vijayakanth
-
విజయ్ అభిమానం.. విజయకాంత్ ఇంట్లో గోట్ టీమ్
కోలీవుడ్ స్టార్ విజయ్- దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా (ది గోట్) ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్’. తాజాగా ఈ సినిమాకు చెందిన యూనిట్ దివంగత నటుడు విజయకాంత్ ఇంటికి చేరుకున్నారు. అక్కడ వారి కుటుంబసభ్యులతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట షేర్ చేశారు. త్వరలో సినిమా విడుదల కానున్నడంతో చిత్ర యూనిట్ వేగంగా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. తాజాగా విడుదలైన ట్రైలర్ అంతగా మెప్పించలేదనే విమర్శలు వస్తున్నప్పటికీ మార్కెట్ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుంది.‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్’ సినిమాలో ఏఐ సాయంతో దివంగత నటుడు విజయకాంత్ను వెంకట్ ప్రభు ఈ చిత్రంలో చూపించబోతున్నారు. సెప్టెంబరు 5న సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా విజయకాంత్కు వెంకట్ ప్రభు, విజయ్ నివాళులర్పించారు. డీఎండీకే ప్రధాన కార్యదర్శి, విజయకాంత్ సతీమణి ప్రేమలతతో వారు కొంతసమయం పాటు మాట్లాడారు.విజయ్, అయన తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ అంటే విజయకాంత్కు చాలా ఇష్టం. అదేవిధంగా విజయకాంత్ అంటే కూడా విజయ్కు చాలా గౌరవం. అలా ఇద్దరి మధ్య మంచి బంధం ఉంది. గతంలో వెట్రి, సెంతూరపండి తదితర చిత్రాల్లో వారిద్దరూ కలిసి నటించారు. విజయకాంత్ మరణం తర్వాత తన రూపాన్ని సినిమాలో వినియోగించుకోవాలని నిర్ణయించుకున్న డైరెక్టర్. ఈమేరకు పలుమార్లు ప్రేమలతను విజ్ఞప్తి చేసి అనుమతి పొందారు. అలా గోట్ సినిమాలో ఏఐ టెక్నాలజీ సాయంతో విజయకాంత్ను వెండితెరపై చూపించబోతున్నారు. ఈ చిత్రంలో విజయ్ రెండు పాత్రలలో కనిపించనున్నాడు. ఆయన్ను కుర్రాడిగా చూపించేందుకు 'డీ- ఏజింగ్' టెక్నాలజీ వినియోగించారు. సెప్టెంబరు 5న 6వేల థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. చెన్నైలో ప్రతి థియేటర్లో మొదటిరోజు ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్’ సినిమానే ఉండేలా ప్లాన్ చేశారు. మీనాక్షీ చౌదరి, స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా వంటి స్టార్స్ ఈ సినిమాలో నటించారు. -
లారెన్స్పై విజయ కాంత్ ఫ్యాన్స్ ఫైర్
దివంగత ప్రముఖ నటుడు విజయ కాంత్ వారసుడు షణ్ముఖ పాండియన్ తన తండ్రి బాటలోనే నటించడానికి సిద్ధమయ్యారు. అలా ఆయన సహాబ్దం చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయ్యారు. కాగా తాజాగా అన్బు దర్శకత్వంలో పడై తలైవన్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. విజయకాంత్ మరణానంతరం షణ్ముఖ పాండియన్ హీరోగా నటిస్తున్న చిత్రంలో తాను కూడా ఒక పాత్రలో నటిస్తానని రాఘవ లారెన్స్ మాట ఇచ్చారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఆయన ఈ చిత్రంలో నటించడం లేదు. దీంతో రాఘవ లారెన్స్ గురించి సామాజిక మాధ్యమాల్లో పలు రకాలుగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. విజయ్ కాంత్ ఫ్యాన్స్ అయితే లారెన్స్ను ట్రోల్ చేయడం కూడా ప్రారంభించారు. దీంతో చిత్ర దర్శకుడు అన్బు ఇలా క్లారిటీ ఇచ్చారు. విజయ కాంత్ కుమారుడు షణ్ముగ పాండియన్ హీరోగా నటిస్తున్న చిత్రంలో లారెన్స్ నటించడం లేదని తెలిపారు. తమ సినిమాలో ఒక పాత్రను పోషిస్తానని రాఘవ లారెన్స్ చెప్పిన విషయం తెలిసిందే.. దీంతో షణ్ముఖ పాండియన్తో పాటు తాను కూడా రాఘవ లారెన్స్ను వెళ్లి కలిశామని గుర్తుచేశారు. ఆ సమయంలో ఆయనకు ధన్యవాదాలు కూడా తెలిపామని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయనకు కథను చెప్పగా బాగుందని మెచ్చుకుంటూ తాను నటిస్తానని లారెన్స్ మాట కూడా ఇచ్చారు. ఆ విధంగా చిత్ర షూటింగ్ ప్రారంభం అయిన తరుణంలో తనకు చిన్న సందేహం కలిగిందని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో నటుడు రాఘవ లారెన్స్ పాత్ర బలంగా ఉన్నట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయాన్ని లారెన్స్కు కూడా తెలిపినట్లు అన్బు అన్నారు. తన నిర్ణయాన్ని రాఘవ లారెన్స్ కూడా స్వాగతించారని చెప్పారు. ఈ సనిమాలో లారెన్స్ నటించిక పోయిన విడుదల సమయంలో ప్రమోషన్ కార్య క్రమాలకు తన చేతనైన సహాయం చేస్తానని మాట ఇచ్చారన్నారు. కాగా రాఘవ లారెన్స్ నటించాల్సిన పాత్రలో దివంగత నటుడు విజయ్కాంత్ను ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో నటింపజేస్తున్నట్లు సమాచారం. -
నాతో సినిమా చేసేందుకు విజయకాంత్ ఒప్పుకోలేదు: ఊర్వశి
రాజకీయాల్లో రాణించిన సినిమా స్టార్లు చాలామందే ఉన్నారు. అందులో విజయకాంత్ ఒకరు. రాజకీయాల్లో కరుప్పు ఎంజీఆర్గా, సినీరంగంలో కెప్టెన్గా క్రేజ్ అందుకున్నాడు విజయకాంత్. హీరోగా రోజుకు మూడు షిఫ్టులు పని చేసేవాడు. ఎంతలా అంటే 1984లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదలయ్యాయి. ఎంతోమంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఆయన గతేడాది డిసెంబర్లో అనారోగ్యంతో కన్నుమూశారు. నన్ను ప్రేమగా పిలిచేవారు తాజాగా సీనియర్ నటి ఊర్వశి ఆయన్ను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనైంది. ఆయన తనతో పని చేయడానికి నిరాకరించారంటూ ఇంటర్వ్యూలో ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకుంది. 'నేను చిన్నగా ఉన్నప్పుడు విజయకాంత్ సినిమాల్లో నటించాను. అప్పుడు ఆయన నన్ను తంగాచ్చి (చెల్లి) అని పిలిచేవారు. తర్వాత నేను హీరోయిన్గానూ సినిమాలు చేశాను. నాతో సినిమా చేయనన్నారు అలా ఓసారి విజయకాంత్ సినిమాలో నన్ను హీరోయిన్గా అనుకున్నారు. అందుకాయన ఒప్పుకోలేదు. నా పక్కన నటించేందుకు ఇష్టపడలేదు. చెల్లి అని పిలిచాక తనకు జంటగా ఎలా నటించగలను అన్నారు. అంతేకాదు, ఆ మూవీలో హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి. అందుకోసమే నా పక్కన నటించలేదు' అని ఊర్వశి చెప్పుకొచ్చింది. చదవండి: నాని 'గ్యాంగ్ లీడర్' హీరోయిన్ అలాంటి సినిమా చేసిందా.. 20 నిమిషాల సీన్స్ కట్ -
విజయ్కాంత్ కోసం ఆ పని చేయనున్న లారెన్స్!
కెప్టెన్ విజయ్కాంత్ ఇక లేరన్న విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 28న కన్నుమూశారు. ఆయన మరణవార్త విని సినీ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. కొందరు సెలబ్రిటీలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి కంటతడి పెట్టుకోగా మరికొందరు ఆయన సమాధి వద్ద నివాళులు అర్పిస్తూ ఎమోషనల్ అయ్యారు. హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ కొద్ది రోజుల క్రితమే తన తల్లితో కలిసి విజయ్కాంత్ సమాధిని సందర్శించి నివాళులు అర్పించాడు. అతడి సినిమాలో చేస్తా ఆ సమయంలో కెప్టెన్ తనయుడు షణ్ముగ పాండియన్ కెరీర్ బాధ్యతలు నువ్వే తీసుకోవాలని ఇంటిసభ్యులు రాఘవను కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం నాడు రాఘవ కీలక ప్రకటన చేశాడు. 'షణ్ముగ పాండియన్ నెక్స్ట్ సినిమాలో అతిథి పాత్రలో నటిస్తాను. వీలైతే దర్శకులు మల్టీస్టారర్ కాన్సెప్ట్తో రండి. అప్పుడు ఇద్దరం ప్రధాన పాత్రల్లో నటించే వీలుంటుంది. అలాగే కెప్టెన్ రెండో కుమారుడు విజయ ప్రభాకరన్ రాజకీయాల్లో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని వీడియో రిలీజ్ చేశాడు. విజయ్కాంత్ మీద ఉన్న ప్రేమ, గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్(ట్విటర్)లో వెల్లడించాడు. అలా తెలుగువారికీ పరిచయం నల్ల ఎంజీఆర్, పురట్చి కలైజ్ఞర్, కెప్టెన్.. ఎలా పలు పేర్లతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు విజయ్కాంత్. తమిళంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందుకున్న ఆయన ఇతర భాషల్లో సినిమాలు చేయలేదు. కానీ ఛాలెంజ్ రౌడీ, పోలీస్ అధికారం, కెప్టెన్, మా బావ బంగారం, సింధూరపువ్వు, బొబ్బిలి రాయుడు, మరణ మృదంగం.. ఇలా ఆయన నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులో అనువాదమవడంతో ఇక్కడివారికీ సుపరిచితులయ్యారు. ఒక్క రూపాయి తీసుకోలేదు నిర్మాత ఇబ్బందుల్లో ఉంటే ఈయన ఒక్క రూపాయి పారితోషికం తీసుకునేవారు కాదు. అలాగే తన కార్యాలయంలో నిత్యాన్నదానం చేసేవారు. అటు సందేశాత్మక చిత్రాలు, ఇటు వాణిజ్య సినిమాలు ఏకకాలంలో చేసేవారు. అలాగే ఎందరో నటీనటులను ప్రోత్సహించి మంచి కెరీర్ అందించారు. ఈయన చివరగా తన కొడుకు షణ్ముగ పాండియన్ను హీరోగా పరిచయం చేసిన సహాబ్దం సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. I’m happy to share with you all that I’m ready to do a cameo role in captain sir’s Son Shanmuga Pandian’s movie as my respect and love for Vijayakanth sir 🙏🏼 pic.twitter.com/zIlNBqnVs2 — Raghava Lawrence (@offl_Lawrence) January 10, 2024 చదవండి: 'ఓ విషయం గర్వంగా చెప్పాలని ఉంది'.. నమ్రత పోస్ట్ వైరల్! విరాట్ నాకు బావ అవుతాడు.. నాతో ఎలా ఉంటాడంటే?: సైంధవ్ హీరోయిన్ -
Actor Surya : బోరున ఏడ్చిన హీరో సూర్య, విజయ్ కాంత్ కు స్టార్ హీరో నివాళి (ఫొటోలు)
-
మా గుండెల్లో ఉంటావ్ అంటూ.. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య
గతేడాది చివర్లో కోలివుడ్ నటుడు కెప్టెన్ విజయకాంత్ మరణ వార్త తమిళనాడును విషాదంలో ముంచెత్తింది. నటుడిగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ నేతగా ప్రజల మనసు గెలుచుకున్న విజయకాంత్ డిసెంబర్ 28న కన్నుమూశారు. తమ ప్రియతమ సహ నటుడికి నివాళులు అర్పించేందుకు సామాన్య ప్రజలతో పాటు తమిళ సినీ ప్రపంచం కూడా తరలి వచ్చింది. ఆ సమయంలో రాలేని వారు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించారు. ప్రస్తుతం హీరో సూర్య విజయకాంత్కు నివాళులు అర్పించిన వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. విజయకాంత్ స్మారక స్థూపం వద్దకు చేరుకోగానే సూర్య తీవ్రమైన భావోద్వేగానికి గురై ఒక్కసారిగా ఏడుస్తూ ఆ వీడియోలో ఉన్నారు. విజయకాంత్ ఇంటికి చేరుకున్న సూర్య ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్తీ కూడా అక్కడే ఉన్నాడు. విజయకాంత్ మరణించే సమయంలో సూర్య విదేశాల్లో ఉన్నారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఒక వీడియో ద్వారా విజయకాంత్ పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. సూర్య కెరీర్ తొలి చిత్రం విజయకాంత్తోనే మొదలైంది. వారిద్దరూ కలిసి నటించిన పెరియన్నలో సూర్య టైటిల్ క్యారెక్టర్గా నటించాడు. మొదటి చిన్న పాత్ర అని సూర్యను తీసుకున్నారు.. కానీ సూర్య టాలెంట్ను గుర్తించిన విజయకాంత్ అతని రోల్ మరింత సమయం ఉండేలా డైరెక్టర్ ఎస్.ఏ చంద్రశేఖర్కు చెప్పారట. అలా అతిధి పాత్రలో అనుకున్న సూర్య ఆ సినిమాలో ప్రధాన పాత్రధారిగా కనిపించారు. అలా వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలుండేవి. కానీ ఈ సినిమా సూర్య కెరీయర్లో 4వ చిత్రంగా వచ్చింది. విజయకాంత్ స్మారక స్థూపం వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సూర్య ఇలా మాట్లాడారు.. 'ఆయనతో కలిసి పని చేస్తూ, మాట్లాడి, తింటూ గడిపిన రోజులు ఎప్పటికీ మరువలేను.. సాయం అడిగిన ఎవ్వరికీ నో చెప్పలేదు. లక్షలాది మందికి సాయం చేసి వారందరికీ పురట్చి కలైంజర్గా మారిన నా సోదరుడు విజయకాంత్ మృతికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఇక లేరనే బాధ నాలో ఎప్పటికీ ఉంటుంది. ఒక కన్నులో ధైర్యం, మరో కన్ను కరుణతో జీవించిన అరుదైన కళాకారుడు. ఎలాంటి తారతమ్యం లేకుండా అందరికి సాయం చేశాడు. పిరాట్చి కలైంజర్ మా గుండెల్లో కెప్టెన్ అయ్యాడు. అన్న విజయకాంత్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను' అని సూర్య సంతాపం తెలిపారు. View this post on Instagram A post shared by Galatta Media (@galattadotcom) View this post on Instagram A post shared by Galatta Media (@galattadotcom) -
విజయకాంత్ను తల్చుకుని ప్రధాని మోదీ భావోద్వేగం
చెన్నై: ప్రముఖ నటుడు, దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (డీఎండీకే) వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకాంత్ను తల్చుకుని దేశ ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం తిరుచిరాపల్లిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. అక్కడ కెప్టెన్ విజయకాంత్ ప్రస్తావన తెచ్చి మరీ నివాళులర్పించారు. ‘‘కొన్నిరోజుల కిందటే.. విజయకాంత్ గారిని మనం కోల్పోయాం. ఆయన సినీ ప్రపంచంలో మాత్రమే కెప్టెన్ కాదు.. రాజకీయ రంగంలో కూడా కెప్టెనే. సినిమాల ద్వారా అశేష ప్రజాభిమాన సంపాదించుకున్న విజయకాంత్.. ఒక నేతగా రాజకీయం కంటే దేశ ప్రయోజనమే ముఖ్యమనుకునేవారు.. అని ప్రధాని మోదీ విజయకాంత్ను కొనియాడారు. ఆయన మరణం తమిళ భూమికి.. దేశానికి తీరని లోటు అని పేర్కొంటూ.. విజయకాంత్ కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మోదీ. PM Modi’s heartfelt condolences to the family and admirers of his dear friend Captain Vijaykanth ❤️#VanakkamModi #Vijayakanth pic.twitter.com/31N8MPYCLx — இந்தா வாயின்கோ - Take That (@indhavaainko) January 2, 2024 తమిళనాడులో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు అభివద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. తొలుత... తిరుచిరాపల్లిలోని భారతిదశన్ యూనివర్సిటీలో స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారాయన. ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత త్రిచీ ఎయిర్ పోర్ట్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన టెర్మినల్ను ప్రారంభించారు. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ డిసెంబర్ 28వ తేదీన కన్నుమూశారు విజయకాంత్(71). ‘కెప్టెన్’ మృతిపట్ల ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ సమయంలో ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ సైతం సంతాపం ప్రకటించారు. తమిళ సినీ రంగంలోనే కాదు.. అక్కడి రాజకీయాల్లోనూ విజయకాంత్ తనదైన ముద్ర వేశారు. Extremely saddened by the passing away of Thiru Vijayakanth Ji. A legend of the Tamil film world, his charismatic performances captured the hearts of millions. As a political leader, he was deeply committed to public service, leaving a lasting impact on Tamil Nadu’s political… pic.twitter.com/di0ZUfUVWo — Narendra Modi (@narendramodi) December 28, 2023 -
కెప్టెన్కు కన్నీటి వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు
డీఎండీకే అధినేత, నటుడు విజయ్కాంత్ (71) అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ముగిశాయి. కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఆయన పార్థివదేహానికి కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సినీ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు, అభిమానులు ఆశ్రునయనాలతో కెప్టెన్ అంతిమయాత్ర ముగిసింది. కాగా.. మొదట విజయ్కాంత్ భౌతికకాయాన్ని డీఎండీకే కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత విజయకాంత్ పార్థివదేహాన్ని చెన్నైలోని తీవు తిడల్కు తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచారు. అక్కడే సినీస్టార్ కమల్ హాసన్, రజనీకాంత్ ఆయనకు నివాళులు అర్పించారు. విజయకాంత్ చివరి చూపు కోసం సామాన్య ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. అనంతరం డీఎండీకే ప్రధాన కార్యాలయానికి పార్థివదేహాన్ని తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా.. కెప్టెన్ విజయకాంత్(71) డిసెంబర్ 28న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణంతో అటు అభిమానులు, సెలబ్రిటీలు విషాదంలో మునిగిపోయారు. ఎంతోమంది హీరోయిన్లకు కెరీర్ ఇచ్చి, మరెందరో హీరోలకు ఆదర్శంగా నిలిచిన ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. #WATCH | Chennai, Tamil Nadu: A large number of people gathered to pay tribute to DMDK President and Actor Vijayakanth. His mortal remains are being taken from Island ground, Anna Salai to Koyambedu DMDK office for the last rites. pic.twitter.com/cbSweIhY7z — ANI (@ANI) December 29, 2023 -
నాలుగేళ్లుగా విజయకాంత్ కుమారుడి పెళ్లికి బ్రేకులు.. ప్రధాని మోదీ కోసమేనా?
కోలీవుడ్ నటుడు, డీఎండీ వ్యవస్థాపకుడు విజయకాంత్ డిసెంబర్ 28న కన్నుమూశారు. నేడు ఆయన అంత్యక్రియలు కూడా పూర్తి అయ్యాయి. కొద్దిమంది సమక్షంలో విజయకాంత్ అంత్యక్రియలు జరిగాయి.కొన్నాళ్ల క్రితం అనారోగ్య కారణాలతో విజయకాంత్ క్రియాశీలక రాజకీయాలకు విరామం ఇచ్చారు. ఇంతలో చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లాడు. పూర్తి విశ్రాంతిలో ఉన్న ఆయన ఎప్పటికప్పుడు వాలంటీర్లను కలవడం మాత్రమే అలవాటు చేసుకున్నారు. వీటన్నింటికీ మించి కొన్ని వారాల క్రితం మళ్లీ అస్వస్థతకు గురయ్యాడు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో ఆయన పదేపదే ఆసుపత్రిలో చేరడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. కుమారుడి పెళ్లికి బ్రేక్ విజయకాంత్కు ఇద్దరు కుమారులు ఉన్నారు. విజయప్రభాకరన్, షణ్ముఘపాండియన్... చిన్న కుమారుడు షణ్ముఘ పాండియన్ తన తండ్రి అడుగుజాడల్లో తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా మారాడు. పెద్ద కుమారుడు విజయప్రభాకరన్ వ్యాపారవేత్త మరియు రాజకీయవేత్త. అతను తన తండ్రి విజయకాంత్ స్థాపించిన రాజకీయ సంస్థ దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (DMDK) యొక్క వివిధ కార్యక్రమాలలో పాల్గొంటాడు. డిసెంబర్ 2019లో, విజయప్రభాకరన్ కోయంబత్తూరుకు చెందిన వ్యాపారవేత్త ఇళంగో కుమార్తె కీర్తనాతో సన్నిహితులు, బంధువుల సమక్షంలో చాలా తక్కువ మంది సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ సమయంలో కూడా అనారోగ్య కారణాలతో నిశ్చితార్థ వేడుకకు విజయకాంత్ రాలేకపోయారు. నిశ్చితార్థం జరిగి నాలుగేళ్లు కానీ.. అయితే ఈ జంట నిశ్చితార్థం జరిగి ఇప్పటికి నాలుగేళ్లు గడుస్తున్నా ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో పెళ్లి విషయంలో పలు ఊహాగానాలు సినీ పరిశ్రమతో పాటు విజయకాంత్ అభిమానుల్లో జోరందుకున్నాయి. కానీ విజయకాంత్ సన్నిహితులు చెబుతున్న ప్రకారం, వారి నిశ్చితార్థం జరిగిన కొన్ని నెలల తర్వాత బయటపడిన కరోనావైరస్ మహమ్మారి వల్ల వారి వివాహ ప్రణాళికలలో అనేక మార్పులు జరిగాయని చెప్పుకొచ్చారు. కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత పెళ్లి పనులు ఏర్పాటు చేసుకుందామనుకుంటే.. ఆ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వీలు కాలేదు. మోదీ చేతుల మీదుగా తన కుమారుడి పెళ్లి జరగాలని విజయకాంత్ ఆశించారట కానీ ఆ సమయంలో ఆయన బిజీగా ఉండటం వల్ల ఆ పెళ్లికి తేదీలు కేటాయించలేకపోయారు మోదీ. దీంతో 2022లో కూడా ఆ పెళ్లికి బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత మోదీ నుంచి ప్రకటన వచ్చినా.. విజయకాంత్ ఆరోగ్యం మరింత క్షణించడం వైద్యం కోసం అమెరికా వెళ్లడం వంటి కారణాల వల్ల ఆ పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. ప్రధాని మోదీ సమక్షంలో తన కుమారుడి పెళ్లి జరగాలని విజయకాంత్ ఎక్కువగా కోరుకున్నారట. రేపొద్దన్న ఆ పెళ్లికి మోదీ రావచ్చు... కానీ ఆ వేడుకలను చూసేందుకు విజయకాంత్ గారు లేరు. కుమారుడి పెళ్లి చూడకుండానే విజయకాంత్ వెళ్లిపోవడం విషాదాన్ని నింపింది. -
విజయ్ మీదకు చెప్పు విసిరిన వ్యక్తి, వీడియో వైరల్
కెప్టెన్ విజయకాంత్(71) ఇక సెలవంటూ గురువారం (డిసెంబర్ 28న) శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయన మరణంతో అటు అభిమానులు, సెలబ్రిటీలు విషాదంలో మునిగిపోయారు. ఎంతోమంది హీరోయిన్లకు కెరీర్ ఇచ్చి, మరెందరో హీరోలకు ఆదర్శంగా నిలిచిన ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన పార్థివదేహాన్ని సందర్శించేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరో విజయ్.. గురువారం రాత్రి చెన్నైలోని ఐల్యాండ్ గ్రౌండ్లో విజయకాంత్ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించాడు. ఆయనను చివరి చూపు చూసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. చేదు అనుభవం.. కెప్టెన్ కుటుంబసభ్యులను పరామర్శించి తిరిగి వెళ్తున్న క్రమంలో విజయ్కు చేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి హీరో మీదకు చెప్పు విసిరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన జనాలు ఇలాంటి సమయంలో ఈ పిచ్చి పనులేంటని మండిపడుతున్నారు. అజిత్ అభిమానులు సైతం ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇకపోతే విజయకాంత్ సినిమాల్లో విజయ్ చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు. అలాగే విజయ్ తండ్రి, దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ విజయకాంత్తో పలు సినిమాలు చేశారు. ఇక విజయ్ హీరోగా నటించిన తొలి చిత్రం 'నాలయ తీర్పు' ఫెయిల్ కావడంతో అతడి రెండో సినిమాలో నటించమని విజయకాంత్ను కోరాడు చంద్రశేఖర్. విజయకాంత్ వల్లే.. అతడికి ఇచ్చిన మాట ప్రకారం సింధూరపండి మూవీలో నటించగా ఇది బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా రాణించింది. ఆ తర్వాత విజయ్ తనకంటూ ఓ స్టార్డమ్ను ఏర్పాటు చేసుకున్నాడు. 'అయితే వియజకాంత్ ఆ రోజు సాయం చేసి ఉండకపోతే ఈరోజు విజయ్ ఇలా ఉండేవాడు కాదు' అని స్వయంగా దళపతి తండ్రి చంద్రశేఖరే ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. Actor #Vijay was attacked by some unidentified persons in the #Vijayakanth funeral place 💔#Captain #RIPVijayakanth pic.twitter.com/lmrmRr1WVR — AK (@iam_K_A) December 29, 2023 We #Ajith fans strongly condemneding this disrespect behaviour to vijay . whoever it may be, we should respect when they came to our place. Throwing slipper to @actorvijay is totally not acceptable 👎🏻 Stay strong #Vijay #RIPCaptainVijayakanth pic.twitter.com/dVg9RjC7Yy — AK (@iam_K_A) December 29, 2023 చదవండి: ఇంటి నుంచి పారిపోయిన హీరోయిన్.. పెళ్లి వద్దు, సహజీవనమే ముద్దంటున్న బ్యూటీ -
వెన్నుపోట్లు, అవయవ మార్పిడి.. ఇష్టమైన ప్రదేశంలో శాశ్వత నిద్ర!
తమిళ రాజకీయాల్లో కరుప్పు ఎంజీఆర్గా, సినీ రంగంలో కెప్టెన్గా పేరు గడించిన సీనియర్ హీరో విజయకాంత్ (71) అనారోగ్య సమస్యలతో గురువారం చైన్నెలో కన్నుమూశారు. ఆయన మరణం దేశీయ ముర్పోకు ద్రవిడ కళగం(డీఎండీకే) కేడర్ను, సినీ అభిమానులను శోక సంద్రంలో ముంచింది. తమ నేత చివరి చూపు కోసం తమిళనాడు నలుమూలల నుంచి అభిమానులు చెన్నైకి పోటెత్తారు. దీంతో కోయంబేడులోని డీఎండీకే కార్యాలయ పరిసరాలు కిక్కిరిసాయి. సాక్షి, చైన్నె: కరుప్పు ఎంజీఆర్ (నలుపు ఎంజీఆర్), కెప్టెన్, పురట్చి కలైంజ్ఞర్ (విప్లవనటుడు)గా మధురైలో స్థిరపడిన తెలుగు సంతతి కుటుంబానికి చెందిన విజయ్రాజ్ నాయుడు తమిళ తెరపై తనదైన ప్రతిభతో విజయకాంత్గా మెరిశారు. తమిళ రాజకీయాలను ప్రక్షాళన చేస్తానంటూ ఏకంగా పార్టీనే ప్రారంభించారు. 2005 సెప్టెంబర్ 14న మధురైలో జరిగిన బహిరంగ సభ ద్వారా డీఎండీకే (దేశీయ ముర్పోకు ద్రవిడ కళగం) పార్టీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆరు నెలల కాలంలో తమిళ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి తన సత్తా చాటుకున్నారు. పేదరికం, అవినీతి నిర్మూలనను, అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, నటుడు దివంగత నేత ఎంజీయార్ ఆశయాల సాధనే అజెండాగా చేసుకుని 2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విరుదాచలం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయకాంత్ ఎంపికయ్యారు. అవినీతి నిర్మూలన, ప్రజాసంక్షేమ పరిపాలన నినాదంతో ప్రజాసేవలో ఒంటరిగా ముందుకు సాగారు. అవిశ్రాంత శ్రమతో.. ఎన్నికల అనంతరం మూడేళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా జోడు పదవులతో రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. డీఎండీకేను క్షేత్రస్థాయిలో బలోపేతం చేశారు. ముక్కుసూటితనం, విషయాన్ని కుండబద్దలు కొట్టడం, పసలేని ప్రభుత్వ పథకాలను నిర్మొహమాటంగా ఎండగట్టడం, తమిళుల రక్షణకు నడుం బిగించటం ద్వారా పార్టీ కేడర్ను, బలాన్ని పెంచుకున్నారు. దరిమిలా 2011 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అతిపెద్ద అన్నాడీఎంకే పార్టీ తన వైపు చూసేలా చేశారు. ఈ ఎన్నికల ద్వారా తల పండిన నేతలతో నిండిన డీఎంకేను మూడో స్థానంలోకి నెట్టి ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించారు. అదే సమయంలో అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత అమ్మ జయలలితతో వైరం తదుపరి పరిణామాలతో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. డిపాజిట్లు గల్లంతు అయినా, ఏమాత్రం తగ్గలేదు. 2014 లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ఎన్డీఏతో కలిసి తమిళనాట మూడో కూటమి ఏర్పాటులో సఫలీకృతులయ్యారు. ఆ ఎన్నికలలో డిపాజిట్లు గల్లంతైనా, రాజకీయంగా దాడులు పెరిగినా ఏ మాత్రం వెనుకంజ వేయకుండా ముందుకు సాగారు. 2016 అసెంబ్లీ ఎన్నికలలో తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా తన నేతృత్వంలో కూటమి ఏర్పాటు ద్వారా కింగ్ మేకర్ స్థాయికి ఎదిగే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పార్టీలోని ముఖ్య నేతలందరూ బయటకు వెళ్లడం, అంతకు ముందు ఎదురైన రాజకీయ దాడులతో ఈ ఎన్నికలలోనూ డిపాజిట్లు గల్లంతయ్యాయి. అనారోగ్య సమస్యలు.. రాజకీయాల్లో పేదల పెన్నిదిగా నిలిచిన తమిళ ఆరాధ్య నటుడు ఎంజీఆర్, తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని ఎలుగెత్తి చాటిన ఎన్టీఆర్లే తనకు మార్గదర్శకులుగా చెప్పుకునేవారు విజయకాంత్. అయితే తనకు ఎదురైన అనారోగ్య సమస్యల కారణంగా క్రమంగా రాజకీయాలకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2019 లోక్సభ ఎన్నికలలో, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటములు, తన వెన్నంటి ఉన్న వారు గతంలో వెన్ను పోటుపొడవడం వంటి పరిణామాలతో బాధను మనసులో మోసి మరింత క్షీణించారు. విదేశాల్లో సైతం ఆయనకు అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. దీంతో పార్టీ బాధ్యతలను ఆయన భార్య ప్రేమలత విజయకాంత్ తన భుజాన వేసుకుని, కేడర్ చేజారకుండా ముందుకు సాగుతూ వచ్చారు. గత వారం జరిగిన పార్టీ సర్వ సభ్య సమావేశంలో విజయకాంత్ పాల్గొనడం కేడర్లో ఉత్సాహాన్ని నింపింది. ఇందులో తన ప్రధాన కార్యదర్శి పదవిని భార్యకు అప్పగించారు. ఇక సెలవంటూ.. గత నెలలో కొన్ని రోజులు ఆయన ఆస్పత్రిలో ఉన్నా, చివరకు సర్వసభ్య సమావేశంలో పాల్గొనడంతో తమ నాయకుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యారనే ఆనందంలో ఉన్న డీఎండీకే కేడర్, అభిమానులకు గురువారం విషాదకర సమాచారం చేరింది. తన సినీ, రాజకీయ ప్రయాణానికి ఇక సెలవంటూ కరుప్పు ఎంజీఆర్ అనంత లోకాలకు వెళ్లిపోవడాన్ని కేడర్ జీర్ణించుకోలేకపోయింది. ఆస్పత్రి నుంచి శాలిగ్రామంలోని నివాసానికి కెప్టెన్ పార్థివ దేహాన్ని తీసుకెళ్లారు. అక్కడ లాంఛనాలు ముగించి కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఊరేగింపులో తండోప తండాలుగా అభిమానులు తరలి రావడంతో నాలుగు కిలోమీటర్ల దూరం దాటేందుకు 3 గంటలు పట్టింది. ముందుగా సీఎం ఎంకే స్టాలిన్, డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్ బాలు, ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ విజయకాంత్ పార్థివ దేహానికి అంజలి ఘటించారు. ఇష్టమైన ప్రదేశంలోనే శాశ్వత నిద్రలోకి.. కోయంబేడులోని తన కల్యాణ మండపం అంటే విజయకాంత్కు ఎంతో ఇష్టం. పార్టీ ఆవిర్భావంతో దీనిని డీఎండీకే ప్రధాన కార్యాలయంగా మార్చేశారు. ఇక్కడి నుంచి అన్ని రకాల కార్యక్రమాలు, వ్యవహారాలు జరిగేవి. ఇక్కడకు వచ్చే కార్యకర్తలకు ఎల్లవేళలా కడుపు నిండా అన్నం పెట్టి పంపించేవారు. తనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఇక్కడే నిర్వహించే వారు. గతంలో రాజకీయ కారణాలతో ఈ కల్యాణ మండపం కొంత భాగం వంతెన కోసం కేటాయించాల్సిన పరిస్థితి వచ్చినా, దీనిని ఆయన వదులుకోలేదు. ప్రస్తుతం ఆయన ఇక్కడే శాశ్వత నిద్రలో సమాధి రూపంలో ఉండబోతున్నారు. ఈ కార్యాలయం ఆవరణలోనే ఆయన్ని ఖననం చేయనున్నారు. శుక్రవారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. కన్నీటి సంద్రంలో.. డీఎండీకే కార్యాలయంలో ఉంచిన విజయకాంత్ పార్థివదేహాన్ని కడసారి దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు కదిలి వస్తున్నారు. పెద్దఎత్తున కార్యకర్తలు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. తమ అభిమాన నాయకుడు ఇక లేరన్న సమాచారంతో బోరున విలపిస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. రాష్ట్రంలోని తమ కార్యాలయాలలో పార్టీ జెండాను అవనతం చేశారు. విజయకాంత్ చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. చదవండి: 'ప్రేమమ్' దర్శకుడు షాకింగ్ పోస్ట్.. ఏకంగా సీఎం కొడుక్కి అలా! -
విజయకాంత్ మృతిపై స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
తమిళ హీరో, రాజకీయ నాయకుడు కెప్టెన్ విజయకాంత్ అనారోగ్యంతో గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో చాలామంది ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అలానే ఆయన సినిమాల్ని గుర్తు చేసుకున్నారు. అయితే ఓ స్టార్ దర్శకుడు మాత్రం షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన చనిపోలేదని, కొందరు హత్య చేశారని చెప్పుకొచ్చాడు. ఇంతకీ అసలేం జరిగింది. (ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) మలయాళంలో 'ప్రేమమ్', 'గోల్డ్' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అల్ఫోన్స్ పుత్రెన్.. ప్రస్తుతం కొత్త మూవీస్ ఏం చేయట్లేదు. తాజాగా విజయకాంత్ మృతిపై స్పందించిన ఇతడు.. ఇన్ స్టా స్టోరీలో షాకింగ్ పోస్ట్ పెట్టాడు. ఈ హత్య ఎవరు చేశారో కనిపెట్టకపోతే మాత్రం.. నెక్స్ట్ మీ తండ్రి స్టాలిన్, అలానే మిమ్మల్ని కూడా వాళ్లు టార్గెట్ చేసే అవకాశముందని ఇతడు రాసుకొచ్చాడు. 'కరుణానిధి, జయలలితని మర్డర్ చేసింది ఎవరో కనిపెట్టాలని మిమ్మల్ని అడిగాను. ఇప్పుడు మీరు కెప్టెన్ విజయకాంత్ను ఎవరు హత్య చేశారో కూడా కనిపెట్టాలి. ఇదంతా ఏముందిలే అని పక్కన పెట్టేస్తారేమో.. ఇప్పటికే స్టాలిన్ సార్పై, ఇండియన్ 2 సెట్స్లో కమల్ హాసన్పై హత్యా ప్రయత్నం జరిగింది. ఒకవేళ ఈ హంతకులను పట్టుకునే ప్రయత్నం చేయకపోతే మిమ్మల్ని కూడా టార్గెట్ చేస్తారు' అని ఆల్ఫోన్స్ రాసుకొచ్చాడు. అయితే అసలు ఈయన ఎందుకు ఇలా రాసుకొచ్చాడా? అని అనుకుంటున్నారు. (ఇదీ చదవండి: 'బబుల్ గమ్' సినిమా రివ్యూ) -
50 ఏళ్ల స్నేహం.. ఫ్రెండ్స్ మధ్య విభేదాలు..
స్నేహానికి విలువనిచ్చిన నటుడు విజయకాంత్. ఈయన, నిర్మాత ఇబ్రహిం రావుత్తర్ చిన్ననాటి నుంచే మంచి మిత్రులు. ఒకే పాఠశాలలో, ఒకే తరగతిలో చదువుకున్న వాళ్లు. అలా వీరి మధ్య స్నేహం చిత్ర పరిశ్రమ వరకూ చేరి 50 ఏళ్లు కొనసాగింది. విజయకాంత్ హీరోగా ఇబ్రహిం రావుత్తర్ పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఆయనకు సలహాదారుడిగానూ ఉన్నారు. విజయకాంత్ వివాహానంతరం వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో దూరం పెరిగింది. అయితే ఇబ్రహిం రావుత్తర్ మరణించినప్పుడు విజయకాంత్ వెంటనే వెళ్లి ఆయన పార్థివ దేహంపై పడి బోరున ఏడ్చేశారు. అంతటి స్నేహబంధం వారిది. ఇక తొలి రోజుల్లో తన సరసన నటించడానికి నిరాకరించి అవమాన పరిచిన పలువురు నటీమణులకు ఆ తరువాత విజయకాంతే అవకాశాలు కల్పించడం విశేషం. ఇక శరత్కుమార్, మన్సూర్ అలీఖాన్, పొన్నంబలం వంటి పలువురు నటులకు తన చిత్రాల్లో అవకాశాలు కల్పించి ప్రోత్సహించి తన మంచి మనసు చాటుకున్నాడు. చదవండి: విజయకాంత్ మరణం.. విశాల్ కన్నీటి పర్యంతం! యాంకర్ సుమ కొడుకు ఫస్ట్ సినిమా ఎలా ఉందంటే? -
మనసున్న మాస్ హీరో
తమిళ ప్రేక్షకులకు విజయ్కాంత్ ఓ ‘పురట్చి కలైజ్ఞర్’ (విప్లవ కళాకారుడు)... నల్ల ఎంజీఆర్... అభిమానులకు మంచి మాస్ హీరో... కెప్టెన్ ... ఇవే కాదు.. ధైర్యం, తెగువకు చిరునామా అనే పేరు కూడా ఉంది.. మంచి మానవతావాది కూడా. ఇలా ఎన్నో రకాల రూపాల్లో నటుడిగా, వ్యక్తిగా తమిళ ప్రజల మనసుల్లో ‘మనసున్న మాస్ హీరో’గా చెరగని ముద్ర వేసుకున్న విజయ్కాంత్ ఇక లేరు. విజయ్కాంత్ తమిళంలో తప్ప ఇతర భాషల్లో సినిమాలు చేయలేదు. కానీ ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ‘ఛాలెంజ్ రౌడీ, రౌడీలకు రౌడీ, పోలీస్ అధికారం, కెప్టెన్, కెప్టెన్ ప్రభాకరన్, మా బావ బంగారం, నేటి రాక్షసులు, సింధూరపువ్వు, అమ్మను చూడాలి, బొబ్బిలి రాయుడు, మరణ మృదంగం’.. ఇలా ఆయన నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులో అను వాదమై, ఇక్కడి ప్రేక్షకులకు విజయ్కాంత్ని దగ్గర చేశాయి. తెలుగు హీరోలు పలువురు విజయ్కాంత్ తమిళ సినిమాలను తెలుగులో రీమేక్ చేసి బ్లాక్బస్టర్స్ కొట్టారు. చిరంజీవి కెరీర్లో బ్లాక్బస్టర్గా నిలిచిన ‘ఠాగూర్’ (2003) విజయ్కాంత్ హీరోగా వచ్చిన తమిళ సినిమా ‘రమణ’ (2002)కు రీమేక్. అలాగే విజయ్కాంత్ హీరోగా నటించిన ‘సట్టమ్ ఒరు ఇరుట్టరై’ (1981), ‘వెట్రి’ (1984), ‘అమ్మన్ కోయిల్ కిళక్కాలే’ (1986) సినిమాలు తెలుగులో ‘చట్టానికి కళ్ళు లేవు’ (1981) ‘దేవాంతకుడు’ (1984), ‘ఖైదీ నంబరు 786’ (1988)గా రీమేక్ కాగా, ఈ చిత్రాల్లో చిరంజీవి హీరోగా నటించారు. విజయ్కాంత్ ‘చిన్న గౌండర్’ (1992) తెలుగు రీమేక్ ‘చినరాయుడు’ (1992)లో వెంకటేశ్, ‘నానే రాజా నానే మంత్రి’ (1985) రీమేక్ ‘నేనే రాజు నేనే మంత్రి (1987)’, ‘ఎన్ పురుషన్దాన్ ఎనక్కు మట్టుమ్దాన్’ (1989) రీమేక్ ‘నా మొగుడు నాకే సొంతం’ (1989) చిత్రాల్లో మోహన్బాబు హీరోగా నటించారు. విజయ్కాంత్ ‘వానత్తై పోల’ (2000) సినిమాను తెలుగులో ‘మా అన్నయ్య’గా రీమేక్ చేసి హిట్ అందుకున్నారు రాజశేఖర్. కాగా కొందరు తెలుగు హీరోల సినిమాల తమిళ రీమేక్లో నటించి హిట్స్ అందుకున్నారు విజయ్కాంత్. బాలకృష్ణ హీరోగా నటించిన ‘భానుమతిగారి మొగుడు’ (1987) సినిమా తమిళ రీమేక్ ‘తెర్కత్తి కళ్లన్’ (1988)లో, ఎన్టీఆర్ బ్లాక్బస్టర్ ఫిల్మ్ ‘సింహాద్రి’ (2003) రీమేక్ ‘గజేంద్ర’ (2004)లో విజయ్కాంత్ హీరోగా నటించి, బ్లాక్బస్టర్స్ అందుకున్నారు. ఇలా ఆయన కెరీర్లో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. విజయ్కాంత్ అసలు పేరు నారాయణన్ విజయ్రాజ్ అళగర్సామి. కేఎన్ అళగర్సామి, ఆండాళ్ అళగర్సామి దంపతులకు 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురైలో జన్మించారాయన. కాగా అళగర్సామి కుటుంబానికి తెలుగు మూలాలు ఉన్నాయి. పదో తరగతి వరకు చదివిన విజయ్రాజ్ తండ్రికి సహాయంగా రైస్ మిల్లు బాధ్యతలను చూసుకునేవాడు. అయితే చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి ఉండటంతో 1979లో చెన్నై చేరుకున్నాడు విజయ్రాజ్. సినీ అవకాశాల కోసం ప్రయత్నించిన ఆయనకు ఎంఏ రాజా దర్శకత్వం వహించిన ‘ఇనిక్కుమ్ ఇళమై’ (1979) చిత్రంలో ప్రతినాయకుడిగా తొలి అవకాశం వచ్చింది. ఆ చిత్ర దర్శక–నిర్మాత ఎంఏ కాజానే విజయ్రాజ్ పేరుని విజయ్కాంత్గా మార్చారు. ‘ఇనిక్కుమ్ ఇళమై’ తర్వాత ‘అగల్ విళక్కు, నీరోట్టం, చామంతి పూ’ తదితర చిత్రాల్లో ఆయన నటించినా ఆశించిన విజయాలు అందుకోలేకపోయారు. ఆ తర్వాత ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘దూరత్తు ఇడి ముళక్కమ్’ (1980) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు విజయ్కాంత్. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో నటించిన ద్వితీయ చిత్రం ‘చట్టం ఒరు ఇరుట్టరై’ (1981) సినిమా సంచలన విజయం సాధించడంతో పాటు విజయ్కాంత్కు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. హీరోగా చాలా బిజీ అయిపోవడంతో రోజుకు మూడు షిఫ్టులుగా పని చేశారాయన. ఎంత బిజీ హీరో అంటే 1984లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదలవడం విశేషం. విజయ్కాంత్ సినిమాల్లో ఎక్కువగా సామాజిక నేపథ్యం ఉంటుంది. వీరోచితం, విప్లవ భావాలు, ప్రజలను ఉత్తేజపరచే అంశాలు ఉంటాయి. అలాగే ఆయన యాక్షన్ కు ప్రత్యేక అభిమానులున్నారు. ‘అమ్మన్ కోయిల్ కిళక్కాలే, వైదేహి కాత్తిరిందాళ్, చిన్న గౌండర్, వానతై ్త పోల’ వంటి పలు కుటుంబ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రాల్లోనూ తనదైన నటనతో అలరించారాయన. పోలీస్ పాత్రలకు వన్నె తెచ్చిన విజయ్కాంత్కు ‘కెప్టెన్ ప్రభాకరన్’ సంచలన హీరోగా పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం తర్వాత ఫ్యాన్స్ ఆయన్ను ‘కెప్టెన్’ అని ప్రేమగా పిల వడం మొదలు పెట్టారు. కొందరు ఫ్యాన్స్ విప్లవ కళా కారుడు అంటూ గౌరవంతో పిలుచుకుంటారు. అయితే విజయ్కాంత్ సినీ కెరీర్ అంత సాఫీగా సాగలేదు. ఆదిలో ఎన్నో కష్టాలు, అవమానాలను ఎదుర్కొన్నారు. విజయ్కాంత్ నలుపు రంగులో ఉండటంతో మొదట్లో పలువురు ప్రముఖ నటీమణులు ఆయన సరసన నటించడానికి నిరాకరించారట. అయినా తనను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్కాంత్. అటు సందేశాత్మక చిత్రాలు, ఇటు వాణిజ్య సినిమాలు ఏకకాలంలో చేశారాయన. సినిమా ప్రారంభంలో కాకుండా విడుదల ముందు పారితోషికాన్ని అందుకుని నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఒకవేళ ఆ సినిమా నిర్మాత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకునేవారు కాదట. ఎంజీఆర్ అభిమాని అయిన విజయ్కాంత్.. తన అభిమాన హీరోలాగా ప్రజల ఆకలి తీర్చేవారు. ఆయన కార్యాలయంలో నిత్యాన్నదానం చేస్తూ.. కరుప్పు (నలుపు) ఎంజీఆర్గా కొనియాడబడ్డారు విజయ్కాంత్. ఆర్కే సెల్వమణి దర్శకత్వం వహించిన ‘కెప్టెన్ ప్రభాకరన్ ’ విజయ్కాంత్కు నూరవ చిత్రం. ఆయన కెరీర్లో 150కిపైగా సినిమాల్లో నటిస్తే.. అందులో 20కిపైగా పోలీస్ ఆఫీసర్గా నటించిన సినిమాలే ఉండడం విశేషం. చివరగా తన కొడుకు షణ్ముగ పాండియన్ ను హీరోగా పరిచయం చేసిన ‘సహాబ్దం’ (1993) చిత్రంలో ముఖ్య పాత్రను పోషించారాయన. ‘విరుదగిరి’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు విజయ్కాంత్. బావ ఎల్.కె. సుధీశ్తో కలిసి మూడు సినిమాలు నిర్మించారు విజయ్కాంత్. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం అధ్యక్షుడిగానూ విశేష సేవలందించారాయన. సినీ పరిశ్రమలో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న విజయ్కాంత్ మృతికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కూడా ఆయనకు మృతి పట్ల విచారం వ్యక్తం చేశాయి. విజయ్కాంత్కుభార్య ప్రేమలత, కుమారులు విజయ ప్రభాకరన్, షణ్ముగ పాండియన్ ఉన్నారు. -
విజయకాంత్ మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో!
తమిళస్టార్ నటుడు, డీఎండీకే అధినేత మృతి పట్ల పలువురు సినీతారలు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్తో పాటు టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆయనకు నివాళులర్పించారు. తాజాగా విజయ్కాంత్ మృతిపట్ల కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ట్విటర్లో పంచుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటనలో విశాల్ ఏడుస్తున్న వీడియో అభిమానులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. విశాల్ వీడియోలో మాట్లాడుతూ..' కెప్టెన్ మరణించిన విషయం ఇప్పుడే నాకు తెలిసింది. ఈ వార్త విన్నాక నా కాళ్లు, చేతులు పనిచేయడం లేదు. కెప్టెన్ను కోల్పోవడం చాలా బాధగా ఉంది. ఆయన చివరి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నా. నేను నడిగర్ సంఘం అధ్యక్షునిగా ఉన్నప్పుడు అండగా నిలిచారు. ఈ సమయంలో వారి కుటుంబానికి ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా. విజయ్కాంత్ సార్కు ఇదే నా కన్నీటి నివాళి' అంటూ ఏడుస్తూ పోస్ట్ చేశారు. కాగా.. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ బుధవారం కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో మంగళవారం ఆస్పత్రిలో చేరిన ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు చెన్నై మియాట్ వైద్యులు ప్రకటన విడుదల చేశారు. విజయ్కాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. -
సినిమాలు, రాజకీయాలు.. విజయ్కాంత్ ఆస్తులు ఎన్ని కోట్లంటే!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్(71) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ ఆస్పత్రిలో చేరిన వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. విజయ్కాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. (ఇది చదవండి: విజయ్కాంత్ గొప్పమనసు.. వారికోసం స్థలం ఇస్తానన్న కెప్టెన్.!) అయితే సినిమాలతో పాటు రాజకీయాల్లో అడుగుపెట్టిన విజయ్కాంత్ గురించి సినీ ప్రేక్షకులు ఆరా తీస్తున్నారు. ఆయన వ్యక్తిగత జీవితం, కెరీర్పై నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఈ సందర్భంగా విజయ్కాంత్ తన సుదీర్ఘ కెరీర్లో ఎంత సంపాదించారు? ఆయనకున్న ఆస్తుల విలువ ఎంత? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తన 1991 చిత్రం కెప్టెన్ ప్రభాకరన్లో సాహసోపేతమైన పోలీసు అధికారి పాత్రలో మెప్పించారు. అప్పటి నుంచి అభిమానులు ఆయనను 'కెప్టెన్' అని ముద్దుగా పిలుచుకున్నారు. 2016లో విజయకాంత్ ఉలుందూరుపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినప్పుడు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన పేరుపై ఉన్న చరాస్తుల విలువ రూ.7.6 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించారు. నగదు, బ్యాంకుల్లో ఉన్న వివరాలతో పాటు ఆయన వివరాలు సమర్పించారు. అతని భార్య ప్రేమలతతో పాటు.. అతనిపై ఆధారపడిన వారి ఆస్తులు కూడా కలిపి మొత్తం ఆస్తులు రూ. రూ.14.79 కోట్లుగా ఉన్నట్లు అఫిడవిట్లో వివరించారు. (ఇది చదవండి: కెప్టెన్ విజయ్కాంత్.. కుటుంబం నేపథ్యమిదే!) అంతే కాకుండా వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, వాణిజ్య, నివాస భవనాలు మొదలైన స్థిరాస్తులు విలువ రూ. రూ. 19.37 కోట్ల ఆస్తులు ఆయన పేరుమీద ఉన్నట్లు వెల్లడించారు. ఆయన భార్య ప్రేమలత విజయ్కాంత్ పేరుపై రూ. 17.42 కోట్ల ఆస్తులు ఉన్నాయని అఫిడవిట్లో పొందుపరిచారు. దీని ప్రకారం స్థిరాస్తుల మొత్తం విలువ రూ. 38.77 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు అన్ని రకాల అప్పులు మొత్తం రూ. 14.72 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. దీంతో మొత్త స్థిర, చరాస్తుల విలువ మొత్తం కలిపి రూ.53 కోట్లకు పైగానే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా 2016లో ప్రకటించిన ఆస్తుల విలువ కాగా.. ఎన్నికల సమయంలో ఈ వివరాలు విజయ్కాంత్ సమర్పించారు. -
విజయ్కాంత్ గొప్పమనసు.. వారికోసం స్థలం ఇస్తానన్న కెప్టెన్.!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ ఆస్పత్రిలో చేరిన వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్ది సేపటి క్రితమే కరోనా సోకినట్లు ప్రకటించిన వైద్యులు.. ఆయన మృతి చెందినట్లు తెలిపారు. విజయ్కాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. అయితే గతంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో ఆయన గొప్ప మనసును చాటుకున్నారు. కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన వారి ఖననానికి తన సొంత స్థలం ఇస్తానని ప్రకటించారు. ఈ విషయంపై ఆయన గతంలో ట్వీట్ చేశారు. ఎందుకలా చేశారంటే... గతంలో చెన్నైకి చెందిన ఓ వైద్యుడికి కరోనా వైరస్ సోకింది. పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందాడు. దీంతో వైద్యుడి మృతదేహాన్ని ఖననం చేయడానికి వెళ్లగా.. అక్కడి స్థానికులు అడ్డుకున్నారు. దీనిపై స్పందిస్తూ విజయ్కాంత్ ప్రకటన విడుదల చేశారు. కరోనాతో మృతిచెందిన వారిని ఖననం చేయడానికి తన సొంత స్థలం ఇస్తానన్నారు. తన ఆండాళ్ అళగర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోని కొంత భాగాన్ని ఖననానికి ఇస్తున్నట్లు వెల్లడించారు. కరోనాతో మృతి చెందినవారిని ఖననం చేయటంతో వైరస్ వ్యాపించెందదని.. ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలని అప్పటి విజయ్కాంత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కానీ ఇవాళ విజయ్కాంత్ మృతి చెందడం అభిమానులకు షాక్కు గురిచేసింది. கொரோனாவால் உயிரிழந்தவர்களின் உடல்களை அடக்கம் செய்ய பொதுமக்கள் எதிர்ப்பு தெரிவித்தால், ஆண்டாள் அழகர் பொறியியல் கல்லூரியின் ஒரு பகுதியை உடல் அடக்கம் செய்ய எடுத்துகொள்ளலாம்.#SpreadHumanity | #COVID19 pic.twitter.com/CG2VLBzj4F — Vijayakant (@iVijayakant) April 20, 2020 -
విజయకాంత్ మృతి పట్ల మోదీ, స్టాలిన్ ఏమన్నారంటే..
దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం (డీఎండీకే) వ్యవస్థాపకుడు విజయకాంత్ మృతి పట్ల ప్రధాని మోదీతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతాపం తెలిపారు. స్టాలిన్ సంతాప సందేశంలో, 'మా ప్రియ మిత్రుడు - నేషనల్ ప్రోగ్రెసివ్ ద్రావిడ సంఘం కెప్టెన్ విజయకాంత్ మరణ వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతితో పాటు ఎంతో బాధను కలిగించింది. మంచి మనసున్న మిత్రుడు విజయకాంత్ సినీ పరిశ్రమలోనూ, ప్రజా జీవితంలోనూ తన కఠోర శ్రమతో ఎన్నో విజయాలను అందుకుని ప్రజల పక్షాన నిలబడ్డారు. నటుడిగా, నటీనటుల సంఘం అధ్యక్షుడిగా, రాజకీయ పార్టీ నాయకుడిగా, శాసనసభ్యుడిగా, ప్రతిపక్ష నేతగా.. ఏ పని చేపట్టినా దానికే పూర్తిగా అంకితమై తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదరించారు. కుటుంబ స్నేహితుడిగా నాకు సుపరిచితుడు. అని స్టాలిన్ తెలిపారు. కొద్దిరోజుల నుంచి విజయకాంత్ తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి సమయంలో ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతుండగా ఈరోజు (డిసెంబర్ 28) ఉదయం మృతి చెందాడు. విజయ్ కాంత్ మృతికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులతో పాటు పలువురు ప్రముఖుల సంతాపం తెలుపుతున్నారు. నేడు తమిళనాడు లోని అన్ని థియేటర్స్ను క్లోజ్ చేస్తున్నారు. అన్ని షో లు రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ కాంత్ నటించిన చివరి సినిమా మధుర విరన్ (2018)లో విడుదలైంది. ఆయన తమిళ చిత్రాల్లో మాత్రమే నటించడం విశేషం. ప్రధాని నరేంద్ర మోదీ: విజయకాంత్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. విజయకాంత్ను తమిళ సినిమా లెజెండ్ అంటూ మోదీ వ్యాఖ్యానించారు. అతని నటన లక్షల మంది హృదయాలను తాకింది. ఆపై రాజకీయ నాయకుడిగా, అతను తమిళనాడు రాజకీయాల్లో శాశ్వత ప్రభావాన్ని చూపారు. ప్రజా సేవలో ఉంటూ చాలా ఏళ్లుగా పోరాడారు. అతని మరణం తమిళనాట రాజకీయాల్లో పూడ్చడం కష్టతరమైనది.' అని మోదీ తన ఎక్స్ పేజీలో పోస్ట్ చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై: 'అనారోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎండీకే అధినేత నా సోదరుడు కెప్టెన్ విజయకాంత్ మృతి చెందారని తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. నేడు ఒక మంచి నటుడిని, మంచి రాజకీయ నేతను కోల్పోయాం. ఆయన నాకు మంచి సోదరుడు.' అని తమిళిసై తెలిపారు. కమల్ హాసన్: నా సోదరుడు, డీఎండీకే అధ్యక్షుడు, విలక్షణ నటుడు విజయకాంత్ మరణవార్త ఎంతో తీవ్ర విషాదాన్ని నింపింది. తమిళనాడు రాజకీయాల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాజకీయాల్లో ఎంతో ధైర్యంగా ఆయన రానించారు. సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన విప్లవ కళాకారుడు. తమిళనాట ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎన్టీఆర్: విజయకాంత్గారి మరణ వార్త ఎంతో బాధాకరం. సినిమా, రాజకీమాల్లో ఆయనొక పవర్హౌస్. సినీ పరిశ్రమ ఒక మంచి నటుడితో పాటు మనసున్న రాజకీయనాయకుడిని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా.. చిరంజీవి: మన ‘పురట్చి కలైంగర్’, ‘కెప్టెన్’ విజయకాంత్ ఇక లేరని తెలిసి గుండె తరుక్కుపోయింది. అయనొక మంచి వ్యక్తిత్వంతో పాటు తెలివైన రాజకీయ నాయకుడు. అయన ఎప్పుడూ స్ట్రెయిట్ తెలుగు చిత్రాలలో నటించనప్పటికీ, ఇక్కడ కూడా ఆయనకు విపరీతమైన ప్రజాదరణతో పాటు ప్రేమను పొందాడు. మన ప్రియమైన ‘కెప్టెన్’ చాలా త్వరగా మనల్ని విడిచిపెట్టి తిరిగిరాని శూన్యాన్ని మిగిల్చాడు! ఆయన అభిమానులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక సానుభూతి. అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా.. మంచు విష్ణు: విజయకాంత్ గారు లేరని వార్త జీర్ణించుకోలేకపోతున్నా. ఆయన సినిమాలు చూస్తూనే నా బాల్యం అంతా గడిచింది. ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ నాలో గుర్తుండిపోతాయి. ఆయన ఎంతో అభిమానంతో మాట్లాడుతారు. రంగం ఏదైనా సరే ఆయన నిజమైన నాయకుడని మంచు విష్ణు తెలిపారు. సంతాపం తెలిపిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి విజయకాంత్ మృతి పట్ల తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి సంతాపం తెలిపింది. తెలుగు చిత్రసీమతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శులు కె.ఎల్. దామోదర్ ప్రసాద్, టి. ప్రసన్న కుమార్ గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం కుటుంబానికి అలాగే భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరనిలోటని వారు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారు ప్రార్థిస్తూ ఒక లేఖను విడుదల చేశారు. Extremely saddened by the passing away of Thiru Vijayakanth Ji. A legend of the Tamil film world, his charismatic performances captured the hearts of millions. As a political leader, he was deeply committed to public service, leaving a lasting impact on Tamil Nadu’s political… pic.twitter.com/di0ZUfUVWo — Narendra Modi (@narendramodi) December 28, 2023 உடல் நலக்குறைவால் மருத்துவமனையில் சிகிச்சை பெற்று வந்த தேமுதிக தலைவர்,சகோதரர் கேப்டன் திரு.விஜயகாந்த் அவர்கள் உயிரிழந்த செய்தியறிந்து மிகவும் மனவேதனை அடைந்தேன். நல்ல திரைப்படக்கலைஞர்.... நல்ல அரசியல் தலைவர்.... நல்ல மனிதர்.... நல்ல சகோதரர்.... ஒட்டுமொத்தமாக ஒரு நல்லவரை நாம்… pic.twitter.com/oPVTWZ1uRD — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) December 28, 2023 Heartbroken to know that our ‘Puratchi Kalingar’, ‘Captain’ Vijayakanth is no more. He was a wonderful human being, Hero of the Masses,a multi faceted personality and an astute politician. Though he never acted in straight Telugu films, he is hugely popular and loved by the… pic.twitter.com/r0N4olxFrL — Chiranjeevi Konidela (@KChiruTweets) December 28, 2023 -
కెప్టెన్ విజయ్కాంత్.. కుటుంబం నేపథ్యమిదే!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్ది సేపటి క్రితమే కరోనా సోకినట్లు ప్రకటించిన వైద్యులు ఆయన మృతి చెందినట్లు తెలిపారు. విజయ్కాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. కుటుంబ నేపథ్యమిదే.. విజయకాంత్ 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురైలో జన్మించారు. విజయ్కాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్స్వామి. చిత్ర పరిశ్రమలోకి వెళ్లిన తర్వాత విజయకాంత్గా పేరు మార్చుకున్నారు. కె.ఎన్. అళగర్స్వామి, ఆండాళ్ ఆయన తల్లిదండ్రులు. 1990లో జనవరి 31న ఆయన ప్రేమలతను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి విజయ్ ప్రభాకర్, విఘ్నేష్ పాండియన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరైన షణ్ముఖ పాండియన్ సగప్తం, మధుర వీరన్ చిత్రాల్లో నటించారు. విజయ్ కుటుంబం చాలా పెద్దది. విజయ్కాంత్కు ఐదుగురు సోదరులు, ఐదుగురు సోదరీమణులు ఉన్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ సినిమాల్లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న విజయ్కాంత్ రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రజలకు సేవల చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2016 ఎన్నికల్లో పరాజయం పొందారు. ఆయన డీఎండీకే పార్టీ ఎన్నికల సమయంలో ఏ ఇతర పార్టీతోనూ పొత్తు పెట్టుకోకపోవడం విశేషం. -
కెప్టెన్ విజయ్కాంత్.. అవార్డుల రారాజు!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్ది సేపటి క్రితమే కరోనా సోకినట్లు ప్రకటించిన వైద్యులు ఆయన మృతి చెందినట్లు తెలిపారు. విజయ్కాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటిస్తున్నారు. 1952 ఆగస్టు 25న మదురైలో విజయ్కాంత్ జన్మించారు. సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్రవేశారు. దాదాపు 150కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. ప్రజలకు సేవల చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు. ఇనిక్కుం ఇలామైతో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు విజయ్కాంత్. సుమారు 100కి పైగా చిత్రాల్లో ఆయన నటించి ఎన్నో ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించారు. దాదాపు 20కి పైగా పోలీస్గా నటించి మెప్పించారు. కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయ్కాంత్.. ఎస్.ఎ. చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘దూరతు ఇడి ముజక్కం’, ‘సత్తం ఓరు ఇరుత్తరై’లతో విజయాలు అందుకున్నారు. ‘కెప్టెన్ ప్రభాకర్’ విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ని కెప్టెన్గా పిలుస్తున్నారు. విజయ్కాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడంతో ఇక్కడి వారికీ ఆయన సుపరిచితులే. అవార్డులు దాదాపు 100కి పైకి సినిమాల్లో నటించిన విజయ్కాంత్ పలు అవార్డులు సొంతం చేసుకున్నారు. 1981లో ఆయన నటించిన తూరతు ఇడిముజక్కం చిత్రానికి ప్రపంచ చలన చిత్రోత్సవ అవార్డ్ లభించింది. 1986లో అమ్మన్ కోయిల్ కిజకలే చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. 1989లో పూంతోట్ట కవల్కరన్ అనే సినిమాకు ఉత్తమ నటుడిగా ఎక్స్ప్రెస్ అవార్డ్ వరించింది. అదే ఏడాదిలో చిందుర పూవే అనే చిత్రానికి ఉత్తమ నటుడు అవార్డుతో పాటు ఫిల్మ్ ఫ్యాన్స్ అవార్డ్ను సొంతం చేసుకున్నారు. 2001లో తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి అవార్డు అందుకున్నారు. వీటితో పాటు 1994లో ‘తమిళనాడు స్టేట్ ఫిల్మ్ ఆనరరీ అవార్డు’ (ఎంజీఆర్ పురస్కారం). 2001లో ‘బెస్ట్ ఇండియన్ సిటిజెన్ అవార్డు’, 2009లో ‘టాప్ 10 లెజెండ్స్ ఆఫ్ తమిళ్ సినిమా అవార్డు’, 2011లో ‘ఆనరరీ డాక్టరేట్’ (ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చర్చ్ మేనేజ్మెంట్) పొందారు. అంతే కాకుండా అనేక ఫిల్మ్ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. విజయకాంత్ దర్శకత్వం వహించిన ఒకే ఒక చిత్రం ‘విరుధగిరి’. అందులో ఆయనే హీరో. తన బావ ఎల్.కె. సుధీశ్తో కలిసి ‘వల్లారసు’, ‘నరసింహ’, ‘సగప్తం’ తదితర చిత్రాలను నిర్మించారు. -
కెప్టెన్గా విజయ్కాంత్.. ఆ పేరు ఎలా వచ్చిందంటే?
డీఎండీతే అధినేత, నటుడు విజయ్కాంత్ తమిళనాడులోని మధురైలో ఆగస్టు 25, 1952న జన్మించారు. కె.ఎన్.అలగస్వామి, ఆండాళ్ దంపతులకు ఆయన జన్మించారు. జనవరి 31, 1990 న ప్రేమలతను విజయకాంత్ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి విజయ్ ప్రభాకర్, విఘ్నేష్ పాండియన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇవాళ కరోనా బారిన పడిన ఆయన ఆస్పతిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కెప్టెన్ పేరు ఎందుకు వచ్చిందంటే.. "కెప్టెన్ ప్రభాకరన్" అనే చిత్రం ద్వారా విజయ్కాంత్కు కెప్టెన్' అని పేరు పెట్టారు. "కెప్టెన్ ప్రభాకరన్" 1992 సంవత్సరంలో విడుదల కాగా బ్లాక్ బస్టర్గా నిలిచింది. దాదాపు 100కి పైగా సినిమాల్లో నటించిన విజయ్కాంత్.. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. -
Vijayakanth: విజయ్కాంత్ కన్నుమూత
దక్షిణ చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాడు డీఎండీకే అధినేత, ప్రముఖ నటుడు విజయకాంత్(71) కన్నుమూశారు. చెన్నై మియోట్ ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అటు ఆస్పత్రి వర్గాలు.. ఇటు తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి విజయకాంత్ మృతిపై అధికారిక ప్రకటన చేశారు. విజయ్కాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్స్వామి. మధురైలో 1952 ఆగష్టు 25న జన్మించారు. విజయకాంత్గా పేరు మార్చుకుని 27 ఏళ్ల వయసులో.. ‘ఇనిక్కుం ఇలామై’తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలి చిత్రంలో ఆయన ప్రతినాయకుడి(విలన్)రోల్ చేశారు. కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయ్కాంత్.. ఎస్.ఎ. చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘దూరతు ఇడి ముజక్కం’, ‘సత్తం ఓరు ఇరుత్తరై’లతో విజయాలు అందుకున్నారు. సుమారు 100కి పైగా చిత్రాల్లో ఆయన నటించి ఎన్నో ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించారు. దాదాపు 20కి పైగా పోలీస్ కథల్లోనే ఆయన నటించి మెప్పించారు. సోలో హీరోగా విరుధగిరి(2010) ఆయన చివరిచిత్రం. తనయుడు షణ్ముగ పాండియన్ హీరోగా నటించిన సగప్తం(2015)లో చివరిసారిగా ఓ అతిథి పాత్రలో తెరపై విజయ్కాంత్ కనిపించారు. Official medical bulletin from Chennai MIOT hospital announcing the passing away of Captain #Vijayakanth #RIPCaptain pic.twitter.com/yLynSrBj9I — Ramesh Bala (@rameshlaus) December 28, 2023 విజయకాంత్ నటించిన 100వ చిత్రం ‘కెప్టెన్ ప్రభాకర్’ విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ని కెప్టెన్గా పిలుస్తున్నారు. ఇక, విజయ్కాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడంతో ఇక్కడి వారికీ ఆయన సుపరిచితులే. ప్రజలకు సేవల చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయాల్లోనూ సత్తా చాటినా ఆయన.. తమిళనాడు రాజకీయాల్లోనూ కీలకంగా వ్యవహరించారు. 👉: కెప్టెన్ ఓ సెన్సేషన్.. విజయకాంత్ అరుదైన చిత్రాలు -
నటుడు విజయ్కాంత్కు కరోనా.. పరిస్థితి విషమం!
తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్కు కొవిడ్ పాజిటివ్గా తేలింది. శ్వాసకోశ సమస్యల కారణంగా ఇటీవలే చికిత్స తీసుకున్నారు. తాజాగా మరోసారి ఆస్పత్రిలో చేరిన విజయకాంత్కు కరోనా సోకింది. దీంతో ప్రస్తుతం ఆయన వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఈ విషయంపై పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. డీఎండికే నేత విజయకాంత్ గత కొన్నాళ్లుగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు . ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు , పార్టీ సమావేశాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత నెల 18న జలుబు దగ్గు గొంతునొప్పి కారణంగా విజయకాంత్ వైద్య పరీక్షల నిమిత్తం చైన్నెలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అలాగే ఆయనకు జలుబు , దగ్గు ఎక్కువగా ఉండడంతో పరీక్షించిన వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆర్యోగ పరిస్థితి క్షీణించిందని పల్మోనాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారని , వైద్యులు పూర్తి ఆక్సిజన్తో ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారని సమాచారం అలాగే ఆయన ఆర్యోగం విషమంగా ఉందనే పుకార్లు కూడా వచ్చాయి. ఈ క్రమంలో నవంబర్ 23న విజయకాంత్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని , వైద్యానికి బాగా సహకరిస్తున్నారని ఆసుపత్రి వైద్యులు పేర్కోని చికిత్స అనంతరం ఈనెల 11న డిశ్చార్జి చేశారు. డీఎండికే వర్కింగ్ కమిటీ సాధారణ సమావేశాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఈ పరిస్థితుల్లో ఆతను మంగళవారం రాత్రి చికిత్స కోసం మళ్లీ ఆసుపత్రిలో చేరారు. తాజాగా కరోనా సోకినట్లు డీఎండీకే ప్రధాన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. Tamil Nadu | DMDK Leader Vijayakanth tested positive for COVID. Due to breathing issues, Vijayakanth has been put on a ventilator: Desiya Murpokku Dravida Kazhagam (DMDK) pic.twitter.com/5XoF1HQhDv — ANI (@ANI) December 28, 2023 -
కమెడియన్ మృతి.. కుటుంబానికి సాయం చేసిన కెప్టెన్!
సీనియర్ సినీ హాస్యనటుడు బోండామణి (60) శనివారం రాత్రి చైన్నె సమీపంలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. శ్రీలంకకు చెందిన ఈయన అక్కడ సైనికుల యుద్ధంలో కుటుంబ సభ్యులను కోల్పోగా తను మాత్రం తప్పించుకుని చైన్నెకి చేరుకున్నారు. చైన్నెలో సినీ ప్రయత్నాలు చేసి చివరకు 1981లో విడుదలైన పవును పవును దాన్ చిత్రం ద్వారా నటుడిగా రంగ ప్రవేశం చేశారు. ఆ చిత్రంలో చిన్న పాత్ర చేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత మంచి హాస్యనటుడుగా గుర్తింపు పొందారు. వందల సినిమాల్లో నటించి.. అలా సుందర ట్రావెల్స్, మరుదమలై, విన్నర్, వేలాయుధం, జిల్లా.. తదతిర చిత్రాల్లో నటించారు. దాదాపు 250కి పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వడివేలు వంటి హాస్యనటులతో కలిసి పలు చిత్రాలు చేశారు. కొంతకాలంగా బోండామణి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. తన రెండు కిడ్నీలు పాడవడంతో చైన్నె ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాదికి పైగా చికిత్స పొందుతూ వచ్చారు. తన ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో బోండామణికి పలువురు సినీ ప్రముఖులు ఆర్థిక సాయం అందించారు. స్వగృహంలో కన్నుమూత రోజూ డయాలసిస్ చేసుకుంటూ వచ్చిన బోండామణి డిసెంబర్ 23న రాత్రి 11 గంటల ప్రాంతంలో రాత్రి ఉన్నట్లుండి కింద పడిపోయారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా బోండామణి అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈయనకు భార్య మాధవి, కొడుకు సాయిరాం, కూతురు సాయికుమారి ఉన్నారు. బోండామణి మృతికి పలువురు సినీ ప్రముఖులు ప్రగాడ సంతాపాన్ని వ్యక్తం చేశారు. లక్ష సాయం కమెడియన్ మృతి పట్ల నటుడు, డీఎండీకే పార్టీ నేత విజయకాంత్ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ లక్ష రూపాయలను నటుడు మీసై రాజేంద్రన్ ద్వారా ఆయన భార్యకు అందించారు. కాగా ఆదివారం క్రోంపేటలోని శ్మశాన వాటికలో బోండామణి అంత్యక్రియలు నిర్వహించారు. బోండామణి కొడుకు సాయిరాం మీడియాతో మాట్లాడుతూ తమకు ఎలాంటి జీవనాధారం లేదని, అద్దె ఇంటిలోనే ఉంటున్నామని నడిగర్ సంఘం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశాడు. చదవండి: రొమాన్స్ సీన్లో నేనేం సిగ్గుపడలేదు కానీ..: ఆండ్రియా -
ఆస్పత్రి నుంచి నటుడు విజయకాంత్ డిశ్చార్జ్
కోలీవుడ్లో కొద్దిరోజుల క్రితం ప్రముఖ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ అనారోగ్యానికి గురైయారు. ఈ కారణంగా చెన్నైలోని మియత్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై నెట్టింట పలు ఊహాగానాలు వచ్చిన సమయంలో ఎప్పటికప్పుడు ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశాయి. దగ్గు,జలుబు కారణంతో ఆస్పత్రిలో విజయకాంత్ చేరారు. చికిత్స అందిస్తున్న క్రమంలో శ్వాసకోస సంబంధిత సమస్యలను ఆయన ఎదుర్కొన్నారు. సుమారు 20 రోజులకు పైగనే ఆయన చికిత్స పొందారు. విజయకాంత్ ఆరోగ్యంపై పలు రూమర్స్ రావడంతో ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు చాలాసార్లు వివరణ ఇచ్చారు. ఆయన సతీమణి ప్రేమలత కూడా వీడియో ద్వారా కెప్టెన్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం ప్రకటించారు. ఊపిరితిత్తులలో శ్లేష్మం ఎక్కువగా ఉండడంతో మరో 14 రోజుల పాటు విజయకాంత్ ఆస్పత్రిలోనే చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నారని ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశాయి. నేడు (డిసెంబర్ 11)న మయత్ హాస్పిటల్ నుంచి విజయకాంత్ డిశ్చార్జ్ అయ్యారు. పూర్తి ఆరోగ్యంతో ఆయన ఇంటికి చేరుకున్నారు. -
మళ్లీ క్షీణించిన విజయకాంత్ ఆరోగ్యం..!
డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయకాంత్ పరిస్థితి మళ్లీ విషమించినట్లు తెలుస్తోంది. మరోసారి అస్వస్థకు గురి కావడంతో కాగా ఆయనకు వెంటి లేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావాల్సి ఉండగా.. ఆయన ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారు. శనివారం విజయకాంత్ ఆరోగ్యం మరింత ఆందోళనకరంగా మారినట్లు తెలుస్తోంది. ఊపిరితిత్తులలో తీవ్ర ఇన్ఫెక్షన్ కారణంగా శ్వాస సమ స్య అధికంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. (ఇది చదవండి: క్యాసినో ఆడి గీతా మాధురి డబ్బులు పోగొట్టింది: నందు) డీఎండీకే అధినేత విజయకాంత్ గత నెల 18వ తేదీ రాత్రి అనారోగ్యం బారిన పడ్డ విషయం తెలిసిందే. ఆయన్ని మనపాక్కంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు.. ఓ దశలో ఆయన ఆరోగ్యంపై చాలా రూమర్స్ వచ్చాయి. ఆయన పరిస్థితి విషమించినట్టుగా వదంతులు వ్యాపించాయి. ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తుండటం, తరచూ శ్వాస సమస్య తలెత్తినట్టుగా, కృత్రిమ శ్వాసను అందిస్తున్నట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. దీంతో డీఎండీకే వర్గాలలో ఆందోళన రెకెత్తించాయి. ఆ తర్వాత విజయకాంత్ సతీమణి ప్రేమలత విజయకాంత్ విడుదల చేసిన వీడియోతో ఆందోళన సద్దుమణిగింది. (ఇది చదవండి: మనలో ఎలాంటి జంతువులు ఉన్నాయో కనిపిస్తోంది: ఆర్జీవీ ట్వీట్) -
కోట్లాది హృదయాల్లో నేనూ ఒకడిని.. విజయకాంత్పై సూర్య కామెంట్
తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ గత కొన్నేళ్లుగా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ కారణంగానే సుమారు మూడేళ్లుగా ఆయన బహిరంగ కార్యక్రమాలు, పార్టీ సమావేశాల్లో పాల్గొనడం మానేశారు. కొన్ని రోజుల క్రితం ఆయన ఆరోగ్యం మరింత క్షిణించడంతో నవంబర్ 18న చెన్నైలోని మయత్ ఆసుపత్రిలో చేరారు. అనంతరం నవంబర్ 23న జ్వరంతో అడ్మిట్ అయిన విజయకాంత్ ఆరోగ్యం బాగానే ఉందని, చికిత్సకు బాగా సహకరిస్తున్నారని ఆసుపత్రి యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. కొంతకాలం తర్వాత ఆసుపత్రి యాజమాన్యం విడుదల చేసిన ఒక ప్రకటనలో, 'విజయకాంత్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. అయితే, అతని పరిస్థితి గత 24 గంటల్లో నిలకడగా లేనందున, అతనికి పల్మనరీ చికిత్సలో సహాయం కావాలి. అతను త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాము. అతను అవసరం ఇంకా 14 రోజులు హాస్పిటల్లో ఫాలో-అప్ చేయవలసి ఉంటుంది.' అని తెలియజేసారు. దీంతో విజయకాంత్ అభిమానులు, డీఎం కార్యకర్తలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆసుపత్రి యాజమాన్యం నివేదికపై ప్రేమలత విడుదల చేసిన వీడియోలో.. విజయకాంత్ త్వరగా కోలుకుంటారని ఆమె వాలంటీర్లకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే విజయకాంత్ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు హల్ చల్ చేస్తున్న వేళ.. విజయకాంత్ ఆస్పత్రిలో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ఎవరూ అనవసర పుకార్లు ప్రచారం చేయవద్దని, ఆ పుకార్లను ఎవరూ నమ్మవద్దని, విజయకాంత్ త్వరగా కోలుకుని మిమ్మల్ని కలుస్తారని అన్నారు. ఈ సందర్భంలో, నటుడు సూర్య కూడా విజయకాంత్ ఆరోగ్యం గురించి అతని కుటుంబం ద్వారా అడిగి తెలుసుకున్నాడు. ఈ మేరకు విజయకాంత్ సతీమణికి ఫోన్ చేసి పరామర్శించారు. అలాగే, నటుడు విజయకాంత్ త్వరగా కోలుకోవాలని సూర్య తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్లో 'సోదరుడు విజయకాంత్ పూర్తిగా కోలుకోవాలని ప్రార్థించే కోట్లాది హృదయాల్లో నేనూ ఒకడిని. కోట్లాది మంది ప్రజల ప్రార్థనలు తప్పకుండా నెరవేరుతాయి. ఆయన పూర్తిగా కోలుకుని మనందరి ముందుకు వస్తారు.' అని పోస్ట్ చేశారు. 1999లో నటుడు సూర్య నటించిన 'పెరియన్న' చిత్రంలో నటుడు విజయకాంత్ ప్రత్యేక పాత్ర పోషించడం గమనార్హం. அண்ணன் விஜயகாந்த் அவர்கள் நலம் பெறப் பிரார்த்திக்கும் கோடான கோடி இதயங்களில் நானும் ஒருவனாகப் பங்கேற்கிறேன்.! கோடானகோடி மனிதர்களின் வேண்டுதல்கள் நிச்சயம் பலிக்கும்.! அவரை பூரண குணமாக்கி, நலம் பெற வைக்கும்.!! — Suriya Sivakumar (@Suriya_offl) December 3, 2023 -
విజయకాంత్ ఫోటోను విడుదల చేసిన సతీమణి
డీఎండీకే అధినేత, కోలీవుడ్ నటుడు విజయకాంత్ కోలుకుంటున్నారని ఆయన సతీమణి ప్రేమలత తెలిపారు. అనారోగ్యం కారణంగా నవంబర్ 18న చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో ఆయన చేరారు. ఆయన ఆరోగ్యం నిలకడగా లేదని ఆస్పత్రి వర్గాలు తెలపడంతో ఆయన ఫ్యాన్స్లో ఆందోళన మొదలైంది. తర్వాత ఆయన కోలుకుంటున్నారని మరో 14 రోజుల పాటు ఆసుపత్రిలో నిరంతర చికిత్స అందించాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ఇలా వైద్యుల నుంచి భిన్నాభిప్రాయాలు రావడంతో ఫ్యాన్స్లో మరింత ఆందోళన నెలకొంది. దీంతో ఆయన సతీమణి ప్రేమలత ఒక వీడియో ద్వారా విజయకాంత్ ఆరోగ్యంపై కీలక ప్రకటన చేశారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలో క్షేమంగా ఇంటికి వస్తారని చెప్పడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఆస్పత్రి వద్దకు పోలీసులు భద్రతను ఏర్పాటు చేయడంతో విజయకాంత్ ఆరోగ్యంపై మళ్లీ అనుమానాలు రేకెత్తాయి. వాటిని ఖండించిన ప్రేమలత... విజయకాంత్తో ఉన్న పోటోలను విడుదల చేసింది. కెప్టెన్ ఆరోగ్యంగా ఉన్నాడు. అతి త్వరలో ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చి మనందరినీ చూస్తాడు. వదంతులను ఎవరూ నమ్మవద్దు, ప్రచారం చేయవద్దు! అని దయతో మనవి చేస్తున్నానని తెలిపింది. ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారని కృత్రిమ శ్వాసక్రియతో చికిత్సపొందుతున్నారని పలు యూట్యూబ్ ఛానల్స్ రకరకాలుగా తప్పుడు ప్రచారం చేయడం భాదగా ఉందని ఆమె తెలిపింది. ఇప్పటికైన ఆయన ఆరోగ్యంపై తప్పుడు ప్రచారాలు చేయడం ఆపాలని ప్రేమలత కోరింది. கேப்டன் ஆரோக்கியமாக இருக்கிறார். வெகு விரைவில் கேப்டன் நல்ல உடல் நலத்துடன் வீடு திரும்புவார், நம் அனைவரையும் சந்திப்பார். யாரும் வதந்திகளை பரப்பவும் வேண்டாம், நம்பவும் வேண்டாம்! என்று அன்போடு கேட்டுக்கொள்கிறேன். - திருமதி. பிரேமலதா விஜயகாந்த். pic.twitter.com/u6tvBGtCdD — Vijayakant (@iVijayakant) December 2, 2023 -
విజయకాంత్ ఆరోగ్యంపై ప్రకటన చేసిన నాజర్
జలుబు, దగ్గు, గొంతునొప్పితో డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ చికిత్స పొందుతున్నారు. నవంబర్ 18న చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో ఆయన చేరారు. ఈ నేపథ్యంలో విజయకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని, చికిత్సకు బాగా సహకరిస్తున్నారని నవంబర్ 23న మయత్ ఆసుపత్రి యంత్రాంగం ఒక ప్రకటనలో పేర్కొంది. కానీ కొన్ని రోజుల తర్వాత, అకస్మాత్తుగా మరోక ప్రకటన విడుదల చేసి అతని పరిస్థితి గత 24 గంటల నుంచి నిలకడగా లేదు అంటూనే పల్మనరీ చికిత్స అవసరం ఉందని తెలిపి విజయకాంత్ త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నామని చెప్పింది. ఆయనకు మరో 14 రోజుల పాటు ఆసుపత్రిలో నిరంతర చికిత్స అందించాల్సి ఉందని తెలిపింది. దీంతో ఆయన అభిమానులు, డీఎండీకే కార్యకర్తలు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.. విజయకాంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. విజయకాంత్ ఆరోగ్యంపై ప్రేమలత విడుదల చేసిన వీడియోలో.. 'కెప్టెన్ ఆరోగ్యంపై ఆసుపత్రి యాజమాన్యం రెగ్యులర్గా నివేదిక ఇస్తుంది. ఆయన ఆరోగ్యంపై భయపడాల్సిన అవసరం లేదు. కెప్టెన్ ఆరోగ్యంగానే ఉన్నారు. వైద్యులు, నర్సులు, నేను అతనిని బాగా చూసుకుంటున్నాం.' అని తెలిపింది. త్వరలోనే ఆయన పూర్తి ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చి అందరినీ కలుస్తారని ఆమె తెలిపారు. ఆమె ప్రకటనతో అభిమానులకు కాస్త ఊరట కలిగింది.. అయితే గత రెండు రోజులుగా విజయకాంత్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వ్యాపించాయి. విజయకాంత్ ఆరోగ్యంపై ఆందోళన కొనసాగుతున్న సమయంలో దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్, నిర్మాత శివ ఆస్పత్రికి వెళ్లారు. విజయకాంత్ ఆరోగ్యం గురించి వైద్యుల ద్వారా పలు విషయాలను తెలుసుకున్నారు. అనంతరం నడిఘర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో.. 'కెప్టెన్ విజయకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారు.. ఆయనపై వస్తున్న వార్తలు నమ్మెద్దు. విజయకాంత్ త్వరలో అభిమానులను కలుస్తారు. అతను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. కానీ ICU వార్డులో అతను ఉన్నందున మేము చూడలేకపోయాం. కానీ విజయకాంత్ ఆరోగ్యంపై తమకు వైద్యులు సమాచారం అందించారు. వైద్య భద్రత దృష్ట్యా ఆయన్ను చూసేందుకు అనుమతించలేదు.' అని తెలిపారు. దీంతో ఆయన అభిమానులకు కాస్త ఊరట కలిగింది.. అయితే గత రెండు రోజులుగా విజయకాంత్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వ్యాపించాయి. -
కెప్టెన్ ఓ సెన్సేషన్.. విజయకాంత్ అరుదైన చిత్రాలు
-
విజయకాంత్ అనారోగ్యంపై పుకార్లు.. ఖండించిన నటుడి సతీమణి
తమిళ స్టార్, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆయన మరణించాడంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్లో విజయకాంత్ ఇక లేరంటూ ఇష్టారీతిన ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదు. కెప్టెన్ విజయకాంత్ సతీమణి ప్రేమలత సైతం సదరు వార్తలను ఖండించింది. కెప్టెన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని పేర్కొంది. ఆయన అనారోగ్యం గురించి వచ్చే వదంతులను నమ్మవద్దని కోరింది. అటు చెన్నైలోని ఆస్పత్రి వర్గాలు సైతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని బుధవారం నాటి ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఇకపోతే విజయకాంత్ 'ఇనిక్కుం ఇలమై' సినిమాతో వెండితెరపై తన ప్రయాణం ఆరంభించారు. 150కి పైగా సినిమాలు చేసిన ఆయన ఇరవైకి పైగా పోలీస్ స్టోరీల్లో నటించి అలరించారు. ఆయన నటించిన 100వ మూవీ 'కెప్టెన్ ప్రభాకర్' హిట్ అయిన తర్వాత నుంచి ఈయన్ని అందరూ కెప్టెన్ అని పిలవడం ప్రారంభించారు. ఈయన చేసిన చాలా సినిమాలు తెలుగులోనూ డబ్, రీమేక్ అయ్యాయి. చిరంజీవి 'ఠాగూర్' మూవీ ఒరిజినల్ వెర్షన్ 'రమణ'లో విజయ్ కాంతే హీరోగా నటించారు! கேப்டன் நலமாக இருக்கிறார். விரைவில் முழு உடல் நலத்துடன் வீடு திரும்பி, நம் அனைவரையும் சந்திப்பார். - திருமதி. பிரேமலதா விஜயகாந்த் pic.twitter.com/P9iHyO7hzG — Vijayakant (@iVijayakant) November 29, 2023 చదవండి: ‘యానిమల్’ మూవీ టాక్ ఎలా ఉందంటే.. ? -
విషమంగా విజయకాంత్ ఆరోగ్యం
సాక్షి, చైన్నె: డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయకాంత్ ఆరోగ్యంపై ఆ పార్టీ వర్గాలలో ఆందోళన నెలకొంది. ఆయనకు ఊపిరితిత్తులకు సంబంధించిన చికిత్స అందిస్తున్నట్లు బుధవారం బులెటిన్ విడుదలైంది. ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు అందులో వైద్యులు వెల్లడించారు. వివరాలు.. డీఎండీకే అధినేత విజయకాంత్ ఈనెల 18వ తేదీ రాత్రి అనారోగ్యం బారిన పడ్డ విషయం తెలిసిందే. ఆయన్ని మనపాక్కంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఇక్కడ ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా, ఆయన అవయవాల పరిస్థితిపై వైద్యులు పరిశోధించి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తుండటం, తరచూ శ్వాస సమస్య తలెత్తినట్టుగా, కృత్రిమ శ్వాసను అందిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో ఆయన ఆరోగ్యంపై వదంతులు రావడంతో దేరడంతో వాటిని నమ్మవద్దని డీఎండీకే కార్యాలయం ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో బుధవారం వెలువడ్డ బులిటెన్ డీఎండీకే వర్గాలలో ఆందోళన రెకెత్తించాయి. విజయకాంత్ ఆరోగ్యం సరిగ్గా లేదని, ఆయనకు ఊపిరితిత్తులకు సంబంధించిన చికిత్స అవశ్యమైనట్టు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన చికిత్స కొనసాగుతోందని, ఆయన మరో రెండు వారాలు ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుందని ఆ బులిటెన్లో పేర్కొనడం డీఎండీకే వర్గాలను కలవరంలో పడేశాయి. గతంలో విజయకాంత్కు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగినట్టు తెలిసింది. ఆ తర్వాత ఆయన ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటూ వచ్చాయి. తాజాగా ఆయనకు మరోమారు ఊపిరితిత్తుల సమస్య తలెత్తడం గమనార్హం. -
హీరో విజయ్కాంత్ హెల్త్ బులెటిన్.. ఆరోగ్యం ఎలా ఉందంటే?
ఈ మధ్య అనారోగ్యానికి గురైన తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ కాంత్.. అనారోగ్యం వల్ల ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. (ఇదీ చదవండి: బ్రేకప్ స్టోరీ బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి.. పెళ్లి గురించి హింట్!) 'విజయకాంత్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. అయినప్పటికీ గత 24 గంటల్లో ఆయన పరిస్థితి స్థిరంగా లేనందున.. ఆయనకు పల్మనరీ చికిత్సలో సహాయం కావాలి. త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నాం. ఇంకా 14 రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుంది' అని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో విజయకాంత్ను.. ఆయన కుటుంబ సభ్యులు ఇటీవల ఆస్పత్రిలో చేర్పించారు. డయాబెటిస్ కారణంగా గతంలో ఆయన కుడికాలి మూడు వేళ్లని తొలగించారు. (ఇదీ చదవండి: Kiraak RP Marriage: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న కమెడియన్ కిర్రాక్ ఆర్పీ..) -
నటుడు విజయకాంత్ హెల్త్ బులిటెన్ విడుదల
డీఎండీకే అధినేత, సీనియర్ నటుడు విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేదని మళ్లీ వార్తలు తెరపైకి వచ్చాయి. చెన్నై మయత్ ఆస్పత్రి యాజమాన్యం నివేదిక ప్రకారం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ మరికొన్ని రోజులపాటు చికిత్స అందించాల్సి ఉందని తెలిపింది. డీఎండీకే అధినేత విజయకాంత్ అనారోగ్య కారణాలతో నవంబర్ 18న చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో చేరారు. విజయకాంత్ దగ్గు, జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నందున సాధారణ వైద్య పరీక్షల కోసం వెళ్లినట్లు డీఎండీకే నేతలు అప్పట్లో వివరించారు. సుమారు 10 రోజుల నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై వారు పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. విజయకాంత్ సాధారణ వైద్య పరీక్షల కోసం వెళ్లారని.. ఒకట్రెండు రోజుల్లో ఇంటికి తిరిగి వస్తారని ఇలాంటి పరిస్థితిల్లో ఆయనపై వచ్చే వదంతులను ఎవరూ నమ్మవద్దని వారు తెలిపారు. కానీ ఆయనకు ఇప్పటికీ కూడా ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తుండటంతో అభిమానుల్లో అనుమానం పెరిగిపోయింది. వైద్యులు ఏమైనా దాస్తున్నారా..? అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఈ పరిస్థితిలో, ఈ రోజు (29-11-2023), DMDK అధినేత విజయకాంత్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మయత్ హాస్పిటల్ వైద్యులు నివేదికను విడుదల చేశారు. అందులో విజయకాంత్ ఆరోగ్యం మెరుగుపడిందని తెలిపారు. నిన్నటి వరకు ఆయన బాగానే ఉన్నారని కానీ గత 24 గంటల నుంచి అతని ఆరోగ్య పరిస్థితి స్థిరంగా లేనందున, అతనికి పల్మనరీ చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అతను త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నామని అందులో తెలిపారు. వైద్యుల సూచన ప్రకారం అతనికి ఇంకా 14 రోజులు ఆసుపత్రిలో నిరంతర చికిత్స అవసరం ఉందని తెలిపారు. -
తెలుగు హీరోపై కోలీవుడ్ నటి 'విచిత్ర' వ్యాఖ్యలు.. తెరపైకి విజయకాంత్ పేరు
కోలీవుడ్ నటి విచిత్ర ప్రస్తుతం తమిళ బిగ్ బాస్-7లో కంటెస్టెంట్గా కొనసాగుతుంది. ఆ షోలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. 1992లో కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన విచిత్ర.. ఎక్కువగా తమిళ సినిమాల్లోనే ఆమె కనిపించింది. అక్కడ సుమారు 90కి పైగా చిత్రాల్లో ఆమె నటించింది. తెలుగులో మాత్రం కేవలం రెండు చిత్రాల్లో మాత్రమే కనిపించగా.. ఇందులో వెంకటేశ్ సూపర్ హిట్ చిత్రం అయిన 'పొకిరి రాజా' (1995)లో 'చిత్ర' పాత్రతో ఆమె మెప్పించింది. ఆపై 2001లో నందమూరి బాలకృష్ణ డిజాస్టర్ సినిమా అయిన 'భలేవాడివి బాసు'లో 'పుష్ప' పాత్రలో కనిపించింది. టాలీవుడ్ హీరోపై నటి విచిత్ర చేసిన వ్యాఖ్యలు 21 ఏళ్లుగా వెండితెరకు దూరంగా విచిత్ర తాజాగా బిగ్బాస్ షోలో తెలుగు చిత్ర పరిశ్రమ నటుడి గురించి ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. 2000 సంవత్సరంలో తనకు తెలుగు సినిమా ఛాన్స్ వచ్చినట్లు విచిత్ర ఇలా చెప్పింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఒక ఫేమస్ హీరోను కలిశానని.. అతను తన గదికి రావాలని పిలిచాడు. కానీ నేను వెళ్లలేదు. దీంతో నాపై కోపం పెంచుకున్నాడు. ఆ హీరో రోజూ తాగి వచ్చి నా గది తలుపు తట్టేవాడు. అంతేకాకుండా ఓరోజు అడవిలో షూటింగ్ జరుగుతుండగా అతడు నన్ను అసభ్యంగా తాకాడు. అక్కడే నా జీవితంలోనే అత్యంత దారుణమైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఎదుర్కొన్నాను. దీంతో సినిమాలకు గుడ్బై చెప్పాశాను.' అని బాంబ్ పేల్చింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. తెరపైకి వచ్చిన విజయకాంత్ పేరు..ఎందుకు..? ఈ వివాదం గురించి ఆ సమయంలో నడిగర్ సంఘానికి విజ్ఞప్తి చేస్తే.. అప్పట్లో నటీనటుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇవన్నీ మరిచిపోయి పని చూసుకోమన్నారని విచిత్ర తెలిపింది. కావాలంటే పోలీసుల వద్దకు వెళ్లండి.. అసోసియేషన్కి ఎందుకు వచ్చారని ఎదురు ప్రశ్నించారని ఆమె వాపోయింది. ఆ తర్వాత చేసేది ఏమీ లేక సినిమాల నుంచి తప్పుకున్నట్లు విచిత్ర పేర్కొంది. అప్పట్లో నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న విజయకాంత్పై తాజాగా విమర్శలు వస్తున్నాయి. (ఇదీ చదవండి: తెలుగు హీరోపై కోలీవుడ్ నటి విచిత్ర చేసిన పూర్తి వ్యాఖ్యలు ఇవే.. ) 2001లో దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడిగా విజయకాంత్ ఉన్నారు. 2000-2006 సంవత్సరం వరకు నడిగర్ అధ్యక్షుడిగా ఆయన కొనసాగారు. ప్రస్తుతం విచిత్ర చెప్తున్న వివాదం కూడా 2000-2001 సమయంలో జరిగినట్లు తెలిపింది. కాబట్టి ఆమె ఫిర్యాదు చేసింది కూడా విజయకాంత్కే ఉంటుందని నెటిజన్లు తెలుపుతున్నారు. అయితే అన్యాయం జరిగిందని సాయం కోసం ఒక ఆడపిల్ల వస్తే విజయకాంత్ ఎందుకు సపోర్ట్ చేయలేదని చెబుతున్నారు. విజయకాంత్ కూడా తెలుగు హీరోకు సపోర్టుగా నిలిచాడా..? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. విజయకాంత్పై ఇప్పటి వరకు తమిళ పరిశ్రమలో ఎలాంటి విమర్శలు లేవు. ఒక రకంగా ఆయనపై ఇదే తొలి విమర్శ అంటూ నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. -
విజయకాంత్ ఆరోగ్యంపై వివరణ ఇచ్చిన తమిళనాడు మంత్రి
డీఎండీకే అధినేత, కోలీవుడ్ సినీ నటుడు విజయకాంత్ తీవ్రమైన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణియన్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడ్డ విజయకాంత్ ఆపరేషన్ చేయించుకున్నారు. మళ్లీ అనారోగ్య సమస్యలు రావడం వల్ల ఆయన తిరిగి చికిత్స పొందుతున్నారు. విజయకాంత్కు వైద్యం అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడిన మంత్రి ఈమేరకు చెప్పారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న విజయకాంత్ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి చెప్పడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. విజయకాంత్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తుండడం వల్ల ఆయన ఆరోగ్య పరిస్థితిపై వదంతులు వచ్చాయని డీఎండీకే పార్టీ నేతలు చెప్పారు. తాజాగా మంత్రి సుబ్రహ్మణియన్ కూడా ఇదే విషయాన్ని అధికారికంగా తెలిపారు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరారు. రెగ్యులర్గా ఆయనకు అందించే చికిత్సలో భాగంగానే ప్రస్తుతం కూడా చికిత్స కొనసాగుతున్నదని , ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ పార్టీ కార్యాలయం ప్రకటించింది. రెండు మూడు రోజులలో విజయకాంత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని పేర్కొంది. -
ఆస్పత్రిలో చేరిన విజయకాంత్.. కన్నీళ్లు పెట్టుకుంటున్న ఫ్యాన్స్
డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయకాంత్ ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయనకు చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలోచికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారంతో డీఎండీకే వర్గాల్లో ఆందోళన నెలకొంది. డీఎండీకే అధినేత విజయకాంత్ సినీ, రాజకీయ పయనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అనారోగ్య కారణాలతో ఆయన ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. పార్టీ బాధ్యతలను కోశాధికారి పదవితో ఆయన సతీమణి ప్రేమలత విజయకాంత్ భుజాన వేసుకుని ముందుకెళ్తున్నారు. ఈ పరిస్థితులలో విజయకాంత్ను చూడలేక పోతున్నామే అన్న ఆవేదనలో ఉన్న కేడర్కు ఇటీవల ఆయన దర్శనం కల్పించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన తన జన్మదిన వేడుకకు విజయకాంత్ హాజరయ్యారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిని చూసిన కేడర్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత నుంచి ఇంట్లోనే విజయకాంత్ ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు ఆరోగ్య పరంగా సమస్యలు తలెత్తడంతో హుటాహుటిన నగరంలోని ఓ ఆస్పత్రికి ఆదివారం తరలించారు. ఆయనకు ఆస్పత్రిలో పరిశోధనలు, చికిత్సలు కొనసాగుతున్నాయి. విజయకాంత్ ఆస్పత్రిలో చేరిన సమాచారంతో డీఎండీకే వర్గాలలో ఆందోళన నెలకొంది. అదే సమయంలో వదంతులు, ప్రచారాలు ఊపందుకున్నాయి. ఇందుకు ముగింపు పలికే విధంగా డీఎండీకే కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. విజయకాంత్కు సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ప్రస్తుతం ఆస్పత్రిలో చేర్పించినట్టు వివరించారు. ఆయన రెండు రోజులలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేడర్కు భరోసా ఇచ్చారు. -
విజయ్కాంత్కు ప్రధాని మోదీ ఫోన్ పరామర్శ
ప్రముఖ తమిళ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత విజయ్కాంత్ను ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి విజయ్కాంత్ భార్య ప్రేమలత విజయకాంతతో గురువారం ఫోన్లో మాట్లాడారు. అనారోగ్యంతో బాధపుడుతన్న విజయ్కాంత్కు మధుమేహం తీవ్రత ఎక్కువైన విషయం తెలిసిందే. దీంతో ఆయన కుడి కాలి మూడు వేళ్లను తొలిగించారు వైద్యులు. దీంతో ఆయన ఆరోగ్యంపై డీఎండీకే వర్గాలు ఆందోళనకు లోనయ్యాయి. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఆందోళన చెందవద్దని డీఎండీకే కార్యాలయం మరోమారు ప్రకటన విడుదల చేసింది. విజయ్కాంత్ త్వరితగితిన కోలుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆకాంక్షించారు. -
నా ఆరోగ్యం క్షీణించిన విషయం నిజమే.. అంత మాత్రాన..
సాక్షి, చెన్నై: అన్యుల మాటలకు మోసపోయి పార్టీకి ద్రోహం చెయొద్దు, పార్టీపై దుష్ప్రచారం చేసే వారిని నమ్మవద్దని కార్యకర్తలకు డీఎండీకే అధ్యక్షులు విజయ్కాంత్ విజ్ఞప్తి చేశారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి తీవ్ర ఆవేదనతో సోమవారం విడుదల చేసిన ప్రకటనలోని అంశాలు ఇలా.. ‘తమిళనాడులో మార్పు తీసుకువచ్చి, రాష్ట్రానికి, ప్రజలకు మేలు చేయాలనే ఉన్నతమై సంకల్పంతో డీఎండీకేను స్థాపించానన్న సంగతి మీకందరికీ తెలుసు. ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజాసంక్షేమం కోసం నా అభిమాన సంఘాలు పనిచేశాయి. అభిమాన సంఘాలు పార్టీలో విలీనమైన తరువాత నాకు అండగా నిలిచింది మీరే. అందరూ కష్టపడి బలమైన పార్టీగా తీర్చిదిద్దారు. చదవండి: (నేరగాడిగా చిత్రీకరించే ఆ వ్యాఖ్యలు నొప్పించాయి: విజయ్ ఆవేదన) అయితే ఇప్పుడు కొందరు కార్యకర్తలు బ్రెయిన్వాష్ చేసే వారి మాటలు నమ్మి పార్టీని వీడివెళ్లడం.. నాకు మాత్రమే కాదు పార్టీకే ద్రోహం చేస్తున్నారని అభిప్రాయపడుతున్నాను. ఇలా వీడి వెళ్లడం మీ బలహీనతను చాటుతోంది. అవకాశవాదంతో ఈ నిర్ణయం తీసుకున్నా మని మీరంతా బాధపడే రోజు వస్తుంది. నా ఆరోగ్యం క్షీణించి ఉన్న విషయం నిజమే. ఈమాత్రాన పార్టీకి భవిష్యత్ లేదని భావించడం సరికాదు. వందేళ్లయినా డీఎండీకేను రూపుమాపడం ఎవ్వరివల్ల కాదు. చదవండి: (అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా చిన్నమ్మ పయనం.. దినకరన్ మద్దతు) తమిళనాడులో ఎప్పటికీ అది వేళ్లూనుకునే ఉంటుంది. పార్టీని ప్రగతిబాటలో తీసుకు వెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృతనిశ్చయంతో ఉండాలి. పార్టీని అప్రతిష్టపాలు చేసేవారి మాటలు నమ్మవద్దు. పార్టీని వీడేలా ప్రలో భాలకు గురిచేస్తున్న వారిని ఖండించడంతోపాటూ అలాంటి వ్యక్తులను గుర్తించి ప్రధాన కార్యాలయం దృష్టికి తీసుకెళ్లండి. అందరం కలిసి బలమైన పార్టీగా ముందుకు సాగుదాం’ అని విజ్ఞప్తి చేశారు. -
నర్సులతో కలిసి సినిమా చూస్తున్న విజయకాంత్
Vijayakanth Watches Super Hit Movie With Nurses In Dubai : తాను ఆరోగ్యంగానే ఉన్నానని డీఎండీకే అధినేత విజయకాంత్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. నర్సులతో కలిసి కాలక్షేపం చేస్తున్న ఫొటోను విడుదల చేశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఆయన్ని దుబాయ్కు తరలించారు. దీంతో ఆయన ఆరోగ్యంపై పార్టీ నాయకులు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో తాను ఆరోగ్యంగా ఉన్నట్లు ట్వీట్ చేశారు. తాను నటించిన క్షత్రియన్ను ఆస్పత్రి నర్సు లతో కలిసి చూస్తూ.. కాలక్షేపం చేస్తున్న ఫొటోను విడుదల చేశారు. దీంతో డీఎండీకే వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. Am doing well. Watching 'Satriyan' movie, with Sisters who taking care of me. நான் நல்ல உடல் நலத்துடன் உள்ளேன். நான் நடித்த 'சத்ரியன்' திரைப்படத்தை, எனது சிகிச்சைக்கு உதவிபுரியும் செவிலியர் சகோதரிகளுடன் பார்த்த போது எடுத்த படம். pic.twitter.com/QekthdQNz2 — Vijayakant (@iVijayakant) September 5, 2021 చదవండి : బిల్డప్ రౌడీగా వచ్చేస్తున్న సందీప్ కిషన్ హీరోయిన్ త్రిషను అరెస్ట్ చేయాలి..హిందూ సంఘాల ఫిర్యాదు -
విజయకాంత్కు అనార్యోగం? చికిత్స కోసం అమెరికాకు..
సాక్షి, చెన్నై: డీఎండీకే అధ్యక్షుడు, నటుడు విజయకాంత్ వైద్య చికిత్స కోసం సోమవారం చెన్నై నుంచి అమెరికాకు బయలుదేరి వెళ్లారు.దీంతో విజయకాంత్ ఆరోగ్యంపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి.ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్నేళ్ల క్రితం, సింగపూర్, అమెరికాలో చికిత్స చేయించుకుని వచ్చారు. అయినా ఆశించినంతగా ఆరోగ్యం మెరుగుపడలేదు. ప్రస్తుతం పార్టీ బాధ్యతలను ఆయన సతీమణి, కోశాధికారి ప్రేమలతకు అప్పగించి ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అడపాదడపా చెన్నైలోని ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. సెకెండ్ వేవ్లో ఆయన కరోనా బారినపడి కోలుకున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ప్రసంగాలు చేయలేక ప్రజలకు చేతితో సైగలు చేస్తూ నామమాత్రంగా ప్రచారం నిర్వహించారు. ఈనెల 25వ తేదీన జన్మదినం కూడా జరుపుకున్నారు. మాట్లాడే సామర్థ్యం, తానుగా లేచి నిలబడే శక్తిని కోల్పోయి బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో మెరుగైన చికిత్స కోసం విజయకాంత్ తన కుమారుడు షణ్ముగపాండియన్, సహాయకులు కుమార్, సోములతో మళ్లీ అమెరికాకు పయనమయ్యారు. చదవండి : '40 ఏళ్ల క్రితం ఈ అమ్మాయి కనిపిస్తే నాకు విడాకులు అయ్యేవి కావు' Karthikeya 2: హీరోయిన్ను రివీల్ చేశారు.. -
Tamil Nadu: స్టాలిన్తో జతకట్టనున్న నటుడు విజయ్కాంత్!
ఉదయసూర్యుని (డీఎంకే చిహ్నం) కిరణాల ధాటికి రాష్ట్రంలోని రెండాకులు (అన్నాడీఎంకే చిహ్నం) విలవిల్లాడుతున్నాయి. రెండాకుల నీడను వీడి, దినకరన్ పంచన చేరిన విజయకాంత్ ఇకపై ఉదయసూర్యుడి కోసం ఢంకా (డీఎండీకే చిహ్నం) భజాయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి, చెన్నై: నటుడు విజయకాంత్ అధ్యక్షతన డీఎండీకే ఏర్పడిన తరువాత రెండు అసెంబ్లీ ఎన్నికలను ఒంటరిగా ఎదుర్కొంది. 2011 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే కూటమిలో చేరింది. అధికార అన్నాడీఎంకే తరువాత అత్యధిక స్థానాల్లో గెలుపొందడం ద్వారా ప్రధాన ప్రతిపక్షస్థానం హోదాను పొందింది. ఆ తరువాత జయలలితతో విబేధించి 2016 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే సహా పలుపార్టీలు ఏకమై ప్రజా సంక్షేమ కూటమిని ఏర్పాటు చేసుకుని బరిలోకి దిగి అందరూ బోల్తాపడ్డారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలిగిన డీఎంకేడీకే, టీటీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే కూటమిలో చేరింది. అయితే ఆ కూటమి కనీసం ఒక్కసీటులో కూడా గెలుపొందలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే డీఎంకే కూటమిలో డీఎండీకే చేరుతుందని కొందరు అంచనా వేసినా అది జరగలేదు. ఎన్నికలు ముగిసిన తరువాత డీఎండీకే తరఫున విజయకాంత్ బావమరిది ఎల్కే సుధీష్, కుమారుడు విజయ్ ప్రభాకరన్ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత సీఎం స్టాలిన్ అనారోగ్యంతో ఉన్న విజయకాంత్ను ఇంటికి వెళ్లి పరామర్శించారు. అప్పుడు కరోనా నివారణ కోసం సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.10 లక్షలను విజయకాంత్ అందజేశారు. ఈ పరిణామాలతో డీఎంకే, డీఎండీకే కార్యకర్తలు, నిర్వాహకుల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంది. మరికొన్ని నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండగా డీఎంకే కూటమిలో డీఎండీకే చేరుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. డీఎండీకే శ్రేణుల కూడా ఇదే ఆశిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి ఏమీ సాధించలేమని డీఎండీకే నేత ఒకరు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే డీఎంకే కూటమిలో చేరాలని భావించాం, అయితే చివరి రోజుల్లో ఆ నిర్ణయం మారిపోయిందని సీనియర్ నేత ఒకరు పెదవి విరిచారు. అన్ని పార్టీలతోపాటూ డీఎండీకే కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలు స్థానిక ఎన్నికల్లో చవిచూడరాదని డీఎండీకే గట్టిగా భావిస్తోంది. డీఎంకే కూటమిలో చేరి స్థానిక ఎన్నికల బరిలో దిగేందుకు నిర్ణయించుకున్న డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి, కోశాధికారి ప్రేమలత త్వరలో పార్టీ నిర్వాహకులతో సమావేశం అవుతున్నట్లు సమాచారం. అదే సమావేశంలో డీఎంకే కూటమిలో డీఎండీకే చేరడంపై అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. -
కెప్టెన్ ఇంటికి సీఎం స్టాలిన్.. ఆత్మీయ పలకరింపు
సాక్షి, చెన్నై: అనారోగ్య సమస్యలతో ఇంటికే పరిమితమైన డీఎండీకే అధినేత విజయకాంత్ను సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం పరామర్శించారు. డీఎంకే పార్టీ నేతలు దురైమురుగన్, రాజాలతో కలిసి విరుగంబాక్కంలోని విజయకాంత్ ఇంటికి స్టాలిన్ వెళ్లారు. విజయకాంత్ను శాలువతో సత్కరించారు. తన పక్కన కూర్చోవాలని స్టాలిన్ను విజయకాంత్ కోరడం విశేషం. 15 నిమిషాల పాటు స్టాలిన్ అక్కడే గడిపారు. వారితో పాటు విజయ్కాంత్ సతీమణి ప్రేమలత, తనయుడు విజయ ప్రభాకరన్, బావమరిది సుదీష్ ఉన్నారు. అనంతరం కరోనా నివారణ నిధికి రూ. 10 లక్షల చెక్కును విజయకాంత్ సీఎంకు అందజేశారు. రాజకీయ వైర్యం మరిచి తమ నేతను స్టాలిన్ కలవడంపై డీఎండీకే నేతలు హర్షం వ్యక్తం చేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిని వీడి అమ్మామక్కల్ మునేట్ర కళగంతో కలిసి పోటీచేసిన డీఎండీకే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. -
నటుడు విజయ్కాంత్కు కరోనా
చెన్నై : తమిళ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయ్కాంత్ కరోనా పాజిటివ్గా నిర్థారణ అయినట్టు తేలింది. దీంతో చెన్నైలోని మియోట్ ఇంటర్నేషనల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా మియోట్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ పృథ్వీ మోహన్దాస్ గురువారం విజయ్కాంత్ హెల్త్బులెటిన్ గురించి వివరించారు. 'విజయకాంత్కు తేలికపాటి కరోనా లక్షణాలు వచ్చాయని .. ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు .ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకుంటారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయనున్నాం ' అని తెలిపారు. కాగా అంతకుముందు విజయకాంత్కు కరోనా లక్షణాలు మాత్రమే ఉన్నాయని డీఎండీకే పార్టీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. విజయ్కాంత్ సాధారణ చెకప్ కోసమని ఎప్పటిలాగే మియోట్ ఇంటర్నేషనల్ ఆసుపత్రికి వెళ్లగా.. కరోనా పరీక్షలు నిర్వహించారు.ఇందులో కరోనా సాధారణ లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ప్రకటనలో వివరించింది. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం పళనిసామి సహా పలువురు ప్రముఖులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. (చదవండి : భారత్లో 57 లక్షలు దాటిన కరోనా కేసులు) -
కష్టాల్లో ‘కెప్టెన్’.. ఆస్తులు వేలం!
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ప్రజల చేత కెప్టెన్ అని ప్రేమగా పిలిపించుకునే డీఎండీకే అధ్యక్షుడు, నటుడు విజయకాంత్ ఆర్థిక కష్టాల్లో పడిపోయారు. విజయకాంత్ చెల్లించాల్సిన రూ.5.50 కోట్ల అప్పుబకాయిని రాబట్టుకునేందుకు ఆయన ఇళ్లు, ఇంజినీరింగ్ కాలేజీని వేలం వేయనున్నట్లు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు శుక్రవారం ప్రకటించింది. చెన్నై సాలిగ్రామంలోని లగ్జరీ ఇంట్లో ఆయన కుటుంబ సమేతంగా నివసిస్తున్నారు. అలాగే చెన్నై శివార్లు చెంగల్పట్టు సమీపంలోని మామండూరులో శ్రీ ఆండాళ్ అళగర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కింద ఆండాళ్ ఇంజినీరింగ్ కాలేజీ ఉంది. ఇటీవలి కాలంలో రాజకీయ ఆర్థిక అవసరాలకు అదనంగా డబ్బు అవసరమైంది. అలాగే ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో నెలరోజులకు పైగా అమెరికాలో చికిత్స పొందారు. ఇలాంటి అదనపు ఆర్థిక అవసరాల కోసం ఆయన అప్పులు చేయాల్సి వచ్చింది. చెన్నై మౌంట్రోడ్డులోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఆయన అప్పు తీసుకున్నారు. మధురాంతకంలోని కాలేజీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టారు. అలాగే కాలేజీ అవసరాల కోసం అప్పు అవసరం కావడంతో బ్యాంకు రుణానికి జామీనుదారులుగా విజయకాంత్ ఆయన సతీమణి ప్రేమలత సంతకాలు చేశారు. ఈ రుణం కోసం అదనంగా తన నివాసంతోపాటూ సాలిగ్రామంలోని మరో ఇళ్లను సైతం తనఖా పెట్టారు. ఇలా పలురూపాల్లో తీసుకున్న అప్పు వడ్డీతో కలుపుకుని రూ. 5,52,73,825 కు చేరుకుంది. ఇందుకు సంబంధించి డబ్బు లేదా కనీసం వడ్డీని కూడా విజయకాంత్ గత కొంతకాలంగా చెల్లించలేదు. దీంతో బ్యాంకు ఇటీవల నోటీసులు జారీచేసినా ఆయన స్పందించలేదు. దీంతో తనఖా పెట్టిన విజయకాంత్ ఆస్తులను వేలం వేసి బకాయి రాబట్టుకునేందుకు బ్యాంకు నిర్ణయించుకుంది. విజయకాంత్కు చెందిన స్థిరాస్తులను జూలై 26వ తేదీన వేలం వేయనున్నట్లు శుక్రవారం బహిరంగ ప్రకటన చేసింది. చట్టపరంగా కాపాడుకుంటాం: ప్రేమలత విజయకాంత్ ఆస్తుల వేలం వార్త శుక్రవారం సాయంత్రానికి అన్ని మాధ్యమాల్లో మార్మోగిపోవడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఎలాంటి పరిస్థితులు ఎదరువుతాయోనని ఆందోళన చెందారు. కెప్టెన్ ఇంటివద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకుని తమ అవేదనను వ్యక్తం చేశారు. పలు తమిళమీడియా ప్రతినిధులు సైతం సాలిగ్రామంలోని విజయకాంత్ ఇంటికి వద్దకు రాగా ఆయన సతీమణి ప్రేమలత మాట్లాడుతూ, విజయకాంత్ జీవితం తెరిచిన పుస్తకం, ఎలాంటి దాపరికాలు లేవని అన్నారు. ఆయన సినిమాలు చేయడం లేదు, రాజకీయాల కోసం డబ్బు ఖర్చుపెట్టాల్సి వచ్చింది. ఇంజినీరింగ్ విద్యకు ఉద్యోగావకాశాలు లేకపోవడంతో మా కాలేజీనే కాదు అన్ని కాలేజీల్లో సరైన అడ్మిషన్లు లేవు. ఇలా పలుకోణాల్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో బ్యాంకు బకాయిలు చెల్లించలేకపోయాం. అయినా మించిపోలేదు, ఆస్తులు వేలంలోకి వెళ్లకుండా చట్టపరంగా ఎదుర్కొంటాం అభిమానులు ఆందోళన చెందవద్దని తెలిపారు. -
నడిగర్ సంఘం ఎన్నికల్లో రాజకీయాల్లేవు
పెరంబూరు: నడిగర్సంఘం ఎన్నికల్లో రాజకీ య ప్రభావం లేదని ఐసరిగణేశ్ పేర్కొన్నారు. ఈ సంఘానికి 2019–2022 ఏడాదికిగానూ రానున్న 23వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విశాల్ పాండవర్ జట్టు, కే.భాగ్యరాజ్ స్వామిశంకరదాస్ జట్టు బరిలోకి దిగుతున్నాయి. ఈ సారి కూడా పోటీ బలంగా ఉండడం, ఎన్నికలకు మరో 9 రోజులే గడువు ఉండడంతో ప్రచార మోత మొదలైంది. సభ్యులను ప్రభావితం చేసేలా వాగ్దానాస్త్రాలను ఇరు జట్లు తమ అంబులపొదలలో వేసుకుని సంధించడానికి సిద్ధం అయ్యారు. కాగా ఈ సారి ప్రచారంలో స్వామిశంకర్దాస్ జట్టు ముందుంది. నడిగర్ సంఘం ప్రస్తావనలో నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ పేరు గుర్తుకు రాక తప్పదు. సంఘం అప్పుల భారం మోస్తున్న తరుణంలో పార్టీకి అధ్యక్ష పదవిని చేపట్టిన విజయకాంత్ సంఘాన్ని రుణ విముక్తి చేసి లాభాల బాట పట్టించారు. దీంతో సంఘంలో ఆయనకు అత్యంత గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఏ జట్టు అయినా ఆయనను కలిసి మద్దతు తీసుకుంటారు. అలా గురువారం ఉదయం స్వామిశంకరదాస్ జట్టు విజయకాంత్ను ఆయన ఇంట్లో కలిసి మద్దతు కోరారు. అనంతరం ఆ జట్టు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న దర్శక, నటుడు కే,.భాగ్యరాజ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల ఆయన నాటక కళాకారులకు డబ్బు ఇస్తానన్న మాటలు చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయాన్ని ఆయన ముందు ప్రస్తావించగా, అందుకు బదలిచ్చిన కే.భాగ్యరాజ్ తాను ఓటుకు నోటులిస్తానని చెప్పలేదని, సాధారణంగా సినీ కళాకారులు ఆర్థి కంగా చితికిపోయిన నాటక కళాకారులను కలసినప్పుడు వారికి డబ్బు ఇవ్వడం జరుగుతుందని, ఇందుకు నటుడు విశాల్, కార్తీ వంటి వారూ అతీ తులు కాదని పేర్కొన్నారు. విజయకాంత్ను కలవడం గురించి అడిగిన ప్రశ్నకు విజయకాంత్ను కలవడం సంతోషంగా ఉందని, ఆయన తమ చేతులు పట్టుకుని ఆశీర్వదించారని చెప్పారు. ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అదే విధంగా నడిగర్సంఘం ఎన్నికల్లో రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయని సీనియర్ నటుడు,నడిగర్సంఘం మాజీ కార్యదర్శి రాధారవి చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా నటుడు,నిర్మాత, ప్రస్తుతం సంఘ కార్యదర్శి పదవికి పోటీలో ఉన్న ఐసరిగణేశ్ స్పందిస్తూ తమ జట్టుకు పలువులు సహకరిస్తున్నారనీ, అయితే నటుడు రాధారవి తమకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని చెప్పలేమనీ అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని అన్నారు.తమకు సంబంధించినంత వరకూ ఈ ఎన్నికల్లో రాజకీయ జోక్యం లేదనీ ఐసరిగణేశ్ పేర్కొన్నారు. -
విజయకాంత్, ప్రేమలతపై సెటైర్లు..
సాక్షి, చెన్నై: లోక్సభ ఎన్నికల్లో డిపాజిట్ల గల్లంతే కాదు, ఓటింగ్ శాతాన్ని డీఎండీకే పూర్తిగా కోల్పోయింది. వరుస పతనాల నేపథ్యంలో ఆ పార్టీ మరింత కష్టాల్లోకి కూరుకుపోయింది. ఆ పార్టీకి ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపు రద్దు అయినట్టే. అలాగే, ఢంకా చిహ్నం దూరం కావడం దాదాపుగా ఖాయమైంది. విజయకాంత్కు షాక్ల మీద షాక్లు తగలడం ఓ వైపు ఉంటే, ఆయన సతీమణి ప్రేమలత తీరుపై డీఎండీకే వర్గాలు విమర్శలు గుప్పించే పనిలో పడడం గమనార్హం. సినీ నటుడిగా అశేషాభిమాన లోకం మదిలో ముద్ర వేసుకున్న విజయకాంత్ 2005లో మదురై వేదికగా డీఎండీకేను ప్రకటించారు. దేశీయ ముర్పోగు ద్రావిడ కళగంతో 2006లో ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో విజయకాంత్ ఒక్కడే అసెంబ్లీ మెట్లు ఎక్కారు. అయితే, ఆ ఎన్నికల్లో విజయకాంత్ సొంతం చేసుకున్న ఓటు బ్యాంక్ ఆ పార్టీ బలాన్ని మరింతగా పెంచింది. 2009 లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన విజయకాంత్ 10.3 శాతం ఓటు బ్యాంక్ను సొంతం చేసుకున్నారు. ఆ తదుపరి పరిణామాలతో 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించారు. ఇందుకు కారణం అన్నాడీఎంకేతో పొత్తుతో ఆ ఎన్నికల్ని ఎదుర్కొనడమే. ప్రధాన ప్రతి పక్ష నేతగా ఉన్నత స్థితికి ఎదిగిన వేళ అన్నాడీఎంకేతో వైరం విజయకాంత్ను కష్టాల సుడిగుండంలో పడేసింది. పార్టీ ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే జై కొట్టడం వంటి పరిణామాలు విజయకాంత్ను ఇరకాటంలో పెట్టాయి. అయినా, ఏ మాత్రం తగ్గని విజయకాంత్ 2014 లోక్సభ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేకు ప్రత్యామ్నాయంగా ఎన్డీఏ నేతృత్వంలో కూటమి ఏర్పాటులో సఫలీకృతుడయ్యారు. అయితే, ఆ ఎన్నికల్లో డిపాజిట్ల గల్లంతుతో పాటు ఓటు బ్యాంక్ పతనం మొదలైంది. 2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్య నేతలు డీఎంకే, అన్నాడీఎంకేల్లోకి వెళ్లడంతో అభ్యర్థుల కోసం తీవ్ర కుస్తీలు పట్టక తప్పలేదు. చివరకు ఆ ఎన్నికల ఫలితాలు విజయకాంత్ను పాతాళంలోకి నెట్టే పరిస్థితిని కల్పించాయి. విజయకాంత్ సైతం ఓటమి పాలు కాగా, ఓటు బ్యాంక్ ఐదు శాతం పైగా దక్కించుకుని పార్టీ గుర్తింపు రద్దు కాకుండా గట్టెక్కారు. గుర్తింపు రద్దయినట్లే.... 2016 ఎన్నికల అనంతరం అనారోగ్య కారణాలతో విదేశాలకు వెళ్తూ వచ్చిన విజయకాంత్కు 2019 లోక్సభ ఎన్నికల్లో డిమాండ్ పెరిగింది. ఆయన్ను తమ వైపు అంటే, తమ వైపు తిప్పుకునేందుకు డీఎంకే, అన్నాడీఎంకేలు ప్రయత్నించాయి. చివరకు అన్నాడీఎంకే – బీజేపీతో జతకట్టిన విజయకాంత్ నాలుగు చోట్ల పోటీ చేశారు. అయితే, ఎన్నికల ఫలితాలు డీఎండీకేను కష్టాల కడలిలో పడేసింది. డిపాజిట్లే కాదు, ఓటు బ్యాంక్ పూర్తిగా పతనమైంది. విజయకాంత్ బావ మరిది సుదీష్ కళ్లకురిచ్చి నుంచి పోటీ చేయగా, 3 లక్ష 21 వేల 794 ఓట్లు దక్కించుకున్నారు. విరుదునగర్లో ఆ పార్టీ నేత అళగర్ స్వామి 3 లక్షల 16 వేల 329 ఓట్లు రాబట్టుకోగలిగారు. ఇక, ఉత్తర చెన్నైలో మోహన్ రాజు లక్షా 29 వేల 468, తిరుచ్చిలో ఇలంగోవన్ లక్షా 61 వేల 999 ఓట్లతో సరిపెట్టుకున్నారు. పార్టీ ఓటు బ్యాంక్ అన్నది 2.19 శాతానికి దిగ జారింది. దీంతో ఆ పార్టీకి ఎన్నికల కమిషన్ గుర్తింపు రద్దు అయినట్టే అన్న పరిస్థితి. డిపాజిట్లతో పాటు ఓటు బ్యాంక్ తగ్గిన దృష్ట్యా, ఆ పార్టీ ఎన్నికల చిహ్నం ఢంకా కూడా దూరమైనట్టే. ఎన్నికల కమిషన్ గుర్తింపు ఓ పార్టీకి తప్పనిసరిగా ఉండాలంటే, కనీసం ఆరు శాతం మేరకు ఓటు బ్యాంక్ను కల్గి ఉండాల్సి ఉంది. అలాగే, ఒక ఎంపీ లేదా, కనీస సంఖ్యలో ఎమ్మెల్యేలైనా ఎన్నిక కావాల్సి ఉంది. అయితే, డీఎండీకేకు వరసుగా మూడు ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు కావడంతో ఆ పార్టీ గుర్తింపు ఇక రద్దయినట్టే. అలాగే, ఢంకా చిహ్నం కూడా ఆ పార్టీకి శాశ్వతంగా దూరం ఖావడం తథ్యం. కాగా, పార్టీ ఓటమికి కోశాధికారి ప్రేమలత విజయకాంత్ కారణం అంటూ ఆ పార్టీ వర్గాలే విమర్శలు గుప్పించే పనిలో పడ్డారు. ఇందుకు తగ్గట్టుగా, సామాజిక మాధ్యమాల్లో ప్రేమలత విజయకాంత్పై సెటైర్లు జోరందుకోవడం గమనార్హం. డీఎంకే తలుపులు తెరచి ఉన్నప్పుడే లోనికి వెళ్లకుండా, అన్నాడీఎంకే వైపుగా వెళ్లి వదినమ్మ పెద్ద తప్పే చేశారని, ఇప్పడు అన్నయ్యకు మరింత కష్టాలు తెచ్చి పెట్టారన్నట్టుగా వ్యాఖ్యల తూటాలు సామాజిక మాధ్యమాల్లో పేలుతున్నాయి. -
మోదీ సభ: బీజేపీ కూటమిలోకి విజయ్కాంత్
సాక్షి, చెన్నై: పొత్తుల పరంగా తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే, బీజేపీ కూటమితో నటుడు కెప్టెన్ విజయ్కాంత్ నేతృత్వంలోని డీఎండీకే చేతులు కలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం కంచీపురంలో భారీ ఎన్నికల ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో అన్నాడీంఎకే-బీజేపీ కూటమిలో డీఎండీకే చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. తమ కూటమిలో డీఎండీకే చేరిన విషయాన్ని తమిళనాడు సీఎం పళనిస్వామి ధ్రువీకరించారు. రానున్న ఎన్నికల్లో మొత్తం నాలుగు పార్టీలు (అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే, డీఎండీకే) కూటమిగా పోటీ చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. విజయ్కాంత్ సతీమణి, డీఎండీకే కోశాధికారి ప్రేమలతతోపాటు పలువురు నేతలు సీఎం నివాసంలో పళనిస్వామిని కలిశారు. మరోవైపు ప్రధాని మోదీ సభా ప్రాంగణంలో వేదికపై ఏర్పాటు చేసిన పోస్టర్లో ప్రధాని మోదీ, సీఎం పళనిస్వామితోపాటు విజయ్కాంత్ చిత్రం కూడా ఉంది. ఇప్పటికే అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే కూటమిగా ఏర్పడ్డాయి. కూటమిలో కొత్తగా చేరిన డీఎండీకేకు నాలుగు నుంచి 5 లోక్సభ స్థానాలు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్-డీఎంకేలు కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కూటమిలో చేరేందుకు డీఎండీకే ఆసక్తి చూపించినా.. మిత్రపక్ష పార్టీల కోసం మరిన్ని సీట్లు వదులుకోవడానికి డీఎంకే నిరాకరించడంతో ఇది సాధ్యపడలేదని తెలుస్తోంది. తమిళనాడులోని 39స్థానాల్లో బీజేపీకి ఐదు, పీఎంకేకు ఏడు స్థానాలను అన్నాడీఎంకే ఇప్పటికీ ఖరారు చేసింది. -
కెప్టెన్ చుట్టూ కూటమి రాజకీయాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్రంలోని రెండు కూటములు సీట్ల సర్దుబాట్లలో ఒకవైపు దూసుకుపోతున్నా డీఎండీకే వైఖరి వల్ల ముందుకు పోలేని పరిస్థితి నెలకొని ఉంది. రెండు కూటములకు చెందిన నేతలు డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో కెప్టెన్ చుట్టూ కూటమి రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ఒక కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అలాగే ప్రతిపక్ష హోదాలో ఉన్న డీఎంకే, కాంగ్రెస్లో మరోకూటమిగా ఏర్పడి అధికారహోదా కోసం అర్రులు చాస్తున్నాయి. రాష్ట్రంలోని వామపక్షాలతోపాటు ప్రాంతీయ పార్టీలన్నీ ఏదో ఒక కూటమిలో సర్దుకుపోయాయి. అయితే అన్నాడీఎంకే, డీఎంకేల తరువాత అతిపెద్ద పార్టీ తనదేనని చెప్పుకుంటున్న డీఎండీకే అధినేత విజయకాంత్, గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ను వీడి మాత్రం సొంతకుంపటి పెట్టుకున్న తమిళమానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్ మాత్రం ఏ కూటమిలో చేరుదామా అనే తీరులో ఇంకా తర్జనభర్జన దశలోనే ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల వేడిరాజుకున్న కొత్తల్లో అన్నాడీఎంకే– బీజేపీ కూటమివైపు మొగ్గిన విజయకాంత్కు అక్కడ ఆశించిన సీట్లు దక్కకపోవడంతో కాంగ్రెస్, డీఎంకే కూటమి వైపు దృష్టి సారించారు. ఈ విషయాన్ని పసిగట్టిన ప్రతిపక్ష కూటమి విజయకాంత్ను మచ్చిక చేసుకునే పనిలో పడింది. తమిళనాడు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ గురువారం విజయకాంత్ను కలిశారు. ఇక శుక్రవారంనాడు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కూడా విజయకాంత్ ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. అయితే ఎవ్వరికీ విజయకాంత్ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఒకటి రెండురోజుల్లో నిర్ణయాన్ని తీసుకుంటానని విజయకాంత్ ప్రకటించారు. ఇదిలా ఉండగా నటుడు రజనీకాంత్ సైతం శుక్రవారం విజయకాంత్ ఇంటికి వెళ్లి వచ్చారు. అయితే కేవలం స్నేహపూర్వక కలయిక మాత్రమే ఒక్కశాతం రాజకీయాలు కూడా లేవని రజనీకాంత్ ఈ సందర్భంగా మీడియాకు స్పష్టం చేశారు. విజయకాంత్ ఇంటి వద్ద ఇలా ఎదుటి కూటమికి చెందిన నేతలు క్యూ కట్టడం అన్నాడీఎంకే అగ్రజులు ఎడపాడి, పన్నీర్సెల్వంలను ఆశ్చర్యానికి గురిచేసింది. డీఎండీకేను ఎలాగైనా తమ జట్టులో చేర్చుకోవాలని భావిస్తున్న అన్నాడీఎంకే విజయకాంత్కు ఐదుస్థానాలు కేటాయించేందుకు సిద్ధపడినట్లు సమాచారం. ఈ మేరకు మరలా కెప్టెన్తో చర్చలు మొదలుపెట్టారు. బీజేపీ–అన్నాడీఎంకే కూటమిలో డీఎండీకే చేరడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై శుక్రవారం ధీమా వ్యక్తం చేశారు. కూటమి చర్చల్లో ఎలాంటి ప్రతిష్టంభనలు లేవు, వారంరోజుల్లో ఒక నిర్ణయానికి వస్తామని విజయకాంత్ సతీమణి, డీఎండీకే కోశాధికారి ప్రేమలత ప్రకటించారు. ఇలా రాష్ట్రంలోని రెండు కూటములు కెప్టెన్ చుట్టూ తిరుగుతుండగా విజయకాంత్ ఎటువైపు మొగ్గుతారా వేచిచూడాల్సిందే. -
విజయకాంత్, రజనీకాంత్ భేటీపై తీవ్ర చర్చ
సాక్షి, చెన్నై: నటుడు, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయకాంత్తో సూపర్ స్టార్ రజనీకాంత్ భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం విజయకాంత్ నివాసానికి వచ్చిన రజినీకాంత్ అరగంట సేపు అక్కడ గడిపారు. కేవలం విజయకాంత్ను పరామర్శించేందుకే తాను వచ్చినట్టు భేటీ అనంతరం రజనీకాంత్ పేర్కొన్నారు. అలాగే తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని తెలిపారు. కానీ ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ నేపథ్యంలో వీరి భేటీ రాజకీయ వర్గాలో తీవ్ర చర్చకు దారితీసింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీతో కలిసి అన్నాడీఎంకే కూటమిగా ఏర్పడితే.. డీఎంకే కాంగ్రెస్తో జత కట్టింది. అయితే తొలుత అన్నాడీఎంకే కూటమిలో చేరుతుందని భావించిన డీఎండీకే.. సీట్ల సర్దుబాటు కుదరక కూటమి నుంచి వైదొలుగుతున్నట్టుగా వార్తలు వెలువడ్డాయి. ఈ పరిణామాల మధ్య విజయకాంత్ తమ పార్టీ ఆశవహులు ఒంటరిగా బరిలో నిలువనున్నారనే సంకేతాలు పంపారు. ఈ నేపథ్యంలో గురువారం విజయకాంత్తో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ తాజా మాజీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. పరోక్షంగా అన్నాడీఎంకే కూటమికి దూరంగా ఉండాలని ఆయన విజయకాంత్ను కోరినట్టుగా సమాచారం. అయితే ఆ మరుసటి రోజే రజినీకాంత్ విజయకాంత్తో భేటీ కావడంతో డీఎండీకే ఏ కూటమి వైపు మొగ్గు చూపుతుందనే దానిపై ఉత్కంఠత నెలకొంది. మరోవైపు రాజకీయ ఎంట్రీని స్పష్టం చేసిన రజినీకాంత్.. తాను రానున్న లోక్సభ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయనని తెల్చిచెప్పిన సంగతి తెలిసిందే. -
డీఎండీకే అధినేతకి అస్వస్థత
సాక్షి, చెన్నై : : డీఎండీకే అధినేత, తమిళ ప్రముఖ నటుడు విజయకాంత్ అస్వస్థతకు గురయ్యారు. అరోగ్యం క్షీణించడంతో ఆయనను ఆదంబాక్కంలోని మియాట్ ఆస్పత్రికి తరలించారు. గత కొంత కాలంగా విజయ్ కాంత్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. సినీ నటుడిగా అశేష అభిమానుల నాయకుడిగా మన్ననల్ని అందుకున్న విజయకాంత్ డీఎండీకేతో రాజకీయాల్లో అడుగు పెట్టి ప్రధాన ప్రతి పక్ష నేత స్థాయికి చేరారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు. -
డీఎండీకే అధినేత విజయకాంత్కు అస్వస్థత
సాక్షి, చెన్నై : డీఎండీకే అధినేత, తమిళ ప్రముఖ నటుడు విజయకాంత్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళనలకు గురయ్యారు. అయితే సాధారణ హెల్త్ చెకప్ కోసమే విజయకాంత్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. శనివారం ఉదయం డిశ్చార్జ్ అవుతారని పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. -
విజయకాంత్ చేదు వార్త
సాక్షి, హైదరాబాద్ : సినీరంగం నుంచి రాజకీయాల్లో ప్రవేశించి తనదైన ముద్ర వేసిన నటుడు కెప్టెన్ విజయ్కాంత్ మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. గత కొద్ది సంవత్సరాలుగా పలు ఆరోగ్య సమస్యలతో కెప్టెన్ సతమతమవుతున్నారు. ఇందుకోసం పలుమార్లు శస్త్రచికిత్సలు కూడా ఆయన చేయించుకున్నారు. తాజాగా అనారోగ్యానికి గురైన డీఎమ్డీకే పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ ఇంటికే పరిమితం అయ్యారు. చికిత్స నిమిత్తం అమెరికా వెళ్తున్నట్లు ట్విట్టర్లో విజయ్కాంత్ ట్వీట్ చేశారు. ఈ నెల 7వ తేదీన వెళ్తున్నానని, వీడ్కోలు చెప్పేందుకు ఎయిర్పోర్టుకు రావొద్దని అభిమానులను కోరారు. pic.twitter.com/967LlEGiVd — Vijayakant (@iVijayakant) July 5, 2018 -
నాన్నకు ప్రేమతో..
తమిళసినిమా: కన్నవారిపై ఎవరికైనా ప్రేమ ఉంటుంది. అయితే దాన్ని నిరూపించుకోవడానికి విశేష సందర్భం అందరికీ కలగదు. యువ నటుడు షణ్ముగ పాండియన్కు అలాంటి మంచి తరుణం కలిసొచ్చింది. సీనియర్ నటు డు, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయ్కాంత్ పుత్రరత్నాల్లో ఒకరే ఈ షణ్ముగపాండియన్. ఈయన కథానాయకుడిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. షణ్ముగ పాండియన్ నటించిన మదురైవీరన్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చిం ది. ఇక విజయకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనది 40 ఏళ్ల గొప్ప నట చరిత్ర. అందులో ఎన్నో సంచలన విజయాలను అందుకున్నారు. ఎందరికో నట జీవితా న్ని ప్రసాదించిన ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి న నటుడు విజయకాంత్. అలాంటి ఆయన 40 సినీ వసంతోత్సవ వేడుకను ఇటీవల కాంచీపురం సమీపంలో ఘనంగా నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు, వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆ వేడుకలో పాల్గొని ఆశీర్వాదాలు, అభినందనలు అందించారు. అదే వేదికపై విజయకాంత్ కుటుంబసభ్యులు పాల్గొన్నా, ఆయన చిన్న కొడుకు, నటుడు షణ్ముగపాండియన్ హాజరు కాలేదు. కారణం ఆ సమయంలో ఆయన లండన్లో ఉన్నారు. నాన్న 40 నట వసంతాల వేడుకలో పాల్గొన లేకపోయానన్న కొరతను ఇటీవల చెన్నైకి తిరిగొచ్చిన తరువాత తీర్చుకున్నారు. అది ఎలాగంటే తన తండ్రి రెండు కళ్లను తన బాహువులపై పచ్చబొట్టు పొడిపించుకుని ఆయన ముందు నిలిచి ఇది నాన్నపై తనకున్న ప్రేమ అని నిరూపించుకున్నారు. అదే సమయంలో తన తండ్రి ఆశీస్సులు అందుకుని ఎనలేని ఆనంద తరుణాన్ని పంచుకున్నారు. తండ్రితో ఫొటో తీసుకుని మధురానుభూతిని పొందారు. -
విజయకాంత్, ప్రేమలత అరెస్ట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: కర్ణాటకకు చెందిన వ్యక్తిని అన్నాయూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా నియమించడాన్ని నిరసిస్తూ డీఎండీఎంకే శుక్రవారం భారీ ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు విజయకాంత్తోపాటూ పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నాయూనివర్సిటీ వైస్చాన్స్లర్గా కర్ణాటక రాష్ట్రానికి చెందిన సూరప్పను గవర్నర్ ఖరారు చేశారు. తమిళనాడు, కర్ణాటకల మధ్య కావేరి జల వివాదం, మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటులో కేంద్రం అవలంబిస్తున్న నిర్లక్ష్యవైఖరిపై రాష్ట్రంలో ఉధృతంగా పోరాటాలు సాగుతున్న తరుణంలో సూరప్ప నియామకం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తం అయ్యాయి. అయితే ఇవేమీ పట్టనట్లుగా ఇటీవలే వైస్చాన్స్లర్ సూరప్ప బాధ్యతలు చేపట్టారు. సూరప్ప పేరును ఉపసంహరించాలని కోరుతూ ఈనెల 18వ తేదీన గవర్నర్ బంగ్లా దిశగా ర్యాలీలు నిర్వహించాలని డీఎండీకే నిర్ణయించింది. అయితే ఇందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసు నిషేధాజ్ఞలు మీరి ఈనెల ర్యాలీ జరపాలని డీఎండీకే శ్రేణులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సైదాపేట పనగల్మాలిగై వద్ద వేలాదిగా చేరుకున్నారు. వందకుపైగా పోలీసులు మోహరించారు. డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత నాయకత్వంలో పార్టీ కార్యకర్తలంతా గవర్నర్ బంగ్లా వైపు ర్యాలీగా కదిలారు. వీసీగా సూరప్ప నియామకాన్ని ఖండిస్తూ, గోబ్యాక్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీ కొద్దిదూరం కూడా సాగకమునుపే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరుపక్షాల మధ్య తోపులాట, వాగ్వివాదం చోటుచేసుకుంది. కొందరు కార్యకర్తలు గవర్నర్ బంగ్లా వైపు పరుగులు పెట్టగా పోలీసులు వారి వెంటపడి పట్టుకున్నారు. గవర్నర్ బంగ్లా ముట్టడియత్నం చేసిన విజయకాంత్, ప్రేమలత సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో కూర్చుని ఉన్న విజయకాంత్ గవర్నర్ బంగ్లావైపు వెళ్లే ప్రయత్నం చేయడంతో ఆయన్ను కూడా అరెస్ట్ చేశారు. డీఎండీకే ఆందోళన కారణంగా సైదాపేట పరిసరాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. అరెస్ట్ చేసిన వారందరినీ సాయంత్రం విడిచిపెట్టారు. -
రేపు కుండబద్దలు కొడతా: అగ్రహీరో
సాక్షి, చెన్నై: విలక్షణ నటుడు కమల్హాసన్ రేపటి నుంచి రాజకీయ నాయకుడిగా మారబోతున్నారు. రేపు ఆయన సొంత పార్టీ ప్రకటించబోతున్నారు. ఈ నెల 21న రామేశ్వరంలో కమల్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, అదే రోజు మథురైలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. తన రాజకీయ ప్రయాణంలో రేపు అన్ని కుండబద్దలు కొడతానని ఆయన తెలిపారు. ఎవరెవరు తనతో కలిసి వస్తారో పార్టీ ప్రకటించాక చెబుతానని అన్నారు. తమిళ రక్తానికి నా మద్దతు: సీమాన్ నామ్ తమిళర్ నేత సీమాన్ మంగళవారం కమల్హాసన్ను కలిశారు. ఈ సందర్భంగా సీమాన్ మాట్లాడుతూ.. తమిళ రక్తానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. కమల్ నటన చూసి అభిమానిగా పెరిగానని, ఆయన కలుస్తానంటే వచ్చికలిసినట్టు చెప్పారు. రజనీకాంత్ కలుస్తానంటే తప్పకుండా కలుస్తానని చెప్పారు. కాగా, కమల్ హాసన్ సోమవారం డీఎండీకే విజయకాంత్ను కలిశారు. రజనీకాంత్, డీఎంకే అధినేత కరుణానిధి, స్టాలిన్లతో ఆదివారం భేటీ అయ్యారు. -
రాజకీయాల్లో ఆయన నా సీనియర్..!
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయ పార్టీ ఏర్పాట్లలో ఉన్న ప్రముఖ నటుడు కమల్హాసన్ ఇటీవల పలు పార్టీల నేతలను, సహచర నటులను కలుస్తున్నారు. ఆ కోవలోనే ఆయన నటులు రజనీకాంత్, డీఎంకే అధినేత కరుణానిధి, స్టాలిన్లను ఆదివారం కలిశారు. తాజాగా, సోమవారం చెన్నైలోని కోయంబేడులోని డీఎండీకే ప్రధాన కార్యాలయానికి వెళ్లి విజయకాంత్తో సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు. ‘మీవంటి వాళ్లు రాజకీయాల్లోకి రావడం అవసరం’ అని కమల్కు విజయకాంత్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని ప్రారంభించే ముందు నేతలను కలుస్తున్నట్లే రాజకీయాల్లో తన కంటే సీనియర్ అయిన విజయకాంత్ను కలిసానని కమల్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. కాగా, కమల్, రజనీ కలవడం వల్ల తమకు వచ్చిన నష్టమేమీ లేదని మంత్రి జయకుమార్ వాఖ్యానించారు.ఈ నెల 21న రామేశ్వరంలో కమల్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, అదే రోజు మథురైలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఎంజీ రామచంద్రన్, జయలలిత, విజయకాంత్ ఇలా అందరూ తమ రాజకీయ తొలి అడుగును మథురై జిల్లా నుంచే ప్రారంభించడం గమనార్హం. -
రజనీ, కమల్ పొలిటికల్ ఎంట్రీపై ‘కెప్టెన్’ కామెంట్
సాక్షి, చెన్నై: రజనీకాంత్, కమల్హాసన్ రాజకీయ ప్రవేశంపై డీఎండీకె అధ్యక్షుడు, నటుడు ‘కెప్టెన్’ విజయ్కాంత్ స్పందించారు. వీరిద్దరి కంటే రాజకీయాల్లో తానే సీనియర్ అని చెప్పారు. రజనీ, కమల్ తన కంటే జూనియర్లని అని వ్యాఖ్యానించారు. వీరిద్దరితో కలిసి పోటీ చేయబోమని సూచనప్రాయంగా వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎండీకె ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు. తమిళుల దేవత ఆండాల్ అమ్మవారిపై కవి, సినీగేయ రచయిత వైరముత్తు చేసిన వ్యాఖ్యలను విజయ్కాంత్ ఖండించారు. వైరముత్తుకు వ్యతిరేకంగా జీయర్ల పోరాటానికి మద్దతు తెలిపారు. కాగా, ఒక పత్రికలో ఆండాల్ అమ్మవారి గురించి రాసిన వైరముత్తు.. ఆమెను 'దేవదాసి'తో పోల్చారు. దీంతో హిందూ సంఘాలు ఆయనపై మండిపడ్డాయి. తన వ్యాఖ్యలకు వైరముత్తు క్షమాపణ చెప్పినప్పటికీ నిరసనలు ఆగలేదు. వైరముత్తు నాలుక కోస్తే రూ.10 కోట్లు బహుమతిగా ఇస్తానని బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ప్రకటించడం సంచలనం రేపింది. -
రంగంలోకి దిగిన కెప్టెన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో తలెత్తిన రాజకీయ సంక్షోభంపై డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ స్పందించారు. పళనిస్వామి సర్కారు బలం నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. మైనార్టీలోకి పడిపోయిన రాష్ట్ర ప్రభుత్వాన్ని బలపరీక్షకు ఆదేశించాల్సిందిగా గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్ను కోరారు. చెన్నై రాజ్భవన్లో శనివారం కొత్త గవర్నర్కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు వినతిపత్రం సమర్పించారు. ‘గత ఏడాది కాలంలో రాష్ట్రంలో పాలన పూర్తిగా కుంటుపడింది. ఒక్క కొత్త పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం లేదు. ప్రజలను, రాష్ట్రాన్ని మోసపుచ్చుతూ పాలకులు కాలక్షేపం చేస్తున్నారు. డెంగీ జ్వరాల విశ్వరూపం, శాంతి భద్రతల సమస్య, అన్నదాతల ఆవేదనలు, రేషన్ దుకాణాల్లో సరుకుల కొరత వంటి సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టిన అధికార పార్టీ నేతలు తమ పదవులను కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా వ్యవహరిస్తారని గవర్నర్గా బాధ్యతలు స్వీకరించేపుడు మీరు చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకుని ఈ వినతి పత్రం సమర్పిస్తూ జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామ’ని వినతి పత్రంలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధం అని, ఒంటరిగానే పోటీ చేస్తామని ఈ సందర్భంగా కలిసిన మీడియాతో విజయకాంత్ చెప్పారు. -
వారు రాజకీయాల్లోకొచ్చినా భయం లేదు
పెరంబూరు: రజనీకాంత్, కమలహాసన్ రాజకీయాల్లోకొచ్చినా మాకేం భయం లేదు అని డీఎం డీకే అధ్యక్షుడు, నటుడు విజయకాంత్ అన్నారు. పుదుగై జిల్లా, నెడువాసల్ గ్రామప్రజలు తమ ప్రాంతంలో హైడ్రోకార్బన్ పథకానికి వ్యతిరేకంగా గత ఏప్రిల్ 12 నుంచి పోరాటాలు చేస్తున్నారు. వారికి మద్దతు తెలపడానికి ఆదివారం డీఎండీకే నేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత ఆ గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా విజయకాంత్ మాట్లాడుతూ ప్రాణాలొడ్డి అయినా హైడ్రోకార్బన్ పథకాన్ని అడ్డుకుంటా మన్నారు. సోమవారం ఆ గ్రామంలో హైడ్రోకార్బన్ పథకం ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలించిన విజయకాంత్ ఈ పథకాన్ని నిలిపి వేసేలా అవసరం అయితే రాష్ట్ర, కేంద్ర మంత్రులను కలిసి వారిపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. అదే విధంగా రజనీకాంత్, కమలహాసన్ రాజకీయ రంగ ప్రవేశంపై ప్రస్తావిస్తూ, వారు రాజకీయల్లోకి వచ్చినా తమకు భయం లేదని వ్యాఖ్యానించారు. సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం చేయాలని ఆయన అభిమానులు ఆశిస్తుండటంతో పాటు, ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా నటుడు కమలహాసన్ అన్నాడీఎంకే నేతలపై అవినీత అస్త్రాలను సంధిస్తున్నారు. దీంతో తమిళనాడు భవిష్యత్తు రాజకీయాలు ఎటు దారి తీస్తాయోనన్న ఆసక్తి నెలకొంది. -
వాళ్లిద్దరూ వచ్చినా భయంలేదు: విజయ్కాంత్
పెరంబూరు(తమిళనాడు): రజనీకాంత్, కమల్హాసన్ రాజకీయాల్లోకొచ్చినా తమకేం భయం లేదని డీఎండీకే అధ్యక్షుడు, నటుడు ‘కెప్టెన్’ విజయ్కాంత్ అన్నారు. కమల్హాసన్ ఒక్కరే ధైర్యంగా రాష్ట్ర నాయకుల గురించి వాస్తవాలు మాట్లాడుతున్నారని మెచ్చుకున్నారు. సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం చేయాలని ఆయన అభిమానులు ఆశిస్తుండటంతోపాటు, ఆయనపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల అన్నాడీఎంకే నేతల అవినీతిపై కమల్హాసన్ విమర్శనాస్త్రాలను సంధించారు. దీంతో తమిళనాడు భవిష్యత్ రాజకీయాలు ఎటువైపు దారి తీస్తాయోనన్న ఆసక్తి నెలకొంది. పుదుగై జిల్లా నెడువాసల్ గ్రామ ప్రజలు తమ ప్రాంతంలో హైడ్రో కార్బన్ పథకాన్ని అమలు చేయరాదంటూ గత ఏప్రిల్ 12వ తేదీ నుంచి పోరాటం చేస్తున్నారు. వారికి మద్దతు తెలపడానికి ఆదివారం డీఎండీ నేత విజయ్కాంత్, ఆయన సతీమణి ప్రేమలత ఆ గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా విజయకాంత్ మాట్లాడుతూ హైడ్రో కార్బన్ పథకాన్ని అమలు పరచడానికి అధికారులతో మంత్రులు గ్రామంలోకి అడుగు పెడితే ప్రాణాలొడ్డి అయినా వారిని అడ్డుకుంటామని అన్నారు. సోమవారం ఆ గ్రామంలో హైడ్రో కార్బన్ పథకాన్ని ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలించిన విజయకాంత్ ఈ పధకాన్ని నిలిపి వేసేలా అవసరం అయితే రాష్ట్ర, కేంద్ర మంత్రులను కలిసి వారిపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా రజనీకాంత్, కమల్హాసన్ రాజకీయాలను ప్రస్తావిస్తూ, వారు రాజకీయల్లోకి వచ్చినా తమకు భయం లేదని వ్యాఖ్యానించారు. -
పనికొచ్చే ప్రశ్నలు వేయండి
సాక్షి, చెన్నై : ప్రజల్లోకి వచ్చిన మరుసటి రోజే డీఎండీకే అధినేత విజయకాంత్ టెన్షన్కు గురయ్యారు. తన ధోరణి ఇంతే అని నిరూపించుకుంటూ మీడియా ముందు శివాలెత్తారు. ఏందీ..అమ్మమ్మా...అంటూ కోపం వచ్చేస్తుంది..వస్తే అంతే అంటూ విరుచుకు పడ్డారు. తదుపరి త్వరలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు.రెండు నెలలకు పైగా డీఎండీకే అధినేత విజయకాంత్ అనారోగ్యంతో ఇం టికి, ఆస్పత్రికి పరిమితమైన విష యం తెలిసిందే. శని వారం శివగంగైలో పర్యటించిన ఆయన తాను ఆరోగ్య వంతుడినయ్యానని చాటుకున్నారు. ప్రజలతో ఇక మమేకం అని ప్రకటించుకుని , రెండో రోజు ఆదివారం తిరునల్వేలిలో పర్యటించారు. అయితే, ఆయన ధోరణిలో మాత్రం ఎలాంటి మార్పులేదు. మరింత దూకుడుతో ఆగ్రహాన్ని ప్రదర్శించడం గమనార్హం. కెప్టెన్ టెన్షన్ : డీఎండీకే నాయకుడి ఇంటి శుభకార్య వేడుకకు సతీమణి ప్రేమలతతో కలిసి హాజరై విజయకాంత్ను మీడియా వర్గాలు చుట్టుముట్టి ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశాయి. దీంతో తనలో కొంత కాలంగా నిద్రపోతున్న ఆవేశాన్ని బయటకు తీశారు. అన్నాడీఎంకే గురించి సంధించిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ఓపీఎస్ చెప్పాడంటా... అమ్మ.. అమ్మ మ్మా... ఏందీ అమ్మమ్మా...నాకు కోపం వచ్చిం దో... అంటూ నాలుక మడత పెట్టి మరీ ఆగ్రహాన్ని ప్రదర్శించడంతో మీడియా వర్గాలు అవాక్కయ్యారు. అన్నాడీఎంకేలోని శిబిరాల గురించి ప్రస్తావించగా, ఓపీఎస్(పన్నీరు), ఈపీఎస్(ఎడపాడి పళనిస్వామి) ఇద్దరూ వేస్ట్.., తన వద్ద ఆ ఇద్దరి ప్రస్తావన వద్దే వద్దంటూ మళ్లీ తన ఆక్రోశాన్ని ప్రదర్శించారు. అమ్మ సమాధి వద్ద కూర్చున్నాడంటా...నీ...అంటూ మళ్లీ కోపం వచ్చేస్తుందంటూ ఆ ప్రశ్నకు సమాధానం దాట వేశారు. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం, చిదంబరం ఇంట్లో ఐటీ దాడుల ప్రస్తావన తీసుకురాగా, ఉపయోకరంగా, ప్రజలకు మంచి అనిపించే ప్రశ్నలను వేస్తే సమాధానాలు ఇస్తానని, లేదంటే వెళ్లి పోతానంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రజనీకాంత్కు వ్యతిరేకత బయలు దేరి ఉందే అని ప్రశ్నించగా, అవన్నీ సహజం అని, తనుకూ వ్యతిరేకత తప్పలేదు..ఇప్పుడు రాజకీయాల్లో ఏ స్థాయికి చేరానో చూసుకోండంటూ వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ తనకు మంచి మిత్రుడు...అంతే అని స్పందించారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోసం సిద్ధం కావాల్సిన అవసరం లేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆ ఎన్నికలకు ముందే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. చివరగా ఈవీఎంలలో ఎలాంటి మోసాలు, అవకతవకలు చేయడానికి వీలు లేదని ఆయన స్పష్టం చేశారు. -
ప్రేమలతకు పగ్గాలు
డీఎండీకే పగ్గాలు విజయకాంత్ సతీమణి ప్రేమలత చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమెకు ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టేందుకు డీఎండీకే వర్గాలు నిర్ణయానికి వచ్చాయి. మరో రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. సాక్షి, చెన్నై: 2005లో సినీ నటుడు విజయకాంత్ దేశీయ ముర్పోగు ద్రావిడ కళగం(డీఎండీకే)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పార్టీ ఆవిర్భావంతో జరిగిన తొలి ఎన్నికల్లో తానొక్కడినే గెలిచినా, ఢీలా పడకుండా అడుగులు వేశారు. వ్యవస్థాపక అధ్యక్షుడిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా జోడు పదవులతో ముందుకు సాగి 2011లో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించారు. అయితే 2016 ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న పరిణామాలు డీఎండీకేను ఢీలా పడేలా చేశాయి. ఎండీఎంకే, వామపక్షాలు, వీసీకే నేతృత్వంలోని కూటమిలోకి విజయకాంత్ వెళ్లడాన్ని ఖండిస్తూ, ఆ పార్టీలో ఉన్న సీనియర్లు అందరూ బయటకు వచ్చేశారు. ఈ ప్రభావం ఆ ఎన్నికల్లో విజయకాంత్కు గట్టి దెబ్బ తగిలేలా చేశాయి. డిపాజిట్లే కాదు, గత కొన్నేళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన ఓటు బ్యాంక్ను ఆయన కోల్పోక తప్పలేదు. మళ్లీ పూర్వ వైభవం లక్ష్యంగా మీలో ఒక్కడ్నీ అంటూ కేడర్ వద్దకు పరుగులు తీస్తూ వచ్చిన విజయకాంత్ ప్రస్తుతం అనారోగ్యం బారిన పడ్డారు. గత కొద్ది రోజులుగా ఆసుపత్రికి, ఇంటికి తిరగక తప్పడం లేదు. ప్రస్తుతం ఆయనకు మళ్లీ కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స అనివార్యమైనట్టుగా ప్రచారం సాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో పార్టీని నడిపించడంతోపాటుగా కేడర్ను దక్కించుకునే విధంగా పగ్గాలు ఆయన సతీమణి ప్రేమలతకు అప్పగించేందుకు తగ్గ కార్యాచరణ డీఎండీకేలో సిద్ధం అవుతోన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. విజయకాంత్ సతీమణి ప్రేమలత మంచి వాక్చాతుర్యం కల్గిన వారు. సమయానుగుణంగా స్పందించే తత్వం ఉన్న వారు. ఇంకా చెప్పాలంటే, విజయకాంత్ను మించి ప్రసంగాలు సాగించగల సమర్థురాలు. డీఎండీకే ఎన్నికల ప్రచారంలో ఆమె పాత్ర కీలకం. పార్టీలో ఎలాంటి పదవీ లేకున్నా, అన్నీ తానై విజయకాంత్ వెన్నంటి ఆమె సాగుతున్నారని చెప్పవచ్చు. పార్టీలో ఆమెకు పదవి కట్టబెట్టాలన్న నినాదం ఎప్పటి నుంచో వస్తున్నా, విజయకాంత్ అందుకు తగ్గ నిర్ణయాన్ని ఎన్నడూ తీసుకోలేదు. ఇందుకు కారణం, ఎక్కడ పార్టీలోని సీనియర్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తారోననే. ప్రస్తుతం సీనియర్లు ఎవ్వరూ ఆ పార్టీలో లేరు. ఉన్నదంతా అభిమాన లోకం. వారిని రక్షించుకోవాలంటే, పార్టీ పగ్గాలు ప్రేమలతకు అప్పగించాల్సిన అనివార్యం ప్రస్తుతం ఏర్పడి ఉంది. విజయకాంత్ ఆసుపత్రిలో ఉండడంతో, పార్టీని నడిపించేందుకు తగ్గ కార్యాచరణను డీఎండీకే వర్గాలు సిద్ధం చేశాయి. విజయకాంత్ చేతిలో ఉన్న జోడు పదవుల్లో ఓ పదవిని ప్రేమలత స్వీకరించాలన్న నినాదాన్ని అందుకుని ఉన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడి పదవి విజయకాంత్ వద్దే ఉంచి, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టాలని ప్రేమలత మీద ఒత్తిడి తెచ్చే పనిలో కేడర్ ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో, డీఎండీకే వెబ్సైట్లోనూ ఆమె తప్ప మరొకరు లేరని, ఆమె పగ్గాలు చేపట్టాల్సిందేనని కేడర్ తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో డీఎండీకే కార్యాలయం నుంచి ప్రేమలత ప్రధాన కార్యదర్శి అన్న అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఎక్కువేనని ఓ నేత పేర్కొన్నారు. విజయకాంత్ బావమరిది సుధీష్ ఆ పార్టీ యువజన నేతగా ఉన్నా, పార్టీని నడిపించే సత్తా మాత్రం ప్రేమలతకు మాత్రమే ఉందని, ఆమె పగ్గాలు చేపట్టేందుకు ఇదే మంచి సమయంగా ఆ నేత వ్యాఖ్యానించడం గమనార్హం. -
సింగపూర్కు విజయకాంత్
చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్ను సింగపూర్కు తరలించే అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. గత ఏడు రోజులుగా ఆయన పోరూర్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయనకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స సింగపూర్లో జరిగినట్టుగా సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మేరకు మళ్లీ సింగపూర్కు తరలించేందుకు తగ్గ కసరత్తులు సాగుతున్నాయి. ఈ విషయంపై వైద్యులతో ఆయన సతీమణి ప్రేమలత చర్చిస్తున్నట్టుగా సమాచారం. అయితే విజయకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఆందోళన వద్దంటూ ప్రేమలత మీడియాకు వెల్లడించారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఆర్కేనగర్ ఎన్నికల ప్రచారానికి ఆయన వస్తాడని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. -
ఆర్కేనగర్ బరిలో డీఎండీకే
► అభ్యర్థిగా మదివానన్ ► పన్నీరు శిబిరంలో తిలకవతి ► దీప పూజలు ► ఏర్పాట్లలో ఈసీ సాక్షి, చెన్నై: ఆర్కే నగర్ బరిలో డీఎండీకే అభ్యర్థిగా మదివానన్ పోటీ చేయనున్నారు. ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొంటామని ఆ పార్టీ అధినేత విజయకాంత్ ప్రకటించారు. అవకాశం ఇస్తే, పన్నీరుసెల్వం శిబిరం నుంచి ఆర్కే నగర్ నుంచి పోటీకి సిద్ధమని మాజీ డీపీజీ తిలకవతి సంకేతాన్ని ఇచ్చారు. ఇక, వేంకటేశ్వరుని సన్నిధిలో పూజల అనంతరం ఆర్కేనగర్పై దీప దృష్టి పెట్టారు. అమ్మ జయలలిత మరణంతో ఖాళీ ఏర్పడ్డ ఆర్కేనగర్ నియోజకవర్గానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఆ నియోజకవర్గంలో ఎన్నికల సందడి మొదలైంది. ఆ సీటును కైవసం చేసుకోవడం లక్ష్యంగా డీఎంకే పావులు కదిపే పనిలో పడింది. జయలలిత చేతిలో స్వల్ప ఓట్లతో ఓటమి చవిచూసిన సిమ్లా ముత్తు చోళన్ను మళ్లీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సోమవారం అభ్యర్థి విషయంగా డీఎంకే కార్యాలయం ప్రకటన చేయనున్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక, తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కమ్యూనిస్టులకు డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ విన్నవించుకున్నారు. డీఎండీకే అభ్యర్థిగా : అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు, ఓటింగ్ శాతం గల్లంతు చేసుకున్న డీఎండీకే, తాజాగా ఆర్కేనగర్ ఎన్నికల్ని ఒంటరిగా ఎదుర్కొనేందుకు నిర్ణయించింది. ఆ పార్టీ అభ్యర్థిగా ఉత్తర చెన్నై జిల్లా పార్టీ కార్యదర్శి మదివానన్ పేరును విజయకాంత్ ఖరారు చేశారు. అయితే, పలువురు నాయకులు విజయకాంత్ సతీమణి ప్రేమలత పోటీ చేయాలని నినదిస్తున్నారు. పోటీకి సిద్ధం : మాజీ డీజీపీ తిలకవతి ఎన్నికల్లో పోటీకి సిద్ధమన్న సంకేతాన్ని పంపించారు. మాజీ సీఎం పన్నీరుశిబిరం నుంచి ఆర్కేనగర్ బరిలో దిగేందుకు తాను రెడీ అని, అయితే, అవకాశం దక్కేనా అన్న ఎదురు చూపుల్లో ఉన్నారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూ్యలో ఆమె ఈ ప్రకటన చేశారు. దీప పూజలు: ఆర్కే నగర్ నుంచి ఎన్నికల్లో పోటీకి జయలలిత మేన కోడలు దీప సిద్ధమయ్యారు. టీనగర్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో పూజల అనంతరం ఆమె ఆర్కేనగర్ ఎన్నికల పనుల మీద దృష్టి పెట్టారు. అలాగే, ఎంజీఆర్, అమ్మ, దీపా పేరవై సభ్యత్వ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఏర్పాట్లలో ఈసీ: రాజకీయ పక్షాలు అభ్యర్థుల ఎంపిక , గెలుపు పావులు కదిపేందుకు తగ్గ వ్యూహ రచనల్లో ఉంటే, ఎన్నికల ఏర్పాట్ల మీద ఎన్నికల యంత్రాంగం దృష్టి పెట్టింది. అభ్యర్థుల ఖర్చుల పరిశీలనకు మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించింది. నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లు, భద్రత చర్యల మీద దృష్టి పెట్టింది. డీఎంకే ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగర పోలీసు కమిషనర్ జార్జ్ బదిలీకి రంగం సిద్ధం అయింది. సోమవారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి. -
సారీ కెప్టెన్..
ఉపఎన్నికల్లో ఎవరికీ మద్దతుఇచ్చేది లేదన్న మక్కల్ ఇయక్కం నేతలు డీఎండీకేకు మద్దతుపై తిరుమా మరో కొత్త పలుకు సాక్షి, చెన్నై: మక్కల్ ఇయక్కం వర్గాల మాటల గారడీ రాజకీయ విశ్లేషకులనే విస్మయంలో పడేస్తోంది. రోజుకో మా ట, పూటకో అభిప్రాయం వ్యక్తం చేయడమే కాకుండా, మరో మారు డీఎండీకే అధినేత విజయకాంత్కు ఝలక్ ఇచ్చారు. నిన్నటి వరకు మద్దతు కోరితే, పరిశీలన అని పలికిన ఆ నాయకులు మంగళవారం ఉప ఎన్నికల్లో డీఎండీకేకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చారు. ఇక, వీసీకే నేత తిరుమావళవన్ కొత్త పలుకుగా, యూసీసీకి వ్యతిరేకంగా రా జకీయ పక్షాలు ఏకం కావాలంటూ అఖి ల పక్షానికి పిలుపునిచ్చే పనిలో పడ్డారు. మక్కల్ ఇయక్కంలోని ఎండీఎంకే నేత వైగో, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, వీసీకే నేత తిరుమావళవన్ల తీరు విమర్శలకు దారి తీస్తున్నారుు. రోజుకో మాట, పూటకో అభిప్రాయం అన్నట్టుగా ఎవరికి వారు మీడియా ముందుకు వచ్చి చర్చల్లోకి ఎక్కడమే కాకుండా, విమర్శలను, వ్యంగ్యాస్త్రాలను ముట్టగట్టుకునే పనిలో పడ్డారు. నిన్నటి వరకు ఉప ఎన్నికల్లో డీఎండీకే మద్దతు కోరితే పరిశీలిస్తామన్న సీపీఎం, సీపీఐ, వీసీకే నేతలు , తాజాగా మద్దతు ఇచ్చే ప్రసక్తేలేదని తేల్చేశారు. వీరి పరిశీలన మేరకు డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమని ప్రేమలత మీడియాతో మాట్లాడుతూ, పరిస్థితులకు అనుగుణంగా తమకు మద్దతును ప్రకటించాలని విన్నవించారు. దీంతో మక్కల్ ఇయక్కం మద్దతు ఉప రేసులో ఉన్న డీఎండీకే అభ్యర్థులకు దొరికినట్టేనా..? అన్న ఎదురు చూపులు పెరిగా రుు. అయితే, మీడియా సందించిన ప్రశ్నలకు సమాధానంగానే పరిశీలన అన్న నినాదాన్ని తాము తెర మీదకు తెచ్చామేగానీ, ఉప ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతు లేదంటూ ఆ ఇయక్కం తేల్చడం డీఎండీకేకు మరో షాక్కే. గత వారం విజయకాంత్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి తప్పు చేశామని ఆ ఇయక్కంలోని వైగో స్పందిస్తే, తాజాగా మిగిలిన ముగ్గురు విజయకాంత్కు పరిశీలన అంటూ ఝలక్ ఇవ్వడం గమనార్హం. వీసీకే నేత తిరుమావళవన్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ఉప ఎన్నికల్ని బహిష్కరిస్తూ ఇయక్కం వర్గాలు నిర్ణయం తీసుకున్నాయని, విజయకాంత్ తమ వద్దకు వచ్చి ఎలాంటి మద్దతు కోరలేదని, ఏ పనిచేసినా సక్రమంగా చేయాలన్నదే తన అభిమతం అని, అందుకే ఉప ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. సీపీఎం నేత రామకృష్ణన్ అదేపల్లవి అందుకున్నారు. తామందరం కల సి కట్టుగా ఎన్నికల బహిష్కరణ నిర్ణ యం తీసుకున్నామని, అలాంటప్పుడు ఎలా మద్దతు ఇస్తామని మీడియాకు ఎదురు ప్రశ్న వేశారు. ఇక, పరిశీలన అన్న విషయం, కేవలం డీఎండీకేకు మద్దతు ఇస్తారా..? అని మీడియా సంధించిన ప్రశ్నకు , అటు వైపు నుంచి వచ్చే విజ్ఞప్తి మేరకు పరిశీలన అని సమాధానం ఇచ్చామేగానీ, మద్దతు ఇచ్చేస్తామని చెప్పలేదుగా అంటూ స్పందించారు. తిరుమా కొత్త పల్లవి : యూనిఫాం ’సివిల్’ కోడ్ (యూసీసీ- ఉమ్మడి పౌర సృ్మతి)కి వ్యతిరేకంగా రాష్ట్రంలో మైనారిటీ సంఘాలు, పార్టీలు, జమాత్లు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తాము సైతం అంటూ వీసీకే నేత తిరుమావళవన్ కదిలారు. ఏకంగా సివిల్ కోడ్కు వ్యతిరేకంగా ఏకం అవుదామని రాజకీయ పక్షాలకు పిలుపు నిచ్చారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఈ విషయంలో తమతో చేతులు కలపాలని, ప్రతి పక్షాలన్నీ ఏకం కావాలని కోరారు. అఖిల పక్షంగా ముందుకు సాగుదామని, యూసీసీని వ్యతిరేకిద్దామని పిలుపు నిచ్చారు. -
కొత్త పలకరింపు
చెన్నై : తమిళనాడు కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు తిరునావుక్కరసర్ డీఎండీకే కార్యాలయం మెట్లు ఎక్కారు. ఆ పార్టీ అధినేత విజయకాంత్తో ఆదివారం భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజకీయచర్చ సాగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ వైపునకు డీఎండీకేను తిప్పుకుని డీఎంకేతో కలిసి ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేసిందని చెప్పవచ్చు. అయితే, మెట్టు దిగని విజయకాంత్ ప్రజా సంక్షేమ కూటమిలో చేరి డిపాజిట్లనే కాదు, పార్టీ పరంగా తీవ్ర కష్ట నష్టాల్ని చవిచూడాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాతాళంలోకి నెట్టబడ్డ విజయకాంత్ స్థానిక ఎన్నికలతో బలాన్ని చాటుకునేందుకు తీవ్ర కుస్తీలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో టీఎన్సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ డీఎండీకే కార్యాలయానికి వెళ్లడం ప్రాధాన్యత చోటు చేసుకుంది. గత వారం స్టాలిన్కు వ్యతిరేకంగా తిరునావుక్కరసర్ స్పందించిన తీరు డీఎంకే వర్గాల్లో ఆక్రోశాన్ని రగిల్చి ఉన్న విషయం తెలిసిందే. మళ్లీ డీఎంకేకు అనుకూలంగా తిరునావుక్కరసర్ స్పందించే యత్నం చేస్తున్నా, డీఎంకే వర్గాలు మాత్రం కాంగ్రెస్కు స్థానికంలో చెక్ పెట్టాలన్న వ్యూహంతో ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అన్నాడీఎంకేకు అనుకూలంగా స్పందించిన కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి గుణపాఠం చెప్పే దిశలో స్థానిక సీట్ల బేరాల్లో పొమ్మని పొగ బెట్టే విధంగా వ్యవహరించాలని అధిష్టానంపై పలువురు డీఎంకే నాయకులు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో తిరునావుక్కరసర్ డీఎండీకే అధినేత విజయకాంత్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నట్టు అయింది. తమ భేటీలో స్థానిక చర్చ సాగినట్టు తిరునావుక్కరసర్ వ్యాఖ్యానించడం గమనార్హం. డీఎంకే పక్కన పెట్టిన పక్షంలో డీఎండీకేతో కలసి పయనించేందుకు తగ్గట్టుగా స్థానిక చర్చ సాగి ఉంటుందేమో అన్న ప్రచారం ఊపందుకోవడం ఆలోచించదగ్గ విషయమే.కొత్త పలకరింపు : కొత్త అధ్యక్షుడు తిరునావుక్కరసర్ కోయంబేడులోని డీఎండీకే కార్యాలయం మెట్లు ఎక్కారు. ఆయన వెంట పార్టీ ప్రధాన కార్యదర్శి చిరంజీవి కూడా ఉన్నారు. తమ కార్యాలయానికి చేరుకున్న తిరునావుక్కరసర్కు డీఎండీకే అధినేత విజయకాంత్, యువజన నేత సుదీష్ ఆహ్వానం పలికారు. మర్యాద పూర్వక పలకరింపుల్లో రాజకీయ, స్థానిక చర్చ సాగి ఉండడం గమనార్హం. మీడియాతో తిరునావుక్కరసర్ మాట్లాడుతూ విజయకాంత్తో భేటీలో ప్రస్తుత రాజకీయ అంశాలపై మాట్లాడుకున్నామని, స్థానిక ఎన్నికలపై చర్చించుకున్నామని స్పందించారు. విజయకాంత్ తనకు మిత్రుడు అని, ఆయన్ను మర్యాద పూర్వకంగా పలకరించేందుకు వచ్చానని వ్యాఖ్యానించారు. -
అన్నా నీవే దిక్కు!
మా దగ్గర డబ్బుల్లేవ్ కెప్టెన్కు నేతల షాక్ ఇక దరఖాస్తుల హోరు ‘స్థానిక’ సమరం డీఎండీకే వర్గాలకు జీవన్మరణ సమస్యగా మారింది. ఓ వైపు బల నిరూపణ, మరో వైపు ఎన్నికల ఖర్చుకు నిధి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఉన్నదంతా పార్టీ కోసం ఇన్నాళ్లు ఖర్చు పెట్టిన వాళ్లంతా, ఇప్పుడు ‘అన్నా’ డబ్బుల్లేవు... నీవే దిక్కు అని కెప్టెన్ కోర్టులోకి బంతిని నెట్టే పనిలో పడ్డారు. ఇందుకు తగ్గ షాక్లను పార్టీ అధినేత విజయకాంత్కు ఇచ్చే పనిలో జిల్లా నేతలు ఉన్నారు. చెన్నై : రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయ శక్తి డీఎండీకే అన్నట్టుగా ప్రజల మన్ననల్ని అందుకున్న నాయకుడు విజయకాంత్. పార్టీ ఆవిర్భావ సమయంలో సినీ అభిమానం ఆయన వెంట కదిలింది. అభిమాన లోకం రాజకీయంగా ఎదిగారు. తమ నేత ఇచ్చే పిలుపు మేరకు చేపట్టే కార్యక్రమాలకు ఇళ్లు గుళ్ల చేసుకున్న వాళ్లెందరో ఉన్నారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించినా, చివరకు అధికార పక్షంతో విజయకాంత్ పెట్టుకున్న వైర్యం డీఎండీకే వర్గాల్ని ఆర్థికంగా మరింత కష్టాల్లోకి నెట్టిందని చెప్పవచ్చు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అయితే చావు దెబ్బే తిన్నారు. ఇక, తాము ఇమడలేమంటూ పెద్ద సంఖ్యలో కేడర్ డీఎండీకేను వీడింది. దీంతో మిగిలిన వాళ్లను రక్షించుకునేందుకు విజయకాంత్ తీవ్రంగానే కుస్తీలు పట్టారు. ఇప్పుడు ఉన్న కేడర్లో ఆర్థికంగా దెబ్బ తిన్న వాళ్లు కొందరు అయితే, మరి కొందరు చేతిలో చిల్లిగవ్వకూడా లేకుండా రాజకీయాలు చేసే వాళ్లు ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ నేతల్లో స్థానిక ఎన్నికల ఖర్చు గుబులు బయలు దేరింది. ఎక్కడ తమ నెత్తిన వేసే రీతిలో కెప్టెన్ పిలుపునిస్తారో అన్న ఉత్కంఠ బయలు దేరింది. దీంతో ముందస్తుగా మేల్కొన్న జిల్లాల నేతలు అన్నా..డబ్బుల్లేవు...నీవే దిక్కు అన్నట్టు విజయకాంత్ వద్ద మొరపెట్టుకునే పనిలో పడ్డారు. అన్నా డబ్బుల్లేవు..: స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? పొత్తా? ఒంటరా..? అన్న అంశాలపై కేడర్ అభిప్రాయాల్ని విజయకాంత్ స్వీకరించే పనిలో పడ్డారు. మంగళవారం నుంచి ఈ ప్రక్రియ సాగుతూ వస్తోంది. ఇందులో జిల్లాలు, డివిజన్ల నుంచి వస్తున్న నేతలు విజయకాంత్కు షాక్లు ఇచ్చే పనిలో పడ్డారట..!. బలోపేతం లక్ష్యంగా కెప్టెన్ ఇచ్చే సూచనలు, సలహాలను నేతలు చక్కగా ఆలకిస్తున్నారు. అదే అభిప్రాయాల విషయానికి వచ్చే కొద్ది నేతలు తమ గళాన్ని విప్పే పనిలో పడడం కెప్టెన్కు పెద్ద షాక్కే అంట..!. డబ్బుల్లేవు, మళ్లీ..మళ్లీ తాము సొంత డబ్బులు ఖర్చు పెట్టలేం అన్న సమాధానాలు పెద్ద సంఖ్యలో వచ్చినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలకు దూరంగా ఉంటే మంచిదన్నట్టుగా సలహాలు ఇచ్చే పనిలో పడ్డట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అందరి అభిప్రాయాల్ని శ్రద్ధంగా వినే విజయకాంత్, చివరలో ఎన్నికల్లోకి వెళ్తున్నాం...తాను సూచించే వ్యక్తి గెలుపునకు శ్రమించాల్సిందే అంటూ కేడర్కు హుకుం జారీ చేసి పంపించేస్తున్నట్టు సమాచారం. ఇంత మాత్రానికి తమను పిలిపించి అభిప్రాయాలు సేకరించడం ఏమిటో అంటూ పలువురు నేతలు కోయంబేడులోని పార్టీ కార్యాలయం వద్ద పెదవి విప్పడం గమనార్హం. అదే సమయంలో తాను మాత్రం తగ్గేది లేదన్నట్టుగా విజయకాంత్ ముందుకు సాగుతుండడంతో స్థానికంలో బలాన్ని చాటగలమా అన్న అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారట! ఇక, ఓ వైపు కేడర్ అభిప్రాయాలు అంటూ, మరో వైపు దరఖాస్తుల స్వీకరణ అంటూ విజయకాంత్ తనదైన రూట్లో పయనం సాగిస్తుండడం గమనార్హం. దరఖాస్తుల హోరు : ఎన్నికలపై అభిప్రాయ సేకరణ ఓ వైపు కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో సాగితే, మరో వైపు బుధవారం నుంచి ఎన్నికల బరిలో నిలబడే ఆశావహులు దరఖాస్తులు సమర్పించుకునే విధంగా ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేయడం ఆలోచించదగ్గ విషయమే. ఇక విజయకాంత్ రూటే సెపరేటుగా ఉంటే, పీఎంకే అయితే, తాము ఒంటరే అన్నది స్పష్టం చేశారు. ఎన్నికల బరిలో నిలబడే ఆశావహుల నుంచి దరఖాస్తుల ఆహ్వానానికి శ్రీకారం చుట్టారు. అలాగే, బీజేపీ సైతం ఒంటరి అన్నట్టుగానే దరఖాస్తుల పర్వానికి శ్రీకారం చుట్టింది. కోడంబాక్కంలో ఈ దరఖాస్తుల పంపిణీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ ప్రారంభించేశారు. దీంతో ఆయా పార్టీలో దరఖాస్తుల వేగం పుంజుకుంది. -
ఫీనిక్స్ పక్షి!
కెప్టెన్ కొత్త నినాదం 65వ వసంతంలోకి విజయకాంత్ మక్కల్ ఇయక్కం నేతల శుభాకాంక్షలు స్నేహ పూర్వక పలకరింపు : వైగో, తిరుమా సరైన సమయంలో నిర్ణయం : ప్రేమలత సాక్షి, చెన్నై: తమ నేత విజయకాంత్ పేరుకు ముందు కెప్టెన్ అన్న పదం డీఎండీకే వర్గాలకు కలిసి రానట్టుంది. అందుకే ఇక, తమ నేతను ఫీనిక్స్పక్షితో పోల్చే పనిలో పడ్డట్టున్నారు. ఇందుకు తగ్గట్టుగా గురువారం ఆయన బర్త్డే కేక్లలో ‘ఫీనిక్స్ పక్షి’ అని తాటి కాయంత అక్షరాలతో కొన్ని నినాదాల్ని పొందు పరచి ఉండడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో డీఎండీకే అధినేత విజయకాంత్ చతికిలబడ్డ విషయం తెలిసిందే. కోల్పోయిన వైభవాన్ని మళ్లీ చేజిక్కించుకుని తీరుతామన్న ధీమాతో డీఎండీకే వర్గాలు ఉన్నాయి. తమ నేత బర్త్డే తదుపరి జరిగే కార్యక్రమాలతో డీఎండీకే పుంజుకున్నట్టే అన్న వ్యాఖ్యల్ని సంధించడం మొదలెట్టారు. ఇందుకు తగ్గట్టుగా గురువారం 65వ వసంతంలోకి అడుగుపెట్టిన విజయకాంత్ను అభినందనలతో ముంచెత్తిన డీఎండీకే వర్గాలు, ఇక తమ నేత ఫీనిక్స్పక్షి అన్నట్టు నినాదాన్ని అందుకోవడం విశేషం. ఎట్టి ఆటుపోట్లు ఎదురై కింద పడ్డా, మళ్లీ చటుక్కున పుంజుకుని రయ్యూ మంటు గాల్లో దూసుకు వెళ్లే ఫీనిక్స్పక్షితో తమ నేత విజయకాంత్ను పోల్చడం కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకే అంటూ డీఎండీకే వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఫీనిక్స్పక్షి: విజయకాంత్ బర్త్డేను పురస్కరించుకుని శాలిగ్రామంలోని ఆయన నివాసం పరిసరాల్ని డీఎండీకే వర్గాలు సుందరంగా తీర్చిదిద్దాయి. పార్టీ తోరణాలు, జెండాలతో ఆలంకరించడంతో పాటు విజయకాంత్ ఇంటి వద్ద ఏదో పండుగ అన్నట్టుగా వాతావరణం కల్పించారు. ఉదయాన్నే విజయకాంత్కు ఆయన సతీమణి ప్రేమలత, తనయులు షణ్ముగపాండియన్, విజయ ప్రభాకరన్, బావమరిది సుదీష్ నిలువెత్తు పూలమాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. అప్పటికే బారులు తీరిన పార్టీ వర్గాలు, కేడర్ ఒక్కక్కరుగా విజయకాంత్కు స్వయంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడి నుంచి పదకొండు గంటల సమయంలో కోయంబేడులోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న విజయకాంత్కు బ్రహ్మరథం పలికారు. మక్కల్ ఇయక్కంకు చెందిన ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, సీపీఐ నేత ముత్తరసన్, సీపీఎం తరఫున సంపత్ అక్కడికి చేరుకుని నిలువెత్తు పూలమాలతో, శాలువలతో సత్కరిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడ ఫీనిక్స్ పక్షి అన్న పదంతో, నేడు చతికిల బడ్డా, రేపు అధికారం అన్న నినాదంతో పొందు పరిచిన భారీ కేక్ను విజయకాంత్తో కలిసి వైగో, తిరుమావళవన్ కట్ చేశారు. తమ స్నేహాన్ని చాటుకునే రీతిలో కేక్ కత్తిరింపు సాగింది. తదుపరి పార్టీ కార్యాలయంలో నేతలందరూ కాసేపు సమాలోచన అయ్యారు. అనంతరం వెలుపలకు వస్తూ, మీడియాతో వైగో మాట్లాడుతూ మక్కల్ ఇయక్కంలో ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐ ఉన్నాయని, ఈ నాలుగు పార్టీలు కలిసి స్థానిక ఎన్నికల్ని ఎదుర్కొంటాయని వ్యాఖ్యానించారు. విజయకాంత్కు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చామేగానీ, ఎలాంటి రాజకీయం చర్చ లేదని స్పష్టం చేశారు. ఇక, తిరుమావళవన్ మాట్లాడుతూ స్నేహ పూర్వక పలకరింపు మాత్రమేనని, స్థానిక చర్చకు ఆస్కారం లేదన్నారు. విజయకాంత్ సతీమణి, డీఎండీకే మహిళా విభాగం కార్యదర్శి ప్రేమలత మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో సాగుతున్న తీరును చూస్తుంటే, అధికార పక్షం బలహీన పడ్డట్టు స్పష్టం అవుతోందన్నారు. అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని డిమాండ్ చేస్తూ, స్థానిక సమరం గురించి సరైన సమయంలో విజయకాంత్ నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించారు. ఇక, విజయకాంత్కు టీఎన్సీసీ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ఇళంగోవన్ పలువురు ఫోన్లో శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు. -
ఇక వదినమ్మ రాజ్యం
సాక్షి, చెన్నై: డీఎండీకేలో వదినమ్మ ప్రేమలత విజయకాంత్ ఇక పూర్తిస్థాయిలో చక్రం తిప్పబోతున్నారు. కొత్త రక్తంతో పూర్వవైభవం లక్ష్యంగా అడుగులకు సిద్ధ పడ్డ విజయకాంత్ తన సతీమణికి పార్టీలో పదవి కట్టబెట్టేందుకు నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. త్వరలో ఇందుకు తగ్గ అధికార ప్రకటన వెలువడ బోతున్నది. పార్టీ సిద్ధాంతాల ప్రచార కార్యదర్శి పగ్గాలు వదినమ్మను వరించే అవకాశాలు ఉన్నట్టుగా డీఎండీకేలో చర్చ బయలుదేరడం గమనార్హం. సినీ నటుడి నుంచి రాజకీయ నేత గా ఎదిగిన విజయకాంత్కు వెన్నంటి ఆయన సతీమణి ప్రేమలత, బావ మరి ది సుదీష్ ఉంటూ వస్తున్నారు. సుదీష్ డీఎండీకే యువజన పగ్గాలతో ఆది నుం చి ముందుకు సాగుతూ వస్తున్నారు. పా ర్టీ ఆవిర్భావంతో డీఎండీకే వ్యవహారాలను తెర వెనుక నుంచి ప్రేమలత సా గించే వారు. 2011 ఎన్నికల్లో ఆమె పార్టీ కోసం పూర్తి స్థాయిలో తనను అంకితం చేసుకున్నారు. ఎలాంటి పదవి పార్టీలో లేకున్నా, ఆ ఎన్నికల్లో డీఎంకే పతనం లక్ష్యంగా ప్రచార బాధ్యతల్ని తన భుజాన వేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి తన వాక్చాతుర్యంతో ప్రజ ల్ని ఆకర్షించారని చెప్పవచ్చు. ఆ ఎన్నికల్లో డీఎండీకే ప్రధాన ప్రతి పక్షంగా అవతరించడం ప్రేమలత బాధ్యతలు పెరి గాయి. పార్టీ అనుబంధ మహిళా విభా గం కార్యదర్శి పదవితో పార్టీ వ్యవహారాల్లో ఆమె జోక్యం పెరిగిందని చెప్పవచ్చు. ఇది మరీ ఎక్కువ కావడంతో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకేకు పెద్ద దెబ్బ తగిలేలా చేశాయి. టార్గెట్ వదినమ్మ: ప్రజా సంక్షేమ కూటమిలోకి డీఎండీకేను తీసుకెళ్లడంలో ప్రేమలత కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు, విమర్శలు బయలు దేరాయి. వదినమ్మ తీరును ఖండిస్తూ, నిరసిస్తూ బయటకు వెళ్లిన వాళ్లు తీవ్రంగానే స్పందించారు. వాటిని ఖాతరు చేయని వదినమ్మ రాష్ట్ర వ్యాప్తం గా సుడిగాలి పర్యటనే సాగించారు. విజ యకాంత్ కేవలం బహిరంగ సభలకు పరిమితం అయితే, తానొక్కరే అన్నట్టుగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రేమలత తీవ్రంగానే చక్కర్లు కొట్టారు. ఇంత వరకు సాగిన తతంగాలు ఓ ఎత్తు అయితే, ఎన్నికల అనంతరం డీఎండీకేను వీడే వారు మరీ ఎక్కువే అయ్యారు. వీళ్లు కూడా వదినమ్మను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించిన వాళ్లే. వదినమ్మకు పదవి: ఇన్నాళ్లు తన సతీమణికి పార్టీలో ఎలాం టి పదవి లేనందునే, విమర్శలు, ఆరోపణలు గుప్పించారని, ఇక, ఆమెను అందలం ఎక్కిస్తా చూడండి అన్నట్టు, ఉండే వాళ్లు ఉండొచ్చు, వెళ్లే వాళ్లు వెళ్లొచ్చన్న సంకేతాన్ని విజయకాంత్ జిల్లాల నేతల కు రెండు రోజుల క్రితం పంపిం చినట్టు సమాచారం. ఇప్పటికే డీఎండీకే నుంచి ముఖ్యమైన నాయకులు బయటకు వెళ్లిన దృష్ట్యా, ఇక ఉన్న వాళ్లందరూ తన అభిమానులేనని, వీరి ద్వారా సరికొత్త రక్తాన్ని నింపి, బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగుతానన్న ధీమాను విజయకాంత్ తన సంకేతంతో నేతల్లోకి పంపించి ఉండడం గమనార్హం. సరికొత్త అడుగులతో ముందుకు సాగి పూర్వ వైభవాన్ని చేజిక్కించుకోవాల్సిన అవసరం ఉందని, స్థానిక సమరంతో సత్తా ను చాటుకోవాల్సి ఉన్నందున, పార్టీలో వదినమ్మకు పదవిని అప్పగించే విధం గా జిల్లాల్లో తీర్మానాలు చేసి రాష్ర్ట కమిటీకి పంపించాలని సూచించి ఉండటం ఆలోచించదగ్గ విషయమే. తానేదో స్వ యంగా వదినమ్మకు పదవి కట్టబెట్టినట్టుగా కాకుండా, జిల్లాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు అందలం ఎక్కించినట్టు చెప్పుకునేందుకే అన్నయ్య తన సంకేతా న్ని పంపించినట్టుగా డీఎండీకే వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాల కమిటీల సమావేశాల్లో తీసుకునే తీర్మానం మేరకు త్వరలో రాష్ట్ర కమిటీ ఆమోదించి వదినమ్మకు పార్టీలో పదవి కట్టబెట్టడం ఖాయం అంటున్నారు. వదినమ్మకు పార్టీ సిద్ధాంతాల ప్రచార కార్యదర్శి పగ్గాలు అప్పగించేందుకు అవకాశాలు ఉన్నాయ ని, ఆ పదవికి ఆమె అన్ని రకాలుగా అర్హురాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. విజయకాంత్ సంకేతం అలా పంపించారో లేదో, ఇలా కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్, సేలం జిల్లాల నేతలు ఇందుకు తామూ ఒకే అన్నట్టుగా తమ అన్నయ్యకు లేఖల్ని పంపించి ఉండడం విశేషం. విజయకాంత్ ఆరోగ్య పరంగా సమస్యల్ని ఎదుర్కొంటున్న దృష్ట్యా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార పర్యటనలు సాగించడం కష్టతరమే. ఇందుకు నిదర్శనం అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేవలం బహిరంగ సభలకే ఆయన పరిమితం కావడమే. ఈ దృష్ట్యా, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, కేడర్లో ఉత్సాహం నింపడం, పూర్వ వైభం లక్ష్యంగా ముందుకు సాగాలంటే, వదినమ్మకు తగిన బాధ్యతలు తప్పనిసరి అన్న విషయాన్ని గుర్తించే తమ అన్నయ్య పదవీ నిర్ణయాన్ని తీసుకున్నట్టు డీఎండీకే నాయకుడు ఒకరు పేర్కొనడం గమనార్హం. వదినమ్మ చేతికి పదవి దక్కిన పక్షంలో, ఇక డీఎండీకేలో ఆమె పూర్తిస్థాయిలో చక్రం తిప్పే అవకాశాలు ఎక్కువే. ఈ పరిణామాలు ఎలాంటి మలుపులు, పరిణామాలకు దారి తీస్తాయో అన్నది వేచి చూడాల్సిందే. -
సుప్రీంకు అన్న, వదిన..
వారెంట్ రద్దుకు పిటిషన్ విల్లుపురం కోర్టు సమన్లు సాక్షి, చెన్నై : డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలతల, ఆ పార్టీ వర్గాల మీదున్న పరువు నష్టం దావాల విచారణల వేగం పెరిగింది. తిరుప్పూర్ కోర్టు పీటీ వారెంట్ జారీ చేసి ఉంటే, విల్లుపురం కోర్టు బుధవారం సమన్లు జారీ చేయడం గమనార్హం. సీఎం జయలలితకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు, ఆధార రహిత ఆరోపణలు గుప్పించే వారిపై పరువు నష్టం దావాల మోత రాష్ట్రంలో మోగడం జరుగుతున్నది. ఆ దిశగా డీఎండీకే అధినేత విజయకాంత్పై అనేకానేక పిటిషన్లు జిల్లాల వారీగా దాఖలై ఉన్నాయి. పిటిషన్ల విచారణల్లో భాగంగా కోర్టు మెట్లు ఎక్కకుండా డుమ్మాలు కొడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తిరుప్పూర్ కోర్టు డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలతలకు మంగళవారం పిటీ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో బుధవారం విల్లుపురం కోర్టు సమన్లు జారీ చేయడం గమనార్హం. మరో కేసు నిమిత్తం కోర్టు మెట్లు ఎక్కాల్సి ఉండగా, డుమ్మా కొట్టారు. ఎక్కడ తిరుప్పూర్ కోర్టు తరహాలో విల్లుపురం కోర్టు సైతం పీటీ వారెంట్ జారీ చేస్తుందోనన్న ఆందోళనతో విజయకాంత్, ప్రేమలత తరఫున న్యాయవాదులు మేల్కొన్నారు. ఆ ఇద్దరు కోర్టుకు హాజరు కాలేని పరిస్థితులను వివరించడంతో న్యాయమూర్తి సరోజిని దేవి ఏకీభవించారు. ఆగస్టు తొమ్మిదో తేదీకి విచారణ వా యిదా వేస్తూ, ఆ రోజున తప్పని సరిగా కోర్టుకు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. విల్లుపురం కోర్టు సమన్లతో తప్పించుకున్నా, తిరుప్పూర్ కోర్టు వారెంట్తో ఎక్కడ అరెస్టు కావాల్సి వస్తుందోనన్న బెంగ తో విజయకాంత్, ఆయన సతీమణి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ ఇద్దరి తరఫున న్యాయవాది మణి ఈ పిటిషన్ దాఖలు చేశారు. తిరుప్పూర్ కోర్టు పీటీ వారెంట్ను రద్దు చేయాలని విన్నవించారు. -
అన్న, వదినమ్మకు వారెంట్
సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలతలకు తిరుప్పూర్ కోర్టు మంగళవారం పిటీ వారెంట్ జారీ చేసింది. ఆ ఇద్దర్నీ అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచాలన్న ఈ వారెంట్తో డీఎండీకే వర్గాల్లో ఆందోళన బయలు దేరింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా ఎవరైనా సరే అనుచిత వ్యాఖ్యలు చేసినా, ఆధార రహిత ఆరోపణలు గుప్పించినా కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. ఇందుకు అద్దం పట్టే విధంగా ప్రభుత్వ తరఫు న్యాయవాదులు పరువు నష్టం దావాల్ని కోర్టుల్లో కోకొల్లలుగా దాఖలు చేశారు. ఇందులో భాగంగా గతంలో తిరుప్పూర్ జిల్లా పల్లడంలో జరిగిన బహిరంగ సభలో డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత సీఎం జయలలితను టార్గెట్ చేసి తీవ్రంగానే విరుచుకు పడ్డారు. వారి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వ తరఫు న్యాయవాది సుబ్రమణియన్ తిరుప్పూర్ మొదటి మెజిస్ట్రేట్ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ పిటిషన్తో సీఎంకు వ్యతిరేకంగా ఆధార రహిత ఆరోపణలు గుప్పించిన విజయకాంత్, ప్రేమలతలపై చర్యకు కోర్టును విన్నవించారు. ఈ పిటిషన్ను విచారిస్తున్న న్యాయమూర్తి అలమేలు నటరాజన్ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే అని విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలతలకు సమన్లు జారీ చేసింది. అయితే, ఆ సమన్లను ఆ ఇద్దరూ ఖాతరు చేయలేదు. మంగళవారం కోర్టుమెట్లు ఎక్కాల్సిన ఆ ఇద్దరు డుమ్మా కొట్టారు. దీంతో న్యాయమూర్తికి ఆగ్రహం వచ్చినట్టుంది. ఆ ఇద్దర్నీ కోర్టులో హాజరు పరచాలని పీటీ వారెంట్ జారీ చేశారు. ఈ వారెంట్ జారీతో డీఎండీకే వర్గాల్లో ఆందోళన బయలు దేరింది. అసలే రోజుకో రూపంలో సమస్యలు తమ అన్న, వదినమ్మలను చుట్టుముట్టుతున్న సమయంలో ఈ వారెంట్ ఏమిటో అన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు రాష్ర్టంలో తమకు వ్యతిరేకంగా ఉన్న దృష్ట్యా, పోలీసులు అరెస్టు చేసినా చేస్తారేమో అన్న ఉత్కంఠకు గురి అవుతున్నారు. ఇది వరకు విజయకాంత్, ప్రేమలతల మీద వేర్వేరుగా కోర్టుల్లో పరువు నష్టం దావాలు విచారణలో ఉన్నాయి. అయితే, తిరుప్పూర్ కోర్టులో మాత్రం ఇద్దరి మీద ఒకే కేసు విచారణలో ఉన్నది. -
ఎదురుదాడి!
అసంతృప్త వాదుల ఆరోపణలకు చెక్ పెట్టే రీతిలో ఎదురు దాడికి డీఎండీకే వర్గాలు సిద్ధమయ్యాయి. డీఎండీకే ట్రస్టుకు రూ.500 కోట్లు విరాళాల రూపంలో వచ్చినట్టుగా ఆధారాలు ఉన్నాయా? ఉంటే కోర్టులో తేల్చుకునేందుకు సిద్ధం అని ఆ పార్టీ కోశాధికారి కేఆర్ ఇలంగోవన్ సవాల్ చేశారు. సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్ల గల్లంతు, ఓటు బ్యాంక్ పతనం వెరసి డీఎండీకేను పీకల్లోతు కష్టాల్లో ముంచింది. ఆ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో వలసలు బయలు దేరాయి. పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ మీద అసంతృప్తి, అసహనంతో బయటకు వచ్చిన ముఖ్య నేతలందరూ డీఎంకే తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో పీకల్లోతు కష్టాల్లో ఉన్న విజయకాంత్ మీద తీవ్ర ఆరోపణలు సంధించే పనిలో పడ్డారు. డీఎండీకే ట్రస్టులో ఉన్న రూ.ఐదు వందలు మింగేశారని, డీఎంకే చేతికి అధికారం దక్కకుండా చేయడం లక్ష్యంగా ప్రజా సంక్షేమ కూటమిలోకి వెళ్లినందుకు అన్నాడీఎంకే రూ.750 కోట్లు అప్పగించినట్టుగా తీవ్ర ఆరోపణలు చేయడం మొదలెట్టారు. ఇది కాస్త విజయకాంత్ను, ఆయన వెన్నంటి ఉన్న మరి కొందరు నేతల్లో తీవ్ర ఆవేదనను రేకెత్తించిన ట్టు సమాచారం. దీంతో పార్టీ నుంచి బయటకు వెళ్తూ తీవ్ర ఆరోపణలు గుప్పించే వారిపై ఎదురుదాడికి డీఎండీకే వర్గాలు సిద్ధమయ్యాయి. పార్టీని అడ్డం పెట్టుకుని బయటకు వెళ్లిన ఆయా నేతలు గతంలో ఏ మేరకు సంపాదించారో ఆ వివరాల్ని సేకరించడం, వారి పనితీరును టార్గెట్ చేసి తీవ్రంగా స్పందించేందుకు సిద్ధం అయ్యారు. ఇందుకు తగ్గట్టుగా గురువారం డీఎండీకే కోశాధికారి కేఆర్ ఇలంగోవన్ పేర్కొంటూ విజయకాంత్, పార్టీ మీద ఆధార రహిత ఆరోపణలు చేస్తూ ఉంటే, తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. డీఎంకే ఇచ్చిన స్క్రిప్ట్తో డీఎండీకే మీద దుమ్మెత్తి పోయడం ఇకనైనా మానుకోవాలని, లేని పక్షంలో బయటకు వెళ్లిన వారందరి బండారం చిట్టా విప్పాల్సి ఉంటుందని ధ్వజమెత్తారు. విరాళాల రూపంలో డీఎండీకే ట్రస్టుకు రూ. ఐదు వందల కోట్లు వచ్చినట్టు, ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. పార్టీ, ట్రస్టు వ్యవహారాల లెక్కలు వివరాలు ఆదాయపన్ను, ఎన్నికల కమిషన్, పార్టీ సర్వసభ్య సమావేశం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తూనే ఉన్నట్టు పేర్కొన్నారు. చౌక బారు విమర్శలు, ఆరోపణలు గుప్పించే ఈ నాయకులు పార్టీని అడ్డం పెట్టుకుని ఏ మేరకు సంపాదించారో? బయట పెట్టాలా..? అని మండి పడ్డారు. విజయకాంత్ మీదగానీ, పార్టీ మీదగానీ నిందలు వేస్తూ ఉంటే, కోర్టుకు లాగుతామని హెచ్చరించారు. ట్రస్టు నిధుల వ్యవహారంగా శ్వేత పత్రానికి సిద్ధమంటూ, కోర్టులోనూ తేల్చుకునేందుకు రెడీ అని వ్యాఖ్యానించడం గమనార్హం. -
శశికళ ద్వారా కెప్టెన్కు రూ.750 కోట్లు
సాక్షి, చెన్నై : ప్రజా సంక్షేమ కూటమితో కలిసి ఎన్నికల్ని ఎదుర్కొన్న డీఎండీకే అధినేత విజయకాంత్కు అన్నాడీఎంకే తరఫున భారీ కానుక ముట్టినట్టు మాజీలు ఆరోపణలు గుప్పించే పనిలో పడ్డారు. సీఎం జయలలిత నెచ్చెలి శశికళ ద్వారా రూ.750 కోట్లు కెప్టెన్ ఖాతాలోకి చేరినట్టుగా ఆరోపణలు గుప్పిస్తూ, డీఎండీకే ట్రస్టులో మాయమైన రూ. ఐదు వందల కోట్ల వ్యవహారం కోర్టులో తేల్చుకుంటామని ప్రకటించారు. డీఎండీకే అధినేత విజయకాంత్ కింగ్ కావాలన్న ఆశతో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా సంక్షేమ కూటమితో కలిసి ఎదుర్కొన్నారు. ఈ కూటమి అన్నాడీఎంకే షాడోగా, ఇందుకుగాను కూటమి కన్వీనర్, ఎండీఎంకే నేత వైగోకు రూ. 1,500 కోట్లు అన్నాడీఎంకే ముట్టచెప్పినట్టు ఆరోపణలు ఎన్నికల సమయంలో గుప్పుమన్నాయి. అదే సమయంలో ఆ కూటమితో పొత్తు వద్దే వద్దంటూ డీఎండీకే ముఖ్య నేతలు తమ కెప్టెన్కు సూచించి, చివరకు టాటా చెప్పారు. ఆ ఎన్నికల్లో డిపాజిట్లే కాదు, ఇక డీఎండీకే పాతాళంలోకి చేరినట్టే అన్నట్టుగా ఫలితాలు వెలువడ్డాయి. ఈ ప్రభావం తో డీఎండీకేను వీడి డీఎంకే, అన్నాడీఎంకే గూటికి చేరే వారి సంఖ్య పెరిగి ఉన్నది. అత్యధిక శాతం మంది డీఎంకేలోకి వస్తున్నారని చెప్పవచ్చు. అలాగే, డీఎండీకేను చీల్చి మక్కల్ డీఎండీకేను ఏర్పాటు చేసుకుని డీఎంకేలోకి విలీనానికి సిద్ధం అవుతున్న మాజీలు తమ కెప్టెన్ మీద తీవ్ర ఆరోపణలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే డీఎండీకే ట్రస్టులో ఉన్న రూ. ఐదు వందల కోట్లను విజయకాంత్ కుటుంబం మింగేసిందంటూ డీఎండీకే మాజీలు ఆరోపణలు గుప్పిస్తూ వచ్చారు. తాజాగా, అన్నాడీఎంకే నుంచి విజయకాంత్కు ఇటీవల భారీ కానుక ముట్టినట్టుగా ఆరోపణలు అందుకోవడం గమనార్హం. రూ.750 కోట్లు : డీఎంకే చేతికి అధికారం చిక్కకుండా చేయడం లక్ష్యంగా ఆవిర్భవించిన ప్రజా సంక్షేమ కూటమిలో ఏమి ఏరుగని అమాయకుడిగా వ్యవహరించిన విజయకాంత్ నిజ స్వరూపం తాజాగా బయట పడిందని మక్కల్ డీఎండీకే నేత ఆరోపించే పనిలోపడ్డారు. మాజీ ఎమ్మెల్యే మక్కల్ డీఎండీకే నేత చంద్రకుమార్ నేతృత్వంలో సేలం వేదికగా బుధవారం జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, ముఖ్య నేత పార్తీబన్ మాట్లాడుతూ, అన్నాడీఎంకేకు వ్యతిరేకం..వ్యతిరేకం అంటూ , చివరకు ఆ పార్టీకి అధికార పగ్గాలు అప్పగించడంలో విజయకాంత్ కూడా కీలక భూమిక పోషించి ఉన్నారని ఆరోపించారు. పేదరిక నిర్మూలన, అవినీతి నిర్మూలన అని వ్యాఖ్యలు చేసిన విజయకాంత్కు అవినీతి సొమ్ము కోట్లల్లో ముట్టి ఉన్నదని ఆరోపణలు గుప్పించారు. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి రావడం లక్ష్యంగా చేసుకున్న లోపాయికారి ఒప్పందానికి తగ్గ కానుక విజయకాంత్కు ఇటీవల లభించినట్టు పేర్కొన్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జె జయలలిత నెచ్చెలి శశికళ ద్వారా రూ. 750 కోట్లు విజయకాంత్ గుప్పెట్లోకి చేరి ఉన్నదని ఆరోపించారు. అవినీతి గురించి డైలాగులు వళ్లించే విజయకాంత్ సినిమాల్లోనే హీరో అని, వాస్తవిక జీవితంలో విలన్గా మారి ఉన్నారని ధ్వజమెత్తారు. విజయకాంత్ బండారం బయట పడి ఉన్నదని, అందుకే ఆపార్టీ గుడారం ఖాళీ కానున్నదని వ్యాఖ్యానించారు. డీఎండీకే నుంచి 90 శాతం మంది బయటకు రానున్నారని, ఇందులో 70 శాతం మంది తమతో కలిసి డీఎంకేలో చేరనున్నట్టు ప్రకటించారు. సేలం వేదికగా ఈనెల 17న జరగనున్న బహిరంగ సభతో డీఎంకే దళపతి స్టాలిన్ సమక్షంలో మక్కల్ డీఎండీకేను విలీనం చేయనున్నామని ప్రకటించారు. విజయకాంత్కు వ్యతిరేకంగా త్వరలో కోర్టుకు వెళ్లనున్నామని, పేదల కోసం ఏర్పాటు చేసిన ట్రస్టు నుంచి మాయం చేసిన రూ. 500 కోట్లను కక్కిస్తామన్నారు. ఈట్రస్టు నుంచి ఇటీవల 1.15 కోట్లతో ఓ కారును సైతం కొనుగోలు చేసి ఉండడం బట్టి చూస్తే, విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత, బావమరిది సుదీష్ ఏ మేరకు అవినీతికి పాల్పడి ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నాని పేర్కొన్నారు. ఆ ట్రస్టు వ్యవహారాలు, నిధులకు సంబంధించిన శ్వేత పత్రాన్ని విడుదల చేయడానికి సిద్దమా..? అని ఈ సందర్భంగా విజయకాంత్కు సవాల్ విసిరారు. -
మూడు లక్షల మంది పార్టీకి టాటా!
చెన్నై : డీఎండీకే అధినేత విజయకాంత్ను అసెంబ్లీ ఎన్నికలు పీకల్లోతు కష్టాల్లో ముంచిన విషయం తెలిసిందే. పార్టీలో చీలిక, జిల్లాల కార్యదర్శులు గుడ్బై లేఖాస్త్రాలు, కేడర్లో అసంతప్తి జ్వాల వెరసి డీఎండీకే భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నది. ఇప్పటికే పలువురు నాయకులు గుడ్బై చెప్పేయగా, ఉన్న వాళ్లను లాక్కెళ్లేందుకు మక్కల్ డీఎండీకే నేత చంద్రకుమార్ తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ డీఎండీకే కేడర్ను తన వైపునకు తిప్పుకోవడంతో తీవ్రంగానే చంద్రకుమార్ అండ్ బృందం పరుగులు తీస్తున్నది. డీఎండీకే నుంచి మూడు లక్షల మంది తమతో కలసి డీఎంకేలో చేరబోతున్నట్టు ఆదివారం చంద్రకుమార్ ప్రకటించడం గమనార్హం. దీంతో విజయకాంత్ వెన్నంటి ఎందరు ఉంటారో అన్న ప్రశ్న బయలు దేరింది. స్థానిక సమరంపై సమాలోచనకు ఆహ్వానిస్తే నేతలు పార్టీ కార్యాలయం వైపుగా తొంగిచూడక పోవడం బట్టి చూస్తే, ఇక, డీఎండీకే భవిష్యత్తు ఏమిటో అన్న ప్రశ్న బయలు దేరింది. స్థానిక బరిలో దిగాలంటే, పార్టీ నిధులు ఇవ్వాల్సిందేనని, తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టే స్థితిలో లేమంటూ పలువురు నాయకులు కరాఖండీగా విజయకాంత్ ఎదుట స్పష్టం చేశారు. పార్టీ నిధులు ఇప్పట్లో రాలే పరిస్థితిలేని దష్ట్యా, ట్రస్టు నిధుల వ్యవహారంలో ఆరోపణలు వచ్చి ఉన్న నేపథ్యంలో ఈ సారి స్థానిక సమరం తమకు అవసరమా? అన్న యోచనలో విజయకాంత్ ఉన్నట్టు సమాచారాలు వెలువడుతున్నాయి. నిధులు పంపిణీ చేసినా, ఎన్నికల్లో ప్రస్తుతం తమ ఓటమి తప్పదని, అధికార బలం ముందు అభ్యర్థులు తల వంచాల్సిన పరిస్థితి తప్పదన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఉన్నట్టు సమాచారం. అందుకే ఈ సారి స్థానిక ఎన్నికల్ని బహిష్కరించి, తదుపరి పార్టీ బలోపేతం దిశగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కేడర్లో ఉత్సాహాన్ని నింపేందుకు తగ్గ కార్యాచరణతో విజయకాంత్ ఉన్నట్టుగా ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. స్థానిక సమరం బహిష్కరణ ప్రకటనను తన జన్మదినం సందర్భంగా విజయకాంత్ చేస్తారని చెబుతున్నారు. -
ఇక ఒంటరే!
మళ్లీ పాత నినాదం కెప్టెన్ నిర్ణయం ఇలంగోవన్ వ్యాఖ్య ఆ మూడు చోట్ల బరిలో అభ్యర్థులు స్థానికంతో సత్తా చెన్నై : పార్టీ ఆవిర్భావంతో అందుకున్న నినాదాన్ని మళ్లీ తారక మంత్రంగా స్వీకరించి ప్రజల్లోకి వెళ్లేందుకు కెప్టెన్ నిర్ణయించారు. తంజావూరు, అరవకురిచ్చిలతో పాటు తిరుప్పర గుండ్రం ఉపఎన్నికలో ఒంటరిగా తమ అభ్యర్థుల్ని నిలబెట్టేందుకు కసరత్తుల్లో పడ్డారు. ఇందుకు తగ్గట్టుగా ఆ పార్టీ కోశాధికారి ఇలంగోవన్ స్పందించడం గమనార్హం. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తానే అంటూ రాజకీయాల్లోకి వచ్చి ప్రధాన ప్రతి పక్ష స్థాయికి ఎదిగిన నాయకుడు డీఎండీకే అధినేత విజయకాంత్. పార్టీ ఆవిర్భావంతో ఐదేళ్లు ఒంటరిగా పయనం సాగించి, తదుపరి అన్నాడీఎంకేతో కలిసి ఎదుర్కొన్న ఎన్నికలతో ప్రజల మన్ననల్ని అందుకున్నారు. అయితే, ఇటీవలి ఎన్నికల్లో ఆయన తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం పాతాళంలోకి నెట్టింది. కింగ్ కావాలన్న ఆశతో ఈ కింగ్మేకర్ ప్రజా సంక్షేమ కూటమికి నేతృత్వం వహించి చతికిల బడ్డారు. అడ్రస్సు గల్లంతు చేసుకుని, చేసిన తప్పునకు ఇప్పుడు పశ్చాత్తాపంలో పడ్డారని చెప్పవచ్చు. కోల్పోయిన వైభవాన్ని చేజిక్కించుకునేందుకు బలోపేత నినాదాన్ని అందుకున్నారు. బలోపేతం లక్ష్యంగా పార్టీ వర్గాలతో ఏకంగా పది రోజులు చర్చించి, సమీక్షించి చేసిన తప్పులు మళ్లీ చేయకూడదన్న నిర్ణయానికి వచ్చారు. గతంలో ఒంటరిగా ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఆదరణ లభించిన దృష్ట్యా, మళ్లీ అదే నినాదంతో ముందుకు సాగేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక, తాను ఒంటరి...ప్రజలతోనే పొత్తు అంటూ బయట నుంచి ప్రభుత్వాన్ని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గానీయండి, అరవకురిచ్చి, తంజావూరు ఎన్నికలు, తిరుప్పరగుండ్రం ఉప ఎన్నికల్ని ఒంటరిగా ఎదుర్కొనేందుకు కసరత్తుల్లో పడ్డారు. ఇందుకు తగ్గట్టుగా డీఎండీకే కోశాధికారి ఏఆర్ ఇళంగోవన్ గురువారం స్పందించడం గమనార్హం. ధర్మపురిలో జరిగిన ఓ కార్యక్రమానంతరం మీడియా ప్రశ్నలకు ఇలంగోవన్ సమాధానాలు ఇచ్చారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయ శక్తి రాష్ట్రంలో డీఎండీకే మాత్రమేనని, కోల్పోయిన వైభవాన్ని మళ్లీ చేజిక్కించుకుని తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. స్వలాభం కోసం కొందరు పార్టీని వీడారని, నిజమైన అభిమానం పార్టీలోనే ఉన్నదని వ్యాఖ్యానించారు. ఇక, ఏ ఎన్నికలు అయినా సరే ఒంటరిగానే ఎదుర్కొనేందుకు తమ అధినేత నిర్ణయించారని, అందుకు తగ్గ పయనం సాగనున్నదని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని ఒంటరిగానే ఎదుర్కొంటామని, ఇక ఏ కూటమి లేదని, అవసరం అయితే, ఎవరైనా తమ గొడుగు నీడకు రావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. వాయిదా పడ్డ ఆ రెండు నియోజకవర్గాలు, తిరుప్పర గుండ్రం ఉప ఎన్నికల్లో డీఎండీకే అభ్యర్థులు పోటీలో ఉంటారని, ఒంటరి పయనం, ఇక ప్రజలతో తమ అధినేత కెప్టెన్ పొత్తు అంటూనే, అసెంబ్లీలో డీఎంకే అధినేత కరుణానిధి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
టాటా..బైబై
ఇక ఎవరి దారి వారిదే త్వరలో కొత్త పొత్తులు వాసన్ బహిరంగ ప్రకటన తదుపరి కెప్టెన్ సమాయత్తం వీసీకే, వామపక్షాలు కూడా సంక్షేమ కూటమి శుభం కార్డు ప్రజా సంక్షేమ కూటమికి టాటా.. బైబై చెప్పేందుకు అందులోని పార్టీల నాయకులు సిద్ధమయ్యారు. ఆ కూటమితో పొత్తు ముగిసిందంటూ తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ వ్యాఖ్యానించారు. తదుపరి ఇదే వ్యాఖ్యను అందుకునేందుకు డీఎండీకే అధినేత విజయకాంత్ సిద్ధమయ్యారు. ఆయన బాటలో తలా ఓ దారి అన్నట్టుగా వీసీకే, వామపక్షాలు నడిచేందుకు నిర్ణయించాయి. ఈ దృష్ట్యా, ఇక ప్రజా సంక్షేమ కూటమి అడ్రస్సు గల్లంతైనట్టే. సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తామే అని జబ్బలు చరిచిన డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమికి ఫలితాలు చెంప పెట్టే. ఈ కూటమిలోని డీఎండీకే, ఎండీఎంకే, వీసీకే, తమిళ మానిల కాంగ్రెస్, సీపీఎం, సీపీఐల డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. అందరి కన్నా,ఈ ఎన్నికల్లో భారీ నష్టాన్ని డీఎండీకే, సీపీఎం, సీపీఐలు చవిచూశాయి. ఇక, కాంగ్రెస్ను వీడి తమిళ మానిల కాంగ్రెస్కు పునర్ జీవం పోసిన సీకే వాసన్కు తొలి ఎన్నికలే పెద్ద షాక్. డీఎంకే గొడుగు నీడన రాజకీయ పయనం సాగించి ప్రజా సంక్షేమ కూటమిలోకి చేరిన వీసీకేకు కోలుకోలేని దెబ్బ తప్పలేదు. ఇక, ఎండీఎంకే అంటారా..?. గత ఎన్నికల్ని బహిష్కరించిన ఆ పార్టీకి, తాజా ఫలితాల ఓ లెక్కే కాదు. ఎన్నికల అనంతరం ఆ కూటమిలో బీటలు వారినట్టే అన్న ప్రచారం బయలు దేరింది. అయితే, కూటమి కన్వీనర్ ఎండీఎంకే నేత వైగో మాత్రం తమ కూటమిలో చీలికకు అవకాశం లేదని, ప్రజల కోసం ఒకే గళం, ఒకే నినాదంతో ముందుకెళ్తామని ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ కూటమికి టాటా..బైబై అని స్పందించడంతో అదే నినాదంతో ముందుకు వెళ్లేందుకు మిగిలిన పార్టీలు సిద్ధమయ్యాయి. టాటా.. బైబై : చెన్నైలో పార్టీ ముఖ్య నాయకులు, జిల్లాల నేతలతో తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ సమాలోచించారు. ఇందులో తీసుకున్న నిర్ణయం మేరకు ఇక టాటా గుడ్ బై అంటూ ప్రజా సంక్షేమ కూటమి నుంచి బయటకు వచ్చేశారు. ఆ కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు వరకు మాత్రమేనని ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వాసన్ వ్యాఖ్యానించారు. అందుకే ఎన్నికల సమయంలో తమ కంటూ ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటించామని గుర్తు చేశారు. ఆ కూటమి ఆ ఎన్నికలతో ముగిసిందని, ఇక తమ పయనం బలోపేతం అని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం లక్ష్యంగా మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నట్టు వివరించారు. స్థానిక ఎన్నికల్లో తమ బలాన్ని చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. ఆ ఎన్నికల్లో పొత్తు ఎవరితో అన్నది తేల్చుతామని వ్యాఖ్యానించారు. సందర్భానుచితంగా, సమయానుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ కొత్త పొత్తు ప్రయత్నాలు ఉంటాయని చెప్పారు. కెప్టెన్ కూడా : వాసన్ అధికారికంగా ప్రకటించి కూటమి నుంచి బయటకు వెళ్లడంతో ఆ బాటను అనుసరించేందుకు డీఎండీకే అధినేత విజయకాంత్ సిద్ధమయ్యారు. పార్టీ నేతలతో సమీక్షను ముగించిన విజయకాంత్ ఇక, భవిష్యత్ కార్యాచరణ మీద దృష్టి పెట్టి ఉన్నారు. ఇందులో భాగంగా ప్రజా సంక్షేమ కూటమి నుంచి బయటకు వచ్చేస్తున్నామన్న అధికారిక ప్రకటనను ఒకటి రెండు రోజుల్లో విజయకాంత్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో సమీక్షల సమయంలో నాయకుల అభిప్రాయాల్ని విన్న విజయకాంత్, వారి అభిష్టానికి అనుగుణంగా నడచుకునే విధంగా వ్యవహరించడమే కాకుం డా, కొన్ని సందర్భాల్లో తిరగబడే విధంగా వ్యాఖ్యల్ని సంధించినట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించిన నాయకులకు దూకుడుకు కల్లెం వేసే రీతిలో అవసరం అయితే, పార్టీని రద్దు చేయడం, లేదా మరో పార్టీలోకి విలీనం చేయడానికి తాను వెనుకాడబోనంటూ విజయకాంత్ హెచ్చరించి ఉండటం గమనించాల్సిన విషయమే. ఇక, ప్రజా సంక్షేమ కూటమితో ఒరిగిందేమీ లేని దృష్ట్యా, మళ్లీ డీఎంకేకు దగ్గరయ్యే విధంగా వీసీకే నేత తిరుమా ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ఇందుకు అద్దం పట్టే రీతిలో డీఎంకే అధినేత కరుణానిధికి అనుకూల వ్యాఖ్యల్ని అందుకుని ఉండటం ఆలోచించాల్సిందే. అదే విధంగా వామపక్షాలు సైతం కూటమి నుంచి బయటకు వచ్చేందుకు నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. వామపక్షాలు మాత్రమే ఇక కలిసి నడిచే రీతిలో కార్యాచరణను సీపీఎం, సీపీఐ వర్గాలు సిద్ధం చేసి ఉండడం ఆలోచించ దగ్గ విషయం. స్థానిక ఎన్నికల్లో సీపీఎం, సీపీఐలు కలిసి కట్టుగా సాగితే, తమకు పట్టున్నచోట్ల గెలుపు బావుటాకు మార్గం సుగమం అవుతుందన్న ధీమాతో ఆ పార్టీల వర్గాలు ఉండడం విశేషం. -
కెప్టెన్ కసరత్తు
రాష్ర్ట పర్యటనకు నిర్ణయం బలోపేతం లక్ష్యంగా పయనం సాక్షి, చెన్నై: చతికిలపడ్డ డీఎండీకేను బలోపేతం చేయడం లక్ష్యంగా ఆ పార్టీ అధినేత విజయకాంత్ కసరత్తుల్లో పడ్డారు. పార్టీల నేతలతో సమీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 20 వరకు ఈ సమీక్షలు సాగనున్నాయి. తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించబోతున్నారు. బలోపేతం లక్ష్యంగా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే రీతిలో ఈ పర్యటనకు చర్యలు తీసుకునే పనిలో పడ్డారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తానే అన్నంతగా ఎదిగిన నేత విజయకాంత్. డీఎండీకే ఆవి ర్భావంతో సత్తా చాటి, ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించి చివరకు చతికిలబడ్డారు. ఎంత వేగంగా ఎదిగారో, అంతే వేగం గా పాతాళంలోకి నెట్టబడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ మేకర్గా ఉండి ఉంటే, కెప్టెన్ను ప్రజలు ఆదరించి ఉంటారేమో. కింగ్ అంటూ ముందుకు సాగి ఆరుగురితో కలసి డీఎంకే, అన్నాడీఎంకే అనే ఇద్దర్ని వేర్వేరుగా ఢీ కొట్టి చివరకు అడ్రస్సు గల్లంతు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విజయకాంత్ చరిష్మా అంటే ఇది అని చెప్పుకున్న వాళ్లంతా, ఇప్పుడు వ్యంగ్యాస్త్రాలు, చమత్కారాలు సంధించే పనిలో పడ్డారు. డిపాజిట్లు గల్లంతై, ఓటు బ్యాంక్ కోల్పోయి దీనావస్థలో ఉన్న పార్టీకి కొత్త ఉత్సాహం నింపడం ఇప్పుడు విజయకాంత్ ముందు ఉన్న పెద్ద సవాల్. కోల్పోయిన వైభవాన్ని చేజిక్కించుకోవడం లక్ష్యంగా తీవ్ర కసరత్తులకు సిద్ధం అయ్యారు. ఆ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండల, యూనియన్, నియోజకవర్గ స్థాయిల్లోని నేతలతో సమీక్షించి, మళ్లీ బలనిరూపణ లక్ష్యంగా ముందుకు సాగాల్సిన తీరుపై సమీక్షించే పనిలో పడ్డారు. ఆ మేరకు సమీక్షలకు సోమవారం శ్రీకారం చుట్టారు. చెన్నై కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో తొలి రోజు చెన్నై, తిరువళ్లూరు జిల్లాల నేతలతో సమీక్షించారు. వార్డు స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయి వరకు ప్రస్తుతం పార్టీ పరిస్థితి, వెన్నంటి ఉన్న కేడర్, నాయకుల వివరాలను సేకరించారు. పార్టీలో ప్రక్షాళన పర్వంతో ముందుకు సాగితే, కొత్త రక్తం నింపినట్టు అవుతుందన్న అంశాన్ని నాయకుల ముందు ఉంచి వారి అభిప్రాయాల్ని సేకరించినట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేద్దామని, అధికార పూర్వకంగా ప్రజా సంక్షేమ కూటమికి టాటా చెప్పే ప్రకటన విడుదల చేయాలని విజయకాంత్ను నాయకులు పట్టుబట్టి ఉన్నారు. ఇందుకు సానుకూలంగానే విజయకాంత్ స్పందించినట్టు, ఆ కూటమితో పని లేకుండా, పార్టీ బలం పెంపు లక్ష్యంగా ముందుకు సాగుదామని నేతలకు సూచించి ఉన్నారు. ఈ సమీక్షలు 20వ తేదీ వరకు సాగించే రీతిలో నిర్ణయం తీసుకుని ఉన్నారు. మంగళవారం తిరువణ్ణామలై, కృష్ణగిరి, ధర్మపురి, వేలూరు, కాంచీపురం, విల్లుపురం జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు. ఆగస్టులో రాష్ట్ర వ్యాప్తంగా విజయకాంత్ పర్యటన సాగించేందుకు నిర్ణయించి ఉన్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో రోజుకు ఒక జిల్లా చొప్పున ఎంపిక చేసుకుని, మూడు నాలుగు ప్రధాన నియోజకవర్గ కేంద్రాల్లో సంక్షేమ సామగ్రి పంపిణీ, బహిరంగ సభలతో బలాన్ని చాటుకోవడం, ఢీలా పడ్డ కేడర్లో ఉత్సాహం నింపడం లక్ష్యంగా విజయకాంత్ పర్యటన సిద్ధం అవుతోన్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
మూడు గుడ్బైలు
వైదొలగాలని డీఎండీకే, తమాకా, వీసీకే నిర్ణయం వాసన్, విజయకాంత్, తిరుమా వెల్లడి అసెంబ్లీ ఎన్నికల సమయంలోఎన్నో ఆశలతో ఆవిర్భవించిన ప్రజా సంక్షేమ కూటమి సంక్షోభంలో పడిపోయింది. ఎన్నికలు ముగిసి ముప్పైరోజులు కూడా కాకుండానే మూడు పార్టీలు కూటమికి గుడ్బై చెప్పేశాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నిక ల్లో కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిపోగా డీఎంకే, అన్నాడీఎంకేలే ప్రభుత్వ పగ్గాల కోసం పోటీపడుతున్నాయి. సుమారు ఐదు దశాబ్దాలుగా ఈ రెండు పార్టీలదే పెత్తనంగా మారింది. మూడో అతిపెద్ద పార్టీగా పుట్టుకొచ్చిన డీఎండీకే ఒంటరిగా తన సత్తాను చాటలేక చతికిలబడింది. డీఎంకే, అన్నాడీఎంకే ఆధిపత్యానికి గండికొట్టడమే లక్ష్యంగా గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజాసంక్షేమ కూటమి ఆవిర్భవించింది. కూటమి ఏర్పాటుకు మూలకర్తై ఎండీఎంకే అధినేత వైగో అనేక పార్టీలను కూటమిలో చేర్చే బాధ్యతలను చేపట్టారు. వీసీకే, వామపక్షాలు కూటమిలో చేరిపోయాయి. ఆ తరువాత డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ డీఎంకే కూటమివైపు మొగ్గుచూపుతూనే సంక్షేమ కూటమిలో చేరిపోయారు. అన్నాడీఎంకేతో పొత్తు కోసం పాకులాడిన తమిళ మానిల కాంగ్రెస్ అధినేత జీకే వాసన్ సైతం గత్యంతరం లేక సంక్షేమ కూటమి తీర్థం పుచ్చుకున్నారు. కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయకాంత్ను రంగంలోకి దించారు. అత్యధిక పార్టీలు కలిగిన కూటమిగా తాము అధికారంలోకి రావడం ఖాయమని ప్రచారం చేసుకున్నారు. తీరా ఓట్ల లెక్కింపు రోజున వెల్లడైన ఫలితాల్లో సంక్షేమ కూటమికి శృంగభంగమే మిగిలింది. సంక్షేమ కూటమి నుంచి పోటీ చేసిన 234 మంది అభ్యర్థుల్లో ఒక్కరూ గెలవలేదు. కూటమిలోని వివిధ పార్టీ అధ్యక్షులు ఘోరపరాజయం పాలైనారు. ముఖ్యమంత్రి అభ్యర్థి విజయకాంత్ ఏకంగా డిపాజిట్టునే కోల్పోయారు. కనీస శాతం ఓట్లు కూడా సాధించలేకపోయిన కూటమిలోని పార్టీలు చివరకు ఎన్నికల కమిషన్ గుర్తింపునే కోల్పోయే దుస్థితికి చేరుకున్నాయి. కూటమి ఓటమితో పార్టీ నేతలు పోస్టుమార్టం చేసుకున్నారు. ఓటమిపై ఒకరికొకరు నిందించుకున్నారు. కూటమి నుంచి వైదొలగాలంటూ ఆయా పార్టీ నేతలపై ఒత్తిళ్లు పెరిగాయి. ఇదిలా ఉండగా, కూటమి నుంచి డీఎండీకే, తమాకా వెళ్లిపోయినా నష్టం లేదంటూ ఇటీవల జరిగిన ఎండీఎంకే నిర్వాహకుల సమావేశంలో వైగో వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని వైగో కూడా ఖండించలేదు. కూటమికి బై: జీకే వాసన్ సంక్షేమ కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్ సోమవారం ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మూడు దశలుగా పార్టీ సమావేశమైందని తెలిపారు. సోమవారం రాష్ట్రస్థాయి నిర్వాహకులతో సమావేశం అయ్యామని చెప్పారు. అందరి అభిప్రాయాలను స్వీకరించి విశ్లేషించుకున్నామని అన్నారు. ఈ నెల 11వ తేదీన కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి కీలకమైన నిర్ణయాలను ప్రకటిస్తామని తెలిపారు. సంక్షేమ కూటమి నుంచి వైదొలగాలన్న నేతల అభిప్రాయంతో ఏకభవిస్తూ కార్యవర్గ సమావేశంలో అధికారికంగా ప్రకటించనున్నట్లు వాసన్ నర్మగర్భంగా తెలిపారు. సమావేశానికి హాజరైన నేతలు సైతం కూటమికి గుడ్బై చెప్పనున్నట్లు స్పష్టం చేశారు. విజయకాంత్ సిద్ధం సంక్షేమ కూటమి నుంచి వైదొలిగితేనే డీఎండీకే నిలబడుతుందనే స్థాయిలో ఒత్తిళ్లను విజయకాంత్ ఎదుర్కొంటున్నారు. ఓటమి కారణాలపై పార్టీ సమావేశంలో పోస్టుమార్టం నిర్వహించగా అందరూ సంక్షేమ కూటమినే నిందించారు. ఎన్నికల బూత్ నిర్వహణకు ఏజెంట్లకు కూటమి నుంచి కనీస ఆర్థిక సాయం అందలేదని, ఉన్న ఆస్తులను పణంగాపెట్టి నడిరోడ్డులో నిలుచున్నామని ఆవేదన వ్యక్తం చేయడంతో ఒక్కో అభ్యర్థికి రూ.10 లక్షలు చెల్లించాలని విజయకాంత్ నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉండగా డీఎండీకే నుంచి వేరుపడిన మక్కల్ డీఎండీకే పెట్టుకున్న నేతలు మరింత మందిని తమవైపు లాక్కునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ దుష్పరిణామాల నుంచి బైటపడేందుకు కూటమి నుంచి వీలైనంత త్వరగా బైటపడాలని విజయకాంత్ నిర్ణయించకున్నట్లు ఆ పార్టీ ముఖ్యనేత సోమవారం తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో విజయకాంత్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటిస్తారని ఆయన చెప్పారు. ‘స్థానికం’లో ఒంటరి పోరు: తిరుమా రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సంక్షేమ కూటమి అవసరం ఎంతమాత్రం లేదని, ఒంటరిగా బరిలోకి దిగుతామని వీసీకే అధినేత తిరుమావళవన్ సోమవారం ప్రకటించారు. సంక్షేమ కూటమితో తెగదెంపులకు సిద్ధం అవుతున్నామని అన్నారు. తాను పోటీ చేసిన కాట్టుమన్నార్ కోవిల్లో ఓట్లను మరోసారి లెక్కించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. -
తప్పులు గుర్తించే పనిలో..
ఘోర పరాజయం డీఎండీకేను డీలా పడేలా చేసింది. డిపాజిట్ల గల్లంతుతో పాటుగా ఓటు బ్యాంక్ పతనం కావడంతో భవిష్యత్తు కార్యచరణపై విజయకాంత్ దృష్టి పెట్టారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు జిల్లాల కార్యదర్శులతో సమాలోచనలో మునిగారు. ప్రజా సంక్షేమ కూటమితో పొత్తే పార్టీ కొంప ముంచిందని పలువురు జిల్లా కార్యదర్శులు విజయకాంత్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. బీజేపీ సైతం తప్పులను గుర్తించే పనిలో పడింది. సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి ఘోర పరాజయాన్ని చవి చూసిన విషయం తెలి సిందే. ఇందులో డీఎండీకేకు అత్యధికంగా నష్టం జరిగి ఉన్నది. ప్రధాన ప్రతిపక్ష స్థాయిలో ఉన్న పార్టీ, ఇప్పుడు చతికిల పడింది. 5.4 శాతం మేరకు ఓటు బ్యాంక్ను సైతం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. విజయకాంత్ సైతం ముఫ్పై వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి చవి చూడాల్సినంతగా డీఎండీకే దిగజారింది. విజయకాంత్కు తీవ్ర నష్టం ఏర్పడిందన్న విషయం కూటమిలోని మిత్రులందరికీ తెలుసు. అందుకే ఆయన్ను ఓదార్చే రీతిలో కూటమిలోని ఎండీఎంకే, సీపీఎం, సీపీఐ, వీసీకే, తమిళ మానిల కాంగ్రెస్లు రెండు రోజుల క్రితం విజయకాంత్తో సమాలోచించారు. ఈ సమాలోచనతో విజయకాంత్ మినహా తక్కిన నేతలు మీడియా ముందుకు వచ్చి తమ కూటమి కొనసాగుతుందని ప్రకటించి వెళ్లారు. అయితే, నష్టం ఎక్కడి నుంచి తమకు ఎదురైందో అన్వేషించి, భవిష్యత్తును మళ్లీ పునర్ నిర్మించుకునేందుకు విజయకాంత్ సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా సోమవారం నుంచి మూడు రోజుల పాటుగా రాష్ట్రంలోని పార్టీ జిల్లాల కార్యదర్శులు ముఖ్య నాయకులతో సమాలోచనకు నిర్ణయించారు. ఆ మేరకు కోయంబేడులో జరిగిన సమాలోచనకు ఉదయం పలువురు జిల్లాల కార్యదర్శులు హాజరయ్యారు. పొత్తే కొంప ముంచింది: కోయంబేడులో విజయకాంత్ నేతృత్వంలో జరిగిన ఈ సమాలోచనలో పలువురు నేతలు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేసి ఉన్నారు. ప్రజా సంక్షేమ కూటమితో కలిసి వెళ్లడం వల్లే పార్టీ పతనం కావాల్సి వచ్చిందని, ఇది కొనసాగితే, ఇక కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్న హెచ్చరికను చేసినట్టు సమాచారం. ఇకనైనా వ్యూహాత్మకంగా వ్యవహరించడం, అదును చూసి అడుగులు వేసి బలోపేతం చేసుకోవాలని లేనిపక్షంలో కేడర్ చేజారే ప్రమాదం ఉందని సూచించినట్టు తెలిసింది. పార్టీ ఎన్నికల గుర్తింపు రద్దు, ఢంకా చిహ్నం దూరం కాబోతున్న విషయంగా విజయకాంత్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేసినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగుదామని, ఆ ఎన్నికల్లో గెలుపుతో మళ్లీ బలాన్ని చాటుకుందామన్న భరోసాను కేడర్కు ఇచ్చే విధంగా పలు సూచనలు , సలహాల్ని జిల్లాల కార్యదర్శులకు విజయకాంత్ ఇచ్చి ఉన్నారు. ఇక, విజయకాంత్ బాటలోనే ఎండీఎంకే నేత వైగో ఓటమిపై నేతలతో సమాలోచించేందుకు నిర్ణయించారు. ఒకటో తేదిన చెన్నైలోని పార్టీ కార్యాలయంలో ఈ సమాలోచనా సమావేశం సాగనున్నది. ఇక, రాష్ట్రంలో ఓటమి చవి చూసినా, ఓటు బ్యాంక్ ఊరట నివ్వడంతో తదుపరి అడుగులు దిశగా పీఎంకే సిద్ధం అయింది. ఇందు కోసం కేడర్తో సమాలోచించేందుకు నిర్ణయించారు. ఓటమి చవిచూసిన అభ్యర్థులు, పార్టీ ముఖ్య నేతలతో మంగళవారం పీఎంకే అధినేత రాందాసు, ఎంపీ అన్భుమణి రాందాసు, పార్టీ అధ్యక్షుడు జికే మణిలు సమాలోచనా సమావేశానికి నిర్ణయించారు. కమలనాథుల మంతనాలు : ఇక ఐదుసీట్లు గ్యారంటీ అని ఢిల్లీకి నివేదిక పంపించి చివరకు ఒక్కటి కూడా దక్కక నిరాశలో పడ్డ కమలనాథులు సైతం మంతనాల్లో మునిగారు. నాలుగు చోట్ల రెండో స్థానం దక్కినా, మిగిలిన అన్ని చోట్ల డిపాజిట్లు గల్లంతు కావడంతో ఓటమి కారణాలపై సోమవారం సమీక్షించారు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సంతోష్ నేతృత్వంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్, నేతలు ఇలగణేషన్, వానతీ శ్రీనివాసన్, హెచ్ రాజా తదితరులతో కూడిన కమిటీ సమాలోచించి ఓటమి కారణాలను ఆరా తీసింది. కేంద్ర ప్రభుత్వ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు తగ్గట్టుగా బలాన్ని పెంచుకునే విధంగా కార్యచరణను సిద్ధం చేశారు. ఈసమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీలోని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పంపించేందుకు నిర్ణయించారు.