Amazon
-
అమెజాన్ ఆధ్వర్యంలో మిలటరీ ప్రోగ్రామ్
దేశానికి సేవ చేయడానికి తమ జీవితాలను అంకితం చేసిన వారికి అద్భుతమైన అవకాశాలను అందించేందుకు ఆన్లైన్ మార్కెట్ వేదిక 'అమెజాన్ ఇండియా' మిలటరీ ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన వివరాలను, ఈ ప్రోగ్రామ్ ద్వారా ఉద్యోగాలను అందుకున్నవారి అనుభవాలను సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో పంచుకున్నారు.కెరీర్ మార్పు కంటే ఎక్కువసైనిక నేపధ్యం నుంచి కార్పొరేట్ ప్రపంచానికి మారడం అనేది ఒక కెరీర్ మార్పు కంటే ఎక్కువ. ఎందుకంటే.. వీరు వ్యూహాత్మక దృష్టి క్రమశిక్షణ అసమానమైన స్థితిస్థాపకతల అరుదైన సమ్మేళనం కలిగిన వారు. వీటన్నింటినీ కార్పొరేట్ కార్యాలయానికి తీసుకురాగల సమర్ధులు. ఈ విశిష్ట విలువను గుర్తిస్తూ, అమెజాన్ మిలిటరీ ప్రోగ్రామ్ రూపొందించింది. దీని ద్వారా సైనిక నేపధ్యం ఉన్న అనుభవజ్ఞులకు మార్గదర్శకత్వం, శిక్షణతో పాటు సాధికారతను అందిస్తుంది, కంపెనీలో కీలక పాత్ర పోషిస్తూ విజయవంతంగా మారేలా చేస్తుంది.తీర్చిదిద్దిందిమిలటరీలో పనిచేసిన మామయ్య స్ఫూర్తితో గత 2008 లో భారతీయ నావికాదళ అధికారిగా విధులు నిర్వర్తించడం ప్రారంభించి, దశాబ్దం పాటు పనిచేశాను. పైరసీ వ్యతిరేక కార్యకలాపాల ద్వారా విదేశీ సేవా పతకాన్ని నిబద్ధత అంకితభావానికి 9-సంవత్సరాల సేవా పతకాన్ని అందుకోవడంతో అందుకున్నా. ఆ ప్రయాణం నా వృత్తిపరమైన జీవితానికి ఒక రూపం ఇవ్వడంతో పాటు నన్ను ఒక సమర్ధత కలిగిన వ్యక్తిగా మార్చింది నాకు స్థితిస్థాపకత శక్తిని, టీమ్ వర్క్ బలాన్ని నిస్వార్థ అంకితభావం తాలూకు ప్రభావాన్ని నాకు నేర్పింది. ఇక ప్రయోజనం, సహకారం అభివృద్ధి అమెజాన్ డైనమిక్ మిశ్రమం. నా మొదటి రోజు నుంచే నేను కస్టమర్ అబ్సెషన్, బోల్డ్ థింకింగ్ నిరంతర అభివృద్ధి చెందే కల్చర్లో అమరిపోయాను. లెఫ్టినెంట్ కమాండర్ 'విక్టర్ జైస్' (రిటైర్డ్) -
మరోమారు లేఆఫ్స్: దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం
దిగ్గజ టెక్ కంపెనీలన్నీ లాభాల బాటలో దూసుకెళ్తున్న వేళ.. 'అమెజాన్' (Amazon) మరోమారు లేఆఫ్స్ ప్రకటించనుంది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్దీకరించేందుకు.. సంస్థ తన కమ్యూనికేషన్స్ & సస్టైనబిలిటీ విభాగాల నుంచి ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రభావం ఎంతమంది ఉద్యోగులపై పడుతుందనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.కంపెనీ కార్యకలాపాలను మరింత సమర్ధవంతంగా నిర్వహించడంలో భాగంగానే.. ఈ లేఆప్స్ ప్రక్రియ చేపట్టనున్నట్లు అమెజాన్ చెబుతోంది. ఉద్యోగుల తొలగింపు కొంత కష్టమైన ప్రక్రియే.. కానీ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి, సంస్థ పనితీరును మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ నిర్మాణమే తీసుకోవాల్సి వచ్చిందని.. సంస్థలో పబ్లిక్ రిలేషన్స్ అండ్ కార్పొరేట్ బాధ్యతను పర్యవేక్షిస్తున్న 'డ్రూ హెర్డెనర్' (Drew Herdener) పేర్కొన్నారు.యాండీ జెస్సీ 2021లో ఆమెజాన్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. కంపెనీని పునర్నిర్మించడానికి లేదా అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లడానికి కావలసిన ప్రయత్నాలను చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే పలువురు ఉద్యోగులను సైతం తొలగించారు. ఇప్పుడు మరోమారు ఈ లేఆప్స్ వార్త తెరమీదకు వచ్చింది.2022లో కంపెనీ వివిధ విభాగాల్లో 27,000 మందిని తొలగించడమే కాకుండా.. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కూడా రద్దు చేసింది. ఉద్యోగులందరూ.. ఆఫీసులకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారానికి ఐదు రోజులు ఆఫీసు నుంచి పని చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం దాదాపు అన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ విధానం తొలగించాయి. కాబట్టి ఉద్యోగులందరూ ఆఫీస్ బాట పట్టారు.అమెజాన్ పెట్టుబడి రూ.60 వేలకోట్లుతెలంగాణలో డేటా సెంటర్లను విస్తరించేందుకు రూ.60 వేల కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ సిద్ధమైంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ‘అమెజాన్ వెబ్ సర్విసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ’ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో జరిపిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇదీ చదవండి: బంగారం.. మరింత పెరిగే అవకాశం! -
హైదరాబాద్ అమెజాన్లో రూ.102 కోట్ల మోసం
అమెజాన్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సొంత ఉద్యోగులే రూ.102 కోట్ల భారీ మోసానికి పాల్పడ్డారు. కంపెనీ లాజిస్టిక్స్, పేమెంట్ వ్యవస్థలను తారుమారు చేసి నిధులను పక్కదారి పట్టించారు. అమెజాన్ తన ఆర్థిక రికార్డుల్లో వ్యత్యాసాలను గమనించి అంతర్గత దర్యాప్తు ప్రారంభించడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇందులో పాల్గొన్న ఉద్యోగులు కొన్ని నెలలుగా ఈ వ్యవహారం నడుపుతున్నారని, దీనివల్ల సంస్థకు గణనీయమైన ఆర్థిక నష్టాలు వచ్చాయని దర్యాప్తులో వెల్లడైంది.అమెజాన్లో ఏదైనా వస్తువులు ఆర్డర్ చేసినప్పుడు గోదాములో డెలివరీ ఏజెంట్ వస్తువులు రిసీవ్ చేసుకున్న వెంటనే యాప్లో చెక్-ఇన్ చేయాలి. సదరు వస్తువులను యూజర్లకు డెలివరీ ఇచ్చిన తర్వాత చెక్-అవుట్ చేయాల్సి ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఆర్డర్ పెట్టినవారు చిరునామాలో అందుబాటులో లేకపోతే ఆ వివరాలు వెంటనే యాప్లో అప్డేట్ చేయాలి. దీన్ని రిలే అపరేషన్ సెంటర్లో ఉన్నవారు నిర్ధారిస్తారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న అమెజాన్ కాల్సెంటర్ నుంచి ప్రపంచవ్యాప్తంగా డెలివరీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు. దీన్ని రిలే ఆపరేషన్ సెంటర్ అంటారు. వినియోగదారులు చిరునామాలో లేకపోతే అక్కడకు వెళ్లి వచ్చినందుకు డెలివరీ ఏజెంట్లకు ఛార్జీలు అందిస్తారు. అయితే చాలాచోట్ల ఈ డెలివరీ సదుపాయాన్ని ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు నిర్వహిస్తుంటాయి. వాటికి అమెజాన్ డెలివరీ చెల్లింపులు చేస్తుంటుంది.అమెరికాకు నకిలీ ట్రిప్పులుమోసగాళ్లు అమెజాన్ డెలివరీ వ్యవస్థను ఉపయోగించుకున్నారు. గతంలో కంపెనీలో పని చేసి మానేసిన కొందరి సాయంతో అమెరికాకు వస్తువులు డెలివరీ చేస్తున్నట్లు నకిలీ డెలివరీ ట్రిప్పులను సృష్టించి వాటికి చెల్లింపులు చేశారు. ఇందుకు రిలే ఆపరేషన్ సెంటర్లో ఉద్యోగులు సహకరించారు. అలా కొన్ని నెలలుగా ఏకంగా రూ.102,88,05,418 మోసానికి పాల్పడ్డారు.ఇదీ చదవండి: సడన్ ఫేమ్.. చైనా ఏఐ ‘డీప్సీక్’పై సైబర్ ఎటాక్సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఫిర్యాదుఅమెజాన్ తన ఆర్థిక రికార్డుల్లో వ్యత్యాసాలను గమనించి అంతర్గత దర్యాప్తు ప్రారంభించడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కంపెనీ ఉద్యోగులు కొన్ని నెలలుగా ఈ కుంభకోణాన్ని నడుపుతున్నారని, దీనివల్ల సంస్థకు గణనీయమైన ఆర్థిక నష్టాలు వచ్చాయని దర్యాప్తులో తేలింది. దీనిపై అమెజాన్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అంతర్గత భద్రతా చర్యలను బలోపేతం చేసేందుకు కంపెనీ చర్యలు చేపట్టింది. -
తెలంగాణలో అమెజాన్ పెట్టుబడి 60 వేల కోట్ల రూపాయలు.. డేటా సెంటర్ల ఏర్పాటు కోసం కీలక ఒప్పందం
-
అమెజాన్ పెట్టుబడి రూ.60 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్)లో రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ పెట్టుబడిని సాధించింది. తెలంగాణలో డేటా సెంటర్లను విస్తరించేందుకు రూ.60 వేల కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ప్రఖ్యాత అమెజాన్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ‘అమెజాన్ వెబ్ సర్విసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ’ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో జరిపిన భేటీలో ఈ నిర్ణయం వెలువడింది. అమెజాన్తోపాటు మరికొన్ని సంస్థలతోనూ డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. భూమి కేటాయించాలని కోరిన అమెజాన్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ రాష్ట్రంలో ఇప్పటికే మూడు డేటా సెంటర్లను నిర్వహిస్తోంది. తాజాగా విస్తరణ కోసం అవసరమైన భూమిని కేటాయించాలని ఆ సంస్థ ప్రతినిధులు కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. అమెజాన్ భారీ పెట్టుబడులకు ముందుకు రావడంపై సీఎం రేవంత్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ రైజింగ్ విజన్’తో తమ ప్రభుత్వం ఏడాదిగా చేపట్టిన ప్రయత్నాలు ఫలితాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. అమెజాన్ ఒప్పందంతో దేశంలో డేటా సెంటర్ల కేంద్రంగా హైదరాబాద్ గుర్తింపు సాధిస్తుందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. డేటా సెంటర్ల రంగంలో మరిన్ని పెట్టుబడులు ⇒ హైదరాబాద్లో రూ.15వేల కోట్ల పెట్టుబడితో 300 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ ఏర్పాటు కోసం అమెరికాకు చెందిన టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఏఐ ఆధారిత అప్లికేషన్లు, క్లౌడ్ సేవలు, డేటా ప్రాసెసింగ్కు ఈ సెంటర్ ఉపయోగపడుతుంది. ⇒ అమెరికాకు చెందిన ఉర్సా క్లస్టర్స్ రూ.5వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన అత్యాధునిక ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్ను స్థాపించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ⇒ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల్లో అగ్రగామి సంస్థ బ్లాక్స్టోన్ హైదరాబాద్లో రూ.4,500 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. బ్లాక్స్టోన్ అనుబంధ విభాగం జేసీకే ఇన్ఫ్రా 150 మెగావాట్ల సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేస్తుంది. ఇన్ఫోసిస్, విప్రో విస్తరణ ప్రణాళికలు కూడా.. ⇒ హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని గోపన్పల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ ఏర్పాటుకు విప్రో సంస్థ ముందుకు వచ్చింది. సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్బాబులతో జరిగిన భేటీలో విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీ విప్రో క్యాంపస్ విస్తరణకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. దీనితో 5వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ⇒ ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ హైదరాబాద్లోని పోచారంలో ఉన్న తమ క్యాంపస్లో 17 వేల ఉద్యోగాలు కల్పించేలా విస్తరణ ప్రణాళిక ప్రకటించింది. రూ.75 కోట్ల పెట్టుబడితో నూతన ఐటీ భవనాల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్లో విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీతో భేటీ అయిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు -
తెలంగాణకు పెట్టుబడులు.. రూ.1.78 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: దావోస్లో రికార్డు స్థాయిలో రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు, 49,500 ఉద్యోగాల కల్పనకు సంబంధించి పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడుల సాధన లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం’.. ముందెన్నడూ లేనిరీతిలో భారీ ఫలితాన్ని సాధించినట్లు తెలిపింది. గత ఏడాది జరిగిన సదస్సులో కేవలం రూ.40 వేల కోట్ల పెట్టుబడులు సాధించగా.. ప్రస్తుత సదస్సులో నాలుగింతలకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు పేర్కొంది. ఈ నెల 16న విదేశీ పర్యటనకు బయలుదేరిన రేవంత్రెడ్డి బృందం 17 నుంచి 19వ తేదీ వరకు సింగపూర్లో పర్యటించింది. అనంతరం దావోస్కు చేరుకుని మూడురోజుల పాటు డబ్ల్యూఈఎఫ్ సమావేశాల్లో పాల్గొంది. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్దన్రెడ్డి తదితరులు ఈ బృందంలో ఉన్నారు. సమావేశాలు సక్సెస్ అయ్యాయన్న సర్కారు దావోస్లో పారిశ్రామికవేత్తలతో తెలంగాణ రైజింగ్ బృందం నిర్వహించిన సమావేశాలు విజయవంతమైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. అమెజాన్, సన్ పెట్రో కెమికల్స్, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్, మేఘా ఇంజనీరింగ్ సంస్థలు భారీ పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీలు హెచ్సీఎల్, ఇన్ఫోసిస్, విప్రో హైదరాబాద్ కేంద్రంగా విస్తరణ ప్రణాళికలు ప్రకటించాయి. డేటా సెంటర్ల రంగంలో అమెజాన్, టిల్మాన్, ఉర్సా, సిఫి, కంట్రోల్ ఎస్ సంస్థలు పెట్టుబడులను ప్రకటించాయి. సోలార్ సెల్స్, రాకెట్ తయారీ, రక్షణ రంగంలోనూ భారీ ఎత్తున పెట్టుబడుల ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయం, గ్రీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలున్నాయని పేర్కొంది. తెలంగాణ రైజింగ్– 2050 లక్ష్య సాధనపై అంతర్జాతీయ పెట్టుబడిదారులు, వాణిజ్యవేత్తలు, విధాన నిర్ణేతల నుంచి పెద్దయెత్తున సానుకూలత వ్యక్తమైనట్లు ప్రకటించింది. యూనీలివర్, హెచ్సీఎల్ టెక్, విప్రో, ఇన్ఫోసిస్, సుహానా మసాలా, ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్, ఫోనిక్స్, అగిలిటీ, స్కైరూట్ ఏరోస్సేస్, జేఎస్డబ్ల్యూ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపింది. అనేక రంగాల్లో అనుకూలతలు: సీఎం రేవంత్ ‘అంతర్జాతీయగా వాణిజ్యానికి పర్యాయపదంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. సాఫ్ట్వేర్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్, తెలంగాణకు అనుకూలతలు ఉన్నాయి. డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్రి్టక్ వాహనాలు, సెమీ కండక్టర్లతో పాటు ఇతర రంగాల్లో పురోగతికి కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. కోవిడ్ తర్వాత సరఫరా వ్యవస్థలు చైనా బయట అవకాశాలను (చైనా ప్లస్ వన్) అన్వేషిస్తున్న నేపథ్యంలో ఆ అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా రాష్ట్రం వేగంగా అడుగులు వేస్తోంది. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు క్లస్టర్ల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నాం. ఔటర్ రింగు రోడ్డు లోపలి వైపు సేవలు, ప్రతిపాదిత రీజినల్ రింగు రోడ్డు, ఓఆర్ఆర్ నడుమ తయారీ, ట్రిపుల్ ఆర్ బయట ఉన్న గ్రామీణ తెలంగాణను ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ఉద్యోగాల కల్పన, ఆదాయం పెంపు, వాణిజ్య అవకాశాలు, మరింత మెరుగైన సంక్షేమం కోసం ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు సాగుతాం..’ అని దావోస్ పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
సీఎం రేవంత్ పర్యటనతో రాష్ట్రానికి పెట్టుబడులు
-
అమెజాన్ తొలి రాకెట్ ప్రయోగం.. స్పేస్ఎక్స్కు ముప్పు?
అమెజాన్ ఆధ్వర్యంలోని బ్లూ ఆరిజిన్(Blue Origin) స్పేస్ సర్వీస్ కంపెనీ తన మొదటి రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. జెఫ్ బెజోస్(Jeff Bezos) నేతృత్వంలోని ఈ సంస్థ ‘న్యూ గ్లెన్’ అనే స్పేస్క్రాఫ్ట్ను జనవరి 8న ప్రయోగించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రయోగం ఫ్లోరిడాలోని కేప్ కనావరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి నిర్వహిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ సంస్థ స్థాపించిన 25 ఏళ్లకు మొదటి రాకెట్ను లాంచ్ చేస్తుండడం విశేషం. ఇప్పటికే ఎలన్ మస్క్ ఆధ్వర్యంలోని స్పేస్ఎక్స్ ప్రైవేట్ స్పేస్ సంస్థ అంతరిక్ష ప్రయోగాల్లో ఆధిపత్యం చలాయిస్తోంది. ఈ నేపథ్యంలో దానికి పోటీగా అమెజాన్ ఈ ప్రయోగం చేయడం రెండు సంస్థల మధ్య పోటీని తెలియజేస్తుంది. త్వరలో ప్రయోగించబోయే రాకెట్ లాంచ్కు సంబంధించి ‘నెక్ట్స్ స్టాప్ లాంచ్’ అని తెలియజేస్తూ జెఫ్ బెజోస్ ఎక్స్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు.ఆరు గంటల ప్రయోగంబ్లూ ఆరిజిన్ న్యూ గ్లెన్ రాకెట్(New Glenn rocket)ను లండన్లోని కేప్ కెనవెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి లాంచ్ చేయనున్నట్లు ‘స్పేస్ ఫ్లైట్ నౌ’ తెలిపింది. 2024 డిసెంబర్ 27న రాకెట్ హాట్-ఫైర్ పరీక్ష పూర్తయినట్లు తెలిపింది. రాకెట్ పనితీరును, పేలోడ్లను మోసుకెళ్లే సామర్థ్యాన్ని పరీక్షించే ఈ ప్రయోగం సుమారు ఆరు గంటల పాటు ఉంటుందని భావిస్తున్నారు. న్యూ గ్లెన్ విజయవంతమైతే, బ్లూ ఆరిజిన్ను ప్రైవేట్ రంగ అంతరిక్ష రేసులో ముందంజలో ఉంచుతుందని కంపెనీ విశ్వసిస్తుంది.ఇదీ చదవండి: 130 బిలియన్ డాలర్లకు దేశీ ఫార్మాస్పేస్ఎక్స్కు ముప్పు?స్పేస్ఎక్స్ ఇటీవల పునర్వినియోగ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 2024లోనే 132 ప్రయోగాలు చేసి 99 శాతం సక్సెస్ రేట్ సాధించింది. ఈ కంపెనీకు చెందిన స్టార్ లింక్కు పోటీగా బ్లూ ఆరిజిన్ నిలుస్తుందా లేదా అనే అంశాన్ని పరిశీలించాల్సి ఉంది. స్పేస్ఎక్స్తోపాటు లూనార్ ల్యాండర్ తయారీ కంపెనీలు, ప్రైవేట్ స్పేస్ స్టేషన్లు వంటి పోటీదారులతో పోటీ పడటానికి అమెజాన్ ప్రయత్నిస్తోంది. -
ప్రియురాలిని పెళ్లిచేసుకోబోతున్న అమెజాన్ ఫౌండర్ బెజోస్ (ఫోటోలు)
-
'జెఫ్ బెజోస్' జీతం ఇంతేనా..
ప్రపంచంలోని కుబేరుల జాబితాలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తి, అమెజాన్ ఫౌండర్ 'జెఫ్ బెజోస్' గురించి దాదాపు అందరికీ తెలుసు. అయితే 241 బిలియన్ డాలర్ల సంపదకు నాయకుడైన ఈయన జీతం ఎంత ఉంటుందనేది బహుశా ఎవ్వరికీ తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం.జెఫ్ బెజోస్ సంపద భారీగా ఉన్నప్పటికీ.. కంపెనీలో అతని వార్షిక వేతనం 80000 డాలర్లు (సుమారు రూ.67 లక్షలు) మాత్రమే అని సమాచారం. 1998 నుంచి కూడా అతని బేసిక్ శాలరీలో ఎలాంటి మార్పు లేదని తెలిసింది.నేను సంస్థ వ్యవస్థాపకుడిని, కాబట్టి ఇప్పటికే కంపెనీలో పెద్ద వాటా కలిగి ఉన్నాను. ఇలాంటి సమయంలో ఎక్కువ జీతం తీసుకోవడం ఏ మాత్రం సమంజసం కాదని నిర్ణయించుకున్నాను, అందుకే తక్కువ జీతం తీసుకుంటున్నా అని బెజోస్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.కంపెనీలోని వాటాల ద్వారానే మిలియన్ల సంపాదిస్తున్నారు. 2023 - 24 మధ్య.. సంవత్సరంలో గంటకు 8 మిలియన్లు సంపాదించినట్లు సమాచారం. కంపెనీ సీఈఓగా వైదొలగిన తరువాత.. బెజోస్ తన అమెజాన్ స్టాక్లోని చాలా భాగాన్ని క్రమంగా విక్రయించారు. 2025 చివరి నాటికి 25 మిలియన్ షేర్లను విక్రయించాలని యోచిస్తున్నట్లు ఫార్చ్యూన్ నుంచి వచ్చిన ఒక నివేదిక ద్వారా తెలిసింది.కంపెనీ నుంచే తనకు భారీ లాభాలు వస్తున్న సమయంలో.. తనకు సంస్థ నుంచి అదనపు ప్రోత్సాహకాలు అవసరం లేదని, అలాంటివి అందకుండా చూడాలని అమెజాన్ కమిటీని కోరినట్లు సమాచారం. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఎక్కువ జీతం తీసుకుంటే.. అసౌకర్యంగా ఉంటుందని బెజోస్ వివరించారు.ఇదీ చదవండి: గుకేశ్ ప్రైజ్మనీలో చెల్లించాల్సిన ట్యాక్స్ ఎంతంటే?నిజానికి బిలియనీర్లు తక్కువ జీతం తీసుకుంటే.. తక్కువ పన్నులు చెల్లించాలి. ప్రోపబ్లిక 2021 నివేదిక ప్రకారం, బెజోస్ 2007, 2011లో ఫెడరల్ ఆదాయపు పన్ను చెల్లించలేదు. ఎందుకంటే ఈయన తన జీతం కంటే ఎక్కువ నష్టాలను చూపించారు. కాబట్టి ఆ సంవత్సరాల్లో భారీ ట్యాక్స్ చెల్లించకుండానే బయటపడ్డారు. -
అమెజాన్ రూ.8.3 కోట్లు విరాళం
కొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార నిధికి అమెజాన్ ఒక మిలియన్ డాలర్లు(రూ.8.3 కోట్లు) విరాళంగా ఇవ్వాలని యోచిస్తోంది. తన ప్రైమ్ వీడియో సర్వీస్లో ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా ప్రసారం చేయనుందని కంపెనీ ప్రతినిధి ఇప్పటికే ధ్రువీకరించారు. ఇందుకోసం అమెజాన్ మరో రూ.8.3 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ నేపథ్యంలో త్వరలో బెజోస్ ట్రంప్ను కలవబోతున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి.ఇప్పటికే మెటా ఛైర్మన్ మార్క్ జూకర్బర్గ్ ఇటీవల ట్రంప్ నివాసంలో కలిసి తన ప్రమాణ స్వీకార నిధికి ఒక మిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. కాబోయే అధ్యక్షుడితో తమ సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రధాన టెక్ కంపెనీలు ప్రయత్నిస్తున్నట్లు తెలిస్తుంది. కాగా, ట్రంప్ తన మొదటి పదవీకాలంలో అమెజాన్ను విమర్శించారు. గతంలో బెజోస్కు చెందిన వాషింగ్టన్ పోస్ట్లో రాజకీయ కవరేజీపై ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. 2019లో ట్రంప్ మొదటి హయాంలో పెంటగాన్ కాంట్రాక్ట్కు సంబంధించి అమెజాన్కు విరుద్ధంగా వ్యవహరించారనే వాదనలున్నాయి.ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బెజోస్ న్యూయార్క్లో జరిగిన డీల్ బుక్ సమ్మిట్లో మాట్లాడుతూ ట్రంప్ రెండోసారి అధికారంలోకి రావడంపై సంతోషంగా ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న ప్రణాళికలను సమర్థిస్తున్నట్టు తెలిపారు. 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి తర్వాత ట్రంప్ ఫేస్బుక్ ఖాతాను నిలిపేస్తున్నట్లు మెటా ప్రకటించింది. 2023 ప్రారంభంలో కంపెనీ తన ఖాతాను పునరుద్ధరించింది.ఇదీ చదవండి: 10 రోజుల్లో 10000 మంది కొన్న కారు ఇదే..ఎలాన్మస్క్ ఇప్పటికే ట్రంప్నకు పూర్తి మద్దతినిచ్చారు. ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించాక తన కార్యవర్గంలో మస్క్, వివేక్రామస్వామిని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) సంయుక్త సారథులుగా నియమించిన విషయం తెలిసిందే. -
అమెజాన్ కొత్త అడుగు..
ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ దేశీయంగా క్విక్ కామర్స్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ’15 నిమిషాల లోపే’ నిత్యావసరాలను డెలివరీ చేసేలా బెంగళూరులో పైలట్ ప్రాజెక్టును ఈ నెలలో మొదలుపెట్టబోతున్నట్లు అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ సమీర్ కుమార్ తెలిపారు. దేశీయంగా ఇప్పటికే క్విక్ కామర్స్ మార్కెట్లో బ్లింకింట్, జెప్టో మొదలైనవి విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.డేటమ్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఈ మార్కెట్ 6.1 బిలియన్ డాలర్లుగా ఉండగా 2030 నాటికి 40 బిలియన్ డాలర్లకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు భారత్లో ఈ–కామర్స్ వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని కుమార్ వివరించారు. ఇక్కడ విక్రేతలు.. ఔత్సాహిక వ్యాపారవేత్తల సంఖ్య పెరుగుతుండటం, నాణ్యమైన తయారీ, సానుకూల పాలసీలు, టెక్నాలజీ మొదలైనవన్నీ ఇందుకు దోహదపడే అంశాలని పేర్కొన్నారు.భారీ డిస్కౌంట్లతో చిన్న వ్యాపారాలను దెబ్బతీస్తోందంటూ అమెజాన్పై వచ్చే ఆరోపణల మీద స్పందిస్తూ.. తమ కంపెనీ కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా, నిబంధనల మేరకు వ్యాపారం నిర్వహిస్తోందని కుమార్ చెప్పారు. చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలు కూడా మనుగడ సాగించేలా తోడ్పాటు అందించడమనేది ఒక పెద్ద కంపెనీగా తన బాధ్యతగా అమెజాన్ భావిస్తుందని పేర్కొన్నారు. 80 బిలియన్ డాలర్ల ఎగుమతులు అమెజాన్ 2030 నాటికి భారత్ నుండి మొత్తం ఎగుమతులు 80 బిలియన్ డాలర్లకు చేర్చనున్నట్టు ప్రకటించింది. 2015 నుంచి కంపెనీ ఎగుమతులు చేపడుతోంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం, లక్షలాది భారతీయ చిన్న వ్యాపారులు, డైరెక్ట్ టు కంజ్యూమర్ బ్రాండ్లతోపాటు ఇతర కీలక వాటాదారులతో కలిసి పనిచేస్తున్నట్టు అమెజాన్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఎస్వీపీ అమిత్ అగర్వాల్ తెలిపారు.సంస్థ ఏటా నిర్వహించే సంభవ్ సదస్సు సందర్భంగా ఆయన మాట్లాడారు. 2030 నాటికి మొత్తం 80 బిలియన్ డాలర్ల ఎగుమతులను అందుకునేందుకు నిబద్ధతతో ఉన్నట్టు వివరించారు. 2015లో ప్రారంభించినప్పటి నుండి అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ భారత్లోని 200లకుపైగా నగరాల నుండి 1,50,000 పైచిలుకు నమోదిత విక్రేతలను కలిగి ఉందని చెప్పారు. 2025 చివరి నాటికి భారత్ నుండి మొత్తం ఎగుమతులు 20 బిలియన్ డాలర్లను అధిగమించబోతున్నాయని కంపెనీ బ్లాగ్ తెలిపింది. గడువు కంటే ముందుగానే.. భారత్ను గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా స్థాపించడానికి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్తో (డీపీఐఐటీ) అమెజాన్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. తయారీ స్టార్టప్స్లో 120 మిలియన్ డాలర్లు పెట్టుబడి చేయనున్నట్టు ప్రకటించింది. అమెజాన్ ఒక కోటి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను డిజిటలీకరణ చేస్తామని, 2025 నాటికి భారత్ నుండి మొత్తం 20 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులను సాధించి.. దేశంలో 20 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని గతంలో హామీ ఇచ్చింది. గడువు కంటే ఏడాది ముందుగానే డిజిటలీకరణ లక్ష్యాన్ని పూర్తి చేసినట్టు అమెజాన్ తెలిపింది. 1.2 కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల డిజిటలైజ్ చేశామని, మొత్తం ఎగుమతులు 13 బిలియన్ డాలర్లు నమోదయ్యాయని, 14 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు అందించామని వివరించింది. లాజిస్టిక్స్ సేవలు.. దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థలు, డైరెక్ట్ టు కంజ్యూమర్ (డీ2సీ) బ్రాండ్స్ కోసం అమెజాన్ షిప్పింగ్, అమెజాన్ ఫ్రైట్ పేరుతో సరుకు రవాణా సేవలను ప్రారంభించినట్లు అమిత్ అగర్వాల్ ప్రకటించారు. అమెజాన్ ఫ్రైట్ కింద నగరాల మధ్య, నగరాల్లో రవాణా కోసం పూర్తి ట్రక్లోడ్ సరుకు రవాణా సేవలను అందిస్తారు. అలాగే అమెజాన్ షిప్పింగ్ కింద బిజినెస్ టు కంజ్యూమర్ (బీ2సీ) పార్సిల్ డెలివరీలను చేపడతారు. -
విద్యార్థులకు ఏడబ్ల్యూఎస్ గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) తాజాగా 100 మిలియన్ డాలర్ల క్లౌడ్ క్రెడిట్స్ను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ లెర్నింగ్ సొల్యూషన్స్ అభివృద్ధి, తదుపరి స్థాయికి చేర్చడంలో అర్హత కలిగిన విద్యా సంస్థలు, పేద విద్యార్థులకు సహాయం చేయడానికి రాబోయే ఐదేళ్లలో ఈ క్రెడిట్స్ను అందజేయనున్నట్లు వెల్లడించింది.ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేషన్ ఈక్విటీ ఇనిషియేటివ్ కింద గ్రహీతలకు నగదు వలె పనిచేసే క్లౌడ్ క్రెడిట్స్ను మంజూరు చేస్తారు. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సేవలను ఉపయోగించినప్పుడు సంస్థలు వారి ఖర్చులను తగ్గించుకోవడానికి ఇది వీలు కల్పిస్తుందని కంపెనీ తెలిపింది.ఈ క్రెడిట్స్తో గ్రహీతలు ఏఐ అసిస్టెంట్స్, కోడింగ్ కరికులమ్స్, కనెక్టివిటీ టూల్స్, ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్స్, మొబైల్ అప్లికేషన్స్, చాట్బాట్స్తోపాటు వివిధ సాంకేతిక ఆధారిత అభ్యాస అనుభవాల వంటి ఆవిష్కరణలను రూపొందించడానికి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ టెక్నాలజీ, అధునాతన ఏఐ సేవలను ఉపయోగించుకోవచ్చు. -
ప్రియురాలిని పెళ్లి చేసుకోబోతున్న అమెజాన్ ఫౌండర్ (ఫోటోలు)
-
ఆఫీస్కు రండి.. లేదా కంపెనీ మారండి!
ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులకు అమెజాన్ ఇకపై పూర్తిగా ఆఫీస్ నుంచి పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జనవరి, 2025 నుంచి వారానికి ఐదు రోజులు కార్యాలయం నుంచే పని చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఏడబ్ల్యూఎస్) సీఈఓ మాట్ గార్మాన్ స్పష్టం చేశారు. కంపెనీ వృద్ధి కోసం విభిన్న ఆలోచనలు పంచుకునేందుకు ఉద్యోగుల వ్యక్తిగత సహకారం అవసరమని తెలిపారు.పదిలో తొమ్మిది మంది ఓకేఈ సందర్భంగా గార్మాన్ మాట్లాడుతూ..‘కంపెనీ వృద్ధికి ఉద్యోగులు సహకరించాలి. ఇప్పటి వరకు చాలామంది ఇంటి నుంచి పని చేస్తున్నారు. ఇకపై ఈ విధానం మారనుంది. 2025, జనవరి నుంచి ఉద్యోగులు పూర్తిగా కార్యాలయం నుంచే పని చేయాల్సి ఉంటుంది. ఈ చర్య సంస్థ ప్రతిష్టాత్మక లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందని నమ్ముతున్నాం. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయానికి కట్టుబడని వారు ఇతర సంస్థల్లో చేరవచ్చు. పూర్తి సమయం పని చేసేందుకు ఇష్టపడని ఉద్యోగుల కోసం ఇతర కంపెనీలు వారి అవసరాలకు బాగా సరిపోయే పని వాతావరణాన్ని అందించవచ్చు. చాలా మంది ఉద్యోగులు మార్పుకు మద్దతు ఇస్తున్నారు. నేను మాట్లాడిన పది మంది ఉద్యోగుల్లో తొమ్మిది మంది కంపెనీ నిర్ణయానికి అనుకూలంగా ఉన్నారు’ అని గార్మాన్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: మస్క్పై ట్రంప్ ప్రశంసల జల్లు: ఆయనో మేధావి అంటూ..ఉత్పాదకత పెరుగుతున్నట్లు ఆధారాలు లేవుఇదిలాఉండగా, చాలా మంది అమెజాన్ ఉద్యోగులు కంపెనీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఐదు రోజులు కార్యాలయంలో పని చేసేందుకు తాము సిద్ధంగా లేమన్నారు. ఆఫీస్లో పని చేయడం ద్వారా ఉత్పాదకత మెరుగవుతుందనడానికి స్పష్టమైన ఆధారాలు లేవన్నారు. కార్యాలయానికి వెళితే అనవసరమైన ప్రయాణ సమయం, ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఇప్పటి వరకు అమెజాన్ తన ఉద్యోగులను వారానికి మూడు రోజులు కార్యాలయంలో పని చేయాలని కోరింది. కొంతమంది ఉద్యోగులు ఇప్పటికీ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులను వారానికి రెండు లేదా మూడు రోజులు ఆఫీసు నుంచి పని చేయడానికి అనుమతించింది. ఈ విధానాన్ని కాదని అమెజాన్ ఐదు రోజులు ఆఫీస్కు రమ్మనడం తగదని కొందరు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. -
పండగల్లో రూ. లక్ష కోట్ల వస్తువులు కొనేశారు
సాక్షి, అమరావతి: ఈ పండుగల సీజన్లో అన్లైన్ అమ్మకాలు రికార్డుస్థాయిలో దుమ్ము రేపాయి. దేశ చరిత్రలో తొలిసారిగా కేవలం నెల రోజుల్లో లక్ష కోట్లకు పైగా ఆన్లైన్ కొనుగోళ్లు జరిగాయి. దసరా దీపావళి పండుగలకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రవేశపెట్టిన భారీ డిస్కౌంట్ ఆఫర్లు సూపర్ హిట్ అయ్యాయి. ఈకామర్స్ కన్సల్టెన్సీ సంస్థ డాటమ్ ఇంటెలిజెన్స్ ఈ విషయాలు తెలిపింది. ఇదే సీజన్లో 2022లో రూ.69,000 కోట్ల విలువైన అమ్మకాలు జరగ్గా, 2023లో రూ.81,000 కోట్లుకు చేరాయని, ఈ ఏడాది రూ.లక్ష కోట్లు దాటినట్లు ఆ సంస్థ సర్వేలో వెల్లడైంది. ఇటీవలి దసరా సమయలో రూ.55,000 కోట్ల అమ్మకాలు జరిగితే దీపావళి సమయంలో మరో రూ.50,000 కోట్ల అమ్మకాలు జరిగినట్లు డాటమ్ పేర్కొంది.నాన్ మెట్రో అమ్మకాలే అధికం ఈసారి ఆన్లైన్ అమ్మకాల్లో నాన్ మెట్రో పట్టణాలు సత్తా చూపించాయి. మొత్తం అమ్మకాల్లో 85 శాతం చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచే జరిగినట్లు అమెజాన్ పేర్కొంది. మొత్తం అమ్మకాల్లో 65 శాతం స్మార్ట్ ఫోన్లే ఉన్నాయంటే ఏ స్థాయిలో మొబైల్ ఫోన్లను కొన్నారో అర్థం చేసుకోవచ్చు. ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఉన్న లగ్జరీ స్మార్ట్ ఫోన్లపై యువత అత్యంత ఆసక్తిని కనబర్చినట్లు తేలింది. గతేడాదితో పోలిస్తే లగ్జరీ వస్తువుల అమ్మకాల్లో 30 శాతం వృద్ధి నమోదు కాగా, బ్రాండెడ్ లగ్జరీ ఫ్యాషన్ అమ్మకాల్లో 400 శాతం వృద్ధి నమోదైంది. లగ్జరీ వాచీలు, డియోడరెంట్లు, హ్యాండ్బాగ్స్, స్పోర్ట్స్ వేర్, కిడ్స్వేర్ రంగాల్లో అమ్మకాలు అత్యధికంగా జరిగినట్లు డాటమ్ నివేదిక పేర్కొంది. -
కాసులు కురిపించిన షేర్లు.. కుబేరుల్లో రెండో స్థానానికి జెఫ్ బెజోస్
అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్కు షేర్లు కాసులు కురిపించాయి. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేర్చాయి. 3 బిలియన్ డాలర్లు (రూ.25 వేల కోట్లు) విలువైన అమెజాన్ షేర్లను బెజోస్ ఇటీవల విక్రయించారు. దీంతో ఈ సంవత్సరానికి ఆయన మొత్తం స్టాక్ అమ్మకాలు 13 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. బెజోస్ 1.6 కోట్లకు పైగా షేర్లను విక్రయించారు. ఇటీవల భారీగా పెరిగిన అమెజాన్ స్టాక్ ధరను ఆయన సద్వినియోగం చేసుకున్నారు. ఒక్కో షేరు ధర 200 డాలర్లను తాకింది. అమెజాన్ స్టాక్ గత సంవత్సరంలో 40 శాతానికి పైగా పెరిగింది. ఇటీవల ప్రకటించిన మూడవ త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించి రాణించడంతో గత వారం రోజుల్లోనే షేర్ల విలువ 7 శాతం పెరిగింది.ఇదీ చదవండి: చనిపోయినా.. చచ్చేంత సంపాదనఅమెజాన్ స్టాక్ల విలువ పెరగడంతో బెజోస్ సంపద కూడా పెరిగింది. ఇది గత సంవత్సరంలో 42.8 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ నవంబర్ 3 నాటికి, బెజోస్ 220 బిలియన్ డాలర్ల నెట్వర్త్తో బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో రెండవ స్థానంలో ఉన్నారు. టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ 262 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉండగా, మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ 201 బిలియన్ డాలర్లతో మూడవ స్థానంలో ఉన్నారు. -
అలెక్సా చెబితే టపాసు వింటోంది!
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని చాలామంది టపాసులు కాలుస్తారు. కొంతమంది సరైన నిబంధనలు పాటించకుండా వాటిని కాల్చి గాయాలపాలవుతారు. అలాంటి వారికోసం టెక్నాలజీ వినియోగించి టపాసులను నేరుగా ముట్టించకుండా కాల్చే విధానాన్ని ఇటీవల ఓ వ్యక్తి ప్రయోగించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అమెజాన్ ఏఐ అలెక్సాను ఉపయోగించి టపాసు పేల్చినట్లు ఉన్న ఈ వీడియోను ఇప్పటికే 1.3 కోట్ల మంది వీక్షించడం గమనార్హం.ఇదీ చదవండి: టికెట్ బుక్ అవ్వకుండానే రూ.100 కట్! ఐఆర్సీటీసీ రిప్లై ఇదే..హైటెక్ లాంచ్మనీస్ప్రాజెక్ట్ల్యాబ్ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అప్లోడ్ చేసిన వీడియో ప్రకారం..అమెజాన్కు చెందిన ఏఐ అలెక్సాతో టపాసు రాకెట్ను అనుసంధానించారు. ‘అలెక్సా లాంచ్ ది రాకెట్’ అనే కమాండ్ ఇవ్వగానే అలెక్సా ‘యెస్ బాస్, లాంచింగ్ ది రాకెట్’ అని రిప్లై రావడంతోపాటు అప్పటికే రాకెట్ చివర నిప్పు రాజుకునేలా వైర్లతో ఏర్పాటు చేశారు. దాంతో అలెక్సా కమాండ్ స్వీకరించిన వెంటనే వైర్లలో కరెంట్ సరఫరా అయి నిప్పు రావడంతో రాకెట్ గాల్లోకి దూసుకెళ్లడం వీడియోలో గమనించవచ్చు. ఇంట్లో చిన్న పిల్లలకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇంకొందరు ఈ ప్రయోగం చేసిన వ్యక్తి ఇండియన్ ఇలాన్మస్క్ అని సరదాగా రిప్లై ఇస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికే ఈ వీడియోను 13 మిలియన్ల మంది వీక్షించారు. View this post on Instagram A post shared by Mani's Projects Lab (@manisprojectslab) -
హెచ్పీసీఎల్తో అమెజాన్ జట్టు
ముంబై: సుదూర రవాణా కోసం కర్బన ఉద్గారాలను తక్కువగా వెదజల్లే ఇంధనాల (లో కార్బన్ ఫ్యూయల్స్) అభివృద్ధి, వినియోగానికై ప్రభుత్వ రంగ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్తో ఒప్పందం చేసుకున్నట్టు ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ సోమవారం ప్రకటించింది.సుదూర రవాణాకు ఉపయోగించే వాహనాల్లో ఇంధనాలను పరీక్షించడానికి ఇరు సంస్థలు పైలట్ను నిర్వహిస్తాయి. కర్బన ఉద్గారాలను తక్కువగా వెదజల్లే ఇంధనాలను సులభంగా వినియోగించడానికి ఇంధన కేంద్రాలు, మొబైల్ రీఫ్యూయలింగ్ స్టేషన్ల ఏర్పాటు అవకాశాలను అన్వేíÙస్తామని అమెజాన్ ఇండియా తెలిపింది.ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, హర్యానాలోని బహదూర్గఢ్లో ఇంధన ఉత్పత్తికి వ్యవసాయ, పారిశ్రామిక వ్యర్థాలను ఉపయోగిస్తామని వివరించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇంధన కేంద్రాలు, మొబైల్ రీఫ్యూయలింగ్ స్టేషన్లను అభివృద్ధి చేయడంలో ఈ చొరవ సహాయపడుతుందని పేర్కొంది. -
గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం పన్ను?
కర్ణాటక ప్రభుత్వం గిగ్ వర్కర్ల(షార్ట్టర్మ్, ఫ్లెక్సిబుల్ సమయాల్లో పని చేసేవారు) సంక్షేమం కోసం చర్యలు తీసుకోనుంది. వీరి భద్రత కోసం స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఉబెర్ వంటి ఆన్లైన్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్లపై కర్ణాటక ప్రభుత్వం 1-2 శాతం పన్ను విధించాలని యోచిస్తోంది. ఈమేరకు సబ్కమిటీని ఏర్పాటు చేసి ఈ అంశంపై మరింత చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లు అధికారులు తెలిపారు.ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్స్ (సామాజిక భద్రత, సంక్షేమం) బిల్లు, 2024కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేక సబ్కమిటీ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనిపై వచ్చే వారం చర్చ జరగనుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు. ముసాయిదా బిల్లు ప్రకారం..రాష్ట్ర ప్రభుత్వం ‘ది కర్ణాటక గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ ఫండ్’ పేరుతో ఒక నిధిని ఏర్పాటు చేస్తుంది. దీని కోసం ఆన్లైన్ అగ్రిగేటర్ల నుంచి ‘ప్లాట్ఫారమ్ ఆధారిత గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ ఫీజు’ వసూలు చేయాలని భావిస్తుంది. ఈ ఫీజును ప్రతి త్రైమాసికం చివరిలో రాష్ట్ర ప్రభుత్వానికి చేరేలా ముసాయిదా బిల్లులో ప్రతిపాదనలు చేర్చినట్లు అధికారులు చెప్పారు.ఈ విషయం తెలిసిన టెక్ స్టార్టప్ కంపెనీలు, ఇప్పటికే ఈ విభాగంలో సేవలందిస్తున్న సంస్థలు ఒక గ్రూప్గా చేరి తమ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్), ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) వంటి వివిధ వాణిజ్య సంస్థల ద్వారా ఈ బృందం రాష్ట్ర ప్రభుత్వానికి తమ వినతులు సమర్పించింది. ఈ బిల్లు వల్ల తమ వ్యాపారానికి నష్టాలు తప్పవని చెబుతున్నాయి. సంస్థల కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని తెలియజేస్తున్నాయి.ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ సంస్థల ఎగుమతులు పెంపురూ.2 ప్లాట్ఫామ్ ఫీజు రూ.6కు పెంపు..స్విగ్గీ ఏప్రిల్ 2023లో, జొమాటో ఆగస్టు, 2023లో ప్లాట్ఫామ్ రుసుమును రూ.2గా ప్రవేశపెట్టారు. అయినా కంపెనీలకు వచ్చే ఆర్డర్లు తగ్గకపోవడంతో కస్టమర్లు ఛార్జీల పెంపును అంగీకరిస్తున్నారని భావించారు. దాంతో క్రమంగా ప్లాట్ఫామ్ ఫీజును పెంచుతూ రూ.6 వరకు తీసుకొచ్చారు. జొమాటో రోజూ సుమారు 22-25 లక్షల ఆర్డర్లను డెలివరీ ఇస్తోంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గతంలో జొమాటో తన ప్లాట్ఫారమ్ ఫీజును ఆర్డర్కు రూ.9కి పెంచింది. స్విగ్గీ బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ఇతర నగరాల్లోని నిర్దిష్ట కస్టమర్లకు రూ.10 వసూలు కూడా వసూలు చేసిన సంఘటనలున్నాయి. -
రిటర్న్ టు ఆఫీస్.. ‘నచ్చకపోతే వెళ్లిపోవచ్చు’
ఇంటి నుంచి పనిచేసే విధానానికి దాదాపు అన్ని కంపెనీలు ఇప్పటికే ముగింపు పలికేశాయి. కొన్ని కంపెనీలు వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి ఇంకొన్ని రోజులు ఆఫీస్ నుంచి పనిచేసే హైబ్రిడ్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇప్పుడు ఆ పద్ధతికీ మంగళం పాడేసి పూర్తిగా రిటర్న్ టు ఆఫీస్ విధానాన్ని అమలు చేయడం ప్రారంభించాయి.ప్రపంచ టెక్నాలజీ దిగ్గజమైన అమెజాన్ కూడా ఇటీవల వారానికి 5-రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని ప్రకటించింది. అయితే దీనిపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. వివాదాస్పదమైన ఈ విధానాన్ని అమెజాన్ టాప్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తాజాగా సమర్థించారు. దీనికి మద్దతు ఇవ్వని వారు మరొక కంపెనీకి వెళ్లిపోవచ్చని చెప్పారు.ఇదీ చదవండి: ఉద్యోగులను తొలగిస్తున్న మెటా..అమెజాన్ ఏడబ్ల్యూఎస్ ఆల్-హ్యాండ్ మీటింగ్లో ఆ యూనిట్ సీఈవో మాట్ గార్మాన్ ప్రసంగిస్తూ.. తాను పది మందితో మాట్లాడితే వారిలో తొమ్మిది మంది జనవరిలో అమలులోకి వచ్చే కొత్త విధానానికి మద్దతుగా మాట్లాడారని చెప్పారు. కొత్త విధానం నచ్చని వారు నిష్క్రమించవచ్చని ఆయన సూచించారని రాయిటర్స్ పేర్కొంది.అమెజాన్ ప్రస్తుతం మూడు రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తోంది. అయితే సీఈవో ఆండీ జాస్సీ గత నెలలో ఐదు రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని ప్రకటించారు. దీంతో అనేకమంది ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. కొంతమంది అయితే స్వచ్ఛంద రాజీనామాలకు దిగుతున్నట్లు చెప్పారు. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి తోటి టెక్నాలజీ కంపెనీలు రెండు-మూడు రోజుల ఇన్-ఆఫీస్ పాలసీలను అమలు చేస్తుండగా అమెజాన్ మరో అడుగు ముందుకేసి పూర్తిగా ఐదు రోజుల ఇన్-ఆఫీస్ పాలసీ అమలుకు సిద్ధమైంది. -
అమెజాన్ చేతికి ఎంఎక్స్ ప్లేయర్
ఉచిత స్ట్రీమింగ్ ఓటీటీ ప్లాట్ఫాం ‘ఎంఎక్స్ ప్లేయర్’ను కొనుగోలు చేసినట్లు అమెజాన్ వెల్లడించింది. దాన్ని తమ కంటెంట్ స్ట్రీమింగ్ సర్వీస్ మినీటీవీలో విలీనం చేసి ‘అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్’ కింద ఒకే సర్వీసుగా మార్చినట్లు పేర్కొంది. అమెజాన్ యాప్, ప్రైమ్ వీడియో, ఫైర్ టీవీ, కనెక్టెడ్ టీవీల ద్వారా ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది.అమెజాన్, ఎంఎక్స్ ప్లేయర్ రెండు సర్వీసుల అనుసంధానం ఆటోమేటిక్గా జరుగుతుందని, దీనికోసం ఆయా యాప్లను రీఇన్స్టాల్ లేదా అప్గ్రేడ్ చేయనక్కర్లేదని వివరించింది. సెప్టెంబర్లో రెండు సర్వీసులను 25 కోట్ల మంది యూజర్లు వినియోగించుకున్నట్లు అమెజాన్ పేర్కొంది. అయితే, ఈ డీల్ విలువ ఎంతనేది మాత్రం కంపెనీ వెల్లడించలేదు. సర్వీసును ఉచితంగా కొనసాగేస్తూనే మరింత నాణ్యమైన కంటెంట్ను, మెరుగైన స్ట్రీమింగ్ అనుభూతిని అందించేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ హెడ్ కరణ్ బేడీ తెలిపారు. ఓటీటీ ప్లాట్ఫామ్కు ఆదరణ పెరుగుతుండడంతో కంపెనీలు ఇప్పటికే మార్కెట్ ఉన్న వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.ఇదీ చదవండి: అనుకున్నదే జరిగింది.. వడ్డీలో మార్పు లేదు -
కమలా హ్యారిస్ ఖాళీ బుక్... బెస్ట్ సెల్లర్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారపర్వంలో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్పై వ్యంగ్యాస్త్రంగా ఇటీవల వెలువడిన పుస్తకం ‘అమెజాన్’ బెస్ట్ సెల్లర్గా నిలిచింది. ‘ది అచీవ్మెంట్స్ ఆఫ్ కమలా హ్యారిస్’ అనే ఈ పుస్తకంలో ఉన్నవల్లా దాదాపు ఖాళీ పేజీలే! ఈ పుస్తకంలో కొన్ని అధ్యాయాల పేర్లు మాత్రమే ముద్రించి, అధ్యాయానికీ అధ్యాయానికీ మధ్యనున్న పేజీలన్నీ ఖాళీ తెల్లకాగితాలుగా విడిచిపెట్టి అచ్చేశారు. వాల్మార్ట్ బుక్స్టోర్లో ఒక వ్యక్తి ఈ పుస్తకం వీడియోను చిత్రించి ‘టిక్ టాక్’లో పోస్ట్ చేశారు. తర్వాత జాక్ అనే వ్యక్తి ఈ పుస్తకం వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తే, దాదాపు ఏడు గంటల వ్యవధిలోనే ఇరవై లక్షల మందికి పైగా చూశారు. వందలాది మంది దీనిని రీ΄ోస్ట్ చేశారు. కమలా హ్యారిస్ మీద ఈ వెటకారం వీడియో సంగతి ఎలా ఉన్నా, హోరాహోరీ పోరు నెలకొన్న ఈ ఎన్నికల్లో ఆమె విజయం తథ్యమని ‘ఎన్నికల నోస్ట్రడామస్’గా పేరు పొందిన అమెరికన్ రాజకీయ విశ్లేషకుడు అలన్ లిచ్మన్ ఘంటాపథంగా చెబుతుండటం విశేషం. ఇవీ చదవండి: గురుడి చందమామ యూరోపా.. మంచు లోకంలో మహా సముద్రం!నవరాత్రి గార్బా : మా అమ్మ చూసిందంటే నాకు దబిడి దిబిడే! వైరల్ వీడియో -
ఫ్లిప్కార్ట్, అమెజాన్లపై దర్యాప్తు వాయిదా!
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) డైరెక్టర్ జనరల్(డీజీ) చేసిన విధానపరమైన లోపాల కారణంగా ఫ్లిప్కార్ట్, అమెజాన్లపై జరుగుతున్న దర్యాప్తును కర్ణాటక హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ-కామర్స్ దిగ్గజాలు వివిధ నిబంధనలు ఉల్లంఘించాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) గతంలోనే దర్యాప్తు చేపట్టింది. ఈమేరకు డైరెక్టర్ జనరల్ ఆగస్టు 9న ప్రాథమిక దర్యాప్తు నివేదికను సమర్పించింది. అయితే దర్యాప్తు వివరాలను కోర్టులో తెలియజేసే సమయంలో జరిగిన విధానపరమైన లోపం వల్ల సమగ్ర దర్యాప్తును తాత్కాలికంగా నిలిపేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.ప్రాథమిక దర్యాప్తులోని వివరాల ప్రకారం..ఫ్లిప్కార్ట్, అమెజాన్ కంపెనీలు దేశీయంగా ఎఫ్డీఐ నిబంధనలు పాటించడంలేదు. నియమాలకు విరుద్ధంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనే ప్రత్యేకంగా ప్రోడక్ట్ లాంచ్లు ఏర్పాటు చేస్తున్నాయి. మార్కెట్లో వీలుకాని రాయితీలు ఇస్తున్నాయి. ప్రధానంగా మొబైల్ ఫోన్ బ్రాండ్లపై నిర్దిష్ట విక్రయదారులతో కుమ్మక్కై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. దాంతో చిన్న రిటైలర్లు(ఆఫ్లైన్) తీవ్రంగా నష్టపోతున్నారు.ఇదీ చదవండి: యుద్ధంలో విమానాల టార్గెట్పై ఐఏటీఏ వ్యాఖ్యలుప్రాథమిక దర్యాప్తునకు సంబంధించి కోర్టుకు వివరాలు వెల్లడించే సమయంలో ఫ్లిప్కార్ట్, అమెజాన్ సంస్థలను ‘థర్డ్ పార్టీస్’గా డైరెక్టర్ జనరల్ వర్గీకరించింది. కానీ ఇటీవల కోర్టులో వివరాలు తెలిపే సమయంలో ‘ఆపోజిట్ పార్టీస్(విరుద్ధ సంస్థలు)’గా అభివర్ణించింది. దాంతో కోర్టు స్పందిస్తూ డైరెక్టర్ జనరల్ కంపెనీలను సంబోధించిన తీరును తప్పుపట్టింది. ఇరు సంస్థలను ఆపోజిట్ పార్టీస్ అని అభివర్ణించేందుకు కమిషన్ నుంచి ఏదైనా అనుమతులు తీసుకున్నారా అని ప్రశ్నించింది. దీనిపై వివరణ కోరుతూ విచారణను ఈ నెల 21కు వాయిదా వేసింది. అప్పటివరకు డైరెక్టర్ జనరల్ నిర్వహిస్తున్న సమగ్ర దర్యాప్తును నిలిపేయాలని ఆదేశించింది. ఇదిలాఉండగా, సంస్థల వర్గీకరణకు సీసీఐ ధ్రువీకరణ తప్పనిసరి. -
ఇండియా పోస్ట్, అమెజాన్ జత
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా డెలివరీ సర్వీసుల సామర్థ్యాన్ని పెంపొందించుకునే బాటలో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్, పోస్టల్ శాఖ(ఇండియా పోస్ట్) జతకట్టాయి. ఇందుకు అమెజాన్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్, ఇండియా పోస్ట్ అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. దాంతో దేశవ్యాప్త లాజిస్టిక్స్ సర్వీసుల్లో వ్యూహాత్మక భాగస్వామ్యానికి తాజాగా తెరతీశాయి.సామర్థ్యాల పెంపు, పటిష్టంగా వనరుల వినియోగం, రవాణా నెట్వర్క్లను పంచుకోవడం తదితరాల కోసం పరస్పరం సహకరించుకోనున్నట్లు సంయుక్త ప్రకటనలో వివరించాయి. 1,65,000 పోస్టాఫీసుల నెట్వర్క్ కలిగిన ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా ఈకామర్స్ను విస్తరించేందుకు దోహదపడనున్నట్లు పోస్టల్ సెక్రటరీ వందితా కౌల్ పేర్కొన్నారు. ఇండియా పోస్ట్ సర్వీసులను ఆధునీకరించడం, నూతన సాంకేతికతలను వినియోగించడం తదితర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అమెజాన్తో చేతులు కలిపినట్లు వివరించారు. నిజానికి 2013లోనే కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ దేశవ్యాప్త డెలివరీలకు అమెజాన్ ఇండియా పోస్ట్తో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇక 2023లో సమీకృత విదేశీ లాజిస్టిక్స్ సొల్యూషన్ల కోసం రెండు సంస్థలు ఎంవోయూ కుదుర్చుకున్నాయి. తద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహాసంస్థ (ఎంఎస్ఎంఈ)ల ఈకామర్స్ ఎగుమతులకు తెరతీశాయి.ఇదీ చదవండి: సెప్టెంబర్లో ‘సేవలు’ పేలవం