-
ద్రవిడ్ మళ్లీ దరఖాస్తు చేయాల్సిందే!
ముంబై: టి20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే భారత క్రికెట్ జట్టుకు కొత్త హెడ్ కోచ్ బాధ్యతలు స్వీకరిస్తారని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. దాని కోసం మరికొద్ది రోజుల్లోనే దరఖాస్తులు కోరతామని కూడా ఆయన స్పష్టం చేశారు. భారత జట్టు వరల్డ్ కప్కు బయల్దేరే ముందే ఈ ప్రక్రియ మొదలవుతుందని కూడా జై షా చెప్పారు. గత ఏడాది రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తయిన తర్వాతే కొత్త కోచ్పై చర్చ జరగడంతో కొంత గందరగోళం నెలకొంది. దాంతో ద్రవిడ్నే మరో ఏడాది కొనసాగించారు. ఈసారి అలాంటి స్థితి రాకుండా బోర్డు ముందే జాగ్రత్త పడుతోంది. ఒప్పందం ప్రకారం వచ్చే జూన్లో ద్రవిడ్ పదవీకాలం పూర్తవుతుంది. ద్రవిడ్ మళ్లీ కోచ్గా కొనసాగాలనుకుంటే మళ్లీ దరఖాస్తు చేయాల్సి ఉంటుందని... కొన్ని ఇతర జట్ల తరహాలో వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్లను ఎంపిక చేసే ఆలోచన లేదని కూడా షా పేర్కొన్నారు. కొత్త హెడ్ కోచ్కు మూడేళ్ల పదవీ కాలం ఇస్తామని, 2027 వన్డే వరల్డ్ కప్ వరకు అతను కొనసాగుతాడని బోర్డు కార్యదర్శి ప్రకటించారు. కోచ్ ఎంపిక విషయంలో క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)దే తుది నిర్ణయమన్న షా... విదేశీ కోచ్ అయినా అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్కు చేరని జట్లలో ఉన్న ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది కలిసి మే 24న తొలి బృందంగా టి20 వరల్డ్ కప్ కోసం అమెరికా బయలుదేరతారని జై షా వెల్లడించారు. ఐపీఎల్లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనను ప్రయోగాత్మకంగానే పెట్టామని, అవసరమైతే దీనిపై మళ్లీ చర్చించి కొనసాగించాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లను బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో చేర్చకపోవడంలో తన పాత్ర ఏమీ లేదని... ఇది పూర్తిగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నిర్ణయమని ఆయన సందేహ నివృత్తి చేశారు. -
శ్రేయస్, ఇషాన్ల వేటు పడటానికి కారణం అతడే: జై షా
టీమిండియా స్టార్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్టులు కోల్పోవడానికి తాను కారణం కాదన్నాడు భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా. సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం మాత్రమే తన విధి అని తెలిపాడు.కాగా దక్షిణాఫ్రికా పర్యటన నుంచి మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్.. రంజీల్లో ఆడమని బోర్డు ఆదేశించినా లెక్కచేయలేదు. ఆ తర్వాత వెంటనే ఐపీఎల్-2024 కోసం ముంబై ఇండియన్స్ క్యాంపులో చేరాడు.మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ సైతం రంజీల్లో ముంబై తరఫున బరిలోకి దిగకుండా ఫిట్నెస్ కారణాలు సాకుగా చూపాడు. అయితే, ఎన్సీఏ అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది. ఈ క్రమంలో తాజా సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ఈ ఇద్దరి పేర్లు గల్లంతయ్యాయి.ఆ తర్వాత అయ్యర్ ముంబై తరఫున రంజీ బరిలో దిగినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో వీరిద్దరికి టీ20 వరల్డ్కప్-2024 జట్టులోనూ చోటు దక్కలేదు.అతడి నిర్ణయం ప్రకారమేఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్టులు కోల్పోయిన అంశంపై జై షా తాజాగా స్పందించాడు. ‘‘బీసీసీఐ రాజ్యాంగాన్ని గమనించండి.సెలక్షన్ మీటింగ్లో చర్చించిన విషయాల గురించి మీడియాకు తెలియజేసే కన్వీనర్ను మాత్రమే నేను.ఆ ఇద్దరిని దేశవాళీ క్రికెట్ ఆడాలని నిర్ణయించిందీ.. అదే విధంగా వారు చెప్పినట్లు వినలేదని సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తప్పించిందీ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.అతడు తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడమే నా పని. వాళ్లిద్దరు వెళ్లినా సంజూ శాంసన్ లాంటి వాళ్ల రూపంలో కొత్త ఆటగాళ్లకు చోటు దక్కింది కదా!’’ అని జై షా జాతీయ మీడియాతో వ్యాఖ్యానించాడు.అయ్యర్ అదుర్స్... ఇషాన్ ఫెయిల్కాగా ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నారు. ముంబై ఇండియన్స్ తరఫున ఓపెనర్గా వస్తున్న ఇషాన్ ఇప్పటి వరకు 12 ఇన్నింగ్స్లో కలిపి 266 పరుగులు మాత్రమే చేశాడు.మరోవైపు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం 11 ఇన్నింగ్స్లో 280 పరుగులు చేయడంతో పాటు.. ఈ సీజన్లో జట్టును ప్లే ఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా నిలిపే పనిలో ఉన్నాడు. చదవండి: ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్ -
ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్
టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా హెడ్కోచ్ మారబోతున్నాడా? అంటే అవుననే అంటున్నాడు భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా. కొత్త కోచ్గా భారతీయ క్రికెటర్ లేదంటే విదేశీ ఆటగాడైనా రావొచ్చని సంకేతాలు ఇచ్చాడు.కాగా పొట్టి వరల్డ్కప్-2021 తర్వాత రవిశాస్త్రి స్థానంలో మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అతడి మార్గదర్శనంలో అన్ని ఫార్మాట్లలో ప్రపంచ నంబర్ వన్గా నిలిచిన భారత జట్టు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయింది.టైటిల్ పోరులో రాణించలేకటీ20 ప్రపంచకప్-2022లో సెమీస్లోనే ఇంటిబాట పట్టిన రోహిత్ సేన.. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ 2021-23, వన్డే వరల్డ్కప్-2023 టోర్నీల్లో ఫైనల్ చేరినా టైటిల్ గెలవకలేకపోయింది. ఆఖరి మెట్టుపై ఆస్ట్రేలియా చేతిలో బోల్తాపడి ట్రోఫీని చేజార్చుకుంది.ఇదిలా ఉంటే.. వాస్తవానికి భారత్ వేదికగా ప్రపంచకప్-2023 పూర్తయ్యేనాటికి రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం పూర్తైంది. ఈ క్రమంలో టీ20 వరల్డ్కప్ వరకు ద్రవిడ్ను కోచ్గా కొనసాగాల్సిందిగా బోర్డు కోరడంతో అతడు సమ్మతించినట్లు వార్తలు వచ్చాయి.ద్రవిడ్ గుడ్బై/ ద్రవిడ్కు గుడ్బై?అయితే, తాజా సమాచారం ప్రకారం ద్రవిడ్ తన పదవీకాలాన్ని పొడిగించుకునేందుకు సుముఖంగా లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త కోచ్ వేటలో పడింది. ఇందుకు సంబంధించి త్వరలోనే ప్రకటన విడుదల చేయనుంది.ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా స్వయంగా వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘రాహుల్ పదవీ కాలం జూన్ వరకు పూర్తవుతుంది. ఒకవేళ అతడు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని భావిస్తే.. అప్లై చేసుకోవచ్చు. ఆ స్వేచ్ఛ అతడికి ఉంది.కొత్త కోచ్గా ఫారినర్?ఇక కొత్త కోచ్ ఇండియన్ లేదంటే ఫారినర్ అన్న విషయం గురించి ఇప్పుడే చెప్పలేం. క్రికెట్ అడ్వైజరీ కమిటీ నిర్ణయానుసారమే కోచ్ నియామకం జరుగుతుంది’’ అని జై షా క్రిక్బజ్తో వ్యాఖ్యానించాడు.అలాంటిదేమీ లేదు!అదే విధంగా.. భిన్న ఫార్మాట్లకు భిన్న కోచ్ల గురించి ప్రస్తావన రాగా.. ‘‘ఈ విషయంలో కూడా క్రికెట్ అడ్వైజరీ కమిటీదే తుది నిర్ణయం. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషభ్ పంత్.. ఇలా చాలా మంది మూడు ఫార్మాట్లలో ఆడుతున్న క్రికెటర్లు ఉన్నారు. కానీ కోచ్ల విషయంలో అలా జరిగే ఆస్కారం లేదు’’ అంటూ కొట్టిపారేశాడు. చదవండి: రోహిత్ ముంబైని వీడటం ఖాయం.. ఆ తర్వాత అయ్యర్ కెప్టెన్సీలో! -
Rohit Sharma: మా జట్టు గుండె చప్పుడు!.. వీడియో వైరల్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టినరోజు నేడు(ఏప్రిల్ 30). హిట్మ్యాన్ మంగళవారం నాడు 37వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.బీసీసీఐ కార్యదర్శి జై షా సహా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, గౌతం గంభీర్, వసీం జాఫర్ తదితరులు రోహిత్ శర్మకు విషెస్ తెలిపారు. ఇక హిట్మ్యాన్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఐపీఎల్ ముంబై ఇండియన్స్ అతడి బర్త్డే గిఫ్ట్గా ఫ్యాన్స్ కోసం ప్రత్యేక వీడియోను షేర్ చేసింది.మా జట్టు గుండె చప్పుడు‘‘భారత క్రికెట్లో ఉత్తుంగతరంగంలా దూసుకుపోతున్న మా కెప్టెన్ రోహిత్ శర్మకు హ్యాపీ బర్త్డే! నీ నాయకత్వ పటిమ, నైపుణ్యం అమోఘం. మా జట్టు గుండె చప్పుడు నువ్వు.బౌండరీలు బాదుతూ.. మరో వసంతంలోకి! చరిత్ర పుటల్లోకెక్కిన హిట్మ్యాన్.. నువ్వు మరింత ప్రకాశవంతంగా వెలిగిపోవాలి’’ అని జై షా ఆకాంక్షించాడు.సోదర సమానుడు‘‘ఆయురారోగ్యాలు, సంతోషాలతో నువ్వెప్పుడూ విలసిల్లాలి రోహిత్’’ అంటూ గంభీర్ విష్ చేశాడు. ఇక యువీ.. ‘‘సోదర సమానుడు రోహిత్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ బ్యాట్ నుంచి మరిన్ని పరుగులు జాలువారాలి’’ అని విషెస్ తెలిపాడు.కాగా ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్న ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ భార్య రితికాతో కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇందులో సూర్యకుమార్ యాదవ్, అతడి భార్య దేవిషా శెట్టి కూడా కనిపిస్తున్నారు. కాగా ముంబై మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. HBD Rohit Sharma: హిట్మ్యాన్ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్ ఇదే! -
T20 WC: జట్టు ఎంపిక ఫైనల్.. అతడిపై వేటు తప్పదా?
టీ20 ప్రపంచకప్-2024 జట్టు ప్రకటనకు సమయం ఆసన్నమైంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనబోయే ఆటగాళ్లు ఎవరన్న చర్చకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ ఆతిథ్యంలో ఈ ఐసీసీ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ప్రపంచకప్లో భాగమయ్యే ఇరవై జట్ల ఎంపికను మే 1 వరకు ఖరారు చేయాల్సిందిగా అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆయా దేశాలను ఆదేశించింది.ఈ క్రమంలో ఇప్పటికే న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించగా.. టీమిండియా కూడా అనౌన్స్మెంట్కు సిద్ధమైంది. జట్టు ఎంపిక గురించి ఇప్పటికే బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం.ఢిల్లీలో వీరు ముగ్గురు ఆదివారం సమావేశమై తీసుకున్న నిర్ణయం గురించి బీసీసీఐ కార్యదర్శి జై షాతో మంగళవారం చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఫిట్నెస్, వికెట్ కీపర్ ఎంపిక గురించి మేనేజ్మెంట్ తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.పాండ్యా గనుక బౌలింగ్ చేస్తే అదనపు పేసర్ అవసరం ఉండదు. కానీ అతడి ఫిట్నెస్ దృష్ట్యా బౌలర్గా పూర్తిస్థాయిలో బరిలోకి దిగే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు.. వికెట్ కీపర్ కోటాలో రిషభ్ పంత్తో పాటు సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ పోటీపడుతున్నారు.వీరిలో సంజూ ఐపీఎల్-2024లో దుమ్ములేపుతుండగా.. పంత్ కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. రాహుల్ కూడా బాగానే ఆడుతున్న నిలకడలేమి ఫామ్ కలవరపెడుతోంది.అతడిపై వేటు తప్పదా?మరోవైపు.. ఓపెనింగ్ స్లాట్లో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి పేరు దాదాపుగా ఖరారు కాగా.. బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్ మధ్య పోటీ నెలకొంది. అయితే, మేనేజ్మెంట్ మాత్రం ఈ విషయంలో జైస్వాల్వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. జట్టు ప్రకటన తర్వాతే వరల్డ్కప్లో పాల్గొనబోయే 15 మంది భారత ఆటగాళ్ల గురించి స్పష్టతరానుంది. -
ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐపీఎల్-2024 భారత్లోనే?
క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. లోక్ సభ ఎన్నికల కారణంగా ఐపీఎల్-2024 సెకెండ్ ఫేజ్ను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు గత కొన్ని రోజుల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై బీసీసీఐ సెక్రటరీ జై షా స్పందించారు. రెండో దశ మ్యాచ్లు కూడా భారత్లోనే జరగనున్నట్లు జై షా సృష్టం చేశారు. "ఈ ఏడాది సీజన్ మొత్తం ఇండియాలోనే జరగనుంది. విదేశాల్లో నిర్వహించే ఆలోచన లేదని" క్రిక్బజ్తో జైషా పేర్కొన్నారు. కాగా ఇప్పటికే తొలి ఫేజ్ షెడ్యూల్ను బీసీసీఐ రిలీజ్ చేసింది. తొలి దశలో కేవలం 22 మ్యాచ్లకు షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 22న ఈ క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో చెపాక్ వేదికగా ఆర్సీబీ, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అయితే మరోవారంలో పూర్తి షెడ్యూల్ను కూడా బీసీసీఐ విడుదల చేయనుంది. మరోవైపు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం రిలీజ్ చేసింది. ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జూన్ 1 వరకు లోక్సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. -
మొహమ్మద్ షమీకి సంబంధించి బిగ్ అప్డేట్
టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీకి సంబంధించి బీసీసీఐ కార్యదర్శి జై షా బిగ్ అప్డేట్ ఇచ్చారు. షమీ ఈ ఏడాది సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో (స్వదేశంలో) జరిగే టెస్ట్ సిరీస్ సమయానికి అందుబాటులోకి వస్తాడని షా తెలిపారు. షా స్టేట్మెంట్ను బట్టి చూస్తే షమీ టీ20 వరల్డ్కప్తో పాటు ఐపీఎల్ ఆడడని ఖరారైపోయింది. లండన్లో చీలిమండ గాయానికి శస్త్రచికిత్స చేసుకుని ఇటీవలే స్వదేశానికి వచ్చిన షమీ.. గతేడాది భారత్లో జరిగిన వన్డే వరల్డ్కప్ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. జై షా షమీ హెల్త్ అప్డేట్ ఇస్తున్న సందర్భంగానే మరో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్కు సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు. వెన్ను సమస్యతో బాధపడుతున్న రాహుల్.. ఐపీఎల్ ఆరంభ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని షా తెలిపారు. ఎన్సీఏ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రాహుల్కు ఇంజెక్షన్ అవసరముందని షా పేర్కొన్నారు. వెన్ను సమస్య కారణంగా రాహుల్ ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లోని చివరి నాలుగు మ్యాచ్లకు దూరమయ్యాడు. కాగా, జై షా వీరిద్దరి గురించే కాకుండా మరో టీమిండియా ఆటగాడి హెల్త్ గురించి కూడా అప్డేట్ ఇచ్చడు. 2022లో కారు ప్రమాదానికి గురై ప్రస్తుతం ఎన్సీఏ రీహ్యాబ్లో ఉన్న రిషబ్ పంత్ పూర్తిగా కోలుకున్నాడని షా తెలిపారు. పంత్ మునపటిలా బ్యాటింగ్ చేస్తున్నాడని పేర్కొన్నారు. త్వరలోనే పంత్కు ఎన్ఓసీ ఇస్తామని షా వెల్లడించారు. -
బీసీసీఐ సంచలనం.. ఒక్కో మ్యాచ్కు ఏకంగా రూ. 45 లక్షలు
టెస్టు క్రికెట్ ప్రాధాన్యం పెంచేలా భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా కీలక ప్రకటన చేశాడు. టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమును ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించాడు. పురుషుల సీనియర్ జట్టులో భాగమైన క్రికెటర్లకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపాడు. ఆటగాళ్లను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు.. వారి ఆదాయంలో నిలకడ ఉండేలా తోడ్పడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జై షా పేర్కొన్నాడు. 2022-23 సీజన్ నుంచి టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమును అమలు చేస్తామని.. టెస్టు క్రికెట్ ఆడేవాళ్లకు ఇదొక అదనపు రివార్డు అని ఈ సందర్భంగా వెల్లడించాడు. ఒక్కో మ్యాచ్కు రూ. 45 లక్షలు ఒక సీజన్లో టీమిండియా షెడ్యూల్లో తొమ్మిది టెస్టులు ఉన్నాయనకుంటే.. ఇందులో నాలుగు కంటే తక్కువ మ్యాచ్లు ఆడిన క్రికెటర్లకు ఇన్సెంటివ్స్ ఉండవు. అయితే, 5-6 మ్యాచ్లలో భాగమై తుదిజట్టులో ఆడితే 30 లక్షల చొప్పున.. బెంచ్కే పరిమితం అయితే 15 లక్షల చొప్పున ఫీజు చెల్లిస్తారు. అదే విధంగా.. 7 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్లలో భాగమై తుదిజట్టులో ఆడితే రూ. 45 లక్షలు, బెంచ్కే పరిమితం కావాల్సి వస్తే 22.5 లక్షల చొప్పున చెల్లించనున్నారు. టీమిండియా విజయం తర్వాత ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా విజయం తర్వాత జై షా ఈ ప్రకటన చేయడం విశేషం. కాగా నామమాత్రపు ఆఖరి మ్యాచ్లో రోహిత్ సేన ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా సిరీస్ను 4-1తో సొంతం చేసుకుంది. బజ్బాల్ అంటూ ఇంగ్లండ్ అలా.. బీసీసీఐ ఇలా బజ్బాల్ అంటూ సంప్రదాయ క్రికెట్ రూపురేఖల్నే మార్చేలా ఇంగ్లండ్ దూకుడైన ఆట తీరుతో ముందుకు సాగుతుంటే.. బీసీసీఐ మాత్రం ఈ ఫార్మాట్కు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఇలాంటి ప్రకటన చేయడం గమనార్హం. జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు కచ్చితంగా రంజీలో ఆడాలంటూ నిబంధన విధించిన బోర్డు.. ఆదేశాలను ధిక్కరించిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ల సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి టెస్టు క్రికెట్కు తాము పెద్దపీట వేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ ఈ మేరకు భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించింది. చదవండి: IND Vs ENG 5th Test: అందుకే రోహిత్ అవుట్!.. కెప్టెన్గా బుమ్రా.. బీసీసీఐ చెప్పిందిదే I am pleased to announce the initiation of the 'Test Cricket Incentive Scheme' for Senior Men, a step aimed at providing financial growth and stability to our esteemed athletes. Commencing from the 2022-23 season, the 'Test Cricket Incentive Scheme' will serve as an additional… pic.twitter.com/Rf86sAnmuk — Jay Shah (@JayShah) March 9, 2024 That series winning feeling 😃#TeamIndia 🇮🇳 complete a 4⃣-1⃣ series victory with a remarkable win 👏👏 Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vkfQz5A2hy — BCCI (@BCCI) March 9, 2024 -
Virat Kohli: కోహ్లి సెలవులు.. స్పందించిన జై షా! కీలక వ్యాఖ్యలు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా అండగా నిలిచాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా సెలవు తీసుకోవడం అతడి హక్కు అంటూ కోహ్లి నిర్ణయాన్ని సమర్థించాడు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు కోహ్లి దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన బ్యాటర్ లేకుండానే బరిలోకి దిగిన టీమిండియా తొలి మ్యాచ్లో ఓడినా.. రెండో టెస్టులో గెలిచింది. తిరిగి పుంజుకుని సిరీస్ను ప్రస్తుతం 1-1తో సమం చేసి.. రాజ్కోట్లో మూడో టెస్టులో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లి ఈ కీలక సిరీస్కు దూరం కావడానికి గల కారణం ఇంత వరకు వెల్లడి కాలేదు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. కోహ్లి భార్య అనుష్క శర్మ గర్భవతి అని, ప్రెగ్నెన్సీ సమయంలో తలెత్తిన ఇబ్బందుల కారణంగానే విదేశాల్లో చికిత్స తీసుకునేందుకు వెళ్లారని ప్రచారం జరుగుతోంది. అయితే, బీసీసీఐ మాత్రం ఇంగ్లండ్తో ఆఖరి మూడు టెస్టులకు కోహ్లి అందుబాటులో లేడని ప్రకటించిన సమయంలో.. అతడి నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని పేర్కొంది. తాజాగా ఈ విషయం గురించి బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించాడు. రాజ్కోట్ టెస్టు ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన క్రమంలో ఎదురైన ప్రశ్నలకు బదులిస్తూ.. ‘‘ఒక వ్యక్తి.. తన పదిహేనేళ్ల కెరీర్లో వ్యక్తిగత కారణాలు చూపి సెలవు అడగటం అతడి హక్కు. విరాట్ కారణం లేకుండా సెలవు అడిగే వ్యక్తి కాదు. మా ఆటగాడిపై మాకు నమ్మకం ఉంది. మేము కచ్చితంగా అతడికి అండగా ఉంటాం’’ అని జై షా స్పష్టం చేశాడు. అదే విధంగా.. టీ20 ప్రపంచకప్-2024లో విరాట్ కోహ్లి ఆడతాడా లేదా అన్న అంశం గురించి ప్రస్తావన రాగా.. ఈ విషయం గురించి తర్వాత మాట్లాడదాం అంటూ సమాధానం దాటవేశాడు. అయితే, ఈ ప్రపంచకప్ టోర్నీలో రోహిత్ శర్మనే కెప్టెన్గా వ్యవహరిస్తాడని జై షా స్పష్టం చేశాడు. కాగా ఇషాన్ కిషన్ మానసికంగా అలసిపోయానంటూ సెలవు తీసుకుని.. విదేశాల్లో పర్యటించడం.. కోచ్ రంజీల్లో ఆడమని చెప్పినా ఆడకపోవడం వంటి అంశాలపై బీసీసీఐ పెద్దలు గుర్రుగా ఉన్నారన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. జై షా.. కోహ్లి సెలవుల గురించి ఇలా కామెంట్ చేయడం గమనార్హం. అంతేకాదు.. ఇషాన్ పేరెత్తకుండానే చీఫ్ సెలక్టర్, కోచ్, కెప్టెన్ చెప్పిన మాట వినకపోతే వేటు తప్పదని హెచ్చరికలు జారీ చేశాడు జై షా! చదవండి: BCCI: సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లకు జై షా వార్నింగ్.. ఇకపై -
టీమిండియా కోచ్ పదవిపై కీలక ప్రకటన చేసిన జై షా
బీసీసీఐ కార్యదర్శి జై షా టీమిండియా కోచ్ పదవిపై కీలక ప్రకటన చేశాడు. ఈ ఏడాది జూన్లో జరిగే టీ20 వరల్డ్కప్ వరకు భారత జట్టు ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడే కొనసాగుతాడని స్పష్టం చేశాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య రాజ్కోట్ వేదికగా ఇవాళ మొదలైన మూడో టెస్ట్కు ముందు షా మాట్లాడుతూ ఇలా అన్నాడు. వరల్డ్కప్ ముగిశాక ద్రవిడ్తో మాట్లాడే అవకాశం దొరకలేదు. ఆతర్వాత కూడా టీమిండియా వరుస సిరీస్లతో బిజీ కావడంతో ద్రవిడ్తో ఎలాంటి మాటామంతి జరపలేదు. రాజ్కోట్ టెస్ట్కు ముందు ద్రవిడ్తో మాట్లడే అవకాశం దొరికింది. టీ20 వరల్డ్కప్ వరకు అతన్నే కోచ్గా కొనసాగాలని కోరాం. అందుకు ద్రవిడ్ కూడా సానుకూలంగానే స్పందించాడు. అనుభవజ్ఞుడైన ద్రవిడ్ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. అతను టీమిండియాను సమర్దవంతంగా ముందుండి నడిపించగలడు. అతని మార్గనిర్దేశకం భారత జట్టు టీ20 వరల్డ్కప్లో రాణిస్తుందన్న నమ్మకం ఉంది. ద్రవిడ్తో పాటు సహాయక కోచింగ్ సిబ్బంది మొత్తం వరల్డ్కప్ వరకు యధాతథంగా కొనసాగుతారని షా స్పష్టం చేశాడు. దీనికి ముందే షా మరో కీలక ప్రకటన కూడా చేశాడు. టీ20 వరల్డ్కప్లో రోహిత్ శర్మనే టీమిండియా కెప్టెన్గా ఉంటాడని స్పష్టం చేశాడు. కాగా, భారత క్రికెట్ జట్టుతో రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ గతేడాది చివర్లో జరిగిన వన్డే వరల్డ్కప్తో ముగిసిందన్న విషయం తెలిసిందే. అయితే రాహుల్ సేవల పట్ల సంతృప్తి చెందిన బీసీసీఐ అతన్ని మరో దఫా కోచ్గా కొనసాగాలని విజ్ఞప్తి చేసింది. అనేక సంప్రదింపుల అనంతరం రాహుల్ బీసీసీఐ ప్రతిపాదనకు ఒప్పుకుని హుటాహుటిన సౌతాఫ్రికా పర్యటనకు బయల్దేరాడు. అప్పట్లో కాంట్రాక్ట్ పొడిగింపుపై ఎలాంటి ప్రకటన చేయని బీసీసీఐ.. తాజాగా ద్రవిడ్ కొనసాగింపుపై స్పష్టమైన హామీ ఇచ్చింది. ఇదిలా ఉంటే, రాజ్కోట్ టెస్ట్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా తొలి రోజు టీ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (10), శుభ్మన్ గిల్ (0), రజత్ పాటిదార్ (5) నిరాశపరచగా.. రోహిత్ శర్మ (97 నాటౌట్), రవీంద్ర జడేజా (68 నాటౌట్) టీమిండియాను ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 152 పరుగులు జోడించి, టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించే దిశగా తీసుకెళ్తున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 2, టామ్ హార్ట్లీ ఓ వికెట్ పడగొట్టారు. -
BCCI: టీమిండియా క్రికెటర్లకు జై షా వార్నింగ్.. ఇకపై
Jay Shah’s Stern Message to Central Contract Players: టీమిండియా సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగి ఉన్న క్రికెటర్లను ఉద్దేశించి బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రధాన ఆటగాళ్లు కచ్చితంగా రంజీల్లో ఆడాల్సిందేనని స్పష్టం చేశాడు. లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. కాగా భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్- బీసీసీఐకి మధ్య విభేదాలంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తనకు విశ్రాంతి కావాలంటూ సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన ఈ జార్ఖండ్ బ్యాటర్ను దేశవాళీ క్రికెట్లో ఆడాల్సిందిగా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆదేశించాడు. అయితే, మేనేజ్మెంట్ ఆదేశాలను బేఖాతరు చేసిన ఇషాన్ కిషన్ ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ సెషన్తో బిజీ అయ్యాడు. ఫలితంగా బోర్డు పెద్దల ఆగ్రహానికి గురైన అతడు.. సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోనున్నాడనే ఊహాగానాలు వినిపించాయి. అంతేగాకుండా.. ఇకపై సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లు కనీసం 3-4 రంజీ మ్యాచ్లు ఆడితేనే బీసీసీఐ.. ఐపీఎల్లో ఆడే అవకాశం ఇస్తుందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ అంశాలపై స్పందించాడు. ‘‘తాము దేశవాళీ క్రికెట్కు అందుబాటులో ఉండటం లేదని కొంతమంది ఫోన్ కాల్ ద్వారా సమాచారం ఇచ్చారు. అయితే, అందుకు బదులుగా నేను వారికి లేఖ రూపంలో జవాబు ఇవ్వదలచుకున్నాను. కచ్చితంగా రెడ్ బాల్ క్రికెట్ ఆడాల్సిందే ఒకవేళ సెలక్షన్ కమిటీ చైర్మన్, కోచ్, కెప్టెన్ చెబితే మాత్రం కచ్చితంగా రెడ్ బాల్ క్రికెట్ ఆడాల్సిందే అని చెప్తాను. ఎవరైనా ఆటగాడు ఫిట్గా ఉన్నాడా లేదా? అతడు పరిమిత ఓవర్లు, టెస్టు క్రికెట్ రెండూ ఆడగలడా లేదా అన్న విషయాల గురించి ఎన్సీఏ నుంచి సలహాలు తీసుకుంటాం. అందరికీ వర్తిస్తుంది అందుకు అనుగుణంగానే మా నిర్ణయాలు ఉంటాయి. అయితే, ఫిట్గా ఉన్న ఆటగాళ్లు.. ముఖ్యంగా యువ క్రికెటర్లకు ఎలాంటి మినహాయింపులు ఉండవు. కచ్చితంగా దేశవాళీ రెడ్ బాల్ క్రికెట్ ఆడాల్సిందే. సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగి ఉన్న అందరు భారత క్రికెటర్లకూ ఇది వర్తిస్తుంది’’ అని జై షా కుండబద్దలు కొట్టాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు ఆరంభానికి ముందు సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియం పేరు మార్చారు. సౌరాష్ట్ర క్రికెట్ పాలనా విభాగంలో సేవలు అందించిన నిరంజన్ షా స్టేడియంగా నామకరణం చేశారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన జై షా ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. చదవండి: #Sarfaraz Khan: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. తండ్రి, భార్య కన్నీటి పర్యంతం -
T20 World Cup 2024: టీమిండియా కెప్టెన్పై బీసీసీఐ క్లారిటీ
టి20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా కెప్టెన్ ఎవరన్న అంశంపై బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టతనిచ్చారు రోహిత్ శర్మనే భారత జట్టును ఈ మెగా టోర్నీలో ముందుకు నడిపిస్తాడని పేర్కొన్నారు. అదేవిధంగా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడని జై షా క్లారిటీ ఇచ్చారు. కాగా జూన్ 4 నుంచి టి20 వరల్డ్ కప్ టోర్నీ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ ఐసీసీ ఈవెంట్ కు వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. -
ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా జై షా
-
Jay Shah: 32 ఏళ్ల వయసులో తొలిసారి.. ముచ్చటగా మూడోసారి
బీసీసీఐ కార్యదర్శి జై షా మరోసారి ఆసియా క్రికెట్ మండలి(ఏసీసీ) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇండోనేషియాలోని బాలిలో ఏసీసీ బుధవారం వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఇందులో భాగంగా జై షాను తమ చీఫ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 32 ఏళ్ల వయసులో తొలిసారి.. కాగా జై షా ఏసీసీ బాస్గా ఎన్నికకావడం ఇది వరుసగా మూడోసారి. నజ్ముల్ హుసేన్ స్థానంలో 2021లో తొలిసారిగా అధ్యక్ష పదవిని చేపట్టిన ఆయన.. ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా నిలిచారు. అప్పటికి జై షాకు 32 ఏళ్లు. ఇక తాజా సమావేశంలో సభ్యుల నిర్ణయానికి అనుగుణంగా జై షా పదవీ కాలం కొనసాగనుంది. కాగా బీసీసీఐలో కీలక వ్యక్తిగా ఉన్న ఆయన.. ఏసీసీలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. కోవిడ్ సమయంలో బాస్గా బాధ్యతలు స్వీకరించి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ప్రతీ విషయంలోనూ తనదైన ముద్ర ఇక గతేడాది ఆసియా కప్-2023 హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడంలో జై షా కీలక పాత్ర పోషించారు. ఈవెంట్ నిర్వహణ హక్కులు దక్కించుకున్న పాకిస్తాన్కు టీమిండియాను పంపే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. పాక్ పంతం వీడకపోతే.. ప్రత్యామ్నాయాలు వెదుక్కోవాల్సి ఉంటుందని హెచ్చరించి శ్రీలంక- పాక్ వేదికగా టోర్నీని నిర్వహించేలా జై షా ఏర్పాట్లు చేశారు. టీమిండియా ఆడే మ్యాచ్లన్నింటికీ లంక ఆతిథ్యం ఇచ్చింది. ఇక ఈ దఫా వన్డే ఫార్మాట్లో నిర్వహించిన ఆసియా కప్ ఈవెంట్ ఫైనల్లో టీమిండియా శ్రీలంకను ఓడించి విజేతగా అవతరించింది. కాగా భారత హోం మంత్రి అమిత్ షా కుమారుడే జై షా అన్న విషయం తెలిసిందే. చదవండి: Ind vs Eng 2nd Test: ఇంగ్లండ్కు షాక్.. కీలక స్పిన్నర్ దూరం -
ఐసీసీ కీలక పదవికి గురిపెట్టిన జై షా.. అందుకోసం ఏకంగా!
బీసీసీఐ సెక్రటరీ జై షా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చైర్మెన్ పదవికి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ అధ్యక్షుడి పదవి కోసం జైషా ప్రస్తుతం ఉన్న పోస్టులను వదులుకోనేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జై షా బీసీసీఐ సెక్రటరీగానే కాకుండా ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. ఈ ఏడాది నవంబర్లో ఐసీసీ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఒకవేళ జైషా ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆయన ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్, బీసీసీఐ సెక్రటరీ పదవులను వదులుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఎలక్షన్స్ కంటే ముందే జై షా ఏసీసీ చైర్మెన్ పదవికి గుడ్బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇండోనేషియాలోని బాలిలో రాబోయే రెండు రోజుల్లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ వార్షిక సాధారణ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో జైషా తన నిర్ణయాన్ని వెల్లడించే ఛాన్స్ ఉంది. ఈ సమావేశాల్లో ఆసియా కప్ 2025 వేదికపై కూడా ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. కాగా 2019లో బీసీసీఐ కార్యదర్శిగా జైషా పగ్గాలు చేపట్టాడు. అంతకంటే ముందు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా కూడా జైషా పనిచేశాడు. -
బీసీసీఐ కార్యదర్శి జై షాకు అరుదైన గౌరవం.. భారత క్రీడారంగంలో తొలి లీడర్గా..!
ఇండియన్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్లో ఏ వ్యక్తికి దక్కని అరుదైన గౌరవం బీసీసీఐ కార్యదర్శి జై షాకు దక్కింది. షా.. 2023 సంవత్సరానికి గానూ బెస్ట్ స్పోర్ట్స్ బిజినెస్ లీడర్గా ఎంపికయ్యాడు. ఈ అవార్డును కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ప్రకటించింది. స్పోర్ట్స్ బిజినెస్ అవార్డ్స్లో భాగంగా ఈ అవార్డును ప్రతి ఏటా ప్రకటిస్తారు. షాతో పాటు రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ, డాక్టర్ సమంత కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. CONGRATULATIONS to BCCI Honorary Secretary @JayShah on being awarded the Sports Business Leader of the Year Award at the @FollowCII Sports Business Awards 2023. A first for any leader in Indian Sports administration, this recognition is truly deserved! His leadership has left an… pic.twitter.com/FkPYyv9PI3 — BCCI (@BCCI) December 5, 2023 క్రీడా రంగానికి సంబంధించిన వ్యాపారంలో అసాధారణ నాయకత్వం కనబర్చినందుకు గాను ఈ ముగ్గురు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. షా ఆధ్వర్యంలో ఇటీవల వన్డే వరల్డ్కప్, దానికి ముందు శ్రీలంకలో ఆసియా కప్ జరిగిన విషయం తెలిసిందే. షా ప్రత్యేక చొరవతోనే మహిళల ఐపీఎల్ (WPL) పురుడుపోసుకుంది. ఇతని ఆధ్వర్యంలోనే మహిళా క్రికెటర్లకు పురుష క్రికెటర్లతో సమాన వేతన హక్కు లభించింది. షా తన నాయకత్వ లక్షణాలతో ప్రపంచ క్రికెట్ను కూడా ప్రభావితం చేశాడు. ఇటీవల భారత్లో జరిగిన వన్డే ప్రపంచకప్-2023కు విజయవంతంగా నిర్వహించడం ద్వారా అతనికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. క్రికెట్ను ఒలింపిక్స్లో చేర్చే విషయంలోనూ షా కీలకపాత్ర పోషించాడు. క్రికెట్కు అతను చేసిన ఈ సేవలను గుర్తించే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ఉత్తమ స్పోర్ట్స్ బిజినెస్ లీడర్గా ఎంపిక చేసింది. -
ద్రవిడ్ తనేంటో నిరూపించుకున్నాడు.. వరల్డ్కప్లో కూడా: జై షా
మిండియా హెడ్ కోచ్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. భారత జట్టు హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలాన్ని బీసీసీఐ పొడిగించింది. అతడితో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కాంట్రాక్ట్లను కూడా బీసీసీఐ పెంచింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి జైషా మాట్లాడుతూ.. భారత క్రికెట్ బోర్డు నుంచి పూర్తి మద్దతు ద్రవిడ్కు ఉంటుందని తెలిపాడు. కాగా ద్రవిడ్ కొత్త కాంట్రాక్ట్ వివరాలను మాత్రం బోర్డు బహిర్గతం చేయలేదు. అయితే వచ్చ ఏడాది టీ20 వరల్డ్కప్కు ద్రవిడ్ హెడ్కోచ్ పదవిలో కొనసాగే ఛాన్స్ ఉంది. "భారత ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ ద్రవిడ్ను మించిన గొప్ప వ్యక్తి లేడని నేను ముందే చెప్పాను. ద్రవిడ్ మరోసారి తన నిబద్ధతతో జట్టు కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. ద్రవిడ్ తన కాంట్రాక్ట్ను పొడిగించేందుకు ఒప్పుకోవడంతో టీమిండియా యూనిట్ మరింత బలంగా మారనుంది. ఇప్పటికే అతడి నేతృత్వంలో టీమిండియా మూడు ఫార్మాట్లలో నెం1 జట్టుగా అవతరించింది. ఇది ఒక్కటి చాలు అతడి కోచింగ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి. కోచ్గా తనంటో ద్రవిడ్ నిరూపించుకున్నాడు. వన్డే వరల్డ్కప్లో కూడా భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. వరుసగా 10 మ్యాచ్లు గెలిచిన తర్వాత దురదృష్టవశాత్తూ ఫైనల్లో ఓటమిపాలైంది. హెడ్కోచ్ ద్రవిడ్కు బోర్డు నుంచి ఎల్లప్పడూ సపోర్ట్ ఉంటుంది. భారత జట్టును అంతర్జాతీయ స్దాయిలో మరింత అద్బుతంగా ముందుకు నడిపించాలని ఆశిస్తున్నాని" జై షా పేర్కొన్నాడు. కాగా ద్రవిడ్ తిరిగి మళ్లీ దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు జట్టుతో కలవనున్నాడు. -
జై షాకు క్షమాపణలు చెప్పిన శ్రీలంక ప్రభుత్వం..
శ్రీలంక క్రికెట్ను నాశనం చేశడంటూ బీసీసీఐ సెక్రటరీ, ఏసీసీ అధ్యక్షుడు జై షాపై ఆ దేశ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై శ్రీలంక ప్రభుత్వం స్పందించింది. రణతుంగ చేసిన వ్యాఖ్యలపై జైషాకు శ్రీలంక ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది. శ్రీలంక పార్లమెంట్లో మంత్రి కాంచన విజేశేఖర మాట్లాడుతూ.. మా ప్రభుత్వం తరపున ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛీఫ్ జై షాకు క్షమాపణలు తెలుపుతున్నాము. మా బోర్డులోని లోపాలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ కార్యదర్శి లేదా ఇతర దేశాలపై రుద్దలేము. ఇది మంచి పద్దతి కాదు అని పేర్కొన్నారు. అస్సలు ఏం జరిగిందంటే? వన్డే ప్రపంచకప్ 2023లో పేలవ ప్రదర్శనతో శ్రీలంక లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కార్యవర్గాన్ని ఆ దేశ ప్రభుత్వం రద్దు చేసింది. టీమిండియాతో జరిగిన మ్యాచ్లో ఘోర పరాజయం అనంతరం శ్రీలంక క్రీడల మంత్రి రోషన్ రణసింఘే ఎస్ఎల్సీ కార్యవర్గాన్ని రద్దు చేశారు. అనంతరం మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ సారథ్యంలో ఏడుగురు సభ్యులతో మధ్యంతర కమిటీని నియమించారు. అంతలోనే శ్రీలంకకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా బిగ్షాకిచ్చింది. శ్రీలంక క్రికెట్ బోర్డులో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని సీరియస్గా పరిగణించిన ఐసీసీ ఆ జట్టు సభ్యత్వాన్ని రద్దు చేసంది. ఈ క్రమంలో ఓ స్ధానిక వార్తపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రుణతుంగా మాట్లాడుతూ.. "శ్రీలంక క్రికెట్ బోర్డులో కొంతమంది అధికారులకు జై షాతో మంచి సంబంధాలు ఉన్నాయి. శ్రీలంక క్రికెట్ ఈ స్ధాయికి దిగజారడానికి కారణం అతడే. భారత్లో ఉంటూ శ్రీలంక బోర్డును సర్వనాశనం చేస్తున్నాడు. అతను చాలా పవర్ఫుల్. ఎందుకంటే అతని తండ్రి భారత్ హోమ్ మినిస్టర్" అని సంచలన ఆరోపణలు చేశాడు. చదవండి: World Cup 2023: ఆస్ట్రేలియా-భారత్ ఫైనల్కు అంపైర్లు ఖారారు.. లిస్ట్లో ఐరన్ లెగ్ అంపైర్ -
సర్వనాశనం చేశాడు.. జై షాపై శ్రీలంక మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
వన్డే వరల్డ్కప్ 2023లో ఘోర వైఫల్యాలను ఎదుర్కొని, లీగ్ దశలోనే ఇంటిబాట పటిన శ్రీలంక ఇంటాబయటా ముప్పేట దాడిని ఎదుర్కొంటుంది. వరల్డ్కప్ నుంచి అవమానకర రీతిలో నిష్క్రమించిన అనంతరం ఆ దేశ క్రీడా మంత్రి రోషన్ రణసింఘే బోర్డు మొత్తాన్ని రద్దు చేశాడు. ఆపై బోర్డు అంతర్గత వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తీవ్రంగా పరిగణించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శ్రీలంక క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్ వేటు వేసింది. తమ క్రికెట్ బోర్డుకు పట్టిన దుస్థితి నేపథ్యంలో ఆ దేశ వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తమ దేశ క్రికెట్కు ఈ గతి పట్టడానికి బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా కారణమని సంచలన ఆరోపణలు చేశాడు. తమ బోర్డు అధికారులతో ఉన్న సత్సంబంధాల కారణంగా షా మాపై పెత్తనం చెలాయిస్తున్నాడని ఆరోపించాడు. తన తండి (అమిత్ షా) అధికారాన్ని అడ్డుపెట్టుకుని జై షా లంక క్రికెట్ను శాశిస్తున్నాడని ధ్వజమెత్తాడు. జై షా అనవసర జోక్యం కారణంగానే లంక క్రికెట్కు ఈ దుస్థితి దాపురించిందని వాపోయాడు. జై షాను ఉద్దేశిస్తూ రణతుంగ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్లో దుమారం రేపుతున్నాయి. కాగా, ప్రస్తుత వరల్డ్కప్లో శ్రీలంక ఘోర ప్రదర్శన కనబర్చి లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. ఆ జట్టు ఆడిన 9 మ్యాచ్ల్లో కేవలం 2 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈ కారణంగా శ్రీలంక 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అర్హత సాధించలేకపోయింది. ఈ టోర్నీలో లంక క్రికెట్ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్పై విజయం సాధించడం. మరోవైపు భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్కు చేరుకున్నాయి. బుధవారం జరుగబోయే తొలి సెమీఫైనల్లో భారత్.. న్యూజిలాండ్తో తలపడనుంది. -
వైజాగ్లో కొత్త అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం.. బీసీసీఐ కార్యదర్శి జై షా హామీ
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం నిర్మాణానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా హామీ ఇచ్చారు. సోమవారం గోవాలో జరిగిన బీసీసీఐ 92వ వార్షికోత్సవ సమావేశంలో షా ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెద్దలకు మాట ఇచ్చారు. బీసీసీఐ వార్షికోత్సవ సమావేశానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పి. శరత్ చంద్రారెడ్డి, సెక్రటరీ ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డి, ట్రెజరర్ ఎ.వి. చలం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్ర క్రికెట్కు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి బీసీసీఐ అధ్యక్షులు రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా, ఉపాధ్యక్షులు రాజీవ్ శుక్లా తదితరులతో ఏసీఏ అధ్యక్షులు శరత్ చంద్రారెడ్డి, సెక్రటరీ గోపినాథ్ రెడ్డి చర్చించారు. త్వరలో జై షా వైజాగ్కు వస్తానని హామీ ఇచ్చినట్లు ఏసీఏ పెద్దలు వెల్లడించారు. -
వారణాసి క్రికెట్ స్టేడియం ఆ మహాదేవుడికే అంకితం: ప్రధాని మోదీ
Varanasi International Cricket Stadium Foundation Ceremony Highlights: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, టీమిండియా దిగ్గజాలు కపిల్ దేవ్, సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా తదితరులు కూడా హాజరయ్యారు. #WATCH | PM Modi lays the foundation stone of an international cricket stadium in Uttar Pradesh's Varanasi pic.twitter.com/5sAh2wZ5eA — ANI (@ANI) September 23, 2023 సంతోషంగా ఉంది: యూపీ సీఎం కాగా సుమారు రూ. 451 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ స్టేడియం నిర్మాణం.. 2025, డిసెంబరు నాటికి పూర్తికానున్నట్లు సమాచారం. ఇక శంకుస్థాపన సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. బీసీసీఐ తొలిసారిగా ఆధ్యాత్మిక నగరం వారణాసిలో అంతర్జాతీయస్థాయి క్రికెట్ స్టేడియం నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కాశీకి విచ్చేసిన ప్రధాని మోదీ సహా క్రికెట్ ప్రముఖులకు క్రీడా ఔత్సాహికుల అందరి తరఫున తాను స్వాగతం పలుకుతున్నానని పేర్కొన్నారు. బీసీసీఐ, మోదీజీకి ధన్యవాదాలు అదే విధంగా.. కేంద్ర ప్రభుత్వ పథకం స్మార్ట్ సిటీ మిషన్ కింద స్టేడియం నిర్మాణం చేపట్టారని.. ఉత్తరప్రదేశ్లో ఇది మూడో అంతర్జాతీయ స్టేడియం అని యోగి పేర్కొన్నారు. బీసీసీఐ పర్యవేక్షణలో దీని నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు. యూపీతో పాటు బిహార్లో గల వర్ధమాన క్రికెటర్లకు ఈ స్టేడియం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యూపీకి ఇంత గొప్ప బహుమతి ఇచ్చిన బీసీసీఐ, ప్రధాని నరేంద్ర మోదీకి యోగి ఆదిత్యనాథ్ ధన్యవాదాలు తెలిపారు. #WATCH | Varanasi, UP: "PM Modi is laying the foundation stone for International Cricket Stadium Varanasi by the Board of Control for Cricket in India (BCCI) in Uttar Pradesh for the first time. I welcome PM Modi on behalf of every sports enthusiast in the state," says Uttar… pic.twitter.com/CL4xhbPXZG — ANI (@ANI) September 23, 2023 ఆ మహదేవుడికే అంకితం: ప్రధాని మోదీ వారణాసి స్టేడియం శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘మహదేవుడి నగరంలో నిర్మిస్తున్న ఈ స్టేడియం ఆ మహదేవుడికే అంకితం. కాశీలో ఉన్న క్రికెట్ ఔత్సాహికులకు ఈ స్టేడియం ఎంతగానో ఉపయోగపడుతుంది. పూర్వాంచల్ ప్రాంతం మొత్తానికి తారలా వెలుగొందుతుంది’’ అని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆసియా క్రీడలు-2023లో పాల్గొంటున్న భారత అథ్లెట్లు, క్రీడా జట్లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. #WATCH | This stadium in the city of 'Mahadev' will be dedicated to 'Mahadev' himself. The sportspersons here will benefit from the construction of an international stadium in Kashi. This stadium will become the star of Purvanchal region: PM Modi on the foundation stone laying of… pic.twitter.com/bgh8bErN2l — ANI (@ANI) September 23, 2023 #WATCH | Asian Games will begin from today. I send my good wishes to all the athletes participating in the Games: PM Modi in Varanasi pic.twitter.com/hXzePvaRPM — ANI (@ANI) September 23, 2023 శివతత్వం ఉట్టిపడేలా చారిత్రాత్మక నగరంలో నిర్మించతలపెట్టిన వారణాసి క్రికెట్ స్టేడియాన్ని శివతత్వం ఉట్టిపడేలా.. ప్రేక్షకులు ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయేలా రూపొందించనున్నారు. సీటింగ్ ప్లేస్ పైకప్పు అర్ధచంద్రాకారం, ఫ్లడ్లైట్లు త్రిశూలం, ఓవైపు ఎంట్రన్స్ ఢమరుకాన్ని పోలి ఉండేలా నిర్మాణాలు చేపట్టనున్నారు. సుమారు 30 వేల మంది సీటింగ్ కెపాసిటీతో నిర్మించనున్న ఈ స్టేడియం కోసం యూపీ ప్రభుత్వం సుమారు 121 కోట్లు వెచ్చించి భూమి సేకరించినట్లు సమాచారం. ఇందులో ఏడు పిచ్లను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. చదవండి: శుబ్మన్ గిల్ అరుదైన ఘనత.. సచిన్ ఆల్ టైమ్ రికార్డు బద్దలు! -
కాశీ విశ్వనాథుని దర్శించుకున్న టీమిండియా దిగ్గజాలు.. వీడియో వైరల్
Varanasi International Cricket Stadium: ‘క్రికెట్ దేవుడు’ సచిన్ టెండుల్కర్ కాశీ విశ్వనాథుని దర్శించుకున్నాడు. స్వామివారికి అభిషేకం చేసి భక్తిభావం చాటుకున్నాడు. కాగా ఉత్తరప్రదేశ్లోని చారిత్రాత్మక నగరం వారణాసిలో అంతర్జాతీయస్థాయి స్టేడియం నిర్మించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సమాయత్తమైన విషయం తెలిసిందే. కాశీ విశ్వేశ్వరుడు కొలువైన ఈ ఆధ్యాత్మిక నగరంలో శివతత్వం ఉట్టిపడేట్లుగా సీటింగ్ స్థలం అర్ధ చంద్రాకారంలో.. ఫ్లడ్లైట్స్ త్రిశూలాన్ని స్ఫురించేలా.. ఎంట్రీ ఢమరుకాన్ని పోలి ఉండేలా నిర్మించనున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ స్టేడియానికి శనివారం శంకుస్థాపన చేశారు. కాశీ విశ్వనాథునిరి టీమిండియా దిగ్గజాల అభిషేకం ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజాలు.. వరల్డ్కప్ విజేతలు కపిల్ దేవ్, సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్ ఇప్పటికే వారణాసికి చేరుకున్నారు. వీరితో పాటు బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా అక్కడికి వెళ్లారు. వీరంతా కలిసి విశ్వనాథుని దర్శించుకుని పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా వారణాసి స్టేడియం నిర్మాణం డిసెంబరు 2025 నాటికి పూర్తికానున్నట్లు సమాచారం. దీంతో యూపీలోని లక్నోలో గల భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియం, కాన్పూర్లోని గ్రీన్ పార్క్ క్రికెట్ స్టేడియం తర్వాత మూడో స్టేడియంగా ఇది చరిత్రలో నిలిచిపోనుంది. వారణాసి స్టేడియం నిర్మాణానికి సుమారు 451 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. #WATCH | Uttar Pradesh: Former Indian cricketers Sachin Tendulkar Sunil Gavaskar and Kapil Dev, BCCI Secretary Jay Shah, Rajeev Shukla, BCCI Vice-President, offered prayers at Kashi Vishwanath temple in Varanasi (Video source - PRO Vishwanath Temple) pic.twitter.com/pWc1qWmOqR — ANI (@ANI) September 23, 2023 -
రజినీకాంత్కు వన్డే ప్రపంచకప్ గోల్డెన్ టికెట్..
భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 మరో 15 రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం బీసీసీఐ ప్రత్యేక చొరవ తీసుకుంది. భారత్లోని దిగ్గజాలకు ప్రత్యేక టిక్కెట్లు ఇవ్వాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఇందులో భాగంగా 'గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్' అని పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే బాలీవుడ్ లెజెండ్ అబితాబ్ బచ్చన్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు బీసీసీఐ ఈ గోల్డెన్ టికెట్ను అందజేసింది. తాజాగా సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్కు వన్డే ప్రపంచకప్-2023 గోల్డెన్ టికెట్ను బీసీసీఐ అందించింది. బీసీసీఐ కార్యదర్శి జై షా నేరుగా వెళ్లి గోల్డన్ టికెట్ను అందించి టోర్నీకి ఆహ్వానించారు. ఈ మెరకు బీసీసీఐ ఓ ట్విట్ చేసింది. "బీసీసీఐ కార్యదర్శి జైషా బంగారు టిక్కెట్ను రజినీకాంత్కు అందించారు.భాషలు, సంస్కృతులకు అతీతంగా కోట్లాది మంది హృదయాల్లో దిగ్గజ నటుడు రజినీకాంత్ చెరగని ముద్రవేశారు. తలైవా విశిష్ట అతిథిగా హాజరై టోర్నీకి మరింత వెలుగు తెస్తారని తెలియజేయడానికి సంతోషం ఇస్తున్నామని" బీసీసీఐ ఎక్స్(ట్విటర్)లో రాసుకొచ్చింది. కాగా ఈ గోల్డన్ టిక్కెట్ కలిగి ఉన్న వ్యక్తులు ప్రపంచ కప్ 2023 లోని అన్ని మ్యాచ్లను వీఐపీ స్టాండ్ నుండి ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది. చదవండి: #Shaheen Afridi: రెండోసారి పెళ్లి చేసుకున్న షాహీన్ ఆఫ్రిది.. హాజరైన బాబర్ ఆజం! ఫోటోలు వైరల్ -
జైషాను పాకిస్తాన్కు ఆహ్వానించిన పీసీబీ..
ఆసియాకప్-2023కు మరో 10 రోజుల్లో తెరలేవనుంది. ముల్తాన్ వేదికగా ఆగస్టు 30న జరగనున్న పాకిస్తాన్- నేపాల్ మ్యాచ్తో ఈ మెగాటోర్నీ షురూ కానుంది. ఈ క్రమంలో ఆసియాకప్ ఓపెనింగ్ మ్యాచ్కు హాజరు కావల్సిందగా బీసీసీఐ కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు జై షాకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆహ్వానం పంపింది. అదే విధంగా డర్బన్లో జరిగిన ఐసీసీ సమావేశంలో పీసీబీ చైర్మన్ జాకా అష్రఫ్ కూడా మౌఖికంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తల మధ్య జైషా పాకిస్తాన్కు వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాగా వాస్తవానికి ఈ ఏడాది ఆసియాకప్ పాకిస్తాన్ వేదికగా జరగాల్సింది. కానీ పాకిస్తాన్కు తమ జట్టును పంపేందుకు బీసీసీఐ నిరరారించడంతో ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించకుంది. ఈ మెగా ఈవెంట్లో శ్రీలంక, పాకిస్తాన్ వేదికలగా జరగనుంది. ఈ టోర్నీలోని నాలుగు మ్యాచ్లు మాత్రమే పాకిస్తాన్లో జరగనుండగా.. మిగితా మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే జరగనున్నాయి. ఈ ఈవెంట్ కోసం పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ తమ జట్లను ప్రకటించగా.. భారత జట్టును బీసీసీఐ ఒకట్రెండు రోజుల్లో వెల్లడించే ఛాన్స్ ఉంది. చదవండి: World Cup 2023: వన్డే ప్రపంచకప్కు భారత జట్టు.. ఎవరూ ఊహించని ఆటగాడు ఎంట్రీ! -
జై షా బీసీసీఐ సెక్రటరీ ఎలా అయ్యాడు?.. అమిత్ షాకు ఉదయనిధి స్టాలిన్ కౌంటర్
సాక్షి, చెన్నై: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై తమిళనాడు క్రీడామంత్రి ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. డీఎంకే పార్టీ వారసత్వ పార్టీ అని తమిళనాడులో వారసత్వ రాజకీయాలు ఉన్నాయంటూ అమిత్షా చేసిన వ్యాఖ్యలకు ఉదయనిధి స్టాలిన్ కౌంటర్ వేశారు. కేంద్ర మంత్రి కొడుకు జై షాకు ఏ అర్హత ఉందని బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) సెక్రటరీ పదవి కట్టబెట్టారని ప్రశ్నించారు. కాగా అమిత్ షా శుక్రవారం తమిళనాడులో పర్యటించిన విషయం తెలిసిందే. రామేశ్వరంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ కే అన్నామలై పాదయాత్రను ప్రారంభించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పూర్తి అవినీతి పార్టీ అని, మిత్రపక్షలతో కలిసి వారసత్వ రాజకీయాలను ప్రొత్సహిస్తుందని విమర్శలు గుప్పించారు. అదే విధంగా డీఎంకేను కుటుంబ పార్టీగా అభివర్ణించారు. చదవండి: ఉమేశ్ పాల్ హత్య కేసులో గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ లాయర్ అరెస్టు.. తాజాగా చెన్నైలో ఏర్పాటు చేసిన డీఎంకే యువజన విభాగం నూతన కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్ని అమిత్ షా ఆరోపణలపై విరుచుకుపడ్డారు. తాను ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాతే మంత్రి అయ్యానని పేర్కొన్నారు. తనను ముఖ్యమంత్రిని చేయాలన్నదే డీఎంకే నేతల ధ్యేయమని అమిత్ షా చెబుతున్నారని, మరి మీ కొడుకు(జై షా) బీసీసీఐ సెక్రటరీ ఎలా అయ్యాడని ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. జే ఎన్ని క్రికెట్ మ్యాచ్లు ఆడారని, ఆయన ఎన్ని పరుగులు సాధించాడని ఉదనినిధి స్టాలిన్ అమిత్ షాను ప్రశ్నించాడు. తన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. (జాతీయ విపత్తు కింద రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూ.900 కోట్లు: కిషన్ రెడ్డి)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
స్టార్ డైరెక్టర్తో నయనతార కొత్త సినిమా
టీవీ సీరియల్ మేకప్మెన్ దారుణ హత్య
మీరు నా కెరీర్ రైలు దిగనందుకు కృతజ్ఞతలు
Today Horoscope: ఈ రాశి వారికి ఇంటిలో వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
వడాపావ్ మంత్రం: పద్మాసని విజయరహస్యం
కాకిస్నూరు.. ఓటింగ్లో సూపర్..
వెల్లివిరిసిన మహిళా చైతన్యం
ఎయిరిండియా–విస్తారా విలీన ప్రక్రియలో పురోగతి
ఓటు వేసేందుకు వచ్చి మృత్యువాత
సైన్స్, టెక్నాలజీలో మహిళా గ్రాడ్యుయేట్లు పెరగాలి
తప్పక చదవండి
- కాకిస్నూరు.. ఓటింగ్లో సూపర్..
- వెల్లివిరిసిన మహిళా చైతన్యం
- ఎయిరిండియా–విస్తారా విలీన ప్రక్రియలో పురోగతి
- సైన్స్, టెక్నాలజీలో మహిళా గ్రాడ్యుయేట్లు పెరగాలి
- విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
- రాజ్యాంగ పరిరక్షణే ప్రధానం: కేజ్రీవాల్
- వైఎస్సార్సీపీ ఏజెంట్పై టీడీపీ మూకల హత్యాయత్నం
- Amit Shah: కేజ్రీవాల్కు స్పెషల్ ట్రీట్మెంట్ !
- తిరుపతిలో 144 సెక్షన్ కొనసాగింపు
- USA Presidential Elections 2024: బైడెన్, ట్రంప్ రె‘ఢీ’
Advertisement