Yuzvendra Chahal
-
ట్రెండింగ్ లో చాహల్, ధనశ్రీ.. ఎందుకో తెలుసా (ఫొటోలు)
-
కౌన్సెలింగ్ ఇచ్చినా మారని చాహల్, ధనశ్రీ..
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal), అతడి భార్య ధనశ్రీ వర్మ(Dhanashree Verma) అధికారికంగా విడిపోయినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ విడిపోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరికి ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.విడాకులకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ పూర్తి అయినట్లు వినికడి. గురువారం బాంద్రా కోర్టు బయట చాహల్ కన్పించడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. ఏబీపీ న్యూస్ రిపోర్టు ప్రకారం.. గురువారం ఉదయం చాహల్- ధనశ్రీ విడాకుల కేసు విచారణకు వచ్చింది. ఆ తర్వాత న్యాయమూర్తి ఈ జోడీకి కౌన్సెలింగ్ తీసుకోవాలని సూచించారు. దాదాపు 45 నిమిషాల పాటు కౌన్సిలింగ్ జరిగింది. కౌన్సెలింగ్ సెషన్ తర్వాత ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకుంటున్నారని న్యాయమూర్తికి తెలియజేశారు. దీంతో సాయంత్రం 4.30 గంటలకు వీళ్లకు విడాకులు మంజూరు చేస్తూ కోర్టు తుది తీర్పు వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే తుది విచారణకు ముందు చాహల్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు"దేవుడు నన్ను నేను లెక్కించగలిగే దానికంటే ఎక్కువ సార్లు రక్షించాడు. ఆ సందర్బాలు కూడా నాకు గుర్తులేవు. నేను కష్టాల్లో ప్రతీ సమయంలోనూ దేవుడు నన్ను కాపాడాడు. ఎప్పుడూ నాకు రక్షణగా ఉన్న దేవుడుకి కృతజ్ఞతలు’ అని చాహల్ రాసుకొచ్చాడు."మనం పడే బాధలు, ఎదుర్కొనే సవాళ్లు, ఒత్తడిని కొంతకాలం అనంతరం ఆ దేవుడు ఆశీర్వాదాలుగా మార్చేస్తాడు. మీరు ఈ రోజు ఏదైనా విషయం గురించి ఒత్తిడి, ఆందోళనకు గురైతే మీకు మరో అవకాశం ఉందన్న విషయం తెలుసుకోండి. బాధలను మర్చిపోయి దేవుడిని ప్రార్థించండి.దేవుడిపై మీకున్న విశ్వాసం మీకు మంచి జరిగేలా చేస్తుంది అంటూ ధనశ్రీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ను షేర్ చేసింది. కాగా 2020లో కొవిడ్ లాక్ డౌన్ సమయంలో కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీతో వర్మతో చాహల్కు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో డిసెంబర్ 2020లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.చదవండి: IPL 2025: సన్రైజర్స్ హైదరాబాద్కు గుడ్న్యూస్.. -
యుజ్వేంద్ర చాహల్- ధనశ్రీ విడాకులు.. తాజా పోస్ట్తో క్లారిటీ!
ప్రముఖ కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ ధనశ్రీ వర్మపై గత కొద్ది రోజులుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తన భర్త, టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్తో వివాహ బంధానికి గుడ్ బై చెప్పనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ వార్తలో నేపథ్యంలో ఇటీవల ఆమె చేసిన పోస్టులు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తన బామ్మ, తాతయ్యల ఇంటికెళ్లిన ధనశ్రీ నిజమైన ప్రేమ అంటే ఇదేనంటూ ఫోటోలను షేర్ చేసింది. అంతే చాహల్ సైతం తన భార్యతో దిగిన ఫోటోలను సైతం సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి తొలగించాడు. దీంతో ఈ జంట దాదాపు విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ధనశ్రీ వర్మ చేసిన మరో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ధనశ్రీ ఇన్స్టాగ్రామ్లో రాస్తూ.. "ఒత్తిడి నుంచి ఆశీర్వాదం లభించింది. దేవుడు మన చింతలను, పరీక్షలను ఎలా ఆశీర్వాదాలుగా మార్చగలడనేది ఆశ్చర్యంగా లేదా? మీ జీవితంలో ఏ రోజైనా ఒత్తిడికి గురైతే.. మీకు మరో ఛాయిస్ ఉంటుందని తెలుసుకోండి. మీరు బాధలను అన్నింటినీ ఆ దేవునికి వదిలేయండి. అన్ని విషయాల గురించి కలిసి ఆ దేవుడిని ప్రార్థించండి. దేవుడు మీరు ఉంచిన విశ్వాసం మీకు ఎప్పుడు మంచి చేస్తుంది.' అంటూ ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. అంతేకాకుండా ఇటీవల యుజ్వేంద్ర చాహల్ కూడా ఇన్స్టాగ్రామ్లో భగవంతుడే మనల్ని రక్షిస్తాడంటూ పోస్ట్ను పంచుకున్నారు. నేను లెక్కించగలిగిన దానికంటే ఎక్కువ సార్లు ఆ దేవుడు నన్ను రక్షించాడు.. నాకు తెలియకుండా నాతో ఎల్లప్పుడూ ఉన్నందుకు ధన్యవాదాలు దేవా అంటూ పోస్ట్ చేశారు. తాజా పోస్ట్లతో ధనశ్రీ వర్మ, చాహల్ విడిపోవడం ఖాయమైనట్లేనని తెలుస్తోంది. విడాకులపై అధికారిక ప్రకటన కోసం మాత్రమే ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. వీరిద్దరు డిసెంబర్ 2020లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. -
చాహల్ భార్యకు భరణం రూ.60 కోట్లు!?
టీమిండియా స్టార్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ తన కెరీర్తో పాటు.. తన వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకునేందుకు సిద్దమయ్యాడని గత కొంత కాలంగా ప్రచారం జరగుతోంది.ఇటీవల కాలంలో చాహల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్ట్లు సైతం ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో కూడా చేశారు. చాహల్ అయితే ఏకంగా ఆమె ఫోటోలను కూడా డిలీట్ చేశాడు. దీంతో చాహల్-ధనశ్రీ జంట త్వరలోనే విడాకులు తీసుకోనున్నారని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.ధనశ్రీకి రూ. 60 కోట్లు..?ఈ క్రమంలో తాజాగా వారిద్దరి విడాకులకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర కొడుతోంది. ధనశ్రీకి భరణంగా రూ.60 కోట్లు చెల్లించేందుకు చాహల్ సిద్దమయ్యాడని ఆ వార్త సారాంశం. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా చాహల్ 2020లో కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ జోడీ ఎప్పటికప్పుడు వీడియోలు, డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులను అలరించేవారు. కానీ ఇటీవల కాలంలో ఎవరి జీవితం వారిదే అన్నట్లు ముందుకు వెళ్తున్నారు. కాగా వీరి విడాకులపై వార్తలు రావడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో చాలా సార్లు వారిద్దరూ విడిపోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ వాటిని చాహల్-ధనశ్రీ తీవ్రంగా ఖండిచారు. కానీ ఈసారి మాత్రం వారిద్దరూ విడిపోవడానికి సిద్దంగా ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నారు.తాజాగా ఈ వార్తలపై స్పందించిన ధనశ్రీ.. కొన్ని రోజులుగా ఆధారాలు లేని వార్తలు, ఫేస్ పోస్టులతో తన గౌరవాన్ని తీయడానికి ప్రయత్నిస్తున్నారు. నా మౌనం నా బలహీనతే కాదు అదే నా బలం. కొన్నేళ్లుగా తాను సంపాదించుకున్న పేరును నెగిటివిటీతో తీసేస్తున్నారు. కానీ నిజానికి విలువెక్కువ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. చాహల్ స్పందిస్తూ తమ ప్రైవసీని గౌరవించాలని.. బయటకొస్తున్న వార్తలు నిజాలు కావచ్చు, కాకపోవచ్చు అని చెప్పుకొచ్చాడు.చదవండి: సౌతాఫ్రికా దిగ్గజం సంచలన నిర్ణయం.. 13 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు -
చరిత్ర సృష్టించిన అర్ష్దీప్ సింగ్..
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా అర్ష్దీప్ రికార్డులకెక్కాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టీ20లో బెన్ డకెట్ను ఔట్ చేసిన అర్ష్దీప్.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.ఇప్పటివరకు 61 టీ20 మ్యాచ్లు ఆడిన అర్ష్దీప్.. 97 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పేరిట ఉండేది. చాహల్ 80 మ్యాచ్ల్లో 96 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్తో చాహల్ రికార్డును సింగ్ బ్రేక్ చేశాడు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్కు అర్ష్దీప్ అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. తొలి ఓవర్లోనే విధ్వంసర ఆటగాడు ఫిల్ సాల్ట్ను పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత మూడో ఓవర్లో బెన్ డకెట్ను ఔట్ చేశాడు. ఈ పంజాబీ పేసర్ గత కొంత కాలంగా టీ20ల్లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ క్రమంలోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు అర్ష్దీప్ ఎంపికయ్యాడు. మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాతో కలిసి అర్ష్దీప్ బంతిని పంచుకోనున్నాడు.టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు వీరే..97 వికెట్లు - అర్ష్దీప్ సింగ్ (61 మ్యాచ్లు)96 వికెట్లు - యుజ్వేంద్ర చాహల్ (80 మ్యాచ్లు)90 వికెట్లు - భువనేశ్వర్ కుమార్ (87 మ్యాచ్లు)89 వికెట్లు - జస్ప్రీత్ బుమ్రా (70 మ్యాచ్లు)89 వికెట్లు - హార్దిక్ పాండ్యా(110 మ్యాచ్లు)తుది జట్లుభారత్: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్ఇంగ్లండ్: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టతెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్చదవండి: BCCI: టీమిండియా జెర్సీలపై పాకిస్తాన్ పేరు.. డ్రెస్ కోడ్ ఫాలో అవుతాం: బీసీసీఐ -
‘అతడి ఖేల్ ఖతం.. ఇకపై టీమిండియాలో చోటు ఉండదు’
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎంపిక చేసిన జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) స్పందించాడు. స్పిన్, పేస్ బౌలర్ల విషయంలో సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థించాడు. ఏళ్లకు ఏళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నవారిని.. ఎంపిక చేయకపోవడమే ఉత్తమమని పేర్కొన్నాడు.లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ అధ్యాయం ఇక్కడితో ముగిసిపోయిందన్న ఆకాశ్ చోప్రా.. ‘స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ఖేల్ కూడా ఖతమైందని అభిప్రాయపడ్డాడు. కాగా 2017లో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించింది. నాడు ఫైనల్లో టీమిండియాను ఓడించి విజేతగా నిలిచిన పాకిస్తాన్(India vs Pakistan).. తాజాగా నిర్వహించబోతున్న మెగా టోర్నీ ఆతిథ్య హక్కులు దక్కించుకుంది.కుల్దీప్ యాదవ్ వైపు మొగ్గుఅయితే, భద్రతా కారణాల వల్ల టీమిండియా మాత్రం తమ మ్యాచ్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఆడనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ శనివారం చాంపియన్స్ ట్రోఫీకి తమ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో ఈ ఐసీసీ ఈవెంట్లో పాల్గొనే టీమ్లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్తో పాటు.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ చోటు దక్కించుకున్నారు.మరోవైపు.. పేస్ దళంలో నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు.. మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో యజువేంద్ర చహల్, భువనేశ్వర్ కుమార్లకు అన్యాయం జరిగిందంటూ వారి అభిమానులు సెలక్టర్ల తీరును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘యుజీ చహల్ విషయం కాస్త ప్రత్యేకమైనదే.అతడి కథ ముగిసిపోయింది2023 జనవరిలో అతడు చివరగా ఆడాడు. దాదాపు రెండేళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇక భువీ.. 10 మ్యాచ్లలో అతడి ప్రదర్శన చూసిన తర్వాత అతడిపై సెలక్టర్లు వేటు వేశారు. అయితే, యువీ గణాంకాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. నిలకడగా వికెట్లు తీశాడు కూడా. కాకపోతే.. ఈ టోర్నీ రేసులో అతడు వెనుకబడిపోయాడు.ఇక్కడితో అతడి కథ పూర్తిగా ముగిసిపోయినట్లే. అతడి ఫైల్ క్లోజ్ అయిపోయింది. కానీ సెలక్టర్లు ఇలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదు. నిజానికి రెండేళ్ల క్రితమే అతడి పనైపోయింది. అందుకే సెలక్టర్లు బహుశా మళ్లీ జట్టులో చోటు ఇవ్వలేదు. ఒకవేళ అతడిని ఎంపిక చేసి ఉంటే.. అది తిరోగమనానికి సూచిక అయ్యేది.భువీని ఎలా సెలక్ట్ చేస్తారు?ఇక భువీ మూడేళ్ల క్రితం చివరగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. అసలు వన్డే ఫార్మాట్లో చాలాకాలంగా జట్టులోనే లేడు. మరి అలాంటి ఆటగాడిని అకస్మాత్తుగా మెగా టోర్నీ కోసం పిలిపిస్తే.. ఇప్పుడు సెలక్టర్లను తిడుతున్న వారే.. అతడిని ఎంపిక చేసినా.. ఇదేం తీరు అని ప్రశ్నించేవారు’’ అని పేర్కొన్నాడు. ఏదేమైనా యుజీ, భువీలు ఇక భారత జట్టులో చోటు దక్కించుకోలేరని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి.చదవండి: కరుణ్ నాయర్ను ఎలా సెలక్ట్ చేయగలం?: అగార్కర్ -
అవన్నీ నిజం కాకపోవచ్చు: ఎట్టకేలకు మౌనం వీడిన చహల్
టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. అతడి వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక వదంతులు వ్యాప్తిలోకి వచ్చాయి. భార్య ధనశ్రీ వర్మ(Dhanashree Verma)తో చహల్కు విభేదాలు తలెత్తాయని.. త్వరలోనే ఈ జంట విడిపోనుందనేది(Divorce Rumours) వాటి సారాంశం. అందుకు చహల్ సోషల్ మీడియా పోస్టులు ఊతమిచ్చాయి.పెళ్లి ఫొటోలు డిలీట్సతీమణి ధనశ్రీతో ఉన్న ఫొటోలన్నింటినీ యజువేంద్ర చహల్(Yuzvendra Chahal) డిలీట్ చేశాడు. పెళ్లి ఫొటోలను కూడా తన అకౌంట్ల నుంచి తీసేశాడు. అంతేకాదు.. ఈ దంపతులు సామాజిక మాధ్యమాల్లో ఒకరినొకరు అన్ఫాలో చేశారు. అయితే, ధనశ్రీ ఇన్స్టా ఖాతాలో మాత్రం చహల్తో దిగిన ఫొటోలు అలాగే ఉన్నాయి.కాగా ధనశ్రీ చహల్ను మోసం చేస్తోందంటూ అప్పట్లో రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే. మరో టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ పేరుతో ఆమె పేరును ముడిపెట్టి దారుణమైన కామెంట్లు, మీమ్స్ చేశారు కొంతమంది నెటిజన్లు. మరోవైపు.. చహల్ ఇటీవల ఓ పెళ్లికి మరో అమ్మాయితో కలిసి హాజరైనట్లు ఫొటోలు బయటకు వచ్చాయి.ఆర్జేతో డేటింగ్?అంతేకాదు.. మహ్వశ్ అనే రేడియో జాకీతో కలిసి చహల్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలు కూడా వైరల్గా మారాయి. వీటికి మహ్వశ్ ఫ్యామిలీ అనే ట్యాగ్ జతచేయడంతో చహల్తో ఆమె డేటింగ్ చేస్తుందనే వదంతులు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో చహల్ కూడా ధనశ్రీకి ద్రోహం చేశాడని.. దొందూ దొందేనంటూ ఈ జంటపై విమర్శల వర్షం కురుస్తోంది.ఈ పరిణామాలపై యజువేంద్ర చహల్ ఎట్టకేలకు మౌనం వీడాడు. ‘‘మీ ప్రేమ, మద్దతు వల్లే నేను ఈస్థాయికి చేరుకోగలిగాను. అందుకు నా అభిమానులందరికీ ఎల్లకాలం రుణపడి ఉంటాను. అయితే, ఇప్పటికి ఈ ప్రయాణం ఈ ముగిసిందా?.. లేదు.. నేను వేయాల్సిన ఓవర్లు ఇంకా మిగిలే ఉన్నాయి. నా దేశం కోసం.. నా జట్టు కోసం.. నా అభిమానుల కోసం నేను ఆడుతూనే ఉంటాను.నిజం కావచ్చు.. కాకపోవచ్చు కూడా!దేశానికి ప్రాతినిథ్యం వహించే ఆటగాడిగా ఉండటం నాకెంతో గర్వకారణం. అదే విధంగా.. నేను ఓ కొడుకుని, ఒకరికి సోదరుడిని.. అలాగే చాలా మందికి స్నేహితుడిని. ఈ మధ్యకాలంలో నా వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలపై చాలా మందికి ఆసక్తి కలిగించడం సహజమే. అయితే, కొన్ని సోషల్ మీడియా పోస్టుల వల్ల పుడుతున్న వార్తలు నిజం కావచ్చు.. కాకపోవచ్చు కూడా!అందరూ బాగుండాలిఓ కొడుకుగా.. సోదరుడిగా, స్నేహితుడిగా.. మీ అందరికీ ఓ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి వదంతులు నా కుటుంబ దుఃఖానికి కారణమవుతున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. ఎదుటివారికి అంతా మంచే జరగాలని కోరుకునేలా నా కుటుంబం నాకు విలువలు నేర్పించింది. అదే విధంగా.. అడ్డదారుల్లో వెళ్లకుండా.. అంకిత భావం, కఠిన శ్రమతోనే విజయాన్ని అందుకోవాలని చెప్పింది. నేను ఇప్పటికీ ఆ విలువలకే కట్టుబడి ఉన్నాను.ఆ దేవుడి దయ వల్ల మీ అందరి ప్రేమ, మద్దతు ఎల్లప్పుడూ నాతోనే ఉండాలి. కానీ మీ సానుభూతిని భరించలేను. లవ్ యూ ఆల్’’ అని చహల్ ఇన్స్టా స్టోరీలో సుదీర్ఘ పోస్ట్ షేర్ చేశాడు. అయితే, ఇందులో ఎక్కడా ధనశ్రీ పేరుగానీ, భర్త అనే పదం కానీ అతడు వాడలేదు. కాబట్టి విడాకుల విషయాన్ని చెప్పకనే చెప్పాడంటూ మరోసారి గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు.డాన్స్ టీచర్తో ప్రేమలో పడికాగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ కొరియోగ్రాఫర్, యూట్యూబర్ అయిన ధనశ్రీ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో ధనశ్రీ వద్ద డాన్స్ నేర్చుకునే క్రమంలో ఆమెతో ప్రేమల్లో పడ్డ చహల్.. ఇరు కుటుంబాల సమ్మతంతో 2020, డిసెంబరు 20న ఆమెను వివాహం చేసుకున్నాడు.ఇదిలా ఉంటే.. టీమిండియా తరఫున 2016లో అరంగేట్రం చేసిన చహల్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో స్పిన్నర్గా సత్తా చాటాడు. ఇప్పటి వరకు 72 వన్డేల్లో 121, 80 అంతర్జాతీయ టీ20లలో 96 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లోనూ 205 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. వచ్చే ఏడాది అతడు పంజాబ్ కింగ్స్కు ఆడనున్నాడు. చదవండి: వన్డే సిరీస్ నుంచి అతడికి విశ్రాంతి! -
నా మౌనం బలహీనతకు సంకేతం కాదు: చాహల్ సతీమణి
భారత స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ (Dhanashree Verma) విడాకులకు సిద్ధమవుతున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె పలుమార్లు పరోక్షంగా పోస్టులు పెడుతూనే ఉంది. అయితే, తాజాగా చేసిన పోస్ట్ వైరల్గా మారింది. విడాకుల నేపథ్యంపై ప్రచారం మొదలైన సందర్భం నుంచి ఆమెపై ఎక్కువగా ట్రోల్స్ వస్తున్నాయి. వాటి వల్ల తాను చాలా వేదనకు గురౌతున్నట్లు ఆమె పేర్కొంది.'గత కొన్ని రోజులుగా నా కుటుంబంతో పాటు నేను కూడా చాలా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాను. నా కుటుంబంపై కొందరు నిరాధారమైన వార్తలు రాస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా నాపై ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ట్రోల్స్ చేస్తూ నా ప్రతిష్టను కొందరు పూర్తిగా నాశనం చేస్తున్నారు. నేను చాలా కలత చెందుతున్నాను. నేను ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డాను. నా మౌనం బలహీనతకు సంకేతం కాదు. సోషల్మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం చాలా సులభం. ఇలాంటి సమయంలో కూడా ఇతరులపై కరుణ చూపాలంటే ధైర్యం చాలా అవసరం. నిజం తప్పకుండా గెలుస్తోంది. నేను ఏ విషయంలోనూ సమర్థించుకోను' అని ఆమె తెలిపారు. (ఇదీ చదవండి: 'పుష్ప2' మేకింగ్ వీడియో.. బెంగాల్లో బన్నీ ఆల్ టైమ్ రికార్డ్)2020 డిసెంబర్లో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ విడిపోతున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. 2022లో తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ‘చాహల్’ (Yuzvendra Chahal) పేరును ధనశ్రీ తొలగించింది. అప్పుడు కూడా ఇలాంటి వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ముంబయికి చెందిన దంత వైద్యురాలు అయిన ధనశ్రీ మంచి కొరియోగ్రాఫర్ కూడా. ఓ డ్యాన్స్ రియాలిటీ షోలోనూ ఆమె పోటీపడింది. తనకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో ఆమె డ్యాన్స్ వీడియోలకు మిలియన్ కొద్ది వ్యూస్ వస్తుంటాయి. స్వతహాగా డ్యాన్సర్ అయిన ధనశ్రీ వర్మ.. పలు ఆల్బమ్ సాంగ్స్తో చాలా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమెకు సినిమా ఛాన్స్ దక్కింది. తెలుగులో 'ఆకాశం దాటి వస్తావా' అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీస్తున్న ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్.. హీరోగా పరిచయమవుతున్నాడు. -
గ్లామర్లో హీరోయిన్లకు పోటీ ఇస్తున్న ధనశ్రీ వైరల్ ఫొటోలు
-
IPL 2025: వేలంలో చహల్కు కళ్లు చెదిరే ధర.. జాక్పాట్ కొట్టేశాడు
టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఐపీఎల్ మెగా వేలం-2025లో జాక్పాట్ కొట్టాడు. ఏకంగా రూ. 18 కోట్లు కొల్లగొట్టాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చహల్ కొనసాగుతున్నాడు.ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించిన చహల్.. ఏకంగా 205 వికెట్లు కూల్చాడు. తద్వారా ఇప్పటికీ లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు.ఇక ఐపీఎల్-2024లో రాజస్తాన్కు ఆడిన చహల్ 18 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, వేలానికి ముందు రాజస్తాన్ అతడిని వదిలేయగా.. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు.ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఆదివారం జరిగిన మొదటి సెట్వేలంలో చహల్ కోసం.. గుజరాత్ తొలుత బిడ్ వేసింది. ఈ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పోటీలో దిగింది. అయితే, ధర రూ. 15 కోట్లు దాటిన తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ పోటీలోకి వచ్చింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రంగంలోకి దిగింది. ఆ తర్వాత ఊహించినవిధంగా.. పంజాబ్ కింగ్స్ రేసులోకి వచ్చి ధరను రూ. 18 కోట్లకు పెంచింది. దీంతో సన్ రైజర్స్తప్పుకోగా.. పంజాబ్ చహల్ను దక్కించుకుంది.చదవండి: Rishabh Pant: అయ్యర్ రికార్డు బ్రేక్.. కోట్లు కొల్లగొట్టిన పంత్! లక్నో సొంతం -
చహల్ కోసం పోటా పోటీ.. రూ.12 కోట్లకు కొనుక్కున్న ఆర్సీబీ!?
ఐపీఎల్-2025 మెగా వేలానికి కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉంది. నవంబర్ 24, 25వ తేదీలలో జెడ్డా వేదికగా ఈ మెగా ఆక్షన్ జరగనుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా ఫ్రాంచైజీలు దృష్టి సారించాయి.ఈ మెగా వేలం కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తమ ఆరాధ్య క్రికెటర్లను ఏ ఫ్రాంచైజీ దక్కుంచుకుంటుందోనని ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. తాజాగా టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ కోసం ఫ్యాన్స్ ఆన్లైన్లో మాక్ వేలం నిర్వహించారు. ఈ మెగా వేలం కోసం చహల్ తన కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీంతో రూ. 2 కోట్ల బిడ్డింగ్ నుంచే మాక్ వేలం ప్రారంభమైంది. ఈ క్రమంలో చాహల్ కోసం తొలుత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్,గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. అయితే రూ.9 కోట్లకు పైగా ఆర్సీబీ వెచ్చించేందుకు సిద్దం కావడంతో పోటీ నుంచి పంజాబ్, గుజరాత్ తప్పుకొన్నాయి. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పోటీలోకి వచ్చింది. చహల్ కోసం రూ. 11.5 కోట్లకు బిడ్ వేసింది. ఆఖరికి ఈ మాక్ వేలంలో చాహల్ను రూ. 12 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. చహల్ ఐపీఎల్ జర్నీ ఇదే.. చహల్ 2013లో ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అతడు ఆర్సీబీకి 8 సీజన్ల పాటు ప్రాతినిథ్యం వహించాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి ఎన్నో అద్బుత విజయాలు అందించాడు. కానీ ఆర్సీబీ ఫ్రాంచైజీ మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తూ ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన అతడిని రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. రాజస్తాన్ తరపున తొలి సీజన్లోనే పర్పుల్ క్యాప్ను చహల్ గెలుచుకున్నాడు. ఇప్పుడు రాజస్తాన్ కూడా చహల్ మెగా వేలంలోకి విడిచిపెట్టింది. ఈ మెగా వేలంలో చహల్ను ఆర్సీబీ మళ్లీ సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. కాగా చహల్ ప్రస్తుతం ఐపీఎల్లో లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. ఈ క్యాష్రిచ్ లీగ్లో ఇప్పటివరకు 155 మ్యాచ్లు ఆడిన చహల్.. 22.12 సగటుతో 200 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా టీమిండియా తరఫున టీ20లలో అత్యధిక వికెట్ల(96) వీరుడిగానూ ఉన్నాడుచదవండి: NPL 2024: మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్న శిఖర్ ధావన్.. -
ప్రొఫెషనల్ బ్యాటర్లా మారిన చహల్
టీమిండియా ఆటగాడు యుజ్వేంద్ర చహల్ బౌలర్గా అందరికీ సుపరిచితుడు. అయితే ఇతనిలో ఓ బ్యాటర్ దాగి ఉన్నాడన్న విషయం ఇప్పుడిప్పుడే బయటి ప్రపంచానికి తెలుస్తుంది. బక్క పలచని శరీరాకృతి కలిగిన చహల్ ప్రస్తుతం జరుగుతున్న రంజీ సీజన్లో సుదీర్ఘ ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. ఇది చూసి అతని అభిమానులు ఔరా అంటున్నారు. ఇటీవల ఉత్తర్ప్రదేశ్తో జరిగిన రంజీ మ్యాచ్లో చహల్ 152 బంతులు ఎదుర్కొని 48 పరుగులు చేశాడు. తాజాగా మధ్యప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో 142 బంతులు ఎదుర్కొని 27 పరుగులు చేశాడు. వేదిక ఏదైనా ఎప్పుడూ ఇంతటి సుదీర్ఘ ఇన్నింగ్స్లు ఆడని చహల్ ఒక్కసారిగా ప్రొఫెషనల్ బ్యాటర్లా మారిపోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. టీమిండియాకు నయా ఆల్రౌండర్ దొరికాడంటూ కామెంట్లు చేస్తున్నారు.కాగా, రంజీల్లో హర్యానాను ప్రాతినిథ్యం వహించే చహల్ తాజాగా మధ్యప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో ఓ మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. పదో నంబర్ బ్యాటర్గా బరిలోకి దిగిన చహల్.. తొమ్మిదో నంబర్ ఆటగాడు హర్షల్ పటేల్తో (72 నాటౌట్) కలిసి దాదాపు 300 బంతులు ఎదుర్కొన్నాడు. హర్షల్, చహల్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడటంతో మధ్యప్రదేశ్పై హర్యానా పైచేయి సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 308 పరుగులు చేయగా.. హర్యానా తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి హర్యానా 123 ఆధిక్యంలో ఉంది. హర్షల్ పటేల్తో పాటు అమన్ కుమార్ (4) క్రీజ్లో ఉన్నాడు. -
భారత టెస్టు జట్టులోకి రావడమే నా లక్ష్యం: చాహల్
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సత్తాచాటిన సంగతి తెలిసిందే. కౌంటీ క్రికెట్ డివిజన్ IIలో నార్తాంప్టన్షైర్ ప్రాతినిథ్యం వహించిన చాహల్.. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.ఈ ఇంగ్లండ్ దేశీవాళీ టోర్నీలో కేవలం 4 మ్యాచ్లు మాత్రడే ఆడిన చాహల్ ఏకంగా 19 వికెట్లు పడగొట్టాడు. అందులో రెండు ఫైవ్ వికెట్ల హాల్స్ కూడా ఉన్నాయి. అయితే తాజాగా ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్ మాట్లాడుతూ.. భారత తరపున టెస్టు క్రికెట్ ఆడాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాది జూన్లో ఇంగ్లండ్తో జరగనున్న టెస్టు సిరీస్ కోసం రేసులో ఉండాలని చాహల్ భావిస్తున్నాడు.కౌంటీ క్రికెట్ ఆడటం చాలా కష్టం. నా స్కిల్స్ను మరింత మెరుగుపరుచుకోవడం కోసం నాకు మంచి అవకాశం లభించింది. వచ్చే ఏడాది భారత్ ఇంగ్లండ్లో పర్యటించనున్న నేపథ్యంలో రెడ్బాల్తో నా సత్తా ఎంటో సెలక్టర్లకు తెలియజేయాలనకున్నాను. నాకు కౌంటీ క్రికెట్లో ఆడే అవకాశాన్ని కల్పించిన బ్రిండన్ సర్కి ధన్యవాదాలు. ఆపై రాజస్తాన్ రాయల్స్ కోచ్లు సైతం నాకు ఎంతో సహాయం చేశారు. భారత టెస్టు జట్టులోకి రావడమే నా లక్ష్యమని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్ పేర్కొన్నాడు. -
‘మరో ఏడాది.. మరింత అద్భుతంగా’: భార్యకు భారత క్రికెటర్ విషెస్(ఫొటోలు)
-
ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీస్తున్న చహల్.. తాజాగా మరో మ్యాచ్లో..!
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీస్తున్నాడు. కౌంటీ క్రికెట్లో చహల్ చెలరేగిపోతున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్లో భాగంగా నార్తంప్టన్షైర్కు ప్రాతినిథ్యం వహిస్తున్న చహల్.. లీసెస్టర్షైర్తో జరుగుతున్న మ్యాచ్లో నాలుగు వికెట్లతో (తొలి ఇన్నింగ్స్లో) సత్తా చాటాడు. ఈ మ్యాచ్కు ముందు డెర్బిషైర్తో జరిగిన మ్యాచ్లో తొమ్మిది వికెట్లతో (తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన చహల్, సెకెండ్ ఇన్నింగ్స్లో నాలుగు) మెరిశాడు.అంతకుముందు ఇంగ్లండ్ వన్డే కప్లోనూ చహల్ చెలరేగాడు. నార్తంప్టన్షైర్ తరఫున తన తొలి మ్యాచ్లోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఆ మ్యాచ్లో చహల్ తన కోటా 10 ఓవర్లలో ఐదు మెయిడిన్లు వేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చహల్ రాకతో నార్తంప్టన్షైర్ ఫేట్ మారిపోయింది. ఆ జట్టు వరుస విజయాలు సాధిస్తుంది. చహల్ నార్తంప్టన్షైర్ తరఫున ఫార్మాట్లకతీతంగా సత్తా చాటుతున్నాడు. కాగా, చహల్ టీమిండియా తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడుతున్న విషయం తెలిసిందే.మ్యాచ్ విషయానికొస్తే.. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2 మ్యాచ్ల్లో భాగంగా లీసస్టర్షైర్తో జరుగుతున్న మ్యాచ్లో నార్తంప్టన్షైర్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించారు. చహల్తో పాటు రాబ్ కియోగ్ (3/20), జాక్ వైట్ (2/16), సాండర్సన్ (1/32) సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన లీసెస్టర్షైర్ తొలి ఇన్నింగ్స్లో 203 పరుగులకు ఆలౌటైంది. లీసెస్టర్ ఇన్నింగ్స్లో బుడింగర్ (56) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. హిల్ (32), రెహాన్ అహ్మద్ (30) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్తంప్టన్షైర్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఆ జట్టు లీసెస్టర్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 69 పరుగులు వెనుకపడి ఉంది. చదవండి: భారత్పై అక్కసు తీర్చుకున్న పాక్ హాకీ జట్టు! -
తొమ్మిది వికెట్లు తీసిన చహల్
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ సత్తా చాటాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2 పోటీల్లో నార్తంప్టన్షైర్కు ప్రాతనిథ్యం వహిస్తున్న చహల్.. డెర్బిషైర్తో జరిగిన మ్యాచ్లో తొమ్మిది వికెట్లతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన చహల్, సెకెండ్ ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న నార్తంప్టన్షైర్ డెర్బీషైర్పై 133 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్తంప్టన్షైర్ 219 పరుగులకు ఆలౌటైంది. సైఫ్ జైబ్ (90) సెంచరీ చేజార్చుకోగా.. జస్టిన్ బ్రాడ్ (45) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. డెర్బీషైర్ బౌలర్లలో జాక్ చాపల్, ఆండర్సన్, జాక్ మార్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హ్యారీ మూర్, రీస్, థాంప్సన్, లాయిడ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన డెర్బీషైర్.. చహల్ (5/45), రాబ్ కియోగ్ (3/65), సాండర్సన్ (1/17), జస్టిన్ బ్రాడ్ (1/16) సత్తా చాటడంతో 165 పరుగులకు ఆలౌటైంది. డెర్బీషైర్ ఇన్నింగ్స్లో రీస్ (50), మాడ్సన్ (47), గెస్ట్(28), డొనాల్డ్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.211 పరుగులకు ఆలౌటైన నార్తంప్టన్షైర్54 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్తంప్టన్షైర్ 211 పరుగులకు ఆలౌటైంది. రాబ్ కియోగ్ (63) అర్ద సెంచరీతో రాణించాడు. డెర్బీ బౌలర్లలో ఆండర్సన్, జాక్ మార్లీ చెరో 3, హ్యారీ మూర్ 2, జాక్ చాపెల్, థాంప్సన్ తలో వికెట్ పడగొట్టారు.టార్గెట్ 266266 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డెర్బీషైర్ను రాబ్ కియోగ్ (5/44), చహల్ (4/54) మరోసారి దెబ్బకొట్టారు. వీరి ధాటికి డెర్బీషైర్ 132 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. డెర్బీషైర్ ఇన్నింగ్స్లో వేన్ మాడ్సన్ (48 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు.రెండు ఇన్నింగ్స్ల్లో విఫలమైన పృథ్వీ షాఈ మ్యాచ్లో నార్తంప్టన్షైర్ ఓపెనర్గా బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్ పృథ్వీ షా రెండు ఇన్నింగ్స్లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో నాలుగు పరుగులు చేసిన షా.. రెండో ఇన్నింగ్స్లో రెండు పరుగులకు ఔటయ్యాడు.చదవండి: ఐదేసిన చహల్ -
ఐదేసిన చహల్
కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2 పోటీల్లో భాగంగా డెర్బీషైర్తో జరుగుతున్న మ్యాచ్లో నార్తంప్టన్షైర్కు ప్రాతినిథ్యం వహిస్తున్న టీమిండియా బౌలర్ యుజ్వేంద్ర చహల్ ఐదు వికెట్ల ఘనతతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో చహల్ ఈ ఫీట్ను సాధించాడు. చహల్తో పాటు రాబ్ కియోగ్ (3/65), సాండర్సన్ (1/17), జస్టిన్ బ్రాడ్ (1/16) వికెట్లు తీయడంతో డెర్బీషైర్ తొలి ఇన్నింగ్స్లో 165 పరుగులకు ఆలౌటైంది. డెర్బీషైర్ ఇన్నింగ్స్లో రీస్ (50), మాడ్సన్ (47), గెస్ట్(28), డొనాల్డ్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.FIVE-WICKET HAUL FOR YUZI CHAHAL...!!!! 👌Chahal took 5 wickets for 45 runs in County against Derbyshire, What a spell by the Champion of India. pic.twitter.com/1IzH2xow0W— Johns. (@CricCrazyJohns) September 10, 2024అంతకుముందు నార్తంప్టన్షైర్ తొలి ఇన్నింగ్స్లో 219 పరుగులకు ఆలౌటైంది. సైఫ్ జైబ్ (90) సెంచరీ చేజార్చుకోగా.. జస్టిన్ బ్రాడ్ (45) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. డెర్బీషైర్ బౌలర్లలో జాక్ చాపల్, ఆండర్సన్, జాక్ మార్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హ్యారీ మూర్, రీస్, థాంప్సన్, లాయిడ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.రెండు ఇన్నింగ్స్ల్లో ఫెయిల్ అయిన పృథ్వీ షాఈ మ్యాచ్లో నార్తంప్టన్షైర్ ఓపెనర్గా బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్ పృథ్వీ షా రెండు ఇన్నింగ్స్లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో నాలుగు పరుగులు చేసిన షా.. రెండో ఇన్నింగ్స్లో రెండు పరుగులకు ఔటయ్యాడు. ఆట రెండో రోజు రెండో సెషన్ సమయానికి నార్తంప్టన్షైర్ సెకెండ్ ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది. షా, ప్రాక్టర్ (2) ఔట్ కాగా.. గస్ మిల్లర్ (15), జేమ్స్ సేల్స్ (7) క్రీజ్లో ఉన్నారు.అరంగేట్రంలోనూ ఐదేసిన చహల్చహల్ గత నెలలో జరిగిన ఇంగ్లండ్ వన్డే కప్లోనూ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. నార్తంప్టన్షైర్ తరఫున తన తొలి మ్యాచ్లో కెంట్పై ఈ ఫీట్ను సాధించాడు. ఆ మ్యాచ్లో చహల్ తన కోటా 10 ఓవర్లలో ఐదు మెయిడిన్లు వేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఫలితంగా తన జట్టు కెంట్పై ఘన విజయం సాధించింది. చహల్ టీమిండియా తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడుతున్న విషయం తెలిసిందే. -
చహల్ మాయాజాలం.. తొలి మ్యాచ్లోనే ఐదు వికెట్లు
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ చెలరేగిపోయాడు. ఇంగ్లండ్ డొమెస్టిక్ వన్డే కప్లో నార్తంప్టన్షైర్కు ప్రాతినిథ్యం వహిస్తున్న చహల్.. ఈ కౌంటీ తరఫున ఆడిన తొలి మ్యాచ్లో ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. కెంట్తో ఇవాళ (ఆగస్ట్ 14) జరిగిన మ్యాచ్లో చహల్ ఈ ఘనత సాధించాడు. చహల్ మాయాజాలం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన కెంట్ 35.1 ఓవర్లలో 82 పరుగులకు కుప్పకూలింది. చహల్ 10 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఐదు మెయిడిన్ ఓవర్లు ఉండటం విశేషం. చహల్తో పాటు జస్టిన్ బ్రాడ్ (6.1-1-16-3), లూక్ ప్రోక్టర్ (10-2-25-2) కూడా రాణించడంతో కెంట్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆ జట్టు తరఫున జేడెన్ డెన్లీ (22), ఏకాంశ్ సింగ్ (10), మ్యాట్ పార్కిన్సన్ (17 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. YUZI CHAHAL SHOW: 10-5-14-5. ⭐ pic.twitter.com/byxSVc404X— Mufaddal Vohra (@mufaddal_vohra) August 14, 2024అనంతర 83 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నార్తంప్టన్షైర్ 14 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. పృథ్వీ షా 17 పరుగులు చేసి ఔట్ కాగా.. జేమ్స్ సేల్స్ 33, జార్జ్ బార్లెట్ 31 పరుగులతో అజేయంగా నిలిచారు. బేయర్స్ స్వేన్పోయెల్కు పృథ్వీ షా వికెట్ దక్కింది. కాగా, చహల్ ఈ మ్యాచ్తో పాటు ఐదు కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్లు ఆడేందుకు నార్తంప్టన్షైర్తో ఒప్పందం చేసుకున్నాడు. నార్తంప్టన్షైర్ ఈ మ్యాచ్లో గెలిచినా క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించలేదు. ఇంగ్లండ్ డొమెస్టిక్ వన్డే కప్లో గ్రూప్ దశ మ్యాచ్లు ఇవాల్టితో ముగుస్తాయి. ఆగస్ట్ 16న క్వార్టర్ ఫైనల్స్, 18న సెమీస్, సెప్టెంబర్ 22న ఫైనల్ మ్యాచ్లు జరుగనున్నాయి. -
చహల్కు విషెస్.. నీ బిగ్గెస్ట్ చీర్ లీడర్ నేనే అంటున్న భార్య (ఫొటోలు)
-
కళ్లు చెదిరే అందం.. టీమిండియా స్టార్ భార్య ఫొటోలు వైరల్
-
RR Vs SRH: చాహల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్స్లు సమర్పించుకున్న బౌలర్గా చెత్త రికార్డును చాహల్ నెలకొల్పాడు. ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో క్వాలిఫయర్-2లో రెండు సిక్స్లు ఇచ్చిన చాహల్.. ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో చాహల్ ఇప్పటివరకు 224 సిక్స్లు ఇచ్చాడు. ఇంతుకుముందు ఈ రికార్డు భారత మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా(222) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో చావ్లాను చాహల్ అధిగమించాడు. ఇక కీలక మ్యాచ్లో చాహల్ నిరాశపరిచాడు. తన నాలుగు ఓవర్లలో కోటాలో వికెట్లు ఏమీ తీయకుండా 34 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(50) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రాహుల్ త్రిపాఠి(37), హెడ్(34) పరుగులతో కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఇక రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ రెండు వికెట్లు సాధించాడు. -
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీమిండియా స్పిన్నర్, రాజస్తాన్ రాయల్స్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్(అంతర్జాతీయ క్రికెట్, లీగ్లు)లో 350 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి భారత బౌలర్గా చాహల్ రికార్డులకెక్కాడు.ఐపీఎల్-2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో రిషబ్ పంత్ను ఔట్ చేసిన చాహల్.. ఈ అరుదైన ఫీట్ను తన పేరిట లిఖించుకున్నాడు. చాహల్ ఇప్పటివరకు 350 వికెట్లు పడగొట్టాడు. చాహల్ తర్వాత స్ధానంలో భారత మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా 310 వికెట్లతో ఉన్నాడు.ఇక ఐపీఎల్లో సైతం అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా చాహల్(201) కొనసాగుతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్లు జెక్ ఫ్రెజర్ మెక్ గర్క్(20 బంతుల్లో 50), అభిషేర్ పోరెల్(65) అదరగొట్టారు. వీరిద్దరితో పాటు ఆఖరిలో ట్రిస్టన్ స్టబ్స్ మెరుపులు మెరిపించాడు.20 బంతులు ఎదుర్కొన్న స్టబ్స్.. 3 ఫోర్లు, 3 సిక్స్లతో 41 పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మూడువికెట్లు పడగొట్టగా.. చాహల్, బౌల్ట్, సందీప్ శర్మ తలా వికెట్ సాధించారు. -
IPL 2024: భర్తను చీర్ చేసేందుకు వచ్చిన ధనశ్రీ వర్మ.. లేటెస్ట్ పిక్స్
-
నేనొక ఫైటర్.. వెనకడుగు వేయను: ధనశ్రీ వర్మ
టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తన భర్త చాహల్తో కలిసి వీడియోలు, రీల్స్ చేస్తూ ఫ్యాన్స్ను అలరిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ధనశ్రీ తను చేసిన ఓ పని వల్ల విపరీతమైన ట్రోల్స్కు గురైంది. ధనశ్రీ.. హిందీ పాపులర్ డ్యాన్స్ షో జలక్ దికలాజాలో కంటెస్టెంట్గా బరిలోకి దిగింది. ఈ షో ఫైనల్ సందర్భంగా కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉతేకర్తో ధనశ్రీ వర్మ అత్యంత సన్నిహతంగా దిగిన ఫొటో వైరల్గా మారింది. దీంతో ధనశ్రీని నెటిజన్లు దారుణంగా ట్రోలు చేశారు. భర్తను మోసం చేస్తూ ఇలాంటి పనులు చేయడం సరికాదని, నీకు పెళ్లైందని గుర్తుపెట్టుకో అంటూ కామెంట్లు చేశారు. తాజాగా తనపై వచ్చిన ట్రోల్స్పై స్పందిస్తూ ధనశ్రీ వర్మ ఓ వీడియో విడుదల చేసింది. "అస్సలు మీరు ఎలా ఏదో ఏదో ఊహించుకుంటారు. మీ అభిప్రాయాలను వ్యక్తం చేసేముందు దయచేసి మనుషులగా ఆలోచించండి. నేను ట్రోల్స్, మీమ్స్ను పట్టించుకోను. నా పనిని నేను చేసుకుంటూ పోతాను. కొన్నిసార్లు ఇటువంటి వాటిని చూసి నాలో నేను నవ్వుకుంటాను. కానీ ఈ సారి ఈ చెత్త ట్రోల్స్పై స్పందించాల్సి వచ్చింది. ఎందుకంటే ఈసారి అవి నా కుటుంబాన్ని, నా సన్నిహితులను తీవ్రంగా ప్రభావితం చేశాయి. సోషల్ మీడియా వేదికల్లో అభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ అందరికి ఉంది. కానీ ఇతరుల వ్యక్తి గత జీవితాన్ని టార్గెట్ చేసి మనోభావాలను దెబ్బతీయడం సరికాదు. కొంత మంది ద్వేషాన్ని, విద్వేషాన్ని వ్యాప్తి చేయడమే పనిగా పెట్టుకున్నారు. నా పనిలో సోషల్ మీడియా ప్రధాన భాగం కాబట్టి నేను విడిచిపెట్టలేను. కాబట్టి మీరు కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించి.. మా ప్రతిభ, నైపుణ్యాలను గమనించాలని కోరుతున్నా. మేమంతా మిమ్మల్ని అలరించడానికే సోషల్ మీడియాలో ఉన్నాము. మీ అమ్మ, మీ సోదరి, మీ స్నేహితురాలు, మీ భార్య లాగే నేను కూడా ఒక స్త్రీని అనే విషయాన్ని మర్చిపోకండి. నేను ఒక పోరాట యోధురాలిని. .ఏ విషయానికి భయపడి వెనకడుగు వేయను. ఇకనైనా ఈ వేదికగా ప్రేమను పంచండి. కాస్త సున్నితంగా వ్యవహరించండి. విద్వేషం వ్యాప్తి చేయకండి. మంచి విషయాలపై దృష్టి మీ జీవితంలో ముందుకు సాగాలని నేను ఆశిస్తున్నాని ధనశ్రీ పేర్కొంది. View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
చహల్ భార్య ధనశ్రీ వర్మ చార్మింగ్ లుక్స్ (ఫొటోలు)
-
అతడితో చహల్ భార్య ధనశ్రీ ఫొటో.. రచ్చ రచ్చ.. పదే పదే ఇలా?
టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్ సతీమణి ధనశ్రీ వర్మ మరోసారి విమర్శల పాలయ్యారు. యూట్యూబర్, కొరియోగ్రాఫర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చున్న ఈ డాక్టరమ్మ తీరు చహల్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ‘‘చహల్ భయ్యా కూడా మీతో పదే పదే ఇదే తరహాలో వ్యవహరిస్తే భరించగలరా? లేదంటే.. ప్రచార యావ కోసం ఉద్దేశపూర్వకంగానే ఇలాంటివి చేస్తున్నారా?’’ అంటూ తీవ్ర స్థాయిలో ధనశ్రీని ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది?! టీమిండియా బౌలర్గా కెరీర్ తారస్థాయిలో ఉన్న సమయంలో ధనశ్రీ వర్మను పెళ్లి చేసుకున్నాడు చహల్. డిసెంబరు 22, 2020లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో.. స్వతహాగా కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ తొలుత తనకు నృత్య పాఠాలు నేర్పిందని.. ఈ క్రమంలోనే తాము ప్రేమలో పడి పెళ్లిదాకా వచ్చినట్లు చహల్ ఓ సందర్భంలో తెలిపాడు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ధనశ్రీకి భర్తతో కలిసి దిగిన ఫొటోలు, అతడితో కలిసి చేసిన రీల్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం అలవాటు. అలాగే తన వృత్తిగత విషయాలను ఆమె షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో గతేడాది తన ఇన్స్టా అకౌంట్లో చహల్ ఇంటి పేరును ఆమె తొలగించడంతో విడాకుల వదంతులు తెరమీదకు వచ్చాయి. అదే సమయంలో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్తో ధనశ్రీ సన్నిహితంగా మెలగడమే ఇందుకు కారణమని కొంతమంది నెటిజన్లు అసభ్యకరరీతిలో కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో యజువేంద్ర చహల్- ధనశ్రీ వర్మ స్పందిస్తూ.. విడాకుల విషయాన్ని కొట్టిపారేశారు. అయినప్పటికీ ధనశ్రీ చర్యలను జడ్జ్ చేయడం మానలేదు నెటిజన్లు. చహల్కు అప్పట్లో ఉన్న క్రేజ్ దృష్ట్యానే అతడిని ఆమె పెళ్లాడిందనే తమ సొంత అభిప్రాయాలను వీరి బంధానికి ఆపాదిస్తూ ఇష్టారీతిన కథనాలు అల్లేశారు. తాజాగా ధనశ్రీ వర్మ దిగిన ఓ ఫొటో మరోసారి ఇలాంటి ట్రోల్స్కు కారణమైంది. ధనశ్రీ ప్రస్తుతం ఝలక్ దిఖ్లాజా అనే టీవీ షోలో భాగమయ్యారు. ఈ క్రమంలో మరో కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉటేకర్తో అత్యంత సన్నిహితంగా దిగిన ఫొటో బయటకు వచ్చింది. ప్రతీక్ స్వయంగా ఈ పిక్చర్ను తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నెటిజన్లు ధనశ్రీ తీరును విమర్శిస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం వృత్తిగతం(యాక్టింగ్, డ్యాన్స్)గా ప్రమోషన్స్లో భాగంగా ఇలాంటి ఫొటోలను చేయడాన్ని తప్పుపట్టని వారు.. ఒక్క ఫొటోతో ఒకరి వ్యక్తిత్వాన్ని ఎలా నిర్ణయిస్తారు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఝలక్ దిఖ్లా జా షోలో ఫైనల్స్ వరకు వెళ్లిన ధనశ్రీ వర్మ విజేతగా నిలవలేకపోయింది. ఈ సీజన్లో ఫైనల్ వరకూ వచ్చిన మనీషా రాణి అనే మరో ఫిమేల్ కంటెస్టెంట్ ట్రోఫీని అందుకున్నారు. What will be the Dhanashree Verma reaction if Yuzvendra Chahal does this constantly with his ladies friends ? We all are human and any husband who loves his wife will be hurt by these incidents. This is utter nonsense, and needs to be stopped. pic.twitter.com/xKW2tf7K9v — Sujeet Suman (@sujeetsuman1991) March 2, 2024 I wouldn't post such an intimate pic on instagram even if it was with my wife #ShameOnDhanshree #YuziChahal pic.twitter.com/9pEhXEmtAi — brigadier🇮🇳 (@brigadierdude) March 2, 2024 -
బీసీసీఐ షాకిచ్చింది.. చహల్ అక్కడ అలా!
టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ చాలా కాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. గతేడాది జూలైలో వెస్టిండీస్ పర్యటన సందర్భంగా బరిలోకి దిగిన అతడు మళ్లీ పునరాగమనం చేయలేదు. షాకిచ్చిన బీసీసీఐ వన్డే ప్రపంచకప్-2023 జట్టులోనూ అతడికి స్థానం దక్కలేదు. ఇటీవల సౌతాఫ్రికా పర్యటనకు ఎంపికైనా ఒక్క మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ ఇవ్వలేదు సెలక్టర్లు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టుతో పాతుకుపోవడంతో చహల్కు అవకాశాలు సన్నగిల్లాయి. ఈ క్రమంలో 2023-24 ఏడాదికి గానూ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలోనూ యజువేంద్ర చహల్కు మొండిచేయి చూపింది బీసీసీఐ. ఐపీఎల్లో కింగ్ ఈ నేపథ్యంలో ఇక ఐపీఎల్లోనే మళ్లీ యుజీ స్పిన్ మాయాజాలాన్ని చూసే వీలుంది. గత సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు ఆడిన చహల్ 14 మ్యాచ్లలో కలిపి 21 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక వికెట్లు(187) తీసిన బౌలర్గా చహల్ చరిత్రకెక్కాడు. చుక్కలు చూపించిన సంగీత ఇదిలా ఉంటే.. తనకు దొరికిన విరామ సమయాన్ని భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ కోసం కేటాయించాడు చహల్. ధనశ్రీ ప్రస్తుతం ఝలక్ దిఖ్లాజా షోతో బిజీగా ఉంది. భారత రెజ్లర్ సంగీత ఫొగట్ కూడా ఈ టీవీ షోలో పాల్గొంది. ఈ నేపథ్యంలో విరామ సమయంలో చహల్తో కలిసి సంగీత సందడి చేసింది. అతడిని గొర్రెపిల్లలా వీపుపై వేసుకుని గిరాగిరా తిప్పుతూ తన రెజ్లింగ్ నైపుణ్యాలు ప్రదర్శించింది. ఆ సమయంలో చహల్ కిందపడతానేమోన్న భయంతో దింపేయమంటూ వేడుకున్నా ఆమె వినలేదు. View this post on Instagram A post shared by Tadka Bollywood (@tadka_bollywood_) ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. కాగా ఫొగట్ సిస్టర్స్లో చిన్నవారైన సంగీత ఫొగట్.. స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియాను వివాహమాడింది. ఇక ఝలక్ దిఖ్లాజా షోలో పాల్గొన్న సంగీత తాజాగా ఎలిమినేట్ అయింది. ధనశ్రీ వర్మ మాత్రం టాప్-5లో కొనసాగుతోంది. చదవండి: అతడు తప్పు చేయలేదు.. అలాంటపుడు శిక్ష ఎందుకు? -
'అతడొక లీడింగ్ వికెట్ టేకర్.. అయినా కాంట్రాక్ట్ నుంచి'
బీసీసీఐ తాజాగా 2024-25 ఏడాదికి గానూ వార్షిక ఆటగాళ్ల కాంట్రాక్టులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో భారత స్టార్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్కు చోటు దక్కకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ లిస్ట్లో వీరిద్దరితో పాటు చాలా మంది క్రికెటర్ల పేర్లు లేవు. అందులో స్టార్ లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఒకడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి చాహల్ను తప్పించడం తనకు ఆశ్చర్యం కలిగించిందని చోప్రా తెలిపాడు. "సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో యూజీ చాహల్ పేరు లేకపోవడం చూసి నేను ఆశ్యర్యపోయాను. ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే,శిఖర్ ధావన్, దీపక్ హుడాలను తప్పించడంలో ఒక అర్ధముంది. కానీ చాహల్ టీ20ల్లో భారత తరుపున లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్నాడు. అటువంటి ఆటగాడికి కాంట్రాక్ట్ దక్కకపోవడం దురదృష్టకరం. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం దేనికి సంకేతమో నాకు అర్ధం కావడం లేదు. బహుశా వారు చాహల్ స్ధానంలో కొత్త ఆటగాడిని వెతుకుతున్నట్లున్నారని" తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు. కాగా చాహల్ గతేడాది ఆగస్టు నుంచి జట్టుకు దూరంగా ఉంటున్నాడు. -
Dhanashree Verma Pics: కొత్త సంవత్సరం వేళ చహల్ భార్య ధనశ్రీ ఇలా..గ్లామర్ ఫొటోలు
-
ఒకే రోజున టీమిండియా క్రికెటర్ల వివాహ వార్షికోత్సవం (ఫొటోలు)
-
పెళ్లిళ్లు అక్కడే నిశ్చయమవుతాయంటారు: చహల్ భావోద్వేగం
‘‘నా ప్రియమైన సతీమణి... మనం మొట్టమొదటిసారి కలిసిన రోజు నుంచి ఈ క్షణం దాకా.. ఈ ప్రయాణంలోని ప్రతీ సెకండ్ నా హృదయానికి ఎంతో దగ్గరగా ఉంటుంది. పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయంటారు. ఈ మాట ఎవరు చెప్పారో గానీ.. సరిగ్గా నా కోసం చెప్పినట్లే ఉంది. ప్రతి రోజు నా వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరచుకునేలా చేస్తున్నావు. నీ రాకతో నేను సంపూర్ణమయ్యాను!! నా ప్రేమ దేవతకు పెళ్లిరోజు శుభాకాంక్షలు’’ అంటూ టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ భార్య ధనశ్రీ వర్మ పట్ల ప్రేమను చాటుకున్నాడు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా సతీమణికి కవితాత్మక సందేశాన్ని బహుమతిగా ఇచ్చాడు. Dear wifey , From the first day we met to this moment, every second of this journey has been close to my heart. They say matches are made in heaven and I am sure whoever has written our script is on my side 💕 You make me a better human being every single day.❤️ You complete… pic.twitter.com/1xxe8KqfSt — Yuzvendra Chahal (@yuzi_chahal) December 22, 2023 ఈ సందర్భంగా తన నిచ్చెలితో దిగిన అందమైన ఫొటోలను యుజీ ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. ఇందుకు స్పందనగా ధనశ్రీ సైతం.. ఓ పాటకు తామిద్దరం డాన్స్ చేసిన వీడియోను ఇన్స్టాలో పంచుకుంది. మూడేళ్లుగా పరస్పర సహకారంతో తమ ప్రయాణం ఇక్కడిదాకా వచ్చిందంటూ భర్త పట్ల ఆప్యాయతను చాటుకుంది. View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) కాగా టీమిండియా బౌలర్గా కెరీర్లో తారస్థాయిలో ఉన్న సమయంలో యూట్యూబర్ ధనశ్రీ వర్మను చహల్ పెళ్లాడాడు. 2020, డిసెంబరు 22న గూర్గావ్లో అత్యంత వైభవంగా వీరి పెళ్లి జరిగింది. అయితే, కొన్నాళ్ల క్రితం ధనశ్రీ తన ఇన్స్టా అకౌంట్లో చహల్ ఇంటి పేరును తొలగించడంతో వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వదంతులు వచ్చాయి. అంతేకాదు.. టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్తో ధనశ్రీ పేరును ముడిపెట్టి అసభ్యకరమైన రీతిలో ట్రోల్ చేశారు కొంతమంది నెటిజన్లు. ఈ క్రమంలో యజువేంద్ర చహల్ స్వయంగా స్పందించి విడాకుల రూమర్స్ను కొట్టిపడేశాడు. ధనశ్రీ సైతం భర్తతో కలిసి ఉన్న వీడియో షేర్ చేసి పుకార్లకు చెక్ పెట్టింది. View this post on Instagram A post shared by Sanju V Samson (@imsanjusamson) ఇదిలా ఉంటే.. టీమిండియా యువ బ్యాటర్ సంజూ శాంసన్ పెళ్లిరోజు కూడా నేడు. ఈ సందర్భంగా సతీమణికి విష్ చేస్తూ అందమైన ఫొటోలను పంచుకున్నాడు సంజూ. కాగా తన చిన్ననాటి స్నేహితురాలు చారులతా రమేశ్ను ఐదేళ్ల క్రితం వివామమాడాడు సంజూ. ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న ఈ కేరళ బ్యాటర్ మూడో వన్డేలో శతకం బాది టీమిండియాను గెలిపించాడు. మరోవైపు.. చహల్కు మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. చదవండి: బజరంగ్ పునియా సంచలన ప్రకటన.. ప్రధాని మోదీకి లేఖ! -
Vijay Hazare Trophy 2023: సెమీఫైనల్లో హరియాణా
రాజ్కోట్: లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ (4/37) మాయాజాలం... అంకిత్ కుమార్ (102; 12 ఫోర్లు, 3 సిక్స్లు) శతకం... వెరసి విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోరీ్నలో 12 ఏళ్ల తర్వాత హరియాణా జట్టు మళ్లీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బెంగాల్ జట్టుతో సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో హరియాణా నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బెంగాల్ 50 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. షహబాజ్ అహ్మద్ (100; 4 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీతో రాణించాడు. అనంతరం హరియాణా 45.1 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు సాధించి విజయం సాధించింది. ఇతర క్వార్టర్ ఫైనల్స్లో రాజస్తాన్ 200 పరుగుల తేడాతో కేరళపై, కర్ణాటక ఏడు వికెట్ల తేడాతో విదర్భపై, తమిళనాడు ఏడు వికెట్ల తేడాతో ముంబైపై గెలుపొంది సెమీఫైనల్ చేరుకున్నాయి. -
చహల్ మ్యాజిక్.. శతక్కొట్టిన లోమ్రార్
విజయ్ హజారే ట్రోఫీ 2023లో సెమీస్ బెర్త్లు ఖరారయ్యాయి. ఇవాళ (డిసెంబర్ 11) జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో కర్ణాటక, తమిళనాడు, హర్యానా, రాజస్థాన్ జట్లు విదర్భ, ముంబై, బెంగాల్, కేరళ జట్లపై విజయాలు సాధించి ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో రాజస్థాన్కు చెందిన మహిపాల్ లోమ్రార్ (122 నాటౌట్, కేరళపై), బెంగాల్కు చెందిన షాబాజ్ అహ్మద్ (100, హర్యానా), హర్యానాకు చెందిన అంకిత్ కుమార్ (102, బెంగాల్పై), తమిళనాడు చెందిన బాబా ఇంద్రజిత్ (103 నాటౌట్, ముంబైపై) శతకాలతో చెలరేగగా.. హర్యానాను చెందిన యుజ్వేంద్ర చహల్ (10-0-37-4, బెంగాల్పై), కర్ణాటకకు చెందిన విజయ్కుమార్ వైశాక్ (8.5-2-44-4, విదర్భపై), రాజస్థాన్కు చెందిన అనికేత్ చౌదరీ (7-1-26-4, కేరళపై) బంతితో రాణించారు. డిసెంబర్ 13న జరిగే తొలి సెమీఫైనల్లో హర్యానా, తమిళనాడు.. డిసెంబర్ 14న జరిగే రెండో సెమీఫైనల్లో రాజస్థాన్, కర్ణాటక జట్లు తలపడనున్నాయి. రెండు సెమీఫైనల్స్లో విజేతలు డిసెంబర్ 16న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల స్కోర్ల వివరాలు.. తొలి క్వార్టర్ ఫైనల్: బెంగాల్ 225 (50 ఓవర్లు) హర్యానా 226/6 (45.1 ఓవర్లు) 4 వికెట్ల తేడాతో హర్యానా విజయం రెండో క్వార్టర్ ఫైనల్: రాజస్థాన్ 267/8 (50 ఓవర్లు) కేరళ 67/9 (21 ఓవర్లు) 200 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం మూడో క్వార్టర్ ఫైనల్: విదర్భ 173 (42 ఓవర్లు) కర్ణాటక 177/3 (40.3 ఓవర్లు) 7 వికెట్ల తేడాతో కర్ణాటక విజయం నాలుగో క్వార్టర్ ఫైనల్: ముంబై 227 (48.3 ఓవర్లు) తమిళనాడు 229/3 (43.2 ఓవర్లు) 7 వికెట్ల తేడాతో తమిళనాడు విజయం -
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో నో ఛాన్స్.. చాహల్ రియాక్షన్ ఇదే! పోస్ట్ వైరల్
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్కు సెలక్టర్లు మరోసారి సెలక్టర్లు మొండి చేయి చూపించిన సంగతి తెలిసిందే. ఆసియాకప్, వన్డే ప్రపంచకప్కు చాహల్ను పట్టించుకోపోయిన సెలక్టర్లు.. తాజాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు పరిగణలోకి తీసుకోలేదు. టీ20ల్లో అత్యధిక వికెట్ల తీసిన భారత బౌలర్గా ఉన్న చాహల్ పట్ల సెలక్టర్లు వ్యవహరిస్తున్న తీరు పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాహల్ చివరగా ఈ ఏడాది వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్లో భారత జట్టు తరపున కన్పించాడు. కాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు టీమిండియాను ప్రకటించిన తర్వాత సోషల్ మీడియా ఖాతాలో స్మైలింగ్ ఎమోజీతో తన స్పందించిన చాహల్.. తాజా మరో క్రిప్టిక్ స్టోరీని పోస్ట్ చేశాడు. "మనం కోసం ఎవరూ ఏమనుకున్నా లక్ష్యం దిశగా దూసుకుపోవడమే ఓ యోధుని నిజమైన బలమని" అర్ధం వచ్చేట్లుగా క్రిప్టిక్ స్టోరీని చాహల్ ట్విటర్లో షేర్ చేశాడు. కాగా 2016లో టీమిండియా తరుఫున టీ20ల్లో అరంగేట్రం చేసిన చాహల్.. 80 మ్యాచ్లు ఆడి 96 వికెట్లు పడగొట్టాడు. చాహల్ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ 2023 సీజన్లో హర్యానా తరుపున ఆడుతున్నాడు. ఉత్తరాఖండ్తో తొలి మ్యాచ్లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. తన పది ఓవర్ల కోటాలో 26 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. చదవండి: IND vs AUS: 'నువ్వు మా జట్టుపై ఎక్కువ సిక్సర్లు కొట్టావు'.. రోహిత్ శర్మపై సంజూ కీలక వ్యాఖ్యలు See you at work. 🏏 pic.twitter.com/JNMbz5owKI — Yuzvendra Chahal (@yuzi_chahal) November 24, 2023 -
మయాంక్ మెరుపు శతకం.. పడిక్కల్ ఊచకోత.. ఆరేసిన చహల్
దేశవాలీ 50 ఓవర్ల టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2023లో టీమిండియా ఆటగాడు మయాంక్ అగర్వాల్ (కర్ణాటక) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. జమ్మూ కశ్మీర్తో ఇవాళ (నవంబర్ 23) జరుగుతున్న మ్యాచ్లో భారీ శతకంతో విరుచుకుపడ్డాడు. 132 బంతుల్లో 11 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 157 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న కర్ణాటక నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 402 పరుగుల భారీ స్కోర్ చేసింది. కర్ణాటక ఇన్నింగ్స్లో మయాంక్తో పాటు రవి కుమార్ సమర్థ్ కూడా సెంచరీతో కదం తొక్కాడు. సమర్థ్ 120 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన మయాంక్, సమర్థ్ సెంచరీలతో చెలరేగడం విశేషం. పడిక్కల్ ఊచకోత.. సమర్థ్ ఔటైన అనంతరం ఇన్నింగ్స్ 39వ ఓవర్లో బరిలోకి దిగిన దేవ్దత్ పడిక్కల్ జమ్మూ కశ్మీర్ బౌలర్లను ఊచకోత కోశాడు. పడిక్కల్ వచ్చిన బంతిని వచ్చినట్లు బాది 35 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పడిక్కల్కు జతగా మనీశ్ పాండే కూడా బ్యాట్ ఝులిపించాడు. మనీశ్ 14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జమ్మూ బౌలర్లలో రసిక్ సలామ్, సాహిల్ లోత్రా తలో వికెట్ పడగొట్టారు. శతక్కొట్టిన దీపక్ హుడా.. ఆరేసిన చహల్ 2023 సీజన్ విజయ్ హజారే ట్రోఫీ ఇవాల్టి నుంచే మొదలైంది. ఈ రోజు వివిధ వేదికలపై మొత్తం 18 మ్యాచ్లు జరుగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా ఆటగాడు, రాజస్థాన్ కెప్టెన్ దీపక్ హుడా (114) సెంచరీతో మెరిశాడు. ఇదే మ్యాచ్లో దీపక్ చాహర్ (66 నాటౌట్) అర్ధ సెంచరీతో రాణించాడు. ఉత్తరాఖండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా స్పిన్నర్, హర్యానా బౌలర్ యుజ్వేంద్ర చహల్ 6 వికెట్లతో ఇరగదీశాడు. -
కొంచెం బాధగా ఉంది.. నాకు అలవాటు అయిపోయింది: చాహల్
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్కు వన్డే ప్రపంచకప్-2023 జట్టులో చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే. అతడి స్ధానంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపారు. అంతకుముందు ఆసియాకప్కు కూడా చాహల్ను పరిగణలోకి తీసుకోలేదు. కాగా చాహల్ ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీల్లో బీజీగా ఉన్నాడు. కెంట్ క్రికెట్ క్లబ్కు చాహల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే తనను వరల్డ్కప్కు ఎంపిక చేయకపోవడంపై తాజాగా చాహల్ స్పందించాడు. జట్టులో చోటు దక్కించుకోపోవడం తనకు అలవాటు అయిందని, అది తన జీవితంలో ఒక భాగమైందని చాహల్ చెప్పుకొచ్చాడు. "ఇది వరల్డ్కప్. జట్టులో పదిహేను మంది ఆటగాళ్ళు మాత్రమే ఉండాలి. 17 లేదా 18 ప్లేయర్స్ను ఎంపిక చేయలేరు. ఆ విషయం నాకు తెలుసు. అయితే జట్టులో చోటు దక్కించుకోపోయినందుకు కొంచెం బాధగా ఉంది. కానీ కష్టపడుతూ జీవితంలో ముందుకు సాగడమే నా మోటివ్. నాకు ఇది అలవాటు అయిపోయింది. వరల్డ్కప్లో చోటు దక్కకపోవడం నాకు ఇది మూడో సారి అంటూ నవ్వుతూ" విజ్డెన్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు. అదే విధంగా ఎక్కడో ఒక చోట క్రికెట్ ఆడాలన్న ఉద్దేశ్యంతో ఇంగ్లండ్ కౌంటీల్లో భాగమయ్యానని చాహల్ పేర్కొన్నాడు. చదవండి: IND vs AUS: 'అశ్విన్ ఎంపికలో ఆశ్చర్యమేమీలేదు.. చెన్నైలో చుక్కలు చూపిస్తాడు' -
చాహల్ ఎవరితోనైనా గొడవపడ్డాడేమో.. అందుకే ఎంపిక చేయడం లేదు
వన్డే ప్రపంచకప్-2023 సన్నాహకాల్లో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఈ జట్టులో అనుహ్యంగా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు సెలక్టర్లు చోటుకల్పించారు. ఈ సిరీస్కు అశ్విన్ను ఎంపిక చేసిన సెలక్టర్లు.. మరో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్కు మాత్రం మరోసారి మొండి చేయి చూపించారు. అశ్విన్తో పాటు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు కూడా ఈ జట్టులో చోటుదక్కింది. ఇక ఆసీస్ సిరీస్కు చాహల్ను ఎంపిక చేయకపోవడంపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. చాహల్ ఎవరితోనైనా గొడవపడి ఉండవచ్చు, అందుకే అతడిని ఎంపిక చేయడం లేదని భజ్జీ సంచలన వాఖ్యలు చేశాడు. చాహల్ ఎవరితోనైనా గొడవపడ్డాడేమో.. "యుజ్వేంద్ర చాహల్ ఆసీస్ సిరీస్ జట్టులో ఉండాల్సింది. అతడికి ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదో నాకు అర్ధం కావడం లేదు. అతడు ఎవరితోనైనా గొడవపడ్డాడా? లేదా ఎవరికైనా ఏమన్నా అన్నాడా? అనేది మాత్రం తెలియడం లేదు. కేవలం స్కిల్స్ పరంగా ఆటగాళ్లను ఎంపిక చేస్తే చాహల్కు కూడా చోటు ఇవ్వాలి. చాలా మంది భారత ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నందున చాహల్ పేరు జట్టులో ఉంటుందని భావించాను. జట్టు మేనెజ్మెంట్ హాఫ్ స్పిన్నర్ల కోసం వెతుకుతున్నట్లు నాకు అన్పిస్తోంది. అందుకే వరల్డ్కప్ ప్రణాళికలలో లేని అశ్విన్, వాషింగ్టన్ సుందర్కు మళ్లీ పిలుపునిచ్చారని" భజ్జీ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. తొలి రెండు వన్డేల కోసం భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శార్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ మూడో వన్డే కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ చదవండి: #Shaheen Afridi: రెండోసారి పెళ్లి చేసుకున్న షాహీన్ ఆఫ్రిది.. హాజరైన బాబర్ ఆజం! ఫోటోలు వైరల్ -
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్.. యుజ్వేంద్ర చాహల్ కీలక నిర్ణయం!
వన్డే ప్రపంచకప్-2023కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్కు చోటు దక్కపోయిన సంగతి తెలిసిందే. చాహల్కు ఆసియాకప్ జట్టులో చోటు దక్కపోయినప్పటికీ.. వరల్డ్కప్కు మాత్రం ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ మరోసారి సెలక్టర్లు మొండి చేయి చూపించారు. ఈ క్రమంలో చాహల్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడాలని చాహల్ నిర్ణయించకున్నట్లు తెలుస్తోంది. కౌంటీ ఛాంపియన్షిప్-2023లో ఆఖరి మూడు మ్యాచ్ల్లో కెంట్ క్రికెట్ క్లబ్కు ప్రాతినిథ్యం వహించనున్నట్లు సమాచారం. చాహల్ ఇంగ్లండ్ కౌంటీల్లో కెంట్ తరపున ఆడనున్నాడు. ఇందుకు సంబంధించి కెంట్ కౌంటీ క్రికెట్ క్లబ్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది. కౌంటీ క్రికెట్ ఆడేందుకు బీసీసీఐ అతనికి ఎన్ఓసీ కూడా మంజూరు చేసింది. అతడు భారత జట్టుకు అవసరమైతే వెంటనే జాతీయ జట్టుతో చేరుతాడని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు టైమ్స్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇక ఇప్పటికే ఇంగ్లండ్ కౌంటీల్లో అజింక్యా రహానే, ఛతేశ్వర్ పుజారా, ఉమేశ్యాదవ్ సహచర ఆటగాళ్లు ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడతున్నారు. చదవండి: ODI WC 2023: వరల్డ్కప్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. టికెట్ ధర రూ.57లక్షలు! -
'ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు.. అతడి కంటే జట్టులో తోపులు ఎవరూ లేరు'
ఆసియాకప్-2023కు 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆసియాకప్తో స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీ ఇవ్వనుండగా.. యువ ఆటగాడు తిలక్ వర్మకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. అయితే ఈ జట్టులో స్టార్స్పిన్నర్ యజువేంద్ర చాహల్కు చోటు దక్కలేదు. చహల్కు బదులగా కుల్దీప్ యాదవ్కు సెలక్టర్లు అవకాశమిచ్చారు. ఇక ఆసియాకప్ జట్టు నుంచి చహల్ను పక్కన పెట్టడాన్ని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తప్పుబట్టాడు. వైట్ బాల్ క్రికెట్లో చాహల్ అత్యుత్తమ బౌలర్ అని, అతడికి చోటు దక్కకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించందని హర్భజన్ అన్నాడు. "యుజ్వేంద్ర చాహల్ జట్టులో లేకపోవడం భారత్కు తీరని లోటు. ఎందుకంటే ఆసియాకప్కు ఎంపిక చేసిన జట్టులో లెగ్ స్పిన్నర్ ఒక్కరు కూడా లేరు. లెగ్ స్పిన్నర్కు మ్యాచ్ను మలుపు తిప్పే సత్తా ఉంటుంది. వైట్బాల్ క్రికెట్లో భారత జట్టులో చాహల్ కంటే మెరుగైన స్పిన్నర్ మరొకడు లేడు. అతడు గత కొన్ని మ్యాచ్ల్లో బాగా రాణించకపోవచ్చు. అంత మాత్రాన అతడు మంచి బౌలర్ కాకుండా పోడు. ప్రస్తుత పరిస్థితుల్లో జట్టుకు అతడి సేవలు చాలా అవసరం. అతడికి జట్టులోకి వచ్చేందుకు దారులు ఇంకా మూసుకుపోలేదని నేను అనుకుంటున్నాను. వరల్డ్కప్ భారత్లో జరగనుంది. కాబట్టి చాహల్ను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. చాహల్ మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్. అతడు ఫామ్లో లేడని నాకు తెలుసు. కానీ జట్టుతో లేకపోతే అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని" అని హర్భజన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: Asia Cup 2023: ఆసియాకప్లో భారత్దే పై చేయి.. ఫైనల్లో ఒక్కసారి కూడా తలపడని దాయాదులు! -
అందుకే చాహల్కు జట్టులో చోటివ్వలేదు.. ఆ విషయంలో కుల్దీప్ బెటర్!
ఆసియాకప్ 2023కు భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. ఈ మెగా టోర్నీ కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపికచేశారు. సుదీర్ఘ కాలంగా గాయాలతో బాధపడుతున్న శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు. మరోవైపు ఇప్పటి వరకు ఇంకా వన్డేల్లో అరంగేట్రం చేయని హైదరాబాదీ తిలక్ వర్మకు కీలకమైన ఆసియా కప్ జట్టులో చోటు దక్కడం గమానార్హం. ఇక టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజువేంద్ర చహల్కు ఆసియాకప్ జట్టులో చోటు దక్కకపోవడం అందరినీ ఆశ్యర్యపరిచింది. అతడి స్ధానంలో కుల్దీప్ యాదవ్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపారు. ఈ క్రమంలో చాహల్ను కాదని కుల్దీప్ యాదవ్ను ఎందుకు ఎంచుకున్నారనే దానిపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. కుల్దీప్ బ్యాట్తో కూడా రాణించగలడని, అందుకే చహల్ను కాదని అతడిని ఎంపిక చేశారని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. "విండీస్ సిరీస్లో సంజు శాంసన్ ఎక్కువ పరుగులు చేసి ఉంటే అతడు ఖచ్చితంగా ఈ జట్టులో ఉండేవాడు. అలాగే చాహల్ కూడా వికెట్లు పడగొట్టి ఉంటే జట్టులో అవకాశం దక్కి ఉండేది. అయితే కొన్ని సార్లు జట్టును బ్యాలెన్స్ చేయాలంటే కొంతమందిపై వేటుపడక తప్పదు. కుల్దీప్కు లోయార్డర్లో బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. ఈ కోణంలోనే సెలక్టర్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా కుల్దీప్ చైనామన్ బౌలర్ కూడా కావడం అతడికి కలిసొచ్చింది. అందుకే చహల్ను కాదని కుల్దీప్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపారాని" గవాస్కర్ ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. చదవండి: Yuzvendra Chahal: అందుకే అతడికి జట్టులో చోటివ్వలేదు.. స్పందించిన చహల్! అప్పుడు రోహిత్.. -
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ధనశ్రీ వర్మ అందమైన ఫొటోలు చూసేయండి
-
IND VS WI 5th T20: చెత్త రికార్డు మూటగట్టుకున్న చహల్
టీమిండియాతో నిన్న (ఆగస్ట్ 13) జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో విండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో విండీస్ 5 మ్యాచ్ల సిరీస్ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమై మ్యాచ్తో పాటు సిరీస్ను విండీస్కు అప్పగించింది. బ్యాటింగ్లో సూర్యకుమార్ (61) మినహా అందరూ చేతులెత్తేయగా.. బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ (4-0-18-0) మినహా భారత బౌలర్ల ప్రదర్శన అత్యంత దారుణంగా ఉండింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓవరాక్షన్ బౌలింగ్తో 3 ఓవర్లలో 32 పరుగులు సమర్పించుకోగా.. అర్షదీప్ 2 ఓవర్లలో 20 పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో అత్యంత పేలవమైన ప్రదర్శన కనబర్చిన ఘనత టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్కు దక్కింది. ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన చహల్ ఏకంగా 51 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో ప్రత్యర్ధులు 5 సిక్సర్లు బాదారు. ఈ చెత్త గణాంకాలు నమోదు చేసే క్రమంలో చహల్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాధించుకున్న బౌలర్గా న్యూజిలాండ్ స్పిన్నర్ ఐష్ సోధి సరసన చేరాడు. సోధి తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో 129 సిక్సర్లు సమర్పించుకోగా.. చహల్ ఈ మ్యాచ్లో అతని రికార్డును సమం చేశాడు. ఈ విభాగంలో సోధి, చహల్ తర్వాత ఆదిల్ రషీద్ (119) ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బ్యాటింగ్కు స్వర్గధామమైన పిచ్పై బ్యాటర్ల నిర్లక్ష్యం, పసలేని బౌలింగ్ కారణంగా భారత్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తిలక్ వర్మ (18 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్లు), సూర్యకుమార్ (45 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రొమారియో షెఫర్డ్ (4/31) భారత్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి గెలిచింది. బ్రాండన్ కింగ్ (55 బంతుల్లో 85 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్లు), నికోలస్ పూరన్ (35 బంతుల్లో 47; 1 ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగారు. ఈ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్లను సొంతం చేసుకున్న భారత్.. టీ20 సిరీస్ను కోల్పోయింది. -
'నిన్నెవరు వెళ్లమన్నారు.. వెనక్కి వచ్చేయ్'.. రూల్స్ ఒప్పుకోవు
వెస్టిండీస్తో తొలి టి20లో టీమిండియా నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. విండీస్ విధించిన 150 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా టాపార్డర్, మిడిలార్డర్ విఫలమవడంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులకే పరిమితమైంది. తిలక్ వర్మ 39, సూర్యకుమార్ యాదవ్ 21 పరుగులు ఉన్నంతవరకు మ్యాచ్ టీమిండియావైపే ఉన్నప్పటికి.. స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడం.. ఆ తర్వాత పాండ్యా(19 పరుగులు) వెనుదిరగడంతో టీమిండియా ఓటమి దాదాపు ఖరారైపోయింది. సంజూ శాంసన్, అక్షర్ పటేల్లు ఉన్నప్పటికి రాణించడంలో విఫలమయ్యారు. ఇక భారత ఇన్నింగ్స్ చివర్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యజ్వేంద్ర చహల్ బ్యాటింగ్ ఆర్డర్పై చిన్నపాటి కన్ఫ్యూజన్ ఏర్పడింది. వాస్తవానికి 10వ నెంబర్లో ముకేశ్ కుమార్.. చహల్ చివరి స్థానంలో బ్యాటింగ్కు రావాలి. కుల్దీప్ తొమ్మిదో వికెట్గా వెనుదిరిగిన సమయంలో టీమిండియా విజయానికి ఐదు బంతుల్లో 10 పరుగులు కావాలి. ముకేశ్ పొడగరి కాబట్టి విండీస్ బౌలర్లను ఎదుర్కొని ఆడే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అతన్ని పదో నెంబర్లో బ్యాటింగ్కు పంపాలని భావించింది. కానీ సమన్వయ లోపంతో చహల్ అప్పటికే 10వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చేశాడు. క్రీజులోకి వచ్చేసిన చహల్ స్ట్రైకింగ్ తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇక్కడే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. కోచ్ ద్రవిడ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యాలు డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటికి వచ్చి చహల్ను వెనక్కి రావాలని పిలుపునిచ్చారు. దీంతో చహల్ మళ్లీ పెవిలియన్ వైపు వెళ్లడానికి సిద్దమయ్యాడు. కానీ నిబంధనల ప్రకారం మ్యాచ్లో ఒక బ్యాటర్ మైదానంలో అడుగుపెట్టిన తర్వాత మళ్లీ తిరిగి వెళ్లడానికి ఆస్కారం ఉండదు. ఈ విషయం పాండ్యా, ద్రవిడ్లకు లేటుగా తెలియడంతో ఏం చేయలేకపోయారు. కెప్టెన్ పిలుపుతో ఆల్మోస్ట్ బౌండరీ లైన్ దగ్గరికి వచ్చిన చహల్ను అంపైర్ వెనక్కి పిలవడంతో మళ్లీ బ్యాటింగ్కు రావాల్సి వచ్చింది. ఈ సమయంలో ముకేశ్ కుమార్ బౌండరీ లైన్ వద్ద బ్యాటింగ్కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మొత్తానికి చహల్ చర్య మనకు నవ్వు తెప్పిస్తే.. మేనేజ్మెంట్ను మాత్రం గందరగోళానికి గురి చేసింది. ఇక చివరి ఐదు బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే చేసిన టీమిండియా నాలుగు పరుగుల తేడాతో మ్యాచ్ను విండీస్కు అప్పగించింది. Yuzvendra Chahal walked out at No.10, but the Indian team wanted Mukesh Kumar. Chahal walked off and entered again as he took the field already#Yuzvendrachahal😂😂#INDvWI pic.twitter.com/8rWxh30ahh — Md Nayab 786 🇮🇳 (@mdNayabsk45) August 3, 2023 చదవండి: ధోని రనౌట్తో పోలుస్తున్నారు.. శాంసన్ కెరీర్ ముగిసినట్లా! -
అందమైన ఫోటోలు షేర్ చేసిన ధనశ్రీ వర్మ.. టీమిండియా క్రికెటర్ ఫిదా!
టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ భార్య, ప్రముఖ యూట్యూబర్ ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఆమె మంచి డ్యాన్సర్ కూడా. ధనశ్రీ ఎప్పటికప్పుడు తన డ్యాన్స్ వీడియాలు, ఇన్స్టా రీల్స్తో అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా మరోసారి తన అందమైన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. హాలీవుడ్ కొత్త మూవీ 'బార్బీ' చూడటానికి ఆమె ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్స్ను ధరించింది. ఈ ప్రత్యేక దుస్తుల్లో ఆమె మెరిసిపోయింది. ధనుశ్రీ కొత్త లూక్కు సంబంధిచిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ధనుశ్రీ పోస్టుపై చాహల్ కూడా స్పందించాడు. హార్ట్, ముద్దు ఎమోజీలను చాహల్ రిప్లేగా ఇచ్చాడు. కాగా చాహల్ ప్రస్తుతం వెస్టిండీస్లో ఉన్నాడు. విండీస్తో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ల్లో చాహల్ ఆడేందుకు సిద్దమవుతున్నాడు. చదవండి: Virat Kohli: కోహ్లిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్న విండీస్ క్రికెటర్ తల్లి.. వీడియో వైరల్ -
నన్ను మోసం చేశారు..ఆర్సీబీపై చాహల్ ఫైర్
-
ఆర్సీబీపై చాహల్ గరం గరం.. నమ్మించి మోసం చేశారు! కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా..
భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్లో 8 ఏళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్-2022 మెగా వేలంకు ముందు చాహల్ను ఆర్సీబీ రీటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలో వేలంలోకి వచ్చిన చాహల్ను కనీసం మళ్లీ తిరిగి పొందే ప్రయత్నం కూడా ఆర్సీబీ చేయలేదు. అయితే ఈ వేలంలో చాహల్ను సంజూ శాంసన్ సారధ్యంలోని రాజస్తాన్ రాయల్స్ రూ. 6.50 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇక వేలంలో తనను పట్టించుకోని ఆర్సీబీపై తాజాగా చాహల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 8 సీజన్ల పాటు సేవలు అందించిన తనను విడిచిపెట్టడం చాలా బాధ కలిగించిందని చాహల్ తెలిపాడు. "నన్ను రిటైన్ చేసుకోలేదనే విషయం తెలియగానే చాలా బాధపడ్డాను. 2014లో ఆర్సీబీతో నా ప్రయాణం మొదలైంది. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి తొలి మ్యాచ్ నుంచే నాపై నమ్మకం ఉంచాడు. నేను 8 ఏళ్ల పాటు ఆర్సీబీ ఫ్రాంచైజీ తరపున ఆడాను. 2022 వేలానికి ముందు నేను మేనేజ్మెంట్ను ఎక్కువ డబ్బులు అడిగానని నాపై విమర్శలు వచ్చాయి. నేను అలా చేయలేదని ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చా. దాదాపు 140 మ్యాచ్లు పైగా ఆర్సీబీ తరపున ఆడాను. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం అంటే నాకు చాలా ఇష్టం. ఆర్సీబీ నన్ను ఎందుకు సొంతం చేసుకోలేదో ఇప్పటికి నాకు అర్దం కాలేదు. రిటైన్ చేసుకోపోనప్పటికీ వేలంలో కచ్చితంగా కొనుగోలు చేస్తామని మాట ఇచ్చారు. కానీ వేలంలో కనీస ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత వారి నుంచి కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు. ఈ విషయం గుర్తు తెచ్చుకున్న ప్రతీసారి నాకు బాధ కలుగుతోంది. ఆ తర్వాత ఏది జరిగినా అది నా మంచికే అని భావించాను. రాజస్తాన్ రాయల్స్లో చేరడం వల్ల నేను డెత్ బౌలర్గా మారాను. ఆర్సీబీలో ఉన్నప్పుడు నా ఓవర్ల కోటా దాదాపు 16 లేదా 17 ఓవర్కే పూర్తయ్యేది. కానీ రాజస్తాన్లో చేరాక నా ప్రదర్శన 5 - 10 శాతం ఇంప్రూవ్ అయింది" అని ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అలహబాదియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్ పేర్కొన్నాడు. చదవండి: Asian Games 2023: భారత సెలక్టర్లు చాలా పెద్ద తప్పుచేశారు.. అతడు జట్టులో ఉండాల్సింది -
'మిస్టరీ గర్ల్'తో యజ్వేంద్ర చహల్.. ధనశ్రీ చూస్తే అంతే!
టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్కు చెస్ గేమ్ అంటే చాలా ఇష్టం. చెస్కు చహల్ వీరాభిమాని. గతంలో భారత్లో జరిగిన వరల్డ్ యూత్ చెస్ చాంపియన్షిప్కు ప్రతినిధిగా వ్యవహరించాడు. ఆల్పైన్ వారియర్స్ ఫ్రాంచైజీకి చహల్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు ఇటీవలే దుబాయ్ వేదికగా గ్లోబల్ చెస్ లీగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం టీమిండియాకు మ్యాచ్లు లేకపోవడంతో అంబాసిడర్ హోదాలో దుబాయ్కు వెళ్లాడు. తాజాగా చహల్ ఒక యువతితో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ''నేనిప్పుడు దుబాయ్లో ఉన్నా. మిస్టరీ గర్ల్ విత్ గ్లోబల్ చెస్ లీగ్''అని క్యాప్షన్ జత చేశాడు. అయితే చహల్ పేర్కొన్న మిస్టరీ గర్ల్ పేరు భలే గమ్మత్తుగా ఉంది. ఆమె పేరు జెస్సీ ఫిబ్రవరి. సౌతాఫ్రికాకు చెందిన జెస్సీ ఫిబ్రవరి.. రెండుసార్లు సౌతాఫ్రికా వుమెన్స్ చెస్ చాంపియన్.. మరోసారి ఆఫ్రికన్ వుమెన్స్ చెస్ చాంపియన్గా నిలవడం విశేషం. ఈ సందర్భంగా జెస్సీ తన ట్విటర్లో చహల్తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ''మొత్తానికి చహల్ను కలుసుకున్నా.. సంతోషంగా ఉంది'' అంటూ పేర్కొంది. కాగా చహల్ ఫోటోపై అభిమానులు స్పందించారు. ''ఎవరు పిల్లా నువ్వు.. పేరే గమ్మత్తుగా ఉంది.. చహల్తో ఫోటో దిగావు సరే.. ధనశ్రీ చూస్తే ఊరుకుంటుందా.. అంతే సంగతి'' అంటూ కామెంట్ చేశారు. ఇక సౌతాఫ్రికాలోని పోర్ట్ ఎలిజబెత్కు చెందిన జెస్సీ ఫిబ్రవరి 2016లో మహిళల విభాగంలో చెస్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ టైటిల్ గెలుచుకుంది. 2021 మేలో జెస్సీ ఫిబ్రవరి వుమెన్స్ ఆఫ్రికన్ చాంపియన్షిప్లో పాల్గొని 8 స్కోరుకు గాను ఏడు పాయింట్లు సాధించింది. ఈ పాయింట్లతో 2100 రేటింగ్ సాధించిన జెస్సీ ఫిబ్రవరి గ్రాండ్మాస్టర్ హోదా సాధించింది. ఇక 2021 జూలైలో జరిగిన మహిళల చెస్ వరల్డ్కప్కు క్వాలిఫై సాధించినప్పటికి తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. Just 2 hardcore cricket fans. pic.twitter.com/UBgN3TTmxy — Jesse February (@Jesse_Feb) June 25, 2023 చదవండి: #PoojaTomar: ఆ గేమ్ అంటేనే చావుతో చెలగాటం.. నిజంగా 'ఆడ'పులే! #Wimbledon2023: 'ఆ రూమ్లు మెడిటేషన్కు మాత్రమే.. శృంగారం కోసం కాదు' 'చహల్ విషయంలో తప్పు చేస్తున్నారు'.. బీసీసీఐకి గంగూలీ హెచ్చరిక -
'చహల్ విషయంలో తప్పు చేస్తున్నారు'.. గంగూలీ హెచ్చరిక
టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ టెస్టుల్లో పెద్దగా మెరవనప్పటికి పరిమిత ఓవర్ల క్రికెట్లో వికెట్లు తీయగల సమర్థుడు. కుల్దీప్ యాదవ్తో కలిసి స్వదేశంలో ఎన్నో మ్యాచ్ల్లో టీమిండియాకు విజయాలు అందించాడు. అయితే ఈ మధ్యన అతన్ని పూర్తిగా పక్కకు పెట్టినట్లుగా అనిపిస్తోంది. సాధారణంగా ఉపఖండపు పిచ్లు స్పిన్నర్లకు స్వర్గధామం. అశ్విన్ లాంటి టాప్క్లాస్ స్పిన్నర్ టెస్టుల్లో మాత్రమే ప్రభావం చూపించగలడు. వన్డేలు ఆడినప్పటికి పెద్దగా మెరిసింది లేదు. మరో నాలుగు నెలల్లో భారత్ వేదికగా ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్కప్ జరగనుంది. 2011 తర్వాత పుష్కర కాలానికి టీమిండియా మెగా సమరానికి ఆతిథ్యం ఇస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈసారి రోహిత్ సేన కచ్చితంగా కప్ కొట్టి ధోని సేన మ్యాజిక్ను పునరావృతం చేస్తారని అంతా ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ బాధ్యతలు ఎవరు నడిపస్తారనేది ఆసక్తిగా మారింది. చహల్, కుల్దీప్ యాదవ్లతో పాటు అక్షర్ పటేల్లు ఉన్నప్పటికి రెగ్యులర్ స్పిన్నర్లు ఇద్దరికి మాత్రమే చోటు దక్కుతుంది. ఈ సందర్భంగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. వన్డే వరల్డ్కప్కు యజ్వేంద్ర చహల్ను ఆడించడం ఉత్తమమని.. అతను ప్రభావం చూపే అవకాశం ఉంటుందని గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. గంగూలీ మాట్లాడుతూ.. ''వన్డే వరల్డ్ కప్లో యజ్వేంద్ర చాహాల్ కచ్ఛితంగా ఆడాలి. టీమిండియాకి జడేజా ఉన్నాడు. అతనితో పాటు రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ కూడా ఉన్నారు. అయితే రవిభష్ణోయ్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్ లాంటి స్పెషలిస్టు స్పిన్నర్లే... పరిమిత ఓవర్ల క్రికెట్లో మ్యాచ్ విన్నర్లుగా ఉంటారు.. యజ్వేంద్ర చహాల్ని ఐసీసీ టోర్నమెంట్లలో ఆడించకపోవడం చాలా పెద్ద తప్పు. అతన్ని ఆడించి ఉంటే రిజల్ట్ వేరేగా ఉండేది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా వంటి జట్లపై స్పిన్నర్లు కీ రోల్ పోషించారు.. 2011 వన్డే వరల్డ్ కప్లో పియూష్ చావ్లా, హర్భజన్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: ధోనిని చూసి నేర్చుకోండి?.. ఆసీస్కు ఇంగ్లండ్ ఫ్యాన్స్ చురకలు బెయిర్ స్టో ఔట్ వివాదం.. మొదలుపెట్టింది ఇంగ్లండే కదా! -
భార్య ధనశ్రీతో చహల్.. చూడముచ్చటైన జంట (ఫొటోలు)
-
KKR VS RR: గురువు రికార్డును సమం చేసిన చహల్
రాజస్థాన్ బౌలర్ యుజ్వేంద్ర చహల్కు ఐపీఎల్-2023 సీజన్ చిరకాలం గుర్తుండి పోతుంది. ఈ సీజన్లో రికార్డులు బద్దలు కొట్టడమే ధ్యేయంగా పెట్టుకున్న చహల్.. నిన్న (మే 11) కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ అత్యుత్తమ రికార్డును తన పేరిట లిఖించుకోవడంతో పాటు పలు సాధారణ రికార్డులను సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. నిన్నటి మ్యాచ్లో 4 వికెట్లు పడగొట్టిన చహల్.. క్యాష్ రిచ్ లీగ్లో అత్యధిక వికెట్లు (143 మ్యాచ్ల్లో 187 వికెట్లు) తీసిన బౌలర్గా చరిత్ర సృష్టించడంతో పాటు ఈ సీజన్ టాప్ వికెట్ టేకర్గా (12 మ్యాచ్ల్లో 21 వికెట్లు) తన ప్రస్థానాన్ని కొనసాగించనున్నాడు. ఈ క్రమంలో చహల్ మరో అన్ నోటీస్డ్ రికార్డును సైతం సమం చేశాడు. తన ఐపీఎల్ గురువైన లసిత్ మలింగ పేరిట ఉండిన ఓ రికార్డును చహల్ సమం చేశాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు (7) నాలుగు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మలింగ రెండో స్థానంలో ఉండగా.. నిన్నటి ప్రదర్శనతో చహల్ (7) గురువు సరసన చేరాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు నాలుగు వికెట్లు పడగొట్టిన రికార్డు కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ (8) పేరిట ఉంది. ఈ సీజన్లో అన్ని అనుకూలిస్తే చహల్ మరో 5 మ్యాచ్లు ఆడే అవకాశం ఉంటుంది. దీంతో చహల్ మరెన్ని రికార్డులు బద్దలు కొడతాడో వేచి చూడాలి. చహల్ ప్రస్తుత ఫామ్ను కొనసాగిస్తే, ఈ సీజన్లోనే ఎవరికీ సాధ్యం కాని 200 వికెట్ల క్లబ్లోకి చేరే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, కేకేఆర్తో నిన్న జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. చహల్ (4/25) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగా.. యశస్వి (47 బంతుల్లో 98 నాటౌట్; 13 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్ (29 బంతుల్లో 48 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) బీభత్సం సృష్టించడంతో రాజస్థాన్ 13.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. చదవండి: KKR VS RR: ఆ రికార్డును ఎవరూ పట్టించుకోలేదు.. కోహ్లి తర్వాత యశస్వి ఒక్కడే..! -
చాలా సంతోషంగా ఉంది.. అతడొక లెజెండ్! అది మా అదృష్టం: శాంసన్
ఐపీఎల్-2023లో ప్లే ఆఫ్స్ దిశగా రాజస్తాన్ రాయల్స్ అడుగులు వేస్తోంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా గురువారం కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో రాజస్తాన్ ఘన విజయం సాధించింది. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్లో 12 మ్యాచ్లు ఆడిన రాజస్తాన్.. 6 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఇక కేకేఆర్పై విజయంపై మ్యాచ్ అనంతరం రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ స్పందించాడు. ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన యశస్వీ జైశ్వాల్, యజువేంద్ర చాహల్పై సంజూ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడొక లెజెండ్.. "ఈ మ్యాచ్లో నేను చేసింది ఏమీ లేదు. నాన్స్ట్రైకర్ నుంచి జైశ్వాల్ ఇన్నింగ్స్ చూసి ఎంజాయ్ చేశాను. పవర్ప్లేలో యశస్వీ ఎలా ఆడుతాడో ప్రత్యర్ధి బౌలర్లకు సైతం తెలుసు. పవర్ప్లేలో బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. అటువంటి ఆటగాడు మాకు దొరకడం మా అదృష్టం. ఇక చాహల్ అద్భుతమైన మణికట్టు స్పిన్నర్ అనడంలో ఎటువంటి సందేహంలేదు. చదవండి: #Yashasvi Jaiswal: వాట్ ఏ టాలెంట్.. నేను చూసిన బెస్ట్ బ్యాటింగ్ ఇదే: విరాట్ కోహ్లి తాను ఎంటో మరోసారి నిరూపించుకున్నాడు. అతడొక లెజెండ్. ఫ్రాంచైజీలో చాహల్ వంటి స్పిన్నర్ ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. చాహల్కు నేను ఎటువంటి సూచనలు చేయాల్సిన అవసరం లేదు. బంతితో ఏమి చేయాలో అతడికి బాగా తెలుసు. యుజీకి డెత్ ఓవర్లలో కూడా బౌలింగ్ చేసే సత్తా ఉంది. కెప్టెన్గా నాకు ఎటువంటి ఒత్తిడి లేకుండా చాహల్ చేస్తున్నాడు. ఇక ప్లేఆఫ్స్కు చేరడానికి మాకు ఇంకా రెండు మ్యాచ్లు ఉన్నాయి. ప్రతీ మ్యాచ్ కూడా మాకు కీలకం. ఇదే ఫలితాన్ని రాబోయే మ్యాచ్ల్లో పునరావృతం చేసి ప్లేఆఫ్స్లో అడుగు పెడతామని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో సంజూ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. జైశ్వాల్(98) పరుగులతో ఆజేయంగా నిలిచాడు. చదవండి: # Nitish Rana: నువ్వేమన్నా నెం.1 బౌలర్ అనుకున్నావా.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు! చెత్త కెప్టెన్సీ -
చహల్కు మాత్రమే సాధ్యం.. నలుగురిలో ఒకే ఒక్కడు
ఐపీఎల్ 16వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యజ్వేంద్ర చహల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్ల జాబితాలో డ్వేన్ బ్రావోను అధిగమించి తొలి స్థానంలో నిలిచాడు. దీంతోపాటు మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్లో డెత్ ఓవర్లలో(16 నుంచి 20 ఓవర్లు) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లో చహల్ చోటు సంపాదించాడు. మతీషా పతీరానా 12 వికెట్లతో టాప్లో ఉండగా.. చహల్ 11 వికెట్లతో రెండో స్థానంలో, తుషార్ దేశ్ పాండే 10 వికెట్లతో మూడో స్థానంలో, హర్షల్ పటేల్ 9 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక్కడ విశేషమేమిటంటే టాప్లో ఉన్న నలుగురు బౌలర్లలో ముగ్గురు పేసర్లు ఉంటే చహల్ మాత్రం ఏకైక స్పిన్నర్గా ఉన్నాడు. కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో నితీశ్ రాణా వికెట్ పడగొట్టడం ద్వారా లీగ్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా అవతరించాడు.ఈ మ్యాచ్కు ముందు ఐపీఎల్ లీడింగ్ వికెట్ టేకర్గా ఉండిన డ్వేన్ బ్రావో (161 మ్యాచ్ల్లో 183 వికెట్లు)ను రెండో స్థానానికి వెనక్కునెట్టి ఐపీఎల్ టాప్ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో చహల్, బ్రావోల తర్వాత ముంబై స్పిన్నర్ పియూష్ చావ్లా (176 మ్యాచ్ల్లో 174), అమిత్ మిశ్రా (160 మ్యాచ్ల్లో 172 వికెట్లు), రాజస్థాన్ బౌలర్ అశ్విన్ (196 మ్యాచ్ల్లో 171) టాప్-5లో ఉన్నారు. -
KKR VS RR: చరిత్ర సృష్టించిన చహల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యుజ్వేంద్ర చహల్ చరిత్ర సృష్టించాడు. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యధిక వికెట్లు (143 మ్యాచ్ల్లో 184) సాధించిన బౌలర్గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్-2023లో భాగంగా ఇవాళ (మే 11) కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో నితీశ్ రాణా వికెట్ పడగొట్టడం ద్వారా లీగ్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా అవతరించాడు. ఈ మ్యాచ్కు ముందు ఐపీఎల్ లీడింగ్ వికెట్ టేకర్గా ఉండిన డ్వేన్ బ్రావో (161 మ్యాచ్ల్లో 183 వికెట్లు)ను రెండో స్థానానికి వెనక్కునెట్టి ఐపీఎల్ టాప్ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో చహల్, బ్రావోల తర్వాత ముంబై స్పిన్నర్ పియూష్ చావ్లా (176 మ్యాచ్ల్లో 174), అమిత్ మిశ్రా (160 మ్యాచ్ల్లో 172 వికెట్లు), రాజస్థాన్ బౌలర్ అశ్విన్ (196 మ్యాచ్ల్లో 171) టాప్-5లో ఉన్నారు. కాగా, కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్న కేకేఆర్ 15 ఓవర్ల తర్వాత 4 వికెట్ల నష్టానికి 116 పరుగలు చేసింది. జేసన్ రాయ్ (10), రహ్మానుల్లా గుర్భాజ్ (18), నితిశ్ రాణా (22), ఆండ్రీ రసెల్ (10) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. వెంకటేశ్ అయ్యర్ (49 నాటౌట్), రింకూ సింగ్ (4) క్రీజ్లో ఉన్నారు. ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు పడగొట్టగా.. చహల్, ఆసిఫ్ తలో వికెట్ దక్కించకున్నారు. పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న రాజస్థాన్, కేకేఆర్ జట్లకు ఇది డూ ఆర్ డూమ్యాచ్. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ రెండు జట్లు ఈ మ్యాచ్ తప్పక గెలిచి తీరాలి. చదవండి: సంచలన క్యాచ్.. కొంచెం పట్టు తప్పినా అంతే సంగతి! -
చహల్ చరిత్ర.. టీమిండియా తరపున తొలి బౌలర్గా
రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యజ్వేంద్ర చహల్ ఐపీఎల్లో చరిత్ర సృష్టించాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన చహల్ 29 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఐపీఎల్లో తన పేరిట ఒక రికార్డును లిఖించుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో చహల్ డ్వేన్ బ్రావోతో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు. తాజా మ్యాచ్తో కలిపి ఇప్పటివరకు చహల్ ఐపీఎల్లో 183 వికెట్లు పడగొట్టాడు. బ్రావో కూడా 183 వికెట్లు తీశాడు. అయితే బ్రావో 161 మ్యాచ్ల్లో 183 వికెట్లు తీయగా.. చహల్కు మాత్రం 141 మ్యాచ్లే అవసరమయ్యాయి. ఇక టీమిండియా తరపున ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్గా చహల్ నిలిచాడు. చహల్, బ్రావో తర్వాత పియూష్ చావ్లా 174 వికెట్లతో మూడో స్థానంలో, అమిత్ మిశ్రా 172 వికెట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. రవిచంద్రన్ అశ్విన్ 171 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. -
బిడ్డ ముందే బట్లర్ కు లవ్ ప్రపోజల్ చేసిన చాహల్..
-
నువ్వంటే నాకిష్టం.. నా లవ్ నువ్వే: బట్లర్కు చాహల్ ప్రపోజల్.. వైరల్
టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ మైదానంలోనే కాకుండా ఆఫ్ది ఫీల్డ్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఫన్నీ వీడియోలతో సోషల్ మీడియాలో తన అభిమానులను చాహల్ అలరిస్తుంటాడు. అయితే తాజాగా చాహల్కు సంబంధించిన మరో వీడియో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. చాహల్ ప్రస్తుతం ఐపీఎల్-2023లో బిజీబిజీగా ఉన్నాడు. ఈ మెగా ఈవెంట్లో రాజస్తాన్ రాయల్స్కు చాహల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో తన సహచర ఆటగాడు, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్కు.. చహల్ ఫన్నీగా డేటింగ్ ప్రపోజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ టీమిండియా చేతిలో ఒక చిన్న పూల కుండీని పట్టుకుని మరీప్రపోజ్ చేశాడు. "జోస్ భాయ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వే నా జీవితం. గతేడాది తొలిసారి మిమ్మల్ని చూసినప్పుడే నేను ప్రేమలో పడిపోయాను. ప్రతిరోజు నాకు గుర్తొస్తూనే ఉంటావు. ప్లీజ్ నాతో డేట్కు వస్తారా" అని సరదాగా చహల్ ప్రపోజ్ చేశాడు. అందుకు బదులుగా బట్లర్ "సరే యుజీ.. నేను కచ్చితంగా వస్తాను" అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో చుట్టుపక్కన వారంతా ఒక్కసారిగా చప్పట్లు కొడుతూ గట్టిగా నవ్వుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక రాజస్తాన్ తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 20న ఆర్సీబీతో తలపడనుంది. చదవండి: IPL 2023: తిన్నగా ఆడటమే రాదు.. ఇంకా ప్రయోగాలు ఒకటి! చెత్త బ్యాటింగ్ IPL 2023: విధ్వంసకర వీరుడొచ్చాడు.. వెలగబెట్టిందేమీ లేదు! పాపం పంజాబ్.. The perfect proposal doesn’t exi- 😂 pic.twitter.com/vENeuVtfTq — Rajasthan Royals (@rajasthanroyals) April 20, 2023 -
RR VS LSG: చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్న చహల్... ఈ మ్యాచ్లోనే అవుతుందా..?
ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో ఇవాళ (ఏప్రిల్ 19) జరుగబోయే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. జైపూర్లోని సువాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకాబోయే ఈ మ్యాచ్లో చహల్ మరో 7 వికెట్లు తీస్తే.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ జాబితాలో విండీస్ మాజీ ఆల్రౌండర్ డ్వేన్ బ్రేవో 183 వికెట్లతో (161 మ్యాచ్ల్లో) అగ్రస్థానంలో ఉండగా.. చహల్ ప్రస్తుతం 177 వికెట్లతో (136 మ్యాచ్ల్లో) రెండో స్థానంలో నిలిచాడు. చహల్ ఈ రికార్డును నేటి మ్యాచ్లోనే నెలకొల్పడం కాస్త కష్టమే అయినప్పటికీ అసాధ్యం మాత్రం కాదు. పైగా చహల్ ఈ మ్యాచ్ తమ సొంత మైదానంలో ఆడుతుండటం అతనికి అదనంగా కలిసొచ్చే అంశం. చదవండి: RR VS LSG: అత్యుత్తమ జట్ల మధ్య రసవత్తర సమరం.. గెలుపెవరిది..? అదీ కాక చహల్కు లక్నోపై గణమైన రికార్డు ఉంది. ఐపీఎల్-2022లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్లో చహల్ 4 వికెట్లతో విజృంభించాడు. అదే సీజన్లో జరిగిన రెండో మ్యాచ్లోనూ కీలకమైన దీపక్ హుడా (59) వికెట్ పడగొట్టి సత్తా చాటాడు. ప్రస్తుత సీజన్ ప్రారంభం నుంచి సూపర్ ఫామ్లో ఉన్న చహల్.. ఈ సీజన్లోనూ లీడింగ్ వికెట్ టేకర్గా (5 మ్యాచ్ల్లో 11 వికెట్లు) కొనసాగుతున్నాడు. ఇన్ని సానుకూలమైన అంశాల మధ్య చహల్ నేడు లక్నోతో జరిగే మ్యాచ్లోనే అత్యధిక వికెట్ల ఐపీఎల్ రికార్డును తిరగరాస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటే, రాజస్థాన్-లక్నో జట్ల మధ్య ఇవాళ జరిగే మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ (5 మ్యాచ్ల్లో 4 విజయాలు).. రెండో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ (5 మ్యాచ్ల్లో 3 విజయాలు) అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. అన్ని విభాగాల్లో కాస్త అటుఇటుగా ఉన్న ఈ రెండు జట్లలో విజేత ఎవరో అన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. చదవండి: 14 ఏళ్ల కిందట తండ్రికి ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్న అర్జున్ టెండూల్కర్ -
శ్రేయస్తో చహల్ భార్య ధనశ్రీ తాజా ఫొటో వైరల్! కలిసి వెళ్లేది అందుకేనా?
Shreyas Iyer- Yuzvendra Chahal- Dhanashree Verma: గాయం కారణంగా ఐపీఎల్-2023కి దూరమైన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫొటోలు తాజాగా వైరల్ అవుతున్నాయి. భారత స్టార్ స్పిన్నర్, రాజస్తాన్ రాయల్స్ కీలక బౌలర్ యజువేంద్ర చహల్ భార్య, యూట్యూబర్ ధనశ్రీ వర్మతో అయ్యర్ కలిసి దిగిన ఫొటోలు బయటకు వచ్చాయి. ధనశ్రీ స్వయంగా శనివారం తన ఇన్స్టా స్టోరీలో వీటిని షేర్ చేయడం గమనార్హం. ‘‘మై క్యూటీస్’’ అంటూ హార్ట్ ఎమోజీతో తన స్నేహితురాలు పంచుకున్న ఫొటోను చహల్ సతీమణి షేర్ చేసింది. ఇందులో ఆమె స్నేహితులతో పాటు ఓ మూలన అయ్యర్ కూడా కనిపించాడు. ఇందులో శ్రేయస్ సోదరి శ్రేష్ట అయ్యర్ కూడా ఉండటం విశేషం. కాగా గతంలో.. టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్- దేవిషా దంపతులతో ధనశ్రీ, శ్రేయస్ దిగిన ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. విడాకుల రూమర్లు అంతకుముందే ధనశ్రీ తన ఇన్స్టా అకౌంట్ నుంచి చహల్ ఇంటి పేరును తొలగించడం.. తర్వాత ఈ ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో విడాకుల రూమర్లు గుప్పుమన్నాయి. దీంతో స్వయంగా చహల్- ధనశ్రీ స్పందిస్తూ పుకార్లకు అడ్డుకట్ట వేశారు. అయితే, ఇటీవల టీమిండియా పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ పెళ్లిలోనూ కెప్టెన్ రోహిత్ శర్మ- రితికా దంపతులతో కలిసి ధనశ్రీ- శ్రేయస్ దిగిన ఫొటోలతో మరోసారి వీరు నెట్టింట ట్రెండ్ అయ్యారు. తాజాగా స్నేహితుల ఇంట్లో జరిగిన ఇఫ్తార్ పార్టీకి శ్రేయస్, శ్రేష్టతో పాటు ధనశ్రీ కూడా హాజరైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో మళ్లీ వీరి పేర్లు హైలైట్ అవుతున్నాయి. కలిసి వెళ్లేది అందుకేనా.. డాక్టర్ ధనశ్రీ వర్మ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్. అలాగే కొరియోగ్రాఫర్ కూడా! నిజానికి శ్రేయస్ సోదరి శ్రేష్ట కూడా కొరియాగ్రాఫర్గా రాణించాలని కలలు కంటోంది. ఈ క్రమంలో వీరిద్దరికి స్నేహం కుదరగా.. శ్రేయస్తో కూడా ధనశ్రీ ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టిందని టాక్. ఇప్పటికే అయ్యర్తో గతంలో ఓ డాన్స్ వీడియో షేర్ చేసిన ధనశ్రీ అతడి ఆట తీరును ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టింది. దీంతో కొంతమంది అయ్యర్తో ధనశ్రీ స్నేహాన్ని విమర్శిస్తూ కామెంట్లు చేస్తుండగా.. అభిమానులు మాత్రం తన ఫ్రెండ్ సోదరుడితో ధనశ్రీ ఫ్రెండ్షిప్ చేస్తే పెడర్థాలు తీస్తారా అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఏదేమైనా.. ఏదో రకంగా వార్తల్లో ఉండటం ధనశ్రీకి పరిపాటి అయిందని ఇంకొందరు సెటైర్లు వేస్తున్నారు. తను దొరకడం నా అదృష్టం ధనశ్రీ వీలు చిక్కినప్పుడల్లా భర్త చహల్తో కలిసి ప్రయాణాలు చేస్తుంది. అతడిని ప్రోత్సహిస్తూ భర్త సాధించే విజయాలను ఆస్వాదిస్తుంది. ఇటీవల సన్రైజర్స్తో హైదరాబాద్లో రాజస్తాన్ మ్యాచ్కు విచ్చేసిన ధనశ్రీ.. చహల్ వికెట్లు తీసినపుడు సెలబ్రేషన్ చేసుకున్న తీరు హైలైట్గా నిలిచింది. ఇక మ్యాచ్ తర్వాత చహల్ మాట్లాడుతూ.. తన భార్య గురించి గొప్పగా చెబుతూ.. ఆమెలాంటి జీవిత భాగస్వామి దొరకడం అదృష్టమని పొంగిపోయాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్తో శనివారం నాటి మ్యాచ్లో చహల్ బిజీగా ఉన్న సమయంలో ధనశ్రీ ఫొటోలు షేర్ చేసింది. -
చహల్ చరిత్ర.. మలింగను దాటి రెండో స్థానంలోకి
రాజస్థాన్ స్టార్ స్పిన్ బౌలర్ యజ్వేంద్ర చహల్ చరిత్ర సృష్టించాడు. రాజస్తాన్తో మ్యాచ్లో జితేశ్ శర్మ వికెట్ తీయడం ద్వారా చహల్ ఐపీఎల్లో 171 వ వికెట్ సాధించాడు ఈ క్రమంలో ఐపీఎల్లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్గా రికార్డులకెక్కాడు. చహల్ ఐపీఎల్లో ఇప్పటివరకు 133 మ్యాచ్లు ఆడి 171 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ సైతం 161 మ్యాచ్ల్లో 170 వికెట్లు పడగొట్టి.. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో చహల్తో సమానంగా ఉన్నాడు. తాజాగా చహల్ మలింగను దాటి రెండో స్థానంలో నిలిచాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్ల రికార్డు కరీబియన్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో (183) పేరిట నమోదై ఉంది. ఇక ఈ సీజన్లో మరో 14 వికెట్లు పడగొడితే ఐపీఎల్లో హైయెస్ట్ వికెట్ టేకర్గా నిలుస్తాడు. ప్రస్తుత సీజన్లో చహల్కు మినహా మరే బౌలర్కు ఈ రికార్డు సాధించే అవకాశం లేదు. 2023 ఐపీఎల్ ఆడుతున్న బౌలర్లలో అశ్విన్ (రాజస్థాన్, 158), భువనేశ్వర్ కుమార్ (ఎస్ఆర్హెచ్, 154), సునీల్ నరైన్ (కేకేఆర్, 153) మాత్రమే 150 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో ఉన్నారు. -
'మాట తప్పాడు.. చాలా బ్యాడ్గా అనిపిస్తోంది'
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా శనివారం రాజస్తాన్ రాయల్స్తో హోంగ్రౌండ్లో మ్యాచ్ ఆడిన ఎస్ఆర్హెచ్ దారుణ పరాజయాన్ని చవిచూసింది. 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసిన ఎస్ఆర్హెచ్ 72 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. రాజస్తాన్ బౌలర్ చహల్ నాలుగు వికెట్లతో ఎస్ఆర్హెచ్ పతనాన్ని శాసించాడు. ఇక బుధవారం రాజస్తాన్ పంజాబ్ కింగ్స్తో తర్వతి మ్యాచ్ ఆడనుంది. కాగా పంజాబ్కు వెళ్లే సమయంలో విమానంలో చహల్ను రాజస్తాన్ ప్రెజంటేటర్ ఫన్నీ ఇంటర్య్వూ చేశాడు. చహల్.. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో నాలుగు వికెట్లు తీశావు.. ఉమ్రాన్ బాయ్ ఢిపెన్స్ చేయకపోయుంటే నీకు ఐదో వికెట్ లభించేది.. ఇప్పుడు నువ్వు ఉమ్రాన్కు ఏం చెప్పాలనుకుంటున్నావ్ అని అడిగాడు. ''చెప్పడానికి ఏం లేదు.. నేను ఉమ్రాన్ను కలిసినప్పుడు నాకు బాగా గుర్తు అతను నా బౌలింగ్లో మూడు సిక్సర్లు కొడుతా అని చెప్పాడు.. కానీ ఉమ్రాన్ మాట తప్పాడు.. ఇది చాలా బ్యాడ్గా అనిపించింది. అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక రాజస్తాన్తో మ్యాచ్లో గంటకు 145 కిమీ వేగంతో బంతులేసిన ఉమ్రాన్ మాలిక్.. దేవదత్ను క్లీన్బౌల్డ్ చేసిన బంతి మాత్రం 150 కిమీ స్పీడుతో వచ్చినట్లు తెలుస్తోంది. 🎥Lesson learnt: You cannot escape Taran 😂😂 pic.twitter.com/5XW5CCXqno — Rajasthan Royals (@rajasthanroyals) April 4, 2023 చదవండి: చరిత్రలో ఇదే తొలిసారి.. పురుషుల క్రికెట్లో కొత్త శకం -
IPL 2023: పంజాబ్ కింగ్స్తో మ్యాచ్.. భారీ రికార్డుపై కన్నేసిన చహల్
గౌహతి వేదికగా ఇవాళ (ఏప్రిల్ 5) రాజస్థాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య కీలక సమరం జరుగనుంది. రాత్రి 7: 30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రస్తుత ఎడిషన్లో ఇరు జట్లు ఆడిన చెరో మ్యాచ్లో విజయం సాధించి ఉత్సాహంతో ఉరకలేస్తున్నాయి. కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించగా.. సన్రైజర్స్పై రాయల్స్ 72 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, మరో విజయంపై ధీమాగా ఉంది. భారీ రికార్డుపై కన్నేసిన చహల్.. పంజాబ్తో ఇవాళ జరుగబోయే మ్యాచ్లో రాజస్థాన్ స్టార్ స్పిన్ బౌలర్ యుజ్వేంద్ర చహల్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్లో చహల్ ఓ వికెట్ పడగొడితే, ఐపీఎల్లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్గా రికార్డుల్లోకెక్కుతాడు. చహల్ ఐపీఎల్లో ఇప్పటివరకు 132 మ్యాచ్లు ఆడి 170 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ సైతం 161 మ్యాచ్ల్లో అన్నే వికెట్లు పడగొట్టి ఐపీఎల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో చహల్తో సమానంగా ఉన్నాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్ల రికార్డు కరీబియన్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో (183) పేరిట నమోదై ఉంది. సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్లు పడగొట్టడం ద్వారా మలింగ్ రికార్డును సమం చేసిన చహల్.. ఈ సీజన్లో మరో 14 వికెట్లు పడగొడితే ఐపీఎల్లో హైయెస్ట్ వికెట్ టేకర్గా ఆవిర్భవిస్తాడు. ప్రస్తుత సీజన్లో చహల్కు మినహా మరే బౌలర్కు ఈ రికార్డు సాధించే అవకాశం లేదు. 2023 ఐపీఎల్ ఆడుతున్న బౌలర్లలో అశ్విన్ (రాజస్థాన్, 158), భువనేశ్వర్ కుమార్ (ఎస్ఆర్హెచ్, 154), సునీల్ నరైన్ (కేకేఆర్, 153) మాత్రమే 150 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో ఉన్నారు. -
IPL 2023: చహల్ సంచలన రికార్డు.. ఎవరికీ అందనంత ఎత్తులో! అశూ, బుమ్రా వెనకే!
IPL 2023- Sunrisers Hyderabad vs Rajasthan Royals: గతేడాది అత్యధిక వికెట్లు(27) తీసి పర్పుల్ క్యాప్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఐపీఎల్-2023లోనూ శుభారంభం చేశాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో ఆదివారం నాటి మ్యాచ్లో చహల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఉప్పల్ మ్యాచ్లో నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. రైజర్స్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్(27), పవర్ హిట్టర్గా పేరొందిన హ్యారీ బ్రూక్(13) రూపంలో కీలక వికెట్లు తీసి రైజర్స్ను కోలుకోలేని దెబ్బ కొట్టిన చహల్.. ఆఖర్లో ఆదిల్ రషీద్(18), కెప్టెన్ భువనేశ్వర్కుమార్ (6)లను కూడా అవుట్ చేశాడు. ఈ క్రమంలో చహల్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఎవరికీ అందనంత ఎత్తులో టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా యజువేంద్ర చహల్ చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో 300కు పైగా వికెట్లతో రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ బౌలర్లకు అందనంత ఎత్తులో నిలిచాడు. అదే విధంగా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. అమిత్ మిశ్రాను వెనక్కి నెట్టిన చహల్.. లసిత్ మలింగతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. సన్రైజర్స్తో మ్యాచ్లో హ్యారీ బ్రూక్ను అవుట్ చేయడం ద్వారా పొట్టి ఫార్మాట్లో 300వ వికెట్ నమోదు చేసిన చహల్కు ఐపీఎల్లో ఇది 167వ వికెట్. ఇక రషీద్, భువీ వికెట్లు కూడా పడగొట్టి ఈ సంఖ్యలను 303, 170గా మార్చుకున్నాడు చహల్. అదే విధంగా సన్రైజర్స్పై రాజస్తాన్ భారీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన టీమిండియా క్రికెటర్లు ►యజువేంద్ర చహల్- 303 ►రవిచంద్రన్ అశ్విన్- 287 ►పీయూశ్ చావ్లా- 276 ►అమిత్ మిశ్రా- 272 ►జస్ప్రీత్ బుమ్రా- 256. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు(ఇప్పటి వరకు) 1.డ్వేన్ బ్రావో- 183 వికెట్లు 2. యజువేంద్ర చహల్-170, లసిత్ మలింగ(శ్రీలంక)- 170 వికెట్లు. చదవండి: మార్కరమ్ విధ్వంసకర ఇన్నింగ్స్.. సౌతాఫ్రికాకు ప్రపంచకప్ బెర్తు ఖరారు! ఒక్కడివే 175 కొట్టావు.. కానీ ఇక్కడ అంతా కలిసి.. IPL 2023- Bhuvneshwar Kumar: నువ్వసలు పనికిరావు.. పైగా ఇలా మాట్లాడతావా? చెత్తగా ఆడిందే గాక.. The first Indian to 300 T20 wickets. 👏💗 pic.twitter.com/Q8PDmhHR4V — Rajasthan Royals (@rajasthanroyals) April 2, 2023 Picked up where he left off in 2022. What a performance, Yuzi bhai! 💪💗 pic.twitter.com/t14Erw8ab5 — Rajasthan Royals (@rajasthanroyals) April 2, 2023 -
భర్త ఘనతను దగ్గరుండి ఎంజాయ్ చేసిన ధనశ్రీ
ఐపీఎల్ 16వ సీజన్ను యజ్వేంద్ర చహల్ ఘనంగా ఆరంభించాడు. ఆదివారం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో ఈ రాజస్తాన్ బౌలర్ తన బౌలింగ్తో అదరగొట్టాడు. 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.ఈ నేపథ్యంలో చహల్ తన ఖాతాలో రెండు రికార్డులను జమ చేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన చహల్కు టి20ల్లో ఇది 300వ వికెట్. టీమిండియా తరపున ఈ ఫీట్ సాధించిన తొలి స్పిన్నర్గా.. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్గా ఏకకాలంలో రికార్డు సాధించాడు. కాగా చహల్ సాధించిన ఈ ఘనతను భార్య ధనశ్రీ వర్మ ఎంజాయ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్కు ధనశ్రీ వర్మ హాజరైంది. భర్త టి20ల్లో 300వ వికెట్ సాధించగానే స్టాండ్స్లో ఉన్న ధనశ్రీ ఒక్కసారిగా సంతోషంతో గెంతులేసి చప్పట్లతో చహల్కు అభినందనలు పంపించింది. ఈ సమయంలో ఆమె మొహం నవ్వుతో వెలిగిపోయింది. ఈ సమయంలో అక్కడే ఉన్న అభిమానులు.. చహల్కు ఇంతలా సపోర్ట్ చేసే భార్య దొరకడం నిజంగా అతని అదృష్టం అని మనసులో అనుకునే ఉంటారు. ధనశ్రీ ఎంజాయ్ చేస్తున్న వీడియోపై మీరు ఒక లుక్కేయండి. 💗💗💗 pic.twitter.com/zdHh2WAzAW — Rajasthan Royals (@rajasthanroyals) April 2, 2023 -
చరిత్ర సృష్టించిన చహల్..
ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యజ్వేంద్ర చహల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్గా చహల్ నిలిచాడు. ఆదివారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో చహల్ ఈ ఫీట్ అందుకున్నాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ను ఔట్ చేయడం ద్వారా ఐపీఎల్లో చహల్ 167వ వికెట్ సాధించాడు. తద్వారా అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ల జాబితాలో చహల్ అగ్రస్థానంలో నిలిచాడు. మ్యాచ్లో మొత్తంగా నాలుగు వికెట్లు తీసిన చహల్ 170 వికెట్లతో తొలి స్థానంలో ఉండగా.. అమిత్ మిశ్రా(167 వికెట్లు) రెండో స్థానంలో, పియూష్ చావ్లా(157 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్(157 వికెట్లు) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఇక సునీల్ నరైన్ 153 వికెట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. అంతేకాదు టి20ల్లో అన్ని మ్యాచ్లు(లీగ్లు, అంతర్జాతీయం) కలిపి చహల్కు ఇది 300వ వికెట్ కావడం విశేషం. ఇలా చహల్ ఒక్క వికెట్తో రెండు రికార్డులను కొల్లగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్పై రాజస్తాన్ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఒక దశలో వంద పరుగులు దాటుతుందా అన్న అనుమానం కలిగినప్పటికి చివర్లో అబ్దుల్ సమద్(32 నాటౌట్), ఉమ్రాన్ మాలిక్(19 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో వంద పరుగులు దాటగలిగింది. రాజస్తాన్ బౌలర్లలో చహల్ నాలుగు వికెట్లు తీయగా.. బౌల్ట్ రెండు, అశ్విన్, హోల్డర్లు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు రాజస్తాన్ రాయల్స్ బట్లర్, శాంసన్, జైశ్వాల్లు అర్థశతకాలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు చేసింది. -
ఐపీఎల్-2023లో బద్దలయ్యేందుకు రెడీగా రికార్డులివే..!
మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 16వ ఎడిషన్లో పలు రికార్డులు బద్దలయ్యేందుకు రెడీగా ఉన్నాయి. ఆ రికార్డులేంటో ఓసారి లుక్కేద్దాం. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు: ఇప్పటివరకు ఈ రికార్డు విండీస్ ఆటగాడు డ్వేన్ బ్రావో పేరిట ఉంది. ఈ సీఎస్కే మాజీ ఆల్రౌండర్ 183 వికెట్లు పడగొట్టి ఐపీఎల్ హైయ్యెస్ట్ వికెట్ టేకర్గా చలామణి అవుతున్నాడు. ఈ రికార్డును రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యుజ్వేంద్ర చహల్ బద్దలు కొట్టే అవకాశం ఉంది. చహల్ ఖాతాలో ప్రస్తుతం 166 వికెట్లు ఉన్నాయి. రానున్న సీజన్లో అతను మరో 18 వికెట్లు తీస్తే బ్రావో రికార్డు బ్రేక్ అవుతుంది. అత్యధిక సెంచరీలు: ఐపీఎల్లో అత్యధిక సెంచరీల రికార్డు క్రిస్ గేల్ పేరిట నమోదై ఉంది. యూనివర్సల్ బాస్ ఖాతాలో 6 సెంచరీలు ఉండగా.. ఆర్ఆర్ జోస్ బట్లర్, ఆర్సీబీ విరాట్, పంజాబ్ రాహుల్, ఢిల్లీ వార్నర్ ఈ రికార్డును బ్రేక్ చేసేందుకు రెడీగా ఉన్నారు. అత్యధిక సిక్సర్ల రికార్డు: రాబోయే సీజన్లో ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న సెకెండ్ హైయ్యెస్ట్ సిక్సర్స్ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది. ఏబీడీ ఖాతాలో 251 సిక్సర్లు ఉండగా.. ఈ రికార్డును రోహిత్ శర్మ (240) బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. ఈ జాబితాలో అగ్రస్థానంలో క్రిస్ గేల్ (357) ఉన్నాడు. అత్యధిక డక్స్: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ రానున్న సీజన్లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేసే అవకాశం ఉంది. హిట్మ్యాన్ మరో మ్యాచ్లో డకౌటైతే మన్దీప్ సింగ్ (14)ను అధిగమించి హోల్ అండ్ సోల్గా చెత్త రికార్డుకు ఓనర్ అవుతాడు. ఇవే కాకుండా రానున్న సీజన్లో పలువురు ఆటగాళ్లు ఐపీఎల్లో ఎవరికీ సాధ్యపడని పలు మైలురాళ్లను అధిగమించే అవకాశం ఉంది. అవేంటంటే.. అత్యధిక మ్యాచ్లు: సీఎస్కే సారధి ఎంఎస్ ధోని రానున్న ఐపీఎల్ సీజన్లో 250 మ్యాచ్ల మార్కును అందుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ధోని ఐపీఎల్లో 234 మ్యాచ్లు ఆడి టాప్లో ఉన్నాడు. అత్యధిక పరుగులు: ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ రానున్న సీజన్లో 7000 పరుగుల మైలురాయిని అధిగమించే అవకాశం ఉంది. కోహ్లి ఖాతాలో ప్రస్తుతం 6624 పరుగులుండగా.. ధవన్ ఖాతాలో 6244 రన్స్ ఉన్నాయి. అలాగే వార్నర్ (5881), రోహిత్ శర్మ (5879)లు 6000 పరుగుల క్లబ్లో చేరే అవకాశం ఉంది. అత్యధిక క్యాచ్లు: ఐపీఎల్లో ఇప్పటివరకు 97 క్యాచ్లు అందుకున్న రోహిత్ శర్మ, 93 క్యాచ్లు అందుకున్న విరాట్ కోహ్లి 100 క్యాచ్ల క్లబ్లో చేరే అవకాశం ఉంది. ఈ రికార్డు సురేశ్ రైనా (109) పేరిట ఉంది. -
ఫోజులు తర్వాత.. ముందు బౌలింగ్ మెరుగుపరుచుకో!
పాకిస్తాన్ పేసర్ హసన్ అలీ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో బిజీగా ఉన్నాడు. ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న హసన్ అలీ టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ ఫోజును కాపీ కొట్టాలని ప్రయత్నించాడు. ఐపీఎల్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్కు ఆడిన సమయంలో చహల్ బౌండరీ లైన్ అవతల.. బీచ్లో రిలాక్స్ మోడ్లో కూర్చొన్నట్లుగా ఫోజు ఇచ్చాడు. చహల్ ఇచ్చిన ఆ ఫోజు ఎవర్గ్రీన్గా మిగిలిపోయింది. ఆ తర్వాత ఎన్నోసార్లు ఎంతోమంది ఆటగాళ్లు చహల్లా ఫోజు ఇవ్వడానికి ప్రయత్నించారు. అప్పటికి, ఇప్పటికి ఎప్పుడు చహల్ ఫోజు ఐకానిక్లా మారిపోయింది. తాజాగా పెషావర్ జాల్మీతో ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా హసన్ అలీ చహల్ ఫోజును ఇమిటేట్ చేయాలనుకున్నాడు. అయితే చహల్ అప్పుడు మైదానం బటయ చేస్తే.. హసన్ అలీ మాత్రం గ్రౌండ్లోనే ఐకానిక్ ఫోజును ఇచ్చాడు. ఈ ఫోటోను పాకిస్తాన్ సూపర్ లీగ్ తన ట్విటర్లో షేర్ చేస్తూ క్యాప్షన్ ఏం ఇస్తారు అని అడిగింది. అయితే మ్యాచ్లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన హసన్ అలీ 37 పరుగులిచ్చుకొని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో సొంత అభిమానులే హసన్ అలీపై తిట్ల దండకం మొదలుపెట్టారు. ''ఫోజులు తర్వాత ఇవ్వు.. ముందు నీ బౌలింగ్ ప్రదర్శనను మెరుగుపరుచుకో''.. ''ఈ ఫోజులకేం తక్కువ లేదు.. బౌలింగ్ బాగా చేస్తే మంచిది'' అంటూ చివాట్లు పెట్టారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పెషావర్ జాల్మీ 12 పరుగుల తేడాతో ఇస్లామాబాద్ యునైటెడ్పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జాల్మీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. బాబర్ ఆజం 64 పరుగులు చేయగా.. మహ్మద్ హారిస్ 34 పరుగులు చేశాడు. అనంతరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు మాత్రమే చేసింది. షోయబ్ మక్సూద్ 60, అలెక్స్ హేల్స్ 57 పరుగులు చేశారు. Caption this? #HBLPSL8 | #SabSitarayHumaray | #IUvPZ pic.twitter.com/9MZM7BbE4Y — PakistanSuperLeague (@thePSLt20) March 16, 2023 Jalebia zyada bik gai inki shayad — Noor ul Ain (@thenoorulain13) March 16, 2023 -
RRRతో RR.. వైరలవుతున్న రాజస్థాన్ రాయల్స్ ట్వీట్
ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ నిన్న (ఫిబ్రవరి 11) చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది. ఆర్ఆర్ స్టార్ బౌలర్, టీమిండియా పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ యుజ్వేంద్ర చహల్, అతని భార్య ధనశ్రీ వర్మ నిన్న హైదరాబాద్లో జరిగిన ఫార్ములా ఈ-కార్ రేసింగ్ సందర్భంగా ప్రముఖ దర్శకుడు, RRR ఫేమ్ రాజమౌళిని కలిశాడు. When RR met RRR. 🔥 pic.twitter.com/y8fjeNwibX — Rajasthan Royals (@rajasthanroyals) February 11, 2023 ఈ సందర్భంగా చహల్ దంపతులు రాజమౌళితో కలిసి ఫోటో దిగారు. ఈ ఫోటోను ఆర్ఆర్ యాజమాన్యం తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా నెట్టింట వైరలవుతోంది. ఈ పోస్ట్కు ఆర్ఆర్ యాజమాన్యం.. RR.. RRRని కలిపినప్పుడు అన్న ఆసక్తికర క్యాప్షన్ను పెట్టింది. కాగా, చహల్ కొద్దిరోజుల కిందట RRR మరో ఫేమ్ తారక్ను కలిశాడు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ముందు చహల్తో పాటు టీమిండియా సభ్యులు సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్లు కూడా తారక్తో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. సూర్యకుమార్ యాదవ్ అయితే అతని భార్య కలిసి తారక్తో ఫోటో దిగాడు. అప్పుడు ఈ ఫోటోలు కూడా నెట్టింట హల్చల్ చేశాయి. ఇదిలా ఉంటే, టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో ఆసీస్తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతుండగా.. టెస్ట్ జట్టులో స్థానం దక్కని చహల్ ఖాళీగా ఉన్నాడు. కాగా, 32 ఏళ్ల చహల్ భారత్ తరఫున 72 వన్డేలు, 75 టీ20 మ్యాచ్లు ఆడాడు. వన్డేల్లో 27.13 సగటుతో 121 వికెట్లు పడగొట్టిన చహల్.. టీ20ల్లో 24.68 సగటున 91 వికెట్లు సాధించి, భారత్ తరఫున లీడింగ్ టీ20 వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. -
హైదరాబాద్లో ఫార్ములా ఈ రేసింగ్.. సెలబ్రిటీల సందడి
సాక్షి, హైదరాబాద్: నగరం వేదికగా జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక ఫార్ములా- ఈ రేస్ ఛాంపియన్షిప్లో శనివారం పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. సినీ, క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలు హాజరయ్యారు. ఫార్ములా వన్ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన ఫార్ములా-ఈ కావడంతో భాగ్యనగరం పూర్తి సందడిగా మారింది. హీరో రామ్చరణ్తో పాటు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సహా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్, స్పిన్నర్ యజ్వేంద్ర చహల్, దీపక్ చహర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ కూడా రేసును వీక్షించడానికి వచ్చాడు. ప్రధాన రేసుకు ముందు నిర్వహించిన ప్రాక్టీస్ రేసులను తిలకించిన క్రికెటర్లు సంతోషం వ్యక్తం చేశారు. నెక్లెస్ రోడ్డులో రయ్యుమని దూసుకెళ్తున్న రేసింగ్ కార్లను చూస్తుంటే ముచ్చటేస్తుందని క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన రేసు ప్రారంభమైంది. మొత్తం 2.8 కిమీ స్ట్రీట్ సర్క్యూట్లో 11 ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన 22 రేసర్లు పోటీల్లో పాల్గొంటున్నారు. ఫార్ములా-ఈలో ప్రస్తుతం 9వ సీజన్ నడుస్తోంది. ఇందులో ఇప్పటికే మూడు రేస్లు పూర్తయ్యాయి. మెక్సికో సిటీ మొదటి రేస్కు ఆతిథ్యం ఇవ్వగా, సౌదీ అరేబియాలోని దిరియాలో తర్వాతి రెండు రేస్లు జరిగాయి. హైదరాబాద్లో జరగబోతోంది ఈ సీజన్లో నాలుగో రేస్. ప్రస్తుతం మూడు రేస్ల తర్వాత మొత్తం 76 పాయింట్లతో ఆండ్రెటీ టీమ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, పోర్‡్ష (74) రెండో స్థానంలో ఉంది. Master Blaster #SachinTendulkar at #HyderabadEPrix venue pic.twitter.com/EpqSOt1xML — Sarita Avula (@SaritaTNews) February 11, 2023 He was there for the inaugural Formula 1 race 12 years ago. He is here for the first Formula E race in India @sachin_rt pic.twitter.com/ygDYTNpwuT — Bharat Sharma (@sharmabharat45) February 11, 2023 -
గిల్పై ఇషాన్ కిషన్ ఆగ్రహం.. ఏం పట్టనట్లుగా చహల్
న్యూజిలాండ్తో జరిగిన వన్డే, టి20 సిరీస్లను చేజెక్కించుకున్న టీమిండియా ఫుల్ జోష్లో ఉంది. ముఖ్యంగా ఈ సిరీస్ శుబ్మన్ గిల్కు బాగా ఉపయోగపడింది. కీలకమైన వన్డే వరల్డ్కప్కు ముందు అతను మంచి ఫామ్ కనబరుస్తుండడం.. వరుస సెంచరీలతో జట్టులో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. ఇక కివీస్తో జరిగిన చివరి టి20మ్యాచ్లో గిల్ సుడిగాలి శతకంతో టి20 ప్లేయర్గా పనికిరాడన్న అపవాదును తొలగించుకున్నాడు. అయితే ఇషాన్ కిషన్ మాత్రం తన పేలవ ప్రదర్శనతో జట్టులో స్థానం కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటున్నాడు. సిరీస్ ముగిసిన అనంతరం శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, యజ్వేంద్ర చహల్లు కలిసి చేసిన ఫన్నీ వీడియో ప్రస్తుతం నవ్వులు పూయిస్తుంది. పాపులర్ యూత్ షో ఎంటీవీ రోడీస్లో ఆడిషన్ ఎపిసోడ్ను ఈ ముగ్గరు రీక్రియేట్ చేశారు. చహల్ దర్శకత్వం చేయగా.. గిల్, ఇషాన్లు తమ యాక్షన్ను షురూ చేశారు. వీడియోలో ఇషాన్ కిషన్ గొరిల్లా లాగా జంప్ చేయడం అందరిని ఆకట్టుకుంటుంది. ఆడిషన్లో భాగంగా సరైన ప్రదర్శన ఇవ్వని గిల్ను ఇషాన్ కిషన్ తిట్టడం.. ఆపై చెంపలు వాయించుకోమనడం లాంటివి సరదాగా అనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోనూ గిల్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. వీడియోను బాగా ఎంజాయ్ చేసిన నెటిజన్లు వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు. పరిమిత ఓవర్ల క్రికెట్ అనంతరం టీమిండియా టెస్టు క్రికెట్కు సిద్ధమవుతోంది.ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం ఇప్పటికే టీమిండియా నాగ్పూర్కు చేరుకుంది. ఫిబ్రవరి 9న ఇరుజట్ల మధ్య తొలిటెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టు సిరీస్ టీమిండియాకు చాలా కీలకం. ఇప్పటికే డబ్ల్యూటీసీ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా ఆస్ట్రేలియా ఫైనల్కు చేరుకుంది. ఆసీస్తో సిరీస్ను టీమిండియా 3-1తో గెలిస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడే చాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 10 టెస్టుల్లో గెలుపు, ఒక ఓటమి, నాలుగు డ్రాలతో కలిపి 75.56 పర్సంటైల్ పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. ఐదు టెస్టుల్లో గెలుపు, నాలుగింటిలో ఓటమి, ఒక డ్రాతో కలిపి 58.93 పర్సంటైల్ పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉంది. View this post on Instagram A post shared by Ꮪhubman Gill (@shubmangill) చదవండి: ఆసీస్తో తొలి టెస్టు.. నాగ్పూర్ చేరుకున్న టీమిండియా -
చహల్ అరుదైన రికార్డు.. తొలి భారత బౌలర్గా!
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అరుదైన రికార్డును సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా చహల్ నిలిచాడు. లక్నో వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో ఒక్క వికెట్ పడగొట్టిన చహల్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. చహల్ 75 మ్యాచ్ల్లో 91 వికెట్లు సాధించాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా వెటరన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్(90) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో భువీ రికార్డును చహల్ బ్రేక్ చేశాడు. ఇక ఓవరాల్గా టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కివీస్ వెటరన్ పేసర్ టిమ్ సౌథీ (107 మ్యాచ్ల్లో 134) అగ్రస్థానంలో ఉండగా.. షకీబ్ అల్ హసన్ (109 మ్యాచ్ల్లో 128), రషీద్ ఖాన్ (74 మ్యాచ్ల్లో 122) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. చదవండి: బుమ్రా 'ఓ బేబీ బౌలర్'.. దారుణంగా అవమానించిన పాక్ మాజీ ఆటగాడు -
పాండ్యాది చెత్త నిర్ణయం.. నంబర్ 1 బౌలర్ విషయంలో ఎందుకలా? హుడాను మాత్రం..
India vs New Zealand, 2nd T20I: న్యూజిలాండ్తో రెండో టీ20లో టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. లక్నోలో జరిగిన ఆదివారం నాటి మ్యాచ్లో రెండు ఓవర్ల బౌలింగ్లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ప్రమాదకర బ్యాటర్ ఫిన్ అలెన్ను నాలుగో ఓవర్లోనే పెవిలియన్కు పంపి టీమిండియాకు శుభారంభం అందించాడు. పొదుపుగా బౌలింగ్ కివీస్ ఇన్నింగ్స్లో భాగంగా చహల్ వేసిన ఈ మొదటి ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ప్రత్యర్థి బ్యాటర్లను తిప్పలు పెట్టాడు. అలాగే ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఆరో ఓవర్లో బరిలోకి దిగిన యుజీ.. 4 పరుగులు మాత్రమే ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేశాడు. కానీ.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రం ఆ తర్వాత చహల్ చేతికి బంతినివ్వలేదు. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తిచేయనివ్వలేదు. ఈ విషయంపై స్పందించిన టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ హార్దిక్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. చెత్త నిర్ణయం చహల్ విషయంలో కెప్టెన్ నిర్ణయం తనని ఆశ్చర్యపరిచిందన్న గౌతీ.. టీ20 ఫార్మాట్లో జట్టులో నంబర్ స్పిన్నర్గా ఉన్న బౌలర్ను ఎలా పక్కనపెడతారని ప్రశ్నించాడు. ఈ మేరకు బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మ్యాచ్ అనంతర చర్చలో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ‘‘నాకైతే అమితాశ్చర్యం కలిగింది. ఇలాంటి వికెట్పై ఈ నిర్ణయం తీసుకోవడమెలా జరిగిందన్న ప్రశ్నకు నా దగ్గరైతే సమాధానం ఉండదు. టీ20 ఫార్మాట్లో మీకున్న నంబర్ 1 స్పిన్నర్ చహల్. అలాంటిది తనతో రెండు ఓవర్లే వేయించాడు. అప్పటికే తను ఫిన్ అలెన్ వంటి కీలక ఆటగాడిని అవుట్ చేశాడు. అయినా సరే బౌలింగ్ కోటా పూర్తి చేయనివ్వకపోవడం నాకైతే చెత్త నిర్ణయం అనిపిస్తోంది’’ అని గంభీర్.. హార్దిక్ పాండ్యాను విమర్శించాడు. హుడా విషయంలో అలా ఎలా? చహల్కు రెండు ఓవర్లు ఇవ్వడమే ఒక ఎత్తైతే.. దీపక్ హుడాతో నాలుగు ఓవర్లు వేయించడం తనను మరింత ఆశ్చర్యానికి గురిచేసిందంటూ గంభీర్ విస్మయం వ్యక్తం చేశాడు. ‘‘యువ బౌలర్లు అర్ష్దీప్ సింగ్ లేదంటే శివం మావికి అవకాశం ఇవ్వాలనుకోవడంలో తప్పు లేదు. అలాంటపుడు చహల్తో మొదటి, చివరి ఓవర్లు వేయిస్తే సరి. లక్నో పిచ్పై అతడు న్యూజిలాండ్ను 80 లేదంటే 85 పరుగులకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించేవాడు. కానీ హుడాతో 4 ఓవర్లు వేయించారు. అక్కడే ట్రిక్ మిస్ అయింది’’అని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఎక్కువ పరుగులు ఇచ్చింది ఎవరంటే? ఈ మ్యాచ్లో స్పిన్ ఆల్రౌండర్ దీపక్ హుడా 4 ఓవర్ల బౌలింగ్లో 17 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇక అందరికంటే అత్యధికంగా పేస్ ఆల్రౌండర్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 4 ఓవర్లలో 25 పరుగులు సమర్పించుకుని ఒక వికెట్ పడగొట్టగలిగాడు. మిగతా వాళ్లలో వాషింగ్టన్ సుందర్కు ఒకటి, కుల్దీప్ యాదవ్కు ఒకటి, అర్ష్దీప్ సింగ్కు రెండు వికెట్లు దక్కాయి. ఇదిలా ఉంటే.. కివీస్తో రెండో మ్యాచ్లో ఒక వికెట్ తీసిన చహల్.. అంతర్జాతీయ టీ20లలో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా అవతరించాడు. ప్రస్తుతం 91 వికెట్లు తన ఖాతాలో ఉన్నాయి. ఇక రెండో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. చదవండి: Hardik Pandya: ఇదేం పిచ్.. షాక్కు గురయ్యాం.. టీ20 కోసం చేసింది కాదు.. క్యూరేటర్లు ఇకనైనా.. IND vs NZ: వన్డేల్లో హిట్.. టీ20ల్లో ఫట్! గిల్కు ఏమైంది? ఇకనైనా అతడిని.. .@surya_14kumar hits the winning runs as #TeamIndia secure a 6-wicket win in Lucknow & level the #INDvNZ T20I series 1️⃣-1️⃣ Scorecard ▶️ https://t.co/p7C0QbPSJs#INDvNZ | @mastercardindia pic.twitter.com/onXTBVc2Wu — BCCI (@BCCI) January 29, 2023 -
కుల్దీప్ చెవులు పిండిన చహల్.. బెదిరించిన సిరాజ్
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో మంగళవారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా 90 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. తద్వారా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. మ్యాచ్ విజయం అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతున్న సమయంలో చహల్, కుల్దీప్, సిరాజ్ల మధ్య ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చహల్ వెనుక నుంచి కుల్దీప్ చెవులను పట్టుకొని పిండగా.. ముందున్న సిరాజ్ అతనికేదో వార్నింగ్ ఇచినట్లుగా కనిపించాడు. అయితే ఇదంతా కేవలం సరదా కోసమే అని వీడియోలో స్పష్టంగా కనిపించింది. కానీ వీడియోలో మాత్రం కుల్దీప్ కాస్త సీరియస్గానే కనిపించినప్పటికి.. సిరాజ్, చహల్లు మాత్రం నవ్వు మొహంతో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోనూ ఒక వ్యక్తి తన ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనింగ్ జోడి రోహిత్, గిల్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. ఇద్దరు శతకాలతో విరుచుకుపడడం.. చివర్లో పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కివీస్ 295 పరుగులకు ఆలౌట్ అయింది. డెవన్ కాన్వే శతకంతో మెరిసినప్పటికి మిగతావారు విఫలమయ్యారు. శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్లో 25 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో మూడు వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. శార్దూల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించగా.. టోర్నీలో డబుల్ సెంచరీ,సెంచరీతో మెరిసిన గిల్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. pic.twitter.com/blhqgq6QVG — LePakad7 (@AreBabaRe2) January 24, 2023 చదవండి: వన్డే, టి20ల్లో మనమే.. ఇక టెస్టులే బాకీ 'ర్యాంకులు పట్టించుకోం.. ఆసీస్తో సిరీస్ అంత ఈజీ కాదు' -
'మంచి భవిష్యత్తు'.. చహల్ను టీజ్ చేసిన రోహిత్ శర్మ
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య రాయ్పూర్ వేదికగా మరికొద్ది గంటల్లో రెండో వన్డే ప్రారంభం కానుంది. ఉత్కంఠగా సాగిన తొలి వన్డేలో టీమిండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా బ్యాటింగ్ బలంగా కనిపిస్తున్నప్పటికి బౌలింగ్ విభాగం మాత్రం కాస్త ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో టీమిండియా బౌలర్లు వికెట్లు తీయడంలో ఇబ్బంది పడుతున్నారు. సిరాజ్ ఒక్కడే మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాడు. అతని చలువతోనే టీమిండియా తొలి వన్డే గెలవగలిగింది. తొలి వన్డేలో ఏమాత్రం ప్రభావం చూపని శార్దూల్ ఠాకూర్ను తప్పించి ఉమ్రాన్ మాలిక్ను రెండో వన్డేలో ఆడిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయం పక్కనబెడితే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ను టీజ్ చేయడం వైరల్గా మారింది. రాయ్పూర్లో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్పై చహల్ ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో డ్రెస్సింగ్ రూమ్లో తమకు కల్పించిన సౌకర్యాల గురించి వివరించాడు. అటుపై ఆటగాళ్లతో మాట్లాడాడు. ఈ సందర్భంగా మసాజ్ సెంటర్ వద్దకు రాగానే చహల్.. ఎక్కడైనా హాయిగా ఉంటుందంటే అది ఇదే అంటూ మసాజ్ స్ట్రెచర్ను చూపించాడు.. దీనిని నేను బాగా ఎంజాయ్ చేస్తాను అని పేర్కొన్నాడు. చహల్ వ్యాఖ్యలను గమనించిన రోహిత్ శర్మ.. ''నీకు మంచి భవిష్యత్తు ఉంది'' చహల్ అంటూ టీజ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోనూ బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. Inside #TeamIndia's dressing room in Raipur! 👌 👌 𝘼 𝘾𝙝𝙖𝙝𝙖𝙡 𝙏𝙑 📺 𝙎𝙥𝙚𝙘𝙞𝙖𝙡 👍 👍 #INDvNZ | @yuzi_chahal pic.twitter.com/S1wGBGtikF — BCCI (@BCCI) January 20, 2023 చదవండి: లైంగిక వేధింపులు.. కటకటాల్లో స్టార్ ఫుట్బాలర్ IND vs NZ 2023: మరో హోరాహోరీకి రె‘ఢీ’ -
మ్యాన్ ఆఫ్ మాసెస్.. జూనియర్పై టీమిండియా బౌలర్ ట్వీట్
జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ టాలీవుడ్తో పాటు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ పోటీలో నిలవడంతో యంగ్ టైగర్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. తాజాగా టీమిండియా క్రికెటర్లు సైతం టాలీవుడ్ యంగ్ టైగర్ను కలిశారు. న్యూజిలాండ్తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆటగాళ్లు జూనియర్తో ఫోటోలు దిగారు. ఆ ఫోటోలను క్రికెటర్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ ఎన్టీఆర్తో దిగిన ఫోటోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. చాహల్ తన ట్విటర్లో రాస్తూ..' మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ను కలుసుకోవడం ఆనందంగా ఉంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలిచినందుకు అభినందనలు. ఇది మనమందరం గర్వపడాల్సిన సమయం.' అంటూ పోస్ట్ చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్కు ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాలోని లాస్ఎంజిల్స్లో ఈ అవార్డును సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు. It was indeed a pleasure meeting the man of masses @tarak9999 What a gentleman. Congratulations on the golden globe win. We all are proud. 🇮🇳 pic.twitter.com/tw79z2YtAw — Yuzvendra Chahal (@yuzi_chahal) January 17, 2023 -
సూర్యకుమార్ చేతికి ముద్దు పెట్టిన చాహల్.. వీడియో వైరల్
రాజ్కోట్ వేదికగా శ్రీలంకతో జరిగిన కీలకమైన మూడో టీ20లో 91 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-1తేడాతో భారత్ సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 45 బంతుల్లోనే సూర్య భాయ్ సెంచరీ సాధించాడు. ఇక ఓవరాల్గా 51 బంతులు ఎదర్కొన్న ఈ ముంబైకర్.. 9 సిక్స్లు, 7 ఫోర్లతో 112 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 228 పరుగల భారీ స్కోర్ సాధించింది. సూర్య భాయ్ ఇన్నింగ్స్కు చాహల్ ఫిదా ఇక సూర్య సంచలన ఇన్నింగ్స్కు భారత స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఫిదా అయిపోయాడు. మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ చేతికి చాహల్ ముద్దుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై స్పందించిన అభిమానులు.. సూర్య భాయ్ ఆటకు ఎవరైనా సలాం కొట్టాల్సిందే అంటూ సోషల్ మీడియలో కామెంట్లు చేస్తున్నారు. ఇక భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే గౌహతి వేదికగా జనవరి 10న జరగనుంది. pic.twitter.com/NeFHhMq35d — Guess Karo (@KuchNahiUkhada) January 8, 2023 చదవండి: AUS vs SA: వైట్వాష్ నుంచి తప్పించుకున్న దక్షిణాఫ్రికా.. మూడో టెస్టు డ్రా -
నేను ఆల్రౌండర్ని.. చహల్కు ఇక ఎప్పటికీ ఆ ఛాన్స్ రాదు!
Yuzvendra Chahal: టీమిండియా లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్... సౌతాఫ్రికా చైనామన్ బౌలర్ తబ్రేజ్ షంసీ.. ఒకరినొకరు ఆటపట్టించుకోవడంలో ఎల్లప్పుడూ ముందుంటారు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్కు ఆడుతున్న సమయంలో చహల్తో.. షంసీకి స్నేహం బలపడింది. ఇక ఛాన్స్ దొరికినప్పుడల్లా పరస్పరం సరదాగా మాటల యుద్ధానికి దిగడం వీరికి అలవాటు. ఈ క్రమంలో తాజాగా మరోసారి షంసీ... చహల్ను ఆటపట్టిస్తూ అతడిని ట్రోల్ చేశాడు. కాగా జనవరి 10 నుంచి సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆరంభం కానున్న సమయం తెలిసిందే. సౌతాఫ్రికా ఆల్రౌండర్ని! ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్లో రాజస్తాన్ ఫ్రాంఛైజీ పర్ల్ రాయల్స్- ముంబై ఫ్రాంఛైజీ ఎంఐ కేప్టౌన్ తలపడనున్నాయి. ఈ సందర్భంగా రాజస్తాన్ తమ ట్విటర్లో షంసీ వీడియోను షేర్ చేసింది. ఇందులో షంసీ చహల్ను ఉద్దేశించి.. ‘‘హెలో యుజీ.. సౌతాఫ్రికా నుంచి నేను.. ఆల్రౌండర్ను మాట్లాడుతున్నా.. అది సరేగానీ.. నువ్వు ఎంత ప్రయత్నించినా బ్యాటింగ్ ఆర్డర్లో నా కంటే ముందు స్థానంలో ఎప్పుడూ రాలేవు.. ఎప్పుడూ అంటే ఎప్పుడూ కూడా నీకు ఆ అవకాశం రాదు’’ అంటూ ఆటపట్టించాడు. ఇక సోషల్ మీడియాలో తనదైన పంచులతో చెలరేగే చహల్.. ‘‘అది సరేగానీ.. నీ టమ్మీ(పొట్ట) గురించి కాస్త చెప్పు బ్రో’’ అంటూ కౌంటర్ వేశాడు. కాగా చహల్ ప్రస్తుతం స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్తో బిజీగా ఉన్నాడు. గతంలో రాజస్తాన్కు ఆడిన షంసీ.. ఈసారి వేలంలో కోటి రూపాయల కనీస ధరతో పేరు నమోదు చేసుకోగా.. అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. అయితే, సౌతాఫ్రికా టీ20లీగ్లో మాత్రం ఈ స్పిన్నర్ రాజస్తాన్ పర్ల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చదవండి: IPL 2023: ఐపీఎల్ వేలానికి ముందు ఈ సిరీస్ జరిగి ఉంటేనా! కానీ పాపం.. Hardik Pandya: మావి స్థానంలో తను రావాల్సింది! ఇలా చేస్తాడనుకోలేదు.. What about your tummy my bru 😂😂 @shamsi90 — Yuzvendra Chahal (@yuzi_chahal) January 7, 2023 -
లంకతో మూడో టీ20.. భారీ రికార్డుపై కన్నేసిన చహల్
IND VS SL 3rd T20: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. రాజ్కోట్ వేదికగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 7) జరుగనున్న నిర్ణయాత్మక మూడో టీ20లో చహల్ (73 మ్యాచ్ల్లో 88) మరో 3 వికెట్లు తీస్తే, భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ పేరిట ఉంది. భువీ.. 87 మ్యాచ్ల్లో 90 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కివీస్ వెటరన్ పేసర్ టిమ్ సౌథీ (107 మ్యాచ్ల్లో 134) అగ్రస్థానంలో ఉండగా.. షకీబ్ అల్ హసన్ (109 మ్యాచ్ల్లో 128), రషీద్ ఖాన్ (74 మ్యాచ్ల్లో 122) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్ల సిరీస్లో టీమిండియా, శ్రీలంక చెరో మ్యాచ్ గెలువగా, ఇవాళ జరుగబోయే మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. రెండు జట్లు ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాయి. తుది జట్ల విషయానికొస్తే.. భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. గత మ్యాచ్లో విఫలమైన శుభ్మన్ గిల్, అర్షదీప్ స్థానాల్లో రుతురాజ్, ముకేశ్ కుమార్ ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. లంక విషయానికొస్తే.. రెండో టీ20లో బరిలోకి దిగిన జట్టే యధాతథంగా కొనసాగవచ్చు. తుది జట్లు (అంచనా) భారత్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్/శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, అక్షర్ పటేల్, చహల్, ముఖేశ్ కుమార్/అర్ష్దీప్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్. శ్రీలంక: దసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిసాంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక, భనుక రాజపక్స, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, దిల్షాన్ మదుషంక, కసున్ రజిత. -
Ind Vs SL: భువీ రికార్డుకు ఎసరు పెట్టిన చహల్! అదే జరిగితే..
India Vs Sri Lanka 1st T20: టీమిండియా లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ అరుదైన ఘనతకు చేరువయ్యాడు. శ్రీలంకతో మంగళవారం మొదలు కానున్న టీ20 సిరీస్ నేపథ్యంలో అతడిని ఓ రికార్డు ఊరిస్తోంది. తొలి టీ20 తుదిజట్టులో చహల్కు చోటు ఖాయంగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడు వాంఖడే మ్యాచ్లో నాలుగు వికెట్లు తీస్తే.. తోటి బౌలర్, టీమిండియా సీనియర్ సీమర్ భువనేశ్వర్ కుమార్ రికార్డు బద్దలు కొట్టే వీలుంది. కాగా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన టీమిండియా బౌలర్గా భువీ కొనసాగుతున్నాడు. భువీ రికార్డు బద్దలు! ఇప్పటి వరకు మొత్తంగా పొట్టి క్రికెట్లో పేసర్ భువీ ఆడిన 87 మ్యాచ్లలో 90 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. స్పిన్నర్ చహల్.. 71 మ్యాచ్లలో 87 వికెట్లు కూల్చాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంకతో స్వదేశంలో సిరీస్కు భువీని సెలక్టర్లు పక్కనపెట్టగా.. చహల్కు మాత్రం జట్టులో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో తొలి టీ20లో రాణిస్తే చహల్.. భువీ పేరిట ఉన్న రికార్డును అధిగమించే అవకాశం ఉంది. టాప్-5లో ఉన్నది వీళ్లే కాగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో టీ20 సిరీస్కు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ టీ20లలో టీమిండియా అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో పాండ్యా టాప్-5లో ఉండటం విశేషం. భువీ 90, చహల్ 87, అశ్విన్ 72, జస్ప్రీత్ బుమ్రా 70 వికెట్లతో ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. చదవండి: Ind Vs SL: రుతురాజ్, ఉమ్రాన్కు నో ఛాన్స్.. గిల్ అరంగేట్రం! Jaydev Unadkat: టీమిండియా ప్లేయర్ సంచలనం.. .. రంజీ చరిత్రలోనే తొలి బౌలర్గా -
మహ్మద్ సిరాజ్ అరుదైన రికార్డు.. తొలి భారత బౌలర్గా
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అరుదైన రికార్డు సాధించాడు. 2022 ఏడాది వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా సిరాజ్ నిలిచాడు. బంగ్లాదేశ్తో రెండో వన్డేలో అనముల్ హక్ ఔట్ చేసిన సిరాజ్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది వన్డేల్లో ఇప్పటి వరకు 14 మ్యాచ్లు ఆడిన సిరాజ్ 23 వికెట్లు సాధించాడు. ఇక అంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో చాహల్ రికార్డును సిరాజ్ బ్రేక్ చేశాడు. ఈ ఏడాది వన్డేల్లో 14 మ్యాచ్లు ఆడిన చాహల్ 21 వికెట్లు పడగొట్టాడు. సెంచరీతో చెలరేగిన మెహాదీ హసన్ ఇక కీలకమైన రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. కేవలం 69 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ను మహ్మదుల్లా, మెహాదీ హసన్ అదుకున్నారు. ఏడో వికెట్కు వీరిద్దరూ కలిసి 147 పరుగుల రికార్డు బాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఈ మ్యాచ్లో మెహాదీ హసన్ ఆజేయ శతకంతో చెలరేగాడు. 83 బంతులు ఎదుర్కొన్న మెహాదీ హసన్ 8 ఫోర్లు, 4 సిక్స్లతో 100 పరుగులు సాధించాడు. అదే విధంగా మెహాదీ హసన్ కూడా 77 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు, ఉమ్రాన్ మాలిక్, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించారు. చదవండి: Cristiano Ronaldo: రొనాల్డోకు ఘోర అవమానం? పాపం.. బెంచ్ మీద కూర్చుని నిర్లిప్తతతో.. సిగ్గుచేటు అంటూ.. -
'అతడు అద్భుతమైన బౌలర్.. న్యూజిలాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాడు'
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్తో తొలి టీ20లో శుక్రవారం టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు కివీస్ స్టార్ బ్యాటర్ గ్లెన్ ఫిలిఫ్స్ భారత బౌలింగ్ విభాగంపై ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఈ సిరీస్లో భారత బౌలింగ్ ఎటాక్లో లెగ్స్పిన్నర్ యజువేంద్ర చాహల్ కీలకపాత్ర పోషిస్తాడని ఫిలిఫ్స్ అభిప్రాయపడ్డాడు. విలేకరుల సమావేశంలో ఫిలిప్స్ మాట్లాడూతూ.. "టీ20 క్రికెట్లో ప్రతీ జట్టు సరైన లెగ్ స్పిన్నర్ కోసం వెతుకుతోంది. మా జట్టుకు ఇష్ సోధి రూపంలో మ్యాచ్ విన్నింగ్ లెగ్స్పిన్నర్ ఉన్నాడు. అదే విధంగా ఆఫ్గానిస్తాన్ రషీద్ ఖాన్ రూపంలో అద్భుతమైన లెగ్గీ ఉన్నాడు. లెగ్ స్పిన్నర్లు మ్యాచ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఇక టీమిండియాకు కూడా చాహల్ రూపంలో అద్భుతమైన మణికట్టు స్పిన్నర్ ఉన్నాడు. అతడు ఈ సిరీస్లో మా బ్యాటర్లను ఇబ్బంది పెడతాడని నేను భావిస్తున్నారు. అదే విధంగా భారత్ బౌలింగ్ ఎటాక్లో అతడు కీలక పాత్ర పోషిస్తాడు. అతడికి 'స్కై' స్టేడియం వంటి చతురస్రకార మైదానంలో బంతిని రెండు వైపులా టర్న్ చేసే సత్తా ఉంది. అతడి బౌలింగ్లో బంతి ఎటువైపు వెళుతుందో అంచనా వేయడం చాలా కష్టం" అని అతడు పేర్కొన్నాడు. టీ20 సిరీస్కు భారత జట్టు.. హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుబ్మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్వెల్, డెవాన్ కాన్వే (వికెట్ కీపన్), లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ (వన్డే). టామ్ లాథమ్ (వన్డే), డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి (టీ20). టిమ్ సౌతీ, బ్లెయిర్ టిక్నర్ (టీ20) చదవండి: IND vs NZ: భారత అభిమానులకు బ్యాడ్ న్యూస్.. న్యూజిలాండ్తో తొలి టీ20 కష్టమే!