతి బ్యాట్ను తాకినప్పుడు వచ్చిందా లేక ప్యాడ్ తాకినప్పుడా అనేది తేలాలి. దీనిపై నాకు కూడా సందేహాలు ఉన్నాయి’ అని హస్సీ అన్నాడు.ఇది చాలా ధైర్యంతో కూడిన నిర్ణయంఅయితే, ఆసీస్ మాజీ సారథి మార్క్వా మాట్లాడుతూ... ‘ఇది చాలా ధైర్యంతో కూడిన నిర్ణయం. దీంతో రాహుల్ సంతృప్తిగా ఉండకపోవచ్చు’ అని పేర్కొనడం గమనార్హం. ఇక.. భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘మరో కోణం నుంచి చూడా లని థర్డ్ అంపైర్ కోరినా... అది అందుబాటులో లేకపోయింది. మరి ఇలాంటి సందేహాస్పద పరిస్థితిలో అంపైర్ నిర్ణయాన్ని మార్చడం ఎందుకు’ అని ట్వీట్ చేశాడు. అదే విధంగా.. ‘స్పష్టత లేనప్పుడు అవుట్ ఇవ్వకూడదు’ అని ఇర్ఫాన్ పఠాన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు.స్టార్క్ స్పందన ఇదేఈ నేపథ్యంలో... శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఫీల్డ్ అంపైర్ నిర్ణయం తారుమారైంది. అయితే, అది సరైందే అనుకుంటున్నా. శబ్దం వచ్చిన మాట నిజం. ఆ వికెట్ సరైందేనని భావిస్తున్నా’’ అని స్టార్క్ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. శుక్రవారం మొదలైన తొలి టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి.. 150 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో శనివారం ఆటలో ఆసీస్ను తొలి ఇన్నింగ్స్లో 104 పరుగులకే కుప్పకూల్చింది. ఫలితంగా 46 పరుగుల స్పల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.చదవండి: హర్షిత్.. నీ కంటే నేను ఫాస్ట్గా బౌల్ చేయగలను: స్టార్క్ వార్నింగ్.. రాణా రియాక్షన్ వైరల్Matthew Hayden explaining the KL Rahul bat-pad scenario. - Unlucky, KL. 💔 pic.twitter.com/lf0UOWwmy8— Mufaddal Vohra (@mufaddal_vohra) November 22, 2024 -
హర్షిత్.. నీ కంటే నేను ఫాస్ట్గా బౌల్ చేస్తా: స్టార్క్ వార్నింగ్.. రాణా రియాక్షన్ వైరల్
ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య తొలి టెస్టు.. రెండో రోజు ఆట సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్.. భారత యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాకు ‘స్వీట్ వార్నింగ్’ ఇచ్చాడు. అయితే, ఇందుకు హర్షిత్ స్పందించిన తీరు నెట్టింట వైరల్గా మారింది.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్- భారత్ మధ్య ఐదు టెస్టులు జరుగనున్నాయి. ఇందులో భాగంగా పెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య శుక్రవారం మొదటి టెస్టు ఆరంభమైంది. ఇక ఈ మ్యాచ్కు వ్యక్తిగత కారణాల దృష్ట్యా రోహిత్ శర్మ దూరం కాగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా భారత జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు.ఇక పెర్త్లో టాస్ గెలిచిన బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆతిథ్య ఆసీస్ సైతం తొలి రోజే బ్యాటింగ్కు దిగింది. ఈ క్రమంలో ఆది నుంచే ఆసీస్ బ్యాటర్లను టార్గెట్ చేస్తూ పేస్ దళ నాయకుడు బుమ్రా వికెట్ల వేట మొదలుపెట్టగా.. మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా అతడికి సహకారం అందించారు.రాణా తొలి వికెట్ అతడేఫలితంగా శుక్రవారం నాటి ఆటలో టీమిండియా పైచేయి సాధించగలిగింది. బుమ్రా నాలుగు వికెట్లతో రాణించగా.. సిరాజ్ రెండు వికెట్లు కూల్చాడు. ఇక అరంగేట్ర బౌలర్ హర్షిత్ రాణా ట్రవిస్ హెడ్(11) రూపంలో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో తొలి వికెట్ దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే.. తొలి రోజు ఆట పూర్తయ్యే సరికి ఆసీస్ ఏడు వికెట్ల నష్టానికి 67 రన్స్ మాత్రమే చేసింది.అంతేకాదు.. శనివారం నాటి రెండో రోజు ఆరంభంలోనే వికెట్ తీసి మరోసారి దూకుడు ప్రదర్శించింది. ప్రమాదకారిగా మారుతున్న అలెక్స్ క్యారీ(21)ని బుమ్రా అవుట్ చేయగా.. నాథన్ లియాన్(5)ను హర్షిత్ పెవిలియన్కు పంపాడు.అయితే, ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ మాత్రం క్రీజులో పాతుకుపోయి.. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఈ క్రమంలో ఆసీస్ ఇన్నింగ్స్ 40వ ఓవర్లో బుమ్రా.. హర్షిత్ను రంగంలోకి దించాడు. ఈ క్రమంలో మూడో బంతిని హర్షిత్ బౌన్సర్గా సంధించగా.. స్టార్క్ హెల్మెట్కు తగిలింది.హర్షిత్.. నేను నీ కంటే వేగంగా బౌలింగ్ చేయగలనుదీంతో కంగారూపడిన హర్షిత్ స్టార్క్ వైపు చూస్తూ అంతే ఓకే కదా అన్నట్లు సైగలతోనే అడిగాడు. ఇందుకు బదులుగా నవ్వులు చిందించిన స్టార్క్.. ‘‘హర్షిత్.. నేను నీ కంటే వేగంగా బౌలింగ్ చేయగలను. పాత జ్ఞాపకాలు గుర్తున్నాయి’’ అంటూ ఐపీఎల్లో తాము కలిసి ఆడిన విషయాన్ని గుర్తు చేశాడు.ఇక స్టార్క్ మాటలతో ఒక్కసారిగా హర్షిత్ చిరునవ్వులు చిందిస్తూ అలాగే అన్నట్లు తలూపాడు. మామూలుగా ఆసీస్- భారత్ మ్యాచ్ అంటే స్లెడ్జింగ్ మొదట గుర్తుకువస్తుంది. అయితే, హర్షిత్- స్టార్క్ మాత్రం ఇలా ఫ్రెండ్లీగా ఉండటం అభిమానులను ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కాగా ఐపీఎల్-2024లో హర్షిత్ రాణా, స్టార్క్ కోల్కతా నైట్ రైడర్స్కు ప్రాతినిథ్యం వహించారు. జట్టును చాంపియన్గా నిలపడంలో ఈ ఇద్దరు పేసర్లు తమ వంతు పాత్రలు పోషించారు. అదీ సంగతి!!104 పరుగులకే కుప్పకూలిన ఆసీస్ఇక క్రీజులో పాతుకుపోయి జిడ్డు బ్యాటింగ్తో భారత బౌలర్లను ఇబ్బంది పెట్టిన స్టార్క్ వికెట్ను ఆఖరికి హర్షిత్ దక్కించుకోవడం విశేషం. మొత్తంగా 112 బంతులు ఎదుర్కొని 26 పరుగులు చేసిన స్టార్క్ పదో వికెట్గా వెనుదిరగడంతో ఆసీస్ ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో 104 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో బుమ్రా ఐదు, రాణా మూడు, సిరాజ్ రెండు వికెట్లు తీశారు.Mitch Starc offers a little warning to Harshit Rana 😆#AUSvIND pic.twitter.com/KoFFsdNbV2— cricket.com.au (@cricketcomau) November 23, 2024 -
Aus vs Pak: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా
పాకిస్తాన్తో వన్డే సిరీస్ను ఆస్ట్రేలియా విజయంతో ఆరంభించింది. మెల్బోర్న్ వేదికగా సోమవారం జరిగిన తొలి మ్యాచ్లో రెండు వికెట్ల తేడాతో గెలిచింది. పాకిస్తాన్ను తక్కువ స్కోరుకే పరిమితం చేసినా.. ఆసీస్ గెలుపు కోసం కష్టపడాల్సి వచ్చింది.చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియాపాక్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని(204) ఛేదించే క్రమంలో 167 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో ప్యాట్ కమిన్స్ కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. ఓవర్ ఓవర్కు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో ఆఖరి వరకు అజేయంగా జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక ఈ గెలుపుతో ఆసీస్ చరిత్ర సృష్టించింది.వన్డే ఫార్మాట్లో పాకిస్తాన్తో ఆడిన తక్కువ మ్యాచ్లలోనే.. ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఓవరాల్గా ఇప్పటి వరకు పాక్తో 109 మ్యాచ్లు ఆడిన కంగారూ జట్టు 71 మ్యాచ్లలో జయభేరి మోగించింది. ఇక ఈ జాబితాలో వెస్టిండీస్ రెండోస్థానంలో ఉంది. ఆసీస్తో సమానంగా 71సార్లు పాక్పై గెలుపొందినప్పటికీ.. మ్యాచ్ల పరంగా ఆసీస్ కంటే వెనుకబడింది.రిజ్వాన్కు కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే ఓటమికాగా మూడు వన్డే, మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా సోమవారం(నవంబరు 4) ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. పాక్ వన్డే, టీ20 జట్ల కెప్టెన్గా వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్కు ఇదే తొలి మ్యాచ్.ఇక మెల్బోర్న్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బౌలింగ్ చేసింది. మిచెల్ స్టార్క్ మూడు వికెట్లతో రాణించగా.. కమిన్స్ రెండు, ఆడం జంపా రెండు, లబుషేన్, సీన్ అబాట్ ఒక్కో వికెట్ తీశారు. ఈ క్రమంలో పాక్ 46.4 ఓవర్లలో కేవలం 203 పరుగులే చేసింది.నసీం షా బ్యాట్ ఝులిపించినాపాక్ ఇన్నింగ్స్లో రిజ్వాన్ 44 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. టెయిలెండర్ నసీం షా 40 రన్స్తో రాణించాడు. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే తడబడ్డ ఆతిథ్య ఆసీస్ కమిన్స్ ఆఖరి వరకు పట్టుదలగా నిలబడంతో 33.3 ఓవర్లలో పనిపూర్తి చేసింది. పాక్పై రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. స్టార్క్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఓపెనర్లు షఫీక్(12), సయీమ్ ఆయుబ్(1) సహా 19 బంతుల్లోనే 24 రన్స్ చేసిన షాహిన్ ఆఫ్రిదిని అవుట్ చేసి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ను అతడు దెబ్బకొట్టాడు. పాకిస్తాన్పై వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్లుఆస్ట్రేలియా- 71 (109 మ్యాచ్లు)వెస్టిండీస్- 71 (137 మ్యాచ్లు)శ్రీలంక- 59 (157 మ్యాచ్లు)ఇంగ్లండ్- 57 (92 మ్యాచ్లు)ఇండియా- 57 (135 మ్యాచ్లు)ఆసీస్ వర్సెస్ పాక్ తొలి వన్డే - ప్లేయింగ్ ఎలెవన్ఆస్ట్రేలియామాథ్యూ షార్ట్, జేక్ ఫ్రేజర్-మెగర్క్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, ఆరోన్ హార్డీ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.పాకిస్తాన్అబ్దుల్లా షఫీక్, సయీమ్ అయూబ్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్, వికెట్ కీపర్), కమ్రాన్ గులాం, ఆఘా సల్మాన్, ఇర్ఫాన్ ఖాన్, షాహిన్ అఫ్రిది, నసీం షా, హారిస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్.చదవండి: ICC: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, జింబాబ్వేలకు భారత్ ఆతిథ్యం -
మిచెల్ స్టార్క్ అరుదైన రికార్డు.. ఆరో బౌలర్గా
మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ నిప్పులు చేరిగాడు. తన పేస్ బౌలింగ్తో పాక్ బ్యాట్లకు స్టార్క్ చుక్కలు చూపించాడు. తన 10 ఓవర్ల కోటాలో 33 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.ఇందులో మూడు మేడిన్ ఓవర్లు ఉండడం విశేషం. స్టార్క్తో పాటు స్పిన్నర్ ఆడమ్ జంపా, కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తలా రెండు వికెట్లు సాధించారు. దీంతో పాకిస్తాన్ 46.2 ఓవర్లలో కేవలం 203 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ రిజ్వాన్(44) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, నసీం షా(40) ఆఖరిలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.స్టార్క్ అరుదైన రికార్డు..ఇక ఈ మ్యాచ్లో 3 వికెట్లతో చెలరేగిన మిచెల్ స్టార్క్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. స్వదేశంలో వన్డేల్లో 100 వికెట్ల మైలు రాయిని అందుకున్న ఆరో ఆసీస్ బౌలర్గా స్టార్క్ రికార్డులకెక్కాడు. పాక్ ఓపెనర్లు షఫీక్, అయూబ్లను ఔట్ చేసి స్టార్క్ ఈ ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో స్టార్క్ కంటే ముందు బ్రెట్ లీ, గ్లెన్ మెక్గ్రాత్, షేన్ వార్న్,క్రెయిగ్ మెక్డెర్మాట్లు ఉన్నారు. కాగా ఐపీఎల్-2025 సీజన్కు ముందు స్టార్క్ను కేకేఆర్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. అతడిని ఐపీఎల్-2024 మినీవేలంలో ఏకంగా 24.75 కోట్ల రూపాయలను ఖర్చు చేసి మరి కొనుగోలు చేసింది. -
Aus vs Pak: ఆసీస్తో వన్డే.. దంచికొట్టిన షాహిన్ ఆఫ్రిది, నసీం షా.. కానీ..
ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో పాకిస్తాన్ నామమాత్రపు స్కోరుకు పరిమితమైంది. కేవలం 203 పరుగులకే ఆలౌట్ అయింది. కంగారూ పేసర్ల విజృంభణ ముందు పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. అయితే, ఆఖర్లో టెయిలెండర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షా దంచికొట్టడంతో పర్యాటక జట్టు రెండు వందల మార్కును దాటగలిగింది.ఆస్ట్రేలియా పర్యటనలోకాగా వరుస ఓటముల అనంతరం పాక్ జట్టు ఇటీవలే ఫామ్లోకి వచ్చింది. సొంతగడ్డపై ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ను 2-1తో గెలిచి పునరుత్తేజం పొందింది. అనంతరం.. మూడు వన్డే, మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చింది. ఇక ఈ టూర్తో మహ్మద్ రిజ్వాన్ పాక్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్గా తన ప్రయాణం మొదలుపెట్టాడు.ఈ క్రమంలో ఆసీస్- పాక్ మధ్య సోమవారం నాటి తొలి వన్డేకు మెల్బోర్న్ వేదికైంది. టాస్ గెలిచిన ఆతిథ్య ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ చేసింది. సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ పాక్ ఓపెనర్లు సయీమ్ ఆయుబ్(1), అబ్దుల్ షఫీక్(12)లను తక్కువ స్కోర్లకే పెవిలియన్కు పంపాడు.బాబర్, రిజ్వాన్ నామమాత్రంగానే..అయితే, వన్డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం(37).. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(44)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, బాబర్ను అవుట్ చేసి ఆడం జంపా ఈ జోడీని విడదీయగా.. రిజ్వాన్ వికెట్ను మార్నస్ లబుషేన్ దక్కించుకున్నాడు.మిగతా వాళ్లలో కమ్రాన్ గులామ్(5), ఆఘా సల్మాన్(12) పూర్తిగా విఫలం కాగా.. ఇర్ఫాన్ ఖాన్ 22 పరుగులు చేయగలిగాడు. ఇలా స్పెషలిస్టు బ్యాటర్లంతా పెవిలియన్కు క్యూ కట్టిన వేళ.. పేసర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షా బ్యాట్ ఝులిపించారు.షాహిన్ ధనాధన్.. నసీం సూపర్గాషాహిన్ 19 బంతుల్లోనే 24 రన్స్(3 ఫోర్లు, ఒక సిక్సర్) చేయగా.. నసీం షా ఆడిన కాసేపు సిక్సర్లతో అలరించాడు. మొత్తంగా 39 బంతులు ఎదుర్కొని 40 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఒక ఫోర్, నాలుగు సిక్స్లు ఉండటం విశేషం. ఈ క్రమంలో పాకిస్తాన్ 46.4 ఓవర్లలో 203 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇక ఆసీస్ బౌలర్లలో పేసర్లు స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. కెప్టెన్ కమిన్స్ రెండు, సీన్ అబాట్ ఒక వికెట్ దక్కించుకున్నారు. స్పిన్నర్లు ఆడం జంపా రెండు, లబుషేన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.Starc gets the ball rolling! #AUSvPAK pic.twitter.com/CYXcVECkj1— cricket.com.au (@cricketcomau) November 4, 2024 ఇదిలా ఉంటే.. నసీం షా ఇన్నింగ్స్కు క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆసీస్ వంటి పటిష్ట జట్టుపై ఇలాంటి షాట్లు బాదడం మామూలు విషయం కాదంటూ కొనియాడుతున్నారు. ఇక పాక్ జట్టు ఫ్యాన్స్ అయితే.. నసీం కాబోయే సూపర్ స్టార్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు.. బాబర్ ఆజం, రిజ్వాన్ వంటి వాళ్లు నసీంను చూసి నేర్చుకోవాలంటూ వీరిద్దరి వైఫల్యాలను గుర్తు చేస్తున్నారు. Babar and Rizwan should learn something from Naseem Shah. #PAKvsAUS pic.twitter.com/Hd7BhgtAMa— Humza Sheikh (@Sheikhhumza49) November 4, 2024 ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ తొలి వన్డే- మెల్బోర్న్తుదిజట్లుఆస్ట్రేలియామాథ్యూ షార్ట్, జేక్ ఫ్రేజర్-మెగర్క్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, ఆరోన్ హార్డీ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.పాకిస్తాన్అబ్దుల్లా షఫీక్, సయీమ్ అయూబ్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్, వికెట్ కీపర్), కమ్రాన్ గులాం, ఆఘా సల్మాన్, ఇర్ఫాన్ ఖాన్, షాహిన్ అఫ్రిది, నసీం షా, హారిస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్.చదవండి: సొంతగడ్డపైనే ఘోర అవమానం.. గంభీర్కు బీసీసీఐ షాక్!.. ఇక చాలు.. -
స్టార్క్కు పీడకల.. ఆసీస్ తొలి బౌలర్గా చెత్త రికార్డు
ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్కు చేదు అనుభవం ఎదురైంది. ఈ వరల్డ్క్లాస్ పేసర్ బౌలింగ్లో ఇంగ్లండ్ హార్డ్ హిట్టర్ లియామ్ లివింగ్స్టోన్ చితక్కొట్టాడు. ఒకే ఓవర్లో 6,0,6,6,6, 4 పరుగులు పిండుకుని పీడకలను మిగిల్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇంగ్లండ్ టీ20 తరహా బ్యాటింగ్పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన ఆస్ట్రేలియా శుక్రవారం.. ఆతిథ్య జట్టుతో నాలుగో వన్డేలో తలపడింది. లండన్లోని లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ను వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి తొలుత ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.27 బంతుల్లోనేఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్ 39 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఏకంగా 312 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ 63, కెప్టెన్ హ్యారీ బ్రూక్ 87 పరుగులు చేయగా.. లియామ్ లివింగ్స్టోన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 27 బంతుల్లోనే మూడు బౌండరీలు, ఏడు సిక్సర్లు బాది 62 పరుగులతో ఆఖరి వరకు నాటౌట్గా నిలిచాడు.స్టార్క్కు పీడకలఇక లివింగ్స్టోన్ ఖాతాలోని ఏడు సిక్స్లలో నాలుగు స్టార్క్ బౌలింగ్లో బాదినవే. అది కూడా ఆఖరి ఓవర్లో కావడం విశేషం. 39వ ఓవర్లో స్టార్క్ వేసిన తొలి బంతినే సిక్సర్గా మలిచిన లివింగ్స్టోన్.. రెండో బంతికి పరుగులు రాబట్టలేకపోయాడు. అయితే, మూడో బంతి నుంచి స్పీడు పెంచాడు. హ్యాట్రిక్ సిక్స్లు బాది ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను ముగించాడు.186 పరుగుల తేడాతో విజయంఇదిలా ఉంటే.. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 24.4 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లు మాథ్యూ పాట్స్ నాలుగు, బ్రైడన్ కార్సే మూడు, జోఫ్రా ఆర్చర్ రెండు, ఆదిల్ రషీద్ ఒక వికెట్ పడగొట్టి కాంగరూ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. ఇక ఈ విజయంతో ఇంగ్లండ్ ఐదు వన్డేల సిరీస్ను 2-2తో సమం చేసింది. తదుపరి బ్రిస్టల్ వేదికగా ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక ఆఖరి వన్డే జరుగనుంది.స్టార్క్ చెత్త రికార్డులివింగ్స్టోన్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా స్టార్క్ ఖాతాలో చెత్త రికార్డు నమోదైంది. ఆస్ట్రేలియా ప్లేయర్లలో వన్డే మ్యాచ్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు(28) సమర్పించుకున్న బౌలర్గా స్టార్క్ నిలిచాడు. అంతకు ముందు ఈ రికార్డు జేవియర్ డోహర్టి పేరిట ఉండేది. బెంగళూరులో 2013లో టీమిండియాతో మ్యాచ్లో అతడు 26 పరుగులు ఇచ్చుకున్నాడు.చదవండి: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్6️⃣▪️6️⃣6️⃣6️⃣4️⃣Incredible final over hitting from Liam Livingstone 💪💥🏴 #ENGvAUS 🇦🇺 | @liaml4893 pic.twitter.com/qfEDxOM88N— England Cricket (@englandcricket) September 27, 2024 -
చెలరేగిన స్టార్క్.. ఇంగ్లండ్పై ఆసీస్ ఘన విజయం
ఇంగ్లండ్ గడ్డపై ఆస్ట్రేలియా తమ జోరును కొనసాగిస్తోంది. లీడ్స్ వేదికగా ఇంగ్లీష్ జట్టుతో జరిగిన రెండో వన్డేలో 69 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్ 2-0 ఆధిక్యంలో ఆసీస్ దూసుకెళ్లింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ్రస్టేలియా 44.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలెక్స్ క్యారీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 67 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ మార్ష్(59 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. అదేవిధంగా ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (29; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మాథ్యూ షార్ట్ (29; 4 ఫోర్లు, ఒక సిక్సర్) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. స్టీవ్ స్మిత్ (4), మ్యాక్స్వెల్ (7), లబుషేన్ (19) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ మూడు వికెట్లు పడగొట్టగా, రషీద్, బెతల్, పొట్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.నిప్పులు చేరిగిన స్టార్క్..అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ జేమీ స్మిత్ (61 బంతుల్లో 49; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), బెన్ డకెట్ (32) పోరాడినా ఫలితం లేకపోయింది. ఆసీస్ బౌలర్లలో పేసర్ మిచెల్ స్టార్క్ మూడు వికెట్లతో ఇంగ్లండ్ను దెబ్బతీశాడు. అతడితో పాటు హాజిల్వుడ్, హార్దీ, మాక్స్వెల్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇరు జట్ల మధ్య మంగళవారం(సెప్టెంబర్ 24) మూడో వన్డే జరగనుంది.చదవండి: IND vs BAN: అశ్విన్ మాస్టర్ మైండ్.. బంగ్లా బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్(వీడియో) -
Eng vs Aus: ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ!
ఇంగ్లండ్తో తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ!.. కంగారూ జట్టులోని ముగ్గురు స్టార్ క్రికెటర్లు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఫలితంగా ఈ ముగ్గురు నాటింగ్హామ్ వన్డేలో ఆడటంపై సందిగ్దం నెలకొంది. కాగా మూడు టీ20, ఐదు వన్డే మ్యాచ్లు ఆడేందుకు ఆస్ట్రేలియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.ఆ ముగ్గురు దూరంఇందులో భాగంగా తొలి టీ20లో ఆసీస్ గెలవగా.. రెండో మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ విజయం సాధించింది. మూడో టీ20 వర్షం కారణంగా రద్దు కావడంతో సిరీస్ 1-1తో సమమైంది. ఈ క్రమంలో గురువారం నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. అయితే, ఆసీస్ స్టార్లు ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్, పేసర్లు జోష్ హాజిల్వుడ్, మిచెల్ స్టార్క్ తొలి వన్డేకు అందుబాటులో ఉండకపోవచ్చని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.గాయాల బెడదఈ ముగ్గురు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు పేర్కొంది. కాగా రెండో టీ20కి ముందు కూడా ఆసీస్కు ఇలాంటి సమస్యే ఎదురైన విషయం తెలిసిందే. కెప్టెన్ మిచెల్ మార్ష్ అనారోగ్యం కారణంగా జట్టుకు దూరం కాగా.. ట్రవిస్ హెడ్ సారథ్యం వహించాడు. ఇక వీరితో పాటు వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్, యువ బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెగర్క్ కూడా గాయాలతో బాధపడుతున్నట్లు సమాచారం.మాథ్యూ షార్ట్కు అవకాశం?ఇదిలా ఉంటే.. తొలి వన్డే నేపథ్యంలో హాజిల్వుడ్, స్టార్క్ దూరమైతే సీన్ అబాట్, డ్వార్షుయిస్ తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఇక మాక్సీ స్థానాన్ని మాథ్యూ షార్ట్ భర్తీ చేసే ఛాన్స్ ఉంది. ఇక మార్ష్ ప్రస్తుతం కోలుకున్నట్లు సమాచారం. టీ20 సిరీస్కు దూరమైన స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ సైతం వన్డేలతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో తొలి వన్డేకు ముందు కెప్టెన్ మిచెల్ మార్ష్ మాట్లాడుతూ.. తమ తుదిజట్టు కూర్పుపై ఇంకా నిర్ణయానికి రాలేదని తెలిపాడు. ఇక లెగ్ స్పిన్నర్ ఆడం జంపా తమ జట్టులో ఉండటం అదృష్టమని.. వందో వన్డే ఆడబోతున్న అతడికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.ఇంగ్లండ్తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, సీన్ అబాట్, జోష్ హాజిల్వుడ్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, మాథ్యూ షార్ట్, ఆరోన్ హార్డీ, జేక్ ఫ్రేజర్-మెగర్క్, అలెక్స్ క్యారీ, బెన్ డ్వార్షుయిస్, కూపర్ కనోలీ.చదవండి: IND vs BAN 1st Test: భారత కీలక వికెట్లుకూల్చిన యువ పేసర్ -
యాషెస్ సిరీస్ ఎంతో.. ఆ ట్రోఫీ కూడా అంతే ఇంపార్టెంట్: స్టార్క్
భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది చివర్లలో బోర్డర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా ఆతిథ్య ఆసీస్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో అమీతుమీ తెల్చుకోనుంది. పాకిస్తాన్తో దైపాక్షిక సిరీస్లు జరగపోయినప్పటి నుంచి భారత్కు అత్యంత ముఖ్యమైన టెస్ట్ సిరీస్లలో ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఒకటిగా మారింది. దీంతో ప్రతీ రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ సిరీస్ కోసం ఇరు జట్ల అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. కాగా గత రెండు పర్యాయాలు కంగారులను వారి సొంత గడ్డపై ఓడించిన భారత్.. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు ఈసారి భారత్పై ఎలాగైనా టెస్టు సిరీస్ విజయం సాధించి తమ 9 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఆసీస్ భావిస్తోంది. టీమిండియాపై టెస్టు సిరీస్ను ఆసీస్ చివరగా 2014-15లో సొంతం చేసుకుంది. ఈ సిరీస్ కోసం ఆసీస్ ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియన్ క్రికెటర్లు, తమ అభిమానులకు బీజీటీ ట్రోఫీ ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్తో సమనమని స్టార్క్ అభిప్రాయపడ్డాడు."ఈసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఐదు మ్యాచ్ల సిరీస్ జరగనుంది. దీంతో ఈ బీజీటీ ట్రోఫీ యాషెస్ సిరీస్తో సమానం. మా సొంతగడ్డపై ప్రతీ మ్యాచ్లోనూ మేము విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాము. కానీ భారత్ మాత్రం చాలా బలమైన ప్రత్యర్ధి. ఆ జట్టును ఓడించడం అంత ఈజీ కాదు. భారత్, ఆసీస్ డబ్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్నాయి. కాబట్టి ఈ సిరీస్ అభిమానులకు మంచి థ్రిల్ను పంచుతుంది. ఈ సారి భారత్ను ఎలాగైనా ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంటామని ఆశిస్తున్నాను" అని వైడ్ వరల్డ్ స్పోర్ట్స్ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టార్క్ పేర్కొన్నాడు.కాగా 32 ఏళ్ల తర్వాత తొలిసారి భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ టెస్టు సిరీస్ జరగనుంది. చివరగా 1991-92లో ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల సిరీస్ జరిగింది.ఈ ఏడాది నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. -
ప్రపంచంలో ఆ ఐదుగురే అత్యుత్తమ బౌలర్లు..!
ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ప్రపంచంలో తాను మెచ్చిన ఐదుగురు అత్యుత్తమ బౌలర్ల జాబితాను ప్రకటించాడు. ఈ జాబితాలో రషీద్ టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానాన్ని ఇచ్చాడు. ఆతర్వాత ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్, న్యూజిలాండ్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ట్రెంట్ బౌల్ట్, ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్, పాకిస్తాన్ స్పీడ్స్టర్ షాహిన్ అఫ్రిదికి చోటిచ్చాడు. ఆదిల్ ప్రపంచంలో నంబర్ వన్ బ్యాటర్గా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని ఎంపిక చేశాడు.కాగా, ఆదిల్ రషీద్ ఎంపిక చేసిన బౌలర్లలో మిచెల్ స్టార్క్ అందరి కంటే ఎక్కువ అంతర్జాతీయ వికెట్లు కలిగి ఉన్నాడు. స్టార్క్ తన కెరీర్లో ఇప్పటివరకు 673 వికెట్లు పడగొట్టాడు. స్టార్క్ తర్వాత అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా ట్రెంట్ బౌల్ట్ ఉన్నాడు. బౌల్ట్ ఇప్పటిదాకా 611 వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరి తర్వాతి స్థానంలో బుమ్రా ఉన్నాడు. బుమ్రా తన కెరీర్లో ఇప్పటివరకు 397 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా తర్వాతి స్థానంలో షాహిన్ అఫ్రిది ఉన్నాడు. అఫ్రిది ఖాతాలో 313 వికెట్లు ఉన్నాయి. ఆదిల్ ఎంపిక చేసిన అత్యుత్తమ బౌలర్ల జాబితాలో చివరి స్థానంలో జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు. ఆర్చర్ అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటివరకు 115 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. -
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్
ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్కప్ (వన్డే, టీ20) చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా అవతరించాడు. టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో తంజిద్ హసన్ వికెట్ తీసిన స్టార్క్.. లంక దిగ్గజం లసిత్ మలింగకు అధిగమించి వరల్డ్కప్ లీడింగ్ వికెట్ టేకర్గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వన్డే, టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో మలింగ 94 వికెట్లు (60 మ్యాచ్ల్లో) పడగొట్టగా.. స్టార్క్ 95 వికెట్లు (52 మ్యాచ్ల్లో) తీశాడు. ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో స్టార్క్, మలింగ తర్వాతి స్థానాల్లో షకీబ్ అల్ హసన్ (77 మ్యాచ్ల్లో 92 వికెట్లు), ట్రెంట్ బౌల్ట్ (47 మ్యాచ్ల్లో 87 వికెట్లు), మురళీథరన్ (49 మ్యాచ్ల్లో 79 వికెట్లు) ఉన్నారు. స్టార్క్ ఖాతాలో ఉన్న 95 వరల్డ్కప్ వికెట్లలో 30 టీ20 వరల్డ్కప్ వికెట్లు.. 65 వన్డే వరల్డ్కప్ వికెట్లు ఉన్నాయి. స్టార్క్ ఇప్పటివరకు ఎనిమిది వరల్డ్కప్ టోర్నీల్లో పాల్గొన్నాడు. ఇందులో ఐదు టీ20 వరల్డ్కప్ టోర్నీలు (2012, 2014, 2021, 2022, 2024), మూడు వన్డే వరల్డ్కప్ టోర్నీలు (2015, 2019, 2023) ఉన్నాయి.ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో పాట్ కమిన్స్ (4-0-29-3) హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ డక్వర్త్ లూయిస్ పద్దతిన 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్.. కమిన్స్, ఆడమ్ జంపా (4-0-24-2), మిచెల్ స్టార్క్ (4-0-21-1), మ్యాక్స్వెల్ (2-0-14-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్లో కెప్టెన్ షాంటో (41), తౌహిద్ హ్రిదోయ్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. తంజిద్ హసన్ 0, లిటన్ దాస్ 16, రిషద్ హొసేన్ 2, షకీబ్ 8, మహ్మదుల్లా 2, మెహిది హసన్ 0 పరుగులకు ఔటయ్యారు. తస్కిన్ అహ్మద్ 13, తంజిమ్ హసన్ సకీబ్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు.141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 11.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం మొదలై మ్యాచ్కు అంతరాయం కలిగించి, డక్వర్త లూయిస్ పద్దతిన ఫలితాన్ని నిర్దారించేలా చేసింది. వర్షం మొదలయ్యే సమయానికి ఓపెనర్ డేవిడ్ వార్నర్ (35 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), మ్యాక్స్వెల్ (6 బంతుల్లో 14 నాటౌట్; ఫోర్, సిక్స్) క్రీజ్లో ఉన్నారు. వార్నర్.. ట్రవిస్ హెడ్తో (31) కలిసి ఆసీస్కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు కలిసి పవర్ ప్లేలో 59 పరుగులు జోడించారు. -
IPL 2024: ఓ పక్క స్టార్క్.. మరోపక్క అయ్యర్..!
ఐపీఎల్ 2024 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ ఛాంపియన్గా అవతరించింది. నిన్న జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్రైజర్స్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, మూడో ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. అంతిమ సమరంలో మిచెల్ స్టార్క్ (3-0-14-2), వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆరెంజ్ ఆర్మీని చెడుగుడు ఆడుకున్నారు. వీరికి రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1), రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా తోడవ్వడంతో కేకేఆర్ సునాయాస విజయం సాధించింది.క్వాలిఫయర్ మ్యాచ్లోనూ వీరిద్దరే.. నిన్నటి ఫైనల్లో సన్రైజర్స్ను డామేజ్ చేసిన స్టార్క్, వెంకటేశ్ అయ్యర్లు ఇదే సన్రైజర్స్ను క్వాలిఫయర్-1లోనూ ముప్పుతిప్పలు పెట్టారు. నాటి మ్యాచ్లోనూ స్టార్క్ అద్భుతమైన గణాంకాలు (4-0-34-3) నమోదు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు ఎంపిక కాగా.. వెంకటేశ్ అయ్యర్ సైతం ఫైనల్లోలానే మెరుపు ఇన్నింగ్స్తో (28 బంతుల్లో 51 నాటౌట్) విరుచుకుపడ్డాడు. ఈ ఇద్దరు పోటీపడి మరీ సన్రైజర్స్పై దండయాత్ర చేసి వారికి టైటిల్ దక్కకుండా చేశారు.సీజన్ ఆరంభ మ్యాచ్ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన స్టార్క్ కీలకమైన ప్లే ఆఫ్స్లో ఫామ్లోని వచ్చి కేకేఆర్ పాలిట గెలుపు గుర్రంగా మారగా.. వెంకటేశ్ అయ్యర్ సీజన్ స్టార్టింగ్ నుంచి ఓ మోస్తరు ప్రదర్శనలతో అలరించాడు. ప్లే ఆఫ్స్లో తిరుగులేని అయ్యర్.. నిన్నటి ఫైనల్తో వెంకటేశ్ అయ్యర్ ప్లే ఆఫ్స్ హీరో అని మరోసారి నిరూపించుకున్నాడు. అయ్యర్కు ప్లే ఆఫ్స్లో ఇది వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ (55, 50, 51*, 52*). ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఘనత మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనాకు దక్కుతుంది. రైనా ప్లే ఆఫ్స్లో ఏడు 50కి పైగా స్కోర్లు సాధించాడు.ఫైనల్స్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మిచెల్ స్టార్క్ ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో కమిన్స్ (24) టాప్ స్కోరర్గా నిలువగా.. మెరుపు వీరులు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) దారుణంగా విఫలమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్లకు తలో వికెట్ దక్కింది. -
IPL 2024 Final: కేకేఆర్కు అచ్చొచ్చిన 'M'
ఐపీఎల్ 2024 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ విజేతగా ఆవిర్భవించింది. నిన్న (మే 26) జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్రైజర్స్ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి మూడోసారి టైటిల్ను ఎగరేసుకుపోయింది.అంతిమ సమరంలో మిచెల్ స్టార్క్ అద్భుతంగా రాణించి కేకేఆర్ను పదేళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్గా నిలబెట్టాడు. ఫైనల్లో స్టార్క్ 3 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు, రెండు క్యాచ్లు పట్టాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.ఐపీఎల్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్ల్లో ఒకటి కంటే ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించాడు. స్టార్క్ సన్రైజర్స్తోనే జరిగిన తొలి క్వాలిఫయర్లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా (4-0-34-3) నిలిచాడు.సీజన్ ఆరంభంలో దారుణంగా విఫలమైన స్టార్క్ అత్యంత కీలకమైన నాకౌట్ మ్యాచ్ల్లో అద్భుతంగా రాణించి కేకేఆర్కు పదేళ్ల తర్వాత మరోసారి టైటిల్ను అందించాడు. ఓవరాల్గా చూస్తే ఈ సీజన్లో స్టార్క్ సన్రైజర్స్ పాలిట విలన్గా దాపురించాడు.మరోసారి కలిసొచ్చిన 'M'ఇదిలా ఉంటే, ఐపీఎల్ ఫైనల్స్లో కేకేఆర్కు 'M' అక్షరం మరోసారి కలిసొచ్చింది. కేకేఆర్ ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన మూడు సందర్భాల్లో ఈ అక్షరంతో పేరు మొదలయ్యే ఆటగాళ్లే ఆ జట్టు పాలిట గెలుపు గుర్రాలయ్యారు. MMM2012లో మన్విందర్ బిస్లా, 2014లో మనీశ్ పాండే, తాజాగా మిచెల్ స్టార్క్ ఫైనల్స్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్లుగా నిలిచి కేకేఆర్కు టైటిల్స్ అందించారు. దీన్ని బట్టి చూస్తే ఐపీఎల్ ఫైనల్స్లో కేకేఆర్కు M అక్షరం సెంటిమెంట్ బాగా అచ్చొచ్చిందని స్పష్టమవుతుంది.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ మిచెల్ స్టార్క్ ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు ఇన్నింగ్స్లో కెప్టెన్ కమిన్స్ (24) టాప్ స్కోరర్గా నిలిచాడు. మెరుపు వీరులు, ఓపెనర్లు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు. కమిన్స్ కాకుండా మార్క్రమ్ (20), నితీశ్ రెడ్డి (13), క్లాసెన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కేకేఆర్ బౌలర్లలో స్టార్క్తో పాటు రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1) ఇరగదీశారు. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో (26 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వెంకటేశ్ అయ్యర్తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6) అజేయంగా నిలిచి కేకేఆర్కు పదేళ్ల తర్వాత మరో టైటిల్ను అందించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్లకు తలో వికెట్ దక్కింది. సిరీస్ ఆధ్యాంతం బ్యాట్తో (14 మ్యాచ్ల్లో 488 పరుగులు), బంతితో (17 వికెట్లు) మాయ చేసిన సునీల్ నరైన్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. -
IPL 2024 Final: సన్రైజర్స్కు గుండెకోత.. చరిత్ర సృష్టించిన స్టార్క్
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా నిన్న (మే 26) జరిగిన ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్లో కోల్కతా నైట్రైడర్స్ విజేతగా ఆవిర్భవించింది. తుది సమరంలో కేకేఆర్.. సన్రైజర్స్ హైదరాబాద్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి మూడోసారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో సన్రైజర్స్ తమ ప్రధాన బలమైన బ్యాటింగ్లో దారుణంగా విఫలమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. నమ్మకాన్ని వమ్ము చేయని స్టార్క్కేకేఆర్ పేసర్, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్ తనపై యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తనకు లభించిన ధరకు న్యాయం చేశాడు. అంతిమ సమరంలో స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి సన్రైజర్స్కు గుండెకోత మిగిల్చాడు. అతను 3 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు, రెండు క్యాచ్లు పట్టాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి ఆటగాడుఐపీఎల్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్ల్లో ఒకటి కంటే ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించాడు. స్టార్క్ సన్రైజర్స్తోనే జరిగిన తొలి క్వాలిఫయర్లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా (4-0-34-3) నిలిచాడు. సీజన్ ఆరంభంలో దారుణంగా విఫలమైన స్టార్క్ అత్యంత కీలకమైన నాకౌట్ మ్యాచ్ల్లో అద్భుతంగా రాణించి కేకేఆర్కు పదేళ్ల తర్వాత మరోసారి టైటిల్ను అందించాడు. ఓవరాల్గా చూస్తే ఈ సీజన్లో స్టార్క్ సన్రైజర్స్ పాలిట విలన్లా దాపురించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి అత్యుత్సాహంగా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ నిర్ణీత ఓవర్లైనా కూడా ఆడకుండానే (18.3 ఓవర్లు) 113 పరుగులకు చాపచుట్టేసింది. ఆ జట్టు ఇన్నింగ్స్లో కెప్టెన్ కమిన్స్ (24) టాప్ స్కోరర్గా నిలిచాడు. మెరుపు వీరులు, ఓపెనర్లు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) దారుణంగా నిరాశపరిచారు. కమిన్స్ కాకుండా మార్క్రమ్ (20), నితీశ్ రెడ్డి (13), క్లాసెన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కేకేఆర్ బౌలర్లలో స్టార్క్తో పాటు రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1) ఇరగదీశారు. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.The winning by Celebration by Kolkata Knight Riders after winning the third IPL title. 🏆 pic.twitter.com/OgQBi87Kzt— Johns. (@CricCrazyJohns) May 26, 2024ఆడుతూ పాడుతూ..అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో (26 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వెంకటేశ్ అయ్యర్తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6) అజేయంగా నిలిచి కేకేఆర్కు పదేళ్ల తర్వాత మరో టైటిల్ను అందించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్లకు తలో వికెట్ దక్కింది. గత సీజన్లో టేబుల్ చివర్లో ఉండిన సన్రైజర్స్ ఈ సీజన్లో రన్నరప్గా నిలవడం ఆ జట్టు అభిమానులకు ఊరట కలిగించే అంశం. సిరీస్ ఆధ్యాంతం బ్యాట్తో (14 మ్యాచ్ల్లో 488 పరుగులు) ఇరగదీసి, బంతితో (17 వికెట్లు) మాయ చేసిన సునీల్ నరైన్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. -
IPL 2024 KKR Vs SRH: వాళ్ల వల్లే గెలిచాం.. ఫైనల్లోనూ మేమే: శ్రేయస్ అయ్యర్
‘‘చాలా చాలా సంతోషంగా ఉంది. జట్టులోని ప్రతి ఒక్కరు తమ వంతు పాత్రను సమర్థవంతంగా పోషించారు. మా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నాను. ఈరోజు మేము ఏం చేయగలమో అదే చేసి చూపించాం. కీలకమైన ఈ మ్యాచ్లో మా జట్టులోని ప్రతి ఒక్క బౌలర్ తమ బాధ్యతను నెరవేర్చారు.వరుసగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. ఇలాంటి వైవిధ్యమైన బౌలింగ్ లైనప్ ఉంటే కెప్టెన్ పని సులువవుతుంది. మా బౌలర్లంతా అద్భుతంగా రాణించారు. ఇక ముందు కూడా మా ప్రదర్శన ఇలాగే ఉంటుందని భావిస్తున్నా.ఈరోజు గుర్బాజ్ తన తొలి మ్యాచ్ ఆడాడు. ఓపెనర్గా మాకు శుభారంభమే అందించాడు. ఇదే జోరులో మరింత ముందుకు వెళ్లాలని పట్టుదలగా ఉన్నాం. ఫైనల్లోనూ మా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాం’’ అని కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు.ఐపీఎల్-2024లో తుదిపోరుకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. కాగా లీగ్ దశలో పద్నాలుగింట తొమ్మిది విజయాలతో టాపర్గా నిలిచిన కేకేఆర్.. క్వాలిఫయర్-1లోనూ సత్తా చాటింది.అహ్మదాబాద్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో జయభేరి మోగించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్కు కేకేఆర్ బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు.సీజన్ ఆసాంతం విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడిన సన్రైజర్స్కు షాకిస్తూ 159 పరుగులకే కుప్పకూల్చారు. మిచెల్ స్టార్క్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునిల్ నరైన్, ఆండ్రీ రసెల్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఈ క్రమంలో నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్కు ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ 14 బంతుల్లో 23, సునిల్ నరైన్ 16 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేయగలిగారు.అయితే, వన్డౌన్లో వచ్చిన వెంకటేశ్ అయ్యర్, నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ సన్రైజర్స్ ఫీల్డర్ల తప్పిదాల కారణంగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆకాశమే హద్దుగా చెలరేగారు. వెంకటేశ్ 28 బంతుల్లో 51, శ్రేయస్ అయ్యర్ 24 బంతుల్లో 58 పరుగులతో దుమ్ములేపారు.వీరిద్దరి విజృంభణతో 13.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి కేకేఆర్ 164 పరుగులు సాధించింది. సన్రైజర్స్ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ఫైనల్లో అడుగుపెట్టింది.ఈ విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన శ్రేయస్ అయ్యర్ జట్టు ప్రదర్శన పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. అదే విధంగా.. మైదానంలో వెంకటేశ్ అయ్యర్తో తన కమ్యూనికేషన్ గురించి చెబుతూ.. ‘‘నిజానికి నాకు తమిళ్ మాట్లాడటం రాదు. అయితే, ఎదుటివాళ్లు మాట్లాడింది అర్థం చేసుకోగలను. వెంకీ తమిళ్లోనే మాట్లాడతాడు. నేను అతడికి హిందీలో బదులిస్తాను’’ అని తెలిపాడు.What a memorable 𝗞𝗻𝗶𝗴𝗵𝘁 for the men in purple 💜Unbeaten half-centuries from Venkatesh Iyer 🤝 Shreyas IyerThe celebrations continue for the final-bound @KKRiders 😎Scorecard ▶️ https://t.co/U9jiBAlyXF#TATAIPL | #KKRvSRH | #Qualifier1 | #TheFinalCall pic.twitter.com/xBFp3Sskqq— IndianPremierLeague (@IPL) May 21, 2024 -
SRH Vs KKR: స్టార్క్ సూపర్ డెలివరీ.. హెడ్కు ఫ్యూజ్లు ఔట్
ఐపీఎల్-2024 సీజన్ మొత్తం అదరగొట్టిన సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్.. కీలక మ్యాచ్లో మాత్రం నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న క్వాలిఫయర్-1లో హెడ్ డకౌటయ్యాడు.కేకేఆర్ పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన బంతితో హెడ్ను బోల్తా కొట్టించాడు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన స్టార్క్ రెండో బంతిని మిడిల్ స్టంప్ను టార్గెట్ చేస్తూ గుడ్లెంగ్త్ డెలివరీ సంధించాడు. ఆ బంతిని హెడ్ ఆఫ్సైడ్ దిశగా షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి ప్యాడ్, బ్యాట్ గ్యాప్ మధ్యలో నుంచి వెళ్లి స్టంప్స్ను గిరాటేసింది. ఇది చూసిన హెడ్కు మైండ్ బ్లాంక్ అయిపోయింది. అంతేకాకుండా హెడ్ ఔట్కాగానే కేకేఆర్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.Starc sets the tone for Qualifier 1 with a ripper! 🔥#IPLonJioCinema #TATAIPL #KKRvSRH #TATAIPLPlayoffs #IPLinBengali pic.twitter.com/3AJG5BvZwT— JioCinema (@JioCinema) May 21, 2024 -
KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్ చేరే తొలి జట్టు ఇదే!
ఐపీఎల్-2024లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఫైనల్ చేరే తొలి జట్టును ఖరారు చేసే క్వాలిఫయర్-1లో మాజీ చాంపియన్లు కోల్కతా నైట్ రైడర్స్- సన్రైజర్స్ హైదరాబాద్ మంగళవారం తలపడనున్నాయి.అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అమీ తుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లెజెండరీ పేసర్ వసీం అక్రం కీలక వ్యాఖ్యలు చేశాడు. కేకేఆర్ చాలా ప్రమాదకర జట్టు అంటూ ప్రత్యర్థి సన్రైజర్స్ హైదరాబాద్ను హెచ్చరించాడు.అగ్రస్థానంలో నిలవడానికి ప్రధాన కారణం‘‘పాయింట్ల పట్టికలో కేకేఆర్ అగ్రస్థానంలో నిలవడానికి ప్రధాన కారణం వారి బౌలింగ్ లైనప్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వికెట్లు తీయగల సమర్థులు ఆ జట్టులో ఉన్నారు.అలాంటి బౌలర్లు ఉన్న జట్టు ఏదైనా కచ్చితంగా విజయాలు సాధిస్తుంది. ఈ సీజన్లో ఇప్పటికే వరుణ్ చక్రవర్తి 18, హర్షిత్ రాణా 16, ఆల్రౌండర్లు ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్ చెరో 15, మిచెల్ స్టార్క్ 12 వికెట్లు పడగొట్టారు.ప్రమాదకర జట్టు ముఖ్యంగా ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించగల స్టార్క్ ఉండటం వారికి ప్రధాన బలం. కేకేఆర్ ఎలాంటి హడావుడి లేకుండా.. పూర్తి ఆత్మవిశ్వాసంతో.. ఫైనల్ చేరేందుకు అర్హతలు ఉన్న ప్రమాదకర జట్టు అని కచ్చితంగా చెప్పగలను.ఇక ఈ జట్టులో ఉన్న ప్రతి ఒక్క బ్యాటర్ కూడా కీలక సమయంలో ఏదో ఒక మ్యాచ్లో రాణిస్తూనే ఉన్నాడు. దూకుడుగా ఆడుతున్నట్లుగా కనిపిస్తున్నా ఎక్కడా అతి విశ్వాసం ప్రదర్శించరు’’ అని వసీం అక్రం పేర్కొన్నాడు.కోల్కతా నైట్ రైడర్స్కే ఎక్కువ అవకాశాలుక్వాలిఫయర్-1 నేపథ్యంలో ఫైనల్ చేరే తొలి జట్టుగా కోల్కతా నైట్ రైడర్స్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని స్పోర్ట్స్కీడాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. అయితే, ఓపెనర్ ఫిల్ సాల్ట్(ఇంగ్లండ్) జట్టుకు దూరం కావడం కచ్చితంగా ప్రభావం చూపుతుందని వసీం అక్రం అభిప్రాయపడ్డాడు. కాగా వసీం అక్రం గతంలో కేకేఆర్ జట్టుతో కలిసి పనిచేశాడు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో తమ ఆరంభ మ్యాచ్లో కేకేఆర్- సన్రైజర్స్ పరస్పరం తలపడ్డాయి. ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ మ్యాచ్లో కేకేఆర్ 4 పరుగుల స్వల్ప తేడాతో రైజర్స్ను ఓడించింది.చదవండి: MI: ఈ సీజన్లో నిరాశే మిగిలింది.. అయితే: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్ -
భార్యాభర్తలిద్దరూ స్టార్ క్రికెటర్లే.. అతడు కాస్ట్లీ.. ఆమె కెప్టెన్!(ఫొటోలు)
-
స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. హార్డ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ తప్ప మిగిలిన వాళ్లలో ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.ముఖ్యంగా టాపార్డర్ దారుణంగా విఫలమైంది. ఓపెనర్లు ఇషాన్ కిషన్(13)- రోహిత్ శర్మ(11) పూర్తిగా నిరాశపరచగా.. వన్డౌన్ బ్యాటర్ నమన్ ధిర్(11) కూడా చేతులెత్తేశాడు.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాలుగో నంబర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 56) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన బ్యాటర్లు తిలక్ వర్మ(4), నేహాల్ వధేరా(6), హార్దిక్ పాండ్యా(1) పెవిలియన్కు క్యూ కట్టారు.సూర్య ఒంటరి పోరాటం వృథాసూర్య ఈ క్రమంలో ఒంటరి పోరాటం చేస్తున్న సూర్యకు తోడైన టిమ్ డేవిడ్(20 బంతుల్లో 24) నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇక టెయిలెండర్లు గెరాల్డ్ కోయెట్జీ(8), పీయూశ్ చావ్లా(0), జస్ప్రీత్ బుమ్రా(1 నాటౌట్) కూడా చేతులెత్తేయడంతో 145 పరుగులకే ముంబై కథ ముగిసిపోయింది.ఫలితంగా కేకేఆర్ విధించిన 170 పరుగుల లక్ష్య ఛేదనలో విఫలమైన ముంబై వాంఖడేలో పన్నెండేళ్ల తర్వాత తొలిసారి కోల్కతా చేతిలో 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.ఈ పరాజయం ముంబై ఫ్యాన్స్ హృదయాలను ముక్కలు చేస్తే.. పందొమ్మిదో ఓవర్లో మూడు వికెట్లు తీసి పాండ్యా సేన పతనాన్ని శాసించిన మిచెల్ స్టార్క్ను చూసి కేకేఆర్ అభిమానులు మురిసిపోయారు.అద్భుత రీతిలో బౌల్డ్ చేసిముంబైతో మ్యాచ్లో 3.5 ఓవర్లు బౌల్ చేసిన స్టార్క్ 33 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్ను అద్భుత రీతిలో బౌల్డ్ చేయడం హైలైట్గా నిలిచింది. గంటకు 142.3 కిలో మీటర్ల వేగంతో స్టార్క్ విసిరిన బంతి లెగ్ స్టంప్ను ఎగురగొట్టింది.అయినప్పటికీ స్టార్క్ పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు. అయితే.. ఇషాన్ అవుట్ కాగానే ముంబై ఇండియన్స్ కోచ్ మార్క్ బౌచర్తో పాటు చీర్ గర్ల్స్.. ముఖ్యంగా రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ వైరల్గా మారాయి. ఇక ఇషాన్తో పాటు టిమ్ డేవిడ్, కోయెట్జీ, పీయూశ్ చావ్లా వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు స్టార్క్. చదవండి: అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యాStumps dismantled, in vintage Starc style 🔥🫡 #TATAIPL #MIvKKR #IPLonJioCinema #IPLinBhojpuri pic.twitter.com/RcERxhgJps— JioCinema (@JioCinema) May 3, 2024 -
IPL 2024: కేకేఆర్ను ఢీకొట్టనున్న పంజాబ్.. స్టార్క్ ఔట్, ధవన్ ఇన్..?
ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 26) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్.. టేబుల్ సెకెండ్ టాపర్ అయిన కేకేఆర్ను వారి సొంత మైదానమైన ఈడెన్ గార్డెన్స్లో ఢీకొట్టనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ పంజాబ్కు చాలా కీలకం కానుంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే పంజాబ్ ప్లే ఆఫ్స్ లెక్కల్లో ఉంటుంది.లేకపోతే మరో సీజన్లో టైటిల్ లేకుండా రిక్త హస్తాలతో వైదొలగాల్సి ఉంటుంది. పంజాబ్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. మరోవైపు కేకేఆర్ ఏడింట ఐదు మ్యాచ్లు గెలిచి రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్లో కేకేఆర్ అంచనాలకు తగ్గట్టు రాణిస్తూ మూడో టైటిల్ దిశగా అడుగులు వేస్తుంది.హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. పంజాబ్పై కేకేఆర్ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్ల్లో తలపడగా.. కేకేఆర్ 21, పంజాబ్ 11 మ్యాచ్ల్లో గెలుపొందాయి.బలాబలాల విషయానికొస్తే.. పంజాబ్తో పోలిస్తే కేకేఆర్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పెట్టి సొంతం చేసుకున్న మిచెల్ స్టార్క్ మినహా కేకేఆర్కు పెద్ద సమస్యలేమీ లేవు. స్టార్క్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్ల్లో తేలిపోయాడు. వికెట్లు తీయకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. నరైన్, రసెల్తో పాటు కుర్ర బౌలర్లు రాణిస్తుండటంతో స్టార్క్ వైఫల్యాలు హైలైట్ కావడం లేదు.పంజాబ్తో నేటి మ్యాచ్లో స్టార్క్ పక్కకు కూర్చోవాల్సి రావచ్చు. అతను ఆర్సీబీ గత మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు (వేలికి). స్టార్క్ గత రెండు రోజులుగా ప్రాక్టీస్ సెషన్స్లోనూ కనబడలేదు. దీన్ని బట్టి చూస్తే.. పంజాబ్తో మ్యాచ్లో అతను ఆడకపోవచ్చని తెలుస్తుంది.పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు మిడిలార్డర్ బ్యాటర్లు శశాంక్ సింగ్, అశుతోష్ శర్మపై అందరి చూపు ఉంది. ఈ సీజన్లో ఈ ఇద్దరు అద్భుతమైన పోరాటాలతో పంజాబ్ ఆడిన ప్రతి మ్యాచ్ను రక్తి కట్టించారు. వీరిద్దరి నుంచి అభిమానులు మరోసారి సంచలన ఇన్నింగ్స్లు ఆశిస్తున్నారు. వీరిద్దరు మినహా ఈ సీజన్లో పంజాబ్కు చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ లేవు. ఈ మ్యాచ్లో పంజాబ్ రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధవన్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్లకు దూరంగా శిఖర్ తాజాగా జరిగిన ప్రాక్టీస్ సెషన్స్లో యాక్టివ్గా కనిపించాడు. దీన్ని బట్టి అతని రీఎంట్రీ ఖాయమని తేలిపోయింది. నేటి మ్యాచ్లో స్టార్క్ ఆడకపోతే అతడి స్థానంలో దుష్మంత చమీర ఆడే అవకాశం ఉంది. తుది జట్లు (అంచనా)..కేకేఆర్: ఫిల్ సాల్ట్ (వికెట్కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్/దుష్మంత చమీర, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ. [ఇంపాక్ట్ ప్లేయర్: వెంకటేష్ అయ్యర్]పంజాబ్: శిఖర్ ధవన్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో, ప్రభ్సిమ్రన్ సింగ్, సామ్ కర్రన్, జితేష్ శర్మ (వికెట్కీపర్), లియామ్ లివింగ్స్టోన్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, హర్షల్ పటేల్. [ఇంపాక్ట్ ప్లేయర్: అర్ష్దీప్ సింగ్] -
అసలు ఆ ఓవర్లో అన్ని పరుగులిస్తావా?.. స్టార్క్పై ఆగ్రహం
#Starc: కోల్కతా నైట్ రైడర్స్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. కోట్లు పెట్టి కొన్నందుకు అతడి వల్ల జట్టుకు ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయిందని సొంత జట్టు అభిమానులే ఫైర్ అవుతున్నారు. కాగా ఐపీఎల్-2024 వేలంలో భాగంగా కేకేఆర్ మిచెల్ స్టార్క్ కోసం మిగతా ఫ్రాంఛైజీలతో పోటీ పడి మరీ అతడిని సొంతం చేసుకుంది. ఇందుకోసం ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 24.75 కోట్లు ఖర్చు పెట్టింది. ఫలితంగా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్గా ఈ ఆసీస్ స్టార్ రికార్డులకెక్కాడు. కానీ అందుకు తగ్గ ప్రదర్శన మాత్రం చేయలేకపోతున్నాడు. పదిహేడో ఎడిషన్లో తొలి రెండు మ్యాచ్లో వికెట్లు తీయలేకపోయిన స్టార్క్.. ఆ తర్వాత గాడిలో పడ్డట్లే కనిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్పై రెండు.. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. అసలు ఆ ఓవర్లో అన్ని పరుగులిస్తావా? అయితే.. రాజస్తాన్ రాయల్స్తో మంగళవారం నాటి మ్యాచ్లో మరోసారి విఫలమయ్యాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన స్టార్క్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఏకంగా 50 పరుగులు లీక్ చేశాడు. ముఖ్యంగా కీలకమైన పద్దెనిమిదవ ఓవర్లో 18 పరుగులు ఇవ్వడం తీవ్ర ప్రభావం చూపింది. ఇక కేకేఆర్ మిగిలిన బౌలర్లలో స్పిన్నర్లు సునిల్ నరైన్ (2/30), వరుణ్ చక్రవర్తి (2/36) మెరుగ్గా ఆడగా.. స్టార్క్తో పాటు పేస్ విభాగంలో వైభవ్ అరోరా(1/45), హర్షిత్ రాణా (2/45) భారీగా పరుగులు ఇచ్చారు. అయితే, వీరిద్దరు వికెట్లు కూడా తీశారు. కానీ ఎంతో అనుభవం ఉన్న స్టార్క్ ఒక్క వికెట్ కూడా తీయలేక చతికిలపడ్డాడు. ఇక ఈ మ్యాచ్లో ఆఖరి బంతికి సింగిల్ తీసిన సెంచరీ వీరుడు జోస్ బట్లర్ రాజస్తాన్ను గెలిపించిన విషయం తెలిసిందే. పైసా వసూల్ మాత్రమే.. ప్రదర్శన లేదు ఫలితంగా వరుస విజయాలతో జోరు మీదున్న కేకేఆర్కు ఓటమి ఎదురైంది. ఈ క్రమంలో స్టార్క్ విమర్శకుల టార్గెట్గా మారాడు. స్టార్క్ కాస్త పొదుపుగా బౌలింగ్ చేసి ఉంటే కేకేఆర్కు భంగపాటు తప్పేదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక నెట్టింట అయితే.. అతడిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ‘‘రూ. 24.75 కోట్లు ఖర్చు పెట్టి కొంటే పైసా వసూల్ మాత్రమే.. ప్రదర్శన లేదు’’ అంటూ స్టార్క్పై సెటైర్లు వేస్తున్నారు. అయితే, అతడి ఫ్యాన్స్ మాత్రం అండగా నిలుస్తూ.. కీలక సమయంలో రాణించి తన విలువేంటో చాటుకుంటాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేకేఆర్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు: ►వేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్కతా ►టాస్: రాజస్తాన్.. బౌలింగ్ ►కేకేఆర్ స్కోరు: 223/6 (20) ►రాజస్తాన్ స్కోరు: 224/8 (20) ►ఫలితం: రెండు వికెట్ల తేడాతో కేకేఆర్పై రాజస్తాన్ విజయం Another Last Over Thriller 🤩 A Jos Buttler special guides @rajasthanroyals over the line and further extends their lead at the 🔝 🙌 🙌 Scorecard ▶️ https://t.co/13s3GZLlAZ #TATAIPL | #KKRvRR pic.twitter.com/d3FECR81X1 — IndianPremierLeague (@IPL) April 16, 2024 చదవండి: ఐపీఎల్ చరిత్రలో తొలి జట్టుగా రాజస్తాన్ ఆల్టైమ్ రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024 KKR VS LSG: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన రమణ్దీప్ సింగ్
లక్నో సూపర్ జెయింట్స్తో ఇవాళ (ఏప్రిల్ 14) జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ ఆటగాడు రమణ్దీప్ సింగ్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో దీపక్ హుడా (8) కొట్టిన షాట్ను రమణ్దీప్ డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ను అందుకున్నాడు. ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. Ramandeep Singh. 🦅pic.twitter.com/3mhPdFNAJc — Mufaddal Vohra (@mufaddal_vohra) April 14, 2024 కాగా, కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది. ఆచితూచి ఇన్నింగ్స్ ప్రారంభించిన లక్నో 13 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. డికాక్ (10), కేఎల్ రాహుల్ (39), దీపక్ హుడా (8), స్టోయినిస్ (10) ఔట్ కాగా.. బదోని (27), పూరన్ (2) క్రీజ్లో ఉన్నారు. స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రసెల్ తలో వికెట్ పడగొట్టారు. ప్రస్తుత సీజన్లో లక్నో హ్యాట్రిక్ విజయాలు సాధించి (5 మ్యాచ్ల్లో 3 విజయాలు) పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. 4 మ్యాచ్ల్లో 3 విజయాలతో కేకేఆర్ రెండో స్థానంలో ఉంది. హ్యాట్రిక్ విజయాల అనంతరం కేకేఆర్, లక్నో ఇటీవలే ఓ ఓటమిని ఎదుర్కొన్నాయి. కేకేఆర్ తమ చివరి మ్యాచ్లో సీఎస్కే చేతిలో ఓడగా.. లక్నో తాజాగా ఢిల్లీ చేతిలో పరాభవం ఎదుర్కొంది. హెడ్ టు హెడ్ ఫైట్ల విషయానికొస్తే.. ఈ ఇరు జట్లు ఇప్పటివరకు 3 మ్యాచ్ల్లో ఎదురెదురుపడగా.. మూడు సందర్భాల్లో లక్నోనే విజయం వరించింది. -
IPL 2024: కోట్లు పెట్టినా పేలని పేస్ గన్.. 20 లక్షలకే పేట్రేగిపోతున్న యువ సంచలనం
ఐపీఎల్ 2024 వేలంలో అత్యధిక ధర (24.75 కోట్లతో కేకేఆర్ సొంతం చేసుకుంది) పలికి, లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన ఆసీస్ పేస్ గన్ మిచెల్ స్టార్క్.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పేలవ ప్రదర్శనలతో నిరాశపరుస్తున్నాడు. భారీ అంచనాల నడుమ ఈ సీజన్ బరిలోకి దిగిన స్టార్క్ ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్ల్లో ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 100 పరుగులు సమర్పించుకున్నాడు. సన్రైజర్స్తో జరిగిన తొలి మ్యాచ్లో 4 ఓవర్లలో 53 పరుగులిచ్చిన స్టార్క్.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లు బౌల్ చేసి 47 పరుగులు సమర్పించుకున్నాడు. జట్టులోని కుర్ర బౌలర్లు సత్తా చాటుతుంటే కోట్లు కుమ్మరించి కొనుక్కున స్టార్క్ తేలిపోతుండటంతో కేకేఆర్ యాజమాన్యం అసంతృప్తిగా ఉంది. స్టార్క్తో పాటు కేకేఆర్ బౌలింగ్ అటాక్ను ప్రారంభిస్తున్న 22 ఏళ్ల యువ పేసర్ హర్షిత్ రాణా సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్లు, ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 2 వికెట్లు తీసి ఔరా అనిపిస్తే.. స్టార్క్ మాత్రం తనపై పెట్టిన డబ్బుకు కనీస న్యాయం కూడా చేయలేక ఉసూరుమనిపిస్తున్నాడు. స్టార్క్పై పెట్టిన పెట్టుబడిలో కనీసం ఒకటో వంతు (20 లక్షలు) కూడా లభించని రాణా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంటే.. స్టార్క్ మాత్రం కోట్లు జేబులో వేసుకుని దిక్కులు చూస్తున్నాడు. మరో పక్క తన సహచరుడు, సన్రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ తనపై పెట్టుకున్న అంచనాలకు న్యాయం చేస్తుంటే స్టార్క్ మాత్రం కేకేఆర్ అభిమానులకు, యాజమాన్యానికి గుండు సున్నా చూపిస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్ల్లో కేకేఆర్ ఎలాగోలా గెలిచింది కాబట్టి సరిపోయింది. లేకుంటే స్టార్క్పై విమర్శల పర్వం మొదలయ్యేది. ఇప్పటికైనా స్టార్క్ మొద్దు నిద్రను వీడి రాణించాలని కేకేఆర్ అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, ప్రస్తుత సీజన్లో కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్.. ఏప్రిల్ 3న జరిగే తమ తదుపరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. నేటి మ్యాచ్ల విషయానికొస్తే.. ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్లో గుజరాత్ తమ సొంత మైదానంలో సన్రైజర్స్ను ఎదుర్కోనుండగా.. విశాఖలో జరిగే రాత్రి మ్యాచ్లో ఢిల్లీ, సీఎస్కే జట్లు తలడనున్నాయి. -
రూ. 24.75 కోట్లు.. మరీ ఇంత చెత్త ప్రదర్శనా?
ఐపీఎల్-2024.. మినీ వేలంలో ఏకంగా రూ. 24.75 కోట్లకు అమ్ముడుపోయిన క్రికెటర్. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు. మరి ఆడిన రెండు మ్యాచ్లలో అతడి గణాంకాలు ఎలా ఉన్నాయి?!.. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఐపీఎల్లో పునరాగమనం చేశాడు ఆస్ట్రేలియా స్టార్ మిచెల్ స్టార్క్. వన్డే వరల్డ్కప్-2023లో సత్తా చాటిన ఈ సీనియర్ పేసర్ కోసం వేలంలో ఫ్రాంఛైజీలన్నీ పోటీ పడితే.. కోల్కతా నైట్ రైడర్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఒక్క వికెట్ కూడా తీయలేదు కానీ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలో స్టార్క్ వల్ల జట్టుకు చేకూరిన ప్రయోజనం శూన్యం. ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ లో కేకేఆర్ తమ తొలి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడిన విషయం తెలిసిందే. సొంతమైదానం ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ మ్యాచ్లో కేకేఆర్ అదృష్టవశాత్తూ.. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. అందుకే స్టార్క్ పేలవ ప్రదర్శన పెద్దగా హైలైట్ కాలేదు. చెత్త గణాంకాల వల్ల విమర్శలు నిజానికి ఈ మ్యాచ్లో మిచెల్ స్టార్క్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి ఏకంగా 53 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. 22 ఏళ్ల పేసర్ హర్షిత్ రాణా(4/33) విజయవంతమైన చోట ఈ లెఫ్టార్మ్ పేసర్ పూర్తిగా తేలిపోయాడు. తదుపరి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లోనూ చెత్త ప్రదర్శన పునరావృతం చేశాడు స్టార్క్. నాలుగ ఓవర్ల బౌలింగ్లో 47 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. ఫలితంగా.. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలో కలిపి 8-0-100-0 గణాంకాలు నమోదు చేసి విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. కమిన్స్ మాత్రం మెరుగ్గానే మరోవైపు.. రూ. 20.50 కోట్లకు అమ్ముడై సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. తొలి మ్యాచ్లో 1/32, మలి మ్యాచ్లో 2/35 గణాంకాలతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్గా ఓ మ్యాచ్లోనూ జట్టును గెలిపించాడు. బీరు కంటే ఎక్కువే ఇదిలా ఉంటే.. స్టార్క్ ప్రదర్శనను ఐస్ల్యాండ్ క్రికెట్ దారుణంగా ట్రోల్ చేసింది. ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు స్టార్క్ బౌలింగ్ గణాంకాలు.. తమ దేశంలో బీర్ కంటే కూడా ఖరీదుగా ఉన్నాయని వ్యంగ్యస్త్రాలు సంధించింది. కాగా యూరోపియన్ దేశం ఐస్ల్యాండ్లో బీర్ ధరలు.. మిగతా దేశాలతో పోలిస్తే ఎక్కువగానే ఉంటాయనే ప్రచారం ఉంది. చదవండి: మాటల్లేవ్.. ఇన్నాళ్లూ ఎక్కడ దాక్కున్నావు! స్మిత్కు వార్నింగ్ ఇచ్చేశా! -
RCB Vs KKR: విరాట్ కోహ్లి విధ్వంసం.. 4 ఫోర్లు, 4 సిక్స్లతో! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో విరాట్ కోహ్లి సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్లో కోహ్లి విధ్వంసం సృష్టించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి కింగ్ కోహ్లి మాత్రం అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేకేఆర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఓపెనర్గా వచ్చి నాటౌట్గా నిలిచి తన జట్టుకు మంచి స్కోర్ అందించాడు. 58 బంతులు ఎదుర్కొన్న 4 ఫోర్లు, 4 సిక్స్లతో 83 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్ధానానికి చేరుకున్నాడు. ఓవరాల్గా ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడిన కోహ్లి 90.50 సగటుతో 181 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో కోహ్లితో పాటు గ్రీన్(33), కార్తీక్(20) పరుగులతో రాణించాడు. King Kohli in his Kingdom! 🥵🤌#RCBvsKKR pic.twitter.com/c8kgfXdWHS — OneCricket (@OneCricketApp) March 29, 2024 -
IPL 2024: 24 కోట్ల బౌలర్కు చుక్కలు చూపించిన క్లాసెన్..
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడు పోయిన ఆసీస్ స్టార్ పేసర్, కోల్కతా నైట్ రైడర్స్ ప్రీమియర్ బౌలర్ మిచెల్ స్టార్క్కు సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో స్టార్క్ను ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఓ ఆట ఆడేసికున్నారు. ముఖ్యంగా సన్రైజర్స్ స్టార్ హెన్రిస్ క్లాసెన్ అయితే స్టార్క్ను ఊచకోత కోశాడు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 19 ఓవర్ వేసిన స్టార్క్ ఏకంగా 26 పరుగులు సమర్పించకున్నాడు. ఆ ఓవర్లో మొత్తం నాలుగు సిక్స్లు బాదారు. అందులో క్లాసెన్ 3 సిక్స్లు కొట్టగా.. షబాజ్ అహ్మద్ ఓ సిక్స్ బాదాడు. ఈ మ్యాచ్లో స్టార్క్ తన నాలుగు ఓవర్ల కోటాలో వికెట్ ఏమీ తీయకుండా ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు. కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో రూ.24.75 కోట్ల భారీ ధరకు స్టార్క్ను కేకేఆర్ కొనుగోలు చేసింది. ఈ క్రమంలో దారుణ ప్రదర్శన కనబరిచిన స్టార్క్ను నెటిజన్లు దారుణంగా విఫలమవుతున్నారు. తన కంటే రూ.20 లక్షల తీసుకున్న హర్షిత్ రానా ఎంతో బెటర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్లో రానా మూడు వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా ఆఖరి ఓవర్లో అద్బుతంగా బౌలింగ్ చేసి తన జట్టుకు విజయాన్ని అందిచాడు. ఈ మ్యాచ్లో 4 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. హెన్రిస్ క్లాసెన్ 63 పరుగులతో విరోచిత పోరాటం చేసినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. -
రూ. 24.75 కోట్ల ఆటగాడు... ఎన్ని వికెట్లు తీస్తాడంటే?!
ఐపీఎల్-2024 సందడి మొదలైపోయింది. పొట్టి ఫార్మాట్లోని మజాను అందించేందుకు ఆటగాళ్లు.. ఆస్వాదించేందుకు అభిమానులూ సిద్ధమైపోయారు. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్తో శుక్రవారం (మార్చి 22) ఈవెంట్కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, ఐపీఎల్ కామెంటేటర్ స్టీవ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సహచర ఆటగాడు మిచెల్ స్టార్క్ ఐపీఎల్-2024లో కచ్చితంగా సత్తా చాటుతాడంటూ.. తాజా ఎడిషన్లో ఎన్ని వికెట్లు తీయగలడో అంచనా వేశాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో అదరగొట్టిన మిచెల్ స్టార్క్ దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత క్యాష్ రిచ్ లీగ్లో పునరాగమనం చేయనున్నాడు. వేలంలో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ అతడి కోసం పోటీ పడి ఏకంగా రూ. 24.75 కోట్లు ఖర్చు చేసింది. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా ఈ పేస్ బౌలర్ నిలిచాడు. దీంతో మిచెల్ స్టార్క్పై అంచనాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈఎస్ఎపీఎన్క్రిక్ఇన్ఫో షోలో మాట్లాడిన ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్కు స్టార్క్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘నాకు తెలిసి అతడు కొత్త బంతితో కచ్చితంగా మ్యాజిక్ చేయగలడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతడే బౌలింగ్ చేస్తాడు కాబట్టి వికెట్లు తీసే అవకాశం ఉంటుంది. ఈసారి స్టార్క్ 30 వికెట్లు తీస్తాడని అనుకుంటున్నా’’ అని స్మిత్ అంచనా వేశాడు. కాగా ఐపీఎల్లో ఒక ఎడిషన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా డ్వేన్ బ్రావో, హర్షల్ పటేల్ సంయుక్త రికార్డు సాధించారు. 2013లో సీఎస్కే తరఫున బ్రావో.. 2021లో ఆర్సీబీ తరఫున హర్షల్ పటేల్ 32 వికెట్లు తీశారు. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడిన సౌతాఫ్రికా స్టార్ కగిసో రబడ 30 వికెట్లతొ రెండోస్థానాన్ని ఆక్రమించాడు. ఇదిలా ఉంటే కేకేఆర్ తాజా సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్తో మార్చి 23న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
IPL 2024: కేకేఆర్ క్యాంప్లో జోష్ నింపుతున్న మిచెల్ స్టార్క్
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్ కోల్కతా నైట్రైడర్స్ క్యాంప్లో కొత్త జోష్ నింపుతున్నాడు. ఐపీఎల్ 2024 ప్రారంభానికి మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో అన్ని జట్లతో పాటు కేకేఆర్ కూడా ప్రాక్టీస ముమ్మరం చేసింది. కేకేఆర్ విషయానికొస్తే.. స్టార్క్ ఆ జట్టుకు తరుపుముక్కగా పరిగణించబడుతున్నాడు. ప్రాక్టీస్ సెషన్స్లో స్టార్క్ పేట్రేగిపోతున్నాడు. Mitchell Starc in Purple😍pic.twitter.com/yBDau2M436 — CricTracker (@Cricketracker) March 20, 2024 నిప్పులు చెరిగే బంతుల సంధిస్తూ సహచరులను తెగ ఇబ్బంది పెడుతున్నాడు. తాజాగా స్టార్క్ సహచర ఆటగాడిని ఎల్బీడబ్ల్యూ చేసే వీడియో ఒకటి నెట్టింట వైరలవుతుంది. ఇందులో స్టార్క్ మెరుపు వేగంతో బంతిని సంధిస్తూ కనిపించాడు. సహజంగానే మెరుపు వీరుడిగా పేరున్న స్టార్క్ ఇంత భారీ మొత్తం తనపై పెట్టుబడి పెట్టడంతో ఇంకాస్త విజృంభించే అవకాశం ఉంది. Pure cinema! 🤌 pic.twitter.com/u1vR0Wvq2r — KolkataKnightRiders (@KKRiders) March 19, 2024 కేకేఆర్ యాజమాన్యం స్టార్క్పై భారీ ఆశలు పెట్టుకుంది. గంభీర్ మెంటార్షిప్లో కేకేఆర్ కొత్త రక్తంతో ఉరకేలుస్తుంది. ఈసారి ఎలాగైనా మూడో ఐపీఎల్ టైటిల్ సాధించాలని ఆ జట్టు యాజమాన్యం కంకణం కట్టుకు కూర్చుంది. ఐపీఎల్ 2024 వేలంలో కేకేఆర్ స్టార్క్ను 24.75 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. All about the 𝐊𝐧𝐢𝐠𝐡𝐭 kind of hustle! 🔥 pic.twitter.com/9aJNIpJUtN — KolkataKnightRiders (@KKRiders) March 20, 2024 ఇదిలా ఉంటే, ఐపీఎల్ 17వ ఎడిషన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా జరిగే సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. ఆర్సీబీతో తలపడుతుంది. కేకేఆర్ తమ తొలి మ్యాచ్ను మార్చి 23న ఆడనుంది. ఈడెన్ గార్డెన్స్లో జరిగే ఈ మ్యాచ్లో కేకేఆర్.. ఆరెంజ్ ఆర్మీను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. తొలి విడదలో ప్రకటించిన షెడ్యూల్ వరకు కేకేఆర్ మార్చి 29, ఏప్రిల్ 3న మరో రెండు మ్యాచ్లు ఆడనుంది. 29న జరిగే తొలి మ్యాచ్లో ఆర్సీబీతో (బెంగళూరు), 2న జరిగే మరో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో (విశాఖ) కేకేఆర్ తలపడనుంది. Chalo shuru karte hai! 🗓 pic.twitter.com/i2l0M9dP8x — KolkataKnightRiders (@KKRiders) February 22, 2024 కోల్కతా నైట్ రైడర్స్ పూర్తి జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, అనుకూల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కేఎస్ భరత్, చేతన్ సకారియా, మిచెల్ స్టార్క్, అంగ్క్రిష్ రఘువంశీ, రమణదీప్ సింగ్, షెర్ఫానే రూథర్ఫోర్డ్, మనీష్ పాండే, ముజీబ్ ఉర్ రెహమాన్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్. గాయపడిన/ఉపసంహరించుకున్న ఆటగాళ్ళు: జాసన్ రాయ్, గుస్ అట్కిన్సన్. -
స్టార్క్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాదిన రింకూ! మెరుపు ఇన్నింగ్స్
కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఐపీఎల్-2024 సన్నాహకాల్లో తలమునకలైంది. కేకేఆర్ ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయి ఇంట్రా- స్వ్కాడ్ మ్యాచ్తో బిజీబిజీగా గడిపారు. మెగా టోర్నీ ఆరంభానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్లో చెమటోడ్చారు. ఇక ఈ మ్యాచ్లో కేకేఆర్ స్టార్, టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్, ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ మధ్య పోరు హైలైట్గా నిలిచింది. సన్నాహకాల్లో భాగంగా టీమ్ పర్పుల్, టీమ్ గోల్డ్గా విడిపోయిన కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్ మైదానంలో మంగళవారం ప్రాక్టీస్ చేసింది. పర్పుల్కు స్టార్క్ సారథ్యం వహించగా.. టీమ్ గోల్డ్లో ఉన్న రింకూ సింగ్ అతడికి చుక్కలు చూపించాడు. వరల్డ్క్లాస్ పేసర్ అయిన స్టార్క్ బౌలింగ్లో రింకూ భారీ సిక్సర్ బాదాడు. కళ్లు చెదిరే రీతిలో మిడ్ వికెట్ మీదుగా సిక్స్ కొట్టి సత్తా చాటాడు. అంతేకాదు స్టార్క్ బౌలింగ్లో బాగానే పరుగులు పిండుకున్నాడు. Rinku Singh smashed a SIX to Mitchell Starc 🍿💥 This is Cinema!! pic.twitter.com/zQNhfPrqSR — कट्टर KKR समर्थक 🦁🇮🇳 ™ (@KKRWeRule) March 19, 2024 ఇక ఈ మ్యాచ్లో స్టార్క్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 40 పరుగులు సమర్పించుకుని ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. మరోవైపు.. రింకూ సింగ్ 16 బంతుల్లోనే 37 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అదే విధంగా కేకేఆర్లో జేసన్ రాయ్ స్థానాన్ని భర్తీ చేస్తూ కొత్తగా వచ్చిన ఫిల్ సాల్ట్ 41 బంతులు ఎదుర్కొని 78 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇక వైస్ కెప్టెన్ నితీశ్ రాణా 30 బంతుల్లో 50 పరుగులతో రాణించగా... మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 40 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అయితే, ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో ఎట్టకేలకు టీమ్ పర్పుల్ విజయం సాధించింది. Starc⚡ vs Russell 💪?! Join #KnightLIVE to witness thrilling Practice Match https://t.co/0Z8XOaYXxE — KolkataKnightRiders (@KKRiders) March 19, 2024 కాగా వన్డే వరల్డ్కప్-2023లో అదరగొట్టిన ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కోసం కేకేఆర్ కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా రూ. 24.75 కోట్లు ఖర్చు పెట్టిన విషయం తెలిసిందే. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత అతడు ఐపీఎల్లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక ఐపీఎల్-2024లో కేకేఆర్ సన్రైజర్స్తో మార్చి 23న తొలి మ్యాచ్ ఆడనుంది. -
భర్త అడుగుజాడల్లో భార్య.. స్టార్క్ దంపతులకు విచిత్ర అనుభవం
భర్త అడుగుజాడల్లో భార్య అనే నానుడును నిజజీవితంలో మనం తరుచూ వింటుంటాం. ఈ మాటను క్రీడాజీవితంలో ఫాలో అయ్యి చూపించింది ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ అలైసా హీలీ. ఆస్ట్రేలియా పురుషుల జట్టు స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ భార్య అయిన హీలీ.. ప్రస్తుతం ఆస్ట్రేలియా మహిళల టెస్ట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తుంది. హీలీ క్రికెట్కు సంబంధించిన ఓ విషయంలో భర్త స్టార్క్ అడుగుజాడల్లో నడిచింది. యాదృచ్చికంగా చోటు చేసుకున్న ఈ సందర్భం ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఏం జరిగిందంటే.. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ 2013లో భారత్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 99 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ మ్యాచ్ స్టార్క్ కెరీర్లో తొమ్మిదవది. యాదృచ్చికంగా స్టార్క్ భార్య అలైసా హీలీ కూడా తన తొమ్మిదవ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 99 పరుగుల వద్దనే ఔటైంది. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో హీలీ తృటిలో సెంచరీ చేజార్చుకుని బాధతో పెవిలియన్కు చేరింది. అయితే తాను భర్త అడుగుజాడల్లోనే నడుస్తున్నానన్న విషయం హీలీకి తెలియకపోయి ఉండవచ్చు. తొమ్మిదో టెస్ట్లో భార్యా భర్తలు 99 పరుగుల వద్ద ఔట్ కావడం ఆసక్తికరంగా మారింది. కాగా, సౌతాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్ట్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్లో లిచ్ఫీల్డ్ (4), ఎల్లిస్ పెర్రీ (3), తమిళ మెక్గ్రాత్ (0) తక్కువ స్కోర్లకే వెనుదిరగగా.. బెత్ మూనీ (78), అలైసా హీలీ (99), సథర్ల్యాండ్ (54 నాటౌట్) అర్దసెంచరీలు చేసి ఆసీస్ను ఆదుకున్నారు. సౌతాఫ్రికా మహిళల జట్టుకు ఇది తొలి టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. -
అతడే కాదు.. అసలు ఎవరికీ ఆ అర్హత లేదు: టీమిండియా దిగ్గజం
IPL 2024- KKR: ఐపీఎల్ వేలం-2024లో కోల్కతా నైట్ రైడర్స్ అవలంబించిన వ్యూహాన్ని టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ విమర్శించాడు. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ కోసం కేకేఆర్ ఏకంగా 24 కోట్లు వెచ్చించడం అతిశయోక్తిగా అనిపించిందన్నాడు. ఏ క్రికెటర్ కూడా అంత మొత్తం అందుకునేందుకు అర్హుడు కాదని తాను భావిస్తున్నట్లు గావస్కర్ పేర్కొన్నాడు. కాగా దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత స్టార్క్ క్యాష్ రిచ్ లీగ్లో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఏకంగా రూ. 24.75 కోట్లు భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్-2023లో సత్తా చాటిన ఈ పేస్ బౌలర్ కోసం మినీ వేలంలో ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. ఈ క్రమంలో స్టార్క్ కోసం గుజరాత్ టైటాన్స్తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైన కేకేఆర్.. ఏకంగా రూ. 24.75 కోట్లు చెల్లించి అతడిని సొంతం చేసుకుంది. తద్వారా ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ పాత రికార్డులన్నీ బద్దలుకొట్టాడు. ఈ విషయం గురించి సునిల్ గావస్కర్ తాజాగా స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడాడు. ‘‘నాకైతే నిజంగా ఇది అతిశయోక్తి అనిపించింది. అతడే కాదు.. అసలు ఎవరికీ ఆ అర్హత లేదు నాకు తెలిసి ఏ క్రికెటర్కు కూడా అంత భారీ మొత్తం అందుకోగల అర్హత లేదు. ఒకవేళ తాను ఆడే 14 మ్యాచ్లలో స్టార్క్ కనీసం నాలుగింటిలోనైనా ప్రభావం చూపితే.. ఆ డబ్బుకు కాస్తైనా న్యాయం చేసినట్లు అవుతుంది. మిగతా మ్యాచ్లలోనూ రాణించగలిగితే అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వంటి జట్లలో మేటి బ్యాటర్లు ఉన్నారు. ఈ జట్లపై స్టార్క్ బంతితో ప్రభావం చూపితే మాత్రం ఫ్రాంఛైజీ తన కోసం వెచ్చించిన మొత్తానికి న్యాయం చేసినవాడవుతాడు’’ అని సునిల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు. తొలుత ఆర్సీబీకి ఆడాడు కాగా 2014, 2015 సీజన్లలో ఆర్సీబీకి ఆడిన స్టార్క్.. 2018లో కేకేఆర్కు మారాడు. అప్పుడు కేకేఆర్ అతడి కోసం రూ. 9.40 కోట్లు ఖర్చు చేయగా.. గాయం కారణంగా ఆడలేకపోయాడు. ఇక వన్డే వరల్డ్కప్-2023లో మిచెల్ స్టార్క్ మొత్తంగా ఆడిన 10 మ్యాచ్లలో 16 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆసీస్ ఆరోసారి ప్రపంచ చాంపియన్గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. చదవండి: Ravindra Jadeja: మా కోడలి వల్లే ఇదంతా... మండిపడ్డ రివాబా! -
కమిన్స్ దెబ్బ.. రెండో టెస్టులోనూ పాక్ చిత్తు.. సిరీస్ ఆస్ట్రేలియాదే
Australia vs Pakistan, 2nd Test : పాకిస్తాన్తో రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆఖరి మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. బాబర్ ఆజం స్థానంలో టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన షాన్ మసూద్ సారథ్యంలో పాకిస్తాన్ తొలిసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య డిసెంబరు 14న మొదలైన తొలి టెస్టులో ఆతిథ్య ఆసీస్ ఏకంగా 360 పరుగుల తేడాతో పాక్ను చిత్తు చేసింది. ఈ క్రమంలో రెండో టెస్టులోనైనా గెలిచి నిలవాలని పాక్ భావించింది. బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో కంగారూ జట్టును 318 పరుగులకు కట్టడి చేయగలిగింది పాక్. కానీ బ్యాటర్ల వైఫల్యం కారణంగా 264 పరుగులకే షాన్ మసూద్ బృందం ఆలౌట్ కావడంతో.. ఆసీస్కు 54 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాకు పాక్ ఆరంభంలోనే షాకిచ్చింది. పేసర్లు షాహిన్ ఆఫ్రిది, మీర్ హంజా దెబ్బకు టాపార్డర్ కుప్పకూలిపోయింది. 16 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ఇబ్బందుల్లో పడింది. Mitch Marsh hangs on at third man! Whatta catch! #AUSvPAK pic.twitter.com/BFC1LBXjeK — cricket.com.au (@cricketcomau) December 29, 2023 ఇలాంటి క్లిష్ట దశలో మిచెల్ మార్ష్ (96; 13 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (50; 3 ఫోర్లు) అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్కు 153 పరుగులు జోడించి ఆసీస్ను నిలబెట్టారు. ఈ క్రమంలో.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 62.3 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో ఓవరాల్గా 241 పరుగుల ఆధిక్యంతో నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన ఆస్ట్రేలియా 262 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ ముగించింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ను ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ బెంబేలెత్తించాడు. ఐదు వికెట్లతో చెలరేగి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మరో పేసర్ మిచెల్ స్టార్క్ కూడా తనదైన శైలిలో రాణించడంతో పాకిస్తాన్ 237 పరుగులకే చాపచుట్టేసింది. షాన్ మసూద్ కెప్టెన్ ఇన్నింగ్స్(71 బంతుల్లో 60 పరుగులు), ఆగా సల్మాన్ అర్ధ శతకం(50)తో రాణించినా ఫలితం లేకుండా పోయింది. 79 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో ఓటమి పాలు కాగా నాలుగో రోజే ఆట ముగిసిపోయింది. ఇక పాక్ రెండో ఇన్నింగ్స్లో స్టార్క్ నాలుగు, జోష్ హాజిల్వుడ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ప్యాట్ కమిన్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య నామమాత్రపు ఆఖరి టెస్టు బుధవారం (జనవరి 3) నుంచి ప్రారంభం కానుంది. కాగా ఆస్ట్రేలియాలో పాక్ ఇంత వరకు ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదన్న విషయం తెలిసిందే. 1995లో చివరగా కంగారూ గడ్డపై టెస్టు మ్యాచ్ గెలిచింది. తాజా పరాజయంతో 1999 పర్యటన నుంచి ఆ జట్టు వరుసగా 16 టెస్టుల్లో ఓడింది. THE AUSSIES GET IT DONE! 🔥 📺 Watch Day 4 #AUSvPAK on Fox Cricket and Kayo Sports: https://t.co/VNpf5Xojhg ✍ BLOG: https://t.co/physFvdl0W 🔢 MATCH CENTRE: https://t.co/v8I8vaM89H pic.twitter.com/D8dCwItqhb — Fox Cricket (@FoxCricket) December 29, 2023 -
వాళ్లిద్దరికి అంత మొత్తమా? ముంబై మాత్రం తెలివిగా రూ. 15 కోట్లకే: ఏబీడీ
ఐపీఎల్ వేలం-2024 వేలంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తెలివిగా వ్యవహరించాయని సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ అన్నాడు. అదే సమయంలో సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ మాత్రం ఆస్ట్రేలియా క్రికెటర్ల కోసం భారీ మొత్తం వెచ్చించడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఈసారి వేలంలో ఫాస్ట్ బౌలర్లకు డిమాండ్ ఉన్న వాస్తవమే అయినా.. మరీ ఈ స్థాయిలో రూ. 20 కోట్లకు పైగా ఖర్చుచేస్తారని ఊహించలేదన్నాడు. కాగా దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన ఆక్షన్లో ఆసీస్ పేసర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ రికార్డు స్థాయి ధర పలికిన విషయం తెలిసిందే. కమిన్స్ను సన్రైజర్స్ రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేయగా.. స్టార్క్ కోసం కేకేఆర్ ఏకంగా రూ. 24.75 కోట్లు ఖర్చు చేసింది. దీంతో క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే వీరిద్దరు అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా నిలిచారు. ఈ నేపథ్యంలో తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఏబీ డివిలియర్స్కు ఈ విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘ఈసారి వేలంలో కొన్ని ఫ్రాంఛైజీలు స్మార్ట్గా వ్యవహరించాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ భావోద్వేగాలకు తావులేకుండా తెలివిగా కొనుగోళ్లు చేశాయి. నిజానికి కమిన్స్, స్టార్క్ అద్భుతమైన ఆటగాళ్లే! అయితే, వాళ్ల కోసం అంత భారీ మొత్తం వెచ్చించాలా? అంటే అవసరం లేదనే చెప్పవచ్చు. ఫాస్ట్ బౌలర్లకు ఈసారి వేలంలో డిమాండ్ ఉన్న మాట నిజమే! అందుకే ధరలు అమాంతం పెరిగిపోయాయి. అయితే, ముందుగా చెప్పినట్లు ముంబై ఇండియన్స్ తెలివిగా ఆటగాళ్లను కొనుగోలు చేసింది. నువాన్ తుషార, దిల్షాన్ మధుషాంక అద్భుతమైన క్రికెటర్లు. ఇక మహ్మద్ నబీ, శ్రేయస్ గోపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి ధరకే వాళ్లిద్దరు ముంబైకి లభించారు. ముఖ్యంగా.. కొయెట్జీ, మధుషాంక, తుషారలను కలిపి 15 కోట్ల రూపాయలకే సొంతం చేసుకోవడం నాకు నచ్చింది’’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా పేస్త్రయం గెరాల్డ్ కొయెట్జీని రూ. 5 కోట్లు, దిల్షాన్ మధుషాంకను రూ. 4.5 కోట్లు, నువాన్ తుషారను రూ. 4.8 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఇక నబీ కోసం రూ. 1.5 కోట్లు, గోపాల్ కోసం రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. వీరితో పాటు నామన్ ధిర్ను రూ. 20 లక్షలు, అన్షూల్ కాంబోజ్ను రూ. 20 లక్షలు, శైవిక్ శర్మను రూ. 20 లక్షలకు ఐపీఎల్-2024 వేలంలో ముంబై కొనుగోలు చేసింది. -
రూ.24.75 కోట్లు! అస్సలు ఊహించలేదు.. షాక్కు గురయ్యాను: స్టార్క్
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్-2024 వేలంలో స్టార్క్ను రూ.24.75 కోట్ల భారీ ధరకు కోల్కతా నైట్రైడర్స్ సొంతం చేసుకుంది. ఈ ఆసీస్ పేసర్ కోసం ఢిల్లీ, ముంబై,గుజరాత్,కోల్కతా తీవ్రంగా పోటీ పడ్డాయి. కానీ చివరి వరకు ఎక్కడ తగ్గని కేకేఆర్.. ఈ యార్కర్ల కింగ్ను దక్కించుకుంది. అంతకంటే ముందు ఇదే వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ప్యాట్ కమ్మిన్స్(రూ.20.50 కోట్లు) రికార్డును స్టార్క్ బ్రేక్ చేశాడు. ఇక ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర దక్కడంపై స్టార్క్ స్పందించాడు. "నిజంగానే షాక్కు గురయ్యాను. ఇంత మొత్తాన్ని అసలు ఊహించలేదు. ఎనిమిదేళ్ల తర్వాత ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 లీగ్లో మళ్లీ ఆడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. ఇప్పుడు విలువ పెరిగినా నా ఆటతీరు ఎప్పుడూ మారలేదు. భారీ మొత్తం కాబట్టి ఒత్తిడి సహజమే అయినా... నాకున్న అనుభవంతో మంచి ఫలితాలు సాధిస్తాననే నమ్మకం ఉందని" స్టార్ స్పోర్ట్స్తో స్టార్క్ పేర్కొన్నాడు. కాగా మిచెల్ స్టార్క్ గతంలో ఐపీఎల్లో ఆడిన అనుభవం పెద్దగా లేదు. అతడు కేవలం రెండు సార్లు మాత్రమే ఈ క్యాష్ రిచ్ లీగ్లో ఆడాడు. 2014, 15 సీజన్లలో ఆర్సీబీ తరపున స్టార్క్ ప్రాతినిథ్యం వహించాడు. 27 మ్యాచ్లలో 7.16 ఎకానమీతో 34 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత వేర్వేరు కారణాలతో అతను ఎనిమిది సీజన్ల పాటు లీగ్కు దూరంగా ఉన్నాడు. 2018లో కోల్కతా అతడిని ఎంచుకున్నా... గాయంతో టోర్నీకి ముందే తప్పుకున్నాడు. చదవండి: ENG vs WI: ఇదేమి విధ్వంసం.. ఏకంగా 267 పరుగులు! పాపం విండీస్ -
నీకు రూ. 20.50 కోట్లు... నాకు రూ. 24.75 కోట్లు
ఐపీఎల్ వేలం షురూ... ముందుగా బ్యాటర్ల జాబితా... అది ముగిసిన తర్వాత రెండో సెట్ క్యాప్డ్ బౌలర్ల జాబితా ముందుకు వచ్చింది... నాలుగో ఆటగాడిగా ప్యాట్ కమిన్స్ పేరు వినిపించింది... రూ.2 కోట్ల కనీస విలువతో వేలం మొదలైంది... చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ముందుగా పోటీ పడగా, ఆపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వచ్చి చేరింది. రూ.7.80 కోట్ల వద్ద సన్రైజర్స్ బరిలోకి దిగింది.. ఆపై మిగతా జట్లు తప్పుకోగా... రైజర్స్, ఆర్సీబీ మాత్రమే వేలం మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లాయి... రూ.20.25 కోట్ల వద్ద రెండు టీమ్లు ఆగాయి... దానికి మరో రూ.25 లక్షలు సన్రైజర్స్ జోడించాక బెంగళూరు స్పందించలేదు. రూ.20.50 కోట్లతో కమిన్స్ హైదరాబాద్ చెంత చేరడంతో ఐపీఎల్లో కొత్త రికార్డు నమోదైంది. కానీ సినిమా అంతటితో ముగిసిపోలేదు... గంట సేపటి తర్వాత మిచెల్ స్టార్క్ పేరు వేలంలోకి వచ్చింది... ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ మొదలు పెట్టింది. ఆపై ముంబై, కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) సీన్లోకి వచ్చేశాయి. కోల్కతా, గుజరాత్ టైటాన్స్ పోటీ పడి స్టార్క్ విలువను రూ.20 కోట్లు దాటించేశాయి... అయినా ఇరు జట్లు వెనక్కి తగ్గలేదు. ఆసీస్ పేసర్ కోసం పోటీని కొనసాగించాయి... మరింత వేగంగా ఈ మొత్తం రూ.24.50 కోట్లకు చేరింది... ఈ దశలో కోల్కతా మరో అడుగు ముందుకేసింది... గుజరాత్ ఇక చాలనుకుకోవడంతో రూ.24.75 కోట్లతో స్టార్క్ తన సహచరుడు కమిన్స్ రికార్డును కొద్ది సేపటికే బద్దలు కొట్టేశాడు. ఇద్దరు స్టార్ ఆసీస్ పేసర్లు కలిసి ఐపీఎల్ ద్వారా రూ. 45.25 కోట్లతో పండగ చేసుకున్నారు! ఐపీఎల్ వేలం ఎప్పటిలాగే అంచనాలకు భిన్నంగా ఊహించని రీతిలో సాగింది. పేరుకే మినీ వేలం అయినా ఆటగాళ్లకు లభించిన మొత్తాలు మెగా వేలంలా అనిపించాయి. పెద్దగా గుర్తింపు లేని, టి20 ఫార్మాట్లో అంతగా అద్భుతాలు చూపించని ఆటగాళ్లపై కూడా కాసుల వాన కురవగా, ఇప్పటికే తమ ఆటతో సత్తా నిరూపించుకున్న కొందరికి ఆశ్చర్యకరంగా తక్కువ విలువే దక్కింది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రవిస్ హెడ్, న్యూజిలాండ్ ప్లేయర్ డరైల్ మిచెల్, విండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్, హరియాణా బౌలర్ హర్షల్ పటేల్ భారీ సొమ్మును తమ ఖాతాలో వేసుకోగా... అన్క్యాప్డ్ భారత ఆటగాడు సమీర్ రిజ్వీ (ఉత్తరప్రదేశ్), కుమార్ కుశాగ్ర (జార్ఖండ్) భారీ విలువ పలికి సంచలనం సృష్టించడం వేలంలో హైలైట్. 72 మంది ఆటగాళ్లతో... దుబాయ్: ఐపీఎల్–2024 కోసం మంగళవారం జరిగిన వేలం ముగిసింది. మొత్తం 332 మంది ఆటగాళ్లు వేలంలో అందుబాటులోకి రాగా... 10 ఫ్రాంచైజీలు కలిసి 72 మందిని ఎంచుకున్నాయి. ఇందులో 30 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. వేలంలో గరిష్టంగా 77 మందిని తీసుకునే అవకాశం ఉన్నా... కోల్కతాలో 2 ఖాళీలు, రాజస్తాన్లో 3 ఖాళీలు ఉండిపోయాయి. తొలిసారి విదేశీ గడ్డపై జరిగిన ఐపీఎల్ వేలంను మొదటిసారి ఓ మహిళ (మల్లిక సాగర్) నిర్వహించడం విశేషం. మధ్యాహ్నం 1 గంటకు మొదలైన వేలం స్వల్ప విరామాలతో రాత్రి 9 గంటల వరకు సాగింది. ఈ వేలం కోసం అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ.230 కోట్ల 45 లక్షలు వెచ్చించాయి. ఆసీస్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ రూ. 24.75 కోట్లతో కొత్త రికార్డు నెలకొల్పగా... 24 మంది క్రికెటర్లను కనీస విలువ రూ.20 లక్షలతో జట్లు సొంతం చేసుకున్నాయి. వచ్చే సీజన్ ఐపీఎల్ మార్చి 22 నుంచి మే 26 జరిగే అవకాశం ఉంది. ఐపీఎల్ వేలం విశేషాలు... ♦ విండీస్ ప్లేయర్ రావ్మన్ పావెల్ కోసం రాజస్తాన్ భారీ మొత్తం (రూ.7.40 కోట్లు) వెచ్చించింది. గతంలో ఢిల్లీ తరఫున ఏమాత్రం ప్రభావం చూపలేకపోయినా... కరీబియన్ ప్రీమియర్ లీగ్లో తమ జట్టు బార్బడోస్ రాయల్స్కు అతను కెపె్టన్ కావడమే ప్రధాన కారణం. ♦ హ్యారీ బ్రూక్ను చాలా తక్కువ మొత్తం (రూ.4 కోట్లు)కే ఢిల్లీ సొంతం చేసుకుంది. గత ఏడాది సన్రైజర్స్ బ్రూక్కు రూ. 13.25 కోట్లు ఇచ్చింది. ♦ బెంగళూరు తరఫున 3 సీజన్లలో ఆకట్టుకున్న లెగ్స్పిన్నర్ హసరంగను సన్రైజర్స్ చాలా తక్కువ మొత్తానికి (రూ. 1.50 కోట్లు) సొంతం చేసుకుంది. ♦ వన్డే వరల్డ్కప్లో చక్కటి ప్రదర్శన కనబర్చినా న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్రకు తక్కువ మొత్తమే (రూ.1.80కోట్లు) దక్కింది. అతని సహచరుడు డరైల్ మిచెల్ కోసం మాత్రం చెన్నై చాలా మొత్తం (రూ.14 కోట్లు) ఖర్చు చేసింది. ♦ ఫామ్ కోల్పోయి భారత జట్టులో స్థానం చేజార్చుకోవడంతో పాటు ఐపీఎల్లోనూ భారీగా పరుగులిస్తూ వచ్చిన హర్షల్ పటేల్ కోసం పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.11.75 కోట్లు వెచ్చించింది. ♦ విండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ కోసం బెంగళూరు అనూహ్యంగా చాలా పెద్ద మొత్తం (రూ.11.50 కోట్లు) చెల్లించింది. ♦ ఒకే ఒక అంతర్జాతీయ వన్డే, 2 టి20లు ఆడిన ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్కు రూ. 10 కోట్లు దక్కడం అనూహ్యం. ♦ వేలంలో ముందుగా పేరు వచ్చినప్పుడు రిలీ రోసో (దక్షిణాఫ్రికా)ను ఎవరూ పట్టించుకోలేదు కానీ చివర్లో పంజాబ్ కింగ్స్ రూ. 8 కోట్లకు అతడిని కొనుగోలు చేయడం విశేషం. వేలంలో టాప్–10 వీరే... 1. స్టార్క్ (కోల్కతా) రూ. 24.75 కోట్లు 2. కమిన్స్ (హైదరాబాద్) రూ. 20.50 కోట్లు 3. మిచెల్ (చెన్నై) రూ. 14 కోట్లు 4. హర్షల్ పటేల్ (పంజాబ్) రూ. 11.75 కోట్లు 5. జోసెఫ్ (బెంగళూరు) రూ. 11.50 కోట్లు 6. స్పెన్సర్ జాన్సన్ (గుజరాత్) రూ. 10 కోట్లు 7. సమీర్ రిజ్వీ (చెన్నై) రూ. 8.40 కోట్లు 8. రిలీ రోసో (పంజాబ్) రూ. 8 కోట్లు 9. షారుఖ్ (గుజరాత్) రూ. 7.40 కోట్లు 10. పావెల్ (రాజస్తాన్) రూ. 7.40 కోట్లు నిజంగానే షాక్కు గురయ్యాను. ఇంత మొత్తాన్ని అసలు ఊహించలేదు. ఎనిమిదేళ్ల తర్వాత ప్రపంచంలోని అత్యుత్తమ టి20 లీగ్లో మళ్లీ ఆడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. ఇప్పుడు విలువ పెరిగినా నా ఆటతీరు ఎప్పుడూ మారలేదు. భారీ మొత్తం కాబట్టి ఒత్తిడి సహజమే అయినా... నాకున్న అనుభవంతో మంచి ఫలితాలు సాధిస్తాననే నమ్మకం ఉంది. –మిచెల్ స్టార్క్ సన్రైజర్స్తో జత కట్టేందుకు అమితోత్సాహంతో ఉన్నా. ఆరెంజ్ ఆర్మీ గురించి చాలా విన్నా. హైదరాబాద్లో కూడా మ్యాచ్లు ఆడా. నాకు బాగా నచ్చింది. నాతో పాటు హెడ్ కూడా ఉన్నాడు. విజయాలతో సీజన్ సాగాలని ఆశిస్తున్నా. –ప్యాట్ కమిన్స్ మిచెల్ స్టార్క్ రెండు సార్లు మాత్రమే ఐపీఎల్లో (2014–15) అదీ బెంగళూరు జట్టు తరఫునే ఆడాడు. 27 మ్యాచ్లలో 7.16 ఎకానమీతో 34 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత వేర్వేరు కారణాలతో అతను ఎనిమిది సీజన్ల పాటు లీగ్కు దూరంగా ఉన్నాడు. 2018లో కోల్కతా అతడిని ఎంచుకున్నా... గాయంతో టోర్నీకి ముందే తప్పుకున్నాడు. ప్యాట్ కమిన్స్ ఢిల్లీ తరఫున 12 మ్యాచ్లు, కోల్కతా తరఫున 30 మ్యాచ్లు ఆడి మొత్తం 45 వికెట్లు పడగొట్టాడు. 2020 వేలంలో కేకేఆర్ అతనికి రూ. 15.50 కోట్లు ఇచ్చింది. అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా 2023 సీజన్లో కమిన్స్ ఆడలేదు. వరల్డ్ కప్లో జట్టును విజేతగా నిలిపి అతను మళ్లీ ఇక్కడ అడుగు పెట్టాడు. -
2024 ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేయబడ్డ ఆటగాళ్లు వీరే..!
దుబాయ్లోని కోలోకోలా ఎరీనా వేదికగా ఇవాళ (డిసెంబర్ 19) జరిగిన ఐపీఎల్ 2024 వేలం ఆసక్తికరంగా సాగింది. మొత్తం 77 స్లాట్ల కోసం వేలం జరగగా.. ఆయా ఫ్రాంచైజీలు 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఈ వేలంలో మిచెల్ స్టార్క్ అత్యధిక ధర పలికిన క్యాప్డ్ ప్లేయర్ కాగా.. సమీర్ రిజ్వి అత్యధిక ధర పలికిన అన్ క్యాప్డ్ ప్లేయర్గా నిలిచాడు. ఐపీఎల్ 2024 వేలం 2024 ఆయా ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్న ఆటగాళ్ల జాబితా: రోవ్మన్ పావెల్ (రూ. 7.40 కోట్లు); రాజస్థాన్ రాయల్స్ హ్యారీ బ్రూక్ (రూ. 4 కోట్లు); ఢిల్లీ క్యాపిటల్స్ ట్రావిస్ హెడ్ (రూ. 6.80 కోట్లు); సన్రైజర్స్ హైదరాబాద్ వనిందు హసరంగ (రూ. 1.50 కోట్లు); సన్రైజర్స్ హైదరాబాద్ రచిన్ రవీంద్ర (రూ. 1.80 కోట్లు); చెన్నై సూపర్ కింగ్స్ శార్దూల్ ఠాకూర్ (రూ. 4 కోట్లు); చెన్నై సూపర్ కింగ్స్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (రూ. 50 లక్షలు); గుజరాత్ టైటాన్స్ పాట్ కమిన్స్ (రూ. 20.50 కోట్లు); సన్రైజర్స్ హైదరాబాద్ గెరాల్డ్ కోయెట్జీ (రూ. 5 కోట్లు); ముంబై ఇండియన్స్ హర్షల్ పటేల్ (రూ. 11.75 కోట్లు); పంజాబ్ కింగ్స్ డారిల్ మిచెల్ (రూ. 14 కోట్లు); చెన్నై సూపర్ కింగ్స్ క్రిస్ వోక్స్ (రూ. 4.20 కోట్లు); పంజాబ్ కింగ్స్ ట్రిస్టన్ స్టబ్స్ (రూ. 50 లక్షలు); ఢిల్లీ క్యాపిటల్స్ కేఎస్ భరత్ (రూ. 50 లక్షలు); కోల్కతా నైట్ రైడర్స్ చేతన్ సకారియా (రూ. 50 లక్షలు); కోల్కతా నైట్ రైడర్స్ అల్జరీ జోసెఫ్ (రూ. 11.50 కోట్లు); రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమేష్ యాదవ్ (రూ. 5.80 కోట్లు); గుజరాత్ టైటాన్స్ శివమ్ మావి (రూ. 6.40 కోట్లు); లక్నో సూపర్ జెయింట్స్ మిచెల్ స్టార్క్ (రూ. 24.75 కోట్లు); కోల్కతా నైట్ రైడర్స్ జయదేవ్ ఉనద్కత్ (రూ. 1.60 కోట్లు); సన్రైజర్స్ హైదరాబాద్ దిల్షన్ మధుశంక (4.60 కోట్లు); ముంబై ఇండియన్స్ శుభమ్ దూబే (రూ. 5.80 కోట్లు); రాజస్థాన్ రాయల్స్ సమీర్ రిజ్వీ (8.40 కోట్లు); చెన్నై సూపర్ కింగ్స్ అంగ్క్రిష్ రఘువంశీ (రూ. 20 లక్షలు); కోల్కతా నైట్ రైడర్స్ అర్షిన్ కులకర్ణి (రూ. 20 లక్షలు); లక్నో సూపర్ జెయింట్స్ షారుక్ ఖాన్ (రూ. 7.40 కోట్లు); గుజరాత్ టైటాన్స్ రమణదీప్ సింగ్ (రూ. 60 లక్షలు); కోల్కతా నైట్ రైడర్స్ టామ్ కోహ్లర్ కాడ్మోర్ (రూ. 40 లక్షలు); రాజస్థాన్ రాయల్స్ రికీ భుయ్ (రూ. 20 లక్షలు); ఢిల్లీ క్యాపిటల్స్ కుమార్ కుషాగ్రా (రూ. 7.20 కోట్లు); ఢిల్లీ క్యాపిటల్స్ యష్ దయాల్ (రూ. 5 కోట్లు); రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సుశాంత్ మిశ్రా (రూ. 2.20 కోట్లు); గుజరాత్ టైటాన్స్ ఆకాశ్ సింగ్ (రూ. 20 లక్షలు); సన్రైజర్స్ హైదరాబాద్ కార్తీక్ త్యాగి (రూ. 60 లక్షలు); గుజరాత్ టైటాన్స్ రాసిఖ్ దార్ (రూ. 20 లక్షలు); ఢిల్లీ క్యాపిటల్స్ మానవ్ సుతార్ (రూ. 20 లక్షలు); గుజరాత్ టైటాన్స్ ఎం సిద్ధార్థ్ (రూ. 2.40 కోట్లు); లక్నో సూపర్ జెయింట్స్ శ్రేయాస్ గోపాల్ (రూ. 20 లక్షలు); ముంబై ఇండియన్స్ షెర్ఫేన్ రూథర్ఫోర్డ్ (రూ. 1.5 కోట్లు); కోల్కతా నైట్ రైడర్స్ ఆష్టన్ టర్నర్ (రూ. 1 కోటి); లక్నో సూపర్ జెయింట్స్ టామ్ కర్రన్ (1.50 కోట్లు); రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డేవిడ్ విల్లీ (2 కోట్లు); లక్నో సూపర్ జెయింట్స్ స్పెన్సర్ జాన్సన్ (రూ. 10 కోట్లు); గుజరాత్ టైటాన్స్ ముస్తాఫిజుర్ రెహమాన్ (రూ. 2 కోట్లు); చెన్నై సూపర్ కింగ్స్ జై రిచర్డ్సన్ (రూ. 5 కోట్లు); ఢిల్లీ క్యాపిటల్స్ నువాన్ తుషార (రూ. 4.80 కోట్లు); ముంబై ఇండియన్స్ నమన్ ధీర్ (రూ. 20 లక్షలు); ముంబై ఇండియన్స్ అన్షుల్ కాంబోజ్ (రూ. 20 లక్షలు); ముంబై ఇండియన్స్ సుమిత్ కుమార్ (రూ. 1 కోటి); ఢిల్లీ క్యాపిటల్స్ అశుతోష్ శర్మ (రూ. 20 లక్షలు); పంజాబ్ కింగ్స్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (రూ. 20 లక్షలు); పంజాబ్ కింగ్స్ శశాంక్ సింగ్ (రూ. 20 లక్షలు); పంజాబ్ కింగ్స్ తనయ్ త్యాగరాజన్ (రూ. 20 లక్షలు); పంజాబ్ కింగ్స్ రాబిన్ మింజ్ (3.60 కోట్లు); గుజరాత్ టైటాన్స్ ప్రిన్స్ చౌదరి (రూ. 20 లక్షలు); పంజాబ్ కింగ్స్ జాతవేద్ సుబ్రమణ్యన్ (రూ. 20 లక్షలు); సన్రైజర్స్ హైదరాబాద్ రిలీ రోసౌ (రూ. 8 కోట్లు); పంజాబ్ కింగ్స్ అర్షద్ ఖాన్ (రూ. 20 లక్షలు); లక్నో సూపర్ జెయింట్స్ ముమ్మద్ నబీ (రూ. 1.50 కోట్లు); ముంబై ఇండియన్స్ షాయ్ హోప్ (రూ. 75 లక్షలు); ఢిల్లీ క్యాపిటల్స్ గుస్ అట్కిన్సన్ (రూ. 1 కోటి); కోల్కతా నైట్ రైడర్స్ స్వస్తిక్ చికారా (రూ. 20 లక్షలు); ఢిల్లీ క్యాపిటల్స్ అబిద్ ముస్తాక్ (రూ. 20 లక్షలు); రాజస్థాన్ రాయల్స్ శివాలిక్ శర్మ (రూ. 20 లక్షలు); ముంబై ఇండియన్స్ స్వప్నిల్ సింగ్ (రూ. 20 లక్షలు); రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అవినాష్ రావు ఆరవెల్లి (రూ. 20 లక్షలు); చెన్నై సూపర్ కింగ్స్ నాండ్రే బర్గర్ (రూ. 50 లక్షలు); రాజస్థాన్ రాయల్స్ సాకిబ్ హుస్సేన్ (రూ. 20 లక్షలు); కోల్కతా నైట్ రైడర్స్ సౌరవ్ చౌహాన్ (రూ. 20 లక్షలు); రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాకీ ఫెర్గూసన్ (రూ. 2 కోట్లు); రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముజీబ్ ఉర్ రెహమాన్ (రూ. 2 కోట్లు); కోల్కతా నైట్ రైడర్స్ మనీశ్ పాండే (రూ. 50 లక్షలు); కోల్కతా నైట్ రైడర్స్ -
IPL 2024 Auction: స్టార్క్కు లభించే మొత్తం ఐపీఎల్ ప్రైజ్మనీ కంటే ఎక్కువ..!
దుబాయ్లోని కోకోకోలా ఎరీనాలో ఇవాళ (డిసెంబర్ 19) జరుగుతున్న ఐపీఎల్ 2024 వేలంలో ఆసీస్ స్పీడ్స్టర్ మిచెల్ స్టార్క్కు ఊహకందని ధర దక్కిన విషయం తెలిసిందే. స్టార్క్ను కోల్కతా నైట్రైడర్స్ రికార్డు స్థాయిలో 24.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఓ ఆటగాడికి దక్కిన అత్యధిక ధర. స్టార్క్కు ఇంతటి ధర లభించకముందు ఇదే వేలంలో అతని సహచరుడు, ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్కు కూడా ఇంచుమించు ఇలాంటి ధరనే లభించింది. కమిన్స్ను సన్రైజర్స్ హైదరాబాద్ 20 కోట్ల 50 లక్షలకు సొంతం చేసుకుంది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. 2024 సీజన్లో స్టార్క్, కమిన్స్లకు లభించబోయే మొత్తం ఐపీఎల్ విజేత ప్రైజ్మనీ కంటే ఎక్కువ. ఐపీఎల్ విజేతకు 20 కోట్ల ప్రైజ్మనీ లభిస్తుంది. ఇది స్టార్క్, కమిన్స్లకు వ్యక్తిగతంగా లభించే మొత్తం కంటే తక్కువ. ఐపీఎల్ విన్నర్, రన్నరప్లకు లభించే మొత్తం కలుపుకుంటే కూడా స్టార్క్, కమిన్స్లకు లభించే మొత్తంతో సరితూగదు. ఐపీఎల్ రన్నరప్కు లభించే 13 కోట్లు, విజేతకు లభించే 20 కోట్లు కలుపుకుంటే 33 కోట్లు మాత్రమే అవుతుంది. ఇది ఆసీస్ బౌలింగ్ ద్వయానికి లభించే మొత్తంతో పోల్చుకుంటే ఇంకా 11.75 కోట్లు తక్కువ. ఈ విషయం ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. -
IPL 2024: స్టార్క్ వేయబోయే ఒక్కో బంతి విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
వచ్చే సీజన్లో ఐపీఎల్ ఆల్టైమ్ హైయ్యెస్ట్ పెయిడ్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ వేయబోయే ఒక్కో బంతి విలువ 7 లక్షలకు పైమాటే ఉంటుంది. ఖచ్చితంగా చెప్పాలంటే 2024 సీజన్లో స్టార్క్ వేయబోయే ఒక్కో బంతి విలువ 7 లక్షల 36 వేల 607 రూపాయలు. లీగ్ క్రికెట్ చరిత్రలోనే ఇది కనీవినీ ఎరుగని మొత్తం. ఏ బౌలర్ కలలోనూ ఇంత మొత్తాన్ని ఊహించి ఉండడు. అయితే స్టార్క్కు ఇంత మొత్తం లభించాలంటే అతన్ని కొనుగోలు చేసిన కేకేఆర్ ప్లే ఆఫ్స్కు ముందే నిష్క్రమించాల్సి ఉంటుంది. ఒకవేళ కేకేఆర్ ప్లే ఆఫ్స్ దశ దాటి ఫైనల్స్కు చేరితే స్టార్క్కు లభించే మొత్తంలో కోత పడుతుంది. వచ్చే సీజన్లో కేకేఆర్ ఫైనల్స్కు చేరే క్రమంలో దాదాపుగా 16 మ్యాచ్లు ఆడాల్సి వస్తుంది. స్టార్క్ 16 మ్యాచ్లు ఆడాల్సి వస్తే ఒక్కో బంతికి లభించే మొత్తం 6.44 లక్షలకు తగ్గిపోతుంది. కాగా, దుబాయ్లోని కోకోకోలా ఎరినాలో ఇవాళ (డిసెంబర్ 19) జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో కోల్కతా నైట్రైడర్స్ జట్టు మిచెల్ స్టార్క్ను 24 కోట్ల 75 లక్షల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఓ ఆటగాడికి లభించే అత్యధిక ధర ఇదే. స్టార్క్కు ఇంత భారీ ధర దక్కక ముందు అతని సహచరుడు, ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్కు కూడా ఇంచుమించు ఈ స్థాయి ధరనే లభించింది. కమిన్స్ను సన్రైజర్స్ హైదరాబాద్ 20 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ వేలానికి ముందు వరకు ఐపీఎల్ ఆల్టైమ్ అత్యధిర ధర 18.5 కోట్లుగా ఉండింది. గత సీజన్లో పంజాబ్ కింగ్స్ ఇంగ్లండ్ ఆటగాడు సామ్ కర్రన్ను ఈ రికార్డు ధరకు కొనుగోలు చేసింది. -
మిచెల్ స్టార్క్ సరి కొత్త చరిత్ర.. ఐపీఎల్లో అత్యధిక ధర! రూ. 24.75 కోట్లకు
ఐపీఎల్-2024 వేలంలో సంచలనాలు నమోదవుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచిల్ స్టార్క్ రికార్డులకెక్కాడు. స్టార్క్ను రూ.24.70 కోట్లకు కోల్కతా నైట్రైడర్స్ కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్తో వేలంలోకి వచ్చిన అతడి కోసం గుజరాత్ టైటాన్స్, కేకేఆర్ తీవ్రంగా పోటీ పడ్డాయి. ఆఖరికి గుజరాత్ టైటాన్స్ టైటాన్స్ వెనక్కి తగ్గడంతో కేకేఆర్ సొంతం చేసుకుంది. కాగా ఇదే వేలంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ను రూ.20.50 కోట్ల రికార్డు ధరకు సన్రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు స్టార్క్ డీల్తో కమ్మిన్స్ రికార్డు బద్దలైంది. కాగా స్టార్క్ ఐపీఎల్లో చివరగా 2015 సీజన్లో ఆర్సీబీ తరపున ఆడాడు. ప్రస్తుతం వరల్డ్క్లాస్ పేసర్లలో స్టార్క్ ఒకడు. ఇటీవల భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్లోనూ స్టార్క్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. -
'స్మిత్ను ఎవరూ కొనరు.. అతడికి మాత్రం ఏకంగా రూ.20 కోట్లు'
ఐపీఎల్-2024 మినీ వేలానికి సర్వం సిద్దమైంది.ఈ క్యాష్రిచ్ లీగ్ వేలం దుబాయ్లోని కోకాకోలా అరేనా వేదికగా మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ వేలంలో 77 స్ధానాలకు గానూ మొత్తంగా 330 ఆటగాళ్లు పాల్గోనున్నారు. ఇందులోనే ఇద్దరు అసోసియేట్ ప్లేయర్లు సహా 119 విదేశీ ఆటగాళ్లున్నారు. భారత్ నుంచి 214 ప్లేయర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక ఈ వేలంలో నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గం, ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్ టామ్ మూడీ కీలక వ్యాఖ్యలు చేశాడు. వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ను ఎవరూ కొనుగోలు చేయరని మూడీ జోస్యం చెప్పాడు. అయితే ఆసీస్ పేసర్ మిచిల్ స్టార్క్ మాత్రం భారీ ధరకు అమ్ముడుపోతాడని మూడీ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది వేలంలో స్టీవ్ స్మిత్ను ఏ ఫ్రాంఛైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపకపోవచ్చు. కానీ మిచిల్ స్టార్క్పై మాత్రం కాసుల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం అత్యధిక ధర కలిగి ఉన్న శామ్ కుర్రాన్(రూ.18.50) రికార్డును స్టార్క్ బ్రేక్ చేస్తాడు. స్టార్క్ దాదాపు రూ.20 కోట్లకు అమ్ముడుపోయిన ఆశ్చర్యపోన్కర్లేదని ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మూడీ పేర్కొన్నాడు. చదవండి: IPL 2024 Auction Updates: ఐపీఎల్ వేలానికి సర్వం సిద్దం.. జాక్పాట్ ఎవరికో? -
IPL 2024: స్టార్క్, కమిన్స్లకు భారీ ధర.. శార్దూల్ ఠాకూర్కు జాక్పాట్..!
ఐపీఎల్ 2024 వేలం రేపు (డిసెంబర్ 19) దుబాయ్లోని కోకాకోలా ఎరీనాలో జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ వేలం రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుంది. ఈ వేలానికి ముందు ఇవాళ (డిసెంబర్ 18) అదే వేదికపై మాక్ ఆక్షన్ (డమ్మీ వేలం) జరిగింది. ఈ వేలంలో పలువురు స్టార్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కోసం ఆర్సీబీ చిన్న సైజ్ యుద్దమే చేసింది. ఆ జట్టు ప్రతినిధి మైక్ హెస్సన్ స్టార్క్ను 18.5 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నాడు. మాక్ వేలంలో ఇదే అత్యధిక ధర. స్టార్క్ తర్వాత సౌతాఫ్రికా యంగ్ గన్ గెరాల్డ్ కొయెట్జీ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. చివరికి కొయెట్జీని గుజరాత్ టైటాన్స్ 18 కోట్లకు దక్కించుకుంది. వీరిద్దరి తర్వాత ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. అంతిమంగా కమిన్స్ను 17.5 కోట్లకు సన్రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఈ మాక్ ఆక్షన్లో ఎవరూ ఊహించని ధరకు లార్డ్ శార్దూల్ ఠాకూర్ అమ్ముడుపోయాడు. శార్దూల్ను పంజాబ్ కింగ్స్ 14 కోట్లకు దక్కించుకుంది. లంక పేసర్ దిల్షన్ మధుషంక, లంక స్పిన్నర్ వనిందు హసరంగ, ఆసీస్ స్టార్ బ్యాటర్, వరల్డ్కప్ హీరో ట్రవిస్ హెడ్ల కోసం కూడా ఫ్రాంచైజీలు తెగ పోటీపడ్డాయి. మధుషంకను కేకేఆర్ (10.5 కోట్లు), హ్యారీ బ్రూక్ను గుజరాత్ టైటాన్స్ ( 9.5 కోట్లు), హసరంగను (8.5 కోట్లు), ట్రవిస్ హెడ్లను (7 కోట్లు) సీఎస్కే దక్కించుకున్నాయి. మిచెల్ స్టార్క్- 18.5 కోట్లు (ఆర్సీబీ) గెరాల్డ్ కొయెట్జీ-18 కోట్లు (గుజరాత్ టైటాన్స్) పాట్ కమిన్స్- 17.5 కోట్లు (సన్రైజర్స్ హైదరాబాద్) శార్దూల్ ఠాకూర్-14 కోట్లు (పంజాబ్ కింగ్స్) దిల్షన్ మధుషంక-10.5 కోట్లు (కేకేఆర్) హ్యారీ బ్రూక్- 9.5 కోట్లు (గుజరాత్ టైటాన్స్) వనిందు హసరంగ-8.5 కోట్లు (సీఎస్కే) ట్రవిస్ హెడ్- 7 కోట్లు (సీఎస్కే) కాగా, మాక్ వేలంలో లభించిన ధర డమ్మీ ధర అయినప్పటికీ.. పై పేర్కొన్న ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడటం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. రేపు జరుగబోయే అధికారిక వేలంలో ఈ ఆటగాళ్లపై కనక వర్షం కురువడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరితో పాటు వరల్డ్కప్ హీరో, న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర కోసం కూడా ఫ్రాంచైజీలు ఎగబడవచ్చు. ఐపీఎల్ 2024 వేలం తేదీ: డిసెంబర్ 19, 2023 సమయం: మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం (భారతకాలమానం ప్రకారం) వేదిక: దుబాయ్లోని కోకాకోలా ఎరీనా ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ (టీవీ) డిజిటల్: జియో సినిమా మొత్తం స్లాట్లు: 77 వేలంలో పాల్గొంటున్న మొత్తం ఆటగాళ్లు: 333 భారతీయ ఆటగాళ్లు: 214 విదేశీ ఆటగాళ్లు: 119 -
IPL 2024: వేలంలో వాళ్లిద్దరికి రూ. 14 కోట్లకు పైగానే! హెడ్కు తక్కువే!
ఐపీఎల్-2024 వేలానికి సమయం ఆసన్నమైన తరుణంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంగళవారం(డిసెంబరు 19)నాటి వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయే ఆటగాళ్లు వీరేనంటూ తన అంచనాలు తెలియజేశాడు. అయితే, ఈ వేలంలో హాట్కేక్గా మారతాడనుకున్న వన్డే వరల్డ్కప్-2023 హీరో ట్రవిస్ హెడ్ విషయంలో మాత్రం అశ్విన్ ట్విస్ట్ ఇవ్వడం విశేషం. అశ్విన్ అంచనా ప్రకారం.. దుబాయ్ వేదికగా జరుగునున్న క్యాష్ రిచ్ లీగ్ వేలంలో తమిళనాడు బ్యాటింగ్ ఆల్రౌండర్ షారుఖ్ ఖాన్ 10 -14 కోట్ల రూపాయలకు అమ్ముడుపోతాడు. న్యూజిలాండ్ ఆల్రౌండర్, ప్రపంచకప్-2023లో సెంచరీలతో విరుచుకుపడిన రచిన్ రవీంద్రకి రూ. 4- 7 కోట్ల మేర దక్కే అవకాశం ఉంది. ఇక టీమిండియా బౌలర్ హర్షల్ పటేల్, వెస్టిండీస్ బ్యాటర్ రోవ్మన్ పావెల్, సౌతాఫ్రికా బౌలర్ గెరాల్డ్ కోయెట్జీలు రూ. 7- 10 కోట్ల మేర ధర పలికే ఛాన్స్ ఉంది. మరోవైపు.. ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రవిస్ హెడ్ రేంజ్ మాత్రం రూ. 2- 4 కోట్ల మధ్యే ఉంటుందని అశ్విన్ అంచనా వేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ ఐపీఎల్-2024 వేలంలో రూ. 4- 7 కోట్లకు అమ్ముడుపోగలడని అశ్విన్ పేర్కొన్నాడు. అదేవిధంగా.. ఆస్ట్రేలియా స్టార్ పేసర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ మాత్రం రూ. 14 కోట్ల మార్కును దాటగలరని అశూ పేర్కొనడం విశేషం. సోషల్ మీడియా వేదికగా ఈ మేరకు తన అంచనాలు తెలియజేసిన అశ్విన్.. క్రికెట్ షాట్ల రూపంలో ఎవరు ఎంత ధర పలికే అవకాశం ఉందని తెలియజేయడం మరో విశేషం. డిఫెన్స్ షాట్(రూ. 2-4 కోట్ల మధ్య), డ్రైవ్(రూ. 4-7), పుల్షాట్(రూ. 7- 10 కోట్లు), స్లాగ్(రూ. 10-14 కోట్లు), హెలికాప్టర్ షాట్(14+ కోట్లకు పైగా) అంటూ అశ్విన్ వివిధ రేంజ్ల మధ్య ఉంటారనుకున్న ప్లేయర్ల పేర్లను ఇలా షాట్లతో పోల్చి వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన వీడియోపై లుక్కేయండి! View this post on Instagram A post shared by Ashwin (@rashwin99) -
IPL 2024 Auction: ఫ్రాంఛైజీల కళ్లన్నీ అతడిపైనే! హాట్కేకుల్లా ఆ ఇద్దరు!
IPL 2024 Auction: ఐపీఎల్–2024 సీజన్ కోసం ఆటగాళ్ల వేలానికి సర్వం సిద్ధమైంది. ఈనెల 19న దుబాయ్లో వేలం కార్యక్రమం జరుగుతుంది. మొత్తం 1166 మంది ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఫ్రాంచైజీలతో సంప్రదించాక ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ 333 మందితో సోమవారం తుది జాబితాను ప్రకటించింది. ఇందులో 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఫ్రాంచైజీల కళ్లన్నీ అతడిపైనే ఇక వన్డే వరల్డ్కప్లో ఆస్ట్రేలియాను విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించిన ట్రావిస్ హెడ్పై ఫ్రాంచైజీలన్నీ కన్నేశాయి. కమిన్స్, మిచెల్ స్టార్క్లు కూడా ఆసీస్ తరఫున హాట్ కేక్లు కానున్నారు. ప్రపంచకప్లో సెమీఫైనలిస్టుగా నిలిచిన న్యూజిలాండ్ తరఫున మెరిసిన రచిన్ రవీంద్రపై కూడా కోట్లు కురిసే అవకాశాలున్నాయి. 77 స్థానాలు.. కేకేఆర్కు అత్యధికంగా అదే విధంగా.. ఫ్రాంచైజీల విషయానికొస్తే మొత్తం 10 జట్లకు కావాల్సింది 77 మంది ఆటగాళ్లయితే ఇందులో 30 విదేశీ బెర్తులున్నాయి. ఇందుకోసం రూ. 262.95 కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఖాళీల పరంగా చూస్తే అత్యధికంగా కోల్కతా నైట్రైడర్స్ 12 మందిని కొనుక్కోవాల్సి ఉండగా... ఆ జట్టు చేతిలో రూ. 32.70 కోట్లు అందుబాటులో ఉన్నాయి. టైటాన్స్ వద్ద రూ.38.15 కోట్లు ఇక అత్యధిక మొత్తం రూ.38.15 కోట్లు గుజరాత్ వద్ద ఉంటే వారికి 8 మంది ఆటగాళ్లు కావాలి. కనిష్ట మొత్తం రూ. 13.15 కోట్లు లక్నో సూపర్ జెయింట్స్ ఖాతాలో ఉండగా... వారు ఆరు బెర్తుల్ని భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. బరిలో ఉన్న తెలుగు క్రికెటర్లు వీరే! మరోవైపు.. ధోని టీమ్ చెన్నై ఖాతాలో రూ. 31.40 కోట్లు, కోహ్లి జట్టు బెంగళూరు ఖాతాలో రూ. 23.25 కోట్లు అందుబాటులో ఉండగా ఇరుజట్లకు ఆరుగురు చొప్పున ఖాళీలున్నాయి. ఇక హైదరాబాద్ నుంచి అభిషేక్ మురుగన్, రాహుల్ బుద్ధి, రోహిత్ రాయుడు, అనికేత్ రెడ్డి, రవితేజ, తనయ్ త్యాగరాజన్, అరవెల్లి అవినాశ్రావు, రక్షణ్ రెడ్డి, మనీశ్ రెడ్డి... ఆంధ్ర నుంచి కోన శ్రీకర్ భరత్, రికీ భుయ్, హనుమ విహారి, పృథ్వీరాజ్ వేలంలో ఉన్నారు. జట్టు- ఖాళీల సంఖ్య - మిగిలిన మొత్తం ►చెన్నై- 6- రూ. 31.4 కోట్లు ►ఢిల్లీ- 9 - రూ. 28.95 కోట్లు ►గుజరాత్- 8- రూ. 38.15 కోట్లు ►కోల్కతా - 12- రూ. 32.7 కోట్లు ►లక్నో- 6 - రూ. 13.15 కోట్లు ►ముంబై - 8 - రూ. 17.75 కోట్లు ►పంజాబ్- 8- రూ. 29.1 కోట్లు ►బెంగళూరు- 6 - రూ. 23.25 కోట్లు ►రాజస్తాన్ - 8- రూ. 14.5 కోట్లు ►హైదరాబాద్- 6- రూ. 34 కోట్లు ►మొత్తం- 77- రూ. 262.95 కోట్లు -
ఆ్రస్టేలియా : స్వదేశంలో వరల్డ్ కప్ గెలుపు సంబరాలు (ఫొటోలు)
-
CWC 2023: కెప్టెన్గా ఇప్పటివరకు హిట్టే! బ్యాటర్గా ఫట్టు.. ఇలా అయితే ఎలా?
ICC WC 2023- Temba Bavuma Batting Failure: వన్డే వరల్డ్కప్-2023లో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన ఏడు ఇన్నింగ్స్లో కలిపి కేవలం 145 పరుగులు చేశాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్. తాజాగా కీలక సెమీ ఫైనల్లో డకౌట్ అయ్యాడు. దీంతో అతడిపై విమర్శల వర్షం కురుస్తోంది. కాగా భారత్ వేదికగా ప్రపంచకప్ టోర్నీలో ఆరంభం నుంచి అదరగొట్టింది సౌతాఫ్రికా. శ్రీలంకపై భారీ విజయంతో ఈవెంట్ను ఆరంభించిన సఫారీ జట్టు.. లీగ్ దశలో తొమ్మిదింట ఏడు విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లను చిత్తుగా ఓడించిన సఫారీలు భారీగా రన్రేటు మెరుగపరుచుకున్నారు. లీగ్ దశలో ఏడు విజయాలతో సెమీస్కు పాకిస్తాన్పై ఒక్క వికెట్ తేడాతో గట్టెక్కిన ప్రొటిస్ జట్టు.. అనూహ్యంగా నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత టీమిండియా చేతిలో ఏంకగా 243 పరుగుల తేడాతో మట్టికరిచింది. ఇక అఫ్గనిస్తాన్పై విజయంతో లీగ్ దశను ముగించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్కరమ్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్, కగిసో రబడ వంటి కీలక ప్లేయర్లు అత్యుత్తమంగా రాణించడంతో సౌతాఫ్రికా మరోసారి సెమీస్లో అడుగుపెట్టగలిగింది. కెప్టెన్గా ఇలా హిట్టయినప్పటికీ బ్యాటర్గా మాత్రం పేలవ ప్రదర్శన కనబరిచాడు తెంబా బవుమా. View this post on Instagram A post shared by ICC (@icc) ఆసీస్ పేసర్ల దెబ్బకు సఫారీల విలవిల ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ మ్యాచ్లో పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. దీంతో నెట్టింట అతడిపై ట్రోలింగ్ మొదలైంది. కాగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని భావించిన సఫారీలు తుదిజట్టులో అదనపు స్పిన్నర్ను చేర్చుకున్నారు. కేశవ్ మహరాజ్తో పాటు తబ్రేజ్ షంసీని ఆడించేందుకు సిద్ధమైంది మేనేజ్మెంట్. అయితే, పిచ్ పేసర్లకు అనుకూలిస్తుండటం ఆస్ట్రేలియాకు వరంగా మారింది. తొలి ఓవర్ ఆఖరి బంతికి బవుమాను పెవిలియన్కు పంపిన మిచెల్ స్టార్క్.. హిట్టర్ ఎయిడెన్ మార్కరమ్(10) వికెట్ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మరో పేసర్ జోష్ హాజిల్వుడ్ క్వింటన్ డికాక్(3), రాస్సీ వాన్ డర్ డస్సెన్(6) రూపంలో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. వర్షం కారణంగా 14వ ఓవర్ వద్ద ఆట నిలిపివేసే సమయానికి సౌతాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి కేవలం 44 పరుగులు మాత్రమే చేసింది. Temba Bavuma contribution for South Africa throughout the ODI world cup 2023 😂#SAvsAUS #Bavuma #Chokers #Proteas pic.twitter.com/HEXXvqJNtr — Ashutosh Srivastava 🇮🇳 (@sri_ashutosh08) November 16, 2023 Temba Bavuma gone for a duck in Semifinal 🔥 The man the myth the legend Brigadier Temba Bavuma 👏#SAvsAUS pic.twitter.com/uUhxYkbS67 — Radhika Chaudhary (@Radhika8057) November 16, 2023 -
న్యూజిలాండ్పై ఆసీస్ గెలుపు.. స్టార్క్ జైత్రయాత్రకు ముగింపు.. పలు రికార్డుల వివరాలు
ఆసీస్తో ఇవాళ (అక్టోబర్ 28) జరిగిన ఉత్కంఠ సమరంలో న్యూజిలాండ్ 5 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. 389 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో చివరి బంతి వరకు పోరాడిన కివీస్.. ప్రత్యర్ధికి ఓటమిని పరిచయం చేసి పరాజయంపాలైంది. రచిన్ రవీంద్ర (89 బంతుల్లో 116; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆఖర్లో జేమ్స్ నీషమ్ (39 బంతుల్లో 58; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరోచితంగా పోరాడి కివీస్ను గెలిపించినంత పని చేశారు. చివరి బంతికి ఆరు కావాల్సి ఉండగా.. స్టార్క్ కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేయడంతో కివీస్ కనీసం ఒక్క పరుగు కూడా రాబట్టలేక ఓటమిపాలైంది. ఆసీస్ గెలిచినా.. ఈ మ్యాచ్లో ఆసీస్ గెలిచినా, ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ మాత్రం చెత్త గణాంకాలను నమోదు చేయడంతో పాటు వరల్డ్కప్లో తన వికెట్ల జైత్రయాత్రకు ముగింపు పలికాడు. ఈ మ్యాచ్లో 9 ఓవర్లు వేసిన స్టార్క్ ఒక్క వికెట్ కూడా తీయకుండా 89 పరుగులు సమర్పించుకుని వరల్డ్కప్లో ఆసీస్ తరఫున అత్యంత ధారాళంగా పరుగులు సమర్పించుకున్న బౌలర్గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో స్టార్క్ మరో చెత్త రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్కప్లో గత 23 మ్యాచ్లుగా సాగుతున్న తన వికెట్ల జైత్రయాత్రకు (మ్యాచ్లో కనీసం ఓ వికెట్ తీయడం) ఈ మ్యాచ్తో ఎండ్ కార్డ్ పడింది. పై రికార్డులతో పాటు ఈ మ్యాచ్లో నమోదైన పలు రికార్డుల వివరాలు ఇలా ఉన్నాయి.. వరల్డ్కప్ మ్యాచ్ల్లో రెండో అత్యధిక సిక్సర్ల సంఖ్య (32) రికార్డు ఈ మ్యాచ్లో నమోదైంది. ఈ విభాగంలో 2019 వరల్డ్కప్ ఇంగ్లండ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ టాప్లో ఉంది. ఆ మ్యాచ్లో 33 సిక్సర్లు నమోదయ్యాయి. వరల్డ్కప్ మ్యాచ్ల్లో రెండో అత్యధిక బౌండరీల సంఖ్య (97) రికార్డు ఈ మ్యాచ్లో నమోదైంది. ఈ జాబితాలో టాప్లో ఇదే వరల్డ్కప్లో జరిగిన సౌతాఫ్రికా-శ్రీలంక మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్లో ఏకంగా 105 బౌండరీలు నమోదయ్యాయి. వన్డేల్లో ఛేదనలో నాలుగో అత్యధిక స్కోర్ (383/9) రికార్డును న్యూజిలాండ్ ఈ మ్యాచ్లో నమోదు చేసింది. ఈ విభాగంలో 2006 సౌతాఫ్రికా-ఆసీస్ మ్యాచ్ టాప్లో ఉంది. ఆ మ్యాచ్లో ఆసీస్ నిర్ధేశించిన 435 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా ఛేదించి సంచలనం సృష్టించింది. ఈ విభాగంలో 2009లో జరిగిన భారత్-శ్రీలంక మ్యాచ్ రెండో స్థానంలో నిలిచింది. నాటి మ్యాచ్లో భారత్ నిర్ధేశించిన 415 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ శ్రీలంక 411 పరుగులు చేసి 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఓటమిలో (వరల్డ్కప్లో) అత్యధిక స్కోర్ (383/9) చేసిన జట్టుగా న్యూజిలాండ్ రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్కు ముందు ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉండేది. ఇదే వరల్డ్కప్లో లంకేయులు 344/9 స్కోర్ చేయగా.. పాక్ విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. వరల్డ్కప్ మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా తరఫున ఆత్యధిక క్యాచ్లు (3) అందుకున్న నాన్ వికెట్కీపర్ స్టార్క్ రికార్డుల్లోకెక్కాడు. గతంలో అలెన్ బోర్డర్, రికీ పాంటింగ్, ఆరోన్ ఫించ్ (నాన్ వికెట్కీపర్స్) కూడా వరల్డ్కప్ మ్యాచ్ల్లో 3 క్యాచ్లు పట్టారు. వన్డేల్లో అత్యధిక పరుగులు నమోదైన విభాగంలో ఈ మ్యాచ్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు కలిపి 771 పరుగులు చేశాయి. ఈ విభాగంలో 2006 సౌతాఫ్రికా-ఆసీస్ మ్యాచ్ (872) టాప్లో ఉండగా.. 2009 భారత్-శ్రీలంక మ్యాచ్ (825) రెండో స్థానంలో నిలిచింది. ఇవే కాక ఈ మ్యాచ్లో పలు చిన్నా చితక రికార్డులు కూడా నమోదయ్యాయి. -
Aus Vs Pak: చెత్త బౌలింగ్.. అయినా వరల్డ్కప్లో అరుదైన ఘనత!
ICC ODI WC 2023: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్కప్ టోర్నీలో పాకిస్తాన్ లెజెండరీ పేస్ బౌలర్ వసీం అక్రం పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. కాగా వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఆసీస్ శుక్రవారం పాకిస్తాన్తో తలపడింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పాకిస్తాన్కు.. కంగారూ ఓపెనర్లు చుక్కలు చూపించారు. డేవిడ్ వార్నర్- మిచెల్ మార్ష్ కలిసి మొదటి వికెట్కు రికార్డు స్థాయిలో 259 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ఆసీస్ 367 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో పాక్ 305 పరుగులకే పరిమితం కావడంతో ఆస్ట్రేలియా 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం(18), మహ్మద్ రిజ్వాన్(46), ఇఫ్తికార్ అహ్మద్(26) రూపంలో కీలక వికెట్లు తీయడంతో పాటు మహ్మద్ నవాజ్(14) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. పాక్ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, స్టార్క్ మాత్రం ఈ మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 8 ఓవర్ల బౌలింగ్లో ఏకంగా 65 పరుగులు సమర్పించుకుని.. ఒక (హసన్ అలీ(8)) వికెట్ తీయగలిగాడు. అయినప్పటికీ ఓ అరుదైన రికార్డు సాధించాడు. వరల్డ్కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో వసీం అక్రంతో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. అదే విధంగా ఈ ఘనత సాధించిన రెండో ఆసీస్ బౌలర్గా చరిత్రకెక్కాడు. వరల్డ్కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ బౌలర్లు ►గ్లెన్ మెగ్రాత్(ఆస్ట్రేలియా)- 39 మ్యాచ్లలో 71 వికెట్లు ►ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక)- 40 మ్యాచ్లలో 68 వికెట్లు ►లసిత్ మలింగ(శ్రీలంక)- 29 మ్యాచ్లలో 56 వికెట్లు ►మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా)- 22 మ్యాచ్లలో 55 వికెట్లు ►వసీం అక్రం(పాకిస్తాన్)- 38 మ్యాచ్లలో 55 వికెట్లు. ►►వసీం అక్రం కంటే వేగంగా స్టార్క్ 55 వికెట్లు తీయడం గమనార్హం. చదవండి: WC 2023: అందుకే ఓడిపోయాం.. ప్రధాన కారణం అదే.. అతడి వల్లే.: బాబర్ ఆజం View this post on Instagram A post shared by ICC (@icc) -
మిచెల్ స్టార్క్ క్రీడా స్పూర్తి.. రనౌట్ చేసే అవకాశమున్నా! వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా లక్నో వేదికగా శ్రీలంకతో జరగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. బ్యాటర్ను మన్కడింగ్(రనౌట్) చేసే అవకాశం ఉన్నప్పటికీ స్టార్క్ కేవలం వార్నింగ్తో మాత్రమే సరిపెట్టాడు. ఏం జరిగిందంటే? శ్రీలంక ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో నాలుగో బంతిని స్టార్క్ వేయడానికి సిద్దమయ్యాడు. అయితే స్టార్క్ బంతి డెలివరీ చేయకముందే నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉన్న కుశాల్ పెరీరా క్రీజును వదిలి ముందుకు వెళ్లిపోయాడు. ఇది గమనించిన స్టార్క్ బంతిని విసరకుండా ఆగిపోయాడు. అలా అని మన్కడింగ్(రనౌట్) కూడా చేయలేదు. వెంటనే పెరీరా వైపు చూసి మరోసారి అలా చేయవద్దు అంటూ హెచ్చరించాడు. అదే విధంగా ఫీల్డ్ అంపైర్కు కూడా ఫిర్యాదు చేశాడు. కాగా క్రీడా స్పూర్తి ప్రదర్శించిన స్టార్క్పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా కొత్త నిబంధనల ప్రకారం మన్కడింగ్ను రనౌట్గా పరిగిణిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: WC 2023: వంద శాతం ఫిట్గా లేకున్నా సరే అతడిని తీసుకురండి.. లేదంటే: భారత మాజీ క్రికెటర్ pic.twitter.com/YR8XbloNxc — Ishan Martinez (@IshanMarti66419) October 16, 2023 -
మిచెల్ స్టార్క్ అరుదైన ఘనత.. వరల్డ్కప్ చరిత్రలోనే తొలి బౌలర్గా
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ వన్డే ప్రపంచకప్ టోర్నీలో 50 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా చెన్నై వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో ఇషాన్ కిషన్ను ఔట్ చేసిన స్టార్క్ ఈ మార్క్కు చేరుకున్నాడు. తద్వారా మరో అరుదైన ఘనతను స్టార్క్ తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్లో అతి తక్కువ బంతుల్లో 50 వికెట్లు పడగొట్టిన బౌలర్గా స్టార్క్ నిలిచాడు. స్టార్క్ కేవలం 941 బంతుల్లోనే 50 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక క్రికెట్ దిగ్గజం లసిత్ మలింగ పేరిట ఉండేది. మలింగ 1187 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. తాజా మ్యాచ్తో మలింగ రికార్డును స్టార్క్ బ్రేక్ చేశాడు. ఇక ఓవరాల్గా ఇప్పటివరకు 112 మ్యాచ్లు ఆడిన స్టార్క్ 221 వికెట్లు పడగొట్టాడు. చదవండి: #Ducks: ఆనందం కాసేపు కూడా లేదు! నువ్వేం కెప్టెన్? గోల్డెన్ డక్ బాయ్ నువ్వేమో -
స్టార్క్ హ్యాట్రిక్... ఆ్రస్టేలియా, నెదర్లాండ్ మ్యాచ్ రద్దు
తిరువనంతపురంలో జరిగిన ఆ్రస్టేలియా, నెదర్లాండ్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వానతో ఆట ఆలస్యం కావడంతో మ్యాచ్ను 23 ఓవర్లకు కుదించారు. ముందుగా ఆసీస్ 23 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (55) అర్ధ సెంచరీ సాధించగా...గ్రీన్ (34), క్యారీ (28), స్టార్క్ (24 నాటౌట్) రాణించారు. వాన్ డర్ మెర్వ్, డి లీడ్, వాన్ బీగ్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం నెదర్లాండ్స్ 14.2 ఓవర్లలో 6 వికెట్లకు 84 పరుగులు సాధించింది. మిచెల్ స్టార్క్ చెలరేగి ‘హ్యాట్రిక్’ సాధించాడు. అతను వరుసగా మూడు బంతుల్లో మ్యాక్స డౌడ్, వెస్లీ బరెసి, బాస్ డి లీడ్లను అవుట్ చేశాడు. అయితే మళ్లీ వాన రావడంతో అంపైర్లు ఇక ఆటను కొనసాగించకుండా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ్రస్టేలియా తర్వాతి వామప్ మ్యాచ్లో అక్టోబర్ 3న హైదరాబాద్లో పాకిస్తాన్తో తలపడుతుంది. -
టీమిండియాతో మూడో వన్డే.. ఆ ఇద్దరు స్టార్లు వచ్చేస్తున్నారు
టీమిండియాతో రేపు జరుగబోయే నామమాత్రపు మూడో వన్డేలో ఇద్దరు ఆసీస్ స్టార్లు రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. గాయాల కారణంగా తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న గ్లెన్ మ్యాక్స్వెల్, మిచెల్ స్టార్క్ మూడో వన్డే బరిలో నిలువనున్నట్లు సమాచారం. వీరిద్దరూ ఇవాళ (సెప్టెంబర్ 26) జరిగిన నెట్స్ సెషన్లో పాల్గొన్నారు. స్టార్క్, మ్యాక్సీ రాకతో తొలి వన్డేలో ఆడిన నాథన్ ఇల్లిస్, రెండో వన్డే ఆడిన స్పెన్సర్ జాన్సన్ జట్టుకు దూరంకానున్నారు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా రేపు జరుగబోయే చివరి మ్యాచ్లో భారత్-ఆస్ట్రేలియా జట్లు రాజ్కోట్ వేదికగా తలపడనున్నాయి. తొలి రెండు వన్డేలు గెలిచిన భారత్ ఇదివరకే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. దీంతో రేపు జరుగబోయే మ్యాచ్ ఇరు జట్లకు వరల్డ్కప్కు ముందు ప్రాక్టీస్గా పరిగణించడబడుతుంది. మరోవైపు రేపటి మ్యాచ్లో టీమిండియా స్టార్లు సైతం రంగంలోకి దిగనున్నారు. తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ రేపటి మ్యాచ్తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. అలాగే రెండో వన్డేకు దూరంగా ఉన్న బుమ్రా రేపటి మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. నామమాత్రపు మ్యాచ్ అయినా భారత్ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగాలని భావిస్తుంది. -
టీమిండియాతో తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బలు
మొహాలీ వేదికగా టీమిండియాతో రేపు (సెప్టెంబర్ 22) జరుగబోయే తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్వెల్ గాయాల కారణంగా తొలి వన్డేకు దూరం కానున్నారు. ఈ విషయాన్ని ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ కొద్దిసేపటి కిందట నిర్ధారించారు. గజ్జల్లో నొప్పి కారణంగా స్టార్క్.. చీలిమండ గాయం కారణంగా మ్యాక్సీ తొలి మ్యాచ్కు దూరంగా ఉంటారని స్టార్క్ తెలిపారు. మరోవైపు సౌతాఫ్రికాతో సిరీస్కు దూరంగా ఉన్న కెప్టెన్ పాట్ కమిన్స్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్లు భారత్తో తొలి వన్డేకు సిద్ధంగా ఉన్నారు. వీరిద్దరూ పూర్తి ఫిట్నెస్ట్ సాధించి, బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు. స్టార్క్, మ్యాక్స్వెల్ మినహా తొలి వన్డేలో ఆసీస్ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగనుంది. ఇదిలా ఉంటే, భారత్-ఆస్ట్రేలియాల మధ్య సెప్టెంబర్ 22, 24, 27 తేదీల్లో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో తొలి వన్డే మొహాలీలో, రెండో వన్డే ఇండోర్లో, మూడో వన్డే రాజ్కోట్లో జరుగనుంది. ఈ మూడు మ్యాచ్లు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ సిరీస్ అయిపోయిన వెంటనే వరల్డ్కప్ సన్నాహక మ్యాచ్లు మొదలవుతాయి. అక్టోబర్ 5 నుంచి వరల్డ్కప్ మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్-గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్తో 2023 వరల్డ్కప్ మొదలవుతుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. మెగా టోర్నీలో భారత్.. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. ఆతర్వాత అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్తాన్తో, అక్టోబర్ 14న పాకిస్తాన్లను ఢీకొంటుంది. చిరకాల ప్రత్యర్ధితో మ్యాచ్కు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. టీమిండియా: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, నాథన్ ఎల్లిస్, కెమెరూన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషేన్, మిచెల్ మార్ష్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్ , మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా -
IPL 2024: అప్పట్లో ఆర్సీబీకి.. 8 ఏళ్ల తర్వాత రీఎంట్రీ! కారణం తెలిస్తే..
Mitchell Starc Eyes IPL Return In 2024: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పునరాగమనం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. ఐపీఎల్-2024కు తప్పక అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడు. ఆర్సీబీకి ప్రాతినిథ్యం కాగా 2014 ఎడిషన్ సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున క్యాష్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చిన స్టార్క్.. తొలుత ఢిల్లీతో మ్యాచ్లో ఒక వికెట్ తీశాడు. మరుసటి ఏడాదిలోనే ఐపీఎల్ నుంచి వైదొలిగిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. మొత్తంగా ఈ టీ20 లీగ్లో 27 మ్యాచ్లలో కలిపి 34 వికెట్లతో రాణించాడు. ఎనిమిదేళ్ల తర్వాత ఐపీఎల్ రీఎంట్రీ కాగా, 2018లో కోల్కతా నైట్ రైడర్స్ అతడిని కొనుగోలు చేసినప్పటికీ గాయం కారణంగా ఆడలేకపోయాడు. ఆ తర్వాత అంతర్జాతీయ టెస్టు క్రికెట్కే తన ప్రాధాన్యం అంటూ ఐపీఎల్కు దూరమయ్యాడు. ఈ క్రమంలో సుమారు ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చేందుకు స్టార్క్ సిద్ధపడుతున్నాడు. అయితే, దీని వెనుక పెద్ద మాస్టర్ ప్లానే ఉంది మరి! టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాల్లో భాగంగా స్టార్క్ మళ్లీ క్యాష్ రిచ్ లీగ్లోకి అడుగుపెడుతున్నాడు. అతడే స్వయంగా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. అసలు విషయం అదీ! ‘‘ఇప్పటికి ఎనిమిదేళ్లు గడిచాయి. వచ్చే ఏడాది కచ్చితంగా తిరిగి వస్తా. టీ20 ప్రపంచకప్నకు ముందు ఇది నాకెంతగానో ఉపయోగపడుతుంది. ఐపీఎల్లో ఆడేందుకు ఆసక్తి చూపడానికి ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చు. ఐసీసీ టోర్నీకి ముందు ఇలాంటి అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు’’ అని మిచెల్ స్టార్క్ పేర్కొన్నాడు. డబ్ల్యూపీఎల్లో కెప్టెన్గా స్టార్క్ భార్య కాగా ఆస్ట్రేలియా తరఫున ఇప్పటి వరకు 82 టెస్టులు, 110 వన్డేలు, 58 టీ20లు ఆడిన స్టార్క్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 333, 219, 73 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. స్టార్క్ భార్య, ఆసీస్ వికెట్ కీపర్ భార్య అలిసా హేలీ వుమెన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఉన్న విషయం తెలిసిందే. మహిళా క్రికెట్ను అభివృద్ధి చేసే క్రమంలో బీసీసీఐ ప్రవేశపెట్టిన ఈ టీ20 లీగ్లో యూపీ వారియర్స్ జట్టుకు ఆమె కెప్టెన్గా ఎంపికైంది. రూ. 70 లక్షలతో యూపీ ఫ్రాంఛైజీ హేలీని కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే... ప్రపంచకప్-2023 టోర్నీకి ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో మిచెల్ స్టార్క్ స్థానం దక్కించుకున్నాడు. చదవండి: సిగ్గుపడు రోహిత్! నువ్వసలు కెప్టెన్వేనా?.. వాళ్లకు ఉన్నపాటి బుద్ధి నీకు లేదు! వరల్డ్కప్ తర్వాత ద్రవిడ్ బై.. బై! నాడు అతడు ‘బలిపశువు’.. కొత్త కోచ్గా అతడే? -
రూట్ను వదలని కమిన్స్.. స్టార్క్ దెబ్బకు పల్టీలు కొట్టిన వికెట్లు
యాషెస్ సిరీస్లో మూడో టెస్ట్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుంది. 251 పరుగుల లక్ష్య ఛేదనలో 27/0 ఓవర్నైట్ స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. లంచ్ విరామం సమయానికి 4 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసి, లక్ష్యానికి 98 పరుగుల దూరంలో ఉంది. హ్యారీ బ్రూక్ (40), బెన్ స్టోక్స్ (7) క్రీజ్లో ఉన్నారు. మిస్ఫైర్ అయిన మొయన్ అలీ ప్రయోగం.. ఛేదనలో మొయిన్ అలీని వన్డౌన్లో దింపి ఇంగ్లండ్ మేనేజ్మెంట్ చేసిన ప్రయోగం మిస్ఫైర్ అయ్యింది. అలీ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి, మిచెల్ స్టార్క్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. స్టార్క్.. అలీని ఔట్ చేసిన విధానం అభిమానులను ఆకట్టుకుంది. వికెట్లు గాల్లో పల్టీలు కొట్టిన వైనం ఆసీస్ ఫ్యాన్స్కు కనువిందు చేసింది. రూట్ను వదలని కమిన్స్.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ (21)ను పాట్ కమిన్స్ ఫోబియా వదిలిపెట్టడం లేదు.కమిన్స్ రూట్ను వరుసగా మూడో ఇన్నింగ్స్లో కూడా ఔట్ చేశాడు. రూట్.. ఒకే బౌలర్ చేతిలో వరుసగా మూడు ఇన్నింగ్స్ల్లో ఔట్ కావడం ఇది మూడోసారి. గతంలో అల్జరీ జోసఫ్, స్కాట్ బోలండ్.. రూట్ను వరుసగా మూడుసార్లు ఔట్ చేశారు. ఓవరాల్గా చూస్తే..రూట్ తన కెరీర్లో అత్యధిక సార్లు (11) కమిన్స్ బౌలింగ్లోనే ఔటయ్యాడు. కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 237 పరుగులకు చాపచుట్టేసింది. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 224 పరుగులకు టపా కట్టేసి ఇంగ్లండ్ 251 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో మిచెల్ మార్ష్ (118) సెంచరీ చేయగా.. మార్క్ వుడ్ 5 వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో బెన్ స్టోక్స్ (80) అర్ధసెంచరీతో రాణించగా.. పాట్ కమిన్స్ 6 వికెట్లతో ఇరగదీశాడు. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో ట్రావిస్ హెడ్ (77) టాప్ స్కోరర్గా నిలువగా.. బ్రాడ్, వోక్స్ తలో 3 వికెట్లు, మార్క్ వుడ్, మొయిన్ అలీ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. -
Ashes Series 2nd Test: టాప్-5లోకి చేరిన మిచెల్ స్టార్క్
స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా టాప్-5 బౌలర్ల జాబితాలో చేరాడు. యాషెస్ సిరీస్లో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లు పడగొట్టడం ద్వారా టెస్ట్ల్లో ఆసీస్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానానికి (79 టెస్ట్ల్లో 315 వికెట్లు) ఎగబాకాడు. ఈ క్రమంలో మాజీ స్పీడ్స్టర్ మిచెల్ జాన్సన్ను (73 టెస్ట్ల్లో 313 వికెట్లు) అధిగమించాడు. ఈ జాబితాలో దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ తొలి స్థానంలో (145 టెస్ట్ల్లో 708 వికెట్లు) ఉండగా.. గ్లెన్ మెక్గ్రాత్ (124 టెస్ట్ల్లో 563 వికెట్లు), నాథన్ లయోన్ (122 టెస్ట్ల్లో 496 వికెట్లు), డెన్నిస్ లిల్లీ (70 టెస్ట్ల్లో 355 వికెట్లు) వరుసగా 2,3,4 స్థానాల్లో నిలిచారు. ఇదిలా ఉంటే, ఆసీస్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. బెన్ డకెట్ (50), బెన్ స్టోక్స్ (29) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ గెలవాలంటే ఆఖరి రోజు 257 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆసీస్ గెలుపుకు 6 వికెట్లు అవసరమున్నాయి. స్కోర్ వివరాలు.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ (స్టీవ్ స్మిత్ 110, ట్రవిస్ హెడ్ 77, డేవిడ్ వార్నర్ 66; రాబిన్సన్ 3/100, టంగ్ 3/98) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 325 ఆలౌట్ (డకెట్ 98, బ్రూక్ 50; స్టార్క్ 3/88, హెడ్ 2/17) ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 279 ఆలౌట్ (ఖ్వాజా 77; బ్రాడ్ 4/65) ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్: 114/4 (డకెట్ 50 నాటౌట్; కమిన్స్ 2/20) (నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి) -
భార్య ఆట చూద్దామని వస్తే నిరాశే మిగిలింది
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే పురుషుల క్రికెట్లో తొలి టెస్టు ముగిసింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఇరుజట్లు లార్డ్స్ వేదికగా జూన్ 28 నుంచి రెండో టెస్టుకు సిద్దమవుతున్నాయి. తాజాగా గురువారం నాటింగ్హమ్ వేదికగా ఆస్ట్రేలియా వుమెన్స్, ఇంగ్లండ్ వుమెన్స్ మధ్య యాషెస్ ఏకైక టెస్టు ప్రారంభమైంది. మ్యాచ్లో ఆస్ట్రేలియా వుమెన్స్ తొలిరోజు ఆధిక్యం కనబరిచింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 85 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. అనాబెల్ సదర్లాండ్ 39 పరుగులు, అలానా కింగ్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఎలీస్ పెర్రీ 99 పరుగులు చేసి ఒక్క పరుగుతో సెంచరీ చేజార్చుకోగా.. తాహిలా మెక్గ్రాత్ 61 పరుగులు, అష్ష్లే గార్డనర్ 40 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎసెల్స్టోన్ మూడు వికెట్లు, లారెన్ ఫైలర్ రెండు వికెట్లు పడగొట్టింది. కాగా ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్, వుమెన్ క్రికెటర్ అలీసా హేలీలు భార్యభర్తలన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టుకు మిచెల్ స్టార్క్ బెంచ్కే పరిమితమయ్యాడు. అయితే రెండో టెస్టులో బరిలోకి దిగే అవకాశం ఉంది. మ్యాచ్కు ఐదురోజులు సమయం ఉండడంతో స్టార్క్ తన భార్య ఆట చూడడం కోసం స్టేడియం దగ్గర క్యూలైన్లో నిల్చొని వెళ్లడం ఆసక్తి కలిగించింది. భార్య ఆటను ఎంజాయ్ చేయాలని భావించిన మిచెల్ స్టార్క్కు నిరాశే మిగిలింది. మ్యాచ్లో అలీసా హేలీ డకౌట్గా వెనుదిరిగింది. ఆమె ఔటైన తర్వాత స్టార్క్ ఇచ్చిన రియాక్షన్ వైరల్గా మారింది. Mitchell Starc is here of course, waiting in an already crowded queue to get into Trent Bridge for the opening day of the #WAshes Test with Alyssa Healy captaining for the first time pic.twitter.com/wf6g7hUuut — Bharat Sundaresan (@beastieboy07) June 22, 2023 చదవండి: సస్పెన్షన్ వేటు.. బౌలర్కు షాకిచ్చిన ఐసీసీ ఐదు బంతుల్లో 5 సిక్సర్లు బాదిన ఆర్సీబీ స్టార్ -
Ashes Series: భార్య కోసం ఆసీస్ స్టార్ ఆటగాడు ఏం చేశాడో చూడండి..!
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తన భార్య అలైస్సా హీలీ ఆడుతున్న మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్టేడియం బయట సాధారణ వ్యక్తిలా క్యూ లో నిల్చున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. వివరాల్లోకి వెళితే.. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మహిళా జట్ల మధ్య ఇవాల్టి (జూన్ 22) నుంచి ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (ఏకైక టెస్ట్ మ్యాచ్) జరుగుతుంది. ఈ మ్యాచ్ ద్వారా స్టార్క్ భార్య అలైస్సా హీలీ ఆసీస్ టెస్ట్ కెప్టెన్గా అరంగేట్రం చేయనుంది. హీలీ కెరీర్లో చిరకాలం గుర్తిండిపోయే ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్టార్క్ ట్రెంట్బ్రిడ్జ్ స్టేడియం బయట టికెట్ కోసం క్యూలో నిల్చున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆసీస్ లంచ్ విరామం సమయానికి 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. బెత్ మూనీ (33), ఫోబ్ లిట్చ్ఫీల్డ్ (23) ఔట్ కాగా.. ఎల్లైస్ పెర్రీ (36 నాటౌట్), తహీలా మెక్గ్రాత్ (11 నాటౌట్) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో కేట్ క్రాస్, లారెన్ ఫైలర్కు తలో వికెట్ దక్కింది. మరోవైపు ఇంగ్లండ్ జట్టుతో 5 టెస్ట్ మ్యాచ్ల యాషెస్ సిరీస్ ఆడేందుకు మిచెల్ స్టార్క్ ఆసీస్ జట్టుతో పాటు ఇంగ్లండ్లో పర్యటిస్తున్నాడు. సమీకరణల కారణంగా స్టార్క్ తొలి టెస్ట్ ఆడలేకపోయాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆసీస్ 2 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది. లార్డ్స్ వేదికగా ఈ నెల 28 నుంచి జరిగే రెండో టెస్ట్లో స్టార్క్కు తుది జట్టులో ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తొలి టెస్ట్లో ఆశించినంత ప్రభావం చూపించని హాజిల్వుడ్ ప్లేస్లో స్టార్క్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. -
Ashes 2nd Test: అతడిని పక్కన పెట్టి స్టార్క్ను తీసుకు రండి: ఆసీస్ మాజీ కెప్టెన్
ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా అద్భుతమైన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లార్డ్స్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో కూడా అదే జోరును కొనసాగించాలని ఆసీస్ జట్టు భావిస్తోంది. అయితే తొలి టెస్టులో ఆసీస్ విజయం సాధించినప్పటికీ.. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ను బయట కూర్చోని పెట్టడం అందరనీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో రెండో టెస్టుకు మిచెల్ స్టార్క్ను తుది జట్టులోకి తీసుకురావాలని ఆసీస్ మాజీ కెప్టెన్ టీమ్ పైన్ సూచించాడు. స్కాట్ బోలాండ్కు విశ్రాంతినిచ్చి అతడి స్ధానంలో స్టార్క్కు అవకాశం ఇవ్వాలని పైన్ అభిప్రాయపడ్డాడు. "ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆడుతున్నప్పుడు తుది జట్టును ఎంపిక చేయడం చాలా కష్టం. మేము డబ్ల్యూటీసీ ఫైనల్తో కలపి వరుసగా ఆరు వారాల్లో ఆరు టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నాము. కాబట్టి ఆసీస్ ఫాస్ట్ బౌలర్లు రొటేట్ అవుతారనడంలో సందేహం లేదు. లార్డ్స్ టెస్టుకు బోలాండ్ను పక్కన పెట్టి స్టార్క్ను తీసుకురావాలి. అయితే బోలాండ్ కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. కానీ టెస్టుల్లో ఫాస్ట్ బౌలర్ల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. వారు బాగా అలిసిపోతారు. కాబట్టి వారికి తగినంత విశ్రాంతి అవసరం. ఈ క్రమంలో బెంచ్ బలాన్ని కూడా పరీక్షంచాలి. కానీ ఈ ఐదు టెస్టుల్లో కొనసాగే ఏకైక ఫాస్ట్ బౌలర్ మా కెప్టెన్ పాట్ కమిన్సే అని" వాట్లే సేన్ పోడ్కాస్ట్లో పైన్ పేర్కొన్నాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జూన్ 28 నుంచి ప్రారంభం కానుంది. చదవండి: క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సంజయ్ దత్.. -
WTC Final: అరుదైన క్లబ్లో మిచెల్ స్టార్క్.. నాలుగో బౌలర్గా..!
ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో ఆస్ట్రేలియా.. టీమిండియా ముందు భారీ లక్ష్యం ఉంచేలా ఉంది. 123/4 స్కోర్ వద్ద నాలుగో ఆటను ప్రారంభించిన ఆసీస్.. ఆదిలోనే లబూషేన్ (41) వికెట్ కోల్పోయినప్పటికీ 300 పరుగుల లీడ్ను సాధించింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో పుజారాకు క్యాచ్ ఇచ్చి లబూషేన్ ఔటయ్యాడు. కాగా, తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ఆటగాడు మహ్మద్ షమీని ఔట్ చేయడంతో ఆసీస్ స్పీడ్స్టర్ మిచెల్ స్టార్క్ ఓ అరుదైన క్లబ్లో చేరాడు. స్టార్క్ అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లు కలిపి) 600 వికెట్లు పడగొట్టిన 24వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఆసీస్ తరఫున షేన్ వార్న్ (999), మెక్గ్రాత్ (948), బ్రెట్ లీ (718) తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో దిగ్గజ స్పిన్నర్ మురళీథరన్ (1347) అగ్రస్థానంలో ఉండగా.. షేన్ వార్న్, జేమ్స్ ఆండర్సన్ (972), అనిల్ కుంబ్లే (956), మెక్గ్రాత్ టాప్=5లో ఉన్నారు. భారత బౌలర్లలో కుంబ్లే, హర్భజన్ (711), అశ్విన్ (697), కపిల్ దేవ్ (687), జహీర్ ఖాన్ (610) స్టార్క్ కంటే ముందున్నారు. స్కోర్ వివరాలు.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 469 ఆలౌట్ (హెడ్ 163, స్మిత్ 121, సిరాజ్ 4/108) భారత్ తొలి ఇన్నింగ్స్: 296 ఆలౌట్ (రహానే 89, ఠాకూర్ 51, కమిన్స్ 3/83) ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 138/5 (లబూషేన్ 41, జడేజా 2/25) ఆసీస్ 311 పరుగుల ఆధిక్యంలో ఉంది చదవండి: విధ్వంసం సృష్టించిన కర్రన్ బ్రదర్స్.. సిక్సర్ల సునామీ -
ఐపీఎల్లో వచ్చే డబ్బు కంటే ఆస్ట్రేలియాకు 100 టెస్ట్లు ఆడటమే ముఖ్యం..!
WTC Final: ఐపీఎల్లో ఆడకపోవడంపై ఆస్ట్రేలియా స్పీడ్స్టర్ మిచెల్ స్టార్క్ తొలిసారి స్పందించాడు. ఐపీఎల్ కంటే ఆస్ట్రేలియాకు ఆడటమే తనకు ముఖ్యమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ఐపీఎల్లో లభించే డబ్బు కంటే, దేశానికి 100 టెస్ట్లు ఆడటమే తనకు ఇష్టమని తెలిపాడు. ఇందుకోసమే తాను ఐపీఎల్ ఆడనని స్పష్టం చేశాడు. డబ్బంటే ప్రతి ఒక్కరికి ఇష్టమేనని, దేశానికి ఆడటానికే తన మొదటి ప్రాధాన్యత అని, ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలనుకుంటున్నానని అన్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక వెబ్సైట్తో స్టార్క్ మాట్లాడుతూ.. మూడు ఫార్మాట్లు ఆడుతూ తన జట్టుతో 10 సంవత్సరాల ప్రయాణం పూర్తి చేసుకున్నానని, ఓ ఫాస్ట్ బౌలర్కు ఇది అంత సులువు కాదని, ఇతర లీగ్లు ఆడకపోవడం వల్లనే ఇది సాధ్యపడిందని తెలిపాడు. ఆసీస్ తరఫున సత్తా చాటే మరో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ వచ్చిన రోజు తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటానని చెప్పుకొచ్చాడు. కాగా, 33 ఏళ్ల స్టార్క్ ఐపీఎల్లో కేవలం రెండు సీజన్లు మాత్రమే ఆడాడు. ఈ రెండు సీజన్లు అతను ఆర్సీబీకే ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లో 27 మ్యాచ్లు ఆడిన స్టార్క్ 34 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత సూపర్ ఫామ్లో ఉన్నా, ఏదో ఒక సాకు చెబుతూ ఐపీఎల్ను స్కిప్ చేస్తూ వచ్చాడు. ఆస్ట్రేలియా తరఫున 77 టెస్ట్లు,110 వన్డేలు, 5 టీ20లు ఆడిన స్టార్క్.. మొత్తంగా 598 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ గెలిచిన 2015 వన్డే వరల్డ్కప్, 2021 టీ20 వరల్డ్కప్ జట్లలో సభ్యుడిగా ఉన్న స్టార్క్.. రేపటి నుంచి ప్రారంభంకాబోయే డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ గెలిచి మూడు ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇదిలా ఉంటే, ఓవల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జూన్ 7 నుంచి 11 వరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. చదవండి: WTC Final: అతను సెంచరీ కొట్టాడా టీమిండియా గెలిచినట్లే..! -
WC 2023: వాళ్లిద్దరు చెలరేగితే ఈసారి ట్రోఫీ ఆసీస్దే: రిక్కీ పాంటింగ్
ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్-2023 నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ వేదికగా జరుగనున్న ఈ ఐసీసీ మెగా టోర్నీలో ఆసీస్కు ఇద్దరు బౌలర్లు కీలకంగా మారనున్నారని పేర్కొన్నాడు. వారిద్దరు అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే కంగారు జట్టు ఆరోసారి వన్డే వరల్డ్కప్ ట్రోఫీ గెలిచే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. కాగా 1987, 1999, 2003, 2007, 2015లో ఆస్ట్రేలియా జగజ్జేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన ఆసీస్ ఈసారి కూడా వన్డే ప్రపంచకప్-2023కు నేరుగా అర్హత సాధించింది. ఐసీసీ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో నిలిచింది. వాళ్లిద్దరు విజృంభిస్తే ఈ నేపథ్యంలో భారత్ వేదికగా అక్టోబరులో మొదలుకానున్న మెగా ఈవెంట్కు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో ఐసీసీ రివ్యూ షోలో మాట్లాడిన రిక్కీ పాంటింగ్.. పేసర్ మిచెల్ స్టార్క్, లెగ్ స్పిన్నర్ ఆడం జంపా విజృంభిస్తే ఈసారి ఆసీస్కు తిరుగు ఉండదని ధీమా వ్యక్తం చేశాడు. వీరిద్దరు చెలరేగితే టైటిల్ గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నాడు. ‘‘మిచెల్ స్టార్క్ .. ఆరడుగుల ఐదు అంగుళాల ఎత్తు.. లెఫ్టార్మర్.. గంటకు సుమారు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలడు. అతడు ఫామ్లో ఉంటే ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలే! పరిమిత ఓవర్ల క్రికెట్లో గణాంకాలు చూస్తే స్టార్క్ సత్తా ఏమిటో అర్థమవుతుంది. ట్రంప్ కార్డ్ అతడే ఇక ఆడం జంపా. స్టార్క్తో పాటు జంపా కూడా గత నాలుగైదేళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్లో కీలక బౌలర్గా ఎదుగుతున్నాడు. ఆసీస్ బౌలింగ్ విభాగానికి వెన్నెముకలా మారాడు. ఇటీవల టీమిండియాతో సిరీస్లో అతడు లేని లోటు కనిపించింది. లెగ్ స్పిన్నర్ జంపా రానున్న వరల్డ్కప్లో ఆస్ట్రేలియాకు ట్రంప్ కార్డ్గా మారనున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు’’ అని రిక్కీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. కాగా 2015 ప్రపంచకప్ టోర్నీలో స్టార్క్ 8 మ్యాచ్లలో 22 వికెట్లు పడగొట్టి ఆసీస్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. గత రెండు పర్యాయాల్లో ఆసీస్ తరఫున ఈ ఐసీసీ ఈవెంట్లో లీడ్ వికెట్ టేకర్గా ఉన్నాడు. ఇక జంపా.. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆసీస్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఇదిలా ఉంటే రిక్కీ పాంటింగ్ ప్రస్తుతం ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్గా బిజీబిజీగా ఉన్నాడు. చదవండి: CSK Vs LSG: చెత్త బౌలింగ్.. పేసర్లకు ధోని స్ట్రాంగ్ వార్నింగ్! ఇలాగే కొనసాగితే సన్రైజర్స్కు గుడ్న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేశాడు! ఇక తిరుగుండదు -
స్టార్క్ దెబ్బకు వణికిపోతున్న టీమిండియా.. మూడో వన్డేలోనైనా గెలుస్తారా..?
39/4, 49/5.. ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేల్లో 10 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్లు ఇవి. సొంతగడ్డపై కొదమసింహాల్లా రెచ్చిపోయే టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు ప్రస్తుత వన్డే సిరీస్లో ఆసీస్ స్పీడ్స్టర్ మిచెల్ స్టార్క్ పేస్ ధాటికి గజగజ వణికిపోతున్నారు. ఫలితంగా భారత్ పవర్ ప్లేల్లో చెత్త గణాంకాలు నమోదు చేసింది. తొలి వన్డేలో కేఎల్ రాహుల్ (75 నాటౌట్), రవీంద్ర జడేజా (45 నాటౌట్) పుణ్యమా అని గట్టెక్కిన భారత్.. రెండో వన్డేలో పూర్తిగా చేతులెత్తేసింది. నిప్పులు చెరిగే వేగం, కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్, ఇరువైపుల బంతిని అద్భుతంగా స్వింగ్ చేసిన స్టార్క్ రెండో వన్డేలో భారత టాపార్డర్ బ్యాటర్ల భరతం పట్టాడు. స్టార్క్ ధాటికి టీమిండియా 117 పరుగులకే కుప్పకూలింది. ఇక్కడ ఓ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రెండు వన్డేల్లో స్టార్క్ ఇద్దరు భారత బ్యాటర్లను ఒకేలా ఔట్ చేశాడు. శుభ్మన్ గిల్ను ఆఫ్ స్టంప్ అవతల టెంప్టింగ్ డెలివరీ వేసి బట్టలో వేసుకున్న స్టార్క్.. సూర్యకుమార్ యాదవ్ను రెండు మ్యాచ్ల్లో ఒకేలా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో (టెస్ట్ సిరీస్) ఏమంత ప్రభావం చూపించని స్టార్క్.. వన్డే సిరీస్ ప్రారంభంకాగానే జూలు విదిల్చిన సింహంలా గర్జిస్తున్నాడు. తొలి వన్డేలో 3, రెండో వన్డేలో 5 వికెట్లు పడగొట్టిన స్టార్క్ దెబ్బకు భారత ఆటగాళ్లు క్రీజ్లోకి రావాలంటేనే భయపడిపోతున్నారు. ముఖ్యంగా కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో స్టార్క్ సంధిస్తున్న స్వింగింగ్ యార్కర్లను ఎదుర్కోవాలంటే భారత బ్యాటర్లకు ప్యాంట్ తడిసిపోతుంది. ఇలాంటి బంతులకు నిస్సహాయులుగా వికెట్ సమర్పించుకోవడం తప్ప భారత బ్యాటర్లు ఏమీ చేయలేకపోతున్నారు. ఇదే పరిస్థితి చెన్నై వేదికగా జరిగే ఆఖరి వన్డేలోనూ కొనసాగితే, టీమిండియా సిరీస్ కోల్పోవాల్సి ఉంటుంది. స్టార్క్ విషయంలో భారత ఆటగాళ్ల మైండ్సెట్ మారకపోతే.. చెన్నై వన్డేలో టీమిండియాకు ఘోర పరాభవం తప్పకపోవచ్చు. ఆసీస్ స్పీడ్స్టర్ విషయంలో భారత బ్యాటర్లు, ముఖ్యంగా టాపార్డర్ ఆటగాళ్లు ప్రత్యేక ప్రణాళిక, ప్రాక్టీస్ లేకపోతే.. త్వరలో భారత్లోనే జరుగనున్న వన్డే వరల్డ్కప్లో స్టార్క్ రూపంలో టీమిండియాకు పెను ప్రమాదం పొంచి ఉన్నట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉపఖండపు పిచ్లపై మహామహులైన ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొన్న భారత బ్యాటర్లకు స్టార్క్ పెద్ద విషయమేమి కాకపోయినప్పటికీ, నిర్లక్ష్యం చేస్తే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇదిలా ఉంటే, ఆసీస్తో మూడో వన్డేలో ఎలాగైనా నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా ఆటగాళ్లు పట్టుదలగా ఉన్నారు. రెండో వన్డేలో జరిగిన పొరపాట్ల విషయంలో అంతర్మధనం చేసుకున్న భారత ఆటగాళ్లు, ఆ తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని భావిస్తున్నారు. బ్యాటింగ్ విషయంలో, ముఖ్యంగా టాపార్డర్ వైఫల్యం విషయంలో టీమిండియా భారీ కసరత్తే చేస్తుంది. చెన్నై పిచ్ బ్యాటింగ్కు సహకరించే అవకాశం ఉంది కాబట్టి, రెండో వన్డే ఆడిన జట్టునే భారత మేనేజ్మెంట్ యధాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. -
పాపం సూర్య! అందరూ తననే అంటున్నారు.. అతడి తప్పేం లేదు! అంతా..
India vs Australia, 2nd ODI- Suryakumar Yadav: ‘‘పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడు ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అని చెప్పవచ్చు. ఇలాంటి అత్యుత్తమ పేసర్ల బౌలింగ్లో అవుటైన బ్యాటర్ను మరీ అంతగా విమర్శించడం సరికాదు’’ అని టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ అన్నాడు. అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన బౌలర్లలో మిచెల్ స్టార్క్ది వేరే లెవల్ అంటూ ఆకాశానికెత్తాడు. టీమిండియాతో రెండో వన్డేలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. విశాఖపట్నం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో 8 ఓవర్ల బౌలింగ్లో 53 పరుగులిచ్చి 5 వికెట్లు కూల్చాడు. రోహిత్ శర్మ(13), శుబ్మన్ గిల్(0), సూర్యకుమార్ యాదవ్(0), కేఎల్ రాహుల్(9) వంటి కీలక బ్యాటర్ల వికెట్లు తీశాడు. ఆఖర్లో సిరాజ్(0) వికెట్ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసీస్ను గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. పాపం సూర్యకుమార్.. ఇదిలా ఉంటే.. టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ మొదటి వన్డేలో కూడా స్టార్క్ చేతికే చిక్కిన విషయం తెలిసిందే. రెండో మ్యాచ్లో కూడా మరోసారి స్టార్క్ బౌలింగ్లో గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. దీంతో అతడి ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కామెంటేటర్ దినేశ్ కార్తిక్ సూర్యకు అండగా నిలిచాడు. ‘‘పాపం సూర్యకుమార్ యాదవ్.. రెండుసార్లు మొదటిబంతికే వెనుదిరిగాడు. దీంతో చాలా మంది.. ‘‘వచ్చిన అవకాశాలను సూర్య సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు’’ అని ఘాటుగా విమర్శిస్తున్నారు. నిజానికి తన తప్పేమీ లేదు. మొదటి బంతికే అవుటవడం అంటే క్రీజులో కుదురుకునే అవకాశం కూడా రాలేదని అర్థం. అలాంటపుడు ఏ బ్యాటర్కైనా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. వాళ్ల స్టైలే వేరు! స్టార్క్ లాంటి అత్యుత్తమ బౌలర్లు తమ అద్భుత నైపుణ్యాలతో బ్యాటర్ను బోల్తా కొట్టించగలరు’’ అని డీకే క్రిక్బజ్ షోలో వ్యాఖ్యానించాడు. ఫాస్ట్ బౌలర్లలో స్టార్క్తో పాటు పాక్ పేసర్ షాహిన్ ఆఫ్రిది, కివీస్ స్టార్ ట్రెంట్బౌల్ట్ స్టైలే వేరని.. వారిని ఎదుర్కోవడం అంత సులువుకాదని పేర్కొన్నాడు. అలాంటి వారు పటిష్ట టీమిండియాతో ఆడే ఛాన్స్ వచ్చినపుడు మరింతగా రెచ్చిపోతారని దినేశ్ కార్తిక్ చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే మార్చి 22న చెన్నైలో జరుగనుంది. చదవండి: IND vs AUS: మా ఓటమికి ప్రధాన కారణమిదే.. అస్సలు ఊహించలేదు! వారిద్దరూ అద్భుతం Temba Bavuma: సెంచరీల మీద సెంచరీలు బాదుతూ జాత్యాహంకారుల నోళ్లు మూయించిన ధీరుడు