Mumbai Indians
-
ఉప్పల్ అదిరేలా SRH, ముంబై ప్లేయర్ల ప్రాక్టీస్.. విజయం ఎవరిదో (ఫొటోలు)
-
ఉప్పల్లో సన్‘రైజ్’ అయ్యేనా?
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ 18వ సీజన్లో నిలకడ కనబర్చలేకపోతున్న సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఏడు మ్యాచ్లాడి 2 విజయాలు 5 పరాజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్న సన్రైజర్స్... బుధవారం మరో మారు ముంబై ఇండియన్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. గత గురువారం వాంఖడే వేదికగా ముంబైతోనే తమ చివరి మ్యాచ్ ఆడిన ఎస్ఆర్హెచ్... స్వల్ప విరామం అనంతరం మరోసారి ముంబైతోనే తలపడుతోది. ఈ సీజన్లో ఆడితే బ్రహ్మండం... లేదంటే శూన్యం అన్నట్లు సాగుతున్న హైదరాబాద్... ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో గెలుపు తప్పనిసరి. జట్టులో లెక్కకు మిక్కిలి హిట్టర్లు ఉన్నా... వారంతా కలిసి కట్టుగా కదం తొక్కలేకపోతుండటమే ఎస్ఆర్హెచ్ను ఇబ్బంది పెడుతోంది. సొంతగడ్డపై బీభత్సం సృష్టించే ఆరెంజ్ ఆర్మీ... ఉప్పల్లో అయినా తిరిగి విజయాల బాట పట్టాలని చూస్తోంది. మరోవైపు గత మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గి ఫామ్లోకి వచ్చిన ముంబై ఇండియన్స్... అదే జోరు కొనసాగిస్తూ పాయింట్ల పట్టికలో పైపైకి దూసుకెళ్లాలని భావిస్తోంది. తాజా సీజన్లో ఆడిన తొలి 5 మ్యాచ్ల్లో కేవలం ఒక్క విజయమే సాధించిన ముంబై ఇండియన్స్... ఆ తర్వాత గాడిన పడింది. స్టార్ పేసర్ బుమ్రా వచ్చాక బౌలింగ్ మరింత రాటుదేలగా... గత మ్యాచ్తో హిట్మ్యాన్ రోహిత్ శర్మ లయ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఉప్పల్లో సన్రైజర్స్ పరుగుల ఉప్పెన సృష్టిస్తుందా లేక ముంబై గెలుపు జోరు కొనసాగుతుందా చూడాలి! టాపార్డర్ రాణిస్తేనే... గతేడాది నిలకడైన ప్రదర్శనతో రన్నరప్గా నిలిచిన సన్రైజర్స్ జట్టు... ఈసారి అదే తీవ్రత కొనసాగించలేకపోతోంది. తొలి పోరులో భారీ స్కోరు చేసి ప్రత్యర్థులను బెదరగొట్టిన రైజర్స్... ఆ తర్వాత మాత్రం పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటోంది, ఎస్ఆర్హెచ్ తరఫున ఆడిన తొలి పోరులోనే సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్ ఆ తర్వాత ఆకట్టుకోలేకపోతుండగా... గత సీజన్లో ‘ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు’ దక్కించుకున్న ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి పూర్తిగా విఫలమవుతూ ఉన్నాడు. ఓపెనర్లు అభిõÙక్ శర్మ, ట్రావిస్ హెడ్పై జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది. దానికి తగ్గట్లు వీరిద్దరు ఆడిన రోజు టీమ్ మొత్తం చెలరేగుతుండగా... ఓపెనర్లు విఫలమైన సందర్భంలో మాత్రం ఓ మాదిరి స్కోరు చేసేందుకు కూడా తడబడుతోంది. మిడిలార్డర్లో క్లాసెన్, అనికేత్ వర్మ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ మ్యాచ్లో ఇషాన్, నితీశ్ కూడా గాడిన పడాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. అటు బౌలింగ్లోనూ రైజర్స్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది. కెప్టెన్ కమిన్స్తో పాటు టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ, హర్షల్ పటేల్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుండగా... ఇషాన్ మలింగ, జీషన్ అన్సారీపై అధిక భారం పడుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో రైజర్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ముంబై అలవోకగా ఛేదించింది. అయితే అది వాంఖడేలోని కాస్త టరి్నంగ్ పిచ్కాగా... ఉప్పల్ ఫ్లాట్ పిచ్పై ఎలాంటి ఫలితం వస్తుందనేది ఆసక్తికరం. ‘హ్యాట్రిక్’తో జోరుమీదున్న ముంబై ఎప్పట్లాగే ఈసారి కూడా పరాజయాలతోనే సీజన్ను ప్రారంభించిన ముంబై ఇండియన్స్... ఆ తర్వాత పుంజుకుంది. గత మూడు మ్యాచ్లను పరిశీలిస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)పై హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై విజయాలు సాధించింది. చెన్నైతో పోరు ద్వారా రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం ఆ జట్టుకు అదనపు బలాన్నిస్తోంది. రోహిత్, సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సీఎస్కే నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు 15.4 ఓవర్లలోనే అధిగమించింది. హైదరాబాదీ తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, నమన్ ధీర్తో మిడిలార్డర్ కూడా బలంగా ఉంది. బౌలింగ్లోనూ ముంబైకి పెద్దగా ఇబ్బందులు లేవు. గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన స్టార్ పేసర్ బుమ్రా మునుపటి వేగం అందిపుచ్చుకోగా... బౌల్ట్, దీపక్ చహర్ అతడికి సహకరిస్తున్నారు. సాంట్నర్, అశ్వని కుమార్ మరోసారి కీలకం కానున్నారు. అయితే సొంతగడ్డపై ఎంతటి బౌలింగ్ బృందాన్ని అయినా చిత్తు చేయగల ఆరెంజ్ ఆర్మీ హిట్టర్లను ముంబై బౌలర్లు ఏమేరకు అడ్డుకుంటారనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. తుదిజట్లు (అంచనా) సన్రైజర్స్ హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, క్లాసెన్, అనికేత్ వర్మ, హర్షల్ పటేల్, షమీ, జీషాన్ అన్సారీ, ఇషాన్ మలింగ, రాహుల్ చహర్. ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్, రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్, తిలక్ వర్మ, నమన్ ధీర్, సాంట్నర్, దీపక్ చహర్, కరణ్ శర్మ, బౌల్ట్, బుమ్రా.10 సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య ఇప్పటి వరకు 24 మ్యాచ్లు జరగగా... అందులో హైదరాబాద్ జట్టు 10 విజయాలు సాధించింది. మరో 14 మ్యాచ్ల్లో ముంబై గెలుపొందింది. -
చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి జట్టుగా
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ముంబై గెలుపొందింది. సీఎస్కే నిర్ధేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. ముంబై స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ(76), సూర్యకుమార్ యాదవ్(68) ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ముగించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగలు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో రవీంద్ర జడేజా(53), శివమ్ దూబే(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. మంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా.. చాహర్, శాంటర్న్ తలా వికెట్ సాధించారు.చరిత్ర సృష్టించిన ముంబై..ఇక ఈ మ్యాచ్లో సీఎస్కేను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్ ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ను మూడు సార్లు తొమ్మిది లేదా అంతకంటే ఎక్కువ వికెట్ల తేడాతో ఓడించిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది.ముంబై కంటే ముందు ఏ జట్టు కూడా ఈ ఫీట్ సాధించలేకపోయింది. 2008 ఐపీఎల్ సీజన్లో సీఎస్కేను తొలిసారిగా ముంబై ఇండియన్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత 2020 సీజన్లో షార్జా వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నైపై 10 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. మళ్లీ ఇప్పుడు ఐదేళ్ల తర్వాత చెన్నైను 9 వికెట్ల తేడాతో హార్దిక్ సేన ఓడించింది. కాగా ఈ ఓటమితో సీఎస్కే తమ ప్లేఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటివరకు 8 మ్యాచ్ల ఆడిన చెన్నై కేవలం రెండింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో కొనసాగుతోంది.చదవండి: IPL 2025: 'వారిద్దరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు'.. స్టార్ క్రికెటర్లపై సెహ్వాగ్ ఫైర్ -
MI VS CSK: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. నిన్న (ఏప్రిల్ 20) సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న హిట్మ్యాన్.. ఐపీఎల్లో 20 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న తొలి భారత క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్కు ముందు రోహిత్, విరాట్ కోహ్లి తలో 19 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచి భారత్ తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచిన ఆటగాళ్లుగా ఉన్నారు.విరాట్ నిన్ననే పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచి రోహిత్ రికార్డును సమం చేశాడు. అయితే గంటల వ్యవధిలోనే రోహిత్ విరాట్ను వెనక్కు నెట్టి హోల్ అండ్ సోల్గా భారత్ తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు (ఐపీఎల్) గెలుచుకున్న ఆటగాడిగా అవతరించాడు.ఓవరాల్గా ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో రోహిత్ మూడో స్థానానికి ఎగబాకాడు. ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడీ ఐపీఎల్లో 25 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఏబీడీ తర్వాత క్రిస్ గేల్ (22), రోహిత్ (20) వరుస స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్ నాలుగో స్థానంలో ఉన్నాడు.ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్లు (టాప్-5)20 - రోహిత్ శర్మ (264 మ్యాచ్లు)19 - విరాట్ కోహ్లీ (260 మ్యాచ్లు)18 - ఎంఎస్ ధోని (272 మ్యాచ్లు)16 - యూసుఫ్ పఠాన్ (174 మ్యాచ్లు)16 - రవీంద్ర జడేజా (248 మ్యాచ్లు)ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్లు (టాప్-5)25- ఏబీ డివిలియర్స్ (184 మ్యాచ్లు)22- క్రిస్ గేల్ (142 మ్యాచ్లు)20 - రోహిత్ శర్మ (264 మ్యాచ్లు)19 - విరాట్ కోహ్లీ (260 మ్యాచ్లు)18 - ఎంఎస్ ధోని (272 మ్యాచ్లు)నిన్నటి మ్యాచ్లో రోహిత్ మరో రికార్డు కూడా సాధించాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో శిఖర్ ధవన్కు వెనక్కు నెట్టాడు. ఈ జాబితాలో విరాట్ టాప్ ప్లేస్లో ఉన్నాడు.ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు (టాప్-5)8326 - విరాట్ కోహ్లీ6786 - రోహిత్ శర్మ*6769 - శిఖర్ ధావన్6565 - డేవిడ్ వార్నర్5528 - సురేష్ రైనామ్యాచ్ విషయానికొస్తే.. నిన్న రాత్రి వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రవీంద్ర జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు,2 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.సీఎస్కే ఇన్నింగ్స్లో అరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు,2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. ముంబై బౌలర్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఛేదనకు దిగిన ముంబై రోహిత్ శర్మ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 15.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. -
ముంబై దూకుడు.. చెన్నైకు మరో ఓటమి
-
IPL 2025: ఇటు రోహిత్.. అటు కోహ్లి
భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ విజృంభించారు. భారీ షాట్లతో అలరిస్తూ ఆదివారం అభిమానులకు డబుల్ ధమాకా అందించారు. పంజాబ్ కింగ్స్తో పోరులో కోహ్లి క్లాసిక్ ఇన్నింగ్స్తో కదంతొక్కగా... చెన్నైతో మ్యాచ్లో రోహిత్ శర్మ ఊర మాస్ షాట్లతో చెలరేగిపోయాడు. ఫలితంగా పంజాబ్పై బెంగళూరు బదులు తీర్చుకోగా... చెన్నైపై ముంబై ఇండియన్స్ భారీ విజయం నమోదు చేసుకుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఓ మాదిరి ప్రదర్శనతో సరిపెట్టుకున్న రోహిత్... తనను ‘హిట్మ్యాన్’ ఎందుకు అంటారో వాంఖడేలో నిరూపించాడు. విరాట్ దూకుడుతో బెంగళూరు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లగా... రోహిత్ మెరుపులతో ముంబై నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. ఓపెనర్లుగా తొలి ఓవర్లోనే క్రీజులో అడుగుపెట్టిన ఈ ఇద్దరూ చివరి వరకు అజేయంగా నిలిచి తమ జట్లను గెలిపించడం కొసమెరుపు.ముంబై: సిక్స్... ఫోర్... ముంబై ఇన్నింగ్స్ మొత్తం ఇదే తీరు! బంతి పడటమే ఆలస్యం బౌండరీ వెళ్లెందుకు ఓసారి, సిక్స్ అయ్యేందుకు మరోసారి బంతి అదేపనిగా ముచ్చట పడిందనిపించింది. ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ, టి20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ల ఆట మ్యాచ్లో హైలైట్స్ను చూపించలేదు. హైలైట్సే మ్యాచ్గా మార్చేసింది. దీంతో ముంబై 177 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించింది. చెన్నైపై 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.ముందుగా చెన్నై సూపర్కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు), శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్స్లు) రాణించారు. అనంతరం ముంబై 15.4 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి 177 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్స్లు), సూర్య (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్లు) హోరెత్తించారు. దంచేసిన జడేజా, దూబే ఆంధ్ర కుర్రాడు షేక్ రషీద్ (20 బంతుల్లో 19; 1 ఫోర్)కు ఓపెనింగ్లో అవకాశమిస్తున్న ధోనిని నిరుత్సాహపరిచాడు. పవర్ప్లేలో 20 బంతులాడి కూడా ఒకే ఒక్క బౌండరీ బాదాడు. రచిన్ రవీంద్ర (5) విఫలమవగా, 17 ఏళ్ల ‘లోకల్ బాయ్’ ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్లు) ఉన్నది కాసేపే అయినా ఫోర్లు, సిక్స్లతో అలరించాడు. తర్వాత వచ్చిన జడేజా, దూబే భారీషాట్లు బాదడంతో చెన్నై పుంజుకుంది. ఇద్దరు నాలుగో వికెట్కు 79 పరుగులు జోడించారు. సిక్స్లు బాదిన దూబే 30 బంతుల్లో, జడేజా 34 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ధోని (4)ని బుమ్రా ఎంతో సేపు నిలువనీయలేదు. బాదుడే... బాదుడు రోహిత్ శర్మకు జతగా ఓపెనింగ్ చేసిన రికెల్టన్ తొలి ఓవర్లోనే బౌండరీలతో తమ ఉద్దేశం చాటగా, రెండో ఓవర్ నుంచి రోహిత్ విరుచుకుపడటంతో చెన్నై బౌలర్లకు కష్టాలు తప్పలేదు. మూడో ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. జేమీ ఓవర్టన్ ఓవర్న్నర (9 బంతులు) వేసిన ఐదో ఓవర్లో రికెల్టన్, రోహిత్ చెరో సిక్స్ కొట్టడంతో 18 పరుగులు వచ్చాయి. దీంతో పవర్ప్లేలో 62 పరుగులు చేసిన ముంబై తర్వాతి ఓవర్లోనే రికెల్టన్ (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ను కోల్పోయింది. సూర్యకుమార్ రావడం... రోహిత్తో కలిసి ధనాధన్ షోను డబుల్ చేసింది. ఇద్దరు బౌండరీలు, సిక్సర్లు కొట్టేందుకు పోటీపడటంతో స్టేడియం హోరెత్తింది. ముందుగా ‘హిట్మ్యాన్’ 33 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... సూర్య 26 బంతుల్లో అర్ధసెంచరీ అధిగమించాడు. ఇద్దరు బంతిని అదేపనిగా బౌండరీలైన్ను దాటిస్తూనే ఉండటంతో లక్ష్యం ముంబై వైపు నడిచివచ్చింది.స్కోరు వివరాలు చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: షేక్ రషీద్ (స్టంప్డ్) రికెల్టన్ (బి) సాంట్నర్ 19; రచిన్ (సి) రికెల్టన్ (బి) అశ్వని 5; ఆయుశ్ (సి) సాంట్నర్ (బి) దీపక్ చహర్ 32; జడేజా (నాటౌట్) 53; దూబే (సి) జాక్స్ (బి) బుమ్రా 50; ధోని (సి) తిలక్ (బి) బుమ్రా 4; జేమీ ఓవర్టన్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–16, 2–57, 3–63, 4–142, 5–156. బౌలింగ్: చహర్ 4–0–32–1, బౌల్ట్ 4–0–43–0, అశ్వని 2–0–42 –1, సాంట్నర్ 3–0–14–1, బుమ్రా 4–0–25–2, విల్ జాక్స్ 1–0–4–0, హార్దిక్ 2–0–13–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) ఆయుశ్ (బి) జడేజా 24; రోహిత్ (నాటౌట్) 76; సూర్యకుమార్ (నాటౌట్) 68; ఎక్స్ట్రాలు 9; మొత్తం (15.4 ఓవర్లలో వికెట్ నష్టానికి) 177. వికెట్ల పతనం: 1–63. బౌలింగ్: ఖలీల్ 2–0–24–0, ఓవర్టన్ 2–0– 29–0, అశ్విన్ 4–0–25–0, జడేజా 3–0–28–1, నూర్ 3–0–36–0, పతిరణ 1.4–0–34–0. ముల్లాన్పూర్: ముందు బౌలర్లు, తర్వాత బ్యాటర్లు రాణించడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తమ సొంతగడ్డపై పొగొట్టుకున్న ఫలితాన్ని పంజాబ్కు వెళ్లి రాబట్టుకుంది. ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్పై ఘనవిజయం సాధించింది. ముందుగా పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. జోష్ ఇన్గ్లిస్ (17 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), శశాంక్ సింగ్ (33 బంతుల్లో 31; 1 ఫోర్) మెరుగ్గా ఆడారు. కృనాల్, సుయశ్లకు రెండేసి వికెట్లు దక్కాయి. తర్వాత బెంగళూరు 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి (54 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అదరగొట్టాడు. దేవదత్ పడిక్కల్ (35 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్స్లు) మెరిపించాడు. కోహ్లి ఆఖరిదాకా... పెద్ద లక్ష్యం కాకపోయినా... బెంగళూరు జట్టు తమ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (1) వికెట్ను తొలి ఓవర్లోనే కోల్పోయింది. పంజాబ్కు దక్కింది ఈ ఆరంభ సంబరమే! అటు తర్వాత కథంతా కింగ్ కోహ్లి, పడిక్కల్ నడిపించారు. వన్డౌన్ బ్యాటర్ పడిక్కల్ భారీ సిక్సర్లతో విరుచుకుపడగా... కోహ్లి క్లాసిక్స్ షాట్లతో ముల్లాన్పూర్ ప్రేక్షకుల్ని గెలిచాడు. ఇద్దరు రెండో వికెట్కు 103 పరుగులు జోడించారు. పడిక్కల్ అవుటైనా... ఆఖరిదాకా క్రీజులో నిలబడిన కోహ్లి జట్టును గెలిపించాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) డేవిడ్ (బి) కృనాల్ 22; ప్రభ్సిమ్రాన్ (సి) డేవిడ్ (బి) కృనాల్ 33; అయ్యర్ (సి) కృనాల్ (బి) షెఫర్డ్ 6; ఇన్గ్లిస్ (బి) సుయశ్ 29; నేహల్ (రనౌట్) 5; శశాంక్ (నాటౌట్) 31; స్టొయినిస్ (బి) సుయశ్ 1; యాన్సెన్ (నాటౌట్) 25; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–42, 2–62, 3–68, 4–76, 5–112, 6–114. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–26–0, యశ్ దయాళ్ 2–0–22–0, హాజల్వుడ్ 4–0–39–0, కృనాల్ పాండ్యా 4–0–25–2, షెఫర్డ్ 2–0–18–1, సుయశ్ 4–0–26–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) ఇన్గ్లిస్ (బి) అర్ష్ దీప్ 1; కోహ్లి (నాటౌట్) 73; పడిక్కల్ (సి) నేహల్ (బి) హర్ప్రీత్ 61; పాటీదార్ (సి) యాన్సెన్ (బి) చహల్ 12; జితేశ్ శర్మ (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 1; మొత్తం (18.5 ఓవర్లలో 3 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–6, 2–109, 3–143. బౌలింగ్: అర్ష్ దీప్ 3–0–26–1, జేవియర్ 3–0–28–1, హర్ప్రీత్ బ్రార్ 4–0–27–1, యాన్సెన్ 3–0–20–0, చహల్ 4–0–36–1, స్టొయినిస్ 1–0–13–0, నేహల్ 0.5–0–9–0. ఐపీఎల్లో నేడుకోల్కతా X గుజరాత్ వేదిక: కోల్కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
CSK Vs MI: రోహిత్, సూర్యకుమార్ విధ్వంసం.. చెన్నైను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2025లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 20) రాత్రి జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రవీంద్ర జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు,2 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సీఎస్కే ఇన్నింగ్స్లో అరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు,2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. షేక్ రషీద్ 20 బంతుల్లో 19, రచిన్ రవీంద్ర 9 బంతుల్లో 5, ధోని 6 బంతుల్లో 6 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఛేదనకు దిగిన ముంబై రోహిత్ శర్మ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 15.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. స్కై వరుసగా రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్ను ముగించాడు. ఈ మ్యాచ్లో ఆది నుంచే దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ సీజన్లో తొలిసారి సామర్థ్యం మేరకు సత్తా చాటాడు. ముంబై ఇన్నింగ్స్లో రికెల్టన్ (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్) కూడా పర్వాలేదనిపించాడు. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజాకు వికెట్ దక్కింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. -
IPL 2025: సీఎస్కేపై ముంబై ఇండియన్స్ ఘన విజయం
సీఎస్కేపై ముంబై ఇండియన్స్ ఘన విజయంచెన్నై సూపర్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా.. ముంబై 15.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ముంబైని విజయతీరాలకు చేర్చారు. స్కై వరుసగా రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్ను ముగించాడు.సూర్యకుమార్ హాఫ్ సెంచరీస్కై 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 14.2 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 146/1గా ఉంది.టార్గెట్ 177.. 13 ఓవర్లలో ముంబై స్కోర్ 127/1రోహిత్ శర్మ (36 బంతుల్లో 53; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (23 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్ శర్మరోహిత్ 33 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఎండ్లో సూర్యకుమార్ 32 పరుగులతో (20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయంగా ఉన్నాడు. 12 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 112/1గా ఉంది. టార్గెట్ 177.. 9 ఓవర్లలో ముంబై స్కోర్ 88/1రోహిత్ శర్మ (27 బంతుల్లో 44; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (8 బంతుల్లో 14; ఫోర్, సిక్స్)తొలి వికెట్ కోల్పోయిన ముంబై6.4వ ఓవర్- 63 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్లో ఆయుశ్ మాత్రేకు క్యాచ్ ఇచ్చి రికెల్టన్ (24) ఔటయ్యాడు.టార్గెట్ 177.. 6 ఓవర్లలో ముంబై స్కోర్ 62/0రోహిత్ శర్మ (18 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రికెల్టన్ (18 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్)టార్గెట్ 177.. ధాటిగా ఆడుతున్న రోహిత్ శర్మ177 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ ధాటిగా ఆడుతుంది. రోహిత్ శర్మ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. 3 ఓవర్లలో ముంబై స్కోర్ వికెట్ నష్టపోకుండా 35 పరుగులుగా ఉంది. రోహిత్ 10 బంతుల్లో 2 ఫోర్లు,2 సిక్సర్ల సాయంతో 22 పరుగులు చేశాడు. రికెల్టన్ 8 బంతుల్లో 2 బౌండరీల సాయంతో 11 పరుగులు చేశాడు. రాణించిన దూబే, జడేజా.. గౌరవప్రదమైన స్కోర్ చేసిన సీఎస్కేటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే గౌరవప్రమదై స్కోర్ చేసింది. శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రవీంద్ర జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు,2 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించడంతో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సీఎస్కే ఇన్నింగ్స్లో అరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు,2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. షేక్ రషీద్ 20 బంతుల్లో 19, రచిన్ రవీంద్ర 9 బంతుల్లో 5, ధోని 6 బంతుల్లో 6 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు. ధోని ఔట్18.4వ ఓవర్- 156 పరుగుల వద్ద సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి ధోని (4) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన సీఎస్కే.. దూబే ఔట్16.2వ ఓవర్- 142 పరుగుల వద్ద సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్లో విల్ జాక్స్కు క్యాచ్ ఇచ్చి శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఔటయ్యాడు. ధాటిగా ఆడుతున్న దూబేఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన శివమ్ దూబే అదరగొడుతున్నాడు. 27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. దూబేకు జతగా రవీంద్ర జడేజా (19) క్రీజ్లో ఉన్నాడు. 15 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 118/3గా ఉంది.మూడో వికెట్ కోల్పోయిన సీఎస్కే7.6వ ఓవర్- 63 పరుగుల వద్ద సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. మిచెల్ సాంట్నర్ బౌలింగ్లో షేక్ రషీద్ (19) స్టంపౌటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 66/3గా ఉంది. రవీంద్ర జడేజా (6), శివమ్ దూబే (1) క్రీజ్లో ఉన్నారు. మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఔటైన ఆయుశ్ మాత్రేఅరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే తన తొలి ఇన్నింగ్స్లోనే అదరగొట్టాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేసి దీపక్ చాహర్ బౌలింగ్లో సాంట్నర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 6.5 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 57/2గా ఉంది. షేక్ రషీద్కు (17) జతగా రవీంద్ర జడేజా క్రీజ్లోకి వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే3.1వ ఓవర్- 16 పరుగుల వద్ద సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. అశ్వనీ కుమార్ తన స్పెల్ తొలి బంతికే రచిన్ రవీంద్ర (9 బంతుల్లో 5) వికెట్ తీశాడు. ఆంధ్ర కుర్రాడు షేక్ రషీద్ 10 బంతుల్లో బౌండరీ సాయంతో 11 పరుగులు చేసి క్రీజ్లో ఉన్నాడు. రషీద్కు జతగా అరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే క్రీజ్లోకి వచ్చాడు.ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 20) రాత్రి ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో ముంబై టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(వికెట్కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్ఇంపాక్ట్ సబ్స్: రోహిత్ శర్మ, కార్బిన్ బాష్, రాజ్ బావా, సత్యనారాయణ రాజు, రాబిన్ మింజ్చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, ఆయుష్ మ్హత్రే, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, విజయ్ శంకర్, జామీ ఓవర్టన్, MS ధోని(కెప్టెన్/వికెట్కీపర్), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీష పతిరణఇంపాక్ట్ సబ్లు: అన్షుల్ కాంబోజ్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, సామ్ కర్రాన్, రవిచంద్రన్ అశ్విన్ -
IPL 2025: సన్రైజర్స్పై విజయం.. చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా వాంఖడే మైదానం వేదికగా నిన్న (ఏప్రిల్ 17) జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో మూడు సిక్సర్లు (2 ఆనికేత్, కమిన్స్ ఒకటి) సహా 22 పరుగులు, అంతకుముందు దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రెండు సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రావడంతో సన్రైజర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో అభిషేక్ 40, ట్రవిస్ హెడ్ 28, ఇషాన్ కిషన్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 19, క్లాసెన్ 37, అనికేత్ 18 (నాటౌట్), కమిన్స్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2, బౌల్ట్, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై మరో 11 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. ముంబై ఇన్నింగ్స్లో రికెల్టన్ 31, రోహిత్ శర్మ 26, విల్ జాక్స్ 36, సూర్యకుమార్ యాదవ్ 26, హార్దిక్ 21, తిలక్ 17 (నాటౌట్) పరుగులు చేశారు. సన్రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 3, ఎషాన్ మలింగ 2, హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టారు. తొలుత బంతితో, ఆతర్వాత బ్యాట్తో రాణించిన విల్ జాక్స్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్ఎస్ఆర్హెచ్పై గెలుపుతో ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఓ వేదికపై ఛేజింగ్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. వాంఖడే మైదానంలో ముంబై 29 సార్లు (47 మ్యాచ్ల్లో) లక్ష్యాలను ఛేదిస్తూ విజయాలు సాధించింది. ఈ రికార్డు సాధించే క్రమంలో ముంబై కేకేఆర్ను అధిగమించింది. కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్లో 28 సార్లు (40 మ్యాచ్ల్లో) లక్ష్యాలను ఛేదిస్తూ విజయాలు సాధించింది.ఐపీఎల్లో ఓ వేదికపై ఛేజింగ్ చేస్తూ అత్యధిక విజయాలు సాధించిన జట్లు..ముంబై ఇండియన్స్- వాంఖడే స్టేడియం- 29 విజయాలు (47 మ్యాచ్లు)కేకేఆర్- ఈడెన్ గార్డెన్స్- 28 (40)రాజస్థాన్ రాయల్స్- సువాయ్ మాన్ సింగ్ స్టేడియం- 24 (31)ఆర్సీబీ- చిన్నస్వామి స్టేడియం- 21 (41)సన్రైజర్స్ హైదరాబాద్- ఉప్పల్ స్టేడియం- 21 (32)సీఎస్కే- చెపాక్ స్టేడియం- 20 (31) -
ఆరోజు నాకు కోపం వచ్చింది.. అందుకే అలా అరిచాను: రోహిత్ శర్మ
టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మైదానంలో వ్యూహాలతోనే కాకుండా.. తనదైన శైలిలో సెటైర్లు పేలుస్తూ అభిమానులను ఆకట్టుకుంటాడు. ఒక్కోసారి తన సరదా చేష్టలతో సహచర ఆటగాళ్లను ఆటపట్టించే హిట్మ్యాన్.. కీలక సమయాల్లో మాత్రం గంభీరంగా మారిపోతాడు. అలా ఇంగ్లండ్ (IND vs ENG)తో 2024 నాటి టెస్టు మ్యాచ్లో రోహిత్ శర్మ అన్న మాటలు స్టంప్ మైకులో రికార్డయ్యాయి.గార్డెన్లో తిరిగేందుకు వచ్చారా?‘‘ఇక్కడ ఎవరూ ఖాళీగా.. పనీపాటా లేకుండా గార్డెన్లో తిరిగేందుకు రాలేదు’’ అంటూ సహచర ఆటగాళ్లను ఒకింత తీవ్ర స్వరంతోనే మందలించాడు. అప్పట్లో వైరల్ అయిన ఈ వ్యాఖ్యలపై రోహిత్ శర్మ తాజాగా స్పందించాడు. ‘‘ఆరోజు వైజాగ్లో మ్యాచ్. ఓవర్ పూర్తయ్యే సమయంలో మా వాళ్లు ఏదో వాకింగ్కు వచ్చినట్లు గార్డెన్లో నడిచినట్లుగా అటూ ఇటూ తిరుగుతున్నారు.ఒక్కరూ పరిగెత్తడం లేదు. మైదానంలో చురుగ్గా లేనేలేరు. మ్యాచ్ చేజారిపోతుందేమోననిపించింది. అది మాకు అతి ముఖ్యమైన, తప్పక గెలవాల్సిన మ్యాచ్. అందుకే ఈరోజు మనమంతా ఇంకాస్త ఎక్కువగా శ్రమించాలి అని మా వాళ్లకు ఆరోజు పొద్దునే గట్టిగా చెప్పాను.అందుకే నాకు కోపం వచ్చిందికానీ వాళ్లేమో గ్రౌండ్లో సరదాగా చక్కర్లు కొడుతున్నారు. అప్పుడు మేము ఒక్క వికెట్ అయినా తీయాలని పరితపించిపోతున్నాం. కానీ ఎవరూ అందుకు తగ్గ ప్రయత్నం చేసినట్లు అనిపించలేదు.అందుకే నాకు కోపం వచ్చింది. మా వాళ్లకు గట్టిగానే క్లాస్ తీసుకున్నా. ప్రత్యర్థి జట్టు భాగస్వామ్యాలను కూల్చాలని చెప్పా. అలాంటి సమయంలో సమిష్టిగా పనిచేస్తేనే ఫలితం వస్తుంది. అయితే, మా వాళ్లు ఎవరి పనిలో వాళ్లు బిజీగా ఉన్నట్లు కనిపించింది. అందుకే అలా అన్నాను’’ అని రోహిత్ శర్మ జియోహాట్స్టార్తో మాట్లాడుతూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.106 పరుగుల తేడాతో గెలుపుకాగా గతేడాది ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఇంగ్లండ్ను 106 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తొలి టెస్టులో ఓడిన రోహిత్ సేన.. ఆ తర్వాత మిగతా నాలుగు గెలిచి.. 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది.ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ఇంత వరకు తన స్థాయికి తగ్గట్లుగా రాణించలేదు. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లు ఆడి కేవలం 82 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కాగా ఐపీఎల్-2025 (IPL 2025) ఆరంభానికి ముందు చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో రోహిత్ టీమిండియాకు ఐసీసీ టైటిల్ అందించాడు. అంతకు ముందు టీ20 ప్రపంచకప్-2024లోనూ టీమిండియాను చాంపియన్గా నిలిపి దిగ్గజ కెప్టెన్ల జాబితాలో చేరిపోయాడు.ఇక భారత్కు పొట్టి ప్రపంచకప్ అందించిన తర్వాత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లితో కలిసి రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేవలం లీగ్ క్రికెట్లో మాత్రమే అతడు పొట్టి ఫార్మాట్లో ఆడుతున్నాడు. కాగా ముంబై ఇండియన్స్కు ఏకంగా ఐదు సార్లు ట్రోఫీ అందించిన కెప్టెన్గా ఘనత సాధించిన రోహిత్ శర్మ.. గతేడాది నుంచి ఆటగాడిగా కొనసాగుతున్నాడు.చదవండి: నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్! -
రైజర్స్ ఓటమి బాట
ఐదు రోజుల క్రితం అద్భుత ఆటతో 245 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన సన్రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు సమష్టి వైఫల్యంతో మరో పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. నాలుగు వరుస ఓటముల తర్వాత గత మ్యాచ్లో గెలిచిన జట్టు ఖాతాలో మళ్లీ ఓటమి చేరింది. బ్యాటింగ్లో మెరుపులు కనిపించక టీమ్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఆ తర్వాత ఛేదనలో ముంబై ఇండియన్స్ కొంత తడబడినా... మరో 11 బంతులు మిగిలి ఉండగా లక్ష్యాన్ని అందుకోవడంలో సఫలమైంది. ముంబై: ఐపీఎల్లో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ కీలక విజయాన్ని అందుకుంది. గురువారం జరిగిన పోరులో ముంబై 4 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40; 7 ఫోర్లు), హెన్రిచ్ క్లాసెన్ (28 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. అనంతరం ముంబై 18.1 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ద మ్యాచ్’ విల్ జాక్స్ (26 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్స్లు), ర్యాన్ రికెల్టన్ (23 బంతుల్లో 31; 5 ఫోర్లు) కీలక పరుగులు సాధించారు. కనిపించని దూకుడు... ఇన్నింగ్స్ తొలి బంతికే అభిషేక్కు అదృష్టం కలిసొచ్చింది. దీపక్ చహర్ వేసిన బంతి అభిక్ బ్యాట్ ఎడ్జ్ను తీసుకొని స్లిప్ వైపు దూసుకెళ్లగా విల్ జాక్స్ దానిని అందుకోలేకపోయాడు. అనంతరం అతను కొన్ని చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. మరోవైపు ట్రవిస్ హెడ్ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు) బ్యాటింగ్లో సహజమైన ధాటి కనిపించలేదు. చహర్ ఓవర్లో అభిషేక్ వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 46 పరుగులకు చేరింది. ఆ తర్వాత ఒక్కసారిగా ముంబై బౌలర్ల ఆధిపత్యం మొదలైంది. కట్టుదిట్టమైన బంతులతో వారు రైజర్స్ను నిలువరించారు. తొలి వికెట్కు 59 పరుగుల భాగస్వామ్యం (45 బంతుల్లో) తర్వాత అభిషేక్ను పాండ్యా వెనక్కి పంపాడు. 24 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చినా... నోబాల్తో బతికిపోయిన హెడ్ దానిని వాడుకోలేకపోయాడు. ఇషాన్ కిషన్ (2) మళ్లీ విఫలం కాగా, నితీశ్ కుమార్ రెడ్డి (21 బంతుల్లో 19; 1 ఫోర్) మరోసారి ప్రభావం చూపలేకపోయాడు. పవర్ప్లే ముగిసిన తర్వాత 7–17 ఓవర్ల మధ్యలో రైజర్స్ 5 ఫోర్లు మాత్రమే కొట్టగా... ఇన్నింగ్స్లో 17వ ఓవర్ వరకు ఒక్క సిక్స్ కూడా రాలేదు. చివర్లో 2 ఓవర్ల కారణంగా (మొత్తం 43 పరుగులు) రైజర్స్ స్కోరు 160 దాటింది. చహర్ వేసిన 18వ ఓవర్లో క్లాసెన్ వరుసగా 6, 4, 4, 6 బాదగా... పాండ్యా వేసిన ఆఖరి ఓవర్లో అనికేత్ 2 సిక్స్లు, కమిన్స్ ఒక సిక్స్ కొట్టారు. కీలక భాగస్వామ్యం.. ఎప్పటిలాగే ఫటాఫట్ షాట్లతో ఛేదనను మొదలు పెట్టిన రోహిత్ శర్మ (16 బంతుల్లో 26; 3 సిక్స్లు) మరోసారి తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. ఐదు బంతుల వ్యవధిలో అతను మూడు సిక్సర్లు బాదాడు. మలింగ ఓవర్లో రికెల్టన్ మూడు ఫోర్లు కొట్టగా, 4 పరుగుల వద్ద జాక్స్ ఇచ్చిన క్యాచ్ను హెడ్ వదిలేశాడు. రికెల్టెన్ అవుటైన తర్వాత జాక్స్, సూర్యకుమార్ (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్లు) మూడో వికెట్కు 29 బంతుల్లో 52 పరుగులు జోడించి జట్టు విజయానికి బాటలు వేశారు. వీరిద్దరు ఏడు పరుగుల తేడాతో వెనుదిరిగినా... కెప్టెన్ హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (17 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి గెలుపు దిశగా నడిపించారు. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) (సబ్) బావా (బి) పాండ్యా 40; హెడ్ (సి) సాంట్నర్ (బి) జాక్స్ 28; ఇషాన్ కిషన్ (స్టంప్డ్) రికెల్టన్ (బి) జాక్స్ 2; నితీశ్ కుమార్ రెడ్డి (సి) తిలక్ వర్మ (బి) బౌల్ట్ 19; క్లాసెన్ (బి) బుమ్రా 37; అనికేత్ వర్మ (నాటౌట్) 18; కమిన్స్ (నాటౌట్) 18; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–59, 2–68, 3–82, 4–113, 5–136. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–47–0, బౌల్ట్ 4–0–29–1, బుమ్రా 4–0–21–1, విల్ జాక్స్ 3–0–14–2, హార్దిక్ పాండ్యా 4–0–42–1, సాంట్నర్ 1–0–8–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) హెడ్ (బి) హర్షల్ పటేల్ 31; రోహిత్ (సి) హెడ్ (బి) కమిన్స్ 26; విల్ జాక్స్ (సి) అన్సారీ (బి) కమిన్స్ 36; సూర్యకుమార్ (సి) అన్సారీ (బి) కమిన్స్ 26; తిలక్ వర్మ (నాటౌట్) 21; పాండ్యా (సి) ఇషాన్ కిషన్ (బి) మలింగ 21; నమన్ (ఎల్బీ) (బి) మలింగ 0; సాంట్నర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (18.1 ఓవర్లలో 6 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–32, 2–69, 3–121, 4–128, 5–162, 6–162. బౌలింగ్: షమీ 3–0–28–0, కమిన్స్ 4–0–26–3, ఇషాన్ మలింగ 4–0–36–2, అన్సారీ 3.1–0–35–0, హర్షల్ 3–0–31–1, రాహుల్ చహర్ 1–0–9–0. ఐపీఎల్లో నేడుబెంగళూరు X పంజాబ్ వేదిక: బెంగళూరురాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025: కలిసి కట్టుగా రాణించిన ముంబై.. చిత్తుగా ఓడిన సన్రైజర్స్
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 17) జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో మూడు సిక్సర్లు (2 ఆనికేత్, కమిన్స్ ఒకటి) సహా 22 పరుగులు, అంతకుముందు దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రెండు సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రావడంతో సన్రైజర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో అభిషేక్ 40, ట్రవిస్ హెడ్ 28, ఇషాన్ కిషన్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 19, క్లాసెన్ 37, అనికేత్ 18 (నాటౌట్), కమిన్స్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2, బౌల్ట్, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై మరో 11 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది (6 వికెట్లు కోల్పోయి). ముంబై ఇన్నింగ్స్లో రికెల్టన్ 31, రోహిత్ శర్మ 26, విల్ జాక్స్ 36, సూర్యకుమార్ యాదవ్ 26, హార్దిక్ 21, తిలక్ 17 (నాటౌట్) పరుగులు చేశారు. సన్రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 3, ఎషాన్ మలింగ 2, హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టారు. -
MI VS SRH: సిక్సర్ల సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. కోహ్లి, గేల్, ఏబీడీ సరసన చోటు
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ తమ సొంత మైదానమైన వాంఖడే స్టేడియంలో సిక్సర్ల సెంచరీ పూర్తి చేశాడు. సన్రైజర్స్తో ఇవాళ (ఏప్రిల్ 17) జరుగుతున్న మ్యాచ్లో రోహిత్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 3 సిక్సర్లు బాదిన రోహిత్ వాంఖడే స్టేడియంలో (ఐపీఎల్లో) ఇప్పటివరకు 102 సిక్సర్లు కొట్టాడు. ఒకే స్టేడియంలో సిక్సర్ల సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. కోహ్లి, గేల్, డివిలియర్స్ సరసన చేరాడు. ఈ ముగ్గురు కూడా ఆర్సీబీకి ఆడుతూ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్ల సెంచరీ పూర్తి చేశారు. వీరిలో కోహ్లి అత్యధికంగా 130 సిక్సర్లు బాదగా.. గేల్ 127, డివిలియర్స్ 118 సిక్సర్లు కొట్టారు. ఐపీఎల్లో ఈ ముగ్గురితో పాటు రోహిత్ మాత్రమే ఒకే వేదికలో సిక్సర్ల సెంచరీని పూర్తి చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో మూడు సిక్సర్లు (2 ఆనికేత్, కమిన్స్ ఒకటి) సహా 22 పరుగులు, అంతకుముందు దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రెండు సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రావడంతో సన్రైజర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో అభిషేక్ 40, ట్రవిస్ హెడ్ 28, ఇషాన్ కిషన్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 19, క్లాసెన్ 37, అనికేత్ 18 (నాటౌట్), కమిన్స్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2, బౌల్ట్, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ ఎప్పటిలాగే ఆదిలో విధ్వంసం సృష్టించి, ఆతర్వాత ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో రోహిత్ 16 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 26 పరుగులు చేసి తొలి వికెట్గా వెనుదిరిగాడు. 9 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 82/2గా ఉంది. రోహిత్ ఔటయ్యాక మరో ఓపెనర్ రికెల్టన్ (31) కూడా పెవిలియన్కు చేరాడు. ప్రస్తుతం విల్ జాక్స్ (14), సూర్యకుమార్ యాదవ్ (8) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ముంబై గెలవాలంటే 66 బంతుల్లో మరో 81 పరుగులు చేయాలి. -
MI VS SRH: రికార్డుల్లోకెక్కిన ట్రావిస్ హెడ్.. గేల్, మ్యాక్స్వెల్ కంటే వేగంగా..!
ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్తో ఇవాళ (ఏప్రిల్ 17) జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన శైలికి భిన్నంగా నిదానంగా ఆడుతున్నారు. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 10 ఓవర్ల తర్వాత సన్రైజర్స్ స్కోర్ 75/2గా ఉంది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40; 7 ఫోర్లు), ఇషాన్ కిషన్ (3 బంతుల్లో 2) ఔట్ కాగా.. ట్రావిస్ హెడ్ (25 బంతుల్లో 25; 3 ఫోర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (5 బంతుల్లో 3) క్రీజ్లో ఉన్నారు. ఇప్పటివరకు ముంబై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి సన్రైజర్స్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీపక్ చాహర్ 3 ఓవర్లలో 26 పరుగులు.. బౌల్ట్ ఓ ఓవర్లో 10 పరుగులు.. బుమ్రా 2 ఓవర్లలో 10, విల్ జాక్స్ 2 ఓవర్లలో 12 (ఇషాన్ వికెట్), హార్దిక్ 2 ఓవర్లలో 17 పరుగులిచ్చారు (అభిషేక్ వికెట్). ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు అభిషేక్, హెడ్లకు మూడు లైఫ్లు లభించాయి. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్లోనే అభిషేక్, హెడ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. హార్దిక్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో హెడ్ క్యాచ్ ఔటైనప్పటికీ నో బాల్ కావడంతో బ్రతికిపోయాడు.1000 పరుగుల క్లబ్లో హెడ్ఈ మ్యాచ్లో హెడ్ ఐపీఎల్లో 1000 పరుగులు పూర్తి చేశాడు. హెడ్ కేవలం 575 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో వేగవంతమైన క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్లో ఆండ్రీ రసెల్ మాత్రమే హెడ్ కంటే వేగంగా 1000 పరుగులు పూర్తి చేశాడు. రసెల్ 545 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. హెడ్.. విధ్వంసకర వీరులు క్రిస్ గేల్ (615), మ్యాక్స్వెల్ (610) కంటే వేగంగా 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.ఐపీఎల్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు.. 545 - ఆండ్రీ రస్సెల్575 - ట్రావిస్ హెడ్*594 - హెన్రిచ్ క్లాసెన్604 - వీరేంద్ర సెహ్వాగ్610 - గ్లెన్ మాక్స్వెల్615 - క్రిస్ గేల్617 - యూసుఫ్ పఠాన్617 - సునీల్ నరైన్ -
IPL 2025: సన్రైజర్స్పై ముంబై ఇండియన్స్ విజయం
సన్రైజర్స్పై ముంబై ఇండియన్స్ విజయంఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 17) జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో మూడు సిక్సర్లు (2 ఆనికేత్, కమిన్స్ ఒకటి) సహా 22 పరుగులు, అంతకుముందు దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రెండు సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రావడంతో సన్రైజర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో అభిషేక్ 40, ట్రవిస్ హెడ్ 28, ఇషాన్ కిషన్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 19, క్లాసెన్ 37, అనికేత్ 18 (నాటౌట్), కమిన్స్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2, బౌల్ట్, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై మరో 11 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది (6 వికెట్ల నష్టానికి). ముంబై ఇన్నింగ్స్లో రికెల్టన్ 31, రోహిత్ శర్మ 26, విల్ జాక్స్ 36, సూర్యకుమార్ యాదవ్ 26, హార్దిక్ 21, తిలక్ 17 (నాటౌట్) పరుగులు చేశారు. సన్రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 3, ఎషాన్ మలింగ 2, హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టారు. నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై14.3వ ఓవర్- 128 పరుగుల వద్ద ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్లో అన్సారీకి క్యాచ్ ఇచ్చి విల్ జాక్స్ (36) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన ముంబై12.4వ ఓవర్- 121 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్లో జీషన్ అన్సారీకి క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ (26) ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 82/29 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 82/2గా ఉంది. రోహిత్ ఔటయ్యాక మరో ఓపెనర్ రికెల్టన్ (31) కూడా పెవిలియన్కు చేరాడు. ప్రస్తుతం విల్ జాక్స్ (14), సూర్యకుమార్ యాదవ్ (8) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ముంబై గెలవాలంటే 66 బంతుల్లో మరో 81 పరుగులు చేయాలి.హ్యాట్రిక్ ఫోర్లతో రఫ్ఫాడించిన రికెల్టన్ఎషాన్ మలింగ బౌలింగ్లో (6వ ఓవర్) రికెల్టన్ హ్యాట్రిక్ ఫోర్లతో రఫ్ఫాడించాడు. 5.5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 54/1. రికెల్టన్ 21, విల్ జాక్స్ 6 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ముంబై.. రోహిత్ ఔట్163 పరుగుల లక్ష్య ఛేదనలో ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ మూడు సిక్సర్లు బాదిన అనంతరం ఔటయ్యాడు. రోహిత్ 16 బంతుల్లో 26 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్లో హెడ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. 3.5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 32/1గా ఉంది. రికెల్టన్ (5), జాక్స్ క్రీజ్లో ఉన్నారు.సత్తా చాటిన ముంబై బౌలర్లు.. స్వల్ప స్కోర్కే పరిమితమైన సన్రైజర్స్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో మూడు సిక్సర్లు (2 ఆనికేత్, కమిన్స్ ఒకటి) రావడంతో సన్రైజర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో అభిషేక్ 40, ట్రవిస్ హెడ్ 28, ఇషాన్ కిషన్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 19, క్లాసెన్ 37, అనికేత్ 18 (నాటౌట్), కమిన్స్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2, బౌల్ట్, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ పడగొట్టారు. 18.1 ఓవర్ల తర్వాత 136/5అనికేత్ వర్మ (1), కమిన్స్నత్తనడకన సాగుతున్న ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ నిదానంగా బ్యాటింగ్ చేస్తుంది. ఆ జట్టు ఇన్నింగ్స్ నత్తనడకను తలపిస్తుంది. అభిషేక్ (40), హెడ్ (28), ఇషాన్ (2) ఔట్ కాగా.. నితీశ్ (14), క్లాసెన్ (4) క్రీజ్లో ఉన్నారు. 14 ఓవర్ల తర్వాత సన్రైజర్స్ స్కోర్ 95/3గా ఉంది. మూడో వికెట్ డౌన్.. హెడ్ ఔట్11.1వ ఓవర్- 82 పరుగుల వద్ద సన్రైజర్స్ మూడో వికెట్ కోల్పోయింది. అప్పటికే రెండు లైఫ్లు లభించిన హెడ్ (28) విల్ జాక్స్ బౌలింగ్లో సాంట్నర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన సన్రైజర్స్.. ఇషాన్ కిషన్ ఔట్8.4వ ఓవర్- 68 పరుగుల వద్ద సన్రైజర్స్ రెండో వికెట్ కోల్పోయింది. విల్ జాక్స్ బౌలింగ్లో ఇషాన్ కిషన్ (2) స్టంపౌటయ్యాడు. హెడ్ (22), నితీశ్ క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన సన్రైజర్స్.. అభిషేక్ ఔట్7.3వ ఓవర్-సన్రైజర్స్ 59 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో రాజ్ బవాకు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ (40) ఔటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత సన్రైజర్స్ స్కోర్ 65/1గా ఉంది. హెడ్ (20), ఇషాన్ కిషన్ (1) క్రీజ్లో ఉన్నారు. 7 ఓవర్ల తర్వాత ఎస్ఆర్హెచ్ స్కోర్ 53/0అభిషేక్ 36, ట్రవిస్ హెడ్ 14కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న ముంబై బౌలర్లుటాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ముంబై.. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంది. తొలి ఓవర్లోనే ఓపెనర్లు అభిషేక్, హెడ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తొలి నాలుగు ఓవర్లు చాహర్, బౌల్ట్, బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు కేవలం బాదడమే లక్ష్యంగా పెట్టుకుని సఫలం కాలేకపోతున్నారు. 4 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 29/0గా ఉంది. అభిషేక్ 20, హెడ్ 6 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 17) ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై ఏడులో, ఎస్ఆర్హెచ్ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి.తుది జట్లు..ముంబై ఇండియన్స్: ర్యాన్ రికెల్టన్ (వికెట్కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, కర్ణ్ శర్మముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ సబ్స్: రోహిత్ శర్మ, కార్బిన్ బాష్, అశ్వని కుమార్, రాజ్ బావా, రాబిన్ మింజ్సన్రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్కీపర్), అనికేత్ వర్మ, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, ఎషాన్ మలింగసన్రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ సబ్లు: అభినవ్ మనోహర్, జయదేవ్ ఉనద్కత్, సచిన్ బేబీ, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్ -
ముంబైకి ప్రధాన సమస్య అతడే!.. సీజన్ మొత్తం ఎలా భరిస్తారో!?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఐపీఎల్-2025లో పేలవ ఫామ్తో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముంబై ఇండియన్స్ (Mumabi Indians)కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లలో కలిపి చేసిన పరుగులు కేవలం 56. చివరగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో రోహిత్.. 12 బంతులు ఎదుర్కొని కేవలం 18 పరుగులే చేశాడు.మరోవైపు.. ముంబై ఇండియన్స్ జట్టు పరిస్థితి కూడా దారుణంగా ఉంది. గత సీజన్లో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచిన హార్దిక్ సేన.. ఈసారి కూడా ఆఖరి స్థానం కోసం పోటీపడుతున్నట్లుగా అనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆడిన ఆరు మ్యాచ్లలో ముంబై కేవలం రెండే గెలవడం ఇందుకు నిదర్శనం.సన్రైజర్స్ హైదరాబాద్తో ఢీఇక ఐపీఎల్-2025 (IPL 2025)లో కోల్కతా నైట్ రైడర్స్తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించిన హార్దిక్ సేన.. గురువారం నాటి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ను ఢీకొట్టనుంది. ఇందుకు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక.ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ వైఫల్యం ముంబైపై ఎలాంటి ప్రభావం చూపుతోందన్న అంశంపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.బ్యాటింగ్ ఆర్డరే ప్రధాన సమస్య‘‘ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. బ్యాటింగ్ ఆర్డర్. అవును ఇది నిజమే. ఓపెనర్ రోహిత్ శర్మ పరుగులు సాధించలేకపోతున్నాడు. ఒకవేళ అతడి వైఫల్యం ఇలాగే కొనసాగితే ముంబై బ్యాటింగ్ ఆర్డర్ కుదేలవడం ఖాయం.రోహిత్ కుదురుకోకపోతే.. ఎవరిని ఎప్పుడు బ్యాటింగ్కు పంపాలో అర్థం కాని పరిస్థితి. నిజానికి ఓపెనర్గా రియాన్ రికెల్టన్ రాణిస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ డీసెంట్గా బ్యాటింగ్ చేస్తున్నారు.నమన్ ధీర్ చక్కగా ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్యా కూడా ఫామ్లోనే ఉన్నాడు. ఇకపోతే.. విల్ జాక్స్ తన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతున్నా.. పర్లేదనిపిస్తున్నాడు. ఎటొచ్చీ రోహిత్ శర్మ ఫామ్లేమి వల్లే సమస్య. అతడు ఓపెనర్ కాబట్టి నమన్ ధీర్, విల్ జాక్స్ వంటి వాళ్లను బ్యాటింగ్ ఆర్డర్లో వెనుక పంపాల్సి వస్తోంది.సీజన్ ఆసాంతం అతడిని ఎలా భరిస్తుందో?ఏదేమైనా రోహిత్ వైఫల్యాలు ఇలాగే కొనసాగితే ముంబై ఇండియన్స్ సీజన్ ఆసాంతం అతడిని ఎలా భరిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు’’ అని భారత జట్టు మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. రోహిత్ శర్మ గొప్ప టీ20 ప్లేయర్ అని.. అయితే, ఆది నుంచే దూకుడు ప్రదర్శించకుండా కాస్త జాగ్రత్తగా ఆడితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.చదవండి: అతడు చేసిన తప్పేంటి?.. మీకసలు తెలివి ఉందా?: షేన్ వాట్సన్ ఫైర్ -
'అదేమి పెద్ద నేరం కాదు.. రోహిత్ బ్యాటింగ్ ఆర్డర్ను మార్చండి'
ఐపీఎల్-2025లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ(Rohit Sharma) పేలవ ఫామ్ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ.. 11.20 సగటుతో కేవలం 56 పరుగులు మాత్రమే చేశాడు.అతడి ఇన్నింగ్స్లలో 18 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. ఈ క్రమంలో రోహిత్ శర్మపై భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ కారణంగానే ముంబై ఇండియన్స్ టాప్లో నిలవలేకపోయిందని ఆమె అభిఫ్రాయపడింది. ముంబై ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడి.. నాలుగు ఓటములు, రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో ఉంది. "ఏ ప్లేయరైనా ఫామ్ లేకపోవడం పెద్ద నేరమేమి కాదు. ప్రతీ ఒక్కరి కెరీర్లో ఎత్తు పల్లాలు ఉంటాయి. అయితే రోహిత్ ఫామ్లో లేకపోవడంతోనే ముంబై ఇండియన్స్ ఈ సారి కూడా టాప్-4లో కొనసాగలేకపోతుంది. రోహిత్ ఓపెనర్గా రాణించడంలో విఫలమవుతున్నాడు.కాబట్టి అతడిని దిగువన బ్యాటింగ్కు పంపితే జట్టుకు ప్రయోజనం చేకూరే అవకాశముంది. ముంబై చాలా అప్షన్స్ ఉన్నాయి. రోహిత్ స్ధానంలో విల్ జాక్స్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లను ప్రయత్నించవచ్చు. రోహిత్ శర్మ ఎంతటి గొప్ప ఆటగాడు మనందరికి తెలుసు. ఈ ఏడాది సీజన్లో అతడికి మంచి ఆరంభం దక్కలేదు. సహజంగా ఐపీఎల్లోనైనా, వరల్డ్కప్లోనైనా మన స్టార్ బ్యాటర్లు ఫామ్లో ఉండాలని కోరుకుంటాము. కొంతమంది వెంటనే తమ ఫామ్ను అందుకుని తిరిగి గాడిలో పడతారు. మరి కొంత మంది కాస్త ఆలస్యంగా తమ రిథమ్ను అందుకుంటారు. అంతమాత్రన వారు అత్యుత్తమ బ్యాటర్లు కాదని ఆర్ధం కాదని" పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చోప్రా పేర్కొన్నారు.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన గుంటూరు కుర్రాడు.. తొలి సీఎస్కే ప్లేయర్గా -
‘కోచ్లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)పై భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో ఓడిపోవాల్సిన మ్యాచ్లో ముంబై గెలిచిందంటే అందుకు ప్రధాన కారణం రోహిత్ అని కొనియాడాడు. కాగా ఐపీఎల్-2025 (IPL 2025)లోనూ ముంబై స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతోంది.ఇప్పటి వరకు ఈ సీజన్లో హార్దిక్ సేన ఆడిన ఆరు మ్యాచ్లలో కేవలం రెండు మాత్రమే గెలిచింది. చివరగా ఢిల్లీతో ఆదివారం జరిగిన మ్యాచ్లో 12 పరుగుల తేడాతో ముంబై గట్టెక్కింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్ చేసింది.205 పరుగులు ఓపెనర్ రియాన్ రికెల్టన్ (25 బంతుల్లో 41), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 40) రాణించగా.. తిలక్ వర్మ ( Tilak Varma- 33 బంతుల్లో 59), నమన్ ధీర్ (Naman Dhir- 17 బంతుల్లో 38 నాటౌట్) దంచికొట్టారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ముంబై 205 పరుగులు సాధించింది.కరుణ్ నాయర్ విధ్వంసకర ఇన్నింగ్స్ఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీ తడబడినా కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89) విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా ఆఖరి వరకు పోటీ ఇచ్చింది. ఈ క్రమంలో ప్రమాదకర బ్యాటర్ కరుణ్ నాయర్తో పాటు కేఎల్ రాహుల్, స్టబ్స్ ఆట కట్టించేందుకు రోహిత్ శర్మ ఇచ్చిన సలహాలు పనిచేశాయి.కొత్త బంతితో మ్యాజిక్బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఐపీఎల్-2025లో మంచు ప్రభావం మరీ ఎక్కువగా ఉంటే.. పదవ ఓవర్ ముగిసిన తర్వాత కొత్త బంతిని తీసుకోవచ్చు. ఈ రూల్ను ఢిల్లీతో మ్యాచ్లో హార్దిక్ పాండ్యాతో రోహిత్ అమలు చేయించాడు. జోరు మీదున్న ఢిల్లీకి అడ్డుకట్ట వేసేందుకు స్పిన్నర్ కర్ణ్ శర్మకు కొత్త బంతిని ఇవ్వాలని డగౌట్ నుంచి సూచించాడు. రోహిత్ ఇచ్చిన ఈ సలహా బాగా వర్కౌట్ అయింది. 14, 16 ఓవర్లలో కర్ణ్ ట్రిస్టస్ స్టబ్స్, కేఎల్ రాహుల్ రూపంలో కీలక వికెట్లు తీశాడు. ఇక కరుణ్ నాయర్ను మిచెల్ శాంట్నర్ను పెవిలియన్కు పంపాడు. ఈ నేపథ్యంలో 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయి.. ఢిల్లీ ముంబై చేతిలో ఓటమిని చవిచూసింది.కోచ్లు అహాన్ని పక్కన పెట్టాలిఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ అద్భుతం చేశాడు. స్పిన్నర్లు.. ముఖ్యంగా కర్ణ్ శర్మను రంగంలోకి దించాలని హెడ్కోచ్ మహేళ జయవర్దనేకు చెప్పాడు. కర్ణ్ ఏకంగా మూడు వికెట్లు తీసి మ్యాచ్ను మలుపు తిప్పాడు.నిజంగా ఇదొక అద్భుతమైన వ్యూహం. కానీ జయవర్ధనే తొలుత రోహిత్ మాటకు అంగీకరించలేదనిపించింది. కొన్నిసార్లు కోచ్లు తమ అహాన్ని పక్కన పెట్టి.. జట్టు ఎలా బాగుపడుతుందనే విషయం మీదే దృష్టి పెట్టాలి.రోహిత్ శర్మ డగౌట్ నుంచి ఇన్పుట్స్ ఇచ్చాడు. కానీ జయవర్ధనేకు అవి నచ్చినట్లు లేదు. ఒకవేళ జయవర్ధనే చెప్పినట్లు విని ఉంటే ఢిల్లీ చేతిలో ముంబై ఓడిపోయేది. రోహిత్ కెప్టెన్. దిగ్గజ సారథి.. కెప్టెన్ ఎప్పుడూ కెప్టెన్లాగే ఆలోచిస్తాడు. రోహిత్ వ్యూహం వల్లే ముంబై గెలిచింది’’ అని చెప్పుకొచ్చాడు.చదవండి: మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..కెప్టెన్గా అది పంత్ నిర్ణయం.. నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..: బిష్ణోయిAgar miss kiye toh ab dekho - 𝐊𝐚𝐫𝐧 𝐒𝐡𝐚𝐫𝐦𝐚 𝐤𝐚 𝐁𝐡𝐨𝐨𝐥 𝐁𝐡𝐮𝐥𝐚𝐢𝐲𝐚𝐚 🌀#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #DCvMIpic.twitter.com/T8KabriAbK— Mumbai Indians (@mipaltan) April 13, 2025 -
రోహిత్ శర్మ మాస్టర్ మైండ్.. డగౌట్ నుంచే మ్యాచ్ తిప్పేసిన హిట్మ్యాన్
ఐపీఎల్-2025 (IPL 2025) ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. ఈ మెగా ఈవెంట్లో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఉత్కంఠపోరులో 12 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. ఓ దశలో సునయాసంగా మ్యాచ్ గెలిచేలా కన్పించిన ఢిల్లీ.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో తొలి ఓటమి చవిచూడాల్సింది. అయితే ఢిల్లీ వికెట్లను కుప్పకూల్చడంలో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ కీలక పాత్ర పోషించాడు. డగౌట్ నుంచే తన మాస్టర్ మైండ్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు హిట్మ్యాన్.అసలేమి జరిగిందంటే?ఈ మ్యాచ్లో 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఆడింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 13 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఢిల్లీ విజయానికి 7 ఓవర్లలో 61 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో అప్పటికే రాహుల్, స్టబ్స్ ఉన్నారు. ఇదే సమయంలో బంతి మార్చాలని అంపైర్లకు ముంబై జట్టు అభ్యర్థించింది. వారి అభ్యర్ధను అంగీకరించిన అంపైర్లు బంతిని మార్చారు. వెంటనే డగౌట్లో ఉన్న రోహిత్ శర్మ రంగంలోకి దిగాడు. రోహిత్.. హెడ్ కోచ్ జయవర్దనే, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేతో మాట్లాడి ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ కర్ణ్ శర్మతో బౌలింగ్ చేయించాలని హార్దిక్కు సైగలు చేశాడు. రోహిత్ మాట విన్న పాండ్యా.. కర్ణ్ను 14వ ఓవర్ వేసేందుకు ఎటాక్లో తీసుకొచ్చాడు.అయితే రోహిత్ ఊహించినట్టే ఆ ఓవర్లో ముంబై ఇండియన్స్కు ఫలితం దక్కింది. అద్భుతమైన ఫామ్లో స్టబ్స్ భారీ షాట్కు ప్రయత్నించి తన వికెట్ను కోల్పోయాడు. బంతి పొడిగా ఉన్నందున, రోహిత్ ప్రణాళిక సరిగ్గా పనిచేసింది. ఆ తర్వాత 16 ఓవర్ వేసిన కర్ణ్..కేఎల్ రాహుల్ను సైతం బోల్తా కొట్టించాడు. రాహుల్ వికెట్తో మ్యాచ్ ముంబై వైపు మలుపు తిరిగింది. కాగా డగౌట్లో కూర్చుని మ్యాచ్ ఫలితాన్నే మార్చేసిన రోహిత్ శర్మపై అభిమానులు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. రోహిత్ నంబర్ వన్ కెప్టెన్ ఎలా అయ్యాడో మరోసారి నిరూపించుకున్నాడని నెటిజన్లు కొనియాడుతున్నారు. అయితే ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ(18).. ఫీల్డింగ్లో బయటకు వెళ్లిపోయాడు. అతడి స్ధానంలోనే కర్ణ్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగాడు. #MI's spinners 𝙩𝙪𝙧𝙣𝙚𝙙 the game on its head! 🙌Here’s how the experts broke down their coaching staff's spot-on call to bring them in at just the right moment 🗣#IPLonJioStar 👉 #LSGvCSK | MON, 14th APR, 6:30 PM LIVE on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/POK9x6m9Qc— Star Sports (@StarSportsIndia) April 13, 2025 -
DC VS MI: కరుణ్ నాయర్తో బుమ్రా వాగ్వాదం.. సారి చెప్పినా పట్టించుకోని వైనం
ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య నిన్న (ఏప్రిల్ 13) జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఎప్పుడూ ఎవరితో గొడవ పడని ముంబై పేసర్ జస్ప్రీత్ బుమ్రా సహనాన్ని కోల్పోయాడు. ఢిల్లీ బ్యాటర్ కరుణ్ నాయర్తో వాగ్వాదానికి దిగాడు. కరుణ్ సారీ చెప్పినా పట్టించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.The average Delhi vs Mumbai debate in comments section 🫣Don't miss @ImRo45 's reaction at the end 😁Watch the LIVE action ➡ https://t.co/QAuja88phU#IPLonJioStar 👉 #DCvMI | LIVE NOW on Star Sports Network & JioHotstar! pic.twitter.com/FPt0XeYaqS— Star Sports (@StarSportsIndia) April 13, 2025ఇంతకీ ఏం జరిగిందంటే.. ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదిస్తుండగా (ఇన్నింగ్స్ 6వ ఓవర్ చివరి బంతికి) కరుణ్ పరుగు తీసే క్రమంలో బౌలింగ్ చేస్తున్న బుమ్రాను పొరపాటున ఢీకొట్టాడు. దీనికి కరుణ్ వెంటనే క్షమాపణ చెప్పినా బుమ్రా పట్టించుకోలేదు. కరుణ్పై నోరు పారేసుకున్నాడు. హార్దిక్ కల్పించుకుని కరుణ్కు సర్ది చెప్పాడు. బుమ్రా-కరుణ్ మధ్య వాగ్వాదాన్ని నిశితంగా గమనిస్తున్న రోహిత్ శర్మ తనదైన శైలిలో కామెడీ చేస్తూ కనిపించాడు.పొరపాటున జరిగిన దానికి కరుణ్ సారీ చెప్పినా బుమ్రా పట్టించుకోకపోవడానికి కారణం వేరే ఉంది. ఆ ఓవర్లో, అంతకుముందు ఓవర్లో కరుణ్ బుమ్రాను చెడుగుడు ఆడుకున్నాడు. బుమ్రాను ఎదుర్కొన్న 9 బంతుల్లో కరుణ్ 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 26 పరుగులు చేశాడు. కెరీర్లో ఏ బ్యాటర్ బుమ్రాను ఇంతలా చితక్కొట్టలేదు. Nair fire against Bumrah 🔥pic.twitter.com/3D6kjyR5lx— Delhi Capitals (@DelhiCapitals) April 13, 2025బుమ్రా అత్యంత వేగంతో సంధిస్తున్న బంతులను కరుణ్ సునాయాసంగా బౌండరీలు, సిక్సర్లుగా తరలించాడు. ఇదే కోపంతో బుమ్రా కరుణ్పై నోరు పారేసుకున్నాడు. బుమ్రాతో వాగ్వాదం జరిగే సమయానికి కరుణ్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన కరుణ్ కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో కరుణ్ ట్రెంట్ బౌల్ట్పై కూడా ఇదే తరహా విరుచుకుపడ్డాడు. ఆ ఓవర్లో కరుణ్ మూడు బౌండరీలు బాదాడు. కరుణ్ దెబ్బకు హార్దిక్ బౌల్ట్ను బౌలింగ్ నుంచి తప్పించి మళ్లీ చివర్లో బరిలోకి దించాడు. ఈ మ్యాచ్లో కరుణ్ కర్ణ్ శర్మ, హార్దిక్ పాండ్యాను కూడా వదిలి పెట్టలేదు. హార్దిక్ బౌలింగ్లో 2 సిక్సర్లు, ఓ ఫోర్.. కర్ణ్ శర్మ బౌలింగ్లో ఓ సిక్సర్, 2 ఫోర్లు బాదాడు.ఈ మ్యాచ్లో కరుణ్ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడినా ఢిల్లీ ఓటమిపాలైంది. గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ ఒత్తిడికి లోనై చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుంది. ఢిల్లీ మరో ఓవర్ మిగిలుండగానే చివరి మూడు వికెట్లు రనౌట్ల రూపంలో కోల్పోయి 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సింగిల్స్ తీసుకుని స్ట్రయిక్ రొటేట్ చేసుకున్నా ఢిల్లీకి విజయాకాశాలు ఉండేవి. అయితే లోయర్ ఆర్డర్ బ్యాటర్లు లేని రెండో పరుగులకు ప్రయత్నించి వికెట్లు పారేసుకున్నారు. కరుణ్ ఔటయ్యాక (13వ ఓవర్లో) కొత్త బంతి తీసుకోవడం కూడా ముంబైకి కలిసొచ్చింది. కొత్త బంతితో కర్ణ్ శర్మ, సాంట్నర్, బౌల్ట్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలకమైన స్టబ్స్, కేఎల్ రాహుల్, విప్రాజ్ నిగమ్ వికెట్లు తీశారు. ఫలితంగా చివరి రెండు ఓవర్లకు ముందు ఢిల్లీ బ్యాటర్లు ఒత్తిడికి లోనై రనౌట్ల రూపంలో వికెట్లు సమర్పించుకున్నారు. 3 వికెట్లు తీసిన కర్ణ్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), ర్యాన్ రికెల్టన్ (41), సూర్యకుమార్ యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించగా.. రోహిత్ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
DC VS MI: ఢిల్లీ కొంప ముంచిన హ్యాట్రిక్ రనౌట్స్.. చరిత్రలో ఇదే తొలిసారి
ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ జరగని ఓ ఘటన నిన్న చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో అత్యంత అరుదైన హ్యాట్రిక్ రనౌట్స్ నమోదయ్యాయి. ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదిస్తూ.. ఢిల్లీ వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లను రనౌట్ల రూపంలో కోల్పోయింది. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్లో వరుసగా మూడు బంతుల్లో మూడు రనౌట్లు కావడం ఇదే మొదటిసారి.లీగ్ ఆరంభ సీజన్లో (2008) ఓ సారి ఒకే ఓవర్లో మూడు రనౌట్లు నమోదైనా, అవి వరుస బంతుల్లో జరగలేదు. నాడు పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ లక్ష్యాన్ని ఛేదిస్తూ చివరి ఓవర్లో (2, 4, 6 బంతులకు) మూడు వికెట్లు రనౌట్ల రూపంలో కోల్పోయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఒకే ఓవర్లో, అందులోనూ వరుసగా మూడు బంతుల్లో రనౌట్లు నమోదయ్యాయి.నిన్నటి మ్యాచ్లో ముంబై నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ ఢిల్లీ 19వ ఓవర్ చివరి మూడు బంతులకు వరుసగా అశుతోష్ శర్మ (17), కుల్దీప్ యాదవ్ (1), మొహిత్ శర్మ (0) వికెట్లను రనౌట్ల రూపంలో కోల్పోయింది. కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించి గెలుపుకు పటిష్ట పునాది వేసినా, చివర్లో హ్యాట్రిక్ వికెట్లు కోల్పోయి ఢిల్లీ పరాజయాన్ని కొని తెచ్చుకుంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో ముంబై ఢిల్లీపై 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ప్రస్తుత సీజన్లో ఢిల్లీకి ఇదే తొలి ఓటమి. లేని, అనవసరమైన పరుగుల కోసం ప్రయత్నించి ఢిల్లీ గెలుపు గుర్రాన్ని దిగింది. పరుగుల వేటలో ఒత్తిడికిలోనై రనౌటైంది.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), ర్యాన్ రికెల్టన్ (41), సూర్యకుమార్ యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించగా.. రోహిత్ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం ఛేదనలో ఢిల్లీ తొలి బంతికే జేక్ ఫ్రేజర్ (0) వికెట్ కోల్పోయినా.. అభిషేక్ పోరెల్ (33), కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతంగా ఆడి గెలుపుకు పటిష్ట పునాది వేశారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముంబై బౌలర్లు పుంజుకున్నారు. కొత్త బంతితో కర్ణ్ శర్మ (4-0-36-3), మిచెల్ సాంట్నర్ (4-0-43-2) మాయ చేశారు. 58 పరుగుల వ్యవధిలో ఢిల్లీ చివరి 8 వికెట్లు కోల్పోయింది. ఈ గెలుపుతో ముంబై తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకగా.. సీజన్లో తొలి ఓటమి చవిచూసిన ఢిల్లీ టాప్ ప్లేస్ నుండి రెండో స్థానానికి పడిపోయింది.నేటికి అది రికార్డే2008 సీజన్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా ఐదుగురు ముంబై బ్యాటర్లు రనౌట్లయ్యారు (చివరి ఓవర్లో మూడు రనౌట్లతో కలుపుకుని). ఐపీఎల్ చరిత్రలో నేటికీ ఇది ఓ రికార్డుగా కొనసాగుతుంది. ఇప్పటివరకు ఏ ఐపీఎల్ మ్యాచ్లోనూ ఐదుగురు బ్యాటర్లు రనౌట్లు కాలేదు. -
కరుణ్ అద్భుతంగా ఆడాడు.. అలా చేయాలంటే చాలా సాహసం కావాలి: హార్దిక్
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (ఏప్రిల్ 13) రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్పై ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), ర్యాన్ రికెల్టన్ (41), సూర్యకుమార్ యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించగా.. రోహిత్ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం ఛేదనలో ఢిల్లీ తొలి బంతికే జేక్ ఫ్రేజర్ (0) వికెట్ కోల్పోయినా.. అభిషేక్ పోరెల్ (33), కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతంగా ఆడి జట్టు గెలుపుకు పటిష్ట పునాది వేశారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముంబై బౌలర్లు పుంజుకున్నారు. కొత్త బంతితో కర్ణ్ శర్మ (4-0-36-3), మిచెల్ సాంట్నర్ (4-0-43-2) మాయ చేశారు. 58 పరుగుల వ్యవధిలో ఢిల్లీ చివరి 8 వికెట్లు కోల్పోయింది. 19వ ఓవర్ చివరి మూడు బంతులకు ముగ్గురు ఢిల్లీ బ్యాటర్లు రనౌట్ కావడంతో ఢిల్లీ ఓటమి ఖరారైంది. కీలకమైన మూడు వికెట్లు తీసిన కర్ణ్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఈ గెలుపుతో ముంబై తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకగా.. సీజన్లో తొలి ఓటమి చవిచూసిన ఢిల్లీ టాప్ ప్లేస్ నుండి రెండో స్థానానికి పడిపోయింది. మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఇలా అన్నాడు. గెలవడం ఎప్పుడూ ప్రత్యేకమే. ముఖ్యంగా ఇలాంటి విజయాలు. కరుణ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఓ దశలో మ్యాచ్ చేయి దాటిపోతున్నట్లు అనిపించింది. అయినా మేము గెలుపుపై ఆశలు వదులు కోలేదు. పోటీలో ఉండేందుకు ఒకరినొకరం ఉత్తేజపరచుకున్నాము. ఒకర్రెండు వికెట్లు ఆటను మాకు అనుకూలంగా మారుస్తాయని తెలుసు. గతంలో నాకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయి.కర్ణ్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బౌండరీల పరిధి 60 మీటర్లలోపు ఉన్నప్పుడు బంతిని టాస్ వేయాలంటే చాలా సాహసం కావాలి. కర్ణ్ శర్మ అలా చేసి సక్సెస్ సాధించాడు. అందరం తలో చేయి వేసి మా అవకాశాలను నిలుపుకోగలిగాము. బ్యాటింగ్ ఆర్డర్పై స్పందిస్తూ.. ఆటగాళ్లు ఫామ్లోకి రావాల్సి ఉంది. వీలైనన్ని బంతులు ఎదుర్కొంటేనే అది జరుగుతుంది. ఈ మ్యాచ్లో మంచు తీవ్ర ప్రభావం చూపింది. కొత్త బంతితో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇలాంటి విజయాలు జట్టు గతిని మారుస్తాయి. పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. -
గెలవాల్సిన మ్యాచ్లో ఓడిన ఢిల్లీ.. కరుణ్ పోరాటం వృధా.. సీజన్లో తొలి ఓటమి
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ నాలుగు వరుస విజయాల తర్వాత తొలి ఓటమి చవిచూసింది. ముంబై ఇండియన్స్తో నిన్న (ఏప్రిల్ 13) రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో 12 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లోనూ ఢిల్లీ గెలవాల్సి ఉండింది. అయితే 19వ ఓవర్ చివరి మూడు బంతులకు మూడు వికెట్లు రనౌట్ల రూపంలో కోల్పోయి ఓటమిని కొని తెచ్చుకుంది. సింగిల్స్ తీసినా గెలిచే మ్యాచ్లో ఢిల్లీ చివరి వరుస బ్యాటర్లు డబుల్స్ కోసం ప్రయత్నించి రనౌటయ్యారు. 19వ ఓవర్లో హై డ్రామా నడిచింది. నాలుగో బంతికి రనౌట్ కాకముందు అశుతోష్ శర్మ వరుసగా రెండు బౌండరీలు బాది మంచి టచ్లో కనిపించాడు. అయితే అతను లేని రెండో పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. ఆతర్వాతి బంతికి కుల్దీప్ కూడా అనవసరమైన రెండో పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. చివరి బంతికి మోహిత్ సింగిల్ తీసే ప్రయత్నం చేయగా.. సాంట్నర్ డైరెక్ట్ హిట్తో అతన్ని కూడా రనౌట్ చేశాడు. దీంతో ఢిల్లీ మరో ఓవర్ మిగిలుండగానే పరాజయంపాలైంది. ముంబై నిర్దేశించిన 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీ విజయానికి పటిష్ట పునాది వేశాడు. ఓ దశలో (11.3 ఓవర్లలో 135/2) ఢిల్లీ సునాయాసంగా గెలిచేలా కనిపించింది.అయితే కరుణ్ ఔట్ కావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముంబై బౌలర్లు పుంజుకున్నారు. కొత్త బంతితో కర్ణ్ శర్మ (4-0-36-3), మిచెల్ సాంట్నర్ (4-0-43-2) మాయ చేశారు. 58 పరుగుల వ్యవధిలో ఢిల్లీ చివరి 8 వికెట్లు కోల్పోయింది. ఛేదనలో ఢిల్లీ తొలి బంతికే జేక్ ఫ్రేజర్ (0) వికెట్ కోల్పోయినా.. అభిషేక్ పోరెల్ (33), కరుణ్ నాయర్ రెండో వికెట్కు 10.1 ఓవర్లలో 119 పరుగులు జోడించారు. 119 పరుగుల వద్ద పోరెల్, 135 పరుగుల వద్ద (11.4వ ఓవర్) కరుణ్ నాయర్ వికెట్ వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ పతనం మొదలైంది. కేఎల్ రాహుల్ను (15) కర్ణ్ శర్మ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు (క్యాచ్ అండ్ బౌల్డ్). ఆ తర్వాత అక్షర్ పటేల్ను (9) బుమ్రా, ట్రిస్టన్ స్టబ్స్ను (1) కర్ణ్ శర్మ ఔట్ చేశారు. తొలి మ్యాచ్లో (ఈ సీజన్లో) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అశుతోష్ శర్మ (17), కుల్దీప్ (1), మోహిత్ శర్మ (0) రనౌట్ కాగా.. మరో హిట్టర్ విప్రాజ్ నిగమ్ను (14) సాంట్నర్ స్టంపౌట్ చేశాడు. అంతకుముందు ముంబై టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), రికెల్టన్ (41), సూర్యకుమార్యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించగా.. రోహిత్ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో గెలుపుతో ముంబై తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకగా.. సీజన్లో తొలి ఓటమి చవిచూసిన ఢిల్లీ టాప్ ప్లేస్ నుండి రెండో స్థానానికి పడిపోయింది.మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఓటమి పట్ల విచారం వ్యక్తం చేశాడు. గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయామని బాధ పడ్డాడు. మిడిలార్డర్లో కొన్ని చెత్త షాట్లు కొంపముంచాయని అన్నాడు. మంచు కూడా కీలకపాత్ర పోషించిందని తెలిపాడు. కుల్దీప్, కరుణ్ నాయర్పై ప్రశంసల వర్షం కురిపించాడు. -
ఢిల్లీ క్యాపిటల్స్ పై ముంబై ఇండియన్స్ విజయం
-
IPL 2025, MI VS DC: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (ఏప్రిల్ 13) రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్పై ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ పటిష్ట స్థితిలో ఉండినప్పటికీ.. ఆతర్వాత ఒత్తిడికి లోనై ఓటమిని కొని తెచ్చుకుంది. 19వ ఓవర్లో చివరి మూడు బంతులకు ఢిల్లీ వరుసగా మూడు వికెట్లు రనౌట్ల రూపంలో కోల్పోయి పరాజయంపాలైంది. ఓ దశలో ఢిల్లీ 11.3 ఓవర్లలో 135 పరుగులు (రెండు వికెట్ల నష్టానికి) చేసి సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) ఔట్ కావడంతో పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైంది. 58 పరుగుల వ్యవధిలో ఢిల్లీ చివరి 8 వికెట్లు కోల్పోయింది. తద్వారా కరుణ్ నాయర్ అద్భుత ఇన్నింగ్స్ వృధా అయ్యింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ ఈ మ్యాచ్లో దుమ్మురేపాడు. బుమ్రా లాంటి బౌలర్ను కూడా ఉతికి ఆరేశాడు. ముంబై విజయంలో వెటరన్ కర్ణ్ శర్మ (4-0-36-3), మిచెల్ సాంట్నర్ (4-0-43-2) కీలకపాత్ర పోషించారు. సాంట్నర్ అద్భుతమైన టచ్లో ఉన్న కరుణ్ నాయర్ను క్లీన్ బౌల్డ్ చేయగా.. కర్ణ్ శర్మ.. అభిషేక్ పోరెల్ (33), కేఎల్ రాహుల్ (15), ట్రిస్టన్ స్టబ్స్ (1) వికెట్లు తీశాడు. ఛేదనలో ఢిల్లీ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. జేక్ ఫ్రేజర్ డకౌటై మరోసారి నిరాశపరిచాడు. తమ తొలి మ్యాచ్లో (ఈ సీజన్లో) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అశుతోష్ శర్మ (17) ఈ మ్యాచ్లో రనౌటయ్యాడు. ముంబై బౌలర్లలో దీపక్ చాహర్, బుమ్రా కూడా తలో వికెట్ తీశారు.ఈ మ్యాచ్లో ముంబై తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), రికెల్టన్ (41), సూర్యకుమార్యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించగా.. రోహిత్ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో గెలుపుతో ముంబై తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. ఢిల్లీ ఈ సీజన్లో తొలి ఓటమిని చవిచూసి, రెండో స్థానానికి పడిపోయింది.చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్ఢిల్లీపై గెలుపుతో ముంబై ఇండియన్స్ ఓ అరుదైన రికార్డు సృష్టించింది. తొలి ఇన్నింగ్స్లో 200 ప్లస్ స్కోర్లు చేసిన ప్రతిసారి గెలిచిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు ముంబై 15 మ్యాచ్ల్లో ఇలా గెలిచింది. ముంబై తర్వాత ఢిల్లీ అత్యధిక మ్యాచ్ల్లో ఇలా గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు 13 సార్లు తొలి ఇన్నింగ్స్లో 200 ప్లస్ స్కోర్లు చేసి గెలిచింది. ముంబై, ఢిల్లీ కంటే సీఎస్కే అత్యధిక సార్లు (21) 200 ప్లస్ స్కోర్లకు డిఫెండ్ చేసుకున్నప్పటికీ.. ఐదు సార్లు ఓడిపోయింది. ఆర్సీబీ కూడా 19 సార్లు తొలి ఇన్నింగ్స్లో 200 ప్లస్ స్కోర్లు చేసి డిఫెండ్ చేసుకోగా.. 5 సార్లు ఓటమిపాలైంది. ఎస్ఆర్హెచ్ 15 సార్లు 200 ప్లస్ స్కోర్లు చేసి డిఫెండ్ చేసుకోగా.. 2 సార్లు ఓటమిపాలైంది. -
DC Vs MI: పరుగుల వేటలో ఢిల్లీ ‘రనౌట్’
వరుస విజయాలతో జోరుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్కు బ్రేక్ పడింది. ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది. మొదట తిలక్ వర్మ, సూర్యకుమార్ రాణించడంతో మంచి స్కోరు చేసిన ముంబై... అనంతరం చివరి వరకు పట్టు వదలకుండా ప్రయత్నించి సీజన్లో రెండో విజయం ఖాతాలో వేసుకుంది. చాలా రోజుల తర్వాత ఐపీఎల్లో బరిలోకి దిగిన కరుణ్ నాయర్ ఒంటిచేత్తో ఢిల్లీని గెలిపించేలా కనిపించినా... చివర్లో వెంటవెంటనే వికెట్లు కోల్పోయి విజయానికి దూరమైంది. న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ ఫీల్డర్ల గురికి ఢిల్లీ క్యాపిటల్స్కు ఐపీఎల్ 18వ సీజన్లో తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన ఈ పోరులో ముంబై జట్టు 12 పరుగుల తేడాతో ఢిల్లీపై గెలుపొందింది. మొదట ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (33 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా... సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్లు), రికెల్టన్ (25 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. ఆఖర్లో నమన్ ధీర్ (17 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్, విప్రాజ్ నిగమ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... అభిషేక్ పొరెల్ (33; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఢిల్లీ జట్టు వరుసగా మూడు బంతుల్లో అశుతోష్ శర్మ, కుల్దీప్, మోహిత్ శర్మ వికెట్లను కోల్పోయి ఓటమిని ఖరారు చేసుకుంది. ఈ ముగ్గురూ రనౌట్ కావడం గమనార్హం. ముంబై బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కరణ్ శర్మ 3 వికెట్లు, సాంట్నర్ 2 వికెట్లు పడగొట్టారు. తిలక్ తడాఖా... గత కొన్ని మ్యాచ్ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ముంబై మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ... ఢిల్లీపై చక్కటి ప్రదర్శన కనబర్చాడు. ఫలితంగా పాండ్యా బృందం మంచి స్కోరు చేయగలిగింది. తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన రికెల్టన్ రెండో ఓవర్లో సిక్సర్తో జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చాడు. మూడో ఓవర్లో రికెల్టన్ 2 ఫోర్లు, రోహిత్ శర్మ 6, 4 బాదడంతో 19 పరుగులు వచ్చాయి. మంచి టచ్లో కనిపించిన రోహిత్ (12 బంతుల్లో 18)ను లెగ్స్పిన్నర్ విప్రాజ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ముంబై తొలి వికెట్ కోల్పోగా... సూర్యకుమార్ బాధ్యతాయుతంగా ఆడాడు. మరికొన్ని మెరుపుల అనంతరం రికెల్టన్ కూడా ఔట్ కాగా... తిలక్ ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. ఫలితంగా ముంబై 10 ఓవర్లలో 104/2తో నిలిచింది. సూర్యకుమార్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా (2) వరుస ఓవర్లలో ఔట్ కాగా... తిలక్కు నమన్ జత కలవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో తిలక్ 26 బంతుల్లో ఈ సీజన్లో రెండో హాఫ్సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కదంతొక్కిన కరుణ్.. దేశవాళీ టోర్నీల్లో దుమ్మురేపుతున్న కరుణ్ నాయర్ ఈ మ్యాచ్లో విశ్వరూపం చూపాడు. ఏడేళ్లుగా ఐపీఎల్లో హాఫ్సెంచరీ చేయని నాయర్ ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే మెక్గుర్క్ (0) ఔట్ కావడంతో ఇంపాక్ట్ ప్లేయర్గా అడుగుపెట్టిన నాయర్... క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల మోత మోగించాడు. రెండో ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన అతడు... ఐదో ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. స్టార్ పేసర్ బుమ్రా వేసిన ఆరో ఓవర్లో 6, 4, 6తో కరుణ్ 22 బంతుల్లో హాఫ్సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాండ్యా ఓవర్లో 6, 4 కొట్టిన నాయర్... కరణ్ శర్మ ఓవర్లో రెండు ఫోర్లతో సెంచరీకి సమీపించాడు. ఈ క్రమంలో రెండో వికెట్కు 61 బంతుల్లో 119 పరుగులు జోడించిన అనంతరం పొరెల్ ఔట్ కాగా... మరో ఫోర్ కొట్టిన అనంతరం కరుణ్ వెనుదిరిగాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ (9), స్టబ్స్ (1) విఫలం కాగా... కేఎల్ రాహుల్ (15), అశుతోష్ శర్మ (17), విప్రాజ్ (14) పోరాటం జట్టును గెలిపించలేకపోయింది. నాయర్ మెరుపులతో 11 ఓవర్లు ముగిసేసరికి 128/2తో అలవోకగా విజయం సాధించేలా కనిపించిన ఢిల్లీ... ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) విప్రాజ్ 18; రికెల్టన్ (బి) కుల్దీప్ 41; సూర్యకుమార్ (సి) స్టార్క్ (బి) కుల్దీప్ 40; తిలక్ (సి) పొరెల్ (బి) ముకేశ్ 59; హార్దిక్ (సి) స్టబ్స్ (బి) విప్రాజ్ 2; నమన్ (నాటౌట్) 38; జాక్స్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–47, 2–75, 3–135, 4–138, 5–200; బౌలింగ్: స్టార్క్ 3–0–43–0; ముకేశ్ 4–0–38–1; విప్రాజ్ నిగమ్ 4–0–41–2; కుల్దీప్ 4–0–23–2; అక్షర్ 2–0–19–0; మోహిత్ 3–0–40–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెక్గుర్క్ (సి) జాక్స్ (బి) దీపక్ చహర్ 0; పొరెల్ (సి) నమన్ (బి) కరణ్ శర్మ 33; కరుణ్ నాయర్ (బి) సాంట్నర్ 89; రాహుల్ (సి అండ్ బి) కరణ్ శర్మ 15; అక్షర్ (సి) సూర్యకుమార్ (బి) బుమ్రా 9; స్టబ్స్ (సి) నమన్ (బి) కరణ్ శర్మ 1; అశుతోష్ (రనౌట్) 17; విప్రాజ్ నిగమ్ (స్టంప్డ్) రికెల్టన్ (బి) సాంట్నర్ 14; స్టార్క్ (నాటౌట్) 1; కుల్దీప్ (రనౌట్) 1; మోహిత్ (రనౌట్) 0; ఎక్స్ట్రాలు 13; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్) 193. వికెట్ల పతనం: 1–0, 2–119, 3–135, 4–144, 5–145, 6–160, 7–180, 8–192, 9–193, 10–193. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–24–1; బౌల్ట్ 2–0–21–0; బుమ్రా 4–0–44–1; సాంట్నర్ 4–0–43–2; హార్దిక్ పాండ్యా 2–0–21–0; కరణ్ శర్మ 4–0–36–3. ఐపీఎల్లో నేడులక్నో X చెన్నై వేదిక: లక్నోరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
కరుణ్ నాయర్ మెరుపులు వృథా.. ముంబై చేతిలో ఢిల్లీ ఓటమి
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి ఓటమి చవిచూసింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన హై స్కోరింగ్ థ్రిల్లర్లో పై 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలైంది. 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ 19 ఓవర్లో వరుసగా మూడు రనౌట్లు అయి మ్యాచ్ను చేజార్చుకుంది. ఢిల్లీ బ్యాటర్లలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన కరుణ్ నాయర్(40 బంతుల్లో 12 ఫోర్లు,5 సిక్స్లతో 89) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు అభిషేక్ పోరెల్(33) పర్వాలేదన్పించాడు. రాహుల్తో పాటు మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ ఓటమితో కరుణ్ నాయర్ ఇన్నింగ్స్గా వృథా అయిపోయింది. ముంబై బౌలర్లలో ఇంపాక్ట్ ప్లేయర్ కరణ్ శర్మ మూడు వికెట్లు పడగొట్టగా.. శాంట్నర్ రెండు , బుమ్రా, చాహర్ తలా వికెట్ సాధించారు. కాగా ఈ ఏడాది సీజన్లో ముంబైకి ఇది రెండో విజయం కావడం గమనార్హం.తిలక్ హాఫ్ సెంచరీ..బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(59) టాప్ స్కోరర్గా నిలవగా.. ర్యాన్ రికెల్టన్(41), సూర్యకుమార్(40), నమాన్ ధీర్(38) పరుగులతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రజ్ నిగమ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముఖేష్ కుమార్ ఓ వికెట్ సాధించారు. -
IPL 2025: రోహిత్ శర్మ మళ్లీ ఫెయిల్.. వెళ్లి రెస్ట్ తీసుకో భయ్యా?
ఐపీఎల్-2025లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. అతడి ఆట తీరు ఏ మాత్రం మారడం లేదు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రోహిత్ తీవ్ర నిరాశపరిచాడు.12 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. రెండు ఫోర్లు, ఒక సిక్సర్తో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. స్పిన్నర్ విప్రజ్ నిగమ్ బౌలింగ్ రివర్స్ స్వీప్ ఆడి వికెట్ల ముందు హిట్మ్యాన్ దొరికిపోయాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ.. 11.20 సగటుతో కేవలం 56 పరుగులు మాత్రమే చేశాడు. 0,8,13,17,18 ఇవి వరుసగా రోహిత్ శర్మ చేసిన స్కోర్లు ఇవి. దీంతో మరోసారి విఫలమైన రోహిత్ను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. ఆడింది చాలు వెళ్లి రెస్టు తీసుకో రోహిత్ అంటూ పోస్ట్లు చేస్తున్నారు. మరికొంత మంది విరాట్ కోహ్లి అద్బుతంగా ఆడుతుంటే నీకు ఏమైంది రోహిత్ అంటూ ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. గతేడాది ఐపీఎల్ సీజన్లో కూడా రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. ఇక మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ దూకుడుగా ఆడుతోంది. 13 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 2 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. Rohit Sharma has become a joke . Failed again and again.. But no former indian player will talk about it because all these former players lick Rohit Sharma's feet.Pure liability in cricket. pic.twitter.com/wvIVk8GwRM— Suprvirat (@ishantraj51) April 13, 2025 -
ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్ విజయం
IPL 2025 MI vs DC Live Updates: ఐపీఎల్-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడతున్నాయి.ముంబై ఇండియన్స్ విజయంఅరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన హై స్కోరింగ్ థ్రిల్లర్లో ఢిల్లీ క్యాపిటల్స్పై 12 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ బ్యాటర్లలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన కరుణ్ నాయర్(40 బంతుల్లో 12 ఫోర్లు,5 సిక్స్లతో 89) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు అభిషేక్ పోరెల్(33) పర్వాలేదన్పించాడు. ముంబై బౌలర్లలో కరణ్ శర్మ మూడు వికెట్లు పడగొట్టగా.. శాంట్నర్ రెండు , బుమ్రా, చాహర్ తలా వికెట్ సాధించారు. ఢిల్లీ రెండో వికెట్ డౌన్..అభిషేక్ పోరెల్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన పోరెల్.. కరుణ్ శర్మ బౌలింగ్లో ఔటయ్యాడు. 11 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది.కరుణ్ నాయర్ ఫిప్టీ..ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ కరుణ్ నాయర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. కేవలం 22 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను నాయర్ అందుకున్నాడు. 6 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది.క్రీజులో కరుణ్ నాయర్(50), అభిషేక్ పోరెల్(16) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న కరుణ్ నాయర్..5 ఓవర్లు మగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. క్రీజులో కరుణ్ నాయర్(32), అభిషేక్ పోరెల్(16) ఉన్నారు.తొలి వికెట్ డౌన్..206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. జాక్ ఫ్రేజర్ మెక్గర్క్.. దీపక్ చాహర్ బౌలింగ్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు.చెలరేగిన ముంబై బ్యాటర్లు.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(59) టాప్ స్కోరర్గా నిలవగా.. ర్యాన్ రికెల్టన్(41), సూర్యకుమార్(40), నమాన్ ధీర్(38) పరుగులతో రాణించారు.ఔటైన సూర్య, హార్దిక్ముంబై ఇండియన్స్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. 40 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా(2) విప్రజ్ నిగమ్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 16 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న తిలక్, సూర్య13 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 2 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(40), తిలక్ వర్మ(30) ఉన్నారు.ముంబై రెండో వికెట్ డౌన్. ర్యాన్ రికెల్టన్ రూపంలో ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన రికెల్టన్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 8 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ(4), సూర్యకుమార్ యాదవ్(14) ఉన్నారు.ముంబై తొలి వికెట్ డౌన్..రోహిత్ శర్మ రూపంలో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. విప్రజ్ నిగమ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 5 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న ముంబై..3 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(16), ర్యాన్ రికెల్టన్(22) ఉన్నారు.ఐపీఎల్-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు ఢిల్లీ స్టార్ ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ గాయం కారణంగా దూరమయ్యాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ మాత్రం తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, అభిషేక్ పోరెల్, కెఎల్ రాహుల్(వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా -
ముంబైతో మ్యాచ్.. అరుదైన రికార్డులకు చేరువలో రాహుల్
ఐపీఎల్-2025లో వరుస విజయాలతో దూసుకు పోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ మరో కీలక పోరుకు సిద్దమైంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో కూడా గెలిచి తమ జైత్ర యాత్రను కొనసాగించాలని ఢిల్లీ భావిస్తోంది. ఈ మ్యాచ్కు ముందు ఢిల్లీ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను పలు అరుదైన రికార్డులను ఊరిస్తోంది. ముంబైతో మ్యాచ్లో రాహుల్ మరో మూడు సిక్స్లు కొడితే ఐపీఎల్లో 200 సిక్స్ల మైలు రాయిని అందుకుంటాడు. రాహుల్ ఇప్పటివరకు 135 మ్యాచ్లు ఆడి 197 సిక్స్లు బాదాడు. కేఎల్ మరో మూడు సిక్స్లు బాదితే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, సురేష్ రైనా వంటి దిగ్గజాల సరసన చేరుతాడు.ఒకే ఒక హాఫ్ సెంచరీ..అదే విధంగా ఈ మ్యాచ్లో రాహుల్ మరో 50 రన్స్ చేస్తే ముంబై ఇండియన్స్పై వెయ్యి ఐపీఎల్ పరుగులను పూర్తి చేసుకుంటాడు. రాహుల్ ఇప్పటివరకే ముంబై ఇండియన్స్పై 950 పరుగులు చేశాడు. రాహుల్ ప్రస్తుతం ఉన్న ఫామ్కు ఈ రికార్డులు బద్దలు అవ్వడం ఖాయమన్పిస్తోంది.గత మ్యాచ్లో ఆర్సీబీపై రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 53 బంతుల్లోనే 93 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అంతకుముందు సీఎస్కేపై హాఫ్ సెంచరీతో మెరిశాడు.ముంబైతో మ్యాచ్కు ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు(అంచనా): జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్చదవండి: అక్కడ కూర్చుని మాట్లాడటం తేలికే.. ఇక్కడికి వస్తే తెలుస్తుంది: శార్దూల్ ఫైర్ -
IPL 2025: బీభత్సం సృష్టించిన గాలి దుమారం.. భయంతో కేకలు పెట్టిన రోహిత్ శర్మ
దేశ రాజధాని ఢిల్లీని నిన్న (ఏప్రిల్ 11) సాయంత్రం గాలి దుమారం వణికించింది. ఇది సృష్టించిన బీభత్సానికి జనం అల్లాడిపోయారు. ప్రజా రవాణా స్తంభించిపోయింది. విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. గాలి దూమారం ప్రభావం ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ సెషన్పై కూడా పడింది. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ నిమిత్తం ఆ జట్టు నిన్న సాయంత్రం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుంది. Straight out of a 🌪️ movie#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #DCvMI pic.twitter.com/Tv7j3ILf9v— Mumbai Indians (@mipaltan) April 11, 2025ఈ క్రమంలో గాలి దుమారం బీభత్సం సృష్టించడంతో మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న ముంబై ఇండియన్స్ బృంద సభ్యులు భయంతో వణికిపోయారు. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ కేకేలు పెడుతూ బృంద సభ్యులను మైదానం నుంచి తిరిగి రమ్మంటూ అభ్యర్థించాడు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ యాజమాన్యం తమ అధికారిక సోషల్మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో రోహిత్ కేకేలు పెడుతుండగా.. దీపక్ చాహర్, కోచ్లు మహేల జయవర్ధనే, లసిత్ మలింగ డగౌట్ వైపు పరిగెత్తుకుంటూ వస్తారు.రోహిత్.. సహచరులను మైదానం వీడి సురక్షితంగా డగౌట్కు చేరుకోవాలని కేకేలు పెడుతూనే తన సహజ శైలిలో జోక్లు వేశాడు. తనవైపు ఫోకస్ పెట్టిన కెమెరామెన్ను "నా ముఖం ఏం చూపిస్తున్నావు. ఆ వీడియో తీసుకో" అంటూ అరిచాడు. గాలి దూమారం ధాటికి స్టేడియంలో వస్తువులు గాల్లో ఎగురుతూ కనిపించాయి.ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ఏప్రిల్ 13వ తేదీ రాత్రి జరుగనుంది. ఈ మ్యాచ్ సమయానికి ఢిల్లీలోని వాతావరణం క్లియర్గా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్కు వర్షం నుంచి కాని, గాలి దుమారం నుంచి కాని ఎలాంటి ముప్పు లేదని ప్రకటన విడుదల చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. ప్రస్తుత సీజన్లో ఢిల్లీ అజేయ జట్టుగా కొనసాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో నాలుగు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ముంబై ఇండియన్స్ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుత సీజన్లో ఆడిన ఐదు మ్యాచ్ల్లో నాలుగింట ఓడి పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. ఐదు మ్యాచ్ల్లో నాలుగింట గెలిచి గుజరాత్ టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా.. కేకేఆర్, ఆర్సీబీ, పంజాబ్, లక్నో, రాజస్థాన్ వరస స్థానాల్లో ఉన్నాయి. సన్రైజర్స్, సీఎస్కే చివరి నుంచి రెండు స్థానాల్లో నిలిచాయి.ఇవాళ (ఏప్రిల్ 12) డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్లో లక్నోతో గుజరాత్ తలపడనుండగా.. రాత్రి మ్యాచ్లో పంజాబ్ను సన్రైజర్స్ ఢీకొట్టనుంది. -
సారీ చెప్పినా సరే!.. ముంబై ఇండియన్స్ స్టార్పై ఏడాది నిషేధం
సౌతాఫ్రికా ఆల్రౌండర్, ముంబై ఇండియన్స్ ఆటగాడు కార్బిన్ బాష్ (Corbin Bosch)పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నిషేధం విధించింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో పాల్గొనకుండా ఏడాది పాటు బ్యాన్ చేసింది. ఇందుకు సంబంధించి పీసీబీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.కాగా పీఎస్ఎల్-2025 (IPL 2025) సీజన్కు గానూ పెషావర్ జల్మీ ఫ్రాంఛైజీ బాష్ను జట్టులోకి తీసుకుంది. దీంతో జట్టుతో అతడు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. నిజానికి ఈ ప్రొటిస్ పేసర్ ముందు నుంచి ఐపీఎల్ వైపే మొగ్గు చూపాడు. కానీ మెగా వేలం-2025లో అతడిని ఎవరూ కొనలేదు.అలా అదృష్టం వరించింది..అయితే, సహచర ఆటగాడు లిజాడ్ విలియమ్స్ గాయం కారణంగా ఐపీఎల్-2025కి దూరం కావడంతో.. బాష్ను అదృష్టం వరించింది. ముంబై ఇండియన్స్ జట్టు విలియమ్స్ స్థానంలో బాష్ను ఎంపిక చేసింది. అయితే, ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే పీఎస్ఎల్ కూడా నిర్వహించాలనే పీసీబీ నిర్ణయం వల్ల బాష్ వంటి విదేశీ ఆటగాళ్లకు ఇబ్బందులు ఎదురయ్యాయి.ఐపీఎల్ లేదంటే పీఎస్ఎల్.. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఆడేందుకు వీలు పడుతుంది.. కాబట్టి సహజంగానే డబ్బుకు డబ్బు.. పేరుకు పేరు వచ్చే ఐపీఎల్కే ఓటు వేసిన బాష్.. పీఎస్ఎల్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో అతడికి పీసీబీ నోటీసులు జారీ చేసింది.సారీ.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాఇందుకు బదులుగా.. ‘‘విజయవంతమైన, వివిధ దేశాల టీ20 లీగ్లలో భాగమైన ముంబై ఇండియన్స్ వంటి మేటి ఫ్రాంఛైజీ ఆఫర్ను కాదంటే.. నాకు భవిష్యత్తులో మళ్లీ ఈ అవకాశం రాకపోవచ్చు. అందుకే పెషావర్ జల్మీ నుంచి వైదొలిగాను’’ అని బాష్ వివరణ ఇచ్చాడు. అయితే, పీసీబీ మాత్రం అతడిపై ఏడాది పాటు వేటు వేస్తూ నిర్ణయం తసీఉకుంది.‘‘ఈ ఆల్రౌండర్పై ఏడాది కాలం నిషేధం విధిస్తున్నాం. వచ్చే ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్ సెలక్షన్కు అతడు అర్హత పొందలేడు’’ అని పీసీబీ తమ ప్రకటనలో పేర్కొంది. కాగా లీగల్ నోటీసులు అందుకున్న సమయంలోనే బాష్.. ‘‘నా నిర్ణయం పట్ల నాకూ పశ్చాత్తాపంగానే ఉంది. అందుకే పాకిస్తాన్ ప్రజలకు, పెషావర్ జల్మీ అభిమానులకు క్షమాపణలు చెబుతున్నా.నా చర్యల వల్ల మీ మనసు బాధపడి ఉంటుందని తెలుసు. అయితే, నా భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకోవాలి. త్వరలోనే పీఎస్ఎల్లో పునరాగమనం చేసేందుకు ఎదురుచూస్తున్నా’’ అని బహిరంగంగానే క్షమాపణలు చెప్పాడు. కానీ పీసీబీ మాత్రం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.కాగా ఏప్రిల్ 11 నుంచి పీఎస్ఎల్ ప్రారంభం కానుంది. కాగా ఐపీఎల్లో 30 ఏళ్ల బాష్ ఇంతవరకు అరంగేట్రం చేయలేదు. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ సందర్భంగా మాత్రం సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా వచ్చి రిషభ్ పంత్ క్యాచ్ అందుకున్నాడు. అయితే, సౌతాఫ్రికా టీ20 లీగ్లో అతడు ముంబైకి ఆడుతుండటం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో ముంబై ఇప్పటికి ఐదు మ్యాచ్లు ఆడి కేవలం ఒకటే గెలిచింది.చదవండి: CSK Vs KKR: ‘ద్రోహి వచ్చేశాడు చూడండి... జీవితం చాలా చిత్రమైనది’ -
MI VS RCB: తిలక్ వర్మ ఎపిసోడ్లో అసలు విషయాన్ని బయట పెట్టిన హార్దిక్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో సతమతమవుతూ పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానానికి పడిపోయింది. నిన్న హోం గ్రౌండ్ వాంఖడేలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లోనూ ముంబైకి పరాభవం తప్పలేదు. ఈ మ్యాచ్లో ముంబై గెలుపు కోసం చివరి వరకు పోరాడినా ఫలితం దక్కలేదు. భారీ లక్ష్య ఛేదనలో తిలక్ వర్మ (56), హార్దిక్ పాండ్యా (42) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి ముంబైని గెలిపించేందుకు ప్రయత్నించారు. అయితే గెలుపు దరి చేరిన సమయంలో ఈ ఇద్దరు స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. దాదాపు పదేళ్ల తర్వాత ఆర్సీబీ ముంబైని వారి సొంత ఇలాకాలో ఓడించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. విరాట్ కోహ్లి (67), రజత్ పాటిదార్ (64), జితేశ్ శర్మ (40 నాటౌట్), పడిక్కల్ (37) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో చివరి వరకు పోరాడిన ముంబై లక్ష్యానికి 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆర్సీబీ బౌలర్లు చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశారు. 18, 19 ఓవర్లలో ప్రమాదకరంగా కనిపిస్తున్న తిలక్ (భువీ), హార్దిక్ను (హాజిల్వుడ్) ఔట్ చేశారు. చివరి ఓవర్లో కృనాల్ చెలరేగి (6 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు) లాంఛనంగా మ్యాచ్ను ముగించాడు. మ్యాచ్ అనంతరం హార్దిక్ మాట్లాడుతూ ఓటమికి గల కారణాలను వివరించాడు. ఈ క్రమంలో గత మ్యాచ్లో (లక్నో) తిలక్ను రిటైర్డ్ ఔట్గా వెనక్కు పంపడంపై అసలు విషయాన్ని బయటపెట్టాడు. లక్నోతో మ్యాచ్కు ముందు రోజు తిలక్ చేతి వేలికి గాయమైందని తెలిపాడు. ఆ సమయంలో తిలక్ను రిటైర్డ్ ఔట్గా పెవిలియన్కు పంపడం కేవలం వ్యూహం మాత్రమే కాదని వివరించాడు. గాయం కారణంగా తిలక్ షాట్లు ఆడలేక అసౌకర్యంగా కనిపించాడన్నాడు. అందుకే అతన్ని రిటైర్డ్ ఔట్గా పెవిలియన్కు పంపి సాంట్నర్ను బరిలోకి దించామని పేర్కొన్నాడు.కాగా, లక్నోతో మ్యాచ్ ముగిశాక హార్దిక్ తిలక్ గాయం విషయాన్ని చెప్పలేదు. భారీ షాట్లు ఆడే ఆటగాడు కావాలనే ఉద్దేశంతో సాంట్నర్ను బరిలోకి దించినట్లు తెలిపాడు. సాంట్నర్ను భారీ హిట్టర్గా చెప్పుకొచ్చిన హార్దిక్.. ఆ మ్యాచ్ చివరి ఓవర్లో అతనికి స్ట్రయిక్ ఇవ్వకపోవడం కొసమెరుపు. ఆ మ్యాచ్లో ముంబై లక్నో చేతిలో 12 పరుగుల తేడాతో ఓడింది. ఆర్సీబీతో మ్యాచ్ తరహాలోనే ఆ మ్యాచ్లోనూ ముంబై విజయతీరాల వరకు చేరి గెలుపు సాధించలేకపోయింది. ఈ రెండు మ్యాచ్ల్లో హార్దిక్ రాణించినా ముంబైకి ఓటమి తప్పలేదు. ప్రస్తుతానికి ముంబై 5 మ్యాచ్ల్లో ఒకే ఒక విజయం సాధించి ఈ సీజన్లో తమ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుకుంది. ఐదు సార్లు ఛాంపియన్ అయిన ఈ జట్టు ఏప్రిల్ 7న జరిగే తమ తదుపరి మ్యాచ్లో ఓటమి ఎరుగని ఢిల్లీ క్యాపిటల్స్ను ఢీకొట్టనుంది. -
RCB Vs MI: ఆర్సీబీ అదరహో
ముంబై విజయలక్ష్యం 222 పరుగులు... ఆర్సీబీ చక్కటి బౌలింగ్తో స్కోరు 99/4 వద్ద నిలిచింది. ముంబై గెలిచేందుకు 8 ఓవర్లలో 123 పరుగులు చేయడం అసాధ్యంగా అనిపించింది. అయితే అసాధారణ ఆటతో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా పోరాడారు. కేవలం 34 బంతుల్లో 89 పరుగులు జోడించి విజయం దిశగా నడిపించారు. అయితే ఆరు పరుగుల వ్యవధిలో వీరిద్దరిని అవుట్ చేసి బెంగళూరు చివరకు మ్యాచ్పై పట్టు నిలబెట్టుకుంది. అంతకుముందు కెప్టెన్ రజత్ పాటీదార్, విరాట్ కోహ్లి, జితేశ్ శర్మ దూకుడుతో బెంగళూరు ప్రత్యర్థికి సవాల్ విసిరింది. ముంబై: వాంఖెడే మైదానంలో పదేళ్ల తర్వాత ముంబైపై బెంగళూరు విజయం సాధించింది. సోమవారం చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఆర్సీబీ 12 పరుగులతో ముంబై ఇండియన్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రజత్ పాటీదార్ (32 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్స్లు), విరాట్ కోహ్లి (42 బంతుల్లో 67; 8 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించగా... జితేశ్ శర్మ (19 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్లు), దేవదత్ పడిక్కల్ (22 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. తిలక్ వర్మ (29 బంతుల్లో 56; 4 ఫోర్లు, 4 సిక్స్లు) హాఫ్ సెంచరీ చేయగా, హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 42; 3 ఫోర్లు, 4 సిక్స్లు) రాణించాడు. సమష్టి ప్రదర్శన... ఇన్నింగ్స్ రెండో బంతికే ఫిల్ సాల్ట్ (4) వెనుదిరగ్గా... కోహ్లి, పడిక్కల్ కలిసి దూకుడుగా స్కోరుబోర్డును నడిపించారు. బౌల్ట్ ఓవర్లో వీరిద్దరు కలిసి 16 పరుగులు రాబట్టారు. చహర్ ఓవర్లో పడిక్కల్ వరుసగా 6, 6, 4 బాదగా పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 73 పరుగులకు చేరింది. చక్కటి షాట్లు ఆడిన కోహ్లి 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. మరో భారీ షాట్కు ప్రయతి్నంచి పడిక్కల్ వెనుదిరగడంతో 91 పరుగుల (52 బంతుల్లో) రెండో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత సాంట్నర్ ఓవర్లో 2 సిక్స్లతో పాటీదార్ జోరు ప్రదర్శించాడు. హార్దిక్ ఒకే ఓవర్లో కోహ్లి, లివింగ్స్టోన్ (0)లను అవుట్ చేయగా, బౌల్ట్ ఓవర్లో ఆర్సీబీ బ్యాటర్లు పాటీదార్, జితేశ్ కలిసి 18 పరుగులు సాధించారు. 16 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 169/4. ఆఖరి 4 ఓవర్లలో బెంగళూరు 52 పరుగులు సాధించింది. భారీ భాగస్వామ్యం... భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లో 6, 4తో దూకుడుగా ఆటను మొదలు పెట్టిన రోహిత్ శర్మ (9 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్)... దయాళ్ తర్వాతి ఓవర్లో వరుసగా 2 ఫోర్లు కొట్టి తర్వాతి బంతికి బౌల్డయ్యాడు. రికెల్టన్ (17), జాక్స్ (22) కూడా మెరుగ్గానే ఆరంభించినా ఎక్కువ సేపు నిలవలేకపోయారు. బౌలర్ దయాళ్, కీపర్ జితేశ్ సమన్వయలోపంతో సులువైన క్యాచ్ను వదిలేయడంతో బతికిపోయిన సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 28; 5 ఫోర్లు)ను అదే ఓవర్లో మరో రెండు బంతుల తర్వాత పెవిలియన్ పంపించి దయాళ్ సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత సుయాశ్ ఓవర్లో తిలక్ 2 ఫోర్లు, సిక్స్...హాజల్వుడ్ వేసిన తర్వాతి ఓవర్లో హార్దిక్ 2 ఫోర్లు, 2 సిక్స్లు బాది విజయంపై ఆశలు రేపారు. గత మ్యాచ్లో ‘రిటైర్ట్ అవుట్’గా పంపించిన కసి తిలక్ బ్యాటింగ్లో కనిపించింది. తర్వాతి మూడు ఓవర్లలో కూడా ఈ జోరు కొనసాగి 43 పరుగులు వచ్చాయి. అయితే తిలక్ వికెట్తో ఆట మళ్లీ బెంగళూరు వైపు మొగ్గింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (బి) బౌల్ట్ 4; కోహ్లి (సి) నమన్ (బి) హార్దిక్ 67; పడిక్కల్ (సి) జాక్స్ (బి) పుతూర్ 37; పాటీదార్ (సి) రికెల్టన్ (బి) బౌల్ట్ 64; లివింగ్స్టోన్ (సి) బుమ్రా (బి) హార్దిక్ 0; జితేశ్ (నాటౌట్) 40; డేవిడ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 221. వికెట్ల పతనం: 1–4, 2–95, 3–143, 4–144, 5–213. బౌలింగ్: బౌల్ట్ 4–0–57–2, చహర్ 2–0–29–0, బుమ్రా 4–0–29–0, జాక్స్ 1–0–10–0, సాంట్నర్ 4–0–40–0, హార్దిక్ 4–0– 45–2, విఘ్నేశ్ 1–0–10–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) దయాళ్ 17; రికెల్టన్ (ఎల్బీ) (బి) హాజల్వుడ్ 17; జాక్స్ (సి) కోహ్లి (బి) కృనాల్ 22; సూర్యకుమార్ (సి) లివింగ్స్టోన్ (బి) దయాళ్ 28; తిలక్వర్మ (సి) సాల్ట్ (బి) భువనేశ్వర్ 56; హార్దిక్ (సి) లివింగ్స్టోన్ (బి) హాజల్వుడ్ 42; నమన్ ధీర్ (సి) దయాళ్ (బి) కృనాల్ 11; సాంట్నర్ (సి) డేవిడ్ (బి) కృనాల్ 8; దీపక్ చహర్ (సి) డేవిడ్ (బి) కృనాల్ 0; బౌల్ట్ (నాటౌట్) 1; బుమ్రా (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–21, 2–38, 3–79, 4–99, 5–188, 6–194, 7–203, 8–203, 9–209. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–48–1, యశ్ దయాళ్ 4–0–46–2, హాజల్వుడ్ 4–0–37–2, సుయాశ్ శర్మ 4–0–32–0, కృనాల్ పాండ్యా 4–0–45–4. -
ముంబై కంచుకోట బద్దలు.. పదేళ్ల తర్వాత ఆర్సీబీ గెలుపు
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తిరిగి గెలుపు బాట పట్టింది. వాఖండే వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్లో 12 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. 222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేయగల్గింది.ముంబై బ్యాటర్లు ఆఖరి వరకు పోరాడినప్పటికి కొండంత లక్ష్యాన్ని కరిగించలేకపోయారు. ముంబై విజయానికి చివరి ఓవర్లో 19 పరుగులు అవసరమయ్యాయి. ఆర్సీబీ స్పిన్నర్ కృనాల్ పాండ్యా అద్బతంగా బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(29 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 56) టాప్ స్కోరర్గా నిలవగా.. హార్దిక్ పాండ్యా(15 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 42)క్రీజులో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు.ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా నాలుగు వికెట్లు పడగొట్టగా.. హాజిల్ వుడ్, దయాల్ తలా రెండు వికెట్లు సాధించారు. వాంఖడేలో ముంబై ఇండియన్స్పై ఆర్సీబీ విజయం సాధించడం 10 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.కోహ్లి, పాటిదార్ హాఫ్ సెంచరీలుఈ మ్యాచ్లో ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(67), రజిత్ పాటిదార్(64) హాఫ్ సెంచరీలు సాధించగా.. పడిక్కల్(37), జితేష్ శర్మ(40) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌలర్లలో బౌల్ట్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించగా.. విఘ్నేష్ ఒక్క వికెట్ పడగొట్టారు. -
IPL 2025: హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు.. తొలి భారత క్రికెటర్గా
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. వాంఖడే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో పాండ్యా రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. విరాట్ కోహ్లి, లివింగ్ స్టోన్లను వరుస క్రమంలో పెవిలియన్కు పంపాడు. లివింగ్ స్టోన్ వికెట్ పాండ్యాకు 200వ టీ20 వికెట్ కావడం గమనార్హం. దీంతో ఓ అరుదైన ఫీట్ను పాండ్యా తన పేరిట లిఖించుకున్నాడు.టీ20 క్రికెట్లో 5000 పరుగులతో పాటు 200 వికెట్లు తీసిన తొలి భారత క్రికెటర్గా పాండ్యా నిలిచాడు. ఇప్పటివరకు ఏ ఇండియన్ క్రికెటర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు. ఓవరాల్గా ఈ అరుదైన ఘనత సాధించిన 12వ ప్లేయర్గా పాండ్యా రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది సీజన్లో పాండ్యా ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడి 10 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(67), రజిత్ పాటిదార్(64) హాఫ్ సెంచరీలు సాధించగా.. పడిక్కల్(37), జితేష్ శర్మ(40) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌలర్లలో బౌల్ట్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించగా.. విఘ్నేష్ ఒక్క వికెట్ పడగొట్టారు.ఈ అరుదైన ఫీట్ సాధించిన ఆటగాళ్లు వీరే..డ్వేన్ బ్రావో - 6970 పరుగులు- 631 వికెట్లుషకీబ్ అల్ హసన్ - 7438 పరుగులు - 492 వికెట్లుఆండ్రీ రస్సెల్ - 9018 పరుగులు - 470 వికెట్లుమహ్మద్ నబీ - 6135 పరుగులు- 369 వికెట్లుసమిత్ పటేల్ - 6673 పరుగులు- 352 వికెట్లుకీరాన్ పొలార్డ్ - 13537 పరుగులు- 326 వికెట్లురవి బొపారా - 9486 పరుగులు- 291 వికెట్లుడేనియల్ క్రిస్టియన్ - 5848 పరుగులు - 281 వికెట్లుమోయిన్ అలీ - 7140 పరుగులు - 375 వికెట్లుషేన్ వాట్సన్ – 8821 పరుగులు- 343 వికెట్లుమహ్మద్ హఫీజ్ – 7946 పరుగులు- 202 వికెట్లుహార్దిక్ పాండ్యా – 5390 పరుగులు- 200 వికెట్లుచదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. -
IPL 2025 RCB vs MI: ఉత్కంఠపోరులో ఆర్సీబీ విజయం
Rcb vs MI Live Updates:ఉత్కంఠపోరులో ఆర్సీబీ విజయంవాంఖడే వేదికగా ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై 12 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. 222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేయగల్గింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(29 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 56) టాప్ స్కోరర్గా నిలవగా.. హార్దిక్ పాండ్యా(15 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 42)క్రీజులో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా నాలుగు వికెట్లు పడగొట్టగా.. హాజిల్ వుడ్, దయాల్ తలా రెండు వికెట్లు సాధించారు. హార్దిక్ ఔట్..తిలక్ వర్మ(56), హార్దిక్ పాండ్య(35) వికెట్లను ముంబై ఇండియన్స్ వరుస క్రమంలో కోల్పోయింది. ముంబై విజయానికి 11 బంతుల్లో 28 పరుగులు కావాలి.దూకుడుగా ఆడుతున్న తిలక్, పాండ్యా16 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. తిలక్ వర్మ(46), హార్దిక్ పాండ్యా(34) దూకుడుగా ఆడుతున్నారు. ముంబై విజయానికి 24 బంతుల్లో 52 పరుగులు కావాలి.ముంబై నాలుగో వికెట్ డౌన్సూర్యకుమార్ యాదవ్ రూపంలో ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన సూర్యకుమార్.. యశ్దయాల్ బౌలింగ్లో ఔటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ(30), హార్దిక్ పాండ్యా(0) ఉన్నారు.ముంబై ఇండియన్స్ మూడో వికెట్ డౌన్..విల్ జాక్స్ రూపంలో ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన విల్ జాక్స్.. కృనాల్ పాండ్యా బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి తిలక్ వర్మ వచ్చాడు. 10 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 3 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది.5 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 52/25 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. క్రీజులో విల్ జాక్స్(13), సూర్యకుమార్ యాదవ్(5) ఉన్నారు.ముంబై రెండో వికెట్ డౌన్..ర్యాన్ రికెల్టన్ రూపంలో ముంబై రెండో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన రికెల్టన్.. జోష్ హాజిల్ వుడ్ బౌలింగ్లో ఔటయ్యాడు.తొలి వికెట్ కోల్పోయిన ముంబై..222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్కు భారీ షాక్ తగిలింది. 17 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. యశ్దయాల్ బౌలింగ్లో ఔటయ్యాడు. 2 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది.ముంబై ముందు భారీ టార్గెట్వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(67), రజిత్ పాటిదార్(64) హాఫ్ సెంచరీలు సాధించగా.. పడిక్కల్(37), జితేష్ శర్మ(40) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌలర్లలో బౌల్ట్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించగా.. విఘ్నేష్ ఒక్క వికెట్ పడగొట్టారు.ఆర్సీబీ నాలుగో వికెట్ డౌన్..లివింగ్ స్టోన్ రూపంలో ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఖాతా తెరవకుండానే లివింగ్ స్టోన్ పెవిలియన్కు చేరాడు. 15 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.ఆర్సీబీ మూడో వికెట్ డౌన్.. కోహ్లి ఔట్విరాట్ కోహ్లి రూపంలో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 67 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఔటయ్యాడు. నిలకడగా ఆడుతున్న విరాట్, పాటిదార్13 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(60), పాటిదార్(19) ఉన్నారు.ఆర్సీబీ రెండో వికెట్ డౌన్..దేవ్దత్త్ పడిక్కల్ రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన పడిక్కల్.. విఘ్నేష్ పుత్తార్ బౌలింగ్లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి తన హాఫ్ సెంచరీ మార్క్ను పూర్తి చేసుకున్నాడు. 53 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు.దూకుడుగా ఆడుతున్న కోహ్లి..విరాట్ కోహ్లి దూకుడుగా ఆడుతున్నాడు. 25 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. 4 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లితో పాటు పడిక్కల్(13) ఉన్నారు.ఆర్సీబీకి భారీ షాక్.. సాల్ట్ ఔట్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు ఆర్సీబీకి ఆదిలోనే భారీ షాక్ తగిలింది. 4 పరుగులు చేసిన ఫిల్ సాల్ట్.. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 2 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(9), పడిక్కల్(4) ఉన్నారు.ఐపీఎల్-2025లో వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ తిరిగి తుది జట్టులోకి వచ్చారు.తుది జట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI: విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, యశ్ దయాల్ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI: ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, విఘ్నేష్ పుత్తూర్, జస్ప్రీత్ బుమ్రా -
ముంబై ఇండియన్స్కు భారీ షాక్.. హెడ్ కోచ్ రాజీనామా
ముంబై ఇండియన్స్ మహిళా జట్టు హెడ్కోచ్ పదవికి ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం చార్లెట్ ఎడ్వర్డ్స్ విడ్కోలు పలికింది. ఎడ్వర్డ్స్ ఇటీవలే ఇంగ్లండ్ మహిళల జట్టు ప్రధాన కోచ్గా ఎంపికైంది. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్తో తన ప్రయాణాన్ని ఎడ్వర్డ్స్ ముగించింది. ఈ విషయాన్ని ముంబై ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది."చార్లెట్ కోచింగ్లో ముంబై ఇండియన్స్ ఎన్నో అద్బుతమైన విజయాలను సాధించింది. కేవలం మూడు సీజన్లలోనే రెండు టైటిల్స్ను అందించిన ఘనత ఆమె సొంతం. ఎంతో యువ క్రికెటర్లకు ఆమె స్ఫూర్తిదాయకంగా నిలిచింది. మాకు రెండు టైటిల్స్ను అందించినందుకు ధన్యవాదాలు. ఇంగ్లండ్ మహిళల జట్టు ప్రధాన కోచ్గా మీ సరికొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు" అంటూ ఎంఐ అధికారిక ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా చార్లెట్ డబ్ల్యూపీఎల్ తొట్టతొలి సీజన్లోనే ముంబై ఇండియన్స్ హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టనుంది. మొదటి సీజన్లోనే తన అనుభవంతో ముంబైను ఛాంపియన్స్గా చార్లెట్ నిలిపింది. ఆ తర్వాత డబ్ల్యూపీఎల్-2025 టైటిల్ను కూడా చార్లెట్ నేతృత్వంలోనే ముంబై సొంతం చేసుకుంది.చార్లెట్కు కోచ్గా అపారమైన అనుభవం ఉంది. ఇంగ్లండ్ ఉమెన్స్ క్రికెట్ సూపర్ లీగ్లో సదర్ వైపర్స్ జట్టుకు ఎడ్వర్డ్స్ హెడ్కోచ్గా ఐదు టైటిల్స్ను అందించింది. అదేవిధంగా ది హండ్రెడ్ లీగ్లో సదరన్ బ్రేవ్ను కూడా ఓ సారి ఛాంపియన్గా నిలిపింది. ఇప్పుడు ఇంగ్లండ్ హెడ్ కోచ్ కొత్త పాత్ర స్వీకరించేందుకు ఆమె సిద్దమైంది. జాన్ లూయిస్ స్ధానాన్ని చార్లెట్ భర్తీ చేయనుంది. ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు గత కొంతకాలంగా దారుణమైన ప్రదర్శన కనబరుస్తోంది. టీ20 ప్రపంచకప్-2023 తర్వాత ఇంగ్లండ్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టును తిరిగి గాడిలో పెట్టేందుకు ఈసీబీ కోచింగ్ బాధ్యతలను చార్లెట్కు అప్పగించింది.చదవండి: గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్గా ఊహించని పేరు చెప్పిన కపిల్ దేవ్ -
బుమ్రా X బెంగళూరు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో మరో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో పోరుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ సాధించలేకపోయిన ఆర్సీబీ... ఈసారి ఆరంభం నుంచే మంచి ప్రదర్శన చేస్తుంటే... మరోవైపు లీగ్లో ఘన చరిత్ర ఉన్న ముంబై ఇండియన్స్ పడుతూ లేస్తూ సాగుతోంది. బెంగళూరు ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండింట గెలవగా... హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ నాలుగు మ్యాచ్ల్లో కేవలం ఒక్క దాంట్లోనే విజయం సాధించింది. బ్యాటర్ల వైఫల్యం ముంబైని ఇబ్బంది పెడుతున్నా... స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పునరాగమనంతో జట్టు బలం రెట్టింపైంది. సోమవారం మ్యాచ్కు బుమ్రా అందుబాటులో ఉంటాడని ముంబై కోచ్ జయవర్ధనే వెల్లడించడంతో... ఇది బెంగళూరు బ్యాటింగ్కు బుమ్రా బౌలింగ్కు మధ్య సమరంగా మారిపోయింది. మరోవైపు తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచి జోరు కనబర్చిన ఆర్సీబీ... చివరి మ్యాచ్లో గుజరాత్ చేతిలో ఓడింది. తిరిగి గెలుపు బాటపట్టాలని బెంగళూరు ఎదురుచూస్తోంది. బ్యాటర్లు రాణిస్తేనే... ముంబై ఇండియన్స్ ప్రధాన బలమైన స్టార్ బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ప్రభావం చూపలేకపోగా... హైదరాబాద్ ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మ మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. నాలుగు మ్యాచ్ల్లో కలిసి ముంబై జట్టు తరఫున ఇప్పటి వరకు కేవలం రెండే అర్ధశతకాలు నమోదయ్యాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సూర్యకుమార్ యాదవ్, రికెల్టన్ చెరో హాఫ్ సెంచరీ చేశారు. ప్రాక్టీస్లో గాయం కారణంగా లక్నోతో మ్యాచ్లో బరిలోకి దిగని రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది. తాజా సీజన్లో 177 పరుగులు చేసిన సూర్యకుమార్ అదే ప్రదర్శన కొనసాగించాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఫర్వాలేదనిపిస్తున్నా... బ్యాటింగ్లో మరింత ధాటిగా ఆడాల్సిన అవసరముంది. లక్నోతో పోరులో వికెట్లు చేతిలో ఉన్నా... భారీ షాట్లు ఆడలేక ఇబ్బంది పడిన ముంబై... ప్రాక్టీస్లో తమ లోపాలపై దృష్టి పెట్టింది. బౌల్ట్, పాండ్యా, అశ్వని కుమార్, దీపక్ చాహర్, విఘ్నేశ్ పుతుర్ రూపంలో ముంబైకి మెరుగైన బౌలింగ్ దళమే ఉంది. బుమ్రా రాకతో ముంబై బౌలింగ్ దళం మరింత పటిష్టమైంది. కోహ్లిపైనే భారం... ఐపీఎల్ ఆరంభం నుంచి ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లిపైనే బెంగళూరు ఎక్కువగా ఆధార పడుతోంది. సీజన్ ఆరంభ పోరులో అర్ధశతకంతో ఆకట్టుకున్న విరాట్... ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోతున్నాడు. మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ నుంచి మరింత బాధ్యతాయుత ఇన్నింగ్స్ రావాల్సి ఉంది. మిడిలార్డర్లో కెపె్టన్ రజత్ పాటీదార్తో పాటు దేవదత్ పడిక్కల్ ప్రభావం చూపలేకపోతున్నారు. వీరిద్దరు నిలకడ కనబర్చాల్సిన అవసరముంది. ఇంగ్లండ్ ఆల్రౌండర్ లివింగ్స్టోన్, జితేశ్ శర్మ మంచి టచ్లో ఉండగా... కృనాల్ పాండ్యా అటు బంతితో, ఇటు బ్యాట్తో రాణించాల్సిన అవసరముంది. గతంలో ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించిన టిమ్ డేవిడ్ ఈ మ్యాచ్లో కీలకం కానున్నాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే గత సీజన్లతో పోల్చుకుంటే బెంగళూరు బౌలింగ్ దళం ఈసారి బలంగా కనిపిస్తోంది. ఆ్రస్టేలియా పేసర్ హాజల్వుడ్తో పాటు ఐపీఎల్లో అపార అనుభవమున్న భువనేశ్వర్, యశ్ దయాళ్ పేస్ భారాన్ని మోయనున్నారు. లివింగ్స్టోన్, రసిక్ సలామ్తో కలిసి కృనాల్ పాండ్యా స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నాడు. -
ఆర్సీబీతో మ్యాచ్.. ముంబై ఇండియన్స్కు డబుల్ గుడ్న్యూస్
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ కీలకపోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా సోమవారం(ఏప్రిల్ 7) వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు ముందు ముంబై ఇండియన్స్కు డబుల్ గుడ్న్యూస్ అందింది. తొలి నాలుగు మ్యాచ్లకు గాయం కారణంగా దూరంగా ఉన్న ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. పునరాగామనానికి సిద్దమయ్యాడు.ఇప్పటికే ముంబై ఇండియన్స్ జట్టులోకి చేరిన బుమ్రా, సోమవారం ఆర్సీబీతో జరగనున్న మ్యాచ్లో ఆడనున్నాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మహేల జయవర్ధనే ధ్రువీకరించాడు. జస్ప్రీత్ బుమ్రా ఫిట్గా ఉన్నాడని, ఆర్సీబీతో మ్యాచ్లో ఆడే అవకాశముందని జయవర్ధనే తెలిపాడు. ఆర్సీబీతో మ్యాచ్.. ముంబై ఇండియన్స్కు డబుల్ గుడ్న్యూస్మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్కు దూరమైన ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. రోహిత్ నెట్స్లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. దీంతో రేపటి మ్యాచ్లో అతడు ఆడటం ఖాయమైంది. కాగా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. దీంతో ఆర్సీబీతో మ్యాచ్ ముంబైకి కీలకం కానుంది. -
RCB Vs MI: ముంబై ఇండియన్స్కు శుభవార్త.. సింహం గర్జించేందుకు సిద్దమైంది..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో మూడు పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. ముంబై ఏప్రిల్ 7న జరిగే తమ తదుపరి మ్యాచ్లో ఇన్ ఫామ్ ఆర్సీబీని ఢీకొంటుంది. ఈ మ్యాచ్కు ముందు ఆ జట్టుకు శుభవార్త తెలిసింది. గాయం కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులో చేరాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ తమ అధికారిక సోషల్మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది. బుమ్రా ఐపీఎల్ జర్నీకి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసి సింహం గర్జించేందుకు సిద్దంగా ఉందని క్యాప్షన్ జోడించింది. View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians)ఈ వీడియోలో బుమ్రా భార్య సంజనా తమ కొడుకు అంగద్కు తండ్రి ఐపీఎల్ ప్రస్తానాన్ని వివరిస్తుంది. 2013లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన బుమ్రా నాటి నుంచి ముంబై సాధించిన అనేక విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. బుమ్రా ముంబై ఇండియన్స్ తరఫున 133 మ్యాచ్లు ఆడి 165 వికెట్లు తీశాడు.బుమ్రా ఈ ఏడాది ఆరంభంలో సిడ్నీలో జరిగిన చివరి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సందర్భంగా గాయపడ్డాడు (వెన్ను సమస్య). ఫలితంగా అతను భారత్ ఛాంపియన్గా నిలిచిన ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమ్యాడు. గాయానికి సంబంధించి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత బుమ్రా దాదాపు రెండు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. ఇటీవలే అతను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రిపోర్ట్ చేశాడు. కొన్ని రోజులు అక్కడ రీహ్యాబ్లో ఉండిన బుమ్రా.. తాజాగా ముంబై ఇండియన్స్ క్యాంప్లో చేరాడు. బుమ్రా జట్టులో చేరినా ఏప్రిల్ 7న ఆర్సీబీతో జరిగే మ్యాచ్కు అందుబాటులో ఉండడని తెలుస్తుంది. బుమ్రా విషయంలో రిస్క్ తీసుకోలేమని చెబుతున్న బీసీసీఐ మరికొన్ని రోజులు అతన్ని అబ్జర్వేషన్లోనే ఉంచాలని భావిస్తుంది. ఏప్రిల్ 13న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగే మ్యాచ్కు బుమ్రా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బుమ్రాను ముంబై ఇండియన్స్ ఈ సీజన్ మెగా వేలానికి ముందు రూ. 18 కోట్లకు రీటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.ఈ సీజన్లో బుమ్రా లేని లోటు ముంబై ఇండియన్స్లో కొట్టొచ్చినట్లు కనిపించింది. యువ బౌలర్లు విజ్ఞేశ్ పుతుర్, అశ్వనీ కుమార్ సత్తా చాటినా బుమ్రా స్థాయిలో ప్రభావం చూపలేకపోయారు. సీనియర్ పేసర్లు ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ కూడా తమ సామర్థ్యం మేరకు రాణించలేకపోయారు. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా బంతితో సత్తా చాటినా (4-0-36-5) ముంబై ఇండియన్స్ను గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్లో ముంబై వేగంగా పరుగులు సాధించలేక 12 పరుగుల తేడాతో ఓడింది. హర్దిక్ పాండ్యా చివరి వరకు క్రీజ్లో ఉన్నా ముంబైని గెలిపించలేకపోయాడు. చివరి ఓవర్లో సాంట్నర్కు స్ట్రయిక్ ఇవ్వకుండా హార్దిక్ ఓవరాక్షన్ చేశాడు. స్ట్రయిక్ అట్టిపెట్టుకుని అతనైనా పరుగులు రాబట్టాడా అంటే అదీ లేదు. వరుసగా రెండు డాట్ బాల్స్ చేసి ముంబై ఓటమిని ఖరారు చేశాడు. బుమ్రా రాకతోనైనా ముంబై ఫేట్ మారుతుందేమో చూడాలి. లక్నోతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ కూడా ఆడలేదు. గాయం కారణంగా హిట్మ్యాన్ ఈ మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. -
MI Vs LSG: ఏం చేస్తున్నావ్ హార్దిక్?!.. ఆకాశ్ అంబానీ ఆగ్రహం!
ఐపీఎల్-2025 (IPL 2025) సీజన్ను పరాజయంతో ప్రారంభించిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) వైఫల్యాలు కొనసాగుతున్నాయి. తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన హార్దిక్ సేన.. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ చేతిలోనూ పరాజయం పాలైంది.ఈ క్రమంలో కోల్కతా నైట్ రైడర్స్పై గెలుపుతో విజయాల బాట పట్టిందనుకుంటే.. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ ముందు తలొగ్గింది. లక్నోలోని ఏకనా స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్లో పంత్ సేన చేతిలో 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో.. లక్ష్య ఛేదనలో భాగంగా ముంబై నాయకత్వ బృందం తీసుకున్న నిర్ణయాలు ఆశ్చర్యపరిచాయి.విజయానికి ఇరవై నాలుగు పరుగుల దూరంలో ఉన్న సమయంలో బ్యాటర్ తిలక్ వర్మ ( Tilak Varma- 23 బంతుల్లో 25)ను రిటైర్డ్ అవుట్గా వెనక్కి పిలిపించారు. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు జతగా బౌలింగ్ ఆల్రౌండర్ మిచెల్ సాంట్నర్ క్రీజులోకి వచ్చాడు. Batting at 25 off 23 in the run chase, #TilakVarma retired himself out to make way for Mitchell Santner! 🤯Only the 4th time a batter has retired out in the IPL!Watch LIVE action ➡ https://t.co/nH2UGjQY0t #IPLonJioStar 👉 #LSGvMI, LIVE NOW on Star Sports 1, Star Sports 1… pic.twitter.com/NJ0C0F8MvL— Star Sports (@StarSportsIndia) April 4, 2025పరుగు తీసేందుకు నిరాకరణఇక ఆఖరి ఓవర్లో ముంబై గెలుపునకు 22 పరుగులు అవసరమైన సమయంలో .. ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో హార్దిక్ తొలి బంతికే సిక్సర్ బాదాడు. దీంతో ముంబై శిబిరంలో జోష్ కనిపించింది. అయితే, ఆ తర్వాత ఆవేశ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. రెండో బంతికి రెండు పరుగులు ఇచ్చాడు ఈ పేస్ బౌలర్. అయితే, మూడో బంతికి సింగిల్ తీసే అవకాశం ఉన్నా పాండ్యా మాత్రం అందుకు నిరాకరించాడు.ఈ క్రమంలో మూడో బంతికి ముంబై పరుగులేమీ రాబట్టలేకపోగా.. నాలుగో బంతి కూడా డాట్ అయింది. అప్పటికే ముంబై పరాజయం దాదాపుగా ఖరారు కాగా.. ఐదో బంతికి హార్దిక్ సింగిల్ తీసి.. సాంట్నర్ను క్రీజులోకి పంపాడు. ఆఖరి బంతికి సాంట్నర్ పరుగులేమీ రాబట్టలేదు. ఫలితంగా పన్నెండు పరుగుల తేడాతో ముంబైకి పరాజయం తప్పలేదు. ఆకాశ్ అంబానీ ఆగ్రహంఅయితే, తిలక్ వర్మను కాదని ‘హిట్టింగ్’ కోసమని సాంట్నర్ను పంపిన ముంబై వ్యూహం బెడిసికొట్టగా.. సాంట్నర్కు స్ట్రైక్ ఇచ్చేందుకు హార్దిక్ నిరాకరించడం జట్టు యజమాని ఆకాశ్ అంబానీకి కోపం తెప్పించింది. ఆఖరి ఓవర్ మూడో బంతికి హార్దిక్ చేసిన పనికి ఆకాశ్ ఇచ్చిన రియాక్షన్ వైరల్గా మారింది.మరోవైపు.. ఆఖరి ఓవర్ ఐదో బంతికి లక్నో విజయం దాదాపు ఖరారు కాగా.. లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ముఖం ఆనందంతో వెలిగిపోయింది. చప్పట్లు కొడుతూ అతడు విజయాన్ని సెలబ్రేట్ చేసుకోగా.. మరోవైపు ఆకాశ్ మాత్రం తమ సభ్యులతో సీరియస్గా చర్చించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.ఐపీఎల్-2025:లక్నో వర్సెస్ ముంబైలక్నో స్కోరు: 203/8 (20)ముంబై స్కోరు: 191/5 (20)ఫలితం: 12 పరుగుల తేడాతో ముంబైపై లక్నో గెలుపు.చదవండి: హిట్టర్లు అవసరం.. అందుకే తిలక్ను వెనక్కి పంపించాం: హార్దిక్MI Owner Akash Ambani reaction When Hardik Pandya on 19.3 Balls not takes the Single.#LSGvsMI pic.twitter.com/BCznQ7fc5J— Vikas Yadav (@VikasYadav69014) April 4, 2025 -
LSG Vs MI: నువ్విక మారవా?.. లక్నో జట్టుకు రెండు భారీ షాకులు.. పాపం పంత్!
గెలుపు జోష్లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో లక్నో జట్టు తప్పిదానికి గానూ ఐపీఎల్ పాలక మండలి అతడికి జరిమానా విధించింది. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున రూ. 12 లక్షల ఫైన్ వేసింది.దిగ్వేశ్కి మరోసారి షాక్అదే విధంగా.. లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ సింగ్ రాఠీకి ఐపీఎల్ పాలక మండలి మరోసారి షాకిచ్చింది. అనుచిత ప్రవర్తనకు గానూ మ్యాచ్ ఫీజులో యాభై శాతం మేర కోత విధించడంతో పాటు.. అతడి ఖాతాలో మరో డీమెరిట్ పాయింట్ జతచేసింది.203 పరుగులుఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా లక్నోలోని ఏకనా స్టేడియంలో ఎల్ఎస్జీ- ముంబై (LSG vs MI) ఇండియన్స్ మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు సాధించింది.ఓపెనర్లు మిచెల్ మార్ష్ (60), ఐడెన్ మార్క్రమ్ (53), ఆయుశ్ బదోని (30), డేవిడ్ మిల్లర్(27) రాణించారు. ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా అత్యధికంగా ఐదు వికెట్లు తీయగా.. విఘ్నేశ్ పుతూర్, అశ్వనీ కుమార్, ట్రెంట్ బౌల్ట్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.పన్నెండు పరుగుల తేడాతోఇక లక్ష్య ఛేదనలో ముంబై ఐదు వికెట్లు నష్టపోయి 191 పరుగులకే పరిమితమైంది. నమన్ ధీర్ (24 బంతుల్లో 46), సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 67), హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 28 నాటౌట్) పోరాటం వృథాగా పోయింది. పన్నెండు పరుగుల తేడాతో లక్నో చేతిలో ముంబై ఓటమి పాలైంది.అయితే, ఈ మ్యాచ్లో లక్నో జట్టు నిర్ణీత సమయంలో 20 ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయింది. ఫలితంగా ఆఖరి ఓవర్లో 30 యార్డ్ సర్కిల్లోకి అదనంగా ఓ ఫీల్డర్ను పిలవాల్సి వచ్చింది. ముంబై విజయానికి చివరి ఓవర్లో 22 పరుగులు అవసరమైన వేళ కేవలం నలుగురు ఫీల్డర్లను మాత్రమే రింగ్ బయట ఉంచాల్సి వచ్చింది. దీనితో పాటు.. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా ఆ జట్టు కెప్టెన్ పంత్కు జరిమానా కూడా పడింది.స్లో ఓవర్ రేటు ‘‘లక్నోలోని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందు వల్ల లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్కు జరిమానా విధించడమైనది’’ అని ఐపీఎల్ ఒక ప్రకటన విడుదల చేసింది.ఇదిలా ఉంటే.. దిగ్వేశ్ సింగ్ రాఠీ విషయంలోనూ ఐపీఎల్ పాలక మండలి మరో ప్రకటన జారీ చేసింది. ‘‘లక్నోలోని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం ముంబై ఇండియన్స్తో మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన లక్నో బౌలర్ దిగ్వేశ్ సింగ్ మ్యాచ్ ఫీజులో యాభై శాతం కోత విధిస్తున్నాం.మళ్లీ అదే తప్పుఆర్టికల్ 2.5లోని లెవల్ 1 తప్పిదానికి అతడు పాల్పడ్డాడు. ఈ సీజన్లో అతడు నిబంధనలు అతిక్రమించడం ఇది రెండోసారి. మంగళవారం పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లోనూ దిగ్వేశ్ రూల్స్ ఉల్లంఘించాడు. అప్పుడు ఒక డీమెరిట్ పాయింట్తో పాటు తాజాగా మరో డీమెరిట్ పాయింట్ అతడి ఖాతాలో చేరింది’’ అని సదరు ప్రకటనలో పేర్కొంది. అయితే, దిగ్వేశ్కు ఫైన్ వేయడానికి గల కారణం.. నమన్ వికెట్ తీసిన తర్వాత.. మరోసారి నోట్బుక్లో రాస్తున్నట్లుగా సెలబ్రేట్ చేసుకోవడం అని తెలుస్తోంది.నువ్విక మారవా? .. పాపం పంత్!కాగా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో.. లక్నో జట్టులోని మిగతా బౌలర్లతో పోలిస్తే దిగ్వేశ్ సింగ్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 21 పరుగులే ఇచ్చి.. నమన్ ధీర్ రూపంలో కీలక వికెట్ తీశాడు. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. కానీ తన అనుచిత ప్రవర్తనతో ఇలా మరోసారి శిక్షను అనుభవించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు దిగ్వేశ్పై.. ‘‘మారవా.. నువ్విక మారవా?’’ అంటూ మీమ్స్ ట్రోల్స్ చేస్తున్నారు. మరోవైపు..బ్యాటర్గా విఫలమవుతున్న పంత్కు ఇలా సారథిగానూ ఎదురుదెబ్బ తగలడం పట్ల.. ‘పాపం పంత్’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.చదవండి: హిట్టర్లు అవసరం.. అందుకే తిలక్ను వెనక్కి పంపించాం: హార్దిక్ Just the breakthrough #LSG needed! Avesh Khan's change in pace does the trick as LSG dismiss Surya Kumar Yadav at a crucial juncture! 👊Updates ▶️ https://t.co/HHS1Gsaw71#TATAIPL | #LSGvMI | @LucknowIPL pic.twitter.com/KKptbNOjLI— IndianPremierLeague (@IPL) April 4, 2025 -
హిట్టర్లు అవసరం.. అందుకే తిలక్ను వెనక్కి పంపించాం: హార్దిక్
లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) రిటైర్డ్ అవుట్గా వెనుదిరగడం క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది. లక్ష్య ఛేదనలో ఐదో స్థానంలో వచ్చిన ఈ ఎడమచేతి వాటం ఆటగాడు.. 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మైదానం నుంచి నిష్క్రమించాడు. అతడి స్థానంలో బౌలింగ్ ఆల్రౌండర్ మిచెల్ సాంట్నర్ క్రీజులోకి వచ్చాడు.ఈ నేపథ్యంలో స్పెషలిస్టు బ్యాటర్ను పెవిలియన్కు పంపి.. ఆల్రౌండర్ను రప్పించిన ముంబై నాయకత్వ బృందంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో లక్నో చేతిలో ఓటమి అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఈ విషయంపై స్పందించాడు.హిట్టర్లు అవసరం.. అందుకే తిలక్ను వెనక్కి పంపించాం‘‘ఆఖర్లో మాకు హిట్టింగ్ ఆడే ఆటగాడు కావాలని అనుకున్నాం. క్రికెట్లో ఇలాంటివి సహజం. అయితే, ఒక్కోసారి మన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. అయితే, వ్యూహాలు పక్కాగా అమలు చేస్తామని అనుకోవడంలో తప్పులేదు.ఒక్కోసారి ఇంకాస్త మెరుగైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బౌలింగ్లో స్మార్ట్గా ఉండాలి. బ్యాటింగ్లో వివిధ ఆప్షన్లు ప్రయత్నించాలి. మనదైన శైలిలో ఆడుతూనే దూకుడు ప్రదర్శించగలగాలి’’ అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.ఓటమికి కారణం అదేఇక లక్నో చేతిలో ఓటమి తమను తీవ్ర నిరాశకు గురిచేసిందన్న హార్దిక్ పాండ్యా.. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు పరిమితం చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్నాడు. అయితే, తనకు ఏకనా వికెట్ మీద ప్రయోగాలు చేసేందుకు ఎక్కువగా ఆప్షన్లు దొరకలేదని.. వికెట్లు తీయడం కంటే కూడా తాము డాట్ బాల్స్ వేసేందుకే ఎక్కువగా ప్రయత్నించామని తెలిపాడు. బ్యాటర్ల వైఫల్యం తీవ్ర ప్రభావం చూపిందని.. తమ పరాజయానికి అదే కారణమని పేర్కొన్నాడు.లక్నో ఓపెనర్లు ధనాధన్కాగా ఐపీఎల్-2025లో భాగంగా శుక్రవారం నాటి మ్యాచ్లో లక్నో- ముంబై జట్లు తలపడ్డాయి. సొంత మైదానం ఏకనాలో టాస్ ఓడిన లక్నో తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 60), ఐడెన్ మార్క్రమ్ (38 బంతుల్లో 53) అదరగొట్టగా.. నికోలస్ పూరన్ (12), కెప్టెన్ రిషభ్ పంత్ (2) పూర్తిగా నిరాశపరిచారు.ఈ క్రమంలో ఆయుశ్ బదోని (19 బంతుల్లో 30), డేవిడ్ మిల్లర్ (14 బంతుల్లో 27) మెరుపు బ్యాటింగ్తో ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఆఖర్లో శార్దూల్ ఠాకూర్ ఐదు, ఆవేశ్ ఖాన్ రెండు పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి లక్నో 203 పరుగులు స్కోరు చేసింది.ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐదు వికెట్లతో చెలరేగగా.. విఘ్నేశ్ పుతూర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్ ఒక్కో వికెట్ తీశారు. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే ముంబై తడ‘బ్యా’టుకు గురైంది. ఓపెనర్లు విల్ జాక్స్ (5), రియాన్ రికెల్టన్ (10) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు.నమన్, సూర్య, హార్దిక్ పోరాటం వృథాఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ నమన్ ధీర్.. సూర్యకుమార్ యాదవ్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. నమన్ 24 బంతుల్లో 46 రన్స్ చేయగా.. సూర్య 43 బంతుల్లో 67 పరుగులు సాధించాడు. అయితే, క్రీజులో నిలదొక్కుకునేందుకు కష్టపడ్డ తిలక్ వర్మ 23 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 25 పరుగులు చేసిన క్రమంలో.. మేనేజ్మెంట్ అతడిని వెనక్కి పిలిపించింది.Batting at 25 off 23 in the run chase, #TilakVarma retired himself out to make way for Mitchell Santner! 🤯Only the 4th time a batter has retired out in the IPL!Watch LIVE action ➡ https://t.co/nH2UGjQY0t #IPLonJioStar 👉 #LSGvMI, LIVE NOW on Star Sports 1, Star Sports 1… pic.twitter.com/NJ0C0F8MvL— Star Sports (@StarSportsIndia) April 4, 2025 అప్పటికి ముంబై విజయానికి 24 పరుగులు కావాల్సి ఉండగా.. మిగిలింది కేవలం ఏడు బంతులు మాత్రమే. ఆ సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా(16 బంతుల్లో 28 నాటౌట్) క్రీజులో ఉండగా.. తిలక్ స్థానంలో సాంట్నర్ వచ్చాడు. అయితే, ఆఖరి ఓవర్ను లక్నో పేసర్ ఆవేశ్ ఖాన్ కట్టుదిట్టంగా వేసి.. కేవలం తొమ్మిది పరుగులే ఇచ్చాడు. దీంతో ముంబై 191 పరుగుల వద్ద నిలిచిపోయి.. 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, ఆకాశ్ దీప్, ఆవేశ్ ఖాన్ ఒక్కో వికెట్ తీయగా.. పొదుపుగా బౌలింగ్ చేసి నమన్ వికెట్ తీసిన దిగ్వేశ్ సింగ్ రాఠి (1/21)కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ముంబై ఇప్పటి వరకు ఈ సీజన్లో నాలుగు మ్యాచ్లు పూర్తి చేసుకుని.. ఒక్కటి మాత్రమే గెలిచింది.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. తొలి కెప్టెన్గాJust the breakthrough #LSG needed! Avesh Khan's change in pace does the trick as LSG dismiss Surya Kumar Yadav at a crucial juncture! 👊Updates ▶️ https://t.co/HHS1Gsaw71#TATAIPL | #LSGvMI | @LucknowIPL pic.twitter.com/KKptbNOjLI— IndianPremierLeague (@IPL) April 4, 2025 -
బుమ్రా... మరికొన్ని రోజుల తర్వాతే...
ఐపీఎల్ తాజా సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టుకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సేవలు లభించేందుకు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత జనవరిలో ఆ్రస్టేలియా పర్యటన నుంచి వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో చికిత్స తీసుకుంటున్నాడు. వేగంగా కోలుకుంటున్న బుమ్రా ఐపీఎల్లో కనీసం మరో రెండు మ్యాచ్లు ముంబై జట్టుకు దూరంగా ఉండనున్నాడు.బుమ్రాకు పూర్తిస్థాయి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించిన తర్వాత... బీసీసీఐ మెడికల్ టీమ్ బుమ్రా ఫిట్నెస్పై సంతృప్తి వ్యక్తం చేస్తేనే అతను ఐపీఎల్లో ఆడతాడు. పూర్తి ఫిట్నెస్ సాధించాకే మళ్లీ మైదానంలో అడుగు పెట్టాలని బుమ్రా భావిస్తున్నాడు. వచ్చే జూన్లో ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్లో భారత్ పర్యటించనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో బుమ్రా పునరాగమనంపై తొందరపడకూడదని బీసీసీఐ భావిస్తోంది. ముంబై తరఫున బుమ్రా ఆడలేకపోతుండటంతో... సత్యనారాయణ రాజు, విఘ్నేశ్, అశ్వని కుమార్లాంటి యువ ఆటగాళ్లకు ఐపీఎల్లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది -
ఇంట గెలిచిన లక్నో
లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయలక్ష్యం 204 పరుగులు... నమన్, సూర్యకుమార్ చెలరేగినప్పుడు గెలుపు సునాయాసం అనిపించింది... చివర్లో 2 ఓవర్లో 29 పరుగులు చేయాల్సి ఉన్నా హార్దిక్ పాండ్యా కొట్టగలడని అనిపించింది... కానీ లక్నో మ్యాచ్ను కాపాడుకోగలిగింది. 19వ ఓవర్లో శార్దుల్ 7 పరుగులే ఇవ్వగా, ఆఖరి ఓవర్లో పదునైన బౌలింగ్తో అవేశ్ ఖాన్ 9 పరుగులే ఇచ్చాడు. దాంతో ముంబైకి ఓటమి తప్పలేదు. నలుగురు లక్నో బౌలర్లు 40కి పైగా పరుగులు ఇవ్వగా... స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ 21 పరుగులే ఇవ్వడటం చివరకు ఫలితంపై ప్రభావం చూపించింది. అంతకుముందు మిచెల్ మార్ష్, మార్క్రమ్ బ్యాటింగ్తో 200 పరుగులు దాటిన లక్నో ప్రత్యర్థికి సవాల్ విసిరింది. లక్నో: ఐపీఎల్ సీజన్లో సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్కు తొలి విజయం దక్కింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో లక్నో 12 పరుగుల తేడాతో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 60; 9 ఫోర్లు, 2 సిక్స్లు), ఎయిడెన్ మార్క్రమ్ (38 బంతుల్లో 53; 2 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేయగా, ఆయుష్ బదోని (19 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించాడు. హార్దిక్ పాండ్యా (5/36) తన టి20 కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులే చేయగలిగింది. సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 67; 9 ఫోర్లు, 1 సిక్స్), నమన్ ధీర్ (24 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు. పంత్ విఫలం... లక్నోకు ఓపెనర్లు మార్ష్, మార్క్రమ్ శుభారంభం అందించారు. బౌల్ట్ వేసిన తొలి ఓవర్ నాలుగో బంతి మార్ష్ బ్యాట్ను తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. అయితే దీనిని ముంబై బృందం గుర్తించక అప్పీల్ చేయలేదు. దాంతో బతికిపోయిన మార్ష్ ఆ తర్వాత చెలరేగిపోయి బౌల్ట్ తర్వాతి ఓవర్లో 6, 4 కొట్టాడు. అనంతరం అశ్వని ఓవర్లో మార్ష్ వరుసగా 6, 4, 2, 2, 4, 4 బాదగా, వైడ్తో కలిపి మొత్తం 23 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో 27 బంతుల్లో మార్ష్ హాఫ్ సెంచరీ పూర్తి కాగా, పవర్ప్లేలో లక్నో 69 పరుగులు సాధించింది. ఎట్టకేలకు పుతూర్... మార్ష్ను వెనక్కి పంపించాడు. మార్ష్, మార్క్రమ్ తొలి వికెట్కు 42 బంతుల్లోనే 76 పరుగులు జోడించారు. ఫామ్లో ఉన్న నికోలస్ పూరన్ (12) ఎక్కువసేపు నిలబడలేకపోగా, రిషభ్ పంత్ (2) వరుసగా నాలుగో మ్యాచ్లోనూ విఫలమయ్యాడు. ఈ దశలో బదోని, మార్క్రమ్ కలిసి ఇన్నింగ్స్ను నడిపించారు. సాంట్నర్ ఓవర్లో బదోని వరుసగా 3 ఫోర్లు కొట్టగా, ఎట్టకేలకు 17వ ఓవర్లో మార్క్రమ్ అర్ధసెంచరీ (34 బంతుల్లో) పూర్తయింది. వీరిద్దరు నాలుగో వికెట్కు 31 బంతుల్లో 51 పరుగులు జత చేశారు. చివర్లో డేవిడ్ మిల్లర్ (14 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుతో స్కోరు 200 దాటింది. సూర్య హాఫ్ సెంచరీ... ఛేదనలో ముంబై ఆరంభంలోనే జాక్స్ (5), రికెల్టన్ (10) వికెట్లు కోల్పోయింది. అయితే నమన్, సూర్య భాగస్వామ్యంతో స్కోరు దూసుకుపోయింది. ముఖ్యంగా నమన్ మెరుపు బ్యాటింగ్తో చెలరేగిపోయాడు. ఆకాశ్దీప్ ఓవర్లో అతను వరుసగా 6, 6, 4, 4 బాదాడు. దాంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 64 పరుగులకు చేరింది. అయితే రాఠీ బౌలింగ్లో నమన్ బౌల్డ్ కావడంతో 69 పరుగుల (35 బంతుల్లో) మూడో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాతా జోరు సాగించిన సూర్య 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 24 బంతుల్లో 52 పరుగులు చేయాల్సిన స్థితిలో సూర్య అవుట్ కాగా...షాట్లు ఆడటంలో బాగా ఇబ్బంది పడిన తిలక్వర్మ (23 బంతుల్లో 25; 2 ఫోర్లు) ‘రిటైర్డ్ అవుట్’గా తప్పుకున్నాడు. చివర్లో హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఎంతగా ప్రయత్నించినా ముంబైకి ఓటమి తప్పలేదు. 17వ, 18వ ఓవర్లలో కలిపి 23 పరుగులు వచ్చినా... చివరి 2 ఓవర్లలో 29 పరుగులు చేయడంలో ముంబై విఫలమైంది. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి అండ్ బి) పుతూర్ 60; మార్క్రమ్ (సి) బావా (బి) పాండ్యా 53; పూరన్ (సి) చహర్ (బి) పాండ్యా 12; పంత్ (సి) (సబ్) బాష్ (బి) పాండ్యా 2; బదోని (సి) రికెల్టన్ (బి) అశ్వని 30; మిల్లర్ (సి) నమన్ (బి) పాండ్యా 27; సమద్ (సి) నమన్ (బి) బౌల్ట్ 4; శార్దుల్ (నాటౌట్) 5; ఆకాశ్దీప్ (సి) సాంట్నర్ (బి) పాండ్యా 0; అవేశ్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 203. వికెట్ల పతనం: 1–76, 2–91, 3–107, 4–158, 5–173, 6–182, 7–200, 8–200. బౌలింగ్: బౌల్ట్ 3–0–28–1, దీపక్ చహర్ 2–0–23–0, అశ్వని కుమార్ 3–0–39–1, సాంట్నర్ 4–0–46–0, విఘ్నేశ్ పుతూర్ 4–0–31–1, హార్దిక్ పాండ్యా 4–0–36–5. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: జాక్స్ (సి) బిష్ణోయ్ (బి) ఆకాశ్దీప్ 5; రికెల్టన్ (సి) బిష్ణోయ్ (బి) శార్దుల్ 10; నమన్ ధీర్ (బి) రాఠీ 46; సూర్యకుమార్ (సి) సమద్ (బి) అవేశ్ 67; తిలక్వర్మ (రిటైర్డ్ అవుట్) 25; పాండ్యా (నాటౌట్) 28; సాంట్నర్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1–11, 2–17, 3–86, 4–152, 5–180. బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 4–0–40–1, ఆకాశ్దీప్ 4–0–46–1, అవేశ్ ఖాన్ 4–0–40–1, దిగ్వేశ్ రాఠీ 4–0–21–1, రవి బిష్ణోయ్ 4–0–40–0 రోహిత్ శర్మ దూరం ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ లక్నోతో మ్యాచ్లో ఆడలేదు. గురువారం ప్రాక్టీస్ సందర్భంగా అతని మోకాలికి గాయమైంది. దాంతో అతను ఈ పోరు నుంచి తప్పుకున్నాడు. రోహిత్ స్థానంలో రాజ్ బావాకు టీమ్ అవకాశం కల్పించింది. ఐపీఎల్లో నేడుచెన్నై X ఢిల్లీ వేదిక: చెన్నై మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి పంజాబ్ X రాజస్తాన్వేదిక: ముల్లాన్పూర్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. తొలి కెప్టెన్గా
ఐపీఎల్-2025లో భాగంగా ఎకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్లో హార్దిక్ బంతితో మ్యాజిక్ చేశాడు. తన బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. మిగితా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికి హార్దిక్ మాత్రం ఐదు వికెట్లతో చెలరేగాడు. పాండ్యా తన నాలుగు ఓవర్ల కోటాలో 36 పరుగులిచ్చి 5 వికెట్లను పడగొట్టాడు. పాండ్యాకు ఐపీఎల్లో ఇది తొలి ఫైవ్ హాల్ వికెట్ కావడం గమానార్హం. ఐపీఎల్లో కాదు టీ20ల్లోనే అతడికి మొదటి ఐదు వికెట్ల హాల్. తద్వారా పలు అరుదైన రికార్డులను పాండ్యా తన పేరిట లిఖించుకున్నాడు.తొలి కెప్టెన్గా..ఐపీఎల్లో ఫైవ్ వికెట్ల హాల్ సాధించిన తొలి కెప్టెన్గా పాండ్యా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఎవరికి సాధ్యం కాలేదు. అదేవిధంగా ఈ క్యాష్రిచ్ లీగ్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్గా హార్దిక్ రికార్డులెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు కెప్టెన్గా అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే ఐపీఎల్ 2009లో డెక్కన్ ఛార్జర్స్తో జరిగిన మ్యాచ్లో కెప్టెన్గా 16 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. తాజా మ్యాచ్తో కుంబ్లే రికార్డును పాండ్యా బ్రేక్ చేశాడు.అంతేకాకుండా ఐపీఎల్లో అత్యధిక వికెట్ల సాధించిన రెండో కెప్టెన్గా అనిల్ కుంబ్లే రికార్డును పాండ్యా సమం చేశాడు. కుంబ్లే తన ఐపీఎల్ కెరీర్లో కెప్టెన్గా 30 వికెట్లు పడగొట్టగా.. పాండ్యా ఇప్పటివరకు సారథిగా 30 వికెట్లు సాధించాడు.ఐపీఎల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్లు వీరే..5/36- హార్దిక్ పాండ్యా (ముంబై ఇండియన్స్)4/16- అనిల్ కుంబ్లే (ఆర్సీబీ)4/16- అనిల్ కుంబ్లే (ఆర్సీబీ)4/17- JP డుమిని (ఢిల్లీ డేర్డేవిల్స్)4/21- షేన్ వార్న్ (రాజస్తాన్ రాయల్స్)ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన కెప్టెన్లు వీరే:57 - షేన్ వార్న్30 - హార్దిక్ పాండ్యా30 - అనిల్ కుంబ్లే25 - రవిచంద్రన్ అశ్విన్21 - పాట్ కమ్మిన్స్మార్ష్ విధ్వంసం.. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్(31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 60), మార్క్రమ్(53) హాఫ్ సెంచరీలతో మెరవగా.. డేవిడ్ మిల్లర్(27), బదోని(27) రాణించారు. ముంబై బౌలర్లలో హార్ధిక్ పాండ్యాతో పాటు.. విఘ్నేష్ పుత్తార్, బౌల్ట్, అశ్వినీ కుమార్ తలా వికెట్ సాధించారు.చదవండి: IPL 2025: సీఎస్కే కెప్టెన్గా ఎంఎస్ ధోని? -
ముంబైకి భారీ షాక్.. రోహిత్ శర్మకు గాయం
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్కు ముందు నెట్ ప్రాక్టీస్లో రోహిత్ శర్మ మోకాలికి గాయమైంది. దీంతో లక్నో మ్యాచ్కు రోహిత్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని టాస్ సందర్బంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు.అదేవిధంగా గాయంతో బాధపడుతున్న జస్ప్రీత్ బుమ్రా త్వరలోనే జట్టులోకి రానున్నట్లు పాండ్యా పేర్కొన్నాడు. ఇక రోహిత్ శర్మ స్ధానంలో రాజ్ అంగద్ బావా తుది జట్టులోకి వచ్చాడు. అయితే ఈ సీజన్లో రోహిత్ శర్మ తన మార్క్ చూపించలేకపోయాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన రోహిత్ కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు.తుది జట్లుముంబై ఇండియన్స్విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ శాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, దీపక్ చాహర్, విఘ్నేశ్ పుత్తూర్లక్నో సూపర్ జెయింట్స్ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్, కెప్టెన్) ఆయూష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ఆకాశ్ దీప్, అవేశ్ ఖాన్చదవండి: ద్రవిడ్ సెంచరీలు చేస్తే.. రూమ్లోకి వెళ్లి ఏడ్చేవాడిని: నితీష్ రాణా -
ముంబై ఇండియన్స్పై లక్నో విజయం..
LSG vs MI Live Updates: ఐపీఎల్-2025లో భాగంగా లక్నో వేదికగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి.ముంబై ఇండియన్స్పై లక్నో విజయం..ఏక్నా స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో 12 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. ఆఖరి ఓవర్లో అవేష్ ఖాన్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ముంబై ఇండియన్స్ బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(67) టాప్ స్కోరర్గా నిలవగా.. నమాన్ ధీర్(46) పరుగులతో పర్వాలేదన్పించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(28) ఆఖరిలో పోరాడినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. లక్నో బౌలర్లలో ఆకాష్ దీప్, దిగ్వేష్, శార్ధూల్ ఠాకూర్, అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు.17 ఓవర్లకు ముంబై స్కోర్:164/4సూర్యకుమార్ యాదవ్ రూపంలో ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 67 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. అవేష్ ఖాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. ముంబై విజయానికి 21 బంతుల్లో 46 పరుగులు కావాలి. క్రీజులో ప్రస్తుతం తిలక్ వర్మ(18), హార్దిక్(5) పరుగులతో ఉన్నారు. 13 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 125/313 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ మూడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(46), తిలక్ వర్మ(12) ఉన్నారు. ముంబై మూడో వికెట్ డౌన్..నమన్ ధీర్ రూపంలో ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 46 పరుగులు చేసిన ధీర్.. దిగ్వేష్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.దూకుడుగా ఆడుతున్న ధిర్, సూర్యఆదిలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయిన ముంబై ఇండియన్స్ తిరిగి పుంజుకుంది. నమాన్ ధిర్(46), సూర్యకుమార్ యాదవ్(21) దూకుడుగా ఆడుతున్నారు. 8 ఓవర్లు ముగిసే సరికి ముంబై రెండు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది.ముంబైకి ఆదిలోనే భారీ షాక్..204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. కేవలం 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రెండో ఓవర్లో ఆకాష్ దీప్ బౌలింగ్లో విల్ జాక్స్(5) తొలి వికెట్ కోల్పోవగా.. తర్వాత శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్లో ర్యాన్ రికెల్టన్(10) ఔటయ్యారు. 3 ఓవర్లు ముగిసే సరికి ముంబై రెండు వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది.చెలరేగిన లక్నో బ్యాటర్లు.. ముంబై ముందు భారీ టార్గెట్లక్నో వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన లక్నో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్(31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 60), మార్క్రమ్(53) హాఫ్ సెంచరీలతో మెరవగా.. డేవిడ్ మిల్లర్(27), బదోని(27) రాణించారు. ముంబై బౌలర్లలో హార్ధిక్ పాండ్యా ఐదు వికెట్లతో చెలరేగగా.. పుత్తార్, బౌల్ట్, అశ్వినీ కుమార్ తలా వికెట్ సాధించారు.లక్నో నాలుగో వికెట్ డౌన్..ఆయూష్ బదోని రూపంలో లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన బదోని.. అశ్వినీ కుమార్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో మార్క్రమ్(49), డేవిడ్ మిల్లర్(1) ఉన్నారు. 16 ఓవర్లు ముగిసే సరికి లక్నో నాలుగు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.పంత్ మరోసారి ఫెయిల్..రిషబ్ పంత్ మరోసారి విఫలమయ్యాడు. ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పంత్ ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో చెత్త షాట్ ఆడి తన వికెట్ను కోల్పోయాడు. 12 ఓవర్లు ముగిసే సరికి లక్నో మూడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది.లక్నో రెండో వికెట్ డౌన్..నికోలస్ పూరన్(12) రూపంలో లక్నో రెండో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో దీపక్ చాహర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 10 ఓవర్లు ముగిసే సరికి లక్నో రెండు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. క్రీజులో మార్క్రామ్(23) ఉన్నాడు.లక్నో తొలి వికెట్ డౌన్..మిచెల్ మార్ష్ రూపంలో లక్నో సూపర్జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 60 పరుగులు చేసిన మార్ష్.. విఘ్నేష్ పుత్తార్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి నికోలస్ పూరన్ వచ్చాడు. 7 ఓవర్లకు ముంబై స్కోర్దుమ్ములేపుతున్న మార్ష్..మిచెల్ మార్ష్ దుమ్ములేపుతున్నాడు. కేవలం 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ సాధించాడు. 60 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. అతడి ఇన్నింగ్స్లలో 9 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. 6 ఓవర్లు ముగిసే సరికి లక్నో 69 పరుగులు చేసింది. దూకుడుగా ఆడుతున్న లక్నో..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 3 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. క్రీజులో మిచెల్ మార్ష్(26), మార్క్రమ్(5) ఉన్నారు.ఐపీఎల్-2025లో భాగంగా లక్నో వేదికగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు రోహిత్ శర్మ దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్లో మోకాలికి గాయమైంది. అతడి స్ధానంలో రాజ్ అంగద్ తుది జట్టులోకి బావా వచ్చాడు.తుది జట్లు లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, దీపక్ చాహర్, విఘ్నేష్ పుత్తూర్ -
LSG Vs MI: ఏం చేయాలో.. అది సరిగ్గానే చేశాను: జహీర్ ఖాన్తో రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్-2025 (IPL 2025)లో ఇప్పటి వరకు తన మార్కు చూపలేకపోయాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఈ సీజన్లో మూడు మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్.. మొత్తంగా కేవలం 21 పరుగులే చేశాడు.తమ తొలి మ్యాచ్లో భాగంగా చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్తో పోరులో డకౌట్ అయిన రోహిత్.. గుజరాత్ టైటాన్స్పై ఎనిమిది పరుగులకే పెవిలియన్ చేరాడు. చివరగా కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో పదమూడు పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ (Rohit Sharma) బ్యాటింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇక ముంబై ఇండియన్స్ తదుపరి శుక్రవారం నాటి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. ఇందుకోసం ఇప్పటికే లక్నోలోని ఏకనా స్టేడియంలో కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో లక్నో మెంటార్, టీమిండియా పేస్ దిగ్గజం జహీర్ ఖాన్ (Zaheetr Khan)తో రోహిత్ శర్మ జరిపిన సంభాషణ వైరల్గా మారింది.ఏం చేయాలో.. అది సరిగ్గానే చేశాను‘‘నేనేం చేయాలో అది సరిగ్గానే చేశాను. గతంలో చాలానే చేశాను. ఇప్పుడు కొత్త చేయాల్సింది ఏమీ లేదు’’ అని రోహిత్ జహీర్తో అన్నాడు. ఇంతలో లక్నో కెప్టెన్, టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ వచ్చి వెనుక నుంచి రోహిత్ శర్మను ఆలింగనం చేసుకున్నాడు. ఈ క్రమంలో చిన్నగా స్మైల్ ఇస్తూనే రోహిత్ సీరియస్గా తన సంభాషణను కొనసాగించాడు.ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. కాగా ఐపీఎల్-2025లో రోహిత్ వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ గట్టిగానే విమర్శించాడు.మూస పద్ధతులకే పరిమితమైతే కుదరదు‘‘రోహిత్ ప్రస్తుతం గడ్డు దశను ఎదుర్కొంటున్నాడు. గత మూడు- నాలుగేళ్ల క్రితం ఉన్న పస ఇప్పుడు తన బ్యాటింగ్లో లేదు. ప్రతి ఉదయం కొత్తదే. అత్యుత్తమంగా రాణించాలంటే కఠినంగా శ్రమించకతప్పదు.పరిస్థితులు అతడి చేజారిపోయాయి. ఇప్పటికీ తన సహజమైన ప్రతిభ, మూస పద్ధతులకే పరిమితమైతే కుదరదు’’ అని మంజ్రేకర్ ఘాటు విమర్శలు చేశాడు. ఈ నేపథ్యంలో రోహిత్ జహీర్తో అన్న మాటలను మంజ్రేకర్కు ఆపాదిస్తూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.ఘనమైన చరిత్రఇదిలా ఉంటే.. గతేడాది ముంబై ఇండియన్స్.. కెప్టెన్గా రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. ఈ క్రమంలో 2025లో అతడు జట్టును వీడతాడనే ప్రచారం జరిగినా.. హిట్మ్యాన్ ముంబైతోనే కొనసాగుతున్నాడు. కాగా ముంబైకి ఐదుసార్లు ట్రోఫీ అందించిన చరిత్ర రోహిత్ శర్మకు ఉంది. క్యాష్ రిచ్ లీగ్లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి సారథి కూడా అతడే. ఇక ఐపీఎల్లో రోహిత్ శర్మ ఇప్పటి వరకు 260 మ్యాచ్లు ఆడి 6649 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు కూడా ఉన్నాయి. చదవండి: జట్టు మారనున్న తిలక్ వర్మ?.. HCA స్పందన ఇదేQ: For how long are you going to watch this reel? 😍A: Haaanjiiii 🫂💙#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #LSGvMI pic.twitter.com/e2oxVieoz2— Mumbai Indians (@mipaltan) April 3, 2025 -
అయోధ్యలో ఫ్యామిలీతో ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ సందడి (ఫొటోలు)
-
MI vs LSG: రోహిత్, పంత్కు పరీక్ష!
లక్నో: భారీ అంచనాలతో బరిలోకి దిగి ఈ సీజన్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న ఇరు జట్ల మధ్య శుక్రవారం కీలక పోరు జరగనుంది. లక్నో సూపర్ జెయింట్స్ను ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ ‘ఢీ’ కొట్టనుంది. తాజా సీజన్లో చెరో 3 మ్యాచ్లాడిన ఇరు జట్లు ఒక్కో విజయం సాధించి రెండేసి పరాజయాలు మూటగట్టుకున్నాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర (రూ. 27 కోట్లు) దక్కించుకున్న లక్నో సారథి పంత్... ఇప్పటి వరకు ఆకట్టుకోలేకపోయాడు. గత మూడు మ్యాచ్ల్లో అతడు వరుసగా 0, 15, 2 పరుగులు చేశాడు. దీంతో అతడిపై తీవ్ర ఒత్తిడి ఉండగా... ఐపీఎల్లో కెప్టెన్సీకి దూరమైనప్పటి నుంచి కేవలం ఇంపాక్ట్ ప్లేయర్గానే ఆడుతున్న రోహిత్ శర్మ కూడా ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్నాడు. తాజా సీజన్లో ఆడిన మూడు మ్యాచ్ల్లో ‘హిట్మ్యాన్’ వరుసగా 0, 8, 13 పరుగులు చేశాడు. వీరిద్దరు ఎలాంటి ప్రణాళికలతో బరిలోకి దిగుతారో చూడాలి. మరోవైపు ఐపీఎల్లో ముంబైపై మెరుగైన రికార్డు ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ దాన్నే కొనసాగించాలని భావిస్తోంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 6 మ్యాచ్లు జరగగా... అందులో ఐదింట లక్నో గెలుపొందింది. మరి స్పిన్కు సహకరిస్తున్న లక్నో పిచ్పై విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి! బుమ్రా లేకపోయినా బలంగానే... ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోయినా... ముంబై ఇండియన్స్ బౌలింగ్ దళం పటిష్టంగానే కనిపిస్తోంది. నైపుణ్యం ఉన్న దేశీయ ఆటగాళ్లను గుర్తించి వారిని సానబెట్టే అలవాటు ఉన్న ముంబై ఫ్రాంచైజీ ఇప్పటికి ఎందరో స్టార్ ఆటగాళ్లను తయారు చేసింది. బుమ్రా, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఇలా వెలుగులోకి వచ్చిన వారే. ఇప్పుడా జాబితాలో మరో రెండు కొత్త పేర్లు చేరేలా కనిపిస్తున్నాయి. గాయం కారణంగా తొలి దశ మ్యాచ్లకు బుమ్రా దూరం కావడంతో... జట్టు బౌలింగ్ బలహీనపడుతుంది అనుకుంటే... మేమున్నామంటూ బాధ్యత తీసుకునేందుకు యువ ఆటగాళ్లు ముందుకు వచ్చారు. లెఫ్టార్మ్ పేసర్ అశ్వని కుమార్, మణికట్టు స్పిన్నర్ విఘ్నేశ్ పుథుర్ చెరో 4 వికెట్లతో ఆకట్టుకున్నారు. యంగ్ ప్లేయర్లకు దిశానిర్దేశం చేయడంలో మెరుగైన రికార్డు ఉన్న ముంబై ఫ్రాంచైజీ వీరిద్దరినీ జాగ్రత్తగా తీర్చిదిద్దుతోంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓడినప్పటికీ డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్తో ఆడిన చివరి మ్యాచ్లో ముంబై సాధికారిక విజయం సాధించింది. దక్షిణాఫ్రికా ప్లేయర్ రికెల్టన్ మెరుపులు మెరిపిస్తుండగా... హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ చక్కటి టచ్లో ఉన్నాడు. గత మ్యాచ్తో సూర్యకుమార్ కూడా లయ అందుకోగా... రోహిత్ శర్మ నుంచి మేనేజ్మెంట్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. కెపె్టన్ హార్దిక్తో పాటు బౌల్ట్, అశ్వని, దీపక్ చాహర్, సాంట్నర్ బౌలింగ్లో కీలకం కానున్నారు. ఫుల్ ఫామ్లో పూరన్, మార్ష్... కొత్త సారథి రిషబ్ పంత్ భారీ స్కోర్లు చేయలేకపోతున్నా... లక్నో జట్టుకు బ్యాటింగ్లో పెద్దగా సమస్యలు కనిపించడం లేదు. టి20 స్పెషలిస్ట్, విండీస్ స్టార్ నికోలస్ పూరన్ భారీ సిక్సర్లతో విరుచుకు పడుతుంటే... ఆ్రస్టేలియా బ్యాటర్ మిషెల్ మార్ష్ జట్టుకు మెరుగైన ఆరంభాలు అందిస్తున్నాడు. గత మూడు మ్యాచ్ల్లో ఈ ఇద్దరు రెండేసి హాఫ్ సెంచరీలు సాధించారు. క్షణాల్లో ప్రత్యర్థి నుంచి మ్యాచ్ను లాగేసుకోగల సామర్థ్యం ఉన్న వీరి నుంచి మేనేజ్మెంట్ ఇలాంటి మెరుపులే ఆశిస్తోంది. మార్క్రమ్, డేవిడ్ మిల్లర్ రూపంలో మరో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు కూడా ధాటిగా ఆడగలిగే వాళ్లే కావడం... లక్నోకు కలిసి రానుంది. ఆయుశ్ బదోని, శార్దుల్ ఠాకూర్, షాబాజ్ నదీమ్ రూపంలో ముగ్గురు స్వదేశీ ప్లేయర్లు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేందుకు సిద్ధం. ఎటొచ్చి పంత్ ఫామ్ మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది.చాంపియన్స్ ట్రోఫీలో భారత తుది జట్టులో చోటు దక్కకపోవడంతో బెంచ్కే పరిమితమైన రిషబ్... ఈ మ్యాచ్లోనైనా దంచికొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇతర జట్లతో పోల్చుకుంటే... బౌలింగ్లో కాస్త బలహీనంగా కనిపించిన లక్నో... శార్దుల్ ఠాకూర్ రాకతో బలంగా తయారైంది. గాయం నుంచి కోలుకున్న ఆకాశ్దీప్ ఈ మ్యాచ్లో ఆడటం ఖాయమే. రవి బిష్ణోయ్, దిగ్వేశ్ రాఠి కీలకం కానున్నారు. తుది జట్లు (అంచనా) లక్నో సూపర్ జెయింట్స్: పంత్ (కెప్టెన్), మార్క్రమ్, మార్ష్, పూరన్, బదోని, మిల్లర్, సమద్, శార్దుల్, దిగ్వేశ్ రాఠి, ఆకాశ్దీప్, రవి బిష్ణోయ్, సిద్ధార్థ్. ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్, రికెల్టన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, నమన్ ధీర్, సాంట్నర్, దీపక్ చాహర్, బౌల్ట్, అశ్వని కుమార్, విఘ్నేశ్ పుథుర్, ముజీబ్. 6 ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య 6 మ్యాచ్లు జరిగాయి. ఐదింటిలో లక్నో గెలుపొందగా... ఒక మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. -
IPL 2025: ముంబై ఇండియన్స్కు కొనసాగనున్న కష్టాలు..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ను ముంబై ఇండియన్స్ తమ ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే మొదలుపెట్టింది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడగా.. ఇందులో బుమ్రా లేని లోటు కొట్టిచ్చినట్లు కనిపించింది. ఈ మూడు మ్యాచ్ల్లో ముంబై తొలి రెండు మ్యాచ్లు ఓడి.. ఆతర్వాతి మ్యాచ్లో గెలిచింది.ముందుగా జరిగిన ప్రచారం ప్రకారం బుమ్రా తొలి మూడు మ్యాచ్ల తర్వాత అందుబాటులోకి రావాల్సి ఉండింది. అయితే బుమ్రా రాక మరింత ఆలస్యమవుతుందని తాజా నివేదికలు చెబుతున్నాయి. బుమ్రా గాయం ఊహించిన దానికంటే తీవ్రమైందని బీసీసీఐ వర్గాల సమాచారం. బుమ్రా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్లో ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటికీ.. అక్కడి వైద్యులు రిస్క్ తీసుకోదలచుకోలేదని తెలుస్తుంది. బుమ్రాపై అతిగా ఒత్తిడి తెస్తే మొదటికే మోసం రావచ్చని వారు భావిస్తున్నారట. ప్రస్తుతం వైద్యులు బుమ్రాకు స్ట్రెస్ ఫ్రాక్చర్ కాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారట. ఐపీఎల్ ఎంట్రీకి బుమ్రా కూడా తొందరపడటం లేదని తెలుస్తుంది. సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్లో బుమ్రా చాలా జాగ్రత్తగా ఉన్నాడని సమాచారం. ఒకవేళ బుమ్రా తొందరపడి ఐపీఎల్లో ఆడాలనుకుంటే గాయం తీవ్రతరమై దీర్ఘకాలిక నష్టం సంభవించే ప్రమాదం ఉంది. అందుకే బుమ్రా విషయంలో బీసీసీఐ రిస్క్ తీసుకోదలచుకోలేదని తెలుస్తుంది. దీన్ని బట్టి ఐపీఎల్-2025లో బుమ్రా ఎంట్రీ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. బుమ్రా తిరిగి ఎప్పుడు బరిలోకి దిగుతాడన్న విషయాన్ని బీసీసీఐ అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే మాత్రం బుమ్రా మే నెలలోనే ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అప్పటికి ముంబై ఇండియన్స్ 10 మ్యాచ్లకు పైగా ఆడేసి ఉంటుంది. బుమ్రా గైర్హాజరీ ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే ముంబై ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండింట ఓడింది. ఒకవేళ బుమ్రా మే నెలలో ఎంట్రీ ఇచ్చినా నాలుగు మ్యాచ్లు మాత్రమే ఆడే అవకాశం ఉంటుంది. ముంబై ఇండియన్స్ బుమ్రా లేకపోయినా తదుపరి మ్యాచ్ల్లో సత్తా చాటితే ప్లే ఆఫ్స్కు చేరే అవకాశం ఉంటుంది. అప్పుడు బుమ్రా సేవలను ఆ జట్టు ప్లే ఆఫ్స్లో వినియోగించుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ముంబై ఇండియన్స్కు అంత సీన్ లేదనిపిస్తుంది. ఆ జట్టులో సమతుల్యత లోపించినట్లు కనిపిస్తుంది. బౌలింగ్లో బౌల్ట్ మినహా ఆ జట్టులో సీనియర్ ఎవరూ లేరు. కొత్తగా వచ్చిన బౌలర్లతో ఆ జట్టు కాలం వెల్లదీస్తుంది. కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో యువ పేసర్ అశ్వనీ కుమార్ సత్తా చాటడంతో ముంబై ఇండియన్స్ సీజన్ తొలి విజయం నమోదు చేసింది. బ్యాటింగ్లో కూడా ఆ జట్టు అంతంతమాత్రంగానే ఉంది. రోహిత్ శర్మ పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. కాగా, బుమ్రా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. అదే గాయం కారణంగా అతను ఛాంపియన్స్ ట్రోఫీ కూడా దూరమయ్యాడు. -
MI Vs KKR: భలా బౌల్ట్.. ఏ బౌలర్కు సాధ్యం కాని రీతిలో..!
ఐపీఎల్లో ప్రస్తుత ముంబై ఇండియన్స్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు ఉంది. ఐపీఎల్లో తొలి ఓవర్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా బౌల్ట్ రికార్డు కలిగి ఉన్నాడు. తాజాగా ఈ రికార్డును బౌల్ట్ మరింత మెరుగుపర్చుకున్నాడు. నిన్న (మార్చి 31) కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో బౌల్ట్ మరోసారి తొలి ఓవర్లో వికెట్ తీసి తన తొలి ఓవర్ వికెట్ల సంఖ్యను 30కి (96 మ్యాచ్లు) పెంచుకున్నాడు. ఐపీఎల్లో బౌల్ట్ తర్వాత తొలి ఓవర్లో అత్యధిక వికెట్లు తీసిన ఘనత భువనేశ్వర్ కుమార్కు దక్కుతుంది. ప్రస్తుతం ఆర్సీబీకి ఆడుతున్న భువీ ఐపీఎల్ తొలి ఓవర్లలో 27 వికెట్లు (126 మ్యాచ్లు) తీశాడు. ఈ రికార్డుకు సంబంధించి బౌల్ట్, భువీ దరిదాపుల్లో ఎవరూ లేరు. ఐపీఎల్ తొలి ఓవర్లో ప్రవీణ్ కుమార్ 15, సందీప్ శర్మ 13, దీపక్ చాహర్ 13 వికెట్లు తీశారు.కాగా, కేకేఆర్తో నిన్న జరిగిన మ్యాచ్లో బౌల్ట్ తొలి ఓవర్లోనే సునీల్ నరైన్ను డకౌట్ చేశాడు. తద్వారా కేకేఆర్ పతనానికి నాంది పలికాడు. ఈ మ్యాచ్లో అరంగేట్రం పేసర్ (ముంబై ఇండియన్స్) అశ్వనీ కుమార్ (3-0-24-4) చెలరేగడంతో కేకేఆర్ 116 పరుగులకే కుప్పకూలింది. అశ్వనీ కుమార్తో పాటు దీపక్ చాహర్ (2-0-19-2), బౌల్ట్ (4-0-23-1), హార్దిక్ పాండ్యా (2-0-10-1), విజ్ఞేశ్ పుతుర్ (2-0-21-1), సాంట్నర్ (3.2-0-17-1) రాణించడంతో కేకేఆర్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది (16.2 ఓవర్లలో). కేకేఆర్ ఇన్నింగ్స్లో రఘువంశీ (26) టాప్ స్కోరర్ కాగా.. రమణ్దీప్ (22), మనీశ్ పాండే (19), రింకూ సింగ్ (17), రహానే (11) రెండంకెల స్కోర్లు చేశారు. డికాక్ (1), సునీల్ నరైన్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), రసెల్ (5) దారుణంగా విఫలమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్.. ర్యాన్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), సూర్యకుమార్ (9 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ (12 బంతుల్లో 13) పేలవ ప్రదర్శన కొనసాగగా.. విల్ జాక్స్ (17 బంతుల్లో 16) నిరాశపరిచాడు. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్కు 2 వికెట్లు దక్కాయి.ఈ సీజన్లో రెండు వరుస పరాజయాల తర్వాత ముంబై ఇండియన్స్కు లభించిన తొలి విజయం ఇది. కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టుకు ఈ సీజన్లో ఇది రెండో పరాజయం. తొలి మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో ఓడిన ఈ జట్టు.. ఆతర్వాతి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై విజయం సాధించి, తాజాగా ముంబై ఇండియన్స్ చేతిలో ఓడింది. -
IPL 2025: కేకేఆర్ చెత్త రికార్డులు
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మార్చి 31) వాంఖడేలో జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ ముంబై ఇండియన్స్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ ఓటమితో కేకేఆర్ పలు చెత్త రికార్డులు మూటగట్టుకుంది. ఐపీఎల్లో ఓ జట్టు (ముంబై ఇండియన్స్) చేతిలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్టుగా తమ పేరిటే ఉన్న చెత్త రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. తాజా ఓటమితో ముంబై ఇండియన్స్ చేతిలో కేకేఆర్ పరాజయాల సంఖ్య 24కు చేరింది. ఐపీఎల్లో ఏ జట్టూ ఓ జట్టు చేతిలో ఇన్ని మ్యాచ్లు ఓడిపోలేదు. కేకేఆర్ తర్వాత ఈ చెత్త రికార్డు ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ పేరిట ఉంది. ఆర్సీబీ సీఎస్కే చేతిలో.. పంజాబ్ కేకేఆర్ చేతిలో తలో 21 మ్యాచ్లు ఓడిపోయాయి.ఐపీఎల్లో ఓ జట్టు చేతిలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్లు..కేకేఆర్- 24 ముంబై ఇండియన్స్ చేతిలోఆర్సీబీ- 21 సీఎస్కే చేతిలోపంజాబ్- 21 కేకేఆర్ చేతిలోసీఎస్కే- 20 ముంబై ఇండియన్స్ చేతిలోఆర్సీబీ- 20 కేకేఆర్ చేతిలోనిన్నటి ఓటమితో కేకేఆర్ మరో చెత్త రికార్డు కూడా తమ ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్లో ఓ వేదికపై ఓ జట్టు చేతిలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్టుగా నిలిచింది. కేకేఆర్ వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ చేతిలో అత్యధికంగా 10 పరాజయాలు ఎదుర్కొంది. ఓ వేదికపై ఓ జట్టు చేతిలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్ల జాబితాలో పంజాబ్, ఆర్సీబీ, ఢిల్లీ కేకేఆర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ఐపీఎల్లో ఓ వేదికపై ఓ జట్టు చేతిలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్లు..కేకేఆర్- 10 వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ చేతిలోపంజాబ్-9 ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ చేతిలోఆర్సీబీ- 8 వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ చేతిలోఆర్సీబీ- 8 చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్ చేతిలోఆర్సీబీ- 8 చెపాక్ స్టేడియంలో సీఎస్కే చేతిలోఢిల్లీ- 8 ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ చేతిలోమ్యాచ్ విషయానికొస్తే.. ముంబై ఇండియన్స్ చేతిలో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం ఎదుర్కొంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. అరంగేట్రం పేసర్ అశ్వనీ కుమార్ (3-0-24-4) చెలరేగడంతో కేకేఆర్ను 116 పరుగులకే కుప్పకూల్చింది. కేకేఆర్ను మట్టికరిపించడంలో ముంబై బౌలర్లు దీపక్ చాహర్ (2-0-19-2), బౌల్ట్ (4-0-23-1), హార్దిక్ పాండ్యా (2-0-10-1), విజ్ఞేశ్ పుతుర్ (2-0-21-1), సాంట్నర్ (3.2-0-17-1) తలో చేయి వేశారు.కేకేఆర్ ఇన్నింగ్స్లో రఘువంశీ (26) టాప్ స్కోరర్ కాగా.. రమణ్దీప్ (22), మనీశ్ పాండే (19), రింకూ సింగ్ (17), రహానే (11) రెండంకెల స్కోర్లు చేశారు. డికాక్ (1), సునీల్ నరైన్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), రసెల్ (5) దారుణంగా విఫలమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్.. ర్యాన్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), సూర్యకుమార్ (9 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్కు 2 వికెట్లు దక్కాయి. ఈ సీజన్లో రెండు వరుస పరాజయాల తర్వాత ముంబై ఇండియన్స్కు లభించిన తొలి విజయం ఇది. కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టుకు ఈ సీజన్లో ఇది రెండో పరాజయం. తొలి మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో ఓడిన ఈ జట్టు.. ఆతర్వాతి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై విజయం సాధించి, తాజాగా ముంబై ఇండియన్స్ చేతిలో ఓడింది. -
IPL 2025, MI VS KKR: చరిత్ర పుటల్లో సూర్యకుమార్
భారత టీ20 జట్టు కెప్టెన్, ముంబై ఇండియన్స్ విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర పుటల్లోకెక్కాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, సురేశ్ రైనా తర్వాత టీ20ల్లో 8000 పరుగులు పూర్తి చేసుకున్న ఐదో భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. నిన్న (మార్చి 31) కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అనంతరం స్కై ఈ ఘనత సాధించాడు. నిన్నటి మ్యాచ్తో కలుపుకుని సూర్య ఇప్పటివరకు టీ20ల్లో (అంతర్జాతీయ మ్యాచ్లు, దేశవాలీ, ఐపీఎల్) 8007 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా చలామణి అవుతున్న విరాట్ ఖాతాలో 12976 పరుగులు ఉన్నాయి.టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లువిరాట్ కోహ్లి- 12976రోహిత్ శర్మ- 11851శిఖర్ ధవన్- 9797సురేశ్ రైనా- 8654సూర్యకుమార్ యాదవ్- 8007మ్యాచ్ విషయానికొస్తే.. కేకేఆర్తో నిన్న జరిగిన మ్యాచ్లో సూర్య 9 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 27 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కేకేఆర్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో రెండు వరుస పరాజయాల తర్వాత ముంబై సాధించిన తొలి విజయం ఇది. ముంబై గెలుపులో సూర్య తనవంతు పాత్ర పోషించాడు. కేకేఆర్ నిర్దేశించిన 117 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో స్కై తన సహజ శైలిలో బ్యాట్ను ఝులిపించాడు. ఈ సీజన్లో తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన ర్యాన్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈ మ్యాచ్లో సత్తా చాటాడు. రోహిత్ శర్మ (12 బంతుల్లో 13) పేలవ ప్రదర్శన కొనసాగగా.. విల్ జాక్స్ (17 బంతుల్లో 16) నిరాశపరిచాడు. ముంబై 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి కేకేఆర్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్కు 2 వికెట్లు దక్కాయి.అంతకుముందు అరంగేట్రం పేసర్ అశ్వనీ కుమార్ (3-0-24-4) చెలరేగడంతో కేకేఆర్ 116 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లలో దీపక్ చాహర్ (2-0-19-2), బౌల్ట్ (4-0-23-1), హార్దిక్ పాండ్యా (2-0-10-1), విజ్ఞేశ్ పుతుర్ (2-0-21-1), సాంట్నర్ (3.2-0-17-1) కూడా రాణించారు.కేకేఆర్ ఇన్నింగ్స్లో రఘువంశీ చేసిన 26 పరుగులే (16 బంతుల్లో) అత్యధికం. ఆఖర్లో రమణ్దీప్ (12 బంతుల్లో 22) బ్యాట్ ఝులిపించడంతో కేకేఆర్ అతి కష్టం మీద 100 పరుగుల మార్కును దాటింది. కేకేఆర్ ఇన్నింగ్స్లో రఘువంశీ, రమణ్దీప్తో పాటు మనీశ్ పాండే (19), రింకూ సింగ్ (17), రహానే (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. గత మ్యాచ్లో (రాజస్థాన్) ఒంటిచేత్తో కేకేఆర్ను గెలిపించిన డికాక్ ఈ మ్యాచ్లో తేలిపోయాడు. సునీల్ నరైన్ డకౌటయ్యాడు. కోట్టు పెట్టి కొన్న వెంకటేశ్ అయ్యర్ (3) తుస్సుమనిపించాడు. విధ్వంసకర వీరుడు రసెల్ (11 బంతుల్లో 5) విఫలమయ్యాడు. -
MI VS KKR: అతడు అద్భుతం.. క్రెడిట్ వాళ్లకే.. రసెల్ వికెట్ కీలకం: హార్దిక్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. నిన్న (మార్చి 31) సొంత మైదానంలో కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్ల్లో సీఎస్కే, గుజరాత్ చేతుల్లో ఘోరంగా ఓడిన ఎంఐ.. కేకేఆర్తో మ్యాచ్లో అనూహ్యంగా పుంజుకుని సంతృప్తి పొందే విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముంబై గెలుపులో అరంగేట్రం పేసర్ అశ్వనీ కుమార్ కీలకపాత్ర పోషించాడు. అశ్వనీ 3 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అశ్వనీతో పాటు దీపక్ చాహర్ (2-0-19-2), బౌల్ట్ (4-0-23-1), హార్దిక్ పాండ్యా (2-0-10-1), విజ్ఞేశ్ పుతుర్ (2-0-21-1), సాంట్నర్ (3.2-0-17-1) కూడా రాణించడంతో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై కేకేఆర్ను 116 పరుగులకే కుప్పకూల్చింది.కేకేఆర్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా రాణించలేకపోయారు. రఘువంశీ చేసిన 26 పరుగులే (16 బంతుల్లో) అత్యధికం. ఆఖర్లో రమణ్దీప్ (12 బంతుల్లో 22) బ్యాట్ ఝులిపించడంతో కేకేఆర్ అతి కష్టం మీద 100 పరుగుల మార్కును దాటింది. కేకేఆర్ ఇన్నింగ్స్లో రఘువంశీ, రమణ్దీప్తో పాటు మనీశ్ పాండే (19), రింకూ సింగ్ (17), రహానే (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. గత మ్యాచ్లో (రాజస్థాన్) సత్తా చాటిన డికాక్ ఈ మ్యాచ్లో తేలిపోయాడు. సునీల్ నరైన్ డకౌటయ్యాడు. కోట్టు పెట్టి కొన్న వెంకటేశ్ అయ్యర్ (3) తుస్సుమనిపించాడు. విధ్వంసకర వీరుడు రసెల్ (11 బంతుల్లో 5) విఫలమయ్యాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆడుతూపాడుతూ విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన ర్యాన్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈ మ్యాచ్లో సత్తా చాటాడు. సూర్యకుమార్ (9 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తన సహజ శైలిలో విధ్వంసం సృష్టించాడు. రోహిత్ శర్మ (12 బంతుల్లో 13) పేలవ ప్రదర్శన కొనసాగగా.. విల్ జాక్స్ (17 బంతుల్లో 16) నిరాశపరిచాడు. ముంబై 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్కు 2 వికెట్లు దక్కాయి.మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ గెలుపు సంతృప్తికరంగా ఉంది. హోం గ్రౌండ్లో గెలవడం మరింత ప్రత్యేకం. సమిష్టిగా రాణించాం. ప్రతి ఒక్కరు గెలుపులో భాగమయ్యారు. వికెట్ మేము ఊహించిన దానికంటే ఎక్కువగానే మాకు అనుకూలించింది. అశ్వనీ కూమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పిచ్ను పరిశీలించాక అశ్వనీ తన సహజ శైలిలో బౌలింగ్ చేసినా సత్ఫలితాలు వస్తాయని అనుకున్నాము. అదే జరిగింది. అశ్వనీ లాంటి ఆణిముత్యాన్ని వెలికి తీసినందుకు మా స్కౌట్స్ను అభినంధించాలి. ముంబై ఇండియన్స్ స్కౌట్స్ దేశం నలుమూలలా తిరిగి విజ్ఞేశ్ పుతుర్, అశ్వనీ కుమార్ లాంటి టాలెంటెడ్ కిడ్స్ను ఎంపిక చేశారు. ప్రాక్టీస్ సమయంలోనే అశ్వనీలోని టాలెంట్ను గమనించాము. అతని బౌలింగ్లో ప్రత్యేకమైన లేట్ స్వింగ్ ఉంది. పైగా అతను లెఫ్ట్ హ్యాండర్. అశ్వనీ తీసిన రసెల్ వికెట్ చాలా కీలకం. అతడు డికాక్ క్యాచ్ను అందుకున్న తీరు కూడా అద్భుతం. ఓ ఫాస్ట్ బౌలర్ అంత ఎత్తుకు ఎగిరి క్యాచ్ పట్టడం ఆషామాషీ కాదు. ముందు చెప్పినట్లు, సమిష్టిగా రాణించడం శుభసూచకం. -
MI VS KKR: సమిష్టి వైఫల్యం.. రహానే ఆవేదన
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన కేకేఆర్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో స్థాయికి తగ్గట్టుగా ఆడటం లేదు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండింట ఓటమిపాలైంది. తొలి మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో చావుదెబ్బ తిన్న ఆ జట్టు.. ఆతర్వాతి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై ఏకపక్ష విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. తాజాగా నిన్న (మార్చి 31) ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొని సీజన్లో రెండో ఓటమిని మూటగట్టుకుంది.ఈ మ్యాచ్లో కేకేఆర్ బ్యాటింగ్లో ఘోరంగా విఫలమైంది. ముంబై ఇండియన్స్ అరంగేట్రం పేసర్ అశ్వనీ కుమార్ (3-0-24-4) ధాటికి 116 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా రాణించలేదు. అంగ్క్రిష్ రఘువంశీ చేసిన 26 పరుగులే అత్యధికం. ఆఖర్లో రమణ్దీప్ సింగ్ (12 బంతుల్లో 22; ఫోర్, 2 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించకపోయుంటే 100 పరుగులు కూడా వచ్చేవి కాదు. రఘువంశీ, రమణ్దీప్తో పాటు మనీశ్ పాండే (19), రింకూ సింగ్ (17), రహానే (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. డికాక్ (1), నరైన్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), ఆండ్రీ రసెల్ (5) దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో అశ్వనీ కుమార్తో పాటు దీపక్ చాహర్ (2-0-19-2), బౌల్ట్ (4-0-23-1), హార్దిక్ పాండ్యా (2-0-10-1), విజ్ఞేశ్ పుతుర్ (2-0-21-1), సాంట్నర్ (3.2-0-17-1) కూడా సత్తా చాటారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనుకు దిగిన ముంబై ఇండియన్స్ సునాయాసంగా విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన ర్యాన్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈ మ్యాచ్లో సత్తా చాటాడు. సూర్యకుమార్ (9 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తన సహజ శైలిలో విధ్వంసం సృష్టించాడు. రోహిత్ శర్మ (12 బంతుల్లో 13) పేలవ ప్రదర్శన కొనసాగగా.. విల్ జాక్స్ (17 బంతుల్లో 16) నిరాశపరిచాడు. మొత్తంగా ముంబై 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్కు 2 వికెట్లు దక్కాయి.మ్యాచ్ అనంతరం లూజింగ్ కెప్టెన్ అజింక్య రహానే ఇలా అన్నాడు. సమిష్టిగా బ్యాటింగ్లో విఫలమయ్యాం. టాస్లో చెప్పినట్లుగానే ఈ వికెట్ బ్యాటింగ్ చేయడానికి బాగుంది. 180-190 పరుగులు చేసుంటే మంచి స్కోర్ అయ్యుండేది. వికెట్పై మంచి బౌన్స్ కూడా ఉంది. కొన్నిసార్లు బౌన్స్ను, పేస్ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ ఆట నుండి చాలా వేగంగా నేర్చుకోవాలి. బంతితో కూడా పెద్దగా రాణించలేకపోయాము. బౌలర్లు శక్తి మేరకు ప్రయత్నించారు కానీ, బోర్డుపై ఓ మోస్తరు స్కోరైనా లేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాము. పవర్ప్లేలో నాలుగు వికెట్లు కోల్పోయాక కోలుకోవడం కష్టం. మంచి భాగస్వామ్యాలు కొనసాగుండాల్సింది. చివరి వరకు ఓ బ్యాటర్ క్రీజ్లో ఉండటం అవసరం. -
IPL 2025: ముంబై బోణీ
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ జట్టు 18వ సీజన్లో గెలుపు బోణీ కొట్టింది. డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ జట్టుతో సోమవారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఎడంచేతి వాటం యువ పేస్ బౌలర్ అశ్వని కుమార్ ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్లో చిరస్మరణీయ ప్రదర్శనతో అదరగొట్టాడు. పంజాబ్కు చెందిన అశ్వని తన ప్రతిభతో ముంబై జట్టుకు ఈ సీజన్లో తొలి విజయాన్ని అందించాడు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్కు దిగిన కోల్కతా నైట్రైడర్స్ 16.2 ఓవర్లలో కేవలం 116 పరుగులకే కుప్పకూలింది. 23 ఏళ్ల అశ్వని 3 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. కోల్కతాను తక్కువ స్కోరుకే కట్టడి చేశాడు. అనంతరం ముంబై ఇండియన్స్ జట్టు ఆద్యంతం దూకుడుగా ఆడింది. కేవలం 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్లు) ధనాధన్ ఆటతీరుతో అజేయ అర్ధ సెంచరీ సాధించాడు. ముంబై గెలుపుతో ప్రస్తుత సీజన్లో మొత్తం 10 జట్లూ పాయింట్ల ఖాతా తెరిచినట్టయింది. ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్లోనే నాలుగు వికెట్లు పడగొట్టిన తొలి భారతీయ బౌలర్గా ఘనత వహించిన అశ్వని కుమార్కే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. తడబడుతూనే... కోల్కతాకు శుభారంభం లభించలేదు. తొలి ఓవర్లో నరైన్ (0)ను బౌల్ట్ డకౌట్ చేయగా... రెండో ఓవర్లో డికాక్ (1)ను దీపక్ చహర్ పెవిలియన్కు పంపించాడు. మూడో ఓవర్లో అశ్వని తాను వేసిన తొలి బంతికే కెప్టెన్ రహానేను అవుట్ చేశాడు. అశ్వని వేసిన వైడ్ బంతిని రహానే వేటాడి భారీ షాట్ ఆడగా... డీప్ మిడ్వికెట్ వద్ద తిలక్ వర్మ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దాంతో కోల్కతా 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కోల్కతాను ఆదుకుంటాడని భావించి వెంకటేశ్ అయ్యర్ (3) మళ్లీ నిరాశపరచగా... క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడిన రఘువంశీ (16 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) పాండ్యా బౌలింగ్లో వెనుదిరిగాడు. దాంతో 7 ఓవర్లు ముగిసేసరికి కోల్కతా సగంజట్టు పెవిలియన్ చేరింది. ఈ దశలో ఆరో వికెట్కు 29 పరుగులు జోడించి... క్రీజులో నిలదొక్కుకున్నట్లు కనిపించిన రింకూ సింగ్ (14 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్స్), మనీశ్ పాండే (14 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్)లను అశ్వని ఒకే ఓవర్లో అవుట్ చేయడంతో కోల్కతా కోలుకోలేకపోయింది. చివరి ఆశాకిరణం రసెల్ (5)ను అశ్వని 13వ ఓవర్లో బౌల్డ్ చేయడంతో కోల్కతా స్కోరు 100 దాటుతుందా లేదా అనుమానం కలిగింది. అయితే రమణ్దీప్ సింగ్ (12 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్లు) పుణ్యమాని కోల్కతా స్కోరు వంద దాటింది. 17వ ఓవర్లో చివరి వికెట్గా రమణ్దీప్ వెనుదిరగడంతో కోల్కతా ఇన్నింగ్స్ ముగిసింది. రోహిత్ విఫలం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు ఓపెనర్లు రికెల్టన్, రోహిత్ శర్మ (12 బంతుల్లో 13; 1 సిక్స్) తొలి వికెట్కు 46 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ వరుసగా మూడో మ్యాచ్లోనూ విఫలమయ్యాడు. రోహిత్ అవుటైనా మరోవైపు రికెల్టన్ తన ధాటిని కొనసాగించడంతో ముంబైకు ఏ దశలోనూ ఇబ్బంది కాలేదు. విల్ జాక్స్ (17 బంతుల్లో 16; 1 సిక్స్)తో రికెల్టన్ రెండో వికెట్కు 45 పరుగులు జోడించాడు. జాక్స్ అవుటయ్యాక వచ్చిన సూర్యకుమార్ (9 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ధనాధన్ ఇన్నింగ్స్తో 13వ ఓవర్లోనే ముంబైను లక్ష్యానికి చేర్చాడు. స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: క్వింటన్ డికాక్ (సి) అశ్వని కుమార్ (బి) దీపక్ చహర్ 1; సునీల్ నరైన్ (బి) బౌల్ట్ 0; అజింక్య రహానే (సి) తిలక్ వర్మ (బి) అశ్వని కుమార్ 11; అంగ్క్రిష్ రఘువంశీ (సి) నమన్ ధీర్ (బి) హార్దిక్ పాండ్యా 26; వెంకటేశ్ అయ్యర్ (సి) రికెల్టన్ (బి) దీపక్ చహర్ 3; రింకూ సింగ్ (సి) నమన్ ధీర్ (బి) అశ్వని కుమార్ 17; మనీశ్ పాండే (బి) అశ్వని కుమార్ 19; ఆండ్రీ రసెల్ (బి) అశ్వని కుమార్ 5; రమణ్దీప్ సింగ్ (సి) హార్దిక్ పాండ్యా (బి) సాంట్నెర్ 22; హర్షిత్ రాణా (సి) నమన్ ధీర్ (బి) విఘ్నేశ్ 4; స్పెన్సర్ జాన్సన్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 7; మొత్తం (16.2 ఓవర్లలో ఆలౌట్) 116. వికెట్ల పతనం: 1–1, 2–2, 3–25, 4–41, 5–45, 6–74, 7–80, 8–88, 9–99, 10–116. బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 4–0–23–1, దీపక్ చహర్ 2–0–19–2, అశ్వని కుమార్ 3–0–24–4, హార్దిక్ పాండ్యా 2–0–10–1, విఘ్నేశ్ పుథుర్ 2–0–21–1, మిచెల్ సాంట్నెర్ 3.2–0–17–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) హర్షిత్ రాణా (బి) రసెల్ 13; రికెల్టన్ (నాటౌట్) 62; విల్ జాక్స్ (సి) రహానే (బి) రసెల్ 16; సూర్యకుమార్ యాదవ్ (నాటౌట్) 27; ఎక్స్ట్రాలు 3; మొత్తం (12.5 ఓవర్లలో 2 వికెట్లకు) 121. వికెట్ల పతనం: 1–46, 2–91. బౌలింగ్: స్పెన్సర్ జాన్సన్ 2–0–14–0, హర్షిత్ రాణా 2–0–28–0, వరుణ్ చక్రవర్తి 3–0–12–0, రసెల్ 2.5–0–35–2, సునీల్ నరైన్ 3–0–32–0. -
రికెల్టన్, సూర్య మెరుపులు.. బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. వాఖండే వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. 117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 13 ఓవర్లలోనే చేధించింది. ముంబై బ్యాటర్లలో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(40 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 61 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖరిలో సూర్యకుమార్ యాదవ్(7 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 27) మ్యాచ్ను ఫినిష్ చేశాడు. రోహిత్ శర్మ(13) మరోసారి నిరాశపరిచాడు. కేకేఆర్ బౌలర్లలో రస్సెల్ ఒక్కడే రెండు వికెట్లు సాధించాడు. నాలుగేసిన అశ్వినీ..అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. ముంబై ఇండియన్స్ బౌలర్ల దాటికి కేవలం 16.2 ఓవర్లలో కేవలం 116 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లలో అరంగేట్ర పేసర్ అశ్వినీ కుమార్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. దీపక్ చాహర్ రెండు, బౌల్ట్, శాంట్నర్, హార్దిక్, విఘ్నేష్ తలా వికెట్ సాధించారు. కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ(26) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.చదవండి: IPL 2025: ఐపీఎల్ అరంగేట్రంలోనే సరికొత్త చరిత్ర.. ఎవరీ అశ్వినీ కుమార్? -
ఐపీఎల్ అరంగేట్రంలోనే సరికొత్త చరిత్ర.. ఎవరీ అశ్వినీ కుమార్?
ముంబై ఇండియన్స్ మరో యువ సంచలానాన్ని క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది. ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన యువ పేస్ బౌలర్ అశ్వనీ కుమార్.. తన తొలి మ్యాచ్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్-2025లో భాగంగా వాఖండే వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో అశ్వనీ కుమార్ నిప్పలు చేరిగాడు. తన పేస్ బౌలింగ్తో కేకేఆర్ బ్యాటర్లను చుక్కలు చూపించాడు. రహానే, రింకూ సింగ్, రస్సెల్ వంటి స్టార్ బ్యాటర్లను ఈ యువ పేసర్ బోల్తా కొట్టించాడు. తన తొలి బంతికే కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానేను ఔట్ చేసి తన డెబ్యూను ఘనంగా చాటుకున్నాడు. ఈ మ్యాచ్లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్వినీ కుమార్.. కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఎవరీ అశ్వినీ కుమార్ అని నెటిజన్లు తెగవేతికేస్తున్నారు.ఎవరీ అశ్వినీ కుమార్..?అశ్వనీ కుమార్ పంజాబ్కు చెందిన ఎడమచేతి వాటం పేసర్. 23 ఏళ్ల అశ్వనీ కుమార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పంజాబ్కే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతడికి అద్భుతమైన యార్కర్లు, బౌన్సర్లు వేసే సత్తా ఉంది. డెత్ బౌలింగ్లో కూడా అతడు రాణించగలడు. గతేడాది పంజాబ్ వేదికగా జరిగిన షేర్ ఈ పంజాబ్ టీ20 ట్రోఫీలో అశ్వనీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో ముంబై ఇండియన్స్ సౌట్ల దృష్టిలో పడ్డాడు. ఈ టోర్నీలో డెత్ బౌలింగ్లో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025 మెగా వేలంలో అశ్వని కుమార్ను ముంబై ఇండియన్స్ రూ. 30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. గత ఏడాది ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టులో ఉన్నప్పటికీ అతనికి ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. అశ్విని కుమార్ 2022లో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ తరపున టీ20 అరంగేట్రం చేశాడు. ఆ టోర్నీలో 4 టీ20లు ఆడి మూడు వికెట్లు పడగొట్టాడు. అశ్వనీ పంజాబ్ తరపున 2 ఫస్ట్-క్లాస్, 4 లిస్ట్-ఎ మ్యాచ్లు కూడా ఆడాడు.👉ఈ మ్యాచ్లో నాలుగు వికెట్లతో చెలరేగిన అశ్వినీ కుమార్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ డెబ్యూ మ్యాచ్ లో నాలుగు వికెట్లు పడగొట్టిన ఫస్ట్ ఇండియన్ బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. అదేవిధంగా అరంగేట్రంలో ముంబై ఇండియన్స్ తరుపన తొలి బంతికే వికెట్ తీసిన రెండో బౌలర్గా అశ్వినీ నిలిచాడు. ఈ జాబితాలో అగ్రస్ధానంలో అల్జారీ జోషఫ్ ఉన్నాడు.చదవండి: PAK vs NZ: 'వారిని బూట్లతో కొట్టాలి.. పాక్ క్రికెట్ను నాశనం చేశారు' -
కేకేఆర్ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్..
MI vs KKR live Updates And highlights: ఐపీఎల్-2025లో వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.కేకేఆర్ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్..ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. వాఖండే వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. 117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 12.5 ఓవర్లలోనే చేధించింది. ముంబై బ్యాటర్లలో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్(40 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 62 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖరిలో సూర్యకుమార్ యాదవ్(7 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 27) మ్యాచ్ను ఫినిష్ చేశాడు.దూకుడుగా ఆడుతున్న రికెల్టన్10 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. క్రీజులో ర్యాన్ రికెల్టన్(45), విల్ జాక్స్(12) ఉన్నారు.ముంబై ఇండియన్స్ తొలి వికెట్ డౌన్..రోహిత్ శర్మ రూపంలో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. రస్సెల్ బౌలింగ్లో ఔటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. క్రీజులో రికెల్టన్(31), విల్ జాక్స్(8) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న ముంబై ఓపెనర్లుముంబై ఇండియన్స్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 5 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. క్రీజులో రికెల్టన్(29), రోహిత్ శర్మ(13) ఉన్నారు.2 ఓవర్లకు ముంబై స్కోర్: 15/02 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(12), రికెల్టన్(1) ఉన్నారు.116 పరుగులకే 10 వికెట్లు..16.2 ఓవర్లో శాంట్నర్ బౌలింగ్లో రమణ్ దీప్ సింగ్ వికెట్ కోల్పోయాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 117పరుగులు చేయాల్సి ఉంది. 97 పరుగులకే 9 వికెట్లు.. హర్షిత్ రాణా ఔట్97 పరుగుల వద్ద కేకేఆర్ తన తొమ్మిదవ వికెట్ను కోల్పోయింది. హర్షిత్ రాణా (4) పరుగులకే ఔటయ్యాడు. విఘ్నేష్ వేసిన 14వ ఓవర్లో పెవీలియన్ బాట పట్టాడు. 88 పరుగులకే 8 వికెట్లు.. రసెల్ ఔట్88 పరుగుల వద్ద కేకేఆర్ తన ఎనిమిదో వికెట్ ను కోల్పోయింది. రసెల్(5) ఔటయ్యాడు. అశ్వనీ కుమార్ వేసిన 13 ఓవర్ లో రసెల్ పెవిలియన్ చేరాడు. అశ్వనీ కుమార్ వేసిన ఆ ఓవర్ నాల్గో బంతికి రసెల్ బౌల్డ్ అయ్యాడు.80 పరుగులకే 7 వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో కేకేఆర్రింకూ సింగ్(17), మనీష్ పాండే(19)లు వరుసగా పెవిలియన్ చేరారు. అశ్వనీ కుమార్ వేసిన 11 ఓవర్ లో వీరిద్దరూ పెవిలియన్ చేరారు. 11 ఓవర్ మూడో బంతికి రింకూ సింగ్ అవుట్ కాగా, ఆ ఓవర్ చివరి బంతికి పాండే పెవిలియన్ చేరాడు.కష్టాల్లో కేకేఆర్.. 45 పరుగులకే 5 వికెట్లు ముంబై ఇండియన్స్ బౌలర్లు నిప్పులు చేరుగుతున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కేకేఆర్.. 45 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రఘువంశీ(26) రూపంలో కేకేఆర్ ఐదో వికెట్ కోల్పోయింది.కేకేఆర్ మూడో వికెట్ డౌన్..ముంబై ఇండియన్స్ బౌలర్లు నిప్పులు చేరుగుతున్నారు. అజింక్య రహానే రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రహానే.. అశ్వని కుమార్ బౌలింగ్లో ఔటయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది.కేకేఆర్ రెండో వికెట్ డౌన్..క్వింటన్ డికాక్ రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన డికాక్.. దీపక్ చాహర్ బౌలింగ్లో ఔటయ్యాడు. 3 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 26 పరుగులు చేసింది. క్రీజులోకి రఘువన్షి(9), అజింక్య రహానే(12) ఉన్నారు.కేకేఆర్ తొలి వికెట్ డౌన్.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కేకేఆర్కు ఆదిలోనే బిగ్షాక్ తగిలింది. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో సునీల్ నరైన్.. ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి అజింక్య రహానే వచ్చాడు.తుది జట్లుకోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానే (కెప్టెన్), రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, విఘ్నేష్ పుత్తూర్. -
ముంబై ఇండియన్స్కు గుడ్ న్యూస్.. ప్రాక్టీస్ మొదలు పెట్టిన బుమ్రా
ఐపీఎల్-2025లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్కు ఓ గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ పేసర్, టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమవుతున్నాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావసం పొందుతున్నాడు.ఈ క్రమంలో జస్ప్రీత్ నెట్స్లో బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. తాజాగా బుమ్రా ప్రాక్టీస్కు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. దీంతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆఖరి టెస్టులో గాయపడిన బుమ్రా.. అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉంటున్నాడు.ఈ క్రమంలోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు బుమ్రా దూరమయ్యాడు. అయితే బుమ్రా రీ ఎంట్రీపై ఇంకా క్లారిటీ లేదు. బుమ్రా ఫిట్నెస్పై తాజాగా ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ జయవర్దనే కూడా స్పందించాడు. "బుమ్రా తన రోజూ ప్రాక్టీస్ చేస్తున్నాడు. త్వరలోనే ఆ స్పీడ్ స్టార్ కోలుకుంటాడని ఆశిస్తున్నాము. ఎప్పుడొస్తాడు అనేది మాత్రం చెప్పలేము" అని జయవర్దనే పేర్కొన్నాడు. కాగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లోని వైద్యబృందం బుమ్రాకు ఈ వారంలో ఫిట్నెస్ టెస్టు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ టెస్టును బుమ్రా క్లియర్ చేసినట్లైతే త్వరలోనే ముంబై జట్టులో బుమ్రా చేరే అవకాశముంది. బుమ్రా గతేడాది అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. టీమిండియా టీ20 వరల్డ్కప్ గెలవడంలో బుమ్రాదే కీలక పాత్ర. ఆ తర్వాత బీజీటీని భారత్ కోల్పోయినప్పటికి బుమ్రా మాత్రం 32 వికెట్లతో లీడిగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. దీంతో అతడికి 2024 ఏడాదికి గాను ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు వరించాయి. ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైంది.చదవండి: RR VS CSK: చివరి ఓవర్లో ధోని ఔట్.. సీఎస్కే ఫ్యాన్ గర్ల్ రియాక్షన్ చూడండి..!Bumrah has started bowling in NCA. Don't know when he will get the clearance but feeling better after watching this clip. pic.twitter.com/FTpnuVoJoW— R A T N I S H (@LoyalSachinFan) March 30, 2025 -
ఐపీఎల్-2025లో నేడు (మార్చి 31) బిగ్ ఫైట్.. ముంబై ఇండియన్స్ ఖాతా తెరిచేనా..?
ఐపీఎల్-2025లో ఇవాళ (మార్చి 31) బిగ్ ఫైట్ జరుగనుంది. ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ను కోల్కతా నైట్రైడర్స్ వారి సొంత మైదానం వాంఖడేలో ఢీకొట్టనుంది. ఈ సీజన్లో ఇంకా బోణీ కొట్టని ముంబై ఇండియన్స్ సొంత అభిమానుల మధ్య ఖాతా తెరవాలని పట్టుదలగా ఉంది. ఎంఐ తొలి రెండు మ్యాచ్ల్లో సీఎస్కే, గుజరాత్ చేతుల్లో పరాజయంపాలైంది. కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టు సీజన్ను ఓటమితో ప్రారంభించింది. తొలి మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో చిత్తైంది. రెండు మ్యాచ్లో రాజస్థాన్పై ఘన విజయం సాధించి బోణీ కొట్టింది.హెడ్ టు హెడ్ రికార్డ్స్..కేకేఆర్పై ముంబైకు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఈ రెండు జట్లు తలపడిన 34 సందర్భాల్లో 23 సార్లు ముంబై విజయం సాధించింది. కేవలం 11 మ్యాచ్ల్లో మాత్రమే కేకేఆర్ గెలుపొందింది. అయితే ఇరు జట్లు చివరిగా తలపడిన 6 సందర్భాల్లో మాత్రం కేకేఆర్ 5 సార్లు జయకేతనం ఎగురవేసింది. చివరిగా వాంఖడేలో తలపడిన మ్యాచ్లో కూడా కేకేఆర్నే విజయం వరించింది. 12 ఏళ్ల తర్వాత కేకేఆర్ ముంబైని వారి సొంత ప్రేక్షకుల మధ్య ఓడించింది.బలాబలాల విషయానికొస్తే.. ఈ సీజన్లో ఇరు జట్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇరు జట్లలో భారీ హైప్ ఉన్న ఆటగాళ్లు ఉన్నా ఫలితం కనిపించడం లేదు. ముంబైతో పోలిస్తే కేకేఆర్ కాస్త పర్వాలేదనిపిస్తుంది. ఈ సీజన్లో ఆ జట్టు ఓ మ్యాచ్ కూడా గెలిచింది.బ్యాటింగ్నే ప్రధాన ఆయుధంగా నమ్ముకున్న ముంబై ఇండియన్స్ను ఆ జట్టు బ్యాటర్లు పూర్తిగా నిరాశపరుస్తున్నారు. రోహిత్, రికెల్టన్, సూర్యకుమార్, తిలక్ వర్మ సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నారు. బౌలింగ్లో హార్దిక్ గత మ్యాచ్లో పర్వాలేదనిపించినా బ్యాటర్గా తేలిపోయాడు. నమన్ ధీర్ గత సీజన్లో వచ్చిన హైప్ను రీచ్ కాలేదు. యువ ఆటగాడు రాబిన్ మింజ్కు అవకాశాలిస్తే రెండు మ్యాచ్ల్లో తేలిపోయాడు. బ్యాటర్గా దీపక్ చాహర్ తొలి మ్యాచ్లో పర్వాలేదనిపించాడు. బ్యాటర్గా సత్తా చాటేందుకు మిచెల్ సాంట్నర్కు సరైన అవకాశం లభించలేదు. బౌలింగ్ విషయానికొస్తే.. బౌల్ట్, సాంట్నర్ స్థాయికి తగ్గట్టు రాణించలేదు. దీపక్ చాహర్ పర్వాలేదనిస్తున్నాడు. ఆంధ్ర కుర్రాడు సత్యనారాయణ రాజు తేలిపోయాడు. తొలి మ్యాచ్లో విజ్ఞేశ్ పుతుర్ అద్భుతంగా బౌలింగ్ చేసినా రెండో మ్యాచ్లో అతన్ని ఆడించలేదు.కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టుకు కూడా బ్యాటింగే ప్రధాన బలం. బౌలింగ్ డిపార్ట్మెంట్లో వరుణ్ చక్రవర్తి కాస్త అనుభవజ్ఞుడిలా కనిపిస్తాడు. తొలి మ్యాచ్లో బ్యాట్తో, బంతితో సత్తా చాటిన సునీల్ నరైన్ అస్వస్థత కారణంగా రెండో మ్యాచ్ ఆడలేదు. తొలి మ్యాచ్లో అర్ద సెంచరీతో రాణించిన రహానే రెండో మ్యాచ్లో విఫలమయ్యాడు. రాయల్స్తో జరిగిన మ్యాచ్లో డికాక్ సెంచరీకి చేరువై ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. డికాక్ ఫామ్లోకి రావడం కేకేఆర్కు శుభసూచకం. రాయల్స్తో మ్యాచ్లో నరైన్కు ప్రత్యామ్నాయంగా వచ్చిన మొయిన్ అలీ బంతితో సత్తా చాటాడు. వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్లు తమపై పెట్టిన పెట్టుబడికి న్యాయం చేయలేకపోతున్నారు. రసెల్, రమన్దీప్కు సరైన అవకాశాలు రావాల్సి ఉంది. బౌలింగ్లో స్పెన్సర్ జాన్సన్ ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. యువ పేసర్లు హర్షిత్ రాణా, వైభవ్ అరోరా పర్వాలేదనిపించారు.నేటి మ్యాచ్లో కేకేఆర్ బ్యాటర్లు రాణిస్తే ఆ జట్టుకే విజయావకాశాలు అధికంగా ఉంటాయి. అయితే ముంబైని వారి సొంత ఇలాకాలో ఓడించడం అంత ఈజీ కాదు. రోహిత్, సూర్యకుమార్ చెలరేగితే ముంబైకి పట్టపగ్గాలు ఉండవు.తుది జట్లు (అంచనా)..ముంబై: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, విఘ్నేష్ పుతుర్, సత్యనారాయణ రాజుకేకేఆర్: క్వింటన్ డి కాక్, వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, సునీల్ నరైన్, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ,అంగ్క్రిష్ రఘువంశీ -
IPL 2025: హార్దిక్ పాండ్యాకు మరో షాక్
ఓటమి బాధలో (గుజరాత్ చేతిలో) ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు మరో షాక్ తగిలింది. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గానూ హార్దిక్కు 12 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం హార్దిక్కు ఈ ఫైన్ విధించబడింది. ఈ సీజన్లో హార్దిక్ జట్టు చేసిన మొదటి తప్పిదం కాబట్టి 12 లక్షల జరిమానాతో సరిపుచ్చారు.హార్దిక్ ఈ సీజన్ తొలి మ్యాచ్లోనే స్లో ఓవర్ రేట్ తప్పిదాలకు సంబంధించిన నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. గత సీజన్లో హార్దిక్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ మూడు సార్లు స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసింది. ఇందుకు గానూ హార్దిక్పై ఓ మ్యాచ్ నిషేధం పడింది. గత సీజన్ వరకు ఓ జట్టు మూడు సార్లు (ఒకే సీజన్లో) స్లో ఓవర్రేట్ మెయింటైన్ చేస్తే కెప్టెన్పై ఓ మ్యాచ్ నిషేధించేవారు. అయితే ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఆ రూల్ను ఎత్తి వేశారు. ఈ సీజన్లో స్లో ఓవర్ రేట్ తప్పిదాల కారణంగా కెప్టెన్లపై నిషేధం ఉండదు. కేవలం జరిమానాలు మాత్రమే ఉంటాయి.ఇదిలా ఉంటే, గుజరాత్ టైటాన్స్తో నిన్న (మార్చి 29) జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 36 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్కు ఇది వరుసగా రెండో ఓటమి. తొలి మ్యాచ్లో ముంబై సీఎస్కే చేతిలో ఓడింది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ముంబై బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో తేలిపోయింది. తొలుత బౌలింగ్ చేసి గుజరాత్ను భారీ స్కోర్ (196/8) చేయనిచ్చిన ఆ జట్టు.. ఆతర్వాత ఛేదనలో (160/6) చేతులెత్తేసింది. గుజరాత్ బౌలర్లు సొంత పిచ్ అడ్వాన్టేజ్ను వినియోగించుకుని ముంబై బ్యాటర్లను కట్టడి చేశారు. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా (4-0-29-2) బౌలింగ్లో రాణించినప్పటికీ.. బ్యాటింగ్లో తేలిపోయాడు. ఛేదన కీలక దశలో బంతులు వృధా (17 బంతుల్లో 11) చేసి జట్టు ఓటమిని ఖరారు చేశాడు. ఈ మ్యాచ్లో హార్దిక్ (కెప్టెన్గా) చేసిన ప్రయోగాలు కూడా బెడిసికొట్టాయి. రాబిన్ మింజ్ను తనకంటే ముందు బ్యాటింగ్కు పంపిన హార్దిక్ పెద్ద తప్పిదమే చేశాడు. మింజ్ కీలక దశలో బంతులను వృధా చేసి (6 బంతుల్లో 3) చీప్గా ఔటయ్యాడు. తుది జట్టు ఎంపికలోనూ హార్దిక్ పెద్ద తప్పులే చేశాడు. తొలి మ్యాచ్లో అద్భుతం చేసిన విజ్ఞేశ్ పుతుర్ను, భారీ హిట్టర్.. అందులోనే గత సీజన్లో అహ్మదాబాద్లో సెంచరీ చేసిన విల్ జాక్స్కు తప్పించి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. -
IPL 2025: గుజరాత్ బౌలర్పై నోరు పారేసుకున్న హార్దిక్.. వైరల్ వీడియో
గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య నిన్న (మార్చి 29) జరిగిన మ్యాచ్ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా ఇన్నింగ్స్ 15వ ఓవర్లో హార్దిక్ పాండ్యా, గుజరాత్ స్పిన్నర్ సాయి కిషోర్ గొడవ పడ్డారు. ముంబై ఓటమి ఖరారైన దశలో తొలుత సాయి కిషోర్ హార్దిక్ను గెలికాడు. డాట్ బాల్ వేసిన ఆనందంలో ముంబై కెప్టెన్ వైపు బిర్రుగా చూశాడు. GAME 🔛Hardik Pandya ⚔ Sai Kishore - teammates then, rivals now! 👀🔥Watch the LIVE action ➡ https://t.co/VU1zRx9cWp #IPLonJioStar 👉 #GTvMI | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, & JioHotstar pic.twitter.com/2p1SMHQdqc— Star Sports (@StarSportsIndia) March 29, 2025ఇందుకు హార్దిక్ కూడా ధీటుగా స్పందించాడు. సాయి కిషోర్తో కంటితో యుద్దం చేస్తూనే దుర్భాషలాడాడు. అంపైర్ల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. మ్యాచ్ అనంతరం హార్దిక్, సాయి కిషోర్ ఒకరినొకరు హగ్ చేసుకోవడం కొసమెరుపు. హార్దిక్, సాయి కిషోర్ గతంలో కలిసి గుజరాత్కు ఆడిన విషయం తెలిసిందే. హార్దిక్తో గొడవపై సాయి కిషోర్ ప్రజెంటేషన్ సందర్భంగా కూడా స్పందించాడు. హార్దిక్ నాకు మంచి మిత్రుడని అన్నాడు. మైదానంలో ఇలాగే ఉండాలి. అక్కడ ఎవరైనా ప్రత్యర్థులే. మేము విషయాలను వ్యక్తిగతంగా తీసుకోము. మేము మంచి పోటీదారులం. ఆట ఇలాగే ఉండాలని అనుకుంటున్నానని అన్నాడు.కాగా, ఈ మ్యాచ్లో సాయి కిషోర్ యావరేజ్గా బౌలింగ్ చేసి ఓ వికెట్ తీయగా.. హార్దిక్ బౌలింగ్లో రాణించి, బ్యాటింగ్లో తేలిపోయాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ 36 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించింది. స్లో వికెట్పై తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ భారీ స్కోర్ (196/8) చేసింది. సాయి సుదర్శన్ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (27 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్), జోస్ బట్లర్ (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, సిక్స్) సత్తా చాటారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా (4-0-29-2) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బౌల్ట్ (4-0-34-1), దీపక్ చాహర్ (4-0-39-1), సాంట్నర్ (3-0-25-0) పర్వాలేదనిపించగా.. ముజీబ్ రెహ్మాన్ (2-0-28-1), యువ పేసర్ సత్యనారాయణ రాజు (3-0-40-1) భారీగా పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఆదిలోనే తడబడింది. సిరాజ్ తొలి ఓవర్లోనే ముంబైని దెబ్బకొట్టాడు. రెండు బౌండరీలు బాది జోరుమీదున్న రోహిత్ శర్మను (8) క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం ఐదో ఓవర్లో సిరాజ్ మరోసారి చెలరేగాడు. ఈసారి మరో ఓపెనర్ రికెల్టన్ను (6) రోహిత్ తరహాలోనే క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆతర్వాత క్రీజ్లోకి వచ్చిన తిలక్ వర్మ (36 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 48; ఫోర్, 4 సిక్సర్లు) ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ దశలో గుజరాత్ ప్రస్దిద్ద్ కృష్ణను బరిలోకి దించింది. ప్రసిద్ద్ అద్భుతంగా బౌలింగ్ చేసి క్రీజ్లో కుదురుకున్న తిలక్, స్కైలను ఔట్ చేశాడు. ఇక్కడే ప్రసిద్ద్ ముంబై చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు.ప్రసిద్ద్ అద్భుతమైన స్లో బాల్స్తో ముంబై బ్యాటర్లను ఇరుకునపెట్టాడు. తిలక్, స్కై ఔటయ్యాక హార్దిక్ బ్యాటింగ్కు దిగకుండా రాబిన్ మింజ్ను పంపి తప్పు చేశాడు. మింజ్ (6 బంతుల్లో 3), హార్దిక్ (17 బంతుల్లో 11) బంతులు వృధా చేసి ముంబై ఓటమిని ఖరారు చేశారు. ఆఖర్లో నమన్ ధీర్ (11 బంతుల్లో 18 నాటౌట్), సాంట్నర్ (9 బంతుల్లో 18 నాటౌట్) భారీ షాట్లు ఆడినా అప్పటికే ముంబై ఓటమి ఖరారైపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. పొదుపుగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసిన ప్రసిద్ద్ కృష్ణకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గుజరాత్ బౌలరల్లో ప్రసిద్ద్, సిరాజ్ చెరో 2, రబాడ, సాయికిషోర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో గుజరాత్ ఈ సీజన్లో బోణీ కొట్టింది. ముంబై వరుసగా తమ రెండో మ్యాచ్లో కూడా పరాజయంపాలైంది. -
ముంబైపై గుజరాత్ ఘన విజయం
-
GT VS MI: మేము ప్రొఫెషనల్గా ఆడలేదు.. రెండిటిలోనూ విఫలమయ్యాం: హార్దిక్ పాండ్యా
ఐపీఎల్-2025లో భాగంగా నిన్న (మార్చి 29) గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. హోం గ్రౌండ్లో (అహ్మదాబాద్) జరిగిన ఈ మ్యాచ్లో గుజరాత్ ముంబైని చిత్తు చేసింది. స్లోగా ఉన్న పిచ్పై తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ (196/8) చేసిన గుజరాత్.. ఆతర్వాత దాన్ని అద్భుతంగా డిఫెండ్ చేసుకుంది. ఈ మ్యాచ్ గెలుపుకు గుజరాత్ బ్యాటర్లు, బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాలి. తొలుత బ్యాటింగ్లో వారు ఎక్కువ రిస్క్ చేయకుండానే పరుగులు రాబట్టారు. సాయి సుదర్శన్ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి తనలోని క్లాస్ను ప్రదర్శించాడు. శుభ్మన్ గిల్ (27 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్), జోస్ బట్లర్ (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, సిక్స్) కూడా బాగా ఆడారు. వీరు చేసింది తక్కువ పరుగులే అయినా ఇన్నింగ్స్కు మంచి పునాది వేశారు. ఆతర్వాత వచ్చిన షారుఖ్ ఖాన్ (9), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (18), రాహుల్ తెవాటియా (0), రషీద్ ఖాన్ (6), రబాడ (7 నాటౌట్), సాయి కిషోర్ (1) నిరాశపర్చినా చివరికి గుజరాత్ మంచి స్కోరే చేసింది. సాయి సుదర్శన్ చివరి వరకు క్రీజ్లో ఉండి ఉంటే గుజరాత్ ఇంకా భారీ స్కోర్ చేసేది. ముంబై ప్రధాన పేసర్లు బౌల్ట్ (4-0-34-1), దీపక్ చాహర్ (4-0-39-1) బాగానే బౌలింగ్ చేసినా స్పిన్నర్ ముజీబ్ రెహ్మాన్ (2-0-28-1), యువ పేసర్ సత్యనారాయణ రాజు (3-0-40-1) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. సాంట్నర్ (3-0-25-0) పర్వాలేదనిపించగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (4-0-29-2) అద్భుతంగా బౌలింగ్ చేశాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబైను గుజరాత్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆదిలోనే దెబ్బ కొట్టాడు. సిరాజ్ ఇద్దరు ముంబై ఓపెనర్లను పవర్ ప్లేలోనే ఔట్ చేశాడు. తొలుత రోహిత్ను (8) క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్.. ఆతర్వాత మరో ఓపెనర్ రికెల్టన్ను (6) కూడా అదే తరహాలో పెవిలియన్కు పంపాడు. ఆతర్వాత క్రీజ్లోకి వచ్చిన తిలక్ వర్మ (36 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 48; ఫోర్, 4 సిక్సర్లు) ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఈ దశలో గుజరాత్ తమ ఏస్ పేసర్ ప్రస్దిద్ద్ కృష్ణను బరిలోకి దించింది. ప్రసిద్ద్ అద్భుతంగా బౌలింగ్ చేసి క్రీజ్లో కుదురుకున్న తిలక్, స్కైలను ఔట్ చేశాడు. ఇక్కడే ప్రసిద్ద్ ముంబై చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు. ప్రసిద్ద్ అద్భుతమైన స్లో బాల్స్తో ముంబై బ్యాటర్లను బెంబేలెత్తించాడు. తిలక్, స్కై ఔటయ్యాక హార్దిక్ బ్యాటింగ్కు దిగకుండా రాబిన్ మింజ్ను పంపి తప్పు చేశాడు. మింజ్ (6 బంతుల్లో 3), హార్దిక్ (17 బంతుల్లో 11) ఇద్దరూ బంతులు వృధా చేసి ముంబై ఓటమిని ఖరారు చేశారు. ఆఖర్లో నమన్ ధీర్ (11 బంతుల్లో 18 నాటౌట్), సాంట్నర్ (9 బంతుల్లో 18 నాటౌట్) భారీ షాట్లు ఆడినా అప్పటికే ముంబై ఓటమి ఖరారైపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. పొదుపుగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసిన ప్రసిద్ద్ కృష్ణకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గుజరాత్ బౌలరల్లో ప్రసిద్ద్, సిరాజ్ చెరో 2, రబాడ, సాయికిషోర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో గుజరాత్ ఈ సీజన్లో బోణీ కొట్టింది. ముంబై వరుసగా తమ రెండో మ్యాచ్లో కూడా పరాజయంపాలైంది.మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఇలా అన్నాడు. మేము ప్రొఫెషనల్గా ఆడలేదు. బ్యాటింగ్, బౌలింగ్ రెండిటిలోనూ విఫలమయ్యాం. రెండు విభాగాల్లో 15-20 పరుగులు తక్కువ పడ్డాయని అనుకుంటున్నాను. ఫీల్డ్లో ప్రాథమిక తప్పులు చేసాము. దానికి వల్ల ప్రత్యర్థులకు 20-25 పరుగులు అదనంగా వచ్చాయి. టీ20ల్లో మ్యాచ్ ఫలితాన్ని ఈ పరుగులే నిర్దేశిస్తాయి. గుజరాత్ ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వారు ఛాన్స్లు ఎక్కువగా తీసుకోలేదు. పిచ్ కఠినంగా ఉందని వారికి కూడా తెలుసు. వారు ప్రమాదకర షాట్లు ఆడకుండా పరుగులు సాధించగలిగారు. ఈ పరాజయానికి మేమంతా బాధ్యత తీసుకోవాలి. ఇంకా ప్రారంభ దశల్లోనే ఉన్నాము. బ్యాటర్లు టచ్లోకి రావాలి. వారు త్వరలోనే సామర్థ్యం మేరకు రాణిస్తారని ఆశిస్తున్నాను. గుజరాత్ బౌలర్లు స్లో డెలివరీలను అద్భుతంగా బౌల్ చేశారు. వాటిని ఎదుర్కోవడం చాలా కష్టమైంది. కొన్ని బంతులు నేరుగా వికెట్లపైకి వచ్చాయి. కొన్ని బౌన్స్ అయ్యాయి. ఇలాంటి బంతులను ఎదుర్కోడం బ్యాటర్లకు చాలా కష్టం. గుజరాత్ బౌలర్లు నేను బంతితో చేసిందే చేసి సఫలమయ్యారు. -
గుజరాత్ గెలుపు బోణీ
మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ తాజా సీజన్లో తొలి విజయాన్ని అందుకుంది. మొదటి మ్యాచ్లో పంజాబ్ చేతిలో ఓడిన టీమ్ సొంతగడ్డపై పాయింట్ల ఖాతా తెరిచింది. బ్యాటింగ్లో సాయిసుదర్శన్, బౌలింగ్లో ప్రసిధ్, సిరాజ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. మరో వైపు గత మ్యాచ్లాగే అన్ని రంగాల్లో విఫలమైన ముంబై వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. బ్యాటింగ్లో ఆ జట్టు కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయింది. అహ్మదాబాద్: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన గుజరాత్ టైటాన్స్ గెలుపు బోణీ చేసింది. శనివారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 36 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ చేయగా...జోస్ బట్లర్ (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, 1 సిక్స్), శుబ్మన్ గిల్ (27 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది. సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 48; 1 ఫోర్, 4 సిక్స్లు), తిలక్వర్మ (36 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రసిధ్ కృష్ణ (2/18), సిరాజ్ (2/34) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. కీలక భాగస్వామ్యాలు... గుజరాత్ ఇన్నింగ్స్లో టాప్–3 నెలకొల్పిన రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు జట్టు స్కోరులో కీలకంగా నిలిచాయి. తొలి వికెట్తో గిల్తో 78 పరుగులు (51 బంతుల్లో) జోడించిన సుదర్శన్, రెండో వికెట్కు బట్లర్తో 51 పరుగులు (32 బంతుల్లో) జత చేశాడు. సుదర్శన్, గిల్ ధాటిగా ఆడుతూ 7 ఫోర్లు, 2 సిక్స్లు కొట్టడంతో పవర్ప్లే ముగిసే సరికి స్కోరు 66 పరుగులకు చేరింది. గిల్ వెనుదిరిగిన తర్వాత వచ్చిన బట్లర్ కూడా కొద్ది సేపు ధాటిని ప్రదర్శించాడు. 33 బంతుల్లో వరుసగా రెండో మ్యాచ్లో సుదర్శన్ అర్ధ సెంచరీ పూర్తయింది. షారుఖ్ ఖాన్ (9)ను ముందుగా పంపిన ప్రయత్నం ఫలితం ఇవ్వకపోగా, రూథర్ఫోర్డ్ (18) రాజు ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు. 18వ ఓవర్ చివరి బంతికి సుదర్శన్ను బౌల్ట్ అవుట్ చేయడంతో గుజరాత్ జోరుక బ్రేక్ పడింది. చివరి 2 ఓవర్లలో ఆ జట్టు 17 పరుగులు మాత్రమే సాధించి 4 వికెట్లు చేజార్చుకుంది. దాంతో స్కోరు 200 పరుగులు దాటలేకపోయింది. ముంబై తరఫున రెండో మ్యాచ్ ఆడిన ఆంధ్ర పేస్ బౌలర్ పెన్మత్స సత్యనారాయణ రాజు ఐపీఎల్లో తన తొలి వికెట్ సాధించడం విశేషం. రాణించిన తిలక్... ఛేదనలో ముంబై పూర్తిగా తడబడింది. తిలక్వర్మ, సూర్యకుమార్ క్రీజ్లో ఉన్న సమయంలోనే జట్టు గెలుపుపై ఆశలు ఉండగా...ఇది మినహా మిగతా ఇన్నింగ్స్ పేలవంగా సాగింది. సిరాజ్ వేసిన తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన రోహిత్ శర్మ (8) తర్వాతి బంతికి వెనుదిరగ్గా, రికెల్టన్ (6)ను కూడా సిరాజ్ బౌల్డ్ చేశాడు. తిలక్ మాత్రం కొన్ని చక్కటి షాట్లతో అలరించాడు. రబాడ ఓవర్లో అతను వరుసగా 4, 4, 6 కొట్టాడు. మరో ఎండ్లో సూర్య కూడా తనదైన శైలిలో ధాటిగా ఆడాడు. మూడో వికెట్కు 42 బంతుల్లో 62 పరుగులు జత చేసిన తర్వాత తిలక్ను ప్రసిధ్ వెనక్కి పంపాడు. 51 బంతుల్లో 100 పరుగులు చేయాల్సిన ఈ స్థితినుంచి ముంబై కోలుకోలేకపోయింది. 27 పరుగుల వ్యవధిలో తర్వాతి 4 వికెట్లు కోల్పోయిన జట్టు ఓటమిని ఆహ్వానించింది. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 63; శుబ్మన్ గిల్ (సి) నమన్ (బి) పాండ్యా 38; బట్లర్ (సి) రికెల్టన్ (బి) ముజీబ్ 39; షారుఖ్ (సి) తిలక్ (బి) పాండ్యా 9; రూథర్ఫోర్డ్ (సి) సాంట్నర్ (బి) చహర్ 18; తెవాటియా (రనౌట్) 0; రషీద్ (సి) పాండ్యా (బి) రాజు 6; రబాడ (నాటౌట్) 7; సాయికిషోర్ (రనౌట్) 1; ఎక్స్ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–78, 2–129, 3–146, 4–179, 5–179, 6–179, 7–194, 8–196. బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 4–0–34–1, దీపక్ చహర్ 4–0–39–1, ముజీబ్ 2–0–28–1, హార్దిక్ పాండ్యా 4–0–29–2, సాంట్నర్ 3–0–25–0, సత్యనారాయణ రాజు 3–0–40–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) సిరాజ్ 8; రికెల్టన్ (బి) సిరాజ్ 6; తిలక్వర్మ (సి) తెవాటియా (బి) ప్రసిధ్ 39; సూర్యకుమార్ (సి) గిల్ (బి) ప్రసిధ్ 48; మిన్జ్ (సి) ఇషాంత్ (బి) సాయికిషోర్ 3; పాండ్యా (సి) సిరాజ్ (బి) రబాడ 11; నమన్ (నాటౌట్) 18; సాంట్నర్ (నాటౌట్) 18; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–8, 2–35, 3–97, 4–108, 5–120, 6–124. బౌలింగ్: సిరాజ్ 4–0–34–2, రబాడ 4–0–42–1, ఇషాంత్ 2–0–17–0, రషీద్ 2–0–10–0, సాయికిషోర్ 4–0–37–1, ప్రసిధ్ 4–0–18–2. ఐపీఎల్లో నేడుఢిల్లీ X హైదరాబాద్వేదిక: విశాఖపట్నంమధ్యాహ్నం 3: 30 గంటల నుంచి రాజస్తాన్ X చెన్నై వేదిక: గువాహటిరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
నిప్పులు చెరిగిన సిరాజ్, ప్రసిద్ద్.. ముంబైను చిత్తు చేసిన గుజరాత్
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 36 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులకే పరిమితమైంది.ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(48) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. తిలక్ వర్మ(39) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చిన హార్దిక్ పాండ్యా చేతులేత్తేశాడు. 17 బంతుల్లో 11 పరుగులు చేసిన హార్దిక్ ముంబై ఓటమికి పరోక్షంగా కారణమయ్యాడు.గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. రబాడ, సాయికిషోర్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(63) టాప్ స్కోరర్గా నిలవగా.. శుబ్మన్ గిల్(38), జోస్ బట్లర్(39) రాణించారు. ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ తలా వికెట్ సాధించారు. -
సిరాజ్ సూపర్ బాల్.. రోహిత్ మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ వరుసగా రెండో మ్యాచ్లోనూ విఫలమయ్యాడు. సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్లో డకౌటైన రోహిత్ శర్మ.. ఇప్పుడు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్పై అదే తీరును కనబరిచాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి హిట్మ్యాన్ ఔటయ్యాడు. గుజరాత్ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ అద్బుతమైన బంతితో రోహిత్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ముంబై ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్లో రోహిత్.. వరుసగా రెండు బంతుల్లో బౌండరీలు బాది మంచి టచ్లో కన్పించాడు. కానీ సిరాజ్ అదే ఓవర్లో ఐదో బంతిని రోహిత్కు ఆఫ్ స్టంప్ దిశగా గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని రోహిత్ శర్మ డిఫెండ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి అద్బుతంగా టర్న్ అయ్యి బ్యాట్, ప్యాడ్ మధ్యలో నుంచి వెళ్లి స్టంప్స్ను గిరాటేసింది. దీంతో రోహిత్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. రోహిత్ను ఔట్ చేసిన వెంటనే సిరాజ్ క్రిస్టియానో రొనాల్డో వింటేజ్ ''కాల్మా స్టైల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ తర్వాత ర్యాన్ రికెల్టన్ను కూడా సిరాజ్ బోల్తా కొట్టించాడు. కాగా మహ్మద్ సిరాజ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.Siraj is not effective🤣🤣pic.twitter.com/7cueS6DmvT— Mayank. (@PrimeKohlii) March 29, 2025 -
అదొక చెత్త నిర్ణయం.. హార్దిక్ పాండ్యాతో అట్లుంటది మరి!?
ఐపీఎల్-2025లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో యువ స్పిన్నర్ విఘ్నేష్ పుతూర్కు మంబై ఇండియన్స్ తుది జట్టులో చోటు దక్కలేదు. తన అరంగేట్రంలో సీఎస్కేపై మూడు వికెట్లతో సత్తాచాటినప్పటికి విఘ్నేష్ పుతూర్ను ముంబై ఇండియన్స్ పక్కన పెట్టడం అందరిని ఆశ్యర్యపరిచింది.అతడి స్ధానంలో స్పిన్నర్గా ముజీబ్ ఆర్ రెహ్మాన్ను ముంబై మెనెజ్మెంట్ ఆడించింది. జట్టులోకి వచ్చిన రెహ్మాన్ తన మార్క్ చూపించలేకపోయాడు. రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన ముజీబ్.. 28 పరుగులిచ్చి ఓ వికెట్ సాధించాడు. ఈ క్రమంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై నెటిజన్లు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. తొలి మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన విఘ్నేష్ను ఎందుకు పక్కన పెట్టారాని ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి కొంతమంది ఇదొక చెత్త నిర్ణయమని పోస్టలు పెడుతున్నారు. కాగా సీఎస్కే తో మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన విఘ్నేష్ తన 4 ఓవర్ల కోటాలో 32 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆ మ్యాచ్తో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు.I'm so furious seeing this playing 11/12 of Mumbai Indians, brainless decision making. Chutiye left both the departments weak by leaving Will Jacks & Vignesh Puthur out. Absolutely pathetic.— Vipul 🇮🇳 (@Vipul_Espeaks) March 29, 2025ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(63) టాప్ స్కోరర్గా నిలవగా.. శుబ్మన్ గిల్(38), జోస్ బట్లర్(39) రాణించారు. ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ తలా వికెట్ సాధించారు.చదవండి: IPL 2025: శుబ్మన్ గిల్ అరుదైన ఫీట్.. డేవిడ్ వార్నర్ రికార్డు బద్దలు -
ముంబైపై గుజరాత్ టైటాన్స్ విజయం
IPL 2025 MI vs GT live updates and highlights: ముంబైపై గుజరాత్ టైటాన్స్ విజయంఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 36 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులకే పరిమితమైంది.ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(48) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. తిలక్ వర్మ(39) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చిన హార్దిక్ పాండ్యా చేతులేత్తేశాడు. 17 బంతుల్లో 11 పరుగులు చేసిన హార్దిక్ ముంబై ఓటమికి పరోక్షంగా కారణమయ్యాడు.ముంబై ఐదో వికెట్ డౌన్..సూర్యకుమార్ యాదవ్ రూపంలో ముంబై ఇండియన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 48 పరుగులు చేసిన సూర్య.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో ఔటయ్యాడు. ముంబై విజయానికి 24 బంతుల్లో 77 పరుగులు కావాలి. క్రీజులోకి నమాన్ ధీర్ వచ్చాడు.ముంబై మూడో వికెట్ డౌన్..తిలక్ వర్మ రూపంలో ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన తిలక్ వర్మ.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి ఇంపాక్ట్ ప్లేయర్గా రాబిన్ మింజ్ వచ్చాడు. ముంబై విజయానికి 50 బంతుల్లో 100 పరుగులు కావాలి. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(37) ఉన్నారు.9 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 86/29 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 2 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(25), తిలక్ వర్మ(35) ఉన్నారు.సిరాజ్ ఆన్ ఫైర్.. ముంబై రెండో వికెట్ డౌన్ర్యాన్ రికెల్టన్ రూపంలో ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన రికెల్టన్.. సిరాజ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ చేశాడు. 5 ఓవర్లు ముగిసే సరికి ముంబై.. రెండు వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ(18), సూర్యకుమార్(8) ఉన్నారు.రోహిత్ శర్మ ఔట్.. ముంబై తొలి వికెట్ డౌన్రోహిత్ శర్మ రూపంలో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. మహ్మద్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి తిలక్ వర్మ వచ్చాడు.సుదర్శన్ హాఫ్ సెంచరీ.. ముంబై ముందు భారీ టార్గెట్అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు సమిష్టగా రాణించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(63) టాప్ స్కోరర్గా నిలవగా.. శుబ్మన్ గిల్(38), జోస్ బట్లర్(39) రాణించారు. ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ తలా వికెట్ సాధించారు.19 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 186/6గుజరాత్ టైటాన్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 18 ఓవర్లో ఆఖరి బంతికి బౌల్ట్ బౌలింగ్లో సుదర్శన్(63) ఔట్ కాగా.. 19 ఓవర్లో వరుస క్రమంలో రాహుల్ తెవాటియా, రూథర్ ఫర్డ్ ఔటయ్యారు. 19 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.గుజరాత్ మూడో వికెట్ డౌన్.. షారూఖ్ ఔట్షారూఖ్ ఖాన్ రూపంలో గుజరాత్ టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన షారూఖ్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఔటయ్యాడు. 16 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ మూడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.గుజరాత్ రెండో వికెట్ డౌన్..జోస్ బట్లర్ రూపంలో గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన బట్లర్.. ముజీబ్ ఉర్ రెహ్మన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(49), షారూఖ్ ఖాన్(0) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న జోస్ బట్లర్..12 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో సాయి సుదర్శన్(42), బట్లర్(26) ఉన్నారు.తొలి వికెట్ డౌన్.. శుబ్మన్ గిల్ ఔట్శుబ్మన్ గిల్ రూపంలో గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన గిల్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి జోస్ బట్లర్ వచ్చాడు. 9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న గిల్, సుదర్శన్గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సాయిసుదర్శన్(32), శుబ్మన్ గిల్(32) దూకుడుగా ఆడుతున్నారు. 6 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది.నిలకడగా ఆడుతున్న గుజరాత్ ఓపెనర్లుటాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు శుబ్మన్ గిల్(13), సాయిసుదర్శన్(13) ఉన్నారు.ఐపీఎల్-2025లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చాడు. గుజరాత్ మాత్రం తమ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.తుది జట్లుముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, సత్యనారాయణ రాజు, ముజీబ్ ఉర్ రెహమాన్, ట్రెంట్ బౌల్ట్గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI: శుభమన్ గిల్ (కెప్టెన్), B సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫానే రూథర్ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ -
ఐపీఎల్లో నేటి (మార్చి 29) మ్యాచ్.. ముంబైతో గుజరాత్ 'ఢీ'
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మార్చి 29) ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గుజరాత్ హోం గ్రౌండ్ నరేంద్ర మోదీ స్టేడియంలో (అహ్మదాబాద్) జరుగనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దంగా ఉన్నాయి.ఈ సీజన్లో ఇరు జట్లు తమ తొలి మ్యాచ్ల్లో ఓటమిపాలై నిరాశగా ఉన్నాయి. ముంబై సీఎస్కే చేతిలో.. గుజరాత్ పంజాబ్ చేతిలో పరాజయం పాలయ్యాయి. సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో ముంబై బ్యాటింగ్లో దారుణంగా విఫలమైంది. జట్టు నిండా స్టార్లు ఉన్నా ఒక్కరు కూడా సామర్థ్యం మేరకు రాణించలేకపోయారు. రోహిత్ శర్మ డకౌట్ కాగా.. విదేశీ విధ్వంసకర ఆటగాళ్లు రికెల్టన్ (13), విల్ జాక్స్ (11) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. స్కై (29), తిలక్ వర్మ (31) పర్వాలేదనిపించినా అవి వారి స్థాయికి తగ్గ ఇన్నింగ్స్లు కావు. ఈ మ్యాచ్కు హార్దిక్ పాండ్యా దూరంగా ఉన్నాడు. గత సీజన్లో స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ ఈ సీజన్ తొలి మ్యాచ్లో నిషేధం ఎదుర్కొన్నాడు. గుజరాత్తో నేటి మ్యాచ్కు హార్దిక్ అందుబాటులో ఉంటాడు. హార్దిక్ ఎంట్రీతో రాబిన్ మింజ్ తప్పుకోవాల్సి ఉంటుంది. సీఎస్కేతో మ్యాచ్ ద్వారా ముంబై ఇండియన్స్కు ఓ అణిముత్యం దొరికాడు. 24 ఏళ్ల స్పిన్నర్ విజ్ఞేశ్ పుతుర్ సీఎస్కేతో మ్యాచ్లో మ్యాజిక్ చేశాడు. కేరళకు చెందిన పుతుర్ జాతీయ స్థాయిలో ఎలాంటి మ్యాచ్లు ఆడకుండా నేరుగా ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చి తన తొలి మ్యాచ్లో 3 వికెట్లు తీశాడు. సీఎస్కేతో మ్యాచ్లో ముంబైకు పుతుర్ అద్భుతమైన బౌలింగ్ మినహా ఎలాంటి ఊరట లభించలేదు. పుతుర్ రాణించినా స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ముంబై బౌలర్లు చేతులెత్తేశారు. ట్రెంట్ బౌల్ట్, మిచెల్ సాంట్నర్ సామర్థ్యం మేరకు రాణించలేదు. ఈ మ్యాచ్లో దీపక్ చాహర్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలుత బ్యాటింగ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన చాహర్.. ఆతర్వాత బౌలింగ్లో ఓ వికెట్ తీశాడు. నేటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది.ర్యాన్ రికెల్టన్ (వికెట్కీపర్), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు, విఘ్నేశ్ పుతుర్గుజరాత్ టైటాన్స్ విషయానికొస్తే.. ఈ జట్టు సీజన్ తొలి మ్యాచ్లో పంజాబ్ చేతిలో పరాజయంపాలైనప్పటికీ.. బ్యాటింగ్లో అదరగొట్టింది. భారీ లక్ష్య ఛేదనలో ఆ జట్టు టాపార్డర్ బ్యాటర్లు సాయి సుదర్శన్ (74), శుభ్మన్ గిల్ (33), బట్లర్ (54), రూథర్ఫోర్డ్ (46) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. మధ్య ఓవర్లలో గుజరాత్ బ్యాటర్లు కాస్త వేగంగా ఆడి ఉంటే ఈ మ్యాచ్లో ఆ జట్టు గెలిచేదే. ఈ మ్యాచ్లో ఆ జట్టు ప్రధాన బౌలర్లందరూ నిరాశపరిచారు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన సిరాజ్, రబాడ.. గుజరాత్ తురుపుముక్క రషీద్ ఖాన్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ప్రసిద్ద్ కృష్ణ అదే స్థాయిలో పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్లో సాయి కిషోర్ ఒక్కడే రాణించాడు. అతను 4 ఓవర్లలో కేవలం 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ముంబైతో జరుగబోయే నేటి మ్యాచ్లో గుజరాత్ జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది.శుభ్మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్, సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, కగిసో రబడ, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్హెడ్ టు హెడ్ రికార్డులు..ఐపీఎల్లో గుజరాత్, ముంబై ఇప్పటివరకు ఐదు సార్లు తలపడ్డాయి. ఇందులో గుజరాత్ 3, ముంబై రెండు మ్యాచ్ల్లో గెలుపొందాయి. గుజరాత్కు ముంబైపై సొంత మైదానంలో ఘనమైన రికార్డు ఉంది. ఆ జట్టు ముంబైపై సాధించిన మూడు విజయాలు అహ్మదాబాద్లో వచ్చినవే. ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే గెలుపొందాయి. అహ్మదాబాద్ పిచ్పై మరోసారి పరుగుల వరద పారడం ఖాయం. ఈ పిచ్పై గత మ్యాచ్లో పంజాబ్ 243 పరుగులు చేయగా.. ఛేదనలో గుజరాత్ 232 పరుగులు చేసింది. -
మళ్లీ ప్రేమకు సిద్ధం: హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాసా స్టాంకోవిక్
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాసా స్టాంకోవిక్ ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హార్దిక్ నుంచి విడిపోయాక మళ్లీ ప్రేమలో పడేందుకు సిద్దంగా ఉన్నానని అంది. ప్రేమ, మాతృత్వం, కెరీర్ గురించి మాట్లాడుతూ.. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలో చెప్పుకొచ్చింది. నటి మరియు మోడల్ అయిన నటాసా కొత్త దశలోకి అడుగుపెట్టబోతున్నానని తెలిపింది. గతేడాది జులైలో హార్దిక్ పాండ్యా నుంచి విడిపోయిన నటాసా.. కెరీర్లో ముందుకు సాగడంపై దృష్టి పెడుతున్నానని చెప్పింది. పెళ్లి తర్వాత నాలుగేళ్లు కలిసి ఉన్న నటాసా, హార్దిక్కు అగస్త్య అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. విడిపోయాక వీరిద్దరు అగస్త్యకు కో-పేరెంట్స్గా ఉన్నారు. అగస్త్య తల్లి సంరక్షణలో పెరుగుతున్నాడు.ఇంటర్వ్యూ సందర్భంగా నటాసా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఇలా అంది. నేను మళ్లీ ప్రేమలో పడేందుకు వ్యతిరేకం కాదు. జీవితం ఏది ఇచ్చినా స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నాను. ప్రేమ విషయానికి వస్తే.. ఖచ్చితంగా కొత్త అనుభవాల కోసం ఓపెన్గా ఉన్నాను. సరైన సమయం వచ్చినప్పుడు ప్రేమ అదంతట అదే పుడుతుందని నమ్ముతాను. నమ్మకం మరియు పరస్పర అవగాహన కలిగిన అర్థవంతమైన బంధాలకు విలువ ఇస్తానని తెలిపింది.హార్దిక్ నుంచి విడిపోయాక గతేడాది చాలా కఠినంగా గడిచిందని నటాసా పేర్కొంది. సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే ఎదుగుదల సాధిస్తామని చెప్పింది. గతేడాది చెడుతో పాటు మంచి అనుభవాలు కూడా ఉన్నాయని అంది. వయసుతో కాకుండా అనుభవాలతోనే పరిణతి చెందుతామని చెప్పుకొచ్చింది.కెరీర్ గురించి మాట్లాడుతూ.. హార్దిక్తో పెళ్లి తర్వాత ప్రొఫెషన్కు ఐదేళ్లు దూరంగా ఉన్నాను. తిరిగి కెరీర్ను పునఃప్రారంభించాలని అనుకుంటున్నాను. ఐదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ కెరీర్ను మొదలు పెట్టడం అంత ఈజీ కాదు. కష్టపడి పని చేస్తూ, నన్ను నేను మెరుగుపర్చుకునేందుకు ఇష్టపడే వ్యక్తిని కాబట్టి నా ప్రయత్నాలు కొనసాగిస్తాను. ఏదీ వీలు కాకపోతే మరో కెరీర్ను ఎంచుకుంటాను.నటాసా మార్చి 4వ తేదీన తన 33వ పుట్టిన రోజు జరుపుకుంది. దీనిపై మాట్లాడుతూ.. ఈ పుట్టిన రోజు నాకు చాలా స్పెషల్. అగస్త్యతో చాలా సరదాగా గడిపాను. నాకు ఇష్టమైన వ్యక్తులతో ఆనందంగా ఉన్నాను. ఈ ఏడాది నాకు కెరీర్పరంగా, పర్సనల్గా చాలా ప్రత్యేకమైంది.సెర్బియాకు చెందిన నటాసాను హార్దిక్ పాండ్యా 2020లో ప్రేమించి వివాహం చేసుకున్నాడు. నటాసాను విడిపోయాక హార్దిక్ క్రికెట్తో బిజీ అయిపోయాడు. ఇటీవలే టీమిండియా సభ్యుడిగా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన హార్దిక్.. ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు. హార్దిక్ గత సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. -
IPL 2025: దీపక్ చాహర్ను 'కట్టప్ప'తో పోల్చిన అతని సోదరి
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నిన్న (మార్చి 23) రాత్రి జరిగిన మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థులు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో సీఎస్కే విజేతగా నిలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగా.. సీఎస్కే మరో 5 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.ఈ మ్యాచ్లో ముంబై బ్యాటింగ్లో ఘోరంగా విఫలమైంది. ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. తిలక్ వర్మ (31) టాప్ స్కోరర్గా నిలువగా.. సూర్యకుమార్ యాదవ్ (29), దీపక్ చాహర్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ (4-0-18-4), ఖలీల్ అహ్మద్ (4-0-29-3) అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబైని కట్టడి చేశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలు చేసి సీఎస్కేను గెలిపించారు. రుతురాజ్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సీఎస్కే గెలుపుకు బలమైన పునాది వేయగా.. రచిన్ చివరి వరకు క్రీజ్లో ఉండి సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. ఈ మ్యాచ్లో ముంబై ఓడినా అద్భుతంగా ప్రతిఘటించింది. అరంగేట్రం స్పిన్నర్ విజ్ఞేశ్ పుథుర్ (4-0-32-3) సీఎస్కేకు దడ పుట్టించాడు. విజ్ఞేశ్తో పాటు విల్ జాక్స్ (4-0-32-1), నమన్ ధిర్ (3-0-12-0) కూడా రాణించారు. మిడిల్ ఓవర్లలో ఈ ముగ్గురు సత్తా చాటినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ఇదిలా ఉంటే, గత ఏడు సీజన్ల పాటు చెన్నై సూపర్కింగ్స్కు ఆడిన దీపక్ చాహర్ ఈ మ్యాచ్తో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్లో చాహర్ తొలుత బ్యాటింగ్లో సత్తా చాటి ఆతర్వాత బౌలింగ్లో పర్వాలేదనిపించాడు. ఇన్నింగ్స్ చివర్లో బ్యాటింగ్కు దిగిన చాహర్ 15 బంతులు ఎదర్కొని 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చాహర్ బ్యాట్ ఝులిపించకపోయుంటే ఈ మ్యాచ్లో ముంబై ఈ మాత్రం స్కోర్ కూడా చేయలేకపోయేది. అనంతరం బౌలింగ్లోనూ చాహర్ ఆదిలోనే సీఎస్కేను దెబ్బకొట్టాడు. చాహర్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే సీఎస్కే ఓపెనర్ రాహుల్ త్రిపాఠిని పెవిలియన్కు పంపాడు. ఈ మ్యాచ్లో చాహర్ 2 ఓవర్లలో వికెట్ తీసి 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు.చాహర్ ముంబై ఇండియన్స్ తరఫున గ్రాండ్గా అరంగేట్రం చేయడాన్ని అతని సోదరి మాల్తి చాహర్ ఓ హాస్యాస్పదమైన మీమ్ షేర్ చేయడం (సోషల్మీడియాలో) ద్వారా సెలబ్రేట్ చేసుకుంది. చాహర్ తన పాత జట్టుకు (సీఎస్కే) వ్యతిరేకంగా అద్భుతంగా ఆడినందుకు సరదాగా ట్రోల్ చేసింది. Malti Chahar's Instagram story. pic.twitter.com/1bfxj4kcU4— Mufaddal Vohra (@mufaddal_vohra) March 24, 2025చాహర్ను "బాహుబలి" సినిమాలోని కట్టప్ప పాత్రతో పోల్చింది. ఆ సినిమాలో హీరో ప్రభాస్ను (అమరేంద్ర బాహుబలి) అతని మామ కట్టప్ప వెనుక నుంచి కత్తితో పొడుస్తాడు. ఈ మ్యాచ్లో చాహర్ కూడా కట్టప్పలా తనను ధీర్ఘకాలంగా అక్కున చేర్చుకున్న సీఎస్కేను దెబ్బతీసే ప్రయత్నం చేశాడని అర్దం వచ్చేలా మాల్తి సరదాగా ఓ మీమ్ను పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ సోషల్మీడియాలో వైరలవుతుంది. -
IPL 2025: రోహిత్, పోలార్డ్ తర్వాత సూర్యకుమార్
ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో నిన్న (మార్చి 23) జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తాత్కాలిక సారధి సూర్యకుమార్ యాదవ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 29 పరుగులు చేసిన స్కై.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా రోహిత్ శర్మ, కీరన్ పోలార్డ్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రోహిత్ 209 ఇన్నింగ్స్ల్లో 5458 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ తరఫున లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతుండగా.. పోలార్డ్ 171 ఇన్నింగ్స్ల్లో 3412, స్కై 95 ఇన్నింగ్స్ల్లో 3015 పరుగులు చేశాడు. ఈ ముగ్గురి తర్వాత ఎంఐ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అంబటి రాయుడు ఉన్నాడు. రాయుడు 107 ఇన్నింగ్స్ల్లో 2416 పరుగులు చేశాడు.ఇదిలా ఉంటే, సీఎస్కేతో నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. సీజన్ ఆరంభ మ్యాచ్ల్లో ఓడటం ముంబైకి ఇది వరుసగా 13వ సారి. ఈ మ్యాచ్లో సీఎస్కే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటి ముంబై ఇండియన్స్ను ఓడించింది. బ్యాటింగ్లో విఫలమైన ముంబై ఆతర్వాత బౌలింగ్లో రాణించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నూర్ అహ్మద్ (4-0-18-4), ఖలీల్ అహ్మద్ (4-0-29-3) విజృంభించడంతో 155 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) పరిమితమైంది. ముంబై ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. సూర్యకుమార్ (29), తిలక్ వర్మ (31), ఆఖర్లో దీపక్ చాహర్ (15 బంతుల్లో 28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రోహిత్ శర్మ డకౌట్ కాగా.. విధ్వంసకర వీరులు రికెల్టన్ (13), విల్ జాక్స్ (11), అరంగ్రేటం ఆటగాడు రాబిన్ మింజ్ (3), నమన్ ధిర్ (17), సాంట్నర్ (11) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. సీఎస్కే బౌలర్లలో అశ్విన్, ఇల్లిస్ కూడా తలో వికెట్ తీశారు.ఛేదనలో రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలు చేసి సీఎస్కేను గెలిపించారు. రుతురాజ్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సీఎస్కే గెలుపుకు బలమైన పునాది వేయగా.. రచిన్ చివరి వరకు క్రీజ్లో ఉండి సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. ఈ మ్యాచ్లో ముంబై ఓడినా అద్భుతంగా ప్రతిఘటించింది. అరంగేట్రం స్పిన్నర్ విజ్ఞేశ్ పుథుర్ (4-0-32-3) అద్భుతంగా బౌలింగ్ చేసి ఓ దశలో సీఎస్కేకు దడ పుట్టించాడు. ముంబై బౌలర్లలో విజ్ఞేశ్తో పాటు విల్ జాక్స్ (4-0-32-1), నమన్ ధిర్ (3-0-12-0) కూడా రాణించారు. మిడిల్ ఓవర్లలో వీరిద్దరు సీఎస్కేను ఇబ్బంది పెట్టారు. మొత్తంగా మ్యాచ్ ఓడినా ముంబై మంచి మార్కులే కొట్టేసింది. సీఎస్కే తమ తదుపరి మ్యాచ్లో ఆర్సీబీతో (మార్చి 28) తలపడనుండగా.. ముంబై ఇండియన్స్ గుజరాత్ను (మార్చి 29) ఢీకొట్టనుంది. -
IPL 2025: చెత్త రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా చెన్నై సూపర్కింగ్స్తో నిన్న (మార్చి 23) జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్లో 4 బంతులు ఎదర్కొని డకౌటైన హిట్మ్యాన్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డకౌట్లు అయిన ఆటగాడిగా నిలిచాడు. ఈ చెత్త రికార్డును రోహిత్.. గ్లెన్ మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్లతో కలిసి షేర్ చేసుకున్నాడు. ఈ ముగ్గురు ఐపీఎల్లో ఇప్పటివరకు 18 సార్లు ఖాతా తెరవకుండా నిష్క్రమించారు. రోహిత్ 253 ఇన్నింగ్స్ల్లో 18 సార్లు డకౌట్ కాగా.. మ్యాక్సీ 129, డీకే 234 ఇన్నింగ్స్ల్లోనే 18 సార్లు డకౌటయ్యారు. ఈ మ్యాచ్లో రోహిత్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.మ్యాచ్ విషయానికొస్తే.. సీఎస్కే ముంబైపై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. సీజన్ ఆరంభ మ్యాచ్లో ఓడటం ముంబైకి ఇది వరుసగా 13వ సారి. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై బ్యాటర్ల వైఫల్యం కారణంగా 155 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ 4 వికెట్లు తీసి ముంబైకి కళ్లెం వేశాడు. పేసర్ ఖలీల్ అహ్మద్ కూడా రాణించి 3 వికెట్లు తీశాడు. ఇల్లిస్, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ (31) టాప్ స్కోరర్గా నిలువగా.. సూర్యకుమార్ యాదవ్ (29), దీపక్ చాహర్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం ఛేదనకు దిగిన సీఎస్కే ఆదిలోనే ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (2) వికెట్ కోల్పోయినప్పటికీ.. ఆతర్వాత పుంజుకుంది. రచిన్ రవీంద్ర (65 నాటౌట్), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (53) మెరుపు అర్ద సెంచరీలు సాధించి సీఎస్కేను గెలిపించారు. రుతురాజ్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సీఎస్కే గెలుపుకు బలమైన పునాది వేయగా.. రచిన్ చివరి వరకు క్రీజ్లో ఉండి సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. ఈ మ్యాచ్లో ముంబై ఓడినప్పటికీ అద్భుతంగా ప్రతిఘటించింది. స్వల్ప స్కోర్ను కాపాడుకనేందుకు ముంబై బౌలర్లు విశ్వప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా అరంగేట్రం స్పిన్నర్ విజ్ఞేశ్ పుథుర్ (4-0-32-3) అద్భుతంగా బౌలింగ్ చేసి ఓ దశలో సీఎస్కేకు దడ పుట్టించాడు. సీఎస్కే తమ తదుపరి మ్యాచ్లో ఆర్సీబీతో (మార్చి 28) తలపడనుండగా.. ముంబై ఇండియన్స్ గుజరాత్ను (మార్చి 29) ఢీకొట్టనుంది. -
తండ్రి ఆటో డ్రైవర్.. కొడుకు స్టార్ ప్లేయర్
-
IPL 2025: ఈ ఏడాది ధోని మరింత ఫిట్గా ఉన్నాడు.. యవ్వనంగా కనిపిస్తున్నాడు: రుతురాజ్
ఐపీఎల్-2025 సీజన్లో భాగంగా నిన్న (మార్చి 23) రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. సీజన్ ఓపెనింగ్ మ్యాచ్లో ఓడటం ముంబై ఇండియన్స్కు ఇది వరుసగా 13వ సారి. ఐపీఎల్ 2021 సెకెండ్ లెగ్ నుంచి ఇప్పటివరకు ముంబైతో జరిగిన ఏడు మ్యాచ్ల్లో సీఎస్కే ఏడింట విజయాలు సాధించింది. నిన్నటి మ్యాచ్లో సీఎస్కేను అరంగేట్రం ఆటగాడు నూర్ అహ్మద్, రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ప్రదర్శనలతో గెలిపించారు.తొలుత నూర్ (4-0-18-4) తన మాయాజాలం ప్రదర్శించి ముంబైని 155 పరుగులకే పరిమితం చేయగా.. ఆ తర్వాత రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) తమ బ్యాటింగ్ విన్యాసాలతో సీఎస్కేను గెలిపించారు. ఈ మ్యాచ్లో సీఎస్కే పేసర్ ఖలీల్ అహ్మద్ (4-0-29-3) కూడా రాణించాడు. ధోని మెరుపు స్టంపింగ్ (సూర్యకుమార్ యాదవ్) చేసి వింటేజ్ ధోనిని గుర్తు చేశాడు.ఈ మ్యాచ్లో ముంబై స్వల్ప స్కోర్కే పరిమితమైనా.. లక్ష్యాన్ని కాపాడుకోవడంలో అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. ముంబై బౌలర్లు సీఎస్కేను అంత ఈజీగా గెలవనివ్వలేదు. రుతురాజ్ క్రీజ్లో ఉన్నంత సేపు సీఎస్కే వైపే ఏకపక్షంగా సాగిన మ్యాచ్.. ఆతను ఔటయ్యాక మలుపులు తిరిగింది. ఓ దశలో ముంబై అరంగేట్రం స్పిన్నర్ విజ్ఞేశ్ పుథుర్ (4-0-32-3) రెచ్చిపోవడంతో సీఎస్కే కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే రచిన్ చివరి వరకు క్రీజ్లో ఉండి సిక్సర్తో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా (17) రనౌట్ కావడంతో ధోని క్రీజ్లోకి వచ్చాడు. ధోని బ్యాటింగ్కు దిగినా పరుగులేమీ చేయలేదు (2 బంతులు ఎదుర్కొని). ధోని రాకతో చెపాక్ స్టేడియం హోరెత్తింది. ముంబై బౌలర్లలో విజ్ఞేశ్తో పాటు విల్ జాక్స్ (4-0-32-1), నమన్ ధిర్ (3-0-12-0) కూడా రాణించారు. మిడిల్ ఓవర్లలో వీరిద్దరు సీఎస్కేను తెగ ఇబ్బంది పెట్టారు. అంతకుముందు ముంబై బ్యాటింగ్లో ఘోరంగా విఫలమైంది. ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. సూర్యకుమార్ (29), తిలక్ వర్మ (31), ఆఖర్లో దీపక్ చాహర్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌటై నిరాశపర్చగా.. విధ్వంసకర ఆటగాళ్లు రికెల్టన్ (13), విల్ జాక్స్ (11) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ రుతురాజ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. గెలిచిన జట్టులో ఉండటం ఆనందంగా ఉంది. మరింత క్లినికల్గా ఉండటం నాకు చాలా ఇష్టం. కానీ ఆట ఇలాగే సాగుతుంది. బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలో రావడంపై స్పందిస్తూ.. అది జట్టు అవసరం. నేను మూడో స్థానంలో బ్యాటింగ్ రావడం జట్టుకు మరింత సమతుల్యతను ఇస్తుంది. నా స్థానాన్ని మార్చుకోవడం (గతంలో ఓపెనర్గా వచ్చే వాడు) పట్ల నాకు ఎలాంటి బాధ లేదు. వాస్తవానికి ఇంకా సంతోషంగా ఉంది.స్పిన్నర్లు సరైన పాయింట్పై ఉన్నారు. ఈ మ్యాచ్లో వారు ముగ్గురు (నూర్, అశ్విన్, జడేజా) మంచి లయతో బౌలింగ్ చేశారు. ఇది మాకు శుభసూచకం. ఖలీల్ అనుభవజ్ఞుడు. అతని అనుభవం మాకు కలిసొచ్చింది. నూర్ ఓ ఎక్స్ ఫ్యాక్టర్, అందుకే అతన్ని జట్టులో చేర్చుకోవాలనుకున్నాము. అశ్విన్ జట్టులో ఉండటం మాకు బలాన్ని ఇస్తుంది. ధోని ఈ సంవత్సరం మరింత ఫిట్గా ఉన్నాడు. అతను ఇప్పటికీ యవ్వనంగా కనిపిస్తున్నాడు. -
IPL 2025: మా పోరాటం ప్రశంసనీయం.. రుతురాజ్ మ్యాచ్ను లాగేసుకున్నాడు: సూర్యకుమార్
ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్లో ఓడిపోయే ఆనవాయితీని ముంబై ఇండియన్స్ కొనసాగించింది. వరుసగా 13వ ఏడాది ముంబై తమ తొలి మ్యాచ్లో ఓటమిపాలైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా నిన్న (మార్చి 23) రాత్రి జరిగిన మ్యాచ్లో సీఎస్కే ముంబైపై 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ తడబడింది. సీఎస్కే బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. రోహిత్ శర్మ డకౌటై నిరాశపరిచగా.. విధ్వంసకర వీరులు రికెల్టన్ (13), విల్ జాక్స్ (11), తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ (29), తిలక్ వర్మ (31) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. అరంగేట్రం ఆటగాడు రాబిన్ మింజ్ (3) తేలిపోయాడు. నమన్ ధిర్ 17, సాంట్నర్ 11 పరుగులు చేయగా.. ఆఖర్లో దీపక్ చాహర్ (15 బంతుల్లో 28 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ (4-0-18-4) ఐపీఎల్ కెరీర్ను అద్భుతంగా ప్రారంభించాడు. ఖలీల్ అహ్మద్ (4-0-29-3) సత్తా చాటాడు. వెటరన్ రవిచంద్రన్ అశ్విన్, నాథన్ ఇల్లిస్ తలో వికెట్ తీశారు.స్లో ట్రాక్పై ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే ఆదిలోనే వికెట్ కోల్పోయింది. దీపక్ చాహర్ ఓపెనర్ రాహుల్ త్రిపాఠిని 2 పరుగులకే ఔట్ చేశాడు. వన్డౌన్లో బరిలోకి దిగిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. రుతు 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేసి మ్యాచ్ను ముంబై చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. మరో ఎండ్లో రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతాయుతంగా ఆడి చివరి వరకు క్రీజ్లో ఉన్నాడు. సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. రుతురాజ్ ఔటయ్యాక సీఎస్కే కాస్త తడబడింది. అరంగేట్రం స్పిన్నర్ విజ్ఞేశ్ పుథుర్ వరుసగా తన మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి ముంబైని తిరిగి మ్యాచ్లోకి తెచ్చినట్లు కనిపించాడు. ఈ దశలో విల్ జాక్స్, నమన్ ధిర్ కూడా అద్బుతంగా బౌలింగ్ చేశారు. సీఎస్కే ఆటగాళ్లను కట్టడి చేసి పరుగులు రానివ్వకుండా చేశారు. అయితే అప్పటిదాకా అద్బుతంగా బౌలింగ్ చేసిన విజ్ఞేశ్ పుథుర్ను 18వ ఓవర్లో బౌలింగ్కు దించి ముంబై కెప్టెన్ స్కై పెద్ద తప్పు చేశాడు. ఆ ఓవర్లో రచిన్ చెలరేగిపోయి 2 సిక్సర్ల సాయంతో 15 పరుగులు పిండుకున్నాడు. ఆ ఓవర్లోనే ముంబై ఓటమి ఖరారైపోయింది. 19వ ఓవర్లో నమన్ ధిర్ జడ్డూ వికెట్ తీసి కేవలం 2 పరుగులే ఇచ్చినా చివరి ఓవర్ తొలి బంతికే సిక్సర్ బాది రచిన్ సీఎస్కేను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో ధోని సూర్యకుమార్ను మెరుపు స్టంపింగ్ చేసి వింటేజ్ ధోనిని గుర్తు చేశాడు.మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ స్పందిస్తూ.. మేము 15-20 పరుగులు తక్కువ చేశాం. అయినా మా కుర్రాళ్ల పోరాటం ప్రశంసనీయం. యువకులకు అవకాశాలు ఇవ్వడంలో ముంబై ఇండియన్స్ ప్రసిద్ధి చెందింది . ఎంఐ స్కౌట్స్ ఏడాదిలో 10 నెలలు టాలెంట్ను వెతికే పనిలో ఉంటారు. విజ్ఞేశ్ పుథుర్ దాని ఫలితమే. తొలి మ్యాచ్లోనే విజ్ఞేశ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన తొలి 3 ఓవర్లలో 3 వికెట్లు తీసి తిరిగి తమను మ్యాచ్లోకి తెచ్చాడు. ఆట లోతుగా సాగితే అతని కోసమని ఓ ఓవర్ను స్పేర్గా ఉంచాను. అది మిస్ ఫైర్ అయ్యింది. 18వ ఓవర్ విజ్ఞేశ్కు ఇచ్చి తప్పు చేశాను. మ్యాచ్ జరుగుతుండగా మంచు ప్రభావం లేదు. కానీ కాస్త జిగటగా ఉండింది. రుతురాజ్ బ్యాటింగ్ చేసిన విధానం మ్యాచ్ను మా నుండి దూరం చేసింది. ఇది తొలి మ్యాచే. ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని అన్నాడు. కాగా, ముంబై తమ రెండో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ మార్చి 29న అహ్మదాబాద్లో జరుగనుంది. -
వరుసగా 13వ ఏడాది...
సీజన్ ఆరంభ మ్యాచ్లో పరాజయం పాలయ్యే ఆనవాయితీని ముంబై ఇండియన్స్ మరోసారి కొనసాగించింది. వరుసగా 13వ ఏడాది ముంబై జట్టు ఐపీఎల్లో తాము ఆడిన తొలి మ్యాచ్లో ఓటమి పాలైంది. గతేడాది పాయింట్ల పట్టిక అట్టడుగున నిలిచిన ముంబై ఇండియన్స్ ఆదివారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడింది. బ్యాటింగ్లో మెరుపులు మెరిపించలేకపోయిన ముంబై... బౌలింగ్లోనూ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. చెన్నై: ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 18వ సీజన్లో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తమ తొలి మ్యాచ్లో చెన్నై నాలుగు వికెట్ల తేడాతో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్పై గెలిచింది. 2012 ఐపీఎల్లో చివరిసారి తాము ఆడిన తొలి మ్యాచ్లో నెగ్గిన ముంబై జట్టు ఆ తర్వాత ఇప్పటి వరకు మొదటి పోరులో శుభారంభం చేయలేకపోయింది. మొదట ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. హైదరాబాద్ యువతార ఠాకూర్ తిలక్ వర్మ (25 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), దీపక్ చాహర్ (15 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) తలా కొన్ని పరుగులు చేశారు. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (0) డకౌట్ కాగా... రికెల్టన్ (13), విల్ జాక్స్ (11) ఎక్కువసేపు నిలవలేకపోయారు. చెన్నై బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నూర్ అహ్మద్ 4, ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం చెన్నై 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (45 బంతుల్లో 65 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్లు), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధశతకాలతో రాణించారు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) దూబే (బి) ఖలీల్ 0; రికెల్టన్ (బి) ఖలీల్ 13; జాక్స్ (సి) దూబే (బి) అశ్విన్ 11; సూర్యకుమార్ (స్టంప్డ్) ధోని (బి) నూర్ 29; తిలక్ వర్మ (ఎల్బీ) (బి) నూర్ 31; రాబిన్ (సి) జడేజా (బి) నూర్ 3; నమన్ (బి) నూర్ 17; సాంట్నర్ (ఎల్బీ) (బి) ఎలీస్ 11; దీపక్ చాహర్ (నాటౌట్) 28; బౌల్ట్ (సి) రుతురాజ్ (బి) ఖలీల్ 1; సత్యనారాయణ రాజు (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–0, 2–21, 3–36, 4–87, 5–95, 6–96, 7–118, 8–128, 9–141. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–29–3; స్యామ్ కరన్ 1–0–13–0; ఎలీస్ 4–0–38–1; అశ్విన్ 4–0– 31–1; జడేజా 3–0–21–0; నూర్ అహ్మద్ 4–0– 18–4. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (నాటౌట్) 65; రాహుల్ త్రిపాఠి (సి) రికెల్టన్ (బి) చాహర్ 2; రుతురాజ్ (సి) జాక్స్ (బి) విఘ్నేశ్ 53; దూబే (సి) తిలక్ వర్మ (బి) విఘ్నేశ్ 9; దీపక్ హుడా (సి) సత్యనారాయణ (బి) విఘ్నేశ్ 3; కరన్ (బి) జాక్స్ 4; జడేజా (రనౌట్) 17; ధోని (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (19.1 ఓవర్లలో 6 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–11, 2–78, 3–95, 4–107, 5–116, 6–152. బౌలింగ్: బౌల్ట్ 3–0–27–0; చాహర్ 2–0–18–1; సత్యనారాయణ 1–0–13–0; సాంట్నర్ 2.1–0–24–0; జాక్స్ 4–0–32–1; విఘ్నేశ్ 4–0–32–3; నమన్ 3–0–12–0. ఐపీఎల్లో నేడుఢిల్లీ X లక్నో వేదిక: విశాఖపట్నంరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
రుతురాజ్, రచిన్ హాఫ్ సెంచరీలు.. ముంబై పై సీఎస్కే విజయం
సీఎస్కే ఘన విజయం..చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 156 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే 6 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. చెన్నై బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(65 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్(53) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో విఘ్నేష్ మూడు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్, జాక్స్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(31) టాప్ స్కోరర్గా నిలవగా.. ఆఖరిలో దీపక్ చాహర్(28) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఖాలీల్ అహ్మద్ మూడు వికెట్లు సాధించాడు.సీఎస్కే ఐదో వికెట్ డౌన్..సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన సామ్ కుర్రాన్.. విల్ జాక్స్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో రచిన్ రవీంద్ర(20), రవీంద్ర జడేజా(5) ఉన్నారు. 16 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 125/5సీఎస్కే మూడో వికెట్ డౌన్.. దూబే ఔట్శివమ్ దూబే రూపంలో సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన దూబే.. విఘ్నేష్ బౌలింగ్లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 100/3.సీఎస్కే రెండో వికెట్ డౌన్.. గైక్వాడ్ ఔట్రుతురాజ్ గైక్వాడ్ రూపంలో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 53 పరుగులు చేసిన రుతురాజ్ విఘ్నేష్ బౌలింగ్లో ఔటయ్యాడు. 8 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 79/2.6 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 62/16 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ గైక్వాడ్(42), రచిన్ రవీంద్ర(20) ఉన్నారు.తొలి వికెట్ డౌన్..156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి.. దీపక్ చాహర్ బౌలింగ్లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 35/1. క్రీజులోకి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(18), రచిన్ రవీంద్ర(14) పరుగులతో ఉన్నారు.రాణించిన సీఎస్కే బౌలర్లు..చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(31) టాప్ స్కోరర్గా నిలవగా.. ఆఖరిలో దీపక్ చాహర్(28) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఖాలీల్ అహ్మద్ మూడు వికెట్లు సాధించాడు.నూర్ ఆన్ ఫైర్..ముంబై ఇండియన్స్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. ముంబై ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన నూర్ అహ్మద్ బౌలింగ్లో నాలుగో బంతికి రాబిన్ మింజ్ ఔట్ కాగా.. ఆఖరి బంతికి తిలక్ వర్మ(31) పెవిలియన్కు చేరాడు. 13 ఓవర్లకు ముంబై స్కోర్: 96/6సూర్యకుమార్ ఔట్..సూర్యకుమార్ యాదవ్ రూపంలో ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన సూర్యకుమార్.. నూర్ అహ్మద్ బౌలింగ్లో స్టంపౌట్గా వెనుదిరిగాడు. ధోని అద్భుతమైన స్టంపింగ్తో మెరిశాడు. 12 ఓవర్లకు ముంబై స్కోర్: 92/4ముంబై మూడో వికెట్ డౌన్..విల్ జాక్స్ రూపంలో ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన జాక్స్.. అశ్విన్ బౌలింగ్లో దూబేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి తిలక్ వర్మ వచ్చాడు. 6 ఓవర్లకు ముంబై స్కోర్: 52/3ముంబై రెండో వికెట్ డౌన్ర్యాన్ రికెల్టన్ రూపంలో ముంబై రెండో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన రికెల్టన్ ఖాలీల్ అహ్మద్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. 4 ఓవర్లకు ముంబై స్కోర్: 30/2రోహిత్ శర్మ ఔట్..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ముంబైకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. ఖాలీల్ ఆహ్మద్ బౌలింగ్లో దూబేకు క్యాచ్ ఇచ్చి రోహిత్ ఔటయ్యాడు. 2 ఓవర్లకు ముంబై స్కోర్: 17/1ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సీఎస్కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో ఆంధ్ర ఫాస్ట్ బౌలర్ సత్యనారాయణ రాజు ముంబై తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. కాగా ఈ మ్యాచ్కు ముంబై ఇండియన్స్ రెగ్యూలర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరం కావడంతో సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తున్నాడు.తుది జట్లుముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, రాబిన్ మింజ్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజుచెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సామ్ కర్రాన్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, ఖలీల్ అహ్మద్ -
CSK Vs MI: సీఎస్కేతో మ్యాచ్.. హిట్మ్యాన్కు జోడీ ఎవరు..?
ఐపీఎల్-2025లో భాగంగా ఇవాళ (మార్చి 23) రాత్రి (7:30 గంటలకు) రసవత్తర సమరం జరుగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొంటున్నాయి. క్రికెట్లో ఈ రెండు జట్ల మ్యాచ్ను ఎల్ క్లాసికోగా పిలుస్తారు. ఈ మ్యాచ్పై జనాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఐపీఎల్లో ముంబై, సీఎస్కే జట్లు అత్యంత విజయవంతమైన జట్లు. ఈ రెండు జట్లు చెరో ఐదు సార్లు టైటిల్స్ సాధించాయి. ఇరు జట్లు నేటి మ్యాచ్తో ఆరో టైటిల్ వేటను ప్రారంభిస్తాయి.నేటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. నిషేధం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్కు అందుబాటులో లేడు. సీఎస్కే విషయానికొస్తే.. రుతురాజ్ గైక్వాడ్ ఈ జట్టును ముందుండి నడిపించనున్నాడు.తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్కు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సేవలు కూడా అందుబాటులో లేవు. గాయం నుంచి బుమ్రా ఇంకా కోలుకోలేదు. నేటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తుది జట్టు కూర్పును పరిశీలిస్తే.. ఓపెనర్గా రోహిత్ శర్మ వస్తాడు. హిట్మ్యాన్ను జత ఎవరన్నదే ఆసక్తికరంగా మారింది. విల్ జాక్స్ లేదా ర్యాన్ రికెల్టన్లలో ఎవరో ఒకరు హిట్మ్యాన్తో పాటు బరిలోకి దిగుతారు. వన్ డౌన్ తిలక్ వర్మ, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఐదో ప్లేస్లో నమన్ ధిర్ రావడం ఖరారైంది. నేటి మ్యాచ్తో రాబిన్ మింజ్ ఐపీఎల్ అరంగేట్రం చేయవచ్చు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా మిచెల్ సాంట్నర్, కర్ణ శర్మ బరిలో ఉంటారు. పేసర్లుగా దీపక్ చాహర్, కార్బిన్ బాష్, ట్రెంట్ బౌల్ట్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది.సీఎస్కే విషయానికొస్తే.. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే బరిలో నిలిచే అవకాశం ఉంది. వన్డౌన్లో రచిన్ రవీంద్ర, ఆతర్వాత దీపక్ హుడా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్) బరిలోకి దిగవచ్చు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా రవిచంద్రన్ అశ్విన్, పేసర్లుగా సామ్ కర్రన్, మతీషా పతిరణ, అన్షుల్ కాంబోజ్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది.హెడ్ టు హెడ్ రికార్డ్స్ను పరిశీలిస్తే.. ఐపీఎల్లో సీఎస్కే, ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 37 మ్యాచ్ల్లో ఎదురెదురుపడ్డాయి. ఇందులో సీఎస్కే 17, ముంబై 20 మ్యాచ్ల్లో గెలుపొందాయి.ముంబై ఇండియన్స్..రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార యాదవ్, నమన్ ధిర్, బెవాన్ జాకబ్స్, రాజ్ బవా, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజ్ఞేశ్ పుథుర్, సత్యనారాయణ రాజు, కార్బిన్ బాష్, మిచెల్ సాంట్నర్, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, కృష్ణణ్ శ్రీజిత్, రాబిన్ మింజ్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్చెన్నై సూపర్ కింగ్స్..రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోని , రవీంద్ర జడేజా, శివం దూబే, మతీషా పతిరానా, నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, డెవాన్ కాన్వే, సయ్యద్ ఖలీల్ అహ్మద్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, సామ్ కర్రాన్, షేక్ రషీద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి, దీపక్ హుడా, గుర్జన్ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, జామీ ఓవర్టన్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణన్ ఘోష్, శ్రేయాస్ గోపాల్, వంశ్ బేడి, ఆండ్రీ సిద్దార్థ్. -
రైజర్స్ బొణీ కొట్టేనా!
బాదుడే పరామావధిగా చెలరేగి గత సీజన్లో రన్నరప్గా నిలిచిన సన్రజర్స్ హైదరాబాద్... ఈ ఏడాది అదే జోరు కొనసాగించేందుకు సిద్ధమైంది. సొంతగడ్డపై మాజీ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్తో... నేడు కమిన్స్ సేన కప్ వేట ప్రారంభించనుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్తో సన్రైజర్స్ బ్యాటింగ్ లైనప్ శత్రు దుర్బేధ్యంగా ఉండగా... యశస్వి జైస్వాల్, సంజూ సామ్సన్, రియాన్ పరాగ్, హెట్మైర్, ధ్రువ్ జురెల్తో సవాలు విసిరేందుకు రాజస్తాన్ రాయల్స్ రెడీ అయింది. మరి రైజర్స్ దూకుడుకు రాయల్స్ అడ్డుకట్ట వేస్తుందా చూడాలి! సాక్షి, హైదరాబాద్: గత ఏడాది అందినట్లే అంది దూరమైన ఐపీఎల్ ట్రోఫీని ఈసారైనా ఒడిసి పట్టాలనే లక్ష్యంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలి మ్యాచ్కు రెడీ అయింది. ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా జరగనున్న తొలి ‘డబుల్ హెడర్’లో ఆదివారం జరగనున్న తొలి మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్తో హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది. ఒకప్పుడు కట్టుదిట్టమైన బౌలింగ్కు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన సన్రైజర్స్... గత సీజన్లో విధ్వంసక బ్యాటింగ్తో రికార్డులు తిరగరాసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ నుంచి మొదలు పెట్టుకొని కెప్టెన్ కమిన్స్ వరకు ప్రతి ఒక్కరూ దూకుడుగా ఆడేవాళ్లు ఉండటం రైజర్స్కు కలిసి రానుండగా... సీజన్ ఆరంభ మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి. గత ఏడాది మ్యాచ్ మ్యాచ్కు మరింత రాటుదేలుతూ అరాచకం సృష్టించిన రైజర్స్ బ్యాటర్లు... ఈ సీజన్లో తొలి మ్యాచ్ నుంచే జోరు కనబర్చాలని తహతహలాడుతున్నారు. ప్రాక్టీస్ సెషన్లలో హెడ్, క్లాసెన్, అభిషేక్, నితీశ్ వంతులు వేసుకొని మరి భారీ షాట్లు సాధన చేశారు. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్లో సన్రైజర్స్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. వేలంలో కొత్తగా తీసుకున్న ఇషాన్ కిషన్ రాకతో రైజర్స్ బ్యాటింగ్ మరింత పదునెక్కింది. గతేడాది ఒకటికి మూడుసార్లు 250 పైచిలుకు పరుగులు చేసిన రైజర్స్... ఈ సారి 300 మార్క్ అందుకోవాలనే లక్ష్యంతో కనిపిస్తోంది. గాయం నుంచి కోలుకున్న ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మిడిలార్డర్లో కీలకం కానున్నాడు. మరోవైపు వేలి గాయంతో ఇబ్బంది పడుతున్న రాజస్తాన్ రాయల్స్ రెగ్యులర్ కెప్టెన్ సంజూ సామన్స్ ఈ మ్యాచ్లో కేవలం ప్లేయర్గా బరిలోకి దిగనున్నాడు. సీజన్ తొలి మూడు మ్యాచ్లకు సామ్సన్ స్థానంలో రియాన్ పరాగ్ రాయల్స్కు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. సామ్సన్ ఇంపాక్ట్ ప్లేయర్గా... స్వదేశీ ఆటగాళ్ల నైపుణ్యంపైనే ప్రధానంగా ఆధారపడుతున్న రాజస్తాన్ రాయల్స్కు... రెగ్యులర్ కెప్టెన్ సంజూ సామ్సన్ గాయం ఇబ్బంది పెడుతోంది. అతడు కేవలం బ్యాటర్గా మాత్రమే బరిలోకి దిగనున్నాడు. అంటే ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అతడి స్థానంలో రియాన్ పరాగ్ జట్టును నడిపించనుండగా... ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు అందుకోనున్నాడు. యశస్వి జైస్వాల్, సామ్సన్, నితీశ్ రాణా, పరాగ్, ధ్రువ్ జురేల్ ఇలా టాప్–5లో స్వదేశీ ఆటగాళ్లే బ్యాటింగ్ చేయనున్నారు. మిడిలార్డర్లో విండీస్ హిట్టర్ హెట్మైర్ కీలకం కానుండగా... ఆర్చర్, తీక్షణ, వనిందు హసరంగ బౌలింగ్ భారం మోయనున్నారు. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్న రైజర్స్ బ్యాటింగ్ లైనప్ను రాయల్స్ బౌలింగ్ దళం ఎలా అడ్డుకుంటుందనే దానిపైనే ఈమ్యాచ్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. బ్యాటింగ్ బలంగా... ఇంటా బయటా అనే తేడా లేకుండా గతేడాది బరిలోకి దిగిన ప్రతి మ్యాచ్లో పరుగుల వరద పారించిన సన్రైజర్స్... ముఖ్యంగా ఉప్పల్లో ఊచకోత సాగించింది. లక్నో సూపర్ జెయింట్స్తో పోరులో ఆ జట్టు నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఆరెంజ్ ఆర్మీ 9.4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండానే ఛేదించి సంచలనం సృష్టించింది.ఓపెనర్లు అభిషేక్ శర్మ, హెడ్ బంతిపై పగబట్టినట్లు విజృంభిస్తుండటం రైజర్స్కు ప్రధాన బలం కాగా... ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్తో కూడిన మిడిలార్డర్ జట్టుకు మరింత బలాన్నిస్తోంది. అయితే ఫ్రాంఛైజీ తరఫున తొలిసారి బరిలోకి దిగనున్న అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనేది ఆసక్తికరం. గాయం కారణంగా శ్రీలంకతో పర్యటనతో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఆ్రస్టేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్... గాయం నుంచి కోలుకొని జట్టును నడిపించేందుకు సిద్ధమయ్యాడు. పేస్ బౌలింగ్లో మొహమ్మద్ షమీ, హర్షల్ పటేల్ కీలకం కానుండగా, ఆడమ్ జంపా స్పిన్ బాధ్యతలు మోయనున్నాడు. తుది జట్లు (అంచనా) సన్రైజర్స్ హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, షమీ, జాంపా. రాజస్తాన్ రాయల్స్: రియాన్ పరాగ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సంజూ సామ్సన్, నితీశ్ రాణా, ధ్రువ్ జురెల్, హెట్మైర్, హసరంగ, శుభమ్ దూబే, ఆర్చర్, తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్ పాండే. పిచ్, వాతావరణం గతేడాది ఉప్పల్లో జరిగిన మ్యాచ్ల్లో పరుగుల వరద పారింది. మొత్తం 13 మైదానాల్లో ఐపీఎల్ మ్యాచ్లు జరగగా... అందులో రెండో అత్యధికం (ఓవర్కు 10.54 పరుగులు) హైదరాబాద్లో నమోదైంది. ఈసారి కూడా అందుకు భిన్నంగా ఉండకపోవచ్చు. మ్యాచ్కు వర్ష సూచన లేదు. చెన్నై X ముంబైసాయంత్రం గం. 7:30 నుంచిచెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. లీగ్లో అత్యంత విజయవంతమైన జట్లుగా చెరో ఐదు సార్లు ట్రోఫీలు గెలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చెపాక్ వేదికగా ఆదివారం రెండో మ్యాచ్ జరగనుంది. గాయం కారణంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, నిషేధం కారణంగా హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్కు అందుబాటులో లేకపోగా... సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టును నడిపించనున్నాడు. రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రికెల్టన్, నమన్ ధిర్తో ముంబై బ్యాటింగ్ బలంగానే ఉంది. బౌలింగ్లో ట్రెంట్ బౌల్ట్ అనుభవం ముంబైకి ప్రధానాయుధం కాగా... దీపక్ చాహర్, కరణ్ శర్మ, సాంట్నర్, ముజీబ్ ఉర్ రహమాన్ మిగిలిన బాధ్యతలు చూసుకోనున్నారు. మరోవైపు ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్ సుదీర్ఘ విరామం తర్వాత చెన్నై జట్టులో తిరిగి చేరాడు. చెపాక్ లాంటి స్లో పిచ్పై అశ్విన్, జడేజా, నూర్ అహ్మద్ను ఎదుర్కోవడం కష్టమైన పనే. ఎప్పట్లాగే మహేంద్ర సింగ్ ధోని వికెట్ల వెనుక నుంచి చెన్నై జట్టుకు దిశానిర్దేశం చేయనుండగా... బ్యాటింగ్లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కాన్వే, రాహుల్ త్రిపాఠి, శివమ్ దూబే, స్యామ్ కరన్, జడేజా కీలకం కానున్నారు. గత సీజన్లో ఎక్కువ శాతం బ్యాటింగ్కు రాని ధోని ఈ సారి బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వస్తాడా చూడాలి. ఇరు జట్ల మధ్య చివరగా జరిగిన ఐదు మ్యాచ్ల్లో నాలుగింట చెన్నై విజయం సాధించింది. గత సీజన్లో పేలవ ప్రదర్శనతో పట్టిక అట్టడుగు స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్ను తాజాగా ప్రారంభించాలని చూస్తోంది. -
సీఎస్కే, ఢిల్లీ కాదు.. ప్లే ఆఫ్స్కు చేరే జట్లు ఇవే: డివిలియర్స్
ఐపీఎల్-2025 సీజన్కు కౌంట్డౌన్ మొదలైంది. మరో 24 గంటల్లో ఈ మెగా ఈవెంట్కు తేరలేవనుంది. శనివారం ఈడెన్గార్డెన్స్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.కాగా ఈ టోర్నీ ఆరంభానికి సమయం దగ్గరపడుతుండడంతో మాజీ క్రికెటర్లు ప్లే ఆఫ్స్ చేరే జట్లు, టైటిల్ విజేతగా నిలిచే జట్టును అంచనా వేస్తున్నారు. ఈ జాబితాలోకి తాజాగా దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ చేరాడు. ఈ ఏడాది సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరే నాలుగు జట్లను డివిలియర్స్ ప్రిడక్ట్ చేశాడు.గతంలో తను ప్రాతినిథ్యం వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు పాటు ముంబై ఇండియన్స్ (MI), గుజరాత్ టైటాన్స్ (GT), డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్రైడర్స్ (KKR) ప్లే ఆఫ్స్కు చేరుతాయని ఏబీడీ జోస్యం చెప్పాడు."ముంబై ఇండియన్స్ జట్టు చాలా పటిష్టంగా కన్పిస్తోంది. ఈసారి ముంబై ఇండియన్స్ కచ్చితంగా ప్లే ఆఫ్స్కు చేరుకుంటుంది. ఆర్సీబీ కూడా టాప్-4లో నిలుస్తోంది. ఆర్సీబీ జట్టు అన్ని విభాగాల్లో సమతుల్యంగా ఉంది. ఆపై గుజరాత్ టైటాన్స్ కూడా తమ ప్లే ఆఫ్ బెర్త్ను ఖారారు చేసుకుంటుందని భావిస్తున్నాను.ఈ మూడు జట్లతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ కెకెఆర్ కూడా ప్లేఆఫ్ రేసులో ఉంటుంది" అని స్పోర్ట్స్ టాక్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా డివిలియర్స్ ఎంచుకున్న జట్లలో ఐదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్కింగ్స్ లేకపోవడం అభిమానులు ఆశ్చర్యపరిచింది. కాగా గతేడాది సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని సీఎస్కే గ్రూపు స్టేజికే పరిమితమైంది.చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ విధ్వంసం.. 37 బంతుల్లో సెంచరీ -
‘ఈసారి విజేతగా ఆ జట్టే.. సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే’
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా క్రికెట్ టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వినోదం పంచేందుకు సిద్ధమైంది. రెండు నెలలకు పైగా నిర్విరామంగా క్రికెట్ ప్రేమికులకు పొట్టి క్రికెట్ మజా అందించనుంది. ఐపీఎల్-2025 మార్చి 22న మొదలై.. మే 25న ఫైనల్తో ముగియనుంది.గతేడాది.. కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో వరుసగా ఒకటి నుంచి పది స్థానాల్లో నిలిచిన విషయం తెలిసిందే.పది జట్లలో భారీ మార్పులువీటిలో కోల్కతా- హైదరాబాద్ ఫైనల్లో తలపడగా.. రైజర్స్పై నైట్ రైడర్స్ విజయం సాధించి చాంపియన్గా నిలిచింది. ఇక ఏడాది ఈ పది జట్లలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. మెగా వేలం-2025 నేపథ్యంలో ఐదు జట్ల కెప్టెన్లూ మారారు. లక్నోకు రిషభ్ పంత్, పంజాబ్కు శ్రేయస్ అయ్యర్, ఢిల్లీకి అక్షర్ పటేల్, బెంగళూరుకు రజత్ పాటిదార్, కోల్కతాకు అజింక్య రహానే సారథులుగా నియమితులయ్యారు.అత్యధికంగా పదికి 9 పాయింట్లుఈ పరిణామాల నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఐపీఎల్-2025లో పది జట్లకు తనదైన శైలిలో రేటింగ్ ఇచ్చాడు. అదే విధంగా.. ప్లే ఆఫ్స్ చేరే జట్లు, విజేతపై తన అంచనా తెలియజేశాడు. గుజరాత్ టైటాన్స్ జట్టుకు అత్యధికంగా పదికి 9 పాయింట్లు ఇచ్చిన మైకేల్ వాన్.. అతి తక్కువగా ఢిల్లీ క్యాపిటల్స్కు 5 పాయింట్లు వేశాడు.అయితే, గతేడాది పేలవ ప్రదర్శన కనబరిచిన పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్కు ఏడేసి పాయింట్లు ఇవ్వడం విశేషం. ఇక 2024లో పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి అట్టడుగున నిలిచిన ముంబై ఇండియన్స్కు ఏకంగా 7.5 రేటింగ్ ఇవ్వడం గమనార్హం. అన్ని జట్ల కంటే ఈసారి గుజరాత్ టైటాన్స్ గొప్పగా ఉందన్న మైకేల్ వాన్.. ఆ జట్టును తొమ్మిది పాయింట్లతో టాప్లో నిలిపాడు.ఇక గతేడాది ఫైనలిస్టు అయిన సన్రైజర్స్ హైదరాబాద్కు 6.5 పాయింట్లే ఇచ్చిన వాన్.. ఈసారి ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు చాలా తక్కువని అభిప్రాయపడ్డాడు. నాలుగో స్థానం కోసం ఎస్ఆర్హెచ్.. పంజాబ్, లక్నోలతో పోటీ పడుతుందని అంచనా వేశాడు. ఈసారి ముంబై ఇండియన్స్ చాంపియన్గా నిలవడం ఖాయమని వాన్ జోస్యం చెప్పాడు. ఈ మేరకు క్రిక్బజ్తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఐపీఎల్-2025 జట్లకు మైకేల్ వాన్ ఇచ్చిన రేటింగ్(పది పాయింట్లకు)👉గుజరాత్ టైటాన్స్- 9👉కోల్కతా నైట్ రైడర్స్- 8👉లక్నో సూపర్ జెయింట్స్- 7👉పంజాబ్ కింగ్స్- 7👉సన్రైజర్స్ హైదరాబాద్- 6.5👉రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- 6.5👉రాజస్తాన్ రాయల్స్- 6.5👉చెన్నై సూపర్ కింగ్స్- 6👉ఢిల్లీ క్యాపిటల్స్- 5.మైకేల్ వాన్ ఎంచుకున్న టాప్-4 జట్లు(ప్లే ఆఫ్స్)గుజరాత్, కోల్కతా, ముంబై ఇండియన్స్ టాప్-3లో ఉండగా.. నాలుగో స్థానం కోసం లక్నో, పంజాబ్, సన్రైజర్స్ పోటీ.విజేతపై మైకేల్ వాన్ అంచనాఈసారి ముంబై ఇండియన్స్ ట్రోఫీ గెలిచే అవకాశం.చదవండి: CT 2025: టీమిండియాకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ -
మానసిక వేదన.. అయినా తట్టుకున్నాడు.. సింహంలా తిరిగొచ్చాడు!
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)పై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించాడు. అవమానాలను దిగమింగుకుని.. సింహంలా అతడు తిరిగి వచ్చాడని కొనియాడాడు. మానసికంగా తనను వేదనకు గురిచేసినా.. అద్భుత ప్రదర్శనతో తన విలువను చాటుకున్నాడని.. భారత్ రెండు ఐసీసీ టైటిళ్లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడని ప్రశంసించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో సరికొత్త హార్దిక్ పాండ్యాను చూడబోతున్నారని.. ముంబై ఇండియన్స్ను అతడు ఈసారి ప్లే ఆఫ్స్లో నిలుపుతాడని కైఫ్ ధీమా వ్యక్తం చేశాడు. అవహేళనలుకాగా గతేడాది హార్దిక్ ముంబై ఇండియన్స్ సారథిగా ఎంపికైన విషయం తెలిసిందే. ముంబైకి ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మ (Rohit Sharma)ను కాదని.. హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. సొంత మైదానం వాంఖడేలోనూ అతడిని దూషిస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. హార్దిక్ కనిపిస్తే చాలు అవహేళనలతో అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా ప్రవర్తించారు.ఈ క్రమంలో ముంబై గతేడాది పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. దీంతో హార్దిక్ కెప్టెన్సీపై మరోసారి విమర్శలు తీవ్రమయ్యాయి. అయితే, ఈ చేదు అనుభవాల నుంచి త్వరగానే కోలుకున్న హార్దిక్ పాండ్యా.. టీ20 ప్రపంచకప్-2024లో సత్తా చాటాడు. జట్టు చాంపియన్గా నిలవడంలో కీలకంగా వ్యవహరించాడు.అంతేకాదు.. తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా టైటిల్ గెలవడంలోనూ హార్దిక్ది కీలక పాత్ర. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్.. హార్దిక్ పాండ్యా బయోపిక్ గనుక తెరకెక్కితే గత ఏడాది కాలం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని వ్యాఖ్యానించాడు.పంటిబిగువన భరిస్తూ.. ‘‘మనసుకైన గాయాలను పంటిబిగువన భరిస్తూ.. అతడు ముందుకు సాగాడు. అభిమానులే అతడిని హేళన చేశారు. కొంతమంది అతడి గురించి చెడుగా ఆర్టికల్స్ రాశారు. ఓ ఆటగాడిగా ఇన్ని బాధలను భరిస్తూ ముందుకు సాగడం అంత తేలికైన విషయం కాదు.అతడు ఆ నొప్పిని మర్చిపోలేడు. జట్టు నుంచి తప్పిస్తే ఆ బాధ కొన్నాళ్లే ఉంటుంది. కానీ.. అభిమానులే ఇంతలా అవమానిస్తే తట్టుకోవడం కష్టం. ఓ ఆటగాడికి ఇంతకంటే మానసిక వేదన మరొకటి ఉండదు. సింహంలా పోరాడి గెలిచాడుఅయితే, అతడు కుంగిపోలేదు. సింహంలా పోరాడి గెలిచాడు. టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో హెన్రిచ్ క్లాసెన్ వంటి విధ్వంసకర వీరుడిని అవుట్ చేశాడు. చాంపియన్స్ ట్రోఫీలో జంపా బౌలింగ్లో సిక్సర్లు బాదాడు.బంతితో, బ్యాట్తో రాణించి భారత్ గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. ఒకవేళ అతడి బయోపిక్ తీస్తే.. గత ఏడాది కాలం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. సవాళ్లను, గడ్డు పరిస్థితులను అధిగమించి ఎలా ముందుకు సాగాలో తెలుస్తుంది. పాండ్యా తన బలాన్ని గుర్తించాడు. అందుకే ఇంత గొప్పగా పునరాగమనం చేశాడు. ఐపీఎల్-2025లో అతడు ముంబైని తప్పక ప్లే ఆఫ్స్ చేరుస్తాడు’’ అని కైఫ్ హిందుస్తాన్ టైమ్స్తో వ్యాఖ్యానించాడు.కాగా మార్చి 22న ఐపీఎల్ పద్దెనిమిదవ ఎడిషన్ ప్రారంభం కానుండగా.. ఆ మరుసటి రోజు ముంబై తమ తొలి మ్యాచ్ ఆడనుంది. మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్ను ఢీకొట్టనుంది. అయితే, గతేడాది స్లో ఓవర్ రేటు కారణంగా హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్కు దూరం కానున్నాడు. దీంతో అతడి స్థానంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.చదవండి: CT 2025: టీమిండియాకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ -
ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టం: హార్దిక్ పాండ్యా
జట్టులో ‘ముగ్గురు కెప్టెన్ల’ను కలిగి ఉండటం తనకు అదనపు బలమని ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా (Hardik Pandya) హర్షం వ్యక్తం చేశాడు. భిన్న ఫార్మాట్లలో టీమిండియాను ముందుకు నడిపించిన వ్యక్తుల నుంచి తాను తప్పక సలహాలు, సూచనలు తీసుకుంటానని పేర్కొన్నాడు. అంతిమంగా జట్టును విజేతగా నిలపడమే తమ లక్ష్యమని హార్దిక పాండ్యా పేర్కొన్నాడు.ఈసారి తాను రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నానన్న హార్దిక్ పాండ్యా... ఈసారి అభిమానుల నుంచి సానుకూల స్పందన మాత్రమే కోరుకుంటున్నానని తెలిపాడు. కెప్టెన్గా సూర్యకాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పద్దెనిమిదవ ఎడిషన్ మార్చి 22 నుంచి ఆరంభం కానున్న విషయం తెలిసిందే. కోల్కతా నైట్ రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్తో ఈ మెగా ఈవెంట్కు తెరలేవనుండగా.. ముంబై మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.అయితే, గతేడాది స్లో ఓవర్ రేటు కారణంగా హార్దిక్ పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం పడగా.. ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ ముంబై కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన పాండ్యా.. ఈ ఏడాది తాము కచ్చితంగా అనుకున్న ఫలితాన్ని రాబడతామని ధీమా వ్యక్తం చేశాడు.రోజురోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గదు‘‘నేను చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. అప్పుడు కూడా గెలుస్తామనే నేను విశ్వసించాను. అయితే, నేను ఇటీవలే చాంపియన్స్ ట్రోఫీలో ఆడాను. నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది, కాన్ఫిడెన్స్ గురించి నన్ను అడిగితే.. రోజురోజుకూ అది పెరుగుతుందే తప్ప తగ్గదు.ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టంఇక మా జట్టులో నాతో పాటు మరో ముగ్గురు కెప్టెన్లు ఉండటం ఒక రకంగా నా అదృష్టం అని చెప్పాలి. నాకు అవసరమైనపుడు వారి అనుభవాన్ని ఉపయోగించుకుంటా. టీమిండియాను మూడు ఫార్మాట్లలో భిన్న రీతిలో నడిపించిన వారి అనుభవం నాకు కచ్చితంగా అదనపు బలమే.నాకు వారు ఎల్లవేళలా మద్దతుగా ఉంటారు. క్లిష్ట పరిస్థితుల్లో నా భుజం తట్టి నన్ను ముందుకు నడిపిస్తారు. మేమంతా కలిసి అనుకున్న రీతిలో జట్టును ముందుకు తీసుకువెళ్తాం’’ అని హార్దిక్ పాండ్యా బుధవారం నాటి మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.కాగా టీమిండియా వన్డే, టెస్టు సారథి రోహిత్ శర్మతో పాటు.. టెస్టుల్లో రోహిత్ గైర్హాజరీలో కెప్టెన్గా వ్యవహరిస్తున్న జస్ప్రీత్ బుమ్రా.. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.ముంబై రంగులు తప్ప ఇంకేమీ కనిపించవద్దుఇదిలా ఉంటే.. ముంబై అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘నేను టాస్ కోసం వెళ్లినపుడు.. బ్యాటింగ్కి వెళ్లినపుడు నన్ను చీర్ చేయండి. సిక్సర్ బాదితే గట్టిగా అరవండి. వాంఖడే స్టేడియంలో నాకు ముంబై రంగులు తప్ప ఇంకేమీ కనిపించవద్దు’’ అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. కాగా ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మను తప్పించి ముంబై ఫ్రాంఛైజీ గతేడాది పాండ్యాకు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.అయితే, అతడి రాకతో రోహిత్, బుమ్రా, సూర్య అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. ముంబై గతేడాది దారుణంగా విఫలమైన నేపథ్యంలో.. ఆటగాళ్ల మధ్య సమన్వయ లోపమే ఇందుకు కారణమనే విమర్శలు వచ్చాయి. గతేడాది ముంబై పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలిచింది. చదవండి: BCCI: విరాట్ కోహ్లి ఘాటు విమర్శలు.. స్పందించిన బీసీసీఐ -
IPL 2025: పీసీబీ ధమ్కీలకు బెదరని ముంబై ఇండియన్స్ బౌలర్
సౌతాఫ్రికా పేసర్ కార్బిన్ బాష్.. ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ నుంచి ఆఫర్ రావడంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు బాష్కు లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై బాష్ తాజాగా స్పందించాడు. పీసీబీ అధికారుల ధమ్కీలకు వివరణ ఇస్తూ ఇలా అన్నాడు. తన నిర్ణయం పీఎస్ఎల్ను అగౌరవపరచాలని కాదు. ముంబై ఇండియన్స్ బలమైన ఐపీఎల్ జట్టు మాత్రమే కాకుండా అనేక ఇతర లీగ్లలో ఫ్రాంచైజీలు కలిగి ఉంది. ఇలాంటి జట్టు ఆఫర్ను వదులుకుంటే నా భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుంది. అందుకే ఐపీఎల్ ఆఫర్కు ప్రాధాన్యత ఇచ్చాను. ఈ ఆఫర్ నా కెరీర్కు గణనీయమైన ప్రయోజనం చేకూరుస్తుందంటూ వివరణలో పేర్కొన్నాడు. బాష్ వివరణ తర్వాత కూడా పీసీబీ అతనిపై ఐపీఎల్ తరహాలో రెండేళ్లు నిషేధం విధించాలని భావించింది. అయితే ఇలా చేస్తే వచ్చే ఒకరిద్దరు విదేశీ స్టార్లు కూడా పీఎస్ఎల్కు రారని వెనక్కు తగ్గింది.కాగా, ముంబై ఇండియన్స్ నుంచి ఆఫర్ రాకముందు బాష్ను పీఎస్ఎల్ ఫ్రాంచైజీ పెషావర్ జల్మీ వేలంలో కొనుగోలు చేసింది. వాస్తవానికి బాష్ మొదటి నుంచి ఐపీఎల్కే ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే తొలుత వేలంలో బాష్ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. సహచరుడు లిజాడ్ విలియమ్స్ గాయపడటంతో బాష్కు ముంబై ఇండియన్స్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో అతను తప్పనిసరి పరిస్థితుల్లో పీఎస్ఎల్ ఆఫర్కు నో చెప్పాడు.వాస్తవంగా ఈ రాద్దాంతం జరగడానికి పాక్ క్రికెట్ బోర్డే కారణం. ఎప్పుడూ ఐపీఎల్తో క్లాష్ కాకుండా షెడ్యూల్ తయారు చేసుకునే పీఎస్ఎల్.. ఈసారి ఐపీఎల్తో పోటీ పడి ఐపీఎల్ డేట్స్లోనే షెడ్యూల్ను ఫిక్స్ చేసుకుంది. దీంతో పీఎస్ఎల్కు ఎంపికైన వారు (విదేశీ ఆటగాళ్లు) ఐపీఎల్లో ఆడటానికి వీలుండదు. ఐపీఎల్లో ఆడితే పీఎస్ఎల్కు పోలేరు. ఈ యేడు పీఎస్ఎల్ విషయంలో పీసీబీ తీసుకున్న నిర్ణయం కారణంగా చాలా మంది విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్వైపే మొగ్గు చూపారు. ఐపీఎల్లో అయితే డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు వస్తాయని వారి భావన. ఐపీఎల్తో క్లాష్ కావడంతో ఈ సారి పీఎస్ఎల్లో విదేశీ మెరుపులు కనిపించవు. లోకల్ ఆటగాళ్లతోనే పాక్ లీగ్ తూతూ మంత్రంగా జరుగనుంది. పీఎస్ఎల్-2025 సీజన్ ఏప్రిల్ 11 నుండి మే 25 వరకు జరగనుండగా.. ఐపీఎల్ 2025 మార్చి 22 నుండి మే 25 వరకు జరుగుతుంది.సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన కార్బిన్ బాష్ ఫైవ్ టైమ్ ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్తో జతకట్టక ముందు ఆ ఫ్రాంచైజీ యాజమాన్యానికి చెందిన ఎంఐ కేప్టౌన్కు (సౌతాఫ్రికా టీ20 లీగ్) ఆడాడు. ఈ సీజన్లో (2025) ఎంఐ కేప్టౌన్ ఛాంపియన్గా అవతరించింది. ఈ సీజన్లో బాష్ 8 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీసి ఎంఐ కేప్టౌన్ తొలి టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.ఇదిలా ఉంటే, మరో మూడు రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్-2025 ఎడిషన్లో ముంబై తమ తొలి మ్యాచ్ను మార్చి 23న ఆడుతుంది. చెన్నైలో జరిగే ఆ మ్యాచ్లో ముంబై సీఎస్కేను ఢీకొంటుంది.ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్..రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార యాదవ్, నమన్ ధిర్, బెవాన్ జాకబ్స్, రాజ్ బవా, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజ్ఞేశ్ పుథుర్, సత్యనారాయణ రాజు, కార్బిన్ బాష్, మిచెల్ సాంట్నర్, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, కృష్ణణ్ శ్రీజిత్, రాబిన్ మింజ్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ -
IPL 2025: ముంబై ఇండియన్స్ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మార్చి 23న జరుగనుంది. ఆ రోజు డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగనుండగా.. ఎంఐ, సీఎస్కే మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తమ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సేవలు కోల్పోనుంది. గత సీజన్లో చేసిన తప్పుల కారణంగా హార్దిక్ సీఎస్కేతో మ్యాచ్కు దూరం కానున్నాడు. గత సీజన్లో ముంబై ఇండియన్స్ మూడు మ్యాచ్ల్లో స్లో ఓవర్ రేట్తో బౌలింగ్ చేసింది.దీంతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ముంబై కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యాకు రూ.30 లక్షల జరిమానాతో పాటు ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించింది. గత సీజన్లో ముంబై గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో హార్దిక్పై నిషేధం సాధ్యం కాలేదు. ఈ క్రమంలో ఈ సీజన్లో తొలి మ్యాచ్లోనే అతను నిషేధం ఎదుర్కొంటున్నాడు.హార్దిక్ గైర్హాజరీలో ముంబై ఇండియన్స్ తాత్కాలిక సారధిగా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇవాళ (మార్చి 19) స్వయంగా ప్రకటించాడు. సూర్యకుమార్కు భారత టీ20 జట్టు కెప్టెన్గా అనుభవం ఉండటంతో ఎంఐ మేనేజ్మెంట్ అతనికే సారథ్య బాధ్యతలు కట్టబెట్టింది.కాగా, ముంబై ఇండియన్స్ను ఐదు సార్లు ఛాంపియన్గా నిలబెట్టిన రోహిత్ శర్మ కెప్టెన్సీపై అయిష్టతతో 2023 సీజన్ తర్వాత తప్పుకున్న విషయం తెలిసిందే. మరో సీనియర్ ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నాడని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సీనియర్లలో ఒకరైన సూర్యకుమార్కే సీఎస్కేతో మ్యాచ్లో ముంబై కెప్టెన్గా వ్యవహరించే అవకాశం వచ్చింది.టీ20ల్లో సూర్య కుమార్ యాదవ్కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. స్కై సారథ్యంలో భారత్ 18 మ్యాచ్ల్లో కేవలం నాలుగింట మాత్రమే ఓడింది. ఓవరాల్గా స్కై 39 టీ20 మ్యాచ్ల్లో సారథ్యం వహించి 28 మ్యాచ్ల్లో తన జట్టును గెలిపించుకున్నాడు. స్కై.. గతంలోనూ ఓ సందర్భంలో (2023 సీజన్లో) ముంబై ఇండియన్స్ కెప్టెన్గా వ్యవహరించాడు. స్కై తన కెప్టెన్సీలో బ్యాటర్గానూ విశేషంగా రాణించాడు. 37 ఇన్నింగ్స్ల్లో సెంచరీ, 8 హాఫ్ సెంచరీల సాయంతో 164.56 స్ట్రయిక్రేట్తో 1068 పరుగులు చేశాడు.కాగా, ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ దేశీయ స్టార్లపై ఆధారపడి ఉంది. మెగా వేలానికి ముందు ఆ జట్టు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాను రీటైన్ చేసుకుంది. మెగా వేలంలోనూ ఆ జట్టు పెద్దగా విదేశీ స్టార్ల కోసం పాకులాడలేదు.విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, కార్బిన్ బాష్, ర్యాన్ రికెల్టన్ లాంటి ఆటగాళ్లు కొత్తగా జట్టులోకి చేర్చుకుంది. ఈసారి జట్టులోకి వచ్చిన ట్రెంట్ బౌల్ట్కు గతంలో ముంబై ఇండియన్స్తో అనుబంధం ఉంది. మెగా వేలంలో దక్కించుకున్న రీస్ టాప్లే గాయం కారణంగా ఈ సీజన్కు దూరమయ్యాడు. దేశీయ పేసర్ దీపక్ చాహర్ను ముంబై సీఎస్కేతో పోటీపడి దక్కించుకుంది.ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్..హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, నమన్ ధిర్, సూర్యకుమార్ యాదవ్, బెవాన్ జాకబ్స్, రాజ్ భవా, విల్ జాక్స్, విజ్ఞేశ్ పుథుర్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, సత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, రాబిన్ మింజ్, కృష్ణణ్ శ్రీజిత్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్, రీస్ టాప్లే, కర్ణ్ శర్మ, దీపర్ చాహర్, ముజీబ్ రెహ్మాన్ -
‘సిక్సర్’ కొట్టేదెవరో?
ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా గుర్తింపు... హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించిన ఫ్రాంచైజీగా రికార్డు... నైపుణ్యాన్ని వలవేసి పట్టే నేర్పరితనం... యువ ఆటగాళ్లకు అండగా నిలిచే యాజమాన్యం... వెరసి ఐపీఎల్ టోర్నీ చరిత్రలో 5 ట్రోఫీలు సాధించిన ముంబై ఇండియన్స్ జట్టు గత కొన్నాళ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతోంది. రోహిత్ శర్మ నుంచి సారథ్య బాధ్యతలు హార్దిక్ పాండ్యాకు అప్పగించడంతో జట్టులో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అభిమానుల అసహనం, మాజీల రుసరుసలు, విశ్లేషకులు వెటకారాలతో గత సీజన్ గడిచిపోగా... 2024 ఐపీఎల్ తర్వాత భారత జట్టుకు రోహిత్ శర్మ 2 ఐసీసీ ట్రోఫీలు అందించాడు. ఈ రెండింట్లో హార్దిక్ కీలకపాత్ర పోషించడంతో సమస్య సమసిపోయినట్లైంది. మరి ఈ ఏడాదైనా ముంబై సమష్టిగా సత్తాచాటి మునుపటి జోరు సాగిస్తుందా చూడాలి! ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు ఏదైనా ఉందంటే... అది ముమ్మాటికీ చెన్నై సూపర్ కింగ్సే! ఇప్పటి వరకు 15 సీజన్లు ఆడిన చెన్నై జట్టు అందులో 10 సార్లు ఫైనల్కు చేరి ఐదుసార్లు ట్రోఫీ చేజిక్కించుకుంది. ఈ గణాంకాలు చాలు ఐపీఎల్లో చెన్నై జోరు ఏంటో చెప్పేందుకు. వికెట్ల వెనక ధోని మాయాజాలం... కాన్వే, రచిన్ రవీంద్ర బ్యాటింగ్ సామర్థ్యం... శివమ్ దూబే, రవీంద్ర జడేజా ఆల్రౌండ్ మెరుపులు, అశ్విన్, పతిరణ బౌలింగ్ నైపుణ్యం ఇలా అన్నీ విభాగాల్లో పటిష్టంగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్... ఆరో కప్పువేటకు సిద్ధమైంది. –సాక్షి క్రీడావిభాగం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం నుంచి నిలకడ కొనసాగిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు ఆరోసారి ట్రోఫీ చేజిక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. గత కొన్ని సీజన్లుగా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న ముంబై ఇండియన్స్ ఈసారి మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా సాగుతోంది. గత సీజన్ ఆరంభానికి ముందు ఫ్రాంచైజీకి ఐదు ట్రోఫీలు (2013, 2015, 2017, 2019, 2020) అందించిన ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మను కాదని... గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను తీసుకొచ్చి సారథ్య బాధ్యతలు అప్పగించడం అభిమానులకు ఏమాత్రం రుచించలేదు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ముంబై ఇండియన్స్ నిర్ణయాన్ని దుమ్మెత్తిపోసిన అభిమానులు... మైదానంలో హార్దిక్ను గేలి చేశారు. సొంత మైదానం వాంఖడేతో పాటు... దేశంలో ఎక్కడ మ్యాచ్ ఆడేందుకు వెళ్లినా... పాండ్యాకు ఇదే అనుభవం ఎదురైంది. దీంతో సహజంగానే డ్రెస్సింగ్రూమ్ వాతావరణం దెబ్బతింది. అదే మైదానంలో ప్రస్ఫుటమైంది. గత సీజన్లో 14 మ్యాచ్లాడిన ముంబై ఇండియన్స్ జట్టు కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి 10 పరాజయాలతో పట్టికలో అట్టడుగున నిలిచింది. గత నాలుగు సీజన్లలో ఒక్కసారి (2023లో) మాత్రమే ముంబై జట్టు ప్లే ఆఫ్స్కు చేరింది. 2022, 2024లో పట్టికలో కింది స్థానంతో లీగ్ను ముగించింది. అయితే అప్పటికీ ఇప్పటికీ జట్టులో ఎంతో తేడా కనిపిస్తోంది. ఏడాది వ్యవధిలో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఐసీసీ టి20 ప్రపంచకప్తో పాటు, చాంపియన్స్ ట్రోఫీ చేజిక్కించుకుంది. ఈ రెండు విజయాల్లోనూ కీలకంగా నిలిచిన హార్దిక్ పాండ్యాను అభిమానులు తిరిగి అక్కున చేర్చుకున్నారు. దీనికి తోడు రోహిత్ వంటి అనుభవజ్ఞుడి సలహాలు, సూచనలు ఉంటే... పాండ్యా జట్టును మరింత ముందుకు తీసుకెళ్లడం ఖాయమే. బుమ్రా ఫిట్నెస్ సాధించేనా! ఆ్రస్టేలియా పర్యటన సందర్భంగా గాయపడ్డ భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్పై ముంబై ఆందోళన చెందుతోంది. వెన్నునొప్పితో చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఈ ఏస్ పేసర్... ఐపీఎల్ తొలి దశ మ్యాచ్లకు అందుబాటులో ఉండబోడని ఇప్పటికే ఫ్రాంచైజీ వెల్లడించింది. అయితే అతడి సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే దానిపై స్పష్టత లేదు. గతేడాది వేలంలో బుమ్రా, రోహిత్, హార్దిక్, సూర్యకుమార్తో పాటు హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మను ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. అందులో అత్యధికంగా బుమ్రాకు రూ. 18 కోట్లు కట్టబెట్టింది. యువ ఆటగాడు ఇషాన్ కిషన్ను వేలానికి వదిలేసిన ముంబై... ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, సాంట్నర్తో బౌలింగ్ను మరింత పటిష్టం చేసుకుంది. రోహిత్తో కలిసి దక్షిణాఫ్రికా ప్లేయర్ రికెల్టన్ ఇన్నింగ్స్ను ఆరంభించనున్నాడు. భారత ఆటగాళ్ల విషయంలో పటిష్టంగా కనిపిస్తున్న ముంబై ఇండియన్స్... విదేశీ ఆటగాళ్ల ఎంపిక మాత్రం కాస్త అనూహ్యంగా ఉంది. లోయర్ ఆర్డర్లో ధాటిగా ఆడగల విదేశీ పించ్ హిట్టర్ లోటు కనిపిస్తోంది. రూ.5 కోట్ల 25 లక్షలు వెచ్చించి ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా తిరిగి దక్కించుకున్న నమన్ ధీర్పై భారీ అంచనాలు ఉన్నాయి. బుమ్రా గైర్హాజరీలో బౌల్ట్, సాంట్నర్, దీపక్ చాహర్, కరణ్ శర్మ పై బౌలింగ్ భారం పెరగనుంది. ఆంధ్ర ఆటగాడు పెనుమత్స సత్యనారాయణ రాజు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ జట్టులో ఉన్నా... వారికి మ్యాచ్ ఆడే అవకాశం దక్కడం కష్టమే. ముంబై ఇండియన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్ ), రోహిత్, సూర్యకుమార్, తిలక్, రాబిన్ మిన్జ్, రికెల్టన్, శ్రీజిత్ క్రిష్ణన్, జాకబ్స్, నమన్ ధీర్, జాక్స్, సాంట్నర్, అంగద్ , విఘ్నేశ్, కార్బిన్, బౌల్ట్, కరణ్ శర్మ, దీపక్ చాహర్, అశ్వని కుమార్, టాప్లీ, వెంకట సత్యనారాయణ, అర్జున్ టెండూల్కర్, ముజీబ్, బుమ్రా. అంచనా: ముంబై ఇండియన్స్ ఆటతీరు పరిశీలిస్తే... ఆడితే అందలం, లేకుంటే అట్టడుగు స్థానం అనేది సుస్పష్టం. గత నాలుగు సీజన్లలో కేవలం ఒక్కసారే ప్లే ఆఫ్స్కు చేరిన ముంబై... స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ఈ సారి కూడా ప్లే ఆఫ్స్ చేరొచ్చు. సాధారణ ఆటగాడు సైతం... అసాధారణ ప్రదర్శన చేయడం... అప్పటి వరకు జట్టులో చోటు దక్కడమే కష్టమనుకున్న ప్లేయర్ సైతం... ‘ఎక్స్’ ఫ్యాక్టర్గా మారడం... చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో నిత్యకృత్యం.అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవడంలో చెన్నైని మించిన జట్టు లేదనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటి వరకు 5 సార్లు (2010, 2011, 2018, 2021, 2023) ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకున్న సూపర్ కింగ్స్ మరో 5 సార్లు (2008, 2012, 2013, 2015, 2019) రన్నరప్గా నిలిచింది. గతేడాదే రుతురాజ్ గైక్వాడ్కు సారథ్య బాధ్యతలు అప్పగించిన ఫ్రాంచైజీ... అతడితో పాటు రవీంద్ర జడేజాకు రూ. 18 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకుంది.పతిరణను రూ. 13 కోట్లు, శివమ్ దూబేను రూ. 12 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకుంది. అంతర్జాతీయ మ్యాచ్ ఆడి ఐదేళ్లు దాటిపోయిన మహేంద్రసింగ్ ధోనిని రూ. 4 కోట్లకు కొనసాగించింది. వీరితో పాటు రచిన్ రవీంద్రను రూ. 4 కోట్లతో ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా తిరిగి సొంతం చేసుకుంది. ఇక సుదీర్ఘ కాలం తర్వాత రవిచంద్రన్ అశ్విన్ను తిరిగి కొనుగోలు చేసుకుంది. మరి గత కొంత కాలంగా నిలకడగా రాణించలేకపోతున్న సూపర్ కింగ్స్ ఈసారి ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. తలా... అన్నీ తానై! అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అనంతరం కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోని... ఈసారి కూడా జట్టును ముందుండి నడిపించనున్నాడు. పేరుకు రుతురాజ్ కెప్టెన్ అయినా... వికెట్ల వెనక నుంచి టీమ్కు దిశానిర్దేశం చేసేది ధోనినే అనడంలో సందేహం లేదు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడుతున్న ధోనీ గతేడాది బ్యాటింగ్ ఆర్డర్లో మరీ కింది స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. మరి ఈసారైనా అతని బ్యాట్ నుంచి మెరుపులు వస్తాయోమో చూడాలి. బ్యాటింగ్లో కాన్వే, రచిన్, దూబే, రుతురాజ్, జడేజా, ధోని కీలకం కానుండగా... పతిరణ, అశ్విన్, ఖలీల్ అహ్మద్, స్యామ్ కరన్ బౌలింగ్ బాధ్యతలు మోయనున్నారు. రచిన్, జడేజా, దూబే, దీపక్ హూడా, విజయ్ శంకర్, అశ్విన్, జేమీ ఓవర్టన్, సామ్ కరన్ ఇలా లెక్కకు మిక్కిలి ఆల్రౌండర్లు ఉండటం చెన్నైకి అదనపు బలం. ఆంధ్ర ఆటగాడు షేక్ రషీద్ జట్టులో ఉన్నా... అతడికి మ్యాచ్ ఆడే అవకాశం దక్కుతుందో లేదో వేచి చూడాలి. చెన్నై జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్ ), మహేంద్రసింగ్ ధోని, కాన్వే, రాహుల్ త్రిపాఠి, షేక్ రషీద్, వన్ష్ బేదీ, సిద్ధార్్థ, రచిన్ రవీంద్ర, రవిచంద్రన్ అశ్విన్, విజయ్ శంకర్, స్యామ్ కరన్, అన్షుల్ కంబోజ్, దీపక్ హూడా, జేమీ ఓవర్టన్, కమలేశ్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, ముకేశ్, గుర్జప్నీత్ సింగ్, నాథన్ ఎలీస్, శ్రేయస్ గోపాల్, పతిరణ. అంచనా: ఐపీఎల్లో మిగిలిన జట్లతో పోల్చుకుంటే అత్యధిక మంది ఆల్రౌండర్లు అందుబాటులో ఉన్న చెన్నై స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ఫైనల్ చేరడం పెద్ద కష్టం కాకపోవచ్చు. -
IPL: ‘గతేడాది ముంబై గెలవాల్సింది.. ఈసారీ ఆ జట్టు సూపర్.. కానీ..’
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఆటగాళ్లు ఐకమత్యంగా ఉంటే ఆ జట్టును ఎవరూ ఓడించలేరని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. గతం తాలుకు చేదు అనుభవాలు, భేషజాలను వదిలేసి ‘స్టార్లంతా’ ఒకటిగా ముందుడుగు వేయాలని సూచించాడు. యాజమాన్యం సైతం ఈ విషయంలో మరింత చొరవ చూపాలని భజ్జీ విజ్ఞప్తి చేశాడు.కాగా ఐపీఎల్-2024 (IPL)లో ముంబై ఇండియన్స్ అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాను అందలమెక్కించింది. తమకు ఐదుసార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మ (Rohit Sharma)పై వేటు వేసి.. పాండ్యాను కెప్టెన్ను చేసింది. దీంతో అభిమానులు సైతం ముంబై ఓడిపోవాలని కోరుకుంటూ.. పాండ్యాను తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశారు.ఇక రోహిత్తో పాటు టీమిండియా స్టార్లు జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ కూడా పాండ్యాకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయారనే వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లుగానే మైదానంలో వీరి మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఫలితంగా పద్నాలుగు మ్యాచ్లకు గానూ కేవలం నాలుగే గెలిచిన ముంబై.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది.విభేదాలు పక్కనపెట్టాలిఅయితే, ఈసారి విభేదాలన్నీ పక్కనపెట్టి ముంబై ఆటగాళ్లు గనుక కలిసికట్టుగా ఉంటే విజయం వారిదేనని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘జట్టు ప్రదర్శన ఆధారంగానే కెప్టెన్ పనితీరును అంచనా వేస్తారు.అతడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా ఉన్నపుడు.. జట్టు మొత్తం రాణించింది. టైటిల్ గెలిచింది. అందుకే అతడు మంచి కెప్టెన్ అయ్యాడు. నిజానికి ముంబై జట్టు గతేడాది పటిష్టంగా ఉంది. ట్రోఫీ గెలవాల్సింది కూడా!బౌలింగ్ విభాగంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా.. బ్యాటింగ్లో మాత్రం బలంగా ఉంది. అయినా దారుణంగా ఓడిపోయింది. కలిసికట్టుగా ఉన్న జట్లే విజయం సాధిస్తాయి. గతం గతః.. ఆటగాళ్లు తమ మధ్య ఉన్న విభేదాలు పక్కనపెట్టాలి. ఈసారి ముంబై జట్టు మిగతా జట్ల కంటే పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వారికి అద్భుతమైన బ్యాటర్లు ఉన్నారు. సరికొత్తగా ఈ సీజన్ను ఆరంభించి సమిష్టిగా రాణిస్తే జట్టుకు ఎదురే ఉండదు’’ అని భజ్జీ చెప్పుకొచ్చాడు.ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ జట్టు- వారి ధరజస్ప్రీత్ బుమ్రా (రూ. 18 కోట్లు), హార్దిక్ పాండ్యా (కెప్టెన్- రూ.16.35 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ. 16.35 కోట్లు), రోహిత్ శర్మ (రూ. 16.30 కోట్లు), తిలక్ వర్మ (రూ. 8 కోట్లు) , ట్రెంట్ బౌల్ట్ (రూ.12.50 కోట్లు), దీపక్ చహర్ (రూ. 9.25 కోట్లు), నమన్ ధీర్ (రూ.5.25 కోట్లు), విల్ జాక్స్ (రూ.5.25 కోట్లు), ఘజన్ఫర్ (రూ. 4.80 కోట్లు- గాయం వల్ల దూరం- అతడి స్థానంలో ముజీబ్ ఉర్ రెహమాన్)..మిచెల్ సాంట్నర్ (రూ. 2 కోట్లు), ర్యాన్ రికెల్టన్ (రూ. 1 కోటి), రీస్ టోప్లే (రూ. 75 లక్షలు), లిజాద్ విలియమ్స్ (రూ. 75 లక్షలు), రాబిన్ మిన్జ్ (రూ.65 లక్షలు) , కరణ్ శర్మ (రూ.50 లక్షలు), అర్జున్ టెండూల్కర్ (రూ.30 లక్షలు), విఘ్నేశ్ (రూ.30 లక్షలు), సత్యనారాయణ (రూ. 30 లక్షలు), రాజ్ అంగద్ (రూ. 30 లక్షలు), శ్రీజిత్ కృష్ణన్ (రూ. 30 లక్షలు), అశ్వని కుమార్ (రూ. 30 లక్షలు), బెవాన్ జాకబ్స్ (రూ. 30 లక్షలు). చదవండి: IPL 2025: కెప్టెన్ల మార్పు.. ఎవరి జీతం ఎంత?.. అతి చవగ్గా దొరికిన సారథి అతడే! -
టీమిండియా స్టార్లు.. హార్డ్ హిట్టర్లు, దిగ్గజ పేసర్లు.. ముంబై ఈసారైనా..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన మేటి జట్టుగా ముంబై ఇండియన్స్కు పేరుంది. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగానూ ముంబై రికార్డు చెక్కు చెదరకుండా ఉంది. అయితే, గత కొంతకాలంగా అంబానీల ఫ్రాంఛైజీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. గతేడాది ఏకంగా పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. అయితే, మెగా వేలంలో తెలివైన కొనుగోళ్లతో మునుపటి వైభవం సాధించేలా ప్రణాళికలు రచించింది.విదేశీ, భారత్ ఆటగాళ్ల తో జట్టుని పునర్నిర్మించే ప్రయత్నం చేసింది. జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా న్యూ జిలాండ్ వెటరన్ ట్రెంట్ బౌల్ట్ను రూ. 12.50 కోట్లకు కొనుగోలు చేసి బలమైన బౌలింగ్ ని రూపొందించే ప్రయత్నం చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆల్ రౌండర్ దీపక్ చాహర్ను కూడా జత చేసి తమ బౌలింగ్ యూనిట్ను మరింత బలోపేతం చేసుకుంది.మిచెల్ సాంట్నర్, కర్ణ్ శర్మలను చేర్చుకోవడంతో స్పిన్ విభాగం కూడా మరింత బలపడింది. ఇక విల్ జాక్స్, బెవాన్ జాకబ్స్, ర్యాన్ రికెల్టన్ లతో బ్యాటింగ్కు మునుపటి పదును సమకూర్చారు. అయితే భారత్ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. విదేశీ ఆటగాళ్లతో పాటు, రాబిన్ మింజ్, విఘ్నేష్ పుత్తూర్ మరియు రాజ్ బావా వంటి వారిని కనుగోలు చేసి యువ జట్టుని నిర్మించే దిశగా పావులు కదిపింది. అందువల్ల, ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన ఈ జట్టు అన్ని స్థావరాలను కవర్ చేసే ఆల్ రౌండ్ జట్టును నిర్మించడానికి తమ పర్స్ను సమర్థవంతంగా ఉపయోగించింది.ముంబై ఇండియన్స్లో ప్రధాన ఆటగాళ్లుట్రెంట్ బౌల్ట్ ఈ ఎడమచేతి వాటం సీమర్ మూడు సంవత్సరాల తర్వాత ఐపీఎల్ లో మళ్ళీ ముంబై ఇండియన్స్కు తిరిగి ఆడబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్లలో ముంబై ఇండియన్స్కు చెందిన జట్ల తరపున ఆడుతూనే ఉన్నాడు. బౌల్ట్ పవర్ప్లేలో రాణించడంలో మంచి దిట్ట. బుమ్రాతో పాటు ముంబై బౌలింగ్ ని ప్రారంభించే అవకాశముంది.ర్యాన్ రికెల్టన్దక్షిణాఫ్రికాలో బాగా రాణిస్తున్న స్టార్లలో ఒకరు గా ఖ్యాతి గడించిన రికెల్టన్ ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ లో తన బ్యాటింగ్ తో పరుగుల వర్షం కురిపించాడు. ఈ 28 ఏళ్ల వికెట్ కీపర్ ను మరో క్వింటన్ డి కాక్ గా నిపుణులు భావిస్తున్నారు.రాబిన్ మింజ్వికెట్ కీపర్ కూడా అయినా రాబిన్ మింజ్ తన అసాధారణ స్ట్రోక్ ప్లే తో విజృభించి ఆడగలడు. దురదృష్టవశాత్తు బైక్ ప్రమాదం కారణంగా గత సీజన్కు దూరమైన , మింజ్ ఈ సీజన్లో మళ్ళీ తన సత్తా చూపించాలిని పట్టుదలతో ఉన్నాడు.ముజీబ్ ఉర్ రెహమాన్గాయం కారణంగా జట్టు నుంచి తప్పుకున్న తోటి ఆఫ్ఘన్ దేశస్థుడు ఎ ఎం గజన్ఫర్ స్థానంలో ఈ ఆఫ్ స్పిన్నర్ను జట్టులోకి తీసుకున్నారు. రెహమాన్ తన టి 20 కెరీర్లో 18.11 సగటు తో నిలకడగా బౌలింగ్ చేయగల సామర్ధ్యముంది.బెవాన్ జాకబ్స్న్యూజిలాండ్ కి చెందిన 22 ఏళ్ల హార్డ్ హిట్టింగ్ బ్యాటర్. తన అసాధారణ స్ట్రోక్ ప్లే తో ఇటీవల కాలం లో బాగా రాణిస్తున్నాడు. టీ20 కెరీర్లో 148.42 స్ట్రైక్ రేట్ తో ఉన్న జాకబ్స్ ఈ సీజన్లో అనేక మంది బౌలర్లకు తలనొప్పిగా పరిణమించే అవకాశం ఉంది.ముంబై ఇండియన్స్ జట్టుజస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్, నమన్ ధిర్, రాబిన్ మింజ్, కర్ణ్ శర్మ, ర్యాన్ రికెల్టన్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహమాన్, విల్ జాక్స్, అశ్వనీ కుమార్, మిచెల్ సాంట్నర్, రీస్ టాప్లే, క్రిష్ణన్ శ్రీజిత్, రాజ్ అంగద్ బవా, సత్యనారాయణ రాజు, బెవాన్ జేకబ్స్ అర్జున్ టెండుల్కర్, లిజాడ్ విలియమ్స్, విఘ్నేశ్ పుత్తూరు, కార్బిన్ బాష్.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి -
నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. అన్ని ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి
భారత పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)పై టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) ప్రశంసలు కురిపించాడు. మూడు ఫార్మాట్లలోనూ ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్ అతడేనని కొనియాడాడు. తాను ఎదుర్కొన్న బౌలర్లలో అత్యంత కఠినమైన బౌలర్ బుమ్రానే అని కోహ్లి వెల్లడించాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో సత్తా చాటిన కోహ్లి.. ప్రస్తుతం ఐపీఎల్-2025 సన్నాహకాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) సోషల్ మీడియాతో మమేకమైన కోహ్లి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అత్యుత్తమ బౌలర్ ఇక మీ కెరీర్లో ఎదుర్కొన్న టఫెస్ట్ బౌలర్ ఎవరన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ప్రపంచంలో ప్రస్తుతం వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లలో అత్యుత్తమ బౌలర్ ఎవరంటే.. జస్ప్రీత్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఐపీఎల్లో కొన్ని సందర్భాల్లో అతడు నన్ను అవుట్ చేశాడు. అయితే, ఎక్కువసార్లు నేనే అతడిపై పైచేయి సాధించాను. అయినా సరే.. మా ఇద్దరి మధ్య పోటీ అంటే ఎంతో ఆసక్తికరంగా, సరదాగా ఉంటుంది. ప్రతి బంతిని షాట్ బాదేందుకు నేను ప్రయత్నిస్తా.నన్ను ఆపేందుకు అతడూ ట్రై చేస్తాడు. ఇద్దరి మధ్య పోటీ తీవ్రస్థాయికి చేరుకున్న వేళ.. ఎవరూ కూడా తగ్గకుండా ముందుకు సాగితే మజాగా ఉంటుంది కదా!.. ఇక నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నపుడు నేను రెగ్యులర్గా బుమ్రా బౌలింగ్ను ఎదుర్కొంటా. నాకు నచ్చిన, నేను ఆస్వాదించే మూమెంట్ అది. అంతేకాదు.. అదే కఠినమైన సవాల్ కూడా!’’ అని విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు.కాగా క్యాష్ రిచ్ లీగ్ ఆరంభమైన నాటి(2008) నుంచి కోహ్లి ఆర్సీబీలో కొనసాగుతుండగా.. బుమ్రా తన కెరీర్ ఆరంభం నుంచి ముంబై ఇండియన్స్తో ప్రయాణిస్తున్నాడు. ఫోర్లు బాదిన కోహ్లి.. అవుట్ చేసిన బుమ్రాఇక 2013, ఏప్రిల్ 4న ముంబై తరఫున ఆర్సీబీతో మ్యాచ్తో బుమ్రా ఐపీఎల్లో అరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే. నాడు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి.. 32 పరుగులు ఇచ్చిన బుమ్రా మూడు వికెట్లు తీశాడు.తన ఆరంభ ఓవర్లోనే కోహ్లి ఒకటి, రెండు, నాలుగో బంతుల్లో ఫోర్లు బాది చుక్కలు చూపించగా.. ఐదో బంతికి బుమ్రా విజయం సాధించాడు. నాడు 19 ఏళ్ల వయసులో ఉన్న బుమ్రా తన అద్భుత నైపుణ్యాలతో వికెట్ల ముందు కోహ్లిని దొరకబుచ్చుకుని.. తన తొలి వికెట్ సాధించాడు. ఇక ఇప్పటి వరకు 133 మ్యాచ్లు పూర్తి చేసుకున్న బుమ్రా 165 వికెట్లు తీశాడు. ముంబై జట్టు ఐదుసార్లు టైటిల్ గెలిచిన సందర్భాల్లోనూ అతడు జట్టులో భాగంగా ఉన్నాడు.మరోవైపు.. కోహ్లి జట్టు ఆర్సీబీ ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. ఇదిలా ఉంటే.. కోహ్లి- బుమ్రా టీమిండియాకు కలిసి ఆడుతున్న విషయం తెలిసిందే. కోహ్లి సారథ్యంలో బుమ్రా ఆడగా.. పలు సందర్భాల్లో బుమ్రా కెప్టెన్సీలో కోహ్లి ఆడటం విశేషం. చదవండి: అసలు అతడిని జట్టులోకి తీసుకుంది ఎవరు?: పాక్ మాజీ క్రికెటర్ ఆగ్రహం"𝙒𝙝𝙚𝙣𝙚𝙫𝙚𝙧 𝙄 𝙛𝙖𝙘𝙚 𝙝𝙞𝙢, 𝙞𝙩'𝙨 𝙡𝙞𝙠𝙚, '𝙊𝙠𝙖𝙮, 𝙞𝙩'𝙨 𝙜𝙤𝙣𝙣𝙖 𝙗𝙚 𝙛𝙪𝙣.'" 🗣Ever wondered who’s the toughest bowler Virat’s ever faced? 🤔 Catch him spill the tea, at the 𝗥𝗖𝗕 𝗜𝗻𝗻𝗼𝘃𝗮𝘁𝗶𝗼𝗻 𝗟𝗮𝗯 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗦𝗽𝗼𝗿𝘁𝘀 𝗦𝘂𝗺𝗺𝗶𝘁… pic.twitter.com/36F8d8twN6— Royal Challengers Bengaluru (@RCBTweets) March 17, 2025 -
IPL 2025: ముంబై ఇండియన్స్ బౌలర్కు నోటీసులు ఇచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు
ఐపీఎల్-2025లో భాగమైన ముంబై ఇండియన్స్ బౌలర్ కార్బిన్ బాష్కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నోటీసులు ఇచ్చింది. బాష్.. ఐపీఎల్ కాంట్రాక్ట్ కోసం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాంట్రాక్ట్ను వదులుకున్నాడు. సౌతాఫ్రికా ఆల్రౌండర్ అయిన బాష్.. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 ఎడిషన్ కోసం పెషావర్ జల్మీ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. బాష్కు అనుకోకుండా ఐపీఎల్ ఆఫర్ రావడంతో పీఎస్ఎల్ కాంట్రాక్ట్కు నో చెప్పాడు. లిజాడ్ విలియమ్స్ గాయపడటంతో ముంబై ఇండియన్స్ బాష్ను రీప్లేస్మెంట్గా ఎంపిక చేసుకుంది. పీఎస్ఎల్ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గానూ పీసీబీ బాష్పై చర్యలకు ఉపక్రమించింది. ఫ్రాంచైజీ (పెషావర్ జల్మీ) ఏజెంట్ ద్వారా బాష్కు లీగల్ నోటీసులు పంపింది. కాంట్రాక్ట్ ఉల్లంఘించినందుకు గానూ వివరణ ఇవ్వాలని కోరింది. పీఎస్ఎల్ నుండి వైదొలగడం వల్ల ఎదురయ్యే పరిణామాలను వివరించింది. ఈ విషయాన్ని ఇవాళ (మార్చి 16) ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. కాగా, ఐపీఎల్ 2025, పాకిస్తాన్ సూపర్ లీగ్-2025 తేదీలు క్లాష్ అయ్యాయి. పీఎస్ఎల్-2025 ఏప్రిల్ 11 నుండి మే 25 వరకు జరగనుండగా.. ఐపీఎల్ 2025 మార్చి 22 నుండి మే 25 వరకు జరుగుతుంది. -
WPL విజేత ముంబై ఇండియన్స్
-
ఛాంపియన్గా ముంబై ఇండియన్స్.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?
మహిళల ప్రీమియర్ లీగ్- 2025 ఛాంపియన్స్గా ముంబై ఇండియన్స్ నిలిచింది. శనివారం బ్రౌబౌర్న్ వేదికగా జరిగిన ఫైనల్లో 8 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించిన ముంబై ఇండియన్స్ రెండోసారి డబ్ల్యూపీఎల్ టైటిల్ను ముద్దాడింది. ఈ ఫైనల్ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ హర్మన్ప్రీత్ కౌర్ (44 బంతుల్లో 66; 9 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... నాట్ సివర్ బ్రంట్ (28 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించింది.కాప్ ఒంటరి పోరాటం..అనంతరం లక్ష్య చేధనలో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులే చేయగలిగింది. ఢిల్లీ బ్యాటర్లలో ఆల్రౌండర్ మరిజాన్ కాప్ (26 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్లు) ఒంటరి పోరాటం చేసింది. ఓ దశలో ఢిల్లీని కాప్ ఒంటి చేత్తో గెలిపించేలా కన్పించింది.కానీ ఆఖరిలో కాప్ ఓ భారీ షాట్కు ప్రయత్నించి ఔట్ కావడంతో మ్యాచ్ ఫలితం తారుమారు అయింది. నాట్ సివర్ బ్రంట్ 3 కీలక వికెట్లతో ఢిల్లీని దెబ్బ తీసింది. ఇక ఛాంపియన్ నిలిచిన ముంబై ఇండియన్స్కు ఎంత ప్రైజ్మనీ దక్కింది ఆరెంజ్? ఆరెంజ్ క్యాప్ విజేత ఎవరు? వంటి వివరాలను తెలుసుకుందాం.ముంబైకి ప్రైజ్ మనీ ఎంతంటే?ఈ టోర్నీ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్కు రూ. 6 కోట్లు ప్రైజ్మనీగా లభించింది. రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్కు రూ. 3 కోట్లు నగదు బహుమతి అందనుంది. అదేవిధంగా 523 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్రౌండర్ నాట్ స్కివర్ బ్రంట్ ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకుంది. అందుకు గాను 5 లక్షలు నగదు బహుమతి ఆమెకు దక్కింది. పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచిన అమీలియా కేర్కు కూడా రూ.5 లక్షలు నగదు లభించింది.ప్రైజ్ మనీ వివరాలు..విజేత- ముంబై ఇండియన్స్- రూ. 6 కోట్లురన్నరప్-ఢిల్లీ క్యాపిటల్స్- రూ.3 కోట్లుఆరెంజ్ క్యాప్ విజేత- స్కివర్ బ్రంట్-రూ. 5 లక్షలుపర్పుల్ క్యాప్ విజేత- కేర్- రూ. 5లక్షలుమోస్ట్ వాల్యబుల్ ప్లేయర్- స్కివర్ బ్రంట్(523 పరుగులు, 12 వికెట్లు)-రూ. 5 లక్షలుఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్-అమన్జోత్ కౌర్-రూ. 5 లక్షలుసీజన్లో అత్యధిక సిక్సర్లు- ఆష్లీ గార్డనర్ (18 సిక్సర్లు)- రూ.5 లక్షలుచదవండి: హ్యాట్సాఫ్ హర్మన్ -
మహిళల ప్రీమియర్ లీగ్లో విజేతగా ముంబై ఇండియన్స్..టైటిల్ సొంతం (ఫొటోలు)
-
జై ముంబై
మహిళల ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ మరో సారి జయకేతనం ఎగురవేసింది. రెండేళ్ల క్రితం టోర్నీ తొలి విజేతగా నిలిచిన జట్టు ఇప్పుడు మళ్లీ టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది. ఢిల్లీతో తుది పోరులో తక్కువ స్కోరుకే పరిమితమైనా... పట్టుదల, సమష్టితత్వంతో ఆడిన జట్టు లక్ష్యాన్ని కాపాడుకోగలిగింది. ఆల్రౌండర్ నాట్ సివర్ బ్రంట్, కెప్టెన్ హర్మన్ ఆఖరి పోరులో కీలక పాత్ర పోషించారు. మరో వైపు ఢిల్లీ క్యాపిటల్స్ బృందం విషాదంలో మునిగిపోయింది. వరుసగా మూడు సీజన్ల పాటు గ్రూప్లో టాపర్... వరుసగా మూడు ఫైనల్ మ్యాచ్లు... మూడింటిలోనూ పరాజయాలు. ఛేదనలో 17 పరుగులకే ఇద్దరు టాప్ బ్యాటర్లను కోల్పోయిన తర్వాత జట్టు కోలుకోలేకపోయింది. ఆ తర్వాత కొంత పోరాడినా లాభం లేకపోయింది. ముంబై: డబ్ల్యూపీఎల్ సీజన్–3లో ముంబై ఇండియన్స్ చాంపియన్గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో ముంబై 8 పరుగుల స్వల్ప తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్మన్ప్రీత్ కౌర్ (44 బంతుల్లో 66; 9 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... నాట్ సివర్ బ్రంట్ (28 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించింది. 14 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో వీరిద్దరు మూడో వికెట్కు 62 బంతుల్లోనే 89 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులే చేయగలిగింది. మరిజాన్ కాప్ (26 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్లు), జెమీమా రోడ్రిగ్స్ (21 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించగా, నికీ ప్రసాద్ (23 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించింది. నాట్ సివర్ బ్రంట్ 3 కీలక వికెట్లతో ఢిల్లీని దెబ్బ తీసింది. 523 పరుగులు చేసి 12 వికెట్లు తీసిన నాట్ సివర్ బ్రంట్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచింది.మరిజాన్ కాప్ తన వరుస ఓవర్లలో హేలీ మాథ్యూస్ (3), యస్తిక భాటియా (3)లను వెనక్కి పంపడంతో ముంబై ఒత్తిడిలో పడింది. అయితే సివర్, హర్మన్ కలిసి దూకుడుగా ఆడారు. సదర్లాండ్ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టిన హర్మన్...జొనాసెన్ వేసిన తర్వాత ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదింది. 33 బంతుల్లోనే ఆమె హాఫ్ సెంచరీ పూర్తయింది. వీరిద్దరి భాగస్వామ్యం తర్వాత ముంబై తడపడింది. 15 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు సాధ్యం కాలేదు. ఛేదనలో ఢిల్లీ అవకాశాలన్నీ ఓపెనింగ్ భాగస్వామ్యంపైనే ఉన్నాయి. అయితే ఫామ్లో ఉన్న లానింగ్ (13), షఫాలీ (4) రెండు పరుగుల తేడాతో వెనుదిరగడంతో జట్టు స్కోరు వేగం బాగా తగ్గిపోయింది. మధ్యలో జెమీమా కొంత జోరుగా ఆడే ప్రయత్నం చేసినా చేయాల్సిన రన్రేట్ బాగా పెరిగిపోయి చేయిదాటిపోయింది. మరిజాన్ కాప్ ప్రయత్నం కూడా వృథా అయింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక (సి) జెమీమా (బి) కాప్ 8; హేలీ (బి) కాప్ 3; నాట్సివర్ (సి) మణి (బి) చరణి 30; హర్మన్ప్రీత్ (సి) కాప్ (బి) సదర్లాండ్ 66; కెర్ (సి) షఫాలీ (బి) జొనాసెన్ 2; సజన (ఎల్బీ) (బి) జొనాసెన్ 0; కమలిని (స్టంప్డ్) బ్రైస్ (బి) చరణి 10; అమన్జోత్ (నాటౌట్) 14; సంస్కృతి (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–5, 2–14, 3–103, 4–112, 5–112, 6–118, 7–132. బౌలింగ్: మరిజాన్ కాప్ 4–0–11–2, శిఖా పాండే 4–0–29–0, అనాబెల్ సదర్లాండ్ 4–0–29–1, జొనాసెన్ 3–0–26–2, శ్రీ చరణి 4–0–43–2, మిన్ను మణి 1–0–10–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: లానింగ్ (బి) సివర్ 13; షఫాలీ (ఎల్బీ) (బి) షబ్నమ్ 4; జెస్ జాన్సన్ (సి) యస్తిక (బి) కెర్ 13; జెమీమా (సి అండ్ బి) కెర్ 30; అనాబెల్ (స్టంప్డ్) యస్తిక (బి) సైకా 2; మరిజాన్ కాప్ (సి) హేలీ (బి) సివర్ 40; సారా (రనౌట్) 5; నికీ (నాటౌట్)25; శిఖ (బి) సివర్ 0; మిన్ను మణి (సి) సజన (బి) హేలీ 4; శ్రీ చరణి (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 141. వికెట్ల పతనం: 1–15, 2–17, 3–37, 4–44, 5–66, 6–83, 7–123, 8–123, 9–128. బౌలింగ్: షబ్నమ్ ఇస్మాయిల్ 4–0–15–1; నాట్సివర్ బ్రంట్ 4–0–30–3; హేలీ మాథ్యూస్ 4–0–37–1; అమేలియా కెర్ 4–0–25–2; సైకా 4–0–33–1. -
హ్యాట్సాఫ్ హర్మన్
డబ్ల్యూపీఎల్లో 2023 టైటిల్ నెగ్గిన ముంబై ఇండియన్స్ గత ఏడాది డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగింది. అయితే అనూహ్యంగా ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో 5 పరుగుల తేడాతో ఓడి నిష్క్రమించింది. హర్మన్ప్రీత్ క్రీజ్లో ఉన్నంత వరకు జట్టు గెలుపు దిశగానే వెళ్లినా...ఆమె వెనుదిరిగాక ఇతర బ్యాటర్లు 12 బంతుల్లో 16 పరుగులు కూడా చేయలేకపోయారు. ఇది హర్మన్ను తీవ్రంగా బాధించింది. 2025 సీజన్కు ముందు జట్టు కోచ్ దేవిక పల్షికర్తో కలిసి హర్మన్ ఇదే విషయంపై ప్రత్యేకంగా చర్చించింది. చివర్లో ధాటిగా ఆడే ప్రయత్నంలో ఒత్తిడి పెంచుకోవడంకంటే తొలి బంతినుంచే హర్మన్ తనదైన శైలిలో ధాటిగా ఆడాలనేది ప్రణాళిక. ఇందులో తొందరగా అవుటయ్యే ప్రమాదం ఉన్నా... ఇది సరైందిగా వారు భావించారు. ఈసారి టీమ్ విజయంలో బ్యాటర్గా హర్మన్ కీలక పాత్ర పోషించింది. ఏకంగా 154.87 స్ట్రైక్రేట్తో 302 పరుగులు సాధించి తన విలువను చాటింది. టోర్నీలో 11 సిక్స్లు బాదిన తీరు ఆమె ఆధిక్యాన్ని చూపించింది. ఈ టోర్నీలో ప్రతీ మ్యాచ్లో ఆమె దాదాపు చివరి వరకు నిలిచి పని పూర్తయ్యేలా చూసింది. 10 ఇన్నింగ్స్లలో 5 అర్ధసెంచరీలతో 523 పరుగులు చేసిన నాట్ సివర్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. పరుగుల పట్టికలో మూడో స్థానంలో ఉన్న హేలీ మాథ్యూస్ (307) జట్టుకు అదనపు బలంగా మారింది. బౌలింగ్లో అమేలియా కెర్ (18 వికెట్లు), హేలీ మాథ్యూస్ (18), నాట్ సివర్ (12) ప్రత్యర్థులను పడగొట్టడంలో సఫలమయ్యారు. మరో ప్రధాన పేసర్ షబ్నిమ్ ఇస్మాయిల్ అంచనాలకు తగినట్లుగా రాణించకపోయినా... ఆ ప్రభావం జట్టుపై పడకుండా ఈ ముగ్గురు బాధ్యత తీసుకున్నారు. ఫైనల్లో మాత్రం షబ్నమ్ తన స్థాయి ప్రదర్శనను చూపించింది. తొలి మ్యాచ్లో ఢిల్లీ చేతిలో పరాజయంతో ముంబై టోర్నీ మొదలైంది. అయితే ఆ తర్వాత వరుసగా మూడు విజయాలతో జట్టు కోలుకుంది. తర్వాతి మ్యాచ్లో మళ్లీ ఢిల్లీ చేతిలోనే పరాజయం. ఈ సారి హర్మన్, సివర్ ఇద్దరూ విఫలమయ్యారు. ఆ తర్వాత మరో రెండు మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్ ఖాయమైనా... టాప్ స్థానం కోసం జట్టు గట్టిగానే పోరాడింది. అయితే బెంగళూరు చేతిలో ఓటమి తప్పలేదు. దాంతో ఎలిమినేటర్ మ్యాచ్లో ప్రదర్శనపై సందేహాలు వచ్చాయి. అయితే సంపూర్ణ ఆధిక్యంతో విజయం సాధించిన ముంబై అలవోకగా ఫైనల్ చేరింది. గత రెండు లీగ్ మ్యాచ్ తరహాలో ఈ సారి కూడా ఢిల్లీపై ఆరంభంలో తడబాటు కనిపించింది. కానీ మళ్లీ హర్మన్, సివర్ భాగస్వామ్యమే జట్టును నడిపించింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ వీరిద్దరు పట్టుదలగా ఆడటంతో జట్టు ప్రత్యర్థికి సవాల్ విసిరేంత స్కోరును సాధించగలిగింది. ఫైనల్ సహా ఇదే వేదికపై వరుసగా నాలుగో మ్యాచ్ ఆడటం కూడా జట్టుకు కలిసొచ్చింది. టోర్నీలో ఢిల్లీ ఫామ్ చూస్తే 150 పరుగుల ఛేదన పెద్ద కష్టం కాదనిపించినా... ముంబై బౌలర్లంతా సమష్టిగా చెలరేగి మూడేళ్ల వ్యవధిలో రెండో టైటిల్ను అందించడం విశేషం. -
WPL-2025: డబ్ల్యూపీఎల్ విజేతగా ముంబై ఇండియన్స్
డబ్ల్యూపీఎల్-2025లో భాగంగా ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఢిల్లీపై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం 150 పరుగుల లక్ష్య చేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ వెనుక పడింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్కి విజేతగా నిలిచింది. ఈ విజయంతో రెండోసారి ముంబై జట్టు టైటిల్ విన్నర్గా నిలిచింది. ముంబై బ్యాటర్లలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 66) టాప్ స్కోరర్గా నిలిచారు.తుది జట్లుముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): యాస్తికా భాటియా(వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్ప్రీత్ కౌర్(సి), సజీవన్ సజన, అమేలియా కెర్, అమంజోత్ కౌర్, జి కమలిని, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, మారిజానే కాప్, జెస్ జోనాస్సెన్, సారా బ్రైస్ (వికెట్ కీపర్), నికి ప్రసాద్, మిన్ను మణి, శిఖా పాండే, నల్లపురెడ్డి చరణి -
హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ ఎంతంటే?
డబ్ల్యూపీఎల్-2025లో భాగంగా ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న ఫైనల్లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు తడబడ్డారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 66) టాప్ స్కోరర్గా నిలిచారు.ఆమెతో పాటు నాట్ స్కివర్(30) పరుగులతో పర్వాలేదన్పించారు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో జానెసన్, చరణి, కాప్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సదర్లాండ్ ఒక్క వికెట్ సాధించారు.తుది జట్లుముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): యాస్తికా భాటియా(వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్ప్రీత్ కౌర్(సి), సజీవన్ సజన, అమేలియా కెర్, అమంజోత్ కౌర్, జి కమలిని, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, మారిజానే కాప్, జెస్ జోనాస్సెన్, సారా బ్రైస్ (వికెట్ కీపర్), నికి ప్రసాద్, మిన్ను మణి, శిఖా పాండే, నల్లపురెడ్డి చరణిచదవండి: IPL 2025: ఇషాన్ కిషన్ విధ్వంసం.. 16 బంతుల్లో హాఫ్ సెంచరీ! వీడియో వైరల్ -
'ఒకప్పుడు రోహిత్ వారసుడు.. కానీ సడన్గా ఏమైందో మరి'
ఐపీఎల్-2025కు సమయం అసన్నమవుతోంది. మార్చి 22 నుంచి ఈ క్రికెట్ పండగ ప్రారంభం కానుంది. ఈ టైటిల్ వేటలో మొత్తం పది జట్లు మరోసారి తమ ఆదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని వంటి దిగ్గజాలు అభిమానులను అలరించేందుకు సిద్దమయ్యారు. అయితే ఈ ఏడాది సీజన్లో అందరి దృష్టి ఐదు సార్లు ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్పైనే ఉంది.గతేడాది సీజన్లో హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచింది. రోహిత్ శర్మను తప్పించి మరి హార్దిక్కు ముంబై యాజమాన్యం తమ జట్టు పగ్గాలను అప్పగించింది. అప్పటిలో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. తొలి సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ను ఛాంపియన్గా నిలిచిన పాండ్యా.. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు. ఆటగాడిగా, కెప్టెన్గా విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో ఐపీఎల్ 18వ సీజన్లో హార్దిక్ పాండ్యా ఎలా రాణిస్తాడో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో హార్దిక్పై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. "కెప్టెన్గా తనను తను నిరూపించుకోవడానికి హార్దిక్ పాండ్యాకు ఇదొక అద్భుత అవకాశం. ఒకప్పుడు అతడు రోహిత్ శర్మ వారుసుడిగా కొనసాగాడు. రోహిత్ శర్మ గైర్హజారీలో భారత జట్టు కెప్టెన్గా అతడు వ్యవహరించేవాడు. వైట్బాల్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవుతాడని అంతా ఊహించారు.కానీ సడన్గా కెప్టెన్సీ జాబితా నుంచి పాండ్యాను తప్పించారు. హార్దిక్ గురించి ప్రస్తుతం ఎవరూ చర్చించడం లేదు. అతడిని కనీసం వైస్ కెప్టెన్గా కూడా ఎంపిక చేయలేదు. పాండ్యా అద్బుతమైన ఆటగాడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీసారి తను ముందుకు వచ్చి అదుకునేవాడు. కెప్టెన్గా గుజరాత్ టైటాన్స్కు టైటిల్ను అందించాడు. వరుసగా రెండోసారి ఫైనల్కు కూడా చేర్చాడు.ఈ సీజన్లో హార్దిక్ కెప్టెన్గా తన తను నిరూపించుకుంటే మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించే అవకాశముంది" అని చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్లో మార్చి 23న చెన్నై సూపర్కింగ్స్తో తలపడనుంది.చదవండి: IPL 2025: సన్రైజర్స్ హైదరాబాద్కు గుడ్న్యూస్ -
ఢిల్లీ ఈ సారైనా సాధించేనా!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 17 సీజన్ల పాటు ఆడినా ఢిల్లీ జట్టు టైటిల్ గెలవలేకపోయింది. అదే యాజమాన్యానికి చెందిన మహిళల జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో వరుసగా రెండు సీజన్ల పాటు నిరాశపర్చింది. 2023, 2024 సీజన్లలో గ్రూప్ దశలో టాపర్గా నిలవడంతో ఫైనల్కు చేరిన క్యాపిటల్స్ రెండుసార్లూ ఫైనల్ మ్యాచ్లలో ఓడి రన్నరప్గానే సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఇప్పుడు తాజా సీజన్లో కూడా టాపర్గా ఫైనల్ చేరిన టీమ్ మరోసారి ట్రోఫీ కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. నేడు జరిగే ఫైనల్లో 2023 చాంపియన్ ముంబై ఇండియన్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడుతుంది. తాజా సీజన్ లీగ్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్లలోనూ ఢిల్లీనే నెగ్గి 2–0తో ఆధిక్యం ఉంది. అంతర్జాతీయ మహిళల క్రికెట్లో ఆల్టైమ్ గ్రేట్ కెప్టెన్ గా ఉన్న మెగ్ లానింగ్ గత ఏడాది ఢిల్లీకి టైటిల్ అందించడంలో విఫలమైంది. ఈసారి అది పునరావృతం కాకుండా సత్తా చాటాలని ఆమె పట్టుదలగా ఉంది. సీజన్లో ఏకంగా 157.89 స్ట్రయిక్ రేట్తో 300 పరుగులు చేసిన షఫాలీ వర్మ మరోసారి టీమ్కు కీలకం కానుంది.మెగ్ లానింగ్ కూడా 263 పరుగులతో టీమ్ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించింది. జెమీమా రోడ్రిగ్స్ మాత్రం ఆశించినంత మెరుగైన ప్రదర్శన ఇవ్వలేదు. ఫైనల్లోనైనా ఆమె రాణించాల్సి ఉంది. ఆల్రౌండర్గా జెస్ జొనాసెన్ టోర్నీలో చక్కటి ప్రదర్శన కనబర్చింది. 137 పరుగులతో పాటు 11 వికెట్లు తీసిన ఆమెకు శిఖా పాండే (11) అండగా నిలిచింది. వీరిద్దరితో పాటు అనాబెల్ సదర్లాండ్ తమ బౌలింగ్తో ప్రత్యరి్థని కట్టడి చేయగలరు. దూకుడైన బ్యాటింగే ముంబై ప్రధాన బలం. నాట్ సివర్ 156.50 స్ట్రయిక్రేట్తో 5 అర్ధసెంచరీలు సహా 493 పరుగులు సాధించి అగ్ర స్థానంలో ఉంది. హేలీ మాథ్యూస్ (304) కూడా దూకుడైన ఆటకు మారు పేరు. కెపె్టన్గా హర్మన్ప్రీత్ కౌర్ కూడా 156.29 స్ట్రయిక్ రేట్తో 236 పరుగులు చేసి తన వంతు పాత్ర పోషించింది. బౌలింగ్లో హేలీ, అమెలియా కెర్ కలిసి 33 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. సమష్టిగా సత్తా చాటడంతో ముంబై జట్టుదే పైచేయి. ఈ నేపథ్యంలో అంతిమ విజేత ఎవరు అవుతారనేది చూడాలి. -
IPL 2025: హార్దిక్పై నిషేధం.. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా సూర్యకుమార్..?
ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మార్చి 23న జరుగనుంది. ఆ రోజు డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగనుండగా.. ఎంఐ, సీఎస్కే మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తమ కెప్టెన్ సేవలు కోల్పోనుంది. గత సీజన్లో ముంబై ఇండియన్స్ మూడు మ్యాచ్ల్లో స్లో ఓవర్ రేట్తో బౌలింగ్ చేసింది. దీంతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ముంబై కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యాకు రూ.30లక్షల జరిమానా విధించడంతో పాటు ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించింది. గత సీజన్లో ముంబై గ్రూప్ దశలోనే వెనుదిరగడంతో హార్దిక్పై నిషేధం సాధ్యం కాలేదు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025 సీజన్లో తొలి మ్యాచ్లోనే అతను నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది.తొలి మ్యాచ్లో హార్దిక్ గైర్హాజరీలో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ సారధిగా వ్యవహరించే అవకాశం ఉంది. భారత టీ20 జట్టుకు సారధిగా వ్యవహరిస్తుండటంతో ఎంఐ యాజమాన్యం అతనిరే సారథ్య బాధ్యతలు అప్పజెప్పనుందని తెలుస్తుంది. రోహిత్ కెప్టెన్సీపై అయిష్టతను ఇదివరకే తెలియజేశాడు. మరో సీనియర్ బుమ్రా ఆరంభ మ్యాచ్లకు దూరమవుతాడని సమాచారం. ఈ నేపథ్యంలో సీనియర్లలో ఒకరైన సూర్యకుమార్కే తొలి మ్యాచ్లో కెప్టెన్గా వ్యవహరించే అవకాశం రావచ్చు.టీ20ల్లో టీమిండియా కెప్టెన్గా సూర్య కుమార్ యాదవ్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. స్కై సారథ్యంలో భారత్ 18 మ్యాచ్ల్లో కేవలం నాలుగింట మాత్రమే ఓడింది.కాగా, ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ దేశీయ స్టార్లపై ఆధారపడి ఉంది. మెగా వేలానికి ముందు ఆ జట్టు యాజమాన్యం రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాను రీటైన్ చేసుకుంది. మెగా వేలంలోనూ ఆ జట్టు పెద్దగా విదేశీ స్టార్ల కోసం పాకులాడలేదు.విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, కార్బిన్ బాష్, ర్యాన్ రికెల్టన్ లాంటి ఆటగాళ్లు కొత్తగా జట్టులోకి చేర్చుకుంది. ఈసారి జట్టులోకి వచ్చిన ట్రెంట్ బౌల్ట్కు గతంలో ముంబై ఇండియన్స్తో అనుబంధం ఉంది. మెగా వేలంలో దక్కించుకున్న రీస్ టాప్లే గాయం కారణంగా ఈ సీజన్కు దూరమయ్యాడు. దేశీయ పేసర్ దీపక్ చాహర్ను ముంబై సీఎస్కేతో పోటీపడి దక్కించుకుంది.ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్..హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, నమన్ ధిర్, సూర్యకుమార్ యాదవ్, బెవాన్ జాకబ్స్, రాజ్ భవా, విల్ జాక్స్, విజ్ఞేశ్ పుథుర్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, సత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, రాబిన్ మింజ్, కృష్ణణ్ శ్రీజిత్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్, రీస్ టాప్లే, కర్ణ్ శర్మ, దీపర్ చాహర్, ముజీబ్ రెహ్మాన్ -
ఐపీఎల్కు ముందు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న రోహిత్
అతి పెద్ద క్రికెట్ పండుగ ఐపీఎల్ మరో 8 రోజుల్లో ప్రారంభం కానుంది. క్యాష్ రిచ్ లీగ్ 18వ ఎడిషన్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచ ఆతృతగా ఎదురుచూస్తుంది. లీగ్లో పాల్గొనే ఫ్రాంచైజీలన్నీ సన్నాహకాల్లో బిజీగా ఉన్నాయి. ఆటగాళ్లు ఒక్కొక్కరుగా జట్లతో చేరుతున్నారు. ఫ్రాంచైజీల ముఖ్యులు వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నారు.రెండు నెలలకు పైగా సాగే ఈ మెగా ఈవెంట్లో మొత్తం 74 మ్యాచ్లు జరుగనున్నాయి. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్, ఆర్సీబీ మధ్య మ్యాచ్తో ఐపీఎల్ 2025 ప్రారంభమవుతుంది. మే 25న జరిగే ఫైనల్లో ముగుస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం భారత ఆటగాళ్లు కూడా ఒక్కొక్కరుగా తమతమ శిబిరాలకు చేరుకుంటున్నారు. అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఆల్రెడీ డ్యూటీకి ఎక్కేశారు. యాడ్స్తో బిజీగా ఉన్న విరాట్ కోహ్లి మరికొద్ది రోజుల్లో ఆర్సీబీతో జతకడతాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సుదీర్ఘంగా సాగే ఐపీఎల్కు ముందు సేద తీరుతున్నాడు. రోహిత్ సరదాగా కుటుంబంతో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటోలో రోహిత్.. తన నెలల చిన్నారి, కూతురు సమైరా మరియు భార్య రితికాతో కలిసి బోట్లో ప్రయాణిస్తూ కనిపించాడు.ఐపీఎల్ 2025లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచింది. ఐపీఎల్ హిస్టరీలో సీఎస్కే, ముంబై ఇండియన్స్ మాత్రమే ఐదు టైటిల్స్ సాధించాయి. రోహిత్ గత సీజన్కు ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. రోహిత్ తర్వాత హార్దిక్ పాండ్యా ముంబై పగ్గాలు చేపట్టాడు. హార్దిక్ కెప్టెన్సీలో ముంబై గత సీజన్లో పేలవ ప్రదర్శన చేసింది. త్వరలో ప్రారంభం కానున్న సీజన్లో ముంబై ప్రస్థానం మార్చి 23న మొదలవుతుంది. చెన్నై వేదికగా ఆ రోజు జరిగే మ్యాచ్లో ముంబై.. సమవుజ్జీ సీఎస్కేతో తలపడుతుంది. ఈ మ్యాచ్పై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి.ఈ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ పెద్దగా మార్పులేమీ చేయలేదు. మెగా వేలంలో బడా స్టార్లకు ఎర వేయలేదు. కొత్తగా విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, ర్యాన్ రికెల్టన్ లాంటి విదేశీ ఆటగాళ్లు జట్టులో చేరారు. ట్రెంట్ బౌల్ట్కు గతంలో ముంబై ఇండియన్స్తో అనుబంధం ఉంది. మెగా వేలానికి ముందు ముంబై రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాను రీటైన్ చేసుకుంది.ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్..హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, నమన్ ధిర్, సూర్యకుమార్ యాదవ్, బెవాన్ జాకబ్స్, రాజ్ భవా, విల్ జాక్స్, విజ్ఞేశ్ పుథుర్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, సత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, రాబిన్ మింజ్, కృష్ణణ్ శ్రీజిత్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్, రీస్ టాప్లే, కర్ణ్ శర్మ, దీపర్ చాహర్, ముజీబ్ రెహ్మాన్ -
WPL 2025: ముంబై మెరిసె... ఫైనల్లో హర్మన్ బృందం
సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన ముంబై ఇండియన్స్ జట్టు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీ మూడో సీజన్లో టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. ఏకపక్షంగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 47 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్పై ఘనవిజయం సాధించింది. బ్యాట్తో హేలీ మాథ్యూస్, నాట్ సివర్ బ్రంట్, హర్మన్ప్రీత్ కౌర్ చెలరేగడంతో ముంబై భారీ స్కోరు చేసింది. అనంతరం బంతితోనూ ముంబై బౌలర్లు హడలెత్తించారు. దాంతో లక్ష్య ఛేదనలో గుజరాత్ జెయింట్స్ డీలా పడింది. ముంబై ఇండియన్స్ జట్టుతో ఆడిన ఏడోసారీ గుజరాత్ జట్టు పరాజయాన్నే మూటగట్టుకుంది. ముంబై: మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రెండోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ 47 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్పై గెలిచి తుదిపోరుకు చేరింది. శనివారం జరిగే టైటిల్ పోరులో గత ఏడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్తో ముంబై ఆడుతుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (50 బంతుల్లో 77; 10 ఫోర్లు, 3 సిక్స్లు), నాట్ సివర్ బ్రంట్ (41 బంతుల్లో 77; 10 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకాలతో విజృంభించారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (12 బంతుల్లో 36; 2 ఫోర్లు, 4 సిక్స్లు) మెరిపించింది. గుజరాత్ జెయింట్స్ బౌలర్లలో గిబ్సన్ 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ జెయింట్స్ జట్టు 19.2 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. గిబ్సన్ (24 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్), లిచ్ఫీల్డ్ (20 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్), భారతి (20 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా ఫలితం లేకపోయింది. ముంబై బౌలర్లలో హేలీ 3, అమేలియా కెర్ 2 వికెట్లు పడగొట్టింది. హేలీ మాథ్యూస్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. బాదుడే బాదుడు.. మొదట బ్యాటింగ్కు దిగిన ముంబైకి శుభారంభం దక్కలేదు. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేయడంతో పవర్ప్లే ముగిసేసరికి యస్తిక భాటియా (15; 3 ఫోర్లు) వికెట్ కోల్పోయిన ముంబై 37 పరుగులే చేసింది. గిబ్సన్ వేసిన ఏడో ఓవర్లో సివర్ బ్రంట్ రెండు ఫోర్లతో జోరు పెంచగా... ప్రియా ఓవర్లో హేలీ ‘హ్యాట్రిక్’ ఫోర్లతో విరుచుకుపడింది. గుజరాత్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జోడీ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదడంతో 11 ఓవర్లు ముగిసేసరికి ముంబై జట్టు 100/1తో నిలిచింది. ఈ క్రమంలో హేలీ 36 బంతుల్లో, సివర్ 29 బంతుల్లో అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత ఈ జంట మరింత ధాటిగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. గిబ్సన్ వేసిన 15వ ఓవర్లో సివర్ రెండు భారీ సిక్సర్లు బాదగా... ప్రియ ఓవర్లో హేలీ వరుసగా 6, 6, 4 కొట్టింది. రెండో వికెట్కు 71 బంతుల్లో 133 పరుగులు జోడించిన అనంతరం హేలీ అవుట్ కాగా... హర్మన్ వచ్చిరావడంతోనే భారీ షాట్లతో విరుచుకుపడింది. తనూజ వేసిన 18వ ఓవర్లో 2 సిక్స్లు, 2 ఫోర్లు కొట్టిన హర్మన్... చివరి ఓవర్లో మరో 2 సిక్స్లు బాదింది. దీంతో ముంబై భారీ స్కోరు చేసింది. చివరి 5 ఓవర్లలో ముంబై జట్టు 73 పరుగులు రాబట్టింది.ఛేజింగ్లో జెయింట్స్ రనౌట్.. భారీ లక్ష్యఛేదనలో గుజరాత్ ప్రభావం చూపలేకపోయింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ బెత్ మూనీ (6) పెవిలియన్ చేరగా... కెప్టెన్ ఆష్లీ గార్డ్నర్ (8), హర్లీన్ డియోల్ (8) ఎక్కువసేపు నిలవలేకపోయారు. దీంతో గుజరాత్ 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో గిబ్సన్, లిచ్ఫీల్డ్ కాస్త పోరాడినా... ముంబై బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతూ ఒత్తిడి పెంచారు. క్రమశిక్షణతో కూడిన బౌలింగ్కు చక్కటి ఫీల్డింగ్ తోడవడంతో ముంబై జట్టు స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. భారతి, సిమ్రన్ (8 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమయ్యాయి. పేలవ ఫీల్డింగ్తో ముంబై బ్యాటర్లు ఇచ్చిన 4 క్యాచ్లు వదిలేసిన గుజరాత్ జట్టు... వికెట్ల మధ్య చురుకుగా పరిగెత్తలేక రనౌట్ రూపంలో 3 వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది.స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక భాటియా (సి) భారతి (బి) గిబ్సన్ 15; హేలీ మాథ్యూస్ (సి) మూనీ (బి) కాశ్వీ గౌతమ్ 77; సివర్ బ్రంట్ (సి) లిచ్ఫీల్డ్ (బి) గిబ్సన్ 77; హర్మన్ప్రీత్ కౌర్ (రనౌట్) 36; సజన (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–26, 2–159, 3–198, 4–213. బౌలింగ్: కాశ్వీ గౌతమ్ 4–0–30–1; ఆష్లీ గార్డ్నర్ 2–0–15–0; తనూజ కన్వర్ 4–0–49–0; గిబ్సన్ 4–0–40–2; ప్రియా మిశ్రా 3–0–40–0; మేఘనా సింగ్ 3–0–35–0. గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: బెత్ మూనీ (సి) హేలీ మాథ్యూస్ (బి) షబ్నమ్ 6; గిబ్సన్ (రనౌట్) 34; హర్లీన్ డియోల్ (రనౌట్) 8; ఆష్లీ గార్డ్నర్ (బి) హేలీ మాథ్యూస్ 8; లిచ్ఫీల్డ్ (స్టంప్డ్) యస్తిక (బి) కెర్ 31; భారతి (బి) హేలీ 30; కాశ్వీ గౌతమ్ (రనౌట్) 4; సిమ్రన్ (సి) హర్మన్ప్రీత్ (బి) కెర్ 17; తనూజ (సి) అమన్జ్యోత్ (బి) సివర్ 16; మేఘన (సి) సివర్ (బి) హేలీ 5; ప్రియ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (19.2 ఓవర్లలో ఆలౌట్) 166. వికెట్ల పతనం: 1–6, 2–34, 3–43, 4–81, 5–107, 6–112, 7–142, 8– 157, 9–165, 10–166. బౌలింగ్: షబ్నిమ్ 4–0–35–1; సివర్ 4–0–31–1; సైకా 1–0– 8–0; హేలీ 3.2–0–31–3, అమన్జ్యోత్ 3–0–32–0; అమేలియా కెర్ 4–0–28–2. -
మాథ్యూస్, స్కివర్ విధ్వంసం.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?
డబ్ల్యూపీఎల్-2025లో ముంబై వేదికగా గుజరాత్ జెయింట్స్తో జరుగుతున్న ఎలిమినేటర్లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ముంబై బ్యాటర్లలో హీలీ మాథ్యూస్(50 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 77), నాట్ స్కివర్ బ్రాంట్(41 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 77) అద్బుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ గుజరాత్ బౌలర్లను ఊచకోత కోశారు. వీరిద్దరూ రెండో వికెట్కు 133 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ సీనియర్ ద్వయంతో పాటు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(12 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 36) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది.గుజరాత్ బౌలర్లలో గిబ్సన్ రెండు, గౌతమ్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా ఈ మ్యాచ్లో గుజరాత్ ఫీల్డర్లు సునాయస క్యాచ్లను జారవిడిచారు. అందుకు గుజరాత్ భారీ మూల్యం చెల్లుంచుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా ఈ ఎలిమినేటర్ మ్యాచ్కు గుజరాత్ స్టార్ ప్లేయర్ డాటిన్ దూరమైంది. డాటిన్ లేని లోటు గుజరాత్ టీమ్లో స్పష్టంగా కన్పించింది. తుది జట్లుముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, అమేలియా కెర్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమంజోత్ కౌర్, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), సజీవన్ సజన, జి కమలిని, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్గుజరాత్: బెత్ మూనీ (వికెట్ కీపర్), కష్వీ గౌతమ్, హర్లీన్ డియోల్, ఆష్లీ గార్డనర్ (కెప్టెన్), ఫోబ్ లిచ్ఫీల్డ్, డేనియల్ గిబ్సన్, భారతీ ఫుల్మాలి, సిమ్రాన్ షేక్, మేఘనా సింగ్, తనూజా కన్వర్, ప్రియా మిశ్రా -
ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి
ఐపీఎల్-2025(IPL 2025) సీజన్ కోసం ముంబై ఇండియన్స్(Mumba Indians) తమ సన్నాహకాలను ప్రారంభించింది. వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంపులో ముంబై ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఆటగాళ్లు ఇప్పటికే ముంబై శిబిరంలో చేరారు. ఇక ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ మెనెజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.తమ జట్టు స్పిరిట్ కోచ్' గా బాలీవుడ్ ఐకాన్ జాకీ ష్రాఫ్ను ముంబై ఇండియన్స్ యాజమాన్యం నియమించింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను ముంబై సోషల్ మీడియాలో షేర్ చేసింది. తమ జట్టు ఆటగాళ్లలో ఉత్సాహాన్ని, పట్టుదల పెంచేందుకు ముంబై ఫ్రాంఛైజీ ఈ వినూత్న ఆలోచన చేసింది. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఏ ఫ్రాంచైజీ కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక ఈ ఏడాది సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.తొలి మ్యాచ్లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతానైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే.. తమ తొలి మ్యాచ్లో మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్తో ఆడనుంది. ఐపీఎల్-2024లో గ్రూపు స్టేజికే పరిమితమైన ముంబై ఇండియన్స్.. ఈ ఏడాది సీజన్లో మాత్రం సత్తాచాటాలని భావిస్తోంది.భారీ షాక్.. అయితే ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బమ్రా గాయం కారణంగా ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ సీజన్కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. బుమ్రా ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పొందుతున్నాడు. అతడు కోలుకోవడానికి మరో నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు సమాచారం. ఏప్రిల్లో బుమ్రా ముంబై జట్టులో చేరనున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.ఐపీఎల్-2025కు ముంబై ఇండియన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా(కెప్టెన్), రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, రాబిన్ మింజ్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, ర్యాన్ రికెల్టన్, దీపక్ చాహర్, అల్లా గజన్ఫర్, విల్ జాక్స్, అశ్వని కుమార్, మిచెల్ సాంట్నర్, రీస్ టోప్లీ, క్రిష్ణన్ ష్రిజిత్, రాజ్ బవా, సత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్, సీ బోచ్, విగ్నేష్ పుతుర్.చదవండి: IPL 2025: అతడి గురించి ఎవరూ మాట్లాడమే లేదు.. మూడో స్థానంలో ఆడిస్తారా? Saans le lamba & shaanti coz 𝙅𝘼𝙂𝙂𝙐 𝘿𝘼𝘿𝘼 - aapla Spirit Coach is here! 🧘♂️😎#MumbaiIndians #PlayLikeMumbai pic.twitter.com/md5fnlJKX9— Mumbai Indians (@mipaltan) March 13, 2025 -
ఫైనల్ చేరేదెవరో!
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. గురువారం జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్తో ముంబై ఇండియన్స్ ఆడనుంది. తాజా సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ ముంబై జట్టునే విజయం వరించగా... ముచ్చటగా మూడోసారి కూడా గెలిచి ఫైనల్కు అర్హత సాధించాలని హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై జట్టు భావిస్తోంది. మరోవైపు ఆష్లీ గార్డ్నర్ కెపె్టన్సీలోని గుజరాత్ జెయింట్స్ జట్టు తొలిసారి ఫైనల్ చేరాలని తహతహలాడుతోంది. లీగ్ దశలో ఆడిన 8 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ 10 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక అగ్రస్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్స్ కూడా 5 మ్యాచ్లు నెగ్గినప్పటికీ రన్రేట్లో ముంబై కంటే మెరుగ్గా ఉన్న ఢిల్లీ జట్టు నేరుగా ఫైనల్కు దూసుకెళ్లింది. ఆ జట్టుకు ఇది వరుసగా మూడో ఫైనల్ కావడం విశేషం. మరోవైపు 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి గుజరాత్ జెయింట్స్ జట్టు ఎలిమినేటర్కు చేరింది. మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో పటిష్టంగా కనిపిస్తోంది. సొంతగడ్డపై మ్యాచ్ ఆడనుండటం హర్మన్ప్రీత్ బృందం బలాన్ని మరింత పెంచుతోంది. హేలీ మాథ్యూస్, నాట్ సివర్ బ్రంట్, అమేలియా కెర్, హర్మన్ప్రీత్ కౌర్, అమన్జ్యోత్ కౌర్, సజన, యస్తిక భాటియా రూపంలో ముంబై జట్టుకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఓపెనర్గా మెరుపు ఆరంభాలు ఇస్తున్న హేలీ మాథ్యూస్... బౌలింగ్లోనూ కీలక వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక బ్యాటింగ్లో సివర్ బ్రంట్ ఫుల్ ఫామ్ చాటుకుంటోంది. ఈ సీజన్లో 8 మ్యాచ్లాడిన సివర్... 416 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా కొనసాగుతోంది. ఇందులో 4 అర్ధశతకాలు ఉన్నాయి. ఇరు జట్ల మద్య చివరగా సోమవారం జరిగిన మ్యాచ్లో హర్మన్ప్రీత్ విజృంభించింది. మిడిలార్డర్లో ధనాధన్ బ్యాటింగ్తో చెలరేగి జట్టు భారీ స్కోరుకు బాటలు వేసింది. బౌలింగ్లో షబ్నమ్ ఇస్మాయిల్, హేలీ మాథ్యూస్, సివర్ బ్రంట్, పారుణిక, అమేలియా, సంస్కృతి, అమన్జ్యోత్ కీలకం కానున్నారు. మరోవైపు ఈ సీజన్లో ముంబైతో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓడిన గుజరాత్... వాటికి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. ఆష్లీ గార్డ్నర్, బెత్ మూనీ, లిచ్ఫీల్డ్, డియాండ్రా డాటిన్, హర్లీన్ డియోల్ కలిసికట్టుగా కదంతొక్కాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. గత మ్యాచ్లో భారీ షాట్లతో ముంబైని వణికించిన భారతి ఫూల్మాలి నుంచి అదే తరహా మెరుపులు కొనసాగాలని కోరుకుంటోంది. బౌలింగ్లో డాటిన్, తనుజ, కాశ్వి, ప్రియ, మేఘన కీలకం కానున్నారు. -
బెంగళూరు గెలిచింది
ముంబై: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచి నేరుగా ఫైనల్ చేరాలనుకున్న ముంబై ఆశలపై డిఫెండింగ్ చాంప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నీళ్లు చల్లింది. డబ్ల్యూపీఎల్ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ 11 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించింది. దీంతో రెండో స్థానంతోనే సరిపెట్టుకున్న హర్మన్ప్రీత్ సేన ఫైనల్కు అర్హత సాధించేందుకు రేపు గుజరాత్ జెయింట్స్తో ‘ప్లేఆఫ్’ మ్యాచ్ ఆడనుంది. వరుసగా ఐదు ఓటముల తర్వాత ఆర్సీబీ విజయం సాధించడం విశేషం. తాజా ఫలితంతో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడో సీజన్లోనూ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఢిల్లీ, ముంబై చెరో 10 పాయింట్లతో సమంగా నిలిచినా ... రన్రేట్తో క్యాపిటల్స్ ముందంజ వేసింది. 2023, 2024లలో కూడా ఢిల్లీ ఫైనల్ చేరినా... రన్నరప్గానే సరిపెట్టుకుంది. మంగళవారం జరిగిన పోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (37 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్స్లు), ఎలీస్ పెరీ (38 బంతుల్లో 49 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసి పోరాడి ఓడింది. నాట్ సివర్ బ్రంట్ (35 బంతుల్లో 69; 9 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించింది. బెంగళూరు బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్నేహ్ రాణా (3/26) మూడు... కిమ్ గార్త్, పెరీ చెరో రెండు వికెట్లు తీశారు. అందరూ ధాటిగా... బెంగళూరు జట్టులో క్రీజులోకి దిగినవారంతా ధాటిగా పరుగులు సాధించారు. సబ్బినేని మేఘన (13 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్స్మృతి ఓపెనింగ్ వికెట్కు 22 బంతుల్లో 41 పరుగులు జోడించారు. తర్వాత కెప్టెన్ మంధానకు జతయిన ఎలీస్ పెరీ కూడా వేగంగా ఆడటంతో బెంగళూరు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీళ్లిద్దరు రెండో వికెట్కు 59 పరుగులు జోడించారు. స్మృతి నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్ (22 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్) తనదైన శైలిలో దూకుడు కనబరిచింది. రిచా, పెరీలిద్దరూ జట్టు స్కోరును 150 పరుగులు దాటించారు. అనంతరం రిచా జోరుకు హేలీ అడ్డుకట్ట వేసింది. అయితే జార్జియా వేర్హామ్ (10 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) డెత్ ఓవర్లలో చెలరేగడంతో ప్రత్యర్థి ముందు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రాణించిన నాట్ సివర్ ముంబై ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్లు హేలీ మాథ్యూస్ (19), అమెలియా కెర్ (9) భారీ లక్ష్యానికి అనువైన శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. నాట్ సివర్ బ్రంట్ చక్కగా పోరాడినప్పటికీ తర్వాత వచ్చిన బ్యాటర్లు వికెట్లు పారేసుకోవడంతో ముంబై జట్టు లక్ష్యానికి దూరమైంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ (20; 2 ఫోర్లు), అమన్జోత్ (17) ప్రభావం చూపలేకపోగా... ఆఖరి ఓవర్లో సజీవన్ సజన (12 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్లు) భారీ షాట్లతో వణికించింది. 3 బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన దశలో ఆమె కూడా అవుట్ కావడంతో ముంబైకి ఓటమి ఖాయమైంది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: మేఘన (సి) పారుణిక (బి) హేలీ మాథ్యూస్ 26; స్మృతి (సి) షబి్నమ్ (బి) అమెలియా 53; ఎలీస్ పెరీ నాటౌట్ 49; రిచా ఘోష్ (సి) నాట్ సివర్ (బి) హేలీ మాథ్యూస్ 36; జార్జియా నాటౌట్ 31; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–41, 2–100, 3–153. బౌలింగ్: షబ్నిమ్ ఇస్మాయిల్ 4–0–41–0, నాట్ సివర్ 2–0–16–0, హేలీ మాథ్యూస్ 4–0–37–2, అమన్జోత్ 4–0–27–0, అమెలియా కెర్ 3–0–47–1, సంస్కృతి గుప్తా 1–0–6–0, పారుణిక సిసోడియా 2–0–24–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) గ్రాహమ్ (బి) స్నేహ్ రాణా 19; అమెలియా (సి) మంధాన (బి) స్నేహ్ రాణా 9; నాట్ సీవర్ (సి అండ్ బి) పెరీ 69; హర్మన్ప్రీత్ (సి) రిచా ఘోష్ (బి) కిమ్ గార్త్ 20; అమన్జోత్ (బి) గ్రాహమ్ 17; యస్తిక భాటియా (సి అండ్ బి) స్నేహ్ రాణా 4; సజన (సి) మేఘన (బి) పెరీ 23; కమలిని (సి) పెరీ (బి) జార్జియా 6; సంస్కృతి (సి) జోషిత (బి) కిమ్ గార్త్ 10; షబ్నిమ్ నాటౌట్ 4; పారుణిక నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–27, 2–38, 3–78, 4–129, 5–134, 6–140, 7–152, 8–167, 9–188. బౌలింగ్: కిమ్ గార్త్ 4–0–33–2, ఎలీస్ పెరీ 4–0–53–2, స్నేహ్ రాణా 4–0–26–3, హిథెర్ గ్రాహమ్ 4–0–47–1, జార్జియా వేర్హామ్ 4–0–29–1. -
ముంబై ‘ఫైనల్’ రేసులో...
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో అగ్రస్థానంతో నేరుగా ఫైనల్ చేరేందుకు ముంబై ఇండియన్స్ జట్టు విజయం దూరంలో నిలిచింది. సోమవారం జరిగిన మ్యాచ్లో ముంబై 9 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్పై గెలుపొందింది. మొదట ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ హర్మన్ప్రీత్ (33 బంతుల్లో 54; 9 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించింది. తర్వాత గుజరాత్ 20 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. భారతి (25 బంతుల్లో 61; 8 ఫోర్లు, 4 సిక్స్లు) ముంబై బౌలర్లపై విరుచుకుపడింది. జెయింట్స్ ఒకదశలో 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమికి సిద్ధమవగా... భారతి ధనాధన్ ఆటతో ఆశలు రేపింది. 41 బంతుల్లో 88 పరుగుల సమీకరణం ఆఖరి ఓవర్కు వచ్చేసరికి 6 బంతుల్లో 13 పరుగులుగా మారింది. కానీ 20వ ఓవర్ వేసిన హేలీ... తనూజ (10)ను రనౌట్ చేసింది. తర్వాతి బంతికి సిమ్రాన్ (18; 1 ఫోర్, 1 సిక్స్), చివరి బంతికి ప్రియా (1) వికెట్లు తీసి ఆలౌట్ చేసింది. నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగే లీగ్ దశ ఆఖరి మ్యాచ్లోనూ గెలిస్తే ముంబై 12 పాయింట్లతో పట్టికలో టాప్ లేపి నేరుగా ఫైనల్కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ క్యాపిటల్స్ 10 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నా... మెరుగైన రన్రేట్ కారణంగా ఢిల్లీ ‘టాప్’లో ఉంది. -
నేరుగా ఫైనల్ చేరడమే లక్ష్యం
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ప్లే ఆఫ్స్ బెర్త్లు శనివారం ఖరారయ్యాయి. ఇక మిగిలిందల్లా అగ్రస్థానం కోసం పోటీ! పాయింట్ల పట్టికలో ‘టాప్’లో నిలిచిన ఏకైక జట్టు నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది. ఇప్పుడు ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ల పోరాటం కూడా దీని కోసమే! 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న గుజరాత్కు ఇది ఆఖరి లీగ్ మ్యాచ్ కాగా... మంచి రన్రేట్తో గెలిస్తే అగ్రస్థానంతో తుదిపోరుకు చేరే అవకాశముంది. 8 పాయింట్లతో రన్రేట్లో వెనుకబడినప్పటికీ... ముంబై జట్టుకు ఇంకా రెండు మ్యాచ్లు ఉండటం, సొంత ప్రేక్షకుల మధ్య జరగనుండటం అదనపు అనుకూలతగా మారింది. మాజీ చాంపియన్ ముంబై నేడు జెయింట్స్పై, రేపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై గెలిస్తే చాలు ఎలాంటి రన్రేట్ సమీకరణాలతో పనిలేకుండా 12 పాయింట్లతో ఫైనల్ బరిలో నిలవొచ్చు. ఇప్పటికైతే ఢిల్లీ క్యాపిటల్స్ 10 పాయింట్లతో ‘టాప్’లో ఉంది. అనామకం కాదు కీలకం ముంబై, గుజరాత్ జట్లు ప్లేఆఫ్స్ చేరిన నేపథ్యంలో ఇది అనామక మ్యాచ్ అనుకుంటే పోరపాటే అవుతుంది. ఫైనల్ రేసు కోసం ఇరు జట్ల మధ్య ముమ్మాటికి కీలకపోరే జరుగనుంది! ముంబై జట్టు విదేశీ బ్యాటర్ల బలగంతో పటిష్టంగా ఉంది. నాట్ సివర్ బ్రంట్, హేలీ మాథ్యూస్లు ఈ టోర్నీలో నిలకడగా ఫామ్ చాటుకున్నారు. వీళ్లిద్దరితో పాటు కెప్టెన్ హర్మన్ప్రీత్, అమెలియా కెర్లు కూడా మెరుగ్గానే ఆడుతుండటంతో బ్యాటింగ్ లైనప్కు ఏ ఢోకా లేదు. బౌలింగ్లోనూ విదేశీ ఆల్రౌండర్లే జట్టు విజయాల్లో భాగమవుతున్నారు. యూపీ వారియర్స్తో జరిగిన గత మ్యాచ్లో అమెలియా కెర్ ఐదు వికెట్లతో సత్తా చాటుకుంది. నాట్ సివర్, హేలీ మాథ్యూస్లు కూడా అడపాదడపా వికెట్లను పడగొడుతున్నారు. మరోవైపు గుజరాత్ జెయింట్స్ కూడా గత మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జోరుకు చెక్ పెట్టింది. 177 పరుగుల భారీ లక్ష్యాన్ని జెయింట్స్ సులువుగా ఛేదించింది. హర్లీన్ డియోల్, బెత్ మూనీ, కెపె్టన్ ఆష్లీ గార్డ్నర్ సూపర్ ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లో ఆల్రౌండర్ డియాండ్రా డాటిన్, కాశ్వీ, తనూజ, మేఘన సింగ్లు ప్రభావం చూపగలరు. తుది జట్లు (అంచనా) ముంబై ఇండియన్స్: హర్మన్ప్రీత్ (కెప్టెన్), హేలీ మాథ్యూస్, అమెలియా కెర్, నాట్ సివర్, అమన్జ్యోత్ కౌర్, యస్తిక, సజన, కమలిని, సంస్కృతి, షబ్నమ్, పారుణిక సిసోడియా. గుజరాత్ జెయింట్స్: ఆష్లీ గార్డ్నర్ (కెప్టెన్), బెత్ మూనీ, హేమలత, హర్లీన్ డియోల్, డియాండ్రా, లిచ్ఫీల్డ్, కాశ్వీ గౌతమ్, భారతి, తనూజ, మేఘన సింగ్, ప్రియా మిశ్రా. -
IPL 2025: ముంబై ఇండియన్స్తో జతకట్టిన సౌతాఫ్రికా ఆల్రౌండర్
సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కార్బిన్ బాష్ ఫైవ్ టైమ్ ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్తో జతకట్టాడు. సహచరుడు లిజాడ్ విలియమ్స్ గాయం కారణంగా తదుపరి సీజన్కు దూరం కావడంతో అతని స్థానాన్ని బాష్ భర్తీ చేస్తున్నాడు. 30 ఏళ్ల బాష్ను ముంబై ఇండియన్స్ తమ హ్యామిలీలోకి ఆహ్వానించింది. రైట్ హ్యాండ్ బ్యాట్, రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలింగ్ వేసే బాష్ సౌతాఫ్రికా తరఫున ఓ టెస్ట్, 2 వన్డేలు ఆడాడు. బాష్ గతేడాది డిసెంబర్లో టెస్ట్ల్లో అరంగేట్రం చేశాడు.బాష్ తన తొలి టెస్ట్ మ్యాచ్లోనే ఇరగదీశాడు. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో బాష్ తొలి ఇన్నింగ్స్లో అజేయమైన 81 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో 4 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో బాష్ అద్భుత ఆల్రౌండ్ ప్రదర్శన కారణంగా సౌతాఫ్రికా పాకిస్తాన్ను 2 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.ఈ మ్యాచ్కు ముందు బాష్ అదే పాకిస్తాన్పైనే వన్డే అరంగేట్రం చేశాడు. బాష్ ఇప్పటివరకు 2 వన్డేలు ఆడి 2 వికెట్లు సహా 55 పరుగులు చేశాడు. అరంగేట్రం ఇన్నింగ్స్లో బాష్ 44 బంతుల్లో 40 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇదే అతనికి వన్డేల్లో అత్యధిక స్కోర్. బాష్ తన రెండో వన్డేను కూడా పాక్తోనే ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగిన ట్రై సిరీస్లో బాష్ పాకిస్తాన్ మ్యాచ్లో ఆడాడు.అంతర్జాతీయ అరంగేట్రం అనంతరం బాష్ సౌతాఫ్రికా టీ20 లీగ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది బాష్ ఎంఐ కేప్టౌన్ తరఫున బరిలో నిలిచాడు. ఈ సీజన్లో బాష్ 8 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీసి ఎంఐ కేప్టౌన్ తమ తొలి టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.బాష్ సౌతాఫ్రికా 2014 అండర్-19 వరల్డ్కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. నాడు పాకిస్తాన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో చెలరేగి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఆ మ్యాచ్లో బాష్ 4 వికెట్లు తీశాడు. బాష్ తన కెరీర్లో వివిధ ఫార్మాట్లలో ఇప్పటివరకు 2500కు పైగా పరుగులు చేసి 150కిపైగా వికెట్లు తీశాడు. బాష్ టీ20ల్లో 86 మ్యాచ్లు ఆడి 59 వికెట్లు తీశాడు. బాష్ చేరికతో ముంబై ఇండియన్స్లో ఆల్రౌండర్ల సంఖ్య 9కి చేరింది. ఇప్పటికే ఆ జట్టులో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, బెవాన్ జాకబ్స్, మిచెల్ సాంట్నర్, విల్ జాక్స్, అర్జున్ టెండూల్కర్ తదితర ఆల్రౌండర్లు ఉన్నారు. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్-2025 ఎడిషన్లో ముంబై తమ తొలి మ్యాచ్ను మార్చి 23న ఆడుతుంది. చెన్నైలో జరిగే ఆ మ్యాచ్లో ముంబై సీఎస్కేను ఢీకొంటుంది.ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్..రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార యాదవ్, నమన్ ధిర్, బెవాన్ జాకబ్స్, రాజ్ బవా, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజ్ఞేశ్ పుథుర్, సత్యనారాయణ రాజు, కార్బిన్ బాష్, మిచెల్ సాంట్నర్, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, కృష్ణణ్ శ్రీజిత్, రాబిన్ మింజ్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ -
IPL 2025: ముంబై ఇండియన్స్కు భారీ షాక్..
ఐపీఎల్-2025(IPL-2025) ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు భారీ షాక్ తగలింది. ఆ జట్టు స్టార్ పేసర్, టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) గాయం కారణంగా ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ సీజన్కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. బుమ్రా ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్నాడు.ఈ క్రమంలోనే కీలకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సైతం బుమ్రా దూరమయ్యాడు. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పొందుతున్నాడు. అతడు తన పూర్తి ఫిట్నెస్ సాధించడానికి రెండు నుంచి మూడు వారాల సమయం పట్టనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ భారత స్పీడ్ స్టార్ ఏప్రిల్లో ముంబై ఇండియన్స్ శిబిరంలో చేరే అవకాశం ఉంది."బుమ్రా వేగంగా కోలుకుంటున్నాడు. అతడి మెడికల్ రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి. అతడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో తిరిగి తన బౌలింగ్ ప్రాక్టీస్ను ప్రారంభించాడు. అయితే ఐపీఎల్లో బౌలింగ్ చేసే ఫిట్నెస్ మాత్రం ఇంకా సాధించలేదు. ఏప్రిల్ మొదటి వారంలో బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టే అవకాశముంది. అది కూడా మేము కచ్చితంగా చెప్పలేము. మా వైద్య బృందం అతడిపై క్రమంగా వర్క్లోడ్ పెంచుతుంది.అతడు ఎటువంటి అసౌకర్యం లేకుండా బౌలింగ్ చేయగలిగితేనే వైద్య బృందం క్లియరన్స్ ఇస్తోంది. అప్పటివరకు అతడు సీఓఈలోనే ఉండనున్నాడని" బీసీసీఐ అధికారి ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్లో మార్చి 23న చెన్నైసూపర్ కింగ్స్తో తలపడనుంది. హార్దిక్ కూడా..ఈ మ్యాచ్కు ముంబై రెగ్యూలర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం దూరం కానున్నాడు. గతేడాది సీజన్లో స్లో ఓవర్ రేటు కారణంగా పాండ్యాపై ఒక్క మ్యాచ్ నిషేధం పడింది. హార్దిక్ గత సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో మూడోసారి స్లో ఓవర్ రేట్కు కారణమయ్యాడు.దీంతో వరుసగా మూడు సార్లు స్లో ఓవరేట్ను మెయింటేన్ చేయడంతో ఐపీఎల్ నిర్వహకులు అతడిపై ఆడకుండా ఒక్క మ్యాచ్ నిషేదం విధించారు. ఆ బ్యాన్ను పాండ్యా ఈ ఏడాది సీజన్లో ఎదుర్కొన్నాడు. తొలి మ్యాచ్కు బెంచ్కే పరిమితం కానున్నాడు. కాగా గతేడాది సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శనతో లీగ్ స్టేజికే పరిమితమైన సంగతి తెలిసిందే.చదవండి: BCCI: శుబ్మన్ గిల్కు ప్రమోషన్.. ఏకంగా రూ. 7 కోట్ల జీతం!? -
WPL 2025: వారియర్స్ ఆశలు ఆవిరి!
లక్నో: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ‘ప్లే ఆఫ్’ దశకు అర్హత సాధించే అవకాశాలు సజీవంగా ఉండాలంటే గెలవాల్సిన మ్యాచ్లో యూపీ వారియర్స్ జట్టు నిరాశపరిచింది. గురువారం జరిగిన మ్యాచ్లో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్పై గెలిచి ప్లే ఆఫ్స్ దశకు చేరువైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. జార్జియా వోల్ (33 బంతుల్లో 55; 12 ఫోర్లు) డబ్ల్యూపీఎల్లో తొలి అర్ధశతకంతో ఆకట్టుకోగా... గ్రేస్ హ్యారిస్ (28; 3 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ దీప్తి శర్మ (27; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. కిరణ్ నవ్గిరె (0), షినెల్ హెన్రీ (6), శ్వేత సెహ్రావత్ (0), ఉమా ఛెత్రీ (1) విఫలమయ్యారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో అమేలియా కెర్ 38 పరుగులిచ్చి 5 వికెట్లతో అదరగొట్టగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హేలీ మాథ్యూస్ (2 వికెట్లు; 68 పరుగులు) ఆల్రౌండ్ ప్రదర్శన తో మెరిపించింది. ఓపెనర్లు రాణించడంతో ఒకదశలో 7.5 ఓవర్లలో 74 పరుగులు చేసిన యూపీ వారియర్స్ ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయింది. అమేలియా విజృంభణతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి సాధారణ స్కోరుకే పరిమితమైంది. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. హేలీ (46 బంతుల్లో 68; 8 ఫోర్లు, 2 సిక్స్లు), సివర్ బ్రంట్ (23 బంతుల్లో 37; 7 ఫోర్లు) రాణించారు.వీరిద్దరూ రెండో వికెట్కు 58 బంతుల్లోనే 92 పరుగులు జోడించడంతో ముంబై సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. లీగ్లో భాగంగా శుక్రవారం జరగనున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో గుజరాత్ జెయింట్స్ ఆడుతుంది. -
ఐదేసిన అమేలియా కెర్.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన వారియర్జ్
డబ్ల్యూపీఎల్-2025లో భాగంగా లక్నో వేదికగా ఇవాళ (మార్చి 6) యూపీ వారియర్జ్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై ఇండియన్స్ యూపీ వారియర్జ్ను నామమాత్రపు స్కోర్కే పరిమితం చేసింది. అమేలియా కెర్ ఐదు వికెట్లతో విజృంభించడంతో వారియర్జ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 150 పరుగులు మాత్రమే చేయగలిగింది. వారియర్జ్ ఇన్నింగ్స్లో ఓపెనర్ జార్జియా వాల్ (55) అర్ద సెంచరీతో రాణించగా.. గ్రేస్ హ్యారిస్ (28), కెప్టెన్ దీప్తి శర్మ (27), వృందా దినేశ్ (10), ఆఖర్లో సోఫీ ఎక్లెస్టోన్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. కిరణ్ నవ్గిరే, శ్వేతా సెహ్రావత్ డకౌట్లు కాగా.. చిన్నెల్ హెన్రీ 6, ఉమ్రా ఛెత్రీ ఒక పరుగు చేశారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో అమేలియా కెర్తో పాటు హేలీ మాథ్యూస్ (2), నాట్ సీవర్ బ్రంట్ (1), పరుణిక సిసోడియా (1) వికెట్లు తీశారు. వారియర్జ్ ఇన్నింగ్స్కు ఓపెనర్లు గ్రేస్ హ్యారిస్, జార్జియా వాల్ గట్టి పునాది వేశారు. వీరిద్దరూ తొలి వికెట్కు 74 పరుగులు (8 ఓవర్లలో) జోడించారు. హ్యారిస్, వాల్ క్రీజ్లో ఉండగా.. వారియర్జ్ భారీ స్కోర్ సాధిస్తుందని అంతా భావించారు. అయితే 16 పరుగుల వ్యవధిలో వీరిద్దరూ ఔట్ కావడంతో వారియర్జ్ కష్టాల్లో పడింది. హ్యారిస్, వాల్ ఔటయ్యాక వారియర్జ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి భారీ స్కోర్ చేయలేకపోయింది. సెకండ్ డౌన్లో వచ్చిన దీప్తి శర్మ చివరి ఓవర్ వరకు క్రీజ్లో ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఆఖర్లో ఎక్లెస్టోన్ ఓ మోస్తరుగా బ్యాట్ను ఝులిపించడంతో వారియర్జ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.ఈ సీజన్లో వారియర్జ్ ఆశించిన స్థాయిలో రాణించలేక పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 2 మ్యాచ్ల్లో మాత్రమే గెలుపొందింది. ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ ఆడిన 7 మ్యాచ్ల్లో ఐదింట విజయాలు సాధించి ప్లే ఆఫ్స్కు కూడా అర్హత సాధించింది. గత రెండు సీజన్లలో చివరి స్థానంలో నిలిచిన గుజరాత్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. గతేడాది రన్నరప్ ముంబై ఇండియన్స్ మూడులో, ఢిపెండింగ్ చాంపియన్ ఆర్సీబీ నాలుగో స్థానంలో ఉన్నాయి. నేటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలిస్తే పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుని ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంటుంది. -
ఢిల్లీ ‘టాప్’ షో
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 టోర్నమెంట్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బౌలర్ల సమష్టి కృషికి ఓపెనర్లు మెగ్ లానింగ్, షఫాలీ వర్మ మెరుపులు తోడవడంతో శుక్రవారం జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 9 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించింది. మొదట బ్యాటింగ్కు దిగిన హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. హర్మన్ప్రీత్ (16 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్), హేలీ మాథ్యూస్ (22; 4 ఫోర్లు), సివర్ బ్రంట్ (18), అమేలియా కెర్ (17), అమన్జ్యోత్ కౌర్ (17) తలా కొన్ని పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో జెస్ జొనాసెన్, మిన్ను మణి చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 14.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 124 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (49 బంతుల్లో 60 నాటౌట్; 9 ఫోర్లు), ఓపెనర్ షఫాలీ వర్మ (28 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్స్లు) చెలరేగారు. వీరిద్దరూ తొలి వికెట్కు 85 పరుగులు జోడించారు. షఫాలీ అవుటయ్యాక జెమీమా రోడ్రిగ్స్ (15 నాటౌట్; 2 ఫోర్లు)తో కలిసి మెగ్ లానింగ్ లాంఛనాన్ని పూర్తి చేసింది. ముంబై బౌలర్లలో అమన్జ్యోత్ కౌర్ ఏకైక వికెట్ పడగొట్టింది. జెస్ జొనాసెన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్లో 6 మ్యాచ్లాడిన ఢిల్లీ క్యాపిటల్స్ 4 విజయాలు, 2 పరాజయాలతో 8 పాయింట్లు ఖాతాలో వేసుకొని అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 5 మ్యాచ్ల్లో 3 విజయాలు, 2 పరాజయాలతో 6 పాయింట్లు సాధించిన ముంబై ఇండియన్స్ పట్టిక రెండో స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తలపడుతుంది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక భాటియా (సి) సారా (బి) శిఖ 11; హేలీ మాథ్యూస్ (సి) షఫాలీ వర్మ (బి) అనాబెల్ 22; సివర్ బ్రంట్ (సి అండ్ బి) జెస్ జొనాసెన్ 18; హర్మన్ప్రీత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జెస్ జొనాసెన్ 22; అమేలియా కెర్ (సి) అనాబెల్ (బి) మిన్ను 17; సజన (సి) లానింగ్ (బి) మిన్ను 5; అమన్జ్యోత్ (నాటౌట్) 17; కమలిని (బి) జెస్ జొనాసెన్ 1; సంస్కృతి గుప్తా (సి) జెమీమా (బి) మిన్ను 3; కలిత (రనౌట్) 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 123. వికెట్ల పతనం: 1–35, 2–35, 3–73, 4–83, 5–100, 6–101, 7–104, 8–115, 9–123. బౌలింగ్: మరిజానె కాప్ 3–0–16–0; శిఖ పాండే 4–1–16–1; జెస్ జొనాసెన్ 4–0–25–3; అనాబెల్ సదర్లాండ్ 4–0–21–1; టిటాస్ సాధు 2–0–24–0; మిన్ను మణి 3–0–17–3. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెగ్ లానింగ్ (నాటౌట్) 60; షఫాలీ వర్మ (సి) అమేలియా కెర్ (బి) అమన్జ్యోత్ 43; జెమీమా రోడ్రిగ్స్ (నాటౌట్) 15; ఎక్స్ట్రాలు 6; మొత్తం (14.3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి) 124. వికెట్ల పతనం: 1–85; బౌలింగ్: షబ్నమ్ ఇస్మాయిల్ 4–0–26–0; సివర్ బ్రంట్ 2–0–27–0; హేలీ మాథ్యూస్ 2–0–16–0; అమేలియా కెర్ 2–0–20–0; అమన్జ్యోత్ కౌర్ 2–0–12–1; సంస్కృతి గుప్తా 1.3–0–14–0; కలిత 1–0–9–0. -
చెలరేగిన ఢిల్లీ బౌలర్లు.. స్వల్ప స్కోర్కే పరిమితమైన ముంబై ఇండియన్స్
డబ్ల్యూపీఎల్-2025లో ఇవాళ (ఫిబ్రవరి 28) ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో ఢిల్లీ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. జెస్ జోనాస్సెన్ (4-0-25-3), మిన్నూ మణి (3-0-17-3), శిఖా పాండే (4-1-16-1), అన్నాబెల్ సదర్ల్యాండ్ (4-0-21-1) చెలరేగడంతో ముంబై ఇండియన్స్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో ముంబై బ్యాటర్లు తేలిపోయారు. కనీసం ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. ముంబై ఇన్నింగ్స్లో 22 పరుగులే అత్యధికం. హేలీ మాథ్యూస్, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తలో 22 పరుగులు చేశారు. నాట్ సీవర్ బ్రంట్ 18, అమేలియా కెర్, అమన్జోత్ కౌర్ తలో 17 పరుగులు (నాటౌట్) చేశారు. ఓపెనర్ యస్తికా భాటియా 11 పరుగులు చేసింది. సజీవన్ సజనా 5, జి కమలిని 1, సంస్కృతి గుప్త 3 పరుగులు చేశారు. జింటమణి కలిత డకౌటైంది. ఈ సీజన్లో అద్భుత విజయాలతో టేబుల్ టాపర్గా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లో చెత్త ప్రదర్శన చేసింది. బ్యాటర్లెవరూ స్థాయికి తగ్గట్టుగా రాణించలేదు. కెప్టెన్ హర్మన్ప్రీత్కు మంచి ఆరంభమే లభించినా.. ఆమె పెద్ద స్కోర్ చేయలేకపోయింది. విదేశీ ప్లేయర్లు హేలీ మాథ్యూస్, నాట్ సీవర్ బ్రంట్, అమేలియా కెర్ రెండంకెల స్కోర్లు చేసినా బంతులు వృధా చేశారు. ఈ మ్యాచ్లో ముంబై క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. మూడో వికెట్కు హర్మన్, బ్రంట్ల మధ్య నెలకొల్పబడిన 38 పరుగుల భాగస్వామ్యమే ఈ ఇన్నింగ్స్కు అత్యధికం. ఢిల్లీ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేశారు. టిటాస్ సాధు ఒక్కరే కాస్త ధారాళంగా పరుగులు సమర్పించుకుంది. ఆమె 2 ఓవర్లలో 24 పరుగులిచ్చింది.కాగా, ముంబై ఈ ఎడిషన్లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో 3 విజయాలు సాధించి టేబుల్ టాపర్గా కొనసాగుతుంది. ముంబై తర్వాత రెండో స్థానంలో ఢిల్లీ ఉంది. ఢిల్లీ 5 మ్యాచ్ల్లో 3 విజయాలు సాధించింది. ముంబైతో పోలిస్తే ఢిల్లీ రన్రేట్ బాగా తక్కువగా ఉంది. ముంబై రన్రేట్ 0.780గా ఉండగా.. ఢిల్లీ రన్రేట్ మైనస్లో (-0.223) ఉంది. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మూడో స్థానంలో ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఈ జట్టు ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో కేవలం 2 విజయాలు మాత్రమే చేసింది. ఆర్సీబీ లాగే యూపీ వారియర్జ్, గుజరాత్ జెయింట్స్ తలో 5 మ్యాచ్ల్లో రెండేసి విజయాలు సాధించి నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. -
ముంబై బౌలర్ల విజృంభణ.. స్వల్ప స్కోర్కే పరిమితమైన యూపీ
డబ్ల్యూపీఎల్-2025లో ఇవాళ (ఫిబ్రవరి 26) ముంబై ఇండియన్స్, యూపీ వారియర్జ్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ.. ముంబై బౌలర్లు విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బౌలర్లలో నాట్ సీవర్ బ్రంట్ 3 వికెట్లు పడగొట్టగా.. షబ్నిమ్ ఇస్మాయిల్, సంస్కృతి గుప్తా తలో 2, హేలీ మాథ్యూస్, అమెలియా కెర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. యూపీ ఇన్నింగ్స్లో గ్రేస్ హ్యారిస్ (45) టాప్ స్కోరర్గా నిలువగా.. వృంద దినేశ్ (33) ఓ మోస్తరు స్కోర్ చేసింది. శ్వేతా సెహ్రావత్ (19), ఉమా ఛెత్రీ (13 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. కిరణ్ నవ్గిరే (1), కెప్టెన్ దీప్తి శర్మ (4), తహ్లియా మెక్గ్రాత్ (1), చిన్నెల్ హెన్రీ (7), సోఫీ ఎక్లెస్టోన్ (6) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సైమా ఠాకోర్ డకౌట్ కాగా.. క్రాంతి గౌడ్ (5) అజేయంగా నిలిచింది.ఈ మ్యాచ్లో యూపీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగిందంటే గ్రేస్ హ్యారిస్, వృంద దినేశ్ చలువే. ఈ ఇద్దరు రెండో వికెట్కు 79 పరుగులు జోడించారు. వీరిద్దరు క్రీజ్లో ఉండగా.. యూపీ భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే స్పల్ప వ్యవధిలో వీరు ఔట్ కావడంతో యూపీ ఇన్నింగ్స్ పతనం మొదలైంది. మధ్యలో శ్వేతా సెహ్రావత్, ఉమా ఛెత్రీ కొద్ది సేపు నిలకడగా బ్యాటింగ్ చేయడంతో యూపీ 100 పరుగుల మార్కును దాటగలిగింది.అనంతరం ముంబై ఛేదనను నిదానంగా ప్రారంభించింది. తొలి 2 ఓవర్లలో ఆ జట్టు వికెట్లేమీ నష్టపోనప్పటికీ 2 పరుగులు మాత్రమే చేయగలిగింది. చిన్నెల్ హెన్రీ, సోఫీ ఎక్లెస్టోన్ తొలి రెండు ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ సీజన్లో యూపీ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో రెండింటిలో విజయం సాధించింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మూడు మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించిన ముంబై మూడో ప్లేస్లో ఉంది. 5 మ్యాచ్ల్లో 3 విజయాలు సాధించిన ఢిల్లీ టాప్ ప్లేస్లో ఉండగా.. ఆర్సీబీ రెండో స్థానంలో ఉంది. 4 మ్యాచ్ల్లో ఒకే ఒక విజయం సాధించిన గుజరాత్ చివరి స్థానంలో కొనసాగుతుంది. -
ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలో మరో జట్టుతో జతకట్టిన రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్కు (Rashid Khan) ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫ్యామిలీతో బంధం మరింత బలపడింది. ఇప్పటికే మూడు లీగ్ల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల్లో సభ్యుడిగా ఉన్న రషీద్.. తాజాగా మరో ఎంఐ ఫ్రాంచైజీతో జతకట్టాడు. రషీద్ను ద హండ్రెడ్ లీగ్లో ఎంఐ యాజమాన్యంలో నడుస్తున్న ఓవల్ ఇన్విన్సిబుల్స్ (డిఫెండింగ్ ఛాంపియన్) సొంతం చేసుకుంది. ఓవల్ ఇన్విన్సిబుల్స్లో ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఇటీవలే పెట్టుబడులు పెట్టింది. ఇందులో 49 శాతం వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) కొనుగోలు చేసింది.ప్రస్తుతం రషీద్ ఒక్క ఐపీఎల్ మినహా మిగతా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల్లో (ఫారిన్ లీగ్ల్లో) సభ్యుడిగా ఉన్నాడు. రషీద్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు ఆడుతున్నాడు. రషీద్ సౌతాఫ్రికా టీ20 లీగ్ ముంబై ఇండియన్స్ కేప్టౌన్కు.. ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్కు.. మేజర్ లీగ్ క్రికెట్లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ద హండ్రెడ్ లీగ్ ప్రారంభం నుంచి (2021) ట్రెంట్ రాకెట్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న రషీద్ను ఓవల్ ఇన్విన్సిబుల్స్ డైరెక్ట్ ఓవర్సీస్ సైనింగ్ ద్వారా దక్కించుకుంది.కాగా, ద హండ్రెడ్ లీగ్-2025 సీజన్ కోసం ప్లేయర్ల రిటెన్షన్ జాబితాలను ఎనిమిది ఫ్రాంచైజీలు ఇవాళ ప్రకటించాయి. గత సీజన్లో తమతో ఉన్న 10 మంది సభ్యులను ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోవచ్చు. రిటెన్షన్ జాబితాలో ఒక ఇంగ్లండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్ తప్పక ఉండాలి. అలాగే ముగ్గురు ఓవర్సీస్ ప్లేయర్లు ఉండవచ్చు. అదనంగా ఓ విదేశీ ఆటగాడిని డైరెక్ట్ సైనింగ్ చేసుకోవచ్చు. ఈ పద్దతిలోనే ఇన్విన్సిబుల్స్ రషీద్ ఖాన్ను దక్కించుకుంది. ఫ్రాంచైజీల్లో మిగిలిన స్థానాల భర్తీ డ్రాఫ్ట్ ద్వారా జరుగుతుంది. డ్రాఫ్ట్ తేదీ ప్రకటించాల్సి ఉంది.ద హండ్రెడ్ లీగ్లో ఇటీవలే ఐపీఎల్ ఫ్రాంచైజీలు పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఓవల్ ఇన్విన్సిబుల్స్లో ముంబై ఇండియన్స్.. నార్తర్న్ సూపర్చార్జర్స్లో సన్రైజర్స్ హైదరాబాద్.. మాంచెస్టర్ ఒరిజినల్స్లో లక్నో సూపర్ జెయింట్స్.. సథరన్ బ్రేవ్లో ఢిల్లీ క్యాపిటల్స్ షేర్ దక్కించుకున్నాయి. వీటిలో సన్రైజర్స్ హైదరాబాద్ నార్తర్న్ సూపర్చార్జర్స్ ఫ్రాంచైజీ మొత్తాన్ని కొనుగోలు చేసింది. మిగతా ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆయా ప్రాంచైజీల్లో 49 శాతం వాటాను దక్కించుకున్నాయి.రిటెన్షన్స్ జాబితా..బర్మింగ్హమ్ ఫీనిక్స్- బెన్ డకెట్, ట్రెంట్ బౌల్ట్ (ఓవర్సీస్), లియామ్ లివింగ్స్టోన్, జేకబ్ బేతెల్, ఆడమ్ మిల్నే (ఓవర్సీస్), బెన్నీ హోవెల్, టిమ్ సౌథీ (ఓవర్సీస్), డాన్ మౌస్లీ, విల్ స్మీడ్, క్రిస్ వుడ్, ఆనురిన్ డొనాల్డ్లండన్ స్పిరిట్- లియామ్ డాసన్, డాన్ వారోల్, కేన్ విలియమ్సన్ (ఓవర్సీస్), రిచర్డ్ గ్లీసన్, ఓలీ స్టోన్, ఓలీ పోప్, కీటన్ జెన్నింగ్స్మాంచెస్టర్ ఒరిజినల్స్- జోస్ బట్లర్, ఫిలిప్ సాల్ట్, హెన్రిచ్ క్లాసెన్ (ఓవర్సీస్), మ్యాటీ హర్స్ట్, జోష్ టంగ్, స్కాట్ కర్రీ, టామ్ హార్ట్లీ, సోనీ బేకర్, టామ్ ఆస్పిన్వాల్నార్త్రన్ సూపర్ ఛార్జర్స్- హ్యారీ బ్రూక్, డేవిడ్ మిల్లర్ (ఓవర్సీస్), ఆదిల్ రషీద్, మిచెల్ సాంట్నర్ (ఓవర్సీస్), బ్రైడన్ కార్స్, బెన్ డ్వార్షుయిస్ (ఓవర్సీస్), మాట్ పాట్స్, పాట్ బ్రౌన్, గ్రహం క్లార్క్, టామ్ లాస్ఓవల్ ఇన్విన్సిబుల్స్- సామ్ కర్రన్, విల్ జాక్స్, రషీద్ ఖాన్ (ఓవర్సీస్), జోర్డన్ కాక్స్, సామ్ బిల్లింగ్స్, సాకిబ్ మహమూద్, గస్ అట్కిన్సన్, డొనొవన్ ఫెరియెరా (ఓవర్సీస్), నాథన్ సౌటర్, ట్వాండా ముయేయేసథరన్ బ్రేవ్- జోఫ్రా ఆర్చర్, జేమ్స్ విన్స్, క్రిస్ జోర్డన్, టైమాల్ మిల్స్, డుప్లెసిస్ (ఓవర్సీస్), లూయిస్ డు ప్లూయ్, లారీ ఈవాన్స్, క్రెయిగ్ ఓవర్టన్, ఫిన్ అలెన్ (ఓవర్సీస్), డ్యానీ బ్రిగ్స్, జేమ్స్ కోల్స్ట్రెంట్ రాకెట్స్- జో రూట్, మార్కస్ స్టోయినిస్ (ఓవర్సీస్), టామ్ బాంటన్, సామ్ కుక్, జాన్ టర్నర్, సామ్ హెయిన్, టామ్ అల్సోప్, కాల్విన్ హ్యారీసన్వెల్ష్ ఫైర్- జానీ బెయిర్స్టో, స్టీవ్ స్మిత్ (ఓవర్సీస్), టామ్ కొహ్లెర్ కాడ్మోర్, టామ్ ఏబెల్, లూక్ వెల్స్, స్టీవీ ఎస్కినాజీ -
అమన్జ్యోత్ మెరుపులు
బెంగళూరు: డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు సొంతగడ్డపై చుక్కెదురైంది. అమన్జ్యోత్ కౌర్ ఆల్రౌండ్ మెరుపులు మెరిపించడంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టు రెండో విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్ల తేడాతో ఆర్సీబీపై గెలుపొందింది. మొదట ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఎలీస్ పెర్రీ (43 బంతుల్లో 81; 11 ఫోర్లు, 2 సిక్స్లు) విజృంభించింది. ముంబై బౌలర్లలో అమన్జ్యోత్ కౌర్ 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం ముంబై జట్టు 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (38 బంతుల్లో 50, 8 ఫోర్లు, 1 సిక్స్), సివర్ బ్రంట్ (21 బంతుల్లో 42; 9 ఫోర్లు) ధాటిగా ఆడారు.చివర్లో ఉత్కంఠ నెలకొన్న సమయంలో అమన్జ్యోత్ కౌర్ (27 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు), కమలిని (11 నాటౌట్; 1 ఫోర్) కీలక పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. నేడు జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో యూపీ వారియర్స్ తలపడుతుంది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (సి) యస్తిక (బి) షబ్నిమ్ 26; డానీ వ్యాట్ (సి) హేలీ (బి) సివర్ బ్రంట్ 9; పెర్రీ (సి) షబ్నిమ్ (బి) అమన్జ్యోత్ 81; కనిక (బి) సంస్కృతి 3; రిచా (బి) అమన్జ్యోత్ 28; జార్జియా (సి) సంస్కృతి (బి) అమన్జ్యోత్ 6; కిమ్ గార్త్ (నాటౌట్) 8; ఎక్తా బిష్త్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–29, 2–48, 3–51, 4–57, 5–107, 6–119, 7–165, బౌలింగ్: షబ్నిమ్ 4–0–36–1; సివర్ బ్రంట్ 4–0–40–1; హేలీ మాథ్యూస్ 4–0–37–1; అమేలియా కెర్ 4–0–28–0; సంస్కృతి 1–0–3–1; అమన్జ్యోత్ 3–0–22–3. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: హేలీ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఏక్తా 15; యస్తిక (ఎల్బీడబ్ల్యూ) (బి) కిమ్ గార్త్ 8; సివర్ బ్రంట్ (బి) కిమ్ గార్త్ 42; హర్మన్ప్రీత్ (సి) రిచా (బి) జార్జియా 50; అమేలియా (సి) ఏక్తా (బి) జార్జియా 2; అమన్జ్యోత్ (నాటౌట్) 34; సంజనా (ఎల్బీడబ్ల్యూ) జార్జియా 0; కమలిని (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 8; మొత్తం (19.5 ఓవర్లలో 6 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1–9, 2–66, 3–74, 4–82, 5–144, 6–144, బౌలింగ్: రేణుక 4–0–35–0; కిమ్ గార్త్ 4–0–30–2; జార్జియా 4–1–21–3; ఏక్తా 3.5–0–37–1; జోషిత 2–0–19–0; కనిక 2–0–28–0. -
గుజరాత్ పై ముంబై ఇండియన్స్ విజయం
-
డబ్బులేదు.. మూడేళ్లపాటు మ్యాగీ తిని బతికాడు.. ఇప్పుడు అతడే..: నీతా అంబానీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియా స్టార్లుగా ఎదిగారు హార్దిక్ పాండ్యా(Hardik Pandya), జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah). క్రికెట్ ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని సత్తా చాటుతున్నారు. అయితే, ఈ ఇద్దరిలో దాగున్న అద్భుత నైపుణ్యాలను తెరమీదకు తెచ్చింది మాత్రం ముంబై ఇండియన్స్ యాజమాన్యం అని చెప్పవచ్చు.అంతేకాదు పాండ్యా, బుమ్రా సాధారణ ఆటగాళ్ల నుంచి సూపర్స్టార్లుగా ఎదగడంలో ఈ ఐపీఎల్ ఫ్రాంఛైజీదే కీలక పాత్ర. ఇక ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్బౌలర్గా వెలుగొందుతుండగా.. హార్దిక్ పాండ్యా సైతం టీమిండియా కీలక ప్లేయర్గా జట్టులో సుస్థిర స్థానం సంపాదించాడు. అంతేకాదు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ స్థాయికీ చేరుకున్నాడు.ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ యజమాని, భారత కుబేరుడు ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ(Nita Ambani) పాండ్యా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన హార్దిక్ పాండ్యా, అతడి అన్న కృనాల్ పాండ్యాలో తాము ఆట పట్ల అంకిత భావాన్ని గుర్తించి అవకాశం ఇచ్చామని.. ఈరోజు వాళ్లు ఉన్నతస్థాయికి చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు.అరుదైన గౌరవంకాగా రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. దార్శనిక నాయకత్వం, సమాజానికి చేసిన అసాధారణ సేవకు గుర్తింపుగా మసాచుసెట్స్ విశిష్ట గవర్నర్ ప్రశంసాపత్రాన్ని ఆమెకు ప్రదానం చేసింది. ఈ సందర్భంగా బోస్టన్లో మాట్లాడిన నీతా అంబానీ హార్దిక్ పాండ్యా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.‘‘ఐపీఎల్లో మాకు ఫిక్స్డ్ బడ్జెట్ ఉంటుంది. ఒక్కో ఫ్రాంఛైజీ ఇంతే ఖర్చు పెట్టాలనే నిబంధన ఉంటుంది. అయితే, మేము ఆ డబ్బును కొత్త మార్గాల్లో ఖర్చుచేయాలనుకున్నాం. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను వెలికితీయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్లాం.బక్కపల్చగా, పొడుగ్గా ఉన్న ఇద్దరు యువకులుముఖ్యంగా రంజీ ట్రోఫీ మ్యాచ్లు జరిగినప్పుడు నేను ప్రత్యేకంగా అక్కడికి వెళ్లేదాన్ని. నాతో పాటు మా స్కౌట్ బృందం కూడా ఉండేది. ప్రతి దేశవాళీ మ్యాచ్ను నిశితంగా గమనించేవాళ్లం. మా స్కౌట్ క్యాంపులో భాగంగా బక్కపల్చగా, పొడుగ్గా ఉన్న ఇద్దరు యువ ఆటగాళ్లను చూశాం.మ్యాగీ మాత్రమే తిని బతికారునేను వెళ్లి వాళ్లతో మాట్లాడాను. తాము గత మూడేళ్లుగా కేవలం మ్యాగీ మాత్రమే తిని బతుకుతున్నామని అప్పుడు వాళ్లు చెప్పారు. తమ దగ్గర డబ్బు లేదని అందుకే నూడుల్స్తో కడుపు నింపుకొంటున్నామని అన్నారు. అయితే, అప్పుడు నాకు వారిలో ఆట పట్ల ఉన్న నిబద్ధత.. ఏదో సాధించాలన్న బలమైన తపన కనిపించాయి.ఆ ఇద్దరు.. సోదరులు.. వారు మరెవరో కాదు.. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా. 2015లో నేను హార్దిక్ పాండ్యా కోసం రూ. 10 లక్షలు ఖర్చుచేసి వేలంలో అతడిని కొనుక్కున్నా. ఇప్పుడు అతడు ముంబై ఇండియన్స్కు గర్వకారణమైన కెప్టెన్’’ అని నీతా అంబానీ హార్దిక్ పాండ్యా నైపుణ్యాలపై ప్రశంసలు కురిపించారు.మరో ఆణిముత్యం.. అతడే ఓ చరిత్రఇక ఆ మరుసటి ఏడాది.. తమకు మరో ఆణిముత్యం దొరికిందన్న నీతా అంబానీ.. ‘‘ఓ యువ క్రికెటర్. అతడి బాడీ లాంగ్వేజ్ భిన్నంగా ఉంది. అతడు బౌలింగ్ చేస్తే చూడాలని అక్కడ కూర్చున్నాం. తానేంటో అతడు బంతితోనే నిరూపించుకున్నాడు. అతడు బుమ్రా. ఇక ఆ తర్వాత జరిగిందంతా ఓ చరిత్ర’’ అంటూ జస్ప్రీత్ బుమ్రాను ఆకాశానికెత్తారు. ఇక తిలక్ వర్మను కూడా తాము ఏరికోరి ఎంచుకున్నామన్న నీతా అంబానీ.. టీమిండియాకు ముంబై ఇండియన్స్ ఓ నర్సరీ లాంటిదంటూ తమ ఫ్రాంఛైజీపై ప్రశంసలు కురిపించారు.ఐపీఎల్ 2025లో పాల్గొనే ముంబై ఇండియన్స్ జట్టుహార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధిర్, బెవాన్ జాకబ్స్, రాజ్ బవా, విల్ జాక్స్, విజ్ఞేశ్ పుతుర్, సత్యనారాయణ రాజు, మిచెల్ సాంట్నర్, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, రాబిన్ మింజ్, కృష్ణణ్ శ్రీజిత్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వని కుమార్, రీస్ టాప్లే, లిజాడ్ విలియమ్స్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్.#WATCH | Boston, US: Reliance Foundation Founder-Chairperson Nita Ambani tells how she scouted for new talent for the Mumbai Indians team and included Hardik Pandya, Krunal Pandya, Jasprit Bumrah and Tilak Varma in the teamShe says, "In IPL, we all have a fixed budget, so every… pic.twitter.com/v0HriPJH8T— ANI (@ANI) February 17, 2025 -
IPL 2025: ముంబై ఇండియన్స్ ఆడే మ్యాచ్లు ఇవే..!
ఐపీఎల్ 2025 (IPL 2025) సీజన్ షెడ్యూల్ ఇవాళ (ఫిబ్రవరి 16) విడుదలైంది. ఈ సీజన్లో ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మార్చి 23న తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. తొలి మ్యాచ్లో ముంబై జట్టు తమ లాగే ఫైవ్ టైమ్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్తో (Chennai Super Kings) తలపడనుంది. ఈ మ్యాచ్కు చెన్నై ఆతిథ్యమివ్వనుంది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ మొత్తం 14 మ్యాచ్లు (ప్లే ఆఫ్స్ కాకుండా) ఆడుతుంది. ఇందులో ఏడు తమ సొంత మైదానంలో ఆడనుంది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్.. సీఎస్కే, సన్రైజర్స్, లక్నో, గుజరాత్, ఢిల్లీతో తలో రెండు మ్యాచ్లు ఆడుతుంది. కేకేఆర్, ఆర్సీబీ, రాజస్థాన్, పంజాబ్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది.ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ ఆడే మ్యాచ్లు..మార్చి 23 (ఆదివారం)- సీఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ (చెన్నై)మార్చి 29 (శనివారం)- గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (అహ్మదాబాద్)మార్చి 31 (సోమవారం)- కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)ఏప్రిల్ 4 (శుక్రవారం)- లక్నో వర్సెస్ ముంబై ఇండియన్స్ (లక్నో)ఏప్రిల్ 7 (సోమవారం)- ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)ఏప్రిల్ 13 (ఆదివారం)- ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ఢిల్లీ)ఏప్రిల్ 17 (గురువారం)- సన్రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)ఏప్రిల్ 20 (ఆదివారం)- సీఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)ఏప్రిల్ 23 (బుధవారం)- సన్రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (హైదరాబాద్)ఏప్రిల్ 27 (ఆదివారం)- లక్నో వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)మే 1 (గురువారం)- రాజస్థాన్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (జైపూర్)మే 6 (మంగళవారం)- గుజరాత్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)మే 11 (ఆదివారం)- పంజాబ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ధర్మశాల)మే 15 (గురువారం)- ఢిల్లీ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)ఐపీఎల్ 2025 కోసం ముంబై ఇండియన్స్ జట్టు..హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధిర్, బెవాన్ జాకబ్స్, రాజ్ బవా, విల్ జాక్స్, విజ్ఞేశ్ పుతుర్, సత్యనారాయణ రాజు, మిచెల్ సాంట్నర్, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, రాబిన్ మింజ్, కృష్ణణ్ శ్రీజిత్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వని కుమార్, రీస్ టాప్లే, లిజాడ్ విలియమ్స్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ -
టీ20ల్లో అరుదైన మైలురాయిని తాకిన టీమిండియా కెప్టెన్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్, మహిళల ఐపీఎల్లో (WPL) ముంబై ఇండియన్స్ సారధి అయిన హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) పొట్టి క్రికెట్లో (T20 Cricket) అరుదైన మైలురాయిని తాకింది. హర్మన్.. భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్, డబ్ల్యూపీఎల్లో ఆర్సీబీ సారధి అయిన స్మృతి మంధన తర్వాత టీ20ల్లో 8000 పరుగుల మైలురాయిని తాకిన రెండో భారత మహిళా క్రికెటర్గా రికార్డు నెలకొల్పింది. డబ్ల్యూపీఎల్-2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో నిన్న (ఫిబ్రవరి 15) జరిగిన ఉత్కంఠ పోరులో హర్మన్ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్కు ముందు 8000 పరుగులు పూర్తి చేసేందుకు హర్మన్కు 37 పరుగులు అవసరమయ్యాయి. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో హర్మన్ 8000 పరుగుల మైలురాయిని చేరుకుంది. ఈ మ్యాచ్లో హర్మన్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడింది. 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసింది.అంతర్జాతీయ క్రికెట్తో పాటు వివిధ టీ20 లీగ్ల్లో హర్మన్ చేసిన పరుగులుడబ్ల్యూపీఎల్- 591 పరుగులుమహిళల బిగ్బాష్ లీగ్- 1440 పరుగులుహండ్రెడ్ వుమెన్స్ లీగ్- 176 పరుగులుఅంతర్జాతీయ క్రికెట్- 3589 పరుగులు- వీటితో పాటు హర్మన్ దేశవాలీ టీ20 టోర్నీల్లో పంజాబ్ తరఫున మరిన్ని పరుగులు సాధించింది.టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత మహిళా క్రికెటర్లు..స్మృతి మంధన- 8349హర్మన్ప్రీత్ కౌర్- 8005జెమీమా రోడ్రిగెజ్- 5826షఫాలీ వర్మ- 4542మిథాలీ రాజ్- 4329దీప్తి శర్మ- 3889ముంబై, ఢిల్లీ మ్యాచ్ విషయానికొస్తే.. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ సమరంలో ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఢిల్లీ గెలుపుకు చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. అరుంధతి రెడ్డి చాలా ప్రయాసపడి రెండు పరుగులు పూర్తి చేసింది. తొలి పరుగును సునాయాసంగా పూర్తి చేసిన అరుంధతి.. రెండో పరుగు తీసే ప్రయత్నంలో డైవ్ చేయగా... కీపర్ వికెట్లను గిరాటేసింది. మూడో అంపైర్కు నివేదించగా... రీప్లేలో అరుంధతి బ్యాట్ క్రీజ్ను దాటినట్లు తేలింది. దీంతో రెండో పరుగొచ్చింది. ఫలితంగా ఢిల్లీ 2 వికెట్ల తేడాతో గెలిచింది. ఆఖరి బంతిదాకా చెమటోడ్చిన ముంబై ఇండియన్స్కు పరాభవం తప్పలేదు.ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 19.1 ఓవర్లలో 164 పరుగుల వద్ద ఆలౌటైంది. నాట్ సీవర్ బ్రంట్ (59 బంతుల్లో 80 నాటౌట్; 13 ఫోర్లు) చెలరేగింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (22 బంతుల్లో 42; 4 ఫోర్లు, 3 సిక్స్లు) మెరిపించింది. ఢిల్లీ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ 3, శిఖా పాండే 2 వికెట్లు తీశారు.అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు చేసి గెలిచింది. ఓపెనింగ్లో షఫాలీ వర్మ (18 బంతుల్లో 43; 7 ఫోర్లు, 2 సిక్స్లు) దంచేసింది. మిడిలార్డర్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నికీ ప్రసాద్ (33 బంతుల్లో 35; 4 ఫోర్లు) ఢిల్లీ గెలుపుకు అవసరమైన పరుగుల్ని జతచేసింది. -
ముంబై ఇండియన్స్లోకి స్టార్ ప్లేయర్.. ఎవరంటే?
ఐపీఎల్-2025కు సీజన్కు ముంబై ఇండియన్స్ స్పిన్నర్, అఫ్గానిస్తాన్ నయా స్పిన్ సంచలనం ఘజన్ఫర్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. వెన్ను గాయంతో బాధపడుతున్న ఘజన్ఫర్.. ఐపీఎల్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి దూరమయ్యాడు. ఐపీఎల్-2025 మెగా వేలంలో ఘజన్ఫర్ను రూ. 4.8 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ అతడు కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్ధానాన్ని మరో అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్తో ముంబై ఇండియన్స్ భర్తీ చేసుకుంది.ముజీబ్ను రూ. 2 కోట్ల కనీస ధరకు ముంబై ఒప్పందం కుదుర్చుకుంది. "ఐపీఎల్ 18వ సీజన్కు అల్లా ఘజన్ఫర్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో ముజీబ్-ఉర్-రెహ్మాన్ను జట్టులోకి తీసుకున్నాము. ముజీబ్కు ఇప్పటికే ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. అతడు 19 ఐపీఎల్ మ్యాచ్ల్లో 19 వికెట్లు పడగొట్టాడు. అతడిని బెస్ప్రైస్రూ. 2 కోట్లకు కొనుగోలు చేశాము" అని ముంబై ఫ్రాంచైజీ ఓ ప్రకటనలో పేర్కొంది.కాగా టీ20ల్లో ముజీబ్కు మంచి రికార్డు ఉండడంతో ముంబై తమ జట్టులోకి తీసుకుంది. పవర్ప్లేలో తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టే సత్తా అతడికి ఉంది. అయితే పాక్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం ముజీబ్ను అఫ్గాన్ సెలక్టర్లు ఎంపిక చేయలేదు.అతడి స్ధానంలో ఏఎం ఘజన్ఫర్ను ఎంపిక చేశారు. కానీ ఘజన్ఫర్ గాయం కారణంగా దూరం కావడంతో ముజీబ్ను తిరిగి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి తీసుకుంటారని అంతా భావించారు. కానీ అఫ్గాన్ సెలక్టర్లు మాత్రం నంగేయాలియా ఖరోటేను ఎంపిక చేసి అందరికి షాకిచ్చారు.ముంబై ఇండియన్స్ జట్టుజస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్ (రూ. 12.50 కోట్లు), నమన్ ధీర్ (రూ. 5.25 కోట్లు), రాబిన్ మింజ్ (రూ. 65 లక్షలు), కర్ణ్ శర్మ (రూ. 50 లక్షలు), దీపాక్ రికల్టన్ (ఆర్. 2 కోట్లు), దీపక్.9 కోట్లు. కోటి), అల్లా గజన్ఫర్ (రూ. 4.80 కోట్లు), విల్ జాక్స్ (రూ. 5.25 కోట్లు), అశ్వనీ కుమార్ (రూ. 30 లక్షలు), మిచెల్ సాంట్నర్ (రూ. 2 కోట్లు), రీస్ టోప్లీ (రూ. 75 లక్షలు), కృష్ణన్ శ్రీజిత్ (రూ. 30 లక్షలు), రాజ్ అంగద్ బావా (ఆర్. 30 లక్షలు), సత్యానారాయణ 30 లక్షలు. బెవాన్ జాకబ్స్ (రూ. 30 లక్షలు), అర్జున్ టెండూల్కర్ (రూ. 30 లక్షలు), లిజాద్ విలియమ్స్ (రూ. 75 లక్షలు), విఘ్నేష్ పుత్తూర్ (రూ. 30 లక్షలు). -
ఆఖరి బంతికి ఢిల్లీ గెలిచింది
వడోదర: లక్ష్యఛేదనలో ఢిల్లీకి చివరి 12 బంతుల్లో 21 పరుగులు కావాలి...అయితే 5 బంతుల్లో 5 పరుగులే వచ్చాయి. సమీకరణం 7 బంతుల్లో 16 పరుగులకు మారడంతో ముంబైకే విజయావకాశాలు ఉన్నాయి. కానీ ఆపై డ్రామా సాగింది... ఆఖరి బంతి దాకా సాగిన రనౌట్/నాటౌట్ హంగామా ఢిల్లీనే గట్టెక్కించింది. కలిత వేసిన 20వ ఓవర్లో తొలి నాలుగు బంతుల్లో 8 పరుగులు రాగా, ఐదో బంతికి నికీ ప్రసాద్ (33 బంతుల్లో 35; 4 ఫోర్లు) క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆఖరి బంతికి 2 పరుగులు చేయాల్సిన తరుణంలో హైదరాబాదీ ఆల్రౌండర్ తొలి పరుగు పూర్తి చేసింది. అయితే రెండో పరుగు తీసే ప్రయత్నంలో డైవ్ చేయగా... కీపర్ వికెట్లను గిరాటేసింది. మూడో అంపైర్కు నివేదించగా... రీప్లేలో ఆమె పడిన డైవ్తో బ్యాట్ క్రీజ్ను దాటినట్లు తేలడంతో రెండో పరుగొచ్చింది. దీంతో ఢిల్లీ 2 వికెట్ల తేడాతో గెలిచింది. ఆఖరి బంతిదాకా చెమటోడ్చిన ముంబై ఇండియన్స్ జట్టు 2 వికెట్ల తేడాతో ఓడింది. డబ్ల్యూపీఎల్లో శనివారం ఆసక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 19.1 ఓవర్లలో 164 పరుగుల వద్ద ఆలౌటైంది. నాట్ సీవర్ బ్రంట్ (59 బంతుల్లో 80 నాటౌట్; 13 ఫోర్లు) చెలరేగింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (22 బంతుల్లో 42; 4 ఫోర్లు, 3 సిక్స్లు) మెరిపించింది. ఢిల్లీ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ 3, శిఖా పాండే 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు చేసి గెలిచింది. ఓపెనింగ్లో షఫాలీ వర్మ (18 బంతుల్లో 43; 7 ఫోర్లు, 2 సిక్స్లు) దంచేసింది. మిడిలార్డర్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నికీ ప్రసాద్ గెలిచేందుకు అవసరమైన పరుగుల్ని జతచేసింది. సీవర్, హర్మన్ దంచేసినా... ముంబై ఓపెనర్లు హేలీ మాథ్యూస్ (0), యస్తిక (11) సహా ఆఖరి వరుస బ్యాటర్లు షబ్నమ్ (0), సైకా ఇషాక్ (0) వరకు ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేదు. వన్డౌన్లో నాట్ సీవర్ బ్రంట్, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఇద్దరే ముంబైని ఆదుకున్నారు. వాళ్లిదరు మెరిపించడంతో ఒకానొక దశలో ముంబై 10.3 ఓవర్లలోనే వంద పరుగులకు చేరింది. మూడో వికెట్కు 73 పరుగులు జోడించాక ధాటిగా ఆడుతున్న కెపె్టన్ హర్మన్ అవుటైంది. తర్వాత వచ్చినవారెవరూ బాధ్యత కనబర్చలేదు. కానీ సీవర్ బ్రంట్ 36 బంతుల్లో అర్ధసెంచరీ సాధించి ఆఖరిదాకా అజేయంగా పోరాడింది. అదరగొట్టిన షఫాలీ ఓపెనర్ షఫాలీ వర్మ పవర్ ప్లేలో పవర్ హిట్టింగ్తో కెపె్టన్ మెగ్ లానింగ్ (15)తో కలిసి ఢిల్లీకి మెరుపు ఆరంభమిచ్చింది. ఆరో ఓవర్ ఐదో బంతికి షఫాలీ జోరుకు హేలీ కళ్లెం వేయగా, మరుసటి ఓవర్లో లానింగ్ను షబ్నమ్ అవుట్ చేసింది. తర్వాత జెమీమా (2), అనాబెల్ సదర్లాండ్ (13), అలైస్ క్యాప్సి (16)లు విఫలమవడంతో ఢిల్లీ ఆట పడుతూలేస్తూ సాగింది. ఈ దశలో నికీ ప్రసాద్, సారా బ్రైస్ (10 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) జోడీ ఆరో వికెట్కు వేగంగా 31 పరుగులు జతచేయడంతో ఢిల్లీ గెలుపుదారిలో పడింది. స్వల్పవ్యవధిలో సారా, శిఖాపాండే (2) నిష్క్రమించినా ఆఖరి బంతి దాకా పోరాడిన ఢిల్లీ టెయిలెండర్లు జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక (బి) శిఖాపాండే 11; హేలీ (సి) లానింగ్ (బి) శిఖాపాండే 0; సీవర్ బ్రంట్ నాటౌట్ 80; హర్మన్ప్రీత్ (సి) నికీ (బి) అనాబెల్ 42; అమెలియా రనౌట్ 9; సజన (సి) బ్రైస్ (బి) అనాబెల్ 1; అమన్జ్యోత్ (బి) క్యాప్సి 7; సంస్కృతి (సి) లానింగ్ (బి) మిన్నుమణి 2; కలిత రనౌట్ 1; షబ్నిమ్ రనౌట్ 0; సైకా ఇషాక్ (బి) అనాబెల్ 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 164. వికెట్ల పతనం: 1–1, 2–32, 3–105, 4–129, 5–133, 6–146, 7–156, 8–159, 9–160, 10–164. బౌలింగ్: శిఖా పాండే 4–0–14–2, అలైస్ క్యాప్సి 2–0– 25–1, అరుంధతి 4–0– 40–0, మిన్నుమణి 4–0–23–1, అనాబెల్ 3.1–0–34–3, రాధా యాదవ్ 2–0–26–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెగ్ లానింగ్ (బి) షబ్నమ్ 15; షఫాలీ (సి) అమన్జ్యోత్ (బి) హేలీ 43; జెమీమా (సి) హర్మన్ప్రీత్ (బి) అమెలియా 2; అనాబెల్ (బి) సీవర్ బ్రంట్ 13; క్యాప్సి (సి) షబ్నమ్ (బి) అమెలియా 16; నికీ ప్రసాద్ (సి) అమెలియా (బి) కలిత 35; సారా బ్రైస్ (సి) కలిత (బి) హేలీ 21; శిఖా పాండే రనౌట్ 2; రాధా యాదవ్ నాటౌట్ 9; అరుంధతీ నాటౌట్ 2; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–60, 2–60, 3–66, 4–76, 5–109, 6–140, 7–147, 8–163. బౌలింగ్: షబ్నమ్ 4–0–18–1, సైకా 3–0–43–0, సీవర్ బ్రంట్ 4–0–38–1, హేలీ మాథ్యూస్ 4–0–31–2, అమెలియా కెర్ 4–0–22–2, కలిత 1–0–10–1. శ్రేయాంక స్థానంలో స్నేహ్ రాణా బెంగళూరు: డబ్ల్యూపీఎల్ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో కీలక మార్పు జరిగింది. గాయంతో బాధపడుతున్న స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ టోర్నీ నుంచి తప్పుకుంది. శుక్రవారం జరిగిన టోర్నీ తొలి మ్యాచ్లో కూడా ఆమె బరిలోకి దిగలేదు. శ్రేయ స్థానంలో స్నేహ్ రాణాను ఆర్సీబీ జట్టులోకి తీసుకున్నారు. గత ఏడాది గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడిన రాణా ఈ సారి వేలంలో ఎంపిక కాలేదు. రాణాను రూ.30 లక్షలకు బెంగళూరు ఎంచుకుంది. డబ్ల్యూపీఎల్లో నేడుగుజరాత్ X యూపీ వారియర్స్ రాత్రి గం. 7:30 స్టార్ స్పోర్ట్స్, జియోహాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
ఆర్సీబీకి భారీ షాక్!
మహిళల ప్రీమియర్ లీగ్(WPL)-2025 ఆరంభానికి ముందే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ప్లేయర్లు గాయాల వల్ల ఈ టోర్నమెంట్కు దూరం కాగా.. తాజాగా స్టార్ స్పిన్నర్ ఆశా శోభన కూడా తప్పుకొంది.ఈ నేపథ్యంలో ఆమె స్థానాన్ని భారత వికెట్ కీపర్ బ్యాటర్ నుఝత్ పర్వీన్తో భర్తీ చేస్తున్నట్లు ఆర్సీబీ గురువారం ప్రకటన విడుదల చేసింది. ‘‘దురదృష్టవశాత్తూ.. మోకాలి గాయం కారణంగా మా చాంపియన్ ఆల్రౌండర్ ఆశా శోభన(Asha Sobhana) డబ్ల్యూపీఎల్-2025 మొత్తానికి దూరమైంది.స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ నుఝత్ పర్వీన్ ఈ సీజన్లో ఆశా శోభన స్థానాన్ని భర్తీ చేస్తుంది. నుఝత్ ఆర్సీబీకిలో నీకు స్వాగతం’’ ఆర్సీబీ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.కాగా 33 ఏళ్ల లెగ్ స్పిన్నర్ ఆశా శోభన మహిళల టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా చివరగా భారత్కు ప్రాతినిథ్యం వహించింది. నాడు గ్రూప్ దశలో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్లో ఆమె గాయపడింది. అయితే, ఇంత వరకు కోలుకోలేదు. ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ తాజా ఎడిషన్ మొత్తానికి ఆమె దూరమైంది.గత సీజన్లో ఆశా శోభన మొత్తంగా పన్నెండు వికెట్లు తీసి జట్టు చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించింది. ఇక ఇదివరకే సోఫీ మెలినెక్స్, కేట్ క్రాస్ గాయాల కారణంగా ఆర్సీబీకి దూరం కాగా.. సోఫీ డివైన్ టోర్నీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది.మరోవైపు.. ఆల్రౌండర్ శ్రేయాంక పాటిల్ కూడా గాయం వల్ల స్వదేశంలో పలు సిరీస్లకు దూరమైన విషయం తెలిసిందే. కాబట్టి ఆమె ఆర్సీబీ తుదిజట్టులోకి వస్తుందా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది.ముంబై ఇండియన్స్లోకి పరుణిక సిసోడియాడబ్ల్యూపీఎల్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్కు కూడా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ పూజా వస్త్రాకర్ సీజన్ మొత్తానికి దూరమైంది. ఆమె స్థానంలో పరుణిక సిసోడియా జట్టులోకి వచ్చింది. కనీస ధర రూ. 10 లక్షలతో పరుణిక ముంబై ఇండియన్స్లో చేరింది.కాగా ఇటీవల జరిగిన మహిళల అండర్-19 వరల్డ్కప్ టోర్నీలో పరుణిక అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ నుంచి ఆమెకు పిలుపు రావడం గమనార్హం. ఇక ఫిబ్రవరి 14- మార్చి 15 వరకు మహిళల ప్రీమియర్ లీగ్ జరుగనుంది. ముంబై ఇండియన్స్ వుమెన్స్, ఆర్సీబీ వుమెన్స్, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మొత్తంగా 22 మ్యాచ్లు జరుగుతాయి. -
మరో క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్ యాజమాన్యం
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) యాజమాన్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) మరో క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఐదు క్రికెట్ ఫ్రాంచైజీలు కలిగిన RIL.. తాజాగా ద హండ్రెడ్ లీగ్లోని ఓవల్ ఇన్విన్సిబుల్స్ (లండన్ బేస్డ్) ఫ్రాంచైజీలో 49 శాతం వాటాను సొంతం చేసుకుంది. మిగిలిన 51 శాతం వాటాను ఇన్విన్సిబుల్స్ మాతృ సంస్థ అయిన సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్ (SCC) నిలబెట్టుకుంది.RIL, దాని అనుబంధ సంస్థ అయిన RISE వరల్డ్వైడ్ ద్వారా సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇన్విన్సిబుల్స్లో తమ వాటా కోసం RIL దాదాపు 644 కోట్ల రూపాయలు (60 మిలియన్ GBP) చెల్లించినట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) విక్రయించిన మొట్టమొదటి ఫ్రాంచైజీ ఓవల్ ఇన్విన్సిబుల్స్. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీ విలువ 1320 కోట్ల రూపాయలుగా (123 మిలియన్ GBP) ఉంది. ఓవల్ ఇన్విన్సిబుల్స్ను ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ తమ కుటుంబంలోకి స్వాగతించారు.ఈ భాగస్వామ్యంతో ముంబై ఇండియన్స్ అభిమానుల స్థావరాన్ని భారత్తో పాటు న్యూయార్క్, UAE, దక్షిణాఫ్రికా, ఇప్పుడు ఇంగ్లండ్కు విస్తరిస్తున్నామని ఆమె అన్నారు. మా ప్రపంచ క్రికెట్ ప్రయాణంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నామని నీతా అంబాని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.హండ్రెడ్ లీగ్లో ఫ్రాంచైజీని కొన్న మూడో ఐపీఎల్ జట్టు..కాగా, ద హండ్రెడ్ లీగ్లో ఇటీవలే ఐపీఎల్ ఫ్రాంచైజీలైన లక్నో సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్ కూడా పెట్టుబడులు పెట్టాయి. నార్తర్న్ సూపర్చార్జర్స్ ఫ్రాంచైజీను సన్రైజర్స్ యాజమాన్యం సన్ గ్రూప్ హస్తగతం చేసుకుంది. ఈ ఫ్రాంచైజీలో మొత్తం వంద శాతాన్ని సన్ గ్రూప్ కొనుగోలు చేసింది.అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం RPSG గ్రూప్.. మాంచెస్టర్ ఒరిజినల్స్ (ఇంగ్లండ్) ఫ్రాంచైజీని కళ్లు చెదిరే ధర వెచ్చించి సొంతం చేసుకుంది. ఒరిజినల్స్ మొత్తం విలువలో 49 శాతాన్ని RPSG గ్రూప్ దక్కించుకుంది. భారత కరెన్సీలో ఈ వాటా విలువ రూ. 1251 కోట్లు.హండ్రెడ్ లీగ్లో ఇన్విన్సిబుల్స్ హవాఓవల్ ఇన్విన్సిబుల్స్ మహిళల జట్టు 2021, 2022 ఎడిషన్లలో ద హండ్రెడ్ విజేతగా నిలిచింది. పురుషుల జట్టు 2023, 2024 ఎడిషన్లలో ఛాంపియన్గా నిలిచింది.ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుముంబై ఇండియన్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉంది. ఈ ఫ్రాంచైజీ 2013, 2015, 2017, 2019, 2020 ఎడిషన్లలో ఛాంపియన్గా నిలిచింది. ముంబై ఇండియన్స్ రెండు సందర్భాలలో ఛాంపియన్స్ లీగ్ను కూడా గెలుచుకుంది. ఇటీవల, MI కేప్ టౌన్ SA20 2025 టైటిల్ను కూడా గెలుచుకుంది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంఐ ఫ్రాంచైజీలు ఇవే..!ముంబై ఇండియన్స్ (ఐపీఎల్), ముంబై ఇండియన్స్ (డబ్ల్యూపీఎల్), ఎంఐ న్యూయార్క్ (మేజర్ లీగ్ క్రికెట్), ఎంఐ కేప్టౌన్ (సౌతాఫ్రికా టీ20 లీగ్), ఎంఐ ఎమిరేట్స్ (ఇంటర్నేషనల్ లీగ్ టీ20), తాజాగా ఓవల్ ఇన్విన్సిబుల్స్ (ద హండ్రెడ్ లీగ్) -
ముంబై ఇండియన్స్కు షాక్.. టోర్నీ నుంచి ఔట్
ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో (ILT20-2025) డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్కు (MI Emirates) షాక్ తగిలింది. ప్రస్తుత ఎడిషన్లో ఆ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్లో నాకౌటైంది. నిన్న (ఫిబ్రవరి 7) షార్జా వారియర్జ్తో (Sharjah Warriorz) జరిగిన మ్యాచ్లో ఎంఐ ఎమిరేట్స్ 6 వికెట్ల తేడాతో పరాజయంపాలై, టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసింది. 42 పరుగులు (22 బంతుల్లో; 6 ఫోర్లు, సిక్స్) చేసిన నికోలస్ పూరన్ ఎంఐ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. టామ్ బాంటన్ (29), విల్ జాక్స్ (18), కుసాల్ పెరీరా (18), అకీల్ హొసేన్ (15) రెండంకెల స్కోర్లు చేశారు. భారీ హిట్టర్లు ఆండ్రీ ఫ్లెచర్ (0), బెవాన్ జాకబ్స్ (7), రొమారియో షెపర్డ్ (7) దారుణంగా విఫలమయ్యారు. వారియర్జ్ బౌలర్లలో టిమ్ సౌథీ 2, ఆడమ్ మిల్నే, దిల్షన్ మధుషంక, అస్టన్ అగర్, హర్మీత్ సింగ్, రోహన్ ముస్తఫా తలో వికెట్ పడగొట్టారు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వారియర్జ్ 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (40), జాన్సన్ ఛార్లెస్ (36) వారియర్జ్ విజయానికి గట్టి పునాది వేయగా.. టిమ్ సీఫర్ట్ (40 నాటౌట్), రోహన్ ముస్తఫా (2 నాటౌట్) వారియర్జ్ను విజయతీరాలకు చేర్చారు. జేసన్ రాయ్ (26) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఎంఐ బౌలర్లలో ముహమ్మద్ రోహిద్ ఖాన్ 3, ఫజల్ హక్ ఫారూకీ ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపు అనంతరం వారియర్జ్ రెండో క్వాలిఫయర్లో డెసర్ట్ వైపర్స్ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్లో విజేత ఫిబ్రవరి 9న జరిగే ఫైనల్లో దుబాయ్ క్యాపిటల్స్తో అమీతుమీ తేల్చుకుంటుంది.కాగా, యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ఇప్పటిదాకా రెండు ఎడిషన్లు జరిగాయి. తొలి ఎడిషన్లో గల్ఫ్ జెయింట్స్ ఛాంపియన్గా నిలువగా.. రెండో సీజన్లో ఎంఐ ఎమిరేట్స్ విజేతగా నిలిచింది. గత ఎడిషన్ ఫైనల్లో ఎమిరేట్స్ దుబాయ్ క్యాపిటల్స్పై విజయం సాధించింది. ఈ సీజన్లో క్యాపిటల్స్ అందరికంటే ముందే ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. -
సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫైనల్లోకి ముంబై ఇండియన్స్
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫ్యామిలీకి చెందిన ఎంఐ కేప్టౌన్ (MI Cape Town) తొలిసారి సౌతాఫ్రికా టీ20 లీగ్లో (SA20 2025) ఫైనల్కు చేరింది. నిన్న (ఫిబ్రవరి 4) జరిగిన తొలి క్వాలిఫయర్లో ఎంఐ కేప్టౌన్ పార్ల్ రాయల్స్పై 39 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ప్రస్తుత సీజన్లో ఎంఐకు ఇది మూడో అత్యధిక స్కోర్. ముంబై ఇన్నింగ్స్లో ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ (27 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), వాన్ డర్ డస్సెన్ (32 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సహా డెవాల్డ్ బ్రెవిస్ (30 బంతుల్లో 44 నాటౌట్; 4 సిక్సర్లు), జార్జ్ లిండే (14 బంతుల్లో 26; 3 సిక్సర్లు), డెలానో పోట్గెటర్ (17 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. రాయల్స్ బౌలర్లలో దునిత్ వెల్లలగే 2, ఫోర్టుయిన్, డేవిడ్ గేలియమ్ తలో వికెట్ పడగొట్టారు.200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. ఎంఐ బౌలర్లు కలిసికట్టుగా సత్తా చాటడంతో 19.4 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌటైంది. ట్రెంట్ బౌల్ట్, కగిసో రబాడ, కార్బిన్ బాష్, కెప్టెన్ రషీద్ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్జ్ లిండే ఓ వికెట్ దక్కించుకున్నాడు. రాయల్స్ ఇన్నింగ్స్లో డేవిడ్ మిల్లర్ (45) టాప్ స్కోరర్గా నిలువగా.. దినేశ్ కార్తీక్ (31) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఛేదనలో రాయల్స్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఈ మ్యాచ్లో రెండు వికెట్లు తీసిన రషీద్ ఖాన్ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అవతరించాడు. ఈ మ్యాచ్లో ఓడినా ఫైనల్కు చేరేందుకు రాయల్స్కు మరో అవకాశం ఉంటుంది. రేపు (ఫిబ్రవరి 6) జరుగబోయే క్వాలిఫయర్-2లో రాయల్స్.. ఎలిమినేటర్ మ్యాచ్లో విజేతతో తలపడుతుంది. ఇవాళ (ఫిబ్రవరి 5) జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్.. జోబర్గ్ సూపర్కింగ్స్తో తలపడనుంది. గత రెండు సీజన్లలో టేబుల్ లాస్ట్లో నిలిచిన ఎంఐ కేప్టౌన్ తొలిసారి ఫైనల్కు చేరింది. సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్ సౌతాఫ్రికా టీ20 లీగ్ రెండు ఎడిషన్లలో విజేతగా నిలిచింది. -
IPL 2025: ప్రధాన ఆటగాళ్లకు ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్(Mumbai Indians) గతేడాది ఘోర పరాభవాన్ని చవిచూసింది. పద్నాలుగు మ్యాచ్లలో కేవలం నాలుగే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. స్టార్ ప్లేయర్లు ఉన్నా పేలవ ప్రదర్శనతో చతికిలపడి అవమానభారంతో లీగ్ దశలోనే నిష్క్రమించింది.అయితే, ఈ దుస్థితికి యాజమాన్యమే కారణమని ముంబై ఇండియన్స్ అభిమానులే విమర్శల వర్షం కురిపించారు. ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు అంబానీల సారథ్యంలోని ముంబై జట్టు.. తమ కెప్టెన్ను మార్చడమే ఇందుకు ప్రధాన కారణం. ముంబై ఫ్రాంఛైజీకి ఘనమైన చరిత్ర ఉంది. రోహిత్ శర్మ సారథ్యంలోక్యాష్ రిచ్ లీగ్లో అత్యధిక సార్లు ట్రోఫీ గెలిచిన జట్టుగా ముంబై నిలిచింది. రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలో ఏకంగా ఐదుసార్లు టైటిల్ సాధించి.. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. అయితే, గత సీజన్ ఆరంభానికి ముందు రోహిత్ను కెప్టెన్గా తప్పించిన మేనేజ్మెంట్..అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మరీ.. పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించింది.పాండ్యాకు అవమానాలురోహిత్ శర్మ ఫ్యాన్స్తో పాటు.. ముంబై జట్టు అభిమానులు కూడా ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయారు. దీంతో హార్దిక్ పాండ్యా మైదానంలోకి రాగానే అతడిని కించపరిచేలా పెద్ద ఎత్తున గోల చేశారు. ముంబై సొంత గ్రౌండ్ వాంఖడేలోనూ హార్దిక్కు ఇలాంటి చేదు అనుభవాలు తప్పలేదు. రోహిత్ కూడా అభిమానులను వారించకుండా మిన్నకుండిపోవడం అనుమానాలకు తావిచ్చింది.రోహిత్ టీమ్ వర్సెస్ హార్దిక్ అనేలాహార్దిక్ పాండ్యాను కెప్టెన్ను చేయడం రోహిత్ శర్మకు ఇష్టం లేదనే ప్రచారం జరిగింది. రోహిత్తో పాటు.. అతడి తర్వాత కెప్టెన్ పదవిని ఆశించిన జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్లకు కూడా హార్దిక్తో పొసగడం లేదనే వార్తలు గుప్పుమన్నాయి. ఫలితంగా ముంబై ఇండియన్స్ డ్రెసింగ్రూమ్లో విభేదాలు తలెత్తాయంటూ వదంతులు వ్యాపించాయి. అయితే, మైదానంలో రోహిత్, బుమ్రా, సూర్య ఒక జట్టుగా కనిపించడం.. హార్దిక్ పాండ్యా ఒంటరిగా ఉండటం వీటికి బలాన్ని చేకూర్చాయి.ఫలితంగా వరుస ఓటముల రూపంలో ముంబై ఇండియన్స్ భారీ మూల్యమే చెల్లించింది. అయితే, ఈసారి మాత్రం అలాంటి పొరపాటును పునరావృతం చేయకూడదని ముంబై యాజమాన్యం భావిస్తోందట. ప్రధాన ఆటగాళ్లకు ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ వార్నింగ్!ఇందుకోసం ఇటీవలే ప్రత్యేకంగా ఓ సమావేశం కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీని మనస్ఫూర్తిగా అంగీకరించాలని.. అతడికి అన్ని వేళలా అండగా నిలవాలని జట్టులోని ప్రధాన ఆటగాళ్లతో మేనేజ్మెంట్ పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.అదే విధంగా.. ఆటగాళ్లంతా కలిసికట్టుగా ఉండి.. జట్టు ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యంగా పనిచేయాలని గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. హార్దిక్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా అతడిని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు సమాచారం.కాగా తనను కెప్టెన్గా తప్పించిన ముంబై ఇండియన్స్తో రోహిత్ శర్మ బంధం తెంచుకుంటాడనే ప్రచారం జరుగగా.. అతడు మాత్రం అనూహ్య రీతిలో అదే ఫ్రాంఛైజీతో కొనసాగేందుకు నిర్ణయించుకున్నాడు.రోహిత్ మళ్లీ ముంబైతోనే..ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ముంబై రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో రోహిత్ కూడా ఉండటం విశేషం. జస్ప్రీత్ బుమ్రా(రూ. 18 కోట్లు), సూర్యకుమార్ యాదవ్(రూ. 16.35 కోట్లు),హార్దిక్ పాండ్యా(రూ. 16.35 కోట్లు), రోహిత్ శర్మ(రూ. రూ. 16.30 కోట్లు), తిలక్ వర్మ(రూ. 8 కోట్లు)లను ముంబై అట్టిపెట్టుకుంది. కాగా గత సీజన్ ఆఖరి మ్యాచ్లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా.. హార్దిక్ పాండ్యాకు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్-2025లో మొదటి మ్యాచ్ ఆడకుండా అతడిపై నిషేధం పడింది.చదవండి: ఆసీస్తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు.. : భజ్జీ -
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కెప్టెన్గా రషీద్ ఖాన్..
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 సీజన్కు ముందు ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్గా అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ను ముంబై కేప్ టౌన్ తిరిగి నియమించింది. కాగా తొట్ట తొలి సీజన్లో ముంబై కేప్ టౌన్ కెప్టెన్గా వ్యవహరించిన రషీద్.. గాయం కారణంగా రెండో సీజన్కు దూరమయ్యాడు.ఇప్పుడు వచ్చే ఏడాది సీజన్కు అతడు అందుబాటులోకి రావడంతో మరోసారి కేప్టౌన్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. తొలి సీజన్లో అతడి సారథ్యంలోని కేప్ టౌన్ జట్టు దారుణ ప్రదర్శన కనబరిచింది. పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచి గ్రూపు స్టేజిలోనే రషీద్ జట్టు ఇంటిముఖం పట్టింది. రెండో సీజన్లో కూడా ముంబై తలరాత మారలేదు.రషీద్ స్ధానంలో ముంబై కేప్ టౌన్ కెప్టెన్గా విండీస్ దిగ్గజం కిరాన్ పొలార్డ్ వ్యవహరించాడు. రెండో సీజన్లో కూడా ముంబై జట్టు పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానానికే పరిమితమైంది. కనీసం మూడో స్ధానంలోనైనా ముంబై కేప్ టౌన్ తలరాత మారుతుందో లేదో చూడాలి.కాగా ఎస్ఏ 20-2025 సీజన్కు ముందు ముంబై ఫ్రాంచైజీ ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. ముంబై కేప్టౌన్ జట్టులో స్టోక్స్తో పాటు ట్రెంట్ బౌల్ట్, కగిసో రబాడ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. కాగా ముంబై కేప్టౌన్ జట్టు ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి చెందినదే అన్న విషయం తెలిసిందే. ఇక ఎస్ఎ టీ20 లీగ్ మూడో సీజన్ జనవరి 9, 2025న ప్రారంభం కానుంది.ఎస్ఏ20 2025 ఎడిషన్ కోసం ఎంఐ కేప్టౌన్ జట్టు..బెన్ స్టోక్స్, రషీద్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నువాన్ తుషార, క్రిస్ బెంజమిన్, కగిసో రబాడ, డెవాల్డ్ బ్రెవిస్, రస్సీ వాన్ డర్ డస్సెన్, ర్యాన్ రికెల్టన్, జార్జ్ లిండే, డెలానో పాట్గెయిటర్, థామస్ కేబర్, కానర్ ఎస్టర్హ్యుజెన్చదవండి: అశ్విన్కు వచ్చే పెన్షన్ ఎంతో తెలుసా? -
ముంబై ఇండియన్స్ మహిళా టీం, యువ ప్రతిభకు ప్రాధాన్యం : నీతా
మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 3 కోసం రిలయన్స్ఫౌండేన్ చైర్పర్సన్ నీతా అంబానీ యాజమాన్యలోని ముంబై ఇండియన్స్ పటిష్టమైన టీంను సిద్ధం చసింది. WPL 2025 ఆదివారం బెంగుళూరులో జరిగిన వేలంలో కొత్తగా నలుగురు మహిళా క్రికెటర్లను జట్టులో చేర్చుకుంది. దీనిపై నీతా అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. తమ ముంబై ఇండియన్స్ మహిళా జట్టులో యువతకు ప్రాధాన్యత ఇచ్చి, వారిలోని ప్రతిభను గుర్తించి, తద్వారా టీం పటిష్టతకు ప్రయత్నిస్తోందని నీతా తెలిపారు.నీతా అంబానీ కొత్తగా ఎంపికైన టీంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పురుషుల జట్టులో ఆటగాళ్లు బుమ్రా, హార్తిక్, తిలక్ ప్రపంచ వేదికపై ప్రతిభతో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్నారు. అలాగే గతేడాది వేలంలో తీసుకున్న సజనకూడా అద్భుతంగా ఆడిందంటూ ప్రశంసించారు నీతా. ముంబై ఇండియన్స కుటుంబంలో భాగమైన అమ్మాయిలందరి గురించి తాను గర్వపడుతున్నానని వ్యాఖానించారు. కొత్తగా టీంలో చేరిన తమిళనాడుకు చెందిన 16 ఏళ్ల వికెట్ కీపర్ జి. కమలిని, ఆల్ రౌండర్లు సంస్కృతి గుప్తా, అక్షితా మహేశ్వరి, దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ నాడిన్ డి క్లర్క్కు ఆత్మీయ స్వాగతం పలికారు. “Grooming young talent, and watching them play at the global stage feels wonderful.”Mrs. Nita Ambani encourages new talent joining the 𝗙𝗔𝕄𝕀𝗟𝗬 at the #TATAWPLAuction! 💙#OneFamily #AaliRe #MumbaiIndians pic.twitter.com/VySfK4B6W6— Mumbai Indians (@mipaltan) December 15, 2024 -
మినీ వేలం: యువ క్రికెటర్కు కళ్లు చెదిరే ధర.. ఎవరీ కమలిని?
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మినీ వేలం సందర్భంగా తమిళనాడుకు చెందిన ఓ యువ క్రికెటర్పై కనక వర్షం కురిసింది. పదహారేళ్ల జి. కమలిని కోసం ముంబై ఇండియన్స్ భారీ మొత్తం ఖర్చు చేసింది. అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో ఉన్న ఈ ఆల్రౌండర్ను ఏకంగా రూ. 1.60 కోట్లకు కొనుగోలు చేసింది.19 స్థానాల కోసంభారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మినీ వేలంలో మొత్తం 120 మంద మహిళా క్రికెటర్లు పాల్గొంటున్నారు. ఐదు జట్లలో కలిపి ఖాళీగా ఉన్న 19 స్థానాల కోసం భారత్ నుంచి 91 మంది, విదేశాల నుంచి 29 మంది ఆటగాళ్లు బరిలో నిలిచారు.రూ. 10 లక్షల కనీస ధరఇక బెంగళూరు వేదికగా ఆదివారం మొదలైన ఈ వేలంపాటలో జి. కమలిని రూ. 10 లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఆమె కోసం ఢిల్లీ క్యాపిటల్స్తో పాటు ముంబై ఇండియన్స్ బిడ్ వేసింది. అయితే, ఈ ఆల్రౌండర్ను ఎలాగైనా తమ జట్టులోకి చేర్చుకోవాలని పట్టుబట్టిన ముంబై యాజమాన్యం.. ఢిల్లీతో పోటీ పడి ఆమె ధరను కోటి దాటించింది.అయినప్పటికీ ఢిల్లీ వెనక్కి తగ్గకపోవడంతో మరో అరవై లక్షలు పెంచి ఏకంగా 1.60 కోట్ల రూపాయలకు ముంబై కమలిని సేవలను సొంతం చేసుకుంది. కాగా అన్క్యాప్డ్ ప్లేయర్ అయినప్పటికీ జి.కమలిని కోసం వేలంలో భారీ డిమాండ్ రావడానికి కారణం.. ఆమె నైపుణ్యాలే.భారీ సిక్సర్లతో విరుచుకుపడే లెఫ్టాండర్ఇటీవల జరిగిన అండర్-19 మహిళల టీ20 ట్రోఫీలో తమిళనాడు టైటిల్ గెలవడంలో జి. కమలినిది కీలక పాత్ర. ఈ టోర్నమెంట్లో ఎనిమిది మ్యాచ్లలో కలిపి ఆమె 311 పరుగులు చేసింది. భారీ సిక్సర్లతో విరుచుకుపడే ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. పార్ట్ టైమ్ స్పిన్నర్గానూ సేవలు అందించింది.అంతేకాదు.. ఈ లెగ్బ్రేక్ స్పిన్నర్ వివిధ కేటగిరీల్లో తమిళనాడు తరఫున వికెట్ కీపర్గానూ బరిలోకి దిగింది. అందుకే ఈ ఆల్రౌండర్ కోసం ముంబై భారీ మొత్తం ఖర్చు చేసింది. సౌతాఫ్రికా ఆల్రౌండర్ కోసంకాగా ముంబై ఇండియన్స్ మహిళా జట్టులో నాలుగు ఖాళీలు ఉండగా.. ఒక స్థానం జి. కమలిని భర్తీ చేసింది. ఇక ఈ వేలంలో కమలిని కంటే ముందు సౌతాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నదినె డి క్లర్క్ను ముంబై కొనుక్కుంది. ఆమె కోసం రూ. 30 లక్షలు వెచ్చించింది.డాటిన్కు రూ. 1.70 కోట్లుమరోవైపు.. వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ డియోండ్రా డాటిన్ను గుజరాత్ జెయింట్స్ రూ. 1.70 కోట్లకు సొంతం చేసుకుంది. యూపీ వారియర్స్తో పోటీపడీ మరీ డాటిన్ను దక్కించుకుంది. అదే విధంగా సిమ్రన్ షేక్ కోసం గుజరాత్ అత్యధికంగా రూ. 1.90 కోట్లు ఖర్చు చేసింది.అయితే, తొలి రౌండ్లో పూనమ్ యాదవ్, స్నేహ్ రాణా(కనీస ధర రూ. 30 లక్షలు) వంటి భారత ప్లేయర్లు అమ్ముడుపోకుండా మిగిలిపోయారు. కాగా డబ్ల్యూపీఎల్లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ పేరిట ఐదు జట్లు పాల్గొంటున్నాయి. చదవండి: BGT: మహ్మద్ షమీకి బైబై! -
హార్దిక్ పాండ్యా విధ్వంసం.. ఒకే ఓవర్లో 28 పరుగులు! వీడియో వైరల్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో బరోడాకు ప్రాతినిథ్యం వహిస్తున్న పాండ్యా మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా శుక్రవారం త్రిపురతో జరిగిన మ్యాచ్లో హార్దిక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.త్రిపుర బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా త్రిపుర స్పిన్నర్ పర్వేజ్ సుల్తాన్ను ఈ బరోడా ఆల్రౌండర్ ఊతికారేశాడు. బరోడా ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన పర్వేజ్ బౌలింగ్లో 4 సిక్స్లు, ఒక ఫోర్తో పాండ్యా 28 పరుగులు పిండుకున్నాడు.ఓవరాల్గా 23 బంతులు ఎదుర్కొన్న పాండ్యా.. 3 ఫోర్లు, 5 సిక్స్లతో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. పాండ్యా విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా బరోడా 110 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 11.2 ఓవర్లలో చేధించింది. బరోడా బ్యాటర్లలో పాండ్యాతో పాటు మితీష్ పటేల్ 37 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన త్రిపుర నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. త్రిపుర బ్యాటర్లలో కెప్టెన్ మన్దీప్ సింగ్(50) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.బరోడా బౌలర్లలో అభిమన్యు సింగ్ మూడు వికెట్లు, కెప్టెన్ కృనాల్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా ఈ టోర్నీలో హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడి 115.50 సగటుతో 231 పరుగులు చేశాడు.చదవండి: Asia Cup 2024: రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. లైవ్ ఎక్కడో తెలుసా? Hardik Pandya was on fire again 🔥🔥The Baroda all-rounder went berserk smashing 6⃣,6⃣,6⃣,4⃣,6⃣ in an over on his way to a whirlwind 47(23) against Tripura 🙌🙌#SMAT | @IDFCFIRSTBankScorecard ▶️ https://t.co/1WPFeVRTum pic.twitter.com/xhgWG63y9g— BCCI Domestic (@BCCIdomestic) November 29, 2024 -
ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆసక్తికర ఘటన
ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలు చెరి ముగ్గురు ఆటగాళ్లను కుండ మార్పిడి చేసుకున్నాయి. 2025 మెగా వేలంలో ఆర్సీబీ సొంతం చేసుకున్న రొమారియో షెపర్డ్, టిమ్ డేవిడ్, నువాన్ తుషార 2024 సీజన్లో ముంబై ఇండియన్స్కు ఆడారు. 2024 సీజన్లో ఆర్సీబీకి ఆడిన విల్ జాక్స్, రీస్ టాప్లే, కర్ణ్ శర్మ.. 2025 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ వశమయ్యారు. వేలంలో ఓ ఫ్రాంచైజీ నుంచి మరో ఫ్రాంచైజీకి మారడం సాధారణమే అయినప్పటికీ.. ఏకంగా ముగ్గురు ఆటగాళ్ల కుండ మార్పిడి జరగడం సిత్రమే.కాగా, ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేలంలో మొత్తం 577 మంది ఆటగాళ్లు పాల్గొనగా ఆయా ఫ్రాంచైజీలు 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వీరిలో 62 మంది విదేశీ ఆటగాళ్లు కాగా.. మిగిలిన వారు దేశీయ ఆటగాళ్లు.వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డు నెలకొల్పాడు. పంత్ను లక్నో సూపర్ జెయింట్స్ 27 కోట్ల భారీ మొత్తం వెచ్చింది సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో కూడా ఇదే భారీ మొత్తం కావడం విశేషం. ఐపీఎల్ 2025 వేలంలో సెకెండ్ హైయ్యెస్ట్ పేమెంట్ శ్రేయస్ అయ్యర్కు దక్కింది. శ్రేయస్ను పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. వేలంలో మూడో అత్యధిక ధర వెంకటేశ్ అయ్యర్కు దక్కింది. వెంకటేశ్ను కేకేఆర్ 23.75 కోట్లకు కొనుగోలు చేసింది. -
'నిజంగా నేను ఆశ్చర్యపోయాను.. థాంక్యూ ముంబై ఇండియన్స్'
ఐపీఎల్-2025 మెగా వేలం ముగిసింది. జెడ్డా వేదికగా జరిగిన ఈ వేలంలో అన్క్యాప్డ్ న్యూజిలాండ్ బ్యాటర్ బెవాన్ జాకబ్స్ను కొనుగోలు చేసి ముంబై ఇండియన్స్ అందరిరని ఆశ్చర్యపరిచింది. కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే వంటి కివీస్ స్టార్ క్రికెటర్లు అన్సోల్డ్గా మిగిలిన చోట.. జాకబ్స్ అమ్ముడుపోవడంతో అందరూ విస్తుతపోయారు. 21 ఏళ్ల జాకబ్ను రూ.30 లక్షల కనీస ధరకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. అయితే ముంబై తనను దక్కించుకోవడాన్ని బెవాన్ జాకబ్స్ సైతం నమ్మలేకపోతున్నాడు."ఉదయం మేల్కొన్నవెంటనే వేలంలో నేను అమ్ముడుపోయానన్న వార్త విని నేను ఆశ్చర్యపోయాను. నిజంగా నాకు ఇది చాలా పెద్ద అవకాశం. నన్ను కొనుగోలు చేసినందుకు ముంబై ఇండియన్స్కు ధన్యవాదాలు.నాకు అక్కడ ఆడే అవకాశం లభిస్తే ఇంకా ఎక్కువగా సంతోషపడతాను. ముంబై ఇండియన్స్ వంటి అద్బుత ఫ్రాంచైజీలో చేరేందుకు అతృతగా ఎదురుచూస్తున్నాను. అదేవిధంగా ప్రపంచంలోని అత్యుత్తమమైన ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ నుంచి అన్ని విషయాలను నేర్చుకునేందుకు ప్రయత్నిస్తాను" అని ఓ స్పోర్ట్స్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాకబ్ పేర్కొన్నాడు.ఇప్పటివరకు ఆరు టీ20లు ఆడిన జాకబ్.. 33.50 సగటుతో 134 పరుగులు చేశాడు. సూపర్ స్మాష్ 2024-25 సీజన్పై జాకబ్ దృష్టిపెట్టాడు. సూపర్ స్మాష్ సీజన్ను ఐపీఎల్కు ముందు ప్రాక్టీస్గా ఉపయోగించుకోవాలని జాకబ్ భావిస్తున్నాడు.ఈ టోర్నీలో అతడు ఆక్లాండ్కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. కాగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కొత్త ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు ఎల్లప్పుడూ ముందుంటుంది. ఇప్పటికే డెవాల్డ్ బ్రెవిస్, క్రిష్మార్ సాంటోకీ వంటి విదేశీ ఆటగాళ్లు తమ ఫస్ట్క్లాస్ అరంగేట్రానికి ముందే ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించారు.చదవండి: IPL 2025: 'రూ.75 లక్షలకు కూడా ఎవరూ తీసుకులేదు.. ఇప్పటికైనా సిగ్గు పడు' -
వేలం ముగిసింది.. ఇంకా ఎవరి పర్సులో ఎంత? ఎన్ని ఖాళీలు.. పూర్తి వివరాలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2025 సీజన్కు సంబంధించి మెగా వేలం కార్యక్రమం పూర్తయింది. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన వేలంపాటలో.. తాము కోరుకున్న ఆటగాళ్ల కోసం పది ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. ఎట్టకేలకు తమకు కావాల్సిన వారిని దక్కించుకున్నాయి. ఇక వేలం ప్రక్రియ ముగిసింది కాబట్టి... ఇక వచ్చే ఏడాది మార్చిలో జరిగే టోర్నీకి ఎలా సమాయత్తం కావాలో ఫ్రాంచైజీలు ప్రణాళికలు రచించుకుంటాయి.కాగా ఐపీఎల్లో ఇంతవరకూ టైటిల్ నెగ్గలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఈసారి ఎలాగైనా ఆ లోటును తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి. మరి వచ్చే సీజన్లోనైనా ఈ జట్లలో ఒకటి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంటుందో లేదో వేచి చూడాలి.ఇక ఆదివారం నాటి తొలిరోజు వేలంలో టీమిండియా స్టార్లు రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ భారీ ధర పలికారు. వికెట్ కీపర్ బ్యాటర్, కెప్టెన్ ఆప్షన్ అయిన పంత్ కోసం లక్నో ఏకంగా రూ. 27 కోట్లు వెచ్చించింది. మరోవైపు.. పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ను రూ. 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ తాము రిలీజ్ చేసిన వెంకటేశ్ అయ్యర్ను ఏకంగా రూ. 23.75 కోట్లకు కొనుగోలు చేసి మరోసారి జట్టులో చేర్చుకుంది.ఇదిలా ఉంటే.. సోమవారం నాటి రెండో రోజు వేలంలోని విశేషాలను గమనిస్తే.. భువనేశ్వర్ కుమార్ కోసం ముంబై ఇండియన్స్, లక్నో మధ్య తీవ్ర పోటీ సాగింది. ఈ రెండు కలిసి అతడి విలువను రూ.10 కోట్ల 50 లక్షల వరకు తీసుకెళ్లాయి. ఈ స్థితిలో అనూహ్యంగా ముందుకు వచ్చిన బెంగళూరు రూ.10 కోట్ల 75 లక్షలకు అతడిని సొంతం చేసుకుంది. మరోవైపు.. తమ పాత ఆటగాడు దీపక్ చహర్ను తీసుకునేందుకు చెన్నై సూపర్కింగ్స్ చివరి వరకు ప్రయత్నించింది. ముంబై, పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీలతో పోటీ పడి రూ. 8 కోట్ల వరకు బరిలో నిలిచింది. అయితే వెనక్కి తగ్గని ముంబై రూ.9 కోట్ల 75 లక్షలకు అతడిని దక్కించుకుంది.వీరికి మంచి ధర👉సోమవారం వేలంలో అందరికంటే ముందుగా న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ పేరు రాగా అతడిని తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు. 👉గత ఏడాది వరకు బెంగళూరు జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన డుప్లెసిస్ను ఈసారి అతని కనీస విలువ రూ.2 కోట్లకే ఢిల్లీ క్యాపిటల్స్ ఎంచుకుంది. 👉భారత పేస్ బౌలర్లలో ఆకాశ్దీప్ (రూ.8 కోట్లు; లక్నో), ముకేశ్ కుమార్ (రూ. 8 కోట్లు; ఢిల్లీ), తుషార్ దేశ్పాండే (రూ. 6 కోట్ల 50 లక్షలు; రాజస్తాన్ రాయల్స్) మంచి ధర పలికారు. 👉అఫ్గానిస్తాన్ మిస్టరీ ఆఫ్స్పిన్నర్ అల్లా గజన్ఫర్(రూ. 4.80 కోట్లు) కోసం కోల్కతా, బెంగళూరులతో పోటీ పడి ముంబై సొంతం చేసుకుంది. భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని పోలిన బౌలింగ్ శైలిగల గజన్ఫర్ గత ఏడాది కోల్కతా టీమ్లో ఉన్నా మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. 👉ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ఒకే ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది అందరి దృష్టిలో పడిన ప్రియాన్ష్ ఆర్య కోసం నాలుగు జట్లు బరిలో నిలవగా, చివరగా పంజాబ్ దక్కించుకుంది. 👉పదేళ్ల క్రితం చివరి టీ20 మ్యాచ్ ఆడి టెస్టుల రిటైర్మెంట్ తర్వాత ఇప్పుడు ఐపీఎల్లో రిజిస్టర్ చేసుకున్న ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ను ఎవరూ పట్టించుకోలేదు.👉రిటెయిన్ చేసుకున్న వారితో కలిపి మొత్తం 25 ఆటగాళ్ల గరిష్ట కోటాను చెన్నై సూపర్కింగ్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ పూర్తి చేసుకోగా... లక్నో సూపర్ జెయింట్స్ (24), ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ (23), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (22), డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ (21), రాజస్తాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ (20) అంతకంటే తక్కువ మందితో సరిపెట్టాయి. చెన్నై సూపర్ కింగ్స్రుతురాజ్ (రూ. 18 కోట్లు) జడేజా (రూ. 18 కోట్లు) పతిరణ (రూ. 13 కోట్లు) శివమ్ దూబే (రూ. 12 కోట్లు) ధోని (రూ. 4 కోట్లు) నూర్ అహ్మద్ (రూ.10 కోట్లు) ఆర్. అశి్వన్ (రూ. 9.75 కోట్లు) కాన్వే (రూ. 6.25 కోట్లు) ఖలీల్ అహ్మద్ (రూ. 4.80 కోట్లు) రచిన్ రవీంద్ర (రూ. 4 కోట్లు) రాహుల్ త్రిపాఠి (రూ. 3.40 కోట్లు) అన్షుల్ కంబోజ్ (రూ.3.40 కోట్లు) స్యామ్ కరన్ (రూ. 2.40 కోట్లు) గుర్జప్నీత్ సింగ్ (రూ. 2.20 కోట్లు) నాథన్ ఎలిస్ (రూ. 2 కోట్లు) దీపక్ హుడా (రూ.1.70 కోట్లు) జేమీ ఓవర్టన్ (రూ.1.50 కోట్లు) విజయ్ శంకర్ (రూ. 1.20 కోట్లు) వంశ్ బేడీ (రూ. 55 లక్షలు) ముకేశ్ చౌదరీ (రూ. 30 లక్షలు) షేక్ రషీద్ (రూ. 30 లక్షలు) అండ్రి సిద్ధార్థ్ (రూ. 30 లక్షలు) కమలేశ్ నాగర్కోటి (రూ. 30 లక్షలు) రామకృష్ణ ఘోష్ (రూ. 30 లక్షలు) శ్రేయస్ గోపాల్ (రూ.30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 65 కోట్లు; వేలానికి రూ. 54.95 కోట్లు; మిగిలింది: 5 లక్షలుఢిల్లీ క్యాపిటల్స్అక్షర్ పటేల్ (రూ. 16.50 కోట్లు) కుల్దీప్ యాదవ్ (రూ. 13.25 కోట్లు) స్టబ్స్ (రూ. 10 కోట్లు) అభిషేక్ పోరెల్ (రూ. 4 కోట్లు) కేఎల్ రాహుల్ (రూ. 14 కోట్లు) స్టార్క్ (రూ. 11.75 కోట్లు) నటరాజన్ (రూ. 10.75 కోట్లు) జేక్ ఫ్రేజర్ (రూ 9 కోట్లు) ముకేశ్ కుమార్ (రూ. 8 కోట్లు) హ్యారీ బ్రూక్ (రూ. 6.25 కోట్లు) అశుతోష్ శర్మ (రూ. 3.80 కోట్లు) మోహిత్ శర్మ (రూ.2.20 కోట్లు) డుప్లెసిస్ (రూ. 2 కోట్లు) సమీర్ రిజ్వీ (రూ. 95 లక్షలు) దుష్మంత చమిర (రూ. 75 లక్షలు) డోనొవన్ ఫెరీరా (రూ. 75 లక్షలు) విప్రాజ్ నిగమ్ (రూ.50 లక్షలు) కరుణ్ నాయర్ (రూ. 50 లక్షలు) మాధవ్ తివారి (రూ. 40 లక్షలు) అజయ్ జాదవ్ (రూ.30 లక్షలు) దర్శన్ నల్కండే (రూ. 30 లక్షలు) త్రిపురాణ విజయ్ (రూ. 30 లక్షలు) మన్వంత్ కుమార్ (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 47 కోట్లు; వేలానికి రూ 72.80 కోట్లు; మిగిలింది: రూ. 20 లక్షలు గుజరాత్ టైటాన్స్రషీద్ ఖాన్ (రూ. 18 కోట్లు) శుబ్మన్ గిల్ (రూ. 16.50 కోట్లు) సాయి సుదర్శన్ (రూ. 8.5 కోట్లు) రాహుల్ తెవాటియా (రూ. 4 కోట్లు) షారుక్ ఖాన్ (రూ. 4 కోట్లు) బట్లర్ (రూ.15.75 కోట్లు) సిరాజ్ (రూ.12.25 కోట్లు) రబాడ (రూ.10.75 కోట్లు) ప్రసిధ్ కృష్ణ (రూ.9.50 కోట్లు) సుందర్ (రూ. 3.20 కోట్లు) రూథర్ఫర్డ్ (రూ. 2.60 కోట్లు) కొయెట్జీ (రూ. 2.40 కోట్లు) ఫిలిప్స్ (రూ. 2 కోట్లు) సాయి కిషోర్ (రూ. 2 కోట్లు) మహిపాల్ లోమ్రోర్ (రూ.1.70 కోట్లు) గుర్నూర్ సింగ్ (రూ. 1.30 కోట్లు) అర్షద్ ఖాన్ (రూ.1.30 కోట్లు), జయంత్ (రూ. 75 లక్షలు) ఇషాంత్ (రూ. 75 లక్షలు) కరీమ్ జనత్ (రూ. 75 లక్షలు) కుమార్ కుశాగ్ర (రూ.65 లక్షలు) మానవ్ సుతార్ (రూ. 30 లక్షలు) అనూజ్ రావత్ (రూ.30 లక్షలు) నిశాంత్ సింధు (రూ. 30 లక్షలు) కుల్వంత్ (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 51 కోట్లు; వేలానికి రూ. 68.85 కోట్లు; మిగిలింది: 15 లక్షలు పంజాబ్ కింగ్స్శశాంక్ సింగ్ (రూ.5.5 కోట్లు) ప్రభ్సిమ్రన్ సంగ్ (రూ.4 కోట్లు) శ్రేయస్ అయ్యర్ (రూ.26.75 కోట్లు) అర్ష్దీప్ సింగ్ (రూ.18 కోట్లు) యుజువేంద్ర చహల్ (రూ.18 కోట్లు) స్టొయినిస్ (రూ.11 కోట్లు) మార్కొ జాన్సెన్ (రూ. 7 కోట్లు) నేహల్ వధేరా (రూ.4.20 కోట్లు) మ్యాక్స్వెల్ (రూ.4.20 కోట్లు) ప్రియాన్‡్ష ఆర్య (రూ. 3.80 కోట్లు) జోష్ ఇంగ్లిస్ (రూ. 2.60 కోట్లు) అజ్మతుల్లా (రూ. 2.40 కోట్లు) ఫెర్గూసన్ (రూ. 2 కోట్లు) వైశాక్ విజయ్కుమార్ (రూ.1.80 కోట్లు) యశ్ ఠాకూర్ (రూ.1.60 కోట్లు) హర్ప్రీత్ బ్రార్ (రూ.1.50 కోట్లు) ఆరోన్ హార్డి (రూ. 1.25 కోట్లు) విష్ణు వినోద్ (రూ.95 లక్షలు) జేవియర్ బార్ట్లెట్ (రూ. 80 లక్షలు) కుల్దీప్ సేన్ (రూ. 80 లక్షలు) అవినాశ్ (రూ. 30 లక్షలు) సూర్యాంశ్ షెడ్గే (రూ. 30 లక్షలు) ముషీర్ఖాన్ (రూ.30 లక్షలు) హర్నూర్ (రూ.30 లక్షలు) ప్రవీణ్ దూబే (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ.9.50 కోట్లు; వేలానికి రూ. 110.15 కోట్లు; మిగిలింది: రూ. 35 లక్షలు రాజస్తాన్ రాయల్స్యశస్వి జైస్వాల్ (రూ. 18 కోట్లు) సంజూ సామ్సన్ (రూ. 18 కోట్లు) ధ్రువ్ జురేల్ (రూ. 14 కోట్లు) రియాన్ పరాగ్ (రూ. 14 కోట్లు) హెట్మైర్ (రూ. 11 కోట్లు) సందీప్శర్మ (రూ. 4 కోట్లు) జోఫ్రా ఆర్చర్ (రూ.12.50 కోట్లు) తుషార్ దేశ్పాండే (రూ.6.50 కోట్లు) హసరంగ (రూ.5.25 కోట్లు) మహీశ్ తీక్షణ (రూ.4.40 కోట్లు) నితీశ్ రాణా (రూ. 4.20 కోట్లు) ఫజల్హక్ (రూ. 2 కోట్లు) క్వెన మఫాక (రూ. 1.50 కోట్లు) ఆకాశ్ మధ్వాల్ (రూ.1.20 కోట్లు) వైభవ్ సూర్యవంశి (రూ. 1.10 కోట్లు) శుభమ్ దూబే (రూ. 80 లక్షలు) యు«ద్వీర్ చరక్ (రూ. 35 లక్షలు) కుమార్ కార్తికేయ (రూ.30 లక్షలు) అశోక్ శర్మ (రూ. 30 లక్షలు) కునాల్సింగ్ (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 79 కోట్లు; వేలానికి రూ. 40.70 కోట్లు; మిగిలింది: రూ. 30 లక్షలు సన్రైజర్స్ హైదరాబాద్క్లాసెన్ (రూ. 23 కోట్లు) కమిన్స్ (రూ. 18 కోట్లు) హెడ్ (రూ. 14 కోట్లు) అభిõÙక్ శర్మ (రూ. 14 కోట్లు) నితీశ్ రెడ్డి (రూ. 6 కోట్లు) ఇషాన్ కిషన్ (రూ.11.25 కోట్లు) షమీ (రూ.10 కోట్లు) హర్షల్ పటేల్ (రూ.8 కోట్లు) రాహుల్ చహర్ (రూ.3.20 కోట్లు) అభినవ్ మనోహర్ (రూ.3.20 కోట్లు) రాహుల్ చహర్ (రూ. 3.20 కోట్లు) ఆడమ్ జంపా (రూ.2.40 కోట్లు) సిమర్జీత్ సింగ్ (రూ. 1.50 కోట్లు) ఇషాన్ మలింగ (రూ. 1.20 కోట్లు) బ్రైడన్ కార్స్ (రూ. 1 కోటి) ఉనాద్కట్ (రూ. 1 కోటి) కమిండు మెండిస్ (రూ. 75 లక్షలు) జీషాన్ అన్సారి (రూ. 40 లక్షలు) అనికేత్ వర్మ (రూ. 30 లక్షలు) అథర్వ తైడే (రూ.30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 75 కోట్లు; వేలానికి రూ.44.80 కోట్లు; మిగిలింది: రూ.20 లక్షలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకోహ్లి (రూ. 21 కోట్లు) రాజత్ పటిదార్ (రూ.11 కోట్లు) యశ్ దయాళ్ (రూ. 5 కోట్లు) హాజల్వుడ్ (రూ.12.50 కోట్లు) ఫిల్ సాల్ట్ (రూ.11.50 కోట్లు) జితేశ్ శర్మ (రూ.11 కోట్లు) భువనేశ్వర్ (రూ.10.75 కోట్లు) లివింగ్స్టోన్ (రూ.8.75 కోట్లు) రసిక్ ధార్ (రూ.6 కోట్లు) కృనాల్ పాండ్యా (రూ. 5.75 కోట్లు) టిమ్ డేవిజ్ (రూ. 3 కోట్లు) జాకబ్ బెథెల్ (రూ. 2.60 కోట్లు) సుయాశ్ శర్మ (రూ.2.60 కోట్లు) పడిక్కల్ (రూ. 2 కోట్లు) తుషార (రూ. 1.60 కోట్లు) రొమరియో (రూ. 1.50 కోట్లు ఇన్గిడి (రూ. 1 కోటి) స్వప్నిల్ సింగ్ (రూ.50 లక్షలు) మనోజ్ (రూ. 30 లక్షలు) మోహిత్ రాఠి (రూ. 30 లక్షలు) అభినందన్ (రూ. 30 లక్షలు) స్వస్తిక్ చికార (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 37 కోట్లు; వేలానికి రూ. 82.25 కోట్లు; మిగిలింది: రూ. 75 లక్షలు ముంబై ఇండియన్స్బుమ్రా (రూ. 18 కోట్లు) హార్దిక్ పాండ్యా (రూ.16.35 కోట్లు) సూర్యకుమార్ (రూ. 16.35 కోట్లు) రోహిత్ శర్మ (రూ. 16.30 కోట్లు) తిలక్ వర్మ (రూ. 8 కోట్లు) ట్రెంట్ బౌల్ట్ (రూ.12.50 కోట్లు) దీపక్ చహర్ (రూ. 9.25 కోట్లు) నమన్ ధీర్ (రూ.5.25 కోట్లు) విల్ జాక్స్ (రూ.5.25 కోట్లు) ఘజన్ఫర్ (రూ. 4.80 కోట్లు) సాంట్నర్ (రూ. 2 కోట్లు) రికెల్టన్ (రూ. 1 కోటి) రీస్ టోప్లే (రూ. 75 లక్షలు) లిజాద్ విలియమ్స్ (రూ. 75 లక్షలు) రాబిన్ మిన్జ్ (రూ.65 లక్షలు) కరణ్ శర్మ (రూ.50 లక్షలు) అర్జున్ టెండూల్కర్ (రూ.30 లక్షలు) విఘ్నేశ్ (రూ.30 లక్షలు) సత్యనారాయణ (రూ. 30 లక్షలు) రాజ్ అంగద్ (రూ. 30 లక్షలు) శ్రీజిత్ కృష్ణన్ (రూ. 30 లక్షలు) అశ్వని కుమార్ (రూ. 30 లక్షలు) బెవాన్ జాకబ్స్ (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ. 75 కోట్లు; వేలానికి రూ. 44.80 లక్షలు; మిగిలింది: రూ. 20 లక్షలులక్నో సూపర్ జెయింట్స్నికోలస్ పూరన్ (రూ.21 కోట్లు) రవి బిష్ణోయ్ (రూ.21 కోట్లు) మయాంక్ యాదవ్ (రూ. 11 కోట్లు) మోసిన్ ఖాన్ (రూ.4 కోట్లు) ఆయుశ్ బదోని (రూ.4 కోట్లు) రిషభ్ పంత్ (రూ.27 కోట్లు) అవేశ్ ఖాన్ (రూ.9.75 కోట్లు) ఆకాశ్దీప్ (రూ.8 కోట్లు) మిల్లర్ (రూ.7.50 కోట్లు) అబ్దుల్ సమద్ (రూ.4.20 కోట్లు) మిచెల్ మార్‡్ష (రూ.3.40 కోట్లు) షహబాజ్ అహ్మద్ (రూ. 2.40 కోట్లు) మార్క్రమ్ (రూ.2 కోట్లు) బ్రీట్జ్కే (రూ. 75 లక్షలు) షమర్ జోసెఫ్ (రూ. 75 లక్షలు) సిద్ధార్థ్ (రూ. 75 లక్షలు) యువరాజ్ (రూ. 30 లక్షలు) ప్రిన్స్ యాదవ (రూ. 30 లక్షలు) ఆకాశ్ సింగ్ (రూ. 30 లక్షలు) దిగ్వేశ్ సింగ్ (రూ. 30 లక్షలు) హిమ్మత్ సింగ్ (రూ.30 లక్షలు) ఆర్యన్ జుయల్ (రూ.30 లక్షలు) అర్శిన్ కులకర్ణి (రూ. 30 లక్షలు) హంగార్గేకర్ (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ.51 కోట్లు; వేలానికి రూ. 68.90 కోట్లు; మిగిలింది: రూ. 10 లక్షలు కోల్కతా నైట్ రైడర్స్రింకూ సింగ్ (రూ. 13 కోట్లు) నరైన్ (రూ. 12 కోట్లు) రసెల్ (రూ. 12 కోట్లు) వరుణ్ చక్రవర్తి (రూ. 12 కోట్లు) హర్షిత్ రాణా (రూ. 4 కోట్లు) రమణ్దీప్ (రూ.4 కోట్లు) వెంకటేశ్ అయ్యర్ (రూ.23.75 కోట్లు) ఆన్రిచ్ నోర్జే (రూ.6.50 కోట్లు) డికాక్ (రూ.3.60 కోట్లు) అంగ్కృష్ (రూ.3 కోట్లు) జాన్సన్ (రూ. 2.80 కోట్లు) గుర్బాజ్ (రూ.2 కోట్లు) మొయిన్ అలీ (రూ. 2 కోట్లు) వైభవ్ అరోరా (రూ.1.80 కోట్లు) రోవ్మన్ పావెల్ (రూ.1.50 కోట్లు) రహానే (రూ. 1.50 కోట్లు) మనీశ్ పాండే (రూ. 75 లక్షలు) ఉమ్రన్ మలిక్ (రూ. 75 లక్షలు) అనుకూల్ రాయ్ (రూ. 40 లక్షలు) మయాంక్ మర్కండే (రూ. 30 లక్షలు) లవ్నిత్ సిసోడియా (రూ. 30 లక్షలు) ఖర్చు: రిటెయినర్లకు రూ.69 కోట్లు; వేలానికి రూ. 50.95 కోట్లు; మిగిలింది: రూ.5 లక్షలు. -
IPL Auction 2025 : పేస్ బౌలర్లకు పట్టం
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడు... అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానం... టైటిల్ సహా దశాబ్దకాలం పాటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించిన పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేలంలో ఫ్రాంచైజీలను ఆకర్షించడంలో సఫలమయ్యాడు. రెండో రోజు వేలంలో భువీ (రూ.10 కోట్ల 75 లక్షలు) అత్యధిక ధరతో అగ్ర స్థానంలో నిలిచాడు. భువనేశ్వర్లాగే చెన్నై మూడు ట్రోఫీ విజయాల్లో కీలక బౌలర్గా నిలిచిన దీపక్ చహర్కు (రూ.9 కోట్ల 25 లక్షలు) భారీ మొత్తం దక్కింది. వీరిద్దరిని వరుసగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు దక్కించుకున్నాయి. ప్రతీ జట్టుకూ భారత పేసర్ల అవసరం ఉండటంతో సోమవారం వేలంలో ఆకాశ్దీప్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్పాండేలకు మంచి విలువ లభించింది. విదేశీ ఆటగాళ్లలో మార్కో జాన్సెన్, విల్ జాక్స్లను ఫ్రాంచైజీలు తగిన మొత్తానికి సొంతం చేసుకున్నాయి. ఆరంభంలో ఆసక్తి చూపించకపోయినా... అజింక్య రహానే, దేవదత్ పడిక్కల్, ఉమ్రాన్ మాలిక్వంటి ఆటగాళ్లను చివర్లో టీమ్లు ఎంచుకున్నాయి. రెండో రోజు కూడా ఆస్ట్రేలియా డాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్కు నిరాశ ఎదురవగా... కేన్ విలియమ్సన్, బెయిర్స్టో, మిచెల్, శార్దుల్ ఠాకూర్ తదితరులను ఫ్రాంచైజీలు దూరంగా ఉంచాయి. జిద్దా (సౌదీ అరేబియా): ఐపీఎల్–2025 కోసం రెండు రోజుల పాటు సాగిన వేలం సోమవారం ముగిసింది. మొత్తం 577 మంది క్రికెటర్లు వేలంలోకి రాగా... గరిష్టంగా 204 మంది క్రికెటర్లను ఎంచుకునే అవకాశం ఉండగా... 10 ఫ్రాంచైజీలు కలిపి మొత్తం 182 మంది ఆటగాళ్లనే వేలంలో తీసుకున్నాయి. వీరిలో 62 మంది విదేశీయులు కాగా... అన్ని జట్లూ కలిపి వేలంలో రూ.639.15 కోట్లు వెచ్చించాయి. ఐపీఎల్లో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా బిహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. వేలంలో రాజస్తాన్ రూ.1 కోటీ 10 లక్షలకు ఎంచుకునే సమయానికి వైభవ్ వయసు 13 ఏళ్ల 243 రోజులు మాత్రమే. వైభవ్ ఇప్పటి వరకు 5 రంజీ మ్యాచ్లు, ఒక టి20 మ్యాచ్ ఆడాడు. అయితే ఇటీవల భారత అండర్–19 జట్టు సభ్యుడిగా ఆ్రస్టేలియా అండర్ –19 జట్టుతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్లో మెరుపు సెంచరీతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. తొలి రోజు వేలం రికార్డులతో హోరెత్తించగా, రెండో రోజు కూడా పేరున్న ఆటగాళ్లకు మంచి మొత్తమే దక్కింది. సోమవారం జాబితాలో పెద్ద సంఖ్యలో యువ ఆటగాళ్లు బరిలో నిలవగా, కొందరిని అదృష్టం తలుపు తట్టింది. జాతీయ జట్టుకు ఆడని అన్క్యాప్డ్ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు చివర్లో కనీస విలువకే తీసుకొని జట్టులో మిగిలిన ఖాళీలను నింపాయి. -
ఐపీఎల్ వేలం 2025 : అదిరే డ్రెస్లో నీతా అంబానీ, ధర ఎంతో తెలుసా?
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ ఫ్యాషన్ స్టైల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సమయానికి తగ్గట్టుగా డ్రెస్లను ఎంపిక చేసుకోవడంలో, ఫ్యాషన్ను, బిజినెస్ను మిళితం చేయడంలో నీతా తరువాతే ఎవరైనా అనేది అభిమానుల మాట మాత్రమే కాదు, ఫ్యాషన్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం కూడా. తాజా ఐపీఎల్ -2025 వేలం సందర్భంగా మరోసారి తన స్టైల్తో అందర్నీ తనవైపు తిప్పుకుంది. నీతా అంబానీ నేవీ బ్యూ ప్యాంట్సూట్ ధరించి అందరినీ ఆకర్షించింది. అంతేకాదు ఆ డ్రెస్ ధర కూడా హాట్ టాపిక్గా నిలిచింది. ఐపీఎల్ టీం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓనర్ అయిన నీతా అంబానీ వైడ్-లెగ్ ప్యాంట్, బ్లూ సూట్లో హుందాగా కనిపించారు. నీతా ధరించిన ‘మజే’ బ్రాండ్కు చెందిన ఈ బ్రేజర్ సూట్ ధర అక్షరాలా 950 డాలర్లు. అంటే దాదాపు రూ.78 వేలు. ఇందులో బ్లేజర్ రూ. 47 వేలు కాగా వైడ్-లెగ్ ట్వీడ్ ట్రౌజర్ ధర సుమారు రూ. 31వేలు, మొత్తంగా ఆమె సూట్ ధర రూ.78 వేలు. అంతేనా వజ్రాలు పొదిగిన ఎంఐ బ్రూచ్, హ్యాండ్బ్యాగ్, డైమండ్ రింగ్, డైమండ్ చెవిపోగులు, సన్ గ్లాసెస్, వాచ్, హీల్స్ ఇలా అన్నీ ప్రత్యేకంగా కనిపించడం విశేషం. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)nbsp;ఐపీఎల్ మెగా వేలం-2025 తొలి రౌండ్ విడత ప్రక్రియ దుబాయ్లోని జెడ్డాలో ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఇందులో ఎంఐ నలుగురు సూపర్ స్టార్లు రోహిత్ శర్మ,హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాతోపాటు టీమిండియా యంగ్ ప్లేయర్ తిలక్ వర్మకూడా ఉన్నాడు. ముఖ్యంగా తిలక్ వర్మను రూ.8 కోట్లకు దక్కించుకోవడం విశేషంగా నిలిచింది. ఈ వేలంలో నీతా అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ కూడా పాల్గొన్నారు. -
IPL 2025: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. తొలి మ్యాచ్కు ముందే కెప్టెన్పై నిషేధం
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్కు భారీ షాక్ తగిలింది. గత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్తో ఆడిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ మెయిన్టెయిన్ చేసినందుకుగానూ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఓ మ్యాచ్ నిషేధం విధించారు. గత సీజన్లో అదే చివరి మ్యాచ్ కావడంతో ఈ సీజన్ తొలి మ్యాచ్లోనే నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు ఐపీఎల్ మేనేజ్మెంట్ తెలిపింది. నిషేధంతో పాటు హార్దిక్కు రూ. 30 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ పేర్కొంది. తదుపరి మ్యాచ్లో హార్దిక్ ఇంపాక్ట్ ప్లేయర్గానూ బరిలోకి దిగకూడదు. హార్దిక్తో పాటు నాటి మ్యాచ్లోని సభ్యులైన ప్రతి ఆటగాడికి రూ. 12 లక్షలు, లేదంటే మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా వర్తిస్తుంది.కాగా, గత సీజన్లో కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన హార్దిక్ను ముంబై ఇండియన్స్ యాజమాన్యం తదుపరి సీజన్కు కూడా కెప్టెన్గా కొనసాగించింది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా ఐదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. తదుపరి సీజన్ కోసం ముంబై రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ ఉన్నారు. ముంబై ఇండియన్స్కు ఆర్టీఎం ద్వారా తాము రిలీజ్ చేసిన ఓ ఆటగాడిని తిరిగి దక్కించుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా నవంబర్ 24, 25 తేదీల్లో జరుగనుంది. కాగా, గత కొన్ని సీజన్లుగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ముంబై ఇండియన్స్ గత సీజన్ను చివరి స్థానంతో ముగించిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ చివరిసారిగా 2020లో టైటిల్ సాధించింది. -
ఇషాన్ కిషన్కు కళ్లు చెదిరే ధర.. రూ. 14.5 కోట్లకు వారి సొంతం!
టీమిండియాకు దూరమైన ఇషాన్ కిషన్కు ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనూ ఈ ఏడాది కలిసి రాలేదు. ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్-2024లో ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. పద్నాలుగు మ్యాచ్లలో కలిపి 320 పరుగులు చేయగలిగాడు. అయితే, మెగా వేలానికి ముందు ముంబై ఫ్రాంఛైజీ మాత్రం అతడిని వదిలేసింది.జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలతో పాటు యువ క్రికెటర్ తిలక్ వర్మను రీటైన్ చేసుకున్న ముంబై.. ఇషాన్ పేరును మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. నిజానికి 2018లో ముంబై తరఫునే క్యాచ్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. ఆరంభం నుంచే మెరుగ్గా రాణించిన ఇషాన్ కిషన్ కోసం ఐపీఎల్-2022లో ముంబై భారీ మొత్తం వెచ్చించింది.నాడు రూ. 15.25 కోట్ల ధరకు ముంబై సొంతంనాటి మెగా వేలంలో అతడిని ఏకంగా రూ. 15.25 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. కానీ.. అప్పటి నుంచి నేటి దాకా ఇషాన్ కిషన్ అందుకు తగ్గ పైసా వసూల్ ప్రదర్శన మాత్రం ఇవ్వలేకపోయాడు. అంతేకాదు.. దేశవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించి సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయి.. జాతీయ జట్టుకూ దూరమయ్యాడు.అయితే, ఇటీవలే రంజీల్లో సెంచరీలు చేయడంతో రీ ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్.. భారత్-‘ఎ’ జట్టుకు సెలక్ట్ అయ్యాడు. కానీ.. ఆస్ట్రేలియా గడ్డపై కంగారూ జట్టుతో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్లో పూర్తిగా విఫలమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఇషాన్ కిషన్ ఐపీఎల్-2025 మెగా వేలంలోకి రాబోతున్నాడు.వికెట్ కీపర్ కోటాలో కళ్లు చెదిరే మొత్తంఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిర్వహించిన ‘మాక్ వేలం’లో మాత్రం ఇషాన్ కిషన్ భారీ ధర పలకడం విశేషం. మెగా వేలంలో ఇషాన్ రూ. 2 కోట్ల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్నాడు. అయితే, అశ్విన్ మాత్రం తన వేలంలో.. వికెట్ కీపర్ కోటాలో ఇషాన్ కోసం బిడ్ వేసే ఫ్రాంఛైజీలు రూ. 5 కోట్ల నుంచి మొదలుపెట్టాలని సూచించాడు.ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ. 5 కోట్లకు బిడ్ వేయగా.. క్రమక్రమంగా ఇషాన్ ధర రూ. 10 కోట్లకు పెంచింది. దీంతో పంజాబ్ కింగ్స్ రేసు నుంచి తప్పుకోగా.. లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం వికెట్ కీపర్ కోసం ఏకంగా రూ. 14.5 కోట్లు వెచ్చించి దక్కించుకుంది.ఏకంగా రూ. 21 కోట్ల మొత్తానికి అతడు ఉన్నా కూడాఅయితే, అశ్విన్ నిర్వహించిన ఈ మాక్వేలంలో ఇషాన్ కిషన్కు కళ్లు చెదిరే మొత్తం దక్కడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్లో లేని ఇషాన్ కోసం.. మెగా వేలంలో ఏ ఫ్రాంఛైజీ అంతగా ఆసక్తి చూపదని.. మహా అయితే, అతడికి రూ. ఐదు కోట్లు దక్కవచ్చని క్రికెట్ ప్రేమికులు అంటున్నారు.అంతేకాదు.. లక్నో ఇప్పటికే వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ను ఏకంగా రూ. 21 కోట్ల మొత్తానికి అట్టిపెట్టుకుంది. అలాంటిది.. ఇషాన్ను ఆ ఫ్రాంఛైజీ కొనుక్కోవడం ఏమిటంటూ అశూ మాక్ వేలంలో లక్నో తరఫున పాల్గొన్న అభిమానులను ట్రోల్ చేస్తున్నారు. కాగా సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా నవంబరు 24, 25 తేదీల్లో మెగా వేలం జరుగనుంది.చదవండి: BGT 2024: టీమిండియాకు గుడ్న్యూస్ -
హ్యాట్రిక్ తీసిన బౌలర్నే వదిలేసిన ముంబై ఇండియన్స్
మహిళల ఐపీఎల్ (WPL) 2025 సీజన్ వేలానికి ముందు ఐదు ఫ్రాంచైజీలు (ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్) ఇవాళ రిటెన్షన్ జాబితాలను విడుదల చేశాయి. దాదాపుగా అన్ని ఫ్రాంచైజీలు నలుగురి నుంచి ఆరుగురిని వేలానికి వదిలేసి మిగతా ప్లేయర్లను అలాగే అట్టిపెట్టుకున్నాయి. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ సైతం నలుగురిని వేలానికి వదిలేసి, 14 మంది ప్లేయర్లను రీటైన్ చేసుకుంది. ముంబై ఇండియన్స్ వదిలేసిన ప్లేయర్స్లో ముగ్గురు భారత అన్క్యాప్డ్ ప్లేయర్లు కాగా.. ఓ విదేశీ స్టార్ ప్లేయర్ ఉంది. వచ్చే సీజన్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఇంగ్లండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ ఇస్సీ వాంగ్ను అనూహ్యంగా వేలానికి వదిలేసింది. 22 ఏళ్ల ఇస్సీ డబ్ల్యూపీఎల్ డెబ్యూ సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున హ్యాట్రిక్ తీసింది. మహిళల ఐపీఎల్లో హ్యాట్రిక్ తీసిన తొలి క్రికెటర్ ఇస్సీనే కావడం విశేషం. 2023 సీజన్లో యూపీ వారియర్జ్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఇస్సీ ఈ ఘనత సాధించింది. హ్యాట్రిక్ తీయడంతో పాటు తొలి సీజన్లో ఓ వెలుగు వెలిగిన ఇస్సీ 2024 సీజన్లో మరో స్టార్ విదేశీ పేసర్ (షబ్నిమ్ ఇస్మాయిల్) రావడంతో మరుగున పడిపోయింది. షబ్నిమ్ ఎంట్రీతో ఇస్సీకి అవకాశాలు కరువయ్యాయి. షబ్నిమ్ అద్భుతమైన ప్రదర్శనలతో రాణించడంతో ఈ ఏడాది వేలానికి ముందు ఇస్సీని వదిలేసింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. తుది జట్టులో నలుగురు విదేశీ ప్లేయర్లకు మాత్రమే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎంఐ మేనేజ్మెంట్ ఇస్సీని వదులుకోక తప్పలేదు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఇస్సీతో పాటు స్వదేశీ అన్క్యాప్డ్ ప్లేయర్లు ప్రియాంక బాలా, హుమైరా ఖాజీ, ఫాతిమా జాఫర్లను కూడా వేలానికి వదిలేసింది. ముంబై ఇండియన్స్ ఈసారి కూడా హర్మన్ప్రీత్ను కెప్టెన్గా కొనసాగించింది. ఎంఐ రీటైన్ చేసుకున్న ప్లేయర్స్లో యస్తికా భాటియా, అమెలియా కెర్, క్లో టైరాన్, హేలీ మాథ్యూస్, నాట్ సీవర్ బ్రంట్, పూజా వస్త్రాకర్, షబ్నిమ్ ఇస్మాయిల్ లాంటి స్వదేశీ, విదేశీ స్టార్లు ఉన్నారు. వేలంలో పాల్గొనేందుకు ముంబై ఇండియన్స్ పర్స్లో ఇంకా 2.65 కోట్ల బ్యాలెన్స్ ఉంది. ఈ మొత్తంతో ముంబై ఇండియన్స్ మరో నలుగురు ప్లేయర్స్ను కొనుగోలు చేయవచ్చు. డబ్ల్యూపీఎల్ రూల్స్ ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ఠంగా 18 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవచ్చన్న విషయం తెలిసిందే. ఇందులో ఆరుగురు విదేశీ ప్లేయర్స్కు అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే, తొలి సీజన్లో అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్.. రెండో సీజన్లో ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలైంది. ఈ సీజన్లో ముంబైని ఇంటికి పంపించిన ఆర్సీబీనే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి ఛాంపియన్గా నిలిచింది.ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ వీళ్లే..హార్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), యస్తికా భాటియా, అమెలియా కెర్, క్లో టైరాన్, హేలీ మాథ్యూస్, జింటిమణి కలిత, నాట్ సీవర్ బ్రంట్, పూజా వస్త్రాకర్, సంజీవన్ సంజనా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాఖీ, అమన్జోత్ కౌర్, అమన్దీప్ కౌర్, కీర్తనముంబై ఇండియన్స్ వదిలేసిన ప్లేయర్స్ వీళ్లే..ప్రియాంక బాలా, హుమైరా ఖాజీ, ఫాతిమా జాఫర్, ఇస్సీ వాంగ్ -
IPL 2025: ఇషాన్ కాదు.. వాళ్లిద్దరికోసం ముంబై పోటీ.. వాషీ కూడా రేసులోనే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025 మెగా వేలానికి ముహూర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో నవంబరు 24, 25 తేదీల్లో వేలంపాట నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అందరి కళ్లు టీమిండియా స్టార్లపైనే ఉన్నాయి.రేసులో భారత స్టార్లురిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ సహా రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్ తదితర సీనియర్ ప్లేయర్లు కూడా రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి ముంబై ఇండియన్స్ భారత స్పిన్నర్లను దక్కించుకునేందుకు ఇతర ఫ్రాంఛైజీలతో కచ్చితంగా పోటీపడుతుందని అభిప్రాయపడ్డాడు.పాలసీ పరిపూర్ణంగా ఉపయోగించుకునికాగా ఈసారి రిటెన్షన్ విధానాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకున్న జట్టు ముంబై ఇండియన్స్ అని చెప్పవచ్చు. నిబంధనలకు అనుగుణంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లను అట్టిపెట్టుకుంది. జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మలను కొనసాగించాలని నిర్ణయించుకుంది.ఇక వీళ్లందరికి ఖర్చు పెట్టింది పోనూ.. ముంబై పర్సులో ఇంకా రూ. 45 కోట్లు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘ముంబై బ్యాటింగ్ ఆర్డర్ మరోసారి పటిష్టంగానే కనిపిస్తోంది. అయితే, వాళ్ల రిటెన్షన్ లిస్టులో బుమ్రా రూపంలో ఒకే ఒక స్పెషలిస్టు బౌలర్ ఉన్నాడు.కాబట్టి వారికి ఇప్పుడు బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నిజానికి ముంబై 225- 250 పరుగులు స్కోరు చేయగల సామర్థ్యం కలిగిన జట్టు. అయితే, అదే స్థాయిలో పరుగులు కూడా సమర్పించుకున్న సందర్భాలు ఉన్నాయి.బ్యాటింగ్ పైనే ఎక్కువగా ఏదేమైనా వాళ్లు బ్యాటింగ్ పైనే ఎక్కువగా ఆధారపడతారన్నది వాస్తవం. కానీ ప్రతిసారీ ఇదే టెక్నిక్ పనికిరాదు. వాళ్ల జట్టులో ఉంటే ఇండియన్ బ్యాటింగ్ లైనప్.. విదేశీ బౌలింగ్ లైనప్ ఉంటుంది. ఇప్పుడు వారికి ఇద్దరు స్పిన్నర్ల అవసరం కూడా ఉంది. అందుకే కచ్చితంగా వాళ్లు యుజీ చహల్ వెనుకపడటం ఖాయం.ఇషాన్ కాదుఒకవేళ అతడిని దక్కించుకోలేకపోతే.. ముంబై ఇండియన్స్ వాషింగ్టన్ సుందర్నైనా సొంతం చేసుకుంటుంది’’ అని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ఇషాన్ కిషన్ పేరును కూడా ప్రస్తావించిన ఆకాశ్ చోప్రా.. అతడిని ముంబై కొనుగోలు చేసే అవకాశం లేదని అభిప్రాయపడ్డాడు. వికెట్ కీపర్ కోటాలో ఇషాన్ను పరిగణించినా.. క్వింటన్ డికాక్ లేదంటే జితేశ్ శర్మ వైపు మొగ్గు చూపుతుందని అంచనా వేశాడు. చదవండి: Aus vs Pak: ఆసీస్కు కొత్త కెప్టెన్ -
ముంబై టాప్-3 లిస్టులో దక్కని చోటు.. రోహిత్ ఏమన్నాడంటే..!
-
IPL 2025: మన లీడర్.. మన కెప్టెన్.. రీటైన్ను సంపూర్ణంగా వాడుకుంది ఎవరు?
గత మూడేళ్లుగా పేలవ ఆట తీరుతో వెనుకబడ్డ సన్రైజర్స్ హైదరాబాద్ను తన అద్భుత కెప్టెన్సీతో ఈసారి టైటిల్ రేసులో నిలిపాడు ప్యాట్ కమిన్స్. ఆస్ట్రేలియాకు వన్డే వరల్డ్కప్ అందించిన సారథిగా నీరాజనాలు అందుకున్న ఈ ఫాస్ట్ బౌలర్.. ఫ్రాంఛైజీ తనకు చెల్లించిన రూ. 20.50 కోట్లకు పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు.సహచర ఆటగాళ్లతో మమేమకమవుతూ సరైన సమయంలో అవకాశాలు ఇచ్చి జట్టును ఫైనల్కు తీసుకువెళ్లాడు. తద్వారా ఆరెంజ్ ఆర్మీకి ఇష్టమైన కెప్టెన్గా మారిపోయాడు. కానీ.. జాతీయ జట్టు విధుల దృష్ట్యా ఈసారి కమిన్స్ అసలు ఐపీఎల్ ఆడతాడా? కెప్టెన్గా కొనసాగుతాడా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, రిటెన్షన్ లిస్టు విడుదల సందర్భంగా సన్రైజర్స్ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసింది.మన లీడర్.. మన కెప్టెన్వచ్చే ఏడాది కూడా ప్యాటీనే రైజర్స్ను ముందుకు నడిపించబోతున్నాడని..ఫ్రాంఛైజీ అధికారికంగా ప్రకటించింది. ‘‘మన లీడర్.. మన కెప్టెన్... ప్యాటీ కమిన్స్ మిమ్మల్ని ఉప్పల్లో మరోసారి కలిసేందుకు సిద్ధంగా ఉన్నాడు’’ అంటూ ఆరెంజ్ ఆర్మీకి శుభవార్త అందించింది. ఇక ఈ ఏడాది పరుగుల విధ్వంసంతో రికార్డులు తిరగరాసిన సన్రైజర్స్.. రిటెన్షన్ల విషయంలోనూ దూకుడుగా వ్యవహరించింది. హార్డ్ హిట్టర్ హెన్రిక్ క్లాసెన్ కోసం ఏకంగా రూ. 23 కోట్లు ఖర్చు చేసింది. ఆ జట్లు వదిలేశాయిఇదిలా ఉంటే.. ఇతర ఫ్రాంఛైజీలలో కోల్కతా, ఢిల్లీ, లక్నో, పంజాబ్, బెంగళూరు తమ కెప్టెన్లను వేలంలోకి వదిలివేయగా.. చెన్నై, ముంబై, గుజరాత్, రాజస్తాన్ మాత్రం తమ సారథులను కొనసాగించాయి. దీంతో ఈసారి ఈసారి ఐపీఎల్ వేలం ఆసక్తికరంగా సాగడం ఖాయం.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం ఈనెల నెలాఖరున జరగనుండగా... రీటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో కొందరు ఆటగాళ్లు అనూహ్యంగా కోట్లు కొల్లగొట్టగా... మరికొందరు స్టార్ ప్లేయర్లు ఫ్రాంచైజీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అధిక ధర వీరికేఅందరికంటే అత్యధికంగా దక్షిణాఫ్రికా ‘హార్డ్ హిట్టర్’ హెన్రిచ్ క్లాసెన్కు సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ. 23 కోట్లు కేటాయించగా... విరాట్ కోహ్లీకి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... నికోలస్ పూరన్కు లక్నో సూపర్ జెయింట్స్ రూ.21 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకున్నాయి. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టుకు సారథ్యం వహించిన హార్దిక్ పాండ్యా... ఇక మీదట కూడా నాయకుడిగా కొనసాగడం ఖాయం కాగా... ముంబై మొత్తంగా ఐదుగురు ప్రధాన ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. మేటి పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు అత్యధికంగా రూ. 18 కోట్లు కేటాయించిన ఫ్రాంచైజీ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు చెరో రూ. 16 కోట్ల 35 లక్షలు వెచ్చించింది.ఇక ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మకు రూ. 16 కోట్ల 30 లక్షలు కేటాయించింది. హైదరాబాద్ ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మకు రూ.8 కోట్లు ఇచ్చి ముంబై తమ వద్దే పెట్టుకుంది. రీటైన్ను సంపూర్ణంగా వాడుకుంది ఎవరంటే?ఆటగాళ్ల కొనుగోలు కోసం ఒక్కో జట్టు రూ.120 కోట్లు ఖర్చు చేసుకునే అవకాశం ఉండగా... అందులో రూ. 75 కోట్లు రిటెన్షన్కు కేటాయించారు. తాజా జాబితాను చూస్తే ముంబై ఇండియన్స్ జట్టు రీటైన్ను సంపూర్ణంగా వాడుకోగా... అత్యల్పంగా పంజాబ్ కింగ్స్ జట్టు కేవలం ఇద్దరు ప్లేయర్లనే అట్టి పెట్టుకుంది. పంజాబ్ మరీ ఇద్దరినేపంజాబ్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన ఆ్రస్టేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యూహాల్లో భాగంగా... కేవలం ఇద్దరు ‘అన్క్యాప్డ్’ ప్లేయర్లను మాత్రమే రీటైన్ చేసుకున్న పంజాబ్ వద్ద వేలం కోసం అత్యధికంగా రూ. 110.5 కోట్లు మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ను కోల్కతా నైట్ రైడర్స్ వేలానికి వదిలేయగా... తొమ్మిదేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్తో కొనసాగుతున్న రిషబ్ పంత్ను ఫ్రాంచైజీ వదిలేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం కేఎల్ రాహుల్పై నమ్మకం ఉంచలేదు. రింకూ సింగ్కు జాక్పాట్.. ధోనీ ‘అన్క్యాప్డ్’ ప్లేయర్చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనీ సహా మొత్తం ఐదుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకోగా... రాజస్తాన్ రాయల్స్ కూడా ఆరుగురు ప్లేయర్లను రీటైన్ చేసుకుంది. స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 16 కోట్ల 50 లక్షలు కేటాయించగా... సిక్సర్ల వీరుడు రింకూ సింగ్కు కోల్కతా రూ.13 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకుంది. వెస్టిండీస్ ద్వయం రసెల్, నరైన్తో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి తలా రూ. 12 కోట్లు కేటాయించింది. కోల్కతా వదిలేసుకున్న శ్రేయస్ అయ్యర్ కోసం వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడటం ఖాయమే కాగా... సారథి కోసం చూస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పంత్పై కన్నేసే అవకాశాలు ఉన్నాయి. బేబీ మలింగకు రూ. 13 కోట్లుజాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఐదేళ్లు దాటిపోయిన ధోనీని ఐపీఎల్ నిబంధనల ప్రకారం ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ కోటాలో రీటైన్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ... మాజీ సారథికి రూ.4 కోట్లు కేటాయించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్తో పాటు స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు చెరో రూ. 18 కోట్లు వెచ్చించింది. శ్రీలంక పేసర్ పతిరణకు రూ. 13 కోట్లు, పేస్ ఆల్రౌండర్ శివమ్ దూబేను రూ.12 కోట్లకు అట్టిపెట్టుకుంది. రాజస్తాన్ రైట్రైట్రిటైనింగ్లో మొత్తం ఆరు అవకాశాలను వాడుకున్న రాజస్తాన్ రాయల్స్... సంజూ సామ్సన్, యశస్వి జైస్వాల్కు చెరో రూ.18 కోట్లు కేటాయించింది. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్కు చెరో రూ. 14 కోట్లు వెచ్చించింది.పూరన్ కోసం అంత అవసరమా?కేఎల్ రాహుల్ను వేలానికి వదిలేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిలకడగా ఆడతాడో లేదో తెలియని వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ కోసం రూ. 21 కోట్లు కేటాయించింది. గాయాలతో సహవాసం చేసే సూపర్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్, స్పిన్నర్ రవి బిష్ణోయ్కు రూ. 11 కోట్లు కేటాయించిన లక్నో... మొహసిన్ ఖాన్, ఆయుష్ బదోనీలకు చెరో రూ. 4 కోట్లు వెచ్చించింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్కు రూ.18 కోట్లు కేటాయించిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ... కెప్టెన్ శుబ్మన్ గిల్ను రూ. 16 కోట్ల 50 లక్షలకు అట్టిపెట్టుకుంది. వేలానికి రానున్న ప్రధాన ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, అర్ష్దీప్ సింగ్, సిరాజ్, చాహల్, అశ్విన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, షమీ (భారత్). వార్నర్, మ్యాక్స్వెల్, కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, స్టొయినిస్ ఆస్ట్రేలియా). బెయిర్స్టో, లివింగ్స్టోన్, స్యామ్ కరన్, బట్లర్, ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్). డుప్లెసిస్, డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్, నోర్జే (దక్షిణాఫ్రికా). కాన్వే, రచిన్ రవీంద్ర, బౌల్ట్ (న్యూజిలాండ్). చదవండి: Ind vs Pak: భారత బ్యాటర్ల విధ్వంసం.. అయినా పాక్ చేతిలో తప్పని ఓటమి -
IPL 2025: నాకు ఇదే కరెక్ట్.. ముంబై రిటెన్షన్ లిస్టుపై రోహిత్ కామెంట్స్
టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) భవితవ్యం విషయంలో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. మెజారిటీ మంది విశ్లేషకులు, కామెంటేటర్లు చెప్పినట్లుగా ‘హిట్మ్యాన్’ ముంబై ఇండియన్స్ను వీడలేదు. కెరీర్ ఆరంభం నుంచి తనకు అండగా నిలబడ్డ ఫ్రాంఛైజీతో కొనసాగేందుకే అతడు మొగ్గుచూపాడు. రోహిత్ అభిమానులకు కూడా ఇది ఒకరకంగా షాకిచ్చిందనే చెప్పవచ్చు.కాగా ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ విడుదల చేసిన రిటెన్షన్ జాబితాలో రోహిత్ శర్మకు చోటు దక్కిన విషయం తెలిసిందే. అయితే, టాప్-3లో మాత్రం అతడికి స్థానం ఇవ్వలేదు ముంబై. తమ ప్రాధాన్య ఆటగాళ్లలో రోహిత్ను నాలుగో ప్లేయర్గా అట్టిపెట్టుకుంది. దీంతో మరోసారి అతడి ఫ్యాన్స్ ఫ్రాంఛైజీపై మండిపడుతున్నారు.అందుకే వారికి పెద్దపీటఈ నేపథ్యంలో తాను నాలుగో ప్లేయర్గా ఉండటంపై రోహిత్ శర్మ స్పందించాడు. అంతర్జాతీయ టీ20ల నుంచి తాను రిటైర్ అయిన కారణంగా తనకు అదే సరైన స్థానమంటూ.. ఫ్రాంఛైజీ నిర్ణయాన్ని సమర్థించాడు. జాతీయ జట్టుకు ఆడుతున్న క్రికెటర్లకే మొదటి ప్రాధాన్యం దక్కుతుందని.. అందుకే ఫ్రాంఛైజీ వాళ్లకు పెద్దపీట వేసిందని చెప్పుకొచ్చాడు.ఇది సరైన నిర్ణయమని తానూ నమ్ముతున్నానన్న రోహిత్.. కోరుకున్న ఆటగాళ్లను వేలంలోకి వదిలేసి మళ్లీ కొనుక్కోవడం కష్టమని పేర్కొన్నాడు. ఇక గత రెండు- మూడేళ్లుగా తమ జట్టు స్థాయికి తగ్గట్లుగా రాణించలేకోయిందని.. ఈసారి మాత్రం పొరపాట్లు పునరావృతం కానివ్వమని చెప్పాడు. ముంబై ఇండియన్స్కు ఘనమైన చరిత్రముంబై తరఫున తాను చాలా ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నానని.. సహచర ఆటగాళ్లతో సమన్వయం చేసుకుంటూ జట్టును మెరుగైన స్థితిలో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపాడు.ట్రోఫీలు గెలవడంలో ముంబై ఇండియన్స్కు ఘనమైన చరిత్ర ఉందన్న రోహిత్ శర్మ... క్లిష్ట పరిస్థితుల్లోనూ పోరాటపటిమ కనబరిచి గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నాడు. కాగా అంబానీల సారథ్యంలోని ముంబై ఇండియన్స్ కెప్టెన్గా వ్యవహరించిన రోహిత్ శర్మ జట్టును ఏకంగా ఐదుసార్లు చాంపియన్గా నిలిపాడు.అనూహ్య రీతిలో రోహిత్పై వేటుతద్వారా క్యాష్ రిచ్ లీగ్లో ఈ ఘనత సాధించిన తొలి సారథిగా చరిత్రకెక్కాడు. అయితే, ఈ ఏడాది అనూహ్య రీతిలో ముంబై కెప్టెన్గా రోహిత్ను తప్పించి.. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాను నియమించింది. గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ను ట్రేడ్ చేసుకుని మరీ జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ అభిమానులు ఫ్రాంఛైజీతో పాటు హార్దిక్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ఈ ఏడాది అట్టడుగున ముంబైరోహిత్ సైతం చాలాసార్లు మైదానంలోనే తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు కనిపించింది. జట్టు రెండు వర్గాలుగా విడిపోయిందన్న వార్తలకు బలం చేకూరుస్తూ ముంబై ఇండియన్స్ ఐపీఎల్-2024లో వరుస ఓటములు చవిచూసింది. పద్నాలుగు మ్యాచ్లకు గానూ నాలుగే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో రోహిత్ ముంబైని వీడతాడని.. ముంబై సైతం అతడిని విడిచిపెడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఈ చర్చలకు ఫ్రాంఛైజీ గురువారం చెక్ పెట్టింది. వేలానికి ముందు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్లలో రోహిత్ ఉన్నట్లు ప్రకటించింది. ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు1. జస్ప్రీత్ బుమ్రా(టీమిండియా ప్రధాన పేసర్)- రూ. 18 కోట్లు2. సూర్యకుమార్ యాదవ్(టీమిండియా టీ20 కొత్త కెప్టెన్)- రూ. 16.35 కోట్లు3. హార్దిక్ పాండ్యా(టీమిండియా స్టార్ ఆల్రౌండర్)- రూ. 16.35 కోట్లు4. రోహిత్ శర్మ(టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్)- రూ. రూ. 16.30 కోట్లు5.తిలక్ వర్మ(టీమిండియా రైజింగ్ స్టార్)- రూ. 8 కోట్లు.వరల్డ్కప్ జట్టులోటీమిండియాకు టీ20 ప్రపంచకప్-2024 అందించిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ తన పదవి నుంచి వైదొలగడంతో పాటు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. ఇక ముంబై తాజాగా రిటైన్ చేసుకున్న బుమ్రా, హార్దిక్, సూర్య అతడి సారథ్యంలోని విన్నింగ్ టీమ్లో సభ్యులే.చదవండి: ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా విడుదల View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians)