Rashid Khan
-
Champions Trophy: ఆసీస్తో కీలక సమరం.. ఆఫ్ఘనిస్తాన్ కొంపముంచిన రషీద్ ఖాన్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గ్రూప్-బిలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలక సమరంలో ఆఫ్ఘనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి ఓ మోస్తరు స్కోర్ చేసింది. వన్ డౌన్ బ్యాటర్ సెదిఖుల్లా అటల్ (95 బంతుల్లో 85; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (63 బంతుల్లో 67; ఫోర్, 5 సిక్సర్లు) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. సెదిఖుల్లా, ఒమర్జాయ్.. ఇబ్రహీం జద్రాన్ (22), రహ్మత్ షా (12), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (20), రషీద్ ఖాన్తో (19) కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ఆసీస్ ముందు ఫైటింగ్ టోటల్ను ఉంచారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో రహ్మానుల్లా గుర్భాజ్ (0), మహ్మద్ నబీ (1), గుల్బదిన్ నైబ్ (4), నూర్ అహ్మద్ (6) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షుయిష్ 3, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా తలో 2, ఎల్లిస్, మ్యాక్స్వెల్ చెరో వికెట్ పడగొట్టారు.274 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం లభించింది. ఓపెనర్ మాథ్యూ షార్ట్ తొలి ఓవర్ నుంచే ఆఫ్ఘన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఒమర్జాయ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఓ బౌండరీ బాదిన షార్ట్.. మూడో ఓవర్లో శివాలెత్తిపోయాడు. ఒమర్జాయ్ వేసిన ఈ ఓవర్లో షార్ట్ 2 బౌండరీలు, ఓ సిక్సర్ బాదాడు. ఫలితంగా ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. మరో ఎండ్లో విధ్వంసకర ఆటగాడు ట్రవిస్ హెడ్ కూడా ఫజల్ హక్ ఫారూకీ బౌలింగ్లో బౌండరీ బాది మాంచి టచ్లో ఉన్నట్లు కనిపించాడు. వీరిద్దరు రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియా 3 ఓవర్లలో 32 పరుగులు చేసింది.హెడ్ క్యాచ్ జారవిడిచిన రషీద్ ఖాన్ఫజల్ హక్ ఫారూకీ వేసిన నాలుగో ఓవర్ తొలి బంతికి డేంజరెస్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ను ఔట్ చేసే సువర్ణావకాశాన్ని ఆఫ్ఘనిస్తాన్ చేజార్చుకుంది. హెడ్ మిడ్ ఆన్ దిశగా అందించిన క్యాచ్ను రషీద్ ఖాన్ జారవిడిచాడు. ఈ క్యాచ్ ఎంత మూల్యమైందో ఆఫ్ఘనిస్తాన్ కొద్ది సేపటిలోనే తెలిసింది. లైఫ్ లభించిన అనంతరం హెడ్ చెలరేగిపోయాడు. ఆతర్వాతి బంతికే సిక్సర్ బాదాడు. అదే ఓవర్ చివరి బంతికి బౌండరీ కొట్టాడు. దీంతో 4 ఓవర్ల అనంతరం ఆసీస్ స్కోర్ వికెట్ నష్టపోకుండా 42కు చేరింది.సింపుల్ క్యాచ్ను జారవిడిచిన ఖరోటేఅనంతరం ఐదో ఓవర్ తొలి బంతికి ఆఫ్ఘనిస్తాన్ సబ్స్టిట్యూట్ ఫీల్డర్ ఖరోటే సింపుల్ క్యాచ్ను జారవిడిచాడు. ఈ సారి మాథ్యూ షార్ట్కు లైఫ్ లభించింది. ఒమర్జాయ్ బౌలింగ్ షార్ట్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా షాట్ ఆడాడు. చేతిలోకి వచ్చిన క్యాచ్ను ఖరేటో వదిలేశాడు. దీంతో 7 బంతుల వ్యవధిలో ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డర్లు రెండు క్యాచ్లు జారవిడిచినట్లైంది.ఆఫ్ఘనిస్తాన్ ఊపిరిపీల్చుకుందిఖరోటే క్యాచ్ వదిలేశాక రెండు బంతులకే షార్ట్ ఔటయ్యాడు. ఒమర్జాయ్ బౌలింగ్లో గుల్బదిన్ క్యాచ్ పట్టడంతో షార్ట్ మెరుపు ఇన్నింగ్స్కు (15 బంతుల్లో 20; 3 ఫోర్లు, సిక్స్) తెరపడింది. దీంతో ఆఫ్ఘన్లు ఊపిరిపీల్చుకున్నారు. షార్ట్కు ఔట్ చేసిన ఆనందం ఆఫ్ఘన్లకు ఎంతో సేపు మిగల్లేదు. స్టీవ్ స్మిత్ వచ్చీ రాగానే రెండు వరుసగా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా ఆసీస్ 5 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును దాటింది.మూల్యం చెల్లించుకుంటున్న ఆఫ్లన్లుహెడ్ క్యాచ్ను జారవిడిచినందుకు ఆఫ్ఘన్లు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. లైఫ్ లభించాక హెడ్ చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో 3 బౌండరీలు.. తొమ్మిదో ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలు సాధించి ఆఫ్ఘన్లను పశ్చాత్తాపపడేలా చేశాడు. అనంతరం హెడ్ నూర్ అహ్మద్ వేసిన 11వ ఓవర్లో రెండు పరుగులు తీసి కెరీర్లో 17వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 12 ఓవర్లలోనే ఆస్ట్రేలియా వికెట్ నష్టపోయి 100 పరుగుల మార్కును తాకింది.ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే సెమీస్కు చేరుకుంటుంది. ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఆసీస్కు మాత్రం ఈక్వేషన్స్ అలా లేవు. ఆసీస్ ఈ మ్యాచ్లో ఓడినా.. రేపు జరుగబోయే మ్యాచ్లో ఇంగ్లండ్ సౌతాఫ్రికాను ఓడిస్తే సెమీస్కు చేరే అవకాశం (మెరుగైన రన్రేట్ కలిగి ఉంటే) ఉంటుంది. -
ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలో మరో జట్టుతో జతకట్టిన రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్కు (Rashid Khan) ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫ్యామిలీతో బంధం మరింత బలపడింది. ఇప్పటికే మూడు లీగ్ల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల్లో సభ్యుడిగా ఉన్న రషీద్.. తాజాగా మరో ఎంఐ ఫ్రాంచైజీతో జతకట్టాడు. రషీద్ను ద హండ్రెడ్ లీగ్లో ఎంఐ యాజమాన్యంలో నడుస్తున్న ఓవల్ ఇన్విన్సిబుల్స్ (డిఫెండింగ్ ఛాంపియన్) సొంతం చేసుకుంది. ఓవల్ ఇన్విన్సిబుల్స్లో ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఇటీవలే పెట్టుబడులు పెట్టింది. ఇందులో 49 శాతం వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) కొనుగోలు చేసింది.ప్రస్తుతం రషీద్ ఒక్క ఐపీఎల్ మినహా మిగతా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల్లో (ఫారిన్ లీగ్ల్లో) సభ్యుడిగా ఉన్నాడు. రషీద్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు ఆడుతున్నాడు. రషీద్ సౌతాఫ్రికా టీ20 లీగ్ ముంబై ఇండియన్స్ కేప్టౌన్కు.. ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్కు.. మేజర్ లీగ్ క్రికెట్లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ద హండ్రెడ్ లీగ్ ప్రారంభం నుంచి (2021) ట్రెంట్ రాకెట్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న రషీద్ను ఓవల్ ఇన్విన్సిబుల్స్ డైరెక్ట్ ఓవర్సీస్ సైనింగ్ ద్వారా దక్కించుకుంది.కాగా, ద హండ్రెడ్ లీగ్-2025 సీజన్ కోసం ప్లేయర్ల రిటెన్షన్ జాబితాలను ఎనిమిది ఫ్రాంచైజీలు ఇవాళ ప్రకటించాయి. గత సీజన్లో తమతో ఉన్న 10 మంది సభ్యులను ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోవచ్చు. రిటెన్షన్ జాబితాలో ఒక ఇంగ్లండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్ తప్పక ఉండాలి. అలాగే ముగ్గురు ఓవర్సీస్ ప్లేయర్లు ఉండవచ్చు. అదనంగా ఓ విదేశీ ఆటగాడిని డైరెక్ట్ సైనింగ్ చేసుకోవచ్చు. ఈ పద్దతిలోనే ఇన్విన్సిబుల్స్ రషీద్ ఖాన్ను దక్కించుకుంది. ఫ్రాంచైజీల్లో మిగిలిన స్థానాల భర్తీ డ్రాఫ్ట్ ద్వారా జరుగుతుంది. డ్రాఫ్ట్ తేదీ ప్రకటించాల్సి ఉంది.ద హండ్రెడ్ లీగ్లో ఇటీవలే ఐపీఎల్ ఫ్రాంచైజీలు పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఓవల్ ఇన్విన్సిబుల్స్లో ముంబై ఇండియన్స్.. నార్తర్న్ సూపర్చార్జర్స్లో సన్రైజర్స్ హైదరాబాద్.. మాంచెస్టర్ ఒరిజినల్స్లో లక్నో సూపర్ జెయింట్స్.. సథరన్ బ్రేవ్లో ఢిల్లీ క్యాపిటల్స్ షేర్ దక్కించుకున్నాయి. వీటిలో సన్రైజర్స్ హైదరాబాద్ నార్తర్న్ సూపర్చార్జర్స్ ఫ్రాంచైజీ మొత్తాన్ని కొనుగోలు చేసింది. మిగతా ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆయా ప్రాంచైజీల్లో 49 శాతం వాటాను దక్కించుకున్నాయి.రిటెన్షన్స్ జాబితా..బర్మింగ్హమ్ ఫీనిక్స్- బెన్ డకెట్, ట్రెంట్ బౌల్ట్ (ఓవర్సీస్), లియామ్ లివింగ్స్టోన్, జేకబ్ బేతెల్, ఆడమ్ మిల్నే (ఓవర్సీస్), బెన్నీ హోవెల్, టిమ్ సౌథీ (ఓవర్సీస్), డాన్ మౌస్లీ, విల్ స్మీడ్, క్రిస్ వుడ్, ఆనురిన్ డొనాల్డ్లండన్ స్పిరిట్- లియామ్ డాసన్, డాన్ వారోల్, కేన్ విలియమ్సన్ (ఓవర్సీస్), రిచర్డ్ గ్లీసన్, ఓలీ స్టోన్, ఓలీ పోప్, కీటన్ జెన్నింగ్స్మాంచెస్టర్ ఒరిజినల్స్- జోస్ బట్లర్, ఫిలిప్ సాల్ట్, హెన్రిచ్ క్లాసెన్ (ఓవర్సీస్), మ్యాటీ హర్స్ట్, జోష్ టంగ్, స్కాట్ కర్రీ, టామ్ హార్ట్లీ, సోనీ బేకర్, టామ్ ఆస్పిన్వాల్నార్త్రన్ సూపర్ ఛార్జర్స్- హ్యారీ బ్రూక్, డేవిడ్ మిల్లర్ (ఓవర్సీస్), ఆదిల్ రషీద్, మిచెల్ సాంట్నర్ (ఓవర్సీస్), బ్రైడన్ కార్స్, బెన్ డ్వార్షుయిస్ (ఓవర్సీస్), మాట్ పాట్స్, పాట్ బ్రౌన్, గ్రహం క్లార్క్, టామ్ లాస్ఓవల్ ఇన్విన్సిబుల్స్- సామ్ కర్రన్, విల్ జాక్స్, రషీద్ ఖాన్ (ఓవర్సీస్), జోర్డన్ కాక్స్, సామ్ బిల్లింగ్స్, సాకిబ్ మహమూద్, గస్ అట్కిన్సన్, డొనొవన్ ఫెరియెరా (ఓవర్సీస్), నాథన్ సౌటర్, ట్వాండా ముయేయేసథరన్ బ్రేవ్- జోఫ్రా ఆర్చర్, జేమ్స్ విన్స్, క్రిస్ జోర్డన్, టైమాల్ మిల్స్, డుప్లెసిస్ (ఓవర్సీస్), లూయిస్ డు ప్లూయ్, లారీ ఈవాన్స్, క్రెయిగ్ ఓవర్టన్, ఫిన్ అలెన్ (ఓవర్సీస్), డ్యానీ బ్రిగ్స్, జేమ్స్ కోల్స్ట్రెంట్ రాకెట్స్- జో రూట్, మార్కస్ స్టోయినిస్ (ఓవర్సీస్), టామ్ బాంటన్, సామ్ కుక్, జాన్ టర్నర్, సామ్ హెయిన్, టామ్ అల్సోప్, కాల్విన్ హ్యారీసన్వెల్ష్ ఫైర్- జానీ బెయిర్స్టో, స్టీవ్ స్మిత్ (ఓవర్సీస్), టామ్ కొహ్లెర్ కాడ్మోర్, టామ్ ఏబెల్, లూక్ వెల్స్, స్టీవీ ఎస్కినాజీ -
SA20 2025: తొలిసారి విజేతగా ఎంఐ కేప్టౌన్.. ప్రైజ్మనీ ఎంతంటే?
ముచ్చటగా మూడోసారి గెలిచి.. సౌతాఫ్రికా టీ20 లీగ్(South Africa T20 League)లో ‘హ్యాట్రిక్’ చాంపియన్గా నిలవాలన్న సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్(Sunrisers Eastern Cape) జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. బ్యాటర్ల సమష్టి కృషికి... రబడ, బౌల్ట్ బుల్లెట్ బౌలింగ్ తోడవడంతో... ముంబై ఇండియన్స్ (ఎంఐ) కేప్టౌన్ జట్టు ఫైనల్లో రైజర్స్పై విజయం సాధించింది. తద్వారా తొలిసారి SAT20 ట్రోఫీ చేజిక్కించుకుంది. మరి ఫైనల్ విశేషాలు, ప్రైజ్మనీ వివరాలు, అత్యధిక పరుగులు, వికెట్ల వీరులు తదితర అంశాలపై ఓ లుక్కేద్దామా?!సౌతాఫ్రికా టీ20 లీగ్లో భాగంగా శనివారం అర్ధరాత్రి దాటాక ఎంఐ కేప్టౌన్- సన్రైజర్స్ ఈస్టర్న్కేప్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. రషీద్ ఖాన్ కెప్టెన్సీలోని ఎంఐ జట్టు మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రికెల్టన్ (15 బంతుల్లో 33; 1 ఫోర్, 4 సిక్స్లు), ఎస్టెర్హ్యుజెన్ (39; 2 ఫోర్లు, 2 సిక్స్లు), బ్రేవిస్ (18 బంతుల్లో 38; 2 ఫోర్లు, 4 సిక్స్లు), డసెన్ (23) తలా కొన్ని పరుగులు చేశారు.సన్రైజర్స్బ్యాటింగ్ ఆర్డర్ కుదేలుఇక సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ బౌలర్లలో మార్కో యాన్సెన్, రిచర్డ్ గ్లీసన్, లియామ్ డాసన్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఎంఐ కేప్టౌన్ బౌలర్ల ధాటికి సన్రైజర్స్ జట్టు నిలవలేకపోయింది. 18.4 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. టామ్ అబెల్ (30) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ మార్క్రమ్ (6), స్టబ్స్ (15), యాన్సెన్ (5), బెడింగ్హమ్ (5) విఫలమయ్యారు. ఎంఐ బౌలర్లలో రబడ 4 వికెట్లు పడగొట్టగా... బౌల్డ్ 4 ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు.ఈ క్రమంలో ఎంఐ కేప్టౌన్ జట్టు 76 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్ను చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో గత రెండు పర్యాయాలు విజేతగా నిలిచిన సన్రైజర్స్ ఫ్రాంచైజీకి చెందిన ఈస్టర్న్ కేప్ జట్టు... ఈసారి రన్నరప్తో సరిపెట్టుకోగా... ఎంఐ కేప్టౌన్ తొలిసారి ట్రోఫీ హస్తగతం చేసుకుంది. బౌల్డ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, మార్కో యాన్సెన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’అవార్డులు దక్కాయి. కాగా 2023లో తొలిసారి సౌతాఫ్రికా టీ20 లీగ్ ప్రవేశపెట్టగాఅవార్డుల వివరాలు👉ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్- బౌల్ట్ (ఎంఐ కేప్టౌన్) 👉స్పిరిట్ ఆఫ్ ద సీజన్- ఎంఐ కేప్టౌన్ 👉క్యాచ్ ఆఫ్ ద సీజన్- బ్రేవిస్ (ఎంఐ కేప్టౌన్) 👉రైజింగ్ స్టార్ బ్రేవిస్- (ఎంఐ కేప్టౌన్) 👉బ్యాటర్ ఆఫ్ ద సీజన్- ప్రిటోరియస్ (పార్ల్ రాయల్స్) 👉బౌలర్ ఆఫ్ ద సీజన్- యాన్సెన్ (ఈస్టర్న్ కేప్) 👉ప్లేయర్ ఆఫ్ ది సీజన్- యాన్సెన్ (ఈస్టర్న్ కేప్) ఎస్ఏ20 2025 విశేషాలు 👉అత్యధిక పరుగులు- ప్రిటోరియస్ 397 👉అత్యధిక వికెట్లు- యాన్సెన్ 19 వికెట్లు 👉అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన- రబడ 4/25 👉అత్యధిక సిక్స్లు- బ్రేవిస్ 25 👉అత్యధిక ఫోర్లు- ప్రిటోరియస్ 47 ప్రైజ్మనీ వివరాలు👉విజేత జట్టుకు 3,25,00,000 ర్యాండ్లు (రూ. 15 కోట్ల 46 లక్షలు) 👉రన్నరప్ జట్టుకు 1,62,00,000 ర్యాండ్లు (రూ. 7 కోట్ల 70 లక్షలు). చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ టెండుల్కర్ను దాటేసి..𝐏𝐎𝐕 - 𝒀𝒐𝒖'𝒗𝒆 𝒋𝒖𝒔𝒕 𝒘𝒐𝒏 #BetwaySA20 season 3 🏆 #WelcomeToIncredible pic.twitter.com/RZmQFsGMFK— Betway SA20 (@SA20_League) February 8, 2025 -
చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ప్రపంచ రికార్డు
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rashid Khan) చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో (ఇంటర్నేషనల్ మరియు ఫ్రాంచైజీ క్రికెట్) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రషీద్ ఈ రికార్డును సాధించే క్రమంలో విండీస్ మాజీ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో (Dwane Bravo) రికార్డును బద్దలు కొట్టాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో (SA20) భాగంగా పార్ల్ రాయల్స్తో నిన్న (ఫిబ్రవరి 4) జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో రషీద్ ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్లో రెండు వికెట్లు తీసిన రషీద్.. తన జట్టును (ఎంఐ కేప్టౌన్) తొలిసారి ఫైనల్స్కు (కెప్టెన్గా) చేర్చాడు.26 ఏళ్ల రషీద్ 461 టీ20ల్లో 633 వికెట్లు పడగొట్టగా.. అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న బ్రావో 582 మ్యాచ్ల్లో 631 వికెట్లు తీశాడు. రషీద్ ఆఫ్ఘనిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 161 వికెట్లు.. ఫ్రాంచైజీ మరియు దేశవాలీ క్రికెట్లో 472 వికెట్లు పడగొట్టాడు. రషీద్ తన టీ20 కెరీర్లో ఆఫ్ఘనిస్తాన్ సహా సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, ఎంఐ కేప్టౌన్, అడిలైడ్ స్ట్రయికర్స్, గయానా అమెజాన్ వారియర్స్, ఎంఐ ఎమిరేట్స్, లాహోర్ ఖలందర్స్, ససెక్స్ షార్క్స్, ట్రెంట్ రాకెట్స్ తదితర జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు..రషీద్ ఖాన్-633డ్వేన్ బ్రావో-631సునీల్ నరైన్-574ఇమ్రాన్ తాహిర్-531షకీబ్ అల్ హసన్-492కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఎంఐ కేప్టౌన్ తొలిసారి ఫైనల్కు చేరింది. నిన్న (ఫిబ్రవరి 4) జరిగిన తొలి క్వాలిఫయర్లో ఎంఐ కేప్టౌన్ పార్ల్ రాయల్స్పై 39 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన రాయల్స్ 19.4 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది. రాణించిన బ్రెవిస్, రికెల్టన్ఈ మ్యాచ్లో ఎంఐ చేసిన స్కోర్.. ఈ సీజన్లో ఆ జట్టుకు మూడో అత్యధిక స్కోర్. ఎంఐ ఇన్నింగ్స్లో ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ (27 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), వాన్ డర్ డస్సెన్ (32 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సహా డెవాల్డ్ బ్రెవిస్ (30 బంతుల్లో 44 నాటౌట్; 4 సిక్సర్లు), జార్జ్ లిండే (14 బంతుల్లో 26; 3 సిక్సర్లు), డెలానో పోట్గెటర్ (17 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. రాయల్స్ బౌలర్లలో దునిత్ వెల్లలగే 2, ఫోర్టుయిన్, డేవిడ్ గేలియమ్ తలో వికెట్ పడగొట్టారు.తలో చేయి వేసిన బౌలర్లు200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ను ఎంఐ బౌలర్లు తలో చేయి వేసి దెబ్బేశారు. ఎంఐ బౌలర్ల ధాటికి రాయల్స్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ట్రెంట్ బౌల్ట్, కగిసో రబాడ, కార్బిన్ బాష్, కెప్టెన్ రషీద్ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్జ్ లిండే ఓ వికెట్ పడగొట్టి రాయల్స్ పతనాన్ని శాశించారు. రాయల్స్ ఇన్నింగ్స్లో డేవిడ్ మిల్లర్ (45) టాప్ స్కోరర్గా నిలువగా.. దినేశ్ కార్తీక్ (31) ఓ మోస్తరు స్కోర్ చేశాడు.ఓడినా మరో ఛాన్స్ఈ మ్యాచ్లో ఓడినా ఫైనల్ చేరేందుకు రాయల్స్కు మరో అవకాశం ఉంది. రేపు (ఫిబ్రవరి 6) జరుగబోయే క్వాలిఫయర్-2లో రాయల్స్.. ఎలిమినేటర్ మ్యాచ్లో విజేతతో తలపడుతుంది. ఇవాళ (ఫిబ్రవరి 5) జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్.. జోబర్గ్ సూపర్కింగ్స్తో తలపడనుంది. గత రెండు సీజన్లలో టేబుల్ లాస్ట్లో నిలిచిన ఎంఐ కేప్టౌన్ తొలిసారి ఫైనల్కు చేరింది. సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్ సౌతాఫ్రికా టీ20 లీగ్ రెండు ఎడిషన్లలో విజేతగా నిలిచింది. -
సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫైనల్లోకి ముంబై ఇండియన్స్
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫ్యామిలీకి చెందిన ఎంఐ కేప్టౌన్ (MI Cape Town) తొలిసారి సౌతాఫ్రికా టీ20 లీగ్లో (SA20 2025) ఫైనల్కు చేరింది. నిన్న (ఫిబ్రవరి 4) జరిగిన తొలి క్వాలిఫయర్లో ఎంఐ కేప్టౌన్ పార్ల్ రాయల్స్పై 39 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ప్రస్తుత సీజన్లో ఎంఐకు ఇది మూడో అత్యధిక స్కోర్. ముంబై ఇన్నింగ్స్లో ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ (27 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), వాన్ డర్ డస్సెన్ (32 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సహా డెవాల్డ్ బ్రెవిస్ (30 బంతుల్లో 44 నాటౌట్; 4 సిక్సర్లు), జార్జ్ లిండే (14 బంతుల్లో 26; 3 సిక్సర్లు), డెలానో పోట్గెటర్ (17 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. రాయల్స్ బౌలర్లలో దునిత్ వెల్లలగే 2, ఫోర్టుయిన్, డేవిడ్ గేలియమ్ తలో వికెట్ పడగొట్టారు.200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. ఎంఐ బౌలర్లు కలిసికట్టుగా సత్తా చాటడంతో 19.4 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌటైంది. ట్రెంట్ బౌల్ట్, కగిసో రబాడ, కార్బిన్ బాష్, కెప్టెన్ రషీద్ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్జ్ లిండే ఓ వికెట్ దక్కించుకున్నాడు. రాయల్స్ ఇన్నింగ్స్లో డేవిడ్ మిల్లర్ (45) టాప్ స్కోరర్గా నిలువగా.. దినేశ్ కార్తీక్ (31) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఛేదనలో రాయల్స్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఈ మ్యాచ్లో రెండు వికెట్లు తీసిన రషీద్ ఖాన్ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అవతరించాడు. ఈ మ్యాచ్లో ఓడినా ఫైనల్కు చేరేందుకు రాయల్స్కు మరో అవకాశం ఉంటుంది. రేపు (ఫిబ్రవరి 6) జరుగబోయే క్వాలిఫయర్-2లో రాయల్స్.. ఎలిమినేటర్ మ్యాచ్లో విజేతతో తలపడుతుంది. ఇవాళ (ఫిబ్రవరి 5) జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్.. జోబర్గ్ సూపర్కింగ్స్తో తలపడనుంది. గత రెండు సీజన్లలో టేబుల్ లాస్ట్లో నిలిచిన ఎంఐ కేప్టౌన్ తొలిసారి ఫైనల్కు చేరింది. సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్ సౌతాఫ్రికా టీ20 లీగ్ రెండు ఎడిషన్లలో విజేతగా నిలిచింది. -
సన్రైజర్స్ చిత్తు.. ప్లేఆఫ్స్కు చేరిన ముంబై ఇండియన్స్ టీమ్
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో ఎంఐ కేప్ టౌన్(MI Cape Town) జట్టు ప్లే ఆఫ్స్కు ఆర్హత సాధించింది. న్యూలాండ్స్ వేదికగా బుధవారం సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్(Sunrisers Eastern Cape)తో జరిగిన లీగ్ మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఎంఐ జట్టు తొలిసారి తమ ప్లేఆఫ్ బెర్త్ను ఖారారు చేసుకుంది.108 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఎంఐ వికెట్ నష్టపోకుండా కేవలం 11 ఓవర్లలోనే ఊదిపడేసింది. ముంబై జట్టు ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్(59), రాస్సీ వాన్ డెర్ డస్సెన్(48) ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశారు. స్టార్ ఫాస్ట్బౌలర్ మార్కో జానెసన్ సైతం తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన జానెసన్ ఏకంగా 25 పరుగులు సమర్పించుకున్నాడు.4 వికెట్లతో చెలరేగిన కార్బిన్ బాష్..అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ 19.2 ఓవర్లలో కేవలం 107 పరుగులకే కుప్పకూలింది. సన్రైజర్స్ బ్యాటర్లలో బెడింగ్హామ్(45) మినహా మిగితందరూ తీవ్ర నిరాశపరిచారు. కెప్టెన్ మార్క్రమ్(10), స్టబ్స్(5), అబెల్ విఫలమయ్యారు. ఎంఐ బౌలర్లలలో ఆల్రౌండర్ కార్బిన్ బాష్ 4 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు రబాడ రెండు, బౌల్ట్, రషీద్ ఖాన్, డెవాల్డ్ బ్రెవిస్ తలా వికెట్ సాధించారు. కాగా ఎంఐ కేప్ టౌన్ జట్టు ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి చెందనిదే కావడం గమనార్హం.సన్రైజర్స్ ఫ్లే ఆఫ్స్ చేరుతుందా?ఎస్ఎ20-2025లో పార్ల్ రాయల్స్, ఎంఐ కేప్ టౌన్లు ఇప్పటికే తమ ప్లే ఆఫ్స్ బెర్త్లను ఖారారు చేసుకోగా.. మరో రెండు స్ధానాల కోసం సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్, జోబర్గ్ సూపర్ కింగ్స్, ప్రిటోరియా క్యాపిటల్స్ పోటీ పడుతున్నాయి. అయితే ప్రిటోరియా క్యాపిటల్స్ కంటే సన్రైజర్స్, సూపర్ కింగ్స్కు ప్లే ఆఫ్స్కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫిబ్రవరి 1న పార్ల్ రాయల్స్తో తలపడనుంది.అయితే ఈ మ్యాచ్లో సన్రైజర్స్ ఓడినా ప్లే ఆఫ్స్కు చేరే అవకాశముంది. ఎందుకంటే ఈస్ట్రన్ క్యాప్ ఖాతాలో 19 పాయింట్లు ఉన్నాయి. జోబర్గ్ సూపర్ కింగ్స్(15), ప్రిటోరియా(14) పాయింట్లతో మూడు నాలుగు స్ధానాల్లో ఉన్నాయి. జోబర్గ్, ప్రిటోరియా జట్లకు ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. జోబర్గ్ మిగిలిన రెండు మ్యాచ్ల్లో గెలిస్తే ఎటువంటి సమీకరణాలు లేకుండా ప్లే ఆఫ్స్కు ఆర్హత సాధిస్తుంది. ఒకవేళ ప్రిటోరియా ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టాలంటే జో బర్గ్ మిగిలిన రెండు మ్యాచ్ల్లో కనీసం ఒక్క గేమ్లోనైనా ఓటమి చెందాలి. ఈ సమయంలో ప్రిటోరియా మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధిస్తే 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్లో అడుగుపెడుతుంది.చదవండి: జనాయ్ భోంస్లే కాదు.. సిరాజ్ డేటింగ్లో ఉన్నది ఆమెతోనే? -
చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. ఆరు టెస్ట్ల తర్వాత అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్గా రికార్డు నెలకొల్పాడు. 26 ఏళ్ల రషీద్ ఆరు టెస్ట్ల అనంతరం 45 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్ స్పిన్నర్ అల్ఫ్ వాలెంటైన్, శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ఆరు టెస్ట్ల అనంతరం 43 వికెట్లు పడగొట్టి రషీద్ తర్వాతి స్థానంలో ఉన్నారు.జింబాబ్వేతో జరిగిన రెండో టెస్ట్లో రషీద్ 11 వికెట్లు తీసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రెండో టెస్ట్లో విజయంతో ఆఫ్ఘనిస్తాన్ రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీసిన రషీద్.. రెండో ఇన్నింగ్స్లో ఏడు వికెట్లు పడగొట్టాడు. రషీద్ తన ఆరు మ్యాచ్ల టెస్ట్ కెరీర్లో 5 ఐదు వికెట్ల ప్రదర్శనలు, 3 పది వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు.రెండో ఇన్నింగ్స్లో రషీద్ నమోదు చేసిన గణాంకాలు (7/66) ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యుత్తమమైనవి. రషీద్ తన సొంత రికార్డునే (7/137) అధిగమించి ఈ గణాంకాలు నమోదు చేశాడు.రెండో స్థానంలో రషీద్ఆరు టెస్ట్ల అనంతరం అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రషీద్ ఖాన్ (45) సౌతాఫ్రికా పేసర్ వెర్నన్ ఫిలాండర్తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ పేసర్ చార్లీ టర్నర్ టాప్లో నిలిచాడు. టర్నర్ ఆరు టెస్ట్ల అనంతరం 50 వికెట్లు పడగొట్టాడు.వరుసగా రెండు మ్యాచ్ల్లో 10 వికెట్లుఈ మ్యాచ్లో 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన రషీద్.. వరుసగా రెండు మ్యాచ్ల్లో ఈ ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్లో రషీద్తో పాటు సౌతాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ మాత్రమే వరుసగా రెండు టెస్ట్ల్లో 10 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.జింబాబ్వేతో రెండో టెస్ట్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో తక్కువ స్కోర్కే (157) చాపచుట్టేసిన ఆఫ్ఘనిస్తాన్ రెండో ఇన్నింగ్స్లో అనూహ్యంగా పుంజుకుని 363 పరుగులు చేసింది. రహ్మత్ షా (139), ఇస్మత్ ఆలం (101) సెంచరీలతో కదంతొక్కారు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఇస్మత్ అరంగేట్రంలోనే శతక్కొట్టాడు. ఎనిమిది అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చి డెబ్యూలో సెంచరీ చేసిన 11 ఆటగాడిగా ఇస్మత్ ఆలం రికార్డుల్లోకెక్కాడు.జింబాబ్వే విషయానికొస్తే.. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే ఎక్కువ స్కోర్ చేసింది. సికందర్ రజా (61), క్రెయిగ్ ఎర్విన్ (75) అర్ద సెంచరీలతో రాణించడంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 243 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే తడబడింది. రషీద్ తన స్పిన్ మాయాజాలంలో జింబాబ్వేను 205 పరుగులకు పరిమితం చేశాడు. ఫలితంగా జింబాబ్వే లక్ష్యానికి 73 పరుగుల దూరంలో నిలిచిపోయింది. -
రషీద్ ఖాన్ విశ్వరూపం.. 10 వికెట్ల ప్రదర్శన నమోదు
బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్లో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ మ్యాచ్లో రషీద్ ఖాన్ 10 వికెట్ల ఘనత నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీసిన రషీద్ రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా రషీద్ ఖాన్కు టెస్ట్ల్లో ఇది మూడో 10 వికెట్ల ప్రదర్శన. రషీద్ తన ఆరు మ్యాచ్ల టెస్ట్ కెరీర్లో ఐదు 5 వికెట్ల ప్రదర్శనలు, మూడు 10 వికెట్ల ప్రదర్శనల సాయంతో 44 వికెట్లు పడగొట్టాడు. రషీద్ విజృంభించడంతో రెండో టెస్ట్లో జింబాబ్వే ఓటమి అంచుల్లో ఉంది. ఛేదనలో తడబడిన జింబాబ్వే విజయానికి ఇంకా 82 పరుగుల దూరంలో ఉంది. చేతిలో మరో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. జింబాబ్వే సెకెండ్ ఇన్నింగ్స్లో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. క్రెయిగ్ ఎర్విన్ (44), రిచర్డ్ నగరవ (3) క్రీజ్లో ఉన్నారు. జింబాబ్వే సెకెండ్ ఇన్నింగ్స్లో బెన్ కర్రన్ (38), సికందర్ రజా (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఆరు వికెట్లు పడగొట్టగా.. జియా ఉర్ రెహ్మాన్ రెండు వికెట్లు తీశాడు.అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్లో అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. తొలుత రహ్మత్ షా (139) సెంచరీతో కదం తొక్కగా.. ఎనిమిదో నంబర్ ఆటగాడు ఇస్మత్ ఆలం (101) ఆఖర్లో బాధ్యతాయుతమైన సెంచరీ చేశాడు. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్లో 363 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ ఆరు వికెట్లు పడగొట్టగా.. నగరవ 3, సికందర్ రజా ఓ వికెట్ దక్కించుకున్నారు.దీనికి ముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 243 పరుగులకు ఆలౌటైంది. సికందర్ రజా (61), క్రెయిగ్ ఎర్విన్ (75) అర్ద సెంచరీలతో రాణించారు. ఆఖర్లో సీన్ విలియమ్స్ (49) విలువైన పరుగులు జోడించాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4, అహ్మద్జాయ్ 3, ఫరీద్ అహ్మద్ 2, జియా ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ దక్కించుకున్నారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 157 పరుగులకే ఆలౌటైంది. సికందర్ రజా, న్యామ్హురి తలో మూడు వికెట్లు, ముజరబానీ రెండు, నగరవ ఓ వికెట్ పడగొట్టి ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో రషీద్ ఖాన్ (25) టాప్ స్కోరర్గా నిలిచాడు. కాగా, జింబాబ్వే-ఆఫ్ఘనిస్తాన్ మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. -
జింబాబ్వేతో రెండో టెస్టు.. అఫ్గాన్ 157 ఆలౌట్
బులవాయో: అద్వితీయ బ్యాటింగ్తో జింబాబ్వేతో తొలి టెస్టును ‘డ్రా’ చేసుకున్న అఫ్గానిస్తాన్ జట్టు... రెండో టెస్టులో స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. ఇరు జట్ల మధ్య గురువారం ప్రారంభమైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది.రషీద్ ఖాన్ (20 బంతుల్లో 25; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లలో ఏ ఒక్కరూ 20 పరుగుల మార్క్ దాటలేకపోయారు. కెపె్టన్ హష్మతుల్లా (13), రహమత్ షా (19), అబ్దుల్ మాలిక్ (17), రియాజ్ హసన్ (12), అఫ్సర్ (16), షహీదుల్లా (12), ఇస్మత్ ఆలమ్ (0) ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్కు వరస కట్టారు.జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, న్యూమన్ న్యామురి చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. చేతిలో 10 వికెట్లు ఉన్న జింబాబ్వే ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 151 పరుగులు వెనుకబడి ఉంది. జాయ్లార్డ్ గుంబీ (4 బ్యాటింగ్), బెన్ కరన్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.చదవండి: IND vs AUS: రోహిత్ను కావాలనే పక్కన పెట్టారా?.. కెప్టెన్ బుమ్రా ఏమన్నాడంటే? -
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కెప్టెన్గా రషీద్ ఖాన్..
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 సీజన్కు ముందు ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్గా అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ను ముంబై కేప్ టౌన్ తిరిగి నియమించింది. కాగా తొట్ట తొలి సీజన్లో ముంబై కేప్ టౌన్ కెప్టెన్గా వ్యవహరించిన రషీద్.. గాయం కారణంగా రెండో సీజన్కు దూరమయ్యాడు.ఇప్పుడు వచ్చే ఏడాది సీజన్కు అతడు అందుబాటులోకి రావడంతో మరోసారి కేప్టౌన్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. తొలి సీజన్లో అతడి సారథ్యంలోని కేప్ టౌన్ జట్టు దారుణ ప్రదర్శన కనబరిచింది. పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచి గ్రూపు స్టేజిలోనే రషీద్ జట్టు ఇంటిముఖం పట్టింది. రెండో సీజన్లో కూడా ముంబై తలరాత మారలేదు.రషీద్ స్ధానంలో ముంబై కేప్ టౌన్ కెప్టెన్గా విండీస్ దిగ్గజం కిరాన్ పొలార్డ్ వ్యవహరించాడు. రెండో సీజన్లో కూడా ముంబై జట్టు పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానానికే పరిమితమైంది. కనీసం మూడో స్ధానంలోనైనా ముంబై కేప్ టౌన్ తలరాత మారుతుందో లేదో చూడాలి.కాగా ఎస్ఏ 20-2025 సీజన్కు ముందు ముంబై ఫ్రాంచైజీ ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. ముంబై కేప్టౌన్ జట్టులో స్టోక్స్తో పాటు ట్రెంట్ బౌల్ట్, కగిసో రబాడ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. కాగా ముంబై కేప్టౌన్ జట్టు ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి చెందినదే అన్న విషయం తెలిసిందే. ఇక ఎస్ఎ టీ20 లీగ్ మూడో సీజన్ జనవరి 9, 2025న ప్రారంభం కానుంది.ఎస్ఏ20 2025 ఎడిషన్ కోసం ఎంఐ కేప్టౌన్ జట్టు..బెన్ స్టోక్స్, రషీద్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నువాన్ తుషార, క్రిస్ బెంజమిన్, కగిసో రబాడ, డెవాల్డ్ బ్రెవిస్, రస్సీ వాన్ డర్ డస్సెన్, ర్యాన్ రికెల్టన్, జార్జ్ లిండే, డెలానో పాట్గెయిటర్, థామస్ కేబర్, కానర్ ఎస్టర్హ్యుజెన్చదవండి: అశ్విన్కు వచ్చే పెన్షన్ ఎంతో తెలుసా? -
టెస్ట్ జట్టులో రషీద్ ఖాన్
త్వరలో జింబాబ్వేతో జరుగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇవాళ (డిసెంబర్ 16) ప్రకటించారు. ఆఫ్ఘన్ స్టార్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ చాలాకాలం తర్వాత టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. రషీద్ తన చివరి టెస్ట్ మ్యాచ్ను 2021లో ఆడాడు. గజ్జల్లో గాయం కారణంగా రషీద్ టెస్ట్ మ్యాచ్లకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. తాజాగా సెలెక్టర్ల కోరిక మేరకు రషీద్ టెస్ట్ జట్టులో చేరాడు.జింబాబ్వేతో టెస్ట్ సిరీస్ కోసం హష్మతుల్లా షాహిది నేతృత్వంలో 18 మంది సభ్యులతో కూడిన ఆఫ్ఘన్ జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టులో ఏడుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. వీరిలో లెఫ్ట్ ఆర్మ్ సీమర్ బషీర్ అహ్మద్, ఆల్రౌండర్ ఇస్మత్ ఆలమ్ దేశవాలీ టోర్నీల్లో సత్తా చాటారు.మరో నలుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు అజ్మతుల్లా ఒమర్జాయ్, ఫరీద్ అహ్మద్ మలిక్, రియాజ్ హసన్, సెదిఖుల్లా అటల్ ఈ ఏడాది సెప్టెంబర్లో న్యూజిలాండ్తో జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచ్కు ఎంపికయ్యారు. ఆ మ్యాచ్ వర్షం, వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా ఒక్క రోజు కూడా సాగలేదు.కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లలో టీ20 సిరీస్ ఇదివరకే ముగిసింది. టీ20 సిరీస్ను ఆఫ్ఘనిస్తాన్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మూడు వన్డే మ్యాచ్లు డిసెంబర్ 17, 19, 21 తేదీల్లో జరుగనున్నాయి. ఈ మ్యాచ్లన్నీ హరారే వేదికగా జరుగుతాయి. తొలి టెస్ట్ డిసెంబర్ 26 నుంచి.. రెండో టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 2 నుంచి బులవాయో వేదికగా జరుగుతాయి.జింబాబ్వేతో రెండు టెస్ట్ల కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు..హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మత్ షా (వైస్ కెప్టెన్), ఇక్రమ్ అలీఖైల్ (వికెట్కీపర్), అఫ్సర్ జజాయ్ (వికెట్కీపర్), రియాజ్ హసన్, సెదిఖుల్లా అటల్, అబ్దుల్ మలిక్, బహీర్ షా మహబూబ్, ఇస్మత్ ఆలం, అజ్మతుల్లా ఒమర్జాయ్, జహీర్ ఖాన్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్ , జహీర్ షెహజాద్, రషీద్ ఖాన్, యామిన్ అహ్మద్జాయ్, బషీర్ అహ్మద్ ఆఫ్ఘన్, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్ -
చరిత్ర సృష్టించిన అఫ్గాన్ యువ సంచలనం.. ప్రపంచంలోనే?
షార్జా క్రికెట్ గ్రౌండ్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి వన్డేలో 92 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ చారిత్రత్మక విజయం సాధించింది. ఈ మ్యాచ్లో అఫ్గాన్ యువ స్పిన్నర్ అల్లా ఘజన్ఫర్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఘజన్ఫర్ స్పిన్ ఉచ్చులో చిక్కుకుని బంగ్లా బ్యాటర్లు విల్లవిల్లాడారు.ఈ మ్యాచ్లో 6.3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన ఘజన్ఫర్ కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఘజన్ఫర్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.ఘజన్ఫర్ సాధించిన రికార్డులు ఇవే..👉వన్డే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో అఫ్గానిస్తాన్ బౌలర్గా 18 ఏళ్ల ఘజన్ఫర్ నిలిచాడు. ఈ జాబితాలో రషీద్ ఖాన్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 2018లో గ్రాస్ ఐలెట్లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో రషీద్ ఖాన్ 18 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.👉అంతర్జాతీయ వన్డేల్లో 6 వికెట్ల ఘనత సాధించిన మూడో అత్యంత పిన్న వయష్కుడిగా ఘజన్ఫర్ రికార్డులకెక్కాడు. ఈ అఫ్గానీ 18 సంవత్సరాల 231 రోజుల వయస్సులో ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ దిగ్గజం వకార్ యూనిస్(18 సంవత్సరాల 164 రోజులు) అగ్రస్ధానంలో ఉండగా, రషీద్ ఖాన్(18 సంవత్సరాల 174 రోజులు) రెండో స్ధానంలో ఉన్నాడు.👉అదే విధంగా బంగ్లాదేశ్-అఫ్గాన్ వన్డేల్లో గణాంకాలు నమోదు చేసిన బౌలర్గా కూడా ఘజన్ఫన్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ షకీబ్ అల్హసన్ పేరిట ఉండేది. 2019లో సౌతాంప్టన్లో అఫ్గాన్తో జరిగిన వన్డేల్లో షకీబ్ 29 పరుగులిచ్చి 5 వికెట్ల పడగొట్టాడు. తాజా మ్యాచ్లో 6 వికెట్లు పడగొట్టిన ఘజన్ఫన్.. షకీబ్ అల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. From 132/3 to 143 all out! 🤯Bangladesh have just been routed by the spin wizardry of AM Ghazanfar! 🪄#AFGvBANonFanCode pic.twitter.com/vLUXe6Xc56— FanCode (@FanCode) November 6, 2024 -
BAN Vs AFG: ఘజన్ఫర్ మాయాజాలం.. బంగ్లాదేశ్ను చిత్తు చేసిన అఫ్గాన్
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అఫ్గానిస్తాన్ జట్టు...బంగ్లాదేశ్తో వన్డే సిరీస్లో శుభారంభం చేసింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన తొలి పోరులో అఫ్గానిస్తాన్ 92 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 49.4 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది.ఆల్రౌండర్ మొహమ్మద్ నబీ (79 బంతుల్లో 84; 4 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపులు మెరిపించగా... కెపె్టన్ హష్మతుల్లా షాహిది (92 బంతుల్లో 52; 2 ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు. గుర్బాజ్ (5), రహమత్ షా (2), అజ్మతుల్లా (0) విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తఫిజుర్, తస్కిన్ అహ్మద్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 34.3 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటైంది. అఫ్గానిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ అల్లా మొహమ్మద్ ఘజన్ఫర్ 26 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ను దెబ్బ కొట్టాడు.బంగ్లాదేశ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ నజుమల్ హోస్సేన్ షాంటో (68 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ నిలిచాడు. సౌమ్య సర్కార్ (33), మిరాజ్ (28) మినహా ఇతర బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. తంజీద్ హసన్ (3), మహ్ముదుల్లా (2), ముష్పికర్ (1), రిషాద్ (1), తౌహిద్ (11) ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు చేరారు. ఇరు జట్ల మధ్య శనివారం ఇక్కడే రెండో వన్డే జరగనుంది.చదవండి: టాప్–20 నుంచి కోహ్లి, రోహిత్ అవుట్ -
IPL 2025: అతడికి రూ. 18 కోట్లు.. గుజరాత్ రిటెన్షన్ లిస్టు ఇదే!
ఐపీఎల్-2025 మెగా వేలానికి సమయం ఆసన్నమవుతోంది. నవంబరు చివరి వారంలో ఆక్షన్ నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. అదే విధంగా.. వేలానికి ముందు పది ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను అక్టోబరు 31లోపు సమర్పించాలని డెడ్లైన్ విధించినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్కు సంబంధించిన ఆసక్తికర వార్తలు తెరమీదకు వచ్చాయి. టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీని విడిచిపెట్టాలని ఫ్రాంఛైజీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక కెప్టెన్గా శుబ్మన్ గిల్ను కొనసాగించడంతో పాటు అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ను కూడా టైటాన్స్ రిటైన్ చేసుకోనుందట!పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంకాగా 2022లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్లోనే చాంపియన్గా నిలిచింది. మరుసటి ఏడాది రన్నరప్గా నిలిచి సత్తా చాటింది. అయితే, ఆ రెండు దఫాల్లో కెప్టెన్గా వ్యవహరించిన టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ ఏడాది జట్టును వీడి.. ముంబై ఇండియన్స్లో చేరాడు. ఈ క్రమంలో హార్దిక్ స్థానంలో శుబ్మన్ గిల్కు ఫ్రాంఛైజీ సారథ్య బాధ్యతలు అప్పగించింది.అయితే, ఐపీఎల్-2024లో గిల్ సేన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. గాయం కారణంగా షమీ సీజన్ మొత్తానికి దూరం కావడం.. కొన్ని మ్యాచ్లలో ఆఖరి వరకు పోరాడినా ఒత్తిడిలో చిత్తు కావడం ప్రభావం చూపింది. దీంతో పద్నాలుగు మ్యాచ్లకు గానూ కేవలం ఐదే గెలిచిన గుజరాత్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.అతడికి రూ. 18 కోట్లుఅయినప్పటికీ.. టీమిండియా భవిష్య కెప్టెన్గా గుర్తింపు పొందిన శుబ్మన్ గిల్పై నమ్మకం ఉంచిన ఫ్రాంఛైజీ యాజమాన్యం అతడికి రూ. 18 కోట్ల మేర చెల్లించి తమ జట్టు నాయకుడిగా కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇక వరల్డ్క్లాస్ స్పిన్నర్ అయిన రషీద్ ఖాన్ సైతం ఈ సీజన్లో నిరాశపరిచాడు. 12 మ్యాచ్లు ఆడి కేవలం పది వికెట్లే తీశాడు. అయినప్పటికీ రషీద్ నైపుణ్యాలపై నమ్మకంతో అతడిని కూడా రిటైన్ చేసుకోనున్నారట.సాయి కిషోర్ను కూడా...అదే విధంగా.. ఐపీఎల్-2024లో శతకం బాది.. ఓవరాల్గా 527 పరుగులతో సత్తా చాటిన సాయి కిషోర్ను కూడా టైటాన్స్ అట్టిపెట్టుకోనుందట. ఇక అన్క్యాప్డ్ ప్లేయర్లు షారుఖ్ ఖాన్,రాహుల్ తేవటియాలను కూడా కొనసాగించనున్నట్లు సమాచారం. కాగా షమీ వన్డే వరల్డ్కప్-2023లో సత్తా చాటిన అనంతరం చీలమండకు సర్జరీ చేయించుకున్నాడు. ఈ క్రమంలో ఆటకు దూరమైన అతడు ఇంతవరకు పునరాగమనం చేయలేదు. అందుకే టైటాన్స్ షమీని వదిలేయనున్నట్లు సమాచారం.చదవండి: Ranji Trophy: 68 బంతుల్లోనే సెంచరీ.. ఆర్సీబీకి స్ట్రాంగ్ మెసేజ్! -
#RashidKhanMarriage : వైరలవుతున్న స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పెళ్లి (ఫొటోలు)
-
వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. రషీద్ వివాహం నిన్న (అక్టోబర్ 3) రాత్రి ఆఫ్ఘన్ రాజధాని కాబుల్లో జరిగింది. పష్తూన్ సంప్రదాయం ప్రకారం రషీద్ పెళ్లి చేసుకున్నాడు. రషీద్ వివాహ కార్యక్రమానికి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు సీఈవో నసీబ్ ఖాన్ సహా చాలా మంది స్వదేశీ క్రికెటర్లు హాజరయ్యారు. Historical Night 🌉 Kabul is hosting the wedding ceremony of the prominent Afghan cricket star and our CAPTAIN 🧢 Rashid Khan 👑 🇦🇫 @rashidkhan_19Rashid Khan 👑 and his three brother got married at same day.Wishing him a and his thee brother happy and healthy life ahead! pic.twitter.com/YOMuyfMMXP— Afghan Atalan 🇦🇫 (@AfghanAtalan1) October 3, 2024రషీద్తో పాటు అతని ముగ్గురు సోదరులకు ఒకే సారి వివాహం జరిగినట్లు తెలుస్తుంది. రషీద్ పెళ్లి ఫోటోలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. రషీద్ వివాహ వేదిక వద్ద కొందరు తుపాకులు పట్టుకుని పహారా కాస్తూ కనిపించారు. ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది.Scenes outside the hotel which is hosting Rashid Khan's wedding in Kabul. pic.twitter.com/LIpdUYVZcA— Mufaddal Vohra (@mufaddal_vohra) October 3, 202426 ఏళ్ల రషీద్కు ప్రపంచంలో మేటి స్పిన్నర్గా పేరుంది. రషీద్ పొట్టి క్రికెట్లో తిరుగులేని బౌలర్గా చలామణి అవుతున్నాడు. రషీద్ విశ్వవ్యాప్తంగా జరిగే ప్రతి లీగ్లో పాల్గొంటాడు. టీ20ల్లో రషీద్ సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్గా (613 వికెట్లు) కొనసాగుతున్నాడు. Congratulations to the one and only King Khan, Rashid Khan, on your wedding! Wishing you a lifetime of love, happiness, and success ahead.@rashidkhan_19 pic.twitter.com/fP1LswQHhr— Mohammad Nabi (@MohammadNabi007) October 3, 2024రషీద్ ఆఫ్ఘనిస్తాన్ తరఫున 5 టెస్ట్లు, 105 వన్డేలు, 93 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో రషీద్ 376 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ రషీద్ 121 మ్యాచ్లు ఆడి 149 వికెట్లు తీశాడు. రషీద్ ఖాతాలో ఐదు వన్డే హాఫ్ సెంచరీలు, ఓ టెస్ట్ హాఫ్ సెంచరీ ఉన్నాయి.The wedding hall that will host Rashid Khan’s wedding ceremony in Kabul, Afghanistan today 🔥#ACA pic.twitter.com/FOM2GCkqZw— Afghan Cricket Association - ACA (@ACAUK1) October 2, 2024Black is the ultimate style statement. Congratulations Mr. Magician @rashidkhan_19 🎉🎊 pic.twitter.com/KlMYqzpJ32— Wazhma Ayoubi 🇦🇫 (@WazhmaAyoubi) October 3, 2024 -
53 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి!
అఫ్గనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. యాభై మూడేళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఇంత వరకూ ఏ క్రికెటర్కు సాధ్యం కాని రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. సౌతాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా ఐదు వికెట్లతో చెలరేగి రేర్ ఫీట్ నమోదు చేశాడు. ఇంతకీ అదేంటంటారా?!..అఫ్గనిస్తాన్- సౌతాఫ్రికా మధ్య యూఏఈ వేదికగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్లో సౌతాఫ్రికాను ఓడించి.. వన్డేల్లో ప్రొటిస్పై మొదటి విజయం అందుకున్న హష్మతుల్లా బృందం.. రెండో వన్డేలో సంచలన విజయం సాధించింది. బవుమా సేనను ఏకంగా 177 పరుగుల తేడాతో చిత్తు చేసింది.షార్జా వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికాపై నెగ్గి.. అఫ్గన్ సిరీస్ గెలవడంలో 26 ఏళ్ల రషీద్ ఖాన్ది కీలక పాత్ర. ప్రొటిస్ ఇన్నింగ్స్లో 9 ఓవర్లు బౌల్ చేసిన ఈ స్పిన్ మాంత్రికుడు కేవలం 19 పరుగులే ఇచ్చి 5 వికెట్లు కూల్చాడు. సౌతాఫ్రికా ఓపెనర్ టోనీ డి జోర్జి(17), ఐడెన్ మార్క్రమ్(21), ట్రిస్టన్ స్టబ్స్(5), కైలీ వెరెన్నె(2), వియాన్ మల్డర్(2) రషీద్ స్పిన్ ఉచ్చులో చిక్కుకుని పెవిలియన్ చేరారు.ఇదిలా ఉంటే.. శుక్రవారం(సెప్టెంబరు 20) రషీద్ ఖాన్ పుట్టినరోజు కావడం విశేషం. ఈ క్రమంలో వన్డే చరిత్రలో పుట్టినరోజున ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్గా ఈ అఫ్గన్ స్టార్ రికార్డు సృష్టించాడు. అంతకు ముందు తమ బర్త్డే నాడు సౌతాఫ్రికా ఆల్రౌండర్ వెర్నర్ ఫిలాండర్ 2007లో ఐర్లాండ్ మీద 4/12, ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ 2010లో ఆస్ట్రేలియా మీద 4/44 గణాంకాలు నమోదు చేశారు.High 🖐️s for @RashidKhan_19 after a sensational performance to help #AfghanAtalan secure a series win over Proteas. 🤩👏#AFGvSA | #GloriousNationVictoriousTeam pic.twitter.com/xRAz6CBBpE— Afghanistan Cricket Board (@ACBofficials) September 20, 2024 -
వన్డేల్లో అఫ్గన్ సంచలనం.. 177 రన్స్ తేడాతో సౌతాఫ్రికా చిత్తు
Afghanistan Beat South Africa By 177 Runs Ind 2nd ODI 2024: తమ వన్డే క్రికెట్ చరిత్రలో అఫ్గనిస్తాన్ సరికొత్త చరిత్ర లిఖించింది. పటిష్ట సౌతాఫ్రికాపై తొలిసారిగా సిరీస్ నెగ్గింది. తద్వారా ఈ ఘనత సాధించిన మొదటి అఫ్గన్ జట్టుగా హష్మతుల్లా బృందం నిలిచింది. కాగా అఫ్గనిస్తాన్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా యూఏఈ పర్యటనకు వెళ్లింది.ఏకంగా 177 పరుగుల తేడాతో చిత్తుఈ క్రమంలో షార్జా వేదికగా బుధవారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య జట్టు చేతిలో అనూహ్య రీతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అఫ్గనిస్తాన్కు సౌతాఫ్రికాపై ఇదే తొలి వన్డే విజయం. అనంతరం.. శుక్రవారం షార్జాలోనే జరిగిన రెండో మ్యాచ్లోనూ హష్మతుల్లా బృందం సంచలన విజయం సాధించింది.సౌతాఫ్రికాను ఏకంగా 177 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అఫ్గన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన అద్భుత ప్రదర్శనతో ప్రొటిస్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేశాడు. 9 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు.శతక్కొట్టిన గుర్బాజ్షార్జా వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీతో మెరిశాడు. 110 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 105 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ రియాజ్ హసన్ 29 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వన్డౌన్ బ్యాటర్ రహ్మత్ షా(50) హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇక నాలుగో నంబర్ బ్యాటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ సైతం 86 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయిన అఫ్గనిస్తాన్ 311 పరుగుల భారీ స్కోరు సాధించింది.రషీద్ ఖాన్ వికెట్ల వేటసౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి, నండ్రేబర్గర్, కాబా పీటర్, ఐడెన్ మార్క్రమ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికాకు శుభారంభం లభించలేదు. కెప్టెన్ తెంబా బవుమా 38, మరో ఓపెనర్ టోరీ డి జోర్జి 31 పరుగులకే అవుట్ అయ్యారు. వీరిద్దరు నిష్క్రమించిన తర్వాత ప్రొటిస్ జట్ట బ్యాటింగ్ ఆర్డర్ను రషీద్ ఖాన్ కుప్పకూల్చాడు.టోనీ వికెట్తో వేట మొదలుపెట్టిన రషీద్ ఖాన్.. మార్క్రమ్(21), ట్రిస్టన్ స్టబ్స్(5), కైలీ వెరెన్నె(2), వియాన్ మల్డర్(2)లను పెవిలియన్కు పంపి సౌతాఫ్రికా వెన్ను విరిచాడు. మిగతా పనిని మరో స్పిన్నర్ నంగేయాలియా ఖరోటే పూర్తి చేశాడు. ఈ మ్యాచ్లో రషీద్ ఐదు వికెట్లు దక్కించుకోగా.. ఖరోటే 4, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ తీశారు.అఫ్గనిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా- రెండో వన్డే👉వేదిక: షార్జా క్రికెట్ స్టేడియం👉టాస్: అఫ్గనిస్తాన్.. తొలుత బ్యాటింగ్👉అఫ్గన్ స్కోరు: 311/4 (50)👉సౌతాఫ్రికా స్కోరు: 134 (34.2)👉ఫలితం: సౌతాఫ్రికాపై 177 పరుగుల తేడాతో అఫ్గన్ సంచలన విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రషీద్ ఖాన్.చదవండి: ఇంగ్లండ్ గడ్డపై దుమ్ములేపిన చహల్.. బంగ్లాతో సిరీస్కు సై!High 🖐️s for @RashidKhan_19 after a sensational performance to help #AfghanAtalan secure a series win over Proteas. 🤩👏#AFGvSA | #GloriousNationVictoriousTeam pic.twitter.com/xRAz6CBBpE— Afghanistan Cricket Board (@ACBofficials) September 20, 2024 -
సౌతాఫ్రికాతో అఫ్గన్ వన్డే సిరీస్.. స్టార్ స్పిన్నర్ రీఎంట్రీ
అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పునరాగమనం చేయనున్నాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు అతడు అందుబాటులోకి వచ్చాడు. ఈ విషయాన్ని అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. కాగా షార్జా వేదికగా అఫ్గన్ జట్టు సౌతాఫ్రికాతో మూడు వన్డేలు ఆడనుంది.ఆ ఇద్దరు దూరంఇందుకు సెప్టెంబరు 18- 22 వరకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో అఫ్గన్ బోర్డు 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. హహ్మతుల్లా షాహిది కెప్టెన్సీలోని ఈ టీమ్లోకి రషీద్ ఖాన్ ఎంట్రీ ఇచ్చినట్లు తెలిపింది. ఇదిలా ఉంటే.. మరో కీలక స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహమాన్ గాయం కారణంగా ఈ సిరీస్కు దూరం కాగా.. స్టార్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ సైతం చీలమండ నొప్పి వల్ల సెలక్షన్కు అందుబాటులోకి రాలేకపోయాడని వెల్లడించింది.రషీద్ రావడం సంతోషంవీరి స్థానాల్లో అబ్దుల్ మాలిక్, దార్విష్ రసూలీలను జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపింది. కాగా వెన్నునొప్పి కారణంగా రషీద్ ఖాన్ కొన్నిరోజులుగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్తో తాము ఆడబోతున్న ఏకైక జట్టుకు రషీద్ అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమని అఫ్గన్ బోర్డు గతంలో విచారం వ్యక్తం చేసింది. అయితే, ఇప్పుడు అతడు జట్టుతో చేరడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేసింది.కివీస్తో టెస్టు మొదలుకాకుండానేఇక భారత్లోని నోయిడా వేదికగా న్యూజిలాండ్తో అఫ్గన్ ఏకైక టెస్టుకు అంతరాయాలు ఏర్పడిన విషయం తెలిసిందే. నోయిడా స్టేడియంలో ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో.. చిత్తడిగా మారిన అవుట్ఫీల్డ్ ఎండకపోవడంతో తొలిరెండు రోజుల ఆట రద్దైంది. ఇక మూడో రోజు నుంచి వర్షం మొదలుకావడంతో పరిస్థితి మరింత విషమించింది. దీంతో సోమవారం మొదలుకావాల్సిన టెస్టు మ్యాచ్ నాలుగు రోజులైనా.. కనీసం టాస్ కూడా పడలేదు. శుక్రవారం నాటి ఐదో రోజు ఆట కూడా రద్దైతే.. అఫ్గన్-కివీస్ టెస్టు మొదలుకాకుండానే ముగిసిపోనుంది.సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్కు అఫ్గనిస్తాన్ జట్టుహష్మతుల్లా షాహిది (కెప్టెన్), రహ్మత్ షా (వైస్ కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), అబ్దుల్ మాలిక్, రియాజ్ హసన్, దార్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్, నంగ్యాల్ ఖరోతి, అల్లా మొహమ్మద్ గజన్ఫర్, ఫజల్ హక్ ఫారూఖీ, బిలాల్ సమీ, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్.చదవండి: Ind vs Aus: ఆ ముగ్గురు బ్యాటర్లు ప్రమాదకరం: ఆసీస్ బౌలర్ -
కివీస్తో టెస్టుకు అఫ్గన్ జట్టు ప్రకటన.. రషీద్ లేకుండానే!
న్యూజిలాండ్తో ఏకైక టెస్టుకు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. హష్మతుల్లా షాహిద్ కెప్టెన్సీలోని ఈ టీమ్లో మొత్తంగా పదహారు మంది సభ్యులకు చోటిచ్చిన్నట్లు తెలిపింది. ఇందులో ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్లు రియాజ్ హసన్, షామ్స్ ఉర్ రహమాన్, ఖలీల్ అహ్మద్లను తొలిసారి జట్టుకు ఎంపికచేసినట్లు పేర్కొంది. నోయిడా వేదికగా.. రషీద్ ఖాన్ లేకుండానేఅయితే, గాయం కారణంగా స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మాత్రం ఈ మ్యాచ్కు దూరం కానున్నాడు.కాగా భారత్ వేదికగా అఫ్గనిస్తాన్- న్యూజిలాండ్ మధ్య సెప్టెంబరు 8 నుంచి టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే కివీస్ ఆటగాళ్లు భారత్కు చేరుకున్నారు. అఫ్గన్తో జరుగనున్న మొట్టమొదటి టెస్టులో విజయమే లక్ష్యంగా సన్నాహకాలు ముమ్మరం చేశారు.ఈ క్రమంలో అఫ్గన్ బోర్డు సైతం ఆచితూచి జట్టును ఎంపిక చేసుకుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ తొలి టైటిల్ గెలిచిన న్యూజిలాండ్ను ఢీకొట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధమైంది. ఈ మ్యాచ్లో ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, వంటి టాప్ బ్యాటర్లతో పాటు.. స్టార్ ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ తదితరులు అఫ్గన్కు కీలకం కానున్నారు. రహ్మనుల్లా గుర్బాజ్కు నో ప్లేస్అదే విధంగా ఓపెనింగ్ బ్యాటర్లు అబ్దుల్ మాలిక్, బహీర్ షా, వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇక్రం అలిఖిల్, అఫ్సర్ జజాయ్లతో బ్యాటింగ్ విభాగం సిద్ధమైంది. ఇక అజ్మతుల్లాతో పాటు ఆల్రౌండర్ల విభాగంలో షాహిదుల్లా కమల్, షామ్స్ ఉర్ రహమాన్ చోటు దక్కించుకున్నారు. ఇక రషీద్ ఖాన్ గైర్హాజరీలో కైస్ అహ్మద్, జియా ఉర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్, జాహీర్ ఖాన్ స్పిన్దళంలో చోటు దక్కించుకోగా.. ఫాస్ట్ బౌలర్లలో నిజత్ మసూద్ ఒక్కడికే ఈ జట్టులో స్థానం దక్కింది. అయితే, రహ్మనుల్లా గుర్బాజ్కు మాత్రం ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. కాగా అఫ్గనిస్తాన్ ఇప్పటి వరకు మొత్తంగా తొమ్మిది టెస్టు మ్యాచ్లు ఆడి కేవలం మూడింట గెలిచింది.న్యూజిలాండ్తో గ్రేటర్ నోయిడాలో ఏకైక టెస్టుకు అఫ్గన్ జట్టుహష్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, అబ్దుల్ మాలిక్, రియాజ్ హసన్, అఫ్సర్ జజాయ్, ఇక్రం అలిఖిల్, బహీర్ షా మహబూబ్, షాహిదుల్లా కమల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షామ్స్ ఉర్ రహమాన్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్, జహీర్ ఖాన్ పక్తీన్, కైస్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, నిజత్ మసూద్. -
న్యూజిలాండ్తో ఏకైక టెస్ట్.. రషీద్ ఖాన్కు విశ్రాంతి
సెప్టెంబర్ 9 నుంచి 13 వరకు గ్రేటర్ నోయిడా వేదికగా న్యూజిలాండ్తో జరుగనున్న ఏకైక టెస్ట్ కోసం ఆఫ్ఘనిస్తాన్ ప్రిలిమినరీ స్క్వాడ్ను ఇవాళ (ఆగస్ట్ 27) ప్రకటించారు. 20 సభ్యులున్న ఈ జట్టుకు హష్మతుల్లా షాహిది సారధిగా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్కు చోటు దక్కలేదు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా రషీద్ ఖాన్కు విశ్రాంతి ఇస్తున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. రషీద్కు టెస్ట్ మ్యాచ్ ఆడే ఫిట్నెస్ లేదని ఏసీబీ పేర్కొంది. రషీద్ ఆగస్ట్ 12న జరిగిన హండ్రెడ్ లీగ్ మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. దీంతో అర్దంతరంగా అతను ఆ టోర్నీ నుంచి వైదొలిగాడు. రషీద్ ఇటీవల జరిగిన ఓ లోకల్ టోర్నీలో పాల్గొన్నా టెస్ట్ క్రికెట్ ఆడే స్థాయి అతనికి లేదని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. రషీద్.. న్యూజిలాండ్తో టెస్ట్ మ్యాచ్ అనంతరం జరిగే సౌతాఫ్రికా వన్డే సిరీస్కంతా పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని ఏసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది. సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ సెప్టెంబర్ 18-22 మధ్య తేదీల్లో జరుగనుంది. ఈ సిరీస్కు యూఏఈ ఆతిథ్యం ఇవ్వనుంది. మరోవైపు 20 మంది సభ్యుల ఆఫ్ఘనిస్తాన్ ప్రిలిమినరీ స్క్వాడ్ ఈనెల 28న గ్రేటర్ నొయిడాలోకి సన్నాహక శిబిరానికి చేరుకుంటుంది. ఈ సన్నాహక శిబిరంలో ప్రతిభ ఆధారంగా 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేస్తారు. బీసీసీఐ గ్రేటర్ నోయిడాను ఆఫ్ఘనిస్తాన్కు హోం గ్రౌండ్ కింద అలాట్ చేసిన విషయం తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, అబ్దుల్ మాలిక్, రహమత్ షా, బహీర్ షా మహబూబ్, ఇక్రమ్ అలీఖేల్ (వికెట్కీపర్), షాహిదుల్లా కమల్, గుల్బాదిన్ నాయబ్, అఫ్సర్ జజాయ్ (వికెట్కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్, షాహమ్సుర్ రెహ్మాన్, ఖైస్ అహ్మద్, జహీర్ ఖాన్, నిజత్ మసూద్, ఫరీద్ అహ్మద్ మాలిక్, నవీద్ జద్రాన్, ఖలీల్ అహ్మద్, యమా అరబ్. -
ట్రెంట్ రాకెట్స్కు బిగ్ షాక్.. హండ్రెడ్ లీగ్ నుంచి రషీద్ ఖాన్ ఔట్
హండ్రెడ్ లీగ్ నుంచి ట్రెంట్ రాకెట్స్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ ఔటయ్యాడు. గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. రషీద్ స్థానాన్ని ఆసీస్ ఆఫ్ స్పిన్నర్ క్రిస్ గ్రీన్ భర్తీ చేయనున్నాడు.ప్రస్తుతం హండ్రెడ్ లీగ్లో ట్రెంట్ రాకెట్స్ ఐదో స్థానంలో కొనసాగుతుంది. గ్రూప్ దశలో ఈ జట్టు మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్ల్లో గెలిచినా రాకెట్స్ ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే.ప్రస్తుతానికి ఓవల్ ఇన్విన్సిబుల్స్ ప్లే ఆఫ్స్కు క్వాలిఫై కాగా.. వెల్ష్ ఫైర్, లండన్ స్పిరిట్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. నార్త్రన్ సూపర్ ఛార్జర్స్, సథరన్ బ్రేవ్, బర్మింగ్హమ్ ఫీనిక్స్, ట్రెంట్ రాకెట్స్, మాంచెస్టర్ ఒరిజినల్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాయి.కాగా, ఇటీవల సథరన్ బ్రేవ్తో జరిగిన మ్యాచ్లో రషీద్ ఖాన్ ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు సమర్పించుకుని ట్రెంట్ రాకెట్స్ ఓటమికి పరోక్ష కారకుడైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో పోలార్డ్ రషీద్ ఖాన్ బౌలింగ్ను ఊచకోత కోశాడు. -
వరుసగా ఐదు సిక్సర్లు.. రషీద్ ఖాన్కు చుక్కలు.. చరిత్ర సృష్టించిన పోలార్డ్
హండ్రెడ్ లీగ్లో సథరన్ బ్రేవ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న విండీస్ దిగ్గజం కీరన్ పోలార్డ్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. నిన్న (ఆగస్ట్ 10) ట్రెంట్ రాకెట్స్తో జరిగిన మ్యాచ్లో రషీద్ ఖాన్ బౌలింగ్లో వరుసగా ఐదు సిక్సర్లు బాదిన పోలార్డ్.. క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో ఐదు అంతకంటే ఎక్కువ సిక్సర్లు రెండుసార్లు బాదిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్కు ముందు పోలార్డ్ శ్రీలంకతో జరిగిన అంతర్జాతీయ టీ20లో అఖిల ధనంజయం బౌలింగ్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు. తాజాగా రషీద్ ఖాన్ బౌలింగ్లో ఓ సెట్లో (హండ్రెడ్ లీగ్లో ఐదు బంతులను ఓ సెట్గా పరిగణిస్తారు) ఐదుకు ఐదు సిక్సర్లు కొట్టాడు. పొట్టి క్రికెట్లో రషీద్ను ఈ స్థాయిలో చితక్కొట్టిన బౌలర్ కూడా లేడు. ఈ మ్యాచ్కు ముందు రషీద్ బౌలింగ్లో ఓ ఓవర్లో అత్యధికంగా నాలుగు సిక్సర్లు మాత్రమే వచ్చాయి. Kieron Pollard against yellow teams. 🥶- Rashid Khan taken to the cleaners, 5 sixes in a row. 🤯pic.twitter.com/CjrB63JwWD— Mufaddal Vohra (@mufaddal_vohra) August 11, 20242016 టీ20 వరల్డ్కప్లో ఏబీ డివిలియర్స్ రషీద్ బౌలింగ్లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టాడు. 2018 ఐపీఎల్లో క్రిస్ గేల్, 2023 సౌతాఫ్రికా టీ20 లీగ్లో మార్కో జన్సెన్, 2024 ఐపీఎల్లో విల్ జాక్స్ రషీద్ ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదారు.మ్యాచ్ విషయానికొస్తే.. స్వల్ప లక్ష్య ఛేదనలో నిదానంగా ఇన్నింగ్స్ను ప్రారంభించిన పోలార్డ్.. రషీద్ ఖాన్ బౌలింగ్లో ఒక్కసారిగా గేర్ మార్చి సిక్సర్ల వర్షం కురిపించాడు. 127 పరుగుల ఛేదనలో 14 బంతులు ఎదుర్కొని 6 పరుగులు మాత్రమే చేసిన పోలార్డ్.. రషీద్ వేసిన 16వ సెట్లో పూనకం వచ్చినట్లు ఊగిపోయి ఐదు సిక్సర్లు బాదాడు. 20 బంతుల్లో తన జట్టు విజయానికి 49 పరుగులు అవసరం కాగా.. పోలార్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రషీద్ బౌలింగ్ను ఊచకోత కోసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో 23 బంతులు ఎదుర్కొన్న పోలార్డ్ 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేశాడు. పోలార్డ్ విధ్వంసం ధాటికి బ్రేవ్ మరో బంతి మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. -
కిరాన్ పొలార్డ్ విధ్వంసం.. వరుసగా 5 సిక్స్లు! వీడియో వైరల్
ది హండ్రెడ్ లీగ్-2024లో శనివారం సౌతాంప్టన్ వేదికగా ట్రెంట్ రాకెట్స్తో జరిగిన మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో సదరన్ బ్రేవ్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్లో సదరన్ బ్రేవ్ ఆల్-రౌండర్ కీరన్ పొలార్డ్ విధ్వంసం సృష్టించాడు.127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సదరన్ బ్రేవ్ 68 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన పొలార్డ్ తొలుత కాస్త ఆచితూచి ఆడాడు. బౌలర్లను ఎదుర్కొవడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు.ఒకనొక దశలో 14 బంతులు ఎదుర్కొన్న ఈ కరేబియన్ ఆల్రౌండర్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అభిమానులకు విసుగు తెప్పించాడు. ఆఖరి 20 బంతుల్లో సదరన్ బ్రేవ్ విజయానికి 49 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో అప్పటివరకు జిడ్డు బ్యాటింగ్ చేసిన పొలార్డ్ పూనకం వచ్చినట్లు చెలరేగిపోయాడు. ట్రెంట్ రాకెట్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్ను పొలార్డ్ ఊచకోత కోశాడు. 16వ సెట్ బౌలింగ్ చేసిన రషీద్ ఖాన్ బౌలింగ్లో పొలార్డ్ వరుసగా 5 సిక్స్లు బాది మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఓవరాల్గా ఈ మ్యాచ్లో 23 బంతులు ఎదుర్కొన్న పొలార్డ్.. 2 ఫోర్లు, 5 సిక్స్లతో 45 పరుగులు చేశాడు. 127 పరుగుల లక్ష్యాన్ని 99 బంతుల్లో 8 వికెట్లు కోల్పోయి చేధించింది. View this post on Instagram A post shared by Southern Brave (@southernbrave) -
చరిత్రపుటల్లోకెక్కిన రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆటగాడు, వరల్డ్ నంబర్ వన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ చరిత్రపుటల్లోకెక్కాడు. టీ20 ఫార్మాట్లో 600 వికెట్లు తీసిన రెండో బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. హండ్రెడ్ లీగ్ 2024లో భాగంగా మాంచెస్టర్ ఒరిజినల్స్తో నిన్న (జులై 29 జరిగిన మ్యాచ్లో రషీద్ 600 వికెట్ల క్లబ్లో చేరాడు. ఒరిజినల్స్ బ్యాటర్ పాల్ వాల్టర్ వికెట్ తీయడంతో 600 వికెట్ల మైలురాయిని తాకడు. టీ20ల్లో రషీద్కు ముందు విండీస్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో మాత్రమే 600 వికెట్లు తీశాడు. బ్రావో 578 మ్యాచ్ల్లో 630 వికెట్లు పడగొట్టగా.. రషీద్ కేవలం 441 మ్యాచ్ల్లో 600 వికెట్ల ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బ్రావో, రషీద్ తర్వాత సునీల్ నరైన్ (557), ఇమ్రాన్ తాహిర్ (502), షకీబ్ అల్ హసన్ (492), ఆండ్రీ రసెల్ (462) ఉన్నారు. భారత్ నుంచి అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్గా చహల్ ఉన్నాడు. చహల్ 305 మ్యాచ్ల్లో 354 వికెట్లు పడగొట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. హండ్రెడ్ లీగ్లో ట్రెంట్ రాకెట్స్కు ఆడుతున్న రషీద్ ఈ మ్యాచ్లో రెండు వికెట్లు తీశాడు. రషీద్తో పాటు ఇమాద్ వసీం (2/21), సామ్ కుక్ (2/37) రాణించడంతో రసవత్తర పోరులో ఒరిజినల్స్పై రాకెట్స్ పరుగు తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాకెట్స్ నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. టామ్ బాంటన్ (45), రోవ్మన్ పావెల్ (27), రషీద్ ఖాన్ (15 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మాంచెస్టర్ బౌలర్లలో టామ్ హార్ట్లీ 3, సికందర్ రజా 2, పాల్ వాల్టర్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం ఛేదనలో మాంచెస్టర్ 100 బంతుల్లో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులకు పరిమితమైంది. ఫలితంగా రాకెట్స్ పరుగు తేడాతో విజయం సాధించింది. మాంచెస్టర్ ఇన్నింగ్స్లో హెల్డన్ (40) టాప్ స్కోరర్గా కాగా.. మ్యాడ్సన్ (28), వాల్టర్ (29), సికందర్ రజా (21) ఓ మోస్తరు పరుగులు చేశారు. రాకెట్స్ బౌలర్లలో ఇమాద్ వసీం, రషీద్ ఖాన్, సామ్ కుక్ తలో 2 వికెట్లు, థాంప్సన్ ఓ వికెట్ పడగొట్టారు. -
హండ్రెడ్ లీగ్లో రసవత్తర సమరం.. పరుగు తేడాతో రషీద్ ఖాన్ టీమ్ విజయం
హండ్రెడ్ లీగ్ 2024లో నిన్న (జులై 29) ఓ రసవత్తర సమరం జరిగింది. మాంచెస్టర్ ఒరిజినల్స్తో జరిగిన మ్యాచ్లో ట్రెంట్ రాకెట్స్ పరుగు తేడాతో గెలుపొందింది. ఆఖరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్లో మాంచెస్టర్ గెలుపుకు చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. క్రీజ్లో ఓపెనింగ్ బ్యాటర్ మ్యాక్స్ హోల్డన్ ఉన్నాడు. జోర్డన్ థాంప్సన్ బౌలింగ్ చేస్తున్నాడు. మామూలు షాట్ ఆడినా ఓ పరుగు సులువుగా వచ్చేది. అయితే హోల్డన్ భారీ షాట్తో మ్యాచ్ ముగిద్దామని ప్రయత్నించి సామ్ హెయిన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా రాకెట్స్ మ్యాచ్ను చేజార్చుకుంది. 2 runs needed off 1 ball and then this happened 🤯🤯🤯The craziest match of the year already 🔥#TheHundred #tapmad #HojaoADFree pic.twitter.com/2ByQfycxNJ— Farid Khan (@_FaridKhan) July 29, 2024ఈ మ్యాచ్లో రాకెట్స్ సునాయాసంగా గెలవాల్సింది. చివరి ఐదు బంతుల్లో ఆ జట్టు ఆరు పరుగులు చేస్తే గెలిచి ఉండేది. సికందర్ రజా తొలి రెండు బంతులకు రెండు డబుల్స్ తీసి రాకెట్స్ గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు. ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. మూడో బంతికి పరుగు రాకపోగా.. నాలుగో బంతికి సికందర్ రజా రనౌటయ్యాడు. దీంతో చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి వచ్చింది. జోర్డన్ థాంప్సన్ లెంగ్త్ డెలివరిని వేయగా హోల్డన్ పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి బ్యాక్వర్డ్ స్వేర్ లెగ్లో ఉన్న ఫీల్డర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాకెట్స్.. నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. టామ్ బాంటన్ (45), రోవ్మన్ పావెల్ (27), రషీద్ ఖాన్ (15 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మాంచెస్టర్ బౌలర్లలో టామ్ హార్ట్లీ 3, సికందర్ రజా 2, పాల్ వాల్టర్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనలో మాంచెస్టర్ 100 బంతుల్లో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులకు పరిమితమైంది. ఫలితంగా రాకెట్స్ పరుగు తేడాతో విజయం సాధించింది. మాంచెస్టర్ ఇన్నింగ్స్లో హెల్డన్ (40) టాప్ స్కోరర్గా కాగా.. మ్యాడ్సన్ (28), వాల్టర్ (29), సికందర్ రజా (21) ఓ మోస్తరు పరుగులు చేశారు. రాకెట్స్ బౌలర్లలో ఇమాద్ వసీం, రషీద్ ఖాన్, సామ్ కుక్ తలో 2 వికెట్లు, థాంప్సన్ ఓ వికెట్ పడగొట్టారు.నిన్ననే ఇరు జట్ల మధ్య జరిగిన మహిళల మ్యాచ్లో ఫలితం రివర్స్ అయ్యింది. ట్రెంట్ రాకెట్స్పై మాంచెస్టర్ ఒరిజినల్స్ పరుగు తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ నిర్ణీత 100 బంతుల్లో 137 పరుగులు చేయగా.. రాకెట్స్ 100 బంతుల్లో 136 పరుగులకే ఓటమిపాలైంది. -
డుప్లెసిస్ మెరుపు అర్ద సెంచరీ.. రషీద్ ఖాన్ వీరోచిత పోరాటం
మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) 2024 ఎడిషన్లో భాగంగా ముంబై ఇండియన్స్ న్యూయార్క్తో ఇవాళ (భారతకాలమానం ప్రకారం) జరిగిన మ్యాచ్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది.డుప్లెసిస్ మెరుపు అర్ద సెంచరీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టెక్సాస్ సూపర్ కింగ్స్.. ఓపెనర్లు డుప్లెసిస్ (38 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), డెవాన్ కాన్వే (28 బంతుల్లో 40; 3 ఫోర్లు, సిక్సర్) చెలరేగి ఆడటంతో ఓ మోస్తరు స్కోర్ చేసింది. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్లో ఆరోన్ హార్డీ 22, జాషువ ట్రంప్ 3, మిలింద్ కుమార్ 2, సావేజ్ 10 పరుగులు చేసి ఔట్ కాగా.. స్టోయినిస్ 24, డ్వేన్ బ్రావో 7 పరుగులతో అజేయంగా నిలిచారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ (4-0-17-1) పొదుపుగా బౌలింగ్ చేయగా.. ట్రెంట్ బౌల్ట్ 2, నోష్తుష్ కెంజిగే, ఎహసాన్ ఆదిల్ తలో వికెట్ పడగొట్టారు.రషీద్ ఖాన్ వీరోచిత పోరాటం వృధా177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. 52 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. మెనాంక్ పటేల్ (45 బంతుల్లో 61; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), రషీద్ ఖాన్ (23 బంతుల్లో 50; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆదుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రషీద్ పోరాడితే పోయేదేమీ లేదన్నట్లు బ్యాటింగ్ చేశాడు. రషీద్ వీరోచితంగా పోరాడినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్లో కీరన్ పోలార్డ్ (17 బంతుల్లో 5), టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 6) చాలా బంతులు వృధా చేశారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో స్టోయినిస్ 4, జియా ఉల్ హక్ 2, మొహమ్మద్ మోహిసిన్ ఓ వికెట్ పడగొట్టారు.ఇదిలా ఉంటే, మేజర్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్ జులై 5న మొదలైన విషయం తెలిసిందే. ఈ ఎడిషన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో వాషింగ్టన్ ఫ్రీడం (4 మ్యాచ్ల్లో 3 విజయాలు) టాప్లో ఉండగా.. టెక్సాస్ సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్, సీయాటిల్ ఓర్కాస్ వరుస స్థానాల్లో ఉన్నాయి. లీగ్లో భాగంగా రేపు (రాత్రి ఒంటి గంటకు) జరుగబోయే మ్యాచ్లో సీయాటిల్ ఓర్కాస్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్ తలపడనున్నాయి. -
సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం.. ఆఫ్ఘన్ల గుండె బద్దలైంది..!
టీ20 వరల్డ్కప్ 2024లో ఆఫ్ఘనిస్తాన్ జైత్రయాత్ర ముగిసింది. ఇవాళ (జూన్ 27) జరిగిన తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా చేతిలో ఓటమితో ప్రపంచకప్లో ఆఫ్ఘనిస్తాన్ పోరాటం ముగిసింది. ఈ ఓటమితో ఆఫ్ఠనిస్తాన్ వరల్డ్కప్ నుంచి నిష్క్రమించింది. టోర్నీ ఆరంభం నుంచి సంచలన విజయాలు సాధిస్తూ సెమీస్ దాకా చేరిన ఆఫ్ఘనిస్తాన్ అవమానకర రీతిలో వైదొలగడం ప్రతి క్రికెట్ అభిమానిని కలిచి వేస్తుంది. ఈ ఓటమి అనంతరం ఆఫ్ఘన్ల గుండెలు బద్దలయ్యాయి. ఆఫ్ఘన్ ఆటగాళ్లు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ దేశ అభిమానుల బాధ అయితే వర్ణణాతీతంగా ఉంది. ఆఫ్ఘన్ ఓటమిని తట్టుకోలేని ఫ్యాన్స్ కన్నీటిపర్యంతమయ్యారు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలిన అనంతరం కెప్టెన్ రషీద్ ఖాన్, కోచ్ జోనాథన్ ట్రాట్ ముఖాల్లో విషాద ఛాయలు కనిపించాయి. వారి ముఖాలు చూస్తే ఎంత కఠినాత్ములకైనా జాలేయాల్సిందే. రషీద్ ఖాన్ కన్నీటిపర్యంతమవుతూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఓటమి అనంతరం డగౌట్కు చేరుకునే క్రమంలో ఆఫ్ఘన్ ఆటగాళ్లు ఏడ్చినంత పని చేశారు. ఆఫ్ఘన్ ఆటగాళ్ల విషాద ముఖాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లు ఆఫ్ఘన్లను ఓదారుస్తున్నారు. ఆటలో గెలుపోటములు సహజమే అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే తలెత్తుకో కెప్టెన్ అని ట్వీట్ చేసింంది. Chin up, Skipp! You've given us the World this event! 🙌@RashidKhan_19#AfghanAtalan | #T20WorldCup | #GloriousNationVictoriousTeam pic.twitter.com/jFu6SO2vmX— Afghanistan Cricket Board (@ACBofficials) June 27, 2024మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్కు తొలిసారి సెమీస్కు చేరామన్న సంతోషం కనీసం రెండ్రోజులైనా లేకుండా పోయింది. ఈ బాధ నుంచి వారు బయటపడాలంటే సమయం తీసుకుంటుంది. కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో ఆఫ్ఘనిస్తాన్.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లాంటి మెరుగైన జట్లకు షాకిచ్చి సెమీస్కు చేరిన విషయం తెలిసిందే. ఆసీస్, బంగ్లాదేశ్లపై విజయాల అనంతరం ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ల సంతోషం వర్ణణాతీతంగా ఉండింది. ఆఫ్ఘన్ల సంబరాలు అంబరాన్నంటాయి. తాజాగా సెమీఫైనల్లో ఓటమి ఆ జట్టు ఆటగాళ్లను, ఆ దేశ అభిమానులను కలిచి వేస్తుంది.ఇదిలా ఉంటే, ట్రినిడాడ్ వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ (జూన్ 27) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ 9 వికెట్ల తేడాతో చిత్తు ఓడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్లు 56 పరుగుల స్వల్ప స్కోర్కు చాపచుట్టేయగా.. సౌతాఫ్రికా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా సౌతాఫ్రికా తొలిసారి ప్రపంచకప్ టోర్నీల్లో (వన్డే, టీ20) ఫైనల్కు చేరింది.ఇవాళ రాత్రి 8 గంటలకు జరుగబోయే రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు వరుణుడి ముప్పు పొంది ఉందని సమాచారం. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే సూపర్-8లో మెరుగైన పాయింట్లు ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్స్కు వెళ్తుంది. ఈ మ్యాచ్కు రిజర్వ్ డే లేదు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుతో సౌతాఫ్రికా ఫైనల్లో తలపడుతుంది. -
T20 World Cup 2024: రషీద్ ఖాన్కు మందలింపు
ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ను ఐసీసీ మందలించింది. టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన సూపర్-8 మ్యాచ్లో బ్యాట్ను నేలకేసి కొట్టినందుకు గాను మందలింపుతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ను ఫైన్గా విధించింది. 24 నెలల వ్యవధిలో రషీద్ చేసిన మొదటి తప్పిదం కావడంతో ఐసీసీ స్వల్ప చర్యలతో సరిపెట్టింది. బ్యాట్ను నేలకేసి కొట్టడం ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.9ని ఉల్లంఘన కిందికి వస్తుంది. దీన్ని లెవెల్ 1 తప్పిదంగా పరిగణిస్తారు.బంగ్లాదేశ్తో మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో రషీద్ బ్యాట్ను నేలకేసి కొట్టాడు. ఆ సందర్భంలో తన బ్యాటింగ్ భాగస్వామి కరీం జనత్ స్ట్రైక్ను తిరస్కరించినందుకు (రెండో పరుగు) రషీద్ బ్యాట్ను నేలకేసి కొట్టాడు. ఆ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించి సెమీఫైనల్కు చేరింది. అయితే సెమీస్లో ఆ జట్టుకు సౌతాఫ్రికా చేతిలో చుక్కెదురైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్లు 56 పరుగుల స్వల్ప స్కోర్కు చాపచుట్టేయగా.. సౌతాఫ్రికా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా సౌతాఫ్రికా తొలిసారి ప్రపంచకప్ టోర్నీల్లో (వన్డే, టీ20) ఫైనల్కు చేరింది. ఇవాళే (జూన్ 27, రాత్రి 8 గంటలకు) జరుగబోయే రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు వరుణుడి ముప్పు పొంచి ఉందని సమాచారం. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే సూపర్-8లో మెరుగైన పాయింట్లు ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్స్కు వెళ్తుంది. ఈ మ్యాచ్కు రిజర్వ్ డే లేదు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుతో సౌతాఫ్రికా ఫైనల్లో తలపడుతుంది. -
భారత్కు ధన్యవాదాలు!.. అన్నీ తామై నడిపించిన వీరులు
క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా అఫ్గనిస్తాన్ జట్టు గురించే చర్చ. అసాధారణ ఆట తీరుతో రషీద్ ఖాన్ బృందం టీ20 వరల్డ్కప్-2024లో సెమీస్ చేరిన విధానం నిజంగా ఓ అద్భుతం లాంటిదే. న్యూజిలాండ్పై భారీ విజయం మొదలు.. ఆస్ట్రేలియాను ఓడించడం దాకా.. సంచలన ప్రదర్శనతో అఫ్గన్ ఇక్కడిదాకా చేరుకున్న తీరు అమోఘం. గత ఎడిషన్లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవని జట్టు ఈసారి ఏకంగా టాప్-4లో నిలవడం అంటే మామూలు విషయం కాదు.గత కొన్నేళ్లుగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గన్లకు రషీద్ బృందం సాధించిన విజయం కొత్త ఊపిరిలూదింది. కష్టాలన్నీ మర్చిపోయి వీధుల్లోకి వచ్చి మరీ ప్రజలు తమ సంతోషాన్ని పంచుకోవడం ఇందుకు నిదర్శనం.ఈ క్రమంలో అఅఫ్గన్ క్రికెట్ ఎదుగుదులలో తోడ్పాడు అందించిన భారత్కు తాలిబన్ రాజకీయ కార్యాలయ అధినేత సుహైల్ ఖాన్ ధన్యవాదాలు చెప్పడం విశేషం. ఇక అఫ్గన్ ప్రయాణం ఇక్కడి దాకా సాగడంలో కీలక పాత్ర పోషించిన ముఖ్యమైన వ్యక్తులకు కూడా తాలిబన్ నేతలు, అఫ్గన్ ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆ ముఖ్యులు ఎవరంటే..రషీద్ ఖాన్కెప్టెన్గా జట్టుకు అన్నీ తానే, అంతటా తానే అయి నడిపిస్తున్నాడు. తన పదునైన లెగ్స్పిన్తో టోర్నీలో 16 వికెట్లు పడగొట్టిన రషీద్... బ్యాటింగ్లోనూ మెరుపులతో తన పాత్ర పోషించాడు. బంగ్లాతో మ్యాచ్లో అతని మూడు సిక్సర్లే చివరకు కీలకంగా మారాయి. ఆసీస్తో మ్యాచ్లో బౌలర్లను మార్చిన తీరులో అతని నాయకత్వ సామర్థ్యం కూడా కనిపించింది. 25 ఏళ్ల రషీద్ ఇప్పటి వరకు 92 టి20లు ఆడి 152 వికెట్లు తీయడంతోపాటు 452 పరుగుల సాధించాడు. రహ్మనుల్లా గుర్బాజ్ఓపెనర్గా అతని దూకుడైన ఆట జట్టుకు మంచి ఆరంభాలను అందించి విజయానికి బాటలు వేసింది. 281 పరుగులతో ప్రస్తుతం టోర్నీ టాప్ స్కోరర్గా ఉన్నాడు. ముఖ్యంగా కోల్కతా నైట్రైడర్స్ తరఫున ఐపీఎల్ అనుభవంతో ఇటీవల అతని బ్యాటింగ్ మరింత పదునెక్కింది. 22 ఏళ్ల గుర్బాజ్ ఇప్పటి వరకు 62 టి20లు ఆడి 1657 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. నవీన్ ఉల్ హక్ప్రధాన పేసర్గా జట్టుకు కీలక సమయాల్లో వికెట్లు అందించి పైచేయి సాధించేలా చేశాడు. టోర్నీలో 13 వికెట్లు తీసిన అతను బంగ్లాదేశ్పై ఆరంభంలో తీసిన 2 వికెట్లే విజయానికి బాటలు వేశాయి.ట్రవిస్ హెడ్ను క్లీన్»ౌల్డ్ చేసిన అతని అవుట్స్వింగర్ టోర్నీకే హైలైట్గా నిలిచింది. 24 ఏళ్ల నవీన్ 44 టి20లు ఆడి 59 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పలు ఫ్రాంచైజీ లీగ్లలో రెగ్యులర్గా ఆడుతున్నాడు. ‘మీరు బాగా ఆడితే గెలిస్తే చాలు...అదే నాకు ఫీజు, పారితోషకం’ – అజయ్ జడేజా (వన్డే వరల్డ్ కప్లో టీమ్కు మెంటార్గా పని చేసిన జడేజా అఫ్గాన్ బోర్డునుంచి ఒక్క రూపాయి కూడా తీసుకునేందుకు నిరాకరించాడు) డ్వేన్ బ్రేవో (బౌలింగ్ కన్సల్టెంట్): 573 టి20 మ్యాచ్లు, 625 వికెట్లతో అపార అనుభవం ఉన్న విండీస్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రేవోను ఈ టోర్నీ కోసం అఫ్గాన్ బౌలింగ్ కన్సల్టెంట్గా నియమించుకుంది. అతడి నియామకాన్ని జట్టు సమర్థంగా వాడుకుంది. ముఖ్యంగా అఫ్గాన్ పేసర్ల బౌలింగ్లో ఆ తేడా కనిపించింది. టి20ల్లో స్లో బంతులను వాడే విషయంలో బ్రేవో సూచనలు, వ్యూహాలు అద్భుతంగా పని చేశాయి. జొనాథన్ ట్రాట్: ఇంగ్లండ్ మాజీ ఆటగాడైన ట్రాట్ హెడ్ కోచ్గా జట్టు పురోగతిలో కీలక పాత్ర పోషించాడు. జూలై 2022 నుంచి అతను కోచ్గా కొనసాగుతున్నాడు. గత ఏడాదే పదవీ కాలం పూర్తయినా మళ్లీ అతడినే అఫ్గాన్ కొనసాగించింది. ట్రాట్ శిక్షణ, ప్రణాళికలు కొత్త తరహా టీమ్ను ప్రపంచానికి పరిచయం చేశాయి. ఇప్పుడు సరైన ఫలితాలు అందిస్తున్నాయి. మహ్మద్ నబీ15 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో ఆ జట్టు ప్రస్థానం ప్రారంభమైంది. ఆరంభంలో ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్–డివిజన్–5లో జపాన్, బోట్స్వానావంటి జట్లతో తలపడిన టీమ్ ఇప్పుడు ఆసీస్, కివీస్, విండీస్, పాక్లను దాటి వరల్డ్ కప్ సెమీస్లోకి అడుగు పెట్టడం అసాధారణం. అఫ్గానిస్తాన్ ఆల్రౌండర్ మొహమ్మద్ నబీ 15 ఏళ్లుగా జాతీయ జట్టుకు ఆడుతున్నాడు. అఫ్గాన్ పురోగతికి అతను ప్రత్యక్ష సాక్షి. అఫ్గాన్ తరఫున ఏకంగా 45 ప్రత్యర్థి దేశాలపై విజయం సాధించిన టీమ్లలో అతను భాగస్వామి. ‘ఆరంభంలో మేం ఎదుర్కొన్న సమస్యలను దాటి ఇక్కడికి రావడం ఎంతో గొప్పగా అనిపిస్తోంది. మా ఘనతల వెనక ఎన్నో కష్టాలు, త్యాగాలు ఉన్నాయి. అవి ఇప్పుడు ఫలితాన్ని అందించాయి’ అని నబీ చెప్పాడు. ఈ టోర్నీలో అఫ్గాన్ టీమ్ ప్రదర్శనలతో పలువురు కీలక పాత్ర పోషించారు. కల నిజమైందిసెమీస్కు చేరడం కలగా ఉంది. ఇంకా నమ్మలేకపోతున్నాను. న్యూజిలాండ్పై గెలుపుతో మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మేం చేసింది తక్కువ స్కోరని తెలుసు. కానీ గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నాం. మా ప్రణాళికలను సమర్థంగా అమలు చేశాం. జట్టులో ప్రతీ ఒక్కరు తమ పాత్ర సమర్థంగా పోషించారు. ఇది పెద్ద ఘనత మా దేశంలో ప్రజలకు సంతోషం పంచాలని కోరుకున్నాం. అక్కడ ఇప్పుడు సంబరాలు జరుగుతున్నాయి. మా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు. –రషీద్ ఖాన్, అఫ్గానిస్తాన్ కెప్టెన్ -సాక్షి. క్రీడా విభాగం -
సఫారీలకు సెమీస్ గండం.. ఈ సారైనా గట్టెక్కుతారా?
ఐసీసీ వరల్డ్కప్లలో అత్యంత దురదృష్టకరమైన జట్టు ఎదైనా ఉందంటే మనకు టక్కున గుర్తుచ్చేది దక్షిణాఫ్రికానే. టోర్నీ మొత్తం ఆసాధరణమైన ప్రదర్శన.. వరుసగా విజయాలు. కానీ కీలకమైన సెమీఫైనల్స్లో మాత్రం ఒత్తిడికి చిత్తు. ఇప్పటివరకు అటు వన్డే వరల్డ్కప్లోనూ, ఇటు టీ20 వరల్డ్కప్లోనూ కనీసం ఒక్కసారి కూడా ఫైనల్లో అడుగుపెట్టలేకపోయింది.ప్రతీసారి సెమీస్ లో ఓడిపోతూ చోకర్స్ గా ముద్రపడ్డ సఫారీలు మరోసారి టైటిల్ రేసులో నిలబడ్డారు. పొట్టి వరల్డ్కప్లలో ముచ్చటగా మూడోసారి సెమీస్లో సౌతాఫ్రికా అడుగుపెట్టింది. టీ20 వరల్డ్కప్-2024 తొలి సెమీఫైనల్లో భాగంగా ట్రినడాడ్ వేదికగా శుక్రవారం సంచలనాల అఫ్గానిస్తాన్తో దక్షిణాఫ్రికా తలపడనుంది.ఈ సారైనా గట్టుకెక్కుతుందా?ఓవరాల్గా వన్డే, టీ20 ప్రపంచకప్ల నాకౌట్స్లో దక్షిణాఫ్రికా 10 సార్లు తలపడింది. ఆడిన 10 మ్యాచ్ల్లో కేవలం మ్యాచ్లో మాత్రం విజయం సాధించింది. అది కూడా క్వార్టర్ ఫైనల్లో కావడం గమనార్హం. ఇక 8 మ్యాచ్ల్లో ఓటమి పాలవ్వగా.. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది.టీ20 వరల్డ్కప్లో ఇప్పటివరకు రెండు సార్లు సెమీఫైన్సల్ ఆడిన దక్షిణాఫ్రికా ఓసారి పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలవ్వగా.. మరోసారి ఇండియా చేతిలో పరాజయం పాలైంది. కానీ ఈసారి మాత్రం తమ పేరిట ఉన్న చోకర్స్ ముద్రను ఎలాగైనా చెరేపేయాలన్న కసితో దక్షిణాఫ్రికా ఉంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆజేయంగా ఉన్న సౌతాఫ్రికా అదే జోరును సెమీస్లోనూ కొనసాగించి తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతోంది.దక్షిణాఫ్రికా బలబలాలు..దక్షిణాఫ్రికా బ్యాటింగ్ బౌలింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. బ్యాటింగ్లో క్వింటన్ డికాక్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్ వంటి అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. ప్రస్తుతం వారు అంతా మంచి రిథమ్లో కూడా ఉన్నారు. అయితే కెప్టెన్ మార్క్రమ్ ఫామ్ మాత్రం ప్రోటీస్ జట్టు మెనెజ్మెంట్ను కలవరపెడుతోంది. అదేవిధంగా స్పిన్ను కూడా ఎదుర్కొనేందుకు సఫారీ బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడుతున్నారు. అఫ్గాన్ ప్రధాన బలం స్పిన్నర్లే. మరి అఫ్గాన్ స్పిన్నర్లు దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. ఇక దక్షిణాఫ్రికా బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సఫారీ బౌలర్లు అదరగొడుతున్నారు. నోర్జే, రబాడ, జానెసన్ వంటి పేసర్లు ప్రత్యర్ధి జట్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ పేస్ త్రయం చెలరేగితే అఫ్గాన్ బ్యాటర్లకు కష్టాల్లు తప్పవు.అఫ్గాన్తో అంత ఈజీ కాదు..అయితే ప్రస్తుత వరల్డ్కప్లో సంచలనాలు నమోదు చేస్తున్న అఫ్గానిస్తాన్ను ఓడించడం దక్షిణాఫ్రికాకు అంత ఈజీ కాదు. ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు వంటి పటిష్టమైన జట్లను ఓడించి తొలిసారి సెమీస్లో అడుగుపెట్టిన అఫ్గాన్.. రెట్టింపు ఆత్మవిశ్వాసంతో సఫారీలను ఢీ కొట్టనుంది. అఫ్గాన్ బ్యాటింగ్ పరంగా కాస్త వీక్గా కన్పిస్తున్నప్పటకి బౌలింగ్లో మాత్రం బలంగా కన్పిస్తోంది. అఫ్గాన్ జట్టులో వరల్డ్క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. అదేవిధంగా పేస్ బౌలింగ్లోనూ ఫరూఖీ, నవీన్ ఉల్ హక్ సత్తాచాటుతున్నారు. బ్యాటింగ్లో ఎక్కువగా ఓపెనర్లపైనే అఫ్గాన్ ఆధారపడుతోంది. సెమీస్లో ఆల్రౌండ్ షోతో అఫ్గాన్ అదరగొడితే దక్షిణాఫ్రికాకు ఇబ్బందులు తప్పవు. -
అఫ్గనిస్తాన్ చీటింగ్ చేసి గెలిచిందా? ఏంటీ డ్రామా? ఫ్యాన్స్ ఫైర్
ఐసీసీ టోర్నీలో తొలిసారి సెమీస్ చేరిన అఫ్గనిస్తాన్ జట్టుపై ప్రశంసలు కురుస్తున్నాయి. టీ20 ప్రపంచకప్-2024లో అండర్డాగ్స్గా అడుగుపెట్టి టాప్-4లో నిలిచినందుకు రషీద్ ఖాన్ బృందాన్ని క్రికెట్ ప్రపంచం కొనియాడుతోంది.అయితే, అదే సమయంలో అడ్డదారిలో గెలిచారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించి.. బంగ్లాదేశ్ను దెబ్బకొట్టారనే ఆరోపణలు వస్తున్నాయి.ఆ ఇద్దరిపై ఆగ్రహంఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ కోచ్ జొనాథన్ ట్రాట్, బౌలింగ్ ఆల్రౌండర్ గుల్బదిన్ నైబ్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే..వరల్డ్కప్-2024 సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో అఫ్గనిస్తాన్ బంగ్లాదేశ్తో తలపడింది. సెయింట్ విన్సెంట్ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అఫ్గన్ తొలుత బ్యాటింగ్ చేసింది.రహ్మనుల్లా గుర్బాజ్ రైజ్ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 43 పరుగులతో రాణించగా.. కెప్టెన్ రషీద్ ఖాన్ 19 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగతా వాళ్లలో మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 18 రన్స్ తీయగా.. వేరెవరు కనీసం పది పరుగుల స్కోరు దాటలేదు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 115 పరుగులు స్కోరు చేసింది అఫ్గన్ జట్టు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్కు ఆదిలోనే షాకిచ్చారు అఫ్గన్ పేసర్లు.ఓపెనర్ తాంజిద్ హసన్ డకౌట్ కాగా.. వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ నజ్ముల్ షాంటో ఐదు పరుగులకే నిష్క్రమించాడు. మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కాసేపైనా క్రీజులో నిలవలేకపోయారు.పట్టుదలగా లిటన్ దాస్ఇలాంటి క్లిష్ట సమయంలో ఓపెనర్ లిటన్ దాస్(54 నాటౌట్) పట్టుదలగా నిలబడ్డాడు. అయితే, బంగ్లా ఇన్నింగ్స్ పన్నెండో ఓవర్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.లిటన్ దాస్తో కలిసి తంజీమ్ హసన్ సకీబ్ క్రీజులో ఉన్న సమయంలో వర్షం పడే సూచనలు కనిపించాయి. పన్నెండో వోర్ వేసిన నూర్ అహ్మద్ బౌలింగ్లో నాలుగో బంతికి తంజీమ్ ఒక్క పరుగు కూడా తీయలేకపోయాడు.అదే సమయంలో అఫ్గన్ కోచ్ జొనాథన్ ట్రాట్ వాన పడే అవకాశం ఉందని తమ ఆటగాళ్లకు సంకేతాలు ఇచ్చాడు. కాస్త స్లోగా ఆడండని సైగలు చేశాడు.తొడ కండరాల్లో నొప్పి అంటూఅప్పటికి బంగ్లాదేశ్ స్కోరు 81/7.. డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్ అఫ్గనిస్తాన్ కంటే కేవలం రెండు పరుగులే వెనుకబడి ఉంది. అంటే.. ఆ సమయంలో వర్షం పడి.. ఆ తర్వాత మ్యాచ్ గనుక రద్దైపోతే ఫలితం అఫ్గనిస్తాన్కు అనుకూలంగా వచ్చే అవకాశం ఉండదు.ఈ నేపథ్యంలో కోచ్ సైగల మేరకు స్లిప్స్లో ఫీల్డింగ్ చేస్తున్న నైబ్.. ఒక్కసారిగా చేతి పైకెత్తి.. తొడ కండరాల్లో నొప్పి అంటూ కుప్పకూలిపోయాడు. అతడి చేష్టలు చూసి కెప్టెన్ రషీద్ ఖాన్ సైతం అసహనంగా కదిలాడు. అసలేమైంది అన్నట్లుగా సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు.This has got to be the most funniest thing ever 🤣 Gulbadin Naib just breaks down after coach tells him to slow things down 🤣😂 pic.twitter.com/JdHm6MfwUp— Sports Production (@SportsProd37) June 25, 2024 ఇంతలో నైబ్కు సబ్స్టిట్యూట్గా నజీబుల్లా మైదానంలోకి రాగా.. ఫిజియోలతో పాటు నైబ్ మైదానం వీడాడు. అప్పటికి వర్షం పడలేదు. కానీ నైబ్ వల్ల మ్యాచ్ కాస్త ఆలస్యమైంది. ఆ తర్వాతి బంతికి బంగ్లా ఒక పరుగు చేసింది. ఓవర్లో మొత్తంగా రెండు పరుగులే వచ్చాయి.ఒకవేళ నైబ్ డ్రామా చేయకపోయి ఉంటే.. మరుసటి రెండు బంతుల్లో గనుక బంగ్లా రెండు పరుగులు చేసి.. ఆ తర్వాత వర్షం పడి మ్యాచ్ రద్దైతే కచ్చితంగా బంగ్లానే గెలిచేది.సెమీస్ రేసు నుంచి అవుట్అయితే, నైబ్ గాయం వల్ల ఆలస్యానికి తోడు వరణుడు కూడా అప్పటికి కరుణించడంతో మ్యాచ్ కొనసాగింది. ఇక పదమూడవ ఓవర్లో బంగ్లాదేశ్ కేవలం ఆరు పరుగులే చేయగా.. గ్రూప్-1 సమీకరణలకు అనుగుణంగా సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.అప్పుడు సెమీస్ బెర్తు కోసం ఆస్ట్రేలియా- అఫ్గనిస్తాన్ మధ్య పోటీ ఏర్పడింది. మరోవైపు డీఎల్ఎస్ పద్ధతిలో బంగ్లా ఇన్నింగ్స్ను 19 ఓవర్లకు కుదించి విజయ లక్ష్యాన్ని 114 పరుగులుగా విధించారు అంపైర్లు. అయితే, అఫ్గన్ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో బంగ్లాదేశ 17.5 ఓవర్లలో కేవలం 105 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.కేవలం 33 నిమిషాల వ్యవధిలోనే తిరిగి వచ్చిఫలితంగా అఫ్గనిస్తాన్ గెలిచి సెమీస్లో అడుగుపెట్టగా.. ఆస్ట్రేలియా ఇంటిబాట పట్టింది. అయితే, ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. అంతకుముందు గాయంతో విలవిల్లాడిన గుల్బదిన్ నైబ్.. కేవలం 33 నిమిషాల వ్యవధిలోనే తిరిగి వచ్చి ఓ వికెట్ తీయడంతో పాటు.. గెలుపు సంబరాల్లో అందరికంటే వేగంగా పరిగెత్తడం.ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్కాగా గుల్బదిన్ నైబ్ ‘లీల’ల గురించి చర్చ మొదలైంది. కామెంటేటర్ సైమన్ డౌల్ అయితే.. ‘‘ఆస్కార్ గెలుచుకునే నటన.. ఆ ఫిజియోలు సూపర్.. మరీ ఇంత త్వరగా గాయం నుంచి కోలుకోవడం నిజంగా ఆశ్చర్యమే’’ అంటూ సెటైర్లు వేశాడు.టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం గుల్బదిన్కు రెడ్కార్డ్ ఇవ్వాలంటూ సరదాగా కామెంట్ చేయగా.. అతడు బదులిస్తూ ఒక్కోసారి సంతోషం.. ఒక్కోసారి దుఃఖం అంతే అంటూ అంతే లైట్గా తీసుకున్నాడు.No words.... @ICC shouldtake action on this pic.twitter.com/61n3N2SuhG— Hassan Abbasian (@HassanAbbasian) June 25, 2024 -
అఫ్గనిస్తాన్ సంచలనాలు.. మనోళ్లదే పెద్దన్న పాత్ర!
టీ20 ప్రపంచకప్-2024లో సంచలనం.. పసికూనగా భావించే అఫ్గనిస్తాన్ తొలిసారిగా ఓ ఐసీసీ టోర్నీలో సెమీ ఫైనల్ చేరింది. సరికొత్త చరిత్రకు నాంది పలికింది. అంతర్జాతీయ క్రికెట్ మండలిలో పూర్తిస్థాయి సభ్యత్వ దేశంగా మారిన ఏడేళ్ల వ్యవధిలోనే ఈ ఘనత సాధించింది అఫ్గన్ జట్టు.దేశంలోని అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా అనేక కష్టనష్టాలకోర్చి ఈరోజు ప్రపంచం దృష్టిని ఆకర్షించి స్థాయికి ఎదిగింది. ముఖ్యంగా వరల్డ్కప్ వంటి మెగా టోర్నీలో హేమాహేమీలైన న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలను ఓడించి సత్తా చాటింది.ఈ రెండు మేటిజట్లను దాటుకుని.. కీలక మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించి సెమీస్లో సగర్వంగా అడుగుపెట్టింది. ట్రినిడాడ్లో గురువారం నాటి మ్యాచ్లో భాగంగా సౌతాఫ్రికాతో తొలి సెమీ ఫైనల్లో తలపడనుంది. మరి అఫ్గనిస్తాన్ జట్టు ఇక్కడిదాకా రావడం వెనుక భారత్ పాత్ర కూడా ఉందన్న విషయం తెలుసా?!అవును.. అండర్డాగ్స్గా ఉన్న అఫ్గనిస్తాన్ జట్టు ఈ స్థాయికి ఎదగడం వెనుక భారత క్రికెట్ నియంత్రణ మండలి హస్తం కూడా ఉంది. దేశంలోని ఆర్థిక పరిస్థితులు, సదుపాయాల లేమి దృష్ట్యా అఫ్గనిస్తాన్కు అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్లకు ఆతిథ్యం కల్పించే అవకాశం లేకుండా పోయింది.పెద్దన్నగా ఆపన్నహస్తంఅలాంటి సమయంలో బీసీసీఐ అఫ్గన్ బోర్డుకు పెద్దన్నగా ఆపన్నహస్తం అందించింది. గ్రేటర్ నోయిడాలో ఉన్న షాహీద్ విజయ్ సింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను తమ హోం గ్రౌండ్గా వాడుకునేందుకు 2015లో బీసీసీఐ అనుమతినిచ్చింది.ఈ క్రమంలో 2017లో అఫ్గనిస్తాన్ గ్రేటర్ నోయిడా వేదికగా ఐర్లాండ్తో అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లోనూ పాల్గొంది. ఆ తర్వాత కొన్నాళ్లకు తమ మకాంను షార్జాకు మార్చిన అఫ్గన్ జట్టు.. మళ్లీ ఉత్తరప్రదేశ్ వేదికగా బంగ్లాదేశ్తో వన్డే, టీ20 సిరీస్ ఆడేందుకు సిద్దమైంది.అంతర్జాతీయ వేదిక కల్పించిఇలా సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్న అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టును బీసీసీఐ ఆదుకుంది. అంతర్జాతీయ వేదిక కల్పించి వారిని ప్రోత్సహించింది.మనవాళ్లే ముందుండి నడిపించిఇక అఫ్గన్ జట్టు బలోపేతం కావడంలో పలువురు భారత మాజీ క్రికెటర్ల పాత్ర కూడా ఉండటం విశేషం. లాల్చంద్ రాజ్పుత్, మనోజ్ ప్రభాకర్, అజయ్ జడేజా గతంలో ఈ జట్టుకు మార్గనిర్దేశకులుగా ఉన్నారు.వన్డే వరల్డ్కప్-2023 సమయంలో అజయ్ జడేజా అఫ్గన్ మెంటార్గా ఉండి ముందుకు నడిపించగా.. అంచనాలకు మించి రాణించింది. అంతేకాదు మొట్టమొదటిసారి పాకిస్తాన్పై వన్డేలో విజయం సాధించి చరిత్ర సృష్టించింది.దేశాల మధ్య సత్సంబంధాలుభారత్- అఫ్గనిస్తాన్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఆ దేశ పార్లమెంట్ భవనం నిర్మాణం విషయంలోనూ భారత్ ఆర్థిక సహాయం చేసింది.ఇక ప్రపంచంలోనే సంపన్న బోర్డు అయిన బీసీసీఐ గతంలో ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీని ఇండియాకు ఆహ్వానించింది. బెంగళూరు వేదికగా టీమిండియాతో అఫ్గన్ తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న వేళ.. మ్యాచ్ వీక్షించేందుకు స్వాగతం పలికింది. ఇరు దేశాల అనుబంధం, క్రికెట్ జట్ల మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఐపీఎల్లో అఫ్గన్ ఆటగాళ్లుఇటీవల ఆస్ట్రేలియాపై విజయం తర్వాత అఫ్గన్ కెప్టెన్ రషీద్ ఖాన్ మాట్లాడుతూ.. లీగ్ క్రికెట్ ఆడుతుండటం వల్లే తమ జట్టు టీ20 ఫార్మాట్లో మరింత దృఢంగా మారిందని పేర్కొన్నాడు.ముమ్మాటికీ అది నిజమే.. ముఖ్యంగా ఐపీఎల్లో ఆడటం ద్వారా అఫ్గనిస్తాన్ ఆటగాళ్ల ఆర్థిక స్థితి మెరుగుపడటమే గాకుండా.. క్యాష్ రిచ్ లీగ్ ద్వారా వారి నైపుణ్యాలు మరింత విస్తృతంగా అభిమానులను ఆకర్షిస్తున్నాయి.రషీద్ ఖాన్ సహా మహ్మద్ నబీ, రహ్మనుల్లా గుర్బాజ్.. ముఖ్యంగా బంగ్లాదేశ్పై అఫ్గన్ గెలుపొంది.. సెమీస్ చేరడంలో కీలక పాత్ర పోషించిన పేసర్ నవీన్ ఉల్ హక్ కూడా ఐపీఎల్లో ఆడుతున్నవాడే!చదవండి: David Warner: డేవిడ్ వార్నర్ గుడ్బై View this post on Instagram A post shared by ICC (@icc) -
ఆయనొక్కడే మమ్మల్ని నమ్మాడు: రషీద్ ఖాన్ భావోద్వేగం
అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. తొలిసారి ప్రపంచకప్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. టీ20 వరల్డ్కప్-2024 సూపర్-8 మ్యాచ్లో భాగంగా బంగ్లాదేశ్ను చిత్తు చేసి ఈ మేరకు చరిత్ర సృష్టించింది. View this post on Instagram A post shared by ICC (@icc)అంతేకాదు అఫ్గన్ దెబ్బకు.. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియా టోర్నీ నుంచే నిష్క్రమించింది. దీంతో అఫ్గనిస్తాన్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లు సైతం తీవ్ర భావోద్వేగంలో మునిగిపోయారు. View this post on Instagram A post shared by ICC (@icc)నమ్మశక్యం కాని రీతిలోఇక చారిత్రాత్మక విజయానంతరం అఫ్గనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెమీస్ చేరడం ఓ కలలాగా ఉందని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. నమ్మశక్యం కాని రీతిలో న్యూజిలాండ్ను ఓడించామని.. ఇప్పుడిలా ఇక్కడిదాకా చేరుకున్నామని హర్షం వ్యక్తం చేశాడు.ఈ సంతోష సమయంలో తనకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని రషీద్ ఖాన్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తమ జట్టును చూస్తే తనకు గర్వంగా ఉందని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరు తమ పాత్రను సమర్థవంతంగా పోషించారని.. టీ20 ఫార్మాట్లో ముఖ్యంగా తమ బౌలర్లు అద్భుతంగా ఆడుతున్నారని కొనియాడాడు.ఇలా తొలిసారి సెమీ ఫైనల్లోఅండర్-19 వరల్డ్కప్లో సెమీస్ చేరిన ఘనత అఫ్గనిస్తాన్కు ఉందని.. అయితే, మెగా టోర్నీలో ఇలా తొలిసారి సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన అనుభూతిని మాటల్లో వర్ణించలేనని పేర్కొన్నాడు.అదే విధంగా.. తమపై నమ్మకం ఉంచిన ఏకైక వ్యక్తి బ్రియన్ లారా అంటూ ఈ సందర్భంగా రషీద్ ఖాన్ వెస్టిండీస్ దిగ్గజానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆయన నమ్మకాన్ని నిలబెడతామని చెప్పానని.. అందుకు తగ్గట్లుగానే తమ జట్టు విజయం సాధించిందని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc)మేము సెమీ ఫైనల్ చేరతామని చెప్పిన ఏకైక వ్యక్తి‘‘మేము సెమీ ఫైనల్ చేరతామని చెప్పిన ఏకైక వ్యక్తి బ్రియన్ లారా. ఆయన మాటలు నిజమని మేము రుజువు చేశాం. వెల్కమ్ పార్టీ సమయంలో లారాను కలిసినపుడు.. మీ నమ్మకం నిజం చేస్తామని చెప్పాను’’ అంటూ రషీద్ ఉద్వేగానికి లోనయ్యాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 సెమీ ఫైనలిస్టు అంచనాల నేపథ్యంలో చాలా మంది మాజీ క్రికెటర్లు.. టీమిండియాతో పాటు సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లేదంటే న్యూజిలాండ్ పేర్లు చెప్పారు. అయితే, లారా మాత్రం ఈసారి అఫ్గనిస్తాన్ కచ్చితంగా టాప్-4లో చేరుతుందని అంచనా వేశాడు. ఇప్పుడదే నిజమైంది.కాగా గ్రూప్ దశలో గ్రూప్-సిలో ఉన్న అఫ్గనిస్తాన్ నాలుగింట మూడు విజయాలతో సూపర్-8లో అడుగుపెట్టింది. ఇక ఇందులో గ్రూప్-1లో భాగమైన రషీద్ ఖాన్ బృందం.. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్లను ఓడించి సెమీస్కు చేరుకుంది.చదవండి: T20 World Cup 2024 IND VS AUS: సెంచరీ గురించి ఆలోచనే లేదు.. రోహిత్ -
T20 World Cup 2024 : సెమీస్కు ఆఫ్ఘనిస్తాన్..ఆస్ట్రేలియా ఇంటికి (ఫొటోలు)
-
ఇది మా దేశం గర్వించదగ్గ విజయం.. అతడొక అద్బుతం: రషీద్ ఖాన్
టీ20 వరల్డ్కప్-2024లో ఆస్ట్రేలియా జైత్ర యాత్రకు అఫ్గానిస్తాన్ బ్రేక్లు వేసింది. కింగ్స్టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆసీస్ను 21 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ చిత్తు చేసింది. దీంతో 2023 వన్డే ప్రపంచకప్లో ఓటమికి అఫ్గాన్ బదులు తీర్చుకుంది. ఈ మ్యాచ్లో అఫ్గాన్ బౌలర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. 150 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని అఫ్గాన్ బౌలర్లు కాపాడుకున్నారు. లక్ష్య చేధనలో అఫ్గాన్ బౌలర్ల దాటికి ఆసీస్ 127 పరుగులకే చాపచుట్టేసింది. అఫ్గాన్ మీడియం పేసర్ గుల్బాదిన్ నైబ్ 4 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా.. నవీన్ ఉల్హక్ మూడు వికెట్లు, ఒమర్జాయ్, రషీద్ ఖాన్, నబీ ఒక్క వికెట్ సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఈ విజయంతో అఫ్గాన్ తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ స్పందించాడు. ఆసీస్ వంటి పటిష్ట జట్టుపై విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని రషీద్ తెలిపాడు."ఇది మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే విజయం. ఆసీస్ వంటి పెద్ద జట్టుపై విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఇది మా దేశం గర్వించదగ్గ సందర్భం. మాకు కూడా ఒక జట్టుగా చాలా గర్వంగా ఉంది. ప్రత్యర్ది బౌలింగ్ లైనప్ను బట్టి మా ప్లేయింగ్ ఎలెవన్ను ఎంపిక చేస్తున్నాము. అందుకే ప్రతీ మ్యాచ్లోనూ ఒకే ప్లేయింగ్ ఎలెవన్తో ఆడలేకపోతున్నాము. కింగ్స్ టౌన్ పిచ్పై 140 పరుగులు మంచి స్కోర్గా భావించవచ్చు. మాకు బ్యాటింగ్లో మంచి ఆరంభం వచ్చింది. కానీ మేము ఫినిషింగ్ మాత్రం సరిగ్గా చేయలేకపోయాం. ఆఖరికి ప్రత్యర్ధి ముందు 150 పరుగుల లక్ష్యాన్ని ఉంచాము. ఈ టార్గెట్ను ఎలాగైనా డిఫెండ్ చేసుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగాం. అందుకు తగ్గట్టే మా బాయ్స్ అదరగొట్టారు. మా జట్టు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఎక్కువ మంది ఆల్రౌండర్లను కలిగి ఉండటం జట్టుకు కలిసొచ్చింది. ఇక నైబ్ ఒక అద్బుతం. అతడి వల్లే ఇదింతా. నైబ్కు ఉన్న అనుభవాన్ని మొత్తం ఈ మ్యాచ్లో చూపించాడు. అదే విధంగా నవీన్,నబీ కూడా అద్బుమైన ప్రదర్శన కనబరిచారు. మా తదుపరి మ్యాచ్లో ఇదే జోరును కొనసాగిస్తామని పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో రషీద్ ఖాన్ పేర్కొన్నాడు. -
అది గుర్తుకొస్తే నా ఒళ్లు జలదరిస్తుంది: రషీద్ ఖాన్
టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో ఆదివారం ఉదయం ఆసక్తికర పోరు జరుగనుంది. గ్రూప్-1లో భాగమైన అఫ్గనిస్తాన్ పటిష్ట ఆస్ట్రేలియాతో తలపడనుంది. సెయింట్ విన్సెంట్లోని కింగ్స్టౌన్ స్టేడియం ఇందుకు వేదిక.ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కాగా వన్డే ప్రపంచకప్-2023లో అంచనాలకు మించి రాణించిన అఫ్గన్ ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే.మాక్స్వెల్ రాకతో అంతా తలకిందులుఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ సెంచరీ కారణంగా 292 పరుగులు స్కోరు చేసిన అఫ్గనిస్తాన్.. లక్ష్య ఛేదనలో కంగారూ జట్టును ఆది నుంచే బెంబేలెత్తించింది. అయితే, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ రాకతో అంతా తలకిందులైంది.అఫ్గన్తో మ్యాచ్లో 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆసీస్ను మాక్సీ గట్టెక్కించాడు. కండరాల నొప్పి వేధిస్తున్నా లెక్క చేయక డబుల్ సెంచరీతో చెలరేగాడు. 128 బంతుల్లో 201 పరుగులతో అజేయంగా నిలిచి ఆస్ట్రేలియాను ఒంటిచేత్తో గెలిపించాడు.నా ఒళ్లు జలదరిస్తుందిఇక ఇరు జట్లు ఇలా మరోసారి ఐసీసీ టోర్నీలో తలపడనున్న నేపథ్యంలో రషీద్ ఖాన్ ఐసీసీ డిజిటల్తో తన మనసులోని భావాలు పంచుకున్నాడు. నాటి మాక్సీ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. ‘‘రాత్రిపూట నేను నిద్రకు ఉపక్రమించే సమయంలో ఒక్కోసారి ఆట గురించి తలచుకుంటాను.అలాంటపుడు నా ఒళ్లు జలదరిస్తుంది. అసలు అదొక అద్భుత, నమ్మశక్యం కాని ఇన్నింగ్స్. మేము చూసిన అత్యంత గొప్ప ఇన్నింగ్స్లో అదొకటి’’ అని రషీద్ ఖాన్ మాక్స్వెల్ను ప్రశంసల్లో ముంచెత్తాడు.కాగా సూపర్-8లో టీమిండియా చేతిలో ఓడిన అఫ్గనిస్తాన్కు ఆసీస్తో పోరు కీలకం కానుంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. అయితే, కంగారూ జట్టుతో అంత ఈజీ కాదన్న విషయం తెలిసిందే.బంగ్లాదేశ్ను చిత్తు చేసిమరోవైపు.. సూపర్-8లో శుక్రవారం నాటి మ్యాచ్లో ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. ఆంటిగ్వాలో ఆసీస్ 28 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ ప్రకారం) బంగ్లాదేశ్పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ (36 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్), తౌహీద్ హృదయ్ (28 బంతుల్లో 40; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. చివర్లో కమిన్స్ ‘హ్యాట్రిక్’తో టీమ్ సాధారణ స్కోరుకు పరిమితమైంది. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఐదో బంతికి మహ్ముదుల్లా (2), చివరి బంతికి మెహదీ హసన్ (0)లను అవుట్ చేసిన కమిన్స్... ఆ తర్వాత 20వ ఓవర్ తొలి బంతికి తౌహీద్ను వెనక్కి పంపి ‘హ్యాట్రిక్’ పూర్తి చేసుకున్నాడు.తొలి వికెట్కు 41 బంతుల్లోనే 65 పరుగులుఅనంతరం ఆస్ట్రేలియాకు వార్నర్ (35 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు), హెడ్ (21 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడైన ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరు తొలి వికెట్కు 41 బంతుల్లోనే 65 పరుగులు జోడించారు.అనంతరం రిషాద్ తన వరుస ఓవర్లలో హెడ్, మార్ష్ (1)లను అవుట్ చేయగా...11.2 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 2 వికెట్లు కోల్పోయి 100 పరుగులు సాధించింది. ఈ దశలో భారీ వర్షం కురిసింది. వాన ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను ఆ స్థితిలో ముగిస్తున్నట్లు ప్రకటించారు.డక్వర్త్ నిబంధనల ప్రకారం ఆ సమయానికి ఆసీస్ 72 పరుగులు చేస్తే సరిపోతుంది. కానీ అప్పటికే 28 పరుగులు ముందంజలో ఉన్న కంగారూ టీమ్ విజేతగా నిలిచింది. ‘హ్యాట్రిక్’ల రికార్డుఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో నమోదైన ‘హ్యాట్రిక్’ల సంఖ్య ఏడు. బ్రెట్లీ (2007) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆస్ట్రేలియా బౌలర్గా కమిన్స్ నిలవగా... గతంలో కర్టిస్ కాంఫర్ (ఐర్లాండ్), హసరంగ (శ్రీలంక), రబాడ (దక్షిణాఫ్రికా), కార్తీక్ మెయప్పన్ (యూఏఈ), జోష్ లిటిల్ (ఐర్లాండ్) ఈ ఘనతను నమోదు చేశారు. -
T20 World Cup 2024: సత్తా చాటిన సూర్యకుమార్.. ఆఫ్ఘనిస్తాన్ ముందు భారీ లక్ష్యం
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా బార్బడోస్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ (జూన్ 20) జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటగా.. విరాట్ కోహ్లి (24), రిషబ్ పంత్ (20), హార్దిక్ పాండ్యా (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రోహిత్ శర్మ (8), శివమ్ దూబే (10), రవీంద్ర జడేజా (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో అక్షర్ పటేల్ (12) రెండు బౌండరీలు బాది ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఫజల్ హక్ ఫారూఖీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. నవీన్ ఉల్ హక్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాఆఫ్ఘనిస్తాన్ : రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, హజ్రతుల్లా జజాయ్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్(కెప్టెన్), నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫజల్ హక్ ఫారూఖీ -
T20 World Cup 2024: భారత్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్.. తుది జట్టులో కుల్దీప్
టీ20 వరల్డ్కప్ 2024 గ్రూప్-8 మ్యాచ్ల్లో భాగంగా ఇవాళ (జూన్ 20) భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. బార్బడోస్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు చెరో మార్పు చేశాయి. భారత్కు సంబంధించి సిరాజ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రాగా.. ఆప్ఘనిస్తాన్ తరఫున కరీమ్ జనత్ స్థానంలో హజ్రతుల్లా జజాయ్ తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, హజ్రతుల్లా జజాయ్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్(కెప్టెన్), నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫజల్ హక్ ఫారూఖీ -
అఫ్గాన్తో అంత ఈజీ కాదు.. కోహ్లి ఫామ్లోకి వస్తాడా?
టీ20 వరల్డ్కప్-2024 సూపర్-8లో తమ తొలి పోరుకు టీమిండియా సిద్దమైంది. సూపర్-8లో భాగంగా గురువారం బార్బోడస్ వేదికగా అఫ్గానిస్తాన్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి సూపర్-8 రౌండ్ను విజయంతో ఆరంభించాలని రోహిత్ సేన భావిస్తోంది. ఇప్పటికే కరేబియన్ దీవులకు చేరుకున్న భారత జట్టు తీవ్రంగా శ్రమించింది.అఫ్గాన్తో అంత ఈజీ కాదు..అయితే అఫ్గానిస్తాన్తో మ్యాచ్ అంత ఈజీ కాదు. ఒకప్పుడు అఫ్గాన్ వేరు ఇప్పుడు అఫ్గాన్ వేరు. రషీద్ ఖాన్ నేతృత్వంలోని అఫ్గానిస్తాన్ సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్ వంటి పటిష్ట జట్టును మట్టికరిపించిన అఫ్గాన్.. భారత్, ఆస్ట్రేలియా వంటి వరల్డ్క్లాస్ జట్లకు సవాలు విసిరేందుకు సిద్దమైంది. అఫ్గాన్ గ్రూపు-స్టేజిలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడింట విజయం సాధించి సూపర్-8లో అడుగుపెట్టింది. సూపర్-8 రౌండ్ గ్రూపు-1లో భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్తో పాటు అఫ్గానిస్తాన్ చోటు దక్కించుకుంది. అఫ్గాన్ బలాలు, బలహీనతలు..అఫ్గానిస్తాన్ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. అయితే అఫ్గాన్ ప్రధాన బలం బౌలింగ్ అనే చెప్పాలి. అఫ్గాన్ జట్టులో అద్బుతమైన ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు ఉన్నారు. ఈ మెగా టోర్నీలో గ్రూపు స్టేజిలో వెస్టిండీస్పై మినహా మిగితా మూడు మ్యాచ్ల్లోనూ అఫ్గాన్ బౌలర్లు సంచలన ప్రదర్శన కనబరిచారు.తొలి మ్యాచ్లో ఉగండాను కేవలం 58 పరుగులకే ఆలౌట్ చేసిన రషీద్ సేన.. అనంతరం వరల్డ్క్లాస్ కివీస్ను 75 పరుగులకే అఫ్గాన్ బౌలర్లు కుప్పకూల్చారు. ఆ తర్వాతి మ్యాచ్లో పపువా న్యూగినిను 95 పరుగులకే కట్టడి చేశారు.ముఖ్యంగా అఫ్గాన్ పేసర్ ఫజల్హక్ ఫరూఖీ తన కెరీర్లోనే సూపర్ ఫామ్లో ఉన్నాడు. తన పేస్ బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్లు ఆడిన ఫరూఖీ 12 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. అతడితో పాటు మరో పేసర్ నవీన్ ఉల్ హాక్ తన వంతు న్యాయం చేస్తున్నాడు. ఇక స్పిన్ విభాగంలో కెప్టెన్ రషీద్ ఖాన్తో పాటు ఆల్రౌండర్ మహ్మద్ నబీ సత్తాచాటుతున్నారు. అయితే స్టార్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మన్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కావడం అఫ్గాన్కు నిజంగా గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ముజీబ్ ఉర్ రెహ్మన్ స్ధానంలో నూర్ అహ్మద్ తుది జట్టులోకి వచ్చాడు. నూర్కు కూడా తన స్పిన్మయాజలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడిచేసే సత్తా ఉంది. ఇక బ్యాటింగ్లో ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ సంచలన ఫామ్లో ఉన్నారు. వారు మరోసారి చెలరేగితే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు. వీరిద్దరితో పాటు గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా వంటి ఆల్రౌండర్లు సైతం బ్యాట్తో పర్వాలేదన్పిస్తున్నారు.అయితే అఫ్గాన్కు ఉన్న ఏకైక బలహీనత మిడిలార్డర్. అఫ్గాన్ బ్యాటింగ్ విభాగంలో మిడిలార్డర్ అంత పటిష్టంగా కన్పించడం లేదు. నజీబ్ జద్రాన్, కరీం జనత్, నబీ వంటి వారు తమ స్ధాయికి దగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. మరి సూపర్-8లోనైనా వీరు ముగ్గురూ తమ బ్యాట్కు పనిచెబుతారో లేదో వేచి చూడాలి. ఇక చివరగా అఫ్గానిస్తాన్ను తక్కువగా అంచనా వేస్తే భారత్ భారీ మూల్యం చెల్లుంచుకోక తప్పదు.కోహ్లి ఫామ్లోకి వస్తాడా?కాగా అఫ్గానిస్తాన్తో మ్యాచ్లో అందరి కళ్లు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిపైనే ఉన్నాయి. గ్రూపు స్టేజిలోకి దారుణమైన ప్రదర్శన కనబరిచిన కోహ్లి.. సూపర్-8లోనైనా సత్తాచాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.గ్రూపు స్టేజిలో మూడు మ్యాచ్లు ఆడిన కోహ్లి కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. గతంలో కూడా దాదాపు రెండేళ్ల పాటు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డ కింగ్ కోహ్లి.. ఆసియాకప్-2022లో అఫ్గానిస్తాన్పైనే తన రిథమ్ను తిరిగి పొందాడు. ఆ మ్యాచ్లో విరాట్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. దీంతో మళ్లీ అఫ్గాన్తో మ్యాచ్లో జరగనున్న నేపథ్యంలో విరాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ కచ్చితంగా వస్తుందని కింగ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. -
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన నేపాల్ బౌలర్.. రషీద్ ఖాన్ తర్వాత..!
నేపాల్ లెగ్ స్పిన్ బౌలర్ సందీప్ లామిచ్చేన్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి నేపాల్ బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ తర్వాత ఈ ఫీట్ను సాధించిన రెండో వేగవంతమైన (మ్యాచ్ల పరంగా) బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో (4-1-17-2) ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు.అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మైలురాయిని తాకేందుకు రషీద్ ఖాన్కు 53 మ్యాచ్లు అవసరం కాగా.. సందీప్ తన 54వ మ్యాచ్లో ఈ ఫీట్ను సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్ల మార్కును తాకిన బౌలర్ల జాబితాలో రషీద్, సందీప్ తర్వాత వనిందు హసరంగ (63), హరీస్ రౌఫ్ (71) ఉన్నారు.బంగ్లాతో మ్యాచ్లో సందీప్ 100 వికెట్ల మైలురాయిని అందుకోవడంతో పాటు మరో రికార్డు కూడా సాధించాడు. ప్రపంచ క్రికెట్లో వన్డే, టీ20ల్లో 100 వికెట్ల మార్కును అందుకున్న తొమ్మిదో బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు (42 మ్యాచ్ల్లో) సాధించిన ఘనత సందీప్ పేరిటే ఉంది. సందీప్.. రషీద్ ఖాన్తో పాటు ఈ రికార్డును పంచుకున్నాడు.2018లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సందీప్.. ఒక్క సౌతాఫ్రికా మినహా తాను ఆడిన ప్రతి దేశంపై వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం సందీప్ ఖాతాలో 112 వన్డే వికెట్లు (51 మ్యాచ్ల్లో), 100 టీ20 వికెట్లు (54 మ్యాచ్ల్లో) ఉన్నాయి. సందీప్కు ఐపీఎల్లోనూ ఓ మోస్తరు రికార్డు ఉంది. క్యాష్ రిచ్ లీగ్లో 9 మ్యాచ్లు ఆడిన అతను 13 వికెట్లు పడగొట్టాడు.ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్తో నిన్న జరిగిన మ్యాచ్లో నేపాల్ 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో గెలవడంతో బంగ్లాదేశ్ గ్రూప్-డి నుంచి సూపర్-8కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో ఏ దశలోనూ పోటీ ఇవ్వని నేపాల్ 19.2 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌటై హోర పరాజయాన్ని మూటగట్టుకుంది. -
T20 WC 2024: అఫ్గనిస్తాన్కు భారీ షాక్!
టీ20 ప్రపంచకప్-2024లో అంచనాలకు మించి అదరగొడుతున్న అఫ్గనిస్తాన్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టులోని కీలక స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ గాయం కారణంగా దూరమయ్యాడు.టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు అతడు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి ధ్రువీకరించింది. ముజీబ్ స్థానంలో హజ్రతుల్లా జజాయ్ అఫ్గన్ ప్రధాన జట్టులోకి చేరినట్లు తెలిపింది.కాగా అఫ్గనిస్తాన్ జట్టులోని కీలక సభ్యుల్లో ఒకడైన ముజీబ్ ఉర్ రహ్మాన్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ముఖ్యంగా.. టీ20లలో మెరుగైన రికార్డు కలిగి ఉన్నాడు.అఫ్గన్ తరఫున ఇప్పటి వరకు ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ 46 టీ20లు ఆడి.. 59 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్-2024లో తమ ఆరంభ మ్యాచ్లో ఉగాండాపై మూడు ఓవర్ల బౌలింగ్లో 16 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.అయితే, ఆ తర్వాత ముజీబ్ మళ్లీ తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ రైటార్మ్ బౌలర్ మధ్య వేలికి గాయమైన కారణంగా.. అతడి స్థానంలో నూర్ అహ్మద్ బరిలోకి దిగాడు.ముజీబ్ లేని లోటును నూర్ తీరుస్తాడా?స్పిన్ దళంలో కెప్టెన్ రషీద్ ఖాన్తో భాగమైన నూర్.. న్యూజిలాండ్, పపువా న్యూగినియాతో మ్యాచ్లలో భాగమయ్యాడు. ముజీబ్ లేని లోటును ఈ లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్నర్ తీర్చగలడని అఫ్గన్ మేనేజ్మెంట్ నమ్మకంగా ఉంది.కాగా గ్రూప్-సిలో ఉన్న అఫ్గనిస్తాన్ ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8కు చేరుకుంది. అయితే, స్పిన్కు అనుకూలించే వెస్టిండీస్ పిచ్లపై ముజీబ్ ఉర్ రహ్మాన్ రూపంలో కీలక బౌలర్ సేవలు కోల్పోవడం పెద్ద ఎదురుదెబ్బ లాంటిదే! అయితే, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, నూర్ అహ్మద్ తదితరులు జట్టులో ఉండటం సానుకూలాంశం. పేసర్ ఫజల్హక్ ఫరూకీ కూడా రాణిస్తుండటం ఊరట కలిగించే అంశం. మరో రోవైపు.. ముజీబ్ స్థానంలో జట్టులోకి హజ్రతుల్లా హిట్టర్గా పేరొందిన ఓపెనింగ్ బ్యాటర్.చదవండి: T20 WC: పాకిస్తాన్కు చావు దెబ్బ.. ప్రపంచకప్ టోర్నీ నుంచి అవుట్ -
T20 World Cup 2024: ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్న ఆఫ్ఘన్ బౌలర్లు
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్కప్లో ఆప్ఘనిస్తాన్ జట్టు అన్ని విభాగాల్లో చెలరేగిపోతుంది. మెగా టోర్నీలో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో మూడింట విజయాలు సాధించి సూపర్-8కు అర్హత సాధించింది. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో ఆఫ్ఘన్లకు తిరుగులేకుండా పోయింది. ఆ జట్టు బౌలర్లు ఆడిన మూడు మ్యాచ్ల్లో ప్రత్యర్థులను 100 పరుగులలోపే ఆలౌట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే బౌలింగ్ డిపార్ట్మెంట్లో వారి ఆధిపత్యం ఎలా ఉందో ఇట్టే అర్దమవుతుంది. తొలి మ్యాచ్లో ఉగాండను 58 పరుగులకే ఆలౌట్ చేసిన ఆఫ్ఘన్ బౌలర్లు.. ఆతర్వాతి మ్యాచ్లో పటిష్టమైన న్యూజిలాండ్ను 75 పరుగులకు.. తాజాగా పపువా న్యూ గినియాను 95 పరుగులకు కుప్పకూల్చారు. ఆఫ్ఘన్ బౌలర్లు ఈ తరహాలో చెలరేగడం వెనుక ఆ జట్టు బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ వరల్డ్కప్తో ఆఫ్ఘన్ బౌలింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన బ్రావో ఆ జట్టు సాధిస్తున్న ప్రతి విజయంలో తనదైన మార్కును చూపాడు. బ్రావో ఆధ్వర్యంలో మీడియం ఫాస్ట్ బౌలర్ ఫజల్ హక్ ఫారూఖీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఫారూఖీ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో ఏకంగా 12 వికెట్లు పడగొట్టి టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు.ఉగాండతో జరిగిన తొలి మ్యాచ్లో 5 వికెట్లు తీసిన ఫారూఖీ.. ఆ తర్వాత న్యూజిలాండ్పై 4 వికెట్లు..తాజాగా పపువా న్యూ గినియాపై 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మూడు మ్యాచ్ల్లో ఫారూఖీ రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. ఈ వరల్డ్కప్లో ఆఫ్ఘన్ల వరుస విజయాల్లో ఫారూఖీ ప్రధానపాత్ర పోషించాడు. ఫారూఖీతో పాటు ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్ (3 మ్యాచ్ల్లో 6 వికెట్లు)య సైతం ఓ మోస్తరుగా రాణిస్తున్నాడు.ఈ టోర్నీలో ఆఫ్ఘన్లు బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ చెలరేగిపోతున్నారు. ఆ జట్టు బ్యాటర్లు రహ్మానుల్లా గుర్భాజ్ (167 పరుగులు), ఇబ్రహీం జద్రాన్ (114 పరుగులు) టోర్నీ లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో ఒకటి, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.గ్రూప్ దశలో మరో మ్యాచ్ మిగిలుండగానే సూపర్-8కు అర్హత సాధించిన ఆఫ్ఘనిస్తాన్.. సూపర్-8లో భారత్ (జూన్ 20), ఆస్ట్రేలియా (జూన్ 22), బంగ్లాదేశ్/నెదర్లాండ్స్ (జూన్ 24) జట్లను ఢీకొంటుంది. -
T20 World Cup 2024: రషీద్ ఖాన్ ఈజ్ ద బెస్ట్
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా న్యూజిలాండ్తో నిన్న (జూన్ 7) జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఆఫ్ఘన్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో సత్తా చాటి తమకంటే చాలా రెట్లు మెరుగైన న్యూజిలాండ్ను ఖంగుతినిపించారు. తొలుత బ్యాటింగ్లో చెలరేగిన ఆఫ్ఘన్ ప్లేయర్లు.. ఆతర్వాత బౌలింగ్లోనూ విజృంభించి కివీస్కు ఊహించని షాకిచ్చారు. ఆఫ్ఘన్ బౌలర్ల ధాటికి పటిష్టమైన న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. కివీస్ ఇన్నింగ్స్లో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్దమవుతుంది. న్యూజిలాండ్ను ఈ స్థితికి దిగజార్చడానికి ముఖ్య కారకుడు ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్. ఈ మ్యాచ్లో రషీద్ 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. రషీద్తో పాటు ఫజల్ హక్ ఫారూఖీ (3.2-0-17-4), మొహమ్మద్ నబీ (4-0-16-2) కూడా చెలరేగడంతో న్యూజిలాండ్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. రషీద్, ఫజల్ హక్, నబీల దెబ్బకు 15.2 ఓవర్లలో 75 పరుగులకే చాపచుట్టేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో గ్లెన్ ఫిలిప్స్ (18), మ్యాట్ హెన్రీ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. వీరిద్దరు కూడా సింగిల్ డిజిట్ స్కోర్కే టపా కట్టేసి ఉంటే న్యూజిలాండ్ 50 పరుగుల మార్కు కూడా దాటేది కాదు. దీనికి ముందు రహ్మానుల్లా గుర్బాజ్ (80), ఇబ్రహీం జద్రాన్ (44) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో గుర్బాజ్, జద్రాన్తో పాటు అజ్మతుల్లా (22) రాణించాడు. కివీస్ బౌలర్లలో బౌల్ట్, మ్యాట్ హెన్రీ తలో 2 వికెట్లు తీయగా.. ఫెర్గూసన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఆఫ్ఘన్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో కలిసికట్టుగా రాణించి కివీస్ను 84 పరుగుల తేడాతో చిత్తు చేశారు. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడటం ఇదే తొలిసారి.రషీద్ ఈజ్ ద బెస్ట్..ఈ మ్యాచ్లో అద్భుత గణాంకాలు నమోదు చేసి కివీస్ పతనాన్ని శాశించిన ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ప్రపంచకప్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (4-0-17-4) నమోదు చేసిన కెప్టెన్గా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. రషీద్కు ముందు ఈ ఘనత న్యూజిలాండ్ స్పిన్నర్ డేనియల్ వెటోరీ పేరిట ఉండేది. వెటోరీ 2007 వరల్డ్కప్లో ఇండియాపై 4 ఓవరల్లో 20 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో రషీద్, వెటోరీ తర్వాత ఒమన్ బౌలర్ జీషన్ మక్సూద్ (2021లో పపువా న్యూ గినియాపై 4-0-20-4), ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (2012లో శ్రీలంకపై 4-0-24-3) ఉన్నారు. -
చరిత్ర సృష్టించిన నేపాల్ కెప్టెన్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా
టీ20 వరల్డ్కప్-2024ను నేపాల్ జట్టు ఓటమితో ఆరంభించింది. డల్లాస్ వేదికగా నెదర్లాండ్స్తో జరిగిన లీగ్ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో నేపాల్ ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్లో నేపాల్ పరాజయం పాలైనప్పటకి ఆ జట్టు కెప్టెన్ రోహిత్ పాడెల్ మాత్రం అరుదైన ఘనత సాధించాడు. టీ20 వరల్డ్కప్ చరిత్రలో ఓ జట్టుకు నాయకత్వం వహించిన పిన్న వయస్కుడైన కెప్టెన్గా రోహిత్ పాడెల్ రికార్డులకెక్కాడు. 21 ఏళ్ల 276 రోజుల వయస్సులో నేపాల్ జట్టు కెప్టెన్గా పాడెల్ వ్యవహరిస్తున్నాడు. ఇంతకముందు ఈ రికార్డు జింబాబ్వే మాజీ కెప్టెన్ ప్రోస్పర్ ఉత్సేయ పేరిట ఉండేది. 2007 టీ20 వరల్డ్కప్లో 21 ఏళ్ల 354 రోజుల వయస్సులో జింబాబ్వే జట్టుకు ప్రోస్పర్ ఉత్సేయ సారథ్యం వహించాడు. తాజా మ్యాచ్తో ఉత్సేయ ఆల్టైమ్ రికార్డును పాడెల్ బ్రేక్ చేశాడు. అదే విధంగా టీ20 వరల్డ్కప్ టోర్నీలో ఆడిప అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా కూడా పాడెల్ నిలిచాడు. ఇప్పటివరకు రికార్డు రషీద్ ఖాన్ (22) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో రషీద్ ఖాన్ రికార్డును పాడెల్ బద్దలు కొట్టాడు. -
పాక్ను ఓడించగానే రాత్రంతా సంబరాలు: రషీద్ ఖాన్
వన్డే ప్రపంచకప్-2023 ఆరంభంలో ఓటములు చవిచూసిన అఫ్గనిస్తాన్ ఇంగ్లండ్ను ఓడించి సంచలన గెలుపుతో విజయాల బాట పట్టింది. ఆ తర్వాత పాకిస్తాన్ను మట్టికరిపించిన హష్మతుల్లా బృందం.. శ్రీలంక, నెదర్లాండ్స్తో మ్యాచ్లలో కూడా గెలుపు బావుటా ఎగురవేసింది.ఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీ-2025కి కూడా అర్హత సాధించింది. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అఫ్గన్ ఊహించని స్థాయిలో ప్రత్యర్థులకు షాకిచ్చి సత్తా చాటింది.అదే హైలైట్ఆస్ట్రేలియాతో మ్యాచ్లోనూ ఆఖరి వరకు అద్భుతంగా పోరాడి ఓడినా అభిమానుల హృదయాలు గెలిచింది. సంతృప్తిగానే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే, అన్నింటికంటే పాకిస్తాన్పై గెలుపు మాత్రం అఫ్గన్కు ప్రత్యేకంగా నిలిచిపోయింది.ఎందుకంటే.. అంతర్జాతీయ వన్డేల్లో అది కూడా.. వరల్డ్కప్ లాంటి ప్రధాన ఈవెంట్లో తొలిసారి పాక్పై అఫ్గనిస్తాన్ పైచేయి సాధించింది. స్టార్ బ్యాటర్లు రహ్మనుల్లా గుర్బాజ్(65), ఇబ్రహీం జద్రాన్(87), రెహమత్ షా(77) ఇన్నింగ్స్ కారణంగా తొలిసారి పాక్ను ఓడించింది. దీంతో అఫ్గన్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి.రాత్రి మొత్తం డాన్స్ చేస్తూతాజాగా ఈ విషయం గురించి గుర్తుచేసుకున్నాడు అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్. ‘‘పాకిస్తాన్ మీద గెలిచిన తర్వాత ఆ రోజు రాత్రి మొత్తం నేను డాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాను.గ్రౌండ్ నుంచి హోటల్ దాకా సంబరాలు చేసుకున్నా. అర్ధరాత్రి దాటిన తర్వాత నేను విశ్రాంతి తీసుకోలేదు. అప్పుడు నన్నెవరైనా చూసి ఉంటే.. అసలు నాకు వెన్నునొప్పి ఉందంటే నమ్మేవారే కాదు.గతంలో ఎప్పుడూ లేని విధంగాఅప్పటికీ జాగ్రత్తగా ఉండాలని మా ఫిజియో చెప్తూనే ఉన్నారు. ఏదేమైనా నేను అలా పిచ్చిపట్టినట్లుగా డాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే మా జట్టు మొత్తం ఆశ్చర్యపోయింది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ వాళ్లు నన్ను అలా చూడనేలేదు’’ అని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు.కాగా ఆ మ్యాచ్లో పది ఓవర్లు బౌల్ చేసిన రషీద్ వికెట్ తీయకపోయినా పొదుపుగా(ఎకానమీ 4.10) బౌలింగ్ చేశాడు. నాటి మ్యాచ్లో నూర్ అహ్మద్ మూడు వికెట్లతో చెలరేగి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ను దెబ్బకొట్టాడు. ఐపీఎల్తో బిజీఇదిలా ఉంటే.. రషీద్ ఖాన్ ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ఇప్పటి వరకు 102 పరుగులు చేయడంతో పాటు 8 వికెట్లు తీశాడు.చదవండి: T20 WC: ద్రవిడ్, రోహిత్కు నచ్చకపోవచ్చు.. కానీ నా సలహా ఇదే! -
Afghanistan T20 WC Squad: టీ20 వరల్డ్కప్లో పాల్గొనే ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇదే.. కెప్టెన్గా స్పిన్ మాంత్రికుడు
టీ20 వరల్డ్కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇవాళ (మే 1) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ ఎంపికయ్యాడు. 19 ఏళ్ల యువ వికెట్కీపింగ్ బ్యాటర్ మొహమ్మద్ ఇషాక్, 20 ఏళ్ల స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ నంగ్యాల్ ఖరోటిలకు వరల్డ్కప్ జట్టులో అనూహ్యంగా చోటు దక్కింది. గత వరల్డ్కప్లో ఆడని కరీం జనత్, నూర్ అహ్మద్లకు ఈసారి అవకాశం దక్కింది. ఆఫ్ఘన్ల ప్రధాన బలమైన స్పిన్ విభాగంలో రషీద్ ఖాన్తో పాటు మొహమ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్ ఉన్నారు. పేసర్ల విభాగంలో నవీన్ ఉల్ హాక్, ఫరీద్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూకీ వరల్డ్కప్ జట్టుకు ఎంపికయ్యారు. వికెట్కీపర్ల కోటాలో రహ్మానుల్లా గుర్భాజ్ జట్టులోకి రాగా.. స్పెషలిస్ట్ బ్యాటర్లుగా ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్ ఎంపికయ్యారు. ఆల్రౌండర్ల కోటాలో కరీం జనత్, గుల్బదిన్ నైబ్, హజ్రతుల్లా ఒమర్జాయ్ వరల్డ్కప్ జట్టులోకి వచ్చారు. సెదిక్ అటల్, హజ్రతుల్లా జజాయ్, సలీం సఫీ ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు.జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే వరల్డ్కప్లో ఆఫ్ఘనిస్తాన్ పోరాటం జూన్ 3న మొదలవుతుంది. ఆ రోజు గయానా వేదికగా జరిగే మ్యాచ్లో ఆఫ్ఘన్లు ఉగాండతో తలపడతారు. జూన్ 7న ఇదే వేదికపై వీరు పటిష్టమైన న్యూజిలాండ్ను ఢీకొంటారు. గ్రూప్-సిలో ఆఫ్ఘనిస్తాన్.. వెస్టిండీస్, న్యూజిలాండ్, ఉగాండ, పపువా న్యూ గినియా జట్లతో పోటీపడుతుంది. టీ20 వరల్డ్కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ ఇషాక్ (వికెట్కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, కరీం జనత్, రషీద్ ఖాన్ (కెప్టెన్), నంగ్యాల్ ఖరోటీ, ముజీబ్ ఉర్ రహ్మన్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హాక్, ఫజల్హాక్ ఫరూకీ, ఫరీద్ అహ్మద్ మాలిక్ట్రావెలింగ్ రిజర్వ్స్: సెదిక్ అటల్, హజ్రతుల్లా జజాయ్, సలీం సఫీ -
DC Vs GT: ఓడినా సంతృప్తిగానే ఉంది.. కానీ: శుబ్మన్ గిల్
ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడినా ఆఖరి వరకు తాము పట్టుదలగా పోరాడిన తీరు సంతృప్తినిచ్చిందని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ అన్నాడు. చివరి వరకు తాము గెలుస్తామనే నమ్మకంతోనే ఉన్నామని అయితే.. దురదృష్టవశాత్తూ అనుకున్న ఫలితం రాలేదని విచారం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా గుజరాత్ బుధవారం ఢిల్లీతో తలపడింది. అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ చేసింది. సొంతమైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఢిల్లీ కెప్టెన్ పంత్ 43 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్ల సాయంతో ఏకంగా 88 పరుగులతో అజేయంగా నిలిచాడు.No Rishabh Pant fan will scroll without liking this tweet. ❤️ pic.twitter.com/AwcmRcnD1u— 𝐕𝐈𝐑𝐀𝐓𝕏𝐌𝐀𝐗𝐖𝐄𝐋𝐋 (@ProfKohli18) April 24, 2024వన్డౌన్ బ్యాటర్, ఆల్రౌండర్ అక్షర్ పటేల్(43 బంతుల్లో 66) సైతం బ్యాట్ ఝులిపించాడు. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ (7 బంతుల్లో 26*) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోరు సాధించింది.కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్కు ఆదిలోనే దెబ్బ తగిలింది. ఓపెనర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ అన్రిచ్ నోర్జే బౌలింగ్లో 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.అయితే, మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(39), వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్(39 బంతుల్లో 65) ఇన్నింగ్స్ చక్కదిద్దగా.. డేవిడ్ మిల్లర్(23 బంతుల్లో 55) ధనాధన్ దంచికొట్టి టైటాన్స్ శిబిరంలో ఆశలు రేపాడు. అయితే, మిగతా వాళ్ల నుంచి అతడికి సహకారం లభించలేదు. ఈ క్రమంలో ఎనిమిదో స్థానంలో దిగిన రషీద్ ఖాన్(11 బంతుల్లో 21*) పట్టుదలగా నిలబడ్డాడు. ఆఖరి ఓవర్లో టైటాన్స్ విజయానికి 19 పరుగులు అవసరం కాగా.. మొదటి ఐదు బంతుల్లో 4,4,(0), (0), 6 రాబట్టాడు.ఈ క్రమంలో ఆఖరి బంతికి ఐదు పరుగులు అవసరం కాగా.. రషీద్ పరుగు తీయలేకపోయాడు. ఫలితంగా నాలుగు పరుగుల తేడాతో ఢిల్లీ గుజరాత్పై జయభేరి మోగించింది.So which side do you relate to after that fascinating finish- 😁 or 😕?What a game THAT in Delhi! 👏👏Scorecard ▶️ https://t.co/48M4ajbLuk#TATAIPL | #DCvGT pic.twitter.com/SuO21S3DWF— IndianPremierLeague (@IPL) April 24, 2024ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ మాట్లాడుతూ.. ‘‘ఈ మ్యాచ్లో మేము చాలా బాగా ఆడాం. అయితే, ఓడిపోవడం మాత్రం బాధగానే ఉంది. అయినా.. పట్టుదలగా ఆఖరి వరకు పోరాడినందుకు సంతృప్తిగా ఉంది.అసలు మాకు ఓటమి ఎదురవుతుందని ఏ దశలోనూ అనుకోలేదు. 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలంటే వెళ్లి హిట్టింగ్ ఆడటం ఒక్కటే మార్గం. అంతకు మించి ప్రణాళికలు ఏముంటాయి?కారణం అదేనిజానికి వాళ్లను 200- 210 పరుగులకే కట్టడి చేస్తామనుకున్నాం. అయితే, 2-3 ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇవ్వడం ప్రభావం చూపింది. ఇది చిన్న గ్రౌండ్. ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తేనే ఫలితం ఉంటుంది. బెస్ట్ ఫినిషర్ క్రీజులో ఉన్నపుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి’’ అని పేర్కొన్నాడు.చదవండి: #SRHvRCB: తెలుగులో మాట్లాడిన కమిన్స్.. ఆర్సీబీకి వార్నింగ్! మామ మనోడే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024: ట్రిస్టన్ స్టబ్స్ అద్భుత విన్యాసం.. ఇదే ఢిల్లీని గెలిపించింది..!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో నిన్న (ఏప్రిల్ 24) జరిగిన రసవత్తర సమరంలో ఢిల్లీ క్యాపిటల్స్ 4 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ విజయానికి రిషబ్ పంత్ (43 బంతుల్లో 88 నాటౌట్; 5 ఫోర్లు, 8 సిక్సర్లు, 2 క్యాచ్లు), అక్షర్ పటేల్ (43 బంతుల్లో 66; 5 ఫోర్లు, 4 సిక్సర్లు, 3 క్యాచ్లు, 3-0-28-1) ప్రత్యక్షంగా దోహదపడితే.. ట్రిస్టన్ స్టబ్స్ పరోక్షంగా ఢిల్లీ గెలుపుకు కారణమయ్యాడు. This blinder from Tristan Stubbs saved 5 runs for Delhi Capitals🔥They won the match in 4 runs!Stubbs hero for capitals..David Miller & Rashid khan, you can love to watch them any day❤️Rishabh Pant#GTvsDC #IPL2024 pic.twitter.com/UwJKCIS0Wn— Rakesh_sundarRay (@RSundarRay) April 24, 2024 ఛేదనలో గుజరాత్ లక్ష్యం దిశగా పయనిస్తుండగా (11 బంతుల్లో 32 పరుగులు).. స్టబ్స్ అద్భుత విన్యాసం చేసి సిక్సర్ వెళ్లాల్సిన బంతిని (18.2వ ఓవర్: రసిక్ సలాం బౌలింగ్లో రషీద్ ఖాన్ కొట్టిన షాట్) ఆపాడు. ఫలితంగా ఢిల్లీకి ఐదు పరుగులు సేవ్ అయ్యాయి. ఇంచుమించు ఇదే తేడాతో (4 పరుగులు) ఢిల్లీ గుజరాత్పై విజయం సాధించింది. స్టబ్స్ తన అద్భుత ప్రయత్నంతో ఢిల్లీని గెలిపించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.స్టబ్స్ సూపర్ మ్యాన్ ఎఫర్ట్ను అంతా మెచ్చుకుంటున్నారు. భారీ స్కోర్లు చేసినా చేయకపోయినా ఇలాంటి ప్రయత్నాలే మ్యాచ్లు గెలిపిస్తాయని నెటిజన్లు అంటున్నారు. ఈ మ్యాచ్లో స్టబ్స్ బ్యాట్తోనూ రాణించాడు. ఇన్నింగ్స్ చివర్లో వచ్చి (7 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 26 పరుగులు నాటౌట్) రిషబ్ పంత్తో కలిసి వీరబాదుడు బాదాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ (3-0-15-3) ఒక్కడే రాణించాడు. మోహిత్ శర్మ (4-0-73-0) ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ సైతం అద్భుతంగా పోరాడింది. సాహా (39), సాయి సుదర్శన్ (65), మిల్లర్ (55), రషీద్ ఖాన్ (21 నాటౌట్), సాయికిషోర్ (13 నాటౌట్) గుజరాత్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఆఖర్లో స్టబ్స్ అద్భుత ప్రయత్నం గుజరాత్కు మ్యాచ్ను దూరం చేసింది. రషీద్ కొట్టిన ఆ షాట్ సిక్సర్ అయ్యుంటే గుజరాత్ ఈ మ్యాచ్ తప్పక గెలిచుండేది.అంతిమంగా గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసి లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఢిల్లీ బౌలర్లలో రసిక్ సలాం (4-0-44-3), కుల్దీప్ యాదవ్ (4-0-29-2), అక్షర్ పటేల్ (3-0-28-1), నోర్జే (3-0-48-1), ముకేశ్ కుమార్ (4-0-41-1) వికెట్లు తీశారు. ఈ గెలుపుతో ఢిల్లీ ఆరో స్థానానికి జంప్ కొట్టింది. గుజరాత్ ఏడో ప్లేస్లో నిలిచింది. -
కోహ్లి, బుమ్రా, రోహిత్ కాదు.. అతడే మా జట్టుకు ఆడాలి: బట్లర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్ జోస్ బట్లర్ రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2018 సీజన్ నుంచి బట్లర్ రాజస్తాన్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2023 సీజన్లో 863 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా నిలిచాడు. అయితే ప్రస్తుత సీజన్లో తొలి మూడు మ్యాచ్ల్లో ఇబ్బంది పడిన బట్లర్.. ఆర్సీబీతో మ్యాచ్లో సెంచరీ చేసి తన ఫామ్ను తిరిగి పొందాడు. శనివారం ముల్లానాపూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో కూడా సత్తాచాటాలని బట్లర్ ఊవ్విళ్లరుతున్నాడు. అయితే ఈ మ్యాచ్కు ముందు బట్లర్ తన సహచర ఆటగాడు ట్రెంట్ బౌల్ట్త్ కలిసి "రాయల్స్ ర్యాపిడ్ ఫైర్" అనే ఇంటర్వ్యూలో పాల్గోనున్నాడు. ఈ క్రమంలో బట్లర్కు అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది. ప్రస్తుత ఐపీఎల్ క్రికెటర్లలో ఏ ఆటగాడు రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడాలని మీరు కోరుకుంటున్నారు? అని బౌల్ట్ ప్రశ్నించాడు. అందుకు బట్లర్ ఏమీ ఆలోచించకుండా వెంటనే అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పేరు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా బట్లర్ టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మలను ఎంచుకోపోవడం అందరని విస్మయానికి గురిచేస్తోంది. From his favourite wicket to one player he would like at the Royals, here’s Jos and Boulty like never before 🔥😂 pic.twitter.com/F7524zWiQZ — Rajasthan Royals (@rajasthanroyals) April 12, 2024 -
టీ20కా 'డాన్' రషీద్ ఖాన్.. రోహిత్, రుతురాజ్, గిల్ కంటే ఎక్కువగా..!
ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ పొట్టి క్రికెట్ను శాసిస్తున్నాడని అనడం కాదనలేని సత్యం. ఈ ఫార్మాట్లో టోర్నీలు ఎక్కడ జరిగినా వాలిపోయే రషీద్.. ప్రతి మ్యాచ్లో తనదైన మార్కు వేస్తుంటాడు. ఐపీఎల్లో అయితే రషీద్ ఆటతీరు వేరే లెవెల్లో ఉంటుంది. ఇక్కడ ఆడే ప్రతి మ్యాచ్లోనూ రషీద్ సత్తా చాటుతుంటాడు. బంతితో కాకపోతే బ్యాట్తో అయినా చెలరేగుతుంటాడు. ప్రతి మ్యాచ్లో తన జట్టును గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తుంటాడు. The winning celebration from Rashid Khan. 🥶pic.twitter.com/TqtvV2R1d6 — Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2024 రషీద్ ఆటతీరుకు అభిమానులతో పాటు దిగ్గజ క్రికెటర్లు సైతం ముగ్దులవుతుంటారు. ఇండియాలో రషీద్కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అభిమానులు టీమిండియా స్టార్లతో సమానంగా రషీద్ను అభిమానిస్తారు. క్రికెట్ అభిమానులు రషీద్ను ముద్దుగా టీ20కా 'డాన్' అని పిలుచుకుంటారు. Most Player of the Match awards in IPL at the age of 25: Rashid Khan - 12*. Shubman Gill - 9. Ruturaj Gaikwad - 8. Rohit Sharma - 7. pic.twitter.com/UFE6tn4tJ5 — Mufaddal Vohra (@mufaddal_vohra) April 11, 2024 ఐపీఎల్ 2024 సీజన్లో రషీద్ తాను టీ20 డాన్ను అని మరోసారి రుజువు చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్తో నిన్న (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్లో రషీద్ బంతితో పాటు బ్యాట్తోనూ రాణించాడు. బౌలింగ్లో నాలుగు ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీసిన రషీద్.. తన జట్టు కష్ట సమయంలో (చివరి ఓవర్లో 15 పరుగులు కావాల్సిన దశలో) ఉన్నప్పుడు బ్యాట్ పట్టి మెరుపు ఇన్నింగ్స్ (11 బంతుల్లో 24 నాటౌట్; 4 ఫోర్లు) ఆడాడు. The winning celebrations from the captain and the vice captain. 💥 pic.twitter.com/HKYINLqTdF — Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2024 ఫలితంగా తన జట్టు గుజరాత్.. రాజస్థాన్కు వారి సొంతగడ్డపై ఊహించని షాకిచ్చింది. బంతితో పాటు బ్యాట్తో చెలరేగి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించినందుకు గాను రషీద్ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఐపీఎల్లో రషీద్కు ఇది 12వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. 25 ఏళ్ల వయసులో ఇన్ని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు ఐపీఎల్ చరిత్రలో ఎవరూ గెలవలేదు. టీమిండియా స్టార్లు శుభ్మన్ గిల్ 9, రుతురాజ్ 8, రోహిత్ శర్మ 7 అవార్డులు మాత్రమే గెలిచారు. RASHID KHAN, THE GOAT OF T20 CRICKET. 🐐 - Gill led Gujarat beats Rajasthan for the first time in IPL 2024. An IPL epic in Jaipur! 👏pic.twitter.com/OWVZCyvtmB — Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. చివరి బంతి వరకు ఉత్కంఠరేపిన మ్యాచ్లో రాజస్థాన్పై గుజరాత్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. రషీద్ ఖాన్ చివరి బంతికి బౌండరీ బాది గుజరాత్ను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. సంజూ శాంసన్ (68 నాటౌట్), రియాన్ పరాగ్ (76) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగా.. శుభ్మన్ గిల్ (72), రషీద్, తెవాతియా (22) రాణించడంతో గుజరాత్ చివరి బంతికి విజయతీరాలకు చేరింది. RASHID KARAMATI KHAN, YOU ARE WORLD CLASS 🔥🔥🔥He traps the dangerous Jos Buttler, what a bowler ❤️#IPL2024 #tapmad #HojaoADFree pic.twitter.com/56J7XcOnkR— Farid Khan (@_FaridKhan) April 10, 2024 -
అతడు అద్భుతం.. మా గురించి అలా అనుకోవద్దు: గిల్ కౌంటర్
ఆఖరి బంతికి విజయం సాధించడం ఎల్లప్పుడూ గొప్పగానే ఉంటుందంటూ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ హర్షం వ్యక్తం చేశాడు. రషీద్ భాయ్ వల్లే తమకు రాజస్తాన్ రాయల్స్పై గెలుపు దక్కిందని వైస్ కెప్టెన్పై ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్-2024లో ఆరంభం నుంచి ఓటమి ఎరుగని రాజస్తాన్ జైత్రయాత్రకు గుజరాత్ బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. జైపూర్లో బుధవారం ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో చివరి బంతికి టైటాన్స్ జయభేరి మోగించింది. మెరుపు ఇన్నింగ్స్(11 బంతుల్లో 24*)తో గుజరాత్ శిబిరంలో ఆశలు నింపిన రషీద్ ఖాన్.. అంచనాలు నిలబెట్టుకుంటూ ఆఖరి బంతికి ఫోర్ బాది గెలుపును ఖరారు చేశాడు. రాహుల్ తెవాటియా(11 బంతుల్లో 22) సైతం విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక కష్ట సమయంలో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్(44 బంతుల్లో 72) ఆడటం టైటాన్స్కు కలిసి వచ్చింది. The elegance of the Prince 🤌#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/EzGEcv6Pk9 — JioCinema (@JioCinema) April 10, 2024 ఈ నేపథ్యంలో విజయానంతరం కామెంటేటర్ హర్షా భోగ్లేతో ముచ్చటిస్తున్న సమయంలో శుబ్మన్ గిల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గెలుపు నేపథ్యంలో గిల్ను అభినందిస్తూ.. ‘‘బాగా ఆడారు. మీకు రెండు పాయింట్లు వచ్చాయి. అయితే, నాలాంటి చాలా మంది మీరు ఆలస్యం చేస్తున్నారు కాబట్టి ఏమవుతుందోనని కంగారు పడ్డారు. కానీ మీరు బాగా ఆడారు’’ అని హర్షా భోగ్లే అన్నాడు. ఇందుకు స్పందిస్తూ.. ‘‘థాంక్యూ.. మేము ఆడుతున్నపుడు ఇంకెప్పుడూ అలా అనుకోకండి’’ అంటూ తమ జట్టు గురించి గొప్పగా చెబుతూ ఒకరకంగా హార్ష భోగ్లేకు గట్టి కౌంటరే వేశాడు శుబ్మన్ గిల్. ఇక తమ విజయం గురించి మాట్లాడుతూ.. ‘‘అప్పటికీ.. మూడు ఓవర్లలో 45 పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఒక్కో బ్యాటర్ తొమ్మిది బంతుల్లో 22 పరుగులు చేయాలనుకున్నాం. నిజంగా మ్యాచ్ ఫినిష్ చేయడం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. ఈరోజు నేను ఆపని చేయాలనుకున్నాను. అయితే, రాహల్- రషీద్ భాయ్ ఆ పని పూర్తి చేశారు. ఆఖరి బంతికి విజయం సాధించడం ఎప్పుడూ గొప్ప అనుభూతిని మిగులుస్తుంది. రషీద్ ఖాన్ లాంటి వాళ్లు జట్టులో ఉండాలని ప్రతి ఒక్క కెప్టెన్ కోరుకుంటాడనడంలో సందేహం లేదు’’ అని శుబ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు. 𝘾𝙧𝙞𝙨𝙞𝙨 𝙈𝙖𝙣 delivered yet again 😎 🎥 Relive the thrilling end to a thrilling @gujarat_titans win! Recap the match on @starsportsindia & @Jiocinema 💻 📱#TATAIPL | #RRvGT pic.twitter.com/eXDDvpToZ0 — IndianPremierLeague (@IPL) April 10, 2024 IPL 2024: రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ స్కోర్లు ►రాజస్తాన్: 196/3 (20) ►గుజరాత్: 199/7 (20) ►ఫలితం: మూడు వికెట్ల తేడాతో రాజస్తాన్పై గుజరాత్ టైటాన్స్ విజయం ► ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రషీద్ ఖాన్(ఒక వికెట్, 24 పరుగులు- నాటౌట్). చదవండి: IPL 2024: మాట్లాడలేకపోతున్నా.. అతడి వల్లే ఓటమి.. ఆ ఒక్క బంతి..! #ShubmanGill: కొరకరాని కొయ్యలా సంజూ.. అంపైర్తో గొడవపడ్డ గిల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
#Sanju: మాట్లాడలేకపోతున్నా.. అతడి వల్లే ఓటమి.. ఆ ఒక్క బంతి..!
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్కు తొలిసారి ఓటమి ఎదురైంది. వరుసగా నాలుగు మ్యాచ్లలో గెలుపొంది జోరు మీదున్న సంజూ సేనకు గుజరాత్ టైటాన్స్ అడ్డుకట్ట వేసింది. రాయల్స్ను వారి తమ సొంత మైదానంలోనే ఓడించి మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక తమ జైత్రయాత్రకు బ్రేక్ పడటంపై రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ విచారం వ్యక్తం చేశాడు. ఆఖరి బంతికి ఫలితం తారుమారైందంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఏదేమైనా గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా ఆడి మ్యాచ్ను తమ నుంచి లాగేసుకుందని పేర్కొన్నాడు. మాట్లాడలేకపోతున్నా.. అక్కడే ఓడిపోయాం ఈ మేరకు ఓటమి అనంతరం సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ చివరి బంతికి మ్యాచ్ మా చేజారింది. మ్యాచ్ ఓడిన కెప్టెన్గా ఇలాంటి సమయంలో మాట్లాడటం కష్టంగా ఉంది. భావోద్వేగాలు అదుపులోకి వస్తే గానీ నేను చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పలేను. ఏదేమైనా గుజరాత్ టైటాన్స్కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఆఖరి నిమిషం వరకు ఇరు జట్ల మధ్య విజయం ఊగిసలాడటమనేది ఈ టోర్నీకి ఉన్న ప్రత్యేకత. ఇది మా బౌలర్ల తప్పే మేము తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాల్సిన సమయం. నిజానికి నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. 180 మంచి స్కోరే అనుకున్నా. అయితే, మేము లక్కీగా 196 పరుగులు చేశాం. కచ్చితంగా అది విన్నింగ్ స్కోరే. పిచ్పై తేమ లేదు కాబట్టి మా బౌలింగ్ విభాగం పనిపూర్తి చేయాల్సింది. జైపూర్లో 197.. తేమ లేని వికెట్పై డిఫెండ్ చేయడం అంత కష్టమేమీ కాదు’’ అంటూ బౌలర్ల వైఫల్యాన్ని ఎత్తిచూపాడు. రాణించిన సంజూ, రియాన్ పరాగ్ కాగా జైపూర్లో బుధవారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(24), జోస్ బట్లర్(8) నామమాత్రపు స్కోర్లకు పరిమితం కాగా.. వన్డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. Fifty comes up for SANJU SAM5️⃣0️⃣N 💥#RRvGT #TATAIPL #IPLonJioCinema #IPLinMalayalam pic.twitter.com/Fxlr57hK6L — JioCinema (@JioCinema) April 10, 2024 మొత్తంగా 38 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 68 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఇక నాలుగో నంబర్ బ్యాటర్ రియాన్ పరాగ్ మరోసారి సుడిగాలి ఇన్నింగ్స్(48 బంతుల్లో 76)తో అదరగొట్టాడు. Caution ⚠ It's Riyan Parag demolition on display 🔥💥#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/dzKuPfTS0Q — JioCinema (@JioCinema) April 10, 2024 అంతా రషీద్ ఖాన్ వల్లే ఆఖర్లో హెట్మెయిర్ మెరుపులు(5 బంతుల్లో 13- నాటౌట్) మెరిపించగా.. రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే తడబడ్డప్పటికీ గుజరాత్ ఆఖరి బంతి వరకు పోరాడి విజయాన్ని అందుకుంది. శుబ్మన్ గిల్(72) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రషీద్ ఖాన్(11 బంతుల్లో 24- నాటౌట్) రాజస్తాన్ను గెలుపునకు దూరం చేశాడు. ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. ఏకంగా ఫోర్ బాది గుజరాత్ను విజయతీరాలకు చేర్చాడు. The elegance of the Prince 🤌#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/EzGEcv6Pk9 — JioCinema (@JioCinema) April 10, 2024 రాజస్తాన్ వర్సెస్ గుజరాత్ స్కోర్లు ►రాజస్తాన్: 196/3 (20) ►గుజరాత్: 199/7 (20) ►ఫలితం: మూడు వికెట్ల తేడాతో రాజస్తాన్పై గుజరాత్ టైటాన్స్ విజయం. 𝘾𝙧𝙞𝙨𝙞𝙨 𝙈𝙖𝙣 delivered yet again 😎 🎥 Relive the thrilling end to a thrilling @gujarat_titans win! Recap the match on @starsportsindia & @Jiocinema 💻 📱#TATAIPL | #RRvGT pic.twitter.com/eXDDvpToZ0 — IndianPremierLeague (@IPL) April 10, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: IPL 2024: కొంపముంచిన స్లో ఓవర్ రేట్.. గుజరాత్ సంచలన విజయం -
రాయల్స్కు టైటాన్స్ షాక్
197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది... చివర్లో 4 ఓవర్లలో 59 పరుగులు చేయాల్సిన దశలో గెలుపు అసాధ్యంగా అనిపించింది. కానీ తర్వాతి నాలుగు ఓవర్లలో వరుసగా 17, 7, 20, 17 పరుగులు సాధించిన టైటాన్స్ అనూహ్య విజయాన్ని అందుకుంది. అప్పటి వరకు నియంత్రణతో బౌలింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ పేలవ బౌలింగ్, వ్యూహ వైఫల్యంతో చేజేతులా మ్యాచ్ను కోల్పోయి ఈ సీజన్లో తొలి ఓటమిని ఎదుర్కొంది. జైపూర్: వరుస విజయాలతో అజేయంగా దూసుకుపోతున్న రాజస్తాన్ రాయల్స్కు బ్రేక్ పడింది. బుధవారం జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో రాయల్స్పై గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్స్లు), సామ్సన్ (38 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 199 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (44 బంతుల్లో 72; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించగా, సాయి సుదర్శన్ (29 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రషీద్ ఖాన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో టైటాన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. శతక భాగస్వామ్యం... గత మూడు మ్యాచ్లలో వైఫల్యాల తర్వాత ఈసారి యశస్వి (19 బంతుల్లో 24; 5 ఫోర్లు) కాస్త మెరుగైన ప్రదర్శన కనబర్చగా, గత మ్యాచ్లో సెంచరీ చేసిన బట్లర్ (8) విఫలమయ్యాడు. పవర్ప్లేలో రాజస్తాన్ 43 పరుగులే చేయగా... ఈ దశ నుంచి సామ్సన్, పరాగ్ భారీ భాగస్వామ్యం రాయల్స్ను పటిష్ట స్థితికి చేర్చింది. ఇద్దరూ వేగంగా పరుగులు సాధించారు. పరాగ్ 34 బంతుల్లో, సామ్సన్ 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నారు. ఎట్టకేలకు 19వ ఓవర్లో పరాగ్ను అవుట్ చేసి మోహిత్ ఈ జోడీని విడదీశాడు. అయితే ఉమేశ్ వేసిన చివరి ఓవర్లో సామ్సన్, హెట్మైర్ (13 నాటౌట్) చెరో సిక్స్ బాదడంతో మొత్తం 19 పరుగులు వచ్చాయి. గిల్ కెప్టెన్ఇన్నింగ్స్... భారీ ఛేదనలో టైటాన్స్కు సుదర్శన్, శుబ్మన్ గిల్ దూకుడైన ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. వీరిద్దరు తొలి వికెట్కు 64 పరుగులు జోడించినా... అందుకు 50 బంతులు తీసుకున్నారు. రాయల్స్ కట్టుదిట్టమైన బౌలింగ్తో వీరి పరుగుల వేగాన్ని నిరోధించింది. బౌల్ట్ తొలి 2 ఓవర్లలో 8 పరుగులే ఇవ్వగా... అవేశ్ బౌలింగ్లో 14 పరుగులు రాబట్టడంతో టైటాన్స్ స్కోరు పవర్ప్లే ముగిసే సరికి 44 పరుగులకు చేరింది. అయితే కుల్దీప్ సేన్ ఒక్కసారిగా గుజరాత్ను దెబ్బ తీశాడు. తన బౌలింగ్లో 6 పరుగుల వ్యవధిలో అతను సుదర్శన్, వేడ్ (4), మనోహర్ (1)లను వెనక్కి పంపించాడు. ఈ దశలో కెపె్టన్ గిల్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 35 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. విజయ్ శంకర్ (16) ప్రభావం చూపలేకపోగా... 28 బంతుల్లో 65 పరుగులు చేయాల్సిన స్థితిలో గిల్ వెనుదిరగడంతో టైటాన్స్ ఆశలు సన్నగిల్లాయి. అయితే కీలక సమయంలో రషీద్ ఖాన్ (11 బంతుల్లో 24 నాటౌట్; 4 ఫోర్లు), రాహుల్ తెవాటియా (11 బంతుల్లో 22; 3 ఫోర్లు) ఆట జట్టును గెలిపించింది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) వేడ్ (బి) ఉమేశ్ 24; బట్లర్ (సి) తెవాటియా (బి) రషీద్ 8; సామ్సన్ (నాటౌట్) 68; పరాగ్ (సి) శంకర్ (బి) మోహిత్ 76; హెట్మైర్ (నాటౌట్) 13; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–32, 2–42, 3–172. బౌలింగ్: ఉమేశ్ 4–0–47–1, జాన్సన్ 4–0–37–0, రషీద్ 4–0–18–1, నూర్ 4–0–43–0, మోహిత్ 4–0–51–1. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 35; గిల్ (స్టంప్డ్) సామ్సన్ (బి) చహల్ 72; వేడ్ (బి) కుల్దీప్ 4; మనోహర్ (బి) కుల్దీప్ 1; విజయ్ శంకర్ (బి) చహల్ 16; తెవాటియా (రనౌట్) 22; షారుఖ్ (ఎల్బీ) (బి) అవేశ్ 14; రషీద్ ఖాన్ (నాటౌట్) 24; నూర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–64, 2–77, 3–79, 4–111, 5–133, 6–157, 7–195. బౌలింగ్: బౌల్ట్ 2–0–8–0, అవేశ్ 4–0–48–1, మహరాజ్ 2–0–16–0, అశి్వన్ 4–0–40–0, చహల్ 4–0–43–2, కుల్దీప్ సేన్ 4–0–41–3. ఐపీఎల్లో నేడు ముంబై X బెంగళూరు వేదిక: ముంబై రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
కొంపముంచిన స్లో ఓవర్ రేట్.. రాజస్థాన్పై గుజరాత్ సంచలన విజయం
ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో ఇవాళ (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ రాజస్థాన్ రాయల్స్ కొంపముంచింది. రాయల్స్ నిర్దిష్ట సమయానికి (ఓవర్ రేట్లో) ఐదు నిమిషాలు వెనుకబడి ఉండటంతో చివరి ఓవర్లో సర్కిల్ బయట ఓ ఫీల్డర్ను తక్కువగా ఉంచాల్సి వచ్చింది. ఇదే రాజస్థాన్ ఓటమికి కారణమైంది. 6 బంతుల్లో 15 పరుగులు అవసరమైన సందర్భంలో.. సర్కిల్ బయట ఓ ఫీల్డర్ తక్కువగా ఉండటంతో గుజరాత్ బ్యాటర్లు ఫ్రీగా షాట్లు ఆడి గెలుపుకు కావాల్సిన పరుగులు రాబట్టారు. ఈ ఓవర్లో గుజరాత్ బ్యాటర్లు సర్కిల్ పై నుంచి సులువుగా షాట్లు ఆడి మూడు బౌండరీలు సాధించారు. ఇన్నింగ్స్ చివరి బంతికి రషీద్ ఖాన్ ఫోర్ కొట్టి గుజరాత్ను గెలిపించాడు. దీనికి ముందు కుల్దీప్ సేన్ 19వ ఓవర్లో 20 పరుగులిచ్చి గుజరాత్ను గెలుపు లైన్లో నిలబెట్టాడు. మ్యాచ్ ఆరంభంలో ఇదే కుల్దీప్ 10 బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి రాజస్థాన్ను మ్యాచ్లోకి తెచ్చాడు. మొత్తంగా చూస్తే స్లో ఓవర్ రేటే రాజస్థాన్ పాలిట శాపంగా మారింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్ (38 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్లో యశస్వి 24, బట్లర్ 8, హెట్మైర్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ను రాహుల్ తెవాతియా (22), రషీద్ ఖాన్ (24 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్లు ఆడి గెలిపించారు. ఈ ఇద్దరు ఆఖరి రెండు ఓవర్లలో 37 పరుగులు రాబట్టి రాజస్థాన్కు గెలుపును దూరం చేశారు. గుజరాత్ ఇన్నింగ్స్కు తొలుత సాయి సుదర్శన్ (35), శుభ్మన్ గిల్ (72) గట్టి పునాది వేశారు. గుజరాత్ ఇన్నింగ్స్లో మాథ్యూ వేడ్ 4, అభినవ్ మనోహర్ 1, విజయ్ శంకర్ 16, షారుక్ ఖాన్ 14 పరుగులు చేసి ఔటయ్యారు. కుల్దీప్ సేన్ (4-0-41-3), చహల్ (4-0-43-2) రాణించినప్పటికీ రాజస్థాన్కు ఓటమి తప్పలేదు. -
IPL 2024 GT VS PBKS: ఫిఫ్టి కొట్టిన రషీద్ ఖాన్
ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్తో నిన్న (ఏప్రిల్ 4) జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ రషీద్ ఖాన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో గుజరాత్ తరఫున 50 వికెట్లు సాధించిన తొలి బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. నిన్నటి మ్యాచ్లో జితేశ్ శర్మ వికెట్ సాధించడం ద్వారా రషీద్ ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్కు ముందు మ్యాచ్లోనే (సన్రైజర్స్తో) షమీని అధిగమించి గుజరాత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అవతరించిన రషీద్.. తాజాగా మరో మైలురాయిని తాకాడు. పంజాబ్తో మ్యాచ్లో రషీద్ 4 ఓవర్లలో 40 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. ఐపీఎల్లో గుజరాత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్లు.. రషీద్ ఖాన్-50 మొహమ్మద్ షమీ-48 మోహిత్ శర్మ-34 నూర్ అహ్మద్-17 అల్జరీ జోసఫ్-14 మ్యాచ్ విషయానికొస్తే.. శాశంక్ సింగ్ (29 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) అనూహ్య రీతిలో విరుచుకుపడటంతో గుజరాత్పై పంజాబ్ సంచలన విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్య ఛేదనలో ఈ ఇద్దరు ఆటగాళ్లు చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఆడి పంజాబ్ను గెలిపించారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శుభ్మన్ గిల్ (89 నాటౌట్) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. పంజాబ్ శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, ప్రభ్సిమ్రన్ సింగ్ (35) రాణించడంతో 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా 3 వికెట్ల తేడాతో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో గుజరాత్ను వెనుక్కునెట్టి ఐదో స్థానానికి చేరుకుంది. -
SRH Vs GT: రషీద్ ఖాన్ సూపర్ డెలివరీ.. క్లాసెన్కు ఫ్యూజ్లు ఔట్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 13 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్స్లతో 24 పరుగులు చేశాడు. అయితే తనకు వచ్చిన ఆరంభాన్ని భారీ ఇన్నింగ్స్గామలచడంలో క్లాసెన్ విఫలమయ్యాడు. గుజరాత్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అద్బుతమైన బంతితో క్లాసెన్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 14 ఓవర్లో మూడో బంతిని రషీద్ ఫ్లాట్గా సంధించాడు. బంతి టర్న్ అవుతుందని భావించిన క్లాసెన్.. ఫుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ ఫ్లాట్గా వచ్చిన బంతి క్లాసెన్ బ్యాట్కు మిస్స్ అయ్యి లెగ్ స్టంప్ను గిరాటేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు ఒక్కసారిగా సంబరాల్లో మునిగి తేలిపోయారు. కానీ క్లాసెన్ మాత్రం నిరాశతో తన బ్యాట్కు పంచ్లు ఇస్తూ మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సన్రైజర్స్ బ్యాటర్లలో అబ్దుల్ సమద్(29), అభిషేక్ శర్మ(29) పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో మొహిత్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా.. ఉమేశ్ యాదవ్, ఒమర్జాయ్, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ తలా వికెట్ సాధించారు. pic.twitter.com/J6y5BOQ5IE — Sitaraman (@Sitaraman112971) March 31, 2024 -
IPL 2024: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. షమీ రికార్డు బద్దలు
గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రషీద్ ఖాన్ రికార్డులెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో హెన్రిచ్ క్లాసెన్ను ఔట్ చేసిన రషీద్.. ఈ అరుదైన ఫీట్ను తన పేరిట లిఖించుకున్నాడు. రషీద్ ఇప్పటివరకు ఐపీఎల్లో గుజరాత్ తరపున 49 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు గుజరాత్ స్టార్ పేసర్ మహ్మద్ షమీ(48) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో షమీని రషీద్ అధిగమించాడు. కాగా ఈ ఏడాది సీజన్కు గాయం కారణంగా మహ్మద్ షమీ దూరమైన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సన్రైజర్స్ బ్యాటర్లలో అబ్దుల్ సమద్(29), అభిషేక్ శర్మ(29) పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో మొహిత్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా.. ఉమేశ్ యాదవ్, ఒమర్జాయ్, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ తలా వికెట్ సాధించారు. -
Viral Video: కళ్లు చెదిరే సిక్సర్ బాదిన రషీద్ ఖాన్
ఐర్లాండ్తో నిన్న జరిగిన రెండో టీ20 ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్లో ఇరగదీసిన రషీద్.. ఆతర్వాత బౌలింగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రషీద్ (12 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్), మొహమ్మద్ నబీ (38 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సదీఖుల్లా అటల్ (32 బంతుల్లో 35; 2 ఫోర్లు, సిక్స్) బ్యాట్తో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. పై ముగ్గురు మినహా ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో ఎవ్వరూ రాణించలేకపోయారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ 3, జాషువ లిటిల్, బ్యారీ మెక్కార్తీ తలో 2 వికెట్లు, బెంజమిన్ వైట్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్.. రషీద్ ఖాన్ (4-0-14-4), ఖరోటే (4-0-23-2), నబీ (3-0-14-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమై 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో బల్బిర్నీ (45), గ్యారెత్ డెలానీ (39) మాత్రమే రాణించారు. We have seen that before! 😄 Just @RashidKhan_19 being Rashid Khan! 🤩👏🙌#AfghanAtalan | #AFGvIRE2024 pic.twitter.com/yxRqBibMQf — Afghanistan Cricket Board (@ACBofficials) March 17, 2024 బంతిని చూడకుండానే సిక్సర్ బాదిన రషీద్.. ప్రపంచ స్థాయి బౌలర్ అయిన రషీద్ ఖాన్ అడపాదడపా బ్యాట్తోనూ ప్రతాపం చూపించడం తెలిసిందే. ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో రషీద్ మరోసారి బ్యాట్తో తన ప్రతాపాన్ని చూపించాడు. ఈ మ్యాచ్లో 18వ ఓవర్ ఆఖరి బంతికి రషీద్ బాదిన సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. బ్యారీ మెక్కార్తీ బౌలింగ్లో రషీద్ బంతిని చూడకుండానే సిక్సర్గా మలిచాడు. లెగ్సైడ్ దిశగా మెక్కార్తీ సంధించిన ఫుల్ టాస్ బంతిని రషీద్ కళ్లు మూసుకుని సిక్సర్ కొట్టాడు. రషీద్కు ఇలాంటి షాట్లు ఆడటం కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి షాట్లు చాలాసార్లు ఆడాడు. రషీద్ బాదిన ఈ సిక్సర్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో ఐర్లాండ్ తొలి మ్యాచ్లో గెలవగా.. ఆఫ్ఘనిస్తాన్ రెండో మ్యాచ్లో విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 ఇవాళ (మార్చి 18) జరుగనుంది. -
రీ ఎంట్రీలో అదరగొట్టిన రషీద్ ఖాన్.. 14 ఏళ్ల రికార్డు బద్దలు
అఫ్గానిస్తాన్ టీ20 కెప్టెన్ రషీద్ ఖాన్ తన రీ ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. గాయం కారణంగా గత కొంత కాలంగా ఆటకు దూరంగా ఉన్న రషీద్.. శుక్రవారం ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20తో తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో తన రీ ఎంట్రీ మ్యాచ్లో రషీద్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్లో 3 వికెట్లతో రషీద్ సత్తాచాటాడు. తన 4 ఓవర్ల కోటా స్పెల్లో 19 పరుగులిచ్చి రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు. పాల్ స్టిర్లింంగ్, క్యాంప్హెర్ వంటి కీలక వికెట్లను ఖాన్ పడగొట్టాడు. ఈ క్రమంలో రషీద్ ఖాన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన అఫ్గానిస్తాన్ కెప్టెన్గా రషీద్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆ జట్టు మాజీ కెప్టెన్ నవ్రోజ్ మంగల్ పేరిట ఉండేది. 2014 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో ఐర్లాండ్పై మంగల్ 4 ఓవర్లలో 23 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. తాజా మ్యాచ్తో మంగల్ ఆల్టైమ్ రికార్డును రషీద్ ఖాన్ బ్రేక్ చేశాడు. కాగా ఈ మ్యాచ్లో అఫ్గానిస్తాన్ అనుహ్యంగా 38 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కాగా ఐపీఎల్-2024 సీజన్కు ముందు రషీద్ ఫుల్ ఫిట్నెస్ సాధించడం గుజరాత్ టైటాన్స్కు కలిసొచ్చే అంశం. The Magician King @rashidkhan_19 is Back https://t.co/FkSsk7O91b — Baaz Khan (@Im_BaazKhan) March 15, 2024 -
అఫ్గానిస్తాన్ను చిత్తు చేసిన ఐర్లాండ్..
అఫ్గానిస్తాన్ జట్టుకు పసికూన ఐర్లాండ్ ఊహించని షాకిచ్చింది. షార్జా వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన తొలి టీ20లో 38 పరుగుల తేడాతో ఐర్లాండ్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటర్లలో హ్యారీ టెక్టర్(56) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు బల్బర్నీ(22), స్టిర్లింగ్(25) పరుగులతో రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో కెప్టెన్ రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. నంగేయాలియా ఖరోటే 2వికెట్లు, ఓమర్జాయ్ చెరో వికెట్ సాధించారు. చెలరేగిన బెంజిమిన్ వైట్.. అనంతరం 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 111 పరుగులకే కుప్పకూలింది. దీంతో 38 పరుగుల తేడాతో అఫ్గాన్ ఓటమి పాలైంది. ఐర్లాండ్ స్పిన్నర్ బెంజిమిన్ వైట్ 4 వికెట్లతో అఫ్గాన్ను దెబ్బతీశాడు. అతడితో పాటు లిటిల్ 3 వికెట్లు, మెక్గ్రాతీ రెండు, అడైర్ వికెట్ సాధించారు. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో మహ్మద్ ఇషాఖ్(32) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 మార్చి 17న జరగనుంది. చదవండి: CSK: సీఎస్కేకు బిగ్ షాక్! డెత్ ఓవర్ల స్పెషలిస్టు అవుట్! -
గుజరాత్ టైటాన్స్కు గుడ్న్యూస్.. స్టార్ వచ్చేస్తున్నాడు!
IPL 2024- Gujarat Titans: అఫ్గనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఈ విషయాన్ని రషీద్ ఖాన్ ధ్రువీకరించాడు. కాగా అఫ్గన్ లెగ్ స్పిన్నర్ భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023 తర్వాత వెన్నునొప్పికి సర్జరీ చేయించుకున్నాడు. అప్పటి నుంచి అంతర్జాతీయ, లీగ్ క్రికెట్కు దూరమయ్యాడు. ఈ క్రమంలో మార్చి 15 నుంచి మొదలుకానున్న అఫ్గనిస్తాన్- ఐర్లాండ్ టీ20 సిరీస్తో తాను రీఎంట్రీ ఇస్తున్నట్లు రషీద్ ఖాన్ వెల్లడించాడు. ‘‘రానున్న సిరీస్లో జాతీయ జట్టు తరఫున మళ్లీ బరిలోకి దిగాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. ఇందుకు సంబంధించిన శిక్షణ కూడా మొదలుపెట్టాను. అన్నీ సజావుగా సాగుతున్నాయి. నిజానికి సర్జరీ కారణంగా గడిచిన మూడు నెలల కాలం కష్టంగా తోచింది. ఏడెనిమిది నెలలుగా వెన్నునొప్పి బాధపెడుతోంది. వరల్డ్కప్ టోర్నీకి ముందుగానే సర్జరీకి వెళ్తే బాగుంటుందని డాక్టర్లు సూచించారు. అయితే, ఐసీసీ మెగా ఈవెంట్లో దేశం తరఫున ఆడాలనే నేను నిర్ణయించుకున్నాను. దేవుడి దయ వల్ల ఇప్పుడంతా బాగుంది. రానున్న రోజులు మరింత గొప్పగా ఉంటాయని భావిస్తున్నాను’’ అని రషీద్ ఖాన్ అఫ్గన్ క్రికెట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అదే విధంగా.. టీ20 వరల్డ్కప్-2024కు ముందు ఐపీఎల్ ఆడటం కూడా తమకు కలిసి వస్తుందని రషీద్ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశాడు. ఐపీఎల్కాగా రషీద్ ఖాన్ రీఎంట్రీ ఐపీఎల్ ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్కు కూడా శుభవార్తగా పరిణమించింది. ఇప్పటికే కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టును వీడి ముంబై ఇండియన్స్ సారథి కాగా.. మహ్మద్ షమీ తాజా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో రషీద్ ఆగమనం టైటాన్స్కు ఊరట కలిగించనుంది. ఇక గత సీజన్లో రషీద్ ఖాన్ 17 మ్యాచ్లు ఆడి 27 వికెట్లు తీశాడు. తద్వారా అత్యధిక వికెట్ టేకర్ల మూడో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే.. మార్చి 15- 18 వరకు అఫ్గన్- ఐర్లాండ్ మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. ఇక ఐపీఎల్-2024లో గుజరాత్ మార్చి 24న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. చదవండి: ధోని, యువీ కాదు..! టీమిండియాలో గ్రేటెస్ట్ సిక్స్ హిట్టర్ అతడే: ద్రవిడ్ -
IPL 2024: కోహ్లి, గిల్ కాదు!.. ఈసారి ఆరెంజ్ క్యాప్ అతడిదే!
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్-2024 సందడి మొదలుకానుంది. చెన్నై వేదికగా మార్చి 22న ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. తాజా ఎడిషన్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పది ఫ్రాంఛైజీల ఆటగాళ్లందరూ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నారు. జాతీయ జట్టు షెడ్యూల్తో బిజీగా ఉన్న వాళ్లు మినహా మిగతా వాళ్లంతా ఐపీఎల్ జట్ల శిక్షణా శిబిరంలో చేరి.. ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. ఇక ఎప్పటిలాగే.. ఈ సీజన్ ఆరంభానికి ముందు కూడా.. ఈసారి ఆరెంజ్ క్యాప్ విజేత ఎవరు? పర్పుల్ క్యాప్ గెలిచేది ఎవరు? చాంపియన్గా నిలిచేది ఏ జట్టు? అంటూ అభిమానులు తమ అంచనాలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్కు ఇలాంటి ప్రశ్నలు ఎదురుకాగా.. ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. ఓ యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చహల్ మాట్లాడుతూ.. ‘‘ఈసారి ఆరెంజ్ క్యాప్ను యశస్వి జైస్వాల్ లేదంటే జోస్ బట్లర్ గెలుస్తాడు. ఇక పర్పుల్ క్యాప్ విషయానికొస్తే.. ఈసారి అత్యధిక వికెట్లు తీసేది నేనే.. నా తర్వాతి స్థానంలో రషీద్ ఖాన్ ఉంటాడు’’ అని పేర్కొన్నాడు. ఈ మేరకు అత్యధిక పరుగుల వీరుడిగా టీమిండియా స్టార్ ఓపెనర్, రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరును చెప్పాడు చహల్. యజువేంద్ర చహల్- బట్లర్, జైస్వాల్(PC: RR/IPL) అదే విధంగా.. రాయల్స్లో మరో సహచర ఆటగాడు, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్కు కూడా ఆరెంజ్ క్యాప్ గెలిచే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డాడు. అయితే, అత్యధిక వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ మాత్రం తానే గెలుస్తానని చహల్ ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. కాగా ఐపీఎల్లో విజయవంతమైన బౌలర్గా యజువేంద్ర చహల్ పేరొందాడు. చాలా ఏళ్లపాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన చహల్.. రెండేళ్ల క్రితం రాజస్తాన్ రాయల్స్కు మారాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2023లో 14 మ్యాచ్లలో కలిపి 21 వికెట్లు తీశాడీ మణికట్టు స్పిన్నర్. తద్వారా క్యాష్ రిచ్ లీగ్లో అత్యధిక వికెట్లు(187) తీసిన బౌలర్గా చరిత్ర సృష్టించాడు. అయితే, టీమిండియాలో మాత్రం చహల్కు అవకాశాలు సన్నగిల్లాయి. ఇటీవలే సెంట్రల్ కాంట్రాక్టు కూడా కోల్పోయాడతడు! ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్ స్టార్ శుబ్మన్ గిల్ 890 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఆర్సీబీ స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ 730, సీఎస్కే ఓపెనర్ డెవాన్ కాన్వే 672, ఆర్సీబీ ముఖచిత్రం విరాట్ కోహ్లి 639 పరుగులతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. చదవండి: #DhanashreeVerma: పదే పదే ఇలా ఎందుకు? చహల్ భార్య ధనశ్రీ వర్మ ఫొటోపై రచ్చ -
India Vs Afghanistan T20I: టీమిండియాతో తొలి టీ20.. ఆఫ్ఘనిస్తాన్కు భారీ షాక్
టీమిండియాతో టీ20 సిరీస్కు ముందు ఆఫ్ఘనిస్తాన్కు భారీ షాక్ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆ జట్టు స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్ భారత్తో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ సిరీస్ కోసం రషీద్ జట్టుతో పాటు భారత్కు విచ్చేసినప్పటికీ.. గాయం పూర్తిగా తగ్గకపోవడంతో సెలెక్టర్లు అతన్ని తిరిగి ఇంటికి పంపించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇదే గాయం కారణంగా రషీద్ బిగ్బాష్ లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్లకు కూడా దూరంగా ఉన్నాడు. రషీద్ భారత్తో టీ20 సిరీస్ మొత్తానికి దూరమైనట్లు ఆ జట్టు తాత్కాలిక కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ ప్రకటించాడు. కాగా, రషీద్ వన్డే వరల్డ్కప్ అనంతరం వెన్నెముక సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, భారత్-ఆఫ్ఘనిస్తాన్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఇవాల్టి నుంచి ప్రారంభంకానుంది. మొహాలీ వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ అనంతరం జనవరి 14న రెండో టీ20 (ఇండోర్), జనవరి 17న (బెంగళూరు) మూడో టీ20 జరుగనున్నాయి. తొలి టీ20కి కోహ్లి దూరం.. చాలాకాలంగా టీ20ల్లో తన బ్యాటింగ్ చూడాలని వెయ్యి కళ్లతో ఎదురుచూసిన అభిమానులకు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఊహించని షాక్ ఇచ్చాడు. వ్యక్తిగత కారణాల చేత అతను ఆఫ్ఘనిస్తాన్తో తొలి టీ20కి దూరమయ్యాడు. కోహ్లి రెండో టీ20 నుంచి తిరిగి అందుబాటులోకి వస్తాడని భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రకటించాడు. -
ప్రఖ్యాత హిందుస్తానీ గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ కన్నుమూత
కోల్కతా: ప్రముఖ హిందుస్తానీ గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ (55)మంగళవారం కోల్కతా లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్ను మూశారు. 2019 నుంచి ప్రొస్టేట్ క్యాన్సర్తో ఆయన బాధపడుతు న్నారు. గత నెలలో గుండెపోటుకు గురైన ఖాన్ అప్పటి నుంచి ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి ఖాన్ మంగళవారం మధ్యాహ్నం 3.45కు తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రాంపూర్–సహస్వాన్ ఘరానా సంప్రదాయానికి చెందిన ఖాన్ ఘరానా వ్యవస్థాపకుడు ఇనాయత్ హుస్సేన్ ఖాన్ ముని మనవడు. యూపీలోని బదౌన్కు చెందిన ఖాన్ కుటుంబం ఆయనకు పదేళ్ల వయస్సులో 1980లో కోల్కతాకు వలస వచ్చింది. సీఎం మమతా బెనర్జీ ఆస్పత్రికి వెళ్లి ఖాన్ కుటుంబసభ్యులను ఓదార్చారు. రషీద్ ఖాన్ మృతి పట్ల రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఇలా ఉండగా, ఖాన్ 11 ఏళ్ల వయస్సులోనే 1994లో మొట్టమొదటి కచేరీలో పాల్గొని, సంగీత కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాంపూర్ సహస్వాన్ సంప్రదాయ గానా నికి చిట్ట చివరి దిగ్గజంగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ‘విలంబిత్ ఖయాల్’ శైలిలో మూడు దశాబ్దాలుగా కోట్లాది మంది సంగీత ప్రియులను ఆయన గాత్రం అలరిస్తోంది. మై నేమ్ ఈజ్ ఖాన్, జబ్ వుయ్ మెట్, ఇసాక్, మంటో, మౌసమ్ తదితర చిత్రాల్లో నేపథ్య గాయకుడిగా ఉన్నారు. ఆయన్ను కేంద్రం పద్మ శ్రీ, పద్మ భూషణ్ అవార్డులతో గౌరవించింది. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్(55) కన్నుమూశారు. గతనెల కోల్కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రొస్టేట్ క్యాన్సర్కు చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని బదౌన్లో జన్మించిన రషీద్ ఖాన్ జబ్ వి మెట్ అనే బాలీవుడ్ చిత్రంలోని ఆవోగే జబ్ తుమ్ అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా.. కళారంగంలో ఆయన సేవలకు గానూ భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం, 2006లో సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. 2022లో పద్మభూషణ్ అవార్డ్ ప్రదానం చేసింది. -
టీమిండియాతో సిరీస్కు అఫ్గన్ జట్టు ప్రకటన: ప్లేయర్గా రషీద్.. కెప్టెన్?
Ind vs Afg T20 Serie- Rashid Khan returns in squad but might not play: టీమిండియాతో టీ20 సిరీస్కు అఫ్గనిస్తాన్ తమ జట్టును ప్రకటించింది. భారత్ వేదికగా జరుగనున్న సిరీస్కు 19 మంది సభ్యులతో కూడిన టీమ్ను ఎంపిక చేసింది. వెన్నునొప్పితో బాధపడుతున్న కెప్టెన్, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్కు కూడా ఈ జట్టులో చోటిచ్చినట్లు వెల్లడించింది. కెప్టెన్గా మళ్లీ అతడే అయితే, భారత జట్టుతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో.. అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం లేదని పేర్కొంది. రషీద్ ఖాన్ స్థానంలో ఇబ్రహీం జద్రాన్ మరోసారి కెప్టెన్గా వ్యవహరించనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు శనివారం ప్రకటన విడుదల చేసింది. కాగా జనవరి 11 నుంచి టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్ల సిరీస్ ఆరంభం కానుంది. కాగా గాయం కారణంగా రషీద్ ఖాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో టీ20 సిరీస్కు దూరం కాగా.. అతడి స్థానంలో స్టార్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ సారథ్య బాధ్యతలు నిర్వహించాడు. ఇక ఈ 22 ఏళ్ల రైట్హ్యాండ్ బ్యాటర్ కెప్టెన్సీలో యూఏఈ సిరీస్ను పర్యాటక అఫ్గనిస్తాన్ 2-1తో అఫ్గన్ గెలుచుకుంది. సర్జరీ చేయించుకున్న రషీద్ ఖాన్.. అఫ్గన్కు ఇదే తొలిసారి ఇక వెన్నునొప్పికి సర్జరీ చేయించుకున్న రషీద్ ఖాన్.. ఇంకా పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించలేదు. కాబట్టి.. జట్టుకు ఎంపికైనప్పటికీ అతడు టీమిండియాతో మ్యాచ్లు ఆడే అవకాశం లేదు. ఇదిలా ఉంటే.. టీ20 సిరీస్ కోసం అఫ్గనిస్తాన్ భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో పటిష్ట, నంబర్ 1 టీమిండియాతో పోటీపడటం తమకు సంతోషాన్నిస్తోందన్న అఫ్గన్ బోర్డు.. మెరుగైన ప్రదర్శనతో అండర్ డాగ్స్ అనే ముద్ర చెరిపేసుకుంటామని పేర్కొంది. టీమిండియాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు అఫ్గనిస్తాన్ జట్టు ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్. చదవండి: శతక్కొట్టిన పుజారా: ఇంగ్లండ్తో సిరీస్కు ముందు సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్ -
అఫ్గానిస్తాన్ కెప్టెన్గా స్టార్ ఓపెనర్..
యూఏఈతో జరగనున్న టీ20 సిరీస్కు 18 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్కు అఫ్గాన్ రెగ్యూలర్ కెప్టెన్, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో అతడి స్ధానంలో యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్కు జట్టు పగ్గాలను అఫ్గాన్ సెలక్టర్లు అప్పగించారు. అదే విధంగా ఈ జట్టులో పేసర్లు ఫజల్హక్ ఫరూకీ, నవీన్ ఉల్ హక్కు చోటు దక్కింది. కాగా వీరిద్దరిపై అఫ్గాన్ క్రికెట్ బోర్డు విదేశీ లీగ్లలో రెండేళ్ల పాటు ఆడకూడకుండా నిషేధం విధించింది. అయితే వీరు అఫ్గాన్ సెంట్రల్ కాంట్రాక్టులను వదులకోనున్నారని వార్తలు వినిపించాయి. కానీ వీరు ఫ్రాంచైజీ క్రికెట్ కంటే జాతీయ జట్టు తరపున ఆడేందుకు మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే యూఏఈ సిరీస్కు సెలక్టర్లు వీరిద్దరిని ఎంపిక చేశారు. డిసెంబర్ 29 నుంచి షార్జా వేదికగా జరగనున్న తొలి టీ20తో మూడు మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కానుంది. మొత్తం మూడు మ్యాచ్లు షార్జా వేదికగానే జరగనున్నాయి. అఫ్గానిస్తాన్ టీ20 జట్టు: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), మహ్మద్ ఇషాక్, హజ్రతుల్లా జజాయ్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, దర్విష్ రసూలీ, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మౌల్లా ఒమర్జాయ్, ఎఫ్ షరఫుద్దీనాల్, ఎఫ్. అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీమ్ మరియు కైస్ అహ్మద్. చదవండి: IND vs SA: గెలుపు జోష్లో ఉన్న సౌతాఫ్రికాకు బిగ్ షాక్.. -
IPL 2024: గుజరాత్ కొత్త కెప్టెన్ ఎవరనుకుంటున్నారు..?
2024 ఐపీఎల్ సీజన్కు ముందు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్కు వలస వెళ్లాడు. ఈ నేపథ్యంలో గుజరాత్ కొత్త కెప్టెన్ ఎవరనే అంశంపై క్రికెట్ అభిమానుల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. గుజరాత్ నయా కెప్టెన్ శుభ్మన్ గిల్ అని కొందరంటుంటే, మరికొందరేమో కేన్ విలియమ్సన్ పేరును సూచిస్తున్నారు. డేవిడ్ మిల్లర్, మొహమ్మద్ షమీ, రషీద్ ఖాన్ పేర్లు సైతం తెరపైకి వస్తున్నాయి. ఇన్ని ఆప్షన్స్ మధ్య టైటాన్స్ యాజమాన్యం కెప్టెన్గా ఎవరిని ఎంపిక చేస్తుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే కెప్టెన్సీ రేసులో శుభ్మన్ గిల్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే కేన్ విలియమ్సన్ లాంటి విజయవంతమైన సారధిని జట్టులో ఉంచుకుని టైటాన్స్ యాజమాన్యం గిల్కు సారధ్య బాధ్యతలు అప్పజెబుతుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. వీరిద్దరిని కాదని షమీ లేదా రషీద్ ఖాన్కు పగ్గాలు అప్పచెబుతారా అంటే పలు సున్నితమైన అంశాలు అడ్డురావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభిమానులు, విశ్లేషకులు ఎన్ని అనుకున్నా టైటాన్స్ యాజమాన్యానికి కెప్టెన్సీ అంశంపై పూర్తి క్లారిటీ ఉండవచ్చు. వారి నుంచి అధికారిక ప్రకటన రావడమే తరువాయి. గుజరాత్ కొత్త కెప్టెన్గా ఎవరైతే బాగుంటుందో మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలపండి. కాగా, 2024 సీజన్కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ (నిలుపుకోవడం), రిలీజ్ (వేలానికి వదిలేయడం) ప్రక్రియ నిన్నటితో (నవంబర్ 26) ముగిసిన విషయం తెలిసిందే. అన్ని ఫ్రాంచైజీలు ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించాయి. దుబాయ్ వేదికగా ఈ ఏడాది డిసెంబర్ 19న జరిగే వేలం తర్వాత అన్ని ఫ్రాంచైజీలకు తుది రూపం వస్తుంది. ప్రస్తుతానికి గుజరాత్ ఫ్రాంచైజీ పరిస్థితి ఇలా ఉంది.. ఆటగాళ్ల సంఖ్య-17 (11 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (76.85 కోట్లు), పర్స్లో మిగిలిన మొత్తం (23.15 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (8), ఇందులో విదేశీ ఆటగాళ్లు (2). రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే.. యశ్ దయాల్ కేఎస్ భరత్ శివమ్ మావి ఉర్విల్ పటేల్ ప్రదీప్ సాంగ్వాన్ ఓడియన్ స్మిత్ అల్జరీ జోసఫ్ దసున్ షనక నిలబెట్టుకున్న ఆటగాళ్లు వీరే.. డేవిడ్ మిల్లర్ శుభ్మన్ గిల్ మాథ్యూ వేడ్ వృద్ధిమాన్ సాహా కేన్ విలియమ్సన్ అభినవ్ మనోహర్ సాయి సుదర్శన్ దర్శన్ నల్కండే విజయ్ శంకర్ జయంత్ యాదవ్ రాహుల్ తెవాటియా మొహమ్మద్ షమీ నూర్ అహ్మద్ సాయికిషోర్ రషీద్ ఖాన్ జాషువ లిటిల్ మోహిత్ శర్మ -
గుజరాత్ టైటాన్స్కు బిగ్ షాక్.. రషీద్ ఖాన్కు సర్జరీ!? ఐపీఎల్కు దూరం
బిగ్ బాష్ లీగ్-2023 నుంచి అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తప్పుకున్నాడు. గత కొంత కాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్న రషీద్.. త్వరలో శస్త్రచికిత్స చేయించుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బిగ్ బాష్ లీగ్ నుంచి రషీద్ వైదొలిగినట్లు సమాచారం. ఈ విషయాన్ని అడిలైడ్ స్ట్రైకర్స్ ప్రాంఛైజీ దృవీకరించింది. గత కొన్ని సీజన్ల నుంచి అడిలైడ్ స్ట్రైకర్స్కు రషీద్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా రషీద్ ఒక వేళ తన వెన్నెముకకు సర్జరీ చేసుకుంటే కచ్చితంగా క్రికెట్కు దాదాపు ఐదు నంచి ఆరు నెలల పాటు దూరం కానున్నాడు. ఈ క్రమంలో భారత్-అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్కు, ఐపీఎల్-2024 సీజన్కు దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరపున రషీద్ ఆడుతున్నాడు. వచ్చే ఏడాది వెస్టిండీస్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్కప్ సమయానికి పూర్తి ఫిట్నెస్తో ఉండాలని రషీద్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సర్జరీ చేసుకోవాలని రషీద్ నిర్ణయించకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీ20ల్లో అఫ్గానిస్తాన్ కెప్టెన్గా రషీద్ ఖాన్ వ్యవహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్కప్-2023లోనూ రషీద్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్, పాకిస్తాన్ వంటి వరల్డ్క్లాస్ జట్లను ఓడించడంలో రషీద్ కీలక పాత్ర పోషించాడు. చదవండి: విండీస్ టీ20 ప్రపంచకప్ వీరుడికి బిగ్ షాకిచ్చిన ఐసీసీ.. -
నాడు పాక్లో తలదాచుకున్న కుటుంబం.. డాక్టర్ కావాలనుకున్న రషీద్ ఇప్పుడిలా
వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్తో అఫ్గానిస్తాన్ మ్యాచ్.. పదకొండేళ్ల వ్యవధిలో.. వన్డేల్లో పాక్తో తలపడిన 7 సార్లూ అఫ్గాన్కు ఓటమే ఎదురైంది. విజయానికి కొన్నిసార్లు చేరువగా రాగలిగినా.. లక్ష్యాన్ని అందుకోవడం మాత్రం అఫ్గాన్ల వల్ల కాలేదు. కానీ ఈసారి లెక్క మారింది. అప్పటికి ఇంగ్లండ్పై గెలిచిన అఫ్గన్.. మరోసారి అద్భుత ప్రదర్శనతో అదరగొట్టి పాక్ను చిత్తు చేయడంలో సఫలమైంది. ఈ గెలుపుతో వచ్చిన జోష్లో తర్వాత మరో రెండు మ్యాచ్లు నెగ్గి.. ప్రపంచకప్లో తొలిసారిగా సెమీస్ రేసులోనూ నిలవగలిగింది. ఇక పాకిస్తాన్పై చిరస్మరణీయమైన విజయం తర్వాత కీలక సభ్యుడైన రషీద్ ఖాన్ ఆట పాటతో మైదానంలోనే సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విజయం జట్టుదే కావచ్చు. కానీ రషీద్కు సంబంధించి ఇది మరింత ప్రత్యేకం. ఎందుకంటే అఫ్గానిస్తాన్ ఒక జట్టుగా ఎదగడంలో అతడి పాత్ర కూడా ఎంతో కీలకం. వరుస పరాజయాల నుంచి బయటపడి క్రికెట్ వేదికపై టీమ్గా ఆ జట్టు సత్తా చాటడంలో రషీద్ కూడా ప్రధాన భాగస్వామి. సరిగ్గా చెప్పాలంటే అఫ్గాన్ క్రికెట్తో పాటు సమాంతరంగా అతనూ ఎదిగాడు. అంతకుమించి కూడా వ్యక్తిగతంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. తమ సొంత దేశంలో యుద్ధ వాతావరణం, మరెన్నో ప్రతికూలతలను అధిగమించి ఈ స్థాయికి చేరిన అతని పట్టుదల, కఠోర సంకల్పం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక దశలో యుద్ధ భయంతో పాకిస్తాన్కు వలస వెళ్లిపోయి అక్కడే దేశవాళీ క్రికెట్లోనూ సత్తా చాటి వెలుగులోకి వచ్చిన రషీద్ ప్రస్థానం అసాధారణం. తొలి గ్లోబల్ సూపర్ స్టార్ అఫ్గానిస్తాన్ దేశం నుంచి వచ్చిన తొలి గ్లోబల్ సూపర్ స్టార్.. ఈ వాక్యం రషీద్ఖాన్కు సరిగ్గా సరిపోతుంది. ఒకటి కాదు రెండు కాదు ప్రపంచవ్యాప్తంగా రషీద్ వేర్వేరు టోర్నీలు, లీగ్స్లో ఏకంగా 30 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో తన సొంత దేశం నుంచి పాకిస్తాన్, భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ మొదలు అటు ఆస్ట్రేలియా నుంచి అమెరికా, ఇంగ్లండ్కు చెందిన జట్ల వరకు ఉన్నాయి. అన్నింటా, అంతటా ఎక్కడ ఆడినా అతనికి అన్ని వైపుల నుంచి అభిమానం దక్కింది. క్రికెట్ ప్రేమికులందరూ లెగ్స్పిన్నర్గా రషీద్ ఆటను చూసి చప్పట్లు కొట్టినవారే! ఏదో ఒక దశలో తమవాడిగా సొంతం చేసుకున్నవారే. సన్రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ను అడిగితే చెప్తారు ఐపీఎల్లో అతని విలువేంటో, అతని ప్రభావం ఎలాంటిదో! తొలిసారి ఐపీఎల్లో అడుగు పెట్టినప్పుడే 2017 నుంచి ఐదు సీజన్ల పాటు హైదరాబాద్కు ఆడిన అతను గత రెండేళ్లుగా గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతని గూగ్లీలు ప్రపంచంలో ఎంతటి బ్యాటర్నైనా ఇబ్బంది పెడతాయి. తొలిసారి ఐపీఎల్లో అడుగు పెట్టినప్పుడే అతను అసోసియేట్ టీమ్ నుంచి ఈ మెగా లీగ్లో ఆడిన తొలి ఆటగాడిగా కొత్త ఘనతతో బరిలోకి దిగాడు. అదీ ఏకంగా రూ. 4 కోట్ల విలువతో రైజర్స్ అతడిని ఎంచుకుంది. అప్పటి నుంచి అతను ఒక వైపు తన ఫ్రాంచైజీ టీమ్లకు, మరో వైపు జాతీయ జట్టుకు స్టార్గా మారాడు. ఇంకా చెప్పాలంటే అతను రాక ముందు వేళ్ల మీద లెక్కించగలిగే విజయాలు మాత్రమే సాధించిన అఫ్గానిస్తాన్ ఆ తర్వాత ఎన్నో సంచలనాలకు కారణమైందంటే అందులో రషీద్ పాత్ర ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. యుద్ధ వాతావరణం నుంచి వచ్చి... అఫ్గానిస్తాన్లోని నన్గర్హర్ రాష్ట్రం అతని స్వస్థలం. ఏడుగురు అన్నదమ్ముల్లో అతను ఆరోవాడు. చాలామంది లాగే తన అన్నలు సరదాగా టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడుతుండటం చూసి అతనికీ ఆసక్తి కలిగింది. అయితే ఆ దేశంలో పరిస్థితులు కనీస స్థాయిలో కూడా లేవు. కాబట్టి ఇంతకంటే మెరుగ్గా క్రికెట్లో ఏమీ చేయలేమనేది అందరి భావన. డాక్టర్ కావాలనుకుంటే విధిరాత మరోలా పెద్దయ్యాక తామేం కావాలో కలలు కనే అందరి పిల్లల్లానే చిన్నప్పుడు రషీద్ కూడా డాక్టర్ కావాలని, కంప్యూటర్స్ నేర్చుకొని పెద్ద స్థాయికి చేరుకోవాలని, మంచి ఇంగ్లిష్ నేర్చుకొని టీచర్ కావాలని.. ఇలా చాలా కలలు కన్నాడు. కానీ అతనికి మరో విధంగా రాసి పెట్టి ఉంది. రషీద్ ఉండే ఊరు బాటి కోట్ పాకిస్తాన్ సరిహద్దులో ఉంటుంది. పెషావర్ సమీప నగరం. చిన్న చిన్న క్రికెట్ టోర్నీలు ఆడేందుకు ఇక్కడివారు అక్కడికి, అక్కడివారు ఇక్కడికి వస్తుంటారు. అలాంటి సమయంలో నజీమ్ అనే మేనేజర్ రషీద్లోని ప్రతిభను గుర్తించాడు. ధాటిగా బ్యాటింగ్ చేయడంతో పాటు ప్రత్యర్థి బ్యాటర్లకు ఏమాత్రం అర్థం కాని అతని బౌలింగ్ శైలి నజీమ్ను ఆకర్షించింది. తన మాట మీద పెషావర్లోని ఒక కళాశాల కోచింగ్ కార్యక్రమంలో రషీద్ను అక్కడివారు తీసుకున్నారు. పాకిస్తాన్కు వలస వెళ్లి దాంతో రషీద్కు కొత్త తరహా శిక్షణ లభించింది. అప్పటి వరకు ఎలాంటి నాణ్యత లేని సిమెంట్ టర్ఫ్లపై ప్రాక్టీస్ చేస్తూ వచ్చిన అతనికి అసలైన క్రికెట్ ఏమిటో అర్థమైంది. దాదాపు అదే సమయంలో అఫ్గానిస్తాన్లో యుద్ధ వాతావరణం ఏర్పడింది. కారణాలు ఏమైనా తీవ్రవాదుల హల్చల్, ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం పరిస్థితులను ఇబ్బందికరంగా మార్చాయి. దాంతో రషీద్ కుటుంబం మొత్తం పాకిస్తాన్లోని పెషావర్కే వెళ్లి తలదాచుకుంది. అక్కడ అతడిని చాలా మంది ముహాజిర్ (శరణార్థి) అంటూ ఆట పట్టించినా.. తన క్రికెట్తో అతను అన్ని మరచిపోయేవాడు. తిరుగులేని ప్రదర్శనతో... అపార ప్రతిభ ఉండటంతో పాకిస్తాన్లో జరిగే పలు దేశవాళీ టోర్నీల్లో రషీద్ చెలరేగిపోయాడు. అయితే సహజంగానే జాతీయ బోర్డు నిబంధనల కారణంగా అతనికి పాక్ టీమ్లో అవకాశాలైతే రాలేదు. కానీ అప్పటికే మెరికలా మారిన అతను తన సొంత దేశం చేరి ఆటపై పూర్తిగా దృష్టి పెట్టాడు. పాకిస్తాన్ దిగ్గజం ఇంజమామ్ ఉల్ హక్ తమ కోచ్గా రావడం రషీద్ కెరీర్ను మలుపు తిప్పింది. ఇంజమామ్ ఒత్తిడి తేవడంతో జింబాబ్వే పర్యటనకు తొలుత.. అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. రషీద్ను తీసుకున్న తర్వాతే మిగతా విషయాలు మాట్లాడదామంటూ ఇంజమామ్ ఒత్తిడి తేవడంతో స్థానం ఖాయమైంది. ఆ తర్వాత కొన్నేళ్లకు చూస్తే అందరికంటే ముందుగా రషీద్ పేరుతోనే టీమ్ షీట్ తయారు కావడం విశేషం. జింబాబ్వే సిరీస్తో అరంగేట్రం చేసిన రషీద్ ఆ తర్వాత అమిత వేగంగా దూసుకుపోయాడు. ఆ తర్వాత లెక్కలేనన్ని ఘనతలు అతడి ఖాతాలో వచ్చి చేరాయి. టెస్టుల్లో, వన్డేల్లో కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా, టి20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్గా పలు ఘనతలు అతడి జాబితాలో చేరాయి. సహాయకార్యక్రమాల్లో ముందుంటూ... భారత గడ్డపై వన్డే వరల్డ్ కప్ మొదలైన రెండు రోజులకు.. అఫ్గానిస్తాన్ జట్టు తమ తొలి మ్యాచ్లో ధర్మశాల మైదానంలో మరికొద్ది సేపట్లో బంగ్లాదేశ్తో తలపడేందుకు సన్నద్ధమైంది. అప్పుడే ఒక విషాద వార్త బయటకు వచ్చింది. అఫ్గానిస్తాన్ దేశాన్ని అతి పెద్ద భూకంపం కుదిపేసింది. మ్యాచ్ ఫీజును విరాళంగా దేశంలో మూడో పెద్ద నగరమైన హిరాట్లో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఎలాగోలా అఫ్గాన్ ఆటగాళ్లు మ్యాచ్ను ముగించేశారు. ఆ వెంటనే జట్టు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన తరఫు నుంచి మొత్తం ప్రపంచకప్ మ్యాచ్ ఫీజును విరాళంగా ప్రకటించేశాడు. ఆపై తగిన సహాయం చేయాలంటూ తన ఫౌండేషన్ ద్వారా కోరాడు. ఒకవైపు టోర్నీలో సత్తా చాటుతూ మరోవైపు తన సన్నిహితుల సహకారంతో అతను అఫ్గానిస్తాన్లో సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూనే ఉన్నాడు. నిధులతో పాటు పునరావాస కార్యక్రమాలూ కొనసాగుతున్నాయి. 25 ఏళ్ల రషీద్ ఇలా స్పందించడం మొదటిసారి కాదు. గతంలోనూ తన దేశంలో ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగం కావడంతోపాటు తన సొంత డబ్బుతో చిన్నారుల చదువు, పేదలకు సహకారం వంటి పనుల్లో చురుగ్గా పాల్గొన్నాడు. అక్కడి పరిస్థితులు కూడా తన దేశం కోసం ఏదైనా చేయాలనే ప్రేరణను కలిగిస్తాయని అతను చెబుతుంటాడు. పేద దేశం, టెర్రరిజం మొదలు ఇతర తీవ్రమైన ప్రతికూలతలకు ఎదురొడ్డి తాను ఇప్పుడు ఒక గొప్ప ఆటగాడిగా ఎదగడం వరకు ఎక్కడా తన మూలాలను మర్చిపోలేదు. ప్రపంచంలో ఏ చోట క్రికెట్ ఆడుతున్నా.. సాయం చేసేందుకు ఎప్పుడైనా సిద్ధమని అతను అన్నాడు. అదే అతడిని మరింత ప్రత్యేకంగా నిలబెట్టింది. -మొహమ్మద్ అబ్దుల్ హాది -
CWC 2023: సంచలనాల ఆఫ్ఘనిస్తాన్కు సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన సచిన్
భారత్ వేదికగా జరుగుతున్న 2023 వన్డే ప్రపంచకప్లో సంచలన విజయాలతో దూసుకుపోతున్న ఆఫ్ఘనిస్తాన్కు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ముంబై వేదికగా ఆఫ్ఘనిస్తాన్ ఇవాళ (నవంబర్ 7) ఐదుసార్లు జగజ్జేత ఆస్ట్రేలియాను ఢీకొట్టనుండగా.. సచిన్ ఆఫ్ఘన్ ప్రాక్టీస్ క్యాంప్లో ప్రత్యక్షమై వారికి విలువైన సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఈ సందర్భంగా సచిన్ ఆఫ్ఘన ప్లేయర్లతో పాటు సహాయ సిబ్బందితోనూ మాట్లాడాడు. A Legendary Visit 🤩 The Legend @sachin_rt visited AfghanAtalan's Training Session this evening at the iconic Wankhede Cricket Stadium in Mumbai. He praised #AfghanAtalan’s recent success at the #CWC23 and shared his invaluable insights with them. 👍#WarzaMaidanGata pic.twitter.com/hdNFslu481 — Afghanistan Cricket Board (@ACBofficials) November 6, 2023 సచిన్ ఆఫ్ఘన్ కోచ్, ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జోనాథన్ ట్రాట్తో పలు పాత విషయాలను షేర్ చేసుకున్నాడు. సచిన్ సలహాలు ఇస్తుండగా ఆఫ్ఘన్ ప్లేయర్లు చాలా ఆసక్తిగా విన్నారు. ఆఫ్ఘన్ ప్లేయర్లలో రషీద్ ఖాన్ ఒక్కడే సచిన్తో మాట కలిపాడు. వరుస సంచలనాలు సాధిస్తున్న ఆఫ్ఘన్ క్రికెటర్లలో సచిన్ స్పూర్తిని నింపే ప్రయత్నం చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహీదితో సైతం సచిన్ కాసేపు ముచ్చటించాడు. సచిన్ రాకతో ఆఫ్ఘన్ క్యాంప్లో కొత్త ఉత్సాహం కనపడింది. ఇదే జోష్లో వారు ఆసీస్కు కూడా షాకివ్వాలని అనుకుంటున్నారు. కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో ఆఫ్ఘనిస్తాన్.. ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక లాంటి పటిష్టమైన జట్లను మట్టికరిపించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా (7 మ్యాచ్ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు), న్యూజిలాండ్ (8 మ్యాచ్ల్లో 4 విజయాలతో 8 పాయింట్లు), పాకిస్తాన్తో (8 మ్యాచ్ల్లో 4 విజయాలతో 8 పాయింట్లు) పాటు సెమీస్ రేస్లో ఉన్న ఆఫ్ఘన్లు.. ఆసీస్పై కూడా గెలిచి ప్రపంచకప్లో తొలిసారి సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకోవాలని పట్టుదలగా ఉన్నారు. అయితే ఇది అషామాషీ విషయం కాదు. సూపర్ ఫామ్లో ఉన్న ఆస్ట్రేలియన్లకు షాకివ్వడం ఆఫ్ఘన్లకు తాహతకు మించిన పనే అవుతుంది. ఈ మ్యాచ్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ సౌతాఫ్రికాతోనూ ఓ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్ల్లో గెలిస్తే వారు ఇతర జట్లతో సంబంధం లేకుండా దర్జాగా సెమీస్కు చేరుకుంటారు. ప్రస్తుతం ఆఫ్ఘన్లు 7 మ్యాచ్ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్నారు. ఆసీస్తో మ్యాచ్లో ఆఫ్ఘన్లు గెలవడంపైనే కాకుండా రన్రేట్పై కూడా దృష్టి సారించాల్సి ఉంటుంది. సెమీస్ రేసులో ఉన్న ఆసీస్ (0.924), న్యూజిలాండ్ (0.398), పాకిస్తాన్లతో (0.036) పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్ రన్రేట్ (-0.330) చాలా తక్కువగా ఉంది. -
రషీద్ ఖాన్కు రతన్ టాటా రూ.10 కోట్లు రివార్డు ఇచ్చారా?
ప్రముఖ వ్యాపార వేత్త రతన్ టాటా ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషిద్ ఖాన్కు రూ.10 కోట్ల వరకు ఆర్ధిక సహాయం చేసినట్లు సోషల్ మీడియాలోని పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వార్తల్ని రతన్ టాటా కొట్టిపారేశారు. గత వారం ప్రపంచకప్లో ఆఫ్గానిస్తాన్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్కు షాకిచ్చిన ఆ జట్టు.. పాక్పై పంజా విసిరింది. పాకిస్తాన్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ఆఫ్గాన్ రెండే వికెట్లు కోల్పోయి ఒక ఓవర్ మిగిలుండగానే ఛేదించింది. అయితే, ఈ మ్యాచ్ విజయంతో ఆఫ్గాన్ క్రికెటర్ రషిద్ ఖాన్ ఇండియన్ ఫ్లాగ్ను ప్రదర్శించారని, ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం.. రషిద్ ఖాన్కు ఐసీసీ రూ.55 లక్షల జరిమానా విధించిందనే ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన రతన్ టాటా..రషిద్ ఖాన్కు భారీ మొత్తంలో ఆర్ధిక సహాయం చేసేలా హామీ ఇచ్చారంటూ’ సోషల్ మీడియాలో పోస్టులు వెలుగులోకి వచ్చాయి. I have made no suggestions to the ICC or any cricket faculty about any cricket member regarding a fine or reward to any players. I have no connection to cricket whatsoever Please do not believe WhatsApp forwards and videos of such nature unless they come from my official… — Ratan N. Tata (@RNTata2000) October 30, 2023 ఆ కథనాల్ని రతన్ టాటా ఖండించారు. తనకు క్రికెట్తో ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. తాను ఏ క్రికెటర్కి రివార్డ్ ఇవ్వలేదని, అలా ఇచ్చేలా ఐసీసీకి సైతం ఎలాంటి సూచనలు చేయలేదని ఎక్స్లో పోస్ట్ చేశారు. తన అధికారిక ప్లాట్ఫారమ్ల నుండి వస్తే తప్ప వాట్సాప్ ఫార్వార్డ్ మెసేజ్లు, తప్పుడు వీడియో కథనాల్ని నమ్మొద్దని రతన్ టాటా నెటిజన్లను కోరారు. చదవండి👉 అప్పుడు ‘మెగాస్టారే’, ఇప్పుడు కరువైన పలకరింపులు.. జీవితం భారమై.. -
ముజీబ్ను హత్తుకుని ఏడ్చేసిన బుడ్డోడు.. మ్యాచ్ కోసం ఏకంగా! వైరల్
ICC ODI WC 2023: ఆటలో గెలుపోటములు సహజం.. అయితే, ఒక్కోసారి భావోద్వేగాలు ఇలాంటి సహజ అంశాలపై పైచేయి సాధిస్తాయి. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన సందర్భాల్లో.. అది కూడా తమకు గతంలో సాధ్యం కాని ఘనత సాధిస్తే.. గెలిచిన జట్టు పట్టరాని సంతోషంలో మునిగిపోతుంది. వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా ఆదివారం అఫ్గనిస్తాన్ జట్టు ఇలాంటి అనుభూతిని ఆస్వాదించింది. ఇంగ్లండ్ ఆటగాడు మార్క్వుడ్ను తమ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌల్డ్ చేయగానే అఫ్గన్ సంబరాలు అంబరాన్నంటాయి. మొట్టమొదటిసారిగా.. అది కూడా వన్డే ప్రపంచకప్ వంటి ఐసీసీ టోర్నీ సందర్భంగా ఇంగ్లండ్పై చారిత్రాత్మక విజయం అందుకోవడంతో అఫ్గన్ ఆటగాళ్ల ముఖాలు మతాబుల్లా వెలిగిపోయాయి. View this post on Instagram A post shared by ICC (@icc) సంతోషం పట్టలేక.. కన్నీటి పర్యంతం డిఫెండింగ్ చాంపియన్ను ఓడించామన్న విజయగర్వంతో వారి కళ్లు మెరిసిపోయాయి. ఈ దృశ్యాల్ని చూసిన అభిమానుల గుండెలు ఆనందంతో నిండిపోయాయి. అయితే, ఓ బుల్లి అభిమాని మాత్రం ఈ సంతోషాన్ని పట్టలేక కన్నీటి పర్యంతమయ్యాడు. ఇంగ్లండ్పై అఫ్గన్ సంచలన విజయంలో కీలక పాత్ర పోషించిన ముజీబ్ ఉర్ రహ్మాన్ను హత్తుకుని ఆనందభాష్పాలు రాల్చాడు. ఇదేమీ ఫైనల్ మ్యాచ్ కాకపోయినా.. అఫ్గనిస్తాన్కు ఈ గెలుపు ఎంతటి సంతోషాన్నిచ్చిందో తన చర్య ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. 1100 కిలోమీటర్లు ప్రయాణించి పదకొండు వందల కిలోమీటర్లు ప్రయాణించి భారత్ రాజధాని ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియం దాకా వచ్చినందుకు తనకు దక్కిన బహుమతికి మురిసిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. బ్యూటీ ఆఫ్ క్రికెట్ ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘క్రికెట్లో ఉన్న అందమే ఇది’’ అంటూ ఆ చిన్నోడిని చూసి ఆనందిస్తూ.. అఫ్గనిస్తాన్ ఆటగాళ్లకు అభినందనలు తెలిజయజేస్తున్నారు. కాగా ఢిల్లీ వేదికగా ఇంగ్లండ్పై అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్ 69 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఈ మ్యాచ్లో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన రైట్ ఆర్మ్ ఆఫ్బ్రేక్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ 16 బంతుల్లో 28 పరుగులు సాధించాడు. అదే విధంగా.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జో రూట్(11), హ్యారీ బ్రూక్(66), క్రిస్ వోక్స్(9) వికెట్లు తీశాడు. తద్వారా అఫ్గనిస్తాన్ గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: CWC 2023: ఆఫ్ఘనిస్తాన్ చారిత్రక విజయం వెనుక ఇంగ్లండ్ మాజీ ఆటగాడి హస్తం This is the way to celebrate the very beautiful game of cricket. An Afghanistan kid traveled 1100 KM & finally they upset England to win the WC match. This boy hugged Mujeeb in tears, they admire #Rashid & #Gurbaz to get little happiness from sports. What a game #ENGvsAFG.🔥 pic.twitter.com/T1D3Uvp4Zv — Amock (@Politics_2022_) October 15, 2023 -
CWC 2023 ENG VS AFG: నాడు విలన్.. నేడు హీరో
వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్తో నిన్న (అక్టోబర్ 15) జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘన్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో రాణించి, జగజ్జేతను మట్టికరిపించారు. తొలుత బ్యాటింగ్లో రహ్మానుల్లా గుర్బాజ్ (57 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇక్రమ్ అలీఖిల్ (66 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రషీద్ ఖాన్ (22 బంతుల్లో 23; 3 ఫోర్లు), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (16 బంతుల్లో 28; 3 ఫోర్లు, సిక్స్).. ఆ తర్వాత బౌలింగ్లో ముజీబ్ ఉర్ రెహ్మాన్ (10-1-51-3), మొహమ్మద్ నబీ (6-0-16-2), రషీద్ ఖాన్ (9.3-1-37-3), నవీన్ ఉల్ హాక్ (6-1-44-1), ఫజల్ హక్ ఫారూఖీ (7-0-50-1) చెలరేగి విశ్వ విజేతకు ఊహించని షాకిచ్చారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో తడబడిన ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. నాడు చితకబాదించుకున్నాడు.. ఇప్పుడు హీరో అయ్యాడు..! ఇంగ్లండ్పై ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించడంలో స్పిన్ ఆల్రౌండర్లు ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ కీలకపాత్ర పోషించారు. వీరిద్దరు తొలుత బ్యాట్తో అతి మూల్యమైన పరుగులు చేసి, ఆ తర్వాత బంతితో మాయ చేశారు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో రషీద్ ఖాన్ పాత్ర అత్యంత ప్రశంసనీయం. గత వరల్డ్కప్లో ఇదే ఇంగ్లండ్ చేతిలో చితకబాదించుకున్న రషీద్.. ఈ మ్యాచ్లో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 3 వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. 2019 వరల్డ్కప్లో నాటి కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (71 బంతుల్లో 148; 4 ఫోర్లు, 17 సిక్సర్లు) విధ్వంసం ధాటికి బలైన రషీద్.. ఆ మ్యాచ్లో 9 ఓవర్లలో ఏకంగా 110 పరుగులిచ్చి కెరీర్లో చెత్త బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. అతి ధారాళంగా పరుగులు సమర్పించుకుని నాడు తన జట్టు పాలిట విలన్ అయిన రషీద్.. నేడు అదే జట్టు పతనాన్ని శాసించి, హీరో అయ్యాడు. -
CWC 2023 ENG VS AFG: వరల్డ్కప్ రికార్డును సమం చేసిన రూట్
న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ (అక్టోబర్ 15) జరుగుతున్న వరల్డ్కప్ మ్యాచ్లో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ ఓ వరల్డ్కప్ రికార్డును సమం చేశాడు. బ్యాటర్, బౌలర్ మాత్రమే కాకుండా ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరైన రూట్.. ఈ మ్యాచ్లో ఏకంగా నాలుగు క్యాచ్లు పట్టి, వరల్డ్కప్ మ్యాచ్లో అత్యధిక క్యాచ్లు ఆందుకున్న నాన్ వికెట్కీపర్గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో మొహమ్మద్ కైఫ్ (2003లో శ్రీలంకపై), సౌమ్య సర్కార్ (2015లో స్కాట్లాండ్పై), ఉమర్ అక్మల్ (2015లో ఐర్లాండ్పై), క్రిస్ వోక్స్ (2019లో పాకిస్తాన్పై)లు వరల్డ్కప్ మ్యాచ్ల్లో నాలుగు క్యాచ్లు పట్టిన నాన్ వికెట్కీపర్లుగా ఉన్నారు. తాజా ప్రదర్శనతో రూట్ వీరి సరసన చేరాడు. ఆఫ్ఘన్తో మ్యాచ్లో రూట్ నాలుగు క్యాచ్లు పట్టడంతో పాటు ఓ వికెట్ కూడా పడగొట్టాడు. ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ షాహీదిని రూట్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్లో రూట్ పట్టిన రషీద్ ఖాన్ క్యాచ్ మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. లాంగ్ ఆన్లో పరిగెత్తుకుంటూ వచ్చి తన కుడిపక్కకు డైవ్ చేస్తూ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు రూట్. View this post on Instagram A post shared by ICC (@icc) కాగా, ఈ మ్యాచ్లో టాస్ ఓడి ఇంగ్లండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్ (57 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), ఆఖర్లో ఇక్రమ్ అలీఖిల్ (66 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (28), రషీద్ ఖాన్ (23), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (28) రాణించడంతో ఆ జట్టు 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. వరల్డ్కప్లో ఆఫ్ఘనిస్తాన్కు ఇది రెండో అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (4-0-41-0), మార్క్ వుడ్ (9-0-50-2), సామ్ కర్రన్ (4-0-46), రీస్ టాప్లే (8.5-1-52-1) ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. ఆదిల్ రషీద్ (10-1-42-3), లియామ్ లివింగ్స్టోన్ (10-0-33-1), జో రూట్ (4-0-19-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టారు. అనంతరం 285 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 33 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బెయిర్స్టోను (2) ఫజల్ హక్ ఫారూఖీ.. రూట్ను (11) ముజీబ్ ఔట్ చేశారు. 7 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 33/2గా ఉంది. డేవిడ్ మలాన్ (19), హ్యారీ బ్రూక్ క్రీజ్లో ఉన్నారు. -
రషీద్ ఖాన్ మంచి మనసు.. ఆఫ్గాన్ భూకంప బాధితులకు విరాళం
ఆఫ్గానిస్తాన్లో సంభవించిన భుకంపం పెను విషాదం మిగిలిచ్చింది. ఈ ఘటనలో దాదాపు 2400 పైగా మృతిచెందారు. భూకంపం ధాటికి ఏకంగా 12కు పైగా గ్రామాలు నేలమట్టమయ్యాయి. దీంతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో ఆఫ్గాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ మంచి మనసు చాటుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ల ఫీజు రూపంలో తనకు వచ్చే మొత్తం ఆదాయాన్ని భూకంప బాధితులకు విరాళంగా ఇస్తున్నట్టు రషీద్ ప్రకటించాడు. "ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమ ప్రావిన్స్లోని హెరాత్, ఫరా, బాద్గీస్ ప్రాంతాల్లో సంభవించిన భూకంపం తీవ్రవిషాదం మిగిల్చిందని తెలిసి చాలా బాధపడ్డాను. తాను ప్రపంచ కప్ 2023 కోసం మొత్తం ఫీజును కష్టాల్లో ఉన్న ప్రజలకు విరాళంగా ఇస్తున్నాను. అదే విధంగా భూకంప బాధితులను అదుకునేందుకు ఫండ్స్ సేకరించేందుకు త్వరలో ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెడతానని ట్విటర్లో రషీద్ పేర్కొన్నాడు. చదవండి: అజారుద్దీన్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ! అందుకే అనర్హత వేటు... ఇక మర్చిపోవాల్సిందే! I learned with great sadness about the tragic consequences of the earthquake that struck the western provinces (Herat, Farah, and Badghis) of Afghanistan. I am donating all of my #CWC23 match fees to help the affected people. Soon, we will be launching a fundraising campaign to… pic.twitter.com/dHAO1IGQlq — Rashid Khan (@rashidkhan_19) October 8, 2023 -
ఒకప్పుడు పసికూన.. ఇప్పుడు వరల్డ్క్లాస్ జట్లకు కూడా చుక్కలు!
ఆఫ్గానిస్తాన్.. పేరుకే పసికూన. కానీ తనదైన రోజును వరల్డ్క్లాస్ జట్లను సైతం ఓడించే సత్తా ఉంది. రోజుకు రోజుకు ఆఫ్గాన్ క్రికెట్ జట్టు మెరుగుపడుతూ వస్తోంది. ఇటీవల కాలంలో శ్రీలంక, పాకిస్తాన్ వంటి మేటి జట్లకు ఆఫ్గాన్ చుక్కలు చూపించింది. ఈ క్రమంలో భారత్ వేదికగా జరగనున్న వరల్డ్కప్లో అద్భుతాలు సృష్టించాలని ఆఫ్గాన్ జట్టు వ్యూహాలు రచిస్తోంది. అస్సలు ఆఫ్గాన్ జట్టు బలబాలాలు ఎంటో ఓ లూక్కేద్దం. వరల్డ్కప్లో చెత్త రికార్డు.. ఆఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టుకు వన్డే వరల్డ్కప్లో చెత్త రికార్డు ఉంది. ఇప్పటివరకు రెండు సార్లు వన్డే ప్రపంచకప్లలో ఆఫ్గాన్ భాగమైంది. 2015, 2019 వరల్డ్కప్లో ఆఫ్గాన్ ఆడింది. ఇప్పటివరకు 15 ప్రపంచకప్ మ్యాచ్లు ఆడిన ఆఫ్గానిస్తాన్ జట్టు.. కేవలం ఒకే మ్యాచ్లో విజయం సాధించింది. అది కూడా 2015 వరల్డ్కప్లో స్కాట్లాండ్పై గెలిచింది. ఆఫ్గాన్ బలం ఎంత? అయితే ఆఫ్గాన్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ పటిష్టంగా ఉంది. ఈ రెండు విభాగాల్లోనూ ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించే సత్తా ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. ఆఫ్గాన్ క్రికెట్ జట్టులో ముఖ్యంగా రషీద్ ఖాన్ వంటి వరల్డ్క్లాస్ ఆల్రౌండర్ ఉన్నారు. ఇటీవల కాలంలో ఆఫ్గాన్ పెద్దగా విజయాలు సాధించకపోయినప్పటికీ.. రషీద్ మాత్రం తన అద్బుతమైన ప్రదర్శనతో అకట్టుకున్నాడు. అదే విధంగా మహ్మద్ నబీ ప్రస్తుత జట్టులో అత్యంత అనుభవం ఉన్న ఆటగాడు. ఆసియాకప్-2023లో శ్రీలంకపై అతడు విరోచిత పోరాటం ఎప్పటికి ఎవరూ మరిచిపోరు. వీరిద్దరికి తోడు ముజ్బర్ రెహ్మన్ వంటి స్పిన్ మాంత్రికుడు ఉన్నాడు. పవర్ప్లేలో కొత్త బంతితో ముజీబ్అద్బుతాలు చేయగలడు. ఇక బ్యాటింగ్లో రహ్ముతుల్లా గుర్భాజ్, ఇబ్రహీం జద్రాన్, కెప్టెన్ షాహిదీ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో లెఫ్ట్ ఆర్మర్ ఫజల్హాక్ ఫరూఖీ వంటి సూపర్ స్టార్ ఉన్నాడు. కాబట్టి ఏ జట్టు అయినా ఆఫ్గాన్ తక్కువగా అంచనావేస్తే.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. వరల్డ్కప్కు ఆఫ్గాన్ జట్టు: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, ఫజల్హాక్- హక్ -
వరల్డ్కప్ 2023లో ఆ ఐదుగురు ప్లేయర్లు తీవ్ర ప్రభావం చూపడం ఖాయం..!
అక్టోబర్ 5 నుంచి భారత్లో జరుగనున్న వన్డే ప్రపంచకప్-2023లో ఐదుగురు ప్లేయర్లు తీవ్ర ప్రభావం చూపగలరని సౌతాఫ్రికన్ లెజెండరీ ఆల్రౌండర్ జాక్ కల్లిస్ అంచనా వేశాడు. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్, టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి, సౌతాఫ్రికా పేస్ గన్ ఎన్రిచ్ నోర్జే, ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్లు వరల్డ్కప్లో విశేషంగా రాణిస్తారని కల్లిస్ జోస్యం చెప్పాడు. కల్లిస్ ఈ ఐదుగురిని ఎంపిక చేయడానికి గల కారణాలను కూడా విశ్లేషించాడు. ఆయా ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్తో పాటు భారత్లో ఆడిన అనుభవం వారి కలిసొస్తుందని అభిప్రాయపడ్డాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఇండియాలో ఆడనప్పటికీ, అతను ప్రపంచకప్లో తప్పక చెలరేగుతాడని తెలిపాడు. రషీద్ ఖాన్, నోర్జే, బట్లర్కు ఐపీఎల్లో ఆడిన అనుభవం, భారత పిచ్లపై వారికున్న రికార్డు, అలాగే ఇండియన్ ఫ్యాన్స్లో వారికున్న క్రేజ్ వారిలోని అత్యుత్తమ ఆటతీరును వెలికి తీస్తుందని అన్నాడు. విరాట్ కోహ్లి విషయానికొస్తే.. ఈ ప్రపంచకప్లో అతన్ని ఆపడం కష్టమని తెలిపాడు. మునుపటితో పోలిస్తే, ప్రస్తుతం విరాట్ ఫామ్ చాలా భీకరంగా ఉందని, అతను మెగా టోర్నీలో అద్భుతాలు చేయడం ఖాయమని జోస్యం చెప్పాడు. విరాట్తో పాటు రషీద్ ఖాన్పై కూడా కల్లిస్ ప్రశంసల వర్షం కురిపించాడు. వరల్డ్కప్లో అతను రాణిస్తే ఆఫ్ఘనిస్తాన్ సంచలనాలను నమోదు చేయడం ఖాయమని అన్నాడు. కల్లిస్.. ఐసీసీ షేర్ చేసిన ఓ వీడియోలో ఈ విషయాలను పంచుకున్నాడు. ఇదిలా ఉంటే, వన్డే వరల్డ్కప్-2023 అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్-రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్తో మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అక్టోబర్ 8న భారత్ తమ తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. అక్టోబర్ 14న భారత్.. పాక్ను ఢీకొంటుంది. -
వన్డే ప్రపంచకప్కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటన.. నవీన్ ఉల్ హాక్కు చోటు
అక్టోబర్ 5 నుంచి భారత్లో జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యుల ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ఇవాళ (సెప్టెంబర్ 13) ప్రకటించింది. ఈ జట్టుకు హస్మతుల్లా షాహీది నాయకత్వం వహించనుండగా.. రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్ ఉల్ హాక్, నూర్ అహ్మద్ లాంటి స్టార్ ప్లేయర్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. వరల్డ్కప్ కోసం ఆఫ్ఘన్ సెలెక్టర్లు ముగ్గురు రిజర్వ్ ప్లేయర్లను కూడా ఎంపిక చేశారు. గుల్బదిన్ నైబ్, షరాఫుద్దీన్ అష్రాఫ్, ఫరీద్ అహ్మద్ మలిక్లు వరల్డ్కప్లో ఆఫ్ఘనిస్తాన్ రిజర్వ్ ప్లేయర్లుగా ఉండనున్నారు. రెగ్యులర్ సభ్యుల్లో ఎవరైనా గాయాల బారిన పడితే వారి స్థానంలో వీరు జట్టులో చేరతారు. రీఎంట్రీ ఇచ్చిన నవీన్ ఉల్ హాక్.. గత ఐపీఎల్లో విరాట్ కోహ్లితో గొడవ కారణంగా భారత క్రికెట్ అభిమానుల దృష్టిలో విలన్లా మారిపోయిన నవీన్ ఉల్ హాక్ను ఆఫ్ఘనిస్తాన్ సెలెక్టర్లు వరల్డ్కప్ జట్టుకు ఎంపిక చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్-2023 కోసం ప్రకటించిన జట్టుకు నవీన్ను ఎంపిక చేయకపోవడంతో, భారత్లో జరిగే వరల్డ్కప్లో కూడా అతనికి ఛాన్స్ ఉండదని అంతా అనుకున్నారు. అయితే, ఆఫ్ఘన్ సెలెక్టర్లు నవీన్కు భారత్లో ఆడిన అనుభవం ఉండటాన్ని పరిగణలోకి అతనికి జట్టులో చోటు ఇచ్చారు. కాగా, కోహ్లితో ఉన్న విభేదాల కారణంగా నవీన్ను ఆఫ్ఘనిస్తాన్ సెలెక్టర్లు పక్కకు పెడతారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. వన్డే వరల్డ్కప్-2023 కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు: హస్మతుల్లా షాహీది (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్కీపర్), ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, అబ్దుల్ రెహ్మాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హాక్, ఫజల్ హాక్ ఫారూఖీ రిజర్వ్ ప్లేయర్లు.. గుల్బదిన్ నైబ్, షరాఫుద్దీన్ అష్రాఫ్, ఫరీద్ అహ్మద్ మలిక్ -
అతిపెద్ద పొరపాటు.. తప్పని భారీ మూల్యం.. కనీసం సింగిల్ తీసినా..
Afghanistan vs Sri Lanka: ఆసియా కప్-2023 నుంచి అఫ్గనిస్తాన్ నిష్క్రమించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో శ్రీలంక చేతిలో రెండు పరుగుల స్వల్ప తేడాతో ఓడి నిరాశగా ఇంటిబాట పట్టింది. గ్రూప్-బిలో ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో అఫ్గన్పై గెలిచిన దసున్ షనక బృందం సూపర్-4లో ఎంట్రీ ఇచ్చి ముందడుగు వేసింది. కచ్చితంగా సూపర్-4కి అర్హత సాధిస్తారనుకున్నాం ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ పీయూశ్ చావ్లా కీలక వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంక- అఫ్గన్ మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషిస్తూ.. ‘‘అఫ్గనిస్తాన్ బ్యాటింగ్ చూస్తే కచ్చితంగా వాళ్లు సూపర్-4కు అర్హత సాధిస్తారని అనిపించింది. కానీ.. ఎప్పుడైతే ముజీబ్ ఉర్ రహమాన్ వికెట్ కోల్పోయిందో.. ఫజల్హక్ ఫారూకీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అంతా తలకిందులైంది. అతడు కనీసం సింగిల్ తీయడానికి కూడా ప్రయత్నించలేదు. క్రీజులోకి వచ్చాడు.. అలా స్టక్ అయిపోయాడు. బహుశా.. కనీసం సింగిల్ అయినా తీయాలని ఎవరూ అతడికి చెప్పలేదేమో! ముజీబ్ అవుట్ కాకపోయినా.. ఫారూకీ సింగిల్ తీసినా.. తర్వాతి బంతికి రషీద్ ఖాన్ ఫోర్ బాది ఉంటే.. అఫ్గనిస్తాన్కు అనుకూలంగా ఫలితం వచ్చి ఉండేది. అతిపెద్ద పొరపాటు కానీ అలా జరుగలేదు. బహుశా.. ఇంకా తాము రేసులో ఉన్నామనే విషయాన్ని తెలిపే షీట్ మైదానంలో ఉన్న వాళ్లకు అంది ఉండదు. కీలక సమయంలో అఫ్గనిస్తాన్ చేసిన అతిపెద్ద పొరపాటు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో పీయూశ్ చావ్లా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా పాకిస్తాన్లోని లాహోర్లో మంగళవారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వన్డౌన్ బ్యాటర్, వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ 92 పరుగులతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గన్.. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా.. నాలుగో స్థానంలో వచ్చిన రహ్మత్ షా(45), కెప్టెన్ హష్మతుల్లా షాహిది(59), మహ్మద్ నబీ(65) ఇన్నింగ్స్తో గాడిన పడింది. ఆ విషయం తెలియదా? అయితే, రన్రేటు పరంగా వెనుకబడ్డ అఫ్గనిస్తాన్ 37.1 ఓవర్లలో టార్గెట్ ఛేదిస్తే సూపర్-4లో అడుగుపెట్టే అవకాశం. ఈ పరిస్థితుల్లో బ్యాటర్లంతా తలా ఓ చెయ్యి వేయగా.. 37 ఓవర్లలో స్కోరు 289 పరుగులకు చేరింది. మరో బంతికి ఇంకో 3 పరుగులు తీస్తే చాలు విజయం సాధిస్తామనగా.. ధనంజయ డిసిల్వా అఫ్గనిస్తాన్ను చావుదెబ్బ కొట్టాడు. అతడి బౌలింగ్లో 37.1వ ఓవర్ వద్ద ముజీబ్ ఉర్ రహమాన్ అవుట్ అయ్యాడు. అయినప్పటికీ అఫ్గనిస్తాన్ సాంకేతికంగా.. 37.3 ఓవర్లలో 294 పరుగులు, 37.4 ఓవర్లలో 295 పరుగులు సాధిస్తే.. క్వాలిఫై అయ్యే అవకాశం ముంగిట నిలవగా.. ధనుంజయ మళ్లీ దెబ్బేశాడు. సింగిల్ కూడా తీయకుండా బిగుసుకుపోయిన ఫారూకీని ఎల్బీ డబ్ల్యూ చేశాడు. దీంతో అఫ్గనిస్తాన్ ఆటగాళ్ల హృదయాలు ముక్కలయ్యాయి. చదవండి: అవును.. టీమిండియాలో నాకు చోటు లేదు.. ఇక: భువీ కీలక నిర్ణయం What a thrilling match! Sri Lanka secures a spot in the Super 4s with a heart-pounding 2-run victory over Afghanistan! 🇱🇰🇦🇫#AsiaCup2023 #AFGvSL pic.twitter.com/PxL53z217r — AsianCricketCouncil (@ACCMedia1) September 5, 2023 -
అదే గనుక జరిగితే అఫ్గనిస్తాన్ను ఎవరూ ఆపలేరు! ప్రత్యర్థికి చుక్కలే!
Asia Cup 2023: అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టుకు స్పిన్నర్లే ప్రధాన బలమని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఒకవేళ స్పిన్కు అనుకూలించే పిచ్లు గనుక వారికి లభిస్తే ప్రత్యర్థి జట్లకు కష్టాలు తప్పవని హెచ్చరించాడు. పాకిస్తాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఆసియా కప్-2023 బుధవారం(ఆగష్టు 30) ఆరంభం కానుంది. గ్రూప్-బిలో అఫ్గనిస్తాన్ ఈ వన్డే టోర్నీలో గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, నేపాల్ ఉండగా... గ్రూప్-బి నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్ పోటీ పడనున్నాయి. ఈ క్రమంలో అఫ్గన్ క్రికెట్ బోర్డు ఆదివారం తమ జట్టును ప్రకటించింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సహా ముజీబ్ ఉర్ రహ్మాన్, మహ్మద్ నబీతో పాటు నూర్ అహ్మద్కు ఈ 17 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. వాళ్లంతా కలిసి ప్రత్యర్థి జట్ల పని పడతారు ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘అఫ్గనిస్తాన్ జట్టు ఎల్లప్పుడూ మెరుగ్గా బౌలింగ్ చేస్తుంది. వాళ్లకు గనుక స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ దొరికితే ఇక అంతే సంగతులు. ముజీబ్ ఉర్ రహ్మాన్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్.. అంతా కలిసి ప్రత్యర్థి జట్టు పని పట్టడం ఖాయం. ఒకవేళ పిచ్ పూర్తిగా స్పిన్ బౌలింగ్కు అనుకూలించిందంటే.. తుదిజట్టులో నూర్ అహ్మద్ కూడా ఎంట్రీ ఇస్తాడు. ఊపిరి కూడా తీసుకోనివ్వరంటే అతిశయోక్తి కాదు అహ్మద్ను గనుక ఆడిస్తే.. అతడితో పాటు రషీద్, నబీ, ముజీబ్ ఒక్కొక్కరు పది ఓవర్లు వేస్తారు. ప్రత్యర్థి జట్టుకు ఊపిరి సలపనివ్వకుండా చెలరేగిపోతారు’’ అని అఫ్గన్ స్పిన్ దళాన్ని ఆకాశానికెత్తాడు. అయితే, అఫ్గన్కు చెప్పుకోదగ్గ పేసర్లు లేకపోవడం మాత్రం బలహీనతే అని ఆకాశ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. ఆ ముగ్గురి రికార్డు ఇలా కాగా ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా ఎదుగుతున్న రషీద్ ఖాన్ ఇప్పటి వరకు 87 వన్డేల్లో 170 వికెట్లు కూల్చాడు. ఇక ముజీబ్ ఉర్ రహ్మాన్ 64 మ్యాచ్లలో 91, మహ్మద్ నబీ 145 మ్యాచ్లు ఆడి 154 వికెట్లు పడగొట్టారు. ఇదిలా ఉంటే.. ఆసియా కప్లో భాగంగా సెప్టెంబరు 3న బంగ్లాదేశ్తో లాహోర్లో అఫ్గన్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆసియా కప్-2023 అఫ్గనిస్తాన్ జట్టు ఇదే హష్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), నజీబుల్లా జద్రాన్, రషీద్ ఖాన్, ఇక్రమ్ అలీ ఖిల్, కరీం జనత్, గుల్బదిన్ నైబ్, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్హక్ ఫారూఖీ, షరాఫుద్దీన్ అష్రఫ్, నూర్ అహ్మద్, అబ్దుల్ రెహ్మాన్, మహ్మద్ సలీం. చదవండి: ఇష్టాయిష్టాలతో పనిలేదు.. ఆరోజు యువరాజ్ సింగ్ నన్ను ఓదార్చాడు: రోహిత్ -
పాక్ భరతం పట్టిన ఆఫ్ఘన్ స్పిన్నర్లు.. పేక మేడలా కూలిన బాబర్ సేన
3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా హంబన్తోట (శ్రీలంక) వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ (ఆగస్ట్ 22) జరుగుతున్న తొలి వన్డేలో పాకిస్తాన్ నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ల ధాటికి వరల్డ్ నంబర్ 2 టీమ్ పేకమేడలా కూలింది. ముజీబ్ ఉర్ రెహ్మాన్ (10-1-33-3), రషీద్ ఖాన్ (10-0-42-2), మహ్మద్ నబీ (10-0-34-2), రెహ్మత్ షా (1.1-0-6-1), ఫజల్ హక్ ఫారూకీ (8-0-51-1)లు పాక్ ఆటగాళ్ల భరతం పట్టారు. ఫలితంగా ఆ జట్టు 47.1 ఓవర్లలో కేవలం 201 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ను ఆఫ్ఘన్ స్పిన్నర్లు ఆరంభంలోనే వణికించారు. ముఖ్యంగా ముజీబ్ పాక్ టాపార్డర్ను కకావికలం చేశాడు. ముజీబ్ కీలకమైన బాబర్ ఆజమ్ (0), మహ్మద్ రిజ్వాన్లను (21) ఔట్ చేసి పాక్ను ఇరకాటంలో పడేశాడు. ఆ తర్వాత కొద్దిసేపు ఇమామ్ ఉల్ హాక్ (61).. ఇఫ్తికార్ అహ్మద్ (30), షాదాబ్ ఖాన్ (39)ల సాయంతో పాక్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే మహ్మద్ నబీ.. స్వల్ప వ్యవధిలో ఇఫ్తికార్, ఇమామ్ల వికెట్లు పడగొట్టి పాక్ను భారీ స్కోర్ చేయనీకుండా కట్టడి చేశాడు. కీలక సమయంలో షాదాబ్ ఖాన్ కూడా రనౌట్ కావడంతో పాక్ తక్కువ స్కోర్కే పరిమితంకాక తప్పలేదు. రషీద్ ఖాన్ సైతం కీలకమైన అఘా సల్మాన్ (7), షాహీన్ అఫ్రిది (2) వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఫకర్ జమాన్ (2) ఔట్ చేసి ఫారూకీ పాక్ పతనానికి నాంది పలకగా.. హరీస్ రౌఫ్ (1)ను ఔట్ చేసి రెహ్మాత్ పాక్ ఇన్నింగ్స్ను లాంఛనంగా ముగించాడు. నసీం షా (18 నాటౌట్) పాక్ను 200 పరుగుల మార్కును దాటించడంతో సాయపడ్డాడు. -
ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో టైటిల్.. ప్రపంచ రికార్డు సమం చేసిన పోలార్డ్
అమెరికా వేదికగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ ఇనాగురల్ టైటిల్ను (2023) ముంబై ఇండియన్స్ అనుబంధ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ఎగరేసుకుపోయింది. భారతకాలమానం ప్రకారం ఇవాళ (జులై 31) ఉదయం జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్.. సియాటిల్ ఆర్కాస్పై 7 వికెట్ల తేడాతో గెలుపొంది, తొలి ఎంఎల్సీ టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది. సీజన్ ఆరంభంలో వెనుకపడిన ఎంఐ న్యూయార్క్.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని హ్యాట్రిక్ విజయాలతో టైటిల్ను నెగ్గింది. All the feels 🥰 💙 🤩 Congratulations to @MINYCricket for winning the inaugural #MajorLeagueCricket Championship Final 🏆 pic.twitter.com/Mk1agQmgo6 — Major League Cricket (@MLCricket) July 31, 2023 ఎలిమినేటర్ మ్యాచ్లో వాషింగ్టన్ ఫ్రీడంపై నెగ్గిన ఎంఐ.. ఆతర్వాత ఛాలెంజర్ మ్యాచ్లో టెక్సాస్ సూపర్ కింగ్స్పై, ఫైనల్లో పటిష్టమైన సియాటిల్ ఆర్కాస్పై నెగ్గి విజేతగా ఆవిర్భవించింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ ఖాతాలో తొమ్మిదో టీ20 టైటిల్ చేరింది. ముకేశ్ అంబానీ అండ్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నడిచే ముంబై ఇండియన్స్ గ్రూప్ ఆఫ్ ఫ్రాంచైజెస్ 2011, 2013 ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లను, ఆతర్వాత 2013, 2015, 2017, 2019, 2020 ఐపీఎల్ టైటిళ్లను, ఈ ఏడాదే (2023) ప్రారంభమైన మహిళల ఐపీఎల్ టైటిల్ను, తాజాగా మేజర్ లీగ్ టీ20 టైటిల్ను నెగ్గాయి. MI are serial winners 🏆🏆🏆🏆🏆🏆🏆🏆 📸: IPL/BCCI pic.twitter.com/owVjc46r38 — CricTracker (@Cricketracker) July 31, 2023 ప్రపంచ రికార్డు సమం చేసిన పోలార్డ్ మేజర్ లీగ్ టీ20 లీగ్ 2023 టైటిల్ నెగ్గడం ద్వారా ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టు సభ్యుడు కీరన్ పోలార్డ్.. తన దేశానికే చెందిన సహచర ఆటగాడు డ్వేన్ బ్రావో పేరిట ఉన్న అత్యధిక టీ20 టైటిళ్ల ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఓ ఆటగాడిగా బ్రావో 16 టీ20 టైటిళ్లలో భాగం కాగా.. ఎంఎల్సీ టైటిల్తో పోలార్డ్, బ్రావో రికార్డును సమం చేశాడు. పోలార్డ్ కూడా ఆటగాడిగా 16 టీ20 టైటిళ్లలో భాగమయ్యాడు. ఆ తర్వాతి స్థానంలో షోయబ్ మాలిక్ (13), రోహిత్ శర్మ (10), ధోని (9), లసిత్ మలింగ (9) ఉన్నారు. RASHID WINS THE BATTLE!⚔️ Rashid Khan gets the last LAUGH 😄against Heinrich Klaasen! 9⃣1⃣/3⃣ (12.1) pic.twitter.com/cfgaAf5CRJ — Major League Cricket (@MLCricket) July 31, 2023 నిప్పులు చెరిగిన బౌల్డ్.. రషీద్ మాయాజాలం ఎంఎల్సీ 2023 ఫైనల్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్కాస్.. ట్రెంట్ బౌల్డ్ (4-0-34-3), రషీద్ ఖాన్ (4-0-9-3) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ (52 బంతుల్లో 87; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే మెరుపు అర్ధసెంచరీతో విరుచుకుపడ్డాడు. 𝓞𝓷 𝓻𝓮𝓹𝓮𝓪𝓽 🔄 Can’t stop watching @nicholaspooran’s 1️⃣3️⃣ sixes he hit today‼️ #MLC2023 #MLCFINAL pic.twitter.com/OynKTi2xnD — Major League Cricket (@MLCricket) July 31, 2023 KHAN-TASTIC!🪄 Rashid Khan STRIKES FIRST💫 for the @MINYCricket! 2⃣5⃣/1⃣ (4.1) pic.twitter.com/ZPhVmSQhfA — Major League Cricket (@MLCricket) July 31, 2023 పూరన్ ఊచకోత.. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. నికోలస్ పూరన్ (55 బంతుల్లో 137; 10 ఫోర్లు, 13 సిక్సర్లు) సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో 16 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
రెక్కలు కట్టుకు తిరుగుతున్న రషీద్ ఖాన్.. ఎక్కడ చూసినా అతడే..!
అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు ఒక్కో మ్యాచ్కు ఒకటి లేదా రెండు రోజుల విరామం తీసుకోవడం సర్వ సాధారణం. భారతీయ అగ్రశ్రేణి క్రికెటర్లయితే కొన్ని సందర్భాల్లో అంతకుమించి విరామం తీసుకుంటుంటారు. సిరీస్, సిరీస్కు మధ్య గ్యాప్ గురించైతే చెప్పక్కర్లేదు. కొందరు భారత ఆటగాళ్లు ఏకంగా నెలల తరబడి గ్యాప్ తీసుకోవడం చూశాం. భారత ఆటగాళ్లకు పెద్దగా అంతర్జాతీయ కమిట్మెంట్స్ (ఐపీఎల్ మినహా ఇతర లీగ్ల్లో ఆడే అవకాశం లేదు) లేకపోవడంతో అవకాశం దొరికినప్పుడల్లా విరామం తీసుకుంటుంటారు. అయితే, ఈ పరస్థితికి ఆఫ్ఘనిస్థాన్ టీ20 కెప్టెన్ రషీద్ ఖాన్ మాత్రం మినహాయింపు. ఈ టాప్ స్పిన్నర్ గంటల వ్యవధిలో ప్రపంచం మొత్తం చుట్టేస్తుంటాడు. నిన్న భూమికి ఓ పక్కన ఉంటే, ఇవాళ మరో పక్కలో ప్రత్యక్షమవుతాడు. విశ్వవ్యాప్తంగా జరిగే దాదాపు అన్ని లీగ్ల్లో పాల్గొనే రషీద్ ఖాన్, కనీస విరామం అనేది లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. వయసు, ఫామ్ ఉన్నప్పుడే సంపాదించుకోవాలని అనుకున్నాడేమో కానీ, రషీద్.. ఎక్కడ ఏ లీగ్ జరిగినా రెక్కలు కట్టుకుని వాలిపోతున్నాడు. తాజాగా ఈ నెల 16న బంగ్లాదేశ్లో ఆ జట్టుతో రెండో టీ20 ఆడిన రషీద్.. ఇవాళ (జులై 18) అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టు తరఫున ఆడాడు. టెక్సాస్ సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన రషీద్ ఓ వికెట్ పడగొట్టాడు. అలాగే బ్యాటింగ్లో 9 బంతులను ఎదుర్కొని 2 బౌండరీల సాయంతో 13 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్లో రషీద్ టీమ్ ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. డెవాన్ కాన్వే సూపర్ ఫిఫ్టితో సూపర్ కింగ్స్ను గెలిపించాడు. ప్రపంచవ్యాప్తంగా రషీద్ ప్రాతినిథ్యం వహిస్తున్న లీగ్లు, జట్ల వివరాలు.. ఆఫ్ఘనిస్తాన్ టీ20 జట్టు కెప్టెన్, మిగతా ఫార్మాట్ల జట్లలో సభ్యుడు ఐపీఎల్- గుజరాత్ టైటాన్స్ బిగ్బాష్ లీగ్- అడిలైడ్ స్ట్రయికర్స్ పాకిస్తాన్ సూపర్ లీగ్- లాహోర్ ఖలందర్స్ ఆఫ్ఘనిస్తాన్ సూపర్ లీగ్- బంద్ ఏ అమీర్ డ్రాగన్స్ మేజర్ లీగ్ క్రికెట్- ముంబై ఇండియన్స్ న్యూయార్క్ కరీబియన్ ప్రీమియర్ లీగ్- బార్బడోస్ ట్రైడెంట్స్ టీ20 బ్లాస్ట్- ససెక్స్ ఇవే కాక రషీద్ గతంలో లంక ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ తదితర లీగ్ల్లో ఆడాడు. -
ఈజీగా గెలవాల్సిన మ్యాచ్.. చచ్చీ చెడీ చివరకు
ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన దశలో ఏ జట్టైనా ఈజీగా విజయం సాధిస్తుందని అందరం అనుకుంటాం. కానీ బంగ్లాదేశ్ జట్టు విషయంలో మాత్రం ఈ సీన్ రివర్స్ అయింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్లో ఒత్తిడికి లోనయ్యి చచ్చీ చెడీ ఎలాగోలా నెగ్గింది. ఆఖరి ఓవర్లో మూడు వికెట్లు కోల్పోవడంతో పాటు ఓటమి చేరువగా వచ్చి మళ్లీ గెలుపు రుచి చూసిన బంగ్లాదేశ్ మ్యాచ్ గెలిచి పరువు నిలబెట్టుకుంది. శుక్రవారం అఫ్గానిస్తాన్తో జరిగిన తొలి టి20 మ్యాచ్లో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. మహ్మద్ నబీ 40 బంతుల్లో 54 పరుగులు నాటౌట్ టాప్ స్కోరర్గా నిలవగా.. అజ్మతుల్లా 18 బంతుల్లో 33, నజీబుల్లా 23 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు తీయగా.. నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, షోరిపుల్ ఇస్లామ్, ముస్తాఫిజుర్, మెహదీ హసన్ మిరాజ్లు తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది. తౌహిద్ చౌదరీ 47 పరుగులు చేయగా.. షమీమ్ హొసెన్ 33 పరుగులు చేశాడు. ఆఫ్గన్ బౌలర్లలో కరీమ్ జనత్ మూడు వికెట్లు తీశాడు. 19 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ ఐదు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. విజయానికి కేవలం ఆరు పరుగులు మాత్రమే అవసరం. ఈ నేపథ్యంలోనే ఆఖరి ఓవర్ వేసిన ఆఫ్గన్ బౌలర్ కరీమ్ జనత్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. తొలి బంతిని మిరాజ్ ఫోర్ బాదడంతో చివరి ఐదు బంతుల్లో రెండు పరుగులు వస్తే చాలు. కానీ తర్వాతి మూడు బంతులకు వరుసగా మిరాజ్, తస్కిన్ అహ్మద్ నసుమ్ అహ్మద్లను ఔట్ చేసి కరీమ్ జనత్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. అయితే ఓవర్ ఐదో బంతికి ఫోర్ బాది బంగ్లాకు మరిచిపోలేని విజయాన్ని అందించాడు షోరిపుల్ ఇస్లామ్. ఈ విజయంతో బంగ్లాదేశ్ రెండు మ్యాచ్ల టి20 సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. This over had more drama than a daily soap 🎢 pic.twitter.com/jxM2zt1CfP — FanCode (@FanCode) July 14, 2023 చదవండి: #ViratKohli: ఆనందంతో చిందులు.. లోకం సంగతి మైమరిచిన కోహ్లి IND Vs WI 2023: ఏంటి కిషన్.. తొలి మ్యాచ్లోనే ఇలా అయితే ఎలా? తెల్లముఖం వేశావుగా -
బంగ్లాదేశ్కు భారీ షాక్
స్వదేశంలో బంగ్లాదేశ్కు ఆఫ్ఘనిస్తాన్ భారీ షాకిచ్చింది. 3 వన్డేల సిరీస్లో భాగంగా చట్టోగ్రామ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆఫ్ఘన్ జట్టు డక్వర్త్ లూయిస్ పద్దతిలో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం అంతరాయల నడుమ 43 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ 83/2 (21.4 ఓవర్లు) స్కోర్ వద్ద ఉండగా వర్షం మరోసారి పలకరించింది. ఈ సమయంలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిన ఎంపైర్లు ఆఫ్ఘనిస్తాన్ను విజేతగా ప్రకటించారు. సత్తా చాటిన ఆఫ్ఘన్ బౌలర్లు.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్.. బంగ్లాదేశ్ను తక్కువ స్కోర్కే పరిమితం చేసింది. ఆఫ్ఘన్ బౌలర్లు ఫజల్ హాక్ ఫారూఖీ (3/24), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (2/23), రషీద్ ఖాన్ (2/21), మహ్మద్ నబీ (1/25), అజ్మతుల్లా (1/39) బంగ్లాదేశ్ను దెబ్బకొట్టారు. బంగ్లా ఇన్నింగ్స్లో తౌహిద్ హ్రిదోయ్ (51) అర్ధసెంచరీతో రాణించగా.. తమీమ్ ఇక్బాల్ (13), లిటన్ దాస్ (26), షాంటో (12), షకీబ్ (15) రెండంకెల స్కోర్లు చేశారు. అలసట లేకుండా గెలుపొందిన ఆఫ్ఘనిస్తాన్.. 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. వరుణుడి పుణ్యమా అని అలసట లేకుండా గెలుపొందింది. 21.4 ఓవర్ల వద్ద (83/2) మొదలైన వర్షం ఎంతకీ ఆగకపోవడంతో అంపైర్లు డక్వర్త్ లూయిస్ పద్దతిన ఆఫ్ఘనిస్తాన్ను విజేతగా ప్రకటించారు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో ఇబ్రహీం జద్రాన్ (41 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్ 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే ఇదే వేదికగా జులై 8న జరుగనుంది. కాగా, ఈ సిరీస్లో భాగంగా జరిగిన ఏకైక టెస్ట్లో బంగ్లాదేశ్ 546 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. వన్డే సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. -
స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. బోర్డుపై అవినీతి ఆరోపణలు
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ప్లేయర్, 26 ఏళ్ల యువ ఓపెనర్ ఉస్మాన్ ఘనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ నుంచి పాక్షికంగా విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డులో అవినీతి నాయకత్వమే తన కఠిన నిర్ణయానికి కారణమని వెల్లడించాడు. మేనేజ్మెంట్, సెలెక్షన్ కమిటీలు మారే వరకు తన నిర్ణయాన్ని మార్చుకోనని, వారు మారాక గర్వంగా జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇస్తానని, అప్పటివరకు ఆటపై పట్టు కోల్పోకుండా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటానని తెలిపాడు. After careful consideration, I have decided to take a break from Afghanistan Cricket. The corrupt leadership in the cricket board has compelled me to step back. I will continue my hard work and eagerly await the right management and selection committee to be put in place. 1/3 pic.twitter.com/lGWQUDdIwJ — Usman Ghani (@IMUsmanGhani87) July 3, 2023 17 వన్డేల్లో సెంచరీ, 2 అర్ధసెంచరీలతో 435 పరుగులు.. 35 టీ20ల్లో 4 అర్ధసెంచరీలతో 786 పరుగులు చేసిన ఉస్మాన్ ఘనీని ఇటీవలి కాలంలో ఆఫ్ఘనిస్తాన్ మేనేజ్మెంట్ జట్టుకు దూరంగా ఉంచింది. అతను ఓ మోస్తరు ఫామ్లో ఉన్నా సెలెక్టర్లు అతన్ని జాతీయ జట్టుకు ఎంపిక చేయడం లేదు. దీంతో చిర్రెత్తిపోయిన ఘనీ.. తనను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో తెలుసుకునేందుకు మేనేజ్మెంట్కు సంప్రదించే ప్రయత్నం చేశాడు. అయితే ఘనీ.. బోర్డు చైర్మన్ను, చీఫ్ సెలెక్టర్ను ఎన్నిసార్లు కలుద్దామని ప్రయత్నించినా వారు ఇతనికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు.దీంతో అతను చేసేదేమీ లేక క్రికెట్ నుంచి పాక్షిక విరామం తీసుకున్నాడు. ఘనీ ఆఫ్ఘనిస్తాన్ తరఫున కొన్ని మ్యాచ్లే ఆడినా, జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఆఫ్ఘన్ క్రికెట్లో ఘనీకి హార్డ్ హిట్టర్గా పేరుంది. -
పడి లేచిన శ్రీలంక.. వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచి సిరీస్ కైవసం
ఆఫ్ఘనిస్తాన్తో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను శ్రీలంక 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ కోల్పోయిన లంకేయులు, ఆతర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని సిరీస్ను చేజిక్కించుకున్నారు. హంబన్తోట వేదికగా ఇవాళ (జూన్ 7) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో లంక బౌలర్ల ధాటికి ఆఫ్ఘన్ బ్యాటర్లు తలవంచారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. చమీర (4/63), హసరంగ (3/7), లహీరు కుమార (2/29), తీక్షణ (1/16) చెలరేగడంతో 22.2 ఓవర్లలోనే 116 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో నబీ (23) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక.. ఓపెనర్లు పథుమ్ నిస్సంక (51), దిముత్ కరుణరత్నే (56 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో కేవలం 16 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘన్ తరుపు ముక్క రషీద్ ఖాన్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. బ్యాటింగ్లో 8 బంతులు ఆడి కేవలం 2 పరుగులు మాత్రమే చేసిన రషీద్.. 4 ఓవర్లు బౌల్ చేసి వికెట్ లేకుండా 21 పరుగులు సమర్పించుకున్నాడు. కాగా, ఈ సిరీస్ అనంతరం ఆఫ్ఘనిస్తాన్.. బంగ్లాదేశ్లో పర్యటించనుంది. అక్కడ వీరు ఓ టెస్ట్, 3 వన్డేలు, 2 టీ20లు ఆడనున్నారు. చదవండి: WTC Final: ఏం ప్రాక్టీస్ చేశారని గెలవడానికి .. గెలుపు ఆస్ట్రేలియాదే..! -
SL Vs AFG: లంకతో వన్డే సిరీస్.. అఫ్గనిస్తాన్కు ఊహించని షాక్!
SL Vs AFG ODI Series- Rashid Khan: శ్రీలంకతో వన్డే సిరీస్ నేపథ్యంలో అఫ్గనిస్తాన్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తొలి రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా పక్కకు తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. కాగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడేందుకు అఫ్గన్ శ్రీలంకలో పర్యటించనుంది. జూన్ 2, 4,7 తేదీల్లో సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. హంబన్టోటాలోని మహీంద రాజపక్స స్టేడియంలోనే మూడు మ్యాచ్లు జరుగనున్నాయి. మూడు మ్యాచ్ల సిరీస్ ఈ నేపథ్యంలో మే 15న 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది అఫ్గన్ బోర్డు. హష్మతుల్లా షాహిది సారథ్యం వహించనున్న జట్టులో రషీద్ ఖాన్కు చోటు దక్కింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023 ఫైనల్ కారణంగా ఈ స్టార్ స్పిన్ బౌలర్ ఆలస్యంగా జట్టుతో చేరనున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో వెన్నునొప్పి కారణంగా అతడు మొదటి రెండు మ్యాచ్లకు దూరమైనట్లు బోర్డు తాజాగా వెల్లడించింది. ‘‘రషీద్ ఖాన్ వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడు. జూన్ 7 నాటి ఫైనల్ వన్డేకు అతడు అందుబాటులోకి వస్తాడని భావిస్తున్నాం’’ అని తెలిపింది. గుజరాత్కు భంగపాటు ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహించిన రషీద్ ఖాన్ 17 మ్యాచ్లు ఆడి 8.23 ఎకానమీతో 27 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు జట్టుకు అవసరమైన సమయంలో బ్యాట్ ఝులిపించి గుజరాత్ను ఫైనల్ చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు ఈ వైస్ కెప్టెన్. అయితే, అనూహ్య పరిస్థితుల నడుమ రిజర్వ్డే(మే 29) జరిగిన ఐపీఎల్-2023 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. తద్వారా వరుసగా రెండోసారి చాంపియన్గా నిలవాలన్న టైటాన్స్పై ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అత్యధిక వికెట్ల వీరులు ఇక రషీద్ అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో మూడో స్థానంతో సరిపెట్టుకోగా.. అతడి సహచర బౌలర్లలో మహ్మద్ షమీ(28 వికెట్లు) పర్పుల్ క్యాప్ గెలుచుకోగా.. మోహిత్ శర్మ (8.17 ఎకానమీతో 27 వికెట్లు) రెండో స్థానంలో నిలిచాడు. రషీద్ లేకున్నా కాగా శ్రీలంకతో మొదటి రెండు వన్డేలకు రషీద్ దూరమైనప్పటికీ మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్లతో స్పిన్ విభాగం కాస్త పటిష్టంగానే కనిపిస్తోంది. ఇక నూర్ అహ్మద్ సైతం ఐపీఎల్ తాజా సీజన్లో గుజరాత్కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. అతడు 13 మ్యాచ్లు ఆడి 7.82 ఎకానమీతో 16 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. శ్రీలంకతో వన్డే సిరీస్కు అఫ్గన్ జట్టు: హష్మతుల్లా షాహిది (కెప్టెన్), రహ్మత్ షా (వైస్ కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, నజీబుల్లా జద్రాన్, మహమ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖాయిల్ (వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, అబ్దుల్ రెహమాన్, ఫజల్ హక్ ఫరూఖీ, ఫరీద్ అహ్మద్ మాలిక్. రిజర్వ్ ప్లేయర్లు: గుల్బాదిన్ నాయబ్, షాహిదుల్లా కమల్, యామిన్ అహ్మద్జాయ్, జియా ఉర్ రెహమాన్ అక్బర్. చదవండి: #MS Dhoni: ఆ ఒక్క ఫోన్ కాల్ వల్లే ఇలా! అది నిజంగా విచారకరం.. అయితే సెల్ఫీతో మొదలు.. అభిమానిని పెళ్లాడనున్న టెన్నిస్ స్టార్ -
స్కూటీపై చక్కర్లు; ఆ ఇద్దరు గుజరాత్ బలం.. జాగ్రత్త
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా మరికొద్ది గంటల్లో సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో తలపడనున్నాయి. మరి ఫైనల్లో ఎవరు విజేత అనేది ఆసక్తికరంగా మారింది. సీఎస్కే ఐదోసారి ఛాంపియన్గా నిలిచి ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేస్తుందా లేక గుజరాత్ టైటాన్స్ రెండోసారి టైటిల్ గెలుస్తుందా అనేది చూడాలి. ఈ విషయం పక్కనబెడితే.. గుజరాత్ టైటాన్స్ హెడ్కోచ్ ఆశిష్ నెహ్రా ఫైనల్ మ్యాచ్కు ముందు అహ్మదాబాద్లోని నరేంద్ర స్టేడియంలో స్కూటీపై చక్కర్లు కొట్టడం వైరల్గా మారింది, పైగా నెహ్రాకు తోడుగా స్కూటీపై మోహిత్ శర్మ, రషీద్ ఖాన్లు కూడా ఉండడం ఆసక్తి కలిగించింది. కాగా ఈ వీడియోనూ జియో సినిమా స్వయంగా ట్విటర్లో షేర్ చేస్తూ.. ''గుజరాత్ టైటాన్స్ ON Their Way To #IPLFinal Like..'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక గుజరాత్ టైటాన్స్కు బౌలింగ్ పెద్ద బలం అని చెప్పొచ్చు. పర్పుల్క్యాప్ రేసులో గుజరాత్ టైటాన్స్ నుంచే ముగ్గురు బౌలర్లు ఉండడం విశేషం. మహ్మద్ షమీ 28 వికెట్లతో టాప్లో ఉండగా.. రషీద్ ఖాన్ 27, మోహిత్ శర్మ 24 వికెట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. వీడియో చూసిన అభిమానులు.. ''ఆ ఇద్దరు గుజరాత్ టైటాన్స్కు బలం.. కాస్త జాగ్రత్త'' అంటూ కామెంట్ చేశారు #GujaratTitans on their way to the #IPLFinal like... pic.twitter.com/nldijNxMR8 — JioCinema (@JioCinema) May 27, 2023 చదవండి: సీఎస్కే ఐదోసారి కొడుతుందా లేక గుజరాత్ డబుల్ ధమాకానా? -
టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్..!
టీమిండియా అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. ఈ ఏడాది జూన్లో భారత్, ఆఫ్గానిస్తాన్ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ వాయిదా వేయాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ సిరీస్ను ఈ ఏడాది సెప్టెంబర్లో నిర్వహించాలని భారత క్రికెట్బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల వర్క్లోడ్, సిరీస్కు బ్రాడ్కాస్టర్ లేకపోవడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఆసియాకప్, వన్డే వరల్డ్కప్ కూడా ఈ ఏడాదే ఉండడంతో.. ఆటగాళ్ల ఫిట్నెస్ దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం భారత జట్టు విండీస్ పర్యటనకు వెళ్లనుంది. విండీస్ పర్యటనకు బయలుదేరే ముందు రోహిత్ అండ్కోకు రెండు వారాల విశ్రాంతి లభిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా రోహిత్ సేన రెండు టెస్టు, 3 వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్లు అన్ని జూలైలో జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను, భారత జట్టును బీసీసీఐ ఒకటెండ్రు రోజుల్లో ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక భారత పర్యటన వాయిదా పడడంతో రషీద్ ఖాన్ సారధ్యంలోని ఆఫ్గాన్ జట్టు బంగ్లాదేశ్ టూర్కు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా మూడు వన్డేలు, రెండు టీ20లు, ఏకైక టెస్టు ఆడనుంది. చదవండి: IPL 2023: 'అతడు ఏదో పెద్ద స్టార్ క్రికెటర్లా ఫీలవతున్నాడు.. గిల్ను చూసి నేర్చుకో' -
సూర్యకుమార్ కంటే రషీద్ఖాన్ బెటర్
-
చిరకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్తో రికార్డులు బద్దలు కొట్టిన రషీద్ ఖాన్
ఐపీఎల్-2023లో భాగంగా నిన్న (మే 12) ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ బ్యాట్తో చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. తన జట్టు గెలుపుపై ఆశలు వదులుకున్న తరుణంలో బరిలోకి దిగిన ఈ ఆఫ్ఘానీ.. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది ముంబై బౌలర్ల భరతం పట్టాడు. కేవలం 32 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో రషీద్ పలు ఐపీఎల్ రికార్డులను బద్దలు కొట్టాడు. ఐపీఎల్లో ఎనిమిది అంతకంటే తక్కువ స్థానంలో బరిలోకి దిగి అత్యధిక స్కోర్ (79 నాటౌట్) సాధించిన ఆటగాడిగా.. అలాగే అత్యధిక సిక్సర్లు (10) బాదిన టెయిలెండర్గా రికార్డు నెలకొల్పాడు. గతంలో టెయిలెండర్గా దిగి అత్యధిక స్కోర్ సాధించిన రికార్డు పాట్ కమిన్స్ పేరిట ఉండేది. 2021 సీజన్లో సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో కమిన్స్ ఎనిమిదో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగి 34 బంతుల్లో 66 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక, గుజరాత్-ముంబై మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. సూర్యకుమార్ (49 బంతుల్లో 103 నాటౌట్; 11 ఫోర్లు, 6 సిక్సర్లు) శివతాండవం చేయడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోర్ చేసింది. బ్యాట్ విధ్వంసం సృష్టించకముందు రషీద్ ఖాన్ బంతితో (4/30) ముంబైను దెబ్బకొట్టాడు. సూర్యకుమార్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి ఉండకపోయినట్లైతే ముంబై తక్కువ స్కోర్కే పరిమతమయ్యేది. 219 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆదిలోనే తడబడిన గుజరాత్.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోతూ ఓటమికి దగ్గరైంది. అయితే రషీద్ ఖాన్ మాత్రం ఓ పక్క వికెట్లు పడుతున్నా, తన పని బాదడమే అన్నట్లు చెలరేగిపోయి, ఓడినా తన జట్టు రన్రేట్ ఎక్కడా తగ్గకుండా చేశాడు. చదవండి: IPL 2023 GT vs MI: మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్ సూర్యకుమార్ కాదు.. అతడే! -
IPL 2023 GT vs MI: మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్ సూర్యకుమార్ కాదు.. అతడే!
ఐపీఎల్-2023లో భాగంగా వాంఖడే స్టేడియం వేదిగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన హై స్కోరింగ్ థ్రిల్లర్లో 27 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 218 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 100 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో గుజరాత్కు భారీ ఓటమి తప్పదని అంతా భావించారు. కానీ ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రషీద్ ఖాన్ అందరి అంచనాలను తలకిందులు చేశాడు. 8 స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రషీద్ ఖాన్ ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 32 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రషీద్ 3 ఫోర్లు, 10 సిక్సర్లతో 79 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అంతకుముందు ముంబై ఇన్నింగ్స్లో సూర్యకుమార్ యాదవ్ కూడా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్లతో 103 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. కాగా సూర్యకు ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్పై భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా యూట్యూబ్ ఛానల్లో తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ కంటే రషీద్ను అత్యంత విలువైన ఆటగాడిగా(మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్) చోప్రా ఎంచుకున్నాడు. టైటాన్స్ టాప్-ఆర్డర్ బ్యాటర్లు రాణించే ఉంటే రషీద్ కచ్చితంగా తన జట్టును గెలిపించేవాడు అని ఆకాష్ చోప్రా తెలిపాడు. "నా వరకు అయితే ఈ మ్యాచ్లో అత్యంత విలువైన ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కాదు. మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్ రషీద్ ఖాన్. టాపర్డర్ బ్యాటర్లు కాస్త రాణించే ఉంటే, రషీద్ ఖాన్ ఒంటరిగా మ్యాచ్ను గెలిపించేవాడు. గుజరాత్ ఐదు వికెట్లు సాధిస్తే.. అందులో రషీద్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అందుతో ఓపెనర్లతో పాటు నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్ వికెట్లు కూడా ఉన్నాయి" అని తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా చెప్పుకొచ్చాడు. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. సూర్య కోసం మా ప్లాన్ ఛేంజ్ చేశాం: రోహిత్ శర్మ -
మేమంతా విఫలమయ్యాం.. అతడొక్కడే అదరగొట్టాడు! టర్న్ చేస్తాడని అనుకున్నా: హార్దిక్
ఐపీఎల్-2023లో ముంబై ఇండియన్స్ మరో అద్భుత విజయం సాధించింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 27 పరుగుల తేడాతో ముంబై గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ మూడో స్థానాన్ని చేరుకుంది. ఇక మ్యాచ్లో గుజరాత్ ఓటమి పాలైనప్పటికీ.. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ మాత్రం అద్భుత ప్రదర్శన కనబరిచాడు. తొలుత బౌలింగ్లో నాలుగు వికెట్లు పడగొట్టిన రషీద్.. అనంతరం బ్యాటింగ్లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. గుజరాత్కు భారీ ఓటమి ఖాయం అనుకున్న వేళ రషీద్.. 32 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్స్లతో 79 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా ఈఏడాది సీజన్లో ముంబై చేతిలో గుజరాత్ ఓటమి చెందడం ఇది రెండో సారి కావడం గమానర్హం. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. "మేము బ్యాటింగ్లో దారుణంగా విఫలమయ్యాం. మా జట్టులో రషీద్ ఒక్కడే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతడు బౌలింగ్ చేసిన విధానం, బ్యాటింగ్ గురించి ఎంత చెప్పకున్న తక్కువ. మ్యాచ్ను రషీద్ భాయ్ టర్న్ చేస్తాడని నేను భావించాను. అతడికి సపోర్ట్గా మరొక బ్యాటర్ ఉండి ఉంటే మ్యాచ్ కచ్చితంగా టర్న్ అయ్యేది. బౌలింగ్లో కూడా విఫలమయ్యం. సరైన ప్రణాళికలను అమలు చేయలేకపోయాం. వికెట్ చాలా ఫ్లాట్గా ఉంది. అయినప్పటికీ మేము ఒక 25 పరుగులు అదనంగా ఇచ్చాం. సూర్య గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీ20 క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. అతడి విషయంలో సరైన ప్లాన్స్ అమలు చేయకపోతే సూర్య విధ్వంసం సృష్టిస్తాడు. అది కేవలం బౌలర్ల చేతిలో మాత్రం ఉంది. ఎందుకంటే నేను ఫీల్డ్ సెట్ చేయడం తప్ప ఇంకా ఏమి చేయలేను. ముంబై చివరి 10 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. మేము వారిలా చేయడంలో విఫలమయ్యం. అందుకు తగ్గ ఫలితం అనుభవించాం. ఈ మ్యాచ్ ఫలితాన్ని మర్చిపోయి మా తదుపరి మ్యాచ్లపై దృష్టి సారిస్తాం" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. చదవండి: #RashidKhan: భారీ ఓటమి తప్పదనుకున్నవేళ రషీద్ సంచలన ఇన్నింగ్స్.. పలు రికార్డులు బద్దలు -
భారీ ఓటమి తప్పదనుకున్నవేళ రషీద్ సంచలన ఇన్నింగ్స్
ఐపీఎల్ 16వ సీజన్లో శుక్రవారం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ జరిగిన వాంఖడే స్టేడియం పరుగులు వర్షంతో తడిసి ముద్దయింది. తొలుత సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో విధ్వంసం సృష్టించగా.. అటుపై గుజరాత్ టైటాన్స్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 219 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఒక దశలో 103 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక గుజరాత్కు భారీ ఓటమి తప్పదనుకున్న వేళ రషీద్ సంచలన ఇన్నింగ్స్తో మెరిశాడు. ఎనిమిదో నెంబర్లో బ్యాటింగ్కు వచ్చి 21 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ అందుకొని ఓవరాల్గా 32 బంతుల్లో 79 పరుగులు నాటౌట్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 3 ఫోర్లు, 10 సిక్సర్లు ఉండడం విశేషం. ఈ క్రమంలోనే రషీద్ ఐపీఎల్ చరిత్రలో పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ► ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్లో బౌలింగ్లో నాలుగు వికెట్లు.. బ్యాటింగ్లో ఫిఫ్టీతో ఆల్రౌండ్ ప్రదర్శన చేయడం ఇది నాలుగో సారి మాత్రమే. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో రషీద్ 30 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్లో 79 పరుగులు చేశాడు. ఇంతకముందు యువరాజ్ సింగ్(ఆర్సీబీ, 83 పరుగులు, 4/35), యువరాజ్ సింగ్(పుణే వారియర్స్, 66 పరుగులు, 4/29), మిచెల్ మార్ష్(ఢిల్లీ క్యాపిటల్స్, 63 పరుగులు, 4/27) ఉన్నారు. ► టి20 క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్లో తొమ్మిదో వికెట్కు అత్యధిక పరుగులు జోడించడం ఇది నాలుగోసారి. ముంబైతో మ్యాచ్లో రషీద్-అల్జారీ జోసెఫ్ జంట 88* పరుగులు జోడించి రెండో స్థానంలో ఉన్నారు. తొలి స్థానంలో బెల్జియంకు చెందిన సబర్ జకీల్, సక్లెయిన్ అలీ 2021లో ఆస్ట్రియాపై 132* పరుగులు ఉన్నారు. ► ఐపీఎల్ చరిత్రలో చేజింగ్ జట్టు తరపున అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో రషీద్ ఖాన్ చోటు సంపాదించాడు. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో రషీద్ 10 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో సనత్ జయసూర్య 11 సిక్సర్లతో తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత ఆడమ్ గిల్క్రిస్ట్, కీరన్ పొలార్డ్, రషీద్ ఖాన్లు పదేసి సిక్సర్లతో ఉన్నారు. ► ఐపీఎల్లో ఎనిమిది.. ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చి హాఫ్ సెంచరీ బాదిన ఆటగాళ్ల జాబితాలో రషీద్ చోటు సంపాదించాడు. రషీద్ కంటే ముందు పాట్ కమిన్స్(2021లో 66 పరుగులు నాటౌట్), హర్బజన్ సింగ్(2015లొ 64 పరుగులు), క్రిస్ మోరిస్(2017లో 52 పరుగులు నాటౌట్) ఉన్నారు. “Main expert hoon, mujhe sab aata hai” 💥 Maiden IPL 5️⃣0️⃣ for @rashidkhan_19 👏🏼#MIvGT #IPLonJioCinema #TATAIPL #IPL2023 pic.twitter.com/Yto3zZ52bC — JioCinema (@JioCinema) May 12, 2023 చదవండి: రికార్డుల మోత మోగించిన సూర్యకుమార్ -
నేలమీదకి దిగిన పాండ్యా.. కప్పు కొట్టే లక్షణాలివే
-
ఆ ఒక్క విషయంలోనే సలహా ఇచ్చాను.. అందుకు ఏమాత్రం సిగ్గుపడను: పాండ్యా
IPL 2023 RR Vs GT: ‘‘నూర్తో ఎలా బౌలింగ్ చేయించాలన్న అంశాన్ని పూర్తిగా రషీద్కే వదిలేశాను. నూర్తో అతడి కంటే అత్యుత్తమంగా సమన్వయం చేసుకునే వాళ్లు మరెవరూ ఉండరన్న విషయం నాకు తెలుసు. వాళ్లు బౌలింగ్ చేస్తున్నపుడు ఎక్కడ స్లిప్ను ప్లేస్ చేస్తే బాగుంటుందో.. ఆ మేరకు సలహాలు మాత్రమే ఇచ్చాను. మిగతాదంతా వాళ్లే ఆత్మవిశ్వాసంతో పూర్తి చేశారు’’ అని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తమ జట్టు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ను ప్రశంసించాడు. ఐపీఎల్-2023లో భాగంగా రాజస్తాన్ రాయల్స్తో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలర్ల విజృంభణ.. రాజస్తాన్కు చుక్కలు సొంతమైదానంలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్కు గుజరాత్ బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా రషీద్ ఖాన్ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి రాజస్తాన్ రాయల్స్ను కోలుకోకుండా చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన ఈ అఫ్గనిస్తాన్ స్పిన్నర్.. కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇక మిగతావాళ్లలో మహ్మద్ షమీ, కెప్టెన్ పాండ్యా, జాషువా లిటిల్ ఒక్కో వికెట్ తీయగా.. మరో అఫ్గన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. గుజరాత్ బౌలర్ల విజృంభణతో సంజూ శాంసన్ సేన కథ 17.5 ఓవర్లకే ముగిసింది. 118 పరుగులకు రాజస్తాన్ ఆలౌట్ అయింది. రషీద్ ఖాన్ కీలక పాత్ర స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ను ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(34 బంతుల్లో 41 పరుగులు), వన్డౌన్లో వచ్చిన హార్దిక్ పాండ్యా(15 బంతుల్లో 39 పరుగులు) తమ అజేయ ఇన్నింగ్స్తో విజయతీరాలకు చేర్చారు. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ 36 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఇక రాజస్తాన్ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి గుజరాత్ గెలుపొందడంలో కీలక పాత్ర పోషించిన రషీద్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. తప్పులు ఒప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడను ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. రషీద్ ఖాన్ అద్బుతంగా బౌలింగ్ చేశాడంటూ ప్రశంసలు కురిపించాడు. అదే విధంగా వృద్ధిమాన్ సాహా అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడంటూ కొనియాడాడు. ఇక గత మ్యాచ్లో పొరపాట్ల గురించి ఆశిష్ నెహ్రాతో చర్చించానన్న పాండ్యా.. ఈసారి వాటిని పునరావృతం కాకుండా చూసుకున్నానని పేర్కొన్నాడు. తన తప్పులను తెలుసుకుని వాటిని సరిచేసుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడనన్న హార్దిక్ పాండ్యా.. శుబ్మన్ అవుటైన తర్వాత తనను తాను నిరూపించుకునే అవకాశం వచ్చిందన్నాడు. లోపం ఎక్కడుందో తెలుసుకుంటేనే దానిని సరిచేసుకుని.. విజయవంతం కాగలమని పేర్కొన్నాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో 53 బంతుల్లో 59 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచినప్పటికీ పాండ్యా తమ జట్టును గెలిపించలేకపోయిన విషయం తెలిసిందే. చదవండి: IPL 2023: కేఎల్ రాహుల్ అవుట్.. అతడి స్థానంలో కర్ణాటక బ్యాటర్ ఎందుకు బాబు మా మర్యాద తీస్తున్నారు.. ఆర్సీబీ బ్యాటర్లను మించిపోయారు..! .@hardikpandya7 put on a show tonight 🤩 Relive the three 6️⃣s 🔥#TATAIPL | #RRvGT | @gujarat_titans pic.twitter.com/JdCQOOrHNR — IndianPremierLeague (@IPL) May 5, 2023 That was some performance by @gujarat_titans 🙌#GT win the match by 9 wickets and add another 2 points to their tally 👌 Scorecard ▶️ https://t.co/54xkkylMlx#TATAIPL | #RRvGT pic.twitter.com/fJKu9gmvLW — IndianPremierLeague (@IPL) May 5, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2023: తిరుగులేని టైటాన్స్
ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో గురువారం వరకు జరిగిన 47 మ్యాచ్లలో ముందుగా బ్యాటింగ్కు దిగిన ఏ జట్టూ కూడా 18 ఓవర్లలోపు ఆలౌట్ కాలేదు. కానీ శుక్రవారం జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ పేలవ ఆటతో మరో 13 బంతులు మిగిలి ఉండగానే కుప్పకూలింది. గుజరాత్ టైటాన్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు సొంతగడ్డపై నిలవలేకపోయిన రాయల్స్ భారీ ఓటమిని ఎదుర్కొంది. 119 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఏకంగా 37 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన గుజరాత్... గత మ్యాచ్లో తమ వేదికపై రాజస్తాన్ చేతిలో ఎదురైన ఓటమికి ఈ గెలుపుతో లెక్క సరి చేసింది. జైపూర్: డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్లో తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్టపర్చుకుంది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో గుజరాత్ 9 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ 17.5 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. సంజూ సామ్సన్ (20 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రషీద్ ఖాన్ (3/14) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం గుజరాత్ 13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 119 పరుగులు సాధించి గెలిచింది. వృద్ధిమాన్ సాహా (34 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) శుబ్మన్ గిల్ (35 బంతుల్లో 36; 6 ఫోర్లు) గెలిపించారు. సమష్టి వైఫల్యం... పాండ్యా తొలి ఓవర్లోనే బట్లర్ (8) వెనుదిరగ్గా... షమీ ఓవర్లో సిక్స్, ఫోర్తో జోరు ప్రదర్శించిన గత మ్యాచ్ హీరో యశస్వి జైస్వాల్ (14) దురదృష్టవశాత్తూ రనౌట్ కావడంతో జట్టు పతనం మొదలైంది. సామ్సన్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడిన షాట్ను అభినవ్ చక్కటి ఫీల్డింగ్తో ఆపగా, బంతిని అందుకున్న మోహిత్ నాన్స్ట్రయికింగ్ ఎండ్ వైపు విసిరాడు. సింగిల్ కోసం ప్రయత్నించి జైస్వాల్ దూసుకురాగా, సామ్సన్ స్పందించలేదు. ఇద్దరూ ఒకేవైపు ఉండిపోగా, జైస్వాల్ వెనక్కి వెళ్లటంలో విఫలమయ్యాడు. టీమ్ను ఆదుకోవాల్సిన సామ్సన్ కూడా తర్వాతి ఓవర్లోనే అవుట్ కావడం రాయల్స్ను దెబ్బ తీసింది. ఆ తర్వాత ఏ ఒక్కరూ పట్టుదల ప్రదర్శించకపోవడంతో జట్టు కోలుకోలేకపోయింది. అలవోకగా... స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ ఆడుతూ పాడుతూ అందుకుంది. ఓపెనర్లు సాహా, గిల్ చకచకా పరుగులు సాధించడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 9 ఫోర్లతో 49 పరుగులకు చేరింది. తొలి వికెట్కు 71 పరుగుల భాగస్వామ్యం తర్వాత ఎట్టకేలకు గిల్ను అవుట్ చేసి రాయల్స్ ఈ జోడీని విడదీసింది. జంపా ఓవర్లో పాండ్యా వరుస బంతుల్లో 6, 4, 6, 6 బాదడం ఇన్నింగ్స్లో హైలైట్గా నిలిచింది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (రనౌట్) 14; బట్లర్ (సి) మోహిత్ (బి) పాండ్యా 8; సామ్సన్ (సి) పాండ్యా (బి) లిటిల్ 30; పడిక్కల్ (బి) నూర్ 12; అశ్విన్ (బి) రషీద్ 2; పరాగ్ (ఎల్బీ) (బి) రషీద్ 4; హెట్మైర్ (ఎల్బీ) (బి) రషీద్ 7; జురేల్ (ఎల్బీ) (బి) నూర్ 9; బౌల్ట్ (బి) షమీ 15; జంపా (రనౌట్) 7; సందీప్ శర్మ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 8; మొత్తం (17.5 ఓవర్లలో ఆలౌట్) 118. వికెట్ల పతనం: 1–11, 2–47, 3–60, 4–63, 5–69, 6–77, 7–87, 8–96, 9–112, 10–118. బౌలింగ్: షమీ 4–0–27–1, పాండ్యా 2–0–22–1, రషీద్ 4–0–14–3, లిటిల్ 4–0–24–1, నూర్ 3–0–25–2, మోహిత్ 0.5–0–5–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (నాటౌట్) 41; గిల్ (స్టంప్డ్) సామ్సన్ (బి) చహల్ 36; పాండ్యా (నాటౌట్) 39; ఎక్స్ట్రాలు 3; మొత్తం (13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 119. వికెట్ల పతనం: 1–71. బౌలింగ్: బౌల్ట్ 3–0–28–0, సందీప్ శర్మ 3–0–19–0, జంపా 3–0–40–0, చహల్ 3.5–0–22–1, అశ్విన్ 1–0–8–0. ఐపీఎల్లో నేడు చెన్నైX ముంబై (మధ్యాహ్నం గం. 3:30 నుంచి) ఢిల్లీ X బెంగళూరు (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
అద్భుతాలు అరుదుగా.. చూసి తీరాల్సిందే
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా కేకేఆర్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్లో ఒక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. బహుశా ఇలాంటి అద్భుతాలు అరుదుగా జరుగుతాయేమో. విషయంలోకి వెళితే.. గుజరాత్తోమ్యాచ్లో కేకేఆర్ ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అఫ్గానిస్తాన్కు చెందిన గుర్బాజ్ 39 బంతుల్లోనే ఏడు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 81 పరుగులు చేసి గుజరాత్కు చుక్కలు చూపించాడు. ఒక దశలో దాటిగా ఆడుతున్న గుర్బాజ్ను ఔట్ చేయడానికి బౌలర్లు తంటాలు పడ్డారు. అయితే నూర్ అహ్మద్ ఎట్టకేలకు గుర్బాజ్ను ఔట్ చేయగలిగాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్ రెండో బంతిని గుర్బాజ్ డీప్ మిడ్వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అయితే అక్కడే రషీద్ ఖాన్ ఎలాంటి తప్పిదం చేయకుండా క్యాచ్ అందుకున్నాడు. Photo: IPL Twitter అయితే మీరు ఒక విషయం గమనించారో లేదో.. బ్యాటింగ్ ఆడిన రహమనుల్లా గుర్బాజ్, బౌలింగ్ వేసిన నూర్ అహ్మద్, క్యాచ్ పట్టిన రషీద్ ఖాన్.. ముగ్గురు ఒక దేశానికి చెందిన ఆటగాళ్లే కావడం విశేషం. ప్రస్తుతం ఈ ముగ్గురు అఫ్గానిస్తాన్ జట్టులో కీలకపాత్ర పోషిస్తున్నారు. అలా బ్యాటింగ్ ఆడినోడు.. బౌలింగ వేసినోడు.. క్యాచ్ పట్టినోడు ఒకే దేశానికి చెందినవారు కావడం అరుదుగా జరుగుతుంది. తాజాగా ఐపీఎల్ అందుకు వేదిక అయింది. Bowler, batter & fielder - it was an 𝐚𝐥𝐥-𝐀𝐟𝐠𝐡𝐚𝐧 𝐚𝐟𝐟𝐚𝐢𝐫 🇦🇫🇦🇫🇦🇫#KKRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/Ht1guUI9Oy — JioCinema (@JioCinema) April 29, 2023 Gurbaz c Rashid Khan b Noor Ahmad 81(39)#IPL2023 #KKRvGT pic.twitter.com/ZIOtZqGZa9 — Cricbuzz (@cricbuzz) April 29, 2023 Batter from Afghanistan. Bowler from Afghanistan. Catch taken by player from Afghanistan. The IPL has truly come a long way #IPL2023 #KKRvGT — Vishesh Roy (@vroy38) April 29, 2023 చదవండి: Shardul Thakur: మోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్.. ప్రయోగం బెడిసికొట్టింది -
IPL 2023: గుజరాత్ విజయాల్లో ఆ దేశ బౌలర్లదే కీలకపాత్ర
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 5 విజయాలతో (రన్రేట్ 0.580) పాయింట్ల పట్టికలో చెన్నై (7 మ్యాచ్ల్లో 5 విజయాలు, 0.662) తర్వాత రెండో స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ విజయాల్లో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా మినహాయించి అందరూ తలో చేయి వేస్తున్నారు. బౌలింగ్లో షమీ, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్.. బ్యాటింగ్లో సాహా, గిల్, విజయ్ శంకర్, మిల్లర్, అభినవ్ మనోహర్.. ఇలా ప్రతి ఒక్కరు ఒక్కో మ్యాచ్లో రాణించి గుజరాత్ను గెలిపించారు. ముఖ్యంగా హార్ధిక్ సేన సాధించిన మెజార్టీ విజయాల్లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ కీలకపాత్ర పోషించారు. వీరు ఆడిన ప్రతి మ్యాచ్లో వికెట్లు సాధించి, కెప్టెన్ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. రషీద్ ఖాన్ విషయానికొస్తే.. ఈ 15 కోట్ల ఆటగాడు (ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రషీద్ ఖాన్ రెమ్యూనరేషన్) ప్రస్తుత సీజన్లో చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్ నుంచి ప్రతి మ్యాచ్లో ఒకటి అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. సీఎస్కేపై 2/26, 10 నాటౌట్ (3) (గుజరాత్ గెలుపు) (మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్) ఢిల్లీపై 3/31 (గుజరాత్ గెలుపు) కేకేఆర్పై 3/37 (గుజరాత్ ఓటమి) పంజాబ్పై 1/26 (గుజరాత్ గెలుపు) రాజస్థాన్పై 2/46 (గుజరాత్ ఓటమి) లక్నోపై 1/33 (గుజరాత్ గెలుపు) ముంబైపై 2/27 (గుజరాత్ గెలుపు) నూర్ అహ్మద్ విషయానికొస్తే.. ఈ 18 ఏళ్ల ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ను గుజరాత్ టైటాన్స్ ఈ ఏడాది వేలంలో 30 లక్షలకు సొంతం చేసుకుంది. లెఫ్ట్ ఆర్మ చైనామెన్ బౌలర్ అయిన నూర్.. ప్రస్తుత సీజన్ ఆడిన 3 మ్యాచ్ల్లో 6 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్లో ఈ యువ బౌలర్ 4 ఓవర్లలో 37 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు (గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్) పడగొట్టాడు. రాజస్థాన్పై 1/29 (గుజరాత్ ఓటమి) లక్నోపై 2/18 (గుజరాత్ గెలుపు) ముంబైపై 3/37 (గుజరాత్ గెలుపు) -
చెత్త రికార్డు.. మొహం చూపించడానికి ఇష్టపడని కోహ్లి
ఐపీఎల్ 16వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో ఆర్సీబీ స్టాండిన్ కెప్టెన్ విరాట్ కోహ్లి గోల్డెన్ డకౌట్ అయిన సంగతి తెలిసిందే. బౌల్ట్ బౌలింగ్లో తొలి బంతికే ఎల్బీగా వెనుదిరిగి ఆశ్చర్యపరిచాడు. అప్పటివరకు కోహ్లి నామస్మరణతో హోరెత్తిన చిన్నస్వామి స్టేడియం కోహ్లి ఔట్తో ఒక్కసారిగా మూగబోయింది. తాను ఔట్ అవ్వడంపై తీవ్ర నిరాశ చెందిన కోహ్లి కనీసం నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న డుప్లెసిస్ మొహం కూడా చూడకుండా తల కిందికేసుకొని వెళ్లిపోయాడు. ఈ క్రమంలో కోహ్లి ఐపీఎల్లో ఒక చెత్త రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు గోల్డెన్ డకౌట్ అయిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లి తాజా దానితో కలిపి ఏడుసార్లు గోల్డెన్డక్గా వెనుదిరగ్గా.. సునీల్ నరైన్, హర్బజన్ సింగ్లతో కలిసి కోహ్లి సంయుక్తంగా ఉన్నాడు. ఇక తొలి స్థానంలో గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పది గోల్డెన్ డకౌట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. Only Rashid Khan has more golden ducks in the IPL than Virat Kohli 🤯 #IPL2023 pic.twitter.com/XFkYHPf0Iq — ESPNcricinfo (@ESPNcricinfo) April 23, 2023 ̶L̶i̶g̶h̶t̶n̶i̶n̶g̶ 𝐁𝐨𝐮𝐥𝐭 𝐬𝐭𝐫𝐢𝐤𝐞𝐬 𝐭𝐰𝐢𝐜𝐞 ⚡⚡#RCBvRR #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/SwM0SekfBQ — JioCinema (@JioCinema) April 23, 2023 చదవండి: RCB VS RR: కోహ్లి గోల్డెన్ డక్.. మహిళా అభిమాని ఏం చేసిందంటే..! -
చరిత్ర సృష్టించిన నేపాల్ క్రికెటర్.. ప్రపంచంలోనే తొలి బౌలర్గా
కీర్తిపూర్ (నేపాల్): అంతర్జాతీయ వన్డేల్లో నేపాల్ స్పిన్నర్ సందీప్ లమిచానె అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన బౌలర్గా సందీప్ లమిచానె ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రీమియర్ కప్ టోర్నీలో భాగంగా ఒమన్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో సందీప్ మూడు వికెట్లు తీశాడు. తద్వారా ఈ ఘనతను సందీప్ పేరిట లిఖించుకున్నాడు. 100 వికెట్ల మైలు రాయిని సందీప్ కేవలం 42 మ్యాచ్ల్లోనే అందుకున్నాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (44 మ్యాచ్లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో రషీద్ రికార్డును సందీప్ బ్రేక్ చేశాడు. చదవండి: ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లకు ధోని సలహాలు.. జ్ఞానోదయం కలిగేనా! -
రషీద్ ఖాన్ అయితే ఏమైనా గొప్పా.. అక్కడుంది సంజూ! వీడియో వైరల్
ఐపీఎల్-2023లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో రాజస్తాన్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రాజస్తాన్ విజయంలో ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్(60), హెట్మైర్(56 నాటౌట్) కీలక పాత్ర పోషించారు. 178 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో శాంసన్, హెట్మైన తమ అద్భుత ఇన్నింగ్స్లతో రాజస్తాన్ను అదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్లకు 59 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక శాంసన్ ఔటయ్యాక హెట్మైర్ తన విశ్వరూపాన్ని చూపించాడు. ప్రత్యర్ధి బౌలర్లపై ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడ్డ ఈ కరీబియన్.. ఆఖరి వరకు క్రీజులో నిలిచి తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. రషీద్ ఖాన్కు చుక్కలు చూపించిన శాంసన్ ఇక ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్కు శాంసన్ చుక్కలు చూపించాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన రషీద్ ఖాన్ బౌలింగ్లో వరుసగా హ్యాట్రిక్ సిక్స్లను సంజూ బాదాడు. దీంతో ఆ ఓవర్లో 3సిక్స్లు, రెండు సింగిల్స్తో కలిపి ఏకంగా 20 పరుగులు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రషీద్ 2 వికెట్లు పడగొట్టనప్పటికీ..తన నాలుగు ఓవర్ల కోటాలో 46 పరుగులిచ్చాడు. ఇక వరల్డ్ నెం1 బౌలర్ అయిన రషీద్ ఖాన్కే చుక్కలు చూపించిన సంజూపై సర్వత్రా ప్రశంసల కురుస్తోంది. చదవండి: IPL 2023 RCB Vs CSK: ఆర్సీబీతో మ్యాచ్.. చెన్నై కెప్టెన్గా జడేజా! మరి ధోని? Attack MODE 🔛! @IamSanjuSamson took on Rashid Khan & how 👌 👌 Watch those 3⃣ SIXES 💪 🔽 #TATAIPL | #GTvRR | @rajasthanroyals Follow the match 👉 https://t.co/nvoo5Sl96y pic.twitter.com/0gG3NrNJ9z — IndianPremierLeague (@IPL) April 16, 2023 -
రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. ఎవరికీ సాధ్యం కాలేదు! వీడియో వైరల్
ఐపీఎల్-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్ జోరుకు బ్రేక్ పడింది. ఆదివారం కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో గుజరాత్ ఓటమిపాలైంది. కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్.. సంచలన ఇన్నింగ్స్తో గుజరాత్కు ఊహించని షాక్ ఇచ్చాడు. కోల్కతా విజయం సాధించాలంటే చివరి 6 బంతుల్లో 29 పరుగులు చేయాల్సి ఉంది. అటువంటి సమయంలో రింకూ వరుసగా ఐదు సిక్స్లు బాది కేకేఆర్కు మరిచిపోలేని విజయం అందించాడు. రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. ఈ మ్యాచ్లో గుజరాత్ స్టాండింగ్ కెప్టెన్ వ్యవహరించిన రషీద్ ఖాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది సీజన్లో రషీద్ తొలి హ్యాట్రిక్ను నమోదు చేశాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను రషీద్ తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన బౌలర్గా రషీద్ నిలిచాడు. ఇప్పటివరకు టీ20ల్లో నాలుగు సార్లు రషీద్ హ్యాట్రిక్ సాధించాడు. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో రషీద్ తర్వాతి స్థానంలో అండ్రూ టై, మహ్మద్ షమీ, అమిత్ మిశ్రా, రస్సెల్, తహీర్ ఉన్నారు. వీరిందరూ ఇప్పటివరకు మూడు సార్లు హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టారు. కాగా రషీద్కు ఐపీఎల్లో ఇదే తొలి హ్యాట్రిక్ కావడం విశేషం. చదవండి: IPL 2023: 5 బంతుల్లో 5 సిక్సర్లు.. గుజరాత్కు ఊహించని షాక్! ఎవరీ రింకూ సింగ్? 𝐇𝐀𝐓-𝐓𝐑𝐈𝐂𝐊 𝐟𝐨𝐫 𝐑𝐚𝐬𝐡𝐢𝐝 𝐊𝐡𝐚𝐧! 👏 👏 Andre Russell ✅ Sunil Narine ✅ Shardul Thakur ✅ We have our first hat-trick of the #TATAIPL 2023 & it's that man - @rashidkhan_19! 🙌 🙌 Follow the match ▶️ https://t.co/G8bESXjTyh#TATAIPL | #GTvKKR | @gujarat_titans pic.twitter.com/fJTg0yuVwu — IndianPremierLeague (@IPL) April 9, 2023 -
ఐపీఎల్లో తొలి హ్యాట్రిక్ నమోదు చేసిన రషీద్ ఖాన్
ఐపీఎల్ 16వ సీజన్లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. గుజరాత్ టైటాన్స్ స్టాండిన్ కెప్టెన్ రషీద్ ఖాన్ కేకేఆర్తో మ్యాచ్లో ఈ ఫీట్ సాధించాడు. కాగా ఐపీఎల్లో రషీద్ ఖాన్కు ఇదే తొలి హ్యాట్రిక్ కావడం విశేషం. గుజరాత్ టైటాన్స్ తరపున కూడా ఇదే తొలి హ్యాట్రిక్ కావడం మరో విశేషం. ఆదివారం కేకేఆర్తో మ్యాచ్లో ఇన్నింగ్స్ 17వ ఓవర్ తొలి బంతికి రసెల్ను, రెండో బంతికి సునీల్ నరైన్ను, మూడో బంతికి శార్దూల్ ఠాకూర్ను పెవిలియన్ పంపి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఇక ఓవరాల్గా రషీద్ ఖాన్కు టి20 కెరీర్లో ఇది నాలుగో హ్యాట్రిక్ కావడం విశేషం. ఇక ఐపీఎల్లో హ్యాట్రిక్ తీసిన 19వ బౌలర్గా రషీద్ నిలిచాడు. ఇక అత్యధికంగా ఐపీఎల్లో హ్యాట్రిక్ తీసిన బౌలర్గా అమిత్ మిశ్రా నిలిచాడు. అమిత్ మిశ్రా మూడుసార్లు హ్యాట్రిక్ ఫీట్ నమోదు చేయగా.. ఆ తర్వాత యువరాజ్ సింగ్ రెండుసార్లు ఈ ఫీట్ నమోదు చేశాడు. Rashid Khan now has hat-tricks in... T20Is ✅ BBL ✅ CPL ✅#TATAIPL 💥✅#GTvKKR #IPLonJioCinema | @rashidkhan_19 pic.twitter.com/FAPTM7j2K3 — JioCinema (@JioCinema) April 9, 2023 -
IPL 2023 DC Vs GT: టైటాన్స్ ఆడుతూ పాడుతూ... గెలిపించిన రషీద్, సుదర్శన్
Delhi Capitals vs Gujarat Titans Scorecard: గుజరాత్ టైటాన్స్... దాదాపు తొలి మ్యాచ్ తరహాలోనే... ఎలాంటి హంగామా, వ్యక్తిగతంగా మెరుపు ప్రదర్శనలు లేవు... విధ్వంసక ఆట లేదు... అంతా సమష్టి తత్వం, అటు బౌలర్లు, ఇటు బ్యాటర్లు తలా ఓ చేయి వేశారు... ముందుగా చక్కటి బౌలింగ్తో ప్రత్యర్థి కట్టడి, ఆపై ప్రశాంతంగా లక్ష్య ఛేదన...డిఫెండింగ్ చాంపియన్ వరుసగా రెండో మ్యాచ్లోనూ గెలిచి సత్తా చాటింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ సొంత మైదానంలో ఆడుతున్న ప్రయోజనాన్ని ఏమాత్రం ఉపయోగించుకోలేక చతికిలపడింది. ఫలితమే వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. న్యూఢిల్లీ: ఐపీఎల్ కొత్త సీజన్లో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయంతో తమ స్థాయిని ప్రదర్శించింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (32 బంతుల్లో 37; 7 ఫోర్లు), అక్షర్ పటేల్ (22 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్లు), సర్ఫరాజ్ ఖాన్ (34 బంతుల్లో 30; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. రషీద్ ఖాన్, షమీ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం గుజరాత్ 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 163 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సాయి సుదర్శన్ (48 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ చేయగా, మిల్లర్ (16 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) చెలరేగాడు. వీరిద్దరు ఐదో వికెట్కు 29 బంతుల్లోనే 56 పరుగులు జోడించారు. సమష్టి వైఫల్యం... తొలి మ్యాచ్తో పోలిస్తే ఈసారి కూడా ఢిల్లీ బ్యాటింగ్ ఏమాత్రం మెరుగుపడలేదు. పృథ్వీ షా, మిచెల్ మార్ష్ మళ్లీ విఫలం కాగా, వార్నర్ మరోసారి తన శైలికి భిన్నంగా దాదాపు అదే తరహాలో 115 స్ట్రయిక్రేట్తో ఆడాడు. టైటాన్స్ బౌలర్లు ఆరంభం నుంచి ప్రత్యర్థిని కట్టి పడేశారు. తన వరుస రెండు ఓవర్లలో పృథ్వీ షా (7), మార్ష్ (4)లను షమీ వెనక్కి పంపగా, వార్నర్ చేసిన పరుగులతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 52/2కు చేరింది. అనంతరం వరుస బంతుల్లో వార్నర్, రోసో (0)లను అవుట్ చేసి జోసెఫ్ ఢిల్లీని దెబ్బ కొట్టాడు. మరో ఎండ్లో సర్ఫరాజ్ నిలబడినా, అతనూ వేగంగా ఆడలేకపోయాడు. 13 పరుగుల వద్ద జోష్ లిటిల్ క్యాచ్ వదిలేసి మరో అవకాశం దక్కినా అతను దానిని ఉపయోగించుకోలేదు. అభిషేక్ పోరెల్ (11 బంతుల్లో 20; 2 సిక్స్లు) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా అది ఎక్కువసేపు సాగలేదు. అయితే 101/5 వద్ద క్రీజ్లోకి వచ్చిన అక్షర్ కీలక పరుగులు సాధించాడు. చివర్లో అతను కొట్టిన మూడు సిక్సర్లతోనే ఢిల్లీ చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగింది. కీలక భాగస్వామ్యం... ఖలీల్ వేసిన తొలి ఓవర్లోనే 2 ఫోర్లు, సిక్స్ కొట్టి వృద్ధిమాన్ సాహా (14) జోరుగా ఇన్నింగ్స్ మొదలు పెట్టగా, ముకేశ్ వేసిన తర్వాతి ఓవర్లో శుబ్మన్ గిల్ (14) రెండు ఫోర్లు కొట్టాడు. అయితే అద్భుత బంతులతో నోర్జే వీరిద్దరిని క్లీన్బౌల్డ్ చేశాడు. హార్దిక్ పాండ్యా (5) కూడా విఫలమయ్యాడు. ఇలాంటి దశలో సుదర్శన్, విజయ్ శంకర్ (23 బంతుల్లో 29; 3 ఫోర్లు) కీలక భాగస్వామ్యంతో టైటాన్స్ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఎలాంటి సాహసాలకు పోకుండా వీరిద్దరు జాగ్రత్తగా ఆడుతూ లక్ష్యం దిశగా నడిపించారు. ఈ క్రమంలో కొన్ని చక్కటి షాట్లతో సుదర్శన్ ఆకట్టుకున్నాడు. నాలుగో వికెట్కు 44 బంతుల్లో 53 పరుగులు జోడించిన అనంతరం శంకర్ను అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. అయితే వచ్చీ రాగానే మిల్లర్ తన దూకుడును ప్రదర్శించాడు. ముకేశ్ ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్ బాది టైటాన్స్ పని సులువు చేశాడు. 44 బంతుల్లో సుదర్శన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, మరో 11 బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ విజయాన్నందుకుంది. విలియమ్సన్ స్థానంలో షనక మోకాలి గాయంతో ఐపీఎల్కు దూరమైన స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ స్థానంలో శ్రీలంక జట్టు కెప్టెన్ దాసున్ షనకను గుజరాత్ టైటాన్స్ జట్టు తీసుకుంది. గత ఐపీఎల్ వేలంలో షనకను ఎవరూ కొనుగోలు చేయలేదు. ఇప్పుడు విలియమ్సన్ స్థానంలో షనకతో అతని కనీస ధర రూ. 50 లక్షలకు గుజరాత్ టైటాన్స్ ఒప్పందం చేసుకుంది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (బి) జోసెఫ్ 37; పృథ్వీ షా (సి) జోసెఫ్ (బి) షమీ 7; మార్ష్ (బి) షమీ 4; సర్ఫరాజ్ (సి) లిటిల్ (బి) రషీద్ 30; రోసో (సి) తెవాటియా (బి) జోసెఫ్ 0; పోరెల్ (బి) రషీద్ 20; అక్షర్ (సి) మిల్లర్ (బి) షమీ 36; అమన్ ఖాన్ (సి) పాండ్యా (బి) రషీద్ 8; కుల్దీప్ (నాటౌట్) 1; నోర్జే (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–29, 2–37, 3–67, 4–67, 5–101, 6–130, 7–148, 8–158. బౌలింగ్: షమీ 4–0–41 –3, లిటిల్ 4–0–27–0, పాండ్యా 3–0–18–0, జోసెఫ్ 4–0–29–2, యష్ దయాల్ 1–0–12–0, రషీద్ ఖాన్ 4–0–31–3. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (బి) నోర్జే 14; గిల్ (బి) నోర్జే 14; సుదర్శన్ (నాటౌట్) 62; పాండ్యా (సి) పోరెల్ (బి) ఖలీల్ 5; విజయ్ శంకర్ (ఎల్బీ) (బి) మార్ష్ 29; మిల్లర్ (నాటౌట్) 31; ఎక్స్ట్రాలు 8; మొత్తం (18.1 ఓవర్లలో 4 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–22, 2–36, 3–54, 4–107. బౌలింగ్: ఖలీల్ 4–0–38–1, ముకేశ్ 4–0–42–0, నోర్జే 4–0–39–2, మార్ష్ 3.1–0–24–1, కుల్దీప్ 3–0–18–0. ఐపీఎల్లో నేడు రాజస్తాన్ vs పంజాబ్ (రాత్రి గం. 7:30 నుంచి ) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
వారిద్దరూ అద్భుతం.. క్రెడిట్ వారికే ఇవ్వాలి! అది మాత్రం చాలా కష్టం
ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్ శుభారంభం చేసింది. అహ్మదాబాద్ వేదికగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టైటాన్స్.. 5వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలోనే ఛేదించింది. గుజరాత్ విజయంలో శుబ్మన్ గిల్(63), రషీద్ ఖాన్( 3బంతుల్లో 10) కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్లో ఆల్రౌండర్ ప్రదర్శన కనబరిచిన రషీద్ ఖాన్కు ప్లేయర్ ఆఫ్ధి మ్యాచ్ అవార్డు లభిచింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. వారిద్దరూ అద్భుతం.. హార్దిక్ మాట్లాడుతూ.. "తొలి మ్యాచ్లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు అద్భుతమైన శుభారంభం. కాగా ఛేజింగ్లో మేము వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి క్లిష్ట పరిస్థితిలో పడ్డాము. ఇటువంటి సమయంలో రషీద్, రాహుల్ తెవాటియా అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. కాబట్టి విన్నింగ్ క్రెడిట్ వీరిద్దరికి ఇవ్వాలి అనుకుంటునున్నాను. శుబ్మన్ కూడా సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. మాకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. తొలుత సీఎస్కే ఓ దశలో 200 పైగా పరుగులు సాధిస్తుందని నేను భావించాను. కానీ మిడ్ఇన్నింగ్స్లో మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. రెండు కీలక వికెట్లు పడగొట్టి సీస్ఎస్కే జోరుకు అడ్డుకట్ట వేశారు. ముఖ్యంగా రుత్రాజ్ వికెట్ మాకు చాలా కీలకం. అదే విధంగా రషీద్ ఖాన్ మాకు దొరికిన నిజమైన ఆస్తి. అతడు మాకు రెండు కీలక వికెట్లు అందించాడు. బ్యాటింగ్లో కూడా రషీద్ అదరగొట్టాడు. ఇక జోషఫ్ కూడా ఆఖరిలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ ఈ మ్యాచ్లో నేను, గిల్ అనవసర షాట్ ఆడి వికెట్లు కోల్పోయాము. అదే విధంగా ఇంపాక్ల్ ప్లేయర్ రూల్ను ఉపయోగించుకోవడం చాలా కష్టం. మా దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరిని ఎప్పుడు ఉపయోగించుకోవాలో నిర్ణయించడం చాలా కష్టమవుతుంది" అని పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ధోని.. 12 ఏళ్ల రికార్డు బద్దలు! -
అదరగొట్టిన డిఫెండింగ్ ఛాంపియన్స్...తొలి మ్యాచ్లో గుజరాత్ ఘన విజయం
అహ్మదాబాద్: ఐపీఎల్–2023ని డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఘనంగా ప్రారంభించింది. దాదాపు ఏకపక్షంగా సాగిన సీజన్ తొలి పోరులో ధోని సేనపై పాండ్యా బృందం విజయాన్ని అందుకుంది. సొంతగడ్డపై భారీ అభిమాన సందోహం మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేసింది. సిక్సర్ల వర్షం కురిపించిన రుతురాజ్ గైక్వాడ్ (50 బంతుల్లో 92; 4 ఫోర్లు, 9 సిక్స్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రషీద్ ఖాన్ (2/26), షమీ (2/29), అల్జారి జోసెఫ్ (2/33) రాణించారు. అనంతరం గుజరాత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసి గెలిచింది. శుబ్మన్ గిల్ (36 బంతుల్లో 63; 6 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రుతురాజ్ మినహా... చెన్నై మొత్తం ఇన్నింగ్స్లో రుతురాజ్ ప్రదర్శనే హైలైట్గా నిలిచింది. ఇతర బ్యాటర్లంతా విఫలం కాగా అతనొక్కడే ఈ స్కోరులో కీలకపాత్ర పోషించాడు. షమీ చక్కటి బంతితో కాన్వే (1)ను క్లీన్బౌల్డ్ చేయడంతో చెన్నై తొలి వికెట్ కోల్పోయింది. ఐపీఎల్లో షమీకి ఇది 100వ వికెట్. ఐర్లాండ్ నుంచి ఐపీఎల్లో ఆడిన తొలి క్రికెటర్గా గుర్తింపు తెచ్చుకున్న జోష్ లిటిల్ తన తొలి ఓవర్లో 15 పరుగులు సమర్పించుకున్నాడు. షమీ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్తో దూకుడు ప్రదర్శించిన మొయిన్ అలీ (17 బంతుల్లో 23; 4 ఫోర్లు, 1 సిక్స్)ని రషీద్ అవుట్ చేయడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 51/2కు చేరింది. పాండ్యా ఓవర్లో రెండు సిక్స్లు కొట్టిన రుతురాజ్... జోసెఫ్ ఓవర్లో మరింత చెలరేగి 3 సిక్స్లు బాదడం విశేషం. ఈ క్రమంలో 23 బంతుల్లోనే అతని అర్ధసెంచరీ పూర్తయింది. ఒకవైపు రుతురాజ్ చెలరేగినా... మరోవైపు బెన్ స్టోక్స్ (7), అంబటి రాయుడు (12) తక్కువ వ్యవధిలో పెవిలియన్ చేరారు. ఈ దశలో గుజరాత్ చక్కటి బౌలింగ్తో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేసింది. సెంచరీ దిశగా వెళుతున్న రుతురాజ్తో పాటు జడేజా (1)ను కూడా ఒకే ఓవర్లో జోసెఫ్ వెనక్కి పంపించాడు. శివమ్ దూబే (19) ప్రభావం చూపలేకపోగా, ఆఖరి ఓవర్లో ధోని (14 నాటౌట్) వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి జట్టుకు చెప్పుకోదగ్గ స్కోరు అందించాడు. రాణించిన గిల్... తుషార్ వేసిన రెండో ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టి ఛేదనను వృద్ధిమాన్ సాహా (16 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్లు) వేగంగా మొదలు పెట్టినా... తొలిసారి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న రాజ్వర్ధన్ మొదటి ఓవర్లోనే అతను వెనుదిరిగాడు. అయితే మరో ఎండ్లో గిల్ కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. సాయి సుదర్శన్ (17 బంతుల్లో 22; 3 ఫోర్లు) కూడా కొద్దిసేపు గిల్కు సహకరించాడు. జడేజా ఓవర్లో వరుసగా 4, 6 కొట్టి గిల్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అయితే తక్కువ వ్యవధిలో సుదర్శన్, పాండ్యా (8), గిల్ వికెట్లు కోల్పోయి గుజరాత్ కష్టాల్లో పడింది. ఈ దశలో విజయ్ శంకర్ (21 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివరి 2 ఓవర్లలో 23 పరుగులు చేయాల్సి ఉండగా తెవాటియా (15 నాటౌట్), రషీద్ ఖాన్ (10 నాటౌట్) కలిసి 2 ఫోర్లు, 2 సిక్సర్లతో జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: కాన్వే (బి) షమీ 1; రుతురాజ్ (సి) గిల్ (బి) జోసెఫ్ 92; మొయిన్ అలీ (సి) సాహా (బి) రషీద్ 23; స్టోక్స్ (సి) సాహా (బి) రషీద్ 7; రాయుడు (బి) లిటిల్ 12; దూబే (సి) రషీద్ (బి) షమీ 19; జడేజా (సి) శంకర్ (బి) జోసెఫ్ 1; ధోని (నాటౌట్) 14; సాన్ట్నర్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–14, 2–50, 3–70, 4–121, 5–151, 6–153, 7–163. బౌలింగ్: షమీ 4–0–29–2, పాండ్యా 3–0–28–0, లిటిల్ 4–0–41–1, రషీద్ 4–0–26–2, జోసెఫ్ 4–0–33–2, యష్ 1–0–14–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) దూబే (బి) రాజ్వర్ధన్ 25; గిల్ (సి) రుతురాజ్ (బి) తుషార్ 63; సుదర్శన్ (సి) ధోని (బి) రాజ్వర్ధన్ 22; పాండ్యా (బి) జడేజా 8; విజయ్శంకర్ (సి) సాన్ట్నర్ (బి) రాజ్వర్ధన్ 27; రాహుల్ తెవాటియా (నాటౌట్) 15; రషీద్ (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 12; మొత్తం (19.2 ఓవర్లలో 5 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–37, 2–90, 3–111, 4–138, 5–156. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–29–0, తుషార్ దేశ్పాండే 3.2–0–51–1, రాజ్వర్ధన్ 4–0–36–3, సాన్ట్నర్ 4–0–32–0, జడేజా 4–0–28–1. ఐపీఎల్లో నేడు పంజాబ్ VS కోల్కతా (మ. గం. 3:30 నుంచి) లక్నోVS ఢిల్లీ (రాత్రి గం. 7:30 నుంచి ) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం అరిజిత్ పాట... రష్మిక, తమన్నా ఆట! ఐపీఎల్లో తొలి మ్యాచ్కు ముందు ఆరంబోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్ మధురమైన గొంతుతో తన కొన్ని అత్యుత్తమ హిట్ సాంగ్స్ను పాడుతూ ప్రేక్షకులను ఉత్సాహపరిచాడు. కేసరియా, చన్నా మేరేయా, తూ మేరా కోయీనా, పఠాన్ తదితర పాటలతో పాటు ‘83’ సినిమాలోని స్ఫూర్తిదాయక పాట ‘లహరాదో’ వచ్చినప్పుడు త్రివర్ణ పతాకాలతో అభిమానులు తమ ఆనందాన్ని ప్రదర్శించారు. ఇద్దరు హీరోయిన్లు రష్మిక మంధాన, తమన్నా భాటియా చేసిన డ్యాన్స్ ప్రదర్శనలతో ‘హౌస్ఫుల్’ స్టేడియం ఊగిపోయింది. తమిళ హిట్ ‘తమ్ తమ్’, పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా’తో పాటు లవ్ యాత్రి సినిమాలోని గుజరాతీ డాండియా పాట ‘రంగీలా తారా’కు డ్యాన్స్ చేసినప్పుడు హర్షధ్వానాలతో ప్రేక్షకులు హోరెత్తించారు. రష్మిక తన హిట్ సాంగ్స్ సామీ, శ్రీవల్లిలకు డ్యాన్స్ చేయడంతో పాటు ఆస్కార్ విజేత ‘నాటు నాటు’ పాటకూ నర్తించింది. ఆ స్టెప్పులకు ఫ్యాన్స్ అంతా తాము పదం కలిపి జత చేరారు! అనంతరం ప్రత్యేక వాహనాల్లో ధోని, పాండ్యా వేదిక వద్దకు వచ్చారు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో గుజరాత్ కెపె్టన్ పాండ్యా ఐపీఎల్ ట్రోఫీని తీసుకొచ్చి వేదికపై ఉంచాడు. ఈ ప్రారంభోత్సవానికి మందిరా బేడీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ కార్యక్రమంలో జోష్ నింపింది. -
వరల్డ్ నంబర్ 1 రషీద్! పాక్పై చెలరేగి టాప్-3లో అతడు.. సన్రైజర్స్ ఫ్యాన్స్ ఖుషీ
ICC T20I Bowling Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో అఫ్గనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ సత్తా చాటాడు. పాకిస్తాన్తో టీ20 సిరీస్లో అదరగొట్టిన ఈ లెగ్ స్పిన్నర్ మరోసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు. శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగను వెనక్కినెట్టి మొదటి ర్యాంకు సాధించాడు. టీ20 ఫార్మాట్లో 2018లో తొలిసారి అగ్రపీఠాన్ని అధిరోహించిన రషీద్ ఖాన్.. మరోసారి వరల్డ్ నంబర్ 1గా నిలిచాడు. కాగా షార్జా వేదికగా పాకిస్తాన్తో జరిగిన టీ20 సిరీస్లో రషీద్ ఖాన్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా.. తొలి టీ20లో ఒక వికెట్ తీసిన ఈ అఫ్గన్ సారథి.. రెండో మ్యాచ్లోనూ ఒక వికెట్ పడగొట్టాడు. ఆఖరిదైన మూడో టీ20లోనూ ఒక వికెట్తో మెరిశాడు. టాప్-3లో ఇద్దరు.. ఈ క్రమంలో 710 రేటింగ్ పాయింట్లతో హసరంగను అధిగమించి ప్రథమ స్థానాన్ని ఆక్రమించాడు. అఫ్గన్కు చెందిన పేసర్ ఫజల్హక్ ఫారూకీ మూడో స్థానంలోకి దూసుకువచ్చాడు. పాక్తో సిరీస్లో 5 వికెట్లతో చెలరేగిన అతడు టాప్-5లో అడుగుపెట్టాడు. దీంతో ఐపీఎల్-2023కి ముందు మంచి బూస్టప్ లభించిందంటూ సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా ఈ సీజన్లో ఫారూకీ ఎస్ఆర్హెచ్కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఇక మిస్టరీ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఎనిమిదో ర్యాంకుకు ఎగబాకాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్తో టీ20 సిరీస్ను 2-1తో గెలిచిన రషీద్ బృందం చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఐసీసీ టీ20 బౌలింగ్ తాజా ర్యాంకింగ్స్ 1. రషీద్ ఖాన్- అఫ్గనిస్తాన్- 710 పాయింట్లు 2. వనిందు హసరంగ- శ్రీలంక- 695 పాయింట్లు 3. ఫజల్హక్ ఫారూకీ- అఫ్గనిస్తాన్- 692 పాయింట్లు 4. జోష్ హాజిల్వుడ్- ఆస్ట్రేలియా- 690 పాయింట్లు 5. ఆదిల్ రషీద్- ఇంగ్లండ్- 684 పాయింట్లు View this post on Instagram A post shared by SunRisers Hyderabad (@sunrisershyd) -
రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాలేదు!
షార్జా వేదికగా పాకిస్తాన్తో జరిగిన మూడో టీ20లో 66 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్ ఓటమి పాలైంది. 183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గానిస్తాన్ 18.4 ఓవర్లలో ఆలౌటైంది. పాక్ బౌలర్లలో ఇహ్సానుల్లా,షాదాబ్ ఖాన్ తలా మూడు వికెట్లు సాధించారు. ఆఫ్గాన్ బ్యాటర్లలో గుర్భాజ్ 18 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక మూడో టీ20లో ఓటమిపాలైనప్పటికీ.. తొలి రెండు మ్యాచ్లో విజయం సాధించిన ఆఫ్గాన్ 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. కాగా ఆఫ్గాన్కు పాక్పై ఇదే తొలి టీ20 సిరీస్ విజయం. రషీద్ ఖాన్ అరుదైన రికార్డు ఇక ఇది ఇలా ఉండగా.. అంతర్జాతీయ టీ20ల్లో ఆఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఎవరికీ సాధ్యం కానీ రికార్డును సృష్టించాడు. టీ20ల్లో బౌండరీ ఇవ్వకుండా 100 బంతులు వేసిన బౌలర్గా రషీద్ ఖాన్ రికార్డులకెక్కాడు. సోమవారం పాకిస్తాన్తో జరిగిన మూడో టీ20లో 106 డెలివరీకి పాక్ బ్యాటర్ సైమ్ అయూబ్ సిక్స్ బాదడంతో రషీద్ రికార్డుకు బ్రేక్ పడింది. ఈ మ్యాచ్లో రషీద్ బ్యాటింగ్లో కూడా 16 పరుగులు చేశాడు. ఇక యూఏఈ నుంచి నేరుగా రషీద్ ఖాన్ భారత్కు రానున్నాడు. ఐపీఎల్-2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్ జట్టుతో అతడు కలవనున్నాడు. చదవండి: బీసీసీఐ దెబ్బకు మాట మార్చిన ఐసీసీ! Rashid Khan is truly a magician. pic.twitter.com/ruMAkdOnZZ — Mazher Arshad (@MazherArshad) March 27, 2023 -
చివరి టి20లో ఓడినా ఆఫ్గన్ది చరిత్రే
పాకిస్తాన్తో జరిగిన మూడు మ్యాచ్ల టి20 సిరీస్ను అఫ్గానిస్తాన్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తటస్థ వేదికలో పాకిస్తాన్పై సిరీస్ గెలవడం ఆఫ్గన్కు ఇదే తొలిసారి. సోమవారం రాత్రి జరిగిన చివరి టి20 మ్యాచ్లో పాకిస్తాన్ 66 పరుగులతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. సయీమ్ అయూబ్ 49 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. షాదాబ్ ఖాన్ 28 పరుగులు చేశాడు. అనంరతం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గన్ 18.4 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ అయింది. అజ్మతుల్లా ఒమర్జెయ్ 21 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. పాక్ బౌలర్లలో కెప్టెన్ షాదాబ్ ఖాన్, ఇషానుల్లా చెరో మూడు వికెట్లు తీయగా.. జమాన్ ఖాన్, ఇమాద్ వసీమ్, మహ్మద్ వసీమ్ జూనియర్లు తలా ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో ఓటమి పాలైనప్పటికి సిరీస్ను 2-1తో కైవసం చేసుకున్న ఆఫ్గన్ ఆటతీరుపై అన్ని వైపుల నుంచి హర్షం వ్యక్తమయింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో మెరిసిన షాదాబ్ ఖాన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రాగా.. సిరీస్ ఆద్యంతం తన ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న మహ్మద్ నబీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికయ్యాడు. Afghanistan put on a remarkable all-round display in the 3-match T20I series to secure a historic 2-1 series win over Pakistan after winning the first two matches of the series. Read More: https://t.co/a8pQYZh5f6 pic.twitter.com/tMg7wgXt8y — Afghanistan Cricket Board (@ACBofficials) March 27, 2023 What a momentous occasion for Afghanistan cricket! 🙌😍 AfghanAtalan have created history by securing their first-ever T20I series win over traditional rivals Pakistan. It's a triumph of grit, courage, and teamwork. pic.twitter.com/nQ7jjqmm14 — Afghanistan Cricket Board (@ACBofficials) March 26, 2023 -
పాకిస్తాన్కు ఘోర అవమానం.. చరిత్ర సృష్టించిన ఆఫ్గానిస్తాన్! ఇదే తొలిసారి
Afghanistan vs Pakistan, 2nd T20I: షార్జా వేదికగా పాకిస్తాన్తో జరిగిన రెండో టీ20ల్లో 7 వికెట్ల తేడాతో ఆఫ్గానిస్తాన్ సంచలన విజయం సాధించింది. తద్వారా మూడు టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆఫ్గాన్ సొంతం చేసుకుంది. కాగా పాకిస్తాన్పై టీ20 సిరీస్ను గెలుచుకోవడం ఆఫ్గానిస్తాన్కు ఇదే తొలి సారి. రాణించిన గుర్భాజ్, ఇబ్రహీం 134 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గానిస్తాన్ 3 వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో ఛేదించింది. ఆఫ్గాన్ బ్యాటర్లలో ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్(49 బంతుల్లో 44) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. మిడిలార్డర్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్(38) కూడా అద్భుతంగా రాణించాడు. పాకిస్తాన్ బౌలర్లలో జమాన్ ఖాన్, ఇహ్సానుల్లా తలా వికెట్ సాధించారు. మరో వికెట్ రనౌట్ రూపంలో పాకిస్తాన్కు లభించింది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 130 పరుగులకే పరిమితమైంది. పాక్ బ్యటర్లలో ఇమాద్ వసీం(64 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా.. ఆఖరిలో కెప్టెన్ షాదాబ్ ఖాన్(32) పర్వాలేదనిపించాడు. ఆఫ్గాన్ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ రెండు కీలక వికెట్లు సాధించగా.. జనత్, రసీద్ ఖాన్, నవీన్ ఉల్ హాక్ తలా వికెట్ పడగొట్టారు. ఇక నామమాత్రపు మూడో టీ20 షార్జా వేదికగా సోమవారం జరగనుంది. చదవండి: PAK vs AFG: టీ20ల్లో పాక్ బ్యాటర్ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా What a momentous occasion for Afghanistan cricket! 🙌😍 AfghanAtalan have created history by securing their first-ever T20I series win over traditional rivals Pakistan. It's a triumph of grit, courage, and teamwork. pic.twitter.com/nQ7jjqmm14 — Afghanistan Cricket Board (@ACBofficials) March 26, 2023 -
కోహ్లి కాదు, గేల్ కాదు.. ఏబీడీ ఆల్టైమ్ గ్రేటెస్ట్ టీ20 ప్లేయర్ అతడే..!
దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఇటీవల తనకు ఎదురైన ఓ క్లిష్ట ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పాడు. పొట్టి క్రికెట్లో ఆల్టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్ ఎవరు అని ఏబీడీని ప్రశ్నించగా.. అతను తన ఆప్త మిత్రుడు విరాట్ కోహ్లి పేరు కానీ, ఆర్సీబీ మాజీ సహచరుడు, విధ్వంసకర ఆటగాడు, విండీస్ మాజీ ప్లేయర్ క్రిస్ గేల్ పేరు కానీ చెప్పకుండా ఎవరూ ఊహించని విధంగా ఆఫ్ఘన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ పేరు చెప్పి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ మెరుపులు మెరిపించగల సత్తా ఉన్న రషీద్ను ఆల్టైమ్ గ్రేట్గా ప్రకటించడాన్ని సమర్ధించుకున్న ఏబీడీ.. రషీద్ను మ్యాచ్ విన్నర్గా పరిగణిస్తానని, మైదానంలో అతనో గర్జించే సింహమని కొనియాడాడు. రషీద్ ప్రతిసారి గెలవాలనుకుంటాడని, ఈ లక్షణమే అతన్ని ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడిగా నిలబెట్టిందని అన్నాడు. టీ20ల్లో రషీద్కు మించిన బెస్ట్ ఆల్రౌండన్ను చూడలేదని చెప్పిన ఏబీడీ.. పొట్టి ఫార్మాట్లో అతను ప్రదర్శించే గట్స్కు సలామ్ కొట్టాడు. సూపర్ స్పోర్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏబీడీ తన మనసులో మాటను బయటపెట్టాడు. కాగా, రషీద్ ఖాన్.. 2017 ఐపీఎల్ సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించిన రషీద్.. 14 మ్యాచ్ల్లో 17 వికెట్లు పడగొట్టి ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్శించాడు. 2017 నుంచి 2021 వరకు ఎస్ఆర్హెచ్కు ప్రాతినిధ్యం వహించిన రషీద్.. 5 ఎడిషన్లలో 93 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్లో గుజరాత్ టైటాన్స్కు వలస వెళ్లిన రషీద్.. ఈ సీజన్ మొత్తంలో 19 వికెట్లు పడగొట్టి, ఆ జట్టు టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 77 మ్యాచ్ల్లో 126 వికెట్లు పడగొట్టిన రషీద్.. 92 ఐపీఎల్ మ్యాచ్ల్లో 112 వికెట్లు దక్కించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్న రషీద్.. ఐపీఎల్తో పాటు ప్రపంచం నలుమూలల్లో జరిగే వివిధ లీగ్ల్లో పాల్గొంటాడు. అతను పీఎస్ఎల్లో లాహోర్ ఖలందర్స్ తరఫున, బిగ్ బాష్ లీగ్లో అడిలైడ్ స్ట్రయికర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. -
కోహ్లి, సూర్య, బాబర్ కాదు.. అతడే ప్రపంచ అత్యుత్తమ ఆటగాడు
దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ క్రికెట్కు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. భారత్లో ఏబీడికి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐపీఎల్లో ఆర్సీబీ తరపున ఎక్కువ మ్యాచ్లు ఆడిన మిస్టర్ 360.. తన ఆటతీరుతో అందరిని మంత్రముగ్ధులను చేశాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్గా డివిలియర్స్ బాధ్యతలు చేపట్టునున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డివిలియర్స్కు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ప్రపంచక్రికెట్లో ఇప్పటివరకు తన అత్యుత్తమ టీ20 క్రికెటర్ ఎవరని ఏబీడిని అడగ్గా.. అందుకు అతడు ఏమీ ఆలోచించకుండా రషీద్ ఖాన్ అంటూ బదులు ఇచ్చాడు. "ప్రపంచ టీ20 క్రికెట్లో నా అల్ టైమ్ ఫేవరేట్ ప్లేయర్ రషీద్ ఖాన్. రషీద్ బాల్తో పాటు బ్యాట్తో కూడా అద్భుతంగా రాణించగలడు. రెండు విభాగాల్లో తన జట్టుకు 100 శాతం ఎఫక్ట్ ఇవ్వగలడు. అతడు ఫీల్డ్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు. ప్రపంచ క్రికెట్లో నెం1గా ఉండాల్సిన అర్హతలు అన్ని అతడికి ఉన్నాయి" అని డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా ప్రస్తుత టీ20 క్రికెట్ను శాసిస్తున్న స్టార్ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ రిజ్వాన్, విరాట్ కోహ్లి, బాబర్ను గాని డివిలియర్స్ ఎంచుకోకపోవడం గమానార్హం. చదవండి: Faf du Plessis: దక్షిణాఫ్రికాకు గుడ్ న్యూస్.. మూడేళ్ల తర్వాత స్టార్ క్రికెటర్ రీ ఎంట్రీ! -
సామ్ బిల్లింగ్స్ మెరుపు అర్ధశతకం.. రషీద్ ఖాన్ మయాజాలం
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023లో భాగంగా ముల్తాన్ సుల్తాన్స్తో నిన్న (మార్చి 4) జరిగిన మ్యాచ్లో లాహోర్ ఖలందర్స్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఖలందర్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. వికెట్కీపర్ సామ్ బిల్లింగ్స్ (35 బంతుల్లో 54; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధసెంచరీతో చెలరేగగా.. షఫీక్ (35 బంతుల్లో 48; 6 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్తో రాణించాడు. ఫకర్ జమాన్ (0), తలాత్ (9), రషీద్ ఖాన్ (0), షాహీన్ అఫ్రిది (9), హరీస్ రౌఫ్ (0) విఫలం కాగా.. మీర్జా బేగ్ (17), సికందర్ రజా (14), డేవిడ్ వీస్ (15 నాటౌట్) రెండంకెల స్కోర్ చేశారు. సుల్తాన్స్ బౌలర్లలో అన్వర్ అలీ, ఇహసానుల్లా, అబ్బాస్ అఫ్రిది, పోలార్డ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. సమీన్ గుల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో సుల్తాన్స్ బౌలర్లు 14 ఎక్స్ట్రా పరుగులు ఇచ్చారు. ఇందులో 11 వైడ్ బాల్స్ ఉండటం విశేషం. అనంతరం 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సుల్తాన్స్.. నిర్ణీత ఓవర్లు పూర్తియ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఖలందర్స్ బౌలర్ రషీద్ ఖాన్ (4-0-15-3) తన స్పిన్ మాయాజాలంతో సుల్తాన్స్ను భారీ దెబ్బకొట్టగా.. జమాన్ ఖాన్ (1/23), హరీస్ రౌఫ్ (1/30), సికందర్ రజా (1/10), హుసేన్ తలాత్ (1/22) తలో వికెట్ పడగొట్టారు. సుల్తాన్స్ ఇన్నింగ్స్లో కీరన్ పోలార్డ్ (28 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), మహ్మద్ రిజ్వాన్ (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా రాణించినా ప్రయోజనం లేకుండా పోయింది. మహ్మద్ రిజ్వాన్ సూపర్ ఫామ్లో ఉండటంతో సీజన్ ఆరంభంలో వరుసగా విజయాలు సాధించిన సుల్తాన్స్.. రిజ్వాన్ ఒక్కసారిగా లయ తప్పడంతో పరాజయాల బాటపట్టింది. లీగ్లో ఇవాళ (మార్చి 5) ఇస్లామాబాద్ యునైటెడ్, క్వెట్టా గ్లాడియేటర్స్ తలపడనున్నాయి. -
అలుపెరగని యోధుడు రషీద్ ఖాన్.. మనిషా.. రోబోనా అంటున్న జనం
ఫ్రాంచైజీ క్రికెట్ రాకతో ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఆడటం గగనమైపోయిన ఈ రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ టీ20 జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ అటు జాతీయ జట్టును బ్యాలెన్స్ చేసుకుంటూ ఏకకాలంలో ప్రపంచ నలుమూలల్లో జరిగే అన్ని లీగ్ల్లో పాల్గొంటూ యావత్ క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు. ఇది అంత ఆషామాషీ విషయం కానప్పటికీ.. రషీద్ ఖాన్ మాత్రం రోబోలా శ్రమిస్తూ అలుపెరుగని యోధుడనిపించుకుంటున్నాడు. గత మూడు నెలల కాలంలో రషీద్ ఖాన్ షెడ్యూల్ని ఓ సారి పరిశీలిస్తే. నిర్ఘాంతపోయే విషయాలు వెలుగుచూస్తాయి. గతేడాది (2022) డిసెంబర్ 14 నుంచి ఈ ఏడాది (2023) జనవరి 5 వరకు ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్బాష్ లీగ్లో పాల్గొన్న రషీద్.. ఆ తర్వాత జనవరి 10 నుంచి ఫిబ్రవరి 6 వరకు సౌతాఫ్రికాలో జరిగిన ఇనాగురల్ ఎస్ఏ20 లీగ్లో ఆడాడు. ఆ వెంటనే ఫిబ్రవరి 9న దుబాయ్ బయల్దేరిన అతను ఆ రోజు ఆ మరుసటి రోజు ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో పాల్గొన్నాడు. దీని తర్వాత ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రషీద్.. యూఏఈలో ఆ జట్టుతో జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో పాల్గొన్నాడు. ఆ వెంటనే రెండు రోజుల గ్యాప్లో (ఫిబ్రవరి 21) పాకిస్తాన్లో వాలిపోయిన రషీద్.. పాకిస్తాన్ సూపర్ లీగ్లో కంటిన్యూ అవుతున్నాడు. రషీద్ ఇలా గ్యాప్ లేకుండా ప్రపంచం నలుమూలలా తిరుగుతూ క్రికెట్ ఆడుతుండటాన్ని గమనిస్తున్న క్రికెట్ అభిమానులు.. ఇతను మనిషా లేక రోబోనా అని చర్చించుకుంటున్నారు. ఓ పక్క ప్రయాణాల్లో అలిసిపోతూ, మరో పక్క ఫిట్నెస్ కాపాడుకుంటూ రాణిస్తున్న రషీద్ ఖాన్ను చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. చాలామంది అంతర్జాతీయ స్టార్స్ రషీద్ను చూసి అసూయ పడుతున్నారు. తనలా తామెందుకు విరామం లేకుండా ఆడలేకపోతున్నామంటూ తమను తాము ప్రశ్నించుకుంటున్నారు. భారత క్రికెట్ అభిమానులైతే బుమ్రాను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. రషీద్ ఓ పక్క ఫ్రాంచైజీ క్రికెట్ ఆడుతూనే జాతీయ జట్టుకు కూడా ఆడుతున్నాడు.. నీకు ఏమైందంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. బుమ్రా.. ఐపీఎల్ కోసం జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో అభిమానులు ఇలా స్పందిస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ రషీద్ ఖాన్లా అలుపెరగని యోధుడిలా క్రికెట్ ఆడటం మాత్రం చాలా గొప్ప విషయమని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా, రషీద్ ఖాన్ భారత్లో జరిగే ఐపీఎల్ కూడా ఆడతాడన్న విషయం అందరికీ తెలిసిందే. అతను ప్రస్తుత ఐపీఎల్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. -
శివాలెత్తిన ఆఫ్ఘన్ ప్లేయర్.. 21 బంతుల్లోనే..!
3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం యూఏఈలో పర్యటించిన ఆఫ్ఘనిస్తాన్.. నిన్న (ఫిబ్రవరి 19) జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందగా.. రెండో మ్యాచ్లో యూఏఈ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్ను సమం చేసుకుంది. సిరీస్ డిసైడర్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. ఓపెనర్లు ముహమ్మద్ వసీం (50 బంతుల్లో 75; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), అరవింద్ (53 బంతుల్లో 59; 7 ఫోర్లు, సిక్స్) అర్ధశతకాలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. వసీం, అరవింద్ మినహా యూఏఈ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. ఆఫ్ఘన్ బౌలర్లలో కెప్టెన్ రషీద్ ఖాన్ (4-0-16-2) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 2 వికెట్లు పడగొట్టగా.. గుల్బదిన్ 2, నవీన్ ఉల్ హక్ ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. ఇబ్రహీం జద్రాన్ (51 బంతుల్లో 60 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్), కరీమ్ జనత్ (22 బంతుల్లో 56 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం ధాటికి 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆకాశమే హద్దుగా చెలరేగిన కరీం జనత్.. కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడమే కాకుండా, సిక్సర్ బాది తన జట్టును గెలిపించాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో జద్రాన్, జనత్తో పాటు రహ్మానుల్లా గుర్బాజ్ (20), అఫ్సర్ జజాయ్ (13) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. గుల్బదిన్ నైబ్ (0), నజీబుల్లా జద్రాన్ (1) విఫలమయ్యారు. యూఏఈ బౌలర్లలో జహుర్ ఖాన్కు 2, అకీఫ్ రాజా, జవార్ ఫరీద్లకు తలో వికెట్ దక్కింది. -
SA20 2023: ముగిసిన ‘ముంబై’ కథ.. టోర్నీ నుంచి అవుట్.. మనకేంటీ దుస్థితి?
SA20, 2023 - Joburg Super Kings vs MI Cape Town: సౌతాఫ్రికా టీ20- 2023 లీగ్లో ఎంఐ కేప్టౌన్ కథ ముగిసింది. ఆరంభ సీజన్లోనే ముంబై ఇండియన్స్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. జోబర్గ్ సూపర్ కింగ్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో ఎంఐ కేప్టౌన్ 76 పరుగుల భారీ తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. దీంతో ఏడో పరాజయం నమోదు చేసిన ఎంఐ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ విజయంతో చెన్నై ఫ్రాంఛైజీకి చెందిన జోబర్గ్ ప్లే ఆఫ్స్నకు చేరుకుంది. కాగా జోహన్నస్బర్గ్ వేదికగా ది వాండరర్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన ఎంఐ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆరంభంలోనే షాక్ ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన జోబర్గ్కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్లు కెప్టెన్ డుప్లెసిస్, హెండ్రిక్స్ డకౌట్గా వెనుదిరిగారు. దీంతో ఎంఐ జట్టు సంబరాలు చేసుకుంది. అయితే, వన్డౌన్లో వచ్చిన అన్క్యాప్డ్ ఇంగ్లిష్ బ్యాటర్ లూయీస్ డు ప్లూయీ వారి ఆనందాన్ని ఎక్కువ సేపు నిలవనీయలేదు. ఆదుకున్న అన్క్యాప్ట్ బ్యాటర్ జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ 48 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 81 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిలిగిన వాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్ 40 పరుగులతో రాణించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో జోబర్గ్ 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. రషీద్ విఫలం ఎంఐ బౌలర్లలో లిండే ఒకటి, సామ్ కరన్ రెండు, జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు తీయగా.. డెవాల్డ్ బ్రెవిస్కు ఒక వికెట్ దక్కింది. ఇక కెప్టెన్ రషీద్ ఖాన్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. మిగతా ఎంఐ బౌలర్లతో పోలిస్తే.. 4 ఓవర్ల కోటాలో 42 పరుగులు ఇచ్చి మ్యాచ్లో చెత్త గణాంకాలు నమోదు చేశాడు. చేతులెత్తేశారు ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఎంఐ కేప్టౌన్ను జోబర్గ్ బౌలర్లు ఆది నుంచే దెబ్బకొట్టారు. ఓపెనర్ రాసీ వాన్ డసెన్ 20, వన్డౌన్లో వచ్చిన గ్రాంట్ రోల్ఫోసన్ 21 పరుగులు చేయగా.. నాలుగో స్థానంలో వచ్చిన బేబీ ఏబీడీ 27 పరగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో 17.5 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ అయిన ఎంఐ భారీ ఓటమిని మూటగట్టుకుంది. హృదయం ముక్కలైంది ఈ పరాజయంతో టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఎంఐ కేప్టౌన్ .. ‘‘మేము ఆరంభ సీజన్ను ఇలా ముగించాలనుకోలేదు. అయినా మేమంతా ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటాం’’ అంటూ హృదయం ముక్కలైందంటూ హార్ట్ ఎమోజీని జత చేసింది. మనకేంటీ దుస్థితి? మరోవైపు.. జోబర్గ్ ప్లే ఆఫ్స్నకు దూసుకెళ్లి టైటిల్ సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇక ఐపీఎల్-2022 సీజన్లో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ముంబై ఫ్యాన్స్ ఉసూరుమంటున్నారు. ‘‘గత కొన్నాళ్లుగా నిరాశే ఎదురవుతోంది. ఏ లీగ్లో కూడా ప్లే ఆఫ్స్ చేరుకోలేమా? మనకేంటీ దుస్థితి’’ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన రషీద్ ఖాన్.. కెప్టెన్గానూ విఫలమయ్యాడు. పదింట ఎంఐ కేవలం మూడు విజయాలే నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ Not the way we’d have wanted to end our inaugural #SA20 campaign 💔 But a family sticks together and so will we. 🤗💙#OneFamily — MI Cape Town (@MICapeTown) February 6, 2023 .@JSKSA20 solidify the 2️⃣nd spot in the #SA20 points table 💛 Watch the #JSKvMICT match highlights and stay tuned to #JioCinema, #Sports18 & @ColorsTvTamil 📺📲 for #SA20League action 🏏#SA20onJioCinema #SA20onSports18 pic.twitter.com/hmmpfGLSy2 — JioCinema (@JioCinema) February 6, 2023 Leus du Plooy's innings brought @JSKSA20 fans a lot of joy 🫶 Keep watching #SA20 action on #JioCinema, #Sports18 & @ColorsTvTamil 📺📲#JSKvMICT #SA20onJioCinema #SA20onSports18 | @SA20_League pic.twitter.com/BsBbqr1QvX — JioCinema (@JioCinema) February 6, 2023 -
రషీద్ ఖాన్ అరుదైన ఘనత.. టీ20ల్లో 500 వికెట్లు
పొట్టి ఫార్మాట్లో ఆఫ్ఘనిస్తాన్ సారధి, ఈ తరంలో ప్రపంచంలోనే మేటి స్పిన్నర్గా పేరొందిన రషీద్ ఖాన్ ఓ అరుదైన ఘనతను సాధించాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్లో భాగంగా ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ జట్టుకు సారధ్యం వహిస్తున్న ఇతను.. నిన్న (జనవరి 23) ప్రిటోరియా క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో (4-0-16-3) 3 వికెట్లు పడగొట్టడం ద్వారా టీ20 ఫార్మాట్లో (ఓవరాల్గా) 500 వికెట్ల మైలురాయిని చేరుకున్న రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 24 ఏళ్ల రషీద్ ఖాన్.. ఈ ఫీట్ను 371 టీ20 మ్యాచ్ల్లో సాధించాడు. The moment he reached 500 wickets 💙#MICTvPC #MICapeTown #OneFamily @rashidkhan_19 pic.twitter.com/MzWTMdqC5D — MI Cape Town (@MICapeTown) January 23, 2023 పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన రికార్డు విండీస్ వెటరన్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో పేరిట ఉంది. బ్రావో.. 500 వికెట్ల మైలరాయిని చేరుకునేందుకు 458 మ్యాచ్లు ఆడాడు. ప్రస్తుతం ఈ విండీస్ వీరుడి ఖాతాలో 614 వికెట్లు ఉన్నాయి. రషీద్ అత్యంత పిన్న వయసులో, అతి తక్కువ మ్యాచ్ల్లో ఈ ఫీట్ను సాధించడంతో మున్ముందు 1000, 1500 వికెట్లు సునయాసంగా సాధిస్తాడని క్రికెట్ ఫాలోవర్స్ అభిప్రాయపడుతున్నారు. రషీద్ ప్రస్తుతం ఐపీఎల్తో సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అన్ని టీ20 లీగ్ల్లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ప్రిటోరియా క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో రషీద్ ఖాన్, జోఫ్రా ఆర్చర్ (3/37), ఓడియన్ స్మిత్ (2/27) బంతితో రాణించినప్పటికీ.. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్లో చేతులెత్తేయడంతో 52 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ప్రిటోరియా క్యాపిటల్స్ తరఫున విల్ జాక్స్ (62) టాప్ స్కోరర్గా నిలువగా.. ఎంఐ కేప్టౌన్ తరఫున బేబీ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ (46) ఓ మోస్తరుగా రాణించాడు. ప్రిటోరియా బౌలర్లలో వేన్ పార్నెల్, అన్రిచ్ నోర్జే తలో 3 వికెట్లు పడగొట్టగా.. ఆదిల్ రషీద్ 2, ఈథన్ బోష్, విల్ జాక్స్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. -
రషీద్ ఖాన్కు చుక్కలు చూపించిన సన్రైజర్స్ బ్యాటర్.. ఒకే ఓవర్లో 28 పరుగులు!
ఆఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఏంఐ కేప్టౌన్కు సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీలో రషీద్ ఖాన్ తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్నాడు. తాజాగా సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్తో జరిగిన మ్యాచ్లో రషీద్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్లో తన నాలుగు ఓవర్ల కోటాలో ఒక్క వికెట్ పడగొట్టి ఏకంగా 53 పరుగులిచ్చాడు. ముఖ్యంగా రషీద్కు సన్రైజర్స్ బ్యాటర్ మార్కో జాన్సెన్ చుక్కలు చూపించాడు. సన్రైజర్స్ ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన రషీద్ బౌలింగ్లో జాన్సెన్ ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. ఆ ఓవర్లో జాన్సెన్ 4 సిక్స్లు, ఒక్క ఫోర్ బాదాడు. ఈ ఓవర్తోనే మ్యాచ్ సన్రైజర్స్ వైపు మలుపు తిరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను సౌతాఫ్రికా టీ20 ట్విటర్లో ఫోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. ఇక ఈ మ్యాచ్లో ఏంఐ కేప్టౌన్పై సన్రైజర్స్ ఈస్టర్న్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సన్రైజర్స్ విజయంలో జాన్సెన్ కీలక పాత్ర పోషించాడు. 7వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన జాన్సెన్ కేవలం 27 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్స్లతో 66 పరుగులు సాధించాడు. Some clean hitting by Marco Jansen as he smashes 2⃣8⃣ runs off the Rashid over 🚀#Betway #SA20 #MICTvSEC | @Betway_India pic.twitter.com/504jSzfqXf — Betway SA20 (@SA20_League) January 18, 2023 చదవండి: Mohammed Siraj: కుటుంబ సభ్యుల నడుమ మ్యాచ్.. నిప్పులు చెరిగిన లోకల్ బాయ్.. భావోద్వేగ ట్వీట్ -
రషీద్ ఖాన్ సంచలన నిర్ణయం!
Rashid Khan: తమతో ఆడాల్సిన సిరీస్ను బహిష్కరిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయంపై అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఘాటుగా స్పందించాడు. ఆటలో రాజకీయాలకు తావు లేకుండా వ్యవహరించాలంటూ హితవు పలికాడు. తమ దేశానికి ప్రాతినిథ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తానన్న రషీద్.. ప్రపంచానికి తమ ఉనికిని గర్వంగా చాటగల ఏకైక మార్గం క్రికెట్ అని పేర్కొన్నాడు. కాగా అఫ్గన్లో మహిళలు, అమ్మాయిల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లే విధంగా తాలిబన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న నేపథ్యంలో ఆస్ట్రేలియా వన్డే సిరీస్ను రద్దు చేసుకుంటున్నట్లు గురువారం ప్రకటించింది. యూఏఈ వేదికగా అఫ్గనిస్తాన్తో జరగాల్సిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొంది. ఆటను రాజకీయాలకు దూరంగా ఉంచండి ఈ విషయంపై స్పందించిన టీ20 కెప్టెన్ రషీద్ ఖాన్.. సీఏ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. అంతేకాదు తాను ఆసీస్ టీ20 టోర్నీ బిగ్బాష్ లీగ్ నుంచి తప్పుకొంటాననే సంకేతాలు కూడా ఇచ్చాడు. ఈ మేరకు.. ‘‘మా దేశానికి ఇప్పుడున్న ఏకైక ఆశాకిరణం క్రికెట్! దయచేసి.. ఆటను రాజకీయాలకు దూరంగా ఉంచండి. మార్చిలో మాతో ఆడాల్సిన సిరీస్ నుంచి తప్పుకొంటున్నట్లు ఆస్ట్రేలియా చేసిన ప్రకటన నన్ను నిరాశకు గురిచేసింది. ప్రపంచ వేదికపై నా దేశానికి ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గౌరవం. కానీ సీఏ నిర్ణయం మా ప్రయాణాన్ని తిరోగమనం దిశగా ప్రేరేపించేలా చేసింది. ఒకవేళ ఆస్ట్రేలియాకు.. అఫ్గనిస్తాన్తో ఆడటం అసౌకర్యంగా అనిపిస్తే.. నేను బీబీఎల్ ఆడటం ద్వారా ఎవరినీ ఇబ్బంది పెట్టదలచుకోలేదు. ఆ లీగ్లో ఆడాలా లేదా అన్న అంశంపై కాస్త కఠినంగానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’’ అని రషీద్ ఖన్ ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా రషీద్ ఖాన్ బిగ్బాష్ లీగ్లో అడిలైడ్ స్ట్రైకర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక అఫ్గన్ క్రికెట్ బోర్డు సైతం.. ‘‘ఆస్ట్రేలియా బోర్డు తీసుకున్న నిర్ణయం విషాదకరం. మేమిది ఊహించలేదు. కచ్చితంగా ఇది మాపై తీవ్ర ప్రభావం చూపుతుంది’’ అని తమ ప్రకటనలో పేర్కొంది. చదవండి: Delhi vs Andhra: సెంచరీతో చెలరేగిన ధ్రువ్ షోరే... ఢిల్లీ దీటైన జవాబు Cricket! The only hope for the country. Keep politics out of it. @CricketAus @BBL @ACBofficials ♥️ 🇦🇫 ♥️ pic.twitter.com/ZPpvOBetPJ — Rashid Khan (@rashidkhan_19) January 12, 2023 -
Rashid Khan: వద్దనుకున్నోడే మళ్లీ దిక్కయ్యాడు
అఫ్గానిస్తాన్ టి20 క్రికెట్ కొత్త కెప్టెన్గా జట్టు స్టార్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ ఎంపికయ్యాడు. ఈ ఏడాది టి20 ప్రపంచకప్లో ఆఫ్గన్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ మహ్మద్ నబీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అప్పటినుంచి బోర్డు కొత్త టి20 కెప్టెన్ను ఎన్నుకోలేదు. తాజాగా బోర్డు మరోసారి రషీద్ ఖాన్వైపే చూసింది. గతంలో వద్దనుకున్న ఆటగాడే మళ్లీ దిక్కయ్యాడు. ఇక టి20 కెప్టెన్ రషీద్ ఖాన్ ఎంపికవ్వడం ఇది రెండోసారి. గతంలో 2021 టి20 ప్రపంచకప్ జట్టును ఎంపిక చేసిన రెండు రోజులకే రషీద్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. కేవలం రెండు నెలల పాటు మాత్రమే ఆ పదవిలో కొనసాగాడు. కొన్ని విషయాల్లో బోర్డుతో తలెత్తిన సమస్యల కారణంగానే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు రషీద్ ఆ సమయంలో వివరించాడు. దీంతో మహ్మద్ నబీని బోర్డు కెప్టెన్గా ఎంపిక చేసింది. అలా రెండేళ్ల పాటు మహ్మద్ నబీ జట్టును నడిపించాడు. అతని కెప్టెన్సీలో అఫ్గానిస్తాన్ జట్టు మంచి విజయాలను నమోదు చేసింది. అయితే ఈ ఏడాది జరిగిన టి20 వరల్డ్కప్లో మాత్రం నిరాశజనక ప్రదర్శనను కనబరిచింది. రెండు మ్యాచ్లు వర్షంతో రద్దు కాగా.. మిగతా మూడు మ్యాచ్ల్లో ఓడి సూపర్-12 దశలోనే వెనుదిరిగింది. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ నబీ మరుసటి రోజే కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. నూతన టి20 కెప్టెన్గా ఎంపికవ్వడంపై రషీద్ ఖాన్ తన ట్విటర్లో స్పందించాడు. ''నన్ను అభిమానించిన శ్రేయోభిలాషులకు.. అండగా నిలబడిన కుటుంబసభ్యలుకు, మిత్రులకు కృతజ్ఞతలు. టి20 కెప్టెన్గా తిరిగి ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. కెప్టెన్ పాత్రతో నా పాత్ర మరింత పెరిగింది. కెప్టెన్సీ అనేది ఎంతో చాలెంజ్తో కూడుకున్నది. ఈ సవాల్ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా.'' అంటూ ట్వీట్ చేశాడు. తాజాగా రషీద్ ఖాన్ను మరోసారి టి20 కెప్టెన్గా ఎంపిక చేసిన బోర్డు స్పందించింది. ''అఫ్గానిస్తాన్ను మూడు ఫార్మాట్లలో సమర్థంగా నడిపించగల సత్తా రషీద్ ఖాన్కు ఉంది. టి20 కెప్టెన్గా మరోసారి బాధ్యతలు తీసుకుంటున్న రషీద్కు ఇవే మా కృతజ్ఞతలు. కెప్టెన్గా తాను ఉన్నత స్థానాన్ని అందుకుంటాడని.. జట్టును గౌరవ స్థానంలో నిలుపుతాడని ఆశిస్తున్నాం'' అంటూ అఫ్గన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మిర్వయిస్ అష్రఫ్ పేర్కొన్నాడు. ఇక రషీద్ ఖాన్ అఫ్గానిస్తాన్ తరపున ఇప్పటివరకు 74 టి20 మ్యాచ్ల్లో 122 వికెట్లు, 86 వన్డేల్లో 163 వికెట్లు, ఐదు టెస్టుల్లో 34 వికెట్లు పడగొట్టాడు. Grateful for this opportunity 🇦🇫🙏 Thank you to all my supporters, well wishers and loved ones ❤️ Ready to take on the big responsibility and an even bigger challenge 💪 pic.twitter.com/2rOSE5Asjp — Rashid Khan (@rashidkhan_19) December 29, 2022 Meet Our T20I Captain 🚨🤩@rashidkhan_19, Afghanistan’s Cricketing Wizard, has replaced @MohammadNabi007 as AfghanAtalan’s captain for the T20I format. Read More 👉 https://t.co/fYUYXrjmxe pic.twitter.com/ZKz9IuVGtL — Afghanistan Cricket Board (@ACBofficials) December 29, 2022 చదవండి: కేన్ మామ డబుల్ సెంచరీ.. కివీస్ తరపున తొలి బ్యాటర్గా టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో సూర్య -
నాశనం చేయకండి: సన్రైజర్స్పై మాజీ ప్లేయర్ ఘాటు వ్యాఖ్యలు
IPL- Sunrisers Hyderabad: ‘‘నేను, రషీద్ 2017లో జట్టులోకి వచ్చినపుడు అంతా బాగానే ఉంది. ఆ తర్వాతి మూడేళ్లు టీమ్ కాంబినేషన్లు చక్కగా కుదిరాయి. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాం. కానీ గత రెండేళ్ల కాలంలో భారీ మార్పులు. అందుకు గల కారణాలు ఏమిటో, కారకులు ఎవరో నాకు తెలియదు గానీ.. ఒక్కసారిగా పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆటగాళ్లు ఆ ఫ్రాంఛైజీకి ఆడేందుకు విముఖత చూపడం ఆరంభించారు’’ అని అఫ్గనిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ నబీ.. సన్రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ తీరును విమర్శించాడు. నబీతో పాటు అఫ్గన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఐపీఎల్-2016 విజేత సన్రైజర్స్ తరఫున గతంలో ఆడిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఇద్దరికీ ఎస్ఆర్హెచ్తో బంధం లేదు. తరచూ మార్పులు కాగా 2016లో జట్టుకు ట్రోఫీ అందించిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ను 2021లో కెప్టెన్సీ నుంచి తప్పించిన సన్రైజర్స్ తర్వాత అతడిని రిలీజ్ చేసింది. అదే విధంగా.. జట్టులో కీలక సభ్యుడైన రషీద్ ఖాన్ను ఐపీఎల్-2022 వేలానికి ముందు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రషీద్ను సొంతం చేసుకున్న కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్గా నియమించుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్-2022లో గుజరాత్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ స్టార్ బౌలర్... ట్రోఫీ గెలవడంలో సహాయపడ్డాడు. మరోవైపు.. సన్రైజర్స్ మాత్రం పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. ఇక ఇటీవల ముగిసిన ఐపీఎల్ -2023 మినీ వేలానికి ముందు తమ కెప్టెన్ కేన్ విలియమ్సన్ను కూడా ఎస్ఆర్హెచ్ వదులుకున్న విషయం తెలిసిందే. దీంతో తరచూ జట్టులో మార్పులు చేస్తున్న సన్రైజర్స్ తీరుపై విశ్లేషకులు పెదవి విరిచారు. నాశనం చేయకండి అంటూ ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ యారీతో మాట్లాడిన ఆ జట్టు మాజీ ప్లేయర్ మహ్మద్ నబీ.. ఇకనైనా తీరు మార్చుకోవాలని ఎస్ఆర్హెచ్కు హితవు పలికాడు. ‘‘జట్టును నాశనం చేయడానికి బదులు.. పటిష్టం చేసేందుకు ప్రయత్నించండి. పేరున్న ఫ్రాంఛైజీగా మీరు చేయాల్సిన మొట్టమొదటి పని అదే. తరచూ మార్పులు చేయకుండా మెరుగైన జట్టు నిర్మాణానికి పాటు పడాలి’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక రషీద్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఐదేళ్ల పాటు వాళ్ల జట్టుకు బ్రాండ్ అంబాసిడర్లా ఉన్న రషీద్ ఖాన్.. వాళ్లను వదిలివెళ్లేలా చేసుకున్నారు. రషీద్ ఒక్కడే కాదు ఎంతో మంది టాప్ ప్లేయర్ల పట్ల కూడా ఇదే వైఖరి. సన్రైజర్స్ ఇలా చేయకుండా ఉండాల్సింది. అసలు వాళ్లకేం కావాలో వాళ్లకైనా అర్థమవుతోందా?’’ అని ఈ ఆల్రౌండర్.. ఎస్ఆర్హెచ్ విధానాల పట్ల విమర్శలు సంధించాడు. కాగా 2021లో మహ్మద్ నబీకి సన్రైజర్స్తో బంధం తెగిపోయింది. ఇక గతేడాది 14 మ్యాచ్లకు గానూ 6 గెలిచిన హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. చదవండి: Suryakumar Yadav: మొన్న 90.. నిన్న 95.. చెలరేగుతున్న సూర్య! టెస్టుల్లో ఎంట్రీ ఖాయం! Aus Vs SA 2nd Test: ఎదురులేని ఆసీస్.. దక్షిణాఫ్రికా చిత్తు! డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఇక.. -
ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన: కెప్టెన్లుగా కీరన్ పొలార్డ్, రషీద్ ఖాన్..
Kieron Pollard- Rashid Khan As MI Teams captains: వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పొలార్డ్, అఫ్గనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్కు ముంబై ఇండియన్స్ యాజమాన్యం రిలయన్స్ కీలక బాధ్యతలు అప్పగించింది. విదేశీ టీ20 లీగ్లలో తమ జట్లకు వీరిద్దరిని కెప్టెన్లుగా నియమించింది. ఈ మేరకు ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ప్రకటన విడుదల చేసింది. యూఏఈ ఐఎల్టీ20 లీగ్లో ఎంఐ ఎమిరేట్స్కు కీరన్ పొలార్డ్, సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఎంఐ కేప్టౌన్కు రషీద్ ఖాన్ సారథ్యం వహిస్తారని తెలిపింది. వీరిద్దరిపై తమకు పూర్తి నమ్మకం ఉందని.. ఆయా లీగ్లలో తమ జట్లను ఉన్నత శిఖరాలకు చేరుస్తారనే నమ్మకం ఉందని పేర్కొంది. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్కు రోహిత్ శర్మ నాయకుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ముంబై ఫ్రాంఛైజీల కెప్టెన్ల జాబితాలో పొలార్డ్, రషీద్ కూడా చేరడం విశేషం. ముంబై ఇండియన్స్కు గుడ్బై ఐపీఎల్లో అత్యుత్తమ ఆల్రౌండర్గా పేరొందిన కీరన్ పొలార్డ్ ఇటీవలే ఈ లీగ్కు ఆటగాడిగా గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే, అతడు ముంబై బ్యాటింగ్ కోచ్గా కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఈ క్రమంలో యూఏఈ లీగ్లో ముంబై జట్టు కెప్టెన్గా పోలీని ప్రకటించడం గమనించడం గమనార్హం. గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్ ఇక ఐపీఎల్-2022 సీజన్తో క్యాష్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్కు రషీద్ ఖాన్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడు సౌతాఫ్రికా టీ20 లీగ్లో ముంబై జట్టుకు సారథిగా నియమితుడు కావడం విశేషం. ఇదిలా ఉంటే.. గతేడాది ముంబై ఇండియన్స్ వదులుకున్న టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. గుజరాత్ను అరంగేట్ర సీజన్లోనే చాంపియన్గా నిలిపిన విషయం తెలిసిందే. 🇮🇳🇦🇪🇿🇦 Leaders of the #OneFamily. 💙#MICapeTown #MIEmirates @MIEmirates @MICapeTown @ImRo45 @KieronPollard55 @rashidkhan_19 pic.twitter.com/ngGMQWSrgS — Mumbai Indians (@mipaltan) December 2, 2022 -
శ్రీలంకను చిత్తు చేసిన ఆఫ్గాన్.. 60 పరుగుల తేడాతో ఘన విజయం
పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో 60 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్ సంచలన విజయం సాధించింది. 294 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 234 పరుగులకే ఆలౌటైంది. ఆఫ్గాన్ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ నాలుగు వికెట్లతో శ్రీలంకను దెబ్బతీయగా.. నైబ్ మూడు, యమీన్ రెండు, రషీద్ ఒక్క వికెట్ సాధించారు. శ్రీలంక బ్యాటర్లలో ఓపెనర్ నిస్సాంక(85) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. ఆఖరిలో హసరంగా(66) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గానిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. ఆఫ్గానిస్తన్ బ్యాటర్లలో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్(106) సెంచరీతో చెలరేగాడు. అతడితో పాట గుర్బాజ్(53), రెహమత్(52) పరుగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో హసరంగా రెండు వికెట్లు సాధించగా..రజితా, కుమారా, లక్షణ్, తీక్షణ తలా వికెట్ పడగొట్టారు. చదవండి: ధావన్కు అన్యాయం జరుగుతూనే ఉంది: రవిశాస్త్రి -
AUS Vs AFG: రషీద్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఆసీస్కు ముచ్చెమటలు
టి20 ప్రపంచకప్లో భాగంగా సూపర్-12లో శుక్రవారం ఆస్ట్రేలియాకు అఫ్గానిస్తాన్ ముచ్చెమటలు పట్టించింది. ఆఖర్లో రషీద్ ఖాన్(23 బంతుల్లో 48 నాటౌట్, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడడంతో అఫ్గానిస్తాన్ దాదాపు విజయానికి చేరువుగా వచ్చింది. 18 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన దశలో రషీద్ ఒక్కసారిగా విజృంభించాడు. కేన్ రిచర్డ్సన్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్ ఐదు, ఆరు బంతులను రెండు సిక్సర్లుగా మలిచాడు. ఈ దెబ్బకు అఫ్గానిస్తాన్ లక్ష్యం 12 బంతుల్లో 33 పరుగులకు మారింది. ఈ దశలో హాజిల్వుడ్ 19వ ఓవర్ వేయగా.. ఆ ఓవర్లో 10 పరుగులు పిండుకున్న రషీద్ సమీకరణాలను 6 బంతుల్లో 22 పరుగులుగా మార్చాడు. ఇక చివరి ఓవర్లో రసూలీ వైడ్ బాల్కు రనౌట్ అయినప్పటికి రషీద్ ఖాన్ ఒక ఫోర్, సిక్స్తో మ్యాచ్ను ఉత్కంఠగా మార్చాడు. రెండు బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన దశలో రెండు పరుగులు రావడం.. ఆ తర్వాత బంతికి ఫోర్ కొట్టినప్పటికి విజయానికి కేవలం నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. దీంతో నిరాశలో కూరుకుపోయిన రషీద్ ఖాన్ను ఆస్ట్రేలియా ఆటగాళ్లు అభినందించడం విశేషం. మొత్తానికి అఫ్గానిస్తాన్ మ్యాచ్లో ఓడినప్పటికి రషీద్ పోరాడిన తీరు అందరిని ఆకట్టుకుంది. ఈ ప్రపంచకప్లో నేరుగా సూపర్-12లో ఆడిన అఫ్గానిస్తాన్కు అంతగా కలిసి రాలేదు. రెండు మ్యా్చ్లు వర్షంతో రద్దు అవడం వారి కొంపముంచింది. ఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలో పరాజయం పొందిన ఆఫ్గన్ శ్రీలంక చేతిలోనూ ఓటమిపాలైంది. అయితే ఆస్ట్రేలియాకు మాత్రం అఫ్గానిస్తాన్ చుక్కలు చూపించింది. ఒక దశలో అఫ్గానిస్తాన్ గెలిచేలా కనిపించడంతో ఆస్ట్రేలియా సెమీస్కు చేరడం కష్టమే అనుకున్నారు. కానీ చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు తృటిలో ఓటమి నుంచి తప్పించుకుంది. ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. మ్యాక్స్వెల్ 52, మిచెల్ మార్ష్ 45, స్టోయినిస్ 25, వార్నర్ 25 పరుగులు చేశారు. చదవండి: మ్యాచ్లో హైడ్రామా.. మ్యాక్స్వెల్పై బౌలర్ ఆధిపత్యం వికెట్ల ముందే ఆడాలని రూల్ లేదు.. అందుకే వెనకాల var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రషీద్ ఖాన్కు తీవ్ర గాయం.. టోర్నీ నుంచి ఔట్!
టీ20 ప్రపంచకప్-2022లో ఆస్ట్రేలియాతో మ్యాచ్కు ముందు ఆఫ్గానిస్తాన్కు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గాయం కారణంగా ఈ మ్యాచ్కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో రషీద్ ఖాన్ గాయపడ్డాడు. ఈ మ్యాచ్లో బౌండరీ ఆపే ప్రయత్నంలో రషీద్ ఖాన్ కాలికి గాయమైంది. వెంటనే ఫీల్డ్ను వదిలి రషీద్ ఫిజియో సాయంతో బయటకు వెళ్లాడు. ఇక ఈ మ్యాచ్లో ఆఫ్గానిస్తాన్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమితో మహ్మద్ నబీ బృందం టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో రషీద్ 9 పరుగులతో పాటు రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఆఫ్గాన్ ఓటమిపాలైంది. ఆఫ్గాన్ ఆడాల్సిన మరో రెండు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఇక తమ అఖరి మ్యాచ్లో ఆఫ్గానిస్తాన్ నవంబర్ 4న ఆస్ట్రేలియాతో తలపడనుంది. #SLvsBAN pic.twitter.com/J8Mw59RWgP — The sports 360 (@Thesports3601) November 1, 2022 చదవండి: వన్డే చరిత్రలో తొలి వికెట్ టేకర్.. ఆస్ట్రేలియా మాజీ బౌలర్ కన్ను మూత -
'చదువును చంపకండి'.. రషీద్ ఖాన్ ఎమోషనల్ ట్వీట్
అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్లో గత శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో అభం శుభం తెలియని విద్యార్థులు చనిపోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఒక ఆగంతకుడు బాంబు ధరించి క్లాస్రూంకు వెళ్లాడు. విద్యార్థులు మధ్య కూర్చున్న తర్వాత తనను తాను పేల్చుకున్నట్లు తెలిసింది. ఆత్మాహుతి దాడిలో 46 మంది బాలికలతో పాటు ఒక మహిళ మరణించినట్లు ఐక్యరాజ్యసమితి ద్రువీకరించింది. ఆ తర్వాత మరణించిన వారి సంఖ్య 53కు చేరుకోగా.. 110 మంది గాయపడినట్లు ఐరాస తన ట్విటర్లో ప్రకటించింది. కాగా కాబుల్ ఆత్మాహుతి ఘటనపై అఫ్గనిస్తాన్ క్రికెటర్లు రషీద్ ఖాన్, రహమత్ షాలు స్పందించారు. ''దయచేసి చదువును చంపేయకండి.. ఏమి తెలియని పిల్లలేం చేశారు.. వారిని ఎందుకు పొట్టబెట్టుకున్నారు.. ఇది చాలా బాధాకరం'' అంటూ పేర్కొన్నారు. ఇక కాబుల్లోని ఆసుపత్రిలోని ఐసియు వెలుపల తన సోదరి స్కూల్ బ్యాగ్తో బాధతో కూర్చున్న టీనేజర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ''ది మోస్ట్ హార్ట్బ్రేకింగ్ ఫోటో'' అంటూ కామెంట్ చేశారు. Kabul Suicide Attack: కాబూల్లో ఆత్మాహుతి దాడి.. 100 మంది చిన్నారులు మృతి Kabul 💔💔 😢😢🤲🏻🤲🏻 #DontKillEducation 🙏🙏 pic.twitter.com/mxmRFsswmc — Rashid Khan (@rashidkhan_19) September 30, 2022 💔💔💔😭😭😭🤲🏻🤲🏻🤲🏻…. pic.twitter.com/tqDGtAVbIv — Rahmat Shah (@RahmatShah_08) October 1, 2022 -
T20 World Cup 2022: జట్టును ప్రకటించిన అఫ్గనిస్తాన్.. యువ బౌలర్ ఎంట్రీ
T20 World Cup 2022- Afghanistan Squad: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకై అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న ఈ ఐసీసీ మెగా ఈవెంట్కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును పంపనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అఫ్గన్ బోర్డు గురువారం ప్రకటన విడుదల చేసింది. కెప్టెన్గా నబీ.. వైస్ కెప్టెన్గా.. ప్రధాన జట్టుతో పాటు నలుగురు రిజర్వు ప్లేయర్లను ఈ మెగా టోర్నీకి ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇక వరల్డ్కప్లో మహ్మద్ నబీ అఫ్గన్ జట్టుకు సారథ్యం వహించనుండగా.. నజీబుల్లా జద్రాన్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఆసియాకప్- 2022 టోర్నీకి రిజర్వ్ ప్లేయర్గా ఎంపికైన యువ బౌలర్ కైస్ అహ్మద్.. ఈసారి 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు ఆస్ట్రేలియాలో ఈ మెగా టోర్నీ జరుగనుంది. ఆసియా కప్ ఆరంభంలో అదుర్స్.. కానీ ఇక ఇటీవల ముగిసిన ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో అఫ్గనిస్తాన్ లీగ్ దశలో రెండు మ్యాచ్లు గెలిచింది. ఈవెంట్ ఆరంభ మ్యాచ్లో శ్రీలంకను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించిన నబీ బృందం.. తమ రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. అయితే, సూపర్ -4 దశలో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. మొదటి మ్యాచ్లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. పాకిస్తాన్తో మ్యాచ్లో ఆఖరి వరకు గట్టిపోటీనిచ్చినా చివరికి పరాజయం పాలైంది. టీమిండియాతో చేతిలో ఓడి.. ఓటమితో టోర్నీని ముగించింది. టీ20 ప్రపంచకప్-2022కు అఫ్గనిస్తాన్ ప్రకటించిన జట్టు: మహ్మద్ నబీ(కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, కైస్ అహ్మద్, ఉస్మాన్ ఘని, ముజీబ్జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, సలీం సఫీ, రషీద్ ఖాన్, ఇబ్రహీం జద్రాన్, డార్విష్ రసూలీ, ఫజల్ హక్ ఫారుకీ, ఫరీద్ అహ్మద్ మాలిక్, నవీన్ ఉల్ హక్. రిజర్వు ప్లేయర్లు: అఫ్సర్ జజాయ్, షరాఫుదీన్ అష్రఫ్, గుల్బదిన్ నాయీబ్, రహ్మత్ షా. చదవండి: T20 WC 2022: అందుకే రసెల్ను ఎంపిక చేయలేదు: విండీస్ చీఫ్ సెలక్టర్ 'ఆ ముగ్గురు ఐపీఎల్లో అదరగొట్టారు.. టీ20 ప్రపంచకప్ భారత జట్టులో ఉండాల్సింది' 🚨 BREAKING NEWS 🚨 Afghanistan Cricket Board today announced its 15-member squad for the ICC @T20WorldCup 2022, which will be played from 16th October to 13th November in Australia. More: https://t.co/1x7it7hx5w pic.twitter.com/ToTKvyCzM4 — Afghanistan Cricket Board (@ACBofficials) September 15, 2022 -
'ఆడింది చాలు పెవిలియన్ వెళ్లు'.. ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం
ఆసియా కప్ టోర్నీ ఎలాంటి గొడవలు లేకుండా సాఫీగా సాగుతుందని మనం అనుకునేలోపే ఒక ఆసక్తికర ఘటన జరిగింది. శనివారం సూపర్-4లో భాగంగా అఫ్గానిస్తాన్, శ్రీలంక మధ్య మ్యాచ్లో రషీద్ ఖాన్, దనుష్క గుణతిలకల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 17 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 145 పరుగులతో ఆడుతోంది. గుణతిలక, రాజపక్సలు సమన్వయంతో ఆడుతూ లంకను విజయపథంవైపు నడిపిస్తున్నారు. అప్పటికే 3 ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చిన రషీద్ ఖాన్ ఒక్క వికెట్ తీయలేకపోయాడు. ఇక 17వ ఓవర్ రషీద్ ఖాన్ వేశాడు. వేసిన తొలి బంతినే దనుష్క బౌండరీగా మలిచాడు. అంతే ఆవేశంతో ఊగిపోయిన రషీద్.. దనుష్కపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డాడు. తానేం తక్కువ తిన్నానా అన్నట్లుగా దనుష్క గుణతిలక కూడా రషీద్కు కౌంటర్ ఇచ్చాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకోగా.. బానుక రాజపక్స వచ్చి వారిద్దరిని విడదీసి రషీద్కు సర్దిచెప్పాడు. అంతటితో వివాదం సద్దుమణిగింది. అయితే ఇదే ఓవర్ నాలుగో బంతికి గుణతిలక క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఇక పెవిలియన్ వెళ్లు అంటూ రషీద్ తన చేతితో గుణతిలకకు సంజ్ఞ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టులో బ్యాటర్స్ అంతా సమిష్టిగా రాణించడంతో విజయాన్ని అందుకుంది. బానుక రాజపక్స (14 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మిగిలిన వారిలో నిసాంక (35; 3 ఫోర్లు, 1 సిక్స్), కుశాల్ మెండిస్ (19 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్లు), గుణతిలక (20 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్లు) అదరగొట్టారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగులు సాధించింది. ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (45 బంతుల్లో 84; 4 ఫోర్లు, 6 సిక్స్లు), ఇబ్రహీమ్ జద్రాన్ (40; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. SL vs AFG - Rashid Khan pic.twitter.com/EbNMcojZo9 — MohiCric (@MohitKu38157375) September 3, 2022 చదవండి: భారత్-పాక్ మ్యాచ్; నోటి దాకా వచ్చినా.. 'బూతు పదం' కావడంతో AFG Vs SL Super-4: టి20 క్రికెట్లో అఫ్గానిస్తాన్ చెత్త రికార్డు.. ఏడేళ్లలో నాలుగోసారి -
ఆఫ్ఘనిస్తాన్తో జాగ్రత్త.. భారత్, పాక్లకు షాకిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు..!
ఆసియా కప్ 2022లో అంచనాలకు మించి రాణిస్తూ.. తమకంటే మెరుగైన జట్లకు షాకిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆఫ్ఘనిస్తాన్పై టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ప్రశంసల వర్షం కురిపించాడు. పసికూనే కాదా అని ఆఫ్ఘనిస్తాన్ను తక్కువ అంచనా వేసి ఏమరపాటుగా ఉంటే భారత్, పాక్లకు కూడా షాక్ తప్పదని హెచ్చరించాడు. తొలి మ్యాచ్లో శ్రీలంకను, రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్ను చిత్తు చేసి, ఉరకలేస్తున్న ఆఫ్ఘన్ను నిలువరించడం భారత్, పాక్ లాంటి జట్లకు కూడా సవాలేనని పేర్కొన్నాడు. ఆఫ్ఘన్ను ముఖ్యంగా బౌలింగ్లో అస్సలు తక్కువ అంచనా వేయరాదని.. లంకతో మ్యాచ్లో యువ పేసర్ ఫజల్ హాక్ ఫారూఖీ (3/11), ముజీబ్ (2/24), నబీ (2/14).. బంగ్లాతో మ్యాచ్లో ముజీబుర్ రెహ్మాన్ (3/16), రషీద్ ఖాన్ (3/22) లు ప్రత్యర్ధులకు ఏ గతి పట్టించారో అందరూ చూశారని అన్నాడు. అలాగే బ్యాటింగ్లోనూ ఆఫ్ఘాన్ను చిన్నచూపు చూడరాదని, బంగ్లాపై ఆ జట్టు బ్యాటర్లు ఇబ్రహీం జద్రాన్ (41 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు), నజీబుల్లా జద్రాన్ (17 బంతుల్లో 43 నాటౌట్; ఫోర్, 6 సిక్సర్లు) ఏ రకంగా చెలరేగారో భారత్, పాక్లు గమనించాలని అల్టర్ జారీ చేశాడు. బంగ్లాదేశ్తో ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్ అనంతరం క్రిక్బజ్తో మాట్లాడుతూ.. జడేజా ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, బంగ్లాపై విజయంతో ఆఫ్ఘాన్.. గ్రూప్-బి నుంచి సూపర్-4కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ గ్రూప్ నుంచి రెండో స్థానం కోసం శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. గ్రూప్-ఏ విషయానికొస్తే.. పాక్పై తొలి మ్యాచ్లో విజయంతో టీమిండియా సూపర్-4 తొలి బెర్తును (గ్రూప్-ఏ) దాదాపుగా ఖరారు చేసుకోగా.. రెండో స్థానం కోసం పాకిస్తాన్, హాంగ్కాంగ్ జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్-ఏలో ఇవాళ భారత్-హాంగ్కాంగ్ జట్లు తలపడనున్నాయి. చదవండి: ఆరు సిక్సర్లతో ప్రపంచ రికార్డు సాధించిన అఫ్గన్ బ్యాటర్ -
బంగ్లాపై విజయం.. రషీద్ ఖాన్ ఖాతాలో కొత్త రికార్డు
అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టి20 క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఆసియాకప్లో మంగళవారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీయడం ద్వారా అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. బంగ్లాతో మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన రషీద్ 22 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్కు ముందు రషీద్ ఖాన్ 112 వికెట్లతో ఉన్నాడు. ముష్ఫికర్ రహీమ్, అఫిప్ హొస్సేన్, మహ్మదుల్లా రూపంలో మూడు వికెట్లతో.. మొత్తంగా 68 మ్యాచ్ల్లో 115 వికెట్లు సాధించి న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీని(114 వికెట్లు) అధిగమించాడు. కాగా రషీద్ కంటే ముందు బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ 122 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బంగ్లాదేశ్తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్ లో అఫ్గానిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. రెండు విజయాలతో అఫ్గానిస్తాన్ ‘సూపర్–4’ దశకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. గురువారం శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్లో గెలిచిన జట్టుకు ‘సూపర్–4’ రెండో బెర్త్ ఖరారవుతుంది. అఫ్గాన్తో మ్యాచ్లో మొదట బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 127 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ముజీబ్ వుర్ రహ్మాన్ (3/16), రషీద్ ఖాన్ (3/22) తిప్పేశారు. ముసాదిక్ (31 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం అఫ్గానిస్తాన్ 13 ఓవర్లలో 3 వికెట్లకు 62 పరుగులే చేసింది. లక్ష్యంలో సగం స్కోరైనా చేయలేదు. ఈ దశలో నజీబుల్లా (17 బంతుల్లో 43 నాటౌట్; 1 ఫోర్, 6 సిక్సర్లు) ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇబ్రహీమ్ (41 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్కు 69 పరుగులు చేసి గెలిపించాడు. చదవండి: Ravindra Jadeja: 'సాంపుల్ మాత్రమే.. అంతకంటే ఘోరమైనవి చాలానే చూశా' AFG Vs BAN: అఫ్గన్తో మ్యాచ్.. అరుదైన ఘనత అందుకోనున్న బంగ్లా కెప్టెన్ -
ఆరోజు కోహ్లి రెండున్నర గంటలు బ్యాటింగ్ చేశాడు.. నేను షాకయ్యా!
Asia Cup 2022- Rashid Khan Comments On Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిపై అఫ్గనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ప్రశంసలు కురిపించాడు. ఆట కోసం ఎంతటి శ్రమకైనా ఓర్చేతత్వం అతడిదని.. పూర్తి సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతాడని కొనియాడాడు. కోహ్లి ఇప్పటికే కెరీర్లో అత్యుత్తమ దశకు చేరుకున్నాడన్న రషీద్.. అందుకే అతడిపై అంచనాలు భారీగా ఉంటాయని పేర్కొన్నాడు. కాబట్టి ప్రతి మ్యాచ్లోనూ సెంచరీ సాధించాలని అభిమానులు భావిస్తున్నారని.. అందుకు కోహ్లి గొప్ప ఆటతీరే కారణమని చెప్పుకొచ్చాడు. చాలా రోజులుగా జట్టుకు దూరమైన కోహ్లి ఆసియా కప్-2022 టోర్నీతో ఎంట్రీ ఇవ్వనున్నాడు. యూఏఈ వేదికగా ఆగష్టు 27 నుంచి ఈ ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. నిజంగా చెప్తున్నా.. రెండున్నర గంటలు బ్యాటింగ్! ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ ప్రజెంటర్ సవేరా పాషాకు ఇచ్చిన ఇంటర్వూలో అఫ్గనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ కోహ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్కు ముందు జరిగిన సంఘటన తనను ఆశ్చర్యపరిచిందన్నాడు. ఈ మేరకు రషీద్ మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్లో భాగంగా ఆ మరుసటి రోజు మేము ఆర్సీబీతో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అప్పుడు నెట్స్లో ప్రాక్టీసు చేస్తున్న కోహ్లిని చూశాను. నిజం చెప్తున్నా.. అతడు రెండున్నర గంటల పాటు బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు. అది చూసి నేను షాక్ అయిపోయాను. అర్ధ శతకంతో మెరిశాడు.. తర్వాతి రోజు మాతో మ్యాచ్లో కోహ్లి 70కి పైగా పరుగులు సాధించాడు. తను ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటాడు’’ అని పేర్కొన్నాడు. ఇక అందరూ అంటున్నట్లుగా కోహ్లి ఫామ్ కోల్పోయినట్లు తాను భావించడం లేదని.. తనపై ఉన్న అంచనాల కారణంగానే విమర్శలు వస్తున్నాయని అభిప్రాయపడ్డాడు. కోహ్లి స్థానంలో ఓ సాధారణ బ్యాటర్ ఉంటే ఇలాంటి మాటలు వినిపించేవి కావని పేర్కొన్నాడు. వాళ్లిద్దరికీ బౌలింగ్ చేయడం ఇష్టం ఇక విరాట్ కోహ్లి, బాబర్ ఆజం వంటి టాప్ క్లాస్ బ్యాటర్లుకు బౌలింగ్ చేయడం తనకు ఇష్టమని రషీద్ తెలిపాడు. కాగా ఐపీఎల్-2022లో రషీద్ ఖాన్ గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ఈ జట్టు అరంగేట్ర సీజన్లోనే విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. కాగా ఆర్సీబీ బ్యాటర్ కోహ్లి.. గుజరాత్తో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 54 బంతుల్లో 73 పరుగులు సాధించాడు. తద్వారా బెంగళూరును 8 వికెట్ల తేడాతో గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఆ మ్యాచ్కు ముందు కోహ్లి ప్రాక్టీసు చేసిన విషయాన్ని రషీద్ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. చదవండి: Asia Cup- Highest Run Scorers: టోర్నీ చరిత్రలో అతడే ఇప్పటి వరకు టాపర్! కానీ కోహ్లి మాత్రం.. Asia Cup 2022 Ind Vs Pak: బాబర్ ఆజంను పలకరించిన కోహ్లి.. వీడియో వైరల్! రషీద్తోనూ ముచ్చట! Hello DUBAI 🇦🇪 Hugs, smiles and warm-ups as we begin prep for #AsiaCup2022 #AsiaCup | #TeamIndia 🇮🇳 pic.twitter.com/bVo2TWa1sz — BCCI (@BCCI) August 24, 2022 -
Asia Cup 2022: బాబర్ ఆజం భుజం తట్టిన కోహ్లి.. వీడియో వైరల్
Virat Kohli- Babar Azam- India Vs Pakistan: ఆసియా కప్-2022 టోర్నీ ఆడేందుకు ఇప్పటికే టీమిండియా, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్ తదితర జట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చేరుకున్నాయి. దుబాయ్ వేదికగా ఆగష్టు 27 నుంచి ఆరంభం కానున్న మెగా ఈవెంట్ కోసం ప్రాక్టీసు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా ఆయా జట్ల ఆటగాళ్లు నెట్స్లో చెమటోడుస్తున్నారు. మరోవైపు.. మైదానంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కోచ్లు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. టీమిండియా ఆటగాళ్లు దుబాయ్ గ్రౌండ్లో ఉన్న సమయంలో అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా అక్కడికి ఎంట్రీ ఇచ్చారు. ఇది గమనించిన భారత ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, యజువేంద్ర చహల్.. అఫ్గన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్, కెప్టెన్ మహ్మద్ నబీని ఆప్యాయంగా పలకరించారు. హైలైట్గా విరాట్ కోహ్లి.. బాబర్ ఆజంను పలకరించి.. ఇక టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం రషీద్తో ముచ్చటించాడు. అదే విధంగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను ఆత్మీయంగా పలకరించి కరచాలనం చేశాడు. ఇటీవల కాలంలో అతడు సాధిస్తున్న రికార్డులను అభినందిస్తున్నట్లుగా భుజం మీద చేయి వేసి ఆప్యాయత ప్రదర్శించాడు. ఆ తర్వాత కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ జట్టుకు మార్గనిర్దేశనం చేస్తూ కనిపించాడు. ఈ వీడియో చూసిన కోహ్లి అభిమానులు.. ఎప్పటిలాగే ఈ వీడియోలోనూ తమ ఆరాధ్య క్రికెటర్ హైలైట్గా నిలిచాడని, పాక్ కెప్టెన్ పట్ల అతడు వ్యవహరించిన తీరు ఎంతో హుందాగా ఉందంటూ మురిసిపోతున్నారు. దుబాయ్లో ఆగష్టు 28న జరుగనున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్తో తిరిగి ఫామ్లోకి వచ్చి జట్టును గెలిపిస్తాండంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా టీ20 వరల్డ్కప్-2021 సమయంలోనూ పాక్ చేతిలో ఓటమి అనంతరం అప్పటి మెంటార్ ఎంఎస్ ధోని, నాటి కెప్టెన్ కోహ్లి.. పాకిస్తాన్ ఆటగాళ్లను అభినందించిన విషయం తెలిసిందే. క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించి అభిమానుల మనసు గెలుచుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈసారి ఆసియా కప్ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరుగనున్న విషయం తెలిసిందే. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ సహా క్వాలిఫైయర్స్లో విజయం సాధించి టోర్నీకి అర్హత సాధించిన హాంకాంగ్ సైతం పాల్గొనబోతోంది. చదవండి: ASIA CUP 2022: ఆసియా కప్కు అర్హత సాధించిన హాంకాంగ్.. భారత్, పాక్తో ఢీ! Asia Cup 2022: ఆసియాకప్కు ముందు కోహ్లి కీలక నిర్ణయం! ఇకనైనా దశ మారనుందా? Hello DUBAI 🇦🇪 Hugs, smiles and warm-ups as we begin prep for #AsiaCup2022 #AsiaCup | #TeamIndia 🇮🇳 pic.twitter.com/bVo2TWa1sz — BCCI (@BCCI) August 24, 2022 -
ఆఫ్ఘనిస్తాన్కు షాకిచ్చిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం
Ireland vs Afghanistan, 5th T20I: సీమర్లు మార్క్ అడైర్ (3/16), జాషువ లిటిల్ (2/14) రెచ్చిపోవడంతో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో ఐర్లాండ్ 7 వికెట్ల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతిలో) ఘన విజయం సాధించింది. తద్వారా 5 మ్యాచ్ల సిరీస్ను 3-2 తేడాతో కైవసం చేసుకుని పర్యాటక జట్టుకు భారీ షాకిచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 15 ఓవర్లలో 95/5 వద్ద ఉండగా భారీ వర్షం కురువడంతో ఇన్నింగ్స్ను అంతటితో ఆపేసిన అంపైర్లు.. ఆ తర్వాత వర్షం కాస్త ఎడతెరిపినివ్వడంతో డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఐర్లాండ్కు 7 ఓవర్లలో 56 పరుగుల టార్గెట్ను నిర్ధేశించారు. ఐర్లాండ్ 3 వికెట్లు కోల్పోయి మరో 2 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో ఉస్మాన్ ఘని (40 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే ఓ మోస్తరుగా రాణించాడు. ఛేదనలో ఐర్లాండ్ బ్యాటర్లు కూడా తడబడినప్పటికీ లక్ష్యం చిన్నది కావడంతో ఆడుతూ పాడుతూ విజయం సాధించారు. పాల్ స్టిర్లింగ్ (10 బంతులో 16), లోర్కన్ టక్కర్ (12 బంతుల్లో 14) రెండంకెల స్కోర్లు సాధించగా.. హ్యారీ టెక్టార్ (5 బంతుల్లో 9), జార్జ్ డాక్రెల్ (4 బంతుల్లో 7) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్ రెహ్మాన్ 2, రషీద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో ఐర్లాండ్ గెలుపొందగా.. ఆతర్వాత ఆఫ్ఘనిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచి సిరీస్ను డిసైడర్ దాకా తీసుకువచ్చింది. చదవండి: రెచ్చిపోయిన బౌలర్లు.. బోణీ కొట్టిన విండీస్ -
నజీబుల్లా వీరవిహారం.. నాలుగో టీ20లో అఫ్ఘనిస్థాన్ సూపర్ విక్టరీ
ఐర్లాండ్ పర్యటనలో వరుస ఓటములు చవిచూసిన అఫ్ఘనిస్థాన్ తిరిగి గాడిలో పడింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన నబీ సేన.. వరుసగా 3, 4 మ్యాచ్ల్లో గెలుపొంది సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. నిన్న (ఆగస్ట్ 15) జరిగిన నాలుగో టీ20లో అఫ్ఘనిస్థాన్ 27 పరుగుల తేడాతో ఐర్లాండ్ను మట్టికరిపించింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘనిస్థాన్.. నజీబుల్లా జద్రాన్ (24 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకం, రషీద్ ఖాన్ (10 బంతుల్లో 31 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్ సాయంతో 6 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్.. అఫ్ఘాన్ బౌలర్లు మూకుమ్మడిగా రెచ్చిపోవడంతో 11 ఓవర్లలో 105 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. జార్జ్ డాక్రెల్ (27 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఐర్లాండ్ను గెలిపించేందుకు విఫలయత్నం చేయగా.. మిగతా ఆటగాళ్లందరూ విఫలయ్యారు. ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్ (9 బంతుల్లో 20; 3 ఫోర్లు, సిక్స్), ఆండ్రూ బల్బిర్నీ (5 బంతుల్లో 15; 2 ఫోర్లు, సిక్స్) మెరుపు ఆరంభాన్ని అందించినప్పటికీ ఐర్లాండ్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆఫ్ఘాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ మాలిక్ 3, రషీద్ ఖాన్, నవీన్ ఉల్ హాక్ తలో 2 వికెట్లు, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ వికెట్ పడగొట్టాడు. ఈ సిరీస్లో నిర్ణయాత్మక ఐదో టీ20 ఆగస్ట్ 17న జరుగనుంది. చదవండి: చెలరేగిన మొయిన్ అలీ.. రెచ్చిపోయిన లివింగ్స్టోన్ -
జింబాబ్వేను చిత్తు చేసిన ఆఫ్ఘనిస్తాన్.. సిరీస్ కైవసం..!
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆఫ్ఘనిస్తాన్ కైవసం చేసుకుంది. 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. 44.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆఫ్ఘాన్ బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్ సెంచరీతో చెలరేగాడు. కాగా ఇది అతడికి తన కెరీర్లో తొలి సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్లో జద్రాన్ 141 బంతుల్లో 120 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు రహమత్ షా 88 పరుగులతో రాణించాడు. ఇక జింబాబ్వే బౌలర్లలో ముజారబానీ, తిరిపానో చెరో వికెట్ సాధించారు. కాగా అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే 228 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో ఇనోసెంట్ కియా 69 పరుగులు, రాయర్ బర్ల్ 51 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ మూడు,ఫజల్హక్ ఫారూఖీ,నబీ,రషీద్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించాడు. చదవండి: Umran Malik Bowling Idols: 'వకార్ యూనిస్ ఎవరో తెలియదు.. ఆ ముగ్గురు పేసర్లే నా ఆదర్శం' -
IPL 2022: అంబరాన్నంటిన గుజరాత్ సంబరాలు.. ఫొటో హైలైట్స్
IPL 2022: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్లో అడుగుపెట్టిన తొలి సీజన్లోనే టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది గుజరాత్ టైటాన్స్. సీవీసీ క్యాపిటల్స్కు చెందిన ఈ జట్టు అరంగేట్రంలోనే ట్రోఫీని ముద్దాడి మధుర జ్ఞాపకంగా మార్చుకుంది. దీంతో హార్దిక్ పాండ్యా సేన సంబరాలు అంబరాన్నంటాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలపై ఓ లుక్కేయండి. హార్దిక్ పాండ్యా ముఖానికి కేక్ పూస్తున్న రషీద్ ఖాన్(PC: IPL/BCCI) భార్య నటాషాతో హార్దిక్ పాండ్యా(PC: IPL/BCCI) కోచ్ ఆశిష్ నెహ్రాతో గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(PC: IPL/BCCI) ఐపీఎల్ ట్రోఫీతో హార్దిక్ పాండ్యా దంపతులు(PC: IPL/BCCI) ట్రోఫీతో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్మన్ గిల్(PC: IPL/BCCI) ట్రోఫీ గెలిచిన సంబరంలో వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్(PC: IPL/BCCI) (మరిన్ని ఫొటోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'అతడు టీమిండియాకు స్టార్ బౌలర్ అవుతాడు'
టీమిండియా యవ బౌలర్, లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ రవి బిష్ణోయ్పై గుజరాత్ టైటాన్స్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. రాబోయే రోజుల్లో బిష్ణోయ్ భారత్కు స్టార్ స్సిన్నర్గా మారుతాడని రషీద్ ఖాన్ కొనియాడాడు. ఇక ఐపీఎల్-2022లో 14 మ్యాచ్లు ఆడిన బిష్ణోయ్ 13 వికెట్లు పడగొట్టాడు. "బిష్ణోయ్ మంచి ప్రతిభావంతుడు. అతడితో నేను చాలా సార్లు మాట్లాడాను. అతడు రాబోయే రోజుల్లో టీమిండియాకు స్టార్ బౌలర్ అవుతాడు. బిష్ణోయ్ తన స్కిల్స్ను మరింత మెరుగుపరచుకుని ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను" అని రషీద్ పేర్కొన్నాడు. ఇక యజువేంద్ర చాహల్ గురించి మాట్లాడూతూ.. "చాహల్ ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ స్పిన్నర్. భారత్, ఆర్సీబీ తరపున చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడు తన బౌలింగ్లో అద్భుతమైన స్కిల్స్ను ప్రదర్శిస్తాడని" రషీద్ తెలిపాడు. ఇక ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న రషీద్ ఆల్రౌండర్ స్కిల్స్తో అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన 18 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2022: ఫైనల్కు 6000 మంది పోలీసులతో భారీ భద్రత.. కారణం అదేనా? -
'ఐపీఎల్ ఫైనల్లో ఖచ్చితంగా స్నేక్ షాట్ ఆడుతాను'
ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ స్టార్ స్సిన్నర్ రషీద్ ఖాన్ బాల్తోనే కాకుండా బ్యాట్తో కూడా అదరగొడుతున్నాడు. అదే విధంగా క్రికెట్లో ఓ కొత్త షాట్ను రషీద్ ఆవిష్కరించాడు. ఆ షాట్కు స్నేక్ షాట్గా రషీద్ నామకరణం కూడా చేశాడు. ఇక అహ్మదాబాద్ వేదికగా ఆదివారం(మే29) జరగున్న ఫైనల్లో రాజస్తాన్ రాయల్స్తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. క్వాలిఫయర్ 1లో రాజస్తాన్పై విజయం సాధించిన గుజరాత్.. ఫైనల్లో కూడా ఆదే జోరును కొనసాగించి టైటిల్ నెగ్గాలని భావిస్తోంది. ఇక ఫైనల్లో కూడా బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా స్నేక్ షాట్ ఆడుతానని రషీద్ ఖాన్ తెలిపాడు. "నేను ప్రాక్టీస్ సెషన్లో ఎక్కువగా బ్యాటింగ్ చేస్తున్నాను. కాగా గతంలో కంటే నాకు ఇప్పుడు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం లభిస్తుంది. కాబట్టి జట్టుకు అఖరిలో కొన్ని పరుగులు అందించగలనే నమ్మకం ప్రతి ఒక్కరూ నాపై పెట్టుకున్నారు. అదే విధంగా జట్టుకు అవసరమైనప్పడు 20 నుంచి 25 పరుగులు చేయగలననే నమ్మకం నాకు ఎప్పుడూ ఉంటుంది. ఇక ఫైనల్లో బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా స్నేక్ షాట్ ఆడుతాను" అని ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రషీద్ ఖాన్ పేర్కొన్నాడు. చదవండి: RCB Tweet On RR: రాజస్తాన్కు ఆర్సీబీ విషెస్.. గుండెల్ని మెలిపెట్టే ట్వీట్! హృదయాలు గెలిచారు! -
IPL 2022: 4 రోజులు సెలవు దొరికింది.. ఏం చేయాలో? సక్కగా నిద్రపో!
IPL 2022 GT Enters Final: ఐపీఎల్లో అరంగేట్రంలోనే అదరగొట్టి ఫైనల్లో అడుగుపెట్టింది గుజరాత్ టైటాన్స్. క్వాలిఫైయర్-1లో రాజస్తాన్ రాయల్స్ జట్టును ఓడించి తుది పోరుకు అర్హత సాధించింది. దీంతో గుజరాత్ ఆటగాళ్లు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తమ విజయాలను ఆస్వాదిస్తూ సంతోషంగా అహ్మదాబాద్కు పయనమవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఎలిమినేటర్ మ్యాచ్లో భాగంగా మరో కొత్త జట్టు లక్నో సూపర్జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బుధవారం(మే 25) పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన టీమ్... క్వాలిఫైయర్-2లో రాజస్తాన్ రాయల్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. కాగా ఎలిమినేటర్ విజేత, రాజస్తాన్ మధ్య మే 27న మ్యాచ్ జరుగుతుంది. ఇక ఇందులో గెలిచిన జట్టు గుజరాత్తో ఫైనల్లో పోటీ పడుతుందన్న సంగతి తెలిసిందే. మే 29న ఈ మెగా పోరు జరుగనుంది. ఈ నేపథ్యంలో విజయోత్సాహంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ తనదైన శైలిలో ట్వీట్ వదిలింది. #LateNightThoughts అన్న హ్యాష్ట్యాగ్తో ‘‘నాలుగు రోజులు సెలవులు దొరికాయి. ఏం చేయాలో?’’ అంటూ కామెంట్ చేసింది. ఇక ఇందుకు స్పందించిన గుజరాత్ వైస్ కెప్టెన్, స్టార్ బౌలర్ రషీద్ ఖాన్.. ‘‘నిద్ర పో’’ అంటూ స్మైలీ ఎమోజీలతో బదులిచ్చాడు. ఈ ట్వీట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఐపీఎల్ క్వాలిఫైయర్-1: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ స్కోర్లు 👉🏾టాస్- గుజరాత్ 👉🏾రాజస్తాన్ రాయల్స్- 188/6 (20) 👉🏾గుజరాత్ టైటాన్స్- 191/3 (19.3) 👉🏾7 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం 👉🏾ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: డేవిడ్ మిల్లర్(38 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 పరుగులు-నాటౌట్) 👉🏾ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా 27 బంతుల్లో 40 పరుగులు నాటౌట్.. అదే విధంగా 2 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. చదవండి👉🏾Hardik Pandya: దీనంతటికీ కారణం వాళ్లే.. ఉప్పొంగిపోను! అతడిని చూసి గర్వపడుతున్నా! చదవండి👉🏾IPL 2022 Eliminator LSG Vs RCB: ఎలిమినేటర్ మ్యాచ్లో విజయం వాళ్లదే.. కారణమిదే: టీమిండియా మాజీ క్రికెటర్ Sooooo Jaooo 😂😂😂 — Rashid Khan (@rashidkhan_19) May 24, 2022 Congratulations to the @gujarat_titans as they march into the Final in their maiden IPL season! 👏 👏 Stunning performance by @hardikpandya7 & Co to beat #RR by 7⃣ wickets in Qualifier 1 at the Eden Gardens, Kolkata. 🙌 🙌 Scorecard ▶️ https://t.co/O3T1ww9yVk#TATAIPL | #GTvRR pic.twitter.com/yhpj77nobA — IndianPremierLeague (@IPL) May 24, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
గోల్డెన్ డక్ తప్పించుకొని మ్యాచ్ విన్నర్గా.. రూల్స్ మార్చాల్సిందే!
ఐపీఎల్ 2022 సీజన్లో గురువారం ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్పై కీలక విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. కోహ్లి దంచుడు.. మ్యాక్స్వెల్ మెరుపులతో 18.4 ఓవరల్లో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. అయితే మ్యాక్స్వెల్ తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్ రషీద్ ఖాన్ బౌలింగ్కు వచ్చాడు. అప్పటికే కోహ్లి, డుప్లెసిస్ మధ్య 115 పరుగుల సెంచరీ భాగస్వామ్యం ఏర్పడింది. 38 బంతుల్లో 44 పరుగులు చేసిన డుప్లెసిస్ను రషీద్ ఆ ఓవర్ రెండో బంతికి పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత మ్యాక్స్వెల్ క్రీజులోకి వచ్చాడు. అయితే రషీద్ మ్యాక్సీకి గూగ్లీ వేశాడు. స్వీప్షాట్ ఆడే ప్రయత్నంలో మ్యాక్సీ బంతిని మిస్ చేయగా.. నేరుగా వికెట్లను తాకింది. అయితే బెయిల్స్ ఎగిరినప్పటికి అవి కిందపడలేదు. రూల్ ప్రకారం బెయిల్స్ కింద పడితేనే బ్యాట్స్మన్ ఔట్ అయినట్లు. వరుసగా రెండో వికెట్ తీశానన్న ఆనందంలో ఉన్న రషీద్ అసలు విషయం తెలిసి తల పట్టుకున్నాడు. అలా గోల్డెన్ డక్ నుంచి తప్పించుకున్న మ్యాక్స్వెల్ 18 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 నాటౌట్గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా ఈ సీజన్లో ఇలా జరగడం ఇది రెండోసారి. ఇంతకముందు రాజస్తాన్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో చహల్ బౌలింగ్లో డేవిడ్ వార్నర్ కూడా ఇలాగే తప్పించుకున్నాడు. బంతి వికెట్లను తాకినప్పటికి బెయిల్స్ కిందపడకపోవడంతో వార్నర్ బతికిపోయాడు. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్.. ''రూల్ మార్చండి.. బంతి వికెట్లను తాకి బెయిల్స్ కిందపడినా.. పడకపోయినా ఔట్ ఇవ్వాల్సిందే. కొన్నిసార్లు ఇవే మ్యాచ్ను మలుపుతిప్పుతాయి. మ్యాక్స్వెల్ విషయంలో ఇదే జరిగింది. గోల్డెన్ డక్ నుంచి తప్పించుకొని మ్యాచ్ విన్నర్గా నిలిచాడు.'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: IPL 2022: మరోసారి చెత్త అంపైరింగ్.. కోపంతో రగిలిపోయిన మాథ్యూ వేడ్ Virat Kohli: కోహ్లి అరుదైన ఫీట్.. ఐపీఎల్ చరిత్రలో తొలి బ్యాటర్గా A Lucky Escape For Glenn Maxwell.#IPL2022 #RCBvGT pic.twitter.com/r2FjmbIbVV — Rahul Choudhary (@Rahulc7official) May 19, 2022 Miracle no 2 of the day. After failure of ball tracker to trace edge, bails didn't fall when @rashidkhan_19 bowled @Gmaxi_32 #IPL20222 #IPL #GTvRCB — Ajay Dhaka (@ajaydhakaajay) May 19, 2022 -
IPL 2022: కీలక మ్యాచ్కు ముందు రషీద్ ఖాన్కు కోహ్లి స్పెషల్ గిఫ్ట్!
Virat Kohli- Rashid Khan: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లి.. గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్కు బహుమతి ఇచ్చాడు. తన బ్యాట్ను కానుకగా అందించాడు. ఐపీఎల్-2022లో భాగంగా ఆర్సీబీ గురువారం(మే 19) గుజరాత్తో తలపడనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టిన హార్దిక్ పాండ్యా బృందంతో... ఫాఫ్ డుప్లెసిస్ సేన చావోరేవో తేల్చుకోనుంది. లీగ్ దశలో తమకు ఆఖరిదైన ఈ మ్యాచ్లో గెలిస్తేనే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తుంది. ఇదిలా ఉంటే.. కీలకమైన మ్యాచ్కు ముందు ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లి మైదానంలో ప్రాక్టీసు చేస్తుండగా.. రషీద్ ఖాన్ కూడా అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో కోహ్లి తన బ్యాట్ను ప్రత్యర్థి జట్టు స్పిన్నర్కు ఇచ్చాడు. ఇందుకు స్పందించిన రషీద్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా ఈ ఆర్సీబీ బ్యాటర్కు ధన్యవాదాలు తెలిపాడు. తాము మైదానంలో కలుసుకున్న వీడియోను షేర్ చేసిన రషీద్ ఖాన్.. ‘‘నిన్ను కలవడం ఎల్లప్పుడూ సంతోషాన్నిస్తుంది కోహ్లి. గిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్స్’’ అని అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ పోస్ట్కు బదులిచ్చిన దక్షిణాఫ్రికా క్రికెటర్ తబ్రేజ్ షంసీ.. ‘‘నా కోసం ఆ బ్యాట్ సేఫ్గా పెట్టు బ్రదర్.. తొందర్లోనే నీ నుంచి నేను లాక్కొంటా’’ అని సరదాగా కామెంట్ చేశాడు. ఇక ఈ సీజన్లో కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అఫ్గన్ స్టార్ రషీద్ ఖాన్ 16 వికెట్లు కూల్చాడు. 72 పరుగులు సాధించాడు. ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో 11 బంతుల్లో 31 పరుగులతో రషీద్ రాణించిన తీరును అభిమానులు మర్చిపోలేరు. చదవండి👉🏾RCB Vs GT: అలా అయితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరలేదు.. ఎందుకంటే: టీమిండియా మాజీ క్రికెటర్ చదవండి👉🏾IPL 2022 RCB Vs GT Prediction: నిలవాలంటే గెలవాలి.. అదీ భారీ తేడాతో..! View this post on Instagram A post shared by Rashid Khan (@rashid.khan19) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
టి20 క్రికెట్లో రషీద్ ఖాన్ అరుదైన ఘనత
ఐపీఎల్ 2022లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సీజన్లో ప్లే ఆఫ్ చేరిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. గుజరాత్ విజయంలో స్పిన్నర్ రషీద్ ఖాన్ నాలుగు వికెట్లతో కీలకపాత్ర పోషించాడు. రషీద్ దెబ్బకు లక్నో సూపర్ జెయింట్స్ 82 పరుగులకే కుప్పకూలింది. ఈ నేపథ్యంలోనే రషీద్ ఖాన్ టి20 క్రికెట్లో అరుదైన ఫీట్ అందుకున్నాడు. ఒక ఏడాదిలో టి20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రషీద్ తొలి స్థానంలో ఉన్నాడు. 2022 ఏడాదిలో రషీద్ ఇప్పటివరకు 27 మ్యాచ్ల్లో 40 వికెట్లతో తొలిస్థానం.. సందీప్ లమిచ్చానే 23 మ్యాచ్ల్లో 38 వికెట్లతో రెండు, డ్వేన్ బ్రావో 19 మ్యాచ్ల్లో 34 వికెట్లతో మూడు, జాసన్ హోల్డర్ 17 మ్యాచ్ల్లో 29 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక రషీద్ లక్నోతో మ్యాచ్ ద్వారా తన ఐపీఎల్ కెరీర్లో బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడు. లక్నోతో మ్యాచ్లో 3.5 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అంతకముందు 2020 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్పై(3 వికెట్లు/7 పరుగులు), పంజాబ్ కింగ్స్పై(3 వికెట్లు/12 పరుగులు) బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడు. చదవండి: Rovman Powell: 'మూడురోజులు టవల్ చుట్టుకునే.. ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు' Rashid Khan is our Top Performer from the second innings for his excellent bowling figures of 4/24. A look at his bowling summary here 👇👇 #TATAIPL #LSGvGT pic.twitter.com/2kIQWyQmFY — IndianPremierLeague (@IPL) May 10, 2022 That 'INTO THE PLAYOFFS' feeling 😁😁 A brilliant team effort tonight and what a way to bounce back! 💪#AavaDe #SeasonOfFirsts #GujaratTitans #TataIPL2022 #IPL pic.twitter.com/sGcRz423Tb — Rashid Khan (@rashidkhan_19) May 10, 2022 -
రషీద్ భయ్యా ఏంటి ఈ గందరగోళం.. వీడియో వైరల్
ఐపీఎల్ 2022లో భాగంగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ముంబై ఇన్నింగ్స్ సమయంలో రషీద్ ఖాన్ మిస్ ఫీల్డింగ్ నవ్వులు పూయించింది. ప్రదీప్ సంగ్వాన్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో రెండో బంతిని ఇషాన్ కిషన్ కవర్స్ దిశగా ఆడాడు. అయితే బంతిని అందుకున్న రషీద్ త్రో విసరడంలో విఫలమయ్యాడు. బంతి అతని కాళ్లను తాకి మళ్లీ వెనక్కి వచ్చింది. దీంతో మళ్లీ పరిగెత్తిన రషీద్ బంతిని అందుకోబోయి పట్టుతప్పి కిందపడ్డాడు. ఈసారి వేగంగా త్రో వేసినప్పటికి మిడిల్ స్టంప్ మిస్ అయి బౌండరీ దిశగా పరిగెట్టింది. ఇంతలో మరో ఫీల్డర్ బంతిని అందుకున్నాడు. ఈ గ్యాప్లో ఇషాన్ కిషన్, రోహిత్ శర్మలు రెండు రన్స్ పూర్తి చేశారు. ఇదంతా గమనించిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా రషీద్ వద్దకు వచ్చి ఏంటిది అన్నట్లు నవ్వుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఇదే రషీద్ ఖాన్ దాటిగా ఆడుతున్న రోహిత్ను ఔట్ చేశాడు. రోహిత్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు సాధించాడు. pic.twitter.com/MybLIpTQRl — Jemi_forlife (@jemi_forlife) May 6, 2022 -
IPL 2022: నిన్ను మిస్సయ్యాను బ్రో.. వార్నర్ ఎమోషనల్.. ఫొటో వైరల్
IPL 2022 David Warner- Kane Williamson: సాధారణంగా ఆటగాళ్లెవరైనా మైదానంలో ఉన్నంత వరకే ‘ప్రత్యర్థులు’. ఒక్కసారి ఆట ముగిసిందంటే అంతా కలిసిపోతారు. సలహాలు, సూచనలు పంచుకుంటూ ముందుకు సాగుతారు. ఇక వేర్వేరు జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నా క్రికెటర్లుగా తాము అందరం ఒకటేనని.. తమ అనుబంధాన్ని చాటుకుంటూ ఉంటారు ఆటగాళ్లు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ మరోసారి ఈ విషయాన్ని నిరూపించారు. ఐపీఎల్-2022లో గురువారం ఢిల్లీ, హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో వార్నర్ విజృంభణతో ఢిల్లీ.. హైదరాబాద్పై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఆట విషయాన్ని పక్కనపెడితే.. మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలు అభిమానుల మనసు దోచుకుంటున్నాయి. ముఖ్యంగా తనను ఘోరంగా అవమానించి బయటకు పంపిన సన్రైజర్స్ ఫ్రాంఛైజీకి చెందిన ఆటగాళ్లతో వార్నర్ వ్యవహరించిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కెప్టెన్ కేన్తో సెల్ఫీ దిగిన వార్నర్.. ‘‘నిన్ను చాలా మిస్సయ్యాను బ్రో’’ అంటూ ఫొటో షేర్ చేశాడు. ఇందుకు స్పందించిన రషీద్ ఖాన్.. ‘‘నేను కూడా’’ అంటూ కామెంట్ చేశాడు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇది చూసిన ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఇంతగా మిస్ అయితే మళ్లీ తిరిగి రావొచ్చు కదా అంటూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు. ఇక వార్నర్, రషీద్ ఖాన్ సుదీర్ఘకాలం పాటు సన్రైజర్స్కు ప్రాతినిథ్య వహించిన సంగతి తెలిసిందే. తాజా ఎడిషన్లో వార్నర్ ఢిల్లీకి ఆడుతుండగా.. రషీద్ టైటాన్స్ జట్టులో ఉన్నాడు. చదవండి👉🏾 David Warner: ‘ప్రతీకారం తీర్చుకున్న వార్నర్’.. ఆ ఒక్క మాట చాలు.. దెబ్బ అదుర్స్ కదూ! 5⃣th win for @RishabhPant17 & Co. in the #TATAIPL 2022! 👏 👏 The @DelhiCapitals beat #SRH by 21 runs & return to winning ways. 👌 👌 #DCvSRH Scorecard ▶️ https://t.co/0T96z8GzHj pic.twitter.com/uqHvqJPu2v — IndianPremierLeague (@IPL) May 5, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
దిగ్గజ క్రికెటర్ టీ20 జట్టు టాప్-5లో ఉన్నది వీళ్లే!
Mahela Jayawardene First 5 Players Of His T20 XI: తన టీ20 జట్టులోని ఐదుగురు ఆటగాళ్ల పేర్లను శ్రీలంక దిగ్గజ క్రికెటర్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ మహేళ జయవర్దనే ప్రకటించాడు. ఇందులో అఫ్గనిస్తాన్ నుంచి ఒకరు, పాకిస్తాన్ నుంచి ఇద్దరు, భారత్ నుంచి, ఇంగ్లండ్ నుంచి ఒకరికి అవకాశం ఇచ్చాడు. వారిని టాప్-5గా ఎంచుకోవడానికి గల కారణాలను కూడా వెల్లడించాడు. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్తో వర్చువల్గా మాట్లాడిన జయవర్దనే ఈ మేరకు తన జట్టులోని టాప్-5ని వెల్లడించాడు. ఇంతకీ ఆ ఐదుగురు క్రికెటర్లు ఎవరంటే.. రషీద్ ఖాన్, షాహిన్ ఆఫ్రిది, జస్ప్రీత్ బుమ్రా, జోస్ బట్లర్, మహ్మద్ రిజ్వాన్. ది ఐసీసీ రివ్యూలో భాగంగా ఈ ముంబై ఇండియన్స్ కోచ్ మాట్లాడుతూ.. ‘‘నా అభిప్రాయం ప్రకారం... టీ20 క్రికెట్లో బౌలర్లదే కీలక పాత్ర పాత్ర. రషీద్ ఖాన్ విషయానికొస్తే అతడు మంచి స్పిన్నర్. అదే విధంగా బ్యాటింగ్ కూడా చేయగలడు. అతడు ఏడు లేదంటే ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. నా జట్టులో అతడు అగ్రస్థానంలో ఉంటాడు’’ అని చెప్పుకొచ్చాడు. అదే విధంగా ఐపీఎల్-2022లో ప్రస్తుతం అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్న రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ గురించి చెబుతూ.. ‘‘జోస్తో ఓపెనింగ్ చేయడం ఇష్టం. తను దూకుడైన బ్యాటర్. పేస్, స్పిన్ బాగా ఆడగలడు. గతేడాది టీ20 ప్రపంచకప్ సందర్భంగా యూఏఈలో కఠిన పరిస్థితులకు ఎదురొడ్డి.. అద్భుతంగా రాణించాడు’ అని ఈ ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్పై జయవర్దనే ప్రశంసలు కురిపించాడు. ఇక జస్ప్రీత్ బుమ్రాను ప్రపంచంలోనే అత్యుత్తమ పేసర్గా జయవర్దనే అభివర్ణించాడు. అందుకే అతడిని తన జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపాడు. ఈ సందర్భంగా సంజనాను ఉద్దేశించి.. ‘‘నువ్వు సిగ్గు పడొద్దు సంజనా.. ఎందుకంటే నేను చెప్పబోయేది నీ భర్త పేరే’’ అని జయవర్దనే పేర్కొనడం విశేషం. ఇక బుమ్రాతో పాటు పాకిస్తాన్ స్పీడ్స్టర్ షాహిన్ ఆఫ్రిది, మిడిలార్డర్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్కు అతడు చోటిచ్చాడు. చదవండి👉🏾IPL 2022: సన్రైజర్స్ హైదరాబాద్కు భారీ షాక్.. కీలక ఆటగాడు దూరం..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: ఇప్పుడు అదృష్టం కలిసి వస్తోంది.. నా భయం అదే!
IPL 2022 SRH Vs GT- Hardik Pandya Comments: గుజరాత్ టైటాన్స్.. ఐపీఎల్-2022 సీజన్తో క్యాష్ రిచ్లీగ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కొత్త జట్టు ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్లలో ఏడింట గెలిచింది. తద్వారా 14 పాయింట్లు సాధించి పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే, ఒకటీ రెండూ మినహా గుజరాత్ గెలిచిన మ్యాచ్లన్నింటిలోనూ దాదాపుగా ప్రతీదీ ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగినదే. కోల్కతా నైట్రైడర్స్పై 8 పరుగుల తేడాతో విజయం, చెన్నై సూపర్కింగ్స్పై ఆఖరి బంతికి 3 వికెట్ల తేడాతో గెలుపు... తాజాగా బుధవారం(ఏప్రిల్ 27) నాటి మ్యాచ్లో రషీద్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్తో చివరి బంతికి జయభేరి. నిజానికి ఈ మ్యాచ్లలో అదృష్టం కలిసిరాకపోతే గుజరాత్ పరిస్థితి వేరేలా ఉండేది. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం ఇదే మాట అంటున్నాడు. సన్రైజర్స్పై విజయానంతరం అతడు మాట్లాడుతూ.. ‘‘డ్రెస్సింగ్ రూంలో మా వాళ్లతో జోక్ చేస్తూ ఉంటాను. ‘చూడండి మీరు మంచివాళ్లు.. మీకు నేను సహాయం చేస్తాను’ అని ఆ దేవుడు చెబుతున్నాడు. చాలాసార్లు ఆఖరి నిమిషంలో మాకు కలిసి వచ్చింది. ఇప్పుడు ఇదే నా భయానికి కారణమైంది. ఒకవేళ నాకౌట్ దశలో మాకు అదృష్టం కలిసిరాదేమోననిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించాడు. ఇక తన బౌలింగ్ ఫిట్నెస్పై దృష్టి సారించానన్న హార్దిక్.. జట్టుకు అవసరమైన సమయంలో కచ్చితంగా తన సేవలు అందిస్తానని పునరుద్ఘాటించాడు. వరుస విజయాల నేపథ్యంలో జట్టులో ఉత్సాహం నిండిందని, తమ విజయాల వెనుక సహాయక సిబ్బంది శ్రమ కూడా ఉందంటూ వాళ్లపై ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్ మ్యాచ్ 40: ఎస్ఆర్హెచ్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ స్కోర్లు ఎస్ఆర్హెచ్- 195/6 (20) గుజరాత్ టైటాన్స్- 199/5 (20) చదవండి👉🏾Rashid Khan: నాలుగు సిక్సర్లు.. అది స్నేక్షాట్.. ఇలా ఎందుకు అన్నానంటే! WHAT. A. GAME! 👌👌 WHAT. A. FINISH! 👍👍 We witnessed an absolute thriller at the Wankhede and it's the @gujarat_titans who edged out #SRH to seal a last-ball win! 🙌 🙌 Scorecard ▶️ https://t.co/r0x3cGZLvS #TATAIPL #GTvSRH pic.twitter.com/jCvKNtWN38 — IndianPremierLeague (@IPL) April 27, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });