Reserve Bank
-
రూ.1,500 కోట్ల పెనాల్టీ వసూలు చేయాల్సిందే
సాక్షి, అమరావతి: రిజర్వ్బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్సియర్స్కు విధించిన రూ.1,500 కోట్ల పెనాల్టీని వసూలు చేసేలా చర్యలు చేపట్టాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కేంద్ర ఆదాయ పన్ను శాఖను కోరారు. ఇప్పటికే 16 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న ఈ విషయాన్ని సత్వరం పరిష్కరించి పెనాల్టీని వసూలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ సంస్థను నిర్వహించిన హిందూ అవిభాజ్య కుటుంబ (హెచ్యూఎఫ్) కర్త చెరుకూరి రామోజీరావు మరణించినందున దీనికి సంబంధించి గతంలో ఉమ్మడి హైకోర్టు విధించిన స్టే కూడా తొలగిపోయినట్లేనని స్పష్టం చేశారు. ఈమేరకు ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్కు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల రెండు వేర్వేరు లేఖలు రాశారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ సంస్థ ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన అక్రమ డిపాజిట్ల ఉదంతాన్ని అందులో సవివరంగా ప్రస్తావించారు. అక్రమంగా డిపాజిట్లు వసూలు నిర్ధారించిన ఆర్బీఐమార్గదర్శి ఫైనాన్సియర్స్ సంస్థ పేరిట రామోజీరావు ప్రజల నుంచి అక్రమంగా డిపాజిట్లు వసూలు చేసిన విషయాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ తొలిసారి 2006లో ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. రిజర్వ్ బ్యాంకు చట్టం ప్రకారం బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు. కానీ మార్గదర్శి ఫైనాన్సియర్స్ రెండు లక్షల మందికిపైగా డిపాజిటర్ల నుంచి అక్రమంగా రూ.2,600 కోట్లకుపైగా డిపాజిట్లు వసూలు చేసింది. ఇదే విషయాన్ని ఉండవల్లి అరుణ్కుమార్ అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, ఆర్బీఐలకు లేఖల ద్వారా తెలియచేశారు. ఈ క్రమంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్పై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ కేసు నమోదు చేసింది. ఆర్బీఐ సెక్షన్ 45 ఎస్ నుంచి తమకు మినహాయింపు ఉందని రామోజీ అప్పట్లో అడ్డగోలుగా వాదించారు. అయితే ఆ వాదనను ఆర్బీఐ కొట్టిపారేసింది. 45 ఎస్ కింద రామోజీరావుకు మినహాయింపు వర్తించదని.. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట వసూలు చేసినవి ముమ్మాటికీ అక్రమ డిపాజిట్లేనని స్పష్టం చేసింది. దాంతో విధి లేని పరిస్థితుల్లో రామోజీరావు తన మార్గదర్శి ఫైనాన్సియర్స్ సంస్థను మూసివేస్తున్నామని.. సేకరించిన అక్రమ డిపాజిట్లను తిరిగి చెల్లించేస్తామని ఆర్బీఐ, న్యాయస్థానాలకు విన్నవించారు.రూ.1,500 కోట్లు పెనాల్టీ విధించిన ఐటీ శాఖస్టే తెచ్చుకున్న రామోజీనిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల ద్వారా రామోజీ సముపార్జించిన అక్రమ ఆదాయంపై ఆదాయపన్ను శాఖ 2008లో రూ.1,500 కోట్ల పెనాల్టీ విధించింది. ఈ మేరకు ఆదాయపన్ను చట్టం సెక్షన్ 271 డి ప్రకారం మార్గదర్శి ఫైనాన్సియర్స్కు నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులపై రామోజీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. స్టే విధించి 16 ఏళ్లు దాటినప్పటికీ దాన్ని తొలగించేందుకు ఇప్పటికీ ఆదాయపన్ను శాఖ సరైన చర్యలు తీసుకోలేదు. దాంతో రూ.1,500 కోట్ల పెనాల్టీ చెల్లింపు అంశం దీర్ఘకాలంగా పెండింగ్లో ఉంది. ‘మార్గదర్శి’పై చర్యలు తీసుకోవాల్సిందేనన్న ‘సుప్రీం’మార్గదర్శి ఫైనాన్సియర్స్ తమ డిపాజిటర్లకు డిపాజిట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించేసినందున ఇక ఎలాంటి చర్యలు అవసరం లేదని ఏపీ – తెలంగాణ ఉమ్మడి హైకోర్టు విభజనకు ముందు రోజు అంటే 2018 డిసెంబర్ 31న తీర్పునిచ్చింది. ఆ తీర్పును అప్పటి టీడీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయకుండా రామోజీరావుకు సహకరించింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమ డిపాజిట్లు ఎవరెవరికి తిరిగి చెల్లించారో వివరాలు వెల్లడించాలని.. అక్రమాలకు పాల్పడిన మార్గదర్శి ఫైనాన్సియర్స్పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. అనంతరం 2019 మేలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యింది. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు.. గతంలో ఉమ్మడి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్పై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు చేపట్టాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలో కేసును తిరిగి విచారించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టుకు సహకరించాలని ఉండవల్లి అరుణ్కుమార్కు సూచించింది. ప్రస్తుతం ఈ కేసు తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉంది. హెచ్యూఎఫ్ కర్త రామోజీరావు మరణించినా సరే... అక్రమ డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్సియర్స్పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.పెనాల్టీ వసూలుకు చర్యలు చేపట్టండిఈ పరిణామాల నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ కేంద్ర ఆదాయపన్ను శాఖకు లేఖ రాశారు. హెచ్యూఎఫ్ కర్త చెరుకూరి రామోజీరావు మరణించినందున ఆ సంస్థపై ఐటీ శాఖ విధించిన పెనాల్టీకి సంబంధించి గతంలో న్యాయస్థానం ఇచ్చిన స్టే ఉత్తర్వులు తొలగిపోయినట్లేనని వివరించారు. రామోజీరావు మరణించిన తరువాత ఆయన కుటుంబ సభ్యులను ఈ కేసు రికార్డుల్లో నమోదు చేయనందున గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులు మనుగడలో లేనట్లుగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు. రామోజీ స్థానంలో తనను హెచ్యూఎఫ్ కర్తగా పరిగణించాలని ఆయన కుమారుడు సీహెచ్.కిరణ్ మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసును విచారిస్తున్న తెలంగాణ హైకోర్టును కోరారు. కానీ మార్గదర్శి ఫైనాన్సియర్స్పై ఆదాయపు పన్ను శాఖ విధించిన పెనాల్టీకి సంబంధించిన కేసులో మాత్రం రామోజీరావు వారసుల పేర్లు రికార్డుల్లో నమోదు కాలేదు. కాబట్టి గతంలో ఆదాయ పన్ను శాఖ విధించిన రూ.1,500 కోట్ల పెనాల్టీపై న్యాయస్థానం ఇచ్చిన స్టే తొలగిపోయినట్లుగానే పరిగణించాలని కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ నివేదించారు. ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్కు విధించిన రూ.1,500 కోట్ల పెనాల్టీని వసూలు చేసేందుకు ఆదాయపన్ను శాఖ న్యాయపరంగా అన్ని చర్యలూ చేపట్టాలని కోరారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాలపై తానే ఫిర్యాదుదారుడిని కాబట్టి పెనాల్టీ అంశంపై ప్రస్తుత పరిస్థితిని తనకు వివరిస్తే అవసరమైతే తాను కూడా తగిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు.తొక్కిపెడుతున్న బాబు సర్కారుమార్గదర్శి ఫైనాన్సియర్స్, దాని కర్త రామోజీరావు భారీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆర్బీఐ ఆధారాలతో సహా న్యాయస్థానానికి నివేదించినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని తొక్కిపెడుతూ మార్గదర్శి ఫైనాన్సియర్స్ను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే.. మార్గదర్శి ఫైనాన్సియర్స్ కర్త రామోజీరావు మరణించినందున ఈ వ్యాజ్యాలపై విచారణే అవసరం లేదంటూ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు ఇటీవల తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. అనవసరమైన విచారణ జరిపి సమయాన్ని వృథా చేసుకోవద్దని ఏకంగా న్యాయస్థానానికే సూచించింది. చట్ట విరుద్ధంగా జరిగిందా.. లేదా?‘డిపాజిట్లు వెనక్కి ఇచ్చే శారు సరే..! అసలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడమే నిబంధనలకు విరుద్ధమని ఆర్బీఐ చెబుతోంది కదా? వసూలు చేసిన డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయడం వేరు.. చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేయడం వేరు. ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది. డిపాజిట్ల వసూలు చట్ట విరుద్ధంగా జరిగిందా.. లేదా? అలా వసూలు చేయడం నేరమా? కాదా? అన్నదే ముఖ్యం. తుది విచారణలో ఈ విషయాన్ని కూడా తేలుస్తాం...’ – మార్గదర్శినుద్దేశించి గతంలో తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యడిపాజిట్ల సేకరణచట్ట విరుద్ధమే:ఆర్బీఐమార్గదర్శి ఫైనాన్సియర్స్, దాని కర్త రామోజీరావు ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 (ఎస్)కి విరుద్ధంగా ప్రజల నుంచి అక్రమంగా డిపాజిట్లు వసూలు చేశారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే పలు దఫాలు న్యాయస్థానానికి నివేదించింది. ఇది సెక్షన్ 58 బీ (5ఏ) ప్రకారం అత్యంత శిక్షార్హమైన నేరమని స్పష్టం చేసింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్, దాని కర్త రామోజీరావుల చట్ట ఉల్లంఘనలకు సంబంధించి ఆర్బీఐ తన కౌంటర్లో పలు కీలక విషయాలను తెలంగాణ హైకోర్టు ముందుంచింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ చట్ట విరుద్ధంగా వసూలు చేసిన డిపాజిట్లపై తమకు ప్రజల నుంచి, డిపాజిటర్ల నుంచి ఫిర్యాదులు అందాయని వెల్లడించింది. డిపాజిట్ల వసూలు విషయంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్న మార్గదర్శి, రామోజీ వాదన శుద్ధ అబద్ధమని స్పష్టం చేసింది. ఇదే సమయంలో... చట్ట విరుద్ధంగా ప్రజల నుంచి రూ.వేల కోట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్సియర్స్ హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) కర్త చెరుకూరి రామోజీరావు మరణించిన నేపథ్యంలో, తమపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొనసాగించడం నిష్ప్రయోజనమంటూ మార్గ దర్శి ఫైనాన్సియర్స్ చేసిన వాదనను ఆర్బీఐ నిర్ధ్వందంగా తోసిపుచ్చింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్, రామోజీరావు ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలను డిపాజిట్ల రూపంలో వసూలు చేశారని, ఇది ఆర్బీఐ చట్టం సెక్షన్ 45ఎస్కి విరుద్ధమని పునరుద్ఘాటించింది. అంతేకాక ఇలా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయడం ఆర్బీఐ చట్టం సెక్షన్ 58 బీ (5ఏ) ప్రకారం శిక్షార్హమని హైకోర్టు దృష్టికి తెచ్చింది. రామోజీరావు మరణించినప్పటికీ మార్గదర్శి ఫైనాన్సియర్స్పై ప్రొసీడింగ్స్ను కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది. -
వృద్ధి సాధనకు ఊతం ఏదీ?
ప్రపంచవ్యాప్తంగా చాలామేరకు ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నా, ఉపాధి కల్పన మెరుగ్గా కనబడు తున్నా వాణిజ్య వ్యవహారాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, దేశాల మధ్య పెరుగుతున్న పోటీ ఒక రకమైన అనిశ్చిత వాతావరణానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆర్థిక సర్వే విడుదల చేసింది. పరస్పర ఆధారిత వర్తమాన ప్రపంచంలో ఏ దేశమూ సమస్యలనూ, సంక్షో భాలనూ తప్పించుకోలేదు. అలాగే వాటి పరిష్కారానికి సాగే కృషిలో భాగస్వామి కాకుండా ఒంట రిగా దేన్నీ అధిగమించలేదు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు ముందుంచిన ఆర్థిక సర్వే దీన్నంతటినీ ప్రతిబింబించింది. మనది ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. ఇతర దేశాలతో పోలిస్తే మనది చురుకైన ఆర్థిక వ్యవస్థే. కానీ ఇటీవలి కాలంలో అది కొంత మంద గమనంతో కదులుతోంది. 2023లో 8.2 శాతంగా ఉన్న వృద్ధి రేటు నిరుడు 6.5 శాతానికి క్షీణించింది. ఇది 2026 వరకూ ఈ స్థాయిలోనే వుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఈ నెల 17న అంచనా వేసింది. పట్టణ ప్రాంత వినియోగంలో క్షీణత, ఆహార పదార్థాల ధరల్లో పెరుగుదల, వేతన స్తంభన, అంతంతమాత్రంగా ఉన్న ఉపాధి కల్పన, ప్రైవేటు రంగ పెట్టుబడుల మందకొడితనం స్పష్టంగా కనబడుతోంది. ఒక్క కర్ణాటక, మహారాష్ట్రల్లో మాత్రమే వినియోగిత పెరి గింది. ఆంధ్రప్రదేశ్లో అంతక్రితం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మెరుగ్గా ఉన్న వినియో గిత ఎన్డీయే సర్కారు వచ్చాక క్షీణించింది. ‘మొత్తంమీద ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నా ఆహార పదార్థాల ధరలు ఇప్పటికీ అధికంగానే ఉన్నాయ’ని సర్వే అంగీకరించింది. గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం ఉండగా, అదిప్పుడు 4.9 శాతానికి చేరుకుంది. ఆహారేతర, ఇంధనేతర సరుకుల ధరల తగ్గుదల ఇందుకు కారణం. వాస్తవానికి పంపిణీ మెరుగుకావటం, వాతావరణం అనుకూలించటం వంటి కారణాల వల్ల చాలా దేశాల్లో ఆహార సరుకుల ధరలు తగ్గాయి. మన దేశమూ, చైనా, బ్రెజిల్ వంటి దేశాల్లో ఇందుకు భిన్నమైన పోకడ కనబడుతోంది. నిరుడు 7.5 శాతం ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ప్రస్తుతం 8.4 శాతానికి చేరుకుంది. పంపిణీ వ్యవస్థ సక్రమంగా లేని కారణంగా కూరగాయలు, పప్పులు వగైరా ధరల్లో పెరుగుదల నమోదవుతున్నదని నిపుణుల అభిప్రాయం. రాగల రోజుల్లో కూరగాయల ధరలు తగ్గుతాయని, ఖరీఫ్ పంటలు మార్కెట్లో అడుగుపెడితే ఇతర ధరలు కూడా సర్దుకుంటాయని సర్వే ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అదంతా ప్రపంచ స్థితిగతులపై ఆధారపడి వుంటుంది. మున్ముందు ప్రపంచ సాగుపంటల ధర వరలు పెరుగుతాయని, వాతావరణ మార్పులు కూడా అనుకూలించకపోవచ్చని అంచనాలు న్నాయి. అదనంగా దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉండనే ఉన్నాయి. ఎదగదల్చుకున్నవారికి ఆశావహ దృక్పథం అవసరం. స్వాతంత్య్రం వచ్చి 2047కి వందేళ్లవు తాయి కాబట్టి అప్పటికల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దుకోవాలని ఎన్డీయే సర్కారు కోరుకుంటోంది. కానీ వరసగా రెండు దశాబ్దాలపాటు 8 శాతం నిలకడైన జీడీపీ కొనసాగితేనే ఇది సాధ్యం. ప్రస్తుత జీడీపీలో పెట్టుబడుల వాటా 31 శాతం. దీన్ని కనీసం 35 శాతానికి తీసుకెళ్లాలి. ముఖ్యంగా తయారీరంగం వృద్ధి చెందాలి. కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్, బయోటెక్నాలజీరంగాల్లో విస్తరిస్తున్న సాంకేతికతలను అందిపుచ్చుకోవాలి. ఇవన్నీ జరిగితేనే ‘వికసిత్ భారత్’ సాకారమవుతుంది. అందుకు భూసంస్కరణలు, కార్మికరంగ సంస్కరణలు అత్యవసరం అంటు న్నది ఆర్థిక సర్వే. కానీ కార్మిక రంగ సంస్కరణలను ట్రేడ్ యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నాయి. బ్రిటిష్ వలస పాలకుల కాలంనుంచి ఇంతవరకూ పోరాడి సాధించుకున్న అనేక హక్కుల్ని లేబర్ కోడ్ హరిస్తున్నదని వాటి ఆరోపణ. ముఖ్యంగా ట్రేడ్ యూనియన్ల ఏర్పాటును కష్టతరం చేయటం, ఇప్పటికేవున్న ట్రేడ్ యూనియన్ల గుర్తింపు రద్దుకు వీలు కల్పించటం, సమ్మె హక్కును కాలరాయటం, మధ్యవర్తిత్వ ప్రక్రియకు ప్రతిబంధకాలు ఏర్పర్చటం, లేబర్ కోర్టుల మూసివేత, ట్రిబ్యునల్ ఏర్పాటు వంటివి ఉన్నాయంటున్నారు. వీటిపై కార్మిక సంఘాలతో చర్చించటం, పార దర్శకత పాటించటం, అవసరమైన మార్పులకు సిద్ధపడటం వంటి చర్యలద్వారా అపోహలు తొల గించటానికి కేంద్రం కృషి చేస్తే కార్మిక రంగ సంస్కరణల అమలు సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చటానికి సంస్కరణలు అవసరం అనుకున్నప్పుడు ఇదంతా తప్పనిసరి. వాస్తవాలను గమనంలోకి తీసుకుని జాగురూకతతో అడుగులేయకపోతే లక్ష్యసాధన కష్ట మవుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం నిరుడు లిస్టెడ్ కంపెనీల లాభార్జన22.3 శాతం పెరిగింది. చెప్పాలంటే ఆర్థిక, ఇంధన, ఆటోమొబైల్ రంగాల కార్పొరేట్ సంస్థలకు లాభాలు వచ్చిపడ్డాయి. కానీ ఆ రంగాల్లో ఉపాధి కల్పన పెరిగింది లేదు. వేతనాలు స్తంభించాయి. పరిస్థితులిలా వుంటే వినియోగిత పెరుగుతుందా? తగినంత డిమాండ్ లేనప్పుడు తయారీరంగంలో పెట్టుబడుల వృద్ధి సాధ్యమవుతుందా? ఈ వ్యత్యాసాలపై దృష్టి పెట్టనంతకాలమూ ఆర్థిక రంగ స్వస్థత సులభం కాదు. వృద్ధికి ఊతం ఇచ్చేందుకు వీలుగా రుణాల వడ్డీ రేట్లు తగ్గించాలని రిజర్వ్బ్యాంకును నిర్మలా సీతారామన్తోపాటు కేంద్ర వాణిజ్యమంత్రి పీయుష్ గోయల్ కూడా కోరుతున్నారు. మంచిదే. తమవంతుగా ఉద్యోగకల్పన, వేతనాల పెంపుపై కూడాకేంద్రం దృష్టి సారించాలి. శనివారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో అందుకు తగిన ప్రతిపాదనలుంటాయని ఆశిద్దాం. -
ఏటా రూ.15 వేల కోట్లపైనే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా తెచ్చుకున్న అప్పుల తిరిగి చెల్లింపుపై రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) స్పష్టతనిచ్చింది. 2015 జనవరి 1వ తేదీ నుంచి 2025 జనవరి 15వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రం రూ.3,49,137 కోట్లను బాండ్ల వేలం ద్వారా తీసుకున్నట్టు వెల్లడించింది. గరిష్టంగా 45 ఏళ్ల కాలపరిమితితో ఈ నిధులు సమీకరించారని.. అంటే 2060 నాటికి ఈ అప్పులన్నింటినీ తీర్చాల్సి ఉంటుందని తాజాగా విడుదల చేసిన ‘ఔట్ స్టాండింగ్ స్టేట్ గవర్నమెంట్స్ సెక్యూరిటీస్’నివేదికలో తెలిపింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు చేసిన అప్పుల లెక్కలను అందులో వెల్లడించింది. తెలంగాణ వచ్చే నాలుగేళ్లలో రూ.60.947.18 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. ఈ ఏడాది రూ.17 వేల కోట్ల పైమాటే.. రాష్ట్రం బాండ్ల వేలం ద్వారా సేకరించిన రుణాలను ఏ సంవత్సరంలో ఎంత తీర్చాల్సి ఉంటుందో ఆర్బీఐ తాజా నివేదికలో వెల్లడించింది. దాని ప్రకారం 2025లో రూ.17,150 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంది. 2026లో రూ.20వేల కోట్లను అప్పులకు అసలు, వడ్డీ కింద చెల్లించాలి. మొత్తమ్మీద వచ్చే నాలుగేళ్లలో రూ.60 వేల కోట్లకు పైగా చెల్లించాలి. ఇవి రిజర్వు బ్యాంకు ద్వారా బహిరంగ మార్కెట్లో తీసుకున్న రుణాలకు అసలు, వడ్డీ మాత్రమేనని.. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం, ఇతర సంస్థలు, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపు అదనమని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. గడువు తీరిన నాటి నుంచి.. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక రూపాల్లో అప్పులు తీసుకుంటుంది. అందులో ప్రధానమైనవి ఆర్బీఐ ద్వారా సేకరించే రుణాలు. ఆర్థిక శాఖ వర్గాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉండే సెక్యూరిటీ బాండ్లను ఆర్బీఐ వేదికగా బహిరంగ మార్కెట్లో వేలానికి పెట్టి ఈ నిధులను సమకూర్చుకుంటుంది. ఇన్ని కోట్ల విలువైన బాండ్లను వేలం వేస్తున్నామని, ఇన్ని సంవత్సరాల కాలపరిమితిలో, ఇంత వడ్డీ చెల్లించి రుణం తీరుస్తామని ఆర్బీఐకి ఇండెంట్ పెడుతుంది. ఆర్బీఐ వేలంలో పాల్గొన్న సంస్థలు.. ఆ బాండ్లను స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు బాండ్ల కాలపరిమితి ముగిసిన కొద్దీ అసలు, వడ్డీ కలిపి చెల్లించి బాండ్లను విడిపించుకుంటాయి. మళ్లీ అవసరాన్ని బట్టి అవే బాండ్లను వేలానికి పెట్టి నిధులు తెచ్చుకుంటాయి. -
భారత్ అభివృద్ధిలో బ్యాంకులది కీలక పాత్ర
పుణె: 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా ఇన్ఫ్రా రంగానికి బ్యాంకులు దన్నుగా నిలవాలని, చిన్న–మధ్యతరహా సంస్థల అవసరాలకు తగ్గట్లుగా రుణ లభ్యత ఉండేలా చూడాలని ఆమె చెప్పారు. అలాగే, ఆర్థిక సేవలు అందుబాటులో లేని వర్గాలను బ్యాంకింగ్ పరిధిలోకి తేవాలని, బీమా విస్తృతిని మరింత పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 90వ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. టెక్నాలజీతో కొత్త మార్పులు.. ఖాతాదారులకు డిజిటల్ బ్యాంకింగ్ను సులభతరం చేసేందుకు ఉపయోగపడుతున్న టెక్నాలజీతో పరిశ్రమలో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ ప్రాధాన్యం పెరుగుతోందని, ప్రస్తుతం భూటాన్, ఫ్రాన్స్ తదితర ఏడు దేశాల్లో ఈ విధానం అందుబాటులో ఉందని ఆమె తెలిపారు. అంతర్జాతీయంగా జరిగే రియల్–టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 45 శాతం వాటా భారత్దే ఉంటోందన్నారు.అయితే, టెక్నాలజీతో పాటు పెరుగుతున్న హ్యాకింగ్ రిస్కులను నివారించేందుకు, అలాంటి వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు బ్యాంకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. బ్యాంకుల్లో మొండిబాకీలు తగ్గుతున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ జూన్ ఆర్థిక స్థిరత్వ నివేదిక సూచిస్తోందని మంత్రి చెప్పారు. లాభదాయకతతో పాటు ఆదాయాలను పెంచుకునే దిశగా బ్యాంకులు తగు విధానాలను పాటించాలని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు సూచించారు. -
ముందస్తు విత్డ్రాకు ఆర్బీఐ నిబంధనలు
ముంబై: ఎన్బీఎఫ్సీల్లో డిపాజిట్ చేసిన మూణ్నెల్ల వ్యవధిలోనే డిపాజిటర్లు అత్యవసర పరిస్థితుల కోసం మొత్తం డబ్బును వెనక్కి తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ప్రిమెచ్యూర్ విత్డ్రాయల్స్పై వడ్డీ లభించదని పేర్కొంది. నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) నిబంధనలను సమీక్షించిన సందర్భంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులు 2025 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. వైద్యం, ప్రకృతి వైపరీత్యాలతో పాటు ప్రభుత్వం ప్రకటించే విపత్తులను అత్యవసర పరిస్థితులుగా పరిగణిస్తారు. మరోవైపు, డిపాజిట్లు స్వీకరించే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీ) పాటించాల్సిన లిక్విడ్ అసెట్స్ పరిమాణాన్ని అవి ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లలో 13 శాతం నుంచి 15 శాతానికి ఆర్బీఐ పెంచింది. అలాగే, పబ్లిక్ డిపాజిట్లకు అన్ని వేళలా పూర్తి కవరేజీ ఉండేలా చూసుకోవాలని, ఏడాదికి ఒకసారైనా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల నుంచి ’ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్’ రేటింగ్ పొందాలని హెచ్ఎఫ్సీలకు సూచించింది. పబ్లిక్ డిపాజిట్లను 12 నెలల నుంచి 60 నెలల్లోపు తిరిగి చెల్లించేయాల్సి ఉంటుంది. -
విదేశీ విద్యపైనే మోజు!
విదేశాల్లో చదువుకునేందకు ఇష్టపడే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. మధ్య తరగతి ప్రజల్లో ఆదాయం పెరగడం, విదేశాల్లో అధిక జీతాలందించే ఉపాధి అవకాశాలుండటంతో పదేళ్లలో వీరి సంఖ్య రెట్టింపైంది. అదే సమయంలో విదేశాల నుంచి మనదేశంలో చదువుకునేందుకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. అయితే భారతీయ విద్యార్థులు విదేశాలకు భారీగా తరలిపోవడం, వారి ఆదాయ, వ్యయాలు అన్నీ ఇతర దేశాల్లోనే జరుగుతుండటంతో దేశీయ కరెంట్ అకౌంట్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.సాక్షి, అమరావతి: విదేశాల్లో ఉన్నత విద్య చదువుకునేందుకు భారతీయ విద్యార్థులు ఆసక్తి మరింత పెరుగుతోంది. అదే సమయంలో భారతీయ విశ్వవిద్యాలయాల్లో అంతర్జాతీయ విద్యార్థుల నమోదు తగ్గుతోంది. దీని కారణంగా భారతదేశ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్పై తీవ్ర ప్రభావం పడుతోంది. విదేశాల్లో చదువుకుంటూ.. అక్కడే పని చేసుకుంటున్న వారు డబ్బును తిరిగి భారతదేశానికి పంపడం లేదు. ఫలితంగా సుమారు రూ.50 వేల కోట్ల కరెంట్ అకౌంట్ లోటును తెచ్చిపెట్టినట్టు ఆర్బీఐ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రిజర్వ్ బ్యాంకు చెబుతున్నదాని ప్రకారం గత పదేళ్లలో భారతీయుల విద్యా ప్రయాణానికి సంబంధించిన వ్యయం రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. 2014–15లో రూ.20,597 కోట్ల నుంచి 2023–24లో రూ.52 వేల కోట్లకు పెరిగింది. ఈ మొత్తం 2025 నాటికి దేశం నుంచి విదేశాలకు వేళ్లే విద్యార్థుల మొత్తం ఖర్చు రూ.5 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. మన విద్యార్థులు ఇష్టపడుతున్న దేశాలు యునైటెడ్ స్టేట్స్(అమెరికా), కెనడా, యునైటెడ్ కింగ్డమ్(యూకే), ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అధిక ఫీజులు, అత్యధిక జీవన వ్యయాలున్నా భారతీయ విద్యార్థుల విదేశీ విద్యకు ప్రసిద్ధ గమ్యస్థానాలుగా ఉన్నాయి. ఆ తర్వాత జర్మనీ, ఐర్లాండ్, సింగపూర్, రష్యా, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్, న్యూజిలాండ్లను ఎంపిక చేసుకుంటున్నారు. అలాగే, దేశానికి వచ్చే విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది దక్షిణాసియా, ఆఫ్రికన్ దేశాలకు చెందినవారే. నేపాల్ అత్యధిక సంఖ్యలో విద్యార్థులను భారతదేశానికి పంపుతోంది. 2014–15లో 21 శాతం నుంచి 2021–22లో 28శాతానికి పెరిగింది. 2014–15తో పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, మలేషియా, సూడాన్, నైజీరియా విద్యార్థుల శాతం తగ్గింది. భారత్కు ఎక్కువ మంది విద్యార్థులను పంపుతున్న దేశాల వరుసలో ఆఫ్ఘనిస్తాన్ 6.72 శాతంతో రెండో, భూటాన్ 3.33 శాతంతో ఆరో దేశంగా నిలుస్తోంది. 2021–22లో అమెరికా విద్యార్థులు 6.71 శాతంతో మూడో స్థానాన్ని, బంగ్లాదేశ్ 5.55 శాతం, యూఏఈ 4.87 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఎన్ని చేసినా ప్రయోజనం స్వల్పమే..అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య క్షీణిస్తున్న క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) 2020ను తెచ్చింది. ఎక్కువ మంది అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించే లక్ష్యంతో ప్రపంచ అధ్యయన గమ్యస్థానంగా భారత్ను తీర్చిదిద్దేందుకు అనేక ప్రతిపాదనలను రూపొందించింది. ఈ క్రమంలోనే యూజీసీ సైతం ద్వంద్వ, ఉమ్మడి డిగ్రీ ప్రోగ్రామ్లను అనుమతించేలా మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. 2018లో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఫ్లాగ్షిప్ ప్రాజెక్టుగా స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ను ప్రారంభించింది. దీని ద్వారా అత్యుత్తమ స్కాలర్షిప్లు, ఫీజు మినహాయింపులను అందించేలా రూపొందించింది. అయితే భాగస్వామ్య దేశాలతో ఒప్పందాల ద్వారా విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు ప్రారంభించారు. కానీ, తగినన్ని నిధులు కేటాయించకపోవడంతో విదేశీ విద్యార్థులను దేశానికి ఆకర్షించడంలో ఈ కార్యక్రమం నత్తనడకన సాగడంతో విఫలమైంది. ప్రభుత్వం తీసుకున్న చొరవతో 2014–15 నుంచి 2019–20 ఆర్థిక సంవత్సరాల వరకు విదేశీ విద్యార్థుల నమోదు కేవలం 16.68శాతం మాత్రమే పెరిగిందని ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ డేటా చెబుతోంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో కరోనా ఎఫెక్ట్తో విదేశీ విద్యార్థుల సంఖ్య 48,035కు, 2021–22లో 46,878కి తగ్గింది. విదేశీ విద్యకు రుణాలు పెరిగాయి..దేశంలో ఉన్నత విద్య కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్లిపోతుండటంతో డెమోగ్రాఫిక్ సమతౌల్యం దెబ్బతింటోంది. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతిలో ఆదాయం పెరుగుతోంది. స్టాక్ మార్కెట్లు వంటివి లాభాలను సృష్టిస్తున్నాయి. నాన్ బ్యాంక్ ఫైనాన్సియల్ కంపెనీలు సైతం విద్యా రుణాలను గణనీయంగా పెంచాయి. ఫలితంగా విదేశాల్లో ఫీజులు చెల్లించే సామర్థ్యం పెద్ద సమస్య కాకుండాపోయింది. – మహేశ్వర్ పెరి, ఛైర్మన్,కెరీర్స్ 360 సీఈవో దేశంలో అంతర్జాతీయ విద్యార్థుల క్షీణత..భారతీయ విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విద్యార్థుల నమోదులో గణనీయమైన క్షీణతను నమోదు చేస్తున్నాయి. ఆర్బీఐ నివేదిక ప్రకారం భారత్లో విద్యా సంబంధిత అంశాల ద్వారా వచ్చే ఆదాయం సగానికి సగం తగ్గింది. 2014–15లో రూ.4,345 కోట్ల నుంచి 2023–24కు రూ.2,068 కోట్లకు పడిపోయింది. అయితే 2022–23తో పోలిస్తే కేవలం విదేశీ మారకపు ఆదాయం స్వల్పంగా పెరిగింది. కోవిడ్ తర్వాత 2021–22లో రూ.912 కోట్ల కనిష్ట స్థాయి నుంచి పుంజుకుంది. అయినప్పటికీ 2014–15తో పోలిస్తే చాలా తక్కువగానే నమోదైంది. -
RBI: బ్యాంకింగ్లో కార్పొరేట్లకు నో ఎంట్రీ
ముంబై: బ్యాంకులను ప్రమోట్ చేయడానికి వ్యాపార సంస్థలను అనుమతించే ఆలోచన ఏదీ ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ చేయడం లేదని గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, బ్యాంకుల ప్రమోట్కు కార్పొరేట్ సంస్థలను అనుమతించడం వల్ల వడ్డీ రిస్్కలు, సంబంధిత లావాదేవీల్లో పారదర్శకత సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందన్నారు. భారతదేశానికి ఇప్పుడు కావలసింది బ్యాంకుల సంఖ్య పెరగడం కాదని పేర్కొంటూ. మంచి, పటిష్ట, సుపరిపాలన ఉన్న బ్యాంకులు ఇప్పు డు కీలకమైన అంశమని వివరించారు. సాంకేతికత ద్వారా దేశవ్యాప్తంగా పొదుపులను సమీకరిస్తుందన్నారు.రుణాలకన్నా... డిపాజిట్ల వెనుకడుగు సరికాదు... డిపాజిట్ల పురోగతికన్నా.. రుణ వృద్ధి పెరగడం సరైంది కాదని పేర్కొంటూ ఇది లిక్విడిటీ సమస్యలకు దారితీస్తుందన్నారు. గృహ పొదుపులు గతం తరహాలోకి కాకుండా మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇన్స్ట్రమెంట్ల వైపు మళ్లడం బ్యాంకింగ్ డిపాజిట్లపై ప్రభావం పడుతోందని అభిప్రాయపడ్డారు. డిపాజిట్లు–రుణాల మధ్య సమతౌల్యత ఉండాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఇక దేశంలో ఆర్థికాభివృద్ధి ఊపందుకుందని పేర్కొన్న ఆయన, ద్రవ్యోల్బణం ఆందోళనలు ఇంకా పొంచి ఉన్నాయని స్పష్టం చేశారు. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం ద్రవ్యోల్బణం కట్టడిపై దృష్టి సారిస్తుందని అన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం సుస్థిర ప్రాతిపదికన 4 శాతం వైపునకు దిగివస్తేనే రుణ రేటు వ్యవస్థ మార్పు గురించి ఆలోచించే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేశారు.స్పెక్యులేషన్లోకి గృహ పొదుపులుఎఫ్అండ్వో ట్రేడ్ చాలా పెద్ద అంశం సెబీ చైర్పర్సన్ మాధవిపురిఇంటి పొదుపులు స్పెక్యులేషన్ వ్యాపారంలోకి వెళుతున్నాయని సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం చూపుతున్నందున ఎఫ్అండ్వోలో స్పెక్యులేటివ్ ట్రేడ్లకు వ్యతిరేకంగా ఇన్వెస్టర్లకు గట్టి హెచ్చరిక పంపుతున్నట్టు చెప్పారు. మూలధన ఆస్తి కల్పనకు ఉపయోగపడుతుందన్న అంచనాలను తుంగలో తొక్కుతున్నారని.. యువత పెద్ద మొత్తంలో ఈ ట్రేడ్లపై నష్టపోతున్నట్టు తెలిపారు. ‘‘ఓ చిన్న అంశం కాస్తా.. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో పెద్ద సమస్యగా మారిపోయింది. అందుకే ఈ దిశగా ఇన్వెస్టర్లను ఒత్తిడి చేయాల్సి వస్తోంది’’అని సెబీ చైర్పర్సన్ చెప్పారు. ప్రతి 10 మంది ఇన్వెస్టర్లలో తొమ్మిది మంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్వో) విభాగంలో నష్టపోతున్నట్టు సెబీ నిర్వహించిన సర్వేలో వెల్లడి కావడం గమనార్హం. ట్రేడింగ్ పరిమాణం పెద్ద ఎత్తున పెరగడంతో, ప్రతి ఒక్కరినీ ఈ దిశగా అప్రమ్తతం చేయడం నియంత్రణ సంస్థ బాధ్యతగా ఆమె పేర్కొన్నారు. ఫిన్ఫ్లూయెన్సర్లు (ఆర్థిక అంశాలు, పెట్టుబడులను ప్రభావితం చేసేవారు) పెట్టుబడుల సలహాదారులుగా సెబీ వద్ద నమోదు చేసుకుని, నియంత్రణల లోపాలను వినియోగించుకుంటున్నారని, దీనిపై త్వరలోనే చర్చా పత్రాన్ని విడుదుల చేస్తామన్నారు. -
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్..
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్కు రిజర్వ్ బ్యాంక్ షాకిచ్చింది. ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ మాధ్యమాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. అలాగే కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా ఆంక్షలు విధించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయి. బ్యాంకు ఐటీ రిస్క్ మేనేజ్మెంట్లో ‘తీవ్రమైన లోపాలు’ బయటపడటం ఇందుకు కారణమని ఆర్బీఐ పేర్కొంది.అయితే, క్రెడిట్ కార్డు కస్టమర్లు సహా ప్రస్తుతమున్న ఖాతాదారులందరికీ బ్యాంకు యథాప్రకారం సేవలు అందించడాన్ని కొనసాగించవచ్చని తెలిపింది. మే 4న కోటక్ మహీంద్రా బ్యాంకు ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్యాంకు ఎక్స్టర్నల్ ఆడిట్ను నిర్వహించి, అందులో బయటపడే సమస్యలను, తాము గు ర్తించిన లోపాలను పరిష్కరిస్తే ఆంక్షలను సమీక్షిస్తామని ఆర్బీఐ పేర్కొంది. పదే పదే సాంకేతిక అంతరాయాలు తలెత్తుతున్న కారణంగా 2020 డిసెంబర్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకుపై కూడా ఆర్బీఐ దాదాపు ఇదే తరహా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఐటీ సంబంధ తనిఖీలో కీలకాంశాలు2022, 2023 సంవత్సరాల్లో నిర్వహించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధ తనిఖీల్లో తీవ్ర ఆందోళనకరమైన అంశాలను గుర్తించినట్లు రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. ‘ఐటీ ఇన్వెంటరీ నిర్వహణ, యూజర్ యాక్సెస్ మేనేజ్మెంట్, వెండార్ రిస్క్ మేనేజ్మెంట్, డేటా సెక్యూరిటీ వంటి అంశాల్లో తీవ్రమైన లోపాలు, నిబంధనలను పాటించకపోవడం మొదలైన వాటిని గుర్తించాం‘ అని వివరించింది. వాటిని సమగ్రంగా, సకాలంలో పరిష్కరించడంలో బ్యాంకు నిరంతరం వైఫల్యం చెందుతున్న కారణంగా తాజా చర్యలు తీసుకోవాల్సి వచి్చందని ఆర్బీఐ తెలిపింది. పటిష్టమైన ఐటీ మౌలిక సదుపాయాలు, రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థ లేకపోవడం వల్ల కోర్ బ్యాంకింగ్ సిస్టం (సీబీఎస్), ఆన్లైన్ .. డిజిటల్ బ్యాంకింగ్ మాధ్యమాలు గత రెండేళ్లుగా తరచూ మొరాయిస్తూ, కస్టమర్లను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నాయని వివరించింది. ఈ ఏడాది ఏప్రిల్ 15న కూడా ఇదే తరహా ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకుకు సంబంధించిన నిర్దిష్ట వ్యాపార విభాగాలపై ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. -
Duvvuri Subbarao: వృద్ధి, వడ్డీ రేటు మార్పులకు ఆ ఇద్దరి నుంచి ఒత్తిడి
న్యూఢిల్లీ: ప్రణబ్ ముఖర్జీ, పి. చిదంబరం ఆర్థిక మంత్రులుగా పని చేసిన సమయంలో సానుకూల సెంటిమెంటు కోసం వడ్డీ రేట్లను తగ్గించాలని, వృద్ధి రేటును పెంచి చూపాలని తమపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు ఉండేవని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ స్వయం ప్రతిపత్తికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం గురించి ప్రభుత్వంలో కొంతైనా అవగాహన ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల ‘జస్ట్ ఎ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరియర్’ పేరిట రాసిన స్వీయకథలో దువ్వూరి ఈ విషయాలు పేర్కొన్నారు. వడ్డీ రేట్ల విషయంలోనే కాకుండా ఇతరత్రా అంశాల్లోనూ ప్రభుత్వం నుంచి ఆర్బీఐపై ఒత్తిడి ఉండేదని ఒక అధ్యాయంలో ఆయన ప్రస్తావించారు. ‘ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయమిది. ఆర్థిక కార్యదర్శి అరవింద్ మాయారాం, ప్రధాన ఆర్థిక సలహాదారు కౌశిక్ బసు మా అంచనాలను సవాలు చేశారు. సానుకూల సెంటిమెంటును పెంపొందించాల్సిన భారాన్ని ప్రభుత్వంతో పాటు ఆర్బీఐ కూడా పంచుకోవాల్సిన అవసరం ఉందన్న వాదనలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు సెంట్రల్ బ్యాంకులు సహకరిస్తుంటే మన దగ్గర మాత్రం ఆర్బీఐ తిరుగుబాటు ధోరణిలో ఉంటోందంటూ మాయారాం వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ప్రభుత్వానికి ఆర్బీఐ చీర్లీడరుగా ఉండాలన్న డిమాండ్కి నేను తలొగ్గలేదు’ అని దువ్వూరి పేర్కొన్నారు. చిదంబరం విషయానికొస్తే .. వడ్డీ రేట్లు తగ్గించాలంటూ ఆర్బీఐపై తీవ్ర ఒత్తిడి తెచి్చనట్లు దువ్వూరి చెప్పారు. పరిస్థితులను సమీక్షించిన మీదట తాను అంగీకరించలేదన్నారు. దీంతో కలవరానికి గురైన చిదంబరం అసాధారణ రీతిలో ఆర్బీఐపై అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారని వివరించారు. ఏపీలోని పార్వతీపురంలో సబ్–కలెక్టరుగా కెరియర్ను ప్రారంభించిన దువ్వూరి కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా, అటు పైన అంతర్జాతీయ మాంద్యం పరిస్థితుల్లో ఆర్బీఐ గవర్నర్గా కూడా పని చేసిన సంగతి తెలిసిందే. -
ఆర్బీఐ అంబుడ్స్మన్ స్కీములకు ఫిర్యాదుల వెల్లువ
ముంబై: రిజర్వ్ బ్యాంక్ అంబుడ్స్మన్ స్కీముల కింద వివిధ సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 2022–23లో ఇవి 68 శాతం పెరిగి 7.03 లక్షలుగా నమోదయ్యాయి. మొబైల్/ఎల్రక్టానిక్ బ్యాంకింగ్, రుణాలు, ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు, పింఛను చెల్లింపులు, రెమిటెన్సులు మొదలైన వాటికి సంబంధించిన ఫిర్యాదులు వీటిలో ఉన్నాయి. ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోవడం, ఆర్బీఐ–సమీకృత అంబుడ్స్మన్ స్కీము (ఆర్బీ–ఐవోఎస్) కింద దాఖలు చేసే ప్రక్రియను సరళతరం చేయడం తదితర అంశాలు ఫిర్యాదుల నమోదుకు దోహదపడ్డాయని అంబుడ్స్మన్ స్కీము వార్షిక నివేదిక పేర్కొంది. అత్యధికంగా 83.78 శాతం ఫిర్యాదులు (1,93,635) బ్యాంకులపై వచ్చాయి. అంబుడ్స్మన్ ఆఫీసులు 2,34,690 ఫిర్యాదులను హ్యాండిల్ చేశాయి. సమస్య పరిష్కారానికి పట్టే సమయం సగటున 33 రోజులకు మెరుగుపడింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇది 44 రోజులుగా ఉంది. -
ఏఐఎఫ్ల పెట్టుబడుల రికవరీపై పిరమల్ ధీమా
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలతో ప్రభావితమయ్యే ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ల (ఏఐఎఫ్) నుంచి పెట్టుబడులను సజావుగా రాబట్టుకోగలమని పిరమల్ ఎంటర్ప్రైజెస్ (పీఈఎల్) ధీమా వ్యక్తం చేసింది. ఈ ఏడాది నవంబర్ 30 నాటికి ఏఐఎఫ్ యూనిట్లలో పీఈఎల్, పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్కు రూ. 3,817 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో రుణగ్రస్త కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయని మొత్తం .. రూ. 653 కోట్లుగా ఉంది. మిగతా రూ. 3,164 కోట్లలో రూ. 1,737 కోట్ల నిధులను గత 12 నెలల వ్యవధిలో మూడు రుణగ్రస్త కంపెనీల్లో ఏఐఎఫ్లు ఇన్వెస్ట్ చేశాయి. అయితే, నిబంధనలకు అనుగుణంగా మొత్తం రూ. 3,164 కోట్లకు పీఈఎల్ ప్రొవిజనింగ్ చేయొచ్చని, ఫలితంగా 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,200 కోట్ల మేర నష్టాలను చూపించే అవకాశం ఉందని బ్రోకరేజి సంస్థ ఎమ్కే ఒక నివేదికలో తెలిపింది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తమ దగ్గర రుణాలు తీసుకున్న సంస్థల్లో ఏఐఎఫ్ల ద్వారా ఇన్వెస్ట్ చేయరాదని, ఒకవేళ చేసి ఉంటే నెలరోజుల్లోగా వాటిని ఉపసంహరించుకోవాలని లేదా ఆ మొత్తానికి ప్రొవిజనింగ్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఇటీవల సూచించిన సంగతి తెలిసిందే. -
దుబారా తగ్గాలి..పన్నేతర ఆదాయం పెంచాలి
సాక్షి, హైదరాబాద్: ఏ దేశమైనా, రాష్ట్రమైనా ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో క్రమశిక్షణ, నిశిత పరిశీలన, వ్యూహాత్మక వినియోగం కీలకమని.. ఆర్థిక నిర్వహణను బట్టే ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పులు సాధ్యమవుతాయని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్, కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు రఘురాం రాజన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం కూడా ఆ దిశలో పనిచేయాలని.. దుబారా తగ్గించుకుని, ప్రజలపై పన్ను భారం మోపకుండా ఆర్థిక వ్యవస్థను నడిపించే వ్యూహాన్ని రూపొందించుకోవాలని సలహా ఇచ్చారు. రఘురాం రాజన్ ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నివాసానికి వచ్చారు. రేవంత్తోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. రెండు గంటలకుపైగా జరిగిన ఈ సమావేశంలో.. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆర్థికాభివృద్ధి కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, దేశంలో ఇతర రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు రఘురాం రాజన్ పలు సూచనలు చేశారు. ఆర్థిక పరిస్థితిని బట్టి ముందుకెళ్లండి రాష్ట్ర ప్రభుత్వ వాస్తవ ఆర్థిక పరిస్థితిని బట్టి ముందుకెళ్లాలని, ఆర్థిక మూలాలను బలోపేతం చేసుకోవడం దృష్టి పెట్టాలని రఘురాం రాజన్ సూచించినట్టు తెలిసింది. మైనింగ్తోపాటు నాలా చార్జీల్లాంటి పన్నేతర ఆదాయాన్ని పెంచుకోవాలని చెప్పినట్టు సమాచారం. కొత్త వాహనాలు కొనడం, కొత్త నిర్మాణాలు చేపట్టడం వంటి దుబారా ఖర్చుల జోలికి వెళ్లవద్దని.. సంక్షేమ పథకాల అమలు కారణంగా అభివృద్ధిపై తిరోగమన ప్రభావం పడకుండా జాగ్రత్త వహించాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. పథకాల కోసం అవసరమయ్యే నిధులను సమకూర్చుకోవడంలో క్రమశిక్షణను కచ్చితంగా పాటించాలని పేర్కొన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా రఘురాం రాజన్ తన అనుభవాలను సీఎం బృందంతో పంచుకున్నట్టు తెలిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. -
అలాంటి సంస్థలతో తస్మాత్ జాగ్రత్త: ఆర్బీఐ
న్యూఢిల్లీ: ప్రింట్ మీడియాతో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ‘రుణమాఫీ’ ఆఫర్లకు సంబంధించిన తప్పుదోవ పట్టించే ప్రకటనల బారిన పడవద్దని రిజర్వ్ బ్యాంక్ ప్రజలను హెచ్చరించింది. రుణమాఫీని ఆఫర్ చేస్తూ రుణగ్రహీతలను ప్రలోభపెట్టే కొన్ని తప్పుదోవ పట్టించే ప్రకటనలను గమనించినట్లు బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఒక ప్రకటనలో తెలిపింది. కొన్ని సంస్థలు, ప్రింట్ మీడియాతో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ఇలాంటి పలు ప్రచారాలు చురుకుగా చేస్తున్నట్లు కనిపిస్తోందని పేర్కొంది. అటువంటి సంస్థలు ఎలాంటి అధికారం లేకుండా ‘రుణ మాఫీ సర్టిఫికెట్లు’ జారీ చేయడానికి సేవా/చట్టపరమైన రుసుమును వసూలు చేస్తున్నాయని కూడా వార్తలు వస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. కొంతమంది వ్యక్తులు రుణ గ్రహీతలను తప్పుదారిపట్టించే విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొంది. అలాంటి సంస్థలతో లావాదేవీలు జరిపితే ఆర్థిక నష్టాలు తప్పవని వినియోగదారులకు హెచ్చరించింది. ‘‘బ్యాంకులతోసహా ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని అటువంటి సంస్థలు లేదా వ్యక్తులు తప్పుగా సూచిస్తున్నారు. తద్వారా బ్యాంకింగ్ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. ఇటువంటి కార్యకలాపాలు ఆర్థిక సంస్థల స్థిరత్వాన్ని ముఖ్యంగా డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తాయి‘ అని ఆర్బీఐ ప్రకటన వివరించింది. ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మి నష్టపోవద్దని, ఈ తరహా తప్పుడు ప్రచారం తమ దృష్టికి వస్తే, విచారణా సంస్థల దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది. -
ఎన్బీఎఫ్సీ వృద్ధి అంతంతే..
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఇటీవల అసురక్షిత రిటైల్ రుణాల నిబంధనలు కఠినతరం చేయడంతో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల (ఎన్బీఎఫ్సీ)పై ప్రభావం చూపనుంది. కఠిన నిబంధనల వల్ల రుణాల మంజూరు నెమ్మదించి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్బీఎఫ్సీ రంగ వృద్ధి ఒక మోస్తరుగానే ఉండనుంది. 16–18 శాతం కన్నా తక్కువే ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేస్తోంది. రాబోయే రోజుల్లో ఉత్పత్తుల్లో వైవిధ్యం, రుణాల ప్రొఫైల్ వంటివి వృద్ధి వ్యూహాల్లో కీలకంగా ఉండగలవని ఒక ప్రకటనలో తెలిపింది. పటిష్టమైన స్థూల, సూక్ష్మ ఆర్థిక పరిస్థితులు .. రిటైల్ రుణాల వృద్ధికి ఊతమివ్వగలవని వివరించింది. రిటైల్గా గృహాలు, వాహనాలు, కన్జూమర్ డ్యూరబుల్స్ మొదలైన వాటిపై చేసే వ్యయాలు పటిష్టంగా ఉండటంతో ప్రైవేట్ వినియోగమనేది దీర్ఘకాలిక సగటుకు పైన కొనసాగుతోందని క్రిసిల్ రేటింగ్స్ ఎండీ గుర్ప్రీత్ చత్వాల్ తెలిపారు. అసురక్షిత రిటైల్ రుణాల నిబంధనలు కఠినతరం అయినప్పటికీ హామీతో కూడుకున్న రుణాలపై ప్రభావం ఉండబోదని పేర్కొన్నారు. ముఖ్యంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలపై (హెచ్ఎఫ్సీ) ప్రభావం ఉండదని తెలిపారు. పటిష్టమైన అమ్మకాల దన్నుతో వాహన రుణాల విభాగం ఈ ఆర్థిక సంవత్సరం 18–19 శాతం వృద్ధి చెందగలదని వివరించారు. వచ్చే ఏడాది గృహ రుణాలు 14 శాతం అప్.. ఎన్బీఎఫ్సీల నిర్వహణలో ఉన్న ఆస్తుల్లో (ఏయూఎం) ప్రస్తుతం గృహ, వాహన రుణాలకు చెరో 25–27 శాతం వాటా ఉన్నట్లు క్రిసిల్ తెలిపింది. ఈ రెండూ స్థిరంగా వృద్ధి చెందగలవని వివరించింది. అఫోర్డబుల్ గృహ రుణాలపై (రూ. 25 లక్షల కన్నా లోపు) హెచ్ఎఫ్సీలు ప్రధానంగా దృష్టి పెడుతుండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరం హోమ్ లోన్ సెగ్మెంట్ 12–14 శాతం వృద్ధి చెందగలదని క్రిసిల్ తెలిపింది. వాహన రుణాల విభాగం 2024–25 మధ్యకాలంలో స్థిరంగా 17–18 శాతం వృద్ధి నమోదు చేయొచ్చని పేర్కొంది. ఎన్బీఎఫ్సీ ఏయూఎంలో అసురక్షిత రుణాల సెగ్మెంట్ మూడో అతి పెద్ద విభాగంగా ఉంది. మరోవైపు, బ్యాంకుల నుంచి ఎన్బీఎఫ్సీల నిధుల సమీకరణ వ్యయాలు 25–50 బేసిస్ పాయింట్ల మేర పెరగవచ్చని క్రిసిల్ అంచనా వేసింది. అయితే, అవి ఎంత మేర బ్యాంకు రుణాలపై ఆధారపడి ఉన్నాయనే అంశంపై వాటి ఆర్థిక పనితీరు మీద ప్రభావం ఉంటుందని వివరించింది. -
‘స్టార్’ గుర్తున్న కరెన్సీ మంచిదే
అమలాపురం టౌన్: కొన్ని కరెన్సీ నోట్లపై నోటు క్రమ సంఖ్యతో పాటు స్టార్ గుర్తు ఉంటుంది. కొన్ని నోట్లపై మాత్రమే ఈ స్టార్ గుర్తు ఎందుకు ఉంటుందనే అంశంపై ప్రస్తుత పరిస్థితుల్లో అవగాహన పెంచుకోవాల్సిన అవసరముంది. ఎందుకంటే ఇటీవల కాలంలో స్టార్ ఉన్న నోట్లు నకిలీవి అంటూ కొంత మంది సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి స్టార్ గుర్తుతో ఉన్న నోట్లు అనేకం సేకరించిన అమలాపురానికి చెందిన కరెన్సీ నోట్ల సేకర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ నోట్లపై ఈ స్టార్ను రిజర్వు బ్యాంకు ఎందుకు ముద్రిస్తుందో, అందుకు అనుసరించే సాంకేతిక, శాసీ్త్రయ అంశాలేమిటో వివరించారు. స్టార్ నోట్లు ఇలా.. దేశంలోని ప్రతి కరెన్సీ నోటుపై మొదటి రెండు అంకెల తర్వాత ఒక ఆంగ్ల అక్షరం (ఒక రూపాయి నుంచి రూ.20 వరకూ), లేదా ఒక అంకె తర్వాత రెండు ఆంగ్ల అక్షరాలు (రూ.50 విలువ పైబడిన నోట్లన్నిటి మీద) ఉంటాయి. దీనిని ప్రిఫిక్స్ అంటారు. ఇలా ముద్రించిన రెండంకెలు, ఆంగ్ల అక్షరం తర్వాత కొంత ఖాళీ ఉండి.. తర్వాత ఆరంకెల క్రమ సంఖ్య ఉంటుంది. కొన్ని నోట్ల మీద ఇలా ఖాళీ ఉన్న భాగంలో స్టార్ గుర్తు ఉంటుంది. వీటిని స్టార్ నోట్లు లేదా రీ ప్లేస్మెంట్ నోట్లు అని అంటారు. పాడైన నోట్ల పైనే స్టార్లు సాధారణంగా చిరిగిపోయిన లేదా బాగా పాడైపోయిన నోట్లను బ్యాంకుల్లో జమ చేస్తాం. అవన్నీ రిజర్వు బ్యాంక్కు చేరతాయి. వాటిని ఒకచోట భద్రపరచి మళ్లీ అవే నంబర్లతో నోట్లు విడుదల చేస్తారు. పాత నోట్ల మీద అప్పటి గవర్నర్ సంతకం ఉంటుంది కాబట్టి వాటి మీద కొత్త గవర్నర్ సంతకం ముద్రించేందుకు వీలుగా ఈ స్టార్ను ముద్రిస్తారు. పాత లేదా పాడైపోయిన నోట్ల రీ ప్లేస్మెంట్ కోసం ఓ గుర్తుగా స్టార్ను ముద్రిస్తారు. ఇంత వరకూ ఎన్ని స్టార్ నోట్లు ముద్రించామన్నది రిజర్వు బ్యాంక్ వద్ద ఉంటుంది. భారతీయ రిజర్వు బ్యాంక్ 2006 ఆగస్టు 31న ఈ స్టార్ నోట్ల విడుదల గురించి ప్రత్యేక ప్రకటన చేసింది. ఈ స్టార్ నోట్లు కలిగి ఉన్న బండిల్స్ మీద కూడా ప్రత్యేక గుర్తు ముద్రించి ఉంటుందని కృష్ణకామేశ్వర్ తెలిపారు. ఈ స్టార్ నోట్లు కూడా సాధారణ నోట్ల మాదిరిగానే చలామణీ అవుతాయని స్పష్టం చేశారు. -
చెలామణిలో రూ.10 నాణేలు
కర్ణాటక: రిజర్వు బ్యాంకు ముద్రించిన రూ.10 నాణేలు చెల్లుబాటులో ఉన్నాయని, ప్రజలు వాటిని ఎలాంటి సంకోచం లేకుండా ఉపయోగించవచ్చని జిల్లాధికారి అక్రం పాషా తెలిపారు. శనివారం నగరంలోని కలెక్టరేట్ సభాంగణంలో జిల్లా లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. పలు చోట్ల రూ.10 నాణేన్ని ఆర్బీఐ నిషేధించిందని తప్పుడు వదంతులు సృష్టించారన్నారు. దీనిపై ప్రజల్లో గందరగోళం ఏర్పడిందన్నారు. అయితే ఈ విషయంలో ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దన్నారు. రూ.10 నాణేన్ని ఆర్బీఐ నిషేధించలేదన్నారు. లీడ్ బ్యాంకు మేనేజర్ సుధీర్ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురికావద్దన్నారు. బ్యాంకుల్లో కూడా డిపాజిట్ చేయవచ్చన్నారు. రూ.10 నాణేలను స్వీకరించకపోతే 2011 సెక్షన్ 6(1) ప్రకారం చట్ట ఉల్లంఘన అవుతుందన్నారు. రూ.10 నాణేలను ఉపయోగించడం వల్ల చిల్లర సమస్య పరిష్కారమవుతుందని అన్నారు. -
ఆర్బీఐ షాక్.. త్వరలో వడ్డీరేట్లను పెంచనుందా?
పెరిగిపోతున్న రీటైల్ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 3,5,6 తేదీలలో ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలకమైన బెంచ్ మార్క్ వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్లు పెంచేలా నిర్ణయం తీసుకోనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మొదటి ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని విడుదల చేయడానికి ముందు వివిధ జాతీయ,అంతర్జాతీయ అంశాలను పరిగణనలోకి తీసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (MPC) ఏప్రిల్ 3, 5, 6 తేదీలలో మూడు రోజుల పాటు సమావేశం కానుంది. కాగా, ఆర్బీఐ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ప్రయత్నంలో మే నుండి ఇప్పటికే రెపో రేటును మొత్తం 250 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. -
International Womens Day: అవగాహన ఉన్నా వినియోగం కొంతే..
ముంబై: ఆర్థిక సేవలపై మహిళలకు అవగాహన పెరుగుతున్నప్పటికీ వారు వాటిని వినియోగించుకోవడం తక్కువగానే ఉంటోంది. బీమా తదితర సాధనాల గురించి మూడో వంతు మందికి తెలిసినా కూడా డిజిటల్ విధానంలో కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్క శాతం కూడా ఉండటం లేదు. రిజర్వ్ బ్యాంక్లో భాగమైన రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్, డిజిటల్ చెల్లింపుల నెట్వర్క్ పేనియర్బై నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మహిళల్లో .. ముఖ్యంగా 18–35 ఏళ్ల వారిలో బీమాపై అవగాహన గతేడాది 29 శాతం మేర పెరిగింది. కానీ పాలసీల వినియోగం 1 శాతానికి లోపే ఉంది. మహిళలు ఎక్కువగా జీవిత బీమా, ఆరోగ్య బీమా వైపు మొగ్గు చూపుతున్నారు. 5,000 రిటైల్ స్టోర్స్లో ఆర్థిక సేవలను వినియోగించుకున్న ఈ వయస్సు గ్రూప్ మహిళలపై నిర్వహించిన సర్వే ద్వారా అధ్యయన నివేదిక రూపొందింది. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు.. ► రిటైల్ స్టోర్స్లో మహిళలు ఎక్కువగా నగదు విత్డ్రాయల్, మొబైల్ రీచార్జీలు, బిల్లుల చెల్లింపుల సర్వీసులను వినియోగించుకుంటున్నారు. ఇతర త్రా పాన్ కార్డు దరఖాస్తులు, వినోదం, ప్రయాణాలు, ఈ–కామర్స్ మొదలైన వాటి సంబంధిత లావాదేవీలూ చేస్తున్నారు. ► తమ పిల్లలకు మంచి చదువు ఇవ్వడానికి అత్యధిక శాతం మహిళలు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు పొదుపే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు 68% మంది తెలిపారు. ఇక అత్యవసర వైద్యం, ఎలక్ట్రానిక్ గృహోపకరణాల కొనుగోలు కోసం పొదుపు చేసుకోవడమూ యవారికి ప్రాధాన్యతాంశాలు. ► నగదు లావాదేవీలను తగ్గించడానికి ప్రభుత్వం, ఆర్బీఐ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా చాలా మంది మహిళలు నగదు రూపంలో లావాదేవీలు జరపడానికే ప్రాధాన్యమిస్తున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో సుమారు 48 శాతం మంది నగదువైపే మొగ్గు చూపారు. నగదు విత్డ్రాయల్ సర్వీసుల కోసమే రిటైల్ స్టోర్ను సందర్శిస్తామంటూ 78 శాతం మంది తెలిపారు. ► అయితే, అదే సమయంలో డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ వినియోగమూ పెరుగుతోంది. 5–20% మంది మహిళలు దీనిని ఎంచుకుంటున్నారు. క్రెడిట్ కార్డుల వినియోగం దాదాపు శూన్యమే. ► డిజిటల్ మాధ్యమం వినియోగం.. 18–40 ఏళ్ల గ్రూప్ మహిళల్లో ఎక్కువగా ఉంటోంది. వారిలో 60%మందికి పైగా మహిళలకు స్మార్ట్ఫోన్లు, వాటి ద్వారా డిజిటల్ కంటెంట్ అందుబాటులో ఉంటోంది. -
గోల్డ్ బాండ్ గ్రాము @ రూ. 5,611
ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్ పథకం 2022–23.. తదుపరి దశలో భాగంగా రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గ్రాముకి రూ. 5,611 ధరను నిర్ణయించింది. ఐదు రోజులపాటు కొనసాగనున్న ఇష్యూ సోమవారం(6న) ప్రారంభంకానుంది. ఈ నెల 10న ముగియనున్న ఇష్యూలో భాగంగా గ్రాముకి ముందస్తు(నామినల్) ధర రూ. 5,611ను ఆర్బీఐ నిర్ణయించింది. కాగా.. ఆర్బీఐతో సంప్రదింపుల తదుపరి కేంద్ర ప్రభుత్వం గ్రాముకి నామినల్ విలువకు రూ. 50 డిస్కౌంట్ను ప్రకటించింది. అయితే ఇందుకు ఇన్వెస్టర్లు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని డిజిటల్ విధానంలో చెల్లింపులు చేపట్టవలసి ఉంటుంది.వెరసి గ్రాము గోల్డ్ బాండ్ ధర రూ. 5,561కు లభించనుంది. ప్రభుత్వం తరఫున ఆర్బీఐ సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చేసే సంగతి తెలిసిందే. వీటిని స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్(ఎస్హెచ్సీఐఎల్), కొన్ని పోస్టాఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈల ద్వారా విక్రయిస్తారు. వీటి కాలపరిమితి ఎనిమిదేళ్లుకాగా.. ఐదేళ్ల తదుపరి రిడెంప్షన్ను అనుమతిస్తారు. ఫిజికల్ గోల్డ్కు డిమాండును తగ్గించే బాటలో 2015 నవంబర్లో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. దేశీ పొదుపు సొమ్మును ఫిజికల్ గోల్డ్కు కాకుండా సావరిన్ గోల్డ్ కొనుగోలువైపు మళ్లించేందుకు ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. పూర్తి స్వచ్చత(999)గల బంగారం సగటు ధరను బాండ్లకు నిర్ణయిస్తారు. ఒక గ్రామును ఒక యూనిట్గా కేటాయిస్తారు. వ్యక్తిగత ఇన్వెస్టర్లను కనిష్టంగా 1 గ్రాము, గరిష్టంగా 4 కేజీలవరకూ కొనుగోలుకి అనుమతిస్తారు. హెచ్యూఎఫ్లకు 4 కేజీలు, ట్రస్ట్లకు 20 కేజీల వరకూ యూనిట్ల కొనుగోలుకి వీలుంటుంది. -
ఉద్యోగులకు చెల్లింపుల్లో రెండంచెల భద్రత
సాక్షి, అమరావతి: రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగులకు ఆన్లైన్ చెల్లింపుల్లో రెండంచెల భద్రతా వ్యవస్థను అమల్లోకి తీసుకువస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎఫ్ఎంఎస్/హెర్బ్ అప్లికేషన్స్ ద్వారా చేసే లావాదేవీలకు రెండంచెల భద్రతను తప్పనిసరి చేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సేవలు పూర్తి సురక్షితంగా అందించేలా సీఎఫ్ఎంఎస్ ఐడీ ఉన్న ప్రతి ఉద్యోగి, పెన్షనర్లు, వ్యక్తులు తమ సీఎఫ్ఎంఎస్ ఐడీని ఆధార్, మొబైల్ నంబర్తో అనుసంధానం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. సీఎఫ్ఎంఎస్ /హెర్బ్ అప్లికేషన్స్లో సురక్షితంగా లాగిన్ అవడానికి ఆధార్తో అనుసంధానం అయిన మొబైల్ ఫోన్కు వచ్చే వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) నమోదును తప్పనిసరి చేసింది. దీనికి అనుగుణంగా ప్రతి ఉద్యోగి ఈకేవైసీ, ఆధార్, మొబైల్ నంబర్ల పరిశీలనను జనవరి 20 నాటికి పూర్తి చేయాలని సంబంధిత శాఖల డీటీఏలు, పీఏవో, ఏపీసీఎఫ్ఎస్ఎస్ సీఈవో చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. -
గుట్టుచప్పుడు కాకుండా రూ. కోట్ల నగదు, బంగారం తరలింపు
జగ్గంపేట: రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను తుంగలోకి తొక్కి, పన్నులను ఎగ్గొడుతూ రూ.కోట్ల నగదు, బంగారాన్ని ప్రైవేటు బస్సులలో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న ఘటనలపై కస్టమ్స్, జీఎస్టీ, ఆదాయ పన్ను శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్గేట్ వద్ద శుక్రవారం పోలీసు అధికారుల తనిఖీలో ఈ దందా వెలుగు చూసిన సంగతి విదితమే. దీనిపై కస్టమ్స్, జీఎస్టీ, ఐటీ అధికారులు జగ్గంపేట సీఐ సూర్యఅప్పారావును శనివారం కలిసి వివరాలు సేకరించారు. అనంతరం 10 కేజీల బంగారాన్ని విజయవాడ నుంచి విశాఖ తరలిస్తున్న పద్మావతి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ వెంకటేశ్వరరావును, టెక్కలి నుంచి విజయవాడ వైపు రూ.5.65 కోట్ల నగదు తరలింపులో పట్టుబడిన బస్సు డ్రైవర్ సుదర్శనరావును విచారించారు. విజయవాడలో రామవరప్పాడు వద్ద బంగారం ఎవరిచ్చారు, విశాఖలో ఎవరికి అందజేయమన్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విధంగా బంగారం, నగదు అక్రమ రవాణా పద్మావతి ట్రావెల్స్లోనే జరుగుతోందా, ఇతర ప్రైవేటు ట్రావెల్స్లో కూడా జరుగుతోందా అనే అంశంపైనా దృష్టి సారించారు. కాగా, కృష్ణవరం టోల్ప్లాజా వద్ద పట్టుబడిన రూ.5.65 కోట్ల నగదు, సుమారు 10 కేజీల బంగారాన్ని రాజమహేంద్రవరంలోని ట్రెజరీలో జమ చేసినట్లు సీఐ చెప్పారు. (చదవండి: సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులోని నిందితుడికి హార్ట్ఎటాక్) -
ఫీచర్ ఫోన్లలో యూపీఐ సర్వీసులు
న్యూఢిల్లీ: ఫీచర్ ఫోన్లలోనూ ఏకీకృత చెల్లింపుల విధానాన్ని (యూపీఐ) అందుబాటులోకి తెస్తూ కొత్త సర్వీసును రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం ఆవిష్కరించారు. దీనితో దాదాపు 40 కోట్ల మంది ఫీచర్ ఫోన్ యూజర్లకు ప్రయోజనం చేకూరుతుంది. సాధారణ మొబైల్ ఫోన్ల ద్వారా కూడా డిజిటల్ ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు వీలు లభిస్తుంది. బహుళ ప్రయోజనకరమైన యూపీఐ విధానం 2016లోనే ప్రవేశపెట్టినా.. ఇప్పటివరకూ ఇది స్మార్ట్ఫోన్లకు మాత్రమే పరిమితమైందని దాస్ తెలిపారు. అట్టడుగు వర్గాలకు, గ్రామీణ ప్రాంతాల వారికి అందుబాటులోకి రాలేదని ఆయన పేర్కొన్నారు. ‘ఇప్పటివరకూ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు దూరంగా ఉన్న వర్గాలకు యూపీఐ 123పే ప్రయోజనకరంగా ఉంటుంది. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు ఇది తోడ్పడుతుంది‘ అని ఫీచర్ ఫోన్లకు యూపీఐ సర్వీసుల ఆవిష్కరణ కార్యక్రమంలో దాస్ చెప్పారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ), బ్యాంకుల అధికారులు ఇందులో పాల్గొన్నారు. 2016లోనే ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం కూడా యూఎస్ఎస్డీ కోడ్ ద్వారా పనిచేసే యూపీఐ సర్వీసును అందుబాటులోకి తెచ్చినప్పటికీ అది కష్టతరంగా ఉండటంతో ప్రాచుర్యం పొందలేదు. దీనితో ఎన్పీసీఐ దాన్ని సరికొత్తగా తీర్చిదిద్దింది. ప్రారంభించడం నుంచి ముగించే వరకూ లావాదేవీ ప్రక్రియ మూడు అంచెల్లో జరుగుతుంది కాబట్టి యూపీఐ 123పే అని బ్రాండ్ పేరు పెట్టినట్లు దాస్ తెలిపారు. యూపీఐ లావాదేవీలు వేగంగా వృద్ధి చెందుతున్నాయని, గత ఆర్థిక సంవత్సరంలో వీటి పరిమాణం రూ. 41 లక్షల కోట్లుగా ఉండగా ఈసారి ఇప్పటిదాకా రూ. 76 లక్షల కోట్ల స్థాయికి చేరాయని చెప్పారు. ఫిబ్రవరిలోనే రూ. 8.26 లక్షల కోట్ల విలువ చేసే 453 కోట్ల లావాదేవీలు జరిగాయన్నారు. ‘యూపీఐ ద్వారా లావాదేవీల పరిమాణం రూ. 100 లక్షల కోట్లకు చేరే రోజు ఎంతో దూరంలో లేదు‘ అని దాస్ చెప్పారు. నాలుగు ప్రత్యామ్నాయాలు.. యూపీఐ కింద.. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్) నంబర్, ఫీచర్ ఫోన్లలో యాప్లు, మిస్డ్ కాల్, శబ్ద ఆధారిత చెల్లింపుల విధానాల ద్వారా ఫీచర్ ఫోన్ యూజర్లు పలు లావాదేవీలు నిర్వహించవచ్చని ఆర్బీఐ తెలిపింది. కుటుంబ సభ్యులు .. స్నేహితులకు చెల్లింపులు జరిపేందుకు, కరెంటు..నీటి బిల్లులు కట్టేందుకు, వాహనాల కోసం ఫాస్ట్ ట్యాగ్ల రీచార్జి, మొబైల్ బిల్లుల చెల్లింపులు, ఖాతాల్లో బ్యాలెన్స్లను తెలుసుకోవడం మొదలైన అవసరాలకు యూపీఐ 123పే ఉపయోగపడుతుంది. మరోవైపు, డిజిటల్ చెల్లింపులకు సంబంధించి ’డిజిసాథీ’ పేరిట ఎన్పీసీఐ ఏర్పాటు చేసిన 24 గీ7 హెల్ప్లైన్ను కూడా ఆర్బీఐ గవర్నర్ దాస్ ప్రారంభించారు. డిజిటల్ చెల్లింపులపై తమ సందేహాల నివృత్తి, ఫిర్యాదుల పరిష్కారం కోసం యూజర్లు.. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.డిజిసాథీ.కామ్ని సందర్శించవచ్చు లేదా తమ ఫోన్ల నుంచి 14431, 1800 891 3333కి ఫోన్ చేయవచ్చు. -
ఏఆర్సీల క్రమబద్ధీకరణకు ఆర్బీఐ కమిటీ సిఫార్సులు
ముంబై: అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీల (ఏఆర్సీ) పనితీరును క్రమబద్ధీకరించే దిశగా రిజర్వ్ బ్యాంక్ కమిటీ పలు సిఫార్సులు చేసింది. మొండి అసెట్స్ను విక్రయించేందుకు ఆన్లైన్ ప్లాట్ఫాం ఏర్పాటు చేయడం, దివాలా కోడ్ ప్రక్రియలో పరిష్కార నిపుణులుగా వ్యవహరించేందుకు ఏఆర్సీలను కూడా అనుమతించడం తదితర అంశాలు ఇందులో ఉన్నాయి. అలాగే రూ. 500 కోట్లు పైబడిన ఖాతాల విషయంలో వాటిని విక్రయిస్తే వచ్చే విలువ, సముచిత మార్కెట్ ధరను బ్యాంకులు ఆమోదించిన ఇద్దరు వేల్యుయర్లతో లెక్క గట్టించాలని కమిటీ సూచించింది. రూ. 100 కోట్లు –500 కోట్ల మధ్య అకౌంట్లకు ఒక్క వేల్యుయర్ను నియమించవచ్చని పేర్కొంది. రుణాన్ని రైటాఫ్ చేయగలిగే అధికారాలు ఉన్న అత్యున్నత స్థాయి కమిటికే.. రిజర్వ్ ధరపై తుది నిర్ణయాధికారం ఉండాలని తెలిపింది. సంబంధిత వర్గాలు డిసెంబర్ 15లోగా ఆర్బీఐకి తమ అభిప్రాయాలు పంపాల్సి ఉంటుంది. ఇటు బాకీల రికవరీ, అటు వ్యాపారాలను పునరుద్ధరణ అంశాల్లో ఏఆర్సీల పనితీరు అంత ఆశావహంగా లేకపోతున్న నేపథ్యంలో వాటి పనితీరును మెరుగుపర్చేందుకు తీసుకోతగిన చర్యలపై ఆర్బీఐ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుదర్శన్ సేన్ సారథ్యంలో కమిటీ ఏర్పడింది. -
ఎస్పీఎఫ్... డీజీపీ పరిధిలోకి వచ్చేనా?
సాక్షి, హైదరాబాద్: హోంశాఖ పరిధిలో పనిచేస్తున్నా ఆ విభాగం పోలీస్ శాఖకు దూరంగా ఉంటుంది. వాళ్లూ ఆయుధాలతో గస్తీ కాస్తున్నా రాష్ట్ర పోలీస్ శాఖ పరిధిలోకి రారు. అంతే కాదు... వాళ్లకు జోన్ల నియామకాలు, జిల్లాలవారీ బదిలీలు ఉండవు. కుటుంబాలకు దూరంగా రాష్ట్ర రాజధానితో పాటు దేవాలయాలు, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, రిజర్వ్ బ్యాంక్ తదితర కీలక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలకు ఆయుధాలతో భద్రత కల్పిస్తారు. అయితే ఇప్పుడు ఆ విభాగాన్ని డీజీపీ పరిధిలోకి తేవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్.. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) విభాగం పోలీస్ శాఖకు సంబంధం లేకుండా ఓ అదనపు డీజీపీ నేతృత్వంలో కార్యాలయాల భద్రతను పర్యవేక్షిస్తుంది. సుమారు 2 వేల మంది సిబ్బంది ఉన్న ఈ విభాగంలో నియామకాలు పోలీస్ రిక్రూట్మెంట్ నుంచే జరిగినా అవి జిల్లా, రేంజ్లు కాకుండా స్టేట్ కేడర్ (రాష్ట్ర స్థాయి) పోస్టుగా పరిగణనలోకి వస్తుంది. దీంతో ఏ జిల్లా నుంచి సెలక్ట్ అయినా రాష్ట్ర స్థాయిలో ఎక్కడకు పోస్టింగ్ వేస్తే అక్కడికి వెళ్లాల్సిందే. డీజీపీ పరిధిలోకి తీసుకురావాలని... నూతన జిల్లాలు, రేంజ్లు, జోన్ల ఏర్పాటు జరిగినా ఈ విభాగానికి అవి వర్తించే అవకాశాలు కనిపించడంలేదు. అయితే సిబ్బంది మాత్రం 2014లో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో డీజీపీ పరిధిలోకి తెచ్చేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కొత్త జోన్ల నిబంధనలు ఎస్పీఎఫ్లో అమలుకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం (హోంశాఖ) చర్యలు చేపట్టలేదు. కొత్త జోన్ల అమలు వల్ల సిబ్బంది తమ సొంత జిల్లాల్లో విధులు నిర్వర్తించే అవకాశం లభిస్తుంది. దానివల్ల మానసిక ఆందోళనలు తొలగడంతోపాటు వారి పిల్లల స్థానికత సమస్య కూడా తీరుతుందని భావించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఇకపై రాష్ట్ర స్థాయి నియామకాలు ఉండవని ఉత్తర్వుల్లో ఉన్నా తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విషయంలో మాత్రం అధికారులు దీనిపై క్లారిటీ ఇవ్వడంలేదని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే డీజీపీ పరిధిలోకి ఈ విభాగాన్ని తేవడం వల్ల సిబ్బందితోపాటు వారి తల్లిదండ్రులకు మెరుగైన వైద్య సౌకర్యం అందేలా ఆరోగ్య భద్రత, లోన్లు కూడా అందే అవకాశం ఉంది. అదేవిధంగా పోలీస్ శాఖ కోటాలో సిబ్బంది పిల్లలకు రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇతర శాఖల్లో డెప్యుటేషన్పై పనిచేసే సౌలభ్యం దొరుకుతుంది. జోన్ల ప్రకారం కేడర్ విభజన జరిగితే సిబ్బంది పిల్లలు వారి సొంత స్థానికతను పొందిన వారవుతారని ఎస్పీఎఫ్ సిబ్బంది వేడుకుంటున్నారు. మెడపై కత్తిలా కేంద్ర బలగాల డిప్యూటేషన్... ప్రాజెక్టులు, కీలకమైన కార్యాలయాలు, భవనాల భద్రతను పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బలగాలను ఎస్పీఎఫ్ పరిధిలోకి శాశ్వత డెప్యుటేషన్పై తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనివల్ల ఆ విభాగంలోని సిబ్బంది పదోన్నతులతోపాటు నిరుద్యోగులకు సైతం తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర బలగాల నుంచి వచ్చే సిబ్బందిని వారివారి నియామక తేదీలను బట్టి సీనియారిటీ ఖరారు చేసి రాష్ట్ర కేడర్లోనే ప్రమోషన్లు కల్పించాల్సి ఉంటుంది. ఇది అధికారులతోపాటు సిబ్బంది మెడపై కత్తిలా వేలాడే ప్రమాదముంటుందనే చర్చ జరుగుతోంది. అందుకే రాష్ట్రస్థాయి నియామకాలైన పోలీస్ కమ్యూనికేషన్, జైళ్ల శాఖల్లాగానే తమకూ రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేసేలా చూడాలని సిబ్బంది ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. -
ఈక్విటీ ఫండ్స్కు భారీ డిమాండ్..
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్ల ర్యాలీ నేపథ్యంలో ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్లోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. న్యూ ఫండ్ ఆఫర్ల (ఎన్ఎఫ్వో) ఊతంతో జులైలో నికరంగా రూ. 22,583 కోట్ల నిధులు వచ్చాయి. దీంతో వరుసగా అయిదో నెలా ఈక్విటీ ఫండ్స్లోకి ఇన్వెస్ట్మెంట్లు వచ్చినట్లయింది. జూన్తో పోలిస్తే జులైలో రూ. 5,988 కోట్లు అధికంగా పెట్టుబడులు వచ్చాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యుచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం ఈ ఏడాది మార్చిలో రూ. 9,115 కోట్లు, ఏప్రిల్లో రూ. 3,437 కోట్లు, మే నెలలో రూ. 10,083 కోట్ల మేర ఈక్విటీ స్కీముల్లోకి పెట్టుబడులు వచ్చాయి. అంతకన్నా ముందు 2020 జులై నుంచి 2021 ఫిబ్రవరి దాకా వరుసగా ఎనిమిది నెలల పాటు నిధుల ఉపసంహరణ కొనసాగింది. తాజా పరిణామాలతో జూన్ ఆఖరున రూ. 33.67 లక్షల కోట్లుగా ఉన్న ఫండ్ పరిశ్రమ నిర్వహణలోని అసెట్స్ (ఏయూఎం) విలువ జులై ఆఖరుకు రూ. 35.32 లక్షల కోట్లకు చేరింది. లిక్విడిటీ.. విధానాల ఊతం.. రిజర్వ్ బ్యాంక్ ఉదార విధానాలు, కార్పొరేట్ల ఆదాయాల వృద్ధి మెరుగ్గా ఉండటం, టీకాల ప్రక్రియతో కోవిడ్ మహమ్మారిని స్థిరంగా కట్టడి చేయగలుగుతుండటం, దేశ..విదేశాల నుంచి వచ్చే నిధుల (లిక్విడిటీ)ఊతంతో ఈక్విటీ మార్కెట్లు చారిత్రక గరిష్టాలను తాకుతున్నాయని యాంఫీ సీఈవో ఎన్ఎస్ వెంకటేష్ తెలిపారు. దీనితో రిటైల్ ఇన్వెస్టర్లు కూడా మ్యుచువల్ ఫండ్ సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్)ల ద్వారా ఈక్విటీ ర్యాలీలో పాలుపంచుకుంటున్నారని ఆయన వివరించారు. సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడం, ఈక్విటీలు ఇటీవల మెరుగైన రాబడులు ఇవ్వడం, కోవిడ్ రెండో విడతలోనూ మార్కెట్లు స్థిరంగా నిలదొక్కుకోవడం వంటి అంశాలు ఇన్వెస్టర్లకు భరోసా కల్పిస్తున్నాయని ఫండ్స్ఇండియా సంస్థ రీసెర్చి విభాగం హెడ్ అరుణ్ కుమార్ తెలిపారు. ఈక్విటీల్లోకి ప్రవహించిన నిధుల్లో 50 శాతం భాగం ఎన్ఎఫ్వోల ద్వారా వచ్చినవేనని వైట్ ఓక్ క్యాపిటల్ సీఈవో ఆశీష్ సోమయ్య పేర్కొన్నారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్దేశించిన స్కీమ్ కేటగిరీ నిబంధనలకు అనుగుణంగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీ) నిధులను కేటాయించడం ఇందుకు ఓ కారణమని వివరించారు. మరిన్ని విశేషాలు.. ►ఈక్విటీ ఫండ్స్లో విభాగాలవారీగా చూస్తే ఫ్లెక్సీ క్యాప్ సెగ్మెంట్లోకి అత్యధికంగా రూ. 11,508 కోట్లు వచ్చాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్, ఇతర ఎన్ఎఫ్వోలు దాదాపు ఏకంగా రూ. 13,709 కోట్లు సమీకరించడం ఇందుకు దోహదపడింది. ►గత నెలలో హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్టర్లు రూ. 19,481 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇందులో రూ. 14,924 కోట్లను ఆర్బిట్రేజ్ ఫండ్స్లో పెట్టారు. ►ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీముల (ఈఎల్ఎస్ఎస్) నుంచి మాత్రం రూ. 512 కోట్లు, వేల్యూ ఫండ్స్ నుంచి రూ. 462 కోట్లు మేర పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. ►గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లోకి నికరంగా రూ. 257 కోట్లు వచ్చాయి. జూన్లో ఇవి రూ. 360 కోట్లు. ►డెట్ మ్యుచువల్ ఫండ్స్లో ఇన్వెస్టర్లు నికరంగా రూ. 73,964 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అత్యధికంగా లిక్విడ్ ఫండ్స్లోకి రూ. 31,740 కోట్లు రాగా, మనీ మార్కెట్ ఫండ్స్లోకి రూ. 20,910 కోట్లు, తక్కువ వ్యవధి ఉండే ఫండ్స్లోకి రూ. 8,161 కోట్లు, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్లోకి రూ. 6,656 కోట్లు వచ్చాయి. ►వివిధ విభాగాలవారీగా చూస్తే మ్యుచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి నికరంగా రూ. 1.14 లక్షల కోట్లు వచ్చాయి. జూన్లో ఇవి రూ. 15,320 కోట్లు. -
నిత్యానంద: సొంతంగా రిజర్వ్ బ్యాంక్!
న్యూఢిల్లీ: అత్యాచారం, కిడ్నాప్ కేసులు ఎదుర్కొంటున్న వివాదాస్పద గురువు నిత్యానంద మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన నిత్యానందా తనకంటూ ప్రత్యేకంగా ఒక దేశాన్నే ఏర్పారుచుకున్నారు. దానికి కైలాసదేశం అని కూడా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. అయితే వినాయక చవితి రోజు కైలాసం దేశానికి కొత్త రిజర్వు బ్యాంకు, కొత్త కరెన్సీ, కొత్త చట్టాలు ప్రారంభిస్తున్నట్లు మరోసారి నిత్యానంద సంచలన ప్రకటనలు చేశారు. దేశం విడిచి పారిపోయిన నిత్యానందకు కొత్త రిజర్వ్ బ్యాంక్, కొత్త కరెన్సీ సృష్టించడం ఎలా సాధ్యమయ్యిందో తెలియడం లేదు. అంతే కాకుండా ఆ కరెన్సీ వేరే దేశాలలో కూడా చలామణి అవుతుందని నిత్యానంద ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఆ దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా తెలిపారు. అయితే ఆ దేశాలు ఏంటి అని మాత్రం ఆయన ప్రకటించలేదు. 300 పేజీలతో కూడా ఆర్థిక విధానాలను ఆయన తయారు చేశారు. వాటికన్ బ్యాంకు తరహాలోనే కైలాసా రిజర్వు బ్యాంకు కార్యకలాపాలు ఉంటాయని, అందులో ఎలాంటి తేడాలు ఉండవని చెప్పారు. భారతదేశానికి చాలా దూరంలో ఉన్న ఈక్విడార్ సమీపంలోని ఒక చిన్నదీపంలో నిత్యానంద ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ దేశం ఎక్కడ ఉందో ఇప్పటి వరకు ఆయనకు, ఆయన అనుచరులకు తప్ప ఎవరికీ తెలియదు. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలోని ఈక్విడార్ సమీపంలోని ఓ చిన్న ద్వీపంలో మకాం వేసిన నిత్యానందస్వామి వినాయక చవితి రోజు ప్రపంచానికి షాక్ ఇచ్చారు. నిత్యానందస్వామితో పాటు ఆయన అనుచరులు శనివారం వినాయక చవితి సందర్బంగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ కైలాసాని నిత్యానందస్వామి స్థాపించారు. అందులో కైలాసదేశం ప్రధాన మంత్రి పదవి గురించి ప్రస్తావించిన నిత్యానంద అందర్నీ ఆచ్చర్యానికి గురిచేస్తున్నారు.ఇక ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో నిత్యానంద తాను తాను హిందూ సంస్కర్తను కానని, పునర్జీవిని అంటూ చెప్పారు. హిందూ మతాన్ని పాటించే వారు హక్కులు కోల్పోవడం వలనే కైలాసదేశం స్థాపించానని, అక్కడ మానవత్వం ఉన్న ఎవరికైనా చోటు ఉంటుందని, ఆ దేశంలో ప్రతిఒక్కరికి జ్ఞానోదయం అవుతోందని నిత్యానంద చెప్పారు. చదవండి: ఇంతకూ నిత్యానంద కథేంటి? -
అలా ఎలా రుణాలిచ్చేశారు?
ముంబై: క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్బీఎల్) వివాదం... తాజాగా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల మెడకు కూడా చుట్టుకుంటోంది. తనఖా పెట్టిన షేర్ల గురించి పూర్తిగా మదింపు చేయకుండా అవి కార్వీకి ఎలా రుణాలిచ్చాయన్న అంశంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. దీనికి సంబంధించి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలపై విచారణ జరపాలంటూ రిజర్వ్ బ్యాంక్కు సెబీ లేఖ రాసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అక్రమంగా క్లయింట్ల సెక్యూరిటీలను తనఖా పెట్టి రుణాలు తీసుకున్నప్పుడే బ్యాంకులు అప్రమత్తం కావాల్సిందని సెబీ వర్గాలు పేర్కొంటున్నాయి. కార్వీ తనఖా పెట్టిన షేర్లను క్లయింట్ల ఖాతాల్లోకి మళ్లించాలంటూ డిసెంబర్ 2న సెబీ ఆదేశించటంతో నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) దాదాపు 90 శాతం మంది క్లయింట్లకు షేర్లను బదలాయించడం తెలిసిందే. అయితే, తమకు పూచీకత్తుగా ఉంచిన షేర్లను క్లయింట్లకెలా బదలాయిస్తారంటూ బ్యాంకులు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ‘ఆ షేర్లపై కార్వీకే అధికారాల్లేనప్పుడు.. వాటిని తనఖా పెట్టుకుని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రుణాలెలా ఇచ్చాయి? వాటిని క్లయింట్ల ఖాతాల్లోకి బదలాయించొద్దంటూ ఎలా చెబుతాయి?‘ అని సెబీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. షేర్లన్నింటికీ రిస్కు.. భారీ ఆస్తులను తనఖా పెట్టి స్వల్ప మొత్తంలో రుణాలు తీసుకుంటున్నప్పుడే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలకు అనుమానం రావాల్సిందని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానించాయి. దాదాపు రూ.5,000 కోట్ల విలువ చేసే ప్రమోటర్ అసెట్స్కు ప్రతిగా కార్వీకి బ్యాంకులు రూ.1,200 కోట్లు రుణమిచ్చాయి. అలాగే రూ. 2,300 కోట్ల విలువ చేసే క్లయింట్ల షేర్లను తనఖా పెట్టి కార్వీ మరో రూ.600 కోట్లు రుణం తీసుకుంది. కార్వీ తీసుకున్న రుణాల్లో ఏ కొంచెం ఎగ్గొట్టినా.. ఇంత భారీ స్థాయిలో తనఖా పెట్టిన షేర్లన్నింటినీ బ్యాంకులు అమ్మేసే ప్రమాదం ఉంటుంది. పైపెచ్చు కార్వీ సొంత బ్యాలెన్స్ షీట్లో రూ.27 లక్షల విలువ చేసే షేర్లు మాత్రమే ఉండటం చూసైనా.. ఏదో పొరపాటు జరుగుతోందని బ్యాంకులు మేల్కొని ఉండాల్సిందని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానించాయి. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు కచ్చితంగా తప్పు చేశాయని ఇలాంటి ఉదంతాలు రుజువు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఐసీఐసీఐ, ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా బ్యాంకులతో పాటు బజాజ్ ఫైనాన్స్ వంటి సంస్థలు షేర్లను తనఖా పెట్టుకుని కార్వీకి దాదాపు రూ.1,800 కోట్ల మేర రుణాలిచ్చాయి. ఈవోడబ్ల్యూకీ సెబీ ఫిర్యాదు..? కార్వీ కేసుకు సంబంధించి ముంబై పోలీస్లో భాగమైన ఆర్థిక నేరాల విభాగానికి (ఈవోడబ్ల్యూ) కూడా సెబీ ఫిర్యాదు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ‘కార్వీ కేసు కేవలం సెక్యూరిటీస్ చట్టానికి మాత్రమే పరిమితమైనది కాదు. ఇది సివిల్ కేసు కూడా కనక సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్కు (శాట్) ఆదేశాలిచ్చే అధికారాల్లేవు. కాబట్టి క్లయింట్ల షేర్లను దొంగిలించిందంటూ కార్వీపై ఈవోడబ్ల్యూకి సెబీ ఫిర్యాదు చేయొచ్చు‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. క్లయింట్ల షేర్లను తనఖా పెట్టి రుణాలు తీసుకుంటున్న ఇతర బ్రోకరేజీ సంస్థలపైనా సెబీ దృష్టి సారించింది. సెక్యూరిటీలను తనఖా పెట్టి రూ.50 కోట్ల పైగా రుణాలు తీసుకున్న సంస్థలు నాలుగే ఉన్నాయని, మిగతా సంస్థలన్నీ సొంత షేర్లనే పూచీకత్తుగా పెట్టాయని తేలినట్లు సమాచారం. -
ఆర్టీజీఎస్ వేళలు మార్పు
ముంబై: భారీ పరిమాణంలో నగదు బదిలీకి ఉపయోగించే ఆర్టీజీఎస్ సిస్టమ్ వేళలను రిజర్వ్ బ్యాంక్ సవరించింది. ప్రస్తుతం ఆర్టీజీఎస్ ఉదయం 8 గం.ల నుంచి అందుబాటులో ఉంటుండగా.. ఇకపై ఉదయం 7 గం.ల నుంచి అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 26 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) విధానంలో రూ. 2 లక్షల పైబడిన మొత్తాన్ని ఆన్లైన్లో బదిలీ చేయొచ్చు. దీని వేళలు ఇప్పుడు కస్టమర్ల లావాదేవీలకు సంబంధించి ఉదయం 8 నుంచి సాయంత్రం 6 దాకా, ఇంటర్బ్యాంక్ లావాదేవీల కోసం రాత్రి 7.45 దాకా ఉం టున్నాయి. ప్రస్తుతం రూ. 2 లక్షల లోపు నిధుల బదిలీ కోసం నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) ఉపయోగిస్తున్నారు. దీని వేళలు ఉదయం 8 నుంచి రాత్రి 7 దాకా ఉంటున్నాయి. కార్డు చెల్లింపులకూ ఈ–మాండేట్... వర్తకులు, వ్యాపార సంస్థలకు క్రెడిట్, డెబిట్ కార్డులు, వాలెట్స్ వంటివాటిద్వారా తరచూ చేసే చెల్లింపులకు కూడా ఈ–మాన్డేట్ విధానాన్ని వర్తింపచేసేందుకు ఆర్బీఐ అనుమతినిచ్చింది. దీనికి రూ. 2,000 దాకా లావాదేవీ పరిమితి ఉంటుంది. ప్రస్తుత విధానం ప్రకారం కార్డుల ద్వారా చిన్న మొత్తాలు చెల్లించినా కూడా ప్రత్యేకంగా వన్ టైమ్ పాస్వర్డ్ వంటివి ఉపయోగించాల్సి వస్తున్నందువల్ల లావాదేవీకి ఎక్కువ సమయం పడుతోంది. తాజా వెసులుబాటుతో చిన్న మొత్తాల చెల్లింపు సులభతరమవుతుంది. ఈ–మాన్డేట్కు నమోదు చేసుకున్నందుకు కార్డ్హోల్డరు నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయరాదని బ్యాంకులు/ఆర్థిక సంస్థలను ఆర్బీఐ ఆదేశించింది. -
మరో 3 బ్యాంకులు పీసీఏ నుంచి బైటికి
ముంబై: మొండిబాకీల భారం కారణంగా ఆంక్షలు ఎదుర్కొంటున్న మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు.. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధి నుంచి బైటికొచ్చాయి. అలహాబాద్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్లపై ఆంక్షలు ఎత్తివేస్తూ ఆర్బీఐ మంగళవారం నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రైవేట్ రంగానికి చెందిన ధన్లక్ష్మి బ్యాంక్ కూడా పీసీఏ నుంచి బైటికొచ్చింది. ఆయా బ్యాంకుల పనితీరును మదింపు చేసిన మీదట పీసీఏపరమైన ఆంక్షలు ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. అలహాబాద్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్లకు ప్రభుత్వం అదనపు మూలధనం సమకూర్చిన నేపథ్యంలో వాటి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడనుండటం ఇందుకు కారణమని వివరించింది. గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి కార్పొరేషన్ బ్యాంకు వితరణ చేసిన మొత్తం రుణాల్లో స్థూల మొండిబాకీలు (ఎన్పీఏ) 17.36 శాతంగా ఉండగా, అలహాబాద్ బ్యాంక్ స్థూల ఎన్పీఏలు 17.81 శాతం స్థాయికి చేరాయి. దీంతో వీటిని పీసీఏ పరిధిలోకి చేర్చి.. రుణవితరణ, వ్యాపార విస్తరణ మొదలైన కార్యకలాపాలపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. పీసీఏ పరిధిలోని బ్యాంకుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఇటీవలే జనవరి 31న బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లపై ఆంక్షలు ఎత్తివేసింది. అయితే, ఇప్పటికీ మరో అయిదు ప్రభుత్వ రంగ బ్యాంకులు (యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, దేనా బ్యాంక్) పీసీఏ పరిధిలోనే ఉన్నాయి. -
రుణ నిర్వహణకు స్వతంత్ర సంస్థ
ప్రభుత్వ రుణ నిర్వహణ వ్యవహారాల కోసం రిజర్వ్ బ్యాంక్ కాకుండా స్వతంత్ర సంస్థ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన అమలు చేయటానికి సమయం ఆసన్నమైందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ‘ప్రభుత్వ రుణ నిర్వహణ కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలి. ఇది స్వతంత్రంగా ఉంటేనే మరింతగా దృష్టి సారించేందుకు సాధ్యపడుతుంది. రుణ సమీకరణ వ్యయాలు తగ్గించుకోవడానికి ప్రభుత్వానికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది‘ అని నీతి ఆయోగ్ శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చెప్పారు. ప్రస్తుతం మార్కెట్ నుంచి నిధుల సమీకరణ సహా ప్రభుత్వ రుణ సమీకరణ కార్యకలాపాలన్నీ ఆర్బీఐ నిర్వహణలోనే ఉంటున్నాయి. అయితే, దీన్ని రిజర్వ్ బ్యాంక్ పరిధి నుంచి తప్పించి ప్రభుత్వ రుణ నిర్వహణ ఏజెన్సీని (పీడీఎంఏ) ఏర్పాటు చేసి దాని చేతికివ్వాలని 2015 ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. ఇది అమల్లోకి రాలేదు కానీ.. తాజాగా రాజీవ్ కుమార్ మరోసారి దీన్ని బైటికి తెచ్చారు. రిజర్వ్ బ్యాంక్ నిర్వర్తించే వేర్వేరు విధులను ఏ విధంగా విభజించాలన్న దానిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని రాజీవ్ కుమార్ చెప్పారు. ‘ఇప్పటికే ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచే బాధ్యతలను కూడా ప్రభుత్వం ఆర్బీఐకే అప్పగించింది. మరి వృద్ధి, ఉద్యోగాల కల్పన, రుణ నిర్వహణ, ఇతరత్రా చట్టపరమైన అంశాల నిర్వహణ మొదలైనవి ఎవరు పర్యవేక్షిస్తారు? ఇదిగో ఇలాంటి అంశాలన్నింటిపైనా చర్చ జరగాలి‘ అని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి బ్యాంకింగ్ భారీ అంతర్జాతీయ మార్కెట్ ప్రయోజనాలను అందుకోవాలంటే భారత్కు ప్రపంచ స్థాయి పెద్ద బ్యాంకులు అవసరమని రాజీవ్ కుమార్ చెప్పారు. వృద్ధికీ ఇది దోహదపడే అంశమని తెలిపారు. 2040 నాటికి 650 బిలియన్ డాలర్లకు రియల్టీ మార్కెట్.. ప్రస్తుతం 120 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2040 నాటికి అయిదు రెట్లు వృద్ధితో 650 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో ఈ రంగం వాటా ప్రస్తుతమున్న ఏడు శాతం నుంచి రెట్టింపు స్థాయికి చేరుతుందని ఆయన వివరించారు. ఇండియా సోత్బీస్ ఇంటర్నేషనల్ రియల్టీ నిర్వహించిన అంతర్జాతీయ లగ్జరీ రియల్టీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా రాజీవ్ కుమార్ ఈ విషయాలు చెప్పారు. బ్యాంకుల్లో లోపాల్లేకుండా చేయడం పెద్ద సవాలు:రాజీవ్కుమార్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల వంటి ఆర్థిక సంస్థలను పూర్తి దోష రహిత విధానంలో పనిచేసేలా చూడడం అన్నది అతిపెద్ద సవాలుగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి రాజీవ్కుమార్ పేర్కొన్నారు. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలను మరింత జవాబుదారీగా మార్చడం కూడా మరో సవాలుగా ఆయన అభివర్ణించారు. ఇక డిపాజిట్లపై సెంట్రల్ రిపాజిటరీ అనుమతి లేకుండా చట్ట విరుద్ధంగా నడిచే డిపాజిట్ పథకాలను నిషేధిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన నేపథ్యంలో... డిపాజిట్లను స్వీకరించేందుకు అనుమతి ఉన్న సంస్థల వివరాలతో సెంట్రల్ రిపాజిటరీ ఏర్పాటు చేయటానికి మార్గం సుగమమైందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి రాజీవ్కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ రిపాజిటరీ వల్ల సామాన్యులు, ఆర్థిక అవగాహన లేని వారు మోసపోకుండా కాపాడుతుందన్నారు. -
మన డాలర్లకు రెక్కలు..!
న్యూఢిల్లీ: భారతీయులకు డాలర్ల అవసరం పెరుగుతోంది. విదేశీ పర్యటనలు, షాపింగ్, విదేశీ విద్య, పెట్టుబడులు, ఆరోగ్య అవసరాల కోసం వారు పెద్ద మొత్తంలో డాలర్లను తీసుకుని ప్రయాణం అవుతున్నారు. స్వేచ్ఛాయుత డబ్బు బదిలీ పథకం (ఎల్ఆర్ఎస్) కింద 2018లో బయటకు పంపిన నిధుల (రెమిటెన్స్) మొత్తం 13 బిలియన్ డాలర్లు. 2015లో ఉన్న 4.5 బిలియన్ డాలర్ల రెమిటెన్స్ కంటే 3 రెట్లు పెరిగినట్టు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గణాంకాలు తెలియజేస్తున్నాయి. అంతేకాదు, ఏటేటా ఈ మొత్తం భారీగా పెరుగుతుండటం గమనార్హం. విదేశాల్లోని టాప్ యూనివర్సిటీల్లో తమ పిల్లల చదువులు, పర్యాటకం, తమ బంధువులకు తీవ్ర అనారోగ్య కారణాలతో చికిత్సల కోసం చేసిన ఖర్చులే వీటిల్లో అధికంగా ఉన్నాయి. సంపన్నులైన వారు తమ పిల్లలను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. భారతీయులు తమ పొదుపు నిధులను స్వదేశంలోనే ఉంచడానికి పరిమితం కాకుండా, విదేశీ పెట్టుబడి అవకాశాల కోసం కూడా చూస్తున్నారని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ముఖ్య ఆర్థిక వేత్త ఎస్కే ఘోష్ తెలిపారు. విదేశీ విద్యకు ఎక్కువ ఖర్చు 2004లో కేంద్రం ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. విదేశాల్లో షాపింగ్, స్టాక్స్, బాండ్లు, ప్రాపర్టీలపై పెట్టుబడులు తదితర కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ లావాదేవీల కోసం ఒక ఏడాదిలో ఒక వ్యక్తి విదేశాలకు 2,50,000 డాలర్లను పంపుకునేందుకు అనుమతించారు. నలుగురున్న కుటుంబం ఈ పథకం కింద 10 లక్షల డాలర్లను ఒక ఏడాదిలో పంపుకోవచ్చు. అయితే 2015 సంవత్సరం మధ్యస్థం నాటికి ప్రతి నెలా సగటున బయటకు పంపే నిధుల మొత్తం 200–300 మిలియన్ డాలర్లను దాటిపోయింది. విదేశీ విద్య, పర్యాటకంపై చేసే ఖర్చులకూ ఈ పథకం కింద ఆర్బీఐ అవకాశం కల్పించడం దీన్ని మరింత విస్తృతం చేసింది. విదేశాలకు తరలించే డాలర్లలో అత్య ధికం ఈ రెండింటికే వినియోగిస్తున్నారు. విదేశీ విద్య, పర్యాటకం కోసం ఏటా వెచ్చించే మొత్తంలో పెరుగుదల ఎంతో వేగంగా ఉంటోంది. ఫలితంగా బయటకు వెళ్లిపోతున్న నిధుల పరిమాణం అనూహ్యంగా పెరుగుతోంది. ముఖ్యంగా విదేశీ విద్య కోసం ఎక్కువ మొత్తంలో డాలర్లను భారతీయులు పంపడం వెనుక గడిచిన కొన్నేళ్లలో అక్కడ స్కాలర్షిప్ అవకాశాలు తగ్గిపోవడం కూడా ఒక కారణం విదేశీ పెట్టుబడులు ఇక అమెరికా, బ్రిటన్లో మన వారు పెట్టుబడులకూ ప్రాధాన్యం ఇస్తుండటం గమనార్హం. టెక్నాలజీ పరంగా అక్కడి కంపెనీలకు ఎక్కువ వృద్ధి అవకాశాలు ఉండటం మనవారిని పెట్టుబడుల కోసం అటువైపు ఆకర్షిస్తోంది. చాలా వరకు పెట్టుబడి పథకాలు, విదేశాల్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ సైతం గూగుల్, యాపిల్, నెట్ఫ్లిక్స్ వంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి. ఈ కంపెనీలకు భారత్లో పోటీనిచ్చేవి లేకపోవడం, వీటిల్లో పెట్టుబడులకు మొగ్గుచూపేలా చేస్తోంది. ‘‘పిల్లల విద్య కోసం, విదేశీ పర్యటనల కోసం చేసే వ్యయాలకు తోడు, డాలర్తో రూపాయి బలహీనత, ఆర్థిక వృద్ధిపై అనిశ్చితి వల్ల చాలా మంది హెచ్ఎన్ఐలు విదేశాల్లో పెట్టుబడి అవకాశాల కోసం చూస్తున్నారు’’ అని ఖైతాన్ అండ్ కంపెనీ పార్ట్నర్ మోయిన్లద్ధా తెలిపారు. మెరుగైన సదుపాయం కోసం ఎల్ఆర్ఎస్ను తీసుకురాగా, కొందరు దీన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు ఆరోపణలు రావడంతో ఆర్బీఐ తన పర్యవేక్షణను కఠినతరం చేసింది. ఇందులో భాగంగా ఈ పథకం కింద రోజువారీ లావాదేవీల వివరాలను రిపోర్ట్ చేయాలని ఆర్బీఐ గతేడాది ఏప్రిల్లో నోటిఫికేషన్ జారీ చేసింది. -
ప్రైవేట్ పెట్టుబడులకు తోడ్పాటునివ్వాలి
ముంబై: వృద్ధి రేటును మరింత మెరుగుపర్చుకోవాలనుకుంటే ప్రైవేట్ పెట్టుబడులకు ఊతమిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం విధానపరమైన చర్యలు లేదా పన్నుపరమైన ప్రయోజనాలను పరిశీలించవచ్చని ఆయన చెప్పారు. తద్వారా 7 శాతం వృద్ధి దగ్గరే చిక్కుబడిపోకుండా మరింత మెరుగ్గా రాణించేందుకు అవకాశాలు ఉంటాయన్నారు. ఏప్రిల్–సెప్టెంబర్ మధ్యకాలంలో వృద్ధి అంచనాలను రిజర్వ్ బ్యాంక్ 7.2–7.4 శాతానికి పరిమితం చేసిన నేపథ్యంలో కోటక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 7.1 శాతం మాతమ్రే నమోదైంది. మరోవైపు, వ్యవస్థలో ద్రవ్యకొరత కారణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగ కార్యకలాపాలు దాదాపు స్తంభించిపోయిన నేపథ్యంలో ద్రవ్య లభ్యత మెరుగుపర్చేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందని ఉదయ్ కోటక్ చెప్పారు. ఇన్ఫ్రా రుణాల సంస్థ ఐఎల్అండ్ఎఫ్ఎస్ సంక్షోభం కారణంగా ప్రస్తుతం పరిస్థితులు మరింత దిగజారాయని.. అయితే ఈ సమస్య వ్యవస్థాగతమైనది కాదని, ఇన్వెస్టర్లు తీవ్ర భయాందోళనలకు గురికావడమే దీనికి కారణమని విశ్లేషించారు. ఐఎల్అండ్ఎఫ్ఎస్ సమస్య పరిష్కారానికి ఉదయ్ కోటక్ సారథ్యంలో ప్రభుత్వం కొత్త బోర్డును నియమించింది. -
‘వాలెట్ల’కు మార్చి గండం!
న్యూఢిల్లీ: డిజిటల్ విప్లవంతో కుప్పతెప్పలుగా పుట్టుకొచ్చిన మొబైల్ వాలెట్ సంస్థలకు ప్రస్తుతం కేవైసీ నిబంధనలు సంకటంగా మారాయి. ఈ ఏడాది ఫిబ్రవరి ఆఖరు నాటికి కస్టమర్లందరి వివరాల (కేవైసీ) ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేయాలన్న రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలను అమలు చేయడానికి వాలెట్ సంస్థలు పరుగులు తీస్తున్నాయి. కానీ, నిర్దేశిత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మరోపక్క, ప్రైవేటు సంస్థలు కస్టమర్ల నుంచి ఈ–కేవైసీ కోసం ఆధార్ను తీసుకోవడానికి వీల్లేదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వాలెట్ సంస్థలకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. డెడ్లైన్ ముగియడానికి ఇంకా కొన్ని వారాల వ్యవధి మాత్రమే మిగిలి ఉండగా.. ఇప్పటిదాకా చాలా మటుకు సంస్థలు కేవలం కొద్ది మంది కస్టమర్ల కేవైసీ మాత్రమే పూర్తి చేయగలిగాయి. దీంతో దాదాపు 95 శాతం మొబైల్ వాలెట్లు మార్చి తర్వాత కార్యకలాపాలు నిలిపివేయాల్సిన పరిస్థితి తలెత్తవచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. మొబైల్ వాలెట్ సంస్థలన్నీ కూడా కచ్చితంగా కేవైసీ ధ్రువీకరణ జరపాల్సిందేనంటూ 2017లో రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. దీంతో వనరులున్న సంస్థలు ఆధార్ ఆధారంగా ఎలక్ట్రానిక్ రూపంలో కేవైసీ వెరిఫికేషన్ జరిపాయి. పేమెంట్స్ బ్యాంకింగ్ లైసెన్స్ కూడా పొందిన పేటీఎం.. బయోమెట్రిక్ డాంగిల్స్, ఫీల్డ్ ఏజెంట్లను ఉపయోగించి కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు కొత్త బ్యాంకు ఖాతాలు కూడా తెరిచింది. ఈ విధంగా పేటీఎం తమ యూజర్లలో దాదాపు 70 శాతం మందికి పూర్తి స్థాయిలో కేవైసీ నిబంధనలు అమలు చేయగలిగినట్లు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. కానీ మిగతా కంపెనీలు నానాతంటాలు పడుతున్నాయి. ప్రాథమిక స్థాయి ధ్రువీకరణ మాత్రమే పూర్తి చేయగలిగామని, బయోమెట్రిక్స్ లేకపోవడంతో పూర్తి వెరిఫికేషన్ చేయలేకపోతున్నామని మరో వాలెట్ సంస్థ అధికారి వివరించారు. పేపర్ రూపంలో డాక్యుమెంట్స్ను సేకరించి, వెరిఫికేషన్ చేయాలంటే ఖర్చులు భారీగా పెరిగిపోయి, లాభదాయకత సమస్యలు ఉంటున్నాయని వాపోయారు. మరోవైపు, సుప్రీం తీర్పు కారణంగా ఇప్పటికే ఆధార్ ఆధారిత ఈకేవైసీ పూర్తి చేసిన కస్టమర్ల డేటా అంతా కూడా మార్చి తర్వాత తమ సర్వర్ల నుంచి తొలగించనుండటంతో ఆయా యూజర్లు కూడా మళ్లీ ప్రత్యేకంగా ఇతరత్రా ధృవీకరణ పత్రాలతో కేవైసీ పూర్తి చేయాల్సిన అవసరం రావొచ్చని కూడా వాలెట్ సంస్థల వర్గాలు తెలిపాయి. సుప్రీం కోర్టు తీర్పు ప్రభావం.. ప్రైవేట్ కంపెనీలు తమ కస్టమర్ల ధృవీకరణ కోసం ఆధార్ ఆధారిత ఎలక్ట్రానిక్ కేవైసీ వెరిఫికేషన్Œ (ఈకేవైసీ) ప్రక్రియను అమలు చేయడానికి లేదంటూ సుప్రీం కోర్టు గతేడాది తీర్పునివ్వడంతో మొబైల్ వాలెట్ సంస్థలకు తాజా సమస్యలు వచ్చి పడ్డాయి. ’ఈకేవైసీ లేదు. సులభతరమైన ప్రత్యామ్నాయ కేవైసీ విధానాల గురించి ఆర్బీఐ ఇప్పటివరకూ ఏ విషయమూ స్పష్టంగా చెప్పలేదు. మరోవైపు, డెడ్లైన్ చూస్తే ఇంకా కొన్ని వారాలే మిగిలి ఉంది. ప్రస్తుత స్థాయిని బట్టి చూస్తే.. ఆలోగా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయగలిగే పరిస్థితి కనిపించడం లేదు’ అని ఒక వాలెట్ సంస్థ సీనియర్ అధికారి తెలిపారు. ప్రైవేట్ కంపెనీలకు ఈ–కేవైసీ అందుబాటులో లేకపోవడంతో.. వీడియో ఆధారిత వెరిఫికేషన్, ఎక్స్ఎంఎల్ ఆధారిత కేవైసీ వంటి ప్రత్యామ్నాయ విధానాలనైనా అనుమతించాలన్న డిమాండ్లు ఉన్నాయి. అయితే, వీటికి రిజర్వ్ బ్యాంక్ నుంచి అధికారికంగా ఆమోదముద్ర లేదు. పార్లమెంటు వైపు చూపు.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆధార్ చట్ట సవరణకి పార్లమెంటు ఆమోదముద్ర వేస్తే కాస్తంత గట్టెక్కగలమని వాలెట్ సంస్థలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ వెరిఫికేషన్ కోసం కస్టమర్లు స్వచ్ఛందంగా ఆధార్ని ఇచ్చేలా చట్ట సవరణ ప్రతిపాదనలు ఉన్నాయి. సౌకర్యంపరంగా.. కస్టమర్లు ఆధార్ వెరిఫికేషన్ వైపు మొగ్గుచూపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అటు ఆర్బీఐ నుంచి కూడా కొంత భరోసా లభిస్తే గట్టెక్కుతామని అంటున్నాయి. స్టాండెలోన్ వాలెట్లపైనే ప్రభావం ఎక్కువ.. దేశీయంగా నాలుగేళ్ల క్రితం పెద్దయెత్తున వాలెట్ కంపెనీలు వచ్చినప్పటికీ.. ప్రస్తుతం కొన్ని మాత్రమే మిగిలాయి. మొబిక్విక్, ఫోన్పే, అమెజాన్పే వంటి సంస్థలు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లేదా టెక్నాలజీ ఆధారిత ఆర్థిక సేవలు అందించే ఇతరత్రా ఫిన్టెక్ కార్యకలాపాల్లోకి మళ్లాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి సంస్థలకు మాత్రమే మనుగడ ఉండవచ్చని, స్టాండెలోన్ వాలెట్లపై మాత్రం తీవ్ర ప్రతికూల ప్రభావం పడగలదని కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ వర్గాలు తెలిపాయి. -
చిన్న సంస్థల రుణాలపై ఆర్బీఐ మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: డిఫాల్ట్ అయిన చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) రుణాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం డిఫాల్ట్ అయినప్పటికీ జనవరి 1 నాటికి ’స్టాండర్డ్’ స్థాయిలోనే ఉన్న రుణాలను వన్ టైమ్ పునర్వ్యవస్థీకరణకు అనుమతించింది. వివిధ రూపాల్లో తీసుకున్న రుణపరిమాణం రూ. 25 కోట్లు దాటని సంస్థలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. 2020 మార్చి 31 నాటికి పునర్వ్యవస్థీకరణ అమలు చేయాల్సి ఉంటుంది. -
భార్య, భర్తల అనుబంధంలా ఉండాలి
రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వం మధ్య సంబంధాలు భార్య, భర్తల మధ్య అనుబంధంలాగా ఉండాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఏవైనా భేదాభిప్రాయాలు వస్తే.. ఇరు పక్షాలు సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం, ఆర్బీఐ మధ్య విభేదాలతో ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్ పదవికి రాజీనామా చేశారన్న విమర్శల నేపథ్యంలో మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ’చేంజింగ్ ఇండియా’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మన్మోహన్ సింగ్ ఈ విషయాలు చెప్పారు. ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని, స్వతంత్రతను గౌరవించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఇటు కేంద్రంతో కలిసి పనిచేస్తూనే అటు పటిష్టంగా, స్వతంత్రంగా కూడా పనిచేసేలా ఉండాలని చెప్పారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వాల రైతు రుణ మాఫీ పథకాలపై స్పందిస్తూ.. ఎన్నికల మేనిఫెస్టోలో హామీలిచ్చిన పక్షంలో తప్పక నెరవేర్చాల్సి ఉంటుందన్నారు. -
యస్ బ్యాంక్ చైర్మన్గా బ్రహ్మ్దత్!
న్యూఢిల్లీ: యస్ బ్యాంక్ చైర్మన్గా డైరెక్టర్లలో ఒకరైన బ్రహ్మ్ దత్ పేరును రిజర్వు బ్యాంకుకు యస్బ్యాంక్ సిఫారసు చేసినట్లు తెలియవచ్చింది. గత నెలలో చైర్మన్ పదవికి అశోక్ చావ్లా రాజీనామా చేయడంతో ఈ పదవి ఖాళీ అయింది. యస్ బ్యాంక్ ఈ పదవికి బ్రహ్మ్దత్ను ఎంపిక చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దత్ ఇప్పటికే డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారని, ఆయనకు బ్యాంక్కు సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన ఉందని, అందుకే చైర్మన్ పదవికి ఆయనను బ్యాంక్ ఎంపిక చేసిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ ఉద్యోగిగా రిటైరైన దత్ ప్రస్తుతం యస్ బ్యాంక్లో ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉన్నారు. మరోవైపు ప్రస్తుతం సీఈఓగా, ఎమ్డీగా ఉన్న రాణా కపూర్ పదవీ కాలాన్ని వచ్చే నెల 31 తర్వాత పొడిగించడానికి ఆర్బీఐ అంగీకరించలేదు. వచ్చే నెల 9న జరిగే బోర్డ్ సమావేశంలో రాణా కపూర్ వారసుడిని ఎంపిక చేస్తామని యస్ బ్యాంక్ వెల్లడించింది .ఫోర్టిస్లో 2 శాతం వాటా విక్రయం ఫోర్టిస్ హెల్త్కేర్లో 2 శాతం వాటాను విక్రయించామని యస్ బ్యాంక్ తెలిపింది. 2.13 శాతం వాటాకు సమానమైన 1,23,37,323 షేర్లను దశల వారీగా విక్రయించినట్లు వెల్లడించింది. ఈ ఏడాది నవంబర్ 21 నాటికి ఫోర్టిస్ హెల్త్కేర్లో యస్ బ్యాంక్కు 9.33 శాతం వాటా ఉంది. -
‘కోటక్ బ్యాంక్’కు కోర్టులో చుక్కెదురు
ముంబై: ప్రమోటర్ల వాటా తగ్గింపునకు సంబంధించిన గడువు వివాదంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ (కేఎంబీ)కి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన డిసెంబర్ 31 డెడ్లైన్పై స్టే విధించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. కేఎంబీ దాఖలు చేసిన పిటిషన్పై వచ్చే ఏడాది జనవరి 17లోగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఆర్బీఐని ఆదేశించింది. ఈ ఏడాది డిసెంబర్ 31లోగా ప్రమోటర్ల వాటాను పెయిడప్ వోటింగ్ ఈక్విటీ క్యాపిటల్లో 20 శాతానికి, 2020 మార్చి 31 నాటికి 15 శాతానికి తగ్గించుకోవాలంటూ 2018 ఆగస్టు 31న ఆర్బీఐ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కేఎంబీ గతవారం హైకోర్టును ఆశ్రయించింది. గతంలో కేవలం పెయిడప్ క్యాపిటల్కి సంబంధించి మాత్రమే ప్రమోటర్ల షేర్హోల్డింగ్ను తగ్గించుకోవాలన్న ఆర్బీఐ తాజాగా పెయిడప్ వోటింగ్ ఈక్విటీ క్యాపిటల్ కింద మార్చిందంటూ కేఎంబీ తరఫు న్యా యవాది డేరియస్ ఖంబాటా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పష్టత కోరుతూ సెప్టెంబర్లో రెండు సార్లు ఆర్బీఐకి లేఖ రాసినప్పటికీ, ఇప్పటిదాకా స్పందన రాలేదని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని కొత్త గవర్నర్ తాజాగా మరోసారి పరిశీలించాలని, అందుకు వీలుగా డెడ్లైన్ను నెల రోజులు పొడిగించాలని కోరుతున్నామన్నారు. మరోవైపు, ఎప్పుడో ఆగస్టులో ఆదేశాలిస్తే.. డెడ్లైన్ దగ్గరకొస్తుండగా స్టే ఇవ్వాలంటూ కేఎంబీ న్యాయ స్థానా న్ని ఆశ్రయించిందంటూ ఆర్బీఐ తరఫు న్యాయవాది వెంకటేష్ ధోండ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ప్రధానితో ఆర్బీఐ గవర్నర్ భేటీ
న్యూఢిల్లీ: కేంద్రంతో వివాదాస్పద అంశాలను పరిష్కరించుకునే దిశగా రిజర్వ్ బ్యాంక్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ గత వారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 9న న్యూఢిల్లీ వచ్చిన ఉర్జిత్ పటేల్.. ప్రధాని కార్యాలయంలో పలువురు సీనియర్ అధికారులతో సమావేశం అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటిలో కొన్నింటిలో ప్రధాని కూడా పాల్గొన్నట్లు వివరించాయి. ఈ చర్చల నేపథ్యంలో చిన్న, మధ్య తరహా సంస్థలకు రుణాలివ్వడానికి సంబంధించి ఆర్బీఐ ప్రత్యేక విధానమేదైనా రూపొందించే అవకాశమున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపాయి. అయితే, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల (ఎన్బీఎఫ్సీ) లిక్విడిటీ సమస్యలు తీర్చడం, రిజర్వ్ బ్యాంక్ దగ్గరున్న మిగులు నిధుల్లో గణనీయ భాగాన్ని ప్రభుత్వానికి బదలాయించడం వంటి అంశాలపై ఏదైనా అంగీకారం కుదిరిందా లేదా అన్నది తెలియరాలేదు. ఈ నెల 19న రిజర్వ్ బ్యాంక్ బోర్డు కీలక సమావేశం జరగనున్న నేపథ్యంలో తాజా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. -
రూపాయి ఆరు రోజుల పతనానికి బ్రేక్..
ముంబై: వరుసగా ఆరు సెషన్ల రూపాయి పతనానికి బ్రేక్ పడింది. డాలర్తో పోలిస్తే దేశీ కరెన్సీ 18 పైసలు బలపడి 74.21 వద్ద క్లోజయ్యింది. బుధవారం ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సే్చంజ్ (ఫారెక్స్)లో ఒకింత మెరుగ్గా 74.18 వద్ద ప్రారంభమైన రూపాయి ట్రేడింగ్ ఒక దశలో 74.05 గరిష్ట స్థాయికి కూడా తాకింది. అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడిన నేపథ్యంలో దేశీయంగా ఎగుమతిదారులు అమెరికా కరెన్సీని విక్రయించడం ఇందుకు తోడ్పడింది. అయితే, ప్రారంభ లాభాలు కొంత వదులుకున్న రూపాయి.. చివరికి 18 పైసల లాభంతో 74.21 వద్ద క్లోజయ్యింది. దీంతో వరుసగా ఆరు సెషన్ల పతనం తర్వాత తొలిసారిగా దేశీ కరెన్సీ కోలుకున్నట్లయింది. అమెరికా డాలర్తో పోలిస్తే మంగళవారం రూపాయి కొత్త కనిష్ట స్థాయి 74.39కి పడిపోయిన సంగతి తెలిసిందే. దేశీ ఈక్విటీ మార్కెట్లలో రిలీఫ్ ర్యాలీ కూడా రూపాయి బలపడటానికి తోడ్పడి ఉంటుందని ట్రేడర్స్ అభిప్రాయపడ్డారు. అలాగే, పండుగల సీజన్లో ద్రవ్య లభ్యతను మెరుగుపర్చేందుకు అక్టోబర్ 11న ప్రభుత్వ బాండ్ల కొనుగోలు ద్వారా రూ. 12,000 కోట్ల మేర నిధులను వ్యవస్థలో అందుబాటులోకి తేవాలన్న రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం కూడా రూపాయి రికవరీకి దోహదపడిందని వివరించారు. ఇక, నగదు సంక్షోభంలో చిక్కుకున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలను ఆదుకునే దిశగా సుమారు రూ. 45,000 కోట్ల అసెట్స్ను కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ప్రకటించడమూ సానుకూలంగా మారిందని ట్రేడర్లు తెలిపారు. -
రిజర్వుబ్యాంకు ద్వారా రైతుబంధు సొమ్ము
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడి సొమ్మును నేరుగా రిజర్వుబ్యాంకు ద్వారా రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఒకేసారి రైతుబంధు సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయడానికి వీలుపడుతుంద ని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రైతులకు 64 బ్యాంకుల్లో ఖాతాలున్నాయి. ఒక్క ఎస్బీఐ వద్దే 11 లక్షల రైతు ఖాతాలున్నాయి. మిగిలినవి వివిధ బ్యాంకుల్లో ఉన్నాయి. దీంతో రైతులందరి ఖాతా నంబర్లను సేకరించి ఒక్కో బ్యాంకుకు అందజేయడం క్లిష్టమైన పని. ఒక్కో బ్యాంకుకు ప్రభుత్వం సొమ్ము సరఫరా చేయడమూ ఇబ్బందేనని వ్యవసాయశాఖ అంచనా వేసింది. బ్యాంకులకు సొమ్ము ఇచ్చాక అవి రైతులకు సక్రమంగా పంపిణీ చేశాయా లేదా తెలుసుకునేందుకు ప్రతీ బ్యాంకును పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ ఇబ్బందులన్నింటికీ రిజర్వుబ్యాంకు ద్వారా సొమ్మును జమచేయడమే పరిష్కారంగా వ్యవసాయశాఖకు కన్పించింది. ఇక రైతు ఖాతాలన్నింటినీ రిజర్వుబ్యాంకు ఇస్తే వివిధ బ్యాం కులతో సంబంధం లేకుండా ఒకేసారి రైతుల ఖాతాల్లోకి సొమ్ము చేరిపోతుంది. అంటే ఏ బ్యాంకు ఖాతాకైనా రిజర్వుబ్యాంకు నుంచి సొమ్ము ఏకకాలం లో వెళ్లిపోతుంది. అందుకే దీనికి సంబంధించి రిజర్వుబ్యాంకు ఉన్నతాధికారులతో బుధవారం సమావేశమై నిర్ణయం తీసుకుంటామని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. రిజర్వుబ్యాంకు ద్వారా రైతు ఖాతాలకు సొమ్ము అందజేస్తే ఎక్కడా అవకతవకలు జరిగే వీలుండదంటున్నారు. ఏకకాలంలో ఖాతాల సేకరణ, సొమ్ము జమ ప్రస్తుతం వ్యవసాయశాఖ రైతు ఖాతాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. నెలాఖరు నాటికి రైతు బ్యాంకు ఖాతాలన్నింటినీ సేకరించాలని వ్యవసాయశాఖ జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ రాహుల్బొజ్జాలు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలోని 52 లక్షల మంది రైతుల నుంచి బ్యాంకు ఖాతాలను, ఐఎఫ్ఎస్సీ కోడ్లను సేకరించాలని నిర్ణయించారు. ఒకవైపు రైతు బ్యాంకు ఖాతాలను సేకరిస్తూనే, వాటన్నింటినీ ఎప్పటికప్పుడు రిజర్వుబ్యాంకుకు అందజేస్తారు. అంతే మొత్తంలో సొమ్మును కూడా అందజేస్తారు. మరోవైపు తమ వద్దకు వచ్చిన ఖాతా నంబర్ల ప్రకారం రిజర్వుబ్యాంకు సంబంధిత సొమ్మును రైతులకు జమ చేస్తుంది. రైతు బ్యాంకు ఖాతా నంబర్ల సేకరణ, వాటిల్లోకి సొమ్ము జమ రెండూ ఏకకాలంలో జరగాలని నిర్ణయించారు. సవాలుగా మారిన ఖాతాల సేకరణ ఇదిలావుంటే వ్యవసాయశాఖ వద్ద ప్రస్తుతం 33 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతా నంబర్లు ఉన్నాయి. కానీ, అవి ఏమేరకు సరైనవో అన్న అనుమానాలున్నాయి. ఎస్బీఐ వద్ద ఉన్న 11 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఏడు లక్షల ఖాతాలే సరిగా ఉన్నాయి. మిగిలిన 4 లక్షల ఖాతాల్లో తప్పులున్నట్లు గుర్తించారు. అందువల్ల ప్రతీ రైతు బ్యాంకు ఖాతాను సేకరించాలని భావిస్తున్నారు. ఇదే ఇప్పుడు వ్యవసాయశాఖకు సవాలుగా మారింది. ప్రతీ రైతు వద్దకు వెళ్లి సేకరించడం మండల వ్యవసాయ విస్తరణాధికారులకు కీలకంగా మారింది. గ్రామాల్లో ఉండే రైతుల నుంచి సేకరించడమైతే సులువే కానీ, ఎక్కడో పట్టణాల్లో ఉండే వారి బ్యాంకు ఖాతాలను సేకరించడం ఎలాగన్న ప్రశ్న అధికారులను తొలుస్తోంది. ఎలాగైనా సేకరించి పెట్టుబడి సొమ్మును రైతు ఖాతాల్లో జమ చేయాల్సిందేనన్న సంకల్పంతో వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. -
15 నుంచి గోల్డ్ బాండ్స్ స్కీమ్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సార్వభౌమ పసిడి బాండ్ల పథకం అక్టోబర్ 15న ప్రారంభం కానుంది. అక్టోబర్ 19 దాకా దరఖాస్తు చేసుకోవచ్చు. 23న బాండ్ల జారీ ఉంటుంది. ఫిబ్రవరి దాకా మొత్తం అయిదు విడతల్లో బాండ్ల జారీ ఉండనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. తదుపరి విడతల తేదీలు నవంబర్ 5–19 (నవంబర్ 13న జారీ), డిసెంబర్ 24–28 (జారీ జనవరి 1), జనవరి 14–18 (జారీ జనవరి 22), ఫిబ్రవరి 4–8 (జారీ ఫిబ్రవరి 12)గా ఉంటాయని వివరించింది. బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నిర్దిష్ట పోస్ట్ ఆఫీసులు, స్టాక్ ఎక్సే్చంజీలైన ఎన్ఎస్ఈ, బీఎస్ఈల ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చు. మరోవైపు, వడ్డీ రేట్లు తగ్గినప్పుడల్లా రుణగ్రహీతలకు ఆ ప్రయోజనాలను బదలాయించడంలో బ్యాంకులు జాప్యం చేస్తుండటంపై అభిప్రా యాన్ని ఆరు వారాల్లోగా తెలియజేయాల్సిందిగా ఆర్బీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. -
ఆర్బీఐ పాలసీ, ఎన్బీఎఫ్సీలపై దృష్టి!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష, స్థూల ఆర్థిక సమాచార వెల్లడి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) రంగంలో చోటుచేసుకోనున్న పరిణామాలు ఈ వారం స్టాక్ మార్కెట్కు అత్యంత కీలకంగా ఉండనున్నట్లు దలాల్ స్ట్రీట్ పండితులు అంచనావేస్తున్నారు. అమెరికా–చైనా దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం, పెరుగుతున్న ముడిచమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ శుక్రవారం 72.48 వద్ద ముగియడం లాంటి ప్రతికూల అంశాలు మార్కెట్ను వెంటాడుతున్న నేపథ్యంలో బలహీన సెంటిమెంట్ కొనసాగేందుకే అవకాశం ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. ‘బోటమ్ ఫిషింగ్కు ఇన్వెస్టర్లలో మార్కెట్పై ఇంకా భరోసా పెరగాల్సిఉంది. ద్రవ్య లభ్యత కొరత, మార్జిన్ ఫండింగ్ తక్కువగా ఉండటం, షార్ట్ సెల్లింగ్ వంటి పలు కారణాలు వల్ల ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ కోలుకునే వరకు మార్కెట్లో సెంటిమెంట్ బలహీనంగానే ఉండేందుకు ఆస్కారం ఉంది. అంగీకార స్థాయికి విలువ చేరుకునే వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. ఆర్బీఐ పాలసీ సమీక్ష ఈ వారంలో కీలకంగా ఉంది.’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. సెప్టెంబరు నెలకు సంబంధించిన ఆటో రంగ అమ్మకాల గణాంకాలు నేడు (సోమవారం) వెల్లడికానున్నాయి. అదే నెలకు చెందిన తయారీ రంగ కార్యకలాపాలను సూచించే నికాయ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) సమాచారం నేడు వెల్లడికానుండగా.. సేవల రంగ పీఎంఐ గణాంకాలు 4న (గురువారం) విడుదలకానుంది. ఇక మంగళవారం (అక్టోబరు 2న) గాంధీ జయంతి సందర్భంగా మార్కెట్లకు సెలవు. ఈ వారంలో ట్రేడింగ్ 4 రోజులకే పరిమితంకానుంది. టారిఫ్ విధించే యోచనలో అమెరికా ‘అమెరికా ఉత్పత్తులపై భారత్ 60% టారిఫ్ విధిస్తోంది. అవే ఉత్పత్తులను మళ్లీ అమెరికాకు ఎగుమతి చేసినప్పుడు మేము ఎటువంటి టారిఫ్ విధించడం లేదు. వీటిపై 10–25% పన్నులు విధించే యోచనలో ఉన్నాం. అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యాలు చేశారు. ఈ అంశం సైతం మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపనుందని భావిస్తున్నారు. వడ్డీ రేట్ల పెంపునకు అవకాశం..! ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఈనెల 3న సమావేశంకానుంది. అక్టోబరు 5న (శుక్రవారం) భేటీ ముగింపు తర్వాత.. మధ్యాహ్నం 2.30కి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షపై కమిటీ కీలక ప్రకటన చేయనుంది. ఆగస్టులో రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్బీఐ ఈసారి సమావేశంలో కూడా పెంపు ప్రకటన చేయవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈసారి కూడా 25 బేసిస్ పాయింట్లు పెంపు ఉండవచ్చని హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ‘నిధుల ప్రవాహం, కొనసాగుతున్న యుద్ధభయాలు, ముడిచమురు ధరల్లో పెరుగుదల, రూపాయి బలహీనత వంటి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టులో మరోసారి వడ్డీ రేట్ల పెంపు ప్రకటన ఉండవచ్చు.’ అని ఎస్ఎమ్సీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్ డీ కే అగర్వాల్ విశ్లేషించారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో వడ్డీ రేట్లు పెరగవచ్చని, మార్కెట్కు ఆర్బీఐ నిర్ణయం కీలకంగా ఉందని డెల్టా గ్లోబల్ పాట్నర్స్ ప్రిన్సిపల్ పాట్నర్ దేవేంద్ర నెవ్గి అన్నారు. 10,850 వద్ద కీలక మద్దతు ‘దిగువస్థాయిలో నిఫ్టీకి ఈవారం 10,850 పాయింట్లు కీలక మద్దతుగా ఉంది. ఈ వారం మార్కెట్ పుంజుకున్న పక్షంలో అత్యంత కీలక నిరోధం 11,050 పాయింట్ల వద్ద ఉంది.’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని విశ్లేషించారు. 4–నెలల గరిష్టస్థాయికి విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) సెప్టెంబరులో రూ.21,023 కోట్లను భారత మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. రూ.10,825 కోట్లను ఈక్విటీ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్న వీరు.. రూ.10,198 కోట్లను డెట్ మార్కెట్ నుంచి వెనక్కుతీసుకున్నారు. ఈఏడాదిలో ఇప్పటివరకు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.13,000 కోట్లను, డెట్ మార్కెట్ నుంచి రూ.48,000 కోట్లను ఉపసంహరించు కుని నికర అమ్మకందారులుగా నిలిచారు. -
బ్యాంకుల లూటీకి తుపాకులెందుకు?
ఆ మధ్య ఓ కథ స్మార్ట్ ఫోన్లలో చక్కర్లు కొట్టింది. హాంగ్కాంగ్లో బ్యాంకును దోచుకోవడానికి దొంగలు వచ్చినప్పుడు యువ ఉద్యో గులు కొందరు హీరోల్లా లేచారట. ‘‘కదిల్తే కాల్చే స్తాం. ఈ సొమ్ము మీది కాదు. కాని ప్రాణాలు మీవి, జాగ్రత్త’’ అని దొంగలు అరిచారు. అంతే, అంతా భయపడ్డారు. దొంగలు తోచినంత దోచుకుపో యారు. ఎంబీఏ పాసైన చిన్నదొంగ, ఆరోతరగతి ఫెయిలయిన పెద్దదొంగతో ‘ఎంత దోచామో లెక్క పెడదామా’ అన్నాడట. ‘ఎందుకు రా, టైం వేస్ట్, సాయంత్రానికి టీవీ చానెళ్లు చెప్పవూ!’’ అని అన్నాడు పెద్ద దొంగ. అన్నగారి అనుభవానికి ముచ్చట పడ్డాడు చిన్నోడు. అక్కడ బ్యాంకు మేనేజరు, దొంగలు వెళ్లిపోగానే 100 ఫోన్ కలుపుతు న్నాడు. అనుభవజ్ఞుడైన సూపర్ వైజర్ ఆపి ‘‘సార్ తొందర పడతారెందుకు. 20 మిలియన్ల డాలర్లు వాళ్లు దోచుకున్నారు. ఇప్పటికే ఓ 70 మిలియన్లు మాయమయ్యాయని మనం బాధపడుతున్నామా, అది వీరి ఖాతాలో వేద్దాం. మరో పది మిలియన్లు ఇప్పటి ఖర్చులకు తీసుకుందాం, అంతా వారు దోచుకున్నట్టే కదా’’. సూపర్ వైజర్ తెలివితేటలకు మేనేజరు ఎంతో ముచ్చట పడ్డాడు. ‘‘బ్రదర్ నెలకో సారి దోపిడీ జరిగితే ఎంతబాగుండు’’ అనే మాటలు అతని నోటివెంట అనుకోకుండా వెలువడ్డాయి. సాయంత్రం టీవీ చానెళ్లలో వంద మిలియన్ డాలర్ల దోపిడీ జరిగిందని ప్రకటించారు. దాని మీద ముగ్గురు నిపుణులు బిగ్ డిబేట్లో కొట్టుకోవడం చూసి పెద్దదొంగ డబ్బు ఎన్ని సార్లు లెక్కించినా 20 మిలియన్లు దాటడం లేదని చెప్పాడు. ఇద్దరూ నోరెళ్లబెట్టారు. ‘‘మనం ప్రాణాలకు లెక్కచేయ కుండా కష్టపడితే దక్కింది ఇది. వాళ్లు చూడు, ఒక్క పెన్ను దెబ్బతో 80 మిలియన్లు దొబ్బారు. పద వుల్లోఉన్న దొంగల ముందు మనమెంతరా? ఎంబీఏ కాదు, పొలిటికల్ సైన్స్, బిజినెస్ మేనేజ్ మెంట్ చదవాలి సార్’’ అన్నాడు చిన్నదొంగ. ఇక మన దేశం విషయానికి వస్తే, అప్పు లక్షయినా, రెండు లక్షలయినా రైతులు తీర్చలేరు. నమ్మిన పొలం పండలేదు. కొన్న మందులు పురు గుల మీద పనిచేయలేదు. రుణదొంగలంటే భరించలేక ఆ మందు తాగారు. పనిచేసింది. 1998 నుంచి 2018 దాకా మూడు లక్షల మంది రైతులు ఇలా ప్రాణాలు తీసుకున్నారు. మరో వైపు పారిశ్రామిక వేత్తలు దాదాపు ఏడు వేల మంది వేల కోట్ల రూపా యలు అప్పు చేసి, సూట్ కేసులతో దేశం వదిలిపెట్టి పారిపోయారు. రైతుల అప్పులు మాఫీ చేస్తామని రాజకీయపార్టీలు ఎన్నికల ముందు హామీ ఇచ్చి వారి ఓట్లు దండుకుంటాయి. రుణ మాఫీ పూర్తిగా చేయ కుండా కొంత తగ్గించి మాఫీ చేసినట్టు ప్రకటించు కుంటారు. సులభంగా వ్యాపారం చేయడం సుపరి పాలనగా చెప్పుకుంటూ ప్రభుత్వాలు పోటీ పడతాయి. ఢిల్లీలో ర్యాంకులిచ్చి అవార్డులు ప్రకటిస్తారు. సులభ వ్యాపార పాలనా ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు తేలికగా పర్మిషన్లతో పాటు పారిశ్రామిక వేత్తలకు అప్పులు కూడా ఇస్తాయి. రాయిటర్ అనే వార్తాసంస్థ బోలెడు ఆర్టీఐ దర ఖాస్తులు వేసి, రిజర్వ్బ్యాంక్ అందించిన సమా చారం ప్రకారం దేశంలో మొండి బాకీలు రూ. 9.5 లక్షల కోట్లు అని తేల్చింది. ఇది జూన్ 2017 నాటి లెక్క. కావాలని రుణం ఎగ్గొట్టే పెద్దలు రూ.110 లక్షల కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టారని ఓ పత్రిక వెల్లడించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో రూ. 11,300 కోట్ల కుంభకోణం జరిగింది. మూడు లక్షల మంది సభ్యులున్న అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘాల సమాఖ్య ఈ స్కాం చూసి చలించిపోయింది. అయ్యా, ఈ దొంగల పేర్లు బయట పెట్టండి అని ఈ సమాఖ్య సభ్యులు వినతి పత్రం సమర్పిం చారు. ఈ అప్పులు ఎగ్గొట్టిన కంపెనీల డైరెక్టర్లకు వీసాలు రాకుండా పాస్ పోర్టులు ఆపండి బాబో అని హోం మంత్రి దగ్గర మొత్తుకున్నారు. వాళ్ల పిచ్చిగాని వినే వారెవరు? వీరికి విరివిగా రుణాలు ఇవ్వడానికి పోటీపడి ముందుకొచ్చిన బ్యాంకు డైరెక్టర్లను ఏం చేస్తారు? విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి రుణ చోర వీరుల పేర్లయినా ఎందుకు బయటపెట్టరు? అని ఈ సమాఖ్య రిజర్వ్బ్యాంక్ను అడిగింది. అప్పులు తీర్చాలనే ఉద్దేశంలేని ఇలాంటి వారికి రుణాలు మాఫీ చేయడం ఎందుకని ఈ సమాఖ్య బ్యాంకులను కూడా ప్రశ్నించింది. ఏడు వేల మంది మిలియనీర్లు వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని దేశం వదిలి పారిపోయారు. అంతేకాదు, పౌరసత్వం మార్చుకుని వారు దర్జాగా విదేశాల్లో స్థిరపడ్డారన్న వార్తలు చదివిన వారికి బ్యాంకు అధికారుల సమాఖ్య ప్రశ్నలు గుర్తొస్తాయి. కంచికి వెళ్లని ఈ కథలో నీతి: బ్యాంకులిచ్చే అప్పు కాగితాల మీద సంతకాలు చేసి డబ్బు లాగేసే సౌక ర్యం ఉన్నప్పుడు తుపాకులతో బ్యాంకు దోపిడీల అవసరం ఏముంటుంది? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
క్యాష్ ఈజ్ కింగ్!
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు రూపంలో ఇంటింటి పొదుపులు గణనీయంగా పెరిగాయి. 2017–18లో స్థూల జాతీయ డిస్పోజబుల్ ఇన్కమ్(జీఎన్డీఐ–ఆదాయపు పన్నులు తదితర వ్యయాల తర్వాత ఖర్చులకు, పొదుపుకు కుటుంబం వద్ద ఉండే మొత్తమే డిస్పోజబుల్ ఇన్కమ్)తో పోల్చిచూస్తే, నగదు రూపంలో ఇంటింటి పొదుపు 2.8%కి పెరిగింది. ఇది ఏడేళ్ల గరిష్ట స్థాయి. రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తాజా గణాంకాల్లో మరిన్ని వివరాలు... 82016 నవంబర్లో పెద్ద నోట్ల రద్దు జరిగింది. అటు తర్వాత గృహ పొదుపులు అసలు పెరక్కపోగా అంతక్రితం ఏడాది (2015–16) తో పోల్చితే 2016–17లో 2 శాతం క్షీణించింది. 82016–17లో జీఎన్డీఐలో గృహ ఫైనాన్షియల్ సేవింగ్స్ కూడా 6.7% క్షీణించాయి. 2015–16లో ఏకంగా 8.1% వృద్ధి నమోదయ్యింది. అయితే 2017–18లో ఈ రేటులో 7.1% వృద్ధి నమోదైంది. 8డిపాజిట్ల రూపంలో పొదుపులు డీమోనిటైజేషన్ ఇయర్ (2016–17) లో 6.3 శాతం పెరిగితే, 2017–18లో ఈ రేటు 2.9 శాతానికి జారిపోయింది. 8షేర్లు, డిబెంచర్లలో పొదుపులు 2015–16లో 0.3 శాతం ఉంటే, 2017–18లో 0.9 శాతానికి ఎగశాయి. స్టాక్ మార్కెట్ బూమ్కు ఇది నిదర్శనం. -
కీలక వ్యవస్థలు నాశనం
లండన్: బీజేపీ పాలనలో సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం, భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) తదితర సంస్థలను నాశనం చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. 2014కు ముందు దేశంలో అభివృద్ధే జరగలేదనడం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను అవమానించారన్నారు. లండన్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులనుద్దేశించి ఆదివారం రాహుల్ ప్రసంగించారు. ‘ప్రపంచ భవిష్యత్తును భారత్ నిర్దేశిస్తోంది. కాంగ్రెస్ సహాయంతోనే భారతీయులు దీన్ని సాధ్యం చేసి చూపించారు. ఆయన పగ్గాలు చేపట్టకముందు దేశంలో అభివృద్ధే జరగలేదని అంటే ప్రతి భారతీయుడిని అవమానించినట్లే’ అని రాహుల్ పేర్కొన్నారు. దేశంలో దళితులు, రైతులు, గిరిజనులు, మైనారిటీలు, పేదలు వారికి కావాల్సిన దానిగురించి గొంతెత్తితే భౌతికదాడులకు పాల్పడుతున్నా రని విమర్శించారు. ఎస్సీ,ఎస్టీలపై దాడుల నియంత్రణ చట్టాన్ని అటకెక్కించారని, స్కాలర్షిప్లను ఆపేశారని ఆరోపణలు చేశారు. దేశంలో రైతులకు రుణమాఫీ చేయకుండా అనిల్ అంబానీ వంటి వ్యక్తులకు మాత్రం అనుచితంగా లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. పార్లమెంటులో రాఫెల్ ఒప్పందంపై తన ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పలేదన్నారు. -
దివాలా అంచున దిగ్గజాలు..
న్యూఢిల్లీ: మొండిపద్దుల పరిష్కారానికి రిజర్వ్ బ్యాంక్ విధించిన డెడ్లైన్ దగ్గరపడుతుండటంతో .. భారీగా రుణాలు పేరుకుపోయిన సంస్థలపై దివాలా చర్యలకు రంగం సిద్ధమవుతోంది. దాదాపు 60 పైచిలుకు కంపెనీలు దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొనాల్సి రావొచ్చని తెలుస్తోంది. ఇందులో పంజ్లాయిడ్, రిలయన్స్ డిఫెన్స్ అండ్ ఇంజినీరింగ్, బజాజ్ హిందుస్తాన్ వంటి కంపెనీలు ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్బీఐ సర్క్యులర్ ప్రభావం..: రుణాల చెల్లింపులో ఒక్క రోజు ఆలస్యమైనా ఆయా మొండిపద్దుల పరిష్కారానికి సత్వరం చర్యలు తీసుకోవాలంటూ బ్యాంకులను ఆదేశిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 12న రిజర్వ్ బ్యాంకు సర్క్యులర్ జారీ చేసింది. రూ. 2,000 కోట్ల పైబడిన రుణఖాతాల పరిష్కారానికి 180 రోజుల డెడ్లైన్ విధించింది. ఈ గడువు దాటితే ఆయా పద్దులపై దివాలా చట్టం కింద చర్యలు ప్రారంభించాలని సూచించింది. ప్రస్తుతం దాని ప్రభావంతోనే పలు కంపెనీలు దివాలా చట్టం చర్యల ముంగిట్లో ఉన్నాయి. ఆర్బీఐ విధించిన 180 రోజుల వ్యవధి మార్చి 1తో మొదలై ఆగస్టుతో ముగుస్తుంది. దీంతో సెప్టెంబర్ ప్రారంభం కాగానే బ్యాంకులు సదరు మొండి ఖాతాలపై దివాలా చట్టం కింద చర్యలు మొదలుపెట్టాల్సి రానుంది. మార్చి 1 నాటికి ఒక్క రోజు పైగా రుణాలు డిఫాల్ట్ అయిన దాదాపు 70–75 ఖాతాల పరిష్కారానికి బ్యాంకులు కసరత్తు చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ, వీటిలో చాలా మటుకు ఖాతాలు ఒక కొలిక్కి రాలేదని, దీంతో వచ్చే రెండు వారాల్లో ఆయా సంస్థలు దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొనాల్సి రానుందని సమాచారం. 60 ఖాతాల్లో కొన్ని.. దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొనాల్సి ఉన్న సంస్థల్లో .. పంజ్ లాయిడ్, రిలయన్స్ డిఫెన్స్ అండ్ ఇంజినీరింగ్, బజాజ్ హిందుస్తాన్, పటేల్ ఇంజినీరింగ్, బాంబే రేయాన్, జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోల్టా ఇండియా, శ్రీరామ్ ఈపీసీ, గీతాంజలి జెమ్స్ మొదలైనవి ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వీటిలో కొన్ని సంస్థలు గతంలో కూడా బ్యాంకింగ్పరమైన చర్యలు ఎదుర్కొన్నాయి. దాదాపు రూ. 14,000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్లో గీతాంజలి జెమ్స్ కూడా విచారణ ఎదుర్కొంటోంది. -
రేట్లకు రెక్కలు!!
న్యూఢిల్లీ: రూపాయి మారకం విలువ అంతకంతకూ పడిపోతున్న నేపథ్యంలో వినియోగవస్తువుల నుంచి ఫోన్లు మొదలైన ఉత్పత్తుల దాకా అన్నింటి ధరలు పెరగనున్నాయి. దేశీ కరెన్సీ పతనం ఇదే తీరుగా కొనసాగితే ..ముడి చమురు దిగుమతుల బిల్లు పెరిగిపోయి, పెట్రోల్, డీజిల్ మొదలుకుని వంట గ్యాస్ దాకా అన్నింటి రేట్లు ఎగియనున్నాయి. దిగుమతుల భారం పెరిగిపోతుండటంతో.. కన్జూమర్ డ్యూరబుల్స్ కంపెనీలు పండుగ సీజన్ ప్రారంభం కావడానికి ముందుగానే రేట్లను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూపాయి మారకం పతన ప్రభావాలను పరిశీలిస్తున్నట్లు సోనీ, పానాసోనిక్, గోద్రెజ్ వంటి సంస్థలు తెలిపాయి. ‘డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 70 స్థాయిని దాటేయడం ముడివస్తువుల వ్యయాలపై మరింతగా ఒత్తిడి పెంచుతోంది. ఈ ప్రభావాలన్నింటినీ పరిశీలిస్తున్నాం. ఇదే తీరు కొనసాగితే.. సమీప భవిష్యత్లో రేట్లు పెంచక తప్పక పోవచ్చు’ అని గోద్రెజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్, ఈవీపీ కమల్ నంది వెల్లడించారు. ఒకవేళ 70 స్థాయి దాటి రూపాయి కొనసాగితే.. పండుగలకు ముందే రేట్లను పెంచవచ్చని, ఆగస్టు ఆఖర్లోగా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. అటు పానాసోనిక్ ఇండియా ప్రెసిడెంట్ మనీష్ శర్మ కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. రూపాయి పతనం ఇలాగే కొనసాగితే వినియోగ ఉత్పత్తుల రేట్లపై ఒత్తిడి తప్పదన్నారు. ప్రస్తుతానికి దేశీ కరెన్సీ తీరును పరిశీలిస్తున్నామని, టీవీల రేట్ల పెంపుపై ఇంకా నిర్ణయాలేమీ తీసుకోలేదని సోనీ ఇండియా హెడ్ ఆఫ్ సేల్స్ సతీష్ పద్మనాభన్ చెప్పారు. కొన్ని ఉత్పత్తుల రేట్లను పెంచే అవకాశాలు ఉండొచ్చని, ఇందుకు మరికాస్త సమయం పట్టొచ్చని హాయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా తెలిపారు. ఎంట్రీ లెవెల్ ఫోన్లపై ప్రభావం.. రూపాయి పతనం కొనసాగితే ముడివస్తువుల ధరలూ పెరుగుతాయని, ఫలితంగా మొబైల్ ఫోన్లు.. ముఖ్యంగా ఎంట్రీలెవెల్ వేరియంట్స్ రేట్లు పెరగవచ్చని హ్యాండ్సెట్ తయారీ సంస్థలు వెల్లడించాయి. ‘డాలర్ మరింత బలపడే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో మొబైల్స్ తయారీ వ్యయాలూ పెరుగుతాయి. ఫలితంగా హ్యాండ్సెట్స్ రేట్లూ పెరిగే అవకాశాలు ఉన్నాయి’ అని ఇంటెక్స్ టెక్నాలజీస్ (ఇండియా) డైరెక్టర్ నిధి మార్కండేయ చెప్పారు. కస్టమ్స్ సుంకాలు, ముడివస్తువుల రేట్ల పెరుగుదలతో హ్యాండ్సెట్స్ పరిశ్రమ ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉందని.. కోమియో ఇండియా సీఈవో సంజయ్ కలిరోనా తెలిపారు. రూపాయి పతనం ప్రభావాలను సమీక్షిస్తున్నామని, రేట్లపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎంట్రీ లెవెల్ మొబైల్స్పై నేరుగా ప్రభావం పడొచ్చని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మహీంద్రూ తెలిపారు. అయితే ఈ విభాగంలో తీవ్ర పోటీ నెలకొనడంతో రేట్ల పెంపుపై నిర్ణయం చాలా కష్టమైన వ్యవహారమని ఆయన పేర్కొన్నారు. పెరిగే చమురు బిల్లు .. రూపాయి కొత్త కనిష్ట స్థాయులకు పడిపోతుండటం చమురు దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనివల్ల ముడిచమురు దిగుమతుల భారం ఈ ఆర్థిక సంవత్సరం ఏకంగా 26 బిలియన్ డాలర్ల మేర పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముడిచమురు దిగుమతుల భారం పెరిగితే.. తత్ఫలితంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ రేట్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. భారత్ చమురు అవసరాల్లో దాదాపు 80 శాతం దిగుమతులే ఉంటున్నాయి. 2017–18లో 220.43 మిలియన్ టన్నుల క్రూడాయిల్ కోసం 87.7 బిలియన్ డాలర్లు వెచ్చించింది. ఈ ఆర్థిక సంవత్సరం దిగుమతులు 227 మిలియన్ టన్నుల మేర ఉంటాయని అంచనా. ‘ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో డాలర్తో రూపాయి మారకం రేటు 65 స్థాయిలో, ముడిచమురు బ్యారెల్ రేటు 65 డాలర్లుగా ఉంటుందనే అంచనాలతో.. దిగుమతుల బిల్లు 108 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని అంచనా వేశాం. కానీ ఇది మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. రూపాయి పతనం వల్ల పూర్తి ప్రభావాలు ఈ నెలాఖరులోనే కనిపించే అవకాశాలు ఉన్నాయి. రూపాయి పతనంతో ఎగుమతి సంస్థలతో పాటు దేశీయంగా చమురు ఉత్పత్తి సంస్థలైన ఓఎన్జీసీ మొదలైన వాటికీ ప్రయోజనం చేకూరుతుంది. అయితే, ఇవి డాలర్ల మారకంలో బిల్లింగ్ చేయడం వల్ల వాటి నుంచి ఇంధనాలు కొనుగోలు చేసి విక్రయించే రిటైల్ సంస్థలు రేట్లను పెంచాల్సి వస్తుంది. ఒకవేళ చమురు రేట్లు ప్రస్తుత స్థాయిలోనే ఉండి, రూపాయి 70 స్థాయిలోనే కొనసాగిన పక్షంలో ఇంధన ధరలు లీటరుకు 50–60 పైసల మేర పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. రూపాయి మరింత పతనం తొలిసారిగా 70కి దిగువన క్లోజింగ్ 26 పైసలు డౌన్ ముంబై: రూపాయి విలువ శరవేగంగా కరిగిపోతోంది. రోజురోజుకూ కొత్త కనిష్ట స్థాయులకు పడిపోతోంది. డాలర్తో పోలిస్తే గురువారం రూపాయి మారకం విలువ మరింత క్షీణించి కీలకమైన 70 మార్కు దిగువన తొలిసారిగా క్లోజయ్యింది. మంగళవారం నాటి ముగింపుతో పోలిస్తే మరో 26 పైసలు తగ్గి 70.15 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఒక దశలో చరిత్రాత్మక కనిష్ట స్థాయి 70.40ని కూడా తాకడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ జోక్యంతో రూపాయి పతనానికి కొంతైనా అడ్డుకట్ట పడిందని కరెన్సీ ట్రేడర్లు పేర్కొన్నారు. క్రితం ముగింపు 69.89తో పోలిస్తే గురువారం ఫారెక్స్ మార్కెట్లో గ్యాప్ డౌన్తో ఏకంగా 70.19 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత ఒక దశలో 70.40 స్థాయికి కూడా పడిపోయి చివరికి కొంత కోలుకుని 70.15 వద్ద క్లోజయ్యింది. పెరిగిపోతున్న ద్రవ్య లోటు, క్రూడాయిల్ ధరల పెరుగుదల, అమెరికా–చైనా మధ్య వాణిజ్య భయాలపై ఆందోళనలు, డాలర్కు డిమాండ్ తదితర అంశాల నేపథ్యంలో దేశీ కరెన్సీ విలువ ఈ ఏడాది ఇప్పటిదాకా 10.5 శాతం మేర క్షీణించింది. వర్ధమాన దేశాల కరెన్సీల పతనానికి కారకమైన టర్కీ లీరా విలువ మాత్రం పెరిగింది. టర్కీ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా 15 బిలియన్ డాలర్లు అందిస్తామంటూ కతార్ ముందుకు రావడంతో లీరా ర్యాలీ కొనసాగింది. మరోవైపు, రూపాయి క్షీణతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు. గత మూడేళ్లుగా 17 శాతం మేర పెరిగిన రూపాయి మారకం ప్రస్తుతం మళ్లీ సహజ స్థాయికి వస్తోందని పేర్కొన్నారు. -
రుణాలు ఇక ప్రియం!
వడ్డీరేట్ల విషయంలో ఈ సారి అందరి అంచనాలూ తలకిందులయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అనూహ్యంగా పాలసీ రేట్లను పెంచి షాకిచ్చారు. దీంతో గృహ, వాహన, కార్పొరేట్, రిటైల్ రుణాలు ఇకపై మరింత భారం కానున్నాయి. నెలవారీ వాయిదాలు (ఈఎంఐ) పెరగనున్నాయి. ఆర్బీఐ రెపో రేటును పెంచడం వరుసగా ఇది రెండోసారి కావడం గమనార్హం. ముఖ్యంగా ద్రవ్యోల్బణం పెరుగుదల ఆందోళనల కారణంగానే రేట్ల పెంపు నిర్ణయాన్ని తీసుకోవాల్సివచ్చిందని ఆర్బీఐ పేర్కొంది. అయితే, పరపతి విధానాన్ని తటస్థంగానే కొనసాగిస్తున్నట్లు చెప్పడం కాస్త ఊరటనిచ్చే అంశం!! ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరపతి విధాన సమీక్షలో ఊహించని నిర్ణయం వెలువడింది. రెపో రేటును మళ్లీ పావు శాతం పెంచి... 6.5 శాతానికి చేర్చింది. రేట్ల పెంపునకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీలో (ఎంపీసీ) ఐదుగురు అనుకూలంగా ఓటేశారు. ఒక సభ్యుడు (రవీంద్ర ధోలకియా) మాత్రం యథాతథంగా కొనసాగించేందుకు మొగ్గు చూపారు. కాగా, రెపో పెంపుతో దీంతో అనుసంధానమైన ఇతర పాలసీ రేట్లు కూడా పెరిగాయి. రివర్స్ రెపో రేటు పావు శాతం పెరిగి 6.25 శాతానికి చేరింది. ఇక నగదు నిల్వల నిష్పత్తిని (సీఆర్ఆర్) మాత్రం 4 శాతం వద్ద యథాతథంగానే ఉంచింది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్), బ్యాంక్ రేట్లు సైతం పావు శాతం చొప్పున ఎగసి 6.75 శాతానికి చేరాయి. కాగా, పాలసీ రేట్లను పెంచినప్పటికీ.. ఇప్పుడు అనుసరిస్తున్న తటస్థ పరపతి విధానాన్నే కొనసాగిస్తామని రిజర్వు బ్యాంకు తెలియజేసింది. అంటే భవిష్యత్తులో ద్రవ్యోల్బణం శాంతిస్తే.. మళ్లీ పాలసీ రేట్లను తగ్గించేందుకు ఆస్కారం ఉంటుంది. కాగా, తదుపరి పరపతి విధాన సమీక్ష అక్టోబర్ 3–5 తేదీల్లో మూడు రోజులపాటు జరుగుతుంది. రెండు నెలల్లో వరుసగా రెండో సారి... దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత తొలిసారిగా గత పాలసీలో జూన్ 6న రెపో రేటును ఆర్బీఐ పావు శాతం పెంచింది. ఇప్పుడు వరుసగా రెండో సమీక్షలోనూ అంచనాలకు భిన్నంగా రేట్లను పెంచి ఆశ్చర్యపరిచింది. ఆర్థికవేత్తలు, బ్యాంకింగ్ నిపుణులు చాలామంది ఈ సారి సమీక్షలో ఆర్బీఐ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతుందని అంచనా వేశారు. ధరలు వెంటాడుతున్నాయ్... అధిక ద్రవ్యోల్బణం, ముడిచమురు రేట్ల పెరుగుదల, అంతర్జాతీయంగా ఫైనాన్షియల్ మార్కెట్లలో అనిశ్చితి, వర్షాలు సరిగ్గా కురవకపోవడం, రైతులకు పంటల మద్దతు ధర (ఎంఎస్పీ) పెంచడం, ద్రవ్యలోటు గుబులు ఇతరత్రా ఆందోళనవల్లే పాలసీ రేట్లను పావు శాతం పెంచినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమిస్తూనే... రిటైల్ ద్రవ్యోల్బణాన్ని మధ్య కాలంలో 4 శాతం(2 శాతం అటూఇటుగా) వద్ద నిలకడగా ఉంచాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు ఎంపీసీ స్పష్టం చేసింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(2018–19, జూలై–సెప్టెంబర్)లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.6 శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో (సెప్టెంబర్ –మార్చి) ద్రవ్యోల్బణం అంచనా 4.8 శాతంగా పేర్కొంది. ఈ ఏడాది జూన్ నెలలో టోకు ధరల (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం నాలుగున్నరేళ్ల గరిష్ట స్థాయి 5.77 శాతానికి ఎగబాకిన సంగతి తెలిసిందే. అదేవిధంగా రిటైల్ ద్రవ్యోల్బణం కూడా ఐదు నెలల గరిష్ట స్థాయిలో 5.07 శాతంగా నమోదైంది. కాగా, వచ్చే ఏడాది (2019–20) తొలి త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5% ఉండొచ్చనేది ఆర్బీఐ అంచనా. వృద్ధి అంచనాలు యథాతథం... ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాల్లో ఆర్బీఐ ఎలాంటి మార్పులూ చేయలేదు. గతంలో పేర్కొన్న విధంగానే జీడీపీ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం(2018–19)లో 7.4 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ జోరందుకోవడం కార్పొరేట్ కంపెనీల లాభాలు దండిగా ఉండటం వంటివి జీడీపీకి దన్నుగా నిలుస్తాయని తెలిపింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న వాణిజ్య యుద్ధ భయాలు.. మన దేశ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్బీఐ అంచనాలప్రకారం.. 2018–19 ప్రథమార్ధంలో వృద్ధి రేటు 7.5–7.6 శాతం, ద్వితీయార్ధంలో 7.3–7.4 శాతం ఉండొచ్చు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం(2019–20)లో వృద్ధి రేటును 7.5 శాతంగా అంచనా వేసింది. రేట్ల పెంపునకు బ్యాంకులు రెడీ.... ఆర్బీఐ పాలసీ రేట్లను పెంచుతుందన్న ముందస్తు సంకేతాలతోనే బ్యాంకులు డిపాజిట్ రేట్లను తాజాగా స్వల్పంగా పెంచాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 0.1 శాతం మేర పెంచిన సంగతి తెలిసిందే. ఇతర బ్యాంకులూ ఇదే బాటను అనుసరించనున్నాయి. ఇప్పుడు రెపో రేటు పెంపుతో రుణాలపై కూడా వడ్డీరేట్లను ఆ మేరకు బ్యాంకులు పెంచడం ఖాయమని నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల రుణ గ్రహీతలకు ఈఎంఐలు మరింత భారమవుతాయని పేర్కొంటున్నారు. సమయానుకూల నిర్ణయం... అంతర్జాతీయ వృద్ధి కొనసాగే ధోరణి అనిశ్చితిగా ఉంది. ఈ దశలో తగిన సౌలభ్యతతో కూడిన తటస్థ నిర్ణయాలు అవసరం. ఆర్బీఐ నిర్ణయం దీనినే సూచించింది. అలాగే రేట్ల పెంపు సైకిల్ ప్రారంభమయ్యిందని కూడా ఈ నిర్ణయం స్పష్టం చేస్తోంది. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ ద్రవ్యోల్బణంపై దూరదృష్టి... దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా ఆర్బీఐ పనిచేస్తోందని తాజా నిర్ణయం సూచిస్తోంది. ద్రవ్యోల్బణం మరింత పెరగనున్న నేపథ్యంలో మార్చిలోగా మరోసారి రేట్ల పెంపును తోసిపుచ్చలేం. – అభిషేక్ బారువా, హెచ్డీఎఫ్సీ చీఫ్ ఎకనమిస్ట్ మరోసారి పెంచకపోవచ్చు రిటైల్ ద్రవ్యోల్బణం కట్టుతప్పే పరిస్థితుల కారణంగా ఆర్బీఐ రేటు పెంపు నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు కూడా దీన్ని క్రమంగా బదలాయించవచ్చు. వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రేటును మరోసారి పెంచకపోవచ్చన్నది నా అభిప్రాయం. – రాణా కపూర్, యస్ బ్యాంక్ సీఈఓ మా గోడు వినలేదు: కార్పొరేట్లు వడ్డీరేట్లను పెంచొద్దన్న తమ అభ్యర్థనలను ఆర్బీఐ పట్టించుకోలేదని కార్పొరేట్ ఇండియా పేర్కొంది. రెపో రేటును వరుసగా రెండోసారి పెంచడంపై పారిశ్రామిక రంగం అసంతృప్తిని వ్యక్తం చేసింది. వడ్డీరేట్లను ఇలా ఎడాపెడా పెంచుతూ పోతే మార్కెట్ నుంచి నిధుల సమీకరణ ప్రైవేటు రంగానికి కష్టతరంగా మారుతుందని అసోచామ్ ప్రెసిడెంట్ సందీప్ జజోడియా వ్యాఖ్యానించారు. వృద్ధి పుంజుకుంటున్న సంకేతాల నేపథ్యంలో రుణాలకు డిమాండ్ మళ్లీ పెరుగుతోందని.. ఆర్బీఐ రేట్ల పెంపు దీనికి సంకేతమని మహీంద్రా మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈఓ అశుతోష్ బిష్ణోయ్ పేర్కొన్నారు. రేట్ల పెరుగుదల సైకిల్ జోరందుకుంటున్న నేపథ్యంలో కొత్తగా డెట్ ఫండ్స్ రూపంలో పెట్టుబడి అవకాశాలు తలుపు తడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న సంవత్సరాల్లో డెట్ మార్కెట్లు మంచి పనితీరును కనబరుస్తాయని చెప్పారు. కాగా, ఇప్పటికీ చాలా కార్పొరేట్ సంస్థలు తీవ్ర రుణ భారంతో ఇక్కట్లు పడుతున్న నేపథ్యంలో తాజా వృద్ధి గణంకాలను పూర్తిగా పునరుత్తేజ సంకేతాలుగా ఆర్బీఐ భావించకూడదని జజోడియా పేర్కొన్నారు. ఇళ్ల అమ్మకాలకు దెబ్బ: రియల్టర్లు ఆర్బీఐ రెపో రేటు పెంచడంపై రియల్టీ డెవలపర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్బీఐ నిర్ణయం కారణంగా గృహ రుణాలు భారమవుతాయని.. దీంతో ఇళ్ల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. ‘రేట్ల పెంపు వల్ల ఇళ్ల కొనుగోలుదారుల సెంటిమెంట్ దెబ్బతింటుంది. ఫలితంగా హౌసింగ్ అమ్మకాలు తగ్గేందుకు దారితీయొచ్చు’అని నరెడ్కో ప్రెసిడెంట్ నిరంజన్ హిరనందానీ వ్యాఖ్యానించారు. ‘వరుసగా రెండు సార్లు వడ్డీరేట్ల పెంపు కారణంగా అందుబాటు గృహాల అమ్మకాలు పెంచేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రియల్టీలో వృద్ధికి చేదోడుగా హౌసింగ్పై జీఎస్టీని ఇప్పుడున్న 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం’ అని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ జక్షయ్ షా పేర్కొన్నారు. ‘వెంటవెంటనే వడ్డీరేట్ల పెంపు వల్ల రుణ రేట్లన్నీ ఎగబాకుతాయి. దీనివల్ల ఇప్పుడిప్పుడే గాడిలోపడుతున్న రియల్ ఎస్టేట్, కన్సూమర్ గూడ్స్ రంగంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. మరీ మఖ్యంగా అందుబాటు గృహాల విభాగానికి తాత్కాలికంగా విఘాతమే’ అని రియల్టీ అగ్రగామి డీఎల్ఎప్ సీఈఓ రాజీవ్ తల్వార్ పేర్కొన్నారు. కాగా, ప్రస్తుత ద్రవ్యోల్బణం రిస్కుల ప్రకారం చూస్తే.. ఆర్బీఐ రేట్ల పెంపు ఊహించినదేనని ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ వ్యాఖ్యానించారు. అయితే, ఇళ్ల మార్కెట్లో సవాళ్ల నేపథ్యంలో ఇకపై రేట్ల పెంపునకు ఆర్బీఐ విరామం ఇస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ధరల కట్టడి కోసమే: ఉర్జిత్ పటేల్ ‘ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో కట్టడి చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉండటం కోసమే రేట్లను పెంచాల్సి వచ్చింది. పంటలకు మద్దతు ధర పెంపు, వర్షపాతం కొరత ఇతరత్రా దేశీయ అంశాలతోపాటు క్రూడ్ ధర జోరు, వాణిజ్య యుద్ధాలు వంటి విదేశీ అంశాలు ద్రవ్యోల్బణం రిస్కులను పెంచుతున్నాయి. వాణిజ్య యుద్ధం... ఇప్పుడు కరెన్సీ యుద్ధాలను పురిగొల్పుతోంది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి విషయంలో వివిధ దేశాల మధ్య తీవ్ర వైరుధ్యాలు నెలకొన్నాయి. అయితే, వృద్ధికి ఊతమిచ్చే ఉద్దేశంతోనే తటస్థ పాలసీ విధానాన్ని కొనసాగిస్తున్నాం’ అని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. ఫారెక్స్ మార్కెట్ సమయం పెంపుపై కమిటీ ఫారెక్స్ మార్కెట్ సమయాన్ని పెంచే అంశాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య పాలసీ సమీక్ష సందర్భంగా పేర్కొన్నారు. దేశీయ మార్కెట్లకు అంతర్జాతీయ మార్కెట్తో అనుసంధానం దృష్ట్యా పలు వర్గాల నుంచి ఫారెక్స్ మార్కెట్ సమయం పెంపునకు డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. మద్దతు ధర ప్రభావం తగ్గుతుంది ఖరీఫ్ సీజన్లో పంటలకు కేంద్ర ప్రభుత్వం పెంచిన మద్దతు ధరల(ఎంఎస్పీ) ప్రభావం ద్రవ్యోల్బణంపై క్రమంగా తగ్గుముఖం పడుతుందని.. అందువల్ల దీన్ని తీవ్రమైన రిస్కుగా పరిగణించకూడదని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్సీ గర్గ్ వ్యాఖ్యానించారు. ఎంఎస్పీ పెంపు కారణంగా ఆహార ద్రవ్యోల్బణంపై ప్రత్యక్షంగా ప్రభావం పడుతుందని... దీంతో రిటైల్ ద్రవ్యోల్బణం ఎగబాకే అవకాశం ఉందని ఆర్బీఐ పాలసీ సమీక్షలో ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో గర్గ్ ఈ విధంగా స్పందించారు. -
రూపాయి రికవరీ
ముంబై: జీవిత కాల కనిష్ట స్థాయికి పడిపోయిన రూపాయి మళ్లీ పుంజుకుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ శుక్రవారం ఏకంగా 21 పైసలు ఎగిసి 68.84 వద్ద క్లోజయ్యింది. కరెన్సీ మార్కెట్లలో తీవ్ర హెచ్చుతగ్గులను నియంత్రించేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా రిజర్వ్ బ్యాంక్ పరోక్షంగా జోక్యం చేసుకుని ఉండొచ్చని, రికవరీకి ఇదే కారణం కావొచ్చని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అటు కొన్ని విదేశీ బ్యాంకులు డాలర్లను షార్ట్ సెల్లింగ్ చేయడం కూడా ఇందుకు దోహదపడి ఉండొచ్చని పేర్కొన్నాయి. శుక్రవారం ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ క్రితం రోజు నాటి రికార్డు కనిష్ట స్థాయి 69.05తో పోలిస్తే కొంత మెరుగ్గా 69.01 వద్ద ప్రారంభమైంది. అంతలోనే అమ్మకాలు వెల్లువెత్తడంతో ఒక దశలో లైఫ్టైమ్ కనిష్ట స్థాయి 69.13కి పడిపోయింది. ఆర్బీఐ జోక్యం వార్తలు, తదితర అంశాల ఊతంతో చివరికి 68.84 వద్ద ముగిసింది. -
35,440 స్థాయి కీలకం
రిజర్వుబ్యాంక్ నాలుగున్నరేళ్ల తర్వాత గతవారం పావు శాతం వడ్డీ రేట్లు పెంచిన తర్వాత రూపాయి విలువ గణనీయంగా మెరుగుపడటం, స్టాక్మార్కెట్ ర్యాలీ జరపడం ఒకేసారి జరిగాయి. భారత్ క్యాపిటల్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు జరుపుతున్న అమ్మకాలకు బ్రేక్ పడుతుందన్న అంచనాలే...కరెన్సీ, స్టాక్ మార్కెట్ల అనుకూల కదలికలకు కారణం. కానీ ఒక రోజు అనంతరం తిరిగి రూపాయి మళ్లీ భారీగా పతనంకావడం, స్టాక్ మార్కెట్ తిరిగి కరెక్షన్ బాటలోకి మళ్లడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసేదే. భారత్తో పాటు ఇతర వర్థమాన దేశాల ఈక్విటీలు, కరెన్సీలు కూడా ఇటీవల క్షీణబాటలో వుండగా, అమెరికా సూచీల్లో నాస్డాక్ ఇప్పటికే ఆల్టైమ్ గరిష్టస్థాయికి చేరింది. మరో రెండు సూచీలు డోజోన్స్, ఎస్ అండ్ పీ–500లు కొత్త రికార్డువైపు పరుగులు తీస్తున్నాయి. అంటే...విదేశీ ఇన్వెస్టర్లు ఇతర మార్కెట్ల నుంచి నిధుల్ని అమెరికా మార్కెట్లోకి తరలిస్తున్నట్లు భావించవచ్చు. ఈ నేపథ్యంలో ఈ వారం ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్లు తీసుకోబోయే నిర్ణయాలు, వెలువరించే సంకేతాలు భారత్ వంటి వర్థమాన మార్కెట్కు కీలకం కానున్నాయి. ఇక ప్రధాన సూచీల సాంకేతికాంశాలు ఇలా వున్నాయి.... సెన్సెక్స్ సాంకేతికాలు.. జూన్ 8తో ముగిసిన వారం ప్రథమార్థంలో గత మార్కెట్ పంచాంగంలో సూచించిన అంచనాలకు అనుగుణంగా 34,785 పాయింట్ల కనిష్టస్థాయివరకూ క్షీణించిన బీఎస్ఈ సెన్సెక్స్...ద్వితీయార్థంలో 35,628 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 216 పాయింట్ల లాభంతో 35,443 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. దాదాపు ఇదేస్థాయి 35,440 పాయింట్లు సెన్సెక్స్కు కీలకమైనది. ఈ స్థాయిపైన బుల్లిష్గానూ, దిగువన బేరిష్గానూ ట్రేడ్కావొచ్చు. ఈ వారం మార్కెట్ పెరిగితే 35,630 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఆ స్థాయిని చేదిస్తే 35,990 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగే చాన్స్ వుంటుంది. 35,440 పాయింట్ల దిగువన కొనసాగితే తిరిగి 35,260 పాయింట్ల వద్దకు పతనం కావొచ్చు. ఈ లోపున ముగిస్తే 34,800 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే 34,340 పాయింట్ల వరకూ పడిపోవొచ్చు. సమీప భవిష్యత్తులో ఈ మూడో మద్దతు మార్కెట్కు కీలకమైనది. ఈ స్థాయిని వదులుకుంటే ఏప్రిల్ తొలివారం నుంచి కొనసాగుతున్న అప్ట్రెండ్ ముగిసినట్లేనని టెక్నికల్ చార్టులు వెల్లడిస్తున్నాయి. నిఫ్టీకి 10,765 స్థాయి కీలకం ఎన్ఎస్ఈ నిఫ్టీ గతవారం ప్రథమార్థంలో గత కాలమ్లో ప్రస్తావించిన అంచనాలకు అనుగుణంగా 10,551 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన తర్వాత 10,818 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 72 పాయింట్ల లాభంతో 10,768 పాయింట్ల వద్ద ముగిసింది. సమీప భవిష్యత్తులో నిఫ్టీకి 10,765 పాయింట్ల స్థాయి కీలకమైనది. ఈ వారం ఈ స్థాయిపైన స్థిరపడితే 10,835 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన ముగిస్తే 10,930 పాయింట్ల వరకూ పెరిగే చాన్స్ వుంటుంది. ఈ వారం 10,765 స్థాయి దిగువన కొనసాగితే 10,720 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ లోపున ముగిస్తే 10,550పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ స్థాయిని కూడా కోల్పోతే 10,420 పాయింట్ల స్థాయి వరకూ పతనం కొనసాగవచ్చు. ఈ చివరి మద్దతును కోల్పోతే మాత్రం మార్కెట్ తిరిగి బేర్స్ గుప్పిట్లో చిక్కుకోవొచ్చు. -
అయిదేళ్లలో రూ. లక్ష కోట్ల మోసాలు
న్యూఢిల్లీ: గడిచిన అయిదేళ్లలో 23,000 పైచిలుకు బ్యాంక్ మోసాల కేసులు నమోదైనట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. వీటి పరిమాణం మొత్తం రూ. లక్ష కోట్ల పైగా ఉంటుందని పేర్కొంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఫ్రాడ్ కేసుల సంఖ్య 5,000 పైచిలుకు ఉండగా, 2017–18లో ఇవి 5,152కి పెరిగాయని సమాచార హక్కు కింద దాఖలైన దరఖాస్తుకు సమాధానంగా ఆర్బీఐ వెల్లడించింది. 2017 ఏప్రిల్ నుంచి 2018 మార్చి 1 దాకా వచ్చిన కేసుల్లో అత్యధికంగా రూ. 28,459 కోట్ల మేర మోసాలు నమోదైనట్లు పేర్కొంది. 2016–17లో 5,076 కేసుల్లో ఈ పరిమాణం రూ. 23,933 కోట్లు. ఆయా కేసులపై సత్వరం చర్యలు తీసుకోవడం జరిగిందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో రూ. 13,000 కోట్ల స్కామ్ దరిమిలా సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొదలైనవి భారీ కుంభకోణాలపై దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈ వివరాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
అనధికారిక లావాదేవీల నుంచి భద్రత కల్పించాలి
చెన్నై: డిజిటల్ మాధ్యమం వినియోగం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అనధికారిక లావాదేవీల నుంచి వినియోగదారులకు భద్రత కల్పించేలా తగు వ్యవస్థను ఏర్పాటు చేయాలని రిజర్వ్ బ్యాంకును, కేంద్ర ఆర్థిక శాఖను అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) కోరింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్, ఆర్థిక శాఖకు మెమోరాండం సమర్పించింది. డిజిటల్ లావాదేవీలు జరిపేలా ఖాతాదారులను కేంద్రం మరింతగా ప్రోత్సహిస్తున్నప్పటికీ... అనధికారిక లావాదేవీల నుంచి ఖాతాదారులకు తగినంత భద్రత కల్పించేలా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు భారత బ్యాంకుల్లో లేవని ఏఐబీఈఏ తెలిపింది. ఈ నేపథ్యంలో కస్టమర్లకు భద్రత కల్పించేలా తగు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, ఈ దిశగా ఆర్బీఐ మాస్టర్ సర్క్యులర్ జారీ చేయాలని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం కోరారు. అలాగే, టెలికంలో విజయవంతమైన నంబర్ పోర్టబిలిటీ తరహాలోనే బ్యాంకింగ్లోనూ అకౌంటు పోర్టబిలిటీని ప్రవేశపెట్టాలన్నారు. అలాగే, ఖాతాదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ఖచ్చితమైన గడువు, లోపభూయిష్ట సేవలకు పెనాల్టీ విధించడం వంటి నిబంధనలతో చార్టర్ ఆఫ్ కస్టమర్ రైట్స్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని వెంకటాచలం తెలిపారు. -
రిటైల్ ద్రవ్యోల్బణం అయిదు నెలల కనిష్టానికి..
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం తాజాగా అయిదు నెలల కనిష్టానికి తగ్గి మార్చిలో 4.28 శాతానికి పరిమితమైంది. ఇది ఫిబ్రవరిలో 4.44 శాతం. గతేడాది మార్చిలో 3.89 శాతం ధరల పెరుగుదలతో పోలిస్తే మాత్రం ఈసారి అధికంగానే ఉండటం గమనార్హం. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతున్నప్పటికీ.. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత 4 శాతం లక్ష్యానికన్నా పైనే కొనసాగుతోంది. 2017 అక్టోబర్లో చివరిసారిగా నాలుగు శాతానికి దిగువన 3.58 శాతంగా ఇది నమోదైంది. ద్రవ్యోల్బణం గణాంకాలను బట్టే ఆర్బీఐ పాలసీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ధరల పెరుగుదలపై సందేహాలతోనే ఇటీవలి పాలసీ సమీక్షలో కీలక రేట్లను య«థాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. కేంద్ర గణాంకాల విభాగం (సీఎస్వో) గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కూరగాయల విభాగంలో ధరల పెరుగుదల ఫిబ్రవరిలో 17.57 శాతంగా ఉండగా.. మార్చిలో 11.7 శాతానికి తగ్గింది. ఇక గుడ్లు, పాలు, ఇతర ఉత్పత్తుల రేట్లు కూడా నెమ్మదించాయి. మొత్తం మీద ఆహార పదార్థాల విభాగానికి సంబంధించి ధరల పెరుగుదల ఫిబ్రవరిలో 3.26 శాతంగా ఉండగా.. గత నెల 2.81 శాతానికి తగ్గింది. ఇంధనం, విద్యుత్కి సంబంధించిన ద్రవ్యోల్బణం కూడా నెలవారీ ప్రాతిపదికన చూస్తే 5.73 శాతానికి పరిమితమైంది. -
ఎన్నికల దారిలో కరెన్సీ!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్దమొత్తంలో పంపుతున్న నగదు ఏమవుతోంది? ఎటు పోతోంది? ఎవరు దాచుకుంటున్నారు? ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ నేతలు, బడాబాబులు ముందుగానే భారీ మొత్తంలో పెద్ద నోట్లను నిల్వ చేసుకున్నారా? కర్ణాటక ఎన్నికలకు ఇక్కడ్నుంచే నగదు తరలివెళ్తోందా? తెలంగాణ, ఏపీలో నగదు కష్టాలకు అసలు కారణాలు ఇవేనని అటు బ్యాంకర్లు.. ఇటు ఆర్బీఐ అధికారులు అనుమానిస్తున్నారు. ఇరు రాష్ట్రాలకు ఎంత నగదు పంపినా.. సగానికిపైగా ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులే వేలాడుతున్నాయి. స్వయంగా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి కరెన్సీ కొరత తీవ్రతను అంగీకరించింది. రాష్ట్రంలో అత్యధిక ఏటీఎంలు ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతులెత్తేసింది. సగానికిపైగా ఏటీఎంలను అనధికారికంగా మూసివేసింది. మూడు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర రాజధాని నుంచి జిల్లా కేంద్రాలను వెతుక్కుంటూ తిరిగినా ఏటీఎంలలో డబ్బుల్లేవు. ఖాతాదారులకు అత్యవసరమై బ్యాంకుకు వెళ్లినా రూ.10 వేలకు మించి డబ్బులు ఇవ్వడం లేదు. పెద్ద నోట్లను రద్దు చేసి ఏడాదిన్నర అవుతున్నా ఈ పరిస్థితి మారకపోవడం గమనార్హం. మూడు నెలలుగా కొరత తీవ్రం తెలుగు రాష్ట్రాల్లో మూడు నెలలుగా నగదు కొరత తీవ్రతరమైంది. ప్రజల డిమాండ్కు సరిపడేంత నగదు పంపాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా ఆర్బీఐకి లేఖలు రాశాయి. మొన్నటివరకు రాష్ట్రంలో నగదు లేకపోవటంతో ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి డబ్బు తెచ్చి ఏటీఎంలలో అందుబాటులో ఉంచారు. జనవరి, ఫిబ్రవరిలో నగదు విత్డ్రా అంచనాలకు మించి పెరిగిపోయింది. ఆర్బీఐ అనుమతి తీసుకుని మహారాష్ట్ర, కేరళలోని తిరువనంతపురం నుంచి హైదరాబాద్కు నగదు తెప్పించినట్లు ఎస్బీఐ అధికారులు చెబుతున్నారు. మార్చి నెల ఆర్థిక సంవత్సరాంతం కావటంతో మిగతా రాష్ట్రాల నుంచి డబ్బు తీసుకోవటం కష్టంగా ఉందని వారు పేర్కొంటున్నారు. ఏటీఎంలలో గతంలో 95 శాతం మేర నగదు ఉండేదని, ఇప్పుడు అది 60 శాతానికి పడిపోయిందని అంగీకరిస్తున్నారు. వెయ్యి కోట్లు కావాలని ఇండెంట్ పెడితే ఆర్బీఐ నుంచి అందులో సగమే వస్తోందని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇక్కడే కొరత ఎందుకు? ఇరుగు పొరుగు రాష్ట్రాలకు మించిన నోట్ల కొరత తెలుగు రాష్ట్రాల్లో నెలకొనడంపై ఆర్బీఐ సైతం విస్మయం వ్యక్తం చేస్తోంది. గతేడాది ఏప్రిల్ నుంచి మార్చి మొదటి వారం వరకు హైదరాబాద్ రిజర్వ్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయానికి ఆర్బీఐ రూ.53 వేల కోట్లు పంపింది. పెద్దనోట్ల రద్దు నుంచి ఇప్పటివరకు రూ.83 వేల కోట్లు పంపిణీ చేసింది. దేశంలోని మొత్తం ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోకెల్లా ఇదే అత్యధికమని అధికారులు చెబుతున్నారు. ఇంత డబ్బు తెలుగు రాష్ట్రాలకు చేరుతున్నా బ్యాంకుల్లో, ఏటీఎమ్ల్లో కొరత ఎందుకుందనే సందేహాలు వెంటాడుతున్నాయి డిపాజిట్లు నిల్.. విత్డ్రాలు ఫుల్.. నోట్ల రద్దు అనంతరం ఖాతాదారులకు బ్యాంకుల పట్ల అభద్రతా భావం పెరిగింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఖాతాదారులు తాము చేసిన పొదుపు డబ్బును సైతం బ్యాంకుల నుంచి ఉపసంహరించుకుంటున్నారు. బ్యాంకుల నుంచి బయటికి వెళ్లిన కరెన్సీ తిరిగి బ్యాంకులకు రావడం లేదు. జీఎస్టీ తర్వాత డిజిటల్ లావాదేవీలు జరిగితే ఐటీ కట్టాలనే భయంతో వ్యాపారులు నగదు వాడకాన్నే ప్రోత్సహించడం కొరతకు మరో కారణం. నగదు విత్ డ్రాలు పెరగడంతో పాటు డిపాజిట్లు బాగా తగ్గిపోయాయి. వేతన జీవులు కూడా ఒకేసారి డబ్బును డ్రా చేసుకుంటున్నారు. దీంతో బ్యాంకులు, ఏటీఎంలలో నగదుకు కటకట తప్పటం లేదని ఎస్బీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. ఇటీవల కేంద్రం తెచ్చిన ఎఫ్ఆర్డీఐ ఫైనాన్షియల్ రెజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ (ఎఫ్ఆర్డీఐ) బిల్లుతో డిపాజిటర్లలో లేనిపోని భయం పట్టుకుంది. దీంతో బ్యాంకుల నుంచి ఎక్కువ మంది సొమ్ము విత్డ్రా చేసుకున్నారు. ఈ బిల్లు కారణంగా బ్యాంకులు నష్టపోతే తీసుకునే చర్యల్లో డిపాజిటర్లు కూడా కొంత భరించాల్సి ఉంటుందనే ప్రతిపాదన ఉన్నట్టు ప్రచారం జరిగింది. అదేమీ లేదని కేంద్రం స్పష్టత ఇచ్చినా ఖాతాదారుల్లో భయాందోళనలు తగ్గలేదు. కర్ణాటక వైపు కరెన్సీ! గతేడాది సెప్టెంబర్ నుంచే ఆర్బీఐ రూ.2 వేల నోట్లను బ్యాంకులకు సరఫరా చేయటం లేదు. మరోవైపు ఖాతాదారుల నుంచి కూడా ఈ నోట్లు బ్యాంకులకు రావడం లేదు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అన్ని పార్టీలు, బడా రాజకీయ బాబులు పెద్ద నోట్లను ఇప్పటికే భారీ ఎత్తున దాచిపెట్టినట్టు ఆరోపణలున్నాయి. కర్ణాటకలో మే నెలలో ఎన్నికలు జరుగనున్నాయి. అక్కడ రాజకీయ పార్టీల ప్రచారం మొదలైంది. ఎన్నికలకు భారీ ఖర్చు పెట్టేందుకు పోటీ పడుతున్న అక్కడి నేతలు ఇప్పటికే నగదును సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణ నుంచి భారీ మొత్తం కర్ణాటకకు తరలివెళ్లినట్లు తెలుస్తోంది. నేతలతో సన్నిహిత సంబంధాలున్న బడా కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులు వీలైనంత డబ్బును ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి పంపినట్లు ప్రచారం జరుగుతోంది. -
రాజన్... ‘క్రియా’ యూనివర్సిటీ వస్తోంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నారు. కొందరు కార్పొరేట్లతో కలిసి యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీరిలో జేఎస్డబ్లు్య గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఉన్నారు. చిత్తూరు జిల్లా శ్రీసిటీలో రానున్న ఈ యూనివర్సిటీకి ‘క్రియా’ అని పేరు పెట్టారు. క్రియా యూనివర్సిటీకి తొలుత రూ.750 కోట్ల నిధులు సమకూరతాయని ఇండస్ఇండ్ బ్యాంక్ చైర్మన్, యూనివర్సిటీ సూపర్వైజరీ బోర్డు చైర్మన్ ఆర్.శేషసాయి ముంబైలో తెలిపారు. దాతృత్వంలో భాగంగా కార్పొరేట్లు ఈ యూనివర్సిటీకి ఖర్చు చేస్తారన్నారు. యూనివర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ సలహాదారుగా రఘురామ్ రాజన్ వ్యవహరిస్తారు. యూనివర్సిటీ ఆఫ్ షికాగోకు చెందిన బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఫైనాన్స్ సబ్జెక్టును రాజన్ బోధిస్తున్న సంగతి తెలిసిందే. క్లాసులు 2019 నుంచి..: యూనివర్సిటీలో 2019 జూలై నుంచి తొలి బ్యాచ్ ప్రారంభమవుతుంది. హాస్టల్ వసతితో కలిపి ఫీజు రూ.7–8 లక్షలు ఉండనుంది. లిబరల్ ఆర్ట్స్, సైన్సెస్లో బీఏ హానర్స్, బీఎస్సీ హానర్స్ డిగ్రీ కోర్సులు ఆఫర్ చేస్తారు. మెరిట్ ఆధారంగానే అడ్మిషన్లుంటాయి. తాత్కాలికంగా శ్రీసిటీలోని ఐఎఫ్ఎంఆర్ క్యాంపస్లో క్లాసులు ప్రారంభిస్తారు. తర్వాత సొంత భవనంలోకి మారుస్తారు. 200 ఎకరాల్లో నిర్మించే క్రియా యూనివర్సిటీ సొంత భవనం 2020 నాటికి సిద్ధమవుతుంది. ప్రపంచ అభివృద్ధిలో పాలుపంచుకునే నవతరం భారతీయులను ఇక్కడ తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా రాజన్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు అందుబాటులో లేని, భవిష్యత్కు అవసరమైన విద్యావిధానం తీసుకొస్తామని చెప్పారు. కాగా, జిందాల్, మహీంద్రాలు యూనివర్సిటీ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారు. పద్మభూషణ్ నారాయణన్ వఘుల్ కౌన్సిల్ చైర్మన్గా వ్యవహరిస్తారు. విద్యావేత్త సుందర్ రామస్వామి వైస్ చాన్స్లర్గా ఉంటారు. యూనివర్సిటీ ప్రకటన సందర్భంగా రాజన్, ఆనంద్ మహీంద్రా, సజ్జన్ జిందాల్ తదితరులు -
ఎల్వోయూలపై నిషేధంతో చిన్న సంస్థలకు దెబ్బ
న్యూఢిల్లీ: లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ (ఎల్వోయూ)ని రిజర్వ్ బ్యాంక్ నిషేధించడం.. వ్యాపారాలపై తక్షణ ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా చిన్న వ్యాపార సంస్థలు.. మరింతగా నిర్వహణ మూలధనాన్ని సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో రూ. 13,000 కోట్ల కుంభకోణం దరిమిలా దిగుమతిదారులు రుణ సదుపాయం పొందేందుకు ఉపయోగపడే ఎల్వోయూలను ఇకపై జారీ చేయొద్దంటూ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించిన నేపథ్యంలో పరిశ్రమ వర్గాల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆర్బీఐ నిర్ణయం దిగుమతి సంస్థల కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తుందని, చాన్నాళ్లుగా ఎల్వోయూల ఆధారంగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న ట్రేడర్లు తాజా పరిణామంతో తప్పనిసరిగా లెటర్స్ ఆఫ్ క్రెడిట్, బ్యాంక్ గ్యారంటీ వంటి సాధనాల వైపు మళ్లాల్సి వస్తుందని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్ శోభన కామినేని పేర్కొన్నారు. మరోవైపు, కుంభకోణాల్లాంటి వాటిని అరికట్టేందుకు ఈ సాధనాలను నిషేధించడం పరిష్కార మార్గం కాదని పీహెచ్డీ చాంబర్ ప్రెసిడెంట్ అనిల్ ఖేతాన్ వ్యాఖ్యానించారు. లావాదేవీలకు అనుగుణంగా మూలధనాన్ని నిర్వహించుకునే చిన్న తరహా సంస్థలపై ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. తాజా పరిణామంతో అవి మరింత అధిక నిర్వహణ మూలధనాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుందని లేకపోతే భారీగా నష్టపోవాల్సి వస్తుందని ఖేతాన్ వివరించారు. విధానకర్తలు జాగ్రత్తగా వ్యవహరించాలి: సన్యాల్ న్యూఢిల్లీ: నీరవ్ మోదీ స్కామ్ నేపథ్యంలో బ్యాంకులు ఎల్వోయూలు జారీ చేయకుండా ఆర్బీఐ నిషేధం విధించిన నేపథ్యంలో ఈ తరహా చర్యల విషయంలో జాగ్రత్తగా వ్యహరించాలని ప్రధానమంత్రి ముఖ్య ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ విధాన కర్తలకు సూచించారు. ఒక మార్గాన్ని మూసివేసే చర్య మిగిలిన వ్యవస్థకు పాకకుండా చూడాలని, ఎందుకంటే సిలో వ్యవస్థ (ఇతర వ్యవస్థలతో అనుసంధానం కాని)తో వ్యవహరించడం లేదని గుర్తు చేశారు. -
ఎల్వోయూల జారీపై నిషేధం
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో రూ. 13,000 కోట్ల మేర లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ (ఎల్వోయూ) కుంభకోణం దరిమిలా రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు ఎల్వోయూలు జారీ చేయడాన్ని నిషేధించింది. వాణిజ్య రుణాలకు సంబంధించి బ్యాంకులు.. ఎల్వోయూలు, లెటర్స్ ఆఫ్ కంఫర్ట్ (ఎల్వోసీ)ల జారీ చేయడాన్ని నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ తెలిపింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని వివరించింది. మార్గదర్శకాలను పునఃసమీక్షించిన అనంతరం.. కేటగిరీ–1 బ్యాంకులు ఎల్వోయూలు/ఎల్వోసీలు జారీ చేసే విధానాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఒక నోటిఫికేషన్లో తెలిపింది. అయితే, దిగుమతులకు సంబంధించి వివిధ సంస్థల రుణ అవసరాల కోసం లెటర్స్ ఆఫ్ క్రెడిట్, బ్యాంక్ గ్యారంటీల జారీని బ్యాంకులు య«థాప్రకారం కొనసాగించవచ్చని పేర్కొంది. పీఎన్బీ అధికారులతో కుమ్మక్కై తీసుకున్న ఎల్వోయూల ఆధారంగా వజ్రాభరణాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ.. దాదాపు రూ. 13,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రస్తుతం సీబీఐ, ఈడీ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఆర్బీఐ తాజా నిబంధనలతో ఎక్కువగా ఎల్వోయూలమీదే ఆధారపడే వ్యాపార సంస్థలపై ప్రతికూల ప్రభావం పడనుంది. అయితే, బ్యాంక్ గ్యారంటీలు, లెటర్ ఆఫ్ క్రెడిట్ విధానం యథాప్రకారం కొనసాగనున్నందున వాణిజ్యంపై పెద్దగా ప్రభావం ఉండబోదని ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ పేర్కొన్నారు. ఎల్వోయూలను ఎక్కువగా వజ్రాభరణాల రంగంలోని పెద్ద సంస్థలే ఉపయోగిస్తాయని ఆయన తెలిపారు. మరోవైపు, నీరవ్ మోదీ 2011 మార్చి 10న ముంబైలోని పీఎన్బీ బ్రాడీ హౌస్ శాఖ నుంచి తొలిసారిగా ఎల్వోయూ తీసుకున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభకు తెలిపారు. ఆ తర్వాత 74 నెలల వ్యవధిలో ఏకంగా 1,212 ఎల్వోయూలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
కుంభకోణంపై నాలుగు రోజులకే సీబీఐకి ఫిర్యాదు
వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ కుంభకోణాన్ని గుర్తించిన నాలుగు రోజుల్లోనే ఇటు రిజర్వ్ బ్యాంక్కు అటు సీబీఐకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పది రోజులకు స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. రూ. 11,400 కోట్ల భారీ కుంభకోణంపై వివరణ ఇవ్వాలంటూ స్టాక్ ఎక్స్చేంజీలు సూచించిన మీదట పీఎన్బీ ఈ విషయాలు వెల్లడించింది. మోసం చోటుచేసుకున్న పరిణామక్రమాన్ని వివరించింది. మోదీ, ఆయన కంపెనీలు నకిలీ బ్యాంక్ గ్యారంటీలను ఏ విధంగా ఉపయోగించుకుని విదేశాల్లోని భారతీయ బ్యాంకుల శాఖల నుంచి రుణాలను తీసుకుని, మోసానికి పాల్పడినదీ స్టాక్ ఎక్స్చేంజీలకు పీఎన్బీ సవివరంగా తెలియజేసింది. పరిణామక్రమం ఇదీ.. ♦ 2018 జనవరి 25న పీఎన్బీ ఈ స్కామ్ను గుర్తించింది. జనవరి 29న రిజర్వ్ బ్యాంక్కు ఫ్రాడ్ రిపోర్టు సమర్పించింది. అదే రోజున ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ సీబీఐకి క్రిమినల్ కంప్లైంటు కూడా ఇచ్చింది. ఫిబ్రవరి 5న స్టాక్ ఎక్సే్చంజీలకు ఈ మోసం గురించి తెలియజేసింది. ♦ మళ్లీ ఫిబ్రవరి 7న ఆర్బీఐకి మరో ఫ్రాడ్ రిపోర్టును సమర్పించింది. అదే రోజున సీబీఐకి ఇంకో ఫిర్యాదు కూడా చేసింది. ఫిబ్రవరి 13న నీరవ్ మోదీ గ్రూప్, గీతాంజలి గ్రూప్, చంద్రి పేపర్ అండ్ అలైడ్ ప్రోడక్ట్స్ సంస్థలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కూడా పీఎన్బీ ఫిర్యాదు చేసింది. వీటి గురించి ఆ మరుసటి రోజున స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. ఫిర్యాదుల సారాంశం ఇదీ.. ♦ పీఎన్బీ ముంబై శాఖలోని ఫారిన్ ఎక్సే్చంజీ విభాగంలో డిప్యుటీ జీఎంగా పనిచేసిన గోకుల్నాథ్ శెట్టి (ప్రస్తుతం రిటైర్డ్) తదితర ఉద్యోగులతో మోదీ, ఆయనకు చెందిన కంపెనీలు కుమ్మక్కయ్యాయి. ముత్యాల దిగుమతికి నిధుల అవసరాల పేరిట పీఎన్బీ నుంచి మోసపూరితంగా 1.77 బిలియన్ డాలర్ల విలువ చేసే గ్యారంటీలు పొందాయి. వాటిని ఉపయోగించుకుని విదేశాల్లోని భారతీయ బ్యాంకుల శాఖల నుంచి రుణాలు తీసుకున్నాయి. ♦ ఆ తర్వాత 2018 జనవరి 16న ముంబైలోని బ్రాడీ హౌస్ పీఎన్బీ శాఖకు దిగుమతి పత్రాలతో వచ్చిన నీరవ్ మోదీ గ్రూప్నకు చెందిన సంస్థలు .. విదేశీ సరఫరాదారులకు చెల్లింపులు జరిపేందుకు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాలంటూ కోరాయి. అప్పటికి శెట్టి రిటైరయ్యారు. 100 శాతం నగదు మార్జిన్ లేనందున లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ (ఎల్వోయూ) ఇవ్వడం కుదరదంటూ పీఎన్బీ సిబ్బంది.. మోదీ సంస్థలకు స్పష్టం చేశాయి. అయితే, తాము చాలా ఏళ్లుగా ఇలాంటి వెసులుబాటు పొందుతున్నామంటూ సదరు సంస్థలు వెల్లడించాయి. దీంతో .. పీఎన్బీ వెంటనే ఈ అంశాన్ని పరిశీలించింది. గతంలో కూడా ఎల్వోయూలు జారీ అయినట్లు గుర్తించింది. వాటి ఆధారంగా రుణాలు ఇవ్వాలంటూ.. బ్యాంకు అంతర్గత వ్యవస్థలో ఎక్కడా నమోదు చేయకుండా స్విఫ్ట్ విధానం ద్వారా విదేశీ బ్యాంకులకు సందేశాలు వెళ్లినట్లు గుర్తించింది. ♦ ఇవన్నీ బైటపడటంతో .. సదరు మొత్తాలను చెల్లించాలంటూ మోదీ గ్రూప్, గీతాంజలి గ్రూప్ వర్గాలతో ఢిల్లీ, ముంబైలలో పీఎన్బీ చర్చలు జరిపింది. అటుపైన నీరవ్ మోదీకి చెందిన మూడు గ్రూప్ సంస్థల ప్రమేయమున్న రూ. 280 కోట్ల మోసానికి సంబంధించి 2018 జనవరి 29న ఎఫ్ఎంఆర్–1 (మోసాలపై ఫిర్యాదు చేసేందుకు ఆర్బీఐ నిర్దేశిత ఫార్మాట్)ను రిజర్వ్ బ్యాంక్కు సమర్పించింది. అటుపై ఫిబ్రవరి7న గీతాంజలి గ్రూప్నకు చెందిన రెండు కంపెనీలు మోసపూరితంగా తీసుకున్న సుమారు రూ. 65.25 కోట్ల ఎల్వోయూలు మెచ్యూర్ కావడంతో మరో రిపోర్టును ఆర్బీఐకి పంపింది. హాంకాంగ్లోని అలహాబాద్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు శాఖల నుంచి ఈ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం కోరింది. -
వేగంగా మొండిబాకీల పరిష్కారం
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్న మొండిబాకీల సమస్యను మరింత వేగవంతంగా పరిష్కరించే దిశగా రిజర్వ్ బ్యాంక్ మరిన్ని చర్యలు చేపట్టింది. మొండిబాకీలుగా మారే ఖాతాలను బ్యాంకులు మరింత ముందుగానే గుర్తించి, సత్వరం తగు చర్యలు తీసుకునే విధంగా నిబంధనలను కఠినతరం చేసింది. ప్రస్తుతం అమలు చేస్తున్న పలు రుణ పునర్వ్యవస్థీకరణ స్కీములను రద్దు చేసింది. సవరించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం రూ.2,000 కోట్లకు పైగా రుణాలు తీసుకున్న సంస్థ ఖాతా మొండిపద్దుగా మారిన పక్షంలో.. డిఫాల్ట్ అయిన నాటి నుంచి 180 రోజుల్లోగా బ్యాంకులు పరిష్కార ప్రణాళిక అమలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కుదరకపోతే దివాలా చట్టం కింద సత్వరం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నిర్దేశిత మార్గదర్శకాలను ఉల్లంఘించే బ్యాంకులపై జరిమానాలు కూడా విధించడం జరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. వారంవారీ నివేదికలు.. ప్రస్తుతం అమల్లో ఉన్న కార్పొరేట్ రుణ పునర్వ్యవస్థీకరణ పథకం, వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణ పథకం (ఎస్డీఆర్) తదితర స్కీమ్లను రిజర్వ్ బ్యాంక్ ఉపసంహరించింది. ఈ స్కీములు ఇంకా అమల్లోకి రాని మొండిబాకీల ఖాతాలన్నింటికీ కొత్త మార్గదర్శకాలు వర్తిస్తాయని పేర్కొంది. మొండిబాకీల పరిష్కారానికి ఉద్దేశించిన జాయింట్ లెండర్స్ ఫోరం (జేఎల్ఎఫ్) విధానాన్ని కూడా ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులన్నీ ప్రతి నెలా సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (సీఆర్ఐఎల్సీ)కి నివేదిక పంపించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం రూ.5 కోట్లకు పైగా రుణాలు తీసుకున్న రుణగ్రహీతల డిఫాల్ట్ల వివరాలను బ్యాంకులు ప్రతి శుక్రవారం తెలియజేయాలి. ఒకవేళ శుక్రవారం సెలవైతే అంతకు ముందు రోజు పంపాలి. వారం వారీ నివేదికల నిబంధన ఫిబ్రవరి 23 నుంచే అమల్లోకి వస్తుంది. ఒక్క దెబ్బతో ప్రక్షాళన..: కొత్త నిబంధనలు డిఫాల్టర్లకు ‘మేల్కొలుపు’ లాంటివని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. మొండిబాకీల సమస్య పరిష్కారాన్ని పదే పదే వాయిదా వేయకుండా, ఒక్క దెబ్బతో ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. బ్యాంకుల ప్రొవిజనింగ్ నిబంధనలపై ఆర్బీఐ నిర్ణయం పెద్దగా ప్రభావం చూపబోదని రాజీవ్ కుమార్ తెలిపారు. మొండిబాకీలుగా మారే అవకాశమున్న పద్దులను బ్యాంకులు మరింత ముందుగా గుర్తించి, నిర్దిష్ట గడువులోగా పరిష్కార ప్రణాళికలను అమలు చేసేలా కొత్త మార్గదర్శకాలు దోహదపడతాయని ఆయన చెప్పారు. 2017 సెప్టెంబర్ 30 నాటికి స్థూలంగా ఎన్పీఏలు ప్రభుత్వ బ్యాంకుల్లో రూ. 7,33,974 కోట్ల మేర, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో రూ. 1,02,808 కోట్ల మేర పేరుకుపోయిన సంగతి తెలిసిందే. భారీగా పేరుకుపోయిన మొండిబాకీల సమస్య పరిష్కారం కోసం రిజర్వ్ బ్యాంక్కు ప్రభుత్వం మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. జీఎస్టీతో త్వరలో పన్నుల పంట! పటిష్ట చర్యలతో నెలకు రూ. లక్ష కోట్లపైన వసూళ్ల అంచనా న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ద్వారా పన్నుల వసూళ్లు వచ్చే ఆర్థిక సంవత్సరం (2018–19) చివరికల్లా గణనీయంగా పెరుగుతాయన్న విశ్వాసాన్ని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. పన్ను ఎగవేతల నివారణకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలన్నీ త్వరలోనే ఫలించబోతున్నాయని, దీనితో వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికల్లా జీఎస్టీ వసూళ్లు నెలకు సగటున లక్ష కోట్ల రూపాయలు దాటడం ఖాయమని వారు అంచనావేస్తున్నారు. పన్ను డేటాను అన్ని కోణాల్లో సరిచూసుకోవడం, ఈ–వే బిల్ వంటి పన్ను ఎగవేత నిరోధక చర్యలను ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తున్నారు. జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్ ప్రక్రియ ఒకసారి పూర్తిగా స్థిరీకరణ జరిగితే, దాఖలైన ఆదాయపు పన్ను రిట ర్న్స్తో జీఎస్టీ ఫైలింగ్ డేటాబేస్ మొత్తాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ అనలటిక్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ (డీజీఏఆర్ఎం) మదింపుచేయగలుగుతుందని, దీనితో ఎగవేతలకు ఆస్కారం లేని పరిస్థితి ఏర్పడుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటి అంచనాలు ఇలా... 2018–19తో జీఎస్టీ ద్వారా దాదాపు రూ.7.44 లక్షల కోట్లు వసూలు కావాలని బడ్జెట్ నిర్దేశించుకుంది. జూలైలో జీఎస్టీ ప్రారంభమైననాటి నుంచీ ఇప్పటి వరకూ (దాదాపు ఎనిమిది నెలలు) జీఎస్టీ వసూళ్ల అంచనా రూ.4.44 లక్షల కోట్లు. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఈ పరిమాణం మరింత పెరగడం ఖాయమన్నది నిపుణుల విశ్లేషణ. 2017 డిసెంబర్ నాటికి దేశంలోని 98 లక్షల వ్యాపార సంస్థలు జీఎస్టీ కింద రిజిస్టర్ అయ్యాయి. బంగారంపై దృష్టి... పసిడి, ఆభరణాల పరిశ్రమలో పన్నుల వసూళ్లకు సంబంధించి చోటుచేసుకుంటున్న లోపాలపై కూడా ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారిస్తోందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ‘‘10% కస్టమ్స్ సుంకం ఉన్నప్పటికీ, పసిడి దిగుమతులు ప్రతినెలా పెరుగుతున్నాయి. అయితే దిగుమతి అయి న ఈ బంగారం ఎటు పోతోంది? తుది సరఫరాదారు ఎవరన్న విషయాన్ని జీఎస్టీ వల్ల గుర్తించగలుగుతాం’’అని ఉన్నతాధికారి తెలిపారు. -
బ్యాంక్ డిపాజిట్లలో ‘ఇంటి’ వాటా ఇంతింత!
ముంబై: పెద్ద నోట్ల రద్దు.. బ్యాంకు డిపాజిట్లలో కుటుంబాల వాటాను దాదాపు రెండు శాతం పెంచింది. రిజర్వ్ బ్యాంక్ గురువారం విడుదల చేసిన గణాంకాలు చూస్తే... ౌ 2015–16లో మొత్తం సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లలో కుటుంబాల వాటా 61.5 శాతం. అయితే ఇది 2016–17లో 63.2 శాతానికి చేరింది. అంటే కుటుంబాల బ్యాంకింగ్ డిపాజిట్ల వాటా ఈ కాలంలో దాదాపు 2 శాతం (200 బేసిస్ పాయింట్లు) పెరిగిందన్నమాట. 2016 నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ►ఇక ఆర్థిక సంవత్సరంలో మొత్తం డిపాజిట్లలో 11.20 శాతం వృద్ధి నమోదయ్యింది. విలువలో ఇది 1,09,43,700 కోట్లు. ఇందులో కేవలం కుటుంబ డిపాజిట్ల పరిమాణం చూస్తే... రూ.69,13,900 కోట్లు. 2015–16తో పోల్చితే ఈ సంఖ్య విషయంలో 14.14 శాతం వృద్ధి నమోదయ్యింది. ►వ్యక్తిగతంగా చూస్తే, సేవింగ్స్ డిపాజిట్లు గణనీయంగా పెరిగాయి. ఈ విలువ 30 శాతం వృద్ధితో రూ.26,78,200 కోట్లకు ఎగసింది. వ్యక్తిగతంగా దాదాపు 70 శాతం మంది సేవింగ్స్ డిపాజిట్స్నే ఎంచుకున్నారు. ఇది గతానికన్నా భిన్నమైన ధోరణి. ►కుటుంబ డిపాజిట్లతో పాటు, ప్రభుత్వ రంగాల నుంచి డిపాజిట్లూ పెరిగాయి. అయితే ఫైనాన్షియల్, విదేశీ డిపాజిట్లలో మాత్రం క్షీణత నమోదయ్యింది. ►రాష్ట్రాల వారీగా మొత్తం డిపాజిట్ల వాటాను చూస్తే, మొత్తం డిపాజిట్లలో 20.4 శాతం వాటాతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. 10 శాతం వాటాతో ఢిల్లీ ఎన్సీఆర్ ద్వితీయ స్థానంలో ఉంది. ►ఒక్క కుటుంబ డిపాజిట్ల వృద్ధిని చూస్తే, ఉత్తరప్రదేశ్ 12.7%తో మొదటి స్థానంలో నిలిచింది. తరువాతి స్థానంల్లో మహారాష్ట్ర (9.5%), బెంగాల్ (8%) గుజరాత్ (7.1%) నిలిచాయి. -
ఖమ్మం డీసీసీబీ ‘ఉత్తుత్తి బ్యాంక్’!
సాక్షి, హైదరాబాద్: దశాబ్దం క్రితం తెలుగులో ఓ సినిమా వచ్చింది. అందులో ‘ఉత్తుత్తి బ్యాంకు’ అని ఓ బ్యాంకు ఏర్పాటు చేస్తారు. అప్పటికప్పుడు ఓ సెటప్ చేసి డబ్బు వసూళ్లు సాగిస్తారు. సరిగ్గా అదే తీరులో ఖమ్మం పూర్వ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పాలక వర్గం కూడా దర్జాగా ఒక సహకార బ్యాంకు బ్రాంచిని తెరిచి రైతుల నుంచి ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేసింది. దానికి రిజర్వు బ్యాంకు అనుమతి లేదు సరికదా కనీసం తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు (టెస్కాబ్)కు సమాచారం కూడా లేదు. టెస్కాబ్ జరిపిన విచారణలో ఈ విషయం బయటపడినట్లు సహకార శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు రైతుల నుంచి దర్జాగా వసూళ్లకు పాల్పడుతున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి నిర్మాణం రైతులకు రుణాలు, బ్యాంకు లావాదేవీలు జరపాల్సిన డీసీసీబీ.. ఒక ట్రస్టు ఏర్పాటు చేసి ఆసుపత్రి నిర్మించడం రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధం. ఖమ్మం డీసీసీబీ రైతు సంక్షేమ నిధి పేరుతో రైతులకిచ్చే పంట రుణాల నుంచి వసూళ్లకు పాల్పడిందని గతంలో జరిపిన విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. అలా రూ.8.11 కోట్లు వసూలు చేసి ఆసుపత్రి నిర్మించింది. అంతేగాక రైతు సంక్షేమ నిధి పేరిట పెద్ద ఎత్తున నిధులను ఆసుపత్రికి వెచ్చిస్తూ, వాహనాల కొనుగోళ్లకు భారీగా ఖర్చు చేస్తున్నారని కూడా ఆరోపణలున్నాయి. వసూలు చేసిన సొమ్మును రైతుల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నట్లు పాలకవర్గం ఇచ్చిన వివరణ రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధమని టెస్కాబ్ ఇప్పటికే స్పష్టంచేసింది. వచ్చే నెలాఖరుకు పాలకవర్గ కాలపరిమితి ముగియనుంది. ఆరోపణలు నిజమేనని తేలాక కూడా ప్రభుత్వం మౌనం వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. -
వృద్ధికి ఆర్బీఐనే అడ్డంకి!
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ అంచనాలు ఉండాల్సినదానికన్నా ఎక్కువగానే ఉంటాయని ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యురాలు ఆషిమా గోయల్ వ్యాఖ్యానించారు. ఇదే అంచనాలతో వడ్డీ రేట్లను తగ్గించటం లేదని, దీంతో ఎకానమీపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని ఆమె పేర్కొన్నారు. ‘‘ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆర్బీఐ అభిప్రాయం సరైనది కాదు. వడ్డీ రేట్లను అధిక స్థాయిలోనే ఉంచడం వల్ల ఉత్పత్తిని త్యాగం చేయాల్సిన పరిస్థితి నెలకొంది’’ అని ఆషిమా స్పష్టంచేశారు. ‘ఆర్బీఐ ఎప్పుడూ ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భావిస్తూ ఉంటుంది. అందుకని ద్రవ్యోల్బణంపై వారి అంచనాలు ఉండాల్సిన దానికంటే ఎక్కువ స్థాయిలోనే ఉంటాయి. ఇక వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉంచడం వల్ల ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయొచ్చన్న అభిప్రాయం కూడా వారికి ప్రతికూలంగానే పనిచేస్తోంది. ఇది వృద్ధికి విఘాతం కలిగించే తీరు అని రుజువైంది కూడా’’ అని ఇంటర్వ్యూలో ఆమె అభిప్రాయపడ్డారు. 2015 జనవరి నాటికల్లా రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) 8 శాతం స్థాయిలో ఉంటుందని 2014 ఏప్రిల్లో ఆర్బీఐ అంచనా వేసింది. అయితే, వాస్తవానికి ఇది 5.2 శాతానికే పరిమితమైంది. అలాగే 2016 మార్చి నాటికి సీపీఐ 5.8 శాతానికి ఉంటుందని అంచనా వేసినప్పటికీ.. ఇది 4.83 శాతం మాత్రమే నమోదైంది. అటు మార్చి 2017 కల్లా సీపీఐ 5 శాతంగా ఉండొచ్చని 2016 తొలినాళ్లలో అంచనా వేసినప్పటికీ.. 3.89 శాతానికే పరిమితమైంది. 2014 నుంచి ముడిచమురు రేట్లు తగ్గుతూ వచ్చినప్పటికీ.. ఈ తగ్గుదల నిలబడేది కాదని, ద్రవ్యోల్బణం ఇంకా.. ఇంకా పెరుగుతూనే ఉంటుందని ఆర్బీఐ విశ్వసిస్తూ వచ్చిందని ఆషిమా చెప్పారు. కమోడిటీల రేట్లే కీలకం.. వాస్తవానికి ద్రవ్యోల్బణం అనేది కమోడిటీలు, ఆహార వస్తువుల ధరల పెరుగుదలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని.. వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉంచడం వల్ల ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చనే అభిప్రాయం సరికాదని ఆషిమా చెప్పారు. ఇతరత్రా వేరే అంశాలతో పోలిస్తే.. అధిక వడ్డీ రేట్ల కన్నా కూడా చమురు ధరలు, ఆహార వస్తువుల రేట్లే ద్రవ్యోల్బణంపై ఎక్కువ ప్రభావం చూపుతాయని అధ్యయనాలు చెబుతున్నాయని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ కీలక పాలసీ రేట్లను మరింతగా తగ్గించేందుకు అవకాశాలు ఉన్నాయని ఆమె తెలిపారు. ‘రిటైల్ ద్రవ్యోల్బణం నిర్దేశిత నాలుగు శాతానికి లోబడే (రెండు శాతం అటూ ఇటుగా) ఉండనున్న నేపథ్యంలో కీలక పాలసీ రేటును మరో 100 బేసిస్ పాయింట్లు (1 శాతం) మేర తగ్గించేందుకు ఆర్బీఐకి వెసులుబాటు ఉంది‘ అని ఆషిమా వివరించారు. స్థూల డిమాండ్ తీరుతెన్నుల ఆధారంగా ఆర్బీఐ పనిచేస్తూ ఉంటుందని.. దేశీయంగా ప్రస్తుతం ఇది బలహీనంగా ఉందని ఆమె పేర్కొన్నారు. డిమాండ్ బలహీనంగా ఉండటం వల్ల ఉత్పత్తి కూడా తక్కువగానే ఉంటుందని.. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉంచడం వల్ల ముందుగా ఉత్పత్తిపైనే ప్రభావం పడుతోందే తప్ప ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం చూపడం లేదని ఆషిమా చెప్పారు. ఇటు వినియోగం, అటు పెట్టుబడులు మందగతిన ఉండటం వల్ల భారత్ ఈ ఆర్థిక సంవత్సరం 6.5 శాతం మాత్రమే వృద్ధి రేటు నమోదు చేయొచ్చని.. 2014 తర్వాత ఇదే అత్యంత తక్కువ కాగలదని ఆమె పేర్కొన్నారు. రికవరీ ఉంది కానీ... త్రైమాసికాల వారీగా రెండో క్వార్టర్లో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 5.7 శాతం నుంచి 6.3 శాతానికి మెరుగుపడటంపై స్పందిస్తూ.. రికవరీ కనిపిస్తున్నా పెద్ద స్థాయిలో లేదని ఆషిమా చెప్పారు. డిమాండ్పరమైన ప్రతిబంధకాలు ఇంకా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ద్రవ్య, పరపతి విధానాలన్నీ సాధ్యమైనంత వరకూ ఉపయోగించుకోవాలని చెప్పారు. కమోడిటీల ధరల తగ్గుదల, పప్పుధాన్యాల సరఫరాను ప్రభుత్వం మెరుగ్గా నిర్వహిస్తుండటం, వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ మెరుగుపడటం, చమురు ధరలు తక్కువ స్థాయిలోనే కొనసాగవచ్చన్న అంచనాల నడుమ ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండగలదని ఆషిమా పేర్కొన్నారు. మరోవైపు వ్యవస్థాగతమైన సంస్కరణలు జీడీపీ వృద్ధి సామర్థ్యాన్ని పెంచుతున్నప్పటికీ.. ఆర్బీఐ పాటిస్తున్న కఠిన ద్రవ్యపరపతి విధానమనేది వినియోగం, పెట్టుబడి డిమాండ్కి అడ్డంకులు సృష్టిస్తోందని ఆమె వివరించారు. -
డీమోనిటైజేషన్ తర్వాత తగ్గిన నగదు చెల్లింపులు
ముంబై: పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రజల్లో చెల్లింపుల అలవాట్లు మారినట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. నగదు చెల్లింపులు గణనీయంగా తగ్గాయని.. రిటైల్ ఎలక్ట్రానిక్ చెల్లింపులు, కార్డులు, చెక్కుల వాడకం పెరిగిందని ఒక అధ్యయనంలో పేర్కొంది. నోట్ల రద్దు సమయంలో పెరిగిన ఈ సాధనాల వినియోగం.. డీమోనిటైజేషన్ అనంతరం కూడా స్థిరంగానే కొనసాగుతోందని తెలిపింది. అధ్యయన నివేదిక ప్రకారం డీమోనిటైజేషన్కి ముందు చెక్కుల పరిమాణం, జారీ విలువ క్షీణించగా.. నోట్ల రద్దు తర్వాత సానుకూల వృద్ధి కనిపిస్తోందని ఆర్బీఐ పేర్కొంది. డీమోనిటైజేషన్ తర్వాత పాయింట్స్ ఆఫ్ సేల్ టెర్మినల్స్లో కార్డు లావాదేవీలు గణనీయంగా పెరిగాయని తెలిపింది. -
ఫెడ్ చైర్మన్గా రాజన్ సరైన అభ్యర్థి!!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ .. ఏకంగా అగ్రరాజ్యం అమెరికా ఫెడరల్ రిజర్వ్ పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయా? ఉండకపోవచ్చేమో కానీ.. ఈ పదవికి మాత్రం ఆయన అన్నివిధాలా సరైన అభ్యర్థే అంటోంది అంతర్జాతీయ ఫైనాన్షియల్ మ్యాగజైన్ బారన్స్. ఈ మేరకు అది ఓ కథనాన్ని ప్రచురించింది. ‘స్పోర్ట్స్ జట్లు ఇతర ప్రపంచ దేశాల నుంచి కూడా అత్యంత సమర్థులను తీసుకోగా లేనిది.. సెంట్రల్ బ్యాంక్లు సమర్థుల్ని ఎందుకు రిక్రూట్ చేసుకోకూడదు?‘ అని ప్రశ్నించింది. ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గుముఖం పట్టేలా చూడటంతో పాటు కరెన్సీకి స్థిరత్వం తెచ్చి, స్టాక్స్ ధరలు యాభై శాతం ఎగిసేలా చర్యలు తీసుకున్న సెంట్రల్ బ్యాంకుల సారథుల జాబితాలో స్టార్గా రాజన్ను అభివర్ణించింది. క్రెడిట్ డెరివేటివ్స్లో భారీ రిస్కుల వల్ల ఆర్థిక సంక్షోభం రాబోతోందంటూ... ముందుగానే కచ్చితమైన హెచ్చరికలు చేసిన ఒకే ఒక్కరు రాజన్ అని బారన్స్ కితాబిచ్చింది. అయితే, ఫెడ్ చైర్మన్గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్న అభ్యర్థుల షార్ట్ లిస్ట్లో ఆయన పేరు లేకపోవడం విచారకరమని పేర్కొంది. కొన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులకు ఇతర దేశస్తులు సైతం నేతృత్వం వహించిన దాఖలాలు ఉన్నాయని బారన్స్ పత్రిక తెలియజేసింది. కెనడాకి చెందిన మార్క్ కార్నీ.. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కి సారథ్యం వహించడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపించింది. ఫెడ్ రిజర్వ్ ప్రస్తుత చైర్పర్సన్ జానెట్ యెలెన్ పదవీకాలం వచ్చే ఏడాది తొలినాళ్లలో ముగియనుండటంతో ఆమె స్థానంలో కొత్త చైర్మన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో ప్రకటించవచ్చన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో బారన్స్ తాజా కథనం ప్రాథాన్యాన్ని సంతరించుకుంది. -
మినిమమ్ బాదుడు
ఆమధ్య బ్యాంకులు ఖాతాదారుల మీద రకరకాల రుసుముల మోత మోగించిన తర్వాత సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఓ జోకు చాలామందికి గుర్తుండే ఉంటుంది.. తన అకౌంట్ ఉన్న బ్యాంకు వైపు మామూలుగా చూసేసరికి ఇరవై రూపాయలు కట్ అయిపోయాయంటూ ఓ వ్యక్తి తన మిత్రుడితో చెప్పి వాపోతున్నట్టు ఉన్న ఆ జోకు అందరినీ నవ్వించడమే కాదు.. బ్యాంకుల ఘనత గురించి ఆలోచింపజేసింది కూడా. బ్యాంకులు ఇప్పుడు వసూలు చేస్తున్న రుసుములు, పెనాల్టీల తీరు చూస్తూ ఉంటే ఈ జోకు ఎంత సత్యమో తేలిగ్గానే అర్థమవుతుంది. సాక్షి, విశాఖపట్నం : సుబ్బారావు ఓ షాపింగ్ మాల్లో చిరుద్యోగి. అతనికొచ్చే నెలసరి వేతనం రూ.10 వేలు. దాంట్లో నాలుగువేలు అద్దెలకే పోతాయి.మిగిలిన జీతం సొమ్ముతో గుట్టుగా జీవనం సాగిస్తున్నాడు. మొదటి వారానికే బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోతుంది. మళ్లీ ఫస్ట్ వరకు ఎదురు చూపులే. కానీ బ్యాంకులో జీతం జమ అయ్యే సరికి రూ.200 కోత పడుతుంది. ప్రతీ నెలా ఈ తంతు జరుగుతూ ఉండేసరికి ఇదేమిటని సుబ్బారావు బ్యాంకు మేనేజర్ను ఆరాతీస్తే ఖాతాలో కనీస మొత్తంగా రూ. 5 వేలు ఉంచడం లేదు కాబట్టి పెనాల్టీ తప్పడం లేదని చెప్పడంతో సుబ్బారావుకు ప్రాణం ఉసూరనిపించింది. ⇒ సూర్యనారాయణ చిరు వ్యాపారి. ఈయనకు ప్రతి నెలా పెట్టుబడి, ఖర్చులు పోనూ రూ.15 వేల వరకు మిగులుతుంది. కానీ అవసరానికి ఆ మొత్తం తీసుకుందామంటే సొంత బ్యాంకు ఏటీఎంలు పనిచేయక చాలా ఇబ్బంది అవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో అందుబాటులో ఉండే ఏదోబ్యాంకు ఏటీఎం నుంచి తనకు కావాల్సిన మొత్తాన్ని తీయడం అనివార్యమవుతుంది. అయితే మూడు కంటే ఎక్కువ సార్లు ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి విత్ డ్రా చేస్తున్నారన్న కారణంతో సొమ్ము తీసిన ప్రతిసారీ రూ. 20 వంతున ఖాతా నుంచి ఫీజు మళ్లిపోతోంది. ⇒ ఇవి సామాన్యుల తిప్పలు. సగటు మానవులకు ఎదురవుతున్న ఇక్కట్లు. అయితే ఇలాటి ఖాతాదారులే ఎక్కువమంది ఉండడంతో బ్యాంకుల పంట పండుతోంది. పెద్ద మొత్తంలో సొత్తు దాఖలు పడుతోంది. ⇒ పెద్ద నోట్ల రద్దు తర్వాత రిజర్వు బ్యాంకు ఆదేశాల మేరకు బ్యాంకులు విధించిన ఆంక్షలో ఈ పరిస్థితి తలెత్తింది. చాలిచాలని జీతంతో కుటుంబపోషణే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో బ్యాంకు ఖాతాలో ఏకంగా ఐదువేలు మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాలంటే ఎలా? అన్నది సామాన్యుల సమస్యగా ఉంది. స్వల్ప ఆదాయమే అధికం జిల్లా జనాభా 43.66 లక్షలయితే, మొత్తం 14 లక్షల కుటుంబాలున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం వీరిలో 31,209 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాగా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు 70,239 మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో 47,818 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్థానిక సంస్థల్లో మరో 11,044 మంది పని చేస్తున్నారు. ఎంప్లాయింట్మెంట్ ఎక్సే్ఛంజి లెక్కల ప్రకారం ప్రైవేటు రంగంలో 49,689 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కానీ అన«ధికారికంగా ప్రైవేటు సెక్టార్లో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో నాలుదైదు లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు. వీరిలో 30 శాతం మంది ఆదాయం రూ.5వేల నుంచి 8వేలు కాగా, 50 శాతం ఆదాయం రూ.8వేల నుంచి రూ.15 వేల వరకు ఉంది. మిగిలిన 20 శాతం మంది ఆదాయం రూ.15 వేలకు పైబడి ఆర్జిస్తున్నారు. చిరు వ్యాపారులు రెండు లక్షల మంది వరకు ఉన్నారు. వీరికి ప్రతి నెలా వచ్చే ఆదాయం రూ.5 వేల నుంచి రూ.10 వేల లోపే. జిల్లాలో 45 బ్యాంకుల పరిధిలో 707 బ్రాంచ్లుంటే వాటిలో 186 బ్రాంచ్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. జిల్లా జనాభాలో బ్యాంకు ఖాతాలున్న వారి సంఖ్య 38లక్షల వరకు ఉంది. బ్యాంకుల్లో 64.54 లక్షల ఖాతాలున్నాయి. జన్ధన్ యోజన ఖాతాలు రూ.9.27లక్షలు కాగా, ఖాతాల్లేని వారి సంఖ్య 8లక్షల వరకు ఉంది. నిత్యం బ్యాంకులు, ఏటీఎంల పరిధి లో రూ.150 నుంచి రూ.200 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతుంటాయి. ప్రైవేటు సెక్టార్లో పనిచేసే ఉద్యోగులతో పాటు చిరు వ్యాపారులు పూర్తిగా బ్యాంకులు, ఏటీఎంలపై ఆధారపడే లావాదేవీలు జరుపు తుంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఉద్యోగులు, ప్రైవేటు సెక్టార్లో పనిచేసే ఉద్యోగుల కంటే చిరుద్యోగులు..చిరు వ్యాపారాలు జరిపే లావాదేవీలే ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు తమకు అవసరమైన మేరకు మాత్రమే విత్ డ్రా చేస్తుంటారు. కానీ చిరుద్యోగులు తమకు వచ్చిన వేతనమంతా విత్డ్రా చేసి నెలవారీ ఖర్చులకు సర్దుబాటు చేసుకుంటుంటారు. మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించని కారణంగా ఆ పొదుపు ఖాతాలనుంచి జూన్ నెలాఖరు నాటికి ఏకంగా రూ.235.06కోట్లు పెనాల్టీ రూపంలో వసూలు చేసినట్టు ఎస్బీఐ ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ మొత్తం రూ.2వేల కోట్లు దాటుతుందని ప్రకటించింది. ఒక్క ఎస్బీఐకే పెనాల్టీ రూపంలో ఇంతపెద్ద మొత్తంలో ఆదాయం వస్తే..ఇతర బ్యాంకులన్నీ కలుపు కుంటే ఈమొత్తం ఐదువేల కోట్లకుపైగానే ఉంటుందని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు విశాఖ జిల్లాలో ఈ విధంగా పెనాల్టీల రూపంలోనే బ్యాంకులు వసూలు చేసిన మొత్తం రూ.2 కోట్లకు పైగానే ఉంటుందని చెబుతున్నారు. ఇందులో గరిష్ట భాగం సామాన్యులదేనని చెప్పనక్కర్దేదు. బ్యాంకుల పెనాల్టీ దోపిడీపై సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మినిమమ్ బ్యాలెన్స్ ఆంక్షలను ఎత్తివేయాలని.. అరకొర వేతనాలతో అవస్థలు పడుతున్న వారంతా ఈ ఆంక్షల వల్ల ఆర్థిక ఇబ్బందుల పాలవు తున్నారని వాపోతున్నారు. అయితే తాము ఆర్బీఐ ఆదేశాల మేరకు వసూలు చేస్తున్నామని.. బ్యాంకుల ప్రమేయం ఏమాత్రం లేదని లీడ్ బ్యాంకు అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. -
బ్యాంకుల విలీనాలతో ఒరిగేదేంటి..?
♦ ప్రభుత్వం స్పష్టతనివ్వాలి... ♦ బలహీన బ్యాంకులతో విలీనాలు మరింత జఠిలం ♦ కన్సాలిడేషన్ సులువైన ప్రక్రియేమీ కాదు ♦ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వ తీరును రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రశ్నించారు. కన్సాలిడేషన్ సహేతుకమైనదే అయినప్పటికీ.. దీనివల్ల కలిగే లాభాలేంటో ప్రభుత్వం చెప్పాలని ఆయన కోరారు. ఒక ఫైనాన్షియల్ డెయిలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో... బ్యాంకుల విలీనాన్ని చాలా సంక్లిష్టమైన ప్రక్రియగా రాజన్ వర్ణించారు. ‘కన్సాలిడేషన్కి బ్యాంకుల సీఈవోలు, మేనేజర్లు మొదలైన వారంతా బోలెడంత శ్రమ, సమయం వెచ్చించాల్సి వస్తుంది. ఐటీ సిస్టమ్స్ అనుసంధానం చేయాలి.. రెండు విభిన్న పని సంస్కృతులు, హెచ్ఆర్ వ్యవస్థలు మొదలైన వాటన్నింటి విలీనం చేయాలి. ఇదంతా అత్యంత శ్రమతో కూడుకున్నదే‘ అని ఆయన చెప్పారు. బ్యాంకులు ఇప్పటికే బలహీనంగా ఉన్న నేపథ్యంలో విలీనాలు మరింత సమస్యాత్మకంగా మారతాయని రాజన్ పేర్కొన్నారు. ‘ఈ ప్రక్రియంతా చాలా సులువుగా ఎలా పూర్తయిపోతుందనేది ప్రభుత్వం చెప్పాలి. ఇది సమస్య నుంచి దృష్టి మరల్చి.. సంస్థను మరింతగా కుంగదీయకుండా, ఏ విధంగా ఊతమివ్వగలదో చెప్పాలి‘ అని వ్యాఖ్యానించారు. నార్త్ బ్లాక్ ఆధిపత్యమేంటి? విలీన ప్రణాళికల్లో ప్రభుత్వమే కీలక పాత్ర పోషిస్తుండటాన్ని రాజన్ ప్రశ్నించారు. ‘ఈ ప్రణాళికలన్నింటినీ నార్త్ బ్లాకే (ఆర్థిక తదితర కీలక శాఖల కార్యాలయాలున్న భవంతి) నిర్ణయిస్తుందా? ఒకవేళ అదే జరిగితే.. ఇక కొత్తేం ఉంది? ఎంతో కొంత వైవిధ్యం ఉండాలన్న జ్ఞాన సంఘం నిబంధనలను చేరుకోనట్లేగా? ఒకవేళ అంతా నార్త్ బ్లాకే నిర్ణయిస్తే.. తేడా ఏముంటుంది?‘ అని ఆయన పేర్కొన్నారు. విలీనాలనేవి బ్యాంకులు ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే చేయాలి తప్ప బలహీనంగా ఉన్నప్పుడు కాదని రాజన్ అభిప్రాయపడ్డారు. ఇదీ నేపథ్యం.. ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను విలీనాల ద్వారా 21 నుంచి 15కి తగ్గించాలని కేంద్రం యోచిస్తున్న సంగతి తెలిసిందే. పటిష్టమైన పెద్ద బ్యాంకులను ఆవిష్కరించడమే దీని వెనుక ప్రధానోద్దేశమని కేంద్రం చెబుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది బ్యాంకులు కలిసి సుమారు రూ. 18,066 కోట్ల మేర నష్టాలు ప్రకటించాయి. ఇక ఆరు బ్యాంకులు కార్యకలాపాల విస్తరణపై ఆంక్షలు ఎదుర్కొంటున్నాయి. ఇక విలీనాల విషయానికొస్తే.. ఏ రెండు బ్యాంకులు కలపాలని చూసినా.. చాలా మటుకు సందర్భాల్లో వాటిలో పేరుకుపోయిన మొండిబాకీల పరిమాణం నిర్దిష్ట స్థాయికి మించిపోవడం ద్వారా ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇతరత్రా కేటాయింపులు పోగా.. మార్చి ఆఖరు నాటికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ మొండి బాకీలు మొత్తం రుణాల్లో 7.8 శాతంగా ఉండగా.. కెనరా బ్యాంక్ మొండి బాకీలు 6.3 శాతంగా నమోదయ్యాయి. విలీనాలకు అనువైనవిగా భావిస్తున్న బలహీన బ్యాంకుల గురించి పెద్ద బ్యాంకులు ఇప్పటికే ప్రభుత్వానికి తమ ఆందోళన తెలియజేశాయి. టేకోవర్ సామర్ధ్యమున్న బ్యాంకులుగా పరిగణిస్తున్న కెనరా బ్యాంక్, పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా మొదలైనవి.. చిన్న బ్యాంకులను విలీనం చేసుకోవడానికి ముందస్తుగా కొన్ని షరతులు విధిస్తున్నాయి. టార్గెట్ బ్యాంకు కచ్చితంగా లాభాలార్జిస్తున్నదై ఉండాలన్నది ఇందులో ప్రధానమైనది. అలాగే, టార్గెట్ బ్యాంకుకు తగినంత మూలధనం ఉన్నప్పటికీ ప్రభుత్వం మరింత పెట్టుబడి సమకూర్చాలని కూడా టేకోవర్ సామర్ధ్యమున్న బ్యాంకులు కోరుతున్నాయి. విలీనాలనేవి బోర్డుల నిర్ణయాల ఆధారంగానే ఉండాలి తప్ప.. ప్రభుత్వం నిర్ణయాల మేరకు ఉండకూడదని బ్యాంకులు ఆశిస్తున్నాయి. బ్యాంకుల బోర్డులు విలీన ప్రతిపాదనలు ముందుకు తెస్తే.. వాటిని మంత్రుల కమిటీ పరిశీలించి, కన్సాలిడేషన్ ప్లాన్కి సూత్రప్రాయ అనుమతులు ఇస్తాయంటూ కేంద్రం ఆగస్టు నెలాఖర్లో పేర్కొంది. -
నేడే మార్కెట్లోకి రూ.200 నోట్లు
-
రుణాలతో వృద్ధి ప్రమాదమే!
ముంబై: రెండంకెల భారీ వృద్ధి రేటును సాధించాలని పలు వర్గాల నుంచి అందుతున్న సూచనలు, వ్యక్తమవుతున్న అభిలాషలపై రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య తీవ్ర హెచ్చరికలు చేశారు. రుణాలను ఆధారం చేసుకుని ‘రెండంకెల వృద్ధి’ని సాధిస్తే... అది పటిష్టంగా నిలబడే అవకాశం ఉండదని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదమూ ఉంటుందని హెచ్చరించారు. ఆసియా సొసైటీ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ఆర్థిక వ్యవస్థ తగిన బాటలో పయనించేట్లు వ్యవస్థాపరమైన పటిష్టత ప్రస్తుతం ఆవశ్యకమని చెప్పారు. ఇది దీర్ఘకాల పటిష్ట, సుస్థిర వృద్ధికి దారితీస్తుందని తెలియజేశారు. ‘‘ఒక్కోసారి కొన్ని అసెట్స్లోకి రుణ ఆధారిత నిధులు భారీగా రావడం వల్ల 9 నుంచి 10% వృద్ధి రేటు సాధన సాధ్యమవుతుందన్నది నా అభిప్రాయం. అయితే అలాంటి వృద్ధి రేటు దీర్ఘకాలంపాటు నిలబడదు’ అని వివరించారు. -
నేడే మార్కెట్లోకి రూ.200 నోట్లు
♦ రిజర్వ్ బ్యాంక్ ప్రకటన ♦ ప్రకాశవంతమైన పసుపు రంగులో...స్వచ్ఛ భారత్ లోగో, అశోక స్తంభం, సాంచీ స్థూపాలకు చోటు ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అందరికీ షాకిచ్చింది. తొలిసారిగా రూ.200 నోట్లను శుక్రవారం నుంచే మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. తక్కువ డినామినేషన్ కరెన్సీకి ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని రూ.200 నోట్లను వెంటనే చెలామణిలోకి తీసుకువస్తున్నట్లు పేర్కొంది. ఈ కొత్త నోట్లు ప్రకాశవంతమైన పసుపు రంగులో ఉంటాయి. ‘ఆగస్ట్ 25 శుక్రవారం రోజున రూ.200 నోట్లను మార్కెట్లోకి తెస్తున్నాం. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం కలిగిన ఈ నోట్లు మహాత్మా గాంధీ నూతన సిరీస్లో ఉంటాయి’ అని బ్యాంక్ తాజా ప్రకటనలో తెలిపింది. కొత్త రూ.50 నోట్లపై హంపీ రథం మాదిరిగానే ఈ రూ.200 నోట్లపై కూడా భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా సాంచీ స్థూపం ఉంటుందని పేర్కొంది. ఇక నోటుకు ఒకవైపు మహాత్మా గాంధీ ఫోటో, అశోక స్తంభం చిహ్నం.. మరొకవైపు స్వచ్ఛభారత్ లోగో, సాంచీ స్థూపం వంటివి ఉంటాయని వివరించింది. ఎక్కడ లభ్యమవుతాయి? వాస్తవానికి రూ.200 నోట్లు అందరికీ ఏటీఎంల ద్వారానే అందుబాటులోకి రావాల్సి ఉంది. కాకపోతే ఈ నోట్లను పంపిణీ చేయడానికి వీలుగా ఏటీఎంలను రీక్యాలిబరేషన్ చేయాల్సి ఉంది. అప్పటిదాకా వీటిని ఇతర రూ.50, 20, 10 నోట్ల మాదిరిగా బ్యాంకు బ్రాంచ్ల ద్వారానే పంపిణీ చేయనున్నట్లు ఆర్బీఐ వర్గాలు తెలియజేశాయి. -
కొత్త ఇన్వెస్టర్లకు ఓపెన్ ఆఫర్ నుంచి మినహాయింపు
న్యూఢిల్లీ: నష్టాల్లో ఉన్న కంపెనీల్లో వాటాలను రుణదాతలు కొనుగోలు చేయడం, తిరిగి ఈ వాటాలను కొత్త ఇన్వెస్టర్లు విక్రయించే అంశానికి సంబంధించి నిబంధనలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సడలించింది. ఇలాంటి సంస్థల్లో వాటాలు కొనుగోలు చేసేటప్పుడు పబ్లిక్ షేర్హోల్డర్లకు కచ్చితంగా ఓపెన్ ఆఫర్ ప్రకటించడం నుంచి మినహాయింపునిచ్చింది. అయితే, వాటాల కొనుగోలుకు సంబంధించి ప్రత్యేక తీర్మానం ద్వారా షేర్హోల్డర్ల అనుమతి పొందడం తదితర షరతులు దీనికి వర్తిస్తాయి. దాదాపు రూ. 8 లక్షల కోట్ల మేర పేరుకుపోయిన మొండిబాకీల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ తీవ్రంగా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో సెబీ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. నష్టాల్లో ఉన్న లిస్టెడ్ కంపెనీలు కోలుకోవడానికి, తద్వారా వాటాదారులు.. రుణదాతలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ చర్యలు ఉద్దేశించినవని ఆగస్టు 14న జారీ చేసిన నోటిఫికేషన్లో సెబీ పేర్కొంది. ప్రస్తుతం వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణ (ఎస్డీఆర్) పథకం కింద నష్టాల్లో ఉన్న కంపెనీల్లో వాటాలు దక్కించుకున్న రుణదాతలకు మాత్రమే ఓపెన్ ఆఫర్ తదితర నిబంధనల నుంచి మినహాయింపులు ఉన్నాయి. అయితే, సదరు రుణదాతల నుంచి వాటాలు కొనుగోలు చేయాలంటే తాము కచ్చితంగా ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సి వస్తుండటం వల్ల కొత్త ఇన్వెస్టర్లు (కొత్త యాజమాన్యం) ముందుకు రావడం లేదు. ఒకవేళ ఓపెన్ ఆఫర్ ప్రకటిస్తే.. కంపెనీలో ఇన్వెస్ట్ చేయగలిగే నిధుల పరిమాణం తగ్గిపోతోంది. ఈ సమస్యలను రుణదాతలు .. తన దృష్టికి తీసుకురావడంతో సెబీ తాజాగా ఓపెన్ ఆఫర్ మినహాయింపులను కొత్త ఇన్వెస్టర్లకు కూడా వర్తించేలా నిర్ణయం తీసుకుంది. -
బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు
సెన్సెక్స్ 239 పాయింట్లు, నిఫ్టీ 68 పాయింట్లు డౌన్ భవిష్యత్తులో రిజర్వుబ్యాంక్ పరపతి విధానం పట్ల సందేహాలు తలెత్తడంతో గురువారం వడ్డీ రేట్ల ఆధారిత బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దాంతో స్టాక్ సూచీలు వరుసగా రెండోరోజు క్షీణించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 239 పాయింట్లు (0.74 శాతం) పతనమై 32,238 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఒకదశలో 10,000 పాయింట్ల స్థాయిని సైతం కోల్పోయింది. చివరకు 68 పాయింట్ల (0.67 శాతం) తగ్గుదలతో 10,014 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. స్టాక్ సూచీలు ఇంతగా తగ్గడం రెండు వారాల్లో ఇదే ప్రధమం. ఆర్బీఐ పాలసీ సమీక్షలో రెపో రేటును పావుశాతం తగ్గించినప్పటికీ, భవిష్యత్తులో రేట్ల కోత వివిధ ఆర్థిక గణాంకాల ఆధారంగా వుంటాయని సూచనాప్రాయంగా వెల్లడించడంతో ఇన్వెస్టర్లు అసహనానికి గురైనట్లు, దీనితో వడ్డీ రేట్ల ఆధారిత షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ నాయర్ తెలిపారు. బ్యాంక్ నిఫ్టీ 1.5 శాతం డౌన్... పలు బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు జరగడంతో ప్రధాన సూచీలకంటే బ్యాంక్ నిఫ్టీ అధికంగా క్షీణించింది. 1.5 శాతంపైగా తగ్గిన బ్యాంక్ నిఫ్టీ 24,675 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అన్నింటికంటే ఎక్కువగా 5.98 శాతం క్షీణించి రూ. 150లోపున క్లోజయ్యింది. కెనరా బ్యాంక్ 3.27 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 3 శాతం, ఎస్బీఐ 2.24 శాతం చొప్పున తగ్గాయి. ప్రైవేటు బ్యాంకింగ్ షేర్లు యాక్సిస్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ బ్యాంక్లు 1.5–2.5 శాతం మధ్య తగ్గాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు... బహుళ వ్యాపారాల దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) 2 శాతం ర్యాలీ జరిపి, రూ. 1,650 వద్ద ముగియడం ద్వారా సరికొత్త రికార్డును నెలకొల్పింది. 2008 జనవరిలో బీఎస్ఈలో నమోదుచేసిన రూ.1,629 గరిష్టస్థాయిని కొద్దిరోజుల క్రితమే ఆర్ఐఎల్ అధిగమించినప్పటికీ, అప్పట్లో ఎన్ఎస్ఈలో నమోదైన రూ. 1,649 గరిష్టరికార్డును గురువారం దాటి ఇంట్రాడేలో ఆల్టైమ్ గరిష్టస్థాయి రూ. 1,665 వద్దకు పెరిగింది. తాజా మార్కెట్ విలువ రూ.5.37 లక్షల కోట్లకు చేరింది. పెరిగిన షేర్లలో భారతి ఎయిర్టెల్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, ఏసీసీ, అంబూజా సిమెంట్లు వున్నాయి. -
రాష్ట్రానికి పెద్ద నోట్ల కోత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి రూ.2,000 నోట్ల సరఫరాను రిజర్వు బ్యాంకు పూర్తిగా నిలి పేసింది. వాటి స్థానంలో రూ.500 నోట్లను పంపిణీ చేస్తోంది. పెద్దనోట్ల రద్దు తర్వాత ఇప్పటివరకు రాష్ట్రానికి రూ. 67 వేల కోట్ల విలువైన నోట్లను రిజర్వు బాంకు సరఫరా చేయగా వాటిలో దాదాపు 90 శాతం రూ.2,000 నోట్లే ఉన్నాయి. అందుకు భిన్నంగా ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో రూ.2,000 నోట్ల సరఫరా తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత పెద్ద నోట్ల పంపిణీ ఆర్బీఐ భారీగా తగ్గించేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలల్లో రిజర్వు బాంకు నుంచి రాష్ట్రానికి రూ. 25 వేల కోట్ల విలువైన కరెన్సీ రాగా, అందులో అధికంగా రూ.500, రూ.100 నోట్లున్నాయి. రూ.2,000 సరఫరా 5 శాతం మించిలేదని అధికారులు చెబుతున్నారు. చిల్లర సమస్యతో పాటు గ్రామీణ ప్రాంతాల అవసరాల దృష్ట్యా చిన్న నోట్ల చలామణికే బ్యాంకు ప్రాధాన్యమిస్తోందనే అభిప్రాయాలున్నాయి. మరోవైపు ఆర్బీఐ త్వరలోనే కొత్తగా రూ.200 నోట్లను ముద్రించి చలామణిలోకి తెచ్చే అవకాశాలున్నాయి. రూ. 2,000 నోట్ల సరఫరాను తగ్గించి రద్దు చేయాలని ఆర్బీఐ యోచిస్తున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు భావిస్తున్నాయి. -
రెండేళ్ల గరిష్ఠానికి రూపాయి
ముంబై: రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు తగ్గించడం తదితర పరిణామాల నేపథ్యంలో రూపాయి మారకం విలువ రెండేళ్ల గరిష్టానికి ఎగిసింది. బుధవారం ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 37 పైసలు బలపడి 63.70 వద్ద ముగిసింది. 2015 జులై 22 తర్వాత ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్రథమం. అప్పట్లో రూపాయి 63.58 వద్ద క్లోజయ్యింది. ఇక ఒకే రోజున 37 పైసలు పెరగడం ఈ ఏడాది ఇదే తొలిసారి. పది నెలల విరామం తర్వాత రెపో రేటు పావు శాతం తగ్గిన దరిమిలా సానుకూల పరిణామాలపై ఆశావహ అంచనాలు నెలకొనడంతో రూపాయి ర్యాలీకి ఊతం లభించినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. -
రెండువేల నోట్లను రద్దుచేస్తారా?
► రాజ్యసభలో విపక్షాల ప్రశ్న ► స్పందించని ఆర్థిక మంత్రి జైట్లీ ► ఉభయసభల్లో ప్రతిపక్షాల ఆందోళన న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రూ.2వేల నోట్లను రద్దుచేస్తారా అని విపక్షం రాజ్యసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం వెంటనే సమాధానమివ్వాలని డిమాండ్ చేసింది. రాజ్యసభలో జీరో అవర్ సందర్భంగా సమాజ్వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ ‘ప్రభుత్వం రూ.2వేల నోట్లను రద్దుచేయాలని నిర్ణయించింది. ఈ నోట్ల ముద్రణను ఆపేయాలని రిజర్వ్ బ్యాంకు ఆదేశించింది. దీనిపై విధానమైన నిర్ణయమేదైనా తీసుకుంటే ఈ పార్లమెంటు సమావేశాలు ముగిసే లోగా సభలో వెల్లడించాలి. రెండోసారి నోట్ల రద్దు చేపట్టాలన్న ఆలోచన ఉందా?’ అని ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ పక్షనేత ఆజాద్ జోక్యం చేసుకుని ప్రభుత్వం వెంటనే బదులివ్వాలని డిమాండ్ చేశారు. ‘రూ.వెయ్యి నాణేలను తెచ్చే ఆలోచన ఉందా?’ అని ప్రశ్నించారు. అయితే దీనిపై జైట్లీ స్పందించలేదు. మౌనంగానే ఉన్నారు. దీంతో మరో సారి నోట్లరద్దు జరగొచ్చని.. జైట్లీ మౌనం దీనికి నిదర్శనమని విపక్ష సభ్యులు అన్నారు. జైట్లీ వర్సెస్ విపక్షాలు బుధవారం రాజ్యసభ ప్రారంభం కాగానే.. బీజేపీ కావాలనే గాంధీ, నెహ్రూ, ఇందిరలను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తోందని, దీనిపై చర్చ జరగాలని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ వాయిదా తీర్మానాన్నిచ్చారు. దీన్ని డిప్యూటీ చైర్మన్ కురియన్ ఆమోదించా రు. ఈ దశలో జోక్యం చేసుకున్న రాజ్యసభ నాయకుడు, కేంద్ర మంత్రి జైట్లీ.. ‘విపక్షాలు వాయిదా తీర్మానాలను దుర్వినియోగం చేస్తున్నాయి. టీవీ చానెళ్లలో ప్రచారం కోసమే వీటిని వాడుకుంటున్నాయి’ అని విమర్శించారు. సంఝౌతా ఎక్స్ప్రెస్ కేసుపై చర్చించాలంటూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఇచ్చిన పాయింట్ ఆఫ్ ఆర్డర్తోపాటుగా ఇతర సభ్యులిచ్చిన వాయిదా తీర్మానాలను చర్చించాలని జైట్లీ పట్టుబట్టారు. ‘ప్రచారం’ వ్యాఖ్యలపై భగ్గుమన్న విపక్షాలు జైట్లీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ వెల్లోకి దూసుకొచ్చాయి. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. అటు, ఆరుగురు కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తేయాలం టూ లోక్సభలో విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ఇది కొనసాగుతుండగానే.. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సవరణ) బిల్లు– 2017 ఆమోదం పొందింది. -
కరెన్సీకి ‘మేకిన్ ఇండియా’ భద్రతా ఫీచర్లు
న్యూఢిల్లీ: మేకిన్ ఇండియా నినాదానికి మరింతగా ఊతమిచ్చే దిశగా రిజర్వ్ బ్యాంక్ సోమవారం కరెన్సీ భద్రత ఫీచర్లకు సంబంధించి బిడ్లను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. గతంలో జారీ చేసిన రెండు టెండర్లను రద్దు చేస్తూ.. మేకిన్ ఇండియా ప్రమాణాలను తప్పనిసరి చేసే నిబంధనను జోడించి కొత్తగా మరో టెండర్ను జారీ చేసింది. దీని ప్రకారం సరఫరాదారు రెండేళ్ల వ్యవధిలో దేశీయంగా తయారీ యూనిట్ నెలకొల్పాలి. అలాగే క్రమంగా స్థానిక కంటెంట్ను కూడా పెంచాల్సి ఉంటుంది. పాకిస్తాన్ దేశస్తు లు లేదా ఆ దేశ మూలాలు ఉన్న వారి సర్వీసులను ఈ ప్రాజెక్టులో ఉపయోగించబోమని బిడ్డరు హామీ ఇవ్వాల్సి ఉంటుంది. సెక్యూరిటీ థ్రెడ్స్, ఇంకు, సెక్యూరిటీ ఫైబర్, అడ్వాన్స్డ్ వాటర్మార్క్ మొదలైనవి సరఫరా చేసేందుకు ఆర్బీఐ ఈ టెండర్ను ఉద్దేశించింది. -
కొత్త డీసీసీబీల ఏర్పాటుకు కసరత్తు!
► ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న సహకార శాఖ ► లాభనష్టాల అంచనా ఆధారంగానే ఏర్పాటు! సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లను ఏర్పాటు చేయాలని సహకార శాఖ యోచిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించింది. కొత్త డీసీసీబీలు ఏర్పాటు చేయాలంటే ప్రస్తుత మున్న వాటి ఆస్తులు, డిపాజిట్లు, రుణాలు, రికవరీ, వ్యాపారం ఆధారంగా విభజించాలి. రిజర్వుబ్యాంకుకు కూడా ప్రతిపాదనలు పంపి దాని ఆమోదం కూడా తీసుకోవాలని భావిస్తు న్నారు. ప్రస్తుతం కొన్ని డీసీసీబీల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడానికి రిజర్వు బ్యాంకు అంగీకరిస్తుందా లేదా అన్న అను మానాలున్నాయి. జిల్లాల విభజన జరిగి నందున విభజన తప్పనిసరని, విభజనకు తోడ్పడాలని సహకారశాఖ రిజర్వుబ్యాంకును కోరే అవకాశముంది. ఫిబ్రవరికి ముగియనున్న పదవీకాలం సహకార సంఘాలకు ప్రస్తుతమున్న పాలక వర్గాల పదవీకాలం వచ్చే ఫిబ్రవరి నాటికి ముగియనుంది. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్(టెస్కాబ్) పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 26తో ముగియ నుంది. జిల్లా సహకార మార్కెటింగ్ సమాఖ్య (డీసీఎంఎస్)లు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)ల పదవీకాలం అదే నెల 18న ముగియనుంది. ఇక 906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(ప్యాక్స్)ల పదవీకాలం అదే నెల మొదటివారంలో ముగియనుంది. 2013లో ఉమ్మడి రాష్ట్రంలో సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి నప్పుడు తెలంగాణలో 10 జిల్లాలే ఉన్నాయి. ఇప్పుడు వాటి సంఖ్య 31కి పెరిగినందున వాటి ప్రకారం జిల్లా సహకార మార్కెటింగ్ సమాఖ్య(డీసీఎంఎస్), జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లు ఏర్పాటు చేయాలి. ఈ ప్రక్రియను ఇప్పుడు ప్రారంభిస్తే వచ్చే జనవరి నాటికి పూర్తవుతుంది. విభజన ప్రక్రియ చేపట్టి ఎన్నికలకు వెళ్లకుండా చూడాలన్న అభిప్రా యమూ సర్కారులో ఉన్నట్లు సమాచారం. 2019లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నం దున సరిగ్గా ఏడాదిలోపు సహకార సంఘాల ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోన్న చర్చ ఉంది. కాబట్టి పర్సన్ ఇన్చార్జులను నియమిస్తేనే బాగుంటుందన్న భావన ప్రభుత్వ వర్గాల్లో నెలకొంది. -
మూడు రోజుల్లో ఫిర్యాదు చేస్తే నష్టపోనక్కర్లేదు
♦ ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలపై ♦ రిజర్వ్ బ్యాంక్ స్పష్టత ♦ పది రోజుల్లోనే ఖాతాలో తిరిగి జమ ♦ ఆలస్యం చేస్తే నష్టానికి బాధ్యత వారిదే న్యూఢిల్లీ: ఖాతాదారుల ప్రమేయం లేకుండా వారి ఖాతాలు, కార్డుల నుంచి జరిగే అనధికార ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీల మోసాలపై మూడు రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే ఇకపై రూపాయి కూడా నష్టపోవాల్సిన అవసరం లేదు. ఈ దిశగా ఆర్బీఐ గురువారం స్పష్టతనిచ్చింది. మూడు రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే పది దినాల్లోగా సదరు మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఆర్బీఐ తెలిపింది. బీమా పరిహారం కోసం ఆలస్యం చేయడం ఉండదని స్పష్టం చేసింది. మూడో పార్టీ చేసిన మోసపూరిత లావాదేవీలపై నాలుగు నుంచి ఏడు దినాల్లోపు రిపోర్ట్ చేస్తే రూ.25,000 వరకు నష్టానికి ఖాతాదారుడే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఖాతాదారుడి నిర్లక్ష్యం వల్ల మోసం జరిగితే, దానిపై బ్యాంకుకు ఫిర్యాదు చేసే వరకూ చోటుచేసుకునే నష్టం ఏదైనా గానీ దాన్ని ఖాతాదారుడే భరించాల్సి ఉంటుందని తెలిపింది. ఖాతాదారుడు అనధికార లావాదేవీపై బ్యాంకుకు సమాచారం ఇచ్చిన తర్వాత చోటు చేసుకునే నష్టం ఏదైనా బ్యాంకే భరించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు సవరించిన మార్గదర్శకాలను ఆర్బీఐ విడుదల చేసింది. తమ ఖాతాలు, కార్డుల నుంచి అనధికారిక లావాదేవీలు జరుగుతున్నాయంటూ ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు పెరిగిపోవడంతో ఆర్బీఐ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ‘‘ఖాతాదారుడు వైపు నుంచి, బ్యాంకు వైపు నుంచి లోపం లేకుండా, వ్యవస్థలో ఎక్కడో లోపం కారణంగా మూడో పక్షం చేసిన ఉల్లంఘనపై ఖాతాదారుడికి ఎటువంటి బాధ్యత లేదు. అయినప్పటికీ అనధికార లావాదేవీ గురించి ఖాతాదారుడు మూడురోజుల్లోపే బ్యాంకుకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకు నిర్లక్ష్యం, లోపం, సాయం కారణంగా అనధికారిక లావాదేవీ చోటు చేసుకుంటే, ఖాతాదారుడు దానిపై సమాచారం ఇచ్చినా, ఇవ్వకపోయినా ఈ విషయంలోనూ అతడికి ఎటువంటి బాధ్యత ఉండదు’’ అని ఆర్బీఐ మార్గదర్శకాల్లో పేర్కొంది. మోసంపై ఏడు రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తే దానిపై ఖాతాదారుల బాధ్యత ఎంత మేరకు అన్నది బ్యాంకుల బోర్డు విధానం మేరకు నిర్ణయించడం జరుగుతుందని వివరించింది. న్యూఢిల్లీ: ఖాతాదారుల ప్రమేయం లేకుండా వారి ఖాతాలు, కార్డుల నుంచి జరిగే అనధికార ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీల మోసాలపై మూడు రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే ఇకపై రూపాయి కూడా నష్టపోవాల్సిన అవసరం లేదు. ఈ దిశగా ఆర్బీఐ గురువారం స్పష్టతనిచ్చింది. మూడు రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే పది దినాల్లోగా సదరు మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఆర్బీఐ తెలిపింది. బీమా పరిహారం కోసం ఆలస్యం చేయడం ఉండదని స్పష్టం చేసింది. మూడో పార్టీ చేసిన మోసపూరిత లావాదేవీలపై నాలుగు నుంచి ఏడు దినాల్లోపు రిపోర్ట్ చేస్తే రూ.25,000 వరకు నష్టానికి ఖాతాదారుడే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఖాతాదారుడి నిర్లక్ష్యం వల్ల మోసం జరిగితే, దానిపై బ్యాంకుకు ఫిర్యాదు చేసే వరకూ చోటుచేసుకునే నష్టం ఏదైనా గానీ దాన్ని ఖాతాదారుడే భరించాల్సి ఉంటుందని తెలిపింది. ఖాతాదారుడు అనధికార లావాదేవీపై బ్యాంకుకు సమాచారం ఇచ్చిన తర్వాత చోటు చేసుకునే నష్టం ఏదైనా బ్యాంకే భరించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు సవరించిన మార్గదర్శకాలను ఆర్బీఐ విడుదల చేసింది. తమ ఖాతాలు, కార్డుల నుంచి అనధికారిక లావాదేవీలు జరుగుతున్నాయంటూ ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు పెరిగిపోవడంతో ఆర్బీఐ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ‘‘ఖాతాదారుడు వైపు నుంచి, బ్యాంకు వైపు నుంచి లోపం లేకుండా, వ్యవస్థలో ఎక్కడో లోపం కారణంగా మూడో పక్షం చేసిన ఉల్లంఘనపై ఖాతాదారుడికి ఎటువంటి బాధ్యత లేదు. అయినప్పటికీ అనధికార లావాదేవీ గురించి ఖాతాదారుడు మూడురోజుల్లోపే బ్యాంకుకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకు నిర్లక్ష్యం, లోపం, సాయం కారణంగా అనధికారిక లావాదేవీ చోటు చేసుకుంటే, ఖాతాదారుడు దానిపై సమాచారం ఇచ్చినా, ఇవ్వకపోయినా ఈ విషయంలోనూ అతడికి ఎటువంటి బాధ్యత ఉండదు’’ అని ఆర్బీఐ మార్గదర్శకాల్లో పేర్కొంది. మోసంపై ఏడు రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తే దానిపై ఖాతాదారుల బాధ్యత ఎంత మేరకు అన్నది బ్యాంకుల బోర్డు విధానం మేరకు నిర్ణయించడం జరుగుతుందని వివరించింది. -
ఫారెక్స్ నిల్వలు ‘ 381.95 బిలియన్ డాలర్లు
ముంబై: దేశంలో ఫారెక్స్ నిల్వలు పెరిగాయి. ఇవి జూన్ 16తో ముగిసిన వారంలో 799 మిలియన్ డాలర్ల మేర పెరుగుదలతో 381.95 బిలియన్ డాలర్లకు ఎగశాయి. దీనికి విదేశీ కరెన్సీ అసెట్స్లో పెరుగుదల ప్రధాన కారణం. రిజర్వు బ్యాంక్ తాజా గణాంకాల ప్రకారం.. ఫారెక్స్ నిల్వల్లో కీలకమైన విదేశీ కరెన్సీ అసెట్స్ 802.4 మిలియన్ డాలర్లమేర పెరుగుదలతో 358.08 బిలియన్ డాలర్లకు ఎగశాయి. బంగారం నిల్వలు ఎప్పటిలాగే స్థిరంగా 20.09 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక ఐఎంఎఫ్ వద్ద ఉన్న స్పెషల్ డ్రాయింగ్ రైట్స్కు సంబంధించిన మొత్తం 1.3 మిలియన్ డాలర్ల తగ్గుదలతో 1.46 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యింది. అలాగే ఐఎంఎఫ్ వద్ద ఉన్న నిల్వలకు సంబంధించిన మొత్తం కూడా 2.1 మిలియన్ డాలర్లమేర తగ్గుదలతో 2.3 బిలియన్ డాలర్లకు క్షీణించింది. కాగా కడపటి వారంలో ఫారెక్స్ నిల్వలు 11.5 మిలియన్ డాలర్లమేర క్షీణించి 381.15 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఫారెక్స్ నిల్వలు ‘381.95 బిలియన్ డాలర్లు ముంబై: దేశంలో ఫారెక్స్ నిల్వలు పెరిగాయి. ఇవి జూన్ 16తో ముగిసిన వారంలో 799 మిలియన్ డాలర్ల మేర పెరుగుదలతో 381.95 బిలియన్ డాలర్లకు ఎగశాయి. దీనికి విదేశీ కరెన్సీ అసెట్స్లో పెరుగుదల ప్రధాన కారణం. రిజర్వు బ్యాంక్ తాజా గణాంకాల ప్రకారం.. ఫారెక్స్ నిల్వల్లో కీలకమైన విదేశీ కరెన్సీ అసెట్స్ 802.4 మిలియన్ డాలర్లమేర పెరుగుదలతో 358.08 బిలియన్ డాలర్లకు ఎగశాయి. బంగారం నిల్వలు ఎప్పటిలాగే స్థిరంగా 20.09 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక ఐఎంఎఫ్ వద్ద ఉన్న స్పెషల్ డ్రాయింగ్ రైట్స్కు సంబంధించిన మొత్తం 1.3 మిలియన్ డాలర్ల తగ్గుదలతో 1.46 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యింది. అలాగే ఐఎంఎఫ్ వద్ద ఉన్న నిల్వలకు సంబంధించిన మొత్తం కూడా 2.1 మిలియన్ డాలర్లమేర తగ్గుదలతో 2.3 బిలియన్ డాలర్లకు క్షీణించింది. కాగా కడపటి వారంలో ఫారెక్స్ నిల్వలు 11.5 మిలియన్ డాలర్లమేర క్షీణించి 381.15 బిలియన్ డాలర్లకు తగ్గాయి. -
ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఖాతా తీసుకోవాలి
► రిజర్వ్ బ్యాంక్ ఏజేఎం సీబీ గణేష్ మునుగోడు : ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆధార్కార్డు, బ్యాంక్ ఖాతాను పొందాలని రిజర్వ్ బ్యాంక్ ఏజేఎం సీబీ గణేష్ సూచించారు. ఆర్థిక అక్ష్యరాస్యత వారోత్సవాల సందర్భంగా బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో కొరటికల్ గ్రామంలో రైతులకు, ప్రజలకు బ్యాంక్ సేవలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రిజర్వ్ బ్యాంక్ ఏజేఎం సీబీ గణేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు అందించే రాయితీలను, ఆర్థిక ఫలాలను పొందాలంటే విధిగా బ్యాంక్ ఖాతా ఉండాలన్నారు.ఖాతాలు లేకపోతే ప్రభుత్వం అందించే ఏ ఒక్క రాయితీ పొందలేరన్నారు. అదే విధంగా రైతులు, వ్యాపారులు, ఇతరులు తమ అవసరాలకు బ్యాంక్ల్లో రుణాలు తీసుకొని తిరిగి వాటిని సకాలంలో చెల్లించాలన్నారు. ఖాతాలు, ఏటీఎం కార్డులు ఉన్నవారు ఎవరైనా మోసగాళ్లు మీ ఏటీఎం పిన్ నంబర్ మార్చుతున్నాం, మీ పాత పిన్ నంబర్ చెప్పమని కోరినా, మరే ఇతర విషయాలు చెప్పి పిన్ అడిగినా చెప్పకూడదన్నారు. అందరు కనీసం తమ పేరును రా యగలిగే వరకు చదువు నేర్చుకోవాలన్నారు. రైతులు రు ణాలతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డులు తీసుకోవాలన్నా రు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ సూ ర్యం, సర్పంచ్ ఐతగోని బుచ్చయ్యగౌడ్, వైఎస్ ఎంపీపీ సిరగమళ్ల నర్సింహ, మేనేజర్లు జేమ్స్, కె మహేష్బాబు, మా జీ సర్పంచ్ ఐతగోని లాల్బహదూర్గౌడ్, యాదయ్యగౌడ్, మురారిశెట్టి యాదయ్య తదితరులు పాల్గొ్గన్నారు. -
బ్యాంకుల్లో పైసల్లేవు..
అదనంగా నెలకు రూ. 2 వేల కోట్లివ్వండి - రిజర్వ్ బ్యాంకును కోరిన ఎస్ఎల్బీసీ - రూ. 400 కోట్లు అడిగిన ఎస్బీఐ - ఈ ఏడాది పంట రుణాల లక్ష్యం రూ. 39,752 కోట్లు సాక్షి, హైదరాబాద్: బ్యాంకుల్లో నగదు కొరత వేధిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) మొరపెట్టుకుంది. ఖరీఫ్లో పంట రుణాలు ఇవ్వలేకపోతున్నామని, కాబట్టి తమ అవసరాలకు తగ్గట్లు డబ్బు అందజేయాలని కోరింది. ఎస్ఎల్బీసీ విన్నపానికి స్పందించిన ఆర్బీఐ ఎంత నగదు కావాలో బ్యాంకుల వారీగా ఇండెంట్ ఇవ్వాలని కోరింది. దీంతో వెంటనే ఎస్ఎల్బీసీ పంట రుణాలు అందజేసేందుకు ఇప్పుడున్న నగదుకు అదనంగా నెలకు రూ.2 వేల కోట్లు కావాలని ఆర్బీఐని కోరినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి ఎస్బీఐ, ఎస్బీహెచ్ బ్యాంకే నెలకు రూ.400 కోట్లు అదనంగా ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. దీంతో త్వరలో నగదు పంపిస్తామని చెప్పింది. అయితే ఎప్పటిలోగా అందజేయనుందో మాత్రం ప్రకటించలేదని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీంతో నగదు కొరత ఎప్పుడు తీరుతుందో రైతు చేతికి ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియకుండా ఉంది. బ్యాంకుల్లోనే వేల కోట్ల రైతు డబ్బు.. వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తున్నాయి. దీంతో ఖరీఫ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే 12 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరిగింది. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చు కోసం రైతులు పంట రుణాలకు వెళ్తున్నారు. బ్యాంకుల్లో ఉన్న తమ డబ్బును తీసుకుందామనుకున్నా అక్కడ డబ్బు లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వరి కొనుగోళ్లు చివరి దశకు వచ్చాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. విక్రయించిన ఆ ధాన్యానికి ప్రభుత్వం రూ.5,500 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసింది. మొత్తం 7 లక్షల మంది రైతుల డబ్బు బ్యాంకుల్లోనే ఉంది. ఈ డబ్బులో దాదాపు రూ.1,500 కోట్లు మాత్రమే రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్నట్లు సమాచారం. మిగిలిన రూ.4 వేల కోట్ల రైతు సొమ్ము బ్యాంకుల్లోనే ఉంది. అవసరాల కోసం రైతులు తమ సొమ్మును తామే తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా రాష్ట్రంలో పలు చోట్ల రైతులు బ్యాంకుల వద్ద ఆందోళనలు చేస్తున్నారు. వరి అమ్మగా వచ్చిన రూ.75 వేలను ప్రభుత్వం బ్యాంకుల్లో జమ చేసిందని, దాన్ని తీసుకోవడానికి బ్యాంకులకు వెళితే నగదు లేదంటూ చెబుతున్నారని బోధన్కు చెందిన రైతు లచ్చిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇచ్చిన పంట రుణాలు 2,573 కోట్లు వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఏటా దాదాపు 40 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటారని అంచనా. అందులో బుధ వారం నాటికి 3.91 లక్షల మంది రైతులకు రూ. 2,573 కోట్ల పంట రుణాలు రైతులకు అందినట్లు అధికారులు తెలిపారు. రేపు పంట రుణాల ప్రణాళిక.. ఈ ఏడాది పంట రుణాల ప్రణాళికను ఎస్ఎల్బీసీ తయారుచేసింది. ఆ ప్రణాళికను శుక్రవారం విడుదల చేయనుంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో వర్షాకాలం, యాసంగి పంటలకు రూ.39,752 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధారించినట్లు తెలిసింది. అందులో ఖరీఫ్కు రూ.23,852 కోట్లు, రబీకి రూ.15,900 కోట్లు నిర్ధారించినట్లు సమాచారం. 2016–17 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ పంట రుణాల ప్రణాళిక రూ.30,140 కోట్లు. -
‘డర్టీ డజన్’పై దివాలా అస్త్రం!
♦ ఆ 12 ఖాతాల సంగతి ముందు చూడండి ♦ వారిపై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోండి ♦ ఎన్పీఏలపై బ్యాంకుల్ని ఆదేశించిన రిజర్వు బ్యాంకు ♦ మిగిలిన ఎన్పీఏలకు సంబంధించి ఆరునెలల్లో ప్రణాళిక ♦ అప్పటికీ పరిష్కారం కాకుంటే వారిపైనా దివాలా కోడ్ ♦ కంపెనీ లా ట్రిబ్యునల్లోనూ ఈ కేసులకు ప్రాధాన్యం ♦ ఎట్టకేలకు మొండి బకాయిలపై కార్యాచరణ షురూ! న్యూఢిల్లీ, మొండి బకాయిల పని పట్టడంలో భాగంగా కింగ్ఫిషర్ గ్రూపు అధినేత విజయ్ మాల్యాపై ఇప్పటికే బ్యాంకులు చట్టపరమైన చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో... అతనికంటె ఘనులు మరో 12 మందిని రిజర్వు బ్యాంకు గుర్తించింది. వారందరిపై దివాలా కోడ్ ప్రకారం చర్యలు ప్రారంభించాల్సిందిగా బ్యాంకుల్ని ఆదేశించింది. చిత్రమేంటంటే దేశవ్యాప్తంగా మొత్తం బ్యాంకులిచ్చిన బకాయిల్లో దాదాపు రూ.8 లక్షల కోట్లు మొండి బకాయిలుగా మారిపోయాయి. ఈ 8 లక్షల కోట్లలో 25 శాతం... అంటే దాదాపు రూ.2 లక్షల కోట్లను ఎగవేసింది కేవలం 12 మంది!!. ‘‘ఈ 12 ఖాతాలపైనా తక్షణం దివాలా చట్టం కింద (ఐబీసీ) చర్యలు ఆరంభించవచ్చునని గుర్తించాం’’ అని ఆర్బీఐ స్పష్టంచేసింది. అయితే ఈ 12 మంది పేర్లు మాత్రం వెల్లడించలేదు. నిరర్ధక ఆస్తులుగా మారిన రూ.8 లక్షల కోట్లలో 75 శాతం... అంటే రూ.6 లక్షల కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులిచ్చినవే. దివాలా చట్టం కింద ఎవరెవరిపై చర్యలు చేపట్టవచ్చో సూచించేందుకు రిజర్వు బ్యాంకు ఇటీవలే అంతర్గతంగా ఓ అడ్వైజరీ కమిటీని నియమించింది. దీన్లో అత్యధికులు ఆర్బీఐలోని స్వతంత్ర సభ్యులే. ఈ కమిటీ అన్నిటినీ పరిశీలించిందని, ఎలాంటి వివక్షకూ తావివ్వకుండా, అధ్యయనానంతరం ఈ నిర్ణయానికి వచ్చిందని బ్యాంకు తెలియజేసింది. ‘‘ఈ కమిటీ అన్ని ఖాతాలనూ పరిశీలించింది. 2016 మార్చి 31 నాటికి రూ.5వేల కోట్లు అంతకన్నా ఎక్కువ అప్పులుండి, వాటిలో 60 శాతానికి పైగా అప్పులు ఎన్పీఏలుగా మారిన పక్షంలో... అలాంటి ఖాతాల్ని ఈ దివాలా చట్టం కింద విచారించవచ్చని సూచించింది. కమిటీ సూచన మేరకు... ఆయా ఖాతాలపై దివాలా చట్టం కింద కేసులు పెట్టాల్సిందిగా మేం బ్యాంకులను కోరుతున్నాం’’ అని ఆర్బీఐ వివరించింది. లా ట్రిబ్యునల్లో ప్రాధాన్యం ఇలా బ్యాంకులు దివాలా కేసు పెట్టిన ఖాతాలపై విచారణకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ అధిక ప్రాధాన్యమిస్తుందని కూడా ఆర్బీఐ ఈ సందర్భంగా తెలియజేసింది. ఈ 12 ఖాతాలూ కాకుండా మిగిలిన ఎన్పీఏలకు సంబంధించి ఆరు నెలల్లోగా బ్యాంకులు పరిష్కార ప్రణాళికను తయారు చేయాల్సిందిగా కూడా రిజర్వు బ్యాంకు అడ్వైజరీ కమిటీ సిఫారసు చేసింది. ‘‘ఒకవేళ ఆయా ఖాతాలకు సంబంధించి ఆరు నెలల్లోగా ఇరు పక్షాలకూ ఆమోదయోగ్యమైన పరిష్కారం దొరకకపోతే... ఆయా ఖాతాలపై కూడా దివాలా చట్టం కింద చర్యలు చేపడతాం’’ అని ఆర్బీఐ తెలియజేసింది. టాప్–500 ఖాతాల్ని పరిశీలించాకే... భారీ ఎత్తున అప్పుల్లో కూరుకుపోయి, స్ట్రెస్డ్ అసెట్స్ ఖాతాలుగా బ్యాంకులు గుర్తించిన 500 ఖాతాలను అడ్వైజరీ కమిటీకి ఇచ్చినట్లు ఈ సందర్భంగా ఆర్బీఐ తెలిపింది. ‘‘ఆ స్ట్రెస్డ్ రుణాల్లో చాలావాటిని బ్యాంకులు ఇప్పటికే ఎన్పీఏలుగా కూడా ప్రకటించేశాయి. వాటన్నిటినీ చూశాకే అడ్వైజరీ కమిటీ తాజా సిఫారసు చేసింది’’ అని ఆర్బీఐ వివరించింది. నిజానికి ఈ 12 ఖాతాల పేర్లను ఆర్బీఐ గానీ, బ్యాంకులుగానీ వెల్లడించలేదు. కాకపోతే దేశవ్యాప్తంగా భారీగా రుణాల్లో కూరుకుపోయి, చాలావరకూ రుణాలను ఇప్పటికే ఎగ్గొట్టి స్ట్రెస్డ్ ఖాతాలుగా మారిన టాప్–14 సంస్థల వివరాలు పై బాక్స్లో చూడవచ్చు. (విజయ్ మాల్యాకు చెందిన కింగ్ఫిషర్ గ్రూప్పై ఇప్పటికే చర్యలు ఆరంభించిన నేపథ్యంలో దాన్ని ఈ జాబితాలో చేర్చలేదు) -
సెన్సెక్స్ 58 పాయింట్లు డౌన్
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ధోరణులు నెలకొన్న నేపథ్యంలో దేశీ మార్కెట్లు గురువారం స్వల్పంగా క్షీణించాయి. సెన్సెక్స్ 58 పాయింట్లు, నిఫ్టీ 16 పాయింట్లు తగ్గాయి. బ్రిటన్లో ఎన్నికలు, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ విధాన సమావేశం తదితర అంశాలు దీనికి కారణమయ్యాయి. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.3 శాతంగా ఉండొచ్చని, వ్యవసాయ రుణాల మాఫీతో ద్రవ్యోల్బణం ఎగుస్తుందన్న రిజర్వ్ బ్యాంక్ వ్యాఖ్యలతో కూడా ట్రేడింగ్ సెంటిమెంట్పై ప్రభావం పడినట్లు బ్రోకింగ్ సంస్థలు పేర్కొన్నాయి. మెరుగ్గానే ప్రారంభమైనప్పటికీ అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రిస్కులకు ఇష్టపడని ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో .. మార్కెట్లు క్షీణించినట్లు వివరించాయి. గురువారం మెరుగ్గా 31,317 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత 31,355–31,194 శ్రేణిలో ట్రేడయి చివరికి 31,213 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 9,669–9,641 మధ్య తిరుగాడి ఆఖరికి 9,647 వద్ద క్లోజయ్యింది. ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ అత్యధికంగా 1.38 శాతం క్షీణించగా .. ఐటీ 1.33 శాతం, పీఎస్యూ 0.60 శాతం మేర తగ్గాయి. సెన్సెక్స్ స్టాక్స్లో టీసీఎస్ అత్యధికంగా 3.59 శాతం పతనమైంది. నష్టపోయిన షేర్లలో ఇన్ఫోసిస్, గెయిల్, హీరోమోటోకార్ప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ మొదలైనవి ఉన్నాయి. అయితే డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, సిప్లా తదితర ఫార్మా స్టాక్స్ దాదాపు 3.79 శాతం దాకా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లు చూస్తే నికాయ్ 0.38 శాతం తగ్గగా, షాంఘై కాంపోజిట్ 0.32 శాతం, హాంగ్ సెంగ్ 0.34 శాతం పెరిగాయి. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ మార్కెట్లు కూడా లాభాల్లోనే ట్రేడయ్యాయి. ఐటీ స్టాక్స్లో అమ్మకాల వెల్లువ .. కీలక మార్కెట్లలో వీసాలపరమైన సమస్యలు, ఇతరత్రా సవాళ్ల నేపథ్యంలో ఐటీ రంగ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. టీసీఎస్ 3.59 శాతం, హెచ్సీఎల్ టెక్ 1.30 శాతం, హెక్సావేర్ టెక్ 0.63శాతం, ఇన్ఫోసిస్ 0.54%, టెక్ మహీంద్రా 0.54శాతం, విప్రో 0.06% క్షీణించాయి. బీఎస్ఈ ఐటీ సూచీ 1.33 శాతం తగ్గి 10,178 వద్ద క్లోజయ్యింది. గత సెషన్లో కూడా ఐటీ స్టాక్స్ దాదాపు 5 శాతం దాకా తగ్గాయి. -
గ్రామీణ పోస్టాఫీసులు ఇక మినీ ఏటీఎంలు
- హ్యాండ్ హెల్డ్ డివైస్ల ద్వారా నగదు చెల్లింపులు - తెలంగాణ, ఏపీల్లో ఏప్రిల్ చివరి నాటికి 2 వేల గ్రామాల్లో అందుబాటులోకి.. - ‘సాక్షి’తో భారత తపాలాశాఖ కార్యదర్శి సుధాకర్ సాక్షి, హైదరాబాద్: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బ్యాంకులు ఏటీఎంల సంఖ్య తగ్గించుకోవాలని నిర్ణయించాయి. తపాలా శాఖ మాత్రం అన్ని గ్రామాల్లోని తపాలా కార్యాలయాల్లో హ్యాండ్ హెల్డ్ డివైస్లను అందుబాటులోకి తెచ్చి వాటిని మినీ ఏటీఎంలుగా మార్చాలని నిర్ణయించింది. ఇందుకు రిజర్వ్ బ్యాంకు కూడా అనుమతివ్వడంతో ఈ నెల చివరి నాటికే అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ నెలాఖరునాటికి దేశవ్యాప్తంగా 24 వేల గ్రామీణ తపాలా కార్యాలయాల్లో హ్యాండ్ హెల్డ్ డివైస్ల ద్వారా నగదు చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు సంబంధించి 2 వేల గ్రామీణ తపాలా కార్యాలయాల్లో నగదు చెల్లింపుల విధానం అందుబాటులోకి రానుంది. త్వరలో ఆ సంఖ్య 13 వేలకు చేరుకోనుంది. ఈ విషయాన్ని భారత తపాలాశాఖ కార్యదర్శి సుధాకర్ వెల్లడించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆయన బుధవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.... దేశవ్యాప్తంగా 13 లక్షల గ్రామీణ తపాలా కార్యాలయాలకు హ్యాండ్ హెల్డ్ డివైస్లను సమకూర్చబోతున్నాం. ఇప్పుడు కొన్ని పోస్టాఫీసులు, సబ్ పోస్టాఫీసుల్లో మైక్రో ఏటీఎంలు పనిచేస్తున్నాయి. అవి కేవలం పోస్టాఫీసుల్లో ఖాతా ఉన్నవారు మాత్రమే నగదు పొందేందుకు ఉపయోగపడుతున్నాయి. వాటితోపాటు కొత్తగా ఏర్పాటు చేసే డివైస్ల నుంచి ఎవరైనా నగదు పొందవచ్చు. తపాలా కార్యాలయాల పనివేళల్లోనే ఇది అందుబాటులో ఉంటుంది. తొలుత రూ.5 వేల వరకు నగదు పొం దవచ్చు. ఆ తర్వాత పెంచుతాం. అన్ని గ్రామీణ తపాలా కార్యాలయాల్లో నగదు నిల్వలు సిద్ధం చేస్తున్నాం. ఏటీఎం కార్డుతో వచ్చే వారు హ్యాండ్ హెల్డ్ డివైస్లో స్వైప్ చేస్తే అక్కడున్న సిబ్బంది డబ్బు అందిస్తారు. తపాలా కార్యాలయాల్లో ఖాతా ఉన్న వారికి ఎలాంటి రుసుములు ఉండవు, బ్యాంకు ఖాతాదారులకు మాత్రం ఒక్కో విత్డ్రా యల్కు నిర్ధారిత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తం ఖాతాదారు నుంచి కాకుండా సంబంధిత బ్యాంకు నుంచి వసూలు చేస్తాం. తపాలా కార్యాలయాలతో గ్రామాల్లోని దుకాణాలను అనుసంధానం చేసి నగదు రహిత లావాదేవీలు జరిపే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. -
బ్లాక్ అండ్ వైట్!
⇒సిటీ హల్చల్ చేస్తున్న ‘కరెన్సీ గ్యాంగ్లు’ ⇒ఆర్బీఐతో లింకులున్నాయంటూ ప్రచారం ⇒ఆ ఆర్డినెన్స్ లేకుంటే నామమాత్రపు కేసే ⇒సందట్లో సడేమియా అన్నట్లు నకిలీ, ‘టాయ్’గాళ్ళు ⇒వివిధ కేసుల్లో 10 రోజుల్లో 36 మంది అరెస్టు సిటీబ్యూరో: ఓ వైపు నగరవాసులు ఏటీఎం కేంద్రాలు, బ్యాంకుల్లో డబ్బు దొరక్క ఇబ్బందులు పడుతుండగా... మరోపక్క ‘కరెన్సీ గ్యాంగ్స్’ సిటీల హల్చల్ చేస్తున్నాయి. పాత కరెన్సీ మారుస్తామని కొందరు, నకిలీ నోట్లతో ఇంకొందరు రెచ్చిపోతున్నారు. ఈ రెండూ చాలవన్నట్లు మల్కాజిగిరిలో ఓ వ్యక్తి బొమ్మ కరెన్సీతో ఏకంగా బ్యాంకుకే వెళ్ళి సంచలనం సృష్టించాడు. మొత్తమ్మీద గడిచిన పది రోజుల్లో కరెన్సీ క్రైమ్కు సంబంధించి పోలీసులు 36 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.3.2 కోట్లకు పైగా స్వాధీనం చేసుకున్నారు. వీటిలో పాత, కొత్త నోట్లతో పాటు టాయ్ కరెన్సీలూ ఉన్నాయి. నెలాఖరుతో ముగియనున్న గడువు... డీమానిటైజేషన్ తర్వాత కేంద్రం పాత నోట్లను మార్చుకోవడానికి అనేక అవకాశాలు ఇచ్చింది. తొలినాళ్ళల్లో బ్యాంకులు, పోస్టాఫీసుల్లోనే మార్చుకునేలా ఏర్పాట్లు చేసింది. ఆపై ఈ నెల 31 వరకు రిజర్వు బ్యాంక్ వద్ద పాత నోట్లను మార్పిడి చేసుకునే అవకాశం ఉంది. నెలాఖరుతో ఆ గడువు ముగియనున్న నేపథ్యంలో ‘నల్లబాబుల’ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆ తర్వాత పాత కరెన్సీ కలిగి ఉండటం కూడా నేరం. దీంతో నేరుగా ఆర్బీఐకి వెళ్ళి మార్చుకోవడానికి ‘లెక్కలు’ తిప్పలు వచ్చిపడతాయి. దీంతో ఎవరికి వారు తమకు ఉన్న పరిచయాల ఆధారంగా పాత నోట్లను గుట్టచప్పుడు కాకుండా మార్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆర్బీఐతో లింకులున్నాయంటూ... పాత నోట్లను మార్చిపెడతామంటూ రంగంలోకి దిగుతున్న వారికి భారీ డిమాండ్ ఉంటోంది. పాత నోట్ల మొత్తంలో 40 నుంచి 50 శాతం కొత్త నోట్లు ఇస్తామంటూ వీరు హల్చల్ చేస్తున్నారు. తమకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో లింకులు ఉన్నాయంటూ ప్రచారం చేసుకుంటూ ‘నల్లబాబుల్ని’ ఆకర్షిస్తున్నారు. తెలంగాణతో పాటు ఏపీ చెందిన ‘పాత వాళ్ల’ను సిటీకి రప్పించి భారీ మొత్తాల మార్పిడికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి కమీషన్ రాయుళ్ళు నిజంగా మార్చడం అనేది జరుగదని పోలీసులు పేర్కొంటున్నారు. కేవలం ఫలానా అధికారులతో తమకు పరిచయాలు ఉన్నాయని చెబుతూ ‘నల్లబాబుల్ని’ ఆకర్షిస్తుంటారని, అవకాశం చిక్కితే వారిని మోసం చేయడానికీ వెనుకాడరని స్పష్టం చేస్తున్నారు. డీమానిటైజేషన్ ప్రకటన వెలువడిన తర్వాత భారీగా ‘మార్పిడి’ జరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదన్నారు. ఆర్డినెన్స్ లేకుంటే నామ్కే వాస్తేనే... ఇలా మార్పిడికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలపై నగర పోలీసులు అనేక మందిని పట్టుకుంటున్నారు. వాస్తవానికి వీరిపై కేవలం మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణతోనే కేసు నమోదు చేసే ఆస్కారం ఉంది. అయితే డీమానిటైజేషన్ తర్వాత కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ఆధారంగా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఓ పక్క వీరు దర్యాప్తు చేస్తూనే మరోపక్క భారీ మొత్తం పట్టుబడినప్పుడు ఆ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇస్తున్నారు. దీంతో ఆ అధికారులు వారి కోణంలో విచారణ చేస్తున్నారు. తాము స్వా«ధీనం చేసుకున్న డబ్బును న్యాయస్థానంలో అప్పగిస్తున్నామని, ఐటీ అధికారులకు అవసరమనుకుంటే కోర్టు ద్వారా తీసుకుంటారని ఓ అధికారి పేర్కొన్నారు. నకిలీ నోట్లతో రంగంలోకి... కరెన్సీ కొరత, మార్పిడికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో రూ.2 వేల నకిలీ కొత్త నోట్లతో రంగంలోకి దిగుతున్న ముఠాలు ఉంటున్నాయి. రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) పోలీసుల బుధవారం అరెస్టు చేసిన ముఠా ఇందుకు నిదర్శనం. కలర్ జిరాక్సు ద్వారా నకిలీ రూ.2 వేల నోట్లు తయారు చేసిన ముగ్గురు సభ్యుల ముఠా దాన్ని నాలుగు నెలల పాటు దాచి ఉంచింది. తాజాగా ఏర్పడిన నగదు కొరత, మార్పిడి ముఠాలకు పెరిగిన డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఆ నకిలీ నోట్లు మార్చేయడానికి రంగంలోకి దిగింది. విషయం వెంటనే ఎస్వోటీకి తెలియడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ‘కరెన్సీ క్రైమ్’ పెరిగిన మాట వాస్తవమేనని పోలీసులే అంగీకరిస్తున్నారు. ఎక్కడికక్కడ నిఘా, సమాచార వ్యవస్థను పటిష్టం చేసి వీరికి చెక్ చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. -
బుచ్చి ఎస్బీఐలో గోల్డ్ లోన్ల గోల్మాల్
- పెద్దనోట్ల రద్దు సమయంలో రూ.12.40 లక్షల అవినీతి - ఇద్దరు అధికారుల మీద సీబీఐ కేసు నమోదు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నోట్ల రద్దు సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుచ్చిరెడ్డిపాళెం శాఖలో బంగారు రుణాల మంజూరు మాటున రూ.12.40 లక్షలు అవినీతి జరిగింది. ఈ విషయంపై అందిన ఫిర్యాదుతో బ్యాంకు సీనియర్ స్పెషల్ అసిస్టెంట్ ఎం.సుల్తాన్ మొహిద్దీన్, డిప్యూటీ మేనేజర్ (ఆపరేషన్) ఐ.జె.రాజశేఖర్మీద కేసు నమోదు చేసినట్లు సీబీఐ ఎస్పీ ఆర్.గోపాలకృష్ణారావు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఖాతాదారులకు, రుణగ్రహీతలకు కూడా నగదు చెల్లింపు విషయంలో రిజర్వ్ బ్యాంకు అనేక షరతులు విధించింది. దేశ వ్యాప్తంగా అనేక బ్యాంకుల్లో ఖాతాదారులు రూ.10 వేల నగదు కూడా ఉపసంహరించుకోలేక అవస్థలు పడ్డారు. బుచ్చిరెడ్డిపాళెం ఎస్బీఐలో పనిచేస్తున్న సుల్తాన్ మొహిద్దీన్, రాజశేఖర్ ఈ అవకాశాన్ని అనుకూలంగా మలుచుకుని అవినీతికి పాల్పడ్డారు. గత ఏడాది నవంబరు 15, 25 తేదీల్లో సుల్తాన్కు బినామీ పేర్ల మీద డిప్యూటీ మేనేజర్ రాజశేఖర్ నాలుగు బంగారు రుణాల కింద రూ.9.70 లక్షలు మంజూరు చేశారు. మరో మూడు బంగారు రుణాలు మంజూరు చేసి ఇందుకు సంబంధించి రూ.2.70 లక్షలు కొత్త రూ.500, రూ.2000 నోట్లు అందజేశారు. ఇదే సమయంలో గత ఏడాది నవంబరు 21, నవంబరు 25వ తేదీల్లో రూ.500 పాత నోట్లు జమ చేసి సుల్తాన్కు మంజూరు చేసిన రెండు బినామీ రుణాలు క్లోజ్ చేశారు. ఈ విషయంపై ఫిర్యాదులు రావడంతో విశాఖపట్నం సీబీఐ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేశారు. బ్యాంకు ఉన్నతాధికారులు సుల్తాన్ మొహిద్దీన్ను సస్పెండ్ చేశారు. సీబీఐ అధికారులు శని, ఆదివారాల్లో ఇందుకు సంబం«ధించి బ్యాంకు రికార్డులు తనిఖీ చేశారు. ఈ సంఘటన బుచ్చిరెడ్డిపాళెంలో సంచలనం కలిగించింది. లోతుగా జరిపిన విచారణలో రూ.12.40 లక్షలు గోల్ మాల్ జరిగిందని తేల్చారు. దీంతో సుల్తాన్, రాజశేఖర్ మీద ఐపీసీ సెక్షన్ 120 ృబి రెడ్విత్ 420, 409, 1988 పీసీ చట్టం లోని సెక్షన్ 13(2), రెడ్ విత్ 13(1)(డి) సెక్షన్ల కింద సోమవారం కేసు నమోదు చేశారు. కేసు విచారణ దశలో ఉందని ఎస్పీ గోపాలకృష్ణారావు తెలిపారు. అధికారులు ఇద్దరూ తమ చేతిలో అధికారాన్ని ఉపయోగించి అవినీతి పాల్పడ్డారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగం సంస్థలు, బీమా సంస్థల్లో అవినీతిపై ప్రజలు ఎస్పీ కార్యాలయం, సీబీఐ, విశాఖపట్నం చిరునామాకు నేరుగా గానీ, పోస్టు ద్వారా లేదా 1800 425 00100 టోల్ఫ్రీ నంబరుకు గానీ ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు. -
నగదు రహితం అంతంత మాత్రమే
► డల్గా..డిజిటల్ టాన్సాక్షన్ ► సైబర్నేరగాళ్ల భయంతో వెనకడుగు.. ► ఏప్రిల్ 1 నుంచి క్యాష్లెస్ సాధ్యమేనా? రాజంపేట: జిల్లాలో డిజిటల్ ట్రాన్సాక్షన్ డల్గానే కొనసాగుతోంది. నగదు లావాదేవీల వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఫిబ్రవరి నాటికి డిజిటల్ లావాదేవీలు తగ్గినట్లు రిజర్వుబ్యాంకు లెక్కలే చెబుతున్నాయి. పెద్దనోట్ల రద్దు తర్వా త నగదు ఉపసంహరణ పరిమితిలో సడలింపుల వల్ల మార్కెట్లో డబ్బు అందుబాటులో ఉంటోంది. రిజర్వు బ్యాంకు లెక్కల ప్రకారం గత ఏడాది నవంబరులో 675.5 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. డిసెంబరు 957.5, ఈ ఏడాది జనవరిలో 870.4 మిలియన్లు, ఫిబ్రవరిలో 537.5 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. గత ఏడాది డిసెంబరుతో పోలీస్తే జనవరిలో 87.1 మిలియన్ల మేర లావాదేవీల్లో తగ్గుదల ఉంది. నగదు అందుబాటులో..: జిల్లాలో వ్యాపార కేంద్రాలైన కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి ప్రాంతాల పరిధిలో నగదు అందుబాటులో ఉండటంతో డిజిటల్ లావాదేవీలు తగ్గిపోయాయి. గత ఏడాది నవంబరులో నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజల వద్ద పెద్దనోట్లు ఉన్నా అవి చిత్తు కాగితాలుగా మిగలడంతో బ్బం దులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ దశలో నగదు రహితంపై ప్రభుత్వంపై దృష్టి సారిం చింది. దాదాపు జిల్లాలో 25 శాతం వరకు నగదు రహిత లావాదేవీలు చేసే స్ధాయికి వెళ్లింది. ప్రచారం చేసినా స్పందనేది..: నగదు రహితలావాదేవీలపై విద్యార్ధులతో ప్రచారం..ప్రతిరోజు సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహించిన ప్రజల నుంచి స్పందన లేదరు. డిజిటల్ లావాదేవీలపై సర్వీస్ చార్జి మినహాయించినా ప్రజలు, వ్యాపారుల నుంచి నిరాస్తకత కనిపిస్తోం ది. డిజిటల్ లావాదేవీల పెంపునకు ఎపీ పర్స్ అనే యాప్ను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. లక్షకుపైగా డౌన్లోడ్తో 3.2 స్టార్ రేటింగ్తో ఇది కొనసాగుతోంది. చౌక దుకాణాల్లో రేషన్ను పూర్తి స్ధాయిలో నగదు రహితంగా అందజేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జిల్లాలో పరిస్ధితి అంతంతమాత్రంగానే ఉంది. లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాలు, ఆధార్తో అనుసంధానం కాకపోడవం, డీలర్ల ఖాతాలు కూడా అనుసంధానం కాకపోవడం, సాప్ట్వేర్, సర్వర్ సమస్యలతో ఇది పూర్తిగా అమలులోకి రాలేదు.ఏప్రిల్ 1 నుంచి పూర్తిగా నగదు రహిత (క్యాష్లెస్) లావాదేవీలు నిర్వహించాలన్న ప్రభుత్వం లక్ష్యం నెరవేరడం కష్టమేనని పలువురు అంటున్నారు. సైబర్ నేరగాళ్ల భయంతోనే..: పెద్దనోట్లు రద్దు చేశాక నగదు రహిత లావాదేవీలు కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. 75శాతం అక్షరాస్యత దాటని మనదేశంలో ఇది సాధ్యమవుతుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రజలకు డిజిటల్ లావాదేవీలపై పూర్తి స్ధాయిలో అవగాహన లేదు. దీన్ని ఆసరాగా తీసుకుని సైబర్నేరగాళ్లు రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకుల్లో డబ్బు జమ చేయాలంటే ఇబ్బందులు పడుతున్నామని, స్వైపింగ్ బాగోతం గోరుచుట్టుపై రోకలిపోటుగా తయారైందని సామాన్య ప్రజలు, వ్యాపారులు అంటున్నారు.చిరు వ్యాపారులు చేసుకొనేవారికి వీటివల్ల ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు. -
గణాంకాల మాయాజాలం
గణాంకాలు సగటు మనిషిని చికాకుపరుస్తాయి. వాటి సారాంశమేమిటో తెలుసు కుని నిట్టూర్చడమో, ఊపిరిపీల్చుకోవడమో తప్ప... లోతుల్లోకి పోయి అర్ధం చేసు కోవడానికి ప్రయత్నించేంత తీరిక, ఓపిక వారికి ఉండవు. వాటి నిజానిజాలను తేల్చుకునే నైపుణ్యమూ ఉండదు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ దేన్నయినా తేలిగ్గా చెప్పే ప్రయత్నం చేస్తారు. అందుకే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశ ప్రచారంలో ఆయన అంతకుముందు రోజు కేంద్ర గణాంకాల శాఖ(సీఎస్ఓ) ప్రకటించిన దేశ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)ని ప్రస్తావించారు. జీడీపీ 7శాతం ఉన్నదని తేలింది గనుక ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ యూనివర్సిటీల్లో చదివిన ‘మహా ఆర్థికవేత్తలు’ ఏమంటారని ఎద్దేవా చేశారు. హార్వర్డ్ కన్నా ‘హార్డ్వర్క్’(కఠోరశ్రమ) మిన్న అని చెప్పారు. ‘పెద్ద నోట్లు రద్దు వల్ల వృద్ధి రేటు 2 శాతం పడిపోతుంది... 4శాతం పడిపోతుంది’అంటూ బెదరగొట్టారని గుర్తుచేశారు. పేర్లు చెప్పకపోయినా మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కేంద్ర మాజీ ఆర్ధికమంత్రి చిదంబరం, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్లను ఉద్దేశించే ఆయనలా అన్నారని అందరికీ అర్ధమైంది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం సంగతలా ఉంచి అంతకుముందు నుంచే ఆర్థిక స్థితి బాగు లేదని పెదవి విరిచినవారున్నారు. ఎవరి వరకో ఎందుకు... రిజర్వ్బ్యాంక్ గవర్నర్గా ఉన్నప్పుడు రఘురాంరాజనే అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి గురయ్యారు. నిరాశామయ వర్తమానంలో భారత్ దేదీప్య మానంగా వెలుగుతున్న దేశమని నిరుడు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అన్నప్పుడు రఘురాం రాజన్ పొంగిపోలేదు. ‘అంధుల దేశానికి ఒంటి కన్ను ఉన్నవాడే రాజు’ అంటూ వ్యాఖ్యానించి నిర్వేదంగా మాట్లాడారు. నిజమే...మొన్న డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికం (అక్టోబర్–డిసెం బర్)లో జీడీపీ 7 శాతంగా నమోదైనట్టు సీఎస్ఓ అంచనా వేసింది. అది 6.1–6.8 మధ్య ఉండొచ్చునని అంతక్రితం అనేక ఏజెన్సీలు భావించాయి. పెద్దనోట్ల రద్దు, కొత్త నోట్ల లభ్యత సక్రమంగా లేని కారణంగా చిన్న పరిశ్రమలు మూతబడటం, రోజుకూలీలు సైతం ఉపాధి కోల్పోవడంవంటివి జరిగాయని వార్తలొచ్చిన నేప థ్యంలో సీఎస్ఓ గణాంకాలు నిజమేనా అన్న సందేహం ఎవరికైనా వస్తుంది. ఎన్ని ఒడిదుడుకులొచ్చినా, చివరకు పెద్దనోట్ల రద్దు లాంటి పెద్ద నిర్ణయం తీసుకున్నా వాటన్నిటినీ తట్టుకునేంత పటిష్టంగా దేశ ఆర్థికవ్యవస్థ ఉంటే అది గర్వించదగిన, సంతోషించదగిన అంశం. అయితే తయారీ, వ్యవసాయ రంగాల ఊతం కార ణంగా అది పెరిగిందని సీఎస్ఓ అంటున్నది. పెద్ద నోట్ల రద్దు సమయంలో హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ ఆర్ధికవేత్తలు మాత్రమే కాదు... ఇతర వర్గాలవారు కూడా ఆ నిర్ణయంలోని లోటుపాట్ల గురించి చర్చించారు. విమర్శించినవారున్నట్టే మెచ్చుకున్న వారూ ఉన్నారు. కానీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్)కు అనుబంధంగా ఉన్న భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) సైతం ఆ నిర్ణయాన్ని దుయ్యబట్టింది. దానివల్ల 20 లక్షలమంది ఉద్యోగావకాశాలు కోల్పోయారని సంస్థ అధ్యక్షుడు బైజ్నాథ్ రాయ్ అప్పట్లో అన్నారు. అసంఘటిత రంగంలో పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉన్నదని కూడా చెప్పారు. నోట్ల రద్దు జరిగిన నెల్లాళ్ల తర్వాత అన్న మాటలవి. ఆ నిర్ణయం వెనకున్న ఉద్దేశం మంచిదని మెచ్చుకుంటూనే ఆయన ఈ లెక్కలు చెప్పారని గుర్తుంచుకుంటే సీఎస్ఓ తాజా గణాంకాలు ఆశ్చర్యం కలిగిం చడంలో వింతేమీ లేదు. సీఎస్ఓ గడిచిన త్రైమాసికంలో ఆశావహమైన స్థితి ఉన్నదని చెప్పడమే కాదు... మొత్తంగా 2016–17 ఆర్ధిక సంవత్సరానికి వృద్ధి రేటు 7.1 శాతంగా ఉంటుందని కూడా భరోసా ఇచ్చింది. అయితే పెద్దనోట్ల రద్దు తర్వాత పరోక్ష పన్నుల వసూళ్లు ముమ్మరమయ్యాయని మర్చిపోకూడదు. పాత నోట్లతో పన్నులు కట్టొచ్చునని ప్రభుత్వాలు ప్రకటించేసరికి ఏళ్ల తరబడి మొండి బకాయిలుగా ఉన్నవి కూడా వసూలయ్యాయి. ఎటూ రద్దయిన నోట్లను చేంతాడంత క్యూల్లో గంటలకొద్దీ నిలబడి మార్చుకోవాల్సి ఉంటుంది గనుక దాని బదులు బకాయిలు చెల్లిస్తే సమస్య తీరుతుందని చాలామంది భావించారు. అదే సమయంలో పలు సంస్థలు, కంపెనీలు కూడా ఉత్పాదకతకు సంబంధించిన పన్నులను పాత నోట్లలో ముందే చెల్లించాయి. అలాగే తమ దగ్గరున్న నగదు నిల్వలను విక్రయాలుగా చూపించాయి. ఇవన్నీ జీడీపీ పెరుగుదలపై ప్రభావాన్ని చూపి ఉండొచ్చు. సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ టాక్స్, కస్టమ్స్ సుంకం వంటి వసూళ్లు మొన్న జనవరికి రూ. 7.03 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంతక్రితం అదే కాలంలో వసూలైన పన్ను వసూళ్లతో పోలిస్తే అది 23.9 శాతం అధికం. పైగా నోట్ల రద్దు రాబోతున్నదని తెలియక రెండు పెద్ద పండుగలకు జనం బాగా ఖర్చుపెట్టారు. వీటన్నిటి సంగతలా ఉంచి రెండేళ్లక్రితం ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థ్ధిక కార్యకలాపాలను కొలిచే విధానాన్ని మార్చినప్పటినుంచి ఆర్థికవ్యవస్థ పెను వేగంతో కదులుతున్నట్టు కనబడటం మొదలుపెట్టిందని, ఇప్పుడు వెలువడిన గణాంకాలు కూడా ఆ వరసలోనివేనని పెదవి విరుస్తున్న వారున్నారు. ఉత్తరాదిలో తయారీ రంగ పరిశ్రమలు విస్తృతంగా ఉండే లూథియానా, ఆగ్రా, నోయిడా... తమిళనాడులోని తిరుపూర్ వంటిచోట్ల పరిశ్రమలు మూతబడ్డాయని, కార్మికులను రిట్రెంచ్ చేశారని వార్తలొచ్చాయి. నిర్మాణరంగం మందగించిందని, వాహనాల అమ్మకాలు తగ్గిపోయాయని కథనాలు వెలువడ్డాయి. తమ ఆదాయం, ఉపాధిపై గృహస్తుల్లో ఉన్న అనిశ్చితివల్ల వినియోగదారుల విశ్వాసం గణనీయంగా పడిపోయిందని రిజర్వ్బ్యాంక్ తాజా సర్వే కూడా చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎస్ఓ అందుకు భిన్నమైన స్థితిని ఆవిష్కరించడం ఒక వైచిత్రి. అయితే ఇది కేవలం ఈ త్రైమాసికానికి సంబంధించిందే. దీన్నిబట్టి అంతా బాగున్నదని మెచ్చుకోవడమో, వాస్తవాలను ప్రతిబింబించడంలేదని విమర్శిం చడమో చేయడం సరికాదు. మొత్తంగా 2016–17 ఆర్థిక సంవత్సరం వాస్తవ స్థితి 2018 జనవరిలో వెలువడే సవరించిన గణాంకాలు చెబుతాయి. అంతవరకూ ఓపిక పట్టక తప్పదు. -
నేటి నుంచి రూ.50వేలు తీసుకోవచ్చు
-
నేటి నుంచి రూ.50వేలు తీసుకోవచ్చు
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు విత్ డ్రా పరిమితులతో ఇబ్బందులు పడ్డ ఖాతాదారులకు నేటి నుంచి ఓ శుభవార్త. సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ నేటి నుంచి వారానికి రూ.50వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. జనవరి 30న జారీచేసిన నోటిఫికేషన్లో దశల వారీగా నగదు విత్ డ్రాలపై ఆంక్షలు ఎత్తివేస్తామని చెప్పిన ఆర్బీఐ, ఆ నోటిఫికేషన్ ప్రకారం ఫిబ్రవరి 20 నుంచి సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ వారానికి రూ.50వేలు డ్రా చేసుకోవచ్చు. ఇన్ని రోజులు ఈ పరిమితి రూ.24వేలుగా ఉండేది. మార్చి 13 నుంచి ఈ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తున్నారు. ప్రస్తుతమైతే, కరెంట్ అకౌంట్ హోల్డర్స్కు నగదు విత్ డ్రాలపై ఎలాంటి పరిమితులు లేవు. వ్యవసాయదారులైతే వారానికి రూ.50 వేలు, వివాహానికి రూ.2.5 లక్షల విత్ డ్రాయల్స్ను అనుమతిస్తున్నారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ 2016 నవంబర్ 8న సంచలన ప్రకటన చేసిన అనంతరం రిజర్వు బ్యాంకు ఏటీఎంలలలో, బ్యాంకు బ్రాంచులలో నగదు విత్ డ్రాయల్స్పై ఆంక్షలు విధించింది. కొద్దికొద్దిగా కరెన్సీ కష్టాలు తొలగిస్తూ వస్తున్న ఆర్బీఐ, వారానికి విత్ డ్రా పరిమితిని రూ.50వేలకు పెంచిన సంగతి తెలిసిందే. (చదవండి: నగదు విత్ డ్రా పై ఆంక్షలు ఎత్తివేత!) -
ఆర్బీఐ నుంచి రూ.30,900 కోట్లు
తాజాగా రాష్ట్రానికి రూ.1,500 కోట్ల నగదు పంపిణీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి రిజర్వ్ బ్యాంకు మరో రూ.1,500 కోట్ల నగదును పంపిణీ చేసింది. దీంతో నోట్ల రద్దు నిర్ణయం అనంతరం తెలంగాణకు రిజర్వ్ బ్యాంకు పంపించిన మొత్తం రూ.30,900 కోట్లకు చేరింది. ప్రస్తుతం పంపించిన నగదులో ఎక్కువగా రూ.500 నోట్లు ఉన్నా యని, వీటిని ఎక్కువగా ఏటీఎంల్లో అందుబాటులో ఉంచినట్లు బ్యాంకర్లు ప్రభుత్వానికి సమాచారం అందించారు. చిన్న నోట్లు పెరిగిన కొద్దీ నగదు కొరత తగ్గుతోందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. డిసెంబర్ చివరి వారంలో ఉన్న పరిస్థితితో పోలిస్తే రాష్ట్రమంతటా నగదు నోట్ల కొరత తీరిందని, ఏటీఎంలు, బ్యాంకుల వద్ద క్యూలైన్లు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయనే అభిప్రాయానికి వచ్చింది. అందుకే టీఎస్ వ్యాలెట్ రూప కల్పన, డిజిటల్ చెల్లింపులను ఉద్యమంలా ప్రోత్సహించేందుకు మొదట్లో హడావుడి చేసిన ప్రభుత్వం క్రమంగా వెనక్కి తగ్గింది. -
ప్రీపెయిడ్ సాధనాల నిబంధనలు సడలింపు
ముంబై: డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే దిశగా.. ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాల (పీపీఐ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ సడలించింది. అన్లిస్టెడ్ కార్పొరేట్ సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్లు, పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు మొదలైనవి తమ ఉద్యోగులకు పీపీఐలను అందించే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు బ్యాంకులు పీపీఐలను జారీ చేయొచ్చని పేర్కొంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం బ్యాంకులు జారీ చేసే ప్రీపెయిడ్ సాధనాలను పొందే అర్హత లిస్టెడ్ కంపెనీలకు మాత్రమే ఉంది. మరోవైపు, సిబ్బంది గుర్తింపు ధృవీకరణ బాధ్యతలన్నీ సదరు సంస్థ యాజమాన్యానికే ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. పీపీఐలు తీసుకుంటున్న ఉద్యోగుల వివరాలన్నీ సక్రమంగా రికార్డు చేసేలా బ్యాంకులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. సంస్థ నుంచి తగు అనుమతులు వచ్చిన తర్వాత పీపీఐలలో బ్యాంకులు నగదును లోడ్ చేస్తాయి. పీపీఐలో గరిష్టంగా రూ. 50,000 లోడ్ చేయొచ్చు. ఈ మొత్తాన్ని వస్తు, సేవల కొనుగోలు, ఫండ్స్ ట్రాన్స్ఫర్ మొదలైన లావాదేవీలకు ఉపయోగించుకోవచ్చు. -
బ్యాంకు డిపాజిట్లలో 65% కుటుంబ ఖాతాదారులవే
ముంబై: దేశీయ బ్యాంకింగ్ రంగంలో ఈ ఏడాది మార్చి నాటికి నమోదైన మొత్తం డిపాజిట్లలో 61.5 శాతం కుటుంబ ఖాతాదారుల నుంచి వచ్చినవేనని రిజర్వ్ బ్యాంకు వెల్లడించింది. 12.8 శాతం వాటాతో ప్రభుత్వం రెండో స్థానంలో ఉంది. కార్పొరేట్ల డిపాజిట్లు 10.8 శాతంగా ఉన్నాయి. గతేడాది మార్చి 31 నాటికి బ్యాంకుల్లో మొత్తం డిపాజిట్లు రూ.89,72,710 కోట్లు కాగా... అవి 2016 మార్చి 31 నాటికి రూ.98,41,290 కోట్లకు వృద్ధి చెందాయి. వీటిలో 63.8 శాతం టర్మ్ డిపాజిట్లు. కరెంట్, సేవింగ్స్ డిపాజిట్లు కలిపి 36.2 శాతంగా ఉన్నాయి. డిపాజిట్లలో 70.6 శాతం వాటాతో ప్రభుత్వరంగ బ్యాంకులు ముందంజలో ఉన్నాయి. ప్రైవేటు రంగ బ్యాంకుల వాటా 21.6 శాతంగా ఉంది. మొత్తం డిపాజిట్లలో 51.5 శాతం మెట్రోపాలిటన్ నగరాల్లోని శాఖలు సేకరించినవి కావడం గమనార్హం. ఆ తర్వాత అర్బన్ ప్రాంతాల్లోని శాఖలు 22.8 శాతం సేకరించగా, సెమీ అర్బన్ శాఖల నుంచి వచ్చినవి 15.4 శాతం ఉన్నాయి. -
మూడు రోజుల్లో తెలంగాణకు 1,550 కోట్లు
-
మూడు రోజుల్లో 1,550 కోట్లు
రాష్ట్రానికి మొత్తంగా వచ్చిన నగదు 22 వేల కోట్లు సాక్షి, హైదరాబాద్: రిజర్వు బ్యాంకు గత మూడు రోజుల్లో మన రాష్ట్రానికి రూ.1,550 కోట్ల విలువైన నగదును సరఫరా చేసింది. అందులో ఎక్కువగా రూ.500, రూ.100 నోట్లే ఉండటంతో చిల్లర కష్టాలకు ఉపశమనం లభించనుంది. ఇకపై మూడు రోజులకోసారి రాష్ట్రాలకు నగదు కేటాయించాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు తెలిపాయి. అంటే వారంలో రెండుసార్లు నగదు రాష్ట్రానికి పంపిణీ కానుందని, దాంతో కరెన్సీ కొరత తీరుతుందని అధికారులు చెబుతున్నారు.ఇప్పటిదాకా పెద్దనోట్లే! : ఈ నెల 20, 21 తేదీల్లో తెలంగాణకు రూ.1,550 కోట్ల నగదు పంపిణీ జరిగిందని.. గ్రామీణ ప్రాంతాలతో పాటు హైదరాబాద్కు ఆ నగదును సరఫరా చేశారని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. దీంతో నోట్ల రద్దు నిర్ణయం వెలువడినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన కరెన్సీ రూ.22 వేల కోట్లకు చేరింది. అయితే అందులో రూ.3 వేల కోట్లే చిన్న నోట్లు.. మిగతా సొమ్ము రూ.2 వేల నోట్లు కావడం గమనార్హం. -
రూ.500 నోట్లు వచ్చాయోచ్!
► చెన్నైకు విమానంలో రూ. 320 కోట్లు ►చిల్లర నాణేలు కూడా ►కష్టం కొంతైనా తీరేనా? సాక్షి, చెన్నై: చిలర్ల కష్టాలు కొంతైనా తీరేనా..! అన్న ఎదురు చూపులు రాష్ట్రంలో పెరిగారుు. ఇందుకు తగ్గట్టుగా శనివారం చెన్నైకు విమానంలో రూ. 500 కొత్త నోట్ల రూ. 320 కోట్ల మే రకు వచ్చి చేరారుు. అలాగే, సేలంకు రూ. కోటి విలువగల రూ.5, రూ.10 నాణేలు వచ్చారుు. రాష్ట్రంలో ఒకటో తేదీ నుంచి చిల్లర సమస్య మరింత జఠిలంగా మారిన విషయం తెలిసిందే. ఏటీఎంలకు వెళ్లినా, బ్యాంకులకు వెళ్లినా రూ. 2వేల నోట్లే ఇస్తుండడంతో చిల్లర సమస్య మరింతగా పెరిగింది. ఏ షాపునకు వెళ్లినా చిల్లర దొరకని దృష్ట్యా, జనం పాట్లు అంతా, ఇంతా కాదు.ఈ కొరతను అధిగమించేందుకు రూ. ఐదు వందల నోట్లు ఎప్పుడెప్పుడు వస్తాయో అని ఎదురు చూపుల్లో పడ్డారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నాసిక్ నుంచి విమానంలో చెన్నైకు ఐదు వందల నోట్లు వచ్చి చేరారుు. ఉదయాన్నే మీనంబాక్కం విమానాశ్రయం కార్గోకు ఈ నోట్లు చేరుకున్నారుు. రిజర్వు బ్యాంక్ వర్గాలు, పోలీసు యంత్రాంగం నిఘా నడుమ నాలుగు కంటైనర్లలోకి నోట్ల కట్టలతో ఉన్న బాక్సుల్ని చేర్చారు. అక్కడి నుంచి గట్టి భద్రత నడుమ రిజర్వు బ్యాంక్ కార్యాలయానికి తరలించారు. అన్ని ఏటీఎంలలో పొందు పరిచేందుకు, బ్యాంకుల్లో పంపిణీ నిమిత్తం తరలించేందుకు రిజర్వు బ్యాంక్ వర్గాలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారుు. సోమవారం రూ. ఐదు వందల కొత్త నోట్లు జనం చేతికి చేరే అవకాశాలు ఉన్నారుు. సేలంకు రూ. కోటి విలువగల రూ. ఐదు, రూ.పది నాణేలను తరలించారు. అక్కడి బ్యాంక్లకు ఈ చిల్లరను గట్టి భద్రత నడుమ చేర్చారు. రిజర్వు బ్యాంక్ నిబంధనల్ని ఉల్లంఘించి బ్యాంకులు వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు బయలు దేరారుు. గృహ, వాహన రుణాలను ముక్కు పిండి మరీ వసూళ్లు చేసే పనిలో పడ్డట్టుగా ఆరోపణలు వస్తున్నారుు. ఇక, శనివారం కూడా బ్యాంక్ల వద్ద, ఏటీఎంల వద్ద జనం బారులు తీరక తప్పలేదు. పలు చోట్ల బ్యాంకుల వద్ద ఆందోళనలు సాగారుు. మన్నార్ కుడికి చెందిన రైతు అశోకన్(55) బ్యాంకు కూలీ. నిలబడి నిరసించి సృ్పహ తప్పాడు. ఆసుపత్రికి తరలించగా, మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. -
పొంతనలేని ఆలోచన, ఆచరణ
అభిప్రాయం అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత తరుణంలో పెళ్లికి కేవలం రూ. 2.5 లక్షలు తీసుకోవడానికి అవకాశం ఇవ్వడం, మళ్లీ ఇందుకు రిజర్వు బ్యాంకు అనేక నిబంధనలు పెట్టడం మరీ విడ్డూరం. నోట్లు మార్చుకోవడానికి వెళ్లినవారి వేళ్లకు గుర్తులు వేయడం కూడా అవమానకరమే. ఖరీఫ్ సీజన్ తుది దశకు చేరుకుని, పంటల నూర్పిళ్లు, కోతలు దగ్గర పడినాయి. వెంటనే రబీ సాగుకు సన్నద్ధం కావాలి. ఇలాంటి పరిస్థితిలో గ్రామ సహకార పరపతి సంఘానికి వారానికి రూ. 50 వేలు మాత్రం ఇవ్వడం ఏం సబబు? నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేసి ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తారు. నల్లధనానికీ, నకిలీ కరెన్సీకి అడ్డుకట్ట వేయడంతో పాటు, ఉగ్రవాదులకు నగదు సరఫరా కూడా ఈ చర్యతో ఆగుతుందని ప్రధాని ప్రకటించారు. దేశ పౌరులు గానీ, రాజకీయ పక్షాలు గానీ ఈ లక్ష్య సాధనను వ్యతిరేకిస్తున్నాయని అనుకోనక్కరలేదు. ఇప్పుడు వస్తున్న విమర్శలు, అభిప్రాయాలు అన్నీ డీమోనిటైజేషన్ (నోట్ల రద్దు)కు అనుసరించిన పద్ధతి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సక్రమంగా లేకపోవడం గురించే. 2013 నాటి భూసేకరణ చట్టంలో చేర్చిన ‘సామాజిక ప్రభావ అంచనా’ పద్ధతిని డీమోనిటైజేషన్ విషయంలో కూడా కేంద్రం అనుసరించి ఉంటే నేడు కోట్లాదిమందికి ఈ ఇబ్బందులు తప్పేవి. దేశంలో అప్రకటిత బినామి ఆస్తులు, పన్ను ఎగవేత, రాజకీయ నాయకులు, ఉద్యోగులు, వ్యాపారుల అవినీతి చర్యల ద్వారా మొత్తంగా పోగుపడిన సంపద దాదాపు రూ. 30 లక్షల కోట్లని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఇందులో నగదు రూపంలోని నల్లధనం 3 నుంచి 4 లక్షల కోట్లు ఉండవచ్చునని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. కొన్ని నెలల క్రితం ప్రకటించిన స్వచ్ఛంద వెల్లడి పథకం ద్వారా దాదాపు రూ. 65 వేల కోట్ల అప్రకటిత ఆదాయానికి సంబంధించిన వివరాలు కేంద్రానికి అందాయి. నల్లధనాన్ని నిరోధించే క్రమంలో ఏ దశలలో, ఏఏ వర్గాలకు సంబంధించి ఏఏ చర్యలు తీసుకోవాలో సరైన ఆలోచన జరగలేదన్న విషయం వాస్తవం. ప్రస్తుతం కేంద్రం అనుసరిస్తున్న విధానం చూస్తే, తిమింగలాలను వదిలి, చిరు చేపలను పడుతున్నట్టే ఉంది. 1947 నుంచి చూస్తే విదేశాలలో భారతీయుల సంపద రూ. 45 లక్షల కోట్లు పైనేనని ఒక అంచనా. పలువురు రాజకీయ నాయకుల పేర్ల మీద, హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ వంటి వ్యాపార వర్గాలకు చెందిన దాదాపు వేరుు మంది పేర్ల మీద స్విస్ బ్యాంకులలో, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స, మారిషస్, సింగపూర్లలోని బ్యాంకులలో లక్షల కోట్లు ఉన్నాయని పనామా పత్రాలు, వికీలీక్స్ బయటపెట్టినా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విదేశాలలోని భారతీయుల ఖాతాలలో 500 బిలియన్ డాలర్ల సంపద ఉందని ఫిబ్రవరి, 2012న సుప్రీంకోర్టుకు ఇచ్చిన పత్రంలో ప్రభుత్వం పేర్కొన్నది. మొన్నటి ఎన్నికలలో బీజేపీ విదేశీ బ్యాంకులలో మూలుగుతున్న మన నల్లడబ్బును స్వదేశానికి తీసుకువస్తామని హామీ ఇచ్చింది. ఇక్కడ ఒక ప్రశ్న. మోదీ ప్రధాని హోదాలో అనేక దేశాలలో పర్యటించారు. అప్పుడు విదేశాలలో మూలుగుతున్న భారతీయుల అక్రమ సంపదను రాబట్టేందుకు గట్టిగా కృషి చేసి ఉంటే అది స్వదేశానికి చేరడానికి వీలుం డేది కదా! కాబట్టి విదేశాలలోని నల్లడబ్బును తెచ్చేందుకు మోదీ చేసిన కృషి స్వల్పం. ఇంకా చిత్రం-విదేశాలలోని భారతీయుల నల్లధనం ఇప్పటికీ మారిషస్, సింగపూర్ వంటి దేశాల నుంచి మనీల్యాండరింగ్ పద్ధతిలో, ఇంకా రౌండ్ టిప్పింగ్, పార్టిసిపేటరీ నోట్స్ పేరిట దేశానికి తిరిగి వస్తున్నది. రైతుల దగ్గర అంత ఆదాయమా? మరికొందరు నల్లధనాన్ని సక్రమ ఆదాయంగా చూపడానికి సేద్యాన్ని వాడుకుంటున్నారు. అడ్డగోలుగా వారి వద్ద పోగుపడిన సంపద వ్యవసాయం నుంచి వచ్చిందంటూ ఆదాయ పన్ను శాఖకు చెబుతున్న లక్షలాది మంది ఖాతాదారులపైన చర్యలు తీసుకుని ఉంటే లక్షల కోట్ల అక్రమార్జనలు వెలుగులోకి వచ్చేవి. దేశంలో వ్యవసాయ ఆదాయం మీద పన్ను లేదు. పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు దీనిని అవకాశంగా తీసుకుని తమకు కోట్లాది రూపాయలు వ్యవసాయం ద్వారా లభిస్తున్నాయని చూపించుకోవడానికి అవకాశం చిక్కింది. ఈ ధోరణి 2007 నుంచి కనిపిస్తున్నది. ఉదాహరణకు- 2007లోనే 78,794 మంది తమ సగటు వార్షిక వ్యవసాయ ఆదాయం రూ. 2.9 లక్షలుగా చూపించారు. 2010లో 4,25,085 మంది తమ వార్షిక వ్యవసాయ ఆదాయం 19.7 లక్షలుగా నమోదు చేయించారు. తరువాత ఈ ధోరణి విశ్వరూపం దాల్చింది. 2011లో అనూహ్యంగా 6,56,944 మంది సగటు వార్షిక వ్యవసాయ ఆదాయం రూ. 30.04 కోట్లుగా ప్రకటించారు. 2012లో 8,12,426 మంది సగటు వ్యవసాయ వార్షిక ఆదాయాన్ని రూ. 874 లక్షల కోట్లుగా చూపారు. ఇది దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కంటే ఎన్నో రెట్లు అధికం. విజయ్శర్మ అనే సమాచార హక్కు చట్టం కార్యకర్త పట్నా హైకోర్టులో వేసిన పిటిషన్ మేరకు ఇన్కమ్ట్యాక్స్ డెరైక్టరేట్ ఈ వివరాలు వెల్లడించింది. కాబట్టి ఈ వ్యవహారం మీద ఆదాయ పన్ను శాఖ, కేంద్ర మంత్రిత్వ శాఖలు తీసుకున్న చర్యల గురించి దేశానికి తెలియచేయాలి. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థల నుంచి బ్యాంకులకు రావలసిన మొండి బకాయిలు లక్షల కోట్లలో ఉన్నాయి. వీటిని చెల్లించవలసిందంటూ మొన్నటిదాకా ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన రఘురామ్ రాజన్ ఈ సంవత్సరమే నోటీసులు కూడా ఇచ్చారు. ఇలా బకాయిలు పడిన ఆ సంస్థల ఆస్తుల విలువ బ్యాంకులకు చెల్లించవలసిన అప్పులో 3వ వంతు కూడా లేవు. ఉదాహరణకు అనిల్ అంబానీ ఆస్తుల విలువ రూ. 60 వేల కోట్లు, అప్పు లక్షా 24 వేల కోట్లు గత 10 సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా ఇన్కంట్యాక్స్, ఎక్సైజ్డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, రాయితీలను ఈ బడా కంపెనీలకు అందజేస్తూ ఉన్నా పర్యవసానంగా దాదాపు రూ. 4 నుండి రూ. 5 లక్షల కోట్ల మేరకు కేంద్రం ఆదాయాన్ని కోల్పోతూ ఉంది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బడా బాబులకు దాదాపు రూ. 1.12 లక్షల కోట్ల మేరకు రుణమాఫీ ఇచ్చింది. రైతులు, చిరు వ్యాపారులు, చిన్న మధ్యతరహా పరిశ్రమల యూనిట్ల నుండి రుణ వసూళ్ల విషయంలో అత్యంత కర్కశంగా ఆస్తులను కూడా వేలం వేసే జాతీయ బ్యాంకులు ఈ పెద్ద వ్యాపారస్తుల ఎడల మెతక వైఖరిని అవలంబిస్తూ ఉండటం గమనార్హం. గ్రామీణ ప్రజలకు ఒరిగేది ఏమిటి? పెద్ద నోట్ల రద్దుకు పూర్వం తమ ఖాతాలలో ప్రజలు దాచుకున్న ధనాన్ని వారి వారి అవసరాల కోసం తీసుకునే సౌకర్యం కూడా ప్రస్తుతం లేకపోవడం అన్యాయం. అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత తరుణంలో పెళ్లికి కేవలం రూ. 2.5 లక్షలు తీసుకోవడానికి అవకాశం ఇవ్వడం, మళ్లీ ఇందుకు రిజర్వు బ్యాంకు అనేక నిబంధనలు పెట్టడం మరీ విడ్డూరం. నోట్లు మార్చుకోవడానికి వెళ్లినవారి వేళ్లకు గుర్తులు వేయడం కూడా అవమానకరమే. ఖరీఫ్ సీజన్ తుది దశకు చేరుకుని, పంటల నూర్పిళ్లు, కోతలు దగ్గర పడినాయి. వెంటనే రబీ సాగుకు సన్నద్ధం కావాలి. ఇలాంటి పరిస్థితిలో గ్రామ సహకార పరపతి సంఘానికి వారానికి రూ. 50 వేలు మాత్రం ఇవ్వడం ఏం సబబు? సభ్యులకు ఇది ఏ విధంగా ఉపకరిస్తుంది? దేశంలో అన్ని వర్గాల ప్రజలు నోట్లతో ఇబ్బంది పడుతున్నారు. క్యూలలో నిలబడిన వారిలో దాదాపు 70 మంది చనిపోవడం శోచనీయం. ఏ విధంగా చూసినా డీమోనిటైజేషన్ నిర్ణయం నల్లధనాన్ని అరికట్టాలన్న లక్ష్యంతో పాటు కొన్ని ఇతర రాజకీయ ప్రయోజనాలను కూడా ఆశించి తీసుకున్నట్టే ఉంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికలలో ఈ చర్య ద్వారా విపక్షాలను చిత్తు చేయాలన్న వ్యూహం అందులో ఒకటి. డీమోనిటైజేషన్ ద్వారా బ్యాంకులకు రూ. 3 నుంచి 4 లక్షల కోట్ల మేరకు (నల్లధనం మురిగిపోతుందని అంచనా వలన) లబ్ధి చేకూరుతుందని, ఆ మేరకు నూతనంగా కరెన్సీ ముద్రించుకుని బ్యాంకుల ఆర్థిక పరిస్థితి మెరుగు పరచుకోవచ్చునని కేంద్రం భావిస్తున్నది. అరుుతే ఈ ధనం తిరిగి పెద్ద పెద్ద పారిశ్రామిక, వ్యవసాయ వేత్తలకే వెళ్తుంది. అంతేతప్ప సామాన్యులకు ఏదో ఒరుగుతుందని ఆశిస్తే అవివేకమే. గ్రామీణ ప్రజలు, రైతుల అవసరాల ఎడల బ్యాంకులు చూపుతున్న పక్షపాత ధోరణి ఇందుకు నిదర్శనం. గ్రామాలలో రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోగా వచ్చిన ధనాన్ని దాచడానికి, అవసరానికి రుణం తీసుకొనడానికి కూడా సహకార బ్యాంకులపై ఆధారపడుతూ ఉంటారు. ఇప్పుడు వారందరికీ ఎనలేని కష్టాలు వచ్చి పడ్డాయి. తక్షణ-దీర్ఘకాలిక చర్యలు అవసరం దేశంలో స్టేట్ బ్యాంకుతో సహా ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల శాఖలు 3,997. ప్రైవేటు రంగంలో 1,987 బ్యాంకు శాఖలు, సహకార రంగంలో 933 శాఖలు ఉన్నాయి. అయితే ఇటీవల రిజర్వు బ్యాంకు అందించిన కొత్తనోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖలకు అందజేసిన దానికన్నా, కొద్ది సంఖ్యలోనే ఉన్న ప్రైవేటు బ్యాంకులకు రెండు నుంచి మూడు రెట్లు అధికంగా అందచేయటం ఏమి సబబు? పర్సంటేజి కమీషన్లతో పాత పెద్దనోట్ల మార్పిడులు జరిగాయన్న సమాచారంలో ప్రైవేటు బ్యాంకులదే పెద్ద పాత్ర అని తెలుస్తూనే ఉంది. మోదీ ప్రభుత్వం ప్రధానంగా హెచ్చు స్థాయిలో నల్లధనం పోగుపడడానికి అవకాశం ఉన్న రియల్ ఎస్టేట్ రంగం, బినామీ ఆస్తులు, పన్ను ఎగవేత అంశం, విదేశాల నుండి నల్లధనం రాబట్టడం, రాజకీయ, ఉద్యోగ రంగాలలో అవినీతి వంటి అంశాలపై తక్షణం దృష్టి సారించి, అవసరమైన మేరకు చట్టాలను సవరించి, కఠినంగా వ్యవహరించి ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని రాబట్టి సామాన్య ప్రజల అవసరాలను తీర్చే విధంగా రుణ పరపతి సౌకర్యాన్ని విస్తరింపజేయటం అవసరం. ప్రస్తుతం నగదు లావాదేవీలలో అనుసరిస్తూ ఉన్న పరిమితులను సడలించి, సామాన్య ప్రజానీకం దైనందిక జీవితంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు వెనువెంటనే చర్యలను చేపట్టాలి. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ పరిధిలో ఉన్న సహకార సంఘాల పట్ల వివక్ష చూపకుండా జాతీయ బ్యాంకులకు ఏ విధమైన నియమ నిబంధనలను విధించారో అవే సూత్రాలను సహకార బ్యాంకులకు కూడా వర్తింపజేసి నగదు లావాదేవీలు నిర్వహించే అవకాశాలు కల్పించి సంక్షోభాన్ని వెంటనే నివారించవలసిన అవసరం ఉంది. గాంధీజీ చెప్పినట్టు లక్ష్యమే కాదు, మార్గం కూడా సజావుగా ఉండాలి. వడ్డే శోభనాద్రీశ్వరరావు వ్యాసకర్త మాజీ మంత్రి, మాజీ ఎంపీ ఈ-మెయిల్ : vaddesrao@yahoo.com -
బ్లాక్ అండ్ వైట్ దందాలో బ్యాంకర్లు
బ్లాక్ అండ్ వైట్ దందాలో బ్యాంకర్లు గుర్తించిన రిజర్వ్బ్యాంక్ రంగంలోకి దిగిన సీబీఐ అనుమానిత బ్యాంకుల జాబితాలో జిల్లా పేరు సాక్షి, సూర్యాపేట : అందరూ అనుకున్నట్లే బ్లాక్ మనీని వైట్గా మార్చుకోవడంలో బ్యాంక్ ఉద్యోగు లు, అధికారుల పాత్ర ఉందని రిజర్వ్బ్యాంక్ అధికారులు గుర్తించారు. పెద్దనోట్లకు చిల్లర ఇచ్చి కమీష న్లు దండుకున్న వ్యవహారంలో బ్యాంకులే కీలక పా త్ర పోషించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. ఈ దందాను నడిపిన వారిపై చర్యలు తీసుకునేం దుకు ఆర్బీఐ కేసును సీబీఐకి అప్పగించింది. దీంతో జిల్లాలోని పలువురు బ్యాంకర్లకు దడ పుడుతోంది. నల్లకుబేరుల వద్ద ఉన్న పాత రూ. 500, వెయి నోట్లను తీసుకుని 20 నుంచి 30 శాతం కమీషన్తో కొత్త నోట్లను అందించిన వ్యవహారంలో సూర్యాపేట జిల్లా ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ రకాల బ్యాంకులు 34 ఉండగా.. వాటి అనుబంధ బ్రాంచీలు 436 ఉన్నాయి. వీటిలో నల్లగొండ జిల్లాలో 209, సూ ర్యాపేట జిల్లాలో 136, యాదాద్రి భువనగిరి జిల్లాలో 94 బ్యాంకులు ఉన్నాయి. అయితే నేషనల్ హైవేపై ఉన్న సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో, నల్లగొండ, యాదాద్రి జిల్లాల కంటే ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి. వ్యాపారవేత్తలు, ఇతర సంపన్నులు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నట్లు ప్ర చారం. ఈ నేపథ్యంలో నల్లధనం ఇక్కడే ఎక్కువగా ఉండే అవకాశముందని ప్రజలు చర్చించుకుంటున్నారు. తమకు బ్యాంకర్లతో ఉన్న పరిచయాలను అనువుగా తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా తమ నల్లడబ్బును మార్పిడి చేరుుంచుకునేందుకు ప్రయత్నించారని.. ఇందుకు బ్యాంకర్లు కూడా కమీషన్లు తీసుకొని సై అని ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. లింగాల ఘటనతో జిల్లాపై నిఘా... నల్లడబ్బును వైట్మనీగా మార్చేందుకు కమీషన్లు తీసుకుని కొత్త నోట్లు అందజేస్తూ ఈనెల 22వ తేదీన పెన్పహాడ్ మండలం లింగాల పెట్రోల్ బంకు సంఘటనతో జిల్లాలోని బ్లాక్మనీ భారీగా వైట్మనీగా మారినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. ఈ సంఘటనలో 12 మంది నేరస్తులు ఉండగా.. అందు లో ముగ్గురు బ్యాంకర్లతో సంబంధాలున్నవారు కావడం గమనార్హం. ఒకరికి బ్యాంకులో డ్రైవర్గా పనిచేసిన అనుభవం.. మరో ఇద్దరు బ్యాంకు మిత్రలుగా పనిచేసిన వారు కావడం.. బ్యాంకర్లు తమ అనుచరులతో బ్లాక్మనీని వైట్మనీగా మార్చారనే ప్రచారం జరుగుతోంది. డబ్బుల మార్పిడికి ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. సదరు వ్యక్తి ఆధార్ లేదా.. ఓటర్ ఐడీ కార్డు జిరాక్స్ తీసుకుని మొదటి రెండుమూడు రోజుల్లో రూ. 4 వేలు ఆతర్వాత రూ. 10 వేలు అందజేశారు. అయితే మొదటి రోజు ఇచ్చిన గుర్తింపు, ఆధార్ కార్డు జిరాక్సులను తమ దగ్గరే ఉంచుకున్న బ్యాంకర్లు పలువురు వాటిని జిరాక్స్లు తీసి వారి పేరుమీద డబ్బులను మార్చినట్లు రికార్డులు చూపించినట్లు ప్రచారం. ఈ దందాకు సహకరించిన బ్యాంకు అధికారులపై సీబీఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఏ అధికారి చిక్కుతాడోనన్న విషయంపై జిల్లాలో చర్చ జరుగుతోంది. బ్యాంకర్ల పాత్రపై ఆరా పెద్ద నోట్ల రద్దు తర్వాత చోటుచేసుకున్న పరిస్థితుల్లో రాష్ట్రంలోని నోట్ల మార్పిడిని గుట్టురట్టు చేసింది సూర్యాపేట జిల్లా పోలీసులే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పని లో ఇప్పటికే మా యంత్రాంగం నిమగ్నమైంది. పెన్పహాడ్ మండలం లింగాల పెట్రోల్ బంక్ సమీపంలో నోట్లను మార్పిడి చేస్తున్న ముఠాను పట్టుకున్నాం.12 మందిని అరెస్టు చేసి రిమాండ్లోఉంచాం. వారిలో ముగ్గురు బ్యాంకులతో సంబంధం ఉన్నవారు కావడంతో బ్యాంకు అధికారుల పాత్ర ఉండి ఉంటుందనే అనుమాని స్తున్నాం. జిల్లాలోని అనుమానం ఉన్న బ్యాం కుల లావాదేవీల వివరాలు.. సీసీ కెమెరాలఫుటేజీలను సేకరించే పనిలో ఉన్నాం. - పరిమళహననూతన్, ఎస్పీ -
బ్యాంకుల్లో రూ.450 కోట్లు 'నల్ల'బాట!
-
రూ.450 కోట్లు 'నల్ల'బాట!
భారీగా అక్రమాలు జరిగినట్లు నిర్ధారించిన రిజర్వుబ్యాంకు ఇందులో పోస్టాఫీసులు, సహకార బ్యాంకులదే ప్రధాన పాత్ర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మేనేజర్ల చేతివాటం.. ప్రైవేట్ బ్యాంకులపైనా అనుమానాలు బ్యాంకుల్లో నగదు లావాదేవీల పరిశీలనకు ప్రత్యేక బృందాలు రిజర్వుబ్యాంకు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సీబీఐ సాక్షి, హైదరాబాద్ మహబూబ్నగర్కు చెందిన ఓ వ్యాపారవేత్త తన దగ్గర రూ.2 కోట్ల విలువైన పాత రూ.500, 1,000 నోట్లు ఉన్నాయని, ప్రత్యామ్నాయ నగదు ఇస్తే 25 శాతం కమీషన్ ఇస్తానని ఈ నెల 22న హైదరాబాద్లోని ఓ ప్రైవేటు బ్యాంకు మేనేజర్కు ఫోన్ చేశారు. అయితే తన బ్యాంకు నుంచి సర్దుబాటు చేయడం కష్టమని.. తాను ఇచ్చే మొబైల్ నంబర్ను సంప్రదిస్తే హైదరాబాద్లోని ఓ పోస్టాఫీసు నుంచి ప్రత్యేక పార్శిళ్ల ద్వారా కొత్త రూ.2వేల నోట్లను దశలవారీగా సమకూరుస్తారని చెప్పారు. ఆ తరువాత కొద్దిసేపటికే హైదరాబాద్లోని పలు పోస్టాఫీసులపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించి.. నగదుతో కూడిన కొన్ని పార్శిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నోట్లు రద్దు ప్రకటన వెలువడిన మరుసటి రోజు నుంచే ఇలా నగదు బ్లాక్ మార్కెట్కు తరలుతున్నట్లు నిఘా సంస్థలు కేంద్రం దృష్టికి తెచ్చాయి. దీనిపై అప్రమత్తమయ్యే లోపే దాదాపు రూ.450 కోట్ల మేర నగదు పక్కదారి పట్టినట్లు రిజర్వుబ్యాంకు తాజాగా అంచనాకు వచ్చింది. నగదు ఏయే రూపాల్లో, ఏ విధంగా అక్రమార్కుల చేతికి చేరిందన్న వివరాలను అంతర్గత విచారణ ద్వారా సేకరించింది. కొద్దిరోజుల్లోనే.. నగదు మార్పిడి ప్రారంభమైన మొదటి నాలుగు రోజుల్లోనే పోస్టాఫీసులు, సహకార బ్యాంకుల ద్వారా దాదాపు రూ.250 కోట్ల మేర, ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకుల ద్వారా మరో రూ.200 కోట్ల మేర కొత్త నోట్లు అక్రమార్కులకు చేరినట్లు అంచనా వేశారు. తొలుత 40 శాతం కమీషన్పై పాత నోట్లు తీసుకుని ప్రత్యామ్నాయ నగదు అందజేస్తామంటూ మొదలైన అక్రమ వ్యాపారం ఇప్పుడు 15 శాతానికి తగ్గిపోరుుంది. ఓ ఉన్నతాధికారి మాటల్లో చెప్పాలంటే ‘ఇప్పుడు రూ.100, రూ.2,000 నోట్లు ఇస్తామని ముందుకు వచ్చేవారు 10 మంది ఉంటే. పాత నోట్లు తీసుకుంటారా అని అడిగేవారు నలుగురు కూడా లేరు’. ఈ లెక్కన ఇప్పటికే భారీ మొత్తంలో నగదు పక్కదారి పట్టి ఉంటుందని రిజర్వుబ్యాంకు అంచనాకు వచ్చి పలు కోణాల్లో విచారణ జరిపింది. పటిష్టమైన నిఘా సహకార బ్యాంకులకు నగదు తరలించిన 48 గంటల్లోనే పక్కదారి పట్టిన విషయం తెలిసి రిజర్వుబ్యాంకు దిగ్బ్రాంతికి గురైంది. ఆ వెంటనే సహకార బ్యాంకులకు నగదు సరఫరా నిలిపివేసింది. అంతేకాదు సహకార బ్యాంకుల నగదు లావాదేవీలపై విచారణ జరపాలని నాబార్డ్ను ఆదేశించింది. తెలంగాణలోని ఏ సహకార బ్యాంకుకు ఎంత మొత్తంలో నగదు వెళ్లిందన్న వివరాలను నాబార్డ్తో పాటు సీబీఐకి అందజేసింది. సహకార బ్యాంకుల్లో ప్రతి రూపారుుకి లెక్క అడుగుతున్నామని, అనుమానం వస్తే విచారణ జరిపిస్తామని నాబార్డు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కొద్ది రోజుల్లోనే నగదు దుర్వినియోగం చేసిన బ్యాంకులు, బాధ్యులైన అధికారుల చిట్టా బయటపెడతామన్నారు. మరోవైపు పోస్టాఫీసుల ద్వారా ప్రజలకు సక్రమంగా నగదు చేరుతుందని తొలుత రిజర్వుబ్యాంకు భావించినా... వారంలోపే వాటిల్లోనూ అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించింది. దీంతో అనుమానిత పోస్టాఫీసులతోపాటు ప్రభుత్వరంగ, ప్రైవేటు బ్యాంకుల వద్ద నిఘా పెంచింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కొందరు బ్యాంకు మేనేజర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని, అనుమానిత కాల్స్ను రికార్డు చేసేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ను నిఘా వర్గాలు సమకూర్చుకున్నాయని తెలుస్తోంది. ఆ సంభాషణల ఆధారంగా కొన్ని లావాదేవీలను గుర్తించారని సమాచారం. నగదు లావాదేవీల పరిశీలనకు ప్రత్యేక బృందాలు ఎక్కువ మొత్తంలో నగదు ఉపసంహరణ, నోట్ల మార్పిడి పేరిట విపరీతంగా రూ.2వేల నోట్లు వినియోగించిన బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రికార్డుల పరిశీలనకు రిజర్వుబ్యాంకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఆ బృందంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ బహుళజాతి ఆర్థిక సంస్థ నిపుణుల సేవలను కూడా వినియోగించుకుంటోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనూ కొందరు సీనియర్ మేనేజర్లు పలు కంపెనీలు, అత్యవసర సర్వీసుల పేరుతో భారీగా నగదు జారీ చేసిన విషయం బయటపడింది. ఆ నగదు ఉపసంహరించిన వారు ఆ మొత్తాన్ని దేనికి వాడారు, ఎవరెవరికి చెల్లించారన్న వివరాలను సేకరించే పనిని సీబీఐకి అప్పగించినట్లు తెలిసింది. నగదు మార్పిడి పేరుతో ఒక రోజు వచ్చిన ఆధార్, ఇతర డాక్యుమెంట్లను మూడో రోజు, ఏడో రోజు, పదో రోజు సమర్పించి పెద్ద ఎత్తున నగదు తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఆ డాక్యుమెంట్ల ఆధారంగా కూడా విచారణ జరుగుతోందని.. వారిలో కొంతమందిని ప్రశ్చించడంతో పాటు సీసీ కెమెరా ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నామని సీబీఐ వర్గాలు వెల్లడించారుు. ఈ అక్రమాలపై ప్రాథమిక నివేదిక అందాకే కేంద్ర ప్రభుత్వం వేలికి ఇంకు గుర్తు పెట్టాలన్న నిర్ణయంతీసుకుందని ఆ వర్గాలు తెలియజేశాయి. త్వరలో అరెస్టులు నోట్ల మార్పిడి, నగదు ఉపసంహరణల్లో అక్రమాలకు పాల్పడినట్లు భావిస్తున్న కొందరిని సీబీఐ ప్రశ్నిస్తోందని.. త్వరలోనే కేసులు నమోదు చేసి కొందరిని అరెస్టు చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే కొద్దిమందిని సీబీఐ అదుపులోకి తీసుకుందని.. వారిలో కొందరు దళారులతోపాటు, పోస్టాఫీసు, బ్యాంకుల సిబ్బంది ఉన్నారని సమాచారం. -
రద్దు నోట్ల నిల్వకు ‘హామీ పథకం’
బ్యాంకుల కోసం అందుబాటులోకి తెచ్చిన ఆర్బీఐ ముంబై: పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకులపై కరెన్సీ నిల్వల భారం తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ‘హామీ పథకం’ (గ్యారెంటీ స్కీమ్)ను మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. దీని కింద బ్యాంకులు తమ వద్ద భారీగా పేరుకుపోరుున రూ.500, రూ.1000 నోట్ల కట్టలను సంబంధింత ఆర్బీఐ ఖజానాలో నేరుగా డిపాజిట్ చేయవచ్చు. ఇందుకు గాను బ్యాంకులకు సంబంధిత నిల్వ గది తాళం చెవి ఇస్తారు. బ్యాంకుల్లో సామర్థ్యానికి మించి రద్దయిన కరెన్సీ నిల్వల వల్ల డిపాజిట్లు ఆలస్యమవుతున్నాయి. దీంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద డిపాజిట్ చేసిన మొత్తానికి బ్యాంకుల కరెంట్ ఖాతాకు ఆర్బీఐ క్రెడిట్ ఇచ్చి, తర్వాత నోట్లు లెక్కిస్తుంది. -
రూ. 5,000 కోట్ల నోట్లు పంపండి
⇒ రిజర్వు బ్యాంకుకు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం ⇒ బ్యాంకులు, ఏటీఎంలన్నింటా నోట్ల కొరత ⇒ ఆర్బీఐ డబ్బులివ్వడం లేదంటున్న బ్యాంకర్లు ⇒ 7,548 ఏటీఎంలలో పనిచేస్తున్నవి కేవలం 1,658 ⇒ బ్యాంకర్లతో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స ⇒ పరిస్థితుల అంచనా కోసం నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన తీవ్ర నగదు కొరత నుంచి గట్టెక్కేందుకు.. వెంటనే రాష్ట్రానికి రూ.5,000 కోట్ల విలువైన కొత్త, చిల్లర నోట్లను పంపించాలని ప్రభుత్వం రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)కు లేఖ రాసింది. రాష్ట్రంలోని చాలా బ్యాంకుల్లో నగదు లేదని, అత్యధిక శాతం ఏటీఎంలు పనిచేయడం లేదని నివేదించింది. పాత నోట్ల మార్పిడి కోసం, తమ అవసరాలకు డబ్బును బ్యాంకుల నుంచి విత్డ్రా చేసుకునేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని వివరించింది. అన్నీ రూ. 2 వేల నోట్లే..! పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన తర్వాత ఆర్బీఐ తెలంగాణలోని బ్యాంకులకు రూ.8,000 కోట్ల విలువైన నోట్లను పంపిణీ చేసింది. అయితే వాటిలో అత్యధికం రూ.2 వేల నోట్లు, మిగతావి రూ.వంద నోట్లు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఇప్పటివరకు అంతకు రెట్టింపు స్థాయిలో నగదు బ్యాంకు ఖాతాల్లో జమ అయింది. దాదాపు రూ.6,000 కోట్లకుపైగా నగదు మార్పిడి జరిగింది. నోట్ల రద్దుతో పాటు నగదు ఉపసంహరణ ఆంక్షలతో మార్కెట్లో చిన్న నోట్ల కొరత తలెత్తింది. కొత్తగా విడుదల చేసిన రూ.2 వేల నోట్లు అందుబాటులో ఉన్నా... వాటిని చిల్లర మార్చుకునేందుకు ప్రజలు ముప్పు తిప్పలు పడుతున్నారు. రాష్ట్రానికి కొత్త రూ.500 నోట్లు పంపిణీ కాకపోవడంతో చిల్లర సమస్య మరింత ఎక్కువగా తలెత్తింది. ఈ నేపథ్యంలో ఈసారి పంపిణీ చేసే నగదులో రూ.2వేల నోట్లకు బదులు రూ.500, రూ.100, రూ.50 నోట్లు ఎక్కువగా ఉండేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐని కోరింది. ఏటీఎంలు ఉండీ లేనట్లే.. రాష్ట్రంలోని కొన్ని బ్యాంకుల్లో నగదు లేదని.. ఏటీఎంలలో అత్యధికం పనిచేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి మంగళవారం అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ అధికారులు, బ్యాంకర్ల ప్రతినిధులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్తో పాటు రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ప్రధానంగా ప్రజలు నోట్లు మార్చుకునేందుకు, నగదు ఉపసంహరణ కోసం పడుతున్న ఇబ్బందులపై చర్చ జరిగింది. రాష్ట్రంలో మొత్తం 7,548 ఏటీఎంలు ఉన్నాయి. వాటిల్లో ఇప్పటివరకు 3,620 ఏటీఎంలను కొత్త నోట్ల జారీకి వీలుగా సిద్ధమయ్యాయని, ఇందులో 1,653 ఏటీఎంలలో మాత్రమే నగదు అందుబాటులో ఉందని బ్యాంకర్లు నివేదించారు. ఆధునీకరణకు నోచుకోని ఏటీఎంలలో అత్యధికంగా ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఆంధ్రా బ్యాంకులకు చెందినవే ఉన్నాయి. ఆర్బీఐ తమకు సరిపడేంత డబ్బు ఇవ్వడం లేదని, దీంతో తమ ఏటీఎంలు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రజలకు సేవలు అందించలేకపోతున్నామని యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధులు పేర్కొన్నారు. వీరితో పాటు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, సిండికేట్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, యూకో బ్యాక్, టెస్కాబ్లు తమ బ్రాంచీల్లోనూ నగదు లేకపోవడంతో ఖాతాదారులను తిప్పి పంపించాల్సి వస్తోందని వెల్లడించారుు. ముందుగా పంపిణీ చేసిన రూ.8,000 కోట్లలో కొంతమేరకు తిరిగి ఖాతాల్లోకి వస్తుందని అంచనా వేశామని.. కానీ అన్నీ చెల్లుబాటు కాని నోట్లే జమవుతుండటంతో... సరిపడేన్ని నోట్లు తిరిగి బ్యాంకులకు ఇవ్వలేకపోతున్నామని ఆర్బీఐ వర్గాలు సైతం వివరించినట్లు తెలిసింది. నేడు కేంద్ర బృందం రాక రాష్ట్రంలో నోట్ల రద్దు పరిణామాలను అధ్యయనం చేసేందు కు కేంద్ర అధికారుల బృందం బుధవారం (నేడు)రాష్ట్రానికి రానుంది. కేంద్ర మానవ వనరుల శాఖ అదనపు కార్యదర్శి రెడ్డి సుబ్రమణ్యం ఆధ్వర్యంలో వివిధ శాఖలకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ బృందంలో ఉంటారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్తోపాటు వివిధ ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ఈ బృందం పర్యటిస్తుంది. వివిధ రంగాలపై పడిన ప్రభావాన్ని తెలుసుకునేందుకు సం బంధిత శాఖల అధికారుల తోనూ భేటీ అవుతుంది. -
ఖాతాల్లోకి ‘బ్లాక్’ వద్దు: కేంద్రం
-
ఖాతాల్లోకి ‘బ్లాక్’ వద్దు
నల్లధనం డిపాజిట్కు అనుమతిస్తే చర్యలు తప్పవు - నేడు ఖాతా ఉన్న బ్యాంకులోనే మార్పిడి, సీనియర్ సిటిజన్లకు మినహారుుంపు - క్రమంగా నగదు మార్పిడి ఎత్తివేతకు కేంద్రం నిర్ణయం న్యూఢిల్లీ: నల్లధనం దాచుకునేందుకు బ్యాంకు ఖాతాల్ని దుర్వినియోగం చేస్తే వారిపై చర్యలు తప్పవని కేంద్రం శుక్రవారం హెచ్చరించింది. జన్ధన్ ఖాతాదారులు, గృహిణులు, ఇతరులు తమ ఖాతాల్ని నల్లధనం డిపాజిట్లకు అనుమతిస్తే ఐటీ చట్టం కింద విచారిస్తామని ప్రకటించింది. ఇతరుల బ్యాంకు ఖాతాల్ని వాడుకుని కొందరు నల్లధనం మార్చుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అందుకు ప్రతిగా కొందరికి డబ్బు ఎరచూపుతున్నట్లు తెలిసిందని పేర్కొంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం సాధారణ ఖాతాల్లో రూ. 2.50 లక్షల వరకూ, జన్ధన్ ఖాతాల్లో రూ. 50 వేల వరకూ జమ చేసుకోవచ్చు. ‘ఇతరుల నల్లధనం మీ ఖాతాలో జమ చేసుకునేందుకు అనుమతిస్తే... విచారణలో అది నిజమని రుజువైతే ఆ నగదుపై ఆదాయపు పన్నుతో పాటు పెనాల్టీ విధిస్తాం. ఖాతాను దుర్వినియోగం చేసేందుకు అనుమతించిన వ్యక్తిని ఆదాయపు పన్ను చట్టం కింద విచారిస్తాం’ అని ఆర్థిక శాఖ పేర్కొంది. నల్లధనం బ్యాంకులో డిపాజిట్ చేస్తే పన్ను, వడ్డీతో పాటు 200 శాతం పెనాల్టీ విధించనున్నారు. బ్యాంకు లాకర్లు సీజ్ చేసి బంగారం, వజ్రాలు, ఆభరణాలు స్వాధీనం చేసుకుంటారన్న వార్తల్లో నిజం లేదని, అవి వదంతులేనని పునరుద్ఘాటించింది. సరిపడా కొత్తవి రాగానే మార్పిడి ఎత్తివేత నగదు మార్పిడిని రూ. 2 వేలకు తగ్గించిన కేంద్రం క్రమంగా దాన్ని ఉపసంహరించుకోవాలని ఆలోచిస్తోంది. దానికి బదులుగా నగదును ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవాలంటూ ప్రజల్ని కోరనుంది. మొదట్లో నగదు మార్పిడి పరిమితి రోజుకు రూ. 4 వేలు ఉండగా, తర్వాత 4,500కు పెంచారు. డిసెంబర్ 30 వరకూ ఒక్కసారే వినియోగించుకోవాలంటూ నిబంధన విధించింది. నవంబర్ 17న ఈ పరిమితిని ఒక్కసారే రూ. 2 వేలకు తగ్గించింది. ‘పెద్ద నోట్ల రద్దు అనంతరం మార్కెట్లో 60% నగదు లభ్యత ఉండాలన్న లక్ష్యాన్ని అధిగమించాం. మిగతా లక్ష్యం చేరుకోగానే నోట్ల మార్పిడిని రద్దు చేస్తాం. సరిపడా కొత్త నోట్లు చలామణీలోకి వస్తే మార్పిడి సదుపాయం తొలగిస్తాం’ అని ఒక ఉన్నతాధికారి చెప్పారు. ఆదివారం బ్యాంకులకు సెలవు నేడు(శనివారం) ఏ బ్యాంకులో ఖాతా ఉంటే అక్కడే పాత నోట్లను మార్చుకోవాలి. ఈ నిబంధన నుంచి సీనియర్ సిటిజన్సకు మినహారుుంపునిస్తున్నట్లు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తెలిపింది. నగదు మార్పిడి పరిమితి మాత్రం రూ. 2 వేలే ఉంటుందని పేర్కొంది. తమ ఖాతాదారులు ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని, అలాగే ఆదివారం బ్యాంకులు పనిచేయవని తెలిపింది. దేశవ్యాప్తంగా దాదాపు 700 పెట్రోల్ బంకుల్లో నగదు స్వైప్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. డెబిట్ కార్డుతో రోజుకు రూ.2 వేలు విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని ఈ వారం చివరికల్లా 2,500 బంకులకు విస్తరించనున్నారు. 20 వేల బంకులకు విస్తరించే ప్రతిపాదనను ప్రస్తుతం పక్కన పెట్టారు. పెట్రోల్ బంకుల్లో నగదు విత్డ్రా వల్ల పెట్రో ఉత్పత్తుల కొనుగోలుకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడలేదని, మొత్తం 646 బంకుల్లో నగదు విత్డ్రా సౌకర్యం కల్పించామని కేంద్రం వెల్లడించింది. 350 ఇండియన్ ఆరుుల్, 266 భారత్ పెట్రోలియం, 70 హిందుస్తాన్ పెట్రోలియం బంకుల్లో ఈ అవకాశం కల్పించామని తెలిపింది. ఆ నోట్ల వివరాలు వెల్లడించలేం బ్యాంకులకు పంపిన రూ. 500 కొత్త నోట్ల వివరాల్ని భద్రతా కారణాల రీత్యా వెల్లడించలేమని మద్రాసు హైకోర్టుకు రిజర్వ్ బ్యాంకు తెలిపింది. రూ. 500 కొత్త నోట్లు తమిళనాడులో అందుబాటులో ఉన్నాయో లేదో చెప్పాలని కోర్టు ఆదేశించడంతో ఆర్బీఐ ఈమేరకు చెప్పింది. అక్రమాలు నిరోధించేందుకే జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో నోట్ల మార్పిడిపై నిషేధం విధించామంది. రూ. 400 కోట్ల నకిలీ నోట్ల చలామణీకి చెక్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా రూ. 400 కోట్ల మేర నకిలీ నోట్ల చలామణీ నిలిచిపోరుుందని, అలాగే పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ నుంచి నకిలీ నోట్ల సరఫరా ఆగిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు చెప్పారు. ‘ప్రతి ఏడాది దేశంలోకి రూ. 70 కోట్ల మేర నకిలీ నోట్లను చలామణీ చేస్తున్నారు. 2015లో రూ. 34.99 కోట్లు, 2014లో రూ. 36.11 క్లోట్లు, 2013లో రూ. 42.90 కోట్ల నకిలీ నోట్లు సీజ్ చేశాం’ అని రిజుజు చెప్పారు. రూ. 700-800 కోట్ల మేర నిధుల్ని ఉగ్రవాదులు వినియోగిస్తున్నారని, ఇందులో నక్సల్స్కు రూ. 300- 400 కోట్లు; కశ్మీర్ వేర్పాటువాదులకు రూ. 20-30 కోట్లు, ఈశాన్య భారతంలో చొరబాటుదారులకు రూ. 350-400 కోట్లు అందుతున్నాయని తెలిపారు. ఐటీ దాడులు బెంగళూరులో రూ.16 కోట్లు, గోవాలో రూ.4 కోట్లు స్వాధీనం సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు, మంగళూరుసహా గోవాలో శుక్రవారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసి పెద్ద మొత్తంలో నగదు, బంగారం, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు... బెంగళూరులోని యలహంకలో చంద్రప్ప అనే ఫైనాన్షియర్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసి రూ.16 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు విమానాశ్రయంలో హైదరాబాద్కు బయల్దేరిన వ్యక్తి నుంచి రూ.13.30 లక్షల నగదు, 200 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూ.50 లక్షల విలువైన పాత రూ.1000 నోట్ల కట్టలతో భువనేశ్వర్ నుంచి బెంగళూరు చేరుకున్న వ్యక్తిని అరెస్టుచేశారు. మరోవైపు, పణజీలో ఓ హోటల్లో ఉన్న వ్యక్తి నుంచి రూ.96.45 లక్షల విలువైన పాత నోట్లతో పాటు రూ.3 కోట్ల విలువ చేసే బంగారు, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇతను కొందరికి ఎక్కువ రేటుకు వీటిని అమ్ముతున్నట్లు విచారణలో తేలింది. మంగళూరులోని ఐదు సహకార సంఘాల కార్యాలయాల్లో సోదాలు చేయగా పాత తేదీలను వేసి నగదు లావాదేవీలు జరిపిన విషయం బయటపడింది. కోట్ల విలువైన పాత కరెన్సీని ఎలా మార్చుకోవాలో తెలీక కొందరు రోడ్డుపై వెదజల్లుతూ వెళ్లిన ఘటన కర్ణాటకలోని మండ్య జిల్లా మద్దూరులో చోటుచేసుకుంది. -
చేతులెత్తేసిన తపాలాశాఖ
-
తపాలాశాఖ చేతులెత్తేసింది
- చాలా పోస్టాఫీసులకు అందని కొత్త నోట్లు - రూ.60 కోట్లడిగితే ఇచ్చింది రూ.12 కోట్లే - చెల్లింపులు చేయలేమంటూ బోర్డులు సాక్షి, హైదరాబాద్: రద్దయిన పెద్ద నోట్ల మార్పిడి తమవల్ల కాదంటూ పోస్టల్ శాఖ చేతులెత్తేసింది. రిజర్వ్ బ్యాంకు, స్టేట్ బ్యాంకులు తపాలా కార్యాలయాలకు చాలినంత నగదు పంపడంలో నిర్లక్ష్యం చూపుతుండటంతో గురువారం రాష్ట్రవ్యాప్తంగా చాలా కార్యాలయాలు పెద్ద నోట్ల మార్పిడిని అనుమతించలేదు. పాత నోట్లను మార్చలేమంటూ బోర్డులు పెట్టేశాయి. నగదు మార్పిడికి అవకాశం కల్పించేందుకు పోస్టాఫీసులకు కూడా నగదు పంపాలని కేంద్రం నిర్ణరుుంచడం తెలిసిందే. ఆ మేరకు ఆర్బీఐ, స్టేట్ బ్యాంకు శాఖల నుంచి ఏ రోజుకా రోజు పోస్టాఫీసులకు నగదు అందాలి. ఇలా తొలి రోజునే పోస్టాఫీసుల ద్వారా రాష్ట్రంలో రూ.52 కోట్ల మార్పిడి జరిగింది. దాంతో రోజుకు రూ.60 కోట్లకు తగ్గకుండా నగదు కావాలని తపాలా అధికారులు కోరినా రూ.30 కోట్లకు మించ కుండానే ఆర్బీఐ, స్టేట్బ్యాంకు పంపుతు న్నాయి. పోస్టాఫీసులు తమ కార్యకలాపాల ద్వారా వచ్చిన నగదు కూడా కలిపి నోట్ల మార్పిడి చేస్తూ వచ్చారుు. రెండో రోజు రూ.78 కోట్లు, మూడో రోజు రూ.83 కోట్లు, నాలుగోరోజు రూ.50 కోట్లు, ఐదోరోజు 60 కోట్లు, ఆరోరోజు రూ.65 కోట్ల చొప్పున మార్చారుు. రోజుకు రూ.60 కోట్లు సమకూర్చాలని రాష్ట్ర అధికారులు బుధవారం కేంద్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వానికీ ఫిర్యాదు చేశారు. కానీ, పరిస్థితి మరింత దిగజారింది. గురువారం రూ.12 కోట్ల నగదే వచ్చినట్టు తెలిసింది. హైదరాబాద్ పరిధిలో నాలుగో వంతు కంటే తక్కువ పోస్టాఫీసులకు, సికింద్రాబాద్లో కొన్నింటికి, జిల్లాల్లోని ప్రధాన పోస్టాఫీసులకు, అది కూడా అరకొరగానే కొత్త నోట్లు అందారుు. దాంతో గురువారం నామమాత్రంగానే మార్పిడి జరిగింది. పేరుకుపోతున్న పాత నోట్లు మరోవైపు పోస్టాఫీసులకు నిత్యం రూ.55 కోట్లకు తగ్గకుండా పాత నోట్లు వస్తుండటంతో వాటిని స్టేట్బ్యాంకులకు పంపుతున్నారు. కానీ తమ వద్దే భారీగా నోట్లు పేరుకుపోతున్నందున తీసుకోలేమని అవి బదులిస్తుండటంతో పోస్టాఫీసుల్లో పాత నోట్లు కుప్పలు పడుతున్నారుు. వాటిని ఎక్కడ దాచాలో కూడా తెలియని గందరగోళం నెలకొంది. ప్రస్తుతం పోస్టాఫీసుల వద్ద రూ.250 కోట్ల వరకు పాత నోట్ల నిల్వ ఉంటుందని అధికారులంటున్నారు. -
ఆర్థిక సంఘానికి హోదాకు సంబంధం లేదు
- ‘మంథన్ సంవాద్’ సదస్సులో ఆర్బీఐ మాజీ గవర్నర్ వై.వి.రెడ్డి స్పష్టీకరణ - ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్రం పాటించాలనే నిబంధనేమీ లేదు - విభజన తరువాత ఏపీ లోటులోకి వెళ్లిపోయింది - కేంద్ర, రాష్ట్ర సంబంధాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి - జీఎస్టీతో ఇంకా మారే అవకాశముంది సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సంఘానికి(ఫైనాన్స్ కమిషన్), ప్రత్యేక హోదాకు ఎటువంటి సంబంధం లేదని భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) మాజీ గవర్నర్, 14వ ఆర్థిక సంఘం చైర్మన్గా పనిచేసిన డాక్టర్ వై.వి.రెడ్డి స్పష్టంచేశారు. ఆర్థిక సంఘం సిఫార్సులను ప్రభుత్వం పాటించాలన్న నిబంధన ఏమీ లేదని ఆయన తేల్చిచెప్పారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని మంథన్ సంస్థ ఆదివారం వివిధ అంశాలపై ‘మంథన్ సంవాద్’ పేరిట భారీ సదస్సును హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించింది. ఈ సందర్భంగా ‘కేంద్ర, రాష్ట్ర సంబంధాలు’ అనే అంశంపై డాక్టర్ వై.వి.రెడ్డి మాట్లాడారు. 14వ ఆర్థిక సంఘంలో ప్రత్యేక హోదా, సాధారణ రాష్ట్రాలు అంటూ తేడా లేదని మాత్రమే ఉందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాతో సంబంధం లేకుండా రాష్ట్రాలన్నింటినీ ఆర్థిక సంఘం ఒకేలా చూస్తుందన్నారు. ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఆర్థిక సంఘం నిధులను కేటాయిస్తుందని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణ మిగులు బడ్జెట్లో ఉందని, ఆంధ్రప్రదేశ్ లోటులోకి వెళ్లిపోయిందని ఆయనీ సందర్భంగా అన్నా రు. తాను పనిచేస్తున్న సమయంలో ఆర్థిక సంఘం ఏ రాష్ట్రాన్నీ... ఎవ్వరినీ సంతృప్తి పరచలేదని... కాబట్టి సమానంగా అసంతృప్తితో ఉంచడమే పనిగా వ్యవహరించామని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో మార్పులు సహజం.. కేంద్రం అనే పదం రాజ్యాంగంలో లేదని... యూనియన్ గవర్నమెంట్ అని మాత్రమే ఉందని వైవీరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్రాలమధ్య సంబంధాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయని, ఒక్కోసారి ఒక్కోవిధంగా ఉందని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ వల్ల కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు ఇంకా మారుతాయన్నారు. కేంద్రం మరింత బలపడుతుందన్నారు. ‘‘నెహ్రూ హయాంలో కేంద్రానికి రాష్ట్రాలతో మంచి సంబంధాలుండేవి. నెహ్రూ సీఎంలతో తరచూ మాట్లాడుతూ ఉండేవారు. అయితే రాజ్యాంగం ఏర్పడిన 30 ఏళ్ల తర్వాత కేంద్రంపై రాష్ట్రాల వ్యతిరేకత పెరిగింది. రాష్ట్రాలు కీలకంగా మారాయి. రాజీవ్గాంధీ ప్రధానమంత్రి అయ్యాక జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా ఏర్పడింది. ఒక ప్రాంతీయ పార్టీ అలా రావడంతో దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. ప్రాంతీయ పార్టీలకు, రాజకీయవేత్తలకు తమకంటూ సొంత విధానాలుండేవి.. ఇవి కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ప్రభావం చూపాయి’’ అని అన్నారు. ఏపీలో ఆర్థిక వ్యవహారాలు మొదలు ఆర్బీఐ గవర్నర్గా, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకుల్లో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవాల్ని వైవీరెడ్డి ఈ సందర్భంగా వివరించారు. ఎవరి ఆహార అలవాట్లు వారివి.. దేశంలో ఎవరి ఆహార అలవాట్లు వారివని... శాకాహారి అంటే ఏదో ప్రత్యేకంగా చూడడం సరికాదని మెగసెసె అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ అన్నారు. బీఫ్ తినేవారికి అది వారి ఆహార అలవాటన్నారు. సఫాయి కర్మచారి వృత్తిని రద్దు చేయడంలో ఇప్పటికీ ప్రభుత్వాలు విజయం సాధించలేకపోయాయన్నారు. గుజరాత్ సీఎంగా నరేంద్రమోదీ ఉన్నప్పుడు సఫాయి కర్మచారి పని ఎంతో పవిత్రమైందనే అర్థంలో వ్యాఖ్యానించారంటూ.. దాన్ని తాను ఖండించిన విషయాన్ని విల్సన్ ప్రస్తావించారు. స్మార్ట్ సిటీలే కాదు.. స్మార్ట్ శానిటేషన్ తీసుకురావాలన్నారు. స్వచ్ఛభారత్ కాదని... మన మనస్సులు స్వచ్ఛంగా ఉండాలన్నారు. కులంతో సంబంధం లేకుండా దేశంలో అందరి మనస్సుల్లో బ్రాహ్మణిజం పేరుకుపోయిందన్నారు. దళితుడు సీఎం, రాష్ట్రపతి, న్యాయమూర్తి అయితే దళితుడు అని ప్రత్యేకంగా ప్రస్తావిస్తారని... ఇతర కులాలవారు ఆ స్థాయికొస్తే అలా చెప్పరన్నారు. కలెక్టర్ అయినా కులంతోనే చూసే పరిస్థితి నెలకొందన్నారు. పోషకాహార లోపంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టట్లేదు: ఆకార్ పటేల్ దేశంలో పోషకాహార లోపంతో ఏటా 5 లక్షలమంది చిన్నారులు మృత్యువాత పడుతున్నా.. ప్రభుత్వాల దృష్టికి రావట్లేదని ప్రముఖ కాలమిస్ట్ ఆకార్ పటేల్ పేర్కొన్నారు. సమాచారం చేరవేతకు ఆంగ్ల భాషను వినియోగిస్తున్న ఉన్నత వర్గాలకు చెందిన 2.5 శాతం మందే దేశంలో ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యారంగంలో సంస్కరణలు రావాల్సిన అవసరముందని అశోక విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు ప్రమత్రాజ్ సిన్హా అన్నారు. దేశంలో వృద్ధాప్య పింఛన్ తీసుకోవాలన్నా లంచం ఇవ్వాల్సిన దుస్థితి నెలకొందని పరిశోధన జర్నలిస్టు అవార్డు గ్రహీత జోసే జోసెఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ర్యాపర్, యాక్టివిస్ట్ సోఫియా అషఫ్,్ర మెషిన్ లెర్నింగ్ ఎక్స్పర్ట్ మనోజ్ సక్సేనా మాట్లాడారు. -
ఆర్బీఐ రూటు ఎటు?
* వేచిచూసే దోరణి ఉండొచ్చంటున్న నిపుణులు... * ఈసారికి పాలసీ రేట్లు యథాతథమేనని అంచనా * గవర్నర్గా ఉర్జిత్ పటేల్కు తొలి పరీక్ష * కొత్తగా ఏర్పాటైన పరపతి విధాన కమిటీకి కూడా * రేపు ఆర్బీఐ పరపతి విధాన సమక్ష... ముంబై: రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కొత్త గవర్నర్ ఉర్జిత్ పటేల్ రేపు తొలి పరీక్షను ఎదుర్కోనున్నారు. గవర్నర్గా ఆయన చేపట్టనున్న తొలి సమీక్షపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదేవిధంగా వడ్డీరేట్లపై నిర్ణయం కోసం కొత్తగా ఉర్జిత్ నేతృత్వంలో ఏర్పాటైన పరపతి విధాన కమిటీ(ఎంపీసీ)కి కూడా ఇదే మొట్టమొదటి భేటీ కావడం గమనార్హం. అయితే, మంగళవారం(అక్టోబర్ 4న) జరగనున్న సమీక్షలో ఆర్బీఐ పాలసీ రేట్లను యథాతథంగానే కొనసాగించే అవకాశాలున్నాయని బ్యాంకర్లు, ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నట్లుగా మరింత నమ్మకమైన గణాంకాల కోసం ఆర్బీఐ వేచిచూడొచ్చనేది వారి అభిప్రాయం. ద్రవ్యోల్బణం కట్టడే ఆర్బీఐ ప్రధాన లక్ష్యమంటూ డిప్యూటీ గవర్నర్గా ఉర్జిత్ కఠిన వైఖరినే అవలంభించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆర్బీఐని ఆయన గుడ్లగూబ(కఠిన విధానాన్ని ఇలా పోలుస్తారు)గా అభివర్ణించారు కూడా. ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేటు 6.5 శాతం, రివర్స్ రెపో 6 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4 శాతంగా కొనసాగుతున్నాయి. ధరల కట్టడికే ఉర్జిత్ మొగ్గు..! ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్టస్థాయి అయిన 5.05 శాతానికి దిగిరాగా... టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం రేటు రెండేళ్ల గరిష్టానికి(3.74%) ఎగబాకడం గమనార్హం. ఆగస్టులో రిటైల్ ధరలు తగ్గినప్పటికీ.. రెండు సూచీలూ కొద్ది నెలలుగా పెరుగుతూనే ఉన్నాయి. మరోపక్క, వచ్చే ఐదేళ్లకాలానికిగాను రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం 4 శాతంగా(రెండు శాతం అటూ ఇటుగా) నిర్ణయించిన సంగతి తెలిసిందే. డిప్యూటీ గవర్నర్గా గతంలో ఆర్బీఐ ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని ఖరారు చేసిన ఉర్జిత్.. ఇప్పుడు కొత్త గవర్నర్గా ధరల కట్టడికే ఎక్కువగా మొగ్గుచూపవచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. మరీముఖ్యంగా కేంద్రం నిర్ధేశించిన ద్రవ్యోల్బణం కొత్త లక్ష్యానికి అనుగుణంగానే ఆయన చర్యలు ఉంటాయని వారు పేర్కొంటున్నారు. తొలిసారి భేటీ అవుతున్న ఎంపీసీకి ప్రభుత్వం, ఆర్బీఐ తరఫున ఉన్న ముగ్గురేసి సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కమిటీకి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ నేతృత్వం వహిస్తారు. పాలసీ రేట్ల విషయంలో కమిటీలోని ఆరుగురు సభ్యులు సగంసగంగా విడిపోతే.. తుది నిర్ణయం గవర్నర్(వీటో అధికారం) తీసుకుంటారు. కాగా, ఇప్పటివరకూ ఉదయం 11 గంటలకు ఆర్బీఐ పాలసీ నిర్ణయాన్ని ప్రకటిస్తుండగా.. దీన్ని మధ్యాహ్నానికి(2.30) మార్చారు. రేటింగ్ ఏజెన్సీల మాట ఇదీ.. ‘రేపటి సమీక్షలో ఆర్బీఐ ఎలాంటి రేట్ల కోతనూ ప్రకటించే అవకాశం లేదు. రానున్న కాలంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే సూచనలు ఉన్న నేపథ్యంలో పాలసీపరంగా రేట్ల తగ్గింపునకు కొంతకాలం వేచిచూసే ధోరణిని అవలంభించవచ్చు’ అని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజా నివేదికలో అభిప్రాయపడింది. ‘ఆర్బీఐ ద్రవ్యోల్బణం లక్ష్యానికి(వచ్చే ఏడాది మార్చికల్లా 5 శాతం) అనుగుణంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో భారీగా తగ్గిననేపథ్యంలో రేట్ల కోత అంచనాలు పెరిగాయి. అయితే, గతంలో కూడా రిటైల్ ధరలు తీవ్ర హెచ్చుతగ్గుల ధోరణిని కనబరిచిన నేపథ్యంలో తాజా తగ్గుదలను మాత్రమే ఎంపీసీ పూర్తిగా పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు. ప్రధానంగా ఆహార ధరల ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోవడం ఆందోళనకరమైన అంశం’ అని మరో ఇండియా రేటింగ్స్ పేర్కొంది. డిసెంబర్ పాలసీ సమీక్షలో పావు శాతం రేట్ల కోత ఉండొచ్చని.. 2017లో ఇక కోతకు విరామం ఉంటుందని జపనీస్ బ్రోకరేజి దిగ్గజం నోమురా అభిప్రాయపడింది. ‘తొలిసారి సమావేశం అవుతున్న ఎంపీసీ.. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న బలమైన సంకేతాల కోసం వేచిచూసే అవకాశం ఉంది. డిసెంబర్ పాలసీలోనే రేట్ల కోతకు ఆస్కారం ఉండొచ్చు’ అని బీఎన్పీ పారిబా చీఫ్ ఎకనమిస్ట్ రిచర్డ్ ఐలే వ్యాఖ్యానించారు. బ్యాంకర్లు ఏమంటున్నారు... టోకు ధరలు, అదేవిధంగా రిటైల్ ధరలకు సంబంధించి ద్రవ్యోల్బణం రేట్లు పెద్దగా దిగిరాలేదు. ఈ నేపథ్యంలో రేపటి సమీక్షలో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులూ చేయకపోవచ్చు. - ఆర్పీ మరాతే, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎండీ, సీఈఓ పాలసీ రేట్లు యథాతథంగానే ఉండొచ్చు. అయితే, బ్యాంకుల మొండిబకాయిల(ఎన్పీఏ) కట్టడి విషయంలో మరికొన్ని చర్యలను ఉర్జిత్ తన తొలి సమీక్షలో ప్రకటించే అవకాశం ఉంది. - అరుణ్ తివారీ, యూనియన్ బ్యాంక్ సీఎండీ -
రెండు నెలలకోసారి కాయిన్మేళా
ఏలూరు (ఆర్ఆర్పేట) : ఆంధ్రాబ్యాంక్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఫైర్స్టేçÙన్ సెంటర్లో నిర్వహించిన కాయిన్ మేళాలో నగర ప్రజలకు రూ.12 లక్షల చిల్లర నాణేలు పంపిణీ చేశామని ఆంధ్రాబ్యాంక్ ఏజీఎం టీవీఆర్ ప్రసాద్ తెలిపారు. ఇటీవల కాలంలో చిల్లర నాణేల కొరత అధికం కావడంతో ప్రజలకు నాణేల కొరత తీర్చడానికి తమ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ జె.మేఘనాథ్ మాట్లాడుతూ ప్రతి రెండు నెలలకు ఒక సారి కాయిన్ మేళా నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. ఈ మేళాలో రూ.2, రూ.5, రూ.10 నాణేలను పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ అధ్యక్షుడు బీహెచ్ రవివర్మ పాల్గొన్నారు. -
ఆర్బీఐ అన్నీ చేయాలని ఆశించొద్దు
బీఓబీ చీఫ్ జయకుమార్ వ్యాఖ్యలు.. ముంబై: వృద్ధి కోసం రిజర్వు బ్యాంకే అన్నీ చేయాలని ప్రభుత్వం ఆశించరాదని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండీ, సీఈవో పీఎస్ జయకుమార్ చెప్పారు. రికవరీ బాధ్యత ప్రభుత్వంపైనే గానీ ఆర్బీఐపై ఉండదన్నారు. ‘‘రికవరీకి సంబంధించి అధిక బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. ఆర్బీఐ గవర్నర్ సమస్యలను పరిష్కరిస్తారని ఆశించడం సరికాదు. అసలు అంశం మరో చోట ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం సేవలకు సంబంధించి విక్రేతలకు సకాలంలో చెల్లింపుల చేయాలని, అమలు విధానాన్ని ఉన్నతీకరించడం ద్వారా ప్రాజెక్టులు సక్రమంగా పనిచేసేట్టు చూడాలని కోరారు. ముంబైలో సోమవారం జరిగిన ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో జయకుమార్ ఈ మేరకు మాట్లాడారు. దేశంలో అతిపెద్ద వ్యాజ్యదారు ప్రభుత్వమేనన్నారు. రుణాల వసూలు ట్రిబ్యునళ్లను మెరుగుపరచడం, దివాళా చట్టాన్ని త్వరగా అమలు చేయడంపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి సూచించారు. -
ఆర్బీఐ పాలసీపైనే చూపు
♦ కొన్ని కీలక కంపెనీల ఫలితాలు ఈ వారంలోనే ♦ ఐఐపీ, ద్రవ్యోల్బణ గణాంకాల ప్రభావం ♦ ఈ వారం మార్కెట్ గమనంపై అంచనాలు న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ వెలువరించే ద్రవ్య పరపతి విధానం, ఎస్బీఐ, హీరో మోటోకార్ప్ తదితర కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాల వెల్లడి, పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు.. ఈ అంశాలన్నీ ఈ వారం స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. వీటితో పాటు వర్షపాత విస్తరణ, అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, రూపాయి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం.. తదితర అంశాల ప్రభావమూ ఉంటుందని వారంటున్నారు. యథాతథంగానే రేట్లు... రెండు నెలలకొకసారి నిర్వహించే ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష ఈ మంగళవారం(ఈ నెల 9న) జరగనున్నది. కాగా కీలక రేట్లలో యథాతథ స్థితిని ఆర్బీఐ కొనసాగించే అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు. ఆర్బీఐ పాలసీ, కంపెనీల ఆర్థిక ఫలితాలపైననే అందరి చూపు ఉంటుందని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ వ్యవస్థాపక డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. కంపెనీల క్యూ1 ఫలితాల వెల్లడి దాదాపు పూర్తికావచ్చిందని పేర్కొన్నారు. శుక్రవారం కీలక గణాంకాలు.. ఈ వారంలో పలు కీలక కంపెనీలు ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. జూన్ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ నెల 12(శుక్రవారం) వెలువడనున్నాయి. అదే రోజు జూలై నెల వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా వెల్లడికానున్నాయి. ఇక అంతర్జాతీయ అంశాల విషయానికొస్తే, వివిధ దేశాల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ వారంలో వెలువడనున్నాయి. జూన్ నెల జర్మనీ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సోమవారం, ఇంగ్లండ్ జూన్ నెల పారిశ్రామికోత్పత్తి గణాం కాలు మంగళవారం రోజున, జూలై నెల చైనా పారిశ్రామిక గణాంకాలు గురువారం వెలువడతాయి. కొనసాగుతున్న విదేశీ పెట్టుబడుల జోరు భారత స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు జోరు కొనసాగుతోంది. రాజ్యసభలో జీఎస్టీ బిల్లుకు ఆమోదం లభించడం, సానుకూల అంతర్జాతీయ సంకేతాల కారణంగా ఈ నెల మొదటివారంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,290 కోట్లు పెట్టుబడులు పెట్టారు. -
రాజన్ను కొనసాగించాలి: సీఐఐ
ఒకాసా: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ను సెప్టెంబర్ 4 తరువాత ఇదే బాధ్యతల్లో కొనసాగించాలని పరిశ్రమల వేదిక- కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) పేర్కొంది. సీఐఐ ప్రెసిడెంట్ నౌషాద్ ఫోర్బ్స్ గురువారం ఇక్కడ ఈ అంశంపై ఒక వార్తా సంస్థతో మాట్లాడారు. ఆర్థికమంత్రి జైట్లీ పర్యటనలో భాగంగా, ఇక్కడకు వచ్చిన అత్యున్నత స్థాయి బృందంలో ఫోర్బ్స్ ఒకరు. ఈ సందర్భంగా ఆయన మాటలను క్లుప్తంగా చూస్తే... ‘‘రాజన్ ఇప్పటివరకూ గణనీయమైన బాధ్యతలు నిర్వహించారు. ఆయనపై వ్యక్తిగత వ్యాఖ్యలు ఎంతమాత్రం సరికాదు. ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు. ఇక మిగిలిన అంశాలకు వస్తే.. రాజన్పై సుబ్రమణ్యస్వామి విమర్శలను నేను తీవ్రంగా చూడ్డం లేదు. ప్రజాస్వామ్యంలో ఇవి ఒక భాగం. అయితే వ్యక్తిగత విమర్శలు మాత్రం సరికాదు. రాజన్ను తిరిగి గవర్నర్గా కొనసాగింపునకు సంబంధించి నిర్ణయాన్ని ప్రభుత్వం తగిన సమయంలో తీసుకుంటుందని భావిస్తున్నాను’’. -
సెన్సెక్స్ 516 పాయింట్లు డౌన్
వడ్డీ రేటు తగ్గింపు స్వల్పమేనన్న నిరుత్సాహం ♦ ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ ♦ 156 పాయింట్లు తగ్గిన నిఫ్టీ ♦ ఫెడ్ భయాలతో ప్రతికూలంగా ప్రపంచ మార్కెట్లు ముంబై: రిజర్వుబ్యాంక్ వడ్డీ రేటును పావుశాతమే తగ్గించిందన్న నిరుత్సాహానికి ప్రతికూల అంతర్జాతీయ ట్రెండ్ తోడవటంతో మంగళవారం ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. దాంతో బీఎస్ఈ సెన్సెక్స్ 516 పాయింట్లు పతనమై 25,000 పాయింట్లస్థాయి దిగువకు జారిపోయింది. రేట్ల కోత అంచనాలతో నెలరోజులుగా పెరిగిన బ్యాంకింగ్ షేర్లే ఆర్బీఐ పాలసీ ప్రకటన అనంతరం అధికంగా క్షీణించాయి. ఆర్బీఐ కేవలం రెపో రేటును మాత్రమే తగ్గించి, సీఆర్ఆర్ను యథాతథంగా అట్టిపెట్టడం కూడా ఇన్వెస్టర్లకు రుచించలేదు. బ్యాంకింగ్ షేర్లలో ఎక్కువగా ఐసీఐసీఐ బ్యాంక్ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యింది. ఈ షేరు 5.45 శాతం క్షీణించగా, ఎస్బీఐ 5.38 శాతం పడిపోయింది. యాక్సిస్ బ్యాంక్ 2.89 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.03 శాతం చొప్పున తగ్గాయి. ఫార్మా షేరు లుపిన్ మినహా సెన్సెక్స్-30లో భాగమైన మిగిలిన షేర్లన్నీ తగ్గుదలతో ముగిశాయి. 25,372 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఒకదశలో 24,837 పాయింట్ల వద్దకు పడిపోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 516 పాయింట్ల భారీనష్టంతో 24,884 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 156 పాయింట్లు నష్టపోయి 7,603 పాయింట్ల వద్ద ముగిసింది. ఫెడ్ ఎఫెక్ట్... మరోవైపు అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయం ప్రపంచ మార్కెట్లను వెన్నాడుతూ ఉంది. ఫెడ్ గత సమావేశపు మినిట్స్ బుధవారం వెల్లడికానున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు క్షీణించడం కూడా ఇక్కడి ట్రేడింగ్పై ప్రభావం చూపింది. పైగా మార్చి నెలలో పెట్టుబడుల జోరుతో పోలిస్తే గత కొద్దిరోజుల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు నెమ్మదించాయని, నగదు మార్కెట్లో లావాదేవీలు తగ్గాయని జియోజిత్ బీఎన్పీ పారిబాస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. తాజా లాభాల స్వీకరణకు ఇది కూడా ఒక కారణమని ఆయన విశ్లేషించారు. బ్యాంకింగ్ షేర్లతో పాటు అదాని పోర్ట్స్ 6.23 శాతం, భారతీ ఎయిర్టెల్ 5.03 శాతం, టాటా మోటార్స్ 4.52 శాతం, బీహెచ్ఈఎల్ 3.67 శాతం, మారుతి 3.66 శాతం, ఎల్ అండ్ టీ 3.30 శాతం, కోల్ ఇండియా 3.26 శాతం, ఎన్టీపీసీ 3.09 శాతం చొప్పున తగ్గాయి. రంగాలవారీగా బీఎస్ఈ టెలికం సూచీ అన్నింటికంటే ఎక్కువగా 3.71 శాతం తగ్గగా, బ్యాంకింగ్ సూచి 3.21 శాతం, ఆటో 2.84 శాతం చొప్పున తగ్గాయి. ట్రేడయిన మొత్తం షేర్లలో 1,631 షేర్లు క్షీణించగా, 882 షేర్లు లాభపడ్డాయి. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపుపై అనిశ్చితి కారణంగా ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. జపాన్ నికాయ్ 2.42 శాతం తగ్గగా, హాంకాంగ్, సింగపూర్ సూచీలు 0.8-1.57 శాతం మధ్య క్షీణించాయి. యూరప్లోని కీలక ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ సూచీలు 1.5-3 శాతం మధ్య తగ్గాయి. కడపటి సమాచారం అందేసరికి అమెరికా సూచీలు తగ్గుదలతో ట్రేడవుతున్నాయి. -
చిన్న సంస్థలకు రుణ నిబంధనల సవరణ
ముంబై: చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) రుణాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ సవరించింది. దాదాపు రూ. 25 కోట్ల దాకా లోన్ పరిమితులున్న సంస్థల రుణ సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని బ్యాంకులకు సూచించింది. మరోవైపు, వార్షిక ఖాతాల క్లోజింగ్కి ముందు రెండు రోజులూ బ్యాంకులు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని ఆర్బీఐ తెలిపింది. మార్చి 30న పూర్తి రోజు, 31న రాత్రి 8 గం.ల దాకా బ్యాంకులు పనిచేస్తాయని వివరించింది. పెన్షనర్లకు చెల్లింపుల్లో పక్కాగా నిబంధనలు పెన్షనర్లకి తప్పుగా చెల్లింపులు/అధిక మొత్తంలో రికవరీ చేసుకోవడం వంటి అంశాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బ్యాంకులు నిర్దిష్ట నిబంధనలను పక్కాగా పాటించాలని ఆర్బీఐ సూచించింది. ఒకవేళ అధిక మొత్తం చెల్లించినట్లు బ్యాంకు దృష్టికి వస్తే.. సత్వరం పెన్షనరు ఖాతాలో ఆ మేరకు సర్దుబాటు చేయాలని పేర్కొంది. అలా పూర్తి మొత్తాన్ని సర్దుబాటు చేయడం సాధ్యం కాకపోతే, మిగిలిన దాన్ని తిరిగి చెల్లించాలని పెన్షనరుకు సూచించాలని ఆర్బీఐ తెలిపింది. పెన్షనరు చెల్లించలేని నిస్సహాయ స్థితిలో ఉంటే భవిష్యత్లో వారికి చేసే చెల్లింపుల నుంచి మినహాయించుకోవాల్సి ఉంటుంది. ప్రతి నెలా నికరంగా పెన్షనరుకు చెల్లించే దానిలో మూడింట ఒక్క వంతును మాత్రమే మినహాయించుకోవాల్సి ఉంటుంది. పెన్షనరు సమ్మతి తెలియజేస్తే మరింత ఎక్కువ మొత్తం మినహాయించుకోవచ్చు. -
రిజర్వు బ్యాంక్కు షాక్
సాక్షి, చెన్నై : ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రాష్ర్టంలో నగదు బట్వాడా అడ్డుకట్ట లక్ష్యంగా తనిఖీలు ముమ్మరం అయ్యాయి. ప్రత్యేక స్క్వాడ్లు ఓ వైపు, ఆయా ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లను అను సంధానిస్తూ ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో తనిఖీలు జోరుగా సాగుతున్నాయి. చేతికి నగదు చిక్కితే చాలు, సీజ్ చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్న తనిఖీల బృందాలపై విమర్శలు బయలు దేరుతున్నాయి. లెక్కలోకి రాని నగదు అంటూ ముందుగా పట్టుకుని సీజ్ చేయడం, వాటికి లెక్కలు చూపించిన తరువాయి అప్పగించడం సాగుతూ వస్తోంది. విధి నిర్వహణలో తాము ఏ మేరకు నిక్కచ్చితనంగా వ్యవహరిస్తున్నామో అని చాటుకునేందుకు ఏకంగా రిజర్వు బ్యాంక్కే ప్రత్యేక బృందాలు షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ నుంచి అధికారుల్ని పరుగులు తీయించాయి. రిజర్వు బ్యాంక్కు షాక్: నామక్కల్జిల్లా పరమత్తి సమీపంలో ప్రత్యేక బృందాలు తనిఖీల్లో నిమగ్నమయ్యాయి. ప్రత్యేక అధికారి బాలసుబ్రమణ్యం నేతృత్వంలో ఈ తనిఖీలు సాగుతుండగా, టోల్గేట్ వైపుగా నాలుగు కంటైనర్లు ఒకదాని తర్వాత మరొకటి రావడంతో అనుమానం నెలకొంది. ఆ కంటైనర్లను నిలిపి తనిఖీ చేశారు. అందులో చిల్లర నాణేలు ఉండడం, అందుకు తగ్గ లెక్కలు లేని దృష్ట్యా, ఆ నాలుగు లారీలను తహశీల్దార్ కార్యాలయానికి తరలించి సీజ్ చేశారు. ఆ కంటైనర్లలో ఉన్న చిల్లర నాణేలు రిజర్వు బ్యాంక్కు చెందినట్టు డ్రైవర్లు చెప్పుకున్నా, అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. వాటిని లెక్కించగా కోటి రూపాయల వరకు రూ. పది నాణేలు, 75 లక్షల వరకు రూ. ఐదు నాణేలు, 37 లక్షల వరకు రూ. రెండు నాణేలు, 23 లక్షల వరకు రూ. 1 నాణెం ఉన్నట్టు గుర్తించారు. ఆ నాణెలు హైదరాబాద్ నుంచి కేరళకు వెళ్తున్నట్టు తేలింది. అయితే, ఆ నాణేలు రిజర్వు బ్యాంక్ నుంచి వెళ్తున్నట్టుగా ఎలాంటి ఆధారాలు లేని దృష్ట్యా, సీజ్ చేసినట్టు అధికారులు ప్రకటించారు. దీంతో ఆ కంటైనర్ల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. వాటిలో నాణేలు ఉన్న సమాచారంతో ఆ పరిసర వాసులు కంటైనర్లు చూడడానికి ఎగబడ్డారు. డ్రైవర్లు ఇచ్చిన సమాచారంతో షాక్కు గురైన హైద రాబాద్లోని రిజర్వు బ్యాంక్ అధికారులు హుటా హుటిన ఆధారాలకు తగ్గ సమాచారాలు, ఆ నగదు బట్వాడాకు చెందిన వివరాల్ని నామక్కల్ పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫ్యాక్స్ రూపంలో పంపాల్సి వచ్చింది. వాటిని పరిశీలించినానంతరం మూడు గంటల సమయంలో కంటైనర్లను వదలి పెట్టారు. ఇక, గుడియాత్తం సమీపంలో వాహన తనిఖీల్లో ఉన్న పోలీసులు మోటార్ సైకిల్పై వచ్చిన శరవణన్ అనే వ్యక్తి వద్ద రూ. నాలుగు లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సొంత పని మీద ఇంటి నుంచి నగదు తీసుకుని వెళ్తున్నట్టు వివరణ ఇచ్చుకున్నా ఫలితం శూన్యం. ఇక, కళ్లకురిచ్చి సమీపంలో ఓ కారులో రూ. 60 వేలు తీసుకొస్తున్న మణి అనే వ్యక్తిని తనిఖీ చేసి, ఆ నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. అయితే, తన కుమారుడికి ఫీజులు చెల్లించడం కోసం బంధువుల వద్ద నుంచి రూ. 60 వేలు అప్పు తీసుకుని, వస్తుంటే, దానిని కూడా స్వాధీనం చేసుకోవడం ఏమిటో అంటూ మణి గగ్గోలు పెడుతున్నాడు. కొన్ని చోట్ల తనిఖీల పేరిట పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తుండడం, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో ఎన్నికల యంత్రాంగంపై విమర్శలు బయలుదేరాయి. -
పెరిగిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు
ముంబై: రిజర్వుబ్యాంక్ వద్ద విదేశీ మారక ద్రవ్య నిల్వలు మార్చి4తో ముగిసిన వారంలో జోరుగా పెరిగాయి. ఈ నిల్వలు 407.5 కోట్ల డాలర్లు పెరిగి 35,086 కోట్ల డాలర్లకు చేరాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు(ఎఫ్సీఏ) బాగా పెరగడమే దీనికి ప్రధాన కారణమని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ వెల్లడించిన గణాంకాల ప్రకారం.., అంతకు ముందటి రెండు వారాల్లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు క్షీణించాయి. మార్చి 4తో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 244.8 కోట్ల డాలర్లు పెరిగి 32,747 కోట్ల డాలర్లకు చేరాయి. ఇక బంగారం నిల్వలు 162.8 కోట్ల డాలర్లు పెరిగి 1,932.4 కోట్ల డాలర్లకు పెరగ్గా, అంతర్జాతీయ ద్రవ్య నిధి... భారత్కు కేటాయించిన స్పెషల్ డ్రాయింగ్ రైట్స్(ఎస్డీఆర్) 5 లక్షల డాలర్లు తగ్గి 147.9 కోట్ల డాలర్లకు పడిపోయాయి. -
‘నల్లధనం’ క్రమబద్ధీకరణ దరఖాస్తులకు ఆహ్వానం
ముంబై: లెక్కల్లో చూపని విదేశీ ఆస్తులను బ్లాక్మనీ చట్టం కింద వెల్లడించిన వారు ఆ సొత్తును క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా రిజర్వ్ బ్యాంక్ సూచించింది. సదరు ఆస్తిని వెల్లడించిన 180 రోజుల్లోగా ఈ మేరకు దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపింది. ప్రిన్సిపల్ చీఫ్ జనరల్ మేనేజర్, ఫారిన్ ఎక్స్చేంజి డిపార్ట్మెంట్ (ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ డివిజన్)ని ఉద్దేశిస్తూ దీన్ని పంపాల్సి ఉంటుందని వివరించింది. 2015 జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన బ్లాక్ మనీ చట్టం.. విదేశీ ఆస్తుల వెల్లడించి, పన్నులు కట్టేందుకు నిర్దిష్ట కాలం పాటు ఒకసారి అవకాశం కల్పించింది. దీని గడువు గతేడాది సెప్టెంబర్తో ముగిసింది. దీని కింద సుమారు 600 డిక్లరేషన్స్ రాగా ఖజానాకు రూ. 2,428 కోట్లు వచ్చాయి. వన్ టైమ్ అవకాశాన్ని వినియోగించుకున్న వారిపై విదేశీ మారక నిర్వహణ చట్టం కింద చర్యలు ఉండబోవని ఆర్బీఐ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
బ్యాంకులకు సెలవులు.. డబ్బులకు ఇబ్బందే..?
♦ రేపటి నుంచి బ్యాంకులకు 4 రోజులు సెలవు ♦ గురువారం మిలాద్ ఉన్ నబీ ♦ శుక్రవారం క్రిస్మస్ ♦ శని, ఆది సాధారణ సెలవులు ♦ కోట్ల లావాదేవీలకు ఇబ్బందే కొరిటెపాడు(గుంటూరు) : బ్యాంకులకు రేపటి నుంచి వరుసగా నాలుగు రోజులు సెలవులు. గురువారం మిలాద్ ఉన్ నబీ, శుక్రవారం క్రిస్మస్, నెలలో 4వ శనివారం సెలవు, ఆదివారం సాధారణ సెలవు. నాలుగు రోజులు వరుసగా బ్యాంకులు మూతపడే పరిస్థితి. రిజర్వు బ్యాంక్ నియమావళి ప్రకారం వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవు ప్రకటించిన సందర్భాలున్నాయి. నాలుగు రోజులు సెలవు అనేది సాధ్యపడే విషయం కాదు. ఇటీవల నెలలో రెండు శనివారాలు బ్యాంకులకు సెలవు, మరో రెండు శనివారాలు పూర్తి పని వేళలకు ఒప్పందం కుదిరింది. దీంతో రెండు, నాల్గవ శనివారం బ్యాంకులకు పూర్తి సెలవు ఇస్తున్నారు. వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతపడితే ఆర్ధిక లావాదేవీలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని, వేల కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోతాయని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో వారం రోజుల్లో మూడు త్రైమాసికాలు ముగుస్తాయి. 9 నెలల కాలంలో ఆర్ధిక లావాదేవీలలో పురోభివృద్ధి కనిపించలేదు. మూడో త్రైమాసికాంతంలో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతపడితే ఆర్ధిక అసమతుల్యత తప్పదు. గురు, శుక్రవారం బ్యాంకులకు సెలవు అనివార్యమైతే రిజర్వుబ్యాంక్ నిర్ణయం మేరకు శనివారం బ్యాంకులు తెరిచే అవకాశం ఉందని, సంబంధిత ఉద్యోగులకు అదనపు భత్యం ఇచ్చి శనివారం బ్యాంకులు తెరిచే అవకాశాలు ఉంటాయని బ్యాంకింగ్ రంగ నిపుణులు భావిస్తున్నారు. మొబైల్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సదుపాయం ఉన్న కారణంగా రిజర్వుబ్యాంక్ వరుస సెలవులపై పెద్దగా స్పందించక పోవచ్చని మరో వర్గం ఉద్యోగులు భావిస్తున్నారు. ఏటీఎం క్యాష్ అడ్మినిస్ట్రేషన్ సెల్ సదుపాయం ఉన్న అన్ని బ్యాంకుల ఏటీఎంలలో శనివారం నగదు నిల్వలు నింపుతామని అధికారులు పేర్కొంటున్నారు. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలను పురష్కరించుకొని బ్యాంకులలో నగదు చలామణి ఉంటుంది. గురు, శుక్రవారాలు బ్యాంకులు మూతపడితే శనివారం పనిదినంగా ప్రకటించాలని వ్యాపార వర్గాలు కోరుతున్నాయి. -
నిరోధం 26,339- మద్దతు 25,386
మార్కెట్ పంచాంగం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ అసలు ఉద్దేశ్యమేమిటో గతవారం స్పష్టమైపోయింది. ఈ సంవత్సరాంతంలో వడ్డీ రేట్ల పెంపు తప్పదంటూ ఫెడ్ ఛైర్పర్సన్ యెలెన్ వెల్లడించేసేశారు. ఈ నేపథ్యంలో మన రిజర్వుబ్యాంక్ పాలసీ నిర్ణయం వెలువడనున్నది. దేశీయంగా ద్రవ్యోల్బణం కనిష్టస్థాయికి పడిపోయినందున, పావుశాతం రేట్ల కోత వుండవచ్చన్న అంచనాలు ఇప్పటికే షేర్ల ధరల్లో ఇమిడిపోయాయి. ఈ కారణంగా అరశాతం తగ్గితేనే మార్కెట్లో మరింత ర్యాలీ జరిగే ఛాన్స్ వుంటుంది. లేదంటే ఆర్బీఐ పాలసీ మీట్ తర్వాత సూచీలు పడిపోయే ప్రమాదం వుంటుంది. ఇక భారత్ సూచీల సాంకేతికాంశాలకు వస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు సెప్టెంబర్ 24తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్ వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 26,339 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగిన తర్వాత 900 పాయింట్లకుపైగా క్షీణించి, 25,386 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. అటుతర్వాత క్రమేపీ కోలుకుని, చివరకు 1.3 శాతం స్వల్పనష్టంతో 25,863 పాయింట్ల వద్ద ముగిసింది. సెప్టెంబర్ 8నాటి 24,833 పాయింట్ల కనిష్టస్థాయి నుంచి ప్రస్తుతం జరుగుతున్న రిట్రేస్మెంట్ ర్యాలీలో గతవారపు 26,339 పాయింట్ల గరిష్టస్థాయిని ‘లోయర్ హై’గా (సెప్టెంబర్ 18నాటి 26,472 పాయింట్ల గరిష్టంతో పోలిస్తే) పరిగణించవచ్చు. ఈ కారణంగా రిట్రేస్మెంట్ ర్యాలీ కొనసాగాలంటే గతవారపు గరిష్టస్థాయి అయిన 26,339 పాయింట్ల స్థాయిని సెన్సెక్స్ ఈ వారం తప్పనిసరిగా అధిగమించాల్సివుంటుంది. ఆర్బీఐ పాలసీ ప్రకటన తర్వాత ఆ స్థాయిని దాటలేకపోయినా, గతవారపు కనిష్టస్థాయి అయిన 25,386 పాయింట్ల స్థాయిని కోల్పోయినా మళ్లీ డౌన్ట్రెండ్లోకి మళ్లీ తర్వాతి రోజుల్లో 24,833 పాయింట్ల వద్దకు పతనమయ్యే ప్రమాదం వుంటుంది. ఆగస్టు 24న సెన్సెక్స్ భారీగా నష్టపోయినపుడు రికార్డు ట్రేడింగ్ పరిమాణంతో 26,730 స్థాయి నుంచి పతనం జరిగింది. ఈ వారం 26,339 పాయింట్ల నిరోధస్థాయిని అధిగమిస్తే 26,500-26,816 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. అటుపైన పటిష్టంగా ముగిస్తే 27,130 పాయింట్ల స్థాయిని చేరే ఛాన్స్ వుంటుంది. ఈ వారం 25,386 పాయింట్ల మద్దతుస్థాయిని కోల్పోతే తిరిగి 24,830 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. నిఫ్టీ మద్దతు 7,723-నిరోధం 8,021 ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,021 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన తర్వాత 7,723 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు 114 పాయింట్ల నష్టంతో 7,868 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్లానే నిఫ్టీకి కూడా గతవారపు కనిష్ట, గరిష్టస్థాయిలు ఈ వారం కీలకమైనవి. ఈ వారం 8,021 పాయింట్ల గరిష్టస్థాయిని దాటితే 8,060-8,142 పాయింట్ల శ్రేణిని సూచీ అందుకోవొచ్చు. ఆపైన ముగిస్తే 8,225 పాయింట్ల వరకూ ర్యాలీ జరిపే అవకాశం వుంది. ఈ వారం 7,723 పాయింట్ల మద్దతుస్థాయిని కోల్పోతే మరోదఫా 7,540 పాయింట్ల స్థాయి వద్దకు తగ్గవచ్చు. ఆర్బీఐ పాలసీ ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో అక్టోబర్ డెరివేటివ్ సిరీస్లో బిల్డప్ తక్కువగా జరిగింది. ఉన్నంతలో 7,800, 7,500 స్ట్రయిక్స్ వద్ద అధిక పుట్ బిల్డప్, 8,000, 8,200 స్ట్రయిక్స్ వద్ద అధిక కాల్ బిల్డప్ వుంది. పాలసీ తర్వాత భారీ ట్రేడింగ్ పరిమాణంతో 7,800 స్థాయిని కోల్పోతే తదుపరి 7,500 మద్దతుస్థాయివరకూ నిఫ్టీ తగ్గవచ్చని, 8,000 స్థాయిని భారీ టర్నోవర్తో దాటితే 8,200 స్థాయివరకూ పెరగవచ్చని ప్రస్తుత ఆప్షన్ బిల్డప్ సూచిస్తున్నది. -
పసిడి పథకాల మార్గదర్శకాలు విడుదల
న్యూఢిల్లీ : పసిడి బాండ్లు (జీబీఎస్), డిపాజిట్లకు (జీఎంఎస్) సంబంధించి ఆవిష్కరించిన రెండు పథకాల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం విడుదల చేసింది. ఈ రెండింటి వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంకుతో సంప్రదించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఆఫీస్ మెమోలో ఆర్థిక శాఖ పేర్కొంది. కరిగింపు చార్జీల వివరాలను కూడా ఇందులో ప్రస్తావించింది. దీని ప్రకారం 100 గ్రాముల పరిమాణం దాకా లాట్కు కనీస చార్జి రూ. 500గాను, 900-1,000 గ్రాముల దాకా పరిమాణానికి దాదాపు రూ. 13,400 దాకా ఉంటుంది. కడ్డీలు తదితర భౌతిక రూపంలో బంగారానికి డిమాండ్ను తగ్గించే దిశగా ప్రభుత్వం ఈ పథకాలను ప్రవేశపెడుతోంది. జీఎంఎస్ కింద ఏడాది నుంచి 15 ఏళ్ల కాల వ్యవధికి బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చు. మరోవైపు, ఫిజికల్ గోల్డ్కు ప్రత్యామ్నాయంగా బాండ్లను (జీబీఎస్) ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ఇవి 2,5,10, 50, 100 గ్రాముల పరిమాణంలో 5-7 సంవత్సరాల కాలవ్యవధికి లభిస్తాయి. -
61 శాతం పెరిగిన పసిడి దిగుమతులు
న్యూఢిల్లీ : రిజర్వు బ్యాంక్ దిగుమతుల నిబంధనలను సడలించడం, అంతర్జాతీయంగా ధరలు క్షీణించడం వంటి పలు అంశాల వల్ల దేశంలోకి పసిడి దిగుమతి బాగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి రెండు మాసాల్లో (ఏప్రిల్-మే) బంగారం దిగుమతి 61% వృద్ధితో 155 టన్నులకు చేరింది. గతేడాది ఇదే సమయంలో బంగారం దిగుమతి 96 టన్నులు. జ్యూయలరీ పరిశ్రమ నుంచి డిమాండ్ అధికంగా ఉండటం వల్ల బంగారం దిగుమతి బాగా పెరిగింది. బంగారం దిగుమతి 2013-14 ఆర్థిక సంత్సరంలో 662 టన్నులుగా, 2014-15లో 916 టన్నులుగా ఉంది. అధిక మొత్తంలో బంగారం దిగుమతి ప్రభావం దేశ కరెంటు ఖాతా లోటుపై ఉంటుంది. 2013-14లో 1.7%గా ఉన్న కరెంటు ఖాతా లోటు 2014-15లో 1.3%కి తగ్గింది. -
పాలసీ, ఫలితాలే దిక్సూచి..
♦ వడ్డీ రేట్లు తగ్గితే, పీఎస్యూ బ్యాంక్ షేర్ల ర్యాలీ ♦ ఈ వారం మార్కెట్పై విశ్లేషకుల అంచనా న్యూఢిల్లీ : మంగళవారం రిజర్వుబ్యాంకు వెల్లడించ బోయే పరపతి విధానం, భారతి ఎయిర్టెల్, టాటా మోటార్స్ తదితర కంపెనీల క్యూ1 ఫలితాల ఆధారంగా ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రెండ్ వుంటుందని విశ్లేషకులు చెప్పారు. అలాగే రుతుపవనాల గమనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, డాలరుతో రూపాయి మారకపు విలువ కదలికలు సైతం మార్కెట్ను నిర్దేశిస్తాయని వారన్నారు. తొలుత ఈ సోమవారం ఆటోమొబైల్ కంపెనీల జూలై విక్రయాలకు అనుగుణంగా ఆయా షేర్లు హెచ్చుతగ్గులకు లోనవుతాయని నిపుణులు తెలిపారు. అటు తర్వాత ఆగస్టు 4నాటి ఆర్బీఐ పాలసీ సమీక్షపై ఇన్వెస్టర్ల దృష్టి మళ్లుతుందని వారు పేర్కొన్నారు. ఆర్బీఐ పాలసీతో పాటు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం చేపట్టబోయే సంస్కరణలు కూడా సమీప భవిష్యత్తులో మార్కెట్ను శాసిస్తాయని క్యాపిటల్ వయా గ్లోబల్ డైరె క్టర్ వివేక్ గుప్తా చెప్పారు. ఆర్బీఐ తన సమీక్షలో వడ్డీ రేట్లు తగ్గిస్తే పీఎస్యూ బ్యాంకులు పెద్ద ర్యాలీ జరుపుతాయని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోది అంచనావేశారు. రేట్ల కోత లేకపోయినా మార్కెట్ పెద్దగా ప్రతికూలంగా స్పందించబోదని, రేట్ల తగ్గింపు వుండకపోవొచ్చన్న అంశాన్ని ఇప్పటికే ఇన్వెస్టర్లు డిస్కౌంట్ చేసుకున్నారని జైఫిన్ అడ్వయిజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దేవేంద్ర నాగ్వి అన్నారు. ఆర్బీఐ గవర్నర్ ఆర్థిక వ్యవస్థపై వెలిబుచ్చే అంచనాలను మార్కెట్ నిశితంగా గమనిస్తుందని, తదుపరి రేట్ల కోత అవకాశాలపై అంచనాల్ని ఏర్పర్చుకుంటుందని ఆయన వివరించారు. ఈ వారం ఫలితాలు... ఈ వారం హెచ్సీఎల్ టెక్నాలజీస్, హీరో మోటార్ కార్ప్, భారతి ఎయిర్టెల్, బీహెచ్ఈఎల్, మహీం ద్రా, టాటా మోటార్స్ కంపెనీలు ఏప్రిల్-జూన్ క్వార్టర్కు ఆర్థిక ఫలితాల్ని వెల్లడించనున్నాయి. ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాల్లో మెరుగుదల ఏమీ లేదని, ఆర్థిక వ్యవస్థ బలహీనత ఫలితాల్లో ప్రతిబింబిస్తున్నదని అశికా స్టాక్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ పారస్ బోత్రా అన్నారు. గతవారం మార్కెట్ గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 2.25 పాయింట్ల స్వల్ప పెరుగుదలతో 28,115 పాయింట్ల వద్ద ముగిసింది. పీఎస్యూ బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ షేర్లు ర్యాలీ జరపగా, కమోడిటీ షేర్లు క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ. 5,300 కోట్లు జూలై నెలలో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ స్టాక్ మార్కెట్లో రూ. 5,300 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) ఈక్విటీ మార్కెట్లో రూ. 5,319 కోట్లు, రుణ మార్కెట్లో రూ. 4 కోట్లు నికరంగా కొనుగోళ్లు జరపడంతో జూలై నెలలో మొత్తం క్యాపిటల్ మార్కెట్లో వారి పెట్టుబడుల విలువ రూ. 5,323 కోట్లకు చే రినట్లు సెంట్రల్ డిపాజిటరీల డేటా వెల్లడిస్తున్నది. -
ఇతర బ్యాంకుల మెషీన్ల్లలోనూ క్యాష్ డిపాజిట్కు ఆర్బీఐ అనుమతి!
కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా సాక్షి, న్యూఢిల్లీ : ఏటీఎంల నెట్వర్క్ అయిన జాతీయ ఫైనాన్షియల్ స్విచ్ (ఎన్ఎఫ్ఎస్)లో భాగంగా ఇంటర్ ఆపరేబుల్ క్యాష్ డిపాజిట్ ప్రారంభించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) ప్రతిపాదన చేసిందని, ఈ మేరకు రిజర్వు బ్యాంక్ ద్వారా కొన్ని షరతులపై సూత్రప్రాయంగా ఆమోదం కూడా లభించిందని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. ఇంటర్ ఆపరేబుల్ క్యాష్ డిపాజిట్ కోసం చేసిన ప్రతిపాదనలపై లోక్సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం జిల్లా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి జయంత్ సిన్హా శుక్రవారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఒక బ్యాంకు ఖాతాదారు ఇతర బ్యాంకుల క్యాష్ డిపాజిట్ మెషీన్ (సీడీఎంఎస్)లో జరిపే ఒక లావాదేవీకి రూ.49,999లు పరిమితి విధించినట్టు చెప్పారు. బ్యాంకుల్ని పటిష్టపరుస్తాం.. ప్రభుత్వరంగ బ్యాంకులను పటిష్టం చేయడంపై కేంద్రం దృష్టిని సారించిందని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. భారతీయ మహిళా బ్యాంకు సహా చిన్నతరహా బ్యాంకులను పెద్ద బ్యాంకుల్లో విలీనం చేసే ప్రతిపాదనలపై ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గోకరాజు గంగరాజు, జ్యోతి ధృవే, భగవంత్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. మరిన్ని అంశాలు... ⇒ ఒకప్పటి సత్యం కంప్యూటర్ సర్వీసెస్సహా దాదాపు 14 సంస్థలపై కంపెనీల చట్ట నిబంధనల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం చట్టపరమైన చర్యలు తీసుకుంటున్న ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ⇒ భారత్లో దాదాపు 8,354 విదేశీ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఒక లిఖితపూర్వక సమాధానంలో మంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. వీటిలో కొన్ని కంపెనీలకు గత మూడు ఆర్థిక సంవత్సరాలుగా పన్ను బకాయిలు ఉన్నాయని, ఆయా కంపెనీలపై తగిన చర్యలు ఆదాయపు పన్ను శాఖ సిద్ధమవుతోందని ఆర్థికశాఖ సహాయమంతిర జయంత్ సిన్హా తెలిపారు. ⇒ కాగా మరో ప్రశ్నకు సిన్హా సమాధానం చెబుతూ, ప్రభుత్వ రంగ బ్యాంకులకు అవసరమైన మూలధన మద్దతు కేంద్రం అందిస్తుందని వివరించారు. మార్కెట్ నుంచి సైతం నిధుల సమీకరణకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ⇒ 2012 నుంచి రక్షణ రంగంలోకి దాదాపు 13 లక్షల డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లు రక్షణశాఖ సహాయమంత్రి రావు లలిత్జిత్ సింగ్ ఒక లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు. -
పీఎస్యూ బ్యాంక్ చీఫ్లతో 12న జైట్లీ భేటీ
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ(పీఎస్యూ) బ్యాంకుల అధిపతులతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ నెల 12న సమావేశం కానున్నారు. ప్రధానంగా బ్యాంకుల వార్షిక పనితీరు, మొండిబకాయిల పరిస్థితిపై ఈ భేటీలో చర్చించనున్నారు. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) తాజా పాలసీ సమీక్షలో రెపో రేటును పావు శాతం తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులు కూడా వృద్ధికి ఊతమిచ్చేవిధంగా రుణ రేట్ల కోతపై దృష్టిపెట్టాలని కూడా ఆయన దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే పలు బ్యాంకులు బేస్ రేటును తగ్గించగా, మరికొన్ని ఈ బాటలోనే ఉన్నాయి. పీఎస్యూ బ్యాంకులతో పాటు నాబార్డ్, ఎన్హెచ్బీ తదితర ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల చీఫ్లు కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు. కాగా, జన ధన యోజన, ప్రధాన మంత్రి సామాజిక భద్రత పథకాల పురోగతి, రుణ వృద్ధి వంటి అంశాలను కూడా సమావేశంలో సమీక్షించనున్నారు. -
మద్దతు 26,550- నిరోధం 27,280
మార్కెట్ పంచాంగం రిజర్వుబ్యాంక్ వడ్డీ రేట్లను పావుశాతం మాత్రమే తగ్గించడంతో గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన అంచనాలకు అనుగుణంగా బ్యాంక్ నిఫ్టీలో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ జరిగింది. దాంతో ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీల (3.8 శాతం) కన్నా, బ్యాంక్ నిఫ్టీ (5.8 శాతం) అధికంగా క్షీణించింది. 2016 మార్చికి ద్రవ్యోల్బణం అంచనాల్ని 6 శాతానికి పెంచుతూ, ఇకపై రేట్ల తగ్గింపు వుండదంటూ ఆర్బీఐ గవర్నర్ రాజన్ చెప్పడంతో మార్కెట్లో పతనం వేగంగా జరిగింది. అయితే వారాంతంలో రాజన్ తన మాటల్ని సవరించుకుని, రేట్ల కోతకు ద్వారాలు మూసుకుపోలేదంటూ మార్కెట్ను శాంతపర్చే ప్రయత్నం చేశారు. అలాగే వర్షాభావ పరిస్థితుల్ని ముందస్తు అంచనాల్లో ప్రకటించిన వాతావరణ శాఖ రుతుపవనాల కదలికలు తొలి రెండురోజుల్లో ఆశావహంగా వున్నట్లు తెలిపింది. రాజన్, వాతావరణ శాఖల మలి ప్రకటనలు రెండూ ఈ వారం మార్కెట్లో ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీని తీసుకువచ్చే చాన్స్ వుంది. అయితే గత శుక్రవారం అమెరికా జాబ్స్ డేటా పటిష్టంగా వున్నందున, ఆ దేశపు కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలు బలపడ్డాయి. ఈ అంచనాలు మార్కెట్లో క్షీణతను కొనసాగించే ప్రమాదమూ వుంది. ఇక సూచీల సాంకేతికాంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... జూన్ 5తో ముగిసిన వారంలో 27,959 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 26,552 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 1,060 పాయింట్ల నష్టంతో 26,768 వద్ద ముగిసింది. గత వారపు కనిష్టస్థాయి అయిన 26,550 పాయింట్ల స్థాయి ఈ వారం సెన్సెక్స్కు తొలి మద్దతు అందించవచ్చు. ఈ మద్దతును కోల్పోయి, ముగిస్తే మే నెల కనిష్టస్థాయి 26,424 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ స్థాయిని కూడా కోల్పోతే 26,250 పాయింట్ల స్థాయికి క్షీణించవచ్చు. ఈ వారం రెండో మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగితే 27,280 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. రానున్న రోజుల్లో ఈ స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో దాటితే మార్కెట్లో డౌన్ట్రెండ్ ముగిసి, 27,470 స్థాయికి ర్యాలీ జరగవచ్చు. ఆపైన సెన్సెక్స్ సాంకేతిక లక్ష్యం 27,950 పాయింట్లు. నిఫ్టీ మద్దతు 8,050-నిరోధం 8,240 ఆర్బీఐ పాలసీ సమీక్ష తర్వాత వేగంగా క్షీణించిన ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన 8,050 పాయింట్ల స్థాయికి పడిపోయింది. చివరకు 319 పాయింట్ల నష్టంతో 8,115 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా జాబ్స్ డేటా ప్రభావంతో ఈ సోమవారం గ్యాప్డౌన్తో ప్రారంభమైతే మరోదఫా 8,050 స్థాయి నిఫ్టీకి మద్దతునివ్వవచ్చు. ఈ స్థాయిని కోల్పోయి, ముగిస్తే 7,990 పాయింట్ల స్థాయికి తగ్గవచ్చు. ఆ లోపున మరో ముఖ్యమైన మద్దతు 7,960 పాయింట్లు. ఈ వారం రెండో మద్దతును పరిరక్షించుకోగలిగితే 8,240 పాయింట్ల అవరోధస్థాయికి నిఫ్టీ పెరగవచ్చు. ఆపైన స్థిరపడితే 8,305 పాయింట్ల స్థాయిని అందుకోవచ్చు. తదుపరి అవరోధ స్థాయిలు 8,380, 8,450 పాయింట్లు. -
ఆర్బీఐలో ఐటీ అనుబంధ సంస్థ!
బెనాలిమ్(గోవా): సైబర్ నేరాలు అంతకంతకూ తీవ్రతరమవుతున్న నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలో ఈ సవాళ్లను ఎదుర్కోవడంపై రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) దృష్టిసారించింది. ఈ చర్యల్లో భాగంగా ప్రత్యేకంగా ఐటీ అనుబంధ సంస్థ(సబ్సిడరీ)ను ఏర్పాటు చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. గురువారమిక్కడ జరిగిన ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సైబర్ సెక్యూరిటీ విషయంలో అనేక సవాళ్లు పొంచిఉన్నాయి. బ్యాకింగ్ రంగంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పర్యవేక్షణ కోసం ఒక ఐటీ సబ్సిడరీపై దృష్టిపెట్టాలని బోర్డు సిఫార్సు చేసింది. బ్యాంకింగ్కు సంబంధించి ఐటీ విధానాలు, సామర్థ్యాల పెంపునకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది’ అని రాజన్ పేర్కొన్నారు. ఫైనాన్షియల్ సేవల రంగంలో ఆన్లైన్ మోసాలు తీవ్రమవుతున్నాయని.. చివరికి ఆర్బీఐ లోగోలతో ఈ-మెయిల్స్ పంపి ప్రజలను మోసగిస్తున్న సైబర్ నేరగాళ్లు కూడా ఉన్నారంటూ గవర్నర్ తాజా ఉదంతాలను ప్రస్తావించారు. -
పశ్చిమాసియా, లిక్విడిటీలపై దృష్టి..
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, నగదు లభ్యత (లిక్విడిటీ), విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు ఈ వారం మార్కెట్ ట్రెండ్ను నిర్దేశించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. సెలవుల కారణంగా మూడురోజులకే ట్రేడింగ్ పరిమితమయ్యే ఈ వారంలో బ్యాంకుల వద్ద లిక్విడిటీ కొరత ఏర్పడవచ్చని వారు అంచనావేశారు. ఏప్రిల్ 2న మహావీర్ జయంతి, 3న గుడ్ఫ్రైడేల కారణంగా మార్కెట్కు సెలవు. సాధారణంగా మార్చి నెలాఖర్లో పన్ను చెల్లింపులతో నగదు లభ్యత కొరవడుతుందని, మనీ మార్కెట్లో (స్వల్పకాలానికి బ్యాంకులు నగదును ఇచ్చిపుచ్చుకునే మార్కెట్) వడ్డీ రేట్లు బాగా పెరిగిపోతాయని విశ్లేషకులు చెప్పారు. లిక్విడిటీ పరిస్థితిని గమనిస్తున్నామని, అవసరమైతే వ్యవస్థలోకి నగదును ప్రవేశపెడతామని మరోవైపు రిజర్వుబ్యాంక్ హామీ ఇచ్చింది. బీఎస్ఈ సెన్సెక్స్ కీలకమైన 28,000 పాయింట్ల స్థాయిని కోల్పోయినందున ఈ వారం షేర్లపై అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుందని, ట్రేడింగ్ పరిమాణం తక్కువగా వుంటుందని బ్రోకర్లు చెప్పారు. ప్రస్తుత దేశీయ, అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా మార్కెట్లో లబ్ధిపొందడం ఇన్వెస్టర్లకు, ప్రత్యేకించి డే ట్రేడర్లకు అంత సులభంకాదని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మంగ్లిక్ అన్నారు. అయితే నిఫ్టీ కీలకమైన 8,300 మద్దతు స్థాయి వద్ద వున్నందున, రానున్న సెషన్లలో చిన్న టెక్నికల్ ర్యాలీ వుండవచ్చనేది ఆయన అంచనా. కానీ పెరుగుదల ఇండెక్స్ ఆధారిత పెద్ద షేర్లు, ప్రధానమైన మిడ్క్యాప్ షేర్లకు మాత్రమే పరిమితం కావొచ్చని ఆయన పేర్కొన్నారు. యెమెన్లో సౌదీ మిలటరీ దాడుల్ని ప్రారంభించినందున, మధ్య ఆసియాలో ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుతున్నాయని, ఈ ధరల తీరుపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టవచ్చని నిపుణులు చెప్పారు. దేశీయంగా మార్కెట్ను కదిల్చే పెద్ద వార్తలేవీ వెలువడే అవకాశం లేనందున, అంతర్జాతీయ అంశాలే ట్రెండ్ను నిర్దేశిస్తాయన్నారు. కార్పొరేట్ల మార్చి త్రైమాసిక ఫలితాలు కూడా బలహీనంగా ఉంటాయని కొటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దీపేన్ షా అంచనాల్లో పేర్కొన్నారు. ఇక ఈ వారం ఫిబ్రవరి నెలకు ప్రధాన మౌలిక పరిశ్రమల వృద్ధి గణాంకాలు, ద్రవ్యలోటు డేటా వెలువడనున్నాయి. రూ. 79,000 కోట్లకువిదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు న్యూఢిల్లీ: ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) రూ. 20,000 కోట్ల వరకూ దేశీ మార్కెట్లో పెట్టుబడి చేయడంతో ఈ ఏడాది వారి పెట్టుబడులు రూ. 79,000 కోట్లకు (1275 కోట్ల డాలర్లు) చేరాయి. మార్చి 2-27 మధ్య ఎఫ్ఐఐలు ఈక్విటీ మార్కెట్లో రూ. 11,813 కోట్లు పెట్టుబడిచేయగా, రూ. 8,912 కోట్ల విలువైన రుణపత్రాల్ని నికరంగా కొనుగోలుచేశారు. బీమా, మైనింగ్ బిల్లులకు పార్లమెంటు ఆమోదం, గార్ పన్ను విధానాన్ని సమీక్షిస్తామన్న హామీలతో విదేశీ పెట్టుబడుల ప్రవాహం మరింత పెరగవచ్చనేది విశ్లేషకులు అంచనా. -
తనిఖీ నివేదికలను ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు ఇవ్వలేం
న్యాయపరమైన చిక్కులే కారణం: ఆర్బీఐ న్యూఢిల్లీ: మనీలాండరింగ్ ఇతరత్రా నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై బ్యాంకుల్లో జరిపిన తనిఖీ నివేదికలను ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) నిరాకరించింది. కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు ఈ విషయాన్ని పేర్కొన్నాయి. సమాచారాన్ని పంచుకోవడం వల్ల న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయన్నది ఆర్బీఐ వాదన. అయితే, నల్లధనం, ఇతర ఆర్థికపరమైన నేరాలకు అడ్డుకట్టవేయాలంటే నో యువర్ కస్టమర్(కేవైసీ), మనీలాండరింగ్ నిరోధ చట్టం(పీఎంఎల్ఏ) నిబంధనల ఉల్లంఘనలపైనే అధికంగా దృష్టిపెట్టాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అంటోంది. సెంట్రల్ ఎకనమిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో(సీఈఐబీ)కు ఫెమా ఉల్లంఘనల వివరాలను ఇచ్చేందుకు ఆర్బీఐ గతంలో హామీనిచ్చిందని.. ఇప్పుడు సమాచారం ఇవ్వడానికి ముందుకురావడం లేదని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ)... తనకు అవసరమైన సమాచారాన్ని సీఈఐబీ నుంచే తీసుకుంటుంది. బ్యాంకుల్లో తనిఖీ నివేదికలను ఆర్బీఐ తమతో పంచుకోవడం లేదన్న విషయాన్ని తాజాగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగిన ఎకనమిక్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్(ఈఐసీ) సమావేశంలో చర్చించినట్లు సమాచారం. సీఈఐబీ చీఫ్ ఈ విషయాన్ని జైట్లీ దృష్టికి తీసుకెళ్లారు. సీఈఐబీ అనేది చట్టపరమైన సంస్థ కాదని.. తనికీ నివేదికలను ఇవ్వడంవల్ల న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయని ఆర్బీఐ చెబుతోందని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా, ఆదాయపు పన్ను(ఐటీ) విభాగానికి కూడా ఆర్బీఐ నుంచి తగిన సహకారం అందడం లేదని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఈ సమావేశంలో ప్రస్తావించడం గమనార్హం. కేైవైసీ నిబంధనలను ఉల్లంఘించిన బ్యాంకులపై ఆర్బీఐ విధించిన జరిమానాలకు సంబంధించి ఐటీ శాఖకు వివరాలు ఇచ్చేందుకు ఆర్బీఐ నిరాకరించడాన్ని సీబీడీటీ ఈ సందర్భంగా పేర్కొంది. అయితే, ఈ సమాచారం ఇవ్వడం అనేది తమ నిబంధనలకు విరుద్ధమని ఆర్బీఐ తేల్చిచెప్పింది. -
సీడీ రేషియో.. మూడు, నాలుగు స్థానాల్లో ఏపీ, తెలంగాణ
ముంబై: క్రెడిట్-డిపాజిట్ల రేషియో(సీడీ)లో ఆంధ్రప్రదేశ్ 109 శాతంతో మూడో స్థానంలో, 106 శాతంతో తెలంగాణ నాల్గో స్థానంలో ఉన్నాయి. సీడీ రేషియోలో 121 శాతంతో తమిళనాడు అగ్ర స్థానంలో, 114.9 శాతంతో చండీగఢ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. బ్యాంకులు సేకరించిన డిపాజిట్లతో పోలిస్తే అవి ఇచ్చిన రుణాల నిష్పత్తి శాతాన్నే సీడీ రేషియోగా వ్యవహరిస్తారు. క్యూ3లో 10%కి తగ్గిన బ్యాంకు పరపతి వృద్ధి రిజర్వు బ్యాంకు సమాచారం ప్రకారం క్యూ3లో బ్యాంకు పరపతి వృద్ధి 10 శాతానికి తగ్గింది. ఇది గతేడాది అదే త్రైమాసికంలో 14.2 శాతంగా నమోదైంది. అలాగే మొత్తం డిపాజిట్లలో వృద్ధి గతేడాది 15.4 శాతంగా ఉంటే, ఈ ఏడాది వృద్ధి మాత్రం 10.9 శాతంగా ఉంది. సమాజంలోని అన్ని వర్గాలలో బ్యాంకు పరపతి, డిపాజిట్ల సంఖ్య తగ్గింపు కనిపించిందని ఆర్బీఐ పేర్కొంది. డిపాజిట్లలో 73.3 శాతాన్ని, పరపతిలో 71.2 శాతాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిగి ఉన్నాయని తెలిపింది. అలాగే డిపాజిట్లలో ప్రైవేట్ బ్యాంకుల శాతం 19.2గా, పరపతిలో 21 శాతంగా ఉందని పేర్కొంది. మెట్రోపాలిటన్ నగరాల్లో డిపాజిట్ల సంఖ్య 53.1 శాతంగా, పరపతి 64.2 శాతంగా ఉందని తెలిపింది. ఈ నగరాల్లో క్రెడిట్- డిపాజిట్ల రేషియో అత్యధికంగా 92.3% ఉందని పేర్కొంది. దేశవ్యాప్తంగా సీడీ రేషియో 76%గా ఉంది. -
బడ్జెట్ రికార్డులు
స్వతంత్ర భారతావనిలో తొలిసారిగా బడ్జెట్ను ప్రవేశపెట్టిన మంత్రి ఆర్కే షణ్ముగంశెట్టి. 1947-49 మధ్య బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆయన నెహ్రూతో విభేదాల కారణంగా పదవి నుంచి వైదొలిగారు. 1951-52లో రిజర్వు బ్యాంకు గవర్నర్ సీడీ దేశ్ముఖ్ తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రిగా కొనసాగుతూ పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. 1958-59లో ఆర్థికశాఖను కూడా పర్యవేక్షించిన ఆయన ఈ రికార్డు సాధించారు. ఆ తర్వాత ఇదే బాటలో ఇందిరాగాంధీ 1970లో, రాజీవ్ 1987లో ప్రధానులుగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా బడ్జెట్లు ప్రవేశపెట్టి అనంతర కాలంలో రాష్ట్రపతి పదవిని అధిష్టించినవారు ఇద్దరున్నారు. 1980-82 మధ్య ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆర్.వెంకట్రామన్, 1974-75లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా, ఆ తర్వాత 1982-84 మధ్య, 2009-12 మధ్య ఆర్థిక మంత్రిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవిని చేపట్టారు. 1991-92లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆ ఏడాది తుది, తాత్కాలిక బడ్జెట్లను రెండు పార్టీలకు చెందిన, వేర్వేరు ఆర్థిక మంత్రులు ప్రవేశపెట్టడం గమనార్హం. తాత్కాలిక బడ్జెట్ను బీజేపీ నేత యశ్వంత్సిన్హా, తుది బడ్జెట్ను మన్మోహన్సింగ్ ప్రవేశపెట్టారు. అతి తక్కువకాలం కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన రికార్డు బీజేపీ నేత జశ్వంత్సింగ్ పేరిట ఉంది. ఆయన కేవలం 13 రోజుల పాటే కొనసాగారు. పరీక్ష పేపర్లే కాదు.. బడ్జెట్ కూడా లీకయింది. కానీ అది 1950లో. అప్పట్లో బడ్జెట్ పత్రాలను రాష్ట్రపతిభవన్లో ముద్రించేవారు. ఆ తర్వాత మింటో రోడ్లోకి మార్చారు. మోరార్జీ దేశాయ్ అత్యధికంగా పది సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత సంపాదించుకున్నారు. దేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక మహిళా ఆర్థిక మంత్రిగా ఇందిరా గాంధీ రికార్డు సృష్టించారు. -
‘జనధన’కు ఆర్బీఐ బూస్ట్
ముంబై: జన్ధన్ యోజన కింద రూ.5,000 వరకూ బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్... ప్రాధాన్యతా రంగానికి రుణంగా పరిగణించడం జరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) బుధవారం ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ పథకం కింద ప్రారంభమైన బ్యాంక్ అకౌంట్లకు రూ.5,000 వరకూ ఓవర్డ్రాఫ్ట్గా ఇవ్వాలన్నది కేంద్ర విధానం. బలహీన వర్గాలు, నిర్దిష్టంగా ప్రకటించిన కొన్ని కీలక రంగాలకు బ్యాంకులు ఇచ్చే రుణాలను ప్రాధాన్యతా రుణాలుగా పేర్కొంటారు.తప్పనిసరిగా ఆయా రంగాలకు బ్యాంకుల్లో నిర్దిష్ట మొత్తాలను కేటాయించాల్సి ఉంటుంది. తక్కువ రుణ రేటూ దీని ప్రత్యేకత. ఆధార్కు అనుసంధానమై, ఆరు నెలలపాటు సంతృప్తికరమైన స్థాయి లో అకౌంట్ నిర్వహణ ఉన్న జన్ధన్ అకౌంట్లకు ఓవర్డ్రాఫ్ట్ సౌలభ్యం వర్తిస్తుంది. గత ఏడాది ఆగస్టులో ప్రధాని నరేంద్రమోదీ జన్ధన్ యోజనను ప్రారంభించారు. జనవరి 31నాటికి ఈ పథకం కింద 12.54 కోట్ల అకౌంట్లు ప్రారంభమయ్యాయి. -
గుజరాత్కు పెట్టుబడుల వెల్లువ!
వైబ్రంట్ గుజరాత్ సదస్సులో కార్పొరేట్ల క్యూ ⇒ రూ. లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంట్ను ప్రకటించిన ⇒ రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ⇒ ఆదిత్య బిర్లా రూ.20,000 కోట్ల పెట్టుబడులు... ⇒ జాబితాలో విదేశీ కార్పొరేట్ దిగ్గజాలు కూడా.. గాంధీనగర్: గుజరాత్కు పెట్టుబడులు పోటెత్తనున్నాయి. ఆదివారం ఇక్కడ ప్రధాని మోదీ ప్రారంభించిన ఏడో వైబ్రంట్ గుజరాత్ సదస్సు(వీజీఎస్)లో దేశ, విదేశాలకు చెందిన కార్పొరేట్ దిగ్గజాలు పోటాపోటీగా భారీ పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించారు. ఈ మూడు రోజుల సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి పారిశ్రామికవేత్తలు, కంపెనీల అధిపతులు, వివిధ దేశాల నేతలు హాజరయ్యారు. గుజరాత్ సీఎంగా మోదీ హయాంలో 2003లో తొలిసారిగా ఆరంభించిన వీజీఎస్ అప్పటినుంచీ ప్రతి రెండేళ్లకోసారి జరుగుతూ వస్తోంది. కాగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, తీవ్ర ఒడిదుడుకులు ఆందోళన కలిగిస్తున్నాయని మోదీ ఈ సదస్సులో మాట్లాడుతూ చెప్పారు. స్థిరమైన, సమ్మిళిత ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. భారత్తో కలిసికట్టుగా సాగేందుకు ప్రపంచంలో అనేక దేశాలు ముందుకొస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. ముకేశ్ అంబానీ జోష్... వీజీఎస్ ప్రారంభం రోజే రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ రూ. లక్ష కోట్ల భారీ పెట్టుబడులను గుజరాత్లో వెచ్చించనున్నట్లు ప్రకటించారు. రానున్న 12-18 నెలల కాలంలో తమ గ్రూప్లోని పలు వ్యాపార విభాగాల్లో ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రధాని మోదీ సారథ్యంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించనుందని ముకేశ్ చెప్పారు. పెట్రోకెమికల్ ప్లాంట్లలో సామర్థ్య విస్తరణ, 4జీ టెలికం బ్రాడ్బ్యాండ్ సేవల ప్రారంభంతోపాటు మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యకలాపాల్లో రిలయన్స్ తమవంతు సహకారాన్ని అందిస్తుందన్నారు. ఇప్పటిదాకా జరిగిన వీజీఎస్లన్నింటికీ తాను హాజరయ్యానన్న ముకేశ్... మోదీని ప్రపంచ నాయకుడిగా అభివర్ణించారు. భారత్కు ఆయన గర్వకారణమని వ్యాఖ్యానించారు. గుజరాత్కే ప్రాధాన్యం: బిర్లా కుమార మంగళం బిర్లా నేతృత్వంలోని ఆదిత్య బిర్లా గ్రూప్ కూడా వీజీఎస్ సందర్భంగా గుజరాత్లో రూ.20,000 కోట్ల విలువైన పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న సిమెంట్ ఇతరత్రా ప్లాంట్లలో ఉత్పత్తి సామర్థ్యాలను పెంచేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు బిర్లా తెలిపారు. గ్రూప్నకు గుజరాత్ అత్యంత ప్రాధాన్య పెట్టుబడుల గమ్యస్థానమని కూడా పేర్కొన్నారు. హాజరైన ఇతర కార్పొరేట్లలో అడాగ్ గ్రూప్ చీఫ్ అనిల్ అంబానీ, హిందూజా గ్రూప్నకు చెందిన శశి రూయా, భారతీ గ్రూప్ సునీల్ మిట్టల్, ఆది గోద్రెజ్, ఉదయ్ కొటక్, ఏఎం నాయక్, ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య, యాక్సిస్ బ్యాంక్ చీఫ్ శిఖా శర్మ, ఓఎన్జీసీ సీఎండీ డీకే షరాఫ్ తదితరులు ఉన్నారు. ఇక విదేశీ కంపెనీల విషయానికొస్తే.. ఆస్ట్రేలియా మైనింగ్ దిగ్గజం రియో టింటో గుజరాత్లోని వజ్రాలు సానబట్టే పరిశ్రమలో 30,000 కొత్త ఉద్యోగాల కల్పించనున్నట్లు వెల్లడించింది. అంత్యంత నమ్మకమైన వ్యాపార గమ్యంగా నిలుస్తున్న గుజరాత్తో మున్ముందు మరింతగా కలిసి పనిచేస్తామని కంపెనీ సీఈఓ శామ్ వాల్ష్ చెప్పారు. తమ కంపెనీ భారత్పై చాలా ఆశావహంగా ఉందని.. గడిచిన ఏడాది వ్యవధిలో 25 కోట్ల డాలర్లను ఇక్కడ వెచ్చించినట్లు మాస్టర్ కార్డ్ చీఫ్ అజయ్ బంగా వెల్లడించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టం కానుందని జపాన్ వాహన దిగ్గజం సుజుకీ చైర్మన్ ఒసాము సుజుకీ పేర్కొన్నారు. గుజరాత్లో నిర్మిస్తున్న తమ కొత్త ప్లాంట్ 2017కల్లా ఉత్పత్తికి సిద్ధమవుతుందన్నారు. ఈ ప్లాంట్కోసం రూ.4,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. మరిన్ని సంస్కరణలు అవసరం... వీజీఎస్లో పాల్గొన్న కార్పొరేట్ దిగ్గజాలు, నిపుణులు భారత్లో మరిన్ని ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టాలని సూచించారు. సమ్మిళిత ఆర్థికాభివృద్ధికి పన్నులు, సబ్సిడీల్లో కీలక సంస్కరణలు ఆవశ్యకమని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ పేర్కొన్నారు. గుజరాత్ సీఎంగా మోదీ అద్భుత పాలనను ఇప్పుడు భారత్వ్యాప్తంగా ఇన్వెస్టర్లు కోరుకుంటున్నారని మాస్టర్ కార్డ్ చీఫ్, అమెరికా-ఇండియా వ్యాపార మండలి చైర్మన్ అజయ్ బంగా చెప్పా రు. అమెరికా ఇన్వెస్టర్లు భారత్పై చాలా ఆసక్తిగా ఉన్నారని.. ఇరు దేశాల మధ్య వారధిగా వ్యహరించేందుకే ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. అదానీ హల్చల్.. అదానీ గ్రూప్నకు చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్, అమెరికా కంపెనీ సన్ ఎడిసన్ కలిపి గుజరాత్లో భారీ సోలార్(సౌర విద్యుత్) పార్క్ను నెలకొల్పనున్నాయి. ఇరు కంపెనీలు జాయింట్ వెంచర్(జేవీ)గా నిర్మించే ఈ సోలార్ పార్కు కోసం రూ.25,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వైబ్రంట్ అదానీ గ్రూప్ ఒక ప్రకటనలో పేర్కొంది. సుమారు 20,000 ఉద్యోగాలను ఇది కల్పించనుందని కూడా తెలిపింది. అదానీ గ్రూప్తో జట్టుకట్టడం ద్వారా భారత్లోనే అతిపెద్ద ఫోటోవోల్టాయిక్(సోలార్) ప్యానల్స్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయనుండం తమకు గర్వకారణమని సన్ ఎడిసన్ సీఈఓ అహ్మద్ చాటిలా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ద్రవీకృత సహజవాయువు(ఎన్ఎన్జీ) దిగుమతితోపాటు చమురు-గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తిలో సహకారం కోసం ఆస్ట్రేలియా ఇంధన దిగ్గజం ఉడ్సైడ్ ఎనర్జీతో అదానీ ఎంటర్ప్రైజెస్ భాగస్వామ్య ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఉడ్సైడ్ ఎనర్జీ సీఈఓ పీటర్ కోల్మన్ సంతకాలు చేశారు. మోదీతో అదానీకి సన్నిహిత సంబంధాలున్న సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వెలుగురేఖ భారత్: కిమ్ గాంధీనగర్: మందగమనంలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒక వెలుగురేఖగా నిలుస్తోందని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ పేర్కొన్నారు. ఆదివారమిక్కడ మొదలైన వైబ్రంట్ గుజరాత్ సదస్సులో మాట్లాడుతూ... ఈ ఏడాది(2015)లో ఇండియా వృద్ది రేటు 6.4 శాతానికి పుంజుకోవచ్చని అంచనా వేశారు. వచ్చే ఏడాది ఈ జోరు మరింత పెరగనుందని కూడా చెప్పారు. అయితే, కుల పరమైన పక్షపాత ధోరణలు, ఇతరత్రా అంశాలు ప్రగతికి అడ్డంకిగా నిలుస్తాయని ఆయన హెచ్చరించారు. దేశ ఆర్థిక ఫలాలను ప్రజలందరికీ పంచే విధంగా ప్రధాని మోదీ పలు పథకాలపై దృష్టిపెట్టారని... దీనివల్ల వృద్ధి రేటు కూడా పుంజుకోవడానికి దోహదపడుతుందని కిమ్ అభిప్రాయపడ్డారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో 5 శాతం దిగువకు పడిపోయిన వృద్ధి రేటు ప్రస్తుత 2014-15 సంవత్సరంలో కొంత మెరుగుపడిన(క్యూ1లో 5.7%, క్యూ2లో 5.3%) సంగతి తెలిసిందే. ఈ ఏడాది 7 శాతం వృద్ధి: పీడబ్ల్యూసీ నిర్మాణాత్మక సంస్కరణల నేపథ్యంలో భారత్లో ఈ ఏడాది(2015) వృద్ధి రేటు 7 శాతాన్ని అందుకోవచ్చని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ అంచనా వేసింది. ముడి చమురు ధరల భారీ క్షీణత స్వల్పకాలంలో జీడీపీకి చేయూతనిస్తాయని అభిప్రాయపడింది. మరోపక్క, చైనాలో వృద్ధి రేటు మందగించొచ్చని పేర్కొంది. కాగా, పెట్టుబడులు ఇంకా పుంజుకోవాల్సిన నేపథ్యంలో 2014-15 ద్వితీయార్ధంలో(క్యూ3, క్యూ4) వృద్ధి రేటు కాస్త తగ్గే అవకాశం ఉందని హెచ్ఎస్బీసీ అంచనా వేసింది. అయితే, సంస్కరణలను వేగంగా అమలు చేయడం, ముడిచమురు దరల తగ్గుముఖం... వృద్ధికి చేయూతనిస్తాయని హెచ్ఎస్బీసీ తెలిపింది. -
కరెన్సీ నోట్ల మార్పిడికి గడువు పొడిగింపు...
2005 ముందునాటి నోట్లపై జూన్ 30 తాజా డెడ్లైన్ ముంబై: 2005కు పూర్వం ముద్రించిన కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు ఉద్దేశించిన గడువును రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) వచ్చే ఏడాది జూన్ 30 దాకా పొడిగించింది. వాస్తవానికి ఇది జనవరి 1తో ముగిసిపోవాల్సి ఉంది. రూ.500, రూ.1,000 సహా వివిధ మారకం విలువల కరెన్సీ నోట్లను జూన్ 30 దాకా పూర్తి విలువకు మార్పిడి చేసుకోవచ్చని ఆర్బీఐ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. పాత కరెన్సీ నోట్లను చలామణీలో నుంచి ఉపసంహరించే దిశగా వాటిని బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయడంగానీ అందుబాటులో ఉన్న బ్యాంకుల శాఖల్లో గానీ ప్రజలు మార్చుకోవచ్చని ఆర్బీఐ సూచించిన సంగతి తెలిసిందే. ఈ రకంగా సింహ భాగం పాత నోట్లను ఇప్పటికే చలామణీలో నుంచి ఉపసంహరించినట్లు ఆర్బీఐ తెలిపింది. అదనపు భద్రతా ఫీచర్లతో ముద్రిస్తున్న మహాత్మా గాంధీ సిరీస్ నోట్లు దాదాపు దశాబ్దం నుంచి చలామణీలో ఉండటం వల్ల పాత నోట్ల ఉపసంహరణతో ప్రజలు ఇబ్బందిపడకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించింది. ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షించడం కొనసాగిస్తామని ఆర్బీఐ పేర్కొంది. 2005కి పూర్వం నోట్లకు వెనుకవైపున వాటిని ముద్రించిన సంవత్సరం ఉండదు. నకిలీ కరెన్సీకి చెక్ చెప్పే ఉద్దేశంతో ఆ తర్వాత నుంచి అదనపు భద్రతా ప్రమాణాలు జోడించడంతోపాటు ముద్రణ సంవత్సరాన్నీ నోట్లపై ముద్రిస్తున్నారు. పాత నోట్ల ఉపసంహరణ ప్రక్రియ మొదలు పెట్టాక రూ. 52,855 కోట్ల విలువ చేసే 144.66 కోట్ల నోట్లను ఆర్బీఐ ధ్వంసం చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఇందులో రూ.100 మారకం విలువగల నోట్లు 73.2 కోట్లు, రూ.500 నోట్లు 51.85 కోట్లు, రూ. 1,000 నోట్లు 19.61 కోట్లు ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయ్యాల్లో ధ్వంసం చేయడం జరిగింది. 2005కి పూర్వం ముద్రించిన సిరీస్ నోట్లను శాఖల్లో గానీ ఏటీఎంల ద్వారా గానీ, జారీ చేయొద్దంటూ ఇప్పటికే బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. ఈ చర్యలతో ప్రస్తు తం చెలామణీలో ఉన్న పాత నోట్ల సంఖ్య స్వల్పం గానే ఉంటుందని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. -
ఆంధ్రా బ్యాంక్ స్వచ్ఛ్ నోట్
రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు ఆంధ్రాబ్యాంక్ ‘స్వచ్ఛ్ నోట్ ’కరెన్సీ మేళాను నిర్వహించింది. చిరిగిపోరుున పాత కరెన్సీని తీసుకొని కొత్త నోట్లను అందించింది. ఈ మేళా కింద శనివారం హైదరాబాద్లోని 46 శాఖల్లో సువూరు రూ. 5 కోట్ల విలువైన కరెన్సీని మార్చినట్లు ఆంధ్రాబ్యాంక్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. సైఫాబాద్ శాఖలో ఏర్పాటు చేసిన మెగా ఎక్స్ఛేంజ్ మేళాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియ జనరల్ మేనేజర్ షెకావత్ ప్రారంభించారు. -
నకిలీ నోట్లను గుర్తించండిలా...
నకిలీ నోట్లతో సామాన్యులు పడుతున్న ఇబ్బంది అంతా ఇంతా కాదు. కష్టపడి సంపాదించిన డబ్బుల్లో నకిలీ నోట్లు ఉన్నాయని తెలిస్తే ఆందోళన తప్పదు. రిజర్వ్బ్యాంక్ 2011 లెక్కల ప్రకారం మన దగ్గర 64,577 మిలియన్ నోట్లను దొంగనోట్లుగా గుర్తించారు. మరి డబ్బులు తీసుకునే ముందు అవి నకిలీవా లేక అసలైనవా? తెలుసుకోవడం తప్పనిసరి. వాటిని ఎలా గుర్తించాలి. ఏ నోటును ఎలా పరీక్షించాలనే వివరాలు మీ కోసం... రూ.వెయ్యి, 500, 100, 50, 20ను గుర్తించాలంటే ఈ 10 అంశాలను పరిశీలించాలి 1. ఎడమవైపున మధ్యలో 1000 సంఖ్యలో ప్రతి అక్షరం సగం కనిపించి సగం కనపడకుండా ఉంటుంది. వెలుతురులో చూస్తే పూర్తిగా కనిపిస్తుంది. నోటును తిరగేసి చూస్తే రివర్స్లో సంఖ్య కనిపిస్తుంది. 2. దాని పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో గాంధీజీ ఫొటో వాటర్ మార్క్తో కనిపిస్తుంది. వాటర్ మార్క్కు పక్కన 1000 సంఖ్య నిలువుగా ఉంటుంది. దీన్ని కూడా వెలుతురుకు పెట్టి చూడాలి. 3. నోటును పైకీ కిందకు అంటుంటే మధ్యలో ఉన్న 1000 అక్షరాల రంగు మారుతుంది. గ్రీన్, బ్లూగా కనిపిస్తుంది. 4. కుడి వైపున పైన, ఎడమ వైపు కింద ఉన్న సిరీస్ నంబరు వెలుతురులో చూస్తే ప్రత్యేకంగా కనిపిస్తుంది. 5. మధ్యలో ఉన్న థ్రెడ్(దారం)పై భారత్, ఆర్బిఐ, 1000 అక్షరాలు కనిపిస్తాయి. నోట్ను పైకీకిందకు అంటుంటే మధ్యలో థ్రెడ్ బ్లూ, గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. 6. దానికిందే ఉన్న హిందీ అక్షరాలు, అలానే పైన నోటుకు మధ్యలో ఉన్న హిందీ, ఇంగ్లిష్ అక్షరాలు ముట్టుకుంటే చేతికి తగిలిన భావన కలుగుతుంది. 7. నోటుకు కుడి వైపున చివరన 1000 సంఖ్యకు, రిజర్వ్ బ్యాంక్ ముద్రకు మధ్యలో లెటెంట్ ఇమేజ్. దీన్ని సూక్ష్మంగా పరిశీలిస్తేనే కనిపిస్తుంది. నోటును దగ్గరగా పెట్టుకుని చూస్తేనేఇది కనిపిస్తుంది. 8. ఇమేజ్ ఎడమ వైపున, గాంధీజీ ఫొటోకు మధ్యలో ఉన్న ఖాళీలో సూక్ష్మ పరిశీలన చేస్తే ఆర్బిఐ, 1000 అక్షరాలు కనిపిస్తాయి. 9. ఎడమ వైపు చివర మధ్యలో డైమండ్ ఆకారంలో గుర్తు ఉంటుంది. దీన్ని చేతితో తడుముతుంటే ముట్టుకున్న ఫీలింగ్ కలుగుతుంది. 10. నోటు వెనుక వైపు మధ్యలో సంవత్సరం ముద్రించి ఉంటుంది. రూ.10 నోట్ ఈ విధంగా... రూ. పది నోటుకు ఏడు అంశాలు పరిశీలించాలి. పైన పేర్కొన్న వాటిలో స్పెషల్ ఐడెంటిఫికేషన్ మార్క్, లెటెంట్ ఇమేజ్ ఉండదు. అక్షరాలు చేతితో తడిమితే ఎలాంటి భావన కలగవు. మిగిలినవన్నీ యథాతథం గమనిక: ప్రతి నోటుకు ఎడమ వైపు చివర మధ్యలో గుర్తులు మారుతుంటాయి. రూ.1000కి డైమండ్, రూ.500కు రౌండ్ చుక్క, రూ.వందకు త్రిభుజం, రూ.50కి బ్లాక్ గుర్తు, రూ. 20కి రెక్టాంగిల్ గుర్తు ఉంటుంది. రూ.10 నోటుకు ఎలాంటి గుర్తు ఉండదు. -
ఏటీఎం కార్డు వాడకంపై బాదుడుకు సిద్ధం!
హైదరాబాద్: ఏటీఎం కార్డు వినియోగదారులపై 'అదనపు చార్జీ' బాదుడుకు రంగం సిద్ధమైంది. ఏటీఎం కార్టును 5 సార్లు మించి వినియోగిస్తే 20 రూపాయల చార్జీని విధించనున్నారు. డబ్బులు విత్ డ్రా చేసినా.. లేదా బ్యాలెన్స్ ఎంక్వయిరీ చేసినా.. ఈ నిబంధన వర్తిస్తుంది. ఇతర బ్యాంక్ ఏటీఎంలో 3సార్లు మించి వాడితే 20 రూపాయలు కోత విధించే విధంగా రిజర్వు బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ సహా 6 మెట్రో నగరాల్లో శనివారం నుంచే అమల్లోకి రానుంది. -
రుణాలు చెల్లించొద్దు!
-
'జేమ్స్ బాండ్ 007 ఇమేజ్ అక్కర్లేదు'
ముంబై: తనకు జేమ్స్ బాండ్ 007 ఇమేజ్ అవసరం లేదని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్ బీఐ) గవర్నర్ రఘురాం రాజన్ స్పష్టం చేశారు. రిజర్వు బ్యాంక్ గవర్నర్ పదవి చేపట్టిన మిమ్మల్ని రాక్ స్టార్ గా, జేమ్స్ బాండ్ తో పోల్చిన విషయాన్ని ప్రస్తావించగా పై విధంగా స్పందించారు. గవర్నర్ పదవిని చేపట్టాక తన స్థాయికి తగ్గించుకునే నిర్ణయాలు తీసుకుంటున్నాను. ప్రజలకు భరోసా ఇచ్చే విధంగానే ఓ కేంద్ర ఉద్యోగి ప్రవర్తించాలి. నిర్ణయాలు తీసుకోవాలి అని రాజన్ అన్నారు. రిజర్వు బ్యాంక్ గవర్నర్ కు జేమ్స్ బాండ్ ఇమేజ్ ఉండకూడదని ఆయన తెలిపారు. ఓ ప్రధానికి సలహాదారుడిగా, ముఖ్య ఆర్ధిక సలహాదారుడిగా సేవలందించిన తాను 2008 నుంచి నివేదికల, ఆర్ధిక వ్యవస్థలను పరిశీలిస్తున్నానని ఆయన తెలిపారు. చాలా నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, అయితే నిర్ణయాలు తీసుకునేందుకు కొంత ఆలస్యం కావొచ్చన్నారు. అంతేకాకుండాతనకు జేమ్స్ బాండ్ ఇమేజ్ అవసరం లేదని.. ఓ బ్యాంకర్ గా తన విధులను సక్రమంగా నిర్వహించాననే సంతృప్తి చాలునని రఘురాం రాజన్ తెలిపారు. -
వచ్చే సంవత్సరం నుంచి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు
నకిలీ నోట్లను అరికట్టడానికి, కరెన్సీ నోట్ల జీవితకాలాన్ని పెంచడానికి వీలుగా వచ్చే సంవత్సరం నుంచి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లనుప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని రిజర్వు బ్యాంకు భావిస్తోంది. మధ్యవర్తుల వ్యవస్థను పూర్తిగా అరికట్టి, కొత్తగా జాతీయ బిల్లుల చెల్లింపు వ్యవస్థను ఏర్పాటుచేయాలని కూడా యోచిస్తోంది. కరెన్సీ నోట్ల జీవిత కాలాన్ని పెంచాలని రిజర్వు బ్యాంకు భావిస్తున్నట్లు బ్యాంకు వార్షిక నివేదికలో పేర్కొన్నారు. ప్లాస్టిక్ నోట్లపై కొన్నేళ్లుగా చర్చలు జరిగిన తర్వాత.. గత జనవరిలోనే రిజర్వు బ్యాంకు టెండర్లు పిలిచింది. ముందుగా చేసే ప్రయోగం విజయవంతం అయితే వచ్చే ఏడాదికల్లా విస్తృతంగా వీటిని ఉపయోగంలోకి తేవాలని అనుకుంటున్నారు. ప్లాస్లిక్ నోట్లు వచ్చేస్తున్నాయని, వంద కోట్ల నోట్లకు సంబంధించి టెండరు బిడ్లు వచ్చాయని , ముందుగా ఐదు నగరాల్లో ప్రయోగాత్మకంగా వీటిని ప్రవేశపెడతామని రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. ప్లాస్టిక్ నోట్ల మీద ఎలాంటి మరకలు పడవు, తొందరగా చిరిగిపోవు. ఇప్పటికే పలు దేశాల్లో పాలిమర్ కరెన్సీ నోట్లను ఉపయోగిస్తున్నారు. ఇవి ఇప్పుడున్న నోట్ల కంటే ఖరీదైనవే అయినా.. జీవితకాలం ఎక్కువ కావడంతో వీటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. విభిన్న వాతావరణ పరిస్థితులు ఉండే కొచ్చి, మైసూర్, జైపూర్, భువనేశ్వర్, సిమ్లా నగరాల్లో ముందుగా ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెడతారు. ముందుగా తక్కువ డినామినేషన్ ఉన్న నోట్లను తేవాలని యోచిస్తున్నారు. -
రైతు నెత్తిన పిడుగు
రుణాల రీషెడ్యూల్ కుదరదని తేల్చి చెప్పిన ఆర్బీఐ జిల్లాలో 2,10,881 రైతుల పరిస్థితి దయనీయం కొత్త రుణాలపై రైతులు ఆశలు వదులుకోవాల్సిందేనా! రిజర్వు బ్యాంకు ప్రకటన రైతు నెత్తిన పిడుగులా ఉంది. రుణాల రీషెడ్యూల్ కుదరదని కుండబద్దలుకొట్టింది. కేవలం కరువు మృడలాల్లోనే ఇందుకు అవకాశం ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీని ప్రకారం జిల్లా రైతులకు రీషెడ్యూల్ వర్తించే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా పరిస్థితి దయనీయంగా మారింది. విశాఖ రూరల్: రుణమాఫీ కాకపోయినా.. కనీసం రీషెడ్యూల్ జరిగితే బ్యాంకుల నుంచి కొత్త రుణాలు పొందవచ్చని జిల్లా రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ కరువు, వరదలు కారణంగా ఆహార ఉత్పత్తులు 50 శాతం కన్నా తక్కువగా వచ్చినప్పుడే వ్యవసాయ రుణాలు రీషెడ్యూల్కు నిబంధనలు వర్తిస్తాయంటూ ఆర్బీఐ స్పష్టం చేసింది. వాస్తవానికి గతేడాది కరువు, వరదలతో జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత ఖరీఫ్కు ముందు 30 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు నివేదికలు రూపొందించేలోగా వరుస తుపాన్లతో పరిస్థితులు తలకిందులయ్యాయి. నష్టం 50 శాతం కంటే ఎక్కువే! వాస్తవానికి గతే డాది కరువు, వరదలు కారణంగా జిల్లాలో 50 శాతం కంటే ఎక్కువగానే పంటల దెబ్బతిన్నాయి. గత సీజన్లో హెలెన్, పైలిన్ తుపాన్లతో పాటు, అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురిశాయి. పంటలన్నీ నీట మునిగాయి. 2013లో వచ్చిన వరదలు కారణంగా జిల్లాలో 13,341 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనాలు వేశారు. అంతకంటే అధికంగా నష్టం జరిగినప్పటికీ ప్రభుత్వ నిబంధనలు ప్రతిబంధకాలయ్యాయి. ఫలితంగా కేవలం 52,426 మంది రైతులకు రూ.12.25 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ లెక్కన కూడా 50 శాతం కూడా నష్టం జరిగినట్లు అధికారులు నివేదికలు ఇవ్వలేదు. అటు కరువు మండలాలు ప్రకటించే అవకాశం లేకపోవడం, ఇటు వరదలకు పంట నష్టం 50 శాతం చూపించపోవడం కారణంగా.. ఇప్పుడు రుణాల రీషెడ్యూల్కు అవకాశం లేకుండా పోయింది. కొత్త రుణాలు లేనట్లేనా? రుణాల రీషెడ్యూల్పై ఆర్బీఐ కచ్చితంగా చెప్పడంతో జిల్లా రైతులకు కొత్త రుణాలు అందే అవకాశం లేదని అధికారులే చెబుతున్నారు.ఈ సీజన్లో మొత్తం 2 లక్షల 304 మంది రైతులకు రూ.700 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో కొత్తవి కంటే రెన్యువల్స్ అధికంగా ఇవ్వాలని నిర్ధేశించారు. జిల్లాలో 58,211 మంది కొత్త వారికి రూ.250 కోట్లు రుణాలు ఇవ్వాలని భావిస్తుండగా, రెన్యువల్స్కు 1,42,093 మంది రైతులకు రూ.450 కోట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు రుణ మాఫీ ప్రకటించడంతో జిల్లాలో 10 శాతం మంది రైతులు కూడా రుణాలు చెల్లించలేదు. ఇప్పటి వరకు రుణ మాఫీ జరగకపోగా, రీషెడ్యూల్కు కూడా దారులు మూసుకుపోయాయి. జిల్లాలో గత నెల వరకు 1668 మంది రైతులకు రూ.3.03 కోట్లు మాత్రమే పంట రుణాలుగా అందించారు. కొత్త వారికి రుణ లక్ష్యం తక్కువగా నిర్దేశించడం.. రెన్యువల్స్కు కొత్త రుణాలు అందించే అవకాశాలు లేకపోవడంతో ఈ సీజన్లో రుణ లక్ష్యం చేరుకొనే అవకాశం కనిపించడం లేదు. -
ఆ ఆశా చెదిరింది
సాక్షి ప్రతినిధి, కాకినాడ :జిల్లా రైతుల చిట్ట చివరి ఆశలు కూడా ఆవిరైపోయాయి. వర్షాభావ పరిస్థితులతో సాగు ఆలస్యమైంది. పెట్టుబడి పెట్టాలంటే చేతిలో చిల్లిగవ్వ లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీ హామీపై ఆశలు పెంచుకుని రుణాలు చెల్లించలేదు. సర్కార్ రుణమాఫీకి సవాలక్ష షరతులు పెడుతోంది. మాఫీ మాటెలా ఉన్నా కనీసం రుణాల రీ షెడ్యూలైనా అవుతుందనుకుని రైతులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ప్రకటించిన కరువు మండలాల జాబితాలో జిల్లాలో కనీసం ఒక్క మండలానికి కూడా చోటు దక్కకపోవడంతో పంట రుణాల రీషెడ్యూల్కు అవకాశాలు అడుగంటాయి. ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీపై గంపెడాశలు పెట్టుకుని రైతులు ఓటేసి బాబును సీఎం చేశారు. అదే నమ్మకంతో స్తోమత ఉన్న రైతులు కూడా రుణాలు చెల్లించలేదు. బాబు చెబుతున్నట్టు ప్రతి రైతు కుటుంబానికీ లక్షన్నర మేర రుణ మాఫీ అనేది ఇప్పట్లో అమలయ్యేలా లేదు. కనీసం రీ షెడ్యూల్ అయితే రుణాల చెల్లింపునకు నాలుగైదేళ్ల వ్యవధి లభిస్తుందని రైతులు ఆశించారు. ఇందుకు బలమైన కారణం కూడా లేకపోలేదు. గత ఏడాది నవంబరు, డిసెంబరుల్లో సంభవించిన భారీ వర్షాలు, తుపాన్లతో జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాల్లో పంట నష్టపోయినట్టు అప్పట్లో జిల్లా యంత్రాంగమే లెక్క తేల్చింది. ఈ నష్టం జిల్లావ్యాప్తంగా 60 మండలాల్లో నమోదైందని రాష్ట్రప్రభుత్వానికి నివేదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుమారు 750 మండలాల్లో నష్టం సంభవించిందంటూ అప్పట్లో సర్కార్ ఇచ్చిన జాబితాలో మన జిల్లాలో 60 మండలాలున్నాయి. ఇదే విషయాన్ని రిజర్వుబ్యాంక్కు కూడా నివేదించినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. అప్పటి నివేదికలు అమలు చేయగలిగి ఉంటే జిల్లాలో రూ.1500 కోట్ల మేరకు రుణాలు రీషెడ్యూల్ అయ్యేవంటున్నారు. బాబు రుణమాఫీ హామీ అమలు కాకున్నా, రుణాల రీ షెడ్యూల్ జరిగి తీరుతుందని, దీని వల్ల కొంత వెసులుబాటు లభిస్తుందని ఖరీఫ్ రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ ఆర్బీఐ ప్రకటించిన 120 మండలాల జాబితాలో జిల్లాలో ఒక్క మండలానికీ చోటు దక్కకపోవడంతో వారు హతాశులయ్యారు. రీ షెడ్యూల్ అయితే పాతరుణాలు తక్షణం జమ చేయాల్సిన అవసరం లేకపోవడంతో పాటు ఎంత అప్పు ఉందో అంత మేరకు కొత్త రుణం పొందే అవకాశం ఉంటుందని నిరీక్షిస్తున్న రైతులను ఆర్బీఐ నిర్ణయం కుదేలు చేసింది. 10 శాతం కూడా జమ కాని బకాయిలు బాబు మాటలు నమ్మడంతో.. జిల్లా మొత్తమ్మీద రూ.6000 కోట్ల వ్యవసాయ రుణ బకాయిల్లో కనీసం 10 శాతం కూడా రైతులు జమ చేయలేదు. ఏదో క్షణాన మాఫీ అవుతుందని స్వల్పకాలిక, బంగారు రుణాలు తీసుకున్న సుమారు ఎనిమిది లక్షలమంది రైతులూ బ్యాంకుల వైపు కన్నెత్తి చూడలేదు. బాబు రుణమాఫీ ప్రకటన వెలువడ్డాక కొన్ని బ్యాంకులు నయానా, భయానో రూ.200 కోట్ల రుణాలు వసూలు చేయగలిగాయి. మిగిలిన వారు మాఫీపై నమ్మకంతో చెల్లించకుండా ఉండిపోయారు. తీరా ఇప్పుడు మాఫీపై గురి తప్పినా, రీ షెడ్యూల్ నమ్మకం వమ్మయినా రుణాలు జమ చేసే శక్తి వారికి ఎంత మాత్రం లేదు. పెట్టుబడికే చిల్లిగవ్వ లేక సతమతమవుతుంటే రుణాలు ఎలా చెల్లిస్తామంటున్న రైతులతో బ్యాంక్ల పరిస్థితీ సంకటంగానే ఉంది. అలాగని బకాయిలతో సంబంధం లేకుండా కొత్త రుణాలు ఇచ్చే ఆలోచనా కనిపించడం లేదు. ఇందుకు వారి కారణాలు వారికున్నాయి. జిల్లా వార్షిక రుణ ప్రణాళిక రూ.5,514.42 కోట్లు. ఇందులో ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు రూ.3,308.65 కోట్లు ఇవ్వాలని బ్యాంక్లు అనుకున్నాయి. రుణమాఫీ, రీషెడ్యూల్ హామీలతో వసూళ్లు నిలిచిపోయి జూలై నెలాఖరుకు రూ.515 కోట్లు మాత్రమే రుణాలు ఇచ్చాయి. ఇదే సమయానికి గత ఖరీఫ్ సీజన్లో రూ.2,232 కోట్ల రుణాలను రైతులకు ఇచ్చాయి .హామీలపై హామీలు గుప్పించి అధికారంలోకొచ్చిన బాబు ఇప్పుడు రుణమాఫీ, రీ షెడ్యూల్లలో ఏదీ నిర్దిష్టంగా అమలు చేయకుండా ద్రోహం చేశారని రైతులు మండిపడుతున్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకుంటే రుణాలు ఎప్పుడో చెల్లించేవారమని, ఎప్పటిలానే తిరిగి రుణపరపతి లభించేదని వాపోతున్నారు. రుణాలు అందకుండా చేసి, పెట్టుబడులకు చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితిలోకి నెట్టారని ఆక్రోశిస్తున్నారు. -
'బ్యాంకులు రుణమాఫీకి సానుకూలంగా లేవు'
ఏ బ్యాంకులూ రుణమాఫీకి సానుకూలంగా లేవని, పరపతి విధానం దెబ్బతింటున్న భావనతో బ్యాంకులు మాఫీని వ్యతిరేకిస్తున్నాయని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. వ్యవసాయ రుణాలను రీషెడ్యూల్ చేసేందుకు రిజర్వు బ్యాంకు వ్యతిరేకంగా ఉందని చెప్పారు. రుణాలు రీషెడ్యూల్ చేస్తే కాస్త వెసులుబాటు వస్తుందని భావించామని, అయితే ఇప్పటికీ రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని పుల్లారావు చెప్పారు. రుణమాఫీ అమలుకు రెండు నెలల సమయం పడుతుందని, ఈలోపు వనరుల సమీకరణపై తీవ్ర కసరత్తు చేస్తున్నామని తెలిపారు. బ్యాంకులకు రూ.45 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని, అయితే ఎఫ్ఆర్బీఎమ్ ప్రకారం 15 వేల కోట్లకు మించి రుణాలు తెచ్చుకోలేమని వివరించారు. ఎర్రచందనం అమ్మకం ద్వారా కూడా 2 వేల కోట్ల రూపాయలకు కు మించి ఆదాయం రాదని, ఇతర వనరుల కోసం కమిటీ కసరత్తు చేస్తోందని పుల్లారావు చెప్పారు. -
రుణమాఫీపై ప్రభుత్వం చేతులెత్తేసింది!
-
ఆర్బీఐ కోరిన సమాచారం పంపిన తెలంగాణ
* ఆగస్టు 13న ఎస్ఎల్బీసీ సమావేశం సాక్షి. హైదరాబాద్: రుణాల రీ షెడ్యూల్పై ఆర్బీఐ కోరిన సమాచారాన్ని తెలంగాణ ఆర్థికశాఖ అధికారులు మంగళవారం పంపించారు. 2013 ఖరీఫ్ సీజన్లో 50 శాతం పంట దిగుబడి తక్కువగా ఉన్న ప్రాంతాల వివరాలు ఇవ్వాలని, ఒకవేళ రుణాల రీ షెడ్యూల్ చేస్తే ప్రభుత్వం ఏ విధంగా ఆ నిధులను సర్దుబాటు చేస్తుందని, ఆదాయమార్గాలు ఏమిటని ఆర్బీఐ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. దీంతో పూర్తి వివరాలతో ప్రభుత్వం లేఖ రాసింది. పంట దిగుబడి సరాసరిని చూడొద్దని ఆర్థికశాఖ ఆర్బీఐని కోరింది. నిధుల సమీకరణలో భాగంగా.. భూముల విక్రయం, ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణ, పన్నుల వసూళ్లలో లోపాలను అధిగమించ డం, మొండిబకాయిల వసూళ్లు, ప్రభుత్వం పొదుపు చేసిన నిధులను బ్యాంకులకు చెల్లించడానికి వినియోగించనున్నట్టు ఆర్థికశాఖ అధికారులు రిజర్వ్బ్యాంకుకు వివరించనున్నారు. పంటల నూర్పిడి సమయంలో భారీవర్షాల కారణంగా రైతులు పంటలు పోయి తీవ్రంగా నష్టపోయారని ఆర్థికశాఖ వివరించింది. ఈ లేఖపై ఆర్బీఐ స్పందన ఎలా ఉంటుందో తెలియదు కాని, మంగళవారం రిజర్వ్బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ మీడియాతో మాట్లాడుతూ.. 50% తక్కువ దిగుబడి వస్తేనే రీ షెడ్యూల్ సాధ్యమని, ఆ విధంగా తక్కువ దిగుబడి వచ్చిన వాటి ప్రాంతాల గురించి సమాచారం ఇవ్వాలని ఆ ప్రభుత్వాలను కోరినట్టు తెలిపారు. కాగా తెలంగాణ రాష్ట్ర బ్యాంకర్ల సమావేశం ఈ నెల 13న నిర్వహించనున్నట్టు తెలిసింది. -
రుణాల రీషెడ్యూల్పై అధికారుల కసరత్తు
ఆర్బీఐ గవర్నర్తో చర్చల కోసం 4న ముంబైకి పయనం! హైదరాబాద్: తెలంగాణ రైతుల రుణాల రీ షెడ్యూల్కు సంబంధించి రిజర్వుబ్యాంకు (ఆర్బీఐ) అడిగిన సమాచారంతో పాటు, మరింత స్పష్టత ఇవ్వడానికి రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు సోమవారం ముంబై వెళ్లనున్నారు. వీరు రిజర్వుబ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ను కలిసి, రీ షెడ్యూల్పై రిజర్వ్బ్యాంకు నుంచి స్పష్టత తీసుకోనున్నారు. తెలంగాణలో 2013 ఖరీఫ్ రుణాలకు మాత్రమే రీ షెడ్యూల్ వర్తింప చేస్తామని రిజర్వ్బ్యాంకు ఇదివరకు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇదికూడా 337 మండలాల్లోని రైతులకు మాత్రమే వర్తిస్తుందని ఆర్బీఐ పేర్కొంది. బంగారం తాకట్టు రుణా లు, పాత బకాయిలకు సంబంధించి రీ షెడ్యూల్ చేయబోమని.. అది ప్రభుత్వమే చూసుకోవాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 78 మండలాలను రీ షెడ్యూల్ పరిధిలో చేర్చబోమని కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది. కాగా, 337 మండలాల్లో రీ షెడ్యూల్ చేసేచోట పంటల దిగుబడి ఎలా ఉందన్న సమాచారం కూడా ఇవ్వాలని ఆర్బీఐ ప్రభుత్వాన్ని కోరింది. ఇదిలా ఉండగా రుణాలు రీ షెడ్యూల్ చేసే మండలాల్లో రైతుల రుణాలు నాలుగైదు వేల కోట్లకు మించవని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్బీఐ రీ షెడ్యూల్ చేసినా.. చేయకపోయినా ప్రభుత్వం మాత్రం రుణ మాఫీతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. వాస్తవ ఆదాయం ఆధారంగా నిధులు ఇవ్వాలి 14వ ఆర్థిక సంఘం నిధులను వాస్తవ ఆదాయ ఆధారంగా కేటాయించాలని ఆర్థిక శాఖ కోరింది. వ్యాట్ రూపంలో హైదరాబాద్కు అధిక ఆదాయం వస్తోందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న వాదనలతో ఏకీభవించరాదని అధికారులు ఆర్థిక సంఘాన్ని కోరారు. తమకు వస్తున్న ఆదాయం ఆశించిన స్థాయిలో లేదని ఈ సందర్భంగా ఆర్థిక శాఖ సలహాదారు జీఆర్ రెడ్డి, ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావులు 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైవీరెడ్డిని కలిసి వివరించారు. -
చంద్రబాబుకు రిజర్వు బ్యాంక్ షాక్
గత ఏడాది ప్రకృతి వైపరీత్యం వల్ల పంటలు పండలేదని, అందుకే రుణాలను రీషెడ్యూలు చేయాలని రిజర్వు బ్యాంకును కోరిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిజర్వు బ్యాంకు తాజా లేఖ ఇబ్బందికరంగా పరిణమించింది. ఆంధ్రప్రదేశ్ అర్థ గణాంక శాఖ నుంచి సేకరించిన పంటల దిగుబడి వివరాల ఆధారంగా గత ఖరీఫ్లో పంటల దిగుబడి సాధారణం కంటే 50 శాతానికి తగ్గలేదని ఆర్బీఐ అంటోంది. కాబట్టి ప్రకృతి వైపరీత్యం ఉందని చెప్పలేమని రిజర్వు బ్యాంకు చెబుతోంది. అందుకే రుణాల రీ షెడ్యూల్కు అనుమతి సాధ్యం కాదని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ దీపావలి పంత్ జోషి లిఖితపూర్వకంగా స్పష్టంచేశారు. దీంతో గత ఖరీఫ్ రుణాలు రీ షెడ్యూల్ అయితే రుణ మాఫీపై కొంతకాలం నాన్చొచ్చన్న ఆలోచనలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఆర్బీఐకి ఏమి సమాధానమివ్వాలో తేల్చుకోలేకపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాలనే జోషి లేఖలో ఉటంకించడం వల్ల దాని వాదనను ఖండించలేని పరిస్థితి ఎదురైందని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. ఇక రుణాల రీ షెడ్యూల్కు దారులు మూసుకుపోయినట్లేనని వారు అంటున్నాయి. ఆర్బీఐ గవర్నర్తో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదని తెలిసింది. రుణ మాఫీ చేయకుండా కరవు, తుఫాను పేరుతో గత ఖరీఫ్ రైతు రుణాలను రీ షెడ్యూల్ చేసి చేతులు దులుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే అభిప్రాయం ఆర్బీఐ అధికారుల్లో గట్టిగా ఉందని అధికారులు భావిస్తున్నారు. -
పంట రుణాలు ఎలా చెల్లిస్తారు?
సమగ్ర ప్రణాళిక ఇవ్వాలని ఇరు రాష్ట్రాలకు ఆర్బీఐ లేఖ తర్వాతే రీషెడ్యూల్పై నిర్ణయమని స్పష్టీకరణ నిధులు ఎలా సమకూరుస్తారంటూ ఆరా సాక్షి, హైదరాబాద్: పంట రుణాలను రీషెడ్యూల్ చేసినప్పటికీ ఆ మొత్తాన్ని ఎలా తిరిగి చెల్లిస్తారో చెప్పాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను రిజర్వ్ బ్యాంక్ ప్రశ్నించింది. గడువు ముగిసిన తర్వాత రుణాలు చెల్లించేందుకు నిధులను ఎలా సమకూరుస్తారో తెలియజేయాలని కోరింది. అసలు రుణ మాఫీని అమలు చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం అనుసరించే ప్రణాళిక ఏమిటో వివరించిన తర్వాతే.. రీషెడ్యూల్ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పింది. లేనిపక్షంలో నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కారులకు ఆర్బీఐ లేఖ రాసింది. రాష్ర్టంలో తుపాను, కరువు ప్రభావిత మండలాల్లో ఉన్న ఖాతాల సంఖ్య, రుణాల మొత్తం, రీషెడ్యూల్ చేసిన రుణాలను ప్రభుత్వం తిరిగి చెల్లించే విధానం, నిధుల సమీకరణ తీరు వంటి సమగ్ర వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డాక్టర్ దీపాలీపంత్ జోషి రాసిన లేఖ బుధవారం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు అందింది. తుపాను, కరువు పీడిత మండలాలకు మాత్రమే రీ-షెడ్యూల్ వర్తిస్తుందని, ఇతర మండలాలకు విస్తరించకూడదని స్పష్టం చేశారు. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 27 వరకు తీసుకున్న పంట రుణాలను మాత్రమే రీ-షెడ్యూల్ చేయనున్నట్లు కూడా పేర్కొన్నారు. అలాగే బంగారంపై తీసుకున్న వ్యవసాయ రుణాలను రీ-షెడ్యూల్ పరిధిలో చేర్చలేమని కూడా రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో గత ఖరీఫ్లో గుర్తించిన 323 తుపాను, కరువు పీడిత మండలాల్లో రైతులు తీసుకున్న సుమారు 7,500 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్లో 572 మండలాల్లోని 12 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.10 వేల కోట్లలోపు పంట రుణాలు రీ షెడ్యూల్ అవుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్బీఐ లేఖలోని ముఖ్యాంశాలు రీషెడ్యూల్ మూడేళ్లకు మించి ఉండదు. తొలి ఏడాది మారటోరియం. మిగతా రెండేళ్లలో రుణాలు తిరిగి చెల్లించాలి. గత ఖరీఫ్లో తీసుకున్న పంట రుణాలకు మాత్రమే వర్తింపు. గోల్డ్ లోన్స్కు, పాత బకాయిలకు వర్తించదు. తుపాను, కరువు ప్రభావిత మండలాలకే రీషెడ్యూల్. మాఫీ చేయాలని భావిస్తే రైతుల రుణాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వమే నగదు రూపంలో బ్యాంకులకు చెల్లించాలి. సర్కారు తిరిగి చెల్లించేవరకూ రీషెడ్యూల్ అయిన పంట రుణాలు ఆయా రైతుల పేరు మీదనే ఉంటాయి. పంట రుణాలను బ్యాంకులకు చెల్లించడానికి అవసరమైన నిధులను ప్రభుత్వం ఎలా సమకూర్చుకుంటుందో వివరించాలి. రుణ మాఫీ కసరత్తును ఎప్పటిలోగా ముగిస్తారనే షెడ్యూల్ను కూడా ముందే స్పష్టం చేయాలి. పూర్తి స్థాయి ప్రణాళిక అందిన తర్వాతే తదుపరి చర్యలు. -
అదో రుణానందలహరి
రుణ మాఫీ అంటే సాధారణంగా వ్యవసాయానికి ఇచ్చే రుణాలు. పంట పండించడానికి ఇచ్చే రుణాలు. మాఫీ ఈ రెండింటికీ వర్తిస్తుందా? చంద్రబాబుకు పదేళ్ల పాలనానుభవం ఉంది. కాబట్టి నెట్టుకొస్తాడని కొందరి భావన. ప్రపంచ బ్యాంకు నుంచి కోట్ల రూపాయల రుణాలు తీసుకోవడంలోనే, చెల్లించడంలోనే ఆయనకు అపార అనుభవం ఉంది. రుణ మాఫీ హామీ సమస్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తల తినేస్తున్నది. తెలంగాణలో కేసీఆర్ది కూడా ఇదే పరిస్థితి. ‘మీరిచ్చిన వాగ్దా నాలను నెరవేర్చండి!’ అని రైతులు ముఖ్యమంత్రులను వేడుకుంటున్నారు. ముఖ్యమంత్రులు ప్రధానిని దేబరిస్తున్నారు. మామూలుగా జరిగేదేమి టంటే, సహకార సంఘాల దగ్గర రుణాలు తీసుకుని, వాటిని చెల్లించని పక్షంలో అకౌంట్ పుస్తకాలలో ఆ అప్పు తీర్చేసినట్టు, అదే మొత్తాన్ని తిరిగి రుణంగా ఇచ్చినట్టు సర్దుబాటు చేసుకుంటారు. కానీ ఈ రుణాలు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి తీసుకున్నవి. కాబట్టి ఆ పప్పులు ఉడకవు. ఒకవేళ ప్రధాని ద్వారా రిజర్వు బ్యాంకు మీద ఒత్తిడి తీసుకువచ్చి సహకార బ్యాంకులు అనుసరించే పద్ధతిలోనే రుణం చెల్లింపు చేయించ గలిగినా; ఖరీఫ్ పంటకు రుణం లభించదు. ఇంతకీ ఈ రుణమాఫీ వాగ్దానం బ్యాంకులు ఇచ్చిన రుణాలకే వర్తిస్తుందా? స్థానిక భూకామందుల నుంచి తీసుకున్న వాటికి కూడా వర్తిస్తుందా? ముఖ్యమంత్రులూ! ఈ రుణాలు కూడా మాఫీ అవుతాయా? రుణ మాఫీ అంటే సాధారణంగా వ్యవసాయానికి ఇచ్చే రుణాలు. పంట పండించడానికి ఇచ్చే రుణాలు. మాఫీ ఈ రెండింటికీ వర్తిస్తుందా? చంద్రబాబుకు పదేళ్ల పాలనానుభవం ఉన్నది కాబట్టి ఏదో విధంగా నెట్టుకొస్తాడని కొంత మంది భావన. ఆయన పాలనలో ప్రపంచ బ్యాంకు నుంచి కోట్ల రూపాయల రుణాలు తీసుకోవడంలో, చెల్లించడంలో ఆయనకు అపార అనుభవం ఉంది. ఉదాహరణకి 1999-2000 నుంచి 2003-2004 వరకు రుణాల రాకపోకల గణాంకాల పట్టికను పరిశీలిద్దాం. తెచ్చిన అప్పులో సింహభాగం వడ్డీలు, అసలులో కొంత భాగం తిరిగి చెల్లించిన పరిస్థితి. ఆయన పరిపాలనానుభవం ఇదన్నమాట. ఆయన గత పాలనలో ఏం జరిగిందో చాలామంది మరచిపోయి ఉండొచ్చు. కానీ జర్నలిస్టులు ఆ పని చేయలేరు. ఆ సమాచారాన్నే ఇప్పుడు మీతో పంచుకుంటాను. అప్పు చేయనిదే అభివృద్ధి సాధ్యం కాదన్నది అప్పట్లో ఆయన నోటి నుంచి రాలిన ఆణిముత్యాలలో ఒకటి. మామూలుగా ప్రభుత్వాలు చేసే పనేమిటంటే- 1. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువైతే అప్పు తెచ్చి ఆ లోటును పూడ్చడం. 2. బడ్జెట్లో చేసిన కేటాయింపులను పూర్తిగా ఖర్చు చేయక పోవడం. 2003-04లో అందుకోలేకపోయిన ద్రవ్య లక్ష్యాలను ఈ పట్టికలో గమనించవచ్చు. లోటు ఏటా పెరుగుతూనే వచ్చింది. 1999-2000 రెవెన్యూ లోటు రూ. 1233 కోట్లు ఉండగా అది 2003-04 సంవత్సరానికి రూ. 3771 కోట్లకు పెరిగింది. అదే కాలంలో ద్రవ్య లోటు రూ. 4976 కోట్ల నుంచి రూ. 7450 కోట్లకు చేరింది. ఈ గణాంకాలన్నీ కాగ్ నివేదిక నుంచి తీసుకున్నవే. చంద్రబాబే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వాలైనా నిధులు మంజూరు చేస్తాయికానీ పూర్తి ఖచ్చు చేయవు. చేసినా లక్ష్యాలు నెరవేరవు. ఫలితాలు అందవలసిన వారికి అందవు. ప్రతి బడ్జెట్ బాగోతం ఇంతే. కాగ్ నివేదిక ప్రకారమే ‘అప్పు తెచ్చిన డబ్బులో సగానికి సగం రోజువారీ ఖర్చుల కోసమే వినియోగమైంది.’ ఈ గణాంకాలన్నీ మొత్తం బడ్జెట్కు సంబంధించినవి. వివరాలలోకి పోయి చూస్తే సామాజిక సేవల రంగాలలో దక్షిణాది రాష్ట్రాలలో చంద్రబాబు ప్రభుత్వం ఏ స్థానంలో ఉందో ఈ పట్టిక చెబుతుంది. (సెస్ డెరైక్టర్ మహేంద్రదేవ్, ఫ్యాకల్టీ సభ్యురాలు శ్రీదేవి రచించిన పత్రం ఆధారంగా)ఈ సంక్షేమ పథకాల్లో వైద్య రంగాన్ని తీసుకొని చుద్దాం. 2000 సంవత్సరంలో రాష్ట్రంలో 1,389 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుంటే నాలుగేళ్ల తర్వాత కూడా అన్నే ఉన్నాయి. ఈ కేంద్రాలలో డాక్టర్లు, నర్సులు, సరిపడా మందులున్నాయా అనే ప్రశ్నకు జవాబు నా కన్నా మీకే బాగా తెలుసు. అలాగే డిస్పెన్సరీలు, పడకలు, టీబీ ఆసుపత్రుల సంఖ్య నెత్తిన మేకు కొట్టేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండాల్సిన వాటికన్నా 2.6 శాతం తక్కువ ఉన్నాయని కాగ్ మొట్టికాయ వేసింది. హైదరాబాద్ నగరాన్ని హైటెక్ సిటీగా మార్చిన ఘనత చంద్రబాబు ఖాతాలోనే వెయ్యాలి. నాణేనికి రెండు ముఖాలు ఉన్నట్టు హైదరాబాద్ ఒక ముఖం అయితే, మిగతా జిల్లాలు, గ్రామాలు మరొక ముఖం. ఆ ముఖాన్ని 2001 జనాభా లెక్కలు చూపించాయి. రాష్ట్రంలో కోటీ అరవైఎనిమిది లక్షల ఏభై వేల కుటుంబాలుంటే వారిలో 1.22 కోట్ల కుటుంబాలు ఇంకా పిడకలు, బొగ్గు, కట్టెపుల్లల మీదే వంటావార్పు చేసుకొంటున్నారు. 1.12 కోటి మందికి పొలాలు, పొలంగట్లు, రైలుపట్టాలే మరుగుదొడ్లు. సగం కుటుంబాలకు ఎలాంటి మురుగునీటి సౌకర్యం లేదు. అయితే ఇదంతా చంద్రబాబు హయాంలో జరిగిందనడం లేదు. అంతకు ముందు నాలుగు దశాబ్దాలుగా పాలించిన వారి వాటా కూడా ఉంది. పేదరికం గ్రామాల్లో 11 శాతానికి పడిపోయిందని లెక్కలు చెప్పిన చంద్రబాబు, తన హయాంలో కూడా ఎంత తగ్గిందో చెబితే బావుండేది. చంద్రబాబు పరిపాలన ప్రారంభించిన సంవత్సరంలో రాష్ట్రం అసలు, వడ్డీ చెల్లింపులు సగటున రోజుకు కోటి రూపాయలు. ఈ సగటు 2005-06 ఆఖరు నాటికి సుమారు 22 కోట్లు. రోజుకు 24 గంటలు కాబట్టి ఉజ్జాయింపుగా సగటున గంటకు కోటి రూపాయలు. అంటే 95-96లో రోజుకు ఒక కోటి రూపాయలైతే, 2005-06 నాటికి గంటకు కోటి రూపాయలు! ఎంత అభివృద్ధో! అప్పుడాయన అప్పు చేయనిదే అభివృద్ధి సాధ్యం కాదంటూ రాష్ట్రం ఆర్థికంగా ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉందో శ్వేత పత్రాలు విడుదల చేసి ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తెచ్చారు. ఇప్పుడు కూడా శ్వేత పత్రాల విడుదల ప్రారంభించారు. చరిత్ర పునరావృతమవుతుందా? (వ్యాసకర్త ఆర్థిక విశ్లేకులు) వి. హనుమంత రావు -
రీషెడ్యూల్ చేసినా రుణాలు డౌటే..
రైతు రుణాల మాఫీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రుణమాఫీకి రిజర్వ్బ్యాంకు తిరకాసు పెడుతుండటంతో.. టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని రీషెడ్యూల్ చేసి తాత్కాలిక ఉపశమనం పొందే యత్నం చేస్తోంది. కరువు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన చోటే రీషెడ్యూల్కు అవకాశముండగా.. కరువు ప్రాంతాల ఎంపికలో ప్రభుత్వం అనుసరించిన విధానంతో రైతులకు పెద్దగా ప్రయోజనం దక్కే అవకాశం కనిపించడం లేదు. ప్రభుత్వం గద్దెనెక్కి నెలన్నర కావస్తుండగా రైతుల రుణమాఫీపై అస్పష్టత కొనసాగుతూనే ఉంది. మాఫీకి బదులు రీషెడ్యూల్ చేయనున్నారనే వార్తలు జిల్లా రైతుల్లో గుబులు పుట్టిస్తున్నా యి. కరువు మండలంగా ప్రకటిస్తేనే రీషెడ్యూల్కు అవకాశముంటుంది. అతివృష్టి లేదా అనావృష్టి వల్ల పంటలు దెబ్బతిని, బ్యాంకుల్లో రైతు లు తీసుకున్న రుణాలు కట్టలేని పరిస్థితిలో ఉంటే ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటిస్తుంది. ప్రభుత్వం కోరితే రిజర్వ్బ్యాంకు నిబంధనల ప్రకారం.. పంట రుణాలు ఇచ్చిన బ్యాం కులు... ఈ కరువు మండలాల్లో రైతుల రుణాలను రీషెడ్యూల్ చేస్తాయి. గత అక్టోబర్లో జిల్లాలో పైలిన్ తుపాన్ ప్రభావంతో నష్టం జరగ్గా దానిని ప్రమాణికంగా తీసుకున్న ప్రభుత్వం... జిల్లాలో 57 మండలాలుండగా పంటనష్టం జరిగిన 50 మండలాలను కరువు మండలాలుగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో రీషెడ్యూల్ చేయాల్సి వస్తే ఎంత మొత్తం అవుతుందనే అంచనాలు రూపొందిం చుకునేందుకు ప్రభుత్వం బ్యాంకులను లెక్కలు కోరింది. కరువు మండలాల జాబితాను బ్యాం కులకు పంపించింది. ఆయా మండలాల్లో పంట రుణాలు తీసుకున్న రైతులు ఎంతమంది? తీసుకున్న రుణం ఎంత? ఆఘమేఘాల మీద తెలపాలంటూ బ్యాంకులను కోరింది. అలాగైతే అన్యాయమే కరువు మండలాల జాబితా ప్రకారం రుణాలు రీషెడ్యూల్ చేస్తే జిల్లా రైతులకు అన్యాయం జరిగే ప్రమాదముంది. జిల్లాలో మెజారిటీ మం డలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించినా... ఆ మండలంలోని కొన్ని గ్రామాలనే కరువు గ్రా మాలుగా చూపింది. తుపాన్తో మండలం మొత్తం పంట నష్టపోనందున ఏఏ గ్రామాల్లో నష్టం జరిగిందో అదే గ్రామాలను కరువు గ్రా మాలుగా ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 1200కు పైగా గ్రామాలకు గాను 979 గ్రామాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా గుర్తించా రు. దీంతో రుణాలు రీషెడ్యూల్ చేస్తే బ్యాంకు లు కరువు గ్రామాలుగా ప్రకటించిన గ్రామ రైతుల రుణాలనే రీషెడ్యూల్ చేసి కొత్త రుణాలు ఇస్తాయి. మిగతా గ్రామ రైతులకు మొండిచె య్యే ఎదురుకానుంది. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో మండలానికి నాలుగైదు గ్రా మాలనే ఈ జాబితాలో చేర్చారు. ఉదాహరణకు జగిత్యాల నియోజకవర్గంలోని జగిత్యాల మండలంలో 31 గ్రామాలుండగా కేవలం నాలుగే(బాలెపల్లి, ధర్మారం, కన్నాపూర్, తిమ్మాపూర్) గ్రామాలను మాత్రమే కరువు గ్రామాలుగా గుర్తించారు. రాయికల్ మండలంలో 27 గ్రామాలుండగా... కట్కపూర్, తాట్లవాయి, రాజ్నగర్, ఆలూర్ గ్రామాలను, సారంగాపూర్ మండలంలో 22 గ్రామాలుండగా తుంగూర్, బట్టపల్లి, పోతారం, సారంగాపూర్, అర్పపల్లి, లక్ష్మీదేవిపల్లి, పెంబట్ల గ్రామాలను కరువు గ్రామాలుగా ప్రకటించారు. కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల మండలంలో... గ్రామాలకు గాను ఐలాపూర్, పెద్దపూర్లు మాత్రమే కరువు జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి మండలాలు అసలు కరువు మండలాల జాబితాలోనే లేవు. వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్ మండలం కూడా జాబితాలో లేదు. దీంతో మెజారిటీ గ్రామాల్లో రుణాలు రీషెడ్యూల్ అయ్యే అవకాశం లేకపోగా రైతులకు కొత్త రుణా లు అందే అవకాశం లేదు. ఫలితంగా వారు మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పేలా లేదు. ఒక వేళ రీషెడ్యూల్ చేస్తే కరువు గ్రామాలు కాని రైతుల రుణాలను మాఫీ చేస్తారా? లేక ఏం చేస్తారనే విషయంపై స్పష్టత లేకపోవడంతోఆందోళనకు గురవుతున్నారు. రీ-షెడ్యూల్ అంటే.. సాధారణంగా బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాన్ని అదే ఏడాది చెల్లించాల్సి ఉంటుంది. కానీ, రుణాలను రీ-షెడ్యూల్ చేస్తే తీసుకున్న రుణాన్ని 3 నుంచి 5 ఏళ్లలో వాయిదాల పద్ధతి లో చెల్లించేందుకు అవకాశం ఇవ్వడంతోపాటు నూతనంగా అంతే మొత్తం రుణాన్ని పెట్టుబడి కోసం మళ్లీ ఇస్తారు. కానీ, దీనికి(ముందుగా తీసుకున్న రుణానికి) ప్రస్తుతమున్న రేటు ప్రకా రం 12.5 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పంట రుణం కాస్తా... టర్మ్ లోన్గా మా రుతుంది, తర్వాత ఇచ్చే రుణం పంట రుణంగా మారుతుంది. రీషెడ్యూల్ చేస్తే బకాయిలను ప్రభుత్వమే దశలవారీగా చెల్లించుకోవచ్చని భా విస్తోంది. ఒకవేళ రైతులు చెల్లించినా... వారి ఖా తాల్లో డబ్బు జమ చేసే ఆలోచనలో ఉంది. ప్ర భుత్వం వెంటనే స్పష్టత ఇచ్చి రుణాలు మొత్తం మాఫీ చేయాలని రైతులు కోరుతున్నారు. వర్షాలు పడుతున్నందున పెట్టుబడికి ఇబ్బంది కాకుండా బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేసేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
కొత్త రుణాలు కష్టమే!
* రుణాల రీ-షెడ్యూల్తో తీవ్ర నగదు కొరత * గతేడాది రుణాల మొత్తం రూ. 7,600 కోట్లు సాక్షి, హైదరాబాద్: రైతుల రుణాలు రీ-షెడ్యూల్ అయినప్పటికీ కొత్త రుణాలు మంజూరయ్యే అవకాశం కనిపించడం లేదు. ప్రధానంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు(పీఏసీఎస్), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్ఆర్బీ)ల ద్వారా రీ-షెడ్యూల్ తర్వాత కొత్త రుణాలు అందే పరిస్థితి లేదు. ఇందుకు అవసరమయ్యే మొత్తాన్ని పీఏసీఎస్, ఆర్ఆర్బీలకు అందించలేమని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డు) వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకేసారి మొత్తం నగదు చెల్లిస్తే తప్ప రుణ మాఫీకి రిజర్వ్ బ్యాంకు అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో రుణాలను రీ-షెడ్యూల్ చేసి కొత్త రుణాలు అందించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆర్బీఐని కోరుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇరు ప్రాంతాల రైతులకు పరపతి సంఘాలు, గ్రామీణ బ్యాంకుల నుంచి రూ. 7,600 కోట్ల పంట రుణాలు అందాయి. ఇప్పుడు ఇరు రాష్ట్రాలూ రుణ మాఫీ ప్రకటన చేయడంతో రైతులు బకాయిలు చెల్లించడం లేదు. దీంతో కొత్త రుణాల మంజూరుకు బ్యాంకుల ఆర్థిక పరిస్థితి సహకరించే పరిస్థితి లేదని నాబార్డు సీజీఎం మమ్మెన్ తెలిపారు. ‘ రీ-షెడ్యూల్తో స్వల్పకాలిక రుణాలు కాస్తా మధ్యకాలిక రుణాలుగా మారతాయి. రూ. 7,600 కోట్లలో నాబార్డు వాటా 60 శాతం అంటే రూ. 4,560 కోట్లు. ఈ మొత్తం రైతుల నుంచి తిరిగి రాకపోతే కొత్త రుణాల కోసం పీఏసీఎస్, ఆర్ఆర్బీలకు నాబార్డు నుంచి నిధులు అందించే పరిస్థితి ఉండదు’ అని ఆయన వివరించారు. రుణాల రీ షెడ్యూల్కు ఆర్బీఐ ఓకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో రైతుల రుణాల రీ షెడ్యూల్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అంగీకరించింది. ఈ మేరకు సోమవారం నాడు రిజర్వ్బ్యాంకు రీ షెడ్యూల్కు సంబంధించి విధివిధానాలను కూడా ప్రకటించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఏపీలోని 13 జిల్లాలకు సంబంధించి రీషెడ్యూల్ మొత్తం సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వమే మాఫీ చేస్తే మంచిది వరదలు,కరువు వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాల్సిందేనని.. రుణమాఫీని ప్రభుత్వమే నేరుగా చేస్తే బాగుంటుందని నాబార్డు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రాంతీయ కార్యాలయ సీజీఎంజీజీ మమ్మెన్ అభిప్రాయపడ్డారు. రుణమాఫీ బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు. నాబార్డు 33వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న కార్యక్రమాలను ఆయన వివరించారు.అవి.. - ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ద్వారా గోదాముల నిర్మాణానికి రుణాలిస్తాం. - రెండురాష్ట్రాల్లోని 257 మార్కెట్ కమిటీలకు నేరుగా రూ. 500 కోట్ల రుణాలను ఇవ్వనున్నాం. మార్కెట్ కమిటీలను కూడా గుర్తించాం. ఇందులో రూ.300 కోట్లు ఆంధ్రప్రదేశ్కు, రూ.200 కోట్లు తెలంగాణలోని మార్కెట్ కమిటీలకు ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో మొత్తం రెండు రాష్ట్రాలకు కలిపి రూ. 17,500 కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. - రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు కలిపి ప్రాంతీయ కార్యాలయం ఇక్కడే ఉంది. కొత్త రాజధాని ఏర్పాటైన తర్వాత అక్కడ నాబార్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. -
రుణాల రీషెడ్యూల్కు రిజర్వ్ బ్యాంక్ అంగీకారం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో రైతుల రుణాల రీ షెడ్యూల్కు రిజర్వ్ బ్యాంక్ అంగీకరించిందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. దీనివల్ల కొత్త రుణాలు మంజూరు చేయడానికి సమస్య ఉండదని చెప్పారు. ఎంతమేర రీషెడ్యూల్ చేశారన్న విషయం లిఖిత పూర్వక ఆదేశాలు వచ్చాక తెలుస్తుందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా అమలు చేయకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.