Bigg Boss 7
-
పెళ్లి చేసుకున్న బిగ్బాస్ 7 కంటెస్టెంట్
గతేడాది బిగ్బాస్ 7 తమిళ సీజన్లో పాల్గొన్న ప్రదీప్ ఆంటోని వివాదానికి కారణమయ్యాడు. తనతో పాటు హౌసులోకి వచ్చిన లేడీ కంటెస్టెంట్తో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో రెడ్ కార్డ్ జారీ చేసి, షో నుంచి అర్థాంతరంగా బయటకు పంపేశారు. ఈ సీజన్లో తిరిగి పాల్గొంటాడని అన్నారు. కానీ అది రూమర్ అని తేలిపోయింది. ఇప్పుడు ఇతడు పెళ్లి చేసుకున్నాడు.(ఇదీ చదవండి:'పుష్ప 2' కోసం తమన్.. 'కాంతార' మ్యూజిక్ డైరెక్టర్ కూడా)గత కొన్నాళ్లుగా పూజ అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న ప్రదీప్ ఆంటోని.. జూన్లో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇప్పుడు గురువారం (నవంబర్ 7) క్రిస్టియన్ పద్ధతిలో పూజని పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోల్ని తోటి బిగ్బాస్ కంటెస్టెంట్ సురేశ్ చక్రవర్తి పోస్ట్ చేశాడు. కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పుకొచ్చాడు. డాడా, అరువి, వాళ్ తదితర సినిమాలు చేసిన ప్రదీప్ ఆంటోని.. ఇప్పుడిప్పుడే నటుడిగా నిలదొక్కుకుంటున్నాడు.ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బిగ్ బాస్ 8వ సీజన్ నడుస్తోంది. తెలుగులో ఎప్పటిలానే నాగార్జున హోస్టింగ్ చేస్తుండగా.. తమిళంలో మాత్రం ఈసారి కమల్ హాసన్ తప్పుకొన్నాడు. దీంతో విజయ్ సేతుపతి కొత్త హోస్ట్గా వచ్చాడు. దాదాపు 70 రోజులు అయిపోయినా సరే తెలుగు సీజన్ అంతంత మాత్రంగానే సాగుతోంది. తమిళంలో పర్లేదనిపించేలా నడుస్తోంది.(ఇదీ చదవండి: హైదరాబాద్లోని హనుమాన్ గుడిలో జాన్వీ ప్రత్యేక పూజలు) -
టీవీ షోలో కుమారి ఆంటీ.. 'బిగ్బాస్ 7' బ్యాచ్తో కలిసి స్కిట్!
'మీది మొత్తం థౌజండ్ అయింది రెండు లివర్లు ఎక్స్ ట్రా'.. ఈ డైలాగ్ చెప్పగానే ఈపాటికే మేటర్ అర్థమైపోయింటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సోషల మీడియాలో తెగ పాపులర్ అయిపోతున్న కుమారి ఆంటీదే ఈ డైలాగ్. హైదరాబాద్లోని రోడ్డు సైడ్ మధ్యాహ్న భోజనం అమ్మే ఈవిడ.. ఫుడ్ వ్లాగర్స్ వల్ల చిన్న సైజు సెలబ్రిటీ అయిపోయింది. ఆల్రెడీ ఈమెని పలువురు ఇంటర్వ్యూ చేయగా.. ఇప్పుడు ఏకంగా ఓ టీవీ షోలో కూడా కనిపించింది. (ఇదీ చదవండి: మాజీ భర్త గురించి ప్రశ్న.. క్లారిటీ ఇచ్చేసిన స్టార్ హీరోయిన్) గత కొన్నాళ్ల నుంచి హైదరాబాద్లోని మాదాపూర్లో నాన్ వెజ్ మీల్స్ విక్రయించే ఈమె.. అనుకోకుండా ఫేమస్ అయిపోయింది. దీంతో ఈమె షాప్ దగ్గరకు జనాలు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ అవుతుందని చెప్పి షాప్ మూసివేయడం.. ఈ గొడవపై ఏకంగా తెలంగాణ సీఎంఓ ఆఫీస్ నుంచి స్పందించడం. ఇప్పుడు యధావిధిగా మళ్లీ ఈమె బిజినెస్ రన్ అవుతుండటం.. ఇలా గత కొన్నాళ్ల నుంచి కుమారి ఆంటీ వార్తల్లో నిలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఈమె ఫేమస్ అయినప్పుడే ఇంకెందుకు లేటు.. టీవీ షోల్లో కూడా కనిపిస్తుందని ఊహించారు. ఇప్పుడు అదే జరిగింది. 'బిగ్బాస్ 7' కంటెస్టెంట్స్ అందరూ కలిసి తాజాగా ఓ షోలో పాల్గొన్నారు. ఇందులో కుమారి ఆంటీ కూడా పాల్గొంది. స్టేజీపైనే అందరికీ తన స్టైల్ ఫుడ్ తినిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈమెతో ఓ స్కిట్ కూడా చేయించారని టాక్. (ఇదీ చదవండి: ఇన్నాళ్లకు ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ద కేరళ స్టోరీ'.. రిలీజ్ డేట్ ఫిక్స్) #BBUtsavam షో లో #KumariAunty ! అందరికీ NonVeg భోజనం కూడా... pic.twitter.com/SfmCzFSjOd — Rajesh Manne (@rajeshmanne1) February 6, 2024 -
సైలెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న 'బిగ్బాస్' శోభాశెట్టి
బిగ్బాస్ 7 ఫేమ్ శోభాశెట్టి ఎలాంటి హడావుడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది. సరిగ్గా ఓ రెండు నెలల క్రితం ఇదే షోలో ప్రియుడిని పరిచయం చేసింది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుంది. అలానే త్వరలో పెళ్లి కూడా చేసుకోనుంది. ఇంతకీ ఈ కార్యక్రమం ఎప్పుడు ఎక్కడ జరిగింది? శోభాశెట్టి దీని గురించి ఏం చెప్పిందనేది ఇప్పుడు చూద్దాం. కన్నడ బ్యూటీ శోభాశెట్టి.. 'కార్తీకదీపం' సీరియల్లో మోనిత అనే విలన్ పాత్రతో బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు ప్రతి తెలుగింటిలోనూ ఈమెకు అభిమానులు ఉండొచ్చు. నటిగా అలా అదరగొట్టేసింది. ఇక గతేడాది జరిగిన బిగ్బాస్ 7వ సీజన్లో పాల్గొని దాదాపు చివరివరకు వచ్చేసింది. శివాజీ అండ్ గ్యాంగ్కి తన మాటలతో చుక్కలు చూపించింది. చాలామంది ఈమెని విమర్శించారు కానీ శివాజీ లాంటి వాళ్లతో పోలిస్తే శోభా చాలా బాగా ఆడిందని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7 విన్నర్ ప్రశాంత్ అరెస్ట్పై స్కిట్.. ముఖం మాడ్చుకున్న శివాజీ!) ఇకపోతే ఇదే షోలో తన ప్రియుడు యశ్వంత్ రెడ్డిని పరిచయం చేసింది. శోభా-యశ్వంత్.. ఇదే 'కార్తీకదీపం' సీరియల్లో కలిసి నటించారు. షార్ట్ ఫిల్మ్స్లోనూ యాక్ట్ చేశారు. అలా పనిచేస్తూ ప్రేమలో పడ్డారు. అయితే గతేడాది వీళ్ల నిశ్చితార్థం జరగాల్సింది కానీ ఎందుకో క్యాన్సిల్ అయిపోయిందట. ఈ విషయాన్ని స్వయంగా శోభాశెట్టిని ఇప్పుడు బయటపెట్టింది. తాజాగా బెంగళూరులోని శోభాశెట్టి ఇంట్లో నిశ్చితార్థం జరిగింది. యశ్వంత్-శోభా దండలు మార్చుకున్నాడు. అయితే ఇది నిశ్చితార్థ వేడుక అని వీడియోలో శోభాశెట్టి ఎక్కడ చెప్పలేదు. తర్వాత వీడియోలో దీని గురించి చెబుతానని దాటవేసింది. త్వరలో పెళ్లి డేట్ కూడా చెప్పేస్తుందేమో? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) -
నా తల్లి ముందే అలాంటి బూతులు వినాల్సి వచ్చింది: అమర్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 పలు వివాదాలతో ముగిసింది. హౌస్లో అమర్, శోభ,ప్రియాంక (SPY) ఒక బ్యాచ్లో ఉంటే.. శివాజీ, ప్రశాంత్, యావర్ (SPA) బ్యాచ్లో ఉన్నారు. ఈ రెండు బ్యాచ్ల మధ్య పెద్ద గొడవలే జరిగాయి. ఫైనల్గా ప్రశాంత్ విన్నర్ అయితే.. అమర్ దీప్ రన్నర్ అయ్యాడు. కానీ చాలా మంది ప్రేక్షకుల అభిమానాన్ని ఆయన అమర్ పొందాడు. అతను హీరో రవితేజ సినిమాలో ఛాన్స్ వస్తే చాలు అనుకున్నాడు. బిగ్ బాస్ వల్ల ఆ అవకాశం దక్కింది అదే నాకు పెద్ద విజయం అని అమర్ పేర్కొన్నాడు. బిగ్ బాస్ ఫైనల్ రోజున అమర్ కారుపై దాడి జరుగుతున్నప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో ఒక ఇంటర్వ్యూలో అమర్ ఇలా తెలిపాడు. 'హౌస్ నుంచి బయటకు రాగానే మా వాళ్లు అందరూ నన్ను దాక్కో అన్నారు... బయట ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నేను ఎందుకు దాక్కోవాలి..? నేను ఏం తప్పు చేశాను అని కారు ఎక్కి స్టార్ట్ అయ్యాం. కారు బయటకు రాగానే చాలామంది నా కారు చూట్టూ తిరుగుతూ ఫోన్ లైట్ ఆన్ చేశారు. నేను కనిపించగానే ఒక్కసారిగా బూతులు తిట్టడం స్టార్ట్ చేశారు. రాళ్లతో కారు అద్దాలు పగలకొట్టారు.. అమ్మ పక్కన ఉండగానే నోటికి ఏదొస్తే అది అనేశారు. తల్లి పక్కన ఉన్నప్పుడు అలాంటి మాటలు ఏ కుమారుడు వినలేడు.. వారందరి కోపం నామీద కదా అని కారు దిగే ప్రయత్నం చేస్తే అమ్మ ఆపింది. నాలుగు దెబ్బలు తిన్నా పర్వాలేదు కానీ ఆ తిట్లు భరించలేకపోయాను. కొందరైతే నా భార్య తేజును తీసుకెళ్తాం అంటూ బూతులు మాట్లాడారు. ఇవే మాటలు మిమ్మల్ని ఎవరైనా అంటే తట్టుకోగలరా..? ఓర్చోకోగలరా..? వారందరి మీదా నేనూ రియాక్ట్ కాగలను, కేసులు పెట్టగలను కానీ వారికీ కుటుంబాలు ఉంటాయని ఆలోచించి వద్దనుకున్నాను. నేను మీకు ఏం పాపం చేశాను..? అదొక గేమ్ మాత్రమే.. హౌస్లో కొందరు నన్ను పదేపదే తిట్టినా పెద్దవారు కదా అని ఓర్చుకున్నాను.. వారి వద్ద నేను నిజాయితీగానే మాట్లాడాను.. బ్యాక్ బిచింగ్ చేయలేదు. అని అమర్ తెలిపాడు. అందరిలా తను కూడా సామాన్య కుటుంబం నుంచి వచ్చానని అమర్ పేర్కొన్నాడు. తన నాన్నగారు ఆర్టీసీ ఉద్యోగి అని.. అందులో ఒక మెకానిక్గా పనిచేస్తాడని అమర్ తెలిపాడు. సినిమా అంటే అభిమానంతో ఈ పరిశ్రమలోకి వచ్చి నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు. తన అమ్మగారు అనంతపురం జిల్లాలో బీజేపీ మహిళా విభాగం 'మహిళా మోర్చా' లో కార్యకర్తగా పనిచేస్తున్నారని ఆయన చెప్పాడు. -
పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడంటే.. బిగ్ బాస్ 'అశ్విని' కామెంట్స్
బిగ్ బాస్ తెలుగు సీజన్-7లో వైల్డ్ కార్డ్తో ఎంట్రీ ఇచ్చిన అశ్విని శ్రీ మంచి పాపులారిటీని తెచ్చుకుంది. 5వ వారంలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన గ్లామర్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్ బాస్లో టాస్క్ల పరంగా పెద్దగా మెప్పించకపోయిన తన అందాలతో ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది. హౌస్లో భోలే షావళితో మంచి పెయిర్గా తన ఆటను కొనసాగించిన ఈ బ్యూటీ 12వ వారంలో ఎలిమినేట్ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్విని హీరో పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. తాను గబ్బర్ సింగ్లో నటించిన సమయంలో పవన్తో తనుకున్న పరిచియాన్ని తెలిపింది. ఈ సినిమాలో శ్రుతిహాసన్ ఫ్రెండ్గా నటించిన అశ్విని మంచి గుర్తింపు తెచ్చుకుంది. పవన్ OG సినిమా హిట్ కావాలని ఆమె కోరుకుంది. పవన్ కల్యాణ్ ఎప్పుడూ నా వాడే.. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పింది. పవన్ కల్యాణ్ను మళ్లీ కలిసే అవకాశం వస్తే మీ రియాక్షన్ ఏంటని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చింది. ' పవన్తో దాదాపు 3 నెలలు జర్నీ చేశాను. షూటింగ్ సమయంలో పక్కన కూర్చొపెట్టుకుని పవన్ సార్ మాట్లాడేవారు. సెట్స్లో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ తింటున్న డ్రై ఫ్రూట్స్ కూడా తినమ్మా అంటూ నాకు ఇచ్చేవారు. అశ్విని కమాన్ అని ఎంకరేజ్ చేసేవారు. ఆయనకి ఎప్పుడైనా బోర్ కొడితే నన్నే పిలిచేవారు.. ఆపై మాతో పాటలు, డ్యాన్స్ చేపిస్తూ సరదాగా ఉంటారు. అందుకే పవన్ అంటే ఇష్టం. ఆయన నేను క్యారివాన్లో ఉండేవాళ్లం. షూటింగ్కి రోజులో ఒక్కోసారి మాత్రమే పిలిచేవారు. మిగిలిన టైం అంతా క్యారివాన్లోనే ఉండేదాన్ని. ఆయనపై ఉన్న ఇష్టం మాటల్లో చెప్పలేను. సంథింగ్ ఆయనలో ఏదో ఉంటుంది. గబ్బర్ సింగ్ టైంలో సార్తో షూటింగ్ చేసి ఇంటికెళ్లి పడుకున్న తర్వాత ఆయన నాకు కలలోకి వచ్చేవారు. ఆయనతో షూటింగ్ చేస్తున్నట్టుగానే డ్రీమ్స్ వచ్చేవి. ఆయనతో ఎక్కడికో వెళ్లినట్టుగా పిచ్చి పిచ్చి కలలు వచ్చేవి. సార్ నన్ను మర్చిపోయి ఉంటారు కానీ.. నేను ఎప్పటికీ మర్చిపోలేని అనూభూతులు ఆయనతో ఉన్నాయి.'అని ఆమె చెప్పింది. పవన్పై అశ్విని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో గబ్బర్ సింగ్తో పాటు రాజా ది గ్రేట్ వంటి చిత్రాల్లో నటించినా ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు.. మళ్లీ ఇప్పుడు బిగ్ బాస్ వల్ల మంచి గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) -
నన్ను మోసం చేశారు
-
బిగ్ బాస్ కోసం రూ. 2.50 లక్షలు ఇస్తే మోసం చేశారు: యాంకర్
బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ ముగిసిపోయింది. కానీ ఉల్టాపుల్టా పేరుతో వచ్చిన ఈ సీజన్ ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పించిందో తెలియదు కానీ వివాదాలు మాత్రం భారీగానే ఉన్నాయి. బిగ్ బాస్ పేరుతో మోసం చేశారంటూ టాలీవుడ్ నటి, యాంకర్ స్వప్న చౌదరి ఒక వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 'నమస్తే సేట్ జీ' సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో కి అడుగుపెట్టి అందరి నోట మంచి నటిగా పేరు తెచ్చుకుంది ఖమ్మం జిల్లాకి చెందిన అమ్మినేని స్వప్న చౌదరి. యాంకర్గా, ఈవెంట్ ఆర్గనైజర్గా, అటూ హీరోయిన్గా కొనసాగుతున్న ఈ తెలుగమ్మాయి బిగ్ బాస్కు వెళ్లాలని చాలారోజుల నుంచి కోరిక ఉంది. ఇదే విషయాన్ని గతంలో కూడా చెప్పుకొచ్చింది. దీనినే కొందరు అదునుగా చూసుకొని ఆమె నుంచి రూ. 2.50 లక్షలు తీసుకుని మోసం చేశారు. ఇదే విషయాన్ని ఆమె వీడియో ద్వారా తెలిపింది. 'నాకు బిగ్ బాస్కి వెళ్లడం అంటే చాలా ఇష్టం.. ఎంతలా అంటే నేను నిద్రపోతున్న సమయంలో కూడా బిగ్ బాస్లో ఉన్నట్లు ఊహించుకుంటాను. బిగ్ బాస్ సీజన్ -1 నుంచి అన్నీ సీజన్లు ఎంతో ఇష్టంగా చూశాను. బిగ్ బాస్ సీజన్-7 సమయంలో నన్ను కంటెస్టెంట్గా పంపిస్తానని చెప్పి తమ్మలి రాజు అనే వ్యక్తి నా దగ్గర రూ. 2.50 లక్షలు తీసుకున్నాడు. ఈ డబ్బుతో ప్రతి శనివారం వచ్చే ఎపిసోడ్ సమయంలో నాకు కాస్ట్యూమ్స్ పంపిస్తానన్నాడు. అతని మాటలు నమ్మి నేను గతేడాది జూన్లో డబ్బు ఇచ్చాను. ఆ డబ్బే కాకుండా ఫోటో షూట్ కోసం రూ. 25వేలు తీసుకున్నాడు. చివరి క్షణం వరకు పంపిస్తానని చెప్పి..చేతులెత్తేశాడు. ఆ సమయంలో నాకొక అగ్రిమెంట్ రాసిచ్చాడు. బిగ్ బాస్కు పంపించలేకపోతే డిసెంబర్ నెలలో డబ్బు తిరిగిచ్చేస్తానని చెప్పాడు. కాల్ చేస్తే సరిగ్గా రెస్పాండ్ కాలేదు.. జనవరిలో తప్పకుండా ఇస్తానన్నాడు.. తీరా ఇప్పుడు కాల్ చేస్తే నీకు నచ్చింది చేసుకో.. కావాలంటే పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసుకో అని వార్నింగ్ ఇస్తున్నాడు. నేను ఎంతో కష్టపడి ఆ డబ్బు సంపాదించుకున్నాను. బిగ్ బాస్లోకి వెళ్దామనే నా ఆశను తుంచేశాడు. ఇలాంటి వాళ్లను నమ్మి టీమ్గా పెట్టుకోకండి. వచ్చే సీజన్లో అయిన నాకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను. అని స్వప్న తెలిపింది. View this post on Instagram A post shared by 𝐀𝐧𝐜𝐡𝐨𝐫 𝐒𝐰𝐚𝐩𝐧𝐚 𝐜𝐡𝐨𝐰𝐝𝐚𝐫𝐲 (@its_me_swapna_chowdary) -
పల్లవి ప్రశాంత్ అరెస్ట్పై మొదటిసారి రియాక్ట్ అయిన అమర్ దీప్
బిగ్బాస్ సీజన్ 7 టైటిల్ను రైతుబిడ్డ అనే ట్యాగ్లైన్తో ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ గెలుచుకుంటే రన్నర్గా బుల్లితెర నటుడు అమర్ దీప్ ఉన్నాడు. బిగ్ బాస్లో ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. కానీ వారిద్దరూ మళ్లీ ఒకటిగా సొంత బ్రదర్స్ మాదిరి కలిసిపోయే వారు. అయితే బిగ్బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ను ప్రకటించిన తర్వాత అమర్, ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త అమర్దీప్ కారుపై దాడి చేసే వరకు వెళ్లింది. ఆ సమయంలో కారులో తన కుటుంబ సభ్యులతో కలిసి అమర్ ఉన్నాడు. అంతేకాకుండా అశ్విని, గీతూ రాయల్ కారుతో పాటు ఆరు ఆర్టీసీ బస్సులను కూడా కొందరు దుండగులు ధ్వంసం చేశారు. పోలీసుల సూచనలు పాటించకుండా పల్లవి ప్రశాంత్ ర్యాలీ చేయడం వల్లే ఈ గొడవకు కారణమని పోలీసులు అయన్ను అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు కూడా పంపించారు. ఆపై ప్రశాంత్ బెయిల్ మీద విడుదలయ్యాడు. తాజాగా అమర్ మొదటిసారి బిగ్ బాస్ గురించి రియాక్ట్ అయ్యాడు. 'హౌస్ నుంచి నేను బయటకు రాగానే ఏం జరుగుతుందో అనేది నాకేం అర్థం కాలేదు. అప్పుడు నా మైండ్ బ్లాంక్గా ఉంది. అక్కడితోనే ఆ గొడవ ముగిసిపోయింది. బిగ్ బాస్ వల్ల నాకు చాలా మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా అభిమానుల ప్రేమ దొరికింది. అన్నింటికి మించి నా అన్న రవితేజ సినిమాలో ఛాన్స్ దక్కింది. బిగ్ బాస్ విన్నర్ కంటే నాకు రవితేజ సినిమా అవకాశం దక్కడమే గొప్ప విజయం. ఈ షో ద్వారా నాకు కావాల్సిన ఆదరణ దక్కింది. ఇప్పుడు ఎక్కడికెళ్లినా నన్ను గుర్తిస్తారు.. ఇవన్నీ కూడా బిగ్ బాస్ ద్వారా వచ్చిన అచీవ్మెంట్స్ అని నేను భావిస్తాను. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అనేది మిస్ అండర్స్టాండింగ్ వల్లే జరిగింది. ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు. కంటెస్టెంట్ల మధ్య ఎలాంటి గొడవలు ఉండవు.. కానీ కొందరు ఫ్యాన్స్ చేస్తున్న పనుల వల్లే ఇలాంటి ఇబ్బందులు ఎదరైతాయి. ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉండటం సహజమే.. ఇదీ ఎప్పుడూ ఉండేదే.. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు నా అభిమాన హీరోను ఎవరైనా ఒక మాట అంటే గొడవపడే వాళ్లం... కొంత ఆలోచన శక్తి వచ్చాక అవన్నీ వదిలేసి అందరం కలిసి ప్రతి హీరో సినిమా చూసేవాళ్లం.. ఒకరి కోసం తిట్టుకోవడం, గొడవ పడటం లేకుండా అందరూ కలిసి ఆనందంగా ఉండండి.' అని అమర్ అన్నాడు. -
అమర్ రన్నర్ కావడంతో నాగార్జునకు చెడ్డపేరు: శివాజీ
బిగ్ బాస్ తెలుగు సీజన్ -7లో మూడో స్థానంతో సరిపెట్టుకున్న అక్కసు శివాజీలో కనిపిస్తుంది. అందుకే ఆయన పలు ఇంటర్వ్యూలలో ఇప్పటికీ కూడా అమర్, శోభా పట్ల పలు చిల్లర వ్యాఖ్యలతో పాటు పరుష పదజాలం ఉపయోగిస్తూ మాట్లాడుతున్నాడు. చివరకు అమర్ రన్నర్ ఎలా అయ్యాడో అంటూ చెప్పుకొస్తున్నాడు. బిగ్ బాస్లో శివాజీని అన్నిరోజులు ఉంచడమే గొప్ప విషయం అనుకుంటుంటే.. తనను తాను ఎదో గొప్ప అనుకునే భ్రమలో ఇప్పటికీ ఆయన ఉన్నాడు. శివాజీ వల్లే ఈ సీజన్లో ఇంత రచ్చ అయిందని చెప్పేవారు ఎందరో ఉన్నారు. అనవసరంగా తనను ఈ సీజన్లోకి తీసుకున్నారని కూడా పలువురు కామెంట్లు కూడా చేశారు. హౌస్లో ఎప్పుడూ కూడా తాను పోతా పోతా అంటాడు, ఆటలు ఆడడు, బెడ్డు వదలడు, పైగా చెయ్యి నొప్పి, మాట్లాడితే వెటకారాలు, నీతిబోధలు. బిగ్ బాస్లో ఆయన చేసింది ఇదే కదా.. మరోకటి ఏమైనా ఉంటే చెప్పండి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు కూడా. గట్టు పంచాయితీలు తీర్చే ఈ పెద్దకు ఇద్దరు పాలేర్లు. వారిద్దరినీ తన చుట్టూ తిప్పుకోవడం.. బిగ్ బాస్లో శివాజీ చేసింది ఏమిటి..? నచ్చని వారిపై దుమ్మెత్తిపోయడం.. ఇప్పడు బిగ్ బాస్ బయట కూడా అదే చేస్తున్నాడు. శోభా శెట్టి గొడవతో తనను నెగిటివ్గా చూపించే ప్రయత్నం బిగ్ బాస్ చేశారని తాజాగా శివాజీ సంచలన ఆరోపణ చేశాడు. శోభా శెట్టి పరాకాష్టకు వెళ్లింది. అందుకే మా ఇంట్లో ఆడపిల్లలు అయితే.. అంటూ కోపంగా ప్రవర్తించానని అంటూ శివాజీ ఇలా చెప్పాడు. 'గేమ్ ఒక దశకు వచ్చాక విన్నర్ ఎవరు..? ఎవరెవరికి ఏ స్థానాలు దక్కుతాయో కూడా అంచనా వేశాను. 1, 2, 3 స్థానాల్లో మనం ముగ్గురం ఉండబోతున్నామని ప్రశాంత్ చేతిలో రాశాను. అయితే ఊహించని విధంగా ఒక వ్యక్తిని బిగ్ బాస్ కావాలనే హైలైట్ చేస్తూ వచ్చాడు. బిగ్ బాస్ కూడా అతడిని పొగడడం నాకు నచ్చలేదు. అతను (అమర్) చపాతి చేస్తే బాగుంది నాకు కూడా పంపించు అని బిగ్ బాస్ అంటాడు... నేను ఎంతో కష్టపడి వడలు చేపిస్తే కనీసం ఒక మాట కూడా నాకు దక్కలేదు. పలుసార్లు పౌల్ గేమ్ ఆడిన వ్యక్తిని చివరకు రన్నరప్ను చేశారు. ఇలాంటి తప్పిదాల వల్ల నాగార్జున గారికి చెడ్డ పేరు వస్తుంది. ఇదే విషయం నాగ్ సారుకు కూడా త్వరలో చెబుతాను. న్యాయంగా అయితే టాప్ 3లో ప్రశాంత్, నేను, యావర్ ఉండేవాళ్లం.' అని శివాజీ అన్నారు. -
బిగ్ బాస్ అమర్పై శివాజీ చెత్త వ్యాఖ్యలు.. ఇవి దేనికి సంకేతం..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ -7 ముగిసిపోయి చాలా రోజులే అయింది. విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ ఆపై బెయిల్ మీద విడుదల ఇలా పలురకాల వివాదాలతో ఇప్పటికీ అప్పుడప్పుడు ఈ సీజన్ గురించి వార్తలు వస్తునే ఉన్నాయి. ఈ సీజన్లో రన్నర్గా ఆమర్ దీప్ ఉంటే టాప్-3లో శివాజీ ఉన్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన బిగ్ బాస్ గురించి పలు వ్యాఖ్యలు చేశాడు. బిగ్ బాస్ జర్నీలో బాగా ఇబ్బంది పడిన సందర్భం ఎంటి..? అని శివాజీకి ప్రశ్న ఎదురైంది. హౌస్లో మాదిరే ఇంటర్వ్యూలో కూడా అమర్ పట్ల ఉన్న కోపాన్ని తన వ్యాఖ్యలతో శివాజీ ఇలా చెప్పాడు. 'ప్రశాంత్, యావర్ విషయంలో నేను స్టాండ్ తీసుకున్న సందర్భాల్లో చాలా సార్లు ఇబ్బంది పడ్డాను. ప్రశాంత్ కెప్టెన్ బ్యాడ్జ్ లాక్కున్నారు. అతను సరిగ్గా హౌస్ను హ్యాండిల్ చేయలేకున్నాడు అని అందరూ ఓట్లు వేయడంతో అతని బ్యాడ్జ్ను బిగ్ బాస్ తీసుకున్నాడు. ఒక కామన్ మ్యాన్ కెప్టెన్ అయితే సెలబ్రిటీలకు నచ్చట్లేదా అని కోపం వచ్చింది. హౌస్లో కొందరు యావర్తో గొడవలు పెట్టుకున్నప్పుడు కోపం వచ్చింది. ఫైనల్గా నేను ఒకరిని కొట్టేద్దామని అనుకున్న సందర్భం కూడా వచ్చింది. మూడు వారాలుగా బిగ్ బాస్లో ప్రశాంత్ను మానశికంగా కొందరు టార్చర్ చేశారు. ఆ సమయంలో ప్రశాంత్ను అమర్ రెచ్చగొడుతున్నాడు. నేను పక్కనే ఉన్నాను.. నేను వాడి పక్కన ఉంటే ఎవరినీ లెక్క చేయడు. 14 వారంలో అమర్, ప్రశాంత్ మధ్య భారీగా గొడవ జరుగుతుంది. ఆ సందర్భంలో ఆమర్ను నాలుగు పీకి వెళ్లిపోదాం అనిపించింది. ప్రశాంత్ భుజం మీద చెయి వేసి అమర్ తోసుకుంటూ వెళ్తున్నప్పుడు నాలో కోపం కట్టలు తెంచ్చుకుంది. గేమ్కు బౌండ్ అయి అగ్రిమెంట్లో సంతకం చేశాను కాబట్టి అమర్ను ఏం చేయలేకపోయాను. ఆ సమయంలో నా రక్తం మరిగిపోయింది.' అంటూ అమర్పై మరోసారి ఇంటర్వ్యూలో శివాజీ రెచ్చిపోయాడు. బిగ్ బాస్ అనేది ఒక గేమ్.. ఒక్కొసారి మాటల వల్ల అదుపు తప్పుతుంటారు. అది సహజం అని అందరికీ తెలుసు.. ఆ తర్వాత మళ్లీ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అదీ హౌస్ వరకే పరిమితం. అయినా ప్రశాంత్, అమర్ ఇద్దరూ ఎన్ని గొడవలు పడినా మళ్లీ బ్రదర్స్ మాదిరి ఒకటిగా ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ -7 ముగిసి పోయిన చాప్టర్.. బయటకు వచ్చాక కూడా ఇలా ఒకరిపై విషం చిమ్మడం ఎందుకు శివాజీ.. ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేసి ఏం చెప్పదలుచుకుంటున్నారు. అయినా ప్రశాంత్ కెప్టెన్సీ నచ్చలేదని మీరు కూడా చెప్పారు కదా.. అప్పుడే మరిచిపోతే ఎలా శివాజీ.. అమర్ను నువ్వు రెచ్చగొట్టలేదా మానసిక వేదనకు గురి చేయలేదా అంటూ శివాజీపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. హౌస్లో ఇలాంటి మాటలు మాట్లాడే బయట జనాన్ని రెచ్చగొట్టి అమర మీద దాడి చేయించావు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అమర్ ఇంటికి వెళ్లి దాడి చేయండి అని ఇలా పరోక్షంగా మళ్లీ రెచ్చగొడుతున్నావా అంటూ శివాజీపై విరుచుకుపడుతున్నారు. అమర్పై చేసిన వ్యాఖ్యల వీడియో కింద ఎక్కువ మంది శివాజీని ఏకిపారేసిన కామెంట్లే కనిపిస్తున్నాయి. -
Ashwini Sree: అందంతో ఊరిస్తున్న బ్యూటీ క్వీన్ (ఫోటోలు)
-
'బిగ్బాస్ 7'లో ఓడిపోతేనేం.. ఇప్పుడు శోభాశెట్టికి ఆ అవార్డ్
ఈసారి బిగ్బాస్ సీజన్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మరీ ముఖ్యంగా ఇందులో పాల్గొన్న సీరియల్ నటి శోభాశెట్టి ఇంకా గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఆట కంటే గొడవలతో చాలా ఫేమ్ తెచ్చుకుంది. అదే టైంలో విపరీతమైన ట్రోలింగ్ కూడా ఫేస్ చేసింది. బిగ్బాస్ ట్రోఫీ కచ్చితంగా గెలిచి తీరుతానని చెప్పిన శోభా.. 14వ వారం ఎలిమినేట్ అయి ఆ కల నెరవేర్చుకోలేకపోయింది. అయితేనేం ఇప్పుడో అవార్డ్ గెలుచుకుని మళ్లీ వార్తల్లో నిలిచింది. (ఇదీ చదవండి: డార్లింగ్ ప్రభాస్ ఒక్క రోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా?) శోభాశెట్టి అంటే బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. 'కార్తీకదీపం' మోనిత అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సీరియల్లో లేడీ విలన్గా చేసి చాలా పేరు తెచ్చుకుంది. అలా ఈసారి బిగ్బాస్ షోలో అడుగుపెట్టింది. కానీ ఆట, గెలుపు కంటే గొడవలు పెట్టుకోవడంతోనే ఈమె బాగా ఫేమస్ అయింది. ఒకానొక టైంలో ఈమెని ఎలిమినేట్ చేయకుండా ఇంకా ఉంచుతున్నారేంట్రా బాబు అని చాలామంది అనుకున్నారు. కానీ ఇలాంటి క్యారెక్టర్ షోలో లేకపోతే పెద్దగా మజా ఉండదు. సోఫాజీ అలియాస్ శివాజీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చే విషయంలో ఎక్కడా తగ్గని శోభా.. దాదాపు చివరి వరకు వచ్చేసింది. ఫినాలేకి వారం ఉందనగా ఎలిమినేట్ అయిపోయింది. తాజాగా ఈమెకు ఉత్తమ ప్రతినాయకగా రాష్ట్రీయ గౌరవ్ అవార్డ్ వచ్చింది. ఈ విషయాన్ని శోభానే స్వయంగా తన ఇన్ స్టాలో ఫొటోలతో సహా పోస్ట్ చేసింది. ప్రస్తుతానికైతే ఈమె కొత్త సీరియల్స్ ఏం చేయట్లేదు. త్వరలో షోల్లో గానీ, సీరియల్స్లో గానీ శోభా మళ్లీ కనిపించే అవకాశముంది. (ఇదీ చదవండి: Bigg Boss Telugu: పల్లవి ప్రశాంత్ వివాదం.. నిర్వాహకులు షాకింగ్ డెసిషన్) View this post on Instagram A post shared by Shobhashetty (@shobhashettyofficial) -
Bigg Boss Telugu: పల్లవి ప్రశాంత్ వివాదం.. నిర్వాహకులు షాకింగ్ డెసిషన్
బిగ్బాస్ షోపై చాలా ఏళ్ల నుంచి వ్యతిరేకత వస్తూనే ఉంది. కానీ ఈసారి అది రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ దెబ్బకు మరింత ముదిరిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫినాలే తర్వాత గొడవ, కార్లు-బస్సుల ధ్వంసం, విజేత అరెస్ట్.. ఇప్పుడు ఏకంగా నిర్వాహకులకు పోలీసులు నోటీసులు జారీ చేసేంతవరకు పరిస్థితి వచ్చింది. దీంతో షో ఆర్గనైజర్.. అనుహ్య నిర్ణయం తీసుకున్నారట. ఇప్పుడు అది అందరినీ షాకయ్యేలా చేస్తోంది. హిందీలో చాన్నాళ్ల నుంచి ఉంది కానీ తెలుగులో మాత్రం గత ఏడేళ్లుగా బిగ్బాస్ ప్రసారమవుతోంది. ఎన్టీఆర్, నాని తొలి రెండు సీజన్లను హోస్ట్ చేయగా.. ఆ తర్వాత మాత్రం నాగార్జునే వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. పలువురు సెలబ్రిటీలని హౌసులో 100 రోజుల పాటు ఉంచి, పలు పోటీలు పెట్టి.. వీటన్నింటిలో గెలిచిన వాడిని విజేతగా ప్రకటించడం ఆనవాయితీ. ఈసారి అలా కామన్మ్యాన్, రైతుబిడ్డ ట్యాగ్తో ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ విజేతగా నిలిచాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే) రైతుబిడ్డ పేరు చెప్పుకొని ప్రశాంత్ ఎలా ఆడాడు? ఏంటనే విషయం పక్కనబెడితే.. ఫినాలే జరుగుతుండగానే అన్నపూర్ణ స్టూడియోస్ బయట ఇతడి ఫ్యాన్స్ చాలామంది గుమిగూడిపోయారు. దీంతో ర్యాలీ లాంటివి ఏం వద్దని ముందే పోలీసులు, ప్రశాంత్ని హెచ్చరించారు. దీన్ని లెక్కచేయకుండా అభిమానుల దగ్గరకు ప్రశాంత్ వచ్చాడు. దీంతో పలువురు కంటెస్టెంట్స్ కార్లు, పోలీసు వాహనాలు, ఆర్టీసీ బస్సు అద్దాల్ని.. వీళ్లు ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్ని అరెస్ట్ చేసి చంచల్ గుడ జైల్లో పెట్టారు. ఈ మధ్య బెయిల్ మీద కూడా విడుదలయ్యాడు. తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు.. షో నిర్వాహకులకు నోటీసులు కూడా పంపారు. అయితే ఈ తలనొప్పులకు తట్టుకోలేకపోతున్న ఆర్గనైజర్స్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారట. ఇకపై రాబోయే సీజన్స్లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరైనా సరే ర్యాలీలు లాంటివి చేయకూడదట. దీన్నే అగ్రిమెంట్లోనూ పొందుపరచనున్నారట. మరి ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా రైతుబిడ్డ దెబ్బకు 'బిగ్బాస్' తలకు బొప్పి కట్టింది! (ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న 'బిగ్బాస్' మానస్.. రేటు ఎంతో తెలుసా?) -
Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!?
'బిగ్బాస్ 7' ఫేమ్ పల్లవి ప్రశాంత్.. షోలో గెలిచిన తర్వాత చాలా హడావుడి చేశాడు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. తాజాగా బెయిల్పై బయటకొచ్చాడు. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి వెళ్లాలని కండీషన్ పెట్టిన పోలీసులు.. కొన్నాళ్లకు ఇంటర్వ్యూలు లాంటివి ఏం ఇవ్వకూడదని కూడా చెప్పారు. ఇదంతా పక్కనబెడితే ఈ రైతుబిడ్డ.. కొందరిపై రివేంజ్ తీర్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్) రైతుబిడ్డ అనే ట్యాగ్తో 'బిగ్బాస్ 7' షోలో పాల్గొన్న పల్లవి ప్రశాంత్.. ఎలాగైతేనేం విజయం సాధించాడు. అయితే డిసెంబరు 17న ఫినాలే అయిపోయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట ఇతడి ఫ్యాన్స్ చాలామంది వచ్చి చేరారు. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు.. ప్రశాంత్ని వేరే రూట్ నుంచి వెళ్లిపోమని చెప్పారు. కానీ మనోడు పోలీసులు మాట కూడా లెక్క చేయకుండా.. తిరిగి అక్కడికి వచ్చాడు. దీంతో ఇతడి అభిమానులు రెచ్చిపోయారు. పలువురి కంటెస్టెంట్స్ కార్లతో పాటు ఆర్టీసీ బస్సులు, పోలీసు వాహనాలు కూడా ధ్వంసం చేశారు. దీన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు.. ప్రశాంత్ని అతడి ఊరికెళ్లి మరీ అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజుల విధించగా.. చంచల్ గూడా జైల్లో పెట్టారు. నాలుగు రోజుల తర్వాత ఇతడికి బెయిల్ రావడంతో తిరిగి ఊరికివెళ్లిపోయాడు. ఇదంతా పక్కనబెడితే.. ఫినాలే అయిపోయిన తర్వాత ప్రశాంత్ ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించగా, తన ఊరికొస్తే ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పినట్లు కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. (ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న స్టార్ హీరో తమ్ముడు.. అమ్మాయి ఎవరంటే?) తీరా సదరు యూట్యూబర్స్.. ప్రశాంత్ ఇంటర్వ్యూ కోసం అతడి ఊరికి వెళ్లగా, చాలాసేపు వెయిట్ చేయించి తమని నిర్ధాక్షిణ్యంగా వెళ్లిపోమన్నాడని కొందరు ఇన్ స్టాలో స్టోరీలు పెట్టారు. అయితే తాను అలసిపోవడం వల్లే ఇంటర్వ్యూలు ఇవ్వలేకపోయినని ప్రశాంత్ తీరిగ్గా వీడియో పోస్ట్ చేశాడు గానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ప్రశాంత్ అసలు రంగు ఏంటో అందరికీ తెలిసిపోయింది. అయితే తన ఇమేజ్ డ్యామేజ్ చేసిన సదరు యూట్యూబర్స్పై ప్రశాంత్ ఇప్పుడు పరువు నష్టం దావా వేయాలని అనుకుంటున్నాడట. ఇందులో ఎంత నిజముందనేది పక్కనబెడితే.. ఇది జరిగే పనేనా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రశాంత్.. ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేసిన కేసులో అరెస్ట్ అయి, బెయిల్పై బయటకొచ్చాడు. ఇలాంటి టైంలో పరువు నష్టం దావా లాంటి కొత్త తలనొప్పులు తెచ్చుకుంటాడా? అనేది చూడాలి. మరి ఈ విషయంలో నెక్స్ట్ ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: ఆ డబ్బులు ఎగ్గొట్టిన తండ్రి.. అసలు విషయం చెప్పిన అల్లు అర్జున్) -
Pallavi Prashanth: చంచల్ గూడ జైలు నుంచి బయటకొచ్చిన రైతుబిడ్డ
బిగ్బాస్ 7 విజేత ప్రశాంత్.. చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. నాంపల్లి కోర్టు ఇతడికి శుక్రవారం బెయిల్ మంజూరు చేయగా.. తాజాగా జైలు నుంచి బయటకొచ్చాడు. ఈ కేసులో భాగంగా ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసుల ముందు హాజరు కావాలని నాంపల్లి కోర్టు.. ప్రశాంత్ని ఆదేశించింది. అసలు ఈ గొడవేంటి? ప్రశాంత్ని ఎందుకు జైల్లో పెట్టారు? (ఇదీ చదవండి: 'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!) తెలంగాణలోని ఓ పల్లెటూరులో వ్యవసాయం చేసుకునే ప్రశాంత్.. తనని తాను రైతుబిడ్డగా చెప్పుకొన్నాడు. అలా ఇన్ స్టాలో వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈసారి బిగ్బాస్ షోలో కామన్మ్యాన్ అనే ట్యాగ్తో ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 105 రోజుల పాటు హౌసులో ఉండి విజేతగా నిలిచాడు. అయితే ఫినాలేలో విజయం సాధించిన తర్వాత షో నిర్వహించిన అన్నపూర్ణ స్టూడియోస్ బయట చాలా గొడవ జరిగింది. అమర్, అశ్విని, గీతూతో పాటు పలువురు కార్లని ప్రశాంత్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. అయితే షోలో విజేతగా నిలిచిన తర్వాత ప్రశాంత్.. ఫ్యాన్స్ని కలిసేందుకు ప్రయత్నించగా తొలుత పోలీసులు వద్దని వారించారు. కానీ పోలీసుల మాటలని లెక్కచేయకుండా, పంపేచేసిన సరే తిరిగి అక్కడికి వచ్చాడు. దీంతో ఇతడి అభిమానులు రెచ్చిపోయారు. వీరంగం సృష్టించాడు. ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యుడిగా ప్రశాంత్ పై సుమోటాగా కేసు నమోదు చేశారు. రీసెంట్గానే ప్రశాంత్తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల పాటు జైల్లో ఉన్న ఇతడు తాజాగా బెయిల్పై బయటకొచ్చాడు. ఇతడిని చూసేందుకు జైలు దగ్గరకు కూడా అభిమానులు చాలామంది వచ్చారు. (ఇదీ చదవండి: 'సలార్' మూవీకి రివ్యూ ఇచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి) -
పేరు మార్చుకున్న 'బిగ్ బాస్' విన్నర్ పల్లవి ప్రశాంత్
బిగ్బాస్ తెలుగు 7వ సీజన్ టైటిల్ విజేత పల్లవి ప్రశాంత్కు ఉపశమనం లభించింది. బిగ్ బాస్ ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు ప్రశాంత్ను ఏ-1గా, అతని సోదరుడు మనోహర్ను ఏ-2గా పేర్కొంటూ కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో ఆయనకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నేడు (డిసెంబర్ 23) చంచల్ గూడ జైలు నుంచి ఆయన విడుదల కావచ్చు. తాజాగా పల్లవి ప్రశాంత్ ఇన్స్టాలో తన పేరు మారింది. అందులో తన పేరు, బయోను మార్పు చేశారు. MALLA OCHINA, SPY Team Winner అని కొత్తగా తన ఇన్స్టాగ్రామ్లో చేర్చుకున్నాడు. ప్రశాంత్ సూచన మేరకు అతని మరో సోదరుడు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. తన విజయంలో SPY బ్యాచ్ పాత్ర ఎంతగానో ఉందని ప్రశాంత్ గుర్తించినట్లు ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ వల్ల ప్రశాంత్ ఇన్స్టాగ్రామ్కు భారీగా ఫాలోవర్లు పెరిగారు. ప్రస్తుతం ప్రశాంత్ను 1 మిలియన్కు పైగానే ఫాలోవర్లు అనుసరిస్తూ ఉండటం విశేషం. ప్రశాంత్కు అండగా నిలబడిన భోలే చంచల్గూడ జైలు నుంచి పల్లవి ప్రశాంత్ నేడు విడుదల కానున్నాడు. ప్రశాంత్ కోసం అండగా భోలే మాత్రమే నిలబడ్డాడు. హౌస్లో కూడా ఆయన ప్రశాంత్ కోసమే బిగ్ బాస్కు వచ్చానని చెప్పాడు. బెయిల్ వచ్చిన సందర్భంగా భోలే మాట్లాడుతూ.. రైతుబిడ్డకి న్యాయం జరిగిందని తెలిపాడు. 15 వేల పూచీకత్తుతో పాటు రెండు షూరిటీల నిబంధనతో బెయిల్ మంజూరు చేయడం జరిగిందని తెలిపాడు. ప్రశాంత్ అరెస్ట్ అయిన 48 గంటల్లోనే బెయిల్ వచ్చేలా చేసిన అడ్వకేట్లకు ధన్యవాదాలు తెలిపాడు. అంతే కాకుండా నిష్పక్షపాతంగా తీర్పు ఇచ్చిన జడ్జీగారికి పాదాభివందనం తెలిపాడు. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) -
బిగ్బాస్ విజేత పల్లవి ప్రశాంత్కు బెయిల్
బిగ్బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్కు ఊరట లభించింది. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసులో ఆయనకు నాంపల్లి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ప్రశాంత్తోపాటు అతని సోదరుడికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఆదివారం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అదే విధంగా రూ. 15 వేల చొప్పున రెండు షూరిటీలు కాగా బిగ్ బాస్ టైటిల్ గెలిచిన పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. షో విన్నర్గా నిలిచిన అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో ఆయన అభిమానులు అత్యుత్సాహంతో కార్లు, బస్సుల అద్దాలు పగులగొట్టారు. దీంతో పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దాడులకు పల్లవి ప్రశాంత్ కారణమని తేల్చారు. ఈ కేసులో ఎ-1గా పల్లవి ప్రశాంత్ను చేర్చగా, ఎ-2గా అతడి సోదరుడు మనోహర్ను, ఎ-3గా అతడి స్నేహితుడు వినయ్ను చేర్చారు. డిసెంబర్ 20న పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడినీ అదుపులోకి తీసుకున్నారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో ప్రశాంత్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. నేడు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. బిగ్బాస్ విన్నర్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. చదవండి: అమర్ కారుపై దాడి.. రియాక్ట్ అయిన ప్రియాంక -
అమర్ కారుపై దాడి.. రియాక్ట్ అయిన ప్రియాంక
బిగ్బాస్ తెలుగు సీజన్- 7 ఫైనల్ తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద పెద్ద దుమారమే రేగింది. ఈ సీజన్లో పల్లవి ప్రశాంత్ విన్నర్ కాగా అమర్ దీప్ రన్నర్ అయ్యాడు. బిగ్ బాస్ ఫైనల్ రోజున హౌస్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆమర్ కారుపై ఒక వర్గం ఫ్యాన్స్ దాడి చేశారు. అశ్విని, గీతూ రాయల్ కారుతో పాటు ఆరు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. తాజాగా ఈ విషయంపై ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రియాంక రియాక్ట్ అయింది. అభిమానులు ఎవరైనా కానీ ఇలా దాడి చేయడం చాలా దారుణమని ఆమె ఇలా తెలిపింది. 'ఫ్యాన్స్ పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడటం చాలా దారుణం. మీకు ఎవరైనా నచ్చకపోతే వారిని వ్యతిరేకించండి.. అందులో తప్పులేదు కానీ ఇలా దాడి చేయడం చాలా హేయం. ఎవరమైనా ఎంతో కష్టపడి ఒక వస్తువును కొంటాము. కానీ ఇలా కొన్ని క్షణాల్లో నాశనం చేయడం కరెక్ట్ కాదు. దాడి సమయంలో కారులోపల మహిళలు ఉన్నారనే ఆలోచన కూడా లేకుంటే ఎలా..? హౌస్లో గేమ్ పరంగా మాత్రమే మాలో గొడవలు ఉన్నాయి. టాస్క్ ముగియగానే పల్లవి ప్రశాంత్,యావర్,శివాజీ,అమర్ ఇలా అందరం చాలా బాగా కలిసే ఉండే వాళ్లం. మాలో ఎలాంటి గొడవలు లేవు.' ముఖ్యంగా చివరి 4 వారాల్లో ప్రశాంత్తో నాకు మంచి బాండింగ్ ఏర్పడింది. వాడు నిజంగానే భూమి బిడ్డ అని ఆమె తెలిపింది. కానీ ఆ ఇంటర్వ్యూ జరిగిన సమయానికి పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కాలేదు.. దీంతో ఆ ఇంటర్వ్యూలో ప్రశాంత్ అరెస్ట్పై ఆమెకు ఎలాంటి ప్రశ్నలు ఎదురు కాలేదు. -
పల్లవి ప్రశాంత్కు 14 రోజుల రిమాండ్.. చంచల్గూడ జైలుకు తరలింపు
బిగ్బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్, అతని సోదరుడిని జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం రాత్రి అతని స్వగ్రామం గజ్వేల్లోని కొల్గూరులో అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు ప్రశాంత్ను ఏ-1గా, అతని సోదరుడు మనోహర్ను ఏ-2గా పేర్కొంటూ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన తర్వాత వీరిద్దరూ కూడా పరారీలో ఉన్నారు. పోలీసులు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడంతో లాయర్ ద్వారా వారిద్దరూ మళ్లీ ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. సీజన్- 6 కాంటెస్టెంట్ గీతూరాయల్ కారును కూడా ధ్వంసం చేశారు. ఆపై ఆమె కారులోకి చేతులు పెట్టి అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో గీతూ రాయల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా వినకపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దాంతో అల్లరిమూకలు రోడ్లపైకి పరుగులు తీస్తూ ఆరు ఆర్టీసీ బస్సుల అద్దాలను పగులగొట్టారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కేసు పెట్టడం జరిగింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్పై కేసు.. కారణం అన్నపూర్ణ స్టూడియో వద్ద గొడవ జరుగుతున్న సమయంలో బిగ్ బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్ బయటకు వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డగించి మరో గేటు నుంచి పంపారు. కానీ ఆ సమయానికే ప్రశాంత్ను ర్యాలీగా తీసుకెళ్లేందుకు అతని సోదరుడు మనోహర్ తన మిత్రుడు వినయ్ ద్వారా రెండు కార్లను అద్దెకు తెచ్చుకున్నారు. ఇది గమనించిన పోలీసులు ఇప్పటికే ఇక్కడ పరిస్థితి గొడవలతో నిండి ఉంది.. ఈ సమయంలో ర్యాలీ అంటే కష్టం.. బయటకు వెళ్లి ఎక్కడైన సభ పెట్టుకోండి అని చెప్పి.. ఆ కార్లను పక్కనపెట్టి పోలీసులు వేరే వాహనంలో ప్రశాంత్ను పంపించారు. అవన్నీ లెక్క చేయకుండా ప్రశాంత్ తన అభిమానుల మధ్య ర్యాలీ కోసం అద్దె కార్లతో తిరిగి అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలో పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ మళ్లీ జోక్యం చేసుకుని ప్రశాంత్ను రావొద్దని చెప్పినా.. ప్రశాంత్ వినిపించుకోలేదని ఆయన తెలిపారు. ప్రశాంత్ను అడ్డగించి పంపించేశారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫైర్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కార్లపై దాడితో పాటు రెండు పోలీసుల వాహనాలు ధ్వంసం అయ్యాయి. అంతటితో ఆగని అల్లరి మూకలు ఆరు ఆర్టీసీ బస్సు అద్దాలను పగలకొట్టారు. ప్రశాత్కు 14 రోజుల రిమాండ్ ప్రభుత్వ ఆస్థుల ధ్వంసం కేసులో జూబ్లీహిల్స్ ఎస్సై మెహర్ రాకేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్, మనోహర్, వినయ్తో పాటు అద్దె కార్లను నడిపిన డ్రైవర్లు సాయికిరణ్, రాజుపై కూడా కేసు నమోదు చేశారు. ఈనెల 19న డ్రైవర్లు సాయికిరణ్, రాజుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రశాంత్, అతని సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ప్రశాంత్, అతని సోదరుడు మనోహర్ను పోలీసులు అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసులో దాదాపు ఆరు గంటల పాటు జూబ్లీహిల్స్ స్టేషన్లో వారిద్దరినీ విచారించి ఆపై రాత్రి సమయంలోనే జడ్జి ఇంట్లో పల్లవి ప్రశాంత్తో పాటు ఆయన సోదరుడిని పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. పల్లవి ప్రశాంత్తో పాటు సోదరుడు మనోహర్కు కూడా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అర్ధరాత్రి వారిద్దరినీ చల్గూడ జైలుకు పోలీసులు తరలించారు. పోలీసులు ముందే హెచ్చరించినా సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ.. ప్రభుత్వ ఆస్థులకు నష్టం కలిగేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని పోలీసులు తెలిపారు. ఫైనల్గా వారిద్దరిపై ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసును పోలీసులు నమోదుచేశారు. ఇదేం అభిమానం! బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు.… pic.twitter.com/lJbSwAFa8Q — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 18, 2023 -
బిగ్ బాస్పై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు
బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీ రచ్చే జరిగింది. బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ అభిమానులు చేసిన ఫలితంగా అక్కడ గొడవలు జరిగాయని పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఇలా అన్నపూర్ణ స్టూడియో వద్ద పెద్ద గొడవే జరిగింది. ఇప్పటికే బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని పలువురు ప్రముఖులు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ షో గురించి తెలంగాణ మానవ హక్కుల కమిషన్కు (HRC ) హైకోర్టు న్యాయవాది అరుణ్ ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. బిగ్ బాస్ ఫైనల్ రోజున అక్కడ జరిగిన గొడవపై రెండు కేసులు నమోదు అయ్యాయి. కానీ ఎక్కడ హీరో నాగార్జున పేరు లేదు. ఈ కేసులలో నాగార్జున పేరును కూడా చేర్చాలి. అయన కూడా ఈ గొడవలకు బాద్యులే. అంత గొడవ బిగ్ బాస్ నిర్వాహకులు నిర్లక్ష్యం వహించారు. దీంతో 6 ఆర్టీసీ బస్సులు, కార్లు ధ్వంసం అయ్యాయి. ఇప్పటికే ఇదే విషయంపై హైకోర్టుకు లేఖ రాశాను. నాగార్జునను కూడా వెంటనే అరెస్ట్ చెయ్యాలి.' అని ఆయన కోరారు. కేసుల విషయాలు.. బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్లో పాల్గొన్న అమర్దీప్, అశ్విని, అక్కడే ఉన్న మరో సెలబ్రిటీ గీతూ రాయల్ కార్ల మీద దాడి జరిగింది. వారి కార్ల అద్దాలు పగిలాయి. దీంతో గీతూ రాయల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. ఆ తరువాత ఆరు ఆర్టీసీ బస్సులు, ఒక పోలీసు వాహనంపై కూడా దాడి చేశారు. పోలీసులు సుమోటోగా ఈ కేసు పెట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 147, 148, 290, 353, 427 r/w 149 IPC, సెక్షన్ 3 PDPP AC కింద కేసులు పెట్టారు. మొత్తం రెండు కేసులు ఉండగా ఒకదానిలో పల్లవి ప్రశాంత్ పేరు ఉన్నట్లు సమాచారం. -
పల్లవి ప్రశాంత్ బెయిల్కు చిక్కులు.. కారణం ఇదే: ప్రశాంత్ లాయర్
బిగ్బాస్ తెలుగు సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్పై తెలంగాణ పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ముందు గేటు నుంచి రావద్దని పోలీసులు చెప్పినా కూడా ప్రశాంత్ రావడం వల్ల అక్కడ పరిస్థితి కంట్రోల్ చేయడం తమ వల్ల కాలేదేని ఆ సమయంలో పోలీసులు తెలిపారు. ఆ సమయంలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు కూడా ధ్వంసం అయ్యాయి. దీంతో సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసు విషయంపై హైకోర్టు న్యాయవాది డాక్టర్ కే రాజేశ్కుమార్ సాక్షి మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్పై కక్షసాధింపు చర్యలు తగవని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని ఆయన చెబుతూ ప్రశాంత్ బెయిల్ గురించి ఇలా మాట్లాడారు. 'ప్రశాంత్పై కేసు నమోదు చేశారు.. కానీ ఇప్పటి వరకు కనీసం నిందితుడికి FIR కాపీ ఇవ్వడం లేదు. ఈ కేసుల వల్ల భయపడిన పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. దీంతో Fir కాపీ కోసం జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ను నేను సంప్రదించాను. కానీ ఆయన మాత్రం FIR కాపీ కొసం కుటుంబ సభ్యులు రావాలని తెలుపుతున్నారు. కేసు ఏదైనా సరే FIR కాపీని మాత్రం పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన బాధ్యత పొలిసులకు ఉంది. FIR కాపీ ఉంటేనే ప్రశాంత్కు బెయిల్ దరఖాస్తు చేసుకునేందకు అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసులు ఆ కాపీ ఇవ్వకపోవడంతో బెయిల్ దరఖాస్తు చేసుకోలేకపోతున్నాం. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ పాత్ర ఏంటో FIR కాపీ చూస్తేనే తెలుస్తుంది.' అని హైకోర్టు న్యాయవాది కే రాజేశ్కుమార్ తెలిపారు. -
నేనైతే కారుతో గుద్దిపడేసేవాడిని.. అమర్ విషయంపై సోహైల్ ఫైర్
బిగ్బాస్ సీజన్ 7 టైటిల్ను రైతుబిడ్డ అని చెప్పుకుంటున్న పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నాడు. ఈ సీజన్ రన్నర్గా బుల్లితెర నటుడు అమర్ దీప్ ఉన్నాడు. బిగ్ బాస్లో ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. కానీ వారిద్దరూ మళ్లీ ఒకటిగా సొంత బ్రదర్స్ మాదిరి కలిసిపోయే వారు. అయితే బిగ్బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ను ప్రకటించిన తర్వాత అమర్, ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త అమర్దీప్ కారుపై దాడి చేసే వరకు వెళ్లింది. ఆ సమయంలో కారులో తన కుటుంబ సభ్యులతో కలిసి అమర్ ఉన్నాడు. ఈ విషయంపై చాలామంది రియాక్ట్ అవుతున్నారు. తాజాగా సయ్యద్ సోహైల్ రియాక్ట్ అయ్యాడు. 'ఒక వ్యక్తిపై అభిమానం ఉండాలి కానీ ఉన్మాదం పనికిరాదు.. అమర్ కారుపై దాడి చేసింది అందరూ కూడా యువకులే. మనకు ఉద్యోగాలు లేక ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. ఇలాంటి పనులు చేసి తల్లిదండ్రులకు చెడ్డపేరు తీసుకు రాకండి. అభిమానం ముసుగులో ఇలా అమర్పై దాడి చేయడం ఎంత వరకు కరెక్ట్... ఆ దాడి సమయంలో అమర్తో పాటు ఆయన అమ్మగారు, భార్య తేజు ఉన్నారు. వారి కారును చుట్టుముట్టి అద్దాలు పగులకొట్టి ఆపై వారందరినీ నోటికి వచ్చిన బూతులు తిట్టారు. అమర్ భార్య, అమ్మగారిని చెప్పలేని పదాలతో తిట్టారు. మరోకడు అయితే ఆ బూతులు వినలేడు కూడా.. అలాంటి పదాలతో తిట్టడం ఎంత వరకు కరెక్ట్... నేను కూడా ఒక కొడుకుగా చెబుతున్నా.. ఇలాంటి మాటలు నాకే ఏదురైతే గనుకా ఆ సమయంలో కారుతోనే గుద్దిపడేసేవాడిని తర్వాత ఏదైతే అది జరగని.. తన తల్లిదండ్రులను అంటే ఎవరిలోనైనా ఇదే అభిప్రాయం వస్తుంది. భార్య, అమ్మను తన ముందే ఇలా తిడితే ఎవడూ సహించడు. కారుతో అలానే గుద్ది పారేస్తాడు.. కానీ అమర్ సైలెంట్గా వెళ్లిపోయాడు. నిజానికి వాడు చాలా మంచోడు ఇండస్ట్రీలో ఎవరినీ అడిగినా అదే చెబుతాడు.. అంత గొడవ జరిగినా తర్వాత కూడా తన అమ్మ, భార్య జోలికి మాత్రం రాకండి. ఏమైనా చేయాలనుకుంటే తనను మాత్రమే చేసుకోండి అని చెప్పాడు. ఇంతలా ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం దేనికి..?' అని సోహైల్ రియాక్ట్ అయ్యాడు. -
బిగ్ బాస్కు ముందే SPY బ్యాచ్ స్టార్ట్ అయిందా.. వీడియో వైరల్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగిసింది. ఈ సీజన్ ప్రధానంగా SPY (శివాజీ, ప్రశాంత్, యావర్) SPA (శోభ,ప్రియాంక,అమర్) బ్యాచ్ల మధ్యే నడిచింది. చివరకు స్పై బ్యాచ్లోని ప్రశాంత్ విన్నర్గా నిలిచాడు. బిగ్ బాస్ సీజన్ ప్రారంభంలోనే శోభ,ప్రియాంక,అమర్ ముగ్గురూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారని.. వాళ్లందరూ 'స్టార్ మా' బ్యాచ్ అంటూ మొదట్లోనే శివాజీ కన్నింగ్ ప్లాన్ వేశాడు. వాస్తవానికి ఆ విషయంలో వాళ్లే ఒప్పుకున్నారు. ఇక్కడికి రాక ముందే తామందరం మంచి స్నేహితులం.. ఈ షో గురించి తమ మధ్య ఎలాంటి బంధం లేదని చెప్పలేమని తెలిపి వారు గ్రూప్గానే గేమ్ ఆడుతూ వచ్చారు. ఇదే క్రమంలో శివాజీ, యావర్, ప్రశాంత్ కూడా SPY అనే పేరుతో గ్రూప్ అయ్యారు.. వారు కూడా గ్రూప్ గేమ్ ఆడుతూ పదే పదే SPA బ్యాచ్ మాత్రమే గ్రూప్ గేమ్ ఆడుతుందని హౌస్లో పదేపదే ప్రచారం చేయడం ప్రారంభించారు. కానీ వీరు ముగ్గురు హౌస్లోకి రాక ముందే ఒకరికొకరితో పరిచయం ఉంది అంటూ గతంలోనే కొన్ని వార్తలు వచ్చాయి. హౌస్లోకి వచ్చిన తర్వాతే వాళ్ల మధ్య పరిచయం అయినట్లూ ఈ ముగ్గురు కూడా కలరింగ్ ఇచ్చారు. ఎక్కడా తమ మధ్య ముందే పరిచయం ఉందని రివీల్ చేయలేదు. బిగ్ బాస్లోనే మొదటి పరిచయం అయినట్లు కనిపించారు. అలా ఈ ముగ్గురు ఒకటిగా గేమ్ ఆడుతూ.. SPA బ్యాచ్ మాత్రమే గ్రూప్ అంటూ పదే పదే ఎదురుదాడి చేశారు. SPY బ్యాచ్పై ముందు నుంచే చాలా అనుమానాలు కనిపించాయి. బిగ్ బాస్కు ముందు ప్రశాంత్ను ఎక్కడా చూడలేదని యావర్ చెప్పాడు. అంతేకాకుండా కలవలేదని చెప్పాడు. ఇక్కడికి వచ్చాకే ఫ్రెండ్స్ అయ్యామని చెప్పుకొచ్చాడు. అదంతా నిజమేనని జనాలు కూడా నమ్మారు. కానీ అది అబద్దం అని తేలిపోయింది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పల్లవి ప్రశాంత్, యావర్ చాలా క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు. బిగ్ బాస్కు ముందే వారిద్దరి మధ్యే బాటలు సాగాయని తేలిపోయింది. ఇదే క్రమంలో శివాజీ, ప్రశాంత్ మధ్య కూడా పరిచయం ఉందని సమాచారం. బిగ్ బాస్ స్టార్ట్ కాకముందు ప్రశాంత్ను ఇంటర్వ్యూ చేయాలని ఒక యూట్యూబ్ వారిని శివాజీనే సూచించాడట. ఇలా ఈ ముగ్గురి మధ్య పరిచయం ఉన్నప్పటికీ దానిని దాచి వారి గేమ్ ప్లాన్ను మొదలు పెట్టారు. దీంతో స్పై బ్యాచ్ ముందే ప్లాన్ చేసుకొని వచ్చారనే కామెంట్స్ వినిపిస్తన్నాయి. ఇది చూసిన స్పై ఫ్యాన్స్ సైతం ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. జనాలను మోసం చేసారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ చాలా ఏళ్ల నుంచి తమ మధ్య స్నేహం ఉందని ఓపెన్గా చెప్పిన స్పా బ్యాచ్... ఆట కోసం తమ స్నేహాన్ని వదులుకోలేమని చెప్పి ఆటలో ఎన్ని గొడవలు జరిగినా మళ్లీ కలిసిపోతూ.. స్నేహంలో ఇవన్నీ సహజమే అనేలా తమ ఆటను కొనసాగించి నిజమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. View this post on Instagram A post shared by 𝐒𝐌𝐃🧘 (@swaasa_meedha_dhyaasa_) -
నాకేం జరిగినా భయపడను..
-
BB7 RunnerUp Amardeep Photos: సింపుల్ లుక్లో బీటెక్ బాబు అమర్దీప్ (ఫోటోలు)
-
BB7 Winner Pallavi Prashanth Photos: మళ్లొచ్చిన అంటే తగ్గేదేలె.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ (ఫోటోలు)
-
‘ఇదేం అభిమానం!’ బిగ్బాస్ గొడవపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: బిగ్బాస్-7లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అమర్ రన్నరప్గా నిలిచాడు. ఫినాలే పూర్తి అయిన తర్వాత కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో అమర్ ఫాన్స్, పల్లవి ప్రశాంత్ అభిమనులు గొడవకు దిగారు. అయితే ఈ గొడవలో ఆర్టీసి బస్సుల అద్దాలను ఫాన్స్ ధ్వంసం చేశారు. తాజాగా ఈ ఘటనపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ‘‘అభిమానం పేరుతో చేసే పిచ్చి చెష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. ఫాన్స్ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో టీఎస్ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదేం అభిమానం! బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు.… pic.twitter.com/lJbSwAFa8Q — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 18, 2023 -
Bigg Boss 7: శివాజీకి బొమ్మ చూపించిన బిగ్బాస్.. చివరకు అదొక్కటే మిగిలింది!
శివాజీ... బిగ్బాస్ ఆర్గనైజర్స్ ఇచ్చిన హైప్ చూస్తే నిజంగా గెలిచేస్తాడేమో అని అందరూ తెగ భయపడ్డారు. ఎందుకంటే ఈ సీజన్ మొదటిరోజు నుంచి సోఫాపై కూర్చుని ఆర్డర్స్ వేయడం, ప్రశాంత్-యావర్లతో పనిచేయించుకోవడం తప్పితే ఒక్క విషయంలోనూ ఎంటర్టైన్ చేయలేకపోయాడు. నాగార్జున అయితే మాస్టర్ మైండ్, చాణక్య లాంటి పెద్దపెద్ద బిరుదులిచ్చేసి శివాజీని ఆకాశంలో కూర్చోబెట్టాడు. చివరకు అక్కడి నుంచే కిందకు తోసేశాడు. అసలు ఈ సీజన్లో శివాజీ ఏం చేశాడు? ఇంతకీ ఆడాడా లేదా? నటుడు, డబ్బింగ్ ఆర్టిస్టుగా శివాజీ కాస్తోకూస్తో గుర్తింపు ఉంది. అప్పట్లో హీరో, సైడ్ క్యారెక్టర్ తరహా పాత్రలు చేశాడు కానీ ఆ తర్వాత ట్రెండ్కి తగ్గట్లు మింగిల్ కాలేక యాక్టింగ్ పక్కనబెట్టేశాడు. అలా నటుడిగా కనుమరుగైపోయాడు. రాజకీయాల్లోకి వచ్చి 'గరుడ పురాణం' చెప్పాడు. చాల్లే నీ సేవలు అని చెప్పి పక్కకు తోసేశారు. ఇక అన్నీ అయిపోయేసరికి ఏం చేయాలో తెలీక పిల్లల మీద ప్రతాపం చూపించడానికా అన్నట్లు బిగ్బాస్ లోకి వచ్చాడు. ఇక్కడ కూడా మనోడికి మొండిచెయ్యే మిగిలింది. కప్ కొట్టడం సంగతి అటుంచితే కనీసం రన్నరప్ కూడా కాలేకపోయాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) శివాజీ బిగ్బాస్ హౌసులోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు.. 3-4 వారాలు ఉంటే గ్రేట్ అని చాలామంది ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఫినాలే వరకు వచ్చేశాడు. ఏ మాత్రం పనిచేయకపోయినా సరే టాప్-3 వరకు వచ్చేశాడు. అయితే శివాజీ ఈ షోకే అనర్హుడు అని చెప్పడానికి బోలెడన్ని కారణాలున్నాయి. అందులో మొదటిది నాగార్జున సపోర్ట్. గేమ్ షో అంటే సొంతంగా ఆడాలి. కానీ శివాజీ ఎప్పుడు అలా చేసింది లేదు. నోటికొచ్చింది మాట్లాడేయడం.. వీకెండ్ వచ్చేసరికి 'బాబుగారు అలా కాదు.. బాబుగారు ఇలా కాదు' అని డిఫెండ్ చేసుకోవడం.. నాగార్జున శివాజీకి వంతపాడటం. ఇక ప్రశాంత్-యావర్ని గుప్పిట్లో పెట్టుకుని, పనులన్నీ వీళ్లతో చేయించుకోవడం కూడా శివాజీ గేమ్ ప్లాన్లో భాగమేమో? ఇక బిగ్బాస్లో శివాజీ మాటతీరు చాలా వరస్ట్! ఎందుకంటే హౌసులోని ప్రతిఒక్కరూ ఇతర కంటెస్టెంట్స్ని పేరు పెట్టి పిలవాలి. కానీ శివాజీ ఈ విషయంలో చాలా పూర్. కారణం లేకపోయినా సరే అమర్పై మొదటి నుంచే చాలా పగ పెంచేసుకున్నాడు. ప్రతివారం నామినేట్ చేసేవాడు. 'పనికిమాలినోడా', 'పిచ్చోడా' అని నోటికి ఏమొస్తే అలా పిలిచేవాడు. అమర్.. ఇవన్నీ పట్టించుకోడు కాబట్టి లైట్ తీసుకున్నాడు. గౌతమ్ లేదా అర్జున్ని ఇలా గానీ పిలుచుంటే శివాజీకి ఇచ్చిపడేసేవాళ్లు. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ సీజన్ విన్నర్ నేనే.. శివాజీ తలతిక్క కామెంట్స్!) శివాజీలో ఇంకో అవలక్షణం ఏంటంటే.. ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. మిగతా లేడీ కంటెస్టెంట్స్.. తన మాటకు ఎదురుచెప్పలేదు. దీంతో వాళ్లని అమ్మ అమ్మ అని పిలిచేవాడు. వాళ్లని ఏం అనేవాడు కూడా కాదు. కానీ శోభా-ప్రియాంక.. శివాజీ నిజస్వరూపాన్ని ఉన్నది ఉన్నది చెప్పేవారు. మాటకు మాట కౌంటర్ ఇచ్చేవారు. ఇది శివాజీ అస్సలు తీసుకోలేకపోయాడు. 'ఒక్కటి పీకుతా', 'పీక మీద కాలేసి తొక్కుతా' లాంటి పిచ్చికూతులన్నీ కూసి, షో పరువు తీశాడు. మళ్లీ ఏమైనా అంటే.. మాది పల్నాడు, మా దగ్గర ఇలానే మాట్లాడుతారని చెప్పి పుట్టిన ఊరిపేరు కూడా చెడగొట్టాడు. బిగ్బాస్ షోలోకి వచ్చిన మొదటి వారాల్లోనే శివాజీ కుడి చేతికి గాయమైంది. దీంతో చాలా గేమ్స్లో పార్టిసిపేట్ చేయలేదు. కొన్ని గేమ్స్లో కనీస పోటీ ఇవ్వకుండానే చేతులెత్తేశాడు. ఏమన్నా అంటే డిస్ట్రబ్ చేశావ్ అదీ ఇదీ అని అవతల వాళ్లపై అరిచేవాడు. ఈ సీజన్ మొత్తంలో పవరస్త్ర గెలుచుకోవడం, కెప్టెన్ కావడం (ఇంటి సభ్యుల సహకారంతోనే) తప్పితే చెప్పుకోదగ్గ ఘనత శివాజీకి ఒక్కటీ లేదు. ఇక ఫినాలేకి కొన్ని రోజులు ఉందనగా హోస్ట్ నాగార్జునతోనే పిచ్చి వాదనకు దిగాడు. ఇలా బోలెడన్ని కారణాల దృష్ట్యా.. శివాజీని నిర్వహకులు విన్నర్ కాదు కదా కనీసం రన్నరప్ కూడా చేయలేదు. పొరపాటున శివాజీ గానీ విన్నర్ అయ్యింటే మాత్రం అంతకంటే విచిత్రం మరొకటి ఉండేది కాదు. ఓవరాల్గా చూసుకంటే.. షోలో పార్టిసిపేట్ చేయడం, రెమ్యునరేషన్ తీసుకోవడం అనే సంతృప్తి తప్పితే శివాజీకి ఇంకేం మిగల్లేదు! (ఇదీ చదవండి: Bigg Boss 7: అమర్దీప్ కారుపై రైతుబిడ్డ ఫ్యాన్స్ దాడి.. అద్దాలు ధ్వంసం) -
Bigg Boss 7: ఈ సీజన్ విన్నర్ నేనే.. శివాజీ తలతిక్క కామెంట్స్!
బిగ్బాస్ 7 అయిపోయింది. రైతుబిడ్డ గెలిచాడు. అమర్ రన్నరప్గా నిలిచాడు. ఇకపోతే గెలిచేస్తాడు, ట్రోఫీ కొట్టేస్తాడు, చాణక్య అని మాట్లాడుకున్న శివాజీ.. ఊహించని విధంగా మూడో స్థానానికి పరిమితమయ్యాడు. ఏదో హౌస్ట్ నాగార్జున, నిర్వహకులు పుణ్యమా అని ఏ మాత్రం ఆడకపోయినా సరే శివాజీ ఇక్కడ వరకు వచ్చాడు. లేకపోతే మనోడికి అంత సీన్ లేదు. ఇక షో అయిపోయిన తర్వాతైనా సరే తిన్నగా మాట్లాడకుండా తలతిక్క కామెంట్స్ చేస్తున్నాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: అమర్దీప్ కారుపై రైతుబిడ్డ ఫ్యాన్స్ దాడి.. అద్దాలు ధ్వంసం) బిగ్బాస్ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ.. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అదే ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తారు. అలా గీతూ రాయల్.. శివాజీని ఇంటర్వ్వూ చేసింది. షోలో అంటే గెలవాలి కాబట్టి వంద అబద్ధాలు చెప్పొచ్చు. కానీ ఇక్కడ కూడా శివాజీ అదే బాపతు సమాధానాలు ఇస్తూ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం మాత్రం ఆపలేదు. టాప్-3 వరకు వస్తారని ఊహించారా? అని అడిగిదే.. 'ఈ సీజన్ విన్నర్ నేను, నాకు తెలుసు' అని తలతిక్క సమాధానం చెప్పాడు. టాప్-3వరకు వచ్చి, మీరు ఆగిపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? అని అడిగితే.. తిన్నగా సమాధానం చెప్పకుండా.. పల్లవి ప్రశాంత్, ఊరి నుంచి వచ్చాడు, అతడిపై మాటలు దాడి చేశారు, అడ్డుకున్నాను.. ఇలా అడిగిన ప్రశ్నకు ఆన్సర్ చెప్పకుండా ఏదేదో మాట్లాడాడు. యావర్, ప్రశాంత్ మీ వల్లే ఇంతదూరం వచ్చారని అనుకుంటున్నారా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. 'అవును, కాకపోతే వాళ్ల వెనకాల ఓ శక్తి ఉందని అందరికీ తెలియజేశాను' అని శివాజీ అన్నాడు. వీళ్లిద్దరి మైండ్లో లేని ఆలోచనలు పుట్టించారు కదా అని అడగ్గా.. నీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పడానికి రాలేదని హౌస్ట్తోనే వాగ్వాదానికి దిగాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డ ప్రశాంత్ విజయానికి అసలు కారణాలు ఇవేనా?) అమర్ని కావాలనే తొలిరోజు నుంచి టార్గెట్ చేసినట్లు అనిపించింది? దీనికి ఏమంటారు అని శివాజీని అడగ్గా.. మీకు మళ్లీ మళ్లీ చెప్పేదేంటంటే అమర్ గాడు, నేను వెరీగుడ్ ఫ్రెండ్స్ అని మొత్తం ప్లేట్ మార్చేశాడు. హౌసులో అమర్ని పేరుతో కాకుండా ఎన్ని రకాల పదాలతో శివాజీ పిలిచాడో ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటే మీకు ఆన్సర్ తెలుస్తుంది. మీ బ్యాచ్లో ఫేవరిజం లేదా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. 'మీరు ఎంత అనుకున్నా జనం చూస్తున్నారు' అని అదే పాత చింతకాయ పచ్చడి డైలాగ్స్ కొట్టాడు తప్పితే తిన్నగా ఆన్సర్ చెప్పలేకపోయాడు. శివాజీ అసలు బిగ్బాస్లోకి ఎందుకొచ్చాడు? అని అడగ్గా.. బిగ్బాస్ తెలుగు సీజన్లలో నా పేరు గుర్తుండాలి. దటీజ్ మై మార్క్ అని విచిత్రమైన సమాధానాలు చెప్పాడు. అయితే ఈ కామెంట్స్ అన్నీ కూడా ప్రోమోలో చెప్పినవి. ఇక పూర్తి ఇంటర్వ్యూలో ఎన్నెన్ని విచిత్ర విన్యాసాలు చేశాడో చూడాలి? (ఇదీ చదవండి: బిగ్బాస్ విన్నర్ ప్రశాంత్.. మొత్తం ఎన్ని లక్షలు సంపాదించాడంటే?) -
Bigg Boss 7: రైతుబిడ్డ విజయానికి ప్రధాన కారణాలు ఇవే!
పల్లవి ప్రశాంత్.. బిగ్బాస్ షోకు రావడానికి ముందు సోషల్ మీడియా ఉపయోగించే కొద్దిమందికే తెలుసు. కానీ బిగ్బాస్ 7లోకి వచ్చిన తర్వాత తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఒదిగి ఉండే స్వభావం, చురుకుతనం, టాలెంట్, అమాయకత్వం.. ఇవన్నీ జనాలకు బాగా నచ్చేశాయి. మట్టి మనిషిని అని చెప్పుకునే ప్రశాంత్.. తాను గెలిస్తే వచ్చే డబ్బును కష్టాల్లో ఉన్న రైతు కుటుంబాలకే ఇస్తానని చెప్పడం ఎంతోమంది మనసులను కదిలించింది. అలా ఇప్పుడు 7వ సీజన్ విజేతగా నిలిచాడు. మరి అతడి గెలుపు వెనకున్న కారణాలేంటి? చెప్పులరిగేలా తిరిగాడు 'మల్లొచ్చినా అంటే తగ్గేదేలే'.. అని సోషల్ మీడియాలో వీడియోలు చేసుకునే ప్రశాంత్.. ఎలాగైనా బిగ్బాస్ షోలో అడుగుపెట్టాలనుకున్నాడు. అన్నపూర్ణ స్టూడియో చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. ఇప్పుడు విజేతగా గెలిచాడు. అయితే ప్రశాంత్.. బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లో అడుగుపెట్టినప్పుడే తొలి విజయం సాధించాడు. (ఇదీ చదవండి: బీటెక్ కుర్రాడు అమర్.. బిగ్బాస్ ద్వారా ఎంత సంపాదించాడంటే?) గెలుపే అంతిమ లక్ష్యంగా.. రైతుబిడ్డగా హౌస్లో అడుగుపెట్టిన ప్రశాంత్ టాస్కుల్లో విజృంభించి ఆడేవాడు. గెలుపే అంతిమ లక్ష్యంగా పోరాడాడు. విజయం కోసం ఎంతవరకైనా పోరాడతానన్న అతడి ధృడ సంకల్పమే తనను ముందుకు నడిపించింది. ఓడిన ప్రతిసారి రెట్టింపు కసితో ఆడటం జనాలకు ఎంతగానో నచ్చింది. తనను తాను నిరూపించుకునేందుకు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. నామినేషన్స్లో మాత్రం.. షోలో మిగతా టైమ్ అంతా కూడా సింపుల్గా ఉండే ప్రశాంత్.. నామినేషన్స్ వచ్చేసరికి తనలోని మరో యాంగిల్ను బయటకు తీసేవాడు. తానేమీ తక్కువవాడిని కాదని, మీకు పోటీనిచ్చే బలమైన కంటెస్టెంట్ను అని హౌస్మేట్స్కు గుర్తు చేశాడు. నామినేషన్స్లో అతడి వైఖరిని చూసి ప్రశాంత్కు అపరిచితుడిగా ముద్ర వేశారు. అయితే రానురానూ తన తప్పొప్పులను సరిదిద్దుకుంటూ విజయానికి మెట్లు వేసుకుంటూ పోయాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: అమర్దీప్ కారుపై రైతుబిడ్డ ఫ్యాన్స్ దాడి.. అద్దాలు ధ్వంసం) ఈ సీజన్లోనే తొలి కెప్టెన్ మొదట్లో రతిక రోజ్తో క్లోజ్గా ఉంటూ రాంగ్ ట్రాక్ ఎక్కాడు ప్రశాంత్. ఆమె వెన్నుపోటు పొడవడంతో గేమ్పై తిరిగి ఫోకస్ పెట్టాడు. అప్పటినుంచి తప్పటడగులు వేయకుండా ఎవరి జోలికీ వెళ్లకుండా ఆటమీదే తన ధ్యాసను కేంద్రీకరించాడు. బిగ్బాస్ హౌస్లో ఫస్ట్ కెప్టెన్గా నిలిచి తన సత్తా ఏంటో చూపించాడు. అలాగే ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలిచి.. తనకు ఆటలో తిరుగులేదని నిరూపించాడు. అయితే ఈ పాస్ను తన స్నేహితుల కోసం వాడాలనుకున్నాడు. ఆ అవకాశం రాకపోవడంతో కష్టపడి సంపాదించిన పాస్ను వెనక్కు ఇచ్చేందుకు సైతం వెనుకాడలేదు. ఈ నిజాయితీ ప్రేక్షకులకు ఎంతో నచ్చింది. నిష్కల్మషమైన మనసుకు ఫిదా నామినేషన్స్లో ఎన్ని తిట్టుకున్నా సరే తర్వాత అందరినీ తనే వెళ్లి మరీ పలకరించేవాడు. మనసులో ఎటువంటి కోపాలు పెట్టుకోకుండా హౌస్మేట్స్ను కలుపుకుపోయేవాడు. ఎవరెన్ని పనులు చెప్పినా కాదనకుండా చేసేవాడు. ఈ వినయం, విధేయత, మంచితనానికి జనాలు ఫిదా అయ్యారు. కామన్ మ్యాన్ కేటగిరీలో వెళ్లిన ప్రశాంత్ రైతుబిడ్డ కావడంతో జనాలకు బాగా కనెక్ట్ అయ్యాడు. హౌస్లో ఉన్నవాళ్లందరూ సెలబ్రిటీలేనని, ప్రశాంత్ మాత్రం మనలో ఒకరైన రైతుబిడ్డ అని ఫీలయ్యారు. దీంతో షో మొదటినుంచే అతడిని మనలో ఒకడిగా ఫీలయ్యారు. వీటితో పాటు చాలా విషయాల్లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తనదైన మార్క్ చూపించాడు. బిగ్బాస్ 7వ సీజన్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు. (ఇదీ చదవండి: బిగ్బాస్ విన్నర్ ప్రశాంత్.. మొత్తం ఎన్ని లక్షలు సంపాదించాడంటే?) View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) -
Bigg Boss 7: అమర్దీప్ కారుపై రైతుబిడ్డ ఫ్యాన్స్ దాడి.. అద్దాలు ధ్వంసం
బిగ్బాస్ 7 పూర్తయిపోయింది. రైతుబిడ్డ ట్యాగ్తో హౌసులోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అమర్ రన్నరప్గా నిలిచాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఫినాలే పూర్తయిన తర్వాత అమర్ ఫ్యాన్స్ vs రైతుబిడ్డ ఫ్యాన్స్ గొడవకు దిగారు. ఈ క్రమంలోనే అమర్ కారుతో పాటు మరో ఇద్దరి సెలబ్రిటీలు కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. అలానే ఆర్టీసీ బస్సుని కూడా వదల్లేదు. (ఇదీ చదవండి: బిగ్బాస్ విన్నర్ ప్రశాంత్.. మొత్తం ఎన్ని లక్షలు సంపాదించాడంటే?) అసలు విషయానికొచ్చేస్తే.. బిగ్బాస్ అనేది గేమ్ షో. కానీ అభిమానులు అని చెప్పుకు తిరిగే వాళ్లకు అవేమి పట్టవు. ఈ సీజన్లో నామినేషన్స్లో భాగంగా అమర్, ప్రశాంత్ మధ్య చాలాసార్లు వాదన జరిగింది. అయితే అదంతా కూడా గేమ్లో భాగమని అర్థం చేసుకోలేకపోయిన ఈ పిచ్చి ఫ్యాన్స్.. అమర్ కుటుంబ సభ్యులని సోషల్ మీడియాలో వేధించడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు అక్కడ సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఫినాలే ముగిసిన తర్వాత అమర్ తన కారులో ఇంటికి వెళ్లిపోతుంటే.. అతడి కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి దిగారు. వెనకవైపు అద్దం ధ్వంసం చేశారు. అలానే మరో కంటెస్టెంట్ అశ్విని, వీళ్లందరినీ ఇంటర్వ్యూలు చేసిన గీతూ రాయల్ కారుని కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. దీంతో గీతూ.. పోలీస్ కేసు పెట్టింది. ఇది కాదన్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ బయట ప్రశాంత్, అమర్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: బీటెక్ కుర్రాడు అమర్.. బిగ్బాస్ ద్వారా ఎంత సంపాదించాడంటే?) View this post on Instagram A post shared by ❤HD EDITS❤ (@_hd__edits) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) -
Bigg Boss 7: ఎలిమినేట్ అయితేనేం యావర్కి జాక్పాట్.. టోటల్ రెమ్యునరేషన్ ఎంతంటే?
బిగ్బాస్ 7 నుంచి ప్రిన్స్ యావర్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే కప్ కొట్టే విషయంలో ముందు నుంచి ఓ క్లారిటీతో ఉన్న యావర్.. చివరికొచ్చేసరికి తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఎలిమినేట్ అయిన మిగతా వాళ్లతో పోలిస్తే జాక్పాట్ కొట్టేశాడు. దీనికి తోడు మంచి రెమ్యునరేషన్ తీసుకుని హౌస్ నుంచి బయటకొచ్చేశాడు. ఇంతకీ యావర్ ఎలా ఆడాడు? మొత్తం ఎంత సంపాదించాడు? యావర్ ఇంట్రెస్టింగ్ డెసిషన్ సాధారణంగా తెలుగు షోలో పాల్గొంటున్నారు అంటే ఎవరైనా సరే కచ్చితంగా తెలుగులోనే మాట్లాడాలి. బిగ్బాస్ షోలో అయితే ఇది ఇంకా పక్కాగా ఉండాలి. కానీ యావర్ విషయంలో నిర్వహకులు చాలాసార్లు దీన్ని పక్కనబెట్టేశారు. ఇక మనోడు శివాజీ బ్యాచ్లోకి చేరిపోయేసరికి.. ఎలిమినేషన్ నుంచి ప్రతిసారి సేవ్ అవుతూ వచ్చాడు. అలా ఫినాలే వీక్లోకి కూడా అడుగు పెట్టేశాడు. అయితే టాప్-6లో ఉన్న వాళ్లలో యావర్ కప్ కొట్టే ఛాన్స్ లేదు. దీంతో రూ.15 లక్షల సూట్కేస్ తీసుకుని ఫినాలే ఎపిసోడ్లో తనకు తానే ఎలిమినేట్ అయిపోయాడు. రెమ్యునరేషన్ ఎంత? పేరుకు నటుడు అయినాసరే తన ఫ్యామిలీకి చాలా అప్పులు ఉన్నాయని... ఎపిసోడ్స్లోని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. తనకు డబ్బు చాలా అవసరమని కూడా అన్నాడు. ఇప్పుడు దానికి తగ్గట్లే నాగ్.. రూ.15 లక్షల సూట్కేస్ ఆఫర్ చేయగా తీసుకుని, తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా సూట్కేసు ఆఫర్కే ఓటు వేసేసరికి.. ట్రోఫీ రేసు నుంచి తప్పుకొన్నాడు. అలానే వారానికి రూ.లక్షన్నర రెమ్యునరేషన్ చొప్పున 15 వారాలకు గానూ రూ. 22.5 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. అంటే మొత్తంగా రూ.37.5 లక్షల వరకు యావర్ సంపాదించినట్లు తెలుస్తోంది. -
Bigg Boss 7: ప్రియాంక ఎలిమినేట్.. మొత్తం రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
బిగ్బాస్ 7వ సీజన్లో షాకింగ్ ఎలిమినేషన్. ఒక్కో దశని దాటుకుంటూ ఫినాలే వరకు వచ్చిన ప్రియాంక.. చిట్టచివరిది అయిన ఆదివారం ఎపిసోడ్లో ఫస్ట్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్గా నిలిచింది. కప్ కొట్టలేకపోవచ్చు, ఓట్లు విషయంలో మిగతా వారికంటే వెనకబడిపోయి ఉండొచ్చు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం చాలామంది మనసులు గెలిచింది. దీనికి తోడు మంచి రెమ్యునరేషన్తో బిగ్బాస్ హౌస్ నుంచి బయటకొచ్చింది. ఎలిమినేషన్కి రీజన్ బిగ్బాస్ 7 హౌసులోకి తొలి కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంకపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. ఎందుకంటే సీరియల్ నటిగా అందరికీ తెలిసిన ఈమె.. కప్ కొట్టడం, ఫినాలే వీక్ రావడం సంగతి అటుంచితే కొన్ని వారాలు ఉంటే గ్రేట్ అనుకున్నారు. అలాంటిది తొలి పవరస్త్ర కోసమే చివరివరకు వచ్చి ఓడిపోయింది. అక్కడి నుంచి మొదలుపెడితే దాదాపు చాలా గేమ్స్లో చివరివరకు వచ్చి బోల్తా కొట్టింది. ఒకటి రెండుసార్లు మినహా దాదాపు సీజన్ అంతా కూడా చాలా డిగ్నిఫైడ్గా ఆడింది. అమ్మాయి కావడం, పెద్దగా ఫేమ్ లేకపోవడంతో ఈమె ఓట్లు పడలేదు. (ఇదీ చదవండి: Bigg Boss 7: అర్జున్ అంత సంపాదించాడా? 10 వారాల్లోనే..) ఈ క్రమంలోనే ఫినాలే టాప్-6లో అడుగుపెట్టిన వన్ అండ్ ఓన్లీ లేడీ కంటెస్టెంట్గా ప్రియాంక నిలిచింది. కానీ ఓటింగ్ విషయంలో బలమైన కంటెస్టెంట్స్ ఈమె కంటే ముందు ఉండటం ఈమెకు పెద్ద మైనస్ అయిందని చెప్పొచ్చు. ఈ సీజన్లో పాల్గొన్న అమ్మాయిలందరితో పోలిస్తే ప్రియాంక ది బెస్ట్ ఫెర్ఫార్మర్ అని చెప్పొచ్చు. చాలామంది ఒప్పుకొన్న ఒప్పుకోకపోయినా శివాజీ కంటే ప్రియాంక చాలా బెటర్! రెమ్యునరేషన్ ఎన్ని లక్షలు? సీరియల్ నటిగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక.. బిగ్బాస్ షోతో మరింత ఫేమ్, క్రేజ్ తెచ్చుకుంది. ఈమెకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇకపోతే సీజన్ అంతా అంటే 15 వారాల పాటు హౌసులో ఉన్న ప్రియాంక.. వారానికి రూ.2.5 లక్షల రెమ్యునరేషన్ మాట్లాడుకుందట. అంటే మొత్తంగా రూ.37.5 లక్షలు ఈమె సంపాదించినట్లు తెలుస్తోంది. ఇంత మొత్తం డబ్బులు అంటే ప్రియాంక ఆర్థికంగానూ కాస్త కుదురుకున్నట్లే! (ఇదీ చదవండి: Bigg Boss 7 Grand Finale: అది ఫేక్ న్యూస్) -
Bigg Boss 7 Finale Highlights: బిగ్బాస్ 7వ విజేతగా రైతుబిడ్డ ప్రశాంత్
105 రోజులకు పైగా ప్రేక్షకుల్ని అలరించిన బిగ్బాస్ 7 షోకి ఎట్టకేలకు పూర్తయింది. ఆదివారం అంగరంగ వైభవంగా గ్రాండ్ ఫినాలే జరిగింది. ఫినాలేకి అమర్దీప్, ప్రశాంత్, శివాజీ, ప్రియాంక, యావర్, అర్జున్ మిగిలారు. వీరిలో రైతుబిడ్డ ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అలానే ఆదివారం ఎపిసోడ్లో చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ అందించారు. అవేంటో ఓ లుక్కేసేయండి. ►'కేజీఎఫ్' సినిమాలో మంచి ఎలివేషన్ సాంగ్తో నాగార్జున.. ఫినాలే ఎపిసోడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. బ్లాక్ సూట్లో రాయల్ లుక్లో కనిపించి, ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడు. ►ఇక ఫినాలే కోసం వచ్చిన ఈ సీజన్ మిగిలిన హౌస్మేట్స్ అందరూ హిట్ సాంగ్స్కి డ్యాన్స్ చేసి అదరగొట్టేశారు. అశ్విని-పూజా, శోభా-తేజ, గౌతమ్-శుభశ్రీ, సందీప్-నయని పావని స్టెప్పులతో అదరగొట్టారు. భోలే అంటే హీరో, హీరో అంటే బిగ్బాస్ అని స్వయంగా కంపోజ్ చేసిన పాటకు భోలె డ్యాన్స్ చేసి ఫుల్గా ఎంటర్టైన్ చేశాడు. ►బిగ్బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత 15 సినిమా ఆఫర్లు వచ్చాయని టేస్టీ తేజ చెప్పుకొచ్చాడు. 9 వారాల్లో బిగ్బాస్ షోలో ఉండి ఎంత సంపాదించానో.. బయటకొచ్చిన తర్వాత 6 వారాల్లో అంతకంటే రెట్టింపు సంపాదించానని తేజ.. ఇంట్రెస్టింగ్ విషయాల్ని బయటపెట్టాడు. తేజతో పాటు గౌతమ్, భోలె, శోభాశెట్టి తదితరులు.. బిగ్బాస్ నుంచి బయటకెళ్లినా తర్వాత తమ లైఫ్ చాలా బాగుందని అందరూ తమ అభిప్రాయాల్ని చెప్పుకొచ్చారు. ►ఇక ఎలిమినేట్ అయిన హౌస్మేట్స్, హౌస్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్తో హోస్ట్ నాగార్జున మాట్లాడిన తర్వాత.. ఇంట్లో ఉన్న ఆరుగురు డ్యాన్స్ ఫెర్ఫార్మెన్సులతో అదరగొట్టేశారు. యావర్ జిమ్ సామాన్లతో, శివాజీ కాఫీ కప్పుతో, ప్రియాంక కిచెన్ సామాగ్రితో, మొక్కతో ప్రశాంత్, రాకెట్స్తో అర్జున్, కప్పుతో అమర్ డ్యాన్స్ చేశారు. ►ఇక మొత్తం 19 మందికి సంబంధించిన బిగ్బాస్ జర్నీని వీడియోగా ప్లే చేసి అందరికీ చూపించారు. ఇది మొత్తం మంచి ఎంటర్టైన్మెంట్తో సాగింది. ప్రతిఒక్కరూ తమని తాము స్క్రీన్పై చూసుకుని మురిసిపోయారు. ఇక చివర్లో ఎమోషనల్ కంటెంట్ చూసి తేజ.. గుక్కపట్టి ఏడ్చేశాడు. మా అందరిదీ చాలా బ్యూటీఫుల్ జర్నీ అని చెప్పుకొచ్చాడు. ►ఇంట్లోని ఆరుగురు సభ్యులతో చిన్న ఫన్ టాస్క్ పెట్టిన నాగ్.. ఒక్కో కంటెస్టెంట్ మరొకరిలా యాక్ట్ చేసి మెప్పించారు. శివాజీ.. యావర్లా, అర్జున్.. శివాజీలా, యావర్.. అర్జున్లా, ప్రశాంత్.. ప్రియాంకలా, అమర్.. ప్రశాంత్లా, ప్రియాంక.. అమర్లా యాక్ట్ చేసి చూపించారు. ►హౌస్లో ఉన్న ఆరుగురిని బీబీ హౌస్లో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? అని నాగార్జున అడగ్గా.. ఒక్కొక్కరు తమకు నచ్చిన ప్లేస్ చెప్పారు. ప్రియాంక-స్టాండర్డ్ రూమ్, అర్జున్ - గార్డెన్ ఏరియా.. శివాజీ- యావర్-జోయకాలూస్ రూమ్, అమర్- గోడౌన్, ప్రశాంత్-గార్జెన్ ఏరియాలోని మొక్క అని చెప్పి..తమ బొమ్మలను ఆయా ప్లేసుల్లో పెట్టారు. ► అందాల తార నిధి అగర్వాల్ డాన్స్తో అదరగొటేటసింది. జవాన్ సినిమాలోని రామయ్య వస్తావయ్యా సాంగ్తో పాటు నాగార్జున సినిమాకు చెందిన పలు పాటలకు నిధి తనదైన స్టెప్పులేసి అలరించింది. ►టాప్-6లో ఉన్న ఆరుగురిలో నుంచి ఫినాలే ఎపిసోడ్లో అర్జున్ ఫస్ట్ ఎలిమినేషన్గా బయటకొచ్చాడు. ఇతడిని యాంకర్ సుమ.. హౌస్ నుంచి ఇతడిని బయటకు తీసుకొచ్చింది. ►దామిని బాగా కుక్ చేస్తుందనే ప్రశ్నకు యస్.. అశ్వినిని శోభా, ప్రియాంక తొక్కేశారు అన్న ప్రశ్నకు నో.. అర్జున్-అమర్ సంభాషణ ఒక్కోటి ఆణిముత్యం అన్న ప్రశ్నకు యస్.. శోభాపై పెట్టిన శ్రద్ధ, గేమ్ పై పెట్టుంటే తేజ టాప్-5లో ఉండేవాడనే ప్రశ్నకు యస్.. తదితర ప్రశ్నలకు అందరూ సమాధానాలు చెబుతూ ఫన్ జనరేట్ చేశారు. ►కాస్త ఎంటర్టైన్మెంట్ అయిన తర్వాత నటి చంద్రిక రవి స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. 'బావ మనోభావాలు దెబ్బతిన్నాయ్' లాంటి పాటకు కేక పుట్టించే స్టెప్టులేసింది. ఇకపోతే ఎక్స్-కంటెస్టెంట్స్ని పలు అవార్డులతో హోస్ట్ నాగార్జున సత్కరించాడు. పిడకల అవార్డ్- దామిని ఇన్స్టంట్ న్యూడిల్స్ అవార్డ్- నయని పావని వాటర్ బాటిల్ అవార్డ్ - పూజామూర్తి రెడ్ లిప్స్టిక్ అవార్డ్ - శుభశ్రీ ఉడత అవార్డ్ - రతిక సంచాలక్ ఆఫ్ సీజన్ అవార్డ్- సందీప్ మాస్టర్ గోల్డెన్ మైక్ అవార్డ్ - భోలె టిష్యూ అవార్డ్ - అశ్విని డంబెల్ అవార్డ్ - గౌతమ్ ఫైర్ బ్రాండ్ - శోభాశెట్టి బేబీ సోనోగ్రఫీ ఫొటోని టీషర్ట్ పై వేసి, దాన్ని అర్జున్కి గిఫ్ట్గా ఇచ్చారు. ఇది కాస్త స్పెషల్గా అనిపించింది. ►ఇక 'ఈగిల్' సినిమా ప్రమోషన్లో భాగంగా స్టేజీపైకి వచ్చిన రవితేజ.. తన అభిమాని అయిన అమర్తో కాసేపు డ్రామా పండించాడు. తన తర్వాతి సినిమాలో ఛాన్స్ ఇస్తానని బిగ్బాస్ సాక్షిగా హామీ ఇచ్చాడు. అయితే మూవీ ఛాన్స్ ఇస్తా, బయటకొచ్చేస్తావా? అని నాగ్ అడగ్గానే మరో ఆలోచన లేకుండా అమర్ బయటకొచ్చేస్తానని అన్నాడు. అమర్ ఇష్టం చూసి నాగ్-రవితేజ ఇద్దరూ అవాక్కయ్యారు. దీనిబట్టి చూస్తే రవితేజ రాబోయే సినిమాల్లో ఏదో ఒకదానిలో అమర్ యాక్ట్ చేయడం గ్యారంటీ. ►ఫినాలేలో రెండో ఎలిమినేషన్ గా ప్రియాంక బయటకొచ్చింది. కొత్త సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన రవితేజ.. ప్రియాంక ఎలిమినేట్ అయినట్లు చెప్పాడు. ►'నా సామి రంగ' మూవీ ప్రమోషన్ కోసం హౌసులోకి వచ్చిన అల్లరి నరేశ్, రాజ్ తరుణ్.. రూ.15 లక్షల డబ్బుతో ఉన్న గోల్డెన్ సూట్కేస్తో బిగ్బాస్లోకి వచ్చారు. మిగిలిన నలుగురితో (అమర్, ప్రశాంత్, శివాజీ, యావర్) చాలాసేపు డిస్కషన్ పెట్టారు. డబ్బులు తీసుకునేలా టెంప్ట్ చేశారు. చివరకు యావర్.. సూట్కేస్ తీసుకుని, తనకు తానుగా ఎలిమినేట్ అయ్యాడు. అయితే యావర్.. సోదరులు కూడా చెప్పడంతో ఇక ఫైనల్గా సూట్ కేసు తీసుకుని బయటకొచ్చేశాడు. ►'డెవిల్' మూవీ ప్రమోషన్లో భాగంగా షోకి వచ్చిన కల్యాణ్ రామ్, సంయుక్త మేనన్.. కాసేపు సినిమా గురించి చిట్చాట్ చేశారు. కాసేపు సస్పెన్స్ క్రియేట్ చేసిన తర్వాత మిగిలిన ముగ్గురిలో శివాజీ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. అయితే శివాజీ ఎలిమినేట్ కావడాన్ని ప్రశాంత్ తట్టుకోలేకపోయాడు. కాళ్లు పట్టేసుకుని మరీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ►ఇక టాప్-2లో మిగిలిన అమర్, ప్రశాంత్ కోసం హౌసులోకి వెళ్లొచ్చిన హోస్ట్ నాగార్జున.. వీళ్లిద్దరినీ స్టేజీపైకి తీసుకొచ్చారు. అయితే విజేత ఎవరనేది ప్రకటించడానికి ముందు బిగ్బాస్ చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. నాగార్జున జర్నీని వీడియోగా ప్లే చేసి కాస్త ఫన్ జనరేట్ చేశాడు. ►చివరి వరకు సస్పెన్స్ మెంటైన్ చేస్తూ వచ్చిన బిగ్బాస్ హౌస్ట్ నాగార్జున.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ని విజేతగా ప్రకటించాడు. అయితే ఈ విషయాన్ని అస్సలు నమ్మలేకపోయిన ప్రశాంత్.. అలా షాక్లో ఉండిపోయాడు. ఇకపోతే అమర్దీప్ రన్నరప్గా నిలిచాడు. ► బిగ్ బాస్ 7వ సీజన్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్కి రూ.35 లక్షల చెక్తో పాటు మారుతీ సుజుకీ బ్రెజా, రూ.15 లక్షల విలువైన జ్యూవెల్లరీ నెక్లెస్ సెట్ని కూడా బహుమతిగా అందించారు. నాకు వచ్చిన రూ.35 లక్షలు రైతులకే పంచుతాను. రైతుల కోసమే వచ్చిన రైతుల కోసమే ఆడాను. కారు నాన్నకు, నెక్లెస్ అమ్మకు బహుమతిగా ఇస్తాను అంటూ స్పీచ్తో అదరగొట్టాడు. -
Bigg Boss 7: రూ.10 లక్షల టెంప్టింగ్ ఆఫర్.. ఆ విషయంలో అర్జున్, ప్రియాంక సూపర్
మరికొన్ని గంటల్లో బిగ్బాస్ ఫినాలే అంటే హడావుడి ఎలా ఉండాలి. ఇంటి సభ్యులు గానీ ప్రేక్షకులు గానీ టెన్షన్తో ఉక్కిరిబిక్కిరి అయిపోవాలి. ఈ విషయంలో నిర్వహకులు పూర్తిగా చేతులెత్తేశారు. ఏం చేయాలో తెలీక ఏదేదో చేస్తూ ఫుల్ టైమ్ పాస్ చేస్తూ వచ్చారు. చివర్లో సూట్కేస్తో కాస్త సస్పెన్స్ క్రియేట్ చేయాలనుకున్నారు గానీ ఇందులోనూ సక్సెస్ కాలేకపోయారు. ఇంతకీ శనివారం ఏం జరిగిందనేది Day 104 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. టైమ్పాస్ పల్లీ బఠాణీ ఎప్పటిలానే మరో వీకెండ్ వచ్చేసింది. అయితే ఆదివారం ఫైనల్ ఎపిసోడ్ ఉంది కాబట్టి నాగార్జున శనివారం రాలేదు. ఇంట్లో ఉన్న ఆరుగురితోనే టైమ్ పాస్ చేయించాలని ఫిక్సయిన బిగ్బాస్.. చిన్నపిల్లల ఆటలన్నీ పెట్టాడు. కళ్లకు గంతలు కట్టుకుని ఎవరు కొట్టారో చెప్పుకోండి చూద్దాం అనే తరహాలో ఓ గేమ్ పెట్టాడు. ఇందులో ఏమంత ఫన్ క్రియేట్ కాలేదు. దీని తర్వాత ఇంట్లో ఉన్న వాళ్లలా యాక్ట్ చేసి చూపించాలని బిగ్బాస్ కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో రైతుబిడ్డ ప్రశాంత్, అమర్లా యాక్ట్ చేసి చూపించిన అర్జున్.. అలానే కాఫీ ఇవ్వకపోతే బయటకెళ్లిపోతానంటూ శివాజీ చేసే హడావుడిని రీక్రియేట్ చేసిన ప్రియాంక.. ఫుల్ మార్కులు కొట్టేశారు. మిగతా నలుగురికి ఛాన్స్ రాలేదో, మరి వాళ్లు చేయలేదో తెలియలేదు. శ్రీముఖి ఎంటర్టైనర్ ఇక త్వరలో ప్రారంభమయ్యే 'సూపర్ సింగర్' కొత్త సీజన్ ప్రమోషన్ కోసం హౌసులోకి వచ్చిన 3వ సీజన్ రన్నరప్, యాంకర్ శ్రీముఖి.. కాసేపు ఆరుగురు ఇంటి సభ్యులతో పాటలు పాడించింది. 'ట్రూత్ ఆర్ డేర్' గేమ్ ఆడిపించింది. ఈ ఆటలో భాగంగా శివాజీని శ్రీముఖి ఓ ప్రశ్న అడగ్గా.. బయటకెళ్లిన తర్వాత నయని పావనితో బాండింగ్ పెంచుకుంటానని శివాజీ అన్నాడు. రతిక.. ఓసారి ఎలిమినేట్ అయి, హౌసులోకి తిరిగొచ్చినా సరే ఇంకా మెచ్యూరిటీ లెవల్స్ రాలేదని శివాజీ చెప్పాడు. అలానే మరో ప్రశ్నకు బదులిచ్చిన యావర్.. అశ్వినిని పెళ్లి చేసుకుంటా, రతికతో డేట్కి వెళ్తా, శుభశ్రీని కిల్ చేస్తానని నవ్వుతూ చెప్పాడు. సూట్కేస్ గమ్ ప్రతి సీజన్లో ఉన్నట్లే ఫినాలేకి ఓ రోజు ముందు హౌసులోకి బిగ్బాస్ డబ్బుల సూట్కేస్ పంపించాడు. రూ.3 లక్షల మొత్తంతో వేలం పాట మొదలుపెట్టాడు. ఎవరు తీసుకుంటారంటూ ఒకరి తర్వాత మరొకరికి ఆఫర్ ఇచ్చాడు. రూ.3 లక్షల దగ్గర మొదలైన ఈ ఆఫర్.. వరసగా రూ.5 లక్షలు, రూ.8 లక్షలు, రూ.10 లక్షల వరకు వెళ్లింది. కానీ ఎవరు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ మొత్తం మంచి టెంప్టింగ్గా ఉన్నప్పటికీ ఎవరూ ఆసక్తి చూపించలేదు. అయితే ఈ వేలంపాట జరుగుతున్నప్పుడు మధ్యలో శివాజీ.. అర్జున్, అమర్తో చిన్న పిచ్చి డిస్కషన్ పెట్టాడు. ఎంత కావాలి? ఎంత కావాలి? అని అన్నాడు. తనకు రూ.40 లక్షలిస్తే పోతానని అర్జున్.. రూ.45 లక్షలైతే వెళ్లిపోతానని అమర్ అన్నాడు. ఇక చివరగా ప్రియాంకకు ఇంటి నుంచి ఫుడ్ రావడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. ఆదివారం ఫినాలే ఎపిసోడ్ సాయంత్రం 6 లేదా 7 గంటలకు మొదలయ్యే ఛాన్స్ ఉంది. -
Bigg Boss 7: అన్ని లక్షలు ఆఫర్ చేసిన నాగ్.. టైటిల్ రేసు నుంచి ఆ ఒక్కడు డ్రాప్!
బిగ్బాస్ షోలో 7వ సీజన్ విన్నర్ ఎవరనేది మరికొన్ని గంటల్లో తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఎలిమినేషన్ ప్రక్రియ సాగుతోంది. ఇప్పటికే అర్జున్, ప్రియాంక.. తక్కువ ఓట్లు పడిన కారణంగా హౌస్ నుంచి బయటకొచ్చేసినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన నలుగురిలో ఓ కంటెస్టెంట్.. సూట్కేసులోని మంచి మొత్తానికి టెంప్ట్ అయినట్లు టాక్. ఇంతకీ ఎవరా కంటెస్టెంట్? ఎంత డబ్బు దక్కించుకున్నాడు? సూట్కేసు సంప్రదాయం బిగ్బాస్ గత కొన్ని సీజన్లని తీసుకుంటే ఈ సూట్కేసు సంప్రదాయం ఏంటనేది తెలుస్తోంది. 4వ సీజన్లో ఫినాలే రేసులో ఉన్న సొహైల్.. రూ.25 లక్షలు తీసుకుని బయటకొచ్చేశాడు. ఓటీటీ సీజన్లో అరియానా.. రూ.10 లక్షలు తీసుకుని రేసు నుంచి డ్రాప్ అయింది. గత సీజన్లోనూ ఏకంగా రూ.40 లక్షలు తీసుకుని శ్రీహాన్.. తనకు తానుగా బయటకొచ్చేశాడు. అయితే ఈసారి ఫినాలే జరగడానికి ముందు సూట్కేసు ఆఫర్ ఇచ్చిన బిగ్బాస్.. రూ.10 లక్షలు తీసుకుని రేసు నుంచి డ్రాప్ అయ్యే ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఎవరూ దీన్ని ఉపయోగించలేదు. (ఇదీ చదవండి: రైతు బిడ్డకే బిగ్బాస్ ట్రోఫీ.. రన్నరప్ అతనే..‘సాక్షి’పోల్ రిజల్ట్) యావర్ తెలివైన నిర్ణయం SPY బ్యాచ్లో ఉండటం ప్లస్ గేమ్స్లోనూ మంచిగా ఫెర్ఫార్మ్ చేయడం వల్ల.. తెలుగు పెద్దగా రాకపోయినా గానీ యావర్.. ఫినాలే వరకు వచ్చేశాడు. రూ.10 లక్షల మొత్తం ఆఫర్ చేసినప్పుడు లైట్ తీసుకున్నాడు. కానీ ప్రియాంక, అర్జున్.. ఖాళీ చేతులతో ఎలిమినేట్ అయ్యేసరికి మనోడికి బుర్ర పనిచేసినట్లుంది. మిగతా ముగ్గురి(ప్రశాంత్, అమర్, శివాజీ)ని దాటి కప్ కొట్టడం కష్టం. కాబట్టి నాగ్ ఆఫర్ చేసిన రూ.15 లక్షలు తీసుకొని సెల్ఫ్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. యావర్కి అవసరమే సీరియల్స్, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన యావర్.. తనకు, తన ఫ్యామిలీకి డబ్బు అవసరమని ఇదే బిగ్బాస్లో చాలాసార్లు చెప్పుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు రూ.15 లక్షలు తీసుకుని మంచి పనిచేశాడని చెప్పొచ్చు. అయితే డబ్బులు తీసుకునే విషయంలో శివాజీ ఏమైనా హింట్ ఇచ్చాడా? లేదంటే ఇది యావర్ సొంత నిర్ణయమా? అనేది ఆదివారం ఎపిసోడ్లో తెలిసిపోతుంది! (ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న హీరో మంచు మనోజ్.. శుభవార్త చెప్పేశారు!) -
Bigg Boss 7: ఆమె ఎలిమినేట్.. ఈసారి కూడా లేడీ విన్నర్ లేనట్లే!
ఇప్పటివరకు బిగ్బాస్ ఆరు సీజన్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఏడో సీజన్ నడుస్తోంది. మొత్తంగా అన్నింట్లోనూ అబ్బాయిలే విజేతలుగా నిలిచారు. ఓటీటీ షోలో బిందుమాధవి గెలిచినా సరే అది రెగ్యులర్ సీజన్ కేటగిరీలోకి రాదు. అయితే ఈసారైనా లేడీ కంటెస్టెంట్కి నిరాశే ఎదురైంది. ఫినాలే వరకు వచ్చి, టాప్-6లో నిలిచిన వన్ అండ్ ఓన్లీ అమ్మాయి కూడా ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా బ్యూటీ? ఏంటి సంగతి? (ఇదీ చదవండి: ఉచితంగా 'సలార్' టికెట్స్.. తెలుగు యంగ్ హీరో బంపరాఫర్) ప్రియాంక ఎలిమినేట్! సీరియల్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్.. తొలి కంటెస్టెంట్గా ఈ సీజన్లో అడుగుపెట్టింది. హైట్ తక్కువగా ఉన్నాసరే తొలివారం నుంచి అబ్బాయిలకు టఫ్ ఫైట్ ఇచ్చింది. చాపకింద నీరులా ఒక్కో గేమ్ గెలుస్తూ చివరివరకు వచ్చేసింది. ఈసారి ఫినాలే వీక్లో అడుగుపెట్టిన ఏకైక లేడీ కంటెస్టెంట్గా నిలిచింది. అయితే చివరి ఆరుగురిలో ఓట్లు తక్కువ వచ్చిన కారణంగా తొలుత అర్జున్ బయటకెళ్లిపోగా, తాజాగా ప్రియాంక ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. పొట్టిపిల్ల కాదు గట్టిపిల్ల సీజన్ మొదలైనప్పటి నుంచి ప్రియాంక మీద ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. అయితేనేం ఒక్కో వారం మిగిలిన కంటెస్టెంట్స్ని దాటుకుంటూ ఫైనల్ వరకు వచ్చేసింది. టాప్-6లో ఈమె కంటే ఓటింగ్ పరంగా బలమైన కంటెస్టెంట్స్ ప్రశాంత్, అమర్, శివాజీ ఉండటం ఈమెకు కలిసిరాలేదని చెప్పొచ్చు. ఏదేమైనా ఫినాలే వరకు వచ్చినప్పుడే ప్రియాంక గెలిచేసింది. కాకపోతే ట్రోఫీ కూడా గెలుచుకుని ఉంటే వేరే లెవల్ ఉండేది. అయితే ప్రియాంక ఎలిమినేషన్ పై ఆదివారం ఎపిసోడ్లో పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. (ఇదీ చదవండి: బిగ్బాస్: ప్రశాంత్కు బంపరాఫర్ ఇచ్చిన శ్రీముఖి) -
Bigg Boss 7: శివాజీ అతి బద్ధకం.. అమర్కి సర్ప్రైజ్ ఇచ్చిన రైతుబిడ్డ
బిగ్బాస్ 7 పూర్తయిపోవడానికి ఇంకొన్ని గంటలే ఉంది. మొన్నటివరకు జర్నీ వీడియోలతో ప్రేక్షకుల్ని ఎమోషనల్ చేసిన నిర్వహకులు.. ఇప్పుడు ఏం చేయాలో తెలీక టైమ్ పాస్ చేస్తున్నారు. అందరూ ఎంటర్టైన్ చేస్తున్నారు. శివాజీ మాత్రం అతి బద్ధకంతో చిరాకు తెప్పిస్తున్నాడు. రైతుబిడ్డ అమర్కి ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇంతకీ శుక్రవారం ఏం జరిగిందనేది Day 103 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. శివాజీ అలాంటి భాష ఆరుగురు ఇంటిసభ్యులు నిద్రలేవడంతో శుక్రవారం ఎపిసోడ్ మొదలైంది. అయితే అమర్.. మిగిలిన ఐదుగురి జాతకం చెప్పాలని చెప్పి ఓ టాస్క్ ఇచ్చాడు. ఉన్నంతలో మనోడు బాగానే ఎంటర్టైన్ చేయాలని చూశాడు. కానీ మధ్యలో శివాజీ దూరి.. వెధవ-వెధవ అనే పదేపదే అడ్డుతగిలి చిరాకు తెప్పించాడు. టాస్క్ సరిగా పూర్తి చేయనీకుండా తలనొప్పి తీసుకొచ్చాడు. ఇక ఉన్న ఆరుగురూ మరీ బద్ధకంగా వ్యవహరిస్తున్నారని సీరియస్ అయిన బిగ్బాస్.. విన్నర్గా నిలిచేవారు చివరివరకు వచ్చి ఆగిపోరు అని అలెర్ట్గా ఉండాలని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హీరోయిన్.. ఎవరో చెప్పండి చూద్దాం?) యావర్ సేఫ్ గేమ్ ఇక గురువారం ఎపిసోడ్లో భాగంగా అర్జున్, శివాజీ, అమర్.. ఇంట్లో వాళ్లు పంపిన ఫుడ్ని ఆస్వాదించారు. లేటెస్ట్ ఎపిసోడ్లో ప్రియాంక, ప్రశాంత్, యావర్ కోసం ఇంటి నుంచి ఫుడ్ వచ్చింది. అయితే వీళ్లకి ఫుడ్ దక్కుతుందా లేదా అనేది అర్జున్, అమర్, శివాజీ చేతుల్లో ఉంటుందని బిగ్బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. వీళ్ల ముగ్గురికి గేమ్స్ పెట్టి, అందులో గెలిచిన వాళ్లు ఫుడ్ ఎవరికి రావాలో డిసైడ్ చేస్తారని బిగ్బాస్ చెప్పాడు. తొలి గేమ్లో గెలిచిన అమర్.. యావర్ పేరు చెప్పాడు. అయితే ఇంటి ఫుడ్ మరో సభ్యుడితో పంచుకోవాల్సి ఉంటుందని బిగ్బాస్ చెప్పగా.. ఎవరి పేరు చెప్పినా మరొకరు ఫీల్ అవుతారని నాకు ఫుడ్ వద్దని చెప్పేశాడు. శివాజీ బద్ధకం ఇక కప్పులు బ్యాలెన్స్ చేసే రెండో గేమ్లో అర్జున్ గెలిచాడు. ప్రశాంత్ పేరు చెప్పాడు. అయితే ప్రశాంత్ నువ్వు ఎవరితో ఫుడ్ పంచుకుంటావ్? అని బిగ్బాస్ అడగ్గా.. అమర్ పేరు చెప్పాడు. అయితే ఈ రోజు అమర్ పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా ప్రశాంత్ ఇతడి పేరు చెప్పాడు. వీళ్లిద్దరూ ప్రశాంత్ అమ్మ చేసి పంపిన మటన్ కర్రీ, బగారా రైస్ తిన్నారు. ఇకపోతే రెండు గేమ్స్లోనూ శివాజీ మరీ బద్ధకం ఆడి.. ఒక్క గేమ్లోనూ గెలవలేకపోయాడు. ఇలాంటోడిని గనుక బిగ్బాస్ పొరపాటున విజేతని చేస్తే అంతకంటే దరిద్రం మరొకటి ఉండదు! మరోవైపు తనదగ్గరున్న పాయింట్స్ ఉపయోగించుకున్న అమర్.. తన భార్య తేజస్వితో బిగ్బాస్ హౌస్ నుంచి లైవ్ వీడియో కాల్ మాట్లాడాడు. అలా శుక్రవారం ఎపిసోడ్ పూర్తయింది. (ఇదీ చదవండి: 'సలార్' మూవీ సీక్రెట్స్ అన్నీ బయటపెట్టిన ప్రభాస్..) -
Bigg Boss 7: యావర్ ఏడ్చేశాడు.. ప్రశాంత్ ఏడిపించేశాడు!
బిగ్బాస్ షో చివరకొచ్చేసింది. దీంతో హౌస్ అంతా కూడా ఫుల్ పాజిటివ్ వైబ్స్ నడుస్తున్నాయి. ఇప్పటికే అమర్, అర్జున్, శివాజీ, ప్రియాంక.. తమ జర్నీ వీడియోలు చూసేసుకున్నారు. తాజా ఎపిసోడ్లో భాగంగా చివరగా మిగిలిన యావర్, ప్రశాంత్.. తమ జర్నీ వీడియోస్ చూసి తెగ మురిసిపోయారు. ఇంతకీ బుధవారం ఏం జరిగిందనేది Day 101 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: Bigg Boss: వింత టాస్క్.. చావు అంచుల దాకా వెళ్లొచ్చిన యంగ్ హీరోయిన్!) యావర్కి కేజీఎఫ్ ఎలివేషన్స్ ఫైనల్-6లో ఒకడైన యావర్.. తన బిగ్బాస్ బుక్ ఆఫ్ మెమొరీస్ చూసుకోవడంతో బుధవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. తన ఫొటలన్నీ చూస్తూ ఎమోషనల్ అయిపోయిన యావర్.. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక యాక్టివిటీ రూంలో స్క్రీన్పై ప్లే చేసిన దాదాపు 17 నిమిషాల వీడియో చూస్తే అన్ని రకాల భావోద్వేగాలు పలికించాడు. యావర్ కోసం బిగ్బాస్.. కేజీఎఫ్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ వాడేశాడు. వేరే లెవల్ ఎలివేషన్ ఇచ్చాడు. 'నాకు కోపం ఉందని అందరూ అంటారు, కానీ నాలో చరిత్ర సృష్టించే అంతా దమ్ముంది' అని యావర్.. తన ఫీలింగ్ బయటపెట్టాడు. మురిసిపోయిన రైతుబిడ్డ ప్రశాంత్ యావర్ తర్వాత ప్రశాంత్ వంతు. బిగ్బాస్ బుక్ ఆఫ్ మెమొరీస్ చూసుకున్న ప్రశాంత్.. తన తండ్రితో ఉన్న ఫొటో చూసి తెగ ఎమోషనల్ అయిపోయాడు. అనంతరం యాక్టివిటీ రూంలోకి వెళ్లిన ప్రశాంత్.. తన జర్నీని స్క్రీన్పై చూసుకుని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. ఇక మొదటి నుంచి కేవలం ప్రశాంత్ అని పిలుస్తూ వచ్చిన బిగ్బాస్.. ఫస్ట్ టైమ్ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అని పిలిచాడు. దీంతో మనోడు ఏడుపు కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఓవైపు నవ్వుతూ, మరోవైపు ఏడుస్తూ.. ఆనంద భాష్పలతో షర్ట్ అంతా తడిపేశాడని చెప్పొచ్చు. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7 ఫైనల్ అతిథిగా ఆ స్టార్ హీరో? వెరీ ఇంట్రెస్టింగ్!) -
బిగ్బాస్ 7 ఫైనల్ అతిథిగా ఆ స్టార్ హీరో? వెరీ ఇంట్రెస్టింగ్!
బిగ్బాస్ 7వ సీజన్ గ్రాండ్ ఫినాలేకు మరికొన్ని రోజులే ఉంది. ఈ ఆదివారం చాలా గ్రాండ్గా ఈ ఈవెంట్ నిర్వహించబోతున్నాడు. ఇప్పటికే చివరివారాన్ని నిర్వహకులు.. ఫుల్ పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చేశారు. ఎవరు విన్నర్ అవుతారా? అని ప్రేక్షకులు తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఫైనల్కి రాబోయే గెస్ట్ ఎవరనే న్యూస్ బయటకొచ్చింది. ఇప్పటివరకు 6 సీజన్లు పూర్తయ్యాయి. గతసారి చీఫ్ గెస్ట్ అంటూ ఎవరూ రాలేదు. దీంతో నాగార్జునే.. రేవంత్కి ట్రోఫీ అందజేశాడు. అంతకు ముందు పలు సీజన్ల ఫినాలేకు మాత్రం స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేశ్ వచ్చారు. అలా ఈసారి ఎవరైనా వస్తారా? అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇలాంటి టైంలో సూపర్స్టార్ మహేశ్బాబు రాబోతున్నాడనే తియ్యటి వార్త.. అభిమానుల చెవుల్లో పడింది. ఇది నిజమైపోవాలని తెగ ఆరాటపడుతున్నారు. (ఇదీ చదవండి: హీరో విజయ్ దేవరకొండపై అలాంటి వార్తలు.. ఆ వ్యక్తి అరెస్ట్) అయితే ఫినాలే ఎపిసోడ్కి మహేశ్ రావడంలో పెద్ద విచిత్రం ఏం ఉండకపోవచ్చు. ఎందుకంటే మరో నెల రోజుల్లో అంటే సంక్రాంతి కానుకగా 'గుంటూరు కారం'.. థియేటర్లలోకి రాబోతుంది. బిగ్బాస్ షోకి మహేశ్ గెస్ట్గా వస్తే మాత్రం.. ప్రమోషన్ పరంగా మూవీకి కాస్త హెల్ప్ కావొచ్చు. దీనిబట్టి చూస్తే మహేశ్ రావడం గ్యారంటీనే అనిపిస్తోంది. మరో ఒకటి రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చేస్తుందిలే! ఇకపోతే ఈసారి విన్నర్ అయ్యే సూచనలు అమర్-ప్రశాంత్లలో ఒకరికి ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఓట్లు అయితే వీరిద్దరికే ఎక్కువగా పడుతున్నట్లు తెలుస్తోంది. వీళ్లతో పాటు శివాజీ కూడా ఉన్నాడు కానీ అతడిని విన్నర్ చేస్తారా అంటే సందేహంగానే కనిపిస్తుంది. మరి బిగ్బాస్ 7 విజేత.. వీళ్ల ముగ్గురిలో ఒకడా? లేదా అనుహ్యంగా కొత్త వ్యక్తి అవుతాడా అనేది ఆదివారం (డిసెంబరు 17) తేలిపోతుందిలే! (ఇదీ చదవండి: బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఆ ముగ్గురిలో ఎవరు?) -
Bigg Boss 7: శివాజీ బయటపడలేదు.. ప్రియాంక మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోయింది!
బిగ్బాస్ మరోసారి ఏడిపించేశాడు. అవును ప్రియాంక, తనని తాను కంట్రోల్ చేసుకోలేనంతగా ఎమోషనల్ చేశాడు. అయితే శివాజీ మాత్రం పెద్దగా బయటపడలేదు. మరోవైపు ఓ గొడవ వల్ల విడిపోయిన అర్జున్-యావర్ మళ్లీ ఒక్కటయ్యారు. ఈ క్రమంలోనే యావర్ బోరున ఏడ్చేయడం కంటతడి పెట్టించింది. ఇంతకీ మంగళవారం ఏం జరిగిందనేది Day 100 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. శివాజీకి ఓ రేంజు ఎలివేషన్ సోమవారం ఎపిసోడ్లో జర్నీ వీడియోలతో అమర్, అర్జున్ని ఎమోషనల్ చేసిన బిగ్బాస్.. మంగళవారం ఎపిసోడ్ని శివాజీతో స్టార్ట్ చేశాడు. ఇతడి బిగ్బాస్ జ్ఞాపకాల్ని.. 'బుక్ ఆఫ్ మెమొరీస్'లో పొందుపరిచి శివాజీని సర్ప్రైజ్ చేశాడు. అనంతరం దాదాపు 17 నిమిషాల వీడియోని ప్లే చేసి మరీ శివాజీకి ఓ రేంజు ఎలివేషన్స్ ఇచ్చాడు బిగ్బాస్. ఈ క్రమంలోనే శివాజీ.. 25 ఏళ్ల ఇండస్ట్రీ కెరీర్ ఓ ఎత్తు.. బిగ్బాస్ జర్నీ ఓ ఎత్తు.. ఇక్కడి నుంచి ఎంతో కొంత నేర్చుకుని వెళ్తాం. అదైతే సత్యం బిగ్బాస్.. కప్పు గెలుస్తామా? లేదా అనేది పక్కనబెడితే.. చివరివారం వరకు వచ్చిన ఆరుగురు మాత్రం ప్రేక్షకుల హృదయాల్ని గెలిచారని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: 'కాంతార' సినిమాలో ఛాన్స్ కోసం స్టార్ హీరోయిన్ తిప్పలు!) ప్రియాంక గట్టిపిల్ల శివాజీ తర్వాత ప్రియాంకని పిలిచిన బిగ్బాస్.. ఈమెకి సంబంధించిన ఫొటోలని డిస్ప్లే చేశారు. అయితే మిగతా ఫొటోల సంగతేమో గానీ తన బాయ్ఫ్రెండ్ శివతో ఉన్న పిక్ చూసిన తర్వాత తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఇక ప్రియాంక గురించి ఎలివేషన్స్ ఇచ్చిన బిగ్బాస్.. సింపుల్ ప్రియాంకగా ఉండే మీరు.. శివంగి ప్రియాంకగా నామినేషన్స్లో మీరు ఎంత బలమైన కంటెస్టెంట్ అనేది మీరు ఎలాంటివారో తెలిసింది. పొట్టి పిల్ల కాదు గట్టిపిల్ల.. మీరు 100 శాతం ఇస్తూ వచ్చారు. మీ పట్టుదలే మిమ్మల్ని జీవితంలో మొదటి స్థానంలో నిలుపుతుందని కోరుకుంటూ మీ ప్రయాణం చూద్దాం అని దాదాపు 15 నిమిషాల వీడియోని ప్లే చేశాడు. అయితే ఈ వీడియో చూస్తున్నంతసేపు కూడా ప్రియాంక ఎమోషనల్ అవుతూ, ఆనంద బాష్పలతో కనిపించింది. మరోవైపు గతంలో ఓసారి నామినేషన్స్ సందర్భంగా ఇక యావర్తో మాట్లాడనని చెప్పిన అర్జున్.. తన జర్నీ వీడియోలో ఇద్దరం కలిసున్న సీన్స్ భలే ఉన్నాయని చెప్పాడు. దీంతో యావర్, అర్జున్ని హగ్ చేసుకుని గట్టిగా ఏడ్చేశాడు. అలా మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది. ఈరోజు ఎపిసోడ్ గురించి మీకు రాసి చెబితే ఆ ఫీల్ క్యారీ చేయలేం. కాబట్టి కుదిరితే ఫుల్ వీడియో చూడండి. (ఇదీ చదవండి: హీరో చిరంజీవిపై కేసు.. ప్రముఖ నటుడి తిక్క కుదిర్చిన హైకోర్ట్!) -
Bigg Boss 7: రూట్ మార్చిన బిగ్బాస్.. అర్జున్, అమర్ కన్నీళ్లు పెట్టేశారు!
బిగ్బాస్ 7వ సీజన్ చివరి వారానికి వచ్చేశాం. కొన్నిరోజుల ముందు హోస్ట్ నాగార్జున చెప్పినట్లు ఈసారి నామినేషన్స్ లాంటి హడావుడి ఏం లేదు. కేవలం హౌస్లోని ఉన్న ఆరుగురు సభ్యుల ఎమోషన్స్ మాత్రమే పలికించాలని ఫిక్స్ అయినట్లు ఉన్నారు. అందుకు తగ్గట్లే తాజా ఎపిసోడ్లో అమర్, అర్జున్కి బోలెడన్ని సర్ప్రైజులతో పాటు అదిరిపోయే ఎలివేషన్స్ దక్కాయి. ఇంతకీ సోమవారం ఏం జరిగిందనేది Day 99 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. మెమొరీస్ బుక్ చివరి వారాన్ని చాలా అంటే చాలా హ్యాపీ మెమొరీస్తో చాలా పాజిటివ్గా ఎండ్ చేద్దామని బిగ్బాస్ ఫిక్సయ్యాడు. అందుకు తగ్గట్లే ఒక్కో ఇంటి సభ్యుడి జర్నీని చూపించి, అతడి నుంచి ఎమోషన్స్ అన్నీ బయటకు లాగేయాలనేది ఆర్గనైజర్స్ ప్లాన్. ఫస్ట్ ఫస్ట్ అమర్ ని మాత్రమే లాన్లోకి రమ్మన్నారు. అక్కడ అతడి బిగ్బాస్ మెమొరీస్ అన్నింటినీ ఫొటోల రూపంలో ప్రదర్శించాడు. ఆ తర్వాత యాక్టివిటీ రూంలోకి పిలిచిన తర్వాత దాదాపు 16 నిమిషాల జర్నీ వీడియోని ప్లే చేశారు. (ఇదీ చదవండి: హీరో చిరంజీవిపై కేసు.. ప్రముఖ నటుడి తిక్క కుదిర్చిన హైకోర్ట్!) అమర్ ఎమోషనల్ ఇందులో భాగంగా అమర్.. బిగ్ బాస్ హౌసులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏమేం చేశాడు? ఎలా ప్రవర్తించాడు? లాంటి సీన్స్ అన్నింటినీ ఒక్కటిగా చేసి 16 నిమిషాల జర్నీ వీడియో ప్లే చేశారు. అయితే ఈ వీడియో చూస్తే అమర్ నవ్వాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు, గూస్ బంప్స్ తెచ్చుకున్నాడు. చివరకు థ్యాంక్స్ బిగ్బాస్ అని చెప్పాడు. చాలా పెద్ద గిఫ్ట్ ఇది. అల్టిమేట్ బిగ్బాస్ అని అమర్ తన ఆనందాన్ని బయటపెట్టాడు. అర్జున్ ఎమోషనల్ ఇక అమర్కి చేసినట్లే అర్జున్ని కూడా పిలిచిన బిగ్బాస్.. అలానే 'బిగ్బాస్ బుక్ ఆఫ్ మెమొరీస్' చూపించాడు. తన బిగ్బాస్ ఫొటోల్ని చూసి తెగ మురిసిపోయాడు. కాసేపటి తర్వాత యాక్టివిటీ రూంలోకి వెళ్లిన తర్వాత దాదాపు 14 నిమిషాల జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయ్యాడు. ఓవరాల్ వీడియో అంతా నవ్వుతూ చూసిన అర్జున్.. భార్య వచ్చిన క్లిప్ చూసినప్పుడు మాత్రం ఎమోషనల్ అయ్యాడు. అయితే ఈ రోజు ఎపిసోడ్ని రాయడం కంటే వీడియోగా చూస్తేనే కిక్ వస్తుంది. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: నాగార్జున స్పెషల్ స్వెట్ టీ-షర్ట్.. ఎన్ని లక్షల ఖరీదంటే?) -
Bigg Boss 7: నాగార్జున స్పెషల్ స్వెట్ టీ-షర్ట్.. ఎన్ని లక్షల ఖరీదంటే?
బిగ్బాస్ హోస్ట్గా నాగార్జున డౌన్ అయిపోతున్నాడు. గత కొన్ని సీజన్లలో పర్వాలేదనిపించినప్పటికీ.. ఈ సారి మాత్రం తేలిపోయాడు. ప్రతి వీకెండ్ అంటే ఒకప్పుడ నాగ్ హోస్టింగ్ కోసం షో చూసేవారు. ఇప్పుడు దీనికోసం కాకుండా.. నాగ్ వేసుకుంటున్న కాస్ట్యూమ్స్ గురించి ఆరా తీస్తున్నారు. తాజాగా ఆదివారం అలాంటి ఓ స్వెట్ టీ-షర్ట్ వేసుకుని వచ్చాడు. ఇప్పుడు దాని ధర తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?) ఆదివారం ఎపిసోడ్లో భాగంగా పసుపు రంగు చలికోటు లాంటిది వేసుకుని వచ్చాడు. చాలా వదులుగా ఉన్న ఈ టీ-షర్ట్ చూడటానికి డిఫరెంట్గా అనిపించింది. అమర్దీప్ కూడా.. ;మీ స్వెట్ టీ-షర్ట్ బాగుంది, నాకు ఇస్తారా సర్?' అని నాగార్జునని అడిగాడు. దీంతో ఇస్తానులే అని మాటిచ్చాడు. మహా అయితే ఈ టీ-షర్ట్ ఎంత ఖరీదు ఉంటుందిలే అని మీరనుకోవచ్చు. కానీ దీని ధర అక్షరాలు రూ.2,11,190 అని తెలుస్తోంది. buyma.us అనే వెబ్సైట్లో ఇది అందుబాటులో ఉంది. ఇకపోతే తాజా వీకెండ్లో శోభాని ఎలిమినేట్ చేసి పంపేశారు. దీంతో ప్రస్తుతం హౌస్లో టాప్-6 మాత్రమే ఉన్నారు. వీళ్లలో విజేత ఎవరనేది ఈ ఆదివారం అంటే డిసెంబరు 17న తెలిసిపోతుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 మూవీస్) -
ప్రియాంక అమ్మ ఇప్పటికీ పెళ్లిళ్లకు వెళ్లి పనులు చేస్తుంది: శివ
ప్రియాంక జైన్గా కంటే ఇప్పుడు బిగ్ బాస్ ప్రియాంక అనే పేరుతోనే ఆమెకు మంచి గుర్తింపు ఉంది. బుల్లితెరపై 'జానకి కలగనలేదు' సీరియల్తో ఆమె వెలుగులోకి వచ్చింది. అదే విదంగా బుల్లితెర నటుడు శివ కుమార్తో ఆమె ప్రేమలో పడిన విషయం తెలిసిందే. చాలా ఏళ్లుగా వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారు. మౌనరాగం సీరియల్లో కలిసి నటించారు. అమ్ములుగా ప్రియాంక జైన్.. అంకిత్గా శివ కుమార్లు కనిపించారు. కెమెరా ముందే నటనతో జీవించిన వీళ్లు.. కెమెరా వెనుక కూడా రొమాంటిక్ జోడీగా మారారు. ఈ క్రమంలో ప్రియాంకకు బిగ్ బాస్లోకి ఎంట్రీ అవకాశం రావడంతో ఆమెకు మరింత గుర్తింపు దక్కింది. ప్రస్తుతం ఆమె టాప్-5 కంటెస్టెంట్గా ఆమె ఉన్నారు. బిగ్ బాస్ హౌస్లో ప్రియాంక ఎక్కడా బ్యాలెన్స్ తప్పలేదని చెప్పవచ్చు. గేమ్లో తన హుందాతనాన్ని, సంస్కారాన్ని కోల్పోకుండా ఉండటం వల్ల టాప్-5 వరకు వచ్చింది. ఈ క్రమంలో కొందరు యాంటీ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేయడం కూడా జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక కుటుంబం గురించి శివ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రియాంక బిగ్ బాస్లో ఉండగా తన ఇంటికి సంబంధించిన హోమ్ టూర్ వీడియో ఒకటి భారీగా వైరల్ అయింది. ఆ వీడియోను చాలా రోజుల క్రితమే ఆమె యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసిన వారందరూ ప్రియాంక ఇంత పేదరికాన్ని చూసి ఈ స్థాయికి వచ్చిందా..? అని కొందరు ప్రశంసించారు. దీనిని జీర్ణించుకోలేని కొందరూ అదంతా ఓట్ల కోసం సింపతీ అనే విమర్శలు చేయడం ప్రారంభించారు. ఈ విషయంపై శివ ఇలా సమాధానం చెప్పాడు. 'ఆ వీడియో పోస్ట్ చేసే సమయానికి ప్రియాంకకు బిగ్ బాస్ ఆఫర్ రాలేదు. నిజానికి ఆమె అక్కడే జన్మించింది. ప్రియాంక నాన్నగారిని వ్యాపారం పరంగా ఆయన స్నేహితుడు మోసం చేయడంతో ఆర్థికంగా భారీగా నష్టపోయారు. ఆ సమయంలో ఆ ఇల్లు అమ్మేసి ప్రస్తుతం బెంగళూరులో ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు. దానికి రూ. 15 వేలు రెంట్ అవుతుంది.. ఆ డబ్బు కూడా ప్రియాంకనే చెల్లిస్తుంది. ప్రియాంక అమ్మగారు ఇప్పుడు కూడా పెళ్లికూతురికి మేకప్ చేయడం.. మెహందీ పెట్టడం వంటివి చేస్తున్నారు. ఆమె నాన్నగారు ఒక చిన్న మొబైల్ షాప్ పెట్టుకుని కొనసాగుతున్నాడు. చాలా పూర్ ఫ్యామిలీ నుంచి ఇంత దూరం ఆమె వచ్చింది. అలాంటి వ్యక్తిపై కూడా ఇలాంటి దారుణమైన ట్రోల్స్ చేయడం ఏంటి..? గేమ్లో భాగంగా వారు కొద్దిసేపు అరుచుకుంటారు.. మళ్లీ కలిసిపోతారు. అంతే గానీ బయట కొందరు పనిగట్టుకుని ఆమెను ఇంతలా ట్రోల్ చేయడం ఏంటి..? ట్రోల్ చేసే వారిలో ఎవరికైనా అన్యాయం చేసిందా అని ఆయన వ్యాఖ్యానించారు. ఆమెను ఎందరు ట్రోల్ చేసినా నేను ఆమెకు తోడుగా ఉంటూనే వాటిని ఎదుర్కుంటాను. అని ఆయన అన్నారు. రేపటి రోజున 'శివాజీ' కూడా స్టార్ మా బ్యాచ్నే ప్రియాంక, శోభ, అమర్ దీప్ను చాలా మంది 'స్టార్ మా బ్యాచ్' అంటూ ట్రోల్ చేస్తూన్నారని శివ తెలిపాడు. ఈ వ్యాఖ్యలు మొదట చేసింది శివాజీ గారే అంటూ ఆయన చెప్పాడు. బిగ్ బాస్ కూడా 'స్టార్ మా' ఛానెల్లోనే వస్తుంది. రేపొద్దున బిగ్ బాస్ పూర్తి అయ్యాక వీరందరూ బయటకు వస్తారు... అప్పుడు శివాజీ, పల్లవి ప్రశాంత్ వంటి వారితో పాటు అందరూ కూడా 'స్టార్ మా బ్యాచ్'నే అవుతారు. ఎందుకంటే వారందరూ కూడా 'స్టార్ మా' ఛానెల్ కోసం పనిచేశారు. అందులో తప్పేముంది..? ఇలాంటి విషయం లేని ట్రోల్స్ చేయడం ఎందుకు..? అని శివ ప్రశ్నించాడు. View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) -
Bigg Boss 7: అనుకున్నట్లే శోభా ఎలిమినేషన్.. కాకపోతే అదొక్కటే అసంతృప్తి!
బిగ్బాస్ 7వ సీజన్ 14వ వారం కూడా పూర్తయిపోయింది. అనుకున్నట్లే శోభాశెట్టి ఎలిమినేట్ అయిపోయింది. అయితే చివరకొచ్చేసరికి కాస్త టెన్షన్ పెట్టారు గానీ అప్పటికే అందరికీ సీన్ అర్థమైపోయింది. అయితే శోభా.. ఎలిమినేట్ కావడం మాటేమో గానీ సడన్గా తనలో ఓ మార్పు చూపించి అందరికీ షాకిచ్చింది. ఇంతకీ ఆదివారం ఏం జరిగిందనేది Day 98 ఎపిసోడ్ హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?) పశ్చాత్తాపం టాస్క్ శనివారం అందరినీ ఓ ఆటాడేసుకున్న హోస్ట్ నాగార్జున.. ఆదివారం వచ్చేసరికి ఫుల్ కూల్ అయిపోయాడు. 14 వారాల్లో ఏ వారం మీరు పశ్చాత్తాపంగా ఫీలయ్యారు? ఎందుకు? అనే చిన్న గేమ్ ఒకటి పెట్టాడు. ప్రియాంక.. 7వ వారంలో భోలెని ఓ మాట అనకుండా ఉండాల్సిందని చెప్పింది. శోభాశెట్టి.. 9వ వారం యావర్ని పిచ్చోడని అనకుండా ఉండాల్సిందని చెప్పింది. అమర్.. 14వ వారం తను ఎందుకలా పిచ్చోడిలా ప్రవర్తించానే అర్థం కాలేదని అన్నాడు. శివాజీ.. 14వ వారంలో ఆడపిల్లల గురించి ఉపయోగించిన పదాలు వ్యక్తిగతంగా ఫీలయ్యాను కానీ మిగతావాళ్లకు అవి టచ్ అయ్యాయని, ఈ విషయంలో పశ్చాత్తాపపడ్డానిని సంజాయిషీ ఇచ్చుకున్నారు. మిగతా వాళ్లందరూ ఒక్క ముక్కలో చెబితే.. శివాజీ మాత్రం సీరియల్ సాగదీసినట్లు చాంతాడంత చెప్పాడు. పోనీ అదైనా చక్కగా ఉందా అంటే.. మొత్తం యాక్టింగే కనిపించింది. ఎవరు ఏం నేర్చుకున్నారు? ఇక పశ్చాత్తాపం గేమ్ పూర్తయిన తర్వాత 14 వారాల్లో ఒక్కో కంటెస్టెంట్.. ఎవరి దగ్గర ఏం నేర్చుకున్నారో చెప్పాలని నాగ్ చెప్పాడు. దీంతో ఫస్ట్ మాట్లాడిన అమర్.. ప్రశాంత్ దగ్గర నుంచి గేమ్ ఆడటం నేర్చుకున్నాను. అర్జున్ దగ్గర నిజాయతీ నేర్చుకున్నానని అన్నాడు. శివాజీ దగ్గర ఓపికగా ఉండటం నేర్చుకున్నానని యావర్ అన్నాడు. అమర్లా ఫౌల్ గేమ్స్ ఆడొద్దని నేర్చుకున్నానని ప్రియాంక చెప్పింది. శివాజీ దగ్గర లౌక్యం, యావర్ దగ్గర పట్టుదల, ప్రశాంత్ దగ్గర కలిసిపోయి నవ్వుతూ మాట్లాడటం, ప్రియాంక దగ్గర నవ్వుతూ మాట్లాడటం నేర్చుకున్నానని అర్జున్ చెప్పాడు. శోభా మాత్రం.. ఎవరి దగ్గర ఏం నేర్చుకోలేదు కానీ ఫోన్ లేకుండా బతకడం నేర్చుకున్నానని డిఫరెంట్గా చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: లేటు వయసులో పెళ్లి చేసుకున్న జైలర్ నటుడు, ఫోటోలు వైరల్) ఫైనలిస్టులుగా వాళ్లు గతవారం టికెట్ టూ ఫినాలే పోటీల్లో గెలిచి చివరివరకు నిలిచిన అర్జున్.. తొలి ఫైనలిస్ట్గా నిలిచాడు. ఇక ఇప్పుడు సేవింగ్, ఎలిమినేషన్ లాంటిది కాకుండా ఎవరెవరు ఫైనలిస్ట్ అయ్యారనేది నాగార్జున ప్రకటించాడు. వరసగా ప్రియాంక, యావర్, అమర్, ప్రశాంత్.. ఫినాలే వీక్లోకి అడుగుపెట్టినట్లు చిన్నచిన్న హింట్స్ రూపంలో రివీల్ చేశారు. చివరగా శోభా-శివాజీ మిగలగా.. కాసేపు సస్పెన్స్ తర్వాత శోభా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. అయితే తాను బయటకెళ్లిపోతానని ముందే తెలుసో ఏమో గానీ పెద్దగా రియాక్ట్ కాలేదు. సైలెంట్గా స్టేజీపైకి వచ్చేసింది. అయితే ఆమె ఓవరాల్ జర్నీ వీడియో చూపించినప్పుడు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంది. అలానే ఇన్నిరోజులు హౌసులో అందరితో పోట్లాడిన శోభా.. ఎలిమినేట్ అయిన తర్వాత మాత్రం శాంతమూర్తిలా అందరి గురించి మంచిగా చెబుతూ కనిపించేసరికి.. ఈమెలో ఏంట్రా ఈ మార్పు అని అనుకున్నారు. అయితే ఎలిమినేట్ అవుతానని తెలియడం వల్లనో ఏమో గానీ శివాజీ, యావర్లని గేమ్స్ పేరుతో ట్రిగ్గర్ చేసి, వాళ్ల నిజస్వరూపాల్ని బయటపెట్టి వెళ్లిపోయింది. ఇప్పుడున్న వాళ్లతో శోభాతో కొన్ని విషయాల్లో బ్యాడ్ అయ్యిండొచ్చు కానీ ఆమెని చివరి వారం కూడా ఉంచుంటే శివాజీని ఆడుకునేది. ఇప్పుడు ఆమె ఎలిమినేట్ అయిపోవడం.. ఆమె అభిమానులకు చిన్న అసంతృప్తిని మిగిల్చింది. ఇకపోతే టాప్-6 సెలబ్రేషన్స్ చేసుకోవడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: ముంబైలో లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లు.. రామ్ చరణ్ ఆస్తులెంతో తెలుసా?) -
Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?
చాలామంది ప్రేక్షకులు ఎప్పటినుంచో తెగ ఆరాటపడుతున్నట్లు.. శోభాశెట్టి ఎలిమినేట్ అయిపోయింది. 14వ వారం బిగ్బాస్ హౌస్ నుంచి బయటకొచ్చేసింది. అయితే ఇది ఆమెకు ఇది పెద్ద షాకింగ్ విషయమేం కాదు. ఎందుకంటే ఇలా జరుగుతుందని ముందే ఊహించింది. ఇంతకీ శోభా ఎలిమినేషన్కి కారణమేంటి? మొత్తంగా రెమ్యునరేషన్ ఎంత సంపాదించింది? శోభా ఎలిమినేషన్ కరెక్టేనా? శోభాశెట్టి.. బిగ్బాస్ ప్రస్తుత సీజన్లో సీరియల్ బ్యాచ్కి లీడర్. ఫస్ట్ నుంచి అమర్-ప్రియాంకకి సపోర్ట్ చేస్తూనే వచ్చింది. లెక్క ప్రకారం చూస్తే ఈమె చాన్నాళ్ల క్రితమే ఎలిమినేట్ అయిపోవాలి. కానీ షో ఆర్గనైజర్స్ అలా చేయలేదు. శోభాశెట్టిలో వీళ్లకు టీఆర్పీ కనిపించింది. దీంతో మోస్తరుగా ఆడినా సరే ఆమెని చివరివరకు లాక్కొచ్చేశారు. ఎందుకంటే అవసరం అలాంటిది మరి. అలానే శివాజీతో ఢీ అంటే ఢీ అనేలా ఫైట్ చేసింది కూడా ఈమె ఒక్కతే. అలాంటి శోభాని ముందే పంపేంచేసి ఉంటే షోలో మజా ఉండేది కాదు. ఇన్నాళ్లకు శోభా అవసరం తీరిపోయింది. దీనికి తోడు ప్రస్తుతమున్న వాళ్లలో ఓటింగ్ శాతం శోభాదే తక్కువ. అలా ఈమె ఎలిమినేట్ అయిపోవాల్సి వచ్చింది. శివాజీ పరువు పాయే ఈ సీజన్లో సీరియల్ బ్యాచ్, శివాజీ బ్యాచ్.. అందరికి అందరూ అలానే తయారయ్యారు. గేమ్స్ పరంగా అర్జున్, ప్రియాంక మినహా ఒక్కరు కూడా తిన్నగా ఆడలేదు. దీని గురించి పక్కనబెడితే 14 వారాలుగా అమర్ని పురుగు కంటే హీనంగా చూసిన శివాజీ.. నోటికి ఎన్ని వస్తే అన్ని మాటలు అన్నాడు. 'పనికిమాలినోడా' లాంటి చీప్ కామెంట్స్ చేశాడు. అయినా సరే అమర్.. వీటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ వారం.. ఓ టాస్క్ సందర్భంగా జస్ట్ పదే పదే నిమిషాల్లో శివాజీని ఆడేసుకుంది. దీంతో సోఫాజీ ట్రిగ్గర్ అయిపోయాడు. కట్ చేస్తే.. ఆడపిల్లల్ని పీకుతా, పీకమీద కాలేసి తొక్కుతా అని శివాజీ చిల్లర కామెంట్స్ చేశాడు. దీంతో ఉన్న ఆ కాస్త పరువు కూడా పోయింది. దీన్ని కవర్ చేసేందుకు ప్రస్తుతం సోషల్ మీడియాలో శివాజీ బ్యాచ్ పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో శోభా సూపర్ ఆడింది అని చెప్పం గానీ ఎలిమినేట్ అయి వెళ్తూ వెళ్తూ శివాజీ పరువు మాత్రం తీసేసి వెళ్లిపోయింది. రెమ్యునరేషన్ ఎంత? సీరియల్ నటిగా శోభాకి కాస్త పేరుంది. అలానే వారానికి రెండున్నర లక్షల రూపాయల చొప్పున రెమ్యునరేషన్ మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. అంటే 14 వారాలకుగానూ మొత్తం రూ.35 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎలిమినేట్ అయినవాళ్ల పరంగా చూసుకుంటే మాత్రం శోభాదే హయస్ట్ అని చెప్పొచ్చు. సో అదన్నమాట విషయం. -
Bigg Boss 7: ప్రశాంత్ మోసాన్ని బయటపెట్టిన నాగ్.. శివాజీ వరస్ట్ బిహేవియర్!
బిగ్బాస్ 7లో శివాజీ ఓ చెదపురుగు. పురుగు వల్ల చెక్క అంతా డ్యామేజ్ అయినట్లు.. సోఫాజీ అలియాస్ శివాజీ వల్ల ఈ సీజన్ తీరే దెబ్బతినేసింది. దీన్ని బాగుచేయడం నాగ్ వల్ల కూడా కాదు. అయినా సరే పెద్దాయన ముసుగు వేసుకున్న ఈయన ఇప్పటికీ తీరు మార్చుకోవడం లేదు. స్వయంగా నాగార్జున.. నువ్వు చేసింది తప్పురా బాబు అని చెబుతున్నాసరే ఒప్పుకోలేదు. శివాజీ ఒక్కడికే కాదు ఇతడి బ్యాచ్ మొత్తానికి గట్టిగా పడ్డాయి. ఇంతకీ శనివారం ఏం జరిగిందనేది Day 97 ఎపిసోడ్ హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. అర్జున్-ప్రియాంక ఫర్ఫెక్ట్ ప్లేయర్స్ వీకెండ్ కాబట్టి వచ్చేసిన నాగార్జున.. శుక్రవారం సంగతులన్నీ చూశాడు. అలా శనివారం ఎపిసోడ్ మొదలైంది. ఇక ఈసారి ఏడుగురు ఇంటి సభ్యుల తప్పుల్ని బయటపెట్టడమే నాగ్ పనిగా పెట్టుకున్నాడు. అయితే ప్రియాంక, అర్జున్ మాత్రం సేవ్ అయ్యాడు. ఫినాలే వీక్కి చేరుకున్నా సరే ఈ వారమంతా గేమ్స్ ఆడి, ఒక్కటంటే ఒక్క తప్పు చేయని అర్జున్.. జస్ట్ ఒకే ఒక్క ఫౌల్ చేసిన ప్రియాంకని నాగ్ మెచ్చుకున్నాడు. దీనిబట్టి చూస్తే ప్రియాంక కూడా ఫినాలే వీక్కి ఆల్మోస్ట్ చేరిపోయినట్లే ఓ క్లారిటీ వచ్చేసింది. (ఇదీ చదవండి: మెగాహీరో రామ్ చరణ్కు మరో గ్లోబల్ అవార్డ్) శోభాకి స్మూత్గా కౌంటర్స్ ఫస్ట్ ఫస్ట్ శోభా ఫేస్ ఉన్న మార్బెల్ పగలగొట్టిన నాగ్, ఆమెని కన్ఫెషన్ రూంలోకి పిలిచాడు. అలా ఆమెతో పర్సనల్గా మాట్లాడాడు. అయితే వెళ్తున్నప్పుడే ఆమె భయపడుతూ వెళ్లింది. దీన్ని పాయింట్ ఔట్ చేసిన నాగ్.. ఎందుకు భయపడుతున్నావ్ అని అడిగాడు. అసలేమైంది? శివాజీతో గొడవ ఎందుకు? అని నాగ్ అడగ్గా.. 'తెలుగమ్మాయిలు కాదు, ఫేవరిజం అని శివాజీ పదేపదే అంటున్నారు. కొన్నికొన్నిసార్లు ప్రియాంక, నాతో వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అలానే ప్రతిసారి గ్రూపిజం, గ్రూపిజం అని అంటున్నారు. దీని గురించి మాట్లాడుదామని అనుకున్నాను కానీ కుదర్లేదు' అని శివాజీతో వాదనపై శోభా దగ్గర క్లారిటీ తీసుకున్నాడు. అయితే నువ్వు అందరినీ డిస్ట్రబ్ చేస్తున్నావ్, ఇంకా చెప్పాలంటే రెచ్చగొడుతున్నావ్ అని నాగ్, శోభాపై సీరియస్ అయ్యాడు. హౌస్ వాతావరణం కూడా నీ వల్ల కలుషితం అయిపోయిందని అన్నాడు. దీంతో శోభా ఏడ్చేసింది. దీంతో నాగ్ రూట్ మార్చాడు. ఆడపిల్ల ఏడిస్తే షోకి మళ్లీ బ్యాడ్ నేమ్ రావొచ్చని.. ఏమైంది శోభా చెప్పు? అని చాలా స్మూత్ గా అడిగాడు. అయితే వెళ్లిపోతానేమోనని భయమేస్తుంది సర్, అందుకే అలా అని నాగ్ ప్రశ్నలకు శోభా ఆన్సర్ చెప్పుకొచ్చింది. యావర్ అస్సలు మారడు శోభా తర్వాత యావర్ ని కన్ఫెషన్ రూంలోకి పిలిచిన నాగ్.. శోభాని 'చీ..థూ' అని అనడంపై సీరియస్ అయ్యాడు. ఆ ప్రవర్తన బాగుందా? వరస్డ్ బిహేవియర్ అని అన్నాడు. మధ్యలో యావర్.. తనది తప్పు కాదని సమర్థించుకోవడానికి తెగ ప్రయత్నించాడు. దీంతో నాగ్ సీరియస్ అయ్యాడు. నిన్ను చూసిన మాకు ఏమనిపించిందంటే.. ఇది యావర్ నిజస్వరూపం, ఇప్పుడు బయటకొచ్చింది అని నాగ్.. యావర్ గురించి స్మూత్గా నిజాలు చెప్పేశాడు. నీది తప్పు, బయటకెళ్లి శోభాకి మనస్పూర్తిగా సారీ చెప్పు అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ గొడవలో శోభాది కూడా తప్పు ఉందని యావర్, మళ్లీ మళ్లీ అదే పాట పాడేసరికి.. ఇక నీకు చెప్పలేను, దండంరా బాబు అని నాగ్ తన విసుగు చూపించాడు. (ఇదీ చదవండి: సెన్సార్ పూర్తి చేసుకున్న సలార్.. పిల్లలకు థియేటర్లలోకి నో ఎంట్రీ!) రైతుబిడ్డ మస్త్ యాక్టింగ్ రైతుబిడ్డని కన్ఫెషన్ రూంలోకి పిలిచిన నాగ్.. అతడి నిజస్వరూపాన్ని, ఆస్కార్ లెవల్ యాక్టింగ్ బయటపెట్టాడు. చెప్పు ప్రశాంత్.. నీకు ఏ వీడియోలు చూపించాలి అని నాగ్ వంగిమరీ దండం పెడుతూ సెటైరికల్గా మాట్లాడాడు. ఎందుకు ప్రశాంత్ నీకు అందరి మీద అపనమ్మకం ఉంది? నువ్వు అడిగిన ప్రతి వీడియో చూపించడానికి ఉన్నాడా బిగ్ బాస్? అని నాగ్ ఫుల్ సీరియస్ అయ్యాడు. నాగ్ విషయం చెప్పడానికి ట్రై చేస్తుంటే.. అతడిని కూడా ఏమార్చడానికి ప్రయత్నించాడు. దీంతో నాగ్.. చెప్పింది వినరా బాబు అని సైలెంట్ చేశాడు. ఇక అమర్ కొరికేశాడని ప్రశాంత్ సీన్ చేసిన విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఫస్ట్ ఏమో బ్లడ్ వచ్చిందని రైతుబిడ్డ అన్నాడు. అయితే డాక్టర్తో ఇప్పుడే మాట్లాడానని చెప్పిన నాగ్.. నో టూత్ మార్క్, నో బ్లడ్ అని అసలు విషయం చెప్పాడు. అదికాదు సర్ చేయి ఉబ్బిపోయిందని రైతుబిడ్డ మాట మార్చేశాడు. మధ్యలో అర్జున్ కూడా పిలిచిన నాగ్.. ప్రశాంత్ని అమర్ కొరకలేదని, జస్ట్ పట్టి వదిలేశాడని చెప్పాడు. జరిగిన దానికి, నువ్వు అక్కడ చేసినదానికి ఎంత సీన్ చేశావ్ తెలుసా? అని నాగ్ ప్రశాంత్పై ఓ రేంజులో రెచ్చిపోయాడు. మిగతా విషయాల్లో ఎంతో నొప్పి భరించావ్ కానీ అమర్ దగ్గరకొచ్చేసరికి తప్పు ఎక్కడ చేస్తాడా అని ఎదురుచూస్తున్నావ్.. అమర్ విషయంలో పెట్టిన శ్రద్ధ ఆట విషయంలో పెట్టుంటే బాగుండేదని నాగ్ అన్నాడు. అలానే ఈ హౌసులో నువ్వు శివాజీ సేవకుడివా? గులంవా? అని నాగ్ సీరియస్ అయ్యాడు. నాగ్ చెబుతుంటే ప్రశాంత్ అడ్డు తగిలాడు. ప్రశాంత్ నువ్వు చేసిందే తప్పు, అటుఇటు తీసుకెళ్లకు అని నాగ్ కౌంటర్ ఇచ్చాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: తెగించేసిన శోభాశెట్టి.. ఆ నిజాలన్నీ ఒప్పేసుకుంది కానీ!) శివాజీ ఓ వరస్డ్ కేండిడేట్ శివాజీని కన్ఫెషన్ రూంలోకి పిలిచిన నాగార్జున.. ఇన్నివారాలు సపోర్ట్ చేసినట్లు కాకుండా సీరియస్ అయ్యాడు. ఇప్పటికీ మాట్లాడకపోతే షోని ప్రేక్షకులు చూడటం మానేస్తారని తెలుసు. అందుకే నాగ్ ఈసారి తెచ్చిపెట్టుకుని మరీ శివాజీపై సీరియస్ అయ్యాడు. ఆడపిల్లలని పీకుతా అని శివాజీ అన్న కామెంట్పై నాగ్.. వివరణ అడిగాడు. ప్రశాంత్ని గత రెండు వారాల నుంచి టార్చర్ చేస్తున్నారని, అందుకే ఆ ముగ్గురిపై(శోభా-అమర్-ప్రియాంక) సీరియస్ అయ్యానని అన్నాడు. నువ్వు చేసింది తప్పు శివాజీ అని నాగ్ బల్లగుద్ది చెబుతున్నాసరే.. తనని తాను చాలా సమర్థించుకున్నాడు. ప్రేక్షకుల్లోని అమ్మాయి తన బాధ చెబుతున్నా సరే.. ఆమెతో కూడా వాదించాడు తప్పితే తాను చేసింది తప్పని శివాజీ ఒప్పుకోలేదు. ఆడపిల్ల తప్పు చేస్తే గొంత మీద కాలేసి తొక్కుతా అని శివాజీ కామెంట్ చేసి మరో వీడియోని నాగ్ చూపించాడు. అయితే అది కోపం, ఫ్రస్టేషన్ వల్ల వచ్చింది బాబుగారు అని శివాజీ నంగనాచి కబుర్లు చెప్పాడు. ఫ్లోలో వచ్చిన మాట తప్పితే.. వాంటెడ్ గా అన్న మాట కాదు అని శివాజీ ఓ పనికిమాలిన రీజన్ చెప్పాడు. దీనిబట్టి శివాజీ.. ఎంత వరస్ట్ కంటెస్టెంట్ అనేది అర్థమైపోయింది. అమర్కి గట్టిగా పడ్డాయ్ ఈ వారం నిజంగా పిచ్చిపట్టిన వాడిలా ప్రవర్తించిన అమర్ని కూడా నాగ్ ఓ రేంజులో ఆడేసుకున్నాడు. ఏమైంది అమర్, నీకు పిచ్చెక్కిందా? కెప్టెన్ గా ఏంటా బిహేవియర్? అని.. ప్రశాంత్ ని తోసుకుంటూ మెడికల్ రూంలోకి తీసుకువెళ్లడంపై నాగ్ సీరియస్ అయ్యాడు. యావర్, ప్రశాంత్ మీదనే ఎందుకలా చేస్తున్నావ్ అని సీరియస్ అయ్యాడు. ఈ మొత్తం వ్యవహారంలో చపాతీలు కలపడం అనే ఓ చిన్న విషయాన్ని నాగ్ తీసుకొచ్చాడు. ఇంత సీరియస్ డిస్కషన్లో నాగ్ దీని గురించి ఎందుకు మాట్లాడాడు అనేది అస్సలు అర్థం కాలేదు. అలానే నిజంగా 'పిచ్చి నా కొడుకు'లానే బిహేవ్ చేస్తున్నావ్ అని అమర్ ప్రవర్తన గురించి తన కోపాన్ని బయటపెట్టాడు. నన్ను కూడా బయట ఇద్దరు ముగ్గురు అడిగారు.. అమర్ ఎందుకలా సైకోలా బిహేవ్ చేస్తున్నాడని నాగ్ తనకెదురైన సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈవారం సేవింగ్ లాంటివి ఏం ఉండవు, ఫినాలేకి వెళ్లేది ఎవరో చెప్పడం మాత్రమే ఉంటుందని నాగ్ క్లారిటీ ఇవ్వడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. అయితే ఇప్పటికే శివాజీ బ్యాచ్ని నాగార్జున వెనకేసుకొస్తున్నాడని అందరికీ క్లియర్ గా అర్థమైంది. ఇప్పటికీ వాళ్లని తిట్టకపోతే షో పరువు పోతుందని నాగ్ తిట్టినట్లు అనిపించింది అంతే. (ఇదీ చదవండి: శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో అంటూ శివాజీ చిల్లర వ్యాఖ్యలు) -
Bigg Boss 7: తెగించేసిన శోభాశెట్టి.. ఆ నిజాలన్నీ ఒప్పేసుకుంది కానీ!
మిగతా సీజన్లతో పోలిస్తే గొడవలు, గ్రూపుల గోల వల్ల బిగ్బాస్.. ఈసారి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. అయితే ఈ మొత్తం వివాదంలో శోభాశెట్టి అనే ఓ క్యారెక్టర్ వల్ల ఎక్కడలేని మజా వచ్చింది. ఈసారి ఆమె ఎలిమినేట్ అయిపోయిందని అంటున్నారు. సరే దాని గురించి పక్కనబెడితే మాత్రం.. కొన్ని నిజాల్ని స్వయంగా నాగార్జున ముందే ఒప్పేసుకుంది. కాకపోతే హోస్ట్కే బొమ్మ చూపించింది. శోభా ట్రాపులో నాగార్జున 14వ వారం వీకెండ్కి వచ్చేసింది. అంటే మరో వారం రోజుల పాటు షో నడుస్తుంది అంతే. ఈ విషయం శోభాకి కూడా తెలుసు. ఎలానూ కప్ గెలుస్తానని నమ్మకం అయితే లేదు. ఏదైతే అది అయిందని చెప్పి, మొత్తానికే తెగించేసింది. వీకెండ్ వస్తే నాగార్జున.. కచ్చితంగా అడుగుతాడని తెలిసే శివాజీ, యావర్తో కావాలనే గొడవలు పెట్టుకుంది. కరెక్ట్గా ఆమె ఊహించినట్లే నాగ్.. వీటి గురించే అడిగి శోభా ట్రాపులో పడ్డాడు. (ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ.. అక్కడే స్ట్రీమింగ్..) ఫేవరిజం నిజమే! శివాజీ సరే.. ఫేవరిజం అని ప్రతిసారి అంటున్నారు. నాక్కూడా క్లారిటీ కావాలని ఆయన్ని అడుగుదామనుకున్నానని శోభా.. నాగార్జునతో శోభా చెప్పింది. మరి టాస్క్ సందర్భంగా ప్రియాంకని నువ్వు ఎంకరేజ్ చేయడం కరెక్టేనా? అని నాగ్ అడిగితే.. అవును ప్రియాంక అంటే ఇష్టం, అందుకే సపోర్ట్ చేశానని శోభా ఒప్పుకొంది. అలా తన బ్యాచ్ అంటే ఫేవరిజం ఉందని పరోక్షంగా అంగీకరించింది. ఇంకా డెప్త్గా నాగ్ అడుగుతుండేసరికి.. ఈ వారం నా మైండ్ అంతా డిస్ట్రబెన్స్గా ఉందని చెప్పి మొత్తం సీన్ మార్చేసింది. దీంతో నాగ్ కూడా ఏం అనలేకపోయాడు. శోభాకి అది ముందే తెలుసా? బహుశా శోభాకి కూడా ఈసారి తానే ఎలిమినేషన్ అవుతానని ముందే తెలిసినట్లుంది. అందుకే మొత్తానికే తెగించేసి.. ఏదైతే అది అవుతుందని తెలిసి అందరితో గొడవలు పెట్టేసుకుంది. మరీ ముఖ్యంగా తనని మొదటి నుంచి ఇబ్బంది పెడుతున్న శివాజీ, యావర్కి రైట్ లెఫ్ట్ ఇచ్చిపడేసింది. ఈమె దెబ్బకు వీళ్లిద్దరూ అసలు రంగు బయటపడింది. దీని వల్ల శోభా కంటే వాళ్లిద్దరికే డ్యామేజ్ ఎక్కువ ఉండొచ్చు. తీరా వీటన్నింటి గురించి నాగ్ అడిగేసరికి.. మైండ్ డిస్ట్రబ్ అని ప్లేట్ మార్చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో శోభా.. తను అనుకున్నది సాధించినట్లే కనిపిస్తోంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో అంటూ శివాజీ చిల్లర వ్యాఖ్యలు) -
శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో అంటూ శివాజీ చిల్లర వ్యాఖ్యలు
Bigg Boss 7 Day 96 Highlights: బిగ్ బాస్లో ప్రస్తుతం వరుసగా కొట్లాటలు.. గొడవలు.. భారీగానే జరుగుతున్నాయి. మొదటి నుంచి SPY బ్యాచ్లో ఎలాంటి గొడవలు లేకుండా గ్రూప్గానే గేమ్ ఆడుతూ వస్తున్నారు. అదే విధంగా SPA బ్యాచ్ కూడా గ్రూప్ గేమ్ ఆడుతూనే ఇంత వరకు వచ్చింది. కానీ వీరిలో యూనిటి మాత్రం ఎక్కడా కనిపించలేదు. స్నేహితులం అని చెప్పుకుంటున్న వీరి మధ్య కూడా పొరపచ్చాలు వస్తున్నాయి. శోభపై మాటలు తూలిన శివాజీ.. గొంతుపై కాలేసి తొక్కుతా అంటూ బిగ్ బాస్లో ఓట్ అప్పీల్ కోసం ఫన్నీ టాస్క్లు జరుగుతున్నాయి. ఇప్పటికే శోభ,అర్జున్ ఓట్ అప్పీల్ చేసుకున్న విషయం తెలిసిందే. ఓట్ అప్పీల్ కోసం జరుగుతున్న ఫన్సీ గేమ్స్లో శివాజీ,శోభ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో శివాజీ చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరంగా ఉన్నాయి. ఒకానొక సమయంలో బాల్ టాస్క్ ఆడలేనని చెప్పి బయటకు వచ్చేస్తాడు. అసలు శివాజీ ఆడేదే కన్నింగ్ గేమ్.. యావర్, ప్రశాంత్ను వెంటేసుకుని ఇతరులపై నాలుగు పిచ్చి మాటలు విసురుతాడు. కానీ ఎప్పుడూ కూడా శివాజీపై బిగ్ బాస్ కిమ్మనడు. దీనినే అలుసుగా తీసుకున్న శివాజీ తాజాగా జరిగిన బాల్ టాస్క్ విషయంలో శోభపై ఫైర్ అవుతాడు. చిల్లరోళ్లు, క్యారెక్టర్ లెస్, మేము పీకేదానికి ఉన్నామా..? అంటూ శివాజీ రెచ్చిపోతాడు. రేపు శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో... వాడు భయపడిపోడా..? అంటూ అవసరం లేని మాటలు శివాజీ వాగుతాడు. పెళ్లి తర్వాత ఇలాగే ఉంటే అంటూ టాపిక్కు సంబంధంలేని వ్యాఖ్యాలు చేశాడు శివాజీ. ప్రియాంక, శోభను ఉద్దేశిస్తూ.. ఇలాంటి ఆడపిల్లలను ఎక్కడా చూడలేదు.. అదే మన ఇంట్లో ఇలాంటి వాళ్లుంటే గొంతుమీద కాలు వేసే తొక్కేవాడినంటూ నీచమైన వ్యాఖ్యలు చేశాడు. ఇదే క్రమంలో శివాజీని కూడా శోభ పదేపదే ట్రిగ్గర్ చేస్తూ మాట్లాడుతుంది. దానిని సంహించలేని శివాజీ ఇలా వ్యక్తిగతంగా మాట్లాడటం ఏ మాత్రం కరెక్ట్ కాదని చెప్పవచ్చు. ఓట్ అప్పీల్ చేసుకున్న శివాజీ ఓట్ అప్పీల్ చేసుకునేందుకు అర్జున్. శివాజీ పోటీ పడుతారు. అప్పటికే అర్జున్ ఓట్ అప్పీల్ చేసుకోవడం వల్ల హౌస్లోని కంటెస్టెంట్లు అందరూ శివాజీకే ఓట్ అప్పీల్ అవకాశం దక్కేలా సపోర్ట్ చేస్తారు. తర్వాత ఆయన ఓట్ అప్పీల్ చేసుకుంటాడు. తన గేమ్ నచ్చితే ఓట్ వేయాలని ఆయన కోరుతాడు. SPA బ్యాచ్లో గొడవలకు కారణమైన శోభ బిగ్ బాస్లో ఒక యాడ్కు సంబంధించిన టాస్క్లో అమర్, శోభ మధ్య గొడవ జరుగుతుంది. హౌస్లో రెండు గ్రూపులుగా డివైడ్ చేసి.. ఒక బ్యాచ్లో ప్రియాంక, శివాజీ, ప్రశాంత్ ఉంటారు. మరోక బ్యాచ్లో శోభ,యావర్,అర్జున్ ఉంటారు. సంచాలక్గా అమర్ ఉంటాడు. వీరికి ఇచ్చిన టాస్క్లో వండర్ ఉమెన్గా ప్రియాంకను విన్నర్గా ప్రకటిస్తాడు అమర్ దీంతో శోభకు కోపం రావడం.. ఆపై అమర్ నిర్ణయాన్ని తప్పుపట్టిన శోభ గొడవకు దిగుతుంది. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని చెప్పవచ్చు. అక్కడ గెలిచింది ప్రియాంకనే కదా... మనం అనే విషయాన్ని మరిచిపోయి అమర్తో గొడవకు దిగుతుంది. అప్పుడు అమర్ కూడా పక్కన వాళ్లను చూసి నేర్చుకో ఎలా ఉండాలో అని చెబుతాడు. ఇలా SPA బ్యాచ్లో చిచ్చు పెట్టిన వ్యక్తిగా శోభ మిగిలిపోయింది. Sivaji crossed all the limits today. 40 seconds of utter garbage🤮 Ammayila character nunchi valla marriage life varaku neechamga dhigajaaripoyi maatladadu @StarMaa @iamnagarjuna#Sivaji #BiggBoss7Telugu#biggbosstelugu7 pic.twitter.com/SK59Km9Xo4 — Betty🌶️ (@BinduFanBettyyy) December 8, 2023 -
కంట్రోల్ తప్పిన అమర్.. ప్రశాంత్ను కొరికి నెట్టేస్తూ..
బిగ్బాస్ తెలుగు 7వ సీజన్లో 94 రోజులు గడిచిపోయాయి. దాదాపు శుభం కార్డు పడే సమయం వచ్చేసింది. ఉల్టా పుల్టా పేరుతో వచ్చిన ఈ సీజన్ పేరుకు తగినట్లే జరిగింది. ఒక ఎపిసోడ్లో ఫైర్ ఉంటే.. మరో ఎపిసోడ్లో ఫన్ ఉంటుంది. కానీ ఒక్కోసారి ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారు. గురువారం ఎపిసోడ్ అయితే అమర్, ప్రశాంత్ మధ్య మాటల యుద్ధమే నడిచింది. Day 95 హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. అమర్ Vs అర్జున్ టాస్క్లో భాగంగా ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశాన్ని బిగ్ బాస్ కల్పించాడు. అందుకు రీచ్ కావాలంటే కొన్ని ఫన్ టాస్క్లలో గెలవాలని రూల్ పెట్టాడు. వాటిలో అమర్, అర్జున్ ఇద్దరూ గెలిచి ఓట్ అప్పీల్ రేసులోకి వచ్చారు. వారిద్దిరిలో ఒకరిని ఎంపిక చేసి ఓట్ అప్పీల్ అవకాశం ఎవరికి కల్పిస్తారో అనే అంశాన్ని మాత్రం ఓట్ల ప్రాతిపదికన కంటెస్టెంట్ల చేతిలో పెట్టాడు బిగ్ బాస్. ఈ క్రమంలో ఎక్కువ ఓట్లు అర్జున్కు రావడంతో ఆయన ఓట్ అప్పిల్ చేసుకున్నాడు. యావర్,పల్లవి ప్రశాంత్, శివాజీ ముగ్గురూ అర్జున్కు సపోర్ట్ చేస్తే... శోభ,ప్రియాంక ఇద్దరూ అమర్కు సపోర్ట్ చేశారు. దీంతో అర్జున్కు మెజారిటీ వచ్చింది. ఈ ఓటింగ్ విషయంలో కూడా SPY బ్యాచ్లోని ముగ్గురితో అమర్ చిన్నపాటి గొడవకు దిగాడు. దీనికి ప్రధాన కారణం అతను ఈ వారం ఎలిమినేషన్లో ఉండటం... అర్జున్ లేకపోవడం. దీంతో ఓట్ అప్పీల్ అవకాశం తనకు కల్పించాలని అమర్ బలంగా కోరాడు కానీ SPY బ్యాచ్ ఈ విషయంలో అమర్కు ఎలాంటి సాయం చేయలేదు. శోభ ట్రాప్లో యావర్.. ఛీ.. ఛీ.. అంటూ ఫైర్ ఓట్ అప్పీల్ కోసం మరో టాస్క్ను బిగ్ బాస్ ఇచ్చాడు. హౌస్లోని కంటెస్టెంట్లు అయిన అందరికీ టీ షర్ట్స్ ఇస్తాడు బిగ్ బాస్. ఒక బార్డర్ లైన్లో వారందరూ ఉంటూ వారి వద్ద ఉన్న బాల్స్ను తను ప్రత్యర్థులు అనుకున్న వారిపై విసరాలి.. అవి ఎవరి టీ షర్ట్కు ఎక్కువగా అంటుకుంటాయో వారు ఆ రౌండ్ నుంచి ఎలిమినేషన్ అయినట్లు అని రూల్స్ పెడుతాడు బిగ్ బాస్. ఈ క్రమంలో మొదట శోభపై యావర్ అటాక్ స్టార్ట్ చేస్తాడు. అదే సమయంలో ఆమె కూడా అతనిపై ఫైట్ చేస్తుంది. ఈ సమయంలో యావర్ కోపంతో రెచ్చిపోయి శోభపై ఫైర్ అవుతాడు. కానీ శోభ చాలా తెలివిగా యావర్ను బార్డర్ లైన్ దాటేలా చేస్తుంది. కావాలనే ఆట నుంచి ఆమె బయటకు వస్తుంది. కోపంలో ఉన్న యావర్ అదేమి గమనించకుండా లైన్ క్రాస్ అవుతాడు. దీంతో బిగ్ బాస్ ఇద్దరినీ ఎలిమినేట్ చేస్తాడు. అప్పుడు యావర్ కంట్రోల్ తప్పిపోయి శోభపై ఛీ.. ఛీ.. ఛీ.. అంటూ రెచ్చిపోతాడు. పదే పదే అదే మాటను యావర్ ఉపయోగించడం చాలా తప్పుగా ఉంటుంది. చివరకు శివాజీ కూడా యావర్ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాడు. కంట్రోల్ తప్పిన అమర్.. పల్లవి ప్రశాంత్ సూపర్ ఇదే బాల్ టాస్క్లో అమర్ Vs పల్లవి ప్రశాంత్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. గేమ్లో భాగంగా మొదట ప్రశాంత్ వద్దకు అమర్ వెళ్తాడు. ఇద్దరూ టాస్క్లో ఫిజికల్ అవుతారు. ఈ క్రమంలో అమర్ గొంతును ప్రశాంత్ పట్టుకుంటే.. అతని చెయిని అమర్ కొరుకుతాడు. కానీ అది ఆటలో అనుకోకుండా జరిగినట్లు భావించవచ్చు. కానీ ఇదే విషయంలో ఇద్దరూ మాటకు మాట పెరుగుతుంది. ఎవరు ఎవర్నీ కొట్టారో తెలుసుకోవాలంటే మెడికల్ రూమ్కు పోదాం పదండి అన్నా అంటూ ప్రశాంత్ అంటాడు. ఆ సమయంలో అమర్ కంట్రోల్ తప్పుతాడు. ఎదుట ఉండేది ఒక కంటెస్టెంట్ అనే విషయాన్ని అమర్ మరిచిపోయినట్లు ఉన్నాడు. ప్రశాంత్ వీపుపై చెయ్యి పెట్టిన అమర్ పదే పదే తోస్తూ మెడికల్ రూమ్కు పదా అంటూ నెట్టేస్తాడు. ఆ సమయంలో ప్రశాంత్ పట్ల అమర్ చాలా రూడ్గా ప్రవర్తించాడు. తన గొంతును గట్టిగా పట్టుకున్నాడని చెప్పుకొస్తున్న అమర్ కంట్రోల్ తప్పి భారీగానే రెచ్చిపోయాడు. ప్రశాంత్, ఆమర్ మధ్య చాలా సేపు మాటలు యుద్ధం జరిగింది. కానీ ఎక్కడా కూడా ప్రశాంత్ కంట్రోల్ తప్పి మాట్లడలేదు.. పదే పదే అమర్ను అన్నా అంటూ తన వాదనను చెప్పుకొస్తున్నాడు. కానీ అమర్ మాత్రం రెచ్చ గొట్టకు రా అంటూ ప్రశాంత్పై ఫైర్ అవుతున్నాడు. తనను తాను ఏ మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోయిన ఆమర్ పూర్తిగా ట్రాక్ తప్పాడు. ఆ సమయంలో అతను ఏం మాట్లాడుతున్నాడో కూడా గ్రహించలేకపోయాడు.. అలా కోపంలో ఉన్న అమర్ను చూస్తే ఎవరికైనా భయం వేయడం ఖాయం. అంతలా కంట్రోల్ తప్పాడు.. ఆ కోపంలో ఒకానొక సమయంలో ఏమైనా చేసుకుంటా అంటూ రెచ్చిపోయాడు. ఈ విషయంలో అతనిపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. -
Bigg Boss 7: రైతుబిడ్డకు ఇచ్చిపడేసిన అర్జున్.. దెబ్బకు సైలెంట్!
బిగ్బాస్ 7వ సీజన్ అయిపోవడానికి ఇంకా 10 రోజులే ఉంది. ఇలాంటి టైంలో షోని ఎంత ఇంట్రెస్ట్గా డిజైన్ చేయాలి. కానీ నిర్వహకులకు అలాంటి ఆలోచనే లేనట్లు ఉంది. ఎందుకంటే మంగళవారం ఎపిసోడ్ అంతంత మాత్రంగా ఉంది. తాజాగా బుధవారం ఎపిసోడ్ అయితే ఏ విషయంలోనూ అలరించలేకపోయింది. కొద్దొగొప్పో అర్జున్-ప్రశాంత్ గొడవ మాత్రమే ఆసక్తిగా అనిపించింది. ఇంతకీ లేటెస్ట్గా ఏం జరిగిందనేది Day 94 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7' టైటిల్ విజేత రేసులో ఆ ముగ్గురు.. కానీ?) అర్జున్ కేక్ టాస్క్ శోభా.. ఓటు అప్పీలు చేసుకోవడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే బుధవారం ఎపిసోడ్ మొదలైంది. ప్రియాంక-శోభా-అమర్.. కాసేపు తమలో తామే వాదించుకున్న తర్వాత ఊరుకున్నారు. కాసేపటి తర్వాత 2 కిలోల కేక్ పంపించి, అర్జున్ ఒక్కడే దీన్ని తినాలని బిగ్బాస్ ఆర్డర్ వేశాడు. కొంత తిన్నాడు, ఆ తర్వాత వల్ల కావట్లేదనేసరికి ఎవరిదైనా సహాయం తీసుకుంటారా అని అడగ్గా.. యావర్ పేరు చెప్పాడు. అలా వీరిద్దరూ కేక్ మొత్తం తినేశాడు. దీంతో రేపు(గురువారం).. ఇంటి సభ్యుల కోసం కేక్ పంపిస్తానని బిగ్బాస్ చెప్పాడు. పిల్లలని ఆడించే గేమ్ ఎపిసోడ్ని ఎలా టైమ్ పాస్ చేయాలా అని బాగా ఆలోచించిన బిగ్బాస్.. తనకు కవల పిల్లలు ఉన్నారని, నేను బయటకెళ్లి వచ్చేలేపు కాసేపు వాళ్లని ఆడించాలని చెప్పాడు. అందుకోసం రెండు చిన్నపిల్లల బొమ్మల్ని పంపించాడు. అయితే ఇందులో అర్జున్ ఒక్కడే కాస్త ఎంటర్టైన్ చేశాడు. మిగతా వాళ్లందరూ చేతులెత్తేశారు. దీని తర్వాత 'చెర్రీ ఆన్ ద టాప్' అని ఓ గేమ్ పెట్టి, ఇందులో భాగంగా చెర్రీ పండు పడిపోకుండా ఇసుకతో చేసిన కేక్, ఒక్కొక్కరుగా కట్ చేయాలని అన్నాడు. ఇందులో విజేతగా నిలిచిన అమర్.. ఓటు అప్పీలు చేసుకునే ఛాన్సుకు దగ్గరయ్యాడు. (ఇదీ చదవండి: 'పుష్ప' నటుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?) అర్జున్-ప్రశాంత్ గొడవ ఇక ఓటు అప్పీలు చేసుకునేందుకు మరో గేమ్ ఉందని, కాకపోతే దీన్ని ఒక్కరే ఆడాల్సి ఉంటుందని.. దీనికోసం ఎవరైతే ముందుగా గంట మోగిస్తారో వాళ్లకు ఛాన్స్ దక్కుతుందని బిగ్బాస్ చెప్పాడు. అయితే గంట మోగించాలని పరుగెత్తే క్రమంలో అర్జున్.. చేతుల వెనక్కి ఊపుతూ వేగంగా పరుగెత్తాడు. పోటీలో గెలిచి టాస్క్ కూడూ పూర్తి చేశాడు. అయితే పరుగెత్తే క్రమంలో అర్జున్ చేయి, అతడి పక్కనే ఉన్న ప్రశాంత్ని కాస్త గట్టిగా తగిలేసినట్లు ఉంది. దీంతో రైతుబిడ్డ నానా హంగామా చేశాడు. ఎందుకు ఆపేశావ్ అన్నా అని గట్టిగట్టిగా అరిచాడు. దీంతో ఎప్పుడూ సైలెంట్గా ఉండే అర్జున్ కూడా రెచ్చిపోయాడు. నిన్న(మంగళవారం).. పూల్లో డ్యాన్స్ చేసే టాస్క్ కోసం పరుగెత్తినప్పుడు నీ చేయి నాకు తగిలింది, నేను అడిగానా? అని లాజిక్ మాట్లాడాడు. రైతుబిడ్డ దగ్గర ఆన్సర్ లేదు. అర్జున్.. నిన్నటి దాని గురించి అడుగుతుంటే ప్రశాంత్ మాత్రం ఇప్పటి దాని గురించి పదేపదే అడిగాడు. అర్జున్ మరింత గట్టిగా లాజిక్స్ మాట్లాడేసరికి ప్రశాంత్ సైలెంట్ అయిపోయాడు. ఇక అర్జున్, అమర్.. వీళ్లిద్దరిలో ఓటు అప్పీలు చేసుకునే ఛాన్స్ ఎవరికి దక్కిందనేది గురువారం ఎపిసోడ్లో తేలుస్తుంది. (ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ బావతో 'యానిమల్' బ్యూటీ డేటింగ్?) -
'బిగ్బాస్ 7' టైటిల్ విజేత రేసులో ఆ ముగ్గురు.. కానీ?
బిగ్బాస్ 7వ సీజన్ చివరకొచ్చేసింది. ప్రస్తుతం 14వ వారం నడుస్తోండగా, మరో 10 రోజుల్లో షో పూర్తి అయిపోతుంది. ఈ క్రమంలోనే విన్నర్ ఎవరవుతారనే కుతుహలం ఉండటం పక్కా. అందుకు తగ్గట్లే నిర్వహకులు.. ఉన్న ఏడుగురితో గేమ్స్ అవీఇవీ అని టైమ్ పాస్ చేస్తున్నారు. కానీ టైటిల్ రేసులో మాత్రం ముగ్గురే ఉన్నారు. (ఇదీ చదవండి: 'పుష్ప' నటుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?) మిగతా సీజన్లతో పోలిస్తే ఈసారి బిగ్బాస్ అనుకున్నంత ఇంట్రెస్ట్ లేకుండానే సాగుతోంది. శివాజీ బ్యాచ్, సీరియల్ బ్యాచ్.. ఒకరిపై ఒకరు అరుచుకోవడం తప్పితే ఓ ఎంటర్టైన్మెంట్ సరిగా లేదు, ఓ లవ్ ట్రాక్ లేదు. ఎమోషనల్గా ఫీలయ్యే సంఘటన లేదు. ఎలాగోలా ఎపిసోడ్స్ టెలికాస్ట్ చేస్తున్నారు తప్పితే చాలా బోర్ కొట్టించేస్తున్నారు. ఏదైతేనేం షో చివరకు వచ్చేశాం. విజేత ఎవరనేది మరో 10 రోజుల్లో తేలిపోతుంది. అయితే గడిచిన వీకెండ్ సందర్భంగా నిర్వహకులు ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఈ రెండు వారాలు కూడా ఓటింగ్ లైన్స్ తెరుచుకునే ఉంటాయని, ఎక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్.. బిగ్బాస్ 7 విజేతగా నిలుస్తారని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఓటింగ్ నంబర్స్ చూసుకుంటే.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ 34 శాతం ఓట్లతో టాప్ లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ బావతో 'యానిమల్' బ్యూటీ డేటింగ్?) ప్రశాంత్ తర్వాత శివాజీ, అమర్దీప్ దాదాపు 20 శాతం ఓటింగ్ పర్సంటేజ్తో ఉన్నారు. ఆ తర్వాత వరసగా యావర్, అర్జున్, ప్రియాంక, శోభాశెట్టి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ లిస్టులోని తొలి ముగ్గురిలోనే స్థానాలు అటుఇటు మారాలి తప్పితే మిగతా వాళ్లు.. టాప్-3లోకి వచ్చే ఛాన్సులు తక్కువ. అంటే ప్రశాంత్, శివాజీ, అమర్లలో ఎవరో ఒకరే విజేత అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్లే విజేత అని బిగ్బాస్ నిర్వహకులు చెప్పారు. కానీ రాబోయే 10 రోజుల్లో ఏమైనా జరగొచ్చు. లెక్కలు మార్చొచ్చు. ఎన్ని లెక్కలు మారినా సరే ప్రశాంత్ లేదంటే అమర్ విజేత అయితే పెద్దగా సమస్య ఉండదు. శివాజీకి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మిగతావాళ్లతో పోలిస్తే.. మనోడు చాలా విషయాల్లో పూర్. ఏదో మాటలతో లాక్కోచ్చేస్తున్నాడు అంతే! ఏదైతేనేం టైటిల్ కోసం పోటీ మంచిగా నడుస్తోంది. మరి ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారని మీరనుకుంటున్నారు? (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ.. కాబోయే భర్త పోలీస్ ఇన్స్పెక్టర్!) -
Bigg Boss 7: అపరిచితుడులా ప్రవర్తిస్తున్న అమర్.. ప్రియాంకతో అలాంటి సిల్లీ గొడవ!
బిగ్బాస్ 14వ వారం నామినేషన్స్ ఒకేరోజులో పూర్తయ్యాయి. కానీ అమర్-ప్రశాంత్ గొడవ మాత్రం రాత్రంతా నడుస్తూనే ఉంది. 'ఓట్ ఫర్ అప్పీల్' అనే టాస్క్ పెట్టిన బేసిక్ లాజిక్ మర్చిపోయి మరీ ప్రేక్షకుల్ని పిచ్చోళ్లని చేశాడు. శోభా అయితే ఓటు అడిగే విషయంలో అవసరం లేకపోయినా సరే ఎమోషనల్ అయిపోయింది. ఇంతకీ మంగళవారం ఏం జరిగిందనేది Day 93 హైలైట్స్లో చూద్దాం. రైతుబిడ్డ ఎదురుదెబ్బ నామినేషన్స్లో అర్జున్ తప్ప మిగతా వాళ్లంతా ఉన్నారని బిగ్బాస్ చెప్పడంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే మంగళవారం ఎపిసోడ్ మొదలైంది. నామినేషన్స్లో భాగంగా 'అమ్మాయిలా మాట్లాడుతున్నావ్' అని అర్థమొచ్చేలా ప్రశాంత్, అమర్తో అన్నాడు. తననే 'ఆడోడు' అని అంటావా? అని అమర్.. అదే పదాన్ని పదేపదే చెబుతూ ప్రశాంత్ని రెచ్చగొట్టాడు. సెటైర్స్ కూడా వేశాడు. కాసేపటి తర్వాత ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో హిట్ సినిమా) ఓటు అప్పీలుకు ఛాన్స్ చిల్ పార్టీ పేరుతో కొన్ని గేమ్స్ ఉంటాయని చెప్పిన బిగ్బాస్.. ఇందులో గెలిచిన వాళ్లకు ఓటు అడిగే ఛాన్స్ దక్కుతుందని చెప్పాడు. అలా పాట ప్లే కాగానే.. బెంచ్పై వస్తువుల్లో ఒకదాన్ని తీసుకుని స్విమ్మింగ్ పూల్లో దూకాల్సి ఉంటుందని బిగ్బాస్ చెప్పాడు. ఈ పోటీలో చివరివరకు నిలిచిన యావర్ విజేతగా నిలిచాడు. ఇక కలర్స్ జంపింగ్ గేమ్లో అందరూ తడబడ్డారు కానీ శోభా చివరివరకు ఉండి విన్నర్ అయింది. అమర్ కాదు అపరిచితుడు ఈ గేమ్ అయిపోయిన తర్వాత శోభా, ఓ టెడ్డీ బేర్ తీసుకుని రూంలోకి వచ్చింది. అక్కడే అన్న అమర్-ప్రియాంకతో కాసేపు మాట్లాడింది. ఆ తర్వాత ప్రియాంక.. సరదాగానే తలగడతో అమర్ ముఖంపై కొట్టింది. సీరియస్ అయిపోయిన అమర్.. అలిగి బయటకెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత లోపలికి వచ్చాడు. అప్పుడు ప్రియాంక-శోభా లేచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి హర్ట్ అయిన అమర్.. ఏమైంది? మాట్లాడకపోతే మాట్లాడొద్దు అని ప్రియాంకపై సీరియస్ అయ్యాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్న రైతుబిడ్డ.. ఎదురుదెబ్బ తగిలేసరికి!) అమర్ అలా అనేసరికి ప్రియాంక ఊరుకోలేదు. రిటర్న్లో గట్టిగానే ఇచ్చేసింది. ఏం మాట్లాడుతున్నావ్? అదీ ఇదీ అని అమర్కి ఆన్సర్ ఇచ్చింది. బొమ్మలకు ఉన్న విలువ మనుషులకు లేకుండా పోయింది, స్ట్రెయిట్గా చేయాల్సిన పని స్ట్రెయిట్గా చేయవ్ అని అమర్, ప్రియాంకని ఉద్దేశిస్తూ అన్నాడు. ఎందుకు గతవారం జరిగిన విషయాన్ని ఇప్పుడు తీస్తున్నావ్ అని ప్రియాంక రెచ్చిపోయింది. ఈ గొడవలోకి ఎంటరైన శోభా.. మా ఇద్దరి మీద నీకో ఏదో ఉంది, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావ్ అని అమర్కి కౌంటర్ ఇచ్చింది. అయితే ఇదంతా కూడా కంటెంట్ ఇవ్వాలని చేశారా అనే సందేహం వచ్చింది. ఎందుకంటే ఈ ఇష్యూ అంతా అయిపోయిన తర్వాత అర్జున్ మాట్లాడుతూ.. టైమ్ పాస్ కావట్లేదా మీ ముగ్గురికి? అని చిన్న సెటైర్ వేసి నవ్వేశాడు. ఓటు ఫర్ అప్పీలు టాస్క్ పోటీల్లో గెలిచిన యావర్, శోభా.. ఇద్దరు కూడా 'ఓటు ఫర్ అప్పీలు' చేసుకోవాలని, కాకపోతే ఇద్దరిలో ఒకరికి మాత్రమే అవకాశముంటుందని బిగ్బాస్ ఫిట్టింగ్ పెట్టాడు. శోభాకి తక్కువ ఓట్లు పడిన కారణంగా.. అప్పీలు చేసుకునే ఛాన్స్ ఆమెకి దక్కింది. దీంతో.. 'అందరికీ నమస్కారం. నేను 'కార్తీకదీపం' మోనితగానే మీకు తెలుసు. బిగ్బాస్లో చూసేవాళ్లకు శోభాశెట్టిగా తెలుసు. ఇక్కడ మీరు నాకు చాలాచాలా సపోర్ట్ చేశారు. ఈ రోజు నా ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఉన్నాం. కడుపు నిండా తింటున్నాం అంటే మీ అందరీ సపోర్ట్ కారణం. థ్యాంక్యూ సోమచ్ ఫర్ ద సపోర్ట్. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఎలిమినేషన్ హింట్ ఇచ్చేసిన బిగ్బాస్.. ఆ ఇద్దరిలో ఒకరు ఔట్?) 6వ సీజన్ వరకు అబ్బాయిలే గెలిచారు. సీజన్ 7లో నేను గెలవాలి, టైటిల్ కొట్టుకుని వెళ్లాలి. ఈ సీజన్ లో ఉల్టా పుల్టాలో అమ్మాయిగా నేను గెలవాలి అనేది ఒకత్తైతే.. బిగ్బాస్ గెలిస్తే వచ్చే అమౌంట్ గానీ వేరే ఏదైతే ఉందో నాకు చాలా ఇంపార్టెంట్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. నాకు తెలియకుండా ఏదైనా తప్పు చేసుంటే ప్లీజ్ క్షమించండి. ప్లీజ్ ఓటు చేయండి' అని శోభా.. ప్రేక్షకుల్ని ఓట్లు అడుక్కుంది. ఇక ఓటు ఫర్ అప్పీలు టాస్క్లో ఏ ఒక్కరు ఉండాలని.. ఇంటి సభ్యులు డిసైడ్ చేస్తున్న టైంలో ప్రియాంక-శోభా మధ్య చిన్నపాటి వాదన జరిగింది. యావర్ నువ్వు నెక్స్ట్ గేమ్లో గెలిచి, మళ్లీ ఈ ప్లేసులో నిల్చుంటావ్! అందుకే నేను శోభాకి ఇవ్వాలనుకుంటున్నాని ప్రియాంక కారణం చెప్పింది. అంటే నేను వీక్గా ఉన్నానా.. ప్రియాంక మాటల్ని నెగిటివ్గా తీసుకుంది. దీంతో కాసేపు గొడవ జరిగింది. ఈ రోజు ఎపిసోడ్లో మిగతా సోది అంతా పక్కనబెడితే సీరియల్ బ్యాచ్ ప్రవర్తన మాత్రం చాలా విచిత్రంగా అనిపించింది. అప్పుడే గొడవ పడతారు. అప్పుడే కలిసిపోతారేంట్రా బాబు అనిపించింది. అలానే ఎక్కడైనా గేమ్స్ లో ఓడిపోతే ఓట్లు అడుక్కుంటారు. ఈరోజు మాత్రం ఓ పోటీలో గెలిచిన శోభనే ఓట్ల కోసం ప్రాధేయపడటం విడ్డూరంగా అనిపించింది. మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ.. కాబోయే భర్త పోలీస్ ఇన్స్పెక్టర్!) -
Bigg Boss 7: ఎలిమినేషన్ హింట్ ఇచ్చేసిన బిగ్బాస్.. ఆ ఇద్దరిలో ఒకరు ఔట్?
బిగ్బాస్ 7 చివరకొచ్చేసింది. 14వ వారానికి సంబంధించిన నామినేషన్స్ పూర్తయ్యాయి. దీంతో ఈ వారం బిగ్బాస్ ఏం ప్లాన్ చేశాడా? అని అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి టైంలో అసలైన ఫిట్టింగ్ పెట్టేశాడు. ఎలిమినేషన్ గురించి చిన్న హింట్ కూడా ఇచ్చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా, ఇది సమ్థింగ్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. టాస్క్తో బిగ్బాస్ ట్విస్ట్ 'టికెట్ టూ ఫినాలే' పోటీలో గెలిచి ఫైనలిస్ట్ అయిన అర్జున్.. చిట్టచివరి నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు. ఇతడు తప్పితే మిగతా ఆరుగురు(అమర్, ప్రశాంత్, శోభా, ప్రియాంక, యావర్, శివాజీ).. ఈ వారం నామినేషన్స్లో ఉన్నారు. రాబోయే రెండు వారాలకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిపోయాయని చెప్పిన బిగ్ బాస్.. తక్కువ ఓట్లు వచ్చిన చివరి వ్యక్తి 14వ వారం ఎలిమినేట్ అయిపోతాడని నామినేషన్స్ సందర్భంగా చెప్పారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్న రైతుబిడ్డ.. ఎదురుదెబ్బ తగిలేసరికి!) మంగళవారం ఎపిసోడ్లో భాగంగా 'వోట్ ఫర్ మీ' పేరుతో టాస్క్ పెట్టారు. బిగ్బాస్ మాట్లాడుతూ.. 'యావర్, శోభా.. మీరిద్దరూ మీ ఓటు అప్పీలు చేసేందుకు మిగతావారి కంటే చేరువలో ఉన్నారు. కానీ మీ ఇద్దరిలో నుంచి ఒక్కరికి మాత్రమే ఓటు అప్పీలు చేసుకునే వీలుంది. ఆ ఒక్కరు ఎవరు అనే విషయం మిగతా ఇంటి సభ్యుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది' అని ఫిట్టింగ్ పెట్టాడు. ఈ టాస్క్లో భాగంగా యావర్కి శివాజీ, ప్రశాంత్ ఓటేశారు. శోభాకి ప్రియాంక, అమర్తో పాటు అర్జున్ కూడా ఓటేసినట్లు ప్రోమోలో చూపించారు. ప్రస్తుతం హౌస్లో ఉన్నవాళ్లలో అర్జున్ ఫైనల్ వీక్కి అర్హత సాధించాడు. మిగతా ఆరుగురిలో శోభా, యావర్ మాత్రం చివరి స్థానాల్లో ఉంటారు. అంటే ఈ వారం వీళ్లిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయిపోయే ఛాన్సులు గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు అదే విషయాన్ని టాస్క్ పేరు చెప్పి బిగ్బాస్ హింట్ ఇచ్చాడా అనే సందేహం వస్తోంది. అయితే ఈ టాస్కులో శోభా కాస్త భయపడినట్లు కనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
Bigg Boss 7: మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్న రైతుబిడ్డ.. ఎదురుదెబ్బ తగిలేసరికి!
బిగ్బాస్ 7లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ బాగానే ఆడుతున్నాడా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే అలా లేకపోతే 14వ వారం వరకు ఎలా వస్తాడు. అంతే కదా. అయితే అంతా బాగానే ఉన్నా గానీ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు. తాజా నామినేషన్స్లోనూ తనకు అలవాటైన ఓ థియరీ ఉపయోగిద్దామని చూశాడు. కానీ ఎదురుదెబ్బ తగిలింది. గిలగిల కొట్టేసుకున్నాడు. తాజాగా రిలీజైన ప్రోమోతో ఆ విషయం అర్థమైంది. (ఇదీ చదవండి: ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) రైతుబిడ్డ అతితెలివి కామన్మ్యాన్ ప్లస్ రైతుబిడ్డ అనే ట్యాగ్తో బిగ్బాస్లో అడుగుపెట్టిన మిగతా రోజుల్లో ఏ మాత్రం సౌండ్ చేయకుండా, అసలు ఉన్నాడా లేడా అన్నట్లు ఉంటాడు. నామినేషన్స్ వస్తే మాత్రం షర్ట్ పై బటన్ కూడా పెట్టేసి, మెడలో టవల్ వేసుకుని మరీ బుద్దిమంతుడు అయిపోయాడు. అవతల వాళ్లు చెబుతున్నది వినకుండా, వాళ్ల చెప్పిన పాయింట్ మార్చేసి మరీ తనపై సింపతీ వచ్చేలా ప్లేట్ తిప్పేస్తాడు. గతంలో ఓసారి సందీప్ మాస్టర్ నామినేషన్ చేసిన టైంలో.. తనని ఊరోడు అన్నాడని నానా హంగామా చేశాడు. అమర్ రివర్స్ పంచ్ అయితే గతకొన్ని వారాల నుంచి నామినేషన్స్ సైలెంట్గా పూర్తి చేస్తూ వచ్చిన తాజాగా సోమవారం మాత్రం అమర్తో పెద్ద వాదనకు దిగాడు. ఈ క్రమంలోనే 'ఆడవాళ్లలా మాట్లాడకు' అని అర్థమొచ్చేలా అన్నాడు. దీంతో అమర్.. దాన్ని రచ్చ చేశాడు. 'నన్ను ఆడోడా అంటావా, చేతులకు గాజులు వేసుకోవాలా?' అని అమర్ రెచ్చిపోయాడు. దీంతో రైతుబిడ్డ డిఫెన్స్లో పడిపోయాడు. ప్రతిసారీ ఏదో ఒకలా సింపతీ కొట్టేద్దామని చూసే రైతుబిడ్డకు ఈసారి అమర్ రివర్స్ పంచ్ ఇచ్చాడు. ఈ గొడవని ఎవరో ఒకరు ఫుల్స్టాప్ పెట్టాలి. కానీ అమర్ రెచ్చిపోయి ప్రశాంత్ తప్పు చేసేలా చేస్తున్నాడు. మంగళవారం ఎపిసోడ్లోనూ ఈ పంచాయతీ సాగింది. మరి ఈ గొడవకు ఎప్పుడు ఎలా? ఎండ్ కార్డ్ పడిందనేది రాబోయే ఎపిసోడ్లో తేలుతుంది. అప్పటివరకు వెయిట్ అండ్ సీ. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) -
Bigg Boss 7: మళ్లీ గొడవపడ్డ అమర్-ప్రశాంత్.. ట్విస్ట్ ఇచ్చిన బిగ్బాస్!
బిగ్బాస్ చిట్టచివరి నామినేషన్స్ అయిపోయాయి. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండాల్సిన ఈ ప్రక్రియ.. చాలా సిల్లీగా నడిచింది. ఎప్పటిలానే పనికిమాలిన సీరియల్ బ్యాచ్, శివాజీ బ్యాచ్ ఒకరిపై ఒకరు పగ ప్రతీకారాలు చూపించుకున్నారు. వీటన్నింటిలో అమర్-ప్రశాంత్ గొడవ మాత్రం కాస్తోకూస్తో ఎంటర్టైనింగ్గా అనిపించింది. ఇంతకీ సోమవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 92 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. నామినేషన్స్ హడావుడి గౌతమ్ ఎలిమినేట్ అయిపోవడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. ఇక నామినేషన్స్తో సోమవారం ఎపిసోడ్ మొదలైంది. 'టికెట్ టూ ఫినాలే' రేసులో గెలిచిన ఫైనలిస్ట్ అయిన కారణంగా అర్జున్.. ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయినట్లు చెప్పారు. అలా ఈ ప్రక్రియ షురూ అయింది. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? యావర్ - శోభా, ప్రియాంక శోభాశెట్టి - యావర్, శివాజీ ప్రశాంత్ - అమర్,శోభాశెట్టి అర్జున్ - అమర్, యావర్ ప్రియాంక - అమర్, యావర్ శివాజీ - ప్రియాంక, అమర్ అమర్ - ప్రశాంత్, యావర్ చాలా అతి చేసిన యావర్ వీకెండ్ ఎపిసోడ్లో ఓ సందర్భంలో ప్రియాంక మాట్లాడుతూ యావర్.. ఇంట్లో తక్కువ పనిచేస్తున్నాడని చెప్పింది. ఇప్పుడు అదే పాయింట్ కారణాన్ని చూపించి ప్రియాంకని యావర్ నామినేట్ చేశాడు. అయితే ప్రియాంక గురించి మాట్లాడినప్పుడు ఆమెతోనే మాట్లాడాలి. కానీ శోభా-అమర్ పేర్లు ప్రస్తావించాడు. ఫేవరిజం చూపిస్తున్నావ్ నువ్వు అని ప్రియాంకతో అన్నాడు. మధ్యలో ఎంటరైన శోభా.. నీత నన్ను కంపేర్ చేయకు, అసలు నువ్వేం చేస్తావ్.. డిన్నర్ రెడీ అయిన తర్వాత వస్తావ్, తింటావ్, వెళ్లిపోతావ్.. అంతకు మించి ఏం చేస్తున్నావ్ అని యావర్ అసలు చేసేదాన్ని బయటపెట్టింది. దీంతో యావర్ పిచ్చిపిచ్చిగా ప్రవరిస్తూ అతి చేశాడు. అమర్కి షాకిచ్చిన ప్రియాంక సీరియల్ బ్యాచ్కి చెందిన ప్రియాంక.. తన ఫ్రెండ్ అయిన అమర్నే నామినేట్ చేసింది. గతవారం టికెట్ టూ ఫినాలే పోటీలో భాగంగా గేమ్ ఓడిపోయిన బాధలో ఉంటే, పదే పదే పాయింట్స్ గురించి తనని అడగడం నచ్చలేదని కారణం చెప్పింది. ఇక మిగిలిన వాళ్లవి ఓకే అనిపించేలా నామినేషన్స్ జరిగాయి. అమర్-ప్రశాంత్ మధ్యలో మాత్రం ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. రెండో వారం నామినేషన్స్ని గుర్తుచేశారు. అమర్ vs ప్రశాంత్ గత కొన్ని వారాల నుంచి బాగానే ఉన్న ప్రశాంత్, అమర్.. ఈసారి నామినేషన్స్లో రెచ్చిపోయారు. అమర్.. ప్రశాంత్ని నామినేట్ చేశాడు. వీళ్లిద్దరి మధ్య నువ్వు ఫేక్ అంటే నువ్వు ఫేక్ అంటూ, మోసం చేస్తున్నావ్ అదీ ఇది అని అనుకున్నారు. మీదమీదకు వెళ్లి మరీ కొట్టుకుంటారా అనేలా ప్రవర్తించారు. చివరకు శివాజీ, మిగతా ఇంటి సభ్యులు కల్పించుకోవడంతో సైలైంట్ అయిపోయారు. ట్విస్ట్ ఇచ్చిన బిగ్బాస్ ఈ ఫినాలే రేసు మిమ్మల్ని ఓ ఫైనలిస్టుని చేస్తుంది లేదా ఫినిష్ లైన్ చేరకుండానే ఆపేస్తుంది. ఆ నిర్ణయం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది. వారు మీ ప్రతి ఆట ప్రతి మాట ప్రతి కదలిక చాలా దగ్గర నుంచి గమనిస్తున్నారు. కాబట్టి ఇప్పటినుంచి మీరు చేసే ప్రతి పని మీ గెలుపోటములని నిర్ణయిస్తుంది. బిగ్ బాస్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఈ రెండు వారాలు కూడా మీ ఓటింగ్ లైన్స్ తెరుచుకుంటాయి. ఎక్కువ ఓట్లు పొందిన వాడు.. బిగ్బాస్ 7 విజేతగా నిలుస్తాడు. కానీ ఒకవేళ ఈ వారం మీ ఓట్లు.. మిగతా వారి కంటే తక్కువగా ఉంటే ఫినాలే వారానికి చేరుకోవడానికి ముందే ఎలిమినేట్ అవుతారు. అర్జున్.. ఫినాలే వీక్కి చేరుకున్నాడు కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యాడని బిగ్బాస్ చెప్పడంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. -
Bigg Boss 7: రైతుబిడ్డ సేఫ్ గేమ్? చివరకొచ్చినా 'బిగ్బాస్' తీరు మారట్లేదు!
బిగ్బాస్ 7 గురించి హోస్ట్ నాగార్జున ఏమో గొప్పలు చెబుతున్నాడు. రియాలిటీలో మాత్రం అస్సలు అలా లేదు. తాజా ఎపిసోడే దీనికి సరైన ఉదాహరణ. అలానే రైతుబిడ్డ ఈ సీజన్లో చాలా తెలివిగా ఆడాడని అందరూ అనుకుంటున్నారు. కానీ మనోడి సేఫ్ గేమ్ ఇప్పుడు బయటపడింది. అయితే ఓ విషయంలో మాత్రం బిగ్బాస్ అస్సలు తీరు మార్చుకోవడం లేదు. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 91 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. బిగ్బాస్ విన్నర్ ప్రైజ్మనీ ఫినాలే టికెట్ గెలుచుకున్న అర్జున్.. ఎలిమినేషన్ నుంచి సేవ్ అయినట్లు చెప్పడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. ఇక ఈ సీజన్లో విజేతగా నిలిస్తే ఏమేం దక్కుతాయో నాగార్జున ప్రకటించడంతో ఆదివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఈ సీజన్ విన్నర్గా నిలిస్తే రూ.50 లక్షల నగదుతో పాటు మారుతి కార్, రూ. 15 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ సొంతమవుతుందని నాగార్జున చెప్పుకొచ్చాడు. అయితే రూ. 50 లక్షలు గెలిస్తే ఏం చేస్తారని అందరినీ నాగ్ అడిగితే.. అమ్మని ఈ డబ్బుతో హాయిగా చూసుకుంటా, తల్లిదండ్రులకు ఇల్లు కట్టిస్తా లాంటివి చెప్పారు. అయితే ఈ మొత్తం డిస్కషన్లో పెద్దగా డ్రామా పండలేదు. మొత్తం తేలిపోయింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఆ కారణంతో అర్జున్ ఎలిమినేట్.. 13 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?) ప్రమోషన్స్ మధ్య ఎపిసోడ్ అయితే వీకెండ్ ఎపిసోడ్ అంటే.. హౌసులో ఉన్నవాళ్లతో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలి. కానీ బిగ్బాస్ టీమ్ దీనికంటే ప్రమోషన్స్పై ప్రేమ ఎక్కువైపోయింది. ప్రమోషన్స్ చేయొద్దని అనట్లేదు గానీ ఎపిసోడ్లో ఎక్కడో ఐదు నిమిషాల పాటు ప్రమోషన్ ఉంటే బాగుండేది.. ఈ ఆదివారం మాత్రం కాస్త ఎక్కువ లెంగ్త్ ఉండేసరికి చాలా బోర్ కొట్టేసింది. 'నా సామి రంగ', 'హాయ్ నాన్న' సినిమాల్ని ప్రమోట్ చేయడానికి వచ్చిన ఆషికా రంగనాథ్, నాని పర్వాలేదనిపించారు తప్పితే ఏమంత అలరించలేకపోయారు. ప్రశాంత్ సేఫ్ గేమ్? సేవింగ్లో భాగంగా ప్రియాంక, శివాజీ, యావర్ వరసగా ఎలిమినేషన్ నుంచి బయటపడ్డారు. చివరగా ప్రశాంత్, శోభా, గౌతమ్ మిగిలారు. ఇలాంటి టైంలో ఎవిక్షన్ పాస్ ఉపయోగించాల్సిందేనని నాగార్జున అల్టిమేటం జారీ చేశాడు. లేకపోతే తిరిగిచ్చేయాల్సి ఉంటుందని అన్నాడు. ఇక్కడ చాలా తెలివిగా ఆలోచించిన ప్రశాంత్.. శోభా-గౌతమ్ ఇద్దరిలో ఎవరికిచ్చినా ఇలాంటి టైంలో తను బ్యాడ్ అయిపోతానని తెలుసు. అందుకే ఎవరికి ఇచ్చేదే లేదని పదే పదే చెప్పాడు. తిరిగిచ్చేసి హీరో అయిపోదామనుకున్నాడు. కానీ ఇదంతా కూడా సేఫ్ గేమ్లా అనిపించింది తప్పితే ఇంట్రెస్టింగ్గా అయితే లేదు. ఆ తర్వాత ప్రశాంత్ సేవ్ అయ్యాడు. చివరగా శోభా బతికిపోయింది. గౌతమ్ ఎలిమినేట్ అయిపోయాడు. 13వ వారం కావడం వల్లో ఏమో గానీ మనోడి.. ఎలిమినేట్ అయిపోయినా సరే పెద్దగా బాధపడలేదు. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: హనీమూన్కి వెళ్లిన మెగా కపుల్ వరుణ్-లావణ్య?) -
Bigg Boss 7: ఆ కారణంతో గౌతమ్ ఎలిమినేట్.. 13 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?
బిగ్బాస్ 7 నుంచి డాక్టర్బాబు ఎలిమినేట్ అయిపోయాడు. అశ్వద్ధామ 2.0 అని హడావుడి చేసిన ఇతడు.. సింగిల్గా ఆడుతూనే 13వ వారం వరకు నెట్టుకొచ్చేశాడు. అయితే ఇతడు చేసిన కొన్ని పనులు, అలానే హౌసులోని పలువురి వల్ల గౌతమ్.. బయటకొచ్చేసినట్లు అనిపిస్తోంది. ఇవన్నీ పక్కనబెడితే.. ఇన్నివారాలకు కలిపి రెమ్యునరేషన్ మాత్రం గట్టిగా ముట్టినట్లు టాక్. ఇంతకీ ఏంటి విషయం? డాక్టర్బాబు ఫెర్ఫార్మెన్స్ ఓకే డాక్టర్ కమ్ యాక్టర్ గౌతమ్ కృష్ణ.. బిగ్బాస్ హౌస్లో 13వ వారాలైతే ఉన్నాడు గానీ గుర్తింపు అయితే పెద్దగా తెచ్చుకోలేకపోయాడు. మొదటి వారం నుంచి ఇప్పటివరకు దాదాపు ఒంటరిగానే పోరాడుతూ వచ్చారు. ఈ విషయంలో మాత్రం అతడిని మెచ్చుకోవచ్చు. ఇన్ని వారాలు జరిగిన గేమ్స్లోనూ గౌతమ్ గెలిచిన దాఖలాలు అయితే లేవు. ఓ రోజు సీక్రెట్ రూంలో ఉండొచ్చి, 'అశ్వద్ధామ 2.0' అని హడావుడి చేశాడు గానీ అది పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. (ఇదీ చదవండి: హనీమూన్కి వెళ్లిన మెగా కపుల్ వరుణ్-లావణ్య?) ఎలిమినేషన్కి అదే కారణమా? ప్రారంభంలో నామమాత్రంగా ఆడిన గౌతమ్.. ఆ తర్వాత నుంచి శివాజీతో గొడవ పెట్టుకుని హైలైట్ అయ్యాడు. అప్పటి నుంచి తాజా వీకెండ్ ఎపిసోడ్ వరకు ఈ తంతే నడిచింది. అయితే శివాజీ వరస్ట్ కామందు తరహా ప్రవర్తన గురించి కాస్తో కూస్తో నిజాలు మాట్లాడిన వాళ్లలో గౌతమ్ ఒకడు. ఇదే ఇప్పుడు బిగ్బాస్ ఆర్గనైజర్స్కి నచ్చలేదు. గౌతమ్ని ఎలిమినేట్ చేసి పడేశారు. గత రెండు మూడు వారాల గేమ్ తీసుకుంటే శివాజీ, యావర్ కంటే గౌతమ్ చాలా బెటర్. కానీ శివాజీ మీద బిగ్బాసోళ్లకు ప్రేమ ఎక్కువైంది. అదే గౌతమ్కి శాపమైందని టాక్. రెమ్యునరేషన్ ఎంత? ఇకపోతే వారానికి రూ 1.5 లక్షల చొప్పున రెమ్యునరేషన్ అని గౌతమ్ డీల్ మాట్లాడుకున్నాడట. అంటే 13 వారాలకు గానూ దాదాపు రూ 19.5 లక్షలు పారితోషికంగా అందుకున్నాడని సమాచారం. అయితే ఈ విషయంపై గౌతమ్ క్లారిటీ ఇస్తే తప్ప అసలు లెక్కలు తెలియవు. ఏదేమైనా శివాజీతో పెట్టుకోవడం తనకు ప్లస్ అవుతుందని గౌతమ్ అనుకున్నాడు కానీ అదే మైనస్ అయి, ఇంటి నుంచి బయటకొచ్చేలా చేసినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: రానా తమ్ముడి డెస్టినేషన్ వెడ్డింగ్? ఆ దేశంలో మూడు రోజుల పాటు!) -
Bigg Boss 7: ప్రియాంకని ఒప్పించడానికి నాగ్ ప్రయత్నం.. శివాజీకి చెప్పడానికి నో ధైర్యం!
బిగ్బాస్ 7వ సీజన్లో మరో వీకెండ్ వచ్చేసింది. అయితే ఈ వారం ఓ మాదిరి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. కాకపోతే శివాజీ మీద నాగ్ ప్రేమ ఎంత ఉందనేది మరోసారి బయటపడింది. ప్రియాంకని అయితే నాగ్ పదే పదే ఓ విషయం ఒప్పించేందుకు తెగ ప్రయత్నించాడు. అమర్కి ఓ సర్ప్రైజ్ కూడా ఇచ్చాడు. ఇంతకీ శనివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 90 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. బయటపడ్డ ప్రియాంక ఆవేదన టికెట్ టూ ఫినాలే రేసులో గెలిచిన అర్జున్.. ఈ సీజన్ తొలి ఫైనలిస్ట్ కావడంతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచి శనివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. వీకెండ్ కాబట్టి స్టేజీపైకి వచ్చిన నాగార్జున.. శుక్రవారం ఏం జరిగిందో చూశాడు. ఆ తర్వాత ప్రస్తుతానికి వచ్చేశాడు. ఫినాలే రేసు మొదటి రౌండులోనే ఎలిమినేట్ అయిపోయిన శోభా-శివాజీ నిలబెట్టి.. ఒకరి గేమ్ గురించి మరొకరు చెప్పాలని అన్నాడు. ఈ డిస్కషన్లో వీళ్లిద్దరూ అమర్కి పాయింట్స్ ఇవ్వడంపై నాగ్ కౌంటర్స్ వేశాడు. (ఇదీ చదవండి: 'యానిమల్'లో రష్మిక కంటే హైలైట్ అయిన బ్యూటీ.. ఈమె ఎవరంటే?) అమర్ అలుగుతాడని, బ్లాక్ మెయిల్ చేస్తాడని నవ్వుతూనే నిజాలు చెప్పేశాడు. ఆ వెంటనే.. ప్రియాంక చెప్పమ్మా అని ఆమెని నిలబెట్టాడు. దీన్ని నిజమేనని ఒప్పుకొన్న ప్రియాంక.. అది చాలా పెయిన్ఫుల్, ఆల్రెడీ ఓడిపోయినా బాధ ఓవైపు ఉంటే.. మళ్లీ మళ్లీ అమర్ పాయింట్స్ ఇవ్వమని చెబుతుంటే చాలా బాధగా అనిపించింది ప్రియాంక తన ఆవేదన బయటపెట్టింది. ప్రియాంకని ఒప్పించే ప్రయత్నం ప్రియాంకని నిలబెట్టి మాట్లాడిన నాగ్.. గతవారమే అనుకున్నాం కదా ఒంటరిగా గేమ్ ఆడమని.. కానీ నువ్వు ఏం చేశావ్? అని అమర్కి గౌతమ్ ద్వారా పాయింట్లు ఇచ్చిన విషయం గురించి మాట్లాడాడు. అయితే ఈ మొత్తం డిస్కషన్లో ప్రియాంకది గ్రూప్ గేమ్ అని ఒప్పించాలని నాగ్ చాలా ప్రయత్నించాడు. కానీ ఈ విషయంలో ఫెయిలయ్యాడు. ఆ తర్వాత గౌతమ్తోనూ నాగ్.. ప్రియాంకది తప్పని చెప్పించాడు. ప్రియాంక.. నువ్వు ఎంత సమర్ధించుకున్నాసరే నీది గ్రూప్ గేమ్ అని మాకు అనిపించిందని నాగ్ అన్నాడు. కానీ ఇలానే గతంలో శివాజీ బ్యాచ్గా ఆడినప్పుడు మాత్రం నాగ్ కనీసం పల్లెత్తు మాట కూడా అనలేకపోయాడు. దీనిబట్టి శివాజీపై నాగ్ ప్రేమ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: అల్లు అర్జున్కు హెల్త్ ఇష్యూ.. షూటింగ్కు బ్రేక్ ఇచ్చిన సుకుమార్) అమర్కి సర్ప్రైజ్.. ప్రశాంత్కి షాక్ ఈ వారం 'టికెట్ టూ ఫినాలే' అర్జున్ గెలిచిన కారణంగా.. ఎవిక్షన్ పాస్ 14వ వారం కాదు, ఈ వారమే ఉపయోగించాలని ప్రశాంత్కి నాగ్ కండీషన్ పెట్టాడు. దాని గురించి తర్వాత చెబుతానని అన్నాడు. కానీ శనివారం ఎపిసోడ్లో కారణం లాంటిది ఏం చెప్పలేదు. మరోవైపు అమర్ మాట్లాడుతూ.. ఒక్కసారి మీరు నన్ను కెప్టెన్ అని పిలిస్తే వినాలని ఉందని నాగార్జునని రిక్వెస్ట్ చేశాడు. ఇది జరిగిన నాగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. టికెట్ టూ ఫినాలే పోటీలో 1200 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన కారణంగా.. వచ్చే వారం కెప్టెన్ అయ్యావ్ అమర్ అని నాగ్ చెప్పాడు. శివాజీ, అర్జున్.. డిప్యూటీస్ అని నాగ్ ఆదేశించాడు. శివాజీతో గౌతమ్ గొడవ ఇక 'బీబీ లైబ్రరీ' అని ఓ గేమ్ పెట్టారు. ఇందులో భాగంగా కొన్ని పేర్లు రాసున్న బుక్... మరొకరికి ఇవ్వాల్సి ఉంటుందని నాగ్ చెప్పాడు. మిగతా వాళ్ల విషయంలో పెద్దగా ఇబ్బంది కాలేదు కానీ.. 'ప్రతిదానికి నేనే రైట్ అని అనుకోకుండా ఎలా ఉండాలి?' అనే బుక్ మాత్రం గౌతమ్.. శివాజీకి ఇచ్చాడు. దీన్ని తీసుకోలేకపోయిన శివాజీ.. 'కుళ్లు, కుట్ర, కుతంత్రం నుంచి విముక్తి పొందడం ఎలా?' అని పుస్తకాన్ని.. రిటర్న్లో గౌతమ్కి ఇచ్చాడు. దీంతో గొడవ మొదలైంది. ఇద్దరూ నీది తప్పంటే నీది తప్పు అని నామినేషన్స్లో వాదించుకున్నట్లు హోస్ట్ నాగార్జున ముందే గొడవపడ్డారు. అంతా విన్న నాగార్జున.. ఎప్పటిలానే శివాజీకి సపోర్ట్ చేశాడు. గౌతమ్దే తప్పన్నట్లు తీర్పు ఇచ్చాడు. ఫినాలే అస్త్ర గెలుచుకున్న కారణంగా అర్జున్.. ఈ వారం ఎలిమినేషన్స్ నుంచి సేవ్ అయిపోయినట్లు నాగ్ ప్రకటించాడు. అలా శనివారం ఎపిసోడ్ పూర్తయింది. అయితే శనివారం అంతా కూడా నవ్వుతూనే సీరియల్ బ్యాచ్ గురించి నాగార్జున నిజాలు చెప్పాడు. ఇలానే శివాజీ బిహేవియర్ గురించి కూడా నిజాలు చెబితే బాగుండేది అనిపించింది. (ఇదీ చదవండి: ఆ సమస్యతో బాధపడుతున్న అమర్.. లోపల ట్రీట్మెంట్ లేదు!) -
Bigg Boss 7: లవ్ స్టోరీ బయటపెట్టిన రైతుబిడ్డ.. ఆ ఒక్క కారణంతో బ్రేకప్!
గత కొన్నిరోజుల నుంచి జరుగుతున్న 'టికెట్ టూ ఫినాలే' రేసు పూర్తయింది. ఎవరూ ఊహించని విధంగా అర్జున్.. చివరి వరకు పోరాడి తొలి ఫైనలిస్ట్ అయ్యాడు. మరోవైపు రైతుబిడ్డ ప్రశాంత్.. ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియని తన ప్రేమకథని బయటపెట్టాడు. అయితే ఇది బ్రేకప్ అయిపోయిందని చెప్పుకొచ్చాడు. ఇంతకీ శుక్రవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 89 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. గౌతమ్ రేసు నుంచి ఔట్ నాలుగు స్థానాల్లో వరసగా అమర్, అర్జున్, ప్రశాంత్, గౌతమ్ ఉన్నారు. అలా గురువారం ఎపిసోడ్ ముగిసింది. తక్కువ పాయింట్స్ ఉన్న కారణంగా గౌతమ్.. రేసు నుంచి తప్పుకొన్నాడని బిగ్బాస్ చెప్పడంతో శుక్రవారం ఎపిసోడ్ మొదలైంది. తన దగ్గరున్న వాటిలో 20 శాతం అంటే 140 పాయింట్లు.. రేసులో ఉన్న ముగ్గురిలో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుందని బిగ్బాస్ చెప్పగా.. అమర్ పేరు చెప్పాడు. అయితే ఇవి ప్రియాంక పాయింట్స్ అని, ఆమెని మరోమాట అనొద్దని గౌతమ్, అమర్తో చెప్పాడు. (ఇదీ చదవండి: Salaar Part 1: Ceasefire Trailer: రిలీజైన 'సలార్' ట్రైలర్.. స్టోరీ హింట్ ఇచ్చేశారుగా!) బెడ్రూంలో శోభా డిస్కషన్ అయితే పాయింట్స్ ఇస్తూ.. ప్రియాంకని ఏమొనద్దని అమర్కి చెప్పడం ఏం బాగోలేదని శోభా అభిప్రాయపడింది. ఇదే విషయాన్ని రాత్రి నిద్రపోయే టైంలో తన ఫ్రెండ్స్ అయిన ప్రియాంక-అమర్తో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది. అలానే ఇవ్వాలనుకుంటే నువ్వే(ప్రియాంక) నేరుగా ఇవ్వొచ్చు కదా, గౌతమ్ని బతిమలాడి అడగడం ఎందుకు? అని శోభా.. తన ఫ్రెండ్ ప్రియాంకతో చెప్పుకొచ్చింది. శోభాకి పనిష్మెంట్ 10వ గేమ్గా 'కలర్ బాల్స్' అన్ని ఒకే వరసలో సెట్ చేయాలని టాస్క్ ఇచ్చారు. ఇందులో అర్జున్ విజయం సాధించాడు. ఆ తర్వాత ప్రశాంత్, అమర్ నిలిచారు. అయితే ఈ పోటీ పూర్తయిన తర్వాత శోభా.. బంతుల్ని టచ్ చేసిందని చెబుతూ ఆమెకి పనిష్మెంట్ ఇస్తున్నట్లు బిగ్బాస్ కాస్త భయపెట్టాడు. కానీ పనిష్మెంట్గా అందరూ గంట నిద్రపోవాలని అన్నాడు. అందరూ పడుకుని లేచేసరికి బయట గార్డెన్ ఏరియాలో టీ-స్నాక్స్ సదుపాయం ఏర్పాటు చేశాడు. ఇవి తింటూ అందరూ తమతమ లవ్ స్టోరీలు చెప్పాలని బిగ్బాస్ ఆదేశించాడు. (ఇదీ చదవండి: 'యానిమల్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అందులోనే) ప్రశాంత్ భగ్న ప్రేమకథ ఈ టాస్కులో భాగంగా శివాజీ, శోభా.. తమ ప్రేమకథల్ని చెప్పుకొచ్చారు. గౌతమ్ మాత్రం తన సినిమా పిచ్చి వల్ల.. దాదాపు పెళ్లి వరకు ఓ వచ్చిన స్టోరీ బ్రేకప్ అయిపోయిందని చెప్పుకొచ్చాడు. ఇక ప్రశాంత్ని ప్రేమకథ చెప్పాలని బిగ్బాస్ చెప్పమన్నాడు. దీంతో మనోడు అప్పట్లో జరిగిన విషయాన్ని బయటపెట్టాడు. ఓ రోజు పొలంకి వెళ్తుంటే.. దారిలో ఓ అమ్మాయి హాయ్ చెప్పింది. కొన్నాళ్లుకు మెసేజ్ చేసింది. అలా కాస్త పరిచయమైన తర్వాత ఆమెకి ఫ్రెండ్ అని ఒకడు వచ్చాడు. దీంతో నాకు మెసేజులు చేయడం తగ్గించేసింది. వాడు ఒక్క మెసేజ్ చేసినా వెంటనే రిప్లై ఇచ్చేసేది. చాలా రోజుల తర్వాత ఓ రోజు ఫోన్ చేసి.. పొలం పని వదిలేస్తేనే నీ వెంట వస్తా అని సీరియస్గా చెప్పింది. నాకు తెలిసింది పొలం పనే, దీన్ని విడిచిపెట్టి రానని చెప్పేశా, అలా ప్రేమకథ బ్రేకప్ అయిపోయిందని ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. అర్జున్ మైండ్ గేమ్.. తొలి ఫైనలిస్ట్ 'టికెట్ టూ ఫినాలే' పోటీలో భాగంగా 'పట్టు వదలకురా డింభకా' అని పెట్టిన 11వ గేమ్ పెట్టారు. ఇందులో లోపలి నుంచి ఎవరికి వాళ్లు తాడుని డిఫెండ్ చేస్తూనే, కింద పడున్న జెండాలని తీసి, బుట్టలో వేయాలని చెప్పగా అర్జున్.. వేగంగా పదివరకు జెండాలని తన బుట్టలో వేశాడు. తర్వాత అమర్-ప్రశాంత్.. కనీసం అక్కడి నుంచి కదలకుండా చేశాడు. అలా చాలాసేపు ఉంచేశాడు. దీంతో బజర్ మోగింది. ఇక ముగ్గురిలో చివరి స్థానంలో నిలిచిన ప్రశాంత్ ఎలిమినేట్ అయిపోయాడు. కాసేపు బాధపడ్డాడు. 'పాముతో చెలగాటం' అని ఫైనల్ పోటీ పెట్టగా.. ఇందులో అర్జున్ విజయం సాధించాడు. ఏడో సీజన్ తొలి ఫైనలిస్ట్గా నిలిచాడు. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: Dhootha Web Series Review: నాగచైతన్య 'దూత' వెబ్ సిరీస్ రివ్యూ) -
Bigg Boss 7: మాటలు జారిన అమర్.. ప్రియాంక తప్పు చేయకపోయినా సరే అలా!
బిగ్బాస్ ప్రస్తుత సీజన్లో ఫినాలేలో తొలి స్థానం కోసం మంచి పోటీ నడుస్తోంది. మంగళవారం ఓ మూడు గేమ్స్ జరగ్గా.. తాజాగా మరో రెండు గేమ్స్ జరిగాయి. ఇందులో SPY(శివాజీ, ప్రశాంత్, యావర్) బ్యాచ్కి షాక్ తగిలింది. మరోవైపు సీరియల్ బ్యాచ్ లో ప్రియాంకని ఒంటరి చేసేశారు. శోభా-అమర్ కలిసి ఈమెపై మానసికంగా దాడి చేశారు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్లో అసలేం జరిగిందనేది Day 87 హైలెైట్స్లో ఇప్పుడు చూద్దాం. ఓ దాంట్లో టాప్.. మరో దానిలో ఫెయిల్ సోమవారం మూడు గేమ్స్ జరగ్గా.. రెండింటిలో అర్జున్ విజయం సాధించాడు. తాజాగా బుధవారం పెట్టిన గేమ్స్లోనూ అర్జున్ చాలా స్మార్ట్గా వ్యవహరించాడు. 'టికెట్ టూ ఫినాలే' కోసం 'ఎత్తరా జెండా' అని పెట్టిన నాలుగో గేమ్లో ప్రశాంత్, యావర్ తొలి రెండు స్థానాల్లో నిలవగా.. అర్జున్ మూడో స్థానం సంపాదించాడు. ఇక 'గెస్ చేయ్ గురూ' అని పెట్టిన ఐదో గేమ్లో.. వినిపించే సౌండ్స్ బట్టి, అవేంటనేవి వరసగా పలకపై రాయాల్సి ఉంటుంది. ఇందులో అర్జున్ 31 పాయింట్లతో టాప్లో నిలిచాడు. ఇదే పోటీలో సరిగా ఆడని కారణం.. ప్రశాంత్, యావర్ మధ్యలో ఔట్ అయిపోయారు. అలా స్పై బ్యాచ్ ఎదురుదెబ్బ తగిలింది (ఇదీ చదవండి: బ్రేకప్ స్టోరీ బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి.. పెళ్లి గురించి హింట్!) ప్రియాంక పాయింట్స్ దానం ఇక ఐదు గేమ్స్ పూర్తయిన తర్వాత చివరి స్థానంలో ప్రియాంక ఉన్న కారణంగా.. 'టికెట్ టూ ఫినాలే' రేసు నుంచి ఆమెని బిగ్బాస్ తప్పించాడు. అయితే ఆమె దగ్గరున్న వాటిలో సగం పాయింట్స్ వేరొకరికి ఇచ్చేయాల్సి ఉంటుంది చెప్పగా.. 125 పాయింట్లని గౌతమ్కి ఇచ్చేసింది. దీంతో ఓవరాల్ పొజిషన్లో గౌతమ్... మూడో స్థానానికి చేరుకున్నాడు. అయితే ఆ పాయింట్లు తనకు ఇస్తుందనుకున్న అమర్.. ప్రియాంకపై అలిగాడు. మాటలు జారిన అమర్ ప్రియాంక ఎలిమినేట్ అయిపోయి, తన పాయింట్లు గౌతమ్కి ఇచ్చేయడాన్ని అమర్ తీసుకోలేకపోయాడు. ఆమె తప్పు చేసిందని అన్నాడు. అది తన గేమ్, తను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అని శోభా.. పరిస్థితి వివరించడానికి చూసింది. కానీ అమర్ తీసుకోలేకపోయాడు. కాసేపటి తర్వాత ప్రియాంకతో మాట్లాడుతూ.. నాకు ఇవ్వాలనిపించలేదా? అని అమర్.. డైరెక్ట్గా ఆమెనే అడిగాడు. ప్రియాంక, అమర్కి పరిస్థితి అర్థమయ్యేలా చెప్పడానికి చూస్తుంటే.. 'వెధవని అయిపోయింది నేనేగా' అని అమర్ మాట జారాడు. ఏం చెప్పాలనుకుంటున్నావ్, క్లియర్గా చెప్పి వెళ్లు అని ప్రియాంక.. తిరిగి మాట్లాడుతుండగానే అమర్ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. (ఇదీ చదవండి: Kiraak RP Marriage: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న కమెడియన్ కిర్రాక్ ఆర్పీ..) అమర్ ఇలా తయారయ్యాడేంటి? ప్రియాంకపై ఏది పడితే మాట్లాడేసిన అమర్.. 'అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు, మన అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు' అని తనలో తానే ఏదేదో మాట్లాడేసుకున్నాడు. 'పిచ్చ నా కొడకా, ఇప్పుడైనా నీకు కళ్లు తెరుచుకుంటే బాగుపడతావ్' అని తనని తానే తిట్టుకున్నాడు. మరోచోట.. ప్రియాంక, గౌతమ్తో మాట్లాడుతూ.. వాళ్లకు వాళ్లకే గ్రాటిట్యూడ్ ఉంటుంది, మాకు ఉండదా అని శోభా-అమర్ని ఉద్దేశిస్తూ తన మనసులో మాట బయటపెట్టింది. ఇదంతా జరిగిన కాసేపటి తర్వాత అమర్ దగ్గరకొచ్చిన ప్రియాంక.. చేసిన దానికి క్షమాపణలు చెప్పింది. తప్పయిపోయింది, ప్లీజ్ క్షమించు అని బతిమాలాడుకుంది. అయినా సరే అమర్.. శాంతించలేదు. దీంతో మిగతా వాళ్లతో ఈ విషయం గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక్కడ ఓ విషయం మాత్రం వింతగా అనిపించింది. ఎందుకంటే అమర్.. మరీ స్వార్థపరుడిలా ప్రవర్తించాడా అనే సందేహం వచ్చింది. ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం ప్రియాంక ఏం చేయాలో కూడా అమరే డిసైడ్ చేస్తాడా? ఆమెకు స్వాతంత్రం లేదా అనిపించింది. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: 'సలార్' స్టోరీ లీక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. అదీ మ్యాటర్!) -
Bigg Boss 7: సీరియల్ బ్యాచ్ కొట్లాట.. చివరకొచ్చేసరికి ఇలా తయారయ్యేంట్రా!
బిగ్బాస్ గత సీజన్స్ మాటేమో గానీ ఈసారి మాత్రం బ్యాచ్ల గోల ఎక్కువైంది. అంతెందుకు రీసెంట్ వీకెండ్ ఎపిసోడ్లో స్వయంగా హోస్ట్ నాగార్జున ఒప్పుకొన్నాడు. చుక్క బ్యాచ్, ముక్క బ్యాచ్ అని చెప్పుకొచ్చాడు. ఇందులో శివాజీ ఆధ్వర్యంలోని ముక్క బ్యాచ్ బాగానే ఉంది. చుక్క బ్యాచ్ అధ్వానంగా తయారైంది. బయటవాళ్లతో కాదు వీళ్లలో వీళ్లే గొడవపడి ఆ తప్పు చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇంతకీ ఏం జరుగుతోంది? (ఇదీ చదవండి: బ్రేకప్ స్టోరీ బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి.. పెళ్లి గురించి హింట్!) ప్రస్తుత సీజన్లో సీరియల్ బ్యాచ్ సభ్యులైన అమర్, ప్రియాంక, శోభా.. ప్రారంభం నుంచి ఒక్కటిగా ఆడుతున్నారు. మరోవైపు శివాజీ, ప్రశాంత్, యావర్.. ఓ బ్యాచ్గా ఆడుతున్నారు. నామినేషన్స్ దగ్గర నుంచి గేమ్స్ వరకు పోటీ అంతా వీళ్ల మధ్య ఉంటోంది. శివాజీ బ్యాచ్తో పోలిస్తే సీరియల్ బ్యాచ్ కొన్ని విషయాల్లో బెటర్. కానీ ఇప్పుడు వీళ్లే తమ నిల్చున్న కొమ్మ తామే నరుక్కుంటున్నట్లు అనిపిస్తోంది. తాజాగా 'టికెట్ టూ ఫినాలే' కోసం పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శోభా, శివాజీ ఇప్పటికే తక్కువ పాయింట్లు సాధించిన కారణంగా గేమ్ నుంచి సైడ్ అయిపోయారు. అమర్, ప్రశాంత్, అర్జున్, గౌతమ్, యావర్, ప్రియాంక.. ఇలా దాదాపుగా అబ్బాయిలే ఉన్నారు. ఇప్పుడు ప్రియాంక కూడా తక్కువ పాయింట్లు ఉన్న కారణంగా గేమ్ నుంచి సైడ్ అవ్వాలి. దీంతో ఆమె తన సగం పాయింట్లని వేరొకరికి ఇవ్వాలని చెప్పగా, గౌతమ్కి ఇచ్చేసింది. (ఇదీ చదవండి: Kiraak RP Marriage: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న కమెడియన్ కిర్రాక్ ఆర్పీ..) 12వ వారం ప్రియాంక కెప్టెన్ కావడానికి గౌతమ్ సాయం చేశాడు. ఇప్పుడు పాయింట్స్ ఇచ్చి అతడి రుణం తీర్చుకుంది. అయితే పాయింట్స్ ఇవ్వడానికి తాను కనిపించలేదా అని అమర్ హర్ట్ అయిపోయారు. దీంతో శోభా-అమర్ ఒక్కటైపోయారు. ప్రియాంకని వేరు చేసి చూస్తున్నారు. ఇన్నాళ్లు ఒక్కటిగా ఉంటూ వచ్చిన సీరియల్ బ్యాచ్.. శివాజీని అన్ని విషయాల్లోనూ ఎదుర్కొంటూ వచ్చారు. ఇప్పుడు చివరకొచ్చేసరికి వీళ్లలో వీళ్లు కొట్లాడుకుని.. శివాజీ బ్యాచ్ కి హెల్ప్ అయ్యేలా ఉన్నారనిపిస్తుంది. ఒకవేళ ఇలానే జరిగితే మాత్రం.. తెలియకుండానే శివాజీ బ్యాచ్ కి హెల్ప్ చేసినట్లు అవుతుంది. గేమ్లో ఉన్న ఆ కాస్త మజా కూడా పోవడం గ్యారంటీ. అయితే ఈ గొడవలో ప్రియాంక కాస్త ఆలోచనతో వ్యవహరించినట్లు అనిపించింది. అమర్ మాత్రం ప్రతిదానికి అలుగుతూ తనపై ఉన్న సింపతీని కాస్త నెగిటివిటీ చేసుకునేలా కనిపిస్తున్నాడు. మరోవైపు అతడికి సపోర్ట్ చేస్తున్న శోభా కూడా తెలియకుండానే మరింత నెగిటివీ తెచ్చుకుంటోందనిపిస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 25 సినిమాలు) -
Bigg Boss 7: నాగ్ చేతికి ఉన్న బ్యాండ్ చాలా స్పెషల్..రీచార్జ్ చేయాల్సిందే!
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ ఏడో సీజన్ విజయవంతంగా రన్ అవుతోంది. ఉల్టా పుల్టా అంటూ వచ్చిన ఈ సీజన్.. గత సీజన్ కంటే కాస్త బెటర్గానే ఉంది. ఇక ఆరో సీజన్లో అట్టర్ ఫ్లాప్ హోస్ట్గా పేరు తెచ్చుకున్న నాగార్జున..ఏడో సీజన్లో ఇప్పటి వరకు మాత్రం మంచి మార్కులే సంపాదించుకున్నాడు. సీజన్ 7లో ఇప్పటివరకు నాగార్జున ట్రోల్ అయిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. గత సీజన్ల కంటే స్టైలీష్గా హోస్టింగ్ చేస్తున్నాడు నాగార్జున. తన లుక్.. డ్రెస్సింగ్ స్టైల్ వారం వారం డిఫరెంట్గా ఉంటుంది. రంగు రంగుల షర్ట్ వేస్తూ..తెరపై మరింత అందంగా కనిపిస్తున్నాడు. (చదవండి: శివాజీ తెలివిలేని పని.. ప్రియాంక ప్రాణం మీదకొచ్చింది!) ప్రతివారం నాగార్జున వేసే షర్ట్పై నెట్టింట చర్చ జరుగుతోంది. గత శనివారం కూడా నాగార్జున ఓ రంగుల చొక్కాని ధరించి హోస్టింగ్ చేశాడు. ఆ షర్ట్ ధర లక్షల్లో ఉంది. అయితే ఆ షర్ట్తో పాటు ఆరోజు నాగార్జున చేతికి ధరించిన ఓ బ్యాండ్పై ఇప్పుడు నెట్టింట చర్చ మొదలైంది. చూడడానికి అది స్మార్ట్ వాచ్లా కనిపించినా.. దాని వెనక మాత్రం చాలా కథే ఉంది. అదొక ఫిట్నెస్ ట్రాకర్. దాని ద్వారా మన శరీర భాగాల పనితీరును తెలుసుకోవచ్చు. మన బాడీలోని ఒత్తిడి, బీపీ, హార్ట్బీట్, పల్స్ రేట్ను అది ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంది. అయితే దీని కోసం మన మొబైల్లో యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ బ్యాండ్ని చేతికి ధరించి.. శరీర భాగాల పనితీరుని మొబైల్లో చూసుకోవచ్చు. అయితే ఇది స్మార్ట్ వాచ్లా ఒక్కసారి కొంటే..ఎప్పటికీ పనిచేసే పరికరం కాదు. ఫిట్నెస్ని తెలుసుకోవడం కోసం ప్రతి నెల రీచార్జ్ చేసుకోవాలి. ఇలాంటి ఫిట్నెస్ ట్రాకర్ని ధరించాలంటే ఏడాదికి రూ. 25 వేలకు పైగా వరకు చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా నెల నెల కూడా రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ తరహా బ్యాండ్లను సినీ సెలబ్రిటీలతో పాటు క్రీడాకారులు కూడా ఎక్కువగా ధరిస్తున్నారు. -
Bigg Boss 7: శివాజీ తెలివిలేని పని.. ప్రియాంక ప్రాణం మీదకొచ్చింది!
బిగ్బాస్ 7వ సీజన్లో శివాజీ ఉన్నాడంటే ఉన్నాడంతే. ఓ టాస్క్ సరిగా ఆడలేడు, గేమ్లో గెలవలేడు. పోనీ సంచాలక్ బాధ్యత అయినా సరిగా చేశాడా? అంటే అది లేదు. తాజాగా శివాజీ పెట్టిన నిర్ణయం.. ప్రియాంక ప్రాణాల మీదకు తెచ్చింది. మరోవైపు 'టికెట్ టూ ఫినాలే' కోసం ఆల్రెడీ పోటీ మొదలైంది. ఇంతకీ మంగళవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 86 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. శివాజీ సోది ముచ్చట నామినేషన్స్ పూర్తవడంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచి మంగళవారం ఎపిసోడ్ మొదలైంది. మిగతా వాళ్ల సంగతి పక్కనబెడితే అర్జున్, గౌతమ్ తనని నామినేట్ చేయడాన్ని శివాజీ తీసుకోలేకపోయాడు. పొద్దుపొద్దునే ప్రశాంత్తో మాట్లాడుతూ.. మొన్నే వెళ్లిపోవాల్సిందిరా, ఎందుకురా ఈ మెంటల్ టార్చర్ అని గౌతమ్ని ఉద్దేశించి అన్నాడు. అలానే తన విషయంలో అర్జున్ది 100 శాతం పిచ్చి స్ట్రాటజీ అని, నన్ను పంపించేయండ్రా బాబు అని మాట్లాడాడు. ఇది జరిగిన కాసేపటి తర్వాత ప్రియాంకతోనూ మాట్లాడుతూ.. వెళ్లిపోయినా బాగుండేది, పిల్లలు బాగా గుర్తొస్తున్నారని శివాజీ చెప్పుకొచ్చాడు. అయితే ఇవన్నీ కూడా సోది ముచ్చట్లలానే అనిపించాయి. టికెట్ టూ ఫినాలే షురూ 13వ వారం వచ్చేసింది. అంటే ఫినాలే జరగడానికి రెండు వారాలు కూడా లేదు. దీంతో బిగ్బాస్.. తన గేమ్ షురూ చేశాడు. 'టికెట్ టూ ఫినాలే' మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా పలు గేమ్స్ పెడతారని, వీటన్నింటిలో గెలిచి ఎక్కువ పాయింట్స్ సంపాదించిన హౌస్మేట్.. ఇకపై కేవలం ఇంటి సభ్యునిగా ఉండకుండా నేరుగా ఫినాలే వారానికి చేరుకుంటారు. మొట్టమొదటి ఫైనలిస్ట్ అవుతారని బిగ్బాస్ క్లారిటీ ఇచ్చేశాడు. అర్జున్ దూకుడు.. అమర్ అదృష్టం 'టిక్ టాక్ టిక్' అని తొలి గేమ్లో భాగంగా.. బాణం వేగంగా తిరుగుతూ ఉంటుంది. ఆ బాణం టచ్ అయితే ఔట్ అయినట్లు కాదు, ఫ్లాట్ ఫామ్ పైనుంచి కింద పడితే ఔట్ అయినట్లు అని బిగ్బాస్ తొలుత చెప్పాడు. కాసేపటి తర్వాత బాణానికి కాలు తగిలినా సరే ఫౌల్(ఔట్) అని ట్విస్ట్ ఇచ్చాడు. ఇందులో ప్రశాంత్, గౌతమ్, శోభా, శివాజీ, యావర్, అమర్, ప్రియాంక వరసగా ఎలిమినేట్ అయిపోయారు. చివరగా మిగిలిన అర్జున్ విజేతగా నిలిచాడు. పూలని సేకరించే రెండో టాస్క్లో తక్కువ పూలు ఉన్న కారణంగా శివాజీ, ప్రియాంక ఎలిమినేట్ అయిపోయారు. ఇలా రెండు గేమ్స్తో మొదటి లెవల్ పూర్తయింది. పాయింట్ల ప్రకారం చివర్లో ఉన్న శివాజీ, శోభా ఎలిమినేట్ అయిపోయారు. వాళ్లు పాయింట్స్ వేరొకరికి ఇవ్వాలని చెప్పగా.. అమర్కి ఇచ్చేశారు. అలా మనోడికి లక్ కలిసొచ్చింది. తలతిక్క సంచాలక్స్.. గేమ్ డిస్ట్రబ్ ఇక చివరగా 'గాలం వేయ్ బుట్టలో పడేయ్' అనే టాస్క్ పెట్టారు. దీనికి శివాజీ, శోభా సంచాలక్స్గా వ్యవహరించారు. అయితే రింగ్తో బంతిని బయటకు లాగిన తర్వాత ఎవరైనా సరే దాన్ని తీసేసుకోవచ్చని ఓ పిచ్చి రూల్ పెట్టారు. ఈ పోటీ అర్జున్.. బంతిని ఫస్ట్ ఫస్ట్ లాగేసి ఎక్కువ పాయింట్స్ సంపాదించాడు. అయితే ప్రియాంక మూడుసార్లు బంతిని బయటకు లాగినప్పటికీ ప్రశాంత్, యావర్, అమర్.. ఈమె దగ్గర నుంచి లాగేసుకున్నారు. చివర్లో అమర్ అయితే ఈమెని ఎలా పడితే అలా లాగేశాడు. బయటకు చెప్పలేదు గానీ ప్రియాంకకు దెబ్బలు గట్టిగానే తగిలినట్లు అనిపించాయి. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. శివాజీకి గ్రూప్ గేమ్స్ అంటే ప్రశాంత్-యావర్ తో ఏదే మేనేజ్ చేసి ఆడేస్తాడు. కానీ ఒంటరిగా ఆడాలనేసరికి దొరికిపోయాడు. తాజాగా రెండు గేమ్స్ లోనూ ఓడిపోయి.. టికెట్ టూ ఫినాలే రేస్ నుంచి తప్పించారు. పోనీ అది కాదని సంచాలక్ బాధ్యతలు ఇస్తే, అందులోనూ ఎక్కడలేని పిచ్చి రూల్స్ అన్ని పెట్టి.. ప్రియాంక విజయావకాశాల్ని దెబ్బతీసేశాడు చేశాడు. 13వ వారంలో శివాజీ తీరు వల్ల అతడొక్కడే కాదు.. మొత్తం గేమ్ తీరే దెబ్బతింటోంది. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. -
Bigg Boss 7: శివాజీకి షాకిచ్చిన బిగ్బాస్.. ఓట్లు పడినా ఈసారి వేటు గ్యారంటీ!
'బిగ్బాస్' షోలో శివాజీ ఆటలు ఇన్నిరోజులు సాగాయేమో కానీ ఇకపై మాత్రం నో ఛాన్స్. అవును మీరు కరెక్ట్గానే విన్నారు. ఇప్పటివరకు ఓట్లు పడితే సేవ్ అవుతూ వచ్చాడు. ఈసారి మాత్రం వేటు పడటం గ్యారంటీ అనిపిస్తుంది. మొన్నీమధ్యే శివాజీకి బిగ్బాస్.. వార్నింగ్ లాంటి హింట్ ఇచ్చాడు. కాకపోతే మనోడు అప్పుడు అర్థం చేసుకోలేకపోయాడు. ఇప్పుడు రియాలిటీలో అదంతా తెలిసి వస్తోంది. ఇంతకీ ఏం జరుగుతోంది? శివాజీకి బుర్రపనిచేయలేదు మొన్న వీకెండ్ ఎపిసోడ్లో భాగంగా భుజం సమస్య గురించి శివాజీని బిగ్బాస్ అడిగి తెలుసుకున్నాడు. నొప్పి ఎలా ఉందని అడుగుతూనే.. ఇకపై హౌస్లో ఉండాలనుకుంటున్నారా? వెళ్లిపోవాలనుకుంటున్నారా? అని చాలా పద్ధతిగా అడిగాడు. శివాజీ మాత్రం... ఉంటానని, వెళ్లిపోతానని రకానికి ఒకలా చెప్పాడు. చివరగా నాగార్జున సర్ది చెప్పడంతో.. కొనసాగుతానని అన్నాడు. అయితే అన్ని విషయాల్లో ముందు చూపుతో ఆలోచించే శివాజీ.. బిగ్బాస్ ఇచ్చిన హింట్ని సరిగా అర్థం చేసుకోలేక పప్పులో కాలేశాడు. కరెక్ట్గా చెప్పాలంటే శివాజీకి బుర్రలేదని క్లియర్గా అర్థమైపోయింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 25 సినిమాలు) శివాజీకి వరస షాక్లు ఈవారం నామినేషన్స్ పూర్తయిపోయాయి. అమర్ తప్ప మిగతా ఏడుగురు లిస్టులో ఉన్నారు. అయితే ఈసారి కెప్టెన్సీ కోసం టాస్క్లు ఏం ఉండవని నాగ్ ముందే చెప్పాడుగా. దీనికి తగ్గట్లే 'టికెట్ టూ ఫినాలే' పోరు మొదలైంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోల ప్రకారం మూడు గేమ్స్ పెట్టగా.. శివాజీ అడ్డంగా దొరికిపోయాడు. ఏ ఒక్క దానిలోనూ కనీసం చివరివరకు వెళ్లలేకపోయాడు. ఇలా వరస షాక్లు తగిలాయి. వేటు పడటం గ్యారంటీ? ప్రతివారం ఓట్లు పడితే నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోవచ్చు. ఇన్నాళ్లు ఇదే జరుగుతోంది. అయితే చివరి వారాల్లో ఓట్లు ఎక్కువ పడితే సరిపోదు. గేమ్స్లోనూ గెలవాల్సి ఉంటుంది. ఇన్నాళ్లు గ్రూప్ గేమ్స్ కాబట్టి శివాజీ తన మాటలతో మేనేజ్ చేస్తూ బండి లాక్కొచ్చేశాడు. కానీ ఇప్పుడు జరిగేవన్నీ సింగిల్ గేమ్స్ కదా. శివాజీ పనితనం ఏంటో తేలుతుంది. ఒకవేళ టికెట్ టూ ఫినాలే పోటీలో గెలవకపోతే.. ఓటింగ్తో సంబంధం లేకుండా బయటకు పంపేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న ఫిజికల్ టాస్క్ల వల్ల భుజం నొప్పి తిరగబెడితే మాత్రం.. శివాజీ మిడ్ వీక్ ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. (ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్ ఎంగేజ్మెంట్.. కాబోయే భర్త ఎవరంటే?) -
Bigg Boss 7: మళ్లీ ఎలిమినేట్ అయిన రతిక.. కారణం మాత్రం అదే!
బిగ్బాస్ 7లో మరో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. కాకపోతే ఈసారి డబుల్ ఎలిమినేషన్ జరిగింది. అశ్వినితో పాటు బిగ్బాస్కి ఎంతో ఇష్టమైన రతిక ఎలిమినేట్ అయిపోయింది. తనని రెండోసారి కూడా బయటకు పంపేస్తారని రతికకి ముందే తెలుసు. ఎలిమినేషన్తో పాటు సండే ఎపిడోస్లో ఇంకా ఏమేం జరిగాయనేది Day 84 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: యాంకర్ రష్మీకి పెళ్లి కుదిరిందా? అసలు విషయం ఏంటంటే!) శివాజీ గురించి నిజం అశ్విని ఎలిమినేట్ కావడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. ఆమె స్టేజీపైకి రావడంతో ఆదివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. అయితే హస్లో ఉన్నవాళ్లలో ఎవరు హిట్? ఎవరు ఫ్లాప్? అనేది చెప్పాలని నాగ్ అడగ్గా.. అలా కాదు హిట్, సూపర్హిట్ ఎవరనేది చెబుతానని అశ్విని చెప్పింది. రతిక-ప్రియాంక ఫ్లాప్ అని చెప్పిన అశ్విని, అమర్-గౌతమ్-శోభాశెట్టి-శివాజీ హిట్ అని చెప్పింది. ప్రశాంత్-అర్జున్-యావర్ మాత్రం సూపర్హిట్ అని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. అయితే శివాజీ గురించి చెప్పిన అశ్విని.. ఆయన కొందరి వరకు మాత్రమే పరిమితమైపోయారని నిజాన్ని చెప్పింది. దీన్ని తీసుకోలేకపోయిన సోఫాజీ అలి.యాస్ శివాజీ.. నువ్వు అలా అనుకుంటున్నావ్ అని ఏదేదో చెప్పి కవర్ చేశాడు. చుక్క బ్యాచ్ vs ముక్క బ్యాచ్ అయితే అశ్విని మాట్లాడుతున్నప్పుడు ప్రస్తుతం హౌస్లో రెండు గ్రూప్స్ ఉన్నాయని చెప్పింది. ఇది నిజమేనని ఒప్పుకొన్న నాగార్జున.. అమర్-శోభా-ప్రియాంకలని కలిపి 'చుక్క బ్యాచ్' అని.. శివాజీ-యావర్-ప్రశాంత్లని కలిపి 'ముక్క బ్యాచ్' అని చెప్పాడు. అయితే ఇన్నాళ్లు బయట అనుకున్నది స్వయంగా నాగార్జున చెప్పడంతో.. గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని నిర్వహకులే ఒప్పుకొన్నట్లు అయింది. ఆ తర్వాత ఇంట్లో వస్తువుల గురించి, వస్తువులతో పాటల గురించి టాస్క్స్ పెట్టారు. ఇదంతా టైమ్ పాస్ పల్లీ బఠాణీ వ్యవహారంలా అనిపించింది తప్పితే అలరించలేకపోయింది. (ఇదీ చదవండి: లవర్ని పరిచయం చేసిన 'జబర్దస్త్' నరేశ్.. కాకపోతే!) రతిక ముందే పసిగట్టింది శనివారం అశ్విని ఎలిమినేట్ కాగా.. మిగిలిన ఏడుగురిలో ఆదివారం వరసగా అమర్, గౌతమ్, ప్రశాంత్, యావర్, శివాజీ సేవ్ అయ్యారు. చివరగా అర్జున్, రతిక మిగిలారు. అయితే వీళ్లిద్దరిలో ఎవరికైనా ఎవిక్షన్ పాస్ ఉపయోగిస్తావా ప్రశాంత్? అని నాగ్ అడగ్గా.. తాను 14వ వారం మాత్రమే దీన్ని ఉపయోగిస్తానని ఖరాఖండీగా చెప్పేశాడు. ఆ తర్వాత కాసేపు సస్పెన్స్ మెంటైన్ చేసి రతిక ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. వెళ్తూ వెళ్తూ శోభాతో రతిక మాట్లాడుతూ.. బహుశా ఆడట్లేదని నన్ను తీసేశారేమో అని తనలో తానే అనుకుంది. ఇక స్టేజీపై వచ్చిన తర్వాత 'ఏ నిమిషానికి ఏమి జరుగునో' అని పాట పాడి అందరికీ సెండాఫ్ చెప్పేసింది. ఎలిమినేషన్కి అదే కారణం ఈ వారం నామినేట్ అయినప్పుడే రతిక.. తన ఎలిమినేషన్ విషయాన్ని పసిగట్టింది కానీ దాన్ని పెద్దగా సీరియస్ తీసుకోలేదు. ఒకవేళ ఈ వారం టాస్క్ గెలిచి ఎవిక్షన్ పాస్ గెలుచుకుని ఉంటే కచ్చితంగా సేవ్ అయ్యేది. తొలుత నాలుగు వారాలు ఉన్నప్పుడు సోది ముచ్చట్లు పెట్టింది. దీంతో ఎలిమినేట్ చేసి ఇంటికి పంపేశారు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఐదు వారాలు ఉంది. కానీ గేమ్స్ ఆడే విషయంలో అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎప్పుడు చూడు శివాజీకి చెంచాగిరి చేయడమే సరిపోయింది. ఇలా పలు కారణాల వల్ల రతిక ఎలిమినేట్ అయిపోయింది. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: రతిక ఎలిమినేట్.. మొత్తం ఎంత సంపాదించిందో తెలుసా?) -
Bigg Boss 7: రతిక ఎలిమినేట్.. మొత్తం ఎంత సంపాదించిందో తెలుసా?
బిగ్బాస్ దత్తపుత్రిక రతిక మళ్లీ ఎలిమినేట్ అయిపోయింది. డబుల్ ఎలిమినేషన్లో భాగంగా రెండో వికెట్ రూపంలో హౌస్ నుంచి బయటకొచ్చేసింది. అయితే ఈ వారం నామినేట్ అయినప్పుడే ఈమె బయటకెళ్లడం కన్ఫర్మ్ అని అందరూ ఫిక్సయ్యారు. అలా అనుకున్నదే జరిగింది.అసలు రతిక రెండోసారి ఎలిమినేట్ కావడానికి కారణమేంటి? మొత్తం రెమ్యునరేషన్ రూపంలో ఎంత సంపాదించింది? రతిక మళ్లీ అదే తప్పు బిగ్బాస్ షోలోకి వస్తున్నారంటే ఎంటర్టైన్ చేయాలి లేదంటే గేమ్స్ ఆడాలి. ఈ రెండు విషయాల్లోనూ రతిక ఫెయిలైంది. ఫస్ట్ ఎలిమినేట్ కావడానికి ముందు సరిగ్గా నాలుగు వారాలు హౌసులో ఉంది. అయితే వచ్చిన వెంటనే ప్రశాంత్ని తన చుట్టూ తిప్పుకొన్న రతిక.. అతడిపై రివర్స్ అయింది. దీంతో ఈమెపై నెగిటివిటీ పెరిగింది. పోనీ గేమ్స్ అయినా ఆడితే ఇది తగ్గేదేమో కానీ ముచ్చట్లు పెట్టడం తప్పితే ఒక్క విషయంలోనూ పెద్దగా మెప్పించలేకపోయింది. అలా నాలుగు వారాల తర్వాత హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. (ఇదీ చదవండి: యాంకర్ రష్మీకి పెళ్లి కుదిరిందా? అసలు విషయం ఏంటంటే!) బిగ్బాస్కి ఏం ప్రేమ పుట్టకొచ్చిందో ఏమో గానీ ఎలిమినేట్ అయిన రెండు వారాల్లోనే పిచ్చి లాజిక్స్ అని చెప్పి, రతికని తిరిగి హౌస్లోకి తీసుకొచ్చారు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అయినా రతిక గేమ్స్ ఆడిందా? అంటే అస్సలు లేదు. 'ఈ వారం కచ్చితంగా ఆడతా' అని హోస్ట్ నాగార్జునకు ప్రతిసారి చెప్పడమే సరిపోయింది. దానికి తోడు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్క గేమ్ కూడా గెలవలేకపోయింది. అలా ఈ వారం నామినేషన్స్లో నిలిచింది. అయితే రైతుబిడ్డ ప్రశాంత్తో ఈమె గొడవ పెట్టుకోవడం మైనస్ అయింది. దీంతో పాటు పలు కారణాలు కూడా రతిక పాప ఎలిమినేషన్కి కారణమయ్యాయి. రెమ్యునరేషన్ ఎంతంటే? ఇక రెండుసార్లు కలిపి రతిక.. బిగ్బాస్ హౌస్లో 9 వారాలు ఉంది. తొలుత నాలుగు వారాలు, రీఎంట్రీ తర్వాత మరో ఐదు వారాల పాటు బండి లాక్చొచ్చేసింది. ఇక ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం రతికకి వారానికి రూ.2 లక్షలు అనుకున్నారట. అంటే ఓవరాల్గా దాదాపు రూ.18 లక్షల వరకు రెమ్యునరేషన్ రూపంలో సంపాదించినట్లు తెలుస్తోంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: లవర్ని పరిచయం చేసిన 'జబర్దస్త్' నరేశ్.. కాకపోతే!) -
Shobha Shetty: మాటలతోనే కాదు, అందంతోనూ దడ పుట్టిస్తున్న నటి (ఫోటోలు)
-
Bigg Boss 7: అశ్విని ఎలిమినేట్.. ఏడు వారాలకు రెమ్యునరేషన్ ఎంత తెలుసా?
బిగ్బాస్ 7లో అనుకున్నట్లే ఎలిమినేషన్ జరిగింది. శనివారం ఎపిసోడ్లో భాగంగా హౌస్ నుంచి అశ్విని బయటకొచ్చేసింది. గతవారం హోస్ట్ నాగార్జున చెప్పినట్లే ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా ఈమెది తొలి వికెట్. అయితే ఈమె ఎలిమినేట్ అవడానికి హింట్స్ ముందే వచ్చాయి. ఇన్నాళ్లు హౌస్లో ఉన్నందుకుగానూ ఎన్ని లక్షలు సంపాదించింది? (ఇదీ చదవండి: Bigg Boss 7: బయటకొచ్చేస్తానని శివాజీ డ్రామా? అమర్ నిజస్వరూపం బట్టబయలు!) వైల్డ్ కార్డ్ ఎంట్రీ 'సరిలేరు నీకెవ్వరు', 'సర్దార్ గబ్బర్ సింగ్', 'రాజా ది గ్రేట్' తదితర సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేసిన అశ్వినికి గుర్తింపు ఏం రాలేదు. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం ఈమె ఒంపుసొంపులకు బోలెడంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే అక్టోబరు 8న బిగ్బాస్లోకి ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. వీళ్లలో అశ్విని ఒకరు. భోలెతో దోస్తీ ఇక బిగ్బాస్లోకి వచ్చిన తర్వాత అశ్విని మిగతా వాళ్లతో పెద్దగా కలవలేకపోయింది. తనతో ఎవరు మింగిల్ అవ్వట్లేదని సీరియల్ బ్యాచ్తో నామినేషన్స్ సందర్భంగా ఈమె గొడవ కూడా పెట్టుకుంది. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలోనే తనతో పాటు వచ్చిన సింగర్ భోలెతో ఈమెకి దోస్తీ కుదిరింది. గేమ్స్ పరంగా అంతంత మాత్రంగానే ఉన్న అశ్విని.. ఒక్కో వారం సేవ్ అవుతూ ఇప్పటివరకు ఉండిపోయింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డ వల్ల రెండోసారి రతిక ఎలిమినేట్.. వేరే లెవల్ రివేంజ్!) ఎలిమినేషన్ కారణం? అయితే ప్రతివారం కాస్తోకూస్తో తన టంగ్ పవర్ చూపిస్తూ వచ్చిన అశ్విని.. ఈ వారం మాత్రం సైలెంట్ అయిపోయింది. నామినేట్ చేయడానికి పేర్లు లేవని చెప్పి సెల్ఫ్ నామినేట్ చేసుకుంది. దీంతో అప్పుడే చాలామంది ఈమె ఈవారం ఎలిమినేట్ అయిపోవడం పక్కా అని ఫిక్స్ అయ్యారు. అనుకున్నట్లు ఈమె బయటకొచ్చేసింది. రెమ్యునరేషన్ ఎంత? వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అశ్విని.. బిగ్బాస్లో మొత్తంగా ఏడు వారాలు ఉంది. వారానికి రూ.2 లక్షలు చొప్పున దాదాపు రూ.14 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్లో ప్రసుతానికైతే ఈమె ఎక్కువ మొత్తం అందుకుంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్లో ఇంకా అర్జున్ మాత్రమే మిగిలున్నాడు. (ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన 'జబర్దస్త్' ఫైమా.. అసలు ఏమైందంటే?) View this post on Instagram A post shared by Ashwini Sri (@ashwinii_sree) -
Bigg Boss 7: బయటకొచ్చేస్తానని శివాజీ డ్రామా? అమర్ నిజస్వరూపం బట్టబయలు!
బిగ్బాస్ షోలో కాస్తోకూస్తో ఆసక్తిగా ఉండేవి అంటే నామినేషన్స్, వీకెండ్ ఎపిసోడ్ మాత్రమే. ఈ సీజన్లో నామినేషన్స్ తప్ప వీకెండ్ ఎపిసోడ్స్ బోరింగ్గా సాగుతూ వచ్చాయి. ఇన్నాళ్లకు ఓ వీకెండ్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. హోస్ట్ నాగార్జున అయితే ఒక్కొక్కరిని నిలబెట్టి కడిగేశాడు. అలానే చాలామంది ఊహించినట్లే అశ్విని ఎలిమినేట్ అయిపోయింది. ఇంతకీ శనివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 83 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. శివాజీ భుజం డ్రామా కెప్టెన్సీ టాస్క్లో తనకు అన్యాయం జరగడంపై అమర్ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. ఎవరొచ్చి చెప్పినా సరే ఆ బాధ నుంచి బయటకు రాలేకపోయాడు. ఇక శివాజీని కన్ఫెషన్ గదికి పిలిచిన బిగ్బాస్.. భుజం నొప్పి తగ్గిందా? అంతా ఓకేనా అని ఆరా తీశాడు. డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారం కోలుకుంటున్నారని, రాబోయే వారాల్లో టఫ్ గేమ్స్ ఉంటాయని చెప్పాడు. హౌసులో ఉండాలనుకుంటున్నారా? బయటకొచ్చేయాలనుకుంటున్నారా? అని బిగ్బాస్ అడగ్గా.. కాస్త టైమ్ ఇస్తే ఆలోచించి చెబుతానని అన్నాడు. అయితే ఇకపై హౌసులో మీ గాయానికి ఎలాంటి ప్రమాదం జరిగినా బాధ్యత అంతా మీదే అని బిగ్బాస్ క్లారిటీ ఇచ్చాడు. తొలుత కొనసాగుతానని చెప్పిన శివాజీ.. కాసేపటి తర్వాత మనసు మార్చుకుని.. బయటకెళ్లిపోతా అని అన్నాడు. (ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన 'జబర్దస్త్' ఫైమా.. అసలు ఏమైందంటే?) ధైర్యం చెప్పిన నాగ్ ఇదంతా జరిగిన తర్వాత హోస్ట్ నాగార్జున కూడా కన్ఫెషన్ రూంకి పిలిచి మరీ శివాజీ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశాడు. 100 శాతం ఎఫర్ట్ పెట్టలేనప్పుడు కప్ ఆశించడం కరెక్ట్ కాదని, అందుకే వెళ్లిపోతానని అన్నట్లు శివాజీ చెప్పాడు. ఎక్కువ ఆలోచించొద్దు, భయమనేది వద్దని నాగ్ కాస్త సర్దిచెప్పేసరికి శివాజీ అంగీకరించాడు. ఇకపై ఏం జరిగినా బాధ్యత తనదేనని చెప్పాడు. దీనిబట్టి చూస్తే.. ఒకవేళ గాయం ఏమైనా తిరగబెడితే మాత్రం ఎప్పుడైనా సరే శివాజీ హౌస్ నుంచి బయటకెళ్లిపోయే ఛాన్స్ ఉంది. మరి చివరి వారం వరకు ఉంటాడా లేదా అనేది అతడి గాయం తీవ్రత బట్టి ఆధారపడి ఉంటుంది. అమర్ నిజస్వరూపం ఎవిక్షన్ పాస్ గెలుచుకున్న ప్రశాంత్ని నాగార్జున మెచ్చుకున్నాడు. ఆ తర్వాత అశ్విని నిలబెట్టి.. డబుల్ ఎలిమినేషన్ అని తెలిసి కూడా సెల్ఫ్ నామినేట్ చేసుకుంటావా? కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? అని అని నాగ్ సీరియస్ అయ్యాడు. అనంతరం అమర్తో మాట్లాడాడు. గతంలో ప్రశాంత్ ఏడుస్తుంటే, దాన్ని యాక్టింగ్ అని అమర్ అందులో అన్నట్లు ఉంది. తాజాగా కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా అమర్ ఏడవటాన్ని లింకప్ చేసి నాగ్ ప్రశ్నించాడు. వేరేవాళ్లు ఏడిస్తే, వాళ్లది యాక్టింగ్ అని నువ్వు అన్నావ్.. ఇప్పుడేమో నువ్వు చేసింది యాక్టింగా? అని నాగ్ అడిగేసరికి.. నా వరకు వస్తే గానీ తెలియలేదు అని అమర్ తన అభిప్రాయం చెప్పాడు. అలానే గత వారం కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా తన ఏడిచింది స్ట్రాటజీ అని శివాజీతో మాట్లాడుతూ అమర్ ఓ సందర్భంలో చెప్పాడు. ఆ వీడియోని కూడా స్క్రీన్పై ప్లే చేసిన నాగ్.. ఇదేంటని అడిగాడు. అమర్ ఏదో చెప్పబోతుంటే.. నీ విషయంలో ఏది యాక్టింగ్? ఏది జెన్యూనిటీ? ఏది స్ట్రాటజీ? అనేది మాకే అర్థం కావట్లేదని నాగ్ అసహనం వ్యక్తం చేశాడు. ఏదైనా సరే కెప్టెన్సీ కంటే కప్ ముఖ్యం అని చెప్పి అమర్ని నాగ్ శాంతింపజేశాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డ వల్ల రెండోసారి రతిక ఎలిమినేట్.. వేరే లెవల్ రివేంజ్!) శివాజీ వాదన శివాజీ.. కెప్టెన్సీ విషయమై అమర్కి మాటిస్తున్నా అన్నావ్? మాట కోసం చచ్చిపోతాను అన్నావ్? ఎందుకు మాట మార్చావ్ అని నాగ్, శివాజీని అడిగాడు. దానికి శివాజీ ఏదేదో చెప్పుకొచ్చాడు. అమర్ కెప్టెన్ అయితే తన డిప్యూటీలుగా ప్రియాంక-శోభాని పెట్టుకుంటానన్నాడని అది తనకు నచ్చలేదని, అలానే ప్రియాంక కెప్టెన్సీలో చాలా విషయాలు కరెక్ట్గా జరగలేదని నాగ్ ముందే చెప్పాడు. మధ్యలో లేచిన ప్రియాంక.. నాగ్ ముందే శివాజీతో వాదన పెట్టుకుంది. ఇదంతా కూడా చిన్నపిల్లలా యవ్వారంలా అనిపించింది తప్పితే డీసెంట్గా అయితే లేదు. అలానే 'హత్య టాస్క్' సందర్భంగా శోభాకి సీక్రెట్ చెప్పి, ఆమె డెడ్ అవ్వకుండా ప్రియాంక కాపాడింది. ఈ వీడియోని చూపించిన నాగ్.. ప్రియాంకని కూడా ఓ రేంజులో ఇచ్చిపడేశాడు. మీ ముగ్గురూ(అమర్-ప్రియాంక-శోభా).. ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటున్నారని సీరియస్ అయ్యాడు. అశ్విని ఎలిమినేట్ చివర్లో యావర్ని కూడా నిలబెట్టి కెప్టెన్ అంటే హౌస్ మొత్తానికి కెప్టెన్ అని, ఆమెతో నామినేషన్స్ సందర్భంగా ప్రవర్తించిన తీరు సరికాదని చెప్పిన నాగార్జున.. యావర్తో ప్రియాంకకు సారీ చెప్పించాడు. కట్ చేస్తే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని గుర్తుచేసిన నాగ్.. గన్తో పేల్చడం అనేది పెట్టి అశ్విని ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. అయితే ప్రశాంత్.. నువ్వేమైనా ఎవిక్షన్ పాస్ ఇప్పుడు ఉపయోగిస్తావా అని అడగ్గా.. 14వ వారం వేరొకరి కోసం ఉపయోగిస్తానని ప్రశాంత్, నాగార్జునకు మాటిచ్చేశాడు. అలా శనివారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు స్టార్ హీరోయిన్.. ఈమె ఎవరంటే?) -
Bigg Boss 7: రైతుబిడ్డ వల్ల రెండోసారి రతిక ఎలిమినేట్.. వేరే లెవల్ రివేంజ్!
బిగ్బాస్ దత్తపుత్రిక రతిక మళ్లీ ఎలిమినేట్ అయిపోయింది. అవును మీరు విన్నది నిజమే. అయితే ఈసారి తనకు తానుగా ఎలిమినేట్ కాలేదు. రైతుబిడ్డ రివేంజ్ వల్ల ఈ బ్యూటీ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. రెండుసార్లు రతిక ఎలిమినేషన్కి రైతుబిడ్డ ప్రశాంతే కారణమయ్యాడు. ఇంతకీ లేటెస్ట్ ఎలిమినేషన్లో ఏం జరిగింది? ప్రశాంత్, రతికపై ఎలా పగ తీర్చుకున్నాడనేది ఇప్పుడు చూద్దాం. బిగ్బాస్ హౌస్లో రతిక ఓ వింత కంటెస్టెంట్. ఎందుకంటే తొలి వారంలో ఎఫర్ట్ పెట్టింది. రెండో వారానికి వచ్చేసరికి రైతుబిడ్డ ప్రశాంత్తో ప్రేమ కహానీ మొదలుపెట్టింది. అక్కడివరకు బాగానే ఉంది. కానీ రోజులు గడిచేసరికి తనలోని మరో యాంగిల్ బయటకు తీసింది. అన్నిరోజులు క్లోజ్గా మూవ్ అయిన ప్రశాంత్పై రివర్స్ అయింది. దీంతో ఈమెకి ప్రశాంత్ ఫ్యాన్స్ నుంచి ఫుల్ నెగిటివిటీ ఏర్పడింది. దీనికి తోడు గేమ్స్లోనూ రతిక సరిగా ఆడకపోవడం మరో మైనస్. ఫలితంగా ఐదో వారం ఈమెని ఎలిమినేట్ చేసి బయటకు తోసేశారు. (ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన 'జబర్దస్త్' ఫైమా.. అసలు ఏమైందంటే?) అయితే బిగ్బాస్కి రతిక అంటే చాలా ప్రేమ. దీంతో వింత లాజిక్స్ అన్ని పెట్టి ఎలాగోలా రీఎంట్రీ పేరుతో ఈమెని మళ్లీ హౌస్లోకి తీసుకొచ్చారు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అయినా గేమ్స్, టాస్కులు ఆడిందా అంటే నో ఛాన్స్. శివాజీకి చెంచాగిరి చేయడమే సరిపోయింది. దానికి తోడు ప్రశాంత్ తో మళ్లీ గొడవ పెట్టుకుంది. దీంతో ఈ వారం రతిక, ప్రశాంత్.. ఒకరిని ఒకరు నామినేట్ చేసుకున్నారు. ఇద్దరూ నామినేషన్స్లోనూ ఉన్నారు. ఇకపోతే ఈ వీకెండ్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని, హోస్ట్ నాగార్జున గత వారమే చెప్పారు. మరోవైపు ఈ వారం జరిగిన పోటీలో గెలిచిన ప్రశాంత్, ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు. దాన్ని ఇప్పుడు వీకెండ్ ఎలిమినేషన్ సందర్భంగా ఉపయోగించేసినట్లు తెలుస్తోంది. తొలుత అశ్విని ఎలిమినేట్ అయిందట. రెండో విడతలో చివరగా రతిక, అర్జున్ మిగిలారట. వీళ్లిద్దరిలో ఎవరో ఒకరి కోసం ఎవిక్షన్ పాస్ ఉపయోగించాలని చెప్పగా.. ప్రశాంత్ తన పాస్ ని అర్జున్ కి ఇచ్చేశాడట. అలా రతిక.. రైతుబిడ్డ వల్లే రెండోసారి ఎలిమినేట్ అయిపోయిందట. ఈ క్రమంలోనే రైతుబిడ్డ, రతికపై వేరే లెవల్ రివేంజ్ తీర్చుకున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: భర్తని పరిచయం చేసిన హీరోయిన్ ఇలియానా.. ఇతడెవరో తెలుసా?) -
అమర్ని మోసం చేసిన శివాజీ? చివరకు అలాంటి పరిస్థితి!
బిగ్బాస్ హౌస్లో అమర్ మరోసారి బలైపోయాడు. శివాజీ దారుణంగా మోసం చేశాడు. దీంతో నొప్పి తట్టుకోలేకపోయాడు. చివర్లో ఓకే చెప్పాడు గానీ బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వడంతో హౌస్మేట్స్ అందరూ షాకయ్యారు. అయితే ఆ ఒక్కటి చేయకపోవడమే అమర్ కెప్టెన్సీపై దెబ్బేసింది. ఇంతకీ శుక్రవారం ఏం జరిగిందనేది Day 82 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. చివరి కెప్టెన్సీ టాస్క్ ఈ వారం నామినేషన్స్ తర్వాత 'హత్యల టాస్క్' ఇచ్చిన అని బిగ్బాస్ గేమ్ పెట్టాడు. అది అయిపోవడంతో గురువారం ఎపిసోడ్ ముగిసింది. ఏడో సీజన్లో చిట్టచివరి కెప్టెన్ కోసం 'పాయింట్ బ్లాంక్' అని టాస్క్ పెట్టడంతో శుక్రవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఈ గేమ్ ప్రకారం.. ఓ చోట రెండు ఫొటోలు చూపిస్తారు. ఇద్దరు హౌస్మేట్స్ ఓ నిర్ణయానికొచ్చి, ఆ రెండు ఫొటోల్లో కెప్టెన్ కావడానికి ఎవరు అనర్హులో గన్తో కాల్చేయాల్సి ఉంటుందని బిగ్బాస్ క్లారిటీ ఇచ్చాడు. (ఇదీ చదవండి: 'కోటబొమ్మాళి పీఎస్' సినిమా రివ్యూ) ఎవరు ఎవరిని కాల్చారు? ఎవరిని సేవ్ చేశారు? హౌస్మేట్స్ షూట్-సేఫ్ గౌతమ్ , ప్రియాంక - శోభా, అర్జున్ ప్రశాంత్, శోభాశెట్టి - అశ్విని, అమర్ యావర్, రతిక - ప్రశాంత్, శివాజీ శివాజీ, అశ్విని - యావర్, అర్జున్ అమర్, అర్జున్ - ప్రియాంక, శివాజీ యావర్, రతిక - గౌతమ్, అర్జున్ ప్రియాంక, అశ్విని - రతిక, అమర్ అమర్, గౌతమ్ - శివాజీ, అర్జున్ శివాజీ, శోభా - అర్జున్, అమర్ అమర్ కెప్టెన్సీ పిచ్చి గత వీకెండ్ సందర్భంగా.. 12వ వారం గురించి రెండు ట్విస్టులు ఇచ్చాడు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని, అలానే కెప్టెన్సీ టాస్క్ కూడా ఈ వారం చివరిదని హోస్ట్ నాగార్జున చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఉన్నవాళ్లలో అమర్, అశ్విని, రతిక.. కెప్టెన్ కాలేదు. దీంతో అమర్, తన ఫొటో కాల్చొద్దని అందరినీ బతిమలాడుకున్నాడు. దీనికి అందరూ ఓకే చెప్పారు కూడా. అయితే మిగతా వాళ్లతో పోలిస్తే.. నేను కెప్టెన్ అవ్వాలి, లేకపోతే ఉండలేను అనేంత రేంజులో అమర్ హడావుడి చేశాడు. దీన్ని పిచ్చి అంటారా? లేదా ఇంకేదైనా అంటారా అనేది అర్థం కాలేదు. శివాజీ వెన్నుపోటు? హౌస్లోకి వచ్చినప్పటి నుంచి అమర్ అంటే శివాజీకి ఎందుకో కోపం. కారణమున్నా లేకపోయినా సరే కొన్నివారాలు అతడినే నామినేట్ చేసేవాడు. ఇక ఇది చివరి వారమని.. తనకు కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఇవ్వాలని.. టాస్క్ ప్రారంభానికి ముందే అమర్ అడిగాడు. దానికి శివాజీ కూడా సరేనన్నాడు. కానీ చివర్లో అర్జున్, అమర్ ఫొటోలు వచ్చేసరికి తన ఓటు అర్జున్కి వేస్తున్నట్లు చెప్పాడు. అమర్ విషయంలో ప్లేటు తిప్పేశాడు. శివాజీకి జోడిగా ఉన్న శోభా మాత్రం.. అమర్ పేరు చెప్పింది. దీనిబట్టి చూస్తే శివాజీ.. మరోసారి అమర్ అంటే కోపాన్ని బయటపెట్టడంతో పాటు వెన్నుపోటు పొడిచేశాడు. (ఇదీ చదవండి: Aadikeshava Review: 'ఆదికేశవ' సినిమా రివ్యూ) అదే కొంపముంచింది అయితే అర్జున్ భార్య అతడిని కెప్టెన్ కావాలని కోరుకుందని, అందుకే తన పేరు చెప్పినట్లు శివాజీ తన కారణం చెప్పాడు. దీంతో అమర్-శివాజీ మధ్య చాలాసేపు డిస్కషన్ జరిగింది. అమర్ అయితే నేను ఎలాగైనా కెప్టెన్ కావాలన్నా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఓవైపు అర్జున్ తన స్టాండ్ బలంగా చెబుతుండేసరికి.. ఇది ఎంతకీ తెగలేదు. దీంతో ఇక నిర్ణయం చెప్పకపోతే.. కెప్టెన్సీనే పూర్తిగా రద్దు చేస్తామని హెచ్చరించాడు. అప్పుడు ఇక వేరే దారిలేక శోభా-శివాజీ కలిసి.. అర్జున్ పేరు చెప్పారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. అర్జున్ ఫొటోతో పాటు అమర్ ఫొటో కూడా కాలిపోయింది. అయితే ఈ విషయంలో శివాజీది ఎంత తప్పుందో అమర్ది కూడా అంతే తప్పుందని చెప్పొచ్చు. ఏడుస్తూ టైమ్ వేస్ట్ చేసుకోకుండా శివాజీని కన్విన్స్ చేసి ఉండాల్సింది. కానీ బ్యాడ్ లక్. నిర్ణయం ఆలస్యమయ్యేసరికి అర్జున్తో పాటు అమర్ ఫొటో కూడా కాలిపోయింది. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. మరీ అమర్ కొత్త కెప్టెన్ అవుతాడా? లేదా? అనేది శనివారం ఎపిసోడ్లో తేలుతుందిలే. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు) -
Bigg Boss 7: అమర్కి ఎదురుదెబ్బలు.. మొన్న ప్రియాంక ఇప్పుడు శోభా!
బిగ్బాస్ షో నిర్వహకులు, హౌస్మేట్స్ ఇద్దరికి ఇద్దరూ అలానే తగలడ్డారు. లేటెస్ట్ ఎపిసోడ్ చూస్తే సరిగ్గా ఈ డైలాగే గుర్తొచ్చింది. ఎందుకంటే అందరూ ఫెర్ఫార్మ్ చేయమని.. బిగ్బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. అందుకు తగ్గట్లే ఎంటర్టైన్ చేయాల్సింది పోయి అందరూ కలిసి చిరాకు కలిగేలా చేశారు. మరీ ముఖ్యంగా శోభా-అమర్దీప్ అయితే నస పెట్టారు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 80 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. టాస్క్ ఓకే.. ఫెర్ఫార్మెన్సే? ఎవిక్షన్ పాస్ ప్రశాంత్ గెలుచుకోవడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. ఇక మిసెస్ బిగ్బాస్ని ఎవరో హత్య చేశారని, చంపిందెవరో కనుక్కోమని అర్జున్-అమర్కి బిగ్బాస్ టాస్క్ ఇవ్వడంతో బుధవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. వీళ్లిద్దరూ కూడా ఇన్వెస్టిగేట్ ఆఫీసర్స్ ఇంద్రజిత్-కామ్జిత్ రోల్స్ చేశారు. అశ్విని-శోభాశెట్టి రిపోర్టర్స్గా, రతిక-గౌతమ్ సీక్రెట్ ప్రేమ జంటగా, యావర్-ప్రియాంక.. పని మనషులుగా నటించారు. శివాజీ, నువ్వు మర్డరర్ అని చెప్పిన బిగ్బాస్.. పోలీసులు దొరక్కుండా మరిన్నీ మర్డర్స్ చేయాలని సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: శివాజీకి షాక్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ ఇద్దరేనా?) శోభా-అమర్ నస సీరియల్ బ్యాచ్ అనగానే శోభా-అమర్-ప్రియాంక గుర్తొస్తారు. ఇప్పటివరకు ఒక్కటిగా ఆడుతూ వస్తున్న వీళ్ల మధ్య గ్యాప్ వస్తోంది. గతవారం కెప్టెన్సీ టాస్క్లో గెలిచిన తర్వాత అమర్ దగ్గరకొచ్చిన ప్రియాంక.. నేను గెలుస్తుంటే నీకు ఆనందంగా లేదని ఉన్న నిజాన్ని బయటపెట్టింది. ఇప్పుడు టాస్క్లో భాగంగా శోభా తన మైక్ పట్టుకుని పైపైకి వస్తుందని చెప్పి, ఓవర్ ల్యాప్ చేస్తున్నావ్ నువ్వు అని అమర్, ఆమెతో అన్నాడు. దీంతో శోభా హర్ట్ అయిపోయింది. స్మెల్ వస్తోంది, దూరంగా వెళ్లు అని పదేపదే అంటున్నాడని చెప్పి అమర్తో శోభా గొడవ పెట్టుకుంది. ఈ వాదన ఎక్కువయ్యేసరికి అమర్.. తన లాఠీ విసిరేసి మరీ కాస్త అతి చేశాడు. వెనక్కి తోయడం అనేది యాక్టింగ్లో భాగం, నేను ఎవరినైనా కావాలని ఆపుతున్నానా అని అమర్ తన పాయింట్ చెప్పాడు. అయితే ఈ మాట తనని చూసి ఎందుకు అంటున్నావ్ అని అశ్విని, అమర్పై రెచ్చిపోయింది. గొడవ మీ ఇద్దరికీ జరిగితే నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నావ్ అని అశ్విని అరిచింది. ఫెర్ఫార్మ్ చేయండ్రా అని బిగ్ బాస్ చెబితే సీరియల్ బ్యాచ్లోని అమర్-శోభా మాత్రం అనవసర వాదనలతో చాలా నస పెట్టేశారు. సీక్రెట్ టాస్క్లో భాగంగా రైతుబిడ్డ ప్రశాంత్ మొక్కని శివాజీ మాయం చేశాడు. అయితే మిగతా రోజులతో పోలిస్తే.. లేటెస్ట్ ఎపిసోడ్ చాలా నీరసంగా సాగింది. హౌస్మేట్స్ ఒక్కరు కూడా కనీసం ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయారు. అలా బుధవారం ఎపిసోడ్ ముగింది. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరోయిన్.. భర్త ఎవరంటే?) -
Bigg Boss 7: శివాజీకి షాక్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ ఇద్దరేనా?
బిగ్బాస్ 12వ వారం నడుస్తోంది. గతవారం లానే ఈసారి కూడా ఏకంగా 8 మంది నామినేట్ అయ్యారు. గత వీకెండ్ లో నాగ్ చెప్పినట్లు ఈసారి డబుల్ ఎలిమినేషన్ గండం ఉంది. మరోవైపు పెద్దాయన శివాజీకి అమర్దీప్ వల్ల షాక్ తగిలింది. ఇంతకీ అసలేం జరుగుతోంది? నామినేషన్స్-ఓటింగ్-ఎలిమినేషన్ సంగతేంటి అనేది ఇప్పుడు చూద్దాం. నామినేషన్స్ సంగతేంటి? బిగ్బాస్ ప్రస్తుత సీజన్లో 11 వారాలు పూర్తయ్యాయి. పదివారాల పాటు ఒక్కో కంటెస్టెంట్ చొప్పున ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. గతవారం మాత్రం యావర్ తన ఎవిక్షన్ పాస్ తిరిగిచ్చేసిన కారణాన్ని చూపిస్తూ నో ఎలిమినేషన్ అన్నారు. ఈ వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగ్ బాంబు పేల్చాడు. దీంతో ఈసారి నామినేషన్స్ అనేది కాస్త ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. కెప్టెన్ ప్రియాంక, శోభా తప్పితే మిగిలిన 8 మంది లిస్టులోకి చేరిపోయారు. (ఇదీ చదవండి: కాస్ట్లీ కారులో మెగాహీరో రామ్ చరణ్.. దీని ధరెంతో తెలుసా?) డేంజర్లో బ్యూటీస్? అయితే ప్రతిసారి రైతుబిడ్డ, శివాజీకి ఎక్కువ ఓట్లు పడేవి. ఈ వారం మాత్రం అనుహ్యంగా అమర్దీప్ అగ్రస్థానంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఓ రకంగా శివాజీకి దెబ్బే అని చెప్పొచ్చు. అమర్ టాప్లో ఉండగా, రెండు-మూడు స్థానాల్లో శివాజీ, ప్రశాంత్ ఉన్నారట. ఆ తర్వాత వరసగా యావర్, గౌతమ్, అర్జున్ ఉన్నట్లు తెలుస్తోంది. చివరి రెండు స్థానాల్లో రతిక, అశ్విని ఉన్నారట. అంటే ఆడ లేడీస్ ఇద్దరూ డేంజర్ జోన్లో ఉన్నట్లే. లిస్ట్ మారే ఛాన్స్ ఉందా? ప్రస్తుత పరిస్థితుల బట్టి ఈ వారం ఓటింగ్ విషయంలో పెద్దగా మార్పులేం ఉండకపోవచ్చని తెలుస్తోంది. అలానే అశ్విని.. ఈ వారం సెల్ఫ్ నామినేట్ చేసుకుని, అసలు బిగ్బాస్లో ఉండటానికి తనకు ఇష్టం లేదనే విషయాన్ని పరోక్షంగా చెప్పేసింది. మరోవైపు రతిక.. ఒక్కటంటే ఒక్క విషయంలోనూ ఆకట్టుకోలేకపోతుంది. దానికి తోడు ఈ వారం నామినేషన్స్లో ఉన్నవాళ్లతో పోలిస్తే వీళ్లిద్దరికీ ఫ్యాన్ బేస్ కూడా పెద్దగా లేదు. కాబట్టి ఓటింగ్ లిస్ట్ అనేది మారకపోవచ్చు. అంటే అమ్మాయిలిద్దరూ ఎలిమినేట్ అయిపోవడం గ్యారంటీ! శనివారం వరకు ఆగితే ఎలిమినేషన్ సంగతేంటో తేలిపోతుంది! అప్పటివరకు జస్ట్ వెయిట్ అండ్ సీ! (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరోయిన్.. భర్త ఎవరంటే?) -
Bigg Boss 7: బయటపడ్డ శివాజీ మరో కోణం.. మనోడు బిగ్బాస్లో బ్రెయిన్లెస్ 'చాణక్య'!
శివాజీ పేరు చెప్పగానే బిగ్బాస్ షోలో చాణక్య అని అంటారేమో! కానీ అంత సీన్ లేదని లేటెస్ట్ ఎపిసోడ్తో క్లారిటీ వచ్చేసింది. 12వ వారం నామినేషన్స్లో అసలు రంగు అంతా బయటపడింది. అస్సలు బుర్రలేదన్నట్లుగా నోటికొచ్చినట్లు మాట్లాడి ఇజ్జత్ మొత్తం తీసేసుకున్నాడు. డాక్టర్బాబు గౌతమ్ అయితే శివాజీ మైండ్ని చదివేశాడు. అసలు ఈ పెద్దాయన ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో క్లారిటీగా చెప్పేశాడు. ఇంతకీ మంగళవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 79 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) గౌతమ్, శివాజీ.. ఇద్దరూ ఇద్దరే! ఆరుగురు హౌస్మేట్స్ సోమవారం ఎపిసోడ్లో తమ నామినేషన్స్ పూర్తి చేశారు. ఆగిన దగ్గర నుంచి మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. గౌతమ్ని నామినేట్ చేస్తున్నట్లు చెప్పిన శివాజీ.. బ్యాలెన్సింగ్ టాస్క్తోపాటు మిగతా విషయాల్ని కారణాలుగా చెప్పాడు. కానీ గౌతమ్ మాత్రం... పాయింట్ టూ పాయింట్ చెప్పండన్నా అనేసరికి శివాజీ వాదించలేకపోయాడు. తర్వాత అశ్విని పేరు శివాజీ చెప్పాడు గానీ ఆమె సెల్ఫ్ నామినేట్ కాబట్టి.. ఆమెని నామినేట్ చేయడానికి వీల్లేదని బిగ్బాస్ చెప్పడంతో అర్జున్ని నామినేట్ చేశాడు. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? శివాజీ - గౌతమ్, అశ్విని యావర్ - అమర్దీప్, అర్జున్ శోభాశెట్టి - శివాజీ, అర్జున్ ప్రియాంక - యావర్, శివాజీ యావర్తో మాటల్లేవు! శివాజీది పూర్తయిన తర్వాత యావర్.. అమర్, అర్జున్ని నామినేట్ చేస్తున్నట్లు చెప్పాడు. తన తప్పొప్పుల గురించి, చేసినప్పుడే ఎందుకు చెప్పలేదని యావర్, అర్జున్ని అడిగాడు. అయితే ఇది చాలా సిల్లీ రీజన్ అని, ఇక హౌసులో ఉన్నన్నీ రోజులు నీతో మాట్లాడేది లేదని అర్జున్ సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరోవైపు కెప్టెన్గా నిన్ను కంట్రోల్ చేయాలని చూస్తే.. 'కెప్టెన్ కాదు నువ్వు' అని ఎందుకన్నావ్, అది నచ్చలేదని ప్రియాంక, యావర్ని నామినేట్ చేసింది. దీంతో తెలుగు సరిగా రానీ యావర్కి ఏం అర్థమైందో ఏంటో గానీ.. 'వేస్కో అది' అని పిచ్చిపిచ్చిగా బిహేవ్ చేస్తూ వెళ్లిపోయాడు. (ఇదీ చదవండి: యాంకర్ రష్మీతో పెళ్లెప్పుడు? సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్!) శివాజీ దగ్గర నో ఆన్సర్ యావర్ తర్వాత శివాజీని నామినేట్ చేస్తున్నట్లు ప్రియాంక చెప్పింది. రాజమాతలు టాస్కులో నేను చేసింది తప్పని ఎలా అంటారు? మేం ఏం మాట్లాడుకున్నామో మీకేమైనా తెలుసా? అని ప్రియాంక అడిగేసరికి శివాజీ దగ్గర సమాధానం లేదు. దీంతో తనకు అలవాటు అయినట్లు నానా హంగామా చేశాడు. మీరు ఏమనుకుంటారో అదే చేస్తారు, నామినేషన్ యాక్సెప్టెడ్ అని అనేసి శివాజీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరి.. మీరు ఇద్దరు(యావర్, ప్రశాంత్) మాత్రమే తప్పులు చేస్తుంటే, చెప్పి మరీ వాళ్లని సరిదిద్దుతున్నారు, మిగతా వాళ్లకు ఎందుకు చెప్పట్లేదని ప్రియాంక అడిగేసరికి.. శివాజీ ట్రిగ్గర్ అయిపోయాడు. ఈ హౌసులో ప్రతిసారి పొరపాట్లు మీద పొరపాట్లు జరుగుతున్నాయి అని అన్నాడు. అవి ఏంటి? అనే ప్రియాంక అడిగితే.. నేను చెప్పలేను, నేను చెప్పలేను అని శివాజీ ఏదేదో మాట్లాడాడు. ఎందుకంటే పెద్దాయన దగ్గర ఆన్సర్ లేదు! ఇక్కడ అర్థమైంది ఏంటంటే.. శివాజీ ఏం చేసినా తప్పు కాదు కానీ పక్కనోళ్లు చిన్న పొరపాటు చేసినా అది తప్పే. నాగార్జున నెత్తికెక్కించుకునేసరికి శివాజీ బాగా రెచ్చిపోతున్నాడు. అందుకే ప్రియాంకపై నోటికొచ్చినట్లు మాట్లాడుతూ.. పెద్దరికం పోగొట్టుకుని బ్రెయిన్లెస్ చాణక్య అయిపోయాడు. (ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఆ రెండు హిట్ మూవీస్.. ఒక్కరోజు గ్యాప్లో రిలీజ్!) శివాజీ గురించి చెప్పిన గౌతమ్ నామినేషన్స్ పూర్తయిన తర్వాత బయట కూర్చుని అర్జున్తో మాట్లాడిన గౌతమ్.. శివాజీ అసలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఆ మధ్య కొన్ని వారాల పాటు ఆయన్ని ఎవరు ఎదురించలేదు, ఇప్పుడు అలా ఆయన చేసింది తప్పని చెబుతుంటే ఆయన తీసుకోలేకపోతున్నాడని గౌతమ్ చెప్పుకొచ్చాడు. దీంతో శివాజీ అసలు రంగు బయటపడినట్లయింది. ప్రియాంక తనని నామినేట్ చేయడాన్ని తీసుకోలేకపోయిన శివాజీ.. తన బ్యాచ్ సభ్యులైన యావర్, ప్రశాంత్తో మాట్లాడుతూ.. గేమ్ ఆడటానికి వచ్చినా కూడా ఓ క్యారెక్టర్ అంటూ ఉండాలి. పెద్ద గేమ్, స్ట్రాటజీ, నేను ఇలానే ఆడతాను లాంటివి అనడం ఓకే, కానీ క్యారెక్టర్ కావాలి కదా అని శివాజీ అన్నాడు. మరి ఇంత చెప్పినా శివాజీకి ఏమైనా క్యారెక్టర్ ఉందా అంటే లేదు. ఎప్పుడు చూడు ఆ యావర్-ప్రశాంత్లని రెచ్చగొట్టి అవతలి వాళ్లపైకి పంపించడం తప్పితే గేమ్ ఆడిన దాఖలాలు అయితే పెద్దగా కనిపించలేదు. ఎపిసోడ్ చివర్లో ఎవిక్షన్ పాస్ కోసం బ్యాలెన్సింగ్ టాస్క్ పెట్టగా అందులో రైతుబిడ్డ ప్రశాంత్ విజయం సాధించాడు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. ఈ వారం నామినేషన్స్ లిస్ట్ శివాజీ అర్జున్ రతిక గౌతమ్ ప్రశాంత్ యావర్ అమర్దీప్ అశ్విని (ఇదీ చదవండి: ఎవిక్షన్ పాస్ గెలుచుకున్న రైతుబిడ్డ.. ఆమెని దెబ్బకొట్టడం గ్యారంటీ!?) -
Nayani Pavani Latest Photos: బోల్డ్ అండ్ బ్యూటీ నయని పావని అందాలు (ఫోటోలు)
-
Bigg Boss 7: రైతుబిడ్డతో గౌతమ్ 'పంచె' పంచాయతీ.. క్షమాపణలు చెప్పిన రైతుబిడ్డ!
బిగ్బాస్ 12వ వారంలో అడుగుపెట్టేసింది. అలానే సోమవారం కాబట్టి నామినేషన్స్ మంచి ఇంట్రెస్టింగ్గా సాగాయి. కాకపోతే ఈసారి అందరి శివాజీ గ్యాంగ్ని టార్గెట్ చేశారనిపించింది. మరోవైపు ఓ లేడీ కంటెస్టెంట్ ఎలిమినేషన్ అనే కత్తిపై డైరెక్ట్గా పీక పెట్టేసింది. దీంతో ఈ వారం ఈ హాట్ బ్యూటీ బయటకెళ్లిపోవడం గ్యారంటీ అనిపిస్తోంది. ఇంతకీ సోమవారం నామినేషన్స్ సందర్భంగా అసలేం జరిగిందనేది Day 78 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. రతికక చెప్పి మరీ అమర్ అలా ఎలిమినేషన్ చేయకపోవడంతో అందరూ రిలాక్స్ అయిపోయారు. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే సోమవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. అశ్విని-గౌతమ్ ఇద్దరూ దీని గురించి మాట్లాడుకున్నారు. మరోవైపు కెప్టెన్సీ ఫైనల్ గేమ్లో తనని టార్గెట్ చేసి కొట్టావ్ నిన్నే ఈసారి నామినేట్ చేస్తా రతిక అని అమర్ ఆమెతో చెప్పాడు. చెప్పినట్లే చేశాడు. ఇంకా ఎవరు ఎవర్ని నామినేట్ చేశారనేది లిస్ట్ ఇదిగో. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? అమర్దీప్ - యావర్, రతిక గౌతమ్ - ప్రశాంత్, శివాజీ రతిక - అమర్దీప్, ప్రశాంత్ అర్జున్ - యావర్, శివాజీ ప్రశాంత్ - గౌతమ్, రతిక అశ్విని - సెల్ఫ్ నామినేషన్ యావర్ నో లాజిక్స్ ఇక ఫస్ట్ ఫస్ట్ అమర్ వచ్చాడు. యావర్ని నామినేట్ చేశాడు. ఎవిక్షన్ పాస్ గేమ్ ఆడే విషయంలో కాలు కింద పెట్టావ్, అది తప్పే కదా అని అమర్ అన్నాడు. అవును నేను కావాలని చేయలేదు, అది అనుకోకుండా జరిగిందని యావర్ అన్నాడు. అలానే సంచాలక్ గా నువ్వు కూడా ఫెయిలయ్యావ్ కదా అని యావర్ అంటే.. అవును ఫౌల్ ఆడినందుకు నిన్ను నామినేట్ చేస్తున్నా, రిటర్న్ నన్ను నామినేట్ చేస్కో అని ఇద్దరి మధ్య కాస్త లాజిక్లెస్ డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత రతికని నామినేట్ చేసి అమర్ మాట్లాడుతుండగా మధ్యలో యావర్ ఎంట్రీ ఇచ్చాడు. కెప్టెన్ ప్రియాంక, యావర్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తుంటే.. అసలు నువ్వు ఎవరు? నువ్వు ఎవరు? అని యావర్ అతిచేశాడు. ప్రశాంత్ vs గౌతమ్ తొలుత గౌతమ్, ప్రశాంత్ని నామినేట్ చేశాడు. బాల్స్ బ్యాలెన్స్ చేసే గేమ్లో సంచాలక్గా ఫెయిలయ్యావని కారణం చెప్పాడు. కానీ ప్రశాంత్ వింటేగా, అస్సలు ఒప్పుకోలేదు. ఆ టతర్వాత ప్రశాంత్ వచ్చి గౌతమ్ ని నామినేట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య చాలాసేపు వాదన నడిచింది. ఒకానొక దశలో గౌతమ్ని ఉద్దేశించి 'పంచె ఊసిపోకుండా చూస్కో' అని ప్రశాంత్ అన్నాడు. దీంతో పంచాయతీ మొదలైంది. కాసేపటి తర్వాత అసలు నా పంచె గురించి నువ్వెవరు అసలు.. ఎక్కువ తక్కువగా మాట్లాడకు, గుర్తుపెట్టుకో అని గౌతమ్ చాలా సీరియస్ అయ్యాడు. దీంతో గోళీలు వేస్కో అని మళ్లీ ప్రశాంత్ రెచ్చగొట్టాడు. దీంతో గౌతమ్ మాట్లాడుతూ.. ఇలాంటి వాటినే చిల్లర కథలు అంటారు, ఛీ అని సీరియస్ అయ్యాడు. పాయింట్ చెప్పు, పర్సనల్ కి రాకు అని గౌతమ్ వార్నింగ్ ఇచ్చాడు. పంచె అనేది తెలుగోడి సంస్కృతి, దాన్ని కించపరుస్తూ నువ్వు మాట్లాడటం మంచిది కాదు. అది నార్మల్గా చెప్పడానికి వచ్చినా, అది తప్పు వేలో తీసుకెళ్లడానికి చేస్తే బాగోదని గౌతమ్ కామెంట్స్ చేశాడు. దీంతో రైతుబిడ్డకి తప్పు తెలిసొచ్చింది. పంచె గురించి నేను తప్పుగా ఏం అనలే, దయచేసి నన్ను క్షమించండి. నేను పంచె ఊడిపోకుండా కాపాడుకో అని అన్నాను తప్పితే మరోమాట అనలే అని చేతులెత్తి మరీ రైతుబిడ్డ ప్రశాంత్ క్షమాపణలు చెప్పాడు. శివాజీని లాజిక్స్తో కొట్టారు ప్రశాంత్ తర్వాత శివాజీని.. గౌతమ్ నామినేట్ చేశాడు. మీరు బ్యాలెన్సింగ్ గేమ్లో ఎక్కువ ఫౌల్స్ చేశారని గౌతమ్ అనగానే.. నువ్వెవరయ్యా చెప్పడానికి అని శివాజీ అడిగాడు. నేను సంచాలక్గా వచ్చి చెప్పలేదు కదా అని గౌతమ్ రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. నీకు ఏమి ఉండవ్, ఏదో ఒకటి చేయాలి, నీకు గొడవ కావాలి, నాకిష్టం లేదు యాక్సెప్టెడ్.. వేస్కో అని శివాజీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అలానే అర్జున్ కూడా శివాజీని నామినేట్ చేశాడు. బాల్స్ బ్యాలెన్స్ టాస్కులో ప్రశాంత్ అరుస్తున్నాడని చెప్పి.. మీరు గట్టిగట్టిగా అరుస్తూ బాల్స్ విసిరికొట్టి గేమ్ నుంచి బయటకెళ్లిపోయారు. అయితే అప్పటికే యావర్ ఆడుతున్నాడు కదా.. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మీరే తప్పు చేశారు కదా అని అర్జున్ చెప్పగానే.. శివాజీ దగ్గర ఆన్సర్ లేదు. దీంతో హెల్తీగా తీసుకుంటానని నవ్వి ఊరుకున్నాడు. ఇక్కడ శివాజీ దగ్గర ఆన్సర్ లేదు అందుకే ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక సిల్లీ కారణాలతో తాను నామినేట్ చేయదలచుకోలేదని, ఎవరిని నామినేట్ చేయడానికి రీజన్స్ కనిపించట్లేదని అశ్విని చెప్పగా.. ఒకవేళ పేర్లు చెప్పకపోతే సెల్ఫ్ నామినేట్ అయిపోతారని బిగ్ బాస్ అన్నాడు. అలాగే అని అశ్విని ఓకే చెప్పింది. బహుశా ఆమెకి ఇంట్లో ఉండటం ఇష్టం లేనట్లు ఉంది. ఈ వారం ఎలానూ డబుల్ ఎలిమినేషన్ ఉంది కదా! వెళ్లిపోదాం అని ఫిక్స్ అయ్యి ఇలా సెల్ఫ్ నామినేట్ చేసుకున్నట్లు ఉందని అనిపించింది. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది. -
Bigg Boss 7: డబుల్ ఎలిమినేషన్పై ట్విస్ట్.. అశ్విని, రతిక చివరకు అలా!
బిగ్బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ చాలా అంటే చాలా బోరింగ్గా సాగింది. చివర్లో ఓ ఐదు నిమిషాలు తప్పితే ఒక్కటంటే ఒక్క పాయింట్లోనూ ఆసక్తిగా అనిపించలేదు. శివాజీపై ఏదో వేయాలని హోస్ట్ నాగార్జున అక్కడక్కడ సెటైర్లు వేస్తున్నాడు. మరోవైపు ఈ వారం ఎలిమినేషన్ ఏం జరగలేదు. అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో హోస్ట్ నాగ్ కారణం చెప్పాడు. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 77 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. రతిక కన్నింగ్ ప్రిన్స్ యావర్.. ఫౌల్ గేమ్ ఆడి, వీడియోలతో సహా దొరికిపోయినందుకు తన ఎవిక్షన్ పాస్ని తిరిగిచ్చేయడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. దాని గురించి డిస్కస్ చేసుకోవడంతో ఆదివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ప్రియాంక, శోభా.. యావర్ని మెచ్చుకోగా రతిక మాత్రం తన్న కన్నింగ్నెస్ బయటపెట్టింది. 'సేఫ్ గేమ్ ఆడావ్ నువ్వు, ఎక్కడ నాకు ఇవ్వాల్సి వస్తుందని తిరిగిచ్చేశావ్ కదా' అని యావర్తో తన అసహనాన్ని వ్యక్తం చేసింది. అనంతరం హోస్ట్ నాగార్జున.. ఇంటి సభ్యుల్ని పలకరించాడు. ఇక సింపతీ కొట్టేద్దామని ఫిక్స్ అయిన శివాజీ.. బూతులు మాట్లాడినందుకు అందరికీ సారీ చెప్పేశాడు. (ఇదీ చదవండి: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ కార్తిక.. పెళ్లి ఫోటోలు వైరల్) సండే ఫన్డే కాదు ఇకపై సండే అంటే ఫన్డే కాదని చెప్పిన నాగార్జున.. యాడ్ ఏ ఫ్రెండ్, బ్లాక్ ఏ హౌస్మేట్' టాస్క్ పెట్టాడు. ఇందులో ఒక్కొక్కరు.. ఇద్దరికీ ఈ రెండు ట్యాగ్స్ ఇవ్వాల్సి ఉంటుందని నాగ్ చెప్పాడు. ఎవరు.. ఎవరెవరికి ఏ ట్యాగ్ ఇచ్చారు? కంటెస్టెంట్స్.. ఫ్రెండ్.. బ్లాక్ హౌస్మేట్ గౌతమ్ - ప్రశాంత్, శోభాశెట్టి అమర్దీప్ - ప్రశాంత్, రతిక రతిక - శోభాశెట్టి, అమర్ శోభాశెట్టి - రతిక, గౌతమ్ అశ్విని - శోభాశెట్టి, గౌతమ్ యావర్ - శోభాశెట్టి, గౌతమ్ ప్రశాంత్ - అమర్దీప్, రతిక అర్జున్ - శివాజీ, యావర్ శివాజీ - అర్జున్, రతిక ప్రియాంక - ప్రశాంత్, అశ్విని శివాజీ మళ్లీ అలానే ఆదివారం ఎపిసోడ్లో 'కోటబొమ్మాళి పీఎస్' మూవీ టీమ్ ప్రమోషన్లో భాగంగా వచ్చారు. అయితే అంతా మాట్లాడుతున్న సమయంలో.. శివాజీని పెద్దాయన అని శ్రీకాంత్ సరదాగా అన్నాడు. దీంతో.. తనని అందరూ పెద్దాయన-పెద్దాయన అని అనడంపై శివాజీ ఫన్నీ కామెంట్స్ చేశాడు. తలుపులు తీస్తే ఎల్లిపోతా సర్, ఇది నరకంగా ఉంది అని బుర్ర బాదుకుని మరీ పాత శివాజీని గుర్తుచేశాడు. సరదాకి అన్నాసరే శివాజీ అంటున్నాడనేది అర్థం కాలేదు. ఇకపోతే సేవింగ్లో భాగంగా తొలి రౌండ్లో యావర్, ప్రియాంక.. రెండో రౌండ్లో అర్జున్, అమర్దీప్ సేవ్ అయ్యారు. మూడో రౌండ్లో శోభాశెట్టి, రతిక సేవ్ అయ్యారు. చివరగా గౌతమ్, అశ్వినిలలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అనుకున్నారు. కానీ ఇద్దరు సేవ్ అయినట్లు నాగ్ ప్రకటించారు. తద్వారా ఈ వారం నో ఎలిమినేషన్ అని తేలింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: శివాజీ భజన చేస్తున్న బిగ్బాస్! చివరకు నాగార్జున కూడా అలానే?) నో ఎలిమినేషన్కి కారణమదే అయితే ఈ వారం ఎవిక్షన్ పాస్ ఉపయోగించలేని పరిస్థితుల్లో అంటే ఈ రోజు ఎలిమినేషన్ లేదని నాగార్జున చెప్పుకొచ్చాడు. అయితే గతవారం కేవలం ఐదుగురికి మాత్రమే ఎవిక్షన్ పాస్ కోసం పోటీపడే ఛాన్స్ వచ్చిందని, ఈ వారం మాత్రం అందరూ దానికోసం పోటీపడే అవకాశమొస్తుందని నాగ్ చెప్పాడు. అయితే అది ఎప్పుడు ఎలా వస్తుందనేది బిగ్బాస్ డిసైడ్ చేస్తారని నాగ్ వివరణ ఇచ్చాడు. అలానే రాబోయే వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి నాగ్ షాక్ ఇచ్చాడు. అంటే ఈ వారం మిస్ అయినోడు, నెక్స్ట్ వారం కలిపి ఇద్దరిని ఒకేసారి ఇంటికి పంపేస్తారనమాట. అయితే ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ అయినప్పుడు రతిక.. తెగ భయపడిపోయింది. దీంతో నాగార్జున ఆమెని సముదాయించాడు. 'ఏంటి రతిక.. సేవ్ అయ్యావని నమ్మలేకపోతున్నావా?' అని నాగార్జున అడిగాడు. దీంతో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు సర్ అని తన ఆనందాన్ని, భయాన్ని మిక్స్ చేసిన ఫీలింగ్స్ రతిక బయటపెట్టింది. చివరవరకు వచ్చేసరికి అశ్విని కూడా అలానే భయపడిపోయింది. కానీ నో ఎలిమినేషన్ అనేసరికి రతిక, అశ్విని.. హమ్మయ్యా అనుకున్నారు. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: నెలన్నర నుంచి ఓటీటీ ట్రెండింగ్లో ఆ థ్రిల్లర్ మూవీ) -
Bigg Boss 7: శివాజీ భజన చేస్తున్న బిగ్బాస్! చివరకు నాగార్జున కూడా అలానే?
బిగ్ బాస్ హౌసులో భజన ఎక్కువైంది. శివాజీ ఏం చేసినా, ఏం మాట్లాడినా అతడు చెప్పిన సమాధానాలు విని తలుపుతున్నారు. పాపం హోస్ట్ నాగార్జున కూడా ఏం చేయలేకపోతున్నాడు. షోకు కొన్ని నియమాలు అని ఉంటాయి. శివాజీ మీద ప్రేమ ఎక్కువై, అవి ఉన్నట్లు కూడా మరిచిపోతున్నాడు. బూతులు మాట్లాడినందుకు వార్నింగ్ ఇవ్వాల్సింది పోయి బతిమాలాడుకుంటున్నారు. సరే ఇంతకీ శనివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 76 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భర్త వరుణ్ గురించి లావణ్య ఫస్ట్ పోస్ట్!) శివాజీ ఒకటే భజన ప్రియాంక.. బిగ్బాస్ హౌసుకి కొత్త కెప్టెన్ కావడంతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. వీకెండ్ కదా.. నాగార్జున రావడంతో శనివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. శుక్రవారం జరిగినదంతా చూసిన హోస్ట్ నాగ్.. ఇంటి సభ్యుల్ని పలకరించాడు. ఈవారం అసలేం జరిగిందనే విషయాన్ని శివాజీతో మొదలుపెట్టాడు. అంతా బానే ఉంది గానీ ఓ విషయం మాత్రం నచ్చట్లేదు శివాజీ అని నాగ్ అనగానే.. బూతులా బాబుగారు! వాటిని కావాలని అనలేదని, అలా వచ్చేశాయని ఏదో చెప్పడానికి ట్రై చేశాడు. అసలు అమర్ని పిచ్చి పోహో అని ఎందుకన్నావ్ శివాజీ అనగానే.. ఇంట్లో పోహా చేసుకుంటాం కదా బాబుగారు అందుకే అలా అన్నానని ఓ పనికిమాలిన లాజిక్ చెప్పాడు. అమర్దీప్ ఓ పిచ్చోడు. వాటిని నేను అస్సలు పట్టించుకోలేదని అన్నాడు. శివాజీని బతిమాలాడిన నాగ్ పిచ్చి నాయాల్ల, పిచ్చి పోహా, ఎర్రి పోహా.. ఇవన్నీ హౌసులో వాడే పదాలా? అని నాగ్, శివాజీపై సీరియస్ అయినట్లు నటించాడు. ఈ విషయంలో నీ అనుభవం ఏమైంది? ఈ విషయంలో నీ సహనం ఏమైంది? ఈ విషయంలో నీ సమర్థత ఏమైంది? అని నాగ్ అడిగాడు తప్పితే.. నియమాల ప్రకారం బిగ్బాస్లో బూతులు మాట్లాడుకూడదు. అలాంటి అర్థం వచ్చేలా మాట్లాడిన పనిష్మెంట్ ఇవ్వాలనే సోయి లేకుండా పోయింది. చూసే ప్రేక్షకుల్లో చాలామందికి వాటి అర్థాలేంటో, అవి ఎంత పెద్ద బూతులనేది తెలుసు. కానీ బిగ్బాస్ ఆర్గనైజర్స్, హోస్ట్ నాగార్జునకు తెలియకుండా పోయింది. దీంతో ఎప్పటిలానే ఆ టాపిక్ని నైస్గా సైడ్ చేసేసి, శివాజీకి కనీసం వార్నింగ్-పనిష్మెంట్ లాంటివి ఏం ఇవ్వకుండానే మిగతా విషయాలపై పడ్డారు. (ఇదీ చదవండి: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్బాస్.. నో ఎలిమినేషన్) నో కెప్టెన్సీ టాస్క్ ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా అమర్ ప్రవర్తన గురించి నాగ్ అడిగాడు. దీంతో హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఎలాగైనా సరే కెప్టెన్ కావాలనే అలా చేశానని అమర్ ఏదో సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఈ సందర్భంలో నాగ్ ఓ విషయమై ట్విస్ట్ ఇచ్చాడు. వచ్చే వారం మాత్రమే కెప్టెన్సీ టాస్క్ ఉంటుందని, మిగిలిన మూడు వారాల్లో కెప్టెన్సీ టాస్క్ ఏం ఉండదని బాంబ్ పేల్చాడు. రతికకి క్లాస్- ఆ పదాలు బ్యాన్ రతికని నిలబట్టి నాగ్ కడిగేశాడు. దేంట్లో గెలిచావ్ చెప్పు రతిక అని నాగార్జున సీరియస్ అయ్యాడు. ఈ ప్రశ్న అడగానికి ముందు ఆమె ఫొటో పెట్టి మూడు బాటిల్స్ పగలగొట్టాడు. ఈవారం నామినేషన్స్ మాట్లాడిన కొన్ని మాటల్ని బ్యాన్ చేస్తున్నట్లు నాగ్ చెప్పుకొచ్చాడు. రతిక ఎక్కువగా చెప్పే.. 'వచ్చే వారం నుంచి నేనేంటో చూపిస్తాను', 'నేను ఇక్కడి నుంచి ఆడతాను' అనే వాటితో పాటు శివాజీ ఎక్కువగా చెప్పే 'జనాలు చూస్తున్నారు' అనే వాక్యంతో పాటు సీరియల్ బ్యాచ్ ఎక్కువగా ఉపయోగించే 'పోట్రే చేస్తున్నారు' అనే ఈ వాక్యాలన్నీ ఈరోజు నుంచి హౌసులో బ్యాన్ చేస్తున్నానని నాగ్ చెప్పాడు. అయితే ఈ పనేదో ముందే చేసుంటే బాగుండేది. ఇప్పుడు చేసి ఏం ఉపయోగం అనిపించింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?) ఎవిక్షన్ పాస్ రిటర్న్ ఇక ప్రశాంత్ గురించి మాట్లాడిన నాగ్.. అసలు ఈ వారం ఏమైనా గేమ్ ఆడావా నువ్వు అని అడిగాడు. దీంతో తల అడ్డంగా ఊపుతూ ప్రశాంత్ సమాధానం చెప్పలేకపోయాడు. ఫ్యామిలీ వీక్లో అందరూ వచ్చిన నీ పేరు చెప్పేసరికి రిలాక్స్ అయిపోయావా కదా అని కౌంటర్స్ వేశాడు. అలానే ఎవిక్షన్ పాస్ దక్కించుకునే విషయంలో యావర్ ఫౌల్ గేమ్ ఆడినట్లు వీడియోలతో సహా నాగ్ బయటపెట్టాడు. దీంతో యావర్.. అది తనకు వద్దని తిరిగిచ్చేశాడు. అయితే ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఒకటే అనిపించింది. పెద్దాయన అనే ముసుగులో నీతులు చెప్పే శివాజీ.. తాను మాత్రం నీతులు పాటించాడు. బూతుల్ని నేరుగా మాట్లాడితే ప్రాబ్లమ్ అవుతుందని, పదాలు మార్చి మరి.. తెలివిలేని అమర్ని అంటాడు. వీకెండ్ లో వచ్చే నాగార్జున.. పనిష్మెంట్ ఇచ్చి బుద్ది చెప్పాల్సింది పోయి శివాజీ చెప్పిన దానికి తలూపేస్తాడు. దీనిబట్టి చూస్తే బిగ్బాస్ ఆర్గనైజర్స్ ఎప్పుడు మారతారో అనే సందేహం వస్తోంది. అలా శనివారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు) -
Bigg Boss 7: అమర్దీప్ది ఓవరాక్షనా? నిజమైనా ఎమోషనా?
బిగ్బాస్ గేమ్ ఈ రోజు ఎందుకో చాలా అంటే చాలా ఆసక్తిగా అనిపించింది. బహుశా శివాజీ గ్యాంగ్ లేకపోవడం వల్ల కావచ్చు. అలానే అమర్దీప్ అయితే హౌస్ అంతా గాయిగత్తర చేశాడు. పిచ్చిపట్టిన వాడిలా అరుస్తూ బీభత్సం సృష్టించాడు. మరోవైపు ప్రియాంకని చూస్తే నిజంగా హేట్సాఫ్ అనిపించింది. ఇంతకీ శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందనేది Day 75 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. శివాజీ బ్లాక్మెయిల్ ఎవిక్షన్ పాస్ చివరి రౌండ్లో నిర్ణయం తీసుకునే దగ్గర గురువారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే శుక్రవారం ఎపిసోడ్ మొదలైంది. శోభా తన అభిప్రాయం చెప్పడానికి ప్రయత్నిస్తుంటే.. శివాజీ తన వాళ్లకు రాకపోతే బాగోదు అన్నంత రేంజులో బ్లాక్మెయిల్ చేశాడు. సంచాలక్స్ ఒక్క మాట అనుకుని యావర్.. ఎవిక్షన్ పాస్ విజేత అని ప్రకటించడంతో శివాజీ చల్లబడ్డాడు. మంచి డెసిషన్ తీసుకున్నారని పుడింగిలా పనికిమాలిన కామెంట్ చేశాడు. దీంతో శోభా ట్రిగ్గర్ అయిపోయింది. నియమాల ప్రకారం అన్నప్పుడు ఒకవేళ నేను గానీ, ప్రశాంత్ గానీ తప్పు నిర్ణయం తీసుకుంటే.. పనిష్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉంటానని శోభాశెట్టి చెప్పింది. దీంతో శివాజీ అతి చేశాడు. నువ్వు సంచాలక్గా ఉన్న ప్రతిసారీ 90 శాతం వాదనలు, గొడవలు, డిస్కషన్, మనస్పర్థలు జరిగాయి కాబట్టే నేను చెబుతున్నానని శివాజీ అన్నాడు. మూడుసార్లు సంచాలక్గా ఇబ్బందిపడ్డావ్ శోభా, ఇది నిజం, అందుకే నేను నిన్ను అలెర్ట్ చేశానని శివాజీ నీతికబర్లు చెప్పాడు. ఇక్కడంతా గమనిస్తే శోభాదే తప్పు అని తను అనుకునేలా శివాజీ బ్లాక్మెయిల్ చేశాడనిపించింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?) ప్లేటు తిప్పేసిన శివాజీ ఇక యావర్ ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు. దీంతో దాన్ని నచ్చినప్పుడు ఉపయోగించుకోవచ్చని బిగ్బాస్ క్లారిటీ ఇచ్చేశాడు. అయితే శోభాతో అంతా గొడవపడ్డ శివాజీ.. మళ్లీ ప్లేట్ తిప్పేశాడు. నేను గెలవలేదని ఫైట్ చేశానని అనుకున్నారా మీరేమైనా అని శోభానే శివాజీ నైస్గా అడిగాడు. అరిచినప్పుడేమో అరిచేసి, ఇప్పుడేమో నంగనాచిలా మాటలు చెప్పి శోభాని ఏమార్చడానికి శివాజీ ట్రై చేశాడు. నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలని నేను ఫైట్ చేశానని నీతికబుర్లు చెప్పాడు. దీంతో నా అనుకున్న ఫ్రెండ్స్ అందరూ బాల్కానీలో తనని వదిలేసి మీటింగ్ పెట్టిరని, తాను అందరికీ శత్రువు అయిపోయానని శోభా తెగ బాధపడిపోయింది. ప్రియాంక నువ్వు సూపర్ ఎవిక్షన్ పాస్ తంతు పూర్తయిన తర్వాత కొత్త కెప్టెన్ కోసం రెండు లెవల్స్లో టాస్కులు జరుగుతాయని బిగ్ బాస్ చెప్పుకొచ్చాడు. ఇందులో అందరూ పోటీదారులే అని అన్నాడు. తొలుత ఇటుకులు తెచ్చే టాస్క్ పెట్టగా అందరూ చాలా పోటీపోటీగా గేమ్ ఆడారు. కాకపోతే ప్రతి దశలోనూ తక్కువ ఇటుకులు తెచ్చిన కారణంగా రతిక, గౌతమ్, అశ్విని, శోభాశెట్టి వరసగా ఎలిమినేట్ అయ్యారు. వీళ్లందరూ గేమ్ ఎలా ఆడాలో తెలియక, కిందపడిపోయి, అరుస్తూ ఆటపై సరిగా కాన్సట్రేషన్ చేయలేకపోయారు. అమ్మాయిల్లో ప్రియాంక ఒక్కతే సైలెంట్ గా తనపని తాను చేసుకుని నెక్స్ట్ రౌండ్కి అర్హత సాధించింది. ఈమెతో పాటు అమర్, ప్రశాంత్, అర్జున్.. ఫైనల్ టాప్-4కి క్వాలిఫై అయ్యారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు) అమర్ పిచ్చిపట్టినట్లు ప్రవర్తన ఈ గేమ్ లో భాగంగా నలుగురు పోటీదారులు ఇటుకులతో టవర్ కట్టాలి. బజర్ మోగిన తర్వాత మిగిలిన వాళ్లు వాటిని పడగొట్టడానికి ట్రై చేయాలి. ఇందులో ప్రశాంత్, అర్జున్ వరసగా ఔట్ అయిపోయారు. చివరకు అమర్, ప్రియాంక మిగలగా.. అమ్మాయి అయిన ప్రియాంక చాలా చక్కగా అస్సలు సౌండ్ చేయకుండా గేమ్ ఫినిష్ చేసింది. అమర్ మాత్రం కెప్టెన్సీ కోసం రెచ్చిపోయాడు. అరుస్తూ, ఏడుస్తూ, భయపెడుతూ స్ట్రాటజీలన్నీ ఉపయోగించాడు కానీ వర్కౌట్ కాలేదు. ప్రియాంక గెలిచింది. దీంతో కిందపడి కొట్టేసుకున్నాడు. అయితే అది కోపంతో వచ్చిన బాధే కానీ ఎవరిపై కోపం ఏం లేదని అమర్ సంజాయిషీ ఇచ్చుకున్నాడు. ప్రియాంక-అమర్ మనస్పర్థలు అయితే తాను కెప్టెన్ అయినట్లు కలగన్నాను కానీ తాను ఏది అనుకుంటే అది జరగదని అమర్దీప్ తెగ బాధపడిపోయాడు. అమర్ దగ్గరకొచ్చిన ప్రియాంక.. నువ్వు గెలిస్తే నేను అంతే సంతోషపడుతున్నాను, కానీ నీ దగ్గర నుంచి మాత్రం అలాంటి రెస్పాన్ రావట్లేదని అమరదీప్తో ఖరాఖండీగా చెప్పేసింది. దీంతో ఫ్రెండ్స్ ఇద్దరి మధ్య మనస్పర్థలు బయటపడ్డాయి. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియాంక దగ్గర నుంచి అమర్ ఎలా ఆడాలో తెలుసుకోవాలి. కానీ మనోడు అది చేయకుండా ఏడుస్తూ కనిపించాడు. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి సైడ్-బి' సినిమా రివ్యూ)