Pushpa Movie
-
పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అల్లు అర్జున్, పుష్ప సినిమా విషయంలో రాజకీయ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక, తాజాగా పుష్ప సినిమాపై మంత్రి మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక స్మగ్లర్ సినిమాకు అవార్డు ఇవ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.మంత్రి సీతక్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో స్మగ్లర్ను హీరో చేశారు.. పోలీసును విలన్ చేశారు. ఒక స్మగ్లర్ పోలీసుల దుస్తులు విప్పి నిలబెడితే జాతీయ స్థాయిలో అవార్డులు ఇవ్వడం దేనికి సంకేతం. ఇలాంటి సినిమాలు నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయి. మానవతా దృక్పథం ఉన్న సినిమాలు రావాలి. జైభీమ్ వంటి సందేశాత్మక చిత్రాలకు అవార్డులు రాలేదు. అలాంటి సినిమాలకు ప్రోత్సహకాలు లేవు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా పుష్ప-2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు కాగా.. అల్లు అర్జున్ అరెస్టై జైలుకు కూడా వెళ్లి.. మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయంగానూ రచ్చ రేపింది. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు అల్లు అర్జున్కు మద్ధతుగా నిలిచాయి. రేవంత్ సర్కార్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అయితే.. కాంగ్రెస్ మాత్రం పోలీసుల చర్యలను సమర్థిస్తూ..అల్లు అర్జున్దే మొత్తం తప్పు అంటూ వాదిస్తూ వస్తోంది. దీంతో, ఈ వ్యవహరంలో రోజుకో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. -
కేజ్రీవాల్ తలవంచడు..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పుష్ప–2 సినిమా మేనియా నడుస్తోంది. అదిప్పుడు రాజకీయాలనూ ప్రభావితం చేస్తోంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇప్పుడు ‘తగ్గేదే లే’అంటున్నారు. తాజాగా ఆయన పుష్ప అవతారమెత్తారు. ‘కేజ్రీవాల్.. ఝుకేగా నహీ’అనే ట్యాగ్ లైన్ తో ఆప్ రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కేజ్రీవాల్ కుంభకోణాల సాలీడు గూడు’అంటూ బీజేపీ రిలీజ్ చేసిన పోస్టర్కు ఆప్ ఇచ్చిన కౌంటర్ ‘టాక్ ఆఫ్ ద టౌన్’గా మారింది. ఎన్నికలకు రెండు నెలల ముందే బీజేపీ వర్సెస్ ఆప్ పోస్టర్ వార్ చలి కాలంలోనూ పొలిటికల్ హీట్ పెంచుతోంది. బీజేపీ పోస్టర్లో ఏముంది?ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మోసాల కు పాల్పడుతోందంటూ బీజేపీ శనివారం పోస్టర్ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీ నర్ కేజ్రీవాల్ను హైలైట్ చేసింది. మద్యం విధానంలో కుంభకోణం ఆరోపణలు, మొహల్లా క్లినిక్, హవాలా, భద్రత, రేషన్, పానిక్ బటన్, శీష్ మహల్, మందులు, ఢిల్లీ జల్ బోర్డ్, క్లాస్రూమ్, సీసీటీవీ స్కామ్లను ప్రస్తావిస్తూ. ’కేజ్రీవాల్ కుంభకోణాల సాలెగూడు’అని ట్యాగ్లైన్ పెట్టింది.కేజ్రీవాల్ పుష్ప అవతార్బీజేపీ పోస్టర్కు ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ.. పాన్ ఇండియా సినిమా పుష్ప రేంజ్లో కౌంటర్ ఇచ్చింది. పుష్ప పోస్టర్లో హీరో అల్లు అర్జున్ ముఖాన్ని తీసేసి ఆ స్థానంలో కేజ్రీవా ల్ ఫేస్ పెట్టారు. ఒక చేతిలో ఆ పార్టీ గుర్తు చీపురు పట్టుకున్నట్లు చూపించారు. ’కేజ్రీవా ల్ ఝుకేగా నహీ (కేజ్రీవాల్ తలవంచడు)’ టైటిల్ పెట్టారు. పోస్టర్ కింద ‘కేజ్రీవాల్ ఫోర్త్ టర్మ్ కమింగ్ సూన్’అంటూ ట్యాగ్లైన్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆప్ ఇదే పోస్టర్ను ప్రచార అస్త్రంగా మార్చుకునే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. 1998 నుంచి బీజేపీ ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉంది. 2015 నుంచి ఇక్కడ ఆప్ సొంతంగా అధికారంలో ఉంది. -
కుప్పంలో సీజ్ ది థియేటర్
చిత్తూరు, సాక్షి: సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో.. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి కోపమొచ్చింది. తమ అభిమాన నటుడి సినిమా ప్రదర్శించకుండా అధికారులు ఓ థియేటర్ను సీజ్ చేయడంపై రగిలిపోతున్నారు. స్థానికంగా ఓ నేతకు చెందిన రెండు థియేటర్లలో పుష్ప 2 చిత్రం ప్రదర్శిస్తున్నారు. అయితే.. ఎన్వోసీ సర్టిఫికెట్ లేకుండా సినిమా ప్రదర్శిస్తున్నారంటూ అధికారులు షోలను అర్ధాంతరంగా నిలిపివేయించి మరీ తాళాలు వేశారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. లైసెన్సు రెన్యూవల్ చేసుకోకుండా థియేటర్ రన్ చేస్తున్నారని అధికారులు చెబుతుండగా.. ఇది కక్ష సాధింపు చర్యలో భాగమై ఉండొచ్చంటూ ఫ్యాన్స్ వాదిస్తున్నారు. మరోవైపు వారాంతం కావడంతో కొత్త సినిమా చూద్దామని థియేటర్కు వస్తున్న ప్రేక్షకులు.. గేటుకు తాళాలు చూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇదీ చదవండి: టార్గెట్ అల్లు అర్జున్.. రాజకీయ సెగ! -
‘పుష్ప-2 బెనిఫిట్ షో కలెక్షన్లు ఏం చేస్తారు?’
హైదరాబాద్, సాక్షి: అల్లు అర్జున్-సుకుమార్ ‘పుష్ప-2’ చిత్ర విడుదలకు తెలంగాణ హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. సినిమా టికెట్ ధరల పెంపు వివాదంపై దాఖలైన పిటిషన్ను మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు.. ఈ మేరకు విడుదల చేసుకునేందుకు మైత్రీ మూవీ మేకర్స్కు అనుమతి ఇచ్చింది. అదే టైంలో బెనిఫిట్ ద్వారా వచ్చే వసూళ్ల వివరాలను తమకు తదుపరి విచారణలో అందజేయాలని ప్రొడక్షన్ హౌజ్ను ఆదేశించింది. పుష్ప 2 సినిమా టికెట్ ధరల పెంపు వివాదంపై హైకోర్టు విచారణ జరిగింది. బెనిఫిట్ షోపేరుతో రూ.800 వసూలు చేయడం అన్యాయమని, బెనిఫిట్ షో ద్వారా వచ్చే డబ్బును ఎక్కడికి మల్లిస్తున్నారో తెలియాల్సిన అవసరం ఉందని పిటిషనర్ సతీష్ కోరారు. అయితే..చివరి నిమిషంలో సినిమా విడుదలను అడ్డుకోలేమని చెబుతూ విడుదలకు హైకోర్టు క్లియరెన్స్చ్చింది. పూర్తి నివేదిక పరిశీలించి ఆదేశాలు ఇస్తామని పేర్కొంది. అలాగే.. టికెట్ ధరల పెంపు ప్రభుత్వ జీవోలను సైతం పరిశీలిస్తామన్న హైకోర్టు తెలిపింది. కౌంటర్ దాఖలు చేయడానికి నిర్మాత తరఫు న్యాయవాది సమయం కోరగా, తదుపరి విచారణను డిసెంబరు 17వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ నిర్దేశించిన విధంగానే టికెట్ల ధరలు కొనసాగనున్నాయి. అలాగే.. బెనిఫిట్ షో వసూళ్ల పూర్తి వివరాలు రెండు వారాల్లో సమర్పించాలని మైత్రి మూవీస్ కు హైకోర్టు స్పష్టం చేసింది.ఇక.. రాత్రి 10గం. షోవేస్తే.. అది అయిపోయే సరికి 1గం. అవుతుందని, తద్వారా పిల్లలకు నిద్ర లేకుండా పోతుందని, వాళ్లకు నిద్ర ఎంతో అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. వాదనలు ఇలా.. మొదటి 15రోజులు సైతం అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు: పిటిషనర్ తరఫు లాయర్భారీ బడ్జెట్తో సినిమా చిత్రీకరించడంతో టికెట్ ధరలు పెంచాల్సి వచ్చింది: మైత్రీమూవీ మేకర్స్ తరఫు లాయర్‘ప్రభుత్వమే టికెట్ రేట్లు పెంచడానికి అనుమతించి కదా’: హైకోర్టుటికెట్ రేట్ల పెంపు వల్ల అభిమానులపై భారం పడుతోంది. అర్ధరాత్రి 1 గంటకు, తెల్లవారుజామున నాలుగు గంటలకు షోలు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు: పిటిషనర్ తరపు న్యాయవాదిపెంచిన రేట్ల ద్వారా వచ్చిన ఆదాయం ఛారిటీ, సీఎం, పీఎం సహాయ నిధి ఖాతాలో వెళ్లడం లేదు. కేవలం నిర్మాత మాత్రమే లబ్ది పొందుతున్నాడు: పిటిషనర్ తరపు న్యాయవాదిటికెట్ ధరలతో పోలిస్తే థియేటర్లలో పాప్కార్న్, మంచి నీళ్ల బాటిళ్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు కదా. బెనిఫిట్ షోకు ఒక వ్యక్తి 10మంది కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తే రూ.8వేలు అవుతుంది కదా: హైకోర్టు న్యాయమూర్తిబెనిఫిట్ షో కేవలం హీరో అభిమానుల సంఘాలకు మాత్రమే. అందుకే రేట్లు పెంచారు: నిర్మాత తరపు న్యాయవాది పుష్ప ది రూల్ స్క్రీనింగ్కు తెలంగాణ సర్కార్ ఇచ్చిన అనుమతులుడిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలకే పడనున్న బెనిఫిట్ షోరాత్రి 9.30 షోకు టికెట్ ధరను అదనంగా రూ.800 వర్తింపు. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా రూ.800 చెల్లించాల్సిందే.అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు కూడా అనుమతిడిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీఫ్లెక్స్లో రూ.200 పెంపు.డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్లో రూ.105, మల్టీఫ్లెక్స్లో రూ.150 పెంపు.డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్లో రూ.20, మల్టీఫ్లెక్స్లో రూ.50 పెంపునకు అనుమతి అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో రాబోతున్న పుష్ప 2 డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 12 వేల స్క్రీన్లలో గ్రాండ్గా విడుదల కానుంది. 2021 డిసెంబర్లో రిలీజ్ అయిన పుష్ప మొదటి భాగం సంచలనాలు సృష్టించగా.. ఇప్పుడు రెండో భాగం మీద భారీ అంచనాలే ఉన్నాయి. -
పుష్ప.. మేక్ ఇన్ ఇండియా.. తగ్గేదే లే.. ఇంతకీ కథ ఎలా పుట్టిందంటే..
బాహుబలి తర్వాత ఆ స్థాయిలో తెలుగు సినిమా గురించి చర్చ సుకుమార్-అల్లు అర్జున్ల ‘పుష్ప’తోనే నడిచింది. దాదాపు 70 ఏళ్లుగా ఊరిస్తూ వచ్చిన జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఎట్టకేలకు ఓ తెలుగు నటుడిని వరించింది ఈ చిత్రంతోనే. మూడేళ్ల కిందట వచ్చిన ఈ చిత్ర మొదటి భాగం ఏ స్థాయిలో హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే ఇప్పుడు రెండో భాగం భారీ అంచనాల నడుమ ఆరు భాషల్లో.. 12వేలకు పైగా స్క్రీన్లలో డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్కు రెడీ అయ్యింది. ఈ మేనియా నడుమే అసలు పుష్పగాడి కథ ఎలా పుట్టిందో ఓసారి గుర్తు చేసుకుందాం. పుష్పరాజ్.. తన ఇంటిపేరును కూడా చెప్పుకోలేని స్టేజ్లో అవమానాలు ఎదుర్కొనే ఓ మొరటు యువకుడు. అయినా సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో ‘నీ యవ్వ.. తగ్గేదే లే’’ అంటాడు. ఓనర్ ముందే ఇస్టయిల్గా కుర్చీలో కూర్చుని ఆ ఉద్యోగానికి కాలదన్ని మరీ ఎర్ర చందనం ముఠాలో చేరతాడు. అడవిలో స్మగ్లింగ్ కోసం కూలీగా వెళ్లి.. క్రమక్రమంగా శత్రువుల్ని పెంచుకుంటూ ఆ మాఫియాకి కింగ్గా ఎలా ఎదిగాడన్నది పుష్ప ది రైజ్ కథ. ఈ మధ్యలో తల్లి పార్వతమ్మ, సవతి అన్న ఫ్యామిలీ సెంటిమెంట్.. దానికి సమాంతరంగానే శ్రీవల్లితో ప్రేమాయణం కూడా నడుస్తుంది. ఆఖర్లో షెకావత్ సర్తో నడిచే బ్రాండ్ ట్రాక్తో కథకు కొనసాగింపుగా పుష్పగాడి పెళ్లిలోనే ‘‘శుభం కార్డు’’ పడుతుంది. మొదటిపార్ట్లో పుట్టుకొచ్చిన ఎనిమీస్ మధ్యే పుష్పగాడి రూల్ ఎలా నడుస్తుందనే దానితో సుకుమార్ రెండో పార్ట్ను చూపించబోతున్నారు!. అయితే..👉పుష్ప కథ, కాస్టింగ్ దగ్గరి నుంచి.. చాలా విషయాల్లో దర్శకుడు సుకుమార్ అనుకున్నది అనుకున్నట్లు జరగలేదు!. దశాబ్దాల కిందట ఏపీలో జరిగిన వాస్తవ ఘటనల స్ఫూర్తితో పుష్ప కథను రాసుకున్నాడు సుక్కూ. ఆయన దానిని ఓ వెబ్ సిరీస్గా తీయాలని భావించాడు. కానీ, ఆ తర్వాత ఎందుకనో నిర్ణయం మార్చుకుని ఫీచర్ ఫిల్మ్ వైపు మొగ్గు చూపాడు. 👉ఈ కథతో ఓ అగ్రహీరోను సంప్రదిస్తే.. ఆయన సై అన్నాడు. ప్రాజెక్టు ప్రారంభ పనుల్లోనూ ఆ హీరో సుక్కూతో కలిసి పాలుపంచుకున్నాడు. తీరా.. అనివార్య కారణాల వల్ల ఆయన తప్పుకోగా.. తాను వ్యక్తిగతంగా ఎంతో ఇష్టపడే హీరో అల్లు అర్జున్ దగ్గరకే ఆ కథ చేరింది. అయితే ఆ స్టార్ హీరోతో తీయాలనుకున్న కథ వేరైనా.. బ్యాక్డ్రాప్ మాత్రం ఇదేనని సుకుమార్ తర్వాత క్లారిటీ ఇచ్చారు కూడా.👉కాస్టింగ్లో విషయంలోనూ సుక్కూ లెక్క తప్పింది. కీలక పాత్రలకు అనుకున్నవాళ్లతో కాకుండా వేరే వాళ్లను ఎంచుకోవాల్సి వచ్చింది. మైత్రి మేకర్స్ సుకుమార్తో కొత్త సినిమా అనౌన్స్ చేసింది 2019 జులైలో. అదే ఏడాది దసరాకు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుందని ప్రకటించింది. ఈలోపు అయితే అది కాస్త ఆలస్యమై.. అక్టోబర్ 30వ తేదీన కొంతమంది కాస్టింగ్తో పూజా కార్యక్రమం ద్వారా ముహూర్తం షాట్తో లాంఛనంగా ప్రారంభమైంది. 👉ఇక రెగ్యులర్ షెడ్యూల్ను అదే ఏడాదిలో కేరళలో యాక్షన్ షూట్తో ప్రారంభించాలనుకున్నప్పటికీ.. అప్పటికే అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో ఉండడంతో ఆలస్యమైంది. ఆపై 2020 మార్చ్లో కేరళ షెడ్యూల్తో షూటింగ్ మొదలుకావాల్సింది.కానీ, కరోనాతో సినిమాకు అడ్డుపడింది. అక్కడి నుంచి పుష్పకు సినిమా కష్టాలే నడిచాయి.👉2020 ఏప్రిల్ 8వ తేదీ.. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా రగ్డ్ లుక్తో పుష్ప ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి హాట్ టాపిక్గా మారింది.First Look and the Title of my next movie “ P U S H P A “ . Directed by dearest Sukumar garu . Music by dearest friend @ThisIsDSP . Really excited about this one. Hoping all of you like it . @iamRashmika @MythriOfficial #MuttamsettyMedia pic.twitter.com/G8ElmLKqUq— Allu Arjun (@alluarjun) April 8, 2020👉అయితే చిత్ర షూటింగ్ ఏరకంగానూ మేకర్స్ అనుకున్న విధంగా జరగలేదు. కరోనా పరిస్థితులే అందుకు కారణం. ఆంక్షల కారణంగా లిమిట్ మెంబర్స్తో.. ముందుగా అనుకున్న లోకేషన్లలో కాకుండా ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో షూట్ కానిచ్చారు. ఏపీ, తమిళనాడు అటవీ ప్రాంతంలో 200 రోజులు షూటింగ్ జరుపుకోవడం, అదీ కరోనా లాంటి టైంలో.. మాములు విషయం కాదు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం చెప్పాలి. 👉కరోనాతో కుదేలైన రంగాల్లో చలన చిత్ర రంగం కూడా ఉంది. షూటింగ్లు లేక వేల మంది టెక్నీషియన్లకు ఉపాధి లేకుండా పోయింది. ఆ టైంలో ధైర్యంగా షూటింగ్తో ‘పుష్ప’ ఎంతో మందికి ఆసరాగా నిలబడింది. అంతేకాదు విదేశీ టెక్నిషియన్లను ప్రాధాన్యత ఇస్తున్న టైంలో.. స్వదేశీ వాళ్లకు అవకాశం ఇవ్వాలని మేకర్లు భావించారు. అలా కరోనా టైంలో ప్యూర్ ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రాజెక్టుగానూ పుష్ప ది రైజ్ గుర్తింపు దక్కించుకుంది. 👉కరోనా వైరస్ టైంలో అష్టకష్టాలు పడినా రిలీజ్ విషయంలోనూ అనుకున్నది జరగలేదు. 2021 పంద్రాగష్టు వారంలో విడుదల చేయాలనుకుంటే.. అది కాస్త డిసెంబర్ 17కి చేరింది. పుష్ప ది రైజ్ లాంటి సినిమా తీయడం అసమాన విషయం. నా ఒక్కడికే కాదు రెండేళ్లపాటు ఈ చిత్రం కోసం పని చేసిన వాళ్లందరికీ ఇది నాలుగు చిత్రాలతో సమానం. ::: పుష్ప ప్రమోషన్లో అల్లు అర్జున్ 👉2021 డిసెంబర్లో అల్లు అర్జున్ కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అయ్యింది పుష్ప ది రైజ్. అయితే.. రిలీజ్ అయ్యాక తెలుగులో మిక్స్డ్ రివ్యూస్ రాబట్టింది. కానీ, హిందీతో పాటు మిగతా భాషల్లో బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది. ఆ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.👉ముఖ్యంగా డీఎస్పీ అందించిన పాటలు.. అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యి గ్లోబల్ వైడ్గా ట్రెండింగ్ అయ్యాయి. సెలబ్రిటీలు సైతం ఆ ట్రెండ్ను ఫాలో అయ్యారు. బన్నీ స్టెప్పులు రీల్స్ రూపంలో సోషల్ మీడియాతో పాపులారిటీ సంపాదించుకున్నాయి. ఇంకోవైపు.. ‘‘తగ్గేదే లే’’, ‘‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు”లాంటి డైలాగులు పొలిటికల్ గానూ ఒక ఊపు ఉపడం గమనార్హం. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31)#PushpaCelebrityFanatics" Now a days, all around everyone discussing about one film #Pushpa " ❤️🔥When Defence Minister of India @rajnathsingh ji mentioned about Pushpa euphoria & dialogue. This shows to what extent the reach & impact @alluarjun made 🙏💥 pic.twitter.com/Cuu1K0TXnX— Ghouse Allu Arjun fans Wgl (@AlluWgl) October 23, 2024👉సుకుమార్ ‘పుష్ప ది రైజ్’.. 2022లో రష్యన్ భాషలో డబ్ అయ్యి అక్కడి థియేటర్లలో సందడి చేసింది. అంతేకాదు అదే ఏడాది మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ‘‘బ్లాక్బస్టర్ హిట్స్ ఫ్రమ్ ఎరౌండ్ ది వరల్డ్’’ కేటగిరీలో ప్రదర్శితమైంది. అలా పుష్ప అంటే నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్ అని ప్రూవ్ చేసుకుంది.👉హిందీలో పుష్ప కేరక్టర్కు డబ్బింగ్ చెప్పింది నటుడు శ్రేయాస్ తల్పడే. తమిళంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ కేపీ శేఖర్ చెప్పారు. ఇక మలయాళంలో అల్లు అర్జున్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు నుంచి మలయాళంలో డబ్ అయ్యే ఆయన ప్రతీ చిత్రానికి ఫిల్మ్ మేకర్ జిస్ జాయ్ వాయిస్ ఇస్తున్నారు. పుష్పకి కూడా ఆయనే డబ్ చెప్పారు. 👉షెకావత్ కేరక్టర్కు ఒక్క హిందీలో తప్ప(రాజేష్ ఖట్టర్) మిగతా అన్ని భాషల్లో ఫహద్ ఫాజిల్ సొంత వాయిస్ ఇచ్చుకున్నారు. ఈ కేరక్టర్కు సుకుమార్ మొదట బెంగాలీ నటుడు ‘జిషు సేన్ గుప్తా’(భీష్మ ఫేం) అనుకున్నారు. ఆ తర్వాత కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని తీసుకోవాలనుకున్నారు. ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో.. విక్రమ్, మాధవన్, ఆర్య, బాబీ సింహా ఇలా పలువురి పేర్లను పరిశీలించారు. చివరకు మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్తో సుకుమార్ ఫిక్స్ అయ్యారు.:: వెబ్ డెస్క్ ప్రత్యేకం -
పుష్పకు ఆదరణ కరువు.. రూ.1 కోటి కూడా రాలే!
క్లాసిక్, బ్లాక్బస్టర్ సినిమాలను మళ్లీ రిలీజ్ చేయడం ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ మూవీ పుష్పను ఇటీవలే మళ్లీ విడుదల చేశాడు. నవంబర్ 22 నుంచి ఈ మూవీ హిందీ వర్షన్ థియేటర్లలో ఆడుతోంది. దీనితో పాటు హిందీ కల్ట్ క్లాసిక్ కరణ్ అర్జున్ కూడా ఒకేరోజు రిలీజైంది. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం వారం రోజుల్లో రూ.1 కోటి వసూలు చేసింది.ఏ సినిమా కలెక్షన్స్ ఎంతంటే?పుష్ప కేవలం రూ.70 లక్షలు మాత్రమే రాబట్టింది. రీరిలీజ్ ట్రెండ్లో కరణ్ అర్జున్, పుష్ప రెండూ నిరాశపర్చాయి. ఇకపోతే షారూఖ్ ఖాన్ 'కల్ హో నా హో' సినిమా కూడా నవంబర్ 15న రీరిలీజ్ అవగా ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. ఈ చిత్రం పది రోజుల్లోనే రూ.3.70 కోట్లు వసూలు చేసింది.పుష్ప 2ఇకపోతే అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించారు. -
పెళ్లికి రెడీ అయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి
'పుష్ప' సినిమాలో జాలిరెడ్డిగా తనదైన విలనిజం చూపించిన కన్నడ నటుడు ధనంజయ.. పెళ్లికి రెడీ అయిపోయాడు. కర్ణాటక రాష్ట్ర దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న తనకు కాబోయే భార్యని పరిచయం చేశాడు. దీంతో రహస్యంగా నిశ్చితార్థం అయిన విషయం బయటపడింది.(ఇదీ చదవండి: మొదటి పెళ్లిరోజు.. స్పెషల్ వీడియోతో వరుణ్ తేజ్-లావణ్య)కన్నడలో హీరో కమ్ విలన్గా పలు సినిమాలు చేసి చాలా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనంజయ. ఫ్యాన్స్ ఇతడిని ముద్దుగా డాలీ అని పిలుస్తారు. ఇతడి యాక్టింగ్ నచ్చి, సుకుమార్ తన 'పుష్ప'లో జాలీరెడ్డి రోల్ ఇచ్చారు. తనదైన స్లాంగ్తో ఫెర్ఫెక్ట్ విలనిజం చూపించాడు. త్వరలో సీక్వెల్లోనూ అదరగొట్టేయనున్నాడు.ధనంజయ్ ఎంగేజ్మెంట్ విషయానికొస్తే ధన్యతని పెళ్లి చేసుకోబోతున్నాడు. చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన ఈమె డాక్టర్. గైనకాలజీలో ఈమె స్పెషలిస్ట్. వీళ్లిద్దరికీ చాలా క్రితం నుంచే పరిచయం. తొలుత స్నేహితులుగా ఉండేవారు. క్రమంగా ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్, సహ నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు. వచ్చే ఫిబ్రవరిలో పెళ్లి జరగొచ్చని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు) View this post on Instagram A post shared by Daali Dhananjaya (@dhananjaya_ka) -
పుష్ప-2తో పాటు.. పుష్ప-3 గ్లింప్స్
-
సినిమా హీరోలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
సినిమా హీరోలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సినిమాల్లో హీరో అడవులను కాపాడేవాడని.. ఇప్పుడు స్మగ్లింగ్ చేయడమే హీరోయిజం అయ్యిందని వ్యాఖ్యానించారు. బెంగళూరు పర్యటనలో ఉన్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరో అడవులను కాపాడేవాడు. కానీ ఇప్పుడు హీరోనే అడవులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఒక్క సినిమా వ్యక్తిగా అలాంటి సినిమాలు చేయడం నాకు కష్టం. అది బయటికి మంచి మెసేజ్ ను ఇవ్వలేదు ’ అని పవన్ అన్నారు.‘పుష్ప’గురించేనా?పవన్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గందపు చెక్కలు స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా నటించాడు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ అల్లు నటనకు ఫిదా అయ్యారు. ఈ చిత్రం బన్నీకి జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. అలాంటి సినిమాపై పవన్ కల్యాణ్ పరోక్షంగా సెటైర్లు వేశాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. -
పుష్ప పాటకు RGV డ్యాన్స్
-
'పుష్ప' విలన్కి అరుదైన వ్యాధి.. దీని వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే?
'పుష్ప' విలన్ ఫహాద్ ఫాజిల్ అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా తానే బయటపెట్టాడు. 41 ఏళ్ల వయసులో ADHD (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్) సమస్య తనకు నిర్ధారణ అయినట్లు చెప్పాడు. ఇది మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుందని అన్నాడు. తాజాగా ఓ కార్యక్రమంలోనే పాల్గొన్న ఫహాద్.. తనకున్న సమస్యకి చికిత్స కోసం డాక్టర్ సలహా అడిగాడు.(ఇదీ చదవండి: పెళ్లయిన మూడు నెలలకే విడిపోతున్నారా? అసలు విషయం ఇది)చిన్నతనంలో ఈ వ్యాధి బయటపడితే దీన్ని నయం చేయొచ్చని, కానీ తాను 41 ఏళ్ల వయసులో దీని బారిన పడ్డాడని ఫహాద్ చెప్పుకొచ్చాడు. దీంతో తాను జీవితాంతం ఈ వ్యాధితో బాధపడాల్సిందే అని అన్నాడు. ఇకపోతే ఈ వ్యాధి రావడం వల్ల ఏకాగ్రత లేకపోవడం, హైపర్ యాక్టివ్, హైపర్ ఫోకస్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి.మలయాళ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. 'పుష్ప'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలిభాగంలో చాలా తక్కువ సేపు కనిపించాడు. కానీ ఆగస్టు 15న రాబోతున్న 'పుష్ప 2'లో మాత్రం ఎక్కువగానే ఉండబోతున్నాడు. ఇప్పటికే ఇతడి సీన్స్ షూటింగ్ పూర్తయింది. మరోవైపు రీసెంట్గా 'ఆవేశం' అనే మలయాళ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. రూ.30 కోట్లతో తీసిన ఈ చిత్రం రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మలయాళ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.(ఇదీ చదవండి: ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
Allu Arjun Jatara Look Secret: పుష్పరాజ్ భీకర రూపం రహస్యం ఇదేనా?
పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ పీక్కు చేరింది. ఈ మూవీకి జాతీయ ఉత్తమ అవార్డు గెలుచు కుని మరో మెట్టు ఎక్కాడు అల్లు అర్జున్. దీనికి సీక్వెల్గా వస్తున్న 'పుష్ప 2: ది రూల్' పై అంచనాలు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే పుష్ప 2 సినిమా టీజర్లో అల్లు అర్జున్ నీలి రంగు చీర, నగలు, నిమ్మకాయ దండలతో వెరైటీ లుక్ హాట్టాపిక్గా నిలిచింది. దీంతో అభిమాన హీరో కొత్త ట్రెండ్ సెట్ చేయడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. 2003లో గంగోత్రి సినిమాతో తెరంగేట్రం చేసిన అల్లు అర్జున్ ..ఈ మూవీలో లేడీ గెటప్తో కనిపించి అలరించాడు. తాజాగా పుష్ప-2 సినిమాలో కూడా అమ్మవారి భీకర రూపంతో ఫ్యాన్స్ని మరింత ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఎర్రచందనం, తిరుపతి జిల్లాలో కథ సాగుతుంది కనుక ఇది గంగమ్మ జాతర నేపథ్యమే ఈ లుక్అని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటీ గంగమ్మ జాతర తెలుసుకుందాం రండి. తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. గంగమ్మ జాతరకు 900 ఏళ్ల చరిత్ర ఉంది. గ్రామదేవతగా అవతరించిన గంగమ్మ.. సాక్షాత్తు తిరుమల శ్రీవారి చెల్లెలని భావిస్తారు. వారం రోజుల పాటు జరిగే గంగమ్మ జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. గంగమ్మ జాతర విశిష్టత పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటిరాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించి వేధించేవాడట. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కి.మీ దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. యుక్త వయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది.. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కోవడంతో అనేక వేషాలు ధరించి మూడు రోజులపాటు గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో నాలుగోరోజు గంగమ్మ-దొరవేషం వేసి, పాలెగాడిని అంత మొందించిందని భక్తుల విశ్వాసం. ఈ దుష్టశిక్షణను తలచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేసుకుంటారు. ఈ జాతరలో తొలి రోజున బైరాగివేషం ,రెండోరోజు బండవేషం,మూడోరోజు తోటివేషం,నాలుగోరోజు దొరవేషం వేసుకుంటారు. నాలుగో రోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ ఐదోరోజున మాతంగి వేషం ధరిస్తారు. ఆరోరోజు సున్నపుకుండల వేషం వేస్తారు. ఏడోరోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. గోపురాన్ని పోలిన సప్పరాలను (వెదురు బద్దలతో) తయారుచేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి. అదేరోజున కైకాల కులస్థులు పేరంటాళ్ళ వేషం వేస్తారు.మగవారు ఆడవేషం వేసుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. ఇలా చేస్తే అమ్మవారు అనుగ్రహించి తమ కోర్కెలు తీరుస్తుందని భక్తుల నమ్మకం. పేరంటాలు వేషంలోఉన్న కైకాల కులస్థులు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్నితయారుచేస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచిమట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఎనిమిదిరోజులపాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది. బన్నీ న్యూ లుక్ రహస్యం వీడాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరోవైపు పుష్ప 2: ది రూల్ టీజర్కి రెస్పాన్స్ ఒక రేంజ్లో ఉంది. బన్నీ మాతంగి లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘‘మరో బ్లాక్బస్టర్..బన్నీకి మరో జాతీయ అవార్డు పక్కా" అని కమెంట్ చేశారు. -
Allu Arjun HD Images: ప్రతి పాత్రా ప్రత్యేకం.. వెండితెర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ప్రత్యేకం (ఫొటోలు)
-
అల్లు అర్జున్ పుష్ప మూవీ.. ఆ స్టైల్ కాపీ కొట్టేశారా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప బాక్సాఫీస్ను షేక్ చేసింది. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం పలు రికార్డులు కొల్లగొట్టింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. శ్రీవల్లిగా టాలీవుడ్ను అభిమానులను అలరించింది. ఎర్రచందనం సిండికేట్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాతో అల్లు అర్జున్ను ఓ రేంజ్ స్థాయికి తీసుకెళ్లింది. అంతే కాకుండా ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ కూడా అందుకున్నారు. అయితే ఈ సినిమాలో పుష్పరాజ్ మేనరిజానికి సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా భుజం కాస్తా పైకి ఎత్తి బన్నీ నటించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికీ ఆ స్టైల్కు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఏది ఏమైనా ఈ చిత్రంలో అల్లు అర్జున్ డైలాగ్స్, వాకింగ్ స్టైల్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకున్నాయి. పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే అనే డైలాగ్ అభిమానులను ఓ ఊపు ఊపేసింది. పుష్ప సినిమాలో ముఖ్యంగా అల్లు అర్జున్ నడక ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే అచ్చం అల్లు అర్జున్ లాగే ఆ వాకింగ్ స్టైల్ను టాలీవుడ్ హీరో చేసి చూపించారు. కాకపోతే ఇప్పుడు కాదండోయ్. దాదాపు 22 ఏళ్ల క్రితమే శ్రీహరి అలాంటి మేనరిజంతో మెప్పించారు. ఇది చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్ షాకవుతున్నారు. 2002లో వచ్చిన పృథ్వీ నారాయణ అనే చిత్రంలో సేమ్ బన్నీ వాకింగ్ స్టైల్తో అదరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ శ్రీహరి అద్భుతంగా చేశారంటూ కామెంట్స్ చేశారు. మరికొందరేమో పుష్ప మేనరిజం కాపీ కొట్టారా? అంటూ డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం బన్నీ పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. pushpa walking style appatlone srihari gaaru 👌❤️ pic.twitter.com/4PJj9Y1Z1Z — celluloidpanda (@celluloidpanda) March 25, 2024 -
ఎన్ని కోట్లు ఇచ్చినా ఇకపై వాటికి మాత్రం 'నో'!
‘ఊ అంటావా మావ.. ’ అంటూ ‘పుష్ప’లోని ప్రత్యేక పాటలో వీలైనంత గ్లామరస్గా కనిపించడంతో పాటు హాట్ స్టెప్స్తో, హాట్ హాట్ హావభావాలతో ఐటమ్ సాంగ్ లవర్స్ని ఆకట్టుకున్నారు సమంత. అయితే ఈ బ్యూటీ ఈ రేంజ్లో చేయడం చాలామందిని షాక్కి గురి చేసింది. ‘అవసరమా?’ అని చర్చించుకున్నవాళ్లూ ఉన్నారు. సమంత కూడా ఈ పాట చేసినప్పుడు చాలా అసౌకర్యంగా ఫీలయ్యారట. ఆ విషయం గురించి ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ – ‘‘ఊ అంటావా..’ పాట ఫస్ట్ షాట్ తీసేటప్పుడు భయంగా అనిపించింది. నా కాళ్లు వణికాయి. నేను అంత అందంగా ఉండనని, కొందరు అమ్మాయిల్లా బాగుండననీ అనుకుంటుంటాను. దాంతో నాకు ‘ఊ అంటావా..’ పాట సవాల్లా అనిపించింది. అయితే సెక్సీగా కనిపించడం అనేది నా ఆలోచన కాదు కాబట్టి ఆ పాట చిత్రీకరణ అప్పుడు వణికిపోయాను. కానీ ఓ వ్యక్తిగా, నటిగా నాకు అసౌకర్యంగా అనిపించినవి, క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడం నుంచే నేను ఎదిగాను. ‘ఊ అంటావా..’ పాట నాకు సౌకర్యం కాదనిపించినా కొత్తగా ఏదైనా చేయాలని చేశాను. నిజానికి ఆ పాట లిరిక్స్ నాకు సవాల్గా అనిపించాయి. అమ్మాయిలంటే అందం మాత్రమే కాదనేలా ఆ పాట ఉంటుంది. అది నచ్చి చేశాను’’ అన్నారు. ఇకపై ఇలాంటి పాటలు చేస్తారా? అనే ప్రశ్నకు ‘‘లేదు.. ఎందుకంటే ఇలాంటి సవాళ్లను స్వీకరించాలనుకోవడంలేదు’’ అన్నారు సమంత. ఇక ప్రత్యేక పాటలకు సమంత ‘ఊహూ’ అంటారని స్పష్టమైపోయింది. -
అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 3 బిగ్ అప్డేట్
-
తెలుగు స్టార్ దర్శకుడికి ఇంత పెద్ద కూతురు ఉందా? గుర్తుపట్టారా మరి?
ఈ అమ్మాయి గురించి ఎవరికీ పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఈమె తండ్రి గురించి టాలీవుడ్లో ఎవరినీ అడిగినా సరే చెప్పేస్తారు. ఎందుకంటే స్వతహాగా టీచర్ అయిన ఇతడు.. ఎవరి దగ్గర పనిచేయకుండానే ఇండస్ట్రీలోకి వచ్చాడు. తనదైన మార్క్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ రెండు మూడేళ్ల క్రితం మాత్రం తన లేటెస్ట్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఆ దర్శకుడి కూతురి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మాయి పేరు సుకృతి వేణి. తండ్రి పేరు సుకుమార్. యస్.. మీరు ఊహించింది కరెక్టే. పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి డైరెక్టర్ సుకుమార్ కూతురే. తాజాగా ఈమె పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ క్రమంలోనే సుకుమార్ భార్య తబిత కొన్ని ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇందులో సుకృతిని చూస్తే సడన్గా గుర్తుపట్టలేరు. ఎందుకంటే గతంలో ఒకటి రెండు సార్లు కనిపించిన కాస్త చిన్నపిల్లలా అనిపించింది. కానీ ఇప్పుడు టీనేజీలోకి వచ్చేసింది. (ఇదీ చదవండి: చాన్నాళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) అయితే సడన్గా సుకుమార్ కూతురు ఫొటో చూసి.. అందంగా ఉన్నారని కామెంట్స్ పెడుతున్నారు. అలానే ఈ అమ్మాయి.. త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందేమోనని అంటున్నారు. అయితే సుకృతికి యాక్టింగ్ టాలెంట్ ఉందా లేదా? అనేది పక్కనబెడితే పాడే ప్రతిభ ఉంది. ఎందుకంటే సొంతంగా యూట్యూబ్ ఛానెల్ కూడా ఈమెకి ఉంది. అలానే అమెరికాలోని మసాచుసెట్స్ బెర్కెలే మ్యూజిక్ కాలేజీలో కోర్స్ చేస్తున్నట్లు ఉంది. ఇవన్నీ చూస్తుంటే సింగర్ అయ్యేలా కనిపిస్తుంది. ఒకవేళ సింగర్ అయితే అప్పుడు తెలుగు సినిమాల్లో పాడుతుందా? లేదంటే పాప్ సింగర్ అవుతుందా అనేది చూడాలి. ఇకపోతే 'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ని 'బన్నీ మామ' అని పిలుస్తూ క్యూట్గా మాట్లాడింది ఈమెనే. కావాలంటే యూట్యూబ్లో వీడియో చూడండి. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: చెల్లి ఎంగేజ్మెంట్.. డ్యాన్స్తో దుమ్మురేపిన సాయిపల్లవి!) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) -
అల్లు అర్జున్ 'పుష్ప'గాడికి రెండేళ్లు.. ఆశ్చర్యం కలిగించే రికార్డ్స్
సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'పుష్ప' 2021 డిసెంబర్ 17న పాన్ ఇండియా రేంజ్లో విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం సుమారు రూ. 170 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలు ఉన్నాయి. బన్నీ- రష్మిక మందన్నల యాక్టింగ్ ఈ సినిమా విజయానికి బలమైన కారణమైతే.. సినిమా చివరి భాగంలో ఫహద్ ఫాజిల్ పాత్ర హైలెట్గా నిలిచింది. ప్రముఖ హీరోయిన్ సమంత ఈ సినిమా కోసం 'ఉ అంటావా... ఊ ఊ అంటావా..' పాటలో ప్రత్యేకంగా కనిపించింది. ఇలా పుష్ప సినిమాకు ఎన్నో అదనపు ఆకర్షణలతో విడుదలై.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారుగా రూ. 373 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. నేటికి (డిసెంబర్ 17) ఈ సినిమా విడదులై రెండు ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులతో పాటు పలు ఆసక్తకరమైన విషయాలు మరోసారి గుర్తుచేసుకుందాం. ► అల్లు అర్జున్కు పుష్ప తొలి పాన్ ఇండియా సినిమా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల చేశారు. ► ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా నిడివి 2: 59 గంటలు. 'పుష్ప' అత్యధిక భాగం అడవుల్లోనే షూట్ చేశారు. అందుకోసం మారేడుమిల్లి అడవులను ఎంపిక చేసుకున్నారు. ► అల్లు అర్జున్ 'పుష్ప' గెటప్లో రెడీ అయ్యేందుకు మేకప్ కోసం దాదాపు రెండు గంటల సమయం పట్టేదని బన్నీ చెప్పాడు. తెల్లవారుజామున 4.30 నిద్రలేచి సెట్కు వెళ్లితే.. ఉదయం 5 నుంచి 7 వరకూ మేకప్ కోసమే సమయం పట్టేదట. షూటింగ్ పనులు పూర్తయ్యాక మేకప్ తీయడానికి 30 నిమిషాల సమయం పట్టేదని బన్నీ గతంలో చెప్పాడు. ► ఈ సినిమాలోని పాటలు అన్నీ కలిపి యూట్యూబ్లో 7బిలియన్ వ్యూస్ సాధించాయి. అంటే 700కోట్ల మంది వీక్షించారు. ఇండియాలో ఈ రికార్డు సాధించిన తొలి చిత్రంగా పుష్ప రికార్డుకెక్కింది. ► యూట్యూబ్ 'టాప్ 100 గ్లోబల్ సాంగ్స్' జాబితాలో 'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా!' పాట మొదటి స్థానంలో నిలవగా.. 'సామీ సామీ' పాట రెండో స్థానం దక్కించుకుంది. దాక్కో దాక్కో మేక 24వ స్థానంలో ఉంటే శ్రీవల్లి సాంగ్ 74వ ప్లేసులో నిలిచింది. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అనే పాట మాత్రం 97వ స్థానంలో నిలిచింది. ► 'ఆర్య'తో బన్నీకి సూపర్ హిట్ ఇచ్చిన సుకుమార్.. దాదాపు పదేళ్ల తర్వాత 'పుష్ప' కోసం మళ్లీ వాళ్లిద్దరూ ఈ ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. ► ప్రపంచవ్యాప్తంగా పుష్ప రూ.373కోట్లు (గ్రాస్) వసూలు చేసింది. ఒక్క హిందీలోనే రూ.108 కోట్లు (నెట్) కలెక్షన్లు రాబట్టడం విశేషం. 2021లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప రికార్డు క్రియేట్ చేసింది. ►ఓటీటీలోనూ 'పుష్ప' గాడు దుమ్ములేపాడు. 2022లో అమెజాన్ప్రైమ్ వీడియోలో అత్యధికమంది వీక్షించిన మూవీగా నిలిచింది. టెలివిజన్లోనూ పుష్పరాజ్ ఏమాత్రం తగ్గలేదు. 2022లో అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన చిత్రంగా పుష్ప నిలిచింది. అప్పట్లో 10మిలియన్+ ఇన్స్టా రీల్స్ క్రియేట్ చేసి ఇండియాలో పుష్పతో ఇన్స్టాగ్రామ్నే షేక్ చేశాడు. ► అవార్డుల విషయంలోనూ 'తగ్గేదేలే' అంటూ దూసుకుపోయాడు. ఏడు ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు ఏడు సైమా అవార్డులు ఈ చిత్రానికి దక్కాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గీత రచయిత, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులు వచ్చాయి. ► ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్- 2022 పుష్పకు దక్కింది ► పుష్ప సినిమాకు రెండు జాతీయ అవార్డులు దక్కాయి. ఉత్తమ హీరోగా అల్లు అర్జున్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్కు దక్కాయి. ► 7 ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డ్స్ను దక్కించుకున్న పుష్ప. -
నిమిషం యాడ్ కోసం రూ. 10 కోట్లు.. రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు. దీంతో అతని రెమ్యునరేషన్తో పాటు పలు యాడ్ రెమ్యునరేషన్ కూడా పెరిగింది. సుకుమార్ డైరెక్ట్ చేసి పుష్ప నుంచి పార్ట్ -2 త్వరలో విడుదల కానుంది. 2024 కొత్త ఏడాదిలో బన్నీ పేరు మరోసారి పాన్ ఇండియా రేంజ్లో వెలిగిపోవడం ఖాయం. ఇలాంటి సమయంలో కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తుల కోసం యాడ్స్ రూపంలో ప్రమోట్ చేయాలని కోరడం సహజం. ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఒక మద్యం కంపెనీకి చెందిన తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయాలని కోరాయాట. అందుకు సుమారు రూ. 10 కోట్లు ఆఫర్ చేశాయట. కేవలం 60 సెకండ్లు మాత్రమే తమ యాడ్లో కనిపిస్తే చాలని కోరాయట.. కానీ ఈ డీల్ను అల్లు అర్జున్ సున్నితంగా రిజెక్ట్ చేశారని సమాచారం. మద్యం, సిగరెట్స్, గుట్కా తదితర దుర్వ్యసనాల యాడ్స్లలో నటిస్తే సమాజంలో చెడును వ్యాప్తి చేసినట్లు అవుతుందని అయన చెప్పారట.. అందు కోసం ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా తాను చేయనని చెప్పి పంపించేశాడట బన్నీ. ప్రజలకు హానికరం చేసే వస్తువులను ప్రమోట్ చేసి వాటి ద్వారా వచ్చే డబ్బు తనకు అవసరం లేదని ఆయన ఫ్యాన్స్ కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. సరోగేట్ యాడ్స్ నిషేధం మద్యం, సిగరెట్స్, గుట్కా తదితర హానికరమైన వాటిని సరోగేట్ యాడ్స్ అంటారు. నియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉండే ప్రకటనల (యాడ్స్) నియంత్రణకు కేంద్రం మార్గదర్శకాలను నిర్ణయించింది. ఈ మేరకు సరోగేట్ యాడ్స్ (ప్రచారం చేయడానికి వీల్లేని ఉత్పత్తులకు సంబంధించి వాటి పేరుతోనే అదేరీతిలో ఉండే వేరే ఉత్పత్తులను చూపించడం)ని కూడా నిషేధించింది. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ గతంలో ఒక పాన్ మసాలా ప్రొడక్ట్ తో కుదుర్చుకున్న బ్రాండ్ అంబాసిడర్ కాంట్రాక్టును రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే ప్రమోషనల్ డబ్బులను కూడా వాపసు ఇచ్చేశారు. ఈ పాన్ మసాలా ప్రకటనను చట్టం నిషేధించిన సరోగేట్ యాడ్స్ గా పరిగణిస్తారని బిగ్ బీ కి తెలియక ఒప్పుకున్నట్లు ఆయన తెలిపిన విషయం తెలిసిందే. భారతదేశంలో ఎందుకు నేరం కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ చట్టం 1995 ద్వారా పొగాకు, మద్యం, సిగరెట్లు వంటి ఉత్పత్తుల ప్రకటనలపై భారత్లో నిషేధం ఉంది. దీంతో సెలబ్రీటిలతో ఈ సరోగేట్ ప్రకటనలు పుట్టుకొచ్చాయి. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తుల ప్రకటనలు ఉండకూడదని భారత ప్రభుత్వం నిర్ణయించింది. టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ 2003, సెక్షన్ 5 అనే చట్టాన్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. సిగరెట్లు, పొగాకు వంటి హానకరమైన ఉత్పత్తుల వినియోగాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రోత్సహించ కూడదని ఆ చట్టం చెబుతుంది. దీంతో ప్రస్తుతం చాలామంది సెలబ్రిటీలు వాటిని ప్రమోట్ చేయడం లేదు. -
‘పుష్ప’ నటుడు కేశవ అరెస్ట్
పంజగుట్ట:‘పుష్ప’సినిమాలో హీరో స్నేహితునిగా నటించి ఎంతో క్రేజ్ సంపాదించుకున్న నటుడు జగదీశ్ అలియాస్ కేశవ (మచ్చా) ఓ యువతి ఆత్మహత్యకు కారణమయ్యాడు. పంజగుట్ట పోలీసులు బుధవారం అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. కేసు పూర్వాపరాలిలా.. కాకినాడకు చెందిన యువ తి ఓ సంస్థలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే, సినిమాల్లో జూనియర్ ఆరి్టస్టుగా నటిస్తుండేది. పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలోని సంగీత్నగర్లో అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్లో నివసిస్తుండేది. తల్లి దండ్రులు కాకినాడలోనే ఉండగా, ఆమెకు భర్తతో విడాకులు అయ్యాయి. కొంతకాలం కిందట ఆ యువతికి మణికొండలో నివసించే నటుడు జగదీశ్ పరిచయమయ్యాడు. పరిచయం కాస్తా ప్రేమగా మారి కొద్దిరోజులు లివింగ్ రిలేషన్లో ఉన్నారు. జగదీశ్ ఆ యువతిని కాదని మరో యువతిని వివాహం చేసుకోవడంతో ఆమె జగదీశ్ను దూరం పెట్టసాగింది. ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేది కాదు. రహస్యంగా ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి ఈ క్రమంలో గత నెల 27న మహిళ నివసించే ఫ్లాట్ వద్దకు వచ్చిన జగదీశ్.. సదరు మహిళ మరో యువకునితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను కిటికీలోనుంచి తీశాడు. ఆ తర్వాత డోర్కొట్టి లోనికి వెళ్లి మీ బాగోతం మొత్తం రికార్డ్ చేశానంటూ వారిని బెదిరించాడు. ఫొటోలు డిలీట్ చెయ్యా లని ఎంత బతిమిలాడినా వినలేదు. దీంతో ఆ యువతి, యువకుడు పోలీసులకు ఫోన్ చేస్తామనడంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు కూడా ఫోన్లో వేధించాడు. 29వ తేదీ ఉదయం ఆ యువతి మరొకరితో సన్నిహితంగా ఉన్న ఫొటో పంపించి.. ఇలాంటి ఫొటోలుఇంకా చాలా ఉన్నాయనీ, అవన్నీ బయటపెడతానని బెదిరించాడు. దీంతో తీవ్ర ఆందోళన, ఒత్తిడికి గురైన యువతి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎలాంటి సూసైడ్ నోట్ లేకపోవడంతో ఆత్మహత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మరుసటిరోజు యువతి బంధువులు జగదీశ్ వేధింపులను పోలీసులకు వివరించగా ఆ మేరకు కేసు పెట్టారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు జగదీశ్ను పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
'పుష్ప' నటుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?
'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ ఫ్రెండ్ పాత్ర చేసిన నటుడు జగదీష్ని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేస్తున్న ఈ నటుడు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉండటం షాకింగ్గా అనిపించింది. ఇంతకీ ఏమైంది? ఓ జూనియర్ ఆర్టిస్టు.. మరో వ్యక్తితో ఉన్నప్పుడు నటుడు జగదీశ్ ఫొటోలు తీశాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఈ వేధింపులు తాళలేక మనస్తాపానికి గురైన సదరు మహిళ (జూనియర్ ఆర్టిస్టు).. గత నెల 29న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మహిళ ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకున్నారు. దీనంతటికి కారణం 'పుష్ప' నటుడు జగదీష్ అని నిర్ధారించుకున్నారు. అయితే గత కొన్నిరోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఇతడిని.. అరెస్ట్ చేసి, కోర్టులో బుధవారం హాజరు పరిచారు. ఆత్మహత్య చేసుకున్న మహిళతో గతంలో జగదీశ్కు సినీ రంగంలో పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. ఇక జగదీష్ కెరీర్ విషయానికొస్తే.. మల్లేశం, జార్జిరెడ్డి, పలాస 1978 తదితర చిత్రాల్లో సహాయ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా సుకుమార్ దృష్టిలో పడి 'పుష్ప' లాంటి పాన్ ఇండియా మూవీలో అవకాశం దక్కించుకున్నాడు. మచ్చ మచ్చ అని అల్లు అర్జున్ కూడా ఉండే పాత్రలో కామెడీ పండించాడు. 'సత్తిగాని రెండెకరాలు' అనే సినిమాలో హీరోగానూ నటించాడు. 'పుష్ప 2'తో బిజీగా ఉన్న ఇతడు అరెస్ట్ ఇప్పుడు ఒక్కసారిగా అందరినీ అవాక్కయ్యేలా చేసింది. -
జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్.. సరికొత్త చరిత్ర
జాతీయ అవార్డుల కార్యక్రమం ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా తెలుగు హీరో అల్లు అర్జున్ అవార్డు అందుకున్నాడు. 'పుష్ప' చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. అయితే తెలుగు సినీ చరిత్రలో ఈ పురస్కారం దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. (ఇదీ చదవండి: లియో నిర్మాతలకు షాకిచ్చిన మద్రాస్ హైకోర్ట్!) ఈసారి జాతీయ అవార్డులతో తెలుగు సినిమా కళకళలాడిపోయింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. రాష్ట్రపతి నుంచి పురస్కారం అందుకోగా.. 'ఉప్పెన'కి బుచ్చిబాబు, 'పుష్ప' సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, 'ఆర్ఆర్ఆర్' సినిమాకుగాను నేపథ్య సంగీతానికి కీరవాణి, కొరియోగ్రఫీకి ప్రేమ్ రక్షిత్, స్పెషల్ ఎఫెక్ట్స్కి శ్రీనివాస్ మోహన్, ప్లే బ్యాక్ సింగర్ కాలభైరవ, స్టంట్ కొరియోగ్రఫీకి కింగ్ సోలమన్ అవార్డులు అందుకున్నారు. అలానే 'కొండపొలం' పాటకు చంద్రబోస్ కూడా జాతీయ అవార్డులు అందుకున్నారు. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) జాతీయ అవార్డుల పూర్తి జాబితా ఇదే ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప) ఉత్తమ నటి: ఆలియా భట్ (గంగూబాయి) & కృతిసనన్ (మిమీ) ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి (ద కశ్మీరీ ఫైల్స్ - హిందీ) ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠీ (మిమీ- హిందీ) ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (గోదావరి - మరాఠీ సినిమా) ఉత్తమ సంగీత దర్శకుడు (సాంగ్స్): పుష్ప- దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (బీజీఎమ్) : ఆర్ఆర్ఆర్- ఎమ్.ఎమ్ కీరవాణి బెస్ట్ ఫీచర్ ఫిలిం: రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్ (హిందీ) ఉత్తమ పిల్లల చిత్రం: గాంధీ & కో (గుజరాతీ) ఉత్తమ కొరియోగ్రఫీ: ఆర్ఆర్ఆర్-ప్రేమ్ రక్షిత్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: ప్రీతిశీల్ సింగ్ డిసౌజా (గంగూబాయి కతియావాడి) ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: ఆర్ఆర్ఆర్-శ్రీనివాస్ మోహన్ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్: శ్రేయా ఘోషల్ (ఇరవిన్ నిహాల్ - తమిళ మూవీ) బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్: కాలభైరవ (ఆర్ఆర్ఆర్ - కొమురం భీముడో) ఉత్తమ లిరిక్స్: చంద్రబోస్-కొండపొలం మూవీ (తెలుగు) ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డ్(స్టంట్ కొరియోగ్రఫీ): ఆర్ఆర్ఆర్- కింగ్ సోలమన్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: వీరా కపూర్ ఏ (సర్దార్ ఉద్దామ్-హిందీ) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: దిమిత్రీ మాలిక్ & మాన్సి ధ్రువ్ మెహతా (సర్దార్ ఉద్దామ్) ఉత్తమ ఎడిటింగ్: సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కతియావాడి మూవీ) బెస్ట్ ఆడియోగ్రఫీ (లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్): అరుణ్ అశోక్ & సోనూ కేపీ (చవిట్టు మూవీ-మలయాళం) బెస్ట్ ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనర్) : అనీష్ బసు (జీలీ మూవీ- బెంగాలీ) బెస్ట్ ఆడియోగ్రఫీ (రీరికార్డిస్ట్ ఆఫ్ ద ఫైనల్ మిక్స్డ్ ట్రాక్): సినోయ్ జోసెఫ్ (సర్దార్ ఉద్దామ్-హిందీ) బెస్ట్ స్క్రీన్ప్లే (ఒరిజినల్): షాహీ కబీర్ (నాయట్టు సినిమా-మలయాళం) బెస్ట్ స్క్రీన్ప్లే (డైలాగ్ రైటర్) : ప్రకాశ్ కపాడియా & ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కతియావాడి) బెస్ట్ సినిమాటోగ్రఫీ: అవిక్ ముఖోపాధ్యాయ్ (సర్దార్ ఉద్దామ్ మూవీ-హిందీ) ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: భవిన్ రబరీ (ఛెల్లో షో - గుజరాతీ సినిమా) బెస్ట్ ఫిలిం ఆన్ ఎన్వైర్మెంట్ కంజర్వేషన్: అవషావ్యూహం (మలయాళం) బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్: అనునాద్-ద రెజోనెన్స్ (అస్సామీస్) బెస్ట్ పాపులర్ ఫిలిం ఆన్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్: ఆర్ఆర్ఆర్ ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: మెప్పాడియన్ (మలయాళం) స్పెషల్ జ్యూరీ అవార్డ్: షేర్ షా (హిందీ సినిమా) నర్గీస్ దత్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్: ద కశ్మీరీ ఫైల్స్ (హిందీ) భాషల వారీగా ఉత్తమ చిత్రాలు బెస్ట్ మీషింగ్ ఫిల్మ్: బూంబా రైడ్ బెస్ట్ అస్సామీస్ ఫిల్మ్: అనుర్ బెస్ట్ బెంగాలీ ఫిల్మ్: కల్కొకో-హౌస్ ఆఫ్ టైమ్ బెస్ట్ హిందీ ఫిల్మ్: సర్దార్ ఉద్దామ్ బెస్ట్ గుజరాతీ ఫిల్మ్: లాస్ట్ ఫిల్మ్ షో బెస్ట్ కన్నడ ఫిల్మ్: చార్లి 777 బెస్ట్ మైథిలీ ఫిల్మ్: సమాంతర్ బెస్ట్ మరాఠీ ఫిల్మ్: ఏక్ దా కై ఝాలా బెస్ట్ మలయాళ ఫిల్మ్: హోమ్ బెస్ట్ మెయిటెయిలోన్ ఫిల్మ్: ఏక్ హోయిగీ యమ్ (అవర్ హౌమ్) బెస్ట్ ఒడియా ఫిల్మ్: ప్రతిక్ష్య (ద వెయిట్) బెస్ట్ తమిళ్ ఫిల్మ్: కడైసి వివసై (ద లాస్ట్ ఫార్మర్) బెస్ట్ తెలుగు ఫిల్మ్: ఉప్పెన నాన్ ఫీచర్ ఫిలింస్ బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్: ఏక్ థా గావ్ (గర్హివాలీ - హిందీ) బెస్ట్ వాయిస్ ఓవర్: కులదా కుమార్ భట్టాచారి (హాథీ బందూ) బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: ఇషాన్ దీవేచా (సక్కలెంట్) బెస్ట్ ఎడిటింగ్: అబ్రో బెనర్జీ (ఇఫ్ మెమొరీ సెర్వ్స్ మీ రైట్) బెస్ట్ ఆన్లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్: సురుచి శర్మ (మీన్ రాగా) బెస్ట్ ఆడియోగ్రఫీ(ఫైనల్ మిక్స్డ్ ట్రాక్): ఉన్ని కృష్ణన్ (ఏక్ థా గావ్) బెస్ట్ సినిమాటోగ్రఫీ: బిట్టూ రావత్ (పాతాళ్ తీ) ఉత్తమ డైరెక్షన్: బకుల్ మతియానీ (స్మైల్ ప్లీజ్) ఉత్తమ కుటుంబ కథా చిత్రం: చాంద్ సాన్సీ (హిందీ) ఉత్తమ షార్ట్ ఫిక్షన్ ఫిలిం: దాల్ బాత్ (గుజరాతీ) స్పెషల్ జ్యూరీ అవార్డ్: రేఖా మూవీ (మరాఠీ) బెస్ట్ ఏనిమేషన్ ఫిల్మ్: కండిట్టుండూ (మలయాళం) బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ ఫిలిం: లుకింగ్ ఫర్ చలాన్ (ఇంగ్లీష్) బెస్ట్ ఎక్స్ప్లోరేషన్ ఫిలిం: ఆయుష్మాన్ (ఇంగ్లీష్-కన్నడ) బెస్ట్ ఎడ్యుకేషనల్ ఫిలిం: సిర్పంగిలన్ సిర్పంగల్ (తమిళం) బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్(షేర్డ్): మీతూ దీ (ఇంగ్లీష్) & త్రీ టూ వన్ (మరాఠీ-హిందీ) బెస్ట్ ఎన్వైర్మెంట్ ఫిలిం: మున్నం వలవు (మలయాళం) బెస్ట్ ప్రమోషనల్ ఫిలిం: వర్లీ ఆర్ట్ (ఇంగ్లీష్) బెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫిలిం: ఇథోస్ ఆఫ్ డార్క్నెస్ (హిందీ-బెంగాలీ) బెస్ట్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఫిలింస్: టీఎన్ కృష్ణన్ బౌ స్ట్రింగ్స్ టూ డివైన్ బెస్ట్ బయోగ్రాఫికల్ ఫిలిం(షేర్డ్): రుఖు మతిర్ దుఖు మహీ (బెంగాలీ) & బియాండ్ బ్లాస్ట్ (మణిపురి) బెస్ట్ ఎత్నోగ్రాఫిక్ ఫిలిం: ఫైర్ ఆన్ ఎడ్జ్ (టివా) బెస్ట్ డెబ్యూ నాన్ ఫియేచర్ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: పాంచిక (గుజరాతీ- డైరెక్టర్ అంకిత్ కొఠారీ) -
ద–పొలిటికల్–‘పుష్ప’! సినిమాలూ, రాజకీయ గుర్తులు.. తగ్గేదేలే
సినిమాలంటే అందరికీ ఆసక్తి కదా. మామూలు జనాలకు మరీ ఎక్కువ. అందుకే జనాలందరికీ సినిమా భాషలోనే తమ అర్జీలు చెప్పుకుంటే పరమ క్యాచీగా ఉంటుందనుకున్నాయి రాజకీయ పార్టీలు. బాడీ లాంగ్వేజీలోలాగా... తమనే గెలిపించాలంటూ ‘మూవీ లాంగ్వేజీ’లో పొలిటికల్ పార్టీలు విన్నవించుకోవాలని నిర్ణయించుకుంటే... ఆ వచ్చే అభ్యర్థనలకు ఊహారూపమే ఈ వాక్యాలు... ‘పుష్ప సినిమా చూశారుగా అందరూ. అందులోని పాటలో హీరో చెప్పు జారిపోలా. అచ్చం అలాగే జారింది మా అధికారం కూడా. అయితే హీరోగారి గూడ పైకి లేచి నిలబడింది చూశారా... ఈసారి అచ్చం మీరూ మమ్మల్ని పైకి లేపండి. గూడను కాదు... మా చేతిని. అదే... చేతి గుర్తును.’’ ‘ప్రజలారా... చేతిగుర్తు వారి మాటలు చెవిన పెట్టకండి. అసలు పుష్ప అంటే ఏమిటి? పువ్వు! దీని బట్టి తెలియడంల్యా.. ఎవరికి ఓటెయ్యాలో! పుష్పకు ఓటెయ్యండి. అంటే ‘పువ్వు గుర్తు’కు అని అర్థం. పువ్వు గుర్తు అంటే కమలం పార్టీ అని విజ్ఞులైన మీకు వేరే చెప్పాలా?’’ ‘ఈ పువ్వు గుర్తువారూ, ఆ చెయ్యి గుర్తు వారూ ఎలాంటివాళ్లు? ఆ సినిమాలోనే చూశారుగా. గంధం చెక్కల ఆచూకీ చెప్పేదాకా కారెక్కించి తిప్పుతారు. తీరా ఆచూకీ దొరికాక... హీరో కారెక్కబోతుంటే కార్లోంచి కాలు పక్కకు లాగేస్తారు. నాల్రూపాయలు పారేసి... షేర్ ఆటోలో రమ్మంటారు. ఓడనెక్కేదాక ఓడమల్లయ్యా... ఓడ దిగాక బోడ మల్లయ్య. ఇలాంటి పార్టీలకా మీ ఓటు? పాపం... హీరో అప్పటికప్పుడు కారు కొనాల్సి వచ్చింది. హీరో కొన్నదేమిటి? ‘కారు’! ఆ సంగతి గుర్తుపెట్టుకోండి. అసలు మా కారు గుర్తుకు ఓటేస్తే... కృతజ్ఞతకొద్దీ ఎప్పుడూ కార్లోనే తిప్పుతాం. కారు దిగకండి... మమ్మల్నీ దించకండి. కారు స్పీడు విషయంలో మీరు తగ్గేదేల్యా... మమ్మల్ని తగ్గించేదే ల్యా’’ సినిమా అభ్యర్థనలు పూర్తయ్యాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూ హెచ్చరించే కేన్సర్ క్యారెక్టర్ ‘ముఖేశ్’ఈసారి ఈ సినిమా యాడ్స్ అయ్యాక వచ్చాడు. అతడు చెప్పేదేమిటంటే... ‘‘అసలా మూవీ హీరోయే ఓ ఎర్రచందనం స్మగ్లర్. అతడు చేసేదే అడవుల్ని నరకడం. మీకు అర్థమవ్వడం కోసం ఎంతటి సినిమా ఉపమాలిచ్చినా సరే... ఈ నెగెటివ్ కేరెక్టర్ల పట్ల పాజిటివ్ కోణంలో కాకుండా అసలు కేరెక్టర్లను గుర్తెరిగి ఎంచుకోండి. ఐదేళ్ల పాటు హాయిగా మిమ్మల్ని మీరే పరిపాలించుకోండి. -
‘రారా సామి’పాటకి స్కూల్ గర్ల్ స్టెప్పులు..రష్మిక ‘క్యూట్’ రియాక్షన్
అల్లు అర్జున్, రష్మిక మందన్నా కలిసి నటించిన పుష్ప చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఆ సినిమాలోని ‘రారా సామి’పాటకు రష్మిక వేసిన స్టెప్పులు బాగా వైరల్ అయ్యాయి. అప్పట్లో ఎక్కడ చూసిన ఈ పాటే మోగేది. చాలా మంది రీల్స్ చేసి.. ఈ పాటను వైరల్ చేశారు. పలువురు హీరోయిన్లు కూడా ఈ పాటకు స్టెప్పులేశారు. సినిమా విడుదలై రెండేళ్లు కావోస్తున్న ‘రారా సామి’ క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. తాజాగా ఈ పాటకు దాదాపు ఐదేళ్లు వయసు ఉన్న చిన్నారి చిందులేసి అలరించింది. మహారాష్ట్రకు చెందిన ఆ చిన్నారి.. స్కూల్ కల్చరల్ ప్రోగ్రామ్లో భాగంగా రారా సామి పాటకు డ్యాన్స్ చేసింది. ఆమెతో పాటు మిగతా విద్యార్థులు కూడా స్టెప్పులేసి అలరించారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. దీనిని రష్మిక ఎక్స్(ట్విటర్)లో షేర్ చేస్తూ.., ‘సో క్యూట్’ అంటూ అని క్యాప్షన్ ఇచ్చింది. So cute 🥰 https://t.co/bfXDGQ8dMJ — Rashmika Mandanna (@iamRashmika) October 2, 2023 -
'ఏక్ రూపాయ్వాలా, నీ యవ్వ తగ్గేదేలే...'
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అడవిలో చెట్లు కొట్టుకునే కూలోడు అంతర్జాతీయ స్మగ్లర్గా ఎదిగిన కథ ‘పుష్ప’ సినిమా. వాస్తవానికి అలాంటి ఘటనలు నిజ జీవితంలో జరగవు. కానీ.. ఉమ్మడి కరీంనగర్లో పీ డీఎస్ బియ్యం కొనుగోలు చేసి.. అధిక ధరలకు ఇ తర రాష్ట్రాలకు ఎగుమతి చేసే వ్యాపారిని చూస్తే ని జమే అనిపిస్తోంది. ‘ఏక్ రూపాయ్వాలా’ కోడ్ నే మ్తో అధికారులు ముద్దుగా పిలుచుకునే ఈ స్మగ్లర్ నెట్వర్క్ ఒకప్పుడు పాత కరీంనగర్ జిల్లాకే పరిమి తం. నేడు ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. రెండేళ్ల క్రితం ఉమ్మడి జిల్లా దాటి మహారాష్ట్రలో ఎంటర్ అ య్యాడు. ఆ సమయంలో అతడి దందా.. పీడీఎస్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్న తీరును ‘సాక్షి’ దినపత్రిక ‘ఏక్ రూపాయ్వాలా’ శీర్షికన వ రుస కథనాలు ప్రచురించింది. వీటిపై డీజీపీ కార్యాలయం స్పందించి దాడులకు ఆదేశించింది. అప్పటి కరీంనగర్ సీపీ సత్యనారాయణ నేతృత్వంలో టా స్క్ఫోర్స్ బృందాలు వరుస దాడులతో విరుచుకుపడ్డాయి. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిని బైండోవర్ కూడా చేశాయి. దీంతో కొంతకా లం సదరు వ్యాపారి, అతని అనుచరులు కార్యకలాపాలు నిలిపివేశారు. సైకిళ్లతో మొదలై.. గూడ్స్ రైళ్లలో తరలించే స్థాయికి.. ఒకప్పుడు గ్రామాల్లో సైకిళ్లపై తిరుగుతూ.. పీడీఎస్ బియ్యాన్ని సేకరించి వాహనాల్లో తరలించడంలో ఏక్ రూపాయ్వాలాది అందెవేసిన చేయి. అప్పట్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలు వ రుసగా రావడం.. పత్రికల్లో వరుస కథనాలు రావడంతో అతడి వ్యాపారం సుప్తావస్థలోకి వెళ్లింది. ఆ తర్వాత కొత్త పద్ధతిలో వ్యాపారంలోకి దిగాడు. అధి కారులకు లంచాలిస్తూ.. మహారాష్ట్రకు బియ్యం తరలించడం కంటే అధికారికంగానే ఎగుమతి చేయాల ని నిర్ణయించాడు. అదునుకోసం చూస్తున్న అతడికి తమిళనాడు తెలంగాణ ప్రభుత్వానికి బియ్యం కో సం చేసిన వినతి ఆసరాగా దొరికింది. రూ.37.50కు కిలో చొప్పున కావాలని తమిళనాడు కోరడం.. ఆ డీల్ రద్దు కావడంతో ‘ఏక్ రూపాయ్వాలా’ రంగంలోకి దిగాడు. కిలో రూ.31.50కే ఇస్తామని డీల్ కుది ర్చినట్లు సమాచారం. ఎగుమతికి కావాల్సిన బి య్యంలో తనవంతుగా పీడీఎస్ రైస్ ఇచ్చేందుకు సి ద్ధమయ్యాడు. అతడికి కావాల్సినంత బియ్యం ఇచ్చేందుకు ఉమ్మడి జిల్లాలోని పలువురు రైస్మిల్లర్లు కూడా సమ్మతించారని తెలిసింది. ఇందులో కస్ట మ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ఉన్నట్లు తెలిసింది. వా రం వ్యవధిలో దాదాపు ఐదు వేల టన్నుల బియ్యాన్ని కరీంనగర్ నుంచి గూడ్స్ ద్వారా ఎగుమతి చేసినట్లు సమాచారం. వీటివిలువ దాదాపు రూ.160 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. డిమాండ్ నేపథ్యంలో మరోరూ.60 కోట్ల విలువైన 2వేల ట న్నుల బియ్యాన్ని తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు మరో గూడ్స్రేక్ (కొన్ని బోగీలతో కూ డిన రైలు)ను ఇప్పటికే బుక్చేశారని సమాచారం. ఇంత జరుగుతున్నా.. సివిల్ సప్లయి అధికారులు, పోలీసులకు సమాచారం లేకపోవడం గమనార్హం. అటెన్షన్ డైవర్షన్లో అందెవేసిన చేయి.. తెలంగాణ, మహారాష్ట్రలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాలో ‘ఏక్ రూపాయ్వాలా’ది అందె వేసిన చే యి. అచ్చం వీరప్పన్ తరహాలో.. పోలీసులు బందో బస్తుల్లో నిమగ్నమయ్యే సందర్భాల్లోనే భారీ వాహనాల్లో టన్నుల కొద్దీ బియ్యం రాష్ట్ర సరిహద్దులు దా టిస్తాడు. ఇపుడు బహిరంగ దందా చేస్తున్న నేపథ్యంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. తమ పై సివిల్ సప్లయీస్, పోలీసుల కన్ను పడకుండా.. గణేశ్ ఉత్సవాల్లో అధికారులు తలమునకలైన సందర్భాన్ని వాడుకుని రైలు ద్వారా తెలివిగా.. పకడ్బందీగా తమిళనాడుకు బియ్యం ఎగుమతి చేశా డు. త్వరలో ఎన్నికలకోడ్ రాబోతోంది. కోడ్ వస్తే వాహన తనిఖీలు పెరుగుతాయి. దానికి ముందే రెండోవిడత సరుకు పంపేలా ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం. కిలో రూపాయి బియ్యాన్ని రూ. 4 లేదా రూ.5 కమీషన్ చొప్పున విక్రయించే ‘ఏక్ రూపాయ్ వాలా’ నేడు రూ.వందల కోట్ల వ్యాపారా నికి పడగలెత్తిన తీరు సినిమా కథను తలపిస్తోంది. ఫిర్యాదు వచ్చింది చర్యలు తీసుకుంటాం కరీంనగర్ నుంచి తమిళనాడుకు సీఎంఆర్ బియ్యం అక్రమంగా వెళ్తున్నాయని మాకు అధికారికంగా ఫిర్యాదు వచ్చింది. వెంటనే అడిషనల్ కలెక్టర్, సివిల్ సప్లయీస్ ఉన్నతాధికారులకు చేరవేశాను. వారు స్పందించి రంగంలోకి దిగారు. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. – రవీందర్ సింగ్, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ -
ఏంది పుష్పా ఇది? ఇంకా షూటింగే కాలే.. అప్పుడే వెయ్యి కోట్లా?
పుష్ప.. పుష్పరాజ్.. అప్పుడే వేట మొదలుపెట్టాడు. పుష్ప సినిమాకు కలెక్షన్స్ మాత్రమే కాదు అవార్డులు సైతం వచ్చాయి. 69 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న జాతీయ ఉత్తమ నటుడి అవార్డును పుష్పరాజ్ తన వశం చేసుకున్నాడు. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో అల్లు అర్జున్కు ఉత్తమ నటుడి పురస్కారం వరించింది. దీనిపై యావత్ తెలుగు ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఈ అవార్డుతో తన రేంజ్ ఏంటో మరోసారి చూపించాడు పుష్పరాజ్. ఇకపోతే ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే! మొదటిదాన్ని మించిపోయేలా రెండో పార్ట్ తీయాలని ప్రయత్నిస్తున్నాడు సుకుమార్. మేకింగ్ దశలోనే పుష్ప 2కి అదిరిపోయే ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్కు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏకంగా రూ.1000 కోట్లు ఆఫర్ చేసినట్లు టాక్! పుష్ప 2 సినిమాకు సంబంధించిన అన్ని రకాల హక్కులను తమకు సొంతం చేయాలని, అలాగైతే వెయ్యి కోట్లు ఇస్తామని ముందుకు వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. మరి ఈ ఆఫర్కు పుష్ప మేకర్స్ ఎలా స్పందించారు? అసలు ఈ ప్రచారంలో నిజమెంత? అన్నది తెలియాల్సి ఉంది. చదవండి: మొదటి వారం నామినేషన్స్లో 8 మంది.. ఎవరెవరంటే? -
మెగా ఫ్యాన్స్ సపోర్ట్తో ఎంట్రీ.. ఆపై దూరం.. బన్నీ సమాధానం ఇదే
‘‘ఒకరు అదే పనిగా మనల్ని విమర్శిస్తున్నారంటే మనం ఎదిగినట్లే... బయటకు చెప్పలేం... చాలా అవమానాలుంటాయి.. నాది అత్యాస.. నాకు అన్నీ కావాలి... నేషనల్ బెస్ట్ హీరో అని ఊరికే ఇచ్చేయరు’’... ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు అల్లు అర్జున్. ‘జాతీయ ఉత్తమ నటుడు’ అవార్డు దక్కించుకున్న ఆనందంలో ఉన్న అల్లు అర్జున్తో శనివారం జరిపిన ఇంటర్వ్యూలోని విశేషాలు ఈ విధంగా... ► జాతీయ ఉత్తమ నటుడి ప్రకటన రాగానే మీ రియాక్షన్? అల్లు అర్జున్: ఇంగ్లీష్లో ఎలైటెడ్ (ఉక్కిరి బిక్కిరి.. పట్టరానంత ఆనందం...) అంటారు. నా ఫీలింగ్ అదే. అయితే ఈ అవార్డు నాకు వచ్చింది నా వల్ల కాదు. సుకుమార్ వల్ల వచ్చిందన్నది నా ఫస్ట్ ఫీలింగ్. అవార్డు ప్రకటన రాగానే నేను, సుకుమార్ ఆప్యాయంగా హత్తుకుని, ఆ ఉద్విగ్న క్షణాల్లో అలా ఓ నిమిషానికి పైగా ఉండిపోయాం. మైత్రీ మూవీ మేకర్స్ కాకుండా ‘పుష్ప’ని ఎవరు తీసినా ఈ సినిమా ఇంత బాగా వచ్చి ఉండేది కాదు. నాతో ‘పుష్ప’ తీశారని అలా అనడంలేదు. ‘రంగస్థలం’ చూసినçప్పుడే ‘మైత్రీ సపోర్ట్ చేసింది కాబట్టే నువ్వు అనుకున్న సినిమా తీయగలిగావు. ఈ సినిమాని వేరే ఏ బేనర్తో చేసినా తీయలేకపోయేవాడివి’ అని సుకుమార్తో అన్నాను. ‘పుష్ప’కి కూడా ఇదే వర్తిస్తుంది. ► ఈ తరంలో తెలుగులో ఉన్న ‘బెస్ట్ యాక్టర్స్’లో మీరు ఒకరు. ముందు తరాల్లో ఎందరో ‘బెస్ట్ యాక్టర్స్’ ఉన్నారు. వారికి ఉత్తమ జాతీయ నటుడు అవార్డు లభించలేదు. ఈ విషయంపై మీ అభి్రపాయం.. నాకు అవార్డు వచ్చినందుకు ఎంత హ్యాపీగా ఉందో.. ముందు తరాల వారికీ, నా సమకాలీన నటులకు అవార్డు రాలేదన్నది అంతే బాధాకరమైన విషయం. వారంతా అర్హులే. జాతీయ అవార్డు దక్కించుకునే స్థాయి నటనను అందరూ ప్రదర్శించారు. కానీ ఎందుకో వారికి రాలేదు. సామర్థ్యం లేక వారికి అవార్డులు రాలేదనుకుంటే అది మన తెలివితక్కువతనమే. మన పరిశ్రమలో ఎప్పుడూ గొప్ప నటులు ఉంటూనే ఉన్నారు. కానీ ఎందుకో కుదర్లేదు.. ఈసారి కుదిరింది. ► అంటే.. కాస్త అదృష్టం కూడా కలిసి రావాలంటారా? అదృష్టాన్ని నమ్మను. మన కృషి మనం చేస్తూ ఉంటే సరైన చాన్స్, టైమ్ వచ్చినప్పుడు కొడితే ఆ పాయింట్ను అదృష్టం అంటా. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే విషయంలో నేను ఎప్పుడూ కృషి చేస్తూనే ఉన్నాను. ఇక ఇప్పుడు తెలుగు సినిమాలకు దేశవ్యాప్త గుర్తింపు దక్కడం, తెలుగు సినిమాలపై అందరి దృష్టి పడటం అనేది అవకాశం. సో... నా కృషికి చాన్స్, టైమ్ కలిసి స్ట్రైక్ అయ్యాయి. ఇది లక్ అంటాను. ► మీ 20 ఏళ్ల సక్సెస్ఫుల్ కెరీర్లో మీ కుటుంబం, అభిమానుల, ఇండస్ట్రీ భాగస్వామ్యం ఎంత.. నా సక్సెస్లో అందరి సపోర్ట్ ఉంది. ఏ సపోర్ట్ లేదని అనలేను. నా ఫ్యామిలీ, ఇండస్ట్రీ సపోర్ట్ ఉంది. ఎక్కువ శాతం ఉన్న నా సొంత ఫ్యాన్స్ సపోర్ట్తో పాటు మెగా ఫ్యాన్స్, ఇతర హీరోల ఫ్యాన్స్ ప్రోత్సాహం కూడా ఉంది. ► మీ కెరీర్ ఫస్ట్ మొదలైంది మెగా ఫ్యాన్స్ సపోర్ట్తోనే. ఆ తర్వాత మీకు సొంత ఆర్మీ (అభిమానులు) ఏర్పాటైంది. ఇలా ఓన్ ఫ్యాన్ బేస్ డెవలప్ అయ్యాక పాజిటివిటీతో పాటు నెగటివిటీ కూడా వచ్చింది. ఈ విషయాన్ని ఎలా చూస్తారు.. నేనే కాదు.. ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా ఒకచోటు నుంచి మొదలై, జీవితంలో ఎదిగే క్రమంలో కొంత టైమ్ గడిచాక తనకంటూ ఓ డెవలప్మెంట్ జరుగుతుంది. అది సహజం.. ఇందుకు ఉదాహరణగా చాలామంది ఉన్నారు. కొన్నిసార్లు పిల్లలు తమ తల్లిదండ్రుల కన్నా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇదొక సహజమైన ప్రయాణం. ► కానీ ఎక్కడ మొదలయ్యారో ఆ నీడలో ఉండాలని వేరేవాళ్లు అనుకోవడం సహజంగా జరుగుతుంటుంది.. నేనేమనుకుంటానంటే.. ఒకరు విశేషంగా ఎదుగుతూ, ఓ లెవల్కి వచ్చాక.. వారు మన దగ్గర ఉండలేరని వారికే అర్థం అయిపోతుంది.. వాళ్లు ఇక్కడ సరిపోరని. అది పేరెంట్స్ అయినా కావొచ్చు.. ఫ్యామిలీలో ఎవరైనా కావొచ్చు. అయితే వాళ్లు ఎప్పుడు కోరుకుంటారంటే.. వాళ్లకంటే తక్కువగా ఉన్నప్పుడో.. ఇప్పుడు వాళ్లు ఎంత ఉన్నారో.. మనం అంతే ఉన్నప్పుడు ఎందుకు బయటకు వెళ్లాలని కోరుకుంటారు. అదే మనం ‘టెన్ ఎక్స్’ ఎదిగాం అనుకుంటే అప్పుడు వాళ్లు కోరుకోరు. ఇదంతా సైజ్ డిఫరెన్స్పై ఆధారపడి ఉంటుంది. ► చిరంజీవిగారి ఇంటికి వెళ్లారు కదా. ఆయన స్పందన.. చిరంజీవిగారు చాలా మంచి మాట అన్నారు. ఓ జాతీయ అవార్డు రావడానికి ఓ నటుడికి కావాల్సిన కారణాలు ఇరవై ఉంటే.. అన్ని కారణాల్లోనూ నువ్వు వంద మార్కులు కొడతావ్ అన్నారు. బాడీ లాంగ్వేజ్.. మేకప్ కావొచ్చు... సంభాషణల ఉచ్చారణ కావొచ్చు.. ఇలా కొన్ని చెప్పుకుంటూ వచ్చారు. చిరంజీవిగారికి ఉన్న అనుభవంతో ఓ విషయాన్ని ఆయన మనకన్నా బాగా చూడగలరు. బాగా పెర్ఫార్మ్ చేశావ్. చెప్పాలంటే.. నీకు ఇవ్వకపోతే తప్పయిపోయేది అనే స్థాయిలో పెర్ఫార్మ్ చేశావన్నారు. ► ఏదైనా మనకు దక్కినప్పుడు అందుకు మనం నిజంగా అర్హులమేనా? అనే ఓ ఆలోచన కలగడం సహజం. నేషనల్ అవార్డు ప్రకటించినప్పుడు అలాంటి ఆలోచన మీకేమైనా కలిగిందా? నేనూ సుకుమార్గారు ఎప్పుడూ నిజం అనేది ఒకటి ఉంటుందని మాట్లాడుకుంటుంటాం. మేం నిజాయితీగా కష్టపడ్డాం. ఆ కష్టం ప్రజలకు కనెక్ట్ అయ్యింది. ఇది నిజం. ఒక సినిమా బాగుందా? లేదా అనేది నిజం మాట్లాడుతుంది. బాగోలేని సినిమాను నేను ఎంత ప్రమోట్ చేసినా వర్కౌట్ కాదు. కానీ మనం నిజాయితీగా కష్టపడ్డప్పుడు ఆ కష్టమే మాట్లాడుతుంది. అది నిజం. అప్పుడు నిజం దానంతట అదే మాట్లాడుతుంది. ఒకవేళ నేను సినిమాలో బాగా యాక్ట్ చేసి, నేనే బాగోలేదని చెప్పినా కూడా నా మాట ఎవరూ నమ్మరు. ఎందుకంటే నిజం నాకంటే గొప్పది.. నన్ను మించినది అనేది నా అభప్రాయం. ► తెలుగు సినిమాకు ఈ ఏడాది ఎక్కువగా జాతీయ అవార్డులు వచ్చాయి... ఈ విషయం గురించి ఏమంటారు? ఈ గౌరవం దక్కడానికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ముఖ్య కారణంగా చెప్పుకోవాలి.. ‘పుష్ప’ కూడా. ‘ఆర్ఆర్ఆర్’కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. దీంతో జాతీయ స్థాయిలో ‘ఆర్ఆర్ఆర్’ను గౌరవించుకోకపోతే అది తప్పవుతుందనే ఓ ప్రత్యేక ఫీలింగ్ ఆ సినిమాపై ఉంది. ఏదో ఆస్కార్స్కు వెళ్లింది కదా అని కాకుండా నిజంగా ఆ సినిమాకు సంబంధించి ఎవరెవరికి రావాలో వారికి ఇచ్చారు. తెలుగు సినిమాకు ప్రాముఖ్యత చేకూర్చారు. అందుకు తగ్గ కష్టం కూడా ఆ సినిమాలు పడ్డాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీ ప్రామిసింగ్గా ఉంది. ఈ ఇంపాక్ట్ వారిపై (జ్యూరీని ఉద్దేశిస్తూ..) కూడా ఉంటుంది. ► ఈ సమయంలో మీ తాత (ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య)గారు ఉండి ఉంటే సంతోషించేవారు.. ఆయన జీవించి ఉన్నట్లయితే.. ఇన్నేళ్ల చరిత్రలో నా మనవడు కొట్టాడు. తన జీవితానికి ఇది చాలని ఆయన ఫీలయ్యే సందర్భం కచ్చితంగా అయ్యుండేది. ఆ విషయం పక్కన పెడితే... నేను నేషనల్ అవార్డుని సాధించడం మా నాన్నగారు చూడగలిగారు. నాకు అదే చాలా అదృష్టం. ► ‘పుష్ప’లో నటనపరంగా తగ్గేదే లే అన్నట్లు నటించారు. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్, రామ్చరణ్ అద్భుత నటనతో పాటు ఆ సినిమా ఆస్కార్తో గ్లోబల్గా రీచ్ అయింది. తమిళ ‘జై భీమ్’లో సూర్య నటన అద్భుతం.. ఈ పెద్ద పోటీలో జాతీయ అవార్డు ఎవరికి దక్కుతుందనే కోణంలో ఆలోచించారా? మనం సౌత్లో ఉన్నాం కాబట్టి ఈ రెండు సినిమాల గురించే మాట్లాడటం సహజం. అయితే పోటీలో హిందీ నుంచి ‘షేర్షా, సర్దార్ ఉద్దమ్’ వంటి చిత్రాలు ఉన్నాయి. ఇంకా వేరే భాషల నుంచి వేరే చిత్రాల్లో నటించిన హీరోలు ఉన్నారు. పోటీలో 20 మందికి పైగా ఉన్నారు. కానీ ఫైనల్గా నేషనల్ హీరో ఒక్కడే. ఈ ప్రాసెస్లో ‘పుష్ప’ హీరోకి అవార్డు దక్కే అర్హత పూర్తిగా ఉంది. ఎందుకంటే నేషనల్ హీరోని సెలక్ట్ చేసేటప్పుడు అతని నటన చూస్తారు.. సినిమాని కాదు. అయినా బెస్ట్ ఫిలిం కింద నేషనల్ అవార్డుకి ‘పుష్ప’ని తీసుకోరు. ఎందుకంటే స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్ కాబట్టి. అందుకే ఉత్తమ చిత్రం కేటగిరీకి మేం ‘పుష్ప’ని పంపించలేదు. బెస్ట్ యాక్టర్ కేటగిరీ అనేది పూర్తిగా నటనని బేస్ చేసుకునే ఇస్తారు. ఆ విధంగా పుష్పరాజ్.. బెస్ట్ అనుకుని, నామినేషన్కి పంపించాం. మా నమ్మకం నిజమైంది. ► 20 ఏళ్ల కెరీర్.. 20 మందికి పైగా హీరోలతో పోటీ పడి నేషనల్ అవార్డు తెచ్చుకున్న ఈ ఆనందంలో మీ కెరీర్ని విశ్లేషించుకుంటే ఏమనిపిస్తోంది? యాక్చువల్గా ఇలా ఆనందంగా ఉన్నప్పుడు కాదు.. ‘సాడ్ మూమెంట్స్’ అప్పుడే ఎక్కువ ఎనలైజ్ చేసుకుంటాం. హ్యాపీ అప్పుడు హాయిగా అలా వెళ్లిపోతాం. 20 ఏళ్ల లైఫ్ టైమ్లో ఏ మనిషికైనా హ్యాపీ.. సాడ్ ఈ రెండూ ఉంటాయి. బయట చూసేవాళ్లకు అంతా స్మూత్గా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ ఏ మనిషి జీవితం కూడా ఈ రెండూ లేకుండా ఫ్రిజ్లో పెట్టిన మటన్లా ఫ్రీజ్ అయిపోవడం జరగదు (నవ్వుతూ). ఏ చెట్టుకి ఆ గాలి. బయటకు చెప్పలేకపోవచ్చు కానీ.. చాలా అవమానాలు ఉంటాయి. ఆ చెప్పలేనివి జరిగినప్పుడు విశ్లేషణ అనేది మొదలవుతుంది. అందులోంచే నేర్చుకోవడం, నడుచుకోవడం కూడా తెలుస్తుంది. ► మీరన్నట్లు అవమానాలు సహజం. పైగా ఇప్పుడీ డిజిటల్ వరల్డ్లో ట్రోల్స్ ఎక్కువ.. వీటిని పట్టించుకుంటారా? హండ్రెడ్ పర్సంట్ అన్నీ పట్టించుకుంటాను. కాకపోతే ‘ఫన్’గా తీసుకుంటాను. మన కోసం ఒకళ్లు పని గట్టుకుని టైమ్ కేటాయించి, అదే పనిగా విమర్శిస్తున్నారంటే మనం ఎదిగినట్లే కదా (నవ్వుతూ). మా స్టాఫ్లో ఒకరు.. ‘చూడండి సార్.. మీ గురించి ఇలా అనుకుంటున్నారు’ అంటే, ‘మంచిదే కదా.. మనం ఎదిగినట్లు అర్థం’ అన్నాను. ఏమీ లేకుండా మిగిలిపోయినవాళ్లను ఎవరూ పట్టించుకోరు. సో.. మనల్ని పట్టించుకున్నారంటేనే మనం సాధిస్తున్నాం అని అర్థం. ► మరి.. ‘మెగా ఫ్యాన్స్’, ‘అల్లు అర్జున్ ఆర్మీ’ అంటూ ఫ్యాన్ వార్ జరుగుతుంటుంది కదా.. ఆ వార్ని కూడా పట్టించుకుంటారా? నేను ఏదైనా ఒకటి పట్టించుకోనంటే ఆ ఫ్యాన్ వార్ని మాత్రమే. నేనస్సలు పట్టించుకోను. ఎందుకు పట్టించుకునేంత టైమ్ లేదు. ఫ్యాన్స్ పని ఫ్యాన్స్ చూసుకుంటారు. నా పని నేను చూసుకుంటాను. ► వసూళ్లు, అవార్డుల గురించి పట్టించుకుంటారా..? వీటి గురించి అయితే పక్కాగా ఆలోచిస్తాను. వేరే వాటి గురించి ఆలోచించను. నా ఫోకస్ అంతా వాటిపైనే ఉంటుంది. మిగతావారి గురించి నాకు తెలియదు కానీ నాకు మాత్రం అన్నీ కావాలి. అవార్డులు కావాలి... కలెక్షన్స్ కావాలి. ప్రజల్లో పేరు, నా సినిమా నిర్మాతలకు డబ్బులు రావాలి. జనాలకు పిచ్చెక్కిపోయే సినిమాలు ఇవ్వాలి.. ఇలా నాకు అన్నీ కావాలి. ఆ క్లారిటీ నాకు ఉంది. నాది అత్యాశ.. నాకు అన్నీ కావాలి. అందుకే తగ్గేదే లే అంటూ హార్డ్ వర్క్ చేస్తాను. ఆగేదే లే అంటూ సినిమాలు చేసుకుంటూ వెళతాను.. ► ‘పుష్ప 2’ తర్వాత మీ ప్రాజెక్ట్? ప్రస్తుతం ‘పుష్ప 2’ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. వాళ్లకు న్యాయం చేయాలనే ఆలోచనే ప్రజెంట్ నా మైండ్లో ఉంది. ‘పుష్ప 2’ తర్వాత నా తర్వాతి సినిమాపై మరింత క్లారిటీ ఇస్తాను. ► ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ సినిమా తర్వాత మీరు కొంత గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత మీరు చేసిన ‘అల.. వైకుంఠపురములో.., పుష్ప’ హిట్. ఆ గ్యాప్లో మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే ఈ హిట్స్కి కారణమా.. నా గురించి నేను వంద శాతం తెలుసుకోవడానికి ఆ సమయం నాకు దొరికినట్లయింది. నేను ఏం తప్పులు చేశాను? ఎటు వెళ్తున్నాను అని ఆలోచించుకున్నాను. కొందరు సలహాలు ఇచ్చారు. చెప్పాలంటే నన్ను నేను సరిద్దుకున్న సమయం అది. అలా నన్ను నేను సరిదిద్దుకుని ఇకనుంచి తగ్గేదే లే... ఆపేదేలే అనుకున్నాను. ► జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు సాధించారు. ఇక వాట్ నెక్ట్స్ అనే ప్రెజర్ ఏమైనా? దేశవ్యాప్తంగా సినిమా పెరుగుతోంది. తెలుగు సినిమా మరింతగా ప్రగతి పథంలో ముందుకు వెళుతోంది. ఇప్పుడు మనం ఏ ప్రయోగాలు చేసినా రిసీవ్ చేసుకోవడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది ప్రెజర్ కాదు.. పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. చెప్పాలంటే ఎవరికైనా ప్రెజర్ లేదూ అంటే అది మనకే. తెలుగు పరిశ్రమతో పోటీపడాలని ఇతర ఇండస్ట్రీలు ఒత్తిడికి గురవుతున్నాయి. ► మీ నాన్నగారు (నిర్మాత అల్లు అరవింద్) చాలా సంతోషపడి ఉంటారు. అలాగే మీ కుటుంబ సభ్యులు ఎలా స్పందించారు... అవార్డు సాధించిన నాకన్నా.. మా నాన్నగారికి ఎక్కువ శుభాకాంక్షలు వచ్చాయి (నవ్వుతూ). మా అమ్మ అయితే ఆనందంతో మాట్లాడలేకపోయారు. అమ్మ హగ్లోనే ఆమె సంతోషం అర్థమైపోయింది. అలాగే నా సినిమా గురించి మా ఆవిడ (స్నేహా) ఎప్పుడూ భావోద్వేగానికి లోనవ్వదు. కానీ తొలిసారి ఎమోషన్కి గురై, నన్ను హత్తుకుంది. -
నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్.. ఏయే ఓటీటీల్లో?
జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. అలానే మిగతా దక్షిణాది భాషల్లోని చిత్రాలు సైతం అవార్డులు గెలుచుకున్నాయి. 'పుష్ప' మూవీకిగానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు గెలుచుకోవడం మాత్రం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిపోయింది. అలానే 'ఆర్ఆర్ఆర్'కి ఏకంగా ఆరు పురస్కారాలు దక్కడం కూడా టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది. (ఇదీ చదవండి: మహేశ్బాబు.. జాతీయ అవార్డు మిస్ చేసుకున్నాడా?) అయితే చాలామంది ఎవరెవరికి ఎన్ని అవార్డులు వచ్చాయనేది చూస్తుంటే.. సినీ ప్రేమికులు మాత్రం ఏ సినిమా ఏ ఓటీటీలో ఉందా అని తెగ వెతికేస్తున్నారు. అయితే అలాంటి వాళ్ల కోసం మేం ఆ లిస్టుతో వచ్చేశాం. అవార్డులు గెలుచుకున్న చిత్రాలు ప్రస్తుతం ఏ ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయనేది తెలియాలంటే దిగువన లిస్ట్పై అలా ఓ లుక్కేసేయండి. నేషనల్ అవార్డ్ మూవీస్- ఓటీటీ ఆర్ఆర్ఆర్ - జీ5, డిస్నీ ప్లస్ హాట్స్టార్ (తెలుగు) పుష్ప - అమెజాన్ ప్రైమ్ (తెలుగు) రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్ - జియో సినిమా (తెలుగు-హిందీ) ఉప్పెన - నెట్ఫ్లిక్స్ (తెలుగు) కొండపొలం - నెట్ఫ్లిక్స్ (తెలుగు) ద కశ్మీర్ ఫైల్స్ - జీ5 (తెలుగు డబ్బింగ్) చార్లి 777 - అమెజాన్ ప్రైమ్ (తెలుగు డబ్బింగ్) గంగూబాయి కతియావాడి - నెట్ఫ్లిక్స్ (తెలుగు డబ్బింగ్) మిమీ - నెట్ఫ్లిక్స్ (హిందీ) #Home - అమెజాన్ ప్రైమ్ (తెలుగు డబ్బింగ్) షేర్షా - అమెజాన్ ప్రైమ్ (హిందీ) సర్దార్ ఉద్దామ్ సింగ్ - అమెజాన్ ప్రైమ్ (హిందీ) కడైసి వివసయ్ - సోనీ లివ్ (తెలుగు డబ్బింగ్) నాయట్టు - నెట్ఫ్లిక్స్ (తెలుగు డబ్బింగ్) (ఇదీ చదవండి: బ్రహ్మానందం ఇంటికెళ్లిన బన్నీ.. కారణం అదేనా?) -
మహేశ్బాబు.. జాతీయ అవార్డు మిస్ చేసుకున్నాడా?
స్టార్ హీరో అల్లు అర్జున్.. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. 'పుష్ప' మూవీ రిలీజైనప్పుడు బన్నీ గురించి ఎంత మాట్లాడుకున్నారో.. అవార్డు రావడంతో అంతకంటే ఎక్కువగానే మాట్లాడుకుంటున్నారు. అదే టైంలో హీరో మహేశ్ బాబు మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఫస్ట్ ఛాయిస్ మహేశ్ 'రంగస్థలం' లాంటి బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన తర్వాత మహేశ్తో సినిమా చేయాలని డైరెక్టర్ సుకుమార్ ఫిక్సయ్యాడు. ముందుగా తెలంగాణ బ్యాక్డ్రాప్తో ఓ స్టోరీ అనుకున్నారట. కొన్నాళ్లకు ఎర్ర చందనం స్మగ్లింగ్పై సుక్కు.. ఓ లైన్ రెడీ చేశాడు. మహేశ్తో ఈ మూవీ చేయాలనుకుని.. ఏడాది పాటు దీనిపై వర్క్ చేశారట. కానీ మహేశ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నాడు. అప్పట్లో దీనిపై మహేశ్ ట్వీట్ కూడా పెట్టాడు. Due to creative differences, my film with Sukumar is not happening. I wish him all the best on the announcement of his new project. Respect always for a film maker par exellence. 1 Nenokkadine will remain as a cult classic. Enjoyed every moment working on that film. — Mahesh Babu (@urstrulyMahesh) March 4, 2019 (ఇదీ చదవండి: బ్రహ్మానందం ఇంటికెళ్లిన బన్నీ.. కారణం అదేనా?) లైన్లోకి బన్నీ మహేశ్తో సినిమా అనుకున్నప్పుడు ఓ లైన్ రెడీ చేసిన సుకుమార్.. దాన్ని బాగా డెవలప్ చేసి అల్లు అర్జున్ కి వినిపించాడట. అలా ఈ కాంబో సెట్ అయింది. ఆ తర్వాత ఈ సినిమా.. పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ సృష్టించింది. ఇప్పుడు 'పుష్ప' అనేది మూవీ కాదు బ్రాండ్ అనేంతలా మారిపోయింది. అల్లు అర్జున్ కి నటుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. ఛాన్స్ మిస్? ఇప్పుడు 'పుష్ప' సినిమాకుగానూ అల్లు అర్జున్కి జాతీయ అవార్డు రావడంతో మహేశ్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. అయితే సుక్కు.. మహేశ్ తో సినిమా చేయాలనుకున్నప్పుడు హీరోగా పోలీస్ క్యారెక్టర్ అనుకున్నారట. కానీ బన్నీ లైన్ లోకి వచ్చేసరికి అది కాస్త కూలీ టూ డాన్ పాత్రగా మారింది. కాబట్టి మహేశ్ ఎలాంటి అవకాశం మిస్ చేసుకోలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రెండు వేేర్వేరు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ చేసుంటే అప్పుడు మహేశ్కి జాతీయ అవార్డు వచ్చుండేదా లేదా అనేది అప్పుడు తెలిసేది తప్పు ఇప్పుడు ఈ డిస్కషన్ అనవసరం. (ఇదీ చదవండి: 'పుష్ప'కి జాతీయ అవార్డులు.. ఆ అంశాలే కలిసొచ్చాయా?) -
అల్లు అర్జున్ను పట్టుకుని ఏడ్చేసిన సుకుమార్, వీడియో వైరల్
పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే.. అంటూ ఒక్క డైలాగ్తో అరాచకం సృష్టించాడు అల్లు అర్జున్. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లతో రికార్డులు తిరగరాసిన ఇతడు తాజాగా ఎవరూ ఊహించని అవార్డు అందుకున్నాడు. 69 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కొల్లగొట్టాడు. తెలుగు సినీచరిత్రలోనే బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న తొలి హీరోగా చరిత్ర సృష్టించాడు. దీంతో బన్నీ ఇంట పండగ వాతావరణం నెలకొంది. పుష్ప సినిమాకుగానూ బన్నీకి అవార్డు వరించిన క్రమంలో డైరెక్టర్ సుకుమార్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. అల్లు అర్జున్ను హత్తుకుని ఆనందంతో ఏడ్చేశాడు. కొద్ది క్షణాలపాటు బన్నీని పట్టుకుని ఎమోషనలయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు.. అల్లు అర్జున్ ఫస్ట్ రియాక్షన్ ఇదే! -
ఏడాది దాటిపోయింది.. ఇంకా వదల్లేదా!
ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్కు భారతీయ సినిమాలంటే అమితమైన ప్రేమ. ముఖ్యంగా తెలుగు సినిమాలపై ఆ ప్రేమ మరింత ఎక్కువగా ఉంటుంది. పుష్ప సినిమా వచ్చి ఏడాది దాటిపోయినా ఇంకా వార్నర్ 'తగ్గేదే లే' అంటూ తిరుగతున్నాడు. ఇప్పట్లో 'పుష్ప' మేనియా వార్నర్ను వదిలేలా లేదు. తాజగా టీమిండియాతో వన్డే సిరీస్ గెలిచాకా ట్రోఫీ అందుకునే సమయంలో వార్నర్ పుష్ప సెలబ్రేషన్స్ చేయడం వైరల్గా మారింది. చెన్నై వేదికగా జరిగిన చివరి వన్డేలో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో 2-1తో ఆస్ట్రేలియా సిరీస్ను కైవసం చేసుకుంది. మూడో వన్డేలో విక్టరీ తర్వాత ఆసీస్ జట్టు ట్రోఫీ అందుకున్న సమయంలో వార్నర్ తనదైన స్టైల్లో ఎంజాయ్ చేశాడు. పుష్ప చిత్రంలోని 'తగ్గేదే లే' అన్న ఫేమస్ డైలాగ్తో హీరో అల్లుఅర్జున్ ఇచ్చిన ఫోజును వార్నర్ ఇమిటేట్ చేశాడు. ప్లేయర్లతో గ్రూపు ఫోటో దిగిన సమయంలో వార్నర్.. తగ్గేదేలే అంటూ హల్చల్ చేశాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కూడా పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ వాకింగ్ స్టైల్ను ఇమిటేట్ చేయడం కూడా బాగా ఆసక్తి కలిగించింది. ఆసీస్ నిర్దేశించిన 270 పరుగుల లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 49.1 ఓవర్లలో 248 పరుగులకు పరిమితమైంది. విరాట్ కోహ్లీ(54), హార్దిక్ పాండ్యా(40) చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరిచారు. ఆడమ్ జంపా(4/45) నాలుగు వికెట్లతో విజృంభించాడు. తొలుత ఆసీస్ 49 ఓవర్లలో 269 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్(47) టాప్ స్కోరర్గా నిలిచాడు. హార్దిక్ పాండ్యా (3/44), కుల్దీప్ యాదవ్(3/56) మూడేసి వికెట్లు తీశారు. జంపాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, మార్ష్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ దక్కాయి. Gd morning 🖤🖤#Warner and #Pushpa ... A never ending story 🔥🔥@alluarjun @davidwarner31 co fan 😅 pic.twitter.com/NcIkuFBEFM — Stylish 🌟 Shiva goud AA Dhf (@ShivagoudAA) March 23, 2023 చదవండి: పంజాబ్ కింగ్స్కు ఏకకాలంలో గుడ్న్యూస్.. బ్యాడ్న్యూస్ దేశం క్లిష్ట పరిస్థితుల్లో.. వాళ్లకు ప్లాట్లు, ఖరీదైన ఫోన్లు? -
Maha Shivaratri 2023: థియేటర్స్లో మళ్లీ ఆ సూపర్ హిట్ మూవీస్..ఎక్కడ?
ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో రీరిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలు నటించిన సూపర్ హిట్ చిత్రాలను మళ్లీ థియేటర్స్లో ప్రదర్శిస్తూ.. అభిమానులను అలరిస్తున్నారు. హీరోల పుట్టినరోజు లేదా ఏదైన పండగ రోజు చూస్కొని పాత సినిమాలను మళ్లీ విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలు మహేశ్బాబు, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణల సినిమాలు రీరిలీజై.. మంచి వసూళ్లను రాబడుతున్నాయి. దీంతో స్పెషల్ డే వస్తే చాలు ఓల్డ్ సూపర్ హిట్ మూవీస్.. రీరిలీజ్కు రెడీ అవుతున్నాయి. శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18న కూడా చాలా సినిమాలు మళ్లీ థియేటర్స్లో సందడి చేయడానికి సిద్దమవుతున్నాయి. శివరాత్రి రోజు రీరిలీజ్కు రెడీ అయిన స్టార్ హీరోల సినిమాలపై ఓలుక్కేద్దాం. పుష్ప ది రైజ్ ఐకాన్స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. 2021 డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. మహా శివరాత్రిని పురస్కరించుకొని ఫిబ్రవరి 18న హైదరాబాద్లోని సుష్మ 70 ఎమ్ఎమ్ థియేటర్లో ఉదయం 3 గంటలకు స్పెషల్ షో వేయనున్నారు. అఖండ.. నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ. 2021 డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల రాబట్టింది. ఇందులో అఘోరాగా బాలయ్య నటన అందరిని ఆకట్టుకుంది. శివరాత్రి సందర్భంగా ఈ సినిమా మళ్లీ విడుదల కాబోతుంది. ఫిబ్రవరి 18న హైదరాబాద్లోని సుదర్శన్ 35 ఎమ్ఎమ్ థియేటర్లో అర్థరాత్రి 12.15 నిమిషాలకు, సుష్మ 70 ఎమ్ఎమ్ థియేటర్స్లో రాత్రి 11.49 గంటలకు ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. వాల్తేరు వీరయ్య మెగాస్టార్ చిరంజీవి, రవితేజ కలిసి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం వాల్తేరు వీరయ్య కూడా మళ్లీ థియేటర్స్లో సందడి చేయనుంది. శివరాత్రి పురస్కరించుకొని ఫిబ్రవరి 18న సంధ్య 70 ఎమ్ఎమ్ లో అర్థ రాత్రి 12.15గంటలకు, అలాగే ఉదయం 3 గంటలకు వాల్తేరు వీరయ్య స్పెషల్ షో వేయనున్నారు. కాంతార చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయం సాధించిన కన్నడ చిత్రం ‘కాంతార’. ఈ చిత్రం కన్నడ వెర్షన్ గతేడాది సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. ఇదే పేరుతో టాలీవుడ్లో అక్టోబర్ 15న విడుదలై..ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శివరాత్రి రోజు హైదరాబాద్లోని సప్తగిరి 70ఎమ్ఎమ్ థియేటర్లో అర్థరాత్రి 12 గంటలకు, ఉదయం 3 గంటలకు ప్రదర్శంచనున్నారు. టెంపర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన టెంపర్ మూవి ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఎన్టీఆర్ని కొత్త లుక్లో చూపించడమే కాదు.. యాక్టింగ్లోనూ మరో యాంగిల్ని ప్రేక్షకులకు తెలియజేసిన చిత్రమిది. ఈ చిత్రాన్ని మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్లోని దేవి థియేటర్స్లో అర్థరాత్రి 12.15 గంటలకు, సంధ్య థియేటర్స్లో అర్థరాత్రి 12.30 గంటలకు ప్రదర్శించనున్నారు. వీటితో పాటు మహేశ్బాబు నటించిన సరిలేరే నీకెవ్వరు సినిమా కొత్తపేటలోని మహాలక్ష్మీ కాంప్లెక్స్లో శనివారం అర్థరాత్రి 11.59 గంటలకు, దూకుడు చిత్రం సుదర్శన్లో ఉదయం 3 గంటలకు ప్రదర్శించనున్నారు. అలాగే పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం కూడా మహాలక్ష్మీ కాంప్లెక్స్లో ఉదయం 3 గంటలకు విడుదల కానుంది. -
ఓ పెద్ద కథ ..రెండు సినిమాలు
అన్ని సినిమాలకూ కథ ఉంటుంది. కొన్ని సినిమాలకు పెద్ద కథ ఉంటుంది. అయితే ఆ పెద్ద కథని రెండున్నర గంటల్లో చూపించలేరు. అందుకే రెండు మూడు భాగాలుగా చూపిస్తారు. అలా ఈ ఏడాది ఇటు సౌత్ అటు నార్త్లో ‘పార్ట్ 2’ సినిమాలు చాలానే రానున్నాయి. తొలి భాగం విడుదలై, ఘనవిజయం సాధించిన నేపథ్యంలో మలి భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక కొన్ని చిత్రాలైతే తొలి, మలి భాగం రెండూ ఆన్సెట్స్లో ఉన్నాయి. ఈ చిత్రాల గురించి తెలుసుకుందాం. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రం తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ 2021 డిసెంబరులో రిలీజై సూపర్హిట్ అయింది. దీంతో మలి భాగం ‘పుష్ప: ది రైజ్’పై మరింత ఫోకస్ పెట్టింది ఈ టీమ్. ఈ సినిమా షూటింగ్ వైజాగ్లో జరుగుతోంది. ‘పుష్ప: ది రూల్’ను ఈ ఏడాదే రిలీజ్ చేయా లనుకుంటున్నారు. మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన హిస్టారికల్ ఫిల్మ్ ‘పొన్నియిన్ సెల్వన్’. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రం తొలి భాగం గత ఏడాది సెప్టెంబరులో విడుదలై ఘనవిజయం సాధించింది. ఆల్రెడీ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న రెండో భాగం ఈ ఏడాది ఏప్రిల్ 28న విడుదల కానుంది. అలాగే తమిళంలో ‘వడ చెన్నై’, ‘అసురన్’ వంటి సూపర్ హిట్స్ను అందించిన దర్శకుడు వెట్రిమారన్ ప్రస్తుతం ‘విడుదలై’ అనే సినిమాను తీస్తున్నారు. విజయ్ సేతుపతి, సూరి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. రెండు భాగాలకు సంబంధించిన మేజర్ షూటింగ్ పూర్తయింది. మొదటి భాగాన్ని ఈ ఏడాది వేసవిలో, రెండో బాగాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. అదే విధంగా మరో తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘వెందు తనిందదు కాడు’ (తెలుగులో ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు) చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం గత ఏడాది సెప్టెంబరులో విడుదలైంది. మలి భాగం రిలీజ్పై త్వరలో ఓ స్పష్టత రానుంది. అదే విధంగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలోనే విక్రమ్ హీరోగా ‘ధృవనక్షత్రం’ అనే సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందకు రానుందని కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. తొలి భాగాన్ని ఈ ఏడాదిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అటు మలయాళంలో ‘రామ్’ రెండు భాగాలుగా రూపొందుతోంది. మోహన్లాల్కు ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ వంటి హిట్స్ను అందించిన జీతూ జోసెఫ్ ఈ సినిమాకు దర్శకుడు. సౌత్లోనే కాదు నార్త్లోనూ ఈ ట్రెండ్ కనిపిస్తోంది. రణ్బీర్ కపూర్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ట్రయాలజీగా ఈ సినిమాను తీస్తున్నారు. తొలి భాగం విడుదలైన విషయం తెలిసిందే. మలి భాగం త్వరలోనే సెట్స్కి వెళ్లనుంది. అలాగే జాన్ అబ్రహాం హీరోగా రూపొందిన ‘ఎటాక్’ తొలి భాగం గత ఏడాది ఏప్రిల్లో రిలీజైంది. మలి భాగం రెడీ అవుతోంది. ఇవే కాదు.. రెండు భాగాల చిత్రాలు కొన్ని సెట్స్లో, ఇంకొన్ని చర్చల దశల్లో ఉన్నాయి. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కె’, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘సలార్’ చిత్రాలు చేస్తున్నారు ప్రభాస్. ఈ చిత్రాలు రెండు భాగాలుగా విడుదల కానున్నాయని టాక్. అలాగే హీరో ఎన్టీఆర్, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్లో ఓ సినిమా ఉందనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందని, తొలి భాగంలో ఎన్టీఆర్ హీరోగా, రెండో భాగంలో ధనుష్ హీరోగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక సూర్య హీరోగా శివ డైరెక్షన్లో రూపొందుతున్న చిత్రం కూడా రెండు భాగాలుగా వస్తుందని టాక్. ఇంకా బాలీవుడ్ నిర్మాతలతో కలిసి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, రామాయణం ఆధారంగా ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా రెండు భాగాలు రానుందని టాక్. -
కాలం వెనక్కి వెళ్లే కథలు.. రీల్లైఫ్లో అలాంటి బ్యాక్గ్రౌండ్తో వస్తున్న సినిమాలివే
2023లో ఉన్నప్పుడు 40, 50, 60 ఏళ్లు... అంతకుమించి వెనక్కి వెళ్లే అవకాశం వస్తే...? రియల్ లైఫ్లో సాధ్యం కాకపోవచ్చు. కానీ రీల్ లైఫ్లో ఏదైనా సాధ్యమే. కాలం వెనక్కి వెళ్లొచ్చు.. ముందుకూ వెళ్లొచ్చు. ఇప్పుడు కాలం వెనక్కి వెళ్లే కథలు వెండితెరపైకి రావడానికి రెడీ అవుతున్నాయి. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. స్టువర్టుపురం దొంగగా ముద్రపడిన టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. హీరో రవితేజ టైటిల్ రోల్లో వంశీ దర్శకత్వంలో అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్టువర్టుపురంలో 1970–1980 కాలంలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఇది. వీలైనంత త్వరగా ఈ చిత్రం పూర్తి చేసి ఈ ఏడాదే థియేటర్స్లోకి తీసుకురావాలనుకుంటున్నారు మేకర్స్. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం హీరోగా చేస్తున్న చిత్రాల్లో ‘సలార్’ ఒకటి. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 1970 బ్యాక్డ్రాప్లో ఉంటుందన్న టాక్ ఆల్రెడీ ఫిల్మ్నగర్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ‘సలార్’ చిత్రం ఈ ఏడాది సెప్టెంబరు 28న విడుదల కానుంది. మరోవైపు రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్చరణ్ క్యారెక్టర్లో షేడ్స్ ఉంటాయి. రామ్చరణ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తండ్రి పాత్ర సన్నివేశాలన్నీ 1960–1970 బ్యాక్డ్రాప్కి సంబంధింనవని తెలిసింది. ఐఏఎస్ ఆఫీసర్ల నేపథ్యంలో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్లు నిర్మిస్తున్నారు. ఇంకోవైపు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ చిత్రకథ 1990 బ్యాక్డ్రాప్ నుంచే ఆరంభం అవుతుంది. రెండు భాగాల ఈ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ గత ఏడాది డిసెంబరు 19న విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘పుష్ప’ రెండో భాగం ‘పుష్ప: ది రైజ్’ నిర్మాణంలో ఉంది. ఈ సినిమాకు కూడా 1990 బ్యాక్డ్రాప్ ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది వర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ వేసవిలో థియేటర్స్లో ఆడియన్స్కు ‘దసరా’ చూపేందుకు రెడీ అవుతున్నారు హీరో నాని. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. 1980–1990 బ్యాక్డ్రాప్లో తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల పరిసర ప్రాంతాల్లో ఉన్న ఓ గ్రామం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలిసింది. ఆ గ్రామంలో నెలకొన్న పరిస్థితులను ధరణి (నాని) ఏ విధంగా పరిష్కరించాడు, వెన్నెల (ఇందులో హీరోయిన్ కీర్తీ సురేష్ పాత్ర)తో అతని లవ్స్టోరీ ఏమైంది? అన్నదే ‘దసరా’ ప్రధాన కథాంశం. మరోవైపు ‘డెవిల్’ సినిమా కోసం 1945వ కాలం నాటి బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా మారిపోయారు కల్యాణ్ రామ్. స్వాతంత్య్రం రాకముందు బ్రిటిష్వాళ్లు పరి΄ాలింన మద్రాస్ ప్రెసిడెన్సీలో జరిగిన కొన్ని రహస్య అంశాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించి ఎవరికీ తెలియని ఓ రహస్యాన్ని ఛేదించడానికి గూఢచారిగా కల్యాణ్ రామ్ ఏం చేశారు? అన్నదే ‘డెవిల్’ కథాంశం. నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్స్లోకి రానుంది. ఇంకోవైపు ‘హరోం హర’ అంటున్నారు హీరో సుధీర్బాబు. జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. ‘ది రివోల్ట్’ అనేది క్యాప్షన్. సుమంత్. జి నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమా 1989 నాటి కుప్పం నేపథ్యంలో సాగుతుంది. తమిళ ఇండస్ట్రీలోనూ కొన్ని సినిమాలు ఉన్నాయి. హీరో కమల్హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్గా వీరి కాంబినేషన్లోనే ప్రస్తుతం ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రధానంగా స్వాతంత్య్రానికి పూర్వం అంటే 1920–1930 నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. ఇక ధనుష్ హీరోగా నటిస్తున్న తాజా ΄ాన్ ఇండియన్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’ది 1930–1940 బ్యాక్డ్రాప్ అని త్ర యూనిట్ ఆల్రెడీ ప్రకటింంది. అరుణమాదేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కన్నడ ప్రముఖ నటుడు శివరాజ్కుమార్, సందీప్ కిషన్ కీ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రాలే కాదు.. దర్శకుడు వెట్రిమారన్తో సర్య కమిట్ అయిన ‘వాడివాసల్’, శివ దర్శకత్వంలో సర్య చేస్తున్న 42వ సినిమాలు కూడా గతంలోకి తీసుకెళ్లేవే. 1990 బ్యాక్డ్రాప్ అంటే బొమ్మ హిట్టే అని గత ఏడాది బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. హిట్ రిపీట్ అయితే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది కాబట్టి.. రిపీట్ అవ్వాలని కోరుకుంటుంటారు. గత ఏడాది తెలుగులో బిగ్గెస్ట్ హిట్గా నిలి, బాక్సాఫీస్ వద్ద దాదాపు ర. 1300 కోట్ల గ్రాస్ను వసలు చేసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా 1920 బ్యాక్డ్రాప్లో ర΄÷ందింది. ఇక సువరు 90 కోట్ల ర΄ాయల గ్రాస్ కలెక్షన్స్ను రాబట్టి సపర్హిట్గా నిలిన ‘సీతారామం’ చిత్రకథ 1964–1985 బ్యాక్డ్రాప్లో సాగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాలే కాదు... బాక్సాఫీస్ వద్ద ర. 1100 కోట్లు రాబట్టిన ‘కేజీఎఫ్: ఛాప్టర్ 2 (1980 నేపథ్యంలో...), ర. 400 కోట్లకు పైగా వసలు చేసిన కన్నడ బ్లాక్బస్టర్ ‘కాంతార’ (కథ 1847లో స్టార్ట్ అయినా మేజర్ కథాంశం, స్క్రీన్ ప్లే..1990 బ్యాక్డ్రాప్లోనే సాగుతుంది), హిందీలో ర. 300కోట్లకు పైగా వసలు చేసిన సపర్హిట్ మూవీ ‘ది కశ్మీరీ ‡ఫైల్స్’ (స్క్రీన్ ప్లే 2020లో స్టార్ట్ అయినా... కథ మేజర్గా 1989–1990 నేపథ్యంలోనే సాగుతుంది) కొన్నేళ్లు వెనక్కి తీసుకెళ్లే చిత్రాలే కావడం విశేషం. ఈ జాబితాలో మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో పాటు ఆధ్యాత్మిక అంశాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ‘విరసాక్ష’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు సాయిధరమ్ తేజ్. 1990 నేపథ్యంలో ఓ ఫారెస్ట్ బేస్డ్ విలేజ్లో సాగే థ్రిల్లర్ సినిమా ఇది. మూఢ నమ్మకాలు, సైన్స్, ఆధ్యాత్మిక అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని టాక్. కార్తీక్ దండు దర్శకత్వంలో బీవీఎన్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 21న రిలీజ్ కానుంది. ఈ చిత్రాలే కాదు... 1990ల నేపథ్యంలో రూపొందుతోన్న మరికొన్ని చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాయి. -
పుష్ప: ది రైజ్ వచ్చి సరిగ్గా ఏడాది.. స్పెషల్ పోస్ట్ షేర్ చేసిన మూవీ టీం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం.. ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేసింది. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్.. తగ్గేదే లే’ అంటూ ఇండియన్ బాక్సాఫీస్పై దాడి చేసి కోట్ల రూపాయలను కొల్లగొట్టేశాడు ‘పుష్పరాజ్’. ఈ మూవీ ఫస్ట్పార్ట్ పుష్పా: ది రైజ్ రిలీజై ఈ రోజుకి(డిసెంబర్ 17) సరిగ్గా ఏడాది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది. ఈ మూవీ వచ్చి ఏడాది అయిన పుష్ప రాజ్ సృష్టించిన ఇంపాక్ట్ ఇప్పటికి అలానే ఉంది. చదవండి: పట్టలేని సంతోషంతో భార్యను హగ్ చేసుకున్న అభిషేక్.. ఆ రూమర్లకు ఈ వీడియో చెక్ ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సృష్టించిన సంచలనం, గెలుచుకున్న అవార్డులు, కలెక్ట్ చేసిన మొత్తం వసూళ్లను ఈ సందర్భంగా వెల్లడిచింది మూవీ యూనిట్. పుష్పరాజ్తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 365 కోట్లు కలెక్ట్ చేసిందని, ఇక పాటలు 6 బిలియన్ల వ్యూస్ రాబట్టి తొలి భారత చిత్రంగా నిలిచిందని పేర్కొంది. అదే విధంగా ఇండియన్ ఫిలిం ఆఫ్ ది ఈయర్గా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా గెలిచిందని, అమెజాన్ ప్రైంలో అత్యధికంగా చూసిన ఇండియన్ మూవీగా పుష్ప నిలిచిందని తెలిపారు. 7 ఫలింఫేర్ అవార్డ్స్, 7 సైమా ఆవార్ట్స్తో పాటు.. చదవండి: రామ్ చరణ్పై ‘కింగ్ ఖాన్’ షారుక్ ఆసక్తికర వ్యాఖ్యలు 7 సాక్షి ఎక్స్లెన్స్ అవార్డులను కైవసం చేసుకున్నట్లు వెల్లడించింది పుష్ప టీం. అలా ఇండియాలో సెన్సెషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఇటీవల రష్యాలో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. డిసెంబర్ 8, 2022లో రష్యా వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ చిత్రం అక్కడ సైతం కలెక్షన్స్ కొల్లగొడుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా పుష్ప టీం రష్యాలో పర్యటించింది. ఈ సందర్భంగా రష్యా టూర్లో భాగంగా పుష్ప టీం తీసుకున్న ఫొటోను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఫొటోను షేర్ చేశాడు. కాగా పుష్ప పార్ట్ 2 రిలీజ్ డేట్ కోసం ప్రేక్షకులంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ను జరుపుకుంటోంది. 1 year for the Pan Indian Blockbuster #PushpaTheRise 🔥 1 year for Icon Star @alluarjun setting the screens on fire as #PushpaRaj 🔥 1 year for the sensation at the Indian Box Office 🔥#1YearForIndianHGOTYPushpa @iamRashmika @aryasukku @ThisIsDSP @MythriOfficial pic.twitter.com/3bqf52fb7B — Pushpa (@PushpaMovie) December 17, 2022 View this post on Instagram A post shared by Devi Sri Prasad (@thisisdsp) -
ఈ ఏడాది ఎక్కువమంది చూసిన సినిమాలివే!
'సినిమా చూపిస్త మామా.. నీకు సినిమా చూపిస్త మామా.. సీనుసీనుకీ నీతో నేను సీటీ కొట్టిస్త మామా.. ఇది ఓ పాటలోని లిరిక్.. కానీ అక్షరాలా ఇదే నిజం చేసి చూపించాయి కొన్ని సినిమాలు.. చిన్న, పెద్ద సినిమాలెన్నో ఈసారి భారీ విజయాన్ని మూటగట్టుకుని ప్రేక్షకుడితో నిజంగానే సీటీ కొట్టించాయి. థియేటర్లోనే కాదు, ఓటీటీలో కూడా రచ్చ లేపాయి. అలా ఇండియాలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎక్కువ మంచి చూసిన టాప్ 10 సినిమాల్లో మొదటి ఐదు చిత్రాలు సౌత్వే కావడం గమనార్హం. ఇంతకీ ఆ సినిమాలేంటో చూసేద్దాం... 1. పుష్ప 2. కేజీఎఫ్ 2 3. కేజీఎఫ్ 1 4. సీతారామం 5. పొన్నియన్ సెల్వన్ 1 6. బచ్చన్ పాండే 7. జుగ్ జుగ్ జియో 8. రన్వే 34 9. జురాసిక్ వరల్డ్ డొమైన్ 10. గెహ్రియాన్ చదవండి: భార్యను కౌగిట్లో బంధించిన తారక్ అర్జున్ కల్యాణ్ దృష్టిలో శ్రీసత్య కంటెంట్ మాత్రమే! -
‘కాంతార’ లాంటి చిత్రాలు ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాయి: స్టార్ డైరెక్టర్
ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల హవా నడుస్తోంది. భారీ బడ్జెట్, స్టార్ నటీనటులు అనే సంబంధం లేకుండ కంటెంట్ ఉన్న చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు. బాషతో సంబంధం లేకుండ సౌత్ సినిమాలకు నార్త్లో సైతం విశేష ఆదరణ లభిస్తోంది. ఇందుకు ఇటీవల విడుదలైన కాంతార చిత్రమే ఉదాహరణ. ఈ ప్రాంతీయ సినిమా వచ్చిన ఈ కన్నడ మూవీ దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. దీంతో పాన్ ఇండియా అనే అంశం ప్రస్తుతం బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. చదవండి: వాల్తేరు వీరయ్య: కేక పుట్టిస్తున్న రవితేజ ఫస్ట్లుక్ టీజర్ ఈ నేపథ్యంలో కాంతార మూవీపై స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్చప్ చేసిన వ్యాఖ్యలు హాట్టాపిక్ నిలిచాయి. సైరత్ మూవీ విజయం మరాఠి ఇండస్ట్రీని నాశనం చేసిందని గతంలో ఆ మూవీ డైరెక్టర్ నాగరాజు మంజులే చేసిన వ్యాఖ్యలను అనురాగ్ గుర్తు చేశాడు. ప్రాంతీయ సినిమాలు, సొంత కథల సినిమాలు మంచి విజయం సాధించినప్పటికీ.. వాటి సక్సెస్ కారణంగా ఇండస్ట్రీ నాశనమైపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా కల్చర్ హవా కొనసాగుతుందని, దానివల్ల బాలీవుడ్ ఇండస్ట్రీ నాశనమైపోతుందన్నాడు. చదవండి: అంజలి పెళ్లి చేసుకుందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా చిత్రాల హవా నడుస్తోంది. దీంతో ఈ ట్రెండ్పైనే బాలీవుడ్ దర్శక-నిర్మాతలు దృష్టిపెడుతున్నారు. ఇప్పుడు ఇదే బాలీవుడ్ను నాశనం చేస్తోంది. పుష్ప, కేజీయఫ్ 2, కాంతార వంటి చిత్రాలు దేశవ్యాప్తంగా బ్లాక్బస్టర్ హిట్ అయ్యిండోచ్చు. కానీ అలాంటి సినిమాలు బాలీవుడ్లో వర్కౌట్ కావు. వాటినే కాపీ కొట్టి పాన్ ఇండియా సినిమాలుగా తీయాలని చూస్తే మాత్రం బాలీవుడ్కు భారీ నష్టం తప్పుదు. ప్రస్తుతం బాలీవుడ్కు కావాల్సింది పాన్ ఇండియా సినిమాలు కాదు. ఇండస్ట్రీకి ధైర్యం చెప్పే సినిమాలు కావాలి. కథల్లో ఎప్పుడూ కొత్తదనం ఉండాలి.. అప్పుడే సినిమాలు హిట్ అవుతాయి’’ అని అనురాగ్ పేర్కొన్నాడు. -
Manoj Tiwary: పుష్ప డైలాగ్ కొట్టాల్సింది కాదు!
కోల్కతా: సినిమా డైలాగులు పేల్చడం రాజకీయ నాయకులకు ఈమధ్య బాగా అలవాటైంది. అయితే పంచ్ కోసం పేలుస్తున్న ఆ డైలాగులు.. ఒక్కోసారి బెడిసి కొడుతున్నాయి కూడా. తృణమూల్ కాంగ్రెస్ నేత మనోజ్ తివారీ తాజాగా అల్లు అర్జున్ పుష్ఫ సినిమాలోంచి కొట్టిన డైలాగ్.. బీజేపీకి బాగా కోపం తెప్పించింది. మొత్తం బెంగాల్ ప్రభుత్వం తీరే పుష్ప సినిమాలాగా ఉంది. ఎర్ర చందనపు స్మగర్ల సినిమాలో ఏవో డైలాగులు కొడితే.. ఇక్కడి టీఎంసీ నేత కూడా అలాగే డైలాగులు కొడుతున్నాడు. ఒకరేమో యువత హక్కులను దోచుకుంటున్నారు. మరొకరేమో స్కామ్లు చేసి వాళ్ల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. టీఎంసీ నేతల తీరు.. ఆ సినిమాలోని ఎర్ర చందనపు స్మగ్లర్లలాగే ఉంది. వాళ్లతో పాటు ఆ పార్టీ ఒరిజినల్ క్యారెక్టర్లను బయటపెడుతోంది అంటూ బీజేపీ నేత ఉమేశ్ రాయ్ మండిపడ్డారు. క్రికెటర్ నుంచి రాజకీయ నేత, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిగా ఎదిగిన మనోజ్ తివారీ.. ఆదివారం ఓ ర్యాలీలో పార్టీ కార్యకర్తలంతా సంఘటితంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో.. పుష్ప సినిమాలోని ఝుకేగా నహీ సాలా' (తెలుగులో నీయవ్వ.. తగ్గేదే లే) అంటూ బీజేపీకి సవాల్ విసిరాడు. ఈ వ్యాఖ్యలపైనే బీజేపీ భగ్గుమంది. అయితే.. ర్యాలీ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో.. మీడియా ప్రతినిధులు ఆయన తీరును ప్రశ్నించారు. దీంతో ఆయన నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు.. ఆ డైలాగ్ కొట్టాల్సింది కాదు అని తివారీ క్షమాపణలు చెప్పారు. -
గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన సినిమాలు ఇవే..!
-
పుష్ప మూవీ చూశా, ఆ హీరో ఎవరో తెలియదు: నటి
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్, తగ్గేదేలే అంటూ చిత్తూరు మేనరిజమ్ డైలాగ్స్తో సినీలవర్స్ను ఎంటర్టైన్ చేశాడు అల్లు అర్జున్. ఈ మూవీతో బాక్సాఫీస్ను గడగడలాడించిన బన్నీ ఇప్పుడు పుష్ప సీక్వెల్తో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఎవరో తనకు తెలియదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది అలనాటి నటి, నర్తకి ఎల్ విజయలక్ష్మి. తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో నటించిన ఆమె పెళ్లి తర్వాత అమెరికా వెళ్లిపోయి అక్కడే సెటిలైంది. తాజాగా ఇండియాకు వచ్చిన ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ఐదేళ్ల వయసులోనే డ్యాన్స్ షో చూసి యథాతథంగా అలాగే స్టెప్పులేసేదాన్ని అని చెప్పుకొచ్చింది. నందమూరి తారకరామారావుగారు తనను కోడలా.. కోడలా.. అని పిలిచేవారంటూ మురిసిపోయింది. ఈ మధ్య ఏదైనా సినిమా చూశారా? అన్న ప్రశ్నకు పుష్ప సినిమా చూశానంది. అందులో నటించిన హీరో ఎవరో తెలుసుగా అనేలోపే తనకు తెలియదని చెప్పింది. అతడు అల్లు రామలింగయ్యగారి మనవడు అని చెప్పడంతో ఆశ్చర్యపోయిన నటి.. ఈ మధ్యకాలంలో హీరోల గురించి అడుగుతుంటే రామానాయుడు మనవడు, నాగేశ్వరరావు మనవడు అని ఇలాగే చెప్తున్నారని పేర్కొంది. కాగా ఇటీవల విజయలక్ష్మి ఎన్టీఆర్ పురస్కారాన్ని అందుకుంది. ఈ అవార్డు స్వీకరించేందుకు దాదాపు యాభై ఏళ్ల తర్వాత ఆమె అమెరికా నుంచి తెనాలి రావడం కొసమెరుపు. చదవండి: బిగ్బాస్: టికెట్ టు ఫినాలే బరిలో నిలబడ్డ లేడీ కంటెస్టెంట్ అర్ధరాత్రి ప్రభాస్ చేసిన పనికి సూర్య షాక్ -
రష్యాలో ల్యాండైన ‘పుష్ప’ టీమ్.. అల్లు అర్జున్, రష్మిక సందడి
‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్.. తగ్గేదే లే’ అంటూ ఇండియన్ బాక్సాఫీస్పై దాడి చేసి కోట్ల రూపాయలను కొల్లగొట్టేశాడు ‘పుష్పరాజ్’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం.. ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేసింది. ఈ చిత్రం రిలీజై దాదాపు ఏడాది కావొస్తున్నా పుష్ప రాజ్ సృష్టించిన ఇంపాక్ట్ ఇప్పటకి అలానే ఉంది. ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు రష్యాలో రిలీజ్కు రెడీ అవుతోంది. డిసెంబర్ 8న రష్యాలో గ్రాండ్ గా పుష్ప చిత్రం విడుదల కాబోతుంది. ప్రమోషన్లో భాగంగా మంగళవారం పుష్ప రష్యన్ ట్రైలర్ని కూడా విడుదల చేశారు మేకర్స్. విడుదలకు ఇంకా వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ రష్యా వెళ్లారు. అక్కడ వారికి ఘన స్వాగతం లభించింది. డిసెంబర్ 1న మాస్కోలో, 3న సెయింట్ పీటర్స్బర్గ్లో ప్రీమియర్ షోస్ ప్లాన్ చేశారు. మాస్కోలో జరిగే ప్రీమియర్ షోలో అల్లు అర్జున్, రష్మికతో పాటు దర్శకుడు సుకుమార్, నిర్మాత రవిశంకర్ పాల్గొని అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవనున్నారు. ఇక రష్యాలో ఈ సినిమా ఏ స్థాయిలో రికార్డ్ సృష్టించబోతుందో చూడాలి. -
సాక్షి ఎక్స్లెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
దర్శకుడు సుకుమార్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
పుష్ప 2 లో తమన్నా ..!
-
అల్లు అర్జున్ ఖాతాలో మరో అరుదైన అవార్డు
‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేసింది. పుష్పరాజ్గా బన్నీ నటనకు యావత్ భారత్ సినీలోకం బ్రహ్మరథం పట్టారు. దీంతో ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపించడంతో పాటు అవార్డుల పంటను కూడా పండిస్తోంది. ఇప్పటికే ‘పుష్ప’లో అల్లు అర్జున్ నటనకుగాను ఫిలింఫేర్, సైమా అవార్డులు రాగా.. తాజాగా బన్ని ఖాతలో మరో అవార్డును చేరింది. ఎంటర్టైన్ కేటగిరిలో ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు బన్నీ. ఈ అవార్డును ఢిల్లీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతులు మీదుగా అందుకున్నాడు. (చదవండి: అనుష్కపై గరికపాటి కొంటె వ్యాఖ్యలు.. ఆర్జీవీ ట్వీట్ వైరల్) దాదాపు 20 ఏళ్ల తర్వాత ఉత్తరాదికి చెందిన అవార్డును అందుకున్న దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ నిలవడం గమనార్హం. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘నేను చిత్ర పరిశ్రమలో 20 ఏళ్లుగా పనిచేస్తున్నాను. నేను దక్షిణాదిలో ఎన్నో అవార్డులు అందుకున్నాను. ఉత్తరాది నుంచి అవార్డులు అందుకోవడం ఇదే తొలిసారి కాబట్టి ఇది నాకు చాలా ప్రత్యేకం’అంటూ చెప్పుకొచ్చారు. ఈ అవార్డును కోవిడ్ వారియర్స్ డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలకు అంకింతం చేశాడు. -
పుష్ప: తగ్గేదే లే అంటూ.. నాన్స్టాప్గా షూటింగ్!
హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప’ తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ‘పుష్ప’ మలి భాగం ‘పుష్ప: ది రైజ్’పై మరింత దృష్టి పెట్టింది టీమ్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ఈ నెల 20న ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తగ్గేదే లే అంటూ.. నాన్స్టాప్గా షూటింగ్ చేయడానికి టీమ్ ప్లాన్ చేసిందని సమాచారం. చదవండి: Suriya: ‘నాకు ఆ పాత్ర చేయడం ఇష్టం లేదు, ఆయన కోసమే ఒప్పుకున్నా’ ఈ షెడ్యూల్లోనే హీరో హీరోయిన్లు అల్లు అర్జున్, రష్మికా మందన్నాలు కూడా పాల్గొంటారని తెలిసింది. ఇందులో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్, శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న సినిమా ఇది. ఫాహద్ ఫాజిల్, ధనుంజయ, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
తగ్గేదేలే.. ఫిల్మ్ఫేర్ అవార్డుల్లో 'పుష్ప' క్లీన్స్వీప్..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప' సినిమా అవార్డుల్లోనూ తగ్గేదేలె అంటోంది. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా ఎన్నో రికార్డులను తిరగరాసింది. తాజాగా ప్రతిష్టాత్మక 67వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోనూ పుష్ప క్లీన్ స్వీప్ చేసేసింది. ఏకంగా 7 ఫిల్మ్ఫేర్ అవార్డులను సొంతం చేసుకుని సత్తాచాటింది. ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ నిర్మాత, ఉత్తమ మేల్ సింగర్, ఉత్తమ ఫిమేల్ సింగర్, ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ విభాగాల్లో పుష్ప చిత్రానికి అవార్డుల పంట పండింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. ఫిల్మ్ఫేర్ అవార్డుల్లో పుష్ప క్లీన్ స్వీప్.. థ్యాంక్యూ అంటూ ట్వీట్ చేశాడు. ఫిల్మ్ఫేర్ అవార్డులో..;పుష్ప;కి అవార్డు పంట ♦ ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ ♦ ఉత్తమ దర్శకుడు: సుకుమార్ ♦ఉత్తమ చిత్రం: పుష్ప - ది రైజ్ ♦ ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్ ♦ఉత్తమ గాయకుడు: సిద్ద్ శ్రీరామ్ (శ్రీవల్లి..) ♦ఉత్తమ గాయని: ఇంద్రావతి చౌహాన్ ( ఊ అంటావా మావ) ♦ ఉత్తమ సినిమాటోగ్రాఫర్: మిరోస్లా బ్రొజెక్ (పుష్ప - ది రైజ్) THANK YOU 🖤 pic.twitter.com/1zlOcNx2sS — Allu Arjun (@alluarjun) October 10, 2022 #PUSHPA CLEAN SWEEP AT @filmfare . BEST ACTOR , BEST DIR , BEST MUSIC DIR , BEST CINEMATOGRAPHY , BEST MALE SINGER , BEST FEMALE SINGER & BEST FILM . THANK YOU ALL . HUMBLED 🙏🏽 — Allu Arjun (@alluarjun) October 10, 2022 -
అలా అయితే నాకు మరో 20 ఏళ్లు పట్టేది.. అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్తో పాటు బాలీవుడ్ను సైతం ఊపేసిన సినిమా 'పుష్ప- ది రైజ్'. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అందాల భామ రష్మికతో బన్నీ స్టెప్పులు యూత్ను ఓ రేంజ్లో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలోని సాంగ్స్ దేశవ్యాప్తంగా ప్రాముఖ్యం పొందాయి. పుష్ప సినిమాతో అల్లుఅర్జున్కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోయింది. ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. (చదవండి: క్రేజీ అప్డేట్.. ఆ రోజు నుంచే ‘పుష్ప-2’ రెగ్యులర్ షూటింగ్!) ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ ఈ సినిమాపై ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఆయన మాట్లాడతూ 'పుష్ప మూవీ ఇంతపెద్ద విజయం సాధిస్తుందనుకోలేదు. ఇది నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ చిత్రంలో నేను లేకుంటే ఇంత ప్రేమను పొందడానికి నాకు దాదాపు 20 సంవత్సరాలు పట్టేది. 'పుష్ప-2' పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే ప్రయత్నిస్తాం' అని అన్నారు. -
క్రేజీ అప్డేట్.. ఆ రోజు నుంచే ‘పుష్ప-2’ రెగ్యులర్ షూటింగ్!
పుష్పరాజ్ మళ్లీ సెట్స్లోకి అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ గత ఏడాది డిసెంబరులో విడుదలై అద్భుత విజయం సాధించింది. ఇందులో పుష్పరాజ్ పాత్రలో నటించారు అల్లు అర్జున్. తాజాగా రెండో భాగం ‘పుష్ప: ది రూల్’కు రంగం సిద్ధం చేశారు సుకుమార్ అండ్ కో. ఇటీవలే ‘పుష్ప: ది రైజ్’ పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబరు 1 నుంచి ప్రారంభం కానుందని టాక్. చదవండి: అలనాటి హీరోయిన్ గౌతమి కూతురిని చూశారా? త్వరలో హీరోయిన్గా ఎంట్రీ! ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను ప్లాన్ చేశారు చిత్రయూనిట్. కొందరు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారట. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. తొలిభాగంలో అల్లు అర్జున్తో జోడీ కట్టిన రష్మికా మందన్నానే రెండో భాగంలోనూ హీరోయిన్. ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాగా ‘పుష్ప: ది రూల్’ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
స్మగ్లింగ్లో ‘పుష్ప’ను మించిపోయాడు..
ఉక్కునగరం(విశాఖపట్నం): స్టీల్ప్లాంట్లో పుష్ప సినిమా తరహా దొంగతనానికి యత్నించిన వ్యక్తి సీఐఎస్ఎఫ్ తనిఖీల్లో పట్టుబడ్డాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలివి.. స్టీల్ప్లాంట్ స్ట్రక్చరల్ మిల్లో 56 మిల్లీమీటర్ వ్యాసం కలిగిన రౌండ్ బార్లు తయారు చేస్తుంటారు. అలా తయారైన వాటిలో పగుళ్లు, సరైన సైజు లేని వాటిని స్క్రాప్ కింద పక్కన పెడతారు. వాటిని ఎస్ఎస్డీ విభాగానికి చెందిన కాంట్రాక్టర్ ద్వారా స్టీల్ మెల్ట్షాప్కు తరలించి రీ మెల్టింగ్ చేస్తారు. చదవండి: అదే బావి.. నాడు భర్త, నేడు భార్య గురువారం ఉదయం షిఫ్ట్లో సుమారు 6.30 ప్రాంతంలో ఒక మినీ వ్యాను మెయిన్ గేటు అవుట్ గేటు ద్వారా బయటకు వెళ్లడానికి వచ్చింది. అక్కడ తనిఖీ చేస్తున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా వెనుక భాగం అనుమానాస్పదంగా కనిపించింది. దాన్ని తనిఖీ చేయగా షీట్ల కింద సుమారు 40 రౌండ్ బార్ ముక్కలు బయటపడ్డాయి. అవాక్కైన సిబ్బంది వెంటనే డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే గుట్టుగా ఈ వ్యవహారం ఎన్నాళ్లుగా సాగుతుందో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టుబడిన వాహనం నంబర్ను చూస్తే అది కూడా ఒరిజినల్ కాదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక ఉన్న ముఠా బయటపడితేనే అన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. సీఐఎస్ఎఫ్ సిబ్బంది నిందితుడిని, చోరీ సొత్తును స్టీల్ప్లాంట్ పోలీసులకు అప్పగించారు. -
రష్మికకు మరో భారీ ఆఫర్.. బాలీవుడ్లోనూ తగ్గేదేలే..!
హీరోయిన్ రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. వరుస ఆఫర్లతో కెరీర్లో దూసుకెళ్తోంది. సౌత్ ఇండియాలో ఇప్పటికే ఆమెకు భారీ డిమాండ్ ఉండగా.. బాలీవుడ్లోనూ ఆమె కోసం అక్కడి దర్శకనిర్మాతలు వరుస కడుతున్నారు. ఇప్పటికే ఈ భామ బాలీవుడ్లో నటించిన ‘గుడ్ బై’, ‘మిషన్ మజ్ను’ రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. మరో చిత్రం ‘యానిమల్’ చిత్రీకరణ కొనసాగుతోంది. తాజాగా ఈ నేషనల్ క్రష్ని మరో భారీ ఆఫర్ వరించినట్లు తెలుస్తోంది. అనురాగ్ బసు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆషికీ 3’లో రష్మికను హీరోయిన్గా తీసుకున్నట్లు సమాచారం. అయితే తాజాగా రష్మికకు మరో భారీ ఆఫర్ వరించినట్లు తెలుస్తోంది. ‘ఆషికీ 3’లో ఈ ముద్దుగుమ్మను హీరోయిన్గా తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మధ్యే కథ విన్న రష్మిక వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ విషయాన్ని త్వరలోనే చిత్రబృందం అధికారికంగా వెల్లడించనున్నారు. ఆషికీ 3 హీరో కార్తీక్ ఆర్యన్తో కలిసి రష్మిక ఇటీవల ఓ యాడ్లో నటించింది. ఇద్దరి జోడీ బాగా సెట్ అయిందని బాలీవుడ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆషికీ-3’లో ఈ జంట నటిస్తే సినిమా హిట్ అవడం ఖాయమంటున్నారు. (చదవండి: విజయ్తో రష్మిక మందన్నా సెల్ఫీ వైరల్) ఇప్పటికే బాలీవుడ్లో ‘ఆషికీ’ సీక్వెల్స్కు మంచి ఆదరణ ఉంది. 1990లో రాహుల్ రాయ్, అను అగర్వాల్ జంటగా నటించిన ‘ఆషికీ’ అప్పట్లో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ చిత్రానికి కొనసాగింపుగా 2013లో వచ్చిన ‘ఆషికీ 2’ సైతం సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమా జోడి ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ మంచి పేరు తెచ్చుకున్నారు. -
‘శ్రీవల్లి’ని ఫాలో అయిన చిన్నారి, పాప అడ్రస్ కావాలంటూ రష్మిక ట్వీట్
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప మూవీ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో హీరోయిన్గా నటించిన రష్మిక రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఆమె పాన్ ఇండియా నటిగా మారిపోయింది. ఇక కలెక్షన్ల పరంగా పుష్ప బక్సాఫీసు వద్ద సృష్టించిన సునామి అంతాఇంత కాదు. పుష్పకు ఈ రేంజ్లో గుర్తింపు రావడానికి ఇందులోని పాటలు కూడా ప్రధాన పాత్ర పోషించాయి. ఇప్పటికీ ఈ పాటలు మారుమోగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రష్మిక రారా సామి పాట బాగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసి ఈ పాట రీల్స్యే దర్శనమిచ్చాయి. చదవండి: మళ్లీ బుక్కైన తమన్.. ‘ఏంటమ్మా.. ఇది’ అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ ఇక ఇందులో రారా సామి అంటూ రష్మిక నడుం వంచి వేసిన హుక్ స్టెప్ను ప్రతి ఒక్కరు ఫాలో అయ్యారు. తాజాగా ఇదే పాటకు ఓ చిన్నారి డాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. స్కూల్లో తన స్నేహితులతో కలిసి రారా సామి అంటూ ఈ చిన్నారి డాన్స్ చేస్తూ రష్మిక హుక్ స్టెప్ను అనుసరించింది. ఆ చిన్నారి డాన్స్కు ఫిదా అయిన ఓ నెటిజన్ ఈ వీడియోను తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశాడు. దీంతో వైరల్గా మారిన ఈ వీడియో రష్మిక కంటపడింది. ఇక ఈ ట్వీట్ను రష్మిక రీట్వీట్ చేస్తూ.. ‘షి మేడ్ మై డే. ఈ రోజుకు ఇది చాలు. ఈ క్యూటీని కలవాలనుకుంటున్నా. ఎలా?’ అంటూ పాప అడ్రస్ కావాలంటూ రష్మిక ఆరా తీసింది. చదవండి: రణ్వీర్ చెంప చెల్లుమనిపించిన బాడిగార్డ్! అసలేం జరిగిందంటే.. Maaaaadddddeeeeee myyyyy daaaaaay.. I want to meet this cutie..💘 how can I? 🥹 https://t.co/RxJXWzPlsK — Rashmika Mandanna (@iamRashmika) September 14, 2022 -
బాల్యం హాస్టల్లోనే... వారిలో అమ్మను చూసుకున్నా: రష్మిక
పుష్ప చిత్రంలో పల్లెటూరి యువతిగా చక్కని నటనను ప్రదర్శించి ప్రశంసలు పొందిన హీరోయిన రష్మిక మందన్నా. తెలుగులో టాప్ హీరోయిన్గా రాణిస్తున్న ఈ బ్యూటీ తమిళంలో కార్తీకి జంటగా సుల్తాన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ చిత్రం ఆమెకు ఆశించిన పేరు తీసుకురాలేదనే చెప్పాలి. ఇక ఇటీవల బాలీవుడ్లోనూ అడుగుపెట్టిన రష్మిక అక్కడ చకచకా రెండు చిత్రాలను పూర్తి చేసింది. అక్కడ మరో చిత్రం చేతిలో ఉంది. ఈ సమయంలో తమిళంలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. విజయ్ జంటగా తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న వారీసు చిత్రంలో నటిస్తోంది. (చదవండి: వారంటే మా నాన్నకు చాలా గౌరవం: అమితాబ్) కాగా ఈ అమ్మడు అల్లు అర్జున్తో జతకట్టిన తెలుగు చిత్రం పుష్ప... ఐదు సైమా అవార్డులను కొల్లగొట్టింది. అయితే అందులో ఏ కేటగిరీలోనూ ఈ అమ్మడికి అవార్డు రాకపోవడం విచారించదగ్గ విషయమే. అయితే ఆ విషయాన్ని అస్సలు పట్టించుకోని రష్మికపై కనీసం స్పందించలేదు. అయితే ఇటీవల ఓ భేటీలో తన స్నేహితులు, హాస్టల్ జీవితం గురించి ఈమె చెప్పుకొచ్చింది. అందులో తన బాల్యం హాస్టల్లోనే గడిచిపోయిందని చెప్పింది. తాను ఎక్కడికి వెళ్లినా స్నేహితులు చుట్టూ ఉండే వారని, వారినే.. తన కుటుంబంగా భావించానని పేర్కొంది. ఉపాధ్యాయులతోనూ గౌరవంగా ప్రవర్తించే దానినని, వారిలో తన అమ్మను చూసుకునేదాన్ని తెలిపింది. ఇప్పటికీ తన స్నేహితులను కుటుంబంగా భావిస్తానని చెప్పింది. ఇకపోతే హైస్కూల్లో తాను సగటు విద్యార్థినేనని తెలిపింది. అయితే ప్లస్–2, డిగ్రీలో మాత్రం తాను క్లాస్ టాపర్గా నిలిచానని చెప్పింది. తనకు గణితం, బయాలజీ వంటి సబ్జెక్టులంటే భయమని, అందుకే ప్లస్–2లో తనకు ఇష్టమైన సీఈసీ గ్రూపును తీసుకుని డిగ్రీ వరకు ఉత్తమ ప్రతిభ కనబరిచానని వెల్లడించింది. -
‘పుష్ప’తో నటిగా మంచి గుర్తింపు లభించింది: అక్షర
టాలెంటెడ్ ఉంటే తెలుగు పరిశ్రమలో అవకాశాలు ఎప్పుడూ తలుపు తడుతూనే ఉంటాయి అంటుంది నటి అక్షర. పుష్ప చిత్రంలో హీరో వదిన పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ తెలుగమ్మాయి. కల్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ చిత్రంలో పెళ్లి కూతురి పాత్రలో నటించింది. ఆ తర్వాత రామ్ ‘రెడ్’ చిత్రంలో మంచి పాత్ర పోషించి, మెప్పించడంతో సుకుమార్ ‘పుష్ప’లో అవకాశం కల్పించాడు. ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 చిత్రంతో పాటు రవితేజ, సుధీర్ వర్మ కాంబినేషన్లో వస్తున్న ‘రావణాసుర’లో ఓ విభిన్నమైన రోల్లో నటిస్తోంది. తాజాగా ఆమె మీడియాతో ముచ్చటిస్తూ.. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను పోషించి, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలనేదే తన లక్ష్యమని పేర్కొంది. తనలో టాలెంట్ చూసి అవకాశాలు ఇస్తున్న దర్శక నిర్మాతలకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపింది. త్వరలోనే మరిన్ని వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తానని చెబుతోంది. -
పుష్ప-2 కోసం డిఫరెంట్ లుక్లో అల్లు అర్జున్
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప: ది రైజ్’ ఎంత హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రష్మికా మందన్న హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సునీల్, అనసూయ, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 17న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలై సూపర్హిట్గా నిలిచింది. కాగా ‘పుష్ప’ తొలి భాగం బ్లాక్ బస్టర్ అవడంతో సీక్వెల్పై (పుష్ప: ది రూల్) భారీ అంచనాలు ఉన్నాయి. తొలి భాగంలో పుష్పరాజ్గా ఆకట్టుకున్న అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’లో కొంచెం డిఫరెంట్ లుక్లో కనిపించనున్నారు. ఇందుకోసం లుక్ టెస్ట్ చేశారు. అల్లు అర్జున్కి బాలీవుడ్ ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ ప్రీతీ షీల్ మేకప్ చేశారు. ప్రోస్థటిక్ మేకప్ చేశారని తెలిసింది. గత రెండు రోజుల్లో ఈ లుక్ టెస్ట్ జరిగింది. ఈ లుక్ పై సుకుమార్ సంతోషంగా ఉన్నారని టాక్. రెండో భాగంలోనూ రష్మికా మందన్న హీరోయిన్గా నటించనున్నారు. ఈ నెల 22న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో ఆరంభమవుతుందని తెలిసింది. ఫస్ట్ పార్ట్కి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ రెండో భాగానికి కూడా ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. -
పుష్ప 2పై అప్డేట్ ఇచ్చిన రష్మిక, ‘అప్పుడే సెట్లో అడుగుపెడతా’
‘‘ఫలానా స్క్రిప్ట్ను ఎంచుకుంటే అది జరుగుతుందేమో! ఫలానా స్క్రిప్ట్ను ఎంచుకోకపోతే మరొకటి జరుగుతుందేమో అని హైరానా పడను. జరిగేదే జరుగుతుందనుకుని నా గట్ ఫీలింగ్తో స్క్రిప్ట్స్ ఎంచుకుంటాను’’ అన్నారు రష్మికా మందన్నా. అమితాబ్ బచ్చన్, రష్మికా మందన్నా ప్రధాన పాత్రల్లో నటింన హిందీ చిత్రం ‘గుడ్ బై’. వికాశ్ బాల్ దర్శకత్వంలో రపొందిన ఈ సినివ అక్టోబరు 7న థియేటర్స్లో రిలీజ్ కానుంది. హిందీలో రష్మికా మందన్నాకు ఇదే తొలి చిత్రం. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న రష్మికా మందన్నాను ‘మీరు ఏ విషయానికి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారు’ అని ఓ విలేకరి అడగ్గా.. ‘‘నెగిటివిటీకి గుడ్ బై చెప్పాలనుకుంటున్నాను. చదవండి: ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ నాకు మైనస్ అయ్యింది: సంగీత షాకింగ్ కామెంట్స్ నేను చాలా పాజిటివ్ పర్సన్ని. మనందరం నెగిటివిటీకి గుడ్ బై చెప్పాలని, ప్రపంచం అంతా పాజిటివ్నెస్తో నిండిపోవాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకువర్ దర్శకత్వంలో రపొందిన ‘పుష్ప: ది రైజ్’ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినివ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా నెక్ట్స్ పార్ట్ ‘పుష్ప: ది రైజ్’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇంకా రెండో భాగం చిత్రీకరణ ఆరంభం కాలేదు. అయితే ఈ సినిమా షూటింగ్లో మరో రెండు రోజుల్లో జాయిన్ అవుతున్నట్లుగా రష్మిక అప్డేట్ ఇచ్చారు. చదవండి: చై-సామ్ విడాకులపై సమంత తండ్రి ఎమోషనల్ -
తగ్గేదేలే.. బన్నీ, ఎన్టీఆర్, చరణ్, యశ్ గెటప్లలో గణేషుడు
దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ శోభ కనిపిస్తోంది. నవరాత్రోత్సవాలు జరిపేందుకు ప్రతివీధిలోనూ మండపాలు ముస్తాబయ్యాయి. వినాయక చవితి సంబరాలతో నగరాలన్నీ సందడిగా మారాయి.. ఏ గల్లీలో అడుగు పెట్టినా గణనాథుని రూపాలే దర్శనమిస్తున్నాయి. ప్రతిచోటా రకరకాల రూపాల్లో వినాయక ప్రతిమలు మండపాల్లో కొలువుదీరాయి. అయితే కొన్ని ప్రదేశాల్లో డిఫరెంట్ గణేష్ రూపాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. వినాయక విగ్రహాల మీద సినిమాల ప్రభావం కూడా చాలానే ఉంది. గత కొన్నేళ్లుగా సినిమాలోని హీరోలు, వారు పోషించిన పాత్రల రూపంలో వినాయకుడిని తయారు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా కొందరి హీరోల రూపంలో ప్రతిష్టించారు. తాజాగా ఓచోట పుష్పలో అల్లు అర్జున్ తగ్గేదేలే అన్నట్లు విగ్రహాన్ని రూపొందించారు. మరోచోట ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ సినిమా క్లైమాక్స్లో పరుగెడుతూ ఉన్నటువంటి, బాణాన్ని ఎక్కుపెడుతున్న గెటప్లో ఉన్నాడు గణేషుడు.. అలాగే ఎన్టీఆర్ భీం రూపంలో..కేజీఎఫ్లో యశ్ రూపంలో విఘ్నేశుడి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. ఇక బన్నీ, ఎన్టీఆర్, చరణ్, యశ్ ఫ్యాన్స్ వీటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ ఖుషీ అవుతున్నారు. ఇక సాధారణ జనాలు సైతం ఆ విగ్రహాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ వెరైటీ వినాయకుడి విగ్రహాలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. PushparAAj...Thaggedhe Le 🔥 Allu Arjun Film roles & Ganesh Idols Never Ending Festival VIBE!! 🔥🔥🤩 This time In Pushpa Raj Avatar 🌟🔥#GaneshChaturthi #PushpaTheRule #AlluArjun pic.twitter.com/YuCYEAziMV — Trinadh❤️AADHF🪓 (@TrinadhAADHF) August 30, 2022 -
క్రేజీ న్యూస్: 'పుష్ప 2'కు ముహుర్తం ఫిక్స్.. ఆ రోజే షూటింగ్ ప్రారంభం!
Allu Arjun Pushpa 2 Movie Pooja Ceremony Will Start On August 22: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. పాన్ వరల్డ్ స్థాయిలో పుష్పరాజ్ వైరల్ అయ్యాడు. డైలాగ్స్, సాంగ్స్, స్టెప్పులు.. ఇలా ప్రతీదీ ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా ‘తగ్గేదేలే’ అనే డైలాగ్ ఓ స్వాగ్ క్రియేట్ చేసింది. ఈ ఒక్క డైలాగ్కు ప్రపంచంలోని సినీ ప్రియులంతా ఫిదా అయ్యారు. వాటిని రీల్స్ రూపంలో చేస్తూ ట్రెండ్ క్రియేట్ చేశారు. ఇంకా సమంత గ్లామర్, తనతోపాటు అల్లు అర్జున్ డ్యాన్స్, ఫహాద్ ఫాజిల్ యాక్టింగ్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఇక ఇప్పుడు ప్రేక్షకులంతా ఎదురు చూసేది 'పుష్ప 2' కోసమే. ఆ సినిమాను అప్పుడు స్టార్ట్ చేస్తాం.. ఇప్పుడు ప్రారంభిస్తున్నారు అంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అంతేకాకుండా అందులో విలన్గా ఆ స్టార్ హీరోలు, ఈ బాలీవుడ్ నటులు నటిస్తున్నారని అని ప్రచారం జరిగింది. మరోవైపు అసలు స్క్రిప్టే పూర్తి కాలేదు అని వార్తలు వినిపించాయి. అయితే ఎట్టకేలకు ఆ వార్తలన్నింటికి తెర దించుతూ 'పుష్ప: ది రూల్'ను స్టార్ట్ చేయనున్నాడు సుకుమార్. చదవండి: పాపం హిందీ హీరోలు!.. ఎరక్కపోయి ఇరుక్కున్న హృతిక్ రోషన్ సోమవారం అంటే ఆగస్టు 22న 'పుష్ప 2: ది రూల్' పూజా కార్యక్రమాన్ని మొదలు పెట్టనుంది చిత్రబృందం. ఈ విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అలాగే ఈ సినిమా చిత్రీకరణ సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం. ఆగస్టు 22నే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడం విశేషం. కాగా ఈ సినిమాను రూ. 400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించనున్నట్లు ఆ మధ్య టాక్ వినిపించింది. చదవండి: తన భార్య సొంత చెల్లిని పెళ్లాడిన స్టార్ హీరో.. కష్టాలతో జీవితం After September 15th... — Sarath Chandra Naidu (@imsarathchandra) August 21, 2022 -
సైమా అవార్డు పోటీల్లో ‘పుష్ప’రాజ్ హవా.. బరిలో ఉన్న చిత్రాలివే
దక్షిణాది భాషల్లో రూపొందుతున్న సినిమాలకు ఒకే వేదికపై అవార్డులను అందిస్తున్న సంస్థ సైమా(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్). ఈ ఏడాది ఈ వేడుకను సెప్టెంబర్ 10,11 తేదీలలో బెంగళూరులో జరపనున్నారు. ఈ నేపథ్యంలో సైమా వేదికగా తలపడనున్న సినిమాల జాబితాను విడుదల చేశారు. తెలుగు నుంచి పుష్ప, అఖండ, జాతిరత్నాలు, ఉప్పెన చిత్రాలు ఎక్కువ విభాగాలలో నామినేట్ అయ్యాయి. తెలుగు నుంచి పుష్ప అత్యధికంగా 12 విభాగాల్లో నామినేట్ అవ్వడం గమనార్హం. తమిళ్ నుంచి ‘కర్ణన్(10)’, కన్నడ నుంచి ‘రాబర్డ్’, మలయాళం నుంచి ‘మిన్నల్ మురళీ’ చిత్రాలు అత్యధిక నామినేషన్స్ పొందాయి. ఈ మొత్తం నామినేషన్స్ నుంచి విన్నర్ను ఆన్లైన్ ఓటింగ్ ద్వారా ఎంపిక చేసి అవార్డులు అందిస్తారు. ప్రేక్షకులు తమ అభిమాన నటీనటులు, సాంకేతిక నిపుణులకు సైమా వెబ్సైట్కు వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. సైమా అవార్డులకు నామినేట్ అయిన చిత్రాలివే.. టాలీవుడ్ పుష్ప(అల్లు అర్జున్) : 12 అఖండ(బాలకృష్ణ): 10 జాతిరత్నాలు(నవీన్ పొలిశెట్టి): 8 ఉప్పెన(వైష్ణవ్ తేజ్):8 కోలీవుడ్ కర్ణన్(ధనుష్): 10 డాక్టర్(శివ కార్తికేయన్): 9 మాస్టర్(విజయ్): 7 తలైవి(కంగనా రనౌత్): 7 మాలీవుడ్ మిన్నల్ మురళీ(టోవినో థామస్): 10 కురుప్(దుల్కర్ సల్మాన్):8 మాలిక్(ఫహద్ పాజిల్):6 జోజీ(ఫహద్ ఫాజిల్):6 శాండల్వుడ్ రాబర్ట్(దర్శన్):10 గరుడ గమన వృషభ వాహన(రాజ్ బి.శెట్టి): 8 యువరత్న(పునీత్ రాజ్కుమార్): 7 -
Pushpa2: దేవిశ్రీపైనే ఎక్కువ ప్రెజర్.. ఈ సారి ఏం చేస్తాడో?
అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ విజయంలో దేవీశ్రీ ప్రసాద్ అందించిన పాటలు కీలక పాత్ర పోషించాయి. పాన్ ఇండియా మార్కెట్ లో పుష్ప ను గ్రాండ్ గా ఇంట్రడ్యూస్ చేసేందుకు సినిమాకు సూపర్ ఓపెనింగ్స్ ను అందించేందుకు చాలా హెల్ప్ అయ్యాయి. దేశాన్ని మొత్తాన్ని రాక్ స్టార్ బీట్స్ , బన్ని స్టెప్స్ ఊపేశాయి. ఇప్పుడు పుష్ప-2పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. (చదవండి: సీతారామం’ఫస్ట్ రివ్యూ: థియేటర్ ఎక్స్పీరియన్స్కు సరైన మూవీ!) దీంతో సుకుమార్ మరింత జాగ్రత్తగా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడు. సెప్టెంబర్ నుంచి పుష్ప పార్ట్ 2 సెట్స్ పైకి వెళ్తోంది. అయితే సుకుమార్ కంటే కూడా సీక్వెల్ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ పైనే ఎక్కువ ప్రెజర్ ఉంది. ఈ సారి రాక్ స్టార్ ఎలాంటి ట్యూన్స్ అందిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అందుకు తగ్గట్లే రాక్ స్టార్ అదిరిపోయే ట్యూన్స్ కంపోజ్ చేశాడట. మరోసారి దేవి ట్రాక్స్ సెన్సేషన్ సృష్టించడం ఖాయం అంటోంది చిత్ర యూనిట్. కానీ పుష్ప తర్వాత వచ్చిన సినిమాలకు దేవి అందించిన పాటలేవి అంతగా ఆకట్టుకోలేదు. గుడ్ లక్ సఖి, ఖిలాడి, ఆడవాళ్లు మీకు జోహార్లు, లాంటి చిత్రాలకు రాక్ స్టార్ కంపోజ్ చేసిన సాంగ్స్ సినిమాకు హెల్ప్ కాలేదు. ఎఫ్ 3, ది వారియర్ మూవీస్ కు మాత్రం దేవి ఇచ్చిన పాటలు కొంత ఇంప్రెస్ చేశాయి. ఈ దశలో పుష్ప 2కు దేవి అంచనాలు మించి ట్యూన్స్ అందించగలడా అంటే రాక్ స్టార్ ఎక్స్ పీరియెన్స్ ను తక్కువ అంచనా వేయద్దు అంటున్నారు అతని ఫ్యాన్స్. ఈ సారి ఊ ఆంటావా , శ్రీవల్లి, సామిసామి మించిన ట్యూన్స్ తో తిరిగొస్తాడని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. -
రౌత్ అరెస్ట్: థాక్రే నోట పుష్ప డైలాగ్ ప్రస్తావన
సాక్షి, ముంబై: ప్రతీకార రాజకీయాలతో శివ సేనను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే సంజయ్ రౌత్పై ఈడీ అస్త్రాన్ని ప్రయోగించారని శివ సేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే.. తీవ్ర స్థాయిలో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. ‘మాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్లను తుడిచిపెట్టేస్తాం’ అనే ధోరణితో దర్యాప్తు ఏజెన్సీల ద్వారా ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారు. సంజయ్ రౌత్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. అయినా ఏ దశలోనూ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. పుష్ప అనే సినిమాలో ఓ పాపులర్ డైలాగ్ ఉంది. ఝుకేగా నహీ(తగ్గేదే లే) అని. అది రౌత్కు అన్నివిధాల సరిపోతుంది. నిజమైన శివసైనికుడిగా ఆయన వ్యవహరించారు. కొందరిలా ఆయన ఈడీ బూచికి భయపడలేదు. పిరికిపందలా వెన్నుచూపలేదు. ఎక్కడా తగ్గలేదు. బాలా సాహెబ్ చూపిన మార్గం ఇదే. రౌత్ నిజమైన శివ సైనికుడు అంటూ ఉద్ధవ్ థాక్రే ప్రశంసలు గుప్పించారు. సోమవారం మధ్యాహ్నాం రౌత్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన అనంతరం.. ఉద్దవ్ థాక్రే పైవ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రౌత్కుటుంబ సభ్యులు సైతం బీజేపీపై మండిపడ్డారు. బీజేపీపై సంజయ్ రౌత్ సహేతుక విమర్శలతో విరుచుకుపడుతున్నారని, అందుకే భయపడే ఈడీని ఆయనపై ప్రయోగించిందని బీజేపీపై సంజయ్ రౌత్ కుటుంబం ధ్వజమెత్తింది. ఇదిలా ఉంటే.. పత్రా చాల్ భూకుంభకోణానికి సంబంధించి ఆదివారం సంజయ్ రౌత్ ఇంటిపై ఈడీ సోదాలు నిర్వహించింది. ఆరేడు గంటలపాటు ఆయన్ని పశ్నించి.. చివరికి అర్ధరాత్రి హైడ్రామా నడుమ అరెస్ట్ చేసింది. సోమవారం మనీల్యాండరింగ్ ఆరోపణలపై అరెస్టైన సంజయ్ రౌత్ను.. నాలుగు రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగించింది ముంబై కోర్టు. -
నోట్లో సిగరెట్, చెవికి పోగు.. అల్లు అర్జున్ న్యూ లుక్ వైరల్
‘పుష్ప’ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడాయన పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్లో చేరాడు. టాలీవుడ్లో మాత్రమే కాకుండా.. బాలీవుడ్లోనూ బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. సినీ ప్రియులంతా పుష్ప 2 కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింట్ మొదలు కానుంది. ఇలాంటి తరుణంలో బన్ని న్యూలుక్లో దర్శనమిచ్చి అందరికి షాకిచ్చాడు. (చదవండి: సల్మాన్తో మెగాస్టార్ స్టెప్పులు.. కనువిందు ఖాయం) కొద్దిగా నెరసిన గెడ్డం, నోట్లో సిగరేట్, చెవికి పోగు పెట్టి రఫ్లో లుక్లో కనిపించాడు బన్ని. అయితే ఈ నయా లుక్ సినిమా కోసం కాదు. ఓ యాడ్ షూటింగ్ కోసం బన్ని ఇలా కనిపించాడు. ఇటీవలే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ యాడ్ చిత్రీకరణలో పాల్గొన్న బన్ని..తాజాగా హరీశ్ శంకర్ డైరెక్షన్లో మరో యాడ్ చేశాడు. దాని కోసమే బన్ని ఇలా నయా లుక్లో కనిపించాడు. ఈ ఫోటోని బన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోగా.. కొన్ని క్షణాల్లోనే అది నెట్టింట వైరల్ అయింది. బన్ని నయా లుక్కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. లైకులు, రీట్వీట్లతో సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప 2 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతుంది. మారేడుమిల్లి అడవుల్లోనే ఎక్కువ భాగం షూటింగ్ షెడ్యూల్స్ ఫిక్స్ చేశాడు సుకుమార్. జనవరితో షూటింగ్ కంప్లీట్ చేసి, మరో నాలుగు నెలలు పోస్ట్ ప్రోడకన్ కు టైమ్ ఇచ్చి, వచ్చే వేసవి లో పుష్పరాజ్ గ్రాండ్ రీఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారు. 🖤 pic.twitter.com/wm1GuLLmsA — Allu Arjun (@alluarjun) July 29, 2022 -
పుష్ప 2కి శిష్యుడి సాయం.. అంత సీన్ లేదన్న ఉప్పెన డైరెక్టర్
గురుశిష్యులిద్దరూ స్టార్ హీరోల సినిమాలు పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. సుకుమార్ పుష్ప 2 స్క్రిప్ట్ మీద, బుచ్చిబాబు ఎన్టీఆర్ మూవీ స్క్రిప్ట్ మీద కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో వీరు కలిసి చర్చిస్తున్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో పుష్ప 2 కోసం సుకుమార్ బుచ్చిబాబు సలహాలు తీసుకుంటున్నాడంటూ పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఈ రూమర్స్పై బుచ్చిబాబు స్పందించాడు. 'తన గురువుతో కలిసి దిగిన ఫొటో షేర్ చేస్తూ.. ఈ ఫొటో నేను తర్వాత చేయబోయే నా సినిమా కథ గురించి చర్చిస్తున్న సందర్భంలోది. మా గురువుగారు సుకుమార్ సర్ నా కోసం, నా సినిమా కథ కోసం సాయం చేయడానికి వచ్చారు. సుకుమార్ సర్ సినిమా కథలో కూర్చుని చర్చించేంత స్థాయి నాకు లేదు, రాదు. ఆయన నుంచి నేర్చుకోవడమే తప్ప ఆయనకు ఇచ్చేంత లేదు' అని క్లారిటీ ఇచ్చాడు. ఇక పుష్ప సీక్వెల్ విషయానికి వస్తే ఈ చిత్రాన్ని ఆగస్టులో మొదలుపెట్టాలని భావించారు. కానీ నిర్మాతల మండలి ఆగస్టు 1 నుంచి షూటింగ్స్ బంద్ అని పేర్కొనడంతో చిత్రీకరణ మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. ఈ photo నేను తరువాత చేయబోయే నాసినిమాకథ Discussion సందర్భంలోది మాగురువుగారు@aryasukku సుకుమార్ Sir నా కోసం నా సినిమా కథ కోసం Help చేయడానికి వచ్చారు. సుకుమార్ Sir సినిమా కథలో కూర్చుని Discussion చేసేంత స్థాయి నాకు లేదు రాదు.ఆయన నుంచి నేర్చుకోవడం తీసుకోవడమే తప్ప , ఆయనకి ఇచ్చేంత లేదు pic.twitter.com/KN7qmbLg6X — BuchiBabuSana (@BuchiBabuSana) July 28, 2022 చదవండి: చైతూతో కలిసి ఉన్న ఇంటినే ఎక్కువ రేటుకు కొనుక్కున్న సామ్ విజయ్ పాడిన ‘లైగర్’ యాటిట్యూడ్ సాంగ్ విన్నారా? చితక్కొట్టేశాడుగా.. -
ఆ కల నిజమైంది: రష్మిక మందన్నా
తమిళ చిత్రం సుల్తాన్లో కార్తీతో జోడీ కట్టనుంది పుష్ప బ్యూటీ రష్మిక. తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న పుష్ప చిత్రంలో నటించి రష్మిక మందన్నా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఎక్కడకు వెళ్లిన తన క్యూట్ స్మైల్తో అభిమానులను ఫిదా చేస్తోంది. ప్రస్తుతం విజయ్ సరసన శ్రీవల్లి అనే చిత్రంలో నటిస్తోంది ఈ అమ్మడు. మరోపక్క హిందీ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ ‘విజయ్ సరసన నటించాలనేది నా కలల్లో ఒకటి. అది కూడా పూర్తయిందని ఓ ఇంటర్య్వూలో చెప్పింది. నటీనటులు తమ సినిమాలు బాగా ఆడాలని కోరుకోవడం సహజం. కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చాక అన్ని భాషల్లో విడుదలయ్యే సినిమాల్లో నటించి ఇండియన్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటోందట రష్మిక. అది ‘పుష్ప’ చిత్రంతో తన కోరిక తీరిందని, ఇప్పుడు హిందీ చిత్రం గుడ్ బై చిత్ర షూటింగ్ సమయంలో అమితాబ్ బచ్చన్తో కలిసి పుట్టినరోజు జరుపుకున్నానని, ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి అంటోంది ఈ అమ్మడు. -
షూటింగ్స్ బంద్.. ఎఫెక్ట్ అయ్యే పెద్ద సినిమాలివే!
టాలీవుడ్లో షూటింగ్లు బంద్ కానున్నాయంటూ కొన్నిరోజులుగా ఊరిస్తున్న ఊహాగానాలు నిజమే అయ్యాయి. ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్స్కు బ్రేక్ పడనుంది. దీంతో పెద్ద సినిమాలన్నీ వాయిదా పడే అవకాశం ఉంది. అటు ఓటీటీ రిలీజ్పైనా కఠిన నిర్ణయాలు తీసుకుంది ప్రొడ్యూసర్స్ గిల్డ్. భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లో రిలీజైన 10 వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని తేల్చి చెప్పింది. మామూలు బడ్జెట్తో తీసిన సినిమాలను నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసుకోవచ్చని సూచించింది. అలాగే ఆరు కోట్ల లోపు బడ్జెట్తో తెరకెక్కిన సినిమాల ఓటీటీ రిలీజ్ అంశంపై ఫెడరేషన్తో చర్చించాకే ఓ నిర్ణయం తీసుకుంటామంది. షూటింగ్స్ బంద్తో ఎఫెక్ట్ అయ్యే పెద్ద సినిమాలివే.. ► బాబీ - చిరంజీవి సినిమా ► గాడ్ ఫాదర్ ► మెహర్ రమేశ్- చిరంజీవి ► గోపీచంద్ మలినేని- బాలకృష్ణ (NBK107) ► హరిహర వీరమల్లు ► శంకర్- రామ్చరణ్ (RC15) ► వంశీ పైడిపల్లి- విజయ్ ► ఖుషీ ► యశోద ► ఏజెంట్ ఇవి కాకుండా పుష్ప2, భవదీయుడు భగత్ సింగ్, త్రివిక్రమ్- మహేశ్ కాంబినేషన్లో ఓ మూవీ, కొరటాల శివ- తారక్ కాంబినేషన్లోని భారీ చిత్రాలు సెట్స్కు వెళ్లేందుకు రెడీ అవుతుండగా తాజా నిర్ణయంతో వాటికి ఆదిలోనే ఆటంకం ఏర్పడినట్లయింది. చదవండి: ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్స్ బంద్! -
పుష్ప 2లో నేనా? ఎవరు చెప్పార్రా నాయనా?: నటుడు
పుష్ప స్వాగ్ ఇంకా తగ్గలేదు. పుష్ప డైలాగ్స్, సాంగ్స్, మేనరిజమ్ తరచూ వినిపిస్తూ, కనిపిస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో పుష్ప 2లో ఇతర స్టార్స్ నటించబోతున్నారంటూ వార్తలు ఊరిస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ నటుడు మనోజ్ భాజ్పాయ్ కూడా పుష్ప: ది రూల్లో భాగం కానున్నాడంటూ ఊహాగానాలు ఊపందుకున్న విషయం తెలిసిందే! తాజాగా ఈ రూమర్స్పై మనోజ్ స్పందించాడు. మీకిలాంటి వార్తలు ఎవరు చెప్తార్రా నాయనా? అంటూ ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేల్చేశాడు. దీంతో మనోజ్ పుష్ప సీక్వెల్లో భాగం కాలేదని స్పష్టమైంది. ఇక మనోజ్ భాజ్పాయ్ విషయానికి వస్తే అతడు చివరగా సైలెన్స్.. కెన్ యు హియర్ ఇట్, డయల్ 100 సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం అతడి చేతిలో గుల్మొహర్ సినిమా, సూప్, ఫ్యామిలీ మ్యాన్ 3 వెబ్ సిరీస్ ఉన్నాయి. कहाँ कहाँ से समाचार लातें हैं आप लोग ? 😂😂 https://t.co/O6RBDwMUAK — manoj bajpayee (@BajpayeeManoj) July 20, 2022 చదవండి: రూ.1000 కోట్లు చాలా మామూలు విషయం అంటున్న హీరో ప్రాణాంతక వ్యాధి బారిన హీరోయిన్, 2 సార్లు చావు అంచుల వరకు.. -
పుష్ప-2లో పాపులర్ బాలీవుడ్ నటుడు
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో పుష్ప-2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. పుష్ప-2లో బాలీవుడ్ విలక్షణ నటుడు, ఫ్యామిలీ మ్యాన్ ఫేం మనోజ్ భాజ్పాయి నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే సుకుమార్ ఆయనకు స్క్రిప్ట్ వినిపించగా, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందన్నది త్వరలోనే తెలియనుంది. ఇక గతంలో అల్లు అర్జున్-మనోజ్ భాజ్పాయి కలిసి హ్యాపీ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు ఒకే స్క్రీన్పై వీరు కనిపించనున్నట్లు సమాచారం. -
ఐకాన్ స్టార్ మరో రికార్డ్.. పుష్పతో ఫస్ట్ ఇండియన్ హీరోగా ఘనత
పుష్ప సినిమా మరో అరుదైన రికార్డు అందుకుంది. ఇప్పటికే పుష్ప మేనరిజమ్స్ ఏ స్థాయిలో పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే పాటలు కూడా అదే స్థాయిలో సంచలనాలు సృష్టించాయి. తాజాగా పుష్ప మ్యూజిక్ ఆల్బమ్ ఏకంగా 5 బిలియన్ వ్యూస్ సాధించింది. అంటే అక్షరాలా 500 కోట్ల వ్యూస్ అన్నమాట. ఇండియన్ సినిమాలో ఈ ఘనత సాధించిన మొదటి హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిచిన పుష్ప ఆల్బమ్ అన్నిచోట్లా అద్భుతాలు చేసింది. దాక్కో దాక్కో మేక, ఏయ్ బిడ్డా, ఊ అంటావా ఉఊ అంటావా పాటలకు ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ వచ్చింది. అలాగే సోషల్ మీడియా రీల్స్లో శ్రీవల్లి స్టెప్ సృష్టించిన రికార్డుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ప్రతీ పాటను ఆడియన్స్ అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు కాబట్టే ఇండియాలో మరే సినిమాకు సాధ్యం కాని రీతిలో 500 కోట్ల వ్యూస్ సాధించింది పుష్ప మ్యూజిక్ ఆల్బమ్. దీనికి ముందు అల వైకుంఠపురములో సినిమా కూడా మ్యూజికల్గా సంచలనాలు సృష్టించింది. పుష్ప అదే కంటిన్యూ చేసింది. పుష్ప తనకు మైల్ స్టోన్ మూవీ అవుతుందని ముందు నుంచి చెప్తూనే ఉన్నారు అల్లు అర్జున్. అలా ఆయన చెప్పిన ప్రతీ అంచనా నిజమైపోతుందిప్పుడు. ఈ మధ్యే బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి పంపిన మెసేజ్ వైరల్ అయ్యింది. ప్రతీ సీన్ అద్భుతంగా ఉందని.. అలాటి సినిమా అసలు ఎలా తీసారో కూడా అంతుచిక్కడం లేదంటూ సుకుమార్ను ఆకాశానికి ఎత్తేసారు రాజ్ కుమార్ హిరాణి. సినిమాకు మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చినపుడు కూడా ఫలితంపై నమ్మకంగానే ఉన్నారు బన్నీ. కచ్చితంగా ఈ సినిమా సంచలన విజయం సాధిస్తుందని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే పుష్ప ఏకంగా రూ.350 కోట్లు వసూలు చేసింది. నేషనల్, ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా పుష్ప తరహాలో తగ్గేదే లే అన్నారు.. ఇంకా అంటూనే ఉన్నారు. అటు రాజకీయ నాయకులు సైతం పుష్ప మేనరిజమ్స్ వాడుతూనే ఉన్నారు. చదవండి: ప్రముఖ నటి కుమార్తెపై ట్రోలింగ్.. హీరోయిన్ స్ట్రాంగ్ రిప్లై 2022లో వచ్చిన టాప్ 10 సినిమాల లిస్ట్ ఇదిగో! -
బన్నీ షాకింగ్ లుక్ వైరల్, ట్రోల్ చేస్తున్న నార్త్ నెటిజన్లు
Trolls On Allu Arjun New Look: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు సౌత్లో విపరితమైన క్రేజ్ ఉంది. ఆయన స్టైల్కు, మ్యానరిజంకు ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. తరచూ కొత్త లుక్తో బన్నీ అభిమానులను అలరిస్తుంటాడు. తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మలయాళంలో సైతం బన్నీకి వీపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా పుష్ప మూవీతో నార్త్లో సైతం మంచి ఫాలోయింగ్ను సంపాదించుకున్నాడు బన్నీ. ఈ సినిమాలో పుష్పరాజ్గా అతడు సంపాదించుకున్న క్రేజ్అంతా ఇంత కాదు. చదవండి: తల్లి కాబోతున్న ఆలియా.. నీతూ కపూర్ రియాక్షన్ చూశారా! తగ్గేదే లే అనే డైలాగ్తో అల్లు అర్జున్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు. అందుకే పుష్ప డైలాగ్స్ను కేవలం దేశంలోనే కాదు విదేశాల్లో సైతం ఫాలోయ్యారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన పుష్ప మానియానే కనిపించింది. ఇక శ్రీవల్లి పాటలో అల్లు అర్జున్ హుక్ స్టెప్ను ప్రతి ఒక్కరు అనుసరించారు. అంతలా పుష్ప మూవీలో తన లుక్, ఆటిట్యూడ్తో ఆకట్టుకున్న బన్నీ తాజా లుక్పై నార్త్ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప: ది రూల్ మూవీ షూటింగ్తో బిజీగా ఉన్నాడు. హైదరాబాద్తో పాటు భారత్లోని పలు లోకేషన్లో పుష్ప పార్ట్ 2 షూటింగ్ను జరుపుకుంటుంది. ఇటీవల హైదరాబాద్ ఈ మూవీ షూటింగ్ను జరుపుకోగా ఇందుకు సంబంధించిన బన్నీ లుక్ లీకైంది. మానవ్ మంగ్లాని అనే బాలీవుడ్ ఫొట్రోగాఫర్ పుష్ప 2కు సంబంధించిన అల్లు అర్జున్ లుక్ను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఇందులో బన్నీ కాస్తా బొద్దుగా.. గుండ్రాలు తిరిగిన హేర్ స్టైల్తో దర్శనం ఇచ్చాడు. ఇక లావుగా తయారైన బన్నీ లుక్పై నార్త్ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘‘ వడా పావ్’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. లావెక్కాడు. క్రికెటర్ మలింగా లా ఉన్నాడు’, ‘ఓ మై గాడ్ స్టైలిష్ స్టార్కు ఏమైంది ఇలా తయారయ్యాడు, ఈయన నిజంగానే అల్లు అర్జున్? బాబోయ్ చాలా బరువెక్కాడు’’ అంటూ కొందరూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: అందులో దక్షిణాది నుంచి అల్లు అర్జున్, కాజల్ టాప్ ఇక మరికొందరు నెటిజన్లు బన్నీ వస్తున్న ట్రోల్స్ను ఖండిస్తూ ‘పుష్ప: ది రూల్ కోసం ఆయన కాస్తా లావుగా తయారవ్వాల్సి ఉంది. అందుకే ఆయన బరువెక్కారు’ అంటూ వివరణ ఇస్తున్నారు. మొత్తానికి పుష్ప 2లో బన్నీ కాస్తా బోద్దుగా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే పుష్ప 2లో శ్రీవల్లి పాత్ర(రష్మిక మందన్నా) చనిపోతుందంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రూమర్స్లోపై నిర్మాత వై. రవిశంకర్ క్లారిటీ ఇచ్చాడు. ఓ చానల్తో ముచ్చటించిన ఆయన శ్రీవల్లి పాత్రపై వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇప్పటి వరకు పూర్తి కథ తామే వినలేదని, ఇవన్ని వట్టి పుకార్లలేనిన కొట్టిపారేశాడు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
హార్ట్ సింబల్స్తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్..
సౌత్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది సమంత. ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'ది ఫ్యామిలీ మేన్ 2'తో బాలీవుడ్లోనూ అభిమానులను సంపాదించుకుంది సామ్. అంతేకాకుండా 'పుష్ప' చిత్రంలో చేసిన 'ఊ అంటావా మావా' స్పెషల్ సాంగ్తో అనేక మంది చేత 'ఊ' కొట్టేలా చేసింది. ఈ పాటలో తన డ్యాన్స్, ఎక్స్ప్రెషన్స్తో ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది. అయితే తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ పాటను తనదైన స్టైల్లో ప్రస్తావించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో సల్మాన్ ఖాన్ పాల్గొన్నాడు. ఇందులో భాగంగా 'సల్మాన్ ఖాన్ను ఇన్స్పైర్ (ప్రభావితం) చేసిన సినిమా గానీ, పాట గానీ ఏదైనా ఉందా ?' అని సల్లూ భాయిని యాంకర్ ప్రశ్నించింది. దీనికి సమాధానంగా సల్మాన్ 'ఊ అంటావా మావా' అని హమ్ చేశాడు. ఈ వీడియోను సల్మాన్ ఖాన్ ఫ్యాన్ ట్విటర్లో షేర్ చేశాడు. ఈ ట్వీట్ను సామ్ రీట్వీట్ను చేస్తూ ఎరుపు రంగులో ఉన్న హార్ట్ ఎమోజీస్తో పంచుకుంది. కాగా సమంత ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. యశోద, శాకుంతలం, ఖుషితోపాటు పలు బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్ట్లలో సామ్ నటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: చై-సామ్ బాటలో మరో టాలీవుడ్ జంట? ♥️♥️♥️ https://t.co/UzkF0PVspl — Samantha (@Samanthaprabhu2) June 26, 2022 చదవండి: హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్గా ఉండమని కామెంట్లు.. 'నువ్వే కావాలి' నటుడికి నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు -
'పుష్ప 2'లో శ్రీవల్లి చనిపోతుందా ? నిర్మాత క్లారిటీ !
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. పాన్ వరల్డ్ స్థాయిలో పుష్పరాజ్ వైరల్ అయ్యాడు. డైలాగ్స్, సాంగ్స్, స్టెప్పులు..ఇలా ప్రతీదీ ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా ‘తగ్గేదేలే’అనే డైలాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఒక్క డైలాగ్కు ప్రపంచంలోని సినీ ప్రియులంతా ఫిదా అయ్యారు. అంతేకాకుండా ఇందులో శ్రీవల్లిగా నెషనల్ క్రష్ రష్మిక మందన్నా అదరగొట్టింది. రష్మిక, బన్నీల మధ్య వచ్చే సీన్లు, కెమిస్ట్రీ సినిమాకు బాగా వర్కౌట్ అయింది. కాగా 'పుష్ప'కు సీక్వెల్గా 'పుష్ప: ది రూల్' వస్తున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్లో అలరించిన శ్రీవల్లి పాత్ర సెకండ్ పార్ట్లో చనిపోతుందన్న వార్తలు గత కొద్దిరోజులుగా తెగ షికార్లు చేస్తున్నాయి. ఈ వార్తలపై నిర్మాత వై. రవి శంకర్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. 'అదంతా చెత్త. నాన్సెన్స్. నిజానికి పుష్ప 2 కథేంటో మాకే సరిగ్గా తెలియదు. అవన్నీ వట్టి ఊహాగానాలు మాత్రమే. అందులో ఎలాంటి నిజం లేదు. ఒక్కో సమయంలో పలు వెబ్సైట్లు, టీవీ ఛానెల్స్ సినిమాలపై ఇలానే రాస్తాయి. కానీ వాటి గురించి వారికి ఏం తెలియదు. కాబట్టి దాన్ని నమ్ముతారు' అని వై రవి శంకర్ పేర్కొన్నారు. కాగా పుష్ప 2 సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది. ఆలాగే డిసెంబర్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ. 400 కోట్లు అని సమాచారం. చదవండి: కమెడియన్ లైంగిక వేధింపులు.. 50 ఏళ్ల తర్వాత తీర్పు.. శరద్ పవార్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటికి బెయిల్.. -
అడవి బాట... బాక్సాఫీస్ వేట
అడవిలో వేటకు దిగారు హీరోలు.. ఒకరి వేట అక్రమార్కులను అంతం చేయడం కోసం.. ఒకరి వేట స్మగ్లింగ్ చేయడం కోసం.. ఎవరి వేట ఏదైనా అంతిమంగా బాక్సాఫీస్ వసూళ్ల వేట కోసమే. కొందరు తెలుగు హీరోలు, దర్శకులు అడవి బాట పట్టారు. అడవి నేపథ్యంలో కథలను వెండితెరపైకి తీసుకువస్తున్నారు. ఈ మధ్య ‘అడవి’ సినిమాలు కొన్ని వచ్చాయి. ఇక రానున్న ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ చిత్రాల గురించి తెలుసుకుందాం. హీరో అల్లు అర్జున్– దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాలు లవ్స్టోరీగా ప్రేక్షకులను మెప్పించాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం ‘పుష్ప’ ఫుల్ మాస్ ఎంటర్టైనర్. కంప్లీట్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ స్టోరీ అని తెలిసిందే. గత ఏడాది డిసెంబరులో విడుదలైన ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ ‘పుష్ప: ది రైజ్’ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలో పుష్పరాజ్గా అల్లు అర్జున్ రెచ్చిపోయి నటించారు. ‘పుష్ప: ది రైజ్’ ఇచ్చిన విజయంతో మరింత జోష్తో ‘పుష్ప’లో రెండో భాగమైన ‘పుష్ప: ది రూల్’పై ఫోకస్ పెట్టారు అల్లు అర్జున్, సుకుమార్. ‘పుష్ప: ది రైజ్’ అడవి బ్యాక్డ్రాప్లో సాగినట్లే ‘పుష్ప: ది రూల్’ కూడా అడవి బ్యాక్డ్రాపే. ఈ ఏడాది ఆగస్టులో షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది. ఇక ‘విరాటపర్వం’ కోసం వెండితెర విప్లవకారుడు రవన్న అవతారం ఎత్తారు హీరో రానా. సాయిపల్లవి హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకుడు. 1990 నాటి పరిస్థితుల ఆధారంగా నక్సలిజం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఎక్కువ శాతం షూటింగ్ అడవిలోనే జరిగింది. ప్రియమణి, నందితాదాస్, నవీన్చంద్ర, జరీనా వాహబ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది. మరోవైపు ఇటీవలి కాలంలో మారేడుమిల్లి ఫారెస్ట్లోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేశారట ‘అల్లరి’ నరేశ్. ఎందుకంటే... ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా కోసం. అడవిలో నివాసం ఉండే ఓ ఆదివాసీ తెగ సమస్యలను పరిష్కరించే వ్యక్తి పాత్రలో నటిస్తున్నారు ‘అల్లరి’ నరేశ్. ఈ సినిమా కథనం కూడా అడవి నేపథ్యంలోనే ఉంటుంది. ఈ చిత్రానికి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు ‘సింబా’ చిత్రం కోసం ఫారెస్ట్మేన్గా మారిపోయారు జగపతిబాబు. దర్శకుడు సంపత్ నంది కథ అందిచడంతో పాటు ఓ నిర్మాతగా ఉన్న ఈ సినిమాకు మురళీ మోహన్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్రంలో ప్రకృతి ప్రేమికుడి పాత్రలో కనిపిస్తారు జగపతిబాబు. పర్యావరణ అంశాల నేపథ్యంలో సినిమా కాబట్టి ‘సింబా’ మేజర్ షూటింగ్ అడవి బ్యాక్ డ్రాప్లో ఉంటుందనుకోవచ్చు. అలాగే దివంగత నటుడు హరనాథ్ మనవడు విరాట్రాజ్ ‘సీతామనోహర శ్రీరాఘవ’ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అడవి బ్యాక్డ్రాప్లోనే సాగుతుంది. ఇక ఈ ఏడాది రిలీజైన ‘భీమ్లా నాయక్’, ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’, చిత్రాలు కూడా అడవి నేపథ్యంతో కూడుకున్నవే. రాబోయే రోజుల్లో మరికొన్ని అడవి కథలు వెండితెర పైకి రానున్నాయి. అడవి బాటలోనే మహేశ్-రాజమౌళి సినిమా కూడా: హీరో మహేశ్బాబు–దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ సినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు కథ అందిస్తున్న రచయిత విజయేంద్రప్రసాద్ సైతం మహేశ్ సినిమా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లోనే ఉంటుందని పేర్కొన్నారు. -
పుష్ప మూవీ సమంత వల్లే హిట్ అయ్యింది: భాను చందర్
పుష్ప సినిమా సమంత వల్లే హిట్ అయ్యింది ప్రముఖ నటుడు, సీనియర్ హీరో భానుచందర్ అన్నాడు. ఇటీవల ఓ యూట్యూబ్లో చానల్తో ముచ్చటించిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ను టాలీవుడ్ ఓవర్ చేస్తుందని అందరు అంటున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటని యాంకర్ అడగ్గా.. ఆయన అవును అన్నారు. ‘ఇటీవల కాలంలో వచ్చిన ఎన్నో సౌత్ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. చదవండి: రాత్రి 11 గంటలు, కానిస్టేబుల్ వల్ల అభద్రతకు గురయ్యా: హీరోయిన్ అంతేందుకు ఇటీవల రిలీజ్ అయిన పుష్ప మూవీ ఎంతటి విజయం సాధించిందో చూశాం కదా. ముఖ్యంగా ఈ సినిమా ఆ ఒక్క పాట వల్లే పెద్ద హిట్ అయ్యింది. అదే ఊ అంటావా మావ.. ఊఊ ఉంటావా సాంగ్. సమంత నటించిన ఈ పాట తమిళం, మాళయాళంలో కూడా మారుమోగింది’ అన్నారు. అనంతరం ఆయన ఎలాంటి వారైనా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఎంతపెద్ద సెలబ్రెటీలు అయినా, వారి ఎంతటి పేరు ప్రతిష్టలు ఉన్నా అవి మనల్ని కాపాడలేవన్నారు. ఎంత డబ్బు సంపాదించినా ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవడం ముఖ్యమని ఆయన సూచించారు. -
Pushpa 2: రూ.400 కోట్ల బడ్జెట్.. పుష్ప 2కు ఆ సీన్ హైలైట్ అట
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. పాన్ వరల్డ్ స్థాయిలో పుష్పరాజ్ వైరల్ అయ్యాడు. డైలాగ్స్, సాంగ్స్, స్టెప్పులు..ఇలా ప్రతీదీ ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా ‘తగ్గేదేలే’అనే డైలాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఒక్క డైలాగ్కు ప్రపంచంలోని సినీ ప్రియులంతా ఫిదా అయ్యారు. ఈ రేంజ్ క్రేజ్ ఉన్న పుష్పకు పార్ట్ 2 అంటే ఎలా ఉండాలి? అందుకే లేట్ గా వచ్చిన లేటేస్ట్ గా వస్తామంటున్నాడు సుకుమార్. పుష్పతో ట్రెండ్ చేసిన సుక్కు.. పార్ట్ 2కు మాత్రం పాన్ ఇండియా ట్రెండ్ని ఫాలో కావాలనుకుంటున్నాడట. గతంలో వచ్చిన బాహుబలి, రీసెంట్గా విడుదలైన కేజీయఫ్-2లో హీరో వర్సెస్ విలన్ వార్ని నెక్ట్స్ లెవల్లో చూపించారు. అందుకే ఈ రెండు సీక్వెల్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. (చదవండి: 12 రోజులు..రూ.200 కోట్లు.. ‘సర్కారు వారి పాట’ రికార్డు) ఇప్పుడు ఇదే ట్రెండ్ ను పుష్ప రాజ్ కూడా ఫాలో అవుతాడని చెబుతున్నాడు సుకుమార్. సెకండ్ పార్ట్ లో అల్లు అర్జున్ ,ఫాహద్ ఫాజిల్ మధ్య గేమ్ సీన్ సినిమాకు హైలైట్ గా నిలువనుందని క్లారిటీ ఇచ్చేశాడు. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఇంకా ఇంప్రెసివ్ గా ఉంటుందనీ, కొన్ని సీన్స్ అయితే అబ్బురపరుస్తాయని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు . జులై నుంచి సెకండ్ పార్ట్ షూట్ ప్రారంభం కానుంది. దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతుంది. మారేడుమిల్లి అడవుల్లోనే ఎక్కువ భాగం షూటింగ్ షెడ్యూల్స్ ఫిక్స్ చేసాడు సుకుమార్. జనవరితో షూటింగ్ కంప్లీట్ చేసి, మరో నాలుగు నెలలు పోస్ట్ ప్రోడకన్ కు టైమ్ ఇచ్చి, వచ్చే వేసవి లో పుష్పరాజ్ గ్రాండ్ రీఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారు. -
‘పుష్ప’ సింగర్ పెళ్లిలో ఉపాసన సందడి.. ఫోటోలు వైరల్
‘ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా’(పుష్ప సినిమాలోని ఊ అంటావా..ఊ ఊ అంటావా హిందీ వెర్షన్) అంటూ తన గాత్రంతో బాలీవుడ్ ఆడియన్స్ని ఉర్రూతలూగించిన సింగర్ కనికాకపూర్ రెండో పెళ్లి చేసుకుంది. లండన్కు చెందిని ఓ వ్యాపారవేత్త గౌతమ్ హతిరమనిని కనికా పెళ్లాడింది. లండన్లోని ఓ ప్రముఖ హోటల్లో జరిగిన ఈ వివాహ వేడుకలో రామ్ చరణ్ సతీమణి, కనికా స్నేహితురాలు ఉపాసన పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, కనికకు ఇంతకు ముందే పెళ్లి అయింది. 1988లో లండన్కు చెందని వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని.. మనస్పర్థలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. విడాకుల అనంతరం..కెరీర్పై దృష్టిపెట్టిన కనికా.. రాగిణి, ఎంఎంఎస్ సినిమా పాటలతో ఫేమస్ అయింది. వీటితో పాటు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసింది. ఇక పుష్ప హిందీ వెర్షన్లోని ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా సాంగ్తో కనిక మరింత ఫేమస్ అయింది. -
సమంత ‘ఊ అంటావా..’ పాట సింగర్కు గోల్డ్ మెడల్!
సమంత స్సెషల్ సాంగ్ ‘ఊ అంటావా.. మావ ఊఊ అంటావా సింగర్కు ఇంద్రావతి చౌహాన్కు అరుదైన గౌరవం దక్కింది. ఈ పాటకు గాను ఆమె బిహైండ్వుండ్ వారి గోల్డ్ మెడల్ను అందుకోనుంది. ప్రముఖ డిజిటల్ మీడియా గ్రూప్ బిహైండ్వుడ్ సంస్థ ఈ ఏడాది19 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సంస్థ యానివర్సరి సెలెబ్రెషన్స్లో భాగంగా మే 22న ఈ ఏడాది అత్యధిక ప్రజాదరణ పొందిన సినిమాలు, ఉత్తమ నటులు, సింగర్స్కు గోల్డ్ మెడల్స్ను ప్రదానం చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది బిహైండ్వుడ్ గోల్డ్ మెడల్ ప్రదానోత్సవానికి ఆమెను ఎంపిక చేశారు. చదవండి: హీరోయిన్ ప్రణీత సీమంతం ఫంక్షన్, ఫొటోలు వైరల్ ఈ సందర్భంగా ఇంద్రావతి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేసింది. ‘నిజంగా నేను ఆశీర్వాదించబడ్డాను. మే 22 ఊ అంటావా.. ఊఊ అంటావా పాటకు గోల్డ్ మెడల్ తీసుకోబోతున్నాను. బెస్ట్ థింగ్స్ ఎప్పుడు ఊహించకుండానే వస్తాయి. నాకు ఈ గుర్తింపు రావడానికి కారణంగా దేవిశ్రీ ప్రసాద్ గారు. ఆయనకు నేను ఎప్పటికి కృతజ్ఞురాలిని. థ్యాంక్యూ సార్. ఇది నిజంగా గర్వించే విషయం’ అంటూ రాసుకొచ్చింది. కాగా ఇంద్రావతి ప్రముఖ సింగర్ మంగ్లీ సోదరి అనే విషయం తెలిసిందే. కాగా సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చదవండి: భర్త విక్కీ కౌశల్కు కత్రీనా స్వీటెస్ట్ బర్త్డే విషెస్ పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ మూవీ బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. ఇక విడుదలకు ముందే పుష్ప.. పాటలతో రికార్డులు సృష్టించింది. ఇందులో సమంత నటించిన స్పెషల్ సాంగ్ యూట్యూబ్ను షేక్ చేసింది. ఈ పాటను ఎన్నో వివాదాలు చూట్టుముట్టిన అదే స్థాయిలో రికార్డు క్రియేట్ చేసింది. సోషల్ మీడియా ఎక్కడ విన్న ఊ అంటావా? పాటే వినిపిస్తోంది. ఈ మూవీ విడుదలై సూమారు 5 నెలల గడుస్తున్నా ఇప్పటికీ ఈ పాట మేనియా ఏమాత్రం తగ్గలేదు. అంతేకాదు ఇటీవల ఓ ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫెస్టివల్లో ఈ పాటను ప్రదర్శించడం విశేషం. I'm really so blessed that I'm going to receiving the gold medal on may 22 for oo antava mava song #pushpa movie😍. Best things happen unexpectedly!!! I'm really very much excited and can't express my happiness💃.I will always owe to the @ThisIsDSP sir🙏🏻🙏🏻😍..this is proud moment pic.twitter.com/zVDNuiBFIn — Indravathi Chauhan (@IndravathiChauh) May 15, 2022 -
సమంత పాటంటే ఇష్టం: బాలీవుడ్ హీరో
Ranveer Singh About His Favourite Song Is Samantha Oo Antava: బాలీవుడ్ యంగ్ హీరో రణ్వీర్ సింగ్ ఇటీవల కపిల్ దేవ్ బయోపిక్ '83' చిత్రంతో అలరించాడు. తాజాగా రణ్వీర్ సింగ్ నటిస్తున్న విభిన్న చిత్రం 'జయేశ్భాయ్ జోర్దార్'. దివ్యాంగ్ ఠక్కర్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో 'అర్జున్ రెడ్డి' ఫేమ్ షాలినీ పాండేతోపాటు అనన్య నాగల్ల కీలక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు రణ్వీర్ సింగ్. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో రణ్వీర్కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఈ ఇంటర్వ్యూలో హోస్ట్ రణ్వీర్ సింగ్ను 'తెలుగులో మీకు నచ్చిన పాట ఏది ?' అని అడిగాడు. దీనికి అల్లు అర్జున్ హీరోగా చేసిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప: ది రైజ్'లోని 'ఊ అంటావా మావా' అనే సాంగ్ ఇష్టమని తెలిపాడు రణ్వీర్. దీని గురించి రణ్వీర్ సింగ్ మాట్లాడుతూ 'ఈ మధ్య కాలంలో నాకు బాగా నచ్చిన పాట ఊ అంటావా మావా. ఆ సాంగ్ ప్లే అయినప్పుడు ఐయామ్ గోయింగ్ మ్యాడ్. ఆ పాట మీనింగ్ నాకు తెలియదు. కానీ నా మనసుకు మాత్రం బాగా నచ్చింది. అందుకే ఆ పాటంటే అంత ఇష్టం నాకు. 'అని పేర్కొన్నాడు. పుష్ప మూవీలో సమంత నర్తించిన ఈ స్పెషల్ సాంగ్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో తెలిసిందే. చదవండి: ఓటీటీలోకి సిద్ధార్థ్.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే.. Oo antava from Pushpa is one of my favourite song in recent time: Ranveer Singh 🎧🎺🎻🎸🎶🎵🎼🎹🥁@alluarjun #AlluArjun #Sukumar @ThisIsDSP @Samanthaprabhu2 #RanveerSingh #Pushpa #OoAntavaOoOoAntava pic.twitter.com/6yi5osOwuk — Sreedhar Marati (@SreedharSri4u) May 10, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
క్లాస్రూంలో పుష్ప ‘శ్రీవల్లి’ స్టెప్పులు! ప్రధానోపాధ్యాయురాలిపై వేటు
బరంపురం: ‘పుష్ప’మేనియా గురించి ప్రత్యేకంగా చెప్పాలా?.. అల్లు అర్జున్ సినిమా ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా ఓస్కూల్లో పోరగాళ్లు శ్రీవల్లి పాటకు పుష్పరాజ్ లెవల్లోనే చిందులేశారు. దీంతో ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలిపై వేటు వేశారు అధికారులు. ఒడిశాలోని గంజాం జిల్లాలో హింజిల్కట్ బ్లాక్లో ఉన్న ఓ స్కూల్లో విద్యార్థులు ‘పుష్ప’ పాటకు క్లాస్రూములోనే డ్యాన్స్ చేశారు. దాంతో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలిని అధికారులు సస్పెండ్ చేశారు. బారాముందాలి హైస్కూల్లో పదో తరగతి విద్యార్థులు కొందరు టీచర్లు లేని సమయంలో డిజి క్లాస్రూమ్లోని ఎల్ఈడీ స్క్రీన్పై పుష్ప సినిమాలోని ‘శ్రీవల్లి...’ పాటకు చిందేశారు. అంతటితో ఆగకుండా మరికొన్ని సినిమా పాటలు వేసుకుని.. తెగ చిందులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ ప్రధానోపాధ్యాయురాలు సుజాతపై వేటు వేశారు జిల్లా విద్యాధికారులు. -
బెయిల్పై బయటికి.. వెంటనే పుష్ప డైలాగ్ కొట్టాడు
అధికారం ఉందని ఓ మహిళను అడ్డుపెట్టుకుని తనపై అక్రమ కేసు బనాయించారంటూ బీజేపీపై ఆరోపణలు గుప్పించాడు గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మెవానీ. అస్సాంలో మహిళా కానిస్టేబుల్ను దుర్భాషలాడిన చేసిన కేసులో జిగ్నేష్ మేవానీకి శుక్రవారం బెయిల్ లభించిన విషయం తెలిసిందే. బెయిల్పై బయటికి వచ్చి రాగానే అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని ఫేమస్ డైలాగ్ కొట్టాడాయన. పుష్ప సినిమాలోని ఝుకేగా నహీ(తలవంచను).. తగ్గేదే లే.. డైలాగ్తో ఓ మీడియా ఛానెల్ ముందు పుష్పరాజ్ తరహా మేనరిజాన్ని ప్రదర్శించాడు జిగ్నేష్ మేవానీ. ‘‘నా అరెస్ట్ సాధారణ విషయం కాదు. పీఎంవోలో ఉన్న పొలిటికల్ బాస్ల సూచనలతోనే జరిగింది. నేను చేసిన ట్వీట్లో తప్పేం లేదు. ఆ విషయం ఇప్పటికీ గర్వంగా చెప్తున్నా.. జరిగిన మతఘర్షణలను, అల్లర్లను చూసి ఈ దేశంలో ఒక పౌరుడిగా శాంతి సామరస్యాలను కాపాడమని దేశ ప్రధానిని కోరా. అడగడానికి నాకు హక్కు ఉంది. అంటేకాదు చట్ట సభ ప్రతినిధిగా శాంతిని పాటించాలని ప్రజలను కోరా. అది నా విధి. అదేగా నేను చేసింది. దానికే కేసు పెట్టి అరెస్ట్ చేశారు అని మేవానీ తెలిపారు. ఆపై ఒక ఆడదాన్ని అడ్డుపెట్టి.. కథను అల్లి మరో కేసు పెట్టారు. పిరికిపంద చర్యే ఇది. గుజరాత్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా అందుకే బీజేపీ ఇలా చేస్తోంది అని మేవానీ ఆరోపించారు. అరెస్ట్ వేళ తనకు మద్దతు ఇచ్చిన అస్సాం ప్రజానీకానికి, కాంగ్రెస్కు ధన్యవాదాలు తెలిపాడాయన. అలాగే ఎక్కడో అస్సాంలో తనను అరెస్ట్ చేయడం, కేసులు బనాయించి బయటకు రాకుండా చేయడం.. ముమ్మాటికీ బీజేపీ కుట్రే అని అంటున్నాడు. ప్రశ్నించేవారిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు వీళ్లు. అలాగే ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నన్నూ టార్గెట్ చేశారు. దళితులు, గుజరాత్ ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. సరైన టైంలో బుద్ధి చెప్తారు. గుజరాత్ ఎన్నికల్లో వాళ్లు(బీజేపీ) మూల్యం చెల్లించుకోక తప్పదు. అని పేర్కొన్నాడు ఎమ్మెల్యే మేవానీ. (చదవండి:ఎట్టకేలకుజిగ్నేష్ మేవానీకి బెయిల్) పోలీసులపై కోర్టు ఆగ్రహం మహిళా కానిస్టేబుల్పై దాడి కేసులో గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని ‘‘కావాలనే’’ ఇరికించేందుకు ప్రయత్నించారంటూ అస్సాం పోలీసులపై అక్కడి కోర్టు మండిపడింది. బార్పేట కోర్టు మేవానీకి బెయిల్ మంజూర్ చేసే క్రమంలో తీవ్రంగా పోలీసులను మందలించింది. రాష్ట్రాన్ని పోలీస్ స్టేట్గా మార్చాలనుకుంటున్నారా? అని ప్రశ్నించింది.