kabali
-
డ్రగ్స్ కేసులో ఇద్దరు స్టార్ హీరోయిన్లు, డైరెక్టర్?
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం దుమారం రేపుతోంది. తాజాగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం హాట్ టాపిక్గా మారింది. కబాలి నిర్మాత కేపీ చౌదరిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి అతని నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద ఉన్న నాలుగు సెల్ఫోన్లతో పాటు ల్యాప్టాప్ను తీసుకున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి డ్రగ్స్ దందాలోకి దిగిన కేపీ చౌదరితో పలువురు టాలీవుడ్ ప్రముఖులు టచ్లో ఉన్నారని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అరెస్ట్ అయిన రోషన్ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. (ఇదీ చదండి: సినిమా రంగంలోనే డ్రగ్స్ ఎందుకు?) తాజాగా కేపీ చౌదరి ఏర్పాటు చేసిన పార్టీలకు హాజరైన సినీ ప్రముఖుల లిస్ట్ను పోలీసులు రెడీ చేస్తున్నారు. అతని నుంచి ఒక్కొక్కటిగా డ్రగ్స్ లింక్లు బయటపడుతున్నాయి. అతను ఎవరెవరితో వాట్సప్లలో చాటింగ్ చేశారో విశ్లేషిస్తున్నారు. డ్రగ్ మాఫియా ఖేల్ ఖతం అనుకుంటే.. గోవా టూ హైదరాబాద్ రూట్లో ఈ రాకెట్ మళ్లీ గుప్పుమంది. మరోవైపు డ్రగ్స్ కింగ్ పిన్ గాబ్రియేల్ కోసం గాలిస్తున్నారు. టాలీవుడ్ నుంచి కేపీ చౌదరిని అదుపులోకి తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు.. గతంలో హీరోయిన్ ఛార్మీ, రానా, పూరి,రవితేజ,నవదీప్,ముమైత్ ఖాన్,నందు,తరుణ్ను డ్రగ్స్ లింక్ల గురించి పోలీసులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ డ్రగ్స్ లింక్లో ఇద్దరు ప్రముఖ హీరోయిన్లతో పాటు, నలుగురు మహిళా ఆర్టిస్ట్లు ఉన్నారని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ డ్రగ్ మాఫియా వెనుక ఒక ప్రముఖ డైరెక్టర్ కూడా ఉన్నారని తెలుస్తోంది. కేపీ చౌదరి ఫోన్ను పూర్తిగా పరిశీలించి.. ఈ డ్రగ్స్ లింక్లో ఎవరెవరు ఉన్నారో? వారి పేర్లు బయటపెడుతామని పోలీసులు తెలుపుతున్నారు. (ఇదీ చదండి: తమన్నాతో లవ్.. ఆ సమయం కోసం వెయిట్ చేశా: విజయ్ వర్మ) -
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అరెస్ట్.. భారీస్థాయిలో డ్రగ్స్ స్వాధీనం!
హైదరాబాద్లో డ్రగ్స్ ముఠా కలకలం రేపింది. కబాలి చిత్ర నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి(కేపీ చౌదరి)ని కిస్మత్ పుర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన వద్ద నుంచి 82 గ్రాముల కొకైన్,, రూ.2,05,000 నగదు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 2016లో సినిమా రంగంలోకి వచ్చిన కేపీ చౌదరి కబాలి చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు. సర్ధార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు. (ఇది చదవండి: ఎంగేజ్మెంట్ తర్వాత తొలిసారి ఫోటో షేర్ చేసిన లావణ్య త్రిపాఠి!) సినీరంగంలో నష్టాలు రావడంతో డ్రగ్స్ సరఫరాను ఎంచుకున్నారు. గోవాలో ఓహచ్ఎం పబ్ను ప్రారంభించిన కేపీ చౌదరీ సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. పబ్బులో నష్టాలు రావడంతో హైదరాబాద్ తిరిగొచ్చారు. నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి స్వస్థలం ఖమ్మం జిల్లా బొనకల్ మండలంగా పోలీసులు తెలిపారు. ఆయన గతంలో పూణె ఏరోనాటికల్లో డైరెక్టర్ ఆపరేషన్స్గా పనిచేశారు. సినీ ప్రముఖలతో సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరికి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. గోవాలో నైజీరియన్లతో ఉన్న పరిచయాలతో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఇవాళ పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు కిస్మత్ పుర్లో కొకైన్ విక్రయిస్తుండగా మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. అయితే గతంలోనూ టాలీవుడ్ డ్రగ్స్ కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. -
షూటింగ్లో ప్రమాదం.. హీరోయిన్కు గాయాలు
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన నటి ధన్సిక. తొలి సినిమాతోనే టాలీవుడ్లో సైతం అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటి తెలుగులో వాలు జడ సినిమాతో పాటు తమిళ్లో యోగి డా అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ప్రమాదంలో ధన్సికకు గాయాలయ్యాయి. బార్లో యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొంత మంది రౌడీలు ధన్సిక పైకి బీర్ బాటిళ్లను విసిరే సన్నివేశం షూట్ చేస్తుండగా పగిలిన గాజు ముక్క ఒకటి ధన్సిక కంటి కింది భాగంలో గుచ్చుకుంది. వెంటనే స్పందించిన యూనిట్ సభ్యులు ఆమె దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు. ధన్సిక ట్రీట్మెంట్ పూర్తి అయిన వెంటనే గాయంతోనే తిరిగి షూటింగ్లో పాల్గొన్నారు. -
కబాలి కూతురి కర్రసాము
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన నటి ధన్సిక. తొలి సినిమాతోనే టాలీవుడ్లో సైతం అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటి ప్రస్తుతం వాలుజడ అనే స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ భామకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కబాలి సినిమాలో యాక్షన్ సీన్స్లో కనిపించిన ధన్సిక తాజాగా కర్రసాము చేస్తూ అలరించారు. ఈ వీడియోను ధన్సిక పర్సనల్ పీఆర్వో ప్రియా అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్న ధన్సిక.. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తున్నారు. -
‘కబాలి’ నిర్మాతతో ‘ఆర్ఎక్స్ 100’ హీరో..!
ఇటీవల సంచలన విజయం సాధించిన చిన్న సినిమా ఆర్ఎక్స్ 100. రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్పుత్లు హీరోహీరోయిన్లుగా నటించారు. బోల్డ్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమా యూత్ను ఆకట్టుకోవటంతో వసూళ్ల పంట పండింది. అంతేకాదు ఈ సినిమా దర్శకుడు అజయ్ భూపతితో పాటు హీరోగా నటించిన కార్తికేయకు పెద్ద బ్యానర్ల నుంచి ఆఫర్లు అందుతున్నాయి. తాజాగా హీరో కార్తికేయ ఓ తమిళ నిర్మాణ సంస్థ నిర్మించబోయే సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. కోలీవుడ్లో కబాలి లాంటి భారీ బడ్జెట్ చిత్రాలను అందించిన కలైపులి ఎస్ థాను నిర్మించబోయే సినిమాలో కార్తికేయ హీరోగా నటించనున్నాడట. ఈ సినిమాకు ఎన్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా తమిళ్లోనే తెరకెక్కిస్తారా.. లేక బైలింగ్యువల్గా తెరకెక్కిస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది. -
అయ్యో పాపం
ఇక్కడి ఫొటోలో ఉన్నది ఎవరో తెలుసుగా! అదేనండీ.. రజనీకాంత్ హీరోగా నటించిన ‘కబాలి’ సినిమాలో యోగి క్యారెక్టర్లో రఫ్పాడించిన సాయి ధన్సికనే. ఇంతకీ ఆమె చేతులు, కాళ్లు ఎందుకు కట్టేశారు? అంటే సినిమా కోసం అన్నమాట. ఇంకోమాట.. ఫొటోలో ధన్సిక కూర్చున్నది స్నూకర్ టేబుల్పైన అని అర్థం అవుతోంది కదూ. పాపం.. అలానే రాత్రంతా కూర్చున్నారట. సునీల్ కుమార్ దేశాయ్ దర్శకత్వంలో కన్నడలో రూపొందుతున్న ‘ఉద్ఘర్ష’ సినిమాలో ఆమె నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ సీన్లో ధన్సిక ఇలా కనిపించనున్నారు. తెలుగు సినిమాలు ‘రోగ్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, ఆచారి ఆమెరికా యాత్ర’ సినిమాల్లో విలన్గా నటించిన అనూప్ సింగ్ ఠాకూర్ ఈ సినిమాలో ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. అన్నట్లు.. తెలుగులో ధన్సిక స్ట్రయిట్ సినిమా ‘వాలుజడ’ చేస్తున్నారు. -
అందుకే సూపర్ స్టార్ అయ్యారు
రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాలా’ వండర్బార్ ఫిల్మ్స్ పతాకంపై నటుడు, రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఈ గ్యాంగ్స్టర్ డ్రామాను నిర్మించారు. హ్యూమా ఖురేషీ, అంజలీ పాటిల్ కథానాయికలు. ఈ చిత్రం టీజర్లో చూపించిన రైన్ ఫైట్ షాట్స్ గుర్తుండే ఉంటాయి. ఆ రైన్ ఫైట్ సీక్వెన్స్ ఈ సినిమాకు హైలైట్గా నిలువనుందట. ఈ ఫైట్ సీన్స్ చిత్రీకరణ గురించి, రజనీకాంత్ డెడికేషన్ గురించి చిత్రబృందం చెబుతూ – ‘‘ఐదు రోజుల పాటు ఈ రైన్ సీక్వెన్స్ను చిత్రీకరించాం. రజనీకాంత్ ఒక షాట్ చేసి వచ్చి అలా తడిబట్టలతోనే కూర్చుని ఏదైనా బుక్ చదువుతూ ఉండేవారు. నెక్ట్స్ షాట్ రెడీ అయ్యేవరకూ కొంచెం డ్రై అవ్వండి అని చెబితే మళ్లీ ఎలాగూ తడవాలి కదా.. ఏం ఫర్లేదు అని నవ్వేసేవారు. రజనీకాంత్లో ఉండే బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ప్రతీ సినిమాను తన ఫస్ట్ సినిమాలాగా ట్రీట్ చేయడమే. తన కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. సూపర్ స్టార్ తలుచుకుంటే సీన్ తనకు తగ్గట్టుగా మార్చుకోవచ్చు. కానీ అలా ఒప్పుకోరు. సీన్ డిమాండ్కు తగ్గట్టుగానే రజనీకాంత్ తనని అడాప్ట్ చేసుకుంటారు. రజనీసార్ అలా ఉండటం వల్ల టీమ్లో ఉన్న అందరికీ బూస్ట్లా అనిపించింది’’ అని పేర్కొంది చిత్రబృందం. రజనీకాంత్ సూపర్స్టార్గా ఇంత స్టార్డమ్ను సంపాదించగలిగారంటే అది కేవలం నటుడిగా ఆయనకున్న డెడికేషన్ వల్లే అని అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా జూన్ 7న రిలీజ్ కానుంది. -
‘మేళా’తో టాలీవుడ్కు..
కబాలి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయం అయిన నటి సాయి ధన్సిక. తాజాగా సాయి ధన్సిక సినమ్ అనే లఘు చిత్రంలో అద్భుతంగా నటించి మెప్పించారు. ఆ చిత్రం కోల్కతా అంతర్జాతీయ కల్ట్ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి ఉత్తమ లఘు చిత్రం, ఉత్తమ నటి తదితర 8 అవార్డులను గెలుచుకుంది. అదే విధంగా కాలిఫోర్నియాలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పలు అవార్డులను గెలుచుకుంది. ప్రస్తుతం ఈ భామ ఓ స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటిస్తోంది. మేళా అనే చిత్రం ద్వారా ఈ బ్యూటీ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు. దీనిపై సాయి ధన్సిక మాట్లాడుతూ తెలుగు చిత్రసీమలో ప్రముఖ రచయిత కిరణ్ తనను కలిసి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే ఒక కథను తయారు చేసి తానే దర్శకత్వం వహించడానికి సిద్ధం అయ్యానని చెప్పారన్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా లేడీ ఓరియంటెడ్ కథగా ఈ సినిమా ఉంటుందన్నారు. ప్రేక్షకులకు ద్విపాత్రాభినంలా అనిపిస్తుందని, తాను ఈ చిత్రంలో రెండు విభిన్న గెటప్లలో కనిపిస్తానని, ఒక గెటప్లో దెయ్యంగా కనిపిస్తానని తెలిపారు. ఇందులో తనకు జోడీ ఎవరూ ఉండరని, అయితే తెలుగు, తమిళ ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని చెప్పారు. తెలుగు నటుడు సూర్యతేజ కథానాయకుడిగా, అలీ, భరత్రెడ్డి, మునీష్కాంత్, జాంగిరి మధుమిత నటిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రంలో ఫైటింగ్ సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించానని అన్నారు. మేళా చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో విడుదల కానుందని ఆమె తెలిపారు. -
నాకు స్పెషల్ మూవీ
సూర్యతేజ్, ‘కబాలి’ ఫేమ్ ధన్సిక, సిమ్రాన్, సోని చరిష్టా ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘మేళా’. కిరణ్ శ్రీపురం దర్శకత్వంలో మామిడి వెంకటలక్ష్మి సమర్పణలో సంతోష్ కుమార్ కొంకా నిర్మిస్తున్నారు. కిరణ్ శ్రీపురం మాట్లాడుతూ– ‘‘2006లో ముంబైలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తోన్న చిత్రమిది. 50–60 శాతం చిత్రీకరణ పూర్తయింది. కథానుగుణంగా ధన్సిక, సూర్యతేజ, సోని చరిష్టా పాత్రలకు రెండు, మూడు వెర్షన్స్ ఉంటాయి. ప్రస్తుతం క్లైమాక్స్ లీడ్ సాంగ్ చిత్రీకరిస్తున్నాం. త్వరలోనే ట్రైలర్ విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘విభిన్నమైన కథ, కథనంతో కూడిన చిత్రమిది. కిరణ్గారు సినిమాను పక్కా ప్లానింగ్తో పూర్తి చేస్తున్నారు’’ అన్నారు సంతోష్కుమార్. ‘‘నా కెరీర్లో చాలా ముఖ్యమైన సినిమా ఇది. లవ్, కామెడీ, ఎమోషన్స్ వంటి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు సాయి ధన్సిక. ‘‘వైవిధ్యమైన కథతో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో కీలక పాత్రలో కనిపిస్తా’’ అన్నారు రాజా రవీంద్ర. ఈ సమావేశంలో సోని చరిష్టా కూడా పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుక్కు, కెమెరా: ఎస్.మురళీమోహన్రెడ్డి, సహ నిర్మాత: పంతం అరుణరెడ్డి. -
రజినీ కాంత్ను దాటేసిన విజయ్
-
నేనందుకు అంగీకరించలేదు!
సద్దుమణిగిన విషయాన్ని పదే పదే ప్రస్థావిస్తూ తద్వారా ప్రచారం పొందాలని ఆశిస్తున్నట్లుంది నటి రాధిక ఆప్టే. బాలీవుడ్ చిత్రాల్లో అర్ధనగ్నంగా నటిస్తూ, ఆ ఫొటోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేసి వార్తల్లోకెక్కే ఈ సంచలన నటి. అదేమని ఎవరైనా విమర్శిస్తే, నా శరీరం, నా ఇష్టం అంటూ డేర్గా అనేస్తుంది. ఈ జాణ దక్షిణాదిలో నటించింది చాలా తక్కువ చిత్రాలే. తమిళంలో ధోని, తమిళ్సెల్వన్, కబాలి చిత్రాల్లో నటించింది. కబాలిలో రజనీకాంత్కు భార్యగా నటించడంతో గుర్తింపు బాగానే వచ్చింది. తెలుగులోనూ బాలకృష్ణ సరసన రెండు సినిమాల్లో నటించింది. అయితే ఆ తరువాతే అవకాశాలు రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్పై దృష్టిసారించిన రాధిక ఆప్టే దక్షిణాది చిత్రపరిశ్రమపై నిందలు వేస్తూ ఫ్రీ పబ్లిసిటీ పొందేప్రయత్నం చేస్తోంది. అవకాశాల కోసం హీరోయిన్లను అడ్జెస్ట్ అవ్వాలంటారని నటి వరలక్ష్మీశరత్కుమార్ లాంటి కొందరు సంచలన వ్యాఖ్య చేశారు. అవి అప్పట్లో ప్రకంపనలు సృష్టించిన మాట నిజమే అయినా, అలాంటి వాతావరణం సద్దుమణిగిన తరువాత నటి రాధిక ఆప్టే మరోసారి అదే వివాదాన్ని తెర మీదకు తెచ్చింది. దక్షిణాదిలో హీరోయిన్లను పడక గదికి రమ్మన్ని ఒత్తిడి చేసే సంప్రదాయం ఉంది అని కామెంట్ చేసింది.తనకు అలాంటి చేదు అనుభవం ఎదురైందని, ఒక నిర్మాత కథా చర్చలకు పిలిచి పడక గదికి రమ్మని ఒత్తిడి చేశాడని, అయితే తానందుకు తలవంచలేదని పేర్కొంది. అందుకేనేమో తనకు దక్షిణాదిలో అవకాశాలు ఎక్కువగా రావడం లేదని చెప్పింది. -
ఎలాంటి పాత్రకైనా రెడీ
తమిళసినిమా: ఎలాంటి పాత్రల్లో నటించడానికైనా తాను సిద్ధం అంటున్నారు నటి సాయి ధన్సిక. పేరాన్మమై చిత్రం ద్వారా దర్శకుడు జననాథన్ పరిచయం చేసిన నటి సాయిధన్సిక. ఆ చిత్రంలో జయంరవితో నలుగురు హీరోయిన్లలో ఒకరిగా నటించి ప్రత్యేకత చాటుకున్న తంజావూర్కు చెందిన అచ్చ తమిళమ్మాయి ఆ తరువాత కేరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయ్యిందనే చెప్పాలి. వరుసగా అవకాశాలు తలుపు తట్టడం, అవి నటనకు స్కోప్ ఉన్న పాత్రలు కావడంతో తనదైన స్టైల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు సాయి ధన్సిక. కబాలి చిత్రంలో సూపర్స్టార్ రజనీకాంత్కు కూతురుగా నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో రజనీకాంత్ తరువాత అంత మంచి పేరు తెచ్చుకున్న నటి సాయి ధన్సికనే అని చెప్పాలి. అందుకు నిదర్శనం ఇటీవల ఉత్తమ సహాయనటిగా ఫిలిం ఫేర్ అవార్డును గెలుచుకోవడమే. ఇక మరో విషయం ఏమిటంటే తను నటించిన ఉరు చిత్రం ఇటీవల విడుదలై మంచి ఆదరణతో ప్రదర్శింపబడుతుండటం ఈ ఆనందాన్ని సాయిధన్సిక సోమవారం పాత్రికేయులతో పంచుకున్నారు. ఆ ముచ్చట్లు చూద్దాం. ప్ర: ఉరు చిత్రంలో అద్దాలు పగలగొట్టుకొని దూసుకొచ్చే యాక్షన్ సన్నివేశాల్లో నటించిన అనుభవం గురించి? జ: ఆ యాక్షన్ సన్నివేశంలో నటించగలవా? అని దర్శకుడు అడిగారు. తానూ ఓకే అన్నాను. నిజంగా అది చాలా రిస్కీ షాటే. కరెక్ట్గా నేను అద్దంలోంచి దూకే సమయంలో ఒక వ్యక్తి పక్క నుంచి అద్దాన్ని పగలగొట్టారు. ఆ టైమింగ్ సింక్ అవడంతో ఆ సీన్ చాలా సహజంగా ఉంది. అయితే ఆ సన్నివేశాన్ని కులుమనాలిలో 4 డిగ్రీల చలిలో చిత్రీకరించారు. నేనే కాదు, నటుడు కలైయరసన్ తదితర చిత్ర యూనిట్ అంతా ఎంతో శ్రమించి పనిచేశారు. ఉరు చిత్రంలో నటించడానికి విల్పవర్ అవసరమైంది. ప్రశ్న: ఉరు చిత్రంపై మీ స్పందన? జ: దర్శకుడు కొత్తవాడైనా చాలా బాగా తెరకెక్కించారు. ముఖ్యంగా చిత్ర సస్పెన్స్ను చాలా ఆసక్తిగా రీవీల్ చేశారు. చిత్రానికి ప్రేక్షకులనుంచి మంచి స్పందన వస్తోంది. చిత్ర వర్గాలు ఆన్లైన్ ప్రచారం బాగానే చేస్తున్నారు. అయితే పోస్టర్లలాంటివి ఇంకా బాగా చేస్తే బాగుంటుంది. అయినా చిత్రం చూసిన వారి స్పందన బాగుంది. ఆ మౌత్ ప్రచారం చిత్రానికి బాగా హెల్ప్ అవుతుంది. ప్ర: అన్నీ యా„ýక్షన్ కథా పాత్రల్లోనే నటిస్తున్నట్లున్నారు. కమర్షియల్ హీరోయిన్ పాత్రల్లో నటించే ఆలోచన లేదా? జ: అలాగని ఏమీ లేదు. వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాను. నాకు అలాంటి పాత్రలు రావడానికి బహుశ నేను వచ్చిన దర్శకుడు జననాథన్, బాలా లాంటి వారి స్కూల్ ఒక కారణం కావచ్చు. నా వరకూ నటిగా ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ. అది కమర్షియల్ కథానాయకి పాత్ర అయినా. అయితే పాత్రలు నాకు నచ్చాలి. ప్ర: ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు? జ: తదుపరి కాలకూత్తు చిత్రం విడుదల కానుంది. ఇది మదురైలో చాలా కాలంగా జరుగుతున్న సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం. ఇందులోనూ నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించాను. ఆ తరువాత ఇళిత్తిరు చిత్రం విడుదల కానుంది. ఇందులో విదార్ధ్, తంబిరామయ్యలతో కలిసి హాస్యం పండించాను. ఇంతకు ముందు మీరు అన్నట్లు కమర్షియల్ కథానాయకి పాత్రను ఈ చిత్రంలో చూడవచ్చు. వాటితో పాటు తమిళం, మలయాళం భాషల్లో సోలో అనే చిత్రాన్ని, తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న వాలుజడ చిత్రాల్లో నటిస్తున్నాను. సోలో చిత్రంలో దుల్కర్సల్మాన్ హీరో. తెలుగు చిత్రం వాలుజడ మహిళా ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం. ప్ర: తమిళంతో పాటు తెలుగు, మలయాళం అంటూ దక్షిణాది భాషలన్నింటిలోనూ నటిస్తున్నారు. బాలీవుడ్కెళ్లే ఆలోచన ఉందా? జ: నిజం చెప్పాలంటే కబాలి చిత్రం తరువాత ఇతర భాషా చిత్రాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. అలానే హిందీలోనూ వస్తున్నాయి. అయితే తొందర పడదలచుకోలేదు. మంచి పాత్ర అనిపిస్తే హిందీలోనూ నటిస్తా. -
సూపర్ స్టార్ స్పీడు అందుకేనా..?
సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక సినిమా పూర్తయితే గాని మరో సినిమాకు అంగకీరించడు. అది కూడా సినిమా పూర్తయిన తరువాత రెండు మూడు నెలలకు పైగా గ్యాప్ తీసుకున్న తరువాతే మరో సినిమాను మొదలు పెడతాడు. చాలా ఏళ్లుగా రజనీ ఇదే సిస్టమ్ ఫాలో అవుతున్నారు. అయితే తన నెక్ట్స్ సినిమా విషయంలో మాత్రం రూట్ మార్చాలని నిర్ణయించుకున్నాడట రజనీ. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 2.0 సినిమాలో నటిస్తున్న రజనీ ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. భారీ బడ్జెట్ తో అదే స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో పూర్తయ్యే ఛాన్స్ లేదు. కానీ 2.0 సెట్స్ మీద ఉండగానే రజనీ మరో సినిమాను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. కబాలీ ఫేం పా రంజిత్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు రజనీ. ఈసినిమాను వచ్చే నెల రెండో వారం ప్రారంభించాలని ఫిక్స్ అయ్యారట. ఒక సినిమా సెట్స్ మీద ఉండగా మరో సినిమా గురించి ఆలోచించని రజనీ తన అల్లుడు నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమా కోసం ఈ రూల్ ను మార్చుకున్నారట. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను ధనుష్ నిర్మిస్తున్నాడు. అందుకే ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట. కబాలి సినిమాతో భారీ హైప్ క్రియేట్ చేయటంలో సక్సెస్ అయిన రంజిత్, సినిమాతో మాత్రం నిరాశపరిచాడు. మరి రజనీ ఇచ్చిన ఈసెకండ్ ఛాన్స్ ను ఎంత వరకు సక్సెస్ చేస్తాడో చూడలి. -
అప్పుడు కబాలి.. ఇప్పుడు 'ఖైదీ నెం 150'..
దాదాపు దశాబ్దకాలం తరువాత మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150. తమిళ సూపర్ హిట్ మూవీ కత్తికి రీమేక్ అయిన ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని మెగా అభిమానులు ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గతేడాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి మూవీ విడుదల రోజున(జూలై 22న) చెన్నై, బెంగళూరుల్లోని పలు స్టార్టప్లతో పాటు సౌదీ అరేబియాలోనూ కొన్ని కంపెనీలు సెలవుదినంగా ప్రకటించగా.. తాజాగా రియాద్ లోని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ మెగా మూవీ ఖైదీ నెంబర్ 150 రిలీజు అవుతున్న జనవరి 11ను ఉద్యోగులకు సెలవుదినంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. హాలీడే వివరాలను పేర్కొంటూ ఓ నోటిస్ పేపర్ను పోస్ట్ చేశాడు. (చదవండి: ఉద్యోగులకు దసరా లాగే.. కబాలి బోనస్!) గతంలో కబాలి మూవీకి కూడా మస్కట్, ఒమన్, రియాద్లోని తమ కన్స్ట్రక్షన్ కంపెనీలకు ఇదే విధంగా యాజమాన్యం హాలీడే ఇచ్చింది. ఈ హ్యాపీ న్యూస్ను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. మూవీ మొఘల్, కింగ్ ఆఫ్ కింగ్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చిరంజీవి మూవీ ఖైదీ నెంబర్ 150 ని అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించింది. దాదాపు పదేళ్ల తర్వాత పూర్తిస్థాయి సినిమాలో చిరు నటించడం కూడా మూవీ ఫీవర్ను పెంచేసింది. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీని చిరు తనయుడు రాంచరణ్ నిర్మించిన విషయం తెలిసిందే. చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించగా, దేవీశ్రీ సంగీతాన్ని సమకూర్చాడు. Holiday declared on Jan11th for Riyadh Construction Company on account of #KhaidiNo150 Release. కబాలి కి ఇలానే... @RGVzoomin @Shekar_News pic.twitter.com/aRRax4azyc — #AkkuPakshi (@urstrulyRD) 8 January 2017 -
బుక్ మై షో టాప్–10లో కబాలి
బుక్ మై షో టాప్–10లో నమోదైన చిత్రంగా సూపర్స్టార్ నటించిన కబాలి చిత్రం చోటు చేసుకోవడం విశేషం. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత దాన్ని అందిపుచ్చుకోవడానికి అన్ని రంగాల మాదిరిగానే సినీరంగానికి చెందిన వారు, సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య నానాటికి అధికం అవుతోందని చెప్పకతప్పదు. ఇక సినిమా టికెట్ల ఆన్ లైన్ బుకింగ్ విధానం అమల్లోకొచ్చి చాలా కాలం అయ్యింది. అలాంటి సోషల్ మాద్యమాల్లో బుక్ మై షో అగ్రగామిగా రాణిస్తోంది. సినిమా టిక్కెట్ల కోసం భారతదేశంలో అత్యధిక ప్రేక్షకులు ఉపయోగిస్తున్న సోషల్ మాద్యమం బుక్ మై షో. ఈ మద్యమం ద్వారా 2016లో అధికంగా ప్రేక్షకులు టికెట్స్ బుక్ చేసుకున్న చిత్రాల టాప్–10లో రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం నమోదు కావడం విశేషం. ఇక బాలీవుడ్ బాద్షా నటించిన ఫ్యాన్ చిత్రం 14వ స్థానానికి పరిమితమయ్యింది. అదే విధంగా రీజినల్ భాషా చిత్రాల పట్టికను తీసుకుంటే 2016లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా కబాలి రికార్డు సాధించినట్టు బుక్ మై షో కో–ఫౌండర్, డైరెక్టర్ పరిక్షిత్ దర్ పేర్కొన్నారు. ఇక తెలుగులో చిన్న చిత్రంగా తెరకెక్కి భారీ వసూళ్లను సాధించిన చిత్రంగా అఆ, మలయాళంలో పులిమురుగన్, కన్నడంలో గోది బన్న «సధర్న మై కట్టు చిత్రాలు రికార్డు సాధించినట్లు ఆయన తెలిపారు. కాగా బుక్ మై షో ద్వారా టికెట్లు కొనుగోలు చేసే వారి సంఖ్య 2016లో భారీగా పెరిగిందని, ఇది 2017లో మరింతగా పెరుగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. -
చిత్ర నిర్మాణరంగంలోకి కబాలి దర్శకుడు
దర్శకులు నిర్మాతలుగా మారడం అన్నది కొత్తేమీ కాదు. స్టార్ దర్శకుడు శంకర్ లాంటి వారు చిత్ర నిర్మాణం చేపట్టి విలువలతో కూడిన మంచి కథా చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇదే కోవలో అట్టకత్తి అంటూ దర్శకుడిగా పరిచయం అయిన పా.రంజిత్ తొలి చిత్రంతోనే చిత్రపరిశ్రమ వర్గాల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఆ తరువాత మద్రాస్ అంటూ ఉత్తర చెన్నై యువత జీవన విధానాన్ని సహజత్వంతో తెరపై ఆవిష్కరించి మరో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక మూడో చిత్రంతోనే సూపర్స్టార్ రజనీకాంత్ను గ్యాంగ్స్టర్గా చూపించి కబాలి చిత్రంతో స్టార్ దర్శకుల పట్టికలో చేరారు. తాజాగా మళ్లీ రజనీకాంత్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అయిన పా.రంజిత్ ఆ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. మరో పక్క నీలం ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి నవ దర్శకుడు మారి సెల్వరాజ్ను పరిచయం చేస్తూ చిత్రం నిర్మించడానికి రెడీ అయ్యారు. ఈ చిత్రానికి పరియేరుం పెరిమాళ్ అనే పేరును నిర్ణయించారు. క్రిమి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న కధీర్ హీరోగానూ, నటి ఆనంది హీరోయిన్ గా నటించనున్నారు. ఈ నెల చివర్లో చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఇది తిరునెల్వెలి పరిసర ప్రాంతానికి చెందిన ఒక యువకుడి ఇతివృత్తంగా ఉంటుందట. ప్రేమ, యాక్షన్ అంటూ అన్ని కమర్షియల్ అంశాలతో జనరంజకంగా చిత్రం ఉంటుందట. ఈ విషయాన్ని నూతన సంవత్సరం సందర్భంగా ప్రకటించారు. ఇక మారి సెల్వరాజ్ గురించి చెప్పాలంటే ఈయన దర్శకుడు రామ్ వద్ద కట్రదు తమిళ్, తంగమీన్ గళ్, తరమణి చిత్రాలకు సహాయదర్శకుడిగా పని చేశారు. పరియేరుం పెరుమాళ్ చిత్రానికి కథ, కథనం దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. దీనికి సంతోష్ నారాయణ్ సంగీతం, శ్రీధర్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. -
రజనీ అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్
-
రజనీ అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్
సౌత్ సూపర్ స్టార్ రజనీ అభిమానుల కోసం కబాలి చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థాను ఓ గిఫ్ట్ ఇచ్చాడు. రజనీ కెరీర్ లోనే భారీ హైప్ క్రియేట్ చేసిన కబాలి చిత్రంలోని ఐదు డిలీటెడ్ సీన్స్ను తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు. కొన్ని యాక్షన్ సీన్స్తో పాటు ఎమోషనల్, రొమాంటిక్ సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. పా రంజిత్ దర్శకత్వంలో రజనీ హీరోగా తెరకెక్కిన కబాలి చిత్రంలో రాధికా ఆప్టే హీరోయిన్గా నటించింది. -
కబాలి 2లో మరో కొత్త లుక్లో రజనీ
సూపర్ రజనీకాంత్ హీరోగా ఘనవిజయం సాధించిన సినిమా కబాలి. ఎక్కువగా స్టార్ డైరెక్టర్స్ తో మాత్రమే సినిమాలు చేసే రజనీ తొలిసారిగా ఓ కొత్త దర్శకుడితో చేసిన ఈ సినిమా రజనీ మార్కెట్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. అందుకే కబాలి ఫీవర్ నడుస్తుండగానే ఈ సినిమాకు సీక్వల్ ఉంటుందంటూ ప్రకటించారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్టుగా సమాచారం. మరోసారి పా రంజిత్ దర్శకత్వంలో కబాలి సినిమాకు సీక్వల్ చేస్తున్నాడు రజనీ. ఈ సినిమాను రజనీ అల్లుడు ధనుష్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 2.0 పనుల్లో బిజీగా ఉన్న రజనీ కబాలి సీక్వల్ పని కూడా మొదలెట్టేశాడు. ఇటీవల రజనీని కలిసిన దర్శకుడు పా రంజిత్, సీక్వల్లో రజనీ లుక్, కాస్ట్యూమ్స్ పై చర్చించాడు. త్వరలోనే కబాలీ 2 సెట్స్ మీదకు వెళ్లనుందన్న టాక్ వినిపిస్తోంది. -
సుల్తాన్ ఫస్ట్.. కబాలీ సెకండ్!
-
సుల్తాన్ ఫస్ట్.. కబాలీ సెకండ్!
న్యూఢిల్లీ: ఎన్నో అంచనాల మధ్య విడుదలైన తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ ‘కబాలి’ని వెనక్కి నెట్టి సల్మాన్ ఖాన్ మూవీ సుల్తాన్ గూగుల్ సెర్చ్లో అగ్రస్థానంలో నిలిచింది. 2016 ఏడాదికి గానూ గూగుల్ ఇండియా ట్రెండింగ్ మూవీల జాబితాలో కండలవీరుడు సల్మాన్ హవా సాగింది. కబాలి, డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో వచ్చిన ఉడ్తా పంజాబ్, పాకిస్తాన్ నటులు ఉన్నారని విడుదలను ఆపేయాలన్న మూవీ ‘ఏ దిల్ హై ముష్కిల్’, రుస్తుమ్, సైరత్, మొహంజోదారో మూవీలకు సంబంధించిన వీడియోలు, వార్తలు గూగుల్ ఇండియాలో టాప్ ట్రెండింగ్లో ఉన్నాయి. సుల్తాన్ తర్వాత రెండో స్థానంలో రజనీకాంత్ మూవీ కబాలి నిలిచింది. హీరోల్లో సుశాంత్ రాజ్పుత్.. హీరోయిన్లలో దిశా పటానీ ధోనీ జీవిత కథాంశంతో వచ్చిన మూవీలో తెరపై ధోనీ పాత్రలో మెప్పించిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ మోస్ట్ బాలీవుడ్ ట్రెండింగ్ మేల్ ఆర్టిస్టుగా నిలిచాడు. కబీర్ బేడి, హర్షవర్ధన కపూర్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, సూరజ్ పంచోలీ, అనుపమ్ ఖేర్ టాప్-10 సెర్చింగ్ బాలీవుడ్ నటుల జాబితాలో ఉన్నారు. దిశా పటానీ టాప్ ట్రెండింగ్ హీరోయిన్గా నిలిచింది. పుజా హెగ్డే, ఊర్వశీ రౌతెలా, ఉర్మిలా మండోద్కర్, మందన కరిమి, వాణీ కపూర్, సయామీ ఖేర్, నిమ్రత్ కౌర్ టాప్ 10 ఫీమెల్ ఆర్టిస్టులలో చోటు దక్కించుకున్నారు. -
సూపర్స్టార్తో రొమాన్స్?
సూపర్స్టార్ రజనీకాంత్తో రొమాన్స్ చేయాలన్న చెన్నై చిన్నది త్రిష కోరిక నెరవేరనుందా? అది నెరవేరుతుందో? లేదో గానీ, అలాంటి ప్రయత్నాలు మాత్రం త్రిష ముమ్మరంగా చేస్తున్నట్లు కోడంబాక్కం వర్గాల తాజా సమాచారం. రజనీకాంత్తో మినహా త్రిష ఇతర ప్రముఖ కథానాయకులందరితోనూ నటించారని చెప్పవచ్చు. సూపర్స్టార్తో నటించాలన్నది ఆ అమ్మడి చిరకాల కోరిక. తన సహ నటీమణులైన నయనతార, శ్రీయ, అనుష్క, చివరికి రాధికాఆప్తే, ఆంగ్ల భామ ఎమీజాక్సన్ కూడా రజనీకాంత్తో నటించే అవకాశాన్ని అందుకున్నారు. తనకెందుకు అలాంటి అవకాశం రాలేదన్న ప్రశ్నను త్రిష చాలా సార్లు వేసుకున్నారట. కబాలి చిత్రంలో రజినీకాంత్తో జత కట్టే అవకాశం తనకు లభిస్తుందని ఈ బ్యూటీ ఆశించిదట. అరుుతే ఆ అవకాశం నటి రాధికాఆప్తేను వరించింది. ఎప్పటికై నా సూపర్స్టార్తో నటించి తీరతానన్న నమ్మకంతో ఉన్న త్రిష తాజాగా తన కోరికను నెరవేర్చుకొనే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇటీవల ధనుష్కు జంటగా కొడి చిత్రంలో నటించిన త్రిష తన నటనకు మంచి మార్కులు కొట్టేసిన విషయం తెలిసిందే. కాగా కబాలి చిత్ర కాంబినేషన్ రజనీకాంత్, దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వంలో మరో చిత్రం తెరకెక్కడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సంచలన చిత్రాన్ని రజనీకాంత్ అల్లుడు, నటుడు ధనుష్ తన వండర్బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించనున్నారు. దీంతో ఈ చిత్రంలో రజినీకాంత్తో రొమాన్స చేసే అవకాశం కోసం త్రిష ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో కథానాయకిగా అవకాశం లేకపోతే అతిథి పాత్రలోనైనా నటించడానికి రెడీ అంటున్నారట. త్రిష ప్రయత్నాలు ఫలించాలని ఆశిద్దాం. కాగా ప్రస్తుతం హీరోరుున్ ఓరియంటెడ్ కథా చిత్రం మోహినీని పూర్తి చేసే పనిలో ఉన్న త్రిష తాజాగా అరవిందస్వామికి జంటగా చతురంగవేటై్ట-2, విజయ్సేతపతి సరసన ఒక చిత్రంలో నటిస్తున్నారు. -
కబాలి తరువాత ఎస్3నే..!
చాలా రోజులుగా తన రేంజ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సూర్య, 24 సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చాడు. తన మార్క్ ప్రయోగాత్మక చిత్రంతోనే కమర్షియల్ సక్సెస్ కూడా సాధించి సత్తా చాటాడు. ఇప్పుడు తనకు బాగా కలిసొచ్చిన సింగం సీరీస్తో మరోసారి తన కలెక్షన్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు సూర్య. ఈ డిసెంబర్లో రిలీజ్ అవుతున్న ఎస్ 3 సినిమా ఇప్పటికే రికార్డ్ల వేట మొదలు పెట్టింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి తరువాత అంత వేగంగా మూడు మిలియన్ల వ్యూస్ సాధించిన చిత్రంగా నిలిచింది ఎస్3. ఇప్పటికే 4 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ఎస్ 3 మరిన్ని రికార్డ్ ల దిశగా దూసుకుపోతోంది. సూర్య సరసన అనుష్క, శృతిహాసన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీత దర్శకుడు. -
ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేసిన రజనీ!
దీపావళి పండుగ సందర్భంగా తన అభిమానులను సూపర్స్టార్ రజనీకాంత్ సర్ప్రైజ్ చేశాడు. రజనీ తాజా సినిమా ‘కబాలి’ చెన్నైలోని రోహిణీ థియేటర్లో వందరోజులు ఆడింది. ఈ సినిమా శతదినోత్సవం పూర్తి చేసుకోవడంతో అభిమానులు ఆదివారం థియేటర్ వద్ద సంబరాలు నిర్వహించారు. అనంతరం నేరుగా చెన్నైలోని పోయిస్ గార్డెన్లో ఉన్న రజనీ నివాసానికి వెళ్లారు. రజనీ తన అభిమానుల్ని సాదరంగా ఆహ్వానించడమే కాదు వారితో సరదాగా ముచ్చటించారు కూడా. ఈ సందర్భంగా తన అభిమానులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల అమెరికాకు వెళ్లిన రజనీ తాజాగా చెన్నై తిరిగొచ్చారు. దీపావళి పండుగ సందర్భంగా కూతురు ఐశ్వర్య, అల్లుడు ధనుష్, చిన్న కూతురు సౌందర్య, మనవలతో కలిసి దీపావళీ వేడుక చేసుకున్నారు. అనంతరం తన కోసం వచ్చిన అభిమానులకు ప్రత్యేకంగా సమయం కేటాయించి వారిని ఖుషీ చేశారు. దీంతో ఒకేరోజు డబుల్ పండుగ చేసుకున్నట్టు అభిమానులు సర్ప్రైజ్ అవుతున్నారు. ఇక, దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ‘రోబో-2’ సినిమా యూనిట్తో రజనీ త్వరలో జతకలుస్తున్నట్టు సమాచారం. -
మరోసారి అమెరికా వెళ్లిన రజనీకాంత్..?
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వల్లో నటిస్తున్న సంగతి తెలిసింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే టాకీ పార్ట్ షూటింగ్ పూర్తిచేసుకుంది. అదే జోరుతో సాంగ్స్ షూట్కు రెడీ అయిపోతున్నారు. ఈ సమయంలో ఓ షాకింగ్ న్యూస్ అభిమానులను కలవరపెడుతోంది. రజనీకాంత్ మరోసారి మెడికల్ చెకప్స్ కోసం అమెరికా వెళ్లారట. పాటల షూటింగ్ కోసం ఉక్రేయిన్ వెళ్లాల్సి ఉండగా రజనీ సడన్గా అమెరికా వెల్లటం పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కబాలి రిలీజ్ సమయంలో కూడా రజనీ చాలా కాలం పాటు అమెరికాలోనే చికిత్స తీసుకున్నారు. కబాలి ప్రమోషన్లో కూడా పాల్గొనకుండా 40 రోజులకు పైగా అమెరికాలో ఉన్నారు. తాజాగా మరోసారి అమెరికా వెళ్లారంటూ వస్తున్న వార్తలపై ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. -
రజనీని కలసిన థాయ్ యువరాణి
చెన్నై: తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ను కలవడానికే ప్రత్యేకంగా థాయ్లాండ్ యువరాణి మామ్ లూంగ్ రాజదరశ్రీ జయంకుర శుక్రవారం చెన్నైకి వచ్చారు. రజనీని ఆయన సొంతిట్లో కలసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. రజని ‘కబాలి’ సినిమా షూటింగ్ కొంతభాగం థాయ్లాండ్లో జరిగిన విషయం తెలిసిందే. అక్కడి షూటింగ్ సజావుగా సాగేందుకు యువరాణి జయంకుర సాయపడ్డారు. దాదాపుగా అరగంటకు పైగా వీరి ఇరువురి భేటీ జరిగినట్లు సమాచారం. పలు అంశాలను మామ్ లుయాంగ్ రజనీ వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. రజనీకాంత్ను కలిసినందుకు ఈ సందర్భంగా జయంకుర సంతోషం వ్యక్తం చేశారు. తమ దేశంలో రజనీకాంత్కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నట్లు తెలిపారు. కాగా ఈ సమావేశంపై రజనీకాంత్ కార్యాలయం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. -
కెరీర్పై దృష్టి పెట్టిన సూపర్ స్టార్ కూతురు
ఇటీవల విడాకుల వార్తలతో మీడియాలో కనిపించిన సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ప్రస్తుతం కెరీర్పై దృష్టి పెడుతోంది. ఇప్పటికే కొచ్చాడయాన్ లాంటి భారీ గ్రాఫిక్స్ చిత్రానికి దర్శకత్వం వహించిన సౌందర్య, గోవా అనే కామెడీ చిత్రాన్ని నిర్మించింది. మరోసారి అంతా కొత్త వారితో తెరకెక్కనున్న చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు తీసుకుంది. రజనీకాంత్ హీరోగా కబాలి లాంటి భారీ బ్లాక్ బస్టర్ను అందించిన ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు, నటీనటుల ఎంపిక కూడా జరుగుతున్నట్టుగా తెలిపారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాతో దర్శకురాలిగా సక్సెస్ సాధించాలన్న పట్టుదలతో ఉంది సౌందర్య రజనీకాంత్. -
ఆ సినిమా కబాలి 2 కాదు
రజనీకాంత్ హీరోగా కబాలి సినిమాను తెరకెక్కించిన పా రంజిత్, ఆ సినిమాతో ఆశించిన స్థాయి విజయం సాధించకపోయినా.. క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఒక సమయంలో టాప్ స్టార్లు కూడా పా రంజిత్ దర్శకత్వంలో సినిమా చేయడానికి క్యూ కట్టారు. అయితే కబాలి రిలీజ్ తరువాత మాత్రం సీన్ మారిపోయింది. ఆ సినిమా నిర్మాతలకు లాభాలు తీసుకు వచ్చినా.. డిస్ట్రిబ్యూటర్లు చాలా చోట్ల నష్టపోయారు. దీంతో ఇక రంజిత్కు స్టార్ హీరోలు ఛాన్స్ ఇవ్వటం కష్టమనే భావించారు అంతా. కానీ అందరికీ షాక్ ఇస్తూ రజనీ హీరోగా పా రంజిత్ మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడన్న వార్త హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమాను తానే నిర్మిస్తున్నట్టుగా రజనీ అల్లుడు, తమిళ హీరో ధనుష్ స్వయంగా ప్రకటించారు. దీంతో రజనీ హీరోగా రంజిత్ తెరకెక్కించబోయే సినిమా కబాలి 2 అంటూ ప్రచారం జోరుగా జరిగింది. ఈ విషయంపై స్పందించిన దర్శకుడు పా రంజిత్ క్లారిటీ ఇచ్చాడు. తాను రజనీ హీరోగా మరో సినిమా చేస్తున్న మాట నిజమేనని అయితే ఆ సినిమా కబాలి సీక్వల్ మాత్రం కాదని ప్రకటించాడు. ఓ కొత్త కథను రజనీకి వినిపించానని ఆయనకు కథ నచ్చి స్క్రిప్ట్ రెడీ చేయమన్నారని తెలిపాడు. ప్రస్తుతం రజనీ హీరోగా తెరకెక్కుతున్న రోబో సీక్వల్ పూర్తవ్వగానే పా రంజిత్ దర్శకత్వంలో మరో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
రజనీ మళ్లీ ఆయన్నే ఎందుకు ఎంచుకున్నట్టు?
శంకర్ '2.0' సినిమా షూటింగ్ కొనసాగుతుండగానే.. మరో సినిమాను ఫైనలైజ్ చేసి.. తన అభిమానుల్ని సంతోషంలో ముంచెత్తాడు రజనీకాంత్. 'కబాలి' దర్శకుడు పా రంజిత్తో తాను మరో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు సూపర్ స్టార్. ఈ సినిమాకు తన అల్లుడు ధనుష్ నిర్మాతగా ఉంటాడని తెలిపాడు. ఈ ప్రకటన సహజంగానే రజనీ అభిమానుల్ని థ్రిల్ చేసింది. సూపర్ హిట్ అయిన 'కబాలి'కి సీక్వెల్గా ఈ సినిమా రానున్నట్టు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పా రంజిత్ 'టైమ్స్ ఆఫ్ ఇండియా' పత్రికతో ముచ్చటిస్తూ తనకు మరోసారి ఎలా అవకాశం వచ్చిందో వివరించారు. 'కబాలి విడుదలైన కొన్నిరోజులకు సౌందర్య (రజనీ కూతురు) మేడం నాకు కాల్ చేశారు. కబాలి సినిమా పట్ల రజనీ చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఆయన నన్ను కలువాలనుకుంటున్నట్టు చెప్పారు. ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత మేం కలిశాం. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ 'నీతో పనిచేయడం ఎంతో బాగుంది. నీకు ఓకే అయితే, మనం కలిసి మళ్లీ ఒక సినిమా చేద్దాం' అన్నారు. దీంతో నేను ఎంతో సంతోషించాను. రజనీ సర్ సాధారణంగా దర్శకులకు రెండో అవకాశం ఇవ్వరు. ఇప్పటివరకు చాలా తక్కువమంది ఆయన నుంచి ఈ అవకాశం పొందారు' అని రంజిత్ చెప్పారు. ఈ సినిమాకు ధనుష్ నిర్మాతగా ఉంటారని రజనీయే చెప్పినట్టు వెల్లడించారు. అయితే, ఇది 'కబాలి' సినిమాకు సీక్వెలా? కాదా? అన్నది వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. ప్రస్తుతం తాను సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్టు చెప్పారు. -
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సూపర్ స్టార్
ఇటీవల కబాలి సినిమాతో అంతర్జాతీయ సినీ అభిమానులకు కూడా తన వైపు తిప్పుకున్న సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో సీక్వల్లో నటిస్తున్నాడు. భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2017 ద్వితియార్థంలో రిలీజ్ కానుంది. మరి ఇంతటి భారీ చిత్రం తరువాత రజనీ చేయబోయే సినిమా ఏంటి..? తాజాగా ఈ విషయంపై తమిళ నాట ఆసక్తికరమైన వార్త ఒకటి వినిపిస్తోంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ లను తెరకెక్కించే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రజనీ తన నెక్ట్స్ సినిమా చేయనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ధనుష్ హీరోగా సినిమా చేస్తున్న గౌతమ్ షూటింగ్ సయమంలో ధనుష్కు రజనీ కోసం తయారు చేసిన కథ వినిపించాడట. ధనుష్కు కథ నచ్చటంతో రజనీని కూడా ఒప్పించే పనిలో ఉన్నారట. ప్రస్తుతానికి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా ఈ కాంబినేషన్పై మాత్రం మంచి అంచనాలే ఉన్నాయి. -
రజనీని ఆకట్టుకున్న అభిమాని
-
కబాలి డైరెక్టర్తో సూర్య సినిమా లేనట్టేనా..?
ఇటీవల కాలంలో భారీ హైప్ క్రియేట్ చేసిన సౌత్ సినిమా కబాలి. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో దర్శకుడు పా రంజిత్కు కూడా అదే స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. అందుకే కబాలి రిలీజ్కు ముందే స్టార్ హీరోల నుంచి రంజిత్కు అవకాశాలు వచ్చాయి. తమిళ స్టార్ హీరో సూర్య అయితే తన నెక్ట్స్ సినిమా రంజిత్తోనే అని ప్రకటించేశాడు. అయితే కబాలి రిలీజ్ అయి ఇన్ని రోజులు గడుస్తున్న సూర్య, రంజిత్ల సినిమాపై ఎలాంటి క్లారిటీ లేదు. ముఖ్యంగా కబాలి రిలీజ్ తరువాత సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోవటంతో సీన్ రివర్స్ అయ్యింది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన కబాలి, నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టినా.. డిస్ట్రీబ్యూటర్లు మాత్రం నష్టపోయారన్న టాక్ వినిపించింది. దీంతో సూర్య కూడా రంజిత్తో చేయబోయే సినిమా విషయంలో ఆలోచనలో పడ్డాడట. ప్రస్తుతానికి రంజిత్తో చేయాలనుకున్న సినిమాను పక్కకు పెట్టే ఆలోచనలో ఉన్నాడు సూర్య. -
రెడీ ఫర్ యాక్షన్
యస్.. ఐయామ్ రెడీ ఫర్ యాక్షన్ అంటున్నారు రజనీకాంత్. రేపట్నుంచి చెన్నైలో ‘2.0’ తాజా షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లోనే రజనీ షూటింగ్కి హాజరు కానున్నారు. ‘కబాలి’ షూటింగ్ పూర్తయిన తర్వాత సూపర్స్టార్ మళ్లీ మేకప్ వేసుకోవడం ఇదే. అయితే.. ఈ నెలాఖరున లేదా సెప్టెంబర్ మొదటివారంలో రజనీ షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. అప్పటివరకూ మిగతా నటీనటులపై కీలక సన్నివేశాలు తెరకెక్కించడానికి దర్శకుడు శంకర్ ప్లాన్ చేశారట. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్గా డాక్టర్ రిచర్డ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లీకైన అక్షయ్ గెటప్ ఆడియన్స్లో ఆసక్తి కలిగిస్తోంది. సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న క్రోమ్యాన్గా అక్షయ్, రోబోగా రజనీకాంత్ చేసే యాక్షన్ సన్నివేశాలు చిత్రానికి హైలైట్గా నిలుస్తాయంటు న్నారు. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. -
వేలానికి కబాలి కోటు, కారు
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా కబాలి. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ తరువాత డివైడ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల విషయంలో మాత్రం దుమ్మురేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త రికార్డ్లను నమోదు చేస్తూ రజనీ కలెక్షన్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా రజనీకి ఉన్న క్రేజ్ను మరింత ఉపయోగించుకోవాలని భావిస్తున్న చిత్రయూనిట్ కొత్త ప్లాన్ చేస్తోంది. కబాలి సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ వినియోగించిన కారుతో పాటు ఆయన వేసుకున్న దుస్తులను కూడా వేలానికి ఉంచాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే వందల కోట్ల కలెక్షన్లతో సంచలనం సృష్టించిన కబాలి.. వేలం ద్వారా మరింత భారీ మొత్తాన్ని సొంతం చేసుకుంటుందని భావిస్తున్నారు. రజనీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇతర దేశాల నుంచి కూడా అభిమానులు వేలంలో పాల్గొంటారని.. అందుకు తగని ఏర్పాట్లు చేసే పనిలో ఉంది చిత్రయూనిట్. -
కబాలితో సమస్యలను ఎదుర్కొంటున్నా
తమిళసినిమా; కబాలి కారణంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్నాననీ ఆ చిత్ర దర్శకుడు రంజిత్ పేర్కొన్నారు.తమిళచిత్రపరిశ్రమలో స్క్రీన్ప్లే కింగ్గా పెరొందిన నట,దర్శక నిర్మాత కే.భాగ్యరాజ్ వారసుడు శాంతను కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వాయ్మై.ముక్తాభాను నాయకిగా నటించిన ఈచిత్రంలో గౌండ్రమణి,కే.భాగ్యరాజ్,పూర్ణిమా భాగ్యరాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.ఏ.సెంధిల్కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం స్ధానిక సాలిగ్రామంలోని ప్రసాద్ల్యాబ్లో నిర్వహించారు. తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.ధాను అతిధిగా పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించగా తొలి ప్రతిని దర్శకుడు రంజిత్ అందుకున్నారు.ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ సమాజిక కట్టుబాటులను ఆవిష్కరించే చిత్రం వాయ్మై అని పాటలు,ప్రచార చిత్రాన్ని చూస్తుంటే తెలుస్తోందన్నారు.ప్రస్తుత సమాజంలో ఒక వ్యక్తి నిజాయితీగా జీవించగలడా?అని ప్రశ్నించే ఈ చిత్ర కధను తెరకెక్కించడానికి చాలా ధైర్యం కావాలన్నారు.తొలి చిత్రంతోనే అలాంటి ధైర్యంతో దర్శకుడు ఏ.సెంధిల్కుమార్ వాయ్మై చిత్రాన్ని తెరకెక్కించారని అన్నారు. ఇంతకు ముందు దర్శక నటుడు కే.భాగ్యరాజ్ ఇదు నమ్మఆళ్లు చిత్రానికి చాలా సమస్యలను ఎదుర్కొన్నారన్నారు.అదీ సామాజంలోని మూఢ ఆచారాలను తూర్పారబట్టిన కథా చిత్రం అని గుర్తు చేశారు.తాను కబాలి చిత్రంతో అలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.ఒక కళాకారుడిగా ప్రజల కోసం సమాజాన్ని,రాజకీయాలను ప్రశ్నించే చిత్రాలను చేయాలన్నారు.విమర్శించేవారు విమర్శిస్తునే ఉంటారనీ దర్శకుడు రంజిత్ వ్యాఖ్యానించారు. -
'కబాలి' కోసం బలి!
సూపర్ స్టార్ రజనీకాంత్ 'కబాలి' కళ్లు చెదిరే రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. రిలీజ్కు ముందే భారీ హైప్ను క్రియేట్ చేసిన ఈ సినిమా కథ పరంగా కాస్త నిరాశపరచినా.. కలెక్షన్ల పరంగా కాసుల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దాంతో తలైవా ఫ్యాన్స్ సంబరాలు జరుపుకొంటున్నారు. సూపర్ స్టార్ను అభిమానించేవారికన్నా ఆరాధించేవారి సంఖ్యే ఎక్కువన్న విషయం తెలిసిందే. ఆయన సినిమా విడుదలవుతుందంటే చాలు.. రజనీ విగ్రహాలకు పాలాభిషేకాలు, హారతులు కామన్. ఈసారి మరో అడుగు ముందుకేసి జంతు బలికి పూనుకున్నారు రజనీ ఫ్యాన్స్. కబాలి భారీ సక్సెస్ అయ్యి, రికార్డు కలెక్షన్లు రాబడుతున్నందున దిష్టి తగలకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో మేకలను దేవుడికి బలి ఇస్తున్నారట ఫ్యాన్స్. ఎలాంటి చెడు చూపు సినిమా కలెక్షన్లపై పడకుండా, ఎటువంటి చెడు జరుగకుండా ఉండాలని కోరుకుంటూ మేకలను బలిచ్చే పనిలో ఉన్నారు సూపర్ స్టార్ వీరాభిమానులు. అయితే మూగజీవాలను ఇలా హింసించడం పట్ల జంతు ప్రేమికుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఫ్యాన్స్ అనాలోచిత కార్యక్రమాలను ఆపేందుకు తలైవానే నడుం బిగించాలని పలువురు కోరుకుంటున్నారు. -
కబాలి కలెక్షన్లు 600 కోట్లా..?
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా కబాలికి సంబందించి మరో ఆసక్తికరమైన వార్త మీడియా సర్కిల్స్లో వినిపిస్తోంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన కబాలి డివైడ్ టాక్తో మొదలైనా.. కలెక్షన్ల పరంగా మాత్రం సంచలనాలు నమోదు చేసింది. ప్రీవ్యూ షోస్ తోనే రికార్డ్లకు తెర తీసిన కబాలి, తొలి రోజు కలెక్షన్ల విషయంలో బాలీవుడ్కు కూడా సాధ్యం కాని భారీ రికార్డ్ సెట్ చేసింది. తాజాగా ఈ సినిమా కలెక్షన్లపై వినిపిస్తున్న వార్త బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా షాక్ ఇస్తోంది. ఇప్పటికీ భారీ సంఖ్యలో థియేరట్లలో కొనసాగుతున్న కబాలి, 600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిందన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఈ కలెక్షన్లపై అఫీషియల్గా ఎలాంటి ప్రకటనా లేకపోయినా ఫ్యాన్స్ కబాలి కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. -
కబాలి వర్సెస్ సుల్తాన్.. గెలిచిందెవరు?
ఈ సీజన్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకున్న సినిమాలు రెండు. అవి సల్మాన్ ఖాన్ సుల్తాన్.. రజనీకాంత్ కబాలి. 'కబాలి' విడుదలయ్యే వరకు సుల్తాన్ బాక్సాఫీసును దున్నేశాడు. రికార్డు వసూళ్ల ప్రభంజనం సృష్టించాడు. కానీ, కబాలి ఎంట్రీతో సుల్తాన్ సైడ్ అయ్యాడు. కబాలి తన జోరు ఏంటో చూపాడు. రజనీ మానియాలో దేశం ఊగిపోయింది. బాక్సాఫీసు రికార్డులన్నీ బద్దలయ్యాయి. దీంతో సహజంగానే దేశంలో ఎవరు అతిపెద్ద సూపర్ స్టార్ అని చర్చ అభిమానుల్లో మొదలైంది. బాలీవుడ్ ఖాన్ త్రయం సల్మాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ అందనంత స్థాయిలో రజనీ హల్చల్ చేశాడు. దేశంలో బిగ్గెస్ట్ స్టార్ సల్మానా? రజనీకాంతా? అన్న చర్చ అభిమానుల మొదలైంది... విడుదలకు ముందే కబాలి సినిమా కనీవినీ ఎరుగని క్రేజ్ సంపాదించుకుంది. దేశం మొత్తం రజనీ నామస్మరణలో మునిగిపోయింది. అంచనాలు ఆకాశాన్నంటాయి. దీంతో చెన్నై, బెంగళూరులోని పలు కంపెనీలు విడుదల రోజున సెలవు ప్రకటించాయి. జపాన్ అభిమానులు ఏకంగా విమానంలో చెన్నైకి వచ్చి తొలిరోజు సినిమా చూశారు. విడుదల రోజున ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు షోలు హౌస్ఫుల్ నడిచాయి. అభిమానులైతే 'కబాలి' రిలీజ్ నాడు జనజాతర చేశారు. రజనీ కటౌట్లను పాలాభిషేకాలతో ముంచెత్తారు. తొలిరోజు 90శాతం ఆక్యూపెన్సీతో రజనీ తన స్టామినా ఏంటో చూపించాడు. రిలీజ్ మానియా విషయంలో సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' తేలిపోయింది. రజనీ సినిమాకు వచ్చిన ప్రీ రిలీజ్ క్రేజ్.. దేశంలో మరే స్టా్ర్ హీరో సినిమాకూ ఇప్పటివరకు రాలేదు. బాక్సాఫీసు వసూళ్ల విషయానికొస్తే కబాలి అన్ని రికార్డులను బద్దలుకొట్టాడు. ఒక్క బాహుబలి సినిమా రికార్డును మాత్రం కబాలి చిత్రం అందుకోలేకపోయింది. తొలిరోజు సుల్తాన్ సినిమా రూ. 36.5 కోట్లు వసూలు చేస్తే.. కబాలి ఏకంగా రూ. 48 కోట్లు కొల్లగొట్టింది. చాలా మల్టిప్లెక్స్ థియేటర్లలో తొలిరోజు సుల్తాన్ సినిమా టికెట్లను రూ. 300-350 వరకు అమ్మారు. అదే కబాలి విషయానికొస్తే మల్టిప్లెక్స్ హాల్స్లోనూ టికెట్ ధర రూ. 120కి మించలేదు. అయినా సుల్తాన్ రికార్డును కబాలి దాటాడు. ఓవర్సీస్ వసూళ్లు: అంతర్జాతీయ కలెక్షన్ల విషయంలోనూ కబాలి విజేతగా నిలిచాడు. అమెరికా బాక్సాఫీసు వద్ద భారతీయ సినిమా రికార్డులన్నింటినీ కబాలి కొల్లగొట్టింది. ఓవర్సీస్లోనూ సుల్తాన్ రికార్డులను కబాలి అవలీలగా దాటాడు. ప్రమోషన్స్: 'రేప్' వ్యాఖ్యల వివాదంలో చిక్కుకున్న సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' సినిమా ప్రమోషన్లో పెద్దగా పాల్గొనలేదు. ఈ వివాదం వల్ల విలేకరులతోనూ మాట్లాడలేదు. ఇక రజనీకాంత్ తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొన్నారు. 'కబాలి' సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆయన మచ్చుకైనా కనిపించలేదు. సినిమా విడుదలకు నెల ముందే అమెరికాకు వెళ్లిపోయారు. విడుదలయ్యాక వచ్చారు. అయినా రజనీ మానియా దేశాన్ని చుట్టుకుంది. విమానాలపై పోస్టర్ల నుంచి కార్లపై ఫొటోలు, కటౌట్లు, ఆన్లైన్ అమ్మకాలు ఇలా సర్వత్రా రజనీ మ్యాజిక్ అంటే ప్రపంచానికి చూపింది. ఇంతకంటే ప్రూఫ్ కావాలా రజనీ దేశంలో ఎంతపెద్ద స్టారో చెప్పడానికి అంటున్నారు ఫ్యాన్స్.. -
'బాహుబలి' రికార్డు సేఫ్!
చెన్నై: బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన రజనీకాంత్ 'కబాలి' మొదటి వారం తర్వాత నెమ్మదించింది. అయితే ఫస్ట్ వీక్ లో మాత్రం రికార్డు వసూళ్లు సాధించింది. మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.262 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ ట్రేకర్ బి. రమేశ్ వెల్లడించారు. 'కబాలి' సినిమా ఇండియా రూ.149 కోట్లు నెట్ వసూళ్లు సాధించింది. గ్రాస్ కలెక్షన్ రూ.172 కోట్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 90 కోట్లు వసూలు చేసిందని, మొత్తంగా మొదటి వారంలో రూ. 262 కోట్లు కొల్లగొట్టిందని ట్విట్టర్ ద్వారా రమేశ్ తెలిపారు. 'బాహుబలి' రికార్డును తమ సినిమా బ్రేక్ చేస్తుందని కబాలి' నిర్మాత కళైపులి ఎస్. థాను అంతకుముందు ప్రకటించారు. అయితే కలెక్షన్లు తగ్గిపోవడంతో 'బాహుబలి' రికార్డును 'కబాలి' చేరుకోవడం కష్టం అంటున్నారు విశ్లేషకులు. విడుదలైన మొదటి నుంచే భారీ వసూళ్లు రాబట్టిన 'బాహుబలి' రూ.500 కోట్ల మైలురాయిని అందుకుంది. 'కబాలి' కలెక్షన్లు రూ.500 కోట్లు దాటటకపోవచ్చని విశ్లేషకులు అంచనా. నార్త్ ఇండియాలోనూ 'బాహుబలి' తర్వాతే కబాలి నిలిచిందని డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఫాక్స్ స్టార్ వెల్లడించింది. -
'రజనీకాంత్ను వృద్ధాశ్రమంలో చేర్చండి'
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి చిత్రం విడుదలైనా... ఆ సినిమా గురించి రోజుకో వార్త వెలువడుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ యువకుడు తాను మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే... రజనీకాంత్ను తమిళ నిర్మాతల నుంచి కాపాడి వృద్ధాశ్రమంలో చేర్చాలంటూ చెన్నై వడపళినికి చెందిన కందస్వామి అనే వ్యక్తి నగర పోలీస్ కమిషనర్ కు రెండురోజుల క్రితం ఓ వినతిపత్రం సమర్పించాడు. 'రజనీకాంత్ హీరోగా ఇటీవల విడుదలైన కబాలీకి ఎక్కువగా ప్రచారం చేసి వెంటనే చూడాలనే ఆసక్తిని రేకెత్తించారు. దీంతో అశోక్ నగర్ లోని కాశీ థియేటర్లో రూ.1200లకు టికెట్ కొని కబాలి సినిమా చూశాను. అయితే హీరో రజనీకాంత్, దర్శకుడు రంజిత్ ఇద్దరూ మోసం చేశారు. 66 ఏళ్ల సీనియర్ సిటిజన్ అయిన రజనీకాంత్ చేత ఫైట్స్ చేయించి నిర్మాత, దర్శకులు నన్ను చిత్రవధ చేశారు. సీనియర్ సిటిజన్స్కు తమిళనాడు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. తమిళ నిర్మాతల నుంచి రజనీకాంత్ ను కాపాడి వృద్ధాశ్రమంలో చేర్చండి.' అంటూ కందస్వామి వినతిపత్రంలో పేర్కొన్నాడు. -
కబాలి టైటిల్స్ పై వివాదం.. ఫిర్యాదు
సుల్తాన్బజార్(హైదరాబాద్): డివైడ్ టాక్ వచ్చినా భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం 'కబాలి'పై తొలిసారిగా వివాదం చెలరేగింది. సినిమా టైటిట్స్ లో రజనీకాంత్ పేరు ముందు పద్మవిభూషణ్ బిరుదును ఉంచడంపై తెలంగాణ రక్షణ వేదిక(టీఆర్ వి) మండిపడింది. శుక్రవారం హైదర్ గూడలోని న్యూస్ సర్వీస్ సిండికేట్(ఎన్ఎస్ఎస్)లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మల్లేష్యాదవ్ మాట్లాడారు. కబాలిలో హీరో పేరును 'పద్మవిభూషణ్' రజనీకాంత్ గా చూపారని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 18(1) ప్రకారం అలా చేయడం చట్టవిరుద్ధమని టీఆర్ వి అధ్యక్షుడు అన్నారు. నటీనటులు తమకు లభించిన పౌరపురస్కారాలను సినిమా టైటిళ్లలో ప్రదర్శించరాదంటూ గతంలో నటులుమోహన్ బాబు, బ్రహ్మానందంల కేసుల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులను ఆయన గుర్తుచేశారు. ఈ మేరకు 'కబాలి' సినిమా సంబంధిత వ్యక్తులపై సెన్సార్ బోర్డు రిజినల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. -
ఉత్తరాదిన కబాలి ప్రభంజనం
న్యూఢిల్లీ: బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దలుకొడుతున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కబాలి దక్షిణాదిలోనే కాదు ఉత్తరాదినా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నెల 22న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు హిందీ వర్షెన్లో 28 కోట్ల రూపాయలను వసూలు చేసింది. తెలుగు చిత్రం బాహుబలి తర్వాత ఉత్తరాదిన అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో దక్షిణాది సినిమాగా కబాలి నిలిచింది. పా రంజిత్ దర్శకత్వం వహించిన కబాలి సినిమాను తమిళం, తెలుగు, హిందీ ఇతర భాషల్లో విడుదల చేశారు. కబాలి ప్రపంచ వ్యాప్తంగా 320 కోట్ల వసూళ్లు సాధించినట్టు గురువారం ఈ సినిమా నిర్మాత థాను ప్రకటించాడు. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినా భారత్తో పాటు విదేశాల్లోనూ రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. మలేసియాలో నివసించే తమిళుల హక్కుల కోసం పోరాడే గ్యాంగ్స్టార్ పాత్రలో రజనీ నటించారు. రజనీ సరసన బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే, కూతురిగా ధన్సిక నటించారు. -
సారీ చెప్పిన కబాలి హీరోయిన్..
బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దలుకొడుతున్న కబాలిలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించి మంచి మార్కులు కొట్టేసిన బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తోంది. కాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొననందుకు విచారం వ్యక్తం చేసింది. ఇందుకు క్షమాపణలు చెప్పింది. కబాలి ప్రమోషన్కు దూరమవడం దురదృష్టకరమని, మరో సినిమా షూటింగ్లో పాల్గొనాల్సిరావడమే దీనికి కారణమని చెప్పింది. కబాలి సినిమా విడుదల తేదీని అనుకోకుండా ప్రకటించారని, ఆ సమయంలో తాను వేరే సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నానని రాధిక తెలిపింది. ఈ సినిమా అన్ని రికార్డులు బద్దలుకొడుతోందని, రజనీకాంత్తో నటించే అవకాశం రావడాన్ని గొప్పగా భావిస్తున్నానని చెప్పింది. తాను నటించిన మంచి పాత్రల్లో ఈ సినిమాలోనిది ఒకటంటూ, సినిమా గొప్ప విజయం సాధించినందుకు సంతోషంగా వ్యక్తం చేసింది. కబాలి సినిమాలో రజనీకాంత్ భార్యగా రాధికా, కూతురుగా మరో కీలకపాత్రలో ధన్సిక నటించింది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా భారీ కలెక్షన్లు సాధిస్తోంది. -
300 కోట్లు దాటిన 'కబాలి' కలెక్షన్స్
సూపర్ స్టార్ రజనీకాంత్ కలెక్షన్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయ్యింది. సూపర్ హిట్ టాక్ రాకపోయినా కేవలం రజనీ ఫాలోయింగ్తో కబాలి సరికొత్త రికార్డ్లు సృష్టిస్తోంది. రజనీకాంత్, పేదల కోసం పోరాడే మాఫియాడాన్గా నటించిన ఈ సినిమా.. భారత్తో పాటు ఇతర దేశాల్లో కూడా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలి వారం కాస్త తడబడినట్టుగా కనిపించినా ప్రస్తుతం కలెక్షన్లు బాగానే ఉన్నాయంటున్నారు చిత్రయూనిట్. గురువారం సాయంత్రం చెన్నైలో జరిగిన సక్సెస్ మీట్లో కలెక్షన్లపై నిర్మాత థాను క్లారిటీ ఇచ్చారు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కబాలి ప్రపంచ వ్యాప్తంగా 320 కోట్ల వసూళ్లు సాధించినట్టుగా ప్రకటించారు. రజనీ మానీయా కారణంగా కేవలం ఆరు రోజుల్లో ఈ కలెక్షన్లు సాధ్యమయ్యాయన్నారు. ఇప్పటికే తొలి రోజు రికార్డ్ల విషయంలో టాప్గా నిలిచిన కబాలి, రోబో కలెక్షన్ల రికార్డ్లను చెరిపేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. -
కబాలిలో ‘మై ఫాదర్ బాలయ్య’
కబాలి సినిమాలో తెలంగాణ రచయిత పుస్తకం సూపర్స్టార్ రజనీకాంత్ చేతిలో దర్శనం ‘మై ఫాదర్ బాలయ్య’ పుస్తకానికి అంతర్జాతీయ గుర్తింపు ఖండాంతరాలు దాటిన వైబీ సత్యనారాయణ ఖ్యాతి ఆ పుస్తకంలో కళ్లకుకట్టినట్టుగా కుల వివక్ష చర్చనీయాంశమైన పుస్తక సారాంశం ‘సాక్షి’తో రచయిత ప్రొఫెసర్ వైబీ మనోగతం తెలంగాణ రచయిత వైబీ సత్యనారాయణకు కబాలి సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఈయన తన కుటుంబ నేపథ్యాన్ని వివరిస్తూ రాసిన‘మై ఫాదర్ బాలయ్య’ పుస్తకం తాజాగా కబాలి సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేతిలో దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది. రచయిత పుస్తకం కుల వివక్షపై, కబాలి సినిమాను జాతి వివక్ష ఆధారంగా నిర్మించడంతో ఈ పుస్తకం రజనీ చెంతకు చేరింది. రచయిత ప్రొఫెసర్ వైబీ సత్యనారాయణ మిరుదొడ్డికి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో తన మనోగతాన్ని పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... – మిరుదొడ్డి కుటుంబ నేపథ్యం.. మాది కరీంనగర్ జిల్లా, కమలాపురం మండలం, వంగపల్లి గ్రామం. మా అయ్య, అవ్వ పేర్లు నర్సమ్మ, బాలయ్య. వారికి మేము ఐదుగురం సంతానం. అందులో నేను ఐదోవాడిని. మా అన్నదమ్ముల్లో ముగ్గురు డాక్టరేట్లు కావడం విశేషం. అప్పటి కాలంలో అంటరాని కులంలో ఇంత పెద్ద చదువు చదవడం చరిత్రగా చెప్పుకునే వారు. మా అయ్య రైల్వేలో చిరు ఉద్యోగిగా ఉంటటం వల్ల మా విద్యాభ్యాసం రైల్వే స్కూళ్లలోనే సాగింది. మా అయ్య ఉద్యోగి కావడంతో అప్పుడప్పుడు బదిలీల పేరిట వలస వెళ్లే వారిమి. వలస వెళ్లిన ప్రదేశాల్లో అంటరాని కులమని వివక్ష చూపించే వారు. పుస్తకం రాయాలన్న ఆలోచన కలిగింది ఇక్కడే... తరతరాలుగా నా కుటుంబం కులపరంగా వివక్ష ఎదుర్కొంటున్న నేపథ్యాన్ని ఒక పుస్తక రూపం ఇవ్వాలని అనిపించింది. మా ముత్తాత, తాత, మా అయ్య, నేను ఎదుర్కొన్న వివక్షకు పుస్తక రూపమిచ్చా. అందులో ఒకే కుటుంబానికి చెందిన నాలుగు తరాల కుటుంబాలు కుల వివక్షకు గురైతే కబాలిలో ఒక దేశ జాతి వివక్షకు గురయ్యే విధానాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇది చెప్పుకోదగిన విషయం. ఆ పుస్తకంలో ఏముందంటే... తెలంగాణలో ఒకే కులం, ఒకే కుటుంబం నాలుగు తరాలుగా ఏ విధంగా వివక్షకు గురైందనేది పుస్తకంలో పొందుపర్చాను. అందులో ముందుగా మా ముత్తాత నర్సయ్య.. మాదిగ కులంలో పుట్టినందుకు ఎన్నో విధాలుగా వివక్షకు గురయ్యాడు. చెప్పులు కుట్టడంలో మంచి నేర్పరి. ఒకానొక సందర్భంలో నిజాం నవాబుకు మంచి చెప్పులు కుట్టి ఇవ్వాలన్న పట్టుదలతో ఓ మంచి లేత ఆవు దూడ తోలుతో సుతి మొత్తని చెప్పులు కుట్టి నవాబు కాళ్లకు తొడిగాడు. చెప్పులు కుట్టడంలో మంచి నేర్పరి తనానికి మెచ్చుకున్న నిజాం నవాబు మా మూత్తాతకు 50 ఎకరాల జమీను (భూమి) ఫరాణ (జీవో) ఇవ్వాలని ఆదేశించారు. మాదిగ కులానికి చెందిన నర్సిగానికి నిజాం నవాబు 50 ఎకరాల భూమి ఇచ్చిన విషయం తెలుసుకున్న పటేలు... నీచపు జాతికి చెందిన నీకు ఎందుకురా 50 ఎకరాలు అంటూ 48 ఎకరాలు పటేలు స్వాధీనం చేసుకున్నాడు. కేవలం రెండు ఎకరాలు మాత్రమే సాగు చేసుకోమ్మని మా ముత్తాతను బెదిరించాడు. అప్పటికి పటేళ్లు చెప్పిందే వేదం. మా ముత్తాతకు వచ్చిన రెండు ఎకరాలు మా ముత్తాత కొడుకు పెద్ద మాదిగ నర్సయ్యకు (ముత్తాత కొడుకు పేరు కూడా నర్సయ్యనే) వారసత్వంగా వచ్చింది. వారసత్వంగా వచ్చిన రెండు ఎకరాల్లో మా తాత నర్సయ్య, మా తాతమ్మ పోచవ్వలు మంచిగా సాగు చేసుకుంటున్న తరుణంలో పటేలు కొడుకు దౌర్జన్యం చేశాడు. రెండకరాల సాగుకు నీరందకుండా అడ్డుపడి ఉన్న ఉపాధి బందు జేయించిండు. మా తాత కొడుకు బాలయ్య (అంటే మా అయ్య) మా ఊర్లె ఆలీ సాబు అనే ముస్లిం తాత మా అయ్యకు చదువు నేర్పించాడు. ఆ చదువుతో మా అయ్య బాలయ్య రైల్వేలో చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఉద్యోగ రీత్యా బదిలీల రూపంలో వలసలు వెళ్లేవారిమి. అక్కడ కూడా అంటరాని కులమని చాలా చులకనగా చూసేవారు. మా అయ్య బాలయ్య ఎన్ని అడ్డంకులు ఎదురైనా చదువు విషయంలో రాజీపడక పోతుండే. ఆయన ఆశయాన్ని నెరవేర్చడానికి మేము కష్టపడి చదివాం. మాకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పర్చుకున్నాం. అందుకే నేను రాసిన పుస్తకానికి ‘మై ఫాదర్ బాలయ్య’ అన్న పేరు పెట్టుకున్నా. మై ఫాదర్ బాలయ్య పుస్తకం దేశంలో ఉన్న కుల వివక్షను ఎత్తి చూపుతుంది. కూలీ నుంచి నాయకత్వ లక్షణాల వరకు బతుకు దెరువు కోసం వలస వెళ్లే వారి కూలీ బతుకుల్లో నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని నా పుస్తకం చెబుతుంది. ఒకే కుటుంబంలో నాలుగు తరాలు వివక్షను ఎదుర్కొన్న నేపథ్యాన్ని మై ఫాదర్ బాలయ్య తెలియ జేస్తే, ఒక దేశ జాతి వివక్షను కబాలి సినిమా తెలియజేస్తూనే కూలీ నుంచి నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని స్ఫూర్తినిస్తోంది. కరీంనగర్లో సంబరాలు చేసుకున్నారు... కబాలి చిత్రం విడుదలైన మొదటి రోజే కరీంనగర్ ప్రజలు సంబరాలు చేసుకున్నట్టు మిత్రుల ద్వారా తెలుసుకుని చాలా సంతోషించా. కబాలి చిత్ర హీరో రజనీకాంత్ చేతిలో మా కరీంనగర్ వాసి రాసిన మై ఫాదర్ బాలయ్య పుస్తకం ఉండటం చూసి జిల్లా వాసులు ఎంతో సంబరపడిపోయారు. ఒక అంతర్జాతీయ చిత్రంలో తెలంగాణకు చెందిన దళిత రచయిత రాసిన పుస్తకం కనిపించడం సంతోషంగా ఉందని తెలంగాణ ప్రజలు అభినందనలు తెలుపుతుండటం గర్వంగా ఉంది. ఎడ్యుకేషన్ ద స్ట్రాంగెస్ట్ వెపన్ సమాజంలో అసమానతలను రూపుమాపాలంటే చదువు ఒక్కటే మార్గం. ఎడ్యుకేషన్ ద స్ట్రాంగెస్ట్ వెప(విద్య అనేది అత్యం త పదునైన ఆయుధం). ప్రతి వ్యక్తిలో విద్య అనేది ఉంటే దేశంలో పేట్రేగిపోతున్న అసమానతలను చీల్చుకుంటూ ముందుకు సాగవచ్చు. ఒక మనిషిని ఉన్నత స్థానాన్ని చేరుకోవాలంటే బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తేనే సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు లభిస్తుంది. నా అసలు పేరు... నా అసలు పేరు ఎలుకటి సత్తయ్య. నా సతీమణి గాయత్రి. చదువుతున్న రోజుల్లో నేనే అన్నిట్లో హుషారుగా ఉన్నానని మా హెడ్మాస్టర్.. మా అయ్య పేరు కలిసేటట్టు ఎలుకటి బాలయ్య సత్యనారాయణగా పేరు మార్చారు. కబాలి చేతికి ఆ పుస్తకం ఎలా వెళ్లిందంటే... నేను రాసిన మై ఫాదర్ బాలయ్య పుస్తకం కేవలం ఇంగ్లిష్లోనే మార్కెట్లో లభ్యమయ్యేది. ప్రస్తుతం హిందీ, కన్నడ భాషల్లో అనువాదమై జాతీయ స్థాయిలో మంచి పేరు లభించింది. కాగా ఇదే పుస్తకాన్ని తమిళంలో అనువాదం చేయడానికి తమిళనాడుకు చెందిన జీనీ అనే మహిళ ఇంగ్లిష్లో ఉన్న మై ఫాదర్ బాలయ్యను తమిళ భాషలోకి అనువదిస్తున్నారు. ఆశ్చర్యమేమిటంటే జీనీ అనే మహిళ కబాలి డైరెక్టర్ పారంజిత్ వద్ద అసిస్టెంటు డైరెక్టర్గా పని చేస్తున్నారు. నాలుగు తరాల కుటుంబం వివక్షతను ఎదుర్కొంటున్న నేపథ్యం, ఒక దేశ జాతి నాలుగు తరాలుగా ఎదుర్కొంటున్న వివక్షకు దగ్గరి పోలిక ఉండటంతో మై ఫాదర్ బాలయ్య పుస్తకాన్ని డైరెక్టర్ పారంజిత్ ద్వారా తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ వద్దకు చేరింది. కబాలి చిత్ర కథకు, ఈ పుస్తకానికి ఒకే రకమైన సందేశం ఉండటంలో రజనీకాంత్ ఓకే చెప్పారు. కబాలి చిత్ర కథ ప్రారంభంలోనే హీరో రజనీకాంత్ చేతిలో ఈ పుస్తకం ఉండేలా చిత్రీకరించారు. అప్పటికే జాతీయ స్థాయిలో పేరున్న ఈ పుస్తకం కబాలి చిత్రంలో కన్పించడంతో అంతర్జాతీయంగా గుర్తింపు లభించినట్లయింది. -
కబాలి రికార్డ్ బ్రేక్ చేసిన బాహుబలి
సౌత్ సినిమా రేంజ్ రోజు రోజుకు భారీగా పెరిగిపోతుంది. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాకు మాత్రమే సాధ్యం అనుకున్న వందల కోట్ల కలెక్షన్లను ఇప్పుడు సౌత్ సినిమాలు కూడా అవలీలగా సాధించేస్తున్నాయి. టాప్ స్టార్ల సినిమాలు ప్రీ రిలీజ్ బిజినెస్లోనే వంద కోట్ల కలెక్షన్లకు చేరువవుతున్నాయి. ఇక ప్రపంచ సినీ అభిమానులను సైతం తన వైపు తిప్పుకున్న కబాలి సౌత్ సినిమా రేంజ్ ఏంటో ప్రూవ్ చేసింది. అయితే ఇంతటి భారీ కలెక్షన్లు సాధించిన కబాలి రికార్డ్లు అప్పుడే బ్రేక్ అవుతున్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ బాహుబలి 2 రికార్డుల వేట మొదలుపెట్టింది. ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలు పెట్టిన బాహుబలి యూనిట్, తొలి అడుగులోనే కబాలి రికార్డ్ను బద్దలు కొట్టి సత్తా చాటింది. కబాలి సినిమా మళయాల రైట్స్ను హీరో మోహన్ లాల్ 7.5 కోట్లకు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆ రికార్డ్ను బ్రేక్ చేస్తూ బాహుబలి 2 మళయాల రేట్స్ 10.5 కోట్లకు అమ్ముడయ్యాయి. మాలీవుడ్లో ప్రముఖ డిస్ట్రీబ్యూషన్ కంపెనీగా పేరున్న గ్లోబల్ యునైటెడ్ మీడియా ఈ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసి బాహుబలి రైట్స్ సొంతం చేసుకుంది. బాహుబలి తొలి భాగం రైట్స్ను కూడా ఇదే కంపెనీ సొంతం చేసుకోవటం విశేషం. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో క్లైమాక్స్ చిత్రీకరణలో ఉన్న బాహుబలి 2 సినిమాను 2017 ఏప్రిల్ 14 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
ఐదున్నరకు ఏం జరిగింది?
‘5:35’.. సూర్య నటించనున్న చిత్రం టైటిల్ ఇది. ఈ టైటిల్ వెనక దాగున్న రహస్యం ఏంటి? ఐదు గంటల ముప్పైఐదు నిమిషాలకు ఏం జరిగింది? అనేది చెప్పబోతున్నారా? మరొకటి ఏమైనా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం కొన్ని రోజుల్లో దొరుకుతుంది. రజనీకాంత్ని ‘కబాలి’గా చూపించిన దర్శకుడు పా.రంజిత్ ఈ ‘5:35’ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో సూర్య బాక్సర్గా కనిపిస్తారట. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సెప్టెంబర్లో షూటింగ్ మొదలు కానుంది. సూర్య తమ్ముడు కార్తి, పా.రంజిత్ కలయికలో వచ్చిన ‘మద్రాస్’ ఘనవిజయం సాధించింది. ‘కబాలి’ కథను మొదట విన్నది సూర్యనే. నాకంటే రజనీకాంత్ గారికి ఈ కథ బాగుంటుందని రంజిత్ను స్వయంగా సూపర్స్టార్ వద్దకు తీసుకువెళ్లి, ఆ సినిమా తెరకెక్కడానికి కారణమయ్యారు. రజనీని చాలా స్టైలిష్గా చూపించిన రంజిత్ ఇప్పుడీ ‘5:35’లో సూర్యను ఎలా చూపించబోతున్నారో! ప్రస్తుతం సూర్య నటిస్తున్న ‘సింగం 3’ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. -
రజనీకాంత్కు భారతరత్న!
మహారాష్ట్ర ఎమ్మెల్యే ప్రతిపాదన ముంబై: సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘కబాలి’.. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాతో దేశమొత్తం రజనీ నామస్మరణలో మునిగిపోయింది. సినిమాకు రివ్యూలు ఎలా వచ్చినా కలెక్షన్ల వర్షం భారీగా కురుస్తూ.. తలైవా స్టామినా ఏమిటో చాటుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే అనిల్ గోటే ఓ అరుదైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న’ను రజనీకాంత్కు ప్రదానం చేయాలని ఆయన కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అత్యున్నత పురస్కారం ‘మహారాష్ట్ర భూషణ్’ను రజనీకాంత్కు ఇవ్వాలని ఆయన దేవేంద్ర ఫడ్నవిస్ సర్కారుకు ప్రతిపాదించారు. పనిలో పనిగా రజనీకాంత్కు ‘భారత రత్న’ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మహారాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన కోరారు. రజనీని మహారాష్ట్ర భూమిపుత్రుడిగా అభివర్ణించిన ఎమ్మెల్యే గోటే.. ఆయన అభిమానులకు దేవుడితో సమానమని, తాజా సినిమా సక్సెస్ సినీ పరిశ్రమలో రజనీకున్న స్థానాన్ని చాటుతున్నదని పేర్కొన్నారు. అసాధారణ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘కబాలి’ ఇప్పటికే రూ. 200 కోట్ల క్లబ్బులో ఎంటరైంది. దక్షిణాదిన ఈ సినిమాకు భారీ వసూళ్లు వస్తుండటంతో ‘కబాలి’ కలెక్షన్లు రూ. 300 కోట్లకు చేరవచ్చునని భావిస్తున్నారు. -
సంపూ బాబు, రజనీ మీదే కౌంటరేశాడు..!
యూట్యూబ్ సెన్సేషన్తో వెండితెర మీద అడుగుపెట్టిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, ఎప్పటికప్పుడు తన ఫాలోయింగ్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. సోలో హీరోగా సినిమాలు చేస్తూనే కామెడీయన్గా కూడా దూసుకుపోతున్న సంపూ, తన ట్విట్టర్ పేజ్లో స్టార్ హీరోలను ఉద్దేశించి పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సినిమా మొదట్లో వచ్చే ఈ నగరానికేమయ్యింది యాడ్ స్టైల్లో ఈ ఏడాది స్టార్ హీరోల సినిమాలు ఫ్లాప్ అవ్వడంపై కౌంటరేశాడు సంపూ. సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేసిన కామెంట్ను షేర్ చేశాడు సంపూ. 'ఈ 2016కి ఏమైంది? ఓ పక్క సర్థార్ గబ్బర్సింగ్, మరో పక్క బ్రహ్మోత్సవం. కబాలి కూడా నోరుమెదపలేదు, ఈ నిర్లక్ష్య ధోరణికి కొబ్బరి మట్ట పాడాలి చరమగీతం' అని రాసున్న పోస్ట్ను షేర్ చేశాడు. అయితే ఇలాంటి పోస్ట్లు షేర్ చేస్తే అభిమానుల నుంచి ఏ స్థాయిలో వ్యతిరేకత వస్తుందో ముందే ఆలోచించిన సంపూర్ణేష్, ఎవరో పంపించారు సరదాకి తీసుకోండి అంటూ స్టార్ హీరోల అభిమానులను కూల్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. అదే సమయంలో తన కొబ్బరి మట్ట సినిమాకు మంచి ప్రమోషన్ కూడా చేసుకున్నాడు. Hahaha....evaro pampincharu...saradaki theesukondi pic.twitter.com/I4d9U4C2Bs— Sampoornesh Babu (@sampoornesh) 24 July 2016 -
ఒకేసారి... ఒకటికి... అయిదు!
‘శ్రీమంతుడు’, ‘రుద్రమదేవి’, ‘నాన్నకు ప్రేమతో’, ‘సుప్రీమ్’, ‘కబాలి’ సినిమాలతో పాటు పలు సినిమాలను పంపిణీ చేసిన అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఒకేసారి ఐదు చిత్రాలు ప్లాన్ చేశారీ సంస్థ అధినేత అభిషేక్. ఇప్పటికే ఫాంటమ్-రిలయన్స్ సంస్థలతో కలిసి అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న హిందీ ‘హంటర్’ తెలుగు రీమేక్ తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. నవీన్ మేడారం దర్శకత్వంలో శ్రీనివాస్ అవసరాల హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీత దర్శకుడు. కాగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఓ యాక్షన్ ఎంటర్టైనర్ను నిర్మించనున్నామని అభిషేక్ తెలిపారు. ఇందులో రకుల్ ప్రీత్సింగ్ కథానాయిక. దేవిశ్రీప్రసాద్ పాటలు స్వరపరుస్తారు. రిషీ పంజాబీ కెమేరామ్యాన్గా వ్యవహరించనున్న ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్లో ఆరంభం కానుంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రూపొందించనున్న చిత్రం షూటింగ్ని కూడా ఇదే నెలలోనే ప్రారంభిస్తామని అభిషేక్ చెప్పారు. అడివి శేష్, అదా శర్మ జంటగా రవికాంత్ పేరేపు దర్శకత్వంలో నిర్మించబోతున్న ‘గూఢచారి’ చిత్రాన్ని ఆగస్టులో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సుధీర్బాబు హీరోగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందించనున్న చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ పూర్తయిందని చెప్పారు. ఈ ఐదు చిత్రాలకూ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కాలి సుధీర్ వ్యవహరిస్తారు. -
కబాలి విమానం సీక్రెట్ ఇదే..
విడుదలకు ముందే సంచలనం సృష్టించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కబాలికి సంబంధించి ఎన్నో విశేషాలున్నాయి. బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్లు సాధిస్తున్న కబాలిని రిలీజ్కు ముందు ప్రమోట్ చేయడానికి, రజనీ క్రేజ్ను ఉపయోగించుకోవడానికి కార్పొరేట్ కంపెనీలు పోటీపడ్డ సంగతి తెలిసిందే. రజనీ అభిమానులను ఎక్కువగా ఆకర్షించింది మాత్రం కబాలి విమానం. మలేసియాకు చెందిన ఎయిర్ఏషియా సంస్థ కబాలి పేరుతో ఓ విమానాన్ని నడిపింది. ఆ విమానంపై సూపర్ స్టార్ రజనీ పేరును ఇంగ్లీషులో రాయించడంతో పాటు కబాలి సినిమాలోని రజనీ పోస్టర్లను భారీ సైజులో వేయించింది. గతంలో ఏ భారతీయ హీరోకు కూడా ఇంతటి గౌరవం దక్కలేదు. ఇలా రజనీ ఖ్యాతి ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. ఇంతకీ కబాలి విమానంపై ఎలా పెయింట్ వేశారు, ఇందుకోసం ఎంతమంది పనిచేశారనే విషయాన్ని ఎయిర్ఏషియా వెల్లడించింది. దీనికి సంబంధించి విడుదల చేసిన వీడియో యూ ట్యూబ్లో హల్ చల్ చేస్తోంది. కబాలి బ్రాండ్ విమానం కోసం 300కు మందికిపైగా టెక్నిషియన్లు పనిచేశారు. రజనీ ఫొటోలు, పేరుతో రంగుల్లో కబాలి విమానం కనిపించేలా చేయడానికి దాదాపు 200 గంటలు పనిచేశారు. కబాలి విమానం వెనుక ఇంతమంది శ్రమ దాగుంది. -
కబాలి విమానం సీక్రెట్ ఇదే..
-
కబాలి థియేటర్లో మంటలు
-
కబాలి థియేటర్లో మంటలు
గుంటూరు జిల్లా దాచేపల్లి అలంకార్ థియేటర్లో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి సీట్లతో సహా థియేటర్ పూర్తిగా కాలిపోయింది. థియేటర్లో ప్రదర్శితమవుతున్న కబాలి చిత్రాన్ని మ్యాట్నీ షో చూడటానికి వచ్చిన ప్రేక్షకులు మంటలు ఎగిసిపడటంతో.. భయంతో పరుగులు తీశారు. ఏసీ నుంచి మంటలు వచ్చినట్లు కొంతమంది ప్రేక్షకులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పడానికి యత్నిస్తున్నారు. ఇటివలే రూ. రెండు కోట్లతో థియేటర్ ఆధునీకరించినట్లు మేనేజర్ తెలిపారు. -
సూర్య సినిమా టైటిల్ '5.35'..?
తమిళ్తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దక్షిణాది నటుడు సూర్య. ఇటీవల వరుస ప్రయోగాలతో కాస్త స్లో అయిన సూర్య, 24 సక్సెస్తో తిరిగి ఫాంలోకి వచ్చాడు. ప్రస్తుతం మాస్ మాసాలా ఎంటర్టైనర్ సింగం సీరీస్లో ఎస్ 3 సినిమా చేస్తున్న ఈ గజిని స్టార్ తరువాత చేయబోయే సినిమా విషయంలో కూడా క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల కబాలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న పా రంజిత్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు సూర్య. అయితే కబాలి విషయంలో డివైడ్ టాక్ రావటంతో సూర్య సినిమా పట్టాలెక్కుతుందా..? లేదా.? అన్న అనుమానాలు మొదలయ్యాయి. అదే సమయంలో త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందన్న వార్త ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. మరోసారి ప్రయోగానికే రెడీ అయిన సూర్య ఈ సినిమాకు 5.35 అనే డిఫరెంట్ టైటిల్ను ఫైనల్ చేశాడట. ఇటీవల 24తో సక్సెస్ కొట్టిన ఈ కోలీవుడ్ స్టార్ పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా విషయంలో కూడా అదే సెంటిమెంట్ను ఫాలో అవుతున్నాడు. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా, సెప్టెంబర్లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందన్న వార్త కోలీవుడ్లో జోరుగా వినిపిస్తోంది. -
రజనీపై నానా పటేకర్ కామెంట్స్
అంతర్జాతీయ స్థాయిలో భారీ హైప్ క్రియేట్ చేసిన కబాలి సినిమా రిలీజ్ అయి ఐదు రోజులు దాటుతున్నా ఇప్పటికీ ఈ సినిమాకు సంబందించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. డివైడ్ టాక్తో స్టార్ట్ అయినా.. ఈ సినిమా కలెక్షన్ల రికార్డ్లను బద్దలు కొడుతూ దూసుకుపోతుంది. ఈ సందర్భంగా మాట్లాడిన బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ నానా పటేకర్ రజనీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ ప్రైవేట్ ఈవెంట్లో మీడియా ప్రతినిధి కబాలి గురించి అడిగిన ప్రశ్నకు బదులుగా 'ఇండియాలో సినిమానే సూపర్ స్టార్, ప్రత్యేకంగా నటుల్లో సూపర్ స్టార్లు ఎవరూ లేరు. సినిమా కథ బాగుంటే చిన్న సినిమా కూడా భారీ వసూళ్లను సాధిస్తుంది. అదే కథ బాలేకపోతే స్టార్ హీరో సినిమా కూడా మూడు రోజుల్లో థియేటర్ల నుంచి వెళ్లిపోతుంది'. అంటూ కామెంట్ చేశాడు. -
రజనీకాంత్ అసలు రహస్యం చెప్పారు
చెన్నై: తనపై గత కొంతకాలంగా వస్తున్న ఊహగానాలకు ప్రముఖ దక్షిణాది నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ తెరదించారు. ఆయన అమెరికా టూర్ వెనుక రహస్యాన్ని స్వయంగా ఓ లేఖలో వెల్లడించారు. దాదాపు రెండు నెలలపాటు అమెరికాలో ఆయన ఎందుకు ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా లేదా అసలు ఏం జరుగుతుందని అటు అభిమానులతోపాటు సినీ వర్గాల్లో సైతం తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఓ లేఖలో అందరికీ సమాధానం చెప్పారు. అందులో ఆయన ఏం చెప్పారంటే.. 'నేను శంకర్ దర్శకత్వం వహిస్తున్న 2.0(రోబో 2) చిత్రం, భావోద్వేగాలు, విప్లవాత్మక అంశాలు నిండిన చిత్రం 'కబాలీ' షూటింగ్లలో వరుసగా పాల్గొన్నాను. దీనివల్ల, కొంత మానసికంగా, శారీరకంగా అలసిపోయాను. దాని నుంచి ఉపశమనం పొందేందుకు విశ్రాంతి అవసరం అని అర్థమైంది. అందుకే నా కూతురు ఐశ్వర్య ధనుష్ తో కలిసి రెండు నెలలపాటు అమెరికా టూర్ కు వెళ్లాను. అక్కడే వైద్య పరీక్షలు కూడా పూర్తి చేసుకున్నాను. ఇప్పుడు నా మాతృదేశానికి వచ్చాక మళ్లీ కొత్త బలం వచ్చింది. కబాలీ చిత్రం విజయం గురించి విన్నాక మనసు మరింత ప్రశాంతంగా మారింది. ఈ సందర్భంగా నా చిరకాల మిత్రుడు థనుకు, చిత్ర దర్శకుడు రంజిత్ కు మొత్తం చిత్ర యూనిట్కు ధన్యవాదాలు చెబుతున్నాను. అలాగే, నా ప్రియమైన అభిమానులకు, ప్రజలకు, మీడియా మిత్రులకు, థియేటర్ల యజమానులకు, పంపిణీదారులకు కూడా పదేపదే ధన్యవాదాలు చెబుతున్నాను' అంటూ రజినీ స్వయంగా లేఖలో రాశారు. -
‘కబాలి’ ఒరిజినల్ కలెక్షన్లు తెలిస్తే షాక్ తింటారు!
‘కబాలి’ సినిమా కలెక్షన్ల గురించి అనేక వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా అసలు వసూళ్ల గురించి చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థాను ధ్రువీకృత వివరాలను ఓ జాతీయ వెబ్సైట్కు తెలిపారు. ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’, ఆమిర్ ఖాన్ ‘పీకే’ సినిమా కలెక్షన్ల గురించి తెలిసి విస్మయపోయిన ప్రజలు.. ‘కబాలి’ ఒరిజినల్ వసూళ్ల గురించి తెలిస్తే షాక్ తింటారు. భారీ అంచనాలతో, రజనీకాంత్ మేనియాతో విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ఏకంగా రూ. 400 కోట్లు రాబట్టింది. ఈ 400 కోట్లలో రూ. 200 కోట్లు తొలి వీకెండ్ కలెక్షన్లు కాగా.. మిగతా 200 కోట్లు మ్యూజిక్ హక్కులు, శాటిలైట్ హక్కులు తదితర వాణిజ్య అమ్మకాల ద్వారా దక్కాయి. నిర్మాత థాను మాట్లాడుతూ.. తొలి వీకెండ్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 90 కోట్లను ‘కబాలి’ వసూలు చేసిందని తెలిపారు. ఇందులో ఒక్క అమెరికాలోనే రూ. 28 కోట్లు వసూలయ్యాయని చెప్పారు. అమెరికాలో ప్రజలు చూసిన టాప్ టెన్ సినిమాల్లో ‘కబాలి’ చోటు సంపాదించుకుందని వివరించారు. ఇక భారత్లో తొలి మూడు రోజుల్లో దాదాపు రూ. 100 కోట్ల వసూళ్లు వచ్చాయని తెలిపారు. ‘నా జీవితంలో ఈ రోజుల్ని ఎప్పటికీ మరిచిపోలేను. ఈ సినిమా నాకు ఎంతో ఆనందాన్ని మిగిలించింది. గత వందేళ్లలో భారతీయ సినిమాకు చెందిన అన్ని రికార్డులనూ ‘కబాలి’ బద్దలుకొట్టింది’ అని థాను చెప్పారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ‘కబాలి’ సినిమా బడ్జెట్ సుమారు రూ. 75 కోట్లు. ఇందులో 50 నుంచి 60 కోట్లు రజనీ రెమ్యూనరేషన్ ఉంటుందని భావిస్తున్నారు. సినిమా మలేషియా నేపథ్యంగా సాగుతోంది. మలేషియాలో షూటింగ్ తీయడానికే పెద్దమొత్తంలో ఖర్చయిందని భావిస్తున్నారు. సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అంతా కొత్తవారు, యువత కావడంతో వారికి పెద్దగా ఖర్చు కాలేదని, సినిమా నిర్మాణానికి చాలా తక్కువమొత్తంలోనే ఖర్చు అయిందని సినీ పండితులు చెప్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే ‘కబాలి’ సినిమా కలెక్షన్ల పరంగా అసాధారణ విజయాన్ని సాధించిందని విశ్లేషిస్తున్నారు. ఈ సినిమాకు మొదట నెగిటివ్ రెస్పాన్స్ ఆడియెన్స్ నుంచి వచ్చినా.. సినిమాను చూసేవారి సంఖ్య మాత్రం తగ్గడం లేదని సినీ పరిశీలకులు చెప్తున్నారు. -
మూడ్రోజుల్లో 'కబాలి' కలెక్షన్ ఎంతో తెలుసా?
‘కబాలి’ సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి రజనీకాంత్ రుజువు చేసుకున్నారు. సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ సినిమాను తలదన్నేరీతిలో ‘కబాలి’ తొలి మూడురోజుల్లో వసూళ్లు రాబట్టింది. ‘సుల్తాన్’ సినిమా తొలి మూడురోజుల్లో రూ. 100 కోట్లు వసూలు చేయగా.. ‘కబాలి’ కూడా తొలి మూడురోజుల్లోనే రూ. 100 కోట్ల మార్క్ ను దాటింది. ఈ సినిమా తొలి మూడురోజుల వసూళ్లు ఎంత అనేది వివరాలు తెలియకపోయినా.. మొదటి మూడురోజుల్లో ‘కబాలి’ వందకోట్ల మార్క్ను క్రాస్ చేసిందని సినీ పండితులు చెప్తున్నారు. భారీ అంచనాలతో, రజనీ మేనియాతో విడుదలైన ‘కబాలి’ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయినా సినిమా కలెక్షన్ల విషయంలో మాత్రం దూకుడు ప్రదర్శిస్తోంది. మొదటిరోజే రూ. 48 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో ‘సుల్తాన్’ రికార్డును దాటేసింది. ‘సుల్తాన్’ సినిమా తొలిరోజు రూ. 36.54 కోట్లు వసూలు చేసింది. తొలిరోజు కలెక్షన్ల విషయంలో ‘సుల్తాన్’ రికార్డును అధిగమించినప్పటికీ ‘బాహుబలి’ (రూ.50 కోట్లు) రికార్డును ‘కబాలి’ దాటలేకపోయింది. ఇక, రెండో, మూడోరోజున కూడా ‘కబాలి’ సినిమా భారీగా రికార్డు కొల్లగొట్టిందని, నెగిటివ్ టాక్ ఈ సినిమా ప్రారంభ వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపలేదని సినీ పండితులు చెప్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఈ సినిమా వసూళ్లు భారీస్థాయిలో ఉన్నారని చెప్పారు. సాధారణంగా దక్షిణ భారతంలోనే రజనీ ఫ్యాన్స్ కు ఎక్కువ. ఉత్తర భారతంలో పెద్దగా ఆయన చిత్రాలు ఆడవు. అయితే, ఈ అపప్రథను తాజాగా ‘కబాలి’ దూరం చేసింది. ఉత్తర భారతంలోనూ ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతున్నదని బాలీవుడ్ ట్రేడ్ అనాలిసిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. ఉత్తర భారతంలో తొలి రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 11.4 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా తొలిరోజున తమిళనాడులో రూ. 21.5 కోట్లు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రూ. 13.5 కోట్లు వసూలు చేసింది. -
సొంతరాష్ట్రంలో రజనీకి వ్యతిరేకత
చెన్నై: ప్రపంచవ్యాప్తంగా కబాలి మానియా ఊపేస్తుంటే... రజనీ సొంతరాష్ట్రం కర్ణాటకలో మాత్రం ఆ చిత్రానికి వ్యతిరేకత వస్తోంది. అక్కడ కబాలి పోస్టర్లు, రజనీకాంత్ ఫోటోలను దగ్ధం చేసే కార్యక్రమం జరుగుతుండటం గమనార్హం. కర్ణాటకలో సలువరి పార్టీ కార్యకర్తలు, కన్నడ వేదిక నిర్వాహకులు రజనీపై మండిపడుతున్నారు. రజనీకాంత్ కర్ణాకటకు చెందిన వ్యక్తి అయినా తమిళ పక్షపాతి అని వారు దుయ్యబడుతున్నారు. రజనీ కావేరి జల వివాదం వ్యవహారంలో తమిళనాడుకు మద్దతిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆగ్రహంతోనే ఆయన నటించిన కబాలి చిత్రాన్ని కర్ణాటకలోని 300 థియేటర్లకు పైగా విడుదల చేయాడాన్ని తప్పుపడుతున్నారు. ఈ కారణంగా కన్నడ చిత్రాలు బాధింపుకు గురవుతున్నాయని కన్నడ వేదిక నిర్వహకుడు పటాళ్ నాగరాజ్ పేర్కొన్నారు. ఇలా ఉండగా రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత రజనీకాంత్ ఆదివారం అమెరికా నుంచి చెన్నై చేరుకున్నారు. -
కబాలిలో రంజిత్ స్టయిల్
సూపర్స్టార్ రజనీకాంత్ సినిమా.. అందులోనూ ఇంట్రడక్షన్ సీన్ అంటే స్పెషల్ ఎఫెక్ట్లు, సూపర్ హీరో స్టైల్ మేకింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. కానీ కబాలి సినిమాలో రజనీ ఇంట్రడక్షన్ చాలా సాదాసీదాగా ఉంటుంది. అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూసిన కబాలి సినిమా తొలి షాట్లో రజనీ ఓ పుస్తకం చదువుతూ కనిపిస్తారు. కెమెరా జైలు ఊచల నుంచి మెల్లగా కదులుతూ వెళ్లి చివరగా రజనీకాంత్ నటించిన కబాలి క్యారెక్టర్పై ఫోకస్ అవుతుంది. ఆ సమయంలో రజనీ చేతిలో ఓ పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం పేరు ‘మై ఫాదర్ బాలయ్య’. తెలంగాణకు చెందిన దళిత రచయిత వైబీ సత్యనారాయణ రచించిందే ఈ పుస్తకం. స్వాతంత్య్రానికి ముం దు, ఆ తర్వాత దళితుల జీవన పోరాటం.. చదువు కోసం వారుపడిన పాట్లే ఇతివృత్తంగా ఈ పుస్తక రచన సాగింది. ఈ సీన్ దర్శకుడు పా రంజిత్ అభిమానులను ఏమాత్రం ఆశ్చర్యానికి గురిచేయలేదు. వారంతా ఇదీ రంజిత్ మార్కు షాట్ అని ముక్త కంఠంతో చెపుతున్నారు. కబాలి డెరైక్టర్ రంజిత్ 2014లో రూపొందించిన సినిమా మద్రాస్. తమిళ సినిమాల్లో దళితుల ప్రాతినిథ్యానికి ‘మద్రాస్’ సినిమాను ఓ సాధనంగా వాడుకున్నారని పెద్ద చర్చే నడిచింది. ఇప్పుడు కబాలి విషయంలోనూ అదే పంథా అనుసరించారు రంజిత్. కబాలి చిత్రానికి ప్రొడక్షన్ విభాగంలో పనిచేసిన చాలామంది దళిత సామాజిక వర్గానికి చెందిన వారే. డెరైక్టర్ రంజిత్తో మొదలుపెడితే సినిమాటోగ్రాఫర్ జి.మురళి, ఆర్ట్, కాస్ట్యూమ్ డెరైక్టర్ థా రామలింగమ్, పాటల రచయితలు ఉమాదేవి, అరుణ్రాజా కామరాజ్, ఎం.బాలమురుగన్ ఇలా అందరూ దళితులే. వీరిలో కొందరు తమను కులం పేరుతో గుర్తించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. సినిమా అనేది ఓ కళ అని, ఇక్కడ కళలో నైపుణ్యం మాత్రమే గుర్తింపును ఇస్తుందని, దీనికి ఇతర గుర్తింపులేమీ అవసరం లేదని చెపుతున్నారు. మరికొందరు గతంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులే ఇప్పుడు తమను ఈ స్థానానికి ఎదిగేలా చేశాయని చెపుతున్నారు. మద్రాస్ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా ఇంటర్వ్యూల్లో రంజిత్ మాట్లాడుతూ.. తనకు కులం గురించి మాట్లాడటంపై నమ్మకం లేదని చెప్పారు. ‘మద్రాస్’లో కుల వ్యవస్థ గురించి నిర్భయంగా చూపించారు. తమిళ మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో ఇలాంటి బోల్డ్ అటెంప్ట్ చేయడం అదే తొలిసారి. రంజిత్ సినిమాల్లో ప్రధాన పాత్రలు దళిత సాహిత్యం చదువుతూనో.. లేదా అంబేడ్కర్ చెప్పిన మాటలను అండర్లైన్ చేసి చూపిస్తూనో కనిపిస్తుంటాయి. మలేసియాలో అణచివేతకు గురవుతున్న తమిళుల కోసం పోరాటం చేసే ఓ వ్యక్తి ఇతివృత్తంతోనే కబాలిని రూపొందించాడు రంజిత్. -
అక్కడ ‘కబాలి’ క్లైమాక్స్ మారింది!
విడుదలకు ముందు ‘కబాలి’ సినిమా క్లైమాక్స్పై అనేక కథనాలు వచ్చాయి. ‘కబాలి’ సినిమాలో నెగిటివ్ ఎండింగ్ ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో క్లైమాక్స్లో ‘కబాలి’ చనిపోతాడా? అని రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ నిజానికి దర్శకుడు పా రంజిత్ క్లైమాక్స్ విషయంలో సాహసం చేయలేకపోయాడు. చివరి సీన్లో తుపాకీ పేలుడు శబ్దం వినిపించినా.. ఈ తూటాకి ‘కబాలి’ చనిపోయాడా? అన్న విషయాన్ని మాత్రం దర్శకుడు చూపించలేదు. కథ, కథనం విషయంలో తనదైన స్టైల్ను ఫాలో అయిన పా రంజిత్ క్లైమాక్స్ విషయంలో మాత్రం సాహసించలేకపోయాడు. రజనీ పాత్ర తెరపై చనిపోయినట్టు చూపించడం అంత ఈజీ కాదు. దీనిని అభిమానులు జీర్ణించుకోలేరు. అందుకే తుపాకీ శబ్దంతో, కొంత సస్పెన్స్తో ‘కబాలి’ క్లైమాక్స్ను ముగించాడు. దీంతో సినిమా నెటిగివ్ ఎండింగా.. పాజిటివ్ ఎండింగా అనేది ప్రేక్షకుడికి అంతుచిక్కలేదు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా క్లైమాక్స్ గురించి మరో ట్విస్టు వెలుగుచూసింది. సినిమా అంతా మలేషియా నేపథ్యంగా, అక్కడ జరిగే గ్యాంగ్వార్ ప్రధాన కథగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మలేషియాలో ఈ సినిమా క్లైమాక్స్ను మార్చారు. క్లైమాక్స్లో ‘కబాలి’ పోలీసులకు లొంగిపోతాడని పేర్కొన్నారు. మలేషియా నేపథ్యంగా సినిమా తెరకెక్కడం, ఎక్కువశాతం షూటింగ్ అక్కడే జరిగిన నేపథ్యంలో స్థానికంగా వ్యతిరేకత రాకుండా.. చట్టాన్ని గౌరవించి ‘కబాలి’ పోలీసులకు లొంగిపోయినట్టు పేర్కొన్నారని భావిస్తున్నారు. -
’కబాలి’ని టొరంటోలో డౌన్లోడ్ చేయబోతే..!
రివ్యూలు సంగతి ఎలా ఉన్నా.. సినిమా అంతగా బాలేదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నా.. రజనీకాంత్ తాజా సినిమా ‘కబాలి’ అసాధారణ కలెక్షన్లతో దూసుకుపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ‘కబాలి’ సినిమా తొలిరోజే రూ. 250 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి ఉంటుందని చిత్రనిర్మాతలు ఓ ప్రకటనలో తెలుపడం సంచలనం రేపుతోంది. ‘కబాలి’ తొలిరోజు ఒక్క తమిళనాడులోనే వందకోట్లు వసూలుచేసిందని, తమిళనాడు బయట దేశమొత్తంగా రూ. 150 కోట్లు వసూలుచేసిందని నిర్మాతలు ప్రకటించారు. ఈ వసూళ్ల ప్రకటన ఇలా వుంటే.. మరోవైపు‘కబాలి’ శాటిలైట్ హక్కుల ద్వారా రూ. 200 కోట్లు సాధించవచ్చునని మరో కథనం చెప్పుకొచ్చింది. ఈ కథనాల్లో నిజానిజాలను పక్కనబెడితే.. ప్రపంచవ్యాప్తంగా 12వేల థియేటర్లలో విడుదలైన ‘కబాలి’ సినిమా గత కలెక్షన్ల రికార్డులన్నింటినీ బద్దలుకొట్టి తొలిరోజు భారీగా వసూళ్లు రాబట్టడం ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘కబాలి’ కలెక్షన్లు లెజెండ్ రజనీ సత్తాను మరోసారి ప్రపంచానికి చాటాయని బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కితాబిచ్చారు. మరోవైపు రజనీ సినిమాపై ఎప్పటిలాగే జోక్స్, ఛలోక్తులు ఆన్లైన్లో వీరవిహారం చేస్తున్నాయి. ట్విట్టర్ను చక్కిలిగింతల్లో ముంచెత్తుతున్న ఆ క్రేజీ జోక్స్ మీకోసం.. ’కబాలి సినిమాను డౌన్లోడ్ చేసేందుకు ప్రయత్నించాను. వెంటనే టోరంటో అన్ఇన్స్టాల్ అయిపోయింది. సిస్టం ఫార్మెట్ అయిపోయింది. వై-ఫై క్రాష్ అయింది. సమీపంలో ఉన్న ఎయిర్టెల్ టవర్ మాయమైంది’ Tried downloading Kabali. µTorrent uninstalled itself. System got formated. Wi-Fi router crashed. Nearby Airtel tower vanished. — चार लोग (@WoCharLog) July 21, 2016 ’మీ అక్రమంగా రజనీకాంత్ చిత్రాన్ని ఆన్లైన్లో డౌన్లోడ్ చేస్తే.. ఓ వైరస్ బయటకొచ్చి మీ చెంపఛెళ్లుమనిపిస్తుంది. మిమ్మల్ని వెంటనే పట్టుకెళ్లి రజనీ సినిమా నడుస్తున్న థియేటర్లో పడేస్తుంది’ ‘అందరి సినిమాలు మొదట విడుదలై తర్వాత టోరంటోలో లీకవ్వుతాయి. కానీ రజనీ సినిమా టోరంటోలో లీకైన తర్వాతే షూటింగ్ మొదలవుతుంది’. -
కబాలి రీమేక్ లో అమితాబ్..?
ప్రపంచ వ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమా కబాలి. రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం, రిలీజ్ తరువాత ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. రజనీ అభిమానులు సినిమాను ఎంజాయ్ చేస్తున్నా.. సాధారణ ప్రేక్షకులు మాత్రం నిరాశచెందారు. అయితే కలెక్షన్ల పరంగా మాత్రం రజనీ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్నాడు. అయితే ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. నార్త్లో ప్రయోగాత్మక పాత్రలతో అలరిస్తున్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ను కబాలి రీమేక్లో నటింప చేయాలని భావిస్తున్నారు. మరి సౌత్ సినిమాగా అలరించలేకపోయినా కబాలి.. నార్త్ ఇండస్ట్రీలో ఆకట్టుకుంటుందేమో చూడాలి. -
ఇప్పుడు సూర్య ఛాన్స్ ఇస్తాడా..?
కబాలి సినిమా సెట్స్ మీద ఉండగానే ఆ చిత్ర దర్శకుడు పా రంజిత్కు ఆఫర్లు వెల్లువెత్తాయి. యంగ్ హీరోలు, స్టార్ హీరోలు అన్న తేడా లేకుండా అందరూ రంజిత్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అంటూ ప్రకటించేశారు. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన కబాలి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో రంజిత్ భవిష్యత్తు ప్రమాదంలో పడింది. సాధారణంగా ఫిలిం ఇండస్ట్రీ సక్సెస్ వెంటే పరిగెడుతుంది. హిట్ ఇచ్చిన నటీనటులు, దర్శకులతో కలిసి పనిచేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తారు. అదే ఫ్లాప్ ఇస్తే మాత్రం పట్టించుకోరు. మరి ఇప్పుడు పా రంజిత్ పరిస్థితి ఏంటి అన్న టాక్ వినిపిస్తోంది. గతంలో తన నెక్ట్స్ పా రంజిత్తో అంటూ ప్రకటించిన సూర్య, మాట నిలబెట్టుకుంటాడా..? కబాలి తరువాత కూడా రంజిత్ దర్శకత్వంలో సినిమా చేస్తాడా..? చూడాలి. -
కబాలి మొదటి రోజు వసూలెంతో తెలుసా?
తమిళసినిమా: విడుదలకు ముందే కాదు ఆ తరువాత కూడా కబాలి గురించి కథనాలు కదం తొక్కుతున్నాయి.ఆ క్రెడిట్ అంతా సూపర్స్టార్ రజనీకాంత్దేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆయన నటించిన ఈ చిత్రం ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రభంజనంలా శుక్రవారం తెరపైకి వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ప్రపంచవ్యాప్త రజనీ అభిమానులు ఎదురు చూశారు.ఇప్పుడు చూస్తూ (మగిల్చి)సంతోషపడుతున్నారు.కబాలి చిత్రం వారిలో పండగ వాతావరణాన్ని సృష్టించిందనే చెప్పాలి.ఉత్సవాలు జరుపుకుంటున్నారు.రజనీకాంత్ చిత్రాన్ని మొదటి రోజు మొదటి షో చూడటం ఘనతగా భావిస్తున్నారు.చూసిన వారిలో ఏదో సాధించాయన్న ఫీలింగ్. థియేటర్ల ముందు ఇసుకేస్తే రాలనంత జనం. 90 శాతం టికెట్లు ముందుగానే రిజర్వేషన్ అయ్యి పోవడంతో టికెట్లు దొరకని వారు మళ్లీ మళ్లీ థియేటర్లకు వచ్చి టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత ధర చెల్లించి అయినా కబాలి చిత్రం చూసి తీరాలనే నిర్ణయంతో తమ ప్రయత్నాలు చేయడం అన్నది ఒక్క కబాలి చిత్రానికే చెల్లుతుంది.ఒక్క భారతరేశంలోనే కాదు,ప్రపంచ వ్యాప్తంగా కబాలి చిత్రంపై అంచనాలు నెలకొన్న నేపథ్యంలో అమెరికా,మలేషియా,సింగపూర్ మొదలగు 50 దేశాలలో ఈ చిత్రం హవా కొనసాగుతోంది.చిత్రం చూసిన రజనీ అభిమానులు ఆనందతాండ వం చేస్తున్నారనే చెప్పవచ్చు. 6,500 థియేటర్లలో కబాలి కబాలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా 6500 థియేటర్లకు పైగా విడుదలైంది.ఇందులో 3,500 థియోటర్లకు పైగా హౌస్ఫుల్గా ప్రదర్శింపబడుతున్నాయి. 2వేల థియేటర్లలో వారానికి పైగా అడ్వాన్స్ బుకింగ్ జరిగిపోయింది.ఇక తమిళనాడు,కేరళ,ఆంధ్రా,తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల్లో కబాలికి అమోఘ ఆదరణ లభిస్తోంది. మొదటి రోజు వసూళ్లు రూ.40 కోట్లు చిత్ర ప్రారంభం నుంచి రికార్డులకు శ్రీకారం చుట్టిన కబాలి విడుదలకు ముందే నిర్మాతకు రూ.200 కోట్లు టేబుల్ ప్రాపర్టీని అందించిందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విడుదలైన తరువాత తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు రూ.40 కోట్లు అని తెలిసింది.బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ఖాన్ నటించిన సుల్తాన్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజు వసూళ్లు 36 కోట్లు. కబాలి విడుదలకు ముందు వరకూ ఇదే రికార్డు. ఇప్పుడా రికార్డును కబాలి బద్దలు కొట్టిందని సమాచారం. కాగా ఒక్క వారానికి రూ.120 కోట్ల వసూళ్లకు దాటుతుందని సినీ వర్గాల అంచనా.కాగా కబాలితో రజనీకాంత్ స్టామినా మరింత పెరిగింది.అమెరికాలో ఉన్న రజననీకాంత్ చిత్రం విడుదల ముందే చెన్నైకి తిరిగి వస్తారని భావించారు.కాగా ఇటీవల ఆయన అమెరికాలో కారులో పయనిస్తుండగా అక్కడి ప్రజల కంటపడ్డారు.అంతే వారంతా ఆనందంతో చేతులు ఊపుతూ పరుగులు తీశారు.దీంతో కారు నిలిపి వారికి ఉత్సాహంగా రజనీకాంత్ షేక్హ్యాండ్ ఇచ్చిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.అంతగా కబాలి ఫీవర్ పెల్లుబికిందన్న మాట. -
టికెట్ దొరకలేదని మలేషియా అభిమాని ఆత్మహత్య
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మేనియా ఖండాంతరాలను దాటుతోంది. ఇప్పటికే జపాన్ మలేషియా దేశాల్లో రజనీకి అక్కడ స్టార్ హీరోల స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మలేషియాలో రజనీ మేనియా ఏ స్థాయిలో ఉందో ప్రూవ్ చేసే సంఘటన ఒకటి కబాలి సినిమా రిలీజ్ రోజు జరిగింది. రజనీ హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా మలేషియాలో అక్కడి ప్రాంతీయ చిత్రం స్థాయిలో మలాయ్ భాష లో రిలీజ్ అయ్యింది. సినిమా టికెట్ల కోసం మలేషియన్ అభిమానులు కూడా భారీగా పోటి పడ్డారు. ఈనేపథ్యంలో టికెట్ దొరకని ఓ అభిమాని పది అంతస్థుల బిల్డింగ్ మీదనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మలేషియాలోని కేన్ సిసి ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కబాలి సినిమాలో అత్యధిక శాతం షూటింగ్ మలేషియాలోనే జరగటంతో సినిమాపై అక్కడ భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. -
బాక్సాఫీస్ను షేక్ చేస్తోన్న కబాలి
భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కబాలి బాక్సాఫీస్ రికార్డ్ల దుమ్ముదులుపుతోంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్లో సంచలనాలను నమోదు చేసిన తలైవా, రిలీజ్ తరువాత కూడా తన హవా కోనసాగిస్తున్నాడు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో ఈ సినిమాకు థియేటర్లు లభించటంతో కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధ్యమవుతున్నాయి. తమిళనాట 650కి పైగా స్క్రీన్లో రిలీజ్ అయ్యింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే స్థాయిలో రిలీజ్ అయిన కబాలి భారీ వసూళ్లను సాధిస్తోంది. ఇప్పటికే తొలి మూడు రోజుల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు కబాలి హవా దక్షిణాదిని ఊపేయనుంది. రజనీకి భారీ క్రేజ్ ఉన్న తెలుగు, తమిళ్లోనే కాదు, కేరళలో కూడా కబాలి భారీగా రిలీజ్ అయ్యింది. దాదాపు 306 థియేటర్లలో రిలీజ్ అయి అక్కడ కూడా రికార్డ్ సృష్టించింది. కబాలి సంచలనాలు దక్షిణాదికే పరిమితమైపోలేదు. ఉత్తరాదిలో కూడా తలైవా హవా చూపిస్తున్నాడు. కేవలం ఈ సినిమా చూడటానికే విదేశీయులు ముంబై చేరుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో కలిపి 135 థియేటర్లలో కబాలి సందడి కనిపిస్తుండగా, పంజాబ్లో 70 థియేటర్లలో కబాలి రిలీజ్ అయ్యింది. ముంబై, కలకత్తా, ఢిల్లీ లాంటి ప్రధాన నగరాల్లో కబాలి మేనియా బాగా కనిపిస్తోంది. ఇప్పటికే తొలి రోజు కలెక్షన్ల రికార్డులను తిరగరాసిన తలైవా.. ముందు ముందు మరిన్ని రికార్డులు సాధించే దిశగా దూసుకుపోతున్నాడు. అయితే సినిమాకు డివైడ్ టాక్ రావటంతో బాహుబలి, భజరంగీబాయిజాన్ లాంటి భారీ రికార్డ్లకు డోకా లేదన్న వాదన వినిపిస్తోంది. -
ఆన్లైన్లో కబాలి డా
చెన్నై : పైరసీని అరికట్టడం కాదు కదా కనీసం నిలువరించడం సాధ్యం కాదని తాజా పరిణామాలతో మరోసారి రుజువైంది. కబాలి చిత్రం తెరపైకి రావడానికి ముందే ఇంటర్నెట్లో హల్చల్ చేయడమే ఇందుకు నిదర్శనం. ఇది ఖండించదగ్గ అంశమే అయినా పైరసీ ఎంతగా వేళూనుకుపోయిందో అర్థం చేసుకోవలసిన సంఘటన ఇది. వివరాల్లోకి వెళ్లితే సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం కబాలి. భారీ అంచనాల మధ్య ఇంకా చెప్పాలంటే ప్రపంచ సినిమానే ఆసక్తిగా ఈ చిత్రం విడుదలకు ఎదురు చూసింది. ఈ చిత్రం విడుదలకు ముందే నిర్మాత ధాను పైరసీని అడ్డుకోవడానికి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా పైరసీపై నిషేధాజ్ఞలు జారీ చేసింది. దీంతో చాలా వెబ్సైట్లు మూత పడ్డాయి. హమ్మయ్య ఇక పైరసీ బెడద తప్పింది అనుకున్నారంతా. అయితే అది పైరసీ అనేది ఓ మహమ్మారి కదా... పూర్తిగా అంతం అవుతుందా? కబాలి చిత్రం తెరపైకి రావడానికి ఒక్క రోజు ముందే 10 నిమిషాల ప్రారంభ సినిమా నెట్లో చక్కర్లు కొట్టింది. దానికి గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే అది చిన్న శాంపిల్ అని, కబాలి చిత్రం థియేటర్లలోకి రావడానికి కొంత సమయం ముందే తన పని చూపించింది. పూర్తి చిత్రం క్లియర్ కట్గా తమిళ్గన్ అనే వెబ్సైట్లో హల్చల్ చేయడంతో చిత్ర వర్గం కంగుతింది. విషయం ఏమిటంటే ఇంత వరకూ భారతీయ సినీ పరిశ్రమలో ఏ చిత్రానికి ఇవ్వనంత బూస్టప్ను కబాలికి చేశారు. చిత్రాన్ని చూడడానికి కార్పొరేట్ సంస్థలు బల్క్లో భారీ మొత్తాలను చెల్లించి టికెట్లను కొనుగోలు చేయడంతో సాధారణ ప్రేక్షకులు కబాలిని చూడలేని పరిస్థితి. ఎలాగైనా చూసి తీరాలనుకున్న కొందరు మాత్రం నగర శివారు ప్రాంతాల్లో చిన్న థియేటర్లలో టికెట్లు కొని చూడడానికి సిద్ధమయ్యారు. నటుడు శివకార్తికేయన్ లాంటి వారు కూడా సదరు ప్రాంతంలోని థియేటర్లలో కబాలి చిత్రాన్ని చూశారని సమాచారం. కబాలి చిత్రం ఇప్పుడు తమిళ్గన్ అనే వెబ్సైట్లో అందర్నీ ఎంటర్టెయిన్ చేస్తోంది. ఆ వెబ్సైట్పై చిత్ర నిర్మాత తరఫున మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్నది గమనార్హం. కబాలి కథేందంటే కబాలి చిత్రంలో రజనీకాంత్ పాత చిత్రాలలో మాదిరిగానే వచ్చిన చిత్రం ఇది. దక్షిణాఫ్రికాలో నెల్సన్మండేలా తరహాలో మలేషియాలో తమిళుల హక్కుల కోసం పోరాడిన రజనీకాంత్ 25 ఏళ్లు జైలు జీవితాన్ని గడిపి బయటకు వస్తారు. తన జైలు జీవితకాలంలో బయట జరిగిన సంఘటనలను రజనీకాంత్కు అనుచరుడు జాన్విజయ్ వివరిస్తాడు. ఆ విధంగా 43 గ్యాంగ్ అనే మాదక ద్రవ్యాల ముఠా అక్కడి యువకులను ఎలా మత్తు మందులకు బానిసలుగా తయారు చేస్తోంది, హత్యలు,అత్యాచారాలు అంటూ ఎలా అరాచకాలు సృష్టిస్తోంది, దీనికంతా కారణం ఎవరు? అన్న విషయాలను కబాలి తెలుసుకుంటాడు. ఆ తరువాత తమిళలు అధికంగా నివసించే ప్రాంతంలో తన పేరుతో మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిని ఆ మత్తు నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్రం చేస్తూ వారికి పునర్జన్మను ప్రసాదించే సేవాకార్యక్రమలు నిర్వహిస్తున్న కలైయరసన్ను కలుసుకుంటాడు. అక్కడ యువకులతో తాను ఎందుకు దాదాగా మారాల్సి వచ్చిందన్నది వివరిస్తాడు. కబాలి జైలుకు వెళ్లే సమయంలో తుపాకీ గుండుకు గురైన నిండు గర్బిణి అయిన తన భార్య గుర్తు కొస్తుంది. ఇప్పుడు భార్య,బిడ్డ ఎక్కడున్నారు? ఏమి చేస్తున్నారన్నది తెలియక అయోమయంలో పడతాడు. మరో పక్క మాదక ద్రవ్యాల ముఠా నాయకుడు కిషోర్ను వేటాడి అంతం చేస్తాడు? అయితే చివరికి తన భార్య బిడ్డను కలుసుకున్నాడా? లేదా? అన్నది మాత్రం కబాలి చిత్రం చూడాల్పిందే. -
‘కబాలికి’ పాలాభిషేకం
శామీర్పేట్: శామీర్పేట్ మండలంలోని అలియాబాద్ శ్రీక్రిష్ణ సినిమా థియేటర్లో శుక్రవారం విడుదలైన కబాలి సినిమాకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రజనీకాంత్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో హీరో చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో థియేటర్ యజమాని నాగేశ్వరరావు, సల్లూరి అనంతం, ఎస్.మహేశ్, రాజు, భిక్షపతి, శ్రీనివాస్, సునీల్శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇది 'విరాట్ కబాలి'!
ఆంటిగ్వా: భారీ అంచనాలతో విడుదలైన చిత్రం కబాలి. అటు రజనీకాంత్ మేనియా, ఇటు అభిమానుల అమితోత్సాహం ఈ సినిమాపై ముందునుంచే భారీ హైప్ క్రియేట్ చేసింది. శుక్రవారం దేశవ్యాప్తంగా విడుదలైన కబాలి మూవీ రికార్డు కలెక్షన్లపై ఇప్పటికే హాట్ హాట్ చర్చ సాగుతోంది. ఈ సినిమా సరికొత్త రికార్డును నెలకొల్సే అవకాశం ఉందని కొంతమంది సినిమా విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతుండగా, నెటిజన్లు మాత్రం తమదైన శైలిలో కబాలి మూవీ గురించి చర్చించుకుంటున్నారు. రజనీకాంత్ తన అభిమానులకు కబాలి మూవీ చూపిస్తుంటే.. విండీస్ క్రికెట్ జట్టుకు విరాట్ కోహ్లి కబాలి చూపిస్తున్నాడని సరదగా ముచ్చటించుకుంటున్నారు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి భారీ శతకంతో అజేయంగా నిలిచాడు. తొలి రోజ మొదటి ఇన్నింగ్స్లో కోహ్లి 143 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. దీంతో సినిమా టాపిక్ ను క్రికెట్ కు జత చేశారు. ఇది 'విండీస్ లో విరాట్ కబాలి' అంటూ అభిమానులు పొగడ్తలతో ముంచెత్తున్నారు. కబాలి సినిమా విడుదలైనా.. ఇంకా విండీస్ను మాత్రం కోహ్లి విడిచిపెట్టలేదంటూ ఛలోక్తులు విసురుతున్నారు. మన దిగ్గజ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కూడా కబాలి సినిమా-విరాట్ విధ్వంసాన్ని పోల్చుతూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. ఈ రోజుల తనను మూడు 'లీ'లు ఆకట్టుకున్నాయి. ఒకటి కోహ్లి ఇన్నింగ్స్ చూడటం, రెండో మూలీ(పరోటా) తినడం, మూడు కబాలి మూవీని ఆస్వాదించడం అంటూ చమత్కరించాడు. -
కబాలి మేనియా
-
కబాలి విషయంలో ఫీలవుతున్న రాజమౌళి
బాహుబలి సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసిన టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి, కబాలి విషయంలో ఫీలవుతున్నాడట. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలను రిలీజ్ రోజే చూడటం రాజమౌళికి అలవాటు. కుటుంబ సమేతంగా థియేటర్కు వెళ్లి, అభిమానులతో కలిసి సినిమాలు చూస్తాడు జక్కన్న. అయితే కబాలి సినిమాను అలా చూడలేకపోయాడు. ప్రస్తుతం బాహుబలి 2 సినిమా క్లైమాక్స్ షూటింగ్లో బిజీగా ఉన్న జక్కన్న టీం, కబాలి సినిమా తొలి రోజు చూసే ఛాన్స్ మిస్ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్లో ప్రకటించాడు రాజమౌళి. 'షూటింగ్ లో ఉన్న కారణంగా కబాలి తొలిరోజు తొలి ఆట మిస్ అయ్యాను. థియేటర్లో ఉండి ఉంటే ఇప్పటికే నేను కూడా తలైవా మేనియాలో మునిగిపోయే వాన్ని' అంటూ ట్వీట్ చేశాడు. Missing kabaali FDFS..Stuck in shooting..How i wish i could be there in the theatre engulfed by thalaiva mania...— rajamouli ss (@ssrajamouli) 22 July 2016 -
కబాలి కోసం..థియేటర్ల దగ్గర బారులు
-
మొదటి షోకే మిలియన్ డాలర్లు
కబాలి మేనియా ప్రపంచాన్నిచుట్టేస్తోంది. రిలీజ్కు మూడు రోజుల ముందు నుంచే మొదలైన ఫీవర్.. చివరకు తలైవాను తెరమీద చూసే సరికి పీక్స్కు చేరింది. ఇన్నాళ్లు ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తున్న ఫ్యాన్స్. ఇప్పుడు బద్దలవుతున్న రికార్డ్లను లెక్కలేస్తున్నారు. ఇప్పటికే తొలి షో ప్రదర్శనలు, ప్రపంచ దేశాల్లో రిలీజ్ లాంటి అంశాలతో రికార్డ్ సృష్టించిన కబాలి, ఓవర్ సీస్ మార్కెట్లో వసూళ్ల బాద్షాగా అవతరించాడు. స్టార్ హీరోలు కూడా ఓవర్ సీస్లో వన్ మిలియన్ డాలర్ల మార్క్ కోసం మూడు నాలుగు రోజుల పాటు ఎదురుచూస్తుంటే రజనీ మాత్రం కబాలి తొలి షోకే ఆ రికార్డ్ను రీచ్ అయ్యాడట. అధికారికంగా ప్రకటించకపోయినా.. అత్యధిక సంఖ్యలో థియేటర్లలో ప్రదర్శించటంతో పాటు.. టికెట్ ధరలు కూడా భారీగా పెరగటంతో ఈ రికార్డ్ సాధ్యమయ్యిందంటున్నారు. మార్నింగ్ షో పూర్తి కాక ముందే రికార్డ్ల వేట మొదలెట్టిన రజనీ.. ముందు ముందు మరిన్ని రికార్డ్లు సృష్టిస్తాడంటున్నారు ఫ్యాన్స్. -
'కబాలి' మూవీ రివ్యూ
టైటిల్ : కబాలి జానర్ : ఎమోషనల్ డ్రామా తారాగణం : రజనీకాంత్, రాధికా ఆప్టే, ధన్సిక, విన్స్స్టన్ చావో సంగీతం : సంతోష్ నారాయణ్ దర్శకత్వం : పా రంజిత్ నిర్మాత : కలైపులి ఎస్ థాను భారతీయ సినీ చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమా కబాలి. రజనీ మానియా రేంజ్ ఏంటో చూపిస్తూ ఈ సినిమా ప్రపంచదేశాల సినీ అభిమానులను సైతం ఆకర్షించింది. రెండు భారీ డిజాస్టర్ల తరువాత రజనీ హీరోగా నటించిన సినిమా.. కేవలం రెండు యావరేజ్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు. ఈ కాంబినేషన్లో వచ్చిన సినిమాకు ఇంత హైప్ ఎలా క్రియేట్ అయ్యిందంటూ ట్రేడ్ పండితులు కూడా అవాక్కవుతున్నారు. అసలు అంతలా కబాలిలో ఏముంది..? నిజంగానే రజనీ కబాలితో మ్యాజిక్ చేశాడా..? అభిమానుల అంచనాలను కబాలి అందుకుందా..? కథ : మలేషియా, కౌలాలంపూర్లో జరిగిన గ్యాంగ్ వార్లో అరెస్ట్ అయిన మాఫియా డాన్ కబాలి(రజనీ కాంత్). 25 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన కబాలి విడుదలవుతున్నాడంటూ, ప్రభుత్వం, పోలీస్ శాఖలు అలర్ట్ అవుతాయి. తిరిగి గ్యాంగ్ వార్ మొదలుపెట్టవద్దని కబాలికి చెప్పి విడుదల చేస్తారు. కానీ మలేషియాలో మగ్గిపోతున్న భారతీయుల కోసం పోరాటం చేసే కబాలి బయటకు రాగనే అక్కడి పరిస్థితులను చూసి మరోసారి పోరాటం మొదలు పెడతాడు. డ్రగ్స్ అమ్ముతూ, అమ్మాయిలను ఇబ్బంది పెట్టే 43 గ్యాంగ్తో యుద్ధం ప్రకటిస్తాడు. కబాలి రాకకోసం ఎదురుచూస్తున్న 43 గ్యాంగ్ లీడర్ టోని లీ (మలేషియా నటుడు విన్స్స్టన్ చావో) తన అనుచరుడు వీరశంకర్ (కిశోర్) సాయంతో కబాలిని చంపేందుకు ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఈ ప్రయత్నాల నుంచి కబాలి ఎలా బయటపడ్డాడు..? అసలు కబాలి డాన్గా ఎందుకు మారాడు..? అతని కుటుంబం ఏమైంది..? చివరకు టోని లీ కథను కబాలి ఎలా ముగించాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : కబాలిగా రజనీకాంత్ మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ వయసులో కూడా తనలోని స్టైల్, గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి ప్రూవ్ చేశాడు తలైవా. భారీ యాక్షన్ సీన్స్, రేసీ స్క్రీన్ ప్లే లేకపోయినా కేవలం రజనీ మానరిజమ్స్తో ఆడియన్స్ను కట్టిపడేశాడు. ఫైట్స్, హీరోయిజంతో పాటు అద్భుతమైన ఎమోషన్స్తో ఆకట్టుకున్నాడు. తెర మీద కనిపించేది కొద్ది సేపే అయినా రాధిక ఆప్టే మంచి నటన కనబరిచింది. ముఖ్యంగా కబాలిని తిరిగి కలుసుకునే సన్నివేశంలో ఆమె నటన ప్రేక్షకులతో కంటతడిపెట్టిస్తుంది. లేడీ డాన్గా కనిపించిన ధన్సిక నటనతో పాటు యాక్షన్ సీన్స్లోనూ ఆకట్టుకుంది. స్టైలిష్గా కనిపిస్తూనే.. మంచి ఎమోషన్స్ను పండించింది. విలన్గా నటించిన విన్స్స్టన్ చావో డాన్ లుక్లో పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. రాక్షసుడైన గ్యాంగ్ స్టర్గా చావో నటన సినిమాకు ప్లస్ అయ్యింది. ముఖ్యంగా రజనీ స్టార్ డమ్ ను ఢీకొనే పర్ఫెక్ట్ విలన్గా కనిపించాడు. ఇతర పాత్రలలో కిశోర్, జాన్ విజయ్, నాజర్, దినేష్ రవి లాంటి నటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : కబాలి లాంటి కథతో రజనీని ఒప్పించిన దర్శకుడు అప్పుడే సగం విజయం సాధించేశాడు. ఈ కథకు రజనీ అంతటి భారీ స్టార్ డమ్ ఉన్న నటుడు తప్ప మరే హీరో చేసినా.. వర్క్ అవుట్ కాదు. అయితే పూర్తి యాక్షన్ డ్రామాగా సినిమాను ప్రమోట్ చేసిన దర్శకుడు.. సినిమాలో ఆ వేగం చూపించలేకపోయాడు. స్లో నారేషన్ ఇబ్బంది పెట్టినా.. రజనీని కొత్తగా చూపిస్తూ అన్నింటిని కవర్ చేశాడు. ఇక సినిమాకు మరో ఎసెట్ సంతోష్ నారాయణ్ సంగీతం. కబాలి థీం మ్యూజిక్తో కట్టిపడేసిన సంతోష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్తో సినిమాను నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్లాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, యాక్షన్ కొరియోగ్రఫి లాంటివి ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : రజనీకాంత్ మెయిన్ స్టోరి లైన్ నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : స్లో నారేషన్ ఓవరాల్గా కబాలి భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను కాస్త నిరాశపరిచినా.. రజనీ అభిమానులకు మాత్రం బాషాను గుర్తు చేస్తోంది. - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్. -
కబాలి 'పది' నిజాలు
ముంబై: టీజర్ లోనే కబాలి రా.. అంటూ సినీ ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసిన సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజా చిత్రం కబాలి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులముందుకి వచ్చింది. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యి, కోట్లలో వ్యాపారాన్ని గడించిన ఈ సూపర్ మూవీపై అంచనాలు అంతకంటే భారీగా నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లను పలకరించిన కబాలి ఫీవర్ సృష్టించే రికార్డులపై అత్యంత ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కబాలి సినిమాకు సంబంధించి ముఖ్యమైన పది సంగతులు సినీ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఒక కొత్త టీమ్ తో రజనీకాంత్ కలిసి పనిచేయడం రజనీకాంత్ తాజా సినిమాలో గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణం పాడిన పాట లేకపోవడం సైన్ ఫిక్షన్ ..సూపర్ నేచురల్ ఫిలిం ఓ డాన్ నిజ జీవిత గాథ అధారంగా రూపొందించిన చిత్రం థ్యాంక్స్ టు సౌందర్య రజనీకాంత్. మూడో సినిమాతోనే సూపర్ స్టార్ రజనీ సినిమాకు దర్మకత్వం వహించాడు పా రంజిత్, అయితే ఆయనను రజనీకాంత్ కూ పరిచయం చేసిన ఘనత కూతురికి సౌందర్యకు దక్కుతుంది. సో. ..కబాలిని ఇంత గొప్పగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన క్రెడిట్ కూడా సౌందర్యదే. మరోవైపు సినిమా మొదలైన పావుగంట తర్వాత హీరో తలైవా తెరమీద ఆవిష్కారం. మామూలు రజనీకాంత్ స్టయిల్ విన్యాసాలు.. పంచ్ డైలాగులు.. ఈ సినిమాలో లేవు. ట్రైయిలర్స్ లేవు. మలేషియన్ ప్రభుత్వం రజనీకాంత్ పట్ల గౌరవ సూచకంగా ఒక స్పెషల్ స్టాంప్ ను విడుదల చేసింది. మలేషియాలో భారీగా రిలీజవున్న తొలి భారతీయ సినిమా కబాలి. సినిమా చిత్రీకరణ ఎక్కువ భాగా మలేషియాలో జరగడంతో అక్కడకూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కబాలి సృష్టించిన మేనియా ఇంతేనా ఇంకా చాలా ఉంది. గూగుల్ స్పెషల్ యాప్, ఓ ప్రయివేటు విమానయానసంస్థరూపొందించిన స్పెషల్ విమానం, ముత్తూట్ ఫినాన్స్ వారి వెండినాణాలు, దబ్ స్మాష్ వీడియో కాంపిటీషన్, కోయంబత్తరూ లో ఒక కఫే రజనీ కి డెడికేట్ .. ఇలా చాలా ప్రత్యేకతలే వున్నాయి. మరి కలెక్షన్ల వసూళ్లలో ఇంకెన్ని రికార్డులు నెలకొల్పనుందో వేచి చూడాలి. -
'కబాలీ'పై టాలీవుడ్ ఏమంటోంది!
హైదరాబాద్: భాగ్యనగరంలో ఎక్కడ చూసిన 'కబాలీ' ఫీవర్ కనిపిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీ మూవీ చూసేందుకు ఇన్నాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులు థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. మూవీ చూసేందుకు థియేటర్లకు ప్రేక్షకులు, సెలబ్రిటీలు పరుగులు పెడుతున్నారు. హైదరాబాద్ లో ఐమాక్స్ థియేటర్ వద్ద టాలీవుడ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలు డాన్ 'కబాలీ' తమ అభిప్రాయాలను పంచుకున్నారు. 'చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. నా రూములో ఆయన పోస్టర్లు ఉన్నాయి. రజనీకాంత్ అంటే పిచ్చి. గతంలో రజనీ ఏ సినిమా చూసేందుకు ఇలా ఎదురు చూడలేదు. డిఫరెంట్ లుక్, మేజరిజమ్, భాషా లాంటి గెటప్ లో కనిపించడంతో ప్రేక్షకులలో ఆసక్తి రెట్టింపయింది. ఆయన స్టైల్ గురించి చెప్పక్కర్లేదు' అని స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు, యంగ్ హీరో పూరి ఆకాశ్ అన్నాడు. 'రజనీకాంత్ ప్రతి సినిమాకు ఇలాంటి వాతావరణం ఉంటుంది. ఎవరికీ అర్థంకాని అదో విచిత్రమైన ఫినామినా. రజనీ తనను ఏమైనా కొత్తగా ఆవిర్కరించుకున్నారా అనే ఆసక్తి ప్రేక్షకులలో ఉంది. పాపులర్ స్టార్ మాత్రమే కాదు ఆయన ఓ అద్భుతమైన నటుడు. అమితాబ్ 60 ఏళ్ల తర్వాత ఎలాంటి సినిమాలు చేస్తున్నారో చూశాం. అంతకంటే ఎక్కువగా రజనీ గారు తన సినిమాల్లో కనిపిస్తారని అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటివరకూ ఆయనను 100 శాతం తెరమీద ఆవిష్కరించిన సినిమా రాలేదు' అని డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ పేర్కొన్నాడు. 'కథ కోసం రాలేదు. కేవలం ఆయన స్టైల్, మ్యానరిజమ్ కోసం వచ్చాను. దేశం మొత్తం రజనీ ఫివర్ ఉంది. ఈ వయసులోనూ ఆయన సంచలనాలు చేస్తారని , రెండున్నర గంటలు ఆయన ఎంటర్ టైన్ చేస్తానని మూవీ చూసేందుకు వచ్చాను' అని టాలీవుడ్ స్క్రిప్ట్ రైటర్ వక్కంతం వంశీ రజనీపై అభిమానాన్ని చాటుకున్నాడు. 'అంతులేనికథ'లో రజనీకాంత్ చేసిన తాగుబోతు పాత్ర నుంచి ఆయనను అభిమానిస్తున్నాను. ఆయన ఇంకా చాలా సినిమాలు చేయాలని, ఆయన మరింత ఆరోగ్యంతో ఉండాలని ప్రొడ్యూసర్ లగడిపాటి శ్రీదర్ కోరుకున్నాడు. టాలీవుడ్ లోనే కాదు, హాలీవుడ్ లోనూ ఇంత క్రేజ్ ఉన్న హీరో మరోకరు లేరు. రజనీ సార్ కు వీర ఫ్యాన్ ను. చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీ వచ్చింది. డిఫరెంట్ లుక్ ముఖ్యంగా గెడ్డంతో కనిపించడం ఆకట్టుకుంటుంది అంటూ సెలబ్రిటీలు 'కబాలీ' గురించి చెబుతున్నారు. -
'కబాలి: బ్రదర్ ఆఫ్ లింగా'
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కబాలి' సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తమ ఆరాధ్య కథానాయకుడు నటించిన సినిమాను తొలిరోజే చూడాలన్న ఉద్దేశంతో అభిమానులు ధియేటర్లకు పోటెత్తారు. సినిమా చూసినవాళ్లు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సినిమా చాలా బాగుందని రజనీ అభిమానులు అంటుంటే అంత గొప్పగా ఏంలేదని మామూలు ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. నకిలీ సమీక్షలు రాసేవారు జాగ్రత్తగా ఉండాలని రజనీ అభిమానులు హెచ్చరించడం గమనార్హం. గొప్ప సినిమా విడుదైన రోజే తొలి ఆట చూడడం అద్భుతమైన అనుభవమని, ఇది సంబరాలు చేసుకోవాల్సిన సమయమని టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా ట్వీట్ చేశాడు. 'కబాలి' చాలా బాగుందని మలేసియాలో సినిమా చూసిన యువ అభిమాని ట్వీట్ చేసింది. రజనీకాంత్ కనిపించినప్పుడల్లా విజిల్స్, కేకలు వేయకుండా ఉండలేకపోయానని తెలిపింది. ఫ్రాన్స్ గ్రాండ్ ఫిక్స్ ధియేటర్ లో 'కబాలి' సినిమా ప్రదర్శన సందర్భంగా రజనీకాంత్ తెరపై కనిపించిన సందడి ఫొటోను ట్విట్టర్ లో పెట్టాడు. ధియేటర్ లో 2800 మంది ఉన్నారని వెల్లడించాడు. సమీక్షలతో పనిలేకుండా అందరూ రజనీకాంత్ సినిమా చూడాలని ఓ వీరాభిమాని అన్నాడు. కబాలి' తమను ఎంతో ఆకట్టుకుందని పొంగిపోయాడు. సినిమా నెమ్మదిగా ఉందని, చాలా సన్నివేశాలు విసుగు పుట్టించాయని రాకేశ్ కుమార్ అనే ప్రేక్షకుడు పేర్కొన్నాడు. రజనీకాంత్ తొలిసారిగా కనిపించే సన్నివేశం బాగుందన్నాడు. సినిమా గొప్పగా ఏంలేదన్నాడు. 'కబాలి' తీవ్ర నిరాశకు గురిచేసిందని, డబ్బులు తిరిగిచ్చేయాలని మరో ప్రేక్షకుడు వాపోయాడు. సంగీతం బాలేదని అన్నాడు. ఇలాంటి చెత్త సినిమా తీసిన దర్శకుడు పా రంజిత్ ను క్షమించలేమంటూ ఇంకో ప్రేక్షకుడు అసహనం వ్యక్తం చేశాడు. 'కబాలి'ని 'లింగా' సోదరుడిగా పోల్చాడు. Amazing Movie First Day First Show ! Let the festival begin #thalaivar #kabali #nerrupuda… https://t.co/ATdcPrTb4U — Suresh Raina (@ImRaina) 21 July 2016 #Watched Kabali in Malaysia Woohoooo I shouted & screamed like anything.. @superstarrajini is exceptional.. Perum magizhchi @beemji sir -
'కబాలీ'పై టాలీవుడ్ ఏమంటోంది!