Bigg Boss 7
-
పెళ్లి చేసుకున్న బిగ్బాస్ 7 కంటెస్టెంట్
గతేడాది బిగ్బాస్ 7 తమిళ సీజన్లో పాల్గొన్న ప్రదీప్ ఆంటోని వివాదానికి కారణమయ్యాడు. తనతో పాటు హౌసులోకి వచ్చిన లేడీ కంటెస్టెంట్తో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో రెడ్ కార్డ్ జారీ చేసి, షో నుంచి అర్థాంతరంగా బయటకు పంపేశారు. ఈ సీజన్లో తిరిగి పాల్గొంటాడని అన్నారు. కానీ అది రూమర్ అని తేలిపోయింది. ఇప్పుడు ఇతడు పెళ్లి చేసుకున్నాడు.(ఇదీ చదవండి:'పుష్ప 2' కోసం తమన్.. 'కాంతార' మ్యూజిక్ డైరెక్టర్ కూడా)గత కొన్నాళ్లుగా పూజ అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న ప్రదీప్ ఆంటోని.. జూన్లో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇప్పుడు గురువారం (నవంబర్ 7) క్రిస్టియన్ పద్ధతిలో పూజని పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోల్ని తోటి బిగ్బాస్ కంటెస్టెంట్ సురేశ్ చక్రవర్తి పోస్ట్ చేశాడు. కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పుకొచ్చాడు. డాడా, అరువి, వాళ్ తదితర సినిమాలు చేసిన ప్రదీప్ ఆంటోని.. ఇప్పుడిప్పుడే నటుడిగా నిలదొక్కుకుంటున్నాడు.ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బిగ్ బాస్ 8వ సీజన్ నడుస్తోంది. తెలుగులో ఎప్పటిలానే నాగార్జున హోస్టింగ్ చేస్తుండగా.. తమిళంలో మాత్రం ఈసారి కమల్ హాసన్ తప్పుకొన్నాడు. దీంతో విజయ్ సేతుపతి కొత్త హోస్ట్గా వచ్చాడు. దాదాపు 70 రోజులు అయిపోయినా సరే తెలుగు సీజన్ అంతంత మాత్రంగానే సాగుతోంది. తమిళంలో పర్లేదనిపించేలా నడుస్తోంది.(ఇదీ చదవండి: హైదరాబాద్లోని హనుమాన్ గుడిలో జాన్వీ ప్రత్యేక పూజలు) -
టీవీ షోలో కుమారి ఆంటీ.. 'బిగ్బాస్ 7' బ్యాచ్తో కలిసి స్కిట్!
'మీది మొత్తం థౌజండ్ అయింది రెండు లివర్లు ఎక్స్ ట్రా'.. ఈ డైలాగ్ చెప్పగానే ఈపాటికే మేటర్ అర్థమైపోయింటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సోషల మీడియాలో తెగ పాపులర్ అయిపోతున్న కుమారి ఆంటీదే ఈ డైలాగ్. హైదరాబాద్లోని రోడ్డు సైడ్ మధ్యాహ్న భోజనం అమ్మే ఈవిడ.. ఫుడ్ వ్లాగర్స్ వల్ల చిన్న సైజు సెలబ్రిటీ అయిపోయింది. ఆల్రెడీ ఈమెని పలువురు ఇంటర్వ్యూ చేయగా.. ఇప్పుడు ఏకంగా ఓ టీవీ షోలో కూడా కనిపించింది. (ఇదీ చదవండి: మాజీ భర్త గురించి ప్రశ్న.. క్లారిటీ ఇచ్చేసిన స్టార్ హీరోయిన్) గత కొన్నాళ్ల నుంచి హైదరాబాద్లోని మాదాపూర్లో నాన్ వెజ్ మీల్స్ విక్రయించే ఈమె.. అనుకోకుండా ఫేమస్ అయిపోయింది. దీంతో ఈమె షాప్ దగ్గరకు జనాలు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ అవుతుందని చెప్పి షాప్ మూసివేయడం.. ఈ గొడవపై ఏకంగా తెలంగాణ సీఎంఓ ఆఫీస్ నుంచి స్పందించడం. ఇప్పుడు యధావిధిగా మళ్లీ ఈమె బిజినెస్ రన్ అవుతుండటం.. ఇలా గత కొన్నాళ్ల నుంచి కుమారి ఆంటీ వార్తల్లో నిలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఈమె ఫేమస్ అయినప్పుడే ఇంకెందుకు లేటు.. టీవీ షోల్లో కూడా కనిపిస్తుందని ఊహించారు. ఇప్పుడు అదే జరిగింది. 'బిగ్బాస్ 7' కంటెస్టెంట్స్ అందరూ కలిసి తాజాగా ఓ షోలో పాల్గొన్నారు. ఇందులో కుమారి ఆంటీ కూడా పాల్గొంది. స్టేజీపైనే అందరికీ తన స్టైల్ ఫుడ్ తినిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈమెతో ఓ స్కిట్ కూడా చేయించారని టాక్. (ఇదీ చదవండి: ఇన్నాళ్లకు ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ద కేరళ స్టోరీ'.. రిలీజ్ డేట్ ఫిక్స్) #BBUtsavam షో లో #KumariAunty ! అందరికీ NonVeg భోజనం కూడా... pic.twitter.com/SfmCzFSjOd — Rajesh Manne (@rajeshmanne1) February 6, 2024 -
సైలెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న 'బిగ్బాస్' శోభాశెట్టి
బిగ్బాస్ 7 ఫేమ్ శోభాశెట్టి ఎలాంటి హడావుడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది. సరిగ్గా ఓ రెండు నెలల క్రితం ఇదే షోలో ప్రియుడిని పరిచయం చేసింది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుంది. అలానే త్వరలో పెళ్లి కూడా చేసుకోనుంది. ఇంతకీ ఈ కార్యక్రమం ఎప్పుడు ఎక్కడ జరిగింది? శోభాశెట్టి దీని గురించి ఏం చెప్పిందనేది ఇప్పుడు చూద్దాం. కన్నడ బ్యూటీ శోభాశెట్టి.. 'కార్తీకదీపం' సీరియల్లో మోనిత అనే విలన్ పాత్రతో బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు ప్రతి తెలుగింటిలోనూ ఈమెకు అభిమానులు ఉండొచ్చు. నటిగా అలా అదరగొట్టేసింది. ఇక గతేడాది జరిగిన బిగ్బాస్ 7వ సీజన్లో పాల్గొని దాదాపు చివరివరకు వచ్చేసింది. శివాజీ అండ్ గ్యాంగ్కి తన మాటలతో చుక్కలు చూపించింది. చాలామంది ఈమెని విమర్శించారు కానీ శివాజీ లాంటి వాళ్లతో పోలిస్తే శోభా చాలా బాగా ఆడిందని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7 విన్నర్ ప్రశాంత్ అరెస్ట్పై స్కిట్.. ముఖం మాడ్చుకున్న శివాజీ!) ఇకపోతే ఇదే షోలో తన ప్రియుడు యశ్వంత్ రెడ్డిని పరిచయం చేసింది. శోభా-యశ్వంత్.. ఇదే 'కార్తీకదీపం' సీరియల్లో కలిసి నటించారు. షార్ట్ ఫిల్మ్స్లోనూ యాక్ట్ చేశారు. అలా పనిచేస్తూ ప్రేమలో పడ్డారు. అయితే గతేడాది వీళ్ల నిశ్చితార్థం జరగాల్సింది కానీ ఎందుకో క్యాన్సిల్ అయిపోయిందట. ఈ విషయాన్ని స్వయంగా శోభాశెట్టిని ఇప్పుడు బయటపెట్టింది. తాజాగా బెంగళూరులోని శోభాశెట్టి ఇంట్లో నిశ్చితార్థం జరిగింది. యశ్వంత్-శోభా దండలు మార్చుకున్నాడు. అయితే ఇది నిశ్చితార్థ వేడుక అని వీడియోలో శోభాశెట్టి ఎక్కడ చెప్పలేదు. తర్వాత వీడియోలో దీని గురించి చెబుతానని దాటవేసింది. త్వరలో పెళ్లి డేట్ కూడా చెప్పేస్తుందేమో? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) -
నా తల్లి ముందే అలాంటి బూతులు వినాల్సి వచ్చింది: అమర్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 పలు వివాదాలతో ముగిసింది. హౌస్లో అమర్, శోభ,ప్రియాంక (SPY) ఒక బ్యాచ్లో ఉంటే.. శివాజీ, ప్రశాంత్, యావర్ (SPA) బ్యాచ్లో ఉన్నారు. ఈ రెండు బ్యాచ్ల మధ్య పెద్ద గొడవలే జరిగాయి. ఫైనల్గా ప్రశాంత్ విన్నర్ అయితే.. అమర్ దీప్ రన్నర్ అయ్యాడు. కానీ చాలా మంది ప్రేక్షకుల అభిమానాన్ని ఆయన అమర్ పొందాడు. అతను హీరో రవితేజ సినిమాలో ఛాన్స్ వస్తే చాలు అనుకున్నాడు. బిగ్ బాస్ వల్ల ఆ అవకాశం దక్కింది అదే నాకు పెద్ద విజయం అని అమర్ పేర్కొన్నాడు. బిగ్ బాస్ ఫైనల్ రోజున అమర్ కారుపై దాడి జరుగుతున్నప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో ఒక ఇంటర్వ్యూలో అమర్ ఇలా తెలిపాడు. 'హౌస్ నుంచి బయటకు రాగానే మా వాళ్లు అందరూ నన్ను దాక్కో అన్నారు... బయట ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నేను ఎందుకు దాక్కోవాలి..? నేను ఏం తప్పు చేశాను అని కారు ఎక్కి స్టార్ట్ అయ్యాం. కారు బయటకు రాగానే చాలామంది నా కారు చూట్టూ తిరుగుతూ ఫోన్ లైట్ ఆన్ చేశారు. నేను కనిపించగానే ఒక్కసారిగా బూతులు తిట్టడం స్టార్ట్ చేశారు. రాళ్లతో కారు అద్దాలు పగలకొట్టారు.. అమ్మ పక్కన ఉండగానే నోటికి ఏదొస్తే అది అనేశారు. తల్లి పక్కన ఉన్నప్పుడు అలాంటి మాటలు ఏ కుమారుడు వినలేడు.. వారందరి కోపం నామీద కదా అని కారు దిగే ప్రయత్నం చేస్తే అమ్మ ఆపింది. నాలుగు దెబ్బలు తిన్నా పర్వాలేదు కానీ ఆ తిట్లు భరించలేకపోయాను. కొందరైతే నా భార్య తేజును తీసుకెళ్తాం అంటూ బూతులు మాట్లాడారు. ఇవే మాటలు మిమ్మల్ని ఎవరైనా అంటే తట్టుకోగలరా..? ఓర్చోకోగలరా..? వారందరి మీదా నేనూ రియాక్ట్ కాగలను, కేసులు పెట్టగలను కానీ వారికీ కుటుంబాలు ఉంటాయని ఆలోచించి వద్దనుకున్నాను. నేను మీకు ఏం పాపం చేశాను..? అదొక గేమ్ మాత్రమే.. హౌస్లో కొందరు నన్ను పదేపదే తిట్టినా పెద్దవారు కదా అని ఓర్చుకున్నాను.. వారి వద్ద నేను నిజాయితీగానే మాట్లాడాను.. బ్యాక్ బిచింగ్ చేయలేదు. అని అమర్ తెలిపాడు. అందరిలా తను కూడా సామాన్య కుటుంబం నుంచి వచ్చానని అమర్ పేర్కొన్నాడు. తన నాన్నగారు ఆర్టీసీ ఉద్యోగి అని.. అందులో ఒక మెకానిక్గా పనిచేస్తాడని అమర్ తెలిపాడు. సినిమా అంటే అభిమానంతో ఈ పరిశ్రమలోకి వచ్చి నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు. తన అమ్మగారు అనంతపురం జిల్లాలో బీజేపీ మహిళా విభాగం 'మహిళా మోర్చా' లో కార్యకర్తగా పనిచేస్తున్నారని ఆయన చెప్పాడు. -
పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడంటే.. బిగ్ బాస్ 'అశ్విని' కామెంట్స్
బిగ్ బాస్ తెలుగు సీజన్-7లో వైల్డ్ కార్డ్తో ఎంట్రీ ఇచ్చిన అశ్విని శ్రీ మంచి పాపులారిటీని తెచ్చుకుంది. 5వ వారంలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన గ్లామర్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్ బాస్లో టాస్క్ల పరంగా పెద్దగా మెప్పించకపోయిన తన అందాలతో ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది. హౌస్లో భోలే షావళితో మంచి పెయిర్గా తన ఆటను కొనసాగించిన ఈ బ్యూటీ 12వ వారంలో ఎలిమినేట్ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్విని హీరో పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. తాను గబ్బర్ సింగ్లో నటించిన సమయంలో పవన్తో తనుకున్న పరిచియాన్ని తెలిపింది. ఈ సినిమాలో శ్రుతిహాసన్ ఫ్రెండ్గా నటించిన అశ్విని మంచి గుర్తింపు తెచ్చుకుంది. పవన్ OG సినిమా హిట్ కావాలని ఆమె కోరుకుంది. పవన్ కల్యాణ్ ఎప్పుడూ నా వాడే.. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పింది. పవన్ కల్యాణ్ను మళ్లీ కలిసే అవకాశం వస్తే మీ రియాక్షన్ ఏంటని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చింది. ' పవన్తో దాదాపు 3 నెలలు జర్నీ చేశాను. షూటింగ్ సమయంలో పక్కన కూర్చొపెట్టుకుని పవన్ సార్ మాట్లాడేవారు. సెట్స్లో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ తింటున్న డ్రై ఫ్రూట్స్ కూడా తినమ్మా అంటూ నాకు ఇచ్చేవారు. అశ్విని కమాన్ అని ఎంకరేజ్ చేసేవారు. ఆయనకి ఎప్పుడైనా బోర్ కొడితే నన్నే పిలిచేవారు.. ఆపై మాతో పాటలు, డ్యాన్స్ చేపిస్తూ సరదాగా ఉంటారు. అందుకే పవన్ అంటే ఇష్టం. ఆయన నేను క్యారివాన్లో ఉండేవాళ్లం. షూటింగ్కి రోజులో ఒక్కోసారి మాత్రమే పిలిచేవారు. మిగిలిన టైం అంతా క్యారివాన్లోనే ఉండేదాన్ని. ఆయనపై ఉన్న ఇష్టం మాటల్లో చెప్పలేను. సంథింగ్ ఆయనలో ఏదో ఉంటుంది. గబ్బర్ సింగ్ టైంలో సార్తో షూటింగ్ చేసి ఇంటికెళ్లి పడుకున్న తర్వాత ఆయన నాకు కలలోకి వచ్చేవారు. ఆయనతో షూటింగ్ చేస్తున్నట్టుగానే డ్రీమ్స్ వచ్చేవి. ఆయనతో ఎక్కడికో వెళ్లినట్టుగా పిచ్చి పిచ్చి కలలు వచ్చేవి. సార్ నన్ను మర్చిపోయి ఉంటారు కానీ.. నేను ఎప్పటికీ మర్చిపోలేని అనూభూతులు ఆయనతో ఉన్నాయి.'అని ఆమె చెప్పింది. పవన్పై అశ్విని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో గబ్బర్ సింగ్తో పాటు రాజా ది గ్రేట్ వంటి చిత్రాల్లో నటించినా ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు.. మళ్లీ ఇప్పుడు బిగ్ బాస్ వల్ల మంచి గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) -
నన్ను మోసం చేశారు
-
బిగ్ బాస్ కోసం రూ. 2.50 లక్షలు ఇస్తే మోసం చేశారు: యాంకర్
బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ ముగిసిపోయింది. కానీ ఉల్టాపుల్టా పేరుతో వచ్చిన ఈ సీజన్ ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పించిందో తెలియదు కానీ వివాదాలు మాత్రం భారీగానే ఉన్నాయి. బిగ్ బాస్ పేరుతో మోసం చేశారంటూ టాలీవుడ్ నటి, యాంకర్ స్వప్న చౌదరి ఒక వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 'నమస్తే సేట్ జీ' సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో కి అడుగుపెట్టి అందరి నోట మంచి నటిగా పేరు తెచ్చుకుంది ఖమ్మం జిల్లాకి చెందిన అమ్మినేని స్వప్న చౌదరి. యాంకర్గా, ఈవెంట్ ఆర్గనైజర్గా, అటూ హీరోయిన్గా కొనసాగుతున్న ఈ తెలుగమ్మాయి బిగ్ బాస్కు వెళ్లాలని చాలారోజుల నుంచి కోరిక ఉంది. ఇదే విషయాన్ని గతంలో కూడా చెప్పుకొచ్చింది. దీనినే కొందరు అదునుగా చూసుకొని ఆమె నుంచి రూ. 2.50 లక్షలు తీసుకుని మోసం చేశారు. ఇదే విషయాన్ని ఆమె వీడియో ద్వారా తెలిపింది. 'నాకు బిగ్ బాస్కి వెళ్లడం అంటే చాలా ఇష్టం.. ఎంతలా అంటే నేను నిద్రపోతున్న సమయంలో కూడా బిగ్ బాస్లో ఉన్నట్లు ఊహించుకుంటాను. బిగ్ బాస్ సీజన్ -1 నుంచి అన్నీ సీజన్లు ఎంతో ఇష్టంగా చూశాను. బిగ్ బాస్ సీజన్-7 సమయంలో నన్ను కంటెస్టెంట్గా పంపిస్తానని చెప్పి తమ్మలి రాజు అనే వ్యక్తి నా దగ్గర రూ. 2.50 లక్షలు తీసుకున్నాడు. ఈ డబ్బుతో ప్రతి శనివారం వచ్చే ఎపిసోడ్ సమయంలో నాకు కాస్ట్యూమ్స్ పంపిస్తానన్నాడు. అతని మాటలు నమ్మి నేను గతేడాది జూన్లో డబ్బు ఇచ్చాను. ఆ డబ్బే కాకుండా ఫోటో షూట్ కోసం రూ. 25వేలు తీసుకున్నాడు. చివరి క్షణం వరకు పంపిస్తానని చెప్పి..చేతులెత్తేశాడు. ఆ సమయంలో నాకొక అగ్రిమెంట్ రాసిచ్చాడు. బిగ్ బాస్కు పంపించలేకపోతే డిసెంబర్ నెలలో డబ్బు తిరిగిచ్చేస్తానని చెప్పాడు. కాల్ చేస్తే సరిగ్గా రెస్పాండ్ కాలేదు.. జనవరిలో తప్పకుండా ఇస్తానన్నాడు.. తీరా ఇప్పుడు కాల్ చేస్తే నీకు నచ్చింది చేసుకో.. కావాలంటే పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసుకో అని వార్నింగ్ ఇస్తున్నాడు. నేను ఎంతో కష్టపడి ఆ డబ్బు సంపాదించుకున్నాను. బిగ్ బాస్లోకి వెళ్దామనే నా ఆశను తుంచేశాడు. ఇలాంటి వాళ్లను నమ్మి టీమ్గా పెట్టుకోకండి. వచ్చే సీజన్లో అయిన నాకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను. అని స్వప్న తెలిపింది. View this post on Instagram A post shared by 𝐀𝐧𝐜𝐡𝐨𝐫 𝐒𝐰𝐚𝐩𝐧𝐚 𝐜𝐡𝐨𝐰𝐝𝐚𝐫𝐲 (@its_me_swapna_chowdary) -
పల్లవి ప్రశాంత్ అరెస్ట్పై మొదటిసారి రియాక్ట్ అయిన అమర్ దీప్
బిగ్బాస్ సీజన్ 7 టైటిల్ను రైతుబిడ్డ అనే ట్యాగ్లైన్తో ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ గెలుచుకుంటే రన్నర్గా బుల్లితెర నటుడు అమర్ దీప్ ఉన్నాడు. బిగ్ బాస్లో ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. కానీ వారిద్దరూ మళ్లీ ఒకటిగా సొంత బ్రదర్స్ మాదిరి కలిసిపోయే వారు. అయితే బిగ్బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ను ప్రకటించిన తర్వాత అమర్, ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త అమర్దీప్ కారుపై దాడి చేసే వరకు వెళ్లింది. ఆ సమయంలో కారులో తన కుటుంబ సభ్యులతో కలిసి అమర్ ఉన్నాడు. అంతేకాకుండా అశ్విని, గీతూ రాయల్ కారుతో పాటు ఆరు ఆర్టీసీ బస్సులను కూడా కొందరు దుండగులు ధ్వంసం చేశారు. పోలీసుల సూచనలు పాటించకుండా పల్లవి ప్రశాంత్ ర్యాలీ చేయడం వల్లే ఈ గొడవకు కారణమని పోలీసులు అయన్ను అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు కూడా పంపించారు. ఆపై ప్రశాంత్ బెయిల్ మీద విడుదలయ్యాడు. తాజాగా అమర్ మొదటిసారి బిగ్ బాస్ గురించి రియాక్ట్ అయ్యాడు. 'హౌస్ నుంచి నేను బయటకు రాగానే ఏం జరుగుతుందో అనేది నాకేం అర్థం కాలేదు. అప్పుడు నా మైండ్ బ్లాంక్గా ఉంది. అక్కడితోనే ఆ గొడవ ముగిసిపోయింది. బిగ్ బాస్ వల్ల నాకు చాలా మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా అభిమానుల ప్రేమ దొరికింది. అన్నింటికి మించి నా అన్న రవితేజ సినిమాలో ఛాన్స్ దక్కింది. బిగ్ బాస్ విన్నర్ కంటే నాకు రవితేజ సినిమా అవకాశం దక్కడమే గొప్ప విజయం. ఈ షో ద్వారా నాకు కావాల్సిన ఆదరణ దక్కింది. ఇప్పుడు ఎక్కడికెళ్లినా నన్ను గుర్తిస్తారు.. ఇవన్నీ కూడా బిగ్ బాస్ ద్వారా వచ్చిన అచీవ్మెంట్స్ అని నేను భావిస్తాను. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అనేది మిస్ అండర్స్టాండింగ్ వల్లే జరిగింది. ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు. కంటెస్టెంట్ల మధ్య ఎలాంటి గొడవలు ఉండవు.. కానీ కొందరు ఫ్యాన్స్ చేస్తున్న పనుల వల్లే ఇలాంటి ఇబ్బందులు ఎదరైతాయి. ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉండటం సహజమే.. ఇదీ ఎప్పుడూ ఉండేదే.. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు నా అభిమాన హీరోను ఎవరైనా ఒక మాట అంటే గొడవపడే వాళ్లం... కొంత ఆలోచన శక్తి వచ్చాక అవన్నీ వదిలేసి అందరం కలిసి ప్రతి హీరో సినిమా చూసేవాళ్లం.. ఒకరి కోసం తిట్టుకోవడం, గొడవ పడటం లేకుండా అందరూ కలిసి ఆనందంగా ఉండండి.' అని అమర్ అన్నాడు. -
అమర్ రన్నర్ కావడంతో నాగార్జునకు చెడ్డపేరు: శివాజీ
బిగ్ బాస్ తెలుగు సీజన్ -7లో మూడో స్థానంతో సరిపెట్టుకున్న అక్కసు శివాజీలో కనిపిస్తుంది. అందుకే ఆయన పలు ఇంటర్వ్యూలలో ఇప్పటికీ కూడా అమర్, శోభా పట్ల పలు చిల్లర వ్యాఖ్యలతో పాటు పరుష పదజాలం ఉపయోగిస్తూ మాట్లాడుతున్నాడు. చివరకు అమర్ రన్నర్ ఎలా అయ్యాడో అంటూ చెప్పుకొస్తున్నాడు. బిగ్ బాస్లో శివాజీని అన్నిరోజులు ఉంచడమే గొప్ప విషయం అనుకుంటుంటే.. తనను తాను ఎదో గొప్ప అనుకునే భ్రమలో ఇప్పటికీ ఆయన ఉన్నాడు. శివాజీ వల్లే ఈ సీజన్లో ఇంత రచ్చ అయిందని చెప్పేవారు ఎందరో ఉన్నారు. అనవసరంగా తనను ఈ సీజన్లోకి తీసుకున్నారని కూడా పలువురు కామెంట్లు కూడా చేశారు. హౌస్లో ఎప్పుడూ కూడా తాను పోతా పోతా అంటాడు, ఆటలు ఆడడు, బెడ్డు వదలడు, పైగా చెయ్యి నొప్పి, మాట్లాడితే వెటకారాలు, నీతిబోధలు. బిగ్ బాస్లో ఆయన చేసింది ఇదే కదా.. మరోకటి ఏమైనా ఉంటే చెప్పండి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు కూడా. గట్టు పంచాయితీలు తీర్చే ఈ పెద్దకు ఇద్దరు పాలేర్లు. వారిద్దరినీ తన చుట్టూ తిప్పుకోవడం.. బిగ్ బాస్లో శివాజీ చేసింది ఏమిటి..? నచ్చని వారిపై దుమ్మెత్తిపోయడం.. ఇప్పడు బిగ్ బాస్ బయట కూడా అదే చేస్తున్నాడు. శోభా శెట్టి గొడవతో తనను నెగిటివ్గా చూపించే ప్రయత్నం బిగ్ బాస్ చేశారని తాజాగా శివాజీ సంచలన ఆరోపణ చేశాడు. శోభా శెట్టి పరాకాష్టకు వెళ్లింది. అందుకే మా ఇంట్లో ఆడపిల్లలు అయితే.. అంటూ కోపంగా ప్రవర్తించానని అంటూ శివాజీ ఇలా చెప్పాడు. 'గేమ్ ఒక దశకు వచ్చాక విన్నర్ ఎవరు..? ఎవరెవరికి ఏ స్థానాలు దక్కుతాయో కూడా అంచనా వేశాను. 1, 2, 3 స్థానాల్లో మనం ముగ్గురం ఉండబోతున్నామని ప్రశాంత్ చేతిలో రాశాను. అయితే ఊహించని విధంగా ఒక వ్యక్తిని బిగ్ బాస్ కావాలనే హైలైట్ చేస్తూ వచ్చాడు. బిగ్ బాస్ కూడా అతడిని పొగడడం నాకు నచ్చలేదు. అతను (అమర్) చపాతి చేస్తే బాగుంది నాకు కూడా పంపించు అని బిగ్ బాస్ అంటాడు... నేను ఎంతో కష్టపడి వడలు చేపిస్తే కనీసం ఒక మాట కూడా నాకు దక్కలేదు. పలుసార్లు పౌల్ గేమ్ ఆడిన వ్యక్తిని చివరకు రన్నరప్ను చేశారు. ఇలాంటి తప్పిదాల వల్ల నాగార్జున గారికి చెడ్డ పేరు వస్తుంది. ఇదే విషయం నాగ్ సారుకు కూడా త్వరలో చెబుతాను. న్యాయంగా అయితే టాప్ 3లో ప్రశాంత్, నేను, యావర్ ఉండేవాళ్లం.' అని శివాజీ అన్నారు. -
బిగ్ బాస్ అమర్పై శివాజీ చెత్త వ్యాఖ్యలు.. ఇవి దేనికి సంకేతం..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ -7 ముగిసిపోయి చాలా రోజులే అయింది. విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ ఆపై బెయిల్ మీద విడుదల ఇలా పలురకాల వివాదాలతో ఇప్పటికీ అప్పుడప్పుడు ఈ సీజన్ గురించి వార్తలు వస్తునే ఉన్నాయి. ఈ సీజన్లో రన్నర్గా ఆమర్ దీప్ ఉంటే టాప్-3లో శివాజీ ఉన్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన బిగ్ బాస్ గురించి పలు వ్యాఖ్యలు చేశాడు. బిగ్ బాస్ జర్నీలో బాగా ఇబ్బంది పడిన సందర్భం ఎంటి..? అని శివాజీకి ప్రశ్న ఎదురైంది. హౌస్లో మాదిరే ఇంటర్వ్యూలో కూడా అమర్ పట్ల ఉన్న కోపాన్ని తన వ్యాఖ్యలతో శివాజీ ఇలా చెప్పాడు. 'ప్రశాంత్, యావర్ విషయంలో నేను స్టాండ్ తీసుకున్న సందర్భాల్లో చాలా సార్లు ఇబ్బంది పడ్డాను. ప్రశాంత్ కెప్టెన్ బ్యాడ్జ్ లాక్కున్నారు. అతను సరిగ్గా హౌస్ను హ్యాండిల్ చేయలేకున్నాడు అని అందరూ ఓట్లు వేయడంతో అతని బ్యాడ్జ్ను బిగ్ బాస్ తీసుకున్నాడు. ఒక కామన్ మ్యాన్ కెప్టెన్ అయితే సెలబ్రిటీలకు నచ్చట్లేదా అని కోపం వచ్చింది. హౌస్లో కొందరు యావర్తో గొడవలు పెట్టుకున్నప్పుడు కోపం వచ్చింది. ఫైనల్గా నేను ఒకరిని కొట్టేద్దామని అనుకున్న సందర్భం కూడా వచ్చింది. మూడు వారాలుగా బిగ్ బాస్లో ప్రశాంత్ను మానశికంగా కొందరు టార్చర్ చేశారు. ఆ సమయంలో ప్రశాంత్ను అమర్ రెచ్చగొడుతున్నాడు. నేను పక్కనే ఉన్నాను.. నేను వాడి పక్కన ఉంటే ఎవరినీ లెక్క చేయడు. 14 వారంలో అమర్, ప్రశాంత్ మధ్య భారీగా గొడవ జరుగుతుంది. ఆ సందర్భంలో ఆమర్ను నాలుగు పీకి వెళ్లిపోదాం అనిపించింది. ప్రశాంత్ భుజం మీద చెయి వేసి అమర్ తోసుకుంటూ వెళ్తున్నప్పుడు నాలో కోపం కట్టలు తెంచ్చుకుంది. గేమ్కు బౌండ్ అయి అగ్రిమెంట్లో సంతకం చేశాను కాబట్టి అమర్ను ఏం చేయలేకపోయాను. ఆ సమయంలో నా రక్తం మరిగిపోయింది.' అంటూ అమర్పై మరోసారి ఇంటర్వ్యూలో శివాజీ రెచ్చిపోయాడు. బిగ్ బాస్ అనేది ఒక గేమ్.. ఒక్కొసారి మాటల వల్ల అదుపు తప్పుతుంటారు. అది సహజం అని అందరికీ తెలుసు.. ఆ తర్వాత మళ్లీ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అదీ హౌస్ వరకే పరిమితం. అయినా ప్రశాంత్, అమర్ ఇద్దరూ ఎన్ని గొడవలు పడినా మళ్లీ బ్రదర్స్ మాదిరి ఒకటిగా ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ -7 ముగిసి పోయిన చాప్టర్.. బయటకు వచ్చాక కూడా ఇలా ఒకరిపై విషం చిమ్మడం ఎందుకు శివాజీ.. ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేసి ఏం చెప్పదలుచుకుంటున్నారు. అయినా ప్రశాంత్ కెప్టెన్సీ నచ్చలేదని మీరు కూడా చెప్పారు కదా.. అప్పుడే మరిచిపోతే ఎలా శివాజీ.. అమర్ను నువ్వు రెచ్చగొట్టలేదా మానసిక వేదనకు గురి చేయలేదా అంటూ శివాజీపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. హౌస్లో ఇలాంటి మాటలు మాట్లాడే బయట జనాన్ని రెచ్చగొట్టి అమర మీద దాడి చేయించావు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అమర్ ఇంటికి వెళ్లి దాడి చేయండి అని ఇలా పరోక్షంగా మళ్లీ రెచ్చగొడుతున్నావా అంటూ శివాజీపై విరుచుకుపడుతున్నారు. అమర్పై చేసిన వ్యాఖ్యల వీడియో కింద ఎక్కువ మంది శివాజీని ఏకిపారేసిన కామెంట్లే కనిపిస్తున్నాయి. -
Ashwini Sree: అందంతో ఊరిస్తున్న బ్యూటీ క్వీన్ (ఫోటోలు)
-
'బిగ్బాస్ 7'లో ఓడిపోతేనేం.. ఇప్పుడు శోభాశెట్టికి ఆ అవార్డ్
ఈసారి బిగ్బాస్ సీజన్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మరీ ముఖ్యంగా ఇందులో పాల్గొన్న సీరియల్ నటి శోభాశెట్టి ఇంకా గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఆట కంటే గొడవలతో చాలా ఫేమ్ తెచ్చుకుంది. అదే టైంలో విపరీతమైన ట్రోలింగ్ కూడా ఫేస్ చేసింది. బిగ్బాస్ ట్రోఫీ కచ్చితంగా గెలిచి తీరుతానని చెప్పిన శోభా.. 14వ వారం ఎలిమినేట్ అయి ఆ కల నెరవేర్చుకోలేకపోయింది. అయితేనేం ఇప్పుడో అవార్డ్ గెలుచుకుని మళ్లీ వార్తల్లో నిలిచింది. (ఇదీ చదవండి: డార్లింగ్ ప్రభాస్ ఒక్క రోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా?) శోభాశెట్టి అంటే బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. 'కార్తీకదీపం' మోనిత అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సీరియల్లో లేడీ విలన్గా చేసి చాలా పేరు తెచ్చుకుంది. అలా ఈసారి బిగ్బాస్ షోలో అడుగుపెట్టింది. కానీ ఆట, గెలుపు కంటే గొడవలు పెట్టుకోవడంతోనే ఈమె బాగా ఫేమస్ అయింది. ఒకానొక టైంలో ఈమెని ఎలిమినేట్ చేయకుండా ఇంకా ఉంచుతున్నారేంట్రా బాబు అని చాలామంది అనుకున్నారు. కానీ ఇలాంటి క్యారెక్టర్ షోలో లేకపోతే పెద్దగా మజా ఉండదు. సోఫాజీ అలియాస్ శివాజీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చే విషయంలో ఎక్కడా తగ్గని శోభా.. దాదాపు చివరి వరకు వచ్చేసింది. ఫినాలేకి వారం ఉందనగా ఎలిమినేట్ అయిపోయింది. తాజాగా ఈమెకు ఉత్తమ ప్రతినాయకగా రాష్ట్రీయ గౌరవ్ అవార్డ్ వచ్చింది. ఈ విషయాన్ని శోభానే స్వయంగా తన ఇన్ స్టాలో ఫొటోలతో సహా పోస్ట్ చేసింది. ప్రస్తుతానికైతే ఈమె కొత్త సీరియల్స్ ఏం చేయట్లేదు. త్వరలో షోల్లో గానీ, సీరియల్స్లో గానీ శోభా మళ్లీ కనిపించే అవకాశముంది. (ఇదీ చదవండి: Bigg Boss Telugu: పల్లవి ప్రశాంత్ వివాదం.. నిర్వాహకులు షాకింగ్ డెసిషన్) View this post on Instagram A post shared by Shobhashetty (@shobhashettyofficial) -
Bigg Boss Telugu: పల్లవి ప్రశాంత్ వివాదం.. నిర్వాహకులు షాకింగ్ డెసిషన్
బిగ్బాస్ షోపై చాలా ఏళ్ల నుంచి వ్యతిరేకత వస్తూనే ఉంది. కానీ ఈసారి అది రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ దెబ్బకు మరింత ముదిరిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫినాలే తర్వాత గొడవ, కార్లు-బస్సుల ధ్వంసం, విజేత అరెస్ట్.. ఇప్పుడు ఏకంగా నిర్వాహకులకు పోలీసులు నోటీసులు జారీ చేసేంతవరకు పరిస్థితి వచ్చింది. దీంతో షో ఆర్గనైజర్.. అనుహ్య నిర్ణయం తీసుకున్నారట. ఇప్పుడు అది అందరినీ షాకయ్యేలా చేస్తోంది. హిందీలో చాన్నాళ్ల నుంచి ఉంది కానీ తెలుగులో మాత్రం గత ఏడేళ్లుగా బిగ్బాస్ ప్రసారమవుతోంది. ఎన్టీఆర్, నాని తొలి రెండు సీజన్లను హోస్ట్ చేయగా.. ఆ తర్వాత మాత్రం నాగార్జునే వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. పలువురు సెలబ్రిటీలని హౌసులో 100 రోజుల పాటు ఉంచి, పలు పోటీలు పెట్టి.. వీటన్నింటిలో గెలిచిన వాడిని విజేతగా ప్రకటించడం ఆనవాయితీ. ఈసారి అలా కామన్మ్యాన్, రైతుబిడ్డ ట్యాగ్తో ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ విజేతగా నిలిచాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే) రైతుబిడ్డ పేరు చెప్పుకొని ప్రశాంత్ ఎలా ఆడాడు? ఏంటనే విషయం పక్కనబెడితే.. ఫినాలే జరుగుతుండగానే అన్నపూర్ణ స్టూడియోస్ బయట ఇతడి ఫ్యాన్స్ చాలామంది గుమిగూడిపోయారు. దీంతో ర్యాలీ లాంటివి ఏం వద్దని ముందే పోలీసులు, ప్రశాంత్ని హెచ్చరించారు. దీన్ని లెక్కచేయకుండా అభిమానుల దగ్గరకు ప్రశాంత్ వచ్చాడు. దీంతో పలువురు కంటెస్టెంట్స్ కార్లు, పోలీసు వాహనాలు, ఆర్టీసీ బస్సు అద్దాల్ని.. వీళ్లు ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్ని అరెస్ట్ చేసి చంచల్ గుడ జైల్లో పెట్టారు. ఈ మధ్య బెయిల్ మీద కూడా విడుదలయ్యాడు. తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు.. షో నిర్వాహకులకు నోటీసులు కూడా పంపారు. అయితే ఈ తలనొప్పులకు తట్టుకోలేకపోతున్న ఆర్గనైజర్స్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారట. ఇకపై రాబోయే సీజన్స్లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరైనా సరే ర్యాలీలు లాంటివి చేయకూడదట. దీన్నే అగ్రిమెంట్లోనూ పొందుపరచనున్నారట. మరి ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా రైతుబిడ్డ దెబ్బకు 'బిగ్బాస్' తలకు బొప్పి కట్టింది! (ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న 'బిగ్బాస్' మానస్.. రేటు ఎంతో తెలుసా?) -
Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!?
'బిగ్బాస్ 7' ఫేమ్ పల్లవి ప్రశాంత్.. షోలో గెలిచిన తర్వాత చాలా హడావుడి చేశాడు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. తాజాగా బెయిల్పై బయటకొచ్చాడు. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి వెళ్లాలని కండీషన్ పెట్టిన పోలీసులు.. కొన్నాళ్లకు ఇంటర్వ్యూలు లాంటివి ఏం ఇవ్వకూడదని కూడా చెప్పారు. ఇదంతా పక్కనబెడితే ఈ రైతుబిడ్డ.. కొందరిపై రివేంజ్ తీర్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్) రైతుబిడ్డ అనే ట్యాగ్తో 'బిగ్బాస్ 7' షోలో పాల్గొన్న పల్లవి ప్రశాంత్.. ఎలాగైతేనేం విజయం సాధించాడు. అయితే డిసెంబరు 17న ఫినాలే అయిపోయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట ఇతడి ఫ్యాన్స్ చాలామంది వచ్చి చేరారు. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు.. ప్రశాంత్ని వేరే రూట్ నుంచి వెళ్లిపోమని చెప్పారు. కానీ మనోడు పోలీసులు మాట కూడా లెక్క చేయకుండా.. తిరిగి అక్కడికి వచ్చాడు. దీంతో ఇతడి అభిమానులు రెచ్చిపోయారు. పలువురి కంటెస్టెంట్స్ కార్లతో పాటు ఆర్టీసీ బస్సులు, పోలీసు వాహనాలు కూడా ధ్వంసం చేశారు. దీన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు.. ప్రశాంత్ని అతడి ఊరికెళ్లి మరీ అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజుల విధించగా.. చంచల్ గూడా జైల్లో పెట్టారు. నాలుగు రోజుల తర్వాత ఇతడికి బెయిల్ రావడంతో తిరిగి ఊరికివెళ్లిపోయాడు. ఇదంతా పక్కనబెడితే.. ఫినాలే అయిపోయిన తర్వాత ప్రశాంత్ ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించగా, తన ఊరికొస్తే ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పినట్లు కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. (ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న స్టార్ హీరో తమ్ముడు.. అమ్మాయి ఎవరంటే?) తీరా సదరు యూట్యూబర్స్.. ప్రశాంత్ ఇంటర్వ్యూ కోసం అతడి ఊరికి వెళ్లగా, చాలాసేపు వెయిట్ చేయించి తమని నిర్ధాక్షిణ్యంగా వెళ్లిపోమన్నాడని కొందరు ఇన్ స్టాలో స్టోరీలు పెట్టారు. అయితే తాను అలసిపోవడం వల్లే ఇంటర్వ్యూలు ఇవ్వలేకపోయినని ప్రశాంత్ తీరిగ్గా వీడియో పోస్ట్ చేశాడు గానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ప్రశాంత్ అసలు రంగు ఏంటో అందరికీ తెలిసిపోయింది. అయితే తన ఇమేజ్ డ్యామేజ్ చేసిన సదరు యూట్యూబర్స్పై ప్రశాంత్ ఇప్పుడు పరువు నష్టం దావా వేయాలని అనుకుంటున్నాడట. ఇందులో ఎంత నిజముందనేది పక్కనబెడితే.. ఇది జరిగే పనేనా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రశాంత్.. ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేసిన కేసులో అరెస్ట్ అయి, బెయిల్పై బయటకొచ్చాడు. ఇలాంటి టైంలో పరువు నష్టం దావా లాంటి కొత్త తలనొప్పులు తెచ్చుకుంటాడా? అనేది చూడాలి. మరి ఈ విషయంలో నెక్స్ట్ ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: ఆ డబ్బులు ఎగ్గొట్టిన తండ్రి.. అసలు విషయం చెప్పిన అల్లు అర్జున్) -
Pallavi Prashanth: చంచల్ గూడ జైలు నుంచి బయటకొచ్చిన రైతుబిడ్డ
బిగ్బాస్ 7 విజేత ప్రశాంత్.. చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. నాంపల్లి కోర్టు ఇతడికి శుక్రవారం బెయిల్ మంజూరు చేయగా.. తాజాగా జైలు నుంచి బయటకొచ్చాడు. ఈ కేసులో భాగంగా ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసుల ముందు హాజరు కావాలని నాంపల్లి కోర్టు.. ప్రశాంత్ని ఆదేశించింది. అసలు ఈ గొడవేంటి? ప్రశాంత్ని ఎందుకు జైల్లో పెట్టారు? (ఇదీ చదవండి: 'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!) తెలంగాణలోని ఓ పల్లెటూరులో వ్యవసాయం చేసుకునే ప్రశాంత్.. తనని తాను రైతుబిడ్డగా చెప్పుకొన్నాడు. అలా ఇన్ స్టాలో వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈసారి బిగ్బాస్ షోలో కామన్మ్యాన్ అనే ట్యాగ్తో ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 105 రోజుల పాటు హౌసులో ఉండి విజేతగా నిలిచాడు. అయితే ఫినాలేలో విజయం సాధించిన తర్వాత షో నిర్వహించిన అన్నపూర్ణ స్టూడియోస్ బయట చాలా గొడవ జరిగింది. అమర్, అశ్విని, గీతూతో పాటు పలువురు కార్లని ప్రశాంత్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. అయితే షోలో విజేతగా నిలిచిన తర్వాత ప్రశాంత్.. ఫ్యాన్స్ని కలిసేందుకు ప్రయత్నించగా తొలుత పోలీసులు వద్దని వారించారు. కానీ పోలీసుల మాటలని లెక్కచేయకుండా, పంపేచేసిన సరే తిరిగి అక్కడికి వచ్చాడు. దీంతో ఇతడి అభిమానులు రెచ్చిపోయారు. వీరంగం సృష్టించాడు. ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యుడిగా ప్రశాంత్ పై సుమోటాగా కేసు నమోదు చేశారు. రీసెంట్గానే ప్రశాంత్తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల పాటు జైల్లో ఉన్న ఇతడు తాజాగా బెయిల్పై బయటకొచ్చాడు. ఇతడిని చూసేందుకు జైలు దగ్గరకు కూడా అభిమానులు చాలామంది వచ్చారు. (ఇదీ చదవండి: 'సలార్' మూవీకి రివ్యూ ఇచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి) -
పేరు మార్చుకున్న 'బిగ్ బాస్' విన్నర్ పల్లవి ప్రశాంత్
బిగ్బాస్ తెలుగు 7వ సీజన్ టైటిల్ విజేత పల్లవి ప్రశాంత్కు ఉపశమనం లభించింది. బిగ్ బాస్ ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు ప్రశాంత్ను ఏ-1గా, అతని సోదరుడు మనోహర్ను ఏ-2గా పేర్కొంటూ కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో ఆయనకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నేడు (డిసెంబర్ 23) చంచల్ గూడ జైలు నుంచి ఆయన విడుదల కావచ్చు. తాజాగా పల్లవి ప్రశాంత్ ఇన్స్టాలో తన పేరు మారింది. అందులో తన పేరు, బయోను మార్పు చేశారు. MALLA OCHINA, SPY Team Winner అని కొత్తగా తన ఇన్స్టాగ్రామ్లో చేర్చుకున్నాడు. ప్రశాంత్ సూచన మేరకు అతని మరో సోదరుడు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. తన విజయంలో SPY బ్యాచ్ పాత్ర ఎంతగానో ఉందని ప్రశాంత్ గుర్తించినట్లు ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ వల్ల ప్రశాంత్ ఇన్స్టాగ్రామ్కు భారీగా ఫాలోవర్లు పెరిగారు. ప్రస్తుతం ప్రశాంత్ను 1 మిలియన్కు పైగానే ఫాలోవర్లు అనుసరిస్తూ ఉండటం విశేషం. ప్రశాంత్కు అండగా నిలబడిన భోలే చంచల్గూడ జైలు నుంచి పల్లవి ప్రశాంత్ నేడు విడుదల కానున్నాడు. ప్రశాంత్ కోసం అండగా భోలే మాత్రమే నిలబడ్డాడు. హౌస్లో కూడా ఆయన ప్రశాంత్ కోసమే బిగ్ బాస్కు వచ్చానని చెప్పాడు. బెయిల్ వచ్చిన సందర్భంగా భోలే మాట్లాడుతూ.. రైతుబిడ్డకి న్యాయం జరిగిందని తెలిపాడు. 15 వేల పూచీకత్తుతో పాటు రెండు షూరిటీల నిబంధనతో బెయిల్ మంజూరు చేయడం జరిగిందని తెలిపాడు. ప్రశాంత్ అరెస్ట్ అయిన 48 గంటల్లోనే బెయిల్ వచ్చేలా చేసిన అడ్వకేట్లకు ధన్యవాదాలు తెలిపాడు. అంతే కాకుండా నిష్పక్షపాతంగా తీర్పు ఇచ్చిన జడ్జీగారికి పాదాభివందనం తెలిపాడు. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) -
బిగ్బాస్ విజేత పల్లవి ప్రశాంత్కు బెయిల్
బిగ్బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్కు ఊరట లభించింది. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసులో ఆయనకు నాంపల్లి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ప్రశాంత్తోపాటు అతని సోదరుడికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఆదివారం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అదే విధంగా రూ. 15 వేల చొప్పున రెండు షూరిటీలు కాగా బిగ్ బాస్ టైటిల్ గెలిచిన పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. షో విన్నర్గా నిలిచిన అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో ఆయన అభిమానులు అత్యుత్సాహంతో కార్లు, బస్సుల అద్దాలు పగులగొట్టారు. దీంతో పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దాడులకు పల్లవి ప్రశాంత్ కారణమని తేల్చారు. ఈ కేసులో ఎ-1గా పల్లవి ప్రశాంత్ను చేర్చగా, ఎ-2గా అతడి సోదరుడు మనోహర్ను, ఎ-3గా అతడి స్నేహితుడు వినయ్ను చేర్చారు. డిసెంబర్ 20న పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడినీ అదుపులోకి తీసుకున్నారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో ప్రశాంత్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. నేడు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. బిగ్బాస్ విన్నర్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. చదవండి: అమర్ కారుపై దాడి.. రియాక్ట్ అయిన ప్రియాంక -
అమర్ కారుపై దాడి.. రియాక్ట్ అయిన ప్రియాంక
బిగ్బాస్ తెలుగు సీజన్- 7 ఫైనల్ తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద పెద్ద దుమారమే రేగింది. ఈ సీజన్లో పల్లవి ప్రశాంత్ విన్నర్ కాగా అమర్ దీప్ రన్నర్ అయ్యాడు. బిగ్ బాస్ ఫైనల్ రోజున హౌస్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆమర్ కారుపై ఒక వర్గం ఫ్యాన్స్ దాడి చేశారు. అశ్విని, గీతూ రాయల్ కారుతో పాటు ఆరు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. తాజాగా ఈ విషయంపై ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రియాంక రియాక్ట్ అయింది. అభిమానులు ఎవరైనా కానీ ఇలా దాడి చేయడం చాలా దారుణమని ఆమె ఇలా తెలిపింది. 'ఫ్యాన్స్ పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడటం చాలా దారుణం. మీకు ఎవరైనా నచ్చకపోతే వారిని వ్యతిరేకించండి.. అందులో తప్పులేదు కానీ ఇలా దాడి చేయడం చాలా హేయం. ఎవరమైనా ఎంతో కష్టపడి ఒక వస్తువును కొంటాము. కానీ ఇలా కొన్ని క్షణాల్లో నాశనం చేయడం కరెక్ట్ కాదు. దాడి సమయంలో కారులోపల మహిళలు ఉన్నారనే ఆలోచన కూడా లేకుంటే ఎలా..? హౌస్లో గేమ్ పరంగా మాత్రమే మాలో గొడవలు ఉన్నాయి. టాస్క్ ముగియగానే పల్లవి ప్రశాంత్,యావర్,శివాజీ,అమర్ ఇలా అందరం చాలా బాగా కలిసే ఉండే వాళ్లం. మాలో ఎలాంటి గొడవలు లేవు.' ముఖ్యంగా చివరి 4 వారాల్లో ప్రశాంత్తో నాకు మంచి బాండింగ్ ఏర్పడింది. వాడు నిజంగానే భూమి బిడ్డ అని ఆమె తెలిపింది. కానీ ఆ ఇంటర్వ్యూ జరిగిన సమయానికి పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కాలేదు.. దీంతో ఆ ఇంటర్వ్యూలో ప్రశాంత్ అరెస్ట్పై ఆమెకు ఎలాంటి ప్రశ్నలు ఎదురు కాలేదు. -
పల్లవి ప్రశాంత్కు 14 రోజుల రిమాండ్.. చంచల్గూడ జైలుకు తరలింపు
బిగ్బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్, అతని సోదరుడిని జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం రాత్రి అతని స్వగ్రామం గజ్వేల్లోని కొల్గూరులో అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు ప్రశాంత్ను ఏ-1గా, అతని సోదరుడు మనోహర్ను ఏ-2గా పేర్కొంటూ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన తర్వాత వీరిద్దరూ కూడా పరారీలో ఉన్నారు. పోలీసులు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడంతో లాయర్ ద్వారా వారిద్దరూ మళ్లీ ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. సీజన్- 6 కాంటెస్టెంట్ గీతూరాయల్ కారును కూడా ధ్వంసం చేశారు. ఆపై ఆమె కారులోకి చేతులు పెట్టి అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో గీతూ రాయల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా వినకపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దాంతో అల్లరిమూకలు రోడ్లపైకి పరుగులు తీస్తూ ఆరు ఆర్టీసీ బస్సుల అద్దాలను పగులగొట్టారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కేసు పెట్టడం జరిగింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్పై కేసు.. కారణం అన్నపూర్ణ స్టూడియో వద్ద గొడవ జరుగుతున్న సమయంలో బిగ్ బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్ బయటకు వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డగించి మరో గేటు నుంచి పంపారు. కానీ ఆ సమయానికే ప్రశాంత్ను ర్యాలీగా తీసుకెళ్లేందుకు అతని సోదరుడు మనోహర్ తన మిత్రుడు వినయ్ ద్వారా రెండు కార్లను అద్దెకు తెచ్చుకున్నారు. ఇది గమనించిన పోలీసులు ఇప్పటికే ఇక్కడ పరిస్థితి గొడవలతో నిండి ఉంది.. ఈ సమయంలో ర్యాలీ అంటే కష్టం.. బయటకు వెళ్లి ఎక్కడైన సభ పెట్టుకోండి అని చెప్పి.. ఆ కార్లను పక్కనపెట్టి పోలీసులు వేరే వాహనంలో ప్రశాంత్ను పంపించారు. అవన్నీ లెక్క చేయకుండా ప్రశాంత్ తన అభిమానుల మధ్య ర్యాలీ కోసం అద్దె కార్లతో తిరిగి అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలో పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ మళ్లీ జోక్యం చేసుకుని ప్రశాంత్ను రావొద్దని చెప్పినా.. ప్రశాంత్ వినిపించుకోలేదని ఆయన తెలిపారు. ప్రశాంత్ను అడ్డగించి పంపించేశారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫైర్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కార్లపై దాడితో పాటు రెండు పోలీసుల వాహనాలు ధ్వంసం అయ్యాయి. అంతటితో ఆగని అల్లరి మూకలు ఆరు ఆర్టీసీ బస్సు అద్దాలను పగలకొట్టారు. ప్రశాత్కు 14 రోజుల రిమాండ్ ప్రభుత్వ ఆస్థుల ధ్వంసం కేసులో జూబ్లీహిల్స్ ఎస్సై మెహర్ రాకేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్, మనోహర్, వినయ్తో పాటు అద్దె కార్లను నడిపిన డ్రైవర్లు సాయికిరణ్, రాజుపై కూడా కేసు నమోదు చేశారు. ఈనెల 19న డ్రైవర్లు సాయికిరణ్, రాజుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రశాంత్, అతని సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ప్రశాంత్, అతని సోదరుడు మనోహర్ను పోలీసులు అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసులో దాదాపు ఆరు గంటల పాటు జూబ్లీహిల్స్ స్టేషన్లో వారిద్దరినీ విచారించి ఆపై రాత్రి సమయంలోనే జడ్జి ఇంట్లో పల్లవి ప్రశాంత్తో పాటు ఆయన సోదరుడిని పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. పల్లవి ప్రశాంత్తో పాటు సోదరుడు మనోహర్కు కూడా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అర్ధరాత్రి వారిద్దరినీ చల్గూడ జైలుకు పోలీసులు తరలించారు. పోలీసులు ముందే హెచ్చరించినా సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ.. ప్రభుత్వ ఆస్థులకు నష్టం కలిగేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని పోలీసులు తెలిపారు. ఫైనల్గా వారిద్దరిపై ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసును పోలీసులు నమోదుచేశారు. ఇదేం అభిమానం! బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు.… pic.twitter.com/lJbSwAFa8Q — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 18, 2023 -
బిగ్ బాస్పై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు
బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీ రచ్చే జరిగింది. బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ అభిమానులు చేసిన ఫలితంగా అక్కడ గొడవలు జరిగాయని పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఇలా అన్నపూర్ణ స్టూడియో వద్ద పెద్ద గొడవే జరిగింది. ఇప్పటికే బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని పలువురు ప్రముఖులు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ షో గురించి తెలంగాణ మానవ హక్కుల కమిషన్కు (HRC ) హైకోర్టు న్యాయవాది అరుణ్ ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. బిగ్ బాస్ ఫైనల్ రోజున అక్కడ జరిగిన గొడవపై రెండు కేసులు నమోదు అయ్యాయి. కానీ ఎక్కడ హీరో నాగార్జున పేరు లేదు. ఈ కేసులలో నాగార్జున పేరును కూడా చేర్చాలి. అయన కూడా ఈ గొడవలకు బాద్యులే. అంత గొడవ బిగ్ బాస్ నిర్వాహకులు నిర్లక్ష్యం వహించారు. దీంతో 6 ఆర్టీసీ బస్సులు, కార్లు ధ్వంసం అయ్యాయి. ఇప్పటికే ఇదే విషయంపై హైకోర్టుకు లేఖ రాశాను. నాగార్జునను కూడా వెంటనే అరెస్ట్ చెయ్యాలి.' అని ఆయన కోరారు. కేసుల విషయాలు.. బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్లో పాల్గొన్న అమర్దీప్, అశ్విని, అక్కడే ఉన్న మరో సెలబ్రిటీ గీతూ రాయల్ కార్ల మీద దాడి జరిగింది. వారి కార్ల అద్దాలు పగిలాయి. దీంతో గీతూ రాయల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. ఆ తరువాత ఆరు ఆర్టీసీ బస్సులు, ఒక పోలీసు వాహనంపై కూడా దాడి చేశారు. పోలీసులు సుమోటోగా ఈ కేసు పెట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 147, 148, 290, 353, 427 r/w 149 IPC, సెక్షన్ 3 PDPP AC కింద కేసులు పెట్టారు. మొత్తం రెండు కేసులు ఉండగా ఒకదానిలో పల్లవి ప్రశాంత్ పేరు ఉన్నట్లు సమాచారం. -
పల్లవి ప్రశాంత్ బెయిల్కు చిక్కులు.. కారణం ఇదే: ప్రశాంత్ లాయర్
బిగ్బాస్ తెలుగు సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్పై తెలంగాణ పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ముందు గేటు నుంచి రావద్దని పోలీసులు చెప్పినా కూడా ప్రశాంత్ రావడం వల్ల అక్కడ పరిస్థితి కంట్రోల్ చేయడం తమ వల్ల కాలేదేని ఆ సమయంలో పోలీసులు తెలిపారు. ఆ సమయంలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు కూడా ధ్వంసం అయ్యాయి. దీంతో సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసు విషయంపై హైకోర్టు న్యాయవాది డాక్టర్ కే రాజేశ్కుమార్ సాక్షి మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్పై కక్షసాధింపు చర్యలు తగవని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని ఆయన చెబుతూ ప్రశాంత్ బెయిల్ గురించి ఇలా మాట్లాడారు. 'ప్రశాంత్పై కేసు నమోదు చేశారు.. కానీ ఇప్పటి వరకు కనీసం నిందితుడికి FIR కాపీ ఇవ్వడం లేదు. ఈ కేసుల వల్ల భయపడిన పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. దీంతో Fir కాపీ కోసం జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ను నేను సంప్రదించాను. కానీ ఆయన మాత్రం FIR కాపీ కొసం కుటుంబ సభ్యులు రావాలని తెలుపుతున్నారు. కేసు ఏదైనా సరే FIR కాపీని మాత్రం పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన బాధ్యత పొలిసులకు ఉంది. FIR కాపీ ఉంటేనే ప్రశాంత్కు బెయిల్ దరఖాస్తు చేసుకునేందకు అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసులు ఆ కాపీ ఇవ్వకపోవడంతో బెయిల్ దరఖాస్తు చేసుకోలేకపోతున్నాం. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ పాత్ర ఏంటో FIR కాపీ చూస్తేనే తెలుస్తుంది.' అని హైకోర్టు న్యాయవాది కే రాజేశ్కుమార్ తెలిపారు. -
నేనైతే కారుతో గుద్దిపడేసేవాడిని.. అమర్ విషయంపై సోహైల్ ఫైర్
బిగ్బాస్ సీజన్ 7 టైటిల్ను రైతుబిడ్డ అని చెప్పుకుంటున్న పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నాడు. ఈ సీజన్ రన్నర్గా బుల్లితెర నటుడు అమర్ దీప్ ఉన్నాడు. బిగ్ బాస్లో ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. కానీ వారిద్దరూ మళ్లీ ఒకటిగా సొంత బ్రదర్స్ మాదిరి కలిసిపోయే వారు. అయితే బిగ్బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ను ప్రకటించిన తర్వాత అమర్, ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త అమర్దీప్ కారుపై దాడి చేసే వరకు వెళ్లింది. ఆ సమయంలో కారులో తన కుటుంబ సభ్యులతో కలిసి అమర్ ఉన్నాడు. ఈ విషయంపై చాలామంది రియాక్ట్ అవుతున్నారు. తాజాగా సయ్యద్ సోహైల్ రియాక్ట్ అయ్యాడు. 'ఒక వ్యక్తిపై అభిమానం ఉండాలి కానీ ఉన్మాదం పనికిరాదు.. అమర్ కారుపై దాడి చేసింది అందరూ కూడా యువకులే. మనకు ఉద్యోగాలు లేక ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. ఇలాంటి పనులు చేసి తల్లిదండ్రులకు చెడ్డపేరు తీసుకు రాకండి. అభిమానం ముసుగులో ఇలా అమర్పై దాడి చేయడం ఎంత వరకు కరెక్ట్... ఆ దాడి సమయంలో అమర్తో పాటు ఆయన అమ్మగారు, భార్య తేజు ఉన్నారు. వారి కారును చుట్టుముట్టి అద్దాలు పగులకొట్టి ఆపై వారందరినీ నోటికి వచ్చిన బూతులు తిట్టారు. అమర్ భార్య, అమ్మగారిని చెప్పలేని పదాలతో తిట్టారు. మరోకడు అయితే ఆ బూతులు వినలేడు కూడా.. అలాంటి పదాలతో తిట్టడం ఎంత వరకు కరెక్ట్... నేను కూడా ఒక కొడుకుగా చెబుతున్నా.. ఇలాంటి మాటలు నాకే ఏదురైతే గనుకా ఆ సమయంలో కారుతోనే గుద్దిపడేసేవాడిని తర్వాత ఏదైతే అది జరగని.. తన తల్లిదండ్రులను అంటే ఎవరిలోనైనా ఇదే అభిప్రాయం వస్తుంది. భార్య, అమ్మను తన ముందే ఇలా తిడితే ఎవడూ సహించడు. కారుతో అలానే గుద్ది పారేస్తాడు.. కానీ అమర్ సైలెంట్గా వెళ్లిపోయాడు. నిజానికి వాడు చాలా మంచోడు ఇండస్ట్రీలో ఎవరినీ అడిగినా అదే చెబుతాడు.. అంత గొడవ జరిగినా తర్వాత కూడా తన అమ్మ, భార్య జోలికి మాత్రం రాకండి. ఏమైనా చేయాలనుకుంటే తనను మాత్రమే చేసుకోండి అని చెప్పాడు. ఇంతలా ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం దేనికి..?' అని సోహైల్ రియాక్ట్ అయ్యాడు. -
బిగ్ బాస్కు ముందే SPY బ్యాచ్ స్టార్ట్ అయిందా.. వీడియో వైరల్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగిసింది. ఈ సీజన్ ప్రధానంగా SPY (శివాజీ, ప్రశాంత్, యావర్) SPA (శోభ,ప్రియాంక,అమర్) బ్యాచ్ల మధ్యే నడిచింది. చివరకు స్పై బ్యాచ్లోని ప్రశాంత్ విన్నర్గా నిలిచాడు. బిగ్ బాస్ సీజన్ ప్రారంభంలోనే శోభ,ప్రియాంక,అమర్ ముగ్గురూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారని.. వాళ్లందరూ 'స్టార్ మా' బ్యాచ్ అంటూ మొదట్లోనే శివాజీ కన్నింగ్ ప్లాన్ వేశాడు. వాస్తవానికి ఆ విషయంలో వాళ్లే ఒప్పుకున్నారు. ఇక్కడికి రాక ముందే తామందరం మంచి స్నేహితులం.. ఈ షో గురించి తమ మధ్య ఎలాంటి బంధం లేదని చెప్పలేమని తెలిపి వారు గ్రూప్గానే గేమ్ ఆడుతూ వచ్చారు. ఇదే క్రమంలో శివాజీ, యావర్, ప్రశాంత్ కూడా SPY అనే పేరుతో గ్రూప్ అయ్యారు.. వారు కూడా గ్రూప్ గేమ్ ఆడుతూ పదే పదే SPA బ్యాచ్ మాత్రమే గ్రూప్ గేమ్ ఆడుతుందని హౌస్లో పదేపదే ప్రచారం చేయడం ప్రారంభించారు. కానీ వీరు ముగ్గురు హౌస్లోకి రాక ముందే ఒకరికొకరితో పరిచయం ఉంది అంటూ గతంలోనే కొన్ని వార్తలు వచ్చాయి. హౌస్లోకి వచ్చిన తర్వాతే వాళ్ల మధ్య పరిచయం అయినట్లూ ఈ ముగ్గురు కూడా కలరింగ్ ఇచ్చారు. ఎక్కడా తమ మధ్య ముందే పరిచయం ఉందని రివీల్ చేయలేదు. బిగ్ బాస్లోనే మొదటి పరిచయం అయినట్లు కనిపించారు. అలా ఈ ముగ్గురు ఒకటిగా గేమ్ ఆడుతూ.. SPA బ్యాచ్ మాత్రమే గ్రూప్ అంటూ పదే పదే ఎదురుదాడి చేశారు. SPY బ్యాచ్పై ముందు నుంచే చాలా అనుమానాలు కనిపించాయి. బిగ్ బాస్కు ముందు ప్రశాంత్ను ఎక్కడా చూడలేదని యావర్ చెప్పాడు. అంతేకాకుండా కలవలేదని చెప్పాడు. ఇక్కడికి వచ్చాకే ఫ్రెండ్స్ అయ్యామని చెప్పుకొచ్చాడు. అదంతా నిజమేనని జనాలు కూడా నమ్మారు. కానీ అది అబద్దం అని తేలిపోయింది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పల్లవి ప్రశాంత్, యావర్ చాలా క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు. బిగ్ బాస్కు ముందే వారిద్దరి మధ్యే బాటలు సాగాయని తేలిపోయింది. ఇదే క్రమంలో శివాజీ, ప్రశాంత్ మధ్య కూడా పరిచయం ఉందని సమాచారం. బిగ్ బాస్ స్టార్ట్ కాకముందు ప్రశాంత్ను ఇంటర్వ్యూ చేయాలని ఒక యూట్యూబ్ వారిని శివాజీనే సూచించాడట. ఇలా ఈ ముగ్గురి మధ్య పరిచయం ఉన్నప్పటికీ దానిని దాచి వారి గేమ్ ప్లాన్ను మొదలు పెట్టారు. దీంతో స్పై బ్యాచ్ ముందే ప్లాన్ చేసుకొని వచ్చారనే కామెంట్స్ వినిపిస్తన్నాయి. ఇది చూసిన స్పై ఫ్యాన్స్ సైతం ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. జనాలను మోసం చేసారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ చాలా ఏళ్ల నుంచి తమ మధ్య స్నేహం ఉందని ఓపెన్గా చెప్పిన స్పా బ్యాచ్... ఆట కోసం తమ స్నేహాన్ని వదులుకోలేమని చెప్పి ఆటలో ఎన్ని గొడవలు జరిగినా మళ్లీ కలిసిపోతూ.. స్నేహంలో ఇవన్నీ సహజమే అనేలా తమ ఆటను కొనసాగించి నిజమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. View this post on Instagram A post shared by 𝐒𝐌𝐃🧘 (@swaasa_meedha_dhyaasa_) -
నాకేం జరిగినా భయపడను..
-
BB7 RunnerUp Amardeep Photos: సింపుల్ లుక్లో బీటెక్ బాబు అమర్దీప్ (ఫోటోలు)
-
BB7 Winner Pallavi Prashanth Photos: మళ్లొచ్చిన అంటే తగ్గేదేలె.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ (ఫోటోలు)
-
‘ఇదేం అభిమానం!’ బిగ్బాస్ గొడవపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: బిగ్బాస్-7లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అమర్ రన్నరప్గా నిలిచాడు. ఫినాలే పూర్తి అయిన తర్వాత కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో అమర్ ఫాన్స్, పల్లవి ప్రశాంత్ అభిమనులు గొడవకు దిగారు. అయితే ఈ గొడవలో ఆర్టీసి బస్సుల అద్దాలను ఫాన్స్ ధ్వంసం చేశారు. తాజాగా ఈ ఘటనపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ‘‘అభిమానం పేరుతో చేసే పిచ్చి చెష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. ఫాన్స్ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో టీఎస్ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదేం అభిమానం! బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు.… pic.twitter.com/lJbSwAFa8Q — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 18, 2023 -
Bigg Boss 7: శివాజీకి బొమ్మ చూపించిన బిగ్బాస్.. చివరకు అదొక్కటే మిగిలింది!
శివాజీ... బిగ్బాస్ ఆర్గనైజర్స్ ఇచ్చిన హైప్ చూస్తే నిజంగా గెలిచేస్తాడేమో అని అందరూ తెగ భయపడ్డారు. ఎందుకంటే ఈ సీజన్ మొదటిరోజు నుంచి సోఫాపై కూర్చుని ఆర్డర్స్ వేయడం, ప్రశాంత్-యావర్లతో పనిచేయించుకోవడం తప్పితే ఒక్క విషయంలోనూ ఎంటర్టైన్ చేయలేకపోయాడు. నాగార్జున అయితే మాస్టర్ మైండ్, చాణక్య లాంటి పెద్దపెద్ద బిరుదులిచ్చేసి శివాజీని ఆకాశంలో కూర్చోబెట్టాడు. చివరకు అక్కడి నుంచే కిందకు తోసేశాడు. అసలు ఈ సీజన్లో శివాజీ ఏం చేశాడు? ఇంతకీ ఆడాడా లేదా? నటుడు, డబ్బింగ్ ఆర్టిస్టుగా శివాజీ కాస్తోకూస్తో గుర్తింపు ఉంది. అప్పట్లో హీరో, సైడ్ క్యారెక్టర్ తరహా పాత్రలు చేశాడు కానీ ఆ తర్వాత ట్రెండ్కి తగ్గట్లు మింగిల్ కాలేక యాక్టింగ్ పక్కనబెట్టేశాడు. అలా నటుడిగా కనుమరుగైపోయాడు. రాజకీయాల్లోకి వచ్చి 'గరుడ పురాణం' చెప్పాడు. చాల్లే నీ సేవలు అని చెప్పి పక్కకు తోసేశారు. ఇక అన్నీ అయిపోయేసరికి ఏం చేయాలో తెలీక పిల్లల మీద ప్రతాపం చూపించడానికా అన్నట్లు బిగ్బాస్ లోకి వచ్చాడు. ఇక్కడ కూడా మనోడికి మొండిచెయ్యే మిగిలింది. కప్ కొట్టడం సంగతి అటుంచితే కనీసం రన్నరప్ కూడా కాలేకపోయాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) శివాజీ బిగ్బాస్ హౌసులోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు.. 3-4 వారాలు ఉంటే గ్రేట్ అని చాలామంది ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఫినాలే వరకు వచ్చేశాడు. ఏ మాత్రం పనిచేయకపోయినా సరే టాప్-3 వరకు వచ్చేశాడు. అయితే శివాజీ ఈ షోకే అనర్హుడు అని చెప్పడానికి బోలెడన్ని కారణాలున్నాయి. అందులో మొదటిది నాగార్జున సపోర్ట్. గేమ్ షో అంటే సొంతంగా ఆడాలి. కానీ శివాజీ ఎప్పుడు అలా చేసింది లేదు. నోటికొచ్చింది మాట్లాడేయడం.. వీకెండ్ వచ్చేసరికి 'బాబుగారు అలా కాదు.. బాబుగారు ఇలా కాదు' అని డిఫెండ్ చేసుకోవడం.. నాగార్జున శివాజీకి వంతపాడటం. ఇక ప్రశాంత్-యావర్ని గుప్పిట్లో పెట్టుకుని, పనులన్నీ వీళ్లతో చేయించుకోవడం కూడా శివాజీ గేమ్ ప్లాన్లో భాగమేమో? ఇక బిగ్బాస్లో శివాజీ మాటతీరు చాలా వరస్ట్! ఎందుకంటే హౌసులోని ప్రతిఒక్కరూ ఇతర కంటెస్టెంట్స్ని పేరు పెట్టి పిలవాలి. కానీ శివాజీ ఈ విషయంలో చాలా పూర్. కారణం లేకపోయినా సరే అమర్పై మొదటి నుంచే చాలా పగ పెంచేసుకున్నాడు. ప్రతివారం నామినేట్ చేసేవాడు. 'పనికిమాలినోడా', 'పిచ్చోడా' అని నోటికి ఏమొస్తే అలా పిలిచేవాడు. అమర్.. ఇవన్నీ పట్టించుకోడు కాబట్టి లైట్ తీసుకున్నాడు. గౌతమ్ లేదా అర్జున్ని ఇలా గానీ పిలుచుంటే శివాజీకి ఇచ్చిపడేసేవాళ్లు. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ సీజన్ విన్నర్ నేనే.. శివాజీ తలతిక్క కామెంట్స్!) శివాజీలో ఇంకో అవలక్షణం ఏంటంటే.. ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. మిగతా లేడీ కంటెస్టెంట్స్.. తన మాటకు ఎదురుచెప్పలేదు. దీంతో వాళ్లని అమ్మ అమ్మ అని పిలిచేవాడు. వాళ్లని ఏం అనేవాడు కూడా కాదు. కానీ శోభా-ప్రియాంక.. శివాజీ నిజస్వరూపాన్ని ఉన్నది ఉన్నది చెప్పేవారు. మాటకు మాట కౌంటర్ ఇచ్చేవారు. ఇది శివాజీ అస్సలు తీసుకోలేకపోయాడు. 'ఒక్కటి పీకుతా', 'పీక మీద కాలేసి తొక్కుతా' లాంటి పిచ్చికూతులన్నీ కూసి, షో పరువు తీశాడు. మళ్లీ ఏమైనా అంటే.. మాది పల్నాడు, మా దగ్గర ఇలానే మాట్లాడుతారని చెప్పి పుట్టిన ఊరిపేరు కూడా చెడగొట్టాడు. బిగ్బాస్ షోలోకి వచ్చిన మొదటి వారాల్లోనే శివాజీ కుడి చేతికి గాయమైంది. దీంతో చాలా గేమ్స్లో పార్టిసిపేట్ చేయలేదు. కొన్ని గేమ్స్లో కనీస పోటీ ఇవ్వకుండానే చేతులెత్తేశాడు. ఏమన్నా అంటే డిస్ట్రబ్ చేశావ్ అదీ ఇదీ అని అవతల వాళ్లపై అరిచేవాడు. ఈ సీజన్ మొత్తంలో పవరస్త్ర గెలుచుకోవడం, కెప్టెన్ కావడం (ఇంటి సభ్యుల సహకారంతోనే) తప్పితే చెప్పుకోదగ్గ ఘనత శివాజీకి ఒక్కటీ లేదు. ఇక ఫినాలేకి కొన్ని రోజులు ఉందనగా హోస్ట్ నాగార్జునతోనే పిచ్చి వాదనకు దిగాడు. ఇలా బోలెడన్ని కారణాల దృష్ట్యా.. శివాజీని నిర్వహకులు విన్నర్ కాదు కదా కనీసం రన్నరప్ కూడా చేయలేదు. పొరపాటున శివాజీ గానీ విన్నర్ అయ్యింటే మాత్రం అంతకంటే విచిత్రం మరొకటి ఉండేది కాదు. ఓవరాల్గా చూసుకంటే.. షోలో పార్టిసిపేట్ చేయడం, రెమ్యునరేషన్ తీసుకోవడం అనే సంతృప్తి తప్పితే శివాజీకి ఇంకేం మిగల్లేదు! (ఇదీ చదవండి: Bigg Boss 7: అమర్దీప్ కారుపై రైతుబిడ్డ ఫ్యాన్స్ దాడి.. అద్దాలు ధ్వంసం) -
Bigg Boss 7: ఈ సీజన్ విన్నర్ నేనే.. శివాజీ తలతిక్క కామెంట్స్!
బిగ్బాస్ 7 అయిపోయింది. రైతుబిడ్డ గెలిచాడు. అమర్ రన్నరప్గా నిలిచాడు. ఇకపోతే గెలిచేస్తాడు, ట్రోఫీ కొట్టేస్తాడు, చాణక్య అని మాట్లాడుకున్న శివాజీ.. ఊహించని విధంగా మూడో స్థానానికి పరిమితమయ్యాడు. ఏదో హౌస్ట్ నాగార్జున, నిర్వహకులు పుణ్యమా అని ఏ మాత్రం ఆడకపోయినా సరే శివాజీ ఇక్కడ వరకు వచ్చాడు. లేకపోతే మనోడికి అంత సీన్ లేదు. ఇక షో అయిపోయిన తర్వాతైనా సరే తిన్నగా మాట్లాడకుండా తలతిక్క కామెంట్స్ చేస్తున్నాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: అమర్దీప్ కారుపై రైతుబిడ్డ ఫ్యాన్స్ దాడి.. అద్దాలు ధ్వంసం) బిగ్బాస్ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ.. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అదే ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తారు. అలా గీతూ రాయల్.. శివాజీని ఇంటర్వ్వూ చేసింది. షోలో అంటే గెలవాలి కాబట్టి వంద అబద్ధాలు చెప్పొచ్చు. కానీ ఇక్కడ కూడా శివాజీ అదే బాపతు సమాధానాలు ఇస్తూ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం మాత్రం ఆపలేదు. టాప్-3 వరకు వస్తారని ఊహించారా? అని అడిగిదే.. 'ఈ సీజన్ విన్నర్ నేను, నాకు తెలుసు' అని తలతిక్క సమాధానం చెప్పాడు. టాప్-3వరకు వచ్చి, మీరు ఆగిపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? అని అడిగితే.. తిన్నగా సమాధానం చెప్పకుండా.. పల్లవి ప్రశాంత్, ఊరి నుంచి వచ్చాడు, అతడిపై మాటలు దాడి చేశారు, అడ్డుకున్నాను.. ఇలా అడిగిన ప్రశ్నకు ఆన్సర్ చెప్పకుండా ఏదేదో మాట్లాడాడు. యావర్, ప్రశాంత్ మీ వల్లే ఇంతదూరం వచ్చారని అనుకుంటున్నారా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. 'అవును, కాకపోతే వాళ్ల వెనకాల ఓ శక్తి ఉందని అందరికీ తెలియజేశాను' అని శివాజీ అన్నాడు. వీళ్లిద్దరి మైండ్లో లేని ఆలోచనలు పుట్టించారు కదా అని అడగ్గా.. నీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పడానికి రాలేదని హౌస్ట్తోనే వాగ్వాదానికి దిగాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డ ప్రశాంత్ విజయానికి అసలు కారణాలు ఇవేనా?) అమర్ని కావాలనే తొలిరోజు నుంచి టార్గెట్ చేసినట్లు అనిపించింది? దీనికి ఏమంటారు అని శివాజీని అడగ్గా.. మీకు మళ్లీ మళ్లీ చెప్పేదేంటంటే అమర్ గాడు, నేను వెరీగుడ్ ఫ్రెండ్స్ అని మొత్తం ప్లేట్ మార్చేశాడు. హౌసులో అమర్ని పేరుతో కాకుండా ఎన్ని రకాల పదాలతో శివాజీ పిలిచాడో ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటే మీకు ఆన్సర్ తెలుస్తుంది. మీ బ్యాచ్లో ఫేవరిజం లేదా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. 'మీరు ఎంత అనుకున్నా జనం చూస్తున్నారు' అని అదే పాత చింతకాయ పచ్చడి డైలాగ్స్ కొట్టాడు తప్పితే తిన్నగా ఆన్సర్ చెప్పలేకపోయాడు. శివాజీ అసలు బిగ్బాస్లోకి ఎందుకొచ్చాడు? అని అడగ్గా.. బిగ్బాస్ తెలుగు సీజన్లలో నా పేరు గుర్తుండాలి. దటీజ్ మై మార్క్ అని విచిత్రమైన సమాధానాలు చెప్పాడు. అయితే ఈ కామెంట్స్ అన్నీ కూడా ప్రోమోలో చెప్పినవి. ఇక పూర్తి ఇంటర్వ్యూలో ఎన్నెన్ని విచిత్ర విన్యాసాలు చేశాడో చూడాలి? (ఇదీ చదవండి: బిగ్బాస్ విన్నర్ ప్రశాంత్.. మొత్తం ఎన్ని లక్షలు సంపాదించాడంటే?) -
Bigg Boss 7: రైతుబిడ్డ విజయానికి ప్రధాన కారణాలు ఇవే!
పల్లవి ప్రశాంత్.. బిగ్బాస్ షోకు రావడానికి ముందు సోషల్ మీడియా ఉపయోగించే కొద్దిమందికే తెలుసు. కానీ బిగ్బాస్ 7లోకి వచ్చిన తర్వాత తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఒదిగి ఉండే స్వభావం, చురుకుతనం, టాలెంట్, అమాయకత్వం.. ఇవన్నీ జనాలకు బాగా నచ్చేశాయి. మట్టి మనిషిని అని చెప్పుకునే ప్రశాంత్.. తాను గెలిస్తే వచ్చే డబ్బును కష్టాల్లో ఉన్న రైతు కుటుంబాలకే ఇస్తానని చెప్పడం ఎంతోమంది మనసులను కదిలించింది. అలా ఇప్పుడు 7వ సీజన్ విజేతగా నిలిచాడు. మరి అతడి గెలుపు వెనకున్న కారణాలేంటి? చెప్పులరిగేలా తిరిగాడు 'మల్లొచ్చినా అంటే తగ్గేదేలే'.. అని సోషల్ మీడియాలో వీడియోలు చేసుకునే ప్రశాంత్.. ఎలాగైనా బిగ్బాస్ షోలో అడుగుపెట్టాలనుకున్నాడు. అన్నపూర్ణ స్టూడియో చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. ఇప్పుడు విజేతగా గెలిచాడు. అయితే ప్రశాంత్.. బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లో అడుగుపెట్టినప్పుడే తొలి విజయం సాధించాడు. (ఇదీ చదవండి: బీటెక్ కుర్రాడు అమర్.. బిగ్బాస్ ద్వారా ఎంత సంపాదించాడంటే?) గెలుపే అంతిమ లక్ష్యంగా.. రైతుబిడ్డగా హౌస్లో అడుగుపెట్టిన ప్రశాంత్ టాస్కుల్లో విజృంభించి ఆడేవాడు. గెలుపే అంతిమ లక్ష్యంగా పోరాడాడు. విజయం కోసం ఎంతవరకైనా పోరాడతానన్న అతడి ధృడ సంకల్పమే తనను ముందుకు నడిపించింది. ఓడిన ప్రతిసారి రెట్టింపు కసితో ఆడటం జనాలకు ఎంతగానో నచ్చింది. తనను తాను నిరూపించుకునేందుకు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. నామినేషన్స్లో మాత్రం.. షోలో మిగతా టైమ్ అంతా కూడా సింపుల్గా ఉండే ప్రశాంత్.. నామినేషన్స్ వచ్చేసరికి తనలోని మరో యాంగిల్ను బయటకు తీసేవాడు. తానేమీ తక్కువవాడిని కాదని, మీకు పోటీనిచ్చే బలమైన కంటెస్టెంట్ను అని హౌస్మేట్స్కు గుర్తు చేశాడు. నామినేషన్స్లో అతడి వైఖరిని చూసి ప్రశాంత్కు అపరిచితుడిగా ముద్ర వేశారు. అయితే రానురానూ తన తప్పొప్పులను సరిదిద్దుకుంటూ విజయానికి మెట్లు వేసుకుంటూ పోయాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: అమర్దీప్ కారుపై రైతుబిడ్డ ఫ్యాన్స్ దాడి.. అద్దాలు ధ్వంసం) ఈ సీజన్లోనే తొలి కెప్టెన్ మొదట్లో రతిక రోజ్తో క్లోజ్గా ఉంటూ రాంగ్ ట్రాక్ ఎక్కాడు ప్రశాంత్. ఆమె వెన్నుపోటు పొడవడంతో గేమ్పై తిరిగి ఫోకస్ పెట్టాడు. అప్పటినుంచి తప్పటడగులు వేయకుండా ఎవరి జోలికీ వెళ్లకుండా ఆటమీదే తన ధ్యాసను కేంద్రీకరించాడు. బిగ్బాస్ హౌస్లో ఫస్ట్ కెప్టెన్గా నిలిచి తన సత్తా ఏంటో చూపించాడు. అలాగే ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలిచి.. తనకు ఆటలో తిరుగులేదని నిరూపించాడు. అయితే ఈ పాస్ను తన స్నేహితుల కోసం వాడాలనుకున్నాడు. ఆ అవకాశం రాకపోవడంతో కష్టపడి సంపాదించిన పాస్ను వెనక్కు ఇచ్చేందుకు సైతం వెనుకాడలేదు. ఈ నిజాయితీ ప్రేక్షకులకు ఎంతో నచ్చింది. నిష్కల్మషమైన మనసుకు ఫిదా నామినేషన్స్లో ఎన్ని తిట్టుకున్నా సరే తర్వాత అందరినీ తనే వెళ్లి మరీ పలకరించేవాడు. మనసులో ఎటువంటి కోపాలు పెట్టుకోకుండా హౌస్మేట్స్ను కలుపుకుపోయేవాడు. ఎవరెన్ని పనులు చెప్పినా కాదనకుండా చేసేవాడు. ఈ వినయం, విధేయత, మంచితనానికి జనాలు ఫిదా అయ్యారు. కామన్ మ్యాన్ కేటగిరీలో వెళ్లిన ప్రశాంత్ రైతుబిడ్డ కావడంతో జనాలకు బాగా కనెక్ట్ అయ్యాడు. హౌస్లో ఉన్నవాళ్లందరూ సెలబ్రిటీలేనని, ప్రశాంత్ మాత్రం మనలో ఒకరైన రైతుబిడ్డ అని ఫీలయ్యారు. దీంతో షో మొదటినుంచే అతడిని మనలో ఒకడిగా ఫీలయ్యారు. వీటితో పాటు చాలా విషయాల్లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తనదైన మార్క్ చూపించాడు. బిగ్బాస్ 7వ సీజన్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు. (ఇదీ చదవండి: బిగ్బాస్ విన్నర్ ప్రశాంత్.. మొత్తం ఎన్ని లక్షలు సంపాదించాడంటే?) View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) -
Bigg Boss 7: అమర్దీప్ కారుపై రైతుబిడ్డ ఫ్యాన్స్ దాడి.. అద్దాలు ధ్వంసం
బిగ్బాస్ 7 పూర్తయిపోయింది. రైతుబిడ్డ ట్యాగ్తో హౌసులోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అమర్ రన్నరప్గా నిలిచాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఫినాలే పూర్తయిన తర్వాత అమర్ ఫ్యాన్స్ vs రైతుబిడ్డ ఫ్యాన్స్ గొడవకు దిగారు. ఈ క్రమంలోనే అమర్ కారుతో పాటు మరో ఇద్దరి సెలబ్రిటీలు కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. అలానే ఆర్టీసీ బస్సుని కూడా వదల్లేదు. (ఇదీ చదవండి: బిగ్బాస్ విన్నర్ ప్రశాంత్.. మొత్తం ఎన్ని లక్షలు సంపాదించాడంటే?) అసలు విషయానికొచ్చేస్తే.. బిగ్బాస్ అనేది గేమ్ షో. కానీ అభిమానులు అని చెప్పుకు తిరిగే వాళ్లకు అవేమి పట్టవు. ఈ సీజన్లో నామినేషన్స్లో భాగంగా అమర్, ప్రశాంత్ మధ్య చాలాసార్లు వాదన జరిగింది. అయితే అదంతా కూడా గేమ్లో భాగమని అర్థం చేసుకోలేకపోయిన ఈ పిచ్చి ఫ్యాన్స్.. అమర్ కుటుంబ సభ్యులని సోషల్ మీడియాలో వేధించడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు అక్కడ సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఫినాలే ముగిసిన తర్వాత అమర్ తన కారులో ఇంటికి వెళ్లిపోతుంటే.. అతడి కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి దిగారు. వెనకవైపు అద్దం ధ్వంసం చేశారు. అలానే మరో కంటెస్టెంట్ అశ్విని, వీళ్లందరినీ ఇంటర్వ్యూలు చేసిన గీతూ రాయల్ కారుని కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. దీంతో గీతూ.. పోలీస్ కేసు పెట్టింది. ఇది కాదన్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ బయట ప్రశాంత్, అమర్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: బీటెక్ కుర్రాడు అమర్.. బిగ్బాస్ ద్వారా ఎంత సంపాదించాడంటే?) View this post on Instagram A post shared by ❤HD EDITS❤ (@_hd__edits) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) -
Bigg Boss 7: ఎలిమినేట్ అయితేనేం యావర్కి జాక్పాట్.. టోటల్ రెమ్యునరేషన్ ఎంతంటే?
బిగ్బాస్ 7 నుంచి ప్రిన్స్ యావర్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే కప్ కొట్టే విషయంలో ముందు నుంచి ఓ క్లారిటీతో ఉన్న యావర్.. చివరికొచ్చేసరికి తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఎలిమినేట్ అయిన మిగతా వాళ్లతో పోలిస్తే జాక్పాట్ కొట్టేశాడు. దీనికి తోడు మంచి రెమ్యునరేషన్ తీసుకుని హౌస్ నుంచి బయటకొచ్చేశాడు. ఇంతకీ యావర్ ఎలా ఆడాడు? మొత్తం ఎంత సంపాదించాడు? యావర్ ఇంట్రెస్టింగ్ డెసిషన్ సాధారణంగా తెలుగు షోలో పాల్గొంటున్నారు అంటే ఎవరైనా సరే కచ్చితంగా తెలుగులోనే మాట్లాడాలి. బిగ్బాస్ షోలో అయితే ఇది ఇంకా పక్కాగా ఉండాలి. కానీ యావర్ విషయంలో నిర్వహకులు చాలాసార్లు దీన్ని పక్కనబెట్టేశారు. ఇక మనోడు శివాజీ బ్యాచ్లోకి చేరిపోయేసరికి.. ఎలిమినేషన్ నుంచి ప్రతిసారి సేవ్ అవుతూ వచ్చాడు. అలా ఫినాలే వీక్లోకి కూడా అడుగు పెట్టేశాడు. అయితే టాప్-6లో ఉన్న వాళ్లలో యావర్ కప్ కొట్టే ఛాన్స్ లేదు. దీంతో రూ.15 లక్షల సూట్కేస్ తీసుకుని ఫినాలే ఎపిసోడ్లో తనకు తానే ఎలిమినేట్ అయిపోయాడు. రెమ్యునరేషన్ ఎంత? పేరుకు నటుడు అయినాసరే తన ఫ్యామిలీకి చాలా అప్పులు ఉన్నాయని... ఎపిసోడ్స్లోని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. తనకు డబ్బు చాలా అవసరమని కూడా అన్నాడు. ఇప్పుడు దానికి తగ్గట్లే నాగ్.. రూ.15 లక్షల సూట్కేస్ ఆఫర్ చేయగా తీసుకుని, తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా సూట్కేసు ఆఫర్కే ఓటు వేసేసరికి.. ట్రోఫీ రేసు నుంచి తప్పుకొన్నాడు. అలానే వారానికి రూ.లక్షన్నర రెమ్యునరేషన్ చొప్పున 15 వారాలకు గానూ రూ. 22.5 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. అంటే మొత్తంగా రూ.37.5 లక్షల వరకు యావర్ సంపాదించినట్లు తెలుస్తోంది. -
Bigg Boss 7: ప్రియాంక ఎలిమినేట్.. మొత్తం రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
బిగ్బాస్ 7వ సీజన్లో షాకింగ్ ఎలిమినేషన్. ఒక్కో దశని దాటుకుంటూ ఫినాలే వరకు వచ్చిన ప్రియాంక.. చిట్టచివరిది అయిన ఆదివారం ఎపిసోడ్లో ఫస్ట్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్గా నిలిచింది. కప్ కొట్టలేకపోవచ్చు, ఓట్లు విషయంలో మిగతా వారికంటే వెనకబడిపోయి ఉండొచ్చు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం చాలామంది మనసులు గెలిచింది. దీనికి తోడు మంచి రెమ్యునరేషన్తో బిగ్బాస్ హౌస్ నుంచి బయటకొచ్చింది. ఎలిమినేషన్కి రీజన్ బిగ్బాస్ 7 హౌసులోకి తొలి కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంకపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. ఎందుకంటే సీరియల్ నటిగా అందరికీ తెలిసిన ఈమె.. కప్ కొట్టడం, ఫినాలే వీక్ రావడం సంగతి అటుంచితే కొన్ని వారాలు ఉంటే గ్రేట్ అనుకున్నారు. అలాంటిది తొలి పవరస్త్ర కోసమే చివరివరకు వచ్చి ఓడిపోయింది. అక్కడి నుంచి మొదలుపెడితే దాదాపు చాలా గేమ్స్లో చివరివరకు వచ్చి బోల్తా కొట్టింది. ఒకటి రెండుసార్లు మినహా దాదాపు సీజన్ అంతా కూడా చాలా డిగ్నిఫైడ్గా ఆడింది. అమ్మాయి కావడం, పెద్దగా ఫేమ్ లేకపోవడంతో ఈమె ఓట్లు పడలేదు. (ఇదీ చదవండి: Bigg Boss 7: అర్జున్ అంత సంపాదించాడా? 10 వారాల్లోనే..) ఈ క్రమంలోనే ఫినాలే టాప్-6లో అడుగుపెట్టిన వన్ అండ్ ఓన్లీ లేడీ కంటెస్టెంట్గా ప్రియాంక నిలిచింది. కానీ ఓటింగ్ విషయంలో బలమైన కంటెస్టెంట్స్ ఈమె కంటే ముందు ఉండటం ఈమెకు పెద్ద మైనస్ అయిందని చెప్పొచ్చు. ఈ సీజన్లో పాల్గొన్న అమ్మాయిలందరితో పోలిస్తే ప్రియాంక ది బెస్ట్ ఫెర్ఫార్మర్ అని చెప్పొచ్చు. చాలామంది ఒప్పుకొన్న ఒప్పుకోకపోయినా శివాజీ కంటే ప్రియాంక చాలా బెటర్! రెమ్యునరేషన్ ఎన్ని లక్షలు? సీరియల్ నటిగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక.. బిగ్బాస్ షోతో మరింత ఫేమ్, క్రేజ్ తెచ్చుకుంది. ఈమెకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇకపోతే సీజన్ అంతా అంటే 15 వారాల పాటు హౌసులో ఉన్న ప్రియాంక.. వారానికి రూ.2.5 లక్షల రెమ్యునరేషన్ మాట్లాడుకుందట. అంటే మొత్తంగా రూ.37.5 లక్షలు ఈమె సంపాదించినట్లు తెలుస్తోంది. ఇంత మొత్తం డబ్బులు అంటే ప్రియాంక ఆర్థికంగానూ కాస్త కుదురుకున్నట్లే! (ఇదీ చదవండి: Bigg Boss 7 Grand Finale: అది ఫేక్ న్యూస్) -
Bigg Boss 7 Finale Highlights: బిగ్బాస్ 7వ విజేతగా రైతుబిడ్డ ప్రశాంత్
105 రోజులకు పైగా ప్రేక్షకుల్ని అలరించిన బిగ్బాస్ 7 షోకి ఎట్టకేలకు పూర్తయింది. ఆదివారం అంగరంగ వైభవంగా గ్రాండ్ ఫినాలే జరిగింది. ఫినాలేకి అమర్దీప్, ప్రశాంత్, శివాజీ, ప్రియాంక, యావర్, అర్జున్ మిగిలారు. వీరిలో రైతుబిడ్డ ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అలానే ఆదివారం ఎపిసోడ్లో చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ అందించారు. అవేంటో ఓ లుక్కేసేయండి. ►'కేజీఎఫ్' సినిమాలో మంచి ఎలివేషన్ సాంగ్తో నాగార్జున.. ఫినాలే ఎపిసోడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. బ్లాక్ సూట్లో రాయల్ లుక్లో కనిపించి, ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడు. ►ఇక ఫినాలే కోసం వచ్చిన ఈ సీజన్ మిగిలిన హౌస్మేట్స్ అందరూ హిట్ సాంగ్స్కి డ్యాన్స్ చేసి అదరగొట్టేశారు. అశ్విని-పూజా, శోభా-తేజ, గౌతమ్-శుభశ్రీ, సందీప్-నయని పావని స్టెప్పులతో అదరగొట్టారు. భోలే అంటే హీరో, హీరో అంటే బిగ్బాస్ అని స్వయంగా కంపోజ్ చేసిన పాటకు భోలె డ్యాన్స్ చేసి ఫుల్గా ఎంటర్టైన్ చేశాడు. ►బిగ్బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత 15 సినిమా ఆఫర్లు వచ్చాయని టేస్టీ తేజ చెప్పుకొచ్చాడు. 9 వారాల్లో బిగ్బాస్ షోలో ఉండి ఎంత సంపాదించానో.. బయటకొచ్చిన తర్వాత 6 వారాల్లో అంతకంటే రెట్టింపు సంపాదించానని తేజ.. ఇంట్రెస్టింగ్ విషయాల్ని బయటపెట్టాడు. తేజతో పాటు గౌతమ్, భోలె, శోభాశెట్టి తదితరులు.. బిగ్బాస్ నుంచి బయటకెళ్లినా తర్వాత తమ లైఫ్ చాలా బాగుందని అందరూ తమ అభిప్రాయాల్ని చెప్పుకొచ్చారు. ►ఇక ఎలిమినేట్ అయిన హౌస్మేట్స్, హౌస్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్తో హోస్ట్ నాగార్జున మాట్లాడిన తర్వాత.. ఇంట్లో ఉన్న ఆరుగురు డ్యాన్స్ ఫెర్ఫార్మెన్సులతో అదరగొట్టేశారు. యావర్ జిమ్ సామాన్లతో, శివాజీ కాఫీ కప్పుతో, ప్రియాంక కిచెన్ సామాగ్రితో, మొక్కతో ప్రశాంత్, రాకెట్స్తో అర్జున్, కప్పుతో అమర్ డ్యాన్స్ చేశారు. ►ఇక మొత్తం 19 మందికి సంబంధించిన బిగ్బాస్ జర్నీని వీడియోగా ప్లే చేసి అందరికీ చూపించారు. ఇది మొత్తం మంచి ఎంటర్టైన్మెంట్తో సాగింది. ప్రతిఒక్కరూ తమని తాము స్క్రీన్పై చూసుకుని మురిసిపోయారు. ఇక చివర్లో ఎమోషనల్ కంటెంట్ చూసి తేజ.. గుక్కపట్టి ఏడ్చేశాడు. మా అందరిదీ చాలా బ్యూటీఫుల్ జర్నీ అని చెప్పుకొచ్చాడు. ►ఇంట్లోని ఆరుగురు సభ్యులతో చిన్న ఫన్ టాస్క్ పెట్టిన నాగ్.. ఒక్కో కంటెస్టెంట్ మరొకరిలా యాక్ట్ చేసి మెప్పించారు. శివాజీ.. యావర్లా, అర్జున్.. శివాజీలా, యావర్.. అర్జున్లా, ప్రశాంత్.. ప్రియాంకలా, అమర్.. ప్రశాంత్లా, ప్రియాంక.. అమర్లా యాక్ట్ చేసి చూపించారు. ►హౌస్లో ఉన్న ఆరుగురిని బీబీ హౌస్లో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? అని నాగార్జున అడగ్గా.. ఒక్కొక్కరు తమకు నచ్చిన ప్లేస్ చెప్పారు. ప్రియాంక-స్టాండర్డ్ రూమ్, అర్జున్ - గార్డెన్ ఏరియా.. శివాజీ- యావర్-జోయకాలూస్ రూమ్, అమర్- గోడౌన్, ప్రశాంత్-గార్జెన్ ఏరియాలోని మొక్క అని చెప్పి..తమ బొమ్మలను ఆయా ప్లేసుల్లో పెట్టారు. ► అందాల తార నిధి అగర్వాల్ డాన్స్తో అదరగొటేటసింది. జవాన్ సినిమాలోని రామయ్య వస్తావయ్యా సాంగ్తో పాటు నాగార్జున సినిమాకు చెందిన పలు పాటలకు నిధి తనదైన స్టెప్పులేసి అలరించింది. ►టాప్-6లో ఉన్న ఆరుగురిలో నుంచి ఫినాలే ఎపిసోడ్లో అర్జున్ ఫస్ట్ ఎలిమినేషన్గా బయటకొచ్చాడు. ఇతడిని యాంకర్ సుమ.. హౌస్ నుంచి ఇతడిని బయటకు తీసుకొచ్చింది. ►దామిని బాగా కుక్ చేస్తుందనే ప్రశ్నకు యస్.. అశ్వినిని శోభా, ప్రియాంక తొక్కేశారు అన్న ప్రశ్నకు నో.. అర్జున్-అమర్ సంభాషణ ఒక్కోటి ఆణిముత్యం అన్న ప్రశ్నకు యస్.. శోభాపై పెట్టిన శ్రద్ధ, గేమ్ పై పెట్టుంటే తేజ టాప్-5లో ఉండేవాడనే ప్రశ్నకు యస్.. తదితర ప్రశ్నలకు అందరూ సమాధానాలు చెబుతూ ఫన్ జనరేట్ చేశారు. ►కాస్త ఎంటర్టైన్మెంట్ అయిన తర్వాత నటి చంద్రిక రవి స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. 'బావ మనోభావాలు దెబ్బతిన్నాయ్' లాంటి పాటకు కేక పుట్టించే స్టెప్టులేసింది. ఇకపోతే ఎక్స్-కంటెస్టెంట్స్ని పలు అవార్డులతో హోస్ట్ నాగార్జున సత్కరించాడు. పిడకల అవార్డ్- దామిని ఇన్స్టంట్ న్యూడిల్స్ అవార్డ్- నయని పావని వాటర్ బాటిల్ అవార్డ్ - పూజామూర్తి రెడ్ లిప్స్టిక్ అవార్డ్ - శుభశ్రీ ఉడత అవార్డ్ - రతిక సంచాలక్ ఆఫ్ సీజన్ అవార్డ్- సందీప్ మాస్టర్ గోల్డెన్ మైక్ అవార్డ్ - భోలె టిష్యూ అవార్డ్ - అశ్విని డంబెల్ అవార్డ్ - గౌతమ్ ఫైర్ బ్రాండ్ - శోభాశెట్టి బేబీ సోనోగ్రఫీ ఫొటోని టీషర్ట్ పై వేసి, దాన్ని అర్జున్కి గిఫ్ట్గా ఇచ్చారు. ఇది కాస్త స్పెషల్గా అనిపించింది. ►ఇక 'ఈగిల్' సినిమా ప్రమోషన్లో భాగంగా స్టేజీపైకి వచ్చిన రవితేజ.. తన అభిమాని అయిన అమర్తో కాసేపు డ్రామా పండించాడు. తన తర్వాతి సినిమాలో ఛాన్స్ ఇస్తానని బిగ్బాస్ సాక్షిగా హామీ ఇచ్చాడు. అయితే మూవీ ఛాన్స్ ఇస్తా, బయటకొచ్చేస్తావా? అని నాగ్ అడగ్గానే మరో ఆలోచన లేకుండా అమర్ బయటకొచ్చేస్తానని అన్నాడు. అమర్ ఇష్టం చూసి నాగ్-రవితేజ ఇద్దరూ అవాక్కయ్యారు. దీనిబట్టి చూస్తే రవితేజ రాబోయే సినిమాల్లో ఏదో ఒకదానిలో అమర్ యాక్ట్ చేయడం గ్యారంటీ. ►ఫినాలేలో రెండో ఎలిమినేషన్ గా ప్రియాంక బయటకొచ్చింది. కొత్త సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన రవితేజ.. ప్రియాంక ఎలిమినేట్ అయినట్లు చెప్పాడు. ►'నా సామి రంగ' మూవీ ప్రమోషన్ కోసం హౌసులోకి వచ్చిన అల్లరి నరేశ్, రాజ్ తరుణ్.. రూ.15 లక్షల డబ్బుతో ఉన్న గోల్డెన్ సూట్కేస్తో బిగ్బాస్లోకి వచ్చారు. మిగిలిన నలుగురితో (అమర్, ప్రశాంత్, శివాజీ, యావర్) చాలాసేపు డిస్కషన్ పెట్టారు. డబ్బులు తీసుకునేలా టెంప్ట్ చేశారు. చివరకు యావర్.. సూట్కేస్ తీసుకుని, తనకు తానుగా ఎలిమినేట్ అయ్యాడు. అయితే యావర్.. సోదరులు కూడా చెప్పడంతో ఇక ఫైనల్గా సూట్ కేసు తీసుకుని బయటకొచ్చేశాడు. ►'డెవిల్' మూవీ ప్రమోషన్లో భాగంగా షోకి వచ్చిన కల్యాణ్ రామ్, సంయుక్త మేనన్.. కాసేపు సినిమా గురించి చిట్చాట్ చేశారు. కాసేపు సస్పెన్స్ క్రియేట్ చేసిన తర్వాత మిగిలిన ముగ్గురిలో శివాజీ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. అయితే శివాజీ ఎలిమినేట్ కావడాన్ని ప్రశాంత్ తట్టుకోలేకపోయాడు. కాళ్లు పట్టేసుకుని మరీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ►ఇక టాప్-2లో మిగిలిన అమర్, ప్రశాంత్ కోసం హౌసులోకి వెళ్లొచ్చిన హోస్ట్ నాగార్జున.. వీళ్లిద్దరినీ స్టేజీపైకి తీసుకొచ్చారు. అయితే విజేత ఎవరనేది ప్రకటించడానికి ముందు బిగ్బాస్ చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. నాగార్జున జర్నీని వీడియోగా ప్లే చేసి కాస్త ఫన్ జనరేట్ చేశాడు. ►చివరి వరకు సస్పెన్స్ మెంటైన్ చేస్తూ వచ్చిన బిగ్బాస్ హౌస్ట్ నాగార్జున.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ని విజేతగా ప్రకటించాడు. అయితే ఈ విషయాన్ని అస్సలు నమ్మలేకపోయిన ప్రశాంత్.. అలా షాక్లో ఉండిపోయాడు. ఇకపోతే అమర్దీప్ రన్నరప్గా నిలిచాడు. ► బిగ్ బాస్ 7వ సీజన్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్కి రూ.35 లక్షల చెక్తో పాటు మారుతీ సుజుకీ బ్రెజా, రూ.15 లక్షల విలువైన జ్యూవెల్లరీ నెక్లెస్ సెట్ని కూడా బహుమతిగా అందించారు. నాకు వచ్చిన రూ.35 లక్షలు రైతులకే పంచుతాను. రైతుల కోసమే వచ్చిన రైతుల కోసమే ఆడాను. కారు నాన్నకు, నెక్లెస్ అమ్మకు బహుమతిగా ఇస్తాను అంటూ స్పీచ్తో అదరగొట్టాడు. -
Bigg Boss 7: రూ.10 లక్షల టెంప్టింగ్ ఆఫర్.. ఆ విషయంలో అర్జున్, ప్రియాంక సూపర్
మరికొన్ని గంటల్లో బిగ్బాస్ ఫినాలే అంటే హడావుడి ఎలా ఉండాలి. ఇంటి సభ్యులు గానీ ప్రేక్షకులు గానీ టెన్షన్తో ఉక్కిరిబిక్కిరి అయిపోవాలి. ఈ విషయంలో నిర్వహకులు పూర్తిగా చేతులెత్తేశారు. ఏం చేయాలో తెలీక ఏదేదో చేస్తూ ఫుల్ టైమ్ పాస్ చేస్తూ వచ్చారు. చివర్లో సూట్కేస్తో కాస్త సస్పెన్స్ క్రియేట్ చేయాలనుకున్నారు గానీ ఇందులోనూ సక్సెస్ కాలేకపోయారు. ఇంతకీ శనివారం ఏం జరిగిందనేది Day 104 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. టైమ్పాస్ పల్లీ బఠాణీ ఎప్పటిలానే మరో వీకెండ్ వచ్చేసింది. అయితే ఆదివారం ఫైనల్ ఎపిసోడ్ ఉంది కాబట్టి నాగార్జున శనివారం రాలేదు. ఇంట్లో ఉన్న ఆరుగురితోనే టైమ్ పాస్ చేయించాలని ఫిక్సయిన బిగ్బాస్.. చిన్నపిల్లల ఆటలన్నీ పెట్టాడు. కళ్లకు గంతలు కట్టుకుని ఎవరు కొట్టారో చెప్పుకోండి చూద్దాం అనే తరహాలో ఓ గేమ్ పెట్టాడు. ఇందులో ఏమంత ఫన్ క్రియేట్ కాలేదు. దీని తర్వాత ఇంట్లో ఉన్న వాళ్లలా యాక్ట్ చేసి చూపించాలని బిగ్బాస్ కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో రైతుబిడ్డ ప్రశాంత్, అమర్లా యాక్ట్ చేసి చూపించిన అర్జున్.. అలానే కాఫీ ఇవ్వకపోతే బయటకెళ్లిపోతానంటూ శివాజీ చేసే హడావుడిని రీక్రియేట్ చేసిన ప్రియాంక.. ఫుల్ మార్కులు కొట్టేశారు. మిగతా నలుగురికి ఛాన్స్ రాలేదో, మరి వాళ్లు చేయలేదో తెలియలేదు. శ్రీముఖి ఎంటర్టైనర్ ఇక త్వరలో ప్రారంభమయ్యే 'సూపర్ సింగర్' కొత్త సీజన్ ప్రమోషన్ కోసం హౌసులోకి వచ్చిన 3వ సీజన్ రన్నరప్, యాంకర్ శ్రీముఖి.. కాసేపు ఆరుగురు ఇంటి సభ్యులతో పాటలు పాడించింది. 'ట్రూత్ ఆర్ డేర్' గేమ్ ఆడిపించింది. ఈ ఆటలో భాగంగా శివాజీని శ్రీముఖి ఓ ప్రశ్న అడగ్గా.. బయటకెళ్లిన తర్వాత నయని పావనితో బాండింగ్ పెంచుకుంటానని శివాజీ అన్నాడు. రతిక.. ఓసారి ఎలిమినేట్ అయి, హౌసులోకి తిరిగొచ్చినా సరే ఇంకా మెచ్యూరిటీ లెవల్స్ రాలేదని శివాజీ చెప్పాడు. అలానే మరో ప్రశ్నకు బదులిచ్చిన యావర్.. అశ్వినిని పెళ్లి చేసుకుంటా, రతికతో డేట్కి వెళ్తా, శుభశ్రీని కిల్ చేస్తానని నవ్వుతూ చెప్పాడు. సూట్కేస్ గమ్ ప్రతి సీజన్లో ఉన్నట్లే ఫినాలేకి ఓ రోజు ముందు హౌసులోకి బిగ్బాస్ డబ్బుల సూట్కేస్ పంపించాడు. రూ.3 లక్షల మొత్తంతో వేలం పాట మొదలుపెట్టాడు. ఎవరు తీసుకుంటారంటూ ఒకరి తర్వాత మరొకరికి ఆఫర్ ఇచ్చాడు. రూ.3 లక్షల దగ్గర మొదలైన ఈ ఆఫర్.. వరసగా రూ.5 లక్షలు, రూ.8 లక్షలు, రూ.10 లక్షల వరకు వెళ్లింది. కానీ ఎవరు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ మొత్తం మంచి టెంప్టింగ్గా ఉన్నప్పటికీ ఎవరూ ఆసక్తి చూపించలేదు. అయితే ఈ వేలంపాట జరుగుతున్నప్పుడు మధ్యలో శివాజీ.. అర్జున్, అమర్తో చిన్న పిచ్చి డిస్కషన్ పెట్టాడు. ఎంత కావాలి? ఎంత కావాలి? అని అన్నాడు. తనకు రూ.40 లక్షలిస్తే పోతానని అర్జున్.. రూ.45 లక్షలైతే వెళ్లిపోతానని అమర్ అన్నాడు. ఇక చివరగా ప్రియాంకకు ఇంటి నుంచి ఫుడ్ రావడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. ఆదివారం ఫినాలే ఎపిసోడ్ సాయంత్రం 6 లేదా 7 గంటలకు మొదలయ్యే ఛాన్స్ ఉంది. -
Bigg Boss 7: అన్ని లక్షలు ఆఫర్ చేసిన నాగ్.. టైటిల్ రేసు నుంచి ఆ ఒక్కడు డ్రాప్!
బిగ్బాస్ షోలో 7వ సీజన్ విన్నర్ ఎవరనేది మరికొన్ని గంటల్లో తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఎలిమినేషన్ ప్రక్రియ సాగుతోంది. ఇప్పటికే అర్జున్, ప్రియాంక.. తక్కువ ఓట్లు పడిన కారణంగా హౌస్ నుంచి బయటకొచ్చేసినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన నలుగురిలో ఓ కంటెస్టెంట్.. సూట్కేసులోని మంచి మొత్తానికి టెంప్ట్ అయినట్లు టాక్. ఇంతకీ ఎవరా కంటెస్టెంట్? ఎంత డబ్బు దక్కించుకున్నాడు? సూట్కేసు సంప్రదాయం బిగ్బాస్ గత కొన్ని సీజన్లని తీసుకుంటే ఈ సూట్కేసు సంప్రదాయం ఏంటనేది తెలుస్తోంది. 4వ సీజన్లో ఫినాలే రేసులో ఉన్న సొహైల్.. రూ.25 లక్షలు తీసుకుని బయటకొచ్చేశాడు. ఓటీటీ సీజన్లో అరియానా.. రూ.10 లక్షలు తీసుకుని రేసు నుంచి డ్రాప్ అయింది. గత సీజన్లోనూ ఏకంగా రూ.40 లక్షలు తీసుకుని శ్రీహాన్.. తనకు తానుగా బయటకొచ్చేశాడు. అయితే ఈసారి ఫినాలే జరగడానికి ముందు సూట్కేసు ఆఫర్ ఇచ్చిన బిగ్బాస్.. రూ.10 లక్షలు తీసుకుని రేసు నుంచి డ్రాప్ అయ్యే ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఎవరూ దీన్ని ఉపయోగించలేదు. (ఇదీ చదవండి: రైతు బిడ్డకే బిగ్బాస్ ట్రోఫీ.. రన్నరప్ అతనే..‘సాక్షి’పోల్ రిజల్ట్) యావర్ తెలివైన నిర్ణయం SPY బ్యాచ్లో ఉండటం ప్లస్ గేమ్స్లోనూ మంచిగా ఫెర్ఫార్మ్ చేయడం వల్ల.. తెలుగు పెద్దగా రాకపోయినా గానీ యావర్.. ఫినాలే వరకు వచ్చేశాడు. రూ.10 లక్షల మొత్తం ఆఫర్ చేసినప్పుడు లైట్ తీసుకున్నాడు. కానీ ప్రియాంక, అర్జున్.. ఖాళీ చేతులతో ఎలిమినేట్ అయ్యేసరికి మనోడికి బుర్ర పనిచేసినట్లుంది. మిగతా ముగ్గురి(ప్రశాంత్, అమర్, శివాజీ)ని దాటి కప్ కొట్టడం కష్టం. కాబట్టి నాగ్ ఆఫర్ చేసిన రూ.15 లక్షలు తీసుకొని సెల్ఫ్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. యావర్కి అవసరమే సీరియల్స్, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన యావర్.. తనకు, తన ఫ్యామిలీకి డబ్బు అవసరమని ఇదే బిగ్బాస్లో చాలాసార్లు చెప్పుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు రూ.15 లక్షలు తీసుకుని మంచి పనిచేశాడని చెప్పొచ్చు. అయితే డబ్బులు తీసుకునే విషయంలో శివాజీ ఏమైనా హింట్ ఇచ్చాడా? లేదంటే ఇది యావర్ సొంత నిర్ణయమా? అనేది ఆదివారం ఎపిసోడ్లో తెలిసిపోతుంది! (ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న హీరో మంచు మనోజ్.. శుభవార్త చెప్పేశారు!) -
Bigg Boss 7: ఆమె ఎలిమినేట్.. ఈసారి కూడా లేడీ విన్నర్ లేనట్లే!
ఇప్పటివరకు బిగ్బాస్ ఆరు సీజన్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఏడో సీజన్ నడుస్తోంది. మొత్తంగా అన్నింట్లోనూ అబ్బాయిలే విజేతలుగా నిలిచారు. ఓటీటీ షోలో బిందుమాధవి గెలిచినా సరే అది రెగ్యులర్ సీజన్ కేటగిరీలోకి రాదు. అయితే ఈసారైనా లేడీ కంటెస్టెంట్కి నిరాశే ఎదురైంది. ఫినాలే వరకు వచ్చి, టాప్-6లో నిలిచిన వన్ అండ్ ఓన్లీ అమ్మాయి కూడా ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా బ్యూటీ? ఏంటి సంగతి? (ఇదీ చదవండి: ఉచితంగా 'సలార్' టికెట్స్.. తెలుగు యంగ్ హీరో బంపరాఫర్) ప్రియాంక ఎలిమినేట్! సీరియల్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్.. తొలి కంటెస్టెంట్గా ఈ సీజన్లో అడుగుపెట్టింది. హైట్ తక్కువగా ఉన్నాసరే తొలివారం నుంచి అబ్బాయిలకు టఫ్ ఫైట్ ఇచ్చింది. చాపకింద నీరులా ఒక్కో గేమ్ గెలుస్తూ చివరివరకు వచ్చేసింది. ఈసారి ఫినాలే వీక్లో అడుగుపెట్టిన ఏకైక లేడీ కంటెస్టెంట్గా నిలిచింది. అయితే చివరి ఆరుగురిలో ఓట్లు తక్కువ వచ్చిన కారణంగా తొలుత అర్జున్ బయటకెళ్లిపోగా, తాజాగా ప్రియాంక ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. పొట్టిపిల్ల కాదు గట్టిపిల్ల సీజన్ మొదలైనప్పటి నుంచి ప్రియాంక మీద ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. అయితేనేం ఒక్కో వారం మిగిలిన కంటెస్టెంట్స్ని దాటుకుంటూ ఫైనల్ వరకు వచ్చేసింది. టాప్-6లో ఈమె కంటే ఓటింగ్ పరంగా బలమైన కంటెస్టెంట్స్ ప్రశాంత్, అమర్, శివాజీ ఉండటం ఈమెకు కలిసిరాలేదని చెప్పొచ్చు. ఏదేమైనా ఫినాలే వరకు వచ్చినప్పుడే ప్రియాంక గెలిచేసింది. కాకపోతే ట్రోఫీ కూడా గెలుచుకుని ఉంటే వేరే లెవల్ ఉండేది. అయితే ప్రియాంక ఎలిమినేషన్ పై ఆదివారం ఎపిసోడ్లో పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. (ఇదీ చదవండి: బిగ్బాస్: ప్రశాంత్కు బంపరాఫర్ ఇచ్చిన శ్రీముఖి) -
Bigg Boss 7: శివాజీ అతి బద్ధకం.. అమర్కి సర్ప్రైజ్ ఇచ్చిన రైతుబిడ్డ
బిగ్బాస్ 7 పూర్తయిపోవడానికి ఇంకొన్ని గంటలే ఉంది. మొన్నటివరకు జర్నీ వీడియోలతో ప్రేక్షకుల్ని ఎమోషనల్ చేసిన నిర్వహకులు.. ఇప్పుడు ఏం చేయాలో తెలీక టైమ్ పాస్ చేస్తున్నారు. అందరూ ఎంటర్టైన్ చేస్తున్నారు. శివాజీ మాత్రం అతి బద్ధకంతో చిరాకు తెప్పిస్తున్నాడు. రైతుబిడ్డ అమర్కి ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇంతకీ శుక్రవారం ఏం జరిగిందనేది Day 103 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. శివాజీ అలాంటి భాష ఆరుగురు ఇంటిసభ్యులు నిద్రలేవడంతో శుక్రవారం ఎపిసోడ్ మొదలైంది. అయితే అమర్.. మిగిలిన ఐదుగురి జాతకం చెప్పాలని చెప్పి ఓ టాస్క్ ఇచ్చాడు. ఉన్నంతలో మనోడు బాగానే ఎంటర్టైన్ చేయాలని చూశాడు. కానీ మధ్యలో శివాజీ దూరి.. వెధవ-వెధవ అనే పదేపదే అడ్డుతగిలి చిరాకు తెప్పించాడు. టాస్క్ సరిగా పూర్తి చేయనీకుండా తలనొప్పి తీసుకొచ్చాడు. ఇక ఉన్న ఆరుగురూ మరీ బద్ధకంగా వ్యవహరిస్తున్నారని సీరియస్ అయిన బిగ్బాస్.. విన్నర్గా నిలిచేవారు చివరివరకు వచ్చి ఆగిపోరు అని అలెర్ట్గా ఉండాలని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హీరోయిన్.. ఎవరో చెప్పండి చూద్దాం?) యావర్ సేఫ్ గేమ్ ఇక గురువారం ఎపిసోడ్లో భాగంగా అర్జున్, శివాజీ, అమర్.. ఇంట్లో వాళ్లు పంపిన ఫుడ్ని ఆస్వాదించారు. లేటెస్ట్ ఎపిసోడ్లో ప్రియాంక, ప్రశాంత్, యావర్ కోసం ఇంటి నుంచి ఫుడ్ వచ్చింది. అయితే వీళ్లకి ఫుడ్ దక్కుతుందా లేదా అనేది అర్జున్, అమర్, శివాజీ చేతుల్లో ఉంటుందని బిగ్బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. వీళ్ల ముగ్గురికి గేమ్స్ పెట్టి, అందులో గెలిచిన వాళ్లు ఫుడ్ ఎవరికి రావాలో డిసైడ్ చేస్తారని బిగ్బాస్ చెప్పాడు. తొలి గేమ్లో గెలిచిన అమర్.. యావర్ పేరు చెప్పాడు. అయితే ఇంటి ఫుడ్ మరో సభ్యుడితో పంచుకోవాల్సి ఉంటుందని బిగ్బాస్ చెప్పగా.. ఎవరి పేరు చెప్పినా మరొకరు ఫీల్ అవుతారని నాకు ఫుడ్ వద్దని చెప్పేశాడు. శివాజీ బద్ధకం ఇక కప్పులు బ్యాలెన్స్ చేసే రెండో గేమ్లో అర్జున్ గెలిచాడు. ప్రశాంత్ పేరు చెప్పాడు. అయితే ప్రశాంత్ నువ్వు ఎవరితో ఫుడ్ పంచుకుంటావ్? అని బిగ్బాస్ అడగ్గా.. అమర్ పేరు చెప్పాడు. అయితే ఈ రోజు అమర్ పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా ప్రశాంత్ ఇతడి పేరు చెప్పాడు. వీళ్లిద్దరూ ప్రశాంత్ అమ్మ చేసి పంపిన మటన్ కర్రీ, బగారా రైస్ తిన్నారు. ఇకపోతే రెండు గేమ్స్లోనూ శివాజీ మరీ బద్ధకం ఆడి.. ఒక్క గేమ్లోనూ గెలవలేకపోయాడు. ఇలాంటోడిని గనుక బిగ్బాస్ పొరపాటున విజేతని చేస్తే అంతకంటే దరిద్రం మరొకటి ఉండదు! మరోవైపు తనదగ్గరున్న పాయింట్స్ ఉపయోగించుకున్న అమర్.. తన భార్య తేజస్వితో బిగ్బాస్ హౌస్ నుంచి లైవ్ వీడియో కాల్ మాట్లాడాడు. అలా శుక్రవారం ఎపిసోడ్ పూర్తయింది. (ఇదీ చదవండి: 'సలార్' మూవీ సీక్రెట్స్ అన్నీ బయటపెట్టిన ప్రభాస్..) -
Bigg Boss 7: యావర్ ఏడ్చేశాడు.. ప్రశాంత్ ఏడిపించేశాడు!
బిగ్బాస్ షో చివరకొచ్చేసింది. దీంతో హౌస్ అంతా కూడా ఫుల్ పాజిటివ్ వైబ్స్ నడుస్తున్నాయి. ఇప్పటికే అమర్, అర్జున్, శివాజీ, ప్రియాంక.. తమ జర్నీ వీడియోలు చూసేసుకున్నారు. తాజా ఎపిసోడ్లో భాగంగా చివరగా మిగిలిన యావర్, ప్రశాంత్.. తమ జర్నీ వీడియోస్ చూసి తెగ మురిసిపోయారు. ఇంతకీ బుధవారం ఏం జరిగిందనేది Day 101 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: Bigg Boss: వింత టాస్క్.. చావు అంచుల దాకా వెళ్లొచ్చిన యంగ్ హీరోయిన్!) యావర్కి కేజీఎఫ్ ఎలివేషన్స్ ఫైనల్-6లో ఒకడైన యావర్.. తన బిగ్బాస్ బుక్ ఆఫ్ మెమొరీస్ చూసుకోవడంతో బుధవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. తన ఫొటలన్నీ చూస్తూ ఎమోషనల్ అయిపోయిన యావర్.. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక యాక్టివిటీ రూంలో స్క్రీన్పై ప్లే చేసిన దాదాపు 17 నిమిషాల వీడియో చూస్తే అన్ని రకాల భావోద్వేగాలు పలికించాడు. యావర్ కోసం బిగ్బాస్.. కేజీఎఫ్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ వాడేశాడు. వేరే లెవల్ ఎలివేషన్ ఇచ్చాడు. 'నాకు కోపం ఉందని అందరూ అంటారు, కానీ నాలో చరిత్ర సృష్టించే అంతా దమ్ముంది' అని యావర్.. తన ఫీలింగ్ బయటపెట్టాడు. మురిసిపోయిన రైతుబిడ్డ ప్రశాంత్ యావర్ తర్వాత ప్రశాంత్ వంతు. బిగ్బాస్ బుక్ ఆఫ్ మెమొరీస్ చూసుకున్న ప్రశాంత్.. తన తండ్రితో ఉన్న ఫొటో చూసి తెగ ఎమోషనల్ అయిపోయాడు. అనంతరం యాక్టివిటీ రూంలోకి వెళ్లిన ప్రశాంత్.. తన జర్నీని స్క్రీన్పై చూసుకుని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. ఇక మొదటి నుంచి కేవలం ప్రశాంత్ అని పిలుస్తూ వచ్చిన బిగ్బాస్.. ఫస్ట్ టైమ్ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అని పిలిచాడు. దీంతో మనోడు ఏడుపు కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఓవైపు నవ్వుతూ, మరోవైపు ఏడుస్తూ.. ఆనంద భాష్పలతో షర్ట్ అంతా తడిపేశాడని చెప్పొచ్చు. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7 ఫైనల్ అతిథిగా ఆ స్టార్ హీరో? వెరీ ఇంట్రెస్టింగ్!) -
బిగ్బాస్ 7 ఫైనల్ అతిథిగా ఆ స్టార్ హీరో? వెరీ ఇంట్రెస్టింగ్!
బిగ్బాస్ 7వ సీజన్ గ్రాండ్ ఫినాలేకు మరికొన్ని రోజులే ఉంది. ఈ ఆదివారం చాలా గ్రాండ్గా ఈ ఈవెంట్ నిర్వహించబోతున్నాడు. ఇప్పటికే చివరివారాన్ని నిర్వహకులు.. ఫుల్ పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చేశారు. ఎవరు విన్నర్ అవుతారా? అని ప్రేక్షకులు తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఫైనల్కి రాబోయే గెస్ట్ ఎవరనే న్యూస్ బయటకొచ్చింది. ఇప్పటివరకు 6 సీజన్లు పూర్తయ్యాయి. గతసారి చీఫ్ గెస్ట్ అంటూ ఎవరూ రాలేదు. దీంతో నాగార్జునే.. రేవంత్కి ట్రోఫీ అందజేశాడు. అంతకు ముందు పలు సీజన్ల ఫినాలేకు మాత్రం స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేశ్ వచ్చారు. అలా ఈసారి ఎవరైనా వస్తారా? అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇలాంటి టైంలో సూపర్స్టార్ మహేశ్బాబు రాబోతున్నాడనే తియ్యటి వార్త.. అభిమానుల చెవుల్లో పడింది. ఇది నిజమైపోవాలని తెగ ఆరాటపడుతున్నారు. (ఇదీ చదవండి: హీరో విజయ్ దేవరకొండపై అలాంటి వార్తలు.. ఆ వ్యక్తి అరెస్ట్) అయితే ఫినాలే ఎపిసోడ్కి మహేశ్ రావడంలో పెద్ద విచిత్రం ఏం ఉండకపోవచ్చు. ఎందుకంటే మరో నెల రోజుల్లో అంటే సంక్రాంతి కానుకగా 'గుంటూరు కారం'.. థియేటర్లలోకి రాబోతుంది. బిగ్బాస్ షోకి మహేశ్ గెస్ట్గా వస్తే మాత్రం.. ప్రమోషన్ పరంగా మూవీకి కాస్త హెల్ప్ కావొచ్చు. దీనిబట్టి చూస్తే మహేశ్ రావడం గ్యారంటీనే అనిపిస్తోంది. మరో ఒకటి రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చేస్తుందిలే! ఇకపోతే ఈసారి విన్నర్ అయ్యే సూచనలు అమర్-ప్రశాంత్లలో ఒకరికి ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఓట్లు అయితే వీరిద్దరికే ఎక్కువగా పడుతున్నట్లు తెలుస్తోంది. వీళ్లతో పాటు శివాజీ కూడా ఉన్నాడు కానీ అతడిని విన్నర్ చేస్తారా అంటే సందేహంగానే కనిపిస్తుంది. మరి బిగ్బాస్ 7 విజేత.. వీళ్ల ముగ్గురిలో ఒకడా? లేదా అనుహ్యంగా కొత్త వ్యక్తి అవుతాడా అనేది ఆదివారం (డిసెంబరు 17) తేలిపోతుందిలే! (ఇదీ చదవండి: బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఆ ముగ్గురిలో ఎవరు?) -
Bigg Boss 7: శివాజీ బయటపడలేదు.. ప్రియాంక మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోయింది!
బిగ్బాస్ మరోసారి ఏడిపించేశాడు. అవును ప్రియాంక, తనని తాను కంట్రోల్ చేసుకోలేనంతగా ఎమోషనల్ చేశాడు. అయితే శివాజీ మాత్రం పెద్దగా బయటపడలేదు. మరోవైపు ఓ గొడవ వల్ల విడిపోయిన అర్జున్-యావర్ మళ్లీ ఒక్కటయ్యారు. ఈ క్రమంలోనే యావర్ బోరున ఏడ్చేయడం కంటతడి పెట్టించింది. ఇంతకీ మంగళవారం ఏం జరిగిందనేది Day 100 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. శివాజీకి ఓ రేంజు ఎలివేషన్ సోమవారం ఎపిసోడ్లో జర్నీ వీడియోలతో అమర్, అర్జున్ని ఎమోషనల్ చేసిన బిగ్బాస్.. మంగళవారం ఎపిసోడ్ని శివాజీతో స్టార్ట్ చేశాడు. ఇతడి బిగ్బాస్ జ్ఞాపకాల్ని.. 'బుక్ ఆఫ్ మెమొరీస్'లో పొందుపరిచి శివాజీని సర్ప్రైజ్ చేశాడు. అనంతరం దాదాపు 17 నిమిషాల వీడియోని ప్లే చేసి మరీ శివాజీకి ఓ రేంజు ఎలివేషన్స్ ఇచ్చాడు బిగ్బాస్. ఈ క్రమంలోనే శివాజీ.. 25 ఏళ్ల ఇండస్ట్రీ కెరీర్ ఓ ఎత్తు.. బిగ్బాస్ జర్నీ ఓ ఎత్తు.. ఇక్కడి నుంచి ఎంతో కొంత నేర్చుకుని వెళ్తాం. అదైతే సత్యం బిగ్బాస్.. కప్పు గెలుస్తామా? లేదా అనేది పక్కనబెడితే.. చివరివారం వరకు వచ్చిన ఆరుగురు మాత్రం ప్రేక్షకుల హృదయాల్ని గెలిచారని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: 'కాంతార' సినిమాలో ఛాన్స్ కోసం స్టార్ హీరోయిన్ తిప్పలు!) ప్రియాంక గట్టిపిల్ల శివాజీ తర్వాత ప్రియాంకని పిలిచిన బిగ్బాస్.. ఈమెకి సంబంధించిన ఫొటోలని డిస్ప్లే చేశారు. అయితే మిగతా ఫొటోల సంగతేమో గానీ తన బాయ్ఫ్రెండ్ శివతో ఉన్న పిక్ చూసిన తర్వాత తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఇక ప్రియాంక గురించి ఎలివేషన్స్ ఇచ్చిన బిగ్బాస్.. సింపుల్ ప్రియాంకగా ఉండే మీరు.. శివంగి ప్రియాంకగా నామినేషన్స్లో మీరు ఎంత బలమైన కంటెస్టెంట్ అనేది మీరు ఎలాంటివారో తెలిసింది. పొట్టి పిల్ల కాదు గట్టిపిల్ల.. మీరు 100 శాతం ఇస్తూ వచ్చారు. మీ పట్టుదలే మిమ్మల్ని జీవితంలో మొదటి స్థానంలో నిలుపుతుందని కోరుకుంటూ మీ ప్రయాణం చూద్దాం అని దాదాపు 15 నిమిషాల వీడియోని ప్లే చేశాడు. అయితే ఈ వీడియో చూస్తున్నంతసేపు కూడా ప్రియాంక ఎమోషనల్ అవుతూ, ఆనంద బాష్పలతో కనిపించింది. మరోవైపు గతంలో ఓసారి నామినేషన్స్ సందర్భంగా ఇక యావర్తో మాట్లాడనని చెప్పిన అర్జున్.. తన జర్నీ వీడియోలో ఇద్దరం కలిసున్న సీన్స్ భలే ఉన్నాయని చెప్పాడు. దీంతో యావర్, అర్జున్ని హగ్ చేసుకుని గట్టిగా ఏడ్చేశాడు. అలా మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది. ఈరోజు ఎపిసోడ్ గురించి మీకు రాసి చెబితే ఆ ఫీల్ క్యారీ చేయలేం. కాబట్టి కుదిరితే ఫుల్ వీడియో చూడండి. (ఇదీ చదవండి: హీరో చిరంజీవిపై కేసు.. ప్రముఖ నటుడి తిక్క కుదిర్చిన హైకోర్ట్!) -
Bigg Boss 7: రూట్ మార్చిన బిగ్బాస్.. అర్జున్, అమర్ కన్నీళ్లు పెట్టేశారు!
బిగ్బాస్ 7వ సీజన్ చివరి వారానికి వచ్చేశాం. కొన్నిరోజుల ముందు హోస్ట్ నాగార్జున చెప్పినట్లు ఈసారి నామినేషన్స్ లాంటి హడావుడి ఏం లేదు. కేవలం హౌస్లోని ఉన్న ఆరుగురు సభ్యుల ఎమోషన్స్ మాత్రమే పలికించాలని ఫిక్స్ అయినట్లు ఉన్నారు. అందుకు తగ్గట్లే తాజా ఎపిసోడ్లో అమర్, అర్జున్కి బోలెడన్ని సర్ప్రైజులతో పాటు అదిరిపోయే ఎలివేషన్స్ దక్కాయి. ఇంతకీ సోమవారం ఏం జరిగిందనేది Day 99 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. మెమొరీస్ బుక్ చివరి వారాన్ని చాలా అంటే చాలా హ్యాపీ మెమొరీస్తో చాలా పాజిటివ్గా ఎండ్ చేద్దామని బిగ్బాస్ ఫిక్సయ్యాడు. అందుకు తగ్గట్లే ఒక్కో ఇంటి సభ్యుడి జర్నీని చూపించి, అతడి నుంచి ఎమోషన్స్ అన్నీ బయటకు లాగేయాలనేది ఆర్గనైజర్స్ ప్లాన్. ఫస్ట్ ఫస్ట్ అమర్ ని మాత్రమే లాన్లోకి రమ్మన్నారు. అక్కడ అతడి బిగ్బాస్ మెమొరీస్ అన్నింటినీ ఫొటోల రూపంలో ప్రదర్శించాడు. ఆ తర్వాత యాక్టివిటీ రూంలోకి పిలిచిన తర్వాత దాదాపు 16 నిమిషాల జర్నీ వీడియోని ప్లే చేశారు. (ఇదీ చదవండి: హీరో చిరంజీవిపై కేసు.. ప్రముఖ నటుడి తిక్క కుదిర్చిన హైకోర్ట్!) అమర్ ఎమోషనల్ ఇందులో భాగంగా అమర్.. బిగ్ బాస్ హౌసులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏమేం చేశాడు? ఎలా ప్రవర్తించాడు? లాంటి సీన్స్ అన్నింటినీ ఒక్కటిగా చేసి 16 నిమిషాల జర్నీ వీడియో ప్లే చేశారు. అయితే ఈ వీడియో చూస్తే అమర్ నవ్వాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు, గూస్ బంప్స్ తెచ్చుకున్నాడు. చివరకు థ్యాంక్స్ బిగ్బాస్ అని చెప్పాడు. చాలా పెద్ద గిఫ్ట్ ఇది. అల్టిమేట్ బిగ్బాస్ అని అమర్ తన ఆనందాన్ని బయటపెట్టాడు. అర్జున్ ఎమోషనల్ ఇక అమర్కి చేసినట్లే అర్జున్ని కూడా పిలిచిన బిగ్బాస్.. అలానే 'బిగ్బాస్ బుక్ ఆఫ్ మెమొరీస్' చూపించాడు. తన బిగ్బాస్ ఫొటోల్ని చూసి తెగ మురిసిపోయాడు. కాసేపటి తర్వాత యాక్టివిటీ రూంలోకి వెళ్లిన తర్వాత దాదాపు 14 నిమిషాల జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయ్యాడు. ఓవరాల్ వీడియో అంతా నవ్వుతూ చూసిన అర్జున్.. భార్య వచ్చిన క్లిప్ చూసినప్పుడు మాత్రం ఎమోషనల్ అయ్యాడు. అయితే ఈ రోజు ఎపిసోడ్ని రాయడం కంటే వీడియోగా చూస్తేనే కిక్ వస్తుంది. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: నాగార్జున స్పెషల్ స్వెట్ టీ-షర్ట్.. ఎన్ని లక్షల ఖరీదంటే?) -
Bigg Boss 7: నాగార్జున స్పెషల్ స్వెట్ టీ-షర్ట్.. ఎన్ని లక్షల ఖరీదంటే?
బిగ్బాస్ హోస్ట్గా నాగార్జున డౌన్ అయిపోతున్నాడు. గత కొన్ని సీజన్లలో పర్వాలేదనిపించినప్పటికీ.. ఈ సారి మాత్రం తేలిపోయాడు. ప్రతి వీకెండ్ అంటే ఒకప్పుడ నాగ్ హోస్టింగ్ కోసం షో చూసేవారు. ఇప్పుడు దీనికోసం కాకుండా.. నాగ్ వేసుకుంటున్న కాస్ట్యూమ్స్ గురించి ఆరా తీస్తున్నారు. తాజాగా ఆదివారం అలాంటి ఓ స్వెట్ టీ-షర్ట్ వేసుకుని వచ్చాడు. ఇప్పుడు దాని ధర తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?) ఆదివారం ఎపిసోడ్లో భాగంగా పసుపు రంగు చలికోటు లాంటిది వేసుకుని వచ్చాడు. చాలా వదులుగా ఉన్న ఈ టీ-షర్ట్ చూడటానికి డిఫరెంట్గా అనిపించింది. అమర్దీప్ కూడా.. ;మీ స్వెట్ టీ-షర్ట్ బాగుంది, నాకు ఇస్తారా సర్?' అని నాగార్జునని అడిగాడు. దీంతో ఇస్తానులే అని మాటిచ్చాడు. మహా అయితే ఈ టీ-షర్ట్ ఎంత ఖరీదు ఉంటుందిలే అని మీరనుకోవచ్చు. కానీ దీని ధర అక్షరాలు రూ.2,11,190 అని తెలుస్తోంది. buyma.us అనే వెబ్సైట్లో ఇది అందుబాటులో ఉంది. ఇకపోతే తాజా వీకెండ్లో శోభాని ఎలిమినేట్ చేసి పంపేశారు. దీంతో ప్రస్తుతం హౌస్లో టాప్-6 మాత్రమే ఉన్నారు. వీళ్లలో విజేత ఎవరనేది ఈ ఆదివారం అంటే డిసెంబరు 17న తెలిసిపోతుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 మూవీస్) -
ప్రియాంక అమ్మ ఇప్పటికీ పెళ్లిళ్లకు వెళ్లి పనులు చేస్తుంది: శివ
ప్రియాంక జైన్గా కంటే ఇప్పుడు బిగ్ బాస్ ప్రియాంక అనే పేరుతోనే ఆమెకు మంచి గుర్తింపు ఉంది. బుల్లితెరపై 'జానకి కలగనలేదు' సీరియల్తో ఆమె వెలుగులోకి వచ్చింది. అదే విదంగా బుల్లితెర నటుడు శివ కుమార్తో ఆమె ప్రేమలో పడిన విషయం తెలిసిందే. చాలా ఏళ్లుగా వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారు. మౌనరాగం సీరియల్లో కలిసి నటించారు. అమ్ములుగా ప్రియాంక జైన్.. అంకిత్గా శివ కుమార్లు కనిపించారు. కెమెరా ముందే నటనతో జీవించిన వీళ్లు.. కెమెరా వెనుక కూడా రొమాంటిక్ జోడీగా మారారు. ఈ క్రమంలో ప్రియాంకకు బిగ్ బాస్లోకి ఎంట్రీ అవకాశం రావడంతో ఆమెకు మరింత గుర్తింపు దక్కింది. ప్రస్తుతం ఆమె టాప్-5 కంటెస్టెంట్గా ఆమె ఉన్నారు. బిగ్ బాస్ హౌస్లో ప్రియాంక ఎక్కడా బ్యాలెన్స్ తప్పలేదని చెప్పవచ్చు. గేమ్లో తన హుందాతనాన్ని, సంస్కారాన్ని కోల్పోకుండా ఉండటం వల్ల టాప్-5 వరకు వచ్చింది. ఈ క్రమంలో కొందరు యాంటీ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేయడం కూడా జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక కుటుంబం గురించి శివ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రియాంక బిగ్ బాస్లో ఉండగా తన ఇంటికి సంబంధించిన హోమ్ టూర్ వీడియో ఒకటి భారీగా వైరల్ అయింది. ఆ వీడియోను చాలా రోజుల క్రితమే ఆమె యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసిన వారందరూ ప్రియాంక ఇంత పేదరికాన్ని చూసి ఈ స్థాయికి వచ్చిందా..? అని కొందరు ప్రశంసించారు. దీనిని జీర్ణించుకోలేని కొందరూ అదంతా ఓట్ల కోసం సింపతీ అనే విమర్శలు చేయడం ప్రారంభించారు. ఈ విషయంపై శివ ఇలా సమాధానం చెప్పాడు. 'ఆ వీడియో పోస్ట్ చేసే సమయానికి ప్రియాంకకు బిగ్ బాస్ ఆఫర్ రాలేదు. నిజానికి ఆమె అక్కడే జన్మించింది. ప్రియాంక నాన్నగారిని వ్యాపారం పరంగా ఆయన స్నేహితుడు మోసం చేయడంతో ఆర్థికంగా భారీగా నష్టపోయారు. ఆ సమయంలో ఆ ఇల్లు అమ్మేసి ప్రస్తుతం బెంగళూరులో ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు. దానికి రూ. 15 వేలు రెంట్ అవుతుంది.. ఆ డబ్బు కూడా ప్రియాంకనే చెల్లిస్తుంది. ప్రియాంక అమ్మగారు ఇప్పుడు కూడా పెళ్లికూతురికి మేకప్ చేయడం.. మెహందీ పెట్టడం వంటివి చేస్తున్నారు. ఆమె నాన్నగారు ఒక చిన్న మొబైల్ షాప్ పెట్టుకుని కొనసాగుతున్నాడు. చాలా పూర్ ఫ్యామిలీ నుంచి ఇంత దూరం ఆమె వచ్చింది. అలాంటి వ్యక్తిపై కూడా ఇలాంటి దారుణమైన ట్రోల్స్ చేయడం ఏంటి..? గేమ్లో భాగంగా వారు కొద్దిసేపు అరుచుకుంటారు.. మళ్లీ కలిసిపోతారు. అంతే గానీ బయట కొందరు పనిగట్టుకుని ఆమెను ఇంతలా ట్రోల్ చేయడం ఏంటి..? ట్రోల్ చేసే వారిలో ఎవరికైనా అన్యాయం చేసిందా అని ఆయన వ్యాఖ్యానించారు. ఆమెను ఎందరు ట్రోల్ చేసినా నేను ఆమెకు తోడుగా ఉంటూనే వాటిని ఎదుర్కుంటాను. అని ఆయన అన్నారు. రేపటి రోజున 'శివాజీ' కూడా స్టార్ మా బ్యాచ్నే ప్రియాంక, శోభ, అమర్ దీప్ను చాలా మంది 'స్టార్ మా బ్యాచ్' అంటూ ట్రోల్ చేస్తూన్నారని శివ తెలిపాడు. ఈ వ్యాఖ్యలు మొదట చేసింది శివాజీ గారే అంటూ ఆయన చెప్పాడు. బిగ్ బాస్ కూడా 'స్టార్ మా' ఛానెల్లోనే వస్తుంది. రేపొద్దున బిగ్ బాస్ పూర్తి అయ్యాక వీరందరూ బయటకు వస్తారు... అప్పుడు శివాజీ, పల్లవి ప్రశాంత్ వంటి వారితో పాటు అందరూ కూడా 'స్టార్ మా బ్యాచ్'నే అవుతారు. ఎందుకంటే వారందరూ కూడా 'స్టార్ మా' ఛానెల్ కోసం పనిచేశారు. అందులో తప్పేముంది..? ఇలాంటి విషయం లేని ట్రోల్స్ చేయడం ఎందుకు..? అని శివ ప్రశ్నించాడు. View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) -
Bigg Boss 7: అనుకున్నట్లే శోభా ఎలిమినేషన్.. కాకపోతే అదొక్కటే అసంతృప్తి!
బిగ్బాస్ 7వ సీజన్ 14వ వారం కూడా పూర్తయిపోయింది. అనుకున్నట్లే శోభాశెట్టి ఎలిమినేట్ అయిపోయింది. అయితే చివరకొచ్చేసరికి కాస్త టెన్షన్ పెట్టారు గానీ అప్పటికే అందరికీ సీన్ అర్థమైపోయింది. అయితే శోభా.. ఎలిమినేట్ కావడం మాటేమో గానీ సడన్గా తనలో ఓ మార్పు చూపించి అందరికీ షాకిచ్చింది. ఇంతకీ ఆదివారం ఏం జరిగిందనేది Day 98 ఎపిసోడ్ హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?) పశ్చాత్తాపం టాస్క్ శనివారం అందరినీ ఓ ఆటాడేసుకున్న హోస్ట్ నాగార్జున.. ఆదివారం వచ్చేసరికి ఫుల్ కూల్ అయిపోయాడు. 14 వారాల్లో ఏ వారం మీరు పశ్చాత్తాపంగా ఫీలయ్యారు? ఎందుకు? అనే చిన్న గేమ్ ఒకటి పెట్టాడు. ప్రియాంక.. 7వ వారంలో భోలెని ఓ మాట అనకుండా ఉండాల్సిందని చెప్పింది. శోభాశెట్టి.. 9వ వారం యావర్ని పిచ్చోడని అనకుండా ఉండాల్సిందని చెప్పింది. అమర్.. 14వ వారం తను ఎందుకలా పిచ్చోడిలా ప్రవర్తించానే అర్థం కాలేదని అన్నాడు. శివాజీ.. 14వ వారంలో ఆడపిల్లల గురించి ఉపయోగించిన పదాలు వ్యక్తిగతంగా ఫీలయ్యాను కానీ మిగతావాళ్లకు అవి టచ్ అయ్యాయని, ఈ విషయంలో పశ్చాత్తాపపడ్డానిని సంజాయిషీ ఇచ్చుకున్నారు. మిగతా వాళ్లందరూ ఒక్క ముక్కలో చెబితే.. శివాజీ మాత్రం సీరియల్ సాగదీసినట్లు చాంతాడంత చెప్పాడు. పోనీ అదైనా చక్కగా ఉందా అంటే.. మొత్తం యాక్టింగే కనిపించింది. ఎవరు ఏం నేర్చుకున్నారు? ఇక పశ్చాత్తాపం గేమ్ పూర్తయిన తర్వాత 14 వారాల్లో ఒక్కో కంటెస్టెంట్.. ఎవరి దగ్గర ఏం నేర్చుకున్నారో చెప్పాలని నాగ్ చెప్పాడు. దీంతో ఫస్ట్ మాట్లాడిన అమర్.. ప్రశాంత్ దగ్గర నుంచి గేమ్ ఆడటం నేర్చుకున్నాను. అర్జున్ దగ్గర నిజాయతీ నేర్చుకున్నానని అన్నాడు. శివాజీ దగ్గర ఓపికగా ఉండటం నేర్చుకున్నానని యావర్ అన్నాడు. అమర్లా ఫౌల్ గేమ్స్ ఆడొద్దని నేర్చుకున్నానని ప్రియాంక చెప్పింది. శివాజీ దగ్గర లౌక్యం, యావర్ దగ్గర పట్టుదల, ప్రశాంత్ దగ్గర కలిసిపోయి నవ్వుతూ మాట్లాడటం, ప్రియాంక దగ్గర నవ్వుతూ మాట్లాడటం నేర్చుకున్నానని అర్జున్ చెప్పాడు. శోభా మాత్రం.. ఎవరి దగ్గర ఏం నేర్చుకోలేదు కానీ ఫోన్ లేకుండా బతకడం నేర్చుకున్నానని డిఫరెంట్గా చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: లేటు వయసులో పెళ్లి చేసుకున్న జైలర్ నటుడు, ఫోటోలు వైరల్) ఫైనలిస్టులుగా వాళ్లు గతవారం టికెట్ టూ ఫినాలే పోటీల్లో గెలిచి చివరివరకు నిలిచిన అర్జున్.. తొలి ఫైనలిస్ట్గా నిలిచాడు. ఇక ఇప్పుడు సేవింగ్, ఎలిమినేషన్ లాంటిది కాకుండా ఎవరెవరు ఫైనలిస్ట్ అయ్యారనేది నాగార్జున ప్రకటించాడు. వరసగా ప్రియాంక, యావర్, అమర్, ప్రశాంత్.. ఫినాలే వీక్లోకి అడుగుపెట్టినట్లు చిన్నచిన్న హింట్స్ రూపంలో రివీల్ చేశారు. చివరగా శోభా-శివాజీ మిగలగా.. కాసేపు సస్పెన్స్ తర్వాత శోభా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. అయితే తాను బయటకెళ్లిపోతానని ముందే తెలుసో ఏమో గానీ పెద్దగా రియాక్ట్ కాలేదు. సైలెంట్గా స్టేజీపైకి వచ్చేసింది. అయితే ఆమె ఓవరాల్ జర్నీ వీడియో చూపించినప్పుడు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంది. అలానే ఇన్నిరోజులు హౌసులో అందరితో పోట్లాడిన శోభా.. ఎలిమినేట్ అయిన తర్వాత మాత్రం శాంతమూర్తిలా అందరి గురించి మంచిగా చెబుతూ కనిపించేసరికి.. ఈమెలో ఏంట్రా ఈ మార్పు అని అనుకున్నారు. అయితే ఎలిమినేట్ అవుతానని తెలియడం వల్లనో ఏమో గానీ శివాజీ, యావర్లని గేమ్స్ పేరుతో ట్రిగ్గర్ చేసి, వాళ్ల నిజస్వరూపాల్ని బయటపెట్టి వెళ్లిపోయింది. ఇప్పుడున్న వాళ్లతో శోభాతో కొన్ని విషయాల్లో బ్యాడ్ అయ్యిండొచ్చు కానీ ఆమెని చివరి వారం కూడా ఉంచుంటే శివాజీని ఆడుకునేది. ఇప్పుడు ఆమె ఎలిమినేట్ అయిపోవడం.. ఆమె అభిమానులకు చిన్న అసంతృప్తిని మిగిల్చింది. ఇకపోతే టాప్-6 సెలబ్రేషన్స్ చేసుకోవడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: ముంబైలో లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లు.. రామ్ చరణ్ ఆస్తులెంతో తెలుసా?) -
Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?
చాలామంది ప్రేక్షకులు ఎప్పటినుంచో తెగ ఆరాటపడుతున్నట్లు.. శోభాశెట్టి ఎలిమినేట్ అయిపోయింది. 14వ వారం బిగ్బాస్ హౌస్ నుంచి బయటకొచ్చేసింది. అయితే ఇది ఆమెకు ఇది పెద్ద షాకింగ్ విషయమేం కాదు. ఎందుకంటే ఇలా జరుగుతుందని ముందే ఊహించింది. ఇంతకీ శోభా ఎలిమినేషన్కి కారణమేంటి? మొత్తంగా రెమ్యునరేషన్ ఎంత సంపాదించింది? శోభా ఎలిమినేషన్ కరెక్టేనా? శోభాశెట్టి.. బిగ్బాస్ ప్రస్తుత సీజన్లో సీరియల్ బ్యాచ్కి లీడర్. ఫస్ట్ నుంచి అమర్-ప్రియాంకకి సపోర్ట్ చేస్తూనే వచ్చింది. లెక్క ప్రకారం చూస్తే ఈమె చాన్నాళ్ల క్రితమే ఎలిమినేట్ అయిపోవాలి. కానీ షో ఆర్గనైజర్స్ అలా చేయలేదు. శోభాశెట్టిలో వీళ్లకు టీఆర్పీ కనిపించింది. దీంతో మోస్తరుగా ఆడినా సరే ఆమెని చివరివరకు లాక్కొచ్చేశారు. ఎందుకంటే అవసరం అలాంటిది మరి. అలానే శివాజీతో ఢీ అంటే ఢీ అనేలా ఫైట్ చేసింది కూడా ఈమె ఒక్కతే. అలాంటి శోభాని ముందే పంపేంచేసి ఉంటే షోలో మజా ఉండేది కాదు. ఇన్నాళ్లకు శోభా అవసరం తీరిపోయింది. దీనికి తోడు ప్రస్తుతమున్న వాళ్లలో ఓటింగ్ శాతం శోభాదే తక్కువ. అలా ఈమె ఎలిమినేట్ అయిపోవాల్సి వచ్చింది. శివాజీ పరువు పాయే ఈ సీజన్లో సీరియల్ బ్యాచ్, శివాజీ బ్యాచ్.. అందరికి అందరూ అలానే తయారయ్యారు. గేమ్స్ పరంగా అర్జున్, ప్రియాంక మినహా ఒక్కరు కూడా తిన్నగా ఆడలేదు. దీని గురించి పక్కనబెడితే 14 వారాలుగా అమర్ని పురుగు కంటే హీనంగా చూసిన శివాజీ.. నోటికి ఎన్ని వస్తే అన్ని మాటలు అన్నాడు. 'పనికిమాలినోడా' లాంటి చీప్ కామెంట్స్ చేశాడు. అయినా సరే అమర్.. వీటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ వారం.. ఓ టాస్క్ సందర్భంగా జస్ట్ పదే పదే నిమిషాల్లో శివాజీని ఆడేసుకుంది. దీంతో సోఫాజీ ట్రిగ్గర్ అయిపోయాడు. కట్ చేస్తే.. ఆడపిల్లల్ని పీకుతా, పీకమీద కాలేసి తొక్కుతా అని శివాజీ చిల్లర కామెంట్స్ చేశాడు. దీంతో ఉన్న ఆ కాస్త పరువు కూడా పోయింది. దీన్ని కవర్ చేసేందుకు ప్రస్తుతం సోషల్ మీడియాలో శివాజీ బ్యాచ్ పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో శోభా సూపర్ ఆడింది అని చెప్పం గానీ ఎలిమినేట్ అయి వెళ్తూ వెళ్తూ శివాజీ పరువు మాత్రం తీసేసి వెళ్లిపోయింది. రెమ్యునరేషన్ ఎంత? సీరియల్ నటిగా శోభాకి కాస్త పేరుంది. అలానే వారానికి రెండున్నర లక్షల రూపాయల చొప్పున రెమ్యునరేషన్ మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. అంటే 14 వారాలకుగానూ మొత్తం రూ.35 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎలిమినేట్ అయినవాళ్ల పరంగా చూసుకుంటే మాత్రం శోభాదే హయస్ట్ అని చెప్పొచ్చు. సో అదన్నమాట విషయం. -
Bigg Boss 7: ప్రశాంత్ మోసాన్ని బయటపెట్టిన నాగ్.. శివాజీ వరస్ట్ బిహేవియర్!
బిగ్బాస్ 7లో శివాజీ ఓ చెదపురుగు. పురుగు వల్ల చెక్క అంతా డ్యామేజ్ అయినట్లు.. సోఫాజీ అలియాస్ శివాజీ వల్ల ఈ సీజన్ తీరే దెబ్బతినేసింది. దీన్ని బాగుచేయడం నాగ్ వల్ల కూడా కాదు. అయినా సరే పెద్దాయన ముసుగు వేసుకున్న ఈయన ఇప్పటికీ తీరు మార్చుకోవడం లేదు. స్వయంగా నాగార్జున.. నువ్వు చేసింది తప్పురా బాబు అని చెబుతున్నాసరే ఒప్పుకోలేదు. శివాజీ ఒక్కడికే కాదు ఇతడి బ్యాచ్ మొత్తానికి గట్టిగా పడ్డాయి. ఇంతకీ శనివారం ఏం జరిగిందనేది Day 97 ఎపిసోడ్ హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. అర్జున్-ప్రియాంక ఫర్ఫెక్ట్ ప్లేయర్స్ వీకెండ్ కాబట్టి వచ్చేసిన నాగార్జున.. శుక్రవారం సంగతులన్నీ చూశాడు. అలా శనివారం ఎపిసోడ్ మొదలైంది. ఇక ఈసారి ఏడుగురు ఇంటి సభ్యుల తప్పుల్ని బయటపెట్టడమే నాగ్ పనిగా పెట్టుకున్నాడు. అయితే ప్రియాంక, అర్జున్ మాత్రం సేవ్ అయ్యాడు. ఫినాలే వీక్కి చేరుకున్నా సరే ఈ వారమంతా గేమ్స్ ఆడి, ఒక్కటంటే ఒక్క తప్పు చేయని అర్జున్.. జస్ట్ ఒకే ఒక్క ఫౌల్ చేసిన ప్రియాంకని నాగ్ మెచ్చుకున్నాడు. దీనిబట్టి చూస్తే ప్రియాంక కూడా ఫినాలే వీక్కి ఆల్మోస్ట్ చేరిపోయినట్లే ఓ క్లారిటీ వచ్చేసింది. (ఇదీ చదవండి: మెగాహీరో రామ్ చరణ్కు మరో గ్లోబల్ అవార్డ్) శోభాకి స్మూత్గా కౌంటర్స్ ఫస్ట్ ఫస్ట్ శోభా ఫేస్ ఉన్న మార్బెల్ పగలగొట్టిన నాగ్, ఆమెని కన్ఫెషన్ రూంలోకి పిలిచాడు. అలా ఆమెతో పర్సనల్గా మాట్లాడాడు. అయితే వెళ్తున్నప్పుడే ఆమె భయపడుతూ వెళ్లింది. దీన్ని పాయింట్ ఔట్ చేసిన నాగ్.. ఎందుకు భయపడుతున్నావ్ అని అడిగాడు. అసలేమైంది? శివాజీతో గొడవ ఎందుకు? అని నాగ్ అడగ్గా.. 'తెలుగమ్మాయిలు కాదు, ఫేవరిజం అని శివాజీ పదేపదే అంటున్నారు. కొన్నికొన్నిసార్లు ప్రియాంక, నాతో వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అలానే ప్రతిసారి గ్రూపిజం, గ్రూపిజం అని అంటున్నారు. దీని గురించి మాట్లాడుదామని అనుకున్నాను కానీ కుదర్లేదు' అని శివాజీతో వాదనపై శోభా దగ్గర క్లారిటీ తీసుకున్నాడు. అయితే నువ్వు అందరినీ డిస్ట్రబ్ చేస్తున్నావ్, ఇంకా చెప్పాలంటే రెచ్చగొడుతున్నావ్ అని నాగ్, శోభాపై సీరియస్ అయ్యాడు. హౌస్ వాతావరణం కూడా నీ వల్ల కలుషితం అయిపోయిందని అన్నాడు. దీంతో శోభా ఏడ్చేసింది. దీంతో నాగ్ రూట్ మార్చాడు. ఆడపిల్ల ఏడిస్తే షోకి మళ్లీ బ్యాడ్ నేమ్ రావొచ్చని.. ఏమైంది శోభా చెప్పు? అని చాలా స్మూత్ గా అడిగాడు. అయితే వెళ్లిపోతానేమోనని భయమేస్తుంది సర్, అందుకే అలా అని నాగ్ ప్రశ్నలకు శోభా ఆన్సర్ చెప్పుకొచ్చింది. యావర్ అస్సలు మారడు శోభా తర్వాత యావర్ ని కన్ఫెషన్ రూంలోకి పిలిచిన నాగ్.. శోభాని 'చీ..థూ' అని అనడంపై సీరియస్ అయ్యాడు. ఆ ప్రవర్తన బాగుందా? వరస్డ్ బిహేవియర్ అని అన్నాడు. మధ్యలో యావర్.. తనది తప్పు కాదని సమర్థించుకోవడానికి తెగ ప్రయత్నించాడు. దీంతో నాగ్ సీరియస్ అయ్యాడు. నిన్ను చూసిన మాకు ఏమనిపించిందంటే.. ఇది యావర్ నిజస్వరూపం, ఇప్పుడు బయటకొచ్చింది అని నాగ్.. యావర్ గురించి స్మూత్గా నిజాలు చెప్పేశాడు. నీది తప్పు, బయటకెళ్లి శోభాకి మనస్పూర్తిగా సారీ చెప్పు అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ గొడవలో శోభాది కూడా తప్పు ఉందని యావర్, మళ్లీ మళ్లీ అదే పాట పాడేసరికి.. ఇక నీకు చెప్పలేను, దండంరా బాబు అని నాగ్ తన విసుగు చూపించాడు. (ఇదీ చదవండి: సెన్సార్ పూర్తి చేసుకున్న సలార్.. పిల్లలకు థియేటర్లలోకి నో ఎంట్రీ!) రైతుబిడ్డ మస్త్ యాక్టింగ్ రైతుబిడ్డని కన్ఫెషన్ రూంలోకి పిలిచిన నాగ్.. అతడి నిజస్వరూపాన్ని, ఆస్కార్ లెవల్ యాక్టింగ్ బయటపెట్టాడు. చెప్పు ప్రశాంత్.. నీకు ఏ వీడియోలు చూపించాలి అని నాగ్ వంగిమరీ దండం పెడుతూ సెటైరికల్గా మాట్లాడాడు. ఎందుకు ప్రశాంత్ నీకు అందరి మీద అపనమ్మకం ఉంది? నువ్వు అడిగిన ప్రతి వీడియో చూపించడానికి ఉన్నాడా బిగ్ బాస్? అని నాగ్ ఫుల్ సీరియస్ అయ్యాడు. నాగ్ విషయం చెప్పడానికి ట్రై చేస్తుంటే.. అతడిని కూడా ఏమార్చడానికి ప్రయత్నించాడు. దీంతో నాగ్.. చెప్పింది వినరా బాబు అని సైలెంట్ చేశాడు. ఇక అమర్ కొరికేశాడని ప్రశాంత్ సీన్ చేసిన విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఫస్ట్ ఏమో బ్లడ్ వచ్చిందని రైతుబిడ్డ అన్నాడు. అయితే డాక్టర్తో ఇప్పుడే మాట్లాడానని చెప్పిన నాగ్.. నో టూత్ మార్క్, నో బ్లడ్ అని అసలు విషయం చెప్పాడు. అదికాదు సర్ చేయి ఉబ్బిపోయిందని రైతుబిడ్డ మాట మార్చేశాడు. మధ్యలో అర్జున్ కూడా పిలిచిన నాగ్.. ప్రశాంత్ని అమర్ కొరకలేదని, జస్ట్ పట్టి వదిలేశాడని చెప్పాడు. జరిగిన దానికి, నువ్వు అక్కడ చేసినదానికి ఎంత సీన్ చేశావ్ తెలుసా? అని నాగ్ ప్రశాంత్పై ఓ రేంజులో రెచ్చిపోయాడు. మిగతా విషయాల్లో ఎంతో నొప్పి భరించావ్ కానీ అమర్ దగ్గరకొచ్చేసరికి తప్పు ఎక్కడ చేస్తాడా అని ఎదురుచూస్తున్నావ్.. అమర్ విషయంలో పెట్టిన శ్రద్ధ ఆట విషయంలో పెట్టుంటే బాగుండేదని నాగ్ అన్నాడు. అలానే ఈ హౌసులో నువ్వు శివాజీ సేవకుడివా? గులంవా? అని నాగ్ సీరియస్ అయ్యాడు. నాగ్ చెబుతుంటే ప్రశాంత్ అడ్డు తగిలాడు. ప్రశాంత్ నువ్వు చేసిందే తప్పు, అటుఇటు తీసుకెళ్లకు అని నాగ్ కౌంటర్ ఇచ్చాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: తెగించేసిన శోభాశెట్టి.. ఆ నిజాలన్నీ ఒప్పేసుకుంది కానీ!) శివాజీ ఓ వరస్డ్ కేండిడేట్ శివాజీని కన్ఫెషన్ రూంలోకి పిలిచిన నాగార్జున.. ఇన్నివారాలు సపోర్ట్ చేసినట్లు కాకుండా సీరియస్ అయ్యాడు. ఇప్పటికీ మాట్లాడకపోతే షోని ప్రేక్షకులు చూడటం మానేస్తారని తెలుసు. అందుకే నాగ్ ఈసారి తెచ్చిపెట్టుకుని మరీ శివాజీపై సీరియస్ అయ్యాడు. ఆడపిల్లలని పీకుతా అని శివాజీ అన్న కామెంట్పై నాగ్.. వివరణ అడిగాడు. ప్రశాంత్ని గత రెండు వారాల నుంచి టార్చర్ చేస్తున్నారని, అందుకే ఆ ముగ్గురిపై(శోభా-అమర్-ప్రియాంక) సీరియస్ అయ్యానని అన్నాడు. నువ్వు చేసింది తప్పు శివాజీ అని నాగ్ బల్లగుద్ది చెబుతున్నాసరే.. తనని తాను చాలా సమర్థించుకున్నాడు. ప్రేక్షకుల్లోని అమ్మాయి తన బాధ చెబుతున్నా సరే.. ఆమెతో కూడా వాదించాడు తప్పితే తాను చేసింది తప్పని శివాజీ ఒప్పుకోలేదు. ఆడపిల్ల తప్పు చేస్తే గొంత మీద కాలేసి తొక్కుతా అని శివాజీ కామెంట్ చేసి మరో వీడియోని నాగ్ చూపించాడు. అయితే అది కోపం, ఫ్రస్టేషన్ వల్ల వచ్చింది బాబుగారు అని శివాజీ నంగనాచి కబుర్లు చెప్పాడు. ఫ్లోలో వచ్చిన మాట తప్పితే.. వాంటెడ్ గా అన్న మాట కాదు అని శివాజీ ఓ పనికిమాలిన రీజన్ చెప్పాడు. దీనిబట్టి శివాజీ.. ఎంత వరస్ట్ కంటెస్టెంట్ అనేది అర్థమైపోయింది. అమర్కి గట్టిగా పడ్డాయ్ ఈ వారం నిజంగా పిచ్చిపట్టిన వాడిలా ప్రవర్తించిన అమర్ని కూడా నాగ్ ఓ రేంజులో ఆడేసుకున్నాడు. ఏమైంది అమర్, నీకు పిచ్చెక్కిందా? కెప్టెన్ గా ఏంటా బిహేవియర్? అని.. ప్రశాంత్ ని తోసుకుంటూ మెడికల్ రూంలోకి తీసుకువెళ్లడంపై నాగ్ సీరియస్ అయ్యాడు. యావర్, ప్రశాంత్ మీదనే ఎందుకలా చేస్తున్నావ్ అని సీరియస్ అయ్యాడు. ఈ మొత్తం వ్యవహారంలో చపాతీలు కలపడం అనే ఓ చిన్న విషయాన్ని నాగ్ తీసుకొచ్చాడు. ఇంత సీరియస్ డిస్కషన్లో నాగ్ దీని గురించి ఎందుకు మాట్లాడాడు అనేది అస్సలు అర్థం కాలేదు. అలానే నిజంగా 'పిచ్చి నా కొడుకు'లానే బిహేవ్ చేస్తున్నావ్ అని అమర్ ప్రవర్తన గురించి తన కోపాన్ని బయటపెట్టాడు. నన్ను కూడా బయట ఇద్దరు ముగ్గురు అడిగారు.. అమర్ ఎందుకలా సైకోలా బిహేవ్ చేస్తున్నాడని నాగ్ తనకెదురైన సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈవారం సేవింగ్ లాంటివి ఏం ఉండవు, ఫినాలేకి వెళ్లేది ఎవరో చెప్పడం మాత్రమే ఉంటుందని నాగ్ క్లారిటీ ఇవ్వడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. అయితే ఇప్పటికే శివాజీ బ్యాచ్ని నాగార్జున వెనకేసుకొస్తున్నాడని అందరికీ క్లియర్ గా అర్థమైంది. ఇప్పటికీ వాళ్లని తిట్టకపోతే షో పరువు పోతుందని నాగ్ తిట్టినట్లు అనిపించింది అంతే. (ఇదీ చదవండి: శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో అంటూ శివాజీ చిల్లర వ్యాఖ్యలు) -
Bigg Boss 7: తెగించేసిన శోభాశెట్టి.. ఆ నిజాలన్నీ ఒప్పేసుకుంది కానీ!
మిగతా సీజన్లతో పోలిస్తే గొడవలు, గ్రూపుల గోల వల్ల బిగ్బాస్.. ఈసారి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. అయితే ఈ మొత్తం వివాదంలో శోభాశెట్టి అనే ఓ క్యారెక్టర్ వల్ల ఎక్కడలేని మజా వచ్చింది. ఈసారి ఆమె ఎలిమినేట్ అయిపోయిందని అంటున్నారు. సరే దాని గురించి పక్కనబెడితే మాత్రం.. కొన్ని నిజాల్ని స్వయంగా నాగార్జున ముందే ఒప్పేసుకుంది. కాకపోతే హోస్ట్కే బొమ్మ చూపించింది. శోభా ట్రాపులో నాగార్జున 14వ వారం వీకెండ్కి వచ్చేసింది. అంటే మరో వారం రోజుల పాటు షో నడుస్తుంది అంతే. ఈ విషయం శోభాకి కూడా తెలుసు. ఎలానూ కప్ గెలుస్తానని నమ్మకం అయితే లేదు. ఏదైతే అది అయిందని చెప్పి, మొత్తానికే తెగించేసింది. వీకెండ్ వస్తే నాగార్జున.. కచ్చితంగా అడుగుతాడని తెలిసే శివాజీ, యావర్తో కావాలనే గొడవలు పెట్టుకుంది. కరెక్ట్గా ఆమె ఊహించినట్లే నాగ్.. వీటి గురించే అడిగి శోభా ట్రాపులో పడ్డాడు. (ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ.. అక్కడే స్ట్రీమింగ్..) ఫేవరిజం నిజమే! శివాజీ సరే.. ఫేవరిజం అని ప్రతిసారి అంటున్నారు. నాక్కూడా క్లారిటీ కావాలని ఆయన్ని అడుగుదామనుకున్నానని శోభా.. నాగార్జునతో శోభా చెప్పింది. మరి టాస్క్ సందర్భంగా ప్రియాంకని నువ్వు ఎంకరేజ్ చేయడం కరెక్టేనా? అని నాగ్ అడిగితే.. అవును ప్రియాంక అంటే ఇష్టం, అందుకే సపోర్ట్ చేశానని శోభా ఒప్పుకొంది. అలా తన బ్యాచ్ అంటే ఫేవరిజం ఉందని పరోక్షంగా అంగీకరించింది. ఇంకా డెప్త్గా నాగ్ అడుగుతుండేసరికి.. ఈ వారం నా మైండ్ అంతా డిస్ట్రబెన్స్గా ఉందని చెప్పి మొత్తం సీన్ మార్చేసింది. దీంతో నాగ్ కూడా ఏం అనలేకపోయాడు. శోభాకి అది ముందే తెలుసా? బహుశా శోభాకి కూడా ఈసారి తానే ఎలిమినేషన్ అవుతానని ముందే తెలిసినట్లుంది. అందుకే మొత్తానికే తెగించేసి.. ఏదైతే అది అవుతుందని తెలిసి అందరితో గొడవలు పెట్టేసుకుంది. మరీ ముఖ్యంగా తనని మొదటి నుంచి ఇబ్బంది పెడుతున్న శివాజీ, యావర్కి రైట్ లెఫ్ట్ ఇచ్చిపడేసింది. ఈమె దెబ్బకు వీళ్లిద్దరూ అసలు రంగు బయటపడింది. దీని వల్ల శోభా కంటే వాళ్లిద్దరికే డ్యామేజ్ ఎక్కువ ఉండొచ్చు. తీరా వీటన్నింటి గురించి నాగ్ అడిగేసరికి.. మైండ్ డిస్ట్రబ్ అని ప్లేట్ మార్చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో శోభా.. తను అనుకున్నది సాధించినట్లే కనిపిస్తోంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో అంటూ శివాజీ చిల్లర వ్యాఖ్యలు) -
శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో అంటూ శివాజీ చిల్లర వ్యాఖ్యలు
Bigg Boss 7 Day 96 Highlights: బిగ్ బాస్లో ప్రస్తుతం వరుసగా కొట్లాటలు.. గొడవలు.. భారీగానే జరుగుతున్నాయి. మొదటి నుంచి SPY బ్యాచ్లో ఎలాంటి గొడవలు లేకుండా గ్రూప్గానే గేమ్ ఆడుతూ వస్తున్నారు. అదే విధంగా SPA బ్యాచ్ కూడా గ్రూప్ గేమ్ ఆడుతూనే ఇంత వరకు వచ్చింది. కానీ వీరిలో యూనిటి మాత్రం ఎక్కడా కనిపించలేదు. స్నేహితులం అని చెప్పుకుంటున్న వీరి మధ్య కూడా పొరపచ్చాలు వస్తున్నాయి. శోభపై మాటలు తూలిన శివాజీ.. గొంతుపై కాలేసి తొక్కుతా అంటూ బిగ్ బాస్లో ఓట్ అప్పీల్ కోసం ఫన్నీ టాస్క్లు జరుగుతున్నాయి. ఇప్పటికే శోభ,అర్జున్ ఓట్ అప్పీల్ చేసుకున్న విషయం తెలిసిందే. ఓట్ అప్పీల్ కోసం జరుగుతున్న ఫన్సీ గేమ్స్లో శివాజీ,శోభ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో శివాజీ చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరంగా ఉన్నాయి. ఒకానొక సమయంలో బాల్ టాస్క్ ఆడలేనని చెప్పి బయటకు వచ్చేస్తాడు. అసలు శివాజీ ఆడేదే కన్నింగ్ గేమ్.. యావర్, ప్రశాంత్ను వెంటేసుకుని ఇతరులపై నాలుగు పిచ్చి మాటలు విసురుతాడు. కానీ ఎప్పుడూ కూడా శివాజీపై బిగ్ బాస్ కిమ్మనడు. దీనినే అలుసుగా తీసుకున్న శివాజీ తాజాగా జరిగిన బాల్ టాస్క్ విషయంలో శోభపై ఫైర్ అవుతాడు. చిల్లరోళ్లు, క్యారెక్టర్ లెస్, మేము పీకేదానికి ఉన్నామా..? అంటూ శివాజీ రెచ్చిపోతాడు. రేపు శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో... వాడు భయపడిపోడా..? అంటూ అవసరం లేని మాటలు శివాజీ వాగుతాడు. పెళ్లి తర్వాత ఇలాగే ఉంటే అంటూ టాపిక్కు సంబంధంలేని వ్యాఖ్యాలు చేశాడు శివాజీ. ప్రియాంక, శోభను ఉద్దేశిస్తూ.. ఇలాంటి ఆడపిల్లలను ఎక్కడా చూడలేదు.. అదే మన ఇంట్లో ఇలాంటి వాళ్లుంటే గొంతుమీద కాలు వేసే తొక్కేవాడినంటూ నీచమైన వ్యాఖ్యలు చేశాడు. ఇదే క్రమంలో శివాజీని కూడా శోభ పదేపదే ట్రిగ్గర్ చేస్తూ మాట్లాడుతుంది. దానిని సంహించలేని శివాజీ ఇలా వ్యక్తిగతంగా మాట్లాడటం ఏ మాత్రం కరెక్ట్ కాదని చెప్పవచ్చు. ఓట్ అప్పీల్ చేసుకున్న శివాజీ ఓట్ అప్పీల్ చేసుకునేందుకు అర్జున్. శివాజీ పోటీ పడుతారు. అప్పటికే అర్జున్ ఓట్ అప్పీల్ చేసుకోవడం వల్ల హౌస్లోని కంటెస్టెంట్లు అందరూ శివాజీకే ఓట్ అప్పీల్ అవకాశం దక్కేలా సపోర్ట్ చేస్తారు. తర్వాత ఆయన ఓట్ అప్పీల్ చేసుకుంటాడు. తన గేమ్ నచ్చితే ఓట్ వేయాలని ఆయన కోరుతాడు. SPA బ్యాచ్లో గొడవలకు కారణమైన శోభ బిగ్ బాస్లో ఒక యాడ్కు సంబంధించిన టాస్క్లో అమర్, శోభ మధ్య గొడవ జరుగుతుంది. హౌస్లో రెండు గ్రూపులుగా డివైడ్ చేసి.. ఒక బ్యాచ్లో ప్రియాంక, శివాజీ, ప్రశాంత్ ఉంటారు. మరోక బ్యాచ్లో శోభ,యావర్,అర్జున్ ఉంటారు. సంచాలక్గా అమర్ ఉంటాడు. వీరికి ఇచ్చిన టాస్క్లో వండర్ ఉమెన్గా ప్రియాంకను విన్నర్గా ప్రకటిస్తాడు అమర్ దీంతో శోభకు కోపం రావడం.. ఆపై అమర్ నిర్ణయాన్ని తప్పుపట్టిన శోభ గొడవకు దిగుతుంది. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని చెప్పవచ్చు. అక్కడ గెలిచింది ప్రియాంకనే కదా... మనం అనే విషయాన్ని మరిచిపోయి అమర్తో గొడవకు దిగుతుంది. అప్పుడు అమర్ కూడా పక్కన వాళ్లను చూసి నేర్చుకో ఎలా ఉండాలో అని చెబుతాడు. ఇలా SPA బ్యాచ్లో చిచ్చు పెట్టిన వ్యక్తిగా శోభ మిగిలిపోయింది. Sivaji crossed all the limits today. 40 seconds of utter garbage🤮 Ammayila character nunchi valla marriage life varaku neechamga dhigajaaripoyi maatladadu @StarMaa @iamnagarjuna#Sivaji #BiggBoss7Telugu#biggbosstelugu7 pic.twitter.com/SK59Km9Xo4 — Betty🌶️ (@BinduFanBettyyy) December 8, 2023 -
కంట్రోల్ తప్పిన అమర్.. ప్రశాంత్ను కొరికి నెట్టేస్తూ..
బిగ్బాస్ తెలుగు 7వ సీజన్లో 94 రోజులు గడిచిపోయాయి. దాదాపు శుభం కార్డు పడే సమయం వచ్చేసింది. ఉల్టా పుల్టా పేరుతో వచ్చిన ఈ సీజన్ పేరుకు తగినట్లే జరిగింది. ఒక ఎపిసోడ్లో ఫైర్ ఉంటే.. మరో ఎపిసోడ్లో ఫన్ ఉంటుంది. కానీ ఒక్కోసారి ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారు. గురువారం ఎపిసోడ్ అయితే అమర్, ప్రశాంత్ మధ్య మాటల యుద్ధమే నడిచింది. Day 95 హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. అమర్ Vs అర్జున్ టాస్క్లో భాగంగా ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశాన్ని బిగ్ బాస్ కల్పించాడు. అందుకు రీచ్ కావాలంటే కొన్ని ఫన్ టాస్క్లలో గెలవాలని రూల్ పెట్టాడు. వాటిలో అమర్, అర్జున్ ఇద్దరూ గెలిచి ఓట్ అప్పీల్ రేసులోకి వచ్చారు. వారిద్దిరిలో ఒకరిని ఎంపిక చేసి ఓట్ అప్పీల్ అవకాశం ఎవరికి కల్పిస్తారో అనే అంశాన్ని మాత్రం ఓట్ల ప్రాతిపదికన కంటెస్టెంట్ల చేతిలో పెట్టాడు బిగ్ బాస్. ఈ క్రమంలో ఎక్కువ ఓట్లు అర్జున్కు రావడంతో ఆయన ఓట్ అప్పిల్ చేసుకున్నాడు. యావర్,పల్లవి ప్రశాంత్, శివాజీ ముగ్గురూ అర్జున్కు సపోర్ట్ చేస్తే... శోభ,ప్రియాంక ఇద్దరూ అమర్కు సపోర్ట్ చేశారు. దీంతో అర్జున్కు మెజారిటీ వచ్చింది. ఈ ఓటింగ్ విషయంలో కూడా SPY బ్యాచ్లోని ముగ్గురితో అమర్ చిన్నపాటి గొడవకు దిగాడు. దీనికి ప్రధాన కారణం అతను ఈ వారం ఎలిమినేషన్లో ఉండటం... అర్జున్ లేకపోవడం. దీంతో ఓట్ అప్పీల్ అవకాశం తనకు కల్పించాలని అమర్ బలంగా కోరాడు కానీ SPY బ్యాచ్ ఈ విషయంలో అమర్కు ఎలాంటి సాయం చేయలేదు. శోభ ట్రాప్లో యావర్.. ఛీ.. ఛీ.. అంటూ ఫైర్ ఓట్ అప్పీల్ కోసం మరో టాస్క్ను బిగ్ బాస్ ఇచ్చాడు. హౌస్లోని కంటెస్టెంట్లు అయిన అందరికీ టీ షర్ట్స్ ఇస్తాడు బిగ్ బాస్. ఒక బార్డర్ లైన్లో వారందరూ ఉంటూ వారి వద్ద ఉన్న బాల్స్ను తను ప్రత్యర్థులు అనుకున్న వారిపై విసరాలి.. అవి ఎవరి టీ షర్ట్కు ఎక్కువగా అంటుకుంటాయో వారు ఆ రౌండ్ నుంచి ఎలిమినేషన్ అయినట్లు అని రూల్స్ పెడుతాడు బిగ్ బాస్. ఈ క్రమంలో మొదట శోభపై యావర్ అటాక్ స్టార్ట్ చేస్తాడు. అదే సమయంలో ఆమె కూడా అతనిపై ఫైట్ చేస్తుంది. ఈ సమయంలో యావర్ కోపంతో రెచ్చిపోయి శోభపై ఫైర్ అవుతాడు. కానీ శోభ చాలా తెలివిగా యావర్ను బార్డర్ లైన్ దాటేలా చేస్తుంది. కావాలనే ఆట నుంచి ఆమె బయటకు వస్తుంది. కోపంలో ఉన్న యావర్ అదేమి గమనించకుండా లైన్ క్రాస్ అవుతాడు. దీంతో బిగ్ బాస్ ఇద్దరినీ ఎలిమినేట్ చేస్తాడు. అప్పుడు యావర్ కంట్రోల్ తప్పిపోయి శోభపై ఛీ.. ఛీ.. ఛీ.. అంటూ రెచ్చిపోతాడు. పదే పదే అదే మాటను యావర్ ఉపయోగించడం చాలా తప్పుగా ఉంటుంది. చివరకు శివాజీ కూడా యావర్ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాడు. కంట్రోల్ తప్పిన అమర్.. పల్లవి ప్రశాంత్ సూపర్ ఇదే బాల్ టాస్క్లో అమర్ Vs పల్లవి ప్రశాంత్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. గేమ్లో భాగంగా మొదట ప్రశాంత్ వద్దకు అమర్ వెళ్తాడు. ఇద్దరూ టాస్క్లో ఫిజికల్ అవుతారు. ఈ క్రమంలో అమర్ గొంతును ప్రశాంత్ పట్టుకుంటే.. అతని చెయిని అమర్ కొరుకుతాడు. కానీ అది ఆటలో అనుకోకుండా జరిగినట్లు భావించవచ్చు. కానీ ఇదే విషయంలో ఇద్దరూ మాటకు మాట పెరుగుతుంది. ఎవరు ఎవర్నీ కొట్టారో తెలుసుకోవాలంటే మెడికల్ రూమ్కు పోదాం పదండి అన్నా అంటూ ప్రశాంత్ అంటాడు. ఆ సమయంలో అమర్ కంట్రోల్ తప్పుతాడు. ఎదుట ఉండేది ఒక కంటెస్టెంట్ అనే విషయాన్ని అమర్ మరిచిపోయినట్లు ఉన్నాడు. ప్రశాంత్ వీపుపై చెయ్యి పెట్టిన అమర్ పదే పదే తోస్తూ మెడికల్ రూమ్కు పదా అంటూ నెట్టేస్తాడు. ఆ సమయంలో ప్రశాంత్ పట్ల అమర్ చాలా రూడ్గా ప్రవర్తించాడు. తన గొంతును గట్టిగా పట్టుకున్నాడని చెప్పుకొస్తున్న అమర్ కంట్రోల్ తప్పి భారీగానే రెచ్చిపోయాడు. ప్రశాంత్, ఆమర్ మధ్య చాలా సేపు మాటలు యుద్ధం జరిగింది. కానీ ఎక్కడా కూడా ప్రశాంత్ కంట్రోల్ తప్పి మాట్లడలేదు.. పదే పదే అమర్ను అన్నా అంటూ తన వాదనను చెప్పుకొస్తున్నాడు. కానీ అమర్ మాత్రం రెచ్చ గొట్టకు రా అంటూ ప్రశాంత్పై ఫైర్ అవుతున్నాడు. తనను తాను ఏ మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోయిన ఆమర్ పూర్తిగా ట్రాక్ తప్పాడు. ఆ సమయంలో అతను ఏం మాట్లాడుతున్నాడో కూడా గ్రహించలేకపోయాడు.. అలా కోపంలో ఉన్న అమర్ను చూస్తే ఎవరికైనా భయం వేయడం ఖాయం. అంతలా కంట్రోల్ తప్పాడు.. ఆ కోపంలో ఒకానొక సమయంలో ఏమైనా చేసుకుంటా అంటూ రెచ్చిపోయాడు. ఈ విషయంలో అతనిపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. -
Bigg Boss 7: రైతుబిడ్డకు ఇచ్చిపడేసిన అర్జున్.. దెబ్బకు సైలెంట్!
బిగ్బాస్ 7వ సీజన్ అయిపోవడానికి ఇంకా 10 రోజులే ఉంది. ఇలాంటి టైంలో షోని ఎంత ఇంట్రెస్ట్గా డిజైన్ చేయాలి. కానీ నిర్వహకులకు అలాంటి ఆలోచనే లేనట్లు ఉంది. ఎందుకంటే మంగళవారం ఎపిసోడ్ అంతంత మాత్రంగా ఉంది. తాజాగా బుధవారం ఎపిసోడ్ అయితే ఏ విషయంలోనూ అలరించలేకపోయింది. కొద్దొగొప్పో అర్జున్-ప్రశాంత్ గొడవ మాత్రమే ఆసక్తిగా అనిపించింది. ఇంతకీ లేటెస్ట్గా ఏం జరిగిందనేది Day 94 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7' టైటిల్ విజేత రేసులో ఆ ముగ్గురు.. కానీ?) అర్జున్ కేక్ టాస్క్ శోభా.. ఓటు అప్పీలు చేసుకోవడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే బుధవారం ఎపిసోడ్ మొదలైంది. ప్రియాంక-శోభా-అమర్.. కాసేపు తమలో తామే వాదించుకున్న తర్వాత ఊరుకున్నారు. కాసేపటి తర్వాత 2 కిలోల కేక్ పంపించి, అర్జున్ ఒక్కడే దీన్ని తినాలని బిగ్బాస్ ఆర్డర్ వేశాడు. కొంత తిన్నాడు, ఆ తర్వాత వల్ల కావట్లేదనేసరికి ఎవరిదైనా సహాయం తీసుకుంటారా అని అడగ్గా.. యావర్ పేరు చెప్పాడు. అలా వీరిద్దరూ కేక్ మొత్తం తినేశాడు. దీంతో రేపు(గురువారం).. ఇంటి సభ్యుల కోసం కేక్ పంపిస్తానని బిగ్బాస్ చెప్పాడు. పిల్లలని ఆడించే గేమ్ ఎపిసోడ్ని ఎలా టైమ్ పాస్ చేయాలా అని బాగా ఆలోచించిన బిగ్బాస్.. తనకు కవల పిల్లలు ఉన్నారని, నేను బయటకెళ్లి వచ్చేలేపు కాసేపు వాళ్లని ఆడించాలని చెప్పాడు. అందుకోసం రెండు చిన్నపిల్లల బొమ్మల్ని పంపించాడు. అయితే ఇందులో అర్జున్ ఒక్కడే కాస్త ఎంటర్టైన్ చేశాడు. మిగతా వాళ్లందరూ చేతులెత్తేశారు. దీని తర్వాత 'చెర్రీ ఆన్ ద టాప్' అని ఓ గేమ్ పెట్టి, ఇందులో భాగంగా చెర్రీ పండు పడిపోకుండా ఇసుకతో చేసిన కేక్, ఒక్కొక్కరుగా కట్ చేయాలని అన్నాడు. ఇందులో విజేతగా నిలిచిన అమర్.. ఓటు అప్పీలు చేసుకునే ఛాన్సుకు దగ్గరయ్యాడు. (ఇదీ చదవండి: 'పుష్ప' నటుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?) అర్జున్-ప్రశాంత్ గొడవ ఇక ఓటు అప్పీలు చేసుకునేందుకు మరో గేమ్ ఉందని, కాకపోతే దీన్ని ఒక్కరే ఆడాల్సి ఉంటుందని.. దీనికోసం ఎవరైతే ముందుగా గంట మోగిస్తారో వాళ్లకు ఛాన్స్ దక్కుతుందని బిగ్బాస్ చెప్పాడు. అయితే గంట మోగించాలని పరుగెత్తే క్రమంలో అర్జున్.. చేతుల వెనక్కి ఊపుతూ వేగంగా పరుగెత్తాడు. పోటీలో గెలిచి టాస్క్ కూడూ పూర్తి చేశాడు. అయితే పరుగెత్తే క్రమంలో అర్జున్ చేయి, అతడి పక్కనే ఉన్న ప్రశాంత్ని కాస్త గట్టిగా తగిలేసినట్లు ఉంది. దీంతో రైతుబిడ్డ నానా హంగామా చేశాడు. ఎందుకు ఆపేశావ్ అన్నా అని గట్టిగట్టిగా అరిచాడు. దీంతో ఎప్పుడూ సైలెంట్గా ఉండే అర్జున్ కూడా రెచ్చిపోయాడు. నిన్న(మంగళవారం).. పూల్లో డ్యాన్స్ చేసే టాస్క్ కోసం పరుగెత్తినప్పుడు నీ చేయి నాకు తగిలింది, నేను అడిగానా? అని లాజిక్ మాట్లాడాడు. రైతుబిడ్డ దగ్గర ఆన్సర్ లేదు. అర్జున్.. నిన్నటి దాని గురించి అడుగుతుంటే ప్రశాంత్ మాత్రం ఇప్పటి దాని గురించి పదేపదే అడిగాడు. అర్జున్ మరింత గట్టిగా లాజిక్స్ మాట్లాడేసరికి ప్రశాంత్ సైలెంట్ అయిపోయాడు. ఇక అర్జున్, అమర్.. వీళ్లిద్దరిలో ఓటు అప్పీలు చేసుకునే ఛాన్స్ ఎవరికి దక్కిందనేది గురువారం ఎపిసోడ్లో తేలుస్తుంది. (ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ బావతో 'యానిమల్' బ్యూటీ డేటింగ్?) -
'బిగ్బాస్ 7' టైటిల్ విజేత రేసులో ఆ ముగ్గురు.. కానీ?
బిగ్బాస్ 7వ సీజన్ చివరకొచ్చేసింది. ప్రస్తుతం 14వ వారం నడుస్తోండగా, మరో 10 రోజుల్లో షో పూర్తి అయిపోతుంది. ఈ క్రమంలోనే విన్నర్ ఎవరవుతారనే కుతుహలం ఉండటం పక్కా. అందుకు తగ్గట్లే నిర్వహకులు.. ఉన్న ఏడుగురితో గేమ్స్ అవీఇవీ అని టైమ్ పాస్ చేస్తున్నారు. కానీ టైటిల్ రేసులో మాత్రం ముగ్గురే ఉన్నారు. (ఇదీ చదవండి: 'పుష్ప' నటుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?) మిగతా సీజన్లతో పోలిస్తే ఈసారి బిగ్బాస్ అనుకున్నంత ఇంట్రెస్ట్ లేకుండానే సాగుతోంది. శివాజీ బ్యాచ్, సీరియల్ బ్యాచ్.. ఒకరిపై ఒకరు అరుచుకోవడం తప్పితే ఓ ఎంటర్టైన్మెంట్ సరిగా లేదు, ఓ లవ్ ట్రాక్ లేదు. ఎమోషనల్గా ఫీలయ్యే సంఘటన లేదు. ఎలాగోలా ఎపిసోడ్స్ టెలికాస్ట్ చేస్తున్నారు తప్పితే చాలా బోర్ కొట్టించేస్తున్నారు. ఏదైతేనేం షో చివరకు వచ్చేశాం. విజేత ఎవరనేది మరో 10 రోజుల్లో తేలిపోతుంది. అయితే గడిచిన వీకెండ్ సందర్భంగా నిర్వహకులు ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఈ రెండు వారాలు కూడా ఓటింగ్ లైన్స్ తెరుచుకునే ఉంటాయని, ఎక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్.. బిగ్బాస్ 7 విజేతగా నిలుస్తారని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఓటింగ్ నంబర్స్ చూసుకుంటే.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ 34 శాతం ఓట్లతో టాప్ లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ బావతో 'యానిమల్' బ్యూటీ డేటింగ్?) ప్రశాంత్ తర్వాత శివాజీ, అమర్దీప్ దాదాపు 20 శాతం ఓటింగ్ పర్సంటేజ్తో ఉన్నారు. ఆ తర్వాత వరసగా యావర్, అర్జున్, ప్రియాంక, శోభాశెట్టి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ లిస్టులోని తొలి ముగ్గురిలోనే స్థానాలు అటుఇటు మారాలి తప్పితే మిగతా వాళ్లు.. టాప్-3లోకి వచ్చే ఛాన్సులు తక్కువ. అంటే ప్రశాంత్, శివాజీ, అమర్లలో ఎవరో ఒకరే విజేత అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్లే విజేత అని బిగ్బాస్ నిర్వహకులు చెప్పారు. కానీ రాబోయే 10 రోజుల్లో ఏమైనా జరగొచ్చు. లెక్కలు మార్చొచ్చు. ఎన్ని లెక్కలు మారినా సరే ప్రశాంత్ లేదంటే అమర్ విజేత అయితే పెద్దగా సమస్య ఉండదు. శివాజీకి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మిగతావాళ్లతో పోలిస్తే.. మనోడు చాలా విషయాల్లో పూర్. ఏదో మాటలతో లాక్కోచ్చేస్తున్నాడు అంతే! ఏదైతేనేం టైటిల్ కోసం పోటీ మంచిగా నడుస్తోంది. మరి ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారని మీరనుకుంటున్నారు? (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ.. కాబోయే భర్త పోలీస్ ఇన్స్పెక్టర్!) -
Bigg Boss 7: అపరిచితుడులా ప్రవర్తిస్తున్న అమర్.. ప్రియాంకతో అలాంటి సిల్లీ గొడవ!
బిగ్బాస్ 14వ వారం నామినేషన్స్ ఒకేరోజులో పూర్తయ్యాయి. కానీ అమర్-ప్రశాంత్ గొడవ మాత్రం రాత్రంతా నడుస్తూనే ఉంది. 'ఓట్ ఫర్ అప్పీల్' అనే టాస్క్ పెట్టిన బేసిక్ లాజిక్ మర్చిపోయి మరీ ప్రేక్షకుల్ని పిచ్చోళ్లని చేశాడు. శోభా అయితే ఓటు అడిగే విషయంలో అవసరం లేకపోయినా సరే ఎమోషనల్ అయిపోయింది. ఇంతకీ మంగళవారం ఏం జరిగిందనేది Day 93 హైలైట్స్లో చూద్దాం. రైతుబిడ్డ ఎదురుదెబ్బ నామినేషన్స్లో అర్జున్ తప్ప మిగతా వాళ్లంతా ఉన్నారని బిగ్బాస్ చెప్పడంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే మంగళవారం ఎపిసోడ్ మొదలైంది. నామినేషన్స్లో భాగంగా 'అమ్మాయిలా మాట్లాడుతున్నావ్' అని అర్థమొచ్చేలా ప్రశాంత్, అమర్తో అన్నాడు. తననే 'ఆడోడు' అని అంటావా? అని అమర్.. అదే పదాన్ని పదేపదే చెబుతూ ప్రశాంత్ని రెచ్చగొట్టాడు. సెటైర్స్ కూడా వేశాడు. కాసేపటి తర్వాత ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో హిట్ సినిమా) ఓటు అప్పీలుకు ఛాన్స్ చిల్ పార్టీ పేరుతో కొన్ని గేమ్స్ ఉంటాయని చెప్పిన బిగ్బాస్.. ఇందులో గెలిచిన వాళ్లకు ఓటు అడిగే ఛాన్స్ దక్కుతుందని చెప్పాడు. అలా పాట ప్లే కాగానే.. బెంచ్పై వస్తువుల్లో ఒకదాన్ని తీసుకుని స్విమ్మింగ్ పూల్లో దూకాల్సి ఉంటుందని బిగ్బాస్ చెప్పాడు. ఈ పోటీలో చివరివరకు నిలిచిన యావర్ విజేతగా నిలిచాడు. ఇక కలర్స్ జంపింగ్ గేమ్లో అందరూ తడబడ్డారు కానీ శోభా చివరివరకు ఉండి విన్నర్ అయింది. అమర్ కాదు అపరిచితుడు ఈ గేమ్ అయిపోయిన తర్వాత శోభా, ఓ టెడ్డీ బేర్ తీసుకుని రూంలోకి వచ్చింది. అక్కడే అన్న అమర్-ప్రియాంకతో కాసేపు మాట్లాడింది. ఆ తర్వాత ప్రియాంక.. సరదాగానే తలగడతో అమర్ ముఖంపై కొట్టింది. సీరియస్ అయిపోయిన అమర్.. అలిగి బయటకెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత లోపలికి వచ్చాడు. అప్పుడు ప్రియాంక-శోభా లేచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి హర్ట్ అయిన అమర్.. ఏమైంది? మాట్లాడకపోతే మాట్లాడొద్దు అని ప్రియాంకపై సీరియస్ అయ్యాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్న రైతుబిడ్డ.. ఎదురుదెబ్బ తగిలేసరికి!) అమర్ అలా అనేసరికి ప్రియాంక ఊరుకోలేదు. రిటర్న్లో గట్టిగానే ఇచ్చేసింది. ఏం మాట్లాడుతున్నావ్? అదీ ఇదీ అని అమర్కి ఆన్సర్ ఇచ్చింది. బొమ్మలకు ఉన్న విలువ మనుషులకు లేకుండా పోయింది, స్ట్రెయిట్గా చేయాల్సిన పని స్ట్రెయిట్గా చేయవ్ అని అమర్, ప్రియాంకని ఉద్దేశిస్తూ అన్నాడు. ఎందుకు గతవారం జరిగిన విషయాన్ని ఇప్పుడు తీస్తున్నావ్ అని ప్రియాంక రెచ్చిపోయింది. ఈ గొడవలోకి ఎంటరైన శోభా.. మా ఇద్దరి మీద నీకో ఏదో ఉంది, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావ్ అని అమర్కి కౌంటర్ ఇచ్చింది. అయితే ఇదంతా కూడా కంటెంట్ ఇవ్వాలని చేశారా అనే సందేహం వచ్చింది. ఎందుకంటే ఈ ఇష్యూ అంతా అయిపోయిన తర్వాత అర్జున్ మాట్లాడుతూ.. టైమ్ పాస్ కావట్లేదా మీ ముగ్గురికి? అని చిన్న సెటైర్ వేసి నవ్వేశాడు. ఓటు ఫర్ అప్పీలు టాస్క్ పోటీల్లో గెలిచిన యావర్, శోభా.. ఇద్దరు కూడా 'ఓటు ఫర్ అప్పీలు' చేసుకోవాలని, కాకపోతే ఇద్దరిలో ఒకరికి మాత్రమే అవకాశముంటుందని బిగ్బాస్ ఫిట్టింగ్ పెట్టాడు. శోభాకి తక్కువ ఓట్లు పడిన కారణంగా.. అప్పీలు చేసుకునే ఛాన్స్ ఆమెకి దక్కింది. దీంతో.. 'అందరికీ నమస్కారం. నేను 'కార్తీకదీపం' మోనితగానే మీకు తెలుసు. బిగ్బాస్లో చూసేవాళ్లకు శోభాశెట్టిగా తెలుసు. ఇక్కడ మీరు నాకు చాలాచాలా సపోర్ట్ చేశారు. ఈ రోజు నా ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఉన్నాం. కడుపు నిండా తింటున్నాం అంటే మీ అందరీ సపోర్ట్ కారణం. థ్యాంక్యూ సోమచ్ ఫర్ ద సపోర్ట్. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఎలిమినేషన్ హింట్ ఇచ్చేసిన బిగ్బాస్.. ఆ ఇద్దరిలో ఒకరు ఔట్?) 6వ సీజన్ వరకు అబ్బాయిలే గెలిచారు. సీజన్ 7లో నేను గెలవాలి, టైటిల్ కొట్టుకుని వెళ్లాలి. ఈ సీజన్ లో ఉల్టా పుల్టాలో అమ్మాయిగా నేను గెలవాలి అనేది ఒకత్తైతే.. బిగ్బాస్ గెలిస్తే వచ్చే అమౌంట్ గానీ వేరే ఏదైతే ఉందో నాకు చాలా ఇంపార్టెంట్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. నాకు తెలియకుండా ఏదైనా తప్పు చేసుంటే ప్లీజ్ క్షమించండి. ప్లీజ్ ఓటు చేయండి' అని శోభా.. ప్రేక్షకుల్ని ఓట్లు అడుక్కుంది. ఇక ఓటు ఫర్ అప్పీలు టాస్క్లో ఏ ఒక్కరు ఉండాలని.. ఇంటి సభ్యులు డిసైడ్ చేస్తున్న టైంలో ప్రియాంక-శోభా మధ్య చిన్నపాటి వాదన జరిగింది. యావర్ నువ్వు నెక్స్ట్ గేమ్లో గెలిచి, మళ్లీ ఈ ప్లేసులో నిల్చుంటావ్! అందుకే నేను శోభాకి ఇవ్వాలనుకుంటున్నాని ప్రియాంక కారణం చెప్పింది. అంటే నేను వీక్గా ఉన్నానా.. ప్రియాంక మాటల్ని నెగిటివ్గా తీసుకుంది. దీంతో కాసేపు గొడవ జరిగింది. ఈ రోజు ఎపిసోడ్లో మిగతా సోది అంతా పక్కనబెడితే సీరియల్ బ్యాచ్ ప్రవర్తన మాత్రం చాలా విచిత్రంగా అనిపించింది. అప్పుడే గొడవ పడతారు. అప్పుడే కలిసిపోతారేంట్రా బాబు అనిపించింది. అలానే ఎక్కడైనా గేమ్స్ లో ఓడిపోతే ఓట్లు అడుక్కుంటారు. ఈరోజు మాత్రం ఓ పోటీలో గెలిచిన శోభనే ఓట్ల కోసం ప్రాధేయపడటం విడ్డూరంగా అనిపించింది. మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ.. కాబోయే భర్త పోలీస్ ఇన్స్పెక్టర్!) -
Bigg Boss 7: ఎలిమినేషన్ హింట్ ఇచ్చేసిన బిగ్బాస్.. ఆ ఇద్దరిలో ఒకరు ఔట్?
బిగ్బాస్ 7 చివరకొచ్చేసింది. 14వ వారానికి సంబంధించిన నామినేషన్స్ పూర్తయ్యాయి. దీంతో ఈ వారం బిగ్బాస్ ఏం ప్లాన్ చేశాడా? అని అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి టైంలో అసలైన ఫిట్టింగ్ పెట్టేశాడు. ఎలిమినేషన్ గురించి చిన్న హింట్ కూడా ఇచ్చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా, ఇది సమ్థింగ్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. టాస్క్తో బిగ్బాస్ ట్విస్ట్ 'టికెట్ టూ ఫినాలే' పోటీలో గెలిచి ఫైనలిస్ట్ అయిన అర్జున్.. చిట్టచివరి నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు. ఇతడు తప్పితే మిగతా ఆరుగురు(అమర్, ప్రశాంత్, శోభా, ప్రియాంక, యావర్, శివాజీ).. ఈ వారం నామినేషన్స్లో ఉన్నారు. రాబోయే రెండు వారాలకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిపోయాయని చెప్పిన బిగ్ బాస్.. తక్కువ ఓట్లు వచ్చిన చివరి వ్యక్తి 14వ వారం ఎలిమినేట్ అయిపోతాడని నామినేషన్స్ సందర్భంగా చెప్పారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్న రైతుబిడ్డ.. ఎదురుదెబ్బ తగిలేసరికి!) మంగళవారం ఎపిసోడ్లో భాగంగా 'వోట్ ఫర్ మీ' పేరుతో టాస్క్ పెట్టారు. బిగ్బాస్ మాట్లాడుతూ.. 'యావర్, శోభా.. మీరిద్దరూ మీ ఓటు అప్పీలు చేసేందుకు మిగతావారి కంటే చేరువలో ఉన్నారు. కానీ మీ ఇద్దరిలో నుంచి ఒక్కరికి మాత్రమే ఓటు అప్పీలు చేసుకునే వీలుంది. ఆ ఒక్కరు ఎవరు అనే విషయం మిగతా ఇంటి సభ్యుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది' అని ఫిట్టింగ్ పెట్టాడు. ఈ టాస్క్లో భాగంగా యావర్కి శివాజీ, ప్రశాంత్ ఓటేశారు. శోభాకి ప్రియాంక, అమర్తో పాటు అర్జున్ కూడా ఓటేసినట్లు ప్రోమోలో చూపించారు. ప్రస్తుతం హౌస్లో ఉన్నవాళ్లలో అర్జున్ ఫైనల్ వీక్కి అర్హత సాధించాడు. మిగతా ఆరుగురిలో శోభా, యావర్ మాత్రం చివరి స్థానాల్లో ఉంటారు. అంటే ఈ వారం వీళ్లిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయిపోయే ఛాన్సులు గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు అదే విషయాన్ని టాస్క్ పేరు చెప్పి బిగ్బాస్ హింట్ ఇచ్చాడా అనే సందేహం వస్తోంది. అయితే ఈ టాస్కులో శోభా కాస్త భయపడినట్లు కనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
Bigg Boss 7: మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్న రైతుబిడ్డ.. ఎదురుదెబ్బ తగిలేసరికి!
బిగ్బాస్ 7లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ బాగానే ఆడుతున్నాడా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే అలా లేకపోతే 14వ వారం వరకు ఎలా వస్తాడు. అంతే కదా. అయితే అంతా బాగానే ఉన్నా గానీ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు. తాజా నామినేషన్స్లోనూ తనకు అలవాటైన ఓ థియరీ ఉపయోగిద్దామని చూశాడు. కానీ ఎదురుదెబ్బ తగిలింది. గిలగిల కొట్టేసుకున్నాడు. తాజాగా రిలీజైన ప్రోమోతో ఆ విషయం అర్థమైంది. (ఇదీ చదవండి: ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) రైతుబిడ్డ అతితెలివి కామన్మ్యాన్ ప్లస్ రైతుబిడ్డ అనే ట్యాగ్తో బిగ్బాస్లో అడుగుపెట్టిన మిగతా రోజుల్లో ఏ మాత్రం సౌండ్ చేయకుండా, అసలు ఉన్నాడా లేడా అన్నట్లు ఉంటాడు. నామినేషన్స్ వస్తే మాత్రం షర్ట్ పై బటన్ కూడా పెట్టేసి, మెడలో టవల్ వేసుకుని మరీ బుద్దిమంతుడు అయిపోయాడు. అవతల వాళ్లు చెబుతున్నది వినకుండా, వాళ్ల చెప్పిన పాయింట్ మార్చేసి మరీ తనపై సింపతీ వచ్చేలా ప్లేట్ తిప్పేస్తాడు. గతంలో ఓసారి సందీప్ మాస్టర్ నామినేషన్ చేసిన టైంలో.. తనని ఊరోడు అన్నాడని నానా హంగామా చేశాడు. అమర్ రివర్స్ పంచ్ అయితే గతకొన్ని వారాల నుంచి నామినేషన్స్ సైలెంట్గా పూర్తి చేస్తూ వచ్చిన తాజాగా సోమవారం మాత్రం అమర్తో పెద్ద వాదనకు దిగాడు. ఈ క్రమంలోనే 'ఆడవాళ్లలా మాట్లాడకు' అని అర్థమొచ్చేలా అన్నాడు. దీంతో అమర్.. దాన్ని రచ్చ చేశాడు. 'నన్ను ఆడోడా అంటావా, చేతులకు గాజులు వేసుకోవాలా?' అని అమర్ రెచ్చిపోయాడు. దీంతో రైతుబిడ్డ డిఫెన్స్లో పడిపోయాడు. ప్రతిసారీ ఏదో ఒకలా సింపతీ కొట్టేద్దామని చూసే రైతుబిడ్డకు ఈసారి అమర్ రివర్స్ పంచ్ ఇచ్చాడు. ఈ గొడవని ఎవరో ఒకరు ఫుల్స్టాప్ పెట్టాలి. కానీ అమర్ రెచ్చిపోయి ప్రశాంత్ తప్పు చేసేలా చేస్తున్నాడు. మంగళవారం ఎపిసోడ్లోనూ ఈ పంచాయతీ సాగింది. మరి ఈ గొడవకు ఎప్పుడు ఎలా? ఎండ్ కార్డ్ పడిందనేది రాబోయే ఎపిసోడ్లో తేలుతుంది. అప్పటివరకు వెయిట్ అండ్ సీ. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) -
Bigg Boss 7: మళ్లీ గొడవపడ్డ అమర్-ప్రశాంత్.. ట్విస్ట్ ఇచ్చిన బిగ్బాస్!
బిగ్బాస్ చిట్టచివరి నామినేషన్స్ అయిపోయాయి. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండాల్సిన ఈ ప్రక్రియ.. చాలా సిల్లీగా నడిచింది. ఎప్పటిలానే పనికిమాలిన సీరియల్ బ్యాచ్, శివాజీ బ్యాచ్ ఒకరిపై ఒకరు పగ ప్రతీకారాలు చూపించుకున్నారు. వీటన్నింటిలో అమర్-ప్రశాంత్ గొడవ మాత్రం కాస్తోకూస్తో ఎంటర్టైనింగ్గా అనిపించింది. ఇంతకీ సోమవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 92 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. నామినేషన్స్ హడావుడి గౌతమ్ ఎలిమినేట్ అయిపోవడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. ఇక నామినేషన్స్తో సోమవారం ఎపిసోడ్ మొదలైంది. 'టికెట్ టూ ఫినాలే' రేసులో గెలిచిన ఫైనలిస్ట్ అయిన కారణంగా అర్జున్.. ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయినట్లు చెప్పారు. అలా ఈ ప్రక్రియ షురూ అయింది. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? యావర్ - శోభా, ప్రియాంక శోభాశెట్టి - యావర్, శివాజీ ప్రశాంత్ - అమర్,శోభాశెట్టి అర్జున్ - అమర్, యావర్ ప్రియాంక - అమర్, యావర్ శివాజీ - ప్రియాంక, అమర్ అమర్ - ప్రశాంత్, యావర్ చాలా అతి చేసిన యావర్ వీకెండ్ ఎపిసోడ్లో ఓ సందర్భంలో ప్రియాంక మాట్లాడుతూ యావర్.. ఇంట్లో తక్కువ పనిచేస్తున్నాడని చెప్పింది. ఇప్పుడు అదే పాయింట్ కారణాన్ని చూపించి ప్రియాంకని యావర్ నామినేట్ చేశాడు. అయితే ప్రియాంక గురించి మాట్లాడినప్పుడు ఆమెతోనే మాట్లాడాలి. కానీ శోభా-అమర్ పేర్లు ప్రస్తావించాడు. ఫేవరిజం చూపిస్తున్నావ్ నువ్వు అని ప్రియాంకతో అన్నాడు. మధ్యలో ఎంటరైన శోభా.. నీత నన్ను కంపేర్ చేయకు, అసలు నువ్వేం చేస్తావ్.. డిన్నర్ రెడీ అయిన తర్వాత వస్తావ్, తింటావ్, వెళ్లిపోతావ్.. అంతకు మించి ఏం చేస్తున్నావ్ అని యావర్ అసలు చేసేదాన్ని బయటపెట్టింది. దీంతో యావర్ పిచ్చిపిచ్చిగా ప్రవరిస్తూ అతి చేశాడు. అమర్కి షాకిచ్చిన ప్రియాంక సీరియల్ బ్యాచ్కి చెందిన ప్రియాంక.. తన ఫ్రెండ్ అయిన అమర్నే నామినేట్ చేసింది. గతవారం టికెట్ టూ ఫినాలే పోటీలో భాగంగా గేమ్ ఓడిపోయిన బాధలో ఉంటే, పదే పదే పాయింట్స్ గురించి తనని అడగడం నచ్చలేదని కారణం చెప్పింది. ఇక మిగిలిన వాళ్లవి ఓకే అనిపించేలా నామినేషన్స్ జరిగాయి. అమర్-ప్రశాంత్ మధ్యలో మాత్రం ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. రెండో వారం నామినేషన్స్ని గుర్తుచేశారు. అమర్ vs ప్రశాంత్ గత కొన్ని వారాల నుంచి బాగానే ఉన్న ప్రశాంత్, అమర్.. ఈసారి నామినేషన్స్లో రెచ్చిపోయారు. అమర్.. ప్రశాంత్ని నామినేట్ చేశాడు. వీళ్లిద్దరి మధ్య నువ్వు ఫేక్ అంటే నువ్వు ఫేక్ అంటూ, మోసం చేస్తున్నావ్ అదీ ఇది అని అనుకున్నారు. మీదమీదకు వెళ్లి మరీ కొట్టుకుంటారా అనేలా ప్రవర్తించారు. చివరకు శివాజీ, మిగతా ఇంటి సభ్యులు కల్పించుకోవడంతో సైలైంట్ అయిపోయారు. ట్విస్ట్ ఇచ్చిన బిగ్బాస్ ఈ ఫినాలే రేసు మిమ్మల్ని ఓ ఫైనలిస్టుని చేస్తుంది లేదా ఫినిష్ లైన్ చేరకుండానే ఆపేస్తుంది. ఆ నిర్ణయం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది. వారు మీ ప్రతి ఆట ప్రతి మాట ప్రతి కదలిక చాలా దగ్గర నుంచి గమనిస్తున్నారు. కాబట్టి ఇప్పటినుంచి మీరు చేసే ప్రతి పని మీ గెలుపోటములని నిర్ణయిస్తుంది. బిగ్ బాస్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఈ రెండు వారాలు కూడా మీ ఓటింగ్ లైన్స్ తెరుచుకుంటాయి. ఎక్కువ ఓట్లు పొందిన వాడు.. బిగ్బాస్ 7 విజేతగా నిలుస్తాడు. కానీ ఒకవేళ ఈ వారం మీ ఓట్లు.. మిగతా వారి కంటే తక్కువగా ఉంటే ఫినాలే వారానికి చేరుకోవడానికి ముందే ఎలిమినేట్ అవుతారు. అర్జున్.. ఫినాలే వీక్కి చేరుకున్నాడు కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యాడని బిగ్బాస్ చెప్పడంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. -
Bigg Boss 7: రైతుబిడ్డ సేఫ్ గేమ్? చివరకొచ్చినా 'బిగ్బాస్' తీరు మారట్లేదు!
బిగ్బాస్ 7 గురించి హోస్ట్ నాగార్జున ఏమో గొప్పలు చెబుతున్నాడు. రియాలిటీలో మాత్రం అస్సలు అలా లేదు. తాజా ఎపిసోడే దీనికి సరైన ఉదాహరణ. అలానే రైతుబిడ్డ ఈ సీజన్లో చాలా తెలివిగా ఆడాడని అందరూ అనుకుంటున్నారు. కానీ మనోడి సేఫ్ గేమ్ ఇప్పుడు బయటపడింది. అయితే ఓ విషయంలో మాత్రం బిగ్బాస్ అస్సలు తీరు మార్చుకోవడం లేదు. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 91 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. బిగ్బాస్ విన్నర్ ప్రైజ్మనీ ఫినాలే టికెట్ గెలుచుకున్న అర్జున్.. ఎలిమినేషన్ నుంచి సేవ్ అయినట్లు చెప్పడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. ఇక ఈ సీజన్లో విజేతగా నిలిస్తే ఏమేం దక్కుతాయో నాగార్జున ప్రకటించడంతో ఆదివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఈ సీజన్ విన్నర్గా నిలిస్తే రూ.50 లక్షల నగదుతో పాటు మారుతి కార్, రూ. 15 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ సొంతమవుతుందని నాగార్జున చెప్పుకొచ్చాడు. అయితే రూ. 50 లక్షలు గెలిస్తే ఏం చేస్తారని అందరినీ నాగ్ అడిగితే.. అమ్మని ఈ డబ్బుతో హాయిగా చూసుకుంటా, తల్లిదండ్రులకు ఇల్లు కట్టిస్తా లాంటివి చెప్పారు. అయితే ఈ మొత్తం డిస్కషన్లో పెద్దగా డ్రామా పండలేదు. మొత్తం తేలిపోయింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఆ కారణంతో అర్జున్ ఎలిమినేట్.. 13 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?) ప్రమోషన్స్ మధ్య ఎపిసోడ్ అయితే వీకెండ్ ఎపిసోడ్ అంటే.. హౌసులో ఉన్నవాళ్లతో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలి. కానీ బిగ్బాస్ టీమ్ దీనికంటే ప్రమోషన్స్పై ప్రేమ ఎక్కువైపోయింది. ప్రమోషన్స్ చేయొద్దని అనట్లేదు గానీ ఎపిసోడ్లో ఎక్కడో ఐదు నిమిషాల పాటు ప్రమోషన్ ఉంటే బాగుండేది.. ఈ ఆదివారం మాత్రం కాస్త ఎక్కువ లెంగ్త్ ఉండేసరికి చాలా బోర్ కొట్టేసింది. 'నా సామి రంగ', 'హాయ్ నాన్న' సినిమాల్ని ప్రమోట్ చేయడానికి వచ్చిన ఆషికా రంగనాథ్, నాని పర్వాలేదనిపించారు తప్పితే ఏమంత అలరించలేకపోయారు. ప్రశాంత్ సేఫ్ గేమ్? సేవింగ్లో భాగంగా ప్రియాంక, శివాజీ, యావర్ వరసగా ఎలిమినేషన్ నుంచి బయటపడ్డారు. చివరగా ప్రశాంత్, శోభా, గౌతమ్ మిగిలారు. ఇలాంటి టైంలో ఎవిక్షన్ పాస్ ఉపయోగించాల్సిందేనని నాగార్జున అల్టిమేటం జారీ చేశాడు. లేకపోతే తిరిగిచ్చేయాల్సి ఉంటుందని అన్నాడు. ఇక్కడ చాలా తెలివిగా ఆలోచించిన ప్రశాంత్.. శోభా-గౌతమ్ ఇద్దరిలో ఎవరికిచ్చినా ఇలాంటి టైంలో తను బ్యాడ్ అయిపోతానని తెలుసు. అందుకే ఎవరికి ఇచ్చేదే లేదని పదే పదే చెప్పాడు. తిరిగిచ్చేసి హీరో అయిపోదామనుకున్నాడు. కానీ ఇదంతా కూడా సేఫ్ గేమ్లా అనిపించింది తప్పితే ఇంట్రెస్టింగ్గా అయితే లేదు. ఆ తర్వాత ప్రశాంత్ సేవ్ అయ్యాడు. చివరగా శోభా బతికిపోయింది. గౌతమ్ ఎలిమినేట్ అయిపోయాడు. 13వ వారం కావడం వల్లో ఏమో గానీ మనోడి.. ఎలిమినేట్ అయిపోయినా సరే పెద్దగా బాధపడలేదు. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: హనీమూన్కి వెళ్లిన మెగా కపుల్ వరుణ్-లావణ్య?) -
Bigg Boss 7: ఆ కారణంతో గౌతమ్ ఎలిమినేట్.. 13 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?
బిగ్బాస్ 7 నుంచి డాక్టర్బాబు ఎలిమినేట్ అయిపోయాడు. అశ్వద్ధామ 2.0 అని హడావుడి చేసిన ఇతడు.. సింగిల్గా ఆడుతూనే 13వ వారం వరకు నెట్టుకొచ్చేశాడు. అయితే ఇతడు చేసిన కొన్ని పనులు, అలానే హౌసులోని పలువురి వల్ల గౌతమ్.. బయటకొచ్చేసినట్లు అనిపిస్తోంది. ఇవన్నీ పక్కనబెడితే.. ఇన్నివారాలకు కలిపి రెమ్యునరేషన్ మాత్రం గట్టిగా ముట్టినట్లు టాక్. ఇంతకీ ఏంటి విషయం? డాక్టర్బాబు ఫెర్ఫార్మెన్స్ ఓకే డాక్టర్ కమ్ యాక్టర్ గౌతమ్ కృష్ణ.. బిగ్బాస్ హౌస్లో 13వ వారాలైతే ఉన్నాడు గానీ గుర్తింపు అయితే పెద్దగా తెచ్చుకోలేకపోయాడు. మొదటి వారం నుంచి ఇప్పటివరకు దాదాపు ఒంటరిగానే పోరాడుతూ వచ్చారు. ఈ విషయంలో మాత్రం అతడిని మెచ్చుకోవచ్చు. ఇన్ని వారాలు జరిగిన గేమ్స్లోనూ గౌతమ్ గెలిచిన దాఖలాలు అయితే లేవు. ఓ రోజు సీక్రెట్ రూంలో ఉండొచ్చి, 'అశ్వద్ధామ 2.0' అని హడావుడి చేశాడు గానీ అది పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. (ఇదీ చదవండి: హనీమూన్కి వెళ్లిన మెగా కపుల్ వరుణ్-లావణ్య?) ఎలిమినేషన్కి అదే కారణమా? ప్రారంభంలో నామమాత్రంగా ఆడిన గౌతమ్.. ఆ తర్వాత నుంచి శివాజీతో గొడవ పెట్టుకుని హైలైట్ అయ్యాడు. అప్పటి నుంచి తాజా వీకెండ్ ఎపిసోడ్ వరకు ఈ తంతే నడిచింది. అయితే శివాజీ వరస్ట్ కామందు తరహా ప్రవర్తన గురించి కాస్తో కూస్తో నిజాలు మాట్లాడిన వాళ్లలో గౌతమ్ ఒకడు. ఇదే ఇప్పుడు బిగ్బాస్ ఆర్గనైజర్స్కి నచ్చలేదు. గౌతమ్ని ఎలిమినేట్ చేసి పడేశారు. గత రెండు మూడు వారాల గేమ్ తీసుకుంటే శివాజీ, యావర్ కంటే గౌతమ్ చాలా బెటర్. కానీ శివాజీ మీద బిగ్బాసోళ్లకు ప్రేమ ఎక్కువైంది. అదే గౌతమ్కి శాపమైందని టాక్. రెమ్యునరేషన్ ఎంత? ఇకపోతే వారానికి రూ 1.5 లక్షల చొప్పున రెమ్యునరేషన్ అని గౌతమ్ డీల్ మాట్లాడుకున్నాడట. అంటే 13 వారాలకు గానూ దాదాపు రూ 19.5 లక్షలు పారితోషికంగా అందుకున్నాడని సమాచారం. అయితే ఈ విషయంపై గౌతమ్ క్లారిటీ ఇస్తే తప్ప అసలు లెక్కలు తెలియవు. ఏదేమైనా శివాజీతో పెట్టుకోవడం తనకు ప్లస్ అవుతుందని గౌతమ్ అనుకున్నాడు కానీ అదే మైనస్ అయి, ఇంటి నుంచి బయటకొచ్చేలా చేసినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: రానా తమ్ముడి డెస్టినేషన్ వెడ్డింగ్? ఆ దేశంలో మూడు రోజుల పాటు!) -
Bigg Boss 7: ప్రియాంకని ఒప్పించడానికి నాగ్ ప్రయత్నం.. శివాజీకి చెప్పడానికి నో ధైర్యం!
బిగ్బాస్ 7వ సీజన్లో మరో వీకెండ్ వచ్చేసింది. అయితే ఈ వారం ఓ మాదిరి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. కాకపోతే శివాజీ మీద నాగ్ ప్రేమ ఎంత ఉందనేది మరోసారి బయటపడింది. ప్రియాంకని అయితే నాగ్ పదే పదే ఓ విషయం ఒప్పించేందుకు తెగ ప్రయత్నించాడు. అమర్కి ఓ సర్ప్రైజ్ కూడా ఇచ్చాడు. ఇంతకీ శనివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 90 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. బయటపడ్డ ప్రియాంక ఆవేదన టికెట్ టూ ఫినాలే రేసులో గెలిచిన అర్జున్.. ఈ సీజన్ తొలి ఫైనలిస్ట్ కావడంతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచి శనివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. వీకెండ్ కాబట్టి స్టేజీపైకి వచ్చిన నాగార్జున.. శుక్రవారం ఏం జరిగిందో చూశాడు. ఆ తర్వాత ప్రస్తుతానికి వచ్చేశాడు. ఫినాలే రేసు మొదటి రౌండులోనే ఎలిమినేట్ అయిపోయిన శోభా-శివాజీ నిలబెట్టి.. ఒకరి గేమ్ గురించి మరొకరు చెప్పాలని అన్నాడు. ఈ డిస్కషన్లో వీళ్లిద్దరూ అమర్కి పాయింట్స్ ఇవ్వడంపై నాగ్ కౌంటర్స్ వేశాడు. (ఇదీ చదవండి: 'యానిమల్'లో రష్మిక కంటే హైలైట్ అయిన బ్యూటీ.. ఈమె ఎవరంటే?) అమర్ అలుగుతాడని, బ్లాక్ మెయిల్ చేస్తాడని నవ్వుతూనే నిజాలు చెప్పేశాడు. ఆ వెంటనే.. ప్రియాంక చెప్పమ్మా అని ఆమెని నిలబెట్టాడు. దీన్ని నిజమేనని ఒప్పుకొన్న ప్రియాంక.. అది చాలా పెయిన్ఫుల్, ఆల్రెడీ ఓడిపోయినా బాధ ఓవైపు ఉంటే.. మళ్లీ మళ్లీ అమర్ పాయింట్స్ ఇవ్వమని చెబుతుంటే చాలా బాధగా అనిపించింది ప్రియాంక తన ఆవేదన బయటపెట్టింది. ప్రియాంకని ఒప్పించే ప్రయత్నం ప్రియాంకని నిలబెట్టి మాట్లాడిన నాగ్.. గతవారమే అనుకున్నాం కదా ఒంటరిగా గేమ్ ఆడమని.. కానీ నువ్వు ఏం చేశావ్? అని అమర్కి గౌతమ్ ద్వారా పాయింట్లు ఇచ్చిన విషయం గురించి మాట్లాడాడు. అయితే ఈ మొత్తం డిస్కషన్లో ప్రియాంకది గ్రూప్ గేమ్ అని ఒప్పించాలని నాగ్ చాలా ప్రయత్నించాడు. కానీ ఈ విషయంలో ఫెయిలయ్యాడు. ఆ తర్వాత గౌతమ్తోనూ నాగ్.. ప్రియాంకది తప్పని చెప్పించాడు. ప్రియాంక.. నువ్వు ఎంత సమర్ధించుకున్నాసరే నీది గ్రూప్ గేమ్ అని మాకు అనిపించిందని నాగ్ అన్నాడు. కానీ ఇలానే గతంలో శివాజీ బ్యాచ్గా ఆడినప్పుడు మాత్రం నాగ్ కనీసం పల్లెత్తు మాట కూడా అనలేకపోయాడు. దీనిబట్టి శివాజీపై నాగ్ ప్రేమ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: అల్లు అర్జున్కు హెల్త్ ఇష్యూ.. షూటింగ్కు బ్రేక్ ఇచ్చిన సుకుమార్) అమర్కి సర్ప్రైజ్.. ప్రశాంత్కి షాక్ ఈ వారం 'టికెట్ టూ ఫినాలే' అర్జున్ గెలిచిన కారణంగా.. ఎవిక్షన్ పాస్ 14వ వారం కాదు, ఈ వారమే ఉపయోగించాలని ప్రశాంత్కి నాగ్ కండీషన్ పెట్టాడు. దాని గురించి తర్వాత చెబుతానని అన్నాడు. కానీ శనివారం ఎపిసోడ్లో కారణం లాంటిది ఏం చెప్పలేదు. మరోవైపు అమర్ మాట్లాడుతూ.. ఒక్కసారి మీరు నన్ను కెప్టెన్ అని పిలిస్తే వినాలని ఉందని నాగార్జునని రిక్వెస్ట్ చేశాడు. ఇది జరిగిన నాగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. టికెట్ టూ ఫినాలే పోటీలో 1200 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన కారణంగా.. వచ్చే వారం కెప్టెన్ అయ్యావ్ అమర్ అని నాగ్ చెప్పాడు. శివాజీ, అర్జున్.. డిప్యూటీస్ అని నాగ్ ఆదేశించాడు. శివాజీతో గౌతమ్ గొడవ ఇక 'బీబీ లైబ్రరీ' అని ఓ గేమ్ పెట్టారు. ఇందులో భాగంగా కొన్ని పేర్లు రాసున్న బుక్... మరొకరికి ఇవ్వాల్సి ఉంటుందని నాగ్ చెప్పాడు. మిగతా వాళ్ల విషయంలో పెద్దగా ఇబ్బంది కాలేదు కానీ.. 'ప్రతిదానికి నేనే రైట్ అని అనుకోకుండా ఎలా ఉండాలి?' అనే బుక్ మాత్రం గౌతమ్.. శివాజీకి ఇచ్చాడు. దీన్ని తీసుకోలేకపోయిన శివాజీ.. 'కుళ్లు, కుట్ర, కుతంత్రం నుంచి విముక్తి పొందడం ఎలా?' అని పుస్తకాన్ని.. రిటర్న్లో గౌతమ్కి ఇచ్చాడు. దీంతో గొడవ మొదలైంది. ఇద్దరూ నీది తప్పంటే నీది తప్పు అని నామినేషన్స్లో వాదించుకున్నట్లు హోస్ట్ నాగార్జున ముందే గొడవపడ్డారు. అంతా విన్న నాగార్జున.. ఎప్పటిలానే శివాజీకి సపోర్ట్ చేశాడు. గౌతమ్దే తప్పన్నట్లు తీర్పు ఇచ్చాడు. ఫినాలే అస్త్ర గెలుచుకున్న కారణంగా అర్జున్.. ఈ వారం ఎలిమినేషన్స్ నుంచి సేవ్ అయిపోయినట్లు నాగ్ ప్రకటించాడు. అలా శనివారం ఎపిసోడ్ పూర్తయింది. అయితే శనివారం అంతా కూడా నవ్వుతూనే సీరియల్ బ్యాచ్ గురించి నాగార్జున నిజాలు చెప్పాడు. ఇలానే శివాజీ బిహేవియర్ గురించి కూడా నిజాలు చెబితే బాగుండేది అనిపించింది. (ఇదీ చదవండి: ఆ సమస్యతో బాధపడుతున్న అమర్.. లోపల ట్రీట్మెంట్ లేదు!) -
Bigg Boss 7: లవ్ స్టోరీ బయటపెట్టిన రైతుబిడ్డ.. ఆ ఒక్క కారణంతో బ్రేకప్!
గత కొన్నిరోజుల నుంచి జరుగుతున్న 'టికెట్ టూ ఫినాలే' రేసు పూర్తయింది. ఎవరూ ఊహించని విధంగా అర్జున్.. చివరి వరకు పోరాడి తొలి ఫైనలిస్ట్ అయ్యాడు. మరోవైపు రైతుబిడ్డ ప్రశాంత్.. ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియని తన ప్రేమకథని బయటపెట్టాడు. అయితే ఇది బ్రేకప్ అయిపోయిందని చెప్పుకొచ్చాడు. ఇంతకీ శుక్రవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 89 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. గౌతమ్ రేసు నుంచి ఔట్ నాలుగు స్థానాల్లో వరసగా అమర్, అర్జున్, ప్రశాంత్, గౌతమ్ ఉన్నారు. అలా గురువారం ఎపిసోడ్ ముగిసింది. తక్కువ పాయింట్స్ ఉన్న కారణంగా గౌతమ్.. రేసు నుంచి తప్పుకొన్నాడని బిగ్బాస్ చెప్పడంతో శుక్రవారం ఎపిసోడ్ మొదలైంది. తన దగ్గరున్న వాటిలో 20 శాతం అంటే 140 పాయింట్లు.. రేసులో ఉన్న ముగ్గురిలో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుందని బిగ్బాస్ చెప్పగా.. అమర్ పేరు చెప్పాడు. అయితే ఇవి ప్రియాంక పాయింట్స్ అని, ఆమెని మరోమాట అనొద్దని గౌతమ్, అమర్తో చెప్పాడు. (ఇదీ చదవండి: Salaar Part 1: Ceasefire Trailer: రిలీజైన 'సలార్' ట్రైలర్.. స్టోరీ హింట్ ఇచ్చేశారుగా!) బెడ్రూంలో శోభా డిస్కషన్ అయితే పాయింట్స్ ఇస్తూ.. ప్రియాంకని ఏమొనద్దని అమర్కి చెప్పడం ఏం బాగోలేదని శోభా అభిప్రాయపడింది. ఇదే విషయాన్ని రాత్రి నిద్రపోయే టైంలో తన ఫ్రెండ్స్ అయిన ప్రియాంక-అమర్తో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది. అలానే ఇవ్వాలనుకుంటే నువ్వే(ప్రియాంక) నేరుగా ఇవ్వొచ్చు కదా, గౌతమ్ని బతిమలాడి అడగడం ఎందుకు? అని శోభా.. తన ఫ్రెండ్ ప్రియాంకతో చెప్పుకొచ్చింది. శోభాకి పనిష్మెంట్ 10వ గేమ్గా 'కలర్ బాల్స్' అన్ని ఒకే వరసలో సెట్ చేయాలని టాస్క్ ఇచ్చారు. ఇందులో అర్జున్ విజయం సాధించాడు. ఆ తర్వాత ప్రశాంత్, అమర్ నిలిచారు. అయితే ఈ పోటీ పూర్తయిన తర్వాత శోభా.. బంతుల్ని టచ్ చేసిందని చెబుతూ ఆమెకి పనిష్మెంట్ ఇస్తున్నట్లు బిగ్బాస్ కాస్త భయపెట్టాడు. కానీ పనిష్మెంట్గా అందరూ గంట నిద్రపోవాలని అన్నాడు. అందరూ పడుకుని లేచేసరికి బయట గార్డెన్ ఏరియాలో టీ-స్నాక్స్ సదుపాయం ఏర్పాటు చేశాడు. ఇవి తింటూ అందరూ తమతమ లవ్ స్టోరీలు చెప్పాలని బిగ్బాస్ ఆదేశించాడు. (ఇదీ చదవండి: 'యానిమల్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అందులోనే) ప్రశాంత్ భగ్న ప్రేమకథ ఈ టాస్కులో భాగంగా శివాజీ, శోభా.. తమ ప్రేమకథల్ని చెప్పుకొచ్చారు. గౌతమ్ మాత్రం తన సినిమా పిచ్చి వల్ల.. దాదాపు పెళ్లి వరకు ఓ వచ్చిన స్టోరీ బ్రేకప్ అయిపోయిందని చెప్పుకొచ్చాడు. ఇక ప్రశాంత్ని ప్రేమకథ చెప్పాలని బిగ్బాస్ చెప్పమన్నాడు. దీంతో మనోడు అప్పట్లో జరిగిన విషయాన్ని బయటపెట్టాడు. ఓ రోజు పొలంకి వెళ్తుంటే.. దారిలో ఓ అమ్మాయి హాయ్ చెప్పింది. కొన్నాళ్లుకు మెసేజ్ చేసింది. అలా కాస్త పరిచయమైన తర్వాత ఆమెకి ఫ్రెండ్ అని ఒకడు వచ్చాడు. దీంతో నాకు మెసేజులు చేయడం తగ్గించేసింది. వాడు ఒక్క మెసేజ్ చేసినా వెంటనే రిప్లై ఇచ్చేసేది. చాలా రోజుల తర్వాత ఓ రోజు ఫోన్ చేసి.. పొలం పని వదిలేస్తేనే నీ వెంట వస్తా అని సీరియస్గా చెప్పింది. నాకు తెలిసింది పొలం పనే, దీన్ని విడిచిపెట్టి రానని చెప్పేశా, అలా ప్రేమకథ బ్రేకప్ అయిపోయిందని ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. అర్జున్ మైండ్ గేమ్.. తొలి ఫైనలిస్ట్ 'టికెట్ టూ ఫినాలే' పోటీలో భాగంగా 'పట్టు వదలకురా డింభకా' అని పెట్టిన 11వ గేమ్ పెట్టారు. ఇందులో లోపలి నుంచి ఎవరికి వాళ్లు తాడుని డిఫెండ్ చేస్తూనే, కింద పడున్న జెండాలని తీసి, బుట్టలో వేయాలని చెప్పగా అర్జున్.. వేగంగా పదివరకు జెండాలని తన బుట్టలో వేశాడు. తర్వాత అమర్-ప్రశాంత్.. కనీసం అక్కడి నుంచి కదలకుండా చేశాడు. అలా చాలాసేపు ఉంచేశాడు. దీంతో బజర్ మోగింది. ఇక ముగ్గురిలో చివరి స్థానంలో నిలిచిన ప్రశాంత్ ఎలిమినేట్ అయిపోయాడు. కాసేపు బాధపడ్డాడు. 'పాముతో చెలగాటం' అని ఫైనల్ పోటీ పెట్టగా.. ఇందులో అర్జున్ విజయం సాధించాడు. ఏడో సీజన్ తొలి ఫైనలిస్ట్గా నిలిచాడు. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: Dhootha Web Series Review: నాగచైతన్య 'దూత' వెబ్ సిరీస్ రివ్యూ) -
Bigg Boss 7: మాటలు జారిన అమర్.. ప్రియాంక తప్పు చేయకపోయినా సరే అలా!
బిగ్బాస్ ప్రస్తుత సీజన్లో ఫినాలేలో తొలి స్థానం కోసం మంచి పోటీ నడుస్తోంది. మంగళవారం ఓ మూడు గేమ్స్ జరగ్గా.. తాజాగా మరో రెండు గేమ్స్ జరిగాయి. ఇందులో SPY(శివాజీ, ప్రశాంత్, యావర్) బ్యాచ్కి షాక్ తగిలింది. మరోవైపు సీరియల్ బ్యాచ్ లో ప్రియాంకని ఒంటరి చేసేశారు. శోభా-అమర్ కలిసి ఈమెపై మానసికంగా దాడి చేశారు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్లో అసలేం జరిగిందనేది Day 87 హైలెైట్స్లో ఇప్పుడు చూద్దాం. ఓ దాంట్లో టాప్.. మరో దానిలో ఫెయిల్ సోమవారం మూడు గేమ్స్ జరగ్గా.. రెండింటిలో అర్జున్ విజయం సాధించాడు. తాజాగా బుధవారం పెట్టిన గేమ్స్లోనూ అర్జున్ చాలా స్మార్ట్గా వ్యవహరించాడు. 'టికెట్ టూ ఫినాలే' కోసం 'ఎత్తరా జెండా' అని పెట్టిన నాలుగో గేమ్లో ప్రశాంత్, యావర్ తొలి రెండు స్థానాల్లో నిలవగా.. అర్జున్ మూడో స్థానం సంపాదించాడు. ఇక 'గెస్ చేయ్ గురూ' అని పెట్టిన ఐదో గేమ్లో.. వినిపించే సౌండ్స్ బట్టి, అవేంటనేవి వరసగా పలకపై రాయాల్సి ఉంటుంది. ఇందులో అర్జున్ 31 పాయింట్లతో టాప్లో నిలిచాడు. ఇదే పోటీలో సరిగా ఆడని కారణం.. ప్రశాంత్, యావర్ మధ్యలో ఔట్ అయిపోయారు. అలా స్పై బ్యాచ్ ఎదురుదెబ్బ తగిలింది (ఇదీ చదవండి: బ్రేకప్ స్టోరీ బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి.. పెళ్లి గురించి హింట్!) ప్రియాంక పాయింట్స్ దానం ఇక ఐదు గేమ్స్ పూర్తయిన తర్వాత చివరి స్థానంలో ప్రియాంక ఉన్న కారణంగా.. 'టికెట్ టూ ఫినాలే' రేసు నుంచి ఆమెని బిగ్బాస్ తప్పించాడు. అయితే ఆమె దగ్గరున్న వాటిలో సగం పాయింట్స్ వేరొకరికి ఇచ్చేయాల్సి ఉంటుంది చెప్పగా.. 125 పాయింట్లని గౌతమ్కి ఇచ్చేసింది. దీంతో ఓవరాల్ పొజిషన్లో గౌతమ్... మూడో స్థానానికి చేరుకున్నాడు. అయితే ఆ పాయింట్లు తనకు ఇస్తుందనుకున్న అమర్.. ప్రియాంకపై అలిగాడు. మాటలు జారిన అమర్ ప్రియాంక ఎలిమినేట్ అయిపోయి, తన పాయింట్లు గౌతమ్కి ఇచ్చేయడాన్ని అమర్ తీసుకోలేకపోయాడు. ఆమె తప్పు చేసిందని అన్నాడు. అది తన గేమ్, తను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అని శోభా.. పరిస్థితి వివరించడానికి చూసింది. కానీ అమర్ తీసుకోలేకపోయాడు. కాసేపటి తర్వాత ప్రియాంకతో మాట్లాడుతూ.. నాకు ఇవ్వాలనిపించలేదా? అని అమర్.. డైరెక్ట్గా ఆమెనే అడిగాడు. ప్రియాంక, అమర్కి పరిస్థితి అర్థమయ్యేలా చెప్పడానికి చూస్తుంటే.. 'వెధవని అయిపోయింది నేనేగా' అని అమర్ మాట జారాడు. ఏం చెప్పాలనుకుంటున్నావ్, క్లియర్గా చెప్పి వెళ్లు అని ప్రియాంక.. తిరిగి మాట్లాడుతుండగానే అమర్ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. (ఇదీ చదవండి: Kiraak RP Marriage: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న కమెడియన్ కిర్రాక్ ఆర్పీ..) అమర్ ఇలా తయారయ్యాడేంటి? ప్రియాంకపై ఏది పడితే మాట్లాడేసిన అమర్.. 'అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు, మన అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు' అని తనలో తానే ఏదేదో మాట్లాడేసుకున్నాడు. 'పిచ్చ నా కొడకా, ఇప్పుడైనా నీకు కళ్లు తెరుచుకుంటే బాగుపడతావ్' అని తనని తానే తిట్టుకున్నాడు. మరోచోట.. ప్రియాంక, గౌతమ్తో మాట్లాడుతూ.. వాళ్లకు వాళ్లకే గ్రాటిట్యూడ్ ఉంటుంది, మాకు ఉండదా అని శోభా-అమర్ని ఉద్దేశిస్తూ తన మనసులో మాట బయటపెట్టింది. ఇదంతా జరిగిన కాసేపటి తర్వాత అమర్ దగ్గరకొచ్చిన ప్రియాంక.. చేసిన దానికి క్షమాపణలు చెప్పింది. తప్పయిపోయింది, ప్లీజ్ క్షమించు అని బతిమాలాడుకుంది. అయినా సరే అమర్.. శాంతించలేదు. దీంతో మిగతా వాళ్లతో ఈ విషయం గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక్కడ ఓ విషయం మాత్రం వింతగా అనిపించింది. ఎందుకంటే అమర్.. మరీ స్వార్థపరుడిలా ప్రవర్తించాడా అనే సందేహం వచ్చింది. ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం ప్రియాంక ఏం చేయాలో కూడా అమరే డిసైడ్ చేస్తాడా? ఆమెకు స్వాతంత్రం లేదా అనిపించింది. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: 'సలార్' స్టోరీ లీక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. అదీ మ్యాటర్!) -
Bigg Boss 7: సీరియల్ బ్యాచ్ కొట్లాట.. చివరకొచ్చేసరికి ఇలా తయారయ్యేంట్రా!
బిగ్బాస్ గత సీజన్స్ మాటేమో గానీ ఈసారి మాత్రం బ్యాచ్ల గోల ఎక్కువైంది. అంతెందుకు రీసెంట్ వీకెండ్ ఎపిసోడ్లో స్వయంగా హోస్ట్ నాగార్జున ఒప్పుకొన్నాడు. చుక్క బ్యాచ్, ముక్క బ్యాచ్ అని చెప్పుకొచ్చాడు. ఇందులో శివాజీ ఆధ్వర్యంలోని ముక్క బ్యాచ్ బాగానే ఉంది. చుక్క బ్యాచ్ అధ్వానంగా తయారైంది. బయటవాళ్లతో కాదు వీళ్లలో వీళ్లే గొడవపడి ఆ తప్పు చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇంతకీ ఏం జరుగుతోంది? (ఇదీ చదవండి: బ్రేకప్ స్టోరీ బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి.. పెళ్లి గురించి హింట్!) ప్రస్తుత సీజన్లో సీరియల్ బ్యాచ్ సభ్యులైన అమర్, ప్రియాంక, శోభా.. ప్రారంభం నుంచి ఒక్కటిగా ఆడుతున్నారు. మరోవైపు శివాజీ, ప్రశాంత్, యావర్.. ఓ బ్యాచ్గా ఆడుతున్నారు. నామినేషన్స్ దగ్గర నుంచి గేమ్స్ వరకు పోటీ అంతా వీళ్ల మధ్య ఉంటోంది. శివాజీ బ్యాచ్తో పోలిస్తే సీరియల్ బ్యాచ్ కొన్ని విషయాల్లో బెటర్. కానీ ఇప్పుడు వీళ్లే తమ నిల్చున్న కొమ్మ తామే నరుక్కుంటున్నట్లు అనిపిస్తోంది. తాజాగా 'టికెట్ టూ ఫినాలే' కోసం పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శోభా, శివాజీ ఇప్పటికే తక్కువ పాయింట్లు సాధించిన కారణంగా గేమ్ నుంచి సైడ్ అయిపోయారు. అమర్, ప్రశాంత్, అర్జున్, గౌతమ్, యావర్, ప్రియాంక.. ఇలా దాదాపుగా అబ్బాయిలే ఉన్నారు. ఇప్పుడు ప్రియాంక కూడా తక్కువ పాయింట్లు ఉన్న కారణంగా గేమ్ నుంచి సైడ్ అవ్వాలి. దీంతో ఆమె తన సగం పాయింట్లని వేరొకరికి ఇవ్వాలని చెప్పగా, గౌతమ్కి ఇచ్చేసింది. (ఇదీ చదవండి: Kiraak RP Marriage: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న కమెడియన్ కిర్రాక్ ఆర్పీ..) 12వ వారం ప్రియాంక కెప్టెన్ కావడానికి గౌతమ్ సాయం చేశాడు. ఇప్పుడు పాయింట్స్ ఇచ్చి అతడి రుణం తీర్చుకుంది. అయితే పాయింట్స్ ఇవ్వడానికి తాను కనిపించలేదా అని అమర్ హర్ట్ అయిపోయారు. దీంతో శోభా-అమర్ ఒక్కటైపోయారు. ప్రియాంకని వేరు చేసి చూస్తున్నారు. ఇన్నాళ్లు ఒక్కటిగా ఉంటూ వచ్చిన సీరియల్ బ్యాచ్.. శివాజీని అన్ని విషయాల్లోనూ ఎదుర్కొంటూ వచ్చారు. ఇప్పుడు చివరకొచ్చేసరికి వీళ్లలో వీళ్లు కొట్లాడుకుని.. శివాజీ బ్యాచ్ కి హెల్ప్ అయ్యేలా ఉన్నారనిపిస్తుంది. ఒకవేళ ఇలానే జరిగితే మాత్రం.. తెలియకుండానే శివాజీ బ్యాచ్ కి హెల్ప్ చేసినట్లు అవుతుంది. గేమ్లో ఉన్న ఆ కాస్త మజా కూడా పోవడం గ్యారంటీ. అయితే ఈ గొడవలో ప్రియాంక కాస్త ఆలోచనతో వ్యవహరించినట్లు అనిపించింది. అమర్ మాత్రం ప్రతిదానికి అలుగుతూ తనపై ఉన్న సింపతీని కాస్త నెగిటివిటీ చేసుకునేలా కనిపిస్తున్నాడు. మరోవైపు అతడికి సపోర్ట్ చేస్తున్న శోభా కూడా తెలియకుండానే మరింత నెగిటివీ తెచ్చుకుంటోందనిపిస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 25 సినిమాలు) -
Bigg Boss 7: నాగ్ చేతికి ఉన్న బ్యాండ్ చాలా స్పెషల్..రీచార్జ్ చేయాల్సిందే!
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ ఏడో సీజన్ విజయవంతంగా రన్ అవుతోంది. ఉల్టా పుల్టా అంటూ వచ్చిన ఈ సీజన్.. గత సీజన్ కంటే కాస్త బెటర్గానే ఉంది. ఇక ఆరో సీజన్లో అట్టర్ ఫ్లాప్ హోస్ట్గా పేరు తెచ్చుకున్న నాగార్జున..ఏడో సీజన్లో ఇప్పటి వరకు మాత్రం మంచి మార్కులే సంపాదించుకున్నాడు. సీజన్ 7లో ఇప్పటివరకు నాగార్జున ట్రోల్ అయిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. గత సీజన్ల కంటే స్టైలీష్గా హోస్టింగ్ చేస్తున్నాడు నాగార్జున. తన లుక్.. డ్రెస్సింగ్ స్టైల్ వారం వారం డిఫరెంట్గా ఉంటుంది. రంగు రంగుల షర్ట్ వేస్తూ..తెరపై మరింత అందంగా కనిపిస్తున్నాడు. (చదవండి: శివాజీ తెలివిలేని పని.. ప్రియాంక ప్రాణం మీదకొచ్చింది!) ప్రతివారం నాగార్జున వేసే షర్ట్పై నెట్టింట చర్చ జరుగుతోంది. గత శనివారం కూడా నాగార్జున ఓ రంగుల చొక్కాని ధరించి హోస్టింగ్ చేశాడు. ఆ షర్ట్ ధర లక్షల్లో ఉంది. అయితే ఆ షర్ట్తో పాటు ఆరోజు నాగార్జున చేతికి ధరించిన ఓ బ్యాండ్పై ఇప్పుడు నెట్టింట చర్చ మొదలైంది. చూడడానికి అది స్మార్ట్ వాచ్లా కనిపించినా.. దాని వెనక మాత్రం చాలా కథే ఉంది. అదొక ఫిట్నెస్ ట్రాకర్. దాని ద్వారా మన శరీర భాగాల పనితీరును తెలుసుకోవచ్చు. మన బాడీలోని ఒత్తిడి, బీపీ, హార్ట్బీట్, పల్స్ రేట్ను అది ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంది. అయితే దీని కోసం మన మొబైల్లో యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ బ్యాండ్ని చేతికి ధరించి.. శరీర భాగాల పనితీరుని మొబైల్లో చూసుకోవచ్చు. అయితే ఇది స్మార్ట్ వాచ్లా ఒక్కసారి కొంటే..ఎప్పటికీ పనిచేసే పరికరం కాదు. ఫిట్నెస్ని తెలుసుకోవడం కోసం ప్రతి నెల రీచార్జ్ చేసుకోవాలి. ఇలాంటి ఫిట్నెస్ ట్రాకర్ని ధరించాలంటే ఏడాదికి రూ. 25 వేలకు పైగా వరకు చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా నెల నెల కూడా రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ తరహా బ్యాండ్లను సినీ సెలబ్రిటీలతో పాటు క్రీడాకారులు కూడా ఎక్కువగా ధరిస్తున్నారు. -
Bigg Boss 7: శివాజీ తెలివిలేని పని.. ప్రియాంక ప్రాణం మీదకొచ్చింది!
బిగ్బాస్ 7వ సీజన్లో శివాజీ ఉన్నాడంటే ఉన్నాడంతే. ఓ టాస్క్ సరిగా ఆడలేడు, గేమ్లో గెలవలేడు. పోనీ సంచాలక్ బాధ్యత అయినా సరిగా చేశాడా? అంటే అది లేదు. తాజాగా శివాజీ పెట్టిన నిర్ణయం.. ప్రియాంక ప్రాణాల మీదకు తెచ్చింది. మరోవైపు 'టికెట్ టూ ఫినాలే' కోసం ఆల్రెడీ పోటీ మొదలైంది. ఇంతకీ మంగళవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 86 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. శివాజీ సోది ముచ్చట నామినేషన్స్ పూర్తవడంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచి మంగళవారం ఎపిసోడ్ మొదలైంది. మిగతా వాళ్ల సంగతి పక్కనబెడితే అర్జున్, గౌతమ్ తనని నామినేట్ చేయడాన్ని శివాజీ తీసుకోలేకపోయాడు. పొద్దుపొద్దునే ప్రశాంత్తో మాట్లాడుతూ.. మొన్నే వెళ్లిపోవాల్సిందిరా, ఎందుకురా ఈ మెంటల్ టార్చర్ అని గౌతమ్ని ఉద్దేశించి అన్నాడు. అలానే తన విషయంలో అర్జున్ది 100 శాతం పిచ్చి స్ట్రాటజీ అని, నన్ను పంపించేయండ్రా బాబు అని మాట్లాడాడు. ఇది జరిగిన కాసేపటి తర్వాత ప్రియాంకతోనూ మాట్లాడుతూ.. వెళ్లిపోయినా బాగుండేది, పిల్లలు బాగా గుర్తొస్తున్నారని శివాజీ చెప్పుకొచ్చాడు. అయితే ఇవన్నీ కూడా సోది ముచ్చట్లలానే అనిపించాయి. టికెట్ టూ ఫినాలే షురూ 13వ వారం వచ్చేసింది. అంటే ఫినాలే జరగడానికి రెండు వారాలు కూడా లేదు. దీంతో బిగ్బాస్.. తన గేమ్ షురూ చేశాడు. 'టికెట్ టూ ఫినాలే' మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా పలు గేమ్స్ పెడతారని, వీటన్నింటిలో గెలిచి ఎక్కువ పాయింట్స్ సంపాదించిన హౌస్మేట్.. ఇకపై కేవలం ఇంటి సభ్యునిగా ఉండకుండా నేరుగా ఫినాలే వారానికి చేరుకుంటారు. మొట్టమొదటి ఫైనలిస్ట్ అవుతారని బిగ్బాస్ క్లారిటీ ఇచ్చేశాడు. అర్జున్ దూకుడు.. అమర్ అదృష్టం 'టిక్ టాక్ టిక్' అని తొలి గేమ్లో భాగంగా.. బాణం వేగంగా తిరుగుతూ ఉంటుంది. ఆ బాణం టచ్ అయితే ఔట్ అయినట్లు కాదు, ఫ్లాట్ ఫామ్ పైనుంచి కింద పడితే ఔట్ అయినట్లు అని బిగ్బాస్ తొలుత చెప్పాడు. కాసేపటి తర్వాత బాణానికి కాలు తగిలినా సరే ఫౌల్(ఔట్) అని ట్విస్ట్ ఇచ్చాడు. ఇందులో ప్రశాంత్, గౌతమ్, శోభా, శివాజీ, యావర్, అమర్, ప్రియాంక వరసగా ఎలిమినేట్ అయిపోయారు. చివరగా మిగిలిన అర్జున్ విజేతగా నిలిచాడు. పూలని సేకరించే రెండో టాస్క్లో తక్కువ పూలు ఉన్న కారణంగా శివాజీ, ప్రియాంక ఎలిమినేట్ అయిపోయారు. ఇలా రెండు గేమ్స్తో మొదటి లెవల్ పూర్తయింది. పాయింట్ల ప్రకారం చివర్లో ఉన్న శివాజీ, శోభా ఎలిమినేట్ అయిపోయారు. వాళ్లు పాయింట్స్ వేరొకరికి ఇవ్వాలని చెప్పగా.. అమర్కి ఇచ్చేశారు. అలా మనోడికి లక్ కలిసొచ్చింది. తలతిక్క సంచాలక్స్.. గేమ్ డిస్ట్రబ్ ఇక చివరగా 'గాలం వేయ్ బుట్టలో పడేయ్' అనే టాస్క్ పెట్టారు. దీనికి శివాజీ, శోభా సంచాలక్స్గా వ్యవహరించారు. అయితే రింగ్తో బంతిని బయటకు లాగిన తర్వాత ఎవరైనా సరే దాన్ని తీసేసుకోవచ్చని ఓ పిచ్చి రూల్ పెట్టారు. ఈ పోటీ అర్జున్.. బంతిని ఫస్ట్ ఫస్ట్ లాగేసి ఎక్కువ పాయింట్స్ సంపాదించాడు. అయితే ప్రియాంక మూడుసార్లు బంతిని బయటకు లాగినప్పటికీ ప్రశాంత్, యావర్, అమర్.. ఈమె దగ్గర నుంచి లాగేసుకున్నారు. చివర్లో అమర్ అయితే ఈమెని ఎలా పడితే అలా లాగేశాడు. బయటకు చెప్పలేదు గానీ ప్రియాంకకు దెబ్బలు గట్టిగానే తగిలినట్లు అనిపించాయి. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. శివాజీకి గ్రూప్ గేమ్స్ అంటే ప్రశాంత్-యావర్ తో ఏదే మేనేజ్ చేసి ఆడేస్తాడు. కానీ ఒంటరిగా ఆడాలనేసరికి దొరికిపోయాడు. తాజాగా రెండు గేమ్స్ లోనూ ఓడిపోయి.. టికెట్ టూ ఫినాలే రేస్ నుంచి తప్పించారు. పోనీ అది కాదని సంచాలక్ బాధ్యతలు ఇస్తే, అందులోనూ ఎక్కడలేని పిచ్చి రూల్స్ అన్ని పెట్టి.. ప్రియాంక విజయావకాశాల్ని దెబ్బతీసేశాడు చేశాడు. 13వ వారంలో శివాజీ తీరు వల్ల అతడొక్కడే కాదు.. మొత్తం గేమ్ తీరే దెబ్బతింటోంది. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. -
Bigg Boss 7: శివాజీకి షాకిచ్చిన బిగ్బాస్.. ఓట్లు పడినా ఈసారి వేటు గ్యారంటీ!
'బిగ్బాస్' షోలో శివాజీ ఆటలు ఇన్నిరోజులు సాగాయేమో కానీ ఇకపై మాత్రం నో ఛాన్స్. అవును మీరు కరెక్ట్గానే విన్నారు. ఇప్పటివరకు ఓట్లు పడితే సేవ్ అవుతూ వచ్చాడు. ఈసారి మాత్రం వేటు పడటం గ్యారంటీ అనిపిస్తుంది. మొన్నీమధ్యే శివాజీకి బిగ్బాస్.. వార్నింగ్ లాంటి హింట్ ఇచ్చాడు. కాకపోతే మనోడు అప్పుడు అర్థం చేసుకోలేకపోయాడు. ఇప్పుడు రియాలిటీలో అదంతా తెలిసి వస్తోంది. ఇంతకీ ఏం జరుగుతోంది? శివాజీకి బుర్రపనిచేయలేదు మొన్న వీకెండ్ ఎపిసోడ్లో భాగంగా భుజం సమస్య గురించి శివాజీని బిగ్బాస్ అడిగి తెలుసుకున్నాడు. నొప్పి ఎలా ఉందని అడుగుతూనే.. ఇకపై హౌస్లో ఉండాలనుకుంటున్నారా? వెళ్లిపోవాలనుకుంటున్నారా? అని చాలా పద్ధతిగా అడిగాడు. శివాజీ మాత్రం... ఉంటానని, వెళ్లిపోతానని రకానికి ఒకలా చెప్పాడు. చివరగా నాగార్జున సర్ది చెప్పడంతో.. కొనసాగుతానని అన్నాడు. అయితే అన్ని విషయాల్లో ముందు చూపుతో ఆలోచించే శివాజీ.. బిగ్బాస్ ఇచ్చిన హింట్ని సరిగా అర్థం చేసుకోలేక పప్పులో కాలేశాడు. కరెక్ట్గా చెప్పాలంటే శివాజీకి బుర్రలేదని క్లియర్గా అర్థమైపోయింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 25 సినిమాలు) శివాజీకి వరస షాక్లు ఈవారం నామినేషన్స్ పూర్తయిపోయాయి. అమర్ తప్ప మిగతా ఏడుగురు లిస్టులో ఉన్నారు. అయితే ఈసారి కెప్టెన్సీ కోసం టాస్క్లు ఏం ఉండవని నాగ్ ముందే చెప్పాడుగా. దీనికి తగ్గట్లే 'టికెట్ టూ ఫినాలే' పోరు మొదలైంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోల ప్రకారం మూడు గేమ్స్ పెట్టగా.. శివాజీ అడ్డంగా దొరికిపోయాడు. ఏ ఒక్క దానిలోనూ కనీసం చివరివరకు వెళ్లలేకపోయాడు. ఇలా వరస షాక్లు తగిలాయి. వేటు పడటం గ్యారంటీ? ప్రతివారం ఓట్లు పడితే నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోవచ్చు. ఇన్నాళ్లు ఇదే జరుగుతోంది. అయితే చివరి వారాల్లో ఓట్లు ఎక్కువ పడితే సరిపోదు. గేమ్స్లోనూ గెలవాల్సి ఉంటుంది. ఇన్నాళ్లు గ్రూప్ గేమ్స్ కాబట్టి శివాజీ తన మాటలతో మేనేజ్ చేస్తూ బండి లాక్కొచ్చేశాడు. కానీ ఇప్పుడు జరిగేవన్నీ సింగిల్ గేమ్స్ కదా. శివాజీ పనితనం ఏంటో తేలుతుంది. ఒకవేళ టికెట్ టూ ఫినాలే పోటీలో గెలవకపోతే.. ఓటింగ్తో సంబంధం లేకుండా బయటకు పంపేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న ఫిజికల్ టాస్క్ల వల్ల భుజం నొప్పి తిరగబెడితే మాత్రం.. శివాజీ మిడ్ వీక్ ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. (ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్ ఎంగేజ్మెంట్.. కాబోయే భర్త ఎవరంటే?) -
Bigg Boss 7: మళ్లీ ఎలిమినేట్ అయిన రతిక.. కారణం మాత్రం అదే!
బిగ్బాస్ 7లో మరో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. కాకపోతే ఈసారి డబుల్ ఎలిమినేషన్ జరిగింది. అశ్వినితో పాటు బిగ్బాస్కి ఎంతో ఇష్టమైన రతిక ఎలిమినేట్ అయిపోయింది. తనని రెండోసారి కూడా బయటకు పంపేస్తారని రతికకి ముందే తెలుసు. ఎలిమినేషన్తో పాటు సండే ఎపిడోస్లో ఇంకా ఏమేం జరిగాయనేది Day 84 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: యాంకర్ రష్మీకి పెళ్లి కుదిరిందా? అసలు విషయం ఏంటంటే!) శివాజీ గురించి నిజం అశ్విని ఎలిమినేట్ కావడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. ఆమె స్టేజీపైకి రావడంతో ఆదివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. అయితే హస్లో ఉన్నవాళ్లలో ఎవరు హిట్? ఎవరు ఫ్లాప్? అనేది చెప్పాలని నాగ్ అడగ్గా.. అలా కాదు హిట్, సూపర్హిట్ ఎవరనేది చెబుతానని అశ్విని చెప్పింది. రతిక-ప్రియాంక ఫ్లాప్ అని చెప్పిన అశ్విని, అమర్-గౌతమ్-శోభాశెట్టి-శివాజీ హిట్ అని చెప్పింది. ప్రశాంత్-అర్జున్-యావర్ మాత్రం సూపర్హిట్ అని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. అయితే శివాజీ గురించి చెప్పిన అశ్విని.. ఆయన కొందరి వరకు మాత్రమే పరిమితమైపోయారని నిజాన్ని చెప్పింది. దీన్ని తీసుకోలేకపోయిన సోఫాజీ అలి.యాస్ శివాజీ.. నువ్వు అలా అనుకుంటున్నావ్ అని ఏదేదో చెప్పి కవర్ చేశాడు. చుక్క బ్యాచ్ vs ముక్క బ్యాచ్ అయితే అశ్విని మాట్లాడుతున్నప్పుడు ప్రస్తుతం హౌస్లో రెండు గ్రూప్స్ ఉన్నాయని చెప్పింది. ఇది నిజమేనని ఒప్పుకొన్న నాగార్జున.. అమర్-శోభా-ప్రియాంకలని కలిపి 'చుక్క బ్యాచ్' అని.. శివాజీ-యావర్-ప్రశాంత్లని కలిపి 'ముక్క బ్యాచ్' అని చెప్పాడు. అయితే ఇన్నాళ్లు బయట అనుకున్నది స్వయంగా నాగార్జున చెప్పడంతో.. గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని నిర్వహకులే ఒప్పుకొన్నట్లు అయింది. ఆ తర్వాత ఇంట్లో వస్తువుల గురించి, వస్తువులతో పాటల గురించి టాస్క్స్ పెట్టారు. ఇదంతా టైమ్ పాస్ పల్లీ బఠాణీ వ్యవహారంలా అనిపించింది తప్పితే అలరించలేకపోయింది. (ఇదీ చదవండి: లవర్ని పరిచయం చేసిన 'జబర్దస్త్' నరేశ్.. కాకపోతే!) రతిక ముందే పసిగట్టింది శనివారం అశ్విని ఎలిమినేట్ కాగా.. మిగిలిన ఏడుగురిలో ఆదివారం వరసగా అమర్, గౌతమ్, ప్రశాంత్, యావర్, శివాజీ సేవ్ అయ్యారు. చివరగా అర్జున్, రతిక మిగిలారు. అయితే వీళ్లిద్దరిలో ఎవరికైనా ఎవిక్షన్ పాస్ ఉపయోగిస్తావా ప్రశాంత్? అని నాగ్ అడగ్గా.. తాను 14వ వారం మాత్రమే దీన్ని ఉపయోగిస్తానని ఖరాఖండీగా చెప్పేశాడు. ఆ తర్వాత కాసేపు సస్పెన్స్ మెంటైన్ చేసి రతిక ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. వెళ్తూ వెళ్తూ శోభాతో రతిక మాట్లాడుతూ.. బహుశా ఆడట్లేదని నన్ను తీసేశారేమో అని తనలో తానే అనుకుంది. ఇక స్టేజీపై వచ్చిన తర్వాత 'ఏ నిమిషానికి ఏమి జరుగునో' అని పాట పాడి అందరికీ సెండాఫ్ చెప్పేసింది. ఎలిమినేషన్కి అదే కారణం ఈ వారం నామినేట్ అయినప్పుడే రతిక.. తన ఎలిమినేషన్ విషయాన్ని పసిగట్టింది కానీ దాన్ని పెద్దగా సీరియస్ తీసుకోలేదు. ఒకవేళ ఈ వారం టాస్క్ గెలిచి ఎవిక్షన్ పాస్ గెలుచుకుని ఉంటే కచ్చితంగా సేవ్ అయ్యేది. తొలుత నాలుగు వారాలు ఉన్నప్పుడు సోది ముచ్చట్లు పెట్టింది. దీంతో ఎలిమినేట్ చేసి ఇంటికి పంపేశారు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఐదు వారాలు ఉంది. కానీ గేమ్స్ ఆడే విషయంలో అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎప్పుడు చూడు శివాజీకి చెంచాగిరి చేయడమే సరిపోయింది. ఇలా పలు కారణాల వల్ల రతిక ఎలిమినేట్ అయిపోయింది. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: రతిక ఎలిమినేట్.. మొత్తం ఎంత సంపాదించిందో తెలుసా?) -
Bigg Boss 7: రతిక ఎలిమినేట్.. మొత్తం ఎంత సంపాదించిందో తెలుసా?
బిగ్బాస్ దత్తపుత్రిక రతిక మళ్లీ ఎలిమినేట్ అయిపోయింది. డబుల్ ఎలిమినేషన్లో భాగంగా రెండో వికెట్ రూపంలో హౌస్ నుంచి బయటకొచ్చేసింది. అయితే ఈ వారం నామినేట్ అయినప్పుడే ఈమె బయటకెళ్లడం కన్ఫర్మ్ అని అందరూ ఫిక్సయ్యారు. అలా అనుకున్నదే జరిగింది.అసలు రతిక రెండోసారి ఎలిమినేట్ కావడానికి కారణమేంటి? మొత్తం రెమ్యునరేషన్ రూపంలో ఎంత సంపాదించింది? రతిక మళ్లీ అదే తప్పు బిగ్బాస్ షోలోకి వస్తున్నారంటే ఎంటర్టైన్ చేయాలి లేదంటే గేమ్స్ ఆడాలి. ఈ రెండు విషయాల్లోనూ రతిక ఫెయిలైంది. ఫస్ట్ ఎలిమినేట్ కావడానికి ముందు సరిగ్గా నాలుగు వారాలు హౌసులో ఉంది. అయితే వచ్చిన వెంటనే ప్రశాంత్ని తన చుట్టూ తిప్పుకొన్న రతిక.. అతడిపై రివర్స్ అయింది. దీంతో ఈమెపై నెగిటివిటీ పెరిగింది. పోనీ గేమ్స్ అయినా ఆడితే ఇది తగ్గేదేమో కానీ ముచ్చట్లు పెట్టడం తప్పితే ఒక్క విషయంలోనూ పెద్దగా మెప్పించలేకపోయింది. అలా నాలుగు వారాల తర్వాత హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. (ఇదీ చదవండి: యాంకర్ రష్మీకి పెళ్లి కుదిరిందా? అసలు విషయం ఏంటంటే!) బిగ్బాస్కి ఏం ప్రేమ పుట్టకొచ్చిందో ఏమో గానీ ఎలిమినేట్ అయిన రెండు వారాల్లోనే పిచ్చి లాజిక్స్ అని చెప్పి, రతికని తిరిగి హౌస్లోకి తీసుకొచ్చారు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అయినా రతిక గేమ్స్ ఆడిందా? అంటే అస్సలు లేదు. 'ఈ వారం కచ్చితంగా ఆడతా' అని హోస్ట్ నాగార్జునకు ప్రతిసారి చెప్పడమే సరిపోయింది. దానికి తోడు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్క గేమ్ కూడా గెలవలేకపోయింది. అలా ఈ వారం నామినేషన్స్లో నిలిచింది. అయితే రైతుబిడ్డ ప్రశాంత్తో ఈమె గొడవ పెట్టుకోవడం మైనస్ అయింది. దీంతో పాటు పలు కారణాలు కూడా రతిక పాప ఎలిమినేషన్కి కారణమయ్యాయి. రెమ్యునరేషన్ ఎంతంటే? ఇక రెండుసార్లు కలిపి రతిక.. బిగ్బాస్ హౌస్లో 9 వారాలు ఉంది. తొలుత నాలుగు వారాలు, రీఎంట్రీ తర్వాత మరో ఐదు వారాల పాటు బండి లాక్చొచ్చేసింది. ఇక ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం రతికకి వారానికి రూ.2 లక్షలు అనుకున్నారట. అంటే ఓవరాల్గా దాదాపు రూ.18 లక్షల వరకు రెమ్యునరేషన్ రూపంలో సంపాదించినట్లు తెలుస్తోంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: లవర్ని పరిచయం చేసిన 'జబర్దస్త్' నరేశ్.. కాకపోతే!) -
Shobha Shetty: మాటలతోనే కాదు, అందంతోనూ దడ పుట్టిస్తున్న నటి (ఫోటోలు)
-
Bigg Boss 7: అశ్విని ఎలిమినేట్.. ఏడు వారాలకు రెమ్యునరేషన్ ఎంత తెలుసా?
బిగ్బాస్ 7లో అనుకున్నట్లే ఎలిమినేషన్ జరిగింది. శనివారం ఎపిసోడ్లో భాగంగా హౌస్ నుంచి అశ్విని బయటకొచ్చేసింది. గతవారం హోస్ట్ నాగార్జున చెప్పినట్లే ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా ఈమెది తొలి వికెట్. అయితే ఈమె ఎలిమినేట్ అవడానికి హింట్స్ ముందే వచ్చాయి. ఇన్నాళ్లు హౌస్లో ఉన్నందుకుగానూ ఎన్ని లక్షలు సంపాదించింది? (ఇదీ చదవండి: Bigg Boss 7: బయటకొచ్చేస్తానని శివాజీ డ్రామా? అమర్ నిజస్వరూపం బట్టబయలు!) వైల్డ్ కార్డ్ ఎంట్రీ 'సరిలేరు నీకెవ్వరు', 'సర్దార్ గబ్బర్ సింగ్', 'రాజా ది గ్రేట్' తదితర సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేసిన అశ్వినికి గుర్తింపు ఏం రాలేదు. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం ఈమె ఒంపుసొంపులకు బోలెడంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే అక్టోబరు 8న బిగ్బాస్లోకి ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. వీళ్లలో అశ్విని ఒకరు. భోలెతో దోస్తీ ఇక బిగ్బాస్లోకి వచ్చిన తర్వాత అశ్విని మిగతా వాళ్లతో పెద్దగా కలవలేకపోయింది. తనతో ఎవరు మింగిల్ అవ్వట్లేదని సీరియల్ బ్యాచ్తో నామినేషన్స్ సందర్భంగా ఈమె గొడవ కూడా పెట్టుకుంది. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలోనే తనతో పాటు వచ్చిన సింగర్ భోలెతో ఈమెకి దోస్తీ కుదిరింది. గేమ్స్ పరంగా అంతంత మాత్రంగానే ఉన్న అశ్విని.. ఒక్కో వారం సేవ్ అవుతూ ఇప్పటివరకు ఉండిపోయింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డ వల్ల రెండోసారి రతిక ఎలిమినేట్.. వేరే లెవల్ రివేంజ్!) ఎలిమినేషన్ కారణం? అయితే ప్రతివారం కాస్తోకూస్తో తన టంగ్ పవర్ చూపిస్తూ వచ్చిన అశ్విని.. ఈ వారం మాత్రం సైలెంట్ అయిపోయింది. నామినేట్ చేయడానికి పేర్లు లేవని చెప్పి సెల్ఫ్ నామినేట్ చేసుకుంది. దీంతో అప్పుడే చాలామంది ఈమె ఈవారం ఎలిమినేట్ అయిపోవడం పక్కా అని ఫిక్స్ అయ్యారు. అనుకున్నట్లు ఈమె బయటకొచ్చేసింది. రెమ్యునరేషన్ ఎంత? వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అశ్విని.. బిగ్బాస్లో మొత్తంగా ఏడు వారాలు ఉంది. వారానికి రూ.2 లక్షలు చొప్పున దాదాపు రూ.14 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్లో ప్రసుతానికైతే ఈమె ఎక్కువ మొత్తం అందుకుంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్లో ఇంకా అర్జున్ మాత్రమే మిగిలున్నాడు. (ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన 'జబర్దస్త్' ఫైమా.. అసలు ఏమైందంటే?) View this post on Instagram A post shared by Ashwini Sri (@ashwinii_sree) -
Bigg Boss 7: బయటకొచ్చేస్తానని శివాజీ డ్రామా? అమర్ నిజస్వరూపం బట్టబయలు!
బిగ్బాస్ షోలో కాస్తోకూస్తో ఆసక్తిగా ఉండేవి అంటే నామినేషన్స్, వీకెండ్ ఎపిసోడ్ మాత్రమే. ఈ సీజన్లో నామినేషన్స్ తప్ప వీకెండ్ ఎపిసోడ్స్ బోరింగ్గా సాగుతూ వచ్చాయి. ఇన్నాళ్లకు ఓ వీకెండ్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. హోస్ట్ నాగార్జున అయితే ఒక్కొక్కరిని నిలబెట్టి కడిగేశాడు. అలానే చాలామంది ఊహించినట్లే అశ్విని ఎలిమినేట్ అయిపోయింది. ఇంతకీ శనివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 83 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. శివాజీ భుజం డ్రామా కెప్టెన్సీ టాస్క్లో తనకు అన్యాయం జరగడంపై అమర్ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. ఎవరొచ్చి చెప్పినా సరే ఆ బాధ నుంచి బయటకు రాలేకపోయాడు. ఇక శివాజీని కన్ఫెషన్ గదికి పిలిచిన బిగ్బాస్.. భుజం నొప్పి తగ్గిందా? అంతా ఓకేనా అని ఆరా తీశాడు. డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారం కోలుకుంటున్నారని, రాబోయే వారాల్లో టఫ్ గేమ్స్ ఉంటాయని చెప్పాడు. హౌసులో ఉండాలనుకుంటున్నారా? బయటకొచ్చేయాలనుకుంటున్నారా? అని బిగ్బాస్ అడగ్గా.. కాస్త టైమ్ ఇస్తే ఆలోచించి చెబుతానని అన్నాడు. అయితే ఇకపై హౌసులో మీ గాయానికి ఎలాంటి ప్రమాదం జరిగినా బాధ్యత అంతా మీదే అని బిగ్బాస్ క్లారిటీ ఇచ్చాడు. తొలుత కొనసాగుతానని చెప్పిన శివాజీ.. కాసేపటి తర్వాత మనసు మార్చుకుని.. బయటకెళ్లిపోతా అని అన్నాడు. (ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన 'జబర్దస్త్' ఫైమా.. అసలు ఏమైందంటే?) ధైర్యం చెప్పిన నాగ్ ఇదంతా జరిగిన తర్వాత హోస్ట్ నాగార్జున కూడా కన్ఫెషన్ రూంకి పిలిచి మరీ శివాజీ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశాడు. 100 శాతం ఎఫర్ట్ పెట్టలేనప్పుడు కప్ ఆశించడం కరెక్ట్ కాదని, అందుకే వెళ్లిపోతానని అన్నట్లు శివాజీ చెప్పాడు. ఎక్కువ ఆలోచించొద్దు, భయమనేది వద్దని నాగ్ కాస్త సర్దిచెప్పేసరికి శివాజీ అంగీకరించాడు. ఇకపై ఏం జరిగినా బాధ్యత తనదేనని చెప్పాడు. దీనిబట్టి చూస్తే.. ఒకవేళ గాయం ఏమైనా తిరగబెడితే మాత్రం ఎప్పుడైనా సరే శివాజీ హౌస్ నుంచి బయటకెళ్లిపోయే ఛాన్స్ ఉంది. మరి చివరి వారం వరకు ఉంటాడా లేదా అనేది అతడి గాయం తీవ్రత బట్టి ఆధారపడి ఉంటుంది. అమర్ నిజస్వరూపం ఎవిక్షన్ పాస్ గెలుచుకున్న ప్రశాంత్ని నాగార్జున మెచ్చుకున్నాడు. ఆ తర్వాత అశ్విని నిలబెట్టి.. డబుల్ ఎలిమినేషన్ అని తెలిసి కూడా సెల్ఫ్ నామినేట్ చేసుకుంటావా? కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? అని అని నాగ్ సీరియస్ అయ్యాడు. అనంతరం అమర్తో మాట్లాడాడు. గతంలో ప్రశాంత్ ఏడుస్తుంటే, దాన్ని యాక్టింగ్ అని అమర్ అందులో అన్నట్లు ఉంది. తాజాగా కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా అమర్ ఏడవటాన్ని లింకప్ చేసి నాగ్ ప్రశ్నించాడు. వేరేవాళ్లు ఏడిస్తే, వాళ్లది యాక్టింగ్ అని నువ్వు అన్నావ్.. ఇప్పుడేమో నువ్వు చేసింది యాక్టింగా? అని నాగ్ అడిగేసరికి.. నా వరకు వస్తే గానీ తెలియలేదు అని అమర్ తన అభిప్రాయం చెప్పాడు. అలానే గత వారం కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా తన ఏడిచింది స్ట్రాటజీ అని శివాజీతో మాట్లాడుతూ అమర్ ఓ సందర్భంలో చెప్పాడు. ఆ వీడియోని కూడా స్క్రీన్పై ప్లే చేసిన నాగ్.. ఇదేంటని అడిగాడు. అమర్ ఏదో చెప్పబోతుంటే.. నీ విషయంలో ఏది యాక్టింగ్? ఏది జెన్యూనిటీ? ఏది స్ట్రాటజీ? అనేది మాకే అర్థం కావట్లేదని నాగ్ అసహనం వ్యక్తం చేశాడు. ఏదైనా సరే కెప్టెన్సీ కంటే కప్ ముఖ్యం అని చెప్పి అమర్ని నాగ్ శాంతింపజేశాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డ వల్ల రెండోసారి రతిక ఎలిమినేట్.. వేరే లెవల్ రివేంజ్!) శివాజీ వాదన శివాజీ.. కెప్టెన్సీ విషయమై అమర్కి మాటిస్తున్నా అన్నావ్? మాట కోసం చచ్చిపోతాను అన్నావ్? ఎందుకు మాట మార్చావ్ అని నాగ్, శివాజీని అడిగాడు. దానికి శివాజీ ఏదేదో చెప్పుకొచ్చాడు. అమర్ కెప్టెన్ అయితే తన డిప్యూటీలుగా ప్రియాంక-శోభాని పెట్టుకుంటానన్నాడని అది తనకు నచ్చలేదని, అలానే ప్రియాంక కెప్టెన్సీలో చాలా విషయాలు కరెక్ట్గా జరగలేదని నాగ్ ముందే చెప్పాడు. మధ్యలో లేచిన ప్రియాంక.. నాగ్ ముందే శివాజీతో వాదన పెట్టుకుంది. ఇదంతా కూడా చిన్నపిల్లలా యవ్వారంలా అనిపించింది తప్పితే డీసెంట్గా అయితే లేదు. అలానే 'హత్య టాస్క్' సందర్భంగా శోభాకి సీక్రెట్ చెప్పి, ఆమె డెడ్ అవ్వకుండా ప్రియాంక కాపాడింది. ఈ వీడియోని చూపించిన నాగ్.. ప్రియాంకని కూడా ఓ రేంజులో ఇచ్చిపడేశాడు. మీ ముగ్గురూ(అమర్-ప్రియాంక-శోభా).. ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటున్నారని సీరియస్ అయ్యాడు. అశ్విని ఎలిమినేట్ చివర్లో యావర్ని కూడా నిలబెట్టి కెప్టెన్ అంటే హౌస్ మొత్తానికి కెప్టెన్ అని, ఆమెతో నామినేషన్స్ సందర్భంగా ప్రవర్తించిన తీరు సరికాదని చెప్పిన నాగార్జున.. యావర్తో ప్రియాంకకు సారీ చెప్పించాడు. కట్ చేస్తే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని గుర్తుచేసిన నాగ్.. గన్తో పేల్చడం అనేది పెట్టి అశ్విని ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. అయితే ప్రశాంత్.. నువ్వేమైనా ఎవిక్షన్ పాస్ ఇప్పుడు ఉపయోగిస్తావా అని అడగ్గా.. 14వ వారం వేరొకరి కోసం ఉపయోగిస్తానని ప్రశాంత్, నాగార్జునకు మాటిచ్చేశాడు. అలా శనివారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు స్టార్ హీరోయిన్.. ఈమె ఎవరంటే?) -
Bigg Boss 7: రైతుబిడ్డ వల్ల రెండోసారి రతిక ఎలిమినేట్.. వేరే లెవల్ రివేంజ్!
బిగ్బాస్ దత్తపుత్రిక రతిక మళ్లీ ఎలిమినేట్ అయిపోయింది. అవును మీరు విన్నది నిజమే. అయితే ఈసారి తనకు తానుగా ఎలిమినేట్ కాలేదు. రైతుబిడ్డ రివేంజ్ వల్ల ఈ బ్యూటీ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. రెండుసార్లు రతిక ఎలిమినేషన్కి రైతుబిడ్డ ప్రశాంతే కారణమయ్యాడు. ఇంతకీ లేటెస్ట్ ఎలిమినేషన్లో ఏం జరిగింది? ప్రశాంత్, రతికపై ఎలా పగ తీర్చుకున్నాడనేది ఇప్పుడు చూద్దాం. బిగ్బాస్ హౌస్లో రతిక ఓ వింత కంటెస్టెంట్. ఎందుకంటే తొలి వారంలో ఎఫర్ట్ పెట్టింది. రెండో వారానికి వచ్చేసరికి రైతుబిడ్డ ప్రశాంత్తో ప్రేమ కహానీ మొదలుపెట్టింది. అక్కడివరకు బాగానే ఉంది. కానీ రోజులు గడిచేసరికి తనలోని మరో యాంగిల్ బయటకు తీసింది. అన్నిరోజులు క్లోజ్గా మూవ్ అయిన ప్రశాంత్పై రివర్స్ అయింది. దీంతో ఈమెకి ప్రశాంత్ ఫ్యాన్స్ నుంచి ఫుల్ నెగిటివిటీ ఏర్పడింది. దీనికి తోడు గేమ్స్లోనూ రతిక సరిగా ఆడకపోవడం మరో మైనస్. ఫలితంగా ఐదో వారం ఈమెని ఎలిమినేట్ చేసి బయటకు తోసేశారు. (ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన 'జబర్దస్త్' ఫైమా.. అసలు ఏమైందంటే?) అయితే బిగ్బాస్కి రతిక అంటే చాలా ప్రేమ. దీంతో వింత లాజిక్స్ అన్ని పెట్టి ఎలాగోలా రీఎంట్రీ పేరుతో ఈమెని మళ్లీ హౌస్లోకి తీసుకొచ్చారు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అయినా గేమ్స్, టాస్కులు ఆడిందా అంటే నో ఛాన్స్. శివాజీకి చెంచాగిరి చేయడమే సరిపోయింది. దానికి తోడు ప్రశాంత్ తో మళ్లీ గొడవ పెట్టుకుంది. దీంతో ఈ వారం రతిక, ప్రశాంత్.. ఒకరిని ఒకరు నామినేట్ చేసుకున్నారు. ఇద్దరూ నామినేషన్స్లోనూ ఉన్నారు. ఇకపోతే ఈ వీకెండ్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని, హోస్ట్ నాగార్జున గత వారమే చెప్పారు. మరోవైపు ఈ వారం జరిగిన పోటీలో గెలిచిన ప్రశాంత్, ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు. దాన్ని ఇప్పుడు వీకెండ్ ఎలిమినేషన్ సందర్భంగా ఉపయోగించేసినట్లు తెలుస్తోంది. తొలుత అశ్విని ఎలిమినేట్ అయిందట. రెండో విడతలో చివరగా రతిక, అర్జున్ మిగిలారట. వీళ్లిద్దరిలో ఎవరో ఒకరి కోసం ఎవిక్షన్ పాస్ ఉపయోగించాలని చెప్పగా.. ప్రశాంత్ తన పాస్ ని అర్జున్ కి ఇచ్చేశాడట. అలా రతిక.. రైతుబిడ్డ వల్లే రెండోసారి ఎలిమినేట్ అయిపోయిందట. ఈ క్రమంలోనే రైతుబిడ్డ, రతికపై వేరే లెవల్ రివేంజ్ తీర్చుకున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: భర్తని పరిచయం చేసిన హీరోయిన్ ఇలియానా.. ఇతడెవరో తెలుసా?) -
అమర్ని మోసం చేసిన శివాజీ? చివరకు అలాంటి పరిస్థితి!
బిగ్బాస్ హౌస్లో అమర్ మరోసారి బలైపోయాడు. శివాజీ దారుణంగా మోసం చేశాడు. దీంతో నొప్పి తట్టుకోలేకపోయాడు. చివర్లో ఓకే చెప్పాడు గానీ బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వడంతో హౌస్మేట్స్ అందరూ షాకయ్యారు. అయితే ఆ ఒక్కటి చేయకపోవడమే అమర్ కెప్టెన్సీపై దెబ్బేసింది. ఇంతకీ శుక్రవారం ఏం జరిగిందనేది Day 82 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. చివరి కెప్టెన్సీ టాస్క్ ఈ వారం నామినేషన్స్ తర్వాత 'హత్యల టాస్క్' ఇచ్చిన అని బిగ్బాస్ గేమ్ పెట్టాడు. అది అయిపోవడంతో గురువారం ఎపిసోడ్ ముగిసింది. ఏడో సీజన్లో చిట్టచివరి కెప్టెన్ కోసం 'పాయింట్ బ్లాంక్' అని టాస్క్ పెట్టడంతో శుక్రవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఈ గేమ్ ప్రకారం.. ఓ చోట రెండు ఫొటోలు చూపిస్తారు. ఇద్దరు హౌస్మేట్స్ ఓ నిర్ణయానికొచ్చి, ఆ రెండు ఫొటోల్లో కెప్టెన్ కావడానికి ఎవరు అనర్హులో గన్తో కాల్చేయాల్సి ఉంటుందని బిగ్బాస్ క్లారిటీ ఇచ్చాడు. (ఇదీ చదవండి: 'కోటబొమ్మాళి పీఎస్' సినిమా రివ్యూ) ఎవరు ఎవరిని కాల్చారు? ఎవరిని సేవ్ చేశారు? హౌస్మేట్స్ షూట్-సేఫ్ గౌతమ్ , ప్రియాంక - శోభా, అర్జున్ ప్రశాంత్, శోభాశెట్టి - అశ్విని, అమర్ యావర్, రతిక - ప్రశాంత్, శివాజీ శివాజీ, అశ్విని - యావర్, అర్జున్ అమర్, అర్జున్ - ప్రియాంక, శివాజీ యావర్, రతిక - గౌతమ్, అర్జున్ ప్రియాంక, అశ్విని - రతిక, అమర్ అమర్, గౌతమ్ - శివాజీ, అర్జున్ శివాజీ, శోభా - అర్జున్, అమర్ అమర్ కెప్టెన్సీ పిచ్చి గత వీకెండ్ సందర్భంగా.. 12వ వారం గురించి రెండు ట్విస్టులు ఇచ్చాడు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని, అలానే కెప్టెన్సీ టాస్క్ కూడా ఈ వారం చివరిదని హోస్ట్ నాగార్జున చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఉన్నవాళ్లలో అమర్, అశ్విని, రతిక.. కెప్టెన్ కాలేదు. దీంతో అమర్, తన ఫొటో కాల్చొద్దని అందరినీ బతిమలాడుకున్నాడు. దీనికి అందరూ ఓకే చెప్పారు కూడా. అయితే మిగతా వాళ్లతో పోలిస్తే.. నేను కెప్టెన్ అవ్వాలి, లేకపోతే ఉండలేను అనేంత రేంజులో అమర్ హడావుడి చేశాడు. దీన్ని పిచ్చి అంటారా? లేదా ఇంకేదైనా అంటారా అనేది అర్థం కాలేదు. శివాజీ వెన్నుపోటు? హౌస్లోకి వచ్చినప్పటి నుంచి అమర్ అంటే శివాజీకి ఎందుకో కోపం. కారణమున్నా లేకపోయినా సరే కొన్నివారాలు అతడినే నామినేట్ చేసేవాడు. ఇక ఇది చివరి వారమని.. తనకు కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఇవ్వాలని.. టాస్క్ ప్రారంభానికి ముందే అమర్ అడిగాడు. దానికి శివాజీ కూడా సరేనన్నాడు. కానీ చివర్లో అర్జున్, అమర్ ఫొటోలు వచ్చేసరికి తన ఓటు అర్జున్కి వేస్తున్నట్లు చెప్పాడు. అమర్ విషయంలో ప్లేటు తిప్పేశాడు. శివాజీకి జోడిగా ఉన్న శోభా మాత్రం.. అమర్ పేరు చెప్పింది. దీనిబట్టి చూస్తే శివాజీ.. మరోసారి అమర్ అంటే కోపాన్ని బయటపెట్టడంతో పాటు వెన్నుపోటు పొడిచేశాడు. (ఇదీ చదవండి: Aadikeshava Review: 'ఆదికేశవ' సినిమా రివ్యూ) అదే కొంపముంచింది అయితే అర్జున్ భార్య అతడిని కెప్టెన్ కావాలని కోరుకుందని, అందుకే తన పేరు చెప్పినట్లు శివాజీ తన కారణం చెప్పాడు. దీంతో అమర్-శివాజీ మధ్య చాలాసేపు డిస్కషన్ జరిగింది. అమర్ అయితే నేను ఎలాగైనా కెప్టెన్ కావాలన్నా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఓవైపు అర్జున్ తన స్టాండ్ బలంగా చెబుతుండేసరికి.. ఇది ఎంతకీ తెగలేదు. దీంతో ఇక నిర్ణయం చెప్పకపోతే.. కెప్టెన్సీనే పూర్తిగా రద్దు చేస్తామని హెచ్చరించాడు. అప్పుడు ఇక వేరే దారిలేక శోభా-శివాజీ కలిసి.. అర్జున్ పేరు చెప్పారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. అర్జున్ ఫొటోతో పాటు అమర్ ఫొటో కూడా కాలిపోయింది. అయితే ఈ విషయంలో శివాజీది ఎంత తప్పుందో అమర్ది కూడా అంతే తప్పుందని చెప్పొచ్చు. ఏడుస్తూ టైమ్ వేస్ట్ చేసుకోకుండా శివాజీని కన్విన్స్ చేసి ఉండాల్సింది. కానీ బ్యాడ్ లక్. నిర్ణయం ఆలస్యమయ్యేసరికి అర్జున్తో పాటు అమర్ ఫొటో కూడా కాలిపోయింది. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. మరీ అమర్ కొత్త కెప్టెన్ అవుతాడా? లేదా? అనేది శనివారం ఎపిసోడ్లో తేలుతుందిలే. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు) -
Bigg Boss 7: అమర్కి ఎదురుదెబ్బలు.. మొన్న ప్రియాంక ఇప్పుడు శోభా!
బిగ్బాస్ షో నిర్వహకులు, హౌస్మేట్స్ ఇద్దరికి ఇద్దరూ అలానే తగలడ్డారు. లేటెస్ట్ ఎపిసోడ్ చూస్తే సరిగ్గా ఈ డైలాగే గుర్తొచ్చింది. ఎందుకంటే అందరూ ఫెర్ఫార్మ్ చేయమని.. బిగ్బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. అందుకు తగ్గట్లే ఎంటర్టైన్ చేయాల్సింది పోయి అందరూ కలిసి చిరాకు కలిగేలా చేశారు. మరీ ముఖ్యంగా శోభా-అమర్దీప్ అయితే నస పెట్టారు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 80 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. టాస్క్ ఓకే.. ఫెర్ఫార్మెన్సే? ఎవిక్షన్ పాస్ ప్రశాంత్ గెలుచుకోవడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. ఇక మిసెస్ బిగ్బాస్ని ఎవరో హత్య చేశారని, చంపిందెవరో కనుక్కోమని అర్జున్-అమర్కి బిగ్బాస్ టాస్క్ ఇవ్వడంతో బుధవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. వీళ్లిద్దరూ కూడా ఇన్వెస్టిగేట్ ఆఫీసర్స్ ఇంద్రజిత్-కామ్జిత్ రోల్స్ చేశారు. అశ్విని-శోభాశెట్టి రిపోర్టర్స్గా, రతిక-గౌతమ్ సీక్రెట్ ప్రేమ జంటగా, యావర్-ప్రియాంక.. పని మనషులుగా నటించారు. శివాజీ, నువ్వు మర్డరర్ అని చెప్పిన బిగ్బాస్.. పోలీసులు దొరక్కుండా మరిన్నీ మర్డర్స్ చేయాలని సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: శివాజీకి షాక్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ ఇద్దరేనా?) శోభా-అమర్ నస సీరియల్ బ్యాచ్ అనగానే శోభా-అమర్-ప్రియాంక గుర్తొస్తారు. ఇప్పటివరకు ఒక్కటిగా ఆడుతూ వస్తున్న వీళ్ల మధ్య గ్యాప్ వస్తోంది. గతవారం కెప్టెన్సీ టాస్క్లో గెలిచిన తర్వాత అమర్ దగ్గరకొచ్చిన ప్రియాంక.. నేను గెలుస్తుంటే నీకు ఆనందంగా లేదని ఉన్న నిజాన్ని బయటపెట్టింది. ఇప్పుడు టాస్క్లో భాగంగా శోభా తన మైక్ పట్టుకుని పైపైకి వస్తుందని చెప్పి, ఓవర్ ల్యాప్ చేస్తున్నావ్ నువ్వు అని అమర్, ఆమెతో అన్నాడు. దీంతో శోభా హర్ట్ అయిపోయింది. స్మెల్ వస్తోంది, దూరంగా వెళ్లు అని పదేపదే అంటున్నాడని చెప్పి అమర్తో శోభా గొడవ పెట్టుకుంది. ఈ వాదన ఎక్కువయ్యేసరికి అమర్.. తన లాఠీ విసిరేసి మరీ కాస్త అతి చేశాడు. వెనక్కి తోయడం అనేది యాక్టింగ్లో భాగం, నేను ఎవరినైనా కావాలని ఆపుతున్నానా అని అమర్ తన పాయింట్ చెప్పాడు. అయితే ఈ మాట తనని చూసి ఎందుకు అంటున్నావ్ అని అశ్విని, అమర్పై రెచ్చిపోయింది. గొడవ మీ ఇద్దరికీ జరిగితే నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నావ్ అని అశ్విని అరిచింది. ఫెర్ఫార్మ్ చేయండ్రా అని బిగ్ బాస్ చెబితే సీరియల్ బ్యాచ్లోని అమర్-శోభా మాత్రం అనవసర వాదనలతో చాలా నస పెట్టేశారు. సీక్రెట్ టాస్క్లో భాగంగా రైతుబిడ్డ ప్రశాంత్ మొక్కని శివాజీ మాయం చేశాడు. అయితే మిగతా రోజులతో పోలిస్తే.. లేటెస్ట్ ఎపిసోడ్ చాలా నీరసంగా సాగింది. హౌస్మేట్స్ ఒక్కరు కూడా కనీసం ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయారు. అలా బుధవారం ఎపిసోడ్ ముగింది. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరోయిన్.. భర్త ఎవరంటే?) -
Bigg Boss 7: శివాజీకి షాక్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ ఇద్దరేనా?
బిగ్బాస్ 12వ వారం నడుస్తోంది. గతవారం లానే ఈసారి కూడా ఏకంగా 8 మంది నామినేట్ అయ్యారు. గత వీకెండ్ లో నాగ్ చెప్పినట్లు ఈసారి డబుల్ ఎలిమినేషన్ గండం ఉంది. మరోవైపు పెద్దాయన శివాజీకి అమర్దీప్ వల్ల షాక్ తగిలింది. ఇంతకీ అసలేం జరుగుతోంది? నామినేషన్స్-ఓటింగ్-ఎలిమినేషన్ సంగతేంటి అనేది ఇప్పుడు చూద్దాం. నామినేషన్స్ సంగతేంటి? బిగ్బాస్ ప్రస్తుత సీజన్లో 11 వారాలు పూర్తయ్యాయి. పదివారాల పాటు ఒక్కో కంటెస్టెంట్ చొప్పున ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. గతవారం మాత్రం యావర్ తన ఎవిక్షన్ పాస్ తిరిగిచ్చేసిన కారణాన్ని చూపిస్తూ నో ఎలిమినేషన్ అన్నారు. ఈ వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగ్ బాంబు పేల్చాడు. దీంతో ఈసారి నామినేషన్స్ అనేది కాస్త ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. కెప్టెన్ ప్రియాంక, శోభా తప్పితే మిగిలిన 8 మంది లిస్టులోకి చేరిపోయారు. (ఇదీ చదవండి: కాస్ట్లీ కారులో మెగాహీరో రామ్ చరణ్.. దీని ధరెంతో తెలుసా?) డేంజర్లో బ్యూటీస్? అయితే ప్రతిసారి రైతుబిడ్డ, శివాజీకి ఎక్కువ ఓట్లు పడేవి. ఈ వారం మాత్రం అనుహ్యంగా అమర్దీప్ అగ్రస్థానంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఓ రకంగా శివాజీకి దెబ్బే అని చెప్పొచ్చు. అమర్ టాప్లో ఉండగా, రెండు-మూడు స్థానాల్లో శివాజీ, ప్రశాంత్ ఉన్నారట. ఆ తర్వాత వరసగా యావర్, గౌతమ్, అర్జున్ ఉన్నట్లు తెలుస్తోంది. చివరి రెండు స్థానాల్లో రతిక, అశ్విని ఉన్నారట. అంటే ఆడ లేడీస్ ఇద్దరూ డేంజర్ జోన్లో ఉన్నట్లే. లిస్ట్ మారే ఛాన్స్ ఉందా? ప్రస్తుత పరిస్థితుల బట్టి ఈ వారం ఓటింగ్ విషయంలో పెద్దగా మార్పులేం ఉండకపోవచ్చని తెలుస్తోంది. అలానే అశ్విని.. ఈ వారం సెల్ఫ్ నామినేట్ చేసుకుని, అసలు బిగ్బాస్లో ఉండటానికి తనకు ఇష్టం లేదనే విషయాన్ని పరోక్షంగా చెప్పేసింది. మరోవైపు రతిక.. ఒక్కటంటే ఒక్క విషయంలోనూ ఆకట్టుకోలేకపోతుంది. దానికి తోడు ఈ వారం నామినేషన్స్లో ఉన్నవాళ్లతో పోలిస్తే వీళ్లిద్దరికీ ఫ్యాన్ బేస్ కూడా పెద్దగా లేదు. కాబట్టి ఓటింగ్ లిస్ట్ అనేది మారకపోవచ్చు. అంటే అమ్మాయిలిద్దరూ ఎలిమినేట్ అయిపోవడం గ్యారంటీ! శనివారం వరకు ఆగితే ఎలిమినేషన్ సంగతేంటో తేలిపోతుంది! అప్పటివరకు జస్ట్ వెయిట్ అండ్ సీ! (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరోయిన్.. భర్త ఎవరంటే?) -
Bigg Boss 7: బయటపడ్డ శివాజీ మరో కోణం.. మనోడు బిగ్బాస్లో బ్రెయిన్లెస్ 'చాణక్య'!
శివాజీ పేరు చెప్పగానే బిగ్బాస్ షోలో చాణక్య అని అంటారేమో! కానీ అంత సీన్ లేదని లేటెస్ట్ ఎపిసోడ్తో క్లారిటీ వచ్చేసింది. 12వ వారం నామినేషన్స్లో అసలు రంగు అంతా బయటపడింది. అస్సలు బుర్రలేదన్నట్లుగా నోటికొచ్చినట్లు మాట్లాడి ఇజ్జత్ మొత్తం తీసేసుకున్నాడు. డాక్టర్బాబు గౌతమ్ అయితే శివాజీ మైండ్ని చదివేశాడు. అసలు ఈ పెద్దాయన ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో క్లారిటీగా చెప్పేశాడు. ఇంతకీ మంగళవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 79 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) గౌతమ్, శివాజీ.. ఇద్దరూ ఇద్దరే! ఆరుగురు హౌస్మేట్స్ సోమవారం ఎపిసోడ్లో తమ నామినేషన్స్ పూర్తి చేశారు. ఆగిన దగ్గర నుంచి మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. గౌతమ్ని నామినేట్ చేస్తున్నట్లు చెప్పిన శివాజీ.. బ్యాలెన్సింగ్ టాస్క్తోపాటు మిగతా విషయాల్ని కారణాలుగా చెప్పాడు. కానీ గౌతమ్ మాత్రం... పాయింట్ టూ పాయింట్ చెప్పండన్నా అనేసరికి శివాజీ వాదించలేకపోయాడు. తర్వాత అశ్విని పేరు శివాజీ చెప్పాడు గానీ ఆమె సెల్ఫ్ నామినేట్ కాబట్టి.. ఆమెని నామినేట్ చేయడానికి వీల్లేదని బిగ్బాస్ చెప్పడంతో అర్జున్ని నామినేట్ చేశాడు. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? శివాజీ - గౌతమ్, అశ్విని యావర్ - అమర్దీప్, అర్జున్ శోభాశెట్టి - శివాజీ, అర్జున్ ప్రియాంక - యావర్, శివాజీ యావర్తో మాటల్లేవు! శివాజీది పూర్తయిన తర్వాత యావర్.. అమర్, అర్జున్ని నామినేట్ చేస్తున్నట్లు చెప్పాడు. తన తప్పొప్పుల గురించి, చేసినప్పుడే ఎందుకు చెప్పలేదని యావర్, అర్జున్ని అడిగాడు. అయితే ఇది చాలా సిల్లీ రీజన్ అని, ఇక హౌసులో ఉన్నన్నీ రోజులు నీతో మాట్లాడేది లేదని అర్జున్ సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరోవైపు కెప్టెన్గా నిన్ను కంట్రోల్ చేయాలని చూస్తే.. 'కెప్టెన్ కాదు నువ్వు' అని ఎందుకన్నావ్, అది నచ్చలేదని ప్రియాంక, యావర్ని నామినేట్ చేసింది. దీంతో తెలుగు సరిగా రానీ యావర్కి ఏం అర్థమైందో ఏంటో గానీ.. 'వేస్కో అది' అని పిచ్చిపిచ్చిగా బిహేవ్ చేస్తూ వెళ్లిపోయాడు. (ఇదీ చదవండి: యాంకర్ రష్మీతో పెళ్లెప్పుడు? సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్!) శివాజీ దగ్గర నో ఆన్సర్ యావర్ తర్వాత శివాజీని నామినేట్ చేస్తున్నట్లు ప్రియాంక చెప్పింది. రాజమాతలు టాస్కులో నేను చేసింది తప్పని ఎలా అంటారు? మేం ఏం మాట్లాడుకున్నామో మీకేమైనా తెలుసా? అని ప్రియాంక అడిగేసరికి శివాజీ దగ్గర సమాధానం లేదు. దీంతో తనకు అలవాటు అయినట్లు నానా హంగామా చేశాడు. మీరు ఏమనుకుంటారో అదే చేస్తారు, నామినేషన్ యాక్సెప్టెడ్ అని అనేసి శివాజీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరి.. మీరు ఇద్దరు(యావర్, ప్రశాంత్) మాత్రమే తప్పులు చేస్తుంటే, చెప్పి మరీ వాళ్లని సరిదిద్దుతున్నారు, మిగతా వాళ్లకు ఎందుకు చెప్పట్లేదని ప్రియాంక అడిగేసరికి.. శివాజీ ట్రిగ్గర్ అయిపోయాడు. ఈ హౌసులో ప్రతిసారి పొరపాట్లు మీద పొరపాట్లు జరుగుతున్నాయి అని అన్నాడు. అవి ఏంటి? అనే ప్రియాంక అడిగితే.. నేను చెప్పలేను, నేను చెప్పలేను అని శివాజీ ఏదేదో మాట్లాడాడు. ఎందుకంటే పెద్దాయన దగ్గర ఆన్సర్ లేదు! ఇక్కడ అర్థమైంది ఏంటంటే.. శివాజీ ఏం చేసినా తప్పు కాదు కానీ పక్కనోళ్లు చిన్న పొరపాటు చేసినా అది తప్పే. నాగార్జున నెత్తికెక్కించుకునేసరికి శివాజీ బాగా రెచ్చిపోతున్నాడు. అందుకే ప్రియాంకపై నోటికొచ్చినట్లు మాట్లాడుతూ.. పెద్దరికం పోగొట్టుకుని బ్రెయిన్లెస్ చాణక్య అయిపోయాడు. (ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఆ రెండు హిట్ మూవీస్.. ఒక్కరోజు గ్యాప్లో రిలీజ్!) శివాజీ గురించి చెప్పిన గౌతమ్ నామినేషన్స్ పూర్తయిన తర్వాత బయట కూర్చుని అర్జున్తో మాట్లాడిన గౌతమ్.. శివాజీ అసలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఆ మధ్య కొన్ని వారాల పాటు ఆయన్ని ఎవరు ఎదురించలేదు, ఇప్పుడు అలా ఆయన చేసింది తప్పని చెబుతుంటే ఆయన తీసుకోలేకపోతున్నాడని గౌతమ్ చెప్పుకొచ్చాడు. దీంతో శివాజీ అసలు రంగు బయటపడినట్లయింది. ప్రియాంక తనని నామినేట్ చేయడాన్ని తీసుకోలేకపోయిన శివాజీ.. తన బ్యాచ్ సభ్యులైన యావర్, ప్రశాంత్తో మాట్లాడుతూ.. గేమ్ ఆడటానికి వచ్చినా కూడా ఓ క్యారెక్టర్ అంటూ ఉండాలి. పెద్ద గేమ్, స్ట్రాటజీ, నేను ఇలానే ఆడతాను లాంటివి అనడం ఓకే, కానీ క్యారెక్టర్ కావాలి కదా అని శివాజీ అన్నాడు. మరి ఇంత చెప్పినా శివాజీకి ఏమైనా క్యారెక్టర్ ఉందా అంటే లేదు. ఎప్పుడు చూడు ఆ యావర్-ప్రశాంత్లని రెచ్చగొట్టి అవతలి వాళ్లపైకి పంపించడం తప్పితే గేమ్ ఆడిన దాఖలాలు అయితే పెద్దగా కనిపించలేదు. ఎపిసోడ్ చివర్లో ఎవిక్షన్ పాస్ కోసం బ్యాలెన్సింగ్ టాస్క్ పెట్టగా అందులో రైతుబిడ్డ ప్రశాంత్ విజయం సాధించాడు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. ఈ వారం నామినేషన్స్ లిస్ట్ శివాజీ అర్జున్ రతిక గౌతమ్ ప్రశాంత్ యావర్ అమర్దీప్ అశ్విని (ఇదీ చదవండి: ఎవిక్షన్ పాస్ గెలుచుకున్న రైతుబిడ్డ.. ఆమెని దెబ్బకొట్టడం గ్యారంటీ!?) -
Nayani Pavani Latest Photos: బోల్డ్ అండ్ బ్యూటీ నయని పావని అందాలు (ఫోటోలు)
-
Bigg Boss 7: రైతుబిడ్డతో గౌతమ్ 'పంచె' పంచాయతీ.. క్షమాపణలు చెప్పిన రైతుబిడ్డ!
బిగ్బాస్ 12వ వారంలో అడుగుపెట్టేసింది. అలానే సోమవారం కాబట్టి నామినేషన్స్ మంచి ఇంట్రెస్టింగ్గా సాగాయి. కాకపోతే ఈసారి అందరి శివాజీ గ్యాంగ్ని టార్గెట్ చేశారనిపించింది. మరోవైపు ఓ లేడీ కంటెస్టెంట్ ఎలిమినేషన్ అనే కత్తిపై డైరెక్ట్గా పీక పెట్టేసింది. దీంతో ఈ వారం ఈ హాట్ బ్యూటీ బయటకెళ్లిపోవడం గ్యారంటీ అనిపిస్తోంది. ఇంతకీ సోమవారం నామినేషన్స్ సందర్భంగా అసలేం జరిగిందనేది Day 78 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. రతికక చెప్పి మరీ అమర్ అలా ఎలిమినేషన్ చేయకపోవడంతో అందరూ రిలాక్స్ అయిపోయారు. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే సోమవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. అశ్విని-గౌతమ్ ఇద్దరూ దీని గురించి మాట్లాడుకున్నారు. మరోవైపు కెప్టెన్సీ ఫైనల్ గేమ్లో తనని టార్గెట్ చేసి కొట్టావ్ నిన్నే ఈసారి నామినేట్ చేస్తా రతిక అని అమర్ ఆమెతో చెప్పాడు. చెప్పినట్లే చేశాడు. ఇంకా ఎవరు ఎవర్ని నామినేట్ చేశారనేది లిస్ట్ ఇదిగో. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? అమర్దీప్ - యావర్, రతిక గౌతమ్ - ప్రశాంత్, శివాజీ రతిక - అమర్దీప్, ప్రశాంత్ అర్జున్ - యావర్, శివాజీ ప్రశాంత్ - గౌతమ్, రతిక అశ్విని - సెల్ఫ్ నామినేషన్ యావర్ నో లాజిక్స్ ఇక ఫస్ట్ ఫస్ట్ అమర్ వచ్చాడు. యావర్ని నామినేట్ చేశాడు. ఎవిక్షన్ పాస్ గేమ్ ఆడే విషయంలో కాలు కింద పెట్టావ్, అది తప్పే కదా అని అమర్ అన్నాడు. అవును నేను కావాలని చేయలేదు, అది అనుకోకుండా జరిగిందని యావర్ అన్నాడు. అలానే సంచాలక్ గా నువ్వు కూడా ఫెయిలయ్యావ్ కదా అని యావర్ అంటే.. అవును ఫౌల్ ఆడినందుకు నిన్ను నామినేట్ చేస్తున్నా, రిటర్న్ నన్ను నామినేట్ చేస్కో అని ఇద్దరి మధ్య కాస్త లాజిక్లెస్ డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత రతికని నామినేట్ చేసి అమర్ మాట్లాడుతుండగా మధ్యలో యావర్ ఎంట్రీ ఇచ్చాడు. కెప్టెన్ ప్రియాంక, యావర్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తుంటే.. అసలు నువ్వు ఎవరు? నువ్వు ఎవరు? అని యావర్ అతిచేశాడు. ప్రశాంత్ vs గౌతమ్ తొలుత గౌతమ్, ప్రశాంత్ని నామినేట్ చేశాడు. బాల్స్ బ్యాలెన్స్ చేసే గేమ్లో సంచాలక్గా ఫెయిలయ్యావని కారణం చెప్పాడు. కానీ ప్రశాంత్ వింటేగా, అస్సలు ఒప్పుకోలేదు. ఆ టతర్వాత ప్రశాంత్ వచ్చి గౌతమ్ ని నామినేట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య చాలాసేపు వాదన నడిచింది. ఒకానొక దశలో గౌతమ్ని ఉద్దేశించి 'పంచె ఊసిపోకుండా చూస్కో' అని ప్రశాంత్ అన్నాడు. దీంతో పంచాయతీ మొదలైంది. కాసేపటి తర్వాత అసలు నా పంచె గురించి నువ్వెవరు అసలు.. ఎక్కువ తక్కువగా మాట్లాడకు, గుర్తుపెట్టుకో అని గౌతమ్ చాలా సీరియస్ అయ్యాడు. దీంతో గోళీలు వేస్కో అని మళ్లీ ప్రశాంత్ రెచ్చగొట్టాడు. దీంతో గౌతమ్ మాట్లాడుతూ.. ఇలాంటి వాటినే చిల్లర కథలు అంటారు, ఛీ అని సీరియస్ అయ్యాడు. పాయింట్ చెప్పు, పర్సనల్ కి రాకు అని గౌతమ్ వార్నింగ్ ఇచ్చాడు. పంచె అనేది తెలుగోడి సంస్కృతి, దాన్ని కించపరుస్తూ నువ్వు మాట్లాడటం మంచిది కాదు. అది నార్మల్గా చెప్పడానికి వచ్చినా, అది తప్పు వేలో తీసుకెళ్లడానికి చేస్తే బాగోదని గౌతమ్ కామెంట్స్ చేశాడు. దీంతో రైతుబిడ్డకి తప్పు తెలిసొచ్చింది. పంచె గురించి నేను తప్పుగా ఏం అనలే, దయచేసి నన్ను క్షమించండి. నేను పంచె ఊడిపోకుండా కాపాడుకో అని అన్నాను తప్పితే మరోమాట అనలే అని చేతులెత్తి మరీ రైతుబిడ్డ ప్రశాంత్ క్షమాపణలు చెప్పాడు. శివాజీని లాజిక్స్తో కొట్టారు ప్రశాంత్ తర్వాత శివాజీని.. గౌతమ్ నామినేట్ చేశాడు. మీరు బ్యాలెన్సింగ్ గేమ్లో ఎక్కువ ఫౌల్స్ చేశారని గౌతమ్ అనగానే.. నువ్వెవరయ్యా చెప్పడానికి అని శివాజీ అడిగాడు. నేను సంచాలక్గా వచ్చి చెప్పలేదు కదా అని గౌతమ్ రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. నీకు ఏమి ఉండవ్, ఏదో ఒకటి చేయాలి, నీకు గొడవ కావాలి, నాకిష్టం లేదు యాక్సెప్టెడ్.. వేస్కో అని శివాజీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అలానే అర్జున్ కూడా శివాజీని నామినేట్ చేశాడు. బాల్స్ బ్యాలెన్స్ టాస్కులో ప్రశాంత్ అరుస్తున్నాడని చెప్పి.. మీరు గట్టిగట్టిగా అరుస్తూ బాల్స్ విసిరికొట్టి గేమ్ నుంచి బయటకెళ్లిపోయారు. అయితే అప్పటికే యావర్ ఆడుతున్నాడు కదా.. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మీరే తప్పు చేశారు కదా అని అర్జున్ చెప్పగానే.. శివాజీ దగ్గర ఆన్సర్ లేదు. దీంతో హెల్తీగా తీసుకుంటానని నవ్వి ఊరుకున్నాడు. ఇక్కడ శివాజీ దగ్గర ఆన్సర్ లేదు అందుకే ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక సిల్లీ కారణాలతో తాను నామినేట్ చేయదలచుకోలేదని, ఎవరిని నామినేట్ చేయడానికి రీజన్స్ కనిపించట్లేదని అశ్విని చెప్పగా.. ఒకవేళ పేర్లు చెప్పకపోతే సెల్ఫ్ నామినేట్ అయిపోతారని బిగ్ బాస్ అన్నాడు. అలాగే అని అశ్విని ఓకే చెప్పింది. బహుశా ఆమెకి ఇంట్లో ఉండటం ఇష్టం లేనట్లు ఉంది. ఈ వారం ఎలానూ డబుల్ ఎలిమినేషన్ ఉంది కదా! వెళ్లిపోదాం అని ఫిక్స్ అయ్యి ఇలా సెల్ఫ్ నామినేట్ చేసుకున్నట్లు ఉందని అనిపించింది. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది. -
Bigg Boss 7: డబుల్ ఎలిమినేషన్పై ట్విస్ట్.. అశ్విని, రతిక చివరకు అలా!
బిగ్బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ చాలా అంటే చాలా బోరింగ్గా సాగింది. చివర్లో ఓ ఐదు నిమిషాలు తప్పితే ఒక్కటంటే ఒక్క పాయింట్లోనూ ఆసక్తిగా అనిపించలేదు. శివాజీపై ఏదో వేయాలని హోస్ట్ నాగార్జున అక్కడక్కడ సెటైర్లు వేస్తున్నాడు. మరోవైపు ఈ వారం ఎలిమినేషన్ ఏం జరగలేదు. అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో హోస్ట్ నాగ్ కారణం చెప్పాడు. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 77 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. రతిక కన్నింగ్ ప్రిన్స్ యావర్.. ఫౌల్ గేమ్ ఆడి, వీడియోలతో సహా దొరికిపోయినందుకు తన ఎవిక్షన్ పాస్ని తిరిగిచ్చేయడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. దాని గురించి డిస్కస్ చేసుకోవడంతో ఆదివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ప్రియాంక, శోభా.. యావర్ని మెచ్చుకోగా రతిక మాత్రం తన్న కన్నింగ్నెస్ బయటపెట్టింది. 'సేఫ్ గేమ్ ఆడావ్ నువ్వు, ఎక్కడ నాకు ఇవ్వాల్సి వస్తుందని తిరిగిచ్చేశావ్ కదా' అని యావర్తో తన అసహనాన్ని వ్యక్తం చేసింది. అనంతరం హోస్ట్ నాగార్జున.. ఇంటి సభ్యుల్ని పలకరించాడు. ఇక సింపతీ కొట్టేద్దామని ఫిక్స్ అయిన శివాజీ.. బూతులు మాట్లాడినందుకు అందరికీ సారీ చెప్పేశాడు. (ఇదీ చదవండి: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ కార్తిక.. పెళ్లి ఫోటోలు వైరల్) సండే ఫన్డే కాదు ఇకపై సండే అంటే ఫన్డే కాదని చెప్పిన నాగార్జున.. యాడ్ ఏ ఫ్రెండ్, బ్లాక్ ఏ హౌస్మేట్' టాస్క్ పెట్టాడు. ఇందులో ఒక్కొక్కరు.. ఇద్దరికీ ఈ రెండు ట్యాగ్స్ ఇవ్వాల్సి ఉంటుందని నాగ్ చెప్పాడు. ఎవరు.. ఎవరెవరికి ఏ ట్యాగ్ ఇచ్చారు? కంటెస్టెంట్స్.. ఫ్రెండ్.. బ్లాక్ హౌస్మేట్ గౌతమ్ - ప్రశాంత్, శోభాశెట్టి అమర్దీప్ - ప్రశాంత్, రతిక రతిక - శోభాశెట్టి, అమర్ శోభాశెట్టి - రతిక, గౌతమ్ అశ్విని - శోభాశెట్టి, గౌతమ్ యావర్ - శోభాశెట్టి, గౌతమ్ ప్రశాంత్ - అమర్దీప్, రతిక అర్జున్ - శివాజీ, యావర్ శివాజీ - అర్జున్, రతిక ప్రియాంక - ప్రశాంత్, అశ్విని శివాజీ మళ్లీ అలానే ఆదివారం ఎపిసోడ్లో 'కోటబొమ్మాళి పీఎస్' మూవీ టీమ్ ప్రమోషన్లో భాగంగా వచ్చారు. అయితే అంతా మాట్లాడుతున్న సమయంలో.. శివాజీని పెద్దాయన అని శ్రీకాంత్ సరదాగా అన్నాడు. దీంతో.. తనని అందరూ పెద్దాయన-పెద్దాయన అని అనడంపై శివాజీ ఫన్నీ కామెంట్స్ చేశాడు. తలుపులు తీస్తే ఎల్లిపోతా సర్, ఇది నరకంగా ఉంది అని బుర్ర బాదుకుని మరీ పాత శివాజీని గుర్తుచేశాడు. సరదాకి అన్నాసరే శివాజీ అంటున్నాడనేది అర్థం కాలేదు. ఇకపోతే సేవింగ్లో భాగంగా తొలి రౌండ్లో యావర్, ప్రియాంక.. రెండో రౌండ్లో అర్జున్, అమర్దీప్ సేవ్ అయ్యారు. మూడో రౌండ్లో శోభాశెట్టి, రతిక సేవ్ అయ్యారు. చివరగా గౌతమ్, అశ్వినిలలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అనుకున్నారు. కానీ ఇద్దరు సేవ్ అయినట్లు నాగ్ ప్రకటించారు. తద్వారా ఈ వారం నో ఎలిమినేషన్ అని తేలింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: శివాజీ భజన చేస్తున్న బిగ్బాస్! చివరకు నాగార్జున కూడా అలానే?) నో ఎలిమినేషన్కి కారణమదే అయితే ఈ వారం ఎవిక్షన్ పాస్ ఉపయోగించలేని పరిస్థితుల్లో అంటే ఈ రోజు ఎలిమినేషన్ లేదని నాగార్జున చెప్పుకొచ్చాడు. అయితే గతవారం కేవలం ఐదుగురికి మాత్రమే ఎవిక్షన్ పాస్ కోసం పోటీపడే ఛాన్స్ వచ్చిందని, ఈ వారం మాత్రం అందరూ దానికోసం పోటీపడే అవకాశమొస్తుందని నాగ్ చెప్పాడు. అయితే అది ఎప్పుడు ఎలా వస్తుందనేది బిగ్బాస్ డిసైడ్ చేస్తారని నాగ్ వివరణ ఇచ్చాడు. అలానే రాబోయే వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి నాగ్ షాక్ ఇచ్చాడు. అంటే ఈ వారం మిస్ అయినోడు, నెక్స్ట్ వారం కలిపి ఇద్దరిని ఒకేసారి ఇంటికి పంపేస్తారనమాట. అయితే ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ అయినప్పుడు రతిక.. తెగ భయపడిపోయింది. దీంతో నాగార్జున ఆమెని సముదాయించాడు. 'ఏంటి రతిక.. సేవ్ అయ్యావని నమ్మలేకపోతున్నావా?' అని నాగార్జున అడిగాడు. దీంతో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు సర్ అని తన ఆనందాన్ని, భయాన్ని మిక్స్ చేసిన ఫీలింగ్స్ రతిక బయటపెట్టింది. చివరవరకు వచ్చేసరికి అశ్విని కూడా అలానే భయపడిపోయింది. కానీ నో ఎలిమినేషన్ అనేసరికి రతిక, అశ్విని.. హమ్మయ్యా అనుకున్నారు. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: నెలన్నర నుంచి ఓటీటీ ట్రెండింగ్లో ఆ థ్రిల్లర్ మూవీ) -
Bigg Boss 7: శివాజీ భజన చేస్తున్న బిగ్బాస్! చివరకు నాగార్జున కూడా అలానే?
బిగ్ బాస్ హౌసులో భజన ఎక్కువైంది. శివాజీ ఏం చేసినా, ఏం మాట్లాడినా అతడు చెప్పిన సమాధానాలు విని తలుపుతున్నారు. పాపం హోస్ట్ నాగార్జున కూడా ఏం చేయలేకపోతున్నాడు. షోకు కొన్ని నియమాలు అని ఉంటాయి. శివాజీ మీద ప్రేమ ఎక్కువై, అవి ఉన్నట్లు కూడా మరిచిపోతున్నాడు. బూతులు మాట్లాడినందుకు వార్నింగ్ ఇవ్వాల్సింది పోయి బతిమాలాడుకుంటున్నారు. సరే ఇంతకీ శనివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 76 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భర్త వరుణ్ గురించి లావణ్య ఫస్ట్ పోస్ట్!) శివాజీ ఒకటే భజన ప్రియాంక.. బిగ్బాస్ హౌసుకి కొత్త కెప్టెన్ కావడంతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. వీకెండ్ కదా.. నాగార్జున రావడంతో శనివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. శుక్రవారం జరిగినదంతా చూసిన హోస్ట్ నాగ్.. ఇంటి సభ్యుల్ని పలకరించాడు. ఈవారం అసలేం జరిగిందనే విషయాన్ని శివాజీతో మొదలుపెట్టాడు. అంతా బానే ఉంది గానీ ఓ విషయం మాత్రం నచ్చట్లేదు శివాజీ అని నాగ్ అనగానే.. బూతులా బాబుగారు! వాటిని కావాలని అనలేదని, అలా వచ్చేశాయని ఏదో చెప్పడానికి ట్రై చేశాడు. అసలు అమర్ని పిచ్చి పోహో అని ఎందుకన్నావ్ శివాజీ అనగానే.. ఇంట్లో పోహా చేసుకుంటాం కదా బాబుగారు అందుకే అలా అన్నానని ఓ పనికిమాలిన లాజిక్ చెప్పాడు. అమర్దీప్ ఓ పిచ్చోడు. వాటిని నేను అస్సలు పట్టించుకోలేదని అన్నాడు. శివాజీని బతిమాలాడిన నాగ్ పిచ్చి నాయాల్ల, పిచ్చి పోహా, ఎర్రి పోహా.. ఇవన్నీ హౌసులో వాడే పదాలా? అని నాగ్, శివాజీపై సీరియస్ అయినట్లు నటించాడు. ఈ విషయంలో నీ అనుభవం ఏమైంది? ఈ విషయంలో నీ సహనం ఏమైంది? ఈ విషయంలో నీ సమర్థత ఏమైంది? అని నాగ్ అడిగాడు తప్పితే.. నియమాల ప్రకారం బిగ్బాస్లో బూతులు మాట్లాడుకూడదు. అలాంటి అర్థం వచ్చేలా మాట్లాడిన పనిష్మెంట్ ఇవ్వాలనే సోయి లేకుండా పోయింది. చూసే ప్రేక్షకుల్లో చాలామందికి వాటి అర్థాలేంటో, అవి ఎంత పెద్ద బూతులనేది తెలుసు. కానీ బిగ్బాస్ ఆర్గనైజర్స్, హోస్ట్ నాగార్జునకు తెలియకుండా పోయింది. దీంతో ఎప్పటిలానే ఆ టాపిక్ని నైస్గా సైడ్ చేసేసి, శివాజీకి కనీసం వార్నింగ్-పనిష్మెంట్ లాంటివి ఏం ఇవ్వకుండానే మిగతా విషయాలపై పడ్డారు. (ఇదీ చదవండి: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్బాస్.. నో ఎలిమినేషన్) నో కెప్టెన్సీ టాస్క్ ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా అమర్ ప్రవర్తన గురించి నాగ్ అడిగాడు. దీంతో హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఎలాగైనా సరే కెప్టెన్ కావాలనే అలా చేశానని అమర్ ఏదో సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఈ సందర్భంలో నాగ్ ఓ విషయమై ట్విస్ట్ ఇచ్చాడు. వచ్చే వారం మాత్రమే కెప్టెన్సీ టాస్క్ ఉంటుందని, మిగిలిన మూడు వారాల్లో కెప్టెన్సీ టాస్క్ ఏం ఉండదని బాంబ్ పేల్చాడు. రతికకి క్లాస్- ఆ పదాలు బ్యాన్ రతికని నిలబట్టి నాగ్ కడిగేశాడు. దేంట్లో గెలిచావ్ చెప్పు రతిక అని నాగార్జున సీరియస్ అయ్యాడు. ఈ ప్రశ్న అడగానికి ముందు ఆమె ఫొటో పెట్టి మూడు బాటిల్స్ పగలగొట్టాడు. ఈవారం నామినేషన్స్ మాట్లాడిన కొన్ని మాటల్ని బ్యాన్ చేస్తున్నట్లు నాగ్ చెప్పుకొచ్చాడు. రతిక ఎక్కువగా చెప్పే.. 'వచ్చే వారం నుంచి నేనేంటో చూపిస్తాను', 'నేను ఇక్కడి నుంచి ఆడతాను' అనే వాటితో పాటు శివాజీ ఎక్కువగా చెప్పే 'జనాలు చూస్తున్నారు' అనే వాక్యంతో పాటు సీరియల్ బ్యాచ్ ఎక్కువగా ఉపయోగించే 'పోట్రే చేస్తున్నారు' అనే ఈ వాక్యాలన్నీ ఈరోజు నుంచి హౌసులో బ్యాన్ చేస్తున్నానని నాగ్ చెప్పాడు. అయితే ఈ పనేదో ముందే చేసుంటే బాగుండేది. ఇప్పుడు చేసి ఏం ఉపయోగం అనిపించింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?) ఎవిక్షన్ పాస్ రిటర్న్ ఇక ప్రశాంత్ గురించి మాట్లాడిన నాగ్.. అసలు ఈ వారం ఏమైనా గేమ్ ఆడావా నువ్వు అని అడిగాడు. దీంతో తల అడ్డంగా ఊపుతూ ప్రశాంత్ సమాధానం చెప్పలేకపోయాడు. ఫ్యామిలీ వీక్లో అందరూ వచ్చిన నీ పేరు చెప్పేసరికి రిలాక్స్ అయిపోయావా కదా అని కౌంటర్స్ వేశాడు. అలానే ఎవిక్షన్ పాస్ దక్కించుకునే విషయంలో యావర్ ఫౌల్ గేమ్ ఆడినట్లు వీడియోలతో సహా నాగ్ బయటపెట్టాడు. దీంతో యావర్.. అది తనకు వద్దని తిరిగిచ్చేశాడు. అయితే ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఒకటే అనిపించింది. పెద్దాయన అనే ముసుగులో నీతులు చెప్పే శివాజీ.. తాను మాత్రం నీతులు పాటించాడు. బూతుల్ని నేరుగా మాట్లాడితే ప్రాబ్లమ్ అవుతుందని, పదాలు మార్చి మరి.. తెలివిలేని అమర్ని అంటాడు. వీకెండ్ లో వచ్చే నాగార్జున.. పనిష్మెంట్ ఇచ్చి బుద్ది చెప్పాల్సింది పోయి శివాజీ చెప్పిన దానికి తలూపేస్తాడు. దీనిబట్టి చూస్తే బిగ్బాస్ ఆర్గనైజర్స్ ఎప్పుడు మారతారో అనే సందేహం వస్తోంది. అలా శనివారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు) -
Bigg Boss 7: అమర్దీప్ది ఓవరాక్షనా? నిజమైనా ఎమోషనా?
బిగ్బాస్ గేమ్ ఈ రోజు ఎందుకో చాలా అంటే చాలా ఆసక్తిగా అనిపించింది. బహుశా శివాజీ గ్యాంగ్ లేకపోవడం వల్ల కావచ్చు. అలానే అమర్దీప్ అయితే హౌస్ అంతా గాయిగత్తర చేశాడు. పిచ్చిపట్టిన వాడిలా అరుస్తూ బీభత్సం సృష్టించాడు. మరోవైపు ప్రియాంకని చూస్తే నిజంగా హేట్సాఫ్ అనిపించింది. ఇంతకీ శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందనేది Day 75 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. శివాజీ బ్లాక్మెయిల్ ఎవిక్షన్ పాస్ చివరి రౌండ్లో నిర్ణయం తీసుకునే దగ్గర గురువారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే శుక్రవారం ఎపిసోడ్ మొదలైంది. శోభా తన అభిప్రాయం చెప్పడానికి ప్రయత్నిస్తుంటే.. శివాజీ తన వాళ్లకు రాకపోతే బాగోదు అన్నంత రేంజులో బ్లాక్మెయిల్ చేశాడు. సంచాలక్స్ ఒక్క మాట అనుకుని యావర్.. ఎవిక్షన్ పాస్ విజేత అని ప్రకటించడంతో శివాజీ చల్లబడ్డాడు. మంచి డెసిషన్ తీసుకున్నారని పుడింగిలా పనికిమాలిన కామెంట్ చేశాడు. దీంతో శోభా ట్రిగ్గర్ అయిపోయింది. నియమాల ప్రకారం అన్నప్పుడు ఒకవేళ నేను గానీ, ప్రశాంత్ గానీ తప్పు నిర్ణయం తీసుకుంటే.. పనిష్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉంటానని శోభాశెట్టి చెప్పింది. దీంతో శివాజీ అతి చేశాడు. నువ్వు సంచాలక్గా ఉన్న ప్రతిసారీ 90 శాతం వాదనలు, గొడవలు, డిస్కషన్, మనస్పర్థలు జరిగాయి కాబట్టే నేను చెబుతున్నానని శివాజీ అన్నాడు. మూడుసార్లు సంచాలక్గా ఇబ్బందిపడ్డావ్ శోభా, ఇది నిజం, అందుకే నేను నిన్ను అలెర్ట్ చేశానని శివాజీ నీతికబర్లు చెప్పాడు. ఇక్కడంతా గమనిస్తే శోభాదే తప్పు అని తను అనుకునేలా శివాజీ బ్లాక్మెయిల్ చేశాడనిపించింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?) ప్లేటు తిప్పేసిన శివాజీ ఇక యావర్ ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు. దీంతో దాన్ని నచ్చినప్పుడు ఉపయోగించుకోవచ్చని బిగ్బాస్ క్లారిటీ ఇచ్చేశాడు. అయితే శోభాతో అంతా గొడవపడ్డ శివాజీ.. మళ్లీ ప్లేట్ తిప్పేశాడు. నేను గెలవలేదని ఫైట్ చేశానని అనుకున్నారా మీరేమైనా అని శోభానే శివాజీ నైస్గా అడిగాడు. అరిచినప్పుడేమో అరిచేసి, ఇప్పుడేమో నంగనాచిలా మాటలు చెప్పి శోభాని ఏమార్చడానికి శివాజీ ట్రై చేశాడు. నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలని నేను ఫైట్ చేశానని నీతికబుర్లు చెప్పాడు. దీంతో నా అనుకున్న ఫ్రెండ్స్ అందరూ బాల్కానీలో తనని వదిలేసి మీటింగ్ పెట్టిరని, తాను అందరికీ శత్రువు అయిపోయానని శోభా తెగ బాధపడిపోయింది. ప్రియాంక నువ్వు సూపర్ ఎవిక్షన్ పాస్ తంతు పూర్తయిన తర్వాత కొత్త కెప్టెన్ కోసం రెండు లెవల్స్లో టాస్కులు జరుగుతాయని బిగ్ బాస్ చెప్పుకొచ్చాడు. ఇందులో అందరూ పోటీదారులే అని అన్నాడు. తొలుత ఇటుకులు తెచ్చే టాస్క్ పెట్టగా అందరూ చాలా పోటీపోటీగా గేమ్ ఆడారు. కాకపోతే ప్రతి దశలోనూ తక్కువ ఇటుకులు తెచ్చిన కారణంగా రతిక, గౌతమ్, అశ్విని, శోభాశెట్టి వరసగా ఎలిమినేట్ అయ్యారు. వీళ్లందరూ గేమ్ ఎలా ఆడాలో తెలియక, కిందపడిపోయి, అరుస్తూ ఆటపై సరిగా కాన్సట్రేషన్ చేయలేకపోయారు. అమ్మాయిల్లో ప్రియాంక ఒక్కతే సైలెంట్ గా తనపని తాను చేసుకుని నెక్స్ట్ రౌండ్కి అర్హత సాధించింది. ఈమెతో పాటు అమర్, ప్రశాంత్, అర్జున్.. ఫైనల్ టాప్-4కి క్వాలిఫై అయ్యారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు) అమర్ పిచ్చిపట్టినట్లు ప్రవర్తన ఈ గేమ్ లో భాగంగా నలుగురు పోటీదారులు ఇటుకులతో టవర్ కట్టాలి. బజర్ మోగిన తర్వాత మిగిలిన వాళ్లు వాటిని పడగొట్టడానికి ట్రై చేయాలి. ఇందులో ప్రశాంత్, అర్జున్ వరసగా ఔట్ అయిపోయారు. చివరకు అమర్, ప్రియాంక మిగలగా.. అమ్మాయి అయిన ప్రియాంక చాలా చక్కగా అస్సలు సౌండ్ చేయకుండా గేమ్ ఫినిష్ చేసింది. అమర్ మాత్రం కెప్టెన్సీ కోసం రెచ్చిపోయాడు. అరుస్తూ, ఏడుస్తూ, భయపెడుతూ స్ట్రాటజీలన్నీ ఉపయోగించాడు కానీ వర్కౌట్ కాలేదు. ప్రియాంక గెలిచింది. దీంతో కిందపడి కొట్టేసుకున్నాడు. అయితే అది కోపంతో వచ్చిన బాధే కానీ ఎవరిపై కోపం ఏం లేదని అమర్ సంజాయిషీ ఇచ్చుకున్నాడు. ప్రియాంక-అమర్ మనస్పర్థలు అయితే తాను కెప్టెన్ అయినట్లు కలగన్నాను కానీ తాను ఏది అనుకుంటే అది జరగదని అమర్దీప్ తెగ బాధపడిపోయాడు. అమర్ దగ్గరకొచ్చిన ప్రియాంక.. నువ్వు గెలిస్తే నేను అంతే సంతోషపడుతున్నాను, కానీ నీ దగ్గర నుంచి మాత్రం అలాంటి రెస్పాన్ రావట్లేదని అమరదీప్తో ఖరాఖండీగా చెప్పేసింది. దీంతో ఫ్రెండ్స్ ఇద్దరి మధ్య మనస్పర్థలు బయటపడ్డాయి. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియాంక దగ్గర నుంచి అమర్ ఎలా ఆడాలో తెలుసుకోవాలి. కానీ మనోడు అది చేయకుండా ఏడుస్తూ కనిపించాడు. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి సైడ్-బి' సినిమా రివ్యూ) -
Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?
బిగ్బాస్ 7 తెలుగు సీజన్ గతంతో పోలిస్తే గత కొన్నివారాలుగా పికప్ అయిందని చెప్పొచ్చు. గ్రూపులుగా తయారై కొట్టుకుంటున్నారు. అయితేనేం మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఇకపోతే ఉల్టాపుల్టా అనే ట్యాగ్ లైన్తో ఈ సీజన్ రన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లైన్కి మరోసారి న్యాయం చేసేలా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేసి ట్విస్ట్ ఇవ్వబోతున్నారట. ఇంతకీ మేటర్ ఏంటి? ఎలిమినేట్ అయ్యే ఆ ఇద్దరు ఎవరు? (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు) నామినేషన్స్లో ఎవరు? ఈ వారం బిగ్ బాస్ హౌసులో 8 మంది నామినేట్ అయ్యారు. శివాజీ కెప్టెన్ కాబట్టి అతడు లిస్టులో లేడు. రైతుబిడ్డ ప్రశాంత్కి ఒక్క ఓటు పడటంతో అతడు సేఫ్ అయిపోయాడు. దీంతో మిగిలిన వాళ్లందరూ అంటే అమర్దీప్, యావర్, ప్రియాంక, శోభాశెట్టి, అర్జున్, గౌతమ్, అశ్విని, రతిక ఉన్నారు. వీళ్లలో యావర్కి ఈసారి ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. రెండులో అమర్ ఉన్నాడట. తర్వాత వరసగా రతిక, అశ్విని, గౌతమ్, అర్జున్, ప్రియాంక, శోభాశెట్టి ఉన్నట్లు తెలుస్తోంది. ఎలిమినేట్ అయ్యేది ఎవరు? ఓటింగ్ ప్రకారం చూసుకుంటే సీరియల్ బ్యాచ్లోని ప్రియాంక లేదా శోభాశెట్టిలో ఒకరు ఎలిమినేట్ అయిపోవాలి. కానీ బిగ్బాస్ ఆర్గనైజర్స్ అస్సలు వీళ్లని బయటకు పంపించారు. ఎందుకంటే ఆటైనా గొడవైనా వీళ్లిద్దరూ ముందుంటున్నారు. శివాజీకి ఎదురు నిలబడి మాట్లాడుతున్నది కూడా వీళ్లే. ఇలాంటోళ్లని ఎలిమినేట్ చేసి పంపించేస్తే షోలో మజా పోతుంది. అందుకే ఓట్లు తక్కువ పడినా సరే వీళ్లు బయటకెళ్లే ప్రసక్తే లేదనిపిస్తోంది. (ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి సైడ్-బి' సినిమా రివ్యూ) డబుల్ ట్విస్ట్ ఈ వారం ఎవిక్షన్ పాస్ ఇవ్వడాని కంటే ముందు.. ఇప్పటివరకు హౌసులో ఉన్నదాని ప్రకారం ర్యాంకింగ్ ప్రకారం నిలబడమని బిగ్బాస్ చెప్పాడు. దీంతో వరసగా శివాజీ, యావర్, ప్రశాంత్, ప్రియాంక, శోభా, అమర్, గౌతమ్, అర్జున్, అశ్విని, రతిక నిల్చున్నారు. చివరి రెండు స్థానాల్లో అశ్విని-రతిక ఉన్నారు. అంటే వీళ్లిద్దరూ ఎలిమినేషన్ కి అర్హులని పరోక్షంగా చెప్పినట్లే. అలా ఇప్పుడు ఈ ఇద్దరిని ఈవారం ఒకేసారి ఎలిమినేట్ చేస్తారని అంటున్నారు. లేదంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ప్లానింగ్లో ఉందని టాక్. ఎవిక్షన్ పాస్ సంగతేంటి? ఈవారం పెట్టిన పోటీల్లో గెలిచిన యావర్.. ఎవిక్షన్ పాస్ సొంతం చేసుకున్నాడు. అయితే మనోడు ఎలిమినేషన్లో ఉన్నాడు కాబట్టి సొంతంగా సేవ్ చేసుకోవాలని బిగ్ బాస్ ఫిట్టింగ్ పెడితే.. యావర్ తనకోసం తానే దీన్ని ఉపయోగించే అవకాశముంటుంది. వేరే వాళ్ల కోసం అంటే మాత్రం కచ్చితంగా రతికని యావర్ సేవ్ చేసేస్తాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి. గేమ్, టాస్కుల పరంగా చూసుకుంటే రతిక ఎప్పుడో వెళ్లిపోవాలి. కానీ బిగ్బాస్ ఎందుకో ఆమెపై తెగ ప్రేమ చూపిస్తున్నాడు. ఈసారి ఆమె ఎలిమినేట్ అవుతుందా? సేవ్ అవుతుందా అనేది చూడాలి. అప్పటివరకు వెయిట్ అండ్ సీ. (ఇదీ చదవండి: నెలన్నర నుంచి ఓటీటీ ట్రెండింగ్లో ఆ థ్రిల్లర్ మూవీ) -
తమ్ముడికి రతిక వెన్నుపోటు.. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ అలాంటి మాటలు!
బిగ్బాస్ ముద్దుబిడ్డ రతిక పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తోంది. ఓసారి ఎలిమినేట్ అయి బయటకెళ్లి వచ్చినా ఇంకా బుర్ర పనిచేయట్లేదు. ఏకంగా తమ్ముడికే వెన్నుపోటు పొడిచి పారేసింది. రతికకు తోడు యవర్ కూడా అలానే మెంటలెక్కినట్లు బిహేవ్ చేశాడు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 73 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. టాప్-10 ప్లేసుల కోసం గొడవ నామినేషన్స్ పూర్తి కావడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. ఇకపోతే ఇప్పటివరకు 10 వారాలు పూర్తయ్యాయి కదా.. ఓవరాల్ ఫెర్ఫార్మెన్స్ చూసుకుని టాప్-10లో ఎవరు ఏ ప్లేసులో నిలబడాలో డిసైడ్ చేసుకోవాలని బిగ్బాస్ ఫిట్టింగ్ పెట్టేశాడు. దీంతో మొత్తం గొడవ గొడవ అవుతుందనుకుంటే చాలా సాదాసీదా గొడవలే జరిగాయి. (ఇదీ చదవండి: తెలుగు యంగ్ హీరోకి గాయం.. పట్టుజారి అలా పడిపోవడంతో!) ఏ కంటెస్టెంట్ ఏ స్థానంలో? 1 శివాజీ 2 యావర్ 3 ప్రశాంత్ 4 ప్రియాంక 5 శోభాశెట్టి 6 అమర్దీప్ 7 గౌతమ్ 8 అర్జున్ 9 అశ్విని 10 రతిక శోభా ఫస్ట్ టైమ్ ఏడుపు ఈసారి బిగ్బాస్ సీజన్లోకి వచ్చిన అమ్మాయిల్లో కాస్తోకూస్తో బెటర్ అంటే శోభా-ప్రియాంకనే. చాలామంది వీళ్లని తిడతారు గానీ ఇలాంటోళ్లు లేకపోతే అస్సలు మజా ఉండదు. అయితే ఇన్నాళ్ల గొడవలు, అరుపులతో హౌస్ మొత్తాన్ని గడగడలాడించిన శోభా.. అర్జున్ మాటలకు కన్నీళ్లు పెట్టుకుంది. టాప్-10లో శోభా ఏడో స్థానానికి సూట్ అవుతుందని చెప్పిన అర్జున్.. ప్రతిసారీ శోభాకు అదృష్టం కలిసొచ్చిందని కారణం చెప్పాడు. బయట కాస్త గంభీరంగా కనిపించిన శోభా.. బాత్రూంలోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది. అమర్-ప్రియాంకతో దీని గురించి మాట్లాడుతూ తెగ బాధపడిపోయింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) రతిక వెన్నుపోటు ఆట తప్ప అన్నీ చేస్తున్న రతిక ఓసారి ఎలిమినేట్ అయింది. పిచ్చి కారణాలతో రీఎంట్రీ పేరు చెప్పి ఈమెని మళ్లీ హౌసులోకి తీసుకొచ్చారు. అయినా సరే ఆడకుండా అలానే బండి లాక్కుని వస్తోంది. తాజాగా టాప్-10లో ప్రశాంత్ గురించి మాట్లాడుతూ.. తొలి నాలుగు వారాల్లో నీ గేమ్ కనిపించలేదు, సొంతంగా గేమ్ ఆడలేవు, బిగ్బాస్ రూల్స్ అర్థం కావు, నువ్వు ఆడుతున్నావా? ఒకరి హెల్ప్తో(శివాజీని ఉద్దేశించి) గ్రూపులో ఆడుతున్నావా? అనేది కనిపించట్లేదని రతిక చెప్పింది. అలా శివాజీ గ్రూపులో కలిసిపోయిన రతిక.. అదే గ్రూప్లో పల్లవి ప్రశాంత్కి వెన్నుపోటు పొడిచేసింది. ఇక రతిక అన్నేసి మాటలు అనేసరికి రైతుబిడ్డ ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోలేదు. 'నీ వెనకాల తిరిగా అన్నావ్, మా అమ్మ-నాన్నని తిట్టావ్, నన్ను గుండు గొరిగిస్తా అన్నావ్.. అయినాసరే హౌసుకి ఫస్ట్ కెప్టెన్ అయ్యా. నేను కెప్టెన్ అవ్వాలని అన్న(శివాజీ) లెటర్ త్యాగం చేసిండు. అర్థమైందా అక్కా' అని రతికకి ప్రశాంత్ వేరే లెవల్లో కౌంటర్ వేశాడు. దీంతో బిగ్బాస్ ముద్డుబిడ్డ ఆమె ముఖం మాడిపోయింది. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో సినిమా) యావర్కి నిజంగా పిచ్చే ఇక టాప్-10లో యావర్ ఎక్కడుండాలో అనేది అశ్విని చెప్పడానికి ట్రై చేస్తుంటే.. ఆమెతో యావర్ గొడవ పెట్టుకున్నాడు. ఒకానొక దశలో మాటామాటా పెరిగి ఇద్దరు గట్టిగా అరుచుకున్నారు. అమ్మాయితో మాట్లాడే పద్ధతి ఇదేనా అని అశ్విని కోప్పడితే.. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదని యావర్ అన్నాడు. ఈ మొత్తం వ్యవహారం చూస్తే.. ఏం లేనిదానికి యవర్, అశ్వినితో గొడవ పెట్టుకున్నాడు. దీంతో యావర్కి నిజంగా పిచ్చి పట్టిందా అని డౌట్ వచ్చింది. అర్జున్ కే ఎవిక్షన్ పాస్ అయితే టాప్-10లో అందరూ నిలబడిన తర్వాత బిగ్బాస్ మళ్లీ ఫిట్టింగ్ పెట్టాడు. ఈ తతంగం అంతా కూడా ఎవిక్షన్ పాస్ గురించి అని చెప్పి.. చివరి ఐదు స్థానాల్లో నిలబడిన వాళ్లకు పోటీ ఉంటుందని, అందులో విజేతగా నిలబడిన వాళ్లకు ఎవిక్షన్ పాస్ దక్కుతుందని చెప్పాడు. ఇందులో అమరదీప్, గౌతమ్, అర్జున్, అశ్విని, రతిక పోటీపడగా.. అర్జున్ పాస్ గెలుచుకున్నాడు. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. అయితే శివాజీ.. కాస్త ఆడమ్మా అని రతికకి గైడెన్స్ ఇచ్చినా సరే సొంత గ్రూప్ మీదకే ఈ పిల్ల తిరగబడటం కాస్త వెరైటీగా అనిపించింది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్' షోలో వివాదం.. లేడీ కంటెస్టెంట్పై పోలీస్ కేసు) -
అతను రైతుబిడ్డ.. నేను పాటబిడ్డ.. శివాజీని ఎప్పుడలా చూడలేదు!
బిగ్ బాస్ సీజన్-7 మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పదకొండో వారానికి చేరుకున్న తెలుగువారి రియాలిటీ షో ఈసారి మరింత సరికొత్తగా ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన భోలె షావలి పదో వారం ఎలిమినేట్ అయ్యారు. హోస్లో ఉన్నది కొద్ది వారాలే అయినా.. తన పంచ్లు, పాటలతో అందరినీ అలరించాడు. అయితే హౌస్లో ఉన్నన్ని రోజులు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్కు సపోర్ట్గా నిలిచాడనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేశారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన భోలె షావలి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పల్లవి ప్రశాంత్, శివాజీకి మద్దతుగా ఉన్నారన్న విషయంపై ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. అదేంటో చూద్దాం. భోలె షావలి మాట్లాడుతూ..' నేను వైల్ట్ కార్డ్పై హౌస్లోకి వెళ్లా. కానీ నేను ప్రశాంత్ బిగ్ బాస్లోకి వెళ్లకముందే అతని వీడియోను స్టేటస్గా పెట్టుకున్నా. ఇది చూసిన ప్రశాంత్ క్లోజ్ ఫ్రెండ్ గన్ను అనే వ్యక్తి నన్ను అడిగాడు. సార్.. మీరు ఏంటి ఇలా పెట్టారని అడిగాడు. అవును.. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న నాకే ఆలాంటి ఐడియా రాలేదు. అలాంటిది అతను పోరాడుతుంటే ప్రోత్సహించడం నా ధర్మం అని చెప్పా. కట్ చేస్తే ఇద్దరం బిగ్బాస్లో ఉన్నాం. అతను రైతు బిడ్డ.. నేను పాట బిడ్డ అంతే. కానీ మీరు అలా అనుకుంటే నేను ఏం చేయలేను. శివాజీ, నేను ఇండస్ట్రీలో ఉన్నాం. ఆయన పెద్ద నటుడిగా ఉండి.. బిగ్ బాస్కు వెళ్లడమే గొప్ప. అంతే ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ వల్లే నేను అలా మారిపోయా. ఆయనను కంటెస్టెంట్గా ఎప్పుడూ చూడలేదు. శివాజీని ఒక హీరోలాగానే చూశాను. కానీ నేను హీరో అవుతానని మాత్రం ఎప్పుడు అనుకోలేదు.' అని అన్నారు. కాగా.. భోలె షావలి బిగ్బాస్లో తన మాటలు, పాటలతో ప్రేక్షకులను అలరించారు. -
రతిక పెట్టిన చిచ్చు.. మీదపడి మరీ అరుచుకున్న ఆ ఇద్దరు!
అమ్మాయిల వల్ల రాజ్యాలే కుప్పకూలిపోయాయి. ఆఫ్ట్రాల్ 'బిగ్బాస్' ఎంత? అవును మీరు కరెక్ట్గానే విన్నారు. తాజాగా 11వ వారం నామినేషన్స్లో ఓ అమ్మాయి గతంలో అనేసిన ఓ మాట కోసం ఇద్దరు మేల్ కంటెస్టెంట్స్ గొడవపడ్డారు. మీదమీదపడి కొట్టుకునేంతవరకు వెళ్లిపోయింది. ఇంతకీ మంగళవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 72 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: నటి అన్నపూర్ణ కన్నీళ్లు.. కూతురి ఆత్మహత్య విషయం గుర్తొచ్చి!) నామినేషన్స్లో రచ్చరచ్చ సోమవారం నలుగురు హౌస్మేట్స్ తమతమ నామినేషన్స్ పూర్తిచేశారు. మంగళవారం మిగతా కంటెస్టెంట్స్ నామినేషన్స్ కంప్లీట్ చేశారు. అయితే సోమవారం కాస్తోకూస్తో లాజిక్స్ మాట్లాడారు కానీ మంగళవారం మాత్రం చాలా సిల్లీగా అసలేం ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేకుండా సాగాయి. ఓవరాల్గా ఎనిమిది మంది ఈ వారం నామినేషన్స్లో ఉన్నారు. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? ప్రశాంత్ - అర్జున్, రతిక అశ్విని - ప్రియాంక, అమరదీప్ యవర్ - శోభాశెట్టి, అమరదీప్ శోభాశెట్టి - యవర్, అశ్విని అమరదీప్ - గౌతమ్, యవర్ శివాజీ - గౌతమ్, ప్రియాంక దొరికిపోయిన యవర్ అమరదీప్ని నామినేట్ చేసిన అశ్విని.. తనపై పాట పాడినందుకే చేస్తున్నానని కారణం చెప్పింది. అయితే మరీ ఇంత సిల్లీ రీజనే ఏంట్రా బాబు అనిపించింది. దీని తర్వాత వచ్చిన యవర్, అమరదీప్ని నామినేట్ చేశాడు. అయితే ఫస్ట్ టెడ్డీ గేమ్లో తన బొమ్మ ఎందుకు పట్టుకున్నావ్ అని మాట్లాడాడు. ఇది నా గేమ్ అని అమర్ క్లారిటీ ఇచ్చేసరికి యవర్ మాట మార్చేశాడు. అది కాదు నింజా గేమ్ గురించి మాట్లాడుతున్నా అన్నాడు. దీంతో అమర్ చాలా కూల్గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. గత వారాల్లో తప్పులు ఎత్తిచూపి నామినేషన్ చేస్తున్నావ్ అంతేగా అని అమర్ అనేసరికి.. ఇప్పటివరకు జరిగింది మొత్తం చూసి చెబుతున్నా అని యవర్ అరిచాడు. బిగ్బాస్ నెక్స్ట్ టైమ్ నుంచి ఇలాంటి గేమ్స్ ఇవ్వకండి.. యవర్కి ఇవి నచ్చట్లేదు అని అమరదీప్ సెటైరికల్గా మాట్లాడాడు. (ఇదీ చదవండి: స్టార్ హీరో ప్రేమ వ్యవహారం.. మోసం చేసిన క్లోజ్ ఫ్రెండ్!) రతిక చెప్పిన దానికోసం ఇకపోతే అమర్-యవర్ నామినేషన్స్ సందర్భంగా.. హైప్ కోసమే రతిక వెనక యవర్ తిరుగుతున్నాడని అమరదీప్ అప్పుడెప్పుడో మూడో వారామో నాలుగో వారమో అన్నాడట. ఇప్పుడు దాని గురించి డిస్కషన్ జరగడం ఆశ్చర్యంగా అనిపించింది. ఇది ఇక్కడితో ఆగిపోయింటే పర్లేదు గానీ అమర్ రెచ్చగొట్టేసరికి యవర్ పైపైకి వచ్చాడు. మధ్యలో ఎంటరైన శివాజీ.. వాళ్లని ఆపుచేశాడు. యవర్ కావాలనే అబద్ధాలు చెబుతున్నాడని అమర్ రెచ్చిపోయాడు. అలా మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది. ఈ వారం నామినేట్ అయినోళ్లు అమరదీప్ శోభా ప్రియాంక అర్జున్ రతిక అశ్విని యవర్ గౌతమ్ (ఇదీ చదవండి: 'KCR' మూవీకి అడ్డంకులు.. 'జబర్దస్త్' కమెడియన్ ఎమోషనల్ వీడియో) -
బిగ్ బాస్7 : సొట్టబుగ్గల సుందరి అశ్వినీ శ్రీ (ఫొటోలు)
-
Bigg Boss 7: శుద్ధపూస శివాజీ మళ్లీ దొరికేశాడు.. రతిక, ప్రశాంత్ వల్లే ఇలా!
బిగ్బాస్ 7లో మరో నామినేషన్స్ డే వచ్చేసింది. అయితే ఈసారి రతిక కాస్త ఓవరాక్షన్ చేసింది. అది కూడా ఓ విషయం అర్థం కావడం వల్లే. మరోవైపు అర్జున్, ప్రశాంత్ గాలి అంతా తీసేశాడు. అలా ప్రశాంత్-రతిక అతి వల్ల శివాజీ టార్గెట్ అయిపోయాడు. మరోవైపు శోభా-ప్రియాంక భిన్నంగా ప్రవర్తించారు. ఇంతకీ సోమవారం నామినేషన్స్ సందర్భంగా ఏం జరిగిందనేది Day 71 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. శివాజీ మాయలో రతిక భోలె ఎలిమినేట్ కావడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. ఇక భోలె వెళ్లిపోయాడని రతిక ఏడవడంతో సోమవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. తన ఫ్రెండ్ ఎలిమినేట్ అయినందుకు అశ్విని తెగ బాధపడిపోయింది. అస్సలు ఉండలని అనిపించట్లేదని ఏడుస్తూనే కనిపించింది. మరోవైపు ఎలిమినేషన్ మొదలవడానికి ముందు రతికని శివాజీ ఇన్ఫ్లూయెన్స్ చేశాడు. 'నువ్వు ఏమనుకుంటావో నాకు తెల్వదు, నామినేషన్స్లో నీ టాలెంట్ చూపియ్. నన్ను నమ్ము, ఇది నీకు చాలా హెల్ప్ అవుద్ది. అవతల వాళ్లు నిన్ను ప్రశ్నించే పరిస్థితి రాకుండా చూస్కో. అలానే వాళ్లు కూడా ఏం మాట్లాడుతున్నారో విను. భయంలో ఉండి వినకు' అని రతికతో చెప్పాడు. ప్రతిసారి తను ఎవరికీ ఏం చెప్పట్లేదు బాబుగారు అని చెబుతుంటాడు కదా! మరి ఇప్పుడు చేసిందేంటో శివాజీకే తెలియాలి. దీనిబట్టి రతిక గేమ్ మానేసి ఓట్లు కోసం శివాజీ మాయలో పడిందని క్లియర్గా అర్థమైంది. (ఇదీ చదవండి: పెళ్లికి తొందరపడుతున్న తమన్నా.. ఆ ప్రాబ్లమ్ వల్లే ఇలా!) నామినేషన్స్ షురూ సోమవారం ఎపిసోడ్లో భాగంగా కేవలం నలుగురు మాత్రమే తమ నామినేషన్స్ పూర్తిచేశారు. అయితే ఇన్ని వారాలు తినడం, ముచ్చట్లు పెట్టడం తప్ప మరో పనిచేయని రతిక.. ఈసారి నామినేషన్స్లో శివాజీ ఇన్ఫ్లూయెన్స్ వల్ల రెచ్చిపోయింది. అయితే చెప్పిన పాయింట్స్ కరెక్ట్గా ఉండే బాగున్ను. కానీ శోభా-ప్రియాంక ఈమెని కూల్గా హ్యాండిల్ చేసేసరికి రతికకి ఏం చేయాలో అర్థం కాక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ అలానే బిహేవ్ చేసింది. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? రతిక - శోభాశెట్టి, ప్రియాంక అర్జున్ - ప్రశాంత్, శోభాశెట్టి ప్రియాంక - రతిక, అశ్విని గౌతమ్ - అర్జున్, అమరదీప్ (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో సినిమా) రతిక భయపడిపోయింది ఓసారి ఎలిమినేట్ అయి రీఎంట్రీ ఇచ్చిన రతిక.. తిరిగొచ్చి మూడు వారాలు అవుతున్నా పెద్దగా పీకిందేం లేదు. దీపావళి ఎపిసోడ్లో అందరూ ఇదే చెప్పేసరికి ఈసారి నామినేషన్స్ లో ఏదో ఒకటి మాట్లాడేయాలని ఫిక్స్ అయింది. ఇప్పటికే చేయకపోతే ఇంటికి పంపేస్తారుగా. అందుకే తొలుత శోభాని నామినేట్ చేసింది. గతవారం కెప్టెన్గా ఎఫర్ట్ ఏం కనిపించలేదని నామినేషన్కి కారణం చెప్పింది. మరి వీకెండ్ ఎపిసోడ్లో నాగ్ సర్ అడిగినప్పుడు, నేను కెప్టెన్సీ బాగానే చేశానని ఎందుకు పైకెత్తావ్ అని శోభా అడగ్గానే.. రతిక టాపిక్ మార్చేసింది. దీనిబట్టి అర్థమైంది ఏంటంటే రతికకి ఎలిమినేషన్ భయం పట్టుకుంది. అందుకే హైప్ తెచ్చుకోవాలని నామినేషన్స్ లో కాస్త ఓవరాక్షన్ చేసింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. రతిక.. ప్రియాంకని కూడా నామినేట్ చేసింది. దీంతో ఈమె కూడా లాజిక్తో కొట్టింది. 'నీకు ఇప్పుడు కూడా చెప్పడానికి పాయింట్ లేదు. వేరే వాళ్లు వచ్చి చెబితే దాన్ని నువ్వు సాగదీయడం తప్ప నీకు వేరేవాళ్లపై చెప్పడానికి ప్రత్యేకంగా పాయింట్స్ లేవు. రావు కూడా' అని శివాజీని ఉద్దేశిస్తూ ప్రియాంక సీరియస్ అయింది. ఈ సందర్భంగా వేరే వాళ్లు వచ్చి చెబితే అన్నది శివాజీ గురించే! అలానే 'నాగార్జున సర్ చెప్పేంత వరకు, మీ అమ్మ వచ్చి చెప్పేంత వరకు నీకు నీ విలువ తెలియదు' అని రతిక గాలి మొత్తం ప్రియాంక తీసిపడేసింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) ప్రశాంత్-శివాజీ యవ్వారం ఇక అర్జున్.. పల్లవి ప్రశాంత్ని నామినేట్ చేశాడు. 'నీ జోలికొస్తే నువ్వు వేస్తావ్, బాగానే ఉంటది. కానీ శివాజీ అన్న జోలికొచ్చినా సరే వేస్తావ్ చూడు అక్కడ కొంచెం బాగోదు' అని అర్జున్ కారణం చెప్పాడు. దీంతో ప్రశాంత్ ఎప్పటిలానే హంగామా క్రియేట్ చేయాలని చూశాడు. కానీ మిగతవాళ్లలా అర్జున్ ఊరుకోలేదు. ప్రశాంత్, నామినేషన్స్లో భుజం పైకెత్తి, అటుఇటు తిరుగుతూ ఎలా ప్రవర్తిస్తాడో.. సేమ్ అర్జున్ కూడా అలానే బిహేవ్ చేశాడు. దీంతో ప్రశాంత్ మెంటలెక్కిపోయాడు. 'శివాజీ అన్న నీకు ఫస్ట్ హెల్ప్ చేశాడు. నీకు వెన్నెముకలా నిల్చున్నాడు తప్పులేదు. ఇక నుంచైనా ఆయన ఆట నువ్వు ఆడటం మానేసి, నీ ఆట నువ్వు ఆడు' అని అర్జున్ మరో కారణం చెప్పాడు. దీంతో ప్రశాంత్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇది ఇంకా పెరిగితే తన బండారం బయటపడుతుంది.. బాటిల్ పగలగొట్టేయమన్నాడు. అయితే ప్రశాంత్ గురించి అర్జున్ మాట్లాడుతున్నంతసేపు.. ఏదో తప్పు చేసినవాడిలా శివాజీ ముఖం దించేసి కనిపించాడు. సో దీనిబట్టి అర్థమైంది ఏంటంటే.. శివాజీ ఎన్ని నీతి కబుర్లు చెప్పినా సరే ప్రశాంత్, రతిక, యవర్ని ఇన్ఫ్లూయెన్స్ చేస్తూ గేమ్ ఆడుతున్నాడు. పాపం ఈ ముగ్గురు.. శివాజీ మహానుభావుడు, నీతిమంతుడు, చాణక్య అనుకుని.. అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఇప్పటికైనా వీళ్లు శివాజీ చెప్పాడనో, అతడి మాట వింటే ఓట్లు పడతాయనో కాకుండా ఎవరి గేమ్ వాళ్లు ఆడితే బెటర్. లేదంటే ప్రశాంత్, రతిక, యవర్ అని కాకుండా.. శివాజీ చెంచాలుగానే మిగిలిపోతారు. అలా సోమవారం ఎపిసోడ్ పూర్తయింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి బాయ్ఫ్రెండ్ ఇతడే.. ఈ కుర్రాడెవరో తెలుసా?) -
బిగ్ బాస్ టాప్-5 ఎవరంటే..? ఫైనల్ లిస్ట్ ఇదేనా..?
బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ చాలా గ్రాండ్, కలర్ఫుల్గా సాగింది. టాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది వచ్చారు. అలానే దీపావళి పండగ సెలబ్రేషన్స్ జరిగాయి. 11 మంది కంటెస్టెంట్స్ కుటుంబసభ్యులు స్టేజీపైకి వచ్చి టాప్-5 ఎవరో కూడా చెప్పుకొచ్చారు. ఈసారి టాప్- 5లో శివాజీ, ప్రశాంత్, అమర్ దీప్, ప్రియాంక, గౌతమ్ ఉంటారని.. ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా అభిప్రాయపడ్డారు. అమ్మాయిలలో ప్రియాంక మాత్రమే టాప్ ఫైవ్ రేసులో ఉంది. ► మొదట అమర్ దీప్ కోసం ఆయన అమ్మగారు వచ్చారు.. అమర్ స్నేహితుడు అయిన మానస్ కూడా స్టేజీపైన కనిపించాడు. వారి ప్రకారం టాప్ ఫైవ్ మెంబర్స్ ఎవరు అనేది తేల్చేశారు. ► భోలే షావలి కోసం ఆయన స్నేహితులు వచ్చారు. వారిలో బిగ్ బాస్ వల్ల గుర్తింపు తెచ్చుకున్న నటుడు సయ్యద్ సోహెల్ ఉన్నాడు. మరో ఫ్రెండ్ మదీన్ వచ్చాడు. ► అశ్విని కోసం ఆమె తండ్రి శ్రీనివాస్, వారి కుటుంబ స్నేహితుడు తేజ వచ్చాడు. వారి ప్రకారం టాప్ ఫైవ్లో ఉండేది వీళ్లే.. ► అర్జున్ కోసం ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు వచ్చాడు.. ఆయన ప్రకారం టాప్ ఫైవ్ ఉండేది వీళ్లే.. ► గౌతమ్ కుటుంబ స్నేహితుల ప్రకారం టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వీరే.. ► పల్లవి ప్రశాంత్ కోసం ఆయన అమ్మగారితో పాటు సోదరి కూడా వచ్చారు. వారి ప్రకారం టాప్ ఫైవ్లో ఉండేది వీళ్లే.. ► ప్రియాంక జైన్ కోసం ఆమె అమ్మగారితో పాటు ప్రముఖ నటి ప్రగతి కూడా వచ్చారు. వారి ప్రకారం టాప్ ఫైవ్ వీళ్లే ► రతికా రోజు కోసం ఆమె అమ్మగారితో పాటు యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ భాను వచ్చారు. వారి ప్రకారం టాప్ ఫైవ్ ► శోభ కుటుంబ సభ్యుల ప్రకారం టాప్ ఫైవ్లో ఉండేది వీళ్లే.. ► శివాజీ కోసం ఆయన సతీమణితో పాటు వారి కుమారుడు రిక్కీ వచ్చాడు.. వారి ప్రకారం టాప్ ఫైవ్ ► యావర్ కోసం ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారు. వారి ప్రకారం టాప్ ఫైవ్ లిస్ట్ ఇదే -
బిగ్ బాస్ అర్జున్కు సినిమా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు..!
బిగ్ బాస్తో వచ్చిన గుర్తింపు కొందరికి వరంలా మారుతుంది. వారి జీవితాన్ని కూడా ఉన్నతస్థాయికి తీసుకెళ్తుంది. ఇప్పటికే కొందరి విషయంలో అది నిజమైంది కూడా.. ఈ సీజన్లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన అర్జున్కు ఊహించని అవకాశం దక్కింది. ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు బిగ్ బాస్ వేదికపైకి గెస్ట్గా వచ్చిన విషయం తెలిసిందే.. ఆ సమయంలో అర్జున్కు సినిమా ఛాన్స్ ఇచ్చాడు బుచ్చిబాబు... తను రామ్ చరణ్తో తీయబోయే సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించడంతో అర్జున్ ఎగిరిగంతేశాడు. దీపావళి సందర్భంగా బిగ్బాస్ హౌస్లోకి వెళ్లిన బుచ్చిబాబు.. అర్జున్ ఆట తీరును మెచ్చుకున్నారు. తన కోసం వచ్చినందుకు బుచ్చిబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు అర్జున్. 'మీ ఉప్పెన సినిమాకు అవార్డు వచ్చిన తర్వాత మిమ్మల్ని కలవడానికి రెండు మూడుసార్లు ఆఫీస్కు వచ్చాను. కానీ మీరు చెన్నై వెళ్లారని చెప్పారు. ఫోన్ చేద్దామనుకున్నా కుదరలేకపోయింది. ఈలోగా ఉన్నపలంగా బిగ్బాస్కు రావాల్సి వచ్చింది' అని అర్జున్ అన్నారు. దీనిపై స్పందించిన బుచ్చిబాబు.. 'రామ్ చరణ్ సర్ మూవీలో నువ్వొక సూపర్ పాత్ర చేయబోతున్నావ్. ఫిక్స్ అయిపో' అంటూ పండగ వేళ అర్జున్కి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రం కోసం ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ పనిచేస్తున్నట్లు బుచ్చిబాబు అధికారికంగా ప్రకటించారు. దీంతో బిగ్బాస్ కంటెస్టెంట్లు అందరూ కేరింతలు కొట్టారు. గేమ్ చేంజర్ తర్వాత RC 16 షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అంబటి అర్జున్ కూడా పలు సీరియల్లతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అర్ధనారి, సుందరి వంటి సీరియల్స్లలో ఆయన ముఖ్యపాత్ర పోషించారు. అంతేకాకుండా గోపీచంద్ 'సౌఖ్యం'లో విలన్గానూ మెప్పించాడు. క్రీడా నేపథ్యంలో రూపొందనున్న రామ్ చరణ్ సినిమాలో అర్జున్కు ఛాన్స్ దక్కడం గొప్ప విషయమేనని చెప్పవచ్చు. -
Bigg Boss 7: భోలె షాకింగ్ ఎలిమినేషన్.. ఆ తప్పులే కొంపముంచాయ్!?
బిగ్బాస్ షోలో ప్రతివారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతుంటారు. సోమవారం నామినేషన్స్ పూర్తవగానే.. బయటకెళ్లేది ఎవరనేది ప్రేక్షకులు గెస్ చేస్తుంటారు. ఈ సీజన్లో దాదాపు అన్నిసార్లు అది నిజమైంది కూడా. ఈ వారం మాత్రం షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. పాటబిడ్డ ట్యాగ్తో హౌసులోకి ఎంట్రీ ఇచ్చిన సింగర్, మ్యూజిక్ కంపోజర్ భోలె షావళి ఎలిమినేట్ అయిపోయాడు. ఇలాంటి చిత్రమైన క్యారెక్టర్ ఎలిమినేట్ కావడానికి కారణాలు చాలానే ఉన్నాయనిపిస్తోంది. కాపీ కొట్టడం శాపమైందా? వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా హౌసులోకి వచ్చిన భోలె.. తనని తాను పాటబిడ్డగా పరిచయం చేసుకున్నాడు. అయితే అప్పటికే హౌసులోకి రైతుబిడ్డ ట్యాగ్తో ప్రశాంత్ ఉన్నాడు. పాటబిడ్డ అనే పేరు ప్రశాంత్ని చూసి కాపీ కొట్టినట్లు అనిపించింది. ఉన్నన్ని రోజులు అందరితో మంచిగా ఉండిపోదామని వచ్చానని ఓ సందర్భంలో భోలె అన్నాడు. అది కూడా శివాజీ బిహేవియర్ని కాపీ కొట్టినట్లు అనిపించింది తప్పితే కొత్తగా ఏం అనిపించలేదు. ఈ రెండు విషయాల్లోనూ డిఫరెంట్ అప్రోచ్తో భోలె వచ్చుండాల్సింది. మాట, పాట తేడా కొట్టాయా? స్వతహాగా సింగర్ అయిన భోలె.. బిగ్బాస్లో ఉన్నన్నిరోజులు మాట్లాడినప్పుడు గానీ ఎవరైనా తనని నామినేట్ చేసినప్పుడు గానీ విచిత్రంగా ప్రవర్తించేవాడు. స్ట్రెయిట్గా సమాధానం ఇవ్వకుండా ఏదో పాడుతూ, అర్ధం లేకుండా మాట్లాడుతూ అందరికీ మెంటల్ ఎక్కించేసేవాడు. ఇవన్నీ కాదన్నట్లు వచ్చిన వెంటనే శివాజీ బ్యాచులో కలిసిపోయాడు. దీంతో సీరియల్ బ్యాచ్కి టార్గెట్ అయిపోయాడు. ఈ వారం మహారాణులు తీర్మానంతో ఐదుగురిలో ఒకడిగా భోలె నామినేట్ అయ్యాడు. ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయాడు. సో అదన్నమాట విషయం. -
Big Boss 7: ఎలిమినేట్ అయిన భోలె.. ఎంత సంపాదించాడో తెలుసా?
బిగ్బాస్ 7లో ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పడం కష్టం. ఆదివారం ఎపిసోడ్తో పదోవారం ముగిసింది. గత తొమ్మిది వారాల్లో తొమ్మిది మంది హౌస్ నుంచి బయటకెళ్లిపోగా.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని చిన్న టెన్షన్ నడిచింది. అయితే అందరూ రతిక ఎలిమినేట్ అవుతుందేమో అనుకున్నారు. కానీ అనుహ్యంగా భోలె ఎలిమినేట్ అయిపోయాడు. పాడ పాడుతూ, నవ్వుకుంటూ హౌస్ నుంచి బయటకొచ్చేశాడు. భోలె ఎలిమినేట్ ఈ వారం ఎలిమినేషన్.. రాజమాతలు అనే కాన్సెప్ట్ ప్రకారం జరిగింది. దీంతో అమ్మాయిలందరూ రాజమాతల్లా ఉండి ఎవరూ నామినేట్ కావాలనేది డిసైడ్ చేశారు. అలా శివాజీ, గౌతమ్, యవర్, భోలె, రతిక.. ఎలిమినేషన్స్లో నిలిచారు. ఇందులో ఎప్పటిలానే శివాజీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. తర్వాతి స్థానాల్లో యవర్, గౌతమ్ నిలిచారు. చివరి రెండు స్థానాల్లో రతిక-భోలె మధ్య కాస్త నడిచింది. కానీ భోలెపై వేటు పడింది. మరో ఛాన్స్ లేదు కాబట్టి ఎలిమినేట్ అయిపోయాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: లవ్స్టోరీ అంతా బయటపెట్టిన శోభా.. ఈ సీజన్ టాప్-5 వాళ్లే!?) సంపాదన గట్టిగానే వైల్డ్కార్డ్ కోటాలో పాటబిడ్డ అనే ట్యాగుతో హౌసులోకి ఎంట్రీ ఇచ్చిన భోలె.. ఆట కంటే పాటతో బాగా ఫేమస్ అయ్యాడు. కానీ గేమ్ విషయంలో మాత్రం చాలా వెనకబడిపోయాడు. శివాజీ బ్యాచులో ఉండటం, కాస్త ఎంటర్టైన్ చేయడంతో దాదాపు ఐదు వారాలు ఎలాగోలా బండి లాక్కుంటూ వచ్చేశాడు. అలానే అమ్మాయిలతో గొడవ, బూతులు మాట్లాడటం లాంటివి కాస్త మైనస్ అయ్యాయని చెప్పొచ్చు. ఈసారి ఎలిమినేషన్స్లోనూ అందరూ మనోడి కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండేసరికి భోలెపై వేటు తప్పలేదు. ఇకపోతే భోలె.. రోజుకు రూ.35 వేల చొప్పున అంటే వారానికి దాదాపు రూ.2.5 లక్షల లెక్క రెమ్యునరేషన్ అందుకున్నాడట. అలా లెక్కేసుకుంటే ఐదు వారాలకుగానూ రూ.12 లక్షల వరకు సంపాదించాడని తెలుస్తోంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్లో ఇప్పటివరకు భోలెనే కాస్త ఎక్కువ మొత్తంలో అందుకున్నట్లు లెక్క. ఏదైతేనేం మనోడు వచ్చిన తొలివారంలో చెప్పినట్లు ఉన్నన్ని రోజులు మంచిగా ఉన్నాడు. మంచిగా సంపాదించి, కాస్త పేరు తెచ్చుకుని హౌస్ నుంచి వెళ్లిపోయాడు. (ఇదీ చదవండి: హీరోగా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్బాస్' కంటెస్టెంట్) -
Bigg Boss 7: లవ్స్టోరీ అంతా బయటపెట్టిన శోభా.. ఈ సీజన్ టాప్-5 వాళ్లే!?
బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ చాలా గ్రాండ్, కలర్ఫుల్గా సాగింది. టాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది వచ్చారు. అలానే దీపావళి పండగ సెలబ్రేషన్స్ జరిగాయి. 11 మంది కంటెస్టెంట్స్ కుటుంబసభ్యులు స్టేజీపైకి వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడారు. అలానే కన్నడ బ్యూటీ శోభాశెట్టి.. ఈ షో సాక్షిగా తన ప్రియుడ్ని పరిచయం చేసింది. వాళ్ల లవ్స్టోరీ కూడా మొత్తం బయటపడింది. ఓ మాదిరి ఎంటర్టైనింగ్గా సాగిన ఈ ఎపిసోడ్ లో ఓవరాల్గా ఏం జరిగిందనేది Day 70 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి బాయ్ఫ్రెండ్ ఇతడే.. ఈ కుర్రాడెవరో తెలుసా?) దీపావళి గేమ్తో షురూ ఈ ఆదివారం దీపావళి సందర్భంగా బిగ్బాస్ కళకళలాడింది. హౌస్ట్ నాగార్జునతో పాటు కంటెస్టెంట్స్ అందరూ నిండుగా ముస్తాబై వచ్చారు. 'ఫైండ్ ద క్రాకర్' అనే చిన్న పోటీతో ఎపిసోడ్ మొదలైంది. ఈ గేమ్ లో ప్రియాంక-అమరదీప్ జోడీ గెలిచింది. దీని తర్వాత ఒక్కో ఇంటి సభ్యుడి ఫ్యామిలీ మెంబర్స్-ఫ్రెండ్స్ స్టేజీపైకి వచ్చారు. హౌస్మేట్స్ అందరితోనూ మాట్లాడుతూ ఎవరు బాగా ఆడుతున్నారు? ఎవరు ఇంకా మెరుగవ్వాలి అని సలహాలు ఇచ్చారు. అలానే ఆయా కంటెస్టెంట్ కి సపోర్ట్గా వచ్చినవాళ్లు ఓవరాల్ టాప్-5 ఎవరో కూడా చెప్పుకొచ్చారు. ఈసారి టాప్-5 వాళ్లే ఇకపోతే అమరదీప్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి శోభాశెట్టి ఫ్యామిలీ మెంబర్స్ వరకు ఎవరికి వాళ్లు తమ అభిప్రాయాలు చెబుతూ ఎవరైతే ఈసారి టాప్-5లో ఉండొచ్చనేది గెస్ చేశారు. అయితే ఓవరాల్ లిస్టు చూసుకుంటే ప్రతిఒక్కరూ శివాజీకి ఏదో ఓ స్థానంలో పెట్టారు. దీంతో అతడికి 11 ఓట్లు పడ్డాయి. ఇతడి తర్వాత ప్రశాంత్కి 7, అమరదీప్-ప్రియాంకకు చెరో 6, గౌతమ్కి 5 ఓట్లు పడ్డాయి. మిగిలిన హౌస్మేట్స్కి ఒకటి రెండు ఓట్లు పడ్డాయంతే. దీనిబట్టి చూసుకుంటే.. ఈసారి టాప్-5లో శివాజీ, ప్రశాంత్, అమరదీప్, ప్రియాంక, గౌతమ్ ఉంటారని.. ఫ్యామిలీ మెంబర్స్ అభిప్రాయపడ్డారు. (ఇదీ చదవండి: హీరోగా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్బాస్' కంటెస్టెంట్) శోభా లవర్ ఆగయా దీపావళి ఎపిసోడ్కి ఆయా హౌస్మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు కదా! శోభా కోసం మాత్రం ఆమె తండ్రితో పాటు బాయ్ఫ్రెండ్ యశ్వంత్ రెడ్డి వచ్చాడు. అలా శోభా-యశ్వంత్.. బిగ్బాస్ సాక్షిగా తమ ప్రేమకథని బయటపెట్టారు. దాదాపు మూడన్నరేళ్లుగా ప్రేమించుకుంటున్నామని చెప్పుకొచ్చారు. అలానే శోభానే తొలుత ప్రపోజ్ చేసిందని, యశ్వంత్ బయటపెట్టాడు. 'నీకు నేను లైఫ్ లాంగ్ ఉంటాను, పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. నీ కష్టాల్లో, సుఖాల్లో తోడుంటాను, నీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా తోడుంటాను, పెళ్లి చేసుకుందాం అని అడిగింది. దీంతో నేను ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. కానీ తను చెప్పిన తర్వాత ఓకే అన్నాను' అని శోభా బాయ్ఫ్రెండ్ మొత్తం విషయాన్ని చెప్పాడు. అయితే రఫ్ అండ్ టఫ్ గా ఉండే శోభా.. ముందే తానే ప్రపోజ్ చేయడం, జీవితాంతం తోడుంటాని ప్రియుడితో చెప్పడంతో.. ఈమెలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. భోలె ఎలిమినేట్ ఓవైపు దీపావళి స్పెషల్ ఎపిసోడ్ జరుగుతూనే నామినేషన్స్ లో ఉన్నవాళ్లలో ఎవరు సేవ్ అయ్యారు? ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారనేది నాగ్ చెబుతూ వచ్చాడు. గౌతమ్, శివాజీ, రతిక సేవ్ అయిపోగా.. చివరగా యవర్, భోలె మిగిలారు. వీళ్లిద్దరూ భోలె ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించాడు. అయితే గత ఐదువారాలుగా తనకు తోడుగా ఉన్న భోలె వెళ్లిపోయేసరికి అశ్విని కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ఈరోజు ఎపిసోడ్లో రితికా సింగ్, ఫరియా అబ్దుల్లా లాంటి హీరోయిన్స్ డ్యాన్స్ ఫెర్ఫార్మెన్సులతో అదరగొట్టగా.. శ్రీలీల, కాజల్ తదితరులు సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చారు. చివర్లో హైపర్ ఆది వచ్చి అందరూ గురించి చెబుతూ దడదడలాడించాడు. అలా ఆదివారం ఎపిసోడ్ ఎండ్ అయింది. (ఇదీ చదవండి: Bigg Boss 7 : అమ్మాయిలపై శివాజీ వెకిలి కూతలు.. ఇదేం పద్దతి బాసూ..?) -
Bigg Boss 7: శోభాశెట్టి బాయ్ఫ్రెండ్ ఇతడే.. ఈ కుర్రాడెవరో తెలుసా?
బిగ్బాస్ షో అంటే ఎప్పుడూ గొడవలే కాదు సర్ప్రైజులు కూడా ఉంటాయి. గత కొన్నిరోజులుగా హౌసులో ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ అందరి ఫ్యామిలీలో ఎవరో ఒకరు బిగ్ బాస్ హౌసులోకి వచ్చి, కాసేపు మాట్లాడి వెళ్లిపోయారు. ఇదంతా పక్కనబెడితే దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో మాత్రం శోభాశెట్టి లవర్ని ఆమె చెప్పకుండా స్టేజీపై తీసుకొచ్చి షాకిచ్చారు. శోభాశెట్టికి షాక్ ఫ్యామిలీ వీక్లో భాగంగా శోభాశెట్టిని కలవడానికి హౌసులోకి ఆమె తల్లి రత్నమ్మ వచ్చింది. కాసేపు మాట్లాడి వెళ్లిపోయింది. ఇప్పుడు దీపావళి ఎపిసోడ్లో మాత్రం శోభాశెట్టి తండ్రితో పాటు ఆమె బాయ్ఫ్రెండ్ వచ్చాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోతో ఈ సంగతి బయటపడింది. అయితే తన ప్రేమికుడిని స్టేజీపై అస్సలు ఎక్స్పెక్ట్ చేయని శోభా షాక్ అయిపోయింది. (ఇదీ చదవండి: బిగ్బాస్ అశ్వినికి ఆల్రెడీ పెళ్లయిందా? మరి అలా!) కుర్రాడు ఎవరో తెలుసా? శోభాశెట్టి బాయ్ఫ్రెండ్ పేరు యశ్వంత్. ఇతడు కూడా నటుడే. ఏ 'కార్తీకదీపం'లో మోనితగా శోభాశెట్టి బోలెడంత క్రేజ్ తెచ్చుకుందో అదే సీరియల్లో డాక్టర్బాబు పాత్ర తమ్ముడు ఆదిత్యగా యశ్వంత్ యాక్ట్ చేశాడు. కలిసి నటిస్తున్నప్పుడు స్నేహితులుగా ఉన్న వీళ్లు కొన్నాళ్లకు ప్రేమికులుగా మరో స్టెప్ వేశారు. అయితే తన ప్రేమ విషయాన్ని ఎప్పుడూ బయటపెట్టలేదు. దాదాపు మూడన్నరేళ్ల నుంచి లవ్స్టోరీ చాలా రహస్యంగా మెంటైన్ చేస్తూ శోభా వచ్చింది. గతంలో శోభా-యశ్వంత్ 'బుజ్జి బంగారం' అని ఓ సినిమా చేశారు. అప్పుడు కూడా జంట బాగుందన్నారు కానీ వీళ్ల కాంబో ప్రేమలో ఉందని కనిపెట్టలేకపోయారు. కానీ బిగ్బాస్ నిర్వహకులు ఇప్పుడు ఆ విషయాన్ని తెలుసుకుని.. ఏకంగా దీపావళి ఎపిసోడ్కి తీసుకొచ్చి శోభాశెట్టి ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టారు. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7: శివాజీని తిట్టడానికే భయపడుతున్న నాగ్.. మరీ ఇలా అయితే ఎలా?) -
బిగ్బాస్ 7: శివాజీని తిట్టడానికే భయపడుతున్న నాగ్.. మరీ ఇలా అయితే ఎలా?
బిగ్బాస్ షోలో మరో వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. ఎప్పటిలానే హోస్ట్ నాగార్జున.. స్మూత్గా కౌంటర్స్ వేశాడు. శివాజీ విషయంలో మాత్రం ఎప్పటిలానే మెతకగా ప్రవర్తించాడు. కాకపోతే తిట్టడానికి బదులు బతిమాలాడుకోవడం కాస్త వింతగా, విచిత్రంగా అనిపించింది. రతిక గురించి హౌస్మేట్స్ అందరూ ఓ నిజాన్ని బయటపెట్టారు. ఇంతకీ శనివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 69 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. సీరియల్ బ్యాచ్ మధ్య గొడవ కెప్టెన్సీ రేసులో చివరకు శివాజీ, అర్జున్ మిగలడంతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. ఇక కెప్టెన్సీ టాస్కులో భాగంగా.. ఫ్రెండ్స్ అనుకున్నవాళ్లే తన బొమ్మని తీసుకెళ్లలేదని అమరదీప్ తెగ బాధపడిపోయాడు. ఘోరంగా హర్ట్ అయ్యాడు. ఇదే విషయాన్ని సీరియల్ బ్యాచ్ దగ్గర చెప్పాడు. ఈ క్రమంలోనే శోభా-అమర్ మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఇది జరిగిన కాసేపటికి శివాజీతో మాట్లాడుతూ.. మీరు-ప్రియాంక ముందే ఫిక్స్ చేసుకున్నారని రతిక అనేసింది. అంతే.. 'గేమ్ ఆడవ్ నువ్వు, మిగతావన్నీ ఆలోచిస్తుంటావ్' అని రతికపై శివాజీ సీరియస్ అయిపోయాడు. (ఇదీ చదవండి: బిగ్బాస్ అశ్వినికి ఆల్రెడీ పెళ్లయిందా? మరి అలా!) శివాజీకి హెడ్ వెయిట్ ఈ వారం కొత్త కెప్టెన్ శివాజీ అయ్యాడు. అయితే ఫిజికల్ టాస్క్ పెడితే అర్జున్పై గెలిచి శివాజీ కెప్టెన్ కావడం అసాధ్యం. దీంతో బిగ్బాస్ ఆర్గనైజర్స్ చాలా తెలివిగా ఆలోచించి, హౌస్మేట్స్ అందరినీ సీక్రెట్ రూంకి పిలిపించి ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందని నాగార్జునతో అడిగించారు. ఒక్కరు కూడా మరోమాట లేకుండా శివాజీ పేరు చెప్పారు. షో నిర్వహకులు ప్లాన్ చేసినట్లు శివాజీ కెప్టెన్ అయిపోయాడు. అయితే శివాజీకి బాగా హెడ్ వెయిట్ పెరిగిపోయిందని, అతడితో మాట్లాడుతూ నాగార్జున అన్నాడు. బతిమాలుకున్న నాగార్జున ఎవరు తప్పు చేసినా గట్టిగా నిలదీసి బెదిరించే హోస్ట్ నాగార్జున.. శివాజీ విషయంలో శీతకన్ను ప్రదర్శిస్తుంటారు. మంచోడి అని ఎప్పటికప్పుడు ప్రొజెక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు అదే చేశారు. నామినేషన్స్ సందర్భంగా శివాజీ రాజమాతల్ని ఉద్దేశిస్తూ.. 'రాజమాతలు మీ మూతలు పగుల్తాయ్' అన్న వీడియోని నాగ్ ప్లే చేశాడు. దీని గురించి క్లారిటీ ఇవ్వమని శివాజీని అడిగాడు. ఇక సోఫాజి.. సినిమా యాక్టింగ్ నాగ్ ముందు చేసేసి.. 'అదంతా సరదాకి అన్నాను' అని కవర్ చేశాడు. (ఇదీ చదవండి: సీక్రెట్గా నిశ్చితార్థం చేసుకున్న 'విక్రమ్' నటుడు.. అమ్మాయి ఎవరంటే?) దీంతో శివాజీ తీరుపై నాగ్ బుద్ధి చెప్పాల్సింది పోయి, బతిమలాడుకున్నాడు. 'క్యాజువల్గా నువ్వు అనే మాటల్ని జనాలు వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశముంది. కొంత కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరముంది. నువ్వు సరదాగా అనే మాటల మూలాన కొందరి మనోభావాలు దెబ్బతినొచ్చు, దెబ్బతింటాయి కూడా. చూస్కో, నోరు కంట్రోల్లో పెట్టుకో.. అందుకే వీడియో చూపించాను' అని నాగార్జున అన్నాడు. అయితే ఈ సంభాషణ అంతా కూడా బిగ్బాస్ హౌస్మేట్కి చెబుతున్నట్లు కాకుండా అలా చేయొద్దురా అని ఫ్రెండ్తో బతిమాలాడుకున్నట్లు అనిపించింది. ఇదంతా చూస్తే శివాజీకి హౌస్ట్ నాగార్జున ఫేవర్ అంతా బట్టబయలైంది. రతిక ఎలిమినేషన్ టెన్షన్ ఇక రతికని వీకెండ్ ఎపిసోడ్ లో చూసిన నాగార్జున్.. ఎందుకంత టెన్షన్ పడుతున్నావ్? అని అడిగాడు. 'అంత టెన్షన్లో వద్దు, ఎప్పుడు కొంచెం టెన్షన్లో ఉంటావ్.. వద్దు వద్దు' అని నాగార్జున అన్నాడు. దీంతో రతిక.. 'హౌసులో ఉండాలని ఉంది సర్ అందుకే ఇలా' అని చెప్పుకొచ్చింది. 'ఉండాలి అంటే నువ్వు ఆడాలి అంతే, సింపుల్ ఫార్ములా' అని నాగ్ చెప్పాడు. దీంతో రతిక.. ఎలిమినేషన్ భయం బయటపడింది. ఇకపోతే ఈ వారం పాస్-ఫెయిల్ అని చిన్న గేమ్ పెట్టగా.. ఇంటి సభ్యులందరూ కూడా రతిక పూర్తిగా ఫెయిలైందని ఓటేశారు. అలా శనివారం ఎపిసోడ్ ముగిసింది. దీపావళి సందర్భంగా ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి స్పెషల్ ఎపిసోడ్ ఉండనుంది. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7: పదో వారం ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్!) -
బిగ్బాస్ అశ్వినికి ఆల్రెడీ పెళ్లయిందా? మరి అలా!
బిగ్బాస్ ఏ సీజన్ తీసుకున్నా సరే కచ్చితంగా లేడీస్ కలరింగ్ ఉంటుంది. హాట్బ్యూటీస్నే వీలైనంత వరకు బిగ్ బాస్ ఆర్గనైజర్స్ తీసుకొస్తుంటారు. అలా ఈసారి వచ్చిన వాళ్లలో అశ్విని తన గ్లామర్తో ఆకట్టుకుంటోంది. గేమ్-గొడవల పరంగా పర్లేదనిపిస్తున్న ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: తుస్సుమన్న కొత్త సినిమాలు.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?) తెలుగు సినిమాల్లో నటిగా చిన్నాచితకా పాత్రలు చేసిన అశ్విని శ్రీకి గుర్తింపు అయితే రాలేదు. దీంతో కష్టపడి బిగ్బాస్ 7వ సీజన్ లో అడుగుపెట్టింది. గ్లామర్ చూపించడంలో ఎలాంటి మొహమొటం చూపించట్లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌసులోకి వచ్చిన ఈమె.. మొదటినుంచి భోలెతో ఎక్కువగా ఉంటూ వస్తోంది. ఈవారం అతడు ఎలిమినేట్ కానున్నాడని అంటున్నారు. ఒకవేళ భోలె ఎలిమినేట్ అయితే అశ్విని ఒంటరి అయిపోతుంది. అశ్విని చూస్తే పెళ్లి కాని అమ్మాయిలానే కనిపిస్తుంది. కానీ ఆమెకి ఇదివరకే పెళ్లయిందని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2013లో పెద్దల చూపించిన ఓ అబ్బాయిని పెళ్లి చేసుకుందని, కానీ ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో విడిపోయారని అంటున్నారు. అయితే నిజమా? అబద్ధమా? అనేది మాత్రం తెలియట్లేదు. ఏదేమైనా ఒకవేళ పెళ్లయి విడాకులు తీసుకుంటే మాత్రం స్వయంగా ఈమె చెబితే గానీ ఈ విషయమై క్లారిటీ రాదు! (ఇదీ చదవండి: సీక్రెట్గా నిశ్చితార్థం చేసుకున్న 'విక్రమ్' నటుడు.. అమ్మాయి ఎవరంటే?) Instagramలో ఈ పోస్ట్ని వీక్షించండి Ashwini Sri (@ashwinii_sree) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది -
Bigg Boss 7: శివాజీ vs గౌతమ్.. గొడవలో లాజిక్ లేదు కానీ ఆ నిజాలు బయటకు!
బిగ్బాస్ 7లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. దీంతో హౌస్ అంతా ఎమోనషల్గా మారిపోయింది. ఇలాంటి టైంలో బిగ్బాస్ పెద్ద ఫిట్టింగ్ పెట్టాడు. దీంతో మళ్లీ గొడవలు షురూ. శివాజీతో గౌతమ్ కొట్టుకుంటారేమో అనేంతలా రెచ్చిపోయాడు. కోపంలో అరుస్తూ గౌతమ్.. శివాజీ గురించి కొన్ని నిజాలు బయటపెట్టాడు. దీంతో అందరికీ శివాజీ నిజస్వరూపం ఇదేనా డౌట్ వచ్చింది. ఇంతకీ శుక్రవారం ఎపిసోడ్లో ఏం జరిగిందో Day 68 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. అతి చేసిన రతిక ఫ్యామిలీ వీక్ సందర్భంగా కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా హౌసులోకి వస్తున్నారు. శుక్రవారం అలా తొలుత రతిక తండ్రి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆయన రావడంతో రతిక గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. ఇది కాస్త అతిలా అనిపించింది. ఎందుకంటే ఇప్పటికే ఓసారి రతిక ఎలిమినేట్ అయింది. దీంతో ఇంటికెళ్లి తల్లిదండ్రులని కలిసింది. దేవాలయాలకు కూడా తండ్రితో కలిసి వెళ్లినట్లు వీడియోలు పోస్ట్ చేసింది. ఇప్పుడేమో తండ్రి హౌసులోకి రాగానే తెచ్చిపెట్టుకున్నట్లు ఏడ్చేసింది. మళ్లీ వెంటనే ఏడుపు ఆపేసింది. బహుశా అందరూ తమ తమ ఫ్యామిలీ మెంబర్స్ ని పట్టుకుని ఏడుస్తున్నారని రతిక కూడా ఏడ్చినట్లు అనిపించింది తప్పితే రియల్ ఎమోషనల్ కనిపించలేదు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'భగవంత్ కేసరి' సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్?) రైతుబిడ్డ తండ్రి ఆగయా రతిక తండ్రి వెళ్లిన కాసేపటి తర్వాత పల్లవి ప్రశాంత్ తండ్రి వచ్చారు. చేనులో పండిన బంతిపూలని తీసుకొచ్చి కొడుక్కి ఇచ్చారు. అయితే నాన్న కోసం పొద్దున్నుంచి తినకుండా ఎదురుచూసిన ప్రశాంత్.. తండ్రితో కలిసి భోజనం చేశాడు. ఒకరికొకరు గోరుముద్దులు తినిపించుకోవడం చూడటానికి మంచిగా అనిపించింది. 'ఆట మంచిగా ఆడుకో, ఎవరివి ఏమనకు, నీ ఆట నువ్వు ఆడుకో' అని కొడుక్కి ధైర్యం చెప్పి ప్రశాంత్ తండ్రి వెళ్లిపోయారు. రతిక కన్నింగ్ గేమ్ ఫ్యామిలీ వీక్ అయిపోయింది. దీంతో కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ 'ఓ బేబీ' అని ఓ టాస్క్ పెట్టాడు. ఇందులో భాగంగా ఓవైపు టేబుల్ ఆయా కంటెస్టెంట్స్కి సంబంధించిన ఫొటోలు అతికించిన బొమ్మలు ఉంటాయి. బజర్ మోగిన ప్రతిసారి ఎవరి బొమ్మ అయితే మిగిలిపోతుందో వాళ్లు ఎలిమినేట్ అయినట్లు. ఇందులో వరసగా శోభా, ప్రశాంత్, యవర్, అమరదీప్, రతిక, అశ్విని, భోలె, ప్రియాంక, గౌతమ్ ఎలిమినేట్ అయిపోయారు. అయితే ఈ గేమ్లో కావాలనే మూడు నాలుగుసార్లు పరుగెత్తకుండా రతిక కన్నింగ్ గేమ్ ఆడింది. చివరకు ఐదో ప్రయత్నంలో ఆమె బొమ్మని ఎవరు పట్టుకెళ్లలేదు. దీంతో తను తీసిన గోతిలో తానే పడి బలైపోయింది. (ఇదీ చదవండి: మెట్లపై నిద్రపోయేది.. సుమ సీక్రెట్ బయటపెట్టిన మరో యాంకర్!) శివాజీ vs గౌతమ్ ఇక చివరగా ముగ్గురున్నప్పుడు గౌతమ్ బొమ్మ శివాజీ తీసుకోవడంతో గౌతమ్.. ఎలిమినేట్ అయిపోయాడు. దీంతో కావాలనే శివాజీ తన బొమ్మ పట్టుకున్నారని చెప్పి గౌతమ్ సీన్ క్రియేట్ చేశాడు. అన్యాయం జరిగిందని చెప్పి శివాజీతో గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరూ ఒకరిపై ఒకరు మీదపడి మరీ అరుచుకున్నారు. 'ప్రతిసారి నీతో గోల, వాంటెడ్గా గొడవ పెట్టుకుంటావ్, ప్రతిసారి నీకు అటెన్షన్ కావాలి, అలానే గొడవ చేస్కో' అని శివాజీ అనేసరికి గౌతమ్ మరింత రెచ్చిపోయాడు. 'మీకు కావాల్సినట్లు జరిపించండి, బిగ్బాస్తో మీరు మాట్లాడుకోండి. మీరు సెకండ్ బిగ్బాస్ అనుకుంటా, నేను కూర్చుని ఉంటాను' అనే శివాజీని ఉద్దేశిస్తూ గౌతమ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. 'నువ్వు కేవలం అటెన్షన్ కోసమే ఇదంతా చేస్తున్నావ్' అని శివాజీ తిరిగి అనేసరికి గౌతమ్కి పట్టరాని కోపం వచ్చేసింది. మైక్ పక్కనబెట్టి.. వెళ్లిపోతా బిగ్బాస్, తలుపు తెరవండి అని గట్టిగా బాదుతూ సీన్ క్రియేట్ చేశాడు. శివాజీ నిజస్వరూపం గౌతమ్ చెప్పిన దానిబట్టి చూస్తే.. శివాజీ, రెండో బిగ్బాస్లానే ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే హౌసులోకి అడుగుపెట్టినప్పటి నుంచి పెద్దమనిషి తరహాలో అందరికీ నీతులు చెబుతూ, ప్రశాంత్-యవర్-భోలెతో ఓ బ్యాచ్ తయారు చేసుకుని ఏదేదో చేస్తున్నాడు. శివాజీ ఏం చేసినా సరే వీకెండ్ వచ్చేసరికి హౌస్ట్ నాగార్జున ఇతడికే సపోర్ట్ చేస్తున్నాడు. బహుశా హౌసులోకి రావడానికి ముందే శివాజీ.. బిగ్బాస్ ఆర్గనైజర్స్ అగ్రిమెంట్ చేసుకున్నాడేమో? అని డౌట్ ప్రేక్షకులకు కలుగుతోంది. అదే టైంలో హౌసులో గౌతమ్ తప్ప శివాజీతో ఏ ఒక్కరూ గొడవ పడటానికి ధైర్యం చేయట్లేదు. అందులో గౌతమ్, శివాజీకి కరెక్ట్ మొగుడిలా కనిపించాడు. అలా శుక్రవారం ఎపిసోడ్ ఎండ్ అయింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డకు ఆ బ్యాడ్ న్యూస్ చెప్పిన తండ్రి!) -
Bigg Boss 7: రైతుబిడ్డకు ఆ బ్యాడ్ న్యూస్ చెప్పిన తండ్రి!
బిగ్బాస్ హౌస్ ఎందుకో ఏడిపించేస్తోంది. ప్రతిసారీ ఉన్నట్లే ఇప్పుడు ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. అయితే హౌసులోకి వస్తున్న ప్రతిఒక్కరూ అక్కడ ఉన్నవాళ్లతో పాటు చూస్తున్న మనల్ని కూడా ఏడిపించేస్తున్నారు భయ్యా! తాజాగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తండ్రి హౌసులోకి ఎంట్రీ ఇచ్చారు. కొడుకుకి ధైర్యం చెబుతూనే ఓ బ్యాడ్ న్యూస్ కూడా చెప్పారు. దీంతో ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతకీ ఏం జరిగింది? ప్రతిసారి కామన్ మ్యాన్ కేటగిరీలో ఎవరో ఒకరు వస్తుంటారు. కాకపోతే పెద్దగా గుర్తింపు తెచ్చుకోరు. రైతుబిడ్డ ట్యాగ్తో బిగ్బాస్ 7లోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ మాత్రం మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. శివాజీ కూడా ఉండటం తప్పితే గేమ్ పరంగా ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఫ్యామిలీ వీక్ సందర్భంగా అందరూ కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు వస్తున్నారు. అలా పల్లవి ప్రశాంత్ తండ్రి బిగ్బాస్లో అడుగుపెట్టారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ ఐదు స్పెషల్!) పొలంలో పండిన బంతిపూలని తీసుకొచ్చిన ఆయనని చూసి ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు. ఇక అమరదీప్తో మాట్లాడుతూ.. గొడవలు పడకండి బిడ్డా, మంచిగా కలిసి ఉండండి అని ప్రశాంత్ తండ్రి చెప్పారు. అలానే తండ్రిని ఎత్తుకుని ప్రశాంత్ తిప్పాడు. ఇద్దరూ కలిసి తగ్గేదే లే అనే డైలాగ్ కూడా చెప్పారు. తండ్రి అన్నం కూడా కలిపి తినిపించాడు. ఇదంతా అయిన తర్వాత కొడుకుతో మాట్లాడిన ఆయన.. 'టాలెంట్ ఉంది ఉపయోగించుకో, నేను ఏం చెప్పినా నువ్వు ఏడవకు. నువ్వు ఏడుస్తుంటే అమ్మ ఏడుస్తుంది, ఆమెకు బీపీ కూడా పెరుగుతుంది' అని అన్నాడు. దాదాపు రెండు నెలల నుంచి కొడుక్కి దూరంగా ఉండటం వల్ల ప్రశాంత్ తల్లి తట్టుకోలేకపోతుంది. బహుశా అందుకో కాస్త అనారోగ్యానికి గురైనట్లు ప్రశాంత్ తండ్రి మాటల బట్టి తెలుస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోనే ఇంతలా ఎమోషనల్ చేసింది. ఇక ఫుల్ ఎపిసోడ్లో ఇంకా ఏమేం ఉండబోతుందో? (ఇదీ చదవండి: Japan Review: ‘జపాన్’ మూవీ రివ్యూ) -
బిగ్బాస్లోకి పల్లవి ప్రశాంత్ తండ్రి.. శివాజీతో ఏమన్నాడంటే..?
ప్రస్తుతం బిగ్బాస్ తెలుగు సీజన్ 7లో ఫ్యామిలీ వీక్ నడుస్తున్న విషయం తెలిసిందే .. ఇప్పటికే హౌస్లోని కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు ఒక్కోక్కరిగా వస్తూ అందరితో కలిసి సంతోషంగా గడుపుతున్నారు. అలా ఈ వారం మొత్తం బిగ్ బాస్లో సందడి వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే దాదాపు అందరి కుటుంబ సభ్యులు వచ్చేశారు. పల్లవి ప్రశాంత్, రతిక కుటుంబ సభ్యులు మాత్రం ఈరోజు వచ్చే ఎపిసోడ్లో కనిపించనున్నారు. తాజాగా ప్రశాంత్ నాన్నగారు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. అందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. (ఇదీ చదవండి: సల్మాన్ 'టైగర్-3'ని ఢీ కొడుతున్న తెలుగు డైరెక్టర్) ప్రశాంత్ నాన్నగారు బంతిపూలు తీసుకుని బిగ్ బాస్లోకి అడుగుపెట్టారు. అతన్ని ముందుగా చూసిన శివాజీ ప్రశాంత్కు చెబుతాడు.. అప్పుడు ఒక్కసారిగా తన తండ్రి కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆపై వారిద్దరూ కౌగిలించుకుని ఎమోషనల్ అవుతాడు. ఆ సమయంలో వారి వద్దకు శివాజీ రాగానే పల్లవి ప్రశాంత్ తండ్రి ఇలా అంటాడు.. నా బిడ్డను ఒక తండ్రి లెక్క చూసుకున్నావ్ అంటూ శివాజీతో అంటాడు. అలా అందరితో ఆయన పలకరిస్తూ వారిలో సంతోషాన్ని నింపుతాడు. ఈ సీజన్లో అందరికంటే చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు పల్లవి ప్రశాంత్. కామన్ మ్యాన్ కోటాలో మొదటిసారిగా రైతుబిడ్డగా ప్రశాంత్ అడుగుపెట్టాడు. అయితే అతను బిగ్బాస్లోకి రాకముందే అన్న మల్లొచ్చినా అంటూ సోషల్ మీడియాలో వీడియోలతో తెగ పాపులర్ అయ్యాడు. అలా రైతుల బాధలను సాధరణ ప్రజలకు తెలుపుతూ నెట్టింట భారీగా క్రేజ్ సంపాందించాడు. పంటపొలంలో వ్యవసాయం చేస్తూ ఆయన తండ్రితో కూడా పలు వీడియోలు షేర్ చేశాడు. పట్టుబట్టి మరీ బిగ్ బాస్లోకి అడుగుపెట్టాలని కోరికతో సీజన్ 7లోకి అడుగుపెట్టాడు ప్రశాంత్. -
అమర్ దీప్కు షాకిచ్చిన బిగ్ బాస్.. తెలియకుండానే ఏడ్చాను అంటూ..
బిగ్ బాస్ ఏ సీజన్లో అయినా సరే కంటెస్టెంట్ల మధ్య గొడవలు సహజం.. వారి మధ్య కోపాలు, పంతాలు ఎన్ని ఉన్నా సరే ఫ్యామిలీ వారం అనేది ఒక దశలో వస్తుంది.. ఆ సమయంలో వారందరూ ఎంతో సంతోషంగా కలిసిపోతారు. ఆ సమయం నుంచి వారి ఆటలో మార్పులు కూడా రావచ్చు.. ప్రస్తుతం బిగ్బాస్ -7 సీజన్లో కూడా కంటెస్టెంట్లలో ఎమోషన్ నింపి ప్రేక్షకులతో కట్టిపడేసే సీన్లు ఎన్నో కనిపిస్తున్నాయి. తాజాగా బిగ్ బాస్లోకి అమర్ దీప్ సతీమణి తేజశ్విని వచ్చారు. అందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. (ఇదీ చదవండి: మహ్మద్ షమీ బౌలింగ్కు క్లీన్ బౌల్డ్ అయిన హీరోయిన్) ఈ సీజన్లో ఇప్పటికే శివాజీ, అర్జున్, గౌతమ్, అశ్విని, భోలే, ప్రియాంక కుటుంబ సభ్యులు హౌస్కు వచ్చి వారందరితో కొంత సమయం గడిపారు. ఫ్యామిలీ మెంబర్స్ రాకతో కంటెస్టెంట్స్లలో సంతోషం రెట్టింపు అయింది. నవంబర్ 8న అమర్ దీప్ పుట్టినరోజు కావడంతో ఆయనకు బిగ్ బాస్ షాకిచ్చాడు. మొదట అమర్ను ప్రత్యేక గదికి పిలిపించిన బిగ్ బాస్ అక్కడ ఒక కేకును ఉంచుతాడు. ఈ కేకును మీ సతీమణి తేజశ్విని పంపించారని ఆమె రాలేదని చెప్పి కొంత ఫన్ క్రియేట్ చేస్తాడు బిగ్ బాస్. అప్పుడు కొంతమేరకు నిరుత్సాహపడిన అమర్ కేకును తీసుకుని బయటకు వచ్చేస్తాడు. ఆ సమయంలో అక్కడ తేజశ్విని వచ్చి ఉంటుంది. ఒక్కసారిగా ఆయన ముందుకు వచ్చి ఆమె షాకిస్తుంది. దీంతో తేజశ్వినిని కౌగిలించుకున్న అమర్ ఎమోషనల్ అయ్యాడు. బిగ్ బాస్ ఎంట్రీకి కొన్ని రోజులకు ముందే వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ప్రోమోలో మళ్లీ పెళ్లి చేసుకుందామా..? అని ఫన్నీగా అంటాడు. తేజూని చూసిన అమర్ బాగా ఎమోషనల్ అయి ఇలా అంటాడు 'కొన్ని సార్లు పడుకొని ఏడుస్తున్నాను. ఒకవేళ ఏడుస్తే కనపడుతుంది కదా అని తెలియకుండానే ఏడ్చాను.' అనే మాటలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఈ రోజు రాత్రి టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్లో అమర్ కుటుంబ సభ్యులతో పాటు మరికొందరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా రావచ్చు. -
హగ్గులు-కిస్సులతో ఊపిరాడనివ్వలేదు.. ఆ ఇద్దరి గురించి ప్రియాంకకు వార్నింగ్!
బిగ్బాస్ షో మిగతా రోజులు ఎలా ఉన్నాగానీ 'ఫ్యామిలీ వీక్' ఉన్నప్పుడు మాత్రం అందరినీ ఒక్కటి చేస్తుంది. ప్రస్తుతం ఏడో సీజన్లో అదే నడుస్తోంది. మంగళవారం ఎపిసోడ్లో అర్జున్ భార్య, శివాజీ కొడుకు, అశ్విని తల్లి వచ్చి ఎమోషనల్ చేశారు. ఇప్పుడు మరో ముగ్గురి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి నవ్వించారు, ఏడిపించారు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 66 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. అమ్మ ప్రేమలో గౌతమ్ అశ్విని తల్లి వచ్చి వెళ్లడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. ఉదయం నిద్రలేవడంతో బుధవారం ఎపిసోడ్ మొదలైంది. కాసేపటి తర్వాత గౌతమ్ తల్లి.. పంచెని హౌసులోకి పంపింది. కానీ గౌతమ్.. అది తన కోసమే అని గుర్తుపట్టలేకపోయాడు. కొంతసేపటి తర్వాత 'కన్నయ్యా' అనే పిలుపుతో అమ్మ ఎక్కడుందా అని హౌస్ అంతా తిరిగేశాడు. హౌసులోకి రాగానే ఆమెని పట్టుకుని ఎమోషనల్ అయ్యాడు. అందరినీ పలకరించిన తర్వాత కొడుకుతో చాలా మాట్లాడింది. (ఇదీ చదవండి: రష్మిక ఫేక్ వీడియో.. విజయ్ దేవరకొండ పోస్ట్ వైరల్!) 'సూపర్ ఆడుతున్నావ్.. కరెక్ట్ గానే ఆడుతున్నావ్.. కానీ అక్కడక్కడా ఆలోచిస్తున్నావ్.. మాటలు కొంచెం రాకుండా చూడు.. ఏదైనా పాయింట్ అనుకుంటే దాన్నే స్ట్రాంగ్గా పట్టుకో, వివరణ వద్దు.. ఎక్సప్లెనేషన్ వల్ల డీవియేషన్ వస్తుంది. ఏమైద్దో అని భయం వద్దు, అమ్మ ఎప్పుడు అండగా ఉంటుంది' అని గౌతమ్ కి అతడి తల్లి ధైర్యం నింపింది. అమ్మని అందరూ మిస్ అవుతున్నారు కదా అని హౌసులోని ప్రతిఒక్కరికీ గౌతమ్ తల్లి గోరుముద్దలు తినిపించింది. ఈ సీన్ చూడటానికి చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఆ తర్వాత.. 'అమ్మ.. అమ్మ..' అనే పాట ప్లే చేయగా.. గౌతమ్, తల్లితో కలిసి డ్యాన్స్ చేశాడు. అయితే ఈ పాట ప్లే అవుతున్నంతసేపు శోభా, యవర్.. తల్లి గుర్తొచ్చి ఎమోషనల్ అయ్యారు. ఈ పాట వల్లో, తల్లి అనే ఎమోషనల్ వల్లనో ఏమో గానీ చూస్తున్న మీరు కూడా కన్నీళ్లు పెట్టుకోవడం గ్యారంటీ. హగ్స్-ముద్దులతో ప్రియాంక గౌతమ్ తల్లి వెళ్లిపోయిన తర్వాత కాసేపటికి ప్రియాంక బాయ్ఫ్రెండ్ శివ కుమార్ వచ్చాడు. రోజా ఫ్లవర్ తీసుకొచ్చి, మోకాళ్లపై వంగి మరీ ప్రియాంకకు ప్రపోజ్ చేశాడు. హగ్గులు, నుదుటిపై ముద్దులతో రెచ్చిపోయాడు. దీంతో పక్కనే ఉన్న అర్జున్.. ఏమైనా అడ్డుపెట్టాలా? అని చిన్నగా సెటైర్ వేశాడు. కాకపోతే ఈ కామెంట్ ని పట్టించుకునేంత మూడ్లో ఈ ప్రేమజంట లేదు. ఇన్నాళ్ల విరహవేదన వల్లో ఏమో గానీ ఒకరికి ఒకరు అతుక్కుపోయారు. కాస్త గ్యాప్ ఇచ్చి హౌస్మేట్స్ అందరిని ప్రియాంక బాయ్ఫ్రెండ్ తెగ పొగిడేశాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'టైగర్ నాగేశ్వరరావు'.. అనుకున్న టైమ్ కంటే ముందే?) హౌసులో గొడవ జరిగితే అప్పుడు దాన్ని తెగే దాకా లాగడం నచ్చట్లేదని, ఆ విషయం కాస్త చూసుకోమని ప్రియాంకకు ఆమె బాయ్ఫ్రెండ్ సలహా ఇచ్చాడు. ఫ్రెండ్స్, బెస్ట్ఫ్రెండ్స్ ఎవరు అవసరమే లేదు నీకు అని.. అమరదీప్, శోభా గురించే ఇన్ డైరెక్ట్గా చెప్పాడు. కిచెన్ లోనే ఉండిపోతున్నావ్, బయటకు రా అని కూడా చెప్పాడు. 'బయటకొచ్చాక నాతో గొడవ పడతావా?' అని ప్రియాంక గోముగా అడిగేసరికి.. బాయ్ఫ్రెండ్ ఐస్ అయిపోయాడు. నువ్వు ఏం చెబుతావో అదే వింటానని అనేశాడు. మరి పెళ్లెప్పుడు అని ప్రియాంక అతడిని అడగ్గా.. బయటకొచ్చాక చేసుకుందాం అన్నాడు. ఇప్పుడే చేసుకుందామని ప్రియాంక.. తన విరహావేదనని అంతా బయటపెట్టేసింది. వెళ్తూ వెళ్తూ కూడా కొంతమందితో మాత్రం చూసుకుని ఉండు అని.. శోభా, అమర్ గురించి ప్రియాంక బాయ్ఫ్రెండ్ చెప్పాడు. ఆ తర్వాత భోలె భార్య కూడా వచ్చింది. కాకపోతే యోగ క్షేమాలు మాట్లాడి హౌస్ నుంచి బయటకెళ్లిపోయింది. ఇకపోతే ఈ రోజు ఎపిసోడ్ లో హైలైట్ అంటే మాత్రం ప్రియాంక-ఆమె బాయ్ఫ్రెండ్దే. గౌతమ్ తల్లి ఎమోషన్తో అందరితో కన్నీళ్లు పెట్టిస్తే.. ప్రియాంక ప్రియుడు మాత్రం హౌస్ మొత్తాన్ని రొమాంటిక్గా మార్చేశాడు. ఇక ప్రియాంక-బాయ్ఫ్రెండ్ పెళ్లి డిస్కషన్ చూసిన తర్వాత.. హౌస్ నుంచి బయటకెళ్లగానే ప్రియాంక పెళ్లి చేసుకోవడం గ్యారంటీ అని క్లారిటీ వచ్చేసింది. అలా బుధవారం ఎపిసోడ్ పూర్తయింది. మరి గురువారం ఎపిసోడ్లో ఎలాంటి ఎమోషన్స్ బయటకొస్తాయో తెలియాలంటే వెయిట్ అండ్ సీ. (ఇదీ చదవండి: భూటాన్లో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న సమంత) -
బిగ్ బాస్లో ఫ్యామిలీ వీక్..
బిగ్ బాస్ సీజన్ 7 దాదాపు పది వారాలు పూర్తి కావస్తుంది. ఇక నుంచి బలమైన కంటెస్టెంట్లే హౌస్ నుంచి ఎలిమినేషన్ కానున్నారు. దీంతో ఆట రసవత్తరంగా మారనుంది. ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యులను హౌస్లోకి దింపుతున్నాడు బిగ్ బాస్. సాధారణంగా ప్రతి సీజన్లో సుమారు 12 వారంలో హౌస్లోకి కుటుంబ సభ్యులు వచ్చేవారు. ఇదీ ఉల్టాపుల్టా కదా అందుకే కొంచెం ముందుగానే ఈ ప్లాన్ను సెట్ చేశాడు బిగ్ బాస్. హౌస్లో మిగిలిన 11 మంది కంటెస్టెంట్స్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ హౌస్లోకి అడుగుపెట్టబోతున్నారు. తాజాగా విడుదలైన ప్రోమో ప్రకారం శివాజీ పెద్ద అబ్బాయి ఎంట్రీ ఇచ్చాడు. శివాజీకి రెగ్యులర్ హెల్త్ చెకప్లో భాగంగా అప్పుడప్పుడు డాక్టర్ రూమ్కు వెళ్తుంటాడు. అందులో భాగంగా ఆయన పెద్ద కుమారుడు శ్రీ మాస్క్తో పాటు కళ్లజోడు, కోట్ దరించి డాక్టర్ మాదిరి ఎంట్రీ ఇచ్చాడు.. సార్ మీ ఆరోగ్యం ఎలా ఉందని ప్రశ్నిస్తాడు.. కానీ అక్కడికి వచ్చింది తన కుమారుడేనని గుర్తించని శివాజీ ఫర్వాలేదని చెప్పి తిరిగి వెళ్తున్న సమయంలో నాన్న... అంటూ శ్రీ పిలుస్తాడు. ఆ సమయంలో శివాజీ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతాడు. ఒక్కసారిగా తన బిడ్డను కౌగిలించుకున్న శివాజీ.. తర్వాత అందరికీ నా కుమారుడు అంటూ పరిచయం చేస్తాడు. ఆ సమయంలో అందరూ చాలా సంతోషంగా శ్రీ దగ్గరకు వచ్చి పలకరిస్తారు. బీటెక్ పూర్తి చేసుకున్న 'శ్రీ' మాస్టర్స్ కోసం అమెరికా వెళ్తున్నాడు. అన్నీ సెట్ అయితే మరో వారం లోపు ఆయన ప్రయాణం మొదలౌతుంది. ఇదే విషయాన్ని శివాజీకి కూడా శ్రీ తెలుపుతాడు. దీంతో వెళ్లె ముందు తన తండ్రిని శ్రీ ఇలా కలుసుకున్నాడు. బహుశా బిగ్ బాస్ కూడా ఈ విషయాన్ని గుర్తించే ఫ్యామిలీ వీక్ను రెండు వారాలు ముందుకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి అనుబంధాల విషయంలో బిగ్ బాస్ తీసుకున్న నిర్ణాయాన్ని పలువురు అభినందిస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రోమో బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
తేజ ఎలిమినేట్.. వారికి రీ ఎంట్రీ ఛాన్స్
బిగ్ బాస్ సీజన్ - 7 నుంచి టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. 9 వారాల పాటు ఆటలొ కొనసాగిన ఆయన పాజిటివిటీని సంపాదించుకుని హౌస్ నుంచి వచ్చేశాడు. ఇలాంటి సమయంలో ఇప్పటికే 8 వారంలోనే ఎలిమినేట్ అయిన ఆట సందీప్ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని తన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అందుకు వారు కొన్ని కారణాలను కూడా చెబుతున్నారు. ఎనిమిదో వారంలో సందీప్ నామినేషన్ లిస్ట్లోకి రావడానికి ప్రధాన కారణం తేజ అని తెలిసిందే.. అలా మొదటిసారి నామినేట్ కావడం ఆపై సందీప్ ఎలిమినేషన్ అవడం జరిగిపోయింది. అదే విధంగా తేజ ఎలిమినేషన్కు కారణం శివాజీ.. నామినేషన్ సమయంలో సందీప్ అంశాన్ని లేవనెత్తి తేజను నామినేట్ చేశాడు శివాజీ... ఇలా ఈ ముగ్గురి మధ్యనే గేమ్ నడిచింది. బిగ్ బాస్లో ఉన్నంత వరకు అమర్,శోభ బ్యాచ్లో సందీప్ ఉన్నాడు.. కానీ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎక్కువగా శివాజీ, పల్లవి ప్రశాంత్నే మెచ్చుకుంటూ పలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అదే సమయంలో అమర్,తేజ ఆట గురించి నెగటివ్గా మాట్లాడటం జరిగింది. ఇప్పటికే రతికా రోజ్కు రీ ఎంట్రీ అవకాశం ఇచ్చారు.. కానీ ఆమె అంతగా మెప్పించలేక పోయింది. దీంతో సందీప్కు ఉల్టాపుల్టా పేరుతో రీ ఎంట్రీ అవకాశం కల్పించాలని బిగ్బాస్ టీమ్ కూడా యోచిస్తుందట. అప్పుడు సందీప్ శివాజీ టీమ్ వైపు ఉంటాడా..? అమర్ బ్యాచ్ వైపు ఉంటాడా..? అనే విశయంలో రసవత్తరం మొదలౌతుంది. అన్నీ అనుకూలిస్తే మరో రెండు రోజుల్లో సందీప్ రీ ఎంట్రీ గ్యారెంటీ అని సమాచారం. బిగ్ బాస్లో సంచాలక్గా మాత్రమే ఆయన కొన్ని తప్పులు చేశాడు కానీ ఆటలో ఎక్కడా కూడా సహనం కోల్పోలేదు.. ఎలాంటి నెగటివ్ లేకుండా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. -
బిగ్ బాస్ ఎలిమినేషన్.. టేస్టీ తేజకు రిటర్న్ గిఫ్ట్.. సందీప్ పోస్ట్ వైరల్
మూడో వారంలో దామిని.. నాలుగో వారంలో రతిక.. ఐదో వారంలో శుభ శ్రీ.. ఆరో వారంలో నయని.. ఏడో వారంలో పూజా.. ఎనిమిదో వారంలో సందీప్.. ఇలా మూడో వారం నుంచి ఎనిమిదవ వారం వరకు వరుసగా తేజా ఎవర్ని నామినేట్ చేస్తే వాళ్లు ఎలిమినేట్ అయిపోతూ వస్తున్నారు. అయితే వరుసగా అందర్ని బయటకు పంపిన తేజ.. ఇప్పుడు తనే బయటకు వచ్చేశాడు. అయితే ఇప్పటికీ అధికారికంగా తెలియదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం తేజ ఎలిమినేట్ అయినట్లు ప్రచారం నడుస్తోంది. బిగ్బాస్ హౌస్ నుంచి ఈ వారం నామినేషన్లో శివాజీ, గౌతమ్, ప్రశాంత్, అశ్విని మినహా మిగతా అందరూ ఉన్నారు. ప్రతి వారం మాదిరే ఈ వారంలో కూడా శోభా ఎలిమినేట్ అవతుందని అందరూ భావిస్తున్న సమయంలో ఆమె కెప్టెన్ కావడంతో సస్పెన్స్ మొదలైంది. కెప్టెన్ పేరుతో శోభ సేవ్ అయితే.. టేస్టీ తేజ ఎలిమినేట్ కావడం దాదాపు గ్యారెంటీ అని తెలుస్తోంది. దీంతో తేజ గురించి పలు మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని ఆట సందీప్ షేర్ చేశాడు. బిగ్బాస్ హౌస్లో మొదటి వారం నుంచి ఇప్పటివరకు తేజ ఎవరిని నామినేట్ చేస్తే వాళ్లు ఎలిమినేట్ అయిపోయారనే విషయం తెలిసిందే. ఇప్పటివరకు తేజ నామినేట్ చేసిన ఆరుగురు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఈ లిస్ట్లో వరుసుగా దామిని భట్ల,రతికా రోజ్, శుభ శ్రీ, నయని పావని, పూజా,ఆట సందీప్ ఉన్నారు. ఇలా మూడో వారం నుంచి వరుసగా తేజా ఎవరిని నామినేట్ చేస్తే వాళ్లు ఎలిమినేట్ కావడంతో ఆయనది ఐరన్ లెగ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. ఇలా అందరినీ హౌస్ నుంచి బయటకు పంపిన తేజా ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంపై ఆట సందీప్, తేజ గురించి పలు మీమ్స్ ఇన్స్టాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్నింటిని సందీప్ షేర్ చేశాడు. 'కర్మ ఇట్స్ బ్యాక్.. హౌస్లో మంచి ప్లేయర్ అయిన సందీప్ను చెత్త కారణాలతో పంపించేశావ్.. ఇప్పుడు నువ్వు కూడా అలాంటి చెత్త రీజన్తో బయటకు వస్తున్నావ్..' అంటూ సందీప్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అవన్నీ కూడా నవ్వులు పూయించేలా ఉన్నాయి. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) View this post on Instagram A post shared by Anandani Evaru Koorukoru...🤔 (@anandani_evaru_koorukoru) -
Bigg Boss 7 : శివాజీ వారిని చెడగొడుతున్నాడు.. మానస్
బిగ్బాస్ సీజన్ 7 ఇప్పుడిప్పుడే కాస్త రసవత్తరంగా మారుతోంది. కంటెస్టెంట్స్ అంతా కాస్త సీరియస్గా గేమ్స్ ఆడుతున్నారు. పోటీలో గెలిచేందుకు వందశాతం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకే ఒక కంటెస్టెంట్ మాత్రం సీజన్ ప్రారంభం నుంచి గేమ్ ఆడట్లేదు. అతనే శివాజీ. ప్లేయర్గా హౌస్లోకి వెళి కోచ్గా అవతారమెత్తాడు. పోని అలా అయినా న్యాయంగా ఉంటున్నాడా అంటే.. ‘అబ్బే..మనవి మాటలే’ అంటున్నాడు. నీతి ముచ్చట్లు చెప్పడమే కానీ..పాటించడం మన హిస్టరీలోనే లేదంటున్నాడు. ఇతరులకు ఓ న్యాయం తనకో న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. అయితే హౌస్లో అంతా అతని మాయ మాటలకు పడిపోతే.. గౌతమ్ కృష్ణ మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా శివాజీ నిజస్వరూపం బయటపెడుతున్నాడు. మరోవైపు అమర్దీప్ కూడా ఆ ప్రయత్నం చేస్తున్నాడు కానీ.. శివాజీ తెలివిగా వ్యవహరిస్తూ..అతన్ని బకరా చేస్తున్నారు. ఈ విషయం షో వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఈజీగా అర్థమవుతుంది. తాజాగా బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ మానస్ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. శివాజీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శివాజీ లాంటి కంటెస్టెంట్ని చూడలేదు: మానస్ బిగ్బాస్ షోలో అమర్దీప్, శివాజీల మధ్య కోల్డ్వార్ జరుగుతోంది. ప్రతిసారి చిన్న చిన్న కారణాలు చెప్పి అమర్దీప్ని నామినేట్ చేస్తున్నాడు శివాజీ. అంతేకాదు తనకు నచ్చినవాళ్లు తప్పు చేస్తే సమర్థిస్తాడు.. అదే అమర్దీప్, గౌతమ్ కృష్ణ చిన్న మిస్టేక్ చేసినా..దాన్ని భూతద్దంలో పెట్టి ప్రచారం చేస్తాడు. పైగా తెలివిగా హౌస్లోని మిగతా కంటెస్టెంట్స్కి కూడా తన అభిప్రాయాన్ని రుద్దే ప్రయత్న చేస్తాడు. తాజగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని మానస్ చెప్పాడు. ‘ప్రతీ సీజన్లో శివాజీ లాంటి విలన్స్ ఉంటారు. కానీ హీరో ఎవరనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు. శివాజీ కేవలం ఇద్దరి పట్ల మాత్రమే వ్యక్తిగత ఇష్టం చూపిస్తున్నాడు. మిగిలిన కంటెస్టెంట్ల గేమ్ చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటివరకు నేను రకరకాల మైండ్ సెట్ ఉన్నవాళ్లను చూశాను. కానీ శివాజీ లాంటి కంటెస్టెంట్ను ఇప్పటివరకు చూడలేదు’అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. -
రాహుల్ గురించి రతికనే చెప్పింది.. బిగ్ బాస్ విన్నర్ అతనే గ్యారెంటీ: దామిని
బిగ్బాస్ సీజన్-7లో సింగర్స్ వెళ్లడం సహజం అలాగే ఈసారి కూడా దామిని భట్ల వెళ్లారు. గతంలో రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్ అయితే.. గీతా మాధురి టాప్ ఫైవ్లో చోటు దక్కించుకున్నారు. కానీ ఈ సీజన్లో సింగర్ దామిని భట్ల కేవలం మూడు వారాలు మాత్రమే హౌస్లో ఉన్నారు. ఉన్న కొద్దిరోజులే అయినా ఆటలో తన ప్రత్యేకతను చాటుకుంది. అందరిలా కాకుండా తనదైన స్టైల్లో గేమ్ ప్లే చేసింది. ఓట్ల కోసం నటించకుండా తనకు ఏదైతే నచ్చిందో ఆ పని మాత్రమే హౌస్లో చేసేది.. బహుశా ఇది ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదనిపిస్తుంది. ఆమెలోని నెగటివ్ను మాత్రమే ప్రేక్షకులకు చూపించిన బిగ్ బాస్.. దామినిలోని పాజిటివ్ను మాత్రం తెరపైకి చూపించలేదనే విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యలో బిగ్ బాస్ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్లో నిలబడాలంటే కంటెంట్ ఇవ్వాలి. అప్పుడప్పుడు ఇతరులపైన సీరియస్ అవ్వాలి. హౌస్లో వారికి చాలామందికి పీఆర్ టీమ్ ఉంది. అలాగే నేను కూడా పీఆర్ టీమ్ను ఏర్పాటు చేసుకునే బిగ్ బాస్లోకి వెళ్లాను. కానీ... నేను హౌస్లోకి వెళ్లే ముందు వారికి ఒక సూచన ఇచ్చా... నన్ను మాత్రమే హైప్ చేయండి. అందుకోసం ఎదుటివారిని కించపరిచేలా ఎలాంటి ప్రమోషన్ చేయకండి అని గట్టిగా చెప్పాను. అందులో తేడా వస్తే సహించనని కూడా చెప్పాను. కానీ నా లక్ బాగాలేదు.. ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశాను.' అని దామిని చెప్పింది. రాహుల్తో ప్రేమ గురించి రతికనే చెప్పింది: దామిని బిగ్ బాస్ నుంచి నేను బయటికి రాగానే రాహుల్ సిప్లిగంజ్- రతికా రోజ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయిని తెలిసింది. అప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. అదే సమయంలో నాకు రాహుల్ కాల్ చేసి ఎక్కడున్నావ్ అని ప్రశ్నించాడు... ఇంటి వద్దనే ఉన్నానని చెప్పి లోకేషన్ షేర్ చేస్తే ఇంటికి వచ్చేశాడు. అప్పుడు ఇద్దరం రతిక టాపిక్ గురించి చర్చించాము. ఆమె గురించి వాడు చెప్పాల్సిన మాటలు చెప్పాడు. ఒకసైడ్ మాత్రమే విన్న నేను తప్పు ఎవరిదని జడ్జ్ చేయలేను. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లిన మొదటి మూడు రోజుల్లోనే నా వద్ద రాహుల్ టాపిక్ రతక తెచ్చింది. తనకు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనే అర్థం వచ్చేలా ఆ సమయంలో క్లియర్గా చెప్పింది. ఇద్దరూ ఇండస్ట్రీలోనే ఉన్నారు కదా నిజమే ఉంటుందిలే అని నేను కూడా పెద్దగా సాగతీయలేదు. అని దామిని తెలిపింది. బిగ్ బాస్ విన్నర్ అతనే రతికా రోజ్ను రీ ఎంట్రీ ద్వారా తీసుకోవాలని బిగ్ బాస్ అనుకున్నాడు.. అందుకే ఉల్టాపుల్టా పేరుతో ఎక్కువ ఓట్లు వచ్చిన తమను పక్కన పెట్టి రతికను తీసుకున్నారని దామిని తెలిపింది. తనకు నయని పావని, పూజా, శోభ, ప్రియాంక, అమర్, సందీప్ ఓట్లు వేశారని చెప్పుకొచ్చింది. కానీ ఉల్టాపుల్టా పేరుతో ఆ అవకాశం దక్కలేదని చెప్పింది. శివాజీ వయసు రిత్యా చాలా అనుభం వుంది. ఆయన మైండ్తో ఫెయిర్ గేమ్ ఆడుతున్నాడు. కానీ బిగ్ బాస్ సీజన్ విన్నర్ మాత్రం పల్లవి ప్రశాంత్ కావడం గ్యారెంటీ అని ఆమె తెలిపింది. అతనొక కామన్ మ్యాన్గా గుర్తింపు ఉంది. అతను చాలా మంచి వ్యక్తి నామినేషన్లో మాత్రమే అలా రెచ్చిపోతాడు... ఆ ఒక్క విషయంలో ప్రశాంత్ అంటే తనకు ఇష్టం లేదని దామిని చెప్పింది. ప్రశాంత్ను ఎప్పుడూ ఎవరూ చులకనగా చూడలేదు. వాడు పూర్తిగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి మొదట్లో అడ్జెస్ట్ కావడానికి సమయం పట్టింది. వాడికి ఫస్ట్ వారంలో ఏసీ కూడా సెట్ కాలేదు. దాంతో జ్వరం కూడా వచ్చింది. ఆ సమయంలో వాడిని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాం అని ఆమె చెప్పింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్, వారి కుటుంబ సభ్యల గురించి కొందరు పీఆర్ టీమ్ వారు బూతులతో కామెంట్లు చేస్తున్నారు. ఇదీ ఏ మాత్రం మంచిది కాదని దామిని తెలిపింది. -
నా కుటుంబమే నరకంలోకి తోసింది: షకీలా
దక్షిణ భారత ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని నటి షకీలా. ఒకప్పుడు మలయాళ సినిమా పరిశ్రమలో షకీలా అంటే పెద్ద సంచలనమే. సినిమా టైటిల్స్లో ఆమె పేరు ఉంటే చాలు బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే.. ఆమె సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే తన సినిమాను వాయిదా వేసుకోవాల్సిందే.. అలా ఆమె సినిమాల దాటికి భారీ చిత్రాలే కొట్టుకుపోయాయి. తమిళనాడుకు చెందిన షకీలా సౌత్ చిత్రసీమను తన గ్లామర్తో ఊపేసింది. ఒకప్పుడు షకీలా నటించిన చాలా సినిమాలు అశ్లీలతతో కూడుకొని ఉండేవి. అయితే చాలా ఏళ్ల నుంచి అలాంటి చిత్రాలకు ఆమె దూరంగా ఉంది. షకీలా ఇప్పుడు తమిళం, తెలుగు చిత్రాలతో పాటు పలు రియాల్టీ షోలలో మెప్పిస్తుంది. పలు టెలివిజన్ కార్యక్రమాల ద్వారా హాస్య పాత్రలు చేస్తూ.. కుటుంబ ప్రేక్షకులకు ఇష్టమైన నటిగా మారింది. అంతేకాకుండా తనకు వచ్చే సంపాదనలో కొంతమేరకు సామాజిక సేవా రంగంలో కూడా ఆమె ఖర్చుచేస్తుంది. కుటుంబ పోషణ కోసం షకీలా చిన్న వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని షకీలా పలు సందర్భాల్లో బహిరంగంగానే చెప్పింది. తన సినిమా కెరియర్తో పాటు జీవితంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను తాజాగా షకీలా షేర్ చేసుకుంది. అవి ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. సినిమా ప్రపంచం ఆమె ప్రతిభను సరిగ్గా వినియోగించుకోలేదని. కేవలం తన బాడీ బ్యూటీని చూపించి డబ్బు సంపాదించేందుకే ఉపయోగించుకున్నట్లు ఆమె మరోసారి గుర్తుచేసింది. డబ్బు కోసం తన శరీరాన్ని మొదట ఉపయోగించింది తన సొంత తల్తే అని షకీలా వెల్లడించింది. గతంలో ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షకీలా ఇదే విషయాన్ని చెప్పింది. ఆమ్మ వల్లే మగవాళ్లతో పరిచయం షకీలా మాట్లాడుతూ.. 'చిన్న వయసులోనే నేను బలంగా కనిపించేదానిని. వయసుకు మించి నా హైట్ ఉండేది. నేను హైస్కూల్లో చదువుతున్నప్పుడే కాలేజీ అమ్మాయిలా ఉండేదాన్ని. దారిలో చాలా మంది నన్ను తదేకంగా చూసేవారు. కానీ ఎందుకో నాకు అర్థం కాలేదు. మా ఇంట్లో డబ్బు పెద్ద సమస్యగా ఉండేది. మా అమ్మ మగవాళ్లను పరిచయం చేసి వాళ్ల గదికి వెళ్లమని చెప్పేది. అందుకు నేను ఒప్పుకునేదానిని కాదు.. కానీ ఆ సమయంలో ఆమ్మ కొట్టేది. నాకు వేరే మార్గం లేక నోరు మూసుకుని అమ్మ చెప్పినట్లు ఉండేదానిని.' అని షకీలా అన్నారు. ఈ ఇంటర్వ్యూలో, షకీలా మాట్లాడుతూ, సినిమా పరిశ్రమలోకి రాకముందు కూడా, డబ్బు కోసం తన కుటుంబం తనను పురుషుల గదికి పంపేదని చెప్పింది. ఏం చేయాలో తెలియక షకీలా అందుకు సిద్ధపడిందని ఆ మాటలను బట్టి అర్థమవుతోంది. 'మా అమ్మమ్మ, అమ్మ కూడా ఈ విధంగా చాలా డబ్బు సంపాదించారు. నన్ను అదే దారిలో వెళ్లమన్నారు. కానీ నేను సినిమాలు ఎంపిక చేసుకున్నాను. కానీ ఇక్కడ కూడా నా శరీరం కేవలం ప్రదర్శనకు మాత్రమే ఉంచేవారు. అందుకు నాకు చాలా బాధగా ఉండేది. ఆర్టిస్ట్గా ఉండే అర్హతలు నాకు ఉన్నాయి కానీ ఇండస్ట్రీలో నన్ను ఎవరూ కోరుకోలేదు. కెమెరా ముందు నన్ను కీలుబొమ్మలా వాడుకున్నారు' అని షకీలా అన్నారు. తన జీవితంలో తన సోదరినే చాలా ఎక్కువగా మోసం చేసిందని ఆమె చెప్పింది. షకీలా కూడబెట్టిన మొత్తం డబ్బును తన సోదరి తీసుకుని మోసం చేసినట్లు ఇది వరకే చెప్పింది. ఇటీవల షకీలా తెలుగు బిగ్బాస్ సీజన్ 7లో కనిపించింది. కానీ రెండో వారంలోనే ఆమె ఎలిమినేట్ అయింది. అమె మరికొన్ని రోజులు ఉండుంటే ఆమెకు మరికొంత డబ్బు వచ్చేది. ఆ డబ్బును పలు సామాజిక సేవలకు ఉపయోగించేదని ఆమె అభిమానులు చెప్పుకొచ్చారు. -
శివాజీ మీద పైచేయి సాధించిన అమర్
బిగ్ బాస్ నామినేషన్స్ ఈ వారం చాలా ఫన్నీ రీజన్స్తో ముగిసింది. మంగళవారం జరిగిన నామినేషన్లో యావర్ మాస్టర్ ప్లాన్ వేసి అశ్వినిని నామినేషన్లోకి తీసుకొచ్చాడు. నామినేషన్లో పసలేని కారణాలతో రతికా రోజ్, అశ్వినిలు ఉన్నారని చెప్పవచ్చు. కానీ ఈ వారం నామినేషన్ ప్రక్రియలో శివాజీ మీద అమర్ పైచేయి సాధించాడు. ఆ కథేంటో మంగళవారం జరిగిన ఎపిసోడ్లో ఏం జరిగిందో Day 58 హైలెట్స్ ఇప్పుడు చూద్దాం. సోమవారం ఎపిసోడ్లో ప్రశాంత్ ,ప్రియాంక,అర్జున్ ,శివాజీ,రతిక, తేజ, భోలె నామినేషన్ ప్రక్రియలో పాల్గొని వారికి నచ్చని ఇద్దరి పేర్లు చెబుతూ ఎలిమినేషన్ లిస్ట్లో చేర్చారు. మంగళవారం ఎపిసోడ్లో మొదట శోభ నామినేషన్ విదానాన్ని ప్రారంభంచింది. శోభ సరైన కారణాలతో రతికా రోజ్ను నామినేట్ చేసినా వాటిని తిప్పకొట్టడంలో రతిక విఫలమైంది. లాజికల్ పాయింట్లు లేకుండా రతిక మాట్లాడిన మాటలు చిరాకు తెప్పించాయి. ఆడియన్స్కు బాగా దొరికి పోతున్నావని ఒకానొక సమయంలో తేజ కలుగచేసుకుని రతికా రోజ్ను హెచ్చరిస్తాడు. అయినా ఆమె వినకుండా మరింత రెచ్చిపోయి పసలేని కారణాలు శోభకు చెప్పి రతిక ప్రేక్షకులకు దొరికిపోయింది. ఆ తర్వాత యావర్ను సరైన కారణంతో శోభ నామినేషన్ చేయడంతో ఆయన ఎటువంటి మాటలు మాట్లడకుండా స్వీకరిస్తాడు. యావర్తో అశ్విని ఫైట్ యావర్ మొదటగా శోభను నామినేషన్లో చేర్చగా వారిద్దరి మధ్య ఎలాంటి వాగ్వాదం జరగలేదు. దానికి ప్రధాన కారణం యావర్ చెప్పిన సరైన పాయింట్లకు ఆమె నుంచి ఎలాంటి సమాధానం లేకుండాపోయింది. ఆ తర్వాత అశ్విని పేరును యావర్ లేవనెత్తుతాడు. ఆటలో కన్ఫ్యూజ్ అవుతున్నావని హౌస్లో ఉండాలంటే ఆట తీరును ఆర్థం చేసుకుంటూ ముందుకు సాగాలని ఇవేవి నీలో లేవని అశ్వినికి తెలిపి యావర్ నామినేషన్ చేస్తాడు. అందుకు ఉదాహరణగా గతంలో అమర్ను నామినేట్ చేస్తానని చెప్పి ఆ తర్వాత ఫ్లిప్ అయి అర్జున్ను నామినేషన్ చేయడం ఏంటని యావర్ ప్రశ్నించాడు. అలా యావర్ చెప్పిన ఐదు పాయింట్లలో నాలుగు సరైనవే అనేలా ఉన్నాయి. కానీ సందీప్ మాస్టర్కు ఒక టాస్క్లో అశ్విని వాటర్ పోస్తుంది. దానిని యావర్ తప్పుబడుతూ నామినేట్ చేస్తాడు. ఇందులో ఏ మాత్రం పసలేదని తెలుస్తోంది. వారిద్దరి మధ్య నామినేషన్ ప్రక్రియ చాలా ఫన్నీగా జరుగుతుంది. శివాజీ మీద పైచేయి అమర్ చేసిన నామినేషన్లలో ఈ వారం శివాజీపై పైచేయి సాధించాడని చెప్పవచ్చు. శివాజీని ఉద్దేశిస్తూ.. అన్నా మీకు నేను ఎందుకు నచ్చనో అలాగే మీరు కూడా నాకు నచ్చరు అని ఓపెన్గానే చెబుతాడు అమర్. ఆటలో నేను మాత్రమే అరుస్తున్నాని, కేకలు వేస్తున్నానని ప్రతిసారి నన్ను నామినేషన్ చేస్తున్నావ్.. అలాగే నీ పక్కన ఉన్నవారు కూడా నామినేషన్ సమయంలో కేకలు వేస్తున్నారు కదా వారిని ఎందుకు హెచ్చరించరని సరైన పాయింట్ను శివాజీకి అమర్ వేశాడు. అప్పుడు శివాజీ కూడా వాళ్లకు వార్నింగ్ ఇచ్చాను.. చెబుతున్నాను అంటాడు. అలా చెప్పడం కాదన్నా.. నాకు ఎలా చెప్పారో వాళ్లను కూడా నామినేషన్లో నిలబెట్టి చెప్పండి అని అమర్ తెలుపుతాడు. దీంతో ఇబ్బంది పడ్డ శివాజీ ఆన్సర్ చెప్పలేక సైడ్ అయిపోతాడు. అలాగే సందీప్ మాస్టర్ను ఇంటి నుంచి పంపించావ్ అని తేజను నామినేట్ చేస్తాడు శివాజీ.. మరి సందీప్ మాస్టర్ను ఎలిమినేషన్ లిస్ట్లో పెట్టిన యావర్ను మాత్రం ఒక మాట కూడా అనలేకపోయాడు శివాజీ. ఇలా ఈ వారంలో శివాజీ దొరికిపోయాడు. ఈ వారం నామినేషన్లో ఉండేది వీళ్లే 1. అమర్ దీప్ 2. రతికా రోజ్ 3. శోభ శెట్టి 4. ప్రియాంక జైన్ 5. అర్జున్ 6. టేస్టీ తేజ 7. భోలే షావలి 8. ప్రిన్స్ యావర్ -
నీకు తెలుగు అర్థమవుతోందా?.. యావర్ను ఓ ఆటాడుకున్న అశ్విని!
తెలుగువారి రియాలిటీ షో ఈ ఏడాది ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేస్తోంది. మొదటి నుంచే కొత్త పంథాల్లో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఎమిమిది వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలో మరో వారం మొదలైపోయింది. ఎనిమిదో వారంలో సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఇదిలా ఉంచితే తొమ్మిదో వారానికి నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ విషయానికొస్తే ఒకరిని ఒకరు నామినేట్ చేసే సమయంలో జరిగే వాదనలు మామూలుగా ఉండవు. సోమవారం మొదలైన నామినేషన్స్ ప్రక్రియ మంగళవారం కూడా కొనసాగనుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. (ఇది చదవండి: దొరికిపోయిన రతిక.. మోకాళ్లపై కూర్చుని దండం పెట్టిన అమర్!) ఈ ప్రోమోలో కెప్టెన్లో హోదాలో ఉన్న గౌతమ్.. రతికాను నామినేట్ చేశాడు. తర్వాత ప్రిన్స్ యావర్ను అశ్విని నామినేట్ చేసింది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నీకు తెలుగు అర్థమవుతోందా?.. అసలు ఎందుకు వచ్చావ్ బిగ్బాస్కి? అని అశ్విని ప్రశ్నించింది. దీనికి యావర్ బదులిస్తూ.. నువ్వు అలాంటి మాట అనడం కరెక్టేనా? అని అన్నాడు. అనంతరం ఒక ఆడపిల్లని చేసి నన్ను ఆడుకుంటున్నావ్? అది కూడా నాకు అర్థమవుతోంది అంటూ అశ్విని ఓ రేంజ్లో ఊగిపోయింది. దీంతో ఏం మాట్లాడాలో తెలియనంతగా యావర్ ఫేస్ ఎక్స్ప్రేషన్స్ ఇచ్చాడు. నువ్వు నన్ను టార్గెట్ చేశావ్.. అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నా. లేకపోతే నువ్వసలు నా మైండ్లోనే లేవు అంటూ అశ్విని రెచ్చిపోయింది. ఆ తర్వాత అమర్ను కెప్టెన్ గౌతమ్ నామినేట్ చేయడంతో ప్రోమో ముగిసింది. అంతకుముందు రిలీజ్ చేసిన ప్రోమోలో యవర్ లాజిక్ లేని నామినేషన్స్ చేశాడు. కారణాలు ఏం చెప్పాలో తెలీక శోభాశెట్టి, అశ్వినిని నామినేట్ చేశాడు. మరోవైపు రతిక - శోభాశెట్టి మధ్య వాదన గట్టిగా నడిచినట్లు ప్రోమోలో చూపించారు. శోభాతో మాట్లాడుతూ తేజ పేరు తీసుకొచ్చింది. దీంతో తేజ ముందుకొచ్చి.. 'నా పేరు ఎందుకు మధ్యలో తీసుకొచ్చావ్' అని రతికతో అతడు గొడవ పెట్టుకున్నాడు. 'దొరికిపోయావ్.. దారుణంగా జనాలకి దొరికిపోతున్నావ్' అని తేజ అన్నాడు. ఎవరు ఎవరినీ నామినేట్ చేశారో తెలియాలంటే ఇవాళ జరిగే ఎపిసోడ్తో క్లారిటీ రానుంది. (ఇది చదవండి: ఖరీదైన కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. ఆయనతో ప్రత్యేక పూజలు! ) -
దొరికిపోయిన రతిక.. మోకాళ్లపై కూర్చుని దండం పెట్టిన అమర్!
బిగ్బాస్ షోలో మిగతా రోజుల సంగతెలా ఉన్న నామినేషన్స్ మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. కంటెస్టెంట్స్ అందరూ పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తారు. అవతలి వాళ్లని నామినేట్ చేసి, వాళ్ల వ్యతిరేకిస్తే గొడవ పెట్టుకోవడానికైనా అస్సలు వెనుకాడరు. ఇప్పటికే సోమవారం సగం నామినేషన్స్ పూర్తి కాగా, మంగళవారం మిగిలినవి జరిగాయి. ఇందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేయగా.. అందులో అమరదీప్ హైలైట్ అయ్యాడు. అలానే రతిక ఓ పాయింట్లో దొరికిపోయింది. (ఇదీ చదవండి: లాజిక్స్ మర్చిపోయిన శివాజీ.. అమర్ అడిగిన దానికి నో ఆన్సర్!) యవర్ లాజిక్ లేని నామినేషన్స్ చేశాడు. కారణాలు ఏం చెప్పాలో తెలీక శోభాశెట్టి, అశ్వినిని నామినేట్ చేశాడు. మరోవైపు రతిక - శోభాశెట్టి మధ్య వాదన గట్టిగా నడిచినట్లు ప్రోమోలో చూపించారు. శోభాతో మాట్లాడుతూ తేజ పేరు తీసుకొచ్చింది. దీంతో తేజ ముందుకొచ్చి.. 'నా పేరు ఎందుకు మధ్యలో తీసుకొచ్చావ్' అని రతికతో అతడు గొడవ పెట్టుకున్నాడు. 'దొరికిపోయావ్.. దారుణంగా జనాలకి దొరికిపోతున్నావ్' అని తేజ అన్నాడు. మరి రతిక నోరు మూసుకుంది. మరి ఆమె ఏ విషయంలో దొరికిపోయిందనేది మంగళవారం ఎపిసోడ్లో క్లారిటీ వచ్చేస్తుంది. 'మీరు నామినేట్ చేసిన విధానం నాకు నచ్చలేదు, అందుకే బాధతో మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా' అని అమర్, భోలెని నామినేట్ చేశాడు. 'ఈ హౌసులో ఇంత మంచి పేరు తెచ్చుకున్న నన్ను..' అని భోలె అంటుండగానే.. 'అయ్యో సూపరన్నా మీరు నిజంగా దేవుడు మీరు' అంటూ వెటకారంగా అనేసరికి భోలె మెంటలెక్కిపోయాడు. 'ఈ బిగ్బాస్ హౌసులో ఏం సాధించావ్ నువ్వు? బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నావ్' అని భోలె అన్నాడు. 'ఐ యామ్ హియర్ ఏజ్ ఏ బ్యాడ్ బాయ్, మీకు ఏమన్నా ప్రాబ్లమా?' అని కౌంటర్ ఇచ్చాడు. అలానే 'మారు.. మారు' అని ఒకరికొకరు చెప్పుకొన్నారు. (ఇదీ చదవండి: బిగ్బాస్ షో చరిత్రలో ఫస్ట్టైమ్ అలాంటి నిర్ణయం!) -
బిగ్బాస్ షో చరిత్రలో ఫస్ట్టైమ్ అలాంటి నిర్ణయం!
ప్రస్తుతం తెలుగులో బిగ్బాస్ ఏడో సీజన్ ప్రసారమవుతోంది. ఇప్పటికే ఎనిమిది వారాలు పూర్తయ్యాయి. మరీ అంతా సూపర్ అని చెప్పలేం కానీ ఓ మాదిరిగా అలరిస్తుంది. 'ఉల్టా పుల్టా' ట్యాగ్ లైన్తో జరుగుతున్న ఈ షోలో కొత్త కెప్టెన్ ఓ మంచి నిర్ణయం తీసుకున్నాడు. షో చూస్తున్న ఆడవాళ్ల మనసులు గెలుచుకున్నాడు. ఇంతకీ అసలేం జరిగింది? బిగ్బాస్ షోలో మిగతా రోజులు ఎలా ఉన్నాసరే నామినేషన్స్ రోజు మాత్రం వేరే లెవల్ హడావుడి ఉంటుంది. ఈ సోమవారం అలానే మంచి హీటెక్కించే వాదనలు జరిగాయి. అంతకంటే ముందు కొత్త కెప్టెన్గా గౌతమ్ కృష్ణ బాధ్యతలు అందుకున్నాడు. తనకు డిప్యూటీలుగా హౌసులోని లేడీ కంటెస్టెంట్స్ రతిక, శోభాని ఎంచుకున్నాడు. దీని తర్వాత ఓ నిర్ణయంతో మార్కులు కొట్టేశాడు. (ఇదీ చదవండి: మంచానికే పరిమితమైన స్టార్ డైరెక్టర్ భార్యకు ప్రభుత్వ సాయం) 'ప్రతి ఇంట్లో ఆడవాళ్లు ఎన్నో రకాలు పనులు చేస్తుంటారు. ఇంటి బాధ్యతలు చూసుకోవడంలో వాళ్లదే పైచేయి. ప్రతి ఇంట్లో ఉన్న, ఇక్కడున్న, టీవీల్లో చూస్తున్న ఆడవాళ్లకు గౌరవంగా మన బిగ్బాస్ హౌసులో ఈ వారం ఫీమేక్ వీక్ (ఆడవాళ్ల వారం) జరుపుకొందాం. ఇందుకోసం ఈ వారమంతా లేడీస్కి హాలీడే ఇస్తున్నాను' అని గౌతమ్ చెప్పుకొచ్చాడు. ఇదే గేమ్ ప్లానులో భాగమై ఉండొచ్చు గానీ ఏ భాషలో తీసుకున్నా సరే బిగ్బాస్ ఇలాంటి నిర్ణయం ఇదే ఫస్ట్ టైమ్ అని తెలుస్తోంది. దీనితో పాటే కెప్టెన్ గౌతమ్ మరో ఊహించని మరో నిర్ణయం తీసుకున్నాడు. 'ప్రతిరోజూ లైట్స్ ఆపేసిన తర్వాత ఆ రోజు చేసిన పని గురించి నిర్ణయం ఉంటుంది. ఇంట్లో ఎవరు ఎక్కువ కష్టపడ్డారో వాళ్లకు కష్ట జీవి.. తక్కువ పనిచేసిన వాళ్లకు పనిదొంగ అని బిరుదులు ఇస్తాం. కష్ట జీవికి ఒక డ్రింక్ ఇస్తాను. అలాగే పనిదొంగ తన రెండు గుడ్లను కూడా తిరిగిచ్చేయాలి' అని కెప్టెన్ గౌతమ్ చెప్పాడు. (ఇదీ చదవండి: ప్రేమలో పడిన మరో తెలుగు హీరోయిన్.. త్వరలో పెళ్లి!) -
లాజిక్స్ మర్చిపోయిన శివాజీ.. అమర్ అడిగిన దానికి నో ఆన్సర్!
బిగ్ బాస్ నామినేషన్స్ ఈసారి మరీ అంత హోరాహోరీగా కానప్పటికీ ఇంట్రెస్టింగ్గానే సాగాయి. శివాజీ బ్యాచ్ అంతా సీరియల్ బ్యాచ్ ని మళ్లీ టార్గెట్ చేశారు. ఈరోజు అది మళ్లీ క్లియర్ అయిపోయింది. అలానే అమరదీప్ లాజిక్స్ మాట్లాడేసరికి శివాజీ దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఇంతకీ సోమవారం నామినేషన్స్ ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 57 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. లాజిక్ లెస్ నామినేషన్స్ సందీప్ ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిపోవడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. కంటెస్టెంట్స్ నిద్రలేవడంతో సోమవారం ఎపిసోడ్ మొదలైంది. బిగ్బాస్ కొత్త కెప్టెన్గా గౌతమ్ బాధ్యతలు అందుకున్నాడు. తనకు డిప్యూటీలుగా రతిక, శోభాని ఎంచుకున్నాడు. ఈ వారమంతా ఉమెన్స్ వీక్ సందర్భంగా.. ఇంట్లోని అమ్మాయిలకు విశ్రాంతి అని, అబ్బాయిలే అన్ని పనులు చేయాలని కెప్టెన్ గౌతమ్ ఆర్డర్ వేశాడు. తర్వాత నామినేషన్స్ షురూ అయ్యాయి. (ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్) ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? ప్రశాంత్ - అమరదీప్, తేజ ప్రియాంక - రతిక, భోలె అర్జున్ - శోభా, అమరదీప్ శివాజీ - అమరదీప్, తేజ రతిక - ప్రియాంక, శోభాశెట్టి తేజ - అర్జున్, రతిక భోలె - ప్రియాంక, అమరదీప్ రైతుబిడ్డ చల్లబడ్డాడు! నామినేషన్స్ అంటే రెచ్చిపోయే రైతుబిడ్డ ప్రశాంత్ దగ్గర ఈసారి కారణాలు లేవు. దీంతో ఎప్పటిలానే తన బ్యాచ్కి వ్యతిరకమైన అమరదీప్ని నామినేట్ చేసిపడేశాడు. గతవారం మిర్చి దండ వేశాడని తేజని కూడా నామినేట్ చేశాడు. దీంతో తేజకి చిరాకేసింది. కెప్టెన్సీ కంటెండర్షిప్ రేసులో గెలిచిన వాళ్ల మధ్య గేమ్ పెట్టి, విజేతని డిసైడ్ చేయండి. వాళ్ల గురించి తమకు అప్పజెప్పి ఈ పంచాయతీలు పెట్టకండి బిగ్బాస్ అని తన డిసప్పాయింట్మెంట్ బయటపెట్టాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య గొడవ.. ఈసారి నామినేషన్స్లో ఉన్నదెవరంటే?) శివాజీ పగ-ప్రతీకారం బిగ్బాస్లో పెద్దగా పనులేం చేయకుండా, పెద్దమనిషిలా కలరింగ్ ఇస్తూ ప్రతివారం నెట్టుకొస్తున్న శివాజీ.. ఎప్పటిలానే ఈసారి కూడా అమరదీప్ని నామినేట్ చేశాడు. గతవారం నామినేషన్స్ సందర్భంగా అమరదీప్ గట్టిగట్టిగా అరవడం, డబుల్ మీనింగ్లో మాట్లాడటం నచ్చలేదని శివాజీ అన్నాడు. మరి ప్రశాంత్ ఇలా అరిచాడు కదా అప్పుడు ఎందుకు నామినేట్ చేయలేదన్న? అని అమరదీప్, శివాజీని ప్రశ్నించాడు. వాడికి చాలాసార్లు చెప్పాను, మార్చుకున్నాడని శివాజీ అన్నాడు. ఇక్కడ శివాజీ.. పుత్రప్రేమ క్లియర్గా బయపడింది. ఇక ప్రియాంక.. గేమ్ కనిపించలేదని రతికని నామినేట్ చేసింది. కానీ రతిక మాత్రం ప్రియాంక తనని చేసింది కదా అని ఆమెని నామినేట్ చేసి పడేసింది. అలా ఎంతో సీరియస్గా సాగుతున్న ఈ ప్రక్రియలో తేజ కాస్త ఫన్ జనరేట్ చేశాడు. ఓవరాల్గా చూస్తే శివాజీ బ్యాచ్కి చెందిన శివాజీ, ప్రశాంత్, భోలె.. కావాలని టార్గెట్ చేసి మరీ అమరదీప్ ని నామినేట్ చేయడం.. గ్రూపుల యవ్వారాన్ని మొత్తం బయటపెట్టినట్లయింది. అలానే అమర్ అంటే శివాజీకి ఎందుకంత పగ అనేది అర్థం కావట్లేదు. (ఇదీ చదవండి: యాంకర్ విష్ణుప్రియకు అనారోగ్యమా? లేకపోతే అలా ఎందుకు!) -
Bigg Boss 7: బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య గొడవ.. ఈసారి నామినేషన్స్లో ఉన్నదెవరంటే?
బిగ్బాస్లో మిగతా రోజులు ఎలా ఉన్నాసరే నామినేషన్స్ అప్పుడు మాత్రం మంచి ఊపు వస్తుంది. ఎందుకంటే అన్నిరోజులు మనసులో దాచుకున్నవన్నీ సోమవారం బయటకు కక్కేస్తారు. తమ కోపాన్నంతా చూపించేస్తారు. అలా ఈసారి కూడా మంచి వాడీవేడిగా సాగాయి. అయితే ఈసారి బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు తగువులాడుకోవడం మాత్రం షాకిచ్చింది. ఇంతకీ ఏంటి విషయం? వరసగా ఏడు వారాలు అమ్మాయిలు ఎలిమినేట్ అయిపోయారు. ఎనిమిదో వారం మాత్రం సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. ప్రస్తుతం తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టేశాం. ఇకపోతే ఈసారి ఒక్కో కంటెస్టెంట్.. ఇద్దర్ని నామినేట్ చేయాల్సి ఉంటుంది. నామినేట్ అయిన వ్యక్తులు.. డ్రాగన్ స్నేక్ ముందు నిల్చుంటే అందులో కలర్ పౌడర్ ముఖంపై పడుతుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 32 సినిమాలు రిలీజ్) ప్రియాంక vs అమరదీప్ ఈసారి అనుకోని విధంగా నామినేషన్స్ జరిగాయి. ఇన్నాళ్లు ఒకరికొకరు అండగా ఉంటూ వచ్చిన సీరియల్ బ్యాచ్.. ఇప్పుడు ఎవరికి వాళ్లు ఆడాలని డిసైడ్ అయినట్లు ఉన్నారు. శోభాని అర్జున్ నామినేట్ చేయగా, ఇక ఏది పడితే అది మాట్లాడుతున్నాడని అమరదీప్తో ప్రియాంక గొడవ పెట్టుకుంది. నామినేషన్స్ కంటే ఇదే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇకపోతే తేజ.. అర్జున్, రతికని నామినేట్ చేశాడు. ప్రియాంక.. రతికని నామినేట్ చేసింది. భోలె షావళి.. ప్రియాంకని నామినేట్ చేశాడు. ఎప్పటిలానే శివాజీ బ్యాచ్లోని శివాజీ, ప్రశాంత్.. ఏదో పగ ఉన్నట్లు కావాలనే పిచ్చి పిచ్చి కారణాలు చెప్పి అమరదీప్ని నామినేట్ చేసినట్లు ప్రోమోలో క్లియర్గా కనిపించింది. ఓవరాల్ గా ఈ వారం.. ప్రియాంక, అమరదీప్, శోభాశెట్టి, అర్జున్, తేజ, రతిక, భోలె, యవర్ నామినేట్ అయినట్లు తెలుస్తోంది. మరి ఈ సారి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చూడాలి? (ఇదీ చదవండి: యాంకర్ విష్ణుప్రియకు అనారోగ్యమా? లేకపోతే అలా ఎందుకు!) -
ఫైమా కోసం ఎంతో ఏడ్చాను.. ఫైనల్గా నన్ను రిజక్ట్ చేసింది: ప్రవీణ్
ప్రవీణ్, ఫైమా పలు ఎంటర్టైన్మెంట్ షోలతో స్టేజీపైన మెప్పించిన బుల్లితెర నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ఎన్నో వీడియోలు షేర్ చేశారు. ఈ విషయంపై ప్రవీణ్ మొదటిసారి తన ప్రేమ గురించి రివీల్ చేశాడు. బిగ్ బాస్ ఫైమాతో ప్రవీణ్ ప్రేమలో ఉన్నాడని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఫైమాతో ప్రేమలో పడినట్లు టీవీ స్టేజీలపైనే ఓపెన్గా చెప్పాడు.. త్వరలో ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడం కూడా జరిగింది. అప్పుడు ఫైమా నుంచి కూడా వ్యతిరేకత రాలేదు. కానీ అవన్నీ ఆడియన్స్ను మెప్పించేందుకు చేసిన స్క్రిప్ట్స్ అని చెప్పుకున్నా.. వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వారి సొంత యూట్యూబ్ చానల్స్లలో పలు వీడియోలు కూడా చేశారు. చివరకు ఫైమా వాళ్ల ఇంటికి కూడా ప్రవీణ్ పలుమార్లు వెళ్లాడు.. ఆ సమయంలో ఫైమా తల్లిగారిని అత్తయ్య అని పిలిచేవాడు. అంత సన్నిహిత్యం ఆమె కుటుంబంతో ప్రవీణ్కు ఉంది. దీంతో వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు విపరీతంగా ట్రెండ్ అయింది. ఈ విషయాలన్నింటిపైనా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రవీణ్ రియాక్ట్ అయ్యాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: సందీప్ ఎలిమినేట్.. ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?) 'ఫైమాతో ప్రేమ అనేది ఫ్రెండ్సిప్తో ప్రారంభమైంది. నా జర్నీ ప్రారంభం నుంచి ఆమె నాతోనే ఉన్నారు. అందుకే ప్రేమిస్తున్నాని చెప్పాను. దానికి ఆమె నో చెప్పింది. నా పరంగా చెప్పాల్సింది చెప్పాను.. ఆమెకు ఇష్టం ఉండవచ్చు.. లేకపోవచ్చు ఆమె నిర్ణయాన్ని తప్పపట్టలేను. అంతేకాకుండా ఆమె నో చెప్పిందని తనకు దూరంగా నేను ఎప్పుడూ లేను. మా మధ్య ప్రేమ లేకున్నా ఫ్రెండ్స్గా ఉందామని అనుకున్నాం. ఒక మంచి ఫ్రెండ్గా ఆమె వెంట ఎప్పుడూ ఉంటాను. కానీ ఆమె నా ప్రేమను అంగీకరించలేదనే బాధ చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఒకానొక సమయంలో బాగా ఏడ్చాను. ఫస్ట్ లవ్ ఈజ్ బెస్ట్ లవ్ అంటారు కదా.. అందుకే ఆమె గురించి ఏడ్చాను. ఆమె రిజెక్ట్ చేసినప్పుడు ముందు బాధపడినా... తర్వాత రిలైజ్ అయ్యి అంతా నా మంచికే అనుకున్నా. ప్రస్తుతం నా ఫ్యామిలీ సమస్యలు నాకు ఎక్కువగా ఉన్నాయి. వాటి గురించే ఎక్కువగా పోరాడుతున్నాను. ఈ మధ్య మా నాన్నగారు చనిపోయారు. ఆయన చనిపోయాకు మా అప్పుల గురించి తెలిసింది. ప్రస్తుతం వాటిని చెల్లించే పనిలో ఉన్నాను. ఒకవేళ ఫైమా నన్ను ప్రేమిస్తున్నాను అని భవిష్యత్లో చెబితే తప్పకుండా అంగీకరిస్తాను.' అని ప్రవీణ్ తెలిపాడు. బిగ్ బాస్ నుంచి వచ్చాకే ఫైమాలో మార్పు..? బిగ్బాస్ నుంచి వచ్చాక ఫైమాలో చాలా మార్పులు వచ్చాయని, ఆ షో ద్వారా ఆమెకు మంచి గుర్తింపుతో పాటు సెలబ్రిటీ హోదా రావడంతోనే ప్రవీణ్ను పక్కన పెట్టేసిందని వార్తలు వచ్చాయి. వాటికి ప్రవీణ్ ఇలా రియాక్ట్ అయ్యాడు. 'బిగ్ బాస్ నుంచి ఎలిమినేషన్ అయ్యాక ఫైమా బాగా హర్ట్ అయింది. ఆ మైండ్ సెట్లోనే ఉండిపోయింది. మొదట కొద్దరోజులు ఆమె ఎవర్నీ కలవలేదు. తర్వాత నాతో మంచిగానే మాట్లాడింది. ఆమె బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఆమె కోసం నేను ఎంతో సపోర్ట్ చేశాను. నేను ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ఫైమాకు ఓట్లు వేయాలని కోరినా.. ఆమె నా మనిషి అని ఆమె విజయం కోసం నేను ఎంతో ప్రయత్నం చేశాను.' అని తెలిపాడు. ప్రవీణ్ను ఫైమా మోసం చేసిందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కానీ ప్రవీణ్ ఆ విషయం చెప్పకుండా తను మాత్రమే ప్రేమించానని.. ఫైమా ప్రేమించలేదని చెబుతూ ఆమెను సేఫ్ చేస్తున్నాడని చెబుతున్నారు. బిగ్బాస్లో ఉన్నప్పడే ప్రవీణ్ అంటే ఇష్టం అని నాగార్జున గారితో ఫైమా చెప్పిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఏదేమైనా ప్రవీణ్ మాత్రం వన్సైడ్ లవర్ బాయ్లా మిగిలాడు. -
Bigg Boss 7: సందీప్ ఎలిమినేట్.. ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?
బిగ్బాస్ 7వ సీజన్లో స్ట్రాంగ్ వికెట్ పడిపోయింది. బలమైన కంటెస్టెంట్, టాప్-5లో ఉంటాడని అందరూ అనుకున్న కొరియోగ్రాఫర్ సందీప్ ఎలిమినేట్ అయిపోయాడు. ఎనిమిదో వారం తక్కువ ఓట్లు పడటంతో హౌస్ నుంచి బయటకొచ్చేశాడు. వెళ్తూ వెళ్తూ ఎమోనషల్ అయ్యాడు. అలానే ఇన్నాళ్లు హౌసులో ఉండి గట్టిగా సంపాదించాడు. ఇంతకీ ఎన్ని లక్షలు రెమ్యునరేషన్ అందుకున్నాడో తెలుసా? సందీప్ ఎలిమినేట్ ఈ వారం మొత్తం ఎనిమిది నామినేట్ అయ్యారు. వీళ్లలో ప్రియాంక, గౌతమ్ సేవ్ అయినట్లు శనివారం ఎపిసోడ్లో నాగ్ ప్రకటించాడు. మిగతా వాళ్లలో శివాజీకి ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. భోలె, అమరదీప్, అశ్విని కూడా తమ తమ ఓటు బ్యాంకుతో బతికిపోయారు. చివరి రెండు స్థానాల్లో నిలిచిన శోభా, సందీప్.. ఎవరు వెళ్తారా అని కాస్త సస్పెన్స్ నడిచింది. ఫైనల్గా సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయిపోయాడు. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7: సందీప్ ఎలిమినేట్.. ఏడుస్తూ ఆ నిజం చెప్పేసిన శోభా!) సీరియల్ బ్యాచ్ కష్టమే ప్రస్తుతం బిగ్బాస్ హౌసులో రెండు గ్రూపులు తయారయ్యాయి. శివాజీ ఒక దాన్ని నడిపిస్తున్నాడు. మరోవైపు అమరదీప్, ప్రియాంక, శోభాశెట్టి, సందీప్, తేజ ఓ గ్రూపుగా ఆడుతున్నారు. మొన్నీ మధ్య ఈ గ్రూపుల బాగోతం బయటపడింది. ఇప్పుడు సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయిపోవడంతో సీరియర్ బ్యాచ్ బలహీనమైపోయింది. వచ్చే వారం నుంచి శివాజీ గ్రూప్, వీళ్లపై మరింతగా రెచ్చిపోతారేమో! రెమ్యునరేషన్ అన్ని లక్షలా? వచ్చే తొలివారమే హౌస్మేట్ అయిన సందీప్ ఐదువారాల ఇమ్యూనిటీ దక్కించుకున్నాడు. అది అయిపోయిన తర్వాత కూడా నామినేషన్స్లోకి రాలేదు. ఈసారి తొలిసారి నామినేషన్స్లోకి వచ్చాడు. ఎలిమినేట్ అయిపోయాడు. అయితేనేం దాదాపు ఎనిమిది వారాలు ఇంట్లో ఉన్నాడు. వారానికి రూ.2.75 లక్షలు చొప్పున.. రూ.22 లక్షలు పైనే వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ రకంగా చూసుకుంటే ఇది మంచి అమౌంట్ అని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7'లో సందీప్ ఎలిమినేషన్.. ఆ ఒక్కటే మైనస్ అయిందా?) -
'బిగ్బాస్ 7'లో సందీప్ ఎలిమినేషన్.. ఆ ఒక్కటే మైనస్ అయిందా?
'బిగ్బాస్ 7' నుంచి అనుకోని విధంగా సందీప్ ఎలిమినేట్ అయిపోయాడు. చాలామంది శోభాశెట్టి అనుకున్నారు కానీ చివరవరకు వచ్చి ఆమె బతికిపోయింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్, టాప్-5లో ఉంటాడనుకున్న సందీప్ మాస్టర్ ఇలా ఎలిమినేట్ కావడం అందరినీ షాకయ్యేలా చేసింది. అసలు దీనికి కారణం ఏంటి? అసలు ఈ ఎలిమినేషన్ కరెక్టేనా? సందీప్ బ్యాడ్ లక్ సందీప్ పేరు చెబితే చాలామందికి తెలియకపోవచ్చు గానీ ఆట సందీప్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. రియాలిటీ షోల్లో డ్యాన్సర్గా పేరు తెచ్చుకున్న సందీప్.. ప్రస్తుతం కొరియోగ్రాఫర్గానూ చేస్తున్నాడు. బిగ్బాస్లోకి వచ్చిన వారంలోనే తొలి హౌస్మేట్ అయిపోయాడు. అలానే ఐదు వారాల ఇమ్యూనిటీ సంపాదించాడు. ఇకపోతే పోటీపడిన ప్రతి గేమ్లోనూ ఆకట్టుకున్న సందీప్.. ఎనిమిదో వారం తొలిసారి నామినేట్ అయ్యాడు. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7: సందీప్ ఎలిమినేట్.. ఏడుస్తూ ఆ నిజం చెప్పేసిన శోభా!) సందీప్కి అదే మైనస్ అయితే ఈసారి నామినేషన్స్లో ఉన్నోళ్లందరూ ఇప్పటికే ఆల్రెడీలో ఈ ప్రొసెస్ దాటి వచ్చారు. దీంతో వాళ్లందరికీ ఓటు బ్యాంక్ ఏర్పడింది. సందీప్ మాస్టర్కి మాత్రం ఆ ఛాన్స్ లేకుండా పోయింది. అదే మైనస్ అయింది. దీంతో మిగతా వాళ్లకు ఓట్లు పడ్డాయి. సందీప్కి చాలా తక్కువ పడ్డాయి. ఒకానొక దశలో శోభాశెట్టి ఎలిమినేట్ అవుతుందనుకున్నారు. కానీ సందీప్ బలైపోయాడు. అలానే బిగ్బాస్ నిర్వహకులు శివాజీ బ్యాచ్పై చూపిస్తున్న పక్షపాతం కూడా సందీప్ ఎలిమినేషన్కి ఓ కారణమని చెప్పొచ్చు. రెమ్యునరేషన్ అన్ని లక్షలు? ఇకపోతే దాదాపు 8 వారాల పాటు బిగ్బాస్ హౌసులో ఉండటం అంటే మంచి విషయమే. తొలి కొన్ని వారాలు తప్పితే.. మిగతా రోజుల్లో పోటీల్లో బాగా ఆడాడు. కొన్నింట్లో గెలిచాడు కూడా. ఇకపోతే ముందుగానే చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం సందీప్.. ఒక్కో వారానికి రూ.2.75 లక్షల రెమ్యునరేషన్ మాట్లాడుకున్నాడట. మొత్తం ఎనిమిది వారాలకు గానూ రూ.22 లక్షలకు పైనే సంపాదించినట్లు టాక్. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: 'కేసీఆర్' సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టిన 'జబర్దస్త్' కమెడియన్) -
వీళ్లకేమో తిట్లు.. శివాజీకేమో బుజ్జగింపులు.. ఏంటిది బిగ్బాస్?
బిగ్బాస్ వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. హోస్ట్ నాగార్జున వచ్చేశాడు. కొందరిపై కోప్పడ్డాడు. మరికొందరిని మాత్రం బుజ్జగించాడు. ఇంకొందరిని మెచ్చుకున్నాడు. మరీ తీసిపడేయలేం కానీ ఓ మాదిరి ఇంట్రెస్టింగ్గానే శనివారం ఎపిసోడ్ సాగింది. సీరియల్ బ్యాచ్పై ఫుల్ సీరియస్ అయిన నాగ్.. శివాజీతో పవర్తించిన తీరు మాత్రం కాస్త విచిత్రంగా అనిపించింది. ఇంతకీ శనివారం ఏం జరిగిందనేది Day 55 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. పిచ్చోడు గొడవ గురించి గౌతమ్.. కొత్త కెప్టెన్ కావడంతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. నాగ్ రావడంతో శనివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. శుక్రవారం జరిగిన సంగతుల్ని కాసేపు చూసిన నాగ్.. వర్తమానానికి వచ్చేశాడు. ఫస్ట్ ఫస్ట్ శోభాశెట్టితో మొదలుపెట్టాడు. అసలు యవర్ని 'పిచ్చోడు' అని ఎందుకు అన్నావ్? అని అడిగాడు. అనర్హత పేరు చెప్పి తనకు మిర్చి దండ వేశాడని, నేను మాట్లాడటానికి ట్రై చేస్తుంటే.. తనని మాట్లాడనివ్వలేదని, అందుకే పిచ్చోడు అని అన్నానని శోభా చెప్పుకొచ్చింది. మరి గతవారం భోలె.. ఎర్రగడ్డ అనే పదం వాడితే గింజుకున్నావ్, అది మెంటల్ అని అన్నావ్, ఒప్పుకోనని అన్నావ్.. ఇప్పుడెందుకు ఇలా చేశావ్ అని నాగ్ సీరియస్ అయ్యాడు. 'నీకు క్షమించే గుణం లేనప్పుడు మాటలు జారకూడదు కదమ్మా' అని సుతిమెత్తగా కౌంటర్ వేశాడు. (ఇదీ చదవండి: 60 ఏళ్ల వయసులో హీరోలకు మించిన ఫాలోయింగ్.. ఎవరీ 'నెపోలియన్'?) యవర్ కూడా పడ్డాయ్ ఈ గొడవలో శోభాది ఎంత గొడవ ఉందో యవర్ది కూడా అంతే తప్పు ఉందన్నట్లు నాగ్ చెప్పుకొచ్చాడు. మిర్చిదండ విసిరి కొట్టావ్, బిగ్బాస్ ప్రాపర్టీని డ్యామేజ్ చేశావ్.. మారావ్ అనుకుంటే.. మళ్లీ ముందులానే ప్రవర్తించావ్ యవర్ అని మనోడికి కాస్త గడ్డిపెట్టాడు. 'నువ్వు ప్రవర్తించిన విధానం చూస్తే.. నేను, ఆడియెన్స్ ఎవరైనా సరే పిచ్చోడు అనే అంటారు' కదా అన్నాడు. అయితే యవర్, శోభా.. ఇద్దరూ కూడా తమని తాము సమర్థించుకోవాలని చూశారు. ఇలా మిమ్మల్ని మీరు జస్టిఫై చేయాలని చూడకండి, ఫూల్ అవుతారు అని నాగ్ కౌంటర్ వేశాడు. అమర్ vs ప్రశాంత్ గొడవ నామినేషన్స్ సందర్భంగా ప్రశాంత్తో మాట్లాడుతూ అమరదీప్ కుర్చీ తన్నాడు. 'ఈ నా కొడుకు' అనే పదం వాడటం గురించి నాగ్ అడిగాడు. అమర్ ఏదో చెప్పాలని చూశాడు కానీ వర్కౌట్ కాలేదు. దీంతో నాగ్ మాట్లాడుతూ.. 'ప్రశాంత్ అంటే నీకు చిన్నచూపు అని అంటాటు' అని నాగ్ అనగానే.. 'లేదు సర్ లేదు సర్' అని అమర్ క్లారిటీ ఇచ్చాడు. అక్కడితో ఆ టాపిక్ ముగిసింది. ఇక నామినేషన్స్ లో ఒకలా, మిగతా సమయాల్లో మరోలా ప్రవర్తిస్తుంటావ్? ఏంటి ప్రశాంత్ ఇది అని నాగ్.. కాస్త ఫన్ జనరేట్ చేశాడు. ఇక రతిక గురించి మాట్లాడిన నాగార్జున.. 'హౌసులో కబుర్లు చెప్పడానికి వెళ్లావా? గతం గతహ... అంత ఛాన్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావ్? ఎందుకు ఆడట్లేదు? నామినేషన్స్లో లేవని కాన్ఫిడెన్సా? గతం గురించి మాట్లాడుకుంటే గతంలో ఉండిపోతావ్, మనుషుల గురించి ఫోకస్ చేయొద్దు' అని రతికకు సుతిమెత్తగా నాగ్ కౌంటర్స్ వేశాడు. (ఇదీ చదవండి: నటుడి ఇంట్లో దొంగతనం.. డబ్బులు, బంగారంతో పనిమనిషి పరార్!) శివాజీకి బుజ్జగింపులు 'ఎవరో ఒకర్ని కొట్టేసి వెళ్లిపోతా?' అన్నావ్ కదా శివాజీ అసలేమైంది? అని నాగ్ అడిగాడు. 'నేను అవన్నీ చెప్పుకోలేను. చాలా విషయాలు బాగోట్లేదు. నేను నీతిగానే ఉంటున్నాను. మనుషుల పేర్లు చెప్పలేని గానీ చాలామంది ప్రవర్తన ఇబ్బందికరంగా ఉంటోంది. నన్ను పంపించేశానా? నన్ను తిట్టినా ఓకే?' అని శివాజీ నాగార్జునతో అన్నాడు. ప్రశాంత్, యవర్కి వాళ్ల బిహేవియర్ గురించి చెప్పావా? అని నాగ్ అడగ్గా.. వీళ్లతో పాటు సందీప్కి కూడా చెప్పానని శివాజీ అన్నాడు. దీని తర్వాత నాగ్ మాట్లాడుతూ.. 'శివాజీ సేఫ్ ఆడొద్దు. నీకు ఏమనిపిస్తే అది చెప్పు' అని నాగ్ అన్నాడు. 'ఇదే చివరి అవకాశం.. ఇక చేయి దాటిపోతే చెప్పేస్తా బాబుగారు' అంటూ నాగ్-శివాజీ ఇద్దరికి ఇద్దరూ బుజ్జగించుకున్నట్లు అనిపించింది. అయితే శనివారం ఎపిసోడ్ చూసిన తర్వాత హోస్ట్ నాగార్జున.. సీరియల్ బ్యాచ్ ని ఏమైనా టార్గెట్ చేశాడా అనే సందేహం వచ్చింది. ఎందుకంటే శోభాశెట్టి, అమరదీప్తో గట్టిగా మాట్లాడిన నాగ్.. ఎవడో ఒకడ్ని కొట్టేసి వెళ్లిపోతా అని ఎగిరెగిరి పడిన శివాజీతో మాత్రం నాగ్ బుజ్జగింపులు జరిపాడు. అలా అనొద్దు, సేఫ్ ఆడొద్దు అని చెప్పాడు. అలానే ఈ ఎపిసోడ్ చూస్తే.. సీరియల్ బ్యాచ్ ఓవైపు, శివాజీకి ఓ బ్యాచ్ ఉందని క్లియర్గా అర్థమైంది. ఇకపోతే నామినేషన్స్లో ఉన్న 8 మందిలో ప్రియాంక, గౌతమ్ సేవ్ అయినట్లు నాగ్ చెప్పాడు. ఇంకా ఆరుగురు నామినేషన్స్లో ఉన్నారు. వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆదివారం క్లారిటీ వస్తుంది. అలా శనివారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?) -
శోభ శెట్టి సేఫ్.. షాకిచ్చిన బిగ్ బాస్.. వారిద్దరిలో ఒకరు ఔట్
బిగ్బాస్ సీజన్ 7 సగం పూర్తి అయింది. ఎనిమిది వారాల తర్వాత తొలిసారి ఓ మేల్ కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటికి పోతున్నాడు. మొదటి ఏడు వారాలు లేడీ కంటెస్టెంట్లే హౌస్ నుంచి బయటికి వచ్చేశారు. ఈ వారం నామినేషన్స్లో శివాజీ, బోలే, సందీప్, శోభా శెట్టి, అశ్విని, గౌతమ్, ప్రియాంక, అమర్ దీప్ ఉన్నారు. బిగ్ ఫైట్లో గెలిచిన శోభ బిగ్బాస్లో శివాజీ బ్యాచ్ను ఢీ కొట్టేది శోభ మాత్రమే కాబట్టి ఆమెను ఎలిమినేషన్ చేయాలనే ప్లాన్లో బయట ఉన్న శివాజీ పీఆర్ టీమ్ చాలా గట్టిగానే పోరాడింది. అలా శివాజీకి డప్పు కొట్టే బ్యాచ్ మొత్తం శోభాశెట్టిని టార్గెట్ చేసింది. కొందరైతే ఆమెపై ఏదో వ్యక్తిగత కక్ష ఉన్నట్లుగా కామెంట్లు చేయడం దారుణం. నామినేషన్ లిస్ట్లో శోభ పేరు చేరగానే ఆమెకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నెగటివ్ ప్రచారం చేయడం ప్రారంభించారు. చివరకు బిగ్బాస్ సీజన్ 6లో సామాన్యుడిలా వెళ్లి తెలుగు ప్రేక్షకుల ప్రేమకు దగ్గరైన ఆదిరెడ్డి కూడా శివాజీ బ్యాచ్లోని సభ్యులకే ఎక్కువ సపోర్ట్గా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఆదిరెడ్డి కూడా.. హౌస్లో శివాజీ చేస్తున్న పొలంగట్టు పంచాయితీలనే వెనుకేసుకొస్తున్నారు. ఒకట్రెండు సందర్భాల్లో మినహా శివాజీ బ్యాచ్నే ఆదిరెడ్డి కూడా వెనుకేసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన కంటెస్టెంట్లు ఏ చిన్న తప్పులు చేసినా.. వాటిని ఆదిరెడ్డి కూడా హైలెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆదిరెడ్డికి మంచి ఆదరణ ఉంది. అతనికంటూ మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అతను చెప్పే ప్రతి మాటకు ప్రస్తుతం ఒక వ్యాల్యూ ఉంది. అలాంటి వ్యక్తి కూడా ఎక్కువగా శివాజీ బ్యాచ్నే వెనుకేసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో శివాజీ బ్యాచ్ సేఫ్ అవుతున్నారని చెప్పవచ్చు. తన ఆటతో ప్రేక్షకులకు చిరాకు తెప్పించే భోలే కూడా శివాజీ బ్యాచ్ అండతో సేఫ్ అవుతున్నాడు. ఎందుకు సేఫ్ కొన్నిసార్లు ఆటలో శోభ కూడా తప్పులు చేసి ఉండవచ్చు.. ఆమెతో పాటు శివాజీ బ్యాచ్ కూడా ఎన్నో తప్పులు చేశారు. ఎందుకోగానీ శోభాశెట్టి మీద విపరీతమైన వ్యతిరేకత పెంచడానికి గట్టిగానే ప్రయత్నాలు సాగుతున్నయ్. వాటంన్నిటినీ ఆమె మళ్లీ తిప్పికొట్టింది. హౌస్లో నిలిచింది. శివాజీ బ్యాచ్తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఫైట్ చేస్తున్నందువల్ల కావచ్చు. శివాజీ టీమ్ను శోభ మాత్రమే ఢీ కొడుతుంది. అలాంటిది ఆమెను హౌస్ నుంచి పంపిస్తే ఆటలో మజా ఉండదు. షో రేటింగ్ కూడా పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఆమె సేఫ్ అయినట్లు తెలుస్తోంది. శోభ కూడా ఆటలో ఫైట్ చేస్తుంది. రెచ్చగొడుతుంది.. అప్పుడే ఏడుస్తుంది. కానీ ఏ టాస్కులనూ వదలదు. తన శక్తిమేరకు పోరాడుతుంది. ఏదేమైన ఆటలో ఉండాల్సిన కేరక్టర్ శోభ అని చెప్పవచ్చు. శివాజీ బ్యాచ్ అండతో ఆయన సేఫ్ ఎనిమిదో వారం బిగ్బాస్ నుంచి ఆట సందీప్ ఎలిమినేషన్ జరిగిపోయింది.. దాదాపు ఇదే ఖాయం. మొదటి వారంలోనే లక్కీగా ఐదు వారాలు ఎలిమినేషన్ల నుంచి ఇమ్యూనిటీ పొందాడు. ఇదే అతనికి బిగ మైనస్ అయింది. ఓట్లు వేసే వాళ్లు అతనికి చేరవు కాకుండా చేసింది. ఏడు వారల తర్వాత ఆయన ఎలిమినేషన్ లిస్ట్లో ఉండటంతో ఓట్లు వేసే ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదని చెప్పవచ్చు. ఈసారి నామినేషన్లలో చేరడంతో ఇక లీస్ట్ వోట్లతో హౌజ్ నుంచి వెనుతిరగక తప్పలేదు. ఆటలో మరీ అంత బ్యాడ్ పర్ఫామెన్స్ సందీప్ ఇవ్వలేదు. కానీ శివాజీ బ్యాచ్ కాదు.. శోభాశెట్టి బ్యాచ్… అందుకే తన మీద కూడా బాగా వ్యతిరేకతను బయట ఉండే వారు క్రియేట్ చేశారు. ఆటల్లో, టాస్కుల్లో తను యాక్టివ్గానే ఉన్నాడు. కానీ చివరకు ఔటవ్వక తప్పలేదు. వాస్తవానికి ఈ వారం లక్కీ పర్సన్ భోలే.. ఆతను శివాజీ బ్యాచ్లో చేరడం వల్లే సేఫ్ అయ్యాడు. మరోవైపు శివాజీ టీమ్కు శత్రువు అయిన శోభతో వైరం క్రియేట్ చేసుకున్నాడు. దీంతో ఆయన సేఫ్ అయ్యాడని తెలుస్తోంది. -
శోభాశెట్టి ట్రాపులో పడిన రతిక.. ఈమెది దెయ్యం తిండి అట!
బిగ్బాస్ 7 సీజన్ కొన్నాళ్ల ముందుతో పోలిస్తే ఇప్పుడు కాస్త ఇంట్రెస్టింగ్ మారింది. గొడవలు, తిట్టుకోవడాలు ఎక్కువయ్యాయి. అదే టైంలో కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్స్ కిందామీదా పడుతున్నారు. తాజాగా కెప్టెన్సీ దక్కించుకునేందుకు ఫైనల్ టాస్క్ ఒకటి పెడ్డగా.. ఇందులో శోభాశెట్టి హైలైట్ అయ్యింది. అదే టైంలో ఈమె వల్ల రతిక బండారం బయటపడింది. ఇంతకీ శుక్రవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 54 హైలైట్స్లో చూద్దాం. ప్రశాంత్ vs రతిక అక్క ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్గా ప్రియాంక, గౌతమ్, శోభా, ప్రశాంత్, సందీప్ నిలవడంతో గురువారం ఎపిసోడ్ ముగిసింది. ప్రశాంత్-రతిక మధ్య 'అక్క' అనే పదం గురించి డిస్కషన్తో శుక్రవారం ఎపిసోడ్ షురూ అయింది. తనని అక్క అని పిలవొద్దని, బయట చాలా ప్రాబ్లమ్ అయిందని రతిక చెప్పుకొచ్చింది. కానీ ప్రశాంత్ అస్సలు వినలేదు. అక్క అనే పిలుస్తానని భీష్మించుకు కూర్చున్నాడు. మధ్యలో కారణం లేకుండా ఓసారి ఏడ్చాడు కూడా. ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దిన పెద్దమనిషి శివాజీ.. రతిక-ప్రశాంత్ మధ్య సంధి కుదిర్చాడు. (ఇదీ చదవండి: తల్లి చివరి కోరిక తీర్చబోతున్న మహేశ్బాబు.. త్వరలో శుభకార్యం!) కొత్త కెప్టెన్ వచ్చాడ్రోయ్ ఇక కెప్టెన్సీ కంటెండర్షిప్ రేసులో ఉన్న ఐదుగురిలో ఎవరికి కెప్టెన్ అయ్యేందుకు అనర్హత ఉందో, వాళ్ల మెడలో ఎండుమిర్చి దండ వేయాలని.. 'ఈ మిర్చి చాలా హాట్' అనే టాస్కుని బిగ్బాస్ పెట్టాడు. చివరగా ఎవరి మెడలో అయితే తక్కువ దండలు ఉంటాయో వాళ్లే కెప్టెన్ అవుతారని అన్నాడు. ఇందులో అస్సలు ఒక్క దండ కూడా పడని గౌతమ్.. బిగ్బాస్ హౌసుకి కొత్త కెప్టెన్ అయ్యాడు. ఎవరు ఎవరికి దండేశారు? అమరదీప్ - ప్రశాంత్ తేజ - ప్రశాంత్ యవర్ - శోభాశెట్టి భోలె - ప్రియాంక అశ్విని - ప్రియాంక రతిక - శోభాశెట్టి అర్జున్ - సందీప్ శివాజీ - సందీప్ (ఇదీ చదవండి: అబద్ధం చెప్పి దొరికిపోయిన శ్రీలీల.. ఆ హీరోకి ఆల్రెడీ ముద్దు!) శోభా ట్రాప్లో ఇద్దరు అయితే ఈ టాస్కులో భాగంగా తనని అనర్హత పేరు చెప్పి మిర్చి దండ వేయడంపై శోభాశెట్టి తట్టుకోలేకపోయింది. తొలుత యవర్తో.. తొలి రెండు పోటీల్లో ఓడిపోయి, మూడే గేమ్లో గెలిచావ్ అందుకే ఈ దండ వేస్తున్నా అని కారణం చెప్పాడు. దీంతో శోభా పెద్ద గొడవ పెట్టుకుంది. ఏకంగా పిచ్చోడు అనేసింది. దీంతో అతడు నిజంగానే మెంటలెక్కినట్లు అరిచాడు. మిర్చి దండ విసిరి కొట్టాడు. దీంతో ఇద్దరి మధ్య హోరాహోరీ సాగింది. ఇది అయిన తర్వాత లివింగ్ రూంలో కూర్చుని శోభా కన్నీళ్లు పెట్టుకుంది. గేమ్లో గెలిస్తే ఓ బాధ, గెలవకపోతే ఓ బాధ అని ఏడ్చేసింది. రతిక మళ్లీ అదే తప్పు హౌసులో మాటలు మారుస్తూ అందరి ఆట చెడగొడుతుందనే కారణంతో రతిక ఇప్పటికే ఓసారి హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేస్తోంది. శోభాకి మిర్చి దండ వేసిన ఈమె.. ఏదో చెప్పాలని ప్రయత్నించింది. కానీ శోభా ఊరుకోలేదు. దీంతో చాలాసేపు గొడవ జరిగింది. 'నిన్న నువ్వే నాతో అన్నావ్.. లేడీ కెప్టెన్ ఉంటే బాగుంటుందని, ఇప్పుడు నువ్వే దండం వేస్తున్నావ్' అని రతిక నిజస్వరూపాన్ని శోభా బయటపెట్టింది. అలా శోభా కావాలనే రెచ్చగొడితే.. యవర్, రతిక ఇద్దరూ ట్రాపులో పడ్డారు. ఇది జరిగిన తర్వాత రతిక గురించి శోభా-అశ్విని మాట్లాడుకున్నారు. రతిక ఏంటి? దెయ్యంలా అంత తింటుంది! అని అశ్విని బయటపెట్టింది. రతిక.. తినడం, తిరగడం, మాట్లాడటం తప్ప హౌసులోకి ఏం చేయట్లేదని శోభా అరుస్తూ చెప్పింది. అలా శుక్రవారం ఎపిసోడ్ కాస్త నీరసంగానే ముగిసింది. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?) -
బిగ్బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?
'బిగ్బాస్ 7' షో ఇప్పుడు మంచి మజా ఇస్తోంది. ఎందుకంటే చోటామోటా కంటెస్టెంట్స్ అందరూ ఎలిమినేట్ అయిపోయారు. సగం రోజులు కూడా అయిపోయాయి. దీంతో ఎవరికి వాళ్లు హౌసులో ఉండేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎంతటి గొడవకైనా వెనుకాడటం లేదు. మరోవైపు ఈసారి ఎనిమిది నామినేట్ కాగా అందులో ఓ స్టార్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ గట్టిగా ఉంది. ఇంతకీ ఆ ఒక్కరు ఎవరో తెలుసా? హౌసులో రెండు గ్రూపులు బిగ్బాస్ షో నిర్వహకులు చెప్పేదాని ప్రకారం.. హౌసులో ఎవరికి వాళ్లు గేమ్ ఆడాలి. కానీ ప్రస్తుత సీజన్లో మాత్రం రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. పెద్ద మనిషి అని చెప్పుకొంటున్న శివాజీ.. యవర్, ప్రశాంత్, భోలెకి అండగా నిలుస్తున్నాడు. మొన్నటివరకు ఇది అంత పెద్దగా బయటపడలేదు. ఇప్పుడిప్పుడే అసలు నిజాలు బయటకొస్తున్నాయి. మరోవైపు అమరదీప్, శోభా, ప్రియాంకతో పాటు సందీప్ ఓ గ్రూపుగా ఉన్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) ఎలిమినేషన్ మజా ప్రతిసారి ఎలిమినేషన్లో ఎవరో ఒకరు వీక్ కంటెస్టెంట్ ఉండేవాళ్లు. దీంతో వాళ్లు బయటకెళ్లిపోవడం గ్యారంటీ అని తెలిసేది. కానీ ఈసారి అలా కాదు. శివాజీ, భోలె, అమరదీప్, సందీప్, శోభాశెట్టి, ప్రియాంక, గౌతమ్, అశ్విని.. ఈ వారం నామినేషన్స్లో ఉన్నారు. వీళ్లందరూ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్లు.. స్ట్రాటజీలతో గేమ్ ఆడుతున్నారు. దీంతో ఎవరూ ఎలిమినేట్ అవుతారా అని ఆసక్తి పెరిగింది. శోభాకి గండం? అయితే ఈసారి శివాజీకి ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. అనుహ్యంగా భోలె రెండో స్థానంలో ఉన్నాడట. తర్వాతి స్థానాల్లో వరసగా అమరదీప్, అశ్విని, గౌతమ్, ప్రియాంక ఉన్నట్లు సమాచారం. ఇక చివరి రెండు స్థానాల్లో సందీప్, శోభాశెట్టి దాదాపు ఒకేలా ఓట్లు పడ్డాయట. కానీ శోభాశెట్టిపై ఎలిమినేషన్ వేటు తప్పదని అంటున్నారు. ఒకవేళ అలా కాదంటే మాత్రం సందీప్ మాస్టర్ బయటకెళ్లిపోవడం గ్యారంటీ. ఈ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయినా సరే పెద్ద షాకింగే అని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: విజయ్ 'లియో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
ప్రశాంత్, శివాజీ ముందే ప్లాన్.. సంచలన వ్యాఖ్యలు చేసిన నటరాజ్
బిగ్ బాస్ సీజన్ 7 దాదాపు సగానికి పైగానే పూర్తి అయింది. ఇప్పటికే ఏడు మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఉల్టాపుల్టా పేరుతో రతికా రోజ్ రీ ఎంట్రీ వల్ల షో పట్ల మరింత బజ్ క్రియేట్ చేయాలని బిగ్ బాస్ ప్లాన్ చేశాడు. మరోవైపు ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఆటలో వినిపించే బూతులను కూడా టెలికాస్ట్ చేస్తున్నారు. భోలే, అమర్ చేసిన వ్యాఖ్యలు అందులే భాగమే... ఇన్నీ చేస్తున్నా ఆడియన్స్లో అనుకున్నంత రీచ్ అయితే ఈ సీజ్న్ చేరుకోలేదని తెలుస్తోంది. తాజాగా ఈ సీజన్పై కొరియోగ్రాఫర్, డాన్సర్, బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్ తనదైన స్టైల్లో పలు ఆసక్తకరమైన వ్యాఖ్యలు చేశాడు. శివాజీ, పల్లవి ప్రశాంత్,యావర్,రతికా రోజ్, అమర్ వంటి వారి ఆటతీరుపై ఆయన స్పందించాడు. సమాజంలో పొలిటికల్ ఇమేజ్ క్రియేట్ చేసుకునేందుకే శివాజీ బిగ్బాస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇలాంటి మాయమర్మం చేయకపోతే జనాలు నమ్మరు. ఉదాహరణకు సత్యసాయిబాబ నోటి నుంచి శివలింగం, చేతి నుంచి విభూతి తీసి ప్రజలను ఎలా నమ్మించారో తెలిసిందే. (ఇదీ చదవండి: నా మొదటి లిప్ లాక్ సీన్ ఎవరితో అంటే.. ఊహించని ఆన్సర్ ఇచ్చిన శ్రీలీల) అలాగే శివాజీ కూడా ఒక రైతు బిడ్డకు (పల్లవి ప్రశాంత్) సాయం చేస్తూ తన ఇమేజ్ను చూపించుకునేందుకు, ప్రజల నుంచి సానుభూతిని పొందేందుకు ప్లాన్ చేస్తున్నాడని అర్థం అవుతుంది. హౌస్లో ప్రశాంత్,యావర్కు మాత్రమే శివాజీ సపోర్ట్గా ఉంటున్నాడు. వారిద్దరు కాకుండా మరో వ్యక్తి ఉంటే చూపించండి. యావర్కు పెద్దగా తెలుగు రాదు కాబట్టి కొంత వరకు మొదట్లో ఇబ్బంది పడ్డాడు. అలాంటి వ్యక్తుల పట్ల ప్రజల్లో ఒక సానుభూతి క్రియేట్ అవుతుంది. మన ఇండియన్స్ అంతా సెంటిమెంట్కు పడిపోతాం అది మన బ్లడ్లోనే ఉంది. అందుకే రైతు బిడ్డ అని చెప్పగానే ప్రశాంత్పై సానుభూతితో కూడిన అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. ప్రశాంత్ గెలిస్తే శివాజీ ఎందుకు..? ఈ పాయింట్నే తెలివిగా శివాజీ అందిపుచ్చుకున్నాడు. అందుకే ప్రశాంత్కు ప్రతి విషయంలో శివాజీ సపోర్ట్ చేస్తున్నాడు. వీరిద్దరూ కూడా బిగ్బాస్ ఎంట్రీకి ముందే బయట మాట్లాడుకుని వెళ్లారని తెలుస్తోంది. ఇది నా అభిప్రాయం. వారిద్దరూ సోషల్ మీడియాలో గుర్తింపు ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్కు వేరువేరుగా ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాతే బిగ్బాస్లోకి వచ్చారు. హౌస్లో ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచే వారి ప్లాన్ను అమలు చేశారు. అందులో భాగంగానే ప్రశాంత్ నువ్వు గెలవాలి రా అని శివాజీ పదేపదే అంటున్నాడు. ప్రశాంత్ గెలిస్తే బిగ్బాస్లోకి శివాజీ ఎందుకు వెళ్లినట్లు అని నటరాజ్ ప్రశ్నించాడు. అంతేకాకుండా చాలామంది యూట్యూబర్స్, పలు సోషల్ మీడియాలను రన్ చేస్తున్న వారిని పల్లవి ప్రశాంత్ ముందే కలిసి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడని నటరాజ్ మాస్టర్ చెప్పాడు. బిగ్ బాస్లోకి వెళ్లాలని అతను గత మూడేళ్లుగా ప్రయత్నం చేస్తున్నాడు. బిగ్ బాస్ ఫ్యాన్స్ పేజీలు ఉన్న వాళ్లందరినీ ప్రశాంత్ ముందే కలిశాడు. ఇలా గ్రౌండ్ వర్క్ చేసే బిగ్ బాస్లోకి వెళ్లాడు. వాటంన్నిటికీ తోడు శివాజీ ఇస్తున్న సపోర్ట్ వల్ల కూడా ప్రశాంత్ స్ట్రాంగ్ అయ్యాడు. కానీ రైతు బిడ్డలా మాత్రం హౌజ్లో ప్రశాంత్ కనిపించడంలేదు. అతనిపై సినిమా ప్రభావం ఎక్కువ ఉంది. అతని నామినేషన్ ప్రక్రియ చూస్తున్నప్పుడు ఆ సినిమాల ప్రభావం ఈజీగా కనిపిస్తుంది. -
లవ్బర్డ్స్ శోభా-తేజ మధ్య గొడవ.. పుల్ల పెట్టిన శివాజీ!
బిగ్బాస్ 7లో ఈ వారం నామినేషన్ హడావుడి ముగిసింది. 8 మంది లిస్టులో ఉన్నారు. తాజాగా కెప్టెన్సీ కంటెండర్స్ టాస్కులు షురూ చేశాడు. ఓ రెండు గేమ్స్ జరిగాయి. మరోవైపు హౌసులో ఇప్పటికే మాటలతో మాయ చేస్తూ బండి లాక్కొచ్చేస్తున్న శివాజీ.. శోభా-తేజ మధ్య పుల్లపెట్టి మంట ఎక్కువ చేస్తే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 52 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: విజయ్ 'లియో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) అతి చేస్తున్న శివాజీ నామినేషన్స్ పూర్తవడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. ఉదయం అందరూ నిద్రలేవడంతో బుధవారం ఎపిసోడ్ స్టార్టయింది. ఇక అయిపోయిన నామినేషన్ గురించి శివాజీ ఏదేదో మాట్లాడాడు. 'నామినేషన్ అనేది తెలివైన ప్రక్రియ. కానీ ఆ టైంలో కారణాలు లేకుండా, కొందరు హీరో అయిపోదామని ఎగిరెగిరి పడుతున్నారు. ఈ ప్రక్రియని అపహాస్యం చేస్తున్నారు' అని సీరియల్ బ్యాచ్ని ఉద్దేశిస్తూ అన్నాడు. అయితే ఆ ఎగిరెగిరి పడేవాళ్లలో ప్రశాంత్ కూడా ఉన్నాడు. అంటే శివాజీ లెక్క ప్రకారం.. ప్రశాంత్కి కూడా ఈ కామెంట్ వర్తిస్తుంది. ఎందుకంటే ప్రశాంత్ కూడా నామినేషన్స్లో తప్ప మిగతా రోజులు గేమ్స్ ఆడినా సరే ఉన్నాడా లేడా అన్నట్లు పవర్తిస్తుంటాడు. కన్నీళ్లు పెట్టుకున్న శోభా స్ట్రాంగ్గా ఉండే శోభా కన్నీళ్లు పెట్టుకుంది. గత నామినేషన్స్లో భోలె మెంటల్ అనడాన్ని గుర్తుచేసుకుని మరీ తేజతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత కాసేపటికి తన ఫ్రెండ్స్ అయిన అమర్-ప్రియాంక-సందీప్ దగ్గర మాట్లాడుతూ.. భోలె ఓ వేస్ట్ కేండిడేట్ అని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: నోరు జారిన యాంకర్ సుమ.. మళ్లీ దానిపై సెటైర్లు కూడా!) కెప్టెన్సీ గేమ్స్ షురూ ఈ వారం కెప్టెన్ అయ్యేందుకు 'BB మారథాన్' పేరుతో పోటీ పెట్టనున్నారు. ఇందులో పెట్టే ఒక్కో గేమ్లో నలుగురు పోటీ పడతారు. ఇందులో గెలిచిన వాళ్లు కెప్టెన్సీ కంటెండర్ అవుతారు. చివరి స్థానంలో ఉన్నవాళ్లు ఎలిమినేట్ అవుతారు. అలా 'రిజల్ట్ ఏంటో గెస్ చేయాలంతే?' పేరుతో తొలి గేమ్ పెట్టారు. ఇందులో భాగంగా కొన్ని వస్తువులు నీటిలో వేస్తారు. అవి తేలుతాయో, మునుగుతాయో చెప్పాలంతే.. ఈ పోటీలో ప్రియాంక విజేతగా నిలవగా, అమరదీప్ ఓడిపోయాడు. శోభా, తేజ మధ్య స్థానాలు సంపాదించారు. 'డబ్బాలు సెట్ చేయాలంతే' అనే రెండో గేమ్లో ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. రతిక ఎలిమినేట్ అయిపోయింది. గౌతమ్, యవర్ కూడా ఈ గేమ్ ఆడినప్పటికీ మధ్య స్థానాల్లో నిలబడ్డారు అంతే. పుల్లలు పెడుతున్న శివాజీ రెండో గేమ్లో రతిక ఓడిపోయిన తర్వాత తేజ ఆమెతో జోక్గా.. 'ఓడిపోయినందుకు నువ్వు కూడా అన్నం తిననని బిగ్బాస్తో చెప్పు' అన్నాడు. దీంతో శోభా రెచ్చిపోయింది. తేజతో గొడవ పెట్టుకుంది. ఎందుకలా అన్నావ్ అని గట్టిగా అరుస్తూ వాదన పెట్టుకుంది. మధ్యలో తేజతో మాట్లాడిన శివాజీ.. శోభా గురించి పుల్ల పెట్టే ప్రయత్నం చేశాడు. 'అతి సర్వత్రా వర్జయాత్' అని ఏవేవో సినిమా డైలాగ్స్ కొడుతూ తేజని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఇలా చేస్తే తేజ.. శోభాకి దూరమై తన దగ్గరకు వచ్చేస్తాడని శివాజీ ఆశపడుతున్నట్లు ఉన్నాడు. ఒకటి రెండు రోజులు ముందు కూడా శోభా వెనక తిరుగుతున్నాడని తేజకి శివాజీ క్లాస్ పీకాడు. ఇవన్నీ చూస్తుంటే శివాజీ.. బిగ్బాస్లో ఆడకుండా రాజకీయాలు ఎక్కువ చేస్తున్నాడనిపిస్తోంది. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: గాలి తీసేసిన తమన్.. ఈ కౌంటర్ బోయపాటికేనా?) -
Bigg Boss 7: మళ్లీ దొరికిపోయిన శివాజీ.. అమర్ ఆ పాయింట్ చెప్పేసరికి!
బిగ్బాస్లో మిగతా వాటి సంగతెలా ఉన్నా నామినేషన్స్ మాత్రం మంచి మజా ఇస్తాయి. ఈసారి కూడా అలానే జరిగాయి. సోమవారం నాడు శోభాశెట్టి శివాజీ మీద రెచ్చిపోగా, మంగళవారం నాడు అమరదీప్ శివాజీపై రెచ్చిపోయాడు. ఎప్పుడూ హడావుడి చేసే రైతుబిడ్డ ఈసారి చల్లబడ్డాడు. ఇంతకీ మంగళవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 51 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి:'జైలర్' విలన్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?) శివాజీ రంగు బయటపడింది సోమవారం సగం నామినేషన్స్ పూర్తయ్యాయి. ఇక మిగిలిన నామినేషన్స్తో మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఫస్ట్ ఫస్ట్ వచ్చిన అమరదీప్ శివాజీని నామినేట్ చేశాడు. 'నేను చనిపోయేటప్పుడు కూడా నా పిల్లల్ని నీతో మాట్లాడొద్దని చెబుతాను' అని శివాజీ అనడం అస్సలు కరెక్ట్ కాదని అమరదీప్ అన్నాడు. అయితే ఇది జోక్గా అన్నానని శివాజీ ఏదో కవర్ చేశాడు. కానీ అమరదీప్ అలా అనేసరికి ముఖం మాడిపోయింది. కిందకు దించేసి అలా ఉండిపోయాడు. చివర్లో మాత్రం 'గుర్తులేదు, చూడలేదు, మర్చిపోయా.. దిస్ ఈజ్ మై ప్లాన్' అని శివాజీ అన్నాడు. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? అమరదీప్ - శివాజీ, భోలె యవర్ - శోభాశెట్టి, సందీప్ తేజ - అశ్విని, సందీప్ ప్రశాంత్ - గౌతమ్, అమరదీప్ రతిక - శోభాశెట్టి, అమరదీప్ అర్జున్ - తేజ, భోలె నోరు జారిన సందీప్ ఇక యవర్, సందీప్ని నామినేట్ చేశాడు. ఒకానొక దశలో సందీప్ సీరియస్ అయ్యాడు. యవర్ని ఉద్దేశిస్తూ.. 'బొంగులోది' అనే పదం ఉపయోగించడంతో పాటు చేతితో ఓ సైగ చేశాడు. దీంతో 'బొంగు' అనే పదాన్ని పదే పదే రిపీట్ చేశాడు. దీంతో ప్రతిసారి బిగ్ బాస్.. బీప్ వేసుకోవాల్సి వచ్చింది. ఈ గొడవ జరుగుతుంటే మధ్యలో వచ్చిన శివాజీకి కూడా సందీప్ గట్టిగా ఇచ్చేశాడు. (ఇదీ చదవండి: చిరంజీవి కొత్త సినిమాలో విలన్గా రామ్చరణ్ ఫ్రెండ్!) ప్రశాంత్.. ఈసారి ఏం లే మిగతారోజుల్లో ఉన్నాడో లేడో అన్నట్లు ఉండే ప్రశాంత్.. నామినేషన్స్ వచ్చేసరికి మాత్రం షర్ట్ పై బటన్ కూడా పెట్టుకుని బుద్దిమంతుడిలా రెడీ అవుతాడు. అవతల వాళ్లు చెప్పేది పూర్తికాకుండానే వాదిస్తుంటాడు. ఈసారి మాత్రం అంత సీన్ లేకపోయింది. గౌతమ్.. ప్రశాంత్ గాలి మొత్తం తీసేశాడు. తనని నామినేట్ చేయడంతో.. ప్రశాంత్ దగ్గర సరైన కారణం లేదు. రివేంజ్ నామినేషన్ చేస్తున్నాడని చెప్పాడు. ప్రశాంత్ ఎప్పుడూ చేసినట్లు గౌతమ్ బిహేవ్ చేస్తూ.. కరెక్ట్ గా చెప్పాలంటే అరుస్తూ డైలాగ్స్ చెబుతూ మరీ టీజ్ చేశాడు. దెబ్బకు ప్రశాంత్ సైలెంట్ అయిపోయాడు. ఇక అమరదీప్ని కూడా నామినేట్ చేసిన ప్రశాంత్.. తమ గ్రూప్ సభ్యుడైన భోలె గురించి మాట్లాడటం నచ్చలేదని కారణం చెప్పాడు. దీంతో గ్రూప్ రాజకీయాలు బయటపడినట్లు అయింది. గ్రూపులో ఉన్న అతడిని కంట్రోల్ చేసుకోలేకపోయారని భోలె అనడంతో.. గ్రూప్ మెంబర్ అయిన శోభా రెచ్చిపోయింది. ఇంతలో అమరదీప్ చెవిలో గౌతమ్ ఏదో చెప్పాడని ప్రశాంత్ అనడంతో గౌతమ్ రెచ్చిపోయాడు. ఏదైనా చేసుకుంటా నువ్వేమైనా బిగ్ బాస్ వా దొబ్బెయ్ అని అమరదీప్, ప్రశాంత్తో అన్నాడు. నన్ను ఏకినా, పీకినా, లాగినా ఏం చేసుకున్నా వెనకడుగు వేయను. ఒక్కటి గుర్తుపెట్టుకో ఇక్కడి నుంచి పోతే కప్పుతోనే పోతా, ఎవ్వడు ఏమైనా చేసుకోండి అని అమరదీప్ గట్టిగా అరుస్తూ ప్రశాంత్తో చెప్పాడు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. మొత్తంగా ఈ వారం ఎనిమిది నామినేట్ అయ్యారు. ఈ వారం నామినేట్ అయినోళ్లు శోభా భోలె శివాజీ అశ్విని ప్రియాంక అమరదీప్ సందీప్ గౌతమ్ (ఇదీ చదవండి: పవన్ మతిమరుపు.. సొంత సినిమా గురించే మర్చిపోయాడు!) -
బిగ్ బాస్ శుభశ్రీకి గోల్డెన్ ఛాన్స్.. పాన్ ఇండియా సినిమాలో ఎంట్రీ
బిగ్బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ శుభశ్రీ రాయగురుకు గోల్డెన్ ఛాన్స్ దక్కింది. లాయర్ కావాలని ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఈ ఒడిసా బ్యూటీ సినిమాలపై మక్కువతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. తెలుగు పరిశ్రమపై మక్కువతోనే ఇక్కడికి వచ్చానని ఆమె పలు ఇంటర్వ్యూలలో తెలిపింది. తాజాగా ఆమెకు పవన్- సుజీత్ కాంబినేషన్లో వస్తున్న 'OG' సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించేందుకు అవకాశం దక్కింది. ఇదే విషయాన్ని ఆమె ప్రకటిస్తూ డైరెక్టర్ సుజీత్తో దిగిన ఒక ఫోటోను షేర్ చేసింది. బిగ్ బాస్లో ఆట కూడా బాగా ఆడుతుంది అనుకునే లోపే అనూహ్యంగా ఆమె ఎలిమినేట్ అయిపోయింది. కానీ అంతా మన మంచికే జరిగిందిలే అని తాజాగా సుబ్బు ఫ్యాన్స్ తెలుపుతున్నారు. పవన్తో నటించే అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపింది. తన టాలెంట్ పట్ల నమ్మకాన్ని ఉంచిన డైరెక్టర్ సుజీత్కు థ్యాంక్స్ చెప్పింది. తనను అభిమానిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు అంటూ తెలిపింది. ఇకపోతే బిగ్బాస్ సీజన్ 7 నుంచి ఐదో వారంలోనే అనూహ్యంగా ఎలిమినేట్ అయింది శుభశ్రీ రాయగురు. నిజానికి సుబ్బు చాలా బలమైన కంటెస్టెంట్గా ఉన్నప్పటికీ ఆమె ఎలిమినేషన్ కావడంతో అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత ఆమె రీఎంట్రీ ఉంటుందని ఆశిస్తే అది కూడా ఊల్టాపుల్టా పేరుతో ఆమె ఆశలకు గండి పడింది. View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) -
నామినేషన్స్లో శివాజీ నిజస్వరూపం బయటపెట్టిన శోభా!
బిగ్బాస్ 7 నామినేషన్స్లో హౌస్మేట్స్ మళ్లీ మాటలతో కొట్టేసుకున్నారు. పెద్దమనిషిలా కలరింగ్ ఇస్తూ వస్తున్న శివాజీ నిజస్వరూపాన్ని శోభాశెట్టి బయటపెట్టేసింది. ఇక భోలె గురించి అయితే చెప్పనక్కర్లేదు. గతవారంలానే ఇరిటేట్ చేశాడు. లాజిక్ అనేది లేకుండా ఏదేదో మాట్లాడాడు. ఇంతకీ సోమవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 50 హైలైట్స్లో చూద్దాం. (ఇదీ చదవండి: హీరో ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదా?) రతిక గురించి డిస్కషన్ పూజామూర్తి ఎలిమినేట్, రతిక రీఎంట్రీతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. ఉదయం అందరూ నిద్రలేవడంతో సోమవారం ఎపిసోడ్ మొదలైంది. పొద్దుపొద్దునే రతిక గురించి రైతుబిడ్డ-పాటబిడ్డ బాత్రూంలో డిస్కషన్ పెట్టారు. రతిక తిరిగొచ్చింది కదా? ఎలా అనిపిస్తుందని భోలె, ప్రశాంత్ని అడిగాడు. దీంతో ప్రశాంత్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇప్పుడీ ఈ టాపిక్ ఎందుకు ఎత్తాడురా బాబు అని అనుకున్నాడు. ఎందుకు దిగాలుగా కనిపిస్తున్నావ్? అని భోలె అడగ్గా.. నాన్న వీడియో చూశా కదా! అందుకని అన్నాడు. దీంతో భోలె చల్లబడ్డాడు. రతికపై బిగ్బాస్ ప్రేమ రతికపై బిగ్బాస్కి ఎంత ప్రేముందో మళ్లీ రుజువైంది. ప్రేక్షకులే మాకు ఈమె వద్దు బాబోయ్ అని ఎలిమినేట్ చేసి బయటకు పంపేసినా, పక్కా ప్లాన్ చేసి మరీ రీఎంట్రీ పేరుతో రతికని మళ్లీ హౌసులోకి తీసుకొచ్చాడు. ఇప్పుడేమో ఈ వారం అస్సలు ఆమెని నామినేట్ చేయొద్దని ఆర్డర్ పాస్ చేశాడు. ఆమె గురించి చెప్పడానికి కంటెస్టెంట్ దగ్గరు ఎలానూ రీజన్స్ ఉండవు. కాబట్టి రతికని నామినేట్ చేయరు. అయినా సరే బిగ్బాస్ ప్రత్యేకించి చెప్పడం రతికపై ప్రేమ ఎక్కువైపోయినట్లు అనిపించింది. (ఇదీ చదవండి: స్టార్ హీరో ఇంటి గోడని కూల్చేసిన అధికారులు.. అదే కారణమా?) ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? శివాజీ - శోభాశెట్టి, ప్రియాంక అశ్విని - శోభాశెట్టి, ప్రియాంక గౌతమ్ - ప్రశాంత్, భోలె ప్రియాంక - భోలె, అశ్విని సందీప్ - అశ్విని, భోలె శోభాశెట్టి - శివాజీ, యవర్ భోలె - శోభాశెట్టి, గౌతమ్ లాజిక్స్ మర్చిపోతున్న శివాజీ ఫస్ట్ ఫస్ట్ శివాజీతో నామినేషన్స్ మొదలయ్యాయి. గతవారం నామినేషన్స్ సందర్భంగా భోలెతో గొడవపడటం తనకు నచ్చలేదని చెప్పి శోభా, ప్రియాంకని నామినేట్ చేశాడు.పెద్దోడు కదా సారీ చెప్పిన తర్వాత కూడా అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని శోభాతో అన్నాడు. శివాజీ చెప్పిన దాని ప్రకారం చూస్తే.. పెద్దోడు అయితే బూతులు తిట్టేసి సారీ చెబితే క్షమించేయాలేమో? (ఇదీ చదవండి: వాళ్లకు క్షమాపణలు చెప్పిన మెగాహీరో రామ్చరణ్) ఇచ్చిపడేసిన శోభా ఇక తన నామినేషన్స్ సందర్భంగా శోభాశెట్టి, శివాజీకి ఇచ్చిపడేసింది. 'భోలెతో గొడవ జరిగిన తర్వాత నేను తప్పు చేశానని చెప్పొచ్చు. లేదంటే వీకెండ్లో అయినా చెప్పొచ్చు. అలా కాకుండా నామినేషన్స్లో మాత్రమే చెప్పి, ప్రేక్షకులందరిముందు నన్ను బ్యాడ్ చేద్దామనుకుంటున్నారా?' అని శివాజీని అడిగింది. పైకి పెద్దమనిషి అని చెప్పుకొని.. మనుషుల్ని శివాజీ ఎలా బ్యాడ్ చేస్తున్నాడనేది శోభా ప్రశ్నతో ప్రూవ్ అయింది. అతడి నిజస్వరూపాన్ని బయటపడింది. శివాజీ ఆట చూస్తే ఒకటి మాత్రం కచ్చితంగా అర్థమవుతోంది. మాట వినేవాళ్లని మంచి చేసుకోవడం, అలా కాదంటే మెంటల్గా డౌన్ చేయడం. అమరదీప్ని తొలివారం నుంచి అలానే టార్గెట్ చేశాడు. అతడిని మెంటల్గా డిస్ట్రబ్ చేసి అల్లకల్లోలం చేశాడు. నువ్వు తోపు, తురుము అనేసరికి అమరదీప్ సరిగా కాన్సట్రేట్ చేయలేకపోయాడు. ఇప్పుడు అదే టెక్నిక్ శోభా మీద ప్రయోగిద్దామని శివాజీ చూస్తున్నట్లు ఉన్నాడు. ఎందుకంటే నామినేషన్స్లో శోభాని ఉద్దేశిస్తూ.. నిన్ను ఇక్కడి నుంచి పంపించేయాలంటే, నువ్వు మాత్రమే పోగలవు. నిన్ను ఎవడూ పంపించేయలేడు అని అన్నాడు. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న ఆ స్టార్ సింగర్.. అమ్మాయి ఎవరంటే?) -
Ashwini Sri: బిగ్బాస్ హౌస్లో రచ్చ లేపుతున్న అశ్విని శ్రీ (ఫోటోలు)
-
అందరూ మెచ్చే చిత్రాలు చేస్తా – నిర్మాత సతీష్ కుమార్
‘‘గతంలో నేను నిర్మించిన ‘బట్టల రామస్వామి బయోపిక్’, ‘కాఫీ విత్ ఏ కిల్లర్’ సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ప్రస్తుతం గౌతమ్ కృష్ణ హీరోగా ఓ చిత్రం నిర్మిస్తున్నాను. యువత, కుటుంబ ప్రేక్షకులతో పాటు అందరూ మెచ్చే చిత్రాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా’’ అని నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ అన్నారు. గౌతమ్ కృష్ణ, శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరో హీరోయిన్లుగా పి.నవీన్ కుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా రూపొందుతోంది. సెవెన్ హిల్స్పై సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు. నేడు (సోమవారం) తన పుట్టినరోజు సందర్భంగా సతీష్ కుమార్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ–‘‘ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి స్టూడెంట్ నుంచి కార్పొరేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అనే నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. గౌతమ్ కృష్ణ ప్రస్తుతం బిగ్బాస్ తెలుగు సీజన్ 7 షోలో ఉన్నారు. ఆ షో నుంచి తిరిగి రాగానే మా సినిమా చివరి షెడ్యూల్ పూర్తి చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: త్రిలోక్ సిద్దు, సంగీతం: జుడా శాండీ. -
Bigg Boss 7: గేమ్ పేరు చెప్పి మోసం? నవ్వుతున్నారనే సోయి లేకుండా!
బిగ్బాస్ షోలో మళ్లీ షాకింగ్ ఎలిమినేషన్. అలానే అందరూ ఊహించిన కంటెస్టెంట్ రీఎంట్రీ వచ్చింది. దసరా సందర్భంగా ఎపిసోడ్ ఓ రేంజులో ప్లాన్ చేశారు. కానీ అది అలా అలా సాగింది. ఆటలు, పాటలు, కన్నీళ్లు.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్ బయటకొచ్చాయి. కానీ ఓ విషయమే ప్రేక్షకులకు గుండెల్లో గునపంలా గుచ్చుకుంది. మళ్లీ మళ్లీ ఆలోచించేలా చేసింది. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 49 హైలైట్స్లో చూద్దాం. దసరా స్పెషల్ తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి కొనసాగుతోంది. బిగ్బాస్ హౌసులోనూ పండగ సరదాతో ఆదివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఫుల్ కలర్ఫుల్గా రెడీ అయి వచ్చిన నాగార్జున.. హౌస్మేట్స్కి దసరా శుభాకాంక్షలు చెప్పాడు. దసరా(DASARA)లో ఆరు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఆరు గేమ్స్ పెడతానని, వీటిలో గెలిచినవాళ్లకి సర్ప్రైజులు ఉంటాయని చెప్పాడు. ఈ పోటీల్లో ఇరుజట్లు చెరో మూడింట్లో గెలిచి సమంగా నిలిచాయి. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7' గౌతమ్ హీరోగా కొత్త సినిమా.. నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్) ఫస్ట్ టైమ్ ఏడ్చిన శోభా, యవర్ బిగ్బాస్లోకి వచ్చిన తర్వాత శోభా, యవర్ పెద్దగా ఏడవడం ఎవరూ చూడలేదు. వీళ్లు అలా స్ట్రాంగ్గా ఉండి ఆడుతున్నారు. ఆదివారం పెట్టిన గేమ్స్లో గెలిచిన తర్వాత ఇంటి నుంచి వీళ్లకు లెటర్స్ వచ్చాయి. తమ ఇంటి సభ్యులు తమ గురించి రాయడం, వాటిని వీళ్లు చదువుతూ కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ ఎమోషనల్ చేసింది. నామినేషన్స్ నుంచి సేవ్ అయినప్పుడు తేజ కూడా నాన్నని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇలా అందరినీ ఎంటర్టైన్ చేసే వీళ్లు ఎమోషనల్ కావడం డిఫరెంట్గా అనిపించింది. పూజా ఎలిమినేట్ దసరా ఎపిసోడ్లో హీరోయిన్లు రెబా మోనికా జాన్, పాయల్ రాజ్పుత్.. డ్యాన్స్ ఫెర్ఫార్మెన్సులతో అదరగొట్టారు. యంగ్ సింగర్స్ వాగ్దేవి, లాలస, శిరీష పాటలతో అలరించారు. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా అమరదీప్, అశ్విని, తేజ, గౌతమ్, ప్రశాంత్ వరసగా సేవ్ అయ్యారు. పండగ కాబట్టి ఆయా కంటెస్టెంట్స్కి సంబంధించిన కుటుంబ సభ్యులే వచ్చి సేవ్ అయినట్లు చెప్పుకొచ్చారు. పూజా, భోలె మిగలగా.. పూజా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. మరోవైపు ఈవారం ఓ లేడీ కంటెస్టెంట్ రీఎంట్రీ ఉంటుందన్నారు. అలా రతిక.. బిగ్బాస్లోకి తిరిగి అడుగుపెట్టింది. (ఇదీ చదవండి: చిన్నప్పటి ఫ్రెండ్ కోసం కదిలొచ్చిన చిరంజీవి.. స్వయంగా ఆస్పత్రికి వెళ్లి!) ప్రేక్షకులు మోసపోయారా? బిగ్బాస్లో ఎలిమినేషన్ అనేది ప్రేక్షకుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని హౌస్ట్ నాగార్జున పదే పదే చెబుతుంటాడు. అలాంటిది రతిక ఆట బాగోలేదనే కదా.. ఆమెని ఎలిమినేట్ చేసి బయటకు పంపేశారు. కానీ నిర్వహకులికి మాత్రం ఆమెని తిరిగి ఇంట్లోకి తీసుకురావాలని ప్లాన్. మరీ నేరుగా తీసుకొచ్చేస్తే షో క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. కాబట్టి దామిని, శుభశ్రీ, రతికలో ఒకరిని ఛాన్స్ ఉంటుందని కలరింగ్ ఇచ్చారు. బిగ్బాస్ సభ్యుల ఓట్ల ఆధారంగా ఈ ప్రక్రియ ఉంటుందని చెప్పారు. తీరా చూస్తే ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్లకి కాకుండా తక్కువ ఓట్లు వచ్చినవాళ్లు రీఎంట్రీ ఇస్తారని నాగార్జున అన్నాడు. దీంతో ప్రేక్షకులకు సీన్ అర్థమైపోయింది. రతికని తీసుకురావడానికే ఇదంతా చేస్తున్నారని తెలిసిపోయింది. ఆదివారం ఎపిసోడ్ చివర్లో ఆమె రీఎంట్రీ ఇవ్వడంతో ఇది కన్ఫర్మ్ అయిపోయింది. మొత్తంగా చూస్తే రతిక రీఎంట్రీ కోసం బిగ్బాస్ ఆర్గనైజర్స్.. ఓట్లేసిన ప్రేక్షకుల్ని నిర్ధాక్షిణ్యంగా మోసం చేశారనిపించింది. ఈ వారం పూజాని ఎలిమినేట్ చేసేశారు. బిగ్బాస్ ప్రస్తుతం సీజన్లో వరసగా వెళ్లిపోయిన ఏడో లేడీ కంటెస్టెంట్ ఈమె. అయితే ఏ సీజన్లోనూ జరగనంతా విచిత్రంగా ఈసారి ఎలిమినేషన్స్ సాగుతున్నాయి. అసలు ఏం చేస్తున్నారో? ఏ లాజిక్ ప్రకారం వరసగా లేడీ కంటెస్టెంట్స్ని ఎలిమినేట్ చేస్తున్నారనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఇలాంటి వాటి వల్ల బిగ్బాస్ చూస్తున్న ఆ కొద్దిమంది కూడా ఓట్లేసినందుకు నవ్వుకుంటున్నారు! (ఇదీ చదవండి: 'అల వైకుంఠపురములో' నటుడికి నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?) -
బూతులు బిగ్ బాస్లోనే కాదు.. బయట మరీ దారుణం..ఆమెను రేప్ చేస్తారంటూ
బిగ్బాస్ సీజన్ 7లో ఒక ప్రత్యేకత చోటు చేసుకుంది. ఈసారి ఆటలోని కంటెస్టెంట్లు అదుపు తప్పి బూతులు మాట్లాడటం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా గేమ్స్, టాస్కులు, నామినేషన్లలో హీట్ సంభాషణలు పెరిగి నాలుకలు అదుపు తప్పుతుంటయ్… అది సహజమే గతంలో కూడా ఉండేవి కానీ వాటిని టెలికాస్ట్ చేసే వాళ్లు కాదు. ప్రస్తుతం ప్రోగ్రామ్పై బజ్ క్రియేట్ చేసేందకు ఇవన్నీ తప్పడం లేదని తెలుస్తోంది. బిగ్బాస్ హౌస్లో ఇలా ఉంటే బయట వారి ఫ్యాన్స్ చేసే భూతుల రచ్చ తారా స్థాయికి చేరింది. తను అభిమానించే వ్యక్తి గెలుపు కోసం మరో ఇంటి ఆడబిడ్డపై బూతులతో దాడిచేస్తారా..?ముఖ్యంగా హౌస్లోని లేడీ కంటెస్టెంట్లు శోభ, ప్రియాంకలతో పాటు ఎలిమినేట్ అయిన రతికా రోజ్ను మాటలతో చెప్పలేని భూతు పదాలతో దాడిచేస్తున్నారు. ఆటలో వారికి నచ్చిన స్ట్రాటజీ ఉపయోగించి ముందుకు వెళ్తున్నారు. నచ్చకుంటే ఓటు వేయకండి అని ప్రచారం చేయడంలో ఎలాంటి తప్పులేదు. కానీ అసభ్య పదాలతో వినకూడని మాటలతో వారిద్దరిపై ఎదురు దాడి జరుగుతుంది. రేప్ కూడా చేస్తారు అంటూ కామెంట్లు బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్లలో ఒకరిపై (పేరు తెలపడం లేదు) రేప్ కూడా చేస్తారు.. ఏం చేస్తారో చెప్పండి అంటూ ఒక మహిళ తనకు నచ్చిన కంటెస్టెంట్ను వెనుకేసుకొస్తూ.. సోషల్ మీడియాలో కామెంట్ చేసి వీడియో షేర్ చేసింది. ఇంతటి ఉన్మాదం ఎందుకు...? ఎవరి కోసం..? భోలే చెప్పినట్లు ఎర్రగడ్డలో చేర్పించాల్సింది శోభను కాదు... ఇలాంటి సిగ్గుమాలిన కామెంట్లు చేసే వారందరిని అక్కడ వైద్యం కోసం చేర్పించాలి. అలాగే అమర్దీప్, సందీప్ కుటుంబ సభ్యులపై కూడా ఇలాంటి దాడే జరుగుతుంది. ఒకరి గెలుపు కోసం ఇంతటి నీచానికి పాల్పడటం ఎంత వరకు కరెక్ట్ అని విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి చెత్త పనులు మొదట ప్రారంభించేది హౌస్లోని కంటెస్టెంట్ల పీఆర్ టీమ్ వారే... వారికి నచ్చని వారిపై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకుంటారు. బూతులు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదులుతారు. వాటికి కనెక్ట్ అయిన కొందరు కామన్ ఫ్యాన్స్ షేర్ చేస్తుంటారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: మాటలు మార్చి దొరికిపోయిన రైతుబిడ్డ.. ఫ్రూప్స్తో సహా మొత్తం!) నామినేషన్ల సమయంలో సింగర్ భోలే బూతుల ధారను తాజాగా నాగార్జున కూడా తప్పుబట్టారు. ప్రశాంత్ మీకు బరాబర్ చేసిండు.. అంటూ ఒక బీప్ మాట ఏదో వేసుకున్నాడు భోలే. ఆ సమయంలో ప్రియాంక, శోభాశెట్టి సక్సెస్ఫుల్గా వాటిని తిప్పికొట్టారు కూడా. ఇలాంటి భాషను, ఈ బూతుల్ని సహించేది లేదంటూ తీవ్ర స్థాయిలో తిరగబడ్డారు. చివరకు తన తప్పును తెలుసుకుని సారీ చెప్పి తలవంచాల్సి వచ్చింది. దీంతో సహజంగానే ట్రోలర్లు రెండువైపులా చేరిపోయారు. మాయాస్త్రం టాస్కులో కూడా అమర్ వర్సెస్ ప్రశాంత్… అమర్ బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి, వాడు రీజన్ లేకుండా నన్ను తీసేశాడు.. వాడి వల్ల నా గేమ్ నాశనం అయిందటూ వినరాని పరుష వ్యాఖ్య చేశాడు. ఈ పదం వాడినప్పుడు కూడా ప్రియాంకే సాక్షి… అప్పుడు కూడా అమర్ను 'నోరు జాగ్రత్త' అని హెచ్చరించింది. (ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి'కి షాకిచ్చిన తారక్,మెగా ఫ్యాన్స్.. భారీగా నష్టాలు) శోభాశెట్టిని, ప్రియాంకలను తిట్టడంతో పాటు. అమర్ దీప్ అమ్మగారిని, అతని భార్యను కూడా భూతులు తిట్టడం అధికం అయింది. సోషల్ మీడియాలో భూతుల దాడి తట్టుకోలేక అమర్ తల్లి కన్నీరు పెట్టింది. ముఖ్యంగా ప్రశాంత్ పీఆర్ టీమ్ ఇతర కంటెస్టెంట్లపై బూతు పదాలతో ఎక్కువగా దాడి చేస్తున్నారనేది మెజారిటీగా వినిపిస్తోంది. మరోవైపు సందీప్ భార్య జ్యోతి పరిస్థితి అదే. బిగ్బాస్లో ఉండాలంటే ఆయా కంటెస్టెంట్ల సోషల్ మీడియా బ్యాచులు సైట్లనూ మేనేజ్ చేయాలాల్సిందేనా అనే అపవాదు కనిపిస్తుంది. గతంలో ఏ సీజన్లో కూడా పీఆర్ టీమ్ ప్రభావం అంతగా లేదు. కానీ ఈ సీజన్లో మాత్రం దాదాపు చాలా మందికి పీఆర్ టీమ్ ఉంది. ఎప్పుడూ లేని విధంగా వారు బూతులు క్రియేట్ చేయడం చాలా బాధకారం. ఇవన్నీ చూస్తున్న కామన్ ప్రేక్షకులు కూడా షో నుంచి దూరం అవుతున్నారు. గత సీజన్ను తిరస్కరించినట్టుగానే ఈ సీజన్కు కూడా చాలామంది దూరమైపోయారు. -
Bigg Boss 7: మాటలు మార్చి దొరికిపోయిన రైతుబిడ్డ.. ఫ్రూప్స్తో సహా మొత్తం!
బిగ్బాస్ 7లో ఆడుతున్న రైతుబిడ్డ మాటల మార్చి దొరికిపోయాడు. ప్రూఫ్స్తో సహా హోస్ట్ నాగార్జున ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఇక శివాజీ హౌసులో ఉంటాడా? వెళ్లిపోతాడా అనే దానిపై క్లారిటీ వచ్చేసింది. ఇన్నాళ్లు శివాజీ గురించి పెద్దగా మాట్లడని కంటెస్టెంట్ అతడి గురించి నిజాల్ని బయటపెట్టాడు. ఇంతకీ శనివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 48 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. భోలెకి నాగార్జున క్లాస్ కెప్టెన్సీ టాస్కులో సందీప్, అర్జున్ చివరి స్టేజీకి చేరుకోవడంతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. వీళ్లిద్దరి మధ్య ఫైనల్ గేమ్ పెట్టడంతో శనివారం ఎపిసోడ్ మొదలైంది. ఇందులో గెలిచిన అర్జున్.. బిగ్బాస్ 7 హౌసుకి మూడో కెప్టెన్ అయ్యాడు. ఇక ఇదంతా చూసిన హోస్ట్ నాగార్జున ప్రస్తుతానికి వచ్చేశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడిన తర్వాత ఒక్కొక్కరికీ క్లాస్ పీకాడు. ఈ వారం నామినేషన్స్లో బూతులు మాట్లాడి అతి చేసిన భోలెకి గట్టిగా పడ్డాయి. అతడు మరోసారి ఇలాంటివి జరగవని చెప్పాడు. దీంతో సమస్య అక్కడితో సాల్వ్ అయింది. (ఇదీ చదవండి: అవార్డ్ విన్నింగ్ సౌత్ సినిమా.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి) రైతుబిడ్డ నిజస్వరూపం రైతుబిడ్డ అనే ట్యాగ్తో ప్రతిసారి సింపతీ గేమ్ ఆడుతున్న ప్రశాంత్.. ఈసారి అడ్డంగా దొరికిపోయాడు. ఈ వారం నామినేషన్స్లో భాగంగా.. సందీప్ తనని 'ఊరోడు' అని అన్నాడని, అది తనకు నచ్చలేదని కారణం చెప్పాడు. ఇప్పుడు అదే విషయాన్ని బయటకు తీసిన హోస్ట్ నాగార్జున.. మొత్తం గొడవ క్లియర్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే నామినేషన్స్లో పూనకం వచ్చినట్లు రెచ్చిపోయిన ప్రశాంత్.. నాగ్ అడిగేసరికి మాత్రం నంగనాచి కబుర్లు చెబుతూ పిల్లిలా ప్రవర్తించాడు. హౌస్ట్ నాగార్జున.. ప్రశాంత్ చేసి తప్పని నేరుగా చెప్పొచ్చు. కానీ అలా చేయలేదు. ఇంట్లోని సభ్యులైన పూజా, అర్జున్లతో ఈ విషయాన్ని చెప్పించాడు. ప్రశాంత్ మాటలు మార్చేస్తున్నాడని ఈ ఇద్దరు చెప్పారు. దీంతో రైతుబిడ్డ నిజస్వరూపం బయటపడినట్లయింది. అయితే సందీప్ చెప్పిన తర్వాత అలా కాదు ఇలా అన్నానని చెప్పడానికి ప్రయత్నించానని, కానీ చెప్పే అవకాశం ఇవ్వలేదని నాగార్జునతో చెప్పాడు. కానీ ఇది కూడా అబద్ధమే. నాగ్ పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఈ గొడవని పుల్స్టాప్ పెడదామని ఫిక్స్ అయిన నాగ్.. 'నేను గర్వంగా చెబుతున్నా మా నాన్న ఊరోడు' అని అనడంతో ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. కానీ ప్రశాంత్ మాటలు మార్చి అడ్డంగా దొరికిపోవడంతో అతడి పరువంతా పోయినట్లయింది. (ఇదీ చదవండి: రాజమౌళికి షాక్.. డిజాస్టర్ దర్శకుడి చేతిలో 'మహాభారతం' సినిమా) పాము నిచ్చెన గేమ్ ఇక బిగ్బాస్ 7వ సీజన్ 100 రోజుల గేమ్ అని, శనివారం 50వ రోజు అని చెప్పిన నాగార్జున.. పాము-నిచ్చెన అనే గేమ్ పెట్టాడు. ఇందులో భాగంగా ఒక్కో కంటెస్టెంట్స్.. హౌసులోని తమకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఎవరు కిందకు లాగుతున్నారు? అనేది చెప్పాల్సి ఉంటుంది. కంటెస్టెంట్.. నిచ్చెన, పాము ఎవరు? అశ్విని.. గౌతమ్, శోభా గౌతమ్.. అర్జున్, శివాజీ శివాజీ.. యవర్, అమరదీప్ అమరదీప్.. అర్జున్, తేజ అర్జున్.. గౌతమ్, శివాజీ యవర్.. శివాజీ, గౌతమ్ పూజా.. అర్జున్, అశ్విని ప్రియాంక.. శోభా, అశ్విని భోలె.. శివాజీ, శోభాశెట్టి శోభాశెట్టి.. ప్రియాంక, భోలె సందీప్.. శోభా, శివాజీ తేజ.. అమరదీప్, యవర్ ప్రశాంత్.. శివాజీ, పూజా ఈ ఆటలో భాగంగా శివాజీ రెండు వైపుల ఉన్నాడు. అతడి సపోర్టర్స్ అయిన ప్రశాంత్, యవర్, భోలె.. నిచ్చెన అని చెప్పారు. మరోవైపు గౌతమ్, అర్జున్,సందీప్.. శివాజీ పాములాంటోడని చెప్పారు. మరోవైపు శివాజీ.. తన ఆరోగ్యం గురించి నాగార్జునతో మాట్లాడాడు. శరీరం సహకరించట్లేదని బయటకెళ్లిపోతానని అన్నాడు. ఉండమని చెప్పడంతో.. ఫిజియోని ఏర్పాటు చేయాలని శివాజీ అన్నాడు. దీనికి నాగ్ ఒప్పుకొన్నాడు. అలా శనివారం ఎపిసోడ్ పూర్తయింది. ఏడో వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనేది ఆదివారం ఎపిసోడ్లో తేలుతుంది. (ఇదీ చదవండి: 'టైగర్ నాగేశ్వరరావు'.. ఇప్పుడు జాగ్రత్త పడి ఏం లాభం?) -
నోటికొచ్చింది వాగుతున్న శివాజీ.. మళ్లీ మంచోడిలా కవరింగ్!
బిగ్బాస్లో శివాజీ ఉండలేకపోతున్నాడు. గత ఆరువారాల నుంచి ఏదో మాటలు, మరోవైపు మైండ్ గేమ్తో నెట్టుకొచ్చేశాడు గానీ ఇప్పుడు వాటికి కూడా స్కోప్ లేకుండా పోయింది. ఓ విషయాన్ని తాను చేస్తే ఘనకార్యం అనుకుంటాడు. పక్కనోళ్లు చేస్తే మాత్రం నాన్సెన్స్ అంటున్నాడు. అమరదీప్తో జరిగిన ఓ సంఘటనతో ఇది బయటపడింది. ఇంతకీ శుక్రవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 47 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7: మళ్లీ షాకింగ్ ఎలిమినేషన్.. ఏడోవారం కూడా అమ్మాయే?) శివాజీపై బిగ్బాస్ ప్రేమ కెప్టెన్సీ టాస్క్ పూర్తి కావడంతో గురువారం ఎపిసోడ్ ముగిసింది. కెప్టెన్సీ టాస్కులో విజేతని ప్రకటించడంతో శుక్రవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. టాస్కులో విజయం సాధించిన జిలేబీపురం గ్రామస్థులు కెప్టెన్సీ కంటెండర్స్గా నిలిచారు. అయితే సంచాలక్గా వ్యవహరించిన శివాజీకి కూడా ఛాన్స్ ఉందని, కాకపోతే గెలిచిన జట్టులో ఒకరితో ఎక్సేంజ్ చేసుకోవాల్సి ఉంటుందని బిగ్బాస్ చెప్పాడు. దీంతో భోలె.. తన కంటెండర్షిప్ శివాజీకి దానం చేశాడు. కొత్త కెప్టెన్ ఎవరు? కెప్టెన్సీ కంటెండర్షిప్ కోసం పోటీలో ఉన్న ఆరుగురిలో (ప్రియాంక, అర్జున్, సందీప్, ప్రశాంత్, అశ్విని, శివాజీ) ఎవరు కెప్టెన్ కావాలనేది ప్రత్యర్థి జట్టు గులాబీపురం చేతిలో ఉంటుందని బిగ్బాస్ ఫిట్టింగ్ పెట్టాడు. దీంతో శోభా వచ్చి అశ్వినిని ఎలిమినేట్ చేసింది. అమరదీప్.. శివాజీని ఎలిమినేట్ చేశాడు. పూజామూర్తి.. ప్రశాంత్ని ఎలిమినేట్ చేసింది. యవర్.. ప్రియాంకని ఎలిమినేట్ చేశాడు. ఫైనల్గా అర్జున్, సందీప్.. కెప్టెన్సీ కోసం పోటీపడబోతున్నారు. (ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'భగవంత్ కేసరి' డైరెక్టర్) శివాజీ అసహనం బిగ్బాస్లో ఉన్నప్పుడు ఎన్ని వారాలు, ఎలాంటి టాస్కులైనా సరే అన్నింటికి తట్టుకుని నిలబడాలి. ఈ క్రమంలోనే విజయం సాధించొచ్చు లేదంటే అక్కడివరకు వచ్చామనే ఆనందంతోనైనా బయటకెళ్లొచ్చు. తొలి కొన్నివారాలు మాటలు చెప్పుకొని శివాజీ మంచిగా బండి లాక్కోచేశాడు గానీ ఇప్పుడు శరీరంలోని సహనం అంతా పోయింది. దీంతో నోటికొచ్చింది మాట్లాడుతున్నాడు. కెప్టెన్సీ టాస్కులో భాగంగా అమరదీప్ శివాజీని నామినేట్ చేసి ఎలిమినేట్ చేసేశాడు. దీంతో శివాజీ.. 'నేనో వేస్ట్ కేండిడేట్లా కనిపిస్తున్నా. నేను ఈ హౌసులో పనికిరాను. నాకు ఈ హౌస్ వద్దు, నువ్వు(బిగ్బాస్) వద్దు, తలుపు తీస్తే నేను వెళ్లిపోతా' అని ఏది పడితే అది మాట్లాడాడు. లాజిక్ మర్చిపోయిన శివాజీ అయితే ఐదోవారమే కెప్టెన్ అయ్యే ఛాన్స్ వచ్చినా దాన్ని ప్రశాంత్ కోసం శివాజీ త్యాగం చేశాడు. అప్పుడేమో పెద్ద త్యాగమూర్తిలా నీతులు చెప్పాడు. ఇప్పుడు అమరదీప్.. తనని సైడ్ చేసేసరికి బుర్ర బాదుకున్నాడు. ఈ విషయమై అమర్, సందీప్తో మాట్లాడుతూ కరెక్ట్ లాజిక్ చెప్పాడు. 'ఆయనకు వాళ్లు(ప్రశాంత్, యవర్) ఎంత ముఖ్యమో నాకు నా వాళ్లు అంతే ఇంపార్టెంట్ కదా?' అని అమరదీప్ అన్నాడు. అప్పుడేమో శివాజీ, ప్రశాంత్కి కెప్టెన్సీ వచ్చేలా చేయొచ్చు. ఇప్పుడు మాత్రం అమర్.. తన వాళ్లకు కెప్టెన్సీ ఇవ్వాలని చూసేసరికి శివాజీకి ఎక్కడలేని కోపమొచ్చేసింది. ఇదెక్కడి లాజిక్కో శివాజీకే అర్థం కావాలి. తీరా కాసేపటి తర్వాత అమర్తో అనరాని మాటలు అన్నాడు. 'నేను చచ్చిపోయేటప్పుడు కూడా నా పిల్లలకు నిన్ను నమ్మొద్దని చెబుతాను' అని శివాజీ తనతో అన్నట్లు అమర్, శోభా దగ్గర ఆవేదన వ్యక్తం చేశాడు. మరో సందర్భంలో శివాజీ, తేజతో మాట్లాడుతూ శోభా వెనక తిరగడంపై అతడికి క్లాస్ పీకాడు. (ఇదీ చదవండి: అబ్బ.. ఏం డ్రామా శివాజీ.. అమర్దీప్పై అంత పగ దేనికి?) వెళ్లిపోతానని ఒకటే గోల ఇదే ఎపిసోడ్లో శివాజీని కన్ఫెషన్ రూంలోకి పిలిచిన బిగ్బాస్... ఎలా ఉన్నారు? అని అడిగాడు. దీంతో శివాజీ జరిగిదంతా చెప్పాడు. 'చాలా ఇబ్బంది పడుతున్నా, చెయ్యంతా లాగుతుంది, నన్ను బయటకు పంపేయ్ బిగ్బాస్.. రోజు ఏడుస్తున్నా, ఎవరైనా ఉంటే నవ్వుతూ ఏడుస్తున్నా, ఇలా పిల్లలతో మాటలు పడటం కావట్లేదు. అన్ని ఉన్నాయ్ కానీ న్యాయం చేయలేకపోతున్నా, చాలా ఆశలతో ఇక్కడికి వచ్చా కానీ టైం పడతది బిగ్బాస్.. తెలుస్తుంది నా బాడీ నాకు కోపరేట్ చేయట్లేదని, అమరదీప్ చెప్పింది కరెక్టే, నేను వెళ్తా బిగ్బాస్.. వాళ్లందరి ముందు ఏడవలేకపోతున్నా. నాకు చాలా బరువుగా ఉంది. నేనుంటే కప్ కొడతానని నాకు తెలుసు. కప్పు కొడదామనే వచ్చా. మంచిగా ప్రారంభించినా, ఇప్పుడు పరిస్థితులు నాకు సహకరించట్లేదు. మీతో మాట్లాడుతుంటే కూడా నొప్పిగా ఉంది, కానీ దీన్నంతా కవర్ చేసుకుని అక్కడ నవ్వుతూ మాట్లాడుతున్నా' అని ఎమోషనల్ అయ్యాడు. అయితే మరోసారి డాక్టర్కి చూపించిన తర్వాత చూద్దాం అని బిగ్బాస్ చెప్పుకొచ్చాడు. శివాజీని ఎందుకు ఉంచుతున్నట్లు? ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఫిజికల్ టాస్కుల పరంగా శివాజీ ఒక్కటి ఆడట్లేదు. ఓసారి ఆడిన దానికే చెయ్యికి దెబ్బ తగిలింది. ఇప్పటికీ నొప్పితే విలవిల్లాడిపోతున్నాడు. అలానే ఇప్పటికే 10-15 సార్లు కంటే ఎక్కువగానే.. బయటకెళ్లిపోతా బయటకెళ్లిపోతా అని చెబుతున్నాడు. ఇంత చెబుతున్నాడు. ఇంతలా పోతా పోతా అని అంటున్నా సరే బిగ్బాస్, శివాజీపై ఎందుకు ప్రేమ చూపిస్తున్నాడనేది అర్థం కాని ప్రశ్నలా మారిపోయింది. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. ఈసారి ఆదివారం కాకుండా శనివారం ఎలిమినేషన్ ఉందంటున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: రెండోసారి తండ్రి అయిన 'బలగం' డైరెక్టర్ వేణు) -
బిగ్బాస్ 7: మళ్లీ షాకింగ్ ఎలిమినేషన్.. ఏడోవారం కూడా అమ్మాయే?
బిగ్బాస్ 7 సీజన్లో మరో షాకింగ్ ఎలిమినేషన్ తప్పేలా కనిపించడం లేదు. సాధారణంగా ఆదివారం ఇంటినుంచి బయటకు పంపిస్తూ ఉంటారు. కానీ ఈసారి అది శనివారం ఉండనుందట. అలానే వరసగా ఏడో వారం కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇది మాత్రం ఓ రకంగా ట్విస్ట్ అని చెప్పొచ్చు. బిగ్బాస్లో అసలేం జరుగుతోంది? నామినేషన్స్లో ఏడుగురు ఈసారి నామినేషన్స్ హోరాహోరీగా జరిగాయి. పల్లవి ప్రశాంత్, అమరదీప్, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, పూజామూర్తి, అశ్విని, భోలె షావళి ఈ లిస్టులో ఉన్నారు. వీళ్లలో ఓటింగ్ పరంగా చూసుకుంటే పల్లవి ప్రశాంత్, అమరదీప్ టాప్లో ఉన్నారు. మిగిలిన ఐదుగురిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారా అనేది బుధవారం నుంచి చాలా సస్పెన్స్గా అనిపించింది. (ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'భగవంత్ కేసరి' డైరెక్టర్) భోలె ఓటింగ్ ట్విస్ట్ ఇక ఈ వారం నామినేషన్స్ సందర్భంగా బూతులు, ఆడపిల్లలపై కామెంట్స్ చేసి ఇరిటేషన్ తెప్పించి భోలె.. ఈసారి ఎలిమినేట్ అయిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ తర్వాత అతడు ఓటు బ్యాంక్ పెంచుకుని ఏకంగా మూడో స్థానానికి వచ్చేశాడు. గౌతమ్ మాత్రం మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయాడు. నాలుగులో తేజ ఉన్నట్లు తెలుస్తోంది. మళ్లీ అమ్మాయేనా? ఇక చివరి రెండు స్థానాల్లో అశ్విని, పూజామూర్తి ఉన్నారు. వీళ్లలో ఓటింగ్ పరంగా చూసుకుంటే పూజాకే తక్కువ శాతం ఉంది. దీంతో ఈసారి ఆమెనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు గట్టిగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరసగా ఆరువారాలపాటు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. మళ్లీ ఇప్పుడు అమ్మాయి అని టాక్ వినిపిస్తుండటం విచిత్రంగా అనిపిస్తుంది. చూడాలి మరి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది? (ఇదీ చదవండి: రెండోసారి తండ్రి అయిన 'బలగం' డైరెక్టర్ వేణు) -
వాళ్లు చెబితే ఒప్పుకోలేదు.. ఇప్పుడేమో శివాజీ నిజం బయటపెట్టాడు!
బిగ్బాస్ 7లో శివాజీ ఓ ఆటగాడు. కానీ అనుకోకుండా గాయపడ్డాడు. వయసు రీత్యా కాస్త ఇబ్బంది పడుతున్న హౌసులో ఉన్నాడు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ గత కొన్నివారాల నుంచి కంటెస్టెంట్స్ అందరూ ఓ విషయాన్ని అస్సలు ఒప్పుకోలేదు. ఇప్పుడేమో కంగారులో తనకు తానే నిజం బయటపెట్టాడు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 45 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: 'బిగ్బాస్'లో డబుల్ మీనింగ్ డైలాగ్స్.. 'జబర్దస్త్'ని మించిపోయిందిగా!) శివాజీ ఏడుపు నామినేషన్స్ పూర్తి కావడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. ఉదయం నిద్రలేవడంతో బుధవారం ఎపిసోడ్ మొదలైంది. ఇకపోతే బిగ్బాస్లోకి ఎవరొచ్చినా సరే గేమ్స్ ఆడాలి, మాటలతో మెప్పించాలి. అవతల వాళ్లని నొప్పించి అయినా సరే విజయం సాధించాలి. తప్పు రైటో పక్కనబెడితే యాక్టివ్గా ఉండాలి. కానీ శివాజీ మాటలతో కాలక్షేపం చేస్తున్నాడు. కొన్నిరోజుల ముందు గేమ్ ఆడితే గాయపడ్డాడు. దీంతో హౌసులో ఉండటమైతే ఉన్నాడు గానీ బిగ్బాస్ శివాజీని అస్సలు కష్టపెట్టట్లేదు. దీంతో శివాజీకి చిరాకేస్తుంది. అదే విషయాన్ని పరోక్షంగా చెబుతూ.. 'నేను ఇక్కడ ఉండలేకపోతున్నా, మీ ఇద్దరి (ప్రశాంత్, యవర్) కోసమే ఉంటున్నాను' అని యవర్తో చెబుతూ ఏడ్చేశాడు. గత కొన్నివారాల నుంచి కంటెస్టెంట్స్ ఇదే విషయాన్ని చెప్పారు. శివాజీ అన్న.. మీరు ప్రశాంత్, యవర్కి సపోర్ట్ చేస్తున్నారని అంటే.. ఇతడు ఒప్పుకోలేదు. ఇప్పుడేమో ఏడుస్తూ అసలు నిజం బయటపెట్టేశాడు. (ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి' సినిమా రిలీజ్కి ముందే రూ 3.5 కోట్లు నష్టం?) గులాబీపురం vs జిలేబీపురం నామినేషన్స్ అయిపోయింది. ఇక కొత్త కెప్టెన్ కోసం టాస్క్ పెట్టాలి. ఇందులో భాగంగా ఓ స్పేస్ షిప్ కూలిపోయింది. అందులో గ్రహాంతర వాసుల్ని ఎవరైతే ఎంటర్టైన్ చేస్తారో వాళ్లకు పాయింట్స్ దక్కుతాయి. ఇందుకోసం హౌసులో ఉన్నవాళ్లు.. గులాబీపురం, జిలేబీపురం అనే ఊరిలో వ్యక్తులుగా గెటప్స్ వేసి కాసేపు అలరించారు. కానీ ఇదేమంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. బిగ్బాస్కి కూడా ఇదే అర్థమైపోయినట్లుంది. ఎక్కువసేపు లాగకుండా త్వరగా ముగించాడు. గుడ్లు పగిలాయ్ ఎంటర్టైన్మెంట్ టాస్క్ తర్వాత ఎగ్స్ టాస్క్ పెట్టారు. రిలే రేసులో ఉన్నట్లు నలుగురు ఉంటారు. ఒక చోట నుంచి మరోచోటుకి గుడ్డు ఓ బల్లపై తీసుకెళ్లాలి. ఎవరు ఎక్కువ తీసుకెళ్తే వాళ్లే విజయం సాధించినట్లు. ఈ గేమ్లో జిలేబీపురం టీమ్ విజయం సాధించింది. అలా బుధవారం ఎపిసోడ్ పెద్దగా మెరుపుల్లేకుండా ముగిసింది. (ఇదీ చదవండి: స్టార్ హీరో 25వ సినిమా.. 25 వేల మందికి అన్నదానం) -
'బిగ్బాస్'లో డబుల్ మీనింగ్ డైలాగ్స్.. 'జబర్దస్త్'ని మించిపోయిందిగా!
బిగ్బాస్ 7 తెలుగు సీజన్ ఉన్నంతలో ఓ మాదిరిగా నడుస్తోంది. గొడవలు, అరుపులు, నామినేషన్స్, ఎలిమినేషన్స్తో అలా అలా సాగుతోంది. వారం పదిరోజుల క్రితం వైల్డ్ కార్ట్ కంటెస్టెంట్స్ అని చెప్పి ఐదుగురిని తీసుకొచ్చారు గానీ పెద్దగా మార్పేం రాలేదు. ఇన్నాళ్ల మాటల విషయంలో కాస్త కంట్రోల్ గా ఉన్నోళ్లు ఇప్పుడు ఆ ఒక్క విషయంలో హద్దులు దాటేశారు! డబుల్ మీనింగ్ మాటలతో రెచ్చిపోయారు. (ఇదీ చదవండి: Bigg Boss 7లో భోలె గలీజు పురాణం.. ఆడపిల్లలని చూడకుండా ఆ కామెంట్స్!) ఇంతకీ ఏమైంది? బిగ్బాస్ 7లో ప్రస్తుతం ఏడోవారం నడుస్తోంది. భోలె, అశ్విని, తేజ, ప్రశాంత్, పూజా, అమరదీప్, గౌతమ్ నామినేట్ అయ్యారు. సోమ,మంగవారాల్లో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. బుధవారం నుంచి కెప్టెన్సీ టాస్క్ మొదలుకానుంది. అయితే హౌస్ అంతా మరీ సీరియస్గా ఉందని చెప్పి కెప్టెన్సీ కోసం చిన్న ఫన్నీ టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా రెండు పల్లెటూళ్లు, అందులోని క్యారెక్టర్స్ అని అందరూ ఆయా పాత్రలిచ్చారు. అంతా బాగానే ఉంది కానీ శివాజీ, ప్రశాంత్ చెప్పిన డైలాగ్స్ శ్రుతిమించినట్లు అనిపించాయి. ఏం డైలాగ్స్? ఈ టాస్కులో భాగంగా ప్రశాంత్ 'అన్నా తిప్పేద్దునా' అని అంటే.. పక్కనే ఉన్న అశ్విని.. 'ఏంటిరా నువ్వు నన్ను తిప్పేది' అని అంటుంది. దీనికి బదులుగా 'నా చెంచా' అని ప్రశాంత్ అంటాడు. ఇంతలో శివాజీ అక్కడికొచ్చి.. 'ఊరుని ఒక ఊపు ఊపుతున్నవటా కదా' అని అంటాడు. 'ఇంత అందగత్తెని మరి ఆ మాత్రం ఊపనా ఏంటి?' అని అశ్విని అంటుంది. 'నీ అందం ఏంటో చూద్దాం తోటకి రా ఓసారి' అని శివాజీ కౌంటర్ ఇస్తాడు. పక్కనే ఉన్న సందీప్.. 'ఓ పెద్దాయన చాలా లేతాకు' అంటే, దానికి శివాజీ కౌంటర్ ఇస్తూ.. 'ఆకేదైనా ఆకే కదరా, మేము సున్నం రాస్తాం' అని అంటాడు. సరిగ్గా గమనిస్తే మాట్లాడే విషయంలో హద్దులు దాటేశారా అని డౌట్ వస్తుంది. అలానే ఇలాంటి డైలాగ్స్ విషయంలో 'జబర్దస్త్' షోని మించిపోతున్నారుగా అనే సందేహం రాకమానదు. (ఇదీ చదవండి: స్టార్ హీరో 25వ సినిమా.. 25 వేల మందికి అన్నదానం) -
భోలె గలీజు పురాణం.. ఆడపిల్లలని చూడకుండా ఆ కామెంట్స్!
బిగ్బాస్ ఎపిసోడ్ చూస్తుంటే అయితే ఎంటర్టైన్మెంట్ లేదంటే విసుగొస్తుంది. కానీ చిరాకు మాత్రం రాదు. అయితే ఇప్పుడు ఓ కంటెస్టెంట్ వల్ల అదే జరిగింది. హౌసులో గలీజుగా బూతులు మాట్లాడాడు. అది కూడా ఆడపిల్లల ముందు. పైగా దానికో పిచ్చి సమర్ధన. ఇదంతా కూడా మంగళవారం నామినేషన్స్ సందర్భంగా జరిగింది. ఇంతకీ తాజాగా ఏం జరిగిందనేది Day 44 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. బయటకొచ్చిన మోనిత ఏడుగురు తమ తమ నామినేషన్స్ పూర్తి చేయడంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. తొలుత వచ్చిన శోభా.. భోలెని నామినేట్ చేస్తున్నట్లు చెప్పింది. అయితే టాస్కులో 'ఆడపిల్ల కాబట్టి వదిలేశాను' అనే స్టేట్మెంట్ ఎలా పాస్ చేశారు? అని, అది తనకు నచ్చలేదని కారణం చెప్పింది. అయితే కుండ పగలగొట్టని చెప్పాలి లేదంటే డిఫెండ్ చేయాలి కానీ.. 'నీకు కోపం వస్తే నాకు పాపం అనిపిస్తుందిరా' అని కామెడీ చేశాడు. నువ్వు మోనిత కావొద్దని సలహా ఇచ్చాడు. ఆ తర్వాత కూడా పదేపదే మోనిత అనే పేరు ప్రస్తావిస్తూ.. వింత వింత సామెతలన్నీ చెబుతూ పిచ్చెక్కించాడు. (ఇదీ చదవండి: విజయ్ దెబ్బకు వెనకబడిపోయిన బాలకృష్ణ!) ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? శోభాశెట్టి - తేజ, భోలె శివాజీ - గౌతమ్, అమరదీప్ అశ్విని - పూజామూర్తి, అర్జున్ గౌతమ్ - భోలె, శివాజీ భోలె - శోభాశెట్టి, ప్రియాంక యవర్ - గౌతమ్, అమరదీప్ భోలె బూతు పురాణం అయితే శోభాశెట్టి నామినేట్ చేస్తున్న టైంలో భోలె ఓ బూతు పదాన్ని వాడాడు. దీంతో పక్కనే ఉన్న ప్రియాంక మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? అని ప్రియాంక అనగానే.. 'ఆగమ్మ కాసేపు ఆగు' అని మరింత ఇరిటేషన్ తెప్పించాడు. మధ్యలో 'మా రైతుబిడ్డ' అని చెప్పి ప్రశాంత్ ఫ్యాన్స్ సింపతీ కొట్టేద్దామని చూశాడు. మధ్యలో ఎంటరైన శోభా.. ప్రేమ చూపించి, ప్రశాంత్ ఫ్యాన్స్ ఓట్లు కొట్టేద్దామనుకుంటున్నారా? అని భోలె ఆలోచన బయటపెట్టి, కడిగిపారేసింది. దీంతో వచ్చే వారమే వెళ్లిపోతా, రాస్కో అని భోలె బరస్ట్ అయిపోయాడు. అంత సీరియస్గా గొడవ జరుగుతుంటే.. 'ఆడపిల్లలు మీకు మంచి భవిష్యత్తు ఉంది' అని ఏదేదో మాట్లాడాడు. ఇక కాసేపటి తర్వాత స్పందించిన బిగ్బాస్.. బూతులు మాట్లాడటం ఆపేయకపోతే సహించేది లేదని అన్నాడు. (ఇదీ చదవండి: 'లియో' మూవీ.. రెమ్యునరేషన్ ఎవరికెంత ఇచ్చారు?) మళ్లీ శోభా vs భోలె ఇక భోలె తన నామినేషన్స్లో భాగంగా శోభా, ప్రియాంకని నామినేట్ చేశాడు. కానీ సరైన కారణాలు చెప్పలేకపోయాడు. అలా అని వాళ్లతో వాదించనూ లేకపోయాడు. మధ్యలో 'నీకు ఎర్రగడ్డే దిక్కు' అని శోభాతో అన్నాడు. దీంతో ఆమె మళ్లీ రెచ్చిపోయింది. అయితే బూతులు మాట్లాడటం తనకు ఊతపదం అని ఏదో చెప్పుకొచ్చాడు కానీ అది ఏ మాత్రం కరెక్ట్గా అనిపించలే. ఈ వారం నామినేట్ అయింది వీళ్లే భోలె అశ్విని తేజ ప్రశాంత్ పూజా అమరదీప్ గౌతమ్ అయితే భోలెని సరిగ్గా పరిశీలిస్తే ఓ విషయం క్లియర్గా అర్థమైంది. రైతుబిడ్డ అనే పేరుని పోలినట్లు పాటబిడ్డ అని ట్యాగ్ పెట్టుకుని సింపతీ కొట్టేద్దామనుకున్నాడు. అలానే శివాజీలా మంచి మాటలు చెబుతూ.. హౌసులో ఉండిపోదామనుకున్నాడు. కానీ వచ్చిన రెండోవారానికే భోలె నిజస్వరూపాన్ని ప్రియాంక, శోభాశెట్టి బయటపెట్టేశారు. దీనికి తోడు బూతులు మాట్లాడటంతో భోలె తన పరువు తానే తీసుకున్నట్లు అయింది. మరి ఇలాంటి ఇరిటేటింగ్ క్యారెక్టర్ ఉంటాడా? ఎలిమినేట్ అయిపోతాడా అనేది చూడాలి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాలు రిలీజ్) -
ట్రాక్ తప్పుతున్న రైతుబిడ్డ.. నామినేషన్స్లో ఒక్క పాయింట్ తిన్నగా లేదు!
బిగ్బాస్ హౌసులో నామినేషన్స్ హీట్ మాములుగా లేదు. కాకపోతే ఈ మొత్తం వ్యవహారంలో లాజిక్స్ కంటే అవసరమైన సోది ఎక్కువైంది. రైతుబిడ్డ ప్రశాంత్ అయితే అపరిచితుడులా పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు. చెప్పింది అర్థం చేసుకోకుండా ఏదేదో అరుస్తూ రెచ్చిపోయాడు. శివాజీ విషయంలోనూ అందరికీ చిన్న షాక్ తగిలింది. ఇంతకీ సోమవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 43 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. శివాజీకి సమస్యలు నయని పావని ఎలిమినేట్ కావడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచి సోమవారం ఎపిసోడ్ మొదలైంది. ఆమె వెళ్లిపోవడంతో అందరూ అలానే షాక్లో ఉండిపోయారు. ఉదయానికి మళ్లీ నార్మల్ మూడ్లోకి వచ్చేశారు. ఐదోవారం ఓ గేమ్లో భాగంగా శివాజీ భుజానికి గాయమైంది. దాదాపు 10 రోజులకు పైగా అలానే మెంటైన్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు అతడిని ఎక్స్రే తీసేందుకు బయటకు తీసుకెళ్లి మళ్లీ రాత్రికి తిరిగి తీసుకొచ్చేశారు. ఏదో పెద్ద మనిషిలా అందరికీ సలహాలిస్తూ వారం వారం గడిపేస్తున్న శివాజీకి.. ఎలిమినేట్ చేసి రెస్ట్ ఇస్తే మంచిదేమో! (ఇదీ చదవండి: హిందీ 'బిగ్బాస్'లోకి తెలుగు హీరోయిన్.. ఆ డైరెక్టర్ ముద్దుపై క్లారిటీ) నామినేషన్స్ షురూ ఈ వారం నామినేషన్స్ లో భాగంగా కంటెస్టెంట్ ఎదురుగా ఉన్న కుండ పగలగొట్టి కారణం చెప్పాలని అన్నారు. అయితే ప్రశాంత్, అశ్విని, భోలె.. తమని నామినేట్ చేస్తున్నారని ఫ్రస్టేట్ అయిపోయి టైం మొత్తం తినేశారు. దీంతో సోమవారం కేవలం ఏడుగురు మాత్రమే తమ తమ నామినేషన్స్ పూర్తి చేశారు. మిగిలిన వాళ్లు మంగళవారం నామినేషన్ ప్రక్రియని పూర్తి చేస్తారు. ఎవరు.. ఏ ఇద్దరిని నామినేట్ చేశారు? ప్రశాంత్- సందీప్, తేజ అమరదీప్- భోలె, అశ్విని పూజామూర్తి- భోలె, అశ్విని సందీప్- భోలె, ప్రశాంత్ అర్జున్- భోలె, అశ్విని ప్రియాంక- అశ్విని, భోలె తేజ- పూజా, ప్రశాంత్ (ఇదీ చదవండి: ఏడాది నుంచి దానికి దూరమైన సమంత.. ఎంత కష్టమో!) రైతుబిడ్డ ప్రశాంత్ అబద్ధాలు రైతుబిడ్డ అనే ట్యాగ్తో హౌసులోకి వచ్చిన ప్రశాంత్.. తొలివారం నుంచి కాస్త డిఫరెంట్గానే ఉన్నాడు. గేమ్స్ ఉంటే బాగా ఆడటం, మిగిలిన టైం అంతా శివాజీ వెనకాల తిరగడం, నామినేషన్స్ అంటే అవతల వాళ్లు ఏం చెబుతున్నారో వినిపించుకోకుండా అరిచి గోల చేయడం. ఈసారి కూడా అదే చేశాడు. సందీప్.. కెప్టెన్సీ సరిగా చేయలేకపోయావ్ కదా అని అన్నాడు. అయితే ఈ విషయాన్ని పక్కదారి పట్టించి.. సందీప్ తనని 'ఊరోడు' అన్నాడని గట్టిగా అరుస్తూ చెప్పాడు. అయితే ఇది నిజమైతే పొలం, తినే అన్నంపై ఒట్టు వేయ్ అని సందీప్ అడగ్గానే మళ్లీ మాట మార్చేశాడు. రైతు అనేవాడు పొలంపై ఒట్టు వేయడు అని ఏదేదో చెప్పి కాస్త అతి చేశాడు. సందీప్ మాట్లాడుతుంటే అతడు చెబుతున్నది వినకండా పదే పదే మాటలకు అడ్డు తగిలాడు. ఈ మొత్తం వ్యవహారంలో సందీప్ కూల్ గా ఉండటానికి ట్రై చేస్తే.. ప్రశాంత్ మాత్రం ఫుటేజీ ఇవ్వడానికి ప్రయత్నించాడా అనే డౌట్ వచ్చింది. తట్టుకోలేకపోయిన అశ్విని, భోలె అమరదీప్, పూజా,అర్జున్, ప్రియాంక.. ఇలా వరసగా అందరూ తనని నామినేట్ చేసేసరికి అశ్విని కూడా తట్టుకోలేకపోయింది. తనతో ఎవరూ కలవట్లేదని, మాట్లాడట్లేదని ఒకే కారణాన్ని గుచ్చిగుచ్చి చెప్పింది. దీంతో నామినేట్ చేసినవాళ్లకేమో గానీ చూస్తున్న ప్రేక్షకులకు ఫ్రస్టేషన్ వచ్చేసింది. ఇక భోలె అయితే మరోరకం. అమరదీప్, పూజా తనని నామినేట్ చేసినా భోలె ఏం మాట్లాడలేదు. వాళ్లు చెప్పిన కారణాల్ని అస్సలు డిఫెండ్ చేయలేదు. ఏదో అవతలి వాళ్ల ఆనందమే తనకు ముఖ్యమున్నట్లు ప్రవర్తించాడు. ఇక ప్రియాంక నామినేట్ చేసిన తర్వాత ఆమెని ఇరిటేట్ చేస్తూ పాటలు పాడుతూ, జోక్స్ వేస్తూ ఇబ్బంది పెట్టాడు. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: ఖరీదైన తప్పులు చేశాం.. 'భోళా శంకర్' నిర్మాత షాకింగ్ ట్వీట్) -
ప్రేక్షకుల గుండెల్ని తాకిన నయని పావని.. ఈ కారణంతో నో రీ ఎంట్రీ
బిగ్ బాస్ సీజన్-7 నుంచి ఆరోవారం నయని పావని ఎలిమినేట్ అయ్యింది. వైల్డ్ కార్డ్తో హౌస్లోకి అడుగుపెట్టిన పావని ఒక వారంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. సాధారణంగా ఈ షోను అందరూ ఎంటర్టైన్మెంట్ షో మాదిరే చూస్తారు. కానీ నయని పావని ఎలిమినేట్ అయిన తీరును చూసిన మెజారిటీ ప్రేక్షకులు కన్నీరు పెట్టుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. హౌస్లోని సభ్యులతో పాటు ప్రేక్షకుల గుండెను ఆమె కన్నీళ్లు తాకాయి. చివరకు ఎంతో గొప్ప యాక్టర్, బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కూడా తొలిసారి ఎమోషనల్ అయ్యాడు. నయని పావని స్టేజీపైన మాట్లుడుతున్న సమయంలో ఆమె కంట వస్తున్న కన్నీరు మెడ భాగం వరకు పోతూనే ఉంటాయి. ఆ దృశ్యాలను చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా ఎమోషనల్ అయ్యాడు అని చెప్పవచ్చు. కొద్దిరోజుల క్రిత్రం నయని పావని తండ్రి మరణించారని విషయం తెలిసిందే. అందుకే ఆమె శివాజీని నాన్న అంటూ పిలుస్తూ ఉండేది. స్టేజీపైన శివాజీని డాడీ అంటూ అలా ఉండిపోయిన ఆమె కోసం హౌస్ నుంచి తాను వెళ్లిపోతానని అవకాశం ఉంటే నయని పావనిని హౌస్లో ఉంచండని శివాజీ కోరుతాడు. (ఇదీ చదవండి: బిగ్బాస్ నుంచి శివాజీ ఔట్.. మళ్లీ వచ్చే ఛాన్స్ ఉందా?) అందుకు నాగార్జున అవకాశం లేదు.. అది ప్రేక్షకుల నిర్ణయం అంటాడు. ఆమె హౌస్ నుంచి వెళ్తున్న సమయంలో మొదటిసారి శివాజీ కూడా పావని కోసం గేట్ క్లోజ్ అయ్యే వరకు అక్కడే ఉన్నాడు. అలా ఆమె హౌస్లో ఉన్న వారందరిని మెప్పించింది. ఒక రకంగా ఆదివారం ఎపిసోడ్ నయని పావని వల్ల బిగ్ బాస్ ప్రేక్షకుల హర్ట్ మెల్ట్ అయిందని చెప్పవచ్చు. ఎలిమినేట్కు కారణాలు ఇవే నయని పావనికి ఇన్స్టాగ్రామ్లో సుమారు 6 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్లలో నటించి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ ఆమె హౌస్లోకి వెళ్తున్న సమయంలో పీఆర్ టీమ్ను ఏర్పాటు చేసుకోకుండా వెళ్లడం ప్రధాన కారణం అని తెలుస్తోంది. రీ ఎంట్రీ ఇచ్చిన వారందరిలో ఆమె బెటర్ అనేలా గేమ్ ప్లే చేసింది. ఈ వారంలో ఆమెపై ఎక్కడా నెగటివ్ రాలేదు. శివాజీతో ఆమెకు మంచి బాండింగ్ ఉంది. అలాగే పల్లవి ప్రశాంత్తో ఆమె క్లోజ్గా ఉంది. యావర్ ఆమె వల్లే హౌస్ కెప్టెన్ అయ్యాడు. ఈ ముగ్గురికి ఉన్న ఓట్ బ్యాంక్ ఆమె వైపు వెళ్లలేదు. దీనికి ప్రధాన కారణం ఆమెకు పీఆర్ టీమ్ లేకపోవడం అని చెప్పవచ్చు. అంతకు మించి ఆమెపై ప్రేక్షకుల్లో ఎలాంటి నెగటివిటీ లేదు. నయని పావని రీ ఎంట్రీ.. అవకాశాలు తక్కువే నయని పావని రీ ఎంట్రీ ఉంటే బాగుంటుంది అని ప్రతి బిగ్ బాస్ ప్రేక్షకుడు అనుకుంటున్నాడు. ఆ మేరకు ఇప్పటికే పలువురు ఆమె రీ ఎంట్రీ కోసం సోషల్ మీడియాలతో పాటు స్టార్ మా యూట్యూబ్ వీడియోల కింద మెసేజ్లు చేస్తున్నారు. కానీ బిగ్బాస్ ఆమెకు రీ ఎంట్రీ అవకాశం ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. ఎందకంటే నయని పావని ఎలిమినేషన్ ఎపిసోడ్తో భారీ గుర్తింపు వచ్చింది. మళ్లీ రీ ఎంట్రీ ఇస్తే ఆ ఇమేజ్ కోల్పోయే ఛాన్స్ ఉంది. దీంతో ప్రస్తుతానికి రీ ఎంట్రీ ఆప్షన్ ఇవ్వకుండా... త్వరలో రాబోయే బిగ్బాస్ OTT కోసం ఆమెను ఉపయోగించుకునే అవకాశమే ఎక్కువ ఉంది. దీనికి ప్రధాన కారణం ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్. దీంతో ఆమెను OTT సీజన్ కోసం ఉపయోగించుకుంటే షో రేటింగ్ మరింతే పెరిగే ఛాన్స్ ఉంటుందని బిగ్బాస్ టీమ్ ఆలోచిస్తుందట. ఇదే నిజమైతే OTT సీజన్లో ఆమె టైటిల్ రేసులో నిలవడం ఖాయం. ఏదేమైనా నయని పావని రీ ఎంట్రీ అవకాశాలు చాలా తక్కువ. ఇందులో సందేహమే లేదు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) -
బిగ్బాస్ నుంచి శివాజీ ఔట్.. మళ్లీ వచ్చే ఛాన్స్ ఉందా?
బిగ్బాస్ సీజన్ 7లో వివాదాస్పద కంటెస్టెంట్గా అడుగుపెట్టిన శివాజీ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు అనేకంటే పంపేశారు అని చెప్పడం కరెక్ట్. ఆదివారం ఎపిసోడ్ ముగిసిన తర్వాత చూపించిన ప్రోమోలో ఈ విషయం కనిపిస్తుంది. నయని పావని ఎలిమినేషన్ అయిన తర్వాత సడెన్గా శివాజీ కన్ఫెషన్ రూమ్లో కనిపించాడు. శివాజీ మిమ్మల్ని బయటికి తీసుకువెళ్లడం జరుగుతుందని ఆ సమయంలో బిగ్బాస్ చెప్పాడు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) దీంతో శివాజీ కూడా బయటికి వచ్చి అక్కడే ఉన్న హౌస్మెట్స్తో నేను బయటికి వెళ్తున్నాను అని చెప్తాడు. దీంతో కంటెస్టెంట్లు అందరూ శివాజీని వెళ్లొద్దని ఆపే ప్రయత్నం చేశారు. కానీ.. అదే సమయంలో డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఆ వెంటనే శివాజీ బయటికి వెళ్లిపోయాడు. గేట్స్ క్లోజ్ అయిపోయాయి. దీంతో ఆట నుంచి ఆయన బయటకు వచ్చేసినట్లే శివాజీ మళ్లీ వచ్చే ఛాన్స్ ఉందా ఐదో వారం కెప్టెన్సీ టాస్క్ లో బాగంగా వైర్స్ కింద నుంచి పాకుతూ వెళ్లే గేమ్లో శివాజీ గాయపడ్డాడు . దీని తర్వాత ఆయన పెద్దగా టాస్క్లలో పాల్గొనలేదు. భుజం చెయ్యి నొప్పి భరిస్తూనే హౌస్లో కొనసాగాడు. బిగ్బాస్లో ఎవరికైనా ఇలాంటి చిన్న ఇబ్బందికి గురైతే షో యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. గాయంతో ఇబ్బంది పడుతున్న శివాజీకి వైద్యులు సలహా మేరకే ఆయన హౌస్ నుంచి బయటకు వచ్చి ఉంటారని తెలుస్తోంది. నేడు ఆయనకు వైద్యుల సమక్షంలో ఆయన చేతికి ఎక్స్రే వంటివి తీసి చికిత్స అందిస్తారని సమాచారం. వీలైతే ఆయన్ను సీక్రెట్ రూమ్లో మరో రెండురోజుల పాటు విశ్రాంతి కల్పించి మళ్లీ హౌస్లోకి తప్పకుండా వస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గతంలో బిగ్బాస్-3 సీజన్లో కూడా నూతన్ నాయుడు చేతికి గాయం అయితే రెండురోజులు విశ్రాంతి ఇచ్చి మళ్లీ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సో ఈ లెక్కన శివాజీ బిగ్బాస్లోకి మంగళవారం లేదా బుధవారం తప్పకుండా రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని తెలుస్తోంది. -
బిగ్బాస్ 7 ఎలిమినేషన్.. నయని పావని రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
బిగ్బాస్ 7వ సీజన్ నుంచి ఆరోవారం ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో భాగంగా హౌసులోకి అడుగుపెట్టిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నయని పావని.. వచ్చిన వారంలో తన ఆటతో ఆకట్టుకుంది. కానీ అనుకోని విధంగా బయటకొచ్చేసింది. మరీ వారంలో ఆమె ఎంత సంపాదించిందో తెలుసా? బిగ్బాస్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పలేం. నామినేషన్స్ నుంచి ఎలిమినేషన్స్ వరకు కొన్నిసార్లు మనం ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. అలా ఈ వారం ఏడుగురు నామినేట్ అయ్యారు. రెండు రోజులు ముందు వరకు ఓటింగ్ పరంగా చూసుకుంటే శోభాశెట్టి, పూజామూర్తి, నయని పావని చివరి స్థానాల్లో ఉన్నారు. (ఇదీ చదవండి: హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్బాస్' రతిక) వీళ్లలో చాలామంది శోభాశెట్టి లేదా పూజామూర్తి ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు. కానీ వీళ్లిద్దరూ కాకుండా నయని పావని ఎలిమినేట్ అయిపోయింది. అయితే గేమ్, టాస్కుల పరంగా ఈమెకి బలం ఉంది. ఇంకో రెండు-మూడు వారాలు ఉండుంటే రేసులో ఉండేదేమో. కానీ పరిస్థితులు అనుకూలించక.. వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. ఇకపోతే వారానికి రూ.2 లక్షలకు నయని పావని అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే వచ్చిన వారం మాత్రమే ఉంది కాబట్టి కేవలం రూ.2 లక్షలు తీసుకునే ఇంటికి వెళ్లిపోనుంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: గుడ్డిగా నమ్మేశా.. లవర్ మోసం చేశాడు: యంగ్ హీరోయిన్) -
'బిగ్బాస్ 7'లో నయని పావని ఎలిమినేట్.. అలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్!
'బిగ్బాస్' షోలో ప్రతివారం ఎలిమినేషన్ కచ్చితంగా ఉంటుంది. కానీ గత ఐదువారాల కంటే ఈసారి భిన్నంగా సాగింది. అనుకోని విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న నయని పావని ఎలిమినేట్ అయిపోయింది. అలానే దామిని, రతిక, శుభశ్రీ రీఎంట్రీ విషయంలో నాగ్ సరికొత్త ట్విస్ట్ పెట్టాడు. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 42 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. రీఎంట్రీ కోసం పోలింగ్ ఇక దామిని, శుభశ్రీ, రతికలలో ఒకరికి ఛాన్స్ ఉందని శనివారం ఎపిసోడ్లో చెప్పిన నాగ్.. వాళ్ల కోసం ఓటింగ్ ప్రక్రియ మొదలు పెట్టడంతో ఆదివారం ఎపిసోడ్ ప్రారంభించాడు. ఇందులో భాగంగా అందరూ బ్యాలెట్ బాక్సులో వాళ్లకు అనిపించిన కంటెస్టెంట్కి ఓటు వేశారు. అయితే వీళ్లలో ఎక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి కాకుండా తక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి హౌసులోకి రీఎంట్రీ ఇస్తాడని బాంబు పేల్చాడు. అది ఎవరనేది వచ్చే శనివారం చెబుతానని అన్నాడు. (ఇదీ చదవండి: హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్బాస్' రతిక) కాస్త ఎంటర్టైన్మెంట్ ఆదివారం ఎపిసోడ్ అంటే సందడి ఉంటుంది. అందుకు తగ్గట్లే ఈ వారం 'భగవంత్ కేసరి' టీమ్ నుంచి దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్ శ్రీలీల వచ్చారు. కాసేపు హౌస్మేట్స్ అందరితో డ్యాన్సులు వేయించి, మాట్లాడి తమ చిత్రాన్ని ప్రమోట్ చేసి వెళ్లిపోయారు. ఇక ఎలిమినేషన్లో భాగంగా తేజ, యవర్ తొలి రౌండ్లో సేఫ్ అయ్యారు. రెండో రౌండ్లో అమరదీప్, శోభాశెట్టి సేఫ్ అయ్యారు. మూడో రౌండ్లో పూజామూర్తి సేఫ్ అయింది. చివరగా అశ్విని, నయని పావని మిగలగా.. వీళ్లిద్దరిలో అనుహ్యంగా నయని పావని ఎలిమినేట్ అయిపోయింది. ఏడుస్తూనే ఉంది అయితే వచ్చిన వారంలోనే ఎలిమినేట్ అయిపోవడంపై నయని పావనికి షాక్ తగిలింది. బాగా ఆడాను కానీ ఎలిమినేట్ అయిపోయానని గట్టిగా ఏడ్చేసింది. బాగా ఆడకుండా ఎలిమినేట్ అయితే ఒప్పుకుంటానని ఏడుస్తూ చెప్పింది. ఏం ఆడలేదని పంపించేస్తున్నారో అని ఏడుస్తూనే బిగ్బాస్ని ప్రశ్నించింది. ఇక నయని స్టేజీపై వెళ్లిపోయిన తర్వాత హౌసులో అందరితో ఆమె మాట్లాడుతున్నప్పుడు ప్రతిఒక్కరూ ఏడుస్తూనే ఉన్నారు. ఇన్నేళ్లలో ఇలా ఓ కంటెస్టెంట్ కోసం అందరూ కన్నీళ్లు పెట్టుకోవడం ఇదే మొదటిసారి అని స్వయంగా హౌస్ట్ నాగార్జునే అన్నాడు. ఇంతమంది మనసు గెలుచుకున్న ఈ అమ్మాయి జీవితంలో చాలా పైకొస్తుందని నాగ్ ఆశీర్వదించాడు. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: గుడ్డిగా నమ్మేశా.. లవర్ మోసం చేశాడు: యంగ్ హీరోయిన్) -
బిగ్బాస్ షాకింగ్ నిర్ణయం.. ఓట్లేసిన ప్రేక్షకులు మోసపోయినట్లే!?
బిగ్బాస్ కొత్త కెప్టెన్ యవర్ యాటిట్యూడ్ వల్ల మిగితా ఇంటి సభ్యులు ఇబ్బందిపడ్డారు. దీని గురించి నాగ్ అందరికీ క్లారిటీ ఇచ్చేశాడు. అలానే హౌసులో బ్రెయిన్లెస్, యూజ్లెస్ ఎవరో తెలిసిపోయింది. మరోవైపు గత మూడు వారాల్లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ని తీసుకొచ్చిన బిగ్బాస్ రీఎంట్రీ ప్లాన్ అని చెప్పాడు. దీంతో అందరూ అవాక్కయ్యారు. ఇంతకీ శనివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 41 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. కొత్త కెప్టెన్ వల్ల గొడవ? ప్రిన్స్ యవర్ బిగ్బాస్ హౌసుకి రెండో కెప్టెన్ కావడంతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే శనివారం ఎపిసోడ్ మొదలైంది. వీఐపీ రూంలోకి వెళ్లి స్ప్రైట్ తీసుకునేందుకు అమర్ వెళ్లగా, కెప్టెన్ యవర్ ఇప్పుడు వద్దు తర్వాత ఇస్తానని అన్నాడు. మధ్యలో వచ్చిన సందీప్ బలైపోయాడు. యవర్ కోపానికి దొరికిపోయాడు. మధ్యలో వచ్చిన ప్రియాంకపై కూడా యవర్ సీరియస్ అయ్యాడు. ఇక ఆ తర్వాత కిస్ టఛాలెంజ్లో భాగంగా అమ్మాయిలు ముద్దు సింబల్ని కరెక్ట్గా గెస్ చేసిన తేజ.. శోభాతో డిన్నర్ డేట్ కి వెళ్లాడు. అక్కడ ఒకరికొకరు 'ఐ లవ్ యూ' చెప్పుకోవడం విశేషం. (ఇదీ చదవండి: ఆమె కోసం ఈమె బలి? వచ్చిన వారంలోనే బిగ్బాస్ నుంచి ఆమె ఎలిమినేట్!) నాగ్ క్లాస్ పీకాడు కానీ? ప్రోమోలో యవర్కి హోస్ట్ నాగార్జున ఏదో క్లాస్ పీకినట్లు చూపించారు. కానీ ఎపిసోడ్లో మాత్రం అలాంటిదేం లేదు. కెప్టెన్ ఏం చెబితే హౌసులో అదే రూల్. వీఐపీ రూంలో ఏది ఉంటే అది కెప్టెన్ జోన్లో ఉన్నట్లే. అతడి పర్మిషన్ లేకుండా అక్కడికి వెళ్లడానికి లేదు. స్ప్రైట్ తాగడానికి కూడా లేదని నాగ్.. అందరూ క్లారిటీ ఇచ్చాడు. అలా యవర్ చెప్పిన దానితో అంగీకరించాడు. ఇకపోతే ఈ వారం అమరదీప్.. గేమ్ పరంగా ఇంప్రూవ్ అయ్యావ్ అని నాగ్ మెచ్చుకున్నాడు. రైతుబిడ్డు అర్థంపర్థం లేకుండా తన కెప్టెన్సీ నుంచి కిచెన్ సెక్షన్, గౌతమ్కి ఇవ్వడంపై రైతుబిడ్డ ప్రశాంత్ తట్టుకోలేకపోయాడు. పుడ్ వేస్ట్ చేస్తున్నారని నాగార్జున దగ్గర చాడీలు చెప్పాడు. కానీ అది వేస్ట్ చేయడం కాదు, అటు ఇటు కావడంతో ఫ్రిడ్జ్లో పెట్టాం అని గౌతమ్, సందీప్, ప్రియాంక క్లారిటీ ఇచ్చారు. దీంతో ప్రశాంత్ తన కెప్టెన్సీ పోయిందని అర్థంపర్థం లేకుండా మాట్లాడినట్లు అనిపించింది. (ఇదీ చదవండి: ఫ్యాన్స్కి 'లియో' షాక్.. అక్కడ టికెట్ రేటు రూ.5 వేలు!) రీఎంట్రీ లాజిక్ లేని ట్విస్ట్ గత సీజన్లలోలానే ఈసారి గౌతమ్ని సీక్రెట్ రూంలో ఉంచి, హౌసులోకి రీఎంట్రీ ఇప్పించారు. అక్కడితో అందరూ అయిపోయిందనుకున్నారు. కానీ గత మూడు వారాల్లో ఎలిమినేట్ అయిన దామిని, రతిక, శుభశ్రీని తీసుకొచ్చి వీళ్లలో ఒకరు తిరిగి కంటెస్టెంట్ గా హౌసులోకి వచ్చే అవకాశముందని, అది హౌస్మేట్స్ చేతుల్లోనే ఉందని నాగార్జున షాకిచ్చాడు. దీంతో ఈ ముగ్గురు ఎవరికివారు.. తమని మళ్లీ ఎందుకు తీసుకోవాలో కంటెస్టెంట్స్ తో అప్పీలు చేసుకున్నారు. అయితే వీళ్లలో ఎవరు, ఎప్పుడు రీఎంట్రీ ఇస్తారనేది ఆదివారం చెప్తానని నాగ్ క్లారిటీ ఇచ్చాడు. అలా శనివారం ఎపిసోడ్ పూర్తయింది. అయితే బిగ్బాస్ ఓటింగ్ ప్రకారం తక్కువ ఓట్లు పడిన కారణంగానే రతిక, దామిని, శుభశ్రీ ఎలిమినేట్ అయ్యారు కదా. అంటే ప్రేక్షకులకు వీళ్ల ఆట నచ్చకే బయటకు పంపేశారు. అలాంటిది మళ్లీ వీళ్లనే తిరిగి హౌసులోకి తీసుకొస్తానని అనడం ప్రేక్షకుల ఓటింగ్ వేస్ట్ అని బిగ్బాస్ ఒప్పుకొన్నట్లేగా. ఇదే ఇప్పుడు విడ్డూరంగా అనిపిస్తోంది. (ఇదీ చదవండి: ఈమె తెలుగు సినిమాలు మాత్రమే చేసిన హీరోయిన్.. గుర్తుపట్టారా?) -
ఆమె కోసం ఈమె బలి? వచ్చిన వారంలోనే ఆ బ్యూటీ ఎలిమినేట్!
ఈసారి బిగ్బాస్ తెలుగు సీజన్ అనుకున్నంత గొప్పగా ఏం సాగట్లేదు! వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని గత ఆదివారం ఏకంగా ఐదుగురు కొత్తోళ్లని తీసుకొచ్చారు. కానీ ఆటలో పెద్దగా మార్పు అయితే వచ్చినట్లు కనిపించలేదు. ఇప్పుడు వాళ్లలో ఓ బ్యూటీని ఎలిమినేట్ చేసి బయటకు పంపేశారని తెలుస్తోంది. ఇంతకీ ఏం జరుగుతోంది? ఎలిమినేషన్ ఎవరు? బిగ్బాస్ 7 ఆరోవారం ఎలిమినేషన్లో మొత్తం ఏడుగురు ఉన్నారు. అమరదీప్, ప్రిన్స్ యవర్, తేజ, శోభాశెట్టి, పూజా, అశ్విని, నయని పావని ఈ లిస్టులో ఉన్నారు. అయితే వీళ్లలో ఓటింగ్ పరంగా చూసుకుంటే రెండు రోజుల ముందు వరకు శోభాశెట్టి, పూజా చివరి స్థానాల్లో ఉన్నారు. వీళ్లకు పైన నయని పావని ఉంది. అలాంటిది ఇప్పుడు నయని ఎలిమినేట్ అయినట్లు సమాచారం. (ఇదీ చదవండి: ఫ్యాన్స్కి 'లియో' షాక్.. అక్కడ టికెట్ రేటు రూ.5 వేలు!) ఎలిమినేషన్ ట్విస్ట్? గతవారం హౌస్ నుంచి ప్రియాంక వెళ్లిపోతుందని అనుకున్నారు. కానీ శుభశ్రీని పంపేశారు. గౌతమ్ ని ఎలిమినేట్ చేసినట్లు షో చేసి సీక్రెట్ రూంలో పెట్టారు. తిరిగి హౌసులోకి తీసుకొచ్చేశారు. ఈ వారం కూడా శోభాశెట్టి ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమెని సేఫ్ చేసి నయని పావనిని బయటకు పంపేశారా అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో భాగంగా వచ్చిన అమ్మాయిల్లో అశ్విని, పూజామూర్తి, నయని పావని ఉన్నారు. వీళ్లు వచ్చి వారం కూడా కాలేదు కాబట్టి పెద్దగా నిరూపించుకునే ఛాన్స్ రాలేదు. ఇప్పుడేమో నయని పావని ఎలిమినేషన్ అంటున్నారు. మరో 1-2 వారాలు ఉంచున్నాసరే ఈమె గేమ్ ఏంటనేది తెలిసేది. అసలు నయనని నిజంగానే ఎలిమినేట్ చేశారా అనేది ఆదివారంతో క్లారిటీ వచ్చేస్తుంది. (ఇదీ చదవండి: బిగ్బాస్ చరిత్రలోనే తొలిసారి.. కంటెస్టెంట్ల చేతికి మొబైల్ ఫోన్స్!) -
Subhashree Rayaguru: అందంతో చంపేస్తున్న బిగ్బాస్ బ్యూటీ శుభశ్రీ రాయగురు (ఫోటోలు)
-
రైతుబిడ్డ వింత వాదన.. అది వినిపించుకోకుండా పిచ్చి ప్రవర్తన!
బిగ్ బాస్ 7 షోలో ఊహించని వ్యక్తి రెండో కెప్టెన్ అయ్యాడు. అయితే తామే కెప్టెన్ అయిపోతామని ఫుల్ ధీమాతో బోలెడన్ని ఆశలు పెట్టుకున్న ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ మాత్రం బరస్ట్ అయిపోయారు. వాళ్లకు ఏడుపొక్కడే తక్కువైంది. అదే టైంలో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నోరు జారాడు. పరువు అంతా పోగొట్టుకున్నాడు. ఇంతకీ బిగ్బాస్ శుక్రవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 40 హైలైట్స్లో చూద్దాం. నోరుజారిన రైతుబిడ్డ కెప్టెన్సీ టాస్కులో భాగంగా పోటుగాళ్లతో ఆటగాళ్లు సమం కావడంతో గురువారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే శుక్రవారం ఎపిసోడ్ మొదలైంది. రాత్రి నిద్రపోయే టైంలో శివాజీతో పిచ్చపాటి కబుర్లు ఆడుతూ ప్రశాంత్ నోరుజారాడు. 'కెప్టెన్సీ వచ్చింది అన్నవల్లనే.. నేను చేసిందేం లేదు' అని అన్నాడు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఎంత మోటివేట్ చేసినా గేమ్స్ ఆడింది, కెప్టెన్సీ బ్యాడ్జ్ సంపాదించింది ప్రశాంత్. కానీ శివాజీకి క్రెడిట్ ఇచ్చేసి తన గాలి తనే తీసుకున్నాడు. (ఇదీ చదవండి: 'కేసీఆర్' సినిమా.. హీరోగా 'జబర్దస్త్' కమెడియన్!) ఆటగాళ్లు గెలిచారు ఇక కెప్టెన్సీ టాస్కులో భాగంగా చివరగా 'హూ ఈజ్ ద బెస్ట్' అని గేమ్ పెట్టాడు. ఫుట్బాల్ లాంటిది కానీ బంతిని చేతులతో గోల్ పోస్టులో వేయాల్సి ఉంటుంది. కిందామీద పడి ఈ ఆటలో ఎలాగైతేనేం ఆటగాళ్లు గెలిచారు. కెప్టెన్సీ టాస్కులోకి ఎంటరయ్యారు. అశ్విని-పూజా గొడవ అయితే కెప్టెన్సీ కోసం చివరగా జరిగిన గేమ్లో ఎవరు ఆడాలనే క్రమంలోనే అశ్విని, పూజాని ఉద్దేశిస్తూ.. 'చూస్తే తెలియట్లేదా ఎవరు స్ట్రాంగో?' అని వాళ్ల టీమ్ మెంబర్స్తో చెప్పింది. దీంతో పూజాకి ఎక్కడో కాలింది. గేమ్ అంతా అయిపోయిన తర్వాత అశ్వినికి ఇచ్చిపడేసింది. నోరు అదుపులో పెట్టుకో లేకపోతే మాములుగా ఉండదని వేలు చూపిస్తూ మరీ వార్నింగ్ ఇచ్చింది. ఇద్దరి మధ్య చాలాసేపు వాదన నడిచింది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్'లో అమర్కి అది కష్టమే.. భార్య తేజస్విని కామెంట్స్) యవర్ రెండో కెప్టెన్ ఇక ఆటగాళ్లలో ఎవరు కెప్టెన్ కావాలనేది పోటుగాళ్లు డిసైడ్ చేశారు. ఆటగాళ్లలో అందరికీ బెలూన్స్ ఉంటాయి. పోటుగాళ్ల నుంచి ఒక్కొక్కరు.. ఆటగాళ్లలో ఒకరికి సూది ఇస్తారు. వాళ్లు మరొకరి బెలూన్ని పేల్చేయాలి. చివరగా మిగిలిన వాళ్లు కెప్టెన్ అవుతారని బిగ్బాస్ చెప్పాడు. అలా ఇందులో యవర్ నిలిచి, గెలిచారు. హౌసుకి రెండో కెప్టెన్ అయ్యాడు. నిజం చెప్పిన తట్టుకోని ప్రశాంత్ అయితే సందీప్, ప్రశాంత్ బెలూన్ పేల్చేసి ప్రస్తుతం కెప్టెన్ గా నువ్వే ఉన్నావ్, ఇందులో నువ్వు ఫెయిలయ్యావ్ అని బిగ్ బాస్ ఏదైతే చెప్పాడో అదే మళ్లీ చెప్పాడు. ఇది నిజమని చూస్తున్న వాళ్లందరికీ తెలుసు. ఒక్క రైతుబిడ్డకు తప్ప. అసలు కెప్టెన్గా తానేం తప్పు చేశానో చెప్పు అని సందీప్ చెబుతున్నది వినిపించుకోకుండా మళ్లీ మళ్లీ అదే పాట పాడాడు. ప్రేక్షకులకు విసుగు తెప్పించాడు. ఫిజికల్ గా కష్టపడుతున్నాడు గానీ రైతుబిడ్డ ప్రశాంత్.. బుర్రపెట్టి ఒక్కసారి కూడా తిన్నగా ఆలోచించట్లేదని ఈ సీన్తో అర్థమైపోయింది. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా) -
'బిగ్బాస్'లో అమర్కి అది కష్టమే.. భార్య తేజస్విని కామెంట్స్
'బిగ్బాస్ 7'లో అమరదీప్ ఆటపరంగా తడబడుతున్నాడు. టైటిల్ ఫేవరెట్ అనుకున్నోడు కాస్త ఎలిమినేట్ అయిపోతాడేమో అని రేంజుకి పడిపోయాడు. రైతుబిడ్డతో గొడవ తర్వాత నెగిటివిటీ ఎక్కువైపోయింది. గేమ్ పరంగా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. మొన్నీమధ్య అమరదీప్ తల్లి కొడుకు గురించి మాట్లాడింది. ఇప్పుడు అతడి భార్య తేజస్విని.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అమర్ చిన్నపిల్లాడు బిగ్బాస్లోకి వెళ్లకముందు అమరదీప్-తేజస్విని కలిపి.. ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా అమర్ గురించి చెప్పుకొచ్చిన తేజస్విని.. అతడిది చిన్నపిల్లాడి మనస్తత్వం అని, పిల్లలు ఓసారి వింటారు, మరోసారి వినరు. వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. అమరదీప్కి కూడా ప్రతి విషయం ఇలానే చెప్పాలని తెలిపింది. (ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా) అమర్కి అది కష్టమే ఇకపోతే అమర్ టాస్కుల్లో కష్టపడతాడు కానీ మైండ్ గేమ్స్లో తడబడతాడని తేజస్విని చెప్పింది. బిగ్బాస్లోని కంటెస్టెంట్స్ స్ట్రాటజీలు, మైండ్ గేమ్స్ అమర్ అర్థం చేసుకుని ఆడలేడని చెప్పింది. ఎందుకంటే ఎవరేం చెప్పినా నమ్మేస్తాడని అలానే రోజంతా జరిగిన దానిలో గంట మాత్రమే అది కూడా గొడవపడిన, తప్పుగా మాట్లాడిన విషయాలే చూపిస్తారని చెప్పింది. దీనివల్ల నెగిటివిటీ ఎక్కువైపోతుందని, ఇలాంటి పరిస్థితిని అమర్ హ్యాండిల్ చేయడం కష్టమేనని తేజస్విని చెప్పుకొచ్చింది. వర్కౌట్ కాని టిప్స్ అయితే బిగ్బాస్లోకి వెళ్లే ముందు అమరదీప్కి తేజస్విని చాలా జాగ్రత్తలు చెప్పింది. హైపర్ కావొద్దు, అర్థం చేసుకుని మాట్లాడు, ఎవరినీ నమ్మొద్దు ఇలా చాలా చెప్పి పంపించింది. కానీ అమర్ వీటన్నింటిలోనూ తడబడ్డాడు. దీంతో టాప్-5లో ఉంటాడనుకున్నోడు కాస్త డేంజర్లో పడిపోయాడు. ఈ వారం నామినేట్ అయిన ఏడుగురిలో అమర్ కూడా ఒకడు. కానీ ఓట్లు బాగానే పడుతున్న కారణంగా అమర్ ఎలిమినేషన్ ఇప్పట్లో ఉండకపోవచ్చు అనిపిస్తుంది. (ఇదీ చదవండి: అకీరా హీరోగా ఎంట్రీ? రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్) -
రైతుబిడ్డకు ఏడవడం మాత్రమే వచ్చు.. శివాజీ షాకింగ్ కామెంట్స్!
బిగ్ బాస్ హౌసులోకి కొత్తగా ఐదుగురు వచ్చారు. దీంతో కాస్త జోష్ వచ్చింది. ఇప్పుడు అదే ఊపు కొనసాగిస్తూ అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మరోవైపు రైతుబిడ్డ ప్రశాంత్ కెప్టెన్సీని బిగ్ బాస్ పీకి పడేశాడు. అలానే అమరదీప్ ఎలిమినేషన్ భయం నుంచి కాస్త బయటకొచ్చాడు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్లో ఏమేం జరిగిందనేది Day 38 హైలైట్స్లో చూద్దాం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న 'స్కంద'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) అమర్కి మోటివేషన్ ఆటగాళ్లు vs పోటుగాళ్లు మధ్య కెప్టెన్సీ కోసం పోటీ నడుస్తోంది. మంగళవారం గేమ్స్ సగంలోనే ఆగిపోయాయి. అక్కడి నుంచే బుధవారం ఎపిసోడ్ మొదలైంది. ఇక పోటీల్లో సరిగా ఫెర్ఫార్మ్ చేయలేదని అమరదీప్ డల్ అయిపోయాడు. దీంతో యవర్ అతడికి మోటివేషన్ చేశాడు. రాత్రి నిద్రపోయే టైంలో అమరదీప్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రియాంక, సందీప్ వచ్చి అతడిని సముదాయించారు. రైతుబిడ్డ కెప్టెన్సీ పాయే ప్రశాంత్ కెప్టెన్ అయితే అయ్యాడు గానీ పెద్దగా మెరుపుల్లేవు. దీంతో బిగ్ బాస్ అతడి కెప్టెన్సీని డైరెక్ట్గా రద్దు చేయొచ్చు గానీ అలా చేయలేదు. మిగతా హౌస్మేట్స్ని అసలు కెప్టెన్ అంటే ఏంటని అడిగితే.. వర్క్ డివైడ్ చేయాలి, లీడర్షిప్ క్వాలిటీ అని అతడికి వ్యతిరేకంగా చెప్పారు. తీరా ప్రశాంత్ మంచి కెప్టెన్ అని ఎంతమంది అనుకుంటున్నారు? అని అడిగితే శోభా, సందీప్, తేజ తప్ప అందరూ చేతులెత్తేశారు. అయినా సరే బిగ్బాస్ కనికరించలేదు. (ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీలీలకు పెళ్లి? ఈ రూమర్స్లో నిజమెంత?) యవర్ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా, తేజ నిద్రపోతున్నా, ఇంట్లో రేషన్ అయిపోతున్నా ఏం చేశావంటూ కెప్టెన్సీ పీకిపడేశాడు. ఇక కెప్టెన్సీ నుంచి తీసిపడేసరికి ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కెప్టెన్సీ ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇప్పుడేమో ఇంట్లో ఏడుస్తూ కూర్చున్నాడు. ఇలాంటి టైంలో మరోచోట కూర్చుని మాట్లాడిన శివాజీ.. వాడికి(ప్రశాంత్) ఏడవడం తప్ప ఇంకేం రాదని అన్నాడు. విజేతగా పోటుగాళ్లు మంగళవారం ఎపిసోడ్లో కెప్టెన్సీ కోసం రెండు గేమ్స్ పెట్టిన బిగ్ బాస్.. బుధవారం మిగిలిన రెండు గేమ్స్ పెట్టాడు. 'హౌ ఈజ్ ఫాస్టెస్ట్' గేమ్లో భాగంగా బిగ్ బాస్ చెప్పిన రంగు ఉన్న ఏదైనా వస్తువుని తీసుకొచ్చి లాన్ లోని మార్క్ చేసిన ప్లేసులో వేయాలి. ఇందులో ఆటగాళ్లు గెలిచారు. 'హౌ ఈజ్ స్ట్రాంగెస్ట్' అని పెట్టిన ఇంకో పోటీలో పోటుగాళ్లు గెలిచారు. అలా నాలుగింటిలో మూడు గెలిచిన పోటుగాళ్లు.. కెప్టెన్సీ పోటీలో నిలిచారు. అలా బుధవారం ఎపిసోడ్ పూర్తయింది. (ఇదీ చదవండి: గిఫ్ట్ ఇచ్చిన సమంత.. అతడు తెగ మురిసిపోయాడు!) -
అమర్దీప్కి ఎలిమినేషన్ భయం.. ఇలా అయిపోయాడేంటి?
బిగ్బాస్ హౌసులోకి కొత్తగా ఐదుగురు కంటెస్టెంట్స్ వచ్చారు. ఇప్పటికే ఉన్న ఎనిమిది మందికి గట్టి పోటీ ఇచ్చారు. ఏకంగా రెండు గేమ్స్లో గెలిచేశారు. ఇది కాదన్నట్లు గత 36 గంటలుగా సీక్రెట్ రూంలో ఉన్న గౌతమ్.. హౌసులోకి రీఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు అమరదీప్కి ఎలిమినేషన్ భయం పట్టుకుంది. ఇంతకీ మంగళవారం ఏం జరిగిందనేది Day 37 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: రాజకీయాల్లోకి అనసూయ? హాట్ యాంకర్ సమాధానమిదే!) గౌతమ్ ఈజ్ బ్యాక్ నామినేషన్స్ పూర్తి కావడంతో సోమవారం ఎపిసోడ్ పూర్తయింది. మళ్లీ అక్కడి నుంచే మంగళవారం ఎపిసోడ్ మొదలైంది. ఇది జరగడానికి కాసేపటి ముందు సీక్రెట్ రూంలో ఉన్న గౌతమ్.. హౌసులోకి రీఎంట్రీ ఇచ్చాడు. వస్తూనే 'అశ్వద్ధామ ఈజ్ బ్యాక్' అని కాస్త హడావుడి చేశాడు. మనోడిని సీక్రెట్ రూంలో పెట్టడమే కాస్త అతిగా అనిపిస్తే.. బయటకొచ్చాక చేసిన హంగామా నవ్వుకునేలా చేసింది. ఇకపోతే గౌతమ్.. ఆటగాళ్లలో కాకుండా పోటుగాళ్లలో(కొత్తగా వచ్చినోళ్లు) ఒకడిగా ఉంటాడని బిగ్బాస్ చెప్పాడు. నామినేషన్స్లో ఏడుగురు ఇకపోతే ఈ వారం.. అమరదీప్, యవర్, సందీప్, తేజ, శోభాశెట్టి, నయని, అశ్విని, పూజా నామినేట్ అయ్యారు. అయితే వీళ్లలో ఒకరిని సేవ్ చేయొచ్చు, లేదంటే నేరుగా నామినేట్ చేసే అవకాశాన్ని గౌతమ్కి బిగ్బాస్ ఇచ్చాడు. దీంతో అతడు సందీప్ ని సేవ్ చేస్తున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలోనే శివాజీతో మాట్లాడిన గౌతమ్.. ఎంటర్టైన్ చేయట్లేదని చెప్పి బయటకు పంపేశారు, ఎంటర్టైన్మెంట్ అంటే ప్యాంట్ తీసి తిరగడం కాదు కదా అని శివాజీకి కౌంటర్ వేశాడు. దీని గురించి ఇద్దరి మధ్య కాసేపు వాదన నడిచింది. (ఇదీ చదవండి: కొడుకు లిప్లాక్ సీన్స్.. రాజీవ్ కనకాల అలాంటి కామెంట్స్!) ఆటగాళ్లు vs పోటుగాళ్లు ఐదువారాల నుంచి ఉన్నవాళ్లందరూ ఆటగాళ్లు.. కొత్తగా వచ్చిన వాళ్లందరూ పోటుగాళ్లు గ్రూపులుగా.. 'హూ ఈజ్ ద బెస్ట్' టాస్కులో తలపడతారని అన్నాడు. ఇందులో పలు గేమ్స్ ఉంటారని క్లారిటీ ఇచ్చాడు. వీటిలో గెలిచి ఎవరైతే ఇతరుల కంటె బెస్ట్ అని నిరూపించుకుంటారో వాళ్లు కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారని బిగ్బాస్ చెప్పాడు. తొలుత 'హూ ఈజ్ ఫిట్టెస్ట్' గేమ్ పెట్టగా అందులో పోటుగాళ్లు టీమ్ నుంచి అర్జున్-గౌతమ్ జోడీగా పాల్గొని గెలిచారు. 'హూ ఈజ్ జీనియస్' అనే రెండో గేమ్లోనూ పోటుగాళ్లే విజయం సాధించారు. అమర్ భయం భయం 'హౌ ఈజ్ జీనియస్' గేమ్లో తొలుత ఆడతానని వెళ్లిన అమరదీప్.. సరైన సమాధానాలు చెప్పలేక మధ్యలోనే వచ్చేశాడు. అతడి బదులు తేజ.. గేమ్ పూర్తి చేశాడు. ఇందులో ఆటగాళ్ల గెలవలేదు. దీంతో ఈ గేమ్ పూర్తయిన తర్వాత అమరదీప్ పూర్తిగా డిసప్పాయింట్ అయ్యాడు. ఈ వారం బయటకు తోసేస్తారేమో అనిపిస్తుందని శివాజీతో మాట్లాడుతూ అమర్ భయపడ్డాడు. ఇది జరగడానికి కాసేపటి ముందు కొత్తగా వచ్చిన పూజమూర్తి, అమర్ దగ్గరకొచ్చి.. 'బయట చూసిన అమరదీప్ వేరు.. ఇక్కడ చూస్తున్న అమరదీప్ వేరు' అని అతడితో చెప్పింది. ఈ ఎపిసోడ్లో అయితే అమరదీప్ ముఖంలో ఎలిమినేషన్ భయం స్పష్టంగా కనిపించింది. అలా మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది. (ఇదీ చదవండి: రాజమౌళి బర్త్డే స్పెషల్.. ఈ డైరెక్టర్ ఆస్తి ఎంతో తెలుసా?) -
ఆట సందీప్ను కొట్టిన పల్లవి ప్రశాంత్ .. ఎమోషనల్ అయిన జ్యోతిరాజ్
టాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ పేరు తెలియనివారు ఉండరు. కొరియోగ్రాఫర్, డ్యాన్సర్గా ఈయన చాలామందికి సుపరిచితం. బిగ్బాస్ సీజన్-7లో ఆయన టాప్ కంటెస్టెంట్గా కొనసాగుతున్నారు. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' ఫస్ట్ సీజన్లో విజేతగా నిలిచి ఫేమ్ సంపాదించాడు. అప్పటినుంచి ఈయన పేరు ఆట సందీప్గా స్థిరపడిపోయింది. ఆయన భార్య జ్యోతిరాజ్ కూడా మంచి డ్యాన్సరే అని తెలిసిందే. వారిద్దరూ డ్యాన్స్ బరిలో దిగితే గెలుపు ఖాయం అని తెలిసిందే. (ఇదీ చదవండి; గుండెపోటుతో బాడీ బిల్డర్ మృతి.. పెళ్లి తర్వాత ఈ పొరపాటు చేయడంతో) తాజాగా బిగ్బాస్లో ఉన్న సందీప్పై పలువురు ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయంపై ఆయన భార్య జ్యోతిరాజ్ స్పందించారు. జీవితంలో సందీప్ ఎంతో కష్టపడి పైకి వచ్చాడు.. ఆయనొక కళాకారుడిగా గుర్తింపు ఉంది. ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. అలాంటి వ్యక్తిపై కొందరు యూట్యూబర్స్ చీప్ థంబ్నైల్స్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని జ్యోతిరాజ్ ఆవేదన చెందారు. అందరిలాగే అతనికి కూడా ఫ్యామిలీ ఉందని మరిచిపోవద్దని తెలిపారు. అలాంటి వాటి వల్ల తామెంతో బాధపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. 'యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బు, వ్యూస్ కోసం ఒక మనిషిని ఎంత నీచంగా అయినా మాట్లాడుతారా.. అలాంటి తప్పుడు వీడియోలతో వచ్చిన డబ్బుతో ఎప్పటికీ బాగుపడరు. అన్యాయంగా ఒకరిని తొక్కుతూ.. మరోకడు పైకి రావాలని ఆకాంక్ష ఎందుకు..? బిగ్బాస్లో గెలిచేవాడు గెలుస్తాడు. ఆట నుంచి బయటకు వచ్చేవాడు వస్తాడు. అంతేగానీ ఈ చీప్ ట్రిక్స్ ఎందుకు..? అందరిలాగే ఆట సందీప్ కూడా బిగ్బాస్తో మంచిపేరు రావాలి.. ప్రజల్లో మరింత గుర్తింపు దక్కాలనే వెళ్లాడు. కానీ ఒకరిని గెలిపించేందుకు బయట కొందరు చేసే దందా ఎంతవరకు కరెక్ట్..? వారు కోరుకున్న వ్యక్తి గెలవాలని ఎదుటివారిపై నీచమైన కామెంట్లు చేస్తున్నారు. అలాంటి వారిలో కొందరు సందీప్పై చేస్తున్న కామెంట్ల వల్ల నాతో పాటు మా కుంటుంబం ఎంతో బాధపడుతుంది.' అని ఆమె భావోద్వేగానికి గురైయారు. ఆట సందీప్ను కొట్టిన పల్లవి ప్రశాంత్ 'ఆట సందీప్ను కొట్టిన పల్లవి ప్రశాంత్' అని పలువురు తప్పుడు థంబ్నైల్స్ పెట్టి వీడియో చేశారు. మరికొందరు అదే స్థాయిలో చెడు కామెంట్లు కూడా చేస్తున్నారని జ్యోతిరాజ్ ఇలా తెలిపారు. 'అసలు పల్లవి ప్రశాంత్ కుక్కకొట్టుడు కొట్టడం ఏంటి..? ఎవరు పల్లవి ప్రశాంత్..? ఎవరు ఆట సందీప్..? అదీ డబ్బుతో వచ్చే విలువ కాదు. కళతో వచ్చే విలువ. ఎంతో కష్టపడి సందీప్ ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. పల్లవి ప్రశాంత్ తమ్ముడికి అందరూ సపోర్ట్ చేయండి.. నేనూ కూడా చేస్తాను.. తప్పులేదు. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా అందరం గుర్తించాలి. ఎంతో కష్టపడి అతను కూడా ఈ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఇలాంటి థంబ్నైల్స్ పెట్టడంతో పాటు ఒక మనిషిని మరోక వ్యక్తితో పోల్చి డీగ్రేడ్ చేయకండి. ఇదీ చాలా తప్పు. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్న. బిగ్బాస్లోని అమ్మాయిల్ని కూడా కొందరు నోటికి వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు. వారందరూ కూడా తమ కుటుంబాన్ని వదిలేసి అక్కడ ఉన్నారు. అలాంటి వారి గురించి తప్పుగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆట సందీప్ అంటే ఒక అబ్బాయి కాబట్టి సరేలే అనుకోవచ్చు కానీ ఒక అమ్మాయిని నీచంగా తిట్టడం వల్ల ఆమె కెరియర్ పరిస్థితి ఏంటి. దయచేసి బిగ్బాస్లోని ఆడపిల్లల గురించి చెడు కామెంట్లు చేయకండి.' అని జ్యోతిరాజ్ ఎమోషనల్ అయ్యారు. -
రెండో రోజుకే చుక్కలు చూపించారు.. వెళ్లిపోతానని హాట్ బ్యూటీ గోల
బిగ్బాస్ హౌసులోకి వైల్డ్ కార్ట్ ఎంట్రీగా ఐదుగురు కొత్తోళ్లు వచ్చారు. వాళ్లలో ఓ హాటెస్ట్ బ్యూటీ ఉంది. ఆదివారం ఆమె ఒంపుసొంపులు చూసి అబ్బా సూపర్ అనుకున్న ప్రేక్షకులు.. సోమవారం ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అయ్యో రామా అనుకున్నారు. ఓ లేడీ కంటెస్టెంట్ వల్ల ఇలా జరిగింది. అలానే నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి. ఇంతకీ సోమవారం ఎపిసోడ్లో ఏమైందనేది Day 36 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు రిలీజ్) పుల్ల పెట్టిన బిగ్బాస్ కొత్తగా వచ్చిన ఐదుగురు సభ్యులు ఇంట్లోకి వచ్చేయడంతో ఆదివారం ఎపిసోడ్ పూర్తయింది. వాళ్లని చూపించడంతో సోమవారం ఎపిసోడ్ మొదలైంది. ఇక ఉదయం లేవగానే బిగ్బాస్ ఫిట్టింగ్ పెట్టేశాడు. కొత్తగా వచ్చినవాళ్లని పోటుగాళ్లు.. ఇప్పటికే హౌసులో ఉన్నవాళ్లు ఆటగాళ్లు అని చెప్పాడు. అలానే హెడ్స్ ఆఫ్ లగేజ్ గేమ్లో భాగంగా హౌసులో ఉన్నవాళ్లందరికీ కలిపి కేవలం ఏడు వస్తువులు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని తిరకాసు పెట్టేశాడు. నామినేషన్స్ రచ్చ తొలుత పోటుగాళ్లు మాత్రమే నామినేషన్ చేస్తారని.. గత ఐదువారాలుగా ఉన్న ఇంటి సభ్యుల్ని మాత్రమే నామినేట్ చేయాలని బిగ్బాస్ చెప్పాడు. వీళ్లలో ఎవరు ఎవరిని నామినేట్ చేశారనేది కింద లిస్ట్ ఉంది. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? నయని పావని - తేజ, అమరదీప్ భోలె షావళి - అమరదీప్, సందీప్ అశ్విని - అమరదీప్, శోభాశెట్టి పూజామూర్తి - తేజ, యవర్ అర్జున్ - సందీప్, అమరదీప్ (ఇదీ చదవండి: ఆ స్టార్ డైరెక్టర్కి ఇంత అందమైన చెల్లెలు ఉందా? ఎవరో గుర్తుపట్టారా?) ఇకపోతే నామినేషన్స్లో భాగంగా అమరదీప్ స్వార్థంతో ఆడుతున్నాడని అశ్విని చెప్పింది. అలానే శోభాశెట్టి గ్రూపిజంతో ఆడుతోందని చెప్పింది. దీంతో శోభా ఫైర్ అయింది. అసలు గ్రూపిజం అంటే ఏంటి? నేను ఎవరితో గ్రూపులో ఉన్నానంటూ రెచ్చిపోయింది. ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ కన్ఫ్యూజ్ చేసి పడేసింది. పోటుగాళ్ల నామినేషన్ పూర్తయిన తర్వాత.. బట్టల విషయంలో అశ్విని- శోభాశెట్టి మధ్య గొడవ జరిగింది. దీంతో శోభా గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. హౌస్కి తానే మహారాణి అనుకుంటుందా అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. హౌసులో ఆమె పాలిటిక్స్ నడిపిస్తోందని చెప్పింది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, వాళ్లందరూ మాట్లాడుకుని తనని సెపరేట్ చేసేశారని బోరున ఏడ్చేసింది. ట్విస్ట్ ఇచ్చిన బిగ్బాస్ ఇక పోటుగాళ్లు నామినేషన్స్ పూర్తిచేసిన తర్వాత ఆటగాళ్లకు ఛాన్స్ ఇస్తున్నట్లు బిగ్బాస్ చెప్పాడు. ఇందులో భాగంగా పోటుగాళ్లలో ఒకరిని, ఆటగాళ్లలో ఒకరిని నామినేట్ చేయాల్సి ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ఎవరు ఎవరిని నామినేట్ చేశారనేది కింద లిస్ట్ ఉంది. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? అమరదీప్ - అశ్విని, యవర్ శోభాశెట్టి - అమరదీప్, అశ్విని శివాజీ - అమరదీప్, పూజామూర్తి తేజ - సందీప్, నయని పావని ప్రియాంక - తేజ, అశ్విని సందీప్ - తేజ, అర్జున్ యవర్ - శోభాశెట్టి, పూజామూర్తి ప్రశాంత్ - నయని పావని, అమరదీప్ ఈ నామినేషన్లో భాగంగా అమరదీప్, అశ్వినిని నామినేట్ చేశాడు. వీళ్లిద్దరి మధ్య వాదన జరుగుతున్నప్పుడు.. మీరు కన్నింగ్, సెల్ఫిష్ అని పదాలు నా గురించి వాడటం సరికాదని అశ్విని కామెంట్స్పై అభ్యంతరం వ్యక్తం చేశాడు. మరోవైపు శోభాశెట్టి.. అశ్విని నామినేట్ చేసేసరికి ఆమె తట్టుకోలేకపోయింది. అందరూ తననే నామినేట్ చేస్తున్నారని గట్టిగా ఏడ్చేసింది. తనని పక్కనున్నవాళ్లు ఓదారుస్తున్నా సరే ఇంటికెళ్లిపోతా, ఎలిమినేట్ చేసేయండి అని చిన్నపిల్లలా ఏడ్చేసింది. అలా సోమవారం ఎపిసోడ్ పూర్తయింది. అయితే ఆదివారం ఎపిసోడ్ లో హాట్హాట్గా కనిపించి వావ్ అనిపించిన అశ్విని.. ఎలిమినేషన్స్ అనేసరికి ఏడవటం చాలామంది కుర్రాళ్లు అవాక్కయ్యేలా చేసింది. (ఇదీ చదవండి: ఆర్.నారాయణమూర్తికి సారీ చెప్పిన యంగ్ హీరో!) -
'బిగ్బాస్' 2.0.. హౌసులోకి ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్
బిగ్ బాస్ 7 ఐదు వారాలు పూర్తిచేసుకుంది. ఆదివారం ఒకరిని ఎలిమినేట్ చేయగా, మరో కంటెస్టెంట్ని సీక్రెట్ రూంలోకి పంపించేశారు. ఇకపోతే ఎన్నడూ లేని విధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో భాగంగా ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. అసలు ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 35 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. ప్రతి ఆదివారం ఒక్కొక్కరిని సేఫ్ చేయడంతో మొదలయ్యేది. కానీ ఈసారి మాత్రం డైరెక్ట్గా ఎలిమినేషన్తో మొదలుపెట్టారు. అలా ఐదోవారం శుభశ్రీ హౌస్ నుంచి బయటకెళ్లిపోయింది. ఆ వెంటనే గౌతమ్ని కూడా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. కానీ ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున.. అతడిని సీక్రెట్ రూంలోకి పంపించారు. అక్కడ ఏం చేయాలి? ఎలా ఉండాలనేది బిగ్బాస్ చెబుతాడని నాగార్జున అన్నాడు. తొలి కంటెస్టెంట్గా అర్జున్ పలు సీరియల్స్లో నటించి గుర్తింపు తెచ్చకున్న అంబటి అర్జున్.. బిగ్ బాస్ లాంచ్ 2.0లో ఫస్ట్ కంటెస్టెంట్గా హౌసులోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే దమ్ము ఎవరు? దుమ్ము ఎవరు? అనేది చెప్పమన్నారు. దీంతో అర్జున్.. యవర్, ప్రశాంత్ ని దమ్ము కేటగిరీలో పెట్టాడు. సందీప్, అమరదీప్ దుమ్ము కేటగిరీలో పెట్టాడు. ఎవరీ అర్జున్? చూడటానికి సాఫ్ట్గా కనిపించే అర్జున్ నిజంగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్. విజయవాడలో పుట్టి పెరిగిన ఇతడు ఐటీలో రెండేళ్లపాటు సాఫ్ట్వేర్ డెవలపర్గా పని చేశాడు. మోడల్గా మొదలైన తన ప్రయాణం కాస్తా నటనవైపు పరుగులు తీసింది. అర్ధనారి, గీతోపదేశం, సుందరి వంటి పలు చిత్రాల్లో అతడు నటించాడు. కానీ తనకు జనాల్లో పేరు తీసుకువచ్చింది మాత్రం సీరియల్సే! ప్రస్తుతం అతడి చేతిలో ఎటువంటి ప్రాజెక్టులు లేనట్లు తెలుస్తోంది. అందుకే మళ్లీ మంచి కంబ్యాక్ ఇవ్వడానికి బిగ్బాస్ షోను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వచ్చీరావడంతోనే యావర్, ప్రశాంత్ దమ్మున్న గేమ్ ఆడుతున్నారని, అమర్దీప్, సందీప్ దుమ్ము దుమ్ముగా ఆడుతున్నారని చెప్పాడు. మరి ఇతడు దుమ్ము రేపేలా ఆడతాడా? ఎలా ఆడతాడనేది చూడాలి! రెండో కంటెస్టెంట్గా అశ్విని రెండో కంటెస్టెంట్గా అశ్విని శ్రీ అనే అమ్మాయి బిగ్బాస్ హౌసులోకి ఎంట్రీ ఇచ్చింది. దమ్ము కేటగిరిలో ప్రశాంత్, శివాజీ.. దుమ్ము కేటగిరీలో ప్రియాంక, శోభాశెట్టి అని చెప్పింది. తానొక కిక్ బాక్సర్ అని చెప్పుకొచ్చింది. ఎవరీ అశ్విని? సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అందాలు ఆరబోసేవారిలో ముందు వరుసలో ఉంటుంది అశ్విని శ్రీ. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈ సొట్టబుగ్గల సుందరి ఆర్టిస్ట్గా ఎదగాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు బిగ్బాస్ షోను వేదికగా ఏర్పాటు చేసుకుంది. మూడో కంటెస్టెంట్గా భోలె షావళి బిగ్బాస్ హౌసులోకి మూడో కంటెస్టెంట్గా సింగర్ కమ్ సంగీత దర్శకుడు భోలె షావళి ఎంట్రీ ఇచ్చాడు. అలానే పాటబిడ్డ అనే తనని తాను చెప్పుకొంటూ.. హౌస్ట్ నాగార్జునపై ఓ పాట క్రియేట్ చేసి పాడాడు. దమ్ము కేటగిరీలో శివాజీ, ప్రశాంత్.. దుమ్ము కేటగిరీలో అమరదీప్ అని చెప్పాడు. ఎవరీ భోలె షావళి? 'కష్టపడ్డ.. ఇష్టపడ్డ.. లవ్లో పడ్డ.. అది కాదంటే కాళ్ల మీద పడ్డ..' పాటతో భోలె షావళి పేరు మార్మోగిపోయింది. ఈ పాటతో సెన్సేషన్ సృష్టించిన భోలె షావళి సింగర్ మాత్రమే కాదు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా! వెండితెరకు సైతం ఎన్నో హిట్ సాంగ్స్ అందించాడు. మహబూబాబాద్ జిల్లాలో పుట్టిపెరిగిన ఇతడు ప్రారంభంలో చక్రి దగ్గర అసిస్టెంట్గా పని చేశాడు. ఆయన దగ్గర మెళకువలు నేర్చుకున్న తర్వాత సింగర్గా, సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో ప్రయత్నించాడు, సక్సెస్ అయ్యాడు. బతుకమ్మ, బోనాల పండగల సమయంలోనూ ప్రత్యేక గీతాలు కంపోజ్ చేస్తూ ఉంటాడు. ఈ మ్యూజిక్ డైరెక్టర్ తన టాలెంట్తో మాయ చేసేందుకు బిగ్బాస్ షోకి వచ్చాడు. మరి తన మ్యాజిక్ పని చేస్తుందా? ఎన్ని వారాలు కొనసాగుతాడు? అనేది చూడాలి. నాలుగో కంటెస్టెంట్గా పూజామూర్తి బిగ్బాస్ హౌసులోకి నాలుగో కంటెస్టెంట్గా సీరియల్ నటి పూజామూర్తి ఎంట్రీ ఇచ్చింది. అలానే సరిగ్గా ఈ షోకి రావడానికి ముందు చనిపోయారని చెబుతూ ఎమోషనల్ అయింది. ఇందులో పాల్గొని ఆయన చివరి కలని నిజం చేస్తానని చెప్పింది. దమ్మున్న వారిలో శివాజీ, సందీప్ ఉంటారని.. దుమ్ము కేటగిరీలో తేజ ఉంటారని చెప్పింది. ఎవరీ పూజామూర్తి? గుండమ్మ కథ సీరియల్తో జనాలకు దగ్గరైంది పూజా మూర్తి. ఈమె కన్నడ అమ్మాయి. కానీ తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది. బొద్దుగా ముద్దుగా కనిపించే ఈ బ్యూటీ బిగ్బాస్ 7 ప్రారంభమైన రోజే హౌస్లో అడుగుపెట్టాల్సింది. కానీ సరిగ్గా షో ప్రారంభమయ్యే కొద్ది రోజుల ముందు ఆమె ఇంట విషాదం నెలకొంది. తండ్రి కన్నుమూయడంతో ఆమె రియాలిటీ షోలో ఎంట్రీ ఇవ్వలేకపోయింది. తాజాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టింది. ఎంట్రీ బాగుంది, మరి ఆట ఎలా ఉంటుందో చూడాలి! ఐదో కంటెస్టెంట్గా నయని పావని బిగ్బాస్ హౌసులోకి ఐదో కంటెస్టెంట్గా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నయని పావని (సాయి పావని) ఎంట్రీ ఇచ్చింది. దమ్మున్న వాళ్లలో యవర్, ప్రశాంత్ అని దుమ్ముదుమ్ముగా ఆడుతుందని అమరదీప్, తేజ అని చెప్పింది. ఎవరీ నయని పావని? టిక్టాక్ వీడియోలతో బాగా ఫేమస్ అయింది నయని పావని. ఈమె అసలు పేరు సాయి పవని రాజ్. పక్కా తెలంగాణ అమ్మాయి. టిక్టాక్లో వీడియోలు చేస్తూ కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్తో అందరినీ బుట్టలో వేసుకుంది. సమయం లేదు మిత్రమా, ఎంత ఘాటు ప్రేమ, పెళ్లి చూపులు 2.0, మిత్రమా, బబ్లూ వర్సెస్ సుబ్బులు కేరాఫ్ అనకాపల్లి వంటి పలు షార్ట్ ఫిలింస్లోనూ నటించింది. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్కు ఇన్స్టాగ్రామ్లో 6 లక్షల మందికి పైగా అభిమానులు ఉన్నారు. ఆ మధ్య డ్యాన్స్ షో ఢీలోకి వెళ్లి మంచి గుర్తింపు పొందింది. షార్ట్ ఫిలింస్, రియాలిటీ షోలే కాదు సినిమాలు కూడా చేసింది. చిత్తం మహారాణి, సూర్యకాంతం అనే చిత్రాల్లో నటించి మెప్పించింది. అందానికి అందం, దానికి మించి టాలెంట్ ఉన్న ఈ బ్యూటీ తాజాగా బిగ్బాస్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. మరి తన జర్నీ ఎలా ఉంటుంది? అందరినీ ఆటాడిస్తుందా? తన ఆట తనే ఆడుతుందా? చూడాలి! ఇక వీళ్ల ఐదుగురి ఎంట్రీతో పాటు ఈ ఎపిసోడ్లో తన 'చిన్నా' సినిమా ప్రమోషన్స్లో భాగంగా సిద్ధార్థ్.. టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్లో భాగంగా రవితేజ, నుపురు సనన్, గాయత్రి భరద్వాజ్ కాసేపు అలా వచ్చి సందడి చేసి వెళ్లిపోయారు. అలానే ఇప్పటివరకు అందరూ పవరస్త్ర కోసం పోటీపడ్డారు. కానీ కొత్తగా వచ్చిన ఐదుగురితో పాటు ఆల్రెడీ బిగ్బాస్లో ఉన్న ఎనిమిది మంది హౌస్మేట్స్ అయిపోయారని నాగార్జున చెప్పాడు. అలా వాళ్లలో అర్జున్, అశ్వినికి హౌస్ ఆఫ్ లగేజీ టాస్క్ ఇచ్చారు. మిగతావాళ్లలో ఎవరెవరి దగ్గర ఏ లగేజీ ఉండాలనేది వీళ్లు డిసైడ్ చేస్తారు. అలానే భోలె షావళి, పూజామూర్తి, నయనపావనికి నాగార్జున హౌస్ ఆఫ్ బెడ్స్ టాస్క్ ఇచ్చారు. దీన్నిబట్టి ఎవరు ఏ బెడ్పై పడుకోవాలనేది వీళ్లు నిర్ణయిస్తారు. అలా ఆదివారం ఎపిసోడ్ పూర్తయింది. సోమవారం ఎపిసోడ్లో నామినేషన్స్ ఉంటాయి. -
ఎలిమినేషన్కి ముందే మరో ట్విస్ట్.. ఆ ముగ్గురిపై వేలాడుతున్న కత్తి!
బిగ్బాస్ మినిమమ్ జోష్ ఉంటది. ఎందుకంటే వారంలో కంటెస్టెంట్స్ అందరూ చేసిన చీటింగ్, పొరబాట్లు ఇలా ప్రతి ఒక్కదాని గురించి హోస్ట్ నాగార్జున మాట్లాడుతాడు. ఈసారి కూడా అలానే ఒక్కొక్కరిని నిలబెట్టి మరీ కడిగేసే ప్రయత్నం చేశాడు. ఎలిమినేషన్ కంటే ముందు మరో ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో ఆ ముగ్గురికి భయం పట్టుకుంది. ఇంతకీ శనివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 34 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. అందరి తప్పులు శుక్రవారం ఏం జరిగిందనేది చూసిన నాగ్.. ప్రస్తుతానికి వచ్చేశాడు. అలా శనివారం ఎపిసోడ్ మొదలైంది. రావడంతో బెస్ట్ బడ్డీస్ జోడీలుగా కూర్చోవాలని చెప్పాడు. ఫస్ట్ ప్రియాంక-శోభాశెట్టిని నిలబెట్టి.. ఈ వారం మీరేం తప్పులు చేశారు? మీకేం అన్యాయం జరిగిందని అడిగాడు. స్మైల్ టాస్కులో మూడోసారి గంట కొట్టింది తామే అయినా స్టార్స్ రాలేదని ప్రియాంక చెప్పింది. అయితే తన బడ్డీ శోభా, ఆ గేమ్లో సంచాలక్ కావడం, మరో సంచాలక్ యవర్తో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోవడంతో తానేం అనలేకపోయానని చెప్పింది. అయితే ఈ పోటీలో ప్రతిఒక్కరూ తప్పుగా ఆడారని నాగ్ చెప్పాడు. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఒకేసారి ఇద్దరు ఔట్!) అమర్-సందీప్కి పడ్డాయ్ ఈ వారం కెప్టెన్సీ టాస్కులో భాగంగా గేమ్స్ ఆడుతూ ఎక్కువ తప్పులు చేసింది అమరదీప్-సందీప్. రెగ్యులర్ గా ఎపిసోడ్స్ చూసేవాళ్లందరికీ ఇది తెలుసు. నాగ్ కూడా ఆయా తప్పులు సందీప్-అమరదీప్తో చెప్పించాడు. స్మూత్గా ఇచ్చిపడేశాడు. ఇక ప్రతి సంచాలక్ నిర్ణయాన్ని బొక్కలో జడ్జిమెంట్ అని అమర్ అనడంపై నాగ్ సీరియస్ అయ్యాడు. 'నువ్వే తొక్కలే సంచాలక్.. నీదే బొక్కలో జడ్జిమెంట్' అని అనడంతో అమర్ సైలైంట్ అయిపోయాడు. ఇలా అందరు చేసిన తప్పుల్ని ఎత్తిచూపిన నాగార్జున.. అందరూ దొరికిపోయేలా చేశాడు. అమర్ నిజస్వరూపం అయితే శివాజీ మాట్లాడుతూ.. అమరదీప్కి ఏం చెప్పినా వినట్లేదని, ఎవరూ ఫెయిర్ గేమ్ ఆడట్లేదని తన అభిప్రాయాన్ని చెప్పాడు. మరోవైపు దొంగ టాస్కులో భాగంగా అమరదీప్.. ప్రశాంత్ని ఉద్దేశిస్తూ రూంలో కూర్చుని 'వాడు మేకప్ వేయకపోయినా దొంగలానే ఉంటాడు' అని చెబుతున్న వీడియోని స్క్రీన్పై ప్లే చేసిన నాగ్.. అమర్ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. దీంతో అతడిపై నెగిటివిటీ మరింత పెరిగిపోయింది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్'లోకి వెళ్లొచ్చాక నా భార్యకి అలాంటి మెసేజులు: హీరో వరుణ్ సందేశ్) ఆ ముగ్గురిపై అనర్హత? అయితే కంటెస్టెంట్స్ తప్పులు గురించి చెప్పి, అందరికీ స్మూత్ వార్నింగ్స్ ఇచ్చిన నాగార్జున చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు. ఎలిమినేషన్ గురించి కాకుండా ఈ హౌసులో ఉండటానికి అర్హత లేని ముగ్గురు పేర్లు చెప్పాలని అందరితో అన్నాడు. హౌస్మేట్స్ శోభాశెట్టి, ప్రశాంత్, సందీప్ కాకుండా మిగిలిన ఏడుగురిలోని పేర్లు చెప్పాలని అన్నాడు. దీంతో అందరూ నామినేట్ చేసినోళ్ల పేర్లు, అందుకు కారణాలు చెప్పారు. శోభాశెట్టి.. తేజ, గౌతమ్, శివాజీ ప్రశాంత్.. తేజ, యవర్, అమరదీప్ సందీప్ .. గౌతమ్, శివాజీ, యవర్ ప్రియాంక.. గౌతమ్, శివాజీ, శుభశ్రీ అమరదీప్.. శుభశ్రీ, గౌతమ్, యవర్ శుభశ్రీ.. తేజ, ప్రియాంక, అమరదీప్ గౌతమ్.. తేజ, ప్రియాంక, అమరదీప్ శివాజీ.. అమరదీప్, ప్రియాంక, గౌతమ్ తేజ.. అమరదీప్, శుభశ్రీ, గౌతమ్ యవర్.. అమరదీప్, ప్రియాంక, తేజ అయితే హౌసులో ఉన్న వాళ్ల ప్రకారం.. అమరదీప్, తేజ, గౌతమ్ హౌసులోని అనర్హత కలిగిన ముగ్గురుగా నిలిచారు. కానీ ప్రేక్షకుల అంచనా ప్రకారం ఆ ముగ్గురు ఎవరనేది ఆదివారం చెబుతానని నాగ్ తిరకాసు పెట్టి ఎపిసోడ్ని ఆపేశాడు. అలానే ఆదివారం.. ఎవరూ ఊహించని విషయం చెబుతానని కంటెస్టెంట్స్ అందరితో చెప్పాడు. అలా శనివారం ఎపిసోడ్ పూర్తయింది. ఇక ఆదివారం.. కొత్తగా హౌసులోకి మరో ఆరుగురు కంటెస్టెంట్స్ రాబోతున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జవాన్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!) -
'బిగ్బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఒకేసారి ఇద్దరు ఔట్!
'బిగ్బాస్ 7' షో ఐదోవారం వీకెండ్కి వచ్చేసింది. ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఎవరా అనేది సస్పెన్స్గా మారిపోయింది. అదే టైంలో ఆరుగురు కొత్తవాళ్లు కూడా హౌసులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. సరిగ్గా ఇలాంటి టైంలో బిగ్బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. అందరూ అనుకున్నట్లు కాకుండా డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేసినట్లు సమాచారం. విచిత్రం ఏంటంటే ఆ ఇద్దరు అమ్మాయిలేనట. ఇంతకీ ఏంటి విషయం? ఏంటి విషయం? బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్ ప్రస్తుతం టెలికాస్ట్ అవుతుంది. గత నాలుగు వారాల్లో వరసగా కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికని ఎలిమినేట్ చేసి పంపేశారు. ఐదోవారం మాత్రం పవరస్త్ర గెలుచుకున్న శోభా, సందీప్, ప్రశాంత్ తప్పితే అందరూ నామినేట్ అయ్యారు. వాళ్లకు వచ్చిన ఓటింగ్లో శుక్రవారం వరకు చూసుకుంటే శివాజీ టాప్లో ఉన్నాడు. ప్రియాంక చివర్లో ఉంది. దీంతో ఈసారి ప్రియాంక ఎలిమినేట్ అని అందరూ అనుకున్నారు. (ఇదీ చదవండి: 'బిగ్బాస్'లోకి వెళ్లొచ్చాక నా భార్యకి అలాంటి మెసేజులు: హీరో వరుణ్ సందేశ్) డబుల్ ధమాకా అయితే ఈ ఆదివారం సర్ ప్రైజ్ ఉందని హౌసులో ఉన్నవాళ్లందరికీ నాగ్ చెప్పాడు. ఆరుగురు కొత్త కంటెస్టెంట్స్ అని బయట అందరికీ తెలిసిపోయింది. అలానే వాళ్ల పేర్లు కూడా లీక అయ్యాయి. అర్జున్ అంబటి, కెవ్వు కార్తీక్, పూజామూర్తి, నయని పావని, అశ్విని శ్రీ, భోళే షావలే.. వీళ్లని తెలుస్తోంది. ఇలా కొత్తగా ఆరుగురు వస్తున్నారని.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్లే హౌసులో ఉండే అర్హత లేని ముగ్గురు పేర్లు చెప్పమని నాగ్ చెప్పడం మీరు ప్రోమోలో చూడొచ్చు. ఆ ఇద్దరు పక్కానా? నాగ్ ఇచ్చిన టాస్కులో భాగంగా కంటెస్టెంట్ అందరూ తమకు అనిపించిన తలో ముగ్గురి పేర్లు చెప్పారు. ఇందులో భాగంగా తేజ, ప్రియాంక, శుభశ్రీ ఫైనల్ అయ్యారని.. వీళ్లలో తేజ సేవ్ కాగా శుభశ్రీ-ప్రియాంక ఒకేసారి ఎలిమినేట్ అయ్యారని అంటున్నారు. అలానే ప్రియాంకని పూర్తిగా బయటకు పంపేయకుండా సీక్రెట్ రూంలో ఉంచారని సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాలంటే శనివారం ఎపిసోడ్ పూర్తి కావాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జవాన్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!)