funding
-
భారత్కు సాయం అనవసరం
వాషింగ్టన్: భారత్లో ఓటింగ్ను పెంచడానికంటూ అందిస్తూ వస్తున్న 2.1 కోట్ల డాలర్ల నిధిని రద్దు చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. భారత్కు అసలు ఇంతకాలంగా ఆ మొత్తం ఎందుకు ఇస్తూ వచ్చినట్టని ప్రశ్నించారు. విదేశాలకు సహాయ నిధులకు కోత పెడుతూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన అనంతరం మంగళవారం తన నివాసం మార్–ఎ–లాగోలో అధ్యక్షుడు మీడియాతో మాట్లాడారు. ‘‘భారత్ దగ్గర చాలా డబ్బుంది. అమెరికా నుంచి ప్రపంచంలోనే అత్యధికంగా పన్నులు విధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. మాపై వాళ్ల టారిఫ్లు చాలా ఎక్కువ. అలాంటి దేశానికి 2.1 కోట్ల డాలర్లు ఎందుకిస్తున్నామో అర్థం కావడం లేదు!’’ అన్నారు. అయితే భారత్ పట్ల, ఆ దేశ ప్రధానిపై నాకెంతో గౌరవముందని చెప్పుకొచ్చారు. భారత్తో పాటు పలు దేశాలకు అందిస్తున్న మొత్తం 72.3 కోట్ల డాలర్ల సహాయ నిధులకు డోజ్ ఆదివారం మంగళం పాడటం తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు, ఆర్థికవేత్త సంజీవ్ సన్యాల్ స్పందించారు. భారత్లో ఓటింగ్ శాతం మెరుగు పరిచేందుకు అమెరికా నుంచి 2.1 కోట్ల డాలర్లను ఇన్నేళ్లుగా ఎవరు అందుకుంటూ వచ్చారో తెలుసుకోవాలనుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు. భారత్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అమెరికా నిధులు సమకూరుస్తోందన్న వార్తలను కేంద్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి ఎస్వై ఖురేషీ ఇప్పటికే ఖండించడం తెలిసిందే. 2012లో తాను సీఈసీగా ఉండగా ఈ మేరకు అమెరికా ఏజెన్సీ నుంచి ఎన్నికల సంఘం ఒప్పందం కుదుర్చుకున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు.‘స్పేస్’లో మస్క్ జోక్యముండదుఅంతరిక్ష సంబంధిత ప్రభుత్వ నిర్ణయాల్లో టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ జోక్యం ఉండబోదని ట్రంప్ స్పష్టం చేశారు. మస్క్ ప్రధానంగా డోజ్ ద్వారా ప్రభుత్వానికి ఖర్చులను తగ్గించే పనిమీద ఉంటారన్నారు. ‘‘ఆయనను మీరు ఉద్యోగి అని పిలవవచ్చు. కన్సల్టెంట్ అనొచ్చు. మీకు నచ్చినట్లుగా పిలవవచ్చు, కానీ ఆయన దేశభక్తుడు’’ అని చెప్పుకొచ్చారు. మస్క్ ప్రభుత్వోద్యోగి కాదని, ఆయనకు ఎలాంటి నిర్ణయాధికారాలూ లేవని వైట్హౌస్ సోమవారం పేర్కొనడం తెలిసిందే.టారిఫ్లపై తగ్గేదే లేదుపరస్పర టారిఫ్ల విషయంలో తగ్గేదే లేదని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. ఈ విషయంలో తనతో ఎవరూ వాదించలేరని స్పష్టం చేశారు. ‘భారత్కు మినహాయింపు లేదు. మీరెంత విధిస్తే మేమూ అంతే విధిస్తా’మని ప్రధాని మోదీకి స్పష్టం చేశానని చెప్పారు. ప్రతి దేశానికీ ఇదే వర్తిస్తుందన్నారు. ఎలాన్ మస్క్తో కలిసి ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఆటోమొబైల్ వంటి రంగాల్లో అమెరికాపై భారత్ ఏకంగా 100 శాతం సుంకాలు విధిస్తోందని ట్రంప్ చెప్పగా అవునంటూ మస్క్ శ్రుతి కలిపారు.‘బైడెన్ అటార్నీ’లకు ఉద్వాసనమాజీ అధ్యక్షుడు జో బైడెన్ నియమించిన అటార్నీలందరినీ తొలగించాలని ట్రంప్ ఆదేశించారు. న్యాయశాఖను గత నాలుగేళ్లలో మునుపెన్నడూ లేనంతగా రాజకీయమయం చేశారంటూ ఆక్షేపించారు. అందుకే ఆ శాఖలో ‘బైడెన్ శకం’ ఆనవాళ్లను తొలగించాలని ఆదేశించినట్టు తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ‘‘నమ్మకాన్ని పునరుద్ధరించాలంటే ఇంటిని ప్రక్షాళన చేయాల్సిందే. స్వర్ణయుగపు అమెరికాలో నిష్పాక్షిక న్యాయ వ్యవస్థ ఉండాలి. ఈ రోజు నుంచే అది మొదలవుతుంది’’ అన్నారు. యూఎస్ అటార్నీలుగా పిలిచే ఫెడరల్ ప్రాసిక్యూటర్లను నామినేట్ చేయడం అధ్యక్షుడి బాధ్యత. అమెరికాలో ప్రస్తుతం 93 మంది అటార్నీలున్నారు. ప్రభుత్వ చట్టాల అమలు వీరి బాధ్యత. రిపబ్లికన్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి న్యాయ శాఖ తీవ్ర ప్రకంపనలకు గురవుతోంది. పలువురు ఉన్నతాధికారులను తొలగిస్తున్నారు.ఉక్రెయిన్లో సైనిక పాలనజెలెన్స్కీకి స్వదేశంలో ఆదరణ పూర్తిగా అడుగంటిందని ట్రంప్ అన్నారు. ‘‘జెలెన్స్కీ రేటింగ్స్ 4 శాతానికి పడిపోయాయి. ఆయ నకు ధైర్యముంటే తక్షణం ఎన్నికలకు వెళ్లాలి’’ అని సవాలు కూడా చేశారు. రష్యా కోరిక మేరకే ఇలా ఉక్రెయిన్లో ఎన్నికలకు డిమాండ్ చేస్తున్నానన్న ఆరోపణలను తోసిపుచ్చారు. ‘‘నాతో పాటు చాలా దేశాలు ఈ మేరకు డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఉక్రెయిన్ లో ఏళ్లుగా సైనిక పాలన నడుస్తోంది’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖర్లోగా పుతిన్తో తాను భేటీ అయ్యే అవకాశముందని ఈ సందర్భంగా ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్పై ట్రంప్ తాజా వ్యాఖ్యలను డోజ్ అధిపతి ఎలాన్ మస్క్ పూర్తిగా సమర్థించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో స్పందించారు. ‘‘జెలెన్స్కీకి శాంతి ఇష్టం లేదు. ఆయనకు కావాల్సిందల్లా మరింత డబ్బు, అధికారం మాత్రమే’’ అంటూ ఆక్షేపించారు. -
దాతలకు బైడెన్, హారిస్ కృతజ్ఞతలు
వాషింగ్టన్: ఎన్నికల ఓటమి తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు హారిస్ తొలిసారిగా ఒకే చోట కలిసి కనిపించారు. డెమొ క్రటిక్ నేషనల్ కమిటీ ఆదివారం నిర్వహించిన హాలిడే పార్టిలో వారిద్దరూ వేదికను పంచుకున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచార నిమిత్తం 200 కోట్ల డాలర్లకు పైగా విరాళాలిచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ‘‘డెమొక్రాట్లు విలువల కోసం పోరాటం సాగించాలి. మన స్ఫూర్తి ఓడలేదు. మనం ఓడిపోలేదు. బలంగా ఉన్నాం. దేనికోసం పోరాడుతున్నామో మనకు స్పష్టత ఉంది’’అని అతిథులుతో బైడెన్, హారిస్ అన్నా రు. ‘‘కింద పడితే కచ్చితంగా లేవాల్సిందే.. ఎంత వేగంగా లేస్తారనేదే వ్యక్తికైనా, పార్టికైనా కొలమానమని మా నాన్న చెప్పేవారు’’అని బైడెన్ అన్నారు. నవంబర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కు గట్టి పోటీ ఇచ్చారని భావించిన హారిస్ చివరికి ఆయన చేతిలో భారీ తేడాతో ఓడటం తెలిసిందే. హారిస్ భవితవ్యం ఏమిటి? హారిస్ తన సొంత రాష్ట్రమైన కాలిఫోరి్నయా గవర్నర్ పదవికి పోటీ చేయాలని కొందరు డెమొక్రాట్లు కోరుతున్నారు. ఆమె మాత్రం తన భవిష్యత్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బైడెన్ జనవరి 20న అధ్యక్ష పదవి నుంచి వైదొలగనుండటం తెలిసిందే. అయినా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ అమెరికా సమాజంలో నెలకొన్న లోతైన విభేదాలను చక్కదిద్దేందుకు కృషి చేయాలనుకుంటున్నట్లు ఆయన సరదా వ్యాఖ్యలు చేశారు. ‘‘మీకందరికీ బ్యాడ్ న్యూస్ ఏమిటంటే నేనెక్కడికీ వెళ్లడం లేదు. ఇక్కడే ఉండాలనుకుంటున్నా’’అని నవ్వుతూ అన్నారు. -
పెళ్లి మీది.. ఫండ్ మాది
మన సంస్కృతిలో వివాహానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. జీవితాన్ని మలుపు తిప్పే అతి ముఖ్యమైన పెళ్లి వేడుక చిరకాలం గుర్తుండిపోయేలా నిర్వహించుకోవలాన్న ఆకాంక్ష పెరుగుతోంది. కలిగిన కుటుంబాలు సహజంగానే పెళ్లిళ్లకు ఘనంగా ఖర్చు చేస్తుంటాయి. ఆ మధ్య రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తన చిన్న కుమారుడి వివాహానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారో గుర్తుండే ఉంటుంది. అంబానీ రేంజ్ కాకపోయినా.. తమ పరిధిలో భారీ బడ్జెట్తో వివాహం చేసుకునేందుకు ఎక్కువ మంది ముందుకొస్తున్న ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.మిలీనియల్స్ (1981–1996 మధ్య జన్మించిన వారు), జెనరేషన్ జెడ్ (1996–2009 మధ్య జన్మించిన వారు) యువతీయువకులు వివాహం విషయంలో కేవలం తల్లిదండ్రుల ఆర్థిక సామర్థ్యంపైనే ఆధారపడాలని అనుకోవడం లేదని ఇండియాలెండ్స్ సర్వేలో వెల్లడైంది. వ్యక్తిగత రుణం (పర్సనల్ లోన్) తీసుకుని, బాలీవుడ్ స్టైల్లో లేదా డెస్టినేషన్ వెడ్డింగ్ (తమకు నచ్చిన వేరే ప్రాంతంలో)కు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా 20 పట్టణాల పరిధిలో వివాహంపై 1,200 మంది మిలీనియల్స్ అభిప్రాయాలను ఇండియాలెండ్స్ సర్వే తెలుసుకుంది.42 శాతం మంది తమ వివాహానికి తామే సొంతంగా నిధులు సమకూర్చుకోవాలనే ప్రణాళికతో ఉన్నట్టు తెలిసింది. ఇందులోనూ 41 శాతం మంది తమ పొదుపు నిధులను వాడుకోవాలని అనుకుంటుంటే.. 26 శాతం మంది పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. మరో 33 శాతం మంది పెళ్లి ఖర్చు విషయంలో ఇంకా ఎలాంటి ప్రణాళికతో లేనట్టు వెల్లడైంది. ఇప్పటికీ 82 శాతం పెళ్లిళ్లు వ్యక్తిగత పొదుపు సొమ్ములతోనే పూర్తవుతుండగా.. ఆస్తులు విక్రయించి 6 శాతం మేర, మరో 12 శాతం పెళ్లి వేడుకలు అప్పులతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెళ్లిళ్ల సర్వే వివరాలతో ‘వెడ్డింగ్ స్పెండ్స్ రిపోర్ట్ 2.0’ను ఇండియాలెండ్స్ విడుదల చేసింది.ముందుకొస్తున్న సంస్థలు..వివాహాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా భావించడం, ఖర్చుకు వెనుకాడని ధోరణి ఈ మార్కెట్లో బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలకు భారీ అవకాశాలు కలి్పస్తున్నాయి. పెళ్లి సంబంధాలకు వేదిక అయిన మ్యాట్రిమోనీ డాట్ కామ్ దీన్ని ముందే గుర్తించి.. వెడ్డింగ్లోన్ డాట్ కామ్ పేరుతో ఇటీవలే ఒక ప్రత్యేక పోర్టల్ ప్రారంభించింది. వివాహం కోసం వధూవరులు లేదా తల్లిదండ్రులు ఈ ప్లాట్ఫామ్ సాయంతో రుణం తీసుకోవచ్చు. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, టాటా క్యాపిటల్, ఎల్అండ్టీ ఫైనాన్స్తో ఈ సంస్థ జట్టుకట్టింది.‘‘అన్సెక్యూర్డ్ పర్సనల్ రుణాల్లో 25–30 శాతం మేర వివాహాల కోసమే తీసుకుంటున్నట్టు మా అధ్యయనంలో తెలిసింది. గడిచిన రెండేళ్లలో ఈ డిమాండ్ 20 శాతం మేర పెరిగింది’’అని మ్యాట్రిమోనీ డాట్ కామ్ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ ఝా తెలిపారు. యాక్సిస్ బ్యాంక్ అయితే తనఖా లేకుండానే వివాహ రుణాలు అందిస్తోంది. సులభతర చెల్లింపులతో ఆన్లైన్లో రుణాలను మంజూరు చేస్తున్నట్టు బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ అర్జున్ చౌదరి చెప్పారు. వెడ్డింగ్లోన్ డాట్ కామ్ ఓవర్డ్రాఫ్ట్ సదుపాయం, పర్సనల్ లోన్స్, రివాల్వింగ్ క్రెడిట్ లైన్ పేరుతో 3 రకాల ఉత్పత్తులను ఆఫర్ చేస్తోంది. ఓవర్డ్రాఫ్ట్ సదుపాయం అన్నది రుణ గ్రహీత సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాతో అనుసంధానమై ఉంటుంది.పెరిగిపోయిన వ్యయాలు వివాహాలకు ఖర్చులు పెరిగిపోతుండడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. 68 శాతం మంది రూ.లక్ష నుంచి రూ.5 లక్షల మధ్య రుణం తీసుకోవాలని అనుకుంటున్నారు. సగటు వివాహ వేడుక వ్యయం రూ.36.5 లక్షలకు పెరిగినట్టు ‘వెడ్మీగుడ్’ అనే వెడ్డింగ్ ప్లానర్ చెబుతోంది. ఇక డెస్టినేషన్ వెడ్డింగ్ వేడుక కోసం చేసే ఖర్చు రూ.51 లక్షలకు పెరిగినట్టు తెలిపింది. 2023తో పోలి్చతే ఈ వ్యయాలు 7 శాతం వరకు పెరిగాయి. ముఖ్యంగా కల్యాణ మంటపం, క్యాటరింగ్ చార్జీలు 10 శాతం వరకు పెరిగాయి. పెళ్లి ఘనంగా చేసుకునేందుకు నిధుల లోటును అడ్డంకిగా మెజారిటీ యువతరం భావించడం లేదు. రుణాల లభ్యత పెరిగిపోవడమే ఇందుకు కారణం. మారిన ధోరణి.. గతంలో తెలిసిన వారి వద్ద, స్థానిక రుణదాతల నుంచి వివాహం కోసం అప్పు తీసుకునే వారు. ఇప్పుడు ఈ మార్కెట్ సంఘటితంగా మారి బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీల వైపు మళ్లుతోంది – ప్రవీణ్ ఖండేల్వాల్, సీఏఐటీ వ్యవస్థాపకులురూ.15,000 ఆదాయం ఉంటే చాలు.. నెలవారీ రూ.15,000 ఆదాయం ఉన్న వారు సైతం రూ.50,000 నుంచి రూ.40 లక్షల వరకు రుణాలు పొందొచ్చని యాక్సిస్బ్యాంక్ అధికారి తెలిపారు. వివాహ రుణాలపై వడ్డీ రేటు 10 శాతం నుంచి ప్రారంభమవుతోంది. -
ద.మ. రైల్వే ప్రాజెక్టులకు మరిన్ని నిధులు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ పద్దులో దక్షిణమధ్య రైల్వేకు కేటాయించిన నిధులను రైల్వేశాఖ రూ. 1,350.26 కోట్ల మేర పెంచింది. మధ్యంతర బడ్జె ట్లో దక్షిణమధ్య రైల్వేకు రూ.14,232.84 కోట్లు కేటాయించగా తాజాగా ఆ మొత్తాన్ని 15,583.10 కోట్లకు పెంచింది. మొత్తంగా నిధులు పెంచడంతోపాటు ప్రాజెక్టులవారీగా మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించిన మొత్తాలను కూడా సవరించింది. బైపాస్ లైన్లకు నిదుల పెంపు.. జంక్షన్ స్టేషన్ల సమీపంలో రైల్వే ట్రాఫిక్ పెరిగి ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో బైపాస్ లైన్ల నిర్మాణానికి రైల్వే శాఖ ప్రాధాన్యం ఇస్తోంది. వేగంగా పనులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలకు సవరించిన బడ్జెట్లో నిధులు పెంచింది.దక్షిణమధ్య రైల్వేకు తొలుత రూ. 2,905 కోట్లు కేటాయించగా ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 3,629 కోట్లకు పెంచింది. అలాగే సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ పనులకు రూ. 113.64 కోట్ల మేర అదనపు కేటాయింపులు చేసింది. ట్రాక్ సామర్థ్యం పెంపు పనులకు తొలుత రూ. 1,530 కోట్లు కేటాయించగా ఆ మొత్తాన్ని రూ. 1,930 కోట్లకు పెంచింది. కాజీపేట–విజయవాడ మూడో లైన్కు పెరిగిన నిధులు దక్షిణాది–ఉత్తరాదిని జోడించే గ్రాండ్ ట్రంక్ రూట్లో భాగంగా ఉన్న కాజీపేట–విజయవాడ మార్గంలో జరుగుతున్న మూడో లైన్ నిర్మాణంపై రైల్వే శాఖ దృష్టి సారించింది. ఈ మార్గంలో రైళ్ల సంఖ్యను పెంచడంతోపాటు రైళ్ల వేగాన్ని కూడా పెంచాలని ఇప్పటికే నిర్ణయించింది. ఇందుకోసం మూడో మార్గాన్ని వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఏడాదిలో పనులు ముగించేలా చూస్తోంది. ఈ ప్రాజెక్టుకు మధ్యంతర బడ్జెట్లో రూ.310 కోట్లు కేటాయించగా తాజాగా ఆ మొత్తాన్ని రూ. 190 కోట్ల మేర పెంచి రూ. 500 కోట్ల కేటాయింపులు చేసింది. మరోవైపు నిజామాబాద్ నుంచి మహబూబ్నగర్ మీదుగా డోన్ వరకు రెండో లైన్ను నిర్మాణంలో ఉన్న విషయం తెలిసిందే. ఇది మహారాష్ట్రలోని అకోలా నుంచి డోన్ వరకు విస్తరించిన ప్రాజెక్టు. ఇందులో సికింద్రాబాద్ నుంచి మహబూబ్నగర్ వరకు డబ్లింగ్ పూర్తవగా ఎగువ ప్రాంతంలో జరుగుతున్నాయి. నిజామాబాద్–సికింద్రాబాద్ మధ్య జరగాల్సి ఉంది. ఈ పనులకు తొలుత రూ. 220 కోట్లు ప్రతిపాదించగా ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 550 కోట్లకు పెంచడం విశేషం. బీబీనగర్–గుంటూరు మార్గంలో సింగిల్ లైన్ ఉండటంతో ఆ మార్గంలో రైళ్ల సంఖ్య, వాటి వేగం పెంపు సాధ్యం కావట్లేదు. దీంతో ఈ మార్గంలో రెండోలైన్ నిర్మించే ప్రాజెక్టు గత బడ్జెట్లో మంజూరైంది. ఆ పనులకు మధ్యంతర బడ్జెట్లో రూ. 200 కోట్లు కేటాయించారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 220 కోట్లకు పెంచారు. ఎంఎంటీఎస్ రెండో దశకు నిధుల్లో కోత.. పురోగతి అంతంతమాత్రంగానే ఉన్న భద్రాచలం–డోర్నకల్ ప్రాజెక్టుకు రైల్వే శాఖ నిధులు కుదించింది. రూ. 100 కోట్ల కేటాయింపులను రూ. 50 కోట్లకు తగ్గించింది. అలాగే హైదరాబాద్లో కీలకమైన ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు కేటాయించిన నిధులను రూ. 50 కోట్ల నుంచి రూ. 40 కోట్లకు కుదించింది. -
ర్యాపిడో ఇక ‘యూనికార్న్’..
దేశంలో ప్రముఖ రైడ్-షేరింగ్ సంస్థ ‘రాపిడో’ మరిన్ని పెట్టుబడులు సమీకరిస్తోంది. వెస్ట్బ్రిడ్జ్ క్యాపిటల్ నేతృత్వంలో ఇటీవల జరిగిన సిరీస్-ఈ ఫండింగ్లో ఇన్వెస్టర్ల నుంచి 20 కోట్ల డాలర్లు (సుమారు రూ.1,680 కోట్లు) నిధులు సమీకరణకు హామీ అందుకున్నట్లు ర్యాపిడో తెలిపింది.ఈ తాజా పెట్టుబడులతో రాపిడో విలువ 110 కోట్ల డాలర్లకు (సుమారు రూ.9,236 కోట్లు) పెరిగింది. యానికార్న్ క్లబ్లో చేరింది. ఒక బిలియన్ డాలర్ల విలువను సాధించిన కంపెనీలను యూనికార్న్గా వ్యవహరిస్తారు. కొత్తగా సేకరించిన నిధులను దేశం అంతటా రాపిడో కార్యకలాపాలను విస్తరించడానికి, సర్వీస్ డెలివరీని మెరుగుపరచడానికి వినియోగిస్తామని కంపెనీ పేర్కొంది.బైక్ ట్యాక్సీ సర్వీస్గా 9 సంవత్సరాల క్రితం ర్యాపిడో ప్రారంభమైంది. పవన్ గుంటుపల్లి, అరవింద్ శంఖ, రుషికేష్లు 2015లో దీన్ని స్థాపించారు. ఏడాదికేడాది 150% పైగా వృద్ధితో దేశంలో షేర్డ్ మొబిలిటీ రంగంలో అగ్రగామిగా దాని స్థానాన్ని పటిష్టం చేసుకుంది. మొదట్లో బైక్-టాక్సీలపై దృష్టి సారించిన కంపెనీ, ఆ తర్వాత ఆటో, క్యాబ్ సేవలను విస్తరించింది. దేశంలోని 100 కుపైగా నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
ఒలింపిక్ పతకాల వేటలో... ఖర్చు రూ. 470 కోట్లు
2012 లండన్ ఒలింపిక్స్లో గ్రేట్ బ్రిటన్ 29 స్వర్ణాలు, 18 రజతాలు, 18 కాంస్యాలతో (మొత్తం 65 పతకాలు) మూడో స్థానంలో నిలిచింది. సొంతగడ్డపై పెద్ద సంఖ్యలో పతకాలు గెలిచే లక్ష్యంతో అక్కడి ప్రభుత్వం చాలా ఏళ్ల క్రితమే ప్రణాళికలు రూపొందించి పెద్ద సంఖ్యలో నిధులు కేటాయించింది. వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే తాము గెలిచిన ఒక్కో పతకం కోసం 45 లక్షల పౌండ్లు (సుమారు రూ.38 కోట్లు) ఖర్చు చేసినట్లు ఒలింపిక్స్ తర్వాత అధికారులు వెల్లడించారు. ఆధునిక సౌకర్యాలు, శిక్షణ, టోర్నీలు వంటి సన్నాహాల్లో దీనిని ఖర్చు చేశారు. ఇది పుష్కరకాలం క్రితం నాటి మాట. ఇదే విషయాన్ని భారత్ కోణంలో చూస్తే ఇలాంటిది గతంలో ఎప్పుడూ జరగలేదు. ఆటగాళ్లు వ్యక్తిగత కష్టం, పట్టుదలను నమ్ముకొనే బరిలోకి దిగుతూ వచ్చారు. ఒలింపిక్స్కు చేరువైన సమయంలో అక్కడక్కడా కొంత ఆర్థిక సహకారం లభించినా... అందులో ప్రభుత్వ పాత్ర పెద్దగా లేదు. 1956 నుంచి 1992 వరకు భారత్కు ఒలింపిక్స్లో ఒక్క వ్యక్తిగత పతకం కూడా రాలేదు. ఆ తర్వాతి ఒలింపిక్స్లలో పతకం సాధించినవారు కూడా సొంతంగా సన్నద్ధమైనవారే తప్ప ఒక్కరిని కూడా వ్యవస్థ తీర్చిదిద్దినవారుగా చెప్పలేం. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారింది. కేంద్ర ప్రభుత్వం ఒలింపిక్ క్రీడలను, ఒలింపిక్స్కు అర్హత సాధించే ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. గెలిచి వచ్చిన తర్వాత అందించే నజరానాల కంటే గెలిచేందుకు కావాల్సిన వాతావరణం సృష్టించడం కీలకమని నమ్మింది. అందుకే మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసీ) పేరుతో ప్రత్యేకంగా ఆర్థిక వనరులను చేకూర్చింది. టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్స్) పథకం పేరుతో ఎంపిక చేసిన ఆటగాళ్లకు సహాయం అందించడం ఈ ఎంఓసీలోనే భాగంగా ఉంది. విదేశాల్లో శిక్షణ, పోటీల కోసం ప్రత్యేక క్యాలెండర్ (ఏసీటీసీ)తో ఈ ప్రణాళిక రూపొందించగా... వివిధ వర్గాల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) ద్వారా కూడా నిధులు సేకరించింది. – సాక్షి క్రీడా విభాగం టోక్యో ఒలింపిక్స్లో భారత్ గరిష్టంగా 7 పతకాలు సాధించింది. ఇవి ముగిసిన తర్వాత పారిస్ ఒలింపిక్స్ కోసం సన్నాహాలు షురూ అయ్యాయి. ఈ సారి పతకాల సంఖ్యను పెంచడమే ఏకైక లక్ష్యంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) తమ వంతు పని చేసింది. 16 క్రీడాంశాల్లో ఆయా జాతీయ క్రీడా సమాఖ్యల సూచనలు, ప్రతిపాదనలతో ప్రణాళిక సిద్ధమైంది.కేవలం నిధులు అందించడం మాత్రమే కాగా టోక్యో–పారిస్ మధ్య కాలంలో ఆటగాళ్ల ప్రదర్శనను కూడా ‘సాయ్’ పర్యవేక్షిస్తూ వచ్చింది. అధికారిక లెక్కల ప్రకారం పారిస్ ఒలింపిక్స్ సన్నాహాల కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ. 470 కోట్లు ఖర్చు చేసింది. మన దేశం నుంచి ఈసారి 117 మంది ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. పతకావకాశాలు ఉన్న వివిధ క్రీడలు, క్రీడాకారుల కోసం చేసిన ఖర్చు వివరాలను చూస్తే...అథ్లెటిక్స్: ప్రభుత్వం నుంచి ఎక్కువ ఆర్థిక సహాయం అందుకున్న క్రీడాంశం అథ్లెటిక్స్. ఒలింపిక్స్లో భారత్ నుంచి 29 మంది పాల్గొంటున్నారు. అథ్లెటిక్స్కు కేంద్రం రూ.96.08 కోట్లు ఖర్చు చేసింది. గత టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించడంతో ఈ సారి అంచనాలు మరింత పెరిగాయి. మొత్తం 36 జాతీయ శిక్షణా శిబిరాలు నిర్వహించారు. విదేశీ కోచ్ క్లాజ్ బార్టొనెట్ వద్ద శిక్షణ తీసుకోవడంతో పాటు విదేశాల్లో టోర్నీలు, శిక్షణ కోసం నీరజ్ చోప్రాకే ప్రభుత్వం రూ.5.72 కోట్లు ఇ చ్చింది. బ్యాడ్మింటన్: ప్రభుత్వం ఈ క్రీడ కోసం మొత్తం రూ. 72.02 కోట్లు ఖర్చు చేసింది. భారత్ నుంచి సింగిల్స్ విభాగంలో ముగ్గురు... పురుషుల, మహిళల డబుల్స్లో కలిపి నలుగురు షట్లర్లు బరిలోకి దిగుతున్నారు. విదేశాల్లో శిక్షణ, టోర్నీలకు గరిష్టంగా బ్యాడ్మింటన్ ఆటగాళ్ల 81 ట్రిప్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. డబుల్స్ స్పెషలిస్ట్ కోచ్ మథియాస్ బో వద్ద శిక్షణ, వీడియో అనలిస్ట్, ఇతర సౌకర్యాల కోసం డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టిలకు ప్రభుత్వం రూ. 5.62 కోట్లు ఇవ్వగా... పీవీ సింధుకు రూ.3.13 కోట్లు అందించింది. దీంతో పాటు 17 విదేశీ పర్యటనలు, వ్యక్తిగత కోచ్లు, సిబ్బంది నియామకం కోసం కూడా ‘టాప్స్’ ద్వారా సింధుకు సహకారం లభించింది. బాక్సింగ్: రూ.60.93 కోట్లు షూటింగ్: రూ.60.42 కోట్లు (ఆటగాళ్ల మొత్తం 45 విదేశీ ట్రిప్లకు ప్రభుత్వ సహకారం లభించింది. మొత్తం 41 జాతీయ క్యాంప్లు జరిగాయి) హాకీ: రూ.41.29 కోట్లు (టోక్యోలో కాంస్యం సాధించడంతో ఈ సారి మన జట్టునుంచి మరింత మెరుగైన ప్రదర్శనను ఆశిస్తూ 76 జాతీయ శిక్షణా శిబిరాలు నిర్వహించడంతో పాటు 19 విదేశీ పర్యటనలకు అవకాశం కల్పించింది) ఆర్చరీ: రూ.39.18 కోట్లు (41 జాతీయ క్యాంప్లు నిర్వహించారు) రెజ్లింగ్: రూ.37.80 కోట్లు వెయిట్లిఫ్టింగ్: రూ.26.98 కోట్లు (టోక్యో రజత పతక విజేత మీరాబాయి చానుకు శిక్షణ నిమిత్తం ప్రభుత్వం రూ. 2.74 కోట్లు అందించింది) టేబుల్ టెన్నిస్: రూ. 12.92 కోట్లు జూడో: రూ. 6.30 కోట్లు స్విమ్మింగ్: రూ.3.90 కోట్లు రోయింగ్: రూ.3.89 కోట్లు సెయిలింగ్: రూ.3.78 కోట్లు గోల్ఫ్: రూ.1.74 కోట్లు టెన్నిస్: రూ.1.67 కోట్లు ఈక్వె్రస్టియన్: రూ.95 లక్షలు -
జెప్టోకు నిధుల పంట
న్యూఢిల్లీ: గ్రోసరీ డెలివరీ స్టార్టప్ జెప్టో భారీగా పెట్టుబడులను అందుకుంది. త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానున్న కంపెనీ 66.5 కోట్ల డాలర్ల (రూ. 5,550 కోట్లు) నిధులను సమీకరించింది. దీంతో ఈ క్విక్ కామర్స్ సంస్థ విలువ 3.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 30,000 కోట్లు)కు ఎగసింది. వెరసి ఈకామర్స్ దిగ్గజాలు అమెజాన్, బ్లింకిట్ (జొమాటో), స్విగ్గీ ఇన్స్టామార్ట్, బిగ్బాస్కెట్ (టాటా గ్రూప్)లతో పోటీ పడనుంది.గ్రోసరీ డెలివరీ విభాగంలో తీవ్ర పోటీ కారణంగా అధిక పెట్టుబడులు, తక్కువ మార్జిన్లు నమోదయ్యే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జెప్టోలో తాజా పెట్టుబడులకు ప్రాధాన్యత ఏర్పడింది. 2021 ఏప్రిల్లో ప్రారంభమైన స్టార్టప్ జెప్టోలో కొత్త సంస్థలు ఎవెనీర్ గ్రోత్ క్యాపిటల్, లైట్స్పీడ్, అవ్రా క్యాపిటల్సహా ప్రస్తుత ఇన్వెస్టర్లు గ్లేడ్ బ్రూక్, నెక్సస్, స్టెప్స్టోన్ గ్రూప్ తాజా పెట్టుబడులను అందించాయి.కాగా.. జెప్టో నిర్వహణస్థాయిలో లాభాలు ఆర్జించేందుకు సిద్ధంగా ఉన్నదని, సమీప భవిష్యత్లో స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యే అవకాశముందని సంబంధిత వర్గా లు తెలిపాయి. గ్రోసరీస్ను 10 నిమిషాల్లో డెలివరీ చేసే సంస్థల్లో కంపెనీ 29% వాటాను ఆక్రమిస్తుండగా..40% వాటాతో బ్లింకిట్ టాప్లో ఉంది. -
మస్క్ ఏఐ కంపెనీ Xaiకి పెట్టుబడుల వరద..
ప్రముఖ బిలియనీర్ ఎలోన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఎక్స్ఏఐ (xAI) సిరీస్ బీ ఫండింగ్ రౌండ్లో 6 బిలియన్లను సేకరించారు. ఇందులో వెంచర్ క్యాప్టలిస్ట్ ఆండ్రీసెన్ హోరోవిట్జ్, సీక్వోయా క్యాపిటల్తో సహా పలువురు వ్యాపార వేత్తలు పెట్టుబడులు పెట్టినట్లు ఎక్స్ఏఐ అధికారికంగా తెలిపింది. ఈ నిధుల్ని xAIని మార్కెట్కి పరిచయం చేయడానికి, అధునాతన మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, భవిష్యత్ టెక్నాలజీలపై పరిశోధన, వాటి అభివృద్ధిని వేగవంతం చేసేందుకు సంస్థ ఉపయోగించనుంది. అయితే మొత్తం ఎంతమొత్తంలో ఇన్వెస్టర్ల నుంచి మస్క్ నిధుల్ని సేకరిస్తున్నారనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ ఇతర మీడియా నివేదికలు నిధుల మొత్తం 18 బిలియన్ నుంచి 24 బిలియన్ల మధ్య ఉంటుందని సమాచారం. మస్క్ చాట్జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ ఫౌండర్లలో ఒకరిగా ఉన్నారు. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా పనిచేశారు. అయితే ఏఐ చాట్జీపీటీ వల్ల తలెత్తే ప్రమాదాలను గుర్తించారు. ఆ సంస్థ నుంచి వైదొలగారు. టెక్నాలజీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్కు సలహా ఇచ్చారు. -
బీమా పాలసీ.. అత్యవసర నిధి!
ఉన్నట్టుండి నిధుల అవసరం ఏర్పడిందా..? వ్యక్తిగత రుణానికి తక్కువ క్రెడిట్ స్కోర్ అడ్డు పడుతోందా? లేదంటే వ్యక్తిగత రుణంపై అధిక వడ్డీ రేటు చూసి వెనుకాడుతున్నారా..? ఇలాంటి సందర్భాల్లో బీమా పాలసీయే మిమ్మల్ని ఆదుకుంటుంది. అదెలా అంటారా? ఎండోమెంట్ బీమా ప్లాన్లపై బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు రుణ సదుపాయం కల్పిస్తున్నాయి. పైగా పర్సనల్ లోన్తో పోలిస్తే వడ్డీ రేటు తక్కువే.డబ్బులు అవసరం పడితే బీమా పాలసీని సరెండ్ చేసే వారూ ఉన్నారు. ఇలా ఇన్సూరెన్స్ పాలసీని సరెండర్ చేయడానికి బదులు, దానిపై రుణం తీసుకుని అవసరం గట్టెక్కడమే మంచి మార్గం అవుతుంది. దీనివల్ల బీమా రక్షణను ఎప్పటి మాదిరే కొనసాగించుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందన్నది తెలియజేసే కథనమే ఇది. రుణ సదుపాయం అన్ని రకాల బీమా పాలసీలపై వస్తుందనుకుంటే పొరపాటు. కేవలం కొన్ని రకాల పాలసీలకే ఇది పరిమితం. ‘‘పొదుపుతో కూడిన సంప్రదాయ బీమా పాలసీ (ఎండోమెంట్, మనీ బ్యాక్ ప్లాన్లు) కలిగి ఉన్నవారు వాటిపై పలు రకాల ఆర్థిక అవసరాల కోసం రుణాన్ని పొందొచ్చు’’అని ఏజెస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో విఘ్నేష్ సహానే తెలిపారు. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కేవలం మరణ పరిహారాన్నే అందిస్తాయని, ఎలాంటి రాబడి హామీ ఉండదు కనుక వాటిపై రుణం పొందలేరని స్పష్టం చేశారు. యూనిట్ లింక్డ్ ప్లాన్ల (యులిప్)లోనూ రాబడులు మార్కెట్పై ఆధారపడి ఉంటాయి కనుక వాటిపైనా రుణ సదుపాయం ఉండదని తెలిపారు. ఎక్కడ తీసుకోవచ్చు? పాలసీ మంజూరు చేసిన జీవిత బీమా కంపెనీ నుంచే రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. నేడు చాలా బీమా సంస్థలు పాలసీలపై రుణాలను కూడా ఇస్తున్నాయి. అలాగే, బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు ఈ తరహా రుణాలను ఆఫర్ చేస్తుంటాయి. అయితే, బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీల కంటే పాలసీ మంజూరు చేసిన బీమా సంస్థను సంప్రదించడమే మెరుగైన మార్గమని నిపుణులు అంటున్నారు. ‘‘ఇన్సూరెన్స్ కంపెనీతో పోలిస్తే బ్యాంక్లు బీమా ప్లాన్లపై తక్కువ రుణ మొత్తాన్ని ఆఫర్ చేస్తాయి. అదే మాదిరి బీమా సంస్థలతో పోలిస్తే బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు రుణాలపై కొంచెం అధిక రేటును వసూలు చేస్తుంటాయి’’అని సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ‘ప్లాన్ ఆర్’ వ్యవస్థాపకుడు అజయ్ ప్రుతి తెలిపారు. బ్యాంక్లు సాధారణంగా బీమా పాలసీపై రుణాన్ని నేరుగా కాకుండా.. కరెంట్ అకౌంట్పై ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కింద అందిస్తుంటాయి. ‘‘తరచుగా నిధుల అవసరం ఏర్పడేవారు ఇలా కరెంట్ అకౌంట్పై (సెక్యూరిటీ కింద బీమా పాలసీ జమ చేసి) ఓవర్డ్రాఫ్ట్ సదుపాయం తీసుకోవడాన్ని పరిశీలించొచ్చని పైసా బజార్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సహిల్ అరోరా సూచించారు. చౌక రుణం ‘‘బీమా పాలసీలపై రుణ రేటు చాలా తక్కువగా ఉండడాన్ని గమనించొచ్చు. సాధారణంగా వీటిపై 9–9.5 శాతం వార్షిక వడ్డీ రేటును వసూలు చేస్తుంటారు. అదే వ్యక్తిగత రుణాలు (పర్సనల్ లోన్) అయితే 12 శాతం అంతకంటే ఎక్కువే ఉంటుంది’’అని బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజేష్ కృష్ణన్ తెలిపారు. ఇక బీమా పాలసీలపై రుణం ఎంతొస్తుందంటే.. రుణం తీసుకునే నాటికి ఉన్న స్వా«దీనపు విలువ (సరెండర్ వ్యాల్యూ)లో 90 శాతం వరకు. బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీల నుంచి రుణం మంజూరునకు సాధారణంగా నాలుగు నుంచి ఏడు రోజులు పడుతుంది. అదే బీమా సంస్థల నుంచి రుణం మూడు రోజుల్లోనే పొందొచ్చు. కొన్ని బీమా సంస్థలు ఇంతకంటే వేగంగా ఆన్లైన్లోనే పాలసీలపై రుణాలను మంజూరు చేస్తున్నాయి. ‘‘జీవిత బీమా పాలసీలపై రుణం దరఖాస్తు మదింపు, రుణం మంజూరు చాలా వేగంగా ఉంటుంది. బీమా సంస్థ నుంచే రుణం తీసుకునేట్టు అయితే ఎలాంటి అదనపు తనిఖీలు, పరిశీలనలు అవసరం పడవు’’అని రాజేష్ కృష్ణన్ వివరించారు.బీమా పాలసీపై రుణం తీసుకోవడం ఎంతో సౌకర్యమైనదిగా పాలసీఎక్స్ సీఈవో నావల్ గోయల్ సైతం అంగీకరించారు. ‘‘దరఖాస్తు చేసుకోవడం ఎంతో సులభం. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వారు సైతం పాలసీపై రుణానికి అర్హులే. ఎందుకంటే పాలసీపై రుణం జారీకి క్రెడిట్ స్కోర్ తనిఖీలు అవసరం పడవు’’అని కృష్ణన్ తెలిపారు. ఈ రుణం తిరిగి చెల్లింపు నిబంధనలు కూడా సులభమే. ‘‘రుణం చెల్లించడం వీలు కానప్పుడు కేవలం రుణంపై వడ్డీ వరకే చెల్లించొచ్చు. అసలు రుణాన్ని ఎప్పుడైనా తిరిగి తీర్చివేయవచ్చు’’అని ప్రుతి వివరించారు. ఎంత వీలైతే అంత అసలు రుణంలో చెల్లించుకుంటూ వెళ్లడం కూడా మంచి ఆలోచనే. దీనివల్ల ప్రతి నెలా చెల్లించే వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. అత్యవసర నిధి బీమా పాలసీ అత్యవసర నిధిగానూ అక్కరకొస్తుంది. ప్రతి కుటుంబానికి విధిగా అత్యవసర నిధి ఉండాలి. అనుకోని పరిణామాలతో నెలవారీ వచ్చే ఆదాయం ఆగిపోతే? చేస్తున్న ఉద్యోగం ఊడిపోతే..? అక్కడి నుంచి తిరిగి ఉపాధి లభించేంత వరకు కుటుంబ అవసరాలను తీర్చేందుకు అత్యవసర నిధి ఉపయోగపడుతుంది. కనీసం ఆరు నెలల నుంచి ఏడాది అవసరాలను తీర్చేంత అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. అయితే, ప్రతి ఒక్కరికీ ఇంత మొత్తం అత్యవసర నిధి కింద ఏర్పాటుకు వెసులుబాటు ఉండకపోవచ్చు. ఇలాంటి వారు ఎండోమెంట్ లేదా మనీబ్యాక్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను అత్యవసర నిధి కింద ఉపయోగించుకోవచ్చు. తిరిగి ఉపాధి ఏర్పడి, ఆదాయం చేతికి అందేంత వరకు పాలసీపై రుణంతో అవసరాలను గట్టెక్కొచ్చు. ఆ తర్వాత క్రమంగా ఆరు నెలల్లోపు పాలసీపై రుణాన్ని తీర్చివేయడం మంచి ఆలోచన అవుతుంది. పాలసీ సరెండర్ అంటే? ఎండోమెంట్ లేదా మనీ బ్యాక్ బీమా ప్లాన్ వద్దనుకునే వారు దాన్ని సరెండర్ చేసుకోవచ్చు. అంటే గడువు ముగియకుండానే పాలసీని వెనక్కిచ్చేయడం. పాలసీ తీసుకున్న తర్వాత ఎంత కాలానికి సరెండర్ చేస్తున్నారనే దాని ఆధారంగా దానిపై ఎంతొస్తుందన్నది ఆధారపడి ఉంటుంది. ఈ సరెండర్ వ్యాల్యూ (స్వా«దీనపు విలువ) విషయంలో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) 2024 ఏప్రిల్ 1 నుంచి నూతన నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ప్రకారం బీమా పాలసీ తీసుకున్న మూడేళ్లలోపు సరెండర్ చేస్తే చేతికి చాలా తక్కువే వస్తుంది. అంటే అప్పటికి కట్టిన ప్రీమియంలో సగం కూడా రాదు. అదే పాలసీ తీసుకున్న తర్వాత నాలుగేళ్ల నుంచి ఏడేళ్లలోపు సరెండర్ చేస్తే అధిక విలువ పాలసీదారుకు దక్కుతుంది. నిజానికి ఎండోమెంట్, మనీబ్యాక్ పాలసీల్లో 20–30 ఏళ్లపాటు కొనసాగినప్పుడే ప్రతిఫలం కనిపిస్తుంది. ఇంతకంటే తక్కువ కాలవ్యవధిపై వచ్చే ప్రయోజనం అంతగా ఉండదు. అందుకని నిధుల అవసరం ఏర్పడితే బీమా ప్లాన్ను సరెండర్ చేయడానికి బదులు.. దానిపై రుణం పొందడమే మెరుగైనది అవుతుంది. మళ్లీ నిధుల వెసులుబాటు వచ్చిన వెంటనే తీసుకున్న రుణాన్ని తీర్చివేయాలి. ఆరంభంలో తక్కువే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న కొత్తలో దీనిపై వచ్చే రుణం చాలా స్వల్పం. ఇందులో ఉన్న ప్రతికూలత ఇదే. క్యాష్ వ్యాల్యూ లేదా సరెండర్ వ్యాల్యూ గణనీయంగా పెరిగేందుకు కొన్నేళ్లు పడుతుంది. అప్పుడే చెప్పుకోతగ్గ మేర రుణం దీనిపై వస్తుంది. ఇక ఎండోమెంట్ లేదా మనీ బ్యాంక్ పాలసీలపై దీర్ఘకాలంలో వచ్చే రాబడి 5–6 శాతం మేర ఉంటుంది. దీనిపై రుణం తీసుకుంటే, నికరంగా అందుకునే రాబడి ప్రయోజనం మరింత తగ్గిపోతుందని గుర్తు పెట్టుకోవాలి. తిరిగి చెల్లించలేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై ఉన్న మరో అనుకూలత ఏమిటంటే.. రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైనా అది క్రెడిట్ స్కోర్ను ప్రభావితం చేయబోదని కృష్ణన్ తెలిపారు. రుణంలో అసలు, వడ్డీ, చార్జీలు అన్నింటినీ పాలసీ సరెండర్ వ్యాల్యూ నుంచి బీమా సంస్థలు సర్దుబాటు చేసుకుంటాయని సహిల్ అరోరా తెలిపారు. రుణం చెల్లించకుండా పాలసీదారు మరణించిన సందర్భాల్లో.. పరిహారం నుంచి రుణం, వడ్డీ, చార్జీలను మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని బీమా సంస్థ నామినీ లేదా పాలసీదారు వారసులకు చెల్లిస్తుంది. రుణం తీర్చకుండానే పాలసీ గడువు ముగిసిపోయిందనుకుంటే.. అప్పుడు నికరంగా చెల్లించే మొత్తం నుంచి రుణాన్ని బీమా సంస్థ వసూలు చేసుకుంటుంది. ఒకవేళ రుణంపై వడ్డీ కూడా బకాయి పడితే.. అసలు, వడ్డీ మొత్తం సరెండర్ వ్యాల్యూని దాటిపోతుంటే అప్పుడు పాలసీని బీమా సంస్థ రద్దు చేస్తుంది. పాలసీపై రుణం తీసుకునే సమయంలోనే దానిపై బీమా సంస్థకు హక్కులు బదలాయిస్తున్నట్టు అంగీకారాన్ని తీసుకుంటాయి. రుణం సమంజసమేనా..? అసలు జీవిత బీమా ఎందుకు? ఆర్జించే వ్యక్తికి దురదృష్టవశాత్తూ ఏదైనా వాటిల్లితే అప్పుడు అతనిపై ఆధారపడిన కుటుంబం ఆర్థికంగా కష్టాలు పడకూడదనే. తాను లేకపోయినా, తన కుటుంబ అవసరాలను తీర్చే లక్ష్యంతోనే లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీని తీసుకుంటుంటారు. మరి అలాంటి సాధనంపై రుణం తీసుకుంటే, అసలు ప్రయోజనానికే భంగం కలగొచ్చని నిపుణుల భావన. అదెలా అంటే పాలసీపై రుణం తీసుకున్న తర్వాత సదరు పాలసీదారు అనుకోకుండా మరణం పాలైతే.. కుటుంబానికి దక్కే బీమా పరిహారం పెద్దగా ఉండకపోవచ్చు. దాంతో బీమా ఉద్దేశ్యం నెరవేరకుండా పోతుంది. అందుకని బంగారం, మ్యూచువల్ ఫండ్స్, ప్రాపర్టీ తదితర ఇతర సాధనాలపై రుణం తీసుకోవడాన్ని పరిశీలించొచ్చని చెబుతుంటారు. కానీ, ఇక్కడ వాస్తవ అంశం ఏమిటంటే.. బంగారంపై రుణం తీసుకున్న తర్వాత సదరు వ్యక్తి మరణించినా కానీ, ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత కుటుంబంపైనే పడుతుంది. అందుకని ఏ సాధనంపై రుణం తీసుకున్నా పరిణామం ఒక్కటిగానే ఉంటుంది. అందుకుని దీనికి పరిష్కారం ఒకటి ఉంది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ఏదైనా అవసరం కోసం రుణం తీసుకుంటుంటే, వెంటనే అంత విలువకు టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజీని పెంచుకోవడం లేదంటే అదనపు కవరేజీతో టర్మ్ ప్లాన్ కొనుగోలు చేయడం మంచిది. దీనివల్ల అనుకోనిది జరిగినా వచ్చే పరిహారంతో రుణాలను గట్టెక్కొచ్చు. ఇక దీర్ఘకాల అవసరాలకు కాకుండా స్వల్పకాల అవసరాలకే బీమాపై రుణానికి పరిమితం కావాలి. మూడు నుంచి ఆరు నెలలు మించకూడదు. ఎందుకంటే ఇంత తక్కువ కాలానికి చెల్లించాల్సిన వడ్డీ భారం కూడా చాలా తక్కువే ఉంటుంది. కనుక ఒకవేళ పాలసీదారు మరణించినా కుటుంబం పెద్దగా నష్టపోయేది ఉండదు. బీమా సంస్థ తనకు రావాల్సినంత మేర మినహాయించుకుని, మిగిలినది చెల్లించేస్తుంది. ఎండోమెంట్ ప్లాన్ ఉన్న వారు విధిగా మెరుగైన కవరేజీతో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పకుండా తీసుకోవాలి. అప్పుడు కుటుంబానికి మెరుగైన ఆర్థిక రక్షణ ఉంటుంది. -
ఏమిటీ ఎలక్టోరల్ బాండ్లు..!
ఎన్నికల బాండ్లు. పార్టిలకు విరాళాలిచ్చేందుకు ఉద్దేశించిన ప్రామిసరీ నోట్ల వంటి పత్రాలు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశానికి చెందిన వ్యక్తులు/సంస్థలు ఎవరైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాలూకు ఎంపిక చేసిన శాఖల్లో వీటిని కొనుగోలు చేసి తమకు నచి్చన పార్టికి విరాళంగా ఇవ్వవచ్చు. ఇవి రూ.1,000, రూ.10 వేలు, రూ.లక్ష, రూ.కోటి ముఖవిలువతో ఉంటాయి. జారీ అయిన 15 రోజుల్లోపు వీటిని నగదుగా మార్చుకోవాలి. లేదంటే ఆ మొత్తం ప్రధాని జాతీయ రిలీఫ్ ఫండ్కు వెళ్తుంది. బాండ్ల కొనుగోలుపై సంఖ్య పరిమితేమీ లేదు. ఒక్కరు ఎన్ని బాండ్లైనా కొనవచ్చు. పైగా తమ వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచవచ్చు. బాండ్లపై వారి పేరు తదితర వివరాలేవీ ఉండవు. బ్యాంకు వాటిని ఎవరికీ వెల్లడించదు. పార్టీలు రూ.20 వేలకు మించిన నగదు విరాళాల వివరాలను విధిగా బయట పెట్టాల్సి ఉంటుంది. కానీ ఈ బాండ్ల విషయంలో అలాంటి నిబంధనేదీ లేదు. ఎంత పెద్ద మొత్తం విరాళంగా అందినా వివరాలను ఈసీతో పాటు ఎవరికీ వెల్లడించాల్సిన పని లేదు. ఇది పారదర్శకతకు పాతరేయడమేనన్నది ప్రజాస్వామ్యవాదుల ప్రధాన అభ్యంతరం. గుర్తింపు పొందిన రాజకీయ పార్టిలన్నింటికీ బాండ్లు సేకరించే అవకాశమున్నా ఇది ప్రధానంగా అధికార పార్టిలకే బాగా ఉపయోగపడుతుందన్న వాదనలున్నాయి. ఎన్నికల బాండ్ల పథకం నిబంధనలు పౌరుల సమాచార హక్కు చట్టానికే విరుద్ధమని సుప్రీంకోర్టులో హోరాహోరీగా వాదనలు జరిగాయి. చివరికి ఈ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు గురువారం తీర్పు చెప్పింది. ఇవీ అభ్యంతరాలు ► బాండ్ల కొనుగోలుదారులతో సహా అన్ని వివరాలూ గోప్యంగా ఉంటాయి. ఇది పారదర్శకతకు గొడ్డలిపెట్టు. ► భారీగా విరాళాలిచ్చే కార్పొరేట్ సంస్థలు సదరు పార్టీ అధికారంలోకి వచ్చాక దాని నుంచి భారీగా అనుచిత లబ్ధి పొందే ఆస్కారం చాలావరకు ఉంటుంది. ఇది క్విడ్ ప్రొ కోకు దారి తీస్తుంది. ► పైగా ఈ బాండ్లతో అధికార పార్టిలకే అధిక ప్రయోజనం. దేశవ్యాప్తంగా అత్యధిక బాండ్లు వాటికే అందుతుండటమే ఇందుకు నిదర్శనం. ► మొత్తం ప్రక్రియలో ఎవరి పేరూ బయటికి రాదు గనుక వ్యక్తులకు, సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చేందుకు అధికార పార్టిలు ఇలా బాండ్ల ముసుగులో లంచాలు స్వీకరించే ఆస్కారం కూడా పుష్కలంగా ఉంది. ► పైగా ఈ నిధులను ఎన్నికల కోసమే వాడాలన్న నిబంధనేమీ లేదు. దాంతో వాటిని పార్టిలు తమ ఇష్టానికి ఖర్చు చేసుకోవచ్చు. ► దేనిపై వెచి్చంచాయన్న వివరాలు కూడా ఎవరికీ చెప్పాల్సిన అవకాశం లేదు. ► ఈ పథకం నల్లధనాన్ని మార్చుకునే పరికరంగా కూడా మారింది. ► దీనికి తోడు బాండ్ల కొనుగోలుదారుల వివరాలను తెలుసుకునే అవకాశం అధికార పార్టిలకు ఉంటుంది. ► తద్వారా సదరు వ్యక్తులను, కంపెనీలను వేధించే ప్రమాదమూ ఉంది. అత్యధిక వాటా బీజేపీదే ఎన్నికల బాండ్ల పథకం ద్వారా 2018 మార్చి నుంచి 2024 జనవరి దాకా రూ.16,518.11 కోట్ల విలువైన 28,030 బాండ్లు జారీ అయ్యాయి. వీటిలో పార్టిలన్నింటికీ కలిపి రూ.12,000 కోట్లకు పైగా విరాళాలందాయి. ఎన్నికల సంఘం, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) గణాంకాల ప్రకారం ఇందులో ఏకంగా సగానికి పైగా, అంటే 55 శాతం బీజేపీ వాటాయే కావడం విశేషం. బాండ్ల ద్వారా ఆ పార్టికి రూ.6,566 కోట్లు సమకూరాయి. బీజేపీ మొత్తం ఆదాయంలో సగానికి పైగా బాండ్ల రూపేణా సమకూరినదే. బాండ్ల ద్వారా కాంగ్రెస్ పార్టికి రూ.1,123 కోట్లు రాగా ఇతర పార్టిలన్నింటికీ కలిపి రూ.5,289 కోట్లు అందాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
3 రైల్వే లైన్ల నిర్మాణానికి నిధులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు రాబట్టడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ఏడాది కూడా విజయవంతమైంది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన రైల్వే లైన్లు కోటిపల్లి– నరసాపూర్, విజయవాడ – గూడూరు, కాజీపేట – విజయవాడ మధ్య మూడో లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించింది. ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణానికి ప్రాధాన్యం లభించడంతోపాటు రైల్వే స్టేషన్ల అభివృద్ధికి రైల్వే శాఖ పెద్ద పీట వేసింది. 2024–25కు గాను రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రూ.9,138 కోట్లు కేటాయించింది. రాష్ట్రానికి 2022–23 బడ్జెట్లో రూ.7,032 కోట్లు కేటాయించగా, 2023–24 బడ్జెట్లో రూ.8,406 కోట్లు కేటాయించారు. గత ఏడాదికంటే ఈ ఏడాది రూ.732 కోట్లు అధికంగా కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు, తెచ్చిన ఒత్తిడితోనే రైల్వే బడ్జెట్ కేటాయింపులు ప్రతి ఏటా పెంచుతున్నారని సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఈ బడ్జెట్లో రాష్ట్రంలోని ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులు.. (రూ.లలో) కోటిపల్లి – నరసాపూర్ కొత్త లైన్ నిర్మాణానికి 300 కోట్లు విజయవాడ–గూడూరు మూడో లైన్ 500 కోట్లు కాజీపేట – విజయవాడ మూడో లైన్ 310 కోట్లు విజయవాడ, రేణిగుంట, కాజీపేట, వాడి రైల్వే స్టేషన్ల వద్ద బైపాస్ లైన్లకు 209.8 కోట్లు అమృత్ భారత్ ప్రాజెక్టు కింద రైల్వే స్టేషన్ల అభివృద్ధికి: 425 కోట్లు ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణానికి: 407 కోట్లు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, హైలెవల్ ప్లాట్ఫారాల నిర్మాణానికి: 197 కోట్లు ట్రాఫిక్ ఫెసిలిటీ పనులకు: 172 కోట్లు రాజమహేంద్రవరం వద్ద గోదావరి నదిపై వంతెన నిర్వహణకు: 30 కోట్లు రాష్ట్రం గుండా ప్రయాణిస్తున్న వందేభారత్ రైళ్ల నిర్వహణకు: 10 కోట్లు -
ఫ్లిప్కార్ట్కు 600 మిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దేశీ ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్కు అమెరికన్ రిటైల్ దిగ్గజం 600 మిలియన్ డాలర్లు సమకూర్చనుంది. ఫ్లిప్కార్ట్ ప్రస్తుత వేల్యుయేషన్కు అదనంగా 5–10% లెక్కగట్టి వాల్మార్ట్ ఈ నిధులు అందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, తాజా నిధుల సమీకరణ తర్వాత కంపెనీ వేల్యుయేషన్ ఎంత స్థాయిలో ఉంటుందనేది వెల్లడి కాలేదు. ఇది 40 బిలియన్ డాలర్ల లోపే ఉంటుందని ఇతర వర్గాలు తెలిపాయి. ఫ్లిప్కార్ట్ చివరిసారి 37.6 బిలియన్ డాలర్ల విలువతో జీఐసీ, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్, సాఫ్ట్బ్యాంక్ విజన్ ఫండ్ 2 తదితర సంస్థల నుంచి 3.6 బిలియన్ డాలర్లను సమీకరించింది. -
‘వాటిపై ఆసక్తి ఏది?’.. స్మృతి ఇరానీ ఆవేదన
ముంబై: మహిళల ఆధ్వర్యంలో నడిచే వినూత్నమైన స్టార్టప్లకు మద్దతుగా నిలవకపోవడం పట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ (వీసీ) తీరును కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు. ‘నేటికీ పురుషుల ఆధ్వర్యంలోని కంపెనీలతో పోలిస్తే మహిళల ఆధ్వర్యంలోని స్టార్టప్ కంపెనీలపై వెంచర్ క్యాపిటలిస్ట్లు ఆసక్తి చూపడంలేదు’ అని మెంటార్ మైబోర్డ్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఇరానీ పేర్కొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఎంతో మంది మహిళా ఆవిష్కర్తలు ఉన్నట్టు చెప్పారు. వారి ప్రయత్నాలు వాణిజ్య వెంచర్లుగా రూపాంతరం చెందడం లేదన్న ఆవేదనను ఆమె వ్యక్తం చేశారు. వినూత్నంగా ఉంటున్నప్పటికీ కార్పొరేట్ బోర్డుల్లో ఎంత మంది మహిళలకు చోటు లభించిందో పరిశీలించాలని సూచించారు. మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వాల్సిన అవసరం లేదన్న మంత్రి స్మృతి ఇరానీ ఇటీవలి వ్యాఖ్యలపై విమర్శలు రావడం తెలిసిందే. అయితే తన వ్యాఖ్యలను ఆమె సమర్థించుకున్నారు. ‘‘మీ కంపెనీ హెచ్ఆర్ హెడ్ ప్రతి నెలా మీ నెలసరిని అడిగి తెలుసుకునే పరిస్థితిని ఊహించగలరా?’’అని ఆమె ప్రశ్నించారు. నెలసరి సెలవు ఇవ్వడం ప్రస్తుత చట్టాలకు సైతం విరుద్ధమన్నారు. ‘‘మహిళలు పెళ్లి చేసుకుంటే, పిల్లల కారణంగా పురోగతి చూపించలేరని గతంలో వారికి అవకాశాలు తిరస్కరించడాన్ని చూశాం. ఇప్పుడు నెలసరి రూపంలో వారికి ఉపాధిని నిరాకరించే పరిస్థితిని సృష్టించడం అవసరం అంటారా?’’అని ఇరానీ తన అభిప్రాయాలను పంచుకున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే విషయంలో ఒకే విధానం సరికాదన్నారు. సంప్రదింపుల నైపుణ్యాలను విద్యార్థుల్లో, ముఖ్యంగా మహిళా విద్యార్థుల్లో కలి్పంచడంపై దృష్టి సారించాలని బిజినెస్ స్కూళ్లకు ఆమె సూచించారు. -
స్టార్టప్లకు రూ. కోటి ఫండింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యువతను నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) ‘‘లీప్ ఎహెడ్’’ పేరిట ప్రత్యేక పథకాన్ని చేపట్టింది. ఈ పథకం ద్వారా ప్రారంభ దశలో (స్కేలింగ్) ఉన్న స్టార్టప్లతో పాటు గ్రోత్ స్టేజ్, ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్, కొత్త ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలో ఉన్న స్టార్టప్లకు కోటి రూపాయల వరకు నిధులు సమకూర్చనుంది. ఈ పథకం కింద ఎంపికైన స్టార్టప్లకు మూడు నెలల పాటు హైబ్రీడ్ మోడల్లో శిక్షణ ఇచ్చి మెంటారింగ్ చేస్తూ మార్కెటింగ్, ఫండ్ రైజింగ్ వంటి అవకాశాలను కల్పి స్తుంది. ఇందుకోసం డిసెంబర్ 10లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎస్టీపీఐ కోరింది. ఇప్పటివరకు రాష్ట్రం నుంచి 75 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 15 స్టార్టప్లను ఎంపిక చేసి ఆర్థిక సాయం అందిస్తారు. ఎన్జీఐఎస్ కింద 95 స్టార్టప్స్ నమోదు స్టార్టప్లను ప్రోత్సహించే నెక్టŠస్ జనరేషన్ ఇంక్యుబేషన్ స్కీం (ఎన్జీఐఎస్) కింద రాష్ట్రంలో 95 స్టార్టప్లు నమోదు చేసుకున్నట్లు వినయ్కుమార్ తెలిపారు. ఇందులో 28 స్టార్టప్స్కు రూ.25 లక్షల చొప్పున సీడ్ ఫండింగ్ అందించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్స్కు ప్రోత్సాహం అందిస్తుండటంతో పలు కాలేజీల్లో ఇంక్యుబేషన్ సెంటర్లలో యువత స్టార్టప్స్పై ప్రయోగాలు చేస్తున్నారన్నారు. విశాఖలో నాలుగో తరం సాంకేతిక పరిజ్ఞానం పెంచేలా ఏర్పాటు చేసిన కల్పతరువు సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ, ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నాస్కామ్ ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీలు స్టార్టప్స్కు మంచి వేదికలుగా మారాయని ఆయన వివరించారు. 6న విజయవాడలో ఔట్రీచ్ కార్యక్రమం లీప్ ఎహెడ్ కార్యక్రమంపై విద్యార్థులు, ఔత్సాహిక స్టార్టప్స్కు అవగాహన కల్పి ంచడానికి ఈ నెల 6న విజయవాడలో ఔట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్టీపీఐ విజయవాడ జాయింట్ డైరెక్టర్ బి.వినయ్కుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంక్యుబేషన్, స్టార్టప్ సెంటర్లు ఉన్న పలు ఇంజనీరింగ్ కళాశాలల్లో కూడా సదస్సులు నిర్వహిస్తామన్నారు. -
గృహ యజ్ఞం మెగా డ్రైవ్
తొలిసారిగా ఇళ్లకు అడ్వాన్స్ నిధులు గతంలో ఏ ప్రభుత్వమూ పేదల ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు అడ్వాన్స్ నిధులు ఇచ్చిన దాఖలాల్లేవు. పెద్ద కాంట్రాక్టు సంస్ధలకు మాత్రమే మొబిలైజేషన్ అడ్వాన్స్లు చెల్లించేవి. తొలిసారిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదల ఇళ్ల లబ్ధిదారులకు అడ్వాన్స్ నిధులను మంజూరు చేసింది. ఇన్నాళ్లూ పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తైనా నెలలు తరబడి బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేసిన ప్రభుత్వాలనే చూశామని, గృహ నిర్మాణాలకు అడ్వాన్స్ నిధులు ఇచ్చిన ప్రభుత్వం ఇదేనని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సమాచారం, అభ్యర్ధనల మేరకు నిరుపేద ఇళ్ల లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకునేందుకు అడ్వాన్స్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2,06,020 మంది లబ్ధిదారులకు రూ.376.82 కోట్లను అడ్వాన్స్గా విడుదల చేసింది. అడ్వాన్స్ నిధులు పొందిన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలు డిసెంబర్ నెలాఖరు నాటికి తదుపరి దశకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేసి గృహ ప్రవేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహా యజ్ఞంలా కృషి చేస్తోంది. ఇప్పటికే అక్టోబర్లో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులతో సామూహిక గృహ ప్రవేశాలు చేపట్టగా అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వచ్చే ఫిబ్రవరి నాటికి మరో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించేలా అధికార యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. పేదల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి మెగా కంప్లీషన్ డ్రైవ్ ద్వారా డిసెంబర్ 1వతేదీ నుంచి జనవరి 31 వరకు క్షేత్రస్థాయిలో సచివాలయాలు కేంద్రంగా కార్యాచరణ సిద్ధమైంది. ఈమేరకు మెగా కంప్లీషన్ డ్రైవ్పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్రెడ్డి శనివారం వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. బేస్మెంట్, లెంటల్, రూఫ్ స్థాయిలోని 4.18 లక్షల ఇళ్ల నిర్మాణాలను డ్రైవ్ ద్వారా జనవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. 10,044 సచివాలయాల వారీగా కలెక్టర్లకు లక్ష్యాలను నిర్దేశించారు. డ్రైవ్పై కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి సారించి గృహ నిర్మాణ సిబ్బందితో సమీక్షలు నిర్వహించాలని సూచించారు. మెగా కంప్లీషన్ డ్రైవ్ పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక యాప్ను సోమవారాని కల్లా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు ప్రతి 15 రోజులకు ఒకసారి వెళ్లి నాలుగు దఫాలు సందర్శించడం ద్వారా ఇళ్ల పురోగతిని జియో ట్యాగింగ్ చేసి ఫొటోలను యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. మెటీరియల్, నిర్మాణ సిబ్బందిని సమీకరించుకునేందుకు జిల్లా, మండల స్థాయిలో సమావేశాలను నిర్వహించాలని తేదీలతో సహా కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఆప్షన్–3 లబ్ధిదారుల ఇళ్ల పురోగతిని కూడా కలెక్టర్లు సమీక్షిస్తూ గడువులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వలంటీర్ల కీలక పాత్ర గ్రామ, వార్డు వలంటీర్లు మెగా కంప్లీషన్ డ్రైవ్లో కీలక పాత్ర పోషిస్తారని గృహనిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్జైన్ తెలిపారు. వచ్చే నెల 1వతేదీ నుంచి జనవరి నెలాఖరు వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి మొత్తం నాలుగు సార్లు క్షేత్ర స్థాయిలో ఇళ్లను సందర్శిస్తారని వెల్లడించారు. తొలిసారి సందర్శనలో మెటీరియల్, లేబర్ అవసరాన్ని అంచనా వేస్తారన్నారు. రెండోసారి పురోగతిని యాప్లో అప్డేట్ చేస్తారని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 28, 29వ తేదీల్లో జిల్లా స్థాయిలో మెబిలైజేషన్ సమావేశాలను నిర్వహించాలని ఆదేశించామన్నారు. డిసెంబర్ 1వ తేదీన మండల, పట్టణ స్థానిక సంస్థల స్థాయిలో సమావేశాలు ఉంటాయన్నారు. డిసెంబర్ 4 నుంచి 6వ తేదీలోగా సచివాలయాల స్థాయిలో సమావేశాలను నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. వలంటీర్ల తొలి విడత సందర్శన డిసెంబర్ 7 నుంచి 14 వరకు ఉంటుంది. రెండో విడత 15వ తేదీ నుంచి 31 వరకు జరుగుతుంది. మూడో విడత జనవరి 1వ తేదీ నుంచి 15 వరకు ఉంటుంది. నాలుగో విడత సందర్శన జనవరి 16 నుంచి 31 వరకు ఉంటుందని జైన్ వివరించారు. ఫిబ్రవరిలో మరో ఐదు లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఈ నేపథ్యంలో సచివాలయాలు కేంద్రంగా మెగా కంప్లీషన్ డ్రైవ్ ద్వారా జనవరి నెలాఖరు నాటికి 4.18 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే లక్ష ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యే దశలో ఉన్నాయని వెల్లడించారు. -
భీకర యుద్దం..పాలస్తీనియన్ల కోసం ఈ చిన్నారి చేసిన పని తెలిస్తే!
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. అక్టోబర్ 7న గాజా స్ట్రిప్ నుంచి చొరబడిన హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో ఇజ్రాయెల్పై విరుచుకుపడగా.. ఇజ్రాయెల్ ప్రతికార దాడి చేపట్టింది. ఇరు వర్గాల మధ్య పెద్దఎత్తున కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ బాంబుల దాడుల తీవ్రతకు గాజా అల్లాడుతోంది. ఈ భీకర యుద్ధంలో ఇప్పటివరకు 8,525వేల మంది పాలస్తీనియన్లు బలయ్యారు. ఈ నేపథ్యంలో దాడులను ఆపివేయాలని ప్రపంచదేశాలు ఇజ్రాయెల్కు పిలుపునిస్తున్నాయి.తాజాగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘర్షణకు తాత్కాలిక విరామం ఇవ్వాలని సూచించారు. అయితే ఓవైపు మరణాల సంఖ్య పెరుగుతున్నా హమాస్ను నిర్మూలించేదాకా కాల్పుల విరమణ ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పునరుద్ఘాటించారు. కాల్పులు ఆపడమంటే హమాస్ ఉగ్రవాదులకు, తీవ్రవాదానికి లొంగిపోవడమేనని ఆయన వ్యాఖ్యానించారు. గాజాలో పరిస్థితిలు మరి దారుణంగా మారాయి. ఎటు చూసిన శిథిలాలు.. వాటి కింది చిక్కుకున్న మృతదేహాలే కనిపిస్తున్నాయి. కరెంట్, తాగునీరు, నిత్యవసరాల కొరతతో పాలస్తీనియన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య జరుగుతున్న భీకర యుద్దం నేపథ్యంలో వర్తక, వాణిజ్యాల్లో కుదుపులకు కారణమవుతోంది. ఈ క్రమంలో పాలస్తీనియన్ల కోసం భారీగా నిధులు సమకూరుతున్నాయి. సిరియాలోని ఓ మసీదులో పాలస్తీయన్ల కోసం పలువురు విరాళాలు ఇస్తుండగా, ఓ చిన్నారి సైతం తనకు తోచినంత సహాయం చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. Crowd funding was being done for Palestinians in a Mosque in Syria when this little girl arrived with her small gift❤️#StopGenocideInGaza #Palestine pic.twitter.com/njxeUyLH7R — هارون خان (@iamharunkhan) November 1, 2023 -
రూ.6,929 కోట్లతో గిరిజనాభివృద్ధి
సాక్షి, అమరావతి/దొండపర్తి (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో రూ.6,929 కోట్ల వ్యయంతో గిరిజనాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర తెలిపారు. సీఎం వైఎస్ జగన్ గతేడాది కంటే.. ఈ ఏడాది ఎస్టీ సబ్ప్లాన్కు రూ.784 కోట్లు అధికంగా కేటాయించారని వివరించారు. ఈ నిధులను సద్వినియోగం చేస్తూ.. గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర సబ్ప్లాన్ నిధుల వినియోగాన్ని సమీక్షించారు. అన్ని రంగాల్లోనూ గిరిజనులు అభివృద్ధి సాధించాలన్నదే వైఎస్ జగన్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అందుకే గతేడాది కంటే ఈ ఏడాది అధిక నిధులను కేటాయించారని చెప్పారు. 2022–23లో ఎస్టీ సబ్ప్లాన్కు రూ.6,144.90 కోట్లు మంజూరు చేయగా.. ఈ ఏడాది రూ.6,929.09 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. ఈ నిధులను పూర్తిగా గిరిజన సంక్షేమానికే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిధుల సద్వినియోగంలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. గిరిజన గూడేలకు రహదారులు, తాగునీటి సరఫరా, విద్యా సంస్థల్లో సౌకర్యాలను మెరుగుçపరచాలని సూచించారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, డైరెక్టర్ జె.వెంకటమురళి, ట్రైకార్ ఎండీ రవీంద్రబాబు, జీసీసీ ఎండీ సురేశ్ తదితరులు పాల్గొన్నారు. జీసీసీ సేవల విస్తృతానికి కొత్త వెబ్సైట్ గిరిజనులు, వినియోగదారులు, ఉద్యోగులకు అవసరమైన శీఘ్ర సేవలు, సమగ్ర సమాచారాన్ని అందించడంతో పాటు జీసీసీ సహజ ఉత్పత్తుల మార్కెట్ను మరింత విస్తృతం చేసేందుకు గిరిజన సహకార సంస్థ(జీసీసీ) నూతన వెబ్సైట్ దోహదపడుతుందని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర తెలిపారు. మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జీసీసీ నూతన వెబ్సైట్ను రాజన్నదొర ప్రారంభించారు. సీఎం జగన్ సారథ్యంలో నాలుగేళ్లలో గిరిజన సాధికారత సాధనలో జీసీసీ అనూహ్యమైన, మంచి ఫలాలను గిరిజనులకు అందించిందని వివరించారు. గిరిజనులకు డీఆర్ డిపోల ద్వారా రేషన్ సరుకుల సరఫరా, పెట్రోల్ బంకుల ఏర్పాటు, వివిధ రాష్ట్రాల్లో రిటైల్ ఔట్లెట్ల ద్వారా ఉత్పత్తుల విక్రయాలు, వన్ధన్ వికాస కేంద్రాల ఏర్పాటు, అరకు వ్యాలీ కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో విశేషమైన కృషి చేస్తూ సత్ఫలితాలు సాధిస్తోందని వెల్లడించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ సిబ్బందిని ఆయన అభినందించారు. గిరిజన సంక్షేమ శాఖ నేతృత్వంలో జీసీసీ చేస్తున్న కార్యక్రమాలను సమగ్రంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు జీసీసీ సహజ ఉత్పత్తుల మార్కెట్ను మరింతగా విస్తరించేందుకు ఈ వెబ్సైట్ విశేషంగా దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జీసీసీ వైస్చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి.సురేష్ కుమార్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో జీసీసీ అందిస్తున్న సేవలు, ఖర్చు చేస్తున్న నిధులు, ప్రణాళికలు, ఫలితాలు వంటి వివరాలు అన్నీ గణాంకాలతో సహా నూతన వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపారు. జీసీసీ సహజ ఉత్పత్తుల విక్రయానికి ఆన్లైన్ షాపింగ్తో పాటు సోషల్ మీడియా వేదికలను ఈ నూతన వెబ్సైట్తో అనుసంధానించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జీసీసీ ప్రధాన కార్యాలయం సహా ప్రాంతీయ కార్యాలయాలు, ఉద్యోగుల వివరాలను సమగ్రంగా అందుబాటులో ఉంచడంతో పాటు, పారదర్శకత, జవాబుదారీతనం పెంచే చర్యల్లో భాగంగా జీసీసీ సిబ్బంది బదిలీలు, ఉత్తర్వుల వివరాలతో పాటు టెండర్లు, నోటీసులు, ప్రకటనలు సమగ్రంగా ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని వివరించారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దాండే, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ జె.మురళి, జీసీసీ వైస్చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి.సురేష్ కుమార్, ట్రైకార్ ఎండీ రవీంద్రబాబు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ చీఫ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఓపీఏఎల్లో ఓఎన్జీసీ రూ.15,000 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ).. ఓఎన్జీసీ పెట్రో–అడిషన్స్ లిమిటెడ్కు (ఓపీఏఎల్) సుమారు రూ.15,000 కోట్ల నిధులు సమకూర్చాలని నిర్ణయించింది. అధిక రుణభారం కారణంగా నష్టపోతున్న ఓపీఏఎల్కు ఆర్థిక పునర్ వ్యవస్థీకరణకు ఓఎన్జీసీ బోర్డు గత వారం ఆమోదం తెలిపింది. గుజరాత్లోని దహేజ్ వద్ద భారీ పెట్రోకెమికల్ ప్లాంట్ను నిర్వహిస్తున్న ఓపీఏఎల్లో ఓఎన్జీసీకి 49.36 శాతం, గెయిల్ ఇండియాకు 49.21, గుజరాత్ స్టేట్ పెట్రోకెమికల్ కార్ప్నకు (జీఎస్పీసీ) 1.43 శాతం వాటా ఉంది. ఓపీఏఎల్కు ఆర్థిక పునర్ వ్యవస్థీకరణలో భాగంగా షేర్ వారెంట్లను ఈక్విటీగా ఓఎన్జీసీ మారుస్తుంది. రూ.7,778 కోట్ల విలువైన కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్లను బైబ్యాక్ చేస్తుంది. అలాగే ఈక్విటీ రూపంలో అదనంగా రూ.7,000 కోట్లు పెట్టుబడిగా పెడుతుంది. తద్వారా ఓపీఏఎల్లో దాదాపు 95 శాతం వాటా సమకూరుతుందని స్టాక్ ఎక్సే్ఛంజ్ ఫైలింగ్లో ఓఎన్జీసీ వెల్లడించింది. ఇది అమలు చేసిన తర్వాత ఓఎన్జీసీకి ఓపీఏఎల్ అనుబంధ సంస్థగా మారుతుందని పేర్కొంది. ‘ఆర్థిక పునరి్నర్మాణంతో ఓపీఏఎల్లో ఓఎన్జీసీ హోల్డింగ్ను పెంచుతుంది. ఓపీఏఎల్ మరింత లాభదాయకంగా మారుతుంది. మొత్తం కొనుగోలు వ్యయం రూ.14,864 కోట్లుగా ఉంటుంది’ అని ఓఎన్జీసీ పేర్కొంది. పునర్ వ్యవస్థీకరణ తరువాత ఓపీఏఎల్లో గెయిల్, జీఎస్పీసీ వాటా 5 శాతానికి పరిమితం అవుతుంది. 2008లో ఓపీఏఎల్లో గెయిల్ వాటాను కైవసం చేసుకుంది. దహేజ్ ప్లాంట్ ప్రణాళిక సమయంలో రూ.12,440 కోట్లతో అంచనా వేశారు. కానీ 2017లో దాదాపు రూ.30,000 కోట్లతో పూర్తయింది. ప్లాంటుకు భారీ వ్యయం, నిర్మాణం ఆలస్యం కావడంతో గెయిల్ తన ఈక్విటీ వాటాను రూ.996.28 కోట్లకు పరిమితం చేయాలని నిర్ణయించుకుంది. ఓపీఏఎల్ నష్టాలు 2023 మార్చి నాటికి రూ.13,000 కోట్లకు చేరుకున్నాయి. -
బిల్ గేట్స్ కు దోమలకు సంబంధం ఏమిటి? అసలు అమెరికాలో ఏం జరుగుతోంది?
బిల్ గేట్స్ స్వయంగా దోమలను తరిమిగొట్టే పనేమీ చేయడం లేదు. అయినప్పటికీ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ దీనికి సంబంధించిన ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని తగ్గించేందుకు జన్యుపరంగా మార్పు చెందిన దోమలను అభివృద్ధి చేయడానికి కృషిచేస్తున్న బయోటెక్ కంపెనీ ఆక్సిటెక్కు నిధులు అందజేసినందుకు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్కు అవార్డు ప్రకటించారు. ఏప్రిల్ 2021లో ఫ్లోరిడాలోని ఆరు ప్రదేశాలలో ఆక్సిటెక్ సుమారు 150,000 దోమలను విడుదల చేస్తుందని ఆక్సిటెక్ ప్రకటించింది. అయితే ఈ నిర్దిష్ట ప్రాజెక్ట్కు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నిధులు సమకూర్చలేదని కంపెనీ పేర్కొంది. అంటు వ్యాధులను వ్యాప్తిచేసే దోమల జాతి అయిన ఈడెస్ ఈజిప్టిని జన్యుపరంగా సవరించడానికి బహుళ-సంవత్సరాల పరిశోధన ప్రాజెక్ట్ 2021లో ప్రారంభించారు. అయితే ఈ ప్రాజెక్ట్ వెనుక బిల్ గేట్స్ ఉన్నారని ఇంటర్నెట్లో వార్తలు వెలువడ్డాయి. ఈజిప్టి దోమలను జన్యుపరంగా సవరించడం, తరువాత వాటిని అడవిలోకి విడుదల చేయడం అనేది ఇది మొదటిసారేమీ కాదు. పరిశోధకులు ఒక దశాబ్దానికి పైగా దీనిపై పలు ప్రయత్నాలు చేస్తున్నారు. 2010లో కేమాన్ దీవులలో మార్పు చెందిన దోమల విడుదలను విడుదల చేశారు. 2011, 2012, 2015లో ఆక్సిటెక్ బ్రెజిల్లోని పలు ప్రాంతాలలో జన్యుపరంగా మార్పు చెందిన దోమలను విడుదల చేసింది. ఆడ అనాఫిలిస్ దోమల ద్వారా మాత్రమే మలేరియా అనేది మనుషులకు వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈజిప్టి దోమ స్వయంగా మలేరియాను వ్యాప్తి చెందించదు. ఆక్సిటెక్ సంస్థ అనాఫిలిస్ దోమలను జన్యుపరంగా మార్చడానికి పలు ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ సంస్థ వ్యాధులను వ్యాప్తిని అరికట్టేందుకు జీవసంబంధ పరిష్కారాలను అన్వేషించే పరిశోధనలు సాగిస్తుంటుంది. గేట్స్ ఫౌండేషన్ గ్రాంట్ డాక్యుమెంట్లలో ప్రపంచవ్యాప్తంగా 43 నెలల్లో మలేరియా సంబంధిత ప్రాజెక్టుల కోసం జూన్ 2018లో ఆక్సిటెక్కు $5.8 మిలియన్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. అమెరికా, కరేబియన్లలో మలేరియా దోమలను అరికట్టడానికి ఈ నిధులను అందజేస్తున్నట్లు గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. సెప్టెంబరు 2020లో $1.4 మిలియన్ల రెండవ దఫా గ్రాంట్ను ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో మలేరియా దోమల నివారణ కోసం ఈ ప్రాజెక్ట్కు అందించినట్లు పేర్కొన్నారు. అయితే అమెరికాలో ఈపనులు చేపట్టేందుకు గేట్స్ ఫౌండేషన్ నిధులు సమకూర్చలేదని కంపెనీ ప్రతినిధి మీడియాకు తెలిపారు. ఆక్సిటెక్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ మొదటి దశలోనే ఉంది. 2020లో యూఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ జన్యుపరంగా మార్పు చెందిన దోమలను ఫీల్డ్ టెస్ట్ చేయడానికి ఆక్సిటెక్కు ఆమోదం తెలిపింది. అయితే దీనికిముందు కంపెనీ స్థానిక అధికారుల నుంచి ఆమోదం తీసుకోవలసి ఉంటుంది. అలాగే దీనిపై రెండు సంవత్సరాలలో మొత్తం 6,600 ఎకరాల్లో అధ్యయనం జరగాల్సి ఉంది. అయితే ఇంతలో ఈ కంపెనీకి 31 వేలకు మించిన పబ్లిక్ కామెంట్లు వచ్చాయి. వీటిలోని చాలా వ్యాఖ్యలలో ఈ అధ్యయనానికి అనుమతించకూడదని లేదా మరింత సమాచారం అందుబాటులోకి వచ్చే వరకు వేచి ఉండాలని సూచించారు. అయితే దీనిపై సంస్థ 150 పేజీల ప్రతిస్పందనను తెలియజేసింది. జూన్ 2020లో ఫ్లోరిడా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కన్స్యూమర్ సర్వీసెస్ ఈ అధ్యయనం కోసం అనుమతిని మంజూరు చేసింది. అలాగే ఫ్లోరిడా కీస్ మస్కిటో కంట్రోల్ డిస్ట్రిక్ట్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్తో పాటు ఏడు స్టేట్ ఆఫ్ ఫ్లోరిడా ఏజెన్సీలు దీనికి ఆమోదం తెలిపాయి. కాగా ఈజిప్టి దోమలు ఆఫ్రికాకు చెందినవి. ఈ జాతి పెట్టే గుడ్లు పొడి వాతావరణంలో నెలల తరబడి నిద్రాణంగా ఉంటాయని, వర్షం పడినప్పుడు జీవం పోసుకుని వ్యాప్తి చెందుతాయని సంస్థ తెలిపింది. ఫ్లోరిడా కీస్లోని మొత్తం దోమల జనాభాలో ఈజిప్టి దోమ కేవలం 4% మాత్రమే ఉన్నాయి. కానీ దోమల ద్వారా సంక్రమించే వ్యాధులకు ఈజిప్టి దోమలు బాధ్యత వహిస్తాయి. కాగా ఆడ దోమ మాత్రమే చికున్గున్యా, జికా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను వ్యాపిస్తుంది. ఆడ దోమలు మనుషులకు కుట్టి, తమ లాలాజలంలో బ్యాక్టీరియాను మానవ రక్తంలోకి ప్రసారం చేస్తాయి. వీటిని ఎదుర్కొనేందుకు ఆక్సిటెక్ పరిశోధకులు టెట్రాసైక్లిన్ ట్రాన్స్-యాక్టివేటర్ వేరియంట్ అనే ప్రోటీన్ను దోమల నియంత్రణకు ఒక సాధనంగా గుర్తించారు. ఇది కూడా చదవండి: రాబోయే ఏళ్లలో 100 కోట్లమంది మృతి? Bill Gates is not a Scientist or Doctor. Why the Hell is Bill Gates releasing mosquitos on Americans? How much more proof do people need in order to acknowledge his Diabolical Schemes? Arrest Bill Gates. pic.twitter.com/sC2iLpvCVP — Liz Churchill (@liz_churchill10) September 3, 2023 -
అంకిత భావానికి రూ. 3.5 కోట్లు ప్రతిఫలం! ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
అంకిత భావంతో చేసే పని నలుగురిచే గుర్తించేలా చేస్తుందన్న మాటలు మళ్ళీ ఋజువయ్యాయి. లాస్ వెగాస్లోని బర్గర్ కింగ్లోని మెక్కారన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్యాషియర్ అండ్ కుక్గా పనిచేస్తున్న 'కెవిన్ ఫోర్డ్' 27 సంవత్సరాలు ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పని చేస్తే ఆ సంస్థ అతనికి మిఠాయిలు, పెన్నులు, స్టార్బక్స్ కప్ వంటి వాటితో కూడిన మంచి బ్యాగ్ని అందుకున్నాడు. అన్ని సంవత్సరాలు ఎంతో నిబద్దతతో పనిచేస్తే సరైన గుర్తింపు లభించలేదని, దానికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఆ తర్వాత అతని కుమార్తె సెరీనా GoFundMe పేజీ స్టార్ట్ చేసింది. దీనికి అతి తక్కువ కాలంలోనే అన్యూహ్య స్పందన లభించింది. దీని ద్వారా ఏకంగా నాలుగు లక్షల డాలర్లు.. అంటే సుమారు రూ. 3.48 కోట్లు విరాళాలుగా సమకూరాయి. కెవిన్ ఫోర్డ్ అంకిత భావం, చిత్త శుద్ధి ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశాయి. దీనివల్లే ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు రాగలిగాయి. కుటుంబం పోషణ కోసం గత కొన్ని సంవత్సరాలుగా పని చేస్తూనే ఉన్నాడు. అయితే ఇటీవల లభించిన విరాళాలు వారికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇదీ చదవండి: సిమ్ కార్డ్ డీలర్లకు కొత్త రూల్స్.. అతిక్రమిస్తే రూ. 10 లక్షలు జరిమానా! పదవి విరమణ వయసు వచ్చినప్పటికీ ఆర్థికపరమైన కారణాల వల్ల పనిచేస్తూనే ఉన్నాడు. భారీగా విరాళాలు పొందిన ఫోర్డ్.. ప్రపంచంలో చాలామంది దాతృత్వం కలిగి ఉన్నారు. ఇప్పుడు వచ్చిన డబ్బు నా పిల్లలు మనవళ్ల భవిష్యత్తు కోసం పొదుపు చేస్తానన్నట్లు సమాచారం. -
స్థిరమైన నిధులతోనే శాస్త్రీయ ప్రగతి
సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సూపర్ పవర్గా ఎదగాలన్న లక్ష్యం అందుకోవాలంటే ఏ దేశమైనా తగినన్ని నిధులు, స్థిరంగా అందుబాటులో ఉంచాలి. మౌలిక పరిశోధనలపైనా దృష్టి పెట్టాలి. కోవిడ్-19 టీకా, కో–విన్, యూపీఐ వంటి డిజిటల్ అప్లికేషన్ల అభివృద్ధి... పెరుగుతున్న భారతీయ సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యానికి అద్దం పడుతున్నాయి. ఈ విజయాలు దీర్ఘకాలం పరిశోధనలపై నిధులు ఖర్చుపెట్టిన ఫలితమే. దశాబ్దాలపాటు నాణ్యమైన విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తూండటం, వాటి పోషణకు తగిన నిధులు కేటాయించడం వల్లనే ఈ విజయాలు సాధ్యమయ్యాయి. ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న జాతీయ పరిశోధన సంస్థల సాంకేతిక సామర్థ్యాన్ని దశాబ్దాలుగా ప్రైవేటు రంగమూ ఉపయోగించుకుంది. హింగోలి మహారాష్ట్ర మరాఠ్వాడా ప్రాంతంలోని జిల్లా కేంద్రం. 1948 వరకూ హైదరాబాద్ నిజాం రాజ్యం పరిధిలో ఉండేది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని మిలిటరీ కేంద్రంగానూ వాడుకునేవారు. తాజాగా ఈ జిల్లాకు సరికొత్త గుర్తింపు లభిస్తోంది. అంతర్జాతీయ సైన్స్ ప్రాజెక్టు ‘లేజర్ ఇంటెర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ’ క్లుప్తంగా ‘లిగో’కు కేంద్రంగా ఇది అవతరించనుంది. ఈ మహా భౌతిక శాస్త్ర ప్రయోగ శాల కాస్మిక్ గ్రావిటేషనల్ వేవ్స్ను గుర్తించేందుకు ఉద్దేశించింది. ఇలాంటివే అమెరికాలోని హాన్ఫర్డ్, లివింగ్స్టోన్ ప్రాంతాల్లో ఉన్నాయి. మరోరెండు ఇటలీ, జపాన్లలో ఉన్నాయి. 2030 నాటికి హింగోలి లోనూ ఈ వేధశాల నిర్మాణం పూర్తయితే ప్రపంచవ్యాప్త నెట్వర్క్ సంపూర్ణమవుతుంది. నాలుగు కిలోమీటర్ల పొడవైన భుజాల్లాంటి నిర్మాణాలు... ఎల్ ఆకారంలోని ఇంటర్ఫెరోమీటర్లతో కూడిన ఈ ప్రయోగశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. న్యూఢిల్లీలోని ప్రగతి మైదా¯Œ లో నేషనల్ టెక్నాలజీ డే సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని ఆన్లైన్లో రూ.1,200 కోట్ల విలువైన హింగోలి లిగో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఎంతో ప్రతిష్ఠాత్మ కమైన ఈ ప్రాజెక్టును భారత్ చేపట్టడం హర్షణీయమైన విషయమై నప్పటికీ ఇలాంటి భారీ ప్రాజెక్టులు, మౌలిక శాస్త్ర పరిశోధనల విషయంలో భారత్ వైఖరి ఎలా ఉందన్న విషయాన్ని సమీక్షించేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తోంది. ఎంత ‘వేగం’గా సాగుతున్నాయంటే... లిగో ప్రాజెక్టు ఆలోచనలకు బీజం పడ్డది 2009 లోనే. భారతీయ శాస్త్ర పరిశోధన సంస్థలకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు కలిసికట్టుగా గ్రావిటేషనల్ వేవ్స్పై పరిశోధనలు చేస్తూండేవారు. ఆ క్రమంలోనే భారత్లో గ్రావిటేషనల్ వేవ్స్ వేధశాల ఏర్పాటు చేయాలన్న ఆలోచన పుట్టింది. రెండేళ్ల తరువాత అమెరికాలోని లిగో పరిశోధనశాల తమ పరిశోధనల్లో భాగం కావాలని భారత శాస్త్రవేత్తలకు ఆహ్వానం పలికింది. ఆ ఏడాదే భారత శాస్త్రవేత్తలు విస్తృత చర్చల తరువాత ఇండియన్ లిగో ఏర్పాటుకు సంబంధించి, భారత అణుశక్తి విభాగానికి ఒక ప్రతిపాదన చేశారు. 2012లో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు పచ్చజెండా ఊపుతూ ఓ కమిటీ నిధులు కేటాయించాల్సిందిగా అభ్యర్థించింది. నాలుగేళ్లు వివిధ ప్రభుత్వ విభాగాలకు చక్కర్లు కొట్టిన ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి 2016లో ‘సూత్రప్రాయ అంగీకారం’ తెలిపింది. ఆ తరువాత సుమారు ఏడేళ్ల నిరీక్షణ తరువాత ఈ ప్రాజె క్టుకు తుది అనుమతులు లభించాయి. దేశంలో సైన్స్ ప్రాజెక్టులు ఎంత ‘వేగంగా’ అమలవుతాయో తెలిపేందుకు ఈ ఉదాహరణ చాలు. హింగోలి ప్రాజెక్టు అమల్లో జరిగిన జాప్యం ఇంకో విషయాన్నీ గుర్తు చేస్తుంది. దేశంలో పరిశోధనల కోసం కేటాయిస్తున్న నిధుల్లో పెరుగుదల లేకపోవడాన్ని ఎత్తి చూపుతుంది. స్థూల జాతీయోత్పత్తిలో పరిశోధనలకు (ఆర్ అండ్ డీ) కేటాయించిన నిధులు దశాబ్ద కాలంగా కేవలం 0.7 శాతం మాత్రమేనని నీతి ఆయోగ్ గత ఏడాది విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. ఈ మోతాదు బ్రెజిల్ (1.6 శాతం), దక్షిణాఫ్రికా (0.83) కంటే తక్కువ కావడం గమనార్హం. పొరుగు దేశం చైనా తన స్థూల జాతీయోత్పత్తిలో ఏకంగా 2.14 శాతం ‘ఆర్ అండ్ డీ’కి కేటాయిస్తోంది. కేటాయింపులు అత్యల్పంగా ఉంటే పరిశోధనా రంగంలో పురోగతి సాధ్యం కాదని నీతి ఆయోగ్ తన నివేదికలో విస్పష్టంగా తెలిపింది. లక్ష్యాలూ అస్పష్టమే... 2013లో భారత్ తన ‘ద సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్’ పాలసీలో 2020 నాటికల్లా శాస్త్ర పరిశోధనల రంగంలో టాప్–5లోకి చేరాలని సంకల్పం చెప్పుకొంది. తొమ్మిదేళ్ల తరువాత ఇదే పాలసీని ఆధునికీకరించారు. 2030 నాటికి నాణ్యమైన పరిశోధన ఫలితాలు సాధించే టాప్–5 దేశాల్లోకి భారత్ చేరాలన్న అస్పష్ట లక్ష్యం గురించి ఈ విధానంలో పేర్కొన్నారు. పదాలతో గారడీ చేయడం కంటే పరిశోధనలకు స్థిరంగా నిధులు కేటాయించడం మేలన్న విషయం మన విధాన నిర్ణేతలకు అర్థం కావడం లేదు. ఇటీవలి కాలంలో కోవిడ్–19 టీకా తయారీలో సాధించిన విజయం, కో–విన్, యూపీఐ వంటి డిజిటల్ అప్లికేషన్ల అభివృద్ధి... పెరుగుతున్న భారతీయ సాంకే తిక పరిజ్ఞాన సామర్థ్యానికి అద్దం పడుతున్నాయి. ఈ విజయాలు దీర్ఘకాలం పరిశోధనలపై నిధులు ఖర్చుపెట్టిన ఫలితమే అన్నది విస్మరించరాదు. దశాబ్దాలపాటు నాణ్యమైన విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తూండటం, వాటి పోషణకు తగిన నిధులు కేటాయించడం వల్లనే ఈ విజయాలు సాధ్యమయ్యాయి. ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న జాతీయ పరిశోధన సంస్థల సాంకేతిక సామర్థ్యాన్ని దశా బ్దాలుగా ప్రైవేటు రంగమూ ఉపయోగించుకుంది. కోవిడ్ టీకా, జెనెరిక్ మందుల అభివృద్ధినే తీసుకుందాం. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు చాలాకాలం క్రితమే మందులు, టీకాల తయారీ, క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు అవస రమైన అన్ని ఏర్పాట్లూ చేశాయి. ఈ ఏర్పాట్లు 1970 నుంచి ప్రైవేట్ రంగం ఎదుగుదలకు పునాదిగా నిలిచాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ, టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ వంటివి భారత్ బయోటెక్, శాంతా బయోటెక్ వంటి సంస్థలకు తొలినాళ్ల నుంచి అండదండగా నిలిచాయి. ప్రైవేట్ రంగంలోని టీకా తయారీ కంపెనీలకు వందల కోట్ల నిధులు అందించారు కూడా. సుమారు 30 – 40 ఏళ్లుగా జరుగుతున్న ఈ కార్యక్రమాలు కోవిడ్ మహమ్మారి దాడి చేసిన వెంటనే అక్కరకు వచ్చాయి. ఐటీ రంగానికీ ఇది వర్తిస్తుంది. కంప్యూటర్ సైన్స్, గణిత, భౌతిక శాస్త్రాల్లో పరిశోధ నల ఫలితంగానే ఐటీ రంగం వృద్ధి చెందింది. అల్గారిథమ్స్, ఆర్టిఫీషి యల్ ఇంటెలిజెన్స్, క్రిప్టోగ్రఫీ నెట్వర్కింగ్ రంగాల్లో జరిగిన మౌలిక పరిశోధనలే కంప్యూటర్లు, ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల అభివృద్ధికి కారణ మయ్యాయి. భారతీయ విద్యాసంస్థల్లో కంప్యూటర్ సైన్స్ విద్యా బోధనకు దేశం చాలా ముందుగానే పెట్టుబడులు పెట్టింది. రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీలు (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలని ఇప్పుడు పిలుస్తున్నారు), తరువాతి కాలంలో ట్రిపుల్ ఐటీల ఏర్పాటు కూడా ఈ ప్రయత్నాల్లో భాగమే. ప్రభుత్వ రంగంలో పెట్టిన ఈ పెట్టు బడుల ఫలితాలను ప్రైవేట్ రంగమూ పొందింది. ఆ క్రమంలోనే సరి కొత్త డిజిటల్ అప్లికేషన్ల అభివృద్ధికి దారితీసింది. ప్రస్తుత డిజిటల్ విప్లవం వెనుక ప్రభుత్వ రంగ సంస్థలైన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్లు అభివృద్ధి చేసిన ఈ–గవర్నెన్స్, ఇతర డిజిటల్ అప్లికేషన్ల భూమికను విస్మరించలేము. సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సూపర్ పవర్గా ఎదగాలన్న లక్ష్యం అందుకోవాలంటే ఏ దేశమైనా తగినన్ని నిధులు, స్థిరంగా అందుబాటులో ఉంచాలి. అదే సమయంలో మౌలిక పరిశోధనలపైనా దృష్టి పెట్టాలి. దిగుమతి చేసుకున్న హార్ట్వేర్, విజ్ఞానంతో టెక్నలాజి కల్ అప్లికేషన్ల అభివృద్ధిపై దృష్టి పెట్టడం వల్ల మనం ఇతరులపై ఆధారపడే స్థితి వస్తుంది. మౌలిక రంగ పరిశోధలు ఎన్నో రకాల ఇతర ప్రయోజనాలు అందిస్తాయి. పారిశ్రామిక, సామాజిక లాభాలూ ఒన గూరుతాయి. సర్వవ్యాప్తమైన డిజిటల్ కెమెరా, మెడికల్ ఇమేజింగ్, ఇంటర్నెట్లన్నీ ఇందుకు ఉదాహరణలు. వాతావరణ మార్పులు, ప్రజారోగ్యం, ఆహార భద్రత వంటి అతి సంక్లిష్టమైన ప్రపంచస్థాయి సమస్యల పరిష్కారానికీ మౌలిక పరిశోధనలే ఆధారం. రేపటి తరం టెక్నాలజీల కోసం ఈ రోజే సైన్స్ పై పెట్టుబడులు పెట్టడం అవశ్యం. దినేశ్.సి శర్మ - వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
లోకల్’కు 120 కోట్ల నిధులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైపర్లోకల్ కంటెంట్, కమ్యూనిటీ, క్లాసిఫైడ్ వేదిక అయిన లోకల్ తాజాగా రూ.120 కోట్ల సిరీస్-బి ఫండింగ్ అందుకుంది. గ్లోబల్ బ్రెయిన్, సోనీ ఇన్నోవేషన్ ఫండ్, ఇండియా కోషెంట్ తదితర ఇన్వెస్టర్లు ఈ మొత్తాన్ని సమకూర్చినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. లోకల్ సేవలు అందిస్తున్న మార్కెట్లలో వృద్ధికి, కొత్త విభాగాల పరిచయానికి తాజా నిధులను వినియోగించనున్నట్టు తెలిపింది. (బేబీ షవర్: ఉపాసన పింక్ డ్రెస్ బ్రాండ్, ధర ఎంతో తెలుసా?) తాజా నిధులతో కలిపి ఇప్పటి వరకు రూ.225 కోట్లకుపైగా ఫండింగ్ అందుకున్నట్టు లోకల్ ఫౌండర్, సీఈవో జానీ పాషా తెలిపారు. బెంగళూరు కేంద్రంగా 2018లో ప్రారంభమైన లోకల్ యాప్ 7 రాష్ట్రాల్లో 6 భాషల్లో అందుబాటులో ఉంది. డెయిలీ అప్డేట్స్, కమోడిటీ ధరలు, స్థానిక జాబ్స్, రియల్టీ, మ్యాట్రిమోనియల్, స్థానిక యాడ్లు, క్లాసిఫైడ్స్ సమాచారాన్ని అందిస్తోంది. 4 కోట్లకుపైగా డౌన్లోడ్స్ నమోదయ్యాయి. (బిచ్చగాళ్లను పారిశ్రామికవేత్తలుగా మార్చేసిన ఓ జర్నలిస్టు సాహసం) -
10 వేల మంది మహిళలకు గోల్డ్మ్యాన్ చేయూత
ముంబై: గోల్డ్మ్యాన్ శాక్స్ భారత్లో 10,000 మంది మహిళలకు వ్యాపారం, మేనేజ్మెంట్ విద్యకు కావాల్సిన నిధుల సహకారం అందించినట్టు ప్రకటించింది. వీరి ద్వారా 12,000 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభించాయని, గడిచిన 18 నెలల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.2,800 కోట్ల ఆదాయం సమకూరినట్టు తెలిపింది. గోల్డ్మ్యాన్ శాక్స్ 2008లో మొదటిసారి భారత్లో గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని ఆరంభించింది. 18 నెలల క్రితం తిరిగి దీన్ని ప్రారంభించింది. ‘వుమెన్ఇనీషియేటివ్’ కింద 10,000 మంది మహిళలకు వ్యాపారం, యాజమాన్య విద్యకు కావాల్సిన నిధుల సహకారం అందించనున్నట్టు నాడు ప్రకటించింది. గోల్డ్ మ్యాన్ శాక్స్ కార్యక్రమంలో పాల్గొన్న 10వేల మంది మహిళలల్లో 2,400 మందిపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) అధ్యయనం నిర్వహించగా, ఆ వివరాలను గోల్డ్మ్యాన్ శాక్స్ విడుదల చేసింది. గోల్డ్ మ్యాన్ శాక్స్ నిధుల మద్దతు పొందిన 10వేల మంది మహిళలు గత 18 నెలల్లో తమ సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేసుకున్నాయి. అలాగే, ఆదాయాన్ని నాలుగు రెట్లు పెంచుకున్నాయి. తమ ఉత్పాదకతను సగటున ఐదు రెట్లు వృద్ధి చేసుకున్నాయి. వీరిలో అధిక శాతం మహిళా వ్యాపారవేత్తలు నియామకాలు పెంచుకుంటామని, ఆదాయం పెరుగుతుందన్న అభిప్రాయంతో ఉన్నారు. భారత్లో మహిళా వ్యాపారవేత్తల ప్రాతినిధ్యం ఇప్పటికీ చాలా తక్కువగా ఉన్నట్టు గోల్డ్మ్యాన్ శాక్స్ ఇండియా చైర్మన్, సీఈవో సంజయ్ ఛటర్జీ పేర్కొన్నారు. నిధుల సాయం పొందేందుకు కూడా వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని చెబుతూ.. వారి అసలు సామర్థ్యాలు వెలుగులోకి తెచ్చేందుకు ఇంకా ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలో కేవలం 20 శాతం వ్యాపారాలే మహిళల నిర్వహణలో ఉన్నాయని, మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో వారి వాటా కేవలం 3 శాతంగానే ఉన్నట్టు చెప్పారు. -
హామీలు అమలు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు కావొస్తున్నా, అనేక అంశాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలు ద్వైపాక్షిక అంశాలు పరిష్కారానికి నోచుకోలేదని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. వాటన్నింటినీ పరిష్కరించి రాష్ట్రానికి తగిన సహకారం అందించాలని కోరారు. రాష్ట్ర విభజన అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర కేంద్ర మంత్రులకు విన్నవించేందుకు గురువారం రాత్రి ఢిల్లీకి వచ్చిన వైఎస్ జగన్.. శుక్రవారం ఉదయం మోదీతో పార్లమెంట్లోని ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రధానికి వినతులు అందజేశారు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ పలు దఫాలుగా చర్చలు జరిపి కొంత పురోగతి సాధించినా, కీలక అంశాలన్నీ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయనే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రుణ పరిమితి పెంచండి 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద రూ.36,625 కోట్లు పెండింగ్లో ఉన్నాయని, ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని సీఎం వైఎస్ జగన్ ప్రధానిని కోరారు. రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ చేస్తామంటూ పార్లమెంట్ సాక్షిగా కేంద్రం చెప్పిందని, దీనిపై సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇదే సమయంలో గత ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు తీసుకుందన్న కారణంతో ఇప్పుడు రాష్ట్ర రుణాల పరిమితులపై ఆంక్షలు విధించారని వివరించారు. ఈ ప్రభుత్వం తప్పు లేకపోయినప్పటికీ నిబంధనల ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారని చెప్పారు. 2021–22లో రూ.42,472 కోట్ల రుణ పరిమితి కల్పించి, తదుపరి కాలంలో దానిని రూ.17,923 కోట్లకు తగ్గించారన్నారు. కోవిడ్ మహమ్మారి సృష్టించిన ఆర్థిక విపత్తు సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని, ఈ విషయంలో జోక్యం చేసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. పోలవరానికి అడ్హక్గా రూ.10 వేల కోట్లు పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత గొప్ప సంకల్పంతో ముందుకు సాగుతోందని, ఏపీ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చే దిశగా ప్రాజెక్టు నిర్మాణం సాగిస్తోందని సీఎం.. ప్రధానికి వివరించారు. ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తే కొద్ది కాలంలోనే ఇది వాస్తవ రూపంలోకి వచ్చి ప్రజలకు ఫలితాలు అందుతాయన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖజానా నుంచి రూ.2600.74 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. గత రెండేళ్లుగా ఈ నిధులు పెండింగ్లో ఉన్నాయని, ఈ బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ నిర్ధారించిన పోలవరం ప్రాజెక్టు అంచనాలు రూ.55,548 కోట్లను ఆమోదించాలని విన్నవించారు. తాగునీటి సరఫరా అంశాన్ని కూడా పోలవరం ప్రాజెక్టులో భాగంగా చూడాలని, ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్ వారీగా నిబంధనలు సడలించాలని సూచించారు. ముంపు బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలని, ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రాజెక్టు వ్యయం పెరిగిపోతుందని తెలిపారు. డీబీటీ పద్ధతిలో ముంపు బాధితులకు ఈ సహాయం అందిస్తే జాప్యాన్ని నివారించవచ్చన్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు అడ్హక్గా రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలని కోరారు. ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన ఇతర అంశాలు ఇలా... ♦ తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రావాల్సిన బకాయిలు అలానే ఉన్నాయి. 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ సరఫరా చేసిన విద్యుత్కు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉంది. వీటిని వెంటనే ఇప్పించాలి. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతు బద్ధత పాటించక పోవడంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. దీనివల్ల పీఎంజీకేఏవై కార్యక్రమం కిందకు రాని 56 లక్షల కుటుంబాలకు రాష్ట్రమే సొంతంగా రేషన్ ఇస్తోంది. తద్వారా దాదాపు రూ.5,527 కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోంది. ఈ విషయంలో ఏపీ చేసిన విజ్ఞప్తి సరైనదేనని నీతి ఆయోగ్ కూడా నిర్ణయించిన నేపథ్యంలో చర్యలు తీసుకోవాలి. కేంద్రం వినియోగించని రేషన్ కోటాను రాష్ట్రానికి కేటాయించాలి. ♦ రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంట్ సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. దీనివల్ల రాష్ట్రానికి గ్రాంట్లు, పన్ను రాయితీలు లభిస్తాయి. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడమే కాకుండా, సేవా రంగం విస్తరిస్తుంది. స్వయం శక్తి దిశగా రాష్ట్రం అడుగులేసేందుకు తోడ్పడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. ♦ రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశాం. ప్రతి జిల్లాలో 18 లక్షల మంది జనాభా ఉన్నారు. కొత్తగా కేంద్రం మంజూరు చేసిన మూడు మెడికల్ కాలేజీలతో కలిపి మొత్తంగా 14 మాత్రమే ఉన్నాయి. మిగిలిన 12 కాలేజీలకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు చేయాలి. ఈ కాలేజీలకు సంబంధించిన పనులు అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాయి. వీటికి సంబంధించి కేంద్రం తగిన విధంగా సహాయ పడాలి. ♦ వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఏపీ పునర్విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. ఈ ప్లాంట్ నిలదొక్కుకోవాలంటే ఖనిజ కొరత లేకుండా ఏపీఎండీసీకి గనులు కేటాయించాలి. విభజన అంశాలపై అమిత్షాకు వినతి ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. పార్లమెంట్లోని ఆయన కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పెండింగ్లో ఉన్న రాష్ట్ర విభజన అంశాలను ప్రస్తావించారు. ప్రత్యేక హోదా, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ఆమోదం వంటి అంశాలపై మాట్లాడారు. తిరుపతిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు అంశం గురించి ప్రస్తావించినట్లు తెలిసింది. పార్లమెంట్లో ఘన స్వాగతం ప్రధాని మోదీ, అమిత్షాతో భేటీకై పార్లమెంట్కు వచ్చిన సీఎం వైఎస్ జగన్కు వైఎస్సార్సీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. రాజ్యసభ, లోక్సభ పక్ష నేతలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డిలతో పాటు ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, మార్గాని భరత్, గోరంట్ల మాధవ్, రెడ్డప్ప, తలారి రంగయ్య, పోచ బ్రహ్మానందరెడ్డి, లావు కృష్ణదేవరాయలు, పిల్లి సుభాస్ చంద్రబోస్, ఆర్.కృష్ణయ్య, చింతా అనురాధ, సత్యవతి, గొడ్డేటి మాధవిలు సాదర స్వాగతం పలికారు. జగన్ పార్లమెంట్ భవనంలో లోపలికి వెళుతున్న సమయంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్, పీఎంఓ కార్యాలయ శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్లు పలకరించారు. మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్కౌర్ వైఎస్ జగన్తో ఫొటో దిగారు. కాగా, శుక్రవారం సాయంత్రం 4 గంటల తర్వాత సీఎం జగన్ ఢిల్లీ నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. -
అధిక వ్యయాలతో రియల్టీ ప్రాజెక్టులు అసాధ్యం
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల అభివృద్ధి ఆచరణ సాధ్యం కాని పరిస్థితులు ఉన్నాయని టాటా రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ, సీఈవో సంజయ్ దత్ అన్నారు. భూమి ధరలు పెరిగిపోవడం, నిర్మాణ వ్యయం, నిధుల వ్యయాలు పెరిగిపోవడానికి అదనంగా ఆర్థిక అనిశ్చితులను ప్రస్తావించారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల అనుమతులు నుంచి అభివృద్ది వరకు అన్ని సులభతరంగా సాగేందుకు భాగస్వాములను జవాబుదారీ చేయాలన్న అభిప్రాయాన్ని దత్ వినిపించారు. ‘‘రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో నిధులు అవసరం. మొదట భూమిని సమీకరించుకోవాలి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్), ముంబై, బెంగళూరు తదితర ముఖ్య పట్టణాల్లో ప్రాజెక్టు వ్యయాల్లో భూమి వాటా 50 శాతం నుంచి 80–85 శాతం వరకు ఉంటోంది. ప్రాజెక్టు డిజైన్, అనుమతులు, నిర్మాణ ప్రారంభానికి 2–3 ఏళ్లు పడుతోంది. నిధుల వ్యయాలు ప్రముఖ సంస్థలకు 8.5 శాతంగా ఉంటే, పెద్దగా పేరులేని సంస్థలకు 18 శాతం వరకు ఉంటున్నాయి’’అని సంజయ్ దత్ వివరించారు. దీంతో ప్రాజెక్టు డెవలపర్లు ప్రస్తుత వ్యయాల ఆధారంగా ధరలను ప్రకటించినప్పటికీ.. ప్రాజెక్టు పూర్తయ్యే 5–6 ఏళ్లలో వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నట్టు చెప్పారు. -
షార్క్ టైగర్స్
‘నా దగ్గర ఎన్నో ఐడియాలు ఉన్నాయి. ఫండింగ్ ఉంటే ఎక్కడో ఉండేవాడిని’ అనేది బ్లాక్ అండ్ వైట్ జమాన నాటి మాట. ‘నీ దగ్గర ఐడియా ఉంటే చాలు...దానికి రెక్కలు ఇవ్వడానికి ఎంతోమంది ఉన్నారు’ అనేది నేటి మాట. ‘ఐడియా’ ఉండి ఫండింగ్ అవకాశం లేని స్టార్టప్ కలల యువతరానికి ‘షార్క్ ట్యాంక్ ఇండియా’లాంటి టీవిప్రోగ్రామ్స్ ఆశాదీపాల్లా మారాయి. తాజాగా గుజరాత్కు చెందిన 20 సంవత్సరాల దావల్ తన సోదరుడు జయేష్తో కలిసి స్టార్టప్ కలను సాకారం చేసుకోబోతున్నాడు... దావల్కు కాలేజీ టీ స్టాల్లో టీ తాగడం అంటే చాలా ఇష్టం. అలాంటి ఇష్టం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీనికి కారణం టీ స్టాల్లో పనిచేసే అబ్బాయి ఒక టబ్లో అవే నీళ్లలో గ్లాసులను కడగడం. దారిన పోయే మేక ఒకటి వచ్చి ఆ నీళ్లు తాగినా ఆ నీళ్లు అలాగే ఉండడం! టీ స్టాల్ యజమానికి చెప్పినా అతడు పట్టించుకోకపోవడం!! కాలేజీ టీ స్టాల్లోనే కాదు బయట రోడ్డు సైడ్ టీ స్టాల్స్, దాబాలలో కూడా ఇలాంటి దృశ్యాన్నే చూశాడు దావల్. ‘ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుక్కోవాలి’ అని గట్టిగా అనుకున్నాడు గుజరాత్లోని బవస్కంత గ్రామానికి చెందిన దావల్. యూట్యూబ్లో మెషిన్ డిజైనింగ్ సబ్జెక్ట్పై దృష్టి పెట్టాడు. ఆరు నెలల్లో ఒక అవగాహన వచ్చింది.తండ్రితో కలిసి ఒక హార్డ్వేర్ షాప్కు వెళ్లి స్క్రాప్ ఉచితంగా ఇవ్వాల్సిందిగా బతిమిలాడుకున్నాడు. స్క్రాప్ చేతికి వచ్చిన తరువాత ప్రయోగాలుప్రారంభించాడు. ఒకటి, రెండు, మూడు, నాలుగు ప్రయత్నాల్లోనూ విఫలం అయ్యాడు. ‘చేసింది చాలు. ఇక ఆపేయ్. స్క్రాప్ ఇచ్చేదే లేదు’ అన్నాడు హార్డ్వేర్ షాప్ యజమాని. దీంతో తనకు తెలిసిన ప్రొఫెసర్ను కలిసి విషయం చెప్పాడు. ఆయన పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించాడు. ఈసారి మాత్రం తన ప్రయత్నంలో పూర్తిగా సక్సెస్ అయ్యి ఆటోమెటిక్ టీ–గ్లాస్ వాషింగ్ మెషిన్ కలను నెరవేర్చుకున్నాడు. ఈ మెషిన్లోని వాటర్ జెట్తో 30 సెకండ్ల వ్యవధిలో 15 టీ గ్లాసులను శుభ్రపరచవచ్చు. దీని సామర్థ్యాన్ని పెంచే కొత్త మెషిన్ కూడా తయారు చేశాడు దావల్. దీని గురించి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అనూహ్యమైన స్పందన వచ్చింది. కొందరుప్రొఫెసర్లను కలిసి ఈ మెషిన్ గురించి డెమో ఇచ్చాడు. వారికి నచ్చి అభినందించడమే కాదు లక్ష రూపాయలు ఇచ్చారు. వారు ఇచ్చిన లక్షతో అయిదు మెషిన్లను తయారుచేసి కర్నాటక, తమిళనాడు,మహారాష్ట్రలలో అమ్మారు. దావల్ సోదరుడు జయేష్కు సొంతంగా వ్యాపారం చేయాలనేది కల. సోదరులిద్దరు ‘మహంతం’ పేరుతో స్టార్టప్ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. తాజాగా షార్క్ట్యాంక్ ఇండియా(సోనీ టీవీ) రియాల్టీ షోలో దావల్, జయేష్లు చెప్పిన స్టార్టప్ ఐడియా నచ్చి అయిదుగురు షార్క్స్(బిగ్–షాట్ ఇన్వెస్టర్స్) డీల్ ఆఫర్ చేయడమే కాదు ‘మీ విజయం యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని అభినందించారు. ఆ మాటే విజయమంత్రం ‘అపజయం మాత్రమే అంతిమం కాదు’ అనే మాటను ఎన్నోసార్లు విన్నాను. నా ప్రయత్నంలో విఫలమైనప్పుడల్లా ఈ మాటను గుర్తు తెచ్చుకునేవాడిని. మళ్లీ మళ్లీ ప్రయత్నించేవాడిని. కొందరు నన్ను వింతగా చూసేవారు. కొందరైతే...నీకు నువ్వు సైంటిస్ట్లా ఫీలవుతున్నావు అని వెక్కిరించేవాళ్లు. అయితే నేను వాటిని ఎప్పుడూ పట్టించుకోలేదు. సక్సెస్ కావడమే నా లక్ష్యం అన్నట్లుగా కష్టపడ్డాను. చివరికి ఫలితం దక్కింది. –దావల్ -
జోరు మీదున్న ఫోన్పే... రూ.828 కోట్లు!
న్యూఢిల్లీ: ఫిన్టెక్ దిగ్గజం ఫోన్పే తాజాగా 10 కోట్ల డాలర్లు(రూ. 828 కోట్లు) సమీకరించింది. కొత్తగా రిబ్బిట్ క్యాపిటల్, టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయగా.. ఇప్పటికే వాటాలున్న టైగర్ గ్లోబల్ సైతం నిధులు అందించింది. 12 బిలియన్ డాలర్ల విలువలో ఫోన్పే తాజా పెట్టుబడులను సమకూర్చుకుంది. జనవరి 19న సైతం కంపెనీ జనరల్ అట్లాంటిక్ నుంచి 35 కోట్ల డాలర్లను పొందింది. కంపెనీ కేంద్ర కార్యాలయాన్ని ఇండియాకు మార్చిన తదుపరి బిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రెండు దశలలో 45 కోట్ల డాలర్లు అందుకోగా.. మిగిలిన పెట్టుబడులను తగిన సమయంలో సుప్రసిద్ధ దేశ, విదేశీ ఇన్వెస్టర్లు అందించే వీలున్నట్లు భావిస్తోంది. ఈ నిధులను పేమెంట్స్, ఇన్సూరెన్స్ బిజినెస్ల విస్తరణకు వినియోగించనుంది. అంతేకాకుండా లెండింగ్, స్టాక్బ్రోకింగ్ తదితర కొత్త విభాగాలలోనూ ప్రవేశించాలని ప్రణాళికలు వేసింది. -
సోలార్ రంగంలో తగ్గిన కార్పొరేట్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సోలార్ రంగంలో కార్పొరేట్ ఫండింగ్ గతేడాది మొదటి తొమ్మిది నెలల్లో 13 శాతం తగ్గింది. 24.1 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు మెర్కామ్ క్యాపిటల్ తన నివేదికలో పేర్కొంది. 2021లో ఇదే కాలంలో 27.8 బిలియన్ డాలర్లు వచ్చినట్టు తెలిపింది. వెంచర్ క్యాపిటల్, ప్రైవేటు ఈక్విటీ (వీసీ, పీఈ), డెట్ ఫైనాన్స్, పబ్లిక్ మార్కెట్ ఫండింగ్ను కార్పొరేట్ ఫండింగ్గా చెబుతారు. 2021తో పోలిస్తే గతేడాది వీసీ పెట్టుబడులు 56 శాతం పెరిగి 7 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. డెట్ ఫైనాన్స్ 24 శాతం తగ్గి 12 బిలియన్ డాలర్లుగా ఉంది. పబ్లిక్ మార్కెట్ ఫైనాన్స్ 5.1 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021లో వచ్చిన 7.5 బిలియన్ డాలర్లతో పో లిస్తే 32 శాతం తక్కు వ. అంతర్జాతీయంగా సోలార్ రంగంలో 2022లో మొత్తం 128 విలీనాలు, కొనుగోళ్ల లావాదేవీలు జరిగాయి. ‘‘ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా సోలార్ రంగంలో డిమాండ్ పెరిగింది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించుకోవాలన్న లక్ష్యం ఈ రంగానికి మద్దతుగా నిలిచింది. సోలార్ ప్రాజెక్టుల కొనుగోళ్ల పరంగా 2022 ఉత్తమ సంవత్సరంగా ఉంటుంది. రికార్డు స్థాయిలో వీసీ, పీఈ పెట్టుబడులు వచ్చాయి’’ అని మెర్కామ్ క్యాపిటల్ గ్రూపు సీఈవో రాజ్ ప్రభు తెలిపారు. -
సీఎం జగన్ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులను సత్వరమే పూర్తి చేయడానికి వీలుగా ముందస్తు (అడ్హక్) నిధులివ్వాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తొలి, రెండో దశ పనులను పూర్తి చేయడానికి ఏ మేరకు నిధులు అవసరమో గుర్తించి 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)లను ఉన్నతస్థాయి కమిటీ సోమవారం ఆదేశించింది. ఈ నివేదిక ఆధారంగా నిధులు విడుదల చేయాలని కేంద్రమంత్రి మండలికి కేంద్ర జల్శక్తి, ఆర్థిక శాఖలు ప్రతిపాదనలు పంపనున్నాయి. దానిపై కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేస్తే.. అడ్హక్గా పోలవరానికి నిధుల విడుదలకు మార్గం సుగమం అవుతుంది. రూ.10 వేల కోట్లను అడ్హక్గా విడుదల చేసి, నిధుల కొరత లేకుండా చేయాలని, డిజైన్లను త్వరితగతిన ఆమోదిస్తే పోలవరాన్ని సత్వరమే పూర్తి చేయవచ్చని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. అడ్హక్ నిధుల విడుదలతోపాటు సీఎం జగన్ లేవనెత్తిన అంశాలపై చర్చించడానికి ప్రధాని మోదీ ఆదేశాల మేరకు కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీతో రెండుసార్లు రాష్ట్ర కమిటీ సమావేశమైంది. ఈ సమావేశాలలో అడ్హక్గా పోలవరానికి నిధులిచ్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని కేంద్ర జల్శక్తి శాఖను కేంద్ర కమిటీ ఆదేశించింది. మార్చి వరకూ రూ.7,300 కోట్లు ఇప్పటివరకూ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను రీయింబర్స్మెంట్ చేయడం, మార్చి వరకూ భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం, పనులు చేయడానికి రూ.7,300 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర జల వనరుల శాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. దీనిపై కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ ఢిల్లీలో సోమవారం సమావేశమై చర్చించింది. పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని.. తక్షణం ప్రభుత్వానికి నిధులు విడుదల చేయాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించి.. తొలి దశ, రెండో దశ పూర్తికి ఏ మేరకు నిధులు అవసరమో నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీ, పీపీఏలను ఆదేశించింది. చదవండి: (కల్లుగీత..రాత మారేలా..! సీఎం వైఎస్ జగన్ చొరవతో తీరిన కష్టాలు) -
వెబ్3 స్టార్టప్లు.. 1.3 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దేశీయంగా 450 పైచిలుకు వెబ్3 స్టార్టప్లు గత రెండేళ్లలో 1.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 10,700 కోట్లు) సమీకరించాయి. వీటిలో 80 శాతం అంకుర సంస్థలు ప్రథమ శ్రేణి నగరాల్లోనే ఉన్నాయి. అయితే, జైపూర్, వదోదర, అహ్మదాబాద్ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు కూడా క్రమంగా వెబ్3 స్టార్టప్స్ హబ్లుగా ఎదుగుతున్నాయి. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్, వెంచర్ క్యాపిటల్ ఫండ్ హ్యాష్డ్ ఎమర్జెంట్ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ‘గత రెండేళ్లలో వెబ్3 స్టార్టప్ల సంఖ్య 450కి పైగా పెరిగింది. వీటిలో 4 యూనికార్న్లు (1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ గలవి) ఉన్నాయి. 2022 ఏప్రిల్ నాటికి ఇవి 1.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సమీకరించాయి. 2021–22లో కొత్తగా 170 వెబ్3 స్టార్టప్లు నమోదయ్యాయి‘ అని నివేదిక పేర్కొంది. మెటావర్స్, నాన్ ఫంజిబుల్ టోకెన్స్ (ఎన్ఎఫ్టీ) మొదలైన కొత్త సాంకేతిక కాన్సెప్టులతో వెబ్3 (మూడో తరం వరల్డ్ వైడ్ వెబ్) పదం మరింతగా ప్రాచుర్యంలోకి వస్తోంది. నివేదిక ప్రకారం అంతర్జాతీయంగా వెబ్3 నిపుణుల్లో 11 శాతం మంది భారత్లో ఉన్నారు. తద్వారా వెబ్3 నిపుణుల లభ్యతపరంగా భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. వచ్చే 1–2 ఏళ్లలో వీరి సంఖ్య 120 శాతం పైగా పెరగవచ్చని నివేదిక అంచనా వేసింది. చదవండి: ఈ ఫోన్పై బోలెడు ఆఫర్లు, 90 శాతం వరకు తగ్గింపు కూడా! -
స్టార్టప్స్లోకి భారీగా తగ్గిన పెట్టుబడులు.. ఎంత శాతం అంటే!
న్యూఢిల్లీ: మార్కెట్లో ప్రతికూల సెంటిమెంట్ నెలకొన్న నేపథ్యంలో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో అంకుర సంస్థల్లోకి పెట్టుబడులు తగ్గాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 17 శాతం క్షీణించి 6 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 47,800 కోట్లు) పరిమితమయ్యాయి. పీజీఏ ల్యాబ్స్తో కలిసి ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ‘ఈ క్యాలెండర్ సంవత్సరం (2022) రెండో త్రైమాసికంలో 16 భారీ డీల్స్ కుదిరాయి. వీటి ద్వారా 6 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఈ వ్యవధిలో కొత్తగా 4 యూనికార్న్ సంస్థలు (1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ గలవి) ఏర్పడ్డాయి. దీనితో ప్రథమార్ధంలో మొత్తం యూనికార్న్ల సంఖ్య 20కి చేరింది. వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 26 శాతం భాగం ఫిన్టెక్ విభాగం దక్కించుకుంది’ అని నివేదిక వివరించింది. క్రెడ్, డైలీహంట్ వంటి సంస్థల్లోకి భారీగా నిధులు రావడంతో ఫిన్టెక్, మీడియా.. వినోద రంగాల్లోకి వచ్చే పెట్టుబడుల పరిమాణం గణనీయంగా పెరిగినట్లు పేర్కొంది. క్యూ2లో వచ్చిన పెట్టుబడుల్లో ఈ విభాగాలు 45 శాతం వాటా దక్కించుకున్నాయని తెలిపింది. మొత్తం ఫండింగ్లో 58 శాతం పెట్టుబడులు .. వృద్ధి దశలో ఉన్న సంస్థల్లోకి వచ్చాయి. ఇప్పటికే ఒక నిర్దిష్ట స్థాయికి చేరిన స్టార్టప్స్లో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపినట్లు నివేదిక వివరించింది. -
4 ఏళ్లలో 122 యూనికార్న్లు
ముంబై: ప్రపంచవ్యాప్తంగా లిక్విడిటీ పరిస్థితులు ఆవిరౌతున్న(ఫండింగ్ వింటర్) నేపథ్యంలోనూ దేశీయంగా స్టార్టప్ వ్యవస్థ బలపడే వీలున్నట్లు హురూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది. రానున్న నాలుగేళ్లలో బిలియన్ డాలర్ల విలువ అందుకోగల స్టార్టప్ల సంఖ్య పెరగనున్నట్లు ఒక నివేదికలో అభిప్రాయపడింది. దీంతో కొత్తగా 122 సంస్థలు యూనికార్న్లుగా ఆవిర్భవించనున్నట్లు అంచనా వేసింది. తద్వారా దేశీయంగా యూనికార్న్ల సంఖ్య 200ను మించనున్నట్లు తెలియజేసింది. బిలియన్ డాలర్ల విలువను సాధించే స్టార్టప్లను యూనికార్న్లుగా పిలిచే సంగతి తెలిసిందే. ఏడాది క్రితం 51గా నమోదైన యూనికార్న్ల సంఖ్య ప్రస్తుతం 84కు చేరినట్లు ప్రస్తావించింది. ఇప్పటికే 20 కోట్ల డాలర్లకుపైగా విలువ సాధించిన స్టార్టప్లు మరో 122 ఉన్నట్లు వెల్లడించింది. ఇవి రానున్న రెండు నుంచి నాలుగేళ్లలో యూనికార్న్లుగా ఎదిగే వీలున్నట్లు పేర్కొంది. 36 శాతం అప్ స్టార్టప్ ఎకోసిస్టమ్పై ‘ఫండింగ్ వింటర్’ ప్రభావం చూపగలదని ఏఎస్కే ప్రయివేట్ వెల్త్తో జత కట్టిన హురూన్ ఇండియా.. ఫ్యూచర్ యూనికార్న్ ఇండెక్స్ 2022 పేరుతో రూపొందించిన నివేదికలో అభిప్రాయపడింది. కఠిన పరపతి విధానాలతో ఇటీవల అంతర్జాతీయంగా లిక్విడిటీ తగ్గుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. గతేడాదితో పోలిస్తే 36 శాతం విలువను పెంచుకున్న 122 స్టార్టప్ల విలువ 49 బిలియన్ డాలర్లకు చేరిన ట్లు వెల్లడించింది. ఈ సంస్థలు బిలియన్ డాలర్ల విలువను అందుకోగలవని అభిప్రాయపడింది. ఈ సంస్థలు ప్రస్తుతం 82,300 మంది ఉద్యోగులను కలిగి ఉన్నట్లు తెలియజేసింది. స్టార్టప్లకు పెట్టుబడులు అందిస్తున్న సంస్థలలో వెంచర్ క్యాపిటల్ ఫండ్ సీక్వోయా ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు పేÆ ö్కంది. భవిష్యత్ యూనికార్న్లు 122లో 39 సంస్థలకు సీక్వోయా నిధులు అందించినట్లు వెల్లడించింది. ఈ బాటలో టైగర్ గ్లోబల్ 27 సంస్థలలో పెట్టుబడుల ద్వారా తదుపరి నిలిచినట్లు తెలియజేసింది. రెండేళ్లలో... తాజాగా రూపొందించిన జాబితాలోని 122 స్టార్టప్లలో 51 సంస్థలు రెండేళ్లలోనే బిలియన్ డాలర్ల విలువను సాధించే వీలున్నట్లు నివేదిక అంచనా వేసింది. తదుపరి మరో రెండేళ్లలో మిగిలిన 71 స్టా ర్టప్లు యూనికార్న్లుగా ఆవిర్భవించవచ్చని తెలి యజేసింది. 2017లో ఏర్పాటైన లాజిస్టిక్స్ టెక్ స్టార్టప్ షిప్రాకెట్ ముందుగా ఈ హోదాకు చేరే వీలున్నట్లు పేర్కొంది. ఇదేవిధంగా క్విక్ కామర్స్ కంపెనీ జెప్టో, ఈకామర్స్ సంస్థ టర్టిల్మింట్ వేగ వంత వృద్ధి సాధించనున్నట్లు అభిప్రాయపడింది. -
ఆరంభ స్టార్టప్ల కోసం 130 మిలియన్ డాలర్లు!
న్యూఢిల్లీ: వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘ఫండమెంటల్ వీసీ’ ఆరంభ స్థాయిలోని స్టార్టప్ల కోసం 130 మిలియన్ డాలర్లతో (రూ.100 కోట్లు) నిధిని ప్రారంభించినట్టు ప్రకటించింది. కన్జ్యూమర్ ఇంటర్నెట్, ఆరోగ్య సంరక్షణ, బీమా, ఫైనాన్షియల్ సర్వీసెస్, సాస్, గేమింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్టార్టప్లకు పెట్టుబడులు అందిస్తామని తెలిపింది. ఈ ఏడాది మార్చిలోనే సెబీ నుంచి ఈ సంస్థకు అనుమతి లభించింది. ఒక్కో స్టార్టప్లో ఈ ఫండ్ 1.5 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెడుతుంది. వచ్చే రెండేళ్లలో 30 స్టార్టప్లకు మద్దతుగా నిలవాలనే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపింది. -
ప్రశంసలు సరే.. పైసలివ్వండి: ఎర్రబెల్లి
సాక్షి, హైదరాబాద్: శుద్ధి చేసిన మంచి నీరందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిం దంటూ కేంద్రం ప్రశంసించినందుకు ధన్యవాదాలని.. ప్రశంసలతో పాటు నిధులు కూడా ఇవ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు రాష్ట్రంలో మిషన్ భగీరథ అమలుకు వెంటనే రూ.19 వేల కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. కేంద్ర జలశక్తి, పీఆర్ శాఖలు, ఎన్ఐఆర్డీ, యూని సెఫ్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేషనల్ వాటర్ శానిటేషన్ హైజిన్ కాంక్లేవ్–2022 సదస్సులో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ మాట్లాడుతూ ఇంటింటికీ శుద్ధి చేసిన మంచి నీరందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందని ప్రశంసించారు. కేంద్రమంత్రి ప్రశంసలకు రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పందిస్తూ ధన్యవా దాలు తెలిపారు. మిషన్ భగీరథ కింద రాష్ట్రం లోని 100 శాతం గ్రామీణ ఆవాసాలకు తాగు నీటి సౌకర్యం కల్పించామన్నారు. ఇంటింటికీ నల్లా పథకంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. -
యూనివర్సిటీలకు అన్నివిధాలా సాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యార్థులకు ప్రపంచస్థాయి సాంకే తికతను చేరువ చేసేం దుకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం ముందుకు వచ్చింది. యూనివర్సిటీలకు అన్నివిధాలా సాయం అంది స్తామని యూజీసీ తెలిపింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్చైర్మన్ ప్రొఫెసర్ వి.వెంకటరమణ, ఉస్మానియా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్ల బృందం గురువారం ఢిల్లీలో యూజీసీ నూతన చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్ను కలిసింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో తీసుకొస్తున్న మార్పులను, పురోగతిని వివరించారు. రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన బీఏ, బీకాం ఆనర్స్ కోర్సుల విషయాన్ని ప్రొఫెసర్ రవీందర్ యూజీసీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. వర్సిటీలకు అవసరమైన నిధులు ఇవ్వాలని కోరారు. ఫ్యాకల్టీ అభివృద్ధి, విద్యార్థులకు ఉపకార వేతనాలివ్వ డం, పరిశోధన విధానాలను విస్తరింపజేయడంపై విశ్వవిద్యాలయాలు ప్రధానంగా దృష్టి పెట్టాయని ప్రొఫెసర్ వి.వెంకటరమణ యూజీసీ చైర్మన్కు వివరించారు. త్వరలో వీసీల సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, దానికి ముఖ్య అతిథిగా రావాలని కోరగా యూజీసీ చైర్మన్ అంగీకరించారు. తర్వాత వారు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్తో భేటీ అయ్యారు. అనంతరం సామాజిక న్యాయ, సాధికారిత విభాగం కార్యదర్శి ఆర్.సుబ్రహ్మణ్యంను కలసి రాష్ట్రంలో వివిధ వర్గాల విద్యార్థులకు పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలు, మౌలిక వసతులు, లైబ్రరీ సదుపాయాలపై తోడ్పాటు గురించి చర్చించారు. అనంతరం ఈ సమావేశాల వివరాలను ప్రొఫెసర్ లింబాద్రి మీడియాకు వివరించారు. -
ట్రోల్ చేస్తే తాట తీస్తారు.. షార్క్ ట్యాంక్ ఉందిక్కడ..ఒక్క యాప్తో రూ. 50 లక్షలు
ఇటీవల సోషల్మీడియాలో షార్క్ ట్యాంక్ ఇండియా షో ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. షార్క్ ట్యాంక్ ఇండియాకు చెందిన మీమ్స్, లైన్స్ బాగా ఫేమస్ అయ్యాయి. ఒకానొక సమయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా విపక్షాలను షార్క్ ట్యాంక్ ఇండియాకు చెందిన మీమ్తో విమర్శించారు. అంతగా ఫేమస్ అయ్యింది షార్క్ ట్యాంక్ ఇండియా. ఈ షోలో పాల్గొన్న 13 ఏళ్ల అమ్మాయి రూపొందించిన యాప్తో ఏకంగా 50 లక్షల ఫండింగ్ను సాధించి అందరితో ఔరా..! అనిపిస్తోన్న ఎనిమిదో తరగతి అమ్మాయి గురించి తెలుసుకుందాం..! చిన్న ఐడియానే..ఎంతో ఉపయోగంగా..! చాలా మంది అమ్మాయిలు.. విద్యార్థినులు ఎన్నో సందర్భాల్లో వేధింపులు ఎదుర్కోవడం.. బెదిరింపులకు గురి అవుతూ ఉంటారు. నిస్సహాయ స్థితిలో ఉండి మౌనంగా వెళ్లిపోతుంటారు. వీరి కోసం అనౌష్క జాలీ అనే 13 ఏళ్ల విద్యార్థిని యాప్ను రూపోందించి రియాలిటీ షో షార్క్ ట్యాంక్ ఇండియాలో రివీల్ చేసింది. తన ఐడియాను షోలో రివీల్ చేసి భారీ మొత్తంలో ఫండింగ్ పొందింది. సుమారు ఇన్వెస్టర్ల నుంచి ఏకంగా రూ. 50 లక్షల ఫండింగ్ను దక్కించుకుంది. చిచ్చర పిడుగు..అనౌష్క..! అనౌష్క జాలీ వయస్సు 13 ఏళ్లు. ఆమె ఎనిమిదో తరగతి చదువుతోంది. అనౌష్క చిన్నతనంలో తన తోటీ విద్యార్ధిని వేధింపులకు గురైన విషయం గుర్తుంది. నిస్సహాస్థితిలో ఉండి, వేధింపులకు గురయ్యే వారి కోసం ఎదైనా చేయాలనే ఆలోచించింది అనౌష్క. వెంటనే తనకు వచ్చిన ఆలోచనతో ఎంతో మంది వేధింపులకు గురవుతున్న వారి కోసం అండగా నిలిచేందుకు యాప్ను తయారుచేసింది. ఎందరో విద్యార్థులకు ఆమె తయారు చేసిన యాప్ ఉపయోగపడుతోంది. తర్వాత అనౌష్క జాలీ 'కవచ్' అనే మొబైల్ అప్లికేషన్ తయారు చేసింది. ఈ యాప్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడుతుంది. స్కూల్లో విద్యార్థినులు ఎవరైనా వేధిస్తే.. వెంటనే కంప్లైట్ చేయడానికి, ఇతరులను అలెర్ట్ చేయడానికి ఈ యాప్ ఉపయోగపడనుంది. కవచ్తో రక్షణ..! అనౌష్క జాలీ 'కవచ్' అనే మొబైల్ అప్లికేషన్ తయారు చేసింది. ఈ యాప్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడుతుంది. స్కూల్లో విద్యార్థినులు ఎవరైనా వేధిస్తే.. వెంటనే కంప్లైట్ చేయడానికి, ఇతరులను అలెర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. షార్క్ ట్యాంక్ ఇండియా రియాలిటీ షోలో ఈ యాప్ గురించి పిచ్చింగ్ను ఇచ్చింది. ఈ ఐడియాను మెచ్చి అనౌష్కకు షాదీ డాట్ కామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ అనుపమ్ మిట్టల్, బోట్ వ్యవస్థాపకుడు అమన్ గుప్తా రూ. 50 లక్షల ఫండింగ్ చేశాడు. షార్క్ ట్యాంక్ ఇండియా..! పలు స్టార్టప్స్కు, మంచి ఐడియాతో వచ్చే ఎంట్రిప్యూనర్స్కు షార్క్ ట్యాంక్ ఇండియా ఫండింగ్ను అందిస్తోంది. ఇది ఒక బిజినెస్ రియాలిటీ షో. భారత్పే మేనేజింగ్ డైరెక్టర్ , సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్, boAt సహ వ్యవస్థాపకుడు, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమన్ గుప్తా, Shaadi.com, పీపుల్ గ్రూప్ వ్యవస్థాపకుడు సీఈవో అనుపమ్ మిట్టల్, ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నమితా థాపర్, MamaEarth సహ వ్యవస్థాపకుడు ,చీఫ్ గజల్ అలగ్, SUGAR సౌందర్య సాధనాల CEO, సహ వ్యవస్థాపకుడు వినీతా సింగ్, లెన్స్కార్ట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పీయుష్ బన్సల్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ షో 118 మంది స్టార్టప్స్కు మద్దతును అందించింది. చదవండి: IPL Mega Auction 2022: వేలంలో ఫ్రాంఛైజీలకు ముచ్చెమటలు పట్టించిన తెలుగు తేజం -
పునరుత్పాదక ఇం‘ధన’ శక్తి
న్యూఢిల్లీ: మినీరత్న కంపెనీ భారత పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (ఐఆర్ఈడీఏ)కు రూ.1,500 కోట్ల నిధులను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనితోపాటు మహమ్మారి సమయంలో మారటోరియం విషయంలో రుణగ్రహీతలకు ఎక్స్గ్రేషియా చెల్లింపులకు సంబంధించి బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు రూ.974 కోట్లు క్యాబినెట్ మంజూరు చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం అనంతరం విలేకరులతో సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాలను తెలిపారు. ఆర్బీఐ రుణ నిబంధనల నేపథ్యం. ఆర్బీఐ రుణ నిబంధనల నేపథ్యంలో ఐఆర్ఈడీఏ నిధుల కల్పన నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. తాజా క్యాబినెట్ నిర్ణయం నేపథ్యంలో, పునరుత్పాదక ఇంధన రంగానికి ఐఆర్ఈడీఏ తన రుణ సామర్థ్యాన్ని రూ.12,000 కోట్లకు పెంచుకోవడానికి వీలు కలుగుతుందని ఆయన తెలిపారు. ‘‘ పునరుత్పాదక ఇంధన రంగంలో ఐఆర్ఈడీఏ కీలక పాత్ర పోషిస్తోంది. పునరుత్పాదక శక్తికి ఆర్థిక సహాయం చేయడానికి ఈ సంస్థ ఏర్పాటయ్యింది. గత ఆరు సంవత్సరాల్లో దీని పోర్ట్ఫోలియో రూ. 8,800 కోట్ల నుంచి రూ.27,000 కోట్లకు పెరిగింది’’ అని ఠాకూర్ చెప్పారు. ‘అయితే ఆర్బీఐ తాజా రుణ నిబంధనల ప్రకారం, ఒక సంస్థ తన నికర విలువలో 20 శాతం మాత్రమే రుణం ఇవ్వబడుతుంది. ఐఆర్ఈడీఏ నికర విలువ రూ. 3,000 కోట్లు. దీని ప్రకారం ప్రస్తుతం రూ. 600 కోట్ల వరకు మాత్రమే రుణాలు ఇవ్వగలదు. తాజా కేబినెట్ నిర్ణయంతో సంస్థ నెట్వర్త్ రూ.4,500 కోట్లకు పెరుగుతుంది. దీనివల్ల సంస్థ తన రుణ సామర్థ్యాన్ని సంస్థ భారీగా పెంచుకోగలుగుతుంది’’ అని కేంద్ర మంత్రి వివరించారు. భారీ ఉపాధి కల్పనకు దోహదం: ఐఆర్ఈడీఏ కేబినెట్ నిర్ణయం వల్ల సంస్థలో ఏటా దాదాపు 10,200 ఉద్యోగాల కల్పనకు సహాయపడుతుందని ఐఆర్ఈడీఏ పేర్కొంది. అలాగే ఒక సంవత్సరంలో సుమారు 7.49 మిలియన్ టన్నుల సీఓ2కు సమానమైన ఉద్గారాల తగ్గింపుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని తెలిపింది. ఐఆర్ఈడీఏ ఎంఎన్ఆర్ఈ (మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ) నియంత్రణలో పనిచేస్తుంది. పునరుత్పాక ఇంధన రంగానికి రుణాలను అందించడానికిగాను బ్యాంకింగ్ యేతర ఫైనాన్షియల్ కంపెనీగా ఐఆర్ఈడీఏ 1987 ఏర్పాటయ్యింది. ఈ రంగ ప్రాజెక్ట్ ఫైనాన్షింగ్లో గడచిన 34 సంవత్సరాల్లో సంస్థ కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది. ఎస్బీఐకి రూ.974 కోట్లు మహమ్మారి కరోనా మొదటి వేవ్ సమయంలో 2020లో అమలు చేసిన రుణ మారటోరియంకు సంబంధించి రీయింబర్స్మెంట్గా (పునఃచెల్లింపులుగా) బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు రూ. 973.74 కోట్లు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి ఠాకూర్ తెలిపిన సమాచారం ప్రకారం, నిర్దిష్ట రుణ ఖాతాలలో రుణగ్రహీతలకు ఆరు నెలల పాటు చక్రవడ్డీ– సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం విషయంలో చెల్లింపులకు ఉద్దేశించి ఎక్స్గ్రేషియా పథకం కోసం బడ్జెట్ రూ.5,500 కోట్లు కేటాయించింది. ఇందులో 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.4,626 కోట్ల చెల్లింపులు జరిగాయి. రూ.1,846 కోట్ల అదనపు క్లెయిమ్స్ పెండింగులో ఉన్నాయి. -
నిధులివ్వడానికి లబ్ధిదారులుండాలిగా!
సాక్షి, హైదరాబాద్: ‘‘పేదల కోసం గృహాలు నిర్మిస్తుంటే ఆ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలు ఉండాలిగా. అవే లేవు. అలాంటప్పుడు కేంద్రం అమలు చేస్తున్న ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’పథకం కింద నిధులెలా ఇచ్చేది’’ ♦ఇది కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రశ్న. ‘‘మేం రాష్ట్రంలో అమలు చేస్తున్న రెండు పడకల ఇళ్లకు సంబంధించి ఏర్పాటు చేసుకున్న విధివిధానాలు వేరు. కావాలంటే లబ్ధిదారుల వివరాలు త్వరలో అందిస్తామని అండర్టేకింగ్ ఇస్తాం. క్షేత్రస్థాయిలో పరిస్థితిని మీరు పరిశీలించొచ్చు. ఆ పథకం తదుపరి కిస్తీని విడుదల చేయండి’’ ♦ఇది రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్రానికి ఇచ్చిన హామీ ‘‘లబ్ధిదారుల జాబితా చూడనంతవరకు నిధుల విడుదల కుదరదు’ ♦ఇది తాజాగా కేంద్రప్రభుత్వ యంత్రాంగం స్పష్టీకరణ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పెద్ద చిక్కే వచ్చి పడింది. ఇంతకాలం రుణాలు తీసుకొని ఆ పథకం కింద ఇళ్లను నిర్మిస్తున్న ప్రభుత్వం.. కేంద్రం పథకం ప్రధానమంత్రి ఆవాజ్ యోజన (పీఎంఏవై) కింద ఇచ్చే మొత్తాన్ని కూడా వాటికి జతచేసి అక్కడికక్కడికి సరిపోయేలా ప్లాన్ చేసుకుంది. కానీ రాష్ట్రప్రభుత్వం ఆ ఇళ్ల విషయంలో అనుసరిస్తున్న తీరు కేంద్రం ఇచ్చే నిధులు రాకుండా అడ్డుగోడలా మారింది. చకచకా పనులు కాని చ్చేసి కాంట్రాక్టర్లకు పేరుకుపోయిన రూ. 900 కోట్ల బకాయిలను కేంద్రం నుంచి అందే నిధులతో తీర్చేద్దామనుకున్న తరు ణంలో నిబంధనలు వ్యతిరేకంగా ఉన్నాయంటూ పీఎంఏవై కింద ఇచ్చే నిధులు విడుదల చేయలేమని కేంద్రం తేల్చేసింది. మరోవైపు బకాయిలు ఇస్తేనే పనులు చేస్తా మని కాంట్రాక్టర్లు పనులాపేశారు. హడ్కో నుంచి అప్పు తెద్దామంటే గరిష్ట మొత్తం ఇప్పటికే మంజూరై ఖర్చయిపోయింది. దీంతో పథకాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం సొంత ఖజానా నుంచి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. లబ్ధిదారుల జాబితా లేక.. గతంలో ఇందిరమ్మ పథకం కింద లక్షల్లో ఇళ్లను నిర్మించి పేదలకందించారు. పనులు మొదలయ్యేలోపే అర్హులను గుర్తించి గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసేవారు. తర్వాత పనులు అయ్యే కొద్ది వారికి నిధులు విడుదల చేస్తుండేవారు. కేంద్రం తన వంతు వాటాగా నిధులిచ్చేది. కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంలో అర్హులకు సంబంధించి ఓ అంచనా మేరకు ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వమే ఇళ్లను నిర్మిస్తోంది. వాటిని అందించే వేళ లబ్ధిదారుల జాబితాను రూపొందించి ఇళ్లను కేటాయిస్తోంది. 2.91 లక్షల ఇళ్లకు గాను 1.08 లక్షల ఇళ్లను పూర్తి చేశారు. ఇందులో ఇప్పటివరకు 14,000 మందికే ఇళ్లను అందజేశారు. సిద్ధంగా ఉన్న మిగతా ఇళ్లకు లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేయాల్సి ఉంది. కానీ కేంద్ర విధానం ప్రకారం ముందు లబ్ధిదారుల సంఖ్యను తేల్చి ఆ ప్రకారం ఇళ్లు నిర్మించాలి. దీంతో లబ్ధిదారుల జాబితానే సిద్ధంగా లేనప్పుడు ఏ సంఖ్య ఆధారంగా నిధులు విడుదల చేయాలని కేంద్రం ప్రశ్నిస్తోంది. సమాధానం లేకపోవటంతో నిధులు ఇచ్చేందుకు ససేమిరా అనేసింది. కనీసం 25 వేల మంది జాబితానిస్తే పరిశీలిస్తామన్న కేంద్రం కేంద్రం తాను మంజూరు చేసే పీఎంఏవై ఇళ్లకు ఒక్కో ఇంటికి రూ.లక్షన్నర చొప్పున కేటాయిస్తుంది. ఇందులో కొంతమొత్తాన్ని ముందుగానే విడుదల చేస్తూ రెండో కిస్తీగా 40 శాతం మొత్తాన్ని ఇస్తుంది. మిగతా మొ త్తాన్ని ఫైనల్ ఇన్స్పెక్షన్ తర్వాత విడుదల చేస్తుంది. తొలుత రూ.వేయి కోట్లకు పైగా కేంద్రం నుంచి రాగా, రెండో కిస్తీగా ఇప్పు డు రూ.800 కోట్లు రావాల్సి ఉంది. ఇది లబ్ధిదారుల జాబితాను కేంద్రానికి సమర్పించి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ డబుల్ బె డ్రూమ్ ఇళ్లలో ముందుగా లబ్ధిదారుల జాబి తాను రూపొందించకపోవటంతో కేంద్రానికి సమర్పించలేదు. అందుకే నిధులు అం దలేదు. దీనిపై 3, 4 నెలలుగా రాష్ట్ర అధికారులు కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. జా బితా ఇవ్వకుండా నిధులు ఇవ్వటం సా«ధ్యం కాదని తేలడంతో మార్చి నాటికి జాబితా సిద్ధం చేసి ఇస్తామని రాష్ట్ర అధికారులు ఓ లేఖను సమర్పించారు. దాని కీ అధికారులు సంతృప్తి చెందలేదు. చివరగా కనీసం 25 వేల మందితో కూడిన జాబితాను సమర్పిస్తే పరిశీలిస్తామనగా అధికారులు ప్రస్తుతం ఆ పనుల్లో ఉన్నట్టు సమాచారం. -
రిలయన్స్ జియో కీలక నిర్ణయం...! ఇక యూజర్లకు పండగే..?
యూజర్లకు మరిన్నీ సేవలను అందించేందుకుగాను రిలయన్స్ జియో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా,మ్యూజిక్, క్లౌడ్, హెల్త్, యూపీఐ లాంటి సేవలను జియో తన యూజర్లకు అందిస్తోంది. వీటితో పాటుగా మరిన్నీ గేమింగ్ సేవలను అందించేందుకు జియో సన్నాద్ధమైంది. జూపీ(Zupee)తో కీలక ఒప్పందం..! స్కిల్డ్ బేస్డ్ గేమింగ్ రంగంలో ప్రసిద్ధి చెందిన జూపీతో రిలయన్స్ జియో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో జియో కస్టమర్లకు క్వాలిటీ గేమ్స్ అనుభూతిని పొందే అవకాశం ఉంది. ఈ భాగస్వామ్యంతో జియో తన యూజర్లు జూపీకి చెందిన అన్నీ గేమ్లను యాక్సెస్ చేయవచ్చును. ఈ గేమ్స్ అన్ని భాషలను సపోర్ట్ చేయనున్నాయి. రిలయన్స్ జియో-జూపీ భాగస్వామ్యంతో జూపీ సేవలు మారుమూల గ్రామాలకు చొచ్చుకుపోతాయని జూపీ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, దిల్షేర్ సింగ్ అన్నారు. ఇప్పటికే తమ ఫ్లాట్ఫామ్స్లో సుమారు 70 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ను కల్గి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత భాగస్వామ్యంతో అధిక సంఖ్యలో యూజర్లు గేమ్స్ను యాక్సెస్ చేసే అవకాశం ఏర్పడనుంది. 600 మిలియన్ డాలర్లకు.. సిరీస్ బీ రౌండ్ ఫండింగ్లో నేపియన్ క్యాపిటల్, వెస్ట్ క్యాప్ గ్రూప్, టోమల్సె బే క్యాపిటల్, ఏజే క్యాపిటల్, మాట్రిక్స్ పాట్నర్స్ ఇండియా, ఒరిస్ వెంచర్ నుంచి జూమీ సుమారు 102 మిలియన్ డాలర్లను సేకరించింది. గేమింగ్ రంగంలో కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి, ఆయా గేమింగ్స్ డిజైన్ అనుభవాలను మెరుగుపరచడానికి, మార్కెటింగ్ పలు ఇతర విషయాల్లో ఈ నిధులను ఉపయోగిస్తామని జూపీ పేర్కొంది. కంపెనీ విలువ ఇప్పటివరకు 600 మిలియన్ డాలర్లకు చేరుకుంది. చదవండి: బెంగళూరు, ఢిల్లీ బాటలో హైదరాబాద్.. స్టార్టప్లకు మంచి రోజులు -
16 కోపరేటివ్ బ్యాంకు కస్టమర్లకు మంచిరోజులు!
న్యూఢిల్లీ: నిధుల సంక్షోభం ఎదుర్కొంటున్న 16 కోపరేటివ్ బ్యాంకు కస్టమర్లు.. ఒక్కొక్కరికి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) కింద గరిష్టంగా రూ.5 లక్షల వరకు దక్కనుంది. డీఐసీజీసీ 21 బ్యాంకులతో ఒక జాబితాను రూపొందించగా.. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు) సహా ఐదు బ్యాంకులను ఈ పథకం కింద మినహాయించింది. డీఐసీజీసీ కింద బ్యాంకులు సంక్షోభం పాలైతే.. డిపాజిట్ దారునకు గరిష్టంగా రూ.5లక్షలు పరిహారం చెల్లించే బిల్లుకు పార్లమెంటు ఈ ఏడాది ఆగస్ట్లో ఆమోదం తెలుపగా.. సెప్టెంబర్ 1న ప్రభుత్వం నోటిఫై చేసింది. -
మిగిలింది రూ.135 కోట్లే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఈ పథకం కింద ఖర్చు చేసేందుకు కేవలం రూ.135 కోట్ల బడ్జెటే మిగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా నాలుగున్నర నెలలు ఉండగానే ఈ పరిస్థితి తలెత్తడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మిగిలిన మొత్తంతో కూలీలకు రెండు రోజులకు మించి పనిని కలి్పంచే అవకాశాలు లేవని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో ఇకముందు దీనిని ఎలా అమలు చేయాలి?, ఉపాధి పనులు కోరే కూలీలకు పనుల కల్పన, వారికి వేతనాల చెల్లింపు ఎలా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 7 నెలల్లో 97% నిధులు ఖర్చు చేసిన రాష్ట్రం రాష్ట్రంలో ఈ ఏడాది ఉపాధి హామీ పథకం అమలు, మొత్తం బడ్జెట్, చేసిన వ్యయం, ఉపాధి కల్పన తదితర అంశాలపై గత ఏప్రిల్ నుంచి అక్టోబర్ చివరి వరకు అందుబాటులో (పబ్లిక్ డొమైన్) సమాచారాన్ని లిబ్ టెక్ ఇండియా సంస్ధ ఆధ్వర్యంలో పరిశోధకులు, నిపుణుల బృందం విశ్లేచింది. దీని ప్రకారం..ఈ ఏడాది ఈ పథకం కింద ఇప్పటివరకు జాతీయ స్థాయిలో 90% కంటే కాస్త అధికంగా నిధులు ఖర్చు కాగా, తెలంగాణకు కేటాయించిన బడ్జెట్లో సుమారు 97% ఇప్పటికే ఖర్చు అయ్యింది. రాష్ట్రానికి కేంద్రం రూ.3,671 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఇందులో గత 7 నెలల్లో (ఏప్రిల్–అక్టోబర్) రాష్ట్ర ప్రభుత్వం రూ.3,536 కోట్లు వ్యయం చేసింది. చేసిన పనులకు గాను గత నెల 10వ తేదీ వరకు రూ.2,278 కోట్లు కేంద్రం విడుదల చేసింది. ఇంకా రూ.1,258 కోట్ల మేర బకాయిలు రాష్ట్రానికి రావాల్సి ఉంది. ఒకవైపు చెల్లింపుల కోసం కూలీలు ఎదురు చూస్తుండగా, మిగతా నాలుగున్నర నెలలు పని కల్పన ఇప్పుడు సమస్యగా మారింది. ఉపాధి హామీ పనులకు అత్యంత డిమాండ్ ఉన్న రోజుల్లోనూ రాష్ట్రంలో 1.2 కోట్ల కంటే ఎక్కువ మంది పని కోరలేదు. కానీ ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికే అత్యధికంగా 1.8 కోట్ల మంది పని కావాలని కోరారు. దీనిని బట్టి కూలీలు పని కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్ధమవుతోందని నిపుణులు పేర్కొన్నారు. కొరవడిన స్పష్టత ప్రస్తుత సమస్యను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తుందనే అంశంపై స్పష్టత కొరవడింది. దీనిపై మాట్లాడేందుకు అధికారులెవరూ సముఖంగా లేరు. మరోవైపు ఇంతపెద్ద మొత్తంలో కేంద్రం నుంచి బకాయిలు రావాల్సి రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కేంద్రాన్ని నిలదీయకపోవడం ఏమిటని నిపుణులు ప్రశి్నస్తున్నారు. ఉపాధి హామీ రంగంలో పనిచేస్తున్న వివిధ స్వచ్ఛంద, సేవాసంస్థలు, దళిత సంఘాల ప్రతినిధులు ఆయా ముఖ్యమైన అంశాలపై సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. ఇదిలా ఉంటే 2020–21లో రాష్ట్రానికి రూ.4,763 కోట్లు కేటాయించిన కేంద్రం ఈ ఏడాది (2021–22) రూ.3,671 (గతేడాదితో పోలి్చతే 33 శాతం తక్కువ) కోట్లే కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధి హామీ పనులకు రాష్ట్రంలో డిమాండ్ పెరుగుతున్నందున.. కేంద్రం బడ్జెట్ పెంచాల్సి ఉండగా తగ్గించడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి ఉపాధి బడ్జెట్ను పెంచాలనే డిమాండ్లు వస్తున్నాయి. కేంద్రం అదనపు బడ్జెట్ కేటాయిస్తే కానీ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కొనసాగే పరిస్థితి లేదని నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్రం తక్షణమే బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నారు. సీఎం లేఖ రాయాలి తెలంగాణకు రావాల్సిన బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని కోరుతూ కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ రాయాలి. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులకు ఆటంకం కలగకుండా అదనపు కేటాయింపుల కోసం కేంద్రాన్ని డిమాండ్ చేయాలి. తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను షరతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తిరిగి నియమించాలి. – పి. శంకర్ (దళిత్ బహుజన్ ఫ్రంట్), కురువ వెంకటేశ్వర్లు (ఉపాధి హామీ ఫోన్ రేడియో) డిమాండ్ మేరకు దొరకని పని పూర్తి చేసిన పనులకు సకాలంలో డబ్బులు చెల్లించక పోవడం, ఇతర కారణాల వల్ల కూలీల్లో కొంత నిరుత్సాహం ఉంది. అయినా డిమాండ్ మేరకు కూలీలు పని పొందలేక పోతున్నారనేది మా పరిశీలనలో వెల్లడైంది. కూలీలకు బకాయిలు వెంటనే చెల్లించాలి. అలాగే ఉపాధి హామీ బడ్జెట్ను మరింత పెంచాల్సిన అవసరముంది. ఈ పథకంలో కీలకంగా వ్యవహరించే ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థను మళ్లీ పూర్తి స్థాయిలో ఉపయోగించాలి. – చక్రధర్ బుద్ధా (డైరెక్టర్, లిబ్ టెక్ ఇండియా), గజ్జలగారి ప్రవీణ్కుమార్ (పరిశోధకులు) -
అగ్రరాజ్యాలకు పోటీగా నిలుస్తోన్న భారత్...!
Over 100 Companies in India Raised Series A Funding for Startups in the Past Year: భారత్లో స్టార్టప్స్ సంస్కృతి గణనీయంగా అభివృద్ధి చెందుతుంది. నూతన టెక్నాలజీలను అందిపుచ్చుకుంటూ సరికొత్త ఆవిష్కరణలను భారత స్టార్టప్స్ రూపోందిస్తున్నాయి. ఫండింగ్లో అగ్రరాజ్యాలకే పోటీగా భారత్ నిలుస్తోంది. స్టార్టప్స్ దూకుడు... భారత్లో పలు స్టార్టప్ కంపెనీలు దూకుడు మీదున్నాయి. భారత్లో ఇప్పటివరకు 100కు పైగా యూనికార్న్ స్టార్టప్లుగా అవతరించాయి. ఇండియన్ స్టార్టప్లు సిరీస్ ఏ ఫండింగ్లో భాగంగా పలు దిగ్గజ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. సిరీస్ ఏ ఫండింగ్లో విషయంలో డేటా రిసెర్చ్ అండ్ అనాలిటిక్స్ ఫ్రీమ్ లాంచ్ గ్రావిటీ సహా వ్యవస్థాపకుడు డ్రేక్ డ్యూక్ స్టార్టప్ కంపెనీలపై పలు ఆసక్తి కర విషయాలను తెలియజేశారు. చదవండి: 75వేల కోట్ల కంపెనీ ..! అందులో అమితాబ్ బచ్చన్ ఎంట్రీ...! గత ఏడాది స్టార్టప్ల ‘సిరీస్ ఏ ఫండింగ్ ’ విషయంలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. తొలి రెండుస్ధానాల్లో అమెరికా, యూనైటేడ్ కింగ్డమ్ నిలిచాయి. భారత్కు చెందిన సుమారు 109 స్టార్టప్స్ పలు దిగ్గజం కంపెనీల నుంచి సిరీస్ ఏ ఫండింగ్ను పొందాయి. గత ఏడాది భారత స్టార్టప్స్ సుమారు 1820.3 మిలియన్ డాలర్ల సిరీస్ ఏ ఫండింగ్లో పెట్టుబడులను ఆకర్షించాయని డ్రేక్ పేర్కొన్నారు. The US is in the lead with 1.2K companies with Series A deals Here’s the breakout of the other countries: United Kingdom 🇬🇧 - 225 India 🇮🇳 - 109 Germany 🇩🇪 - 105 France 🇫🇷 - 86 Canada 🇨🇦 - 82 Israel 🇮🇱 - 72 Brazil 🇧🇷 - 42 Switzerland 🇨🇭- 39 Spain 🇪🇸 - 38 Others (283) — Drake Dukes (@DDukes12) September 30, 2021 సిరీస్ ఏ ఫండింగ్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, మెక్కిన్సీ, గోల్డ్మన్ సాక్స్, ఐబీఎమ్, ఐడీఎఫ్, బీసీజీ, బెయిన్ఆలర్ట్స్, యూబర్, ఫేస్బుక్ కంపెనీలు నిలిచాయి. ఈ కంపెనీలు సాఫ్ట్వేర్, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, సాస్, ఫిన్టెక్, హెల్ద్కేర్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్చెయిన్, ఈ-కామర్స్ రంగాలోని స్టార్టప్లకు భారీ పెట్టుబడులను అందిస్తున్నాయి. Series A founders hold prior experiences from these companies: 1. @Google 2. @Microsoft 3. @McKinsey 4. @GoldmanSachs 5. @IBM 6. @IDF 7. @BCG 8. @BainAlerts 9. @Uber 10. @Facebook Other Notables:@salesforce (18th), @Apple (20th), @amazon (28th) — Drake Dukes (@DDukes12) September 30, 2021 చదవండి: ఆ వెబ్సిరీస్తో నెట్ఫ్లిక్స్కు కొత్త తలనొప్పి..! -
టీడీపీ ప్రభుత్వ హయాంలో CMRF నిధుల గోల్మాల్
-
Nalgonda: మున్సిపాలిటీలో నిధులు స్వాహా.. ముగ్గురు అరెస్ట్
సాక్షి, నల్గొండ: నల్గొండ జిల్లాలోని మున్సిపాలిటీలో నిధులు స్వాహా చేసిన ఉదంతంలో అరెస్టుల పర్వం ప్రారంభమైంది. ఆరేళ్ల క్రితం నకిలీ బిల్లు పుస్తకాలను ముద్రించి అక్రమాలకు పాల్పడిన ఉద్యోగుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ-2 రేఖల అరుణకారి, ఏ-12 సత్యనారాయణ, ఏ-16 ఈశ్వరయ్యలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 2010-2014 మధ్యలో నల్లా బిల్లు, ఇంటి నిర్మాణ అనుమతులు, ఆస్తి పన్నును మున్సిపాలిటీ ఖాతాలో జమచేయని ఉద్యోగులు, మొత్తం రూ. 5.04 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. మొత్తం 29 మంది ఉద్యోగులు, 18 మంది పర్యవేక్షణా అధికారులపై 2015లో కేసు నమోదు అయింది. ప్రస్తుతం ముగ్గురిని అరెస్ట్ చేయగా.. మిగతా ఉద్యోగుల అరెస్ట్కు రంగం సిద్ధం అయింది. అవినీతి ఉద్యోగుల్లో మొదలైన టెన్షన్ మొదలైంది. మిగతా ఉద్యోగులు సెలవు పెట్టి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో ఇప్పటికే నలుగురి మృతి చెందారు. మిగతావారిని నేడో, రేపో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: Karimnagar: అత్తగారింట్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య -
ఎట్టకేలకు సీసీఎస్కు నిధులు
సాక్షి, హైదరాబాద్: మూతపడే దశలో ఉన్న ఆర్టీసీ సహకార పరపతి సంఘాని(సీసీఎస్)కి ఎట్టకేలకు రవాణా సంస్థ నిధులు కేటాయించింది. వేయి కోట్లకు పైగా సంఘం నిధులు సొంతానికి వాడుకుని, దాన్ని దివాలా దశకు చేర్చిన ఆర్టీసీ.. తాజాగా దానికి రూ.90 కోట్లు అందజేసింది. త్వరలో నేషనల్ క్రెడిట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) నుంచి ప్రభుత్వ పూచీకత్తు ద్వారా సీసీఎస్కు రూ.400 కోట్ల నిధులు సమకూర్చాల్సి ఉంది. కానీ గతంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి సీసీఎస్ కొంత బకాయి పడింది. అవి మొండి బకాయిలుగా మారటంతో సంఘం ప్రస్తుతం ఎన్పీఏ జాబితాలోకి చేరింది. ఆ బకాయిలు తీరిస్తేగానీ ఎన్సీడీసీ నుంచి రుణం పొందే వీలులేదు. ఈ నేపథ్యంలోనే అందుకు కావాల్సిన నిధులు కేటాయించాల్సిందిగా సీసీఎస్ చాలాకాలంగా ఆర్టీసీని కోరుతోంది. కానీ పట్టించుకోలేదు. అయితే ఆర్టీసీ కొత్త ఎండీగా సజ్జనార్ బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో.. ఆ కసరత్తు వేగం అందుకుంది. నాలుగు రోజుల క్రితం రూ.90 కోట్లు సీసీఎస్కు అందాయి. వడ్డీ బకాయిలకు రూ.7.5 కోట్లు: తాజా నిధుల్లోంచి బ్యాంకు బకాయిల కిం ద రూ.80 కోట్లను చెల్లించిన సీసీఎస్, మిగతా మొత్తం నుంచి రిటైర్డ్ ఉద్యోగుల డిపాజిట్లపై చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు చెల్లించనుంది. గత మూడు నెలలుగా రిటైర్డ్ ఉద్యోగులు వడ్డీ అందక ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద వచ్చిన మొత్తాన్ని సీసీఎస్లోనే డిపాజిట్ చేశారు. -
ఏపీ: సర్కారు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు రెట్టింపు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీ చికిత్సల కింద ప్రభుత్వ ఆస్పత్రులకు అందుతున్న నిధులు గణనీయంగా పెరుగుతున్నాయి. చక్కటి మౌలిక వసతులు, వైద్య సిబ్బంది సేవలు మెరుగ్గా అందుబాటులోకి రావడం వల్ల ఎక్కువ మంది రోగులు ప్రభుత్వాసుపత్రులకు వస్తున్నారు. ముఖ్యంగా సెకండరీ కేర్ ఆస్పత్రులైన వైద్య విధాన పరిషత్ పరిధిలోని సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు పెరగడం మంచి పరిణామంగా పేర్కొంటున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు రెట్టింపు అయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2017లో వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రులకు రూ.16.10 కోట్ల మేర ఆరోగ్యశ్రీ నిధులు అందగా 2020లో రూ.35.78 కోట్లు విడుదలయ్యాయి. 100 శాతానికిపైగా నిధుల పెరుగుదల కనిపించింది. నాడు నేడు పనులు పూర్తయితే.. ప్రస్తుతం సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో నాడు – నేడు ద్వారా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల కొత్త భవనాల నిర్మాణం జరుగుతోంది. ఇవన్నీ పూర్తయితే ఆరోగ్యశ్రీ చికిత్సలు మరిన్ని జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 60 శాతం ఆరోగ్యశ్రీ నిధులు ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులకు వెళుతున్నాయి. అదే ప్రభుత్వ పరిధిలో అన్ని ఆస్పత్రుల అభివృద్ధి జరిగితే ఆ మేరకు నిధులు ప్రభుత్వ ఆస్పత్రులకే అందే అవకాశం ఉంది. క్రమంగా ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వసతులను పెంపొందించి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉత్తమ చికిత్సలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. డాక్టర్ పోస్టుల భర్తీ సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీపై అధికారులు దృష్టి సారిం చిన విషయం తెలిసిందే. 2020లో వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో 692 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటికే 232 మంది వైద్యులను శాశ్వత ప్రాతిపదికన నియమించారు. తిరిగి 2021లో 460 పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టారు. తాజాగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లోనూ 196 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 12 మంది డెంటల్ అసిస్టెంట్ సర్జన్లను నియమించనున్నట్లు ప్రకటించారు. ఇవీ చదవండి: 6న అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు రియా చక్రవర్తితో సంబంధమేంటి? -
‘పాలమూరు’ రుణాలపై తర్జనభర్జన
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తి పోతల పథకం పనుల పూర్తికి నిధుల కొరత వెంటాడుతోంది. కేంద్రం ఇటీవల విడుదల చేసిన కృష్ణా బోర్డు గెజిట్ నోటిఫికేషన్లో ‘పాలమూరు’ను అనుమతిలేని ప్రాజెక్టుగా పేర్కొనడంతో నిధుల విడుదలపై రుణ సంస్థలు, రుణాల సాధనకు ఇరిగేషన్ శాఖ తర్జనభర్జన పడుతున్నాయి. దీనిపై ఇప్పటికే పలుమార్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) తో చర్చలు జరిపిన ఇరిగేషన్ శాఖ... నిధుల విడుదలకు ఆటంకాలు లేకుండా చూడాలని కోరగా దీని పై స్పష్టత వస్తే తప్ప ముందుకెళ్లలేమని పీఎఫ్సీ తేల్చిచెబుతుండటంతో సందిగ్ధత కొనసాగుతోంది. మరో రూ. 2,183 కోట్లు బ్యాలెన్స్.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును రూ. 32,200 కోట్ల అంచనా వ్యయంతో 2016–17లో చేపట్టగా ప్రస్తుతం దీని అంచనా వ్యయం రూ. 50 వేల కోట్లకు చేరుతోంది. భారీ నిధుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రాజెక్టులోని నార్లాపూర్ నుంచి కనీసం ఒక టీఎంసీని ఉద్ధండాపూర్ రిజర్వాయర్ వరకు తరలించేలా ప్రభుత్వం ప్రణాళిక రచించింది. దీనికైనా రూ. 30 వేల కోట్ల మేర నిధుల అవసరాలున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా పాలమూరు–రంగారెడ్డికి సైతం రూ. 6,160.46 కోట్ల రుణాలను పీఎఫ్సీ నుంచే తీసుకొనేలా ఒప్పందాలు చేసుకుంది. ఇందులో ఇప్పటికే రూ. 3,976.98 కోట్ల మేర రుణాలను పీఎఫ్సీ విడుదల చేసింది. మరో రూ. 2,183.48 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ నేపథ్యంలో రుణాల విడుదలను పీఎఫ్సీ నిలిపివేసింది. అన్ని అనుమతులున్నాయంటూ రాష్ట్రం లేఖ.. రుణాల విడుదల కోరుతూ తెలంగాణ ప్రభు త్వం పీఎఫ్సీకి రెండ్రోజుల కిందట లేఖ రాసిన ట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో ప్రాజె క్టు పనులను ప్రస్తుతానికి తాగునీటి అవసరాలు తీర్చేలాగానే చేపడుతున్నామని, ఇందుకు అను మతులు అవసరం లేదని చెప్పినట్లు సమాచా రం. గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ సైతం తాగునీటి వరకు పనులు చేపట్టుకోవచ్చని, పర్యావరణ అనుమతులు వచ్చాకే సాగునీటి పనులు చేపట్టాలని పేర్కొన్న విషయాన్ని పీఎఫ్సీ దృష్టికి తీసుకెళ్లింది. ఈ ఏడాది సెప్టెంబర్లోగా ప్రాజెక్టు కు పర్యావరణ అనుమతులు సాధించే దిశగా చర్యలు మొదలుపెట్టామని, ఆ తర్వాతే సాగు నీటి కాల్వల నిర్మాణ పనులు చేపడతామని వివరించింది. ఈ దృష్ట్యా తాగునీటిని సరఫరా చేసే లా చేపట్టిన ఎలక్ట్రో మెకానికల్, పంపులు, మో టార్ల పనుల కొనసాగింపునకు వీలుగా రుణా లను విడుదల చేయాలని కోరినట్లు తెలిసింది. -
స్టార్టప్లకు జోరుగా వెంచర్ క్యాపిటల్ నిధులు
న్యూఢిల్లీ: స్టార్టప్లకు (ఆరంభ దశలోని కంపెనీలు) వెంచర్ క్యాపిటల్ (వీసీ) నిధులు అండగా నిలుస్తున్నాయి. 2021లో ఇప్పటివరకు 16.9 బిలియన్ డాలర్ల (రూ.1.26 లక్షల కోట్లు సుమారు) నిధులను భారత స్టార్టప్లు సమీకరించాయి. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ నిదానించినప్పటికీ.. వీసీ ఇన్వెస్టర్లు భారత స్టార్టప్ వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని కనబరుస్తున్నట్టు ‘గ్లోబల్ డేటా’ అనే డేటా అనలైటిక్స్ సంస్థ తెలిపింది. నిధుల సమీకరణలో భారత స్టార్టప్లు చైనా స్టార్టప్ల సరసనే నిలుస్తున్నట్టు పేర్కొంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు గణాంకాలను విశ్లేషించి ఈ వివరాలను విడుదల చేసింది. ఈ ఆరు నెలల కాలంలో మొత్తం 828 వీసీ ఫండింగ్ (పెట్టుబడులు) ఒప్పందాలు నమోదయ్యాయి. ఈ ఒప్పందాల విలువ 16.9 బిలియన్ డాలర్లు. వీటిల్లో ఫ్లిప్కార్ట్ 3.6 బిలియన్ డాలర్లు, మొహల్లా టెక్ (షేర్చాట్) 502 మిలియన్ డాలర్లు, జొమాటో 500 మిలియన్ డాలర్లు, థింక్ అండ్ లెర్న్ (బైజూస్) 460 మిలియన్ డాలర్ల సమీకరణ పెద్ద ఒప్పందాలుగా ఉన్నాయి. భారత్లో వీసీ ఫండింగ్ ఒప్పందాల సంఖ్య క్షీణించినా కానీ, విలువ పరంగా వృద్ధి నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి. -
నిధులపై నీళ్లు.. సాగునీటి ప్రాజెక్టులపై గెజిట్ దెబ్బ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధుల కొరత వెంటాడుతోంది. ఇప్పటికే అనేక ప్రాజెక్టుల పరిధిలో భారీగా బకాయిలు పేరుకుపోగా.. కృష్ణా, గోదా వరి బోర్డులపై కేంద్రం తీసుకొచ్చిన గెజిట్తో కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. అనుమతుల్లేవని చెబుతున్న ప్రాజెక్టులకు రుణాల విడుదలలో రుణ సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు నిధుల విడుదలను నిలిపివేయడంతో, ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలు నిర్ణీత గడువులోగా చేరుకునే పరిస్థితి లేకుండా పోతోంది. పేరుకుపోయిన బకాయిలు రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో గతంలో ఎన్నడూ లేనంతగా బకాయిలు పేరుకుపోయాయి. కరోనా ప్రభావంతో రాష్ట్ర ఆదాయానికి గండి పడటం, మరోవైపు ఇతర ప్రాధాన్యత రంగాలకు నిధుల వెచ్చింపు పెరగడంతో ప్రాజెక్టులకు రాష్ట్ర నిధుల నుంచి కేటాయింపులు తగ్గాయి. కొత్త ఆర్థిక ఏడాదిలో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులపై రూ.4,925 కోట్లు వెచ్చించగా, ఇందులో రాష్ట్ర నిధుల నుంచి ఇచ్చింది కేవలం రూ.1,887 కోట్లు మాత్రమే. ఇక రుణాల రూపేణా వచ్చిన సొమ్ముతో మరో రూ.3,038 కోట్లు మేర ఖర్చు చేశారు. అయినప్పటికీ ఇంకా రూ.11,396 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో నిర్మాణ పనులు (వర్క్స్)కు సంబంధించిన బిల్లులే రూ.5,710 కోట్ల మేర పెండింగ్లో ఉన్నాయి. పనులకు సంబంధించిన బకాయిల్లో కాళేశ్వరం పరిధిలోనే రూ.1,200 కోట్ల మేర చెల్లించాల్సి ఉండగా, మల్లన్నసాగర్ రిజర్వాయర్ పరిధిలోనివి రూ.300–400 కోట్ల వరకు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ రిజర్వాయర్ పనులు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా, చివరి దశలో ఉన్న పనులకు నిధుల కొరత కారణంగా కనీసం డీజిల్ ఖర్చులకు సైతం ఇక్కట్లు తప్పట్లేదు. పాలమూరు–రంగారెడ్డి పరిధిలో మరో రూ.2 వేల కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. జూలై తొలివారం వరకు వచ్చిన నిధులు ప్రాజెక్టులకు నిధుల కొరత రావద్దనే ఉద్దేశంతోనే కాళేశ్వరం కార్పొరేషన్, తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్లకు ప్రైవేటు బ్యాంకులతో పాటు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్, నాబార్డ్ వంటి సంస్థలు రుణాలిస్తున్నాయి. ఈ ఆర్థిక ఏడాది జూలై తొలివారం వరకు కాళేశ్వరానికి రూ.1,624 కోట్లు, పాలమూరు–రంగారెడ్డికి రూ.1,039 కోట్లు, కంతనపల్లికి రూ.40 కోట్లు, దేవాదులకు రూ.127 కోట్లు, సీతారామకు రూ.136 కోట్లు మేర రుణాలు విడుదలయ్యాయి. అయినప్పటికీ కాళేశ్వరం, పాలమూరుతో పాటు సీతారామలో పనులకు సంబంధించి రూ.563 కోట్లు, దేవాదులలో రూ.10 కోట్లు బకాయిలున్నాయి. మున్ముందు పనులకు రూ.2 వేల కోట్ల మేర నిధుల అవసరాలున్నాయి. గెజిట్తో రుణ సంస్థల వెనుకంజ ప్రస్తుతం కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్ల కారణంగా రుణ సంస్థలు రుణాల విడుదలపై సందిగ్ధంలో పడ్డాయి. అనుమతుల్లేని ప్రాజెక్టులు, వాటికి అనుమతుల విషయమై గెజిట్లో కేంద్రం పలు సూచనలు చేసిన నేపథ్యంలో రుణాల విడుదలపై సంస్థలు వెనుకంజ వేస్తున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం అదనపు టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, దేవాదుల, సీతమ్మసాగర్ బ్యారేజీ వంటి ప్రాజెక్టులకు కేంద్ర సంస్థల నుంచి అనుమతి తీసుకోవాలని గెజట్లో పేర్కొన్న నేపథ్యంలో రుణ సంస్థలు ఈ అంశాలపై రాష్ట్రానికి ప్రశ్నలు సంధిస్తున్నాయి. ప్రాజెక్టులకు ఆమోదం ఎప్పటిలోగా తీసుకుంటారు, ఒకవేళ అనుమతులు రాకుంటే పరిస్థితి ఏంటీ, రుణాల చెల్లింపు విషయంలో ప్రభుత్వ విధానం ఏంటని ఆరా తీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గెజిట్ వెలువడిన నాటి నుంచి కార్పొరేషన్లకు రుణ సంస్థలు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుకు నాబార్డ్ నుంచి రూ.400 కోట్ల మేర రావాల్సి ఉన్నా.. ప్రస్తుత పరిస్థితులతో వాటిని వాయిదా వేస్తోంది. ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ రుణాలే కీలకం కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత మేర రుణాలు లభిస్తాయన్నది ప్రశ్నార్ధకంగా మారింది. -
మీరు అప్పులు చేస్తున్నారా? అవసరాల కోసం కాకుంటే మంచిదే!
అవసరాలు గట్టెక్కేందుకేనా అప్పు.. ఇలానే ఎందుకు ఆలోచించాలి..? కొంచెం భిన్నంగా ‘రుణంతో ఆస్తులను కూడబెట్టుకుందాం’ అని సంకల్పం చెప్పుకోవచ్చుగా..! ఇలా ఆలోచించే వారు రుణంతో నిజంగానే సంపదను సృష్టించుకోవచ్చు. అందుకు మార్గాలు కూడా ఉన్నాయి. అవసరాలు ఎదురై అప్పును ఆశ్రయించే వారే మన సమాజంలో ఎక్కువ. కానీ, కొందరు తెలివిగా అదే అప్పుతో ఆస్తులను సమకూర్చుకునే విధానాలను అనుసరిస్తుంటారు. ఇటువంటి వారు మిగిలిన వారికి భిన్నం. వడ్డీ రేట్లు కనిష్టాల్లో ఉన్నాయి. తక్కువ వడ్డీ వ్యయాలను అనుకూలంగా చేసుకుని రుణంతో ఇంటిని కొనుగోలు చేసుకోవడం ఒక మంచి మార్గం. కరోనా కారణంగా ఆర్థిక వృద్ధి కనిష్టాలకు చేరిన తరుణంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను సాధ్యమైనంత కనిష్టాలకు తీసుకొచ్చింది. దీనికితోడు ప్రాపర్టీల ధరలు కూడా దిగివచ్చాయి. పన్ను ప్రయోజనాల కోణం నుంచి చూసినా రుణంతో ఆస్తి ఏర్పాటుకు అనుకూల సమయం ఇదేనంటున్నారు నిపుణులు. రుణంతో ఆస్తిని సమకూర్చుకోవాలన్నా.. సంపద సృష్టికి అడ్డుగా ఉన్న రుణాల భారాన్ని దింపుకోవాలన్నా.. అందుకు ఏం చేయాలన్నది ప్రాఫిట్ ప్లస్ కథనంతో తెలుసుకుందాం.. వడ్డీ రేట్ల పరంగా చూస్తే రుణానికి ఇదే మంచి తరుణం. కానీ, ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగ అస్థిరతలను పరిశీలిస్తే రుణం తీసుకునే విషయంలో ఆచితూచి వ్యవహరించక తప్పదు. ఖరీదైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోలుకు లేదా గృహ నవీకరణ తదితర వినియోగ రుణాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఇవి ఆస్తులను తెచ్చి పెట్టేవి కావు. దీనికి బదులు ఇల్లు సమకూర్చుకునేందుకు లేదా వాణిజ్య సముదాయం లేదా వాణిజ్య భవనాన్ని కొనుగోలు చేసేందుకు రుణం బాట పట్టడం అనుకూలమైనదే. ‘‘ఆదాయం విషయమై అనిశ్చిత పరిస్థితులు ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్తుల ఆధారిత రుణాలు మరింత ఆర్థవంతమైనవి’’ అని మైలోన్కేర్ సీఈవో గౌరవ్ గుప్తా అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు రుణాలపై వడ్డీ వ్యయాలు వార్షికంగా 11–36 శాతం వరకు ఉన్నాయి. కానీ, గృహ రుణాలపై వడ్డీ రేట్లు 6.63 శాతం నుంచే అందుబాటులో ఉన్నాయి. ‘‘మొదటిసారి ఇంటిని సమకూర్చుకునే వారికి ఇది మంచి తరుణం. ఎందుకంటే ప్రాపర్టీల ధరలు, వడ్డీ రేట్లు ఇంత తక్కువ ఎప్పుడూ లేవు’’ అని మైమనీ మంత్ర ఎండీ రాజ్ఖోస్లా పేర్కొన్నారు. నాణేనికి మరో కోణం అన్నట్టు.. ఇతర అవసరాలకు కూడా రుణం తీసుకోవాల్సి రావచ్చు. ప్రమాదాల వంటి అత్యవసర పరిస్థితులు, అనారోగ్యం, ఉద్యోగం కోల్పోవడం వంటి అంశాలు రుణం తీసుకునేందుకు దారితీయవచ్చు. ఒకవేళ ఇవే పరిస్థితులు ఎదురైతే వ్యక్తిగత రుణాలకు బదులు బంగారంపై రుణాన్ని పరిశీలించొచ్చు. ఎందుకంటే రుణం పొందేందుకు ఇది సులభమార్గం. ‘‘బ్యాంకులు బంగారం విలువ లో 90% వరకు రుణంగా ఇస్తున్నాయి. అయితే బంగారం ఆభరణాల విలువలో 60–70 శాతానికి మించి రుణం తీసుకోకపోవడమే మంచిది’’ అని ఖోస్లా సూచించారు. మిగులు నిధులు ఉంటే..? అందుబాటులో ఉన్న మార్గాల్లో ఏది మెరుగైనదన్న పరిశీలన చేసుకోవాలి. ఇప్పటికే గృహ రుణం తీసుకున్న వారు.. తమ వద్ద మిగులు నిధులు ఉన్నాయని చెప్పి గృహ రుణాన్ని తీర్చేద్దామనుకుంటున్నారా..? దీనికంటే కూడా మెరుగైన రాబడులను ఇచ్చే సాధనంలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. ఎందుకంటే గృహ రుణంపై వడ్డీ రేటు 7 శాతం స్థాయిలో ఉన్నప్పుడు.. దీన్ని తీర్చేయడానికి బదులు దీర్ఘకాలం కోసం ఈక్విటీలు లేదంటే మరో ప్రాపర్టీని సమకూర్చుకునే ఆలోచన చేయవచ్చు. పైగా గృహ రుణం వల్ల ఎంతో పన్ను ఆదా చేసుకునే చక్కని మార్గం కూడా ఉంది. తమవద్ద మిగులు నిల్వలతో గృహ రుణాన్ని తీర్చేద్దామని అనుకునేవారు దీనికి బదులు అధిక వడ్డీ భారంతో ఉన్న ఇతర రుణాలను తీర్చేసే ఆలోచన కూడా చేయవచ్చు. అధిక వడ్డీతో కూడిన రుణాలను వదిలించుకోవడం కూడా సంపద సృష్టించుకునే మార్గాల్లో ఒకటి. ‘‘రుణ గ్రహీత వద్ద మిగులు నిల్వలు ఉంటే వాటితో అధిక వడ్డీ పడే క్రెడిట్కార్డు, వ్యక్తిగత, ఆటో రుణాలను వదిలించుకోవడాన్ని పరిశీలించొచ్చు’’ అని ఖోస్లా సూచించారు. చెప్పడానికి, ఆచరించడానికి మధ్య ఎంతో అంతరం ఉంది. కనుక మిగులు నిధులు ఉన్న వారు దీర్ఘకాలంలో మెరుగైన విలువను తెచ్చిపెట్టే ఆస్తులపై ఇన్వెస్ట్ చేయలేక.. తీసుకెళ్లి ఫిక్స్డ్ డిపాజిట్ చేసే అవకాశం లేకపోలేదు. ఎఫ్డీపై వడ్డీ రేటు 6 శాతం వస్తుంది. దీనిపై ఆదాయపన్ను కూడా పడుతుంది. ద్రవ్యోల్బణ ప్రభావం తీసివేసి చూస్తే మిగిలేదేమీ ఉండదు. అందుకుని ఇటువంటి వారు ప్రస్తుత రుణాలను (గృహ రుణం అయినా సరే) తీర్చేయడానికి మిగులు నిధులను వినియోగించుకోవచ్చు. సంపద సృష్టికి రుణంతో ఆస్తిని సమకూర్చుకోవడం ఎంత ముఖ్యమో.. అధిక వడ్డీ భారంతో ఆదాయాన్ని మింగేస్తున్న రుణాలను వదిలించుకోవడం కూడా అంతే ముఖ్యమని గుర్తించాలి. తమ వద్దనున్న నిధులపై కనీసం 10 శాతం పైన రాబడులు సమకూర్చుకునే మార్గం ఉంటే గృహ రుణాన్ని ముందుగా తీర్చివేయడానికి దూరంగా ఉండొచ్చని మైలోన్కేర్ గుప్తా సూచించారు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. రుణాలకు చేసే చెల్లింపులు ఆదాయంలో 50 శాతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మించకూడదు. పన్ను ప్రయోజనాలు.. రుణంతో ఇల్లు సమకూర్చుకోవడమే కాదు.. పన్నును ఆదా చేసుకోవచ్చు. ఇంటి రుణ ఈఎంఐలో (నెలవారీ వాయిదా) వడ్డీ భాగంతోపాటు అసలు కూడా కొంత కలసి ఉంటుంది. ఇలా ఒక ఆర్థిక సంవత్సరంలో గృహ రుణానికి చేసే అసలు చెల్లింపులు గరిష్టంగా రూ.1.5 లక్షల మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను చెల్లించక్కర్లేదు. అదే విధంగా ఒక ఆర్థిక సంవత్సరంలో గృహ రుణానికి చేసే వడ్డీ చెల్లింపులు రూ.2లక్షల మొత్తంపైనా సెక్షన్ 24(బి) కింద పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అదే విధంగా సెక్షన్ 80ఈఈఏ కింద అందుబాటు ధరల ఇంటికి తీసుకున్న రుణం అయితే మరో రూ.1.50లక్షల వడ్డీ చెల్లింపులపైనా పన్ను మినహాయింపును కోరొచ్చు. కాకపోతే రుణాన్ని ముందుగానే తీర్చివేస్తే ఈ పన్ను ప్రయోజనాలపై ప్రభావం పడుతుంది. పన్ను ప్రయోజనం కోసమే ఇంటి గురించి ఆలోచిస్తున్నట్టు అయితే రూ.20 లక్షల గృహ రుణం తీసుకుంటే సరిపోతుందంటున్నారు ఖోస్లా. 7.5 శాతం వడ్డీ రేటు ప్రకారం రూ.2 లక్షల వడ్డీ చెల్లింపులపై పన్ను ప్రయోజనాన్ని పొందేందుకు రూ.20 లక్షల రుణం చాలంటున్నారు. ఈ మొత్తంపై వార్షికంగా రూ.50,000–60,000 మేర పన్ను ఆదా చేసుకోవచ్చు. అధిక పన్ను పరిధిలో ఉన్న వారు అందుబాటు ధరల్లోని ఇంటిని రూ.20 లక్షల రుణంతో కొనుగోలు చేసుకోవచ్చని రిటైల్ లెండింగ్ సంస్థ వ్యవస్థాపకురాలు సుకన్యకుమార్ సైతం సూచించారు. టాపప్ లోన్ ఇప్పటికే గృహ రుణం తీసుకుని కొంత తీర్చేశారనుకుందాం. దీనిపై టాపప్ రుణాన్ని పొందే అర్హత పొందినట్టే. అంటే అదనంగా మరికొంత రుణాన్ని తీసుకోవచ్చు. అప్పటికే కొనసాగుతున్న గృహ రుణంపై రేటుతో పోలిస్తే కొంచెం ఎక్కువ రేటు టాపప్ లోన్పై అమలవుతుంది. అయినప్పటికీ వ్యక్తిగత, క్రెడిట్ కార్డు రుణాలతో పోలిస్తే చాలా తక్కువే ఉంటుంది. అందుకుని టాపప్ లోన్ తీసుకుని ప్లాట్ కొనుగోలును పరిశీలించొచ్చు. కాకపోతే టాపప్ లోన్ విషయంలో బ్యాంకులు ప్రస్తుతం కొంచెం కఠినంగానే వ్యవహరిస్తున్నాయి. ‘‘ప్రాపర్టీల ధరలు తగ్గాయి. గతంలో రూ.కోటి విలువైన ఇంటి ధర ప్రస్తుతం రూ.80 లక్షలకు తగ్గిపోయింది. కనుక విలువ పరంగా చూస్తే ఇంటి రుణంపై టాపప్ లోన్ను ఇచ్చేందుకు క్రెడిట్ మేనేజర్లు సౌకర్యంగా భావించడం లేదు’’ అని సుకన్య కుమార్ వివరించారు. అయితే వ్యక్తిగత రుణ చరిత్ర, ఆదాయం ప్రకారం తగిన అర్హతలు ఉంటే టాపప్ లోన్ను సులభంగానే పొందొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. రుణంతో ఇంటిని కొనుగోలు చేసిన ఆ ఇంటి వ్యాల్యూషన్ పెరిగిపోయినట్టయితే మరింత అధికంగా టాపప్లోన్ను అర్హత లభించినట్టే. ఒక వేళ గతంలో రుణ చెల్లింపుల్లో విఫలమైన చరిత్ర ఉండి, రుణ మారటోరియాన్ని వినియోగించుకుని ఉంటే అప్పుడు బ్యాంకులు టాపప్లోన్ మంజూరు విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదు. పాత రుణంపై అధిక రేట్లు లోగడ ఎప్పుడో గృహ రుణం తీసుకున్నవారు ఇప్పటికీ అధిక వడ్డీ రేటే చెల్లిస్తుంటారు. ‘‘బేస్ రేటుతో అనుసంధానమైన గృహ రుణాలు తీసుకున్న వారికి ఇప్పటికీ అధిక వడ్డీ రేటే అమలవుతోంది. కస్టమర్లు అడగకుండా బ్యాంకులు సొంతంగా పాత రుణాలను కొత్త విధానంలోకి మార్చే చర్యలు తీసుకోవు’’ అని సుకన్య కుమార్ పేర్కొన్నారు. కనుక పాత విధానాల్లో గృహ రుణం తీసుకున్న వారు రెపో రేటు లేదా ట్రెజరీ బిల్లు ఆధారిత రేట్ల విధానానికి మారిపోవచ్చు. ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు నూతన విధానంలో బ్యాంకులు సైతం వేగంగా ఆ మేరకు రుణ రేట్లను సవరిస్తున్నాయి. ‘‘గృహ రుణ సంస్థ నుంచి రుణం తీసుకుని ఉన్నట్టయితే అది ప్రైమ్ లెండింగ్ రేటు అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో రెపో రేటుకు ఆ రుణాన్ని మార్చుకోవా లనుకుంటే అందుకు బ్యాలన్స్ ట్రాన్స్ఫర్ ఒక మార్గం’’ అని మైలోన్ కేర్కు చెందిన గుప్తా సూచించారు. రుణం బదిలీ ప్రస్తుతం గృహ రుణాలపై రేట్లు 6.63–7.25% మధ్య ఉన్నాయి. ‘‘ప్రస్తుత మీ గృహ రుణ రేటు ఈ రేట్ల కంటే 0.35 శాతం లేదా అంతకు మించిన వ్యత్యాసంతో ఉంటే తగ్గించాలని రుణదాతను కోరాలి. అది ఫలించకపోతే అప్పుడు మీ గృహ రుణం బ్యాలన్స్ను తక్కువ వడ్డీ రేటుతో ఆఫర్ చేస్తున్న సంస్థకు బదిలీ చేసుకోవాలి’’ అని మార్ట్గేజ్ వరల్డ్ వ్యవస్థాపకుడు విపుల్ పటేల్ సూచించారు. అయితే రుణాన్ని బదిలీ చేసుకోవడం ఎంత మేర ప్రయోజనం ఉంటుందన్నది ముందే అంచనాకు రావాలి. ఎందుకంటే రుణాన్ని బదిలీ చేసుకునే సమయంలో ప్రాసెసింగ్ ఫీజు, ఇతర చార్జీలను భరించాల్సి రావచ్చు. మార్ట్గేజ్ ఒప్పందాలపై స్టాంప్ డ్యూటీ చార్జీలు మిగిలే ప్రయోజాన్ని హరించొచ్చు. ఈ చార్జీలు రూ.10,000–20,000 మధ్యన ఉండొచ్చు. న్యాయ, సాంకేతిక చార్జీల రూపంలో మరో రూ.2,500–10,000 వరకు చెల్లించుకోవాల్సి రావచ్చు. ఇటువంటి చార్జీలన్నీ మినహాయించిన తర్వాత తగిన మిగులుంటుందని భావిస్తే నిస్సంకోచంగా రుణాన్ని బదిలీ చేసుకోవచ్చు. -
అతి ఖరీదైన ఇంజెక్షన్, తయారీకి ఎంత టైం పడుతుందో తెలుసా?
(సాక్షి,వెబ్ డెస్క్) అరుదైన జన్యు వ్యాధి, అంతకంటే అరుదైన మందు. చిన్నారుల పాలిట మృత్యుపాశమై వెంటాడుతున్న ఈ వ్యాధికి చికిత్స చేయించాలంటే ధనికులకే కత్తిమీద సాము. ఇక సామాన్యులు పరిస్థితి చెప్పనలవికాదు. ఎంత గొప్ప ఇన్సూరెన్సులైనా దీని ఖరీదు ముందు బలాదూర్. అదే ‘స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ (ఎస్ఎంఏ)’ డిసీజ్. ఈ వ్యాధి నుంచి బయటపడాలంటే కోట్లాది రూపాయలు ఎందుకు వెచ్చించాలి; దీనికి పరిష్కారమే లేదా? నిపుణులు ఏమంటున్నారు. కండరాల బలహీనతకు కారణమయ్యే అరుదైన జన్యు వ్యాధి ఇది. వెన్నెముక కండరాలను ప్రభావితం చేసే ఈ వ్యాధి రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ‘స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ (ఎస్ఎంఏ)’ గా పిలిచే ఈ వ్యాధిలో ఇందులో పలు రకాలకు, వివిధరకాలు చికిత్సలు ఉండగా, అన్నీ ఖరీదైనవే. అసలు ఈ పేరు వింటేనే తల్లితండ్రుల గుండెల్లో రైళ్లు. ఎందుకంటే రూ.18 కోట్ల విలువైన జోల్జెన్స్మా ఇంజక్షన్ తీసుకోవాలి. అది కూడా అమెరికాలోనే మాత్రమే దొరుకుతుంది. ప్రపంచంలో అత్యంత కాస్ట్ లీ మెడిసిన్గా నిలిచిన దీన్ని నోవార్టిస్ కంపెనీ ఒక్కటే ఉత్పత్తి చేస్తుంది. సామాన్య, నిరుపేద కుటుంబాలు అంత పెద్ద మొత్తాన్ని సమర్చుకోవాలంటే సాధ్యమైనపనేనా? అందుకే ఈ డబ్బును సమకూర్చు కునేందుకు తల్లిదండ్రులు క్రౌడ్సోర్సింగ్ను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇక్కడ సంతోషించదగ్గ పరిణామం ఏమిటంటే..సెలబ్రిటీలనుంచి సామాన్యుల దాకా దాతల అపూర్వ స్పందన, తద్వారా చాలామంది చిన్నారులు ప్రాణాపాయం నుంచి బయటపడటం. ఈ క్రమంలోనే ముంబైకి చెందిన ఐదు నెలల పాప తీరా కామత్, హైదరాబాద్కు చెందిన అయాన్షు గుప్త లాంటి వాళ్లు మృత్యువును ఓడించగా, అయాన్స్, ఖయాతి లాంటి చిన్నారులు ఇంకా సాయంకోసం ఎదురు చూస్తున్నారు. ఎస్ఎంఏను ఎలా గుర్తించాలి? వెన్నెముక కండరాల క్షీణత అనేది అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. సాధారణంగా నవజాత శిశువులు లేదా పిల్లలలో మొదట ఈ వ్యాధికి సంబంధించి లక్షణాలు కనిపిస్తాయి. అంటే పసివాళ్లుగా ఉన్నపుడే ఈ వ్యాధి లక్షణాలను గుర్తించడం కీలకం. పుట్టినప్పుడు ఆరోగ్యంగా ఉన్నా క్రమంగా బలహీనంపడతారు. ముఖ్యంగా నెలల వయసులోనే వారి కదలికలను గమనించాల్సి ఉంటుంది. తల నిలపలేకపోవడం, బోర్లా పడకపోవడం, పాకలేకపోవడం లాంటివి గమనించినపుడు తల్లిదండ్రులు మొదట అనుమానించాలి. ఇంకా కదలికలు బలహీనంగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో, మింగడంలో ఇబ్బందులను ప్రమాదకర సూచనలుగా గ్రహించాలి. ఆలస్యం చేయకుండా జన్యుపరమైన పరీక్షలు చేయించాలని పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ సూచిస్తున్నారు. ఎందుకంటే రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మాత్రమే ఈ ఇంజక్షన్ ఇస్తారు. 90 శాతం కేసులలో శాశ్వత వెంటిలేషన్ లేదా మరణానికి దారి తీస్తుంది. అంతేకాదు చికిత్సకు అంతపెద్ద మొత్తంలో డబ్బును సేకరించడం మరో సవాల్. జోల్జెన్స్మా ఎందుకింత ఖరీదు? ఎస్ఎంఏ చికిత్సలో ప్రాచుర్యంలోకి వచ్చిన రెండో ఔషధం జోల్జెన్స్మా. జర్నల్ ఆఫ్ హెల్త్ ఎకనామిక్స్ ప్రచురించిన 2016నాటి అధ్యయనం ప్రకారం, ఈ డ్రగ్ విలువ 2.6 బిలియన్ డాలర్లు. ఈ మందు సింగిల్ డోస్ తయారీకి 10 సంవత్సరాలకు పైగా పడుతుంది. ఈ ఔషధం అసలు పేరు ఓనసెమ్నోజీన్ అబెపర్వోవెక్ అయితే జోల్జెన్స్మా అనే బ్రాండ్ పేరుతో విక్రయాలు సాగిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జోల్జెన్స్మా డ్రగ్ భారతదేశంలో లభ్యం కాకపోవడం ప్రధాన కారణం. వైద్య నిపుణుల సలహా మేరకు స్విస్ బయో ఫార్మాస్యూటికల్ కంపెనీ నోవార్టిస్ ఉత్పత్తి చేస్తోన్న ఈ ఔషధాన్ని అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడం, దానిపై దిగుమతి పన్ను మరో కారణం. జీఎస్టీ, ఇతర పన్నులు రూపంలోనే రూ.6 కోట్ల వరకు చెల్లించాలంటేపరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. చాలా అరుదుగా 10వేలమందిలో ఒక చిన్నారికి సంభవించే ఈ వ్యాధి నివారణకు సంబంధించిన డ్రగ్ అభివృద్ధి ప్రక్రియ, పరిశోధనలో గణనీయమైన ఖర్చులుంటాయి. ఫార్మా నిపుణుల సమాచారం ప్రకారం ఇదే మందును మన దేశంలో తయారు చేస్తే ప్రస్తుత ధరతో పోలిస్తే మూడు, లేదా నాలుగో వంతు మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో మన చిన్నారులను కాపాడేందుకు ఈ ఔషధాన్ని దేశీయంగా ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో దిగుమతి సుంకం భారం కూడా తగ్గుతుందనీ, దీనిపై కేంద్రం సత్వరమే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ మందు ఉత్పత్తికి డీసీజీఐ లైసెన్స్ ఇవ్వడంతోపాటు, కొనుగోలు శక్తిని బట్టి దేశీయంగా ధర నిర్ణయించడం ఒక్కటే పరిష్కారమని నిపుణుల వాదన. స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ (ఎస్ఎంఏ)వ్యాధి లక్షణాలను బట్టి నాలుగు రకాలుగా పేర్కొంటారు. ఎంఎస్ఏ టైప్-1, టైప్-2,3 4.కూడా ఉన్నాయి. ప్రధానంగా ప్రాణాంతక టైప్-1 బారిన పడిన చిన్నారులు సగటు జీవిత కాలం రెండేళ్లు మాత్రమే. ఈ లోపుగానే ఇంజక్షన్ అందాలి. మరోవైపు టైప్ 3, 4 బారిన పడిన పిల్లల ప్రాణాలకు ప్రమాదం లేకున్నా, శరీరంలోని నాడులు క్షీణించే లక్షణం కారణంగా మిగిలిన పిల్లలతో పోలిస్తే పెరుగుదల లోపాలుంటాయి. టైప్-1 బారిన పడిన చిన్నారులు అందరి పిల్లల్లా నడవ లేరు.. కూర్చోలేరు. చివరికి ఆహారం కూడా మింగలేనంతగా కండరాలు బలహీన పడిపోతాయి. ఊపిరితిత్తుల బలహీనత, శ్వాస సమస్యలు తలెత్తుతాయి. చివరికి పక్షవాతానికి దారితీసి పిల్లల ప్రాణాలను హరిస్తుంది. వీటిన్నిటికీ పరిష్కారమే వండర్ డ్రగ్ జోల్జెన్స్మా. నరానికి ఇచ్చే ఈ సింగిల్ డోస్ ఇంజెక్షన్ ద్వారా చిన్నారులు కూడా ప్రాణాపాయం నుంచి గట్టెక్కుతారు. నరాల పనితీరుకు అవసరమైన ప్రోటీన్లను ఇది ఉత్పత్తి చేస్తుంది, కండరాల కదలికను ఉత్తేజితం చేస్తుంది. బిడ్డ బరువు ఆధారంగా ఈ మోతాదు నిర్ణయిస్తారు. దీంతో పని చేయకుండా పోయిన జన్యువు పనితీరును ఒకే ఒక్క మోతాదుతో భర్తీ చేస్తుంది. కండరాల క్షీణతను అడ్డుకుంటుంది. దీంతో కండరాలు, నరాల వ్యవస్థ తిరిగి పుంజుకుని బాధితులు క్రమక్రమంగా సాధారణ స్థితికి వచ్చే అవకాశాలుంటాయి. ఎస్ఎంఏ చికిత్స కు ఇతర ప్రత్యామ్నాయ మందులు ►పిల్లలు, పెద్దల్లో ఈ వ్యాధి చికిత్సకు అనుమతినిచ్చిన తొలి ఔషధం స్పిన్రాజా (నూనినెర్సెన్). ఈ ఔషదాన్ని 2016, డిసెంబరులో యూఎస్ ఎఫ్డీఏ ఆమోదించింది. వెన్నుపాము చుట్టూ ఉన్న ద్రవంలోకి ఈ ఇంజెక్షన్ను అందిస్తారు. ► రెండు నెలల వయస్సులోపు చిన్నారులకు చికిత్స నిమిత్తం ఎఫ్డీఏ అనుమతినిచ్చిన మూడో ఔషధం ఎవ్రిస్డి (రిస్డిప్లామ్). నోటి ద్వారా అందించే మొదటి డ్రగ్ను లాంచ్ చేస్తున్నట్టు 2020 ఆగస్టులో ఎఫ్డిఎ ప్రకటించింది. మరికొన్ని ఔషధాలు క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి. క్యూర్స్మా ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎంఏ బాధిత చిన్నారుల తల్లిదండ్రుల నేతృత్వంలోని సంఘమే క్యూర్ స్మా ఫౌండేషన్ ఆఫ్ ఇండియా. 2014లో 10కుటుంబాలతో ఈ ఫౌండేషన్ ఏర్పాటైంది. దేశ వ్యాప్తంగా ఆయా కుటుంబాలకు అండగా ఉంటూ వారికి కౌన్సెలింగ్, రిసోర్స్ పూల్, అవగాహనా శిబిరాలతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా సేవలందిస్తుంది. ప్రాణాంతకమైన ఈ వ్యాధి బారినుంచి చిన్నారులను కాపాడుకోవడం, న్యూరాన్లు క్షీణతను నిరోధించి మరణాలను అడ్డుకోవడం పెద్ద విజయమని క్యూర్స్మా ఫౌండేషన్ కో ఫౌండేషన్ డైరెక్టర్ అర్చన పాండా వ్యాఖ్యానించారు. -
ప్రపంచ సంస్థలపై డ్రాగన్ పట్టు
ఒక రాజ్యంపై పట్టు సాధించడం కన్నా, అన్ని రాజ్యాలపై ప్రభావం చూపే సంస్థపై పట్టు సాధిస్తే? సరిగ్గా చైనా ఇదే సూత్రాన్ని అవలంబిస్తోంది. దీనివల్ల తాను ఆడించినట్లు ప్రపంచాన్ని ఆడించవచ్చని చైనా అధినాయకత్వం భావిస్తోంది. ఈ ప్రయత్నాలు ఇప్పటికే కొంతమేర సఫలమయ్యాయని వివిధ నివేదికలు చెబుతున్నాయి. అదేంటో చూద్దాం! ప్రపంచ దేశాలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థలపై పట్టుకోసం చైనా యత్నిస్తోందని, దీనిద్వారా స్వీయ ప్రయోజనాలు పొందాలని చైనా ఆశిస్తోందని ఆశ్చర్యకరమైన అంశాలు బయటకొచ్చాయి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లను ఏవిధంగా చైనా కబ్జా చేసేందుకు యత్నిస్తోందో బ్రిటన్కు చెందిన పార్లమెంటరీ ఫారెన్ అఫైర్స్ కమిటీ నివేదిక వివరించగా, పలు ఐరాస ఏజెన్సీల్లో చైనా పౌరులు కీలక స్థానాల్లో ఉన్నట్లు గేట్వే హౌస్ నివేదిక తెలిపింది. కీలకమైన స్థానాల్లో పాగా వేయడం, ఇందుకోసం సామ, భేద, దానోపాయాలను ఉపయోగించడం ద్వారా ప్రపంచ సంస్థలపై చైనా పట్టుజిక్కించుకుంటోందన్న అనుమానాలను ఈ నివేదికలు బలపరుస్తున్నాయి. చైనా చేస్తున్న ఈ ప్రయత్నాలు ఆ సంస్థల స్థాపక నియమావళికి వ్యతిరేకమే కాక, చైనాకు అవి ఆయుధాలుగా మారతాయనే ఆందోళనలు పెరిగాయి. ఆరింటిపై కన్ను ప్రపంచ దేశాల్లో చాలావాటికి సభ్యత్వాలున్న కీలకమైన అరడజను సంస్థలపై బ్రిటన్కు చెందిన 11 మంది ఎంపీలు తయారు చేసిన నివేదిక దృష్టి సారించింది. ప్రపంచ ఆరోగ్య సమాఖ్య(డబ్ల్యూహెచ్ఓ), ఇంటర్పోల్, అంతర్జాతీయ మానవ హక్కుల హైకమిషనర్ ఆఫీసు(ఓహెచ్సీహెచ్ఆర్)లాంటి ముఖ్యమైన సంస్థల్లో చైనా ప్రాముఖ్యత పెరుగుతున్న తీరును వివరించింది. ఇందుకు పలు ఉదాహరణలు సైతం ఉన్నాయని తెలిపింది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ)లో నైన్త్ డీజీ కోసం 2019లో జరిగిన ఎన్నికలను నివేదిక ఉదహరించింది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు తమకు కామెరూన్ దేశం నుంచి రావాల్సిన 7.8 కోట్ల డాలర్ల అప్పును చైనా మాఫీ చేసింది. అనంతరం నైన్త్ డీజీ పదవికి పోటీ నుంచి కామెరూన్ అభ్యర్థి తప్పుకున్నారు, దీంతో చైనా అభ్యర్థికి ఈ పోస్టు దక్కింది. ప్రస్తుతం ఐరాసకు చెందిన 15 విభాగాల్లో నాలిగింటికి(ఎఫ్ఏఓ, ఐటీయూ, ఐసీఏఓ, ఐడీఓ) చైనావాళ్లే అధిపతులుగా ఉన్నారని, వేరే ఏ దేశానికి చెందిన వారు ఒక్క విభాగానికి మించి అధిపతులుగా లేరని వివరించింది. 2019లో డబ్ల్యూఐపీఓను కూడా చైనా చేజిక్కించుకునేదే కానీ చివరి నిమిషంలో అమెరికా అడ్డంపడింది. డబ్బుతో కొనేస్తుంది కీలక ఆర్గనైజేషన్లను చేజిక్కించుకోవడంలో చైనా ఎక్కువగా నిధులు, ఆర్థిక సాయం మార్గాన్ని ఎంచుకుంటోంది. సాధారణంగా ఇలాంటి సంస్థలకు ఆయా దేశాలు వాటి ఆర్థిక స్థితిని బట్టి నిధులు ఇస్తాయి. ఇదికాకుండా లక్ష్యసాధన కోసం వీటికి వివిధ దేశాలు విరాళాలు ఇస్తుంటాయి. చైనా దీన్ని తనకు అనువుగా మలచుకుంటోందని గేట్వే నివేదిక చెబుతోంది. 2010–19 కాలంలో చైనా చేసే స్వచ్ఛంద విరాళాలు 346 శాతం పెరిగాయి. దీంతో ఐరాస సంస్థలు వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు నిధులు లభించినట్లవుతుంది, ఎక్కువగా విరాళమిచ్చినందుకు సాధారణంగానే చైనా చెప్పినట్లు ఈ ప్రాజెక్టులు ప్రభావితమవుతుంటాయి. నిజానికి యూఎస్ తదితర దేశాలిచ్చే నిధులతో పోలిస్తే చైనా ఇచ్చేది తక్కువే కానీ తక్కువ ఇచ్చి ఎక్కువ ప్రభావం చూపడం చైనా విధానమని ఒక మాజీ అధికారి వివరించారు. అలాగే కొన్నిమార్లు కొన్ని ఆయాచితంగా కలిసివచ్చి సంస్థలపై చైనా పట్టు పెరిగేందుకు దోహదం చేస్తుంటాయి. ఉదాహరణకు డబ్ల్యూహెచ్ఓకు ట్రంప్ ప్రభుత్వం నిధులు తగ్గించగానే, ఆపన్న హస్తం చాచినంత ఫోజుకొట్టి చైనా కొంతమేర నిధులిచ్చి పట్టు పెంచుకుంది. బైడెన్ ఈ పరిస్థితిని చక్కదిద్దే పనులు చేపట్టారు కానీ పోయిన పట్టు తిరిగి రాలేదని నిపుణులు తెలిపారు. అలాగే ఇంటర్పోల్లో చైనా తక్కువ నిధులిచ్చినా ఎక్కువ ప్రభావం చూపే స్థితిలో ఉంది. దీంతో పలు దేశాలకు చెందిన నేరçస్తులపై జారీ చేసే రెడ్కార్నర్ నోటీసులను ప్రభావితం చేయగలదని చెప్పారు. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్పై సైతం పట్టు పెంచుకోవాలని చైనా యత్నిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సంస్థల్లో టాప్–3 స్థాయిలో చైనా ఉంది. ఇప్పటికైతే ఈ రెండిటిపై యూఎస్, ఈయూ పట్టు చాలా గట్టిగా ఉందని గేట్వే నివేదిక తెలిపింది. పరోక్షంగా కూడా ప్రభావం కొన్ని సంస్థల్లోని కీలక పదవిలో చైనీయులు లేకున్నా, ఇప్పుడున్నవారి ద్వారా చైనా పలు విధాలుగా పరోక్ష లబ్ది పొందుతోందని గేట్వే నివేదిక తెలిపింది. ఉదాహరణకు డబ్లు్యహెచ్ఓ అధ్యక్షుడైన టెడ్రోస్ చైనీయుడు కాదు. కానీ ఆయన ఎన్నికకు చైనా 2017లో మద్దతిచ్చింది. అంతకుముందు ఆయన ఇథియోపియా మంత్రిగా పనిచేశారు. ఆఫ్రికాకు చెందిన ఈ దేశంలో అత్యధికంగా చైనా పెట్టుబడులు పెట్టింది. అంతకుముందు ఈ సంస్థకు పదేళ్ల పాటు అధ్యక్షత వహించిన మార్గరెట్ ఛాన్ హాంకాంగ్కు చెందినవారు. దీంతో డబ్లు్యహెచ్ఓ నుంచి చైనాకు ఎంతగా మద్దతు వస్తుందో అవగతమవుతోందని నివేదికలు తెలిపాయి. కొన్ని సంస్థల్లో పట్టు కోసం కొన్నిదేశాలపై చైనా దౌర్జన్యపూరిత డిప్లమసీ మార్గాన్ని ఎంచుకుంటుందని తెలిపాయి. -
వ్యాపారంతో కోలాటం
దేశాల ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. గొంగళిపురుగు అందమైన సీతాకోక చిలుకగా రూపాంతరం చెందినట్లు స్టార్టప్లు దేశాల ఆర్థిక వ్యవస్థలకు పట్టుకొమ్మలు యువతలోని శక్తిసామర్థ్యాలను గుర్తించి, సరైన చోట పెట్టుబడి పెట్టాలి... అప్పుడే దేశాభివృద్ధి జరుగుతుంది... పెట్టుబడి పెట్టిన వారు కూడా పెరగటానికి అవకాశం ఉంటుంది... ఇలా అనటమే కాదు.. ఆచరణలోనూ చూపారు హైదరాబాద్కు చెందిన వాణి కోలా... అమెరికా నుంచి... మింత్ర, మెడ్ప్లస్ వంటి ఎన్నో వ్యాపార సంస్థలకు ఆమె పెట్టుబడులు సమకూర్చారు. అనతి కాలంలోనే అవి ‘ఇంతింతై’ అన్నట్లు చకచకా ఎదిగాయి. ప్రఖ్యాత సంస్థలలో ఆమె పెట్టుబడులు పెట్టి, ఆ సంస్థలతో పాటు వాణి కోలా కూడా ఎదిగారు. ఇరవై రెండు సంవత్సరాల పాటు అమెరికాలో ఉన్న వాణి కోలా 2005 లో భారతదేశానికి తిరిగి వచ్చారు. పనులలో రిస్క్ తీసుకోవటం ఆమెకు ఇష్టం. ‘విశ్రాంతిగా గడపడానికి ఏదో విహార స్థలానికి వెళ్ళడం కంటే భారత దేశంలో గడపడమే నాకు ఇష్టం’ అంటారు వాణి కోలా. ఈ ఆలోచనే వాణి కోలా విజయానికి బాట వేసింది. ఆర్థిక సరళీకరణ వల్ల భారతదేశంలో వచ్చిన మార్పులు వాణిని ఆకర్షించాయి. కలారీ క్యాపిటల్ సంస్థను స్థాపించి, స్టార్టప్స్కు ఫండింగ్ చేయటం ప్రారంభించారు. ఇలా చేయటంలో తనకు చాలా ఆనందం కలుగుతుందంటారు వాణి కోలా. మింత్ర, స్నాప్డీల్, ఫాంటసీ స్పోర్ట్స్, కంపెనీ డ్రీమ్ – 11తో పాటు, మెడ్ ప్లస్, జివామే వంటి ఫార్మస్యుటికల్ చైన్లకు కూడా ఫండింగ్ చేశారు. 2011లో ప్రారంభమైన కలారీ క్యాపిటల్ ఇంతవరకూ 92 వెంచర్స్లో పెట్టుబడులు పెట్టింది. వాణి చేస్తున్న ప్రయత్నం రిలయన్స్ ఇండస్ట్రీస్ దృష్టిలో పడింది. కలారీ పరిధిలో ఉన్న జివామె, అర్బన్ ల్యాడర్ వంటి అనేక కంపెనీలను సొంతం చేసుకుంది. అక్కడితో ఆగకుండా కలారీలో 200 మిలియన్ డాలర్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. ఈ అంశాన్ని వాణి స్వయంగా ఒక ఇ–మెయిల్ ద్వారా తెలియజేశారు. సిలికాన్ వ్యాలీలో రెండు విజయవంతమైన టెక్నాలజీ కంపెనీలకు ఫౌండర్ సిఇఓ అయిన వాణి గెలుపుకి, విజయపథంలో దూసుకుపోవటానికి కారణం... కంపెనీలను రూపొందించడం పైనే తన దృష్టిని కేంద్రీకరించటం, ఉత్పత్తి సామర్థ్యం కలిగిన పారిశ్రామికవేత్తలను గుర్తించడం. పురుషులు అసూయ చెందారు... హైదరాబాద్కు చెందిన వాణీ కోలా... అరిజోనా స్టేట్ యూనివర్శిటీ నుంచి 1980లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. అనంతరం కాలిఫోర్నియా వచ్చి, అక్కడ టెక్నాలజీలో వచ్చిన విప్లవాన్ని తనకు అనుకూలంగా మలచుకున్నారు. తన కంపెనీని 657 మిలియన్ డాలర్లకు విక్రయించారు. 2001లో సెర్టస్ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించారు. ఇన్ని విజయాలు సాధించటానికి ముందు వాణీ కోలా ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు. ఒక మహిళ ఇన్ని విజయాలను సాధించటం నచ్చని పురుష వాణిజ్యవేత్తలు ఆమెను ఎగతాళి చేశారు. విమానాశ్రయంలో కలిసిన ఓ వ్యాపారవేత్త ‘ఏడాది కంటే తక్కువ వయసున్న బిడ్డను ఇంట్లో వదిలేసి, వ్యాపారం కోసం ఇలా తిరగటం మీకు సిగ్గుగా లేదా’ అని వెటకారమాడాడు. ‘ఇలాంటి పరిస్థితులు ఆడవారికేనా.. మగవారికి మాత్రం ఉండవా. మీ ఇంట్లో ఉండే చంటి పిల్లాడిని మీరు మాత్రం వదిలేసి రావట్లేదా’ అంటూ ఎదురు ప్రశ్నించారు వాణీ కోలా. -
Nirmala Sitha Raman: బ్రాడ్బ్యాండ్కి భారీగా నిధులు
దేశంలో ఇంటర్నెట్ బ్రాడ్బాండ్ కనెక్టివీ పెంచేందుకు ఉద్దేశించిన భారత్ నెట్ పథకానికి భారీగా నిధులు కేటాయించారు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. ఇప్పటికే అమలవుతున్న ఈ పథకానికి అదనంగా రూ.19,041 కోట్లు కేటాయిస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ఇంటర్నెట్తో కోవిడ్ పోరు టీకా వేయించుకోవాలనుకునే వారు కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రర్ చేసుకోవాలంటూ కేంద్రం ప్రకటించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇంటర్నెట్ సౌకర్యం లేని మారుమూల ప్రాంత ప్రజలు ఎలా రిజిస్ట్రర్ చేసుకుంటారంటూ ప్రతిపక్షలు ఘాటుగా విమర్శించాయి. మరోవైపు టెలి మెడిసిన్పై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీంతో మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివి పెంచడం లక్ష్యంగా ఉద్దేశించిన భారత్నెట్కు భారీగా నిధులు కేటాయించింది. రూ. 19,041 కోట్లు భారత్ నెట్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఈ పథకానికి అప్పుడు రూ. 42,048 కోట్లు కేటాయించారు. తాజాగా రూ.19,041 కోట్లు అదనంగా జత చేశారు. దీంతో ఈ పథకం మొత్తం విలువ రూ. 61,109 కోట్లకు చేరుకుంది. మారుమూల ప్రాంతాలకు నెట్ భారత్నెట్ ద్వారా దేశంలో ఉన్న 2,50,000 లక్షల గ్రామ పంచాయతీలకు బ్రాడ్ బాండ్ కనెక్షన్ అందివ్వడం లక్ష్యంగా నిర్దేశించారు. 2021 మే 31 నాటికి 1,56,223 గ్రామ పంచాయతీలకు నెట్ కనెక్షన్ అందించారు. చదవండి : థర్డ్ వేవ్ ఎఫెక్ట్.... పిల్లలపై కేంద్రం ఫోకస్ -
రూ. 11 కోట్లకు చేరువలో ‘విరుష్క’ విరాళాల సేకరణ
ముంబై: కరోనాపై పోరులో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, అతని భార్య అనుష్క శర్మ తమ వంతుగా ఇద్దరి తరఫున రూ. 2 కోట్లు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ ‘కెట్టో’ ద్వారా కనీసం రూ. 7 కోట్ల విరాళాన్ని ఇతరుల నుంచి సేకరించాలని వీరిద్దరు నిర్ణయించారు. ‘విరుష్క’ విజ్ఞప్తికి అద్భుత స్పందన వచ్చింది. గడువు ముగిసేందుకు మరో రెండు రోజుల సమయం ఉందనగా ఇప్పటికి ‘విరుష్క’ విరాళాల సేకరణ మొత్తం రూ. 11 కోట్లకు చేరువగా వచ్చింది. ఇందులో ఎంపీఎల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ విరాళం రూ. 5 కోట్లు ఉండటం విశేషం. వసూలైన మొత్తాన్ని విరుష్క ‘ఏసీటీ గ్రాంట్స్’ అనే సంస్థకు అందిస్తారు. -
అభివృద్ధిలో ఉపాధి హామీ నిధులు కీలకం: పెద్దిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పేదలకు ఇచ్చే స్థలాలకు సంబంధించి పదివేల లేఅవుట్లను గుర్తించామని, ఈ లేఅవుట్లలో ఉపాధి హామీ కింద అవెన్యూ ప్లాంటేషన్ చేస్తున్నామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పంచాయతీరాజ్ కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో మంత్రి అధ్యక్షతన గురువారం ఉపాధి హామీ మండలి సమావేశం నిర్వహించారు. పీఆర్ అండ్ ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పీఆర్ కమిషనర్ గిరిజా శంకర్, డైరెక్టర్ (ఇజీఎస్) చిన్నతాతయ్య, వాటర్షెడ్ డైరెక్టర్ వెంకటరెడ్డి, ఉపాధి హామీ మండలి (ఎస్ఇజిసి) సభ్యులు హాజరయ్యారు. (చదవండి: ‘ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి’) రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధి హామీ నిధులు కీలకమని, ఇతర రాష్ట్రాల్లో ఉపాధి హామీ ఏ రకంగా జరుగుతుందో మండలి సభ్యులు పరిశీలించేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం జరుగుతున్న పనులతో పాటు నియోజకవర్గానికి రూ.10 కోట్లు కేటాయించబోతున్నాం. నూరు శాతం ఉపాధి హామీ నిధులతోనే పనులు చేపట్టేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నాం. వైఎస్సార్ క్లినిక్, ఆర్బీకే, నాడు-నేడు, సచివాలయ భవనాల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని’’ అధికారులను మంత్రి ఆదేశించారు. గ్రామాల్లో ఉపాధి హామీ కింద ఈ నాలుగు రకాల పనులను అక్టోబర్ నెల నాటికి పూర్తి చేస్తే నియోజకవర్గానికి ఇంకా అదనంగా మరో రూ.5 కోట్లు ఇస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. (చదవండి: చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోతారు..) -
ఆయుధాల కొనుగోలు : ఆర్మీకి గ్రీన్సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు వివాదం తీవ్రతరమైన నేపథ్యంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా దీటుగా స్పందించేందుకు రక్షణ దళాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణ అవసరాల కోసం ప్రత్యేక నిధిని ప్రకటించింది. 500 కోట్ల రూపాయలలోపు ఎలాంటి ఆయుధ సంపత్తిని సమకూర్చుకునేందుకు రక్షణ దళాలకు ఆర్థిక అధికారాలను కట్టబెట్టింది. అత్యవసర విధానాల కింద ఆయుధ సామాగ్రి కొనుగోలు కోసం త్రివిధ దళాలకు ఆర్థిక స్వేచ్ఛను ప్రభుత్వం సమకూర్చిందని, దీనికింద 500 కోట్ల రూపాయల లోపు ఎలాంటి నూతన ఆయుధాల కొనుగోలునైనా వారు స్వయంగా చేపట్టవచ్చని ఆదివారం అధికార వర్గాలు వెల్లడించాయి. యుద్ధానికి అవసరమైన ఆయుధ సామాగ్రి తమ ఇన్వెంటరీలో లేనిపక్షంలో ఈ ప్రాజెక్టు కింద రక్షణ బలగాలు సైనిక వ్యవహారాల విభాగంతో సంపద్రింపుల ద్వారా ఆయా ఆయుధాలను నేరుగా కొనుగోలు చేయవచ్చని తెలిపాయి. త్రివిధ దళాలు ఇప్పటికే తమకు అవసరమైన ఆయుధాలు, పరికరాల జాబితాను రూపొందించి వాటిని అతితక్కువ సమయంలో సమీకరించేందుకు కసరత్తు చేస్తున్నాయి. చదవండి : అదే చైనా వ్యూహం: జిజి ద్వివేదీ -
ట్రంప్ : డబ్ల్యూహెచ్ఓకు నిధుల కోత?
వాషింగ్టన్: కరోనావైరస్ వ్యాప్తిపై చైనా తప్పుడు వాదనలను ప్రోత్సహిస్తోందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పై మండిపడుతున్న అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సంస్థకు నిధులు అందజేసే విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయి నిధుల్ని కాకుండా పాక్షికంగా అందించేందుకు అంగీకరించినట్టు సమాచారం. అంచనా మొత్తంలో కొంత కోత వేసేందుకు నిర్ణయించిందంటూ ఫాక్స్ న్యూస్ నివేదించింది. మునుపటి నిధుల మొత్తం సంవత్సరానికి 400 మిలియన్ డాలర్లలో పదోవంతు మాత్రమే చెల్లించనుందని ముసాయిదా పత్రాన్ని ఉటంకిస్తూ తెలిపింది. డబ్ల్యూహెచ్ఓకు చైనా ఎంత మొత్తం అయితే చెల్లిస్తుందో అంతే సొమ్ము అమెరికా కూడా చెల్లించాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించినట్లు పేర్కొంది. (ఉచితంగా వెంటిలేటర్లు : ట్రంప్ కీలక ప్రకటన) కాగా కరోనా వైరస్ సృష్టి చైనాలోనే జరిగిందని విరుచుకుపడుతున్నారు అమెరికా అధ్యక్షుడు. దీంతోపాటు వైరస్ వ్యాప్తి విషయంలో ప్రపంచాన్ని హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్ఓ విఫలమైందని మండిపడుతున్న ట్రంప్ సంస్థకు ఇచ్చే నిధుల్ని ఏప్రిల్ 14న నిలిపివేశారు.అయితే ట్రంప్ ఆరోపణలను డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధులు తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. (కరోనా ఎప్పటికీ పోదు : డబ్ల్యూహెచ్ఓ తాజా హెచ్చరిక) -
బడ్జెట్లో పీఎస్బీలకు నిధుల కేటాయింపులు ఉండకపోవచ్చు
న్యూఢిల్లీ: రానున్న 2020–21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రభుత్వరంగ బ్యాంకులకు (పీఎస్బీలు) నిధుల కేటాయింపును ప్రకటించకపోవచ్చని, బదులుగా మొండి బకాయిలు (ఎన్పీఏలు) వసూలుకు, మార్కెట్ల నుంచి నిధుల సమీకరణ దిశగా వాటిని ప్రోత్సహించొచ్చని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే, ప్రభుత్వరంగ బ్యాంకులు తమకు అనుబంధ కంపెనీల్లో, జాయింట్ వెంచర్లలో ఉన్న వాటాల విక్రయం ద్వారా నిధులు సమీకరించొచ్చని ఆ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు కొన్నింటికి బీమా, మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్కార్డుల వ్యాపారంతోపాటు ఎన్ఎస్ఈ తదితర సంస్థల్లో వాటాలు సైతం ఉన్నాయి. ఫిబ్రవరి 1న పార్లమెంటుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పించనున్నారు. -
యుద్ధనేరాల విచారణకు ఐరాస నిధులు
ఐక్యరాజ్య సమితి: సిరియా, మయన్మార్లలో జరిగిన యుద్ధ నేరాల విచారణ కోసం ఐక్యరాజ్య సమితి తన బడ్జెట్లో నిధులు కేటాయించింది. 2020 సంవత్సరానికి గాను ఐరాస సర్వ ప్రతినిధి సభ శుక్రవారం 307 కోట్ల డాలర్లను కేటాయించింది. గత ఏడాదితో పోల్చి చూస్తే బడ్జెట్ స్వల్పంగా పెరిగింది. 2019లో 290 కోట్ల డాలర్ల బడ్జెట్ ఉండేది. ఐక్యరాజ్య సమితి సచివాలయానికి అదనపు బాధ్యతలు అప్పగించడం, ద్రవ్యోల్బణం, డాలర్ మారకం విలువలో తేడాల కారణంగా బడ్జెట్ను పెంచినట్టు యూఎన్ దౌత్యవేత్తలు వెల్లడించారు. యెమన్లో పరిశీలకుల బృందం, హైతిలో రాజకీయ బృందాల ఏర్పాటు, సిరియా అంతర్యుద్ధం, మయన్మార్లో రోహింగ్యా ముస్లింలపై జరిగిన దాడులకు సంబంధించిన నేరాలపై విచారణకు ఈ బడ్జెట్లో నిధుల్ని వినియోగించనున్నారు. ఇలా యుద్ధ నేరాల విచారణకు ఐక్యరాజ్య సమితి నిధులు కేటాయించడం ఇదే తొలిసారి. గతంలో యూఎన్ స్వచ్ఛందంగా ఈ నేరాల విచారణకు ఆర్థిక సాయాన్ని అందించేది. జూన్లో ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన కోసం 600 కోట్ల వార్షిక బడ్జెట్ను ప్రకటించింది. ఇప్పుడు కొత్త సంవత్సరం వేళ ప్రత్యేకంగా మరో బడ్జెట్ను ప్రకటించింది. కొత్త సైబర్ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు అధికమవుతుండడంతో వాటిని నిరోధించడానికి ఒక కొత్త అంతర్జాతీయ ఒప్పందాన్ని ఐరాస రూపొందిస్తోంది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని శుక్రవారం ఐరాస సర్వ ప్రతినిధుల సభ ఆమోదించింది. ఈ తీర్మానాన్ని యూరోపియన్ యూనియన్, అమెరికా, మరికొన్ని దేశాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. యూఎన్లో ఈ తీర్మానం 79–60 ఓట్ల తేడాతో గట్టెక్కింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన నిపుణులతో ఒక కమిటీ వేసి సైబర్ నేరాలు నిరోధించడానికి కసరత్తు జరుగుతుంది. -
పేటీఎమ్కు రూ.4,724 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎమ్ మరోసారి నిధులు సమీకరించింది. పేటీఎమ్ మాతృసంస్థ, వన్97 కమ్యూనికేషన్స్ రూ.4,724 కోట్లు(66 కోట్ల డాలర్లు) సమీకరించిందని, చైనా అన్లైన్ దిగ్గజం అలీబాబాకు చెందిన అలీపేతో పాటు టి రొవె ప్రైస్ నిర్వహణలోని ఫండ్స్, సాఫ్ట్ బ్యాంక్కు చెందిన ఎస్వీఎఫ్ పాంథర్(కేమ్యాన్) ఈ పెట్టుబడులు పెట్టాయని తెలిసింది. ఈ వివరాలను బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫార్మ్ టోఫ్లర్ పేర్కొంది. అయితే, ఈ అంశంపై పేటీఎమ్ స్పందించలేదు. -
హైవేల విస్తరణకు నిధులు
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలోని వివిధ జాతీయ రహదారుల విస్తరణకు వార్షిక ప్రణాళికలో భాగంగా రహదారుల మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. నేషనల్ హైవే–25లో భాగమైన నాతవలస–విజయనగరం–రాయ్పూర్ రోడ్డును 42 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. ఇందుకు రూ.125 కోట్లు వెచ్చించనుంది. విజయనగరం జిల్లా సాలూరు బైపాస్ రోడ్డు (5.8 కి.మీ.) నిర్మాణానికి రూ.48 కోట్లు కేటాయించింది. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి–జీలుగుమిల్లి రోడ్డును 20 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తారు. ఇందుకు రూ.80 కోట్లు ఖర్చు చేయనున్నారు. జీలుగుమిల్లి–కొవ్వూరు మధ్య 26 కిలోమీటర్లను రూ.15 కోట్లతో విస్తరించనున్నారు. రాజమండ్రి–మధురపూడి (విమానాశ్రయం) ఎన్హెచ్–516 రోడ్డును రూ.35 కోట్లతో 34 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు. విజయనగరం జిల్లా మానాపురం రైల్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) అప్రోచ్ రోడ్డుకు రూ.42 కోట్లు వెచ్చి స్తారు. ప్రకాశం జిల్లా వాడరేవు–నారాయణపురం–పిడుగురాళ్ల రోడ్డును 43 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. దీనికి రూ.34 కోట్లు ఖర్చు చేస్తారు. అలాగే కృష్ణా జిల్లా పామర్రు–దిగమర్రు రహదారి (ఎన్హెచ్–165)ని రూ.12 కోట్లతో 17 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు. గుంటూరు–అమరావతి రోడ్డును 9 కిలోమీటర్లమేర రూ.18 కోట్లతో బలోపేతం చేస్తారు. వార్షిక ప్రణాళికలో రూపొందించిన వీటికి పరిపాలనా ఆమోదం కోసం పంపించామని జాతీయ రహదారుల విభాగం సూపరింటెండింగ్ ఇంజనీర్ రాఘవేంద్రరావు ‘సాక్షి’కి చెప్పారు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు జాతీయ రహదారులకు ప్యాచ్ వర్కులు చేస్తున్నామని తెలిపారు. -
బ్లాక్లిస్టులో పాక్..!
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులు అందకుండా చూడటంలో పాకిస్తాన్ విఫలమైందంటూ ఆ దేశాన్ని ఆర్థిక చర్యల టాస్క్ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) ఆసియా పసిఫిక్ గ్రూప్ బ్లాక్లిస్టులో పెట్టింది. ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో రెండు రోజులపాటు జరిగిన సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. అక్టోబర్లో మళ్లీ ఈ చర్చలు జరగనున్నాయి. ఆ లోపు పాక్ తన వైఖరి మార్చుకొని ఉగ్రనిధులను ఆపకపోతే బ్లాక్ లిస్ట్లోనే ఉండిపోయే అవకాశం ఉంది. భారత్ కూడా సభ్యత్వం కలిగి ఉన్న ఈ ఎఫ్ఏటీఎఫ్ సదస్సుకు హోంశాఖ, విదేశాంగ శాఖ ప్రతినిధులు హాజరయ్యారు. పాక్ తరఫున పాకిస్తాన్ స్టేట్ బ్యాంక్ గవర్నర్ హాజరయ్యారు. ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి వాటికి నిధులు అందకుండా చేయడంలో పాక్ విఫలమైందన్నది ఎఫ్ఏటీఎఫ్ ప్రధాన అభియోగం. ఈ బృందంలో 41 మంది సభ్యులు ఉండగా వారికి పాక్ సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేకపోయింది. ఉగ్ర నిధులకు వ్యతిరేకంగా రూపొందించిన 11 అంశాల్లో పదింటిని కూడా చేరలేకపోయింది. ఇప్పటికే గ్రే లిస్టులో ఉన్న పాక్ అక్టోబర్ కల్లా బృంద సభ్యులను మెప్పించగలిగేలా ఉగ్రనిధులను కట్టడి చేయాల్సి ఉంటుందని మరో అధికారి స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంస్థల నుంచి నిధుల కోసం ప్రయత్నిస్తున్న పాక్కు ఇది ఎదురు దెబ్బే. ఐరాసలో ‘కశ్మీర్’ మాటెత్తనున్న ఇమ్రాన్ ఇస్లామాబాద్: కశ్మీర్ను అంతర్జాతీయ సమస్యగా చూపించాలన్న ప్రయత్నాలు ఎప్పటికప్పుడు బెడిసికొడుతున్నా.. పాకిస్తాన్ వైఖరిలో మార్పు రావటం లేదు. త్వరలో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో కశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ఖాన్ ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు తెలిసింది. వచ్చే నెల 27వ తేదీన ప్రధాని ఇమ్రాన్ ఐరాసలో ప్రసంగించేలా షెడ్యూల్ ఖరారయిందని ‘ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక వెల్లడించింది. కశ్మీర్పై భారత్ ఇటీవలి కాలంలో తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇమ్రాన్ ప్రసంగించే అవకాశముందని పేర్కొంది. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు న్యూయార్క్ చేరుకోనున్న భారత ప్రధాని మోదీ వద్ద... భారత్కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని ముస్లిం సంఘాలు, మానవ హక్కుల సంఘాలకు ఇమ్రాన్ సూచించినట్లు కూడా విశ్వసనీయ సమాచారం ఉందని ఆ పత్రిక పేర్కొంది. జమ్మూకశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేయడంపై భారత్తో సంబంధాలను పాక్ తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. -
అమెరికా ఎన్నికల ప్రచారంలో యోగా
వాషింగ్టన్: డెమోక్రాట్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి అభ్యర్థిత్వం కోరుతున్న టిమ్ రియాన్ (46) తన ఎన్నికల నిధుల కోసం సరికొత్త పంథాను అనుసరిస్తున్నారు. ఎన్నికల నిధులను సమకూర్చుకునేందుకు, అమెరికాలోని ముందస్తు ఆరోగ్య పరిరక్షణ విధానానికి ప్రజల మద్దతును కూడగట్టేందుకు యోగాను ఉపయోగించుకోనున్నారు. డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష పదవికి అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వారు సుమారు 24 మంది ఉన్నారు. యోగా శిక్షణ శిబిరంలో పాల్గొని తనతో యోగా చేసేందుకు ఒక్కొక్కరూ మూడు డాలర్లను విరాళంగా ఇవ్వాల్సిందిగా టిమ్ రియాన్ ప్రజల్ని కోరుతున్నారు. యోగా శిక్షణ శిబిరానికి విరాళాలు ఇచ్చిన వారిలో కొంతమందిని డ్రా ద్వారా ఎంపిక చేసి వారికి న్యూయార్క్ ట్రిప్పును కల్పిస్తామని..టిమ్ రియాన్ ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు. -
ప్రాణం పోసిన ‘సోషల్ మీడియా’
భాగ్యనగర్కాలనీ: సోషల్ మీడియా ఓ చిన్నారికి ప్రాణం పోసింది. తన కుమారుడి ఆపరేషన్ కోసం ఆర్థిక సహాయం అందజేయాలని తల్లిదండ్రులు సోషల్ మీడియాలో కోరగా పలువురు స్పందించారు. నేతల సహాయంతో మొత్తం ఆపరేషన్ ఖర్చులు అందజేసేలా కృషి చేశారు. నిజామాబాద్ జిల్లా కామరపల్లి మండలం హాసకొత్తూరు గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన మధుయాదవ్, సునీతారాణి దంపతులకు మే 8న మగబిడ్డ జన్మించాడు. అయితే శిశువు పెద్ద పేగు మూసుకుపోయిందని, ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదమని వైద్యులు పేర్కొన్నారు. దీంతో వెంటనే శిశువుని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆపరేషన్కు రూ.5లక్షల ఖర్చవుతుందని తెలిపారు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఏమి చేయాలో తెలియక ఆ తల్లిదండ్రులు సోషల్ మీడియా ద్వారా దాతలను వేడుకొన్నారు. హైదర్నగర్ డివిజన్లో నివాసముంటున్న నెస్ట్ ప్రణీత్ హ్యాపీ హోమ్స్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్బాబు, డాక్టర్ రెడ్డి లేబోరేటరీ ఉద్యోగులు, సురేందర్ ఫౌండేషన్ మెట్పల్లి, ఆర్ట్ ఆఫ్ సర్వీంగ్ హ్యుమానిటీ ట్రస్టు సభ్యులు స్పందించి విరాళాల ద్వారా రూ.లక్షన్నర సేకరించారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన కేటీఆర్ సీఎం సహాయ నిధి నుంచి ఆపరేషన్ ఖర్చులకు రూ.2.50 లక్షల మంజూరు చేయించారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో ఆ తల్లిదండ్రులు ఆనందపడ్డారు. ఆపరేషన్కు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
జెట్ను ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలి
ముంబై: నిధుల సంక్షోభంతో కార్యకలాపాలు నిలిచిపోయిన జెట్ ఎయిర్వేస్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, 22,000 మంది ఉద్యోగుల భవిష్యత్తు దృష్ట్యా ఇది అవసరమని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ప్రధాని నరేంద్ర మోదీకి సూచించాయి. దెబ్బతిన్న విమానయాన సంస్థకు మరిన్ని నిధులిచ్చే దిశగా బ్యాంకులను ఒత్తిడి చేయకుండా ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధానికి రాసిన లేఖలో ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) పేర్కొంది. జెట్ కార్యకలాపాలపై దర్యాప్తు చేయాలని కోరింది. తాజాగా నిధులిచ్చేందుకు బ్యాంకులు నిరాకరించడంతో జెట్ ఎయిర్వేస్ తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. ‘‘జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు బ్యాంకులు బిడ్లను ఆహ్వానించాయని తెలిసింది. ఒకవేళ ఇది సఫలం కాకపోతే జెట్ ఎయిర్వేస్ను మీరే స్వాధీనం చేసుకోవాలి. దాంతో 22,000 మంది ఉద్యోగాలు భద్రంగా ఉంటాయి’’ అని ఏఐబీఈఏ లేఖలో కోరింది. జెట్ ఎయిర్వేస్కు తాజా నిధుల సాయం చేయాలని బ్యాంకులపై ఒత్తిడి తీసుకురావడాన్ని కూడా వ్యతిరేకించింది. బ్యాంకులు యజమానులు కావడంతో ప్రతి ఒక్కరూ జెట్ బెయిలవుట్ కోసం వాటివైపే చూస్తున్నారని పేర్కొంది. ‘‘నరేష్ గోయల్ ఇప్పటికీ సంస్థ ప్రమోటర్గా 51 శాతం వాటా కలిగి ఉన్నారు. కంపెనీని నడిపించడమా లేక వేరొకరికి అమ్మేయడమా అన్నది అతని సమస్య’’ అని ఏఐబీఈఏ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సంక్షోభం మొత్తానికి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి నరేష్ గోయల్ అని పేర్కొంది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. -
ఎలక్టోరల్ బాండ్లపై పార్టీలకు సుప్రీం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్ల ద్వారా మే 15 వరకూ రాజకీయ పార్టీలు సమీకరించిన నిధుల మొత్తం, దాతల విరాళాలు, బ్యాంక్ ఖాతాల సమాచారం వంటి వివరాలను మే 31లోగా సీల్డ్ కవర్లో ఈసీకి సమర్పించాలని అన్ని రాజకీయ పార్టీలను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్ల పధకం చట్టబద్ధతను సవాల్ చేస్తూ ఓ ఎన్జీవో దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సేకరించే విరాళాల్లో పారదర్శకత పాటించాలన్న పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ఏకీభవించింది. కాగా, రాజకీయ పార్టీలు నిధులు సమకూర్చుకునేందుకు బాండ్లు మినహా పారదర్శక ప్రత్యామ్నాయాలు ఉండాలని, ఎలక్టోరల్ బాండ్లను అనుమతించడంపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరుతున్నారు. మరోవైపు రాజకీయ పార్టీలకు నిధుల కోసం ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలుచేసేవారి పేర్లను గోప్యంగా ఉంచితే ఎన్నికల్లో బ్లాక్మనీని నిరోధించేందుకు ప్రభుత్వం చేపట్టే చర్యలు వృధా అవుతాయని గురువారం సుప్రీం కోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ఎలక్టోరల్ బాండ్ల పధకాన్ని సవాల్ చేస్తూ ఓ ప్రభుత్వేతర సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇక ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలంటే ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లను బహిర్గతం చేయాలని పిటిషనర్ కోరారు. -
‘కశ్మీర్ ఉగ్ర సాయం’పై ఎన్ఐఏ కన్ను
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్న వ్యక్తులు, సంస్థలకు చెందిన ఆస్తులను అటాచ్ చేసేందుకు భద్రతా సంస్థలు చర్యలు ప్రారంభించాయి.కశ్మీర్కు చెందిన వ్యాపారి జహూర్ అహద్ షా వతాలీకి చెందిన 10 స్థిరాస్తులతోపాటు హిజ్బుల్ ముజాహిదీన్ అధినేత సలాహుద్దీన్కు ఇస్లామాబాద్లో ఉన్న నివాసం ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఆదాయ పన్ను శాఖ ఈ ఆస్తుల అటాచ్మెంట్కు సంబంధించి చర్యలు చేపట్టనున్నాయి. ఉగ్ర సంస్థలకు సాయం అందించారన్న కేసులో వతాలీ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. పాక్కు చెందిన ఐఎస్ఐ సూచనల మేరకు ఉగ్రవాద సంస్థలకు, భద్రతా బలగాలపై రాళ్లు రువ్వే వారికి ఆర్థిక సాయం అందజేస్తున్న హిజ్బుల్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు సయ్యద్ సలాహుద్దీన్ సహా, హురియత్ నేతలు, వ్యాపారవేత్తలైన 13 మందిని ఎన్ఐఏ ఇప్పటికే గుర్తించింది. వీరి ద్వారా కశ్మీర్లో ఉగ్రవాదుల చేరికలు, శిక్షణ, పేలుడు సామగ్రి, ఆయుధాలు సమకూర్చడం, అల్లర్లకు పాల్పడే వారికి ఆర్థిక సాయం అందించడం వంటివి జరుగుతున్నాయని ఎన్ఐఏ తేల్చింది. కశ్మీర్ యువతను భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రేరేపించడంలో ఈ 13 మంది కీలకంగా ఉన్నట్లు గుర్తించింది. -
పార్టీలను పోషిస్తున్నది నల్లడబ్బే!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని అతి గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నది ఆర్థిక శక్తే అన్నది ఒప్పుకోం. ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా దేశ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నది మాత్రం ప్రధానంగా డబ్బే. ఎవరు ఎక్కువ డబ్బిస్తే అంటే, ఎవరు ఎక్కువ ఎన్నికల నిధులను విరాళంగా ఇస్తే వారికే మన దేశ రాజకీయ పార్టీలు ఊడిగం చేస్తాయి. అంటే, వారి ప్రయోజనాలకు అనుగుణంగానే పార్టీల విధానాలు ఉంటాయి. అధికారంలోకి వస్తే ఆ విధానాలనే అమలు చేస్తాయి. వారి కోసం ప్రజా ప్రయోజనాలను పణంగా పెడతాయి. ఇలా జరగడానికి ప్రధాన కారణం ఎన్నికల విరాళాల్లో పారదర్శకత లేకపోవడం. అమెరికా, యూరప్ దేశాల్లో ఎన్నికల నిధుల్లో పారదర్శకత కొనసాగుతోంది. ఎవరు, ఏ పార్టీకి ఎక్కువ విరాళాలు ఇచ్చారో ఓటరుకు తెలిసిపోతుంది. ఏ పార్టీ విరాళాలు ఇచ్చిన వారి ప్రయోజనాలకు ప్రాముఖ్యత ఇస్తున్నదో, ఏ పార్టీ ప్రజల ప్రయోజనాలకు ప్రాముఖ్యతనిస్తుందో ఆయా దేశాల్లోని ఓటరు బేరేజు వేసుకొని ఓటు వేయగలరు. దేశ, విదేశాల్లో మూలుగుతున్న నల్లడబ్బును వెలికి తీసుకరావడమే కాకుండా పార్టీలకు విరాళాల రూపంలో వస్తున్న నల్లడబ్బును కూడా అరికడతామని అధికారంలోకి వచ్చిన కొత్తలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంలో నల్లడబ్బును ఏ మాత్రం అరికట్టలేక పోగా, కట్టలు తెంచుకొని నల్లడబ్బు పారేలాగా వెయ్యి, పదివేలు, లక్షా, పది లక్షలు, కోటి రూపాయల ఎన్నికల బాండులను 2017 బడ్జెట్ ప్రతిపాదనల ద్వారా ప్రవేశపెట్టింది. 2017–18 సంవత్సరానికి ఏయే పార్టీకి ఏయే రూపంలో ఎన్ని విరాళాలు వచ్చాయో ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్’ సంస్థ ఇటీవల ఓ జాబితాను విడుదల చేసింది. 20 వేల రూపాయలకు లోపయితే ఎవరైనా 20 వేల రూపాయలు, అంతకులోపు విరాళాలు ఇస్తే వారు తమ గుర్తింపును వెల్లడించాల్సి అవసరం లేదు. గతంలో అన్ని పార్టీలకు 20 వేల రూపాయలే ఎక్కువగా వచ్చేవి. లక్ష రూపాయలు ఇవ్వదల్చిన దాతలు కూడా దాన్ని ఐదు భాగాలుగా విడగొట్టి 20 వేల రూపాయల చొప్పున ఇచ్చేవాళ్లు. 2017–18 సంవత్సరానికి ఆశ్చర్యంగా భారతీయ జనతా పార్టీకి 20 వేల రూపాయలకు మించిన విరాళాలు 93 శాతం, అంటే 437.04 కోట్ల రూపాయలు అందాయి. రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 5. 67 శాతం చొప్పున కేవలం 26.66 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఇందులో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఎన్నికల బాండుల రూపంలో వచ్చినవే ఎక్కువ. అన్ని రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలను పరిశీలిస్తే 20 వేల రూపాయలకు మించని విరాళాలు 51 శాతం వచ్చాయి. ఆ తర్వాత 31 శాతంతో ఎన్నికల బాండులు ఉన్నాయి. ఎన్నికల బాండుల్లో బేజేపీకే 95 శాతం 2018–19 ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల కాలానికే 834.7 కోట్ల రూపాయల ఎన్నికల బాండులు విక్రయించినట్లు బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. 2017–18 సంవత్సరం కన్నా ఇది నాలుగు రెట్లు ఎక్కువ. 2019–2020 సంవత్సరానికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక్క సీపీఎం మినహా ఆరు జాతీయ పార్టీలకు కలిపి 2017–18లో 53 శాతం అంటే, 689.44 కోట్ల రూపాయలు గుర్తు తెలియని దాతల నుంచి వచ్చాయి. 36 శాతం అంటే 467.13 కోట్ల రూపాయలు తెల్సిన దాతల నుంచి వచ్చాయి. ఇక్కడ గుర్తుతెలియని దాతలంటే బ్యాంకులకు, రాజకీయ పార్టీలకు గుర్తు తెలియని వారు కాదు. కేవలం ప్రజలు లేదా ఓటర్లకు గుర్తుతెలియని వారే. భారతీయ స్టేట్ బ్యాంకుల నుంచి ఎవరైనా వెయ్యి రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ఎన్నికల బాండులను కొనుక్కోవచ్చు. వారి వివరాలను బ్యాంకు లావాదేవీల అవసరార్థం బ్యాంకు బ్రాంచులు నమోదు చేసుకోవచ్చు లేదా వదిలేయవచ్చు. ఆ బాండ్ను ఏ పార్టీకి ఇచ్చేది ఆ దాత వెల్లడించాల్సిన అవసరం అస్సలు లేదు. దాత ఆ బాండును తీసుకెళ్లి ఏ పార్టీకి ఇస్తే ఆ పార్టీ ఆ దాత వివరాలను నమోదు చేసుకుంటుంది. అయితే ఇటు బ్యాంకులుగానీ, రాజకీయ పార్టీలుగానీ ఎన్నికల బాండుల దాతల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదు. కనుక ప్రజలకు ఈ వివరాలు తెలిసే అవకాశం లేదు. ప్రజలకు తెలిసే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే మొదట బీజేపీ ప్రభుత్వం ఈ బాండుల దాతల వివరాలను విధిగా వెల్లడించాలనే నిబంధన తీసుకరావాలనుకుంది. నల్లడబ్బుకే ప్రాధాన్యత దాతల వివరాలను వెల్లడిస్తే అధికారంలో ఉన్న తమ పార్టీకి ఎక్కువ విరాళాలు రాకపోవచ్చని, ముఖ్యంగా నల్లడబ్బుకు అవకాశం లేకపోయినట్లయితే నిధులు బాగా తగ్గి పోతాయని మోదీ ప్రభుత్వం భావించి ఈ మోసపు విధానానికే మొగ్గు చూపింది. నల్లడబ్బుకు ముసుగు వేయడానికే ఎన్నికల బాండులను తీసుకొచ్చారని మాజీ ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం. -
సూక్ష్మసేద్యానికి నిధులు కరువు
సాక్షి, హైదరాబాద్: సూక్ష్మసేద్యానికి బ్రేకులు పడ్డాయి. నిధులు లేకపోవడంతోనే ఈ కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.85 లక్షల ఎకరాలకుగాను కేవలం 70 వేల ఎకరాలకు మాత్రమే పరిపాలన అనుమతులిచ్చారు. ఇందులో ఇంకా ఒక్కటి కూడా క్షేత్రస్థాయిలో రైతులకు అందలేదు. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 1,26,054 మంది రైతులు డ్రిప్ ఇరిగేషన్కు మీ–సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఉద్యాన శాఖ వద్ద మూలుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 60 శాతం నిధులు కేటాయింపులు చేసినా రాష్ట్ర ఆర్థిక శాఖ తన వాటా నిధులు విడుదల చేయడం లేదు. కేంద్రం నుంచి రూ.348 కోట్లు కేటాయింపులు రాగా, రాష్ట్ర ఆర్థిక శాఖ దానికి రూ.283 కోట్లు కలిపి ఇవ్వాల్సి ఉంది. అవసరాల రీత్యా అదనంగా మరో రూ.263.55 కోట్లు ఇచ్చేలా యాక్షన్ ప్లాన్కు ఆమోదం కూడా ఇచ్చింది. ఇందులో కేంద్రం రూ.191 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. అయితే అందుకు రాష్ట్ర వాటా కలిపి ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మసేద్యాన్ని ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా బీసీలకు 90, ఇతరులకు 80 శాతం వరకు సబ్సిడీ ఇస్తోంది. సూక్ష్మసేద్యానికి ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం గతంలో నాబార్డు నుంచి రూ.800 కోట్లు రుణంగా తీసుకుంది. ఆ సొమ్ము అంతా కూడా గతేడాది దర ఖాస్తులు, వాటి చెల్లింపులకు పూర్తయింది. పదో స్థానంలో రాష్ట్రం... దేశవ్యాప్తంగా 2.30 కోట్ల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అందుబాటులోకి వచ్చింది. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే సూక్ష్మసేద్యంలో తెలంగాణ పదో స్థానంలో ఉంది. దేశంలో అత్యధికంగా రాజస్తాన్లో 44.71 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. -
గోడను అడ్డుకుంటే ఎమర్జెన్సీనే!
వాషింగ్టన్: మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి ట్రంప్ తన ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. కాంగ్రెస్ అనుమతి లేకుండానే ఇందుకు అవసరమైన నిధులు పొందడానికి జాతీయ అత్యవసర పరిస్థితి విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గోడ నిర్మాణానికి 5.6 బిలియన్ డాలర్లు మంజూరు చేయాలని ట్రంప్ ప్రభుత్వం కోరగా డెమొక్రాట్లు అడ్డుపడిన సంగతి తెలిసిందే. గోడ నిర్మాణ ప్రణాళికలకు మద్దతు కూడగట్టేందుకు ట్రంప్ టెక్సస్లో పర్యటించారు. అత్యవసర పరిస్థితి ప్రకటించే అవకాశాలపై మీడియా ప్రశ్నించగా..ఆ దిశగా ఆలోచిస్తున్నామని సమాధానమిచ్చారు. గోడకు రోనిల్ సోదరుడి మద్దతు.. ఇటీవల అక్రమ వలసదారుడి చేతిలో హత్యకు గురైన భారత సంతతి పోలీసు అధికారి రోనిల్ రాన్ సింగ్ సోదరుడు రెగ్గీ సింగ్..ట్రంప్ గోడ నిర్మాణ ప్రతిపాదనకు మద్దతిచ్చారు. తమ కుటుంబం మాదిరిగా ఇతరులు బాధపడకూడదంటే సరిహద్దును పటిష్టపరచాలని అన్నారు. టెక్సాస్లో జరిగిన ఓ కార్యక్రమంలో రెగ్గీ సింగ్.. ట్రంప్ పక్కనే కూర్చుని కాసేపు ముచ్చటించారు. ‘నా సోదరునిలా మరో పోలీసు అధికారి బలికావొద్దు. ఈ ముప్పును తగ్గించడానికి ఏం చేయాలో చేయండి. మా కుటుంబం మద్దతుగా నిలుస్తుంది’ అని ట్రంప్తో రెగ్గీ అన్నారు. మీడియానే ప్రతిపక్షం.. ‘సరిహద్దుల్లో ఏం జరుగుతుందో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే డెమొక్రాట్లు వినడం లేదు. అక్కడ కృత్రిమ సంక్షోభం ఉందని కొత్తగా చెబుతున్నారు. నకిలీ మీడియా సంస్థల సృష్టే ఇది. వారు ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తున్నారు’ అని సరిహద్దు భద్రత, వలసలపై టెక్సాస్లో జరిగిన సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆర్మీ డబ్బులతో గోడ నిర్మాణం? ఆర్మీ కోర్ ఇంజినీర్ల విభాగంలో నిరుపయోగంగా ఉన్న నిధులతో గోడ నిర్మాణం చేపట్టాలని ట్రంప్ యోచిస్తున్నట్లు తెలిసింది. గోడ నిర్మాణానికి కాంట్రాక్టులు కుదుర్చుకోవడానికి ఎంత సమయం పట్టొచ్చు? నిర్మాణం 45 రోజుల్లో ప్రారంభించొచ్చా? అనే విషయాలు తేల్చాలని ఆర్మీ కోర్ను ట్రంప్ ఆదేశించారు. మరోవైపు, కాంగ్రెస్ అనుమతి లేకుండానే నిధులు పొందేందుకు ట్రంప్ జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటిస్తే ఏం చేయాలని డెమొక్రాట్లు, రిపబ్లికన్లు యోచిస్తున్నారు. ట్రంప్ ఎమర్జెన్సీ విధిస్తే ఆ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయడానికి ఉన్న అవకాశాలను ప్రతిపక్ష డెమొక్రాటిక్ నాయకత్వం పరిశీలిస్తోంది. -
సేకరణ సేవ
సాటి మనిషికి సాయమంటే ముందుండేవాడు. ఆపదవచ్చిందంటే ఆసరా అందించేందుకు వెనుకాడనివాడు.దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల సమయంలో రక్తమోడుతున్న బాధితులను ఆసుపత్రులకు తరలించినవాడు. అలాంటి మంచికుర్రాడికి విధి పరీక్ష పెట్టింది. అనారోగ్యాన్ని అంటగట్టింది. నీకెవరు సాయమొస్తారో చూస్తానంటోంది. కొన్ని నెలలుగా మంచానికి పరిమితమైన ఆ కుర్రాడి వైద్య ఖర్చుల నిమిత్తం అంతర్జాతీయ క్రౌడ్ ఫండింగ్ సంస్థ ‘ఇంపాక్ట్ గురు’ విరాళాలు సేకరిస్తోంది. ఇప్పుడు అతనొక్కడే కాదు... అతని లాంటి మరెందరికో ఇలాంటి సంస్థల ద్వారా చేయూతఅందుతోంది. సాక్షి, సిటీబ్యూరో :2013లో హైదరాబాద్లో జరిగిన బాంబు పేలుళ్ల సమయంలో ఇమ్మాన్యుయేల్ స్వచ్ఛందంగా బాధితులను అంబులెన్స్లో తరలించడంలో చురుకైన సేవలందించాడు. అక్కడ విరిగిన ఎముకలు, శరీర భాగాలున్నా అతనేమాత్రం సంశయించలేదు. ‘మొదటి నుంచీ మా అబ్బాయిది కష్టంలో ఉన్న వారిని ఆదుకునే మనస్తత్వం’ అని చెప్పారు శామ్యూల్. ఆయన ఓ చర్చి పాస్టర్. ప్రస్తుతం ఈయన కుమారుడు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గుల్లియన్ బార్రె సిండ్రోమ్ (జీబీఎస్) అనే ఓ అరుదైన న్యూరాలాజికల్ డిజార్డర్తో బాధపడుతున్నాడు. ఇప్పటి వర కు ‘ఇంపాక్ట్ గురు’ దాతలందించిన సాయంతో రూ.8లక్షలకు పైగానే అందించింది. ‘రోజుకి దాదాపు రూ.లక్ష వ్యయమవుతోంది. దీనికి ఇంపాక్ట్ గురు అందిస్తున్న సహకారం కొంతమేర ఆసరా అవుతోంద’ని చెప్పారు శామ్యూల్. ఏమిటీ క్రౌడ్ ఫండింగ్? దారిద్య్రరేఖకు దిగువనున్న వారికి కొన్ని ప్రభుత్వ పథకాలున్నాయి. అలాగే ధనవంతులకు వ్యయాన్ని భరించే స్థోమత ఉండొచ్చు. ఈ రెండింటికీ చెందని మధ్య, దిగువ మధ్యతరగతి వారికి మాత్రం తీవ్రమైన వ్యాధులు వస్తే ఆ కుటుంబం మొత్తానికి అది జీవన్మరణ సమస్యగా మారుతోంది. ఎన్జీఓలు, చారిటీ సంస్థల విరాళాల సేకరణ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) సంప్రదింపులు నెలల తరబడి సాగే ప్రయాసభరిత వ్యవహారం. ఇంత చేసినప్పటికీ వచ్చేవి అరకొర నిధులే అయి ఉంటాయి. ఇవి బాధితుల అన్ని రకాల అవసరాలను తీర్చేవిగా ఉండవు. ఈ పరిస్థితుల్లోనే అందుబాటులోకి వచ్చింది ఆన్లైన్ ఆధారంగా కొన్ని సంస్థలు సాగించే నిధుల సేకరణ ‘క్రౌడ్ ఫండింగ్’. ఈ ఫండింగ్కు కేవలం స్నేహితులు, వారి బంధువులు, సహోద్యోగుల నుంచి మాత్రమే కాకుండా అపరిచితుల నుంచి కూడా సాయం అందుతోంది. ఆసుపత్రులతో అనుసంధానం... రెండు మూడేళ్లుగా మన దేశంలో క్రౌడ్ ఫండింగ్ వేదికలకు ఆదరణ బాగా పెరిగింది. ఈ సంస్థలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆసుపత్రులతో అనుసంధానమవుతున్నాయి. తద్వారా అవసరార్థులను గుర్తించి సాయాన్ని అందించగలుగుతున్నాయి. అయితే క్రౌడ్ ఫండింగ్ సంస్థలు చెబతున్న ప్రకారం దీర్ఘకాలం పాటు చికిత్స అవసరమైన, మందులు వాడాల్సిన వాటితో పోలిస్తే... అవయవాల మార్పిడి లాంటి అత్యవసర చికిత్సలకు దాతల స్పందన ఎక్కువగా ఉంటోంది. అదే విధంగా 0–17 ఏళ్ల లోపు ఉన్న వారికి వచ్చే లివర్ ట్రాన్స్ప్లాంట్స్ వంటి శస్త్ర చికిత్స సందర్భాల్లోనూ మంచి స్పందన లభిస్తోంది. దుర్వినియోగానికీ ఆస్కారం.. ఈ సంస్థలకు సంబంధించిన సమాచారం ఇంకా పూర్తిగా ప్రజలకు చేరకముందే వీటి చేయూతను దుర్వినియోగం చేస్తున్నవారు కూడా ఉండడం విషాదకరమైన విషయం. నగరానికి చెందిన సామియా అబ్దుల్ హఫీజ్ (22) అనే మహిళ గతేడాది ఏప్రిల్లో కేన్సర్ రోగి అవతారమెత్తి ఒక ఫండ్ రైజింగ్ ఫేస్బుక్ పేజీని సృష్టించింది. తద్వారా రూ.22లక్షలు కొల్లగొట్టింది. అయితే ఈ విషయం బయటపడడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. 2014లో ప్రారంభం... ‘మెడికల్ క్రౌడ్ ఫండింగ్ బాడీగా ‘ఇంపాక్ట్ గురు’ను 2014లో స్థాపించాం. నాలుగేళ్లలోనే ఎంతో విస్తరించింది. ప్రస్తుతం వైద్య ఖర్చుల నిమిత్తం ఆధారపడదగ్గ భారతదేశ అతిపెద్ద వేదిక ఇది. పేద రోగులు, తీవ్రమైన అనారోగ్యంతో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నవారు అలాగే కేన్సర్, డయాలసిస్, ప్రీమెచ్యూర్ బేబీకేర్ తదితర ఖరీదైన దీర్ఘకాల చికిత్సల కోసం తమ వద్దనున్న సొమ్మంతా ఖర్చు చేసేసినా సరిపోని మధ్యతరగతి వర్గాలు... వీరి అవసరాలే లక్ష్యంగా ఈ క్రౌడ్ ఫండింగ్ వేదిక ఆవిర్భవించింది. ఏ మార్గమూ లేని వీరికి క్రౌడ్ ఫండింగ్ ద్వారా తిరిగి తీర్చనవసరం లేని రుణం అందుతుంది. హెల్త్కేర్ను అందరికీ అందుబాటులోకి తేవాలని, వీలైనన్ని జీవితాలను రక్షించాలనేది మా లక్ష్యం’ అని చెప్పారు నిర్వాహకులు. పలువురికి సాయం... సిటీలో చాలా మందికి సాయమందించాం. లివర్ సిర్రోసిస్తో బాధపడుతున్న షణ్ముఖ అనే 11నెలల చిన్నారికి గ్లోబల్ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స నిమిత్తం కేవలం వారం రోజుల్లో రూ.10లక్షలు సేకరించగలిగాం. అదే విధంగా మల్టీపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్తో బాధపడుతూ లిటిల్స్టార్స్ చిల్డ్రన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీమ శంకర్ అనే రెండేళ్ల బాలుడికి ఆర్ధిక సాయం అందించగలిగాం. ఇలా మరెంతో మందికి సాయం చేశాం.ఈ విధానంపై సిటీజనుల్లో అవగాహన పెరిగి మరింత మందికి మా వేదిక ఉపయోగపడాలనికోరుకుంటున్నాం. – పీయూష్ జైన్, సీఈఓ, కో–ఫౌండర్,ఇంపాక్ట్ గురు -
ఇన్నాళ్లూ బీజేపీ నేతలు నిద్రపోయారా?
బెంగళూరు: ‘ఐదేళ్లుగా బీజేపీ నిద్రపోయిందా? గత 15 అసెంబ్లీ సమావేశాల్లో ఈ నిధులపై లెక్కలు చూపిన సమయంలో వారు నిద్రపోయారా? ప్రజలను మోసం చేయడం మానండి. పదేపదే అబద్ధం చెబితే నిజం కాబోదు..’అంటూ బీజేపీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మండిపడ్డారు. కేంద్రం నుంచి అందిన దాదాపు రూ.2,19,506 కోట్ల నిధులకు లెక్కలు చెప్పాలని ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్షా డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. గత ఐదేళ్లలో కేంద్రం నుంచి అందిన నిధుల్లో ప్రతి రూపాయికీ అసెంబ్లీలో లెక్క చూపామని సిద్దరామయ్య స్పష్టం చేశారు. ఈ విషయం బీజేపీకి చెందిన ప్రతిపక్ష నేత జగదీష్ షెట్టర్కు కూడా తెలుసునని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు అమలు కోసం రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కేంద్రం కోత విధించిందని ఆరోపించారు. -
కేంద్ర సహకారం లేదనడం అవాస్తవం
సాక్షి, న్యూఢిల్లీ: పలు పథకాలకు నిధులు, సంస్థల మంజూరులో కేంద్రం తెలంగాణ పై వివక్ష చూపు తోందని మంత్రి కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కేంద్రం తెలంగాణకు అన్ని రకాలుగా సహకారం అందిస్తోందని, విద్యాసంస్థలు, కేంద్ర పథకాలకు నిధుల మంజూరులో పెద్దపీట వేస్తోందన్నారు. రాష్ట్రంలో విద్యా సంస్థల ఏర్పాటు విషయమై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ను బుధవారం ఢిల్లీలో కలసి వినతిపత్రాన్ని ఇచ్చారు. సంగారెడ్డి జిల్లాలో ఐఐటీ పనులను, గిరిజన వర్సిటీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాల న్నారు. ఇఫ్లూ వర్సిటీలో ఉద్యోగులకు కేంద్రమే 100% ప్రయోజనాలు కల్పించా లని, సెంట్రల్ వర్సిటీలో మౌలిక సదుపా యాల కల్పనకు నిధులు విడుదల చేయా లని కోరారు. సర్వశిక్షా అభియాన్, రూసా కింద తెలంగాణకు రూ.149 కోట్లు విడు దల చేసేందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. -
కార్మికుల సొమ్ముతో వాషింగ్ మెషీన్లు
న్యూఢిల్లీ: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి వాడాల్సిన నిధులతో ల్యాప్టాప్లు, వాషింగ్ మెషీన్లు కొనడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. విస్తుగొల్పే, తీవ్ర చర్య అని ఆవేదన వ్యక్తం చేసింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం సమీకరిస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయని కోర్టు ఆక్షేపించింది. ఈ కేసుకు సంబంధించి కార్మిక శాఖ కార్యదర్శి నవంబరు 10 లోపు తమ ముందు హాజరు కావాలనీ, పథకం ఎందుకు పక్కదారి పట్టిందో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సంక్షేమ నిధి మొత్తం రూ.29 వేల కోట్లు ఉండగా, దానిలో 10 శాతాన్ని అసలు ఉద్దేశం కోసం వినియోగించారనీ, మిగతా డబ్బుతో కొందరు కార్మికుల కోసమే వాషింగ్ మెషీన్లు, ల్యాప్టాప్లు కొన్నారని కాగ్ లెక్కల్లో తేలింది. -
‘మరుగు’లో మేత
♦ లబ్ధిదారుల పేరుతో ఎన్జీఓల ఖాతాల్లోకి రూ.కోటి మళ్లింపు ♦ కొన్ని గ్రామాల్లో పాతదొడ్లకు రంగులు వేసి బిల్లులు స్వాహా ♦ ఎంపీడీఓ, జూనియర్ అసిస్టెంటే సూత్రధారులు..? ♦ స్వచ్ఛభారత్ మిషన్, ఉపాధిహామీ నిధులు కైంకర్యం చందర్లపాడు(నందిగామ) : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ మిషన్ నిధులు భారీగా దుర్వినియోగమయ్యాయి. ఎన్జీఓ (నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్) అవతారమెత్తిన కొందరు అధికార పార్టీ నేతలు మరుగుదొడ్లు నిర్మించకుండానే లబ్ధిదారుల పేరుతో లక్షల రూపాయల మేర బిల్లులు పొందారు. చందర్లపాడు మండలంలో జరిగిన ఈ కుంభకోణంలో ఎంపీడీఓ కీలకపాత్ర వహించగా కార్యాలయ జూనియర్ అసిస్టెంటు తనవంతు సహాయ సహకారాలు అందించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నేరుగా లబ్ధిదారుల పేరుతో ఎన్జీఓల ఖాతాలోకి డబ్బు జమచేశారు. ఒక్క తోటరావులపాడు సుమారు 120 మంది పేరుమీద రూ.18 లక్షలు డ్రాచేయగా కోనాయపాలెం, చందర్లపాడు, ముప్పాళ్ల, కాసరబాద, కొడవటికల్లుతో పాటు మిగిలిన పంచాయతీల్లోనే ఈ కుంభకోణం కొనసాగింది. పాత వాటికి బిల్లులు చెల్లించడంతోపాటు, అసలు మరుగుదొడ్లు నిర్మించకుండానే నిర్మాణం పూర్తయినట్లుగా నమోదుచేసి బిల్లులు చెల్లించేశారు. కొన్నిచోట్ల లబ్ధి దారుల ఖాతాల్లోకి డబ్బు జమచేసి, వారికి కొద్ది మొత్తంలో కమిషన్ ఇచ్చి మిగిలిన మొత్తాన్ని స్వాహాచేయగా, మరికొంతమందికి చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. గడిచిన రెండేళ్లుగా స్వచ్ఛభారత్ మిషన్తోపాటు ఉపాధిహామీ పథకం కింద మరుగుదొడ్లు నిర్మించినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి మండలవ్యాప్తంగా కోటి రూపాయల నిధులను స్వాహా చేసినట్లు సమాచారం. నిబంధనలకు పాతర మరుగుదొడ్ల నిర్మాణాల విషయంలో అధికారులు నిబం ధనలను తుంగలో తొక్కారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి అధికారి వరకు పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించారు. దొడ్డి నిర్మాణాలను పరిశీలించిన తరువాత గ్రామ ప్రత్యేకాధికారి (చెక్మెజర్మెంటు అధికారి) ఎంబుక్లో రికార్డు చేయాలి. దానిని మండల పరిషత్ కార్యాలయానికి అందజేయాలి. మరుగు దొడ్డి నిర్మాణం జరిగిందా లేదా, లేదా? అది ఏ స్టేజీలో ఉంది? అన్న విషయాన్ని కంప్యూటర్ డేటాలో పరిశీంచిన తరువాత ఎంపీడీఓ లబ్ధిదారుడి ఖాతాకు బిల్లుమొత్తం జమచేయాలి. అయితే ఈ విషయంలో ఎంపీడీఓ, జూనియర్ అసిస్టెంటు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. మరుగుదొడ్డికి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు కమీషన్ తీసుకుని లబ్ధిదారుడి ఖాతాకు బదులు ఎన్జీఓ ఖాతాలోలో బిల్లులు మళ్లించారని సమాచారం. నిర్మించకుండానే బిల్లులు చెల్లింపు మండలంలో ఇప్పటి వరకు స్వచ్ఛభారత్ మిషన్ కింద 1,936 మరుగుదొడ్లను నిర్మించారని రికార్డుల్లో నమోదు చేశారు. అయితే 11 వేల వరుకు సక్రమంగా నిర్మించారని సమాచారం. అధిక మొత్తంలో మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు చెల్లించరని సమాచారం. కొందరు టీడీపీ కార్యకర్తలకు చెందిన పాత మరుగుదొడ్లకే రంగులు వేసి, కొత్తవాటిగా చూపి బిల్లులు చెల్లించారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కోనపాలెం 2, 3 వార్డులో 100 పాత దొడ్లకు, చందర్లపాడు 4, 5, 9 10, 11, 12, 13, 14 వార్డులో మరో 200 దొడ్లకు బిల్లులు చెల్లించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
చేయి తడపాల్సిందే !
♦ ముడుపులు చెల్లిస్తేనే సబ్సిడీ యూనిట్ మంజూరు..? ♦ చుక్కలు చూపిస్తున్న వ్యవసాయ అధికారులు ♦ లేనిపక్షంలో బడ్జెట్ లేదంటారు.. క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడుతున్న రైతులు ♦ స్థానిక ప్రజాప్రతినిధుల అండతోనే చెలరేగుతున్న అధికార గణం వ్యవసాయ యాంత్రీకరణ, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, గ్రామీణ విత్తన ఉత్పత్తి వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. వీటి కోసం రూ.కోట్లలో నిధులు వెచ్చిస్తోంది. వీటికి దరఖాస్తు చేసుకునే రైతులకు కొందరు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ముడుపులు చెల్లించిన వారికే ప్రాధ్యానత ఇస్తూ యూనిట్లు మంజూరు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అడిగినంత సమర్పించుకోలేని పక్షంలో ఈ ఏడాది మండలానికి కేటాయించిన బడ్జెట్ అయిపోయిందని, వచ్చే బడ్జెట్లో చూద్దామంటూ అధికారులు దాటవేస్తున్నారని రైతన్నలు వాపోతున్నారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో కొందరు వ్యవసాయశాఖ అధికారుల తీరు విమర్శలకు దారితీస్తోంది. చేయి తడపనిదే రైతులకు సంక్షేమ పథకాల యూనిట్లు మంజూరు చేయ డం లేదనే ఆరోపణలు గుప్పుమంటున్నా యి. వచ్చే నామమాత్ర సబ్సిడీ యూనిట్లకు ముడుపులు చెల్లించడం తప్పనిసరి కావడంతో తమకు ఒరిగేదేంటని రైతులు వాపోతున్నారు. ముడుపులు ఇచ్చుకోలేని చిన్న, సన్నకారు రైతులకు అసలు యూ నిట్లు మంజూరు కావడం లేదనే విమర్శలున్నాయి. అడిగినంత సమర్పించుకోని పక్షంలో ఈ ఏడాది మండలానికి కేటాయించిన బడ్జెట్ అయిపోయిందని, వచ్చే బడ్జెట్ లో చూద్దామంటూ దాటవేస్తున్నారని రైతన్న లు వాపోతున్నారు. ముఖ్యంగా ఆర్మూర్, భీంగల్ వ్యవసాయ డివిజన్లలో కొందరు అధికారుల తీరు ఇలా ఉందని తెలుస్తోంది. తమకున్న రాజకీయ పలుకుబడిని వినియోగించుకుని కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆ శాఖ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులకు జీ హుజూర్ అంటూ ఎలాగైనా ఉండొచ్చనే ధోరణితో వ్యవహరిస్తుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాను నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, ఆర్మూర్, భీంగల్ మొత్తం ఐదు వ్యవసాయ డివిజన్లుగా విభజించారు. వర్ని, రుద్రూర్, కోటగిరి మండలాలు బాన్సువాడ డివిజన్లో ఉన్నాయి. వీటి పరిధిలో అసిస్టెంట్ డైరెక్టర్లు, మండల వ్యవసాయశాఖాధికారులు, వ్యవసాయ విస్తీర్ణాధికారులు పని చేస్తున్నారు. ప్రభుత్వం ఈ శాఖ ద్వారా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వ్యవసాయ యాంత్రీకరణ, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, గ్రామీణ విత్తన ఉత్పత్తి వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. వీటి కోసం రూ.కోట్లలో నిధులు వెచ్చిస్తోంది. వీటికి దరఖాస్తు చేసుకునే రైతులకు కొందరు చుక్కలు చూపిస్తున్నారు. బడ్జెట్ లేదంటూ దాటవేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆయా పథకాలకు సంబంధించిన బడ్జెట్, యూనిట్ల వివరాలు.., సమాచారం రైతులకు అందుబాటులో ఉంచాలి. కానీ పారదర్శకత లేకుండా ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో పథకాలు అమలు కావడంతో చిన్న, సన్నకారు రైతులు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు. గతంలో ఈ శాఖలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడిన అధికారిపై అప్పట్లో శాఖాపరమైన విచారణ జరిగింది. ఈ అవకతవకలు వాస్తవమని తేలడంతో షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. తమకున్న పలుకుబడిని వినియోగించుకుని సదరు అధికారి తనపై తదుపరి చర్యలు లేకుండా చేసుకున్నారన్నది ఆ శాఖలో అప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ అధికారి ఇప్పుడు మళ్లీ తన తీరు మార్చుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ‘సాక్షి’ జిల్లా వ్యవసాయశాఖాధికారి వాజీద్ హుస్సేన్ వివరణ కోరగా అలాంటిదేమీ లేదన్నారు. ఎక్కడా రైతుల నుంచి ఫిర్యాదులు రాలేదని పేర్కొన్నారు. -
పంచాయతీల సొమ్ములపై ప్రభుత్వ పెత్తనం
-
మీ నిధులు.. మా ఇష్టం
పంచాయతీల సొమ్ములపై రాష్ట్రప్రభుత్వ పెత్తనం.. 14వ ఆర్థిక సంఘం నిధులపై ఆంక్షలు.. రాజ్యాంగాన్ని పరిహసిస్తూ ఉత్తర్వులు - ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చు పెడితేనే నిధులు - ఇంటి పన్నుల రూపంలో వసూలైన సొమ్ముపైనా అదుపు - గ్రామాల్లో చెత్త సేకరణకు షెడ్లు నిర్మించాలి - ఫొటోలిస్తేనే నిధులు - నిధులు అందుబాటులో లేక పంచాయతీల అవస్థలు - ఆంక్షలపై సర్పంచ్ల ఆగ్రహం సాక్షి, అమరావతి: ఆర్థిక సంఘం నిధులనేవి గ్రామ పంచాయతీలను బలోపేతం చేసేందుకు రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు. గ్రామ పంచాయతీలకు ఆర్ధిక సంఘం ద్వారా కేంద్ర నిధులందాలని, అపుడే అవి పరిపుష్టమై గ్రామ స్వరాజ్య స్వప్నం సాకారమౌతుందని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. 1994లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరహాలో గ్రామ పంచాయతీలకు సైతం స్వయం ప్రతిపత్తిని కల్పించారు. కేంద్రం ఇచ్చే నిధులతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ నిధులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కూ ఉండదు. దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానిది. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాజ్యాంగ స్ఫూర్తిని పట్టపగలే పరిహాసం చేస్తోంది. 14వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం ఇచ్చిన నిధులపై పెత్తనమంతా తమదే అంటోంది. తాము చెప్పినట్లు చేస్తేనే ఆ నిధులు తీసుకోవాలంటూ ఆంక్షలు విధిస్తోంది. దీంతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు లేక సర్పంచ్లు గగ్గోలు పెడుతున్నారు. ఇవెక్కడి ఆంక్షలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికసంఘం నిధులు సర్పంచ్లకు ఇవ్వొద్దు.. కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులను సంబంధిత సర్పంచులకు ఇవ్వొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీల్లో వసూలు చేసి, ట్రెజరీల్లో జమ చేసిన ఇంటి పన్నుల సొమ్ము వినియోగంపైనా ఆంక్షలు విధించింది. కేంద్రం విడుదల చేసిన నిధులను, పంచాయతీల సొంత సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు ఖర్చు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం ఇచ్చే నిధులు, గ్రామాల్లో వసూలు చేసిన ఇంటి పన్నుల డబ్బును గ్రామ పంచాయతీల తీర్మానాలకు అనుగుణంగా ఖర్చు పెట్టుకోవడానికి రాజ్యాంగం వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు సర్పంచ్లకు చెక్ పవర్ను కల్పించింది. రాజ్యాంగం కల్పించిన హక్కును హరించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. షెడ్ల నిర్మాణం పంచాయతీల పనేనట! ‘స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో సేకరించిన చెత్తను ఒక చోట చేర్చేందుకు షెడ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి ఈ షెడ్లను పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే నిర్మించాల్సి ఉంటుంది. కానీ, కేంద్రం ఇచ్చిన నిధులతోపాటు పంచాయతీల సొంత నిధులను వీటి నిర్మాణం కోసం వెచ్చించాలని ప్రభుత్వం అధికారుల ద్వారా సర్పంచ్లపై ఒత్తిడి తీసుకొచ్చింది. అత్యధిక శాతం సర్పంచులు దీన్ని వ్యతిరేకించడంతో ఆంక్షలను తెరపైకి తెచ్చింది. గ్రామ పంచాయతీల పేరిట ఉన్న నిధులను ఆయా సర్పంచ్లు డ్రా చేసుకునే వీల్లేకుండా ట్రెజరీలపై ఆంక్షలు విధించింది. ఇందుకు సంబంధించి కొన్ని జిల్లాల్లో మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. మరికొన్ని జిల్లాల్లో పంచాయతీరాజ్ శాఖ అధికారులు స్పష్టమైన ఉత్తర్వులిచ్చేశారు. ట్రెజరీల్లో పంచాయతీల సొమ్ము రూ.1,449 కోట్లు రాష్ట్రంలోని 12,920 గ్రామ పంచాయతీల పేరుతో ప్రస్తుతం ఖజానాలలో(ట్రెజరీ) దాదాపు రూ.1,449 కోట్ల నిధులున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. 2016–17లో కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో గ్రామ పంచాయతీలకు దాదాపు రూ.1,463 కోట్లు నేరుగా విడుదల చేసింది. ఈ నిధుల్లో ఎక్కువ భాగం ఆర్థిక సంవత్సరం చివరన అంటే ఈ ఏడాది మార్చిలో ఇచ్చింది. సర్పంచ్లు ఇప్పటిదాకా డ్రా చేసిన నిధులు పోగా.. ప్రస్తుతం దాదాపు రూ.900 కోట్లు గ్రామ పంచాయతీల పేరిట ట్రెజరీల్లో ఉన్నట్లు సమాచారం. దీనికితోడు గ్రామ పంచాయతీలు ఇంటి పన్ను రూపంలో వసూలు చేసిన రూ.549 కోట్లను మార్చి నెలలోనే ట్రెజరీల్లో జమ చేశాయి. కేంద్రం ఇచ్చినవాటితో పాటు పంచాయతీల సొంత నిధులను రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చు పెడితేనే వాటిని ట్రెజరీల నుంచి పొందే అవకాశం కల్పిస్తామంటూ సర్కార్ ఆంక్షల అడ్డుగోడ నిర్మించింది. చెల్లింపులు నిలిపివేత గ్రామ పంచాయతీల నిధుల చెల్లింపులపై జూలై 27వ తేదీ నుంచి ట్రెజరీల్లో ఆంక్షలు అమలవుతున్నాయి. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ సర్పంచ్లకు నిధులు విడుదల చేయొద్దంటూ ప్రభుత్వం తేల్చిచెప్పింది. సాధారణ నిధుల నుంచి పంచాయతీల్లో పనిచేసే ఉద్యోగుల జీతాల చెల్లింపులకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. చెత్త సేకరణ షెడ్ల నిర్మాణం పూర్తి చేసి, సంబంధిత ఫోటోలను సమర్పిస్తేనే ట్రెజరీల నుంచి నిధులను విడుదల చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే.. షెడ్ల నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించి, వాటిని ఫొటోలు తీసి ఇస్తేనే ఆర్థిక సంఘం నిధులు పంచాయతీల చేతికొస్తాయన్నమాట! వర్షాకాలంలో గ్రామాల్లో దోమలు వ్యాప్తి చెందకుండా, వ్యాధులు ప్రబలకుండా మురుగు కాల్వలను శుభ్రం చేసుకోవడానికి కూడా నిధులు అందుబాటులో లేకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి లోకేశ్ వింత నిర్ణయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేశ్ పంచాతీయరాజ్ శాఖ మంత్రిగా కుర్చీ ఎక్కాక ఈ శాఖలో ఎన్నడూ లేని వింత పోకడలు చోటుచేసుకుంటున్నాయి. మంత్రి లోకేశ్ తన మనసుకు తోచిందే తడవుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారులు ఆయనకు ఎదురు చెప్పలేక ప్రతి నిర్ణయానికీ తలూపుతున్నారు. అందుకే రాజ్యాంగాన్ని సైతం ఉల్లంఘిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నారని సర్పంచ్లు ఆరోపిస్తున్నారు. -
ప్రత్యేక అభివృద్ధి నిధులేవీ?
- అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో అయోమయం - రూ.2 కోట్ల స్పెషల్ ఫండ్ కోసం ఎదురు చూపులు సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అయోమయంలో ఉన్నారు. నిధులు అందుతాయన్న ఆశాభావంతో ఎక్కడికక్కడ పనుల కోసం పచ్చ జెండా ఊపడం వీరికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం ఏసీడీఎఫ్ (అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధి) ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఏసీడీఎఫ్ కోసం ఏటా రూ.3 కోట్ల నిధులిస్తున్నారు. కాగా, నియో జకవర్గాల్లో మరిన్ని అభివృద్ధి పనుల కోస మంటూ గతేడాది సీఎం కె.చంద్రశేఖర్రావు ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్)ని ప్రకటించారు. ఏసీడీఎఫ్తో సంబంధం లేకుండా ఏటా మరో రూ.2కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ నిధి అతీగతీ లేకపో వడంతో ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. రూ.4వేల కోట్ల ప్రత్యేక నిధి ముఖ్యమంత్రి ఆధీనంలో రూ.4వేల కోట్ల నిధులు ఉంటాయని గత ఏడాది ప్రకటించారు. గత వార్షిక బడ్జెట్లోనే ఈ మేరకు కేటాయింపులు కూడా జరిగాయి. నియోజకవర్గాల పరిస్థితి, అక్కడి సమస్యలు, తక్షణం దృష్టిసారించాల్సిన అంశాలు, శాశ్వత నిర్మాణాల కోసం వెచ్చించాల్సిన అవసరం తదితరాలను పరిగణనలోకి తీసుకుని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు నేరుగా సీఎం నిధులు కేటాయించే వెసులుబాటును ఎస్డీఎఫ్ కల్పించింది. గత ఏడాది రెండు మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుందనగా ఎమ్మెల్యేలకు ఈ నిధులు అందాయి. వాటితో పనులు కూడా జరిగాయి. తొలి ఏడాది నిధులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు కాబట్టి, రెండో ఏటా ఆశ పెట్టుకున్నారు. ఎలాగూ వచ్చే నిధులే కదా అన్న అతి విశ్వాసంతో కొందరు ఎమ్మెల్యేలు తమకు కావాల్సిన వారికి పనులు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారు. వీరిలో కొందరు పనులు కూడా పూర్తి చేశారు. అయితే, ఎస్డీఎఫ్ కింద బడ్జెట్ అందక బిల్లులు పెండింగ్లో పడ్డాయి. అభ్యంతరాలే అసలు సమస్య బడ్జెట్లో అనామతు పద్దుకింద ఏకంగా రూ.4వేల కోట్లు కేటాయించడం కుదరదని, కాగ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ సారి వార్షిక బడ్జెట్లో ఎస్డీఎఫ్ ఎత్తేశారని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ప్రాంభమైన ఏప్రిల్ నుంచి జూన్ నాటికి అంటే తొలి క్వార్టర్ వరకు రూ.36 కోట్లు వివిధ పథకాల్లో భాగంగా మంజూరు చేశారు. ఆయా ప్రభుత్వ పథకాల్లో ఈ నిధులను విలీనం చేసి పాత జిల్లాల వారీగానే నిధులు కేటాయించారని, ఇవికూడా పూర్తిస్థాయిలో అందలేదని తెలుస్తోంది. ఇక వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలకు నేరుగా రూ.2కోట్ల చొప్పున ఇవ్వడం కుదరకనే దానిని ఎత్తివేశారని సమాచారం.