Aakash Chopra
-
Ind vs Ban: భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్!
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్కు టీమిండియా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ మెగా ఈవెంట్లో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనున్న రోహిత్ సేనకు లీగ్ దశలోని మూడు మ్యాచ్లు కీలకమే. ఇందులో ఒక్కటి ఓడినా సెమీ ఫైనల్ చేరే అవకాశాలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మూల్యం చెల్లించాల్సి వస్తుందంటున్నాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra). టీమిండియా ఈ టోర్నీలో ఆడబోయే తొలి మ్యాచ్కు తన ప్లేయింగ్ ఎలెవన్ ఇదేనంటూ యూట్యూబ్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. పేసర్ల విభాగంలో మాత్రంజట్టులో ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లతో పాటు ఓ స్పెషలిస్టు స్పిన్నర్ తప్పక ఉంటాడన్న ఆకాశ్ చోప్రా.. అయితే, ఈ విషయంలో కెప్టెన్, హెడ్కోచ్ ఎవరివైపు మొగ్గుచూపుతారన్నది చెప్పడం కాస్త కష్టమేనని పేర్కొన్నాడు. ఇక పేసర్ల విభాగంలో మాత్రం మొదటి ప్రాధాన్య ఆటగాడిగా అర్ష్దీప్ సింగ్కు తప్పక స్థానం దక్కుతుందని అంచనా వేశాడు.కాగా 2017 తర్వాత తొలిసారిగా చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. పాకిస్తాన్(Pakistan) వేదికగా ఈ వన్డే ఫార్మాట్ టోర్నీ మొదలుకానుండగా... టీమిండియా మాత్రం తమ మ్యాచ్లు దుబాయ్లో ఆడనుంది. ఇందులో భాగంగా గురువారం(ఫిబ్రవరి 20) రోహిత్ సేన తమ తొలి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్-‘ఎ’లో ఉన్న బంగ్లాదేశ్తో తలపడనుంది.ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ- శుబ్మన్ గిల్.. కెప్టెన్, వైస్ కెప్టెన్.. ఓపెనర్లుగా వీరే ఉంటారు. ఇక వన్డౌన్ బ్యాటర్ గురించి సందేహాలు అక్కర్లేదు. రన్ మెషీన్ కోహ్లి మూడో స్థానంలో వస్తాడు.ఇక నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడతాడు. నా అభిప్రాయం ప్రకారం.. అక్షర్ పటేల్ ఐదు, కేఎల్ రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తారు. హార్దిక్ పాండ్యా ఏడు.. రవీంద్ర జడేజా ఎనిమిదో స్థానంలో ఆడతారు. ఒకవేళ రోహిత్ శర్మ కోరుకుంటే కుల్దీప్ యాదవ్ తుదిజట్టులో ఉంటాడు.నా ఓటు కుల్దీప్ యాదవ్కేఅలా కాకుండా గంభీర్ తన నిర్ణయానుగుణంగానే వెళ్లాలనుకుంటే మాత్రం వరుణ్ చక్రవర్తికి అవకాశం వస్తుంది. అయితే, నేను మాత్రం కుల్దీప్ యాదవ్కే ఓటు వేస్తాను. ఇక నా జట్టులో అర్ష్దీప్ సింగ్ తప్పక ఉంటాడు.అతడికి తోడుగా మహ్మద్ షమీ తుదిజట్టులో ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ అలాగాక హర్షిత్ రాణాను పిలిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మిడిల్, డెత్ ఓవర్లలో అతడు చక్కగా రాణించగలడు’’ అని పేర్కొన్నాడు. దుబాయ్ పిచ్లకు అనుగుణంగా టీమిండియా బ్యాటర్లు క్రీజులో కాస్త ఎక్కువ సమయం గడిపితేనే భారీ స్కోర్లు చేయగలిగే ఆస్కారం ఉంటుందని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025: టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్కు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత తుదిజట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్/వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీ/హర్షిత్ రాణా.చదవండి: శివమ్ దూబే విజృంభణ.. కీలక మ్యాచ్లో ఐదు వికెట్లు -
‘చరిత్ర’లో శంభాజీ గురించి ఎందుకు చెప్పలేదు: మాజీ క్రికెటర్ ప్రశ్న
బాక్సాఫీస్ వద్ద హిందీ చిత్రం ‘ఛావా’(Chhaava Movie) దూసుకెళ్తోంది. విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం తొలి రోజే రూ.31 కోట్లు వసూళ్లు సాధించింది. రిలీజ్ రోజే హిట్ టాక్ రావడంతో వసూళ్లు అమాంతం పెరిగాయి. ఇప్పటి వరకు రూ.121 కోట్లు వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కలెక్షన్ల సంగతి పక్కన పెడితే.. ఈ మూవీపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించారంటూ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ని పొగిడేస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన ఇండియన్ మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ఎక్స్ వేదికగా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే కొన్ని ఆసక్తికర ప్రశ్నలు లేవనేత్తారు.‘ఈ రోజే ఛావా చిత్రం చూశాను. ధైర్యం, నిస్వార్థం, వృత్తిపట్ల ఉన్న అంకితభావం ఉన్న గొప్ప కథ ఇది. నిజాయతీగా ఒక ప్రశ్నలు అడగాలనుకుంటున్నా.. ‘ఛత్రపతి శంభాజీ మహారాజ్ చరిత్ర స్కూల్లో ఎందుకు నేర్పించలేదు? పాఠ్య పుస్తకాల్లో ఆయన గురించి ఎక్కడ ప్రస్తావించలేదు? కానీ అక్బర్ గొప్ప నాయకుడు, న్యాయంగా పాలించిన చక్రవర్తి అని మనం నేర్చుకున్నాం. అంతేకాదు ఢిల్లీలోకి ఓ రహదారికి ఔరంగజేబు రోడ్డు అని పేరు కూడా పెట్టుకున్నాం. అలా ఎందుకు జరిగింది?అని తన ఎక్స్ ఖాతాలో ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు.ఆకాశ్ చోప్రా ట్వీట్పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆకాశ్ ట్వీట్ని సమర్థిస్తుండగా..మరికొంతమంది మాత్రం ఇలాంటి వివాదాలు సృష్టించే ట్వీట్స్ చేయొద్దని విమర్శిస్తున్నారు. ‘చరిత్ర తెలుసుకోవడానికి సినిమా ఎప్పుడూ నమ్మదగిన మాధ్యమం కాదు. ఎవరు ఏ ఏ స్థాయిలో కృషి చేశారనే చరిత్ర మొత్తం చూస్తే అర్థం అవుతుంది. మౌర్య/గుప్త సామ్రాజ్యాలు, అక్బర్, ఔరంగజేబు, శివాజీ సహజంగానే శంభాజీ కంటే ఎక్కువ ప్రాధాన్యతతను పొందారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘చరిత్ర తెలుసుకో ఆకాశ్’ అని మరో నెటిన్ కామెంట్ చేయగా.. ‘నేను హిస్టరీలో టాపర్ని. చరిత్రలో నాకు 80 శాతం మార్కులు వచ్చాయి’ అని ఆకాశ్ రిప్లై ఇచ్చాడు. Watched Chhaava today. Incredible tale of bravery, selflessness and the sense of duty. Genuine question—why were we not taught about Chattrapati Sambhaji Maharaj at all in school? Not even a mention anywhere!!! We did learn though how Akbar was a great and fair emperor, and…— Aakash Chopra (@cricketaakash) February 17, 2025 -
ఆ ముగ్గురికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ: భారత మాజీ క్రికెటర్
దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నమెంట్ నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ మొదలుకానుంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-‘బి’ నుంచి అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి.ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎనిమిది బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఇక 2017లో చివరగా విరాట్ కోహ్లి(Virat Kohli) సారథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ ఆడిన టీమిండియా.. ఈసారి రోహిత్ శర్మ(Rohit Sharma) కెప్టెన్సీలో బరిలో దిగనుంది. నాటి జట్టులో భాగమైన కోహ్లి, రోహిత్తో పాటు.. రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా కూడా ఈసారి చాంపియన్స్ ట్రోఫీ టీమ్లో చోటు దక్కించుకున్నారు.ఆ ముగ్గురికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ నలుగురిలో ముగ్గురికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ కాబోతుందంటూ జోస్యం చెప్పాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘మీ అంచనా వందశాతం నిజమేనని మనస్ఫూర్తిగా చెబుతున్నా.కచ్చితంగా ఇలా జరిగే అవకాశం అయితే ఉంది. త్వరలోనే చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. ఆ తర్వాత వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ రూపంలో మరో ఐసీసీ టోర్నీ ఉంది. అయితే, ఈ ఈవెంట్లో టీమిండియా ఫైనల్కు చేరలేదు కాబట్టి.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా ఇందులో ఆడే అవకాశం లేదు.కారణం ఇదేఇక మరుసటి ఏడాది టీ20 ప్రపంచకప్ జరుగనుంది. అయితే, ఇప్పటికే ఈ ముగ్గురు అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. కాబట్టి ఇందులోనూ వీరు భాగం కాలేరు. ఇక.. మళ్లీ 2027లో వన్డే వరల్డ్కప్ జరుగుతుంది. అందుకు ఇంకా చాలా సమయమే ఉంది. అప్పటికి పరిస్థితుల్లో భారీ మార్పులు రావచ్చు. కాబట్టి.. కోహ్లి, రోహిత్, జడేజాలకు ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ కానుందని చెప్పవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.అన్నీ బాగుండి ఆడాలని కోరుకుంటే మాత్రంఅయితే, ఈ ముగ్గురు లేని లోటు తెలియకుండా టీమిండియా ఆడగలిగినపుడే ఇది సాధ్యమవుతుందని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఫిట్గా ఉండటంతో పాటు ఫామ్ కొనసాగిస్తూ తమకు నచ్చినంత కాలం ఆడాలని ఫిక్సయితే మాత్రం వీరిని ఎవరూ ఆపలేరనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఇంటర్నేషనల్ పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెప్పారు. అయితే, ఐపీఎల్లో మాత్రం ఈ ముగ్గురూ కొనసాగుతున్నారు. ఇక రోహిత్ త్వరలోనే 38వ వసంతంలో అడుగుపెట్టనుండగా.. కోహ్లి, జడేజాలకు ఇప్పుడు 36 ఏళ్లు. చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: CT 2025: సురేశ్ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్కప్ వీరులకు నో ఛాన్స్! -
ఆఖరికి అతడికి జట్టులో స్థానమే లేకుండా చేశారు? ఇదేం పద్ధతి?
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తమ జట్టును ఖరారు చేసింది. ప్రాథమిక జట్టులో రెండు మార్పులు చేస్తూ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)ను తప్పించిన యాజమాన్యం.. జట్టులో కొత్తగా ఇద్దరు బౌలర్లకు చోటిచ్చింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) బీసీసీఐ సెలక్టర్ల తీరును విమర్శించాడు. జైస్వాల్పై వేటు వేయడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఈ మాజీ ఓపెనర్.. సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ను పక్కనపెట్టడాన్నీ తప్పుబట్టాడు.యశస్వి జైస్వాల్పై వేటుకాగా జనవరి 18న బీసీసీఐ చాంపియన్స్ ట్రోఫీకి తమ ప్రాథమిక జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో యశస్వి జైస్వాల్తో పాటు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేర్లు కూడా ఉన్నాయి. అయితే, బుమ్రా వెన్నునొప్పి నుంచి కోలుకోకపోవడంతో ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీకి తమ జట్టును ఖరారు చేసేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆయా బోర్డులకు ఫిబ్రవరి 12 వరకు గడువు ఇవ్వగా.. మంగళవారం రాత్రి బీసీసీఐ కీలక ప్రకటన చేసింది.యశస్వి జైస్వాల్పై వేటు వేయడంతో పాటు బుమ్రా ఈ టోర్నీ నుంచి తప్పుకొన్నట్లు తెలిపింది. వీరి స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాతో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలను ప్రధాన జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా భారత జట్టు గురించి ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఆఖరికి అతడికి జట్టులోనే స్థానమే లేకుండా చేశారుఈ మేరకు.. ‘‘బుమ్రా గైర్హాజరీ కారణంగా సెలక్టర్లు సిరాజ్ వైపు మొగ్గు చూపుతారని అనుకున్నా. అలా అయితే నలుగురు పేసర్లు జట్టులో ఉండేవారు. ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. తుదిజట్టులో యశస్విని ఆడించేందుకు శ్రేయస్ అయ్యర్నే పక్కనపెట్టాలని చూసిన యాజమాన్యం ఇప్పుడు కనీసం అతడికి చాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం కూడా కల్పించకపోవడం గమనార్హం’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.కాగా ఇప్పటికే టెస్టుల్లో, టీ20లలో ఓపెనర్గా తనను తాను నిరూపించుకున్న యశస్వి జైస్వాల్.. ఇటీవల ఇంగ్లండ్తో స్వదేశంలో తొలి మ్యాచ్ సందర్భంగా వన్డేల్లో అరంగేట్రం చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అతడు భారత ఇన్నింగ్స్ ఆరంభించగా.. వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ వన్డౌన్లో వచ్చాడు.ఇక మోకాలి గాయం వల్ల భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్కు దూరం కాగా.. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ తనకు అచ్చొచ్చిన నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. ధనాధన్ ఇన్నింగ్స్(36 బంతుల్లో 59) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.కోహ్లి గాయం కారణంగానేఈ క్రమంలో మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. కోహ్లి గాయం కారణంగానే తనకు తుదిజట్టులో చోటు దక్కిందని.. లేదంటే ఈ మ్యాచ్లో తాను భాగమయ్యేవాడినే కాదని తెలిపాడు. అంటే.. జైస్వాల్ను ఆడించే క్రమంలో అయ్యర్ను తప్పించేందుకు కూడా మేనేజ్మెంట్ వెనుకాడలేదని తేలింది. అయితే, తాజాగా జైసూను చాంపియన్స్ ట్రోఫీ ప్రధాన జట్టు నుంచి తీసేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా పైవిధంగా స్పందించాడు.ఇదిలా ఉంటే.. అరంగేట్ర వన్డేలో జైస్వాల్ విఫలమయ్యాడు. 22 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్ మూడు ఫోర్ల సాయంతో 15 పరుగులు చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో వికెట్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. మరోవైపు.. ఇంగ్లండ్తో సిరీస్ల సందర్భంగా సత్తా చాటిన హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఏకంగా చాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం సంపాదించారు.చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: Chris Gayle: అతడొక వరల్డ్క్లాస్ ప్లేయర్.. ఈసారి చాంపియన్స్ ట్రోఫీ వారికే -
Ind vs Eng: ‘రోహిత్ కెప్టెన్సీలో ఆ ఇద్దరు కలిసి ఆడటం ఆశ్చర్యమే’
ఇంగ్లండ్తో వన్డే సిరీస్ను టీమిండియా(India vs England) విజయంతో ఆరంభించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో నాగ్పూర్ వేదికగా పర్యాటక జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఈ మ్యాచ్లో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా(Ravindra Jadeja), అక్షర్ పటేల్(Axar Patel).. ఇద్దరూ అదరగొట్టడం విశేషం.ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇలా జడ్డూ, అక్షర్ కలిసి ఆడతారని తాను అస్సలు ఊహించలేదన్నాడు. ఏదేమైనా ఈ మ్యాచ్లో ఇద్దరు రాణించడం శుభసూచకమని.. అయితే అక్షర్ కంటే జడ్డూ మెరుగ్గా బౌలింగ్ చేశాడని కితాబిచ్చాడు.జడ్డూ, అక్షర్.. ఒకరు బౌలింగ్లో.. ఒకరు బ్యాటింగ్లోకాగా ఇంగ్లండ్తో తొలి వన్డేలో లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలక వికెట్లు తీశాడు. తొమ్మిది ఓవర్ల బౌలింగ్లో కేవలం 26 పరుగులే ఇచ్చి స్టార్ బ్యాటర్లు జో రూట్(19), జొకొబ్ బెతెల్(51) వికెట్లతో పాటు.. టెయిలెండర్ ఆదిల్ రషీద్(8)ను అవుట్ చేశాడు.ఇక లక్ష్య ఛేదనలో భాగంగా జడేజాకు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. మొత్తంగా 10 బంతులు ఎదుర్కొని 12 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు.. జోస్ బట్లర్ (52) రూపంలో బిగ్ వికెట్ దక్కించుకున్న మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్.. బ్యాటర్గానూ దుమ్ములేపాడు.ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అక్షర్ పటేల్ 47 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్సాయంతో 52 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా వీరిద్దరి గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘ఈ మ్యాచ్ సందర్భంగా రవీంద్ర జడేజా అంతర్జాతీయ క్రికెట్లో 6000 పరుగులు పూర్తి చేసుకోవడంతో 600 వికెట్ల క్లబ్లో చేరాడు.రోహిత్ కెప్టెన్సీలో ఆ ఇద్దరు కలిసి ఆడతారని అస్సలు అనుకోలేదుతద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి స్పిన్నర్గా రికార్డు సాధించాడు. అంతకు ముందు ఫాస్ట్బౌలర్ కపిల్ పాజీ ఈ ఫీట్ అందుకున్నాడు. నిజానికి ఈ మ్యాచ్లో అతడికి ఆడే అవకాశం వస్తుందా లేదా అన్న సందేహం ఉండేది. ఎందుకంటే.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో అతడు పదిహేనవ ఆటగాడిగా ఉన్నాడు.నిజానికి ఇద్దరు లెఫ్టార్మ్ స్పిన్నర్లను ఒకే మ్యాచ్లో ఆడించరనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇలాంటిది జరుగుతుందని నేను అనుకోలేదు. కానీ ఈరోజు(గురువారం) ఇది జరిగింది.ఈ మ్యాచ్లో జడ్డూ అక్షర్ కంటే మెరుగ్గా బౌలింగ్ చేశాడు. అక్షర్కు బ్యాటింగ్కు చేసే అవకాశం వచ్చింది. ఇకపై జడ్డూ బౌలింగ్ ఆల్రౌండర్.. అక్షర్ బ్యాటింగ్ ఆల్రౌండర్గా మీకు(మేనేజ్మెంట్) ఉపయోగపడతాడు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి వన్డే స్కోర్లు👉వేదిక: విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగ్పూర్👉టాస్: ఇంగ్లండ్.. బ్యాటింగ్👉ఇంగ్లండ్ స్కోరు: 248 (47.4)👉భారత్ స్కోరు: 251/6 (38.4)👉ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై భారత్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శుబ్మన్ గిల్(96 బంతుల్లో 87 పరుగులు).చదవండి: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్ -
హర్షిత్ బదులు అతడిని పంపాల్సింది: భారత మాజీ క్రికెటర్ ఫైర్
ఇంగ్లండ్తో నాలుగో టీ20(India vs England)లో టీమిండియా యాజమాన్యం వ్యవహరించిన తీరును భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తప్పుబట్టాడు. శివం దూబే(Shivam Dube)కు కంకషన్ సబ్స్టిట్యూట్గా.. హర్షిత్ రాణా(Harshit Rana)ను పంపడం నిబంధనలకు విరుద్ధమని అభిప్రాయపడ్డాడు. ఇలా చేయడం ద్వారా పుణె మ్యాచ్లో భారత జట్టు పన్నెండు మంది ఆటగాళ్లతో బరిలోకి దిగినట్లు అయిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.కాగా టీమిండియా స్వదేశంలో ప్రస్తుతం ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కోల్కతా, చెన్నై మ్యాచ్లలో గెలిచిన సూర్యకుమార్ సేన.. రాజ్కోట్లో జరిగిన మూడో టీ20లో మాత్రం ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పుణెలో శుక్రవారం నాలుగో టీ20 జరిగింది.ఆదిలోనే ఎదురుదెబ్బఇందులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టాస్ విషయంలో కెప్టెన్ నమ్మకాన్ని నిజం చేస్తూ ఇంగ్లండ్ పేసర్ సకీబ్ మహమూద్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓపెనర్ సంజూ శాంసన్(1), వన్డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ(0), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(0)లను అవుట్ చేసి టీమిండియాను దెబ్బకొట్టాడు.దూబే, హార్దిక్ అదరగొట్టారుఈ క్రమంలో అభిషేక్ శర్మ(29) కాసేపు క్రీజులో నిలబడగా.. రింకూ సింగ్(30) ఫర్వాలేదనిపించాడు. అయితే, పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లు శివం దూబే, హార్దిక్ పాండ్యా రాకతో సీన్ మారింది. దూబే 34 బంతుల్లో 53 పరుగులతో దంచికొట్టగా.. పాండ్యా 30 బంతుల్లోనే 53 పరుగులతో దుమ్ములేపాడు. వీరిద్దరి మెరుపు ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.హర్షిత్ రాణా రాకతో..అయితే, ఆఖరి ఓవర్లో జేమీ ఓవర్టన్ బౌలింగ్లో దూబే హెల్మెట్కు బంతి బలంగా తాకగా.. ఫిజియో వచ్చి పరీక్షించాడు. తాను బాగానే ఉన్నానని చెప్పిన దూబే.. బ్యాటింగ్ను కొనసాగించాడు. కానీ ఆ తర్వాత అతడు ఫీల్డింగ్కు మాత్రం రాలేదు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మొదలైన రెండు ఓవర్ల తర్వాత హర్షిత్ రాణాను మేనేజ్మెంట్ మైదానంలోకి పంపింది.ఈ క్రమంలో తన టీ20 అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా అద్భుత బౌలింగ్(3/33)తో ఇంగ్లండ్ను దెబ్బకొట్టి.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఆల్రౌండర్ దూబే స్థానంలో స్పెషలిస్టు ఫాస్ట్బౌలర్ను కాంకషన్ సబ్స్టిట్యూట్గా పంపడం విమర్శలకు దారితీసింది.నిబంధనలకు విరుద్ధంఈ విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. ‘‘ఐసీసీ నిబంధనల ప్రకారం.. బౌలర్ స్థానంలో బౌలర్.. బ్యాటర్ స్థానంలో బ్యాటర్.. ఆల్రౌండర్ స్థానంలో ఆల్రౌండర్(like-for-like replacement) కంకషన్ సబ్స్టిట్యూట్గా రావాలి. రూల్ బుక్లో ఇది స్పష్టంగా రాసి ఉంది.ఉదాహరణకు.. బెక్ డకెట్ తలకు గాయమైతే.. ఫీల్డింగ్ సమయంలో అతడి స్థానంలోమరో బ్యాటర్నే పంపాలి. కానీ బౌలర్ను పంపకూడదు. ఎందుకంటే.. అతడు బౌలింగ్ చేయలేడు .ఒకవేళ బౌలర్ గాయపడితే అతడి స్థానంలో మరో బౌలర్నే పంపాలి. కానీ.. ఇక్కడ శివం దూబేకు 20 ఓవర్లో తలకు గాయమైనప్పుడు.. కంకషన్ సబ్స్టిట్యూట్గా హర్షిత్ రాణాను రప్పించారు. హర్షిత్కు బదులు మహ్మద్ షమీని రప్పించవచ్చు కదా.12 మంది ప్లేయర్లతో ఆడి గెలిచాంఎందుకంటే.. హర్షిత్ రాణా నైపుణ్యాలకు.. శివం దూబే స్కిల్స్కు పోలికే లేదు. దూబే ఎక్కువగా బ్యాటింగ్ చేస్తాడు. అప్పుడప్పుడు గంటకు 115- 120 కిలోమీటర్ల వేగంతో మాత్రమే బౌలింగ్ చేస్తాడు. కానీ.. హర్షిత్ రాణా పూర్తిస్థాయి ఫాస్ట్ బౌలర్. గంటకు 140 -145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తాడు. ఎవరు ఏమన్నా ఇదే వాస్తవం.ఈరోజు శివం దూబే 53 పరుగులు చేశాడు. హర్షిత్ రాణా నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసి.. కీలక వికెట్లు తీశాడు. ఇండియా గెలిచింది. నిజానికి ఈరోజు మనం 12 మంది ప్లేయర్లతో ఆడి గెలిచాం. రమణ్దీప్ సింగ్ను పంపాల్సిందిదూబే బ్యాటింగ్ చేశాడు.. హర్షిత్ బౌలింగ్ చేశాడు’’ అని ఆకాశ్ చోప్రా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. దూబేకు కాంకషన్ సబ్స్టిట్యూట్గా రమణ్దీప్ సింగ్ను పంపాల్సిందని అభిప్రాయపడ్డాడు. కాగా పుణె మ్యాచ్లో ఇంగ్లండ్పై పదిహేను పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది.చదవండి: Suryakumar Yadav: వారిద్దరి వల్లే గెలిచాము.. కానీ అది మాత్రం ఊహించలేదు -
Ind vs Eng: వాళ్లిద్దరిపై వేటు.. తుదిజట్టులో రెండు మార్పులు! ఎందుకంటే
ఇంగ్లండ్తో నాలుగో టీ20(India vs England)కి టీమిండియా సిద్ధమైంది. పుణెలో గెలిచి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. గత మ్యాచ్ తాలూకు తప్పులు సరిదిద్దుకుని.. పరుగుల వరదకు ఆస్కారమిచ్చే పిచ్పై బ్యాట్ ఝులిపించడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.పక్కనపెడితేనే బెటర్ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) కీలక సూచనలు చేశాడు. పుణె టీ20లో భారత జట్టు రెండు మార్పులతో రంగంలోకి దిగాలని సూచించాడు. ధ్రువ్ జురెల్(Dhruv Jurel), వాషింగ్టన్ సుందర్(Washington Sundar) సేవలను మేనేజ్మెంట్ పూర్తి స్థాయిలో వాడుకోవడం లేదన్న ఆకాశ్ చోప్రా.. వారిద్దరిని పక్కనపెడితేనే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్ సుందర్ను బౌలర్గా వాడుకోవడం లేదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అతడిని రెండు మ్యాచ్లలో ఆడించారు. తన మొదటి మ్యాచ్లో అతడు తొలి బంతికే వికెట్ తీశాడు. బెన్ డకెట్ను అవుట్ చేశాడు.అంతేకాదు.. తన తొలి ఓవర్లో ఎక్కువగా పరుగులు కూడా ఇవ్వలేదు. అయినా సరే.. అతడికి రెండో ఓవర్ వేసే అవకాశం ఇవ్వలేదు. ఇక తన రెండో మ్యాచ్లో వాషీ తొలి ఓవర్లోనే పరుగులు ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ అతడి చేతికి బంతిని ఇవ్వలేదు.ఒకవేళ ఒకే ఒక్క ఓవర్ వేయించాలనుకుంటే అతడిని జట్టులోకి తీసుకోవడం ఎందుకు?.. వేరే వాళ్లకు అవకాశం ఇవ్వవచ్చు కదా! .. ఇక ధ్రువ్ జురెల్ సేవలను కూడా సరిగ్గా వాడుకోవడం లేదు. అలాంటప్పుడు అతడు కూడా జట్టులో ఉండటం వల్ల పెద్దగా ఉపయోగం లేదు’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.నలుగురు బౌలర్లుఇక ఇంగ్లండ్తో నాలుగో టీ20లో భారత తుదిజట్టు కూర్పు గురించి మాట్లాడుతూ.. ‘‘నా అభిప్రాయం ప్రకారం... అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనర్లుగానే ఉండాలి. తిలక్ వర్మ వన్డౌన్లో.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగు, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో ఆడాలి.ఇక ఆరోస్థానంలో శివం దూబేను ఆడిస్తే బాగుంటుంది’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. లోయర్- మిడిల్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్గా అతడు చక్కటి ఆప్షన్ అని తెలిపాడు. రాజ్కోట్లో మూడో టీ20లో ఎడమచేతి వాటం బ్యాటర్ కోసమే వాషీని పంపినప్పుడు.. ఈసారి దూబే సేవలు వినియోగించుకోవడంలో తప్పులేదని పేర్కొన్నాడు.అదే విధంగా... ‘‘ఏడో స్థానంలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఉండాలి. ఈ మ్యాచ్లో నలుగురు బౌలర్లు ఉండాలి. అందుకే.. మరో బ్యాటర్ లేదంటే.. ఆల్రౌండర్ గురించి నేను ఆలోచించడం లేదు. స్పిన్నర్లు రవి బిష్ణోయి, వరుణ్ చక్రవర్తిలతో పాటు.. అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీలను ఆడించాలి’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.నలుగురు స్పెషలిస్టు బౌలర్లతో పాటు.. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ కూడా బౌల్ చేయగలరన్న ఆకాశ్ చోప్రా.. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ కూడా బంతితో రాణించగలరని పేర్కొన్నాడు. ఏదేమైనా ఇంగ్లండ్తో నాలుగో టీ20లో వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ల బదులు.. అర్ష్దీప్ సింగ్, శివం దూబేలను ఆడించాలని సూచించాడు.ఇంగ్లండ్తో నాలుగో టీ20కి ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత తుది జట్టుఅభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీ.చదవండి: చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర బ్యాటర్.. రంజీల్లో ఆల్టైమ్ రికార్డు -
‘అతడిని మర్చిపోయాం.. ఇప్పట్లో టీమిండియా రీఎంట్రీ కష్టమే!’
టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్(Ishan Kishan)ను ఉద్దేశించి భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెండు ప్రపంచకప్ టోర్నీలు ఆడిన అతడిని అందరూ త్వరగానే మర్చిపోయామన్నాడు. ఇప్పట్లో ఇషాన్ టీమిండియా తరఫున పునరాగమనం చేసే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డాడు.కాగా 2023లో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అకస్మాత్తుగా స్వదేశానికి తిరిగి వచ్చిన ఇషాన్ కిషన్.. మేనేజ్మెంట్ ఆగ్రహానికి గురయ్యాడు. తిరిగి జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆదేశాలను పెడచెవిన పెట్టాడు. నాటి హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచనలను కూడా లెక్కచేయక మొండిగా వ్యవహరించాడు.సెంట్రల్ కాంట్రాక్టు పాయె!ఈ క్రమంలో బీసీసీఐ ఇషాన్ కిషన్పై కఠిన చర్యలు తీసుకుంది. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి అతడిని తప్పించింది. దీంతో దిగొచ్చిన ఇషాన్ తన సొంతజట్టు జార్ఖండ్ తరఫున దేశీ క్రికెట్ బరిలో దిగాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది.వికెట్ కీపర్ల కోటాలో టీ20 ఫార్మాట్లో సంజూ శాంసన్(Sanju Samson) ముందుకు దూసుకురాగా.. టెస్టుల్లో రిషభ్ పంత్తో కలిసి ధ్రువ్ జురెల్ పాతుకుపోయాడు. ఇక వన్డేల్లో సీనియర్ కేఎల్ రాహుల్ ఉండనే ఉన్నాడు. ఈ క్రమంలో రీఎంట్రీ కోసం ప్రయత్నించిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్కు వరుసగా ఎదురుదెబ్బలే తగిలాయి.ప్రపంచకప్లో ఆడినా..వన్డే ప్రపంచకప్-2023 జట్టులో కేఎల్ రాహుల్తో పాటు ఇషాన్ను ఎంపిక చేసినా.. అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 టీమ్లో మాత్రం రిషభ్ పంత్, సంజూ శాంసన్లకు బీసీసీఐ మొదటి ప్రాధాన్యం ఇచ్చింది. ఇక తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు సంజూ- జురెల్లను ఎంపిక చేసిన బోర్డు.. వన్డేలకు రాహుల్- పంత్లను ఎంచుకుంది.అదే విధంగా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టులోనూ కేఎల్ రాహుల్, రిషభ్ పంత్లకే వికెట్ కీపర్ కోటాలో చోటిచ్చింది. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్కు మద్దతుగా ఉండే కొంతమంది నెటిజన్లు.. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడిని ఎందుకు ఆడించడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఈ విషయమై ఆకాశ్ చోప్రాను స్పందించాల్సిందిగా కోరారు. డబుల్ సెంచరీ కూడా చేశాడు.. కానీఇందుకు బదులిస్తూ.. ‘‘ఇషాన్ కిషన్.. అతడిని మనం ఇంతత్వరగా మర్చిపోవడం ఆసక్తికరమే!.. మళ్లీ అతడిని గుర్తు కూడా చేసుకోవడం లేదు. అతడు టీమిండియా తరఫున రెండు ప్రపంచకప్ టోర్నీలు ఆడాడు. దుబాయ్లో టీ20 ప్రపంచకప్.. సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్ ఆడాడు. వన్డేల్లో అతడి పేరిట డబుల్ సెంచరీ కూడా ఉంది.కాకపోతే అతడు చేసిన తప్పు ఇప్పటికీ వెంటాడుతోంది. ఫస్ల్ క్లాస్ క్రికెట్ ఆడటం ఇష్టం లేదనే సందేశం ఇచ్చాడు. అయితే, సెలక్టర్లకు ఇది నచ్చలేదు. అందుకే బీసీసీఐ అతడి ప్రాధాన్యం తగ్గించింది. ఇప్పట్లో సెలక్టర్లు మళ్లీ అతడిని కనికరించకపోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్లో గనుక సత్తా చాటితే ఏదేమైనా ప్రస్తుతం ధ్రువ్ జురెల్తో పోటీలో ఇషాన్ కిషన్ వెనుకబడి పోయాడన్న ఆకాశ్ చోప్రా.. జట్టులో చోటు కోసం మరికొంత కాలం ఓపికగా ఎదురుచూడక తప్పదని పేర్కొన్నాడు. సెలక్టర్లు అతడి గత ప్రదర్శనలు పరిగణనలోకి తీసుకోవడం లేదని.. ఈసారి ఐపీఎల్లో గనుక సత్తా చాటితే పరిస్థితి మారవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ. 11.25 కోట్లకు ఇషాన్ కిషన్ను కొనుగోలు చేసింది.చదవండి: CT 2025: బుమ్రా, కోహ్లి కాదు!.. టీమిండియా ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అతడే: డివిలియర్స్ -
Ind vs Eng: షమీని తప్పించడానికి కారణం అతడే?
ఇంగ్లండ్తో బుధవారం జరిగిన తొలి టీ20(India vs England) మ్యాచ్లో టీమిండియా అభినుల అందరి దృష్టి పేస్ బౌలర్ మహమ్మద్ షమీ(Mohammed Shami) పైనే నిలిచింది. ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడా(India Beat England)తో సునాయాసంగా విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా.. అయిదు మ్యాచ్లో సిరీస్లో శుభారంభం చేసింది. అయితే దాదాపు పద్నాలుగు నెలల తర్వాత ఈ మ్యాచ్ ద్వారా మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు షమీ సిద్ధంగా ఉన్నాడు. కానీ బుధవారం జరిగిన ఈ మ్యాచ్ లో షమీని భారత్ తుది జట్టు నుంచి తప్పించారు. సీమ్ బౌలింగ్ ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డితో పాటు భారత్ ఒకే ఒక స్పెషలిస్ట్ పేస్ బౌలర్ అర్ష్దీప్ సింగ్తో రంగంలోకి దిగింది.షమీ ఎందుకు ఆడలేదు? కానీ ఎందుకు షమీ ఆడలేదు? అతను పూర్తి ఫిట్నెస్ తో లేడా? అలాంటప్పుడు అసలు జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారు? ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి షమీ మ్యాచ్ ప్రాక్టీస్ చేయడానికి ఇదొక చక్కని అవకాశం. జట్టులోని ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్ నెస్ పై అనుమానాలు ఉన్న సమయంలో షమీ మ్యాచ్ ప్రాక్టీస్ తో పూర్తిగా సిద్ధమవడం భారత్ జట్టు ప్రయోజనాల దృష్ట్యా చాలా కీలకం. దీని వెనుక కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాత్మక ఎత్తుగడ ఏమైనా ఉందా అన్న ప్రశ్నఅందరి లో తలెత్తకమానదు.ఎందుకంటే మ్యాచ్ కి కొద్దీ సేపు ముందు జరిగిన తుది ప్రాక్టీస్ లో షమీ బౌలింగ్ చేయడం ఈడెన్ గార్డెన్స్ లోని ప్రేక్షకులందరూ ప్రత్యక్షంగా చూసారు. షమీ పూర్తి స్థాయి లో బౌలింగ్ చేయకపోయినా ఎలాంటి అసౌకర్యంతో ఉన్నట్టు కన్పించలేదు. మ్యాచ్ కి ముందు వార్మప్లలో బౌలింగ్ చేశాడు. దీంతో అతను పూర్తి ఫిట్నెస్ తో ఉన్నట్టు తేటతెల్లమైంది. మరి ఇంగ్లండ్తో జరిగిన సిరీస్ ఓపెనర్లో షమీ ఎందుకు ఆడలేదు? మ్యాచ్ కి ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ మేము పిచ్ ని దృష్టిలో ఉంచుకొని తుది జట్టుని నిర్ణయించాం. అందుకే షమీ ఈ మ్యాచ్ లో ఆడటంలేదని చెప్పాడు. భారత్ ముగ్గురు స్పిన్నర్లతో రంగంలోకి దిగడం విశేషం.ఫిట్గా లేడేమో?కాగా షమీ చివరిసారి 2023 నవంబర్లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2022లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్లో అతని చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. "షమీ ఆడటం లేదు అంటే అతను ఈ మ్యాచ్ సమయానికి పూర్తి ఫిట్ నెస్ తో లేడని స్పష్టంగా తెలుస్తోంది. అర్ష్దీప్ రూపంలో భారత్ ఒక ఫ్రంట్లైన్ పేసర్ను మాత్రమే ఆడించాలని నిర్ణయించుకుంది. హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరూ పేస్ బౌలింగ్ చేయగల సత్తా ఉన్న ఆల్రౌండర్లు. ఇంగ్లాండ్ ఇందుకు భిన్నంగా నాలుగు పేసర్లను రంగంలోకి దించింది" అని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు.పరిస్థితులకు అనుగుణంగానేఈ మ్యాచ్ లో 34 బంతుల్లో 79 పరుగులు చేసిన భారత్ ఓపెనర్ అభిషేక్ శర్మ అనంతరం మాట్లాడుతూ, పరిస్థితుల ఆధారంగా జట్టు యాజమాన్యం షమీ నిర్ణయం తీసుకుందని అన్నాడు. "ఇది జట్టు యాజమాన్యం నిర్ణయం అని నేను భావిస్తున్నాను. పిచ్ పరిస్థితుల అనుగుణంగా చూసినట్టయితే ఇదే సరైన నిర్ణయమని వారు భావించారు" అని మ్యాచ్ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో అభిషేక్ అన్నాడు.గంభీర్ నిర్ణయమేనా?ఇది పూర్తిగా కోచ్ గంభీర్ నిర్ణయంలాఅనిపిస్తోంది. జట్టులో ఉన్న స్టార్ సంస్కృతికి చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని భావించాల్సి ఉంటుంది. భారత్ జట్టు ఈ మ్యాచ్ లో ఘన విజయం సాధించిన దృష్ట్యా చూస్తే ఈ వ్యూహం ఫలించిందని చెప్పాలి. ఇక షమీని తప్పించిన విషయాన్ని పక్కన పెడితే , ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఈడెన్ గార్డెన్స్ పిచ్ పై సరైన నిర్ణయమే అని రుజువైంది. మరి రానున్న ఛాంపియన్స్ ట్రోఫీ కి ఈ సిరీస్ సన్నాహక టోర్నమెంట్ గా భావిస్తున్న నేపథ్యంలో షమీ ఆడటం చాలా కీలకం. చెన్నై లో జరిగే రెండో మ్యాచ్ లో షమీ రంగప్రవేశం చేస్తాడేమో చూడాలి. -
Ind vs Eng: అతడికి ఊపిరి కూడా ఆడనివ్వడు.. ఇదే లాస్ట్ ఛాన్స్!
అభిషేక్ శర్మ(Abhishek Sharma)కు ఇంగ్లండ్తో టీ20 సిరీస్ ఎంతో కీలకమని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఈ సిరీస్లో గనుక విఫలమైతే ఈ పంజాబీ బ్యాటర్ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని పేర్కొన్నాడు. కాబట్టి ఈసారి అభిషేక్ శర్మ తీవ్రమైన ఒత్తిడిలో మునిగిపోవడం ఖాయమన్న ఆకాశ్ చోప్రా(Aakash Chopra).. సవాళ్లను అధిగమిస్తే మాత్రం మరికొన్ని రోజులు టీమిండియాలో కొనసాగుతాడని అభిప్రాయపడ్డాడు.అరంగేట్రంలో డకౌట్.. ఆ వెంటనే సెంచరీగతేడాది జూలైలో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా.. అభిషేక్ శర్మ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్లోనే డకౌట్ అయిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. మరుసటి మ్యాచ్లో సెంచరీ బాది సత్తా చాటాడు. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో బ్యాట్ ఝులిపించలేకపోయాడు.ఇక ఇప్పటి వరకు 12 టీ20లు పూర్తి చేసుకున్న అభిషేక్ వర్మ కేవలం 256 పరుగులకే పరిమితం అయ్యాడు. తాజాగా ఇంగ్లండ్తో టీ20 సిరీస్ ఆడే భారత జట్టులో చోటు దక్కించుకున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఏ మేరకు రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ అభిషేక్ తనను నిరూపించుకోవడానికి ఇదే ఆఖరి అవకాశం కావొచ్చని అభిప్రాయపడ్డాడు.అతడికి ఊపిరి కూడా ఆడనివ్వడు‘‘ఈసారి కూడా సెలక్టర్లు అభిషేక్ శర్మపై నమ్మకం ఉంచారు. అతడిని జట్టులో కొనసాగించడం నాకూ నచ్చింది. అయితే, అతడు ఇప్పుడు చావోరేవో తేల్చుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు. ఏమాత్రం అవకాశం దొరికినా యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) టీ20 జట్టులోకి దూసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.కాబట్టి అభిషేక్కు అతడితో పోటీ ఊపిరాడనివ్వదనడంలో సందేహం లేదు. యశస్వి జైస్వాల్ కూడా లెఫ్టాండర్ బ్యాటర్ కావడం అభిషేక్ శర్మకు మరో మైనస్. జైసూ మూడు ఫార్మాట్లకు తగిన ఆటగాడు. టెస్టు, టీ20లలో సూపర్ ఫామ్లో ఉన్నాడు.అలా అయితే వృథానేఇక వన్డేల్లో కూడా అరంగేట్రానికి సిద్ధమయ్యాడు’’ అని పేర్కొన్నాడడు. ఇక ఇంగ్లండ్తో వన్డే సిరీస్ కోసమే.. టీ20లలో అతడికి విశ్రాంతినిచ్చారేమోనన్న అభిప్రాయాలు ఉన్నాయన్నాడు ఆకాశ్ చోప్రా. ఒకవేళ ఇంగ్లండ్తో వన్డేల్లో శుబ్మన్ గిల్- రోహిత్ శర్మనే ఇన్నింగ్స్ ఆరంభిస్తే.. జైసూను ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసినందుకు ఫలితం ఉండదని పేర్కొన్నాడు.ఒకే జట్టుతో ఆడతామన్న టీమిండియా సారథిఏదేమైనా యశస్వి జైస్వాల్ మాత్రం తిరిగి టీ20 జట్టులోకి వస్తే.. అభిషేక్ శర్మకు కష్టాలు తప్పవని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇ దిలా ఉంటే.. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. టీ20 ప్రపంచకప్నకు సన్నద్ధమయ్యే క్రమంలో ఒకే జట్టుతో ఆడేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు వెల్లడించాడు. అయితే, ఆకాశ్ చోప్రా అన్నట్లు అభిషేక్ శర్మ మరోసారి విఫలమైతే అతడిపై వేటు తప్పకపోవచ్చు. కాగా బుధవారం(జనవరి 22) నుంచి ఇండియా- ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది.చదవండి: జైస్వాల్కు చోటు.. తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు -
‘అతడి ఖేల్ ఖతం.. ఇకపై టీమిండియాలో చోటు ఉండదు’
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎంపిక చేసిన జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) స్పందించాడు. స్పిన్, పేస్ బౌలర్ల విషయంలో సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థించాడు. ఏళ్లకు ఏళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నవారిని.. ఎంపిక చేయకపోవడమే ఉత్తమమని పేర్కొన్నాడు.లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ అధ్యాయం ఇక్కడితో ముగిసిపోయిందన్న ఆకాశ్ చోప్రా.. ‘స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ఖేల్ కూడా ఖతమైందని అభిప్రాయపడ్డాడు. కాగా 2017లో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించింది. నాడు ఫైనల్లో టీమిండియాను ఓడించి విజేతగా నిలిచిన పాకిస్తాన్(India vs Pakistan).. తాజాగా నిర్వహించబోతున్న మెగా టోర్నీ ఆతిథ్య హక్కులు దక్కించుకుంది.కుల్దీప్ యాదవ్ వైపు మొగ్గుఅయితే, భద్రతా కారణాల వల్ల టీమిండియా మాత్రం తమ మ్యాచ్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఆడనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ శనివారం చాంపియన్స్ ట్రోఫీకి తమ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో ఈ ఐసీసీ ఈవెంట్లో పాల్గొనే టీమ్లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్తో పాటు.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ చోటు దక్కించుకున్నారు.మరోవైపు.. పేస్ దళంలో నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు.. మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో యజువేంద్ర చహల్, భువనేశ్వర్ కుమార్లకు అన్యాయం జరిగిందంటూ వారి అభిమానులు సెలక్టర్ల తీరును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘యుజీ చహల్ విషయం కాస్త ప్రత్యేకమైనదే.అతడి కథ ముగిసిపోయింది2023 జనవరిలో అతడు చివరగా ఆడాడు. దాదాపు రెండేళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇక భువీ.. 10 మ్యాచ్లలో అతడి ప్రదర్శన చూసిన తర్వాత అతడిపై సెలక్టర్లు వేటు వేశారు. అయితే, యువీ గణాంకాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. నిలకడగా వికెట్లు తీశాడు కూడా. కాకపోతే.. ఈ టోర్నీ రేసులో అతడు వెనుకబడిపోయాడు.ఇక్కడితో అతడి కథ పూర్తిగా ముగిసిపోయినట్లే. అతడి ఫైల్ క్లోజ్ అయిపోయింది. కానీ సెలక్టర్లు ఇలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదు. నిజానికి రెండేళ్ల క్రితమే అతడి పనైపోయింది. అందుకే సెలక్టర్లు బహుశా మళ్లీ జట్టులో చోటు ఇవ్వలేదు. ఒకవేళ అతడిని ఎంపిక చేసి ఉంటే.. అది తిరోగమనానికి సూచిక అయ్యేది.భువీని ఎలా సెలక్ట్ చేస్తారు?ఇక భువీ మూడేళ్ల క్రితం చివరగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. అసలు వన్డే ఫార్మాట్లో చాలాకాలంగా జట్టులోనే లేడు. మరి అలాంటి ఆటగాడిని అకస్మాత్తుగా మెగా టోర్నీ కోసం పిలిపిస్తే.. ఇప్పుడు సెలక్టర్లను తిడుతున్న వారే.. అతడిని ఎంపిక చేసినా.. ఇదేం తీరు అని ప్రశ్నించేవారు’’ అని పేర్కొన్నాడు. ఏదేమైనా యుజీ, భువీలు ఇక భారత జట్టులో చోటు దక్కించుకోలేరని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి.చదవండి: కరుణ్ నాయర్ను ఎలా సెలక్ట్ చేయగలం?: అగార్కర్ -
అతడి కెరీర్ను నాశనం చేస్తారా?: భారత మాజీ క్రికెటర్ ఫైర్
ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్ ౩-1 తేడాతో ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటన సందర్భంగా భారత్ డ్రెస్సింగ్ రూమ్ లో విభేదాలు తలెత్తినట్టు దుమారం చెలరేగింది. భారత్ జట్టు సుదీర్ఘ విదేశీ పర్యటనకు వెళ్ళిన సమయంలో ఇలాంటి వార్తలు రావడం సహజమే.అదీ భారత్ జట్టు వరసగా పరాజయం పాలవడం, కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు పేలవమైన ఫామ్తో విఫలం కావడం, చివరి మ్యాచ్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా తప్పుకోవడంతో ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరింది. అయితే టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో విభేదాలు తలెత్తినట్టు వచ్చిన వార్తలు బయటికి పొక్కడానికి.. ఒక యువ క్రికెటర్ కారణమని ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir).. స్వయంగా భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి తెలియజేసాడని కూడా వార్తలు వచ్చాయి.కానీ.. నిజంగా గంభీర్ ఈ విషయాన్నీ బీసీసీఐకి తెలియజేసాడా అంటే.. దీని గురించి బీసీసీఐ అధికారులు ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు. మరి భారత డ్రెస్సింగ్ రూమ్ నుండి ఇలాంటి లీకులకు భాద్యులు ఎవరు? ఈ విషయాన్నీ బీసీసీఐ స్పష్టం చేయాలి. గంభీర్ పేలవమైన రికార్డుగౌతమ్ గంభీర్ను భారత్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా నియమించిన తర్వాత నుంచి భారత్ జట్టు వరుసగా పరాజయాల్ని చవిచూస్తోంది. గత జూలైలో శ్రీలంక జట్టు భారత్ పర్యటనకు రావడానికి ముందు గంభీర్ను హెడ్కోచ్గా నియమించారు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లో భారత్ 3-0 విజయంతో గంభీర్ కోచ్గా తన ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే ఆ తరువాత శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో 0-2తో భారత్ జట్టు ఓటమి చవిచూసింది. ఆ తరువాత బంగ్లాదేశ్పై 2-0 టెస్ట్ సిరీస్ విజయంతో జట్టు కొద్దిగా పుంజుకున్నట్టు కనిపించినా న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ను 0-3 తో కోల్పోయింది. ఇటీవల ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టోర్నమెంట్లో 3-1 తేడాతో భారత్ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్కు ముందు గంభీర్ సీనియర్ ఆటగాళ్లను మందలించాడని వార్తలు వచ్చాయి.అయితే ఇప్పుడు భారత్ మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కొత్త వివాదాన్ని రేకెత్తించాడు. ఈ లీకులు భారత్ జట్టు నుంచి మాత్రమే కాక భారత్ బోర్డు నుంచి కూడా వస్తున్నాయని చోప్రా ఎత్తి చూపడమే కాక ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించాడు. అతడి కెరీర్ నాశనం చేస్తారా? లీకులకు బాధ్యులు ఎవరు?తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసిన వీడియోలో, ఆకాష్ చోప్రా మాట్లాడుతూ.. లీకుల ఆధారంగా వచ్చే కథనాలు ఒక ఆటగాడి కెరీర్కు హాని కలిగిస్తాయని పేర్కొన్నాడు. యువ ఆటగాడి భవిష్యత్తును ప్రమాదంలో పడేసే లీక్ అయిన వాదనలను వ్యాప్తి చేయకుండా ఉండాలని అతను బీసీసీఐని, క్రికెట్ అభిమానుల్ని కోరాడు."ఇలాంటి లీకులు ఒక యువ ఆటగాడి క్రికెట్ కెరీర్ ను ప్రమాదంలో పడేశాయి. ఈ లీకులు వాస్తవమే అని మరో లీకు ద్వారా నిర్ధారణ చేస్తున్నారు. ఇది ఆ అతగాడి కెరీర్ కు ఎంత ప్రమాదమో ఆలోచించారా" అని ప్రశ్నించాడు. బుమ్రా మంచి పనిచేశాడుఅదే వీడియోలో జస్ప్రీత్ బుమ్రా కు సంబంధించిన మరో సంఘటనని చోప్రా ఉదహరించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ చివర్లో, మళ్ళీ రెండవ ఇన్నింగ్స్లో బుమ్రా వెన్నునొప్పి కారణంగా బౌలింగ్ చేయలేకపోయాడు.అయితే బుమ్రా తనకు బెడ్ రెస్ట్ కావాలని డాక్టర్లు సలహా ఇచ్చారని అప్పుడు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు సరికాదని బుమ్రా స్వయంగా ట్వీట్ చేయడం ద్వారా ఖండించాడని చోప్రా ఎత్తి చూపాడు. బుమ్రా ఈ ట్వీట్ చేయని పక్షంలో దాన్ని నిజమని నమ్మేవారు. ఇలాంటి వార్తలను జట్టుతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరూ ఖండించాలి అని చోప్రా సూచించాడు.బీసీసీఐ జాగ్రత్త పడాలిఅయితే భారత్ జట్టు బ్యాటింగ్ కోచ్ గా సీతాన్షు కోటక్ నియమించబోతున్నారని కూడా వార్త బీసీసీఐ అధికారిక ప్రకటనకు ముందే మీడియా లో రావడాన్ని ఇక్కడ ఉదహరించాడు. మీడియాకు ఈ వార్త తెలియకముందే బీసీసీఐ ముందస్తుగా వ్యవహరించి వారి నియామకాలను ముందుగానే ప్రకటించాలని చోప్రా సూచించాడు. "భారత జట్టు బ్యాటింగ్ కోచ్గా సీతాన్షు కోటక్ నియమిస్తున్నారనేది పెద్ద వార్త. ఈ విషయాన్నీ బీసీసీఐ అధికారికంగా ప్రకటించవచ్చు కదా. మీరు ముందస్తుగా చెప్పడం ప్రారంభిస్తే.. లీకులకు స్వస్తి చెప్పే అవకాశం ఉంటుంది’’ అని చోప్రా సూచించాడు. మరి బోర్డు అధికారులు ఈ విషయాన్ని గ్రహిస్తారో లేదో చూడాలి.చదవండి: ఫామ్లో ఉన్నా కరుణ్ నాయర్ను సెలక్ట్ చేయరు.. ఎందుకంటే: డీకే -
అతడిని ఎందుకు సెలక్ట్ చేయలేదు?: భారత మాజీ క్రికెటర్ ఫైర్
ఆస్ట్రేలియా పర్యటనలో పరాభవం చవిచూసిన టీమిండియా.. తదుపరి సొంతగడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్కు సిద్ధమైంది. ఇంగ్లండ్(India vs England)తో ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లు ఆడనుంది. ఇరుజట్ల మధ్య జనవరి 22 నుంచి తొలి టీ20తో ఈ మెగా సమరం మొదలుకానుంది.ఈ సిరీస్తో షమీ రీఎంట్రీఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికే టీ20 సిరీస్కు తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఆడబోయే ఈ జట్టులో పదిహేను మందికి చోటు ఇచ్చినట్లు తెలిపింది. ఈ సిరీస్తో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ సుదీర్ఘ కాలం తర్వాత పునరాగమనం చేయనున్నాడు.స్టార్ క్రికెటర్లు దూరంవన్డే వరల్డ్కప్-2023 తర్వాత చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ.. దాదాపు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చేందుకు ముహూర్తం ఖరారైంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో టీ20లకు యశస్వి జైస్వాల్తో పాటు శుబ్మన్ గిల్, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ క్రికెటర్లు దూరమయ్యారు.బ్యాటర్ల కోటాలో సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్ చోటుదక్కించుకోగా.. వికెట్ కీపర్ల కోటాలో సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్లకు అవకాశం దక్కింది. ఇక ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉండగా.. బౌలింగ్ విభాగంలో పేసర్లు మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణాతో పాటు.. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి స్థానం సంపాదించారు.శివం దూబేకు దక్క ని చోటుఅయితే, ఈ జట్టులో భారత ఆల్రౌండర్, విధ్వంసకర వీరుడు శివం దూబే(Shivam Dube)కు మాత్రం చోటు దక్కలేదు. టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులో భాగం కావడంతో పాటు.. ఇటీవల దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడు దంచికొట్టాడు. అయినప్పటికీ సెలక్టర్లు దూబే పేరును పరిగణనలోకి తీసుకోలేదు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీరును విమర్శించాడు. ‘‘శివం దూబేకు ఏమైంది? నిజానికి రుతురాజ్ గైక్వాడ్ గురించి కూడా మాట్లాడాల్సి ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో తన బ్యాటింగ్ స్థానం(ఓపెనర్) దృష్ట్యా అతడిని ఎంపిక చేయడం వీలుకాకపోవచ్చు.అలాగే రజత్ పాటిదార్కు కూడా మొండిచేయి ఎదురైంది. కానీ.. శివం దూబేను ఎందుకు పక్కనపెట్టారో అర్థం కావడం లేదు. టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు. సౌతాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.టీ20 ప్రపంచకప్ చాంపియన్ను ఎందుకు సెలక్ట్ చేయలేదు?కాబట్టి జట్టు గెలిచినపుడు.. జట్టులోని ప్రతి సభ్యుడికి తమ క్రెడిట్ ఇవ్వాలి. వరల్డ్కప్ లీగ్ మ్యాచ్లలో ఫీల్డింగ్, బ్యాటింగ్ విషయంలో అతడిపై విమర్శలు వచ్చాయి. కానీ తర్వాత అతడు అన్నీ సరిదిద్దుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చాంపియన్ అయ్యాడు. అయినా.. ఎందుకు అతడిని టీ20 సిరీస్కు ఎంపిక చేయలేదు?’’ అని ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు. కాగా వెస్టిండీస్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో దూబే 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 27 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా చివరగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడింది. ఈ ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో కంగారూ జట్టు చేతిలో 3-1తో ఓడి.. పదేళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని చేజార్చుకుంది.చదవండి: అతడు లేకుంటే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మనమే గెలిచేవాళ్లం: అశ్విన్ -
చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టు ఇదే.. వాళ్లిద్దరికి నో ఛాన్స్!
కొత్త సంవత్సరంలో క్రికెట్ ప్రేమికులకు మజా అందించేందుకు మరో ఐసీసీ టోర్నీ సిద్ధమైంది. హైబ్రిడ్ విధానంలో చాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy 2025) నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న ఈ మెగా ఈవెంట్లో.. టీమిండియా మాత్రం తటస్థ వేదికపై తమ మ్యాచ్లు ఆడనుంది. దుబాయ్ వేదికగా ప్రత్యర్థి జట్లతో తలపడనుంది.వన్డే ఫార్మాట్ టోర్నీలో ఎనిమిది జట్లుఇక ఈ ఐసీసీ టోర్నీకి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాక్ నేరుగా అర్హత సాధించగా.. వన్డే వరల్డ్కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ క్వాలిఫై అయ్యాయి. ఈ టోర్నీలో పాల్గొనబోయే ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.డెడ్లైన్ ఆరోజేగ్రూపు-‘ఎ’లో భారత్తో పాటు న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా ఉండగా.. గ్రూపు-‘బి’ నుంచి అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ పోటీపడనున్నాయి. ఈ మెగా టోర్నీకి సంబంధించి జట్లను ప్రకటించేందుకు ఐసీసీ జనవరి 12 వరకు గడువు ఇచ్చింది. అదే విధంగా ఈ ప్రొవిజనల్ జట్లలో మార్పులు చేసుకునేందుకు వీలుగా ఫిబ్రవరి 13 వరకు సమయం ఇచ్చింది.ఈ నేపథ్యంలో జనవరి 11న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) జట్టును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు స్వదేశంలో ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్కు బీసీసీఐ ముందుగా జట్టును ప్రకటించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈలోపు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఈ రెండు ఈవెంట్లకు తన జట్టును ఎంచుకున్నాడు.మరోసారి కెప్టెన్గా, ఓపెనర్గా రోహిత్ శర్మ రోహిత్ శర్మనే కెప్టెన్గా కొనసాగించిన ఆకాశ్ చోప్రా(Aakash Chopra).. శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అయితే, వన్డేల్లో తేలిపోతున్న సూర్యకుమార్ యాదవ్తో పాటు సంజూ శాంసన్ను కూడా నొర్మొహమాటంగా పక్కన పెట్టాలని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘‘రోహిత్ శర్మ మరోసారి కెప్టెన్గా, ఓపెనర్గా ఉండబోతుఉన్నాడు.వన్డే వరల్డ్కప్-2023 నుంచి అతడు 14 ఇన్నింగ్స్ ఆడి 754 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ అర్ధ శతకం ఉంది. ఇక శుబ్మన్ గిల్ గణాంకాలు అంత గొప్పగా ఏమీలేవు. ప్రపంచకప్ కలుపుకొని 12 ఇన్నింగ్స్లో కలిపి 411 రన్స్ చేశాడు. కాబట్టి యశస్వి జైస్వాల్పై కూడా మేనేజ్మెంట్ దృష్టి సారించే అవకాశం ఉంది.సూర్య, సంజూలకు నో ఛాన్స్అయితే, తుదిజట్టులో మాత్రం అతడికి చోటు దక్కకపోవచ్చు. అయినప్పటికీ ప్రధాన జట్టులో జైస్వాల్ ఉండాలి. ఇక విరాట్ కోహ్లి తప్పక ఈ జట్టులో ఉంటాడు. కానీ సూర్యకుమార్ యాదవ్కు మాత్రం ఈసారి జట్టులో స్థానం దక్కదు. విజయ్ హజారే ట్రోఫీలోనూ అతడు పరుగులు రాబట్టలేకపోయాడు.ఇక సంజూ శాంసన్ ఇంత వరకు ఈ దేశీ వన్డే టోర్నీలో ఆడనేలేదు. అయితే, శ్రేయస్ అయ్యర్ మాత్రం వరల్డ్కప్ నుంచే మంచి ఫామ్లో ఉన్నాడు. ప్రపంచకప్ నుంచి 15 ఇన్నింగ్స్లో కలిపి 620 రన్స్ చేశాడు. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా కూడా ఈ జట్టులో ఉంటారు. వన్డేల్లో పంత్ రికార్డు గొప్పగా లేకున్నా ఇషాన్ కిషన్ స్థానంలో అతడు టీమ్లోకి వస్తాడు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లోనూ దాదాపు ఇదే జట్టు పాల్గొంటుందని అంచనా వేశాడు.చాంపియన్స్ ట్రోఫీ 2025కి ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్.చదవండి: SL vs AUS: ఆస్ట్రేలియా కెప్టెన్గా స్టీవ్ స్మిత్ -
కెప్టెన్ కంటే బెటర్.. ప్లీజ్.. అతడిని తప్పించకండి: భారత మాజీ క్రికెటర్
‘‘రిషభ్ పంత్(Rishabh Pant) ఎక్కువగా రివర్స్ స్లాప్ షాట్లు ఆడతాడు. అదే అతడి బలం. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్లో పంత్ కచ్చితంగా ప్రభావం చూపుతాడు. కాబట్టి అతడిని కట్టడి చేస్తే మా పని సగం పూర్తయినట్లే’’- టీమిండియాతో టెస్టులకు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు.గత నాలుగు పర్యాయాలుగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)సిరీస్ను టీమిండియానే దక్కించుకున్న విషయం తెలిసిందే. 2020-21 పర్యటన సందర్భంగా భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తొలిసారి కంగారూ గడ్డపై సత్తా చాటాడు. నాడు అద్భుత రీతిలోసిడ్నీ టెస్టులో 97 పరుగులతో రాణించి.. సిరీస్ ఆశలను సజీవం చేశాడు. నాడు ఆఖరిగా గబ్బాలో జరిగిన టెస్టులో 89 పరుగులతో అజేయంగా నిలిచి.. భారత్ను గెలిపించాడు. తద్వారా సిరీస్ గెలవడంలో తన వంతు పాత్ర పూర్తి చేశాడు.అందుకే ఈసారి ఆసీస్ గడ్డపై బీజీటీ నేపథ్యంలో పంత్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు కమిన్స్ కూడా అతడి గురించి పైవిధంగా స్పందించాడు. కానీ సీన్ రివర్స్ అయింది. ఇప్పటి వరకు బీజీటీ 2024-25లో నాలుగు టెస్టులు పూర్తి కాగా.. పంత్ సాధించిన పరుగులు 154 మాత్రమే. స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్ఏ ఆటగాడికైనా ఒక్కోసారి ఇలాంటి కఠిన పరిస్థితులు ఎదురవడం సహజమే అయినా.. పంత్ వికెట్ పారేసుకుంటున్న తీరు విమర్శలకు దారితీసింది. టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ అయితే పంత్ను ఉద్దేశించి.. ‘‘స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్.. నువ్వు భారత జట్టు డ్రెసింగ్రూమ్లోకి వెళ్లనే కూడదు’’ అంటూ మండిపడ్డాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.తుదిజట్టులో చోటు ఉంటుందా? లేదా?ఈ నేపథ్యంలో సిడ్నీలో జరుగనున్న ఆఖరి టెస్టులో పంత్ తుదిజట్టులో చోటు దక్కించుకోవడంపై సందేహాలు నెలకొన్నాయి. అతడిపై వేటు వేసి యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ను ఎంపిక చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తాజాగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.‘‘రిషభ్ పంత్ను జట్టు నుంచి తప్పించాలని టీమిండియా మేనేజ్మెంట్ యోచిస్తోందా? రాహుల్కు కీపింగ్ బాధ్యతలు అప్పగించి.. శుబ్మన్ గిల్ను మళ్లీ జట్టులోకి తీసుకువస్తారా? దయచేసి అలా మాత్రం చేయకండి. సమస్య ఎక్కడ ఉందో అర్థం చేసుకోకుండా తక్షణ పరిష్కారం కోసం వెతకకండి.కెప్టెన్ కంటే బెటర్.. ప్లీజ్.. అతడిని తప్పించకండిరిషభ్ పంత్ ఈ సిరీస్లో ఎక్కువగా పరుగులు సాధించలేదన్న వాస్తవాన్ని నేనూ అంగీకరిస్తాను. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ కంటే అతడు బాగానే ఆడుతున్నాడు. అంతేకాదు.. అతడి వికెట్ కీపింగ్ నైపుణ్యాలు కూడా అద్భుతం. అతడికి ఆసీస్ గడ్డపై మంచి రికార్డు ఉంది.పంత్.. ఒక్కసారి విఫలమైనంత మాత్రాన పక్కనపెట్టేంత విలువలేని ఆటగాడు కాదు. కాబట్టి దయచేసి అతడిని జట్టు నుంచి తప్పించకండి. ప్రతి ఒక్కరికి తమదైన ప్రత్యేకశైలి ఉంటుంది. అయితే, ఒక్కోసారి ఎంత జాగ్రత్తపడినా.. ప్రతికూల ఫలితాలే ఎదురవుతాయి.పిచ్ పరిస్థితులు కూడా గమనించాలి. మ్యాచ్ స్వరూపం ఎలా ఉందన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇలాంటి కీలక విషయాలను పట్టించుకోకపోతే కష్టమే. ఏదేమైనా.. పంత్ ఒక్కసారి తన లోపాలు సరిదిద్దుకుంటే అతడికి తిరుగు ఉండదు’’ అని ఆకాశ్ చోప్రా పంత్ను సమర్థించాడు.సిడ్నీలో ఐదో టెస్టుఇదిలా ఉంటే.. ఆసీస్తో రెండో టెస్టు నుంచి జట్టుతో కలిసిన కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటి వరకు మొత్తం 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక భారత్- ఆసీస్ మధ్య శుక్రవారం నుంచి ఐదో టెస్టు సిడ్నీలో మొదలుకానుంది.చదవండి: NZ vs SL: కుశాల్ పెరీరా ‘ఫాస్టెస్ట్ సెంచరీ’.. ఉత్కంఠ పోరులో ఆఖరికి! -
'ఛాంపియన్స్ ట్రోఫీ.. అతడికి భారత జట్టులో నో ఛాన్స్'
విజయ్ హజారే వన్డే ట్రోఫీ 2024-25 కోసం ఎంపిక చేసిన కేరళ జట్టులో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్కు చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీ కోసం కేరళ క్రికెట్ ఆసోషియేషన్ నిర్వహించిన శిక్షణా శిబిరానికి గైర్హాజరైనందున అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. దీంతో అతడి స్ధానంలో తమ జట్టు పగ్గాలను సల్మాన్ నజీర్కు కేసీఎ అప్పగించింది. ఈ నేపథ్యంలో శాంసన్ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ దేశవాళీ టోర్నీలో సంజూ భాగం కాకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీకి కోసం వెళ్లే భారత జట్టులో ఛాన్స్ దక్కపోవచ్చు అని సంజూ అభిప్రాయపడ్డాడు."విజయ్ హజారే ట్రోఫీలో పాల్గోనే కేరళ జట్టులో సంజూ శాంసన్ పేరు లేకపోవడం ఆశ్చర్యపరిచింది. అతడిని ఎందుకు ఎంపిక చేయలేదో నాకు ఆర్ధం కావడం లేదు. వాయనాడ్లో నిర్వహించిన ప్రాక్టీస్ క్యాంపులో సంజూ పాల్గోలేదని, అందుకే కెసీఎ సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదని కొంత మంది చెబుతున్నారు.కాలి గాయం కారణంగా శిక్షణా శిబిరానికి ఎంపిక కాలేనని సంజూ కెసీఎకు ముందే తెలియజేసినట్లు మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కారణం ఏదమైనప్పటకి విజయ్ హజారే ట్రోఫీలో సంజూ భాగం కాలేకపోయాడు.ఈ టోర్నీని సంజూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సింది. ఎందుకంటే టీ20ల్లో అతడు అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. అటువంటిప్పుడు వన్డే క్రికెట్ను కూడా శాంసన్ దృష్టిలో పెట్టుకోవాలి. రిషబ్ పంత్ ఇంకా వన్డేల్లో పూర్తి స్ధాయిలో తన మార్క్ను చూపించలేకపోయాడు.మరికొన్ని రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా జరగనుంది. ఈ టోర్నీ కోసమైన విజయ్ హజారే ట్రోఫీలో సంజూ ఆడాల్సింది. బహుశా శాంసన్ను ఛాంపియన్స్ కోసం భారత సెలక్టర్లు ఎంపిక చేయకపోవచ్చు" అనిచోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: IND vs AUS 4th Test: టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్కు గాయం!? -
అతడు 12 కోట్లకే దొరికేవాడు.. ఇషాన్ కూడా చీప్.. అయినా ఎందుకిలా?
ఐపీఎల్ మెగా వేలం-2025లో కోల్కతా నైట్ రైడర్స్(కేకేఆర్) ఫ్రాంఛైజీ అనుసరించిన వ్యూహం తనకు ఆశ్చర్యం కలిగించిందని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. వెంకటేశ్ అయ్యర్ కోసం ఏకంగా రూ. 23.75 కోట్లు ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించాడు. అతడి కంటే ఇషాన్ కిషన్ తక్కువ ధరకు వచ్చేవాడని.. అయినప్పటికీ ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయలేదని కేకేఆర్ నిర్ణయాలను విమర్శించాడు.మూడో ఆటగాడిగాసౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో నవంబరు 24, 25 తేదీల్లో మెగా వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదటిరోజే వెంకటేశ్ అయ్యర్ కోసం కేకేఆర్ కళ్లు చెదిరే మొత్తం ఖర్చు చేసింది. ఫలితంగా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన మూడో ఆటగాడిగా వెంకటేశ్ నిలిచాడు.ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘వేలానికి ముందు ఇద్దరు అయ్యర్ల(శ్రేయస్, వెంకటేశ్)ను కేకేఆర్ రిటైన్ చేసుకోలేకపోయింది. వారి డిమాండ్ను బట్టి వేలంలో ఒక్కరినే దక్కించుకోలగలదని తెలుసు. అయితే, వాళ్లకు ఇప్పుడు కెప్టెన్ అవసరం ఉంది. అయినప్పటికీ వెంకీ కోసం వాళ్లు భారీగా ఖర్చు పెట్టారు.ఇందులో వెంకీ రెండింటికీ సరిపోడుఒక్క ఆటగాడి కోసమే రూ. 23.75 కోట్లు వెచ్చించారు. కెప్టెన్ ఆప్షన్ లేదంటే.. ప్రత్యేక నైపుణ్యాలున్న ఆటగాడి కోసం ఎవరైనా ఇంత భారీగా ఖర్చు చేయొచ్చు. కానీ.. ఇందులో వెంకీ రెండింటికీ సరిపోడు. విశ్వాసపాత్రులుగా ఉండటం చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం అంటారు.అతడు 12 కోట్లకే వచ్చేవాడు.. ఇషాన్ కూడా చీప్ ఇక్కడ అది నిజమే అనిపిస్తోంది. ఒక్కడి కోసం ఇంత మొత్తం పెట్టినపుడు.. ఏదో ఒక విషయంలో మీరు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఇక్కడ అదే జరిగింది. మీకు ఓపెనర్ కావాలని అనుకుంటే... ఫిల్ సాల్ట్(ఆర్సీబీ) కోసం పోటీపడి రూ. 12 కోట్లకు సొంతం చేసుకోవాల్సింది. లేదంటే కేఎల్ రాహుల్(ఢిల్లీ) కోసం రూ. 14 కోట్లకు పైగా వెచ్చించాల్సింది. అదీ కాకపోతే ఇషాన్ కిషన్(సన్రైజర్స్) కూడా తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాడు.అతడు కూడా మంచి ఓపెనర్. అయినప్పటికీ మీరెందుకు వెంకటేశ్ కోసం రూ. 20 కోట్లకు పైగా ఎందుకు ఖర్చు చేశారో అర్థం కావడం లేదు’’ అని చోప్రా కేకేఆర్ వ్యూహాలను విమర్శించాడు. కాగా వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్ ఆల్రౌండర్. అతడు పేస్ బౌలింగ్ కూడా చేయగలడు. కానీ అతడి బౌలింగ్ గణాంకాలు మాత్రం అంతంతమాత్రమే. ఇప్పటి వరకు ఐపీఎల్లో మొత్తంగా 50 మ్యాచ్లు ఆడిన వెంకటేశ్ అయ్యర్ 1326 పరుగులు చేయడంతో పాటు.. మూడు వికెట్లు తీయగలిగాడు.కేకేఆర్ను చాంపియన్గా నిలపడంలోఐపీఎల్-2024లో కేకేఆర్ను చాంపియన్గా నిలపడంలో వెంకటేశ్ అయ్యర్ది కీలక పాత్ర. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఫైనల్లో 26 బంతుల్లోనే 52 పరుగులతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(6*)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే, వేలానికి ముందు కేకేఆర్ వీరిద్దరిని విడిచిపెట్టాల్సి వచ్చింది. దీంతో వెంకీని తిరిగి దక్కించుకునే అవకాశం రాగా.. శ్రేయస్ అయ్యర్ను రూ. 26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో వెంకటేశ్ అయ్యర్ 13 ఇన్నింగ్స్లో కేవలం 370 రన్స్ చేశాడు.చదవండి: వేలం ముగిసింది.. ఇక మిగిలింది అదే!.. ఏ జట్టులో ఎవరు? ఎవరి పర్సులో ఎంత? ఎన్ని ఖాళీలు -
అప్పుడు రూ. 10 కోట్లు.. ఇప్పుడు అన్సోల్డ్.. నా హృదయం ముక్కలైంది!
సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్ మెగా వేలం-2025 సోమవారం ముగిసింది. ఇందులో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ టీమిండియా స్టార్ రిషభ్ పంత్ కోసం ఏకంగా రూ. 27 కోట్లు ఖర్చు చేసింది. ఫలితంగా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్ ఆల్టైమ్ రికార్డు సృష్టించాడు.ఈసారి అతడు అన్సోల్డ్అదే విధంగా శ్రేయస్ అయ్యర్(రూ. 26.75 కోట్లు- పంజాబ్ కింగ్స్), వెంకటేశ్ అయ్యర్(రూ. 23.75 కోట్లు- కోల్కతా నైట్ రైడర్స్) కూడా భారీ ధర పలికారు. అయితే, కొంతమంది టీమిండియా క్రికెటర్లను మాత్రం ఫ్రాంఛైజీలు అస్సలు పట్టించుకోలేదు. అందులో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఒకడు. అతడు ఈసారి అన్సోల్డ్గా మిగిలిపోయాడు.ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ శార్దూల్ కోసం కనీస ప్రయత్నం కూడా చేయకపోవడం తనను విస్మయపరిచిందన్నాడు. ‘‘లార్డ్ ఠాకూర్ పేరు రానేలేదు. క్రికెట్, క్రికెటేతర కారణాలు ఏవైనా కావచ్చు. అతడు రెండుసార్లు అందుబాటులోకి వచ్చాడు. అయినప్పటికీ ఒక్కరు కూడా ఆసక్తి చూపించలేదు.సీఎస్కే అందరి కోసం ట్రై చేసిందితాము వదిలేసిన ఫాస్ట్ బౌలర్లలో శార్దూల్ మినహా అందరినీ.. తిరిగి దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నించింది. అతడిని మాత్రం వదిలేసింది. శార్దూల్ అమ్ముడుపోకుండానే మిగిలిపోయాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో 2020-21 భాగంగా గాబా టెస్టులో అతడి అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియా గెలిచిన తర్వాత.. వేలంలో ఏకంగా రూ. 10 కోట్లు వచ్చాయి. కానీ.. ఈసారి రూ. 2 కోట్లకు అందుబాటులో ఉన్నా ఎవరూ కనీసం పట్టించుకోలేదు. నిజంగా అతడి పరిస్థితిని చూసి నా హృదయం ముక్కలైంది’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇప్పటి వరకు 95 మ్యాచ్లుకాగా 2015లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన ముంబై ఆటగాడు శార్దూల్ ఠాకూర్.. ఈ ఏడాది చెన్నైకి ప్రాతినిథ్యం వహించాడు. అయితే, వేలానికి ముందు అతడిని వదిలేసిన సీఎస్కే.. వేలం సందర్భంగా మొత్తానికే గుడ్బై చెప్పింది. ఇక శార్దూల్ ఠాకూర్ తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటి వరకు 95 మ్యాచ్లు ఆడి 307 రన్స్ చేయడంతో పాటు.. 94 వికెట్లు పడగొట్టాడు.చదవండి: వెంకటేశ్ అయ్యర్, నరైన్ కాదు.. కేకేఆర్ కెప్టెన్గా అతడే!? -
Ind vs SA: వాళ్లు ఓకే.. సూర్యకుమార్ యాదవ్ ఎందుకిలా?
సౌతాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్ గెలవడమే లక్ష్యంగా టీమిండియా ఆఖరి మ్యాచ్లో బరిలోకి దిగనుంది. ఇరుజట్ల మధ్య జొహన్నస్బర్గ్ వేదికగా.. శుక్రవారం నాటి టీ20లో గెలిచి.. 3-1తో పర్యటన ముగించాలని పట్టుదలగా ఉంది. ఇక ఈ టూర్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని యువ జట్టు ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో మెరుగ్గానే రాణించింది.వాళ్లు ఓకేముఖ్యంగా తొలి, మూడో టీ20లో బ్యాటర్లు దంచికొట్టిన తీరు అలరించింది. ఈ సిరీస్లో ఇప్పటి వరకు సంజూ శాంసన్(107- మొదటి టీ20), తిలక్ వర్మ(107 నాటౌట్- మూడో టీ20)లో అద్భుత శతకాలతో సత్తా చాటి విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఇంత వరకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.సూర్యకుమార్ యాదవ్ ఎందుకిలా?సఫారీలతో మూడు టీ20లలో అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 21, 4, 1. ఈ నేపథ్యంలో కీలకమైన నాలుగో టీ20కి ముందు సూర్య ఫామ్పై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సూర్యను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.గత మూడేళ్ల కాలంలో ఇలా‘‘సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ టీ20ల ఫామ్పై ఆందోళన అవసరమే అంటారా?.. చాలా మంది ఈ విషయం గురించి ఆలోచిస్తున్నారు. అందుకే అతడి గణాంకాలను ఓసారి పరిశీలిద్దాం. 2021లో సగటున 34 పరుగులతో 155కు పైగా స్ట్రైక్రేటు నమోదు చేశాడు. కేవలం 11 ఇన్నింగ్స్లోనే ఇది జరిగింది.ఇక 2022లో సూర్య యావరేజ్గా 46 రన్స్తో 187కు పైగా స్ట్రైక్రేటుతో 1164 పరుగులు సాధించాడు. అద్భుతంగా ఆడాడు అనడానికి ఇదే నిదర్శనం. ఇక 2023లో 155కు పైగా స్ట్రైక్రేటుతో 733 రన్స్ సాధించాడు. సగటు 49. పర్లేదు బాగానే ఆడాడు.కానీ..2024లో ఇప్పటి వరకు 17 ఇన్నింగ్స్లో కేవలం 429 పరుగులే చేయగలిగాడు. స్ట్రైక్రేటు 150 ఉన్నా.. సగటు మాత్రం కేవలం 26.8. ఇందులో కేవలం నాలుగు అర్ధ శతకాలే ఉన్నాయి. వీటన్నింటిని బట్టి చూస్తే సూర్య మునుపటి సూర్యలా లేడు. సగటున అతడు రాబడుతున్న పరుగులే ఇందుకు సాక్ష్యం’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.సూర్య కనీసం హాఫ్ సెంచరీ సాధిస్తే..గత మూడేళ్ల కాలంలో ఈ ఏడాది సూర్యకుమార్ బ్యాటింగ్ మరీ అంతగొప్పగా ఏమీలేదని.. కాబట్టి సూర్య ఫామ్ ఆందోళన కలిగించడంలో ఆశ్చర్యం ఏమీ లేదని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. జొహన్నస్బర్గ్ మ్యాచ్లో సూర్య కనీసం హాఫ్ సెంచరీ అయినా సాధిస్తే.. జట్టుతో పాటు అతడికీ ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా డర్బన్లో తొలి టీ20లో గెలిచిన టీమిండియా.. గెబెహాలో ఓడిపోయింది. అయితే, సెంచూరియన్లో మూడో మ్యాచ్లో గెలిచి ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉంది.చదవండి: పాకిస్తాన్తో తొలి టీ20: మాక్స్వెల్ ఊచకోత, స్టొయినిస్ విధ్వంసం -
ఆసీస్-‘ఎ’తో టెస్టుల్లో విఫలం.. అయినా అతడిపై భారీ అంచనాలు!
భారత వన్డే, టీ20 జట్టులో కీలకమైన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్టులకు ఎప్పుడో దూరమయ్యాడు. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్లతో టెస్టు సిరీస్లకు ముందు రెడ్బాల్తో ప్రాక్టీస్ చేసినా.. రీఎంట్రీ మాత్రం ఇవ్వలేకపోయాడు. ఇక హార్దిక్ లేకపోయినా.. శార్దూల్ ఠాకూర్ రూపంలో టెస్టుల్లో టీమిండియాకు పేస్ బౌలింగ్ దొరికాడు. కానీ నిలకడలేమి ఆట తీరుతో ప్రస్తుతం జట్టుకు దూరమైన ఈ ముంబై క్రికెటర్.. రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. నితీశ్కుమార్ రెడ్డికి బంపరాఫర్ ఈ నేపథ్యంలో ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్కుమార్ రెడ్డికి బంపరాఫర్ వచ్చిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ఎంపికైన జట్టులో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా 21 ఏళ్ల ఈ యువ ఆటగాడు చోటు దక్కించుకున్నాడు.ఆసీస్-‘ఎ’తో టెస్టుల్లో విఫలంఅంతకంటే ముందే ఆస్ట్రేలియా-‘ఎ’తో తలపడిన భారత్-‘ఎ’ జట్టు తరఫున ఆడేందుకు కంగారూ గడ్డపై అడుగుపెట్టాడు. అయితే, ఆసీస్-‘ఎ’తో జరిగిన రెండు మ్యాచ్ల అనధికారిక టెస్టు సిరీస్లో నితీశ్ పూర్తిగా నిరాశపరిచాడు. పరుగులు రాబట్టడంలో, వికెట్లు తీయడంలోనూ విఫలమయ్యాడు.రెండు మ్యాచ్లలో నితీశ్ చేసిన స్కోర్లు 0, 17, 16, 38. తీసిన వికెట్ ఒకే ఒక్కటి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరుగనున్న టెస్టుల్లో నితీశ్ రెడ్డిని ఆడిస్తారా? లేదా అన్న అంశంపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్గా మేనేజ్మెంట్ నితీశ్ పేరును పరిశీలించే అవకాశం ఉందన్న ఆకాశ్.. అయితే, ఇప్పుడే అతడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఊహించలేమన్నాడు. ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో మ్యాచ్లలో అతడు విఫలం కావడమే ఇందుకు కారణంగా పేర్కొన్నాడు. అనధికారిక టెస్టుల్లో రన్స్ రాబట్టలేక.. వికెట్లు తీయలేక నితీశ్ ఇబ్బంది పడ్డాడని.. అలాంటి ఆటగాడు పటిష్ట ఆసీస్పై ఎలా రాణించగలడని ప్రశ్నించాడు.అయినా భారీ అంచనాలు.. ఇప్పుడే అదెలా సాధ్యం?‘‘హార్దిక్ పాండ్యా లేనందుకు శార్దూల్ జట్టుతో ఉండేవాడు. కానీ ఇప్పుడు మనం నితీశ్ కుమార్ రెడ్డి నుంచి పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా సేవలు ఆశిస్తున్నాం. ఇప్పుడే అదెలా సాధ్యం? ఇటీవలి అతడి ప్రదర్శనలు గొప్పగా ఏమీలేవు. అయినప్పటికీ అతడిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.ఏదేమైనా అతడు ఈ సిరీస్లో రాణించాలనే కోరుకుంటున్నా. నిజానికి ఫస్ట్క్లాస్ క్రికెట్లోనూ అతడికి పెద్దగా అనుభవం లేదు. అయినా.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ రూపంలో నితీశ్ సేవలు జట్టుకు అవసరం కాబట్టి.. అతడు ఎంపికయ్యాడు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్లో అదరగొట్టికాగా ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అదరగొట్టిన విశాఖపట్నం కుర్రాడు నితీశ్ రెడ్డి.. ఇటీవలే టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇక ఫస్ట్క్లాస్ క్రికెట్ విషయానికొస్తే.. 39 ఇన్నింగ్స్లో కలిపి 779 పరుగులు చేసిన నితీశ్.. 42 ఇన్నింగ్స్లో కలిపి 56 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్- టీమిండియా మ ధ్య నవంబరు 22 నుంచి టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.చదవండి: టీమిండియాకు గుడ్న్యూస్ -
ICC CT 2025: టీమిండియా లేకుంటే చాంపియన్స్ ట్రోఫీ లేనట్లే!
చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియాను పాకిస్తాన్కు పంపే ప్రసక్తే లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు తమ నిర్ణయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి ఈ- మెయిల్ ద్వారా తెలిపింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆదివారం ధ్రువీకరించింది.పాక్ ప్రభుత్వానికి లేఖబీసీసీఐ నిర్ణయాన్ని తమకు తెలియజేస్తూ ఐసీసీ మెయిల్ పంపిందని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ విషయం గురించి తాము పాక్ ప్రభుత్వానికి లేఖ పంపామని.. ప్రభుత్వ సూచనలు, సలహా మేరకు అంతిమ నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. అయితే, అంతకంటే ముందే పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. టీమిండియా తమ దేశానికి తప్పక రావాలని.. ఐసీసీ టోర్నీ విషయంలో హైబ్రిడ్ విధానం కుదరదని పేర్కొన్నాడు.ఈ పరిణామాల నేపథ్యంలో పాక్, భారత మాజీ క్రికెటర్లు ఈ అంశంపై తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. పీసీబీకి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఆదాయానికి భారీగా గండి‘‘అవును.. ఇది ఐసీసీ ఈవెంటే! బ్రాడ్కాస్టర్లు అందుకే డబ్బు కూడా చెల్లించారు. అయితే, ఒకవేళ ఈ టోర్నీలో టీమిండియా పాల్గొనకపోతే.. మ్యాచ్ ప్రసారకర్తలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రారు.ఆర్థికంగా ఒకరకమైన సంక్షోభం ఏర్పడుతుంది. ఒకవేళ టీమిండియా ఈ టోర్నీలో ఆడకపోతే ఆదాయానికి భారీగా గండిపడుతుంది. గతేడాది వన్డే వరల్డ్కప్-2023 కోసం పాకిస్తాన్ జట్టు భారత్కు వచ్చేటపుడు పీసీబీ చీఫ్ మేము శత్రు ప్రదేశంలో అడుగుపెట్టబోతున్నామని అన్నారు.టీమిండియా లేకపోతే ఈసారి చాంపియన్స్ ట్రోఫీ లేనట్లేఒకవేళ పాకిస్తాన్ గనుక భవిష్యత్తులో టీమిండియాతో ఆడొద్దని అనుకుంటే.. అందుకు తగ్గట్లుగానే ప్రభావం ఉంటుంది. అదే విధంగా.. టీమిండియా పాకిస్తాన్తో ఆడకపోతే ఆ ప్రభావం మరింత తీవ్రస్థాయిలో ఉంటుంది. ఎందుకంటే.. ఇది ఆర్థికాంశాలతో ముడిపడి ఉంది.పాకిస్తాన్ ఇప్పుడు డిమాండ్ చేసే స్థితిలో లేదన్నది చేదు నిజం. ఒకవేళ టీమిండియా లేకపోతే ఈసారి చాంపియన్స్ ట్రోఫీ కూడా ఉండదు. పాకిస్తాన్తో సహా ప్రతీ జట్టు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.కాగా వచ్చే ఏడాది ఫిబ్రరి- మార్చి నెలలో జరుగబోయే చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో దిగనుండగా.. గతేడాది వన్డే వరల్డ్కప్లో సత్తా చాటిన టీమిండియా, చాంపియన్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్ బంగ్లాదేశ్, ఇంగ్లండ్ తదితర దేశాలు ఈ టోర్నీకి అర్హత సాధించాయి.చదవండి: Ind vs SA: సూర్య చేసిన అతిపెద్ద తప్పు అదే.. అతడిని ఎందుకు ఆడిస్తున్నట్లు మరి? -
సూర్య చేసిన తప్పు అదే.. అతడిని ఎందుకు ఆడిస్తున్నట్లు?
సౌతాఫ్రికా పర్యటనను ఘనంగా ఆరంభించిన టీమిండియా జోరుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ఆతిథ్య ప్రొటిస్ జట్టు బదులు తీర్చుకుంది. రెండో మ్యాచ్లో మూడు వికెట్ల తేడాతో భారత్పై గెలిచి.. సిరీస్ను 1-1తో సమం చేసింది. కాగా నాలుగు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు సూర్య సేన సౌతాఫ్రికాకు వెళ్లిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో డర్బన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 61 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే, గెబెహాలో ఆదివారం జరిగిన రెండో టీ20లో మాత్రం ఓటమిపాలైంది. కీలక బ్యాటర్లంతా విఫలమైనా.. స్వల్ప లక్ష్యాన్ని కాపాడటం కోసం బౌలర్లు ఆఖరి వరకు పోరాడారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.ఒకే ఒక్క ఓవర్ ఇస్తారా?ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా విమర్శలు చేశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో సూర్య విఫలమయ్యాడని పేర్కొన్నాడు. రెండో టీ20లో అక్షర్కు కేవలం ఒకే ఒక్క ఓవర్ ఇవ్వడం భారత కెప్టెన్ చేసిన అతిపెద్ద తప్పని విమర్శించాడు.ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘అక్షర్ పటేల్ సేవలను పూర్తిగా వినియోగించుకుంటున్నారా? అసలు అతడిని ఎందుకు ఆడిస్తున్నారు? డర్బన్లో అక్షర్కు కేవలం ఒకే ఒక్క ఓవర్ ఇచ్చారు. గెబెహాలోనూ అదే పరిస్థితి.సూర్య చేసిన అతిపెద్ద తప్పు ఇదిస్పిన్నర్లు మాత్రమే ఆరు నుంచి ఏడు వికెట్లు తీస్తున్న పిచ్పై అక్షర్తో ఇలా ఒకే ఒక్క ఓవర్ వేయించడం ఏమిటి? అక్షర్ సేవలను వినియోగించుకోవడంలో మేనేజ్మెంట్ విఫలమవుతోంది. తుదిజట్టులో ముగ్గురు స్పిన్నర్లను ఆడిస్తున్నారు. కానీ వారిని సరైన విధంగా ఉపయోగించుకోలేకపోతున్నారు.భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యం గురించి నేను ప్రస్తుతానికి మాట్లాడదలచుకోలేదు. కానీ బౌలర్గా అక్షర్ పటేల్ను ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారు. ఈ మ్యాచ్లో సూర్య చేసిన అతిపెద్ద తప్పు ఇది అని కచ్చితంగా చెప్పగలను’’ అని పేర్కొన్నాడు. కేవలం 124 పరుగులుఇక ఈ మ్యాచ్లో బ్యాట్ ఝులిపించే ప్రయత్నం చేసిన అక్షర్ పటేల్ రనౌట్ కావడం నిజంగా అతడి దురదృష్టమని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికాతో రెండో టీ20లో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కేవలం 124 పరుగులు చేసింది. తిలక్ వర్మ(20), స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్(27), హార్దిక్ పాండ్యా(39 నాటౌట్) రాణించడంతో ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాను భారత బౌలర్లు ఆది నుంచే ఇబ్బంది పెట్టారు. వరుణ్ ఐదు వికెట్లు తీసినా..ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కేవలం 17 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. మరో స్పిన్నర్ రవి బిష్ణోయి సైతం ఒక వికెట్ తీయగా.. పేసర్ అర్ష్దీప్ సింగ్ కూడా ఒక వికెట్ దక్కించుకున్నాడు.అయితే, స్పిన్కు అనుకూలిస్తున్న పిచ్పై అక్షర్ పటేల్కు మాత్రం ఒకే ఒక్క ఓవర్ ఇవ్వగా.. అతడు కేవలం రెండు పరుగులే ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. భారత బౌలర్లు అటాక్ చేస్తున్నా సౌతాఫ్రికా హిట్టర్ ట్రిస్టన్ స్టబ్స్ 41 బంతుల్లో 47 పరగులుతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఇరుజట్ల మధ్య బుధవారం సెంచూరియన్ వేదికగా మూడో టీ20 జరుగనుంది.చదవండి: హార్దిక్ సెల్ఫిష్ ఇన్నింగ్స్..! ఇదంతా ఐపీఎల్ కోసమేనా: పాక్ మాజీ క్రికెటర్ -
'అతడికి ఇది డూ ఆర్ డై సిరీస్.. లేదంటే ఇక మర్చిపోవాల్సిందే'
దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టీ20 ఇరు జట్ల మధ్య శుక్రవారం డర్బన్ వేదికగా జరగనుంది. ఈ సిరీస్లో సఫారీలను సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని యువ భారత జట్టు ఢీకొట్టనుంది.ప్రోటీస్ సిరీస్కు యశస్వీ జైశ్వాల్, గిల్, రిషబ్ పంత్, బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు దూరమయ్యారు. దీంతో సౌతాఫ్రికా పర్యటనకు రమణ్దీప్ సింగ్, విజయ్కుమార్ వైశ్యాఖ్, యశ్ దయాల్ వంటి కొత్త ముఖాలకు భారత జట్టులో సెలక్టర్లు చోటు కల్పించారు.ఈ నేపథ్యంలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మకు ఈ సిరీస్ డూ ఆర్ డై వంటిది అని చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా జింబాబ్వే సిరీస్తో టీ20ల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అభిషేక్.. జైశ్వాల్ బ్యాకప్ ఓపెనర్గా కొనసాగుతున్నాడు.జైశ్వాల్ గైర్హాజరీ సిరీస్లలో అభిషేక్కు సెలక్టర్లు చోటిస్తున్నారు. అయితే జింబాబ్వే సిరీస్లో సెంచరీ మినహా ఇప్పటివరకు అభిషేక్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఇప్పటివరకు 8 ఇన్నింగ్స్లు ఆడిన అభిషేక్.. 22.71 సగటుతో కేవలం 159 పరుగులు మాత్రమే చేశాడు."అభిషేక్ శర్మ ఈ సిరీస్లో చావోరెవో తెల్చుకోవాల్సిందే. ఎందుకంటే ఈ సిరీస్లో అభిషేక్ రాణించికపోతే వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు అతడిని కచ్చితంగా పక్కనపెట్టేస్తారు. అభిషేక్ శర్మ అద్భుతమైన ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.అతడి బ్యాటింగ్ స్టైల్ అంటే నాకు ఎంతో ఇష్టం. జింబాబ్వే పర్యటనలో సెంచరీ కూడా సాధించాడు. కానీ ఆ తర్వాత ఇప్పటివరకు అభిషేక్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదని" చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: IND-A vs AUS-A: నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. 223 పరుగులకు ఆసీస్ ఆలౌట్ -
IPL 2025: మెగా వేలంలో అతడికి రూ. 30 కోట్లు!
టీమిండియా స్టార్ రిషభ్ పంత్ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ గనుక వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు కావడం ఖాయమని పేర్కొన్నాడు. ఫ్రాంఛైజీలన్నీ పంత్ వైపు చూస్తున్నాయన్న ఆకాశ్ చోప్రా.. అతడు ఈసారి రూ. 25- 30 కోట్ల ధర పలికినా ఆశ్చర్యం లేదన్నాడు.ఫ్రాంఛైజీలు ఎగబడటం ఖాయం.. కారణాలు ఇవేకాగా ఐపీఎల్-2025 మెగా వేలానికి సమయం సమీపిస్తోంది. నవంబరు ఆఖరి వారంలో ఆక్షన్ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. పది ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాను అక్టోబరు 31లోగా సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. రిషభ్ పంత్ వేలంలోకి వస్తే ఫ్రాంఛైజీలు ఎగబడటం ఖాయమంటూ.. అందుకు గల కారణాలను కూడా విశ్లేషించాడు.‘‘రిషభ్ పంత్ వేలంలోకి వస్తాడనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అతడు వికెట్ కీపర్ బ్యాటర్. అయితే, చాలా మంది అతడి టీ20 గణాంకాలు అంత బాగా లేవని అంటూ ఉంటారు. ఐపీఎల్లో ఇంత వరకు భారీ స్థాయిలో పరుగులు రాబట్టలేదన్నది వాస్తవమే.అయినప్పటికీ అతడు వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు కావడం ఖాయం. ఆర్సీబీకి కీపర్ కావాలి.. బ్యాటర్ కావాలి.. బహుశా కెప్టెన్ కూడా కావాలి. ఇక పంజాబ్కి కూడా వికెట్ కీపర్ లేడు. ఢిల్లీకీ పంత్ కావాలి.వాళ్లకూ వికెట్ కీపర్ లేడుకేకేఆర్కు కూడా అతడి అవసరం ఉంది. ఇక సీఎస్కే కూడా పంత్ లాంటి వికెట్ కీపర్ను కోరుకోవడంలో సందేహం లేదు. ఒకవేళ ఇషాన్ కిషన్ జట్టులో లేకుంటే.. ముంబైకీ పంత్ కావాలి. నికోలస్ పూరన్ ఉన్నా... లక్నో కూడా పంత్పై ఆసక్తి చూపవచ్చు.గుజరాత్ జట్టు పరిస్థితి కూడా ఇదే. వాళ్లకూ వికెట్ కీపర్ లేడు. కాబట్టి రిషభ్ పంత్ వేలంలోకి వస్తే రూ. 25- 30 కోట్ల మధ్య అమ్ముడుపోతాడు’’ అని ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. కాగా ఘోర రోడ్డు ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ పంత్.. దాదాపు ఏడాదిన్నర తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు.ఈ ఏడాది రీ ఎంట్రీఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా తిరిగి పగ్గాలు చేపట్టిన పంత్.. జట్టును ఆరోస్థానంలో నిలిపాడు. సారథిగా ఆకట్టుకోలేకపోయినా.. 446 పరుగులతో బ్యాటర్గా రాణించాడు. వికెట్ కీపర్గానూ తన బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేశాడు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ను చాంపియన్గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు.చదవండి: ‘నన్ను వెక్కిరించావు కదా.. అందుకే అలా చేశాను’ -
రోహిత్ అసలేం చేశావు.. అతడితో ఎందుకు బౌలింగ్ చేయించలేదు?
న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్ను భారత్ ఓటమితో ఆరంభించిన విషయం తెలిసిందే. బెంగళూరు వేదికగా జరిగిన మొదటి టెస్టులో 8 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన మార్క్ను చూపించలేకపోయాడు. టాస్ దగ్గర నుంచి బౌలర్ల ఎంపిక వరకు రోహిత్ నిర్ణయాలు బెడిసి కొట్టాయి. తొలి ఇన్నింగ్స్లో రాహుల్ కంటే ముందు కోహ్లిని బ్యాటింగ్కు పంపడం, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం, కివీస్ టెయిలాండర్ టిమ్ సౌథీ భారత స్పిన్నర్లపై విరుచుకుపడుతున్నప్పుడు బుమ్రాతో బౌలింగ్ చేయించకపోవడం వంటివి రోహిత్ చేసిన తప్పిదాలగా క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో రోహిత్ కెప్టెన్సీపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ప్రశ్నల వర్షం కురిపించాడు. కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో రవిచంద్రన్ అశ్విన్ ఆలస్యంగా ఎటాక్లోకి తీసుకురావడాన్ని చోప్రా తప్పు బట్టాడు."అంత తక్కువ టార్గెట్ను డిఫెండ్ చేసుకోవడం అంత సులభం కాదు. ఈ విషయం నాకు కూడా తెలుసు. కానీ అశ్విన్తో కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయించడం నన్ను ఆశ్చర్యపరిచింది. అశ్విన్ బౌలింగ్ చేసి ఉంటే మ్యాచ్ మనదే అని నేను చెప్పడం లేదు. కానీ అతడు వరల్డ్లోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడు. టీమ్లో కూడా అశ్విన్ మించినవారే లేరు. టెస్టుల్లో అతని కంటే ఎక్కువ వికెట్లు ఎవరూ తీయలేదు. లెఫ్ట్ హ్యాండర్లపై కూడా అశూకు మంచి రికార్డు ఉంది. ఎడమచేతి వాటం ఆటగాళ్ళు క్రీజులో ఉన్నప్పుడు కూడా అతడిని ఎటాక్లోకి తీసుకు రాలేదు. అస్సలు ఎందుకు అలా చేయలేకపోయారో ఎవరికీ ఆర్ధం కావడం లేదంటూ" తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు.చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్.. రెండో టెస్టుకు డేంజరస్ ప్లేయర్ దూరం!? -
Ind Vs NZ: రెండో టెస్టులో సర్ఫరాజ్కు నో ఛాన్స్!?
న్యూజిలాండ్తో రెండో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ కచ్చితంగా ఆడతాడని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. కరుణ్ నాయర్ మాదిరి అతడిని దురదృష్టం వెంటాడబోదని జోస్యం చెప్పాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ముంబైకర్ తుదిజట్టులో ఉండటం అత్యవసరమని పేర్కొన్నాడు.కాగా కివీస్తో స్వదేశంలో మూడు టెస్టుల సిరీస్ను టీమిండియా పరాజయంతో ఆరంభించింది. బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేన ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మొదటి ఇన్నింగ్స్లో 46 పరుగులకే ఆలౌటై దారుణంగా విఫలమైనప్పటికీ.. రెండో ఇన్నింగ్స్లో 462 పరుగులు భారీ స్కోరు సాధించింది.ఇందుకు ప్రధాన కారణం సర్ఫరాజ్ ఖాన్. తన కెరీర్లో నాలుగో టెస్టు ఆడిన ఈ ముంబై బ్యాటర్ జట్టు కష్టాల్లో ఉన్న వేళ 150 పరుగులతో అద్బుత ప్రదర్శన కనబరిచాడు. అదే సమయంలో మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన ఈ కర్ణాటక బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లోనూ 12 పరుగులకే నిష్క్రమించాడు.ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో సర్ఫరాజ్ ఖాన్కు తుదిజట్టులో చోటు దక్కడానికి కారణం శుబ్మన్ గిల్ గైర్హాజరీ. ఫిట్నెస్ లేమి కారణంగా గిల్ దూరం కావడంతో విరాట్ కోహ్లి మూడో స్థానంలో రాగా.. సర్ఫరాజ్ నాలుగో నంబర్ బ్యాటర్గా కోహ్లి స్థానాన్ని భర్తీ చేశాడు. అయితే, మిడిలార్డర్లో కేఎల్ రాహుల్తో సర్ఫరాజ్ పోటీపడుతున్న విషయం తెలిసిందే.గిల్ తిరిగి వస్తే ఈ ఇద్దరిలో ఒకరిపై వేటుపడకతప్పదు. తాజా ప్రదర్శన నేపథ్యంలో మేనేజ్మెంట్ సర్ఫరాజ్వైపే మొగ్గుచూపి.. రాహుల్ను బెంచ్కే పరిమితం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కరుణ్ నాయర్ సంగతిని గుర్తుచేస్తూ సర్ఫరాజ్ను కూడా బ్యాడ్లక్ వెంటాడవచ్చునని పేర్కొన్నాడు.ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘అవును.. కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ(300) చేసిన తర్వాత కూడా తదుపరి మ్యాచ్లోనే అతడిని తప్పించారు. అజింక్య రహానే తిరిగి రావడంతో కరుణ్ను డ్రాప్ చేశారు. టెస్టు కెరీర్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే, కరుణ్ నిలకడలేమి ఫామ్ వల్లే అలా జరిగి ఉండవచ్చు.ఒకవేళ కేఎల్ రాహుల్ కోసం సర్ఫరాజ్ను బెంచ్కే పరిమితం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే, నాకు మాత్రం అతడు పుణె మ్యాచ్లో కచ్చితంగా ఆడతాడనే అనిపిస్తోంది. రాహుల్ రెండు ఇన్నింగ్స్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. అంతేకాదు.. ప్రస్తుతం టీమిండియా పరిస్థితి, డ్రెసింగ్ రూం వాతావరణం చూస్తుంటే సర్ఫరాజ్ పుణె టెస్టు తుదిజట్టులో చోటు దక్కించుకుంటాడనే అనిపిస్తోంది’’ అని పేర్కొన్నాడు. స్పోర్ట్స్18తో మాట్లాడుతూ ఆకాశ్ చోప్రా ఈ మేర వ్యాఖ్యలు చేశాడు. కాగా కరుణ్ నాయర్ 2017లో ఇంగ్లండ్తో టెస్టులో త్రిశతకం బాదినా.. ఆ మరుసటి మ్యాచ్లో అతడికి చోటు దక్కలేదు. -
IPL 2025: ‘కమిన్స్ను వదిలేయనున్న సన్రైజర్స్! కారణం ఇదే’
ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్ రాతను మార్చేశాడు ప్యాట్ కమిన్స్. మూడేళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న జట్టును తన కెప్టెన్సీ నైపుణ్యాలతో ఏకంగా ఫైనల్ చేర్చాడు. ఆఖరి మెట్టుపై రైజర్స్ తడబడ్డా.. అక్కడి దాకా జట్టు సాగించిన విధ్వంసకర పరుగుల ప్రయాణం ఐపీఎల్ చరిత్రలోనే ఓ అద్బుతం లాంటిది.నిజానికి ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా వన్డే, టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కోసం సన్రైజర్స్ ఏకంగా రూ. 20.50 కోట్లు ఖర్చు చేసినపుడు విమర్శలే ఎక్కువగా వచ్చాయి. ఈ ఫాస్ట్ బౌలర్ కోసం భారీ మొత్తం వెచ్చించడం వల్ల ప్రయోజనం ఉండదని చాలా మంది మాజీ క్రికెటర్లు పెదవి విరిచారు.సంచలన ఆట తీరుతో టైటిల్కు చేరువగాఅయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కమిన్స్ సారథ్యంలోని జట్టు సంచలన ఆట తీరుతో టైటిల్కు చేరువగా వచ్చింది. ఇక బౌలర్గానూ, సారథిగానూ కమిన్స్.. ఫ్రాంఛైజీ తనపై పెట్టిన పెట్టుబడికి పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు. ఆరెంజ్ ఆర్మీకి ఇష్టమైన కెప్టెన్గా మారిపోయాడు. వచ్చే ఏడాది కూడా తానే కెప్టెన్గా ఉండాలనేంత బలంగా ముద్ర వేశాడు. ఫ్రాంఛైజీ సైతం కమిన్స్నే నాయకుడిగా కొనసాగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాత్రం భిన్నంగా స్పందించాడు. సన్రైజర్స్ కమిన్స్ను అట్టిపెట్టుకోదని.. వేలానికి ముందు అతడిని టీమ్ నుంచి రిలీజ్ చేస్తుందని జోస్యం చెప్పాడు. తాను ఇలా అనడానికి గల కారణాన్ని కూడా వెల్లడించాడు. కంగారూ ఆటగాళ్ల ప్రాధాన్యాలు వేరుగా ఉంటాయి‘‘ప్యాట్ కమిన్స్ వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడతానో.. లేదోనన్న అంశంపై స్పష్టత లేదని చెప్పాడు. ఆస్ట్రేలియాకు ఉన్న బిజీ షెడ్యూల్ ఇందుకు కారణం. యాషెస్, వరల్డ్కప్స్.. ఇలా కంగారూ ఆటగాళ్ల ప్రాధాన్యాలు వేరుగా ఉంటాయి.ఒకవేళ ఆసీస్ షెడ్యూల్కు ఐపీఎల్ షెడ్యూల్ అడ్డు రానట్లయితే.. అప్పుడు పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఐపీఎల్లో కొత్త నిబంధనలు వచ్చాయని కూడా కమిన్స్ చెప్పాడు. మరి అతడి నిర్ణయం ఎలా ఉండబోతుందో తెలియదు.హైదరాబాద్ ఈసారి అతడిని రిటైన్ చేసుకోదువేలంలో తన పేరు నమోదు చేసుకుని.. ఆ తర్వాత తప్పుకొన్న సందర్భాలు లేవని కూడా అతడే చెప్పాడు. గతంలో మిచెల్ స్టార్క్ వంటి ఆసీస్ ఆటగాళ్లు ఇలా చేసిన మాట వాస్తవం. అయితే, కమిన్స్ ఈ విషయంలో క్లారిటీగానే ఉన్నాడు. నా అభిప్రాయం ప్రకారం.. సన్రైజర్స్ హైదరాబాద్ ఈసారి అతడిని రిటైన్ చేసుకోదు.ఎందుకంటే.. మొదటి ప్లేయర్గా అతడిని తీసుకుంటే 18 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఈ సీజన్లో కమిన్స్ బౌలర్గా.. కెప్టెన్గా అద్భుతంగా రాణించినా.. ఫ్రాంఛైజీ మాత్రం అతడిని రిలీజ్ చేస్తుందనే నేను నమ్ముతున్నాను’’ అని ఆకాశ్ చోప్రా విచిత్ర వ్యాఖ్యలు చేశాడు.నిబంధనలు ఇవేకాగా ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో బీసీసీఐ ఇటీవలే రిటెన్షన్ పాలసీని ప్రకటించింది. మొత్తం ఆరుగురి(ఆర్టీఎమ్ కార్డుతో కలిపి)ని తమతో పాటే జట్లు అట్టిపెట్టుకోవచ్చు. ఇందులో ఐదుగురు క్యాప్డ్, కనీసం ఒక్కరు అన్క్యాప్డ్(ఇండియన్ ప్లేయర్స్) ఉండాలి. ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లను అట్టిపెట్టుకుంటే మొదటి మూడు రిటెన్షన్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు చెల్లించాలి.మిగతా రెండు రిటెన్షన్లకు రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక వేలంలోకి వచ్చి అమ్ముడుపోయి.. సీజన్ ఆరంభానికి ముందు సహేతుక కారణాలు లేకుండా తప్పుకొంటే సదరు ఆటగాళ్లపై రెండేళ్ల నిషేధం విధిస్తారు.చదవండి: T20 WC 2024: పట్టిక తారుమారు.. సెమీస్ బెర్తులు ఖరారు -
‘ఇంత చెత్త ఆట చూడలేదు.. మేమేమీ క్యాచ్లు డ్రాప్ చేయలేదు’
మహిళల టీ20 ప్రపంచకప్-2024.. ఆరంభం నుంచే తడబడ్డ భారత జట్టు సెమీ ఫైనల్ చేరాలంటే.. పాకిస్తాన్- న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సిన దుస్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్లో పాక్ గెలిస్తేనే హర్మన్ప్రీత్ సేన టాప్-4కు చేరుతుంది. కాబట్టి.. దాయాది ఎలాగైనా గెలవాలని ఈసారి టీమిండియా అభిమానులు కూడా కోరుకున్నారు.కానీ.. ఫ్యాన్స్ ప్రార్థనలు ఫలించలేదు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ కివీస్ చేతిలో చిత్తుగా ఓడింది. బౌలింగ్లో రాణించినా.. ఫీల్డింగ్లో మాత్రం చెత్త ప్రదర్శన కనబరిచింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో 4.2, 5.2, 7.3, 15.5, 17.2, 19.1, 19.3, 19.5 ఓవర్ల వద్ద ఏకంగా ఎనిమిది క్యాచ్లు జారవిడిచింది.లక్ష్య ఛేదనలోనూ నిర్లక్ష్యపు షాట్లతో మూల్యం చెల్లించి.. తమ క్రికెట్ చరిత్రలోనే అత్యల్పస్కోరు (56 ఆలౌట్) నమోదు చేసింది. కివీస్ చేతిలో ఏకంగా 54 పరుగుల తేడాతో ఓడిపోయింది. టోర్నీ నుంచి తామూ నిష్క్రమిస్తూ.. భారత జట్టును కూడా ఇంటిబాట పట్టించింది పాకిస్తాన్ మహిళా టీమ్.ఇంత చెత్త ఆట చూడలేదుఈ నేపథ్యంలో పాక్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ సనా మిర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘15 ఏళ్ల మా జట్టు ఆట తీరులో నేను ఇలాంటి చెత్త ప్రదర్శన ఎప్పుడూ చూడలేదు’’ అని సనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు.. టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సైతం న్యూజిలాండ్తో మ్యాచ్లో పాకిస్తాన్ ప్రదర్శనపై స్పందించాడు.మేమేమీ క్యాచ్లు ‘డ్రాప్’ చేయలేదు‘‘ఆసియాలో.. మేము ఆటగాళ్లను ‘డ్రాప్’ చేయము.. వారికి కేవలం ‘విశ్రాంతి’ని మాత్రమే ఇస్తాం.. అంతేకాదు.. మేమేమీ క్యాచ్లు ‘డ్రాప్’ చేయము.. కేవలం బంతిని గ్రౌండ్ మీద పెడతాము అంతే’’ అంటూ ఆకాశ్ చోప్రా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా ఇంగ్లండ్తో తొలి టెస్టులో పాకిస్తాన్ పురుషుల జట్టు ఓటమి తర్వాత.. రెండు, మూడో మ్యాచ్ల జట్టు నుంచి బాబర్ ఆజం, షాహిన్ ఆఫ్రిది వంటి స్టార్లను తప్పించి.. రెస్ట్ ఇచ్చామని కోచ్లు చెప్పిన విషయం తెలిసిందే.అదే ప్రభావం చూపిందిఈ నేపథ్యంలో పాక్ పురుషుల, మహిళా జట్ల గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆకాశ్ చోప్రా ఇలా సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశాడు. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత పాక్ మహిళా జట్టు కెప్టెన్ ఫాతిమా సనా మాట్లాడుతూ.. ‘‘మేము బాగానే బౌలింగ్ చేశాం. కానీ.. బ్యాటింగ్.. ముఖ్యంగా ఫీల్డింగ్ విభాగంలో మెరుగ్గా రాణించాల్సింది.మా జట్టులోని సీనియర్లు సైతం బ్యాటింగ్లో విఫలం కావడం ప్రభావం చూపింది. ఒకవేళ మేము గనుక బ్యాటింగ్లో రాటుదేలకపోతే.. మహిళా క్రికెటర్లుగా మా ఉనికికే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది’’ అని పేర్కొంది. ఆ ఎనిమిది క్యాచ్లు ఏదేమైనా.. పాకిస్తాన్ జారవిడిచిన ఆ ఎనిమిది క్యాచ్లు భారత జట్టు కొంపముంచాయి. సెమీస్ చేరాలన్న హర్మన్సేన ఆశలపై నీళ్లు చల్లాయి. దీంతో.. సహజంగానే కొంతమంది.. పాక్ కావాలనే చెత్తగా ఆడిందా అనే సందేహాలూ వ్యక్తం చేస్తున్నారు. అయితే, కివీస్ వంటి జట్టుతో మ్యాచ్ అంతతేలికైన విషయమేమీ కాదని విశ్లేషకులు అంటున్నారు.పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ స్కోర్లువేదిక: దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, దుబాయ్టాస్: న్యూజిలాండ్.. తొలుత బ్యాటింగ్న్యూజిలాండ్ స్కోరు: 110/6 (20)పాకిస్తాన్ స్కోరు: 56 (11.4)ఫలితం: పాక్పై 54 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపు.. సెమీస్లో అడుగుమహిళల టీ20 ప్రపంచకప్-2024 నుంచి పాకిస్తాన్తో పాటు భారత్ కూడా అవుట్.చదవండి: Ind vs NZ: మా ఆటకు హద్దుల్లేవ్.. రోజుకు 400–500 పరుగులైనా..Pakistan dropped 8 catches against New Zealand. 🤯pic.twitter.com/kW53N2A31t— Mufaddal Vohra (@mufaddal_vohra) October 14, 2024 -
‘పరుగుల విధ్వంసం తప్ప.. ఇంకోటి వద్దన్నారు’
టీ20 క్రికెట్లో టీమిండియా దూకుడు మంత్రంతో దూసుకెళ్తోందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఇందుకు కొత్త హెడ్కోచ్ గౌతం గంభీర్, నూతన సారథి సూర్యకుమార్ యాదవ్లే కారణమని పేర్కొన్నాడు. ఫలితంతో సంబంధం లేకుండా పరుగుల విధ్వంసం సృష్టించేందుకు యంగిస్తాన్ సిద్ధమైందని.. మున్ముందు పొట్టి ఫార్మాట్లో భారత జట్టు మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయమని అభిప్రాయపడ్డాడు.లంక పర్యటనతో మొదలుకాగా టీమిండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేసిన గంభీర్.. శ్రీలంక పర్యటనతో తన ప్రయాణం ప్రారంభించాడు. సూర్యకుమార్ పూర్తిస్థాయి కెప్టెన్ అయిన తర్వాత జరిగిన పొట్టి సిరీస్లో లంకను భారత్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. అనంతరం వీరిద్దరి కాంబినేషన్లో స్వదేశంలో టీమిండియా ఇటీవలే బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ ఆడింది.బంగ్లా బౌలింగ్ ఊచకోతసొంతగడ్డపై యువ ఆటగాళ్లతో నిండిపోయిన సూర్యసేన ఆకాశమే హద్దుగా చెలరేగి.. బంగ్లానూ 3-0తో వైట్వాష్ చేసింది. అయితే, లంక పర్యటనతో పోలిస్తే ఈసారి మరింత వేగంగా, మరింత దూకుడుగా పరుగులు రాబట్టింది. తొలి టీ20లో 11.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన భారత్.. ఆఖరి రెండు మ్యాచ్లలో బంగ్లా బౌలింగ్ను ఊచకోత కోసింది. వరుసగా 221, 297 పరుగులు సాధించి వారెవ్వా అనిపించింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘గౌతం గంభీర్, సూర్యకుమార్ యాదవ్ జోడీ టీమిండియాకు సరికొత్త దూకుడు మంత్రాన్ని ఉపదేశించింది. మ్యాచ్ అయినపోయిన తర్వాత రింకూ సింగ్ స్వయంగా ఈ విషయాన్ని పంచుకున్నాడు.పరుగుల విధ్వంసం తప్ప.. ఇంకోటి వద్దన్నారువిధ్వంసకరంగా బ్యాటింగ్ చేయడం తప్ప.. వేరే విషయాల గురించి ఆలోచించవద్దని తమకు ఆదేశాలు వచ్చాయన్నాడు. ఫియర్లెస్ క్రికెట్ ఆడాలని.. వికెట్ పడుతుందనే బెంగ వద్దని మేనేజ్మెంట్ చెప్పిందన్నాడు. దీనిని బట్టి కోచ్, కెప్టెన్ దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.నిజానికి పరుగులు రాబట్టాలనే తొందరలో వికెట్ పారేసుకుంటే జట్టులో చోటు దక్కదని ఆటగాళ్లు భయపడతారు. అయితే, స్వయంగా మేనేజ్మెంట్ రంగంలోకి దిగి ఫాస్ట్గా ఆడమని చెప్పటమే గాక.. ఆ క్రమంలో ప్రతికూల ఫలితాలు వచ్చినా అండగా ఉంటే.. అంతకంటే ఆటగాళ్లకు ఇంకేం కావాలి.బలహీన జట్లపై మాత్రమేనా?జట్టులో తమ స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని ప్లేయర్లు భావిస్తే.. ఫలితాలు కూడా ఇలాగే ఉంటాయి మరి! ఈ యంగిస్తాన్ భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది’’ అని ప్రశంసలు కురిపించాడు. అయితే, ఇప్పటి వరకు యువ టీమిండియా శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి బలహీన జట్లపై తమ బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపిందన్న ఆకాశ్ చోప్రా.. పటిష్ట జట్లపై కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తే కొన్నిసార్లు చిక్కులు తప్పవని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా తమ బ్యాటింగ్.. ముఖ్యంగా పవర్ ప్లేలో ఎలా ఉంటుందో ఇప్పటికే చూపించిందని పేర్కొన్నాడు. కాగా బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో అభిషేక్ శర్మ మినహా మిగతా బ్యాటర్లు 180కి పైగా స్ట్రైక్రేటుతో పరుగులు చేశారు.చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్తో టెస్టులకు టీమిండియా ఓపెనర్గా వస్తే! -
Ind vs Ban 2nd Test: భారత తుదిజట్టు నుంచి అతడు అవుట్!
బంగ్లాదేశ్ను క్లీన్స్వీప్ చేయడమే లక్ష్యంగా టీమిండియా రెండో టెస్టు బరిలో దిగనుంది. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సీజన్ ఫైనల్ చేరే క్రమంలో మరో ముందడుగు వేయాలని పట్టుదలగా ఉంది. కాగా రెండు టెస్టు, మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ భారత్కు వచ్చిన విషయం తెలిసిందే.తొలి టెస్టులో పేసర్లకే పెద్దపీటఈ క్రమంలో ఇరు జట్ల మధ్య చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ను 280 పరుగుల తేడాతో చిత్తు చేసింది. కాగా చెపాక్లోని ఎర్రమట్టి పిచ్పై ఈ మ్యాచ్ జరగగా.. ఇరు జట్లు ఫాస్ట్ బౌలర్లకు ప్రాధాన్యం ఇచ్చాయి. టీమిండియా ముగ్గురు సీమర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్లకు తుదిజట్టులో చోటిచ్చింది.అదే విధంగా.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను కూడా ఆడించింది. దీంతో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు మొండిచేయి ఎదురైంది. అయితే, రెండో టెస్టులో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండబోతుందని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. కాన్పూర్లోని నల్లమట్టి పిచ్పై మ్యాచ్ జరుగనుండటంతో కుల్దీప్ తుదిజట్టులో స్థానం దక్కించుకోవచ్చని అభిప్రాయపడ్డాడు.ఒక ఫాస్ట్ బౌలర్కు ఉద్వాసన‘‘నల్లమట్టి పిచ్పై గ్రాస్ వేసి.. కాస్త తేమగా ఉంచితే.. ఆట మొదటి రోజు, రెండో రోజు అరపూట వరకు బంతి బాగానే బౌన్స్ అవుతుంది. చెన్నై మాదిరే ఈ పిచ్ కూడా ఉంటే.. టీమిండియా మరోసారి ముగ్గురు ఫాస్ట్బౌలర్లతో రంగంలోకి దిగుతుంది. అలా కాకుండా ఇది పక్కాగా కాన్పూర్ పిచ్ అయితే మాత్రం.. రోజురోజుకీ వికెట్ బాగా నెమ్మదిస్తుంది.స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కుల్దీప్ యాదవ్ కచ్చితంగా తుదిజట్టులోకి వస్తాడు. అదే జరిగితే.. ఒక ఫాస్ట్ బౌలర్కు ఉద్వాసన పలకాల్సి ఉంటుంది. పనిభారాన్ని తగ్గించేందుకు బుమ్రాకు విశ్రాంతినిస్తే.. ఆకాశ్ దీప్ జట్టులో ఉంటాడు. లేదంటే.. ఆకాశ్ స్థానాన్ని కుల్దీప్ భర్తీ చేస్తాడు. రెండో టెస్టులో ఆడబోయే టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్లో ఇంతకంటే వేరే మార్పులేమీ ఉండకపోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా భారత తుదిజట్టు కూర్పు గురించి అభిప్రాయాలు పంచుకున్నాడు. శుక్రవారం నుంచి టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు మొదలుకానుంది.బంగ్లాదేశ్తో రెండో టెస్టు భారత తుది జట్టు అంచనారోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.చదవండి: ICC CT 2025: పాకిస్తాన్ కాదు.. సెమీస్ చేరే జట్లు ఇవే: అఫ్గన్ కెప్టెన్📍 Kanpur#TeamIndia hit the ground running ahead of the 2nd #INDvBAN Test 🙌@IDFCFIRSTBank pic.twitter.com/EMPiOa8HII— BCCI (@BCCI) September 26, 2024 -
IPL 2025: భారీ మొత్తానికి డీల్.. ఆ జట్టుతోనే పంత్!
టీమిండియా స్టార్ రిషభ్ పంత్ వచ్చే ఏడాది కూడా ఢిల్లీ క్యాపిటల్స్తోనే ఉంటాడని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. భారీ మొత్తానికి ఫ్రాంఛైజీ అతడిని అట్టిపెట్టుకుందని.. ఢిల్లీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాల్లోకెల్లా ఇదే ఉత్తమమైందని పేర్కొన్నాడు. కాగా రోడ్డు ప్రమాదం కారణంగా ఐపీఎల్-2023 మొత్తానికి దూరమైన పంత్.. పునరాగమనంలో సత్తా చాటిన విషయం తెలిసిందే.ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా బరిలోకి దిగిన పంత్.. జట్టును ప్లే ఆఫ్స్నకు చేర్చలేకపోయినా.. ఆరో స్థానంలో నిలపగలిగాడు. అయితే, సారథిగా విఫలమైనా ఆటగాడిగా మాత్రం ఆకట్టుకున్నాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ మొత్తంగా 446 పరుగులు సాధించి.. ఢిల్లీ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు. వికెట్ కీపర్గానూ రాణించాడు.పాంటింగ్తో పాటు పంత్ కూడా పంజాబ్ జట్టులోకి?అయితే, ఐపీఎల్-2025కి ముందు పంత్ ఢిల్లీ ఫ్రాంఛైజీని వీడనున్నాడనే వార్తలు వచ్చాయి. హెడ్కోచ్ రిక్కీ పాంటింగ్కు ఢిల్లీ ఉద్వాసన పలకగా.. అతడు పంజాబ్ కింగ్స్లో చేరాడు. దీంతో పాంటింగ్తో పాటు పంత్ కూడా పంజాబ్తో జట్టుకట్టనున్నాడనే వదంతులు వ్యాపించాయి. టెస్టుల్లో పునరాగమనంలో పంత్ శతక్కొట్టగా.. అతడిని అభినందిస్తూ పంజాబ్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ఇందుకు ఊతమిచ్చింది.పంత్ కంటే మెరుగైన ఆటగాడు మరొకరు దొరకరుఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్ ఢిల్లీ జట్టును వీడి ఎక్కడికీ వెళ్లడం లేదు. రిక్కీ పాంటింగ్తో కలిసి పంజాబ్ కింగ్స్లో చేరతాడనే వార్తలు అవాస్తవం. చెన్నై సూపర్ కింగ్స్కు కూడా అతడు ఆడే అవకాశం లేదు. క్రిక్బజ్ తాజా కథనం ద్వారా ఈ విషయం వెల్లడైంది. భారీ మొత్తం వెచ్చించి అతడితో ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీ తీసుకున్న ఉత్తమ నిర్ణయాల్లో ఇదొకటి. అతడిని అస్సలు వదులు కోవద్దు. పంత్ కంటే మెరుగైన కెప్టెన్ మళ్లీ మరొకరు మీకు దొరకరు’’ అని పేర్కొన్నాడు. పంత్ ఢిల్లీతోనే ఉండి.. జట్టును విజయపథంలో నడిపి టైటిల్ గెలవాలని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా ఆకాంక్షించాడు. చదవండి: రంజీ ‘జట్టు’లో విరాట్ కోహ్లి, మరో టీమిండియా స్టార్ కూడా.. డీడీసీఏ ప్రకటన -
’ముంబై ఇండియన్స్తో రోహిత్ ప్రయాణం ముగిసినట్టే’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ భవితవ్యం గురించి భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీతో హిట్మ్యాన్ ప్రయాణం ముగిసినట్లేనని.. అతడు ఈసారి మెగా వేలంలోకి వచ్చే అవకాశం ఉందన్నాడు. లేనిపక్షంలో.. ట్రేడింగ్ ద్వారానైనా వేరే ఫ్రాంఛైజీకి బదిలీ కావొచ్చని అభిప్రాయపడ్డాడు.ఐదుసార్లు ట్రోఫీ అందించిఐపీఎల్లో ఓ జట్టును అత్యధిక సార్లు చాంపియన్గా నిలిపిన ఘనత రోహిత్ శర్మ సొంతం. అతడి సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఏకంగా ఐదుసార్లు ట్రోఫీ గెలిచింది. ఐపీఎల్- 2013, 2015, 2017, 2019, 2020 ఎడిషన్లలో టైటిల్ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఒడిదుడుకులు ఎదురైనా గతేడాది ప్లే ఆఫ్స్ చేరి సత్తా చాటింది.రోహిత్ను తప్పించి పాండ్యాకు పగ్గాలుఅయినప్పటికీ ఐపీఎల్-2024 సీజన్లో ముంబై ఇండియన్స్ తన కెప్టెన్ను మార్చింది. దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మను కాదని.. గుజరాత్ టైటాన్స్ను చాంపియన్గా నిలిపిన హార్దిక్ పాండ్యాను భారీ మొత్తానికి ట్రేడ్ చేసుకుని సారథిగా నియమించింది. దీంతో రోహిత్ను అవమానించిన జట్టుకు మేము మద్దతుగా నిలవబోమంటూ అభిమానులు ముంబై ఫ్రాంఛైజీతో పాటు పాండ్యాను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.దారుణ ఫలితంఈ క్రమంలో ఒత్తిడిలో చిత్తైన పాండ్యా సారథ్యంలో ఐపీఎల్-2024లో ముంబై దారుణ ఫలితం చవిచూసింది. పద్నాలుగు మ్యాచ్లలో కేవలం నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇదిలా ఉంటే.. అంబానీల యాజమాన్యంలోని ముంబై జట్టుతో రోహిత్కు సుదీర్ఘ అనుబంధం ఉన్నప్పటికీ.. తనను అవమానకరరీతిలో కెప్టెన్సీ తప్పించారని అతడు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.ముంబై జట్టుతో రోహిత్ ప్రయాణం ముగిసిందిఈ నేపథ్యంలో ఐపీఎల్-2025 మెగా వేలం సందర్భంగా రోహిత్ ముంబైని వీడనున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాల ఆధారంగా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘రోహిత్ ముంబై ఇండియన్స్లో కొనసాగుతాడా లేదా? అన్నది ప్రశ్నార్థకం. అయితే, నా అభిప్రాయం ప్రకారం అతడు ఇక ఆ ఫ్రాంఛైజీతో ఉండడు.అతడేమీ ధోని కాదుఎందుకంటే.. మహేంద్ర సింగ్ ధోని- చెన్నై సూపర్ కింగ్స్ మాదిరి ముంబై- రోహిత్ మధ్య అలాంటి అనుబంధం లేదనిపిస్తోంది. అందుకే రోహిత్ బయటకు రావడం ఖాయమని చెప్పవచ్చు. ముంబై సైతం అతడిని రిటైన్ చేసుకోకపోవచ్చు. కాబట్టి రోహిత్ ట్రేడ్ విండో ద్వారా లేదంటే మెగా వేలంలోకి రావడం ద్వారా వేరే జట్టుకు మారే అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు ముంబై ఇండియన్స్తో రోహిత్ ప్రయాణం ముగిసింది’’ అని పేర్కొన్నాడు. విభేదాలు వచ్చిన తర్వాత కలిసి ప్రయాణించడం కుదరబోదని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.ధోని-చెన్నై అనుబంధం వేరుకాగా రోహిత్ మాదిరే టీమిండియా దిగ్గజ కెప్టెన్ ధోని సైతం చెన్నై సూపర్ కింగ్స్ను ఐదుసార్లు చాంపియన్గా నిలిపాడు. 2008 నుంచి అదే ఫ్రాంఛైజీలో కొనసాగుతున్న తలా... ఈ ఏడాది తానే స్వయంగా కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. రుతురాజ్ గైక్వాడ్కు చెన్నై జట్టు పగ్గాలు అప్పగించాడు. అంతేకాదు వేలం దగ్గర నుంచి తుదిజట్టు ఎంపిక దాకా చెన్నై ఫ్రాంఛైజీ ధోనికి పూర్తి స్వేచ్ఛనిస్తుందని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. ఈ నేపథ్యంలోనే రోహిత్ పరిస్థితి ఇందుకు భిన్నమని ఆకాశ్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు.చదవండి: DT 2024: భారత ‘ఎ’ జట్టులోషేక్ రషీద్.. టీమిండియాతో చేరని సర్ఫరాజ్ ఖాన్! -
టెస్టు కెప్టెన్గానూ అతడు పనికిరాడా?: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియాలో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, కీలక ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వీడ్కోలు పలకగా.. హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ ప్రస్థానం కూడా ముగిసిపోయింది. ఈ క్రమంలో టీ20 జట్టు పూర్తిస్థాయి కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ నియమితుడు కాగా.. గౌతం గంభీర్ కోచ్గా ద్రవిడ్ బాధ్యతలను స్వీకరించాడు.భవిష్య కెప్టెన్గా శుబ్మన్ గిల్మరోవైపు.. 37 ఏళ్ల రోహిత్ శర్మకు డిప్యూటీగా స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్ను నియమించింది బీసీసీఐ. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఈ పంజాబీ బ్యాటర్కు వైస్ కెప్టెన్గా బాధ్యతలు అప్పగించింది. అంతేకాదు.. రోహిత్, సూర్య గైర్హాజరీలో జింబాబ్వే టీ20 సిరీస్కు కెప్టెన్గానూ ఎంపిక చేసింది. తద్వారా భవిష్య కెప్టెన్గా శుబ్మన్ గిల్ ఉండబోతున్నాడని సంకేతాలు ఇచ్చింది.ఈ నేపథ్యంలో మరో స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ గురించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో అద్భుతమైన రికార్డు ఉన్న పంత్ను కెప్టెన్గా నియమిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అయితే, దులిప్ ట్రోఫీ-2024 జట్ల ప్రకటన తర్వాత ఈ ఉత్తరాఖండ్ బ్యాటర్ పేరును బీసీసీఐ భవిష్య కెప్టెన్గా పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలుస్తోందన్నాడు.ఆ నలుగురికి ఛాన్స్కాగా సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న ఈ రెడ్బాల్ టోర్నీకి సంబంధించిన నాలుగు జట్లను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. టీమిండియా స్టార్లు శుబ్మన్ గిల్(టీమ్-ఎ), రుతురాజ్ గైక్వాడ్(టీమ్-సి), శ్రేయస్ అయ్యర్(టీమ్-డి)లకు సారథులుగా అవకాశం ఇచ్చిన బీసీసీఐ.. టీమ్-బి కెప్టెన్గా బెంగాల్ స్టార్ అభిమన్యు ఈశ్వరన్ను నియమించింది. ఈ జట్టులోనే రిషభ్ పంత్కూ చోటిచ్చింది.ఈ విషయంపై స్పందించిన ఆకాశ్ చోప్రా.. ‘‘రిషభ్ పంత్ కెప్టెన్ కాదా!.. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలో అతడు ఆడాలా? మరేం పర్లేదు. అయితే, టీమిండియా భవిష్య కెప్టెన్గా భావిస్తున్న పంత్ను.. ఈ టోర్నీలో సారథిగా ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది.ఏకైక వికెట్ కీపర్ బ్యాటర్గా చరిత్రవ్యక్తిగతంగా నేనేమీ పంత్ను సమర్థించడం లేదు. టెస్టు క్రికెటర్గా అతడి గణాంకాల ఆధారంగానే మాట్లాడుతున్నా. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా గడ్డపై శతకాలు బాదిన భారత ఏకైక వికెట్ కీపర్ బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు పంత్. కెప్టెన్గా తనకంటే గొప్ప ఆటగాడు మరెవరు ఉంటారు? అయినా.. సరే తనను పక్కనపెట్టారు. దీనిని బట్టి టీమిండియా పగ్గాలు అప్పజెప్పే సూచనలూ కనిపించడం లేదు’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా 2022 డిసెంబరులో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన పంత్.. దాదాపు ఏడాదిన్నరపాటు జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్-2024 ద్వారా పునరాగమనం చేసిన ఈ వికెట్ కీపర్.. టీ20 ప్రపంచకప్-2024లోనూ సత్తా చాటాడు.చదవండి: గంభీర్ ప్లాన్ అదుర్స్: బౌలింగ్ కోచ్గా మోర్కెల్ ఎంపికకు కారణం ఇదే! -
'ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. భారత్ జట్టులో సూర్యకుమార్కు నో ఛాన్స్'
భారత టీ20 కెప్టెన్గా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఎంపికైన సంగతి తెలిసిందే. జూలై 26 నుంచి శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్తో టీమిండియా కెప్టెన్గా సూర్యకుమార్ ప్రస్థానం మొదలు కానుంది. అయితే ఇకపై సూర్య కేవలం టీ20ల్లో మాత్రమే భారత జెర్సీలో కన్పించే అవకాశముంది. ఎందుకంటే టీ20ల్లో అద్బుతమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్న సూర్యకుమార్.. వన్డేలు, టెస్టుల్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు. గతేడాది వన్డే వరల్డ్కప్ రన్నరప్గా నిలిచిన భారత జట్టులో సైతం సూర్య సభ్యునిగా ఉన్నాడు.కానీ మిస్టర్ 360 టోర్నీలో దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పటివరకు 37 వన్డేలు ఆడిన ఈ ముంబైకర్ కేవలం 773 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలోని అతడిని కేవలం టీ20లకే పరిమితం చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీతో పాటు కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో సూర్యకుమార్ యాదవ్ ఆడే అవకాశం లేదని చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా జరగనుంది. అయితే భారత్ పాల్గోంటుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు."గతేడాది వన్డే వరల్డ్కప్ ఫైనల్కు చేరిన భారత జట్టులో సూర్యకుమార్ భాగంగా ఉన్నాడు. అదే విధంగా టీ20 వరల్డ్కప్-2024 విజేతగా నిలిచిన జట్టులోనూ సూర్య సభ్యునిగా ఉన్నాడు. డేవిడ్ మిల్లర్ క్యాచ్ను అద్భుతంగా అందుకుని భారత్ను ఛాంపియన్స్గా నిలిపాడు.అంతేకాకుండా టీ20ల్లో దాదాపు ఏడాది పాటు వరల్డ్నెం1గా కొనసాగాడు. కానీ ఇటువంటి అద్భుత ఆటగాడికి వన్డేల్లో మాత్రం చోటు దక్కడం కష్టమనే చెప్పుకోవాలి. ఇకపై సూర్య టీ20ల్లో మాత్రమే కొనసాగనున్నాడు. ఇదే విషయాన్ని బీసీసీఐ ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. అంటే వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో సూర్య ఆడడని ఆర్దం చేసుకోవచ్చు" అని తన యూట్యూబ్ ఛానల్లో ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. -
Ind vs Zim: వికెట్ కీపర్గా అతడే.. భారత తుది జట్టు ఇదే!
దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత యువ టీమిండియా తొలిసారి టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ స్టార్ బ్యాటర్ల నిష్క్రమణ తర్వాత శుబ్మన్ గిల్ కెప్టెన్సీలో జింబాబ్వేతో తలపడేందుకు హరారేకు వెళ్లింది.ఆతిథ్య జట్టుతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం తొలి టీ20 ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన తుది జట్టును ఎంచుకున్నాడు.ఈ మేరకు యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ‘‘టాపార్డర్లో శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ ఉండాలి. పరిస్థితులకు అనుగుణంగా ఈ ముగ్గురి ఆర్డర్ మారొచ్చు కానీ.. టాప్-3లో మాత్రం వీరే ఉండాలి.ఆ తర్వాతి స్థానంలో రియాన్ పరాగ్ బ్యాటింగ్కు రావాలి. ఇక వికెట్ కీపర్గా ధ్రువ్ జురెల్ను ఆడించాలి. బ్యాటింగ్ ఆర్డర్లో ఐదో స్థానం అతడిదే.ఆరో బ్యాటర్గా రింకూ సింగ్ బరిలోకి దిగాలి. లేదంటే జురెల్ కంటే ముందుగానే వచ్చినా పర్లేదు. జురెల్ కీపింగ్ చేస్తాడు కాబట్టి ఈసారి జితేశ్ శర్మకు నేనైతే అవకాశం ఇవ్వను.ఇక ఏడో స్థానంలో వాషింగ్టన్ సుందర్ను ఆడించాలి. ఆల్రౌండర్గా జట్టుకు తన సేవలు అవసరం. నలుగురు బౌలర్లను తీసుకోవాలి కాబట్టి స్పిన్నర్ కోటాలో రవి బిష్ణోయితో పాటు.. వాషింగ్టన్ కూడా అందుబాటులో ఉండటం కలిసి వస్తుంది.అభిషేక్ శర్మ కూడా పార్ట్టైమ్ లెఫ్టార్మ్ స్పిన్నర్గా ప్రభావం చూపగలడు. ఇక పేస్ విభాగంలో ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్ తమ బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చగలరు.నిజానికి హర్షిత్ రాణాను చోటివ్వాల్సింది. అయితే, బెంగాల్ ప్రొ టీ20 లీగ్లో ముకేశ్ కుమార్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఇక ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ వరల్డ్కప్ ట్రావెలింగ్ టీమ్లో భాగం కాబట్టి.. ఈ ముగ్గురిని ఆడించవచ్చు. అందుకే హర్షిత్ రాణాకు ఈసారికి మొండిచేయి తప్పదు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. జింబాబ్వేతో టూర్కు ఎంపికైన సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, శివం దూబే తొలి రెండు మ్యాచ్లకు దూరం కానున్నారు. టీ20 ప్రపంచకప్-2024 విజయోత్సవాల్లో పాల్గొనేందుకు వీరు భారత్కు తిరిగి వచ్చిన విషయం తెలిసిందే.Watch out for those moves 🕺🏻 Wankhede was a vibe last night 🥳#T20WorldCup | #TeamIndia | #Champions pic.twitter.com/hRBTcu9bXc— BCCI (@BCCI) July 5, 2024 జింబాబ్వేతో టీ20 సిరీస్కు భారత జట్టు:శుబ్మన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్, రవి బిష్ణోయ్, సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, తుషార్ దేశ్పాండే, హర్షిత్ రాణా.తొలి టీ20కి ఆకాశ్ చోప్రా ఎంచుకున్న జట్టు:శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయి, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్. -
టీ20 వరల్డ్కప్ బెస్ట్ టీమ్ ఇదే.. కోహ్లి, పంత్లకు నో ఛాన్స్!
టీ20 ప్రపంచకప్ 2024 ఛాంఫియన్స్గా భారత్ నిలిచిన విషయం విధితమే. బార్బోడస్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్.. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన తుది పోరులో 7 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో 140 కోట్ల మంది భారతీయల హృదయాలు విజయ గర్వంతో ఉప్పొంగిపోయాయి. విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు గురువారం ప్రత్యేక విమానంలో బార్బోడస్ నుంచి స్వదేశానికి చేరుకోనుంది.ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 వరల్డ్కప్-2024 ముగియడంతో టీమ్ ఆఫ్ది టోర్నమెంట్ను భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఎంచుకున్నాడు.ఈ జట్టులో వరల్డ్కప్ ఫైనల్ హీరోలు విరాట్ కోహ్లి, అక్షర్ పటేల్కు చోప్రా చోటివ్వలేదు. అదే విధంగా భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్కు సైతం చోటుదక్కలేదు. వీరితో పాటు ఆసీస్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్, ప్యాట్ కమ్మిన్స్కు కూడా చోప్రా ఎంపిక చేయలేదు.కాగా ఈ జట్టుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మను సారథిగా అతడు ఎంపిక చేశాడు. ఇక చోప్రా తన జట్టులో ఓపెనర్లుగా రోహిత్ శర్మ(భారత్), రెహ్మతుల్లా గుర్భాజ్(అఫ్గానిస్తాన్) అవకాశమిచ్చాడు. ఫస్ట్డౌన్లో నికోలస్ పూరన్(వెస్టిండీస్)కు చోప్రా చోటిచ్చాడు. సూర్యకుమార్ యాదవ్(భారత్), హెన్రిచ్ క్లాసెన్(దక్షిణాఫ్రికా)లకు వరుసగా నాలుగు, ఐదు స్ధానాల్లో చాన్స్ దక్కింది. ఆల్రౌండర్ల కోటాలో హార్ధిక్ పాండ్యా(భారత్), రషీద్ ఖాన్లను అతడు ఎంపిక చేశాడు. ఇక ఫాస్ట్ బౌలర్లగా ఫజాలక్ ఫరూఖీ(అఫ్గానిస్తాన్), జస్ప్రీత్ బుమ్రా(భారత్), అర్ష్దీప్ సింగ్(భారత్)లను చోప్రా ఎంచుకున్నాడు.ఆకాష్ చోప్రా ఎంచుకున్న జట్టు ఇదేరోహిత్ శర్మ(కెప్టెన్), గుర్బాజ్, నికోలస్ పూరన్, సూర్యకుమార్ యాదవ్, హెన్రిచ్ క్లాసెన్, ఫజాలక్ ఫరూఖీ,హార్ధిక్ పాండ్యా,రషీద్ ఖాన్,ఫజాలక్ ఫరూఖీ,జస్ప్రీత్ బుమ్రా,అర్ష్దీప్ సింగ్ -
రోహిత్ ఒక అద్భుతమైన నాయకుడు.. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్: చోప్రా
టీ20 వరల్డ్కప్-2024 ఛాంపియన్స్గా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా.. రెండో సారి టీ20 వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడింది. గత 13 ఏళ్లగా ఊరిస్తున్న వరల్డ్కప్ ట్రోఫీ.. ఎట్టకేలకు రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ సొంతమైంది.2011లో ధోని సారథ్యంలో ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకున్న భారత్.. మళ్లీ ఇప్పుడు రోహిత్ నాయకత్వంలోనే వరల్డ్కప్ కల సాధ్యమైంది. భారత్కు వరల్డ్కప్కు అందించిన రోహిత్ శర్మపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా చేరాడు. ప్రపంచకప్ గెలిచిన మూడో భారత కెప్టెన్గా రోహిత్ని యావత్ దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటందని చోప్రా కొనియాడాడు. కాగా వరల్డ్కప్ విజయానంతరం రోహిత్ అంతర్జాతీయ టీ20 క్రికెట్కు గుడ్బై చెప్పేశాడు."రోహిత్ ఒక అద్భుతమైన నాయకుడు. అతడి కెప్టెన్సీ కెరీర్లో ఐదు ఐపీఎల్ ట్రోఫీలు ఉన్నాయి. అతడు ఛాంపియన్స్ లీగ్లో సైతం ముంబైకు టైటిల్ను అందించాడు. ఇప్పుడు టీ20 ప్రంపచకప్ను సైతం భారత్కు అందించి.. తన అంతర్జాతీయ టీ20 కెరీర్ను ముగించాడు.ఒక లీడర్కు ఇంతకుమించి ఇంకేమి కావాలి. కేవలం ముగ్గురు భారత కెప్టెన్లు మాత్రమే ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకోగలిగారు. కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజాల సరసన హిట్మ్యాన్ చేరాడు. రోహిత్ సాధించిన ఈ వరల్డ్కప్ విజయం కొన్ని తాబ్దాల పాటు గుర్తుండిపోతుంది.రోహిత్ కెప్టెన్సీ అత్యుత్తమంగా ఉంటుంది. అతడు ఆటగాళ్లకు పూర్తి స్వేఛ్చను ఇస్తాడు. ఎవరికి అడిగినా రోహిత్ భయ్యా చాలా మంచి కెప్టెన్ చెబుతారు. రోహిత్ మంచివాడు కాదని చెప్పే ఒక్క వ్యక్తి కూడా ఉండడు. రోహిత్ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారమని" తన యూట్యూబ్ ఛానలో ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. -
Ind vs Pak: ప్రతిసారీ ఇంతే.. టీ20 మేటి బ్యాటర్కు ఏమైంది?
టీమిండియా స్టార్, టీ20 వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పొట్టి ప్రపంచకప్ తాజా ఎడిషన్లో ఇంత వరకూ బ్యాట్ ఝులిపించనే లేదు. వరల్డ్కప్-2024లో భాగంగా తొలుత ఐర్లాండ్తో టీమిండియా తలపడగా.. సూర్య నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులే చేశాడు.ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో మ్యాచ్లోనూ మిస్టర్ 360 చేతులెత్తేశాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన సూర్య.. 8 బంతులు ఎదుర్కొని ఏడు పరుగులు మాత్రమే చేయగలిగాడు. హ్యారిస్ రవూఫ్ బౌలింగ్లో ఆమిర్కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు.ఇక ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచినా సూర్య ఫామ్ మాత్రం ఆందోళనకరంగా పరిణమించింది. ముఖ్యంగా ఇలాంటి కీలక మ్యాచ్లలో సూర్య తేలిపోవడం విమర్శలకు దారితీసింది.ప్రపంచకప్-2022 సమయంలోనూ పాక్తో మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ 10 బంతుల్లో 15 రన్స్ చేసి నిష్క్రమించాడు. ఇక గతేడాది వన్డే వరల్డ్కప్ సమయంలోనూ ఒత్తిడిలో చిత్తయ్యాడు ఈ ముంబైకర్. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 28 బంతులు ఎదుర్కొని కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సూర్యకుమార్ ఆట తీరు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రధానమైన మ్యాచ్లలో చేతులెత్తేయడం సూర్యకు పరిపాటిగా మారిందని పేర్కొన్నాడు.బిగ్ మ్యాచ్లలో ఒత్తిడిని తట్టుకోలేకపాకిస్తాన్తో తాజా మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ తీరును ప్రస్తావిస్తూ.. ‘‘పాకిస్తాన్ టాస్ గెలిచి ఇండియాను తొలుత బ్యాటింగ్ చేయమని అడిగింది. విరాట్ కోహ్లి.. ఆ తర్వాత రోహిత్ శర్మ అవుటయ్యారు.ఆ సమయంలో రిషభ్ పంత్ బాధ్యతగా ఆడాడు. అతడికి తోడైన సూర్యకుమార్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. అదే ఇక్కడ పెద్ద ప్రశ్న.మామూలుగా అయితే సూర్య బాగానే ఆడతాడు. కానీ బిగ్ మ్యాచ్లలో మాత్రం రాణింలేకపోతున్నాడు. గతంలో మెల్బోర్న్లో.. 2023 వరల్డ్కప్ సమయంలోనూ ఇలాగే జరిగింది. బిగ్ మ్యాచ్లలో అతడు ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాడా అనే ప్రశ్న తలెత్తుతోంది’’ అని ఆకాశ్ చోప్రా సూర్య ప్రదర్శనపై ఆందోళన వ్యక్తం చేశాడు. చదవండి: Ind vs Pak: కావాలనే బంతులు వృథా చేశాడు: పాక్ మాజీ కెప్టెన్ ఫైర్ -
ఎస్ఆర్హెచ్ కప్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లలేదు: భారత మాజీ ఓపెనర్
ఐపీఎల్-2024లో ఫైనల్ పోరుకు మరి కొన్ని తెరలేవనుంది. చెపాక్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో కోల్కతా నైట్రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా టైటిల్ విజేతను ఎంచుకున్నాడు. కేకేఆర్ ఛాంపియన్స్గా నిలుస్తుందని చోప్రా జోస్యం చెప్పాడు. అయితే ఎస్ఆర్హెచ్ను తక్కువ అంచనా వేయద్దని, ఆ జట్టు టైటిల్ను సొంతం చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లలేదని చోప్రా చెప్పుకొచ్చాడు."ఎస్ఆర్హెచ్-కేకేఆర్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగనుంది. ఈ మ్యాచ్ వన్సైడ్ గేమ్ అయితే కాదు. కేకేఆర్కు గెలిచే ఛాన్స్ ఉంది. అయితే హైదరాబాద్ గట్టీ పోటీ ఇస్తుందని నేను భావిస్తున్నాను. ఒకవేళ సన్రైజర్స్ కప్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లలేదు. ఈ క్యాష్రిచ్ లీగ్లో ఎస్ఆర్హెచ్కు ఇది మూడో ఫైనల్ కాగా.. కేకేఆర్కు నాలుగో ఫైనల్. ఇరు జట్లు టైటిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఫైనల్ మ్యాచ్లో హెడ్ కంటే అభిషేక్ శర్మ కీలకంగా మారనున్నాడు. ఎందుకంటే ప్రత్యర్ధి జట్టులో లెఫ్టార్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ ఉండడంతో హెడ్కు మరోసారి కష్టాలు తప్పవు.బౌలింగ్లో ప్యాట్ కమ్మిన్స్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్ చెలరేగితే కేకేఆర్ను తక్కువ స్కోర్కే కట్టడి చేయవచ్చు. ముఖ్యంగా రాహుల్ త్రిపాఠి ఫామ్ల ఉండడం సన్రైజర్స్ కలిసొచ్చే ఆంశం. కానీ అతడు రిస్క్తో కూడిన షాట్లు ఆడుతున్నాడు. అది అన్ని సమయాల్లో జట్టుకు మంచిది కాదు. ఎస్ఆర్హెచ్ సమిష్టిగా రాణిస్తే మరోటైటిల్ను తమ ఖాతాలో వేసుకోవచ్చు" అని తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు -
'నేనేమి షాహిది అఫ్రిదిని కాను'.. రిటైర్మెంట్ యూటర్న్పై రైనా
టీమిండియా మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ లెజెండరీ ఆటగాడు సురేష్ రైనా తన రిటైర్మెంట్ యూ టర్న్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్న రైనా.. ప్రస్తుతం ఐపీఎల్-2024లో కామెంటేటర్గా బీజీబీజీగా ఉన్నాడు. ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్కు రైనా భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రాతో కలిసి హిందీ వ్యాఖ్యతగా వ్యవహరించాడు.కోల్కతా బ్యాటింగ్ సందర్భంగా ఎనిమిదో ఓవర్లో ఆకాష్ చోప్రా నుంచి రైనాకు తన రిటైర్మెంట్ యూ టర్న్కు సంబంధించి ఓ ప్రశ్న ఎదురైంది. రిటైర్మెంట్ను ఏమైనా వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నవా అంటూ రైనాను చోప్రా ప్రశ్నించాడు. అందుకు బదులుగా రైనా "నేనేమి షాహిద్ అఫ్రిదిని" కాదు అంటూ నవ్వుతూ సమాధనమిచ్చాడు. కాగా పాకిస్తాన్ మాజీ ఆల్-రౌండర్ షాహిద్ అఫ్రిది తన రిటైర్మెంట్ను మూడు సార్లు వెనక్కి తీసుకున్నాడు.చదవండి: Virat Kohli: కీలక మ్యాచ్కు ముందు ఆర్సీబీకి తలనొప్పి! ఒక రకంగా.. -
‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
లక్నో సూపర్ జెయింట్స్ను చిత్తుగా ఓడించిన కోల్కతా నైట్ రైడర్స్పై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. ఏకపక్ష విజయం అన్న మాటలకు కేకేఆర్ సరైన నిర్వచనం ఇచ్చిందని.. విధ్వంసకర ఆట తీరును కళ్లకు కట్టిందని ఆకాశానికెత్తాడు.లక్నో గల్లీకి వెళ్లి గల్లీ క్రికెట్లో మాదిరి వారిని మట్టికరిపించిన తీరు అద్భుతమంటూ కేకేఆర్ను కొనియాడాడు. కాగా సొంత మైదానంలో ఆదివారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది.సంచలన ఇన్నింగ్స్ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(14 బంతుల్లో 32), సునిల్ నరైన్(39 బంతుల్లో 81) మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకోగా.. ఏడో నంబర్ బ్యాటర్ రమణ్ దీప్ సింగ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.కేవలం ఆరు బంతుల్లోనే 25 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన లక్నోను కేకేఆర్ 137 పరుగులకే కుప్పకూల్చింది. పేసర్లు హర్షిత్ రాణా(3/24, రసెల్(2/17), మిచెల్ స్టార్క్(1/22).. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి(3/30), సునిల్ నరైన్(1/22) లక్నో బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేశారు.ఏకపక్ష విజయం ఫలితంగా కేకేఆర్ లక్నోపై ఏకంగా 98 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఐపీఎల్లో లక్నోకు ఇదే అతిపెద్ద పరాజయం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘‘లక్నో గల్లీకి వెళ్లి గల్లీ క్రికెట్ మాదిరే వారిని చిత్తు చేసింది కేకేఆర్. ఏకపక్ష విజయం ఎలా ఉంటుందన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది.SRH అని ఎవరన్నారు?లక్నోకు తమ రెండున్నరేళ్ల ప్రయాణంలో అతిపెద్ద ఓటమిని రుచి చూపించింది. ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో సన్రైజర్స్ హైదరాబాద్ అత్యంత విధ్వంసకర జట్టు అని ఎవరు చెప్పారు?ఎస్ఆర్హెచ్ కాదు! అది కేకేఆర్ మాత్రమే’’ అని ఆకాశ్ చోప్రా శ్రేయస్ అయ్యర్ సేనకు కితాబులిచ్చాడు. ఇప్పటికే కేకేఆర్ ఆరుసార్లు 200 పరుగుల స్కోరు దాటిందని.. కోల్కతా కంటే ప్రమాదకర జట్టు ఇంకేది ఉందని టేబుల్ టాపర్ను ప్రశంసించాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు(287) సాధించిన జట్టుగా సన్రైజర్స్ ఈ ఎడిషన్ సందర్బంగా అరుదైన రికార్డు సాధించిన విషయం తెలిసిందే.చదవండి: అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. వసీం అక్రం కౌంటర్High-Fives in the @KKRiders camp 🙌With that they move to the 🔝 of the Points Table with 16 points 💜Scorecard ▶️ https://t.co/CgxfC5H2pD#TATAIPL | #LSGvKKR pic.twitter.com/0dUMJLasNQ— IndianPremierLeague (@IPL) May 5, 2024 -
T20 WC: తుదిజట్టులో చోటివ్వాల్సిందే.. కెప్టెన్ కూడా కాదనలేడు!
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ శివం దూబే మరోసారి అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో ఆదివారం నాటి మ్యాచ్లో 20 బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్ల సాయంతో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు.కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(98), డారిల్ మిచెల్(52)తో కలిసి చెన్నై సూపర్ కింగ్స్కు 212 పరుగుల భారీ స్కోరు అందించాడు. తద్వారా రైజర్స్పై 78 పరుగుల తేడాతో గెలుపొందడంలో తన వంతు పాత్ర పోషించాడు.కాగా ఐపీఎల్-2024లో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. సీఎస్కే తరఫున మిడిలార్డర్ బ్యాటర్గా బరిలోకి దిగుతున్న దూబే.. తొమ్మిది ఇన్నింగ్స్లో కలిపి 350 పరుగులు చేశాడు.ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి జట్టు ఇప్పటి దాకా సాధించిన ఐదు విజయాల్లో తనదైన ముద్ర వేశాడు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్కప్-2024 ఆడనున్న టీమిండియాలో అతడికి తప్పక చోటివ్వాలని డిమాండ్లు పెరిగాయి.ఈ నేపథ్యంలో సీఎస్కే తాజా విజయం నేపథ్యంలో దూబే ఇన్నింగ్స్పై స్పందించిన భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ పిల్లాడు సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. అతడిని కేవలం ప్రపంచకప్ జట్టుతో పంపించడమే కాదు.తుదిజట్టులోనూ అతడిని తప్పక ఆడించాలి. కేవలం ఎంపిక గురించి కాదు.. ప్లేయింగ్ ఎలెవన్లోనూ చోటివ్వాలని సెలక్టర్లు ఫిక్సైపోవాలి. కెప్టెన్గానీ.. మేనేజ్మెంట్ గానీ అతడిని విస్మరించడానికి వీల్లేదు.ప్రస్తుత టీమిండియా ప్లేయర్లలో అతడి కంటే బెటర్గా హిట్టింగ్ ఆడే బ్యాటర్ మరొకరు లేరు. ఒకవేళ అతడిని గనుక బెంచ్కే పరిమితం చేస్తే అంతకంటే అన్యాయం మరొకటి ఉండదు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్-2024 మొదలుకానుంది. ఈ నేపథ్యంలో జట్ల ప్రకటనకు మే 1 ఆఖరి తేదీగా పేర్కొంది ఐసీసీ. -
అసలు నువ్వేం చేస్తున్నావు యశస్వి?.. మా వాడికేం ఢోకా లేదు
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు బ్యాట్ ఝులిపించలేదు. కనీస స్థాయి ప్రదర్శన చేయలేక చతికిలపడ్డాడు. కాగా గత సీజన్లో 14 మ్యాచ్లు ఆడి ఏకంగా 625 పరుగులు సాధించిన ఈ లెఫ్టాండర్.. టీమిండియాలో ఎంట్రీ ఇచ్చి దుమ్ములేపాడు. టెస్టు, టీ20లలో భారత ఓపెనర్గా సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్లో యశస్వి జైస్వాల్పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. కానీ.. అందుకు తగ్గట్లుగా ఈ రాజస్తాన్ రాయల్స్ స్టార్ రాణించలేకపోతున్నాడు. తాజా సీజన్లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో కలిపి యశస్వి జైస్వాల్ కేవలం 39 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు సాధించిన అత్యధిక స్కోరు 24. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో అయితే పరుగుల ఖాతా తెరవకుండానే అతడు వెనుదిరిగాడు. ఈసారి పరుగుల ఖాతా కూడా తెరవలేదు జైపూర్లో శనివారం జరిగిన మ్యాచ్లో రెండు బంతులు ఎదుర్కొని జైస్వాల్ డకౌట్ అయ్యాడు. రీస్ టోప్లీ బౌలింగ్లో మాక్స్వెల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే, మరో ఓపెనర్ జోస్ బట్లర్ అజేయ శతకం(100)తో రాజస్తాన్ను గెలుపు తీరాలకు చేర్చాడు. 4⃣ wins in 4⃣ matches for the @rajasthanroyals 🩷 And with that victory, the move to the 🔝 of the Points Table 😎💪 Scorecard ▶️ https://t.co/IqTifedScU#TATAIPL | #RRvRCB pic.twitter.com/cwrUr2vmJN — IndianPremierLeague (@IPL) April 6, 2024 సంజూ శాంసన్(69) సైతం మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి రాజస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా రాజస్తాన్ ఖాతాలో వరుసగా నాలుగో గెలుపు చేరింది. ఇక ఇలా జట్టు ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో గెలుపొందింది కాబట్టి జైస్వాల్ వైఫల్యం పెద్దగా లెక్కలోకి రాలేదు. నిజానికి ఏ ఒక్క మ్యాచ్లో ఫలితం తారుమారైనా వేళ్లన్నీ జైస్వాల్ వైపు చూపేవనడంలో సందేహం లేదు. ఏదేమైనా.. ఒంటిచేత్తో జట్టును గెలిపించే సత్తా ఉన్న ఆటగాడైన ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇలా విఫలం కావడం విమర్శలకు తావిస్తోంది. అసలు నువ్వేం చేస్తున్నావు యశస్వి? ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రతిసారీ లెఫ్టార్మ్ పేసర్ల చేతిలో అవుట్ అవుతున్న జైస్వాల్ ఇప్పటికైనా బలహీనతలు అధిగమించేందుకు కృషి చేయాలని సూచించాడు. ‘‘యశస్వి జైస్వాల్ మళ్లీ స్కోరు చేయలేకపోయాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు ఇన్నింగ్స్లో మూడింటిలో లెఫ్టార్మ్ పేసర్ల చేతికే చిక్కాడు. అసలు నువ్వేం చేస్తున్నావు యశస్వి? దయచేసి పట్టుదలగా నిలబడి బ్యాటింగ్ చెయ్యి.. కొన్ని పరుగులు సాధించు. నిజానికి నువ్వు మంచి ఆటగాడివి’’ అంటూ జైస్వాల్ ఆట తీరును ఆకాశ్ చోప్రా విమర్శించాడు. ఇప్పటికైనా తిరిగి పుంజుకుంటే వరల్డ్కప్ జట్టులో పోటీ లేకుండా బెర్తు ఖరారు చేసుకోవచ్చని సూచించాడు. చెత్త బ్యాటర్ అయిపోడు ఇదిలా ఉంటే.. యశస్వి జైస్వాల్కు రాజస్తాన్ రాయల్స్ కోచ్ కుమార్ సంగక్కర అండగా నిలిచాడు. ఫ్రాంఛైజీ క్రికెట్తో పాటు టీమిండియా తరఫున కూడా అదరగొట్టిన యశస్వి.. రెండు ఇన్నింగ్స్లో విఫలమైనంత మాత్రాన చెత్త బ్యాటర్ ఏమీ అయిపోడని వెనకేసుకువచ్చాడు. అతడి నైపుణ్యాలేమిటో తమకు తెలుసునని.. కచ్చితంగా కమ్బ్యాక్ ఇస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. చదవండి: Virat Kohli: ఇంత స్వార్థమా?.. ఐపీఎల్ చరిత్రలో కోహ్లి చెత్త రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
#Pandya: ఆ చెత్త షాట్ అవసరమా హార్దిక్?
IPL 2024- MI Vs RR- #Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన తర్వాత హార్దిక్ పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. ఎక్కడకు వెళ్లినా ప్రేక్షకుల నుంచి హేళనలు.. చెత్త కెప్టెన్సీ కారణంగానే ముంబైకి వరుస ఓటములంటూ మాజీ క్రికెటర్లు, విశ్లేషకుల నుంచి విమర్శలు. ఇక ఆటగాడిగానూ హార్దిక్ పాండ్యా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడం కూడా ముంబై అభిమానుల ఆగ్రహానికి కారణమవుతోంది. ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో కలిపి ఈ పేస్ ఆల్రౌండర్ 69 పరుగులు చేశాడు. బ్యాటర్గా ఫర్వాలేదనిపించినా బౌలింగ్లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఇంత వరకు కేవలం ఒకే ఒక వికెట్ తీశాడు. ఇక రాజస్తాన్ రాయల్స్తో సోమవారం నాటి మ్యాచ్లో హార్దిక్ పాండ్యా అవుటైన తీరు కూడా విమర్శలకు తావిచ్చింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ముంబైని తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఆదుకునే ప్రయత్నం చేశారు. ఐదో స్థానంలో వచ్చిన తిలక్ 29 బంతుల్లో 32 పరుగులు చేయగా.. పాండ్యా 21 బంతుల్లోనే 34 రన్స్ సాధించాడు. అయితే, అప్పటికి ఇంకా పది ఓవర్లు మిగిలి ఉన్నా పాండ్యా అనవసరపు షాట్తో యజువేంద్ర చహల్ బౌలింగ్లో వికెట్ పారేసుకున్నాడు. రోవ్మన్ పావెల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. Chahal strikes, Hardik departs ⚡#IPLonJioCinema #TATAIPL #MIvRR pic.twitter.com/oM7EOvnxvm — JioCinema (@JioCinema) April 1, 2024 ఈ విషయం గురించి భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పేందుకు కృషి చేశారు. కానీ.. వీరిద్దరు ఇంకాసేపు క్రీజులో ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. వాంఖడే పిచ్ 210 పరుగులు స్కోరు చేసేదిగా లేకపోవచ్చు. కానీ 160- 170 పరుగులు సాధించేందుకు ఆస్కారం ఉంది. అయినా.. పదో ఓవర్లో మూడో బంతికి యుజీ బౌలింగ్లో పాండ్యా సిక్సర్ కొట్టేందుకు యత్నించాడు. నిజానికి తను బంతిని సరిగ్గా అంచనా వేస్తే ఫలితం వేరేలా ఉండేది. ఆ షాట్ ఆడి తను అవుటయ్యాడు. ఆ తర్వాత తిలక్ వర్మ కూడా పెవిలియన్ చేరాడు. వీరిద్దరి నిష్క్రమణ తీవ్ర ప్రభావం చూపింది’’ అని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్-2024: ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ స్కోరు ►వేదిక: ముంబై.. వాంఖడే స్టేడియం ►టాస్: రాజస్తాన్ రాయల్స్.. బౌలింగ్ ►ముంబై స్కోరు: 125/9 (20) ►రాజస్తాన్ స్కోరు: 127/4 (15.3) ►ఫలితం: ఆరు వికెట్ల తేడాతో రాజస్తాన్ విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ట్రెంట్ బౌల్ట్(రాజస్తాన్- 3/22). చదవండి: IPL 2024: గేమ్ చేంజర్.. అతడు ఉంటే ముంబై కచ్చితంగా గెలిచేది! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'వెంటనే ముంబై కెప్టెన్సీ నుంచి హార్దిక్ను తీసేయండి'.. క్లారిటీ ఇచ్చిన ఆకాష్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమి చవి చూసింది. ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 31 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ఏకంగా 277 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్లో ముంబై బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి తన వ్యూహాలను అమల చేయడంలో విఫలమయ్యాడు. బౌలర్లను సరిగ్గా ఉపయోగించడంలో పాండ్యా చేతులేత్తేశాడు. ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను సద్వినియోగం చేసుకోవడంలో హార్దిక్ ఇబ్బంది పడుతున్నాడు. తొలి 10 ఓవర్లలో బుమ్రాతో హార్దిక్ కేవలం ఒకే ఒక్క ఓవర్ వేశాడు. నాలుగో ఓవర్ వేసిన బుమ్రా.. మళ్లీ 13 ఓవర్లో ఎటాక్లోకి వచ్చాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అభిషేక్, ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీలు సాధించారు. దీంతో హార్దిక్ పాండ్యాపై మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా సైతం హార్దిక్ పాండ్యాపై సీరియస్ అయినట్లు ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. "ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఇటువంటి చెత్త కెప్టెన్సీని నేను చూడలేదు. హార్దిక్ పాండ్యా తన సారథ్యాన్ని వదిలేయాలి. లేకపోతే ముంబై ఫ్రాంచైజీ అయినా అతడి తొలగించాలి’ అంటూ జియో సినిమా షోలో చోప్రా పేర్కొన్నట్లు ఓ నెటిజన్ ట్విట్ చేశాడు. తాజాగా ఇదే విషయంపై చోప్రా క్లారిటీ ఇచ్చాడు. తను అటువంటి వ్యాఖ్యలు ఏమీ చేయలేదని, అవన్నీ రూమర్సే అని చోప్రా చెప్పుకొచ్చాడు. "అసలు ఏమి జరుగుతుందో నాకు అర్దం కావడం లేదు. మీకేం అయింది? అబద్ధాలను ప్రచారం చేయొద్దు బ్రదర్. మీ స్టేట్మెంట్ తప్పు. అలాగే నా పేరును ప్రస్తావించారు. కానీ, నా పేరులోనూ అక్షర దోషాలు ఉన్నాయి" అంటూ ఓ యూజర్ ట్వీట్కు చోప్రా రిప్లే ఇచ్చాడు. -
'సీఎస్కే ఓపెనర్గా యువ సంచలనం.. ధోని బ్యాటింగ్కు వచ్చేది అప్పుడే'
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్-2024 మెగా సమరానికి సమయం ఆసన్నమైంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ 17వ సీజన్కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. చెపాక్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. సాయంత్రం 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి పోరులో ఎలాగైనా విజయం సాధించి శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. కాగా ఈ ఏడాది సీజన్లో సీఎస్కే కొత్త కెప్టెన్తో బరిలోకి దిగుతోంది. కెప్టెన్ల ఫొటో సెషన్కు ముందు ఎంఎస్ ధోనీ తన బాధ్యతలను యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించేశాడు. కాగా మొదటి మ్యాచ్ నేపథ్యంలో సీఎస్కే ప్లేయింగ్ ఎలెవన్ గురించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో చర్చించాడు. కివీ స్టార్ రచిన్ రవీంద్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్తో కలిసి సీఎస్కే ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని చోప్రా జోస్యం చెప్పాడు. అదేవిధంగా వేలంలో భారీ మొత్తం వెచ్చించి కొన్న యువ ఆటగాడు సమీర్ రిజ్వీ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగే అవకాశముందని చోప్రా అభిప్రాయపడ్డాడు. రచిన్ రవీంద్ర.. రుతురాజ్ గైక్వాడ్తో కలిసి చెన్నై ఇన్నింగ్స్ను ప్రారంభిస్తాడు. అజింక్యా రహానే, డార్లీ మిచెల్ వరుసగా మూడు, నాలుగు స్ధానాల్లో బ్యాటింగ్కు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఐదో స్ధానంలో శివమ్ దూబే బ్యాటింగ్కు రానున్నాడు. ఆ తర్వాత స్ధానాల్లో రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని బ్యాటింగ్కు వస్తారు. ఆపై శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ వంటి ఆల్రౌండర్లు క్రీజులోకి రానున్నారు. అయితే విదేశీ ప్లేయర్ల కోటాలో పతిరానా అందులో బాటులో లేడు కాబట్టి నాలుగో ఆటగాడిగా మొయిన్ అలీ లేదా ముస్తిఫిజర్ రెహ్మన్కు చోటు దక్కే అవకాశముంది. అదేవిధంగా యువ ఆటగాడు సమీర్ రిజ్వీని సీఎస్కే ఉపయోగించుకునే ఛాన్స్ ఉందని యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు. -
భారత టీ20 జట్టు నుంచి అవుట్! వరల్డ్కప్లో నో ఛాన్స్!
IPL 2024- T20 WC 2024: టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు కష్టమేనని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. సెలక్టర్లు అతడిని పక్కనపెట్టినట్లు ఇప్పటికే సంకేతాలిచ్చారని పేర్కొన్నాడు. ఐపీఎల్-2024లో సత్తా చాటితేనే తిరిగి భారత టీ20 జట్టులో స్థానం పొందే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు కెప్టెన్గా ఉన్న భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. వెన్నునొప్పి కారణంగా గత సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఆ తర్వాత భారత టీ20 జట్టులో పునరాగమనం చేసిన అతడు ఫర్వాలేదనిపించాడు. వన్డే వరల్డ్కప్-2023లోనూ సత్తా చాటాడు. అయితే, గత కొన్ని రోజులుగా కెరీర్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు అయ్యర్. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాడనే కారణంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి అతడి సెంట్రల్ కాంట్రాక్టును రద్దు చేసింది. ఈ నేపథ్యంలో భారత జట్టులో శ్రేయస్ అయ్యర్ పునరాగమనంపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో జూన్లో మొదలుకానున్న టీ20 ప్రపంచకప్-2024 జట్టులో అతడికి చోటు దక్కుతుందా లేదా అన్న అంశంపై ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. భారత టీ20 జట్టు నుంచి అవుట్! వరల్డ్కప్లో నో ఛాన్స్! ‘‘శ్రేయస్ అయ్యర్... ప్రస్తుతం నీ పేరు భారత టీ20 జట్టులో లేదు. ఒకవేళ ఐపీఎల్ తాజా ఎడిషన్లో నువ్వు సత్తా చాటితే రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది. 550కి పైగా పరుగులు సాధిస్తే సెలక్టర్లు కచ్చితంగా ఈ పేరును పరిగణనలోకి తీసుకుంటారు. ఐపీఎల్లో అదరగొడితేనే కీలక సభ్యుడిగా జట్టులో చోటిస్తారు. కానీ ప్రస్తుతం అతడి పేరు పరిశీలనలో లేదన్నది వాస్తవం’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2023లో శ్రేయస్ అయ్యర్ స్థానంలో నితీశ్ రాణా కేకేఆర్ను ముందుకు నడిపించాడు. కానీ కనీసం ప్లే ఆఫ్స్నకు కూడా చేర్చలేకపోయాడు. ఈ నేపథ్యంలో తిరిగి కేకేఆర్ పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్.. కెప్టెన్గా, బ్యాటర్గా రాణిస్తేనే వరల్డ్కప్ అవకాశాలను సజీవం చేసుకోగలడు. ఐపీఎల్ పదిహేడో ఎడిషన్లో ప్రదర్శనపైనే అతడి అంతర్జాతీయ టీ20 కెరీర్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు!! ఇదిలా ఉంటే.. మార్చి 22న ఐపీఎల్-2024కు తెరలేవనుంది. చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య చెపాక్లో ఆరంభ మ్యాచ్ జరుగనుంది. ఇక కేకేఆర్ మార్చి 23న సొంతమైదానంలో సన్రైజర్స్ హైదారాబాద్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. చదవండి: # RCB: మేమేం ఏడ్వటం లేదు... అబ్బే ఇవి కన్నీళ్లుకావు! -
IPL 2024: సన్రైజర్స్ తుదిజట్టు ఇదే.. మార్క్రమ్కు నో ఛాన్స్?
ఐపీఎల్-2024 ఆరంభానికి కౌంట్డౌన్ మొదలైంది. మార్చి 22న ఈ మెగా ఈవెంట్కు చెపాక్ వేదికగా తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆరంభ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో మరుసటి రోజే అంటే మార్చి 23న సన్రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. కోల్కతా వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఇదిలా ఉంటే.. గత కొన్నేళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటున్న సన్రైజర్స్ ఈసారి మరో కొత్త కెప్టెన్తో ముందుకు రానుంది. ఆస్ట్రేలియా సారథి, వన్డే వరల్డ్కప్-2023 విజేత ప్యాట్ కమిన్స్పై కోట్లు కుమ్మరించి తన నాయకుడిగా ప్రకటించింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్పై వేటు వేసింది. ఇక జట్టులో వీరిద్దరితో పాటు మరో ఆరుగురు విదేశీ ప్లేయర్లు కూడా ఉన్నారు. నిబంధనల ప్రకారం తుదిజట్టులో కేవలం నలుగురు ఫారిన్ ప్లేయర్లను మాత్రమే ఆడించాలి. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతుందా అన్న చర్చల నడుమ.. టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన జట్టును ప్రకటించాడు. విదేశీ ప్లేయర్ల కోటాలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో పాటు.. ట్రవిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్లకు తన టీమ్లో చోటిచ్చాడు. ‘‘అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్.. ఇద్దరు లెఫ్టాండర్లతో ఓపెనింగ్ చేయించాలనుకుంటే వీరికి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఇవ్వాలి. లేదంటే అభిషేక్ను వన్డౌన్లో ఆడించి.. మయాంక్ అగర్వాల్ను ఓపెనర్గా పంపాలి. ఆ తర్వాతి స్థానాల్లో రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనాద్కట్/ఉమ్రాన్ మాలిక్/టి. నటరాజన్లను పంపించాలి’’అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఒకవేళ స్పిన్ పిచ్లపై ఆడాల్సి వస్తే.. మార్కో జాన్సెన్ స్థానంలో వనిందు హసరంగను తీసుకుంటే బాగుంటుందని ఆకాశ్ చోప్రా సూచించాడు. షాబాజ్ అహ్మద్ రూపంలో మరో స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. కాగా ఆకాశ్ చోప్రా తన తుదిజట్టులో ఐడెన్ మార్క్రమ్కు చోటు ఇవ్వకపోవడం గమనార్హం. గత సీజన్లో అతడు 13 ఇన్నింగ్స్ ఆడి సగటు 22.55తో 248 పరుగులు సాధించాడు. ఐపీఎల్ 2024- సన్రైజర్స్ హైదరాబాద్- ఆకాశ్ చోప్రా తుదిజట్టు: అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనాద్కట్/ఉమ్రాన్ మాలిక్/టి. నటరాజన్. ఐపీఎల్-2024- సన్రైజర్స్ జట్టు: అబ్దుల్ సమద్ ఐడెన్ మార్క్రమ్* రాహుల్ త్రిపాఠి గ్లెన్ ఫిలిప్స్* హెన్రిచ్ క్లాసెన్* మయాంక్ అగర్వాల్.. అన్మోల్ ప్రీత్ సింగ్ ఉపేంద్ర సింగ్ యాదవ్ నితీష్ కుమార్ రెడ్డి అభిషేక్ శర్మ మార్కో జాన్సెన్* వాషింగ్టన్ సుందర్ సన్వీర్ సింగ్ భువనేశ్వర్ కుమార్ టి.నటరాజన్ మయాంక్ మార్కండే ఉమ్రాన్ మాలిక్ ఫజల్హక్ ఫరూఖీ* షాబాజ్ అహ్మద్ (ఆర్సీబీ నుంచి ట్రేడింగ్) ట్రావిస్ హెడ్ * (వేలం - 6.80 కోట్లు) వనిందు హసరంగ* (వేలం - 1.50 కోట్లు) ప్యాట్ కమిన్స్* (వేలం - 20.50 కోట్లు) జయదేవ్ ఉనాద్కట్ (వేలం - 1.60 కోట్లు) ఆకాశ్ సింగ్ (వేలం - 20 లక్షలు) ఝతావేద్ సుబ్రమణియన్ (వేలం - 20 లక్షలు) *- విదేశీ ఆటగాళ్లు. చదవండి: హార్దిక్ రిటైర్ అవ్వటమే బెటర్: భారత మాజీ పేసర్ షాకింగ్ కామెంట్స్ -
ఆ జట్టు ఈసారి కూడా ప్లే ఆఫ్స్ చేరలేదంటే సిగ్గుచేటే!
"It's a shame if this team..: ఐపీఎల్-2024 ఆరంభానికి సమయం ఆసన్నమవుతోంది. మార్చి 22న ఈ మెగా ఈవెంట్కు చెన్నైలో తెరలేవనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. రాజస్తాన్ రాయల్స్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘రాజస్తాన్ రాయల్స్ మెరుగైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్.. సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్, షిమ్రన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్.. వీరితో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. ఇక రోవ్మన్ పావెల్తో పాటు రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చహల్, ఆడం జంపా, ట్రెంట్ బౌల్ట్ కూడా ఉండనే ఉన్నారు. విదేశీ ప్లేయర్లలో చాలా మందికి తుదిజట్టులో ఆడే అవకాశం రాదన్న మాట నిజమే. అయితే, జట్టుకు అవసరాలకు అనుగుణంగా ఒక్కొక్కరికి ఒక్కోసారైనా ఛాన్స్ దక్కుతుంది. ఇప్పుడిక ఆవేశ్ ఖాన్ కూడా రాయల్స్తో చేరాడు. వీళ్లందరినీ చూస్తుంటే ఈ జట్టు ట్రోఫీ గెలుస్తుందని భావిస్తుందని అనుకోవచ్చా? అంటే కచ్చితంగా అవుననే అంటాను. అయితే, గత సీజన్లో తాము ఇంపాక్ట్ ప్లేయర్ను వాడదలచుకోలేదని రాయల్స్ చెప్పింది. ఈసారి మాత్రం వాళ్లు ఇంపాక్ట్ ప్లేయర్ను ఎలా ఉపయెగించుకుంటుందన్న అంశం మీద విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఇంత మంచి జట్టు ఉన్నా.. ఒకవేళ రాయల్స్ గనుక ఈసారి కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరలేదంటే నిజంగా అది సిగ్గుచేటే’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఐపీఎల్-2022 సీజన్లో ఫైనల్ వరకు వెళ్లిన రాజస్తాన్ రాయల్స్ ఆఖరి మెట్టుపై గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది. ఇక గతేడాది ప్లే ఆఫ్స్(టాప్-4) కూడా చేరలేక ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. రాజస్తాన్ రాయల్స్ 2024 జట్టు సంజూ శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హిట్మెయిర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యజువేంద్ర చాహల్, ఆడమ్ జంపా, రోవ్మన్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్ కాడ్మోర్, నండ్రే బర్గర్, అబిద్ ముస్తాక్, అవేశ్ ఖాన్ (లక్నో సూపర్ జెయింట్స్ నుంచి స్వాపింగ్). చదవండి: Anant- Radhika: రోహిత్ తిరుగు పయనం.. భయ్యాకు కోపం వచ్చిందంటే! -
అతడు తప్పు చేయలేదు.. అలాంటపుడు శిక్ష ఎందుకు?
స్టార్ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లను వార్షిక కాంట్రాక్టు జాబితా నుంచి తొలగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో బీసీసీఐని కొంతమంది సమర్థిస్తుంటే.. మరికొంత మంది మాజీ క్రికెటర్లు మాత్రం తప్పుబడుతున్నారు. కాగా సెంట్రల్ కాంట్రాక్టు కలిగి ఉన్న క్రికెటర్లందరూ బోర్డు ఆదేశాలకు అనుగుణంగా తప్పక దేశవాళీ క్రికెట్లో ఆడాలని బీసీసీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే. కోచ్, కెప్టెన్, సెలక్టర్ల సూచనల మేరకు ఎవరైతే దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందో నిర్ణయిస్తామని తెలిపింది. ముఖ్యంగా ఫిట్గా ఉన్న యువ ఆటగాళ్లు బోర్డు సూచించినపుడు తప్పక డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని ఆటగాళ్లను ఆదేశించింది. అయితే, అయ్యర్, ఇషాన్ ఈ నిబంధనలు ఉల్లంఘించారనే వార్తల నడుమ.. వారిద్దరి సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేయడం ఇందుకు బలాన్నిచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లకు అండగా నిలబడ్డాడు. వారికి మద్దతుగా నిలుస్తూ.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వంటి వాళ్లకు మాత్రం ఈ నిబంధనల నుంచి ఎలా మినహాయింపు ఇస్తారని ప్రశ్నించాడు. ఈ క్రమంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘హార్దిక్ పాండ్యా విషయాన్ని సంక్లిష్టం చేయాల్సిన అవసరం లేదు. అతడు ఎన్నో ఏళ్లుగా రెడ్ బాల్ క్రికెట్కు దూరంగా ఉన్నాడు. కాబట్టి ఈ నిబంధన విషయంలో అతడి గురించిన ప్రస్తావనే అనవసరం. అతడు టెస్టు సిరీస్లకు అందుబాటులోనే ఉండటం లేదు. అలాంటపుడు అతడిని ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడమని చెప్పడంలో అర్థమే లేదు. నాలుగు రోజుల మ్యాచ్కు ఓ ఆటగాడి శరీరం సహకరించనపుడు. గాయాల బారిన పడే ప్రమాదం ఉందనీ తెలిసినపుడు అలాంటి వ్యక్తిని ఎవరూ కూడా ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడమని ఆదేశించరు. ఒకవేళ తను టెస్టు ఆడేందుకు పూర్తి ఫిట్గా ఉంటే.. తను టీమిండియాకు ఆడటం మానేసి.. ప్రమోషన్ షూట్లలో పాల్గొంటే అప్పుడు తనది తప్పని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం అతడు ఇలాంటి తప్పులేమీ చేయలేదు. కాబట్టి బీసీసీఐకి అతడిని శిక్షించాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నాడు. చదవండి: Shreyas Iyer: సెమీస్ తుదిజట్టులో అయ్యర్.. రహానే కీలక వ్యాఖ్యలు -
'అతడొక లీడింగ్ వికెట్ టేకర్.. అయినా కాంట్రాక్ట్ నుంచి'
బీసీసీఐ తాజాగా 2024-25 ఏడాదికి గానూ వార్షిక ఆటగాళ్ల కాంట్రాక్టులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో భారత స్టార్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్కు చోటు దక్కకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ లిస్ట్లో వీరిద్దరితో పాటు చాలా మంది క్రికెటర్ల పేర్లు లేవు. అందులో స్టార్ లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఒకడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి చాహల్ను తప్పించడం తనకు ఆశ్చర్యం కలిగించిందని చోప్రా తెలిపాడు. "సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో యూజీ చాహల్ పేరు లేకపోవడం చూసి నేను ఆశ్యర్యపోయాను. ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే,శిఖర్ ధావన్, దీపక్ హుడాలను తప్పించడంలో ఒక అర్ధముంది. కానీ చాహల్ టీ20ల్లో భారత తరుపున లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్నాడు. అటువంటి ఆటగాడికి కాంట్రాక్ట్ దక్కకపోవడం దురదృష్టకరం. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం దేనికి సంకేతమో నాకు అర్ధం కావడం లేదు. బహుశా వారు చాహల్ స్ధానంలో కొత్త ఆటగాడిని వెతుకుతున్నట్లున్నారని" తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు. కాగా చాహల్ గతేడాది ఆగస్టు నుంచి జట్టుకు దూరంగా ఉంటున్నాడు. -
Ind vs Eng 3rd Test: భరత్నే ఆడించండి.. అతడు వద్దు!
India vs England, 3rd Test: ఇంగ్లండ్తో మూడో టెస్టులో శ్రీకర్ భరత్నే టీమిండియా వికెట్ కీపర్గా కొనసాగించాలని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. బ్యాటింగ్ విషయాన్ని పక్కనపెడితే.. కీపర్గా భరత్ రాణిస్తున్న విషయాన్ని మర్చిపోవద్దని గుర్తుచేశాడు. పిచ్లు కఠినంగా ఉన్న కారణంగానే కేఎల్ రాహుల్ను వికెట్ కీపర్గా కాకుండా బ్యాటర్గా ఆడిస్తున్నారన్న ఆకాశ్ చోప్రా.. కాబట్టి భరత్ బ్యాటింగ్ వైఫల్యాన్ని భూతద్దంతో చూడద్దని విజ్ఞప్తి చేశాడు. కాగా సౌతాఫ్రికా పర్యటన నుంచి ఇషాన్ కిషన్ మధ్యలోనే నిష్క్రమించడంతో మరోసారి ఆంధ్ర క్రికెటర్ టీమిండియాలో భాగమయ్యాడు. ప్రొటిస్తో టెస్టుల తర్వాత ఇంగ్లండ్తో స్వదేశంలో ఆడుతున్న సిరీస్లోనూ కీపర్గా భరత్కు అవకాశం వచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్లో జరిగిన తొలి టెస్టులో అతడు 69 పరుగులు చేశాడు. అయితే, సొంతమైదానం విశాఖపట్నంలో జరిగిన రెండో మ్యాచ్లో మాత్రం భరత్ పూర్తిగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్లో కలిపి 23 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో మూడో టెస్టులో ధ్రువ్ జురెల్ అరంగేట్రానికి మేనేజ్మెంట్ సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. భరత్ స్థానంలో వికెట్ కీపర్గా అతడికి ఛాన్స్ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాత్రం భరత్నే కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు.. ‘‘ధ్రువ్ జురెల్ అరంగేట్రం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నా అభిప్రాయం ప్రకారం.. భరత్నే కొనసాగించడం మంచిది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగింది రెండే టెస్టులు. అతడు వికెట్ కీపింగ్ బాగానే చేస్తున్నాడు. కానీ అందరూ అతడి బ్యాటింగ్ వైఫల్యాన్నే ఎత్తి చూపుతున్నారు. పిచ్లు కఠినంగా ఉంటాయనే కారణంగానే రాహుల్ను ప్యూర్ బ్యాటర్గా మాత్రమే బరిలోకి దించారు కదా. మరి భరత్ను స్పెషలిస్టు కీపర్గానే చూడాలి కదా. హైదరాబాద్ టెస్టులో అతడు బ్యాటింగ్ కూడా బాగానే చేశాడు. అయినా కూడా.. బ్యాటర్గానే అతడి సేవలు కావాలనుకుంటే.. కనీసం మరొక్క మ్యాచ్లోనైనా అవకాశం ఇవ్వాలి. ఇప్పుడే తొందరపడకూడదు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కాగా ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: వదినమ్మ అంటూనే వెకిలి కామెంట్.. పో.. ఇక్కడి నుంచి! -
భరత్కే పెద్దపీట.. అంతేగానీ అతడిని ఇప్పట్లో ఆడించరు!
టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ పునరాగమనంపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో వికెట్ కీపర్గా ప్రస్తుతం కేఎస్ భరత్కే మేనేజ్మెంట్ పెద్దపీట వేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఒకవేళ ఏదేని కారణాల చేత భరత్ జట్టుకు దూరమైతే.. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ లేదంటే జగదీశన్ వంటి వాళ్లకు ఛాన్స్ ఇస్తారని అభిప్రాయపడ్డాడు. అంతేగానీ.. ఇషాన్ కిషన్కు మాత్రం రీఎంట్రీ అంత సులువుకాదని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. బ్రేక్ తీసుకున్న ఇషాన్ కాగా మానసికంగా అలసిపోయానంటూ సౌతాఫ్రికా పర్యటన నుంచి ఇషాన్ కిషన్ మధ్యలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబంతో సమయం గడుపుతూనే.. వర్కౌట్లతో బిజీ అయ్యాడు. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్తో ఇషాన్ కిషన్కు విభేదాలు తలెత్తాయన్న వార్తల నడుమ.. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. దేశవాళీ క్రికెట్ ఆడిన తర్వాతే ఇషాన్ తిరిగి జట్టులోకి వస్తాడని పేర్కొన్నాడు. అయితే, రంజీ ట్రోఫీ-2024 రూపంలో అవకాశం ఉన్నా.. ఇషాన్ మాత్రం దానిని పక్కనపెట్టాడు. భరత్కు అవకాశం జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్వాగతం పలికినా జట్టుతో చేరలేదు. ఇదిలా ఉంటే.. ఇషాన్ తిరిగి వచ్చిన తర్వాత సౌతాఫ్రికాతో టెస్టుల్లో అతడి స్థానాన్ని భర్తీ చేసిన ఆంధ్ర క్రికెటర్ కోన శ్రీకర్ భరత్.. స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టుల్లోనూ ఆడుతున్నాడు. అయితే, వికెట్ కీపింగ్ పరంగా అతడికి మంచి మార్కులే పడుతున్నా.. బ్యాటర్గా ఆకట్టుకోలేకపోతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇషాన్ కిషన్ మేనేజ్మెంట్ను అడిగి మరీ విరామం తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంపిటేటివ్ క్రికెట్ ఆడలేదు. తన బ్రేక్ను పొడిగిస్తూనే ఉన్నాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లోనూ కనిపించడం లేదు. మానసికంగా అలసిపోయానంటూ అతడు సెలవు తీసుకున్నాడు. తను బాగుండాలని కోరుకుంటున్నా. అయితే, ఇప్పట్లో అతడు నేరుగా టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చే అవకాశం లేదు. కేఎస్ భరత్ వికెట్ కీపర్గా జట్టులో ఉన్నాడు. అతడి గైర్హాజరీలో ధ్రువ్ జురెల్ లేదంటే.. జగదీశన్ కూడా జట్టులోకి వస్తారేమో కూడా తెలియదు. కానీ.. ఇషాన్ కిషన్కు మాత్రం పిలుపునివ్వరు. అతడు దేశవాళీ క్రికెట్ ఆడిన తర్వాతే మళ్లీ జాతీయ జట్టుకు సెలక్ట్ చేస్తారు’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఆ విషయంలో కోహ్లితో పోల్చవద్దు ఈ సందర్భంగా.. ‘‘విరాట్ కోహ్లి కూడా కాంపిటేటివ్ క్రికెట్ ఆడటం లేదు కదా అంటూ ప్రశ్నలు వేయద్దు. ఎందుకంటే.. కోహ్లి, ఇషాన్ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి.. దయచేసి ఇద్దరినీ పోల్చే ప్రయత్నం చేయొద్దు’’ అంటూ ట్రోల్ చేసే వాళ్లకు చురకలు అంటించాడు ఆకాశ్ చోప్రా. చదవండి: Virat Kohli: అంతా అబద్ధం.. కోహ్లి విషయంలో మాట మార్చిన డివిలియర్స్ -
అతడిని చూస్తే యువీ గుర్తుకొస్తున్నాడు.. హార్దిక్ను వదిలేసి!
India Potential Selection Dilemma For T20 World Cup 2024: టీమిండియా ఆల్రౌండర్ శివం దూబేపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. దూబే ఆట తీరు చూస్తుంటే తనకు యువరాజ్ సింగ్ గుర్తుకు వస్తున్నాడని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2024 జట్టులో ఈ ముంబై బ్యాటర్కు కచ్చితంగా చోటివ్వాలని ఆకాశ్ చోప్రా బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్ సందర్భంగా చాలా ఏళ్ల తర్వాత టీమిండియా తరఫున బరిలోకి దిగిన శివం దూబే.. అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్లో మూడు మ్యాచ్లలో కలిపి 124 పరుగులు సాధించిన ఈ పేస్ ఆల్రౌండర్.. రెండు వికెట్లు తీశాడు. పాండ్యా గైర్హాజరీలో చోటు సంపాదించి.. సత్తా చాటి తద్వారా టీమిండియా 3-0తో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. గాయం కారణంగా దూరమైన హార్దిక్ పాండ్యా స్థానంలో వచ్చిన అవకాశాన్ని ఇలా పూర్తిగా సద్వినియోగం చేసుకున్న దూబే.. ప్రపంచకప్-2024 రేసులో తానూ ఉన్నానంటూ సెలక్టర్లకు గట్టి సందేశమే పంపాడు. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘శివం అతి సుందరం.. పవర్ హిట్టర్.. మూడో టీ20లో అతడిని ఇంకాస్త లేట్గా బ్యాటింగ్కు పంపాల్సింది. శివం కంటే ముందుగా సంజూ శాంసన్ లేదంటే.. రింకూ సింగ్ను బరిలోకి దించితే బాగుండేది. ఎందుకంటే శివం.. ఆచితూచి ఆడే ప్లేయర్ కాదు.. అటాకర్. అటాకర్.. అచ్చం యూవీ మాదిరే బౌలర్లపై ఆధిపత్యం కొనసాగిస్తూ దూకుడు ప్రదర్శించగలడు. నాకు అతడిని చూస్తే యువీ గుర్తుకువస్తాడు. శివంను లోయర్ ఆర్డర్లో ఆడిస్తేనే ఇంకా మెరుగైన ఫలితాలు ఉంటాయి’’ అని అభిప్రాయపడ్డాడు. ఇద్దరూ జట్టులో ఉండాలి అదే విధంగా.. ‘‘తొలి రెండు మ్యాచ్లలో శివం దూబే ఎంత శక్తిమంతంగా సిక్సర్లు బాదాడో చూశాం. అతడి ఆట తీరుకు ముచ్చటపడి కొందరైతే హార్దిక్ను వదిలేసి.. దూబేను జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. నా వరకైతే ఈ ఇద్దరూ జట్టులో ఉంటే బాగుంటుంది. అఫ్గన్తో మూడు మ్యాచ్లలో అదరగొట్టి తాను ప్రపంచకప్ రేసులో ఎవరి కంటే తక్కువ కాదని దూబే నిరూపించాడు. అసలైన పోటీదారు అనిపించుకున్నాడు. ఐపీఎల్లోనూ దూబే ఇలాగే రాణిస్తే.. టీమిండియాలోకి రాకుండా అతడిని ఎవరూ ఆపలేరు’’ అని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. చదవండి: Ayodhya Ram Mandir Inauguration: అయోధ్యకు వెళ్లి తీరతా.. ఏం చేస్తారో చేసుకోండి: హర్భజన్ సింగ్ Ranji Trophy 2024: బ్యాట్తో చెలరేగిన దూబే.. టెస్టుల్లోనూ ఎంట్రీకి సై! -
Ind Vs Eng: వాళ్లిద్దరి అధ్యాయం ఇక ముగిసినట్లే!
అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారా టెస్టు కెరీర్ అధ్యాయం ముగిసిపోయినట్లేనని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఇంగ్లండ్తో సిరీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టుతో ఈ విషయం నిరూపితమైందని పేర్కొన్నాడు. ఇక ముందు ఈ వెటరన్ బ్యాటర్లు టీమిండియా తరఫున ఆడే అవకాశం లేదన్నాడు. కాగా ఒకప్పుడు టెస్టు స్పెషలిస్టులుగా టీమిండియాకు పలు చిరస్మరణీయ విజయాలు అందించారు రహానే, పుజారా. వైస్ కెప్టెన్గా రహానే.. నయావాల్గా పుజారా తమ వంతు పాత్రలను చక్కగా పోషించారు. కానీ గత కొన్ని రోజులుగా వీరిద్దరిని పక్కన పెట్టేశారు సెలక్టర్లు. అడపాదడపా వచ్చిన అవకాశాలను రహానే, పుజారా సద్వినియోగం చేసుకోకపోవడమే ఇందుకు కారణం. మరోవైపు.. యంగ్ క్రికెటర్ల నుంచి ఎదురవుతున్న పోటీలోనూ వీరు వెనుకబడిపోయారు. దీంతో ఇటీవల సౌతాఫ్రికా పర్యటన రూపంలో బిగ్ సిరీస్ నేపథ్యంలో రహానే, పుజారాలను సెలక్టర్లు పట్టించుకోలేదు. తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ప్రకటించిన రెండు మ్యాచ్ల జట్టులోనూ చోటివ్వలేదు. వాళ్లిద్దరిది ముగిసిన అధ్యాయం ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. "ఊహించిన విధంగానే జట్టు ప్రకటన ఉంది. అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారాలను ఎంపిక చేయలేదు. ఇక వాళ్లిద్దరిది ముగిసిన అధ్యాయం. ఎప్పుడైతే సౌతాఫ్రికాతో ఆడే జట్టులో వారికి స్థానం ఇవ్వలేదో అప్పుడే ఇక ముందు కూడా వాళ్లకు ఆడే అవకాశం రాదని ఊహించాను. అక్కడ ధోని కెప్టెన్ కాబట్టి టీమిండియా దారులు మూసుకుపోయినా రహానేకు మాత్రం ఐపీఎల్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కు అతడు గత సీజన్లో ఆడాడు. ఈసారి కూడా బాగా ఆడితే మరికొన్నాళ్లపాటు కొనసాగగలడు. నిజానికి చెన్నైకి ఆడటం ముఖ్యం కాదు.. అక్కడ ధోని కెప్టెన్ కాబట్టి ఆ జట్టుకు ఆడి నిరూపించుకుంటే మళ్లీ టీమిండియా తలుపు తట్టవచ్చు" అని అభిప్రాయపడ్డాడు. కాగా ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక విజయం తర్వాత రహానే వరుసగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2023లో చెన్నైకి ఆడిన అతడు ఫుల్ఫామ్లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో చాలాకాలం తర్వాత ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2021-23 ఫైనల్ సందర్భంగా టీమిండియాకు ఆడే చాన్స్ వచ్చింది. మిగతా వాళ్లంతా విఫలమైనా ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్లో మిగతా వాళ్లంతా విఫలమైనా రహానే మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే, పుజారా మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. ఈక్రమంలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే జట్టులో రహానేకు చోటు దక్కినా.. పుజారాకు మొండిచేయి ఎదురైంది. పుజారా డబుల్ సెంచరీ అయితే, కరేబియన్ గడ్డపై పాత కథను రిపీట్ చేసిన రహానే మళ్లీ టీమిండియాలో స్థానం సంపాదించలేకపోయాడు. ఇక పుజారా సంగతి సరేసరి. ఇంగ్లండ్ కౌంటీల్లో రాణిస్తున్నా సెలక్టర్లు కరుణించడం లేదు. తాజాగా రంజీ ట్రోఫీ-2024లో ఆరంభ మ్యాచ్లో పుజారా డబుల్ సెంచరీతో సౌరాష్ట్ర తరఫున సత్తా చాటగా.. ముంబై కెప్టెన్ రహానే మాత్రం డకౌట్ అయ్యాడు. -
ఈసారి తప్పు ముమ్మాటికీ రోహిత్దే.. చెత్త సెలక్షన్: మాజీ బ్యాటర్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆట తీరుపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించాడు. అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్లో హిట్మ్యాన్ నుంచి ఇలాంటి ప్రదర్శన ఊహించలేదన్నాడు. ముఖ్యంగా రెండో టీ20లో రోహిత్ వికెట్ పారేసుకున్న విధానం విస్మయపరిచిందని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రీఎంట్రీలో రనౌట్ సుమారు పద్నాలుగు నెలల విరామం తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై అఫ్గన్తో తొలి మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ ఓపెనర్.. రనౌట్గా వెనుదిరిగి పూర్తిగా నిరాశపరిచాడు. ఇండోర్లో డకౌట్ మొహాలీ మ్యాచ్లో ఈ మేరకు.. శుబ్మన్ గిల్తో సమన్వయలోపం కారణంగా పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు రోహిత్. ఈ నేపథ్యంలో కనీసం రెండో టీ20లోనైనా హిట్మ్యాన్ మెరుపులు చూడాలని ఆశించిన వాళ్లకు మళ్లీ నిరాశే మిగిలింది. ఇండోర్లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో రోహిత్.. డకౌట్ అయ్యాడు. తప్పుడు షాట్ సెలక్షన్ అఫ్గన్ బౌలర్ ఫజల్హక్ ఫారూకీ సంధించిన బంతికి బౌల్డ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా రోహిత్ శర్మ బ్యాటింగ్ను విశ్లేషిస్తూ.. "రోహిత్ అవుటైన తీరు ఆశ్చర్యపరిచింది. తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఇలాంటి షాట్ ఎందుకు ఆడాడో అర్థం కాలేదు. బంతి నేరుగా స్టంప్స్ ను హిట్ చేసింది. సాధారణంగా రోహిత్ అలాంటి షాట్లు ఆడడు. తొలి టీ20లో సున్నాకే రనౌట్ అయ్యాడు. అందులో అతడి తప్పేమీ లేదు. కానీ రెండో టీ20లో తప్పుడు షాట్ సెలక్షన్తో మూల్యం చెల్లించాడు. ఈసారి తప్పు ముమ్మాటికీ అతడిదే. ఆ రోహిత్ కావాలి రోహిత్ శర్మ టీ20 ఆట తీరు, సామర్థ్యాలపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. కానీ అతడి నుంచి ఇలాంటి ప్రదర్శన ఎవరూ ఊహించరు. ఐపీఎల్ ద్వారానైనా రోహిత్ ఫామ్లోకి రావాలి. వన్డే వరల్డ్ కప్లో దంచికొట్టిన రోహిత్ శర్మ మనకి కావాలి" అని పేర్కొన్నాడు. ఏదేమైనా ఐపీఎల్-2024లో రోహిత్ బ్యాట్ ఝులిపిస్తేనే టీమిండియాకు వరల్డ్ కప్లో సానుకూలంగా ఉంటుందని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా.. అఫ్గనిస్తాన్తో రెండో టీ20లో రోహిత్ శర్మ విఫలం కాగా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్, పేస్ ఆల్రౌండర్ శివం దూబే ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరి కారణంగా రెండో టీ20లో గెలిచిన టీమిండియా సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. -
వరల్డ్కప్ జట్టులో ఉంటాడనుకుంటే.. కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా?!
It seemed like he could be in the World Cup team: టీమిండియా సెలక్టర్ల నిర్ణయాలను అర్థం చేసుకోవడం కష్టమని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ప్రపంచకప్-2024 జట్టులో ఉంటాడనుకున్న ఆటగాడిని అకస్మాత్తుగా ఎందుకు పక్కనపెట్టారని ప్రశ్నించాడు. ఒకప్పుడు ప్రతి సిరీస్కు ఎంపికైన ఆ ప్లేయర్కు ఇప్పుడు కనీసం భారత్-‘ఏ’ జట్టులో కూడా చోటు దక్కకపోవడం ఏమిటని వాపోయాడు. నెట్బౌలర్ నుంచి టీమిండియా స్థాయికి ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ప్రతిభావంతుల్లో జమ్మూ కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ ఒకడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో నెట్ బౌలర్గా మొదలైన అతడి ప్రయాణం.. టీమిండియాకు ఎంపిక అయ్యే స్థాయికి చేరుకుంది. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా 2022లో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు ఈ రైటార్మ్ ఫాస్ట్బౌలర్. అదే ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. తన పదునైన, వేగవంతమైన డెలివరీలతో బ్యాటర్లను తిప్పలు పెట్టడంలో ఉమ్రాన్ మాలిక్ దిట్ట. ఈ క్రమంలో టీమిండియా టీ20 జట్టులో కీలక సభ్యుల్లో ఒకడిగా మారాడు ఈ ఫాస్ట్బౌలర్. అయితే, ఐపీఎల్-2023లో పేలవ ప్రదర్శన తర్వాత ఒక్కసారిగా ఉమ్రాన్ మాలిక్ రాత తలకిందులైంది. వాళ్లిద్దరికి మాత్రం ఛాన్స్లు ఫామ్లేమితో సతమతమవుతున్న అతడికి వెస్టిండీస్ టూర్ రూపంలో టీమిండియా మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కరేబియన్ దీవుల్లో ఆడిన రెండు వన్డేల్లో ధారాళంగా పరుగులు ఇచ్చుకుని జట్టులో తన స్థానాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు ఉమ్రాన్. అయితే, ఉమ్రాన్ మాలిక్ మాదిరే అర్ష్దీప్ సింగ్, అవేశ్ ఖాన్లు కూడా వైఫల్యం చెందినా బీసీసీఐ సెలక్టర్లు వారికి అవకాశాలు ఇస్తున్నారు. తాజాగా అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్కు ఎంపిక చేసిన జట్టులోనూ ఉమ్రాన్కు స్థానం దక్కకపోగా.. వీరిద్దరు మాత్రం చోటు దక్కించుకోవడం విశేషం. మొన్నటిదాకా ఎక్కడ చూసినా అతడే ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ... ‘‘కొంతకాలం క్రితం ఎక్కడ చూసినా ఉమ్రాన్ మాలికే కనబడ్డాడు. అతడిని వెస్టిండీస్ పర్యటనకు తీసుకువెళ్లారు. ఒకానొక సందర్భంలో అతడు వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమని అందరూ భావించారు. కానీ.. ఇటీవల వరుస సిరీస్లలో అతడికి మొండిచేయే చూపారు. కనీసం ఇండియా-ఏ జట్టుకు కూడా అతడిని ఎంపిక చేయలేదు. మూడు నెలల కాలంలోనే అంత పెద్ద మార్పులేం జరిగిపోయాయి. టీమిండియాలో అడుగుపెట్టి.. కొన్ని అవకాశాలు అందిపుచ్చుకున్న తర్వాత.. అకస్మాత్తుగా అతడు కనిపించకుండా పోయాడు. అసలు ఉమ్రాన్ మాలిక్ ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? అతడి విషయంలో అసలు ఏం జరుగుతోంది? ఎందుకు ఇలా జరుగుతోంది అన్న విషయాలను మనం తెలుసుకోవాలి’’ అని పేర్కొన్నాడు. ఉమ్రాన్ మాలిక్కు తగినన్ని అవకాశాలు ఇవ్వాలని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా మేనేజ్మెంట్కు సూచించాడు. కాగా గతేడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్తో టీ20లో ఉమ్రాన్ మాలిక్ తన అత్యుత్తమ గణాంకాలు (2/9- 2.1 ఓవర్లలో) నమోదు చేశాడు. మొత్తంగా తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు ఆడిన 10 వన్డేల్లో 13, 8 టీ20లలో 11 వికెట్లు తీశాడు ఉమ్రాన్ మాలిక్. చదవండి: Ind Vs Afg: అఫ్గన్తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
‘మనం వద్దని మాల్దీవులు ఓటేసింది.. ఇకపై అక్కడికి వెళ్తారా? లేదా..’
Cricket Stars Fume Over Maldives Row: భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులను టీమిండియా మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. భారతీయులను తక్కువ చేసేలా మాట్లాడటం తగదని హితవు పలుకుతున్నారు. గతంలో ఎన్నోసార్లు మాల్దీవుల పర్యటనకు వెళ్లామని.. కానీ ఇకపై అలాంటి పరిస్థితులు ఉండబోవని స్పష్టం చేస్తున్నారు. భారతదేశంలో ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయని.. ఇకపై వాటిపైనే మనమంతా దృష్టి సారించాలని పిలుపునిస్తున్నారు. భారత పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేలా తమ వంతు సహకారం అందిస్తామంటూ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీకి మద్దతు తెలుపుతున్నారు. మోదీ ఫొటోలు వైరల్.. మాల్దీవుల మంత్రుల నోటి దురుసు కాగా ప్రధాని మోదీ.. కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్లో ఇటీవల పర్యటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో లక్షద్వీప్ను పర్యాటక ధామంగా మార్చాలంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు మాల్దీవులతో లక్షద్వీప్ను పోలుస్తూ ప్రధాని మోదీ ఫొటోలను నెట్టింట వైరల్ చేశారు. ఈ నేపథ్యంలో మాల్దీవుల మంత్రులు మోదీని కించపరిచే విధంగా తోలుబొమ్మ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. భారత్లో బీచ్లు, హోటల్ గదులు శుభ్రంగా ఉండవని.. అలాంటి దేశంతో తమకు పోలికేంటని వివాదాస్పద రీతిలో కామెంట్లు చేశారు. దీంతో బాయ్కాట్ మాల్దీవ్స్, #ExploreIndianIslands ట్రెండ్ చేస్తున్నారు భారత నెటిజన్లు. మన పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా, మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, మాజీ బ్యాటర్ సురేశ్ రైనా తదితరులు స్పందించారు. ఈ మేరకు సెహ్వాగ్.. ‘‘ఉడుపి, పాండిలోని పారడైజ్ బీచ్, అండమాన్లోని నీల్, హవెలాక్తో పాటు దేశంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇంతవరకు మనం చూడని చక్కటి బీచ్లు కూడా చాలా ఉన్నాయి. మన ప్రధాని పట్ల మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసిన తీరును అందరూ గమనించాలి. ఇకపై అవసరమైన చోట్ల మౌలిక సదుపాయాలు మరింత అభివృద్ధి చేసి మన పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసి.. ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకోవాలి’’ అని పేర్కొన్నాడు. Whether it be the beautiful beaches of Udupi , Paradise Beach in Pondi, Neil and Havelock in Andaman, and many other beautiful beaches throughout our country, there are so many unexplored places in Bharat which have so much potential with some infrastructure support. Bharat is… pic.twitter.com/w8EheuIEUD — Virender Sehwag (@virendersehwag) January 7, 2024 ఇక ఇర్ఫాన్ పఠాన్.. ‘‘నాకు 15 ఏళ్ల వయసు ఉన్నపటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో పర్యటించాను. ఇండియన్ హోటల్స్లో లభించిన ఆతిథ్యం మరెక్కడా లభించదు. మన దేశంలో ఉన్నన్ని పర్యాటక ప్రాంతాలు మరెక్కడా లేవు. మనం ప్రతి దేశ సంస్కృతిని గౌరవిస్తాం. కానీ.. నా మాతృదేశం గురించి, ఇక్కడి ఆతిథ్యం గురించి ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలు వినడం ఎంతో బాధిస్తోంది’’ అని మాల్దీవుల మంత్రులకు చురకలు అంటించాడు. Having traveled the world since I was 15, every new country I visit reinforces my belief in the exceptional service offered by Indian hotels and tourism. While respecting each country's culture, it's disheartening to hear negative remarks about my homeland's extraordinary… — Irfan Pathan (@IrfanPathan) January 7, 2024 మనం వద్దని మాల్దీవులు ఓటేసింది.. ఇక వెళ్లాలా లేదా? అదే విధంగా ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘ఇండియా వద్దని మాల్దీవులు ఓటేసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో.. వెళ్లవద్దో అన్న అంశంలో భారతీయులు తెలివిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా కుటుంబం అయితే, ఇలాగే చేస్తుంది. జై హింద్’’ అని పేర్కొన్నాడు. ‘India Out’ was a part of the manifesto. Maldives voted for it. Now, it’s up to us, Indians, to choose wisely. I know that my family will. Jai Hind 🇮🇳 — Aakash Chopra (@cricketaakash) January 6, 2024 కాగా మోదీపై అనుచిత వ్యాఖ్యల కారణంగా ఇప్పటికే చాలా మంది భారత ప్రముఖులు మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. పర్యాటకమే ఆయువుపట్టుగా ఉనికిని చాటుకుంటున్న తమకు.. తాజా పరిణామాలు భారీ నష్టం చేకూరుస్తాయని పసిగట్టిన మాల్దీవుల ప్రభుత్వం.. ఇప్పటికే సదరు మంత్రులపై వేటు వేసింది. -
ఆసియాలో పులి.. అక్కడ మాత్రం జీరో! కింగ్ అవ్వాలంటే అదొక్కటే
వైట్బాల్ క్రికెట్లో అదరగొడుతున్న టీమిండియా ఓపెనర్ శుబ్మన్ గిల్.. టెస్టుల్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోతున్నాడు. 2023 ఏడాదిలో మొత్తంగా 45 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన గిల్ 7 సెంచరీలు, 10 అర్ధసెంచరీల సాయంతో 2,118 పరుగులు చేశాడు. అయితే ఏడాది టెస్టుల్లో మాత్రం గిల్ 10 ఇన్నింగ్స్లలో కేవలం 258 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒకే ఒక సెంచరీ ఉంది. మిగితా ఆరు సెంచరీలు వన్డేలు, టీ20లో చేసినవే. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో కూడా గిల్ దారుణంగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్లు కలిపి కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో గిల్పై టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. స్వదేశంలో కాకుండా విదేశీ పిచ్లపై కూడా రాణిస్తానే అత్యుత్తమ టెస్టు బ్యాటర్గా పరిగిణించబడతారని చోప్రా తెలిపాడు. తన యూట్యూబ్ ఛానెల్లో చోప్రా మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో శుబ్మన్ గిల్ ప్రదర్శన నన్ను చాలా నిరాశపరిచింది. గిల్ను అభిమానులు ప్రిన్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అని పిలుచుకుంటారు. ప్రిన్స్ నుంచి రాజుగా మారాలంటే అతడు రెడ్బాల్ క్రికెట్లో నిలకడగా రాణించాలి. ముఖ్యంగా సేనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్,న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అతడి గణంకాలను మెరుగుపరుచుకోవాలి. ఆసియాలో అతడి రికార్డులు అద్బుతంగా ఉన్నాయి. అదే సేనా దేశాల్లో అతడి రికార్డులు ఆసియాకు భిన్నంగా ఉన్నాయి. గిల్కు ఇంకా చాలా కెరీర్ ఉంది. అతడు రాబోయో రోజుల్లో సేనా దేశాల్లో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తాడని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. చదవండి: Test team of the year 2023: అత్యుత్తమ టెస్టు జట్టు ఇదే.. కోహ్లి, రోహిత్లకు నో ఛాన్స్ -
విరాట్ కోహ్లికి రూ.42 కోట్లు.. టీమిండియా మాజీ ఓపెనర్ సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్-2024 వేలంలో స్టార్క్ను రూ.24.75 కోట్ల భారీ ధరకు కోల్కతా నైట్రైడర్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా స్టార్క్ నిలిచాడు. అతడితో పాటు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా భారీ మొత్తం దక్కించుకున్నాడు. రూ.20.50 కోట్లకు ఎస్ఆర్హెచ్ కొనుగొలు చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాళ్లు సురేష్ రైనా, ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత ఆటగాళ్ల కంటే విదేశీ ఆటగాళ్లపై ఎక్కువ మొత్తం ఫ్రాంచైజీలు వెచ్చించడాన్ని రైనా తప్పుబట్టాడు. మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ వంటి టీమిండియా స్టార్లు విదేశీ ఆటగాళ్ల కంటే తక్కువ తీసుకుంటున్నారని అతడు అన్నాడు. అదే విధంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ప్రస్తుతం వేలంలోకి వస్తే రూ. 42 కోట్లకు అమ్ముడుపోతాడని ఆకాష్ చోప్రా జోస్యం చెప్పాడు. అయితే అందుకు ఐపీఎల్ రూల్స్ సవరించాల్సి ఉంటుందని చోప్రా చెప్పుకొచ్చాడు. "ఐపీఎల్ రూల్స్లో కొన్ని మార్పులు చేయాలి. ప్రతీ ఫ్రాంచైజీ పర్స్ను రూ.200 కోట్లకు పెంచాలి. అందులో భారత ఆటగాళ్ల కోసం రూ.150 కోట్లు వెచ్చించేలా కండీషన్ పెట్టాలి. మిగిలిన 50 కోట్ల రూపాయలను విదేశీ క్రికెటర్ల కోసం ఉంచాలి. అప్పుడు కోహ్లి వేలంలో వస్తే 42 కోట్ల రూపాయలకు అమ్ముడుపోతాడని" జియో సినిమాతో చోప్రా పేర్కొన్నాడు. రైనా మాట్లాడుతూ.. "ప్రస్తుతం భారత స్టార్లు జస్ప్రీత్ బుమ్రాకు రూ.12 కోట్లు, మహ్మద్ షమీకి రూ.5 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. ధోని కూడా కేవలం రూ.12 కోట్లకే సీఎస్కే ఆడుతున్నాడు. 8 ఏళ్ల పాటు ఐపీఎల్ ఆడని ఆటగాడికి దాదాపు రూ.25 కోట్లు ఇచ్చారు. అది సరైన నిర్ణయం కాదని అన్నాడు. చదవండి: IPL 2024 Auction: వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ కసి చూపించేశాడు! 10 సిక్స్లతో విధ్వంసం -
పంజాబ్ కింగ్స్లోకి ఆసీస్ విధ్వంసకర ఆటగాడు..!?
వన్డే వరల్డ్కప్లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆసీస్ ఆరోసారి వరల్డ్ ఛాంపియన్స్గా నిలవడంలో హెడ్ది కీలక పాత్ర. . భారత్తో జరిగిన ఫైనల్లో 137 పరుగులతో హెడ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓవరాల్గా మెగా టోర్నీలో కేవలం 5 మ్యాచ్లు మాత్రమే ఆడిన హెడ్.. 44 సగటుతో 220 పరుగులు చేశాడు. కాగా ఈ వరల్డ్కప్ హీరో ఐపీఎల్-2024 మినీ వేలంలో రూ.2 కోట్ల కనీస తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. అద్భుత ఫామ్లో ఉన్న అతడి కోసం ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వేలంలో ట్రావిస్ హెడ్ను దక్కించుకోవడానికి పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ప్రయత్నించాలని అకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. "మిని వేలంలో పంజాబ్ కింగ్స్ అఫ్గాన్ ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ కోసం ప్రయత్నించనున్నట్లు తెలుస్తోంది. సామ్ కుర్రాన్ స్ధానంలో అతడిని ఆడించే ఛాన్స్ ఉంది. నా వరకు అయితే కుర్రాన్ కంటే ఒమర్జాయ్ బాగా రాణిస్తాడని అనుకుంటున్నాను. అయితే ఒమర్జాయ్తో పాటు ట్రావిడ్ హెడ్ కోసం కూడా పంజాబ్ ట్రై చేయాలి. అతడు జానీ బెయిర్స్టోకు హెడ్ ప్రత్యామ్నయంగా ఉంటాడు. అతడికి బ్యాటింగ్తో పాటు బౌలింగ్ చేసే స్కిల్ కూడా ఉంది. అదే విధంగా భారత బౌలర్ కావాలనుకుంటే లార్డ్ శార్ధూల్ ఠాకూర్ కూడా అందుబాటులో ఉన్నాడు" అని తన యూట్యాబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024 మినీవేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది. చదవండి: World Cup 2023: వన్డే వరల్డ్కప్ ఫైనల్ పిచ్కు ఐసీసీ రేటింగ్.. ఎంతంటే? -
ఆడేది 3 మ్యాచ్లు మాత్రమే.. 17 మంది ఎందుకు? భారత సెలక్టర్లపై ప్రశ్నల వర్షం
దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత జట్లను బీసీసీఐ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. సౌతాఫ్రికా టూర్లో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్లకు మూడు వేర్వేరు జట్లను బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. మూడు ఫార్మాట్లలో ముగ్గురు వెర్వేరు కెప్టెన్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికాతో టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు సారథ్యం వహించనుండగా.. వన్డేల్లో రాహుల్.. టెస్టుల్లో రోహిత్ శర్మకు జట్టు పగ్గాలను అప్పగించారు. అయితే ప్రోటీస్తో వైట్ బాల్ సిరీస్లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి దూరమయ్యారు. ఇక ఇది ఇలా ఉండగా.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు 17 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఎంపికపై టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. టీ20లకు 17 మంది సభ్యులను సెలక్టర్లు ఎందుకు ఎంపిక చేశారో అర్ధం కావడం లేదని చోప్రా అన్నాడు. కాగా ఆసీస్తో టీ20 సిరీస్కు దూరమైన రవీంద్ర జడేజా, శుబ్మన్ గిల్, మహ్మద్ సిరాజ్చ కుల్దీప్ యాదవ్.. దక్షిణాఫ్రికాతో సిరీస్కు మాత్రం అందుబాటులోకి వచ్చారు. ఈ నేపథ్యంలో చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. "దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లో సూర్యకుమార్ యాదవ్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఇది సరైన నిర్ణయమే. రవీంద్ర జడేజాను వైస్కెప్టెన్గా ఎంపిక చేశారు. ఇది కాస్త ఆసక్తికర నిర్ణయం. కానీ కేవలం మూడు మ్యాచ్ల సిరీస్కు 17 మంది ఆటగాళ్లు ఎందుకు? ఇప్పుడు తిలక్ వర్మ, రింకూ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు తుది జట్టులో చోటు దక్కే సూచనలు కన్పించడం లేదు. ప్లేయింగ్ ఎలెవన్ను ఎంపిక చేయడం కూడా చాలా కష్టతరమవుతోంది. కనీసం నలుగురు ఆటగాళ్లు సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా బెంచ్కే పరిమితమవుతారు. అటువంటి అంతమంది ఆటగాళ్లను దక్షిణాఫ్రికాకు పంపడం ఎందుకు "అని ప్రశ్నల వర్షం కురిపించాడు. దక్క్షిణాఫ్రికాతో టీ20లకు భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ , అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్. -
అంతా సాఫీగా సాగుతున్నప్పుడు హార్దిక్ ఫ్రాంచైజీ మారడం ఎందుకు..?
ఐపీఎల్ 2024 ఎడిషన్ ప్రారంభానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్ (నిలబెట్టుకోవడం), రిలీజ్ (వేలానికి వదిలేయడం) ప్రక్రియ నిన్నటితో (నవంబర్ 26) ముగిసింది. ఇందులో భాగంగా పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. హార్దిక్ ఫ్రాంచైజీ మార్పు ఇందులో ప్రధానమైన అంశం. గుజరాత్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను రిటైన్ చేసుకున్నట్లే చేసుకుని, ట్రేడింగ్ అంటూ అతన్ని ముంబై ఇండియన్స్కి వదిలేసింది. ఈ అనూహ్య పరిణామం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. హార్ధిక్ ముంబై ఇండియన్స్కు వచ్చేస్తున్నాడని కొద్దిరోజుల ముందు నుంచే ప్రచారం జరిగినప్పటికీ ఆఖర్లో ప్రాంచైజీకి చెందిన ఓ కీలక వ్యక్తి ఇందుకు నో చెప్పాడని టాక్ వినిపిస్తుంది. అందుకే గుజరాత్ హార్దిక్ను రిటైన్ చేసుకుందని, ఈ లోపే ముంబై యాజమాన్యం జోక్యం చేసుకుని హార్దిక్ను సొంతగూటికి చేరేలా చేసిందని ప్రచారం జరుగుతుంది. అసలు హార్దిక్ ఫ్రాంచైజీ మారడమెందుకు..? ట్రేడింగ్ అనే టాపిక్కు ముందు అసలు హార్దిక్ ఫ్రాంచైజీ మారేందుకు ఎందుకు పచ్చ జెండా ఊపాడనే విషయం చర్చయనీయాంశంగా మారింది. టైటాన్స్ను అరంగేట్రం ఎడిషన్లోనే ఛాంపియన్గా, రెండో దఫా రన్నరప్గా నిలబెట్టిన హార్దిక్.. అంతా సాఫీగా సాగుతుండగా ఇంతటి కఠినమైన నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నాడన్న విషయం అభిమానులకు అంతుపట్టడం లేదు. సోషల్మీడియాలో నడుస్తున్న ప్రచారం ప్రకారం హార్దిక్కు-టైటాన్స్ మేనేజ్మెంట్కు రెమ్యూనరేషన్ విషయంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తుంది. ఈ విషయమే హార్దిక్ ఫ్రాంచైజీ మార్పుకు ప్రధాన కారణమని సమాచారం. Once in a while life would give you an opportunity to choose between money and legacy. Whatever you choose will define you for the rest of your life. — Aakash Chopra (@cricketaakash) November 27, 2023 ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. హార్దిక్ రెమ్యూనరేషన్ కోసం ఫ్రాంచైజీ మారాడని పరోక్షంగా ఆరోపిస్తూ ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక్కోసారి జీవితంలో డబ్బు, విలువల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మీరు ఎంచుకున్నదే మీ జీవితాంతం మిమ్మల్ని నిర్వచిస్తూ ఉంటుందని హార్దిక్ను ఉద్దేశిస్తూ వివాదాస్పద ట్వీట్ చేశాడు. ఇలాంటి నిరాధారమైన ప్రచారాలను పక్కన పెడితే అసలు హార్దిక్ ఫ్రాంచైజీ ఎందుకు మారాడన్న విషయం ప్రస్తుతం క్రికెట్ అభిమానులకు చర్చనీయాంశంగా మారింది. -
వచ్చే ఆరునెలలూ కేవలం టీ20లే ఆడించండి: టీమిండియా మాజీ ఓపెనర్
Ind Vs Aus 1st T20- Suryakumar Yadav: టీమిండియా తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టడంలో ‘స్కై’కి ఎవరూ సాటిరారని పేర్కొన్నాడు. ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ ధాటికి ప్రత్యర్థి జట్టు తమ ప్రణాళికలను అప్పటికప్పుడు మార్చుకోవాల్సి వస్తుందంటూ ఆకాశానికెత్తాడు. తొలిసారి టీమిండియా కెప్టెన్గా కాగా రోహిత్ శర్మ గైర్హాజరీ, హార్దిక్ పాండ్యా గాయపడిన నేపథ్యంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు సూర్య టీమిండియా కెప్టెన్గా ఎంపికయ్యాడు. తొలిసారిగా భారత జట్టు పగ్గాలు చేపట్టిన ఈ ముంబై బ్యాటర్ గురువారం నాటి తొలి మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వైజాగ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి.. 208 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే షాకులు తగిలాయి. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే రనౌట్ కాగా.. మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 21 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆదిలోనే జట్టు ఇలా కష్టాల్లో కూరుకుపోయిన వేళ వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 58 పరుగులతో అదరగొట్టగా... నాలుగో స్థానంలో దిగిన సూర్య ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. నో బాల్తో విజయం ఖరారు మొత్తంగా 42 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 190కి పైగా స్ట్రైక్రేటుతో 80 పరుగులు సాధించాడు. ఇక రింకూ సింగ్ ఆఖరి బంతికి షాట్ బాది(నో బాల్ వల్ల.. ఆ సిక్సర్ కౌంట్ కాలేదు) టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. సూర్య వచ్చాడంటే వ్యూహాలు మార్చాల్సిందే ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్.. ప్రత్యర్థి జట్టు బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టేలా ఉంటుంది. నార్మల్ బాల్ వేస్తే కచ్చితంగా షాట్ బాదుతాడు. మిడిలార్డర్లో తను బ్యాటింగ్కు వస్తున్నాడంటే ప్రత్యర్థి ఫీల్డింగ్ మార్పులు చేసుకోవాల్సిందే. డీప్ ఫైన్ లెగ్.. మిడాన్ దిశగా థర్డ్మ్యాన్ను పెట్టాలి. సూర్య క్రీజులోకి వచ్చాడంటే తనకు తగ్గట్లు అప్పోజిషన్ టీమ్ అప్పటికప్పుడు తమ వ్యూహాలు మారుస్తూ పోవాలి. ఈ విషయంలో మిగతా బ్యాటర్లతో పోలిస్తే సూర్య మరింత ప్రత్యేకం’’ అని సూర్య ఆట తీరును ప్రశంసించాడు. వచ్చే ఆరునెలలు కేవలం టీ20లే ఆడించండి ఇక అంతకు ముందు జియో సినిమా షోలో తన అభిప్రాయాలు పంచుకున్న ఆకాశ్ చోప్రా.. ప్రతి ఆటగాడిని మూడు ఫార్మాట్లు ఆడేలా ఒత్తిడి పెట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. సూర్యుకుమార్ వంటి విధ్వంసకర ఆటగాళ్లను వారికి ప్రావీణ్యం ఉన్న ఫార్మాట్లకు పరిమితం చేయడం ద్వారా ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డాడు. టెస్టు, వన్డే, టీ20లలంటూ అటూ ఇటూ తిప్పకుండా.. సూర్యను వచ్చే ఆర్నెళ్ల పాటు పొట్టి ఫార్మాట్లోనే వీలైనంత ఎక్కువగా ఆడించాలని ఆకాశ్ చోప్రా మేనేజ్మెంట్కు సూచించాడు. టీ20 స్పెషలిస్టుగా తన సేవలను విరివిగా వినియోగించుకుంటూ అతడి నైపుణ్యాలు మరింత మెరుగుపడేలా తీర్చిదిద్దాలని సలహా ఇచ్చాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక విమర్శల పాలైన సూర్య.. తనకు అచ్చొచ్చిన టీ20 ఫార్మాట్లో తిరిగి బ్యాట్ పట్టగానే సునామీ ఇన్నింగ్స్ ఆడటం విశేషం. చదవండి: రోహిత్ అలా.. కోహ్లి ఇలా.. ఎవరు మాత్రం టెంప్ట్ కాకుండా ఉంటారు?: ఆశిష్ నెహ్రా Captain Suryakumar Yadav's first match as #TeamIndia Captain presented an additional challenge 😉 How well does SKY remember his match-winning knock? 🤔 WATCH 🎥#TeamIndia | #INDvAUS pic.twitter.com/X9fLNQEqjw — BCCI (@BCCI) November 24, 2023 -
అశ్విన్ను ఆడించి తప్పు చేయకండి! సిరాజ్ కూడా వద్దు.. ఎందుకంటే?
ICC WC 2023- Ind Vs Eng: ఇంగ్లండ్తో మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్ను ఆడించి తప్పుచేయొద్దని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా టీమిండియా మేనేజ్మెంట్కు సూచించాడు. లక్నో పిచ్ను పొరపాటుగా అంచనా వేసి మూల్యం చెల్లించే పరిస్థితి తెచ్చుకోకూడదని విజ్జప్తి చేశాడు. సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023లో రోహిత్ సేన వరుస విజయాలు సాధిస్తున్న విషయం తెలిసిందే. లీగ్ దశలో ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్లలో ఐదూ గెలిచి అజేయంగా నిలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఈ క్రమంలో సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించిన ఇంగ్లండ్తో ఆదివారం పోటీపడనుంది. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) లక్నోలోని భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి ఏక్నా క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత జట్టు కూర్పు.. ముఖ్యంగా అదనపు స్పిన్నర్ను ఆడించాలా లేదా అన్న అంశంపై మాజీ బ్యాటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆఫ్ స్పిన్నర్ను ఆడించాలన్న నిర్ణయం సరైందే.. కానీ ‘‘ఇంగ్లండ్ వంటి జట్టుతో ఆడుతున్నపుడు.. ఆఫ్ స్పిన్నర్ను ఆడించాలనుకోవడం సరైన నిర్ణయమే. లక్నో వంటి పెద్ద మైదానం.. కాబట్టి ఆఫ్ స్పిన్నర్ను ఆడించాలనే అభిప్రాయాలు ఉండటమూ సహజమే. ఐపీఎల్లో ఇక్కడ బంతి టర్న్ అయింది కాబట్టి ఆఫ్ స్పిన్నర్ను ఆడిస్తే బాగుంటుందనుకోవడం మాత్రం సబబు కాదు. ఎందుకంటే ఈసారి ఐపీఎల్ మాదిరి వికెట్ ఉండబోదు. అపుడు నల్లరేగడి మట్టితో పిచ్ రూపొందించారు. ఇది ఎర్రమట్టి పిచ్.. కాబట్టి కానీ ఇప్పుడు ఇది ఎర్రమట్టితో చేసిన పిచ్. దీని మీద బంతి బౌన్స్ అవుతుంది. పేస్ రాబట్టవచ్చు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పరిస్థితి మరింత మారిపోతుంది. ఒకవేళ మనం ముగ్గురు స్పిన్నర్ల సెకండ్ ఫీల్డింగ్ చేయాల్సి వస్తే.. మనకు తెలియకుండానే ప్రత్యర్థికి మంచి చేసిన వాళ్లం అవుతాం. లేదు కచ్చితంగా ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలని భావిస్తే.. అశ్విన్ జట్టులోకి వస్తాడు. అలాంటపుడు పేసర్లు సిరాజ్.. షమీలలో ఒకరిని ఎంచుకోవాల్సి వస్తే నా ఓటు మాత్రం షమీకే. గత మ్యాచ్లో సిరాజ్ బాగానే బౌలింగ్ చేశాడు. సిరాజ్ వద్దు.. ఎందుకంటే అయితే, షమీ ఐదు వికెట్ల హాల్తో అద్భుత ఫామ్లో ఉన్నాడు. ఫామ్ దృష్ట్యా సిరాజ్ కంటే ముందున్న షమీని తుదిజట్టులోకి తీసుకోవాలి’’ అని కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా టీమిండియా చివరగా తలపడిన న్యూజిలాండ్తో మ్యాచ్లో మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ధర్మశాలలో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా ప్రపంచకప్-2023లో షమీకి ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ తుది జట్ల అంచనా టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్ ), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్/ రవిచంద్రన్ అశ్విన్. ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్ ), బెయిర్స్టో, మలాన్, రూట్, స్టోక్స్, బ్రూక్, లివింగ్స్టోన్, వోక్స్, విల్లీ, అట్కిన్సన్, రషీద్. చదవండి: హార్దిక్ వచ్చేంత వరకు అతడే.. ఇంగ్లండ్ డేంజరస్ టీమ్! కాబట్టి మేము.. WC 2023: దెబ్బ మీద దెబ్బ.. పాకిస్తాన్కు భారీ షాకిచ్చిన ఐసీసీ View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
అంతా తెలిసే చేశావంటే నిన్నేమనుకోవాలి? అతడి రాతే అంత.. ఎప్పుడూ ఇలాగే!
ICC WC 2023- South Africa Beat Pakistan By 1 Wicket: ‘‘మ్యాచ్ సాగుతూ.. ఉంది. ఎనిమిది వికెట్లు పడ్డాయి.. ఆ తర్వాత తొమ్మిదో వికెట్ కూడా తీశారు. అయినా.. గెలుపు కోసం అంతలా తంటాలు.. అసలు ఇదేం కెప్టెన్సీ? అసలు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమైందా? టెయిలెండర్లకు సింగిల్స్ తీసే అవకాశం ఇచ్చావు. నీ ఆలోచన ఏంటో అర్థం కాలేదు. ఇందుకు మీరు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని అందరికీ అర్థమైపోయింది. ఇంకా ఓవర్లు మిగిలే ఉన్నాయి కదా.. ప్రధాన బౌలర్ల కోటా పూర్తయ్యేటప్పటికే మ్యాచ్ ముగించాల్సింది. ఆఖర్లో మీకు మిగిలిన ఆప్షన్లు స్పిన్ బౌలర్లు మాత్రమే. ఇదంతా తెలిసి కూడా లోయర్ ఆర్డర్ బ్యాటర్లను సింగిల్స్కు అనుమతించేలా ఫీల్డింగ్ సెట్ చేశావంటే నిన్ను ఏమనుకోవాలి? నువ్వింకా ఏ లోకంలో ఉన్నావు బాబర్? నలుగురైదుగురు సర్కిల్ లోపల.. మిగిలిన వాళ్లు బౌండరీ వద్ద.. ఇలా ఫీల్డ్ సెట్ చేసి నువ్వేం సాధించావు? ఒకవేళ సౌతాఫ్రికా ఆటగాళ్లను చివరి ఓవర్ వరకు తీసుకొచ్చి మ్యాచ్ను కాపాడుకుందామని భావించావా? నువ్వింకా ఏ లోకంలో ఉన్నావు బాబర్? నీ కెప్టెన్సీ నాకైతే అంతుపట్టలేదు. ప్రధాన బౌలర్లు బరిలోకి దిగినపుడు స్లిప్ పెట్టాలి.. సర్కిల్ లోపల ఎక్స్ట్రా ఫీల్డర్లను సెట్ చేయాలి అని తెలియదా?’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం కెప్టెన్సీపై మండిపడ్డాడు. చెత్త కెప్టెన్సీ సౌతాఫ్రికాతో మ్యాచ్లో సారథిగా బాబర్ పూర్తిగా విఫలమయ్యాడంటూ విమర్శలు గుప్పించాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో చేజేతులా ఓటమిని ఆహ్వానించావంటూ బాబర్ తీరును తప్పుబట్టాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్తాన్ చేతులెత్తేసిన విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ మైదానంలో తీవ్ర ఉత్కంఠ రేపిన మ్యాచ్లో పాక్పై సౌతాఫ్రికా ఒక్క వికెట్ తేడాతో గట్టెక్కి టేబుల్ టాపర్గా నిలిచింది. మరోవైపు.. బాబర్ ఆజం బృందం సెమీ ఫైనల్ అవకాశాలు పూర్తి సంక్లిష్టంగా మారాయి. నీ వల్లే ఓటమి! ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. సౌతాఫ్రికా- పాకిస్తాన్ మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. హైడ్రామా నెలకొన్న మ్యాచ్లో టెయిలెండర్లను కూడా కట్టడి చేయలేక చతికలపడ్డ పాకిస్తాన్ ఓటమికి బాబర్ కెప్టెన్సీనే ప్రధాన కారణమని పరోక్షంగా అభిప్రాయపడ్డాడు. అతడి రాతే అంత ఈ సందర్భంగా పాకిస్తాన్ స్పిన్ ఆల్రౌండర్ మహ్మద్ నవాజ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నవాజ్ రాతే అంత. దుబాయ్ గ్రౌండ్లో హార్దిక్ పాండ్యా.. మెల్బోర్న్లో రవిచంద్రన్ అశ్విన్.. ఇప్పుడు ఇక్కడ చెన్నై గ్రౌండ్లో కేశవ్ మహరాజ్.. అతడి బౌలింగ్లో అద్భుతం చేశారు. పాపం ప్రతిసారి నవాజ్ ఎందుకో ఇలా కఠిన పరిస్థితుల్లో చిక్కుకుపోతాడు’’ అంటూ ఆకాశ్ చోప్రా సానుభూతి వ్యక్తం చేశాడు. కాగా సౌతాఫ్రికా విజయలక్ష్యానికి ఐదు పరుగుల దూరంలో ఉన్న సమయంలో ఉసామా మిర్, మహ్మద్ నవాజ్లలో ఒకరిని బరిలోకి దింపాల్సి రాగా బాబర్ ఆజం నవాజ్ వైపు మొగ్గు చూపాడు. ఊహించని షాకిచ్చిన కేశవ్ మహరాజ్ అప్పటికి పేసర్ల కోటా పూర్తవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడు. అయితే, 48 ఓవర్లో నవాజ్ బౌలింగ్లో మొదటి బంతికి తబ్రేజ్ షంసీ సింగిల్ తీసి కేశవ్ మహరాజ్కు స్ట్రైక్ ఇచ్చాడు. అంతే.. రెండో బంతిని ఫోర్గా మలిచిన కేశవ్ ఊహించని రీతిలో సౌతాఫ్రికాను గెలుపుతీరాలకు చేర్చాడు. పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. నవాజ్ మరోసారి బలిపశువు అయ్యాడు. చదవండి: ఓవరాక్షన్ రిజ్వాన్.. అతడి గుండె పగిలింది! మేము ‘చోకర్స్’ కాదు.. అర్థమైందా? View this post on Instagram A post shared by ICC (@icc) -
Ind vs Pak: ఎదుటి వాళ్లను అన్నపుడు నవ్వి.. మనల్ని అంటే ఏడ్చి గగ్గోలు పెట్టడం ఎందుకు?
ICC WC 2023- Ind vs Pak: ఆటను ఆటలాగే చూడాలి.. న్యాయం ఒక్కొక్కళ్లకు ఒక్కో విధంగా ఉండదు.. ఎదుటివాళ్లపై నిందలు వేసే ముందు.. మనం ఎలాంటి వాళ్లమో! మన వల్ల ఎదుటివాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి! అంతేతప్ప... అవతలి వాళ్లను అన్నపుడు నవ్వుకొని.. మనల్ని అంటే ఏడ్చి గగ్గోలు పెట్టడంలో అర్థం ఉండదు.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు డైరెక్టర్ మిక్కీ ఆర్థర్ను ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఇంచుమించు ఇదే రీతిలో కౌంటర్ ఇచ్చాడు. వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా చరిత్రను పునరావృతం చేస్తూ టీమిండియా పాక్పై అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా.. జరిగిన దాయాదుల సమరంలో రోహిత్ సేన సమిష్టి ప్రదర్శనతో బాబం ఆజం బృందాన్ని 7 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. అతడు కాస్త భిన్నం నీలి వర్ణంతో నిండిపోయిన స్టేడియంలో చిరకాల ప్రత్యర్థిపై మరోసారి ఆధిపత్యాన్ని చాటుకుని అభిమానులకు సంతోషం పంచింది. ఇదిలా ఉంటే.. పాక్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ మిగతా ఆటగాళ్లకు కాస్త భిన్నంగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. దీంతో అతడిని ఉద్దేశించి కొంతమంది టీమిండియా ఫ్యాన్స్.. రిజ్వాన్ రీతిలోనే అతడికి కౌంటర్లు ఇచ్చారు. పెవిలియన్కు వెళ్తున్న క్రమంలో రిజ్వాన్ను ట్రోల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్కాగా భారత జట్టు అభిమానులపై కొంతమంది తీవ్రస్థాయిలో విమర్శలకు దిగారు. భారత్- పాక్ మ్యాచ్ అంటే వినోదం మాత్రమే కాదు ఇందుకు బదులుగా.. భారత్- పాక్ మ్యాచ్ అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. భావోద్వేగాల సమాహారం.. కాబట్టి పరస్పరం కౌంటర్లు విసురుకోవడం సహజమే అని మరికొందరు దీనిని చిన్న విషయంగా కొట్టిపారేశారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందంటూ షమీని పాక్ ఫ్యాన్స్ ట్రోల్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వాళ్ల వల్లే ఓడిపోయాం.. అది కూడా ఓ కారణమే అభిమానుల సంగతి ఇలా ఉంటే.. పాక్ టీమ్ డైరెక్టర్ మిక్కీ ఆర్థర్ మాత్రం భారత క్రికెట్ నియంత్రణ మండలిపై బురదజల్లే ప్రయత్నం చేశాడు. సొంతగడ్డపై ఏ జట్టుకైనా ప్రేక్షకుల మద్దతు బలంగా ఉంటుందనే విషయాన్ని మర్చిపోయి.. ఇది ఐసీసీ ఈవెంట్లా కాదు బీసీసీఐ ఈవెంట్లా అనిపిస్తోందని విమర్శించాడు. ఇండియా- పాక్ మ్యాచ్ సందర్భంగా తాను ఒక్కసారి కూడా దిల్ దిల్ పాకిస్తాన్ అనే మ్యూజిక్ వినలేదని చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ ఓటమికి ఒక విధంగా టీమిండియాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన మద్దతే కారణమని చెప్పడానికి ఏమాత్రం సందేహించలేదు. పాక్ ఆటగాళ్లు స్పందించనే లేదు ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.. టీమిండియా అభిమానులను ట్రోల్ చేస్తున్నవాళ్లు, మిక్కీ ఆర్థర్కు తనదైన శైలిలో బదులిచ్చాడు. ‘‘మిక్కీ ఆర్థర్ తప్ప పాకిస్తాన్ ఆటగాళ్లెవరూ స్పందించలేదు. అయినా, కేవలం ఒక్క ఆటగాడి(రిజ్వాన్) విషయంలోనే ఇలా ఎందుకు జరిగిందని అతడు ఆలోచించలేకపోయాడా? మిగతా వాళ్లు చక్కగా తమ పని తాము చేసుకుని వెళ్లిపోయారు కదా! కొంతమంది 20-30 సెకన్ల వీడియోను ఆధారంగా చూపి కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. భారత్ ప్రజలు ప్రతి ఒక్కరిని ప్రేమగా చూస్తారు. ఎదుటి వ్యక్తిని ప్రేమించే గుణం ఉన్న వాళ్లు. శ్రీలంక విషయంలో ఎందుకిలా? సోషల్ మీడియాలో చూసేదంతా నిజం కాదు.. సగం సగం వీడియోలతో అసలు నిజాన్ని దాచేసే ప్రయత్నాలు జరుగుతాయి. దిల్ దిల్ పాకిస్తాన్ అనే మ్యూజిక్ వినిపించనేలేదని మిక్కీ ఆర్థర్ అంటున్నాడు. కొంతమందేమో ప్రేక్షకులు ఇరు జట్లకు మద్దతుగా నిలవాలని సూక్తులు చెబుతున్నారు. మరి శ్రీలంక విషయంలో ఎందుకలా మాట్లాడలేదు? హైదరాబాద్లో జరిగిన దానికి లంక జట్టు కూడా పాక్లాగ ఫిర్యాదులు చేయవచ్చు కదా! హైదరాబాద్లో జీతేగా భాయ్ జీతేగా అని డీజే పెట్టినపుడు.. ప్రేక్షకులంతా పాకిస్తాన్ జీతేగా అని పాక్ టీమ్కు మద్దతు పలికారు. శ్రీలంకకు అసలు సపోర్టు లేదు. అఫ్గనిస్తాన్కు ఢిల్లీ ప్రేక్షకుల మద్దతు అదే విధంగా ఢిల్లీలో ఇంగ్లండ్- అఫ్గనిస్తాన్ మధ్య మ్యాచ్ సందర్భంగా చాలా మంది అఫ్గనిస్తాన్కు మద్దతుగా నిలిచారు. మరి అఫ్గన్ జలేబి గురించి ఇంగ్లండ్ కంప్లైట్ చేయొచ్చా’’ అంటూ తన యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలను సమర్థించుకున్నాడు. కొంతమంది చర్యను మొత్తంగా భారత జట్టు అభిమానులకు ఆపాదించడం సరికాదని హితవు పలికాడు. ఈ నేపథ్యంలో నెటిజన్లు.. ‘నిజం చెప్పారు.. టీమిండియా వరకు వచ్చే సరికే ప్రతి ఒక్కరు వేలెత్తి చూపిస్తారు ఎందుకో? అందరిని సమానంగా చూడాలన్న వారు అందరి పట్ల ఒకే రీతిలో ఆలోచించాలి’’ అని ఆకాశ్ చోప్రాకు మద్దతు పలుకుతున్నారు. మరికొందరేమో ఇలాంటి సున్నిత అంశాల పట్ల ప్రతి ఒక్కరు సంయమనం పాటించాలని కోరుతున్నారు. చదవండి: Ind vs Pak: మా ఓటమికి కారణం అదే.. అతడు అద్భుతం: బాబర్ ఆజం View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: ఆసీస్తో మ్యాచ్కు గిల్ దూరం.. రోహిత్కు జోడీగా ఇషాన్ ఫిక్స్!
ICC Cricket World Cup 2023- Ind Vs Aus: వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా ఆరంభ మ్యాచ్కు శుబ్మన్ గిల్ అందుబాటులో ఉండే అవకాశం లేదని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ మాటలను బట్టి ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇప్పటికే జట్టుకు దూరమయ్యాడని అర్ధం చేసుకోవచ్చన్నాడు. కాగా సొంతగడ్డపై పుష్కరకాలం తర్వాత భారత జట్టు ఐసీసీ ఈవెంట్కు సిద్ధమైన విషయం తెలిసిందే. చెన్నై వేదికగా అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో మ్యాచ్తో వరల్డ్కప్ జర్నీ మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్ డెంగ్యూ బారిన పడటం ఆందోళనకరంగా మారింది. రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే! ఆసీస్తో మ్యాచ్ నాటికి అతడు కోలుకుంటాడో లేదోనన్న సందేహాల నడుమ రాహుల్ ద్రవిడ్ శుక్రవారం అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. వైద్యబృందం పర్యవేక్షణలో ఉన్న గిల్ ఇప్పుడే జట్టుకు దూరమయ్యాడని చెప్పలేమని పేర్కొన్నాడు. ఈ విషయంపై స్పందించిన కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. ‘‘శుబ్మన్ గిల్ ఆరోగ్యం ప్రస్తుతం బాగాలేదు. ప్రెస్కాన్ఫరెన్స్లో రాహుల్ ద్రవిడ్ మాత్రం.. గిల్ పరిస్థితి మరీ అంత అధ్వానంగా లేదని.. అతడు జట్టుతో చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పాడు. రోహిత్కు జోడీగా ఇషాన్ ఫిక్స్ నిజానికి రాహుల్ ద్రవిడ్ ఎప్పుడైతే ఇలా చెప్తాడో.. అలాంటి సందర్భాల్లో సదరు ఆటగాళ్లు దూరమవడం దాదాపు ఖాయమైపోయినట్లే లెక్క! నాకు తెలిసి రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు’’ అని అభిప్రాయపడ్డాడు. చేదువార్తే కదా! ఏదేమైనా రోహిత్తో కలిసి అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పగల గిల్ దూరం కావడం భారత జట్టుకు బ్యాడ్ న్యూసే అవుతుందని ఈ మాజీ ఓపెనర్ విచారం వ్యక్తం చేశాడు. వరల్డ్కప్ వంటి మెగా ఈవెంట్లో అటాకింగ్ మోడ్లో ఉన్న గిల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తే ఆది నుంచే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టే అవకాశం ఉండేదని ఆకాశ్ పేర్కొన్నాడు. కాగా ప్రపంచకప్నకు ముందు ఆసీస్తో వన్డే సిరీస్లో శుబ్ మన్ గిల్ వరుసగా 74, 104 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. చదవండి: అతడు అద్భుతం.. కాస్త ఏమరపాటుగా ఉన్నా అంతే! నాకు అనుభవం: ఏబీడీ -
టెస్టుల్లో స్టోక్స్ కంటే బెస్ట్.. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్రౌండర్! కానీ..
Ben Stokes- Ravindra Jadeja: ‘‘రవీంద జడేజా అద్భుతంగా ఆడుతున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్ దిగుతాడు. అంతేనా.. 10 ఓవర్ల పాటు(వన్డేలో) బౌలింగ్ చేయడం కూడా గ్యారెంటీ. ఇక టెస్టుల్లో కేవలం టీమిండియా తరఫున మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తంలో ప్రస్తుతం అతడే అత్యుత్తమ ఆల్రౌండర్.. బెన్ స్టోక్స్ కంటే కూడా జడేజా బెస్ట్. ఎందుకంటే స్టోక్స్ ఎక్కువగా బౌలింగ్ చేయలేడు. ఒంటిచేత్తో మ్యాచ్లు గెలిపించగల సత్తా జడేజాకు సొంతం. కానీ రావాల్సినంత గుర్తింపు రాలేదు కానీ అనుకున్నంత స్థాయిలో అతడికి రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఏదేమైనా టెస్టుల్లో జడేజా బెస్ట్ ఆల్రౌండర్ అని కచ్చితంగా చెప్పగలను’’ అంటూ టీమిండియా మాజీ బ్యాటర్ ఆకాశ్ చోప్రా.. ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై ప్రశంసలు కురిపించాడు. టెస్టుల్లో ఇద్దరూ.. కాగా ప్రస్తుతం టీమిండియా స్టార్ జడేజా, ఇంగ్లండ్ టెస్టు జట్టు సారథి బెన్ స్టోక్స్.. ఇద్దరూ టెస్టుల్లో అత్యుత్తమ ఆల్రౌండర్లుగా కొనసాగుతున్నారు. ఐసీసీ ర్యాంకింగ్స్లో జడ్డూ గత కొంతకాలంగా నంబర్ 1లో కొనసాగుతుండగా.. స్టోక్స్ నాలుగో స్థానంలో ఉన్నాడు. జడ్డూ, స్టోక్స్ గణాంకాలు ఇలా ఇక ఇప్పటి వరకు 67 అంతర్జాతీయ టెస్టులాడిన జడేజా.. 2804 పరుగులు చేయడంతో పాటు.. 275 వికెట్లు పడగొట్టాడు. స్టోక్స్ 97 టెస్టుల్లో 6117 పరుగులు సాధించడంతో పాటు 197 వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరిలో బెస్ట్ ఎవరంటే తాను జడ్డూ వైపే మొగ్గు చూపుతానని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఇందుకు గల కారణాలు విశ్లేషిస్తూ పైవిధంగా స్పందించాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2021-23 సైకిల్లో జడ్డూ 13 టెస్టుల్లో 47 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు 5- వికెట్ హాల్స్ ఉన్నాయి. ఇక లెఫ్టార్మ్ స్పిన్నర్ అత్యుత్తమ గణాంకాలు 7/42. అదే విధంగా.. రెండు సెంచరీలు.. మూడు ఫిఫ్టీలతో 721 పరుగులు రాబట్టాడు. వన్డేల్లో రీఎంట్రీ.. రికార్డు సృష్టించి ఇక స్టోక్స్ విషయానికొస్తే.. ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 18 మ్యాచ్లలో.. రెండు శతకాలు, నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో 971 పరుగులు సాధించాడు. అదే విధంగా 30 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడీ రైట్ ఆర్మ్ పేసర్. కాగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు స్టోక్స్ వన్డేల్లో తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు. న్యూజిలాండ్తో సిరీస్లో ఎంట్రీ ఇచ్చిన అతడు.. మూడో వన్డేలో ఏకంగా 182 పరుగులతో చెలరేగి ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించిన బ్యాటర్గా నిలిచాడు. మరోవైపు.. జడ్డూ ఆసియా వన్డే కప్-2023 ఆడాడు. వీరిద్దరు భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో ఎలా ఆడాతారో చూడాలిక! చదవండి: Ind vs Aus: కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా? కెప్టెన్ కావాల్సినోడు.. -
Ind vs Aus: కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా? కెప్టెన్ కావాల్సినోడు..
Asian Games 2023: చైనాలో జరుగనున్న ఆసియా క్రీడలు-2023కి ఈసారి భారత క్రికెట్ నియంత్రణ మండలి మహిళా, పురుష జట్లను పంపుతున్న విషయం విదితమే. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో వుమెన్స్ టీమ్.. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో ద్వితీయ శ్రేణి జట్టు హోంగ్జూకు వెళ్లనున్నాయి. అయితే, అంతకంటే ముందు స్వదేశంలో సెప్టెంబరు 22న ఆరంభం కానున్న ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో రుతురాజ్ ఆడేందుకు రంగం సిద్ధమైంది. ఆసీస్తో తొలి మ్యాచ్లో అతడు తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. రెంటికీ చెడ్డ రేవడి ఇదిలా ఉంటే.. ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టులో తిలక్ వర్మ, రింకూ సింగ్ సహా పలువురు యువ స్టార్లు చోటు దక్కించుకున్నారు. మరోవైపు.. కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. సంజూ శాంసన్ ఆసియా కప్లో అలా.. వరల్డ్కప్జట్టులో ఇలా కేఎల్ రాహుల్ ఆగమనంతో ఆసియా కప్-2023లో వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్తో పోటీలో ఓడిన సంజూ.. రిజర్వ్ ప్లేయర్గా ఎంపికయ్యాడు. ఇక బ్యాటర్గా సూర్యకుమార్ యాదవ్ కంటే మెరుగైన స్థితిలోనే ఉన్నా ఈ వన్డే ఈవెంట్లో అతడిని దురదృష్టం వెక్కిరించింది. కెప్టెన్ కావాల్సినోడు.. మరీ ఇంత అన్యాయమా? ప్రపంచకప్-2023 జట్టులోనూ సూర్య వైపే మొగ్గు చూపిన సెలక్టర్లు సంజూను పక్కనపెట్టేశారు. ఆస్ట్రేలియాతో సిరీస్లోనూ అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీరును తప్పుబట్టాడు. ‘‘ఆసియా క్రీడల జట్టులో సంజూ శాంసన్ పేరు లేకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఆసియా కప్లో రిజర్వ్గా ఉన్నాడు.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో చోటు దక్కలేదు. ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసే అవకాశం లేదు. రుతురాజ్ గైక్వాడ్తో కలిసి శుబ్మన్ గిల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. ఇషాన్కు వరుస అవకాశాలు ఇషాన్ మిడిలార్డర్లో నిలదొక్కుకునేందుకు ఇప్పటికే మేనేజ్మెంట్ కావాల్సినన్ని అవకాశాలు ఇచ్చింది. సంజూ శాంసన్ ఆసియా క్రీడల జట్టులో ఉంటేనైనా బాగుండేది. వరల్డ్కప్ టీమ్లో ఎలాగూ చోటివ్వలేదు.. కనీసం ఆసియా క్రీడల్లో ఆడేందుకు కూడా పనికిరాడా? ఇది సరైన పద్ధతి కాదు.. ప్రపంచకప్ జట్టులో ఆఖరి నిమిషం వరకు పోటీ పడ్డ వ్యక్తి కచ్చితంగా ఈ టీమ్లోనైనా ఉండాల్సింది కదా. కేవలం సభ్యుడిగా కాదు.. నిజానికి కెప్టెన్ అవ్వాల్సింది’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. చదవండి: అంబానీ ఇంట పూజకు భార్య అతియాతో రాహుల్.. వీడియో వైరల్ -
పాక్ను ఓడించాలంటే అతడిపై వేటు పడాల్సిందే! లేదంటే..
Asia Cup 2023- Pakistan vs India: పాకిస్తాన్ను ఓడించాలంటే టీమిండియా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగక తప్పదని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. నంబర్ 8లోనూ బ్యాటింగ్ ఆప్షన్ ఉండాలని కోరుకుంటే మాత్రం దాయాదిపై గెలవడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. కాగా ఆసియా కప్-2023లో తొలి మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడిన టీమిండియా స్థాయికి తగ్గట్లు బ్యాటింగ్ చేయలేకపోయింది. పాక్ పేసర్ల ధాటికి పాక్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షా, హ్యారిస్ రవూఫ్ విజృంభణతో 266 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, భారత ఇన్నింగ్స్ తర్వాత వర్షం తెరిపినివ్వకపోవడంతో పాక్ బ్యాటింగ్ సాధ్యం కాలేదు. దీంతో మ్యాచ్ రద్దు కాగా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ నేపథ్యంలో నేపాల్పై గెలుపొందిన టీమిండియా, పాకిస్తాన్ సూపర్-4లో ఆదివారం మరోసారి పోటీపడనున్నాయి. కాగా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తాడంటూ పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ను జరిగిన రెండు మ్యాచ్లలోనూ తుదిజట్టులోకి తీసుకుంది మేనేజ్మెంట్. షమీని కాదని శార్దూల్ను తీసుకుంటే ఇందులో భాగంగా పాక్తో మ్యాచ్లో సీనియర్ పేసర్ మహ్మద్ షమీపై వేటు వేసింది. అయితే, అతడిని కాదని శార్దూల్ తీసుకున్నా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కేవలం 3 పరుగులకే అతడు అవుటయ్యాడు. షమీ- శార్దూల్ (PC: BCCI) ఇక నేపాల్తో మ్యాచ్కు జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడంతో షమీకి చోటు దక్కగా.. అతడు 7 ఓవర్ల బౌలింగ్లో 4.10 ఎకానమీతో ఒక వికెట్ తీశాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. పాకిస్తాన్తో తదుపరి మ్యాచ్లో షమీని ఆడిస్తేనే టీమిండియా అనుకున్న ఫలితం రాబట్టగలదని పేర్కొన్నాడు. పాక్ను ఓడించాలంటే అతడిపై వేటు వేయాల్సిందే ‘‘బౌలింగ్ విభాగంలో కచ్చితంగా మార్పులు చేయాలి. శార్దూల్ ఠాకూర్ స్థానంలో మహ్మద్ షమీని ఆడించాలి. గత మ్యాచ్ సాగిన తీరు బట్టే నేను ఈ మాట చెబుతున్నా. జట్టులో కనీసం ముగ్గురు నాణ్యమైన పేసర్లు ఉండాలి. అలా కాకుండా.. పాకిస్తాన్తో మ్యాచ్లో మళ్లీ బ్యాటింగ్ ఆర్డర్లో నంబర్ 8 వరకు ఆటగాళ్లు ఉండాలని కోరుకుంటే మాత్రం కష్టం. పాక్ను ఓడించాలంటే కచ్తిచంగా మంచి ఫాస్ట్బౌలర్లు జట్టులో ఉండాలి’’ అని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తుదిజట్టులో కచ్చితంగా బుమ్రా, సిరాజ్లతో పాటు షమీ కూడా ఉండాలని పేర్కొన్నాడు. రిజర్వ్ డే కాగా శ్రీలంకలోని కొలంబోలో భారత్- పాక్ తమ తదుపరి మ్యాచ్ ఆడనున్నాయి. అయితే, అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మరోసారి చిరకాల ప్రత్యర్థుల పోరుకు వర్షం అడ్డంకి మారే అవకాశం ఉన్న నేపథ్యంలో రిజర్వ్ డేను కేటాయించింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. చదవండి: Ind Vs Pak: మాకు కూడా కావాలన్న కోచ్లు! మా అంగీకారంతోనేనన్న బోర్డులు.. ఇదేం ట్విస్టు? -
మేటి బ్యాటర్లను సైతం వణికించాడు.. కానీ ఇలా: టీమిండియా మాజీ ఓపెనర్
Aakash Chopra pays tribute to Heath Streak: జింబాబ్వే క్రికెట్ దిగ్గజం, దివంగత హీత్ స్ట్రీక్పై టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. స్ట్రీక్ బౌలింగ్ చేస్తుంటే మేటి బ్యాటర్లు సైతం వణికిపోయేవారని గుర్తుచేసుకున్నాడు. జింబాబ్వేకు దొరికిన క్రికెట్ ఆణిముత్యం ఇక లేడనే నిజాన్ని జీర్ణించుకోక తప్పదంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఆల్రౌండర్ హీత్ స్ట్రీక్ మరణించాడంటూ కొన్ని రోజుల క్రితం నకిలీ వార్త చక్కర్లు కొట్టిన విషయం విదితమే. స్ట్రీక్ సహచర క్రికెటర్ ఒలంగో చేసిన ట్వీట్ గందరగోళానికి దారితీయడంతో.. తాను బతికే ఉన్నానంటూ స్వయంగా అతడు మీడియాకు వెల్లడించాడు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 49 ఏళ్ల వయసులోనే లోకాన్ని వీడాడు కానీ.. రోజుల వ్యవధిలోనే హీత్ స్ట్రీక్ తుదిశ్వాస విడిచిన విషయాన్ని అతడి భార్య బయటపెట్టడంతో మళ్లీ కన్నీటిసంద్రంలో మునిగిపోయారు. తన బౌలింగ్ నైపుణ్యాలతో దిగ్గజ బ్యాటర్లను హడలెత్తించిన ఈ రైట్ ఆర్మ్ పేసర్ క్యాన్సర్తో పోరాడి ఓడి.. 49 ఏళ్ల వయసులోనే కన్నుమూయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నిజంగానే లెజెండ్ ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా.. హీత్ స్ట్రీక్కు నివాళి అర్పిస్తూ.. ‘‘హీత్ స్ట్రీక్ ఇకలేడు. గతంలో ఓసారి ఇలాంటి వార్త నకిలీదని తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కానీ ఈసారి నిజంగానే తను లేడు. గొప్ప ఆటగాడు. ఏమాత్రం సందేహం లేకుండా.. అతడిని మనం జింబాబ్వే లెజెండ్ అని పిలవవచ్చు. ఈ మాట నేను అంటున్నది కాదు.. అతడు నిజంగానే ఓ దిగ్గజం. జింబాబ్వే క్రికెట్కు దొరికిన అత్యంత గొప్ప క్రికెటర్లతో ఒకడు. మేటి బ్యాటర్లను సైతం హడలెత్తించాడు బౌలింగ్లో తనకు తానే సాటి. హరారేలో అతడు బౌలింగ్ చేస్తున్నాడంటే హడలెత్తిపోని బ్యాటర్ ఉండరంటే అతిశయోక్తి కాదు. మేము జింబాబ్వే పర్యటనకు వెళ్లినపుడు ఇలాంటి పరిస్థితే ఉండేది. కేవలం బౌలింగ్ మాత్రమే కాదు.. హీత్ స్ట్రీక్ బ్యాటింగ్ కూడా గొప్పగా ఉండేది. అందుకే అభిమానులతో పాటు అతడి సమకాలీన క్రికెటర్లు కూడా ఆరాధ్యభావంతో చూసేవారు. కానీ ఇలా చిన్న వయసులోనే స్ట్రీక్ వెళ్లిపోవడం బాధాకరం. ఓడిపోయాడు.. మై ఫ్రెండ్ రెస్ట్ ఇన్ పీస్ క్యాన్సర్తో పోరులో అతడు ఓడిపోవడం నిజంగా దురదృష్టకరం. మై ఫ్రెండ్.. నువ్వు ఎక్కడున్నా నీ ఆత్మకు శాంతి చేకూరాలి హీత్. నీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’’ అని విచారం వ్యక్తం చేశాడు. పదమూడేళ్లపాటు దిగ్విజయంగా కాగా అంతర్జాతీయ క్రికెట్లో 1993- 2005 మధ్య పదమూడేళ్ల పాటు జింబాబ్వేకు ప్రాతినిథ్యం వహించాడు. తన కెరీర్లో మొత్తంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 254 మ్యాచ్లు ఆడిన ఈ ఆల్రౌండర్.. 89 మ్యాచ్లకు సారథిగా వ్యవహరించాడు. టీమిండియాను ఓడించి టెస్టుల్లో, వన్డేల్లో కలిపి 455 వికెట్లు కూల్చి ఈనాటికీ జింబాబ్వే తరఫున అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్గా కొనసాగుతున్నాడు. పలు మ్యాచ్లలో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన హీత్ స్ట్రీక్ 4 వేల పరుగులు చేయడం విశేషం. ఇక 2001లో స్ట్రీక్ కెప్టెన్సీలో జింబాబ్వే.. టీమిండియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించడం అప్పట్లో సంచలనంగా మారింది. కాగా సెప్టెంబరు 3న హీత్ స్ట్రీక్ కన్నుమూసిన విషయం విదితమే. చదవండి: సచిన్ కంటే ఇంజమామ్ గొప్ప.. కోహ్లి కంటే బాబర్ బెటర్.. ఏంటిది? చెత్తగా.. -
బ్యాటింగ్ ఆధారంగా బౌలర్లను సెలక్ట్ చేస్తారా.. నిజమా?: మాజీ బ్యాటర్
India World Cup 2023 squad: ‘‘అక్షర్ పటేల్- యుజీ చహల్.. ఈ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేసుకోవాలన్న విషయంలో కచ్చితంగా చర్చ జరిగి ఉంటుంది. టీమిండియాకు ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్ చేయగల ఆటగాడు కావాలి. సరే.. అలాగే అనుకుందాం.. ఈ ఆప్షన్ ఉంది కాబట్టి ఇలా చేశారు. కానీ.. నిజంగానే బ్యాటింగ్ చేయగల సమర్థత ఆధారంగానే బౌలర్లను సెలక్ట్ చేస్తారా?’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అసహనం వ్యక్తం చేశాడు. లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ను కాదని.. ఆల్రౌండర్ అన్న కారణంగా అక్షర్ పటేల్ను జట్టులోకి తీసుకోవడం ఎందుకో సబబుగా అనిపించడం లేదని పేర్కొన్నాడు. చహల్కు నో ఛాన్స్ కాగా భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి వన్డే ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి మంగళవారం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఆసియా వన్డే కప్-2023 టీమ్లో ఉన్న ప్రధాన ఆటగాళ్లందరికీ ఇందులో చోటు దక్కింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుత రికార్డు ఉన్న మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్కు మాత్రం ఈసారి కూడా సెలక్టర్లు మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించాడు. కేవలం బ్యాటింగ్ చేస్తారన్న కారణంగా బౌలర్లను జట్టులోకి తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొన్నాడు. ఇద్దరూ తుదిజట్టులో ఉండరు కదా! అదే విధంగా.. ‘‘బ్యాటింగ్లో డెప్త్ కోసం నంబర్ 8లో ఆల్రౌండర్ను తీసుకుంటామని అంటున్నారు. నిజానికి.. జట్టులోని టాప్-6 బ్యాటర్లలో కొందరు విఫలమైనా జడేజా రూపంలో సూపర్ ఫామ్లో ఉన్న ఆటగాడు అందుబాటులో ఉన్నాడు. టాప్ బ్యాటర్లంతా బాధ్యతాయుతంగా ఆడితే ఎనిమిదో నంబర్ ఆటగాడి గురించి ఆందోళనే ఉండదు కదా! ఒకేరకమైన నైపుణ్యాలు కలిగిన జడేజా, అక్షర్ తుదిజట్టులో కలిసి ఆడతారా? అంటే అదీ లేదు. లెఫ్టాండర్ బ్యాటర్ ఉన్నపుడు లెఫ్టార్మ్ ఫింగర్ స్పిన్నర్ చేతికి కెప్టెన్ బంతిని ఇవ్వడు. కాబట్టి లెఫ్టార్మ్ స్పిన్నర్లతో మిడిల్ ఓవర్లలో 20 ఓవర్లు ఎలా వేయిస్తారు? ఇలా జరగడం సాధ్యమేనా? దీనిని బట్టి అక్షర్ను బెంచ్కే పరిమితం చేస్తారనడం స్పష్టంగా అర్థమవుతోంది కదా!’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. అగార్కర్ రీజన్ ఇదీ కాగా చహల్ను ఎంపిక చేయకపోవడంపై మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం.. జడేజా, అక్షర్ ఎడంచేతి వాటం బ్యాటర్లకు సమర్థవంతంగా బౌలింగ్ చేయగలరు.. అదే విధంగా.. వీరిద్దరి బ్యాటింగ్ కూడా అవసరం కాబట్టే ఇద్దరినీ ఎంపిక చేశామని స్పష్టం చేశాడు. చదవండి: ప్రపంచకప్నకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. ఆ ముగ్గురు అవుట్! కెప్టెన్ సహా.. WC: అంతా బాగానే ఉంది.. కానీ అదొక్కటే లోటు! ఆ ఇద్దరిలో ఒక్కరికే ఛాన్స్.. -
WC 2023: తిలక్ వర్మను ఎందుకు ఎంపిక చేసినట్లు? అతడు అవసరమా?
Former Cricketer Comments On India's provisional World Cup squad Reports: టీమిండియా సెలక్టర్ల తీరుపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అసహనం వ్యక్తం చేశాడు. ఐసీసీ ఈవెంట్కు అక్కర్లేదనుకున్న వాళ్లను ఆసియా కప్-2023 టోర్నీకి ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నించాడు. హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మను కాదని సూర్యకుమార్ యాదవ్ను సెలక్ట్ చేయడం వెనుక ఉద్దేశమేమిటో అర్థం కాలేదని వాపోయాడు. యువ సంచలనం తిలక్ టీమిండియా యువ సంచలనం తిలక్.. వెస్టిండీస్ పర్యటనలో టీ20 సిరీస్లో అద్భుతంగా రాణించాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో 173 పరుగులు సాధించి టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతేకాదు.. ఒక వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు ఈ పార్ట్టైమ్ స్పిన్నర్. ఇక దేశవాళీ వన్డేల్లోనూ తిలక్ రికార్డు మెరుగ్గా ఉంది. దేశవాళీ వన్డేల్లో హిట్ ఇప్పటి వరకు 25 మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. మొత్తంగా ఐదు సెంచరీలు, 5 అర్ధ శతకాల సాయంతో 101.64తో 1236 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో ఎడమచేతి వాటం తిలక్ వర్మకు ఉన్న అదనపు అర్హతగా పేర్కొంటూ ఆసియా వన్డే కప్ టోర్నీకి అతడిని ఎంపిక చేసినట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. అయితే, ఆరంభ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడిన భారత జట్టులో తిలక్ వర్మకు చోటు దక్కలేదు. అదే విధంగా.. నేపాల్తో సోమవారం నాటి మ్యాచ్లోనూ ఆడించే పరిస్థితి కనబడటం లేదు. మరోవైపు.. వరల్డ్కప్-2023కి ఇదే ప్రొవిజినల్ జట్టు అన్న బీసీసీఐ.. 15 మంది సభ్యుల టీమ్ నుంచి తిలక్ వర్మతో పాటు యువ పేసర్ ప్రసిద్ కృష్ణను తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్తో తిలక్ వర్మ సూర్యకుమార్ వన్డే జట్టులో అవసరమా? ఈ విషయంపై స్పందించిన ఆకాశ్ చోప్రా.. ‘‘సూర్యకుమార్ ఆటంటే నాకూ ఇష్టమే. కానీ అతడిని వన్డే ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయడం వెనుక ఉద్దేశం ఏమిటో తెలియడం లేదు. ఒకవేళ పార్ట్టైమ్ స్పిన్నర్లు కావాలనుకుంటే.. అతడు బౌలింగ్ చేయలేడు కదా! తిలక్ను ఎందుకు సెలక్ట్ చేశారు? వన్డేల్లో అతడి రికార్డు కూడా ఏమాత్రం బాగోలేదు. ఆసియా కప్ జట్టులో తిలక్ వర్మకు చోటిచ్చారు. అసలు అప్పుడు అతడిని ఎందుకు సెలక్ట్ చేశారు? పాకిస్తాన్తో మ్యాచ్లో ఆడించలేదు. నేపాల్తో ఆడే జట్టులోనూ అతడికి చోటు దక్కకపోవచ్చు. తిలక్కు వన్డే ప్రపంచకప్ ప్రొవిజినల్ జట్టులో స్థానం ఇవ్వనపుడు ఆసియా కప్కు ఎంపిక చేసి ఉపయోగం ఏమిటి?’’ అని అసహనం వ్యక్తం చేశాడు. సొంతగడ్డపై టీమిండియా.. అదే విధంగా.. శార్దూల్ ఠాకూర్ను నంబర్ 8 బ్యాటర్గా దింపే క్రమంలో ప్రసిద్ కృష్ణకు కూడా ఉద్వాసన పలికి ఉంటారని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ఐసీసీ టోర్నీ ఆరంభం కానుంది. పుష్కరకాలం తర్వాత సొంతగడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్కప్ ఈవెంట్లో ఆతిథ్య టీమిండియా హాట్ ఫేవరెట్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆసియా వన్డే కప్-2023కి భారత జట్టు: రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ. స్టాండ్ బై: సంజూ శాంసన్. చదవండి: ఆసియాకప్ మ్యాచ్లపై నీలినీడలు.. ఇది నాకు ముందే తెలుసు! -
అదే గనుక జరిగితే అఫ్గనిస్తాన్ను ఎవరూ ఆపలేరు! ప్రత్యర్థికి చుక్కలే!
Asia Cup 2023: అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టుకు స్పిన్నర్లే ప్రధాన బలమని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఒకవేళ స్పిన్కు అనుకూలించే పిచ్లు గనుక వారికి లభిస్తే ప్రత్యర్థి జట్లకు కష్టాలు తప్పవని హెచ్చరించాడు. పాకిస్తాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఆసియా కప్-2023 బుధవారం(ఆగష్టు 30) ఆరంభం కానుంది. గ్రూప్-బిలో అఫ్గనిస్తాన్ ఈ వన్డే టోర్నీలో గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, నేపాల్ ఉండగా... గ్రూప్-బి నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్ పోటీ పడనున్నాయి. ఈ క్రమంలో అఫ్గన్ క్రికెట్ బోర్డు ఆదివారం తమ జట్టును ప్రకటించింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సహా ముజీబ్ ఉర్ రహ్మాన్, మహ్మద్ నబీతో పాటు నూర్ అహ్మద్కు ఈ 17 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. వాళ్లంతా కలిసి ప్రత్యర్థి జట్ల పని పడతారు ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘అఫ్గనిస్తాన్ జట్టు ఎల్లప్పుడూ మెరుగ్గా బౌలింగ్ చేస్తుంది. వాళ్లకు గనుక స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ దొరికితే ఇక అంతే సంగతులు. ముజీబ్ ఉర్ రహ్మాన్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్.. అంతా కలిసి ప్రత్యర్థి జట్టు పని పట్టడం ఖాయం. ఒకవేళ పిచ్ పూర్తిగా స్పిన్ బౌలింగ్కు అనుకూలించిందంటే.. తుదిజట్టులో నూర్ అహ్మద్ కూడా ఎంట్రీ ఇస్తాడు. ఊపిరి కూడా తీసుకోనివ్వరంటే అతిశయోక్తి కాదు అహ్మద్ను గనుక ఆడిస్తే.. అతడితో పాటు రషీద్, నబీ, ముజీబ్ ఒక్కొక్కరు పది ఓవర్లు వేస్తారు. ప్రత్యర్థి జట్టుకు ఊపిరి సలపనివ్వకుండా చెలరేగిపోతారు’’ అని అఫ్గన్ స్పిన్ దళాన్ని ఆకాశానికెత్తాడు. అయితే, అఫ్గన్కు చెప్పుకోదగ్గ పేసర్లు లేకపోవడం మాత్రం బలహీనతే అని ఆకాశ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. ఆ ముగ్గురి రికార్డు ఇలా కాగా ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా ఎదుగుతున్న రషీద్ ఖాన్ ఇప్పటి వరకు 87 వన్డేల్లో 170 వికెట్లు కూల్చాడు. ఇక ముజీబ్ ఉర్ రహ్మాన్ 64 మ్యాచ్లలో 91, మహ్మద్ నబీ 145 మ్యాచ్లు ఆడి 154 వికెట్లు పడగొట్టారు. ఇదిలా ఉంటే.. ఆసియా కప్లో భాగంగా సెప్టెంబరు 3న బంగ్లాదేశ్తో లాహోర్లో అఫ్గన్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆసియా కప్-2023 అఫ్గనిస్తాన్ జట్టు ఇదే హష్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), నజీబుల్లా జద్రాన్, రషీద్ ఖాన్, ఇక్రమ్ అలీ ఖిల్, కరీం జనత్, గుల్బదిన్ నైబ్, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్హక్ ఫారూఖీ, షరాఫుద్దీన్ అష్రఫ్, నూర్ అహ్మద్, అబ్దుల్ రెహ్మాన్, మహ్మద్ సలీం. చదవండి: ఇష్టాయిష్టాలతో పనిలేదు.. ఆరోజు యువరాజ్ సింగ్ నన్ను ఓదార్చాడు: రోహిత్ -
ఆసియా కప్ జట్టులో చోటు దక్కకున్నా.. వరల్డ్కప్ టోర్నీలో ఎంట్రీ ఖాయం!
Asia Cup- ICC ODI World Cup 2023: ‘‘వాషింగ్టన్ సుందర్.. అతడి పేరునే పరిగణనలోకి తీసుకోలేదు. ఆసియా కప్ జట్టులో అతడికి చోటు ఇవ్వలేదు. నిజానికి జట్టులో ఆఫ్ స్పిన్నర్ లేడు. కాబట్టి సుందర్ గురించి చర్చ జరగడం సబబే. జట్టులో ఒకటీ అరా మార్పులు ఉండవచ్చు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. యువ స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు వన్డే వరల్డ్కప్-2023 జట్టులో వైల్డ్కార్డ్ ఎంట్రీ లభించవచ్చని జోస్యం చెప్పాడు. ఆఫ్ స్పిన్నర్ అవసరం ఉన్న వేళ మెగా ఈవెంట్ సమయానికి సుందర్కు పిలుపు రావొచ్చని అభిప్రాయపడ్డాడు. వరల్డ్కప్ టోర్నీలో ఎంట్రీ ఖాయం.. ఎందుకంటే ప్రత్యర్థి జట్టులో లెఫ్టాండర్లను ఎదుర్కొనేందుకు టీమిండియాకు తప్పక ఆఫ్ స్పిన్నర్ల అవసరం ఉంటుందని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు. కాగా 2017లో టీమిండియా తరఫున టీ20 మ్యాచ్తో అరంగేట్రం చేసిన తమిళనాడు క్రికెటర్ వాషింగ్టన్ సుందర్. రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ అయిన వాషీ.. ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో 4 టెస్టులు(6 వికెట్లు), 16 వన్డేలు(16 వికెట్లు), 37 టీ20 మ్యాచ్లు(29 వికెట్లు) ఆడాడు. బౌలింగ్తో పాటు లోయర్ ఆర్డర్లో రాణించడం అతడికి ఉన్న అదనపు అర్హత. వాళ్లంతా ఆసియా కప్ జట్టులో అయితే, ఇటీవలి కాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న వాషింగ్టన్ సుందర్కు ఆసియా కప్-2023 జట్టులో చోటు దక్కలేదు. 17 మంది సభ్యుల జట్టులో స్పిన్ విభాగంలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్లను ఎంపిక చేశారు. రోహిత్ శర్మ చెప్పాడు కదా! ఇక ఆసియా కప్ జాబితా నుంచే వరల్డ్కప్ జట్టును ఎంపిక చేస్తామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, అదే సమయంలో రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్లకు దారులు మూసుకుపోలేదని కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. వాషింగ్టన్ సుందర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆఫ్ స్పిన్ బౌలింగ్తో వికెట్లు తీయడంతో పాటు జట్టుకు అవసరమైన సమయంలో పరుగులు రాబట్టడం అతడికి ఉన్న ప్లస్ పాయింట్. ఒకవేళ సుందర్ గనుక మెగా ఈవెంట్కు ముందు ఆడే మ్యాచ్లలో ఆల్రౌండర్గా తనను తాను నిరూపించుకుంటే తప్పక వైల్డ్ కార్డ్ ఎంట్రీ దక్కుతుంది. ప్రస్తుతం జట్టులో ఉన్న టెంప్టింగ్ ఆప్షన్ తనే’’ అని పేర్కొన్నాడు. ఐర్లాండ్ పర్యటనలో కాగా ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉన్న 23 ఏళ్ల వాషింగ్టన్ సుందర్.. తొలి రెండు మ్యాచ్లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. డబ్లిన్లో బుధవారం జరిగే ఆఖరి టీ20లో గనుక సత్తా చాటితేనే అతడి పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అంతేకాదు.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో చోటు దక్కించుకుని మెరుగ్గా రాణిస్తేనే సుందర్ వరల్డ్కప్ ఆశలు సజీవంగా ఉంటాయి. చదవండి: హీత్ స్ట్రీక్ అరుదైన రికార్డులు.. తొలి మ్యాచ్లో నో వికెట్! నాడు టీమిండియాను ఓడించి.. కోహ్లి తానే బెస్ట్ బౌలర్ అనుకుంటాడు.. అతడి బౌలింగ్ అంటే మాకు భయం: భువీ -
ఇప్పుడు హసరంగా.. మొన్న హేల్స్! ప్రపంచ క్రికెట్లో అసలేం జరుగుతోంది?
శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా ఇటీవల టెస్టుక్రికెట్కు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. వైట్ బాల్ ఫార్మాట్లపై దృష్టి సారించేందుకు హసరంగా టెస్టులకు గుడ్బై చెప్పాడు. అయితే హసరంగా నిర్ణయాన్ని భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తప్పుబట్టాడు. హసరంగాపై చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. "టెస్టు క్రికెట్ ఆడడం తనకుకు ఇష్టం లేదని హసరంగా బహిరంగంగా చెప్పాడు. అతడికి కేవలం 26 ఏళ్ల మాత్రమే. ఈ వయస్సులో టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవడం సరైన నిర్ణయమా? అలెక్స్ హేల్స్ ఏకంగా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. అంతకుముందు ట్రెంట్ బౌల్ట్ న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ను వదులుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో ఏం జరుగుతోంది? అంటూ చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో ప్రశ్నించాడు. ఇక హసరంగా వైట్బాల్ కెరీర్ గురించి చోప్రా మాట్లాడుతూ.. అతడు టీ20 క్రికెట్లో అద్బుతమైన అనడంలో ఎటువంటి సందేహం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో శ్రీలంకకు అతడు కీలకం. అయితే టెస్టు క్రికెట్లో ఆడకుండా వైట్బాల్ క్రికెట్పై దృష్టిపెడతనడం సరికాదని చెప్పుకొచ్చాడు. ఇక 2020లో దక్షిణాఫ్రికాపై టెస్టు అరంగేట్రం చేసిన వనిందు.. తన కెరీర్లో కేవలం 4 టెస్టు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. 4 టెస్టుల్లో 196 పరుగులతో పాటు 4 వికెట్లు సాధించాడు. చదవండి: CPL 2023: విండీస్ బ్యాటర్ భారీ సిక్సర్.. దెబ్బకు పాక్ బౌలర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో వైరల్ -
దేశంలో ఒకే ఒక్క హార్దిక్ పాండ్యా ఉన్నాడు.. కానీ: భారత మాజీ క్రికెటర్
Hardik Pandya underwhelming all-round performances: టీమిండియా ‘స్టార్’ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆట తీరుపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా పెదవి విరిచాడు. ఇటీవలి కాలంలో వన్డేల్లో అతడి ప్రదర్శన ఆశించదగ్గ రీతిలో లేదని విమర్శించాడు. వన్డే ప్రపంచకప్-2023 వంటి మెగా ఈవెంట్కు ముందు కీలక ఆటగాడు ఇలా విఫలం కావడం ఆందోళనకు గురిచేసే అంశం అన్నాడు. తాత్కాలిక కెప్టెన్గా కాగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో పరిమిత ఓవర్ల క్రికెట్లో హార్దిక్ పాండ్యా భారత జట్టును ముందుకు నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఆఖరి రెండు వన్డేలు, ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు పాండ్యా తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించాడు. ఆటగాడిగా, కెప్టెన్గా విఫలం అయితే, ఆల్రౌండర్గా.. కెప్టెన్గానూ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను టీమిండియా 2-1తో గెలిచినప్పటికీ.. పాండ్యా సారథ్యంలో టీ20 సిరీస్లో మాత్రం విండీస్ చేతిలో 3-2తో పరాభవం పాలైంది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక వెస్టిండీస్ టూర్ తర్వాత హార్దిక్ ఆసియా వన్డే కప్-2023 టోర్నీలోనే మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. అటుపై భారత్ వేదికగా ప్రపంచకప్ రూపంలో మరో మెగా ఈవెంట్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా తన యట్యూబ్ చానెల్ వేదికగా హార్దిక్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకే ఒక్క హార్దిక్ పాండ్యా ఉన్నాడు.. కానీ ‘‘దేశంలో ఒకే ఒక్క హార్దిక్ పాండ్యా ఉన్నాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడంతో పాటు లోయర్ ఆర్డర్లో ఫినిషర్గా అదరగొట్టగలిగిన వాడు. బౌలింగ్.. బ్యాటింగ్.. అదో ప్యాకేజ్! అయితే.. హార్దిక్ ఈ రెండింటిలోనూ ఇంకా మెరుగ్గా రాణించగలడు. నిజానికి వెస్టిండీస్తో రెండో వన్డేలో టీమిండియా ఓడినపుడు అందరూ యువ ఆటగాళ్ల గురించే మాట్లాడారు. కానీ పాండ్యా గురించి ఇంతవరకు పెద్దగా చర్చించడమే లేదు. వాస్తవానికి హార్దిక్ పాండ్యా వంటి కీలక ఆటగాడిపైనే ఎక్కువ ఫోకస్ ఉండాలి. గత 10 వన్డేల్లో అతడి ప్రదర్శన చెప్పుకోదగినదిగా లేదు. స్ట్రైక్రేటు గురించి కూడా మాట్లాడాలి వెస్టిండీస్తో మూడో వన్డేలో 52 బంతుల్లో 70 పరుగులు చేశాడు. కానీ ఆ ఇన్నింగ్స్ ఎంత పేలవంగా ఆరంభమైందో తెలిసిందే! అయితే, ఆఖర్లో మాత్రం బ్యాట్ ఝులిపించాడు. ఇక మరో మ్యాచ్లో 12 బంతుల్లో 14 పరుగులు.. కేవలం రెండు ఇన్నింగ్స్లో మాత్రమే అతడు ఎదుర్కొన్న బంతుల కంటే పరుగులు ఎక్కువగా ఉన్నాయి. ఫినిషర్గానే కీలక పాత్ర వాస్తవానికి హార్దిక్ పాండ్యా ఫినిషర్ పాత్ర పోషించాలి. కాబట్టి స్ట్రైక్రేటు గురించి చర్చించక తప్పదు. అతడు నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఫినిషర్గా తన నుంచి మంచి ఇన్నింగ్స్ ఆశిస్తున్నా’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా గత 10 వన్డే ఇన్నింగ్స్లో హార్దిక్ పాండ్యా 97.22 స్ట్రైక్రేటుతో 280 పరుగులు చేయగలిగాడు. గత నాలుగేళ్లుగా 100కు స్ట్రైక్రేటు మెయింటెన్ చేస్తున్న అతడి ప్రస్తుత గణాంకాలు ఆశించిన రీతిలో లేవన్నది వాస్తవం. ఇదిలా ఉంటే... ఆగష్టు 30 నుంచి పాకిస్తాన్, శ్రీలంక వేదికగా ఆసియా కప్ టోర్నీ ఆరంభం కానుంది. చదవండి: టీమిండియాతో సిరీస్ నాటికి వచ్చేస్తా.. వరల్డ్కప్ తర్వాత కెప్టెన్ అతడే! -
ఐపీఎల్లో ఆడితే.. వరల్డ్కప్ గెలిచినట్లా? వాళ్లిద్దరికి రెస్ట్ అవసరమా?
India tour of West Indies, 2023: ‘‘మన వాళ్లు అంతర్జాతీయ టీ20లను సీరియస్గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఇషాన్ కిషన్, శుబ్మన్ గిల్ ఐర్లాండ్కు వెళ్లడం లేదన్నది వాస్తవం. ఆటగాళ్లకు విశ్రాంతి అవసరమే. కానీ టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు మనం 14 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఐపీఎల్లో ఆడితే.. వరల్డ్కప్ గెలిచినట్లా? ఐపీఎల్ గురించి మనకు అనవసరం. లీగ్ క్రికెట్లో మన ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచినంత మాత్రాన వరల్డ్కప్ గెలిచినట్లు కాదు కదా! మనం ఇంతవరకు కేవలం ఒక్కసారి మాత్రమే పొట్టి ఫార్మాట్లో జగజ్జేతగా నిలిచాం. అది కూడా ఐపీఎల్ లేనప్పుడు మాత్రమే!’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా మేజర్ ఈవెంట్లకు ఆటగాళ్లను ఎంపిక చేసే పరిస్థితి లేదన్నాడు. యువ ఆటగాళ్లను కూడా విశ్రాంతి పేరిట పక్కన పెట్టడం సరికాదని పేర్కొన్నాడు. ఐర్లాండ్తో టీ20 సిరీస్కు ఓపెనర్లు శుబ్మన్ గిల్, యశస్వి జైశ్వాల్లను ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. సమయం ఉంది కదా! రెస్ట్ ఎందుకు? కాగా వెస్టిండీస్ టూర్లో 3-2తో టీ20 సిరీస్ను కోల్పోయిన టీమిండియా తదుపరి ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఆగష్టు 18- 23 వరకు మూడు టీ20లు ఆడనుంది. దాదాపు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని యువ జట్టు అక్కడికి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘వీలైనన్ని ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడటం మనకు ముఖ్యం. ఐర్లాండ్ వంటి జట్టుతో మూడు టీ20లు ఆడుతున్నారంటే.. ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లను పక్కన పెట్టడం ఎందుకు? విండీస్తో మూడో టీ20 నుంచే అతడికి రెస్ట్ ఇచ్చారు. నాకైతే అర్థం కావడం లేదు ఐర్లాండ్కు కూడా పంపడం లేదు. ఒకవేళ శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఆసియా వన్డే కప్ ఆరంభం నాటికి తిరిగి వస్తే ఇషాన్ పరిస్థితి ఏంటి? ఐర్లాండ్ సిరీస్ ఆగష్టులోనే ముగుస్తుంది. ఆసియా కప్ టోర్నీలో భాగంగా సెప్టెంబరులో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఒకవేళ అతడిని బ్యాకప్ వికెట్ కీపర్గా భావించినా.. ఆసియా కప్ నాటికి కావాల్సినంత విశ్రాంతి దొరుకుతుంది. ఫిట్గా ఉన్న యువ ఆటగాళ్లను కూడా విశ్రాంతి పేరిట పక్కన పెట్టడం ఎందుకో అర్థం కావడం లేదు’’ అని విస్మయం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్తో టీమిండియా నాలుగో టీ20 ముగిసిన తర్వాత ఈ మేరకు ఆకాశ్ చోప్రా వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐదో టీ20లో 8 వికెట్ల తేడాతో హార్దిక్ సేనపై ఘన విజయం సాధించిన కరేబియన్ జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంది. అంతకు ముందు టీమిండియా 1-0తో టెస్టు, 2-1తో వన్డే సిరీస్ను గెలిచిన విషయం తెలిసిందే. ఐర్లాండ్తో టీ20 సిరీస్కు భారత జట్టు: బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్, జితేశ్ శర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షహబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్. చదవండి: Ind Vs WI: టీమిండియాను అవమానించిన విండీస్ హిట్టర్! నోర్ముయ్.. ఇంత చెత్త కెప్టెన్ను ఇప్పటివరకు చూడలేదు.. ఇతడా టీమిండియా ఫ్యూచర్? -
Asia Cup 2023: భారత మాజీ ఓపెనర్కు బిగ్షాక్
క్రికెట్ అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న ఆసియాకప్-2023కు సమయం అసన్నమవుతోంది. ఆగస్టు 30న ముల్తాన్ వేదికగా పాకిస్తాన్,నేపాల్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇప్పటికే పాకిస్తాన్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు తమ జట్లను కూడా ప్రకటించాయి. బీసీసీఐ కూడా తమ జట్టును ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ టోర్నీలో భాగమయ్యే కామేంటేటర్ల జాబితాను ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ ఈవెంట్లో పాల్గోనే మొత్తం 5 దేశాల నుంచి 12 మంది వ్యాఖ్యాతలను ఏసీసీ ఎంపిక చేసింది. ఈ జాబితాలో భారత మాజీ ఓపెనర్, ప్రముఖ వాఖ్యత ఆకాశ్ చోప్రాకు చోటుదక్కకపోవడం గమానార్హం. ఈ కామేంటరీ ప్యానల్లో భారత నుంచి గౌతమ్ గంభీర్, రవిశాస్త్రి, సంజయ్ మంజ్రేకర్, ఇర్ఫాన్ పఠాన్ , దీప్ దాస్గుప్తాకు చోటు దక్కగా.. పాకిస్తాన్ నుంచి వసీం అక్రమ్, వకార్ యూనిస్, బాజిద్ ఖాన్, రమీజ్ రాజాలకు అవకాశం లభించింది. అదే విధంగా బంగ్లాదేశ్ నుంచి అథర్ అలీ ఖాన్, శ్రీలంక నుంచి రస్సెల్ ఆర్నాల్డ్ కూడా కామేంటరీ ప్యానల్లో భాగమయ్యారు. మరోవైపు స్కాట్ స్టైరిస్ తటస్థ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఇక సెప్టెంబర్ 2న యావత్తు క్రికెట్ ప్రపంచం ఎదురుచూసే దాయాదుల పోరు పల్లెకెలె వేదికగా జరగనుంది. చదవండి: IND vs WI: ఇష్టమైనంత మాత్రాన హార్దిక్ .. ధోని అవ్వాల్సిన అవసరం లేదు! ఇక ఆపేయండి