-
పాక్ను ఓడించగానే రాత్రంతా సంబరాలు: రషీద్ ఖాన్
వన్డే ప్రపంచకప్-2023 ఆరంభంలో ఓటములు చవిచూసిన అఫ్గనిస్తాన్ ఇంగ్లండ్ను ఓడించి సంచలన గెలుపుతో విజయాల బాట పట్టింది. ఆ తర్వాత పాకిస్తాన్ను మట్టికరిపించిన హష్మతుల్లా బృందం.. శ్రీలంక, నెదర్లాండ్స్తో మ్యాచ్లలో కూడా గెలుపు బావుటా ఎగురవేసింది.ఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీ-2025కి కూడా అర్హత సాధించింది. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అఫ్గన్ ఊహించని స్థాయిలో ప్రత్యర్థులకు షాకిచ్చి సత్తా చాటింది.అదే హైలైట్ఆస్ట్రేలియాతో మ్యాచ్లోనూ ఆఖరి వరకు అద్భుతంగా పోరాడి ఓడినా అభిమానుల హృదయాలు గెలిచింది. సంతృప్తిగానే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే, అన్నింటికంటే పాకిస్తాన్పై గెలుపు మాత్రం అఫ్గన్కు ప్రత్యేకంగా నిలిచిపోయింది.ఎందుకంటే.. అంతర్జాతీయ వన్డేల్లో అది కూడా.. వరల్డ్కప్ లాంటి ప్రధాన ఈవెంట్లో తొలిసారి పాక్పై అఫ్గనిస్తాన్ పైచేయి సాధించింది. స్టార్ బ్యాటర్లు రహ్మనుల్లా గుర్బాజ్(65), ఇబ్రహీం జద్రాన్(87), రెహమత్ షా(77) ఇన్నింగ్స్ కారణంగా తొలిసారి పాక్ను ఓడించింది. దీంతో అఫ్గన్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి.రాత్రి మొత్తం డాన్స్ చేస్తూతాజాగా ఈ విషయం గురించి గుర్తుచేసుకున్నాడు అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్. ‘‘పాకిస్తాన్ మీద గెలిచిన తర్వాత ఆ రోజు రాత్రి మొత్తం నేను డాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాను.గ్రౌండ్ నుంచి హోటల్ దాకా సంబరాలు చేసుకున్నా. అర్ధరాత్రి దాటిన తర్వాత నేను విశ్రాంతి తీసుకోలేదు. అప్పుడు నన్నెవరైనా చూసి ఉంటే.. అసలు నాకు వెన్నునొప్పి ఉందంటే నమ్మేవారే కాదు.గతంలో ఎప్పుడూ లేని విధంగాఅప్పటికీ జాగ్రత్తగా ఉండాలని మా ఫిజియో చెప్తూనే ఉన్నారు. ఏదేమైనా నేను అలా పిచ్చిపట్టినట్లుగా డాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే మా జట్టు మొత్తం ఆశ్చర్యపోయింది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ వాళ్లు నన్ను అలా చూడనేలేదు’’ అని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు.కాగా ఆ మ్యాచ్లో పది ఓవర్లు బౌల్ చేసిన రషీద్ వికెట్ తీయకపోయినా పొదుపుగా(ఎకానమీ 4.10) బౌలింగ్ చేశాడు. నాటి మ్యాచ్లో నూర్ అహ్మద్ మూడు వికెట్లతో చెలరేగి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ను దెబ్బకొట్టాడు. ఐపీఎల్తో బిజీఇదిలా ఉంటే.. రషీద్ ఖాన్ ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ఇప్పటి వరకు 102 పరుగులు చేయడంతో పాటు 8 వికెట్లు తీశాడు.చదవండి: T20 WC: ద్రవిడ్, రోహిత్కు నచ్చకపోవచ్చు.. కానీ నా సలహా ఇదే! -
Afghanistan T20 WC Squad: టీ20 వరల్డ్కప్లో పాల్గొనే ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇదే.. కెప్టెన్గా స్పిన్ మాంత్రికుడు
టీ20 వరల్డ్కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇవాళ (మే 1) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ ఎంపికయ్యాడు. 19 ఏళ్ల యువ వికెట్కీపింగ్ బ్యాటర్ మొహమ్మద్ ఇషాక్, 20 ఏళ్ల స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ నంగ్యాల్ ఖరోటిలకు వరల్డ్కప్ జట్టులో అనూహ్యంగా చోటు దక్కింది. గత వరల్డ్కప్లో ఆడని కరీం జనత్, నూర్ అహ్మద్లకు ఈసారి అవకాశం దక్కింది. ఆఫ్ఘన్ల ప్రధాన బలమైన స్పిన్ విభాగంలో రషీద్ ఖాన్తో పాటు మొహమ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్ ఉన్నారు. పేసర్ల విభాగంలో నవీన్ ఉల్ హాక్, ఫరీద్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూకీ వరల్డ్కప్ జట్టుకు ఎంపికయ్యారు. వికెట్కీపర్ల కోటాలో రహ్మానుల్లా గుర్భాజ్ జట్టులోకి రాగా.. స్పెషలిస్ట్ బ్యాటర్లుగా ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్ ఎంపికయ్యారు. ఆల్రౌండర్ల కోటాలో కరీం జనత్, గుల్బదిన్ నైబ్, హజ్రతుల్లా ఒమర్జాయ్ వరల్డ్కప్ జట్టులోకి వచ్చారు. సెదిక్ అటల్, హజ్రతుల్లా జజాయ్, సలీం సఫీ ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు.జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే వరల్డ్కప్లో ఆఫ్ఘనిస్తాన్ పోరాటం జూన్ 3న మొదలవుతుంది. ఆ రోజు గయానా వేదికగా జరిగే మ్యాచ్లో ఆఫ్ఘన్లు ఉగాండతో తలపడతారు. జూన్ 7న ఇదే వేదికపై వీరు పటిష్టమైన న్యూజిలాండ్ను ఢీకొంటారు. గ్రూప్-సిలో ఆఫ్ఘనిస్తాన్.. వెస్టిండీస్, న్యూజిలాండ్, ఉగాండ, పపువా న్యూ గినియా జట్లతో పోటీపడుతుంది. టీ20 వరల్డ్కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ ఇషాక్ (వికెట్కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, కరీం జనత్, రషీద్ ఖాన్ (కెప్టెన్), నంగ్యాల్ ఖరోటీ, ముజీబ్ ఉర్ రహ్మన్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హాక్, ఫజల్హాక్ ఫరూకీ, ఫరీద్ అహ్మద్ మాలిక్ట్రావెలింగ్ రిజర్వ్స్: సెదిక్ అటల్, హజ్రతుల్లా జజాయ్, సలీం సఫీ -
DC Vs GT: ఓడినా సంతృప్తిగానే ఉంది.. కానీ: శుబ్మన్ గిల్
ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడినా ఆఖరి వరకు తాము పట్టుదలగా పోరాడిన తీరు సంతృప్తినిచ్చిందని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ అన్నాడు. చివరి వరకు తాము గెలుస్తామనే నమ్మకంతోనే ఉన్నామని అయితే.. దురదృష్టవశాత్తూ అనుకున్న ఫలితం రాలేదని విచారం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా గుజరాత్ బుధవారం ఢిల్లీతో తలపడింది. అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ చేసింది. సొంతమైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఢిల్లీ కెప్టెన్ పంత్ 43 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్ల సాయంతో ఏకంగా 88 పరుగులతో అజేయంగా నిలిచాడు.No Rishabh Pant fan will scroll without liking this tweet. ❤️ pic.twitter.com/AwcmRcnD1u— 𝐕𝐈𝐑𝐀𝐓𝕏𝐌𝐀𝐗𝐖𝐄𝐋𝐋 (@ProfKohli18) April 24, 2024వన్డౌన్ బ్యాటర్, ఆల్రౌండర్ అక్షర్ పటేల్(43 బంతుల్లో 66) సైతం బ్యాట్ ఝులిపించాడు. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ (7 బంతుల్లో 26*) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోరు సాధించింది.కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్కు ఆదిలోనే దెబ్బ తగిలింది. ఓపెనర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ అన్రిచ్ నోర్జే బౌలింగ్లో 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.అయితే, మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(39), వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్(39 బంతుల్లో 65) ఇన్నింగ్స్ చక్కదిద్దగా.. డేవిడ్ మిల్లర్(23 బంతుల్లో 55) ధనాధన్ దంచికొట్టి టైటాన్స్ శిబిరంలో ఆశలు రేపాడు. అయితే, మిగతా వాళ్ల నుంచి అతడికి సహకారం లభించలేదు. ఈ క్రమంలో ఎనిమిదో స్థానంలో దిగిన రషీద్ ఖాన్(11 బంతుల్లో 21*) పట్టుదలగా నిలబడ్డాడు. ఆఖరి ఓవర్లో టైటాన్స్ విజయానికి 19 పరుగులు అవసరం కాగా.. మొదటి ఐదు బంతుల్లో 4,4,(0), (0), 6 రాబట్టాడు.ఈ క్రమంలో ఆఖరి బంతికి ఐదు పరుగులు అవసరం కాగా.. రషీద్ పరుగు తీయలేకపోయాడు. ఫలితంగా నాలుగు పరుగుల తేడాతో ఢిల్లీ గుజరాత్పై జయభేరి మోగించింది.So which side do you relate to after that fascinating finish- 😁 or 😕?What a game THAT in Delhi! 👏👏Scorecard ▶️ https://t.co/48M4ajbLuk#TATAIPL | #DCvGT pic.twitter.com/SuO21S3DWF— IndianPremierLeague (@IPL) April 24, 2024ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ మాట్లాడుతూ.. ‘‘ఈ మ్యాచ్లో మేము చాలా బాగా ఆడాం. అయితే, ఓడిపోవడం మాత్రం బాధగానే ఉంది. అయినా.. పట్టుదలగా ఆఖరి వరకు పోరాడినందుకు సంతృప్తిగా ఉంది.అసలు మాకు ఓటమి ఎదురవుతుందని ఏ దశలోనూ అనుకోలేదు. 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలంటే వెళ్లి హిట్టింగ్ ఆడటం ఒక్కటే మార్గం. అంతకు మించి ప్రణాళికలు ఏముంటాయి?కారణం అదేనిజానికి వాళ్లను 200- 210 పరుగులకే కట్టడి చేస్తామనుకున్నాం. అయితే, 2-3 ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇవ్వడం ప్రభావం చూపింది. ఇది చిన్న గ్రౌండ్. ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తేనే ఫలితం ఉంటుంది. బెస్ట్ ఫినిషర్ క్రీజులో ఉన్నపుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి’’ అని పేర్కొన్నాడు.చదవండి: #SRHvRCB: తెలుగులో మాట్లాడిన కమిన్స్.. ఆర్సీబీకి వార్నింగ్! మామ మనోడే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024: ట్రిస్టన్ స్టబ్స్ అద్భుత విన్యాసం.. ఇదే ఢిల్లీని గెలిపించింది..!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో నిన్న (ఏప్రిల్ 24) జరిగిన రసవత్తర సమరంలో ఢిల్లీ క్యాపిటల్స్ 4 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ విజయానికి రిషబ్ పంత్ (43 బంతుల్లో 88 నాటౌట్; 5 ఫోర్లు, 8 సిక్సర్లు, 2 క్యాచ్లు), అక్షర్ పటేల్ (43 బంతుల్లో 66; 5 ఫోర్లు, 4 సిక్సర్లు, 3 క్యాచ్లు, 3-0-28-1) ప్రత్యక్షంగా దోహదపడితే.. ట్రిస్టన్ స్టబ్స్ పరోక్షంగా ఢిల్లీ గెలుపుకు కారణమయ్యాడు. This blinder from Tristan Stubbs saved 5 runs for Delhi Capitals🔥They won the match in 4 runs!Stubbs hero for capitals..David Miller & Rashid khan, you can love to watch them any day❤️Rishabh Pant#GTvsDC #IPL2024 pic.twitter.com/UwJKCIS0Wn— Rakesh_sundarRay (@RSundarRay) April 24, 2024 ఛేదనలో గుజరాత్ లక్ష్యం దిశగా పయనిస్తుండగా (11 బంతుల్లో 32 పరుగులు).. స్టబ్స్ అద్భుత విన్యాసం చేసి సిక్సర్ వెళ్లాల్సిన బంతిని (18.2వ ఓవర్: రసిక్ సలాం బౌలింగ్లో రషీద్ ఖాన్ కొట్టిన షాట్) ఆపాడు. ఫలితంగా ఢిల్లీకి ఐదు పరుగులు సేవ్ అయ్యాయి. ఇంచుమించు ఇదే తేడాతో (4 పరుగులు) ఢిల్లీ గుజరాత్పై విజయం సాధించింది. స్టబ్స్ తన అద్భుత ప్రయత్నంతో ఢిల్లీని గెలిపించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.స్టబ్స్ సూపర్ మ్యాన్ ఎఫర్ట్ను అంతా మెచ్చుకుంటున్నారు. భారీ స్కోర్లు చేసినా చేయకపోయినా ఇలాంటి ప్రయత్నాలే మ్యాచ్లు గెలిపిస్తాయని నెటిజన్లు అంటున్నారు. ఈ మ్యాచ్లో స్టబ్స్ బ్యాట్తోనూ రాణించాడు. ఇన్నింగ్స్ చివర్లో వచ్చి (7 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 26 పరుగులు నాటౌట్) రిషబ్ పంత్తో కలిసి వీరబాదుడు బాదాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ (3-0-15-3) ఒక్కడే రాణించాడు. మోహిత్ శర్మ (4-0-73-0) ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ సైతం అద్భుతంగా పోరాడింది. సాహా (39), సాయి సుదర్శన్ (65), మిల్లర్ (55), రషీద్ ఖాన్ (21 నాటౌట్), సాయికిషోర్ (13 నాటౌట్) గుజరాత్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఆఖర్లో స్టబ్స్ అద్భుత ప్రయత్నం గుజరాత్కు మ్యాచ్ను దూరం చేసింది. రషీద్ కొట్టిన ఆ షాట్ సిక్సర్ అయ్యుంటే గుజరాత్ ఈ మ్యాచ్ తప్పక గెలిచుండేది.అంతిమంగా గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసి లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఢిల్లీ బౌలర్లలో రసిక్ సలాం (4-0-44-3), కుల్దీప్ యాదవ్ (4-0-29-2), అక్షర్ పటేల్ (3-0-28-1), నోర్జే (3-0-48-1), ముకేశ్ కుమార్ (4-0-41-1) వికెట్లు తీశారు. ఈ గెలుపుతో ఢిల్లీ ఆరో స్థానానికి జంప్ కొట్టింది. గుజరాత్ ఏడో ప్లేస్లో నిలిచింది. -
కోహ్లి, బుమ్రా, రోహిత్ కాదు.. అతడే మా జట్టుకు ఆడాలి: బట్లర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్ జోస్ బట్లర్ రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2018 సీజన్ నుంచి బట్లర్ రాజస్తాన్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2023 సీజన్లో 863 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా నిలిచాడు. అయితే ప్రస్తుత సీజన్లో తొలి మూడు మ్యాచ్ల్లో ఇబ్బంది పడిన బట్లర్.. ఆర్సీబీతో మ్యాచ్లో సెంచరీ చేసి తన ఫామ్ను తిరిగి పొందాడు. శనివారం ముల్లానాపూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో కూడా సత్తాచాటాలని బట్లర్ ఊవ్విళ్లరుతున్నాడు. అయితే ఈ మ్యాచ్కు ముందు బట్లర్ తన సహచర ఆటగాడు ట్రెంట్ బౌల్ట్త్ కలిసి "రాయల్స్ ర్యాపిడ్ ఫైర్" అనే ఇంటర్వ్యూలో పాల్గోనున్నాడు. ఈ క్రమంలో బట్లర్కు అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది. ప్రస్తుత ఐపీఎల్ క్రికెటర్లలో ఏ ఆటగాడు రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడాలని మీరు కోరుకుంటున్నారు? అని బౌల్ట్ ప్రశ్నించాడు. అందుకు బట్లర్ ఏమీ ఆలోచించకుండా వెంటనే అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పేరు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా బట్లర్ టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మలను ఎంచుకోపోవడం అందరని విస్మయానికి గురిచేస్తోంది. From his favourite wicket to one player he would like at the Royals, here’s Jos and Boulty like never before 🔥😂 pic.twitter.com/F7524zWiQZ — Rajasthan Royals (@rajasthanroyals) April 12, 2024 -
టీ20కా 'డాన్' రషీద్ ఖాన్.. రోహిత్, రుతురాజ్, గిల్ కంటే ఎక్కువగా..!
ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ పొట్టి క్రికెట్ను శాసిస్తున్నాడని అనడం కాదనలేని సత్యం. ఈ ఫార్మాట్లో టోర్నీలు ఎక్కడ జరిగినా వాలిపోయే రషీద్.. ప్రతి మ్యాచ్లో తనదైన మార్కు వేస్తుంటాడు. ఐపీఎల్లో అయితే రషీద్ ఆటతీరు వేరే లెవెల్లో ఉంటుంది. ఇక్కడ ఆడే ప్రతి మ్యాచ్లోనూ రషీద్ సత్తా చాటుతుంటాడు. బంతితో కాకపోతే బ్యాట్తో అయినా చెలరేగుతుంటాడు. ప్రతి మ్యాచ్లో తన జట్టును గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తుంటాడు. The winning celebration from Rashid Khan. 🥶pic.twitter.com/TqtvV2R1d6 — Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2024 రషీద్ ఆటతీరుకు అభిమానులతో పాటు దిగ్గజ క్రికెటర్లు సైతం ముగ్దులవుతుంటారు. ఇండియాలో రషీద్కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అభిమానులు టీమిండియా స్టార్లతో సమానంగా రషీద్ను అభిమానిస్తారు. క్రికెట్ అభిమానులు రషీద్ను ముద్దుగా టీ20కా 'డాన్' అని పిలుచుకుంటారు. Most Player of the Match awards in IPL at the age of 25: Rashid Khan - 12*. Shubman Gill - 9. Ruturaj Gaikwad - 8. Rohit Sharma - 7. pic.twitter.com/UFE6tn4tJ5 — Mufaddal Vohra (@mufaddal_vohra) April 11, 2024 ఐపీఎల్ 2024 సీజన్లో రషీద్ తాను టీ20 డాన్ను అని మరోసారి రుజువు చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్తో నిన్న (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్లో రషీద్ బంతితో పాటు బ్యాట్తోనూ రాణించాడు. బౌలింగ్లో నాలుగు ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీసిన రషీద్.. తన జట్టు కష్ట సమయంలో (చివరి ఓవర్లో 15 పరుగులు కావాల్సిన దశలో) ఉన్నప్పుడు బ్యాట్ పట్టి మెరుపు ఇన్నింగ్స్ (11 బంతుల్లో 24 నాటౌట్; 4 ఫోర్లు) ఆడాడు. The winning celebrations from the captain and the vice captain. 💥 pic.twitter.com/HKYINLqTdF — Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2024 ఫలితంగా తన జట్టు గుజరాత్.. రాజస్థాన్కు వారి సొంతగడ్డపై ఊహించని షాకిచ్చింది. బంతితో పాటు బ్యాట్తో చెలరేగి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించినందుకు గాను రషీద్ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఐపీఎల్లో రషీద్కు ఇది 12వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. 25 ఏళ్ల వయసులో ఇన్ని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు ఐపీఎల్ చరిత్రలో ఎవరూ గెలవలేదు. టీమిండియా స్టార్లు శుభ్మన్ గిల్ 9, రుతురాజ్ 8, రోహిత్ శర్మ 7 అవార్డులు మాత్రమే గెలిచారు. RASHID KHAN, THE GOAT OF T20 CRICKET. 🐐 - Gill led Gujarat beats Rajasthan for the first time in IPL 2024. An IPL epic in Jaipur! 👏pic.twitter.com/OWVZCyvtmB — Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. చివరి బంతి వరకు ఉత్కంఠరేపిన మ్యాచ్లో రాజస్థాన్పై గుజరాత్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. రషీద్ ఖాన్ చివరి బంతికి బౌండరీ బాది గుజరాత్ను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. సంజూ శాంసన్ (68 నాటౌట్), రియాన్ పరాగ్ (76) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగా.. శుభ్మన్ గిల్ (72), రషీద్, తెవాతియా (22) రాణించడంతో గుజరాత్ చివరి బంతికి విజయతీరాలకు చేరింది. RASHID KARAMATI KHAN, YOU ARE WORLD CLASS 🔥🔥🔥He traps the dangerous Jos Buttler, what a bowler ❤️#IPL2024 #tapmad #HojaoADFree pic.twitter.com/56J7XcOnkR— Farid Khan (@_FaridKhan) April 10, 2024 -
అతడు అద్భుతం.. మా గురించి అలా అనుకోవద్దు: గిల్ కౌంటర్
ఆఖరి బంతికి విజయం సాధించడం ఎల్లప్పుడూ గొప్పగానే ఉంటుందంటూ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ హర్షం వ్యక్తం చేశాడు. రషీద్ భాయ్ వల్లే తమకు రాజస్తాన్ రాయల్స్పై గెలుపు దక్కిందని వైస్ కెప్టెన్పై ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్-2024లో ఆరంభం నుంచి ఓటమి ఎరుగని రాజస్తాన్ జైత్రయాత్రకు గుజరాత్ బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. జైపూర్లో బుధవారం ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో చివరి బంతికి టైటాన్స్ జయభేరి మోగించింది. మెరుపు ఇన్నింగ్స్(11 బంతుల్లో 24*)తో గుజరాత్ శిబిరంలో ఆశలు నింపిన రషీద్ ఖాన్.. అంచనాలు నిలబెట్టుకుంటూ ఆఖరి బంతికి ఫోర్ బాది గెలుపును ఖరారు చేశాడు. రాహుల్ తెవాటియా(11 బంతుల్లో 22) సైతం విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక కష్ట సమయంలో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్(44 బంతుల్లో 72) ఆడటం టైటాన్స్కు కలిసి వచ్చింది. The elegance of the Prince 🤌#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/EzGEcv6Pk9 — JioCinema (@JioCinema) April 10, 2024 ఈ నేపథ్యంలో విజయానంతరం కామెంటేటర్ హర్షా భోగ్లేతో ముచ్చటిస్తున్న సమయంలో శుబ్మన్ గిల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గెలుపు నేపథ్యంలో గిల్ను అభినందిస్తూ.. ‘‘బాగా ఆడారు. మీకు రెండు పాయింట్లు వచ్చాయి. అయితే, నాలాంటి చాలా మంది మీరు ఆలస్యం చేస్తున్నారు కాబట్టి ఏమవుతుందోనని కంగారు పడ్డారు. కానీ మీరు బాగా ఆడారు’’ అని హర్షా భోగ్లే అన్నాడు. ఇందుకు స్పందిస్తూ.. ‘‘థాంక్యూ.. మేము ఆడుతున్నపుడు ఇంకెప్పుడూ అలా అనుకోకండి’’ అంటూ తమ జట్టు గురించి గొప్పగా చెబుతూ ఒకరకంగా హార్ష భోగ్లేకు గట్టి కౌంటరే వేశాడు శుబ్మన్ గిల్. ఇక తమ విజయం గురించి మాట్లాడుతూ.. ‘‘అప్పటికీ.. మూడు ఓవర్లలో 45 పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఒక్కో బ్యాటర్ తొమ్మిది బంతుల్లో 22 పరుగులు చేయాలనుకున్నాం. నిజంగా మ్యాచ్ ఫినిష్ చేయడం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. ఈరోజు నేను ఆపని చేయాలనుకున్నాను. అయితే, రాహల్- రషీద్ భాయ్ ఆ పని పూర్తి చేశారు. ఆఖరి బంతికి విజయం సాధించడం ఎప్పుడూ గొప్ప అనుభూతిని మిగులుస్తుంది. రషీద్ ఖాన్ లాంటి వాళ్లు జట్టులో ఉండాలని ప్రతి ఒక్క కెప్టెన్ కోరుకుంటాడనడంలో సందేహం లేదు’’ అని శుబ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు. 𝘾𝙧𝙞𝙨𝙞𝙨 𝙈𝙖𝙣 delivered yet again 😎 🎥 Relive the thrilling end to a thrilling @gujarat_titans win! Recap the match on @starsportsindia & @Jiocinema 💻 📱#TATAIPL | #RRvGT pic.twitter.com/eXDDvpToZ0 — IndianPremierLeague (@IPL) April 10, 2024 IPL 2024: రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ స్కోర్లు ►రాజస్తాన్: 196/3 (20) ►గుజరాత్: 199/7 (20) ►ఫలితం: మూడు వికెట్ల తేడాతో రాజస్తాన్పై గుజరాత్ టైటాన్స్ విజయం ► ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రషీద్ ఖాన్(ఒక వికెట్, 24 పరుగులు- నాటౌట్). చదవండి: IPL 2024: మాట్లాడలేకపోతున్నా.. అతడి వల్లే ఓటమి.. ఆ ఒక్క బంతి..! #ShubmanGill: కొరకరాని కొయ్యలా సంజూ.. అంపైర్తో గొడవపడ్డ గిల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
#Sanju: మాట్లాడలేకపోతున్నా.. అతడి వల్లే ఓటమి.. ఆ ఒక్క బంతి..!
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్కు తొలిసారి ఓటమి ఎదురైంది. వరుసగా నాలుగు మ్యాచ్లలో గెలుపొంది జోరు మీదున్న సంజూ సేనకు గుజరాత్ టైటాన్స్ అడ్డుకట్ట వేసింది. రాయల్స్ను వారి తమ సొంత మైదానంలోనే ఓడించి మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక తమ జైత్రయాత్రకు బ్రేక్ పడటంపై రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ విచారం వ్యక్తం చేశాడు. ఆఖరి బంతికి ఫలితం తారుమారైందంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఏదేమైనా గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా ఆడి మ్యాచ్ను తమ నుంచి లాగేసుకుందని పేర్కొన్నాడు. మాట్లాడలేకపోతున్నా.. అక్కడే ఓడిపోయాం ఈ మేరకు ఓటమి అనంతరం సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ చివరి బంతికి మ్యాచ్ మా చేజారింది. మ్యాచ్ ఓడిన కెప్టెన్గా ఇలాంటి సమయంలో మాట్లాడటం కష్టంగా ఉంది. భావోద్వేగాలు అదుపులోకి వస్తే గానీ నేను చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పలేను. ఏదేమైనా గుజరాత్ టైటాన్స్కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఆఖరి నిమిషం వరకు ఇరు జట్ల మధ్య విజయం ఊగిసలాడటమనేది ఈ టోర్నీకి ఉన్న ప్రత్యేకత. ఇది మా బౌలర్ల తప్పే మేము తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాల్సిన సమయం. నిజానికి నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. 180 మంచి స్కోరే అనుకున్నా. అయితే, మేము లక్కీగా 196 పరుగులు చేశాం. కచ్చితంగా అది విన్నింగ్ స్కోరే. పిచ్పై తేమ లేదు కాబట్టి మా బౌలింగ్ విభాగం పనిపూర్తి చేయాల్సింది. జైపూర్లో 197.. తేమ లేని వికెట్పై డిఫెండ్ చేయడం అంత కష్టమేమీ కాదు’’ అంటూ బౌలర్ల వైఫల్యాన్ని ఎత్తిచూపాడు. రాణించిన సంజూ, రియాన్ పరాగ్ కాగా జైపూర్లో బుధవారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(24), జోస్ బట్లర్(8) నామమాత్రపు స్కోర్లకు పరిమితం కాగా.. వన్డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. Fifty comes up for SANJU SAM5️⃣0️⃣N 💥#RRvGT #TATAIPL #IPLonJioCinema #IPLinMalayalam pic.twitter.com/Fxlr57hK6L — JioCinema (@JioCinema) April 10, 2024 మొత్తంగా 38 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 68 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఇక నాలుగో నంబర్ బ్యాటర్ రియాన్ పరాగ్ మరోసారి సుడిగాలి ఇన్నింగ్స్(48 బంతుల్లో 76)తో అదరగొట్టాడు. Caution ⚠ It's Riyan Parag demolition on display 🔥💥#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/dzKuPfTS0Q — JioCinema (@JioCinema) April 10, 2024 అంతా రషీద్ ఖాన్ వల్లే ఆఖర్లో హెట్మెయిర్ మెరుపులు(5 బంతుల్లో 13- నాటౌట్) మెరిపించగా.. రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే తడబడ్డప్పటికీ గుజరాత్ ఆఖరి బంతి వరకు పోరాడి విజయాన్ని అందుకుంది. శుబ్మన్ గిల్(72) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రషీద్ ఖాన్(11 బంతుల్లో 24- నాటౌట్) రాజస్తాన్ను గెలుపునకు దూరం చేశాడు. ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. ఏకంగా ఫోర్ బాది గుజరాత్ను విజయతీరాలకు చేర్చాడు. The elegance of the Prince 🤌#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/EzGEcv6Pk9 — JioCinema (@JioCinema) April 10, 2024 రాజస్తాన్ వర్సెస్ గుజరాత్ స్కోర్లు ►రాజస్తాన్: 196/3 (20) ►గుజరాత్: 199/7 (20) ►ఫలితం: మూడు వికెట్ల తేడాతో రాజస్తాన్పై గుజరాత్ టైటాన్స్ విజయం. 𝘾𝙧𝙞𝙨𝙞𝙨 𝙈𝙖𝙣 delivered yet again 😎 🎥 Relive the thrilling end to a thrilling @gujarat_titans win! Recap the match on @starsportsindia & @Jiocinema 💻 📱#TATAIPL | #RRvGT pic.twitter.com/eXDDvpToZ0 — IndianPremierLeague (@IPL) April 10, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: IPL 2024: కొంపముంచిన స్లో ఓవర్ రేట్.. గుజరాత్ సంచలన విజయం -
రాయల్స్కు టైటాన్స్ షాక్
197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది... చివర్లో 4 ఓవర్లలో 59 పరుగులు చేయాల్సిన దశలో గెలుపు అసాధ్యంగా అనిపించింది. కానీ తర్వాతి నాలుగు ఓవర్లలో వరుసగా 17, 7, 20, 17 పరుగులు సాధించిన టైటాన్స్ అనూహ్య విజయాన్ని అందుకుంది. అప్పటి వరకు నియంత్రణతో బౌలింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ పేలవ బౌలింగ్, వ్యూహ వైఫల్యంతో చేజేతులా మ్యాచ్ను కోల్పోయి ఈ సీజన్లో తొలి ఓటమిని ఎదుర్కొంది. జైపూర్: వరుస విజయాలతో అజేయంగా దూసుకుపోతున్న రాజస్తాన్ రాయల్స్కు బ్రేక్ పడింది. బుధవారం జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో రాయల్స్పై గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్స్లు), సామ్సన్ (38 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 199 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (44 బంతుల్లో 72; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించగా, సాయి సుదర్శన్ (29 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రషీద్ ఖాన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో టైటాన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. శతక భాగస్వామ్యం... గత మూడు మ్యాచ్లలో వైఫల్యాల తర్వాత ఈసారి యశస్వి (19 బంతుల్లో 24; 5 ఫోర్లు) కాస్త మెరుగైన ప్రదర్శన కనబర్చగా, గత మ్యాచ్లో సెంచరీ చేసిన బట్లర్ (8) విఫలమయ్యాడు. పవర్ప్లేలో రాజస్తాన్ 43 పరుగులే చేయగా... ఈ దశ నుంచి సామ్సన్, పరాగ్ భారీ భాగస్వామ్యం రాయల్స్ను పటిష్ట స్థితికి చేర్చింది. ఇద్దరూ వేగంగా పరుగులు సాధించారు. పరాగ్ 34 బంతుల్లో, సామ్సన్ 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నారు. ఎట్టకేలకు 19వ ఓవర్లో పరాగ్ను అవుట్ చేసి మోహిత్ ఈ జోడీని విడదీశాడు. అయితే ఉమేశ్ వేసిన చివరి ఓవర్లో సామ్సన్, హెట్మైర్ (13 నాటౌట్) చెరో సిక్స్ బాదడంతో మొత్తం 19 పరుగులు వచ్చాయి. గిల్ కెప్టెన్ఇన్నింగ్స్... భారీ ఛేదనలో టైటాన్స్కు సుదర్శన్, శుబ్మన్ గిల్ దూకుడైన ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. వీరిద్దరు తొలి వికెట్కు 64 పరుగులు జోడించినా... అందుకు 50 బంతులు తీసుకున్నారు. రాయల్స్ కట్టుదిట్టమైన బౌలింగ్తో వీరి పరుగుల వేగాన్ని నిరోధించింది. బౌల్ట్ తొలి 2 ఓవర్లలో 8 పరుగులే ఇవ్వగా... అవేశ్ బౌలింగ్లో 14 పరుగులు రాబట్టడంతో టైటాన్స్ స్కోరు పవర్ప్లే ముగిసే సరికి 44 పరుగులకు చేరింది. అయితే కుల్దీప్ సేన్ ఒక్కసారిగా గుజరాత్ను దెబ్బ తీశాడు. తన బౌలింగ్లో 6 పరుగుల వ్యవధిలో అతను సుదర్శన్, వేడ్ (4), మనోహర్ (1)లను వెనక్కి పంపించాడు. ఈ దశలో కెపె్టన్ గిల్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 35 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. విజయ్ శంకర్ (16) ప్రభావం చూపలేకపోగా... 28 బంతుల్లో 65 పరుగులు చేయాల్సిన స్థితిలో గిల్ వెనుదిరగడంతో టైటాన్స్ ఆశలు సన్నగిల్లాయి. అయితే కీలక సమయంలో రషీద్ ఖాన్ (11 బంతుల్లో 24 నాటౌట్; 4 ఫోర్లు), రాహుల్ తెవాటియా (11 బంతుల్లో 22; 3 ఫోర్లు) ఆట జట్టును గెలిపించింది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) వేడ్ (బి) ఉమేశ్ 24; బట్లర్ (సి) తెవాటియా (బి) రషీద్ 8; సామ్సన్ (నాటౌట్) 68; పరాగ్ (సి) శంకర్ (బి) మోహిత్ 76; హెట్మైర్ (నాటౌట్) 13; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–32, 2–42, 3–172. బౌలింగ్: ఉమేశ్ 4–0–47–1, జాన్సన్ 4–0–37–0, రషీద్ 4–0–18–1, నూర్ 4–0–43–0, మోహిత్ 4–0–51–1. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 35; గిల్ (స్టంప్డ్) సామ్సన్ (బి) చహల్ 72; వేడ్ (బి) కుల్దీప్ 4; మనోహర్ (బి) కుల్దీప్ 1; విజయ్ శంకర్ (బి) చహల్ 16; తెవాటియా (రనౌట్) 22; షారుఖ్ (ఎల్బీ) (బి) అవేశ్ 14; రషీద్ ఖాన్ (నాటౌట్) 24; నూర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–64, 2–77, 3–79, 4–111, 5–133, 6–157, 7–195. బౌలింగ్: బౌల్ట్ 2–0–8–0, అవేశ్ 4–0–48–1, మహరాజ్ 2–0–16–0, అశి్వన్ 4–0–40–0, చహల్ 4–0–43–2, కుల్దీప్ సేన్ 4–0–41–3. ఐపీఎల్లో నేడు ముంబై X బెంగళూరు వేదిక: ముంబై రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
కొంపముంచిన స్లో ఓవర్ రేట్.. రాజస్థాన్పై గుజరాత్ సంచలన విజయం
ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో ఇవాళ (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ రాజస్థాన్ రాయల్స్ కొంపముంచింది. రాయల్స్ నిర్దిష్ట సమయానికి (ఓవర్ రేట్లో) ఐదు నిమిషాలు వెనుకబడి ఉండటంతో చివరి ఓవర్లో సర్కిల్ బయట ఓ ఫీల్డర్ను తక్కువగా ఉంచాల్సి వచ్చింది. ఇదే రాజస్థాన్ ఓటమికి కారణమైంది. 6 బంతుల్లో 15 పరుగులు అవసరమైన సందర్భంలో.. సర్కిల్ బయట ఓ ఫీల్డర్ తక్కువగా ఉండటంతో గుజరాత్ బ్యాటర్లు ఫ్రీగా షాట్లు ఆడి గెలుపుకు కావాల్సిన పరుగులు రాబట్టారు. ఈ ఓవర్లో గుజరాత్ బ్యాటర్లు సర్కిల్ పై నుంచి సులువుగా షాట్లు ఆడి మూడు బౌండరీలు సాధించారు. ఇన్నింగ్స్ చివరి బంతికి రషీద్ ఖాన్ ఫోర్ కొట్టి గుజరాత్ను గెలిపించాడు. దీనికి ముందు కుల్దీప్ సేన్ 19వ ఓవర్లో 20 పరుగులిచ్చి గుజరాత్ను గెలుపు లైన్లో నిలబెట్టాడు. మ్యాచ్ ఆరంభంలో ఇదే కుల్దీప్ 10 బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి రాజస్థాన్ను మ్యాచ్లోకి తెచ్చాడు. మొత్తంగా చూస్తే స్లో ఓవర్ రేటే రాజస్థాన్ పాలిట శాపంగా మారింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్ (38 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్లో యశస్వి 24, బట్లర్ 8, హెట్మైర్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ను రాహుల్ తెవాతియా (22), రషీద్ ఖాన్ (24 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్లు ఆడి గెలిపించారు. ఈ ఇద్దరు ఆఖరి రెండు ఓవర్లలో 37 పరుగులు రాబట్టి రాజస్థాన్కు గెలుపును దూరం చేశారు. గుజరాత్ ఇన్నింగ్స్కు తొలుత సాయి సుదర్శన్ (35), శుభ్మన్ గిల్ (72) గట్టి పునాది వేశారు. గుజరాత్ ఇన్నింగ్స్లో మాథ్యూ వేడ్ 4, అభినవ్ మనోహర్ 1, విజయ్ శంకర్ 16, షారుక్ ఖాన్ 14 పరుగులు చేసి ఔటయ్యారు. కుల్దీప్ సేన్ (4-0-41-3), చహల్ (4-0-43-2) రాణించినప్పటికీ రాజస్థాన్కు ఓటమి తప్పలేదు. -
IPL 2024 GT VS PBKS: ఫిఫ్టి కొట్టిన రషీద్ ఖాన్
ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్తో నిన్న (ఏప్రిల్ 4) జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ రషీద్ ఖాన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో గుజరాత్ తరఫున 50 వికెట్లు సాధించిన తొలి బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. నిన్నటి మ్యాచ్లో జితేశ్ శర్మ వికెట్ సాధించడం ద్వారా రషీద్ ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్కు ముందు మ్యాచ్లోనే (సన్రైజర్స్తో) షమీని అధిగమించి గుజరాత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అవతరించిన రషీద్.. తాజాగా మరో మైలురాయిని తాకాడు. పంజాబ్తో మ్యాచ్లో రషీద్ 4 ఓవర్లలో 40 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. ఐపీఎల్లో గుజరాత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్లు.. రషీద్ ఖాన్-50 మొహమ్మద్ షమీ-48 మోహిత్ శర్మ-34 నూర్ అహ్మద్-17 అల్జరీ జోసఫ్-14 మ్యాచ్ విషయానికొస్తే.. శాశంక్ సింగ్ (29 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) అనూహ్య రీతిలో విరుచుకుపడటంతో గుజరాత్పై పంజాబ్ సంచలన విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్య ఛేదనలో ఈ ఇద్దరు ఆటగాళ్లు చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఆడి పంజాబ్ను గెలిపించారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శుభ్మన్ గిల్ (89 నాటౌట్) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. పంజాబ్ శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, ప్రభ్సిమ్రన్ సింగ్ (35) రాణించడంతో 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా 3 వికెట్ల తేడాతో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో గుజరాత్ను వెనుక్కునెట్టి ఐదో స్థానానికి చేరుకుంది. -
SRH Vs GT: రషీద్ ఖాన్ సూపర్ డెలివరీ.. క్లాసెన్కు ఫ్యూజ్లు ఔట్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 13 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్స్లతో 24 పరుగులు చేశాడు. అయితే తనకు వచ్చిన ఆరంభాన్ని భారీ ఇన్నింగ్స్గామలచడంలో క్లాసెన్ విఫలమయ్యాడు. గుజరాత్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అద్బుతమైన బంతితో క్లాసెన్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 14 ఓవర్లో మూడో బంతిని రషీద్ ఫ్లాట్గా సంధించాడు. బంతి టర్న్ అవుతుందని భావించిన క్లాసెన్.. ఫుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ ఫ్లాట్గా వచ్చిన బంతి క్లాసెన్ బ్యాట్కు మిస్స్ అయ్యి లెగ్ స్టంప్ను గిరాటేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు ఒక్కసారిగా సంబరాల్లో మునిగి తేలిపోయారు. కానీ క్లాసెన్ మాత్రం నిరాశతో తన బ్యాట్కు పంచ్లు ఇస్తూ మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సన్రైజర్స్ బ్యాటర్లలో అబ్దుల్ సమద్(29), అభిషేక్ శర్మ(29) పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో మొహిత్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా.. ఉమేశ్ యాదవ్, ఒమర్జాయ్, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ తలా వికెట్ సాధించారు. pic.twitter.com/J6y5BOQ5IE — Sitaraman (@Sitaraman112971) March 31, 2024 -
IPL 2024: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. షమీ రికార్డు బద్దలు
గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రషీద్ ఖాన్ రికార్డులెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో హెన్రిచ్ క్లాసెన్ను ఔట్ చేసిన రషీద్.. ఈ అరుదైన ఫీట్ను తన పేరిట లిఖించుకున్నాడు. రషీద్ ఇప్పటివరకు ఐపీఎల్లో గుజరాత్ తరపున 49 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు గుజరాత్ స్టార్ పేసర్ మహ్మద్ షమీ(48) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో షమీని రషీద్ అధిగమించాడు. కాగా ఈ ఏడాది సీజన్కు గాయం కారణంగా మహ్మద్ షమీ దూరమైన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సన్రైజర్స్ బ్యాటర్లలో అబ్దుల్ సమద్(29), అభిషేక్ శర్మ(29) పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో మొహిత్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా.. ఉమేశ్ యాదవ్, ఒమర్జాయ్, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ తలా వికెట్ సాధించారు. -
Viral Video: కళ్లు చెదిరే సిక్సర్ బాదిన రషీద్ ఖాన్
ఐర్లాండ్తో నిన్న జరిగిన రెండో టీ20 ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్లో ఇరగదీసిన రషీద్.. ఆతర్వాత బౌలింగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రషీద్ (12 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్), మొహమ్మద్ నబీ (38 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సదీఖుల్లా అటల్ (32 బంతుల్లో 35; 2 ఫోర్లు, సిక్స్) బ్యాట్తో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. పై ముగ్గురు మినహా ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో ఎవ్వరూ రాణించలేకపోయారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ 3, జాషువ లిటిల్, బ్యారీ మెక్కార్తీ తలో 2 వికెట్లు, బెంజమిన్ వైట్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్.. రషీద్ ఖాన్ (4-0-14-4), ఖరోటే (4-0-23-2), నబీ (3-0-14-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమై 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో బల్బిర్నీ (45), గ్యారెత్ డెలానీ (39) మాత్రమే రాణించారు. We have seen that before! 😄 Just @RashidKhan_19 being Rashid Khan! 🤩👏🙌#AfghanAtalan | #AFGvIRE2024 pic.twitter.com/yxRqBibMQf — Afghanistan Cricket Board (@ACBofficials) March 17, 2024 బంతిని చూడకుండానే సిక్సర్ బాదిన రషీద్.. ప్రపంచ స్థాయి బౌలర్ అయిన రషీద్ ఖాన్ అడపాదడపా బ్యాట్తోనూ ప్రతాపం చూపించడం తెలిసిందే. ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో రషీద్ మరోసారి బ్యాట్తో తన ప్రతాపాన్ని చూపించాడు. ఈ మ్యాచ్లో 18వ ఓవర్ ఆఖరి బంతికి రషీద్ బాదిన సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. బ్యారీ మెక్కార్తీ బౌలింగ్లో రషీద్ బంతిని చూడకుండానే సిక్సర్గా మలిచాడు. లెగ్సైడ్ దిశగా మెక్కార్తీ సంధించిన ఫుల్ టాస్ బంతిని రషీద్ కళ్లు మూసుకుని సిక్సర్ కొట్టాడు. రషీద్కు ఇలాంటి షాట్లు ఆడటం కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి షాట్లు చాలాసార్లు ఆడాడు. రషీద్ బాదిన ఈ సిక్సర్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో ఐర్లాండ్ తొలి మ్యాచ్లో గెలవగా.. ఆఫ్ఘనిస్తాన్ రెండో మ్యాచ్లో విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 ఇవాళ (మార్చి 18) జరుగనుంది. -
రీ ఎంట్రీలో అదరగొట్టిన రషీద్ ఖాన్.. 14 ఏళ్ల రికార్డు బద్దలు
అఫ్గానిస్తాన్ టీ20 కెప్టెన్ రషీద్ ఖాన్ తన రీ ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. గాయం కారణంగా గత కొంత కాలంగా ఆటకు దూరంగా ఉన్న రషీద్.. శుక్రవారం ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20తో తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో తన రీ ఎంట్రీ మ్యాచ్లో రషీద్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్లో 3 వికెట్లతో రషీద్ సత్తాచాటాడు. తన 4 ఓవర్ల కోటా స్పెల్లో 19 పరుగులిచ్చి రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు. పాల్ స్టిర్లింంగ్, క్యాంప్హెర్ వంటి కీలక వికెట్లను ఖాన్ పడగొట్టాడు. ఈ క్రమంలో రషీద్ ఖాన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన అఫ్గానిస్తాన్ కెప్టెన్గా రషీద్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆ జట్టు మాజీ కెప్టెన్ నవ్రోజ్ మంగల్ పేరిట ఉండేది. 2014 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో ఐర్లాండ్పై మంగల్ 4 ఓవర్లలో 23 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. తాజా మ్యాచ్తో మంగల్ ఆల్టైమ్ రికార్డును రషీద్ ఖాన్ బ్రేక్ చేశాడు. కాగా ఈ మ్యాచ్లో అఫ్గానిస్తాన్ అనుహ్యంగా 38 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కాగా ఐపీఎల్-2024 సీజన్కు ముందు రషీద్ ఫుల్ ఫిట్నెస్ సాధించడం గుజరాత్ టైటాన్స్కు కలిసొచ్చే అంశం. The Magician King @rashidkhan_19 is Back https://t.co/FkSsk7O91b — Baaz Khan (@Im_BaazKhan) March 15, 2024 -
అఫ్గానిస్తాన్ను చిత్తు చేసిన ఐర్లాండ్..
అఫ్గానిస్తాన్ జట్టుకు పసికూన ఐర్లాండ్ ఊహించని షాకిచ్చింది. షార్జా వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన తొలి టీ20లో 38 పరుగుల తేడాతో ఐర్లాండ్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటర్లలో హ్యారీ టెక్టర్(56) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు బల్బర్నీ(22), స్టిర్లింగ్(25) పరుగులతో రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో కెప్టెన్ రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. నంగేయాలియా ఖరోటే 2వికెట్లు, ఓమర్జాయ్ చెరో వికెట్ సాధించారు. చెలరేగిన బెంజిమిన్ వైట్.. అనంతరం 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 111 పరుగులకే కుప్పకూలింది. దీంతో 38 పరుగుల తేడాతో అఫ్గాన్ ఓటమి పాలైంది. ఐర్లాండ్ స్పిన్నర్ బెంజిమిన్ వైట్ 4 వికెట్లతో అఫ్గాన్ను దెబ్బతీశాడు. అతడితో పాటు లిటిల్ 3 వికెట్లు, మెక్గ్రాతీ రెండు, అడైర్ వికెట్ సాధించారు. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో మహ్మద్ ఇషాఖ్(32) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 మార్చి 17న జరగనుంది. చదవండి: CSK: సీఎస్కేకు బిగ్ షాక్! డెత్ ఓవర్ల స్పెషలిస్టు అవుట్! -
గుజరాత్ టైటాన్స్కు గుడ్న్యూస్.. స్టార్ వచ్చేస్తున్నాడు!
IPL 2024- Gujarat Titans: అఫ్గనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఈ విషయాన్ని రషీద్ ఖాన్ ధ్రువీకరించాడు. కాగా అఫ్గన్ లెగ్ స్పిన్నర్ భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023 తర్వాత వెన్నునొప్పికి సర్జరీ చేయించుకున్నాడు. అప్పటి నుంచి అంతర్జాతీయ, లీగ్ క్రికెట్కు దూరమయ్యాడు. ఈ క్రమంలో మార్చి 15 నుంచి మొదలుకానున్న అఫ్గనిస్తాన్- ఐర్లాండ్ టీ20 సిరీస్తో తాను రీఎంట్రీ ఇస్తున్నట్లు రషీద్ ఖాన్ వెల్లడించాడు. ‘‘రానున్న సిరీస్లో జాతీయ జట్టు తరఫున మళ్లీ బరిలోకి దిగాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. ఇందుకు సంబంధించిన శిక్షణ కూడా మొదలుపెట్టాను. అన్నీ సజావుగా సాగుతున్నాయి. నిజానికి సర్జరీ కారణంగా గడిచిన మూడు నెలల కాలం కష్టంగా తోచింది. ఏడెనిమిది నెలలుగా వెన్నునొప్పి బాధపెడుతోంది. వరల్డ్కప్ టోర్నీకి ముందుగానే సర్జరీకి వెళ్తే బాగుంటుందని డాక్టర్లు సూచించారు. అయితే, ఐసీసీ మెగా ఈవెంట్లో దేశం తరఫున ఆడాలనే నేను నిర్ణయించుకున్నాను. దేవుడి దయ వల్ల ఇప్పుడంతా బాగుంది. రానున్న రోజులు మరింత గొప్పగా ఉంటాయని భావిస్తున్నాను’’ అని రషీద్ ఖాన్ అఫ్గన్ క్రికెట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అదే విధంగా.. టీ20 వరల్డ్కప్-2024కు ముందు ఐపీఎల్ ఆడటం కూడా తమకు కలిసి వస్తుందని రషీద్ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశాడు. ఐపీఎల్కాగా రషీద్ ఖాన్ రీఎంట్రీ ఐపీఎల్ ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్కు కూడా శుభవార్తగా పరిణమించింది. ఇప్పటికే కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టును వీడి ముంబై ఇండియన్స్ సారథి కాగా.. మహ్మద్ షమీ తాజా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో రషీద్ ఆగమనం టైటాన్స్కు ఊరట కలిగించనుంది. ఇక గత సీజన్లో రషీద్ ఖాన్ 17 మ్యాచ్లు ఆడి 27 వికెట్లు తీశాడు. తద్వారా అత్యధిక వికెట్ టేకర్ల మూడో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే.. మార్చి 15- 18 వరకు అఫ్గన్- ఐర్లాండ్ మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. ఇక ఐపీఎల్-2024లో గుజరాత్ మార్చి 24న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. చదవండి: ధోని, యువీ కాదు..! టీమిండియాలో గ్రేటెస్ట్ సిక్స్ హిట్టర్ అతడే: ద్రవిడ్ -
IPL 2024: కోహ్లి, గిల్ కాదు!.. ఈసారి ఆరెంజ్ క్యాప్ అతడిదే!
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్-2024 సందడి మొదలుకానుంది. చెన్నై వేదికగా మార్చి 22న ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. తాజా ఎడిషన్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పది ఫ్రాంఛైజీల ఆటగాళ్లందరూ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నారు. జాతీయ జట్టు షెడ్యూల్తో బిజీగా ఉన్న వాళ్లు మినహా మిగతా వాళ్లంతా ఐపీఎల్ జట్ల శిక్షణా శిబిరంలో చేరి.. ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. ఇక ఎప్పటిలాగే.. ఈ సీజన్ ఆరంభానికి ముందు కూడా.. ఈసారి ఆరెంజ్ క్యాప్ విజేత ఎవరు? పర్పుల్ క్యాప్ గెలిచేది ఎవరు? చాంపియన్గా నిలిచేది ఏ జట్టు? అంటూ అభిమానులు తమ అంచనాలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్కు ఇలాంటి ప్రశ్నలు ఎదురుకాగా.. ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. ఓ యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చహల్ మాట్లాడుతూ.. ‘‘ఈసారి ఆరెంజ్ క్యాప్ను యశస్వి జైస్వాల్ లేదంటే జోస్ బట్లర్ గెలుస్తాడు. ఇక పర్పుల్ క్యాప్ విషయానికొస్తే.. ఈసారి అత్యధిక వికెట్లు తీసేది నేనే.. నా తర్వాతి స్థానంలో రషీద్ ఖాన్ ఉంటాడు’’ అని పేర్కొన్నాడు. ఈ మేరకు అత్యధిక పరుగుల వీరుడిగా టీమిండియా స్టార్ ఓపెనర్, రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరును చెప్పాడు చహల్. యజువేంద్ర చహల్- బట్లర్, జైస్వాల్(PC: RR/IPL) అదే విధంగా.. రాయల్స్లో మరో సహచర ఆటగాడు, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్కు కూడా ఆరెంజ్ క్యాప్ గెలిచే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డాడు. అయితే, అత్యధిక వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ మాత్రం తానే గెలుస్తానని చహల్ ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. కాగా ఐపీఎల్లో విజయవంతమైన బౌలర్గా యజువేంద్ర చహల్ పేరొందాడు. చాలా ఏళ్లపాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన చహల్.. రెండేళ్ల క్రితం రాజస్తాన్ రాయల్స్కు మారాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2023లో 14 మ్యాచ్లలో కలిపి 21 వికెట్లు తీశాడీ మణికట్టు స్పిన్నర్. తద్వారా క్యాష్ రిచ్ లీగ్లో అత్యధిక వికెట్లు(187) తీసిన బౌలర్గా చరిత్ర సృష్టించాడు. అయితే, టీమిండియాలో మాత్రం చహల్కు అవకాశాలు సన్నగిల్లాయి. ఇటీవలే సెంట్రల్ కాంట్రాక్టు కూడా కోల్పోయాడతడు! ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్ స్టార్ శుబ్మన్ గిల్ 890 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఆర్సీబీ స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ 730, సీఎస్కే ఓపెనర్ డెవాన్ కాన్వే 672, ఆర్సీబీ ముఖచిత్రం విరాట్ కోహ్లి 639 పరుగులతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. చదవండి: #DhanashreeVerma: పదే పదే ఇలా ఎందుకు? చహల్ భార్య ధనశ్రీ వర్మ ఫొటోపై రచ్చ -
India Vs Afghanistan T20I: టీమిండియాతో తొలి టీ20.. ఆఫ్ఘనిస్తాన్కు భారీ షాక్
టీమిండియాతో టీ20 సిరీస్కు ముందు ఆఫ్ఘనిస్తాన్కు భారీ షాక్ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆ జట్టు స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్ భారత్తో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ సిరీస్ కోసం రషీద్ జట్టుతో పాటు భారత్కు విచ్చేసినప్పటికీ.. గాయం పూర్తిగా తగ్గకపోవడంతో సెలెక్టర్లు అతన్ని తిరిగి ఇంటికి పంపించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇదే గాయం కారణంగా రషీద్ బిగ్బాష్ లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్లకు కూడా దూరంగా ఉన్నాడు. రషీద్ భారత్తో టీ20 సిరీస్ మొత్తానికి దూరమైనట్లు ఆ జట్టు తాత్కాలిక కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ ప్రకటించాడు. కాగా, రషీద్ వన్డే వరల్డ్కప్ అనంతరం వెన్నెముక సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, భారత్-ఆఫ్ఘనిస్తాన్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఇవాల్టి నుంచి ప్రారంభంకానుంది. మొహాలీ వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ అనంతరం జనవరి 14న రెండో టీ20 (ఇండోర్), జనవరి 17న (బెంగళూరు) మూడో టీ20 జరుగనున్నాయి. తొలి టీ20కి కోహ్లి దూరం.. చాలాకాలంగా టీ20ల్లో తన బ్యాటింగ్ చూడాలని వెయ్యి కళ్లతో ఎదురుచూసిన అభిమానులకు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఊహించని షాక్ ఇచ్చాడు. వ్యక్తిగత కారణాల చేత అతను ఆఫ్ఘనిస్తాన్తో తొలి టీ20కి దూరమయ్యాడు. కోహ్లి రెండో టీ20 నుంచి తిరిగి అందుబాటులోకి వస్తాడని భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రకటించాడు. -
ప్రఖ్యాత హిందుస్తానీ గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ కన్నుమూత
కోల్కతా: ప్రముఖ హిందుస్తానీ గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ (55)మంగళవారం కోల్కతా లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్ను మూశారు. 2019 నుంచి ప్రొస్టేట్ క్యాన్సర్తో ఆయన బాధపడుతు న్నారు. గత నెలలో గుండెపోటుకు గురైన ఖాన్ అప్పటి నుంచి ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి ఖాన్ మంగళవారం మధ్యాహ్నం 3.45కు తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రాంపూర్–సహస్వాన్ ఘరానా సంప్రదాయానికి చెందిన ఖాన్ ఘరానా వ్యవస్థాపకుడు ఇనాయత్ హుస్సేన్ ఖాన్ ముని మనవడు. యూపీలోని బదౌన్కు చెందిన ఖాన్ కుటుంబం ఆయనకు పదేళ్ల వయస్సులో 1980లో కోల్కతాకు వలస వచ్చింది. సీఎం మమతా బెనర్జీ ఆస్పత్రికి వెళ్లి ఖాన్ కుటుంబసభ్యులను ఓదార్చారు. రషీద్ ఖాన్ మృతి పట్ల రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఇలా ఉండగా, ఖాన్ 11 ఏళ్ల వయస్సులోనే 1994లో మొట్టమొదటి కచేరీలో పాల్గొని, సంగీత కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాంపూర్ సహస్వాన్ సంప్రదాయ గానా నికి చిట్ట చివరి దిగ్గజంగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ‘విలంబిత్ ఖయాల్’ శైలిలో మూడు దశాబ్దాలుగా కోట్లాది మంది సంగీత ప్రియులను ఆయన గాత్రం అలరిస్తోంది. మై నేమ్ ఈజ్ ఖాన్, జబ్ వుయ్ మెట్, ఇసాక్, మంటో, మౌసమ్ తదితర చిత్రాల్లో నేపథ్య గాయకుడిగా ఉన్నారు. ఆయన్ను కేంద్రం పద్మ శ్రీ, పద్మ భూషణ్ అవార్డులతో గౌరవించింది. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్(55) కన్నుమూశారు. గతనెల కోల్కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రొస్టేట్ క్యాన్సర్కు చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని బదౌన్లో జన్మించిన రషీద్ ఖాన్ జబ్ వి మెట్ అనే బాలీవుడ్ చిత్రంలోని ఆవోగే జబ్ తుమ్ అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా.. కళారంగంలో ఆయన సేవలకు గానూ భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం, 2006లో సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. 2022లో పద్మభూషణ్ అవార్డ్ ప్రదానం చేసింది. -
టీమిండియాతో సిరీస్కు అఫ్గన్ జట్టు ప్రకటన: ప్లేయర్గా రషీద్.. కెప్టెన్?
Ind vs Afg T20 Serie- Rashid Khan returns in squad but might not play: టీమిండియాతో టీ20 సిరీస్కు అఫ్గనిస్తాన్ తమ జట్టును ప్రకటించింది. భారత్ వేదికగా జరుగనున్న సిరీస్కు 19 మంది సభ్యులతో కూడిన టీమ్ను ఎంపిక చేసింది. వెన్నునొప్పితో బాధపడుతున్న కెప్టెన్, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్కు కూడా ఈ జట్టులో చోటిచ్చినట్లు వెల్లడించింది. కెప్టెన్గా మళ్లీ అతడే అయితే, భారత జట్టుతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో.. అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం లేదని పేర్కొంది. రషీద్ ఖాన్ స్థానంలో ఇబ్రహీం జద్రాన్ మరోసారి కెప్టెన్గా వ్యవహరించనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు శనివారం ప్రకటన విడుదల చేసింది. కాగా జనవరి 11 నుంచి టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్ల సిరీస్ ఆరంభం కానుంది. కాగా గాయం కారణంగా రషీద్ ఖాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో టీ20 సిరీస్కు దూరం కాగా.. అతడి స్థానంలో స్టార్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ సారథ్య బాధ్యతలు నిర్వహించాడు. ఇక ఈ 22 ఏళ్ల రైట్హ్యాండ్ బ్యాటర్ కెప్టెన్సీలో యూఏఈ సిరీస్ను పర్యాటక అఫ్గనిస్తాన్ 2-1తో అఫ్గన్ గెలుచుకుంది. సర్జరీ చేయించుకున్న రషీద్ ఖాన్.. అఫ్గన్కు ఇదే తొలిసారి ఇక వెన్నునొప్పికి సర్జరీ చేయించుకున్న రషీద్ ఖాన్.. ఇంకా పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించలేదు. కాబట్టి.. జట్టుకు ఎంపికైనప్పటికీ అతడు టీమిండియాతో మ్యాచ్లు ఆడే అవకాశం లేదు. ఇదిలా ఉంటే.. టీ20 సిరీస్ కోసం అఫ్గనిస్తాన్ భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో పటిష్ట, నంబర్ 1 టీమిండియాతో పోటీపడటం తమకు సంతోషాన్నిస్తోందన్న అఫ్గన్ బోర్డు.. మెరుగైన ప్రదర్శనతో అండర్ డాగ్స్ అనే ముద్ర చెరిపేసుకుంటామని పేర్కొంది. టీమిండియాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు అఫ్గనిస్తాన్ జట్టు ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్. చదవండి: శతక్కొట్టిన పుజారా: ఇంగ్లండ్తో సిరీస్కు ముందు సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్ -
అఫ్గానిస్తాన్ కెప్టెన్గా స్టార్ ఓపెనర్..
యూఏఈతో జరగనున్న టీ20 సిరీస్కు 18 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్కు అఫ్గాన్ రెగ్యూలర్ కెప్టెన్, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో అతడి స్ధానంలో యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్కు జట్టు పగ్గాలను అఫ్గాన్ సెలక్టర్లు అప్పగించారు. అదే విధంగా ఈ జట్టులో పేసర్లు ఫజల్హక్ ఫరూకీ, నవీన్ ఉల్ హక్కు చోటు దక్కింది. కాగా వీరిద్దరిపై అఫ్గాన్ క్రికెట్ బోర్డు విదేశీ లీగ్లలో రెండేళ్ల పాటు ఆడకూడకుండా నిషేధం విధించింది. అయితే వీరు అఫ్గాన్ సెంట్రల్ కాంట్రాక్టులను వదులకోనున్నారని వార్తలు వినిపించాయి. కానీ వీరు ఫ్రాంచైజీ క్రికెట్ కంటే జాతీయ జట్టు తరపున ఆడేందుకు మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే యూఏఈ సిరీస్కు సెలక్టర్లు వీరిద్దరిని ఎంపిక చేశారు. డిసెంబర్ 29 నుంచి షార్జా వేదికగా జరగనున్న తొలి టీ20తో మూడు మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కానుంది. మొత్తం మూడు మ్యాచ్లు షార్జా వేదికగానే జరగనున్నాయి. అఫ్గానిస్తాన్ టీ20 జట్టు: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), మహ్మద్ ఇషాక్, హజ్రతుల్లా జజాయ్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, దర్విష్ రసూలీ, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మౌల్లా ఒమర్జాయ్, ఎఫ్ షరఫుద్దీనాల్, ఎఫ్. అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీమ్ మరియు కైస్ అహ్మద్. చదవండి: IND vs SA: గెలుపు జోష్లో ఉన్న సౌతాఫ్రికాకు బిగ్ షాక్.. -
IPL 2024: గుజరాత్ కొత్త కెప్టెన్ ఎవరనుకుంటున్నారు..?
2024 ఐపీఎల్ సీజన్కు ముందు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్కు వలస వెళ్లాడు. ఈ నేపథ్యంలో గుజరాత్ కొత్త కెప్టెన్ ఎవరనే అంశంపై క్రికెట్ అభిమానుల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. గుజరాత్ నయా కెప్టెన్ శుభ్మన్ గిల్ అని కొందరంటుంటే, మరికొందరేమో కేన్ విలియమ్సన్ పేరును సూచిస్తున్నారు. డేవిడ్ మిల్లర్, మొహమ్మద్ షమీ, రషీద్ ఖాన్ పేర్లు సైతం తెరపైకి వస్తున్నాయి. ఇన్ని ఆప్షన్స్ మధ్య టైటాన్స్ యాజమాన్యం కెప్టెన్గా ఎవరిని ఎంపిక చేస్తుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే కెప్టెన్సీ రేసులో శుభ్మన్ గిల్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే కేన్ విలియమ్సన్ లాంటి విజయవంతమైన సారధిని జట్టులో ఉంచుకుని టైటాన్స్ యాజమాన్యం గిల్కు సారధ్య బాధ్యతలు అప్పజెబుతుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. వీరిద్దరిని కాదని షమీ లేదా రషీద్ ఖాన్కు పగ్గాలు అప్పచెబుతారా అంటే పలు సున్నితమైన అంశాలు అడ్డురావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభిమానులు, విశ్లేషకులు ఎన్ని అనుకున్నా టైటాన్స్ యాజమాన్యానికి కెప్టెన్సీ అంశంపై పూర్తి క్లారిటీ ఉండవచ్చు. వారి నుంచి అధికారిక ప్రకటన రావడమే తరువాయి. గుజరాత్ కొత్త కెప్టెన్గా ఎవరైతే బాగుంటుందో మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలపండి. కాగా, 2024 సీజన్కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ (నిలుపుకోవడం), రిలీజ్ (వేలానికి వదిలేయడం) ప్రక్రియ నిన్నటితో (నవంబర్ 26) ముగిసిన విషయం తెలిసిందే. అన్ని ఫ్రాంచైజీలు ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించాయి. దుబాయ్ వేదికగా ఈ ఏడాది డిసెంబర్ 19న జరిగే వేలం తర్వాత అన్ని ఫ్రాంచైజీలకు తుది రూపం వస్తుంది. ప్రస్తుతానికి గుజరాత్ ఫ్రాంచైజీ పరిస్థితి ఇలా ఉంది.. ఆటగాళ్ల సంఖ్య-17 (11 మంది దేశీయ ఆటగాళ్లు, 6 మంది విదేశీ ప్లేయర్స్), వెచ్చించిన మొత్తం (76.85 కోట్లు), పర్స్లో మిగిలిన మొత్తం (23.15 కోట్లు), ఇంకా ఎంతమందికి తీసుకోవచ్చు (8), ఇందులో విదేశీ ఆటగాళ్లు (2). రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే.. యశ్ దయాల్ కేఎస్ భరత్ శివమ్ మావి ఉర్విల్ పటేల్ ప్రదీప్ సాంగ్వాన్ ఓడియన్ స్మిత్ అల్జరీ జోసఫ్ దసున్ షనక నిలబెట్టుకున్న ఆటగాళ్లు వీరే.. డేవిడ్ మిల్లర్ శుభ్మన్ గిల్ మాథ్యూ వేడ్ వృద్ధిమాన్ సాహా కేన్ విలియమ్సన్ అభినవ్ మనోహర్ సాయి సుదర్శన్ దర్శన్ నల్కండే విజయ్ శంకర్ జయంత్ యాదవ్ రాహుల్ తెవాటియా మొహమ్మద్ షమీ నూర్ అహ్మద్ సాయికిషోర్ రషీద్ ఖాన్ జాషువ లిటిల్ మోహిత్ శర్మ -
గుజరాత్ టైటాన్స్కు బిగ్ షాక్.. రషీద్ ఖాన్కు సర్జరీ!? ఐపీఎల్కు దూరం
బిగ్ బాష్ లీగ్-2023 నుంచి అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తప్పుకున్నాడు. గత కొంత కాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్న రషీద్.. త్వరలో శస్త్రచికిత్స చేయించుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బిగ్ బాష్ లీగ్ నుంచి రషీద్ వైదొలిగినట్లు సమాచారం. ఈ విషయాన్ని అడిలైడ్ స్ట్రైకర్స్ ప్రాంఛైజీ దృవీకరించింది. గత కొన్ని సీజన్ల నుంచి అడిలైడ్ స్ట్రైకర్స్కు రషీద్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా రషీద్ ఒక వేళ తన వెన్నెముకకు సర్జరీ చేసుకుంటే కచ్చితంగా క్రికెట్కు దాదాపు ఐదు నంచి ఆరు నెలల పాటు దూరం కానున్నాడు. ఈ క్రమంలో భారత్-అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్కు, ఐపీఎల్-2024 సీజన్కు దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరపున రషీద్ ఆడుతున్నాడు. వచ్చే ఏడాది వెస్టిండీస్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్కప్ సమయానికి పూర్తి ఫిట్నెస్తో ఉండాలని రషీద్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సర్జరీ చేసుకోవాలని రషీద్ నిర్ణయించకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీ20ల్లో అఫ్గానిస్తాన్ కెప్టెన్గా రషీద్ ఖాన్ వ్యవహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్కప్-2023లోనూ రషీద్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్, పాకిస్తాన్ వంటి వరల్డ్క్లాస్ జట్లను ఓడించడంలో రషీద్ కీలక పాత్ర పోషించాడు. చదవండి: విండీస్ టీ20 ప్రపంచకప్ వీరుడికి బిగ్ షాకిచ్చిన ఐసీసీ..
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement