reliance
-
ప్రముఖ బ్రాండ్ ప్రచారకర్తలుగా మహేష్, సితార
దేశంలోని ప్రముఖ ఫ్యాషన్ రిటైల్ బ్రాండ్లలో ఒకటైన రిలయన్స్ ట్రెండ్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన కుమార్తె సితార ఘట్టమనేనిను బ్రాండ్ ప్రచారకర్తలుగా నియమించుకుంది. వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా తయారు చేసిన దుస్తులను వీరు ప్రమోట్ చేయనున్నారు. ‘న్యూ టైమ్స్, న్యూ ట్రెండ్స్’ పేరుతో బ్రాండ్ ప్రచారానికి వీరు ఎంతో తోడ్పడుతారని కంపెనీ తెలిపింది.ప్రమోషన్లో స్టార్లు అవసరమేనా..?సంస్థలు తమ ఉత్పత్తులను వినియోగదారుల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం సెలబ్రిటీల బ్రాండ్ ఎండార్స్మెంట్లు కంపెనీలకు కీలకంగా మారాయి. అయితే బ్రాండ్ ప్రమోషన్ కోసం సంస్థలు సెలబ్రిటీలను ఎందుకు ఎంచుకుంటున్నాయో తెలుసుకుందాం.నమ్మకం, విశ్వసనీయతను పెంపొందించడం: సెలబ్రిటీలను తరచుగా రోల్ మోడల్స్ లేదా ఇన్ఫ్లుయెన్సర్లుగా భావిస్తారు. కాబట్టి తాము ప్రచారం చేస్తున్న బ్రాండ్ పట్ల వినియోగదారులకు సానుకూలత రావడానికి, దాన్ని వినియోగించేందుకు అవకాశం ఉంటుంది. ఇది కంపెనీల సేల్స్ పెరిగేందుకు దోహదం చేస్తుంది.బ్రాండ్ విజిబిలిటీని పెంచడం: సెలబ్రిటీ ప్రమోషన్ల ద్వారా స్టార్ల ఫాలోయింగ్ను కంపెనీలు ఆసరాగా చేసుకుంటాయి. దాంతో బ్రాండ్ ఉత్పత్తుల విజిబిలిటీని పెంచాలని లక్ష్యంగా చేసుకుంటాయి. ముఖ్యంగా ఫ్యాషన్, స్పోర్ట్స్, టెక్నాలజీ వంటి రంగాల్లో ఇది ప్రభావం చూపుతుంది.ఎమోషనల్గా కనెక్ట్ చేయడం: అభిమానులు తరచుగా తమ ఫెవరెట్ స్టార్లతో పరోక్షంగా భావోద్వేగ బంధాన్ని కలిగి ఉంటారు. సెలబ్రిటీలు ఒక బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్నప్పుడు ఆయా ఉత్పత్తులపై వినియోగదారుల భావోద్వేగాలు తోడవుతాయి. దాంతో కంపెనీ సేల్స్ పెరిగే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: వస్తు ఎగుమతులను సేవలు అధిగమించాలిసవాళ్లు లేవా..సెలబ్రిటీల బ్రాండ్ ప్రమోషన్లలో కంపెనీలకు ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. స్టార్ల జీవన విధానం బ్రాండ్లపై ప్రభావం చూపుతుంది. కాంట్రాక్ట్ కుదుర్చుకున్న తర్వాత ఆ సెలబ్రిటీలు ఏదైనా వివాదాల్లో చిక్కుకుంటే కంపెనీ ఉత్పత్తులపై దాని ప్రభావంపడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది బ్రాండ్ ప్రతిష్ఠను దెబ్బతీయవచ్చు. అందువల్ల సెలబ్రిటీ ఎంపిక కీలకంగా మారుతుంది. -
రూ.10కే కోకాకోలా, పెప్సికో షుగర్ ఫ్రీ డ్రింక్స్
సాఫ్ట్డ్రింక్స్ మార్కెట్లో ప్రముఖ బ్రాండ్ల మధ్య పోటీ నెలకొంది. రిలయన్స్ కన్స్యూమర్ ఈ విభాగంలో ఇప్పటికే రూ.10కే కాంపా కోలా డ్రింక్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ తరుణంలో రిలయన్స్కు పోటీగా వినియోగదారులను నిలుపుకునేందుకు కోకాకోలా, పెప్సికో ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా రూ.10కే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్యాక్ల్లో నో షుగర్ వేరియంట్ డ్రింక్స్ను ప్రవేశపెడుతున్నాయి.కోకాకోలా కోక్ జీరో, స్ప్రైట్ జీరో, థమ్స్ అప్ ఎక్స్ ఫోర్స్ పేరుతో కొత్త వేరియంట్లను మార్కెట్లోకి తీసుకొస్తుంది. పెప్సికో తన పెప్సీ నో-షుగర్ వేరియంట్ను ప్రమోట్ చేస్తోంది. ఈ ఉత్పత్తులను రూ.10గా నిర్ణయించడం ద్వారా కోకాకోలా, పెప్సికో తన వినియోగదారులను నిలుపుకోవడంతోపాటు రిలయన్స్కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ఇదీ చదవండి: ఏకీకృత పెన్షన్ విధానంలో కొత్త నిబంధనలుభారత సాఫ్ట్డ్రింక్స్ మార్కెట్ విలువ 2023లో 19.7 బిలియన్ డాలర్లు కాగా, 2032 నాటికి 4.8 శాతం సీఏజీఆర్తో పెరిగి 30.1 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. కోకాకోలా ఇండియా, పెప్సికో ఇండియా, రిలయన్స్ కన్జూమర్, పార్లే ఆగ్రో, డాబర్ ఇండియా, ఐటీసీ లిమిటెడ్.. వంటి ప్రధాన సంస్థలు విభిన్న ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి. ఇందులో కార్బోనేటేడ్ పానీయాలు (కోలా, సోడాలు వంటివి), కార్బోనేటేడ్ కాని పానీయాలు (పండ్ల రసాలు), స్పోర్ట్స్, ఎనర్జీ డ్రింక్లున్నాయి. -
రష్యా క్రూడ్తో అమెరికాకు ఇంధనం
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏడాది కాలంలో 724 మిలియన్ యూరోల విలువైన రష్యా ముడి చమురును ఇంధనంగా మార్చి అమెరికాకు ఎగుమతి చేసింది. ‘‘2024 జనవరి నుంచి 2025 జనవరి మధ్యకాలంలో 2.8 బిలియన్ యూరోల శుద్ధి చేసిన ఇంధనాన్ని భారత్, టర్కిలోని ఆరు రిఫైనరీల నుంచి అమెరికా దిగుమతి చేసుకుంది. ఇందులో 1.3 బిలియన్ యూరోల విలువ చేసే ఇంధనం రష్యా చమురుతో తయారైనది’’అని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) ఒక నివేదికలో వెల్లడించింది.గుజరాత్లోని రిలయన్స్ జామ్నగర్ యూనిట్ల నుంచి అమెరికా రెండు బిలియన్ యూరోల పెట్రోల్, డీజిల్ను దిగుమతి చేసుకోగా.. ఇందులో 724 మిలియన్ యూరోల (రూ.6,733 కోట్లు సుమారు) విలువైన ఇంధనం రష్యా ముడి చమురు ఆధారితమేనని తెలిపింది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై దాడికి నిరసనగా రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించడం తెలిసిందే. దీంతో రష్యా నేరుగా ఎగుమతి చేయడానికి అవకాశం లేకుండా పోయింది. గుజరాత్లోని వాదినార్లో రష్యా రోజ్నెఫ్ట్కు చెందిన నయారా ఎనర్జీకి 20 మిలియన్ టన్నుల సామర్థ్యంతో రిఫైనరీ ఉంది. ఈ సంస్థ సైతం గతేడాది కాలంలో అమెరికాకు 184 మిలియన్ యూరోల ఇంధనాన్ని ఎగుమతి చేసినట్టు ఈ నివేదిక వెల్లడించింది. ఇందులోనూ 124 మిలియన్ యూరోల విలువ మేర రష్యా ముడి చమురు ఆధారితమేనని పేర్కొంది. ప్రభుత్వరంగ ఎంఆర్పీఎల్ సైతం అమెరికాకు 42 మిలియన్ యూరోల విలువైన ఇంధనాన్ని ఎగుమతి చేయగా, ఇందులో 22 మిలియన్ యూరోల మేర రష్యా ముడి చమురుతో చేసిందేనని ఈ నివేదిక తెలిపింది. -
మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్.. స్టార్లింక్తో జియో ఒప్పందం
శాటిలైట్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను భారతదేశంలో ప్రవేశపెట్టడానికి రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ (జేపీఎల్) ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ సహకారం డిజిటల్ అంతరాన్ని పూడ్చడంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మారుమూల, సరైన డిజిటల్ కనెక్టివిటిలేని ప్రాంతాల్లో కమ్యునికేషన్ సేవలను అందించేందుకు తోడ్పడుతుందని నమ్ముతున్నారు. ఇప్పటికే ఎయిర్టెల్ కూడా దేశంలోని తన వినియోగదారులకు స్టార్లింక్ సేవలు అందించేందుకు స్పేస్ఎక్స్తో ఒప్పందం చేసుకుంది.భారత్లో స్టార్లింక్ సేవలు ప్రారంభం కావాలంటే రెగ్యులేటరీ అనుమతులు అవసరమవుతాయి. అందుకోసం కంపెనీ ట్రాయ్ వద్ద అనుమతులకు అవసరమైన పత్రాలు దాఖలు చేసింది. దీనిపై తుని నిర్ణయం వెలువడకుముందే దేశీయ టెలికాం కంపెనీలు స్పేస్ఎక్స్తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం దేశంలోని అన్ని ప్రాంతాల్లోని కస్టమర్లకు మెరుగైన కనెక్టివిటీని అందించేందుకు చేస్తున్న కృషిని హైలైట్ చేస్తుంది. జియో ఫైబర్, జియోఎయిర్ ఫైబర్ వంటి ప్రస్తుత బ్రాడ్బ్యాండ్ సర్వీసులను స్టార్లింక్ భర్తీ చేయనుంది. సాంప్రదాయ ఫైబర్ నెట్వర్క్లు విస్తరించే అవకాశం ఉన్న ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించడం ఈ భాగస్వామ్యం లక్ష్యంగా పెట్టుకుంది.విస్తృతమైన రిటైల్ నెట్వర్క్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా స్టార్లింక్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని జియో యోచిస్తోంది. అందుకు అవసరమైన ఇన్స్టలేషన్, యాక్టివేషన్, సర్వీస్ అవసరాలకు అనుగుణంగా కస్టమర్ సపోర్ట్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తుంది. వినియోగదారులకు సరసమైన, విశ్వసనీయమైన బ్రాండ్బ్యాండ్ కనెక్టివిటీని అందించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు కంపెనీ పేర్కొంది. రిలయన్స్ జియో గ్రూప్ సీఈఓ మాథ్యూ వోమెన్ ఈ భాగస్వామ్యంపై స్పందిస్తూ..‘జియో బ్రాండ్బ్యాండ్ ఎకోసిస్టమ్లో స్టార్లింక్ను అనుసంధానించడం ద్వారా కనెక్టివిటినీ విస్తరిస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యుగంలో హై-స్పీడ్ బ్రాండ్బ్యాండ్ అవకాశాలను పెంచుతున్నాం’ అన్నారు. స్పేస్ఎక్స్ ప్రెసిడెంట్, సీఓఓ గ్విన్ షాట్వెల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ భారతదేశ డిజిటల్ కనెక్టివిటీని విస్తరించడానికి జియోతో కలిసి పనిచేయడం పట్ల ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: ఎస్బీఐ యూపీఐ సేవల్లో అంతరాయంషరతులకు అంగీకారందేశంలో శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలకు సంబంధించిన షరతులను స్టార్లింక్ అధికారికంగా ఇప్పటికే అంగీకరించింది. ఈ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన లైసెన్స్ పొందడానికి భారత ప్రభుత్వం విధించిన నియమాలకు కట్టుబడి ఉంటానని తెలిపింది. స్టార్లింక్ భారత్లో ప్రవేశించేందుకు ఇది కీలక పరిణామమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దేశంలోని మారుమూల ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాలని స్టార్లింక్ ఎప్పటినుంచో యోచిస్తోంది.యూజర్ డేటాను దేశంలోనే నిల్వ చేసేలా..ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం కంపెనీ మొత్తం యూజర్ డేటాను దేశంలోనే నిల్వ చేయాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో ఈ సమాచారాన్ని నిర్ధారించుకోవాలి. దీనికి స్టార్లింగ్ అంగీకరించింది. అయితే ఇటీవల టెలికమ్యూనికేషన్స్ విభాగానికి (DoT) రాసిన లేఖలో స్టార్లింక్ కొన్ని షరతులను సడలించాలని అభ్యర్థించింది. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత కాలక్రమేణా వాటిని పాటించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం కీలకం కానుంది. -
భారత్-పాక్ మ్యాచ్.. విజేతగా ముఖేష్ అంబానీ!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఇటీవల భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో విరాట్ కోహ్లీ తన సత్తా చాటారు. దాంతోపాటు ఈ మ్యాచ్ ప్రారంభం కాకముందే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ రికార్డు సృష్టించారు. అదెలా అనుకుంటున్నారా.. రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన జియోహాట్స్టార్ భారత్-పాక్ మ్యాచ్ను ప్రసారం చేసే ప్రత్యేక హక్కులను కలిగి ఉంది. దాంతో కొన్ని గంటలపాటు సుమారు 12 కోట్ల మందికిపైగా ఈ మ్యాచ్ను వీక్షించారు. కంపెనీకి ఇతర ప్రసార హక్కులు, యాడ్ రెవెన్యూ ద్వారా బారీగానే ఆదాయం సమకూరినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో భారత్-పాక్ మ్యాచ్లో భారత్ విజయం సాధించడంతోపాటు దీన్ని అందరూ వీక్షించేందుకు ప్రసార హక్కులు సాధించిన ముఖేశ్ అంబానీ కూడా విజేతగానే నిలిచినట్లు భావిస్తున్నారు.రిలయన్స్ ఇటీవలే అధికారికంగా హాట్స్టార్తో కలిసి జియోహాట్స్టార్ను ఆవిష్కరించింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరు కంపెనీలకు ఎంతో లాభదాయకమని రెండు సంస్థలు గతంలో తెలిపాయి. ఇటీవల జరిగిన ఒక్కమ్యాచ్లోనే భారీగా రెవెన్యూ సంపాదించినట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రసవత్తరంగా ఉంటుందని ముందే గ్రహించిన కోట్లాదిమంది వ్యూయర్స్ జియోహాట్స్టార్లో ఈ మ్యాచ్ను లైవ్లో వీక్షించారు. ఇది ప్లాట్ఫామ్ వ్యూయర్షిప్ను పెంచడమే కాకుండా ప్రకటనలు, సబ్స్క్రిప్షన్లను, సంస్థ ఆదాయాన్ని కూడా పెంచింది. అంతేకాకుండా, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలోని మరో ఛానెల్ స్పోర్ట్స్ 18 ఈ మ్యాచ్ను టెలివిజన్లో ప్రసారం చేసే హక్కులను కలిగి ఉంది. దీంతో అంబానీ కంపెనీ ఆన్లైన్, టీవీ వ్యూయర్షిప్ రెండింటి నుంచి లాభపడింది.ఇటీవల భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో విరాట్ కోహ్లీ తన సత్తా చాటారు. 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాలో కోహ్లీ సెంచరీ (111 బంతుల్లో 100) చేశారు. మరో 7.3 ఓవర్లు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో భారత్ మ్యాచ్ను కైవసం చేసుకుంది. ఈ విజయం సెమీఫైనల్లో భారత్ స్థానాన్ని సుస్థిరం చేయడమే కాకుండా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత వన్డేల్లో పాకిస్థాన్పై రికార్డు నెలకొల్పింది.ఇదీ చదవండి: గాల్లో ఎగిరే కారు వచ్చేసింది..! ధర ఎంతంటే..జియోహాట్స్టార్ ప్లాన్లు ఇలా..రూ.195 డేటా ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 15GB డేటాను అందిస్తుంది. క్రీడలు, వినోద ప్రియులకు ఇది తగిన ఎంపికగా ఉంటుంది. ఇతర ప్రామాణిక రీఛార్జ్ ప్లాన్ల మాదిరిగా ఈ ఆఫర్లో వాయిస్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. గుర్తించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో లభించే జియోహాట్స్టార్ సబ్స్క్రిప్షన్ 90 రోజుల మొబైల్ ప్లాన్ మాత్రమే. అంటే యూజర్లు జియోహాట్స్టార్ను మొబైల్లో మాత్రమే వీక్షించగలరు.రీచార్జ్ ఇలా..వినియోగదారులు ఈ ఆఫర్ను మైజియో (MyJio) యాప్, జియో వెబ్సైట్ లేదా అధీకృత జియో రిటైలర్ల ద్వారా పొందవచ్చు. రీఛార్జ్ ప్రక్రియ ఇతర జియో ప్రీపెయిడ్ ప్లాన్ల మాదిరిగానే ఉంటుంది. థర్డ్-పార్టీ రీఛార్జ్ ప్లాట్ఫామ్ల ద్వారా కూడా ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.మరో ప్లాన్రూ.195 డేటా ప్లాన్తోపాటు జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా వచ్చే మరో స్టాండర్డ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. అదే రూ.949 ప్లాన్. దీనికి 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. 2GB రోజువారీ డేటా, అపరిమిత 5G డేటా, 84 రోజుల పాటు జియో హాట్స్టార్ ఉచిత మొబైల్ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలను ఈ ప్లాన్ అందిస్తుంది. -
ఐదేళ్లలో రిలయన్స్ రూ.50,000 కోట్ల పెట్టుబడులు
అస్సాం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) వచ్చే ఐదేళ్లలో రూ.50,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. ‘అడ్వాంటేజ్ అస్సాం 2.0 ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్’ సందర్భంగా ఆర్ఐఎల్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఈమేరకు ప్రకటన చేశారు. టెక్నాలజీ, మౌలిక సదుపాయాలు, రిటైల్ విస్తరణ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కంపెనీ ప్రతిష్టాత్మక ప్రణాళికలను వివరించారు. 2018లో జరిగిన సదస్సులో రాష్ట్రంలో రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ హామీ ఇచ్చిందని, కానీ దానిని రూ.12,000 కోట్లకు పెంచామని అంబానీ గుర్తు చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం సహా వివిధ రంగాలకు ప్రయోజనం చేకూర్చేలా ఏఐను ఉపయోగించుకోవాలని ఈ సమ్మిట్ లక్ష్యంగా పెట్టుకుంది.కీలక పెట్టుబడి రంగాలుఏఐ డేటా సెంటర్: అస్సాంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-రెడీ డేటా సెంటర్ను ఏర్పాటు చేయాలని ఆర్ఐఎల్ యోచిస్తోంది. కృత్రిమ మేధ సహాయంతో ఉపాధ్యాయులు, వైద్యులు, రైతులు అస్సాం నివాసితుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని కంపెనీ ఆశిస్తున్నట్లు అంబానీ తెలిపారు.మెగా ఫుడ్ పార్క్: అస్సాంలో సమృద్ధిగా ఉన్న వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు విలువను జోడించడానికి మెగా ఫుడ్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ చర్య రాష్ట్ర రైతులకు మద్దతు ఇస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్, పంపిణీకి కొత్త అవకాశాలను సృష్టించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను మెరుగవుతుంది.రిలయన్స్ రిటైల్ విస్తరణ: అస్సాంలో రిలయన్స్ రిటైల్ స్టోర్ల సంఖ్యను రెట్టింపు చేయాలని ఆర్ఐఎల్ యోచిస్తోంది. ఈ సంఖ్యను 400 నుంచి 800కు పెంచనుంది. ఈ విస్తరణ రిటైల్ ల్యాండ్ స్కేప్ను మెరుగుపరుస్తుంది. వినియోగదారులకు విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు ఇది తోడ్పడుతుంది.క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ: అణు ఇంధనంతో సహా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి అస్సాంను హబ్గా మార్చడంపై కూడా రిలయన్స్ దృష్టి సారించనుంది. అస్సాంలో రెండు కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్లను ఆర్ఐఎల్ నిర్మించనుంది. ఇవి ఏటా 8 లక్షల టన్నుల క్లీన్ బయోగ్యాస్ను ఉత్పత్తి చేస్తాయి. ప్రతిరోజూ రెండు లక్షల ప్యాసింజర్ వాహనాలకు ఇంధనం అందించేందుకు సరిపోతుంది.హై-ఎండ్ హాస్పిటాలిటీ: హై ఎండ్ హాస్పిటాలిటీ రంగాన్ని ప్రోత్సహించడానికి ఆర్ఐఎల్ అస్సాం నడిబొడ్డున విలాసవంతమైన సెవెన్ స్టార్ ఒబెరాయ్ హోటట్ను నిర్మించనుంది. పర్యాటకులను ఆకర్షించడం, రాష్ట్ర ఆతిథ్య ప్రమాణాలను పెంచడం ఈ అభివృద్ధి లక్ష్యం.ఇదీ చదవండి: లకారానికి దగ్గర్లో గోల్డ్రేటు.. ఈ దేశాల్లో చీప్గా కొనుగోలుఈ కార్యక్రమాలు అసోంలోని యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని అంబానీ తెలిపారు. రిలయన్స్ ఫౌండేషన్ తన ‘స్వదేశ్’ స్టోర్ల ద్వారా గ్రీన్ గోల్డ్(వెదురు)ను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ అస్సాంతోపాటు ఈశాన్య రాష్ట్రాలను భారతదేశ అభివృద్ధిలో ప్రధానంగా నిలిపారని అంబానీ కొనియాడారు. -
యూఏఈలోకి రిలయన్స్ ప్రొడక్ట్స్ ఎంట్రీ.. కాంపా లాంచ్
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందిన ఎఫ్ఎంసీజీ విభాగం అయిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) యూఏఈలో (UAE) అడుగు పెట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్ అండ్ బేవరేజ్ సోర్సింగ్ ఈవెంట్ అయిన గల్ఫుడ్ 30వ ఎడిషన్లో యూఏఈలో భారతీయ లెగసీ బ్రాండ్ కాంపాను అధికారికంగా ప్రారంభించింది.2022లో కాంపా కోలాను కొనుగోలు చేసి, 2023లో దేశంలో తిరిగి ప్రవేశపెట్టిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 1970, 80లలో భారతదేశంలో కల్ట్ హోదాను కలిగి ఉన్న ఈ హెరిటేజ్ బ్రాండ్ను విజయవంతంగా పునరుద్ధరించింది. యూఏఈలో ప్రముఖ ఆహార, పానీయాల కంపెనీలలో ఒకటైన అగ్థియా గ్రూప్తో కలిసి కాంపా కోలాను ఇక్కడి వారికి పరిచయం చేస్తోంది."50 సంవత్సరాల క్రితం స్థాపించిన హెరిటేజ్ ఇండియన్ బ్రాండ్ అయిన కాంపాతో యూఏఈ మార్కెట్లోకి ప్రవేశించడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము. ఇక్కడ దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెడుతున్నాం. ఈ ప్రాంతంలో వేగవంతమైన వృద్ధికి గొప్ప సామర్థ్యాన్ని చూస్తున్నాము. యూఏఈలో వినియోగదారులకు పానీయాల అనుభవాన్ని మార్చడానికి భాగస్వాములతో కలిసి ఇక్కడికి వస్తున్నందుకు సంతోషిస్తున్నాము" అని రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ సీఓఓ కేతన్ మోదీ పేర్కొన్నారు. -
ఐపీఎల్ స్పాన్సర్షిప్ డీల్ దక్కించుకున్న రిలయన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 పానీయాల విభాగంలో స్పాన్సర్షిప్ డీల్ను ముఖేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ (RCPL) దక్కించుకుంది. అందుకోసం రిలయన్స్ దాదాపు రూ.200 కోట్లు వెచ్చించింది. గతేడాది ఈ స్పాన్సర్షిప్ హక్కులను కోకాకోలా సొంతం చేసుకుంది. పానీయాల విభాగంలో ఈ డీల్ను దక్కించుకోవడంతో రిలయన్స్కు చెందిన కంపాకోలా విక్రయాలు పెరిగి, దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతుందని కంపెనీ భావిస్తుంది.వేసవిలో సేల్స్ పెంచుకోవాలని సాఫ్ట్డ్రింక్స్ కంపెనీలు ప్రమోషన్స్పై దృష్టి పెట్టాయి. సరిగ్గా ఐపీఎల్ అదే సమయంలో ప్రారంభం కానుండడంతో దీన్ని ఆసరాగా చేసుకుని మరింత ముందుకుసాగాలని భావిస్తున్నాయి. అందులో భాగంగానే రిలయన్స్ ఈ స్పాన్సర్షిప్ హక్కులను దక్కించుకున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కంపా కోలాతో పాటు ఆర్సీపీఎల్ తన స్పోర్ట్స్ డ్రింక్ స్పిన్నర్, రాస్కిక్ గ్లూకో ఎనర్జీని టీ20 లీగ్ సందర్భంగా ప్రచారం చేస్తోంది.ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓ వడ్డీరేటుపై త్వరలో నిర్ణయంశ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్తో కలిసి రూపొందించిన ‘స్పిన్నర్’ ప్రమోషన్స్ కోసం లక్నో సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ అనే ఐదు ఐపీఎల్ జట్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. రూ.10 ధర కలిగిన రాస్కిక్ గ్లూకో ఎనర్జీ కూడా ఈ టోర్నమెంట్లోనే అరంగేట్రం చేస్తోంది. ఐపీఎల్ 2025 కోసం టెలివిజన్, ఓటిటి ప్లాట్ఫామ్ల నుంచి మొత్తం ప్రకటనల ఆదాయం గత సంవత్సరం కంటే 8-10% పెరుగుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది సుమారు రూ.4,500 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నాయి. -
హార్వర్డ్ యూనివర్సిటీలో నీతా అంబానీ ప్రసంగం
భారతీయ వ్యాపారం, విధానాలు, సంస్కృతిపై హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో రిలయన్స్(Reliance) ఫౌండేషన్ గౌరవ ఛైర్పర్సన్ నీతా అంబానీ(Nita Ambani) కీలకోపన్యాసం చేయనున్నారు. 2025 ఫిబ్రవరి 15 నుంచి 16 వరకు జరిగే వార్షిక ఇండియా కాన్ఫరెన్స్లో ఆమె ప్రసంగిస్తారు. ఈ సదస్సుకు విధానకర్తలు, వ్యాపారవేత్తలు, మేధావులతో సహా 1,000 మందికి పైగా ప్రతినిధులు హాజరువుతున్నారు.ఈ కాన్ఫరెన్స్లో భాగంగా నీతా అంబానీ ప్రముఖ విద్యావేత్త, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ మాజీ డీన్ నితిన్ నోహ్రియాతో భారతదేశ కళలు, సంస్కృతి, ఆధునిక ప్రపంచంలో భారతదేశం పాత్ర వంటి అంశాలపై చర్చిస్తారు. ప్రపంచ వేదికలపై దేశం తరఫున వివిధ అంశాలపై మాట్లాడే ప్రభావవంతమైన వ్యక్తుల్లో నీతా అంబానీ ఒకరిగా నిలిచారు. కళలు, హస్తకళలు, క్రీడలు, విద్య, ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాల ద్వారా రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆమె ఎంతో సేవలందిస్తున్నారు.ఇదీ చదవండి: నెమ్మదించిన పారిశ్రామికోత్పత్తి వృద్ధివార్షిక ఇండియా కాన్ఫరెన్స్కు సంబంధించి ఈ సంవత్సరం థీమ్ ‘ఫ్రమ్ ఇండియా టు ది వరల్డ్’గా నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, శ్రేయస్సు కోసం భారతీయ ప్రయత్నాలు ఎలా ఉన్నాయో, దేశంలో అనుసరిస్తున్న విధానాలు, వాటి రూపకల్పన వంటి వాటిపై ఈ కాన్ఫరెన్స్లో చర్చ జరగనుంది. 22 సంవత్సరాలకు పైగా హార్వర్డ్ విద్యార్థులు వ్యాపారం, ఆర్థిక శాస్త్రం, విద్య, సంస్కృతి వంటి విభిన్న విభాగాలకు చెందిన నిపుణులు ఈ కాన్ఫరెన్స్లో మాట్లాడేందుకు ఆతిథ్యం ఇస్తున్నారు. -
మహా కుంభమేళాలో అంబానీ ఫ్యామిలీ (ఫోటోలు)
-
రిలయన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు
గుజరాత్లోని జామ్నగర్లో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ను నిర్మించనున్నట్లు రిలయన్స్(Reliance) ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani) ప్రకటించారు. భారతదేశంలో కృత్రిమ మేధ (AI), డిజిటల్ మౌలిక సదుపాయాలకు డిమాండ్ పెరుగుతుండడంతో రిలయన్స్ ఈ ప్రకటన చేయడం టెక్ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికా ఆధారిత టెక్ కంపెనీ ఎన్విడియా సహకారంతో అత్యాధునిక బ్లాక్వెల్ ఏఐ ప్రాసెసర్లతో నడిచే ఈ డేటా సెంటర్ మూడు గిగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.భారతదేశంలో కృత్రిమ మేధ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి అక్టోబర్ 2024లో రిలయన్స్, ఎన్విడియా మధ్య భాగస్వామ్యం కుదిరినట్లు ఇరు సంస్థలు గతంలోనే ప్రకటించాయి. గతంలో జరిగిన ఎన్విడియా ఏఐ సమ్మిట్(AI Summit) 2024 సందర్భంగా సంస్థ సీఈఓ జెన్సెన్ హువాంగ్ ఏఐ విభాగంలో ఇండియా సామర్థ్యాన్ని నొక్కి చెప్పారు. ‘భారతదేశం తన సొంత కృత్రిమ మేధను తయారు చేయడం పూర్తి అర్థవంతమైన చర్యగా భావిస్తున్నాం. స్థానికంగా డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం వల్ల డేటా భద్రత సవాళ్లు ఏర్పడవు’ అని హువాంగ్ అన్నారు. ఇండియాలో మెరుగైన డిజిటల్ కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు, స్వయం సమృద్ధి కలిగిన ఏఐ ఆవశ్యకతను ఎత్తిచూపుతూ ముఖేష్ అంబానీ ఈ చర్యలు చేపట్టడంతో టెక్ నిపుణుల దృష్టిని ఆకర్షించారు.ఇదీ చదవండి: ఉద్యోగులకు ఏఐ చేదోడుజామ్నగర్లో లార్జ్ ల్యాంగ్వేజీ మోడల్స్తో(ఎల్ఎల్ఎం) డేటా సెంటర్ను ఏర్పాటు చేయాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. స్టార్టప్లకు సహకారం, ఏఐ ప్రాజెక్టులు, ఎల్ఎల్ఎం అభివృద్ధికి రూ.10,000 కోట్లకు పైగా కేటాయించాలని రిలయన్స్ నిర్ణయించింది. డేటా సెంటర్ల అభివృద్ధికి ప్రభుత్వ మద్దతు కూడా లభిస్తుందని కంపెనీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు వేలాది హై-స్కిల్డ్ ఉద్యోగాలను సృష్టిస్తుందని, ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఇండియాను ముందువరుసలో ఉంచుతుందని నిపుణులు భావిస్తున్నారు. సుస్థిర ఇంధన వనరులకు పెద్దపీట వేసే రిలయన్స్ సోలార్, పవన, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులతో సహా పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా ఈ డేటా సెంటర్కు అవసరమైన ఎనర్జీని సరఫరా చేస్తారని కంపెనీ వర్గాలు తెలిపాయి. -
ప్రముఖ బ్రాండ్ను కొనుగోలు చేసిన రిలయన్స్
రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) ఎస్ఐఎల్ బ్రాండ్ను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఎస్ఐఎల్(SIL) వివిధ రకాల జామ్లు, ఊరగాయలు, ఇతర ఆహార ఉత్పత్తులను తయారు చేస్తోంది. రిలయన్స్ ఈ బ్రాండ్ను కొనుగోలు చేయడంతో ఇకపై ఎస్ఐఎల్ ఉత్పత్తులు ఆర్సీపీఎల్ ఆధ్వర్యంలో తయారు చేయనున్నారు.ఈ బ్రాండ్ కొనుగోలు కేవలం వ్యాపార లావాదేవీ మాత్రమే కాదని రిలయన్స్ తెలిపింది. ఐకానిక్ భారతీయ వారసత్వ బ్రాండ్లను పునరుద్ధరించడానికి, వాటిని విస్తరించడానికి ఆర్సీపీఎల్ వ్యూహాత్మక చర్యల్లో భాగమని పేర్కొంది. ఎస్ఐఎల్ను ప్రాచుర్యంలోకి తెచ్చిన ఉత్పత్తులను నిలుపుకుంటూ సమకాలీన అభిరుచులకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తామని ఆర్సీపీఎల్ తెలిపింది. ఎస్ఐఎల్ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా వినియోగదారులకు సులభంగా అందుబాటులో ఉండేలా రిలయన్స్ నెట్వర్క్ ఉపయోగపడనుంది.విస్తరణ దిశగా మరో కంపెనీ..కంపెనీలకు డిజిటల్ పరివర్తన సేవలు అందించే క్రెడెరా భారత్లో కార్యకలాపాలను విస్తరించడంపై మరింతగా దృష్టి పెడుతోంది. ప్రస్తుతం దేశీయంగా ఆరు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో 1,300 మంది సిబ్బంది ఉండగా అతి పెద్దదైన హైదరాబాద్ సెంటర్లో 1,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నట్లు క్రెడెరా ఇండియా సీఈవో గౌరవ్ మాథుర్ తెలిపారు. మరింత మంది మార్కెటింగ్, టెక్నికల్ నిపుణులను నియమించుకోనున్నట్లు చెప్పారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణనిచ్చేందుకు పలు కళాశాలలతో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు. క్రెడెరాకు అంతర్జాతీయంగా 3,000 మంది సిబ్బంది ఉన్నారు. -
రిలయన్స్ జ్యువెల్స్ డ్రీమ్ డైమండ్ సేల్
ప్రముఖ ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన రిలయన్స్ జ్యువెల్స్, వార్షిక ‘డ్రీమ్ డైమండ్ సేల్’ను మళ్లీ తీసుకొచ్చింది. ఈ సేల్ ఫిబ్రవరి 16 వరకు అందుబాటులో ఉంటుందని రిలయన్స్ జ్యువెల్స్ ఒక ప్రకటనలో తెలిపింది. స్టైల్కి, సందర్భానికి త గినట్టుగా డైమండ్ ఆభరణాలను తీసుకొచ్చినట్టు వెల్లడించింది.ఈ ప్రత్యేకమైన ఆఫర్ కస్టమర్లకు డైమండ్ విలువ మరియు మేకింగ్ ఛార్జీలపై 30శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. వివిధ వజ్రాభరణాలతో, ఈ సంవత్సరం డ్రీమ్ డైమండ్ సేల్ కొనుగోలుదారుల జీవితాల్లోని ప్రతీ సందర్బంలో విలువైన క్షణాలను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో స్టేట్మెంట్ బ్రైడల్ సెట్స్, ఉంగరాలు, చెవిపోగులు, బ్యాంగిల్స్ , గ్రాండ్ నెక్లెస్ల ఉంటాయని రిలయన్స్ జ్యువెల్స్ సీఈఓ సునీల్ నాయక్ తెలిపారు. దేశవ్యాప్తంగా 180+ స్వతంత్ర షోరూమ్లలో డైమండ్ కలెక్షన్ను దుకాణదారులు పొందవచ్చన్నారు. ఎప్పటికి మన అందాన్నీ ఇనుమడింప చేసే డైమండ్ నగలు మెరుపు పోకుండా షైనింగ్ ఉండాలంటే ఏం చేయాలి? ఇవిగో టిప్స్ మీకోసం!స్నానం చేసేటప్పుడు డైమండ్ ఆర్నమెంట్స్ను తీయాలి. మైల్డ్ సోప్, మైల్డ్ షాంపూ అయితే ఫరవాలేదు. కానీ గాఢత ఉన్న సబ్బులు, షాంపూలతో స్నానం చేస్తే వాటిలోని రసాయనాల దుష్ప్రభావం ఆభరణాల మీద పడుతుంది.రోజువారీ ధరించే చెవి దిద్దులు, ఉంగరాలు, లాకెట్, బ్రేస్లెట్లు ఎక్కువగా సొల్యూషన్ బారిన పడుతుంటాయి. వాతావరణంలో సొల్యూషన్ కారణంగా ఆభరణాల్లో అమర్చిన డైమండ్ మీద మురికి పేరుకుంటుంది. జిడ్డుగా కూడా మారుతుంది. దాంతో డైమండ్ మెరుపు తగ్గుతుంది. వేడి నీటిలో లిక్విడ్ సోప్ నాలుగు చుక్కలు కలిపి అందులో ఆభరణాన్ని పది నిమిషాల సేపు నానపెట్టి ఆ తర్వాత మెత్తటి బ్రష్తో సున్నితంగా రుద్దాలి. సబ్బు అవశేషాలు ఆభరణం మీద మిగలకుండా శుభ్రమైన నీటిలో ముంచి కడగాలి. నీటిలో నుంచి తీసి మెత్తని నూలు వస్త్రం మీద పెట్టి మెల్లగా అద్దినట్లు తుడవాలి. బేకింగ్ సోడా మంచి క్లీనింగ్ ఎలిమెంట్. కానీ తక్కువ క్వాలిటీ డైమండ్ ఆభరణాలను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా వాడకూడదు. పైన చెప్పుకున్నవి కట్ డైమండ్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అన్కట్ డైమండ్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆభరణం తయారీలో అన్కట్ డైమండ్ వెనుక సిల్వర్ ఫాయిల్ అమరుస్తారు. వెండి వస్తువులు గాలి తగిలితే నల్లబడినట్లే అన్కట్ డైమండ్ ఆర్నమెంట్స్ కూడా అంచులు నల్లబడతాయి. వాటిని గాలి దూరని బాక్సులో భద్రపరచాలి.ఇటీవల వేడుకల్లో ఎయిర్కూలర్లో పెర్ఫ్యూమ్ కలుపుతున్నారు. వాటి ప్రభావంతో కూడా అన్కట్ డైమండ్ ఆర్నమెంట్స్ నల్లబడే ప్రమాదముంది. అన్కట్ డైమండ్ ఆర్నమెంట్ మెరుపు విషయంలో ఇంట్లో ఏ ప్రయత్నమూ చేయకూడదు. అవి చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి ఆభరణాల తయారీ దారులతో పాలిష్ చేయించుకోవాలి.ఆభరణాలు పెట్టే ప్లాస్టిక్ బాక్సులకు ముఖమల్ క్లాత్ని గమ్తో అతికిస్తారు. డైమండ్ ఆర్నమెంట్స్ను బీరువాలో భద్రపరిచేటప్పుడు ఈ గమ్ బాక్సుల్లో పెట్టకూడదు. ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ బాక్సు నుంచి తీసి మెత్తని తెల్లని క్లాత్ మీద అమర్చి భద్రపరుచుకోవాలి. -
అచ్యుతాపురం సెజ్లో రిలయన్స్ సోలార్ పవర్ సెల్ ప్లాంట్!
సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం–రాంబిల్లి సెజ్లో రిలయన్స్ సోలార్ పవర్ అండ్ మాడ్యుల్స్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు రిలయన్స్ పవర్ అధినేత అనిల్ అంబానీ శనివారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం–రాంబిల్లి సెజ్ పరిధిలోని సీతంపాలెం గ్రామంలో స్థలం పరిశీలించారు. ఆయనకు జాయింట్ కలెక్టర్ ఎం. జాహ్నవి, ఏపీఐఐసీ జనరల్ మేనేజర్ హరిప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే, రెవెన్యూ అధికారులు స్వాగతం పలికారు. సెజ్లో ఏపీఐఐసీ భూములను పరిశీలించి తిరిగి విశాఖ ఎయిర్పోర్టుకు ఆయన బయలుదేరారు. అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటుకు అదానీ సంస్థ ముందుకురావడంతో దానికి పోటీగా పునరుత్పాదక విద్యుత్కు సంబంధించి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కొత్తగా రిలయన్స్ న్యూ ఎనర్జీస్ పేరుతో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసు్తన్నట్లు సమాచారం. అందులో భాగంగానే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం–రాంబిల్లి సెజ్ పరిధిలోని సీతంపాలెం గ్రామంలో రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ పేరుతో సోలార్ పవర్ సెల్ అండ్ మాడ్యుల్స్ తయారీ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు స్థలం పరిశీలించినట్లు తెలిసింది. అనిల్ అంబానీ పర్యటనపై అధికారికంగా ముందస్తు సమాచారం లేదని, ఆయన విశాఖ ఎయిర్పోర్టు నుంచి అచ్యుతాపురం–రాంబిల్లి సెజ్కు వస్తున్నారని తెలిసిన వెంటనే జాయింట్ కలెక్టర్ జాహ్నవి, ఏపీఐఐసీ అధికారులు వెళ్లారని సిబ్బంది చెబుతున్నారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడోజన్ పవర్ ప్లాంట్ ఏర్పాటు నేపథ్యంలో...అచ్యుతాపురం మండలంలోని పూడిమడక గ్రామ సమీపంలో సుమారు 1,600 ఎకరాల విస్తీర్ణంలో రూ.1.85 లక్షల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ప్రధాని మోదీ శంకుస్థాపన కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అనిల్ అంబానీ కూడా సోలార్ పవర్ సెల్ అండ్ మాడ్యుల్స్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. అందువల్లే ఆయన ఎటువంటి హడావుడి లేకుండా అచ్యుతాపురం సెజ్లో స్థలం పరిశీలించి వెళ్లినట్లు సమాచారం. -
బ్యాంకింగ్, రిలయన్స్ ర్యాలీ
ముంబై: బ్యాంకులు, రిలయన్స్ ఇండస్ట్రీస్(2%) షేర్ల ర్యాలీతో స్టాక్సూచీలు రెండు రోజుల నష్టాల నుంచి గట్టెక్కాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో సెన్సెక్స్ 234 పాయింట్లు పెరిగి 78,199 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 92 పాయింట్లు బలపడి 23,708 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ట్రేడింగ్ ప్రారంభంలో కాస్త అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. వెంటనే తేరుకొని రోజంతా పరిమిత శ్రేణిలో లాభాల్లో కదలాడాయి. సెన్సెక్స్ ఒక దశలో 488 పాయింట్లు ఎగసి 78,453 వద్ద, నిఫ్టీ 179 పాయింట్లు పెరిగి 23,795 వద్ద గరిష్టాన్ని తాకాయి. బ్యాంకింగ్ షేర్లతో పాటు ఇంధన, ఆయిల్అండ్గ్యాస్, ఇండ్రస్టియల్, కమోడిటీ, సర్విసెస్ షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఒకశాతం, స్మాల్ క్యాప్ సూచీ 2% రాణించాయి. ఇండోఫార్మ్ ఎక్విప్మెంట్ హిట్ఇండోఫార్మ్ ఎక్విప్మెంట్ షేరు బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.215)తో పోలిస్తే 20% ప్రీమియంతో రూ.258 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 33% ర్యాలీ రూ.287 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 27% లాభంతో రూ.273 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,310.37 కోట్లుగా నమోదైంది. -
ధీరూభాయ్ అంబానీని కొనియాడిన నీతా
రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ధీరూభాయ్ అంబానీ 92వ జయంతిని పురస్కరించుకుని, జామ్ నగర్ రిఫైనరీ ప్రారంభించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ధీరూభాయ్ అంబానీ కోడలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ(Nita Ambani) ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.ధీరూభాయ్(dhirubhai ambani) కలల భూమి జామ్ నగర్ అని నీతా అంబానీ అభివర్ణించారు. ఆయన ధైర్యసాహసాలు, అలుపెరగని సంకల్పం, ఆకాంక్షలు నిజం అయ్యాయని చెప్పారు. జామ్ నగర్ కేవలం ఒక ప్రదేశం మాత్రమే కాదని, రిలయన్స్ గ్రూప్నకు కేంద్ర బిందువు అని కంపెనీ సృజనాత్మకత, సర్వీస్ను ప్రతిబింబిస్తుందని ఆమె నొక్కి చెప్పారు. రిఫైనరీ స్థాపించినప్పటి నుంచి కంపెనీ ఎదిగిన తీరుకు జామ్ నగర్ ఉదాహరణ అని అన్నారు. సంస్థ వ్యవస్థాపకులు ధీరూభాయ్ అంబానీకి నివాళులు అర్పించడానికి ఈ కార్యక్రమంలో భాగమైన ఉద్యోగులు, వారి కుటుంబాలు, కీలక ఎగ్జిక్యూటివ్కు ధన్యవాదాలు తెలిపారు. రిలయన్స్ ఎదుగుదలకు, సంస్థ విజయానికి కారణమైన కోకిలాబెన్ అంబానీ(ధీరూభాయ్ అంబానీ భార్య)కు నీతా కృతఙ్ఞతలు తెలియజేశారు.ఇదీ చదవండి: జీఎస్టీ నిబంధనలు పాటించని 30 విభాగాలు గుర్తింపురిలయన్స్ జామ్ నగర్ రిఫైనరీ ప్రత్యేకతలు..గుజరాత్లోని జామ్ నగర్లోని రిలయన్స్(Reliance) రిఫైనరీ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత సంక్లిష్టమైన సింగిల్ సైట్ రిఫైనరీ.సామర్థ్యం: రోజుకు 1.4 మిలియన్ బ్యారెళ్ల ప్రాసెసింగ్ సామర్థ్యం (ఎంఎంబీపీడీ) కలిగి ఉంది.ఈ రిఫైనరీ 216 వివిధ గ్రేడ్ల ముడి చమురును ప్రాసెస్ చేయగలదు.ఇది ఫ్లూయిడైజ్డ్ కెటాలిటిక్ క్రాకర్ (ఎఫ్సీసీ), కోకర్, ఆల్కైలేషన్, పారాక్సిలీన్, పాలీప్రొపైలిన్, రిఫైనరీ ఆఫ్ గ్యాస్ క్రాకర్ (ఆర్ఓజీసీ), పెట్కోక్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లతో సహా మరిన్ని ప్రాసెసింగ్ యూనిట్లను కలిగి ఉంది.ఈ రిఫైనరీలో అధిక నాణ్యతగల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. -
‘జీ’కు సెబీ మళ్లీ షోకాజ్ నోటీసులు
న్యూఢిల్లీ: లిస్టింగ్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (ZEEL) వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర, ఆయన కుమారుడు పునీత్ గోయెంకాలతో పాటు కంపెనీపై విచారణ కొనసాగుతుందని సెబీ స్పష్టం చేసింది. వారికి కొత్తగా షోకాజ్ నోటీసు (ఎస్సీఎన్) జారీ చేయనున్నట్లు పేర్కొంది. గత నోటీసులో పొందుపర్చిన అంశాలన్నీ తాజా ఎస్సీఎన్లో కూడా ఉంటాయని తెలిపింది. కీలక వివరాల వెల్లడి నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణల కింద జీల్తో పాటు సంస్థ టాప్ మేనేజ్మెంట్పై సెబీ(SEBI) విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో 2022 జులైలో తొలుత షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీంతో జీల్, పునీత్ గోయెంకా వివాద సెటిల్మెంట్ కోసం సెబీకి దరఖాస్తు చేసుకున్నారు. కానీ సెబీ హోల్–టైమ్ సభ్యుల కమిటీ దాన్ని తిరస్కరించి, తదుపరి విచారణకు సిఫార్సు చేశారు. ఇదీ చదవండి: 10 నిమిషాల్లో అంబులెన్స్రిలయన్స్ నేవల్ పేరు మార్పున్యూఢిల్లీ: రిలయన్స్(Reliance) నేవల్ అండ్ ఇంజినీరింగ్ సంస్థ పేరు స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్గా మారింది. జనవరి 2 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని స్టాక్ ఎక్స్చేంజీలకు సంస్థ సమాచారమిచ్చింది. దివాలా పరిష్కార ప్రక్రియ కింద రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్ను స్వాన్ ఎనర్జీ దక్కించుకుంది. -
రిలయన్స్ ‘కేజీ’ చమురుకు ప్రీమియం ధర
కేజీ బేసిన్లో ఉత్పత్తి చేసే ముడిచమురుకు ప్రీమియం ధరను డిమాండ్ చేస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance) బిడ్లను ఆహ్వానించింది. దీనికి సంబంధించిన టెండర్ ప్రకారం బిడ్డర్లు అంతర్జాతీయ బెంచ్మార్క్కన్నా కనీసం 3.5 డాలర్లు (Barrel) అధికంగా కోట్ చేయాల్సి ఉంటుంది. 2025 జనవరి 24 నాటికి బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది.ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని గాడిమొగ నుంచి ఈ ఆయిల్ను రిలయన్స్ సరఫరా చేస్తుంది. ప్రధానంగా గ్యాస్ క్షేత్రమైన కేజీ–డీ6(KG Basin) బ్లాక్లో రిలయన్స్కు 66.67 శాతం, బీపీ ఎక్స్ప్లొరేషన్కు (ఆల్ఫా) 33.33 శాతం వాటాలు ఉన్నాయి. ఇందులో కొంత మొత్తం ముడి చమురు కూడా ఉత్పత్తి అవుతుంది. 2025 ఏప్రిల్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు ప్రతి నెలా ఉత్పత్తి చేసే 17,600 బ్యారెళ్ల ఆయిల్ విక్రయం కోసం తాజాగా బిడ్లను ఆహ్వానించారు. ప్రస్తుతం ప్రామాణికంగా తీసుకుంటున్న నైజీరియన్ బోనీ లైట్ గ్రేడ్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 73.5 డాలర్లుగా ఉంది. టెండరు ప్రకటన ప్రకారం దీనికి 1.5 డాలర్ల ప్రీమియంతో పాటు బ్యారెల్కు కనీసం 2 డాలర్లు అధికంగా బిడ్డర్లు కోట్ చేయాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ఆర్టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీల పొరపాట్లకు చెక్పెట్రోల్, డీజిల్పై రూ.5 వరకు తగ్గింపు: నయారాప్రైవేటు రంగ చమురు సంస్థ నయారా ఎనర్జీ పండుగల సందర్భంగా వాహన యజమానుల కోసం ఆఫర్ ప్రకటించింది. డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ల ద్వారా ఇంధనం నింపుకుంటే లీటర్ పెట్రోల్(Petrol), డీజిల్పై రూ.5 వరకు తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది. ‘సబ్ కీ జీత్ గ్యారంటీడ్ 2024’ పథకం కింద పట్టణ, గ్రామీణ ప్రాంత బంకుల్లోనూ పెట్రోల్, డీజిల్పై ఈ ఆఫర్ అమలవుతుందని పేర్కొంది. ‘కస్టమర్లు కేవలం డబ్బును ఆదా చేసుకోవడమే కాకుండా డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించాము’ అని నయారా ఎనర్జీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మాధుర్ తనేజా వెల్లడించారు. జనవరి 31 వరకు ఆఫర్ అమల్లో ఉంటుంది. -
చేతులు మారిన కంపెనీలు.. ఈ ఏడాది బిగ్ డీల్స్ ఇవే..
ఈ కేలండర్ ఏడాది(2024)లో మీడియా, సిమెంట్, ఎయిర్లైన్స్ తదితర రంగాలలో భారీ కొనుగోళ్లు, విలీనాలు జరిగాయి. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్– డిస్నీ ఇండియా (Reliance-Disney) డీల్తోపాటు.. ఎయిర్ ఇండియా (Air India Deal), విస్తారా విలీనం, అదార్ పూనావాలా– థర్మ ప్రొడక్షన్స్ డీల్, భారత్ సీరమ్స్ను సొంతం చేసుకున్న మ్యాన్కైండ్ ఫార్మా, అంబుజా సిమెంట్స్ చేతికి పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ తదితరాలు చేరాయి. వివరాలు ఇలా..భారీ మీడియా సంస్థగా డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన మీడియా సంస్థలు, గ్లోబల్ దిగ్గజం వాల్ట్ డిస్నీకి చెందిన దేశీ విభాగంతో రూ. 70,000 కోట్ల విలువైన విలీనానికి తెరతీశాయి. తద్వారా గ్లోబల్ మీడియా సంస్థ ఆవిర్భావానికి ఊపిరిపోశాయి. వెరసి 2024 నవంబర్ 14కల్లా భాగస్వామ్య కంపెనీ(జేవీ)ని ఏర్పాటు చేశాయి. దీనిలో రిలయన్స్ ఇండస్ట్రీస్కు 16.34 శాతం, వయాకామ్18కు 46.82 శాతం, డిస్నీకి 36.84 శాతం చొప్పున వాటాలు లభించాయి.టాటా గ్రూప్ ఎయిర్లైన్స్ 2022లో ప్రభుత్వం నుంచి ఎయిర్ ఇండియాను చేజిక్కించుకున్న టాటా గ్రూప్ దిగ్గజం విస్తారాను విలీనం చేసుకుంది. 2024 అక్టోబర్లో ఏఐఎక్స్ కనెక్ట్తో చౌక టికెట్ ధరల ఇండియా ఎక్స్ప్రెస్ను విలీనం చేసిన తదుపరి విస్తారాతో ఎయిర్ ఇండియాను మరింత విస్తరించింది. వెరసి ప్రస్తుతం ఎయిర్ ఇండియా 5,600 వీక్లీ విమానాలతో 90కుపైగా ప్రాంతాలను కలుపుతూ సర్వీసులు అందిస్తోంది. విలీనంలో భాగంగా కొత్త సంస్థలో సింగపూర్ ఎయిర్లైన్స్ 25.1 శాతం వాటాను పొందింది.వ్యాక్సిన్ల సంస్థ మీడియావైపు వ్యాక్సిన్ల తయారీ దిగ్గజం సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈవో అదార్ పూనావాలా బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్కు చెందిన థర్మ ప్రొడక్షన్స్ అండ్ థర్మాటిక్ ఎంటర్టైన్మెంట్పై దృష్టి పెట్టారు. వెరసి పూనావాలా 50 శాతం వాటా దక్కించుకోగా.. కరణ్ జోహార్ వాటా 50 శాతంగా కొనసాగుతోంది. కరణ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా కొనసాగుతున్నారు. ఫార్మా చేతికి వ్యాక్సిన్లు హెల్త్కేర్ రంగ లిస్టెడ్ కంపెనీ మ్యాన్కైండ్ ఫార్మా వ్యాక్సిన్ల తయారీ దిగ్గజం భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్తో డీల్ కుదుర్చుకుంది. భారత్ సీరమ్స్ను రూ. 13,768 కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా మహిళా ఆరోగ్య పరిరక్షణ, ఫెర్టిలిటీ ఔషధాలలోనూ కార్యకలాపాలు విస్తరించేందుకు మ్యాన్కైండ్ ఫార్మాకు తోడ్పాటునిచ్చింది.సిమెంటింగ్ డీల్ డైవర్సిఫైడ్ గ్రూప్ అదానీ సంస్థకు చెందిన అంబుజా సిమెంట్స్ విస్తరణపై కన్నేసింది. దీనిలో భాగంగా పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ను రూ. 10,422 కోట్లకు సొంతం చేసుకుంది. తద్వారా 2024 ఆగస్ట్ 16కల్లా పెన్నా సిమెంట్ను పూర్తి అనుబంధ కంపెనీగా మార్చుకుంది. మరోవైపు ఓరియంట్ సిమెంట్లో దాదాపు 47 శాతం వాటాను 45.1 కోట్ల డాలర్ల(రూ. 3,800 కోట్లు)కు కొనుగోలు చేసే బాటలో సాగుతోంది. విస్తరణలో భాగంగా దక్షిణాది మార్కెట్లో విస్తరించే ప్రణాళికల్లో భాగంగా ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం అల్ట్రాటెక్.. ఇండియా సిమెంట్స్పై గురి పెట్టింది. తొలుత 23 శాతం వాటాను సొంతం చేసుకున్న అల్ట్రాటెక్ తదుపరి ప్రమోటర్ల నుంచి మరో 32.72 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకు దాదాపు రూ. 4,000 కోట్లవరకూ వెచ్చించింది. దీంతో ఇండియా సిమెంట్స్లో వాటాను 55 శాతానికి చేర్చుకుంది. ఈ బాటలో తాజాగా ఓరియంట్ సిమెంట్లో 8.69 శాతం వాటాను రూ. 851 కోట్లకు చేజిక్కించుకుంది. -
అంబానీ చేతికి మరో కంపెనీ: రూ.375 కోట్ల డీల్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా హెల్త్కేర్ ప్లాట్ఫామ్ కార్కినోస్ హెల్త్కేర్ను కొనుగోలు చేసింది. డీల్ విలువ రూ.375 కోట్లు. కార్కినోస్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ (RSBVL) దక్కించుకుంది.కార్కినోస్ 2020లో ప్రారంభం అయింది. క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించడం, నిర్ధారణ చేయడం, వ్యాధి నిర్వహణ కోసం సాంకేతికతతో కూడిన వినూత్న పరిష్కారాలను అందిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.22 కోట్ల టర్నోవర్ను ఆర్జించింది.కంపెనీ 2023 డిసెంబర్ వరకు దాదాపు 60 ఆసుపత్రులతో భాగస్వామ్యం కలిగి ఉంది. అనుబంధ కంపెనీ ద్వారా మణిపూర్లోని ఇంఫాల్లో 150 పడకల మల్టీస్పెషాలిటీ క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తోంది. కార్కినోస్ దివాళా పరిష్కార ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముంబై బెంచ్ ఆమోదించింది. ఆర్ఎస్బీవీఎల్ సమర్పించిన పరిష్కార ప్రణాళికకు ఎన్సీఎల్టీ ఆమోదించినట్టు డిసెంబర్ 10న రిలయన్స్ ప్రకటించింది. -
రిలయన్స్ జియోకు 37.6 లక్షల మంది దూరం
న్యూఢిల్లీ: టెలికం రంగ సంస్థ రిలయన్స్ జియో(reliance jio) అక్టోబర్లో 37.6 లక్షల మంది వైర్లెస్ సబ్స్క్రైబర్లను కోల్పోయింది. టెల్కోలు కీలకంగా వ్యవహరించే క్రియాశీల మొబైల్ సబ్స్క్రైబర్స్ జియోకు 38.47 లక్షల మంది పెరిగారు. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన నెలవారీ డేటా ప్రకారం.. అక్టోబర్లో భారతీ ఎయిర్టెల్ (Bharti Airtel) 19.28 లక్షల మంది వైర్లెస్ చందాదార్లను కొత్తగా దక్కించుకుంది. యాక్టివ్ కస్టమర్లు దాదాపు 27.23 లక్షలు అధికం అయ్యారు. వొడాఫోన్ ఐడియా 19.77 లక్షల వైర్లెస్ సబ్స్క్రైబర్లను కోల్పోయింది. క్రియాశీల చందాదార్లు 7.23 లక్షల మంది తగ్గారు.రిలయన్స్ జియో మొత్తం వైర్లెస్ వినియోగదార్ల సంఖ్య అక్టోబర్ నాటికి 46 కోట్లకు వచ్చి చేరింది. సెప్టెంబర్లో ఈ సంఖ్య 46.37 కోట్లుగా ఉంది. సెప్టెంబర్తో పోలిస్తే వొడాఫోన్ ఐడియా మొత్తం వైర్లెస్ యూజర్ బేస్ 21.24 కోట్ల నుంచి అక్టోబర్లో 21.04 కోట్లకు పడిపోయింది. దేశవ్యాప్తంగా మొత్తం యాక్టివ్ వైర్లెస్ సబ్స్క్రైబర్ల సంఖ్య 106.6 కోట్లుగా ఉంది. మొత్తం బ్రాడ్బ్యాండ్ (broadband) చందాదారులు అక్టోబర్ 2024 చివరి నాటికి 0.31 శాతం తగ్గి 94.14 కోట్లుగా ఉన్నారు. మొత్తం టెలిఫోన్ చందాదారుల సంఖ్య 119.06 కోట్ల నుండి 0.21 శాతం తగ్గి 118.82 కోట్లకు క్షీణించింది. ఇదీ చదవండి: ఆన్లైన్ ఉన్నా చివరకు షోరూంలోనే.. తెలుగు రాష్ట్రాల వైర్లైన్లో జియో వృద్ధిఆంధ్రప్రదేశ్, తెలంగాణలో (ఏపీ టెలికం సర్కిల్) వైర్లైన్ విభాగంలో అక్టోబర్లో గణనీయంగా వృద్ధి సాధించినట్లు రిలయన్స్ జియో తెలిపింది. ట్రాయ్ (TRAI) గణాంకాల ప్రకారం రెండు రాష్ట్రాల్లో నికరంగా 69,930 కనెక్షన్లు కొత్తగా జతయినట్లు వివరించింది. దీంతో సెప్టెంబర్లో 17,49,696గా ఉన్న సబ్స్కైబర్ల సంఖ్య అక్టోబర్లో 18,19,626కి చేరినట్లు సంస్థ పేర్కొంది. -
రిలయన్స్ ‘యూస్టా’ స్టోర్ ప్రారంభం
రిలయన్స్ రిటైల్ తన వినియోగదారులకు మరిన్ని బ్రాండ్లను చేరువ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీనగర్ సమీపంలో నాగోల్-అల్కపురి క్రాస్ రోడ్ వద్ద కొత్తగా ‘యూస్టా’ ఫ్యాషన్ బ్రాండ్ స్టోర్ను ప్రారంభించింది. ఇప్పటికే దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ స్టోర్లు ఉన్నాయని కంపెనీ అధికారులు తెలిపారు. దక్షిణ భారతదేశంలో మరింతగా తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు సంస్థ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.దేశంలోని యువత అధికంగా ఇష్టపడే స్టైల్స్లో విభిన్న మోడల్స్ను యూస్టా అందిస్తోందన్నారు. ప్రస్తుతం యూస్టా స్టోర్స్ మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో విస్తరించినట్లు చెప్పారు. ప్రీమియం మోడల్స్తోపాటు సామాన్యులకు అందుబాటు ధరల్లో ఫ్యాషన్ ఉత్పత్తులను అందిస్తున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: ‘బంగారం’లాంటి అవకాశం.. తులం ఎంతంటే..యువతను ఆకర్షించేలా చాలా ఫ్యాషన్ రిటైల్ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. అందుబాటు దరల్లోనే తమ ఉత్పత్తులను అందిస్తున్నాయి. గార్మెంట్ పరిశ్రమ కూడా స్థానికంగా ఎంతో వృద్ధి చెందుతోంది. ఈ రంగంలో ఇతర దేశాలకు చేసే ఎగుమతులు అధికమవుతున్నాయి. స్థానికంగా మంచి ఉత్పత్తులు అందిస్తే సంస్థల బ్రాండ్కు ఆదరణ పెరుగుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. -
గ్రీన్ హైడ్రోజన్.. గేమ్ చేంజర్!
హైడ్రోజన్ కార్లు.. బస్సులు.. రైళ్లు.. నౌకలు.. పరిశ్రమలు... ఇలా ప్రపంచమంతా ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ నామ జపం చేస్తోంది! పునరుత్పాదక ఇంధన రంగంలో గేమ్ చేంజర్గా అభివరి్ణస్తున్న గ్రీన్ హైడ్రోజన్ కోసం భారత్ కూడా వేట మొదలుపెట్టింది. దేశీ కార్పొరేట్ దిగ్గజాలైన రిలయన్స్, అదానీ గ్రూపులతో పాటు అవాడా, హైజెన్కో గ్రీన్ ఎనర్జీస్, థెర్మాక్స్ వంటి సంస్థలు ఈ రంగంలో ఇప్పటికే భారీ ప్రణాళికలతో చకచకా ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా ఈ నయా ఇంధనాన్ని వినియోగదారులకు చౌకగా అందించేందుకు ఉత్పాదక వ్యయాన్ని రెండింతలకు పైగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుతం దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదక వ్యయం ఒక్కో కేజీకి 4–5 డాలర్లు (దాదాపు రూ.340–430)గా ఉంటోంది. అదే గ్రే హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చు 1–2 డాలర్లు (రూ.85–170) మాత్రమే. గ్రే హైడ్రోజన్ ఉత్పత్తి కాలుష్యకరమైనది కావడంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో కంపెనీలు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదక వ్యయాన్ని గణనీయంగా తగ్గించడంపై దృష్టిపెట్టాయి. సరికొత్త టెక్నాలజీలతో పాటు వినూత్న ఉత్పత్తులు, ఇతరత్రా మార్గాలను ఎంచుకుంటున్నాయి. 2030 నాటికి భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్దేశించుకున్న 50 లక్షల వార్షిక టన్నుల ఉత్పత్తి లక్ష్యం సాకారం కావాలంటే, ఉత్పాదక వ్యయాన్ని తగ్గించడం చాలా కీలకమని నిపుణులు పేర్కొంటున్నారు. టెక్నాలజీ దన్ను... గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదనలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పాటు అధునాతన ఎనలిటిక్స్ను అవాడా గ్రూప్ ఉపయోగిస్తోంది. ‘అత్యాధునిక ఎలక్ట్రోలైజర్ టెక్నాలజీ వల్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం మెరుగుపడి, హైడ్రోజన్ ఉత్పత్తికి తక్కువ విద్యుత్ అవసరమవుతుంది. దీంతో వ్యయం భారీగా దిగొస్తోంది’ అని కంపెనీ చైర్మన్ వినీత్ మిట్టల్ పేర్కొన్నారు. హైజెన్కో సంస్థ అయితే, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), ఏఐతో పాటు మెషీన్ లెరి్నంగ్ను ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుంటోంది. కంపెనీ ఒడిశాలోని గోపాల్పూర్లో 1.1 మిలియన్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ అమోనియా ప్రాజెక్టును నెలకొల్పే ప్రణాళికల్లో ఉంది. వెల్స్పన్ న్యూ ఎనర్జీ కూడా గ్రీన్ హైడ్రోజన్ను చౌకగా అందించేందుకు సౌర, పవన విద్యుత్తో పాటు బ్యాటరీల్లో స్టోర్ చేసిన విద్యుత్ను కూడా ఉపయోగిస్తోంది. అంతేకాకుండా పెద్దయెత్తున జల విద్యుత్ను కూడా వినియోగించే సన్నాహాల్లో ఉన్నట్లు కంపెనీ సీఈఓ కపిల్ మహేశ్వరి పేర్కొన్నారు. ఇక గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అవసరమైన మాడ్యూల్స్ తయారీ, విక్రయం, సరీ్వస్ కోసం థర్మాక్స్ బ్రిటన్కు చెందిన సెరెస్తో ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా దాని ఆక్సైడ్ ఎల్రక్టాలిసిస్ టెక్నాలజీని ఉపయోగించుకోనుంది. తక్కువ ఉష్ణోగ్రతతో కూడిన ఎలక్ట్రాలిసిస్ సాంకేతికతతో పోలిస్తే ఇది 25% మెరుగైనదని సంస్థ సీఈఓ ఆశిష్ భండారీ వెల్లడించారు.అంబానీ, అదానీ గిగా ఫ్యాక్టరీలుదేశంలో గ్రీన్ హైడ్రోజన్ సమగ్ర వ్యవస్థ (ఎకో సిస్టమ్) నెలకొల్పేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) 10 బిలియన్ డాలర్లను వెచి్చంచనుంది. 2030 నాటికి కేజీ గ్రీన్ హైడ్రోజన్ను ఒక డాలరుకే ఉత్పత్తి చేయాలనేది కంపెనీ లక్ష్యం. 2026 కల్లా తొలి ఎలక్ట్రోలైజర్ గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ తాజా ఏజీఎంలో ప్రకటించారు కూడా. ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచి, కొత్త తరం ఎలక్ట్రోలైజర్ల కోసం పెట్టుబడి వ్యయాలను తగ్గించుకోవడానికి అధునాతన ఎల్రక్టాలిసిస్ ఆధారిత టెక్నాలజీలను కూడా కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో దిగ్గజ సంస్థల్లో ఒకటిగా అదానీ న్యూ ఇండస్ట్రీస్ను తీర్చిదిద్దే సన్నాహాల్లో అదానీ గ్రూప్ నిమగ్నమైంది. 2030 నాటికి 10 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి తోడ్పడేలా సమగ్ర ఎకో సిస్టమ్ను అభివృద్ధి చేస్తోంది. తదుపరి పదేళ్లలో ఈ సామర్థ్యాన్ని 30 లక్షల టన్నులకు పెంచాలనేది అదానీ లక్ష్యం. ఈ వ్యవస్థలో గ్రీన్ అమోనియా, గ్రీన్ మిథనాల్, పర్యావరణానుకూల విమాన ఇంధనం వంటి పలు ఉత్పత్తులు ఉంటాయి. గ్రీన్ హైడ్రోజన్: ప్రకృతిలో అపారంగా దొరికే నీటిని పునరుత్పాదక ఇంధనాలైన సౌర, పవన, జల విద్యుత్ను ఉపయోగించి హైడ్రోజన్, ఆక్సిజన్గా విడగొడతారు. ఎలక్ట్రోలైజర్లో జరిపే ఈ ప్రక్రియను ఎల్రక్టాలిసిస్గా పేర్కొంటారు. ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ 100 శాతం పర్యావరణానుకూలమైనది కావడంతో దీనికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. దీన్ని నిల్వ చేయడం చాలా సులభం. అంతేకాకుండా, వాహనాల నుండి పరిశ్రమల వరకు అనేక అవసరాల కోసం వాడుకోవచ్చు. గ్రే హైడ్రోజన్: హైడ్రోజన్ ఉత్పత్తిలో ఇది అత్యంత సాధారణ ప్రక్రియ. స్టీమ్ మీథేన్ రిఫారి్మంగ్ (ఎస్ఎంఆర్) అనే ప్రక్రియలో సహజవాయువును ఉపయోగిస్తారు. తయారీలో గణనీయంగా కార్బన ఉద్గారాలను విడుదల చేయడం వల్ల దీనిపై వ్యతిరేకత నెలకొంది. వినియోగంలో మాత్రం 100% పర్యావరణ హితమైనదే. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రిలయన్స్ గ్రూప్ ప్రెసిడెంట్గా ఇరా బింద్రా నియామకం
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గ్రూప్ ప్రెసిడెంట్గా ఇరా బింద్రా(47)ను నియమిస్తున్నట్లు కంపెనీ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ ప్రకటించారు. ఈ స్థాయి వ్యక్తుల నియామకాలకు సంబంధించిన వివరాలను ముఖేశ్ నేరుగా వెల్లడించడం ఇదే తొలిసారి. ఇరా బింద్రా ఇప్పటివరకు యూఎస్లోని మెడ్ట్రానిక్ సంస్థలో పనిచేశారు. అక్కడ ఆమె హెచ్ఆర్ విభాగాధిపతిగా, కంపెనీ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తించారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్లో అన్ని అనుబంధ సంస్థలకు సంబంధించి టాప్ మేనేజ్మెంట్ నియామకాలను ఈమె చేపట్టబోతున్నారు. కంపెనీ ప్రెసిడెంట్గా నియమించడంతో ఈమె రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్న మొదటి కుటుంబేతర మహిళ కావడం విశేషం.ఇదీ చదవండి: సుప్రీం కోర్టు ఆమోదంతో రూ.4,025 కోట్ల ఆస్తులు అప్పగింత‘రిలయన్స్ గ్రూప్లో టాలెంట్ను మెరుగుపరిచేందుకు బింద్రా బాధ్యతలు నిర్వర్తిస్తారు. నాతోసహా ఇషా, ఆకాష్, అనంత్, ఎగ్జిక్యూటివ్ కమిటీతో కలిసి పని చేస్తారు. విభిన్న పరిశ్రమలు, వ్యాపార సైకిల్స్పై బింద్రాకు అపార పరిజ్ఞానం ఉంది. మెడ్ట్రానిక్లో కీలక బాధ్యతల్లో పని చేశారు. జీఈ వంటి ఫార్చ్యూన్ 100 కంపెనీలో హెచ్ఆర్ టీమ్లకు నాయకత్వం వహించారు. కొత్త ఆపరేటింగ్ మోడల్ రూపొందించి దాన్ని అమలు చేశారు. తన నైపుణ్యాలు కంపెనీకి ఎంతో ఉపయోగపడుతాయి’ అని ముఖేశ్ అంబానీ అన్నారు.1998లో ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజీ నుంచి బింద్రా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.1999లో నెదర్లాండ్స్లోని మాస్ట్రిక్ట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు.తర్వాత ఆమె మెడ్ట్రానిక్లో చేరడానికి ముందు జీఈ క్యాపిటల్, జీఈ ఇండియా, జీఈ హెల్త్కేర్, జీఈ ఆయిల్ & గ్యాస్లో పనిచేశారు. -
సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం.. రిలయన్స్ కొత్త ఎల్ఈడీ టీవీ
భారతదేశపు అతిపెద్ద రిటైలర్ అయిన 'రిలయన్స్ రిటైల్ లిమిటెడ్' హర్మాన్ భాగస్వామ్యంతో ఏకంగా ఆరు హోమ్ థియేటర్స్ కలిగిన ఎల్ఈడీ టీవీలను లాంచ్ చేసింది. బీపీఎల్ బ్రాండ్తో ప్రారంభమైన ఈ టీవీలు ప్రత్యేకంగా ఆప్టిమైజ్ అయిన స్పీకర్ మాడ్యూల్స్ పొందుతాయి. కాబట్టి యూజర్లు మంచి ఆడియో అనుభవాన్ని పొందవచ్చు. ఇది థియేటర్ అనుభూతిని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.ప్రస్తుతం మార్కెట్లో మంచి క్వాలిటీ మాత్రమే కాకుండా, అద్భుతమైన ఆడియో సిస్టం కలిగి ఉన్న టీవీల కోసం ఎదురు చూస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రిలయన్స్ రిటైల్ ఈ కొత్త ఎల్ఈడీ టీవీ లాంచ్ చేసింది. ఇది ఆడియో ఈఎఫ్ఎక్స్ ట్యూనింగ్ సాఫ్ట్వేర్ పొందటమే కాకుండా.. నాలుగు ఏఐ అల్గారిథమ్లను పొందుతుంది. కాబట్టి వినియోగదారులు ఇప్పుడు వారి ఇళ్లలో సౌకర్యవంతంగా సినిమాటిక్ అనుభూతిని పొందగలరని సంస్థ వెల్లడిస్తోంది.రిలయన్స్ బీపీఎల్ హోమ్ థియేటర్ ఎల్ఈడీ టీవీలు.. సరికొత్త క్యూఎల్ఈడీ, 4కే అల్ట్రా హెచ్డీ డిస్ప్లే పొందుతాయి. ఈ ఎల్ఈడీ టీవీలు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ స్టోర్లు, పెద్ద ఫార్మాట్ స్టోర్లలో, లేటెస్ట్ రిటైల్ అవుట్లెట్లలో, జియో మార్ట్.కామ్, రిలయన్స్ డిజిటల్.ఇన్ వంటి ఈకామర్స్ మార్కెట్లలో కూడా అందుబాటులో ఉన్నాయి. -
రూ.4 లక్షల కోట్ల సంపద ఆవిరి!
స్టాక్ మార్కెట్లో మదుపర్లు శుక్రవారం ప్రారంభ సమయం నుంచి తమ షేర్లను భారీగా విక్రయిస్తున్నారు. దాంతో ఉదయం 11.45 సమయం వరకు సెన్సెక్స్ 1,200 పాయింట్లకు పైగా పడిపోయింది. గత సెషన్ ముగింపు వరకు మార్కెట్ విలువ మొత్తంగా రూ.458 లక్షల కోట్లు ఉండగా, ఈరోజు సూచీలు నేల చూపులు చూస్తుండడంతో పెట్టుబడిదారుల సంపద రూ.4 లక్షల కోట్లు తగ్గి రూ.454 లక్షల కోట్లకు చేరుకుంది. నిఫ్టీ 368 పాయింట్లు జారి 24,180 వద్దకు పడిపోయింది.స్టాక్ మార్కెట్ పతనానికిగల కారణాలు..విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) అమ్మకాలు: ఎఫ్ఐఐలు నిన్నటి మార్కెట్ సెషన్లో రూ.3,560 కోట్ల విలువైన స్టాక్స్ను విక్రయించారు. ఇటీవల కాలంలో కొంత తక్కువ మొత్తంలో అమ్మకాలు చేసిన ఎఫ్ఐఐలు తిరిగి భారీగా విక్రయాలకు పూనుకోవడం మార్కెట్ నెగెటివ్గా పరిగణించింది.బలహీనమైన రూపాయి: రూపాయి జీవితకాల కనిష్టాన్ని తాకింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 84.83కు చేరింది. ఇది ఇన్వెస్టర్ల ఆందోళనలను మరింత పెంచింది.గ్లోబల్ మార్కెట్ బలహీనత: అమెరికా, యూరప్, జపాన్, చైనా మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. వాటి ప్రభావం ఇండియన్ స్టాక్ మార్కెట్పై పడినట్లు నిపుణులు చెబుతున్నారు.రంగాలవారీ క్షీణత: బ్యాంకింగ్, మెటల్, ఆటో, ఐటీ వంటి రంగాలకు సంబంధించి మార్కెట్లో అధిక వాటాలున్న ప్రధాన షేర్లు భారీగా పతనమయ్యాయి.పారిశ్రామికోత్పత్తి సూచీ: పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ఈసారి భారీగా కొలుకుంటుందని మార్కెట్ ఊహించింది. అయితే, ఈ సూచీ గతంలో కంటే కోలుకున్నా కాస్త నెమ్మదించింది. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది.ఇదీ చదవండి: బ్యాంకులపై ఆధారపడొద్దు: ఐఆర్డీఏఐరిలయన్స్ షేర్లు ఢమాల్..నిఫ్టీలో దాదాపు 10 శాతం వాటాను కలిగి ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర ఈ వారంలో భారీగా క్షీణించింది. గడిచిన ఐదు సెషన్ల్లో 4.47 శాతం, అదే ఆరునెలల్లో 14.55 శాతం పడిపోయింది. అందుకుగల కారణాలను మార్కెట్ వర్గాల అంచనా వేస్తున్నాయి. రిలయన్స్ రిటైల్, ఆయిల్-టు-కెమికల్స్ (ఓ2సీ) సెగ్మెంట్లు ఊహించిన దానికంటే బలహీనమైన పనితీరును కనబరిచినట్లు నిపుణులు చెబుతున్నారు. రిలయన్స్ రిటైల్ స్టోర్ల సంఖ్యను పెంచుకోవడం కాస్తా నెమ్మదించింది. అంతకుముందు వీటి సంఖ్యను గణనీయంగా పెంచుతామని కంపెనీ పేర్కొంది. దానికితోడు ఏడాది కాలంలో పుంజుకున్న మార్కెట్లో క్రమంగా లాభాల స్వీకరణ పెరుగుతోంది. రిలయన్స్ వంటి కంపెనీల్లో ఎఫ్ఐఐలు, రిటైల్ ఇన్వెస్టర్లు భారీగానే పెట్టుబడి పెట్టారు. వీరిలో చాలామంది ఇటీవల ప్రాఫిట్బుక్ చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి. -
అదిరిపోయే బెనిఫిట్స్.. జియో న్యూ ఇయర్ ప్లాన్
రిలయన్స్ జియో తన వినియోగదారులకు కొత్త సంవత్సరం సందర్భంగా నూతన ప్లాన్ను తీసుకొచ్చింది. ఈ ప్రత్యేకమైన ‘న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ 2025’ గడువు డిసెంబర్ 11, 2024 నుంచి జనవరి 11, 2025 వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇందులో రీఛార్జ్ ప్లాన్తోపాటు కూపన్లను కూడా అందించనున్నట్లు పేర్కొంది. ఇందుకు రూ.2025తో రిఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: రూ.5 కోట్ల వాచ్తో జుకర్బర్గ్.. ప్రత్యేకతలివే..ప్లాన్ వివరాలు200 రోజుల పాటు అన్లిమిటెడ్ 5జీ ఇంటర్నెట్ యాక్సెస్.500 జీబీ 4జీ డేటా (రోజుకు 2.5 GB).అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సదుపాయం.పార్టనర్ కూపన్ల రూపంలో రూ.2150 విలువైన అదనపు ప్రయోజనాలు.రూ.500 అజియో కూపన్. రూ.2500 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలు చేస్తే ఈ కూపన్ ఉపయోగించవచ్చు.స్విగ్గీపై రూ.150 తగ్గింపు. కనిష్ట ఆర్డర్ రూ.499 పై వర్తిస్తుంది.ఈజ్ మై ట్రిప్ పై రూ.1500 తగ్గింపు: మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా ఫ్లైట్ బుక్ చేస్తే ఈ కూపన్ వినియోగించుకోవచ్చు.ఈ ప్లాన్ నెలవారీ రూ.349 ప్యాకేజీతో పోలిస్తే మొత్తంగా రూ.468 సేవింగ్స్ను అందిస్తుంది. -
రూ.24,900 కోట్ల అప్పు కోసం బ్యాంకులతో చర్చలు?
రిలయన్స్ ఇండస్ట్రీస్ 3 బిలియన్ డాలర్లు(రూ.24,900 కోట్లు) రుణాన్ని పొందేందుకు బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్బర్గ్ తెలిపింది. వచ్చే ఏడాది చెల్లించాల్సిన రుణాన్ని రీఫైనాన్స్ చేయడానికి ఈ నిధులను ఉపయోగించుకోనున్నట్లు తెలిసింది. ఈమేరకు దాదాపు ఆరు బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్బర్గ్ పేర్కొంది.కంపెనీ గతంలో తీసుకున్న దాదాపు 2.9 బిలియన్ డాలర్ల రుణాల మెచ్యురిటీ 2025 మొదటి త్రైమాసికంలో ముగుస్తుంది. కాబట్టి కంపెనీ ఆయా రుణాలు చెల్లించి తిరిగి రిఫైనాన్స్కు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకే బ్యాంకు ఇంతమొత్తంలో చెల్లించడం ఒకింత రిస్క్తో కూడుకున్న వ్యవహారం కాబట్టి, దాదాపు ఆరు బ్యాంకులతో సంస్థ అధికారులు చర్చలు జరుపుతున్నారని బ్లూమ్బర్గ్ తెలిపింది. అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.ఈ ఒప్పందం కార్యరూపం దాలిస్తే 2023 నుంచి కొంత విరామం తర్వాత రిలయన్స్ ఆఫ్షోర్ రుణాల(ఇతర దేశాలు అందించే అప్పులు) మార్కెట్లోకి తిరిగి ప్రవేశించినట్లుగా అవుతుంది. ఇదిలాఉండగా, రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఇటీవల రుణాల ద్వారా 8 బిలియన్ డాలర్లకు పైగా నిధులు సేకరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ క్రెడిట్ ప్రొఫైల్ మెరుగ్గా ఉండడంతో రుణాలు పొందేందుకు మార్గం సులువవుతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: గ్లోబల్ సౌత్ లీడర్గా భారత్మూడీస్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ క్రెడిట్ రేటింగ్ను Baa2 వద్ద స్థిరంగా ఉంచింది. ఇది ఇండియన్ సావరిన్ గ్రేడ్ కంటే మెరుగ్గా ఉండడం కూడా రిలయన్స్కు కలిసొచ్చే అంశంగా భావించవచ్చు. సంస్థ ఆర్థిక స్థితి, విభిన్న వ్యాపార నమూనా, వినియోగదారుల్లో విశ్వసనీయత..వంటి అంశాలు కూడా రుణదాతలకు భరోసా కల్పిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. -
కేన్సర్లను ముందుగా గుర్తించే 'రక్ష ఆధారిత పరీక్ష'..
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ప్రముఖ జెనోమిక్స్ బయోఇన్ఫర్మేటిక్స్ కంపెనీ స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ వివిధ కేన్సర్లను ముందస్తుగా గుర్తించేందుకు రక్త ఆధారిత పరీక్షను ప్రారంభించింది. కేన్సర్ స్పాట్గా పిలిచే ఈ పరీక్షలో కేన్సర్ కణితికి సంబంధించిన డీఎన్ఏ మూలాన్ని గుర్తించడానికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిన మిథైలేషన్ ప్రొఫైలింగ్ సాంకేతికతను ఉపయోగిస్తుంది. రక్తంలో డీఎన్ఏ మిథైలేషన్ని గుర్తించడానికి స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ జీనోమ్ సీక్వెన్సింగ్ విశ్లేషణ ప్రక్రియను ఉపయోగిస్తోంది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డు సభ్యురాలు ఇషా అంబానీ పిరమల్ మాట్లాడుతూ..మానవ సేవలో భాగంగా ఔషధాల భవిష్యత్తును పునర్నిర్మించే మార్గదర్శక పురోగతికి రిలయన్స్ కట్టుబడి ఉంది. భారత్లో కేన్సర్ మరణాలు ఎక్కువ. అదీగాక ఈ వ్యాధి చికిత్స అనేది రోగుల కుటుంబాలను ఆర్థిక సమస్యల్లోకి నెట్టే అంశం. ఇది వారి పాలిట ఆర్థిక మానసిక వ్యథను మిగిల్చే భయానక వ్యాధిగా మారింది. ఆ నేపథ్యంలోనే ఇలా ముందుస్తుగా గుర్తించే ఆధునిక చికిత్సతో ఆరోగ్య సంరక్షణకు పరిష్కారాలను అందించే దిశగా అడుగులు వేస్తున్నాం. భారతదేశంలోని ప్రజల జీవితాలను మెరుగపరచడానికి రిలయన్స్ కట్టుబడి ఉంది. ఆ నేపథ్యంలోనే వీ కేర్('WE CARE') చొరవతో కొత్త జెనోమిక్స్ డయాగ్నోస్టిక్స్ & రీసెర్చ్ సెంటర్ ఈ ముందస్తు కేన్సర్ గుర్తింపు పరీక్షలను ప్రారంభించిందని చెప్పుకొచ్చారు ఇషా అంబానీ. అలాగే స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు డాక్టర్ రమేష్ హరిహరన్ మాట్లాడుతూ..కేన్సర్తో పోరాడి గెలవాలంటే ముందస్తు హెచ్చరిక అనేది కీలకం. ప్రజలు ఈ కేన్సర్ని జయించేలా ముందస్తు కేన్సర్ గుర్తింపు పరీక్షను ప్రారంభించటం మాకు గర్వకారణం అని అన్నారు. కాగా, ఈ కొత్త జెనోమిక్స్ డయాగ్నోస్టిక్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ క్యాన్సర్స్పాట్ ప్రోగ్రామ్ను ప్రోత్సహించడమే గాక, సరికొత్త పరిష్కారాలను అభివృద్ధి చేసేలా పరిశోధన ప్రయత్నాలకు మద్దతిస్తుంది.(చదవండి: ఈ 'టీ'తో నిద్రపోతున్నప్పుడే బెల్లీఫ్యాట్ మాయం..!) -
2024 విజికీ మీడియా విజిబిలిటీ ర్యాంకింగ్స్: రిలయన్స్ టాప్
ఆదాయం, లాభాలు, మార్కెట్ వాల్యూ, సామాజిక ప్రభావం వంటి వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో నిలిచింది. 2024 విజికీ వెలువరించిన న్యూస్ స్కోర్ ర్యాంకింగ్లో సంస్థ ప్రథమ స్థానంలో నిలిచింది. భారతదేశంలోని ప్రముఖ FMCG లేదా బ్యాంకింగ్ & ఫైనాన్స్ కంపెనీల కంటే కూడా రిలయన్స్ విజిబిలిటీ చాలా ఎక్కువగా ఉందని ఏఐ బేస్డ్ మీడియా ఇంటెలిజెన్స్ సంస్థ తెలిపింది.రిలయన్స్ సంస్థ.. 2024 న్యూస్ స్కోర్లో 100కి 97.43 స్కోర్ చేసింది. ఈ స్కోర్ 2023 (96.46), 2022 (92.56), 2021 (84.9) కంటే ఎక్కువని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే సంస్థ ప్రతి ఏటా వృద్ధి నమోదు చేస్తూనే ఉంది. రిలయన్స్ కంపెనీ విజికీ న్యూస్ స్కోర్ వార్షిక ర్యాంకింగ్స్లో మొదటి నుంచి గత ఐదేళ్లలో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.విజికీ న్యూస్ స్కోర్ అనేది న్యూస్ పరిమాణం, హెడ్లైన్ ప్రజెంటేషన్, పబ్లికేషన్ రీచ్ & రీడర్షిప్ ఆధారంగా నిర్ణయిస్తారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్.. మీడియా ఇంటెలిజెన్స్ని ఉపయోగించి బ్రాండ్లు, వ్యక్తుల కోసం వార్తల దృశ్యమానతను కొలవడానికి ప్రపంచంలోని మొట్టమొదటి ప్రామాణిక కొలమానం.రిలయన్స్ తరువాత ర్యాంకింగ్లలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (89.13), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (86.24), వన్97 కమ్యూనికేషన్స్ (84.63), ఐసీఐసీఐ బ్యాంక్ (84.33), జొమాటో (82.94) ఉన్నాయి. భారతీ ఎయిర్టెల్ ఏడో స్థానంలో ఉండగా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ITC తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ 40వ స్థానంలో ఉంది. -
రిలయన్స్ సెక్యూరిటీస్కు సెబీ గట్టి దెబ్బ
న్యూఢిల్లీ: స్టాక్ బ్రోకర్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా రిలయన్స్ సెక్యూరిటీస్కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చెక్ పెట్టింది. స్టాక్ బ్రోకర్ సంస్థకు రూ. 9 లక్షలు జరిమానా చెల్లించవలసిందిగా ఆదేశించింది. ఖాతాలు, రికార్డులు, అధికారిక వ్యక్తుల ఇతర డాక్యుమెంట్లను సెబీసహా స్టాక్ ఎక్స్చేంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ థిమాటిక్ ఆన్సైట్ పరిశీలన చేపట్టాయి.2022 ఏప్రిల్ నుంచి 2023 డిసెంబర్వరకూ పరిశీలనకు పరిగణించాయి. తదుపరి 2024 ఆగస్ట్ 23న సంస్థకు సెబీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. సెబీ వద్ద రిజిస్టరైన రిలయన్స్ సెక్యూరిటీస్ స్టాక్ బ్రోకర్ నిబంధనలకు అనుగుణంగా ఖాతాలను నిర్వహించవలసి ఉంటుంది.అంతేకాకుండా ఎన్ఎస్ఈఐఎల్ క్యాపిటల్ మార్కెట్ మార్గదర్శకాలు, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ లావాదేవీ నిబంధనలు అమలు చేయవలసి ఉంటుంది. అయితే క్లయింట్ ఆర్డర్ ప్లేస్మెంట్స్, తగినవిధంగా వ్యవస్థలను నిర్వహించకపోవడం తదితర నిబంధనల ఉల్లంఘనను గు ర్తించినట్లు 47 పేజీల ఆదేశాలలో సెబీ పేర్కొంది. -
బ్లాక్ ఫ్రైడే సేల్స్ షురూ: ఆఫర్స్ ఇవే..
రిలయన్స్ డిజిటల్ బ్లాక్ ఫ్రైడే సేల్ మొదలైపోయింది. ఈ సేల్ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 2 వరకు అందుబాటులో ఉంటుంది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, గృహోపకరణాలు వంటి వాటిని ఆఫర్ ధరతో కొనుగోలు చేయాలంటే.. రిలయన్స్ డిజిటల్ లేదా మైజియో స్టోర్లలో లేదా కంపెనీ అధికారిక వెబ్సైట్లలో కొనుగోలు చేయవచ్చు.రిలయన్స్ డిజిటల్ బ్లాక్ ఫ్రైడే సేల్లో భాగంగా.. ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, వన్ కార్డ్ నుంచి ఎంపిక చేసిన డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ. 10వేలు వరకు తక్షణ తగ్గింపు పొందవచ్చు. కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్లను ఎంచుకునే వారికి, ఫైనాన్స్ భాగస్వాములైన బజాజ్ ఫిన్సర్వ్.. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్తో రూ.22,500 వరకు క్యాష్బ్యాక్ కూడా పొందవచ్చు.యాపిల్ ఉత్పత్తులను తక్కువ ధరలో కొనుగోలు చేయాలంటే ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ ఓ బెస్ట్ ఆప్షన్. ఐఫోన్ 16ను ఇప్పుడు రూ. 70,900లకు, ఐప్యాడ్లను 1,371 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేస్తే రూ.25,000 తక్షణ తగ్గింపుగా పొందవచ్చు. అదే సమయంలో రూ.8,995 విలువైన ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ 1,999 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు.బీపీఎల్ 1.5 టన్స్ 3 స్టార్ ఏసీను రూ. 29,990కే కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్ ఇన్వర్టర్ ఏసీలపై కూడా సూపర్ కూల్ ఆఫర్లు ఉన్నాయి. ల్యాప్టాప్ల మీద కూడా అద్భుతమైన తగ్గింపులను పొందవచ్చు. ఓఎల్ఈడీ స్మార్ట్ టీవీలపై రూ. 26000 తక్షణ తగ్గింపు పొందవచ్చు. రూ. 8990 విలువైన సోనీ సీ510 ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ ఇప్పుడు రూ. 3990కే సొంతం చేసుకోవచ్చు. గృహోపకరణాల కొనుగోలుపై కూడా తగ్గింపును పొందవచ్చు.ట్రెండ్స్ బ్లాక్ ఫ్రైడే సేల్బ్లాక్ ఫ్రైడే సేల్లో కస్టమర్లకు మరింత ఉత్సాహాన్ని అందించడానికి.. ట్రెండ్స్ కూడా ప్రత్యేక చొరవను అమలు చేస్తోంది. ఇక్కడ 3,499 రూపాయలకు షాపింగ్ చేస్తే.. రూ.2,000 విలువైన ఉత్పత్తులను ఉచితంగా పొందవచ్చు. ట్రెండ్స్ స్టోర్లు.. భారతదేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఉమెన్స్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ వంటి వాటితో పాటు ఇతర ఫ్యాషన్ యాక్ససరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కస్టమర్లు బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో తగ్గింపు ధరలతో మంచి షాపింగ్ అనుభూతిని పొందవచ్చు. -
రిఫైనింగ్ మార్జిన్లు పెరిగినా.. రిటైల్పై అనిశ్చితి
రిలయన్స్ ఇండస్ట్రీస్ పనితీరు ఇటీవల మందగించడానికి కారణమైన రిఫైనింగ్ మార్జిన్లు పుంజుకున్నా, రిటైల్ విభాగం తీరుతెన్నులను అంచనా వేయడం కష్టతరమేనని బ్రోకరేజి సంస్థ జేపీ మోర్గాన్ పేర్కొంది. రిటైల్ ఆదాయంపై అనిశ్చితి నెలకొన్నట్లు ఒక నివేదికలో వివరించింది. మార్కెట్లు బలహీనంగా ఉండడంతో జియో/రిటైల్ విభాగాల లిస్టింగ్కు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిపింది.నివేదిక ప్రకారం జూన్ నుంచి గణనీయంగా పడిపోయిన రిఫైనింగ్ మార్జిన్లు క్రమంగా మెరుగుపడ్డాయి. అయితే, రిటైల్ రంగం మందగమనంతో పాటు కంపెనీ పునర్వ్యవస్థీకరణ ప్రభావాలు ఉండటంతో రిలయన్స్ రిటైల్కి సంబంధించి సమీప భవిష్యత్తు అంచనాలను వేయలేని పరిస్థితి నెలకొందని నివేదిక వివరించింది. జులై 8 నాటి గరిష్ట స్థాయి నుంచి రిలయన్స్ షేరు 22 శాతం క్షీణించిన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. మిగతా వాటితో పోలిస్తే రిలయన్స్ ఆకర్షణీయమైన ధరలో లభిస్తోందనే అభిప్రాయాలు నెలకొన్నాయి.ఇదీ చదవండి: ఆర్బీఐ గవర్నర్కు ఛాతీ నొప్పిరిలయన్స్లో ప్రధానంగా మూడు వ్యాపార విభాగాలు ఉన్నాయి. మొదటిది ఆయిల్ రిఫైనింగ్.. పెట్రోకెమికల్, రెండోది టెలికం విభాగం జియో, మూడోది రిటైల్ సెగ్మెంట్. వీటితో పాటు మీడియా, న్యూఎనర్జీ వ్యాపారాలూ ఉన్నాయి. ప్రస్తుతం రిలయన్స్ ఆదాయంలో సుమారు 50 శాతం వాటా రిటైల్, టెలికం విభాగాలదే కావడం విశేషం. -
ఐపీఎల్ వేలం 2025 : అదిరే డ్రెస్లో నీతా అంబానీ, ధర ఎంతో తెలుసా?
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ ఫ్యాషన్ స్టైల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సమయానికి తగ్గట్టుగా డ్రెస్లను ఎంపిక చేసుకోవడంలో, ఫ్యాషన్ను, బిజినెస్ను మిళితం చేయడంలో నీతా తరువాతే ఎవరైనా అనేది అభిమానుల మాట మాత్రమే కాదు, ఫ్యాషన్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం కూడా. తాజా ఐపీఎల్ -2025 వేలం సందర్భంగా మరోసారి తన స్టైల్తో అందర్నీ తనవైపు తిప్పుకుంది. నీతా అంబానీ నేవీ బ్యూ ప్యాంట్సూట్ ధరించి అందరినీ ఆకర్షించింది. అంతేకాదు ఆ డ్రెస్ ధర కూడా హాట్ టాపిక్గా నిలిచింది. ఐపీఎల్ టీం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓనర్ అయిన నీతా అంబానీ వైడ్-లెగ్ ప్యాంట్, బ్లూ సూట్లో హుందాగా కనిపించారు. నీతా ధరించిన ‘మజే’ బ్రాండ్కు చెందిన ఈ బ్రేజర్ సూట్ ధర అక్షరాలా 950 డాలర్లు. అంటే దాదాపు రూ.78 వేలు. ఇందులో బ్లేజర్ రూ. 47 వేలు కాగా వైడ్-లెగ్ ట్వీడ్ ట్రౌజర్ ధర సుమారు రూ. 31వేలు, మొత్తంగా ఆమె సూట్ ధర రూ.78 వేలు. అంతేనా వజ్రాలు పొదిగిన ఎంఐ బ్రూచ్, హ్యాండ్బ్యాగ్, డైమండ్ రింగ్, డైమండ్ చెవిపోగులు, సన్ గ్లాసెస్, వాచ్, హీల్స్ ఇలా అన్నీ ప్రత్యేకంగా కనిపించడం విశేషం. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)nbsp;ఐపీఎల్ మెగా వేలం-2025 తొలి రౌండ్ విడత ప్రక్రియ దుబాయ్లోని జెడ్డాలో ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఇందులో ఎంఐ నలుగురు సూపర్ స్టార్లు రోహిత్ శర్మ,హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాతోపాటు టీమిండియా యంగ్ ప్లేయర్ తిలక్ వర్మకూడా ఉన్నాడు. ముఖ్యంగా తిలక్ వర్మను రూ.8 కోట్లకు దక్కించుకోవడం విశేషంగా నిలిచింది. ఈ వేలంలో నీతా అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ కూడా పాల్గొన్నారు. -
రిలయన్స్ బ్రాండ్స్ ఎండీగా వైదొలిగిన మెహతా
రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఆధ్వర్యంలోని రిలయన్స్ బ్రాండ్స్ ఎండీగా వ్యవహరిస్తున్న దర్శన్ మెహతా ఆ స్థానం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా రిలయన్స్ బ్రాండ్స్ వ్యాపారంలో భాగమైన ఆయన రిలయన్స్ గ్రూప్లో మెంటార్గా ఉండబోతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.తదుపరి తరం నాయకులకు మెహతా మార్గదర్శకత్వం వహిస్తారని కంపెనీ పేర్కొంది. రిలయన్స్ గ్రూప్లో వ్యాపార అవకాశాలను విశ్లేషించడానికి, కొత్త వాటిని అన్వేషించడానికి కూడా ఆయన సేవలు వినియోగించుకోనున్నట్లు తెలిపింది. మెహతా రిలయన్స్ బ్రాండ్స్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా కొనసాగుతారని స్పష్టం చేసింది. రిలయన్స్ బ్రాండ్స్ మొదటి ఉద్యోగుల్లో మెహతా కీలక వ్యక్తిగా ఉన్నారు. 2007లో రిలయన్స్ బ్రాండ్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ సంస్థలోనే కొనసాగుతున్నారు. గతంలో ఆయన అరవింద్ బ్రాండ్స్ వంటి కంపెనీల్లో పని చేశారు. విలాసవంతమైన, ప్రీమియం విభాగాల్లో రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని విస్తరించేందుకు మెహతా కృషి చేశారు.ఇదీ చదవండి: ప్రపంచానికి ప్రమాదం: రఘురామ్ రాజన్గడిచిన కొన్నేళ్లుగా రిలయన్స్ బ్రాండ్స్ అనేక గ్లోబల్ బ్రాండ్లతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. బాలెన్సియాగా, జిమ్మీ చూ, బొట్టెగా వెనెటాతో సహా 90 కంటే ఎక్కువ బ్రాండ్లు రిలయన్స్ గ్రూప్తో ఒప్పందం చేసుకున్నాయి. ఈ సంస్థ స్వదేశీ డిజైనర్ బ్రాండ్లను కూడా పరిచయం చేస్తోంది. మెహతా అనంతరం రిలయన్స్ బ్రాండ్కు కొత్త ఎండీని నియమించడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి రిలయన్స్ బ్రాండ్లను పర్యవేక్షిస్తూ సీనియర్ ఎగ్జిక్యూటివ్లుగా ఉన్న వికాస్ టాండన్, దినేష్ తలూజా, ప్రతీక్ మాథుర్, సుమీత్ యాదవ్లతో కోర్ టీమ్ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
ప్రపంచంలోనే అతి పెద్ద ఆటబొమ్మల దుకాణం..!
ఆటబొమ్మలతో ఆడుకోవడం పిల్లలందరికీ ఇష్టమైన వ్యాపకం. ప్రపంచంలోని ప్రతిచోటా పిల్లలందరూ ఆటబొమ్మలను ఇష్టపడతారు. కొందరు అందుబాటులో ఉన్న వస్తువులనే ఆటబొమ్మలుగా మలచుకుని, వాటితో ఆటలాడుకుంటారు. ఇంకొందరు డబ్బులు వెచ్చించి రకరకాల రంగురంగుల ఆటబొమ్మలను కొనుక్కుని ముచ్చట తీర్చుకుంటారు. ఆటబొమ్మలపై పిల్లలకు ఉండే సహజ వ్యామోహం కొందరికి వ్యాపారావకాశం కూడా! పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రపంచవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో పిల్లల కోసం ప్రత్యేకంగా ఆటబొమ్మలను అమ్మే దుకాణాలు వెలిశాయి. వీటిలో అత్యంత పురాతనమైనది ‘హామ్లీస్’ టాయ్ స్టోర్. బ్రిటిష్ రాజధాని లండన్ నగరంలో ఉందిది. విలియమ్ హామ్లీ అనే ఆసామి 1760లో లండన్లోని హై హాల్బోర్న్ వీ«థిలో దీనిని నెలకొల్పాడు. తర్వాత కొద్దికాలానికే రీజెంట్ స్ట్రీట్కు దుకాణాన్ని తరలించాడు. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన, అత్యంత పెద్దదయిన ఆటబొమ్మల దుకాణంగా ఇది గిన్నిస్ రికార్డుల్లోకెక్కడం విశేషం. మొదట్లో ఇది ఒకే దుకాణంగా మొదలైనా, తర్వాతి కాలంలో శాఖోపశాఖలుగా ప్రపంచంలోని పలు దేశాలకు విస్తరించింది. భారత్లో కూడా దీని శాఖలు ఉన్నాయి. తరతరాలుగా బ్రిటిష్ రాచకుటుంబానికి అభిమాన ఆటబొమ్మల దుకాణంగా ఉన్న ‘హామ్లీస్’ చేతులు మారి, ప్రస్తుతం రిలయన్స్ రీటెయిల్ కంపెనీ చేతిలోకి వచ్చింది.‘హామ్లీస్ గ్లోబల్ హోల్డింగ్స్ లిమిటెడ్’కు చెందిన వందశాతం వాటాలను రిలయన్స్ రీటెయిల్ కంపెనీ 2019లో సొంతం చేసుకుంది. రీజెంట్ స్ట్రీట్లోని ‘హామ్లీస్’ స్టోర్ 2010లో తన 250వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ప్రస్తుతం ‘హామ్లీస్’కు బ్రిటన్లో 11 శాఖలు, మిగిలిన దేశాల్లో 90 శాఖలు ఉన్నాయి. అత్యంత పురాతనమైన ఈ దుకాణంలో దొరకని ఆటబొమ్మలు అరుదు. (చదవండి: -
రిలయన్స్, డిస్నీ విలీనం: దిగ్గజ మీడియా సంస్థగా..
రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీకి చెందిన మీడియా వ్యాపారాల విలీనం పూర్తయింది. ఈ విలీనం ఏకంగా రూ.70,352 కోట్ల విలువైన కొత్త జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేసింది. రిలయన్స్ - డిస్నీ విలీనంతో దేశంలోనే అతి పెద్ద మీడియా సామ్రాజ్యం అవతరించింది.జాయింట్ వెంచర్ వృద్ధి కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 11,500 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ సంస్థకు నీతా అంబానీ ఛైర్పర్సన్గా వ్యవహరిస్తారు, వైస్ చైర్పర్సన్గా ఉదయ్ శంకర్ ఉంటారు. విలీన కంపెనీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 16.34 శాతం వాటాను, వయాకామ్ 18 46.82 శాతం వాటాను, డిస్నీ 36.84 శాతం వాటాను పొందుతాయి.కాంపిటిషన్ కమిషన్ (సీసీఐ), జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నుంచి విలీనానికి కావలసిన అనుమతులు కూడా ఇప్పటికే లభించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, డిస్నీ విలీనం తరువాత వీటి కింద సుమారు 100 కంటే ఎక్కువ టీవీ ఛానల్స్ ఉండనున్నాయి. ఇవి ఏడాదికి 30,000 గంటల కంటే ఎక్కువ టీవీ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ను ఉత్పత్తి చేయగలవని సమాచారం.ఇదీ చదవండి: ఆధార్, పాన్ లింకింగ్: ఆలస్యానికి రూ.600 కోట్లు..రిలయన్స్ ఇండస్ట్రీస్, డిస్నీ జాయింట్ వెంచర్ భారతదేశ వినోద పరిశ్రమలో కొత్త శకానికి నాంది పలుకుతుంది. ప్రపంచ స్థాయి డిజిటల్ స్ట్రీమింగ్ సామర్థ్యాలతో పాటు డిజిటల్ ఫస్ట్ అప్రోచ్తో భారతీయులకు మాత్రమే కాకుండా.. ప్రవాస భారతీయులకు సరసమైన ధరలకు అసమానమైన కంటెంట్ ఆప్షన్స్ అందించటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. -
పేరు మార్చుకున్న అంబానీ కోడలు : ఇకపై అధికారికంగా...!
పెళ్లి తరువాత అమ్మాయిలకు అత్తింటి పేరు వచ్చి చేరడం సాధారణం. అయితే ఇది వారి వ్యక్తిగత ఇష్లాలు, ఆచారాలను బట్టి కూడా ఉంటుంది. తాజాగా రిలయన్స్ సామ్రాజ్యాన్ని సృష్టించిన అంబానీ ఇంటి కోడలు రాధికా మర్చంట్ పేరు మార్చుకుంది. పెళ్లి తర్వాత, రాధిక మర్చంట్ తన పేరులో 'అంబానీ'ని అధికారికంగా చేర్చుకుంది. రాధికా మర్చంట్ తన భర్త అనంత్ అంబానీ ఇంటిపేరును తన పేరులో చేర్చుకోవడంతో ‘రాధిక అంబానీ’గా అవతరించింది. వ్యాపారవేత్త విరేన్ మర్చంట్ కుమార్తె అయిన రాధికా మర్చంట్ తన చిరకాల బాయ్ఫ్రెండ్ అనంత్ అంబానీని ఈ ఏడాది జూలైలో పెళ్లాడింది. రాధిక తన తండ్రి వ్యాపారమైన ఎన్కోర్ హెల్త్కేర్కు డొమెస్టిక్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉంది. ఇటీవల ఎంటర్ప్రెన్యూర్ ఇండియాతో మాట్లాడిన ఆమె తన భవిష్యత్ కెరీర్ ప్లాన్లను కూడా వివరించింది. ముఖ్యంగా దక్షిణాది మార్కెట్లలో తమ వ్యాపారాన్ని విస్తరించడంపై దృష్టి సారించినట్లు రాధిక వెల్లడించింది. దేశంలోని అన్ని ప్రాంతాలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను తీసుకురావాలని ఆమె భావిస్తున్నట్టు తెలిపింది.ఇదీ చదవండి : Kartika Purnima 2024: 365 వత్తులు వెలిగిస్తే పాపాలు పోతాయా? -
రూ.11తో 10 జీబీ డేటా!
రిలయన్స్ జియో వినియోగదారులకు కొత్తగా బూస్టర్ ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్కువగా డేటా వాడుకునే కస్టమర్లకు ఈ ప్లాన్ ఎంతో ఉపయోగమని కంపెనీ తెలిపింది. ఈమేరకు ప్లాన్ వివరాలు వెల్లడించింది.కేవలం రూ.11తో 10 జీబీ 4జీ డేటా వాడుకోవచ్చు.ఈ ఆఫర్ వ్యాలిడిటీ కేవలం ఒక గంట మాత్రమే ఉంటుంది.రీఛార్జ్ చేసుకున్న గంట తర్వాత డేటా స్పీడ్ 64 కేబీపీఎస్కు తగ్గిపోతుంది.ఈ ఆఫర్ కేవలం ఇంటర్నెట్ సర్వీసుకే పరిమతం. వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సర్వీసులను ఇది అందించదు.నిర్ణీత సమయంపాటు హైస్పీడ్ డేటా అవసరమయ్యేవారికి ఈ ఆఫర్ ఎంతో ఉపయోగమని కంపెనీ తెలిపింది.లార్జ్ ఫైల్స్ లేదా సాఫ్ట్వేర్ అప్డేట్లు, డౌన్లోడ్ చేయాలనుకొనేవారికి ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పింది.ఇదీ చదవండి: సీపీఐ నుంచి ఆహార ద్రవ్యోల్బణం మినహాయింపు? -
సెబీకి షాక్.. ముకేశ్ అంబానీకి ఊరట
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)తో 2009లో విలీనమైన పెట్రోలియం లిమిటెడ్ (ఆర్పీఎల్)కు సంబంధించిన షేర్లలో 2007లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల విషయంలో ముకేశ్ అంబానీ మరో రెండు సంస్థలకు ఊరట లభించింది. ఇందుకు సంబంధించి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ విధించిన జరిమానా విధింపును కొట్టివేస్తూ శాట్ (సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్) ఇచ్చిన రూలింగ్ను తాజాగా సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.ఈ విషయంలో సెబీ దాఖలు చేసిన అప్పీల్ను కొట్టివేసింది. శాట్ జారీ చేసిన ఉత్తర్వుపై జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘మా జోక్యాన్ని కోరే ఈ అప్పీల్లో చట్టం ప్రమేయం లేదు. మీరు ఒక వ్యక్తిని ఏళ్ల తరబడి వెంబడించలేరు‘ అని బెంచ్ పేర్కొంది. కేసు వివరాలు ఇవీ... » నవంబర్ 2007లో నగదు, ఫ్యూచర్స్ విభాగాల్లో ఆర్పీఎల్ షేర్ల విక్రయం, కొనుగోలులో అవకతవకలు జరిగాయన్నది కేసు సారాంశం. » 2009లో ఆర్ఐఎల్తో విలీనం అయిన లిస్టెడ్ అనుబంధ సంస్థ– ఆర్పీఎల్లో దాదాపు 5 శాతం వాటాను విక్రయించాలని 2007 మార్చిలో ఆర్ఐఎల్ నిర్ణయం తీసుకుంది. » ఈ నేపథ్యంలోనే 2007 నవంబర్లో ఆర్పీఎల్ ఫ్యూచర్స్లో లావాదేవీలు చేపట్టేందుకు ఆర్ఐఎల్ 12 మంది ఏజెంట్లను నియమించిందని, ఈ 12 మంది ఏజెంట్లు కంపెనీ తరపున ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్ఓ) సెగ్మెంట్లో షార్ట్ పొజిషన్లు తీసుకున్నారని, అదే సమయంలో కంపెనీ నగదు విభాగంలో ఆర్పీఎల్ షేర్లలో లావాదేవీలు చేపట్టిందని సెబీ ఆరోపించింది.» ఈ కేసు విషయంలో సెబీ 2021 జనవరిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)పై రూ. 25 కోట్లు, కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీపై రూ. 15 కోట్లు, నవీ ముంబై సెజ్ ప్రైవేట్ లిమిటెడ్పై రూ. 20 కోట్లు, ముంబై సెజ్పై రూ. 10 కోట్లు జరిమానా విధించింది. నవీ ముంబై సెజ్, అలాగే ముంబై సెజ్ను ఒకప్పుడు రిలయన్స్ గ్రూప్లో పనిచేసిన ఆనంద్ జైన్ ప్రమోట్ చేయడం గమనార్హం. 12 సంస్థలకు నిధులు సమకూర్చడం ద్వారా మొత్తం మానిప్యులేషన్ స్కీమ్కు నవీ ముంబై సెజ్, ముంబై సెజ్ పాత్రధారులుగా మారినట్లు ఆరోపణ.ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!» అంబానీ, నవీ ముంబై సెజ్, ముంబై సెజ్లపై 2021లో సెబీ జారీ చేసిన ఉత్తర్వులను శాట్ 2023లో రద్దు చేసింది. జరిమానాకు సంబంధించి డిపాజిట్గా ఉంచిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని శాట్ ఆదేశించింది. కార్పొరేట్ సంస్థలు చట్టాన్ని ఉల్లంఘించే ప్రతి ఆరోపణకు మేనేజింగ్ డైరెక్టర్ను బాధ్యునిగా చేయలేవని పేర్కొంది. ఇద్దరు సీనియర్ అధికారులు అక్రమ లావాదేవీలు నిర్వహించారని స్పష్టమవుతోందని, ఈ విషయంలో ముకేశ్ అంబానీ పాత్ర ఉన్నట్లు సెబీ రుజువుచేయలేకపోయిందని పేర్కొంది. ఆర్ఐఎల్పై ఆరోపణలను మాత్రం శాట్ కొట్టివేయకపోవడం గమనార్హం. » కాగా, శాట్ రూలింగ్ను సవాలుచేస్తూ, డిసెంబర్ 2023 డిసెంబర్ 4న సెబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
అడిగితే 'జియో హాట్స్టార్' ఇచ్చేస్తాం: చిన్నారుల ఆఫర్
కొన్ని రోజులకు ముందు తీవ్ర చర్చకు దారితీసిన జియో హాట్స్టార్ డొమైన్ వ్యవహారం.. మళ్ళీ మరో కీలక మలుపు తిరిగింది. తాజాగా దుబాయ్కి చెందిన ఇద్దరు చిన్నారులు తాము కొనుగోలు చేసిన జియో హాట్స్టార్ డొమైన్ను రిలయన్స్ సంస్థకు ఉచితంగా ఇచ్చేస్తాం అంటూ ఆఫర్ ఇచ్చారు.నిజానికి జియో హాట్స్టార్ విలీనం వేళ.. ఈ పేరుతో ఉన్న డొమైన్ను ఢిల్లీకి చెందిన యాప్ డెవలపర్ ముందుగానే తన పేరుతో రిజిస్టర్ చేసుకున్నాడు. తాను కొనుగోలు చేసిన డొమైన్ను ఇవ్వాలంటే రూ. కోటి రూపాయలు ఇవ్వాలంటూ.. అంబానీకి ఆఫర్ ఇచ్చాడు. ఆ తరువాత డొమైన్ను దుబాయ్కు చెందిన ఇద్దరు చిన్నారులు కొనుగోలు చేశారు.జియో హాట్స్టార్ కొనుగోలు చేసిన చిన్నారులు.. దీనికి సంబంధించిన ఓ కీలక ప్రకటన చేశారు. ఈ డొమైన్ను రిలయన్స్ కంపెనీ కోరుకుంటే ఉచితంగానే ఇచ్చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక రిలయన్స్ సంస్థ నుంచి గానీ.. సంబంధిత అధికారుల నుంచి గానీ ఎలాంటి ఒత్తిడి లేదు. మనస్ఫూర్తిగానే మేము ఈ ప్రకటన చేస్తున్నామని ఆ చిన్నారులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: మాస్క్డ్ ఆధార్ కార్డు గురించి తెలుసా?: ఇది చాలా సేఫ్..చిన్నారులు ఇచ్చిన ఆఫర్కు కంపెనీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అంతకంటే ముందు యాప్ డెవలపర్ నుంచి చిన్నారులు కొనుగోలు చేసిన తరువాత.. చాలామంది ఆ డొమైన్ను విక్రయించండి, అంటూ ఆఫర్ చేసినట్లు వెల్లడించారు. కానీ ఎవరికీ డొమైన్ను విక్రయించలేదని వారు స్పష్టం చేశారు. కేవలం యాప్ డెవలపర్కు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో జియో హాట్స్టార్ డొమైన్ కొనుగోలు చేసినట్లు చిన్నారులు వెల్లడించారు. -
'కంగువ' టీమ్కు గుడ్న్యూస్ చెప్పిన మద్రాసు హైకోర్టు
సౌత్ ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం 'కంగువ'. ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, ఈ సినిమా నిర్మాతలకు మద్రాస్ కోర్టు శుభవార్త చెప్పింది. కంగువ విడుదలను నిలిపివేయాలని రిలయన్స్ సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును పూర్తిగా పరిశీలించిన కోర్టు ఫైనల్ తీర్పును వెల్లడించింది. సినిమా విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేవని క్లారిటి ఇచ్చింది. దీంతో ముందుగా అనుకున్న సమయానికే కంగువ విడుదల కానుందని ప్రకటించింది.కంగువ నిర్మాత కేఈ.జ్ఞానవేల్ రాజా, రిలయన్స్ సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో పలు చిక్కులు ఉన్నాయి. స్టూడియో గ్రీన్ నిర్మాణ సంస్థ తరపున టెడ్డీ-2, ఎక్స్ మీట్స్ ఓయ్, తంగలాన్ చిత్రాల నిర్మాణం కోసం రిలయన్స్ నుంచి రూ.99 కోట్లు పైగానే జ్ఞానవేల్ రాజా రుణం పొందారు. అయితే, రూ.45 కోట్లు తిరిగి చెల్లించిన జ్ఞానవేల్ రాజా మిగిలిన రూ.55 కోట్లు చెల్లించకుండా కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించారని రిలయన్స్ తరపున మద్రాస్ హైకోర్టులో కేసు దాఖలైంది. అయితే, తాజాగా జరిగిన విచారణలో స్టూడియో గ్రీన్ కంపెనీ తరపున ఉన్న న్యాయవాది మాట్లాడుతూ.. రిలయన్స్ కంపెనీకి చెల్లించాల్సిన మొత్తం డబ్బు పూర్తిగా చెల్లించామన్నారు. దీంతో లాయర్ చెప్పిన మాటలను రికార్డ్ చేసుకున్న న్యాయస్థానం కంగువ సినిమాకు ఎలాంటి అడ్డంకులు లేవని తెలిపింది. జస్టిస్ అబ్దుల్ కుద్దూస్ ఎదుట ఈ కేసు విచారణకు వచ్చింది. నవంబర్ 8న రియలన్స్కు కేఈ.జ్ఞానవేల్ రాజా రూ. 55 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది.శివ దర్శకత్వంలో తెరకెక్కిన కంగువ సినిమాలో సూర్య, దిశా పటానీ, బాబీ డియోల్ కీలకపాత్రలు చేశారు. యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ.జ్ఞానవేల్ రాజా ఈ సినిమా కోసం భారీగానే ఖర్చుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 10వేల స్క్రీన్స్లో దీన్ని ప్రదర్శించనున్నట్లు తెలిపారు. దక్షిణాదిలో 2,500 స్క్రీన్స్లలో ఈ చిత్రం విడుదలైతే.. ఉత్తరాదిలో 3,500 స్క్రీన్స్లలో విడుదల కానుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టేలా కంగువ ఉంది. -
ఇక రిలయన్స్ ‘స్నాక్స్’!
ముంబై: పంపిణీదార్లకు అధిక మార్జిన్లను అందిస్తూ క్యాంపాతో సాఫ్ట్డ్రింక్స్ మార్కెట్లో సంచలనం సృష్టించిన రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (ఆర్సీపీఎల్) తాజాగా స్నాక్స్ మార్కెట్పైనా గురిపెట్టింది. చిప్స్, బిస్కెట్స్ మొదలైన వాటి విషయంలోనూ అదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. సూపర్ స్టాకిస్ట్స్లకు మిగతా బ్రాండ్స్ అందించే 3–5 శాతంతో పోలిస్తే (పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు కూడా కలిపి) దాదాపు రెట్టింపు ఇస్తున్నట్లు మార్కెట్ వర్గాలు వివరించాయి. ఆర్సీపీఎల్ 6.5 శాతం ట్రేడ్ మార్జిన్ను ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇక డిస్ట్రిబ్యూటర్ల స్థాయిలో చూస్తే 8 శాతం మార్జిన్లతో పాటు అదనంగా 2 శాతం (పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు సహా) ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. సాధారణంగా డి్రస్టిబ్యూటర్లకు ఇతర స్నాక్ బ్రాండ్స్ 6–6.5 శాతం ఆఫర్ చేస్తుంటాయి. ఆర్సీపీఎల్ అటు రిటైలర్లకు ఏకంగా 20 మార్జిన్ను ఆఫర్ చేస్తోంది. ఈ సెగ్మెంట్లో చాలాకాలంగా ఆధిపత్యం కొనసాగిస్తున్న బ్రిటానియా, పెప్సీకో, స్థానిక కంపెనీలు, ఇతర బ్రాండ్లు ఇచ్చేది 8–15 శాతంగా (మార్జిన్లు, స్కీములు కలిపి) ఉంటోంది. ఆర్సీపీఎల్ ప్రస్తుతం చిప్స్, నమ్కీన్స్ వంటి స్నాక్స్కి సంబంధించి అలాన్ బ్యూగుల్స్, స్నాక్ట్యాక్ బ్రాండ్లను, ఇండిపెండెన్స్ పేరిట బిస్కట్ బ్రాండ్ను విక్రయిస్తోంది.42 వేల కోట్ల మార్కెట్..అధ్యయనాల ప్రకారం దేశీయంగా స్నాక్స్ మార్కెట్ 2023లో సుమారు రూ. 42,695 కోట్ల స్థాయిలో ఉంది. ఇది వార్షికంగా 9.08 శాతం వృద్ధి చెందుతూ 2032 నాటికి రూ. 95,522 కోట్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. దేశీ ఎఫ్ఎంసీజీ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లుగా ఆర్సీపీఎల్ 2022లో ప్రకటించింది. ఆ తర్వాత నుంచి కంపెనీ క్రమంగా కోలా మార్కెట్లోకి చొచ్చుకుపోయే వ్యూహాలను అమలు చేయడం మొదలెట్టింది. పోటీ సంస్థలతో పోలిస్తే ఉత్పత్తులను తక్కువ ధరకే అందించడం, పంపిణీదార్లకు అధిక మార్జిన్లు ఇవ్వడం మొదలైనవి అమలు చేసింది. అమెరికాకు చెందిన అలాన్ బ్యూగుల్స్ బ్రాండ్ను భారత్కి తెస్తున్నట్లు గతేడది మే నెలలో ప్రకటించింది. సాల్టెడ్తో పాటు టొమాటో, చీజ్ తదితర ఫ్లేవర్లలో రూ. 10కే అందించనున్నట్లు పేర్కొంది. సాధారణంగా పెద్ద సంస్థలు మార్కెటింగ్ కోసం కేటాయించే దానిలో 10–15 శాతం కూడా ఖర్చు చేయకుండానే అమ్మకాలను పెంచుకునేందుకు సేల్స్ వ్యవస్థను కూడా ఆర్సీపీఎల్ పటిష్టం చేసుకుంటోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రిటైల్ స్టోర్స్లో వినియోగదార్ల దృష్టిని ఆకర్షించేందుకు మరిన్ని లాంచ్ ప్రమోషన్లను ఆఫర్ చేస్తోందని పేర్కొన్నాయి. -
నీతా.. నిన్నే పెళ్లాడుతా! ట్రాఫిక్ సిగ్నల్లో ప్రపోజ్
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ జీవిత భాగస్వామి నీతా అంబానీ తన 60వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె జీవితంలో ఎంతో ముఖ్యమైన ముఖేష్ అంబానీతో ప్రేమ కథ ఎలా ప్రారంభమైందో ఈ కథనంలో తెలుసుకుందాం..ధీరూభాయ్ని మెప్పించి..ముఖేష్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ.. నీతా హుందాతనం, ప్రతిభను చూసి తన కోడలుగా ఎంచుకున్నారు. ఓసారి నీతా భరతనాట్యం ప్రదర్శనను తిలకించిన ధీరూభాయ్ తన కొడుకు ముఖేష్ ఆమే సరిజోడని భావించారు. వారిద్దరికీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇది వారి మధ్య స్నేహాన్ని క్రమంగా పెంచింది.చెబితేనే కారు కదిలేది..మీడియా నివేదికల ప్రకారం.. ఒకరోజు ముఖేష్ అంబానీ, నీతాతో కలిసి కారులో వెళ్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆపి నీతా వైపు తిరిగి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగారు. నిశ్చేష్టురాలైన ఆమె ఆశ్చర్యంతో ఏమీ చెప్పలేక కొద్దిసేపు అలాగే ఉండిపోయింది. సమాధానం చెప్పే వరకూ కారు కదలదని ముఖేష్ అంబానీ చెప్పారు. దీంతో తరువాత ఆమె అంగీకరించారు. అలా వారు కలిసి జీవితాన్ని ప్రారంభించారు. -
‘పర్యావరణం కోసం వాటికి నేను దూరం’
దీపావళి పండగను పురస్కరించుకుని చాలా మంది విభిన్న రీతుల్లో వేడుకలు నిర్వహించుకుంటారు. దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్న ముఖేశ్ అంబానీ గారాలపట్టి, ఆయన కూతురు ఇషా అంబానీ దీపావళి రోజును ఎలా జరుపుకుంటారో తెలిపారు. ఇంటిల్లిపాది ఎలా వేడుకలు నిర్వహించుకుంటారో తెలియజేశారు. తన వ్యాపారాలు వృద్ధికి ఈ పండగ ఎలా ఉపయోగపడుతుందో చెప్పారు.‘చిన్ననాటి నుంచి నాకు పండుగలంటే చాలా సరదా. ఆ సమయంలో మా ఇల్లు బంధువులతో, పండుగ వేడుకలతో కళకళలాడుతుంది. ఎన్ని పనులున్నా అమ్మానాన్నలు వాటిని పక్కన పెట్టి మాతోనూ, బంధుమిత్రులతోనూ గడుపుతారు. బిజీ జీవితంలో పండుగలు మా అందరికీ ఓ ఆటవిడుపులా దోహదపడుతాయి. అంతేకాదు ఎన్నో విషయాల్నీ శాస్త్రాల్నీ తెలియజేస్తుంటాయి. అయితే నాకు అన్ని పండుగల్లో కెల్లా దీపావళి అంటే చాలా ఇష్టం. మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించడం, ఆ వెలుగును చూస్తూ ఆనందించడం అలవాటు. ఆ కాంతులు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చినట్టు అనిపిస్తుంది. దాంతో వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఈ పండగ వాతావరణం ఎంతో ఉపయోగపడుతుంది. టపాసుల విషయానికొస్తే పక్షుల్నీ, జంతువుల్నీ భయపెట్టీ, పర్యావరణానికి హాని చేసే వాటికి నేను దూరం’ అని చెప్పారు.ఇదీ చదవండి: ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహించే ఏకైక దేశం భారత్!ఇషా అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్న కంపెనీలు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ రిలయన్స్ ట్రెండ్స్ టిరా బ్యూటీ యూస్టా అజార్ట్ హామ్లేస్ నెట్మెడ్స్ ఫ్రెష్పిక్ -
రిలయన్స్ దీపావళి గిఫ్ట్ చూశారా?
దీపావళి సందర్భంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు బహుమతులు ఇస్తాయి. కొన్ని కంపెనీలు బోనస్ల రూపంలో నగదు పంపిణీ చేస్తే మరికొన్ని స్వీట్లు, ఇతర గిఫ్ట్లు ఇస్తూంటాయి. భారత్లోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి బహుమతి అందించింది. రిలయన్స్ ఇచ్చిన గిఫ్ట్బాక్స్ అన్బాక్స్ వీడియో ప్రస్తుతం వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.రిలయన్స్ జియో ఇన్ఫోకామ్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని తనకు అందించిన గిఫ్ట్ బాక్స్ను అన్బాక్స్ చేస్తూ వీడియో రికార్డు చేసింది. ఈ వీడియోలో ఇంగ్లీషు, హిందీలో ‘దీపావళి శుభాకాంక్షలు’, ‘శుభ్ దీపావళి’ అని రాసిన తెల్లటి బాక్స్ను గమనించవచ్చు. ఇందులో మూడు ప్యాకెట్లు ఉన్నాయి. వాటిలో జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష(కిస్మిస్) ఉన్నాయి. View this post on Instagram A post shared by sumanasri😍 (@itlu_me_suma)ఇదీ చదవండి: ఉద్యోగులకు టీ, కాఫీ నిలిపివేత!రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, భార్య నీతా అంబానీ, ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా, ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్తోపాటు తమ కుటుంబంలోని నలుగురు మనవరాళ్లు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు నోట్ ఉంది. -
దీపావళి ఆఫర్: రూ. 699కే జియో 4జీ ఫోన్
రిలయన్స్ జియో.. జియో భారత్ దీపావళి ధమాకా ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద 999 రూపాయల వద్ద లభిస్తున్న 4జీ ఫోన్లను కేవలం రూ. 699లకు అందిస్తోంది. ఈ అవకాశం కేవలం కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 2జీ ఫీచర్ ఫోన్స్ నుంచి అప్గ్రేడ్ అవ్వాలనుకునే వారికి ఇదొక గొప్ప అవకాశం.రూ.123 నెలవారీ సబ్స్క్రిప్షన్ & ప్రయోజనాలుపండుగ సీజన్ ఆఫర్ జియో భారత్ ప్లాన్తో వినియోగదారులు రూ. 123 నెలవారీ సబ్స్క్రిప్షన్ని ఆస్వాదించవచ్చు. ⋆అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్⋆నెలకు 14 జీబీ డేటా⋆455 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్లు⋆సినిమా ప్రీమియర్లు & కొత్త సినిమాలు⋆వీడియో షోలు⋆లైవ్ స్పోర్ట్స్⋆జియో సినిమాలో హైలెట్స్⋆క్యూఆర్ కోడ్ స్కాన్లతో కూడా డిజిటల్ ట్రాన్సక్షన్⋆జియోపే ద్వారా అందుకున్న చెల్లింపులకు సౌండ్ అలర్ట్లను స్వీకరించడం⋆గ్రూప్ చాట్లు⋆జియో చాట్లో వీడియోలు, ఫోటోలు, మెసేజింగ్ వంటివి షేర్ చేయడంఇతర ఆపరేటర్లు అందిస్తున్న అతి తక్కువ ఫీచర్ ఫోన్ ప్లాన్తో (నెలకు రూ. 199) పోలిస్తే.. జియో భారత్ ప్లాన్ (నెలకు రూ. 123) దాదాపు 40 శాతం చౌకగా ఉంటుంది. దీంతో యూజర్ ప్రతినెలా రూ. 76 ఆదా చేయవచ్చు. ఇలా ఆదా చేస్తే మీరు తొమ్మిది నెలల్లో ఫోన్ కొన్న డబ్బును తిరిగి పొందినట్లే అవుతుంది. ఇది కేవలం ఫోన్ కంటే కూడా మీకు ఇష్టమైనవారికి ఇచ్చే గిఫ్ట్గా కూడా పనికొస్తుంది. దీనిని జియోమార్ట్ లేదా అమెజాన్ వంటి వాటిలో కొనుగోలు చేయవచ్చు. -
ఏడేళ్ల తర్వాత రిలయన్స్ గుడ్న్యూస్
దేశంలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా పేరున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏడేళ్ల తర్వాత తన మదుపర్లకు శుభవార్త చెప్పింది. ఈ దీపావళి పండగ నేపథ్యంలో ధన్తేరాస్కు ముందు అక్టోబర్ 28న బోనస్ షేర్ల రికార్డు తేదీని ప్రకటించింది. గత ఏడేళ్ల నుంచి కంపెనీ ఎలాంటి బోనస్ షేర్లను ప్రకటించకపోవడంతో మదుపర్లు కొంత నిరాశతో ఉన్నారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర ఇటీవల భారీగా పడిపోయింది. కేవలం ఈ కంపెనీ అనే కాదు, మార్కెట్ సూచీలు భారీగా నష్టాల బాటపట్టాయి. అక్టోబర్ 25తో ముగిసిన ట్రేడింగ్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర రూ.2,655.45గా ఉంది. తాజాగా కంపెనీ 1:1 బోనస్ ప్రకటించింది. అంటే డీమ్యాట్లో ఒక షేర్ ఉంటే అదనంగా మరో షేర్ జమ అవుతుంది. అందుకు అనుగుణంగా షేర్ ధర కూడా సమానంగా డివైడ్ అవుతుంది. ఫలితంగా ధర తగ్గినట్లు కనిపిస్తుంది. ఈ బోనస్కు అక్టోబర్ 28ను రికార్డు తేదీగా నిర్ణయించారు. ఆ తేదీలోపు డీమ్యాట్ ఖాతాలో కంపెనీ షేర్లు ఉంటే ఈ బోనస్కు అర్హులుగా పరిగణిస్తారు.ఇదీ చదవండి: గ్రామీణ బ్రాడ్బ్యాండ్ విస్తరణకు ఏం చేయాలంటే..రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫార్చ్యూన్ 500 కంపెనీ(అధిక రెవెన్యూ సంపాదిస్తూ అంతర్జాతీయంగా సర్వీసులు అందించే కంపెనీలకు ఇచ్చే గుర్తింపు). ఇది ఎనర్జీ, పెట్రోకెమికల్స్, టెక్స్టైల్స్, రిటైల్, టెలికమ్యూనికేషన్స్, పునరుత్పాదక ఇంధనం, ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా వంటి విభిన్న రంగాల్లో సేవలిందిస్తోంది. 2023-24లో రూ.80 వేలకోట్ల ఆదాయం సంపాదించింది. 2024 నాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ రూ.17,55,986 కోట్లుగా ఉంది. -
‘నా పెళ్లి కోసం అన్నయ్య పెళ్లి వాయిదా’
ఇంట్లో పెళ్లికి ఎదిగిన కొడుకు, కూతురు ఉంటే తల్లిదండ్రులు కూతురికే ముందు పెళ్లి చేయాలనుకుంటారు. ఈ ఆనవాయితి దేశీయంగా దాదాపు అందరి ఇళ్లల్లో జరుగుతోంది. పేద, మధ్య తరగతి, ధనిక కుటుంబాలనే తేడా లేకుండా దీన్ని పాటిస్తున్నారు. ఇందుకు అంబానీ కుటుంబం కూడా అతీతం కాదని నిరూపించారు. ముఖేశ్-నీతా అంబానీ దంపతులకు ఇషా అంబానీ, ఆకాశ్ అంబానీలు కవల పిల్లలు. మొన్న అక్టోబర్ 23న వారు పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి, తన సోదరుడి పెళ్లికి సంబంధించి ఇషా అంబానీ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.‘అన్నయ్య ఆకాశ్ అంబానీ పెళ్లి శ్లోకామెహతాతో నిర్ణయించుకున్నారు. మార్చి 24, 2018న గోవాలో ఎంగేజ్మెంట్ పూర్తయింది. మే, 2018లో ఆనంద్ పిరమాల్తో నాకు నిశ్చితార్థం జరిగింది. ముందుగా అన్నయ్య ఎంగేజ్మెంట్ జరిగింది కాబట్టి, తన వివాహం ముందే జరగాల్సి ఉంది. కానీ నా పెళ్లి కోసం తన వివాహాన్ని వాయిదా వేసుకున్నాడు. అందుకు వదిన శ్లోకామెహతా కూడా ఎంతో సహకరించింది. నా వివాహం డిసెంబర్ 2018లో పూర్తయిన తర్వాత మార్చి 9, 2019లో అన్నయ్య-వదినల పెళ్లి జరిగింది’ అని ఇషా అంబానీ చెప్పారు.ఇషా అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్న కంపెనీలు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ రిలయన్స్ ట్రెండ్స్ టిరా బ్యూటీ యూస్టా అజార్ట్ హామ్లేస్ నెట్మెడ్స్ ఫ్రెష్పిక్ఇదీ చదవండి: ఉచిత భోజనం వోచర్లు వాడిన ఉద్యోగుల తొలగింపుఆకాశ్ అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ జియో ప్లాట్ఫామ్స్ లిమిడెట్ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ముంబయి ఇండియన్స్ -
ఎన్విడియాతో రిలయన్స్ జట్టు
ముంబై: అమెరికన్ టెక్ దిగ్గజం ఎన్విడియా, దేశీ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా చేతులు కలిపాయి. భారత్లో కృత్రిమ మేధ (ఏఐ) కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల కల్పన, ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయడంపై కసరత్తు చేయనున్నాయి. రిలయన్స్కి చెందిన కొత్త డేటా సెంటర్లో ఎన్విడియాకి చెందిన బ్లాక్వెల్ ఏఐ చిప్లను వినియోగించనున్నారు. ఎన్విడియా ఏఐ సమిట్లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ సీఈవో జెన్సెన్ హువాంగ్, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. భాగస్వామ్యం కింద రూపొందించే అప్లికేషన్లను రిలయన్స్ .. భారత్లోని వినియోగదార్లకు కూడా అందించే అవకాశం ఉందని హువాంగ్ తెలిపారు. అయితే, ఈ భాగస్వామ్యానికి సంబంధించి పెట్టుబడులు, నెలకొల్పబోయే మౌలిక సదుపాయాల సామర్థ్యాలు మొదలైన వివరాలను వెల్లడించలేదు. ‘చిప్ల డిజైనింగ్లో భారత్కి ఇప్పటికే ప్రపంచ స్థాయి నైపుణ్యాలు ఉన్నాయి. ఎన్విడియా చిప్లను హైదరాబాద్, బెంగళూరు, పుణెలో డిజైన్ చేస్తున్నారు. ఎన్విడియాలో మూడో వంతు ఉద్యోగులు ఇక్కడే ఉన్నారు‘ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు సాఫ్ట్వేర్ సేవలతో ప్రపంచానికి ఐటీ బ్యాక్ ఆఫీస్గా పేరొందిన భారత్ ఇకపై అవే నైపుణ్యాలను ఉపయోగించి ఏఐ ఎగుమతి దేశంగా ఎదగవచ్చని చెప్పారు. 2024లో భారత కంప్యూటింగ్ సామర్థ్యాలు 20 రెట్లు వృద్ధి చెందుతాయని, త్వరలోనే ప్రభావవంతమైన ఏఐ సొల్యూషన్స్ను ఎగుమతి చేస్తుందన్నారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో రెండో స్థానంలో ఉన్న ఎన్విడియాకు .. భారత్లో హైదరాబాద్ సహా ఆరు నగరాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. భారీ ఇంటెలిజెన్స్ మార్కెట్గా భారత్: అంబానీ భారత్ ప్రస్తుతం కొత్త తరం ఇంటెలిజెన్స్ సాంకేతికత ముంగిట్లో ఉందని, రాబోయే రోజుల్లో వినూత్న ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుందని ముకేశ్ అంబానీ చెప్పారు. ‘అతిపెద్ద ఇంటెలిజెన్స్ మార్కెట్లలో ఒకటిగా భారత్ ఎదుగుతుంది. మనకు ఆ సత్తా ఉంది. ప్రపంచానికి కేవలం సీఈవోలనే కాదు ఏఐ సరీ్వసులను కూడా ఎగుమతి చేసే దేశంగా భారత్ ఎదుగుతుంది‘ అని అంబానీ వ్యాఖ్యానించారు. దేశీయంగా పటిష్టమైన ఏఐ ఇన్ఫ్రా ఉంటే స్థానికంగా సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ మార్కెట్లో భారత్ కీలక దేశంగా మారగలదని ఆయన చెప్పారు. అమెరికా, చైనాలతో పాటు భారత్లో అత్యుత్తమ డిజిటల్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని అంబానీ చెప్పారు. డేటాను అత్యంత చౌకగా అందిస్తూ సంచలనం సృష్టించినట్లుగానే ఇంటెలిజెన్స్ విషయంలోనూ గొప్ప విజయాలతో ప్రపంచాన్ని భారత్ ఆశ్చర్యపర్చగలదని ఆయన పేర్కొన్నారు.ఇన్ఫీ, టీసీఎస్లతో కూడా.. భారత మార్కెట్లో కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా టెక్ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రోలతో చేతులు కలుపుతున్నట్లు హువాంగ్ తెలిపారు. ఎన్విడియా ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫాం ఆధారిత ఏఐ సొల్యూషన్స్ను వినియోగించుకోవడంలో క్లయింట్లకు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో తోడ్పడనున్నాయి. అలాగే ఇండస్ 2.0 అనే ఏఐ నమూనాను అభివృద్ధి చేసేందుకు ఎన్విడియా మోడల్ను టెక్ మహీంద్రా ఉపయోగించనుంది. అటు టాటా కమ్యూనికేషన్స్, యోటా డేటా సర్వీసెస్ వంటి సంస్థలకు ఎన్విడియా తమ హాపర్ ఏఐ చిప్లను సరఫరా చేయనుంది. -
రిలయన్స్ డిజిటల్ దీపావళి ఆఫర్: ఎలక్ట్రానిక్స్పై భారీ తగ్గింపు
దీపావళిని భారతదేశంలో మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి.. రిలయన్స్ డిజిటల్ ‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్’ సేల్ పేరుతో ఎలక్ట్రానిక్స్పై బ్లాక్బస్టర్ డీల్స్ అందించడం ప్రారంభించింది. 2024 నవంబర్ 3 లోపు ప్రముఖ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేసే రూ. 15000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్ దేశ వ్యాప్తంగా ఉన్న రిలయన్స్ డిజిటల్/మై జియో స్టోర్స్లో మాత్రమే కాకుండా.. 'రిలయన్స్ డిజిటల్.ఇన్'లో కూడా అందుబాటులో ఉంటుంది. స్టోర్లలో కొనుగోలు చేసేవారు రూ. 22,500 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.రిలయన్స్ డిజిటల్ అందిస్తున్న కొన్ని అత్యుత్తమ డీల్స్..➤శామ్సంగ్ నియోక్యూఎల్ఇడి టీవీకి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. దీని కొనుగోలుపైన 3 సంవత్సరాల వారంటీతో రూ.41,990 విలువైన 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ ఉచితంగా పొందవచ్చు. ఈఎంఐ రూ.1,990 నుంచి ప్రారంభమవుతుంది.➤రూ.46,900 విలువైన యాపిల్ వాచ్ సీరీస్ 10 ఇప్పుడు రూ. 44,900లకే లభిస్తోంది. రూ.24,999 విలువైన జేబీఎల్ లైవ్ బీమ్ 3ని కేవలం రూ.12,599లకే పొందవచ్చు.➤రూ.45900కే ఐఫోన్ 14 కొనుగోలుపైన తక్షణ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ వంటివి పొందవచ్చు. రిలయన్స్ డిజిటల్లో మాత్రమే లభిస్తున్న మోటొరోలా, గూగుల్ పిక్సెల్ ఫోన్ సీరీస్ కూడా ఆకర్షణీయమైన ధరలకు లభిస్తున్నాయి.➤హోమ్, కిచెన్ యాక్ససరీస్ మీద ''ఎక్కువ కొనండి, ఎక్కువ ఆదా చేసుకోండి' ఆఫర్ను కూడా రిలయన్స్ అందిస్తోంది. వినియోగదారులు ఒకటి కొంటే 5 శాతం, రెండు కొంటే 10 శాతం, మూడు లేదా అంతకంటే ఎక్కువ కొంటే అన్లిమిటెడ్ డిస్కౌంట్తో 15 శాతం తగ్గింపు పొందవచ్చు.➤ల్యాప్టాప్లపై రూ.20,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. మరోవైపు రూ.50,999లకే ప్రారంభమవుతున్న 3050 గ్రాఫిక్స్కార్డులతో గేమింగ్ ల్యాప్టాప్లపై అబ్బురపరిచే డీల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.➤రూ.47000లకు ప్రారంభమవుతున్న వాషర్ డ్రైయర్ కొనుగోలు చేస్తే.. రూ.7295 విలువైన ఎయిర్ ఫ్రైయర్ ఉచితంగా ఇంటికి తీసుకెళ్లవచ్చు.➤రూ.28990ల ప్రారంభ ధర వద్ద లభిస్తున్న 1.5 టన్స్ 3 స్టార్ స్మార్ట్ ఏసీ అందుబాటులో ఉంది.➤రూ. 47,990కి ప్రారంభమవుతున్న ఎంపిక చేసిన సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ల కొనుగోలుపైన.. రూ. 7295 విలువైన ఎయిర్ ఫ్రైయర్ని రూ. 1499కే సొంతం చేసుకోవచ్చు. -
అంబానీ కవల పిల్లల వ్యాపార సామ్రాజ్యం
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ వారసులు, కవలు ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీలు బుధవారం పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ముఖేశ్-నీతా అంబానీ దంపతులకు ఐవీఎఫ్ ద్వారా అక్టోబర్ 23, 1991లో వీరు ఇద్దరు జన్మించారు.ఇషా అంబానీముంబయిలో అక్టోబర్ 23, 1991లో జన్మించారు.యేల్ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.పిరమల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ పిరమల్ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.కింది సంస్థలకు ఇషా అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్రిలయన్స్ ట్రెండ్స్టిరా బ్యూటీయూస్టాఅజార్ట్హామ్లేస్నెట్మెడ్స్ఫ్రెష్పిక్ఇదీ చదవండి: పెట్రోల్ కల్తీని ఎలా గుర్తించాలంటే..ఆకాశ్ అంబానీముంబయిలో అక్టోబర్ 23, 1991లో జన్మించారు.ముంబయిలోని ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషన్ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు.అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.2018లో శ్లోకామెహతాను వివాహం చేసుకున్నారు. వీరికి పృథ్వీ, వేద ఇద్దరు పిల్లలు.కింది సంస్థలకు ఆకాశ్ అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్జియో ప్లాట్ఫామ్స్ లిమిడెట్రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ముంబయి ఇండియన్స్ -
రిలయన్స్ రిటైల్ విస్తరణ
రిలయన్స్ రిటైల్ తన కార్యకలాపాలు విస్తరిస్తోంది. యువతకు ఫ్యాషన్ ఉత్పత్తులను అందించే ‘అజార్ట్’ బ్రాండ్ స్టోర్లను పెంచాలని నిర్ణయించింది. అందులో భాగంగా దేశంలోని ప్రధాన నగరాల్లో 12 కొత్త స్టోర్లను ప్రారంభించినట్లు తెలిపింది. జైపూర్, ఉదయపూర్, రాయ్పూర్, దెహ్రాదూన్, గోరఖ్పూర్, రాంచీ, బెంగళూరులోని వివిధ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.ఇప్పటికే బెంగళూరులో అజార్ట్ బ్రాండ్ పేరుతో స్టోర్లను ప్రారంభించిన రిలయన్స్ రిటైల్ వీటి సంఖ్యను ఐదుకు పెంచింది. ఈ సందర్భంగా రిలయన్స్ రిటైల్ ఫ్యాషన్, లైఫ్స్టైల్ సీఈఓ అఖిలేష్ ప్రసాద్ మాట్లాడుతూ..‘అజార్ట్ బ్రాండ్ను 2022లో స్థాపించాం. క్రమంగా బ్రాండ్ కార్యకలాపాలు విస్తరిస్తున్నాం. యువత నుంచి ఈ బ్రాండ్కు ఆదరణ పెరుగుతోంది. టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఈ బ్రాండ్ యువతకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాం. వినియోగదారుల జీవనశైలిని ప్రతిబింబించేలా, మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందించేలా కంపెనీ పనిచేస్తోంది’ అన్నారు.ఇదీ చదవండి: పాలసీదారుల డేటా లీక్..! ఐటీ సిస్టమ్ల ఆడిట్పండగ సీజన్లో చాలా కంపెనీలు తమ వ్యాపారాలు విస్తరించాలని యోచిస్తుంటాయి. ఫెస్టివల్ నేపథ్యంలో తమ బ్రాండ్ ఉత్పత్తులకు ఆదరణ ఉంటుందని నమ్ముతాయి. కంపెనీ ఉత్పత్తులు వినియోగదారులకు నచ్చితే తదుపరి గిరాకీ ఏర్పడుతుందని భావిస్తాయి. -
రిలయన్స్, వాల్ట్ డిస్నీ డీల్కు ఆమోదం.. షరతులివే..
రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీల మీడియా అసెట్స్ విలీన ప్రతిపాదనకు దాదాపు రెండు నెలల తర్వాత కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఆమోదముద్ర వేసింది. ఇందుకోసం కొన్ని షరతులు విధిస్తూ మంగళవారం 48 పేజీల ఉత్తర్వులను జారీ చేసింది.సీసీఐ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇరు సంస్థలు ఏడు టీవీ చానళ్లను విక్రయించాలి. వీటిలో స్టార్ జల్సా మూవీస్, కలర్స్ మరాఠీ, హంగామా మొదలైనవి ఉన్నాయి. అలాగే క్రికెట్ ఈవెంట్ల ప్రసారాల అడ్వర్టైజ్మెంట్ స్లాట్లకు సంబంధించి బండిల్డ్ విధానంలో వసూలు చేయకూడదు. ఐపీఎల్, ఐసీసీ, బీసీసీఐ వంటి కీలక క్రికెట్ మ్యాచ్ల ఫీడ్ను ప్రసార భారతితో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు, ఇరు సంస్థల ఓటీటీ ప్లాట్ఫాంలు (స్టార్కి చెందిన డిస్నీప్లస్హాట్స్టార్, రిలయన్స్లో భాగమైన వయాకామ్18కి చెందిన జియోసినిమా) వేర్వేరుగా కొనసాగుతాయి.ఇదీ చదవండి: ఇంటి రుణం త్వరగా తీర్చండిలా.. -
జియో వరల్డ్ ప్లాజాలో.. ఈఎల్ & ఎన్ లండన్
ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రసిద్ధి చెందిన లైఫ్స్టైల్ అండ్ కేఫ్ బ్రాండ్ ఈఎల్ & ఎన్ లండన్.. జియో వరల్డ్ ప్లాజాలో తన మొదటి ఇండియన్ అవుట్లెట్ ప్రారంభించింది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ప్రారంభమైన ఈ గ్లోబల్ సెన్సేషన్ భారతీయ మార్కెట్లో మొదటి వెంచర్ అని తెలుస్తోంది.2017లో అలెగ్జాండ్రా మిల్లర్ ప్రారంభించిన ఈఎల్ & ఎన్ (ఈట్, లైవ్ & నోరిష్) ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో మంచి ఆదరణ పొందింది. ఈ బ్రాండ్ పింక్ ఇంటీరియర్స్, అద్భుతమైన ఫ్లోరల్ డెకర్ వంటి వాటితో కస్టమర్లను మాత్రమే కాకుండా.. ప్రేక్షకులను కూడా చాలా ఆకర్షించింది.ఈఎల్ & ఎన్ ఫ్యాషన్ ఫార్వర్డ్ డిజైన్, స్పెషాలిటీ కాఫీ వంటి వాటితో పాటు ప్రత్యేక ఫుడ్ కూడా అందిస్తుంది. ఈ బ్రాండ్ ప్రస్తుతం ప్యారిస్, మిలన్, దుబాయ్, కౌలాలంపూర్తో సహా ప్రపంచవ్యాప్తంగా 37 అవుట్లెట్లను నిర్వహిస్తోంది. ఇప్పుడు ముంబైలో అడుగుపెట్టి భోజన ప్రియులను, సోషల్ మీడియా ఔత్సాహికులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది.జియో వరల్డ్ ప్లాజా రెండవ అంతస్తులో ఉన్న ఈ కొత్త కేఫ్.. 2,130 చ.అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో ప్రత్యేకమైన మోటిఫ్లు, గులాబీ రంగు మెష్ షాన్డిలియర్, సిగ్నేచర్ ఏఎల్ & ఎన్ పుష్పాలు & పత్రాలు, నియాన్ కోట్లు వంటివి ఉన్నాయి. అంతే కాకుండా.. టెర్రాజో & మార్బుల్ ఫ్లోరిం, ఐకానిక్ కేక్, కాఫీ బార్ వంటివి ఉన్నాయి. -
హాట్స్టార్లో జియో సినిమా విలీనం!
రిలయన్స్, డిస్నీ విలీనం తర్వాత ఏర్పడిన జాయింట్ వెంచర్ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. డిస్నీ+హాట్స్టార్లో జియో సినిమాను విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ను 'జియో హాట్స్టార్'గా పిలువనున్నట్లు సమాచారం.విలీనం పూర్తయితే.. ఐపీఎల్ 2025తో సహా అన్ని క్రికెట్ మ్యాచ్లు, స్పోర్ట్స్ ఈవెంట్లు జియో సినిమాలో అందుబాటులో ఉండవు. కంపెనీ అన్ని స్పోర్ట్స్ ఈవెంట్లను డిస్నీ+ హాట్స్టార్కి మార్చాలని యోచిస్తోంది. ఐపీఎల్ సహా భారతదేశంలో క్రికెట్ మ్యాచ్ల డిజిటల్ హక్కులను జియో సినిమా కలిగి ఉంది. డిస్నీ +హాట్స్టార్ అన్ని ఐసీసీ టోర్నమెంట్ల హక్కులను కలిగి ఉంది. అయితే ఇకపై అన్ని మ్యాచ్లను జియో హాట్స్టార్లో చూడవచ్చు. దీనికి సంబంధించి కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారం విడుదల చేయలేదు.రిలయన్స్ ఇండస్ట్రీస్, డిస్నీ ఇండియా విలీనం 2024 ఫిబ్రవరిలో జరిగింది. కొత్తగా ఏర్పడిన జాయింట్ వెంచర్లో 120 టీవీ ఛానెల్లు, జియో సినిమా, డిస్నీ+ హాట్స్టార్ అనే రెండు స్ట్రీమింగ్ సర్వీస్లు ఉన్నాయి.ఇదీ చదవండి: ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీనిజానికి మొదట హాట్స్టార్నే.. జియో సినిమాలో విలీనం చేయనున్నట్లు వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ వంటి వాటికి వేరు వేరుగా ఓటీటీలు ఉంటే బాగుంటుందని.. జియో సినిమానే డిస్నీ+హాట్స్టార్లో విలీనం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. గూగుల్ ప్లే స్టోర్లో జియో సినిమాకు 100 మిలియన్ డౌన్లోడ్స్, డిస్నీ+ హాట్స్టార్కు 500 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండూ కలిసిపోవడం చేత ఇది అతిపెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్గా అవతరించనుంది. -
జియో స్పీడ్ ఎక్కువే: ఓపెన్ సిగ్నల్!
వేగంగా నెట్వర్క్ సేవలందించడంలో జియో దూసుకుపోతుంది. నెట్వర్క్ స్పీడ్, కవరేజ్, స్థిరమైన సర్వీసులు అందించడంలో జియో మరింత మెరుగుపడిందని ఓపెన్ సిగ్నల్ నివేదించింది. దేశంలోని టెలికాం కంపెనీలతో పోలిస్తే జియో అధికంగా 89.5 ఎంబీపీఎస్ స్పీడ్ నెట్వర్క్ను అందిస్తున్నట్లు పేర్కొంది. ‘ఇండియా మొబైల్ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో భారత టెలికాం నెట్వర్క్ కంపెనీల సేవలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించింది.నివేదికలోని వివరాల ప్రకారం..రిలయన్స్ జియో గరిష్ఠంగా 89.5 ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడ్ కలిగిన నెట్వర్క్ను అందిస్తుంది. ఎయిర్టెల్ 44.2 ఎంబీపీఎస్, వొడాఫోన్ ఐడియా 16.9 ఎంబీపీఎస్తో తర్వాత స్థానాల్లో నిలిచాయి. జియో నెట్వర్క్ స్పీడ్ ఎయిర్టెల్ కంటే రెండింతలు ఎక్కువగా ఉంది. ఇది స్ట్రీమింగ్, గేమింగ్, ఇతర డేటా సేవలను మరింత మెరుగ్గా అందించే అవకాశం ఉంది. జియో నెట్వర్క్ సేవలు చాలా మారుమూల ప్రాంతాల్లో కూడా విస్తరించాయి. ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..దేశీయంగా టెలికాం నెట్వర్క్ సేవలకు సంబంధించి కస్టమర్ల అంచనాలు పెరుగుతున్నాయి. ఆన్లైన్ గేమ్లు, వీడియో స్ట్రీమింగ్, ఇతర డేటా అవసరాల కోసం వేగంగా నెట్వర్క్ ఉండాలనుకుంటున్నారు. అదే సమయంలో టెలికాం కంపెనీల మధ్య పోటీ పెరుతుతోంది. దాంతో సంస్థలు మెరుగైన సర్వీసులు ఇచ్చేందుకు సన్నద్ధం అవుతున్నాయి. ఈ ఏడాది జులైలో జియోతోపాటు ఇతర కంపెనీలు టారిఫ్ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. దాంతో కస్టమర్ల అట్రిషన్ రేటు(నెట్వర్క్ మారడం) పెరగడంతో జియో విభిన్న మార్గాలు అనుసరిస్తోంది. టారిఫ్ రేట్లను పెంచినప్పటి నుంచి నెట్వర్క్ స్పీడ్ తగ్గిపోయిందనే అభిప్రాయాలున్నాయి. కాబట్టి క్రమంగా నెట్వర్క్ స్పీడ్ పెంచుతున్నట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు. -
రిలయన్స్ జ్యువెల్స్ 'వివాహం కలెక్షన్': భారీ తగ్గింపులు కూడా..
భారతదేశంలోని అత్యంత విశ్వసనీయ ఆభరణాల బ్రాండ్స్లో ఒకటైన 'రిలయన్స్ జ్యువెల్స్' రాబోయే పండగ సీజన్ కోసం ప్రత్యేక వివాహ కలెక్షన్స్ ఆవిష్కరించింది. ఆధునికత, సంప్రదాయం రెండూ కలబోసిన వినూత్న వివాహ ఆభరణాలు ఎన్నో ఇక్కడ కనిపిస్తాయి. అందంగా తీర్చిదిద్దిన చోకర్లు, గాజులు, చెవి రింగులు, నెక్లెసులు, హాత్ ఫూల్, మాంగ్ టికా, ముక్కు పుడకలు, వడ్డాణాల వంటివి ఈ సరికొత్త ఆవిష్కరణలో ఉన్నాయి.ఈ వివాహం కలెక్షన్లో.. బంగారం, వజ్రాలతో ఎంతో సునిశితంగా తీర్చిదిద్దిన ఎనిమిది అద్భుతమైన ఆభరణాలు ఉన్నాయి. ఇవన్నీ వధువును మరింత అందంగా కనిపించేలా చేస్తాయి. అంతే కాకుండా వివిధ ప్రాంతాల సాంప్రదాయాలను ప్రతిబింబించే అనేక ప్రాంతీయ ఆభరణాలు కూడా ఈ కలెక్షన్లో ఉన్నాయి.వివాహం కలెక్షన్ ఆవిష్కరణ సందర్భంగా రిలయన్స్ జువెల్స్ సీఈఓ సునీల్ నాయక్ మాట్లాడుతూ.. భారతదేశంలో వివాహాలు సంస్కృతికి నిదర్శనం. ఈ వేడుకల్లో వధువు ఆభరణాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సంప్రదాయానికి ప్రతిరూపం మా వివాహం కలెక్షన్. ప్రాంతీయ వారసత్వం, ఆధునిక అభిరుచి కలబోతగా ఈ కలెక్షన్లోని ప్రతి సెట్ నిలుస్తూ.. నేటి వధువు వ్యక్తిత్వానికి, వ్యక్తిగత స్టైల్ను అందిపుచ్చుకుంటాయి. ఇవన్నీ కేవలం పెళ్లి రోజున ధరించేవి మాత్రమే కాదు, ఏళ్ల తరబడి ఈ ఆభరణాలు ఆనందాన్ని అందిస్తాయని ఆయన అన్నారు.రిలయన్స్ జువెల్స్ 2024 నవంబర్ 11 వరకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 25% వరకు, డైమండ్ వ్యాల్యూ, మేకింగ్ ఛార్జీలపై 30% వరకు ఆకర్షణీయ డిస్కౌంట్స్ అందిస్తోంది. ఎంతో విలువైన అద్భుతమైన ఆభరణాలపై పెట్టుబడి పెట్టేందుకు వధువులకు ఇది చక్కని అవకాశం. ఆభరాలు దేశంలోని 185కు పైగా నగరాల్లోని రిలయన్స్ జువెల్స్ స్టోర్స్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. -
‘స్మార్ట్’ ఉన్నా ఫీచర్ ఫోన్లు ఎందుకు?
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్ ఫోన్లకు భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. చాలా కంపెనీలు మొబైల్ ఫీచర్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పరిచయం చేస్తున్నాయి. దాంతో మొబైల్ ఫోన్లను మరింత స్మార్ట్గా మార్చాలని విభిన్న ప్రయోగాలు చేపడుతున్నాయి. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా ఫీచర్ ఫోన్లకు ఆదరణ మాత్రం తగ్గడంలేదు. అయితే వివిధ కారణాలతో చాలామంది ఇంకా ఫీచర్ ఫోన్లవైపే మొగ్గు చూపుతున్నారు. అందుకుగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.ప్రాథమిక కమ్యునికేషన్ కోసం ఈ ఫీచర్ ఫోన్లను ఎక్కువగా వాడుతున్నారు.స్మార్ట్ఫోన్లతో పోలిస్తే బ్యాటరీ లైఫ్ అధికంగా ఉంటుంది.కేవలం కాల్స్, టెక్ట్స్ మెసేజ్లు చేయడానికి వీలుగా దీన్ని అధికంగా వాడుతున్నారు.కొన్ని ఆఫీసుల్లో వివిధ కారణాల వల్ల స్మార్ట్ఫోన్లను అనుమతించడం లేదు. దాంతో చాలామంది ఉద్యోగులు తప్పక ఈ ఫీచర్ ఫోన్ను కొనుగోలు చేస్తున్నారు.స్మార్ట్ఫోన్ ఉన్నా కూడా నిత్యం దూర ప్రయాణాలు చేసేవారు బ్యాకప్ కోసం దీన్ని వినియోగిస్తున్నారు.ఫోన్లకు సంబంధించి సింప్లిసిటీని ఇష్టపడేవారు వీటిని కొనుగోలు చేస్తున్నారు.ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవారు తక్కువ ఖర్చుతో కూడిన ఈ ఫీచర్ ఫోన్లను తీసుకుంటున్నారు. ఒకవేళ పిల్లలు ఫోన్ కావాలని మారాం చేసి తీసుకుని కిందపడేసినా పెద్దగా నష్టం ఉండదు.వృద్ధులు, కంటి చూపు సరిగా లేనివారు ఈ ఫీచర్ ఫోన్లను సులువుగా వినియోగించవచ్చు.ఆర్థిక స్థోమత సరిగాలేని వారు ఈ ఫీచర్ ఫోన్లను ఎంచుకుంటున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్ ఫోన్ మార్కెట్ 2018-2030 మధ్య కాలంలో ఏటా 3.5 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని పలు నివేదికలు చెబుతున్నాయి. భారత్లో 2023 రెండో త్రైమాసికం లెక్కల ప్రకారం అంతకుముందు ఏడాది అదే త్రైమాసికంతో పోలిస్తే తొమ్మిది శాతం ఈ ఫోన్ల అమ్మకాలు పెరిగాయి.ఇదీ చదవండి: ఐదు కంపెనీల ప్రాపర్టీలు వేలంఇటీవల రిలయన్స్ జియో కంపెనీ 4జీ నెట్వర్క్ సదుపాయం కలిగిన ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. ఇటీవల ఢిల్లీలో ప్రారంభమైన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ) 2024 సమావేశంలో భాగంగా ఈ ఫోన్లను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. వీటి ధర రూ.1,099గా నిర్ణయించారు. అయితే రిటైలరనుబట్టి ఈ ధరలో మార్పులుంటాయని గమనించాలి. -
పెట్టుబడులకు పెద్దన్నలు
దేశీయంగా వినియోగం పెరుగుతున్న కొద్దీ వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా దిగ్గజ కంపెనీలు భారీగా కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఇందుకోసం భారీగా ఇన్వెస్ట్ చేయబోతున్నాయి. ఇటీవలి మూడీస్ రేటింగ్స్ ప్రకారం.. కొన్నాళ్ల పాటు ఏటా 45–50 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెడతాయనే అంచనాలు నెలకొన్నాయి.ఆర్థిక వృద్ధి, ఉద్యోగాల కల్పన కోసం తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు కూడా ఈ పెట్టుబడులకు దోహదపడనున్నాయి. ఇక, స్టాండర్డ్ అండ్ పూర్ అంచనాల ప్రకారం వచ్చే దశాబ్దకాలంలో కార్పొరేట్ దిగ్గజాలు 800 బిలియన్ డాలర్లపైగా పెట్టుబడులు పెట్టబోతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా, అదానీ, జేఎస్డబ్ల్యూ గ్రూప్, వేదాంత వంటి దిగ్గజాలు ఈ మేరకు ప్రణాళికలు వేసుకుంటున్నాయి. ఇందులో దాదాపు 40 శాతం పెట్టుబడులు, అంటే సుమారు 350 బిలియన్ డాలర్లు హరిత హైడ్రోజన్, పర్యావరణహిత ఇంధనాలు, ఏవియేషన్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు వంటి .. కొత్త వ్యాపారాల్లోకి రానున్నాయి. అలాగే, ప్రస్తుత వ్యాపారాలను కూడా మరింత పటిష్టం చేసుకోవడంపై బిర్లా, మహీంద్రా, హిందుజా, హీరో, ఐటీసీ, బజాజ్ వంటి పలు దిగ్గజాలు దృష్టి పెడుతున్నాయి. గడిచిన రెండేళ్లుగా ఆయా సంస్థల పెట్టుబడుల సరళిని చూస్తే ఇందుకోసం వచ్చే పదేళ్లలో దాదాపు 400 బిలియన్ డాలర్ల నుంచి 500 బిలియన్ డాలర్ల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చని అంచనాలు నెలకొన్నాయి. రిస్క్లూ ఉన్నాయి..!దేశీ దిగ్గజాల వ్యా పార వృద్ధికి అవకాశాలు భారీగానే ఉన్నప్పటికీ.. పెట్టుబడులపరంగా కొన్ని రిసు్కలు కూడా ఉంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. పెట్టుబడుల కోసం ఏవో కొన్ని సంస్థలు తప్ప చాలా మ టుకు కంపెనీలు పెద్ద ఎత్తున రుణాలపైనే ఆధారపడాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. కాబట్టి లాభదాయకత ఎలా ఉంటుందో ఇంకా తెలియని కొత్త రంగాల్లో పెట్టుబడులపరంగా కావచ్చు ప్రణాళికల అమలుపరంగా కావ చ్చు ఏవైనా సమస్యలు ఎదురైతే రుణభారం గణనీ యంగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. వీటిని గుర్తించే ఆయా కంపెనీలు కొత్త టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేసే విషయంలో ప్రత్యామ్నాయ ప్రణాళికలను కూడా సిద్ధంగా ఉంచుకుంటున్నాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
‘స్మార్ట్’ స్టోర్స్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చమురు నుంచి టెలికామ్ వరకూ అన్ని రంగాల్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న రిలయన్స్... తన రిటైల్ బిజినెస్ను మరింతగా విస్తరిస్తోంది. ప్రస్తుతం సుమారు 900 పైచిలుకు ఉన్న బిగ్ బాక్స్ స్టోర్స్ (స్మార్ట్ బజార్, స్మార్ట్ స్టోర్స్) సంఖ్యను వచ్చే ఏడాది ఆరంభానికల్లా వెయ్యికి పెంచుకోనుంది. చిన్న పట్టణాల్లో కూడా స్టోర్స్కి ఆదరణ లభిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లోనూ గణనీయంగా విస్తరిస్తున్నట్లు సంస్థ రిలయన్స్ రిటైల్ సీఈవో (గ్రోసరీ రిటైల్ బిజినెస్) దామోదర్ మాల్ తెలియజేశారు. ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన... రిలయన్స్ రిటైల్కి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో విస్తరణకు చేస్తున్న ప్రయత్నాలను సమగ్రంగా వివరించారు. ఐఐటీ, ఐఐఎంలో విద్యాభ్యాసం చేసిన దామోదర్, యూనిలీవర్లో తన కెరీర్ను ఆరంభించారు. వ్యాపారవేత్తగా సొంతంగా సూపర్మార్కెట్ వెంచర్ను కూడా నిర్వహించారు. ఫ్యూచర్ గ్రూప్ తర్వాత రిలయన్స్ రిటైల్లో వేల్యూ ఫార్మాట్కి (స్మార్ట్ బజార్, రిలయన్స్ ఫ్రెష్ మొదలైనవి) సంబంధించిన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే భారతీయ వినియోగదారుల పోకడలను, సూపర్ మార్కెట్ల తీరుతెన్నులను గురించి వివరిస్తూ ‘సూపర్మార్కెట్వాలా’, ‘బీ ఎ సూపర్మార్కెట్వాలా’ పుస్తకాలు కూడా రాశారు. రిలయన్స్ రిటైల్ కార్యకలాపాలపై మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.తెలుగు రాష్ట్రాలకు చాలా ప్రాధాన్యం ఉంది... రిలయన్స్ రిటైల్కి దేశవ్యాప్తంగా కార్యకలాపాలు ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలకు చాలా ప్రాధాన్యముంది. ఎందుకంటే తొలి రిటైల్ స్టోర్ను హైదరాబాద్లోనే ప్రారంభించాం. అలాగే తక్కువ ప్రాంతంలో ఎక్కువ స్టోర్స్ ఉన్నది కూడా ఇక్కడే. పండ్లు, ఎఫ్ఎంసీజీ, దుస్తులు, ఆహారోత్పత్తులు మొదలైనవన్నీ లభించే మా స్మార్ట్ బజార్ స్టోర్స్కి కూడా ఇక్కడ ప్రాధాన్యం ఉంది. ఆంధ్రప్రదేశ్లో వివిధ ఫార్మాట్లకు సంబంధించి 180 పైచిలుకు స్టోర్స్ ఉండగా వీటిలో 75 పైగా బిగ్ బాక్స్ స్టోర్స్ ఉన్నాయి. తెలంగాణలోనూ వివిధ ఫార్మాట్ల స్టోర్స్ 145 పైచిలుకు ఉండగా వాటిలో సుమారు 45 బిగ్ బాక్స్ ఫార్మాట్లో ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి 330 పైగా స్టోర్స్ ఉన్నాయి. ఇక చిన్న పట్టణాల విషయానికొస్తే, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లోని తణుకు, మదనపల్లె మొదలైనవి... అలాగే తెలంగాణలో బోధన్, సిద్దిపేట్ వంటి టౌన్లలో కూడా మా స్టోర్స్ను విస్తరించాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మా బిగ్ బాక్స్ స్టోర్స్ 900 పైచిలుకు ఉండగా వచ్చే ఏడాది ఆరంభం నాటికి ఈ సంఖ్యను వెయ్యికి పెంచుకోబోతున్నాం. పెద్ద నగరాల్లోలాగే చిన్న పట్టణాల్లోనూ వేల్యూ యాడెడ్, ప్రీమియం ఉత్పత్తుల కు మంచి డిమాండ్ ఉంటోంది. ఇక్కడి నుంచే భారీగా కొనుగోళ్లు.. తెలుగు రాష్ట్రాల్లో ఆహారోత్పత్తులకు గణనీయమైన డిమాండ్ ఉంది. ఇక్కడ వాటి విక్రయాలు ఎక్కువ. దేశవ్యాప్తంగా ఉత్పత్తులను విక్రయించుకునేలా స్థానిక వ్యాపారులకు అవకాశాలు కల్పిస్తున్నాం. పలు లోకల్ బ్రాండ్లకు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పిస్తున్నాం. ఎంట్రప్రెన్యూర్లతో కలిసి పని చేస్తున్నాం. ప్రాంతీయంగా వినియోగదారులతో మరింతగా మమేకం అవుతూ ఇటీవల పలు స్టోర్స్లో బతుకమ్మ వేడుకలను కూడా నిర్వహించాం.మెరుగ్గా పండుగ సీజన్.. ప్రస్తుతం పండుగ వేడుకలు భారీ స్థాయిలో ఉంటున్నాయి. వివిధ పండుగలను కలిసి జరుపుకుంటున్నారు. సాధారణంగా కొన్నాళ్ల క్రితం వరకు ఒక ప్రాంతానికి పరిమితమైన నవరాత్రి, దాండియా, పూజో మొదలైన వాటిని ఇపుడు మిగతా ప్రాంతాల వారు కూడా చేసుకునే ధోరణి పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి, వరలక్ష్మీ వ్రతం, వినాయక చవితి మొదలైనవి పెద్ద స్థాయిలో జరుపుకుంటారు. ఇలాంటి పండుగ సీజన్లో ఆహారోత్పత్తులు, దుస్తులు, బహుమతులు మొదలైన వాటికి డిమాండ్ గణనీయంగా ఉంటుంది. కాబట్టి వివిధ ప్రాంతాల్లో వివిధ వర్గాల నుంచి ఉండే డిమాండ్కి అనుగుణంగా మా స్టోర్స్ను నిర్వహిస్తున్నాం. పండుగ సీజన్ సందర్భంగా మరిన్ని ఆఫర్లు అందిస్తున్నాం. మా స్టోర్స్ విషయానికొస్తే పండుగ సీజన్ చాలా సానుకూలంగా ప్రారంభమైంది. వివిధ కేటగిరీలవ్యాప్తంగా విక్రయాలు బాగున్నాయి. పూజాద్రవ్యాలు, దుస్తులు మొదలైన వాటికి డిమాండ్ ఉంటోంది. ఆఫ్లైన్, ఆన్లైన్ రిటైల్ పోటీపడుతున్నాయని అనుకోవడం కన్నా ఒకదానికి మరొకటి అనుబంధంగా ఉంటున్నాయని చెప్పవచ్చు. అందుకే వీటన్నింటినీ కలిపి ఆమ్నిచానల్గా వ్యవహరిస్తున్నాం. ఇక, ఆన్లైన్లో ఫేక్ ఆఫర్ల విషయాల్లో వినియోగదారులు జాగ్రత్త వహించక తప్పదు. అపరిచితుల నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయకుండా, విశ్వసనీయమైన చోటే కొనుగోలు చేయడం శ్రేయస్కరం. -
రిలయన్స్కు జియో దన్ను
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ఈ ఆరి్థక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసిక ఫలితాలు వెల్లడించింది. జూలై– సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 5 శాతం క్షీణించి రూ. 16,563 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 17,394 కోట్లు ఆర్జించింది. చమురు శుద్ధి, పెట్రోకెమికల్ బిజినెస్లు నీరసించడంతో ప్రభావం చూపింది. రిటైల్, టెలికం బిజినెస్లు మాత్రం పటిష్ట పనితీరును ప్రదర్శించాయి. రష్యా చౌక చమురుతో చైనా పెట్రోలియం ప్రొడక్టుల సరఫరాలు పెరిగి ఓటూసీ బిజినెస్ మార్జిన్లు మందగించాయి. రిటైల్ సైతం పెద్దగా వృద్ధి సాధించలేదు. కంపెనీ ఇబిటా 2 శాతం తగ్గి రూ. 43,934 కోట్లకు చేరింది. ఫైనాన్స్ వ్యయాలు 5 శాతం పెరిగి రూ. 6,017 కోట్లను తాకాయి. కాగా.. మొత్తం ఆదాయం రూ. 2.38 లక్షల కోట్ల నుంచి రూ. 2.4 లక్షల కోట్లకు బలపడింది. రుణ భారం రూ. 3.36 లక్షల కోట్లకు చేరింది. చేతిలో ఉన్న నగదును పరిగణిస్తే నికర రుణ భారం రూ. 1.16 లక్షల కోట్లకు పరిమితమైనట్లు కంపెనీ వెల్లడించింది. టెలికం జోరుఈ ఏడాది క్యూ2లో ఆర్ఐఎల్ టెలికం, డిజిటల్ బిజినెస్ల విభాగం జియో ప్లాట్ఫామ్స్ నికర లాభం 23 శాతంపైగా జంప్చేసి రూ. 6,539 కోట్లను తాకింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) 7.4 శాతం మెరుగై రూ. 195.1కు చేరింది. టారిఫ్ల పెంపుతో రానున్న 2–3 క్వార్టర్లలో మరింత పుంజుకోనుంది. స్థూల ఆదాయం 18 శాతం ఎగసి రూ. 37119 కోట్లుగా నమోదైంది. 14.8 కోట్ల 5జీ వినియోగదారులతో అతిపెద్ద టెలికం ఆపరేటర్గా ఆవిర్భవించింది. సబ్్రస్కయిబర్ల సంఖ్య 4 శాతం పెరిగి 47.88 కోట్లను తాకింది. రిటైల్ ఓకేరిలయన్స్ రిటైల్ నికర లాభం స్వల్ప వృద్ధితో రూ. 2,836 కోట్లకు చేరింది. ఇబిటా నామమాత్రంగా బలపడి రూ. 5,675 కోట్లయ్యింది. స్థూల ఆదాయం స్వల్పంగా నీరసించి రూ. 76,302 కోట్లకు పరిమితమైంది. స్టోర్ల సంఖ్య 464 పెరిగి 18,946ను తాకింది. ఫలితాల నేపథ్యంలో ఆర్ఐఎల్ షేరు బీఎస్ఈలో స్వల్ప లాభంతో రూ. 2,745 వద్ద ముగిసింది.డైవర్సిఫైడ్ బిజినెస్ల పోర్ట్ఫోలియో మరోసారి పటిష్ట పనితీరును చూపింది. – ముకేశ్ అంబానీ, ఆర్ఐఎల్ చైర్మన్, ఎండీ -
వేలం ప్రక్రియే మేలు: రిలయన్స్
వ్యక్తిగత లేదా గృహ వినియోగదారుల కోసం శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవని రిలయన్స్ తెలిపింది. దేశంలో గృహ వినియోగానికి సంబంధించిన ఉపగ్రహ బ్రాడ్బ్యాండ్ స్పెక్ట్రమ్ను నేరుగా కేటాయించాలని ట్రాయ్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలపై రిలయన్స్ స్పందించింది. నిర్దిష్ట స్థాయి కలిగిన శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవల కోసం స్పెక్ట్రమ్ను నేరుగా కేటాయించడం కంటే వేలం నిర్వహించాలని తెలిపింది.దేశంలో గృహ వినియోగ శాటిలైట్ సేవలకు స్పెక్ట్రమ్ను ఎలా కేటాయిస్తారని గతేడాది నుంచి చర్చలు సాగుతున్నాయి. ఇలొన్మస్క్కు చెందిన స్టార్లింక్, అమెజాన్ ఆధ్వర్యంలోని ప్రాజెక్ట్ కూపర్ వంటి వాటికోసం అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాల్లో స్పెక్ట్రమ్కు సంబంధించి నేరుగా అడ్మినిస్ట్రేటివ్ కేటాయింపులు చేశారు. అయితే ఆసియాలోని వివిధ ప్రాంతాల్లో విస్తరణకు సిద్ధమవుతున్న రిలయన్స్ జియో మాత్రం హోమ్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ స్పెక్ట్రమ్ కోసం వేలం ప్రక్రియ నిర్వహించాలని తెలుపుతుంది. ఈమేరకు ట్రాయ్కు ఇటీవల లేఖ రాసినట్లు పేర్కొంది. మస్క్ కోరుకున్న విధంగా గతేడాది స్పెక్ట్రమ్ను నేరుగా కేటాయించేందుకు ట్రాయ్ నిబంధనలు సవరించనుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: రూపాయి భారీ పతనానికి కారణాలుటెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ దీనికి సంబంధించిన నిబంధనలపై ప్రస్తుతం పబ్లిక్ కన్సల్టేషన్ను నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియపై మరింత స్పష్టత రావడానికంటే ముందే రిలయన్స్ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. ట్రాయ్ తన కన్సల్టేషన్ పేపర్లో ఎలాంటి చట్టపరమైన అధ్యయనాలు నిర్వహించకుండానే స్పెక్ట్రమ్ కేటాయింపులపై నిర్ణయం తీసుకోబోతుందని రిలయన్స్ తన లేఖలో పేర్కొంది. -
స్వచ్ఛత సేవలో రిలయన్స్
ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ దేశ పరిశుభ్రతలో తన వంతు పాలుపంచుకుంది. స్వచ్ఛత పక్షోత్సవాల్లో భాగంగా రిలయన్స్ దేశవ్యాప్తంగా నిర్వహించిన జన్ ఆందోళన్కు విశేష స్పందన లభించింది. 75,000 మంది వాలంటీర్లు 4,100 చోట్ల స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించారు.భారత ప్రభుత్వ 'స్వచ్ఛతా హి సేవా' కార్యక్రమానికి మద్దతుగా రిలయన్స్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర ప్రజలు పరిశుభ్రత చర్యల్లో పాల్గొన్నారు. మొక్కలు నాటారు. పాఠశాలల్లో స్వచ్ఛతపై విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పర్యావరణానికి సేవ చేయడానికి ఇది గొప్ప అవకాశమని రిలయన్స్ ఫౌండేషన్ సీఈవో జగన్నాథ కుమార్ పేర్కొన్నారు.సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకూ నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియోతో పాటు రిలయన్స్ ఫౌండేషన్ స్కూల్స్, జియో ఇన్స్టిట్యూట్ వంటి సంస్థల ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు. రిలయన్స్ వాలంటీర్లు నిర్వహించిన అవగాహన క్విజ్లు, పెయింటింగ్, వ్యాసరచన పోటీలు, ఇతర కార్యకలాపాలలో 30,000 మంది పిల్లలు పాల్గొన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ ఒడిశా, అస్సాం, గుజరాత్, పశ్చిమ బెంగాల్లో 17,000 మొక్కలను నాటింది. -
తెలంగాణ సీఎం సహాయ నిధికి రిలయన్స్ భారీ విరాళం
-
ఆయిల్, గ్యాస్ బ్లాకుల కోసం పోటాపోటీ
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఆయిల్, గ్యాస్ బ్లాకుల వేలంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు పాలు పంచుకున్నాయి. ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలసీ (ఓఏఎల్పీ–8) ఎనిమిదో దశ వేలంలో భాగంగా కేంద్ర సర్కారు 28 బ్లాకులను వేలానికి పెట్టింది. ఇవి 1.36 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి.ప్రైవేటు రంగంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్–బీపీ సంస్థలు మొదటిసారి ఓఎన్జీసీతో కలసి గుజరాత్ తీరంలోని ఓ బ్లాక్కు బిడ్ వేశాయి. ఓఎన్జీసీతోపాటు మరో ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్, వేదాంత, రిలయన్స్ ఇండస్ట్రీస్–బీపీ జేవీ, సన్ పెట్రోకెమికల్స్ ఇందులో పాల్గొన్నాయి. ఎనిమిదో విడత ఓఏఎల్పీలో 28 బ్లాక్లకు బిడ్ల దాఖలు గడువు సెప్టెంబర్ 21తో ముగిసింది. దీంతో ఈ వివరాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) విడుదల చేసింది.ఓఎన్జీసీ తాను సొంతంగా 14 బ్లాకులకు బిడ్లు దాఖలు చేసింది. ఆయిల్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో కలసి మరో నాలుగు బ్లాక్లకు బిడ్లు వేసింది. రిలయన్స్–బీపీతో కలసి వేసిన మరో బిడ్ కూడా కలిపి చూస్తే మొత్తం 19 బ్లాక్లకు ఓఎన్జీసీ పోటీ పడుతోంది. ఇక అనిల్ అగర్వాల్కు చెందిన వేదాంత లిమిటెడ్ మొత్తం 28 బ్లాకులకు సొంతంగా బిడ్లు సమర్పించింది. సన్ పెట్రోకెమికల్స్ ఏడు బ్లాకులకు బిడ్లు వేసింది. మొత్తం మీద నాలుగు బ్లాక్లకు మూడేసి చొప్పున బిడ్లు రాగా, మిగిలిన వాటికి రెండేసి చొప్పున దాఖలయ్యాయి. -
అన్మోల్ అంబానీకి సెబీ రూ. 1 కోటి జరిమానా
న్యూఢిల్లీ: రిలయన్స్ హోమ్ ఫైనాన్స్కి సంబంధించి కార్పొరేట్ రుణాలకు ఆమోదం తెలిపే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైనందుకు గాను పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కుమారుడు అన్మోల్ అంబానీకి సెబీ రూ. 1 కోటి జరిమానా విధించింది. అలాగే రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ చీఫ్ రిస్క్ ఆఫీసర్ కృష్ణన్ గోపాలకృష్ణన్కి రూ. 15 లక్షల ఫైన్ విధించింది. 45 రోజుల్లోగా ఇద్దరూ ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నిధుల మళ్లింపు కేసులో అనిల్ అంబానీతో పాటు మరో 24 మంది సెక్యూరిటీస్ మార్కెట్లో పాల్గొనకుండా సెబీ ఆగస్టులో నిషేధం విధించింది. తాజాగా సోమవారం ఇచ్చిన ఆదేశాల ప్రకారం, జనరల్ పర్పస్ కార్పొరేట్ రణాలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దంటూ కంపెనీ డైరెక్టర్ల బోర్డు నుంచి స్పష్టమైన సూచనలు ఉన్నప్పటికీ బోర్డు సభ్యుడైన అన్మోల్ అంబానీ వాటిని పట్టించుకోకుండా ఎక్యురా ప్రొడక్షన్స్ అనే సంస్థకు రూ. 20 కోట్ల లోన్కి ఆమోదముద్ర వేశారని ఆరోపణలు ఉన్నాయి. -
ఉచితంగా 'జియో ఎయిర్ ఫైబర్': ఇలా చేయండి
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'దీపావళి డబుల్ ధమాకా' ఆఫర్ను రిలయన్స్ డిజిటల్ ప్రకటించింది. దీంతో వినియోగదారులు ఒక సంవత్సరం ఫ్రీ 'జియో ఎయిర్ ఫైబర్' సేవను ఆస్వాదించే అవకాశాన్ని పొందవచ్చు. ఇంతకీ ఈ అవకాశాన్ని ఎలా పొందాలి? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..ఉచితంగా జియో ఎయిర్ ఫైబర్ పొందాలంటే?ఫ్రీగా జియో ఎయిర్ ఫైబర్ సేవలను పొందాలంటే.. 2024 సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 3వరకు ఏదైనా రిలయన్స్ డిజిటల్ స్టోర్లో లేదా మైజియో స్టోర్లో రూ. 20000 లేదా అంతకంటే ఎక్కువ ధరకు షాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసినవాళ్ళే ఉచిత జియో ఎయిర్ ఫైబర్ పొందటానికి అర్హులు.ఈ ఆఫర్ కొత్త వాళ్ళకు మాత్రమే కాకుండా ఇప్పటికే జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ ఉన్న కస్టమర్లు కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ పొందవచ్చు.ఇదీ చదవండి: కంపెనీలో సమస్యలు!.. సత్య నాదెళ్ల కీలక విషయాలుఅర్హత పొందిన కస్టమర్లు ప్రతి నెల నవంబర్ 24 నుంచి అక్టోబర్ 25 వరకు యాక్టివ్ ఎయిర్ఫైబర్ ప్లాన్కు సమానమైన 12 కూపన్లను పొందుతారు. ప్రతి కూపన్ను 30 రోజులలోపు సమీప రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్, జియో మార్ట్ డిజిటల్ ఎక్స్క్లూజివ్ స్టోర్లో రీడీమ్ చేసుకోవచ్చు. ఈ దీపావళి డబుల్ ధమాకా ఆఫర్కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్ సంప్రదించండి. -
ఇజ్రాయెల్ కంపెనీతో జతకట్టిన రిలయన్స్
భారతదేశపు రిలయన్స్ రిటైల్ వెంచర్.. సెప్టెంబర్ 10న ఇజ్రాయెల్ ప్రధాన కార్యాలయం డెల్టా గలీల్ ఇండస్ట్రీస్తో జాయింట్ వెంచర్ను ప్రకటించింది. ఇన్నర్వేర్ మార్కెట్ను విస్తరించడంలో భాగంగా 50/50 జాయింట్ వెంచర్ భాగస్వామ్యాన్ని ధృవీకరించాయి. ఈ భాగస్వామ్యం ద్వారా డెల్టా గలీల్.. రిలయన్స్ ఉత్పత్తుల డిజైన్ అండ్ తయారీకి సహకరిస్తుంది.వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ మార్కెట్లో తన పాదముద్రను విస్తరించేందుకు డెల్టా గలీల్ ఈ భాగస్వామ్యాన్ని ఉపయోగించుకుంటుంది. ఇందులో భాగంగానే రిటైల్, హోల్సేల్ వంటి వాటితో పాటు.. బ్రాండ్ల పోర్ట్ఫోలియోను విస్తరించనుంది.భారతీయ వినియోగదారుల డిమాండ్స్ తీర్చడానికి.. వారు కోరుకునే దుస్తుల ఆవిష్కరణలను ఏర్పాటు చేయడమే ఈ భాగస్వామ్యం ప్రధాన ఉద్దేశ్యం. కంపెనీ గణనీయమైన వృద్ధికి కూడా ఈ జాయింట్ వెంచర్ దోహదపడుతుంది. డెల్టా గలీల్ ఇండస్ట్రీస్ అనేది పురుషులు, మహిళలు, పిల్లల కోసం బ్రాండెడ్ & ప్రైవేట్ లేబుల్ దుస్తులను అందించే సంస్థ. ఈ కంపెనీ 1975లో ప్రారంభమైంది.రిలయన్స్ రిటైల్ & డెల్టా గలీల్ భాగస్వామ్యం గురించి రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వీ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. భారతీయ వినియోగదారులకు వినూత్న ఉత్పత్తులను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. రిలయన్స్తో కలిసి ప్రయాణించడం చాలా ఆనందంగా ఉందని డెల్టా గలీల్ సీఈఓ పేర్కొన్నారు. -
లాల్బాగ్చాకు అనంత్ అంబానీ స్వర్ణకిరీటం
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ప్రఖ్యాతి గాంచిన లాల్బాగ్చా రాజా వినాయకుడికి రిలయన్స్ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రిలయన్స్ ఫౌండేషన్తో కలిసి భారీ విరాళం అందజేశారు. రూ.15 కోట్ల విలువైన 20 కిలోల స్వర్ణ కిరీటాన్ని తన ఆరాధ్య దైవానికి సమరి్పంచారు. లాల్బాగ్చా రాజా భారీ విగ్రహాన్ని గురువారం సాయంత్రం ఆవిష్కరించారు. అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్తో ఇటీవలే జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహం తర్వాత వస్తున్న తొలి వినాయక చవితి కావడంతో స్వర్ణ కిరీటాన్ని తన ఇష్ట దైవానికి అందించినట్లు తెలుస్తోంది. -
అంబానీ కంపెనీ హోమ్లోన్ల విస్తరణ
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలోని జియో ఫైనాన్షియల్ లిమిటెడ్(జేఎఫ్ఎల్) త్వరలో హోమ్లోన్ సర్వీసులను విస్తరిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈమేరకు కంపెనీ తన లోన్ల వివరాలు వెల్లడించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కంపెనీ తన ‘జియో ఫైనాన్స్ యాప్ బీటా మోడ్’ వినియోగదారులకు హోమ్లోన్లు అందిస్తోంది.గతేడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సమావేశం తర్వాత జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. అనంతరం జియో ఫైనాన్స్ యాప్ను ఆవిష్కరించారు. దీని ద్వారా యూపీఐ సర్వీసులు, ఆన్లైన్ బిల్లు చెల్లింపులు, బీమా సేవలు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా సర్వీసు అందిస్తోంది. జేఎఫ్ఎల్ యాప్ బీటా మోడ్ వినియోగదారులకు హోమ్లోన్లు అందిస్తున్నారు. ఈ సర్వీసును త్వరలో కంపెనీ వినియోగదారులందరికీ అందుబాటులోకి తేనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ మార్కెట్లో వస్తున్న వార్తల ప్రకారం కంపెనీ ఈ సర్వీసును తీసుకొస్తే ఇదే రంగంలో సేవలందించే ఇతర హోమ్లోన్ కంపెనీలు, కొన్ని బ్యాంకులపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.మే 30, 2024న ప్రారంభమైన జియో ఫైనాన్షియల్ లిమిటెడ్ యాప్ ఇప్పటికే 10 లక్షల డౌన్లోడ్లను అధిగమించిందని కంపెనీ తెలిపింది. జులై 2023లో బ్లాక్రాక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అందుకోసం ఇరు కంపెనీలు రూ.1,258 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించాయి. -
జియో కస్టమర్లకు గుడ్ న్యూస్
-
అంబానీను దాటేసిన అదానీ.. హురున్ రిచ్ లిస్ట్ విడుదల
దేశంలో అత్యంత సంపన్నుల జాబితాను హురున్ ఇండియా విడుదల చేసింది. అందులో గౌతమ్ అదానీ(62) మొదటి స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న ముఖేశ్ అంబానీ రెండో స్థానానికి చేరారు. ఆ లిస్ట్లో బాలివుడ్ స్టార్ షారుఖ్ఖాన్కు తొలిసారి చోటు దక్కింది.ఈ సందర్భంగా హురున్ ఇండియా వ్యవస్థాపకులు అనస్ రెహమాన్ జునైద్ మాట్లాడుతూ..‘రూ.11.6 లక్షల కోట్ల సంపదతో గౌతమ్ అదానీ(62) తన కుటుంబం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో టాప్లో నిలిచింది. గత ఏడాది భారత్లో ప్రతి ఐదు రోజులకు ఒక కొత్త బిలియనీర్ తయారయ్యాడు. చైనా బిలియనీర్ల సంఖ్య 25 శాతం పడిపోయింది. భారత్లో వీరి సంఖ్య 29% పెరిగింది. దాంతో దేశంలో రికార్డు స్థాయిలో బిలియనీర్ల సంఖ్య 334కు చేరింది. ఆసియా సంపద సృష్టిలో భారత వాటా అధికమవుతోంది’ అని తెలిపారు.హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 నివేదిక ప్రకారం..1. గౌతమ్ అదానీ, కుటుంబం: రూ.11.6 లక్షల కోట్లు2. ముఖేష్ అంబానీ, కుటుంబం: రూ.10.1 లక్షల కోట్లు 3. శివ్ నాడార్, కుటుంబం: రూ.3.1 లక్షల కోట్లు4. సైరస్ పునావాలా, కుటుంబం: రూ.2.89 లక్షల కోట్లు5. దిలిప్ సింఘ్వీ: రూ.2.49 లక్షల కోట్లు.6. కుమార్ మంగళం బిర్లా: రూ.2.35 లక్షల కోట్లు.7. గోపిచంద్ హిందుజా, కుటుంబం: రూ.1.92 లక్షల కోట్లు.8. రాధాకృష్ణ దమాని, కుటుంబం: రూ.1.90,900 కోట్లు.9. అజిమ్ ప్రేమ్జీ, కుటుంబం: రూ.1.90,700 కోట్లు.10. నిరజ్ బజాజ్, కుటుంబం: రూ.1.62 లక్షల కోట్లు2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్లో తక్కువ వయసు ఉన్న వారిగా జెప్టో క్విక్ కామర్స్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు కైవల్య వోహ్రా(21) నిలిచారు.షారుఖ్ ఖాన్కు చోటుమొదటిసారిగా బాలివుడ్ నటుడు షారుఖ్ ఖాన్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్లో చోటు సంపాదించారు. ఐపీఎల్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్లో తాను వాటాలు కలిగి ఉండడంతో వాటి విలువ పెరిగింది. దాంతో మొత్తంగా రూ.7,300 కోట్లతో ఈ లిస్ట్లో స్థానం సంపాదించారు. -
ఆర్ఐఎల్ – డిస్నీ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) మీడియా విభాగం, వాల్ట్ డిస్నీ మధ్య విలీనానికి కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో దేశీయంగా రూ.70,000 కోట్ల మీడియా దిగ్గజం ఆవిర్భవించనుంది. ఆరు నెలల క్రితమే ప్రకటించిన డీల్ను గుత్తాధిపత్య విధానాలను అడ్డుకునే సీసీఐ పరిశీలించింది. ఈ నేపథ్యంలో తొలుత కుదుర్చుకున్న డీల్ నిర్మాణంలో 2 సంస్థలు కొన్ని సవరణలూ ప్రతిపాదించాయి. తాజా డీల్కు సీసీఐ అనుమతి మంజూరు చేసింది. స్వచ్ఛంద సవరణలు: ఆర్ఐఎల్, వయాకామ్18 మీడియా ప్రైవేట్, డిజిటల్18 మీడియా, స్టార్ ఇండియా ప్రైవేట్, స్టార్ టెలివిజన్ ప్రొడక్షన్స్ మధ్య కుదిరిన ఒప్పందంలో స్వచ్ఛంద సవరణల తదుపరి డీల్కు ఆమోదముద్ర వేసినట్లు ‘ఎక్స్’ ద్వారా సీసీఐ వివరించింది. అయితే రెండు పారీ్టల ప్రతిపాదిత సవరణలను వెల్లడించలేదు. తాజా డీల్ ప్రకారం ఆర్ఐఎల్, అనుబంధ సంస్థలు విలీన కంపెనీలో 63.16% వాటాను పొందనున్నాయి. మిగిలిన 36.84% వాటా వాల్డ్ డిస్నీకి దక్కనుంది. విలీన సంస్థ రెండు స్ట్రీమింగ్ సరీ్వసులు, 120 టీవీ చానళ్లను కలిగి ఉండనుంది. వెరసి దేశీయంగా అతిపెద్ద మీడియా హౌస్గా అవతరించనుంది. విలీన సంస్థ ఇలా.. ఆర్ఐఎల్కు గల మీడియా సంస్థలలో నెట్వర్క్ 18 ప్రధానమైనదికాగా.. 18 వార్తా చానళ్లను కలిగి ఉంది. కలర్స్ బ్రాండ్తో ఎంటర్టైన్మెంట్ చానల్తోపాటు క్రీడా చానళ్లను నిర్వహిస్తోంది. మనీకంట్రోల్.కామ్, బుక్మైషో సైట్లతోపాటు కొన్ని మ్యాగజీన్లను ప్రచురిస్తోంది. మరోవైపు ఆర్ఐఎల్ జియోçస్టూడియోస్సహా కేబుల్ డి్రస్టిబ్యూషన్ కంపెనీలు డెన్, హాథవేలో మెజారిటీ వాటాలను కలిగి ఉంది. 21 సెంచురీ ఫాక్స్ నుంచి ఎంటర్టైన్మెంట్ ఆస్తుల కొనుగోలు ద్వారా డిస్నీ+ హాట్స్టార్ దేశీయంగా 2020లో ప్రారంభమైంది. ఇందుకు 71.3 బిలియన్ డాలర్లు వెచి్చంచింది. తద్వారా స్టార్ ఇండియా, హాట్స్టార్లను సొంతం చేసుకుంది. ఎంటర్టైన్మెంట్, సినిమా, స్పోర్ట్స్ తదితర చానళ్లను కలిగి ఉంది. -
29న రిలయన్స్ ఏజీఎం.. అంచనాలన్నీ వీటిపైనే!
భారతీయ పారిశ్రామికవేత్త, అత్యంత సంపన్నుడు అయిన 'ముకేశ్ అంబానీ' ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏట కూడా 'రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్' (AGM) ఈ నెల 29న నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారనే విషయాలను తెలుసుకోవడానికి సర్వత్రా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.ఆగష్టు 29న జరగనున్న 47వ వార్షిక సర్వసభ్య సమావేశంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. అంబానీ తీసుకునే నిర్ణయాలు ఏకంగా 35 లక్షల మందిని ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే లాభాల బాటలో దూసుకెళ్తున్న రిలయన్స్ కంపెనీ ఆగష్టు 29 తరువాత మరింత వృద్ధి చెందే అవకాశం లేకపోలేదు.రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్ 2017లో కేవలం 1500 రూపాయలకే రీఫండబుల్ డిపాజిట్తో జియో ఫోన్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. 2018లో 2999 రూపాయలకు జియో ఫోన్2, 2019లో సౌదీ ఆరామ్కో పెట్టుబడులతో పాటు జియో ఫైబర్ లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. 2020లో గూగుల్ కంపెనీలో పెట్టుబడి, 2021లో రూ. 75000 కోట్ల పెట్టుబడితో కొత్త ఎనర్జీ బ్లూప్రింట్, 2022లో 5జీ కోసం రూ.2 లక్షల కోట్లు కేటాయింపు.. ఇలా సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ ఏడాది జరగబోయే సమావేశంలో.. రిలయన్స్ జియో ఫైనాన్షియల్ లిస్టింగ్ గురించి మాట్లాడే అవకాశం ఉంది. అంతే కాకుండా వారసత్వ ప్రణాళికలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది. అంటే ఉన్న వ్యాపారాలలో ఎవరికి ఏది అప్పగిస్తారో.. గురువారం జరిగే సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది.రిలయన్స్ కంపెనీ ఆయిల్ అండ్ కెమికల్, న్యూఎనర్జీ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగానే గుజరాత్లోని జామ్నగర్లో మెగా గ్రీన్ ఎనర్జీ కాంప్లెక్స్ సిద్ధమవుతోంది. కాబట్టి జరగబోయే సమావేశంలో గిగా ఫ్యాక్టరీలు, ఎనర్జీ స్టోరేజీలు, ఎలక్ట్రోలైసర్లు, ప్యూయల్ సెల్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ వంటి వాటిపై అప్డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. -
రిలయన్స్ హోమ్పై సెబీ
రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్(ఆర్హెచ్ఎఫ్ఎల్) నిధుల అక్రమ మళ్లింపులో అనిల్ అంబానీ ప్రధాన పాత్ర పోషించినట్లు సెబీ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఆడిటింగ్ తదితరాల వివరాలను బయటపెట్టింది. వీటి ప్రకారం అప్పటి కంపెనీ బోర్డు గట్టిగా వ్యతిరేకించినప్పటికీ సంబంధిత యాజమాన్యం వీటిని పట్టించుకోలేదు. కంపెనీ విధానాలను వ్యతిరేకంగా రుణాలను విడుదల చేసింది. అసంపూర్తి డాక్యుమెంటేషన్, క్రెడిట్ పాలసీ నిబంధనల ఉల్లంఘన ద్వారా రుణ మంజూరీ జరిగింది. రుణ విడుదల అంశాలను సమీక్షిస్తూ బోర్డు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ పెడచెవిన పెట్టారు. వెరసి సాధారణ కార్పొరేట్ రుణ విధానాలకు పాతరవేశారు. వీటన్నిటి వెనుక మాస్టర్మైండ్ అనిల్ అంబానీదేనని సెబీ అభిప్రాయపడింది. ఇతర వివరాలు ఇలా.. ఆర్హెచ్ఎఫ్ఎల్ నిధుల అక్రమ మళ్లింపు జరిగినట్లు కంపెనీకి చట్టబద్ధ ఆడిటర్గా వ్యవహరించిన పీడబ్ల్యూసీ, ఫోరెన్సిక్ ఆడిటర్ గ్రాంట్ థార్న్టన్ వెల్లడించాయి. గ్రాంట్ థార్న్టన్ను రుణదాతల కన్సార్షియంకు అధ్యక్షత వహించిన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) నియమించింది. పీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం సాధారణ కార్పొరేట్ లోన్ ప్రొడక్ట్లో భాగంగా విడుదల చేసిన రుణాలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. 2018 మార్చి31కల్లా రూ. 900 కోట్ల రుణాలు విడుదలకాగా.. 2019 మార్చి31కల్లా రూ. 7,900 కోట్లకు జంప్చేశాయి. రుణగ్రహీత సంస్థలలో నెగిటివ్ నెట్వర్త్, అతితక్కువ ఆదాయం, బిజినెస్ కార్యకలాపాలు, లాభార్జన లేకపోవడం తదితర పలు ప్రతికూలతలున్నాయి. ఆర్హెచ్ఎఫ్ఎల్ నుంచి మాత్రమే రుణాలను పొందడం, రుణాలతో పోలిస్తే తక్కువ ఈక్విటీ మూలధనం, రుణాలు అందుకునే ముందుగానే ఏర్పాటుకావడం, రుణ దరఖాస్తు రోజునే రుణ మంజూరీ తదితర అక్రమాలు నెలకొన్నాయి. ఇక 2016 ఏప్రిల్ నుంచి 2019 జూన్వరకూ బీవోబీ చేపట్టిన ఫోరెన్సిక్ ఆడిట్ తొలి నివేదిక 2020 జనవరిలో వెలువడింది. ఈ కాలంలో కార్పొరేట్ రుణ విధానాలకింద ఆర్హెచ్ఎఫ్ఎల్ నుంచి రూ. 14,577 కోట్లకుపైగా రుణాలు విడుదలయ్యాయి. వీటిలో రూ. 12,487 కోట్లకుపైగా నిధులు సంబంధిత 47 సంస్థలకే చేరాయి. 2019 అక్టోబర్ 31కల్లా రూ. 7,984 కోట్ల రుణాలు వసూలుకావలసి ఉంటే.. దాదాపు రూ. 2,728 కోట్లు మొండిబకాయిలుగా నమోదయ్యాయి. తదుపరి నివేదికలలో గ్రూప్లోని పలు ఇతర కంపెనీలకు సైతం రుణాలు విడుదలైనట్లు నివేదిక పేర్కొంది. -
ఏడాదిలో 42 వేల మంది రాజీనామా.. కారణం చెప్పిన రిలయన్స్
ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్)లో ఉద్యోగులు సంఖ్య తగ్గిపోయింది. గతేడాదితో పోలిస్తే ఈఏడాది 42,052 మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఆర్ఐఎల్ వార్షిక నివేదిక ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో మొత్తం శ్రామికశక్తి 3,47,362గా ఉంది. ఇది అంతకుముందు ఏడాదిలో 3,89,414గా ఉండేది. అయితే రాజీనామా చేసిన 42,052 మంది ఉద్యోగుల్లో 38,029 మంది రిలయన్స్ రిటైల్ నుంచే ఉన్నారని నివేదికలో పేర్కొన్నారు.కంపెనీ నివేదికలోని వివరాల ప్రకారం..రిటైల్ రంగంలోని వ్యాపారానికి నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కొరత తీవ్ర అంతరాయంగా మారుతోంది. సాధారణంగా రిటైల్ రంగంలోని ఉద్యోగుల అట్రిషన్ రేటు(ఉద్యోగాలు మారే రేటు) ఎక్కువగా ఉంటుంది. దాంతో రిలయన్స్ రిటైల్ నుంచి 2024 ఆర్థిక సంవత్సరంలో అధికంగా 38,029 మంది రాజీనామా చేశారు. అందులోనూ జియోలో అత్యధికంగా ఉద్యోగం వీడారు. జియోలో 43% కాంట్రాక్ట్ ఉద్యోగులు(ఉద్యోగం రెగ్యులర్ కానివారు, ఒప్పంద ఉద్యోగులు, పార్ట్టైమ్ చేస్తున్నవారు, అప్రెంటిస్లు, ఇంటర్న్లు) ఉన్నారు. రిలయన్స్ రిటైల్లో పని చేస్తున్న మొత్తం శ్రామిక శక్తిలో సగానికి పైగా 30 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారేనని సంస్థ పేర్కొంది.ఇదీ చదవండి: ఊహించిందే జరిగింది.. వడ్డీరేట్ల మార్పు ఎప్పుడంటే..ఇదిలాఉండగా, రిలయన్స్ గ్రూప్ ఉద్యోగుల్లో 53.9% మంది 30 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారని వార్షిక నివేదికలో వెల్లడించారు. అందులో 21.4% మహిళలున్నారు. అలాగే, కొత్తగా నియమితులైన వారిలో 81.8% మంది 30 ఏళ్లలోపు వారు కాగా, 24.0% మంది మహిళలు. ఉద్యోగం మానేసిన వారిలో 74.9% మంది 30 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారే కావడం విశేషం. అందులో 22.7% మంది మహిళలు ఉన్నారు. -
భారత్..డేటా సంపన్న దేశం: అంబానీ
మలిదశ వృద్ధి ప్రయాణానికి రిలయన్స్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. 2016లో జియో 4జీ టెలికం సేవలను ప్రారంభించడం ద్వారా భారత్ను డేటా పరంగా సంపన్న దేశంగా మార్చినట్టు కంపెనీ వార్షిక నివేదికలో అంబానీ పేర్కొన్నారు. జియో ద్వారా దాదాపు దేశంలోని ప్రతి ఇంటికీ అధిక వేగంతో కూడిన 4జీ డేటాను అందుబాటు ధరలకు అందిస్తున్నట్టు చెప్పారు.ఈ సందర్భంగా అంబానీ మాట్లాడుతూ..‘దేశవ్యాప్తంగా 5జీ సేవలను వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చాం. అంతర్జాతీయ అనిశ్చితులున్నా ప్రపంచంలో భారత్ స్థిరంగా అభివృద్ధి చెందుతోంది. వేగంగా వృద్ధి చెందుతున్న దేశ ఆర్థిక వ్యవస్థలో వినియోగ అవసరాలను తీర్చే స్థాయిలో రిలయన్స్ రిటైల్ ఉంది. 100 బిలియన్ డాలర్ల (రూ.8.4 లక్షల కోట్లు) విలువ కలిగిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్లో బడా ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నార’ని చెప్పారు.ఇదీ చదవండి: ఒక్క రూపాయీ జీతం తీసుకోని ముఖేష్ అంబానీ!గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‘2035 నాటికి సున్నా కర్బన ఉద్గారాల విడుదలే(నెట్ జీరో) లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకు వీలుగా జామ్నగర్లో దీరూభాయి అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. పునరుత్పాదక ఇంధన వనరుల తయారీకి సంబంధించి రిలయన్స్ సమగ్ర కేంద్రంగా ఉంటుంది. వయకామ్ 18, స్టార్ ఇండియా వ్యాపారాల విలీనంతో జాయింట్ వెంచర్ టెలివిజన్, డిజిటల్ స్ట్రీమింగ్లో అగ్రగామిగా అవతరిస్తున్నాం’ అని ముఖేశ్ అన్నారు. -
భారత్లో అత్యుత్తమ ర్యాంకు పొందిన సంస్థ
ఫార్చూన్ విడుదల చేసిన ‘గ్లోబల్ 500’ జాబితాలో ప్రపంచంలోనే వాల్మార్ట్ కంపెనీ అత్యుత్తమ ర్యాంకు పొందింది. తర్వాతి స్థానంలో అమెజాన్, స్టేట్ గ్రిడ్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ నుంచి రిలయన్స్ టాప్ కంపెనీగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీ గతేడాదితో పోలిస్తే రెండు స్థానాలు పుంజుకుని 86వ స్థానానికి చేరింది. 2021లో దీని స్థానం 155గా ఉండేది. మూడేళ్లలో రిలయన్స్ మరింత విలువైన కంపెనీగా మారింది.ఫార్చూన్-గ్లోబల్ 500 జాబితాలో చోటు సాధించిన ప్రపంచంలోని టాప్ 10 కంపెనీలువాల్మార్ట్అమెజాన్స్టేట్గ్రిడ్సౌదీ అరమ్కోసినోపెక్ గ్రూప్చైనా నేషనల్ పెట్రోలియంయాపిల్యూనైటెడ్ హెల్త్గ్రూప్బెర్క్షైర్ హాత్వేసివీఎస్ హెల్త్ఇదీ చదవండి: 26 ట్రంక్ పెట్టెల్లో 3.3 లక్షల పత్రాలు..736 మంది సాక్షులు!గ్లోబల్ 500 జాబితాలో చేరిన భారత్లోని టాప్ కంపెనీలురిలయన్స్ ఇండస్ట్రీస్ఎల్ఐసీఇండియన్ ఆయిల్ఎస్బీఐఓఎన్జీసీభారత్ పెట్రోలియంటాటా మోటార్స్హెచ్డీఎఫ్సీ బ్యాంక్రాజేశ్ ఎక్స్పోర్ట్స్ -
పారిస్లో కొత్తజంట..అథ్లెట్ల గురించి ఏం చెబుతున్నారంటే..
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు, కోడలు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పారిస్ ఒలింపిక్స్లో సందడి చేశారు. భారత క్రీడాకారుల మ్యాచ్లు వీక్షించిన అనంతరం ఈ నవ దంపతులు మీడియాతో మాట్లాడారు. ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెట్లు మరిన్ని పథకాలు సాధిస్తారని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా అనంత్ అంబానీ మాట్లాడుతూ..‘దేవుడి దయతో భారత క్రీడాకారులు చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. ఇండియా చాలా పతకాలు సాధిస్తుందని అనుకుంటున్నాను. భారత అథ్లెట్లు ప్రతి ఇండియన్ గర్వపడేలా చేస్తారని విశ్వసిస్తున్నాను’ అన్నారు. అనంత్ భార్య రాధిక మర్చంట్ మాట్లాడుతూ..‘పారిస్ ఒలింపిక్స్లో మొదటి ఇండియా మ్యాచ్ని వీక్షించినందుకు చాలా సంతోషంగా ఉంది. భారత్ ఆటగాళ్ల తీరు అద్భుతంగా ఉంది. మరింత ఉత్సాహంతో పోటీల్లో పాల్గొని మరిన్ని విజయాలు సాధిస్తారని నమ్ముతున్నాను. ఈ క్రీడల వల్ల చాలామంది యువకులు స్ఫూర్తి పొందుతున్నారు’ అని చెప్పారు.ఇదీ చదవండి: బ్యాంకు సర్వీస్ ప్రొవైడర్పై ర్యాన్సమ్వేర్ దాడి!పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అక్కడ రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ఇండియా హౌజ్’ పేరుతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారత సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా దాన్ని రూపొందించారు. రిలయన్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, ఐవోఏ సభ్యురాలు నీతా అంబానీ ఇటీవల ఇండియా హౌజ్లో భారతీయ క్రీడాకారుల విజయాలను సెలబ్రేట్ చేశారు. వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పటికే రెండు పతకాలతో స్టార్ షూటర్ సరబ్జోత్ సింగ్, మనుభాకర్ పారిస్లో విజయఢంకా మోగించారు.#WATCH | #ParisOlympics2024 | Reliance Industries Chairman Mukesh Ambani's son Anant Ambani says, "I am sure that with god's grace, the Indian team will perform very well and we will win many medals. I am sure the Indian team will make every Indian like me proud."Anant Ambani's… pic.twitter.com/HzDwTwNsKn— ANI (@ANI) July 31, 2024 -
భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ బాస్ ఎవరో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత సంపన్నులలో ఒకరైన అంబానీ ఫ్యామిలీ చాలా కాలంగా వ్యాపార సామ్రాజ్యాన్ని శాసిస్తోంది. ధీరూభాయ్ అంబానీ కుటుంబంలోని అందరూ వ్యాపారంలో సంబంధాన్ని కలిగి ఉన్నారు. ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్ ముకేశ్ అంబానీ సారథ్యంలో నడుస్తోంది. ఇందులో ఆకాష్, ఇషా, అనంత్ అంబానీలు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ కంపెనీ నేడు ఈ స్థాయికి రావడానికి కారణమైన వాళ్లలో ధీరూభాయ్ అంబానీ సోదరీమణులలో ఒకరు కూడా ఉన్నారు.ధీరూభాయ్ అంబానీ అంటే.. ముఖేష్ అంబానీ తండ్రి, నీతా అంబానీ మామ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు అని అందరికీ తెలుసు. అయితే ఈయనకు నలుగురు తోబుట్టువులు కూడా ఉన్నట్లు సమాచారం. వీరు త్రిలోచన బెన్, రామ్నిక్లాల్ అంబానీ, జాసుబెన్, నతుభాయ్. త్రిలోచన బెన్ వయసులో ధీరూభాయ్ అంబానీ కంటే పెద్దవారు.త్రిలోచన బెన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థాపనలో పరోక్షంగా ముఖ్యమైన పాత్ర పోషించారు. అయితే ఈమె గురించి చాలామందికి తెలియకపోవడం గమనార్హం. త్రిలోచన బెన్ కుమారుడు రిలయన్స్ వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరైన రసిక్లాల్ మెస్వానీ. ఈమె మనవళ్లు నిఖిల్ ఆర్ మేస్వానీ, హిటల్ ఆర్ మేస్వానీ కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్లో కీలక పదవుల్లో ఉన్నారు.నిఖిల్ ఆర్ మేస్వానీ 1986లో ఆర్ఐఎల్లో చేరి కంపెనీ బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు. ఈయన పెట్రోకెమికల్ విభాగాన్ని చూసుకుంటూ.. ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్తో పాటు ఇండియన్ సూపర్ లీగ్ను నిర్వహించడంలో కూడా పాల్గొంటారు.ఇక త్రిలోచన బెన్ చిన్న మనవడు హిటల్ ఆర్ మేస్వాని 1995లో కంపెనీలో చేరి.. తన అన్న నిఖిల్ మాదిరిగానే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అదే పదవిని నిర్వహించారు. పెట్రోలియం రిఫైనింగ్, మార్కెటింగ్, పెట్రోకెమికల్స్ తయారీతో పాటు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ (HR), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రీసెర్చ్ & టెక్నాలజీ వంటి కంపెనీ ఇతర కార్పొరేట్ విధులను కూడా ఈయన నిర్వహిస్తారు.ముకేశ్ అంబానీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన వ్యాపార ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్నారు. నా మొదటి బాస్.. నా అత్త కుమారుడు రసిక్లాల్ మెస్వానీ అని పేర్కొన్నారు. అంతే కాకుండా ఈయన సంస్థను సరైన దిశలో నడిపించారని ప్రశంసించారు.రసిక్లాల్ మెస్వానీ చాలా ఓపెన్గా ఉంటారు. మేము ఒకరి క్యాబిన్లోకి మరొకరు వెళ్ళవచ్చు. సమావేశాల్లో, చర్చల్లో పాల్గొనవచ్చు. దీన్ని మా నాన్న ప్రోత్సహించారు. నేను అధికారికంగా రిలయన్స్లో చేరినప్పుడు.. నాన్న పాలిస్టర్ వ్యాపారాన్ని రసిక్భాయ్ కింద ఉంచారు. ఇందులో పాలిస్టర్ ఫైబర్ను దిగుమతి చేసుకోవడం, దానిని టెక్స్టైల్ చేయడం, మా సొంత మిల్లులలో విక్రయించడం వంటివి ఉన్నాయని ముకేశ్ అంబానీ వెల్లడించారు. -
ఒలింపిక్ కమిటీకి ఏకగ్రీవంగా ఎన్నికైన నీతా అంబానీ
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) భారత ప్రతినిధిగా తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రపంచ క్రీడల్లో ఇండియా ప్రభావం పెరుగుతుందని, తనను కమిటీ సభ్యురాలుగా ఎన్నుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు నీతా తెలిపారు.జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్లో జరగబోయే ఒలింపిక్ క్రీడల్లో భాగంగా వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యులను ఎన్నుకున్నారు. అందులో భారత్ తరఫున నీతా అంబానీ తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘గ్లోబల్ ఒలింపిక్ బాడీ 142వ సెషన్లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యురాలిగా ఎంపికవ్వడం గౌరవంగా ఉంది. కమిటీ నాపై ఉంచిన నమ్మకం, విశ్వాసానికి ధన్యవాదాలు. ప్రపంచ క్రీడా రంగంలో భారత్ ప్రభావం పెరుగుతోంది. భారత్ తరఫున ఒలింపిక్ కమిటీకి సహకరించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం’ అని చెప్పారు.2016లో రియో డి జెనీరోలో జరిగిన ఒలింపిక్ క్రీడల సందర్భంగా ఆమె తొలిసారి ఐఓసీ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఐఓసీలో చేరిన మొదటి భారతీయ మహిళగా ఆమె గుర్తింపు పొందారు. భారత్లోని ముంబయిలో 30 ఏళ్లకు పైగా ఐఓసీ సెషన్ను నిర్వహించడంలో నీతా అంబానీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలాఉండగా, 2036 ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధమవుతున్నట్లు తెలిసింది.ఇదీ చదవండి: ఈఎస్ఐ పథకంలోకి భారీగా చేరిన ఉద్యోగులునీతా అంబానీ గురించి కొన్ని ఆసక్తికర అంశాలుఅంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా ఎన్నికైన మొదటి భారతీయ మహిళ.న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ ట్రస్టీ బోర్డులో చేరిన మొదటి భారతీయురాలు.ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్కు యజమాని.ఫుట్బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్కు నీతా అంబానీ వ్యవస్థాపక చైర్పర్సన్గా ఉన్నారు.నీతా ‘హర్ సర్కిల్’ అనే డిజిటల్ ప్లాట్పామ్ను స్థాపించారు. దీని ద్వారా భారత్లోని మహిళలకు విభిన్నమైన, ఇంటరాక్టివ్, సామాజిక స్పృహతో కూడిన డిజిటల్ సేవలను అందిస్తున్నారు.ముంబయిలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్గా నీతా అంబానీ వ్యవహరిస్తున్నారు. -
రిలయన్స్ డీలా
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 5 శాతం క్షీణించి రూ. 15,138 కోట్లకు పరిమితమైంది. టెలికం, రిటైల్ బిజినెస్ల వృద్ధిని ఇంధన, పెట్రోకెమికల్ మార్జిన్లు దెబ్బతీశాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 16,011 కోట్లు ఆర్జించింది. త్రైమాసికవారీ(క్యూ4)గా నికర లాభం 20 శాతం క్షీణించింది. తరుగుదల, ఎమారై్టజేషన్ వ్యయాలు 16 శాతం పెరిగి రూ. 13,596 కోట్లను తాకాయి. ఇబిటా 2 శాతం వృద్ధితో రూ. 42,748 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 12 శాతం ఎగసి రూ. 2.57 లక్షల కోట్లను తాకింది. ఆయిల్ టు కెమికల్(ఓ2సీ) బిజినెస్ ఇబిటా 14 శాతం నీరసించి రూ. 13,093 కోట్లకు పరిమితమైంది. చమురు, గ్యాస్ ఇబిటా 30 శాతం జంప్చేసి రూ. 5,210 కోట్లయ్యింది. కేజీ డీ6 బ్లాక్ నుంచి రోజుకి 28.7 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్ను ఉత్పత్తి చేసింది. జూన్ చివరికల్లా ఆర్ఐఎల్ నికర రుణ భారం రూ. 1.12 లక్షల కోట్లకు చేరింది. జియో ఇన్ఫోకామ్ గుడ్ జియో ప్లాట్ఫామ్స్ కన్సాలిడేటెడ్ నికర లాభం 12 శాతం వృద్ధితో రూ. 5,698 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 13 శాతం బలపడి రూ. 34,548 కోట్లను తాకింది. దీనిలో భాగమైన రిలయన్స్ టెలికం సరీ్వసుల విభాగం జియో ఇన్ఫోకామ్ స్టాండెలోన్ నికర లాభం వార్షికంగా 12 శాతం ఎగసింది. రూ. 5,445 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 10 శాతం పుంజుకుని రూ. 26,478 కోట్లకు చేరింది. వినియోగదారుల సంఖ్య 48.97 కోట్లను తాకింది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 181.7కు చేరింది. తలసరి డేటా వినియోగం రోజుకి 1జీబీని మించింది. దీంతో డేటా ట్రాఫిక్ కారణంగా ప్రపంచంలో అతిపెద్ద ఆపరేటర్గా అవతరించింది. చైనా వెలుపల అతిపెద్ద 5జీ ఆపరేటర్గా జియో నిలుస్తోంది. ఆర్ఐఎల్ షేరు బీఎస్ఈలో 2 % క్షీణించి రూ. 3110 వద్ద ముగిసింది. రిటైల్ బాగుంది...రిలయన్స్ రిటైల్ విభాగం ఆర్ఆర్వీఎల్ క్యూ1 నికర లాభం 5 శాతం వృద్ధితో రూ. 2,549 కోట్లయ్యింది. స్థూల ఆదాయం 8 శాతం ఎగసి రూ. 75,615 కోట్లను తాకింది. ఇబిటా 10 శాతంపైగా పుంజుకుని రూ. 5,664 కోట్లకు చేరింది. 331 కొత్త స్టోర్లను తెరిచింది. దీంతో వీటి సంఖ్య 18,918ను తాకింది. మరోపక్క కొత్తగా 30 మెట్రో(హోల్సేల్) స్టోర్లకు తెరతీసింది. వీటి సంఖ్య 200కు చేరింది. జర్మన్ దిగ్గజం మెట్రో ఏజీ నుంచి 2022 డిసెంబర్లో రిలయన్స్ రూ. 2,850 కోట్లకు మెట్రో బిజినెస్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.లాభాలు పటిష్టం కన్జూమర్, ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్ ప్రభావంతో క్యూ1లో మెరుగైన ఇబిటాను సాధించాం. ఇది డైవర్స్ పోర్ట్ఫోలియో బిజినెస్కున్న పటిష్టతను ప్రతిఫలిస్తోంది. డిజిటల్ సర్వీసుల బిజినెస్ ప్రోత్సాహకర పనితీరు చూపుతోంది. రిటైల్ బిజినెస్ సైతం పటిష్ట ఆర్థిక ఫలితాలను సాధించింది. – ముకేశ్ అంబానీ, చైర్మన్, ఎండీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ -
గతేడాదితో పోలిస్తే 34.5 శాతం పెరిగిన యూజర్లు
రిలయన్స్ జియో వైర్డ్ బ్రాడ్బ్యాండ్ యూజర్లు ఏడాదిలో 34.5 శాతం పెరిగారు. ఇదే సేవలందిస్తున్న ఎయిర్టెల్ వినియోగదారలు గతేడాదితో పోలిస్తే 24.2 శాతం పెరిగినట్లు ప్రకటన విడుదల చేశారు.భారత్లో 5జీ ఆధారిత ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (ఎఫ్డబ్ల్యూఏ) సేవలు వేగంగా పెరుగుతున్నాయి. దానికి అనుగుణంగా వైర్డ్ బ్రాడ్బ్యాండ్ వినియోగదారులు కూడా అధికమవుతున్నారు. ఈ విభాగంలో సేవలందిస్తున్న జియో తన ప్రత్యర్థిగా ఉన్న ఎయిర్టెల్ యూజర్ల సంఖ్యను అధిగమించింది.మే 2023-మే 2024 మధ్య జియో వైర్డ్ బ్రాడ్బ్యాండ్ వినియోగదారులు ఎయిర్టెల్ 24.2%తో పోలిస్తే 34.5% పెరిగారు. మే చివరి నాటికి ఎయిర్టెల్ వాడుతున్న 80 లక్షల వినియోగదారులతో పోలిస్తే జియో వైర్డ్ బ్రాడ్బ్యాండ్ యూజర్ల సంఖ్య 1.2 కోట్లకు చేరుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం మే చివరి నాటికి భారతదేశ వైర్డు బ్రాడ్బ్యాండ్ యూజర్లు 4.13 కోట్లుగా ఉంది.ఇదీ చదవండి: కొత్త కోడలి అదృష్టం!! పెళ్లి తర్వాత రూ.25వేల కోట్ల సంపద! -
81,000 దాటిన సెన్సెక్స్
ముంబై: దేశీయ స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ నాలుగోరోజూ కొనసాగింది. అధిక వెయిటేజీ టీసీఎస్(3%), ఇన్ఫోసిస్(2%), రిలయన్స్(1%), ఐసీఐసీఐ బ్యాంక్(1%) చొప్పున రాణించి సూచీల రికార్డు ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల కోతలు సెపె్టంబర్ నుంచి ప్రారంభం కావచ్చొనే అంచనాలూ సానుకూల ప్రభావం చూపాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కలిసొచ్చాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 627 పాయింట్ల లాభంతో 81,343 వద్ద ముగిసింది. నిఫ్టీ 188 పాయింట్లు పెరిగి 24,801 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు సూచీలకు సరికొత్త రికార్డులు కావడం విశేషం. ఉదయం నష్టాలతో మొదలైన సూచీలు ప్రథమార్ధమంతా బలహీనంగా ట్రేడయ్యాయి. మిడ్ సెషన్ నుంచి మార్కెట్ లాభాల బాట పట్టింది. ఒక దశలో సెన్సెక్స్ 806 పాయింట్లు బలపడి 81,523 వద్ద, నిఫ్టీ 225 పాయింట్లు ఎగసి 24,838 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. → ఐటీ కంపెనీలు ప్రకటిస్తున్న జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మెప్పిస్తున్నాయి. సెపె్టంబర్లో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు ఈ రంగ షేర్లకు మరింత డిమాండ్ పెంచాయి. ఎల్టీఐఎం 3.50%, టీసీఎస్ 3%, విప్రో 2.50%, ఇన్ఫోసిస్, పెర్సిస్టెంట్, కోఫోర్జ్, టెక్ మహీంద్రా 2% రాణించాయి. ఎంఫసీస్లు ఒకశాతం లాభపడ్డాయి. రూపాయి రికార్డ్ కనిష్టం @ 83.63 దేశీ కరెన్సీ డాలరుతో మారకంలో చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 5 పైసలు నీరసించి 83.63 వద్ద ముగిసింది. రూపాయి 83.57 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 83.66 వరకూ క్షీణించింది. -
అంబానీ ఆస్తులు జీరో కావాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా..?
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో ఉన్న ముఖేశ్ అంబానీ ఆస్తులు కరిగిపోవాలంటే ఎన్ని రోజులు పడుతుందోననే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా..‘కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయ్’ కదా.. ఒకవేళ అంబానీ తన వ్యాపారం పరంగా ఎలాంటి మూలధన వ్యయం చేయకుండా ప్రస్తుతం ఉన్న ఆస్తిని అనుభవించాలంటే ఎన్నేళ్లు సమయం పడుతుందో తెలుసుకుందాం.ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా పేరున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ నికర ఆస్తుల విలువ రూ.10.21 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఒకవేళ అంబానీ రోజూ రూ.3 కోట్ల రూపాయలు చొప్పున ఖర్చు చేసినా లేదా విరాళంగా ఇచ్చినా ఆయన సంపద మొత్తం 3,40,379 రోజుల్లో జిరో అవుతుంది. అంటే ఏడాదికి 365 రోజులకుగాను లెక్కిస్తే తన సంపద పూర్తిగా కరిగిపోవాలంటే 932 సంవత్సరాల 6 నెలలు పడుతుందన్నమాట. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదిక ప్రకారం 2024 ప్రారంభం నుంచి ఇప్పటివరకు అంబానీ ఆస్తుల నికర విలువ దాదాపు రూ.1.98 లక్షల కోట్లు పెరిగింది.ఇదీ చదవండి: మరో సిమెంట్ కంపెనీపై అదానీ కన్ను?ముఖేశ్ అంబానీ ఇటీవల తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల పెళ్లిని అంగరంగవైభవంగా నిర్వహించారు. రెండుసార్లు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లను జరుపుకున్నారు. దానికోసం రూ.కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. -
స్టయిల్ బై అమీ..
ఈశా అంబానీ రిలయన్స్ వారసురాలిగానే కాదు.. స్టయిల్ ఐకాన్గానూ ప్రసిద్ధురాలే! ఆమెకు ఆ స్టయిల్ని దిద్ది.. ఆమె ఐకానిక్ లుక్స్కి కారణమైన వ్యక్తి అమీ పటేల్! ఒక్క ఈశాకే కాదు ఎంతోమంది బాలీవుడ్ సెలబ్స్కి స్టయిల్ని సెట్ చేసిన ఈమె గురించి కొన్ని వివరాలు..ఫ్యాషన్ ప్రపంచంలో అమీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అనుకొని కాదు అనుకోకుండానే ఈ రంగంలోకి వచ్చింది. అమీ సొంతూరు ముంబై. అక్కడే పెరిగింది. అక్కడి సుప్రసిద్ధ సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఫైన్ ఆర్ట్స్ (పోర్ట్రెయిట్స్)లో మాస్టర్స్ చేసింది డిస్టింక్షన్తో.ఫ్యాషన్ రంగంలో ఆమె జర్నీ ఎల్ ఇండియాలో ఆర్ట్ డైరెక్టర్గా మొదలై లోఫిసియల్ ఇండియాలో ఫ్యాషన్ డైరెక్టర్, హార్పర్స్ బాజార్లో క్రియేటివ్ డైరెక్టర్ హోదా దాకా సాగింది. ఫ్యాషన్ మ్యాగజీన్స్లో పనిచేస్తున్నప్పుడే బాలీవుడ్లో అవకాశం వచ్చింది కాస్ట్యూమ్ డిజైనర్గా. కంటిన్యూ అయింది. ఆ పరిచయాలు, ఆమె పనితీరు‡ఆమెను సెలబ్రిటీ స్టయిలింగ్కి ఇన్వైట్ చేశాయి. అలా అమీ స్టయిలింగ్ చేసిన ఫస్ట్ బాలీవుడ్ స్టార్ ప్రియంకా చోప్రా. ఆమెను పెళ్లి కూతురిగా ముస్తాబుచేసింది అమీనే.ప్రియంకా పెళ్లిలో ఆమెను చూసినవారంతా అమీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఊహించని ఆ అవకాశం.. ఆమె ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అందుకే సొంతంగా స్టయిలింగ్ ఫర్మ్ని స్టార్ట్ చేసింది ‘స్టయిల్ బై అమీ( ్టy ్ఛbyఅఝజీ)’ పేరుతో. బాలీవుడ్కి అమీ స్టయిల్ ఆఫ్ వర్క్ కొత్త కాదు.. పైగా ప్రియంకా చోప్రా స్టయిలింగ్తో ది బెస్ట్ స్టయిలిస్ట్గానూ ప్రూవ్ చేసుకుంది. సెలబ్రిటీల వర్క్ కాంట్రాక్ట్స్, అగ్రీమెంట్స్తో ‘స్టయిల్ బై అమీ’ బిజీ అయిపోయింది. ఆలియా భట్, మాధురీ దీక్షిత్, కత్రినా కైఫ్, రకుల్ప్రీత్ సింగ్, పూజా హెగ్డే, శోభితా ధూళిపాళ.. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంబానీ లేడీస్.. ఈశా అండ్ నీతా అంబానీలతో కనిపిస్తుంది అమీ సెలబ్రిటీ స్టయిలింగ్ లిస్ట్!‘ప్రతి ప్రొఫెషన్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నట్టే సెలబ్రిటీ స్టయిలింగ్ కెరీర్లోనూ ఉంటాయి. కాబట్టి చాలెంజింగ్గా ఉండాలి. స్టయిలింగ్కి ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటూ లేదు. దీనికి స్టయిలిస్ట్ దగ్గర ట్రైనింగ్ని మించిన చదువులేదు. కష్టపడి పనిచేసే తత్వం, సహనం, సామర్థ్యం అదనపు అర్హతలు. మంచి ట్రైనింగ్తో పాటు ఈ మూడూ ఉంటే ఈ కెరీర్లో అందలం ఎక్కొచ్చు. ఫ్యాషన్కి సంబంధించి ఇప్పుడు జెండర్ బారియర్స్ లేవు. అబ్బాయిలు స్కర్ట్స్ వేసుకుంటున్నారు.. అమ్మాయిలు లుంగీ, టీ షర్ట్ని ఇష్టపడుతున్నారు. సో కాస్ట్యూమ్స్కి లింగ భేదాల్లేకుండా పోయాయి. నిన్ను నువ్వు ఎక్స్ప్రెస్ చేసుకోవడమనే అర్థంలోకి మారిపోయింది ఫ్యాషన్."వర్ధమాన స్టయిలిస్ట్లు ఈ మార్పును దృష్టిలో పెట్టుకోవాలి. సెలబ్రిటీ స్టయిలింగ్ అంటే గ్లామరస్ జాబ్ కాదని గుర్తుంచుకోవాలి. ఏ డ్రెస్ వేసుకోవాలి.. దానికి మ్యాచింగ్ యాక్ససరీస్ ఏంటీ.. హెయిర్ స్టయిల్ ఎలా ఉండాలని డిక్టేట్ చేయడం కాదు స్టయిలింగ్ అంటే! సెలబ్రిటీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని.. ఆ పర్సనాలిటీకి తగినట్లుగా వాళ్లను తీర్చిదిద్దే క్లిష్టమైన పని అది. ఈ క్రమంలో ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా సెలబ్రిటీ అభాసుపాలై.. వాళ్ల రెప్యుటేషనే పడిపోవచ్చు. అందుకే దీన్ని ఆషామాషీగా చూడొద్దు!’ అని ఔత్సాహిక స్టయిలిస్ట్లకు సలహా ఇస్తోంది" – అమీ పటేల్. -
అంబానీ చెల్లి.. భర్త చనిపోయినా కోట్ల కంపెనీకి ఛైర్పర్సన్గా..
ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా పేరున్న ముఖేశ్ అంబానీ కుంటుంబం గురించి తెలుసా అంటే.. ఆయన గురించి తెలియని వారుంటారా..? ముఖేశ్ భార్య నీతా, పిల్లలు ఆకాశ్, అనంత్, ఇషా అని చెబుతారు కదూ. కానీ ముఖేశ్ చెల్లెళ్ల గురించి ఎంతమందికి తెలుసు.. అందులో ఒకరి భర్త మరణించినా తన కంపెనీలను సమర్థంగా నిర్వహిస్తూ కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇంతకీ ఆమె ఎవరు..తాను చేస్తున్న వ్యాపారం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.ధీరూభాయ్ అంబానీకి ముఖేష్, అనిల్లతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరి పేర్లు నీనా కొఠారి, దీప్తి సల్గోకర్. నీనా కొఠారి 1986లో కొఠారి షుగర్స్ అండ్ కెమికల్స్ ఛైర్మన్ భద్రశ్యామ్ కొఠారిని వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు అర్జున్ కొఠారి, కుమార్తె నయనతార కొఠారి ఉన్నారు. నీనా భర్త శ్యామ్ కొఠారి 2015లో క్యాన్సర్తో మరణించారు. ఆ తర్వాత నీనా వారి కుటుంబ వ్యాపారమైన కొఠారి షుగర్స్ అండ్ కెమికల్స్ బాధ్యతలను చేపట్టారు. ఏప్రిల్ 8, 2015లో ఆమె కంపెనీ ఛైర్పర్సన్గా నియమితులయ్యారు.ఆమె భర్త మరణానంతరం కంపెనీ లాభాలను పెంచేందుకు చాలా కృషి చేశారు. ప్రస్తుతం కొఠారీ షుగర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.450 కోట్లుగా ఉంది. కార్పొరేట్ షేర్హోల్డింగ్స్ ప్రకారం.. నీనా భద్రశ్యామ్ కొఠారి రెండు స్టాక్లను కలిగి ఉన్నారు. వాటి నికర విలువ రూ.54 కోట్లకు పైగానే ఉంది. కార్పొరేట్ పరిశ్రమలో నీనా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఆమె 2003లో జావగ్రీన్ అనే కాఫీ అండ్ ఫుడ్ చైన్ని ప్రారంభించారు.ఆమె పెద్ద కుమారుడు అర్జున్ కొఠారి..కొఠారి షుగర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్కు మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. కుటుంబ వ్యాపారాన్ని విస్తరించేందుకు తల్లి నీనాతో కలిసి పని చేస్తున్నారు. కాగా, నీనా కుమార్తె నయనతార కెకె బిర్లా మనవడు షమిత్ భారతియాను వివాహం చేసుకున్నారు.ఇదీ చదవండి: అతిథుల కోసం 3 ఫాల్కన్ జెట్లు, 100 విమానాలుముఖేశ్ అంబానీ రెండో చెల్లి దీప్తి సల్గోకర్. ఈమె వీ.ఎం.సల్గోకర్ అండ్ బ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీ దత్తరాజ్ సల్గోకర్ భార్య. ఈ దంపతులు గోవాలో ‘సునపరంతా గోవా సెంటర్’లో ప్రదర్శనశాలను నిర్వహిస్తున్నారు. దీప్తి సల్గ్కోకర్ వీ.ఎం.సగోన్కర్ అండ్ బ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కార్పొరేట్ కమ్యునికేషన్ వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు.ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహా వేడుకకు సర్వం సిద్ధమైంది. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్ సెంటర్లో జులై 12న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటవ్వనుంది. వీరి వివాహానికి దేశీయ ప్రముఖులతోపాటు విదేశాల్లోని దిగ్గజ సంస్థల సీఈఓలు హాజరవుతున్నారు. -
అంబానీ పెద్ద కోడలు శ్లోకా బర్త్డే : ఆకాశ్ స్పెషల్ విషెస్ వైరల్
ఒకవైపు రిలయన్స్అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం అంతా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ పెళ్లి వేడుకల్లో బిజీ బిజీగా ఉన్నారు. మరోవైపు అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా బర్త్డేఈ రోజు. ఈ సందర్భంగా అంబానీ ఫ్యామిలీ శ్లోకాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక వీడియోను రూపొందించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.ముందుగా అంబానీ పెద్ద కుమారుడు, శ్లోకా మెహతా భర్త ఆకాశ్ అంబానీ తన భార్యకు స్పెషల్ విషెస్ అందించారు. తరువాత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, ఇషా, ఆనంద్ పిరామిల్ దంపతులతోపాటు కాబోయే వధూవరులు అనంత్, రాధిక మర్చంట్ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అందించారు. ప్రసిద్ధ డైమండ్ ట్రేడింగ్ కంపెనీ రోజీ బ్లూ డైమండ్స్ ఎండీ కుమార్తె శ్లోకా మెహతా. 1990, జూలై 11 న పుట్టింది. 2019 మార్చిలో ఆకాశ్ అంబానీనీ పెళ్లాడింది. వీరికి పృథ్వీ , వేద ఆకాశ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.కాగా జూలై 12న తన చిరకాల ప్రేయసి రాధిక మర్చంట్ను అనంత్ పెళ్లాడ బోతున్నాడు. ఈ పెళ్లి వేడుక మూడు రోజుల పాటు జరగనుంది. ఈ వివాహానికి దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు హాజరవుతున్నారు. అతిథి మర్యాదల ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు. అంతేకాదు వీరి పెళ్లి సందర్భంగా జులై 12-15 వరకు ముంబైలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఇప్పటికే పోలీసులు ప్రకటించడం గమనార్హం. View this post on Instagram A post shared by Shloka Akash Ambani (@shloka_ambani) -
అతిథుల కోసం 3 ఫాల్కన్ జెట్లు, 100 విమానాలు
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహా వేడుకకు సర్వం సిద్ధమైంది. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్ సెంటర్లో జులై 12న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటవ్వనుంది. వీరి వివాహానికి దేశీయ ప్రముఖులతోపాటు విదేశాల్లోని దిగ్గజ సంస్థల సీఈఓలు హాజరవుతున్నారు. దాంతో వారికి సకల సౌకర్యాలు సమకూర్చేలా ఇప్పటికే ఏర్పాట్లు జరిగిపోయాయి. అందులో భాగంగా ప్రముఖుల కోసం ఏకంగా అంబానీ కుటుంబం మూడు ఫాల్కన్ 2000 జెట్లను, 100 సాధారణ విమానాలను అద్దెకు తీసుకుంది.క్లబ్ వన్ ఎయిర్ సంస్థ సీఈఓ రాజన్ మెహ్రా అంబానీ జెట్ విమానాలను అద్దెకు తీసుకున్నట్లు ధ్రువీకరించారు. పెళ్లికి వచ్చిన అతిథులను తిరిగి వారి గమ్యస్థానాలను చేర్చడానికి వీటిని వినియోగిస్తారని చెప్పారు. అనంత్-రాధిక పెళ్లి సందర్భంగా జులై 12-15 వరకు ముంబయిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఇప్పటికే పోలీసులు ప్రకటించారు.కొన్ని మీడియా కథనాల ప్రకారం అనంత్-రాధికల పెళ్లికి రాబోయే విదేశీ ప్రముఖుల లిస్ట్ ఈ కింది విధంగా ఉంది.సౌదీ అరామ్కో సీఈవో అమిన్ నాసర్హెచ్ఎస్బీసీ గ్రూప్ ఛైర్మన్ మార్క్ టక్కర్భారతీయ సంతతికి చెందిన అడోబ్ సీఈవో శంతను నారాయణ్మోర్గాన్ స్టాన్లీ ఎండీ మైఖేల్ గ్రిమ్స్శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఛైర్మన్ జే లీముబాదలా ఎండీ ఖల్దున్ అల్ ముబారక్ బీపీ సీఈఓ ముర్రేఅనంత్-రాధికల పెళ్లి నేపథ్యంలో ముంబైలోని హోటల్స్ గదుల రేట్లు భారీగా పెరిగాయి. ఇప్పటికే మొత్తం రూమ్స్ బుక్ అయిపోయినట్లు కూడా కొన్ని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్స్ పేర్కొన్నాయి. సాధారణ రోజులలో ముంబైలోని కొన్ని ఫైవ్ స్టార్ హోటల్స్లోని గదుల ఛార్జీ ఒక రాత్రికి సుమారు రూ.13,000గా ఉండేది. అంబానీ ఇంట పెళ్లి వేడుకల సందర్భంగా ఈ ధరలను సుమారు రూ.1 లక్షకు పెంచినట్లు తెలిసింది.ఇదీ చదవండి: వచ్చే 2-3 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు!జులై 12న ‘శుభ్ వివాహ్’, జులై 13న ‘శుభ్ ఆశీర్వాద్’, జులై 14న ‘మంగళ్ ఉత్సవ్’ కార్యక్రమంతో పెళ్లి వేడుకలు ముగియనున్నాయి. త్వరలో పెళ్లి పీటలెక్కే జంట ఇప్పటికే రెండుసార్లు అంగరంగ వైభవంగా ప్రీవెడ్డింగ్ వేడుకలు నిర్వహించుకుంది. ఇటీవల ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు దాదాపు 4500 కిలోమీటర్లు క్రూయిజ్లో ప్రయాణిస్తూ రెండో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. గతంలో ఈ జంట జామ్నగర్లో తమ మొదటి ప్రీవెడ్డింగ్ వేడుకలను జరుపుకున్నారు. ఇటీవల అంబానీ కుంటుంబం 50 పేద జంటలకు సామూహిక వివాహాలను కూడా జరిపించింది. అందుకు అవసరమైన పూర్తి ఖర్చులను భరించింది. వివాహాల అనంతరం కొత్త జంటలకు అవసరమయ్యే ఇంటి సామగ్రిని అందించింది. ఇటీవల జరిగిన సంగీత్ వేడుకల్లో పాప్ సింగర్ జస్టిన్బీబర్ సందడి చేశారు. -
అనంత్-రాధికలు ఏం చదువుకున్నారంటే..
ఆసియా కుబేరుడిగా పేరున్న ముఖేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆయన రెండో కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహం జులై 12న జరుగనుంది. అయితే పెళ్లి పీటలెక్కనున్న జంట ఏం చదువుకుందనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? రిలయన్స్ ఇండస్ట్రీస్లో అనంత్ ఏ పాత్ర పోషిస్తున్నారు? వీరెన్ మర్చెంట్ కూతురిగా ఎన్కోర్ హెల్త్కేర్లో కొత్త పెళ్లి కూతురు ఏ పొజిషన్లో ఉన్నారు..? అనే విషయాలను తెలుసుకుందాం.అనంత్ అంబానీరిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ-నీతా అంబానీల రెండో కుమారుడు అనంత్ అంబానీ. ఆయన తన పాఠశాల విద్యను ముంబయిలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో పూర్తి చేశారు. యూఎస్ఏలోని రోడ్ ఐలాండ్లో ఉన్న బ్రౌన్ విశ్వవిద్యాలయం నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో బ్యాచిలర్స్ డిగ్రీ పట్టా పొందారు. అనంత్ అన్నయ్య ఆకాష్ అంబానీ కూడా బ్రౌన్ యూనివర్శిటీ పూర్వ విద్యార్ధి. ఆకాష్ ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ముఖేశ్ కూతురు, కుమారులు ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీలు ఆగస్టు 2023లో రిలయన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా చేరారు. ప్రస్తుతం అనంత్ అంబానీ రిలయన్స్ న్యూ ఎనర్జీకి సారథ్యం వహిస్తున్నారు.రాధిక మర్చంట్ఎన్కోర్ హెల్త్కేర్ గ్రూప్ వ్యవస్థాపకుడు వీరెన్ మర్చంట్-శైలా మర్చంట్ల కూతురు రాధిక మర్చంట్. ఆమె తన పాఠశాల విద్యను 1999 నుంచి 2006 వరకు కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్లో, 2006 నుంచి 2009 వరకు ఎకోల్ మొండియేల్ వరల్డ్ స్కూల్లో, 2009 నుంచి 2013 వరకు ముంబయిలోని బీడీ సోమాని ఇంటర్నేషనల్ స్కూల్లో పూర్తి చేశారు. ఆమె లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం..యూఎస్ఏలోని న్యూయార్క్లో ఉన్న న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ పట్టా పొందారు. రాధిక మర్చంట్, ఆమె సోదరి అంజలి మర్చంట్ ఎన్కోర్ హెల్త్కేర్ డైరెక్టర్ల బోర్డులో ఉన్నారు. ఆమె తండ్రి వీరెన్ మర్చంట్ కంపెనీ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. తల్లి శైలా మర్చంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఇదీ చదవండి: ‘అనంత్-రాధికల పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుకలు శుక్రవారం(జులై 12)న శుభ వివాహ్తో ప్రారంభమవుతాయి. జులై 13 శనివారం శుభ్ ఆశీర్వాద్, జులై 14న మంగళ్ ఉత్సవ్ కార్యక్రమాలతో ముగుస్తాయి. -
‘అనంత్-రాధికల పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల పెళ్లి వేడుకను పురస్కరించుకుని ముంబయిలో ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా స్థానిక పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ముందస్తు ప్రకటన విడుదల చేశారు. జులై 12 నుంచి 15 వరకు అనంత్-రాధికల వివాహ వేడుక జరిగే బాందాకుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లోని జియో కన్వెన్షన్ సెంటర్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ఈ ట్వీట్పై స్పందించిన ఓ నెటిజన్ ‘అంబానీ పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’ అని కామెంట్ చేశారు. అదికాస్తా వైరల్గా మారుతుంది.ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేశ్ అంబానీ ఇంట్లో పెళ్లంటే మామూలుగా ఉంటుందా..! ఇప్పటికే అంగరంగ వైభవంగా రెండుసార్లు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ను జరుపుకున్నారు. అందుకోసం రూ.కోట్లు ఖర్చు చేశారు. ఈ సెలబ్రేషన్స్కు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు వందల సంఖ్యలో హాజరయ్యారు. మరి పెళ్లికి ఇంకెందరు వస్తారోననే చర్చ జరుగుతోంది. అయితే అలా వస్తున్న వారికి ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా ముంబయి ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.ముంబయి ట్రాఫిక్ పోలీసులు ‘ఎక్స్’ ప్లాట్ఫామ్లో విడుదల చేసిన ప్రకటన ప్రకారం..2024 జులై 12-15 వరకు ముంబయిలోని బాందాకుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో సామాజిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి పెద్ద సంఖ్యలో అతిథులు, వీఐపీలు వస్తున్నారు. దాంతో భద్రతా కారణాల వల్ల జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వైపునకు వెళ్లే వాహనాలను వేరే మార్గానికి మళ్లిస్తున్నామని తెలిపారు.పోలీసుల ప్రకటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘అనంత్ అంబానీ పెళ్లి ఈవెంట్ పబ్లిక్ ఈవెంట్ ఎలా అవుతుంది?’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు. ‘హత్రాస్ భోలేబాబా వ్యవహారం కంటే అంబానీ పెళ్లికి ప్రభుత్వం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటోంది.. కారణం ఏంటో..’ అని ఒకరు, ‘అంబానీ పెళ్లి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’ అని మరొకరు కామెంట్లు చేస్తున్నారు.Due to a public event at the Jio World Convention Centre in Bandra Kurla Complex on July 5th & from July 12th to 15th, 2024, the following traffic arrangements will be in place for the smooth flow of traffic.#MTPTrafficUpdates pic.twitter.com/KeERCC3ikw— Mumbai Traffic Police (@MTPHereToHelp) July 5, 2024ఇదీ చదవండి: సంగీత్లో అదిరిపోయే స్టెప్పులేసిన అంబానీ కుటుంబంఅనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుకలు శుక్రవారం(జులై 12)న శుభ వివాహ్తో ప్రారంభమవుతాయి. జులై 13 శనివారం శుభ్ ఆశీర్వాద్, జులై 14న మంగళ్ ఉత్సవ్ కార్యక్రమాలతో ముగుస్తాయి. -
సంగీత్లో అదిరిపోయే స్టెప్పులేసిన అంబానీ కుటుంబం
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహ వేడుకల్లో భాగంగా ఇటీవల అంబానీ కుటుంబం ఘనంగా సంగీత్ జరుపుకుంది. ఈ సందర్భంగా ఇంటిల్లిపాది సభ్యులు డ్యాన్స్తో సందడి చేశారు. ఈ మేరకు విడుదలైన ఒక వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.అనంత్-రాధికల వివాహం జులై 12న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. జులై 13న ‘శుభ్ ఆశీర్వాద్’, జులై 14న ‘మంగళ్ ఉత్సవ్’ కార్యక్రమంతో వేడుకలు ముగియనున్నాయి. త్వరలో పెళ్లి పీటలెక్కే జంట ఇప్పటికే రెండుసార్లు అంగరంగ వైభవంగా ప్రీవెడ్డింగ్ వేడుకలు నిర్వహించుకుంది. ఇటీవల ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు దాదాపు 4500 కిలోమీటర్లు క్రూయిజ్లో ప్రయాణిస్తూ రెండో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. గతంలో ఈ జంట జామ్నగర్లో తమ మొదటి ప్రీవెడ్డింగ్ వేడుకలను జరుపుకున్నారు. ఇటీవల అంబానీ కుంటుంబం 50 పేద జంటలకు సామూహిక వివాహాలను కూడా జరిపించింది. అందుకు అవసరమైన పూర్తి ఖర్చులను భరించింది. వివాహాల అనంతరం కొత్త జంటలకు అవసరమయ్యే ఇంటి సామగ్రిని అందించింది.ఇదీ చదవండి: దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు రిలయన్స్ సిద్ధం..? -
హాట్స్టార్లో అనంత్-రాధికల వివాహ వేడుక స్ట్రీమింగ్
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహ వేడుకను ప్రసారం చేసేందుకు డిస్నీ హాట్స్టార్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది.అనంత్-రాధికల పెళ్లి జులై 12న జరగనుంది. దేశవ్యాప్తంగా అంబానీ అభిమానులు ఈ వేడుకను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా డిస్నీ హాట్స్టార్ ఈ వేడుక లైవ్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. జులై 12న ‘శుభ్ వివాహ్’తో వేడుక ప్రారంభం కానుంది. జులై 13న 'శుభ్ ఆశీర్వాద్', జులై 14న ‘మంగళ్ ఉత్సవ్’ కార్యక్రమాలతో ముగియనున్నాయి. ఈ సంబరాలను హాట్స్టార్లో వీక్షించవచ్చిన కంపెనీ తెలిపింది.అనంత్ అంబానీ-రాధికల జంట ఇప్పటికే రెండుసార్లు అంగరంగ వైభవంగా ప్రీవెడ్డింగ్ వేడుకలు నిర్వహించుకుంది. ఇటీవల ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు దాదాపు 4500 కిలోమీటర్లు క్రూయిజ్లో ప్రయాణిస్తూ రెండో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. గతంలో ఈ జంట జామ్నగర్లో తమ మొదటి ప్రీవెడ్డింగ్ వేడుకలను జరుపుకున్నారు. ఇటీవల అంబానీ కుంటుంబం 50 పేద జంటలకు సామూహిక వివాహాలను కూడా జరిపించింది. అందుకు అవసరమైన పూర్తి ఖర్చులను భరించింది. వివాహాల అనంతరం కొత్త జంటలకు అవసరమయ్యే ఇంటి సామగ్రిని అందించింది. -
దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు రిలయన్స్ సిద్ధం..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. టెలికాం విభాగంలో సేవలందిస్తున్న జియోను పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు తెచ్చే ప్రతిపాదనలున్నట్లు కొన్ని మీడియా సంస్థల కథనాల ద్వారా తెలిసింది. మార్కెట్ అనుకునేలా జియో ఐపీఓకు వస్తే దేశంలో మునుపెన్నడూ లేనివిధంగా రూ.55,000 కోట్ల నిధులు సమీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. అది దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా రికార్డు నెలకొల్పనుంది.రిలయన్స్ జియో ఇటీవల మొబైల్ టారిఫ్లను పెంచింది. దాంతో టెలికాం రంగంలో సేవలందిస్తున్న ఎయిర్టెల్, వొడాఫోన్ఐడియా వంటి ఇతర కంపెనీలు జియో పంథానే ఎంచుకున్నాయి. అవి కూడా టారిఫ్లను పెంచాయి. దాంతో వినియోగదారుల నుంచి కొంత విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఇలా ఐపీఓ వార్తలు రావడం గమనార్హం. వచ్చే ఏడాది ప్రారంభంలో జియో ఐపీఓ రావొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు జియో 4జీ టారిఫ్లతోనే 5జీ సేవలు అందిస్తుండగా, ఇకపై 5జీకి ప్రత్యేక టారిఫ్ నిర్ణయించే అవకాశం ఉందని చెబుతున్నాయి.జులై నెలలో మొదటి త్రైమాసిక ఫలితాలు వెలువడే అవకాశం ఉండడంతో ఆగస్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) వార్షిక సాధారణ సమావేశాన్ని (ఏజీఎమ్) నిర్వహిస్తుంది. ఇందులో జియో ఐపీఓకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ ఊహిస్తున్న విధంగా జియో ఐపీఓ ద్వారా రూ.55 వేలకోట్లు సమీకరించానుకుంటే దేశంలో అతిపెద్ద ఐపీఓగా నిలువనుంది. ఇప్పటివరకు రూ.21 వేలకోట్లు సమీకరించి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఐపీఓనే అతిపెద్దదిగా ఉంది. జియో మొత్తం విలువ దాదాపు రూ.11 లక్షల కోట్లుగా అంచనా. పెద్ద కంపెనీ ఐపీఓకు వస్తే అందులో సుమారు 5 శాతం విక్రయించాల్సి ఉంటుంది. కాబట్టి దాని విలువ రూ.55 వేలకోట్లుగా లెక్కిస్తున్నారు.ఇదీ చదవండి: గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్.. మంత్రి ప్రకటనఇటీవల పెంచిన టారిఫ్లతో కంపెనీ సగటు వినియోగదారు ఆదాయం (ఆర్పు) పెరుగుతుందని మార్కెట్ అంచనా వేస్తుంది. 5జీకు ప్రత్యేకంగా టారిఫ్లు తీసుకురావడంతో మరింత ఆదాయం సమకూరుతుంది. దాంతో కంపెనీ రెవెన్యూలో పెరుగుదల ఉంటుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఫలితంగా కంపెనీ షేర్లను కొనుగోలు చేస్తున్నారు. కేవలం గడిచిన నెల రోజుల్లో స్టాక్ ధర ఏకంగా 11.4 శాతం పెరిగింది. -
‘మామేరు’ వేడుకలో మెరిసిన రాధిక : అమ్మనగలతో అందంగా, అద్భుతంగా!
అపర కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన చిరకాల ప్రేయసితో వివాహ బంధంలోకి అడుగుపెట్టే ముహూర్తం సమీపిస్తోంది. దీంతో పెళ్లి వేడుకలోని కీలక ఘట్టాలు ఒక్కొక్కటీ వైభవంగా మొదలయ్యాయి.ప్రధానంగా గుజరాతీ వివాహాల్లో తొలుతగా నిర్వహించే ఆచారాలను ఇరు కుటుంబాలు పాటిస్తున్నాయి. ఇందులో భాగంగానే ముంబైలోని యాంటిలియాలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల మామేరు వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా కాబోయే వధువు రాధిక తన స్టయిలిష్ లుక్తో అందర్నీ ఆకట్టుకుంది.అమ్మ నగలతో అందంగారాధికా మర్చంట్ ఆరెంజ్ అండ్ పింక్ షేడ్స్లో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లెహంగాలో అందంగా ముస్తాబైంది. బంగారు నెక్లెస్ , మ్యాచింగ్ జుంకాలు, బ్యాంగిల్స్ ఇంకా స్పెషల్ హెయిర్ స్టయిల్తో ఆమె ఫ్యాషన్ లుక్ అదిరిపోయింది. ముఖ్యంగా ఇదే వేడుకలో తన తల్లి ధరించిన ఆభరణాలను ఎంచుకోవడం ప్రత్యేకతగా నిలుస్తోంది.బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్, ప్రియుడు శిఖర్ పహారియాతో స్టైలిష్గా కనిపించింది. ఇంకా మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్, ఓరీ తదితర బాలీవుడ్ ప్రముఖులు ఈ ఈవెంట్కు మరింత గ్లామర్ జోడించారు. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) గుజరాతీ వివాహాలలో కుటుంబ ప్రాముఖ్యతను, వరుడు తల్లి పుట్టింటివారి ప్రేమలను చాటేలా 'మోసలు' లేదా 'మామెరు' వేడుకులను నిర్వహిస్తారు. ఈ 'మామేరు' వేడుకలో వధూవరులు మేనమామలు, ఇతర కుటుంబ సభ్యుల ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. అమ్మతరపు వారు అందించే బహుమతులను స్వీకరిస్తారు.కాగా జూలై 12నుంచి ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహ వేడుకలు జరగ బోతున్నాయి. జూలై 13న శుభ్ ఆశీర్వాద్, జూలై 14న మంగళ్ ఉత్సవ్ (వివాహ రిసెప్షన్)దాకా ఈ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. -
యూజర్లకు షాక్!.. ఒక్కసారిగా పెరిగిన రీఛార్జ్ ప్లాన్స్
భారతీయ టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ జియో తన కొత్త అన్లిమిటెడ్ ప్లాన్లను ప్రకటించింది. కొత్తగా ప్రకటించిన ఈ ప్లాన్స్ జులై 3నుంచి అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్లాన్లతో పోలిస్తే కొత్తగా అమలులోకి వచ్చే ప్లాన్స్ ధరలు 20శాతం ఎక్కువ.కంపెనీ వెల్లడించిన డేటా ప్రకారం.. జులై 3నుంచి 155 రూపాయల ప్లాన్ 189 రూపాయలకు, 209 రూపాయల ప్లాన్ 249 రూపాయలకు చేరుతుంది. రూ. 2999 యాన్యువల్ ప్లాన్.. త్వరలో 3599 రూపాయలకు చేరుతుంది. దీనికి సంబంధించిన వివరాలను జియో అధికారికంగా వెల్లడించింది.జియో మొత్తం మీద 2 పోస్ట్ పెయిడ్ ప్లాన్ల ధరలు, 17 ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను ఒక్కసారిగా పెంచుతూ ప్రకటించింది. జియో ప్రస్తుతం ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ నేతృత్వంలో ఉంది. కొత్త రీఛార్జ్ ధరలు తప్పకుండా యూజర్ల మీద భారం చూపిస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.Reliance Jio introduces new unlimited 5G plans to be available from 3rd July pic.twitter.com/TsDMAG682r— ANI (@ANI) June 27, 2024 -
భారత్లోనే విలువైన బ్రాండ్
భారత్లో అత్యంత విలువైన బ్రాండ్ల్లో టాటా గ్రూప్ టాప్లో నిలిచింది. ఈ మేరకు బ్రాండ్ ఫైనాన్స్ తాజాగా విడుదల చేసిన విలువైన బ్రాండ్ ర్యాంకింగ్స్ టైటిల్ను టాటా గ్రూప్ దక్కించుకుంది. డిజిటలైజేషన్, ఈ-కామర్స్, ఈవీ, ఎలక్ట్రానిక్స్..వంటి రంగాలపై దృష్టి సారించిన ఈ సంస్థ బ్రాండ్ విలువ గతంలో కంటే 9 శాతం పెరిగి 28.6 బిలియన్ డాలర్ల(రూ.2.3 లక్షల కోట్లు)కు చేరుకుంది. గతేడాది ఈ టైటిల్కు దక్కించుకున్న టాటా గ్రూప్ ఈసారీ తన స్థానాన్ని నిలుపుకుంది.బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం..దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్గా టాటా గ్రూప్ టాప్లో నిలిచింది. 14.2 బిలియన్ డాలర్ల(రూ.1.18 లక్షల కోట్లు) బ్రాండ్ విలువతో ఇన్ఫోసిస్ రెండో స్థానంలో ఉంది. హెచ్డీఎఫ్సీ గ్రూప్ మూడో స్థానం (రూ.86 వేలకోట్లు) సాధించింది. గతేడాదిలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ విలీనం అవ్వడంతో ఈ స్థానం దక్కింది. ఎల్ఐసీ గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ గ్రూప్, ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్, లార్సెన్ & టూబ్రో, మహీంద్రా బ్రాండ్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.బ్రాండ్ ఫైనాన్స్ డైరెక్టర్ సావియో డిసౌజా మాట్లాడుతూ..‘టాటా గ్రూప్ దాని అనుబంధ సంస్థల్లో అత్యాధునిక సాంకేతికత వినియోగిస్తోంది. వ్యూహాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) స్పాన్సర్షిప్లు, ఎయిరిండియా వంటి కంపెనీ వాటాను సొంతం చేసుకుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ డొమైన్లో ప్రత్యేకత చాటుకుంటోంది. దాంతో కంపెనీ వినియోగదారులకు మరింత చేరువైంది. భారత్లోనే అత్యంత విలువైన బ్రాండ్గా స్థానం సంపాదించింది’ అని చెప్పారు.ఇదీ చదవండి: అత్యంత ధనవంతులపై ‘సంపద పన్ను’..?రంగాల వారీగా చూస్తే టెలికాం రంగం తన బ్రాండ్ విలువలో గతంలో కంటే 61 శాతం వృద్ధి సాధించింది. బ్యాంకింగ్ 26 శాతం, మైనింగ్, ఇనుము, ఉక్కు రంగాలు 16 శాతం చొప్పున వృద్ధి నమోదు చేశాయి. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్లలో వెస్ట్సైడ్ బ్రాండ్(టాటా గ్రూప్- 122 శాతం వృద్ధి) అగ్రస్థానంలో ఉంది. -
రిలయన్స్ కొత్త బిజినెస్
రిలయన్స్ రిటైల్ క్విక్ కామర్స్ బిజినెస్లోకి అడుగుపెట్టింది. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన 30-45 నిమిషాల్లో తమ వినియోగదారులకు వస్తువులు అందిస్తామని కంపెనీ తెలిపింది. అయితే ఈ సర్వీస్ ప్రాథమికంగా ముంబయి, నవీ ముంబయిలోని యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని చెప్పింది. సమీప భవిష్యత్తులో క్రమంగా దీన్ని ఇతర నగరాలకు విస్తరిస్తామని పేర్కొంది.ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) ఉత్పత్తులను తక్షణమే డెలివరీ చేసేందుకు వీలుగా రిలయన్స్ రిటైల్ ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చినట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి. జియోమార్ట్ మొబైల్ అప్లికేషన్లో ‘హైపర్లోకల్ డెలివరీ’ ఎంపిక చేసుకుని వస్తువులు ఆర్డర్ పెట్టవచ్చని కంపెనీ చెప్పింది. వినియోగదారులకు తమ వస్తువులను 30-45 నిమిషాల్లో అందిస్తామని పేర్కొంది. ఇందుకోసం రిలయన్స్ జియోమార్ట్ పార్టనర్ల చొరవ కీలకమని చెప్పింది.టాటా యాజమాన్యంలోని బిగ్బాస్కెట్, బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్, జెప్టో.. వంటి క్విక్ కామర్స్ కంపెనీలు తమ వినియోగదారులకు 10 నిమిషాల్లోనే వస్తువులు అందిస్తున్నాయి. కానీ రిలయన్స్ రిటైల్ మాత్రం వస్తువుల డెలివరీ సమయాన్ని 30-45 నిమిషాలుగా ప్రతిపాదించింది. ఈ అంశంపై స్పందిస్తూ..‘ప్రస్తుతం మార్కెట్లో క్విక్ కామర్స్ సేవలందిస్తున్న కంపెనీలు డార్క్ స్టోర్ల ద్వారా వస్తువులు డెలివరీ చేస్తున్నాయి. అందుకోసం కంపెనీ చాలా ఖర్చు చేయాలి. స్టోరేజీ ప్రదేశాలను ఏర్పాటు చేయాలి. పెద్దసంఖ్యలో డెలివరీ సిబ్బందిని నియమించుకోవాలి. దానికి బదులుగా, రిలయన్స్ జియోమార్ట్ పార్టనర్లను రిటైల్ డెలివరీకి వినియోగించుకోవాలని అనుకుంటున్నాం. దాంతో డెలివరీ సమయం కొంత పెరిగినా కంపెనీ బ్యాలెన్స్ షీట్ స్థిరంగా ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి. కస్టమర్ల డెలివరీ మార్గాలను ఆప్టిమైజ్ చేయడానికి ఫైండ్(FYND), లోకస్(Locus) వంటి సాంకేతిక ప్లాట్ఫారమ్లను ఉపయోగిస్తున్నాం’ అని చెప్పింది.గతేడాది రిలయన్స్..జియోమార్ట్ ఎక్స్ప్రెస్ పేరుతో నవీ ముంబయిలో క్విక్ కామర్స్ సర్వీస్ను ప్రారంభించింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సేవలను నిలిపేసింది. తిరిగి తాజాగా తన సర్వీస్లను మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది. రిలయన్స్ రిటైల్ కిరాణా వ్యాపారం కోసం కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దామోదర్ మాల్, జియోమార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సందీప్ వరగంటితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. -
కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న నీతా అంబానీ
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ సోమవారం వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు. జులై 12న జరగబోయే తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ ఆహ్వాన పత్రికను స్వామివారి ముందుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం దేవాలయం ముందున్న దుకాణంలో చాట్ తింటూ స్థానికులతో కాసేపు ముచ్చటించారు.రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ-నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల ప్రివెడ్డింగ్ వేడుకలను ఇప్పటికే ఘనంగా నిర్వహించారు. మొదటిసారి వేడుకలను జామ్నగర్లో జరిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఈ వేడుకలో అలరించారు. ఇటీవల రెండోసారి ఏకంగా సముద్రంలో దాదాపు 4000 కిలోమీటర్లు క్రూయిజ్లో ప్రయాణిస్తూ అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకున్నారు. జులై 12న వివాహ ముహుర్తం నిర్ణయించడంతో ప్రముఖులను ఆహ్వానించాల్సి ఉంటుంది. దానికంటే ముందు నీతా అంబానీ తన ఇష్టదైవమైన కాశీ విశ్వనాథున్ని దర్శించుకుని కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను స్వామివారి చెంత ఉంచేందుకు సోమవారం వారణాసి చేరుకున్నారు.స్వామివారికి మొక్కులు చెల్లించిన అనంతరం దేవాలయం ముందు ఉన్న చాట్ దుకాణంలో చాట్ తింటూ ఆడంబరాలు లేకుండా స్థానికులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘కాశీ విశ్వనాథుడి ఆశీర్వాదాలు ఎప్పుడూ నావెంట ఉంటాయి. అనంత్-రాధికల వివాహ ఆహ్వాన పత్రికను పరమశివుడికి సమర్పించి స్వామివారి దీవెనలు కోరేందుకు వచ్చాను. పదేళ్ల తర్వాత స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది’ అన్నారు. ఈ మేరకు తీసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.#WATCH | Varanasi, Uttar Pradesh: Founder and Chairperson of Reliance Foundation Nita Ambani visits a chaat shop and interacts with locals pic.twitter.com/1QIY4Ha0xs— ANI (@ANI) June 24, 2024ఇదీ చదవండి: యాపిల్ ఉత్పత్తుల్లో మెటా ఏఐ.. క్లారిటీ ఇచ్చిన దిగ్గజ సంస్థ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో ఉన్న జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జులై 12న అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల వివాహం జరగనుంది. ఎన్కోర్ హెల్త్కేర్ సీఈఓ వీరేన్-శైలా మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్. -
దేశ వ్యాప్తంగా జియో సేవలు డౌన్.. గగ్గోలు పెడుతున్న యూజర్లు
ప్రముఖ టెలికం నెట్వర్క్ జియోలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న యూజర్లు వాట్సప్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్, స్నాప్చాట్, యూట్యూబ్, గూగుల్ను వినియోగించుకోలేక పోతున్నామంటూ ఫిర్యాదులు చేస్తున్నారు.ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్డిటెక్టర్ మేరకు..మొబైల్ ఇంటర్నెట్లో సమస్యలు తలెత్తుతున్నాయని 54 శాతం ఫిర్యాదు, 38 శాతం జియో ఫైబర్, 7 శాతం మొబైల్ నెట్వర్క్లో సమస్య ఉత్పన్నమైనట్లు సమాచారం.మరోవైపు యూజర్లకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ జియో కస్టమర్ కేర్ విభాగం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు నెటిజన్లు జియో సంస్థ తీరుకు నిరసనగా మీమ్స్ షేర్ చేస్తున్నారు. -
అనంత్-రాధిక క్రూయిజ్ పార్టీ : మెరిసిన రాధిక, ఫోటోలు వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన ప్రేయసి రాధికా మర్చంట్ను జులైలో పెళ్లి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే మార్చిలో అనంత్-రాధిక తొలి ప్రీవెడ్డింగ్ పార్టీని ఘనంగా నిర్వహించారు. ఆ తరువాత కనీవినీ ఎరుగని రీతిలో ఇటలీలో రెండొ ప్రీ-వెడ్డింగ్ వేడుకను గ్రాండ్ క్రూయిజ్ పార్టీలో నిర్వహించారు. మే 29న ప్రారంభమై జూన్ 1న ఫ్రాన్స్లో ముగిసిన ఈ వేడుకలో పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు సందడి చేసిన సంగతి తెలిసిందే.తాజాగా అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ ఫోటోలు ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అనంత్ రాధికా వివాహం జరగనుంది. మూడు రోజుల పాటు జరిగే వివాహ వేడుకలో మూడు ఈవెంట్లు ఉండ బోతున్నాయి. తొలుత 'శుభ వివాహ' ఆ తర్వాత జూలై 13న 'శుభ్ ఆశీర్వాద్' , 'మంగళ ఉత్సవ్', జూలై 14న వివాహ రిసెప్షన్ ఉంటుంది. అనంత్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్ఫారమ్లు, రిలయన్స్ రిటైల్ వెంచర్స్, రిలయన్స్ న్యూ ఎనర్జీ , రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీ బోర్డులలో డైరెక్టర్గా పనిచేస్తున్నారు -
సినీ, క్రికెట్ ప్రముఖులతో ‘వంతారా’ ప్రచారం
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీకు చెందిన వన్యప్రాణుల సంరక్షణ ప్రాజెక్ట్ వంతారా సరికొత్త ప్రచారం ప్రారంభించింది. ప్రతిఒక్కరూ ప్రకృతిని సంరక్షించాలని కోరింది. అందుకోసం అందరూ కృషి చేయాలని తెలియజేసేలా సినీ, క్రికెట్ ప్రముఖులతో ‘ఐయామ్ వంతారియన్’ పేరుతో ప్రత్యేక ప్రచారం మొదలుపెట్టింది. బుధవారం అందుకు సంబంధించిన ఒక వీడియోను విడుదల చేయడంతో అదికాస్తా వైరల్గా మారింది.ప్రముఖ సినీ ప్రముఖులు అజయ్ దేవగణ్, భూమి పెడ్నేకర్, జాన్వీ కపూర్, వరుణ్ శర్మ, కుషా కపిల, క్రికెట్ ప్రముఖలు కేఎల్ రాహుల్తో సహా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులతో ఈ వీడియో రూపొందించారు. అందరూ పర్యావరణం పట్ల నిబద్ధత కలిగిఉండాలని వారు ఈ వీడియోలో కోరారు. పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని నొక్కిచెప్పారు. #IamAVantarian హ్యాష్ట్యాగ్తో చేపట్టిన ఈ వీడియో ప్రచారానికి భారీగా స్పందన వస్తోంది.రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిలయన్స్ ఫౌండేషన్ వంతారా పేరిట సమగ్ర జంతు సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని గతంలో ప్రారంభించింది. గాయపడిన జంతువులను రక్షించడం, చికిత్స చేయడంతో పాటు వాటి సంరక్షణ, పునరావాసం ఏర్పాటుచేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఇందులోకోసం గుజరాత్లోని జామ్నగర్ రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్లో 3వేల ఎకరాల్లో కృత్రిమ అడవిని ఏర్పాటుచేశారు.ఇదీ చదవండి: బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోయినా యూపీఐ చెల్లింపులు..!ఈ అడవిలో జంతువులు నివసించేందుకు వీలుగా సహజ వసతులు సిద్ధం చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ప్రపంచంలోనే అదిపెద్ద ఆసుపత్రి ఉంది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, అధునాతన సదుపాయాలు ఉన్నాయి. View this post on Instagram A post shared by Vantara Reliance (@vantara) -
అనంత్-రాధికల ప్రీవెడ్డింగ్ వేడుకలో కాటిపెర్రీ పెర్ఫార్మెన్స్
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాప్ సెన్సేషన్ కాటి పెర్రీ చేసిన లైవ్ పెర్ఫార్మెన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో పెర్రీ సిల్వర్కలర్లో శరీరాన్ని హత్తుకుని ఉండే దుస్తులు ధరించి అందరినీ ఆకట్టుకుంది. తనతోపాటు ఈ ఈవెంట్లో పాల్గొన్న తన ట్రూప్ తెల్లటి దుస్తులు ధరించి వేడుకలో పాల్గొన్న సెలబ్రిటీలను అలరించారు.ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్-రాధికల రెండో ప్రీవెడ్డింగ్ వేడుకలు మే 29న ప్రారంభమై జూన్ 1న ముగుస్తాయి. క్రూయిజ్షిప్లో జరిగే ఈ వేడుకలో దాదాపు 900 మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్కు సుమారు 4,380 కిలోమీటర్లమేర క్రూయిజ్ ప్రయాణం సాగుతుంది.అనంత్ అంబానీ-రాధిక మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఈ ఏడాది మార్చినెలలో ఘనంగా జరిగాయి. గుజరాత్లోని జామ్నగర్ జరిగిన ఈ వేడుకల్లో ప్రముఖులు సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో మెటా ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, గ్లోబల్ పాప్ స్టార్ రిహన్న వంటి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. ముకేశ్ అంబానీ తన కుమారుడు, కోడలు ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం సుమారు రూ.1200 కోట్లు ఖర్చు చేసినట్లు ఫోర్బ్స్ గతంలోనే నివేదించింది.ఇదీ చదవండి: భారీగా తగ్గనున్న ఎలక్ట్రానిక్ వాహన ధరలు.. ఎంతంటే..సంప్రదాయ హిందూ వైదిక ఆచారాల ప్రకారం ఈ జంట ముంబైలో జులై 12న వివాహం చేసుకోనుంది. జులై 12 శుక్రవారం రోజున శుభ వివాహ వేడుకతో పెళ్లి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జులై 13 శనివారం శుభ్ ఆశీర్వాద్, జులై 14 ఆదివారం రోజు జరిగే మంగళ్ ఉత్సవ్, వివాహ రిసెప్షన్తో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.Katy Perry performing Firework at Cannes tonight! pic.twitter.com/MafEP3OJGP— Katy Perry Today (@todaykatyp) June 1, 2024 -
అంబానీ మనవరాలా..మజాకా..క్రూయిజ్లో ఫస్ట్ బర్త్డే
రిలయన్స్ అధినేత ముఖేశ్అంబానీ తన మనవరాలి మొదటి పుట్టినరోజు వేడుకలను ఏకంగా క్రూయిజ్ షిప్లో జరుపుకునేలా ప్లాన్ చేశారు. ముఖ్శ్ అంబానీ పెద్దకుమారుడు ఆకాశ్ అంబానీ-శ్లోకామెహతాల కూతురు వేదాఆకాశ్అంబానీ బర్త్డే వేడుకలను 900 మంది సెలబ్రిటీలతో కలిసి సముద్రంలో జరుపుకుంటున్నారు.అపరకుబేరుడు ముఖేశ్అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు దాదాపు 4500 కిలోమీటర్లు క్రూయిజ్లో ఈ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. మే 29న మొదలైన ఈవేడుక జూన్1న ముగియనుంది. అయితే మే31న అనంత్ అన్నయ్య-వదినల కూతురు వేదా మొదటి పుట్టినరోజు. దాంతో పెళ్లి వేడుకల్లోనే ఈ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే అనంత్-రాధిక జంట జామ్నగర్లో తమ మొదటి ప్రీవెడ్డింగ్ ఈవెంట్ను అంగరంగవైభవంగా జరుపుకున్నారు.ఇదీ చదవండి: ఏఐతో వై-ఫై స్పీడ్ పెంచేందుకు పెట్టుబడులుఆకాశ్-శ్లోకా మెహతాలకు ఇద్దరు పిల్లలు. కుమారుడు పృథ్వీ, కూతురు వేదా. పృథ్వీ డిసెంబర్ 2020లో జన్మించాడు. వేదా మే 31, 2023లో పుట్టింది. -
పొల్యూషన్కి మామిడి మొక్కలతో చెక్ పెట్టి..దాన్నే బిజినెస్గా మార్చేశాడు!
భారత పారిశ్రామిక దిగ్గజం,రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి రిలయన్స్ జియో వంటి వివిధ వ్యాపారాలు ఉన్నాయి. ఆయనే ఆసియాలో అతిపెద్ద మామిడి తోటను కలిగి ఉన్న వ్యక్తి కూడా. అంతేగాదు ఎక్కువ మామిడి పండ్లను పండించి ఎగుమతి చేసేది కూడా రిలయన్స్ సంస్థే. దీని వెనుక దాగున్న ఆసక్తికర కథ వింటే..ముఖేశ్ అంబానీకి సలాం కొట్టకుండా ఉండలేరు.భారతదేశంలో అత్యంత ధనవంతుడైన ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ 1990లలో ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ ఆయిల్ని గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేశారు. దీని కారణంగా పెద్ద మొత్తంలో కాలుష్యం ఏర్పడటం జరిగింది. ఈ విషయమై కాలుష్య నియంత్రణ బోర్డుల నుంచి రిలయన్స్కి నోటీసులు వచ్చాయి. దీంతో ఈ సమస్యకు పరిష్కారం కోసం తీవ్రంగా అన్వేషించడం మొదలు పెట్టింది రిలయన్స్. దీనికి చెక్పెట్టగలిగేది మామిడి మొక్కలే అని డిసైడ్ అయ్యారు. వెంటనే ఆ రిఫైనరీ ఆయిల్ సమీపంలో ఉన్న దాదాపు 600 ఎకరాల బంజరు భూములను గ్రీన్ఫీల్డ్గా మార్చేసింది. ఆ భూముల్లో ఏకంగా 200 రకాల మామిడి మొక్కలను నాటించింది. ఈ తోటకు ముఖేశ్ అంబానీ తండ్రి రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ పేరు మీదుగా 'దీరుభాయ్ అంబానీ లిఖీబాగ్ అమ్రాయీ' అనే పేరే పెట్టారు. దీనిని లఖీభాగ్ అని పిలుస్తారు. ఇది బిహార్లోని దర్భంగాలో ఉంది. ఈ తోటలో అల్ఫోన్సో, రత్న, సింధు, నీలం, ఆమ్రపాలి వంటి ప్రధాన భారతీయ రకాలే కాకుండా విదేశీ మామి రకాలు కూడా ఉన్నాయి. ఈ లఖీబాగ్ అమ్రాయి తోట నుంచి ఏడాదికి దాదాపు 127 రకాల మామిడి పండ్లను ఉత్తత్తి చేస్తుంది. వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తారు. అంతేగాదు రిలయన్స్ పండ్ల తోటలను సందర్శించి వినూత్న పద్ధతులను నేర్చుకోమని రైతులను ప్రోత్సహిస్తోంది కూడా. పైగా ప్రతి ఏడాది ఏకంగా ఒక లక్షకుపైగా మామిడి మొక్కలను ఉచితంగా రైతులకు పంపిణీ చేస్తుంది రిలయన్స్ కంపెనీ. ఇక్కడ ఒక సమస్య పరిష్కారాన్ని కనుగొని దాన్నుంచి కూడా వ్యాపారం చేసి లాభాలు ఆర్జించిన గొప్ప వ్యాపారవేత్త మన ముఖేశ్ అంబానీ. నిజంగా బిజినెస్ మ్యాన్ అసలైన నిర్వచనం, స్ఫూర్తి కూడా అతడే కదూ..!.(చదవండి: ఫిడే చెస్ రేటింగ్ పొందిన అతిపిన్న వయస్కురాలు! దటీజ్ జియానా గర్గ్..!) -
రష్యా కంపెనీతో రిలయన్స్ ఒప్పందం.. ఎందుకంటే..
ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనింగ్ కాంప్లెక్స్ ఆపరేటర్గా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రష్యాకు చెందిన రోస్నెఫ్ట్తో ఒప్పందం కుదుర్చుకుంది. నెలకు కనీసం 3 మిలియన్ బ్యారెళ్ల చమురును రష్యా కరెన్సీ రుబెళ్లలో కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ డీల్ ఒక ఏడాదిపాటు కొనసాగుతుందని కంపెనీ వర్గాలు చెప్పాయి.రోస్నెఫ్ట్తో కుదిరిన ఈ డీల్ వల్ల రిలయన్స్ రాయితీ ధరలకే చమురు పొందనుంది. చమురు ఉత్పత్తిదారుల ఒపెక్ ప్లస్ కూటమి జూన్ తర్వాత స్వచ్ఛందంగా క్రూడ్ సరఫరాలో కోతలు విధించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థ (ఒపెక్), రష్యాతో సహా మిత్రదేశాలతో కూడిన ఒపెక్ ప్లస్ కూటమి జూన్ 2న జరిగే ఆన్లైన్ సమావేశంలో చమురు కోతలపై చర్చించనుంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఈ డీల్ కుదుర్చుకోవడంపట్ల మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.ఇదీ చదవండి: థాయ్లాండ్ వీసా నిబంధనల్లో మార్పులురష్యా-ఉక్రెయిన్ మధ్య అనిశ్చితులు తీవ్రరూపం దాల్చిన సమయంలో వెస్ట్రన్ దేశాలు, అమెరికా రష్యా చమురు దిగుమతులపై ఆంక్షలు విధించింది. దాంతో రష్యా తక్కువ ధరకే భారత్ వంటి ఇతర దేశాలకు చమురు అమ్మడం ప్రారంభించింది. అందులో భాగంగానే రిలయన్స్ వంటి భారత ప్రైవేట్ చమురు కంపెనీలు ఆ దేశం నుంచి క్రూడ్ కొనుగోలు చేస్తున్నాయి. ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉంది. -
స్లాట్లు, విదేశీ దైపాక్షిక హక్కులు కోల్పోయిన విమానసంస్థ
గోఎయిర్ విమాన సంస్థ స్లాట్లు, విదేశీ ద్వైపాక్షిక హక్కులను తాత్కాలికంగా ఇతర కంపెనీలకు కట్టబెడుతూ కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ చర్యలు తీసుకుంది.గోఎయిర్కు చెందిన స్లాట్లు, దైపాక్షిక హక్కులను ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగోలకు పంపిణీ చేస్తున్నట్లు మంత్రిత్వశాఖ ప్రకటించింది. అయితే వీటిని సాధారణ పూల్లో ఉంచి ఆపై ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణంగా కేటాయించాలని మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు కొందరు అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా, అకాసా సంస్థ గోఎయిర్ దుబాయ్ విమానయాన హక్కులను కోరినట్లు తెలిసింది. దీనిపై కేంద్రం అకాసాకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.గోఎయిర్ స్లాట్లు, దైపాక్షిక హక్కుల కోసం గతంలో బిడ్డింగ్ వేసిన ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ ఈజ్మైట్రిప్ సీఈఓ నిశాంత్ పిట్టి ఇటీవల తన బిడ్ను ఉపసంహరించుకున్నారు. ఆ సమయంలో ఈజ్మైట్రిప్ స్థిరమైన వృద్ధి సాధించేందుకు వనరులను ఉపయోగించనున్నామని నిశాంత్ చెప్పారు. మళ్లీ గోఎయిర్ కోసం కొత్తగా ఎవరు బిడ్ వేయలేదు. దాంతో సంస్థకు చెందిన స్లాట్లు, ఇతర హక్కులను మంత్రిత్వశాఖ ఇతర సంస్థలకు తాత్కాలికంగా కేటాయించింది.స్లాట్లు, దైపాక్షిక హక్కులు..ఒక నిర్దిష్ట దేశానికి చెందిన విమానయాన సంస్థలు మరొక దేశానికి అంతర్జాతీయ విమానాలను నడిపేందుకు ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకోవాలి. ఇది ఒక దేశం నుంచి వారానికి ఎన్ని విమానాలు ప్రయాణించాలో నిర్ణయిస్తుంది. అయితే విమానయాన సంస్థ ఈ హక్కులు కలిగిఉన్నా విమాన కార్యకలాపాలను ప్రారంభించడానికి ఎయిర్పోర్ట్ల్లో స్లాట్లను కలిగి ఉండాలి. ఒక ఎయిర్లైన్స్ విమానం బయలుదేరడానికి లేదా విమానాశ్రయానికి చేరుకోవడానికి అనుమతించే తేదీ, సమయాన్ని స్లాట్గా పేర్కొంటారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీబీసీఏ అధికారులు, విమానాశ్రయ ఆపరేటర్లు, విమానయాన సంస్థలతో కూడిన కమిటీ ఈ స్లాట్లను కేటాయిస్తుంది.టాటా గ్రూప్కు చెందిన ఎయిర్ ఇండియా, ఇండిగో ప్రతి వారం దాదాపు ఒక కొత్త విమానాన్ని తమ ఫ్లీట్లో చేరుస్తున్నాయి. ఎయిర్ఇండియా ఎక్స్ప్రెస్, అకాసా ఈరంగంలో వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఇలాంటి సమయంలో గోఎయిర్కు ఈ స్థితి రావడంపట్ల మార్కెట్ వర్గాలు కొంత ఆందోళన చెందుతున్నాయి.ఇదీ చదవండి: మరో ఆఫ్రికా దేశంలో రిలయన్స్ సేవలు!వాడియా గ్రూప్ యాజమాన్యంలో గో ఫస్ట్ రుణదాతలకు రూ.6,200 కోట్లకు పైగా బకాయిపడింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ బ్యాంక్లకు వరుసగా రూ.1,934 కోట్లు, రూ.1,744 కోట్లు, రూ.75 కోట్లు రుణాలు చెల్లించాల్సి ఉంది. -
ఆఫ్రికా దేశంలో రిలయన్స్ సేవలు!
భారత్లో మొబైల్ బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తోన్న ప్రముఖ కంపెనీ రిలయన్స్ ఆఫ్రికాలోనూ తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశానికి చెందిన ఒక కంపెనీతో 5జీ షేర్డ్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్లను అందించేందుకు ఒప్పందం చేసుకోనుంది.రిలయన్స్ ఇండస్ట్రీస్లో భాగంగా ఉన్న రాడిసిస్ అనే కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి ఘనాలో తన కార్యకలాపాలు ప్రారంభించాలని యోచిస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి. వాటి ప్రకారం..నెక్స్ట్ జనరేషన్ ఇన్ఫ్రాకో(ఎన్జీఐసీ) అనే ఘనా కంపెనీకి అవసరమయ్యే కీలకమైన మౌలిక సదుపాయాలు, అప్లికేషన్లు, స్మార్ట్ఫోన్లను రాడిసిస్ అందిస్తుంది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో మెరుగైన డిజిటల్ సేవలను అందించేలా కంపెనీ పని చేస్తోందని ఎన్జీఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హర్కిరిత్ సింగ్ బ్లూమ్బెర్గ్ నివేదికలో పేర్కొన్నారు.భారతీ ఎయిర్టెల్ ఇప్పటికే 14 ఆఫ్రికన్ దేశాల్లో మొబైల్ బ్రాడ్బ్యాండ్ సేవలను అందిస్తోంది. సునీల్ భారతి మిట్టల్ నేతృత్వంలోని ఈ కంపెనీ ఆఫ్రికాలో రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్గా చలామణి అవుతోంది. ఇకపై రిలయన్స్ కూడా అక్కడ టెలికాం సేవలు ప్రారంభించడం పట్ల ఇరుకంపెనీల మధ్య పోటీ నెలకొంటుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.ఎన్జీఐసీ పదేళ్లపాటు ఘనాలో 5జీ సేవలను అందించేలా అనుమతులను పొందింది. అయితే ఆ లైసెన్స్ను పదిహేనేళ్లపాటు పొడిగించే అవకాశం ఉంది. ఈ కంపెనీ మూడేళ్ల మూలధన వ్యయం 145 మిలియన్ డాలర్లని అంచనా. ఎలాగైతే భారత్లో జియోను ఆవిష్కరించి టెలికాంరంగంలో రిలయన్స్ ప్రత్యేకత చాటుకుందో అక్కడ కూడా తనదైన ముద్రవేయాలని చూస్తుంది. -
ఏఐతో మరింత అందంగా: రిలయన్స్
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో భాగంగా ఉన్న టీరా బ్యూటీకేర్ కృత్రిమ మేధను వాడుతున్నట్లు కంపెనీ మార్కెటింగ్ హెడ్ తేజస్ కపాడియా తెలిపారు. తమ కస్టమర్లను మరింత అందంగా మార్చేందుకు కంపెనీ కొత్త టెక్నాలజీని పరిచయం చేసిందని చెప్పారు.ఈ సందర్భంగా కపాడియా మాట్లాడుతూ..‘ఆర్ఐఎల్ కొత్త వెంచర్ తిరా బ్యూటీ సెక్టార్లో వినియోగదారులకు సేవలందిస్తోంది. ఈ రంగంలో ఇప్పటికే ఉన్న పోటీదారులకంటే ప్రత్యేకంగా కస్టమర్లను ఆకర్షించేందుకు టెక్నాలజీను వాడుతున్నాం. వినియోగదారుల స్కిన్టోన్ను ఫొటోతీసి వారికి కావాల్సిన బ్యూటీ ప్రొడక్ట్లను సిఫార్సు చేసేలా ఏఐను ఏర్పాటుచేశాం. ఇందులో స్కిన్ఎనలైజర్ టెక్నాలజీ ఉపయోగించాం. దీని సహాయంతో తమకు ఇష్టమైన ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చు. కంపెనీ వెబ్సైట్లో మేకప్, చర్మ సంరక్షణ పాఠాలను కూడా అందిస్తున్నాం’ అని చెప్పారు.వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపారాల్లో బ్యూటీ సెక్టార్ ఒకటి. ఇందులో రిలయన్స్ వంటి దిగ్గజ కంపెనీ ప్రవేశించడంతో చాలా కంపెనీల ఉత్పత్తులపై ప్రభావంపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖేశ్అంబానీ కుమార్తె ఇషా నేతృత్వంలోని టీరా కంపెనీ ఇప్పటికే స్కిన్కేర్ బ్రాండ్ కికో మిలానో, ఎల్బీఎంహెచ్ గ్రూప్నకు చెందిన బ్యూటీ రిటైలర్ సెఫోరాను కొనుగోలు చేసింది. ఈ కంపెనీ రాకతో ఇప్పటికే మార్కెట్లో ఉన్న టాటా గ్రూప్నకు చెందిన పాలెట్, నైకా వంటి బ్రాండ్లపై ప్రభావం ఉండనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇదీ చదవండి: బంగారుకొండను పేరుస్తున్న ఆర్బీఐ..!భారత్లో ఈ బిజినెస్కు భవిష్యత్తులో ఆశించిన మార్కెట్ ఉంటుందని కంపెనీలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ బ్రాండ్లు కూడా దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. 2023లో జపాన్కు చెందిన షిసిడో యాజమాన్యంలోని ‘నార్స్ కాస్మెటిక్’ షాపర్స్ స్టాప్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది పాప్స్టార్ రిహన్న తన కాస్మెటిక్స్ కంపెనీ ఫెంటీ బ్యూటీ ఉత్పత్తులను నైకాతో కలిసి భారత్లో ప్రవేశపెట్టారు. -
రూ.1కే హాలీవుడ్ సినిమాలు, టీవీ షోలు.. ఎక్కడో తెలుసా..
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందిన జియోసినిమా సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరను తగ్గించింది. క్రికెట్ మ్యాచ్ల వంటి లైవ్ ప్రోగ్రామింగ్ను ఉచితంగా అందిస్తున్న కంపెనీ కేవలం రోజూ రూ.1కే హాలీవుడ్ సినిమాలు, టీవీ షోలను అందించనుంది.రిలయన్స్ అనుబంధ సంస్థ వయాకామ్ 18 మీడియా ప్రైవేట్ యాజమాన్యంలోని ఆన్లైన్ స్ట్రీమింగ్ సర్వీస్ జియోసినిమా దాని సబ్స్క్రిప్షన్ను మూడింట రెండు వంతులు తగ్గించి నెలకు రూ.29కి చేర్చింది. ఈ ప్లాన్లో ఆన్లైన్, ఆఫ్లైన్తోపాటు 4K క్వాలిటీ, విదేశీ సినిమాలు, టీవీ సిరీస్లు, పిల్లల ప్రోగ్రామ్లను ఐదు భాషల్లో అందిస్తున్నట్లు వయాకామ్18 డిజిటల్ విభాగం సీఈఓ కిరణ్ మణి తెలిపారు. ‘నాలుగు డివైజ్ల్లో ఏకకాలంలో జియోసినిమాను యాక్సెస్ చేసేలా నెలకు రూ.89తో ఫ్యామిలీప్యాక్ను తీసుకొచ్చాం. జియోసినిమా చూడడం కుటుంబ సభ్యులకు అలవాటుగా మార్చడానికి సరసమైన ధరలతో సబ్స్క్రిప్షన్ ప్లాన్లను అందుబాటులో ఉంచాం. పిల్లల కంటెంట్తో కూడిన అతిపెద్ద లైబ్రరీ కూడా ఇందులో ఉంది’ అని మణి అన్నారు.ఇదీ చదవండి: నెట్ లేకుండానే ఫైల్ షేరింగ్.. ప్రముఖ కంపెనీ కొత్త ఫీచర్1 బిలియన్(100 కోట్లు) ప్లస్ వీక్షకుల కోసం ఇప్పటికే నెట్ఫ్లిక్స్, సోనీ గ్రూప్, అమెజాన్ ప్రైమ్ వంటి ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు పోటీ పడుతున్నాయి. తాజాగా జియో సినిమా తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ మీడియా సంస్థల మధ్య పోటీని మరింత తీవ్రతరం చేస్తుందని పలువురు భావిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వాల్ట్ డిస్నీ విలీనానికి రిలయన్స్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జియోసినిమా ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను ఉచితంగా ప్రసారం చేస్తోంది. -
పైథాని చీరలో అదిరిపోతున్న నీతా అంబానీ..ఆ చీర స్పెషల్ ఏంటంటే..!
రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమర్థవంతమైన బిజినెస్ విమెన్గానూ, ఓ మంచి గృహిణిగా తల్లిగా, అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ దూసుకుపోతున్న శక్తిమంతమైన మహిళ ఆమె. రాబోయే తరాలకు స్పూర్తి ఆమె. అలాగే ఎప్పటికప్పుడూ ట్రెడిషన్కి తగ్గట్టు తనదైన ఫ్యాషన్ లుక్లో కనిపిస్తారు. ఇటీవల చిన్న కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కూడా నీతా స్పెషల్ ఎంట్రాక్షన్గా నిలిచారు. ఆమె ధరించే అత్యంత ఖరీదైన చీరలు, నగలు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాయి కూడా. అలానే ఈసారి నీతా ముఖేష్ అంబానీ కల్చర్ సెంటర్ వార్షికోత్సవంలో ధరించిన చీర కూడా హైలెట్గా నిలిచింది. ఆ చీరకు ఓ స్పెషాలిట కూడా ఉంది. అదేంటంటే..స్టైల్కి స్పెషల్ సిగ్నేచర్ నీతా అంబానీ. హైప్రొఫైల్ వేడుకలకు తగ్గట్టుగా నీతా వస్త్రధారణ ఉంటుంది. ఇటీవల జరిగిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ) వార్షికోత్సవంలో కూడా అలాంటి ఆకర్షణీయమైన వస్తధారణతో హైలెట్గా నిలిచింది. ఆమె ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సంప్రదాయం ఉట్టిపడేలా పైథాని చీరలో వచ్చారు. చూపురులందర్నీ కట్టిపడేసేలా స్టన్నింగ్ లుక్లో సందడి చేసింది నీతా. ఈ చీర బంగారు జరీతో అజంతా గుహలను గుర్తుకు తెచ్చేలా పుష్పాలు, పక్షులతో డిజైన్ చేసి ఉంది. చీరల రాణి.. చీర అంతా కూడా కమలా పువ్వులతో డిజైన్ చేసి ఉంది. నాటితరం చీరల నైపుణ్యం చాటిచెప్పేలా ఉంది ఆ చీర. అంతేగాదు మన దేశీ చీరల కళాకారులను గౌరవిద్దాం. చేతి వృత్తులను ప్రోత్సహించేలా వారు తయారు చేసిన చీరలనే దరిద్దాం అని సోషల్మీడియవేదికగా నీతా పిలుపునిచ్చారు. నిజానికి ఈ పైథాని చీరు మహారాష్ట్ర రాయల్ చీరగా పరిగణించే చీరల్లో ఒకటి. ఈ పైథాని చీరను స్వచ్ఛమైన పట్టుతో రూపొందిస్తారు. ఈ చీర డిజైన్ ముందు వైపు కనిపించినట్లే వెనుకవైపు డిజైన్ స్పష్టంగా కనిపిస్తుంది. చక్కగా చేతితో నేసిన చేనేత వస్త్రం. ఈ చీర నేయాలంటే కళాకారుల వద్ద మంచి నైపుణ్యం ఉండాల్సిందే. ఇది భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా కళాకారులు చాలా శ్రమతో ఈ పైథాని చీరలను రూపొందిస్తారు. దీన్ని చీరల రాణిగా పిలుస్తారు. అలాగే ఈ చీరను నకిలీ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఇక ఇక్కడ నీతా కూడా భారతీయ కళలను ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేసిన ఈ నీతా ముఖేష్ అబానీ కల్చర్ సెంటర్(ఎన్ఎంఏసీసీ) వార్షిక వేడుకలో దీన్నే గుర్తు చేసేలా ఆ పైథాని చీరతో కనిపించారు. అంతేగాదు మన భారతీయ కళల గొప్పదనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేశారు ఆమె. ఏ వేడుకైన హైలెట్ కావాలన్న, దాని ప్రాముఖ్యత తెలియజెప్పాలన్నా.. అందుకు తగ్గ వస్త్రాధారణతోనే సాధ్యమని నీతా చెప్పకనే చెప్పారు. దటీజ్ నీతా అంబానీ కదూ..! (చదవండి: సమ్మర్లో డీహైడ్రేషన్కు చెక్పెట్టేవి ఇవే..!) -
పోటెత్తుతున్న యూజర్లు.. జియోకు కొత్తగా 42 లక్షల సబ్స్కైబర్లు
ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సబ్స్కైబర్లతో దూసుకుపోతుంది. ట్రాయ్ (TRAI) విడుదల చేసిన తాజా టెలికాం గణాంకాల ప్రకారం.. రిలయన్స్ జియో ఈ ఏడాది జనవరి నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2.59 లక్షలకు పైగా చందాదారులు కొత్తగా వచ్చి చేరారు. జనవరిలో జియో అత్యధికంగా 2,59,788 మొబైల్ చందాదారులను చేర్చుకుంది. దీంతో జియో కస్టమర్ల సంఖ్య 3.24 కోట్లకు చేరుకుంది. ఇదే నెలలో ఎయిర్టెల్కు 1.18 లక్షల మంది చేరారు. వోడాఐడియా 44,649 మంది, బీఎస్ఎన్ఎల్ 16,146 మంది కస్టమర్లను కోల్పోయాయి. జనవరి నెలలో దేశవ్యాప్తంగా జియోలో అత్యధికంగా 41.78 లక్షల మంది కొత్త చందాదారులు చేరారు. ఎయిర్టెల్లో 7.52 లక్షల మంది చేరగా, వోడాఐడియా,బీఎస్ఎన్ఎల్లు తమ కస్టమర్లను కోల్పోయాయి. ఈ గణాంకాల ప్రకారం జనవరి 2024 నాటికి దేశంలో మొత్తం మొబైల్ కస్టమర్ల సంఖ్య 52.67 కోట్లకు చేరుకుంది. -
చేతులు కలిపిన అంబానీ– అదానీ
న్యూఢిల్లీ: బిలియనీర్ పారిశ్రామిక దిగ్గజాలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ తొలిసారి చేతులు కలిపారు. దీనిలో భాగంగా అదానీ పవర్కు చెందిన పవర్ ప్రాజెక్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) 26 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. అంతేకాకుండా మధ్యప్రదేశ్లోని ఈ ప్లాంటుకు చెందిన 500 మెగావాట్ల యూనిట్లో ఉత్పత్తయ్యే విద్యుత్ను ఆర్ఐఎల్ సొంత అవసరాలకు వినియోగించుకునేందుకు రెండు సంస్థలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. వెరసి అదానీ పవర్ పూర్తి అనుబంధ సంస్థ మహన్ ఎనర్జెన్ లిమిటెడ్లో 5 కోట్ల ఈక్విటీ షేర్లను ఆర్ఐఎల్ సొంతం చేసుకోనుంది. రూ. 10 ముఖ విలువకే(రూ. 50 కోట్లు) వీటిని చేజిక్కించుకోవడంతోపాటు.. 500 మెగావాట్ల విద్యుత్ను సొంత అవసరాలకు ఆర్ఐఎల్ వినియోగించుకోనుంది. సొంత వినియోగ పాలసీలో భాగంగా ఆర్ఐఎల్ 20 ఏళ్ల దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని(పీపీఏ) ఎంఈఎల్తో కుదుర్చుకున్నట్లు అదానీ పవర్ వెల్లడించింది. మొత్తం 2,800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఎంఈఎల్ ప్లాంటులో 600 మెగావాట్ల యూనిట్ను సొంత అవసరాల పద్ధతిలో తెరతీయనున్నట్లు వివరించింది. -
బిజినెస్: నష్టాల్లోంచి లాభాల్లోకి..
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, అధిక వెయిటేజీ రిలయన్స్(1.25%), ఐటీసీ(1.50%), ఎస్బీఐ(2%) షేర్లు రాణించడంతో సూచీలు ఆరంభ నష్టాలు భర్తీ చేసుకోగలిగాయి. అయితే రూపాయి క్షీణత, చిన్న కంపెనీల షేర్లలో అమ్మకాలు సూచీల భారీ లాభాలకు అడ్డుకట్టవేశాయి. తొలిసెషన్లో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. యూరప్ మార్కెట్ల సానుకూల ప్రారంభంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ట్రేడింగ్లో 729 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 90 పాయింట్ల లాభంతో 72,102 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 71,674 కనిష్టాన్ని, 72,403 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 221 పాయింట్ల రేంజ్లో 21,931 వద్ద గరిష్టాన్ని, 21,710 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 22 పెరిగి 21,839 వద్ద నిలిచింది. రెండు నెలల కనిష్టానికి రూపాయి.. డాలర్ మారకంలో రూపాయి విలువ 16 పైసలు క్షీణించి 83.19 వద్ద నిలిచింది. ఈ ముగింపు స్థాయి రెండు నెలల కనిష్టం. ట్రస్ట్ ఫిన్టెక్ @ రూ.95–101 సాస్ ప్రొడక్ట్ ఆధారిత ఫిన్టెక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్లు అందించే ట్రస్ట్ ఫిన్టెక్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 95–101 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 26న ప్రారంభమై 28న ముగియనుంది.ఆఫర్ ద్వారా కంపెనీ రూ. 63 కోట్లకుపైగా సమీకరించే యోచనలో ఉంది. ఇవి చదవండి: ప్రతి మూడు నెలలకు ఓ కొత్త కారు -
పెళ్లికొడుకు వాచ్పై కన్నేసిన జూకర్బర్గ్ దంపతులు.. ధర ఎంతో తెలుసా..
అంబానీ ఇంట వివాహ వేడుకలు ఇటీవలే ముగిశాయి. అనంత్ అంబానీ-రాధికమర్చంట్ ప్రివెడ్డింగ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రముఖులు, సినీతారలు, ప్రపంచ వ్యాపారవేత్తలు పాల్గొని అలరించిన సంగతి తెలిసిందే. అయితే ప్రివెడ్డింగ్ వేడుకలు ముగిసినా అందుకు సంబంధించిన వార్తలు రోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్కి హాజరైన వారిలో ఫేస్బుక్ అధినేత మార్క్జూకర్బర్గ్ దంపతులు కూడా ఉన్నారు. పెళ్లికొడుకు ధరించిన వాచ్ చూసి వారు దాని వివరాలు అడిగి తెలుసుకుంటున్న వీడియో ఒకటి వైరల్గా మారింది. అనంత్ అంబానీ చేతి గడియారాన్ని గమనించిన మార్క్ భార్య ప్రిస్కిల్లా.. అది చాలా బాగుంది అని అనంత్కు కితాబిచ్చినట్లు తెలిసింది. దానికి జుకర్బర్గ్ అంగీకరిస్తూ తాను ఇప్పుటికే ఆ విషయాన్ని అనంత్కు చెప్పానని జవాబిచ్చారు. దాన్ని ఎవరు తయారు చేశారని ఆమె అడగ్గా.. రిచర్డ్ మిల్లే అని అనంత్ బదులిచ్చాడు. Zuckerberg and wife going gaga over Anant Ambani’s watch (Richard Mille) worth 12-15 crores INR. FYI Anant also has a Patek Philippe Grand Complication Sky Moon Tourbiillion - ₹ 63 crores and a Grand Master Chimes - ₹66 crores 😂 😂 pic.twitter.com/65gwALBGwG — Pakchikpak Raja Babu (@HaramiParindey) March 3, 2024 ఈ వీడియో వైరల్ అయిన వెంటనే పలువురు ఆ వాచ్ ధర, కంపెనీ గురించి సోషల్ మీడియాలో ఆరా తీయడం ప్రారంభించారు. దాని ఖరీదు రూ.15 కోట్లు ఉంటుందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఎక్స్లోని ఒక పోస్ట్ ప్రకారం.. ఆ రిచర్డ్ మిల్లే ఆర్ఎం 56-02 వాచ్ విలువ రూ.15-18 కోట్లు ఉంటుందని అంచనా. అనంత్కు పటెక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్ స్కై మూన్ టూర్బిల్లాన్ కూడా ఉంది. దీని ధర రూ.63 కోట్లుగా ఉందని తెలిసింది. ఇదీ చదవండి: అమృత‘మూర్తి’కి అరుదైన గౌరవం -
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు: స్టైయిలిష్ లుక్లో ఇషా!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సినీ సెలబ్రెటీలు దగ్గర నుంచి పలు రంగాల అధినేతలు దేశ విదేశాల నుంచి తరలి వచ్చి మీరీ ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో అనంత్ అంబానీ సోదరి ఇషా తన ప్రత్యేక వస్త్రాలంకరణలో అందర్నీ మిస్మరైజ్ చేసింది. ఈ వివాహ వేడుకల్లో ఇషా ఫ్యాషన్ ఐకాన్గా పేరుగాంచిని తన తల్లి నీతా అంబానీని ఫాలో అయ్యిందా అన్నంత రేంజ్లో ఉంది ఆమె లుక్. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ కార్ల్ లాగర్ ఫెల్డ్ చెందిన బ్లాక్ డ్రెస్లో అజంతా శిల్పంలా ఉంది. చేతులకు, డైమండ్ బ్రాస్లెంట్, డైమండ్ ఉంగరాలతో మరింత గ్రాండ్గా కనిపించింది. చెవులకు కూడా ఆ డ్రస్కి తగ్గ డైమండ్ జూకాలు ధరించింది. ఐషా ధరించిన గౌను ఆ బ్రాండ్ వ్యవస్థాపకుడు లాంగర్ ఫెల్డ్ చనిపోవడానికి కొద్దిరోజుల ముందు డిజైన్ చేసింది. ఆయన గత కొన్ని దశాబ్దాలుగా ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలుతున్న ప్రముఖ డిజైనర్ . తన క్రియేటివిటీతో ఎన్నో ప్రముఖ డిజైనర్ దుస్తులను పరిచయం చేసి ఫ్యాషన్కి అసలైన అర్థం ఇచ్చిన వ్యక్తి అతను. అతని బ్రాండెడ్ దుస్తులకు పలు సినీ సెలబ్రెటీలు, వ్యాపార ప్రముఖులే అభిమానులు. ఈ బ్రాండ్ ధర కూడా ఓ రేంజ్లో ఉంటుంది. ఇక ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఇషా ధరించిన లాగర్ఫెల్డ్ గౌనుపై వెండి ఆకుల రూపంలో బ్లాక్ షీర్ సిల్హౌట్ అందంగా డిజైన్ చేశారు. ఆ డ్రెస్కి తగ్గట్టు లైట్ మేకప్, పెదాలకు నేచురల్ లిప్స్టిక్తో ప్రత్యేక ఆకర్షణ నిలిచింది ఇషా. చెప్పాలంటే పండు వెన్నెలలో ఉండే జాబిల్లిలా ఆమె స్టన్నింగ్ లుక్ కళ్లు తిప్పుకోనివ్వలేనంతగా కట్టిపడేస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ చక్కెర్లు కొడుతున్నాయి.మరీ మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: అనంత్ అంబానీ అధిక బరువుకి కారణం ఇదే! ఆ విషంయలో కాబోయే భార్య..) -
కొడుకు స్పీచ్.. ముఖేష్ అంబానీ కన్నీళ్లు! వీడియో వైరల్
Mukesh Ambani tears video : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల వివాహం త్వరలో జరుగనుంది. వివాహానికి ముందు ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ గ్రాండ్ ఈవెంట్కి విచ్చేశారు. ఈ సందర్భంగా కొడుకు మాటలకు ముఖేష్ అంబానీ భావోద్వేగానికి గురయ్యారు. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అనేక మంది అతిథుల సమక్షంలో పెళ్లికొడుకు అనంత్ అంబానీ ప్రసంగించారు. తల్లిదండ్రులు ముఖేష్ అంబానీ, నీతా అంబానీలకు కృతజ్ఞతలు తెలుపుతున్నప్పుడు ముఖేష్ అంబానీ భావోద్యేగానికి గురయ్యారు. కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. అనంత్ అంబానీ చేసిన భావోద్వేగ ప్రసంగంలో ముఖ్యంగా తాను అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నప్పుడు తన తల్లిదండ్రులు అందించిన సపోర్ట్ గురించి అనంత్ అంబానీ చెబుతుండగా ముఖేష్ కళ్లలో నీళ్లు తిరిగాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ మారింది. థాంక్యూ అమ్మా.. నాన్న "ఇదంతా అమ్మ చేసిందే.. ఆమె నా కోసం చాలా కష్టపడింది. గత నాలుగు నెలలుగా ఆమె రోజుకు 18-19 గంటలు నా కోసం కష్టపడ్డారు. నేను అమ్మకు చాలా కృతజ్ఞుడను . అమ్మా, మీరు చేసిన ప్రతిదానికీ ధన్యవాదాలు" అని అనంత్ అంబానీ ప్రసంగంలో పేర్కొన్నారు. "మా నాన్న, అమ్మ ఎల్లప్పుడూ నాకు అండగా నిలిచారు. నేను ఏదైనా సాధించగలను అనే ఆత్మ విశ్వాసాన్ని నాకు కలిగించారు. మా నాన్న, అమ్మ నన్ను ఎంతగా అర్థం చేసుకున్నారో.. నేను వారికి ఎప్పటికీ కృతజ్ఞుడను" అని భావోద్వేగంతో చెప్పుకొచ్చారు. నా కొడుకులోనే చూసుకుంటున్నా కాగా అంతకుముందు వేడుకలకు విచ్చేసిన ప్రముఖ వ్యాపారవేత్తలు, కళాకారులు, క్రీడాకారులు, చలనచిత్ర ప్రముఖులు, ఇతర అతిథులందరినీ ఉద్దేశిస్తూ ముఖేష్ అంబానీ ప్రసంగించారు. కార్యక్రమానికి వచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబ అనుబంధం గురించి ప్రస్తావించారు. తన చిన్న కొడుకు అనంత్ అంబానీలోనే చనిపోయిన తన తండ్రి ధీరూభాయ్ అంబానీని చూసుకుంటున్నట్లు వెల్లడించారు. -
అవును.. అతడు మూడు వేల ఎకరాల ‘అడవి’ని సృష్టించాడు!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లు ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్గా ఉన్న అనంత్ గుజరాత్లోని జామ్నగర్లో రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ 3వేల ఎకరాల్లో కృత్రిమ అడవిని ఏర్పాటుచేశారు. వంతారా పేరుతో రిలయన్స్ ఫౌండేషన్ జంతు సంరక్షణకు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ఇటీవల సమగ్ర జంతు సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ప్రారంభించినట్లు సంస్థ ప్రకటించింది. గాయపడిన జంతువులను రక్షించడం, చికిత్స చేయడంతో పాటు వాటి సంరక్షణ, పునరావాసం ఏర్పాటుచేయడం దీని ముఖ్య ఉద్దేశం. వంతారా అనేది ఒక కృత్రిమ అడవి. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటుచేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్లు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి. ఇందుకోసం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్), వరల్డ్ వైల్డ్లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అధునాతన వైద్య సదుపాయాలతో పశువైద్యులు, పోషకాహార నిపుణులు, రోగనిర్ధారణ నిపుణులతో కూడిన ఈ కేంద్రంలో 500 మంది సిబ్బంది, 200 ఏనుగుల శ్రేయస్సును నిర్ధారించడానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. చికిత్స అవసరమైన కొన్ని ఏనుగులకు హైడ్రో థెరపీ పూల్స్, ముల్తానీ మట్టీ మసాజ్ల వంటి చికిత్సలను అందిస్తున్నారు. రెస్క్యూ & రిహాబిలిటేషన్ సెంటర్లో 2,100 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 2000 కంటే ఎక్కువ జంతువులకు ఇందులో ఆశ్రయం ఇస్తున్నారు. 43 విభిన్న జాతులను సంరక్షిస్తున్నట్లు తెలిసింది. రిలయన్స్ ఫౌండేషన్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఇప్పటికే 200 కంటే ఎక్కువ ఏనుగులను, అనేక సరీసృపాలు, పక్షులతో పాటు, ఖడ్గమృగాలు, చిరుతపులులు, మొసళ్లు వంటి క్లిష్టమైన జాతులను విజయవంతంగా రక్షించారు. వన్యప్రాణులు కాపాడేందుకు మెక్సికో, వెనిజులాలోని అంతర్జాతీయ రెస్క్యూ సెంటర్లతో సహకారం చేసుకున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి..ఆ సమయంలో అండగా ఉంది.. ఆమే నా కలలరాణి.. ఈసందర్భంగా ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు, రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్, కొత్త పెళ్లికొడుకు అనంత్ అంబానీ మాట్లాడుతూ.. తనకు చిన్నప్పటినుంచే జంతువుల సంరక్షణపై ఆసక్తి ఉండేదన్నారు. దాంతో వంతారా అడవిని సృష్టించామన్నారు. భారతదేశంలో అంతరించిపోతున్న జంతు జాతులను రక్షించడమే లక్ష్యమన్నారు. భారత్తోపాటు ప్రపంచంలోని అగ్రశ్రేణి జంతుశాస్త్ర, వైద్య నిపుణులు కొందరు ఈ మిషన్లో భాగంగా ఉన్నారని ఆయన తెలిపారు. -
ఆ సమయంలో అండగా ఉంది.. ఆమే నా కలలరాణి..
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల వివాహం త్వరలో జరుగనుంది. వివాహానికి ముందు ప్రీ వెడ్డింగ్ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మూడురోజుల సంబరాలకు అంతర్జాతీయ అతిథులు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం గుజరాత్లోని జామ్నగర్లో జరుగనుంది. అయితే ఎందుకు అక్కడే జరుపుకుంటున్నారనే దానిపై అనంత్ వివరణ ఇచ్చారు. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. జామ్నగర్లోనే.. అనంత్ అంబానీ గుజరాత్లోనే పుట్టాడని చెప్పారు. అక్కడ వేడుక జరుగుతుండటం తన అదృష్టమన్నారు. అందుకే జామ్నగర్ను ఎంచుకున్నామని చెప్పారు. భారత్లోనే వివాహాలు జరుపుకోవాలని మోదీ పిలుపునిచ్చినప్పుడు ఎంతో గర్వంగా అనిపించిందంటూ అనంత్ చెప్పారు. మోదీ పిలుపుతో.. గొప్పింటివారు వివాహాలు అంటే వెంటనే విదేశాలకు వెళ్లిపోతారు. అక్కడే గుట్టుచప్పుడు కాకుండా క్రతువు జరుపుకుంటారు. విదేశాల్లో వివాహ వేడుకలు చేసుకుంటున్న భారతీయ యువ జంటలకు కొద్దినెలల క్రితం మోదీ సూచన చేసిన సంగతి తెలిసిందే. ‘మేకిన్ ఇండియా తరహాలో దేశంలో ‘వెడ్ ఇన్ ఇండియా’ ప్రారంభం కావాలి. భారత్లో పెళ్లి చేసుకునే జంటలను దేవుడు కలుపుతాడని విశ్వసిస్తారు. అలాంటప్పుడు దేవుడు కలిపిన జంటలు తమ జీవితంలో నూతన ప్రయాణాన్ని (పెళ్లి) విదేశాలకు వెళ్లి ఎందుకు ప్రారంభిస్తున్నాయి? యువ జంటలు వెడ్డింగ్ డెస్టినేషన్ గురించి ఆలోచించాలి’ అని పిలుపిచ్చారు. ఇదీ చదవండి: మరో గ్లోబల్ బ్రాండ్ను తీసుకొస్తున్న అంబానీ కంపెనీ అండగా ఉంది.. అనంత్ తాను ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్న సమయంలో రాధికా మర్చంట్ అండగా నిలిచిందని వెల్లడించారు. తన జీవితంలో ఆమె ఉండటం అదృష్టమన్నారు. తన కలలరాణి రాధికేనన్నారు. ఎప్పుడూ మూగజీవాల సంరక్షణ గురించి ఆలోచించే అనంత్ వైవాహిక జీవితంలోకి అడుగుపెడతానని అనుకోలేదన్నారు. కానీ రాధికను కలిసిన తర్వాత మొత్తం మారిందని చెప్పారు. అనంత్ చిన్నప్పటి నుంచి ఊబకాయంతో బాధపడుతున్నారు. తన కుమారుడికి ఆస్థమా ఉండటంతో, బరువు తగ్గడం చాలా కష్టంగా మారిందని గతంలో నీతా అంబానీ తెలిపారు. -
మరో గ్లోబల్ బ్రాండ్ను తీసుకొస్తున్న అంబానీ కంపెనీ
శ్రీలంక పురాతన పానీయాల బ్రాండ్ను ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కంపెనీ భారత్కు తీసుకొస్తోంది. శ్రీలంకకు చెందిన పానీయాల తయారీ సంస్థ ఎలిఫెంట్ హౌస్తో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) భాగస్వామ్యాన్ని ప్రకటించింది. నూతన ఉత్పత్తులను భారతీయులకు పరిచయం చేయనుంది. "భారతదేశం అంతటా ఎలిఫెంట్ హౌస్ బ్రాండ్ కింద పానీయాలను తయారు చేయడం, మార్కెట్ చేయడం, పంపిణీ చేయడం, విక్రయించడం" ఈ భాగస్వామ్యం లక్ష్యం అని రిలయన్స్ రిటైల్ ఒక ప్రకటనలో తెలిపింది. "ఈ భాగస్వామ్యం పెరుగుతున్న మా ఎఫ్ఎంసీజీ పోర్ట్ఫోలియోకు అత్యంత ఇష్టపడే పానీయాలను జోడించడమే కాకుండా నాణ్యమైన ఉత్పత్తుల ద్వారా మా భారతీయ వినియోగదారులకు గొప్ప ఎంపికను కూడా అందిస్తుంది" అని రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సీవోవో కేతన్ మోదీ పేర్కొన్నారు. ఇప్పటికే పలు ప్రఖ్యాత గ్లోబల్ బ్రాండ్లను భారత్కు తీసుకొచ్చిన రిలయన్స్.. 150 ఏళ్ల చరిత్ర ఉన్న పురాతన బేవరేజెస్ బ్రాండ్ ఎలిఫెంట్ హౌస్ను భారత్లో మరింత విస్తరించడానికి సన్నద్ధమైందని కేతన్ మోదీ తెలిపారు. కాగా రిలయన్స్ ఇప్పటికే క్యాంపా సొస్యో, రాస్కిక్ వంటి పానీయాల బ్రాండ్లను కలిగి ఉంది. -
Disney India: రిలయన్స్ చేతికే డిస్నీ..
భారత వ్యాపార ప్రపంచంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన వయోకామ్ మీడియా- వాల్ట్ డిస్నీల మధ్య విలీన ఒప్పందం జరిగింది. తర్వలోనే రూ.70,352 కోట్ల విలువైన జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఈ వెంచర్లో రిలయన్స్ మీడియా యూనిట్ దాని అనుబంధ సంస్థలు విలీన సంస్థలో కనీసం 61 శాతం వాటాను కలిగి ఉండగా... మిగిలిన వాటా డిస్నీదేనని తెలుస్తోంది. ఈ మీడియా వెంచర్కు ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఛైర్పర్సన్గా, వాల్ట్ డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ శంకర్ వైస్ ఛైర్మన్గా వ్యవహరించనున్నాయి. ఈ ఒప్పందానికి నియత్రణ సంస్థలు, వాటాదారుల నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. ఈ ఏడాది చివరి నాటికి లేదంటే 2025 ప్రారంభం నాటికి విలీన ప్రక్రియ ముగియనుంది. విలీనానంతర స్టార్ ఇండియా నుంచి ఎనిమిది భాషల్లో 70 ఛానళ్లు, రిలయన్స్కు చెందిన వయాకామ్ 18 నుంచి 38 ఛానళ్లు కలిపి మొత్తం 120 టెలివిజన్ ఛానళ్లు ఒకే గొడుకు కిందకు రానున్నాయి. ఇవి కాకుండా డిస్నీ హాట్స్టార్, జియోసినిమా పేరుతో రెండు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు ఉండనున్నాయి. -
రూ.8,200కే 5జీ స్మార్ట్ఫోన్.. విడుదల ఎప్పుడంటే..
భవిష్యత్తును శాసించే టెక్నాలజీల్లో 5జీ సాంకేతికత ప్రధానమైంది. మనం ప్రస్తుతం వాడుతున్న ఇంటర్నెట్ను కంటే మరింత వేగంగా అందించేలా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం వాడుతున్న ఎలక్ట్రానిక్స్ వస్తువులు 5జీ టెక్నాలజీకి అనువుగా పనిచేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ సాంకేతికతకు సరిపడే మొబైల్ఫోన్లను కొనుగోలు చేయాలి. అలాంటి వారికి రిలయన్స్, క్వాల్కామ్ కంపెనీలు అవకాశం కల్పిస్తున్నాయి. తక్కువ ధరకే 5జీ చిప్ ఆధారిత స్మార్ట్ఫోన్లను విడుదల చేసే యోచనలో ఉన్నట్లు అమెరికాకు చెందిన సెమీకండక్టర్ సంస్థ క్వాల్కామ్ తెలిపింది. ధర 99 డాలర్ల లోపు (సుమారు రూ.8,200) ఉండనుంది. గిగాబిట్ 5జీ స్పీడ్కు కట్టుబడి ఉన్నామని చెబుతూ... ఈ చిప్లో 2 యాంటెనా 5జీ స్టాండలోన్ (ఎస్ఏ- 2ఆర్ఎక్స్) సొల్యూషన్ ఉందని, దీని వల్ల ఈ ధరల విభాగంలోని 4జీ కంటే కూడా 5 రెట్ల వరకు అధిక వేగం ఉంటుందని పేర్కొంది. ఇదీ చదవండి: ప్రముఖ యాప్లో కాల్రికార్డింగ్ ఫీచర్.. ఫోన్లలో ఈ చిప్ను వాడటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా 280 కోట్ల మందికి 5జీ సాంకేతికతను అందుబాటులోకి తేవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చిప్తో కూడిన మొదటి ఫోను ఈ ఏడాది చివరినాటికి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రారంభ స్థాయి చిప్ ఆధారిత స్మార్ట్ఫోన్ను అభివృద్ధి చేయడంతో భాగంగా రిలయన్స్ జియోతో పాటు ఇతర ఫోన్ల తయారీ కంపెనీలతో క్వాల్కామ్ ఒప్పందం చేసుకోనున్నట్లు తెలుస్తుంది. -
టెంట్లు వేస్తూ దేవాలయాలు నిర్మిస్తున్న అంబానీ.. ఎందుకంటే..
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట వివాహ వేడుక జరుగనుంది. ముకేశ్ అంబానీ-నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధిక మర్చంట్తో జులై 12న ఏర్పాటు చేశారు. దీంతో అంబానీ కుటుంబం ఇప్పటికే పెళ్లి పనులు మొదలు పెట్టేసింది. వారం రోజుల క్రితం లగ్నపత్రిక కూడా రాసుకున్నారు. ఇక మార్చి 1వ తేదీ నుంచి మూడు రోజల పాటు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఈ ముందస్తు వివాహ వేడుకలను గుజరాత్లోని జామ్నగర్లో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు అతిరథ మహారథులు విచ్చేయనున్నారు. అయితే, జామ్నగర్లో ఫైవ్స్టార్ హోటళ్లు లేకపోవడంతో వాటికి ఏమాత్రం తగ్గకుండా వేడుకల కోసం వచ్చే బిలియనీర్ గెస్ట్లకు అంబానీ కుటుంబం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఫైవ్స్టార్ హోటళ్లను తలదన్నే విధంగా గెస్ట్లు ఉండేందుకు అల్ట్రా లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా తాత్కాలిక దేవాలయాలు రూపొందిస్తున్నారు. అతిథుల కోసం ఏర్పాటు చేసే వీటిలో సకల సదుపాయాలూ ఉండనున్నాయి. An Auspicious Beginning Ushering in Anant Ambani and Radhika Merchant's much-awaited wedding, the Ambani family has facilitated the construction of new temples within a sprawling temple complex in Jamnagar, Gujarat. pic.twitter.com/xKZwCauWzG — Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) February 25, 2024 అతిథుల లిస్ట్.. ముందస్తు వివాహ వేడుకలకు ఆహ్వానాలు అందిన వారిలో బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ సహా క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ ఉన్నారు. వ్యాపార దిగ్గజాల్లో మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, బ్లాక్ రాక్ సీఈఓ లారీ ఫింగ్, అడ్నాక్ సీఈఓ సుల్తాన్ అహ్మద్, వాల్ట్ డిస్నీ సీఈఓ బాబా ఐగర్ వంటి వారు ఉన్నారు. అలాగే దేశీయ వ్యాపార దిగ్గజాల్లో గౌతమ్ అదానీ, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, గోద్రేజ్ కుటుంబం, ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకనీ, బిర్లా గ్రూప్ ఛైర్ పర్సన్ కుమార్ మంగళం బిర్లా, ఆర్పీఎస్జీ గ్రూప్ హెడ్ సంజీవ్ గోయెంకా, అదర్ పూనావాలా, సునీల్ మిట్టల్, పవన్ ముంజాల్, నిఖిల్ కామత్, దిలీప్ సంఘ్వీ వంటి వారు ఉన్నారు. ఇదీ చదవండి: ఐటీ ఉద్యోగం.. వర్క్ఫ్రం హాస్పిటల్! కోడలికి ఖరీదైన గిఫ్ట్లు.. ముకేశ్ అంబానీ దంపతులు కాబోయే కోడలు రాధికా మర్చంట్కు ఖరీదైన గిఫ్టులు అందించారు. వాటిలో కోట్ల రూపాయల ఖరీదుచేసే కారు, లక్షల విలువైన వెండి, వజ్రాభరణాలు ఉన్నాయి. అత్తింటి వారు తమకు కాబోయే కోడలికి ముందుగానే సుమారు రూ.4.5 కోట్ల విలువచేసే బెంట్లీ కారు, వెండితో చేసిన లక్ష్మీ గణపతి విగ్రహం, డైమండ్ నెక్లెస్లను గిఫ్ట్గా ఇచ్చినట్లు తెలిసింది. -
అనంత్-రాధిక పెళ్లి సందడి : జోరుగా సన్నాహాలు, లేజర్ లైట్ షో వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీచిన్న కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త కుమార్తె రాధికా మర్చంట్ పెళ్లి సందడికి సంబంధించి రోజుకో ముచ్చట వార్లల్లోనిలుస్తోంది. తాజాగా గుజరాత్లోని జామ్ నగర్లో నిర్వహించిన లేజర్ లైట్ షో ఆకర్షణీయంగా నిలుస్తోంది. అనంత్ అంబానీ తన ప్రేయసి రాధికా మర్చంట్తో జరిగే గ్రాండ్ వెడ్డింగ్ కోసం ఫ్యాన్స్,బిజినెస్ వర్గాల్లో ఎదురు చూస్తున్నాయి. ఈ జంట జూలై 12న మూడుముళ్ల వేడకను నిర్వహించేందుకు ఇరుకుటుంబాలుఏర్పాటు ముమ్మరం చేశాయి. స్టార్-స్టడెడ్ ఈవెంట్కు ముందు మార్చి 1- ఏప్రిల్ 2024 ప్రీ వెడ్డింగ్ వేడులకు సన్నాహాలు ఊపందుకున్నాయి. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) శ్రీకృష్ణుడి థీమ్తో లేజర్ లైట్షో అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ముందు అంబానీకుటుంబం లేజర్ లైట్ షోను ఏర్పాటు చేసిందట. శ్రీకృష్ణుడి థీమ్తో జామ్నగర్లో అందమైన లేజర్ లైట్ షోని విజువల్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. తల్లీ కొడుకుల మధ్య అందమైన బంధాన్ని, పచ్చదనంలో తిరుగుతున్న ఏనుగును, నీలి ఆకుపచ్చ రంగులలో జామ్నగర్ మ్యాప్ను చూపించే దృశ్యాలు విశేషంగా నిలుస్తున్నాయి. అంతేకాదు వివాహానికి ముందు గుజరాత్లోని జామ్నగర్లో 14 కొత్త ఆలయాలను ప్రారంభించనున్నారు. అతిరథమహాథులు, డ్రెస్కోడ్, గిఫ్ట్లు అలాగే అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా అతిరథమహారథులు హాజరుకానున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకకు ముఖేష్ అంబానీ ప్రముఖ అంతర్జాతీయ ప్రముఖులను ఆహ్వానించారట. ఖతార్ ప్రధాన మంత్రి, భూటాన్ రాజు ,రాణి సాహా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ గేట్స్, మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్, బ్లాక్రాక్ సీఈవో లారీ ఫింక్, బ్లాక్స్టోన్ ఛైర్మన్, స్టీఫెన్ స్క్వార్జ్మాన్, డిస్నీ CEO, బాబ్ ఇగర్,అడోబ్ సీఈఓ, శంతను నారాయణ్ లాంటి ప్రముఖులున్నారు. అలాగే అతిథులకు కూడా మూడు రోజులపాటు విభిన్న దుస్తుల కోడ్ ఉంటుంది. దీంతోపాటు అతిథులకు బ్రహ్మాండమైన బహుమతులను కూడా ఇవ్వబోతున్నారట. -
డిస్నీ, రిలయన్స్ ఒప్పందం?
న్యూఢిల్లీ: వాల్ట్ డిస్నీ భారత వ్యాపార విభాగ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మీడియా విభాగం కార్యకలాపాలను విలీనం చేసేందుకు ఇరు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. విలీన సంస్థలో రిలయన్స్ ఇండస్ట్రీస్లో భాగమైన మీడియా విభాగం, ఇతర అనుబంధ సంస్థలకు 61 శాతం వాటా ఉంటుందని, మిగతా వాటాలు డిస్నీకి ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ వారం వెల్లడయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. టాటా ప్లే సంస్థలో డిస్నీకి ఉన్న మైనారిటీ వాటాలను కూడా రిలయన్స్ కొనుగోలు చేయొచ్చని వివరించాయి. సంక్లిష్టంగా మారిన తమ భారత విభాగాన్ని వీలైతే పూర్తిగా విక్రయించేందుకు లేదా ఇతర సంస్థలతో జట్టు కట్టి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు గతేడాది నుంచి డిస్నీ కసరత్తు చేస్తోంది. డిస్నీ, రిలయన్స్ ఒప్పందం? -
త్వరలో పెళ్లి పీటలెక్కుతున్న ఇతన్ని గుర్తుపట్టారా?
ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ ( Anant Ambani ), రాధికా మర్చంట్ల ( Radhika Merchant ) వివాహం త్వరలో జరగబోతోంది. మార్చి 1 నుంచి 3 వరకు మూడు రోజులపాటు గుజరాత్లోని జామ్నగర్లో వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అనంత్ అంబానీ బరువు తగ్గడం, ఆ తర్వాత పెరగడం గురించి చాలా ఊహాగానాలు ఉన్నప్పటికీ అనంత్ అంబానీ కొన్ని నెలల్లోనే 108 కిలోలు ఎలా తగ్గగలిగారు అని అందరూ ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటారు. అప్పట్లో ఆయన అంతలా బరువు తగ్గడానికి ప్రధాన కారణం ముంబైకి చెందిన ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ వినోద్ చన్నా. ఎవరీ వినోద్ చన్నా? దేశంలోని ప్రముఖ సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్లలో ఒకరైన వినోద్ చన్నా, ఒకప్పుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీకి పర్సనల్ ట్రైనర్. కఠినమైన ఆహారం, వ్యాయామ నియమావళి ద్వారా కేవలం 18 నెలల్లో 108 కిలోల బరువు తగ్గడానికి అతను సహాయం చేశాడు. వినోద్ చన్నాది స్వయంగా ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. అతను ఈ రోజు ఉన్న స్థితికి చేరుకోవడానికి చాలా కృషి చేశాడు. అతను ఒకప్పుడు చాలా బక్కపలచగా ఉండేవాడు. దీంతో అతన్ని అందరూ హేళన చేసేవారు. ఒక ఇంటర్వ్యూలో వినోద్ మాట్లాడుతూ.. తాను పెరిగే సమయంలో పోషకాహార లోపంతో బాధపడేవాడినని చెప్పాడు. ఫిట్నెస్ ట్రైనర్గా విజయం సాధించడానికి ముందు వినోద్ చన్నా హౌస్ కీపింగ్, సెక్యూరిటీ గార్డు వంటి చిన్న చిన్న పనులెన్నో చేశాడు. వినోద్ చన్నా పెరిగేకొద్దీ జీవితంలో ఫిట్నెస్ ప్రాముఖ్యతను గ్రహించి జిమ్లో చేరాడు. ఇదే అతని ప్రయాణాన్ని మలుపు తిప్పింది. అనంత్ అంబానీతో కలిసి పనిచేసిన అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో వినోద్ చన్నా మాట్లాడుతూ.. బరువు తగ్గడంలో అనంత్ అంబానీ నిబద్ధతను తెలియజేశారు. అనంత్ అంబానీ కోసం అధిక ప్రోటీన్, హై ఫైబర్, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారంతో ప్రత్యేక డైట్ ప్లాన్ రూపొందించినట్లు వినోద్ చన్నా తెలిపారు. ఆయన ఫీజు ఎంతంటే.. అనంత్ అంబానీతో పాటు నీతా అంబానీ, కుమార్ మంగళం బిర్లా, అనన్య బిర్లా, జాన్ అబ్రహం, శిల్పా శెట్టి, హర్షవర్ధన్ రాణే, వివేక్ ఒబెరాయ్, అర్జున్ రాంపాల్తో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులకు వినోద్ చన్నా పర్సనల్ ట్రైనర్గా వ్యవహరిస్తున్నారు. ఇంతకీ ఆయన ఎంత చార్జ్ చేస్తారో చెప్పలేదు కదా.. 12 ట్రైనింగ్ సెషన్ల ప్యాకేజీకి వినోద్ చన్నా రూ. 1.5 లక్షలు వసూలు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. -
జియో ఫైనాన్షియల్ సరికొత్త రికార్డులు!
దేశీయ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లో సరికొత్త రికార్డ్ లను నమోదు చేశాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ షేర్ ధర 35 శాతం పెరిగింది. ఫలితంగా ఆ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారి రూ. 2 లక్షల కోట్లను అధిగమించింది. ఫిబ్రవరి 23న పేరెంట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ సైతం రికార్డు స్థాయిని తాకింది. ఉదయం 10.30 గంటల సమయానికి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు 8 శాతం పెరిగి.. ఒక్కోషేర్ ధర రికార్డు స్థాయిలో రూ. 326కి చేరుకుంది. ఈ స్టాక్ వరుసగా ఐదవ సెషన్లో 17 శాతం వృద్ధిని నమోదు చేయడంతో సంస్థ విలువ పరంగా రూ. 2.08 లక్షల కోట్లు దాటేందుకు దోహదపడింది. ఆర్ఐఎల్ ఇంట్రాడేలో రికార్డు స్థాయిలో రూ.2,989ను తాకింది. బీఎస్ఈలో ఈ షేరు మునుపటి ముగింపుతో పోలిస్తే 0.5 శాతం పెరిగి రూ.2,978 వద్ద ట్రేడవుతోంది. వ్యూహాత్మక అడుగులు జియో ఫైనాన్షియల్ సెక్యూర్డ్ లోన్లు అందించేందుకు దృష్టి సారిస్తోంది. ఆర్ధిక విభాగంలో ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది రెండు కొత్త ఉత్పత్తులను ప్రారంభించడం ద్వారా దాని సురక్షిత రుణ వ్యాపారాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. దాని అనుబంధ సంస్థ జియో ఇన్ఫర్మేషన్ అగ్రిగేటర్ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా ఎయిర్ ఫైబర్, ఫోన్లు, ల్యాప్టాప్ల వంటి పరికరాల కోసం ఆపరేటింగ్, ఫైనాన్సింగ్ లీజులను అందించడం, చైన్ ఫైనాన్సింగ్, సరఫరాదారుల వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చేలా వ్యూహాత్మకంగా వడివడిగా అడుగులు వేస్తోంది. కాగా, జనవరిలో, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్లాక్రాక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సంస్థలు సంయుక్తంగా భారత్ లో మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు పత్రాలను దాఖలు చేశాయి. 39 కంపెనీలు@ రూ. 2 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం, 39 కంపెనీలు స్టాక్ మార్కెట్ లో రూ. 2 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే ఎక్కువ ట్రేడింగ్ చేస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.20.05 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్తో అగ్రస్థానంలో ఉండగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రూ.14.78 లక్షల కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.10.78 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్: మొత్తం షేర్ల సంఖ్యను మార్కెట్ విలువతో గుణిస్తే వచ్చే విలువను మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. -
ఛాట్జీపీటీకి పోటీగా మన ‘హనూమాన్’!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న వేళ భారత్ కూడా దీనికి పోటీగా.. అలాంటి సేవలని అందించాలనే ఉద్దేశ్యంగా అంబానీకి చెందిన రిలయన్స్, ఇతర ఐఐటీల సమన్వయంతో ఏర్పాటైన 'భారత్ జీపీటీ' వచ్చే నెలలో కొత్త ఏఐ మోడల్ లాంచ్ చేయడానికి సంకల్పించింది. భారత్ జీపీటీ లాంచ్ చేయనున్న ఏఐ మోడల్కు 'హనూమాన్' (Hanooman) అని నామకరణం చేశారు. ఈ హనుమాన్ ఏఐ మోడల్ మొత్తం 11 భాషల్లో సేవలను అందించనున్నట్లు సమాచారం. ఇందులో విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక, పరిపాలన రంగాలకు చెందినవి ఉంటాయి. ఇప్పటికే భారత్ జీపీటీ హనూమాన్ ఏఐ మోడల్ పనితీరును తెలియజేసే వీడియోను ప్రదర్శించింది. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా స్పీచ్ టు టెక్ట్స్ కూడా జనరేట్ చేయవచ్చని సమాచారం. భారతీయుల అవసరాలకు అనుగుణంగా ఈ హనుమాన్ ఏఐ మోడల్ను డెవలప్ చేస్తున్నట్లు రిలయన్స్ వెల్లడించింది. రిలయన్స్ కంపెనీ ఇప్పటికే తమ సబ్స్క్రైబర్లకు ఏఐ సేవలను అందించేందుకు 'జియో బ్రెయిన్' పేరిట ఓ మోడల్ను తయారు చేస్తోంది. మరోవైపు ఇండియన్ యూజర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సర్వం, కృత్రిమ్ వంటి సంస్థలు కూడా ఏఐ మోడల్స్ అభివృద్ధి చేస్తున్నాయి. ఇదీ చదవండి: మొన్న వార్నింగ్.. ఇప్పుడు ఆఫీస్ స్పేస్ - టెక్ దిగ్గజం కొత్త వ్యూహం! ప్రపంచ వ్యాప్తంగా ఏఐ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చాట్జీపీటీ, జెమినీ ఏఐ, ఏఐ గ్రోక్ వంటివి పుట్టుకొస్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు ఇలాంటి టెక్నాలజీల అభివృద్ధికి సన్నద్ధమయ్యే అవకాశం ఉంది, ఇదే జరిగితే మరిన్ని ఏఐ మోడల్స్ పుట్టుకొస్తాయని పలువురు చెబుతున్నారు. -
కూతురికి అరుదైన గౌరవం - ఆనందంలో ముకేశ్ అంబానీ..
రిలయన్స్ గ్రూప్ రిటైల్ వెంచర్ 'రిలయన్స్ రిటైల్'కు నాయకత్వం వహిస్తున్న 'ఇషా అంబానీ' (Isha Ambani), జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బోర్డులో కూడా నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. వ్యాపార రంగంలో దూసుకెళ్తున్న ఆమెను ఇటీవల 'మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్ 2024' అవార్డు వరించింది. రిలయన్స్ రిటైల్ వ్యాపారం అభివృద్ధి చెందడంతో 'ఇషా అంబానీ' పాత్ర అనన్యసామాన్యం. ఈమెకు ఫిబ్రవరి 15న ఓ వార్తాపత్రిక వార్షిక కార్యక్రమంలో 2024 సంవత్సరపు మహారాష్ట్ర ప్రత్యేక అవార్డును గెలుచుకుంది. అవార్డు గెలుచుకున్న సందర్భంలో ఇషా అంబానీ మాట్లాడుతూ.. మహారాష్ట్ర కేవలం మాకు ఉంటున్న ప్రదేశం (ఇల్లు) మాత్రమే కాదు, ఇది మాకు కర్మభూమి. మా తాత 'కలలు కనడానికి ధైర్యం చేయండి, వాటిని సాధించడం నేర్చుకోండి' అని చెప్పేవారు, ఆ మాటలనే అనుసరిస్తూ నా తల్లిదండ్రులు నన్ను పెంచారు. మా నాన్న కష్టపడి ఎలా పనిచేయాలో చూపించి, ఎంతోమందికి ఆదర్శమయ్యారు. అవార్డు అందుకున్న సందర్భంగా ఆమె రిలయన్స్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ అవార్డు మొత్తం రిలయన్స్ కుటుంబానికి చెందినదిని వెల్లడించింది. యేల్ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఇషా ఇప్పుడు రిలయన్స్ రిటైల్ను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంతో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈమె ఇప్పటికే ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డ్స్ 2023లో GenNext ఎంటర్ప్రెన్యూర్ అవార్డును కూడా అందుకుంది. ఇదీ చదవండి: హ్యాండ్సమ్గా కనిపిస్తున్న ఈ కుర్రాడే.. నేడు భారత్ గర్వించదగ్గ వ్యక్తి -
గ్రీన్ ఎనర్జీలో రిలయన్స్ భారీ పెట్టుబడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పర్యావరణహిత ఇంధనం (గ్రీన్ ఎనర్జీ) ఉత్పత్తికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తుండటంతో దిగ్గజ సంస్థలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. తాజాగా రిలయన్స్ గ్రూప్ సుమారు రూ.1,920 కోట్ల పెట్టుబడితో 15 చోట్ల కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా తొలి దశలో 8 యూనిట్ల ఏర్పాటుకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వ్యవసాయ వ్యర్థాలు.. వరిగడ్డి, వేరుశెనగ పొట్టు, జొన్న కంకులు, ఖాళీ కొబ్బరి బొండాలు, చెరకు పిప్పి, మునిసిపాలిటీల నుంచి రోజూ వచ్చే వ్యర్థాల నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ను ఉత్పత్తి చేస్తారు. ఈ 15 యూనిట్ల ద్వారా పూర్తిగా పర్యావరణహితమైన గ్యాస్ను ఉత్పత్తి చేయడమే కాకుండా సేంద్రియ ఎరువులను కూడా తయారుచేయొచ్చు. ఇప్పటివరకు ఈ వ్యర్థాలను తరలించే అవకాశం లేకపోవడంతో రైతులు పొలాల్లోనే వాటిని తగులబెడుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున వాతావరణ కాలుష్యం వెలువడుతోంది.. నేలసారం కూడా తగ్గిపోతోంది. ఇప్పుడు ఇలా కాకుండా నేరుగా రైతుల నుంచే రిలయన్స్ ఈ వ్యర్థాలను కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం ప్రతి యూనిట్కు కనీసం ఐదు కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. వ్యర్థాల కొనుగోలు చేయడం ద్వారా కనీసం 70 వేల మంది రైతులకు లబ్ధి కలుగుతుందని అంచనా. ప్రతి రైతుకు అదనంగా రూ.6,250 చొప్పున ఏటా రైతులకు రూ.45 కోట్ల వరకు అదనపు ఆదాయం లభించనుంది. అంతేకాకుండా ఈ సీబీజీ యూనిట్లకు అనుబంధంగా మరో రూ.1,000 కోట్ల విలువైన పెట్టుబడులు వస్తాయని రిలయన్స్ అధికారులు వెల్లడించారు. తగ్గనున్న కర్బన ఉద్గారాలు, దిగుమతులు.. దేశవ్యాప్తంగా రిలయన్స్ ఏర్పాటు చేస్తున్న 100 సీబీజీ యూనిట్లకు ఏటా 5.5 మిలియన్ టన్నుల వ్యవసాయ వ్యర్థాలు అవసరమవుతాయని అంచనా. తద్వారా 2.2 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గనున్నాయి. ఈ యూనిట్ల ద్వారా సీబీజీనే కాకుండా 2.5 మిలియన్ టన్నుల సేంద్రియ ఎరువులు కూడా ఉత్పత్తవుతాయి. అంతేకాకుండా ఏటా ఏడు మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ దిగుమతులు తగ్గడం ద్వారా విదేశీమారక నిల్వలు పెరగనున్నాయి. వాటికి ప్రత్యామ్నాయంగా సీబీజీ.. రానున్న కాలంలో ఎల్ఎన్జీ (లిక్విడ్ నేచురల్ గ్యాస్), సీఎన్జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్)లకు ప్రత్యామ్నాయంగా సీబీజీ వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్, అదానీ వంటి సంస్థలు ఈ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. రిలయన్స్ అనుబంధ కంపెనీ.. రిలయన్స్ బయోఎనర్జీ లిమిటెడ్ దేశవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో 100 సీబీజీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ 100 యూనిట్లలో 15 యూనిట్లు ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు కానున్నాయి. సుమారు రూ.130 కోట్లతో 20 ఎకరాల విస్తీర్ణంలో ఒక్కో యూనిట్ ఉంటుంది. తొలి దశలో భాగంగా కాకినాడ జిల్లాలో 3, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద 2, విజయవాడ పరిటాల వద్ద, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఒకటి చొప్పున ఏర్పాటు చేయనుంది. తాజాగా పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేతుల మీదుగా నిర్మాణ పనులు ప్రారంభమైన ఈ 8 యూనిట్లు వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి రానున్నాయి. రెండో దశలో మరో ఏడు యూనిట్లను 2026 సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొత్తం ఈ 15 యూనిట్ల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,000 మందికి ఉపాధి లభించనుంది. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న ఒక్కో యూనిట్ ద్వారా ఏటా 7,000 టన్నుల సీబీజీ, 34,300 టన్నుల సేంద్రియ ఎరువులు ఉత్పత్తి కానున్నాయి. -
టాటా షేర్స్ పై కన్నేసిన అంబానీ
-
రాష్ట్రంలో రిలయన్స్, బిర్లా భారీ పెట్టుబడులు
-
CM Jagan: ఆంధ్రప్రదేశ్కు భారీ పెట్టుబడులు
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగ అభివృద్ధిలో మరో కీలక ఘట్టానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు శ్రీకారం చుడుతున్నారు. రిలయన్స్ బయో ఎనర్జీ, ఆదిత్య బిర్లా గ్రూప్తోపాటు పలు సంస్థలు రాష్ట్రంలో నెలకొల్పుతున్న పరిశ్రమలకు ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.4,178 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటవుతున్న పలు పరిశ్రమలకు భూమి పూజ నిర్వహించనున్నారు. ఇవి కాకుండా రూ.655 కోట్లతో నెలకొల్పిన ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. మొత్తంగా సుమారు రూ.4,833 కోట్ల పెట్టుబడులు రానుండగా కొత్తగా 4,046 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. తొలుత 8 చోట్ల రిలయన్స్ ప్లాంట్లు రిలయన్స్ బయో ఎనర్జీ రాష్ట్రంలో 8 ప్రాంతాల్లో వ్యవసాయ వ్యర్ధాల నుంచి బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. మొత్తం రూ.1,024 కోట్ల పెట్టుబడితో తొలి దశలో కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, నెల్లూరులో బయో గ్యాస్ ప్లాంట్లను నెలకొల్పనుంది. తద్వారా 576 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్ రూ.1,700 కోట్ల పెట్టుబడితో తిరుపతి జిల్లా నాయుడుపేటలో మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ కార్బన్ బ్లాక్ను ఏర్పాటు చేయనుంది. దీనిద్వారా 250 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. వీటితో పాటు హెల్లా ఇన్ఫ్రా, వెసువియస్ ఇండియా లిమిటెడ్, ఏపీఐఐసీ, ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్, అన ఒలియో ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన పలు ప్రాజెక్టులకు సీఎం జగన్ వర్చువల్గా శంకుస్థాపనలతో పాటు పలు యూనిట్లను ప్రారంభిస్తారు. -
భారత్లో తొలి కంపెనీగా రిలయన్స్ - రూ.20 లక్షల కోట్లు..
ఫిబ్రవరి 13న ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు ఏకంగా 14 శాతం పుంజుకున్నాయి. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ. 20 లక్షల కోట్లను అధిగమించిన భారతదేశపు మొదటి కంపెనీగా అవతరించింది. 2024లో షేర్ విలువ ఇంత పెరగటం ఇదే మొదటిసారి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ బిఎస్ఇలో ఫిబ్రవరి 13న రూ. 2,957కు చేరింది. ఈ రోజు (ఫిబ్రవరి 13) ఉదయం 1.7 శాతం పెరిగి రూ. 2953వద్ద ట్రేడ్ అయింది. దీంతో మార్కెట్ విలువ ఏకంగా రూ. 20 లక్షల కోట్లు దాటేసింది. 2005లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొదటి సారి రూ.1 లక్ష కోట్ల మార్కెట్ విలువను చేరుకుంది. ఆ తరువాత 2007లో రూ.2 లక్షల కోట్లు, 2007లో రూ.3 లక్షల కోట్లు, 2007లో రూ.4 లక్షల కోట్లకు చేరింది. 2017లో రూ.5 లక్షల కోట్లు, 2019లో రూ.10 లక్షల కోట్లు, 2021లో రూ.15 లక్షల కోట్లు చేరింది. ఆ తరువాత సుమారు 600 రోజుల్లో రూ.20 లక్షల కోట్లు మైలురాయిని సాధించింది. అంటే 2005 నుంచి రూ. 20 లక్షల కోట్ల విలువను చేరుకోవడానికి దాదాపు 19 సంవత్సరాల సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: మరో వ్యాపారంలోకి అంబానీ!.. రూ.27 కోట్ల డీల్ కొత్త సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ పెరుగుదల వైపు అడుగులు వేసింది. జనవరిలో 10.4 శాతం పెరిగిన షేర్ ఇప్పటికి (ఫిబ్రవరి) మరో నాలుగు శాతం పెరిగి ఈ ఏడాది గరిష్ట స్థాయికి చేరింది. దీంతో సంస్థ భారీ లాభాలను సొంతం చేసుకోగలిగింది. (మార్కెట్లో ఒడుదుడుకులు ఏర్పడితే విలువలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి వ్యాల్యూలో తేడాలు రావొచ్చు.. గమనించగలరు.) -
మరో వ్యాపారంలోకి అంబానీ!.. రూ.27 కోట్ల డీల్
'రావల్గావ్ షుగర్ ఫామ్' (Ravalgaon Sugar Farm) ఐకానిక్ క్యాండీ బ్రాండ్ త్వరలో 'ముకేశ్ అంబానీ' చేతుల్లోకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ కంపెనీ కొనుగోలుకు 'రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్' రూ. 27 కోట్ల డీల్ కూడా కుదుర్చుకున్నట్లు సమాచారం. మ్యాంగో మూడ్, కాఫీ బ్రేక్, టట్టీ ఫ్రూటీ, పాన్ పసంద్, చాకో క్రీమ్, సుప్రీమ్ వంటి ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన రావల్గావ్ షుగర్ ఫామ్, తన ట్రేడ్మార్క్లు, వంటకాలు వంటి అన్ని హక్కులను రిలయన్స్ కన్స్యూమర్కు విక్రయించినట్లు శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్ తెలిపింది. సుమారు రూ. 27 కోట్ల డీల్తో కంపెనీని విక్రయించడానికి డైరెక్టర్ల బోర్డు కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం. గత కొంతకాలంగా కంపెనీ మార్కెట్ వాటా తగ్గుముఖం పట్టడం వల్ల వ్యాపారాన్ని కొనసాగించడంలో సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది. పెరిగిన ముడిసరుకుల ధరల వల్ల పెట్టుబడి ఎక్కువవుతోండటంతో.. విక్రయానికి సిద్దమైపోతోంది. రావల్గావ్ షుగర్ ఫామ్ అనేది రావల్గావ్ వాల్చంద్ గ్రూప్లో భాగంగా 1933లో ఏర్పాటైంది. ప్రారంభంలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొని నిలదొక్కుకున్నప్పటికీ క్రమంగా లాభాలు క్షీణించాయి. 2023 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం కేవలం 9.66 కోట్ల రూపాయలు మాత్రమే. ఇదీ చదవండి: ఏప్రిల్ నుంచి ఫాస్ట్ట్యాగ్లు పనిచేయవు! కారణం ఇదే.. కరోనా మహమ్మారి దేశంలో విజృంభించిన సమయంలో స్కూల్స్, ఆఫీసులు వంటివన్నీ నెలల తరబడి మూతపడి ఉన్నాయి. ఇది కంపెనీ వ్యాపారాన్ని గట్టిగా దెబ్బతీసింది. కరోనా తగ్గిన తరువాత కూడా కంపెనీ లాభాలు వృద్ధి చెందక పోవడం వల్ల సంస్థను అమ్మడానికి పూనుకుంది. -
‘బెంజ్ టు బడ్జెట్ కారుకి పడిపోయిన అంబానీ బ్రదర్’
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. అన్నది పెద్దలు చెప్పిన మాట. కానీ ఈ విషయంలో కొందరే విజేతలవుతుంటారు. పెట్రోల్ బంకులో కేవలం 300 రూపాయల జీతానికి పనిచేసిన ధీరూభాయ్ వేల కోట్లను సంపాదించి దిగ్గజ వ్యాపారవేత్తగా నిలిచారు. దేశంలోనే అతిపెద్దదైన రిలయన్స్ ఇండస్ట్రీని స్థాపించి అంబానీ వారసులకు బంగారు బాట పరిచారు. అయితే ఆయన వారసుల పరిస్థితి కొంచెం విచిత్రంగా ఉంటుంది. దీరుభాయ్ ఆయన పెద్ద కుమారుడు ముకేష్ దీరుభాయ్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, చిన్న కుమారుడు అనిల్ దీరూభాయ్ అంబానీ ఒకప్పుడు ప్రపంచ ధనవంతుల జాబితాలో తొలి పది స్థానాల్లో ఉన్నారు. కానీ కాలం కలిసి రాక పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మన దేశంలోనే ఎక్కువ మార్కెట్ విలువ ఉన్న కంపెనీ కాగా, అనిల్ అంబానీ సంస్థలు మాత్రం అప్పులు, కోర్టు కేసులు నడుస్తున్నాయి. వాటి నుంచి బయటపడేందుకు ఉన్న ఆస్తుల్ని అమ్మేస్తున్నారు. సాధారణ జీవితం గడుపుతున్నారు. తాజాగా, అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అనంతరం తిరిగి తన ఇంటికి వచ్చే సమయంలో ముంబై ఎయిర్పోర్ట్లో ఓ సాదాసీదా హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కార్లో తిరుగుతూ దర్శనమిచ్చారు. దీనిపై నెటిజన్లు అనిల్ అంబానీ గతం, వర్తమానాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ‘జర్నీ మెర్సిడెజ్ టూ హ్యుందాయ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒకప్పుడు అపరకుబేరుల జాబితాలో ఉన్న అనిల్ అంబానీ ఓ వెలుగు వెలిగారు. ‘అంబానీ’ల స్టేటస్ ఏ మాత్రం తగ్గకుండా రేంజ్ రోవర్ మెర్సిడెజ్ బెంజ్ ఎస్-క్లాస్, రోల్స్ రాయిస్ రోల్స్ రాయిస్ ఫాంటమ్, లంబోర్ఘిని గల్లార్డోలో తిరిగే వారు. కానీ అదంతా గతం ఇప్పుడు బ్లాక్ కలర్ హ్యుందాయ్ ఐయోనిక్ 5లో ప్రయాణిస్తున్నారు. ఇక అనిల్ అంబానీ ప్రయాణిస్తున్న కారు రూ.44.95 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) ప్రారంభం కాగా చివరికి రూ. 46.05 లక్షలకు (ఎక్స్-షోరూమ్) లభ్యమవుతుంది. ఈ కారు ప్రత్యేకతల విషయానికి వస్తే మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారు 215 బీపీహెచ్ పవర్, 350 ఎన్ఎం టారిక్ను ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రిక్ వాహనం 72.6కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ 631 కిమీ రేంజ్ వరకు ఉంది. హ్యుందాయ్ వెబ్సైట్ ప్రకారం ఈ కారు కేవలం 18 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయగలదు. అదనంగా, 100 కి.మీ పరిధిని పొందడానికి కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఛార్జింగ్ పెడితే సరిపోతుంది. View this post on Instagram A post shared by Voompla (@voompla) -
పడగొట్టిన రిలయన్స్, హెచ్డీఎఫ్సీ
ముంబై: అధిక వెయిటేజీ రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో బజాజ్ ద్వయం, ఐటీసీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫెడరల్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడి(బుధవారం)కి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫలితంగా స్టాక్ సూచీలు మంగళవారం ఒక శాతం పతనమయ్యాయి. సెన్సెక్స్ 802 పాయింట్లు నష్టపోయి 71,140 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 215 పాయింట్లు క్షీణించి 21,522 వద్ద నిలిచింది. ఉదయం స్తబ్ధుగా మొదలైన సూచీలు అమ్మకాల ఒత్తిడితో రోజంతా నష్టాల్లో కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 866 పాయింట్లు క్షీణించి 71,076 వద్ద, నిఫ్టీ 236 పాయింట్లు పతనమై 21,502 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు, రియల్టీ, మీడియా షేర్లకు మాత్రమే స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. కన్జూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, ఎఫ్ఎంసీజీ, యుటిలిటీ, పారిశ్రామిక రంగాల షేర్లలో విక్రయాలు నెలకొన్నాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ సూచీలు 0.53%, 0.18% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,971 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1003 కోట్ల షేర్లను కొన్నారు. ఫెడ్ పాలసీ వెల్లడికి ముందు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఇతర ముఖ్యాంశాలు... జీవితకాల గరిష్ట స్థాయి (రూ.2,918) వద్ద రిలయన్స్ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈలో ఈ షేరు 3% నష్టపోయి రూ.2815 వద్ద స్థిరపడింది. మంగళవారం ట్రేడింగ్లో 7% ర్యాలీ చేసింది. మరో అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లలోనూ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. దీంతో ఈ ప్రైవేట్ రంగ దిగ్గజం దాదాపు 1% నష్టపోయి రూ.1444 వద్ద ముగిసింది. ► క్యూ3 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడంతో బజాజ్ ఫైనాన్స్ షేరు 5% నష్టపోయి రూ.6,815 వద్ద నిలిచింది. షేరు 5% క్షీణతతో మార్కెట్ విలువ రూ. 22,984 కోట్లు హరించుకుపోయి రూ.4.21 లక్షల కోట్లకు దిగివచ్చింది. బజాజ్ ఫైనాన్స్ పతనంతో ఇదే గ్రూప్ చెందిన బజాజ్ ఫిన్సర్వ్ షేరూ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో ఈ షేరు 3% నష్టపోయి రూ.1591 వద్ద నిలిచింది. ► ఐటీసీ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేకపోవడంతో షేరు 3% నష్టపోయి రూ.438 వద్ద నిలిచింది. ►లిస్టింగ్ రోజే ఈప్యాక్ డ్యూరబుల్ షేరు 10% నష్టపోయింది. ఇష్యూ ధర (రూ.230)తో బీఎస్ఈలో 2% డిస్కౌంట్తో రూ.225 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్లో 11% పతనమై రూ.206 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 10% నష్టంతో రూ.208 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,990 కోట్లుగా నమోదైంది. ► మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాటా మోటార్స్–డీవీఆర్తో కలుపుకొని టాటా మోటార్స్ కంపెనీ మారుతీ సుజుకీని అధిగమించి అటో రంగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. బుధవారం టాటా మోటార్స్ షేరు 2% పెరిగి రూ.859 వద్ద, టాటా మోటార్స్–డీవీఆర్ షేరు 1.63% లాభపడి రూ.573 వద్ద ముగిశాయి. ► బీఎల్ఎస్ ఈ–సర్విసెస్ ఐపీఓకు తొలిరోజు 15.63 రెట్ల అధిక స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.37 కోట్ల షేర్లను జారీ చేయగా 21.41 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. రిటైల్ కోటా 49.రెట్లు, సంస్థాగతేతర విభాగం 29.66 రెట్లు, క్యూబీఐ కోటా 2.19 రెట్లు సబ్స్రై్కబ్ అయ్యాయి. -
అయోధ్య రాముడికి అంబానీ దంపతుల కానుక.. 33 కేజీల బంగారం?
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామమందిర ప్రాణ ప్రతిష్ఠ ఎట్టకేలకు ముగిసింది. ఈ దివ్య ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించిన ప్రముఖలతోపాటు టీవీల్లో, ఇతర సాధనాల్లో వీక్షించిన కోట్లాదిమంది భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతోపాటు ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ కుటుంబం కూడా ఈ వేడుకలో పాల్గొంది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు అయోధ్యలోని రామమందిరానికి 33 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు ముందు నుంచే ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 33 కేజీల బంగారంతో పాటు అంబానీలు ఆలయానికి మూడు బంగారు కిరీటాలను కూడా విరాళంగా ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి: Ayodhya: అమ్మతో అయోధ్యలో.. సాఫ్ట్వేర్ కంపెనీ సీఈవో భక్తిపారవశ్యం! ఈ వార్తలు నిజమేనా? అయోధ్య రామమందిరానికి ముఖేష్ అంబానీ దంపతులు మూడు బంగారు కిరీటాలు, 33 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు వచ్చిన ఈ వార్తల్లో నిజం లేదని తెలిసింది. డీఎన్ఏ వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. విరాళాల విషయమై న్యూస్చెకర్ (Newschecker) వెబ్సైట్ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యునితో మాట్లాడింది. ఇలాంటి విరాళాలేవీ తమకు అందించలేదని ట్రస్ట్ సభ్యులు ధ్రువీకరించినట్లుగా పేర్కొంది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
దేశవ్యాప్తంగా వేతనంతో కూడిన సెలవు.. అంబానీ కీలక ప్రకటన
అయోధ్యలో జనవరి 22వ తేదీన బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సగం రోజు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. మోదీ నిర్ణయానికి మద్ధతుగా ప్రతిష్టాత్మక రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అదే బాటలో నిర్ణయం తీసుకున్నారు. జనవరి 22వ తేదీన రిలయన్స్ ఇండస్ట్రీ ఉద్యోగులకు సెలవు ప్రకటించారు. రిలయన్స్ ఆధ్వర్యంలోని అన్ని కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవుదినం ప్రకటించారు. జనవరి 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో అయోధ్యలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిలయన్స్ ఇండస్ట్రీ ఆఫీసులు, కంపెనీలు, ఫ్యాక్టరీలకు సెలవు ప్రకటించినట్లు అంబానీ వెల్లడించారు. ఇదీ చదవండి: రిలయన్స్ లాభం 17,265 కోట్లు దీంతో జనవరి 22వ తేదీన తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఉన్న ట్రెండ్స్ షోరూంలు, ఇతర రిలయన్స్ ఇండస్ట్రీ ఆఫీసులకు వేతనంతో కూడిన సెలవుదినంగా ప్రకటించారు. ముఖేష్ అంబానీ సోమవారం అయోధ్యలో జరిగే కార్యక్రమంలో ఫ్యామిలీతోపాటు హాజరుకానున్నట్లు తెలిసింది. -
రిలయన్స్ లాభం 17,265 కోట్లు
న్యూఢిల్లీ: ఆయిల్ నుంచి రిటైల్ వరకు ఎన్నో వ్యాపారాలు నిర్వహిస్తున్న డైవర్సిఫైడ్ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ డిసెంబర్ త్రైమాసికంలో మిశ్రమ పనితీరు చూపించింది. రిటైల్, టెలికం వ్యాపారాలు రాణించగా, ఆయిల్ టు కెమికల్స్ (ఓటూసీ) నిరాశపరించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 9.3 శాతం పెరిగి రూ.17,265 కోట్లకు చేరుకుంది. షేరువారీ ఆర్జన రూ.25.52గా ఉంది. ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 3.6 శాతం వృద్ధితో రూ.2.28 లక్షల కోట్లుగా నమోదైంది. కానీ, 2023 సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చి చూస్తే నికర లాభం 0.7 శాతం, ఆదాయం 3 శాతం చొప్పున తక్కువగా నమోదయ్యాయి. ఎబిటా (ఆపరేటింగ్ మార్జిన్) క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 2.10 శాతం మేర, 2023 డిసెంబర్ త్రైమాసికంతో పోల్చితే 0.50 శాతం మేర పెరిగి 18 శాతానికి చేరింది. రుణాలపై వ్యయాలు 11 శాతం పెరిగి రూ.5,789 కోట్లుగా ఉన్నాయి. బ్యాలన్స్ షీటులో నగదు, నగదు సమానాలు రూ.1.92 లక్షల కోట్లుగా ఉన్నాయి. కన్సాలిడేటెడ్ రుణ భారం రూ.3.12 లక్షల కోట్లుగా, నికర రుణ భారం రూ.1,19,372 కోట్లుగా ఉంది. రిటైల్ భేష్... ► రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) కన్సాలిడేటెడ్ లాభం క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 40 శాతం పెరిగి రూ.3,165 కోట్లకు చేరింది. ►స్థూల ఆదాయం క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 23 శాతం వృద్ధితో రూ.83,063 కోట్లకు చేరింది. ఒక త్రైమాసికంలో కంపెనీకి ఇదే అత్యధిక ఆదాయం. ► ఎబిటా 31% పెరిగి రూ.6,258 కోట్లు. ► గత త్రైమాసికంలో 252 స్టోర్లను కొత్తగా ప్రారంభించింది. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 18,774కు చేరింది. ఆయిల్, కెమికల్స్... ఆయిల్ టు కెమికల్స్ విభాగంలోనే బలహీనత కనిపించింది. నిర్వహణ పనుల కోసం జామ్నగర్లోని రిఫైనరీ ప్లాంట్లను ఏడు వారాలు మూసివేయడం ప్రభావం చూపించింది. ఆయిల్ టు కెమికల్స్ ఆదాయం 2.4% తగ్గి రూ.1.41 లక్షల కోట్లుగా ఉంది. ఆయిల్ అండ్ గ్యాస్ ఆదాయం 50% వృద్ధితో రూ.6,719 కోట్లకు ఎగసింది.రిలయన్స్ షేరు ఫ్లాట్గా రూ.2,736 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. జియో జూమ్... టెలికం, డిజిటల్ వ్యాపారం రాణించింది. నికర లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12% పెరిగి రూ.5,445 కోట్ల గా ఉంది. ఆదాయం 11 శాతానికి పైగా వృద్ధితో రూ.32,510 కోట్లుగా నమోదైంది. జియో వరకే చూస్తే లాభం 12% పెరిగి రూ.5,208 కోట్లుగా ఉంది. ఆదాయం 10% వృద్ధితో రూ.25,368 కోట్లకు చేరింది. ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయ రూ. 181.70కి చేరింది. ఏడాది క్రితం రూ. 178గా ఉంది. 2023 సెప్టెంబర్ క్వార్టర్తో పోలి స్తే ఫ్లాట్గా ఉంది. డిసెంబర్ నాటికి కస్టమర్ల సంఖ్య 470.09 మిలియన్లకు చేరింది. నికరంగా 11.2 మిలియన్ల కస్టమర్లు జతయ్యారు. 9 కోట్ల మంది 5జీ నెట్వర్క్కు మళ్లారు. -
పటిష్టమైన దేశీ బ్రాండ్ ఏంటో తెలుసా..
గ్లోబల్–500 కంపెనీల జాబితాలో పటిష్టమైన దేశీ బ్రాండ్గా రిలయన్స్ ఇండస్ట్రీస్లో భాగమైన జియో చోటు దక్కించుకుంది. బ్రాండ్ పటిష్టత సూచీలో 88.9 పాయింట్లతో 17వ ర్యాంకులో నిలి్చంది. 2024 సంవత్సరానికి గాను బ్రాండ్ ఫైనాన్స్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ జాబితాలో ఎల్ఐసీ 23వ స్థానంలో, ఎస్బీఐ 24వ స్థానంలో నిల్చాయి. గతేడాది (2023) కూడా పటిష్టమైన భారతీయ బ్రాండ్ల జాబితాలో జియో అగ్రస్థానం దక్కించుకుంది. 2024కి సంబంధించిన జాబితాలో వుయ్చాట్, యూట్యూబ్, గూగుల్, డెలాయిట్, కోకా కోలా, నెట్ఫ్లిక్స్ వంటి సంస్థలు టాప్లో ఉన్నాయి. టెలికమ్యూనికేషన్స్ రంగంలో మిగతా పోటీ సంస్థలతో పోలిస్తే కొత్త కంపెనీ అయినప్పటికీ పరిశ్రమలో జియో అత్యంత వేగంగా ఎదిగిందని నివేదిక పేర్కొంది. ఇదీ చదవండి: గూగుల్పే యూజర్లకు శుభవార్త.. అదేంటంటే? కస్టమర్ల సంఖ్య వేగంగా పెరగడం, నవకల్పనలు, బ్రాండ్పై సానుకూల అభిప్రాయం మొదలైనవన్నీ కూడా జియో బ్రాండ్ పటిష్టత, ట్రిపుల్ ఏ రేటింగ్లో ప్రతిఫలిస్తున్నాయని తెలిపింది. టీసీఎస్, టాటా స్టీల్, టాటా మోటర్స్ వంటి దిగ్గజ కంపెనీలున్న టాటా గ్రూప్.. దక్షిణాసియాలోనే అత్యంత విలువైన బ్రాండ్గా నిలి్చందని నివేదిక పేర్కొంది. -
భారత్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ప్రధాని మోదీనే.. అంబానీ ప్రశంసలు
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశసంల వర్షం కురిపించారు. భారత చరిత్రలో అత్యంత విజయవంతమైన ప్రధాని మోదీనే అని కొనియాడారు. గాంధీనగర్లో జరుగుతున్న ‘వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్’ లో ప్రధాని సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు. వాటిల్లో ♦ రిలయన్స్ ఎప్పుడూ గుజరాతీ కంపెనీగానే ఉంటుంది ♦ నేను గుజరాతీగా గర్వపడుతున్నాను ♦ విదేశీయులు నూతన ఇండియా అంటేనే నూతన గుజరాత్నే ఊహించుకుంటున్నారు. ♦ ఇందంతా కేవలం ఒక్క మోదీ వల్లే సాధ్యమైంది. భారతదేశ చరిత్రలో అత్యంత విజయవంతమైన ప్రధానమంత్రి ప్రధాని మోదీనే ♦ రిలయన్స్ ఎప్పటికీ గుజరాతీ కంపెనీగానే కొనసాగుతుంది. రిలయన్స్ గత 10 సంవత్సరాలలో భారతదేశం అంతటా 12 లక్షల కోట్లు పెట్టుబడు పెట్టింది. అందులో 1/ 3వ వంతు ఒక్క గుజరాత్లోనే పెట్టుబడి పెట్టబడింది ♦ వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ను ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పెట్టుబడిదారుల సదస్సు ♦ గుజరాత్కు స్వాగతం. 10వ వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్. నేడు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పెట్టుబడిదారుల సదస్సు. రెండు దశాబ్దాల క్రితం మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ‘ఇన్వెస్టర్ సమ్మిట్’గా గుర్తింపు పొందింది. ఇది ప్రధాని దార్శనికతకు నిదర్శనం ♦ 2047 నాటికి భారతదేశం 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. దీన్ని ఏ శక్తీ అడ్డుకోలేదు. గుజరాత్ 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుతుంది’అని అంబానీ అన్నారు. అనంతరం రిలయన్స్ ఇండస్ట్రీ దేశంలో పెట్టుబడులపై ప్రస్తావించారు. -
2023 మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్స్.. టాప్లో టాటా - మూడో స్థానంలో అదానీ
ముంబై: గత క్యాలండర్ ఏడాది(2023)లో దేశీ కార్పొరేట్ దిగ్గజాలలో టాటా గ్రూప్ భారీగా లాభపడింది. గ్రూప్లోని షేర్లు లాభాల దౌడు తీయడంతో గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) 35 శాతం దూసుకెళ్లింది. ఉమ్మడిగా రూ. 28.68 లక్షల కోట్లను తాకింది. దీంతో మార్కెట్ క్యాప్రీత్యా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ముకేశ్ అంబానీ గ్రూప్ రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ దాదాపు 11 శాతం ఎగసింది. రూ. 19.42 లక్షల కోట్లకు చేరింది. ఫలితంగా అదానీ గ్రూప్ను అధిగమిస్తూ ద్వితీయ స్థానాన్ని అందుకుంది. అయితే 2022లో రిలయన్స్ గ్రూప్ను వెనక్కి నెట్టిన అదానీ గ్రూప్ వెనకడుగు వేసింది. మార్కెట్ విలువ దాదాపు 28 శాతం క్షీణించడంతో రూ. 14.2 లక్షల కోట్లకు పరిమితమైంది. వెరసి మూడో ర్యాంకులో నిలిచింది. 2022లో టాటా గ్రూప్ విలువ రూ. 21.2 ట్రిలియన్లుకాగా.. అదానీ గ్రూప్ రూ. 19.7 ట్రిలియన్లు, రిలయన్స్ రూ. 17.6 ట్రిలియన్లుగా నమోదయ్యాయి. రంగాలవారీగా తీరిలా దేశీ కార్పొరేట్ బిజినెస్ గ్రూప్లలో ప్రధానంగా ఆటోమోటివ్, ఇంజినీరింగ్, భారీయంత్ర పరికరాలు(క్యాపిటల్ గూడ్స్), విద్యుత్, మౌలిక సదుపాయాలు(ఇన్ఫ్రాస్ట్రక్చర్), రిటైల్ రంగాలు గతేడాది మెరుగైన పనితీరు చూపాయి. అయితే కమోడిటీలు, ఎనర్జీ, ఫైనాన్స్ విభాగాలు మందగించాయి. చెన్నై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మురుగప్ప గ్రూప్ మార్కెట్ విలువ దాదాపు 53 శాతం జంప్చేసి రూ. 3.36 లక్షల కోట్లకు చేరింది. రిటైల్ ఫైనాన్స్, ఇంజినీరింగ్, పవర్ ఎక్విప్మెంట్, సుగర్, ఆగ్రోకెమికల్స్, అబ్రాసివ్స్ తయారీలో ఉన్న మురుగప్ప గ్రూప్ మార్కెట్ విలువ రీత్యా టాప్–10 జాబితాలో చోటు(9వ ర్యాంకు) సాధించింది. 2022లో గ్రూప్ విలువ రూ. 2.2 ట్రిలియన్లు మాత్రమే. ఈ బాటలో జేఎస్డబ్ల్యూ గ్రూప్ రూ. 2.39 ట్రిలియన్ల నుంచి రూ. 3.33 లక్షల కోట్లకు చేరడం ద్వారా 10వ ర్యాంకును సాధించింది. ఇందుకు జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిస్టింగ్(రూ. 44,000 కోట్ల విలువ) జత కలిసింది. రాహుల్ బజాజ్ గ్రూప్ విలువ రూ. 8.21 ట్రిలియన్ల నుంచి 23 శాతంపైగా బలపడి రూ. 10.12 లక్షల కోట్లను తాకింది. వెరసి మరోసారి నాలుగో ర్యాంకులో నిలిచింది. ఆదిత్య బిర్లా గ్రూప్ 33 శాతం ఎగసి ఐదో ర్యాంకును అందుకుంది. విలువ రూ. 4.98 లక్షల కోట్ల నుంచి రూ. 6.6 ట్రిలియన్లకు చేరింది. గ్రూప్లు అటూఇటుగా టెలికం రంగ దిగ్గజం భారతీ(ఎయిర్టెల్) గ్రూప్ మార్కెట్ విలువ రూ. 5.17 ట్రిలియన్ల నుంచి 27 శాతంపైగా జంప్చేసి రూ. 6.59 లక్షల కోట్లను తాకినప్పటికీ ర్యాంకింగ్లో 5 నుంచి 6కు నీరసించింది. ఐటీ సేవల హెచ్సీఎల్ గ్రూప్ మార్కెట్ క్యాప్ 41 శాతం దూసుకెళ్లి రూ. 3.98 ట్రిలియన్లను తాకింది. రెండు స్థానాలు మెరుగుపడి 7కు చేరింది. ఆటో రంగ దిగ్గజం ఎంఅండ్ఎం రూ. 3.95 కోట్ల మార్కెట్ విలువతో ఒక స్థానం తగ్గి 8వ ర్యాంకుకు పరిమితమైంది. నిజానికి 2022లో ఎంఅండ్ఎం మార్కెట్ విలువ రూ. 3 లక్షల కోట్లు మాత్రమే. -
అంబానీ కీలక ప్రకటన.. అదానీకి టెన్షన్!
Reliance-Brookfield data centre: రిలయన్స్-బ్రూక్ఫీల్డ్ డేటా సెంటర్కు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. రానున్న వారంలో ఈ డేటా సెంటర్ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కెనడాకు చెందిన బ్రూక్ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూఎస్కు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ డిజిటల్ రియాల్టీ ఇప్పటికే భాగస్వాములుగా ఉన్న ప్రస్తుత జాయింట్ వెంచర్లోకి ప్రవేశించడానికి రిలయన్స్ గత ఏడాది జూలైలో సుమారు రూ. 378 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ వెంచర్లో మూడు సంస్థలకు ఒక్కొక్క దానికి 33 శాతం వాటా ఉంది. చెన్నైలో జరిగిన తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ తమ గ్రూప్ పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్తో పాటు ఆ రాష్ట్రంలో డేటా సెంటర్ను ఏర్పాటు చేయడంలో పెట్టుబడులు పెడుతుందని చెప్పారు. బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్, డిజిటల్ రియాలిటీ భాగస్వామ్యంతో రిలయన్స్ ఏర్పాటు చేస్తున్న అత్యాధునిక డేటా సెంటర్ను వచ్చే వారం ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. భారతీయ డేటా సెంటర్ల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. సంవత్సరానికి 40 శాతం చొప్పున వృద్ధితో 2025 నాటికి 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్, సునీల్ మిట్టల్కు సంబంధించిన భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్లు ఇప్పటికే తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేశాయి. వీటికి పోటీగా రిలయన్స్ ప్రవేశంతో డేటా సెంటర్ల మార్కెట్ వేడెక్కుతోంది. -
ఓఎన్జీసీ చేతికి 7 బ్లాకులు.. చమురు నిక్షేపాల తవ్వకాల్లో రిలయన్స్
న్యూఢిల్లీ: ఓపెన్ ఏకరేజ్ లైసెన్స్ పాలసీ(ఓఏఎల్పీ)లో భాగంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ) 7 బ్లాకులను గెలుచుకుంది. ప్రయివేట్ రంగ కన్సార్షియం రిలయన్స్–బీపీ, ఇంధన రంగ పీఎస్యూ ఆయిల్ ఇండియా, సన్పెట్రోకెమికల్స్ ఒక్కో క్షేత్రం చొప్పున సాధించాయి. చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తికి సంబంధించి 8వ రౌండ్లో భాగంగా 10 బ్లాకులను ఆఫర్ చేసినట్లు చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. వెరసి ఓఏఎల్పీ–8లో తాజాగా 10 బ్లాకులకు సంతకాలు జరిగినట్లు వెల్లడించారు. ఇదేసమయంలో మూడు కోల్బెడ్ మిథేన్(సీబీఎం) బ్లాకులను సైతం కేటాయించినట్లు తెలియజేశారు. అంతేకాకుండా ఓఏఎల్పీ–9వ రౌండ్ బిడ్డింగ్కు తెరతీసినట్లు తెలియజేశారు. తాజాగా ఆఫర్ చేసిన బ్లాకుల అన్వేషణ కార్యకలాపాలకు 23.3 కోట్ల డాలర్ల పెట్టుబడులు వెచ్చించవచ్చని భావిస్తున్నట్లు అధికారిక నోట్లో చమురు శాఖ పేర్కొంది. 2022 జులైలో ఓఎల్ఏపీ–8వ రౌండ్కు బిడ్డింగ్ను తెరిచిన సంగతి తెలిసిందే. చమురు శాఖ మొత్తం 10 బ్లాకులను ఆఫర్ చేసింది. పలు దఫాలు గడువు తేదీని సవరించాక 2023 జులైలో బిడ్డింగ్ను ముగించింది. హైడ్రోకార్బన్స్ డైరెక్టరేట్ జనరల్(డీజీహెచ్) వివరాల ప్రకారం ఓఎన్జీసీసహా వేదాంతా లిమిటెడ్, ఆయిల్ ఇండియా, సన్ పెట్రోకెమికల్స్, రిలయన్స్–బీపీ ఎక్స్ప్లొరేషన్(అల్ఫా) ఉమ్మడిగా 13 బిడ్స్ దాఖలు చేశాయి. బిడ్స్ తీరిలా కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేసిన 10 బ్లాకులలో ఏడింటికి ఒక్కొక్క బిడ్ దాఖలుకాగా.. మిగిలిన మూడు క్షేత్రాలకు రెండేసి బిడ్స్ లభించాయి. గ్లోబల్ ఇంధన దిగ్గజాలు ఎక్సాన్మొబిల్, షెవ్రాన్, టోటల్ఎనర్జీస్ బిడ్ చేయలేదు. మొత్తం 9 బ్లాకులకు బిడ్ చేసినఓఎన్జీసీ 6 బ్లాకులకు ఒంటరిగా రేసులో నిలిచింది. రిలయన్స్–బీపీ కేజీ బేసిన్లోని లోతైన సముద్రగర్భ బ్లాక్కు బిడ్ వేసింది. దశాబ్ద కాలంగా భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్న రిలయన్స్–బీపీ గత ఓఏఎల్పీ రౌండ్లలోనూ ఒక బ్లాకును గెలుచుకున్నాయి. చమురు దిగుమతుల బిల్లును తగ్గించుకునే లక్ష్యంతో ప్రభుత్వం 2016లో ఓఏఎల్పీకి తెరతీసింది. తద్వారా చమురు సంస్థలు ఇంధన అన్వేషణకు గుర్తించిన ప్రాంత పరిధిని దాటి ఏ ఇతర ప్రాంతాన్నయినా ఎంపిక చేసుకునేందుకు వీలు కల్పించింది. ప్రత్యేక సీబీఎం బిడ్ రౌండ్–2022లో భాగంగా 3 బ్లాకుల కేటాయింపునకు సంతకాలు పూర్తయినట్లు మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. -
12 ఓటీటీలు అందించే జియో కొత్త ప్లాన్ ఇదే..
ప్రముఖ టెలికామ్ దిగ్గజం 'రిలయన్స్ జియో' (Reliance Jio) ఇటీవల తన సబ్స్క్రైబర్ల కోసం కొత్త ప్లాన్ తీసుకువచ్చింది. ఈ ప్లాన్లో భాగంగా రూ.148 చెల్లించి ఏకంగా 12 ఓటీటీలను పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వీడియో స్ట్రీమింగ్ యాప్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో టెలికాం సంస్థలు అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొస్తున్నాయి. ఇటీవల రిలయన్స్ జియో రూ.148తో కొత్త ప్లాన్ను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా 12 ఓటీటీలు లభిస్తున్నాయి. జియో రూ.148 ప్లాన్ కేవలం డేటా ప్యాక్ మాత్రమే. వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్లు ఉండవు. 10 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులు. దీన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే కచ్చితంగా బేస్ ప్లాన్ ఉండాల్సిందే. జియో సినిమా ప్రీమియం కూపన్ మైజియో అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. దీన్ని ఉపయోగించి ఆ ఓటీటీని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: అకౌంట్లో మినిమం బ్యాలెన్స్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు 12 ఓటీటీలు ఇవే.. జియోసినిమా ప్రీమియం జీ5 సోనీలివ్ లయన్స్గేట్ ప్లే డిస్కవరీ+ సన్నెక్ట్స్ డాక్యుబే హోఇచోయ్ ప్లానెట్ మరాఠీ చౌపాల్ ఎపిక్ఆన్ కంచ లంక -
కొత్త బిజినెస్లోకి అంబానీ.. రూ.1200 కోట్ల పెట్టుబడి!
భారతదేశంలోని సంపన్నుల జాబితాలో అగ్రగణ్యుడుగా నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత 'ముఖేష్ అంబానీ' (Mukesh Ambani) మ్యూచువల్ ఫండ్ రంగంలోకి ప్రవేశిస్తారంటూ కొన్ని వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి ముకేశ్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్లాక్రాక్ భాగస్వామ్యంతో మ్యూచువల్ ఫండ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అప్లికేషన్ 'సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా' (SEBI) వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన బ్లాక్రాక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ.. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జాయింట్ వెంచర్ మార్కెట్ కలిగి ఉంది. తాజాగా ఈ రెండు సంస్థలు కలిసి మ్యూచువల్ ఫండ్ విభాగంలో ప్రవేశించడానికి 50:50 ప్రాతిపదికన ఒక్కొక్కరు 150 మిలియన్ డాలర్లు (రూ. 12,48,63,52,500) పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యారు. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలుపై కొత్త సబ్సిడీ.. మహిళలకు అదనపు రాయితీ! జియో, బ్లాక్రాక్ రెండూ కలిసి భారతదేశంలో పెట్టుబడిదారులకు సరసమైన, వినూత్న పెట్టుబడి పరిష్కారాలను అందించే దిశగా అడుగేస్తున్నట్లు రిలయన్స్ గ్రూప్ వెల్లడించింది. మ్యూచువల్ ఫండ్స్ విభాగం జోరుగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో జియో ఫైనాన్షియల్ దీనిపై ద్రుష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. -
గౌతమ్ అదానీకి షాక్.. అంతకంతకూ పెరుగుతున్న ముఖేష్ అంబానీ సంపద!
2023 వ్యాపార వేత్తలకు కలిసి వచ్చిందా? లేదంటే నష్టాల్ని మూటగట్టుకున్నారా? హిండెన్ బర్గ్ రిపోర్ట్తో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఎంత సంపదను కోల్పోయారు?ఆర్ఐఎల్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీస్ డీమెర్జర్ కావడం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి ఎంతమేరకు కలిసి వచ్చింది. వీళ్లిద్దరితో పాటు మిగిలిన వ్యాపార వేత్తలకు ఈ ఏడాది ఎలాంటి ఫలితాల్ని ఇచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన సంపదను అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారు.బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం.. ముఖేష్ అంబానీ ఈ ఏడాది అత్యధికంగా 9.98 బిలియన్ డాలర్ల సంపదను సమకూర్చుకున్నారు. దీంతో ఆయన మొత్తం ఆస్తి విలువ 97.1 బిలియన్ డాలర్లకు చేరింది. ఇక ప్రపచం వ్యాప్తంగా సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ 13వ స్థానంలో కొనసాగుతున్నారు. అంబానీ సంపాదన పెరిగేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ఫైనాన్షియల్ సర్వీస్ షేర్లు రాణించడమే ఇందుకు కారణమని బ్లూంబర్గ్ పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఓ భాగం. అయితే జులై 20, 2023న ఆర్ఐఎల్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీస్ డీమెర్జర్ అయ్యింది. అనంతరం స్టాక్ మార్కెట్లోకి అడుగు పెట్టింది. స్టాక్ మార్కెట్లోని లిస్టింగ్కు ఊహించని స్పందన రావడంతో పాటు రిలయన్స్ షేర్లు సైతం 9 శాతం వృద్దిని నమోదు చేశాయి. ఫలితంగా ముఖేష్ అంబానీ ఈ అరుదైన ఘనతను సాధించారు. అదానీకి అంతగా కలిసిరాలేదు మరో అపరకుబేరుడు అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీకి ఈ ఏడాది అంతగా కలిసి రాలేదంటూ వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా హిండెన్బర్గ్ వంటి నిరాధారమైన నివేదికలతో అదానీ షేర్లు కుప్పకూలాయి. దీంతో 2023లో ఆయన 37.3 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోవాల్సి వచ్చింది. అయినప్పటికీ 83.2 బిలియన్ డాలర్లతో దేశీయ రెండో సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది జనవరి నెలలో అత్యధికంగా 21 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారని నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. సంక్షోభంలోనూ అవకాశాల్ని వెతుకున్న హెచ్సీఎల్ 2023లో ఐటీ కంపెనీలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. అయినప్పటికీ హెచ్సీఎల్ టెక్నాలజీ ఫౌండర్ శివ్ నాడార్ సంపద 9.47 బిలియన్ డాలర్లు పెరిగింది. ఆయన మొత్తం సంపద 34 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. హెచ్సీఎల్ షేరు ధర 41 శాతం పెరిగింది. సాహో సావిత్రి జిందాల్ జిందాల్ గ్రూపు చైర్పర్సన్ సావిత్రి జిందాల్ సంపద కూడా 8.93 బిలియన్ డాలర్లు అందుకొని 24.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంతేకాదు జిందాల్ స్టీల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, జిందాల్ ఎనర్జీ షేర్లు రాణించడంతో మహిళా సంపన్నుల జాబితాలో సావిత్రి జిందాల్ 24.7 బిలియన్ డాలర్లతో కొనసాగుతున్నారు. పరుగులు తీసిన డీఎల్ఎఫ్ షేర్లు రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ షేర్లు స్టాక్ మార్కెట్లో పరుగులు తీశాయి. ప్రీసేల్స్తో పాటు కొత్త కొత్త ప్రాజెక్ట్లు లాంచ్ చేయడం డీఎల్ఎఫ్కు కలిసొచ్చింది. ఆ సంస్థ షేర్లు 91 శాతం వృద్దిని నమోదు చేశాయి. దీంతో ఆ కంపెనీ అధినేత కుషాల్ పాల్ సింగ్ సంపద 7.83 బిలియన్ డాలర్లు పెరిగింది. ఆయన మొత్తం సంపద విలువ 16.1 బిలియన్లకు చేరుకుంది. అదే దారిలో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ సైతం ఇంజినీరింగ్, నిర్మాణ రంగాల్లో 158 ఏళ్లుగా సేవలందిస్తున్న షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ను నియంత్రిస్తున్న షాపూర్ మిస్త్రీ ఈ ఏడాది తన సంపదకు 7.41 బిలియన్ డాలర్లు జోడించారు. ఆయన నికర విలువ ఇప్పుడు 35.2 బిలియన్ డాలర్లు. కుమార్ మంగళం బిర్లాతో పాటు మరింత మంది 2023లో తమ నికర విలువను బాగా పెంచుకున్న ఇతర బిలియనీర్లలో ఆదిత్య బిర్లా గ్రూప్కు చెందిన కుమార్ మంగళం బిర్లా (7.09 బిలియన్ డాలర్లు), రవి జైపురియా (5.91 బిలియన్ డాలర్లు), సన్ ఫార్మా దిలీప్ సంఘ్వి (5.26 బిలియన్ డాలర్లు), లోధా గ్రూప్ మంగళ్ ప్రభాత్ లోధా (3.91 బిలియన్ డాలర్లు), ఎయిర్టెల్ నుంచి సునీల్ మిట్టల్ (3.62 బిలియన్) ఉన్నారు. మరోవైపు ఆదిత్యా బిర్లా గ్రూపు చైర్మన్ కుమార మంగళం బిర్లా సంపద 7.09 బిలియన్ డాలర్లు అధికం కాగా, సన్ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ 5.26 బిలియన్ డాలర్లు, ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్ 3.62 బిలియన్ డాలర్లు పెరిగింది. -
‘నా లక్ష్యం అదే’ : ముఖేష్ అంబానీ
న్యూఢిల్లీ: ఇప్పటివరకు సాధించిన విజయాలతో సంతృప్తి పడి, అలసత్వం వహించబోమని రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ చెప్పారు. డిజిటల్ డేటా ప్లాట్ఫాంలు, కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంలో ప్రపంచ టాప్ 10 వ్యాపార దిగ్గజాల్లో ఒకటిగా ఎదగడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రూప్ వ్యవస్థాపకుడు ధీరుభాయ్ అంబానీ జయంతి సందర్భంగా నిర్వహించే రిలయన్స్ ఫ్యామిలీ డేలో పాల్గొన్న సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. ‘నేడు దేశీయంగా, అంతర్జాతీయంగా వ్యాపార పరిస్థితులు అత్యంత వేగంగా మారిపోతున్నాయి. సాధించిన వాటితో సంతృప్తి చెంది ఆగిపోవడానికి తావు లేదు. రిలయన్స్ ఎప్పటికప్పుడు కొంగొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగుతుంది’ అని అంబానీ చెప్పారు. ‘ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఎకానమీగా ఎదిగేందుకు భారత్ ముందుకు పరుగులు తీస్తున్న నేపథ్యంలో రిలయన్స్ ఎదుట అసాధారణ అవకాశాలు ఉన్నాయి. ప్రపంచంలోనే టాప్ 10 వ్యాపార దిగ్గజాల్లో రిలయన్స్ ఎదగగలదు. తప్పకుండా ఎదుగుతుంది’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం ఉద్యోగులంతా కస్టమర్లకు మరింత విలువ చేకూర్చేలా సేవలందించడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. డిజిటల్ డేటా ప్లాట్ఫామ్లు.. ఏఐ వినియోగంలో గ్లోబల్ లీడర్లలో స్థానాన్ని పటిష్టం చేసుకోవడం, సంస్థాగత సంస్కృతి విషయంలో అంతర్జాతీయ దిగ్గజాల్లో ఒకటిగా ఎదగడం నూతన సంవత్సర తీర్మానాలుగా నిర్దేశించుకోవాలని ఆయన సందేశమిచ్చారు.