Jay Shah
-
అమిత్ షా కొడుకు పేరుతో వసూళ్లు.. మోసగాడి అరెస్ట్
డెహ్రాడూన్:కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు,ఐసీసీ ఛైర్మన్ జై షాపేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరాఖండ్కు చెందిన ప్రియాంషు పంత్ (19) జై షా పేరు చెప్పి ఇక్కడి ఎమ్మెల్యే ఆదేశ్ చౌహాన్కు ఫోన్ చేశాడు.తనను అమిత్ షా కుమారుడు జై షాగా పరిచయం చేసుకొని పార్టీ కోసం రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.అనుమానం వచ్చిన ఎమ్మెల్యే ప్రశ్నించగా తమ మధ్య జరిగిన సంభాషణను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.దీంతో ఎమ్మెల్యే మోసగాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు మొదలు పెట్టిన పోలీసులు మోసానికి పాల్పడుతున్న ప్రియాంశు పంత్ను ఢిల్లీలో అరెస్టు చేశారు. అయితే నిందితుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా జై షా పేరుతో ఫోన్ చేసి డబ్బులిస్తే మంత్రి పదవులు ఇప్పిస్తానని చెప్పినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.విలాసవంతమైన జీవితం గడిపేందుకే పంత్ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. -
2032 ఒలింపిక్స్లోనూ క్రికెట్ను కొనసాగించాలి..!
లూసానే: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ జై షా మంగళవారం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్తో భేటీ అయ్యారు. త్వరలో లూసానేలోనే ఐఓసీ ఉన్నతస్థాయి అధికారులు పాల్గొనే అసాధారణ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మేటి క్రీడా కమిటీల చీఫ్ల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెలాఖరున (30వ తేదీ) జరిగే ఈ కీలకమైన సమావేశంలో క్రికెట్ను ఒలింపిక్స్లో కొనసాగించే అంశంపై చర్చ జరుగనుంది. దీంతో ఈ చర్చ కంటే ముందుగా జై షా, థామస్ బాచ్లు అ అంశంపై అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఐసీసీ సోషల్ మీడియాలో ఇద్దరి ఫొటోను పోస్ట్ చేసింది. ‘లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్లో టి20 ఫార్మాట్లో క్రికెట్ ఈవెంట్ జరగనుంది. అయితే 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్లో క్రికెట్ ఉంటుందా లేదా అన్నది ఇంకా ఖరారు కాలేదు. దాంతో తదుపరి విశ్వక్రీడల్లోనూ క్రికెట్ క్రీడను కొనసాగించే విషయంపై ప్రాథమిక దశ సంప్రదింపులు మొదలయ్యాయి. ఐసీసీ చైర్మన్ జై షా ఈ అంశమై ఐఓసీ చీఫ్ బాచ్తో సమావేశమయ్యారు’ అని ఐసీసీ ‘ఎక్స్’లో ట్వీట్ చేసింది. -
జై షాకు సన్మానం
ముంబై: భారత్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ అయిన జై షాను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఘనంగా సన్మానించనుంది. రేపు జరిగే ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం)లో ఐసీసీ నూతన చైర్మన్ను సన్మానించనున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. బోర్డు సెక్రటరీగా ఉన్న జై షా గతేడాది ఆగస్టులో జరిగిన ఐసీసీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అతిపిన్న వయసులో ఐసీసీ చైర్మన్ అయిన క్రికెట్ పరిపాలకుడిగా ఘనత వహించారు. అయితే మాజీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే పదవీ కాలం నవంబర్ 30 వరకు ఉండటంతో జై షా కాస్త ఆలస్యంగా డిసెంబర్ 1న పదవీ బాధ్యతలు చేపట్టారు. 2019 అక్టోబర్ నుంచి బోర్డు కార్యదర్శిగా, 2021 జనవరి నుంచి ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) చైర్మన్గా కీలకపాత్ర పోషించిన జై షా ఇప్పుడు ఐసీసీ పీఠాన్ని అధిరోహించారు. నిజానికి బీసీసీఐ ఆఫీస్ బేరర్ కాకపోవడంతో ఎస్జీఎంలో జై షా పాల్గొనేందుకు వీల్లేదు. అయితే మీటింగ్కు ముందు లేదంటే తర్వాత ఆయన్ని సత్కరించే అవకాశముంది. -
USA: ‘వరల్డ్ కప్ తర్వాత క్రికెట్ స్థాయి పెరిగింది’
సాక్షి, హైదరాబాద్: అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవలి కాలంలోనే క్రికెట్ కొత్తగా అభివృద్ధి చెందుతోంది. 2024 టి20 వరల్డ్ కప్ టోర్నీ నిర్వహణతో స్థానికుల దృష్టి దీనిపై పడగా... 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో క్రికెట్ కూడా భాగం కావడంతో మరింత ఎక్కువ మందికి ఆసక్తి పెరుగుతోంది. అయితే అమెరికన్లు పెద్దగా పట్టించుకోని సమయంలో ఆటను వారికి చేరువ చేయడంలో యూఎస్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్, తెలుగు వ్యక్తి వేణుకుమార్ రెడ్డి పిసికె పాత్ర ఎంతో ఉంది. నల్లగొండకు చెందిన వేణు గత ఆరేళ్లుగా యూఎస్లో క్రికెట్ను విస్తృతం చేయడంలో ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆటను అమెరికన్లు తమదిగా భావించి ఇతర క్రీడల్లాగే ప్రాధాన్యత ఇచ్చేలా చేయడమే తన లక్ష్యమని వేణు ‘సాక్షి’తో చెప్పారు. ఇటీవలే భారత్కు వచ్చిన ఆయన బీసీసీఐ ఉన్నతాధికారులను కలిసి అమెరికా క్రికెట్ అభివృద్ధి కోసం సహకారాన్ని కూడా కోరారు. ‘టి20 వరల్డ్ కప్ను విజయవంతంగా నిర్వహించగలిగాం. భారత్, పాకిస్తాన్లతో అమెరికా తలపడిన మ్యాచ్లకు స్థానిక అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. పాక్పై గెలుపుతో అమెరికన్లు కూడా ఫలితాలపై ఆసక్తి చూపించారు. ఇప్పుడు మా ముందు ఒలింపిక్స్ రూపంలో పెద్ద లక్ష్యం ఉంది. వచ్చే రెండేళ్లలో క్రికెట్ వారికి మరింత చేరువ చేయడమే మా లక్ష్యం’ అని వేణు రెడ్డి అన్నారు. 1998లో ఐటీ నిపుణుడిగా యూఎస్కు వెళ్లి ఆపై సగటు భారత క్రికెట్ అభిమాని తరహాలో అక్కడ క్రికెట్ టోర్నీలు, క్యాంప్లు నిర్వహిస్తూ వేణు ఆటకు ప్రాచుర్యం పెంచారు. ముఖ్యంగా స్కూల్, కాలేజీలలో టీమ్లను తయారు చేయడం ద్వారా ప్రతిభను గుర్తించే అవకాశం దక్కింది. ‘సహజంగానే భారత్ నుంచి వచ్చిన వారు, భారత మూలాల ఉన్నవారే క్రికెట్ వైపు వచ్చారు. అందరూ ఇతర ఉద్యోగాల్లో ఉంటూ క్రికెట్ ఆడేందుకు వచ్చేవారే. వేర్వేరు రాష్ట్రాల్లో కూడా ఆటకు ప్రాచుర్యం కల్పించేందుకు వాలంటీర్లు ముందుకు వచ్చారు. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు యూఎస్ జట్టు సభ్యులకు మ్యాచ్ ఫీజులు ఇస్తున్నాం. ఇదంతా ఇన్నేళ్లలో అమెరికా క్రికెట్లో వచి్చన మార్పు గురించి చెబుతుంది’ అని వేణు వివరించారు.అయితే ఇప్పటికీ అసలైన అమెరికన్లు కాకుండా ఇతర దేశాల నుంచి వస్తున్న వారే యూఎస్ క్రికెట్ జట్లలో ఎక్కువగా ఉండటం వాస్తవమేనని ఆయన అంగీకరించారు. దీనిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, అలా జరిగితే క్రికెట్ కూడా యూఎస్లో ఇతర క్రీడల్లా దూసుకుపోతుందని వేణు అభిప్రాయపడ్డారు. ‘టి20 వరల్డ్ కప్ సమయంలో పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రతిష్టాత్మక మీడియా కంపెనీలు క్రికెట్పై బాగా దృష్టి పెట్టాయి. అండర్–11 స్థాయి నుంచి అండర్–23 వరకు ఇప్పుడు వరుసగా టోర్నీలు నిర్వహిస్తున్నాం. ఈ దశలో పెద్ద సంఖ్యలో అమెరికన్లు భాగమవుతున్నారు. జాతీయ జట్టుకు ఎంపిక చేసే ముందుకు జరిగే సెలక్షన్స్లో వీరంతా పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో యూఎస్ టీమ్లో మనవారు మాత్రమే కాకుండా అమెరికన్లను కూడా చూడవచ్చు. అయితే భారతీయుల్లో మన తెలుగువారు కూడా యూఎస్ క్రికెటర్లుగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం సంతోషకరం. సీనియర్ మహిళల క్రికెట్లో పగడ్యాల చేతనా రెడ్డి ఇటీవల 136 పరుగులు చేసి అరంగేట్రంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచింది’ అని వేణు గుర్తు చేశారు. ఐసీసీ టోర్నీల్లో మినహా ద్వైపాక్షిక సిరీస్లు ఆడే అవకాశం అమెరికాకు ఎక్కువగా రావడం లేదని... భారత్లోని రంజీ టీమ్లతో మ్యాచ్లు ఏర్పాటు చేసి తమ ఆటను మెరుగుపర్చుకునే అవకాశం ఇవ్వాలని ఇటీవల ఐసీసీ చైర్మన్ జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాలకు విజ్ఞప్తి చేసినట్లు వేణు వెల్లడించారు. ఆసియా కప్ తరహాలో ‘నార్త్ అమెరికన్ చాంపియన్షిప్’ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశామని, త్వరలోనే ఈ టోర్నీ జరుగుతుందని ఆయన చెప్పారు. 2018 నుంచి యూఎస్సీఏలో డైరెక్టర్గా అడుగు పెట్టిన వేణు 2023లో చైర్మన్గా ఎన్నికయ్యారు. తన పదవీ కాలంలో యూఎస్ జట్టు 2024 టి20 టోర్నీ (ఆతిథ్య జట్టు హోదాలో), 2026 టి20 వరల్డ్ కప్కు అర్హత సాధించిందని... 2027 వన్డే వరల్డ్ కప్కు క్వాలిఫై కావాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు వేణు రెడ్డి స్పష్టం చేశారు. -
ICC: జై షా కీలక ముందడుగు.. చిన్న జట్ల పాలిట శాపం?!
టెస్టు క్రికెట్ మనుగడ కోసం సిరీస్లకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త తరహా మార్పుల గురించి యోచిస్తోంది. సంప్రదాయ ఫార్మాట్పై మరింత ఆసక్తి పెంచేందుకు, ఎక్కువ సంఖ్యలో హోరాహోరీ సమరాలు చూసేందుకు టెస్టులను.. రెండు శ్రేణుల్లో( 2- Tier Test cricket) నిర్వహించాలని భావిస్తోంది. టెస్టు మ్యాచ్లు ఎక్కువగా ఆడే మూడు ప్రధాన జట్లు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లతో ఒక శ్రేణి... ఇతర జట్లు కలిపి మరో శ్రేణిలో ఉండే విధంగా ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. దీని అమలు, విధివిధానాలపై ఇంకా స్పష్టత లేకున్నా... ఐసీసీ చైర్మన్గా జై షా(Jay Shah) ఎంపికయ్యాక పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.సీఏ, ఈసీబీ చైర్మన్లతో చర్చలుఈ అంశంపై చర్చించేందుకు ఈ నెలలోనే క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చైర్మన్ మైక్ బెయిర్డ్, ఈసీబీ చైర్మన్ రిచర్డ్ థాంప్సన్లతో జై షా చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రకటించిన భవిష్యత్తు పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ) 2027తో ముగుస్తుంది. ఆ తర్వాతి నుంచి కొత్త విధానాన్ని తీసుకురావాలని ఐసీసీ అనుకుంటోంది. తీవ్రంగా వ్యతిరేకించిన చిన్న జట్లునిజానికి ఇలాంటి ప్రతిపాదన 2016లో వచ్చింది. అయితే ఇలా చేస్తే తమ ఆదాయం కోల్పోవడంతో పాటు పెద్ద జట్లతో తలపడే అవకాశం కూడా చేజారుతుందని జింబాబ్వే, బంగ్లాదేశ్ సహా పలు జట్లు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి.ఈ నేపథ్యంలో ఐసీసీ అప్పట్లో ఈ ఆలోచనను పక్కన పెట్టింది. అయితే ఇప్పుడు దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ ఇది ముందుకు వచ్చింది. టాప్–3 జట్ల మధ్యే ఎక్కువ మ్యాచ్లు చూడాలని అభిమానులు కోరుకుంటారని, ఆ మ్యాచ్లే అత్యంత ఆసక్తికరంగా సాగి టెస్టు క్రికెట్ బతికిస్తాయంటూ మాజీ క్రికెటర్ రవిశాస్త్రి(Ravi Shastri) తదితరులు ఈ తరహా రెండు శ్రేణుల టెస్టు సిరీస్లకు గతంలోనే మద్దతు పలికారు. పెద్ద జట్టు, చిన్న జట్టు మధ్య టెస్టులు జరిగితే ఎవరూ పట్టించుకోరని అతను ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. అఫ్గానిస్తాన్ టెస్టుల్లో తొలిసారి ఇలా... బులవాయో: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అఫ్గానిస్తాన్ జట్టు రెండు టెస్టులతో కూడిన ద్వైపాక్షిక సిరీస్ను తొలిసారి దక్కించుకుంది. అంతేకాకుండా ఆసియా అవతల తొలి టెస్టు సిరీస్ను తమ ఖాతాలో వేసుకుంది. జింబాబ్వేతో రెండు టెస్టుల సిరీస్లో భాగంగా సోమవారం ముగిసిన రెండో టెస్టులో అఫ్గానిస్తాన్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. 278 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్నైట్ స్కోరు 205/8తో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జింబాబ్వే అదే స్కోరు వద్ద ఆలౌటైంది.కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (103 బంతుల్లో 53; 4 ఫోర్లు, 1 సిక్స్) చివరి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఆఖరి రోజు ఆటలో 15 బంతులు ఎదుర్కొన్న జింబాబ్వే ఒక్క పరుగు కూడా జత చేయకుండా రెండు వికెట్లను కోల్పోయింది. ఇరు జట్ల మధ్య భారీ స్కోర్లు నమోదైన తొలి టెస్టు చివరకు ‘డ్రా’ కావడంతో... ఈ విజయంతో అఫ్గానిస్తాన్ 1–0తో టెస్టు సిరీస్ చేజిక్కించుకుంది. కెరీర్ బెస్ట్ (7/66) ప్రదర్శన కనబర్చిన స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 48 పరుగులు చేసిన రషీద్, 11 వికెట్లు పడగొట్టాడు. రహమత్ షాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ఈ పర్యటనలో భాగంగా టి20 సిరీస్ను 2–1తో గెలుచుకున్న అఫ్గానిస్తాన్ జట్టు వన్డే సిరీస్ను 2–0తో చేజక్కించుకుంది. ఇప్పుడు టెస్టు సిరీస్ కూడా నెగ్గి... పర్యటనను విజయవంతంగా ముగించింది. ఐసీసీ టెస్టు హోదా సాధించిన అనంతరం 11 టెస్టు మ్యాచ్లు ఆడిన అఫ్గానిస్తాన్... అందులో నాలుగు మ్యాచ్ల్లో నెగ్గింది. ఓవరాల్గా అఫ్గానిస్తాన్కు ఇది మూడో టెస్టు సిరీస్ విజయం. తటస్థ వేదికగా 2018–19లో ఐర్లాండ్తో భారత్లో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో గెలిచిన అఫ్గానిస్తాన్ తొలి సిరీస్ కైవసం చేసుకోగా... 2019లో బంగ్లాదేశ్తో ఏకైక టెస్టులోనూ నెగ్గి అఫ్గానిస్తాన్ సిరీస్ పట్టేసింది. ఈ రెండు ఆసియాలో జరగ్గా... ఇప్పుడు తొలిసారి జింబాబ్వే గడ్డపై అఫ్గాన్ టెస్టు సిరీస్ను గెలుచుకుంది. 2020–21లో అఫ్గానిస్తాన్, జింబాబ్వే మధ్య జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ 1–1తో ‘డ్రా’ గా ముగిసింది. చదవండి: ఆసీస్తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు.. : భజ్జీ -
BCCI: కీలక పదవుల భర్తీకి సన్నాహకాలు
బోర్డులో ఇటీవల ఖాళీ అయిన కీలక పదవుల్ని భర్తీ చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమైంది. ఇందులో భాగంగా.. ముంబైలో వచ్చే నెల 12న ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని (ఎస్జీఎమ్) ఏర్పాటు చేసింది. బోర్డు కార్యదర్శిగా ఉన్న జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్గా వెళ్లారు.మరోవైపు.. కోశాధికారి ఆశిష్ షెలార్ మహారాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో కార్యదర్శి, కోశాధికారి పదవులు ఖాళీ అయ్యాయి. బోర్డు నియమావళి ప్రకారం ఏదైన పదవి ఖాళీ అయితే 45 రోజుల్లోగా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎస్జీఎమ్ నిర్వహించాలి.ఈ నేపథ్యంలో గురువారం జరిగిన బోర్డు ఉన్నతస్థాయి సమావేశంలో జనవరి 12న ఎస్జీఎమ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర క్రికెట్ సంఘాలకు సమాచారమిచ్చినట్లు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. కాగా మరో ఏడాది పదవీకాలం మిగిలున్నప్పటికీ జై షా, ఆశిష్లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అస్సామ్కు చెందిన బోర్డు సంయుక్త కార్యదర్శి దేవజిత్ సైకియా తాత్కాలిక కార్యదర్శిగా ఉండగా, కోశాధికారి పదవి బాధ్యతల్ని ఎవరికీ కట్టబెట్టలేదు. చదవండి: అశ్విన్కు వచ్చే పెన్షన్ ఎంతో తెలుసా? -
CT 2025: టీమిండియా మ్యాచ్లన్నీ అక్కడే.. ఐసీసీ నిర్ణయం ఇదే
చాంపియన్స్ ట్రోఫీ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాట నెగ్గింది. బీసీసీఐ పట్టుబట్టినట్లుగానే హైబ్రిడ్ మోడల్తో చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ణయించింది. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీతో శనివారం స్వయంగా ప్రకటన వెలువరించేందుకు ఏర్పాట్లు చేసింది. పీసీబీ చీఫ్ శనివారం ఇందుకు సంబంధించి ప్రకటన చేస్తారని ఐసీసీ వర్గాలు తెలిపాయి.టీమిండియా మ్యాచ్లన్నీ అక్కడేమరోవైపు.. ఐసీసీ చైర్మన్, బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా బ్రిస్బేన్ నుంచి వర్చువల్ ఈ సమావేశంలో పాల్గొని అధికారికంగా ప్రకటన చేస్తారని తెలిసింది. వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో నిర్వహిస్తారు. చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్లు అన్నీ ఇక హైబ్రిడ్ పద్ధతిలోనేఇదొక్క టోర్నీయే కాదు... ఇకపై అన్ని ఐసీసీ టోర్నీలకు చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే మ్యాచ్లు హైబ్రిడ్ పద్ధతిలోనే నిర్వహిస్తారు. అంటే వచ్చే ఏడాది భారత్లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్లో ఆడేందుకు పాకిస్తాన్ ఇక్కడకు రాదు. భారత్ మాదిరే పాక్ మ్యాచ్ల్ని కూడా తటస్థ వేదికపై నిర్వహిస్తారు. అదే విధంగా.. 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే పురుషుల టీ20 ప్రపంచకప్ కూడా హైబ్రిడ్ పద్ధతిలోనే జరుగుతుంది. భద్రతా కారణాల దృష్ట్యాకాగా వన్డే వరల్డ్కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి అర్హత సాధించిన విషయం తెలిసిందే. అయితే, డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ మెగా టోర్నీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది. ఫలితంగా నేరుగా ఈ ఈవెంట్కు క్వాలిఫై అయింది.అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. భారత విదేశాంగ శాఖ సైతం బోర్డు నిర్ణయాన్ని సమర్థించింది. ఈ నేపథ్యంలో అనేక చర్చల అనంతరం టీమిండియా మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహించేందుకు పీసీబీ అంగీకరించింది. వేదిక మొత్తాన్ని తరలిస్తామంటూ ఐసీసీ కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధం కావడంతో పట్టువీడి హైబ్రిడ్ మోడల్కు ఒప్పుకొంది. అయితే, తాము కూడా ఐసీసీ ఈవెంట్ల కోసం ఇకపై భారత్లో పర్యటించబోమన్న షరతు విధించినట్లు తాజా పరిణామాలను బట్టి స్పష్టమవుతోంది.చదవండి: Vijay Merchant Trophy: సెంచరీతో చెలరేగిన ద్రవిడ్ చిన్న కుమారుడు.. బౌండరీల వర్షం -
బీసీసీఐ కార్యదర్శిగా దేవజిత్ సైకియా నియామకం
బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా దేవజిత్ సైకియా నియమించబడ్డాడు. అధ్యక్షుడు రోజర్ బిన్నీ తన ప్రత్యేక అధికారాలు వినియోగించి సైకియాను కార్యదర్శిగా ఎంపిక చేశాడు. సైకియా ప్రస్తుతం బీసీసీఐ జాయింట్ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్నాడు. అసోంకు చెందిన సైకియా మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్. మాజీ కార్యదర్శి జై షా ఐసీసీ పీఠాన్ని అధిరోహించిన నేపథ్యంలో సైకియా నియామకం అనివార్యమైంది. ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన జై షా జోడు పదవుల్లో కొనసాగలేడు. అందుకే అతను బీసీసీఐ కార్యదర్శి పదవికి రాజీనామా చేశాడు. శాశ్వత కార్యదర్శిని ఎప్పుడు నియమిస్తారో తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది సెప్టెంబర్లో బీసీసీఐ ఎన్నికలు జరుగనున్నాయి. అప్పుడే శాశ్వత కార్యదర్శి పదవిని కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. -
ఆటను సమున్నత శిఖరాలకు తీసుకెళ్తా: జై షా
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నూతన చైర్మన్గా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జై షా క్రికెట్ను సమున్నత శిఖరాలకు తీసుకెళ్తానని అన్నారు. గురువారం చైర్మన్గా తొలిసారి ఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన ఆయన మాట్లాడుతూ కొత్త బాధ్యతలు ఉత్తేజంగా పని చేసేందుకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు.‘నేను దేన్నయితే ఆసక్తిగా చూసేవాడినో (క్రికెట్)... అదే ఇప్పుడు నన్ను ప్రోత్సహిస్తుంది. మంచి గుర్తింపును ఇస్తుంది. అయితే నాకిది ఆరంభం మాత్రమే! క్రికెట్ క్రీడకు మరింత సొబగులద్దాలి. ఆట కొత్త శిఖరాలు అధిరోహించేందుకు ఐసీసీ ఉన్నతాధికారులతో కలిసి ఇప్పటి నుంచే కష్టపడతాను. మేమంతా స్పష్టమైన విజన్తో ముందుకెళ్తాం’ అని అన్నారు. కార్యాలయ సందర్శన వల్ల సహచరులతో కలిసి పనిచేసేందుకు చక్కని సమన్వయం కుదురుతుందని, ఆరోగ్యకర వాతావరణం నెలకొంటుందన్నారు. రోడ్మ్యాప్కు అవసరమైన వ్యూహాలు ఇక్కడే మొదలవుతాయన్నారు. అంకితభావంతో పనిచేసే ఐసీసీ బృందంతో ఇలా పనిచేయడం మంచి అనుభూతి ఇస్తుందని పేర్కొన్నారు. జై షాకు సాదర స్వాగతం పలికిన డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా ఐసీసీ కొత్త చైర్మన్ పదవీ కాలంలో మరెన్నో మైలురాళ్లు సాధించాలని ఆకాంక్షించారు.చదవండి: SA vs SL 2nd Test: రికెల్టన్ సెంచరీ.. తొలి రోజు సఫారీలదే -
ఐసీసీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన జై షా
ఐసీసీ నూతన చైర్మన్గా జై షా ఇవాళ (డిసెంబర్ 1) బాధ్యతలు చేపట్టారు. జై షా ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు. జై షా మాజీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. ఐసీసీ చరిత్రలో ఈ పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా జై షా రికార్డు సృష్టించారు. ఐసీసీ చైర్మన్ పదవి కోసం ఈ ఏడాది ఆగస్ట్ల్లో జరిగిన ఎన్నికల్లో జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. షా ప్రస్తుతం ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా, బీసీసీఐ సెక్రటరీగా కొనసాగుతున్నారు. షా ఈ రెండు పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉంది. ఐసీసీ అత్యున్నత హోదాలో ఉండి జోడు పదవుల్లో కొనసాగరాదు. షా ఐసీసీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఐదో భారతీయుడిగా నిలిచారు. గతంలో జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్లుగా కొనసాగారు.ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టాక జై షా ఒక ప్రకటన విడుదల చేశాడు. ఐసీసీ చైర్మన్ పదవి చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఐసీసీ డైరెక్టర్లు మరియు బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. క్రికెట్ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్లో క్రికెట్ను ప్రవేశపెట్టడం తన ముందున్న ప్రధాన కర్తవ్యం అని వెల్లడించారు. వచ్చే ఏడాది పాక్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ షాకు తొలి టోర్నమెంట్ కావడం విశేషం. -
‘ఆసియా క్రికెట్’ మ్యాచ్లన్నీ ఆ నెట్వర్క్లోనే లైవ్ స్ట్రీమింగ్..!
భారత్కు చెందిన సోనీ పిక్చర్స్ నెట్వర్క్ (ఎస్పీఎన్ఐ) ఆసియా క్రికెట్కు సంబంధించి ప్రత్యేక మీడియా హక్కుల్ని దక్కించుకుంది. ఈ మేరకు ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ)తో సోనీ సంస్థ ఎనిమిదేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది (2024) నుంచి 2031 సీజన్ ముగిసేదాకా ఏసీసీ ఆధ్వర్యంలో జరిగే పురుషులు, మహిళల ఆసియా కప్, అండర్–19 ఆసియా కప్, ఎమర్జింగ్ జట్ల ఆసియా కప్ మ్యాచ్లను సోనీ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.ఈ ఒప్పందంలో టెలివిజన్ ప్రసార హక్కులతో పాటు డిజిటల్, ఆడియో మాధ్యమాలకు సంబంధించిన హక్కులు కూడా కలిసి ఉన్నాయి. అయితే ఈ ఒప్పందం విలువ బయటికి వెల్లడించకపోయినప్పటికీ గతంకంటే 70 శాతం ఎక్కువని ఏసీసీ ప్రకటించింది. ఇది ఆసియా క్రికెట్ టోర్నీలకు ఉన్న ఆదరణను తెలియజేస్తోందని ఓ ప్రకటనలో తెలిపింది.ఏసీసీ అధ్యక్షుడు జై షా మాట్లాడుతూ ‘క్రికెట్ నైపుణ్యానికి ఆసియా కప్ మూలస్తంభంలా నిలుస్తోంది. మా కొత్త మీడియా భాగస్వామి సోనీ ప్రపంచ శ్రేణి కవరేజీతో ప్రపంచ వ్యాప్తంగా మరెంతో మంది క్రికెట్ వీక్షకుల్ని సంపాదిస్తుందన్న నమ్మకం ఉంది. పెరిగిన మీడియా హక్కుల విలువతో ఆసియా సభ్యదేశాల్లో మౌళిక సదుపాయాల అభివృద్ధి, క్షేత్రస్థాయిలో క్రికెట్ కార్యక్రమాలు కూడా పెరుగుతాయి’ అని విశ్వాసం వెలిబుచ్చారు. సోనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ దాయాదులు భారత్, పాక్ సహా ఏసీసీ మ్యాచ్లు తమ వీక్షకులకు మరింత వినోదాన్ని పంచుతాయని అన్నారు. -
ఐసీసీ చైర్మన్గా రెండు విడతల్లో కొనసాగనున్న జై షా..!
డిసెంబర్ 1 నుంచి ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్న జై షా రెండు విడతల్లో (చెరి మూడేళ్లు) ఆరేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నాడని తెలుస్తుంది. దుబాయ్ వేదికగా ఇటీవల జరిగిన ఐసీసీ బోర్డు సభ్యుల సమావేశంలో ఈ విషయాన్ని ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ పదవి మూడు విడతల్లో ఆరేళ్ల పాటు ఉంది. ఈ మోడల్లో స్వల్ప మార్పులు చేసినట్లు తెలుస్తుంది.కాగా, జై షా ఇటీవలే ఐసీసీ చైర్మన్గా ఎంపికైన విషయం తెలిసిందే. గ్రెగ్ బార్క్లే స్థానంలో జై షా ఐసీసీ చైర్మన్గా ఎంపికయ్యాడు. బార్క్లే 2020 నుంచి రెండు విడతల్లో ఐసీసీ చైర్మన్గా పని చేశాడు. వాస్తవానికి బార్క్లే పదవీకాలం మరో రెండేళ్ల పాటు ఉండింది. అయితే బార్క్లే వ్యక్తిగత కారణాల చేత చైర్మన్ పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. దీంతో నూతన చైర్మన్గా షా ఎంపికయ్యాడు.మరోవైపు ఐసీసీ ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవి కూడా ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఈ పదవిలో పెప్సీకో చైర్ పర్సన్ ఇంద్రా నూయి మూడు విడతల్లో కొనసాగింది. ఇంద్ర నూయి ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవి నుంచి వైదొలిగినప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది.జై షా తర్వాత ఎవరు..?ఐసీసీ చైర్మన్గా జై షా నియామకం ఖరారైపోయిన విషయం తెలిసిందే. దీంతో బీసీసీఐ కార్యదర్శి పదవి ఎవరు చేపడతారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్త కార్యదర్శి రేసులో ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రోహన్ జైట్లీ ముందున్నట్లు తెలుస్తుంది. రోహన్తో పాటు బీసీసీఐ ట్రెజరర్ ఆశిష్ షెలార్, జాయింట్ సెక్రెటరీ దేవజిత్ సైకియా, గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ అనిల్ పటేల్ కూడా పోటీలో ఉన్నట్లు సమాచారం. -
బీసీసీఐ కొత్త కార్యదర్శి ఎవరో గానీ..: పాక్ క్రికెటర్ విమర్శలు
టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ టెస్టు మ్యాచ్కు వరుస అవాంతరాల నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇంకోసారి ఇలాంటి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించవద్దని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి విజ్ఞప్తి చేశాడు. ఈ మ్యాచ్ టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ అవకాశాలపై ప్రభావం చూపవచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు.డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్లో భాగంగా టీమిండియా బంగ్లాదేశ్తో రెండు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో చెన్నై మ్యాచ్లో 280 పరుగుల తేడాతో గెలుపొందిన రోహిత్ సేన.. రెండో టెస్టులోనూ జయభేరి మోగించి బంగ్లాదేశ్ను క్లీన్స్వీప్ చేయడం ఖాయమనిపించింది. తొలి రోజు 35 ఓవర్ల ఆట మాత్రమే అయితే, వర్షం, వెలుతురులేమి, మైదానం సిద్ధంగా లేకపోవడం వంటి కారణాల వల్ల అది సాధ్యపడేలా కనిపించడం లేదు. శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో తొలి రోజు 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్య పడగా... వరుసగా రెండు రోజులు తుడిచిపెట్టుకుపోయాయి. ఆదివారం వర్షం అంతరాయం కలిగించకపోయినా... క్రితం రోజు కురిసిన వానతో మైదానం చిత్తడిగా మారడం వల్ల ఆట సాధ్యపడలేదు.దీంతో వరుసగా రెండో రోజు ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లకే పరిమితమయ్యారు. పలుమార్లు సమీక్షలు నిర్వహించిన అంపైర్లు టీ విరామ సమయంలో మూడో రోజు ఆటను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్టేడియం నిర్వాహకులను ఉద్దేశించి బసిత్ అలీ మాట్లాడుతూ.. ‘‘వాళ్లు అసలు మైదానాన్ని ఆరబెట్టనేలేదు. జై షా తర్వాత ఎవరైతే బీసీసీఐ కార్యదర్శిగా వస్తారోగత రాత్రి వర్షం లేకపోయినా.. సూపర్ సాపర్స్ ఉన్నా.. సోమవారం ఉదయానికి కూడా గ్రౌండ్ ఇంకా చిత్తడిగానే ఉంది. అంటే.. అక్కడి కవర్స్ సరిగ్గా లేవని అర్థం. జై షా తర్వాత ఎవరైతే బీసీసీఐ కార్యదర్శిగా వస్తారో.. వాళ్లు మాత్రం కాన్పూర్లో ఇంకోసారి టెస్టు మ్యాచ్ నిర్వహించకుండా నిషేధం విధించాలి’’ అని విజ్ఞప్తి చేశాడు. ఇక టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘కాన్పూర్ టెస్టు డ్రాగా ముగిస్తే.. డబ్ల్యటీసీ పాయింట్ల పట్టికలో భారత్ స్థానంపై ప్రభావం పడుతుంది. న్యూజిలాండ్తో మూడు టెస్టుల్లో టీమిండియా గెలుస్తుందని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు.డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలోఅగ్రస్థానంలో టీమిండియా అయితే, అందులో ఒక్క మ్యాచ్ డ్రా అయినా.. రోహిత్ సేన చిక్కుల్లో పడుతుంది. ఏదేమైనా కాన్పూర్ స్టేడియానికి టెస్టు మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చే అర్హత మాత్రం లేదు’’ అని బసిత్ అలీ ఘాటు విమర్శలు చేశాడు. కాగా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది.ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆడిన 10 మ్యాచ్లలో ఏడు గెలిచి.. రెండు ఓడిన భారత్.. ఒకటి డ్రా చేసుకుంది. మరోవైపు.. ఆస్ట్రేలియా పన్నెండు మ్యాచ్లలో ఎనిమిది గెలిచి రెండోస్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు టెస్టులు ఆడనున్న రోహిత్ సేన.. ఆతర్వాత ఐదు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది.సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక... కాన్పూర్ స్టేడియం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మున్సిపల్ గ్రౌండ్ కాగా... ఇక్కడ మ్యాచ్ నిర్వహించిన ప్రతిసారి బీసీసీఐ ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటుంది. దీంతో తాత్కాలిక ఏర్పాట్లే తప్ప పూర్తిస్థాయి ఏర్పాట్లపై బోర్డు కూడా దృష్టి పెట్టలేదు. మ్యాచ్కు ముందే స్టాండ్స్ నాణ్యత విషయంలో పెద్ద చర్చ జరగగా... ‘సి’ బ్లాకు నాణ్యత సరిగ్గా లేని కారణంగా అందులోకి ప్రేక్షకులను అనుమతించలేదు.అందుకే కాన్పూర్కు టెస్టు మ్యాచ్ కేటాయించారుదేశంలో ఎన్నో మైదానాలు ఉన్నప్పటికీ బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సొంత మైదానం కావడం వల్లే కాన్పూర్కు టెస్టు మ్యాచ్ కేటాయించారు. సౌకర్యాల విషయంలో ప్రధాన వేదికల దరిదాపుల్లో కూడా లేని కాన్పూర్లో... డ్రైనేజీ వ్యవస్థతో పాటు కనీస వసతులు లేకపోవడంతోనే ఆదివారం ఒక్క చుక్క వర్షం పడకపోయినా మ్యాచ్ను నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ఇక సోమవారం నాటి నాలుగో రోజు మాత్రం ఆట సజావుగా సాగింది. 107/3తో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్.. 233 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన టీమిండియా 34.4 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసి మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.చదవండి: ఒంటిచేత్తో రోహిత్ సంచలన క్యాచ్.. షాక్లో సహచరులు! వీడియో -
IPL: క్రికెటర్లకు బీసీసీఐ బంపరాఫర్.. ఏకంగా రూ.7.50 లక్షలు?
ఐపీఎల్లో ఆడే క్రికెటర్లకు బీసీసీఐ అదిరిపోయే న్యూస్ అందించింది. ఐపీఎల్-2025 సీజన్ నుంచి ప్రతీ ఆటగాడికి మ్యాచ్ ఫీజు కింద రూ.7.50 లక్షలు ఇవ్వాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా ఎక్స్ వేదికగా శనివారం వెల్లడించారు."ఐపీఎల్ మ్యాచ్ ఫీజులు పెంచాలని నిర్ణయించున్నాం. మా క్రికెటర్లు ఇకపై ఒక్కో గేమ్కు రూ.7.5 లక్షల ఫీజు అందుకోనున్నారు. ఈ చారిత్రత్మక నిర్ణయాన్ని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ఓ క్రికెటర్ సీజన్లో అన్ని మ్యాచ్లు ఆడితే కాంట్రాక్ మొత్తంతో పాటు అదనంగా రూ.1.05 కోట్లు పొందుతాడు. ప్రతీ ఫ్రాంచైజీ సీజన్ మ్యాచ్ ఫీజుగానూ రూ. 12.60 కోట్లు కేటాయిస్తుంది. ఐపీఎల్కు, ప్లేయర్లకు ఇది కొత్త శకం' అని ఎక్స్లో జైషా రాసుకొచ్చారు. కాగా గతంలో ఒక్కో మ్యాచ్కు ఫీజు రూ. 2 - 4 లక్షల మధ్యలో ఉండేది. In a historic move to celebrate consistency and champion outstanding performances in the #IPL, we are thrilled to introduce a match fee of INR 7.5 lakhs per game for our cricketers! A cricketer playing all league matches in a season will get Rs. 1.05 crores in addition to his…— Jay Shah (@JayShah) September 28, 2024 -
ప్రాణ స్నేహితుడు, నా ప్రపంచం: సూర్య భార్య భావోద్వేగం
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 34వ వసంతంలో అడుగుపెట్టాడు. అతడి పుట్టినరోజు సందర్భంగా స్నేహితులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి నూతన చైర్మన్గా ఎన్నికైన బీసీసీఐ కార్యదర్శి జై షా, మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తదితరులు సూర్యను విష్ చేశారు.నా ప్రాణ స్నేహితుడు, నా ప్రపంచంఇక సూర్య భార్య దేవిశా శెట్టి తన మనసులోని భావాలు వెల్లడిస్తూ.. భావోద్వేగపూరిత నోట్తో హ్యాపీ బర్త్డే చెప్పింది. ‘‘నా ప్రాణ స్నేహితుడు, భర్త, ప్రేమికుడు.. నా ప్రపంచం.. నా జీవితంలో నేను తీసుకున్న సరైన నిర్ణయానికి నిదర్శనం.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ జీవితంలో నా కోసం కేటాయిస్తున్న ప్రతి ఒక్క రోజుకు నేను రుణపడి ఉంటా!ఈ ప్రపంచాన్ని నాకోసం అందంగా మలిచావు. అసలు నువ్వు లేకుండా నేను ఒక్క పనైనా చేయగలనా? ఇప్పుడూ.. ఎల్లప్పుడూ.. నిన్ను ప్రేమిస్తూనే ఉంటా’’ అంటూ భర్తపై ప్రేమను చాటుకుంది. ఈ సందర్భంగా సూర్యతో దిగిన ఫొటోలను దేవిశా షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక భార్య షేర్ చేసిన పోస్టుకు బదులుగా.. సుకూన్(శాంతి) అంటూ సూర్య బదులిచ్చాడు. కాగా కాలేజీలో తన జూనియర్ అయిన దేవిశాను ప్రేమించిన సూర్య.. పెద్దలను ఒప్పించి 2016, జూలై 7న ఆమెను పెళ్లి చేసుకున్నాడు.నాలుగు టీ20 సెంచరీలుఇక సూర్య కెరీర్ విషయానికొస్తే... టీమిండియా తరఫున ఇప్పటి వరకు 109 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన సూర్యకుమార్ యాదవ్.. 3213 పరుగులు చేశాడు. అత్యధికంగా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో నాలుగు సెంచరీలు నమోదు చేశాడు. పొట్టి ఫార్మాట్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్గా ఎదిగి సత్తా చాటాడు. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత.. రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.టీమిండియా పూర్తిస్థాయి సారథిగాఈ నేపథ్యంలో రోహిత్ శర్మ స్థానంలో సూర్య ఇటీవలే భారత టీ2 జట్టు సారథిగా నియమితుడయ్యాడు. శ్రీలంక పర్యటన సందర్భంగా పూర్తిస్థాయి కెప్టెన్గా పగ్గాలు చేపట్టి.. టీమిండియాకు 3-0తో క్లీన్స్వీప్ విజయం అందించాడు. ప్రస్తుతం గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న సూర్య.. అక్టోబరులో బంగ్లాదేశ్తో జరుగనున్న టీ20 సిరీస్తో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.చదవండి: 'అతడు ఆటను గౌరవించడు.. జట్టులో చోటు దండగ' View this post on Instagram A post shared by Devisha Suryakumar Yadav (@devishashetty_) -
జీవితంలో ఎన్నడూ బ్యాట్ పట్టనోడు క్రికెట్కు ఇన్చార్జ్ అయ్యాడు..!
త్వరలో ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్న బీసీసీఐ కార్యదర్శి జై షాపై కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడుతూ.. జీవితంలో ఎన్నడూ బ్యాట్ పట్టుకోని వ్యక్తి క్రికెట్కు ఇన్చార్జ్ అయ్యాడని విమర్శలు గుప్పించారు. దేశం మొత్తంలో వ్యాపారాలు ముగ్గురు నలుగురు వ్యాపారవేత్తల కనుసన్నల్లో నడుస్తున్నాయని అన్నాడు. सारे बिजनेस देश के 3-4 लोगों को ही मिलते हैं। अमित शाह के बेटे ने कभी क्रिकेट बैट नहीं उठाया, वो क्रिकेट का इंचार्ज बन गया है।: नेता विपक्ष श्री @RahulGandhi 📍 अनंतनाग, जम्मू-कश्मीर pic.twitter.com/wUylZ7QSul— Congress (@INCIndia) September 4, 2024రాహుల్ వ్యాఖ్యలు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా, ప్రస్తుతం వైరలవుతుంది. జై షా ఐసీసీ చైర్మన్గా ఎన్నికయ్యాక ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ సైతం ఇలాంటి వ్యంగ్యమైన వ్యాఖ్యలే చేశాడు. కాగా, జై షా.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిషా షా కుమారుడన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, కొద్ది రోజుల క్రితమే జై షా ఐసీసీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 17 మంది సభ్యులున్న ఐసీసీ ప్యానెల్లో పాకిస్థాన్ మినహా అందరూ జై షాకు మద్దతు తెలిపారు. షా.. ఈ ఏడాది డిసెంబర్ 1న ఐసీసీ చైర్మన్ బాధ్యతలు చేపడతారు. భారత్ నుంచి ఈ బాధ్యతలు చేపట్టబోయే ఐదో వ్యక్తి జై షా. గతంలో జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్లుగా పని చేశారు. -
జై షా స్థానాన్ని భర్తీ చేయనున్న పీసీబీ చీఫ్?
భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ పదవి చేపట్టనున్నారు. ఈ ఏడాది డిసెంబరు 1న ఐసీసీ బాస్గా బాధ్యతలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఎన్నిక ప్రక్రియ ఇప్పటికే పూర్తైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జై షా త్వరలోనే బీసీసీఐ కార్యదర్శి పదవి నుంచి తప్పుకోనున్నారు.అదే విధంగా.. ఆసియా క్రికెట్ మండలి(ఏసీసీ) అధ్యక్షుడిగానూ రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏసీసీ కొత్త ప్రెసిడెంట్ ఎవరన్న చర్చ జరుగుతుండగా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ పేరు తెరమీదకు వచ్చింది. జై షా స్థానాన్ని నక్వీ భర్తీ చేయనున్నాడని.. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.కొత్త బాస్గా నక్వీ?‘‘వచ్చే ఏడాది ఆరంభంలో జరుగనున్న ఏసీసీ సమావేశంలో.. కొత్త అధ్యక్షుడిగా మొహ్సిన్ నక్వీ ఎంపిక కానున్నారు. రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగనున్నారు’’ అని ఏసీసీ వర్గాలు వెల్లడించినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. కాగా ఆసియా వన్డే కప్-2023 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకోగా.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడికి వెళ్లలేదన్న సంగతి తెలిసిందే.అయితే, పాక్ బోర్డు మాత్రం భారత జట్టు తమదేశానికి రావాల్సిందేనని పట్టుపట్టగా.. జై షా నేతృత్వంలోని ఏసీసీ హైబ్రిడ్ విధానంలో మ్యాచ్లు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో పాక్తో పాటు శ్రీలంకను ఆతిథ్య దేశంగా ఎంపిక చేసి.. టీమిండియా మ్యాచ్లను అక్కడ నిర్వహించింది. భారత్తో పాటు లంక ఫైనల్కు చేరగా.. టైటిల్ పోరు కూడా శ్రీలంకలోనే జరిగింది. అయితే, జై షా స్థానంలో నక్వీ వస్తే.. భవిష్యత్లో ఇలాంటి పరిస్థితి తలెత్తితే.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే ఆసక్తి నెలకొంది.ఐసీసీ టోర్నీలకు సన్నాహకాలుగాఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది భారత్లో పురుషుల ఆసియాకప్ జరుగనుంది. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీని2025 సెప్టెంబర్లో నిర్వహించనున్నారు. స్వదేశంలో జరుగనున్న టీ20 ప్రపంచకప్-2026కు ముందుగా ఈ టోర్నీని నిర్వహించడం వల్ల.. ఆసియా దేశాలకు కావాల్సినంత ప్రాక్టీస్ లభించనుంది. అనంతరం.. ఆసియా కప్-2027నకు బంగ్లాదేశ్ ఆతిథ్యమిస్తుంది. అదే ఏడాది దక్షిణాఫ్రికాలో వన్డే ప్రపంచకప్ ఉండటంతో బంగ్లాలో వన్డే ఫార్మాట్లో ఆసియాకప్ నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. -
పాకిస్తాన్కు టీమిండియా రావాలి.. ఆ బాధ్యత అతడిదే: యూనిస్ ఖాన్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ఆతిథ్యమిచ్చేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అన్ని విధాల సన్నద్దమవుతోంది. ఇప్పటికే తమ స్టేడియాల పునర్నిర్మాణ పనులను కూడా పీసీబీ ప్రారంభించింది. కాగా 28 ఏళ్ల తర్వాత తొలి ఐసీసీ ఈవెంట్కు పాకిస్తాన్కు ఆతిథ్యమివ్వనుంది.పాక్లో చివరగా 1996లో ఐసీసీ టోర్నీ(వన్డే వరల్డ్కప్) జరిగింది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీని పీసీబీ ప్రతిష్టత్మకంగా తీసుకుంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఈవెంట్లో పాల్గోనేందుకు టీమిండియా పాకిస్తాన్కు వెళ్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. భారత్ ఆడే మ్యాచ్లను తాత్కాలిక వేదికగా నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తుంటే.. పీసీబీ మాత్రం భారత జట్టు కచ్చితంగా తమ దేశానికి రావల్సిందే అని మొండి పట్టుతో ఉంది. కాగా ఐసీసీ మాత్రం ఈ విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే భారత జట్టు పాక్కు వెళ్తుందా లేదా అన్నది తేల్చాల్సిన బాధ్యత కొత్తగా ఎన్నికైన ఐసిసి ఛైర్మన్ జై షాపై పడింది.ఆ బాధ్యత అతడిదే..ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టును పాకిస్తాన్కు పంపే బాధ్యతను జైషా తీసుకోవాలని యూనిస్ సూచించాడు. "ఐసీసీ చీఫ్గా జై షా నియామకంతో క్రికెట్కు మరింత ఆదరణ పెరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అదే విధంగా భారత జట్టు పాకిస్తాన్కు వచ్చేవిధంగా జై షా చొరవ తీసుకోవాలి. అతడు క్రీడా స్ఫూర్తిని చూపించాల్సిన అవసరం ఉంది. అప్పుడు పాక్ జట్టు కూడా ఆడేందుకు భారత్కు వస్తుంది" అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో యూనిస్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీకి సంబంధించి డ్రాప్ట్ షెడ్యూల్ను కూడా ఐసీసీకి పాక్ క్రికెట్ బోర్డు పంపించింది. డ్రాప్ట్ షెడ్యూల్ ప్రకారం..ఫిబ్రవరి 19, 2025న పాకిస్తాన్- న్యూజిలాండ్ మ్యాచ్తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.చదవండి: మళ్లీ స్కూల్కు వెళ్తా.. విండీస్ టూర్లో కూడా చదువుకున్నా: సఫారీ బౌలర్ -
టీమిండియా పాకిస్తాన్కు రాబోతోంది: పాక్ మాజీ కెప్టెన్
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చైర్మన్గా జై షా ఎన్నికైన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ చీఫ్గా జై షా నియామకాన్ని పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వ్యతిరేకించడం లేదని.. చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా తప్పక తమ దేశానికి వస్తుందని పేర్కొన్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలితో పీసీబీకి ఈ మేరకు అవగాహన కుదిరిందని చెప్పుకొచ్చాడు.పాక్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ-2025కాగా 2017 తర్వాత తొలిసారి చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరుగనున్న ఈ ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను పాక్ దక్కించుకుంది. అయితే, ఇరు దేశాల మధ్య పరిస్థితుల నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్కు వెళ్లబోదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐసీసీపైనే భారం వేసిన పాక్ బోర్డుఈ క్రమంలో హైబ్రిడ్ విధానంలో ఈ ఈవెంట్ను నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీకి ఇప్పటికే విజ్ఞప్తి చేసిందని.. అందుకు తగ్గట్లుగానే టీమిండియా మ్యాచ్లకు తటస్థ వేదికను ఎంపిక చేయబోతున్నారనే వార్తలు వెలువడ్డాయి. అయితే, పాక్ బోర్డు మాత్రం టీమిండియా మ్యాచ్లన్నీ కూడా తమ దేశంలోనే నిర్వహిస్తామని.. ఆ జట్టును తమ దేశానికి రప్పించే బాధ్యత ఐసీసీదేనని పేర్కొంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా ఐసీసీ బాస్గా నియమితుడు కావడంతో పాక్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ విషయంపై స్పందించిన రషీద్ లతీఫ్ మాత్రం భిన్నంగా స్పందించాడు.సగం ప్రక్రియ పూర్తైంది‘‘జై షా నియామకాన్ని పీసీబీ ఏమాత్రం వ్యతిరేకించడం లేదు. ఇప్పటికే ఇరు వర్గాల మధ్య అవగాహన కుదిరిందనే అనుకుంటున్నా. ఒకవేళ టీమిండియా పాకిస్తాన్ వస్తే.. అందుకు జై షానే కారణం అనుకోవచ్చు. భారత ప్రభుత్వ మద్దతుతో అతడు బోర్డును ఒప్పిస్తాడు. ఇందుకు సంబంధించి సగం ప్రక్రియ పూర్తైంది. టీమిండియా పాకిస్తాన్కు రాబోతోంది’’ అని రషీద్ లతీఫ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా సంచలనానికి తెరతీశాడు. కాగా 1996 వన్డే వరల్డ్కప్ తర్వాత పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టోర్నీ ఇదే కావడం విశేషం. ఇక భారత జట్టుకు అక్కడికి వెళ్లి పదహారేళ్లకు పైనే అయింది. 2008లో చివరగా టీమిండియా పాక్లో పర్యటించింది. 2013 తర్వాత ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లకు తెరపడింది.చదవండి: ‘రోహిత్ 59 శాతం.. విరాట్ 61 శాతం.. అయినా ఇంకెందుకు రెస్ట్?’ -
గుజరాత్ క్రికెట్ అసోసియేషన్తో మొదలై ఐసీసీ పీఠం దాకా..!
35 ఏళ్ల జై షా ఐసీసీ పీఠం అధిరోహించనున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. షా ఐసీసీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం నిన్ననే అధికారికంగా వెలువడింది. షా ఐసీసీ బాస్గా ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి బాధ్యతలు చేపడతాడు. షా ఐసీసీలో అత్యున్నత స్థానానికి చేరడానికి ఒక్కో మెట్టు ఎక్కాడు. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ మొదలైన షా ప్రస్తానం.. తాజాగా ఐసీసీ అగ్రపీఠం వరకు చేరింది. షా ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. షా ఐసీసీ చైర్మన్ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతాడు. షా ఐసీసీ పీఠం దక్కించుకున్న ఐదో భారతీయుడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్. శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్లుగా బాధ్యతలు నిర్వర్తించారు.జై షా ప్రస్తానం..2009-2013 వరకు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్2013-2015 వరకు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ2015-2019 వరకు బీసీసీఐ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ కమిటీ2019-2024 వరకు బీసీసీఐ సెక్రెటరీ2024- ఐసీసీ చైర్మన్ -
ఐసీసీ పీఠంపై జై షా
దుబాయ్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిసెంబర్ 1 నుంచి ఐసీసీ చైర్మన్గా జై షా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్గా కొనసాగుతున్న గ్రేగ్ బార్క్లే మూడోసారి ఆ పదవిలో కొనసాగేందుకు విముఖత చూపించడంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే జై షా మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఎన్నిక ఎకగ్రీవమైంది. 35 ఏళ్లకే అత్యున్నత పదవీ బాధ్యతలు దక్కించుకున్న జై షా ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా నిలిచారు. 2019 నుంచి బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగుతున్న జై షా రెండేళ్ల పాటు ఐసీసీ చైర్మన్గా కొనసాగుతారు. భారత్ నుంచి ఐసీసీ పీఠం దక్కించుకున్న ఐదో భారతీయుడిగా జై షా నిలిచారు. గతంలో జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్. శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. ‘అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా ఎన్నికవడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఐసీసీ సభ్యదేశాలతో కలిసి క్రికెట్కు మరింత విస్తరించడానికి కృషి చేస్తా’అని జై షా పేర్కొన్నారు. ఐసీసీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన జై షాను పలువరు అభినందించారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, మాజీ కోచ్లు రాహుల్ ద్రవిడ్, కుంబ్లే, పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా శుభాకాంక్షలు తెలిపారు. ముందున్న సవాళ్లు!ఈ ఏడాది చివర్లో ఐసీసీ పగ్గాలు చేపట్టనున్న జై షా ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగనున్న చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనడంపై సందేహాలు రేకెత్తుతుండగా... ఈ అంశంలో జై షా ఎలాంటి వైఖరి అవలంభిస్తారనేది కీలకంగా మారింది. జై షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా పాకిస్తాన్లో జరగాల్సిన ఆసియా కప్ను హైబ్రిడ్ పద్ధతిలో పాకిస్తాన్, శ్రీలంకలో నిర్వహించారు. టీమిండియా ఆడాల్సిన మ్యాచ్లను శ్రీలంకలో జరిగే విధంగా షెడ్యూల్లో మార్పులు చేశారు. మరి ఇప్పుడు ఐసీసీ చైర్మన్గా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ భాగం కావడంతో దానికి తగినంత ప్రచారం నిర్వహించడం... రోజు రోజుకు ప్రభ తగ్గుతున్న టెస్టు క్రికెట్కు పూర్వ వైభవం తేవడం... టి20ల ప్రభావంతో ప్రాధాన్యత కోల్పోతున్న వన్డేలను మరింత రసవత్తరంగా మార్చడం ఇలా పలు సవాళ్లు జై షాకు స్వాగతం పలుకుతున్నాయి. -
ఐసీసీ చైర్మన్గా జై షా ఏకగ్రీవ ఎన్నిక.. ప్రకటన విడుదల
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చైర్మన్గా జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించి ఐసీసీ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది డిసెంబరు 1న ఆయన బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపింది. కాగా ప్రస్తుతం ఐసీసీ చైర్మన్గా ఉన్న గ్రెగ్ బార్క్లే తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు ఆగష్టు 20న ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.ఇప్పటికే రెండు దఫాలుగా చైర్మన్గా వ్యవహరించిన గ్రెగ్ బార్క్లే.. మూడోసారి పగ్గాలు చేపట్టేందుకు విముఖంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయన స్థానాన్ని జై షా భర్తీ చేశారు. ఐసీసీలోని మొత్తం పదహారు మంది సభ్యుల్లో 15 మంది జై షాకు అనుకూలంగా ఉండటంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.సరికొత్త రికార్డుఇక నవంబరు 30న బార్క్లే పదవీకాలం ముగియనుండగా... ఆ మరుసటి రోజు జై షా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో 35 ఏళ్ల జై షా సరికొత్త రికార్డు సాధించారు. అత్యంత పిన్న వయసులో ఐసీసీ బాస్గా నియమితులైన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.కాగా జై షా ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శిగా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజా పరిణామం నేపథ్యంలో ఆయన త్వరలోనే బీసీసీఐ పదవి నుంచి వైదొలగనున్నారు. ఇక ఐసీసీ చైర్మన్గా ఎన్నిక కావడం తనకు దక్కిన గొ ప్ప గౌరవం అని జై షా హర్షం వ్య క్తం చేశారు.జై షాకు హెచ్సీఏ శుభాకాంక్షలుఐసీసీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన జై షాకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడు జగన్మోహన్ రావు శుభాకాంక్షలుతెలిపారు. జైషా నాయకత్వంలో ప్రపంచ క్రికెట్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.చదవండి: లక్నో కెప్టెన్సీకి రాహుల్ గుడ్బై!.. రేసులో ఆ ఇద్దరు!Jay Shah has been elected unopposed as the next Independent Chair of the ICC.https://t.co/Len6DO9xlE— ICC (@ICC) August 27, 2024 -
BCCI: బీసీసీఐ కొత్త కార్యదర్శి అతడే!?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి కాబోయే చైర్మన్ అంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆయన నిజంగానే ఈ పదవిని చేపడితే.. బీసీసీఐ సెక్రటరీగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త కార్యదర్శి ఎవరన్న అంశంపై భారత క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.తెర మీదకు కొత్త పేరుఇప్పటికే జై షా వారసులుగా ముగ్గురు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, సంయుక్త కార్యదర్శి ఆశిష్ షెలార్, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్లలో ఒకరు జై షా స్థానాన్ని భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ రేసులో తాజాగా మరో పేరు తెర మీదకు వచ్చింది. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్షుడు రోహన్ జైట్లీ కూడా పోటీలో ఉన్నట్లు వార్తా సంస్థ దైనిక్ భాస్కర్ వెల్లడించింది. రోహన్ జైట్లీ మరెవరో కాదు. దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కుమారుడు. రోహన్ నియామకం దాదాపుగా ఖరారైపోయిందని.. బీసీసీఐ కొత్త కార్యదర్శిగా అతడిని చూడబోతున్నామంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి.జై షా ఎన్నిక ఏకగ్రీవమే?మరోవైపు.. ఐసీసీ చైర్మన్గా జై షా ఎన్నిక ఏకగ్రీవం కానుందని తెలుస్తోంది. ఐసీసీలోని మొత్తం 16 మంది సభ్యుల్లో 15 మంది జై షాకు అనుకూలంగా ఉండటం ఇందుకు కారణం. ఇక కొత్త చైర్మన్ ఎన్నిక కోసం ఈ నెల 27తో నామినేషన్ల గడువు ముగుస్తుంది.ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్గా ఉన్న గ్రెగ్ బార్క్లే పదవీకాలం నవంబర్ 30 వరకు ఉంది. కాబట్టి.. కొత్తగా ఎన్నికైన వ్యక్తి డిసెంబర్ 1 తర్వాతే పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఫలితంగా జై షా ఇంకో మూడు నెలల పాటు బీసీసీఐ కార్యదర్శిగానే కొనసాగే అవకాశం ఉంది. అప్పటిలోగా అతడి వారసుడి ఎంపిక పూర్తి చేయాలని బోర్డు పెద్దలు భావిస్తున్నారు.చదవండి: రిటైర్మెంట్ తర్వాత.. అభిమానులకు శుభవార్త చెప్పిన ధావన్ -
ఆ ముగ్గురి సహకారంతోనే టీ20 వరల్డ్కప్ గెలిచాం: రోహిత్
నిన్న (ఆగస్ట్ 21) జరిగిన సియెట్ రేటింగ్ అవార్డ్స్ ఫంక్షన్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్కప్ గెలవడానికి జై షా, అజిత్ అగార్కర్, రాహుల్ ద్రవిడ్ చాలా తోడ్పడ్డారని అన్నాడు. ఈ ముగ్గురిని మూల స్తంభాలతో పోల్చాడు. జట్టు మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చి సత్ఫలితాలు సాధించేందుకు ఈ మూడు స్తంభాలు తోడ్పడ్డాయని తెలిపాడు. నేను నా టీమ్ వరల్డ్కప్ సాధించడానికి ఈ ముగ్గురే కీలకమని ఆకాశానికెత్తాడు. జట్టుగా మేం రాణించడానికి ఆ ముగ్గురు ఇచ్చిన స్వేచ్ఛనే కారణమని తెలిపాడు.తన కెప్టెన్సీ గురించి హిట్మ్యాన్ మాట్లాడుతూ.. తాను ఆషామాషీగా ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలవలేదని, కెప్టెన్గా ఇంతటితో ఆగేది లేదని ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ టైటిళ్లు సాధించడమే తన లక్ష్యమని చెప్పకనే చెప్పాడు. కాగా, నిన్న జరిగిన ఫంక్షన్లో రోహిత్ మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నాడు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్కు లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డు లభించింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. మెన్స్ వన్డే బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, యశస్వి జైస్వాల్ మెన్స్ టెస్ట్ బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ మెన్స్ టీ20 బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నారు.బౌలర్ల విషయానికొస్తే.. మహ్మద్ షమీ మెన్స్ వన్డే బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, రవిచంద్రన్ అశ్విన్ మెన్స్ టెస్ట్ బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, టీమ్ సౌథీ మెన్స్ టీ20 బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు అందుకున్నారు. -
ఐసీసీ చైర్మన్ రేసులో జై షా
దుబాయ్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవి రేసులో ఉన్నారు. ప్రస్తుత చైర్మన్ గ్రెగ్ బార్క్లే రెండో దఫా పదవీ కాలం ఈ నవంబర్ 30వ తేదీతో ముగియనుంది. ఐసీసీ నియమావళి ప్రకారం ఒక వ్యక్తి చైర్మన్ పదవిలో గరిష్టంగా మూడుసార్లు (రెండేళ్ల చొప్పున ఆరేళ్ల పాటు) కొనసాగే అవకాశముంది. అయితే న్యూజిలాండ్కు చెందిన సీనియర్ అటార్నీ అయిన బార్క్లే వరుసగా మూడోసారి కొనసాగేందుకు విముఖత చూపారు. దీంతో కొత్త చైర్మన్ ఎన్నిక అనివార్యం కావడంతో ఈ నెల 27వ తేదీలోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. -
అతడు జట్టులో ఉంటాడో లేదో గ్యారంటీ లేదు: జై షా
లక్నో సూపర్ జెయింట్స్ పేస్ సంచలనం, ఢిల్లీ యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ అంతర్జాతీయ అరంగేట్రానికి మరింత సమయం పట్టనుంది. ఐపీఎల్-2024 సీజన్లో తన పేస్ బౌలింగ్తో మయాంక్ అందరని ఆకట్టుకున్నాడు. 155 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడిన మయాంక్.. 6.99 ఏకానమీతో 7 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అతడికి జాతీయ జట్టులో అవకాశమివ్వాలని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ అతడి ఫిట్నెస్ ప్రధాన సమస్యగా మారింది. తరచుగా గాయాల బారిన పడుతుండటంతో మయాంక్ అరంగేట్రం ఎప్పడన్నది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. తాజాగా మయాంక్ డెబ్యూపై బీసీసీఐ కార్యదర్శి జైషా స్పందించాడు. అతడి ఎంపికపై తను ఇప్పుడే ఏమి చెప్పలేను అని జైషా తెలిపాడు. మయాంక్ యాదవ్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. రాబోయే రంజీ సీజన్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు మయాంక్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు."మయాంక్ యాదవ్ అరంగేట్రంపై ఇప్పుడే నేనేమి చెప్పలేను. అతడిని ఎంపిక చేస్తారా లేదన్న విషయంపై కూడా నేను హామీ ఇవ్వలేను. ఎందుకంటే మయాంక్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు.కానీ అతడొక అద్భుతమైన ఫాస్ట్ బౌలర్. ప్రస్తుతం అతడు ఏన్సీఎలో ఉన్నాడు. మా ఫిజియోల పర్యవేక్షణలో అతడు తన పునరావాసాన్ని కొనసాగిస్తున్నాడని" టైమ్స్ ఆఫ్ ఇండియాతో జై షా పేర్కొన్నాడు. -
జడ్డూనే ముందుగా అడిగా.. నా నిర్ణయాల వల్లే ఇలా: జై షా
తమ కఠిన వైఖరి కారణంగానే టీమిండియా స్టార్లలో మార్పు వచ్చిందని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కార్యదర్శి జై షా అన్నాడు. యువ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ దేశవాళీ టోర్నీల్లో ఆడటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు. కేవలం వీరిద్దరిని దృష్టిలో పెట్టుకుని నిబంధనలు ప్రవేశపెట్టలేదని.. అందరి కంటే ముందుగా రవీంద్ర జడేజా విషయంలో తాను ఈ వైఖరి అవలంబించినట్లు తెలిపాడు.బోర్డు ఆదేశాలను లెక్కచేయలేదుసెంట్రల్ కాంట్రాక్టు ఉన్న భారత క్రికెటర్లు ఫిట్గా ఉండి, జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సమయంలో కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ నిబంధనలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ బోర్డు ఆదేశాలను లెక్కచేయలేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరిని సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారన్న కారణంగా ఈ మేరకు కఠిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పొరపాటు సరిచేసుకున్న శ్రేయస్ ఇప్పటికే రంజీల్లో ఆడి శ్రీలంకతో వన్డే సిరీస్ జట్టులో చోటు దక్కించుకోగా.. ఇషాన్ సైతం దులిప్ ట్రోఫీ-2024 బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం గురించి జై షా స్పందిస్తూ... ‘‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మినహా మిగతా వాళ్లంతా దులిప్ ట్రోఫీ ఆడబోతున్నారు.నా కఠిన నిర్ణయాల వల్లే ఇలానేను కఠినమైన నిర్ణయాలు తీసుకున్నందు వల్లే ఇది సాధ్యమైంది. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కూడా ఈ టోర్నీలో భాగమయ్యారు. మేము స్ట్రిక్ట్గా ఉండాలనే నిర్ణయించుకున్నాం. నిజానికి రవీంద్ర జడేజా గాయం కారణంగా జట్టుకు దూరమైనపుడు.. నేను తనకి కాల్ చేశాను.కోలుకున్న తర్వాత ముందుగా దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించాను. జడేజా అందుకు తగ్గట్లుగా ముందుగా రంజీ మ్యాచ్ ఆడి ఆ తర్వాత టీమిండియాలోకి వచ్చాడు. ఆటగాళ్లు గాయపడటం సహజం. అయితే, గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆటగాళ్లు తిరిగి ఫిట్నెస్ సాధించడంతో పాటు డొమెస్టిక్ క్రికెట్ ఆడితేనే జాతీయ జట్టుకు ఎంపిక చేస్తామని చెప్పాం’’ అని జై షా టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. సెప్టెంబరు 5 నుంచిఅయితే, కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మాత్రం ఇందుకు మినహాయింపు అని జై షా స్పష్టం చేశాడు. కాగా సెప్టెంబరు 5 నుంచి దేశవాళీ రెడ్బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ ఆరంభం కానుంది. స్వదేశంలో బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ముందుకు టీమిండియా స్టార్లు ఈ టోర్నమెంట్ బరిలో దిగనున్నారు. చదవండి: Ind vs Ban: టీమిండియాలో చోటు దక్కదని తెలుసు.. అయినా! -
గంభీర్కు చెప్పడానికి నేనెవరిని?: జై షా
ఒక్కో ఫార్మాట్కు ఒక్కో కోచ్ ఉండాల్సిన అవసరం లేదని తాము భావిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కార్యదర్శి జై షా అన్నాడు. టీమిండియాలోని ఆటగాళ్లలో ఎక్కువ మంది మూడు ఫార్మాట్లలో ఆడుతున్నారని.. అలాంటపుడు ఒకే కోచ్ ఉంటే ఇంకాస్త మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని పేర్కొన్నాడు. ఒక్కసారి ప్రధాన శిక్షకుడిగా ఓ వ్యక్తిని నియమించిన తర్వాత అతడి నిర్ణయానుసారమే అంతా జరుగుతుందని తెలిపాడు.టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా హెడ్కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ వైదొలిన విషయం తెలిసిందే. అతడి స్థానంలో మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ను నియమించింది బీసీసీఐ. అయితే, ఇందుకు సంబంధించిన ప్రకటనకు ముందు.. టీమిండియాకు ముగ్గురు కోచ్లు ఉండబోతున్నారనే వార్తలు వచ్చాయి. టెస్టు, వన్డే, టీ20లకు వేర్వేరు వ్యక్తులు శిక్షణ ఇవ్వనున్నట్లు వదంతులు వ్యాపించాయి.గంభీర్కు చెప్పడానికి నేనెవరిని?ఈ విషయంపై జై షా తాజాగా స్పందించాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ... ‘‘కోచ్ను నియమించుకున్న తర్వాత.. అతడి అభిప్రాయాన్ని మేము గౌరవించాల్సి ఉంటుంది. అతడు చెప్పిందే వినాలి కూడా!.. గౌతం గంభీర్ను హెడ్కోచ్గా సెలక్ట్ చేసుకున్న తర్వాత.. అతడి దగ్గరికి వెళ్లి.. ‘నువ్వు ఈ ఫార్మాట్కు సరిగ్గా కోచింగ్ ఇవ్వలేవు’ అని చెప్పడానికి నేనెవరిని?ఒకవేళ తను మూడు ఫార్మాట్లకు కోచ్గా ఉండాలని భావిస్తే.. మేమెందుకు అడ్డుచెప్తాం? అయినా భారత జట్టులో 70 శాతం మంది ఆటగాళ్లు మూడు ఫార్మాట్లలో ఆడుతూనే ఉన్నారు. కాబట్టి వేర్వేరు కోచ్లు అవసరం లేదనే భావిస్తున్నాం.ఎన్సీఏ కోచ్లు ఉన్నారు కదా!అంతేకాదు.. ఒకవేళ హెడ్కోచ్ విరామం తీసుకున్నా మాకు బ్యాకప్ కోచ్లు ఉండనే ఉన్నారు. జాతీయ క్రికెట్ అకాడమీ కోచ్(ఎన్సీఏ)లు మాకు సేవలు అందిస్తారు. ఉదాహరణకు.. రాహుల్ ద్రవిడ్ బ్రేక్ తీసుకున్నపుడు వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్గా వ్యవహరించాడు కదా! ఇప్పుడు కూడా అంతే!’’ అని జై షా చెప్పుకొచ్చాడు.కాగా శ్రీలంక పర్యటనతో టీమిండియా హెడ్కోచ్గా ప్రస్థానం మొదలుపెట్టిన గౌతం గంభీర్.. టీ20 సిరీస్ 3-0తో క్లీన్స్వీప్ విజయం అందుకున్నాడు. అయితే, వన్డే సిరీస్లో మాత్రం ఘోర పరాభవం ఎదురైంది. ఇరవై ఏడేళ్ల తర్వాత టీమిండియా లంకు వన్డే సిరీస్(0-2)ను కోల్పోయింది. తదుపరి రోహిత్ సేన బంగ్లాదేశ్ స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడనుంది. చదవండి: ’టీ20 ఫార్మాట్ క్రికెట్ను నాశనం చేస్తోంది.. ఇండియా మాత్రం లక్కీ’ -
రోహిత్, కోహ్లి అందుకే ఆడటం లేదు: జై షా
దేశవాళీ క్రికెట్ టోర్నీ దులిప్ ట్రోఫీ-2024లో టీమిండియా యువ క్రికెటర్లందరూ భాగం కాబోతున్నారు. సీనియర్లు మినహా కీలక ఆటగాళ్లంతా ఈ రెడ్బాల్ టోర్నీ బరిలో దిగనున్నారు. శుబ్మన్ గిల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ తదితరులతో పాటు.. అగ్రశ్రేణి ఆటగాళ్లు రవీంద్ర జడేజా, మహ్మద సిరాజ్, కేఎల్ రాహుల్ కూడా ఈ దులిప్ ట్రోఫీలో ఆడనున్నారు.ఇందుకు సంబంధించి ఏ,బి,సి,డి జట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బుధవారం ప్రకటించింది. ఈ జట్లకు వరుసగా శుబ్మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నట్లు తెలిపింది. అయితే, ఈ ప్రకటనకు ముందు.. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి కూడా దులిప్ ట్రోఫీ ఆడబోతున్నారనే వార్తలు వినిపించాయి.బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు సన్నాహకంగా ఈ నవతరం దిగ్గజాలు కూడా దేశవాళీ క్రికెట్ ఆడతారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, రోహిత్, కోహ్లితో పాటు జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ మాత్రం ఈ టోర్నీకి దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి మాత్రమే మినహాయింపు ఎందుకనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి జై షా తాజాగా స్పందించారు.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి మినహాయింపు ఇవ్వడం గురించి చెబుతూ.. ‘‘వాళ్లు తప్ప మిగతా వాళ్లంతా దులిప్ ట్రోఫీలో ఆడుతున్నారు. ఇందుకు వారందరిని ప్రశంసించాలి. అంతేకాదు.. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ బుచ్చిబాబు టోర్నమెంట్ ఆడేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇది హర్షించదగ్గ పరిణామం.ఇక రోహిత్, కోహ్లి వంటి మేటి ఆటగాళ్లను కూడా దులిప్ ట్రోఫీలో ఆడాలని పట్టుబట్టడం సమంజసం కాదు. వాళ్లు గాయాల బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత బోర్డుపై ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లలోని అంతర్జాతీయ క్రికెటర్లందరూ దేశవాళీ టోర్నీలు ఆడరు. బోర్డులు కూడా వారిని ఆడమని బలవంతపెట్టవు. ఆటగాళ్లకు తగిన గౌరవం ఇవ్వాలి కదా!’’ అని జై షా టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు.ఇక బంగ్లాదేశ్లో పరిస్థితుల దృష్ట్యా భారత్తో టెస్టు సిరీస్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘ఇంతవరకు మేము బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారులతో మాట్లాడలేదు. అక్కడ కొత్త ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంది. వాళ్లు మమ్మల్ని సంప్రదిస్తారేమో చూడాలి. లేదంటే.. మేమే వాళ్లను సంప్రదిస్తాం. ఎందుకంటే టీమిండియాకు బంగ్లాదేశ్తో సిరీస్ అత్యంత ముఖ్యమైనది’’ అని జై షా బదులిచ్చారు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో టీమిండియా పటిష్ట స్థితిలో నిలవాలంటే బంగ్లాతో రెండు మ్యాచ్ల సిరీస్ తప్పనిసరి. ఈ రెండింటిలో గెలిచి అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. -
గంభీర్ ప్లాన్: బౌలింగ్ కోచ్గా అతడే ఎందుకంటే?!
బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియా బౌలింగ్ కోచ్గా సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ ప్రయాణం మొదలుకానుంది. మూడేళ్లపాటు అతడు ఈ పదవిలో కొనసాగనున్నాడు. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత హెడ్కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోగా... మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అతడి స్థానాన్ని భర్తీ చేసిన విషయం తెలిసిందే. శ్రీలంక పర్యటన సందర్భంగా ప్రధాన శిక్షకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన గౌతీ.. కోల్కతా నైట్రైడర్స్ ఫ్రాంచైజీ తరఫున తనతో కలిసి పనిచేసిన అభిషేక్ నాయర్, టెన్ డస్కటేను తన సహాయక బృందంలో చేర్చుకున్నాడు. ఆ టూర్లో భారత మాజీ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే టీమిండియా తాత్కాలిక బౌలింగ్ కోచ్గా వ్యవహరించాడు. టీమిండియా మాజీలను కాదనిఈ నేపథ్యంలో పూర్తి స్థాయి బౌలింగ్ కోచ్గా మోర్నీ మోర్కెల్ నియమితుడైనట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా బుధవారం వెల్లడించారు. ఇక 2027లో దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ వరకు మోర్కెల్ కాంట్రాక్ట్ కొనసాగనుందని తెలిపారు. కాగా టీమిండియా బౌలింగ్ కోచ్ రేసులో వినయ్ కుమార్, లక్ష్మీపతి బాలాజీ వంటి భారత మాజీ పేసర్ల పేర్లు కూడా వినిపించిన విషయం తెలిసిందే.బౌలింగ్ కోచ్గా మోర్కెల్ ఎంపికకు కారణం ఇదే!అయితే, గంభీర్ కోరిక మేరకే మోర్నీ మోర్కెల్ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు స్పందిస్తూ.. ‘‘హెడ్కోచ్ పదవి విషయంలో మాత్రమే క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించడం తప్పనిసరి. సహాయక బృందం విషయంలో ప్రధాన కోచ్ సిఫారసును పరిగణనలోకి తీసుకుంటారు. గంభీర్ గతంలో మోర్నీతో పని చేశాడు.అతడి నైపుణ్యాల గురించి గంభీర్కు పూర్తి అవగాహన ఉంది. అందుకే అతడిని తన టీమ్లో చేర్చుకున్నాడు. ఇందుకు మరో కారణం కూడా ఉంది. ఈ ఏడాది నవంబరులో ఆస్ట్రేలియాతో టీమిండియా ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్ ఆడబోతోంది. ఇలాంటి సమయంలో... భారత బౌలింగ్ కోచ్గా... ఆసీస్ గడ్డపై విజయవంతమైన బౌలర్గా పేరు తెచ్చుకున్న సౌతాఫ్రికన్ కంటే అత్యుత్తమ ఎంపిక మరొకటి ఉండదు.వచ్చే ఏడాది ఇంగ్లండ్తోనూ ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు భారత జట్టు అక్కడికి వెళ్లనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే విదేశీ గడ్డపై గొప్ప అనుభవం ఉన్న బౌలర్ కోచ్గా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకే గంభీర్ తన ప్రణాళికలకు అనుగుణంగానే ఏరికోరి మోర్నీని తన బృందంలో చేర్చుకున్నాడు’’ అని పేర్కొన్నాయి.మూడు దేశాలకు కోచ్గా... మోర్కెల్కు గంభీర్కు మధ్య మంచి సమన్వయం ఉంది. ఐపీఎల్లో కేకేఆర్ తరఫున గంభీర్ సారథ్యంలో ఆడిన మోర్నీ అనంతరం లక్నో సూపర్ జెయింట్స్కు బౌలింగ్ కోచ్గా వ్యవహరించాడు. ఆ సమయంలో లక్నో ఫ్రాంచైజీకి గంభీర్ మెంటార్గా వ్యవహరించాడు. దక్షిణాఫ్రికా జాతీయ జట్టు తరఫున 86 టెస్టులు, 117 వన్డేలు, 44 టి20లు ఆడిన మోర్నీ మోర్కెల్ ఓవరాల్గా మూడు ఫార్మాట్లలో కలిపి 544 వికెట్లు పడగొట్టాడు.కెరీర్కు వీడ్కోలు పలికిన అనంతరం మోర్కెల్ పలు జట్లకు బౌలింగ్ కోచ్గా వ్యవహరించాడు. 2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా పాకిస్తాన్ జట్టుకు బౌలింగ్ కోచ్గా పనిచేసిన మోర్కెల్... మహిళల టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ జట్టుకు శిక్షకుడిగా వ్యవహరించాడు. వారిని మెరిల్లా తీర్చిదిద్దడంలో పాత్రఇక ఈ ఏడాది జరిగిన పురుషుల టీ20 ప్రపంచకప్లో నమీబియా జట్టుకూ మోర్కెల్ శిక్షణ ఇచ్చాడు. ఇక ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన నయా పేస్ సంచలనం మయాంక్ యాదవ్, ఆవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్ మెరుగైన ప్రదర్శన వెనక కూడా మోర్కెల్ కృషి ఉంది.ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ మొదలుకానుంది. కాగా గంభీర్ బృందంలో అభిషేక్ నాయర్, టెన్ డస్కటే, ఫీల్డింగ్ కోచ్గా హైదరాబాద్కు చెందిన టి.దిలీప్ కొనసాగుతున్నాడు. తాజాగా మోర్నీ మోర్కెల్ నియామకంతో ఇక కోచింగ్ స్టాఫ్ ఎంపిక ముగిసినట్లయింది. -
BCCI: ఐపీఎల్ మాదిరే మరో టీ20 లీగ్? లెజెండ్స్ స్పెషల్?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మాదిరే మరో ఫ్రాంఛైజీ లీగ్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) శ్రీకారం చుట్టనుందా?.. వేలం ప్రాతిపదికన ఆటగాళ్లను కొనుగోలు చేసి.. జట్లను ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వనుందా?.. అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. అయితే, ఈ టీ20 లీగ్ రిటైర్ అయిన క్రికెటర్ల కోసమే ప్రత్యేకంగా రూపుదిద్దుకోనుందని సమాచారం.బీసీసీఐ ఆధ్వర్యంలో 2008లో మొదలైన ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్గా పేరొందింది. ఈ క్యాష్ రిచ్ లీగ్లో ప్రతిభ నిరూపించుకున్న క్రికెటర్లు.. పేరుప్రఖ్యాతులతో పాటు కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు. ఇక టీమిండియా వెటరన్లు సైతం ఈ లీగ్ ద్వారా ఇంకా యాక్టివ్ క్రికెటర్లుగా కొనసాగుతూ తమలో సత్తా తగ్గలేదని నిరూపించుకుంటున్నారు.లెజెండ్స్ స్పెషల్?అయితే, ఐపీఎల్కు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లలో కొందరు లెజెండ్స్ లీగ్ క్రికెట్ వంటి పొట్టి ఫార్మాట్ టోర్నీల ద్వారా రీఎంట్రీ ఇస్తున్నారు. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ వంటి మాజీలు ఇందులో భాగమవుతున్నారు. అయితే, ఇలా ప్రైవేట్ లీగ్లలో కాకుండా బీసీసీఐ నేతృత్వంలోని లీగ్లో ఆడాలని భారత మాజీ క్రికెటర్లు భావిస్తున్నట్లు సమాచారం.ఈ క్రమంలో బీసీసీఐ కార్యదర్శి జై షాను కలిసి తమ మనసులో మాటను వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ అధికారి ఒకరు దైనిక్ జాగరణ్తో మాట్లాడుతూ.. ‘‘టీ20 లీగ్ నిర్వహణకు సంబంధించి మాజీ క్రికెటర్ల నుంచి ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రపోజల్ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మేము కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చుబీసీసీఐ ఇప్పటికే ఐపీఎల్తో పాటు మహిళా ప్రీమియర్ లీగ్(WPL) కూడా నిర్వహిస్తోంది. ఇక ఈసారి ఐపీఎల్ మెగా వేలం కూడా జరుగబోతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు లీగ్ల నిర్వహణతో పాటు వేలానికి సంబంధించిన పనులతో బీసీసీఐ బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో మాజీ క్రికెటర్లు ప్రతిపాదించినట్లుగా లెజెండ్స్ లీగ్ నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చు. అయితే, భవిష్యత్తులో మాత్రం ఈ లీగ్ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా బీసీసీఐతో అన్ని సంబంధాలు తెంచుకున్న క్రికెటర్లు మాత్రమే విదేశీ లీగ్లలో ఆడేందుకు అనుమతి ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వదేశీ లీగ్తోనే మరోసారి సత్తా చాటాలని మాజీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.చదవండి: అతడే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్: సౌరవ్ గంగూలీ -
ACC: ఏసీసీ బాస్గా పాక్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ?
ఆసియా క్రికెట్ మండలి(ఏసీసీ) తదుపరి అధ్యక్షుడిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నియమితుడు కానున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. నఖ్వీ రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నట్లు తెలుస్తోంది. కాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా ప్రస్తుతం ఏసీసీ ప్రెసిడెంట్గా ఉన్న విషయం తెలిసిందే.జై షా వైదొలిగిన వెంటనేరెండేళ్ల పదవీ కాలం పూర్తయిన తర్వాత ఈ ఏడాది జనవరిలో.. మరోసారి ఏసీసీ బాస్గా బాధ్యతలు చేపట్టాడు జై షా. ఏడాది పాటు అతడి పదవీకాలాన్ని పొడిగిస్తూ ఏసీసీ నిర్ణయం తీసుకున్న క్రమంలో.. ఇప్పటికీ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు. అయితే, రొటేషన్ పాలసీ ప్రకారం ఈసారి ఈ పదవి పాక్ బోర్డు చైర్మన్ను వరించనున్నట్లు ఏసీసీ వర్గాలు తెలిపాయి.‘‘వచ్చే ఏడాది ఏసీసీ సమావేశంలో.. నఖ్వీ నియామకానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేస్తారు. తదుపరి రెండేళ్లపాటు ఏసీసీ ప్రెసిడెంట్గా నఖ్వీ కొనసాగే అవకాశం ఉంది. జై షా వైదొలిగిన వెంటనే అతడి స్థానంలో నఖ్వీ బాధ్యతలు చేపడతాడు’’అని సదరు వర్గాలు జాతీయ మీడియాతో వెల్లడించాయి.వచ్చే ఏడాది భారత్లోకాగా వచ్చే ఏడాది భారత్లో ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నీ పురుషుల ఆసియాకప్ టోర్నమెంట్కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీని వచ్చే ఏడాది సెప్టెంబర్లో నిర్వహించనున్నారు. 2026లో స్వదేశంలో జరిగే టీ20 ప్రపంచకప్కు ముందుగా ఈ టోర్నీ నిర్వహిస్తారు.గతంలోనూ 2023 వన్డే ప్రపంచకప్కు సన్నాహకంగా పాకిస్తాన్లో ఆసియా కప్ను వన్డే ఫార్మాట్లో నిర్వహించారు. అయితే భారత్ అక్కడికి వెళ్లేందుకు నిరాకరించడంతో ‘హైబ్రిడ్ మోడల్’తో భారత్ ఆడిన మ్యాచ్ల్ని శ్రీలంకలో ఏర్పాటు చేశారు. ఫైనల్లో శ్రీలంకపై గెలిచి భారత్ విజేతగా నిలిచింది. అనంతరం 2027 ఆసియా కప్నకు బంగ్లాదేశ్ ఆతిథ్యమిస్తుంది.అదే ఏడాది దక్షిణాఫ్రికాలో వన్డే ప్రపంచకప్ ఉండటంతో బంగ్లాలో వన్డే ఫార్మాట్లో ఆసియాకప్ జరుగనుంది. ఈ రెండు టోర్నీల్లోనూ భారత్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లతో పాటు టెస్టు హోదా దక్కని ఒక ఆసియా జట్టు పాల్గొంటుందని ఆసియా క్రికెట్ మండలి తెలిపింది. -
బీసీసీఐ ఉదారత.. భారత అథ్లెట్లకు ఆర్థిక సాయం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉదారత చాటుకుంది. పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెట్ల బృందానికి ఆర్ధిక సాయం ప్రకటించింది. అథ్లెట్లకు ప్రోత్సాహకంగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కు 8.5 కోట్ల రూపాయలు అందజేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. ఈ విషయాన్ని షా ట్విటర్ ద్వారా తెలిపారు.ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించనున్న అథ్లెట్లకు బీసీసీఐ మద్దతు ఇస్తుందని తెలపడానికి గర్విస్తున్నాను. ఈ ఒలింపిక్స్ కోసం బీసీసీఐ రూ.8.5కోట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అందిస్తుంది. మన అథ్లెట్లందరికీ ఆల్ ది బెస్ట్. భారత్ గర్వించేలా చేయండి. జై హింద్ అని షా తన ట్వీట్లో రాసుకొచ్చాడు.I am proud to announce that the @BCCI will be supporting our incredible athletes representing #India at the 2024 Paris Olympics. We are providing INR 8.5 Crores to the IOA for the campaign.To our entire contingent, we wish you the very best. Make India proud! Jai Hind! 🇮🇳…— Jay Shah (@JayShah) July 21, 2024కాగా, ఈ నెల 26 నుంచి ప్రారంభం కాబోయే పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. భారత బృందంలో 70 మంది పరుషులు, 47 మహిళా సభ్యులు ఉన్నారు. -
టీమిండియా మాజీ కోచ్కు క్యాన్సర్.. ట్రీట్మెంట్కు నిధులు సమకూర్చిన బీసీసీఐ
టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ గతేడాది కాలంగా బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ లండన్లో చికిత్స పొందుతున్నాడు. ట్రీట్మెంట్ ఖరైంది కావడంతో అన్షుమన్ కుటుంబం ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) అన్షుమన్ కుటుంబానికి చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చింది. బీసీసీఐ అన్షుమన్ వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణ సాయం కింద కోటి రూపాయల నిధులు విడుదల చేసింది. అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతి లభించిన అనంతరం నిధులు విడుదల చేయాలని బీసీసీఐ కార్యదర్శి జై షా బోర్డును ఆదేశించారు. నిధుల విడుదల అనంతరం షా అన్షుమన్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మున్ముందు వారికి ఎలాంటి అవసరం వచ్చినా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చాడు. అన్షుమన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. కాగా, 71 ఏళ్ల అన్షుమన్ గైక్వాడ్ 1974-87 మధ్యలో టీమిండియా తరఫున 40 టెస్ట్లు, 15 వన్డేలు ఆడాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్, రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ అయిన అన్షుమన్.. టెస్ట్ల్లో 2 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీల సాయంతో 1985 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ ఉంది. వన్డేల్లో అన్షుమన్ ఓ హాఫ్ సెంచరీ సాయంతో 269 పరుగులు చేశాడు. పార్ట్ టైమ్ బౌలర్ అయిన అన్షుమన్ టెస్ట్ల్లో 2 వికెట్లు, వన్డేల్లో ఓ వికెట్ పడగొట్టాడు.అన్షుమన్ 1997-2000 మధ్యలో రెండుసార్లు టీమిండియా హెడ్ కోచ్గా పని చేశాడు. తొలి దఫా (1997-1999) మూడేళ్లు కోచింగ్ పదవిలో ఉన్న అన్షుమన్.. రెండో దఫా (2000) ఏడాదికాలం భారత హెడ్ కోచ్గా సేవలందించాడు. ప్రస్తుతం క్యాన్సర్తో పోరాడుతూ, ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్షుమన్కు ఆర్దిక సాయం చేయాలని టీమిండియా మాజీలు బీసీసీఐని అభ్యర్దించారు. చాలా మంది నుంచి విన్నపాలను పరిగణలోకి తీసుకుని బీసీసీఐ కోటి రూపాయల నిధులు విడుదల చేసింది. -
Jay Shah: ఐసీసీ తదుపరి చైర్మన్గా జైషా?
బీసీసీఐ సెక్రటరీ జై షా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చైర్మెన్ పదవిపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్లో జరగనున్న ఐసీసీ చైర్మన్ ఎన్నికల్లో జై షా పోటీచేయనున్నట్లు సమాచారం. ఐసీసీ నిర్వహణలో ఆయన సమూల మార్పులు తీసుకురావాలని భావిస్తున్నట్లు క్రిక్బజ్ తమ కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్గా గ్రెగ్ బార్క్లే గత నాలుగు సంవత్సరాలుగా ఈ పదవిలో కొనసాగుతున్నారు. అతడు మరో మారు ఛైర్మన్గా కొనసాగడానికి అర్హత ఉంది. కానీ చైర్మెన్ పదవిపై జై షా పదవిపై ఆసక్తిగా ఉండటంతో గ్రెగ్ బార్క్లే పోటీ నుంచి తప్పుకోనున్నట్లు క్రిక్బజ్ తెలిపింది. కాగా గ్రెగ్ బార్క్లే జై షా మద్దతుతోనే ఐసీసీ ఛైర్మన్ కావడం గమనార్హం. అయితే టీ20 వరల్డ్కప్-2024 ముందు వరకు జై షా బీసీసీఐ సెక్రటరీ, ఐసీసీ చైర్మెన్గానే కొనసాగించాలని భావించండట. కానీ ఇటీవల అమెరికా, వెస్టిండీస్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచ కప్ఆతిథ్యం, నిర్వహణపై విమర్శలు రావడంతో జై షా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐసీసీ బాస్గా జై షా బాధ్యతలు చేపట్టనున్నట్లు వినికిడి. ఇక వేళ జై షా ఐసీసీ చైర్మెన్గా బాధ్యతలు చేపడితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్, బీసీసీఐ సెక్రటరీ పదవులను వదులుకోవాల్సి ఉంటుంది.కాగా 2019లో బీసీసీఐ కార్యదర్శిగా జైషా పగ్గాలు చేపట్టాడు. అంతకంటే ముందు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా కూడా జైషా పనిచేశాడు. అదే విధంగా 2021లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. -
అప్పటివరకు భారత కెప్టెన్ అతడే.. బీసీసీఐ సెక్రటరీ కీలక ప్రకటన
టీ20 వరల్డ్కప్ విజయనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్ విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచే తన చివరిదని రోహిత్ సృష్టం చేశాడు. అయితే టీ20ల్లో రోహిత్ వారసుడు ఎవరన్నది బీసీసీఐ ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు.టీ20ల్లో భారత కెప్టెన్గా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను నియమించే అవకాశమున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే రోహిత్ టీ20ల నుంచి తప్పుకోవడంతో మిగితా ఫార్మాట్లలో భారత కెప్టెన్గా కొనసాగుతాడా లేదా అన్న సందిగ్ధం అభిమానుల్లో నెలకొంది. తాజాగా ఈ విషయంపై బీసీసీఐ సెక్రటరీ జై షా క్లారిటీ ఇచ్చారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్, ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత జట్టుకు రోహిత్ శర్మనే సారథ్యం వహిస్తాడని జై షా సృష్టం చేశాడు."గతేడాది నవంబర్ 23న వరల్డ్కప్ ఫైనల్లో ఓటమి పాలైనప్పటకి.. అభిమానుల మనసును మాత్రం గెలుచుకున్నాము. కానీ ఈ సారి జూన్ 29 న అభిమానుల హృదయాలతో పాటు కప్ను కూడా గెలుచుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఛాంపియన్స్గా నిలిచి బార్బడోస్లో భారత జెండాను ఎగురవేశాము. ఈ విజయం తర్వాత మాకు త్వరలోనే కొన్ని ఐసీసీ కీలక ఈవెంట్లు ఉన్నాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో మేము డబ్ల్యూటీసీ ఫైనల్, ఛాంపియన్స్ ట్రోఫీని గెలుస్తామన్న నమ్మకంగా మాకు ఉందని బీసీసీఐ షేర్ చేసిన వీడియోలో జైషా పేర్కొన్నాడు.కాగా.. పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాదిలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అయితే.. భారత జట్టుని పాక్ను పంపిస్తారా? భారత జట్టు మ్యాచ్లను హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహిస్తారా? అన్నది ఇంకా నిర్ణయించలేదు. -
భారత టీ20 కెప్టెన్గా హార్దిక్ పాండ్యా.. జై షా ఏమన్నాడంటే?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్కప్-2024 ఛాంపియన్స్గా నిలిచిన అనంతరం రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. రోహిత్ ఇకపై కేవలం వన్డేలు, టెస్టుల్లో భారత సారథిగా కొనసాగనున్నాడు.ఈ క్రమంలో టీ20ల్లో భారత జట్టు తదపరి కెప్టెన్ ఎవరన్న ప్రశ్న అందరి మెదడలను తొలుస్తున్న ప్రశ్న. అయితే రోహిత్ వారసుడిగా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా భారత జట్టు పగ్గాలను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. పాండ్యాకు కెప్టెన్గా అనుభవం ఉంది.గతంలో రోహిత్ గైర్హాజరీలో చాలా సిరీస్లో భారత జట్టు తాత్కాలిక సారథిగా పాండ్యా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే బీసీసీఐ కూడా పొట్టి ఫార్మాట్లో భారత జట్టు సారథ్య బాధ్యతలను హార్దిక్కే అప్పజెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. తాజాగా భారత టీ20 కెప్టెన్సీపై బీసీసీఐ సెక్రటరీ జైషా స్పందించాడు. కెప్టెన్ ఎవరన్నది ఇంకా నిర్ణయంచలేదని జై షా తెలిపాడు."భారత జట్టు టీ20 కెప్టెన్ ఎవరన్నది సెలెక్టర్లు నిర్ణయిస్తారు. సెలక్టర్లతో చర్చించిన తర్వాత అధికారికంగా మేము ప్రకటిస్తాము. హార్దిక్ పాండ్యా గురించి చాలా మంది తమను అడిగారని, వరల్డ్కప్నకు ముందు అతడి ఫామ్పై చాలా ప్రశ్నలు వినిపించాయి. కానీ సెలెక్టర్లు అతనిపై విశ్వాసం ఉంచారు. అతడిని తనను తాను నిరూపించుకున్నాడు. ఏదేమైనప్పటికి కెప్టెన్సీ విషయంలో సెలక్టర్లదే తుది నిర్ణయమని" జై షా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇక ఈ నెలలో భారత్ శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు 3 టీ20లు, 3 వన్డేలు జరుగనున్నాయి.శ్రీలంక పర్యటన సమయానికి భారత జట్టుకు కొత్త టీ20 కెప్టెన్ వచ్చే అవకాశముంది. కాగా టీ20 వరల్డ్కప్-2024లో హార్దిక్ పాండ్యా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. భారత్ టైటిల్ను సొంతం చేసుకోవడంలో పాండ్యా కీలక పాత్ర పోషించాడు.చదవండి: రో.. నీలాంటి వ్యక్తి నా సొంతమైనందకు చాలా గర్విస్తున్నా: రితికా -
శ్రీలంక సిరీస్ నుంచి టీమిండియాకు కొత్త కోచ్.. రేసులో ఇద్దరు..!
టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పేరు ఖరారైందని గత కొద్ది రోజులుగా సోషల్మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరిగిన విషయం విధితమే. అయితే ఈ ప్రచారంలో వాస్తవం కొంతమాత్రమే ఉందని బీసీసీఐ కార్యదర్శి జై షా తాజా స్టేట్మెంట్ను బట్టి తెలుస్తుంది. భారత్ హెడ్ కోచ్ రేసులో ఇద్దరు ఉన్నట్లు షా పేర్కొన్నాడు. షా చెప్పిన మాటల ప్రకారం గంభీర్తో పాటు మరో వ్యక్తి (డబ్ల్యూవీ రామన్) భారత హెడ్ కోచ్ పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తుంది.కొత్త హెడ్ కోచ్ అంశంపై మాట్లాడుతూ షా మరిన్ని విషయాలను కూడా రివీల్ చేశాడు. కొత్తగా ఎంపిక కాబోయే కోచ్ ఈ నెల (జులై) చివర్లో ప్రారంభమయ్యే శ్రీలంక సిరీస్ నుంచి బాధ్యతలు చేపడతాడని తెలిపాడు. అలాగే ఈనెల (జులై) 6 నుంచి ప్రారంభం కాబోయే జింబాబ్వే టీ20 సిరీస్కు టీమిండియా హెడ్ కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తాడని షా పేర్కొన్నాడు.కాగా, ప్రస్తుత టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్తో ముగిసిన విషయం తెలిసిందే. ద్రవిడ్కు హెడ్ కోచ్ పదవిలో కొనసాగే ఇష్టం లేకపోవడంతో బీసీసీఐ కొత్త అభ్యర్దుల వేటలో పడింది. ఐపీఎల్ పెర్పార్మెన్స్ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ పదవి రేసులో గంభీర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. క్రికెట్ అడ్వైజరీ కమిటీ (CAC) కూడా గంభీర్వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాను ఓడించి రెండోసారి పొట్టి ప్రపంచకప్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ ముగిసిన అనంతరం భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించారు.మరోవైపు ఈ నెల 6వ తేదీ నుంచి టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత్.. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం శుభ్మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియాను ఇదివరకే ఎంపిక చేశారు. జింబాబ్వే పర్యటన అనంతరం భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. జులై 27 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో 3 టీ20లు, 3 వన్డేలు జరుగనున్నాయి. -
రోహిత్, కోహ్లి ఫ్యాన్స్కు శుభవార్త
టీ20 వరల్డ్కప్ 2024 అనంతరం టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఈ ముగ్గురు ప్రకటించారు. పొట్టి క్రికెట్ నుంచి తప్పుకున్న అనంతరం ఈ ముగ్గురు వన్డే ఫార్మాట్కు కూడా గుడ్బై చెబుతారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించాడు. రోహిత్, కోహ్లి, జడేజా వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతారని అన్నాడు. టీ20 వరల్డ్కప్ 2024 ఆడిన జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతుందని హింట్ ఇచ్చాడు. సీనియర్లంతా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటారని పేర్కొన్నాడు. టీమిండియా మున్ముందు మరిన్ని టైటిళ్లు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. తమ తదుపరి టార్గెట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, ఛాంపియన్స్ ట్రోఫీ టైటల్స్ అని తెలిపాడు. విరాట్, రోహిత్లు వన్డేల్లో కొనసాగడంపై షా క్లూ ఇవ్వడంతో వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆరాధ్య ఆటగాళ్ల మెరుపులను మరిన్ని రోజులు చూడవచ్చని ఆనందపడుతున్నారు.ఇదిలా ఉంటే, బీసీసీఐ నిన్న టీమిండియాకు రూ. 125 కోట్ల నగదు నజరానా ప్రకటించింది. ప్రపంచకప్ ఆధ్యాంతం అద్భుత ప్రదర్శన కనబర్చి, 17 ఏళ్ల తర్వాత పొట్టి ప్రపంచకప్కు తిరిగి సాధించినందుకు భారత బృందం జాక్పాట్ కొట్టింది. టీమిండియా ప్రస్తుతం ఫైనల్ మ్యాచ్కు వేదిక అయిన బార్బడోస్లోనే ఉంది. గాలివాన భీబత్సం (హరికేన్) కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో భారత జట్టు బార్బడోస్లోనే నిలిచిపోవాల్సి వచ్చింది.అయితే, హరికేన్ ప్రభావం తగ్గి విమాన సర్వీసులు పునరుద్ధరించబడితే రేపటి కల్లా టీమిండియా ఢిల్లీలో ల్యాండ్ అవుతుంది. టీమిండియా రాక కోసం స్వదేశంలో అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. భారత ఆటగాళ్లు ఢిల్లీలో ల్యాండ్ కాగానే ఘన స్వాగతం పలకాలని ప్లాన్లు చేసుకున్నారు. భారత ప్రభుత్వం సైతం వరల్డ్కప్ హీరోలను ఘనంగా సన్మానించాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంది. భారత్లోకి ఎంటర్ కాగానే టీమిండియా హీరోలను ఊరేగింపుగా తీసుకుపోవచ్చు. ఈ తంతు అనంతరం భారత క్రికెట్ బృందం ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉంది. -
టీమిండియాకు రూ. 125 కోట్ల ప్రైజ్మనీ
టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. పొట్టి ఫార్మాట్లో జగజ్జేతగా నిలిచిన టీమిండియాకు రూ. 125 కోట్ల ప్రైజ్మనీని ప్రకటిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. టోర్నీ ఆధ్యాంతం టీమిండియా అసాధారణ ప్రతిభ, దృడ సంకల్పం మరియు క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించిందని షా ట్వీట్ చేశాడు. అత్యుత్తమ విజయాన్ని సాధించిన ఆటగాళ్లు, కోచ్లు, సహాయక సిబ్బందికి అభినందనలు తెలిపారు.కాగా, నిన్న (జూన్ 29) జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో టీ20 ప్రపంచకప్ టైటిల్ సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. విరాట్ కోహ్లి (59 బంతుల్లో 76; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (31 బంతుల్లో 47; ఫోర్, 4 సిక్సర్లు), శివమ్ దూబే (16 బంతుల్లో 27; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టగా.. జన్సెన్, రబాడ చెరో వికెట్ దక్కించుకున్నారు.I am pleased to announce prize money of INR 125 Crores for Team India for winning the ICC Men’s T20 World Cup 2024. The team has showcased exceptional talent, determination, and sportsmanship throughout the tournament. Congratulations to all the players, coaches, and support… pic.twitter.com/KINRLSexsD— Jay Shah (@JayShah) June 30, 2024అనంతరం 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. హార్దిక్ పాండ్యా (3-0-20-3), అర్ష్దీప్ సింగ్ (4-0-20-2), బుమ్రా (4-0-18-2) సత్తా చాటడంతో లక్ష్యానికి 8 పరుగుల దూరంలో (169/8) నిలిచిపోయింది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆదిలో తడబడినప్పటికీ.. మధ్యలో క్లాసెన్ (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) టీమిండియాను భయపెట్టాడు. ఆఖర్లో బుమ్రా, హార్దిక్, అర్ష్దీప్ అద్బుతంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా విజయతీరాలకు చేరింది.వరల్డ్కప్ గెలిచిన అనంతరం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 కెరీర్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ఈ టోర్నీతోనే ముగిసింది. -
టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్ పేరు ఖరారు.. త్వరలోనే ప్రకటన..?
టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పేరు ఖరారైనట్లు తెలుస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. భారత్ హెడ్ కోచ్ పదవిపై ఆసక్తి ఉన్నట్లు గంభీర్ స్వయంగా సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు ఓ ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ పేర్కొంది. గంభీర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ అయిన షారుఖ్ ఖాన్కు కూడా ఈ విషయం తెలుసని సదరు వెబ్సైట్ వెల్లడించింది. హెడ్ కోచ్ పదవికి గంభీర్ దరఖాస్తు చేశాడా లేదా అనే విషయంపై స్పష్టత లేనప్పటికీ ఈ విషయం ముమ్మాటికి నిజమేనని సోషల్మీడియా సైతం కోడై కూస్తుంది. ఇదే విషయాన్ని ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ కూడా స్పష్టం చేశాడని తెలుస్తుంది. బీసీసీఐ కార్యదర్శి జై షా, గంభీర్ల మధ్య డీల్ కుదిరిందని.. ఈ విషయమై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని సదరు ఫ్రాంచైజీ ఓనర్ చెప్పినట్లు సమాచారం. రెండ్రోజుల కిందట ముగిసిన ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ఈ డీల్ క్లోజ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ ఫైనల్ ముగిశాక గంభీర్-జై షా చాలాసేపు బహిరంగంగా డిస్కస్ చేసుకోవడం జనమంతా చూశారు. ఆ సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ పదవిపైనే చర్చ జరిగినట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వస్తే కాని ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది. టీ20 వరల్డ్కప్ 2024తో భారత హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తవుతుంది. ద్రవిడ్ పదవి వీడేందుకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో అతి త్వరలోనే ప్రకటన వెలువడేందుకు ఆస్కారం ఉంది. టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. కాగా, గంభీర్ మెంటార్షిప్లో కేకేఆర్ ఈ ఏడాది ఐపీఎల్ ఛాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. పదేళ్లకు ముందు ఇదే గంభీర్ కెప్టెన్గా కేకేఆర్ను ఛాంపియన్గా నిలబెట్టాడు. అంతకు రెండేళ్ల ముందు కూడా గంభీర్ ఓసారి కేకేఆర్కు టైటిల్ అందించాడు. ఘనమైన ట్రాక్ రికార్డుతో పాటు దేశం పట్ల గంభీర్కు ఉన్న కమిట్మెంట్ భారత్ హెడ్ కోచ్ పదవి రేసులో అతన్ని ముందుంచుతుంది. -
IPL 2024: వారికి భారీ నజరానా.. బీసీసీఐ కీలక ప్రకటన
పొట్టి క్రికెట్ ప్రేమికులకు రెండున్నర నెలలుగా వినోదం అందించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్కు ఆదివారంతో తెరపడింది. చెన్నై వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది.ప్యాట్ కమిన్స్ బృందాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి పదేళ్ల తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ క్రమంలో క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్ చాంపియన్గా నిలిచిన కేకేఆర్కు రూ. 20 కోట్ల ప్రైజ్మనీ దక్కగా.. రన్నరప్ సన్రైజర్స్కు రూ. 12.5 కోట్లు అందాయి. ICYMI! That special run to glory 💫💜Recap the #Final on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvSRH | #TheFinalCall pic.twitter.com/qUDfUFHpka— IndianPremierLeague (@IPL) May 26, 2024అన్సంగ్ హీరోలకు భారీ నజరానాఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా కీలక ప్రకటన చేశారు. ఐపీఎల్ పదిహేడో సీజన్ ఇంతగా విజయవంతం కావడం వెనుక ఉన్న ‘అన్సంగ్ హీరో’లకు భారీ మొత్తం కానుకగా ప్రకటించారు.గ్రౌండ్స్మెన్, పిచ్ క్యూరేటర్లకు రూ. 25 లక్షల చొప్పున బహుమతిగా అందించనున్నట్లు ఎక్స్ వేదికగా జై షా వెల్లడించారు. ‘‘తాజా టీ20 సీజన్ను ఇంతగా సక్సెస్ కావడానికి గ్రౌండ్ సిబ్బంది నిర్విరామంగా పనిచేయడమూ కారణమే.వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా అద్భుతమైన పిచ్లను తయారు చేయడంలో వారు సఫలమయ్యారు. అందుకే గ్రౌండ్స్మెన్, క్యూరేటర్ల శ్రమను గుర్తించి వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించాం.ఈ సీజన్లో రెగ్యులర్గా ఐపీఎల్ మ్యాచ్లు సాగిన 10 వేదికల సిబ్బందికి ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు, అదనంగా సేవలు అందించిన మూడు వేదికల సిబ్బందికి రూ. 10 లక్షల చొప్పున అందజేస్తాం. మీ కఠిన శ్రమ, అంకితభావానికి థాంక్యూ’’ అని జై షా సోమవారం ట్వీట్ చేశారు.వేదికలు ఇవేకాగా ఐపీఎల్-2024 సీజన్లో ముంబై(ముంబై ఇండియన్స్), ఢిల్లీ(ఢిల్లీ క్యాపిటల్స్), చెన్నై(చెన్నై సూపర్ కింగ్స్), కోల్కతా(కోల్కతా నైట్ రైడర్స్), చండీఘర్(పంజాబ్ కింగ్స్), హైదరాబాద్(సన్రైజర్స్), బెంగళూరు(ఆర్సీబీ), లక్నో(లక్నో సూపర్ జెయింట్స్), అహ్మదాబాద్(గుజరాత్ టైటాన్స్), జైపూర్(రాజస్తాన్ రాయల్స్)లలో రెగ్యులర్గా మ్యాచ్లు జరగగా.. గువాహటి(రాజస్తాన్ రాయల్స్), విశాఖపట్నం(ఢిల్లీ క్యాపిటల్స్), ధర్మశాల(పంజాబ్ కింగ్స్) మైదానాల్లోనూ మ్యాచ్లు నిర్వహించారు.చదవండి: SRH: అందుకే ఓడిపోయాం.. మా వాళ్లు మాత్రం సూపర్: కమిన్స్The unsung heroes of our successful T20 season are the incredible ground staff who worked tirelessly to provide brilliant pitches, even in difficult weather conditions. As a token of our appreciation, the groundsmen and curators at the 10 regular IPL venues will receive INR 25…— Jay Shah (@JayShah) May 27, 2024 -
టీమిండియా హెడ్ కోచ్గా డివిలియర్స్?.. హింట్ ఇచ్చిన ఏబీడీ
రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ ఎవరన్న అంశంపై క్రికెట్ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది. ఈ పదవి కోసం బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. విదేశీ కోచ్లకు కూడా తలుపు తెరిచే ఉన్నాయంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేయడంతో పలువురు మాజీ క్రికెటర్ల పేర్లు తెరమీదకు వచ్చాయి.ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం రిక్కీ పాంటింగ్, మాజీ కోచ్ జస్టిన్ లాంగర్, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్టీఫెన్ ఫ్లెమింగ్, ఆర్సీబీ కోచ్ ఆండీ ఫ్లవర్ తదితరులు టీమిండియా హెడ్కోచ్ రేసులో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, రిక్కీ, లాంగర్ తాము ఈ పదవి పట్ల ఆసక్తిగా లేమని చెప్పగా.. జై షా సైతం తాము ఎవరికీ ఇంకా ఆఫర్ ఇవ్వలేదంటూ కౌంటర్ ఇచ్చాడు.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టీమిండియా హెడ్ కోచ్గా ఆఫర్ వస్తే ఏం చేస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘నాకైతే ఈ విషయం గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచనా లేదు.అయితే, ఏదేని జట్టుకు కోచింగ్ ఇవ్వడాన్ని నేను పూర్తిగా ఆస్వాదిస్తాను. అదే సమయంలో.. నన్ను ఇబ్బంది పెట్టే అంశాలు కూడా కొన్ని ఉంటాయన్న విషయం మర్చిపోవద్దు.నాకు తెలియని విషయాలను కూడా త్వరత్వరగా నేర్చుకోవాల్సి ఉంటుంది. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది. భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు. కోచ్గా ఉండటానికి నాకెలాంటి అభ్యంతరం లేదు.40 ఏళ్ల వయసులో.. ఇప్పుడు నేను పూర్తి పరిణతి చెందిన వ్యక్తిని. నా కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమేం జరిగాయో అన్న దానిపై మరింత స్పష్టత వచ్చింది. చాలా పాఠాలు నేర్చుకున్నాను.కొంత మంది యువ ఆటగాళ్లకు.. మరికొంత మంది సీనియర్లకు కూడా నా అనుభవం ఉపయోగపడవచ్చు. కొంత మంది ఆటగాళ్లతో.. కొన్ని జట్లతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.కానీ పూర్తిస్థాయిలో హెడ్ కోచ్గా ఉండేందుకు ఇది సరైన సమయం కాదనుకుంటున్నా. ఈ విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నా. అయితే, ముందుగా చెప్పినట్లు కోచ్ మారడానికి నేనెప్పుడూ నో చెప్పను. పరిస్థితులు మారుతూనే ఉంటాయి కదా!’’ అని ఏబీ డివిలియర్స్ న్యూస్18తో పేర్కొన్నాడు.భవిష్యత్తులో తనను కోచ్ అవతారంలో తప్పక చూస్తారనే సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఏబీ డీ అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడో ఎందుకు ఇప్పుడే టీమిండియా హెడ్కోచ్గా వచ్చేయమంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు.. ఆర్సీబీ ఫ్యాన్స్ సైతం వచ్చే ఏడాది డివిలియర్స్ తమ బెంగళూరు జట్టుకు మెంటార్గా రావడం ఖాయమని ఫిక్సయిపోతున్నారు.చదవండి: SRH Captain Pat Cummins: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్.. ఇంకొక్క అడుగు -
BCCI: అవన్నీ అబద్ధాలే: ఆసీస్ మాజీలకు జై షా కౌంటర్
టీమిండియా కొత్త హెడ్ కోచ్ విషయంలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా కొట్టిపారేశారు. ఈ బాధ్యతలు స్వీకరించాల్సిందిగా తాము ఇంత వరకు ఎవరినీ సంప్రదించలేదని స్పష్టం చేశారు.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత రాహుల్ ద్రవిడ్ భారత జట్టు ప్రధాన కోచ్గా పదవీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ అతడి వారసుడిని ఎంపిక చేసే క్రమంలో దరఖాస్తులు ఆహ్వానించింది. విదేశీ కోచ్ల పేర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.హెడ్ కోచ్ రేసులోఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు రిక్కీ పాంటింగ్, జస్టిన్ లాంగర్ సహా న్యూజిలాండ్ మాజీ ఆటగాడు స్టీఫెన్ ఫ్లెమింగ్, శ్రీలంక లెజెండ్ మహేళ జయవర్ధనే తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో రిక్కీ పాంటింగ్ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. బీసీసీఐ తనకు ఆఫర్ ఇచ్చినా తిరస్కరించానని పేర్కొన్నాడు. మరోవైపు.. జస్టిన్ లాంగర్ సైతం కేఎల్ రాహుల్ తన కళ్లు తెరిపించాడంటూ టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం తాను అప్లై చేసుకోనని పరోక్షంగా వెల్లడించాడు.వాళ్లకు మేమే ఆఫర్ ఇవ్వలేదురిక్కీ పాంటింగ్, జస్టిన్ లాంగర్ వ్యాఖ్యలపై బీసీసీఐ కార్యదర్శి జై షా తాజాగా స్పందించారు. ‘‘టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం నేను గానీ, బీసీసీఐ గానీ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లెవరికీ ఆఫర్ చేయలేదు.మీడియా వస్తున్న వార్తలన్నీ నిజం కాదు. జాతీయ జట్టు కోసం సరైన కోచ్ను ఎంపిక చేసుకోవడం క్లిష్టతరమైన ప్రక్రియ. భారత క్రికెట్ స్వరూపాన్ని చక్కగా అర్థం చేసుకోగల వ్యక్తుల కోసం అన్వేషిస్తున్నాం.పూర్తి అవగాహన ఉన్నవాళ్లకే ప్రాధాన్యంటీమిండియా హెడ్ కోచ్గా ఉన్నవారికి భారత దేశవాళీ క్రికెట్ గురించి, ఆటగాళ్ల గురించి పూర్తి అవగాహన ఉండాలి. అలాంటి వాళ్ల కోసమే మేము ఎదురుచూస్తున్నాం.భారత జట్టు ప్రధాన కోచ్గా ఉండటం కంటే అంతర్జాతీయ క్రికెట్లో ప్రతిష్టాత్మకమైన పదవి ఇంకోటి ఉంటుందని అనుకోను. ప్రపంచవ్యాప్తంగా టీమిండియాకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. భారత క్రికెట్ చరిత్ర, ఔన్నత్యం.. ఆట పట్ల మా అంకితభావం.. అన్నీ వెరసి ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయిలో ఉన్నాం.ఇలాంటి చోట జాబ్ చేయడం కంటే గొప్ప విషయం ఏముంటుంది?. ఇలాంటి జట్టుకు గురువుగా బాధ్యతలు నిర్వర్తించే సరైన వ్యక్తి కోసం మేము జల్లెడపట్టాల్సి ఉంటుంది’’ అని జై షా ఇండియన్ ఎక్స్ప్రెస్తో వ్యాఖ్యానించారు. చదవండి: SRH vs RR: అతడి మీదే భారం.. అలా అయితేనే సన్రైజర్స్ ముందుకు -
T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
ఐపీఎల్-2024 ముగిసిన వారం రోజుల్లోపే మరో మెగా ఈవెంట్ క్రికెట్ ప్రేమికుల ముందుకు రానుంది. టీ20 ప్రపంచకప్-2024 రూపంలో మరోసారి పొట్టి ఫార్మాట్ మజాను అందించనుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే భారత్ సహా మిగిలిన ప్రధాన దేశాల క్రికెట్ బోర్డులు జట్లను ప్రకటించాయి.అప్పుడు సెమీస్లోనేజూన్ 1 నుంచి ఆరంభం కానున్న ఈ ఐసీసీ ఈవెంట్కు అమెరికాతో కలిసి వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వనుంది. మొత్తంగా 20 జట్లు పాల్గొననున్న ఈ టీ20 వరల్డ్కప్లో టీమిండియాకు రోహిత్ శర్మనే సారథ్యం వహించనున్నాడు. ఇప్పటికే ఎనిమిదిసార్లు పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్లో పాల్గొన్న హిట్మ్యాన్ రెండో దఫా కెప్టెన్ హోదాలో బరిలోకి దిగనున్నాడు.గత ప్రపంచకప్-2022లో ఫేవరెట్గా బరిలోకి దిగిన రోహిత్ సేన సెమీస్లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్- పాకిస్తాన్ మధ్య ఫైనల్ జరుగగా ఇంగ్లిష్ జట్టు విజేతగా అవతరించింది. ఇక ఈసారి కూడా టీమిండియాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.టైటిల్ రేసులో నిలిచే జట్లు ఇవేఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్-2024లో గట్టి పోటీనిచ్చే, టైటిల్ రేసులో నిలిచే జట్లు ఇవేనంటూ తన అంచనా తెలియజేశాడు.‘‘ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. అలాగే ఆతిథ్య వెస్టిండీస్.. ఈ నాలుగు జట్లే మెగా ఈవెంట్లో కీలకంగా మారనున్నాయి’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో జై షా పేర్కొన్నాడు. అయితే, ఈ లిస్టులో ఆయన డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, గత ఎడిషన్ రన్నరప్ పాకిస్తాన్ పేర్లను విస్మరించడం గమనార్హం.కాగా చిరకాల ప్రత్యర్థులు టీమిండియా- పాకిస్తాన్ గ్రూపు-ఏలో ఉన్నాయి. ఈ రెండు జట్లతో పాటు కెనడా, ఐర్లాండ్, యూఎస్ఏ కూడా ఇదే గ్రూపులో ఉన్నాయి. ఇక జూన్ 5న టీమిండియా ఐర్లాండ్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జూన్ 9న పాకిస్తాన్తో తలపడనుంది.టీ20 ప్రపంచకప్-2024- ఏ గ్రూపులో ఏ జట్టు?👉గ్రూప్-ఏ: కెనడా, ఇండియా(ఏ1), ఐర్లాండ్, పాకిస్తాన్(ఏ2), యూఎస్ఏ👉గ్రూప్-బి: ఆస్ట్రేలియా(బీ2), ఇంగ్లండ్(బీ1), నమీబియా, ఒమన్, స్కాట్లాండ్.👉గ్రూప్-సి: అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్(సీ1), పపువా న్యూగినియా, ఉగాండా, వెస్ట్ ఇండీస్(సీ2).👉గ్రూప్-డి: బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్స్, సౌతాఫ్రికా(డీ1), శ్రీలంక(డీ2). చదవండి: RCB vs CSK: చెన్నైని ఓడించినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరదు! అదెలా?.. మధ్యలో లక్నో! -
ద్రవిడ్ మళ్లీ దరఖాస్తు చేయాల్సిందే!
ముంబై: టి20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే భారత క్రికెట్ జట్టుకు కొత్త హెడ్ కోచ్ బాధ్యతలు స్వీకరిస్తారని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. దాని కోసం మరికొద్ది రోజుల్లోనే దరఖాస్తులు కోరతామని కూడా ఆయన స్పష్టం చేశారు. భారత జట్టు వరల్డ్ కప్కు బయల్దేరే ముందే ఈ ప్రక్రియ మొదలవుతుందని కూడా జై షా చెప్పారు. గత ఏడాది రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తయిన తర్వాతే కొత్త కోచ్పై చర్చ జరగడంతో కొంత గందరగోళం నెలకొంది. దాంతో ద్రవిడ్నే మరో ఏడాది కొనసాగించారు. ఈసారి అలాంటి స్థితి రాకుండా బోర్డు ముందే జాగ్రత్త పడుతోంది. ఒప్పందం ప్రకారం వచ్చే జూన్లో ద్రవిడ్ పదవీకాలం పూర్తవుతుంది. ద్రవిడ్ మళ్లీ కోచ్గా కొనసాగాలనుకుంటే మళ్లీ దరఖాస్తు చేయాల్సి ఉంటుందని... కొన్ని ఇతర జట్ల తరహాలో వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్లను ఎంపిక చేసే ఆలోచన లేదని కూడా షా పేర్కొన్నారు. కొత్త హెడ్ కోచ్కు మూడేళ్ల పదవీ కాలం ఇస్తామని, 2027 వన్డే వరల్డ్ కప్ వరకు అతను కొనసాగుతాడని బోర్డు కార్యదర్శి ప్రకటించారు. కోచ్ ఎంపిక విషయంలో క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)దే తుది నిర్ణయమన్న షా... విదేశీ కోచ్ అయినా అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్కు చేరని జట్లలో ఉన్న ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది కలిసి మే 24న తొలి బృందంగా టి20 వరల్డ్ కప్ కోసం అమెరికా బయలుదేరతారని జై షా వెల్లడించారు. ఐపీఎల్లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనను ప్రయోగాత్మకంగానే పెట్టామని, అవసరమైతే దీనిపై మళ్లీ చర్చించి కొనసాగించాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లను బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో చేర్చకపోవడంలో తన పాత్ర ఏమీ లేదని... ఇది పూర్తిగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నిర్ణయమని ఆయన సందేహ నివృత్తి చేశారు. -
శ్రేయస్, ఇషాన్ల వేటు పడటానికి కారణం అతడే: జై షా
టీమిండియా స్టార్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్టులు కోల్పోవడానికి తాను కారణం కాదన్నాడు భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా. సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం మాత్రమే తన విధి అని తెలిపాడు.కాగా దక్షిణాఫ్రికా పర్యటన నుంచి మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్.. రంజీల్లో ఆడమని బోర్డు ఆదేశించినా లెక్కచేయలేదు. ఆ తర్వాత వెంటనే ఐపీఎల్-2024 కోసం ముంబై ఇండియన్స్ క్యాంపులో చేరాడు.మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ సైతం రంజీల్లో ముంబై తరఫున బరిలోకి దిగకుండా ఫిట్నెస్ కారణాలు సాకుగా చూపాడు. అయితే, ఎన్సీఏ అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది. ఈ క్రమంలో తాజా సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ఈ ఇద్దరి పేర్లు గల్లంతయ్యాయి.ఆ తర్వాత అయ్యర్ ముంబై తరఫున రంజీ బరిలో దిగినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో వీరిద్దరికి టీ20 వరల్డ్కప్-2024 జట్టులోనూ చోటు దక్కలేదు.అతడి నిర్ణయం ప్రకారమేఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్టులు కోల్పోయిన అంశంపై జై షా తాజాగా స్పందించాడు. ‘‘బీసీసీఐ రాజ్యాంగాన్ని గమనించండి.సెలక్షన్ మీటింగ్లో చర్చించిన విషయాల గురించి మీడియాకు తెలియజేసే కన్వీనర్ను మాత్రమే నేను.ఆ ఇద్దరిని దేశవాళీ క్రికెట్ ఆడాలని నిర్ణయించిందీ.. అదే విధంగా వారు చెప్పినట్లు వినలేదని సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తప్పించిందీ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.అతడు తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడమే నా పని. వాళ్లిద్దరు వెళ్లినా సంజూ శాంసన్ లాంటి వాళ్ల రూపంలో కొత్త ఆటగాళ్లకు చోటు దక్కింది కదా!’’ అని జై షా జాతీయ మీడియాతో వ్యాఖ్యానించాడు.అయ్యర్ అదుర్స్... ఇషాన్ ఫెయిల్కాగా ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నారు. ముంబై ఇండియన్స్ తరఫున ఓపెనర్గా వస్తున్న ఇషాన్ ఇప్పటి వరకు 12 ఇన్నింగ్స్లో కలిపి 266 పరుగులు మాత్రమే చేశాడు.మరోవైపు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం 11 ఇన్నింగ్స్లో 280 పరుగులు చేయడంతో పాటు.. ఈ సీజన్లో జట్టును ప్లే ఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా నిలిపే పనిలో ఉన్నాడు. చదవండి: ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్ -
ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్
టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా హెడ్కోచ్ మారబోతున్నాడా? అంటే అవుననే అంటున్నాడు భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా. కొత్త కోచ్గా భారతీయ క్రికెటర్ లేదంటే విదేశీ ఆటగాడైనా రావొచ్చని సంకేతాలు ఇచ్చాడు.కాగా పొట్టి వరల్డ్కప్-2021 తర్వాత రవిశాస్త్రి స్థానంలో మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అతడి మార్గదర్శనంలో అన్ని ఫార్మాట్లలో ప్రపంచ నంబర్ వన్గా నిలిచిన భారత జట్టు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయింది.టైటిల్ పోరులో రాణించలేకటీ20 ప్రపంచకప్-2022లో సెమీస్లోనే ఇంటిబాట పట్టిన రోహిత్ సేన.. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ 2021-23, వన్డే వరల్డ్కప్-2023 టోర్నీల్లో ఫైనల్ చేరినా టైటిల్ గెలవకలేకపోయింది. ఆఖరి మెట్టుపై ఆస్ట్రేలియా చేతిలో బోల్తాపడి ట్రోఫీని చేజార్చుకుంది.ఇదిలా ఉంటే.. వాస్తవానికి భారత్ వేదికగా ప్రపంచకప్-2023 పూర్తయ్యేనాటికి రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం పూర్తైంది. ఈ క్రమంలో టీ20 వరల్డ్కప్ వరకు ద్రవిడ్ను కోచ్గా కొనసాగాల్సిందిగా బోర్డు కోరడంతో అతడు సమ్మతించినట్లు వార్తలు వచ్చాయి.ద్రవిడ్ గుడ్బై/ ద్రవిడ్కు గుడ్బై?అయితే, తాజా సమాచారం ప్రకారం ద్రవిడ్ తన పదవీకాలాన్ని పొడిగించుకునేందుకు సుముఖంగా లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త కోచ్ వేటలో పడింది. ఇందుకు సంబంధించి త్వరలోనే ప్రకటన విడుదల చేయనుంది.ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా స్వయంగా వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘రాహుల్ పదవీ కాలం జూన్ వరకు పూర్తవుతుంది. ఒకవేళ అతడు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని భావిస్తే.. అప్లై చేసుకోవచ్చు. ఆ స్వేచ్ఛ అతడికి ఉంది.కొత్త కోచ్గా ఫారినర్?ఇక కొత్త కోచ్ ఇండియన్ లేదంటే ఫారినర్ అన్న విషయం గురించి ఇప్పుడే చెప్పలేం. క్రికెట్ అడ్వైజరీ కమిటీ నిర్ణయానుసారమే కోచ్ నియామకం జరుగుతుంది’’ అని జై షా క్రిక్బజ్తో వ్యాఖ్యానించాడు.అలాంటిదేమీ లేదు!అదే విధంగా.. భిన్న ఫార్మాట్లకు భిన్న కోచ్ల గురించి ప్రస్తావన రాగా.. ‘‘ఈ విషయంలో కూడా క్రికెట్ అడ్వైజరీ కమిటీదే తుది నిర్ణయం. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషభ్ పంత్.. ఇలా చాలా మంది మూడు ఫార్మాట్లలో ఆడుతున్న క్రికెటర్లు ఉన్నారు. కానీ కోచ్ల విషయంలో అలా జరిగే ఆస్కారం లేదు’’ అంటూ కొట్టిపారేశాడు. చదవండి: రోహిత్ ముంబైని వీడటం ఖాయం.. ఆ తర్వాత అయ్యర్ కెప్టెన్సీలో! -
Rohit Sharma: మా జట్టు గుండె చప్పుడు!.. వీడియో వైరల్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టినరోజు నేడు(ఏప్రిల్ 30). హిట్మ్యాన్ మంగళవారం నాడు 37వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.బీసీసీఐ కార్యదర్శి జై షా సహా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, గౌతం గంభీర్, వసీం జాఫర్ తదితరులు రోహిత్ శర్మకు విషెస్ తెలిపారు. ఇక హిట్మ్యాన్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఐపీఎల్ ముంబై ఇండియన్స్ అతడి బర్త్డే గిఫ్ట్గా ఫ్యాన్స్ కోసం ప్రత్యేక వీడియోను షేర్ చేసింది.మా జట్టు గుండె చప్పుడు‘‘భారత క్రికెట్లో ఉత్తుంగతరంగంలా దూసుకుపోతున్న మా కెప్టెన్ రోహిత్ శర్మకు హ్యాపీ బర్త్డే! నీ నాయకత్వ పటిమ, నైపుణ్యం అమోఘం. మా జట్టు గుండె చప్పుడు నువ్వు.బౌండరీలు బాదుతూ.. మరో వసంతంలోకి! చరిత్ర పుటల్లోకెక్కిన హిట్మ్యాన్.. నువ్వు మరింత ప్రకాశవంతంగా వెలిగిపోవాలి’’ అని జై షా ఆకాంక్షించాడు.సోదర సమానుడు‘‘ఆయురారోగ్యాలు, సంతోషాలతో నువ్వెప్పుడూ విలసిల్లాలి రోహిత్’’ అంటూ గంభీర్ విష్ చేశాడు. ఇక యువీ.. ‘‘సోదర సమానుడు రోహిత్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ బ్యాట్ నుంచి మరిన్ని పరుగులు జాలువారాలి’’ అని విషెస్ తెలిపాడు.కాగా ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్న ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ భార్య రితికాతో కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇందులో సూర్యకుమార్ యాదవ్, అతడి భార్య దేవిషా శెట్టి కూడా కనిపిస్తున్నారు. కాగా ముంబై మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. HBD Rohit Sharma: హిట్మ్యాన్ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్ ఇదే! -
T20 WC: జట్టు ఎంపిక ఫైనల్.. అతడిపై వేటు తప్పదా?
టీ20 ప్రపంచకప్-2024 జట్టు ప్రకటనకు సమయం ఆసన్నమైంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనబోయే ఆటగాళ్లు ఎవరన్న చర్చకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ ఆతిథ్యంలో ఈ ఐసీసీ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ప్రపంచకప్లో భాగమయ్యే ఇరవై జట్ల ఎంపికను మే 1 వరకు ఖరారు చేయాల్సిందిగా అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆయా దేశాలను ఆదేశించింది.ఈ క్రమంలో ఇప్పటికే న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించగా.. టీమిండియా కూడా అనౌన్స్మెంట్కు సిద్ధమైంది. జట్టు ఎంపిక గురించి ఇప్పటికే బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం.ఢిల్లీలో వీరు ముగ్గురు ఆదివారం సమావేశమై తీసుకున్న నిర్ణయం గురించి బీసీసీఐ కార్యదర్శి జై షాతో మంగళవారం చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఫిట్నెస్, వికెట్ కీపర్ ఎంపిక గురించి మేనేజ్మెంట్ తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.పాండ్యా గనుక బౌలింగ్ చేస్తే అదనపు పేసర్ అవసరం ఉండదు. కానీ అతడి ఫిట్నెస్ దృష్ట్యా బౌలర్గా పూర్తిస్థాయిలో బరిలోకి దిగే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు.. వికెట్ కీపర్ కోటాలో రిషభ్ పంత్తో పాటు సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ పోటీపడుతున్నారు.వీరిలో సంజూ ఐపీఎల్-2024లో దుమ్ములేపుతుండగా.. పంత్ కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. రాహుల్ కూడా బాగానే ఆడుతున్న నిలకడలేమి ఫామ్ కలవరపెడుతోంది.అతడిపై వేటు తప్పదా?మరోవైపు.. ఓపెనింగ్ స్లాట్లో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి పేరు దాదాపుగా ఖరారు కాగా.. బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్ మధ్య పోటీ నెలకొంది. అయితే, మేనేజ్మెంట్ మాత్రం ఈ విషయంలో జైస్వాల్వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. జట్టు ప్రకటన తర్వాతే వరల్డ్కప్లో పాల్గొనబోయే 15 మంది భారత ఆటగాళ్ల గురించి స్పష్టతరానుంది. -
ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐపీఎల్-2024 భారత్లోనే?
క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. లోక్ సభ ఎన్నికల కారణంగా ఐపీఎల్-2024 సెకెండ్ ఫేజ్ను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు గత కొన్ని రోజుల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై బీసీసీఐ సెక్రటరీ జై షా స్పందించారు. రెండో దశ మ్యాచ్లు కూడా భారత్లోనే జరగనున్నట్లు జై షా సృష్టం చేశారు. "ఈ ఏడాది సీజన్ మొత్తం ఇండియాలోనే జరగనుంది. విదేశాల్లో నిర్వహించే ఆలోచన లేదని" క్రిక్బజ్తో జైషా పేర్కొన్నారు. కాగా ఇప్పటికే తొలి ఫేజ్ షెడ్యూల్ను బీసీసీఐ రిలీజ్ చేసింది. తొలి దశలో కేవలం 22 మ్యాచ్లకు షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 22న ఈ క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో చెపాక్ వేదికగా ఆర్సీబీ, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అయితే మరోవారంలో పూర్తి షెడ్యూల్ను కూడా బీసీసీఐ విడుదల చేయనుంది. మరోవైపు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం రిలీజ్ చేసింది. ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జూన్ 1 వరకు లోక్సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. -
మొహమ్మద్ షమీకి సంబంధించి బిగ్ అప్డేట్
టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీకి సంబంధించి బీసీసీఐ కార్యదర్శి జై షా బిగ్ అప్డేట్ ఇచ్చారు. షమీ ఈ ఏడాది సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో (స్వదేశంలో) జరిగే టెస్ట్ సిరీస్ సమయానికి అందుబాటులోకి వస్తాడని షా తెలిపారు. షా స్టేట్మెంట్ను బట్టి చూస్తే షమీ టీ20 వరల్డ్కప్తో పాటు ఐపీఎల్ ఆడడని ఖరారైపోయింది. లండన్లో చీలిమండ గాయానికి శస్త్రచికిత్స చేసుకుని ఇటీవలే స్వదేశానికి వచ్చిన షమీ.. గతేడాది భారత్లో జరిగిన వన్డే వరల్డ్కప్ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. జై షా షమీ హెల్త్ అప్డేట్ ఇస్తున్న సందర్భంగానే మరో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్కు సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు. వెన్ను సమస్యతో బాధపడుతున్న రాహుల్.. ఐపీఎల్ ఆరంభ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని షా తెలిపారు. ఎన్సీఏ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రాహుల్కు ఇంజెక్షన్ అవసరముందని షా పేర్కొన్నారు. వెన్ను సమస్య కారణంగా రాహుల్ ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లోని చివరి నాలుగు మ్యాచ్లకు దూరమయ్యాడు. కాగా, జై షా వీరిద్దరి గురించే కాకుండా మరో టీమిండియా ఆటగాడి హెల్త్ గురించి కూడా అప్డేట్ ఇచ్చడు. 2022లో కారు ప్రమాదానికి గురై ప్రస్తుతం ఎన్సీఏ రీహ్యాబ్లో ఉన్న రిషబ్ పంత్ పూర్తిగా కోలుకున్నాడని షా తెలిపారు. పంత్ మునపటిలా బ్యాటింగ్ చేస్తున్నాడని పేర్కొన్నారు. త్వరలోనే పంత్కు ఎన్ఓసీ ఇస్తామని షా వెల్లడించారు. -
బీసీసీఐ సంచలనం.. ఒక్కో మ్యాచ్కు ఏకంగా రూ. 45 లక్షలు
టెస్టు క్రికెట్ ప్రాధాన్యం పెంచేలా భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా కీలక ప్రకటన చేశాడు. టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమును ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించాడు. పురుషుల సీనియర్ జట్టులో భాగమైన క్రికెటర్లకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపాడు. ఆటగాళ్లను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు.. వారి ఆదాయంలో నిలకడ ఉండేలా తోడ్పడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జై షా పేర్కొన్నాడు. 2022-23 సీజన్ నుంచి టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమును అమలు చేస్తామని.. టెస్టు క్రికెట్ ఆడేవాళ్లకు ఇదొక అదనపు రివార్డు అని ఈ సందర్భంగా వెల్లడించాడు. ఒక్కో మ్యాచ్కు రూ. 45 లక్షలు ఒక సీజన్లో టీమిండియా షెడ్యూల్లో తొమ్మిది టెస్టులు ఉన్నాయనకుంటే.. ఇందులో నాలుగు కంటే తక్కువ మ్యాచ్లు ఆడిన క్రికెటర్లకు ఇన్సెంటివ్స్ ఉండవు. అయితే, 5-6 మ్యాచ్లలో భాగమై తుదిజట్టులో ఆడితే 30 లక్షల చొప్పున.. బెంచ్కే పరిమితం అయితే 15 లక్షల చొప్పున ఫీజు చెల్లిస్తారు. అదే విధంగా.. 7 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్లలో భాగమై తుదిజట్టులో ఆడితే రూ. 45 లక్షలు, బెంచ్కే పరిమితం కావాల్సి వస్తే 22.5 లక్షల చొప్పున చెల్లించనున్నారు. టీమిండియా విజయం తర్వాత ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా విజయం తర్వాత జై షా ఈ ప్రకటన చేయడం విశేషం. కాగా నామమాత్రపు ఆఖరి మ్యాచ్లో రోహిత్ సేన ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా సిరీస్ను 4-1తో సొంతం చేసుకుంది. బజ్బాల్ అంటూ ఇంగ్లండ్ అలా.. బీసీసీఐ ఇలా బజ్బాల్ అంటూ సంప్రదాయ క్రికెట్ రూపురేఖల్నే మార్చేలా ఇంగ్లండ్ దూకుడైన ఆట తీరుతో ముందుకు సాగుతుంటే.. బీసీసీఐ మాత్రం ఈ ఫార్మాట్కు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఇలాంటి ప్రకటన చేయడం గమనార్హం. జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు కచ్చితంగా రంజీలో ఆడాలంటూ నిబంధన విధించిన బోర్డు.. ఆదేశాలను ధిక్కరించిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ల సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి టెస్టు క్రికెట్కు తాము పెద్దపీట వేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ ఈ మేరకు భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించింది. చదవండి: IND Vs ENG 5th Test: అందుకే రోహిత్ అవుట్!.. కెప్టెన్గా బుమ్రా.. బీసీసీఐ చెప్పిందిదే I am pleased to announce the initiation of the 'Test Cricket Incentive Scheme' for Senior Men, a step aimed at providing financial growth and stability to our esteemed athletes. Commencing from the 2022-23 season, the 'Test Cricket Incentive Scheme' will serve as an additional… pic.twitter.com/Rf86sAnmuk — Jay Shah (@JayShah) March 9, 2024 That series winning feeling 😃#TeamIndia 🇮🇳 complete a 4⃣-1⃣ series victory with a remarkable win 👏👏 Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vkfQz5A2hy — BCCI (@BCCI) March 9, 2024 -
Virat Kohli: కోహ్లి సెలవులు.. స్పందించిన జై షా! కీలక వ్యాఖ్యలు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా అండగా నిలిచాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా సెలవు తీసుకోవడం అతడి హక్కు అంటూ కోహ్లి నిర్ణయాన్ని సమర్థించాడు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు కోహ్లి దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన బ్యాటర్ లేకుండానే బరిలోకి దిగిన టీమిండియా తొలి మ్యాచ్లో ఓడినా.. రెండో టెస్టులో గెలిచింది. తిరిగి పుంజుకుని సిరీస్ను ప్రస్తుతం 1-1తో సమం చేసి.. రాజ్కోట్లో మూడో టెస్టులో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లి ఈ కీలక సిరీస్కు దూరం కావడానికి గల కారణం ఇంత వరకు వెల్లడి కాలేదు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. కోహ్లి భార్య అనుష్క శర్మ గర్భవతి అని, ప్రెగ్నెన్సీ సమయంలో తలెత్తిన ఇబ్బందుల కారణంగానే విదేశాల్లో చికిత్స తీసుకునేందుకు వెళ్లారని ప్రచారం జరుగుతోంది. అయితే, బీసీసీఐ మాత్రం ఇంగ్లండ్తో ఆఖరి మూడు టెస్టులకు కోహ్లి అందుబాటులో లేడని ప్రకటించిన సమయంలో.. అతడి నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని పేర్కొంది. తాజాగా ఈ విషయం గురించి బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించాడు. రాజ్కోట్ టెస్టు ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన క్రమంలో ఎదురైన ప్రశ్నలకు బదులిస్తూ.. ‘‘ఒక వ్యక్తి.. తన పదిహేనేళ్ల కెరీర్లో వ్యక్తిగత కారణాలు చూపి సెలవు అడగటం అతడి హక్కు. విరాట్ కారణం లేకుండా సెలవు అడిగే వ్యక్తి కాదు. మా ఆటగాడిపై మాకు నమ్మకం ఉంది. మేము కచ్చితంగా అతడికి అండగా ఉంటాం’’ అని జై షా స్పష్టం చేశాడు. అదే విధంగా.. టీ20 ప్రపంచకప్-2024లో విరాట్ కోహ్లి ఆడతాడా లేదా అన్న అంశం గురించి ప్రస్తావన రాగా.. ఈ విషయం గురించి తర్వాత మాట్లాడదాం అంటూ సమాధానం దాటవేశాడు. అయితే, ఈ ప్రపంచకప్ టోర్నీలో రోహిత్ శర్మనే కెప్టెన్గా వ్యవహరిస్తాడని జై షా స్పష్టం చేశాడు. కాగా ఇషాన్ కిషన్ మానసికంగా అలసిపోయానంటూ సెలవు తీసుకుని.. విదేశాల్లో పర్యటించడం.. కోచ్ రంజీల్లో ఆడమని చెప్పినా ఆడకపోవడం వంటి అంశాలపై బీసీసీఐ పెద్దలు గుర్రుగా ఉన్నారన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. జై షా.. కోహ్లి సెలవుల గురించి ఇలా కామెంట్ చేయడం గమనార్హం. అంతేకాదు.. ఇషాన్ పేరెత్తకుండానే చీఫ్ సెలక్టర్, కోచ్, కెప్టెన్ చెప్పిన మాట వినకపోతే వేటు తప్పదని హెచ్చరికలు జారీ చేశాడు జై షా! చదవండి: BCCI: సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లకు జై షా వార్నింగ్.. ఇకపై -
టీమిండియా కోచ్ పదవిపై కీలక ప్రకటన చేసిన జై షా
బీసీసీఐ కార్యదర్శి జై షా టీమిండియా కోచ్ పదవిపై కీలక ప్రకటన చేశాడు. ఈ ఏడాది జూన్లో జరిగే టీ20 వరల్డ్కప్ వరకు భారత జట్టు ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడే కొనసాగుతాడని స్పష్టం చేశాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య రాజ్కోట్ వేదికగా ఇవాళ మొదలైన మూడో టెస్ట్కు ముందు షా మాట్లాడుతూ ఇలా అన్నాడు. వరల్డ్కప్ ముగిశాక ద్రవిడ్తో మాట్లాడే అవకాశం దొరకలేదు. ఆతర్వాత కూడా టీమిండియా వరుస సిరీస్లతో బిజీ కావడంతో ద్రవిడ్తో ఎలాంటి మాటామంతి జరపలేదు. రాజ్కోట్ టెస్ట్కు ముందు ద్రవిడ్తో మాట్లడే అవకాశం దొరికింది. టీ20 వరల్డ్కప్ వరకు అతన్నే కోచ్గా కొనసాగాలని కోరాం. అందుకు ద్రవిడ్ కూడా సానుకూలంగానే స్పందించాడు. అనుభవజ్ఞుడైన ద్రవిడ్ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. అతను టీమిండియాను సమర్దవంతంగా ముందుండి నడిపించగలడు. అతని మార్గనిర్దేశకం భారత జట్టు టీ20 వరల్డ్కప్లో రాణిస్తుందన్న నమ్మకం ఉంది. ద్రవిడ్తో పాటు సహాయక కోచింగ్ సిబ్బంది మొత్తం వరల్డ్కప్ వరకు యధాతథంగా కొనసాగుతారని షా స్పష్టం చేశాడు. దీనికి ముందే షా మరో కీలక ప్రకటన కూడా చేశాడు. టీ20 వరల్డ్కప్లో రోహిత్ శర్మనే టీమిండియా కెప్టెన్గా ఉంటాడని స్పష్టం చేశాడు. కాగా, భారత క్రికెట్ జట్టుతో రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ గతేడాది చివర్లో జరిగిన వన్డే వరల్డ్కప్తో ముగిసిందన్న విషయం తెలిసిందే. అయితే రాహుల్ సేవల పట్ల సంతృప్తి చెందిన బీసీసీఐ అతన్ని మరో దఫా కోచ్గా కొనసాగాలని విజ్ఞప్తి చేసింది. అనేక సంప్రదింపుల అనంతరం రాహుల్ బీసీసీఐ ప్రతిపాదనకు ఒప్పుకుని హుటాహుటిన సౌతాఫ్రికా పర్యటనకు బయల్దేరాడు. అప్పట్లో కాంట్రాక్ట్ పొడిగింపుపై ఎలాంటి ప్రకటన చేయని బీసీసీఐ.. తాజాగా ద్రవిడ్ కొనసాగింపుపై స్పష్టమైన హామీ ఇచ్చింది. ఇదిలా ఉంటే, రాజ్కోట్ టెస్ట్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా తొలి రోజు టీ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (10), శుభ్మన్ గిల్ (0), రజత్ పాటిదార్ (5) నిరాశపరచగా.. రోహిత్ శర్మ (97 నాటౌట్), రవీంద్ర జడేజా (68 నాటౌట్) టీమిండియాను ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 152 పరుగులు జోడించి, టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించే దిశగా తీసుకెళ్తున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 2, టామ్ హార్ట్లీ ఓ వికెట్ పడగొట్టారు. -
BCCI: టీమిండియా క్రికెటర్లకు జై షా వార్నింగ్.. ఇకపై
Jay Shah’s Stern Message to Central Contract Players: టీమిండియా సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగి ఉన్న క్రికెటర్లను ఉద్దేశించి బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రధాన ఆటగాళ్లు కచ్చితంగా రంజీల్లో ఆడాల్సిందేనని స్పష్టం చేశాడు. లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. కాగా భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్- బీసీసీఐకి మధ్య విభేదాలంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తనకు విశ్రాంతి కావాలంటూ సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన ఈ జార్ఖండ్ బ్యాటర్ను దేశవాళీ క్రికెట్లో ఆడాల్సిందిగా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆదేశించాడు. అయితే, మేనేజ్మెంట్ ఆదేశాలను బేఖాతరు చేసిన ఇషాన్ కిషన్ ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ సెషన్తో బిజీ అయ్యాడు. ఫలితంగా బోర్డు పెద్దల ఆగ్రహానికి గురైన అతడు.. సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోనున్నాడనే ఊహాగానాలు వినిపించాయి. అంతేగాకుండా.. ఇకపై సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లు కనీసం 3-4 రంజీ మ్యాచ్లు ఆడితేనే బీసీసీఐ.. ఐపీఎల్లో ఆడే అవకాశం ఇస్తుందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ అంశాలపై స్పందించాడు. ‘‘తాము దేశవాళీ క్రికెట్కు అందుబాటులో ఉండటం లేదని కొంతమంది ఫోన్ కాల్ ద్వారా సమాచారం ఇచ్చారు. అయితే, అందుకు బదులుగా నేను వారికి లేఖ రూపంలో జవాబు ఇవ్వదలచుకున్నాను. కచ్చితంగా రెడ్ బాల్ క్రికెట్ ఆడాల్సిందే ఒకవేళ సెలక్షన్ కమిటీ చైర్మన్, కోచ్, కెప్టెన్ చెబితే మాత్రం కచ్చితంగా రెడ్ బాల్ క్రికెట్ ఆడాల్సిందే అని చెప్తాను. ఎవరైనా ఆటగాడు ఫిట్గా ఉన్నాడా లేదా? అతడు పరిమిత ఓవర్లు, టెస్టు క్రికెట్ రెండూ ఆడగలడా లేదా అన్న విషయాల గురించి ఎన్సీఏ నుంచి సలహాలు తీసుకుంటాం. అందరికీ వర్తిస్తుంది అందుకు అనుగుణంగానే మా నిర్ణయాలు ఉంటాయి. అయితే, ఫిట్గా ఉన్న ఆటగాళ్లు.. ముఖ్యంగా యువ క్రికెటర్లకు ఎలాంటి మినహాయింపులు ఉండవు. కచ్చితంగా దేశవాళీ రెడ్ బాల్ క్రికెట్ ఆడాల్సిందే. సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగి ఉన్న అందరు భారత క్రికెటర్లకూ ఇది వర్తిస్తుంది’’ అని జై షా కుండబద్దలు కొట్టాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు ఆరంభానికి ముందు సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియం పేరు మార్చారు. సౌరాష్ట్ర క్రికెట్ పాలనా విభాగంలో సేవలు అందించిన నిరంజన్ షా స్టేడియంగా నామకరణం చేశారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన జై షా ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. చదవండి: #Sarfaraz Khan: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. తండ్రి, భార్య కన్నీటి పర్యంతం -
T20 World Cup 2024: టీమిండియా కెప్టెన్పై బీసీసీఐ క్లారిటీ
టి20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా కెప్టెన్ ఎవరన్న అంశంపై బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టతనిచ్చారు రోహిత్ శర్మనే భారత జట్టును ఈ మెగా టోర్నీలో ముందుకు నడిపిస్తాడని పేర్కొన్నారు. అదేవిధంగా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడని జై షా క్లారిటీ ఇచ్చారు. కాగా జూన్ 4 నుంచి టి20 వరల్డ్ కప్ టోర్నీ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ ఐసీసీ ఈవెంట్ కు వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. -
ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా జై షా
-
Jay Shah: 32 ఏళ్ల వయసులో తొలిసారి.. ముచ్చటగా మూడోసారి
బీసీసీఐ కార్యదర్శి జై షా మరోసారి ఆసియా క్రికెట్ మండలి(ఏసీసీ) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇండోనేషియాలోని బాలిలో ఏసీసీ బుధవారం వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఇందులో భాగంగా జై షాను తమ చీఫ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 32 ఏళ్ల వయసులో తొలిసారి.. కాగా జై షా ఏసీసీ బాస్గా ఎన్నికకావడం ఇది వరుసగా మూడోసారి. నజ్ముల్ హుసేన్ స్థానంలో 2021లో తొలిసారిగా అధ్యక్ష పదవిని చేపట్టిన ఆయన.. ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా నిలిచారు. అప్పటికి జై షాకు 32 ఏళ్లు. ఇక తాజా సమావేశంలో సభ్యుల నిర్ణయానికి అనుగుణంగా జై షా పదవీ కాలం కొనసాగనుంది. కాగా బీసీసీఐలో కీలక వ్యక్తిగా ఉన్న ఆయన.. ఏసీసీలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. కోవిడ్ సమయంలో బాస్గా బాధ్యతలు స్వీకరించి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ప్రతీ విషయంలోనూ తనదైన ముద్ర ఇక గతేడాది ఆసియా కప్-2023 హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడంలో జై షా కీలక పాత్ర పోషించారు. ఈవెంట్ నిర్వహణ హక్కులు దక్కించుకున్న పాకిస్తాన్కు టీమిండియాను పంపే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. పాక్ పంతం వీడకపోతే.. ప్రత్యామ్నాయాలు వెదుక్కోవాల్సి ఉంటుందని హెచ్చరించి శ్రీలంక- పాక్ వేదికగా టోర్నీని నిర్వహించేలా జై షా ఏర్పాట్లు చేశారు. టీమిండియా ఆడే మ్యాచ్లన్నింటికీ లంక ఆతిథ్యం ఇచ్చింది. ఇక ఈ దఫా వన్డే ఫార్మాట్లో నిర్వహించిన ఆసియా కప్ ఈవెంట్ ఫైనల్లో టీమిండియా శ్రీలంకను ఓడించి విజేతగా అవతరించింది. కాగా భారత హోం మంత్రి అమిత్ షా కుమారుడే జై షా అన్న విషయం తెలిసిందే. చదవండి: Ind vs Eng 2nd Test: ఇంగ్లండ్కు షాక్.. కీలక స్పిన్నర్ దూరం -
ఐసీసీ కీలక పదవికి గురిపెట్టిన జై షా.. అందుకోసం ఏకంగా!
బీసీసీఐ సెక్రటరీ జై షా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చైర్మెన్ పదవికి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ అధ్యక్షుడి పదవి కోసం జైషా ప్రస్తుతం ఉన్న పోస్టులను వదులుకోనేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జై షా బీసీసీఐ సెక్రటరీగానే కాకుండా ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. ఈ ఏడాది నవంబర్లో ఐసీసీ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఒకవేళ జైషా ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆయన ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్, బీసీసీఐ సెక్రటరీ పదవులను వదులుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఎలక్షన్స్ కంటే ముందే జై షా ఏసీసీ చైర్మెన్ పదవికి గుడ్బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇండోనేషియాలోని బాలిలో రాబోయే రెండు రోజుల్లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ వార్షిక సాధారణ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో జైషా తన నిర్ణయాన్ని వెల్లడించే ఛాన్స్ ఉంది. ఈ సమావేశాల్లో ఆసియా కప్ 2025 వేదికపై కూడా ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. కాగా 2019లో బీసీసీఐ కార్యదర్శిగా జైషా పగ్గాలు చేపట్టాడు. అంతకంటే ముందు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా కూడా జైషా పనిచేశాడు. -
బీసీసీఐ కార్యదర్శి జై షాకు అరుదైన గౌరవం.. భారత క్రీడారంగంలో తొలి లీడర్గా..!
ఇండియన్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్లో ఏ వ్యక్తికి దక్కని అరుదైన గౌరవం బీసీసీఐ కార్యదర్శి జై షాకు దక్కింది. షా.. 2023 సంవత్సరానికి గానూ బెస్ట్ స్పోర్ట్స్ బిజినెస్ లీడర్గా ఎంపికయ్యాడు. ఈ అవార్డును కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ప్రకటించింది. స్పోర్ట్స్ బిజినెస్ అవార్డ్స్లో భాగంగా ఈ అవార్డును ప్రతి ఏటా ప్రకటిస్తారు. షాతో పాటు రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ, డాక్టర్ సమంత కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. CONGRATULATIONS to BCCI Honorary Secretary @JayShah on being awarded the Sports Business Leader of the Year Award at the @FollowCII Sports Business Awards 2023. A first for any leader in Indian Sports administration, this recognition is truly deserved! His leadership has left an… pic.twitter.com/FkPYyv9PI3 — BCCI (@BCCI) December 5, 2023 క్రీడా రంగానికి సంబంధించిన వ్యాపారంలో అసాధారణ నాయకత్వం కనబర్చినందుకు గాను ఈ ముగ్గురు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. షా ఆధ్వర్యంలో ఇటీవల వన్డే వరల్డ్కప్, దానికి ముందు శ్రీలంకలో ఆసియా కప్ జరిగిన విషయం తెలిసిందే. షా ప్రత్యేక చొరవతోనే మహిళల ఐపీఎల్ (WPL) పురుడుపోసుకుంది. ఇతని ఆధ్వర్యంలోనే మహిళా క్రికెటర్లకు పురుష క్రికెటర్లతో సమాన వేతన హక్కు లభించింది. షా తన నాయకత్వ లక్షణాలతో ప్రపంచ క్రికెట్ను కూడా ప్రభావితం చేశాడు. ఇటీవల భారత్లో జరిగిన వన్డే ప్రపంచకప్-2023కు విజయవంతంగా నిర్వహించడం ద్వారా అతనికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. క్రికెట్ను ఒలింపిక్స్లో చేర్చే విషయంలోనూ షా కీలకపాత్ర పోషించాడు. క్రికెట్కు అతను చేసిన ఈ సేవలను గుర్తించే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ఉత్తమ స్పోర్ట్స్ బిజినెస్ లీడర్గా ఎంపిక చేసింది. -
ద్రవిడ్ తనేంటో నిరూపించుకున్నాడు.. వరల్డ్కప్లో కూడా: జై షా
మిండియా హెడ్ కోచ్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. భారత జట్టు హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలాన్ని బీసీసీఐ పొడిగించింది. అతడితో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కాంట్రాక్ట్లను కూడా బీసీసీఐ పెంచింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి జైషా మాట్లాడుతూ.. భారత క్రికెట్ బోర్డు నుంచి పూర్తి మద్దతు ద్రవిడ్కు ఉంటుందని తెలిపాడు. కాగా ద్రవిడ్ కొత్త కాంట్రాక్ట్ వివరాలను మాత్రం బోర్డు బహిర్గతం చేయలేదు. అయితే వచ్చ ఏడాది టీ20 వరల్డ్కప్కు ద్రవిడ్ హెడ్కోచ్ పదవిలో కొనసాగే ఛాన్స్ ఉంది. "భారత ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ ద్రవిడ్ను మించిన గొప్ప వ్యక్తి లేడని నేను ముందే చెప్పాను. ద్రవిడ్ మరోసారి తన నిబద్ధతతో జట్టు కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. ద్రవిడ్ తన కాంట్రాక్ట్ను పొడిగించేందుకు ఒప్పుకోవడంతో టీమిండియా యూనిట్ మరింత బలంగా మారనుంది. ఇప్పటికే అతడి నేతృత్వంలో టీమిండియా మూడు ఫార్మాట్లలో నెం1 జట్టుగా అవతరించింది. ఇది ఒక్కటి చాలు అతడి కోచింగ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి. కోచ్గా తనంటో ద్రవిడ్ నిరూపించుకున్నాడు. వన్డే వరల్డ్కప్లో కూడా భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. వరుసగా 10 మ్యాచ్లు గెలిచిన తర్వాత దురదృష్టవశాత్తూ ఫైనల్లో ఓటమిపాలైంది. హెడ్కోచ్ ద్రవిడ్కు బోర్డు నుంచి ఎల్లప్పడూ సపోర్ట్ ఉంటుంది. భారత జట్టును అంతర్జాతీయ స్దాయిలో మరింత అద్బుతంగా ముందుకు నడిపించాలని ఆశిస్తున్నాని" జై షా పేర్కొన్నాడు. కాగా ద్రవిడ్ తిరిగి మళ్లీ దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు జట్టుతో కలవనున్నాడు. -
జై షాకు క్షమాపణలు చెప్పిన శ్రీలంక ప్రభుత్వం..
శ్రీలంక క్రికెట్ను నాశనం చేశడంటూ బీసీసీఐ సెక్రటరీ, ఏసీసీ అధ్యక్షుడు జై షాపై ఆ దేశ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై శ్రీలంక ప్రభుత్వం స్పందించింది. రణతుంగ చేసిన వ్యాఖ్యలపై జైషాకు శ్రీలంక ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది. శ్రీలంక పార్లమెంట్లో మంత్రి కాంచన విజేశేఖర మాట్లాడుతూ.. మా ప్రభుత్వం తరపున ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛీఫ్ జై షాకు క్షమాపణలు తెలుపుతున్నాము. మా బోర్డులోని లోపాలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ కార్యదర్శి లేదా ఇతర దేశాలపై రుద్దలేము. ఇది మంచి పద్దతి కాదు అని పేర్కొన్నారు. అస్సలు ఏం జరిగిందంటే? వన్డే ప్రపంచకప్ 2023లో పేలవ ప్రదర్శనతో శ్రీలంక లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కార్యవర్గాన్ని ఆ దేశ ప్రభుత్వం రద్దు చేసింది. టీమిండియాతో జరిగిన మ్యాచ్లో ఘోర పరాజయం అనంతరం శ్రీలంక క్రీడల మంత్రి రోషన్ రణసింఘే ఎస్ఎల్సీ కార్యవర్గాన్ని రద్దు చేశారు. అనంతరం మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ సారథ్యంలో ఏడుగురు సభ్యులతో మధ్యంతర కమిటీని నియమించారు. అంతలోనే శ్రీలంకకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా బిగ్షాకిచ్చింది. శ్రీలంక క్రికెట్ బోర్డులో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని సీరియస్గా పరిగణించిన ఐసీసీ ఆ జట్టు సభ్యత్వాన్ని రద్దు చేసంది. ఈ క్రమంలో ఓ స్ధానిక వార్తపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రుణతుంగా మాట్లాడుతూ.. "శ్రీలంక క్రికెట్ బోర్డులో కొంతమంది అధికారులకు జై షాతో మంచి సంబంధాలు ఉన్నాయి. శ్రీలంక క్రికెట్ ఈ స్ధాయికి దిగజారడానికి కారణం అతడే. భారత్లో ఉంటూ శ్రీలంక బోర్డును సర్వనాశనం చేస్తున్నాడు. అతను చాలా పవర్ఫుల్. ఎందుకంటే అతని తండ్రి భారత్ హోమ్ మినిస్టర్" అని సంచలన ఆరోపణలు చేశాడు. చదవండి: World Cup 2023: ఆస్ట్రేలియా-భారత్ ఫైనల్కు అంపైర్లు ఖారారు.. లిస్ట్లో ఐరన్ లెగ్ అంపైర్ -
సర్వనాశనం చేశాడు.. జై షాపై శ్రీలంక మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
వన్డే వరల్డ్కప్ 2023లో ఘోర వైఫల్యాలను ఎదుర్కొని, లీగ్ దశలోనే ఇంటిబాట పటిన శ్రీలంక ఇంటాబయటా ముప్పేట దాడిని ఎదుర్కొంటుంది. వరల్డ్కప్ నుంచి అవమానకర రీతిలో నిష్క్రమించిన అనంతరం ఆ దేశ క్రీడా మంత్రి రోషన్ రణసింఘే బోర్డు మొత్తాన్ని రద్దు చేశాడు. ఆపై బోర్డు అంతర్గత వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తీవ్రంగా పరిగణించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శ్రీలంక క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్ వేటు వేసింది. తమ క్రికెట్ బోర్డుకు పట్టిన దుస్థితి నేపథ్యంలో ఆ దేశ వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తమ దేశ క్రికెట్కు ఈ గతి పట్టడానికి బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా కారణమని సంచలన ఆరోపణలు చేశాడు. తమ బోర్డు అధికారులతో ఉన్న సత్సంబంధాల కారణంగా షా మాపై పెత్తనం చెలాయిస్తున్నాడని ఆరోపించాడు. తన తండి (అమిత్ షా) అధికారాన్ని అడ్డుపెట్టుకుని జై షా లంక క్రికెట్ను శాశిస్తున్నాడని ధ్వజమెత్తాడు. జై షా అనవసర జోక్యం కారణంగానే లంక క్రికెట్కు ఈ దుస్థితి దాపురించిందని వాపోయాడు. జై షాను ఉద్దేశిస్తూ రణతుంగ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్లో దుమారం రేపుతున్నాయి. కాగా, ప్రస్తుత వరల్డ్కప్లో శ్రీలంక ఘోర ప్రదర్శన కనబర్చి లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. ఆ జట్టు ఆడిన 9 మ్యాచ్ల్లో కేవలం 2 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈ కారణంగా శ్రీలంక 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అర్హత సాధించలేకపోయింది. ఈ టోర్నీలో లంక క్రికెట్ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్పై విజయం సాధించడం. మరోవైపు భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్కు చేరుకున్నాయి. బుధవారం జరుగబోయే తొలి సెమీఫైనల్లో భారత్.. న్యూజిలాండ్తో తలపడనుంది. -
వైజాగ్లో కొత్త అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం.. బీసీసీఐ కార్యదర్శి జై షా హామీ
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం నిర్మాణానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా హామీ ఇచ్చారు. సోమవారం గోవాలో జరిగిన బీసీసీఐ 92వ వార్షికోత్సవ సమావేశంలో షా ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెద్దలకు మాట ఇచ్చారు. బీసీసీఐ వార్షికోత్సవ సమావేశానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పి. శరత్ చంద్రారెడ్డి, సెక్రటరీ ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డి, ట్రెజరర్ ఎ.వి. చలం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్ర క్రికెట్కు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి బీసీసీఐ అధ్యక్షులు రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా, ఉపాధ్యక్షులు రాజీవ్ శుక్లా తదితరులతో ఏసీఏ అధ్యక్షులు శరత్ చంద్రారెడ్డి, సెక్రటరీ గోపినాథ్ రెడ్డి చర్చించారు. త్వరలో జై షా వైజాగ్కు వస్తానని హామీ ఇచ్చినట్లు ఏసీఏ పెద్దలు వెల్లడించారు. -
వారణాసి క్రికెట్ స్టేడియం ఆ మహాదేవుడికే అంకితం: ప్రధాని మోదీ
Varanasi International Cricket Stadium Foundation Ceremony Highlights: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, టీమిండియా దిగ్గజాలు కపిల్ దేవ్, సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా తదితరులు కూడా హాజరయ్యారు. #WATCH | PM Modi lays the foundation stone of an international cricket stadium in Uttar Pradesh's Varanasi pic.twitter.com/5sAh2wZ5eA — ANI (@ANI) September 23, 2023 సంతోషంగా ఉంది: యూపీ సీఎం కాగా సుమారు రూ. 451 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ స్టేడియం నిర్మాణం.. 2025, డిసెంబరు నాటికి పూర్తికానున్నట్లు సమాచారం. ఇక శంకుస్థాపన సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. బీసీసీఐ తొలిసారిగా ఆధ్యాత్మిక నగరం వారణాసిలో అంతర్జాతీయస్థాయి క్రికెట్ స్టేడియం నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కాశీకి విచ్చేసిన ప్రధాని మోదీ సహా క్రికెట్ ప్రముఖులకు క్రీడా ఔత్సాహికుల అందరి తరఫున తాను స్వాగతం పలుకుతున్నానని పేర్కొన్నారు. బీసీసీఐ, మోదీజీకి ధన్యవాదాలు అదే విధంగా.. కేంద్ర ప్రభుత్వ పథకం స్మార్ట్ సిటీ మిషన్ కింద స్టేడియం నిర్మాణం చేపట్టారని.. ఉత్తరప్రదేశ్లో ఇది మూడో అంతర్జాతీయ స్టేడియం అని యోగి పేర్కొన్నారు. బీసీసీఐ పర్యవేక్షణలో దీని నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు. యూపీతో పాటు బిహార్లో గల వర్ధమాన క్రికెటర్లకు ఈ స్టేడియం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యూపీకి ఇంత గొప్ప బహుమతి ఇచ్చిన బీసీసీఐ, ప్రధాని నరేంద్ర మోదీకి యోగి ఆదిత్యనాథ్ ధన్యవాదాలు తెలిపారు. #WATCH | Varanasi, UP: "PM Modi is laying the foundation stone for International Cricket Stadium Varanasi by the Board of Control for Cricket in India (BCCI) in Uttar Pradesh for the first time. I welcome PM Modi on behalf of every sports enthusiast in the state," says Uttar… pic.twitter.com/CL4xhbPXZG — ANI (@ANI) September 23, 2023 ఆ మహదేవుడికే అంకితం: ప్రధాని మోదీ వారణాసి స్టేడియం శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘మహదేవుడి నగరంలో నిర్మిస్తున్న ఈ స్టేడియం ఆ మహదేవుడికే అంకితం. కాశీలో ఉన్న క్రికెట్ ఔత్సాహికులకు ఈ స్టేడియం ఎంతగానో ఉపయోగపడుతుంది. పూర్వాంచల్ ప్రాంతం మొత్తానికి తారలా వెలుగొందుతుంది’’ అని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆసియా క్రీడలు-2023లో పాల్గొంటున్న భారత అథ్లెట్లు, క్రీడా జట్లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. #WATCH | This stadium in the city of 'Mahadev' will be dedicated to 'Mahadev' himself. The sportspersons here will benefit from the construction of an international stadium in Kashi. This stadium will become the star of Purvanchal region: PM Modi on the foundation stone laying of… pic.twitter.com/bgh8bErN2l — ANI (@ANI) September 23, 2023 #WATCH | Asian Games will begin from today. I send my good wishes to all the athletes participating in the Games: PM Modi in Varanasi pic.twitter.com/hXzePvaRPM — ANI (@ANI) September 23, 2023 శివతత్వం ఉట్టిపడేలా చారిత్రాత్మక నగరంలో నిర్మించతలపెట్టిన వారణాసి క్రికెట్ స్టేడియాన్ని శివతత్వం ఉట్టిపడేలా.. ప్రేక్షకులు ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయేలా రూపొందించనున్నారు. సీటింగ్ ప్లేస్ పైకప్పు అర్ధచంద్రాకారం, ఫ్లడ్లైట్లు త్రిశూలం, ఓవైపు ఎంట్రన్స్ ఢమరుకాన్ని పోలి ఉండేలా నిర్మాణాలు చేపట్టనున్నారు. సుమారు 30 వేల మంది సీటింగ్ కెపాసిటీతో నిర్మించనున్న ఈ స్టేడియం కోసం యూపీ ప్రభుత్వం సుమారు 121 కోట్లు వెచ్చించి భూమి సేకరించినట్లు సమాచారం. ఇందులో ఏడు పిచ్లను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. చదవండి: శుబ్మన్ గిల్ అరుదైన ఘనత.. సచిన్ ఆల్ టైమ్ రికార్డు బద్దలు! -
కాశీ విశ్వనాథుని దర్శించుకున్న టీమిండియా దిగ్గజాలు.. వీడియో వైరల్
Varanasi International Cricket Stadium: ‘క్రికెట్ దేవుడు’ సచిన్ టెండుల్కర్ కాశీ విశ్వనాథుని దర్శించుకున్నాడు. స్వామివారికి అభిషేకం చేసి భక్తిభావం చాటుకున్నాడు. కాగా ఉత్తరప్రదేశ్లోని చారిత్రాత్మక నగరం వారణాసిలో అంతర్జాతీయస్థాయి స్టేడియం నిర్మించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సమాయత్తమైన విషయం తెలిసిందే. కాశీ విశ్వేశ్వరుడు కొలువైన ఈ ఆధ్యాత్మిక నగరంలో శివతత్వం ఉట్టిపడేట్లుగా సీటింగ్ స్థలం అర్ధ చంద్రాకారంలో.. ఫ్లడ్లైట్స్ త్రిశూలాన్ని స్ఫురించేలా.. ఎంట్రీ ఢమరుకాన్ని పోలి ఉండేలా నిర్మించనున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ స్టేడియానికి శనివారం శంకుస్థాపన చేశారు. కాశీ విశ్వనాథునిరి టీమిండియా దిగ్గజాల అభిషేకం ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజాలు.. వరల్డ్కప్ విజేతలు కపిల్ దేవ్, సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్ ఇప్పటికే వారణాసికి చేరుకున్నారు. వీరితో పాటు బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా అక్కడికి వెళ్లారు. వీరంతా కలిసి విశ్వనాథుని దర్శించుకుని పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా వారణాసి స్టేడియం నిర్మాణం డిసెంబరు 2025 నాటికి పూర్తికానున్నట్లు సమాచారం. దీంతో యూపీలోని లక్నోలో గల భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియం, కాన్పూర్లోని గ్రీన్ పార్క్ క్రికెట్ స్టేడియం తర్వాత మూడో స్టేడియంగా ఇది చరిత్రలో నిలిచిపోనుంది. వారణాసి స్టేడియం నిర్మాణానికి సుమారు 451 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. #WATCH | Uttar Pradesh: Former Indian cricketers Sachin Tendulkar Sunil Gavaskar and Kapil Dev, BCCI Secretary Jay Shah, Rajeev Shukla, BCCI Vice-President, offered prayers at Kashi Vishwanath temple in Varanasi (Video source - PRO Vishwanath Temple) pic.twitter.com/pWc1qWmOqR — ANI (@ANI) September 23, 2023 -
రజినీకాంత్కు వన్డే ప్రపంచకప్ గోల్డెన్ టికెట్..
భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 మరో 15 రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం బీసీసీఐ ప్రత్యేక చొరవ తీసుకుంది. భారత్లోని దిగ్గజాలకు ప్రత్యేక టిక్కెట్లు ఇవ్వాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఇందులో భాగంగా 'గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్' అని పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే బాలీవుడ్ లెజెండ్ అబితాబ్ బచ్చన్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు బీసీసీఐ ఈ గోల్డెన్ టికెట్ను అందజేసింది. తాజాగా సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్కు వన్డే ప్రపంచకప్-2023 గోల్డెన్ టికెట్ను బీసీసీఐ అందించింది. బీసీసీఐ కార్యదర్శి జై షా నేరుగా వెళ్లి గోల్డన్ టికెట్ను అందించి టోర్నీకి ఆహ్వానించారు. ఈ మెరకు బీసీసీఐ ఓ ట్విట్ చేసింది. "బీసీసీఐ కార్యదర్శి జైషా బంగారు టిక్కెట్ను రజినీకాంత్కు అందించారు.భాషలు, సంస్కృతులకు అతీతంగా కోట్లాది మంది హృదయాల్లో దిగ్గజ నటుడు రజినీకాంత్ చెరగని ముద్రవేశారు. తలైవా విశిష్ట అతిథిగా హాజరై టోర్నీకి మరింత వెలుగు తెస్తారని తెలియజేయడానికి సంతోషం ఇస్తున్నామని" బీసీసీఐ ఎక్స్(ట్విటర్)లో రాసుకొచ్చింది. కాగా ఈ గోల్డన్ టిక్కెట్ కలిగి ఉన్న వ్యక్తులు ప్రపంచ కప్ 2023 లోని అన్ని మ్యాచ్లను వీఐపీ స్టాండ్ నుండి ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది. చదవండి: #Shaheen Afridi: రెండోసారి పెళ్లి చేసుకున్న షాహీన్ ఆఫ్రిది.. హాజరైన బాబర్ ఆజం! ఫోటోలు వైరల్ -
జైషాను పాకిస్తాన్కు ఆహ్వానించిన పీసీబీ..
ఆసియాకప్-2023కు మరో 10 రోజుల్లో తెరలేవనుంది. ముల్తాన్ వేదికగా ఆగస్టు 30న జరగనున్న పాకిస్తాన్- నేపాల్ మ్యాచ్తో ఈ మెగాటోర్నీ షురూ కానుంది. ఈ క్రమంలో ఆసియాకప్ ఓపెనింగ్ మ్యాచ్కు హాజరు కావల్సిందగా బీసీసీఐ కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు జై షాకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆహ్వానం పంపింది. అదే విధంగా డర్బన్లో జరిగిన ఐసీసీ సమావేశంలో పీసీబీ చైర్మన్ జాకా అష్రఫ్ కూడా మౌఖికంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తల మధ్య జైషా పాకిస్తాన్కు వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాగా వాస్తవానికి ఈ ఏడాది ఆసియాకప్ పాకిస్తాన్ వేదికగా జరగాల్సింది. కానీ పాకిస్తాన్కు తమ జట్టును పంపేందుకు బీసీసీఐ నిరరారించడంతో ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించకుంది. ఈ మెగా ఈవెంట్లో శ్రీలంక, పాకిస్తాన్ వేదికలగా జరగనుంది. ఈ టోర్నీలోని నాలుగు మ్యాచ్లు మాత్రమే పాకిస్తాన్లో జరగనుండగా.. మిగితా మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే జరగనున్నాయి. ఈ ఈవెంట్ కోసం పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ తమ జట్లను ప్రకటించగా.. భారత జట్టును బీసీసీఐ ఒకట్రెండు రోజుల్లో వెల్లడించే ఛాన్స్ ఉంది. చదవండి: World Cup 2023: వన్డే ప్రపంచకప్కు భారత జట్టు.. ఎవరూ ఊహించని ఆటగాడు ఎంట్రీ! -
జై షా బీసీసీఐ సెక్రటరీ ఎలా అయ్యాడు?.. అమిత్ షాకు ఉదయనిధి స్టాలిన్ కౌంటర్
సాక్షి, చెన్నై: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై తమిళనాడు క్రీడామంత్రి ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. డీఎంకే పార్టీ వారసత్వ పార్టీ అని తమిళనాడులో వారసత్వ రాజకీయాలు ఉన్నాయంటూ అమిత్షా చేసిన వ్యాఖ్యలకు ఉదయనిధి స్టాలిన్ కౌంటర్ వేశారు. కేంద్ర మంత్రి కొడుకు జై షాకు ఏ అర్హత ఉందని బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) సెక్రటరీ పదవి కట్టబెట్టారని ప్రశ్నించారు. కాగా అమిత్ షా శుక్రవారం తమిళనాడులో పర్యటించిన విషయం తెలిసిందే. రామేశ్వరంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ కే అన్నామలై పాదయాత్రను ప్రారంభించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పూర్తి అవినీతి పార్టీ అని, మిత్రపక్షలతో కలిసి వారసత్వ రాజకీయాలను ప్రొత్సహిస్తుందని విమర్శలు గుప్పించారు. అదే విధంగా డీఎంకేను కుటుంబ పార్టీగా అభివర్ణించారు. చదవండి: ఉమేశ్ పాల్ హత్య కేసులో గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ లాయర్ అరెస్టు.. తాజాగా చెన్నైలో ఏర్పాటు చేసిన డీఎంకే యువజన విభాగం నూతన కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్ని అమిత్ షా ఆరోపణలపై విరుచుకుపడ్డారు. తాను ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాతే మంత్రి అయ్యానని పేర్కొన్నారు. తనను ముఖ్యమంత్రిని చేయాలన్నదే డీఎంకే నేతల ధ్యేయమని అమిత్ షా చెబుతున్నారని, మరి మీ కొడుకు(జై షా) బీసీసీఐ సెక్రటరీ ఎలా అయ్యాడని ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. జే ఎన్ని క్రికెట్ మ్యాచ్లు ఆడారని, ఆయన ఎన్ని పరుగులు సాధించాడని ఉదనినిధి స్టాలిన్ అమిత్ షాను ప్రశ్నించాడు. తన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. (జాతీయ విపత్తు కింద రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూ.900 కోట్లు: కిషన్ రెడ్డి) -
గుడ్న్యూస్.. ఆగస్టు 10 నుంచి వరల్డ్కప్ టికెట్లు అందుబాటులో!
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు టీమిండియా గడ్డపై వన్డే వరల్డ్కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మ్యాచ్లు జరిగే వేదికలు, మ్యాచ్ షెడ్యూల్ వివరాలను బీసీసీఐ ప్రకటించింది. తాజాగా వన్డే ప్రపంచకప్కు సంబంధించిన మ్యాచ్ల టికెట్లను ఆగస్టు 10 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం. బీసీసీఐ కార్యదర్శి జై షా గురువారం ఢిల్లీలో.. మ్యాచ్లు జరగనున్న అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లతో గురువారం మీటింగ్ నిర్వహించారు. మీటింగ్లో పలు అంశాలపై చర్చించిన అనంతరం టికెట్ల జారీ విషయమై కీలక ప్రకటన చేశారు. వన్డే వరల్డ్కప్లో జరిగే మ్యాచ్లకు హాజరయ్యే అభిమానులు తప్పనిసరిగా ఫిజికల్ టికెట్లు(పేపర్ ప్రింటెడ్) తీసుకెళ్లాలని.. ఆన్లైన్ టికెట్లను(ఈ-టికెటింగ్) అనుమతించబోమని పేర్కొన్నారు. కాగా అభిమానులు ఫిజికల్ టికెట్లను పొందడానికి 7-8 కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపాడు. జై షా మాట్లాడుతూ.. ''మేం ఈసారి ఈ-టికెట్ని ఉపయోగించలేం. ఫిజికల్ టిక్కెట్లు పొందడానికి 7-8 కేంద్రాలు ముందుగానే ప్లాన్ చేశాం. అహ్మదాబాద్, లక్నో వంటి పెద్ద కెపాసిటీ స్టేడియంలలో ఈ-టికెట్ల నిర్వహణ చాలా కష్టం. మేం ముందుగా ద్వైపాక్షిక సిరీస్లలో ఈ-టికెటింగ్ని అమలు చేసి ఆపై ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నమెంట్లకు తీసుకెళ్లాలని మా ప్రణాళిక. ప్రపంచకప్ టిక్కెట్ల ధరతో సహా అన్నీ త్వరలో ప్రకటిస్తాం'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం ప్రోటోకాల్లో భాగంగా ఐసీసీ, బీసీసీఐలు ఒక్కో గేమ్కు 300 హాస్పిటాలిటీ టిక్కెట్లను అందుకోనున్నాయి. ఇక రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లు ఐసీసీకి 1295 లీగ్ గేమ్ టిక్కెట్లతో పాటు.. టీమిండియాకు సంబంధించిన 1355 టికెట్లను.. వీటితో పాటు సెమీ-ఫైనల్ మ్యాచ్ల టిక్కెట్లను కూడా అందించనుంది. మరో 500 జనరల్ టిక్కెట్లను మాత్రం సదరు క్రికెట్ అసోసియేషన్స్ బీసీసీఐకి ఉచితంగా అందించనున్నాయి. చదవండి: Babar Azam: 'బ్రా' ధరించిన పాక్ కెప్టెన్.. షాక్ తిన్న ఫ్యాన్స్; వీడియో వైరల్ అతడిని ఎందుకు తీసుకున్నట్లు? ఫిఫ్టీ సాధించడం గొప్పేమీ కాదు.. కొత్తగా ఏం ఒరిగింది: మాజీ క్రికెటర్ -
చిక్కుల్లో టీమిండియా కెప్టెన్! అప్పీలుకు వెళ్లేది లేదన్న బీసీసీఐ..
ICC- Harmanpreet Kaur- BCCI: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్గా వరుస విజయాలు అందుకున్న హర్మన్ప్రీత్కౌర్ బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ సందర్భంగా అపఖ్యాతి మూటగట్టుకుంది. బంగ్లాతో ఆఖరి మ్యాచ్లో అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ పెవిలియన్కు చేరే క్రమంలో బ్యాట్తో వికెట్లను కొట్టింది. అంతేకాదు.. సిరీస్ 1-1తో సమానమైన నేపథ్యంలో ట్రోఫీ పంచుకునేటపుడు కూడా కాస్త దురుసుగా ప్రవర్తించింది. బంగ్లాదేశ్ కెప్టెన్ దగ్గరికి రాగానే.. ఈ మ్యాచ్ టై అవడానికి అంపైర్లు కూడా కారణం.. వాళ్లను కూడా పిలువు అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించింది. హర్మన్ నుంచి ఊహించని కామెంట్ల నేపథ్యంలో ఆమె తమ జట్టును తీసుకుని డ్రెసింగ్రూంకి వెళ్లిపోయింది. ఈ వరుస సంఘటనల నేపథ్యంలో హర్మన్ప్రీత్ కౌర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు సైతం హర్మన్ వ్యవహారశైలిని తప్పుబట్టారు. ఐసీసీ సైతం ఆమెపై కఠిన చర్యలు చేపట్టింది. నిబంధనలు ఉల్లంఘించిందని పేర్కొంటూ.. రెండు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడకుండా నిషేధం విధించింది. ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎలా స్పందిస్తున్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వీవీఎస్ లక్ష్మణ్ అనుచిత ప్రవర్తన గురించి హర్మన్తో మాట్లాడతారు. మేమైతే ఆమె సస్పెన్షన్ గురించి ఐసీసీని సవాలు చేయబోము. ఇప్పటికే ఆ సమయం కూడా మించిపోయింది’’ అని జై షా పేర్కొన్నాడు. కాగా హర్మన్ ప్రవర్తన ఆమె పట్ల గౌరవాన్ని తగ్గించిందనే కామెంట్లు వినిపిస్తుండగా.. అభిమానులు మాత్రం ఇంతకంటే ఓవరాక్షన్ చేసిన వాళ్లు మాత్రం మీకు కనబడరా అంటూ అండగా నిలుస్తున్నారు. కాగా ఐసీసీ నిషేధం నేపథ్యంలో హర్మన్ప్రీత్ కౌర్ ఆసియా క్రీడలు-2023లో రెండు మ్యాచ్లకు దూరం కానుంది. చదవండి: సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగింపు.. భువనేశ్వర్ కుమార్ కీలక నిర్ణయం! టీమిండియా క్రికెటర్లలో ప్రభుత్వ ఉద్యోగులు వీరే! లిస్టులో ఊహించని పేర్లు.. Harmanpreet Kaur was not happy with the decision 👀#HarmanpreetKaur #IndWvsBangW #INDvWI pic.twitter.com/ZyoQ3R3Thb — Ajay Ahire (@Ajayahire_cric) July 22, 2023 -
Asia Cup 2023: ఆసియా కప్-2023 షెడ్యూల్ విడుదల.. ఆరోజే ఫైనల్
Mens ODI Asia Cup 2023 Schedule: ఆసియా వన్డే కప్-2023 షెడ్యూల్ విడుదలైంది. పాకిస్తాన్, శ్రీలంక వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా ప్రకటించారు. ట్విటర్ వేదికగా బుధవారం ఈ విషయాన్ని తెలియజేశారు. ఆగష్టు 30న ఆరంభం కానున్న ఈ ఈవెంట్ సెప్టెంబరు 17న ఫైనల్ మ్యాచ్తో ముగియనుంది. ఆరోజే ఇండియా-పాక్ మ్యాచ్ పాకిస్తాన్లోని ముల్తాన్ వేదికగా పాకిస్తాన్- నేపాల్ మ్యాచ్ మొదలై.. శ్రీలంకలోని కొలంబోలో ఫైనల్తో ఈ మెగా ఈవెంట్కు తెరపడనుంది. ఇక దాయాదులు భారత్- పాకిస్తాన్ సెప్టెంబరు 2న శ్రీలంకలోని క్యాండీ వేదికగా తలపడనున్నాయి. ఇక ఆ తర్వాత టీమిండియా సెప్టెంబరు 4న నేపాల్తో అదే వేదికపై మ్యాచ్ ఆడనుంది. గ్రూప్-ఏలో నేపాల్ కూడా కాగా ఆసియా వన్డే కప్-2023 గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్తో పాటు నేపాల్ ఉండగా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్ దశలో మొత్తం ఆరు మ్యాచ్లు జరుగనున్నాయి. ఇందులో రెండు గ్రూపుల నుంచి తొలి రెండుస్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-4కు అర్హత సాధిస్తాయి. అలా ఫైనల్కు గ్రూప్-ఏ టాపర్గా నిలిచిన జట్టు, గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో సెప్టెంబరు 6న సూపర్-4లో తొలి మ్యాచ్ ఆడుతుంది. సెప్టెంబరు 15న సూపర్-4 చివరి మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాప్-2 జట్లు సెప్టెంబరు 17నాటి ఫైనల్కు అర్హత సాధిస్తాయి. అందుకే రెండు దేశాల్లో ఇక ఈ టోర్నీ నిర్వహణ హక్కులు పాకిస్తాన్ చేజిక్కించుకోగా.. టీమిండియా పాక్ పర్యటనకు సుముఖంగా లేని నేపథ్యంలో హైబ్రిడ్ మోడల్ను ఆశ్రయించారు. ఇందులో భాగంగా పాక్లోని ముల్తాన్లో ఒక మ్యాచ్.. లాహోర్లో మూడు మ్యాచ్లు జరుగనుండగా.. శ్రీలంకలోని క్యాండీలో మూడు, కొలంబోలో 6 మ్యాచ్లు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. కాగా గతేడాది జరిగిన ఆసియా టీ20 టోర్నీ ఫైనల్లో పాక్ను ఓడించి శ్రీలంక విజేతగా అవతరించిన విషయం తెలిసిందే. చదవండి: దీనస్థితిలో ధోని సొంత అన్న? బయోపిక్లో ఎందుకు లేడు? అయినా అతడితో.. I am happy to announce the schedule for the highly anticipated Men's ODI #AsiaCup2023, a symbol of unity and togetherness binding diverse nations together! Let's join hands in the celebration of cricketing excellence and cherish the bonds that connect us all. @ACCMedia1 pic.twitter.com/9uPgx6intP — Jay Shah (@JayShah) July 19, 2023 -
'జై షా పాకిస్తాన్ వెళ్లడమేంటి?.. దాయాదుల మ్యాచ్ అక్కడే'
ఆసియా కప్ 2023 నిర్వహణపై ఒక స్పష్టత వచ్చింది. పీసీబీ చైర్మన్ జకా అష్రఫ్, బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడు జై షా.. సోమవారం భేటీ కావడం ఆసక్తి కలిగించింది. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ హైబ్రీడ్ మోడల్కు తాను అంగీకరించినట్లు జకా అష్రఫ్ మీడియాకు వెల్లడించాడు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనున్న ఆసియా కప్లో శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్లు, పాకిస్తాన్లో నాలుగు మ్యాచ్లు షెడ్యూల్ చేశారు. మ్యాచ్కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ శుక్రవారం విడుదలయ్యే అవకాశముంది. భారత్ తమ మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే ఆడనుంది. ఈ విషయం పక్కనబెడితే పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు టీమిండియా త్వరలో వెళ్లనుందని.. ముందస్తుగా బీసీసీఐ సెక్రటరీ జై షా పాక్కు వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తారంటూ వార్తలు వచ్చాయి. కాగా ఈ వార్తల్లో నిజం లేదని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. పీటీఐతో మాట్లాడిన ఆయన.. ఆసియా కప్లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్కు శ్రీలంకలోని డంబుల్లా స్టేడియం వేదిక కానుందని పేర్కొన్నారు. ''బీసీసీఐ కార్యదర్శి జై షా, పీసీబీ ప్రతినిధి జాకా అష్రఫ్ సమావేశం తర్వాత ఆసియా కప్ పై స్పష్టత వచ్చింది. మా కార్యదర్శి జై షా, పీసీబీ చైర్మన్ జాకా అష్రఫ్ ను కలిశారు. ఆసియా కప్ షెడ్యూల్ ఖరారైంది. పాకిస్థాన్ లో నాలుగు లీగ్ మ్యాచ్ లు జరుగుతాయి. ఆ తర్వాత 9 మ్యాచ్ లు శ్రీలంకలో జరుగుతాయి. అందులో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కూడా ఉంటుంది. ఒకవేళ ఈ రెండు టీమ్స్ ఫైనల్లో తలపడితే ఆ మ్యాచ్ కూడా శ్రీలంకలోనే జరుగుతుంది" అని అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. ఇండియన్ టీమ్ పాకిస్థాన్ రాబోతోందన్న మీడియా వార్తలను ఆయన ఖండించారు. భారత జట్టే కాదు.. చర్చల కోసం జై షా కూడా పాకిస్థాన్ వెళ్లడం లేదని అరుణ్ ధుమాల్ తేల్చి చెప్పాడు. ఆసియా కప్లో పాకిస్థాన్ జట్టు తమ స్వదేశంలో నేపాల్ తో మాత్రమే ఆడనుంది. ఈ మ్యాచ్ కాకుండా ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్.. బంగ్లాదేశ్, శ్రీలంక.. శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ మధ్య కూడా మ్యాచ్లు జరగనున్నాయి. ఉపఖండంలో 2016 తర్వాత జరుగుతున్న తొలి ఆసియా కప్ ఇదే. ఆ ఏడాది బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వగా.. తర్వాత 2018, 2022లలో యూఏఈలో జరిగింది. చదవండి: జై షాను కలిసిన పీసీబీ చైర్మన్.. ఆసియా కప్కు గ్రీన్ సిగ్నల్ WCC Suggests ICC: 'వరల్డ్కప్ తర్వాత ద్వైపాక్షిక వన్డే సిరీస్లను తగ్గించండి' -
జై షాను కలిసిన పీసీబీ చైర్మన్.. ఆసియా కప్కు గ్రీన్ సిగ్నల్
ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ 2023 జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆసియా క్రికెట్ కౌన్సిల్ పర్యవేక్షిస్తోంది. ఈసారి ఆసియా కప్ హైబ్రీడ్ మోడల్లో జరగనుంది. శ్రీలంక, పాకిస్తాన్లు ఆసియా కప్కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇందులో నాలుగు మ్యాచ్లు పాకిస్తాన్లో.. మరో తొమ్మిది మ్యాచ్లు శ్రీలంకలో జరగనున్నాయి. ఇటీవలే పీసీబీ చైర్మన్గా ఎన్నికైన జకా అష్రఫ్.. ఆసియా కప్ హైబ్రీడ్ మోడల్ను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ ఒక మెట్టు దిగిన జకా అష్రఫ్ తాను అలా అనలేదని.. ఆసియాకప్ టోర్నీని పాకిస్తాన్లో నిర్వహించి ఉంటే బాగుండేదని మాత్రమే అన్నట్లుగా పేర్కొన్నాడు. అయితే ఆసియా కప్ షెడ్యూల్ ఇప్పటివరకు విడుదల కాకపోవడానికి పీసీబీనే పరోక్ష కారణం. హైబ్రీడ్ మోడల్ను ఒకసారి ఒప్పుకోవడం.. మరోసారి తిరస్కరించడం.. వరల్డ్కప్తో ముడిపెట్టడంతో అసలు ఆసియా కప్ జరుగుతుందా అన్న అనుమానం కలిగింది. తాజాగా పీసీబీ చైర్మన్ జకా అష్రఫ్.. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడు జై షాతో భేటి అయ్యాడు. సోమవారం రాత్రి ఇద్దరు దుబాయ్లో కలుసుకొని ఆసియా కప్ గురించి మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్ను హైబ్రీడ్ మోడ్లో నిర్వహించడంపై తమకు అభ్యంతరం లేదని స్వయంగా పీసీబీ చైర్మన్ జకా అష్రఫ్ జైషాకు వెల్లడించారు. దీంతో ఆసియా కప్ నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ శుక్రవారం ఆసియా కప్ 2023 పూర్తి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. ఇదే విషయమై పీసీబీ చీఫ్ మాట్లాడుతూ.. ''జై షాతో మీటింగ్ మంచి ఆరంభం. ఆసియా కప్ హైబ్రీడ్ మోడల్లో నిర్వహించడం మాకు ఓకే. ఇక రానున్న కాలంలో భారత్-పాకిస్తాన్ క్రికెట్ మైత్రి బంధం బలపడే అవకాశముంది. రిలేషన్స్ను పెంచుకుంటూ ముందుకు సాగుతాం'' అంటూ తెలిపాడు. చదవండి: Wimbledon 2023: సంచలనం.. నెంబర్ వన్ స్వియాటెకు షాకిచ్చిన స్వితోలినా -
టీమిండియా అభిమానులకు గుడ్న్యూస్.. ఆ సిరీస్కు ముహూర్తం ఖరారు!
క్రికెట్ అభిమానులకు గుడ్న్యూస్. భారత్-ఆఫ్గానిస్తాన్ మధ్య వన్డే సిరీస్కు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరిలో భారత్-ఆఫ్గానిస్తాన్ మధ్య వన్డే సిరీస్ జరగనున్నట్లు బీసీసీఐ సెక్రెటరీ జైషా వెల్లడించాడు. శుక్రవారం ముంబైలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం తర్వాత జై షా ఈ ప్రకటన చేశాడు. కాగా వాస్తవానికి ఈ ఏడాది జూన్లో మూడు వన్డేల సిరీస్ కోసం ఆఫ్గానిస్తాన్ జట్టు భారత్లో పర్యాటించాల్సింది. కానీ ఇరు జట్ల బీజీబీజీ షెడ్యూల్ కారణంగా ఈ ద్వైపాక్షిక సిరీస్ను వాయిదా వేశారు. భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ అనంతరం ఇరు జట్లకు తగినంత విరామం లభించనుండంతో ఇప్పుడు ఈ సిరీస్ను జనవరిలో ప్లాన్ చేశారు. ఇక అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పలు అంశాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మీడియా రైట్స్ ఫైనల్ చేసే పనిలో అపెక్స్ కౌన్సిల్ పడింది. ఈ క్రమంలో స్వదేశీ ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచ్ల కోసం కొత్త మీడియా హక్కుల ఒప్పందాన్ని ఆగస్టు చివరి నాటికి పూర్తి చేస్తామని జైషా తెలిపారు. డొమెనికాకు చేరుకున్న భారత జట్టు ఇక వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా.. డొమినికా వేదికగా జరగనున్న తొలి టెస్టుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు బార్బడోస్ నుంచి శనివారం డొమినికాకు చేరుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అక్కడికి చేరుకున్న భారత జట్టు మూడు రోజుల ప్రాక్టీస్ క్యాంప్లో పాల్గోనుంది. వెస్టిండీస్తో రెండు టెస్టులకు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: అంబటి రాయుడు కీలక నిర్ణయం -
వరల్డ్కప్ షెడ్యూల్ విడుదల.. జైషాపై ట్రోల్స్, మీమ్స్
క్రికెట్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్కప్ షెడ్యూల్ రిలీజ్ అయింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న మెగా సమరం దాదాపు 50 రోజులపాటు అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. మొత్తం 10 వేదికల్లో గ్రూప్ దశలో 48 మ్యాచ్లు జరగనుండగా.. నాకౌట్ దశలో మూడు మ్యాచ్లు ముంబై(సెమీఫైనల్-1), కోల్కతా(సెమీఫైనల్-2), అహ్మదాబాద్(ఫైనల్) జరగనున్నాయి. ఇక ఆరంభమ్యాచ్ 2019 వన్డే ప్రపంచకప్ విన్నర్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. అయితే వన్డే ప్రపంచకప్లో భాగంగా అహ్మదాబాద్ మొత్తంగా ఐదు మ్యాచ్లకు వేదిక కానుంది. ఆరంభ, ఫైనల్ మ్యాచ్లతో పాటు మధ్యలో చిరకాల ప్రత్యర్థులుగా భావించే టీమిండియా-పాకిస్తాన్, ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్లకు కూడా ఇదే స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక మరో మ్యాచ్ సౌతాఫ్రికా, అఫ్గానిస్తాన్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్కు అంతగా ప్రాధాన్యం లేకపోయినప్పటికి మిగతా నాలుగు మ్యాచ్లకు టీఆర్పీ రేటింగ్ బద్దలవడం ఖాయం. కాగా అహ్మదాబాద్కు కేటాయించిన ఐదు మ్యాచ్ల్లో నాలుగు మ్యాచ్లు ఆసక్తికరంగానే సాగుతాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ జై షా మ్యాచ్ల ఎంపికలో ఏ మేరకు చక్రం తిప్పాడో స్పష్టంగా అర్థమవుతుంది. తన ఆధిపత్యాన్ని చూపిస్తూ తన సొంత ఇలాకాలో జరిగే ఐదు మ్యాచ్లు మంచి ఆసక్తి కలిగించేవే. అందుకే జై షాను సోషల్ మీడియాలో అభిమానులు ట్రోల్ చేయడంతో పాటు మీమ్స్తో రెచ్చిపోయారు. ''సొంత ఇలాకాలో మంచి మ్యాచ్లు పెట్టుకున్నాడు.. బయటి వేదికలకు మాత్రం పనికిరాని మ్యాచ్లు కొన్ని ఇచ్చాడు.. తన ఆధిపత్యం ఎంతలా ఉందనేది అర్థమవుతుంది.. మోదీ ఉన్నంతవరకు ప్రతి ప్రతిష్టాత్మక మ్యాచ్ అహ్మదాబాద్కే వెళుతుందన్నది సత్యం'' అంటూ పేర్కొన్నారు. ఈసారి అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న జరగబోయే భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు క్రికెట్ చరిత్రలోనే అత్యధిక టీఆర్పీ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టేడియం సామర్థ్యం లక్ష మంది కాగా.. దాయాదుల మ్యాచ్కు లక్షకు పైగా వచ్చే అవకాశముంది. ప్రతిష్టాత్మక ఫైనల్తో పాటు మిగతా మ్యాచ్లు పరిశీలిస్తే ఆరంభమ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలిమ్యాచ్ తొలిరోజే ఆసక్తిగా మొదలయ్యే చాన్స్ ఉంటుంది. ఇక ఇంగ్లండ్, ఆస్ట్రేలియా నవంబర్ 4న అహ్మదాబాద్లో ఆడనున్న మ్యాచ్కు కూడా యమా క్రేజ్ ఉంది. వీటితో పాటు ప్రతిష్టాత్మక ఫైనల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. Proud moment for India! Hosting the ICC Men's Cricket World Cup for the fourth time is an incredible honor. With 12 cities as the backdrop, we'll showcase our rich diversity and world-class cricketing infrastructure. Get ready for an unforgettable tournament! #CWC2023 @ICC @BCCI pic.twitter.com/76VFuuvpcK — Jay Shah (@JayShah) June 27, 2023 Jay Shah selecting venues for Pakistan matches pic.twitter.com/EKdSr3rn7h — Rajabets India🇮🇳👑 (@smileandraja) June 18, 2023 #ICCWorldCup2023 schedule pic.twitter.com/Ii7OIoWbMC — Rajabets India🇮🇳👑 (@smileandraja) June 27, 2023 Jay Shah after scheduling Pakistan match against Afghanistan in Chennai #PakistanCricket #WorldCup2023 pic.twitter.com/Wiky1eyRD8 — Rishabh (@Pun_Intended___) June 19, 2023 చదవండి: 'అప్పుడు సచిన్ కోసం.. ఇప్పుడు కోహ్లి కోసం' -
అహ్మదాబాద్ స్టేడియం నిజంగా గొప్పదా!.. ఎందుకంత ప్రాముఖ్యత?
ప్రతిష్టాత్మక ఐసీసీ వన్డే వరల్డ్కప్ 2023కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. పుష్కరకాలం తర్వాత మళ్లీ మెగా టోర్నీకి మన దేశం ఆతిథ్యం ఇస్తుండడంతో ప్రాధాన్యత నెలకొంది. ఇప్పటికే మ్యాచ్లు నిర్వహించనున్న స్టేడియాలకు సంబంధించిన డ్రాఫ్ట్ను బీసీసీఐ ఐసీసీకి పంపించింది. రెండు మూడు రోజుల్లో ఐసీసీ ఆమోదముద్ర వేయడంతో పూర్తి షెడ్యూల్ను విడుదల చేయనుంది. ఇక అందరూ ఊహించినట్లుగానే వరల్డ్కప్ ఆరంభమ్యాచ్, ఫైనల్ మ్యాచ్ సహా మరికొన్ని కీలక మ్యాచ్లకు(భారత్-పాక్) అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. లక్ష మంది సామర్థ్యం, ఆధునిక టెక్నాలజీ.. అత్యాధునిక సౌకర్యాలు.. మంచి డ్రైనేజీ వ్యవస్థ.. ఇది మోదీ స్టేడియం గురించి బయటికి వినపడే విషయాలు. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే.. అహ్మదాబాద్ స్టేడియం అనుకున్నంత రేంజ్లో లేదన్నది అభిమానుల వాదన. ఇది నిజమే అని ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2023 ఫైనల్ సందర్భంగా నిరూపితమైంది. సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఫైనల్ భారీ వర్షం కారణంగా రిజర్వ్డేకు వాయిదా పడింది. రిజర్వ్ డే రోజున కూడా వర్షం పలుమార్లు అంతరాయం కలిగించింది. అయితే మే 28న కురిసిన భారీ వర్షానికి అహ్మదాబాద్ స్టేడియంలో ఒక పెవిలియన్ ఎండ్లో పైకప్పుకు సొట్ట పడడంతో స్టాండ్స్ మొత్తం నీటితో నిండిపోయింది. దీనివల్ల తర్వాతి రోజు మ్యాచ్కు వచ్చిన ప్రేక్షకులకు కూర్చోవడానికి ఇబ్బంది తలెత్తింది. అంతేకాదు స్టేడియం ఔట్ఫీల్డ్తో పాటు పిచ్ కూడా పూర్తిగా బురదమయం అయింది. పిచ్ను తయారు చేయడానికి సాపర్స్, ఇసుకను ఉపయోగించారు. దీనితో పాటు హెయిర్ డ్రైయ్యర్లు, ఇస్త్రీ పెట్టెలు ఉపయోగించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తర్వాత ఇది నిజం కాదని తేలింది. కానీ ఒక్క భారీ వర్షం వల్ల నరేంద్ర మోదీ స్టేడియంలోని లోపాలన్ని బయటపడ్డాయి. ఇవన్నీ పక్కనబెడితే.. కొత్త స్టేడియం కావడంతో అది ప్రారంభమయినప్పటి నుంచి టీమిండియా ఆడిన ఏ ప్రతిష్టాత్మక మ్యాచ్కు అయినా అహ్మదాబాద్ ఆతిథ్యం ఇస్తూనే వస్తోంది. ఇది కొంతమంది అభిమానులకు నచ్చడం లేదు. బీజేపీ హయాంలో ఈ స్టేడియం నిర్మాణం పూర్తవ్వడంతో స్టేడియం పేరును సర్దార్ పటేల్ నుంచి నరేంద్ర మోదీకి మార్చి పొలిటికల్ యాంగిల్కు తెర తీశారు. అంతేకాదు బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా అహ్మదాబాద్కు చెందినవాడు కావడం.. అతని తండ్రి దేశ రాజకీయాల్లో నెంబర్-2గా.. మోదీకి అత్యంత సన్నిహితుడిగా చక్రం తిప్పుతుండడంతో అహ్మదాబాద్ స్టేడియానికి కలిసి వస్తోందని చెప్పొచ్చు. People who are asking for closed roof stadiums have a look at the pillars and roofs of the biggest stadium and the richest cricket board leaking. pic.twitter.com/idKjMeYWYd — Manya (@CSKian716) May 28, 2023 అభిమానులు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే.. ఎందుకు అహ్మదాబాద్ స్టేడియానికి అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు. వాస్తవానికి దేశంలో అతిపెద్ద స్టేడియాల్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ కూడా ఉంది. అందులో ఫైనల్ నిర్వహిస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పేరుకే బీసీసీఐ అయినప్పటికి.. మొత్తం జై షా కనుసన్నుల్లోనే జరుగుతున్నట్లు అర్థమవుతుంది. ఇక మన భాగ్యనగరంలోని ఉప్పల్ స్టేడియం అత్యాధునిక డ్రైనేజీ సౌకర్యం కలిగిన స్టేడియాల్లో ఒకటిగా ఉంది. ఈ వరల్డ్కప్కు ఉప్పల్ ఆతిథ్యమిస్తున్నప్పటికి టీమిండియా ఆడే ఒక్క మ్యాచ్ కూడా ఈ లిస్ట్లో లేదని తెలిసింది. కనీసం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో మ్యాచ్ అయినా మన భాగ్యనగరంలో నిర్వహించి ఉంటే బాగుండేదని అభిమానులు బాధపడ్డారు. చదవండి: World Cup 2023: భారత మ్యాచ్ ‘భాగ్యం’ లేదు! -
AsiaCup 2023: కొత్త ట్విస్ట్.. పాక్ లేకుండానే టోర్నీ నిర్వహణ!
ఆసియా కప్ 2023 విషయమై ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య సయోధ్య కుదిరేలా సూచనలు కనిపించడం లేదు. ఆసియా కప్ను హైబ్రిడ్ మోడ్లో నిర్వహించి తమ పంతం నెగ్గించుకోవాలని చూసిన పీసీబీకి చుక్కెదురైనట్లు తెలుస్తోంది. హైబ్రిడ్ మోడ్ ప్రకారం పాక్లో కొన్ని మ్యాచ్లు.. భారత్ ఆడే మ్యాచ్లను దుబాయ్లో నిర్వహించాలని పీసీబీ భావించింది. కానీ హైబ్రిడ్ మోడ్కు బీసీసీఐ అంగీకరించలేదని.. ఆ సమయంలో దుబాయ్లో వేడి ఎక్కువగా ఉంటుందని.. ఆటగాళ్లు తట్టుకోలేరని ఏసీసీకి బీసీసీఐ వివరించినట్లు సమాచారం. ఏసీసీలో భాగంగా ఉన్న ఇతర దేశాలు కూడా పాక్ ప్రతిపాదించిన హైబ్రీడ్ మోడ్కు ఒప్పుకోనట్లు తెలిసింది. దీంతో పాకిస్తాన్ లేకుండానే ఆసియా కప్ జరగనున్నట్లు తెలిసింది. రిపోర్టు ప్రకారం, టోర్నమెంట్కు అధికారిక హోస్ట్ అయిన పాకిస్థాన్ మినహా ఆసియా కప్ ఆడేందుకు ఏసీసీ సభ్యులందరూ అంగీకరించినట్లు తెలిసింది. పాకిస్థాన్ కాకుండా వేరే దేశంలో ఆసియా కప్ నిర్వహించేందుకు అంగీకరించినట్లు సమాచారం. కానీ పాకిస్థాన్ మాత్రం హైబ్రిడ్ మోడల్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. అందువల్ల పాకిస్థాన్ తన నిర్ణయాన్ని సడలించకపోతే ఈసారి పాక్ జట్టు లేకుండానే ఆసియాకప్ జరగనుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) రాబోయే ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో పాల్గొనే ఇతర దేశాలన్నీ శ్రీలంకలో ఆసియా కప్ ఆడేందుకు ఏకగ్రీవంగా అంగీకరించినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి స్పష్టమైన సందేశం పంపే అవకాశాలు ఉన్నాయి. అలాగే, శ్రీలంకలో ఆసియా కప్కు ఆతిథ్యం ఇవ్వడానికి పాకిస్థాన్ కాకుండా ఇతర దేశాల నుంచి మద్దతు ఎక్కువగా ఉన్నందున ఏసీసీ నిర్ణయాన్ని అంగీకరించడం లేదా పూర్తిగా వైదొలగడం మినహా పాకిస్థాన్కు ఇప్పుడు వేరే మార్గం లేదు. ఒకవేళ ఈ ఈవెంట్లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పాల్గొనకపోతే భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్లు శ్రీలంక వేదికగా ఆసియా కప్లో ఆడతాయి. అయితే ఇప్పుడు పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్ను భారత్ తిరస్కరిస్తే.. అక్టోబర్, నవంబర్లలో భారత్లో జరిగే వన్డే ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ వైదొలిగే అవకాశం ఉంది. అయితే ఇది పాకిస్తాన్కే నష్టం చేకూర్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఆసియా కప్ సెప్టెంబర్ 2 నుంచి 17 వరకు జరిగే నిర్వహించే యోచనలో ఏసీసీ ఉంది. చదవండి: విధ్వంసకర ఇన్నింగ్స్.. 38 బంతుల్లోనే సెంచరీ శ్రీలంకలో ఆసియాకప్.. జరుగుతుందా? లేదా? ఫామ్లో ఉన్నాడు.. రికార్డులు బద్దలు కొట్టడం కష్టమేమి కాదు -
శ్రీలంకలో ఆసియాకప్.. జరుగుతుందా? లేదా?
ఆసియాకప్ 2023 నిర్వహణపై ఇంకా సందిగ్థత వీడడం లేదు. వాస్తవానికి ఈ ఏడాది సెప్టెంబర్లో ఆసియా కప్ జరగాల్సి ఉంది. ఐపీఎల్ 2023 ఫైనల్ తర్వాత ఆసియా కప్ నిర్వహణపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఐపీఎల్ ఫైనల్ అనంతరం నిర్వహించిన మీటింగ్లో ఆసియాకప్ వేదికను పాకిస్తాన్ నుంచి శ్రీలంకకు మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్లో ఆసియా కప్ ఆడేందుకు బీసీసీఐ నిరాకరించింది. దీంతో పీసీబీ హైబ్రిడ్ మోడ్లో ఆసియా కప్ నిర్వహించేందుకు ప్రణాళిక పంపింది. అయితే ఈ ప్రపోజల్ను మీటింగ్లో శ్రీలంక సహా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఆసియా కప్ను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ఏసీసీకి తెలిపింది. దీనికి బీసీసీఐ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో ఆసియాకప్ శ్రీలంకలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది జరిగితే మాత్రం ఆసియా కప్లో పాక్ ఆడేందుకు నిరాకరించే అవకాశం ఉంది. అంతేకాదు ఆసియా కప్ నిర్వహణకు అడ్డుపడుతూ తమవద్ద నుంచి బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తున్నందుకు పీసీబీ ఐసీసీకి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది.దీంతో ఆసియా కప్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. అసలు జరుగుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ బుధవారం మరొకసారి సమావేశం కానుంది. ఈ మీటింగ్లో చర్చించి ఆసియా కప్పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతిపాదన హైబ్రిడ్ మోడల్ రెండు రకాలు ఉన్నాయి. మొదటి ప్రతిపాదన ఏంటంటే ఆసియా కప్ టోర్నమెంట్ పాకిస్థాన్లో నిర్వహించబడుతుంది.. అయితే భారత జట్టు తటస్థ వేదికలో వారితో ఆడవచ్చు. ఇక రెండవ ప్రతిపాదన ఆసియా కప్ టోర్నీని రెండు భాగాలుగా విభజించనున్నారు. తొలి రౌండ్ మ్యాచ్లకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా... ఈ రౌండ్లో భారత్తో మ్యాచ్లు ఉండవు. నిజానికి రెండో రౌండ్లో వారితో భారత జట్టు ఆడుతుంది. అలాగే టోర్నీ ఫైనల్ మ్యాచ్ తటస్థ వేదికపై జరుగుతుంది. చదవండి: #MSDhoni: దాయాది అభిమానులే మెచ్చుకునేలా!