Anchor Ravi
-
ఫ్యామిలీ వేకేషన్లో చిల్ అవుతోన్న టాలీవుడ్ యాంకర్ రవి (ఫోటోలు)
-
తాళి కళ్లకద్దుకుని, అత్తామామల ఆశీర్వాదం తీసుకుని.. (ఫోటోలు)
-
న్యూ బిగినింగ్.. యాంకర్ రవి గృహప్రవేశ వేడుక (ఫోటోలు)
-
పెళ్లయి తొమ్మిదేళ్లు.. యాంకర్ రవి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)
-
యాంకర్ రవి బర్త్ డే పార్టీ.. సందడి చేసిన అనసూయ (ఫొటోలు)
-
అమెరికాలో ఫ్యామిలీతో చిల్ అవుతున్న యాంకర్ రవి (ఫొటోలు)
-
జీవితాలు ఖరాబ్.. కూతుర్ని మర్చిపోయా: యాంకర్ రవి
యాంకర్ రవి.. ఒకప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నానుతూ ఉండేవాడు. గతంలో అతడు యాంకర్ లాస్యతో జోడీగా షోలు చేయడంతో జనాలు వీరిద్దరినీ జంటగా ఊహించుకునేవారు. ఎంతో క్రేజ్ ఉన్న ఈ జంట మధ్య సడన్గా ఏదో గొడవలు వచ్చి మాట్లాడుకోవడం మానేశారు, కలిసి షోలు చేయడం కూడా ఆపేశారు. నిత్యతో పెళ్లితర్వాత ఎన్నో ఏండ్లకు కలిసిపోయారు. కానీ అప్పటికే ఇద్దరూ చెరో దారి చూసుకున్నారు. లాస్య.. మంజునాథ్ను పెళ్లి చేసుకోగా యాంకర్ రవి.. నిత్య మెడలో తాళి కట్టాడు. తమకు పెళ్లైన విషయాలను ఇద్దరూ ఆలస్యంగానే బయటపెట్టారు. తాజాగా ఓ షోకి హాజరైన రవి తన వ్యక్తిగత విషయాల గురించి ఓపెన్ అయ్యాడు. డబ్బు కోసమే పని'నేను పక్కా కమర్షియల్.. నేను డబ్బు కోసమే పని చేస్తున్నాను. నేనసలు కొరియోగ్రాఫర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. కొంతమంది హీరోల దగ్గరికి వెళ్లి నా ఆసక్తిని బయటపెట్టాను. నాగార్జున గారు ముందు పని నేర్చుకుని తర్వాత ప్రయత్నించమన్నారు. ఓ ఛానల్లో కూడా పెట్టించాడు. అక్కడ సమ్థింగ్ స్పెషల్ అనే షో చేశాను. అలా నా జర్నీ మొదలైంది.కో యాంకర్తో కనెక్షన్నాకు పెళ్లయిందన్న విషయాన్ని ఎందుకు బయటపెట్టలేదంటే.. ఏదైనా ఫంక్షన్కు వెళ్లినప్పుడు అక్కడున్నవారు నిత్యతో.. నన్ను చూపిస్తూ ఫలానా తెలుగు యాంకర్ హజ్బెండ్ కదా అనేవారు. నన్ను నా కో యాంకర్తో ముడిపెట్టేవారు. కాదని చెప్తే.. ఆమె భర్తను పట్టుకుని నీ భర్త అంటావేంటి? అని నిత్యనే నిలదీశారు. పాపం.. తను ఎలా ఫీలవుతుందోనని నేను తల దించుకునేవాడిని. అందుకే తనను లేటుగా పరిచయం చేశాను.నా కూతుర్ని మర్చిపోయాబిగ్బాస్ షో విషయానికి వస్తే.. ఈ రియాలిటీ షో వల్ల చాలామంది జీవితాలు ఖరాబయ్యాయి. అక్కడ జరిగేవాటిని జడ్జ్ చేయొద్దు. నేను బిగ్బాస్కు వెళ్లిన 15 రోజులకు నా కూతురి ముఖం ఎలా ఉంటుందో మర్చిపోయాను. తనెలా ఉంటుందో గుర్తురాలేదు.. బిగ్బాస్ హౌస్లో జరిగేదంతా మీకు చూపించరు' అని రవి చెప్పుకొచ్చాడు.చదవండి: 'చివరి స్టేజీలో ఉన్నా.. నా భర్త ముఖం మాడిపోయింది' -
హైదర్నగర్లో ఫ్యాబ్రిక్ స్టూడియో ప్రారంభించిన రాకింగ్ రాకేష్,సుజాత (ఫొటోలు)
-
యాంకర్ రవికి ఎందుకు సారీ చెప్పానంటే?: బిగ్బాస్ ఆదిరెడ్డి
బిగ్బాస్తో ఫేమ్ తెచ్చుకున్న మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి. తెలుగువారి రియాలిటీ షో బిగ్బాస్ సీజన్-6లో కంటెస్టెంట్గా అడుగుపెట్టారు. అయితే తాను ప్రస్తుతం యూట్యూబర్గా రాణిస్తున్నారు. గతేడాది జరిగిన బిగ్బాస్ సీజన్-7 షోపై కూడా చాలా వీడియోలు చేశాడు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్కు సపోర్ట్గా చాలా సార్లు మాట్లాడారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆది రెడ్డి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గతంలో యాంకర్ రవిపై చేసిన వీడియో పట్ల సారీ చెప్పడంపై ఆయన స్పందించారు. ఆదిరెడ్డి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'యాంకర్ రవి అంటే నాకు భయం లేదు. కానీ నేను అతనికి సారీ చెప్పా. ఎందుకంటే నేను ఫ్యామిలీ రిలేషన్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా. నా వల్ల వాళ్లు బాధ పడ్డప్పుడు నేను సారీ చెప్తే తప్పేముంది? మనకు ఫ్యామిలీ రిలేషన్స్ ముఖ్యం కదా?. అసలు ఏం జరిగిందంటే.. బిగ్బాస్ టాస్క్లో యాంకర్ రవి అన్న సంచాలక్. ఆయనకు బిగ్బాస్ కొన్ని రూల్స్ చెప్పాడంట. ఆ విషయం బయట ఉన్న మనకు తెలియదు. కానీ.. నేను రవి అన్న కావాలనే సన్నీని ఓడించాడని నెగెటివ్గా వీడియోలో చెప్పా. కానీ హౌస్ లోపల జరిగేవి కొన్ని మనకు చూపించరు కదా. ఆ విషయం నాకు బిగ్బాస్ వెళ్లి వచ్చాక అర్థమైంది. మనమే రవిని తప్పుగా అనుకున్నామని నాకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు సారీగా ఫీలయ్యాను. ' అంటూ క్లారిటీ ఇచ్చారు. View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) -
Anchor Ravi Latest Photos: గోవాలో భార్యతో యాంకర్ రవి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
Anchor Ravi Daughter Viya Birthday Celebrations: పడవలో యాంకర్ రవి కూతురు బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
తెలుగు షోలో సన్నీ లియోన్.. ఇదెక్కడి ట్విస్టురా మావ!
బాలీవుడ్ నటి సన్నీ లియోన్కు టాలీవుడ్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఆమె తొలిసారిగా తెలుగు బుల్లితెరపై కనిపించబోతోంది. ఆమె జీ తెలుగు కోసం 'తెలుగు మీడియం స్కూల్' అనే కొత్త రియాల్టీ షోకి గెస్టుగా వచ్చింది. దీంతో ఈ షో పై భారీ అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ షోకి సంబంధించిన ప్రోమోను ఛానెల్ విడుదల చేసింది. జీ తెలుగు మునుపెన్నడూ చూడని రియాల్టీ షోగా 'తెలుగు మీడియం స్కూల్'ని పరిచయం చేసింది. ఈ ప్రోమోలో సన్నీ లియోన్తో పాటు ప్రముఖ గాయకుడు మనో, యాంకర్ రవి కూడా ఉన్నారు. (ఇదీ చదవండి: దు:ఖంలోనూ చిన్న కూతురితో ప్రమోషన్లకు వచ్చిన విజయ్ ఆంటోనీ) ఇందులో టీవీ, టాలీవుడ్ హాస్యనటులు కూడా ఉన్నారు. ఈ ప్రోమో విడుదల అయిన వెంటనే సూపర్, అద్భుతం అంటూ సన్నీ లియోన్పై కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో కనకాల సుమ,రష్మి,అనసూయ,శ్రీముఖి వంటి వారు యాంకరింగ్లో తనదైన ముద్ర వేశారు. మరీ గెస్టుగా వచ్చిన ఈ బ్యూటీ వీరిలో ఎవరినైనా మెప్పించేలా యాంకరింగ్ చేస్తుందా అనేది చూడాలి? ఈ షో కాన్సెప్ట్ ఏంటి అనేది ఇంకా నిర్వహకాలు వెల్లడించలేదు. ఈ ప్రోమోలో సన్నీ తెలుగులో మాట్లాడుతూ తనకు ప్రాణం పోసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు అంటూ మాట్లాడింది. అలాగే, ప్రోమో చాక్బోర్డ్పై షో టైటిల్ కనిపించడంతో ముగుస్తుంది, ఆ తర్వాత చీరలో సన్నీ లియోన్ ఉల్లాసమైన చిరునవ్వుతో ఉంటుంది. సన్నీలియోన్ 11 ఏళ్ల కిందటే 'జిస్మ్ 2'తో బాలీవుడ్లోకి అడుగుపెట్టినప్పటికీ, ఆమె 'కరెంట్ తేగ, గరుడ వేగ,జిన్నా' వంటి తెలుగు సినిమాల్లో కూడా నటించింది. -
యాంకర్ రవి కూతురు వియాను చూశారా? ఎంత క్యూట్గా ఉందో (ఫొటోలు)
-
రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాత ఎంగేజ్మెంట్.. పిక్స్ వైరల్
రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాత ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట తాజాగా నిశ్చితార్థం జరుపుకున్నారు. బుల్లితెరపై పలు షోస్లో ప్రేమికుల్లా సందడి చేసిన ఈ జోడీ నిజజీవితంలోనూ ఒక్కటవ్వనుంది. ఈ వేడుకకు జబర్దస్త్ నటులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి రోజా, యాంకర్ రవి, అనసూయ, గెటప్ శ్రీను తదితరులు పాల్గొని జంటను ఆశీర్వదించారు. ఇటీవలే తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడించింది సుజాత. తమ నిర్ణయాన్ని పెద్దలు గౌరవించి, పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపింది. రాకేశ్తో పరిచయం దగ్గర్నుంచి స్నేహం, ప్రేమ, చివరికి పెళ్లి వరకు ఎన్నో మధురమైన ఙ్ఞాపకాలకో ఓ వీడియోలో షేర్ చేసింది సుజాత. త్వరలోనే పెళ్లి డేట్ను అనౌన్స్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంటకు పలువురు సినీతారలు శుభాంకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) -
యాంకర్ రవి యాడ్ షూటింగ్ కోసం భారీ సెట్టింగ్!
బిగ్బాస్ షోతో మరింత పాపులర్ అయ్యాడు యాంకర్ రవి. ప్రస్తుతం ఈ స్టైలీష్ యాంకర్ ఓ కమర్షియల్ యాడ్లో నటించబోతున్నాడు. ‘జబర్దస్త్’ రాకింగ్ రాకేష్తో కలిసి నటించబోయే ఈ యాడ్ .. ఓ వస్త్ర వ్యాపారానికి సంబంధించినది. దీని కోసం హైదరాబాద్లో ఓ భారీ సెట్ని వేసినట్లు తెలుస్తోంది. దాదాపు ఓ సినిమా కోసం వేసేంత సెట్లో ఈ కమర్షియల్ యాడ్ షూటింగ్ జరగనుందట. ఆ యాడ్ ద్వారా జబర్దస్త్ రాకింగ్ రాకేష్, బిగ్ బాస్ యాంకర్ రవి, మోడల్ యశ్వంత్ లు ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ యాడ్ ను యాడ్స్ కింగ్ మేకర్ అయిన సంజీవ్ డైరెక్ట్ చేశారు. అలాగే జబర్దస్త్ కి రైటర్ గా చేసినటువంటి సుభాష్ కెమెరామెన్ గా వర్క్ చేయడం విశేషం. ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి భారీగా ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలోని పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లో ఈ బ్రాండ్ కు సంబందించిన బ్రాంచెస్ ఓపెన్ అవుతుండడం విశేషం. -
ఈ స్టార్ యాంకర్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అందరికంటే ఎక్కువ ఎవరికంటే!
బుల్లితెరపై తమ మాటలతో, పంచ్లతో ప్రేక్షకులను అలరిస్తున్న యాంకర్స్ ఎంతోమంది ఉన్నారు. వీరికి కూడా స్టార్ నటీనటులకు సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అందులో ఎక్కువగా ఫ్యాన్ బేస్ను సంపాదించుకున్న టాప్ ఫీమేల్, మేల్ యాంకర్లలో సుమ కనకాల, ప్రదీప్ మాచీరాజుల మొదటి స్థానంలో ఉంటారు. ఆ తర్వాత అనసూయ భరద్వాజ్, యాంకర్ రవి, రష్మీ గౌతమ్, శ్రీముఖి, శ్యామల, మంజూషలు ఉన్నారు. ఇందులో కొందరు బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై సందడి చేస్తుంటారు. అలా రోజురోజు తమ క్రేజ్ను పెంచుకుంటున్న వారి రెమ్యునరేషన్స్ ప్రస్తుతం హాట్టాపిక్గా మారాయి. మరి ఈ స్టార్ యాంకర్ల పారితోషికం ఎలా ఉందో ఓసారి చూద్దాం! చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం యాంకర్లలో మొదట చెప్పుకోవాల్సింది సుమ కనకాల గురించి. ఎంతోకాలంగా తన యాంకరింగ్తో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తున్నారామె. ఆమె ఇండస్ట్రీకి వచ్చి దశాబ్ధాలు గడుస్తున్నా ఇప్పటికీ సుమ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తనదైన పంచ్, కామెడీ టైమింగ్తో ప్రేక్షకులకు ఫుల్ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది. ఇక స్టార్ హీరోహీరోయిన్లు సైతం సుమకు ఫ్యాన్స్ ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. ఇటూ టీవీ షోలతో అటూ మూవీ ప్రీరిలీజ్, ఆవార్డ్ ఫంక్షన్స్కు సుమ యాంకర్గా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. అలా ఆమె ఒక్కో ఈవెంట్కు రూ. 3 నుంచి రూ. 5 లక్షల వరకు తీసుకుంటందని సమాచారం. ఇక ఒక్కొఎపిసోడ్కు అయితే రూ. 2 నుంచి రూ. 3 లక్షలు తీసుకుందట. ఈ లెక్కన సుమ నెలకు దాదాపు రూ. 20 లక్షలపైనే సంపాదిస్తుంది. ఇక ప్రదీప్ మాచీరాజు కూడా ఇంచుమించు సుమ రెంజ్లోనే పారితోషికం తీసుకుంటాడని తెలుస్తోంది. మూవీ ఈవెంట్స్ అయితే రూ. 3 నుంచి రూ. 4 లక్షల వరకు తీసుకోగా ఒక్కొక్క ఎపిసోడ్కు రూ. 2 లక్షల వరకు అందుకుంటాడట. ఇక రంగమ్మత్తగా ఎనలేని క్రేజ్ సొంతంగా చేసుకున్న అనసూయ యాంకర్గానే కాదు వెండితెరపై నటిగానూ రాణిస్తోంది. చదవండి: ఆసక్తిగా శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ లేటెస్ట్ పోస్ట్.. ‘దీని అంతర్యం ఏంటీ?’ ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్లలో గ్లామరస్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఆమె ఒక్కో ఈవెంట్కు రూ.2 నుంచి రూ. 3 లక్షలు వరకు తీసుకుంటుందట. ఇక యాంకర్ రష్మీ గౌతమ్ రూ. 1.5 నుంచి రూ. 2 లక్షల వరకు డిమాండ్ చేస్తుందట. ఇక యాంకర్ రవి దాదాపు రూ. లక్ష నుంచి రూ. 1.5 లక్షల వరకు తీసుకుంటాడని సమాచారం. ఇక మంజుషా కూడా రూ. 50 వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్. యాంకర్ వర్షిణీ 30వేలు, యాంకర్ శ్యామల రూ. 50వేల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇందులో అందరికంటే సుమ పారితోషికమే ఎక్కువ ఉండటం విశేషం. -
బెంజ్ కారు కొన్న బిగ్బాస్ బ్యూటీ
సాహసం సేయరా డింభకా సినిమాతో ప్రేక్షకులను అలరించింది హమీదా. అందచందాలు ఉన్నప్పటికీ పెద్దగా ఆఫర్లు రాలేదీ ముద్దుగుమ్మకీ. అయితే బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్తో కావాల్సినంత పాపులారిటీ అందుకుంది హమీదా. సింగర్ శ్రీరామ్తో లవ్ ట్రాక్ నడిపి బాగా ఫేమస్ అయింది. తర్వాత బిగ్బాస్ నాన్స్టాప్లోనూ సందడి చేసింది. ఇదిలా ఉంటే హమీదా ఈ దీపావళికి కొత్త కారు కొనుక్కుంది. మెర్సిడిస్ బెంజ్ కారును తన ఇంటికి తెచ్చుకుంది. ఈ మేరకు ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో తన కుటుంబంతో పాటు యాంకర్ రవి, అతడి భార్య నిత్య సక్సేనా కూడా ఉన్నారు. అలాగే యాంకర్ రవితో కొత్త కారులో డ్రైవ్కు వెళ్లిన వీడియోను సైతం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్... కొత్త కారు కొన్న హమీదాకు శుభాకాంక్షలు చెప్తున్నారు. మరి శ్రీరామ్తో ఎప్పుడు డ్రైవ్కు వెళ్తావ్? అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) View this post on Instagram A post shared by Hamida Khatoon (@hamida_khatoon_official) చదవండి: ఆదిరెడ్డికి సర్ప్రైజ్.. కెప్టెన్గా తప్పు చేసిన శ్రీహాన్ -
టాలీవుడ్ యాంకర్లు.. అత్యధిక రెమ్యునరేషన్ ఎవరికో తెలుసా?
టాలీవుడ్లో ఫేమస్ యాంకర్లు ఎంతమంది ఉంటారని అడిగేతే.. ఠక్కున గుర్తొచ్చే పేర్లు సుమ, అనసూయ, రష్మీ, ప్రదీప్, రవి వేళ్లపై చెప్పేస్తారు. తెలుగులో అంతలా క్రేజ్ సంపాందించారు వీరు. టాలీవుడ్లో ఏ ఈవెంట్ జరిగినా యాంకర్ల పాత్ర చాలా కీలకం. వారు లేకుండా ఏ ఫంక్షన్ ఊహించుకోవడం కష్టమే. మరీ అంత ప్రాముఖ్యత ఉన్న యాంకర్స్ తీసుకునే రెమ్యునరేషన్ గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. మరీ వారు ఒక్క ఈవెంట్కు తీసుకుంటారు. వారిలో ఎవరికీ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అన్న విషయాలపై ఓ లుక్కేద్దాం. సుమ కనకాల: ప్రస్తుతం తెలుగులో టాప్ యాంకర్ సుమ కనకాల. ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ నుంచి ఇప్పటి వరకు ఆమె దిగ్విజయంగా కొనసాగిస్తోంది. సుమ కనకాల హాజరయ్యే ఒక్క ఈవెంట్కు దాదాపు రూ.3.5 నుంచి 4 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ప్రదీప్ మాచిరాజు: మేల్ యాంకర్స్లో ముందు వరుసలో వినిపించే పేరు ప్రదీప్ మాచిరాజు. టాలీవుడ్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రదీప్ వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. ప్రదీప్ ఒక్క ఈవెంట్కు రూ.2 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అనసూయ భరద్వాజ్: జబర్దస్త్ ద్వారా ఓ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్న యాంకర్. కామెడీ షో ద్వారా ఫేమస్ అయిన అనసూయ భరద్వాజ్ కూడా భారీగానే పారితోషికం తీసుకుంటోంది. దాదాపు రూ.2-3 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న అనసూయ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తోంది. రష్మీ గౌతమ్: జబర్దస్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించిన మరో యాంకర్ రష్మీ గౌతమ్. ఆమె అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాల్లో నటించినా పెద్దగా సక్సెస్ కాలేదు. యాంకర్గా మంచి పేరు తెచ్చుకున్న రష్మీ ప్రస్తుతం రూ 2 లక్షల నుంచి నుండి రూ 3 లక్షల వరకు పారితోషికం అందుకుంటోంది. రవి: ప్రదీప్ తర్వాత అంతలా పేరు సంపాదించిన మరో మేల్ యాంకర్ రవి. పటాస్ షోతో క్రేజ్ సంపాదించిన రవి కేరీర్ పరంగా ఇప్పుడు కాస్త వెనుకబడ్డారు. అయినప్పటికీ ఒక్కో ఈవెంట్కు రూ.లక్ష రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. శ్యామల: టాలీవుడ్లో ఫేమస్ అయిన మరో యాంకర్ శ్యామల. ఆమె కూడా ప్రస్తుతం రూ.లక్ష వరకు పారితోషికం తీసుకుంటూ.. సినిమాల్లోనూ నటిస్తోంది. మంజూష: టాలీవుడ్ మరో యాంకర్ మంజూష. ఆమె కూడా రూ.లక్ష వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ఇంటర్వ్యూల్లో ఎక్కువగా కనిపించే మంజూష యాంకర్గా తెలుగులో ఫేమస్ అయింది. వర్షిని: టాలీవుడ్ మరో యాంకర్ వర్షిని. ప్రస్తుతం ఆమె రూ.50వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. వర్షినికి జబర్దస్త్ ద్వారా తెలుగులో గుర్తింపు వచ్చింది. -
Sakala Gunabhi Rama: ఈ శుక్రవారం సన్నిదే .. యాంకర్ రవి
‘సినిమా వాళ్లు ఏదో ఒక శుక్రవారం మాది కావాలని కోరుకుంటారు. ఈ శుక్రవారం మాత్రం మా సన్నిదే. సకల గుణాభి రామ చిత్రం నేను చూసాను, చాలా బాగుంది. ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుంది’అని యాంకర్ రవి అన్నారు. బిగ్ బాస్ ఫేమ్ వి జె సన్నీ, అషిమా హీరో హీరోయిన్ గా శ్రీనివాస్ వెలిగొండ దర్శకత్వంలో సంజీవ్ రెడ్డి నిర్మించిన చిత్రం సకల గుణాభి రామ. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16 న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అది నారాయణ ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో బిగ్ బాస్ ఫేమ్ నటులు సోహైల్, మానస్, జెస్సి, హమీద, యాంకర్ రవి మరియు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ రవి మాట్లాడుతూ.. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. పాటలు చాలా బాగున్నాయి. సన్నీ కి ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికి ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’ అని కోరుకున్నారు. సోహైల్ మాట్లాడుతూ ..మేమంతా బిగ్ బాస్ తర్వాత ఫేమస్ అయ్యాము కానీ మా అందరి గోల్ మాత్రం సినిమాల్లో నటించడమే. మేము అందరం చాలా కష్టపడి మా కెరీర్ ని నిలబెట్టుకుంటున్నాం. అలాగే సన్నీ కూడా చాలా కష్టపడ్డాడు. ప్రేక్షకులు అందరూ ఈ చిత్రం చూడండి. ఇలాంటి చిన్న చిత్రాలు విజయవంతం అయితే మరిన్ని మంచి చిత్రాలు మీ ముందుకు వస్తాయి. అందరూ మా సన్నీ నటించిన సకల గుణాభి రామ చిత్రాన్ని చూసి విజయవంతం చేయండి’ అని కోరుకున్నారు. ‘లాక్ డౌన్ టైం లో చిన్న సినిమా గా ప్రారంభం అయిన సకల గుణాభి రామ చిత్రం ఇప్పుడు థియేటర్స్ లో విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. అందరం కొత్త టెక్నిషన్స్ చాలా కష్టపడి పని చేసాం. సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరికీ బాగా నచ్చుతుంది’అని దర్శకుడు శ్రీనివాస్ వెలిగండ అన్నారు. హీరో సన్నీ మాట్లాడుతూ .. నేను బిగ్ బాస్ లో రాక ముందే నాకు హీరో గా అవకాశం ఇచ్చిన మా నిర్మాత సంజీవ్ గారికి నా కృతజ్ఞతలు. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని చేసాం, ప్రేక్షకులు అందరూ మా సినిమా ని చూసి హిట్ చేస్తారు’ అని కోరుకున్నారు. -
ప్రియాంక పెళ్లి వార్తలపై స్పందించిన యాంకర్ రవి
బిగ్బాస్ బ్యూటీ, ట్రాన్స్జెండర్ ప్రియాంక సింగ్ పెళ్లి చేసుకోనుందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ఓ హల్దీ ఫంక్షన్లో ఎల్లో కలర్ సారీలో అదిరిపోయింది పింకీ. పెళ్లికూతురులా ముస్తాబైన ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇది చూసిన అభిమానులు త్వరలోనే ప్రియాంక పెళ్లి చేసుకోబోతుందేమోనని అనుకున్నారు. తాజాగా దీనిపై యాంకర్ రవి స్పందించాడు. ఓ ఫన్ వీడియోను షేర్ చేస్తూ.. 'నా చెల్లి పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది. ఎందుకంటే మధ్యలో ఒక పన్ను ఊడిపోయింది. ముందు దాన్ని సెట్ చేయాలి. ప్రియాంక నా బంగారం..' అని రాసుకొచ్చాడు. యాంకర్ రవి మాటలను బట్టి చూస్తుంటే ప్రియాంక ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునేట్లు లేదని తెలుస్తోంది. ఇకపోతే బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్లో ప్రియాంక, రవి ఇద్దరూ పార్టిసిపేట్ చేశారు. హౌస్లో ఉన్నప్పుడే వీరు బాగా కలిసిపోయారు. షో అయిపోయాక కూడా వారు తమ మధ్య ఉన్న అన్నాచెల్లెలి బంధాన్ని కంటిన్యూ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) చదవండి: నటికి చేదు అనుభవం, అమెరికా ఎయిర్లైన్పై బాలీవుడ్ బ్యూటీ ఫైర్! ఓటీటీలో రామారావు ఆన్ డ్యూటీ, అప్పటినుంచే స్ట్రీమింగ్ -
ఆ కంటెస్టెంట్ వల్లే నాకు టైటిల్ దక్కింది: బిందు మాధవి
బిగ్బాస్ నాన్స్టాప్ విన్నర్గా బిందు మాధవి రికార్డు సృష్టించింది.టైటిల్ రేసులో ఉన్న అఖిల్ సార్థక్ నుంచి గట్టి పోటీ ఎదురైనా చివరికి బిందు మాధవి టైటిల్ విన్నర్గా నిలిచింది. తెలుగు బిగ్బాస్ చరిత్రలోనే తొలి లేడీ విన్నర్గా నిలిచి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. బిగ్బాస్ నాన్స్టాప్ ట్రోఫీతో పాటు రూ. 40లక్షల క్యాష్ ప్రైజ్ను సైతం సొంతం చేసుకుంది. 'మస్తీ' హ్యాష్ ట్యాగ్తో ఎంట్రీ ఇచ్చి 'ఆడపులి' అనే హ్యాష్ ట్యాగ్తో బయటికొచ్చింది. అనంతరం బిగ్బాస్ బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిందు మాధవి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. బిగ్బాస్ టైటిల్ గెలవడం తన మొదటి విజయంగా భావిస్తున్నానని, ఇప్పటి నుంచి ఇక విజయవంతంగా ముందుకు వెళ్తానని అనుకుంటున్నట్లు పేర్కొంది. ఇప్పుడు విన్నర్ అయ్యావ్ కానీ, ఒకసారి కూడా కెప్టెన్ ఎందుకు అవ్వలేదు అని యాంకర్ అడగ్గా అది తనకు కూడా తెలియదని చెప్పింది. హౌస్లో మోస్ట్ ఇరిటేటింగ్ కంటెస్టెంట్ ఎవరు అని అడగ్గా ఏమాత్రం తడుముకోకుండా వెంటనే నటరాజ్ మాస్టర్ అని తెలిపింది. ఈ సీజన్లో పలానా కంటెస్టెంట్ ఉన్నపపుడు నేను ఈ సీజన్కి రావాల్సింది లేకుండే అని ఎవరిని చూస్తే అనిపించింది?అని అడగ్గా వారి వళ్లే తనకీ టైటిల్ దక్కిందంటూ చెప్పుకొచ్చింది. చివరగా విన్నింగ్ మూమెంట్లో గెలుస్తానో, లేదో అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నానని బిందు పేర్కొంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
బిగ్బాస్ ఓటీటీ: రవిపై ఫైర్ అయిన నటరాజ్ మాస్టర్?
Nataraj Master Bigg Boss Buzz Interview After Elimination: బిగ్బాస్ తెలుగు ఓటీటీ చివరి దశకు చేరుకుంది. టైటిల్ను గెలిచేందుకు హౌజ్మేట్స్ గట్టిగా పోటీ పడుతున్నారు. ఇక గతవారం హౌస్మేట్స్ అందరూ నామినేషన్లో ఉన్నారు. బిందు, అఖిల్, బాబా బాస్కర్, నటరాజ్ మాస్టర్, ఆరియాన గ్లోరీ, మిత్ర, అనిల్, యాంకర్ శివ నామినేషన్ల్లో ఉండగా ఇందులో తక్కువ ఒట్స్ వచ్చిన నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యి హౌజ్న వీడాడు. ఎలిమినేషన్ అనంతరం నటరాజ్ మాస్టర్ బిగ్బాస్ బజ్ ఎపిసోడ్లో యాంకర్ రవితో ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా డిస్ని ప్లస్ హాట్స్టార్ రిలీజ్ చేసింది. చదవండి: చిక్కుల్లో కరాటే కల్యాణి, చిన్నారి దత్తతపై నోటీసులు ఇక వచ్చి రాగానే ‘నా రాక కోసం ఎదురు చూస్తున్నావా?’ అని రవికి కౌంటర్ ఇచ్చాడు మాస్టర్. తాను ఒక్కడినే అనుకుంటే మీ తప్పు అంటూ రవి రీకౌంటర్ ఇచ్చాడు. అనంతరం ఒకరి వల్ల మధ్యలోనే ఇంటి నుంచి బయటకు వచ్చాననడంతో అంతా నెగిటివి ఎందుకు మాస్టర్ అని రవి అంటాడు. ఆ తర్వాత చెన్నై.. తమిళ్.. చేసుకుని వెళ్లిపోతారు అనే నటరాజ్ వ్యాఖ్యలను రవి తప్పబట్టినట్లు కనిపించాడు. దీనికి మాస్టర్ దానికి కూడా క్లారిటీ ఇస్తా అంటాడు. ఆ తర్వాత మాస్టర్ తనకు ఒక సక్సెస్ అనేది రాలేదడంతో.. టాలెంట్కి బౌండరీస్ లేవు అంటాడు రవి. అనంతరం ‘నువ్వు ఏదో లోపల పెట్టుకుని ఒక పాయింట్స్ రాసుకుని నా మీద అటాక్ చేస్తున్నావ్ ప్రతి పాయింట్ అర్థమవుతుంది’ అని రవిపై ఫైర్ అయ్యాడు మాస్టర్. ఇలా ఇద్దరి మధ్య సంభాషణ కాస్తా ఘాటూగానే సాగింది. ఆ తర్వాత ఇంత క్రుయల్గా ఏ అమ్మాయిని చూడలేదని, ఆమె తీసే పాయింట్స్ అంటూ నటరాజ్ మాస్టర్ అంటుండగా ఈ రోజు బిందు పాయింట్స్ తీసింది కాబట్టే తనకు.. ఆడియాన్స్కి బిందు లోపట ఉండాలని ఓట్ వేశారు అంటాడు రవి. ఆ వెంటనే శకుని అనే ఓ నెగిటివ్ క్యారెక్టర్ ఒక అమ్మాయికి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అడగ్గా.. ఆడించేది ఎవరు మహా భారతంలో శకుని.. బిగ్బాస్లో ఆ ఇద్దరి ఆడిస్తున్నావంటే నువ్వు శకునే కదా అని సమాధానం ఇస్తాడు మాస్టర్. చదవండి: త్వరలో పెళ్లి.. అంతలోనే బ్యాడ్న్యూస్ చెప్పిన పాప్ సింగర్ ఇక ఆరియానకు ఇంటి డబ్బులు వచ్చాయి ఇంటికి పంపించేయండనం ఏంటని అన్నదానికి.. బిడ్డ మీద ఒట్టు వేయమంటే గేమ్ అయిన వదిలేస్తాను కానీ ఒట్టు వేయను అంటాడు నటరాజ్ మాస్టర్. ఇక నువ్వు బాగానే ప్రిపేర్ అయ్యిన్నావ్ అర్థమైందంటూ రవిపై మాస్టర్ సటైరికల్ కామెంట్స్ చేస్తాడు. దీనికి రవి తాను చాలా బెటర్గా మాట్లాడుతున్నానని, బయటకు వెళ్లి చూస్తే మీరు చాలా బాధపడతారని సమాధానం ఇవ్వడం ఆసక్తి నెలకొంది. ఈ ఇంటర్య్వూలో రవి నటరాజ్ మాస్టర్రను ఎలాంటి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాడు.. నటరాజ్ మాస్టర్ ఎందుకు ఇంత అసహనానికి లోనయ్యాడనేది తెలియాంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే. -
సిరిని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది: శ్రీహాన్
బిగ్బాస్ షోతో లాభపడేవాళ్లతోపాటు నష్టపోయేవాళ్లు కూడా ఉన్నారు. ఈ షోలో అడుగుపెట్టిన కొందరికి సినిమా అవకాశాలు వస్తే మరికొందరు మాత్రం నెగెటివిటీని మూటగట్టుకుని బయటకు వచ్చారు. అలాంటివారిలో సిరి హన్మంత్ ఒకరు. సీరియల్స్, యూట్యూబ్ వెబ్సిరీస్తో పాపులర్ అయిన ఆమె హౌస్లో షణ్ముఖ్ జశ్వంత్తో క్లోజ్గా ఉండటంతో ఆమెపై ఎక్కడలేని నెగెటివిటీ వచ్చింది. బయట తనకోసం ప్రియుడు శ్రీహాన్ ఉన్నాడన్న విషయం మర్చిపోయినట్లు ప్రవర్తిస్తుందని విమర్శలు వచ్చాయి. అంతేకాదు బిగ్బాస్ దెబ్బతో షణ్ముఖ్- దీప్తి సునయన విడిపోయినట్లుగానే సిరి, శ్రీహాన్ కూడా విడిపోనున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ బిగ్బాస్ తర్వాత ఇద్దరూ కలిసి పార్టీలకు హాజరవుతూ రూమర్లకు చెక్ పెట్టేశారు. తాజాగా తన ప్రేయసిపై పొగడ్తలు కురిపించాడు శ్రీహాన్. బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్లతో ఓ సరదా ఇంటర్వ్యూ చేశాడు యాంకర్ రవి. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా అందులో శ్రీహాన్ ఓ వీడియో సందేశం పంపాడు. అందులో సిరి గొప్పతనం గురించి చెప్పుకొచ్చాడు. 'సిరిని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. నాకిప్పటికీ పడుతూనే ఉంది. సిరి ఏదైనా సాధించాలనుకుంటే ఎలాంటి కష్టాలు వచ్చినా దేన్నీ పట్టించుకోదు. తను వైజాగ్లో ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చి కొన్ని సాధించాలనుకుంది. యాంకరింగ్ చేసుకుంటూ సీరియల్స్, సీరియల్స్ నుంచి సినిమాలు, సినిమాల నుంచి మొన్నటి బిగ్బాస్ వరకు.. మొత్తం తన కష్టమే. ఎవ్వరూ సాయం చేసింది లేదు. ఎవరి సపోర్ట్ తను తీసుకుందీ లేదు. కానీ ఎంత మాట్లాడినా సిరిని అర్థం చేసుకోవడం మాత్రం కష్టం' అని చెప్పుకొచ్చాడు. చదవండి: ప్రముఖ సీరియల్ నటి ఇల్లు చూశారా? ఎంత బాగుందో! -
బిగ్బాస్ హౌస్లో యాంకర్ రవి రచ్చ
బిగ్బాస్ నాన్స్టాప్ ముగింపుకు చేరుకుంటోంది. ప్రస్తుతం హౌస్లో తొమ్మిది మంది మాత్రమే మిగిలారు. వీరిలో ఈసారి ఐదుగురు కాకుండా ఆరుగురు ఫినాలేకు చేరుకోనున్నారని టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే బిగ్బాస్ ఐదో సీజన్ కంటెస్టెంట్లు వరుసగా హౌస్లో ఎంట్రీ ఇస్తున్నారు. హౌస్మేట్స్తో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం గేమ్ ఆడిస్తున్నారు. ఇప్పటికే సిరి, మానస్ హౌస్లోకి రాగా తాజాగా యాంకర్ రవి బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ప్రాణం పెట్టి ఆడుతున్న హౌస్మేట్స్తో మరో టాస్క్ ఆడించాడు. అయితే దీనికంటే ముందు వాళ్లతో ఫన్నీ స్కిట్స్ వేయిస్తూ ప్రేక్షకులను తెగ ఎంటర్టైన్ చేశాడు. మరి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరి సొంతం కానుంది? ఈ పాస్తో ఎవరు గేమ్ను మలుపు తిప్పనున్నారు అనేది తెలియాలంటే నేడు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: నామినేషన్స్లో బిందు ఓవరాక్షన్, టైటిల్ గెలిచే అర్హత లేదంటూ.. -
బిందుకు దగ్గరయ్యావని అఖిల్ దూరం పెట్టాడా? అజయ్ ఏమన్నాడంటే?
బిగ్బాస్ నాన్స్టాప్ షోలో ఇప్పటివరకు ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. శ్రీరాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వి, ముమైత్ ఖాన్, స్రవంతి, మహేశ్ విట్టా వరుసగా ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. తాజాగా ఎనిమిదో వారం అజయ్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ సందర్భంగా బిగ్బాస్ బజ్లో యాంకర్ రవికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో భాగంగా యాంకర్ రవి.. నువ్వు బిందుకు దగ్గరయ్యావని అఖిల్ దూరమయ్యాడా? అని సూటిగా ప్రశ్నించాడు. దీనికి అజయ్.. ఈ మధ్యే ఆ చర్చ కూడా మొదలైందని, ఎందుకు ఆమెతో క్లోజ్ ఉంటున్నావని అఖిల్ తనను అడుగుతూ ఉండేవాడని బదులిచ్చాడు. అఖిల్ వల్లే అజయ్ ఇన్నాళ్లు హౌస్లో ఉండగలిగాడని ఇంతకుముందు ఎలిమినేట్ అయినవాళ్లు చెప్పారు. ఎప్పుడైతే అఖిల్కు కొద్దికొద్దిగా దూరమవుతూ వచ్చావో అప్పటినుంచి అజయ్ వీక్ అవుతూ వచ్చాడని రవి పేర్కొనడంతో అజయ్ అలాంటిదేం లేదని ఆన్సరిచ్చాడు. ఇక ఇంటిసభ్యుల గురించి చెప్తూ.. నటరాజ్ మాస్టర్ కొంచెం కంట్రోల్లో ఉంటే బాగుంటుందన్నాడు. శివ స్మార్ట్ కానీ గేమ్లో విలువలు, ఎమోషన్స్ కూడా పక్కన పెట్టేస్తాడని అభిప్రాయపడ్డాడు. బిందుమాధవి చాలా స్ట్రాంగ్ ప్లేయర్, కాకపోతే కొంచెం ఓవర్ థింకింగ్ ఆపేస్తే బాగుంటుందని చెప్పాడు. అరియానా ఇప్పుడే గేమ్ స్టార్ట్ చేసిందన్నాడు. అఖిల్ కప్పు తీసుకుని రావాలని ఆశపడ్డాడు. చదవండి: బిగ్బాస్ షో నుంచి అజయ్ ఎలిమినేట్ మూడో సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ తెలుగువాడే! -
ముమైత్ ఎలిమినేట్.. బిందు మాధవిపై షాకింగ్ కామెంట్స్
Bigg Boss Non-Stop Buzz: బిగ్బాస్ నాన్స్టాప్.. తొలివారం పూర్తి చేసుకుంది. నో కామా నో ఫుల్ స్టాప్ అంటూ నాగార్జున మొదలుపెట్టిన ఈ షో నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్తో ముందుకి సాగుతుంది. ఫన్, ఫ్రస్టేషన్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ ఇలా 17మందితో మొదలైన బిగ్బాస్ షో రసవత్తరంగా సాగుతుంది. మాజీ కంటెస్టెంట్లతో పోటీపడి మరీ కొత్త కంటెస్టెంట్లు తమదైన ఆట కొనసాగిస్తున్నారు. ఇక బిగ్బాస్ ఓటీటీలో తొలి ఎలిమినేషన్ చోటుచేసుకుంది. చదవండి: ఆర్జీవీపై యాంకర్ శ్యామల ఆసక్తికర వ్యాఖ్యలు ఈ వారం వారియర్స్ టీమ్ కంటెస్టెంట్ ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యి బిగ్బాస్ హౌజ్ను వీడింది. 24/7 డిస్నీ హాట్ స్టార్లో నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్ను అందిస్తున్న బిగ్బాస్ అన్ని సీజన్ల మాదిరిగానే బిగ్బాస్ నాన్స్టాప్ బజ్ను షోను కూడా నిర్వహిస్తోంది. ఈ షో ద్వారా ఎలిమినేట్ అయిన సభ్యులు మిగతా కంటెస్టెంట్స్పై ఉన్న తమ అభిప్రాయాన్ని చెప్పుకొవచ్చు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో యాంకర్ రవి ఈ షోకు హోస్ట్గా కనిపించాడు. ఈ సందర్భంగా రవితో కలిసి బిగ్బాస్ హౌజ్ ముచ్చట్లు చెప్పిన ముమైత్ మిగతా కంటెస్టెంట్స్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చదవండి: ఎల్లలు దాటిన అభిమానం, ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఏకంగా థియేటర్నే కొనేశారు! బిందు మాధవిని నాగినితో పోల్చింది. ఇక తన తర్వాత హౌజ్ను వీడేది ఎవరని అడగ్గా.. ఆర్జే చైతూ అంటూ ధీమాగా సమాధానం ఇచ్చింది. ఇలా రవి.. ముమైత్ మనసులోని మాటలను ఎలా బయట పెట్టించాడో తెలుసుకోవాలంటే ఫుల్ ఎపిసోడ్ చూసేయండి. ఇదిలా ఉంటే బిగ్బాస్ నాన్స్టాప్లో యాంకర్ రవి సందడి చేయనున్నాడంటూ ముందు నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షో మొదలయ్యాక రవి కనిపించకపోవడంతో అతడి ఫ్యాన్స్ నిరాశ చెందారు. చివరికి కంటెస్టెంట్గా కాకుండా హోస్ట్గా రవికి బిగ్బాస్ నుంచి పిలుపు వచ్చిందని తెలిసి అతడి ఫాలోవర్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
మై లవ్ ఈజ్ గాన్, అయినా పోతే పోనీ అంటున్న షణ్ముక్
Anchor Ravi Comments On Shannu Break Up Song: బిగ్బాస్ సీజన్-5 రేపిన చిచ్చు ఈ షో తర్వాత కూడా కొనసాగింది. అప్పటి వరకు ప్రేమికులుగా ఉన్న రెండు జంటల మధ్య బిగ్బాస్ అగాధం సృష్టించింది. అయితే దాన్నుంచి సిరి-శ్రీహాన్ బయటపడితే, దీప్తి సునయన- షణ్నూల మధ్య మాత్రం బ్రేకప్ వ్యవహారం కొనసాగింది. ఈ షో అయిన వెంటనే న్యూ ఇయర్కి ఒకరోజు ముందుగా షణ్నూతో దీప్తి తెగదెంపులు చేసుకుంది. తమ దారులు వేరంటూ 5ఏళ్ల బంధానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా స్టార్మాలో వాలెంటైన్స్ డే స్పెషల్గా బిగ్బాస్ కంటెస్టెంట్లతో కలిసి ఓ ఈవెంట్ ప్లాన్ చేశారు. దీనిలో షణ్నూ అదిరిపోయే పర్ఫామెన్స్తో అలరించాడు. ప్రస్తుతం తను ఉన్న సిచ్చువేషన్కి తగ్గట్లుగానే మై లవ్ ఈజ్ గాన్ అంటూ ఎమోషన్తో డ్యాన్సులేశాడు. అనంతరం హోస్ట్ యాంకర్ రవి మాట్లాడుతూ.. మై లవ్ ఈజ్ గాన్ అంటున్నావ్ నీకు ప్రేమ మీద నమ్మకం ఉందా? ఒక వేళ ప్రేమలో సారీ, థ్యాంక్స్, బాయ్ అని ఎవరికి చెబుతావ్ అంటూ అందరి ముందు ఇరికించేశాడు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. మరి రవి అడిగిన ఈ ప్రశ్నలకు షణ్నూ ఎలాంటి ఆన్సర్లు ఇచ్చాడన్నది తెలియాలంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే. View this post on Instagram A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7) -
బ్రేకప్కు ఎండ్ కార్డ్.. మళ్లీ కలిసిపోయిన సిరి-శ్రీహాన్
Siri Hanmanth And Shrihan Patchup After Bigg Boss: బిగ్బాస్ సీజన్-5 ఎఫెక్ట్ రెండు జంటల మధ్య చిచ్చు రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీప్తి సునయన షణ్ముక్కి బ్రేకప్ చెప్పేసింది. తమ దారులు వేరంటూ 5ఏళ్ల బంధానికి ముగింపు పలికింది. అటు శ్రీహాన్ కూడా సిరి ఫోటోలు డిలీట్ చేయడంతో అతను కూడా దీప్తి సునయనను ఫాలో అయినట్లు అందరూ అనుకున్నారు. దీంతో అతడు కూడా త్వరలోనే సిరికి బ్రేకప్ చెప్తాడంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే దీనంతటిని పటాపంచలు చేస్తూ సిరి-శ్రీహాన్లు కలిసిపోయారు. రీసెంట్గా హైదరాబాద్ వచ్చిన వీరిద్దరు యాంకర్ రవి ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ చేశారు. అనంతరం వాళ్ల ఫ్యామిలీతో కలిసి ఫోటోలు దిగి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను యాంకర్ రవి భార్య నిత్య సక్సేనా తన ఇన్స్టా స్టోరీలో పంచుకుంది. మీ ఇద్దరినీ కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది అంటూ పోస్ట్ చేసింది. దీంతో సిరి-శ్రీహాన్ల బ్రేకప్కు ఎండ్ కార్డ్ పడినట్లయ్యింది. ఏది ఏమైనా ఎన్ని కలతలు వచ్చినా బిగ్బాస్ తర్వాత మీరిద్దరు కలవడం సంతోషంగా ఉందంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దీప్తి సునయన- షణ్నూలు కూడా కలిసిపోతే బావుండు అని కోరుకుంటున్నారు. -
రెండేళ్ల తర్వాత మళ్లీ కలిసిన రవి-శ్రీముఖి.. ఫోటోలు లీక్
Anchor Ravi And Sreemukhi Reunited After 2 Years Pics Goes Viral: యాంకర్ రవి.. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ యాంకర్గా సత్తా చాటుతున్నాడు. 'సమ్థింగ్ స్పెషల్' అనే ప్రోగ్రాం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న రవి ఆ తర్వాత శ్రీముఖితో కలిసి చేసిన పటాస్ షోతో మరింత ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. స్టేజ్పై వీరిద్దరి టైమింగ్, కెమిస్ట్రీకి ఎంతోమంది అభిమానులున్నారు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి ఏమైందేమో కానీ వీరిద్దరి జోడీ మళ్లీ ఎక్కడా కనిపించలేదు. దీంతో విబేధాల కారణంగానే వీరు కలిసి యాంకరింగ్ చేయడం లేదనే వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై ఇంతవరకు ఈ జోడీ స్పందించలేదు. అయితే తాజాగా దాదాపు రెండేళ్ల అనంతరం వీరిద్దరు మళ్లీ కలిసినట్లు తెలుస్తుంది. బిగ్బాస్ మహోత్సవం అనే ఓ షో కోసం వీరిద్దరు కలిసి యాంకరింగ్ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో ఈ విషయం బయటపడింది. దీంతో రవి-శ్రీముఖి మళ్లీ కలిసిపోయారంటూ ప్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
సిరిని ఏమనకండి, అస్సలు బాగోదు: యాంకర్ రవి సీరియస్!
Deepthi Sunaina & Shanmukh 'Breakup': ప్రేమ జంట షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునయన విడిపోవడానికి సిరి హన్మంత్ కారణమంటూ కొందరు ఆమెను విమర్శిస్తున్నారు. తన వల్లే దీప్తి షణ్నును వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పరోక్షంగా స్పందించిన సిరి.. 'ఎవరైనా మీ దగ్గరికి వచ్చి.. మీ జీవితం చాలా కఠినంగా ఉందే అని కామెంట్స్ చేస్తే.. వాటికంటే నేను మరింత స్ట్రాంగ్ అని చిరునవ్వుతో సమాధానం చెప్పండి' అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. అంటే ఎవరెంత ట్రోల్స్ చేసినా తానింకా స్ట్రాంగ్ అవుతూనే ఉంటానని చెప్పకనే చెప్పింది సిరి. అయితే బిగ్బాస్ కంటెస్టెంట్లపై జరిగే ఈ ట్రోల్స్ను ఆపాలంటూ యాంకర్ రవి ఆ మధ్య మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. అందులో రవి మాట్లాడుతూ.. 'ఎవరినీ ఏమనకండి. మరీ ముఖ్యంగా సిరిని ఏమనకండి. మంచిగా చెప్తున్నా, జాగ్రత్త! హెచ్చరికల వైపు కూడా పోవట్లేదు.. దయచేసి నెగెటివ్ కామెంట్లు చేయడం మానేయండి. షణ్ను బాగానే ఉన్నాడు. త్వరలోనే అతడితో మాట్లాడి వీడియో కూడా చేస్తాను' అని చెప్పుకొచ్చాడు. -
యాంకర్ రవి ఇంటికి పోలీసులు.. కారణం ఏంటంటే!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలపై ట్రోల్స్ సర్వసాధారణంగా మారిపోయింది. అయితే వాటిని కొంతమంది లైట్గా తీసుకోని పట్టికోకుండా వదిలేస్తే.. మరికొంతమంది మాత్రం సీరియస్గా తీసుకుంటారు. తమపై అతస్య ప్రచారాలు చేసేవారిపై పోలీసులకు ఫిర్యాలు చేసి, శిక్ష పడేలా చేస్తారు. తాజాగా యాంకర్ రవి కూడా అదే పని చేశాడు. తనపై, తన కుటుంబ సభ్యులపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బిగ్బాస్ షో నుంచి బయటకు వచ్చాక.. తనను, తన కుటుంబ సభ్యులపై ట్రోలింగ్కు గురి చేస్తున్నారని రవి వాపోయాడు. తనపై బ్యాడ్ కామెంట్స్ పెడుతున్న వారిని అస్సలు వదిలి పెట్టనని హెచ్చరించాడు. తన పరువుకు భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్న వారి వివరాలను సేకరించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసిన రవి.. ఈ సారి ఏకంగా పోలీసులను తన ఇంటికి పిలిపించుకొని ఆధారాలు, స్క్రీన్ షాట్స్ అందించాడు. దీనికి సంబంధించిన వీడియోని రవి తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేస్తూ.. మీరు చేయాలనుకున్నది మీరు చేయండి.. నేను చేయాల్సింది చేస్తా. కానీ ఒకరికి ఒక నెగిటివ్ కామెంట్, రిప్లై పెట్టే ముందు 30 సెకన్లు ఆలోచించండి. ఇక సోషల్ మీడియాలో చెత్తను క్లీన్ చేద్ధాం.. సోషల్ మీడియాలో దుర్భాషకు వ్యతిరేకంగా పోరాడుదామనే హ్యాష్ ట్యాగులతో రవి ఈ వీడియోని పోస్ట్ చేశాడు. View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) -
పోలీసులను ఆశ్రయించిన యాంకర్ రవి.. వారిపై ఫిర్యాదు!
బుల్లితెర యాంకర్, బిగ్బాస్-5 కంటెస్టెంట్ రవి పోలీసులను ఆశ్రయించారు. తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి తనపై, తన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కొందరిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తనపై ఎన్ని కామెంట్స్ చేసినా పట్టించుకోని రవి.. కుటుంబ సభ్యులపై కూడా ట్రోల్స్ రావడంతో భరించలేక పోలీసులను సంప్రదించినట్లు తెలుస్తోంది. కాగ, బిగ్బాస్ ఐదో సీజన్లో పాల్గొన్న రవి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. రవి బయటకు రావడం పై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం కుటుంబంతో కలిసి హాలిడేకి వెళ్లిన రవి ఇటీవలే తిరిగి వచ్చాడు. ప్రస్తుతం ఆయన బిగ్బాస్ హౌస్లో ఉన్న టాప్ 5లో శ్రీరామ్కు మద్దతుగా ప్రచారం చేస్తున్నాడు. -
శ్రీరామ్ గెలుపు కోసం రంగంలోకి యాంకర్ రవి!
Bigg Boss 5 Telugu, Anchor Ravi Supports To Sreerama Chandra: బిగ్బాస్ జర్నీ.. 19 మందితో మొదలైన ప్రయాణంలో ఐదుగురు మాత్రమే మిగిలారు. వీళ్ల గురి ఇప్పుడు టైటిల్ మీదే ఉంది. వీరు లక్ష్యాన్ని చేరుకోవడానికి అటు ప్రేక్షకులు మాత్రమే కాదు, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు కూడా సాయం చేస్తున్నారు. అదెలాగంటారా? మరేం లేదు, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు వారికి నచ్చిన ఫైనలిస్టుల్లో ఒకరికి ఓట్లేయమంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా యాంకర్ రవి సింగర్ శ్రీరామ్ కోసం రంగంలోకి దిగాడు. ప్రస్తుతం హౌస్లో ఉన్న ఐదుగురూ డిజర్వింగ్ అంటూనే ఆ టైటిల్ మాత్రం శ్రీరామ్కే దక్కాలంటూ ప్రచారం మొదలు పెట్టాడు. అందులో భాగంగా ఆటోను సైతం నడిపాడు. 'అన్నపూర్ణ స్టూడియో హౌస్, బిగ్బాస్ హౌస్.. బిగ్బాస్ హౌస్..' అని అరుస్తూ ఆటోవాలాగా మారిపోయాడు. 'బిగ్బాస్ సీజన్ 5 గెలిచేది ఒకే ఒక్కరు.. అది శ్రీరామచంద్ర మాత్రమే.. అతడికే ఓటేయండి' అంటూ ఆటో నడిపాడు. ఈ ఆటో వెనకాల శ్రీరామ్ను గెలిపించాలంటూ పోస్టర్ కూడా ఉంది. ఇక ఈ వినూత్న ప్రచారం చూసి అభిమానులు యాంకర్ రవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 'నువ్వు లోపలుండి ఆడు, నీకోసం నేను బయటనుంచి ఆడతా' అన్న మాటను రవి నిజం చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: షణ్ముఖ్లో ఆ విషయం నచ్చేది కాదు, అతడే పక్కా గెలుస్తాడు.. కాజల్) View this post on Instagram A post shared by Sreerama Chandra (@sreeramachandra5) -
ఎందుకింత గలీజ్ అయితున్నరు? పోలీసులకు రవి ఫిర్యాదు
Bigg Boss 5 Telugu, Anchor Ravi: బిగ్బాస్ షోకు వెళ్లి ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్న కొద్దిమందిలో యాంకర్ రవి ఒకరు. టాప్ యాంకర్గా రాణిస్తున్న రవి బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్లో పంతొమ్మిదో కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు. హౌస్లోకి వచ్చీరావడంతోనే అందరినీ కలుపుకుని పోయే ప్రయత్నం చేశాడు. కానీ అది మిగతావాళ్లకు నెగెటివ్గా అనిపించింది. రవి కావాలని అన్నింట్లో తలదూర్చుతున్నాడని, ఇన్ఫ్లూయెన్స్ చేస్తున్నాడంటూ నానామాటలు అన్నారు. మరికొన్ని గొడవల్లో అతడే నిందితుడిగా చీవాట్లు తిన్నాడు. ఫ్యామిలీ ఎపిసోడ్లో మాత్రం రవి భార్య నిత్య, కూతురు వియా రావడంతో అతడిపై ఉన్న నెగెటివిటీ పోయి పాజిటివిటీ పెరిగింది. ఇక రవి టాప్ 3లో ఉంటాడనుకుంటున్న సమయంలో 12 వారంలో ఎలిమినేట్ అయ్యాడు. అయితే బయటకు వచ్చిన రవి తనమీద, తన కుటుంబం మీద జరుగుతున్న ట్రోలింగ్ను చూసి తట్టుకోలేకపోయాడు. 24 గంటల్లో మీకు గంట మాత్రమే చూపిస్తారు, అక్కడేం జరుగుతుందో మీకు తెలీదు, నన్ను నెగెటివ్గా చూపించారు అని మొత్తుకుంటున్నా కొందరు నెటిజన్లు అతడిని విమర్శించడం మానుకోలేదు. తను సిరికి సపోర్ట్ చేయడాన్ని సహించలేకపోయిన కొందరు రవి కూతుర్ని కూడా మధ్యలోకి లాగారు. దీంతో ఓపిక నశించిన రవి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. 'నువ్వు గర్వపడటానికి అది(సిరి) ఇండియాకి పతకం తీసుకురాలేదు. నానా పనులు చేసి టాప్ 5కి వచ్చింది. సిగ్గుందా? ఇంట్లో మా పిల్లలకు టీవీ చూపించాలంటేనే భయమేస్తోంది. నువ్వు ఉన్నప్పుడంతా అవతలోడికి ఎలా వెన్నుపోటు పొడవాలని ఉన్నావు.. బిగ్బాస్ హౌస్ బయటకు వచ్చాక ఈ రవినేనా చూసింది అనేలా నటిస్తున్నావు. ఆ షణ్ముఖ్ని తమ్ముడు అంటావ్.. సిగ్గుందా కొంచెమైనా? నువ్వు ఫ్రెండ్షిప్ పేరుతో ఇలానే చేస్తున్నవా? వియాకి ఇలాంటివి నేర్పిస్తావా? నిన్ను చూసి సిగ్గుపడుతున్నాను' అంటూ ప్రియా రెడ్డి అనే యూజర్ మెసేజ్ చేసింది. దీనిపై రవి కాస్త ఘాటుగానే స్పందించాడు. 'నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి మేడమ్. నా కూతురు గురించి ప్రస్తావించినందుకు మీపై పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నాను' అని చెప్పాడు ఇక మరో యూజర్ పంపిన మెసేజ్లను స్క్రీన్షాట్ తీసి ఎందుకు ఇంత గలీజ్గా అయితున్నరు? అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక నుంచి సోషల్ మీడియాలో వచ్చే ఏ నెగెటివ్ కామెంట్ను సహించనని, అలాగే ఫేక్ అకౌంట్స్తో ఇష్టారీతిన కామెంట్లు చేసేవారిని కూడా సైబర్ క్రైమ్ పోలీసులు వదిలిపెట్టరని హెచ్చరించాడు. ఇప్పటిదాకా భరించింది చాలు.. అడ్డదిడ్డంగా మాట్లాడుతూ అసభ్యంగా కామెంట్లు చేసేవారికి శిక్ష పడేవరకు నేను పోరాడుతూనే ఉంటాను అని రవి స్పష్టం చేశాడు. -
బిగ్బాస్పై యాంకర్ రవి తల్లి షాకింగ్ కామెంట్స్
Anchor Ravi Mother Shocking Comments On Bigg Boss: యాంకర్ రవి.. బిగ్బాస్ హౌస్ నుంచి అనుహ్యాంగా ఎలిమినేట్ అయి బయటకు వచ్చాడు. ఇప్పటికీ రవి ఎలిమినేషన్ షాకింగ్గానే ఉంది. టాప్ 3లో ఉండాల్సిన రవి ఎలిమినేట్ కావడంతో అతని అభిమానులు చేసిన రచ్చ గురించి తెలిసిందే. ఈ క్రమంలో బిగ్బాస్ హౌజ్లోకి రవి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ ఇటీవల ప్రచారం జరిగింది. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. ఈ క్రమంలో రవి తల్లి కూడా కొడుకు ఎలిమినేషన్పై అసహనం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. చదవండి: మంచు లక్ష్మిపై ఆర్జీవీ ప్రశంసలు, మురిసిపోతున్న నటి కాగా రవి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన అనంతరం అతడి ఫ్యాన్స్ డ్యాన్స్, డిజేతో గ్రాండ్గా వెల్కం చెప్పారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన మీడియాతో రవి తల్లి ఉమరాణి ముచ్చటించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రవి బయటకు రావడంపై మీ అభిప్రాయం ఏంటని ఆమెను అడగ్గా.. ప్రెషర్ కుక్కర్ నుంచి బయట పడినట్టు ఉందని చెప్పింది. అంతేగాక రవిని వాళ్లు ఎన్కౌంటర్ చేసినట్టు అనిపిస్తోందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘నా కొడుకు టాప్ 5లో ఉండాల్సిన వాడు ఇలా ఎలిమినేట్ అవడం ఆశ్చర్యంగా ఉంది. అతడు గేమ్ ఆడాడు. పిచ్చి చేష్టలు చేసి రాలేదు. ఊరికే కూర్చోని తినలేదు. రవి గేమర్. తెలివిగా ఆడాడు. చదవండి: ప్రభాస్ ఖాతాలో మరో అరుదైన రికార్డు మీకు ఆట ఆడేవాళ్లు, మంచివాళ్లు అవసరం లేదని అర్థమైంది. కావాలని పిలిచి తీసుకెళ్లారు. కానీ ఆ హోదా ఇవ్వలేదు. మీరు ఇచ్చేది ఏంటి వీళ్లు ఇస్తున్నారు చాలు. అది రెస్పెక్ట్ అంటే’ అంటూ అక్కడే ఉన్న ఫ్యాన్స్ను చూపించింది. అలాగే బిగ్బాస్ హౌజ్లో ఉండే కంటెస్టెంట్ సాధారణ వ్యక్తులు కాదని, వారంతా సెలబ్రెటీలు అంది. ‘సెలబ్రెటీలను పట్టుకు తీసుకెళ్లి మేకల్లా, గొర్రెల్లా ఉంచారు. అదే ఇండస్ట్రీలో ఉంటూ సేమ్ ఇండస్ట్రీ వారిని అవమానిస్తున్నారు. రవి అనే కాదు ప్రతి కంటెస్టెంట్కు ఇది ఫేర్ కాదు. ఇది ఎప్పటికి సరైనది కాదు. ఇప్పటికైన కాన్సెప్ట్ మార్చండి. లేకపోతే బిగ్బాస్ ఎవరూ చూడరు’ అంటూ రవి తల్లి ఉమరాణి బిగ్బాస్పై మండిపడింది. -
నమ్మి రూ.45 లక్షలిచ్చి మోసపోయాను: రవి
Bigg Boss 5 Telugu, Anchor Ravi: స్ట్రాంగ్ కంటెస్టెంట్ యాంకర్ రవి టాప్ 5కి వెళ్లడం ఖాయం అనుకుంటున్న తరుణంలో అతడు ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశాడు. నిజానికి బిగ్బాస్ హౌస్లో రవిని చాలావరకు నెగెటివ్గానే చూపించారు. ఒకరి గురించి ఇంకొకరి దగ్గర మాట్లాడటం, అందరికీ సలహాలు ఇవ్వడం లాంటి చేష్టలను నెగెటివ్గానే చూపించాడు బిగ్బాస్. దీంతో అతడికి గుంటనక్క, ఇన్ఫ్లూయెన్సర్, నారదుడు అని రకరకాల పేర్లు పెట్టారు. అయినప్పటికీ రవి తన సహనం కోల్పోకుండానే మాట్లాడుతూ గేమ్ ఆడాడు. లహరి విషయంలోనూ అతడి ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసుకున్నాడు. హౌస్మేట్స్ అతడిని నమ్మాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించే స్థితికి చేరుకున్నాడు. అయితే ఫ్యామిలీ ఎపిసోడ్లో భార్య నిత్య, కూతురు వియా రావడంతో అతడి మీదున్న నెగెటివిటీ ఒక్కసారిగా హుష్కాకి అయింది. రవి మీద పాజిటివిటీ పెరిగింది. కానీ అదే వారం బిగ్బాస్ అతడికి హౌస్లో ఆఖరి వారం చేసి పంపించేశాడు. బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలతో బిజీగా మారాడీ యాంకర్. తాజాగా అతడి ఇంటర్వ్యూ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 'నేను నచ్చలేకపోతే నన్ను తిట్టండి, ఏమైనా అనండి.. కానీ నా ఫ్యామిలీ జోలికి రావద్దు. సోషల్ మీడియాలో చెత్త నా మెసేజ్లు పెడుతున్నారు. ఇలాగైతే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తాను' 'గతంలో నాకో నమ్మకద్రోహం జరిగింది. అన్నా బిజినెస్ పెట్టాలి, మా పరిస్థితి అంత బాగోలేదు అని ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. అతడు రెండు సంవత్సరాల పాటు నాతోనే ఉన్నాడు. అతడికి మందు అలవాటు లేదు, రోజూ గుడికి వెళ్తాడు, నమ్మకస్తుడు.. అందుకని ఏం ఆలోచించకుండా వెంటనే రూ.45 లక్షలు ఇచ్చాను. 20 రోజుల్లో తిరిగిస్తా అన్నవాడు ఇప్పటికీ ఇవ్వలేదు. నా వల్ల ఒకడు బాగుడపతాడు కదా అని లెక్కపత్రం కూడా తీసుకోకుండా డబ్బిచ్చాను, కానీ అతడు మోసం చేశాడు. అది చాలా ఎక్కువ మొత్తం కావడంతో నా భార్య ఉపవాసాలు, పూజలు చేసింది. ఆ డబ్బు తిరిగి రావాలని ప్రతిరోజూ దేవుడికి మొక్కుకున్నాను' అని చెప్పుకొచ్చాడు రవి. -
ఆ కంటెస్టెంట్ జోలికొస్తే బాగోదు: లోబో వార్నింగ్
Bigg Boss Telugu 5, Lobo Supports Shannu: లోబో.. బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్లో ఎంటర్టైనర్ ఆఫ్ హౌస్ బిరుదు అందుకున్నాడీ హైదరాబాదీ. అయితే ఎంటర్టైన్మెంట్ ఒకటే సరిపోదని గేమ్ ఆడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు ప్రేక్షకులు. అయితే బిగ్బాస్ మాత్రం లోబోకు ఒక ఛాన్సిద్దామని సీక్రెట్ రూమ్కు పంపించారు. కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా గేమ్లో పెద్దగా ఛేంజ్ లేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. ఎనిమిదవ వారం అతడిని ఎలిమినేట్ చేశారు. హౌస్లో ఉన్నన్ని రోజులు రవి కోసం గేమ్ ఆడాడని, అతడికి కుడిభుజంలా వ్యవహరించాడని లోబో గురించి అంతా అనుకున్నారు. బయటకు వచ్చాక కూడా తన స్నేహితుడు రవికి ఓట్లేయండంటూ అతడికి సపోర్ట్ చేస్తూ వచ్చాడు. కానీ అనూహ్యంగా రవి కూడా షోలో నుంచి నిష్క్రమించడంతో ఇప్పుడు లోబో మరో కంటెస్టెంట్కు మద్దతు ప్రకటించాడు. యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్కు ఓటేయమని అభ్యర్థిస్తున్నాడు. అతడు ఈ వారం ఓటింగ్లో లేకపోయినా ఓట్లేయండంటూ వీడియో రిలీజ్ చేశాడు. View this post on Instagram A post shared by Lobo (@lobo__619) హౌస్లో ఉన్న అందరూ తనకు ఫ్రెండ్సే అని, కానీ షణ్ను అంటే కాస్త ఎక్కువ లవ్ అని చెప్పుకొచ్చాడు. ఎవరు ఎంత బాగా ఆడుతున్నారు? ఎవరు బాగా ఆడట్లేదు? అనేది పక్కనపెడితే షణ్ను తన ఫ్రెండ్ అని, అతడి జోలికొస్తే బాగోదని హెచ్చరించాడు. షణ్నును తోపుగా అభివర్ణించిన లోబో అతడికి సపోర్ట్ చేసి సూపర్ స్టార్ను చేద్దామని పిలుపునిచ్చాడు. -
బిగ్బాస్లోకి యాంకర్ రవి రీఎంట్రీ!.. ఈ సీజన్లో ఇదే తొలిసారి
Is Anchor Ravi Re Entry In Bigg Boss House: బిగ్బాస్ సీజన్-5లో అన్ఫెయిర్ ఎలిమినేషన్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు యాంకర్ రవి. టాప్-5లో కశ్చితంగా ఉంటాడనుకున్న రవి అనూహ్యంగా ఎలిమినేట్ కావడం ఆయన ఫ్యాన్స్కే కాకుండా, నెటిజన్లకు సైతం షాకిచ్చింది. బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్లో పాల్గొన్నవారిలో రవి అందరికంటే ఎక్కువ పాపులారిటీ ఉన్నవాడు. గేమ్ పరంగానూ రవికి మంచి మార్కులే పడ్డాయి. అయితే అనూహ్యంగా 12వ వారంలోనే ఎలిమినేట్ అయి బయటకు రావడాన్ని రవి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. చదవండి: Bigg Boss Telugu 5: యాంకర్ రవి ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఇవేనా? కావాలనే రవినే ఎలిమినేట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల లెక్కలు చూపించాలంటూ స్టార్మా పై ఒత్తిడి పెంచుతున్నారు రవి ఫాలోవర్స్. ఈ నేపథ్యంలో రవిని మళ్లీ బిగ్బాస్లోకి పంపాలంటూ డిమాండ్స్ వినిపిస్తున్నాయి. దీనిపై స్టార్మా కూడా ఆలోచనలో పడ్డట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ వీకెండ్లో రవిని మళ్లీ బిగ్బాస్లోకి పంపనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఫినాలే దగ్గరపడుతున్న సమయంలో రీఎంట్రీ ఏంటంటూ మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటివరకు ఈ సీజన్లో ఇప్పటివరకు రీ ఎంట్రీ, వైల్డ్ కార్డ్ అన్న ముచ్చటే లేదు. దీంతో రీఎంట్రీ ద్వారా యాంకర్ రవిని మరోసారి హౌస్లోకి పంపేందుకు షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందన్నది తెలియాలంటే వీకెండ్ ఎపిసోడ్ వరకు వేచిచూడాల్సిందే. చదవండి: Bigg Boss Telugu 5: సిరి- షణ్నూల రిలేషన్ గురించి రవి షాకింగ్ కామెంట్స్ -
నా బిడ్డను కూడా వదల్లేదు, ఇంత దారుణమా?: రవి ఫైర్
బిగ్బాస్ కంటెస్టెంట్, యాంకర్ రవి షో నుంచి బయటకు వచ్చిన తర్వాత తొలిసారి ఇన్స్టాగ్రామ్ లైవ్లో అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా బిగ్బాస్ ఇంటి విశేషాలను పంచుకోవడంతో పాటు తనపై వచ్చిన నెగెటివిటీపై కూడా స్పందించాడు. 'నేను వెళ్లేముందే చెప్పాను.. నన్ను ఆడుకోండి, వాడుకోండి, ట్రోల్ చేయండి, మీ ఇష్టమని చెప్పాను. కానీ చాలామంది నా ఫ్యామిలీని, నిత్యను ఇన్వాల్వ్ చేశారు. ఆఖరికి నా బిడ్డను కూడా వదల్లేదు. అంటే బయటొక బ్యాచ్ ఉంటుంది.. వాళ్లకు డబ్బులిస్తే వాళ్ల ఫ్యామిలీ గురించి కూడా చెత్తగా మాట్లాడతారు.' 'రెండు వేల రూపాయలిస్తామంటే వాళ్ల తల్లిదండ్రుల గురించి కూడా చెడ్డగా రాసేవాళ్లు కొందరున్నారు. ఇంత దారుణమా? డబ్బు కోసం ఇంత నీచాతినీచంగా ఈ లెవల్లో దిగిపోతున్నమా? అందరికీ ఒక్కటే చెప్తున్నా.. లోపల జరిగేది ఒకటి, బయటకు వచ్చేది ఇంకొకటి. బయట డబ్బు తీసుకుని గేమ్ ఆడుతున్నవారు లోపలి గేమ్ను డామినేట్ చేస్తున్నారు. 24 గంటల్లో ఒకే గంట మాత్రమే చూపిస్తున్నారు. బిగ్బాస్ అనేది మైండ్ గేమ్.. వాళ్లూవీళ్లూ చెప్పేది కాకుండా మీకు ఎవరు బాగా ఆడుతున్నారనిపిస్తే వారికే ఓటేయండి' అని చెప్పుకొచ్చాడు రవి. -
యాంకర్ రవి సహా బిగ్బాస్లో మోస్ట్ షాకింగ్ ఎలిమినేషన్స్ ఇవే..
Bigg Boss Telugu shocking Eliminations: బిగ్బాస్ హౌస్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన ఎలిమినేషన్స్లో మోస్ట్ షాకింగ్ ఎలిమినేషన్ మాత్రం యాంకర్ రవిదే అని చెప్పొచ్చు. మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా రవి ఎలిమినేట్ కావడం ప్రేక్షకులు ఎవరూ ఊహించలేదు. ఇది మోస్ట్ అన్ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ నెటిజన్లు రవికి సపోర్ట్గా నిలిచారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన బిగ్బాస్ తెలుగు సీజన్స్లతో మోస్ట్ షాకింగ్ ఎలిమినేషన్స్ను ఏంటో ఓసారి చూద్దాం. సీజన్-1 బిగ్బాస్ సీజన్-1లో నటుడు ప్రిన్సీ ఎలిమినేషన్ అందరికీ షాకిచ్చింది. టైటిల్ రేసులో ఉంటాడనుకున్న ప్రిన్సీ ఊహించని విధంగా ఎలిమినేట్ కావడం అప్పట్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. సీజన్-2 బుల్లితెరపై పలు టీవీ షోలతో అలరించే యాంకర్ శ్యామల బిగ్బాస్ హౌస్ నుంచి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది. ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న శ్యామల అంత త్వరగా ఎలిమేట్ కావడం షాకింగ్గా అనిపించింది. దీంతో ఇది అన్ఫెయిర్ అంటూ ఫ్యాన్స్ బాగా ఓట్లు వేసి రీఎంట్రీతో మరోసారి హౌస్లోకి పంపించారు. సీజన్-3 అప్పటివరకు పెద్దగా గుర్తింపు లేని అలీ రెజా బిగ్బాస్ ఎంట్రీతో పాపులర్ అయ్యాడు. అర్జున్రెడ్డిగా గుర్తింపు పొందిన అలీ టాప్-5లో ఉంటాడని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. సీజన్-4 బిగ్బాస్ సీజన్-4లో యాంకర్ దేవి నాగవల్లి ఎలిమినేషన్ అందరినీ కంటతడి పెట్టించింది. హౌస్లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉన్న దేవీ మూడో వారమే ఎలిమినేట్ అవ్వడం ప్రేక్షకులను షాకింగ్కి గురిచేసింది. దీంతో అన్ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో దేవికి మద్దతుగా ఎంతోమంది నిలిచిన సంగతి తెలిసిందే. సీజన్-5 బిగ్బాస్ సీజన్-5లో యాంకర్ రవి ఎంట్రీ నుంచే ఆయన టాప్-5అని అంతా భావించారు. సెపరేట్ ఫ్యాన్ బేస్, ఆటతీరుతో వాడే స్ట్రాటజీస్తో మరింత స్ట్రాంగ్ కంటెస్టెంట్గా గుర్తింపు పొందాడు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ అనూహ్యంగా హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఇప్పటికీ రవి ఎలిమినేషన్ను ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.మోస్ట్ డిసర్వింగ్ కంటెస్టెంట్ను బయటకు పంపించారంటూ ఫైర్ అవుతున్నారు. ఇది మోస్ట్ అన్ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. చదవండి: షణ్నూని ఇష్టపడుతున్నట్లు సిరి నాతో చెప్పింది: యాంకర్ రవి కొత్త ఇంట్లోకి యాంకర్ శ్యామల గృహప్రవేశం.. వీడియో వైరల్ Bigg Boss Telugu 5: అలా అనుకోవడం వల్లే యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడా? -
రవి ఎలిమినేషన్పై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
Bigg Boss Telugu 5, MLA Raja Singh Comments On Bigg Boss Show: బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న బిగ్బాస్ షోను బ్యాన్ చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో బిగ్బాస్ గేమ్ షోను బ్యాన్ చేయాలని, అసలు షోలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. ఈ షో ద్వారా ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని నిర్వాహకులను ప్రశ్నించారు. రవిని ఎలిమినేట్ చేయడం వెనక ఏదో కుట్ర దాగి ఉందని ఆయన అనుమానించారు. తెలంగాణ వ్యక్తిని బయటకు పంపించి మరోసారి కొట్లాట పెట్టడానికి పథకం రచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు బిగ్బాస్తో పాటు హిందీ బిగ్బాస్ను సైతం బ్యాన్ చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు లేఖ రాస్తానని తెలిపారు. కాగా బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్లో పాల్గొన్నవారిలో రవి అందరికంటే ఎక్కువ పాపులారిటీ ఉన్నవాడు. అతడు ఎంట్రీ ఇచ్చినప్పుడే టాప్ 5 పక్కా అని అంతా డిసైడ్ అయ్యారు. కానీ అనూహ్యంగా 12వ వారంలోనే అతడిని ఎలిమినేట్ చేసి పంపించేశారు. తనకంటే తక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్లను హౌస్లో ఉంచి రవిని అన్యాయంగా ఆటలో నుంచి తొలగించారు. దీన్ని రవి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అన్ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ సోషల్ మీడియాలో తమ ఆవేశం వెల్లగక్కుతున్నారు. ఎవరినో సేవ్ చేయడం కోసం రవిని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
షణ్నూని ఇష్టపడుతున్నట్లు సిరి నాతో చెప్పింది: యాంకర్ రవి
Bigg Boss Buzzz: Anchor Ravi Shocking Comments on Shannu and Siri Relationship: బిగ్బాస్ సీజన్-5లో యాంకర్ రవి ఎలిమినేషన్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. టాప్ -5లో ఖశ్చితంగా ఉంటాడనుకున్న రవి అనూహ్య రీతిలో 12వ వారమే హౌస్ నుంచి బయటకు వచ్చాడు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి కూడా రవి ఎలిమినేట్ కావడాన్ని నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ బిగ్బాస్ను తిట్టిపోస్తున్నారు. రవికి మద్దతిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రవి.. తాను ఎలిమినేట్ అవుతానని అస్సలు ఊహించలేదని, ఇప్పటికీ ఇది షాకింగ్గానే ఉందని తెలిపాడు. బిగ్బాస్ హౌస్లో చాలామంది తనను ‘గుంటనక్క’ అని ఏడిపించినా తానేమీ బాధపడలేదని, దాని గురించి పట్టించుకోలేదని తెలిపాడు. ఇక నటరాజ్ మాస్టర్ అయితే హౌస్లోకి ఏదో ఇంటెన్షన్తోనే లోపలికి వచ్చాడని అభిప్రాయపడ్డారు. తనకు తెలిసి ఎవరినీ ఇన్ఫ్లూయెన్స్ చేయలేదు అని, ఒకవేళ తన మాటలకు వాళ్లు ఇన్ఫ్లూయెన్స్ అయ్యారేమో అంటూ కామెంట్ చేశాడు. ఇక షణ్నూ-సిరిల రిలేషన్ గురించి మాట్లాడుతూ... 'షణ్ముఖ్ దీప్తిని ఎంత లవ్ చేస్తాడో.. సిరి చోటూని ఎంత లవ్ చేస్తుందో ఈ ఇద్దరికీ తెలుసు.. కానీ హౌస్లో సిరి షణ్నూని ఇష్టపడుతుంది. ఈ విషయాన్ని స్వయంగా సిరినే చెప్పింది. అన్నా...ఐ లైక్ హిమ్ అని సిరి నాతో ఓపెన్అప్ అయ్యింది' అంటూ వివరించాడు. చదవండి: యాంకర్ రవి ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఇవేనా? -
Bigg Boss Telugu 5: అలా అనుకోవడం వల్లే యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడా?
Bigg Boss 5 Telugu Ravi Elimination Reason: బిగ్బాస్ తెలుగు సీజన్-5లో 12వ వారం ఎలిమినేషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది. నామినేషన్లలో ఉన్న మిగతా కంటెస్టంట్లతో పోలిస్తే రవికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయినప్పటికీ వారికంటే రవి బయటకు రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ రవి ఫ్యాన్స్ సహా నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ రవి ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఏంటి? నిజంగానే మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే తక్కువ ఓట్లు వచ్చాయా? లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అని ఓసారి పరిశీలిస్తే.. ఈ సీజన్లో మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే యాంకర్ రవికే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు. ఎన్నో ఏళ్లుగా బుల్లితెరపై మాస్ మహారాజాగా ఎదిగిన రవి గ్రాఫ్ బిగ్బాస్ హౌస్లో మొదట్లో బాగానే ఉండేది. అయితే లహరి-ప్రియ ఎపిసోడ్లో అమ్మ మీద ఒట్టు అంటూ అబద్దాలు చెప్పడం రవికి అతిపెద్ద మైనస్ అని చెప్పొచ్చు. అప్పటివరకు గుంటనక్క, ఇన్ఫులెన్స్ స్టార్ అని ట్యాగ్ లైన్స్ వచ్చినా ఈ ఒక్క ఎపిసోడ్తో రవి గ్రాఫ్ అమాంతం పడిపోయింది. ఇక శ్వేత ఎలిమినేషన్కి కూడా పరోక్షంగా రవి కారణం అవ్వడంతో మరింత నెగిటివ్ అయ్యాడు. అయినప్పటికీ అతనికి ఉన్న ఫ్యాన్ బేస్తో నామినేట్ అయిన ప్రతీసారి సేవ్ అవుతూ వచ్చాడు. ఈసారి కూడా నామినేషన్స్ నుంచి ఈజీగా గట్టెక్కేస్తాడని అంతా భావించారు. టాప్-5కి రవి చాలా సులువుగా చేరుకుంటాడని అనుకున్నారంతా. దీంతో రవికి ఎలాగైనా భారీ ఓట్లు పడతాయని భావించి ఫ్యాన్ బేస్ తక్కువ ఉన్నవారిని సేవ్ చేయడం కోసం వారికి ఓట్లు వేశారు. ఇది రవికి చాలా పెద్ద మైనస్గా మారింది. ఎలాగో ఓట్లు పడతాయి అన్న ఉద్దేశంతో మిగతా వారికి ఓట్లు వేయడం కూడా రవి ఎలిమినేషన్కు ప్రధాన కారణం అయి ఉండొచ్చని టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా టాప్-5లో ఉండాల్సిన కంటెస్టెంట్ ఇలా అనూహ్యంగా బయటకు రావడం రవి బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. View this post on Instagram A post shared by Big Boss Telugu Season 5 (@bigbosstelugu5.adda) -
రవి పారితోషికం ఎంతో తెలుసా? కోటి కంటే కొంచెం తక్కువంతే!
Bigg Boss 5 Telugu, Anchor Ravi Remuneraion: బిగ్బాస్ షో.. ఇక్కడ ఏమైనా జరగొచ్చు. ఊహించిన కంటెస్టెంట్లు సేవ్ అవ్వచ్చు.. ఊహించని కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవనూ వచ్చు. ఎందుకంటే ఇది బిగ్బాస్. ఎవరి అంచనాలకు అందని రియాలిటీ షో. 12వ వారంలో యాంకర్ రవి ఎలిమినేషన్ ప్రేక్షక లోకాన్ని షాక్కు గురి చేసింది. టాప్ 5లో కాదు కాదు.. ఏకంగా టాప్ 3లో ఉంటాడనుకున్న అతడు సడన్గా ఎలిమినేట్ అవడాన్ని నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ బిగ్బాస్ను తిట్టిపోస్తున్నారు. కాజల్, సిరి, ప్రియాంక కంటే రవికే తక్కువ ఓట్లు వచ్చాయంటే నమ్మలేకపోతున్నామని విచారం వ్యక్తం చేస్తున్నారు. అతడు బిగ్బాస్ హౌస్లో కొనసాగాలని కోరుతూ కామెంట్లు చేస్తున్నారు. అయితే అతడిని బిగ్బాస్ పంపించివేయడానికి భారీ రెమ్యునరేషన్ కూడా ఒక కారణమన్న వాదన తెరపైకి వచ్చింది. బిగ్బాస్ కంటెస్టెంట్లలో రవికి అత్యధిక పారితోషికం చెల్లిస్తున్నారట! వారానికి రూ. 7 లక్షల నుంచి 8 లక్షల మధ్యలో ఇస్తున్నారట! ఈ లెక్కన రవి 12 వారాలకే 90 లక్షల రూపాయలు వెనకేసినట్లు తెలుస్తోంది. ఇది బిగ్బాస్ విజేతకు అందించే 50 లక్షల ప్రైజ్మనీ కన్నా ఎక్కువ కావడం గమనార్హం! బిగ్బాస్ షో ముగింపుకు వచ్చినందున రవికి అంత మొత్తంలో డబ్బులు వెచ్చించి హౌస్లో కొనసాగించడం అవసరం లేదని బిగ్బాస్ నిర్వాహకులు భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ఒక లేడీ కంటెస్టెంట్ను ఫినాలేకు పంపించాలని కూడా బలంగా ఫిక్సయినట్లు రవి ఎలిమినేషన్తో చెప్పకనే చెప్పారు. -
రూ.50 లక్షలు గెలిస్తే అమ్మనవుతా: ట్రాన్స్జెండర్ ప్రియాంక
Bigg Boss Telugu 5, Ravi Eliminated From BB Show: ఇప్పటివరకు బిగ్బాస్ షో విజేతలకు రూ.50 లక్షల ప్రైజ్మనీ మాత్రమే ఇచ్చేవారు. కానీ ఈ సీజన్లో మాత్రం దీనికి అదనంగా ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైన భూమిని కూడా కానుకగా అందిస్తున్నారు. ఈ విషయాన్ని మన్మథుడు నాగార్జున అధికారికంగా ప్రకటించాడు. బిగ్బాస్ విన్నర్ రూ.50 లక్షలతో పాటు, షాద్నగర్లోని సువర్ణ కుటీర్లో రూ.25 లక్షల విలువైన 300 చదరపు గజాల స్థలాన్ని సైతం సొంతం చేసుకోనున్నట్లు వెల్లడించాడు. ఈ ప్రైజ్మనీ గెలిస్తే ఆ డబ్బుతో ఎవరేం చేస్తారో చెప్పాలని హౌస్మేట్స్ను ఆదేశించాడు నాగ్. మొదటగా ప్రియాంక మాట్లాడుతూ.. 'నేను రూ.50 లక్షలు గెలుచుకుంటే తల్లిదండ్రుల కోసం ఇల్లు కొనిస్తా. అలాగే నాకు చిన్నప్పటి నుంచి అమ్మ అని పిలిపించుకోవాలని కోరికగా ఉండేది. కానీ దత్తత తీసుకోవాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలన్నారు. కాబట్టి ఈ ప్రైజ్మనీ గెలిస్తే ఒక అమ్మాయిని దత్తత తీసుకుంటా' అని చెప్పుకొచ్చింది. శ్రీరామ్ మాట్లాడుతూ.. 'తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గరవ్వడానికే షోకు వచ్చాను. పెద్ద ఇల్లు కట్టి పేరెంట్స్తో కలిసి ఉండాలన్నది నా కోరిక' అని చెప్పాడు. 'కొంత వియా చదువు కోసం పొదుపు చేస్తా. నిర్మాణసంస్థ నెలకొల్పాన్న కోరికను నెరవేర్చుకుంటా' అని చెప్పాడు రవి. కాజల్ తనకున్న 30 లక్షల రూపాయల అప్పు తీర్చుకుంటానంది. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టాలనుకుంటున్నానని చెప్పింది. సువర్ణ కుటీర్లో ఇల్లు కట్టుకుంటానంది. సన్నీ వచ్చిందంతా అమ్మకిచ్చేస్తానని, కొంత డబ్బు తీసుకుని సెలూన్ పెడతానన్నాడు. మానస్ తనకు వచ్చిన డబ్బుతో నిర్మాణ సంస్థను నెలకొల్పి కొత్తవాళ్లను ఎంకరేజ్ చేస్తానని చెప్పాడు. షణ్ముఖ్.. ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచుతున్న అమ్మకు 25 లక్షలు ఇస్తానన్నాడు. తనకెన్నో సార్లు డబ్బు సాయం చేసి ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చిన దీప్తి సునయనకు మరో 25 లక్షలిస్తానన్నాడు. సిరి శ్రీహాన్ పేరెంట్స్కు ఉన్న 10 లక్షల అప్పు తీర్చేసి కొంత అమ్మకిస్తానని, అలాగే అంధులకు సాయం చేస్తానని పేర్కొంది. తర్వాత షణ్ముఖ్, ప్రియాంక సేఫ్ అవగా రవి, కాజల్ మాత్రమే నామినేషన్స్లో మిగిలారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ను నువ్వు వాడుకుంటావా? లేదా వీళ్లలో ఒకరిని సేవ్ చేస్తావా? అని నాగ్ సన్నీని అడిగాడు. ఆ పాస్ తనకు రావడం కోసం ఎంతగానో ఫైట్ చేసిన కాజల్కు వాడాడు. కానీ ఓటింగ్లో రవి చివరి స్థానంలో ఉండటంతో అతడు ఎలిమినేట్ అయ్యాడని నాగ్ ప్రకటించాడు. దీంతో ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడి ఉపయోగం లేకపోయింది. రవి కోసం వాడి ఉంటే కనీసం అతడైనా సేవ్ అయ్యేవాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న రవి ఎలిమినేట్ అవడంతో ఏడుపాపుకోలేకపోయిన సన్నీ తన దగ్గరున్న గిఫ్ట్ వోచర్ను అతడికి బహుమతిగా ఇచ్చాడు. సన్నీ మాత్రమే కాదు, ఇంటిసభ్యులెవరూ రవి ఎలిమినేషన్ను జీర్ణించుకోలేకపోయారు. అందరూ కన్నీటితో భారంగా ఆయనకు వీడ్కోలు పలికారు. స్టేజీ మీదకు వచ్చిన రవి చాలా తొందరగా బయటకు వచ్చేశానని బాధపడ్డాడు. అనంతరం ఈ బిగ్బాస్ జర్నీలో ఎవరు పాస్, ఎవరు ఫెయిల్? అనే గేమ్ ఆడాడు. షణ్ను పాస్ అయ్యాడని చెప్పడంతో అతడు లేచి ఏదైనా బాధపెట్టి ఉంటే క్షమించమని కోరాడు. లేట్గా కనెక్ట్ అయిన చందూలో అన్నీ పాజిటివ్సే ఉన్నాయన్నాడు రవి. నువ్వు లోపలి నుంచి ఆడు, నేను బయట నుంచి ఆడతానని చెప్తూ అతడిని పాస్ చేశాడు. ఫ్రెండ్ కోసం ఏదైనా చేస్తాడు, తోపు అంటూ సన్నీని పాస్ చేశాడు. ప్రియాంక, సిరి, కాజల్కు ఫెయిల్ ట్యాగ్ ఇచ్చాడు. టాప్ 5లోకి రావాలని సిరిని ఎంకరేజ్ చేశాడు. మానస్ను చూసి చాలా ఇన్స్పైర్ అయ్యానంటూనే అతడికి ఫెయిల్ ట్యాగ్ ఇచ్చాడు. షణ్ను ఎంతకూ కన్నీళ్లను ఆపుకోలేకపోవడంతో రవి.. నేనెళ్తేనే నువ్వు గెలుస్తావంటూ ఆఖరి మాటగా చెప్పి వీడ్కోలు తీసుకున్నాడు. -
లెక్క తేలాల్సిందే, ఓట్లు చూపించండి: రవి ఫ్యాన్స్ డిమాండ్
Bigg Boss 5 Telugu, Anchor Ravi Eliminated!: 'ఈ వారం యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడు' సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఎలాగో సండే ఎపిసోడ్ షూటింగ్ శనివారమే పూర్తవుతుండటంతో ఎవరు ఎలిమినేట్ అయ్యారనే విషయం ఒకరోజు ముందుగానే లీకవుతూ వస్తోంది. చివరకు అదే నిజమవుతోంది కూడా! ఈసారి రవి బిగ్బాస్ హౌస్ను వీడనున్నాడన్న వార్త బయటకు రాగా అతడి ఫ్యాన్స్ షో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాప్ 3లో ఉంటాడనుకున్న కంటెస్టెంట్ను కనీసం టాప్ 5లోకి కూడా రాకముందే ఎలా ఎలిమినేట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రియాంక సింగ్, కాజల్, సిరి కంటే కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రవికే తక్కువ ఓట్లు ఎలా వస్తాయని నిలదీస్తున్నారు. నిజంగా ఆ ముగ్గురి కంటే రవికి తక్కువ ఓట్లు వచ్చినట్లైతే ఆ ఓట్ల లెక్క చూపించమని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రవిని కావాలని ఎలిమినేట్ చేశారన్న విషయాన్ని అంగీకరించమని సవాలు విసురుతున్నారు. లేడీ కంటెస్టెంట్లను కాపాడటం కోసం రవిని అన్యాయంగా బయటకు పంపించేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరికంటే ఎక్కువ పాపులారిటీ ఉన్న రవి ఇంత సడన్గా ఎలా ఎలిమినేట్ అవడం వెనక ఏదో కుట్ర దాగి ఉందని అనుమానిస్తున్నారు. రవి లేని బిగ్బాస్ షోను తాము చూడలేమంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై బిగ్బాస్ నిర్వాహకులు ఏమని స్పందిస్తారో చూడాలి! -
శ్రీరామ్కు దగ్గరైతే ఎలిమినేషన్ గండం తప్పదా!
Bigg Boss Telugu 5: తన గాత్రంతో ఇండియన్ ఐడల్ షోనే కాదు కోట్లాది మంది ప్రేక్షకుల మనసులనూ గెలిచాడు సింగర్ శ్రీరామచంద్ర. అయితే ఆయనకు టాలీవుడ్లో కన్నా బాలీవుడ్లో ఎక్కువ పాపులారిటీ ఉంది. తను పుట్టిపెరిగింది తెలుగు నేలపైనే కాబట్టి తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలని బిగ్బాస్ షోను ఎంచుకున్నాడు. ఆటతో, మాటలతో, పాటలతో ఆడియన్స్ను మెప్పిస్తూ షోలో కొనసాగుతున్నాడు. అయితే ఎలిమినేషన్ వస్తుందంటే చాలు తను నామినేషన్స్లో ఉన్నా లేకపోయినా శ్రీరామ్ భయంతో వణికిపోతున్నాడు. ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.. శ్రీరామ్ సరదా మనిషి. కానీ అందరితో అంత ఈజీగా కలిసిపోలేడు. మనసు విప్పి మాట్లాడటానికి అతడికి కొంత టైం పడుతుంది. కానీ ఒక్కసారి క్లోజ్ అయితే మాత్రం వాళ్ల కోసం ఎంతకైనా తెగిస్తాడు, ఎంతవరకైనా పోరాడతాడు. విచిత్రంగా శ్రీరామ్కు దగ్గరవుతున్న వాళ్లందరూ ఎలిమినేట్ అవుతున్నారు. దీంతో తనకంటూ ఒకరున్నారనుకులోపే వాళ్లు హౌస్ను వీడటంతో ఒంటరివాడవుతున్నాడు. మొదట్లో హమీదాతో శ్రీరామ్ ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు. ఆమెకు ఏ కష్టం వచ్చినా చిటికెలో ఆమె ముందుండేవాడు. కన్నీళ్లు పెట్టుకుంటే చేరదీసి ఓదార్చేవాడు. ఆమెను ఫ్రెండ్ కన్నా ఎక్కువ అనుకున్న అతడికి బిగ్బాగ్ షాకిస్తూ హమీదాను ఐదో వారంలో ఎలిమినేట్ చేశారు. అప్పటి నుంచి శ్రీరామ్ బాగా డల్ అయ్యాడు. ఆ బాధ నుంచి కోలుకుంటూ విశ్వకు దగ్గరవగా అతడిని కూడా పంపించేశారు. ఆ తర్వాత యానీ మాస్టర్కు సపోర్ట్ చేస్తూ ఆమెతో అప్పుడప్పుడే క్లోజ్ అవుతుండగా తనను కూడా ఎలిమినేట్ చేశారు. నాకు దగ్గరవుతున్నారనుకునేలోపు దూరమవుతున్నారంటూ ఎంతగానో బాధపడిపోయాడు శ్రీరామ్. ఇప్పుడు హౌస్లో ఉన్నవాళ్లలో శ్రీరామ్కు నచ్చిన వ్యక్తి, మనసుకు దగ్గరైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది యాంకర్ రవియే! మొన్నటి కెప్టెన్సీ టాస్క్లోనూ రవికి ఇంటిసభ్యులెవరూ సపోర్ట్ చేయకపోయినా శ్రీరామ్ ఒక్కడే అతడికే ఓటేశాడు. దీన్ని బట్టి శ్రీరామ్కు రవి అంటే ఎంత అభిమానమో ఊహించవచ్చు. అలాంటిది రవి కూడా ఎలిమినేట్ అయిపోతే హౌస్లో శ్రీరామ్ నిజంగానే ఒంటరివాడవడం ఖాయం. ప్రస్తుతం హౌస్లో ఉన్న సన్నీ, మానస్, కాజల్, ప్రియాంక ఒక గ్రూపు కాగా షణ్ముఖ్, సిరి మరో గ్రూపు. మరి శ్రీరామ్ ఈ రెండింటిలో ఏదో ఒక గ్రూపులో చేరతాడా? లేదా ఒంటరిగా గేమ్ ఆడతాడా? అన్నది చూడాలి! -
ఎలిమినేషన్ను మార్చే అధికారం సన్నీ చేతుల్లో!
Bigg Boss Telugu 5 Promo: సండే అంటే ఫన్డే మాత్రమే కాదు ఎలిమినేషన్డే కూడా! ఈ వారం నామినేషన్స్లో రవి, సన్నీ, శ్రీరామ్, ప్రియాంక, షణ్ముఖ్, కాజల్, సిరి ఉన్నారు. వీరిలో సిరి, శ్రీరామ్, సన్నీ నిన్నటి ఎపిసోడ్లోనే సేవ్ అయ్యారు. మిగతావారిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారన్నది నేడు అధికారికంగా వెల్లడి కానుంది. ఈ ఎలిమినేషన్ ఘట్టంపై తాజాగా ప్రోమో వదిలాడు బిగ్బాస్. రవి, కాజల్ ఇద్దరూ ఎలిమినేషన్ అంచుల్లో ఉన్నట్లు చూపించారు. వీరిలో ఒకరిని సేవ్ చేసే అవకాశం మీలో ఒక్కరికే ఉందని నాగ్ వెల్లడించాడు. దీంతో సన్నీ తనకు దక్కిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ను గార్డెన్ ఏరియాలోకి పట్టుకొచ్చాడు. మరి సన్నీ ఆ పాస్ను ఉపయోగించి ఆ ఇద్దరిలో ఎవరినైనా సేవ్ చేశాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం మేరకైతే సన్నీ ఆ పాస్ను వాడలేదట! రవి ఎలిమినేట్ అయ్యాడట! అలాగే ఎవిక్షన్ ఫ్రీ పాస్ కూడా నేటితో ఎక్స్పైర్ అయినట్లు ప్రకటించి షాకిచ్చాడట నాగ్.. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! -
పింకీ కోసం యాంకర్ రవిని ఎలిమినేట్ చేశారా?
Bigg Boss Telugu 5: Is Anchor Ravi Eliminated : బిగ్బాస్ సీజన్-5లో ఈవారం షాకింగ్ ఎలిమినేషన్ జరిగిందని తెలుస్తుంది.ఎవరూ ఊహించని విధంగా యాంకర్ రవి ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ రవి ఎలిమినేట్ అవ్వడం ఏంటని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బ్రింగ్ బ్యాక్ రవి అంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్గా టాప్5లో ఉండాల్సిన రవిని బయటకు పంపించేయడం అన్యాయమని భావిస్తున్నారు. అయితే మరికొందరేమో పింకీని కాపాడటానికి రవిని కావాలనే ఎలిమినేట్ చేశారనే ప్రచారమూ జరుగుతుంది. మానస్తో కంటెంట్ ఇవ్వడం తప్పా కొన్ని వారాలుగా పింకీ ఆట కూడా యాక్టివ్గా లేదనే వాదన కూడా వినిపిస్తుంది. ఫ్యాన్ బేస్ విషయంలోనూ రవితో పోలిస్తే పింకీకి తక్కువగానే ఉందని, మరి అలాంటప్పుడు పింకీ ఎలా సేవ్ అయిందనే ప్రశ్నలు వెలువడుతున్నాయి. సన్నీ దగ్గరున్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ కాజల్ కోసం వాడటం వల్ల రవి బలయ్యాడనే వార్త కూడా బయటకు వచ్చింది. మరి లీకు వీరులు చెప్పినట్లుగా నిజంగానే ఈవారం రవి ఎలిమినేట్ అయి బయటకు వచ్చాడా లేదా ఇందులో మరేదైనా ట్విస్ట్ ఉందా అన్నది చూడాల్సి ఉంది. -
అంతా కలిసి సన్నీని విన్నర్గా తేల్చారు! టాప్ 5లో ఎవరున్నారంటే?
Bigg Boss Telugu 5, Episode 84: కింగ్ నాగార్జున హౌస్మేట్స్ కోసం సర్ప్రైజ్ పట్టుకొచ్చాడు. కంటెస్టెంట్ల కోసం మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ స్టేజీపైకి వస్తారని చెప్పాడు. కానీ వాళ్లు మిమ్మల్ని కలవాలంటే మీకు బాగా నచ్చిన వస్తువులను త్యాగం చేయాలని మెలిక పెట్టాడు. అయినవాళ్లను చూడటం కన్నా విలువైనది ఏముంటుందనుకున్న హౌస్మేట్స్ అందుకు ఓకే అనేశారు. మొదటగా యాంకర్ రవి పాప బొమ్మను త్యాగం చేయడంతో అతడి తల్లి ఉమాదేవి స్టేజీపైకి వచ్చింది. ఫ్యామిలీ అంతా నిన్ను చూసి గర్వపడుతుందని నువ్వు బిగ్బాస్ హౌస్కు రాజువని మెచ్చుకుంది. రవి కోసం బిగ్బాస్ తొలి సీజన్ విన్నర్ శివబాలాజీ కూడా షోకి విచ్చేశాడు. హౌస్లో ఎవరికి సపోర్ట్ చేయొద్దని, నీకు చెప్పాలనిపించిన పాయింట్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపొమ్మని కోరాడు. అనంతరం ఉమావేవి.. రవి, సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్, మానస్లు వరుసగా టాప్ 5లో ఉంటారని చెప్పుకొచ్చింది. తర్వాత పింకీ మేకప్ కిట్ త్యాగం చేయగా ఆమెకోసం హాస్యనటులు సాయి, అప్పారావు వచ్చారు. వీరు ప్రియాంకను విన్నర్గా తేల్చుతూ సన్నీ, శ్రీరామ్, రవి, మానస్లను టాప్ 5లో ఉంచారు. ఈ సందర్భంగా పింకీ మాట్లాడుతూ.. 'నన్ను కన్నడ నుంచి తెలుగుకి తీసుకువచ్చి కామెడీ షో చేయించారు.. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మీరే కారణం' అంటూ అప్పారావుకు కృతజ్ఞతలు తెలిపింది. సన్నీ తనకు ఫ్రెండ్స్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ను త్యాగం చేయగా ఇద్దరు ఫ్రెండ్స్ నిఖిల్, వెంకట్ స్టేజీపై సందడి చేశారు. కప్పు ముఖ్యం బిగిలూ అంటూనే బోర్డు మీద సన్నీని విన్నర్ స్థానంలో ఉంచారు. షణ్ముఖ్, మానస్, శ్రీరామచంద్ర, కాజల్ను తర్వాతి నాలుగు స్థానాల్లో ఉంచారు. మానస్.. తల్లి పంపిన బ్రేస్లెట్ను త్యాగం చేయగా అతడి కంటే ఎక్కువగా పింకీ బాధపడిపోయింది. తర్వాత మానస్ తండ్రి వెంకట్రావు, ఫ్రెండ్ అమర్దీప్ వచ్చాడు. ఏమీ లేనివాడిని తీసుకొచ్చి అన్నీ ఉన్నవాడిలా చేశాడు, నాకు ఇంత గుర్తింపు వచ్చిందంటే మానస్ వల్లేనంటూ అతడిని పొగిడేశాడు. అనంతరం మానస్ను ఫస్ట్ ప్లేస్లో సన్నీ, కాజల్, శ్రీరామ్, షణ్ముఖ్ను మిగిలిన నాలుగు స్థానాల్లో పెట్టారు. కాజల్ ఎంతగానో ఇష్టపడే బొమ్మను త్యాగాల పెట్టెలో పడేసింది. ఆమెను కలవడానికి సోదరితో పాటు, సింగర్ లిప్సిక కూడా వచ్చారు. వీళ్లు కాజల్ను విన్నర్గా తేల్చుతూ సన్నీ, షణ్ను, శ్రీరామచంద్ర, మానస్ను తర్వాతి స్థానాల్లో పెట్టారు. అనంతరం శ్రీరామ్.. హమీదా ఇచ్చిన కానుకను త్యాగం చేయగా అతడి కోసం తల్లి, స్నేహితురాలు వచ్చారు. వీళ్లు శ్రీరామ్, రవి, ప్రియాంక సింగ్, సన్నీ, షణ్ముఖ్లు వరుసగా టాప్ 5లో ఉంటారని జోస్యం చెప్పారు. సిరి కోసం వచ్చిన శ్రీహాన్.. సన్నీ, షణ్ముఖ్, రవి, శ్రీరామ్, సిరిలు వరుసగా టాప్ 5లో ఉంటారన్నాడు. చివరగా షణ్ముఖ్.. తన ప్రేయసి దీప్తి సునయన ఇచ్చిన టీషర్ట్ను భారంగా త్యాగం చేశాడు. అతడి కోసం మొదట అన్నయ్య సంపత్ రాగా తర్వాత దీప్తి సునయన స్పెషల్ ఎంట్రీ ఇవ్వడంతో షణ్ను ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయాడు. ఎమోషన్స్ను స్ట్రెంత్గా మార్చుకో కానీ వీక్ అయిపోవద్దని దీప్తి సూచించింది. నాకు నువ్వేంటో తెలుసంటూ అతడికి ముద్దులు పంపించింది. షణ్ముఖ్, శ్రీరామ్, సన్నీ, రవి, మానస్లు వరుసగా టాప్ 5లో ఉంటారని వీళ్లు అభిప్రాయపడ్డారు. ఫినాలేలో కలుద్దామంటూ వీడ్కోలు తీసుకుంది. ఈరోజు వచ్చిన మెజారిటీ ఫ్యామిలీ మెంబర్స్ సన్నీని టాప్ 5లోని మొదటి రెండు స్థానాల్లో పెడుతూ అతడే విన్నర్ అని చెప్పకనే చెప్పారు. -
ఎలిమినేషన్లో ట్విస్ట్, యాంకర్ రవి అవుట్!
Bigg Boss 5 Telugu, 12th Week Elimination: రోజులు వారాలయ్యాయి.. వారాలు నెలలయ్యాయి.. బిగ్బాస్ ప్రయాణం ముగింపునకు చేరుకుంటోంది. చివరి మజిలీకి చేరుకున్న హౌస్మేట్స్ ఎవరికి వారు టాప్ 5పైనే గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కొందరైతే ఏకంగా కప్పు కొట్టాలని ఫిక్సయ్యారు. కానీ మరికొందరు మాత్రం ఈ వారమే వెళ్లిపోతామేమోనన్న భయంతో బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ఈ 12వ వారం మానస్ మినహా మిగతా ఏడుగురు ఇంటిసభ్యులు నామినేషన్స్లో ఉన్నారు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా షణ్ను, సన్నీ, శ్రీరామ్, రవి ఈజీగా ఎలిమినేషన్ గండం నుంచి గట్టెక్కుతారని అంతా అనుకున్నారు. మిగిలిన కాజల్, ప్రియాంక, సిరిలలో ఒకరు ఎలిమినేట్ కాక తప్పదని అంచనా వేశారు. కానీ తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఈ వారం అమ్మాయిల్లోనుంచి ఒకరు కాకుండా టాప్ 5లో ఉంటాడనుకున్న కంటెస్టెంట్ను పంపించివేశారట! యాంకర్ రవిని ఎలిమినేట్ చేసినట్లు లీకువీరులు నెట్టింట టముకేసి మరీ చెప్తున్నారు. ఈ వార్త విని రవి ఫ్యాన్స్ షాకవుతున్నారు. రవి కంటే సిరి, ప్రియాంక, కాజల్కు ఎక్కువ ఓట్లు రావడం నమ్మశక్యంగా లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే రవి ఎలిమినేట్ అయ్యాడా? లేదా కావాలని పని గట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారా? అన్నది రేపటి ఎపిసోడ్లో తేలనుంది. -
బిగ్బాస్లో సిరి బాయ్ఫ్రెండ్.. 'వదిలేస్తున్నావా సిరి' అంటూ సూటి ప్రశ్న
బిగ్బాస్లో ఈ వారం ఫ్యామిలీ ఎపిసోడ్తో సరదాగా సాగింది. ఫ్యామిలీ మెంబర్స్ బిగ్బాస్లోకి ఎంటర్ కావడంతో రియల్ ఎమోషన్స్ బయటకొచ్చాయి.దాదాపు 80 రోజుల తర్వాత కుటుంబసభ్యులను చూసే అవకాశం రావడంతో హౌస్మేట్స్ బాగా ఎమోషనల్ అయ్యారు. అయితే యాంకర్ రవి, కాజల్ కుటుంబసభ్యులు మినహాయించి మిగతా కంటెస్టెంట్ల కోసం కేవలం ఫ్యామిలీలోనే ఒకరిని మాత్రమే బిగ్బాస్లోకి అనుమతించారు. తాజాగా హౌస్మేట్స్ ఆనందాన్ని మరింత రెట్టింపు చేయడానికి డబుల్ ఎమోషన్స్ని బయటకు రప్పించడానికి మిగతా కుటుంబసభ్యులను కూడా బిగ్బాస్ ఆహ్వానించారు. ఇందులో భాగంగానే రవికోసం ఆయన తల్లి, కాజల్ ఫ్రెండ్ సహా సిరి బాయ్ఫ్రెండ్ శ్రీహాన్ సైతం బిగ్బాస్ స్టేజ్పై సందడి చేశారు. శ్రీహాన్ను చూడగానే సిరి తలదించుకుంది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ 'వదిలేస్తున్నావా సిరి'.. అంటూ శ్రీహాన్ అడగ్గానే ఏం చెప్పాలో తెలియక బాగా ఎమోషనల్ అయ్యింది సిరి. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్మా రిలీజ్ చేసింది. ఇప్పటివరకు సిరిని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న శ్రీహాన్..అలా 'వదిలేస్తున్నావా సిరి'.. అని ఎందుకు అడిగాడు అన్నది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే. Weekend is here...More family members on the stage #BiggBossTelugu5 today at 9 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/Wp3ayU5TV8 — starmaa (@StarMaa) November 27, 2021 -
తండ్రి లేని అమ్మాయివని దగ్గరవలేదు, ఇకనైనా జాగ్రత్తగా..
Bigg Boss Telugu 5, Episode 83: బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టినందుకు సన్నీ తల్లి కళావతి తెగ సంబరపడిపోయింది. బిగ్బాస్ నీకు చెల్లెలిని ఇచ్చిందంటూ కాజల్ వంక చూడటంతో ఆమె సంతోషంతో గెంతులు వేసింది. ఇంటికి వచ్చిన అమ్మకు గోరుముద్దలు తినిపించాడు సన్నీ. ఈ సందర్భంగా ఆమె ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉన్న బాక్స్ను కొడుక్కు అందించడంతో అతడు ఫుల్ ఖుషీ అయ్యాడు. తర్వాత తల్లి బర్త్డేను సెలబ్రేట్ చేయగా నీకు నా గెలుపును బహుమతిగా ఇస్తానని కళావతికి మాటిచ్చాడు. సన్నీ దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండటం వల్లే పింకీ అతడికి క్లోజ్ అవుతుందేమోనని అనుమానపడ్డాడు మానస్. 'పింకీ తనను వదిలి వెళ్లిపోయిన బాయ్ఫ్రెండ్ ప్లేస్లో నన్ను రీప్లేస్ చేద్దామని చూస్తోంది. అయితే అది కుదరదని, నేను అలాంటివాడిని కాదని చెప్పాను. మనం ఫ్రెండ్స్ మాత్రమే అని స్పష్టం చేశాను' అని కాజల్తో చెప్పుకొచ్చాడు. అంతేకాక ఆమె చాలా అబద్ధాలు ఆడుతుందని, అది తనకు నచ్చదన్నాడు. ఇక హగ్గులు ఇచ్చుకోవడం నచ్చలేదని సిరి తల్లి చెప్పిన మాటలకు బాగా హర్టయ్యాడు షణ్ను. ఉన్నన్ని రోజులు జాగ్రత్తగా ఉందామని, ఇంట్లో వాళ్లను బాధపెట్టడం వద్దని హితవు పలికాడు. తండ్రి లేని కూతురని నీకు దగ్గరై అడ్వాంటేజ్ తీసుకోలేదని ఈ మాట మీ అమ్మకు చెప్పని సిరికి సూచించాడు. అనంతరం ప్రియాంక సింగ్ వాళ్ల సోదరి మధు ఎంట్రీ ఇచ్చింది. ఆమె వచ్చీరావడంతోనే నాన్న ఎందుకు రాలేదని నిలదీసింది పింకీ. నాన్నకు కళ్ల ప్రాబ్లమ్ ఉంది కాబట్టి రాలేదని బదులిచ్చింది మధు. నాన్న తల దించుకునే పని చేయనన్నావు, ఆ మాట నిలెబట్టుకోమని ఆయన మరీమరీ చెప్పాడు, గేమ్ మీద మాత్రమే ఫోకస్ చేయ్.. అని హెచ్చరించింది. అయితే మధు తాను సన్నీకి ఫ్యాన్ అని చెప్పింది. తర్వాత రవి భార్య నిత్య హౌస్లో అడుగుపెట్టింది. ఆమెను చూసిన రవి కొంత సంతోషిస్తూనే మరికొంత బాధకు లోనయ్యాడు. కూతురు వియా రాలేదేంటని నిరుత్సాహపడ్డాడు. ఇంతలో వియా హౌస్లోకి సర్ప్రైజ్ ఎంట్రీ ఇవ్వడంతో అతడి ఆనందం కట్టలు తెంచుకుంది. సుమారు 80 రోజుల తర్వాత కూతురు స్పర్శ తగిలినందుకు ఎమోషనల్ అయ్యాడు. నిన్ను చూసి అమ్మ రోజూ ఏడుస్తుందని రవికి ఫిర్యాదు చేసింది వియా. తర్వాత బిగ్బాస్ అంకుల్ ఎక్కడ? అంటూ అతడికోసం ఇల్లంతా వెతికి హంగామా చేసింది. రవి.. తన భార్యకు షణ్నును పరిచయం చేస్తూ ఇతడు లైఫ్లాంగ్ తమ్ముడని చెప్పాడు. అతడితో నిత్య మాట్లాడుతూ.. రవి ఇన్ఫ్లూయెన్స్ చేస్తాడంటారు, కానీ ఆయనకంత సీన్ లేదని తెలిపింది. చాన్నాళ్ల తర్వాత కూతురు కనిపించడంతో ఆమెతో సరదాగా ఆడుకున్నాడు రవి. వీళ్ల కోసం బిగ్బాస్ గుమ్మాడి గుమ్మాడి సాంగ్ప్లే చేయడంతో తండ్రీకూతుళ్లు డ్యాన్స్ చేశారు. తర్వాత బిగ్బాస్ హౌస్ను వదిలి వెళ్లాల్సిన టైం రావడంతో వియా గుక్కపెట్టి ఏడ్చింది. అనంతరం షణ్ను తల్లి ఇంట్లో అడుగు పెట్టడంతో ఆమెను పట్టుకుని ఏడ్చేశాడు. తన ప్రేయసి దీప్తి సునయన ఎలాగుంది అని అడిగి తెలుసుకున్నాడు. సిరి వాళ్ల మమ్మీ కొన్ని నచ్చట్లేదని బాధపడ్డారు అంటూ హగ్గుల గురించి మాట్లాడినదాన్ని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే అవేమీ పట్టించుకోని షణ్ను మదర్.. దేని గురించి ఆలోచించకు, ఫ్రెండ్షిప్ కదా అంటూ కొడుక్కు సపోర్ట్ చేసింది. ఎక్కువ ఎమోషనల్ అయి గేమ్ పాడు చేసుకోకని హెచ్చరించింది. అందరితో కలిసి ఉండమని షణ్నుకు నొక్కి చెప్పింది. గేమ్గేమ్లా చూడండి, ఎక్కువ ఎమోషనల్ అవద్దని షణ్ను, సిరిలకు సూచించి వీడ్కోలు తీసుకుంది. మొత్తానికి భారంగా కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ మీటింగ్ ముగిసింది. -
కూతుర్ని చూడగానే ఎమోషనల్ అయిన యాంకర్ రవి
Bigg Boss 5 Telugu Today Promo, Anchor Ravi Gets Emotional: బిగ్బాస్ హౌస్ ఎమోషన్స్తో నిండిపోయింది. ప్రతి సీజన్లోలాగే ఈసారి కూడా కంటెస్టెంట్ల కోసం ఫ్యామిలీ మెంబర్స్ బిగ్బాస్లోకి ఎంటర్ కావడంతో రియల్ ఎమోషన్స్ బయటకొచ్చాయి. ఇప్పటికే కాజల్, శ్రీరామచంద్ర, సన్నీ, సిరి, మానస్ల కుటుంబసభ్యులు ఎంటర్ అవగా, నేటి ఎపిసోడ్లో యాంకర్ రవి కోసం భార్య నిత్య, కూతురు వియా వచ్చారు. దీంతో రవి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రతిరోజూ వియా ఫోటో చూడనిదే నిద్ర లేవని రవి నేరుగా కూతుర్ని చూడటంతో సంతోషంలో మునిగిపోయాడు. ప్రేమగా హత్తుకొని కాసేపు కబర్లు చెప్పడంతో పాటు సరదాగా ఆడిస్తాడు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్మా రిలీజ్ చేసింది. ఎంతో ఎమోషనల్గా సాగిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. రవి కూతురు వియా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Daughter ni chusaka #Ravi emotions are priceless ❤️ #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/RZLbVj0sIT — starmaa (@StarMaa) November 26, 2021 -
బిగ్బాస్ కంటెస్టెంట్లపై విశ్వక్ సేన్ సెటైర్లు!
Bigg Boss 5 Telugu, Vshwak Sen Supports VJ Sunny: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్లో సన్నీని సపోర్ట్ చేస్తున్నాడు. అంతేకాదు, అతడిని ఎవరైనా ఏమైనా అంటే వారికి గట్టి కౌంటర్లు విసురుతున్నాడు. హౌస్లో సన్నీ ఎవిక్షన్ ఫ్రీపాస్ గెలుచుకుంటే ఎవరూ దాన్ని సెలబ్రేట్ చేయలేదని సెటైర్ విసిరాడు షణ్ను. దీనిపై విశ్వక్ రియాక్ట్ అవుతూ.. మేము చేసుకుంటున్నాంలే.. అని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో రాసుకొచ్చాడు. తాజాగా నామినేషన్స్ జరిగిన తీరుపై కూడా రియాక్ట్ అయ్యాడు. నిన్నటి నామినేషన్స్లో సన్నీకి శ్రీరామచంద్ర, రవిలతో ఫైట్ జరిగింది. ఈ గొడవలో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనేది పక్కన పెడితే విశ్వక్ ఎప్పటిలాగే సన్నీకి సపోర్ట్ చేశాడు. అంతటితో ఆగకుండా రవి, శ్రీరామచంద్రలపై సెటైర్లు విసిరాడు. శ్రీరామచంద్ర అటూఇటూ తిరుగుతుంటే షుగర్ వచ్చిందేమోనని కౌంటర్ వేయగా రవికి ఓవర్ స్మార్ట్ షుగర్ అని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో రాసుకొచ్చాడు. అయితే సపోర్ట్ చేయడం ఓకే కానీ మధ్యలో మా వాళ్లను ఎందుకు తిడుతున్నారని అటు శ్రీరామ్, ఇటు రవి ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వాళ్లకన్నా ముందు నీకు షుగర్ వచ్చినట్లుందంటూ పరుష పదజాలంతో కామెంట్లు చేస్తున్నారు. -
Bigg Boss 5 Telugu: ఫేక్ అకౌంట్లతో ట్రోలింగ్.. రవి భార్య ఆవేదన!
Netizens Troll Bigg Boss Contestant Anchor Ravi Family With Fake Accounts: బిగ్ బాస్ ఇంట్లో యాంకర్ రవి మంచి స్ట్రాటజీలను ప్లే చేస్తూ స్ట్రాంగ్ కంటెంస్టెంట్ మారాడు. టాప్ 5లో రవి పక్కా ఉంటాడని షో ఫాలో అవుతున్నవారందనికి అర్థమవుతుంది. ముందు నుంచే యాంకర్ రవికి బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, హౌస్లోకి వెళ్లాక..తనదైన ఆటతీరుతో మరింతమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రతివారం ఎలిమినేషన్లో ఉండడం కూడా రవికి కలిసొచ్చిందనే చెప్పాలి. నామినేషన్ ఒత్తిడిని దిగమింగుకొని గేమ్ను గేమ్లా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఇప్పటికే ఆయన హౌస్లో ఉన్నాడు. ఇక ఇలాంటి రియాల్టీ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్పై ట్రోలింగ్ అనేది సహజమే. కొంతమంది తమకు నచ్చిన కంటెస్టెంట్ని పొగుడుతూ.. ప్రత్యర్థులను తిడుతుంటారు. అయితే దానికి ఓ కారణం, సందర్భం ఉంటేనే ఫ్యాన్స్ ఇతరులను ట్రోలింగ్ చేస్తుంటారు. కానీ యాంకర్ రవి విషయంలో మాత్రం అందుకు విరుద్దంగా జరుగుతుంది. కొంతమంది రవిని అకారణంగా ట్రోల్ చేయడం మొదలెట్టారు. సోషల్ మీడియాలో కొంతమంది ఫేక్ అకౌంట్లు సృష్టించి, రవిని, వాళ్ల కుటుంబ సభ్యుల్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారని రవి సన్నిహితులు చెబుతున్నారు. రియాల్టీ షోలో కంటెస్టెంట్గా ఉన్నాడు కాబట్టి..అతన్ని తిట్టినా, పొగిడినా పర్లేదు.. కానీ అతని కుటుంబ సభ్యులను కూడా ట్రోల్స్ చేయడం దారుణమనే చెప్పాలి. ‘కావాలనే కొంతమంది నా పేరును, నా కూతురిను ఈ ట్రోల్స్లోకి తీసుకొస్తున్నారు’అని రవి భార్య నిత్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇది గేమ్ స్పిరిట్ కాదని, తమకు ఎందుకు ట్రోల్ చేస్తున్నారో అర్థం కావట్లేదని సన్నిహితుల దగ్గర వాపోయింది. వాస్తవానికి బిగ్బాస్ లాంటి రియాల్టీ షోలోకి వెళ్లే కంటెస్టెంట్స్ ముందే ఓ గట్టి పీఆర్ టీమ్ని ఏర్పాటు చేసుకుంటుంది. వాళ్లు హౌస్లో ఉంటే బయట పీఆర్ టీమ్ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తుంది. అయితే తమ కంటెస్టెంట్స్ని పొగుడుతూ ప్రచారం చేస్తే బాగుంటుంది కానీ...తమవారిని హైలెట్ చేయడం కోసం ఇతరులను ట్రోల్ చేయడం సరికాదు. దాని వల్ల తమ సభ్యుడు ఎలివేట్ అవుతామనుకోవడం పొరపాటు. -
సన్నీ మీద పగ తీర్చుకున్నావా?: రవికి నాగ్ సూటి ప్రశ్న
Bigg Boss Telugu 5 Promo, Gold Evariki? Coal Evariki?: కంటెస్టెంట్ల తప్పొప్పులను సరిదిద్దేందుకు రెడీ అయ్యాడు కింగ్ నాగార్జున. ఈ క్రమంలో యాంకర్ రవికి స్ట్రాంగ్ కోటింగ్ పడినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు తాజా ప్రోమో రిలీజైంది. బాగా ఆడిన వాళ్లకు గోల్డ్, వరస్ట్ పర్ఫామర్స్కు కోల్(బొగ్గు) ఇవ్వాలని చెప్పాడు నాగ్. రవి వరస్ట్గా ఆడింది సన్నీ అంటూ అతడి చేతికి బొగ్గందించాడు. దీంతో నాగ్.. స్విమ్మింగ్ టాస్క్లో సన్నీ మీద పగ తీర్చుకున్నావా? అని రవిని సూటిగా ప్రశ్నించాడు. దీనికతడు అలాంటిదేం లేదని బుకాయించాడు. టీషర్ట్స్ సరిగ్గా వేసుకోవాలని చెప్తూ ఉన్నా అతడు వినిపించుకోలేదని తప్పు సన్నీమీదకు తోసేశాడు. అయితే సన్నీ.. రూల్ బుక్లో టీ షర్ట్ పూర్తిగా ధరించాలని ఉందే తప్ప సరిగ్గా ధరించాలని రాసి లేదని చెప్పుకొచ్చాడు. ఇతడి వాదనతో ఏకీభవించని నాగ్.. మరి మానస్ మొదటి నుంచే ఎలా సరిగ్గా వేసుకున్నాడని తిరిగి ప్రశ్నించాడు. దొరికితే దొంగ అంటూ కాజల్ గేమ్పైనా సెటైర్లు వేశాడు. ఇక శ్రీరామ్ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్లో తనకొచ్చిన పవర్ను రవికిచ్చిన విషయం తెలిసిందేగా. అది నెగెటివ్ పవర్ అని తెలియగానే రవి ముఖం మాడిపోయింది. దీన్ని ప్రస్తావించిన నాగ్.. అతడికి బకరా రవి అన్న పేరు సరిగ్గా సెట్టవుతుందన్నాడు. ఇదిలా వుంటే హౌస్మేట్స్ ఎవరిని వరస్ట్ పర్ఫామర్గా ఎన్నుకోనున్నారనేది నేటి ఎపిసోడ్లో తెలియనుంది. -
'ఈ వారం సన్నీ ఎలిమినేట్ అవుతాడు!'
Bigg Boss 5 Telugu, Task For Eviction Free Pass: బిగ్బాస్ హౌస్లో సిరి, ప్రియాంక సింగ్, యానీ, మానస్ కెప్టెన్సీ కోసం పోటీ పడ్డారు. రింగ్ ఈజ్ కింగ్ టాస్క్లో ఎవరు రింగ్ను చివరి వరకు పట్టుకుంటారో వాళ్లే కెప్టెన్గా నిలుస్తారు. ఈ గేమ్లో మానస్ గెలిచి విజేతగా అవతరించాడు. కెప్టెన్ మానస్ కాజల్కు సారీ చెప్పి ఆమెతో గొడవలకు ఫుల్స్టాప్ పెట్టేశాడు. ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యేందుకు బిగ్బాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ప్రవేశపెట్టాడు. 'నిప్పులే శ్వాసగా.. గుండెలో ఆశగా' టాస్క్లో మీ ఫొటో కాలకుండా చూసుకోవాలని, చివరి వరకు ఎవరి ఫొటో కాలకుండా ఉంటుందో ఆ కంటెస్టెంట్కు ఈ పాస్ దక్కుతుందని ప్రకటించాడు. అయితే తనకెందుకో ఈ వారం సన్నీ ఎలిమినేట్ అవుతాడనిపిస్తోందని రవి జోస్యం చెప్పాడు. ఒకవేళ ఎవిక్షన్ పాస్ గెలిచినా కూడా సన్నీ దాన్ని వాడుకోడని అభిప్రాయపడ్డాడు. తర్వాత టాస్క్లో భాగంగా ఫైర్ ఇంజన్ అలారమ్ మోగగా రవి, షణ్ముఖ్ మొదట ట్రక్ ఎక్కారు. వీరికి మానస్, శ్రీరామ్ ఫొటోలు వచ్చాయి. షణ్ను సేవ్ చేసే అవకాశం మానస్కిద్దామంటే రవి మాత్రం శ్రీరామ్కే ఇద్దామని ఒప్పించాడు. అలా మానస్ ఫొటో మంటల్లో కాలిపోయింది. నెక్స్ట్ రౌండ్లో సన్నీ, మానస్ ట్రక్ ఎక్కారు. వీరి ఎదుట రవి, యానీ మాస్టర్ ఫొటోలు రాగా.. ఏకాభిప్రాయంతో రవి ఫొటోను కాల్చేశారు. షణ్ను, సిరిలు ట్రక్ ఎక్కగా వారు పింకీని కాకుండా సన్నీని సేవ్ చేశారు. తర్వాత యానీ, శ్రీరామ్ల వంతు రాగా జనాల ఓటింగే నాకు ముఖ్యం, ఈ పాస్ అవసరం లేదన్నాడు షణ్ను. ఆడియన్స్ సపోర్ట్తోనే ఇక్కడిదాకా వచ్చాను, వారి డెసిషన్తోనే వెళ్లిపోవాలని ఉందని చెప్పుకొచ్చింది సిరి. వీళ్లిద్దరూ తమకీ పాస్ అవసరం లేదని చెప్పినప్పటికీ యానీ, శ్రీరామ్ ఆలోచించుకుని సిరిని సేవ్ చేశారు. దీంతో ఆమె సంతోషంతో షణ్నును హత్తుకుని అతడికి ఐ లవ్యూ చెప్పింది. ప్రియాంక, కాజల్.. శ్రీరామ్, సిరిలలో నుంచి సిరిని సేవ్ చేశారు. యానీ, ప్రియాంకలకు సన్నీ, కాజల్ ఫొటోలు వచ్చాయి. యానీ.. ఆ రెండు ఫొటోలు కాల్చేద్దామని చెప్పింది. కానీ పింకీ అది తప్పని వారించడంతో ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి కాజల్ ఫొటోను కాల్చేసి సన్నీని సేవ్ చేశారు. తర్వాత అలారమ్ మోగినప్పుడు ట్రక్లో కూర్చున్న మానస్, కాజల్లకు యానీ, సిరి ఫొటోలు వచ్చాయి. ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఇద్దరూ కాలిపోతే సన్నీ గేమ్లో ఉంటాడని కాజల్ అభిప్రాయపడింది. తన ఫొటోను కాల్చేస్తారని భయపడిపోయిన యానీకి కోపం కట్టలు తెంచుకుంది. తనకు పాస్ దక్కుండా చేస్తున్నారని మండిపడిపోయింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం మేరకైతే ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ సన్నీకి దక్కినట్లు సమాచారం! -
తొలిసారి కెప్టెన్ అయిన మానస్, కుంగిపోతున్న సన్నీ!
Bigg Boss 5 Telugu Promo, Maanas Is New Captain!: గత ఆదివారం యాంకర్ రవి అందరి ముందు తనది బ్యాడ్ బిహేవియర్ అంటూ మాట్లాడటం తట్టుకోలేకపోయాడు సన్నీ. అందుకే అతడు ఏం చేసినా, ఏం మాట్లాడినా తీసుకోలేకపోతున్నాడు. ఎప్పటిలా సరదాగా ఉండలేకపోతున్నాడు. తాజాగా అతడు సంచాలకుడిగా ఉన్న గేమ్లోనూ కొట్లాటకు దిగాడు. అయితే రవి.. ఈ దూరాన్ని తగ్గిద్దామనుకున్నాడో? మరింకేదో కానీ తనకు వచ్చిన పవర్ను సన్నీకి త్యాగం చేయడానికి రెడీ అయ్యాడు. అదేమాట బిగ్బాస్కు చెప్పాడు. కానీ సన్నీ మాత్రం అతడిస్తానంటున్న పవర్ను తీసుకోవడానికి రెడీగా లేనని తేల్చి చెప్పాడు. దీంతో హౌస్మేట్స్ అతడికి నచ్చజెప్పేందుకు ఎంతగానో ప్రయత్నించగా చివరాఖరకు అయిష్టంగానే సరేనంటూ తలూపాడు. ఆ పవర్ ద్వారా సన్నీ తదుపరి సైరన్ వచ్చినప్పుడు ఒకరిని తొలగించి వారి స్థానంలో మైన్లో దిగి బంగారం వెతికే అవకాశాన్ని కొట్టేశాడు. ఇదిలా ఉంటే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్తో పాటు కెప్టెన్సీ టాస్క్ కూడా ముగిసిందని, మానస్ కొత్త కెప్టెన్గా అవతరించాడని లీకువీరులు సోషల్ మీడియాలో చాటింపు చేశారు. మానస్ తొలిసారి కెప్టెన్ అయినందుకు కొందరు నెటిజన్లు సంతోషిస్తూనే మరోపక్క సన్నీ బాధతో కుమిలిపోతున్నాడని విచారం వ్యక్తం చేస్తున్నారు. -
ఇద్దరం బాగా కనెక్ట్ అయ్యాం, అందుకే షణ్ను అలా..: రవితో చెప్పేసిన సిరి
Bigg Boss Telugu, Episode 74: కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లో మానస్ తనకు దక్కిన గొడ్డలిని సన్నీకిచ్చిన విషయం తెలిసిందే!దీంతో సన్నీని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచిన బిగ్బాస్ అతడికో స్పెషల్ పవర్ ఇచ్చాడు. ఒకరి నుంచి సగం బంగారు ముత్యాలను తీసుకుని ఇంకొకరికి ఇవ్వాలని చెప్పాడు. దీంతో సన్నీ.. సిరి దగ్గర నుంచి గోల్డ్ను షణ్ముఖ్కు ఇచ్చాడు. మొదటి రౌండ్లో ఎక్కువ బంగారం సంపాదించిన ప్రియాంక, మానస్లకు బెలూన్ టాస్క్ ఇవ్వగా అందులో పింకీ గెలిచింది. ఇద్దరం ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యామని, అందుకే షణ్ను ట్రిప్ అవుతున్నాడని పేర్కొంది సిరి. మీరిద్దరూ ఒకరినొకరు బాగా సీరియస్గా తీసుకుంటున్నారని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు రవి. 'కానీ నీ విషయంలో అతడు ఎందుకంత ట్రిప్ అవుతున్నాడు? నీ విషయంలోనే ఎందుకు ట్రిప్ అవుతున్నాడో ఆలోచించు, నీకు అర్థమవుతుందనుకుంటా, మీరే ఆలోచించుకోండి' అని హితవు పలికాడు. తర్వాత శ్రీరామచంద్రకు ఓ పవర్ వచ్చింది. అయితే అది అతడికి అనుకూలంగా రాలేదు. 30 బంగారు ముత్యాలను ఇవ్వాలని బిగ్బాస్ ఆదేశించాడు. తన దగ్గర ఒక్క ముత్యం కూడా లేకపోవడంతో పథకం రచించిన శ్రీరామ్ తనకో పవర్ వచ్చిందంటూ రవి ముత్యాలను సొంతం చేసుకున్నాడు. చివర్లో మాత్రం ఈ స్పెషల్ పవర్ నాకు రాలేదంటూ బాంబు పేల్చడం గమనార్హం. రెండో రౌండ్లో సన్నీ, సిరి బంగారం వెతుకులాటలో టాప్లో ఉన్నారు. వీళ్లిద్దరిలో ఒకరు కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశాన్ని కల్పించాడు బిగ్బాస్. అయితే సిరి తరపున వేరొకరు ఛాలెంజ్లో పాల్గొనాలంటూ ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో సిరి తనకోసం మానస్ పోటీపడతాడని చెప్పింది. అలా సన్నీని ఓడించేందుకు రంగంలోకి దిగాడు మానస్. తాను గెలిచి సిరిని కెప్టెన్సీ కంటెండర్ను చేశాడు. అయితే ఈ గేమ్ నియమనిబంధనలు తనకు ముందే సరిగా చెప్పలేదంటూ సంచాలకుడైన రవి మీద ఫైర్ అయ్యాడు సన్నీ. అలాగే తన స్నేహితులు మానస్, కాజల్ మీద కూడా చిందులు తొక్కాడు. ఉప్పొంగుకొస్తున్న తన కోపాన్ని తగ్గించుకునేందుకు సన్నీ స్విమ్మింగ్ పూల్లో దూకాడు. ఇది హౌస్లో నుంచి యానీ మాస్టర్ చూడగా సన్నీ మూగబాషలో సంభాషించాడు. ఈ ఒత్తిడి నా వల్ల కాదన్నట్లు ఫేస్ పెడుతూ సూసైడ్ చేసుకుంటున్నట్లుగా చేతితో గన్ పేల్చుకుని నీళ్లలో పడిపోయాడు. -
రవి ఫేక్, సిరి డబుల్ ఫేస్.. 'అరె, కరెక్ట్గా సెట్టయ్యిందే!'
Bigg Boss Telugu 5 Promo: సండేను ఫండే చేస్తానంటూ కంటెస్టెంట్లతో టాస్క్లు ఆడిస్తుంటాడు నాగ్. అయితే కొన్ని ఫన్నీగా ఉన్నా, మరికొన్ని మాత్రం హౌస్మేట్స్ మధ్య చిచ్చు రాజేసేలా ఉంటాయి. తాజగా అలాంటి టాస్కే హౌస్మేట్స్కు ఇచ్చినట్లు కనిపిస్తోంది. తాజాగా రిలీజైన ప్రోమోలో.. నాగ్ కొన్ని పదాలు ఇచ్చి అది ఎవరికి సెట్ అవుతాయో చెప్పాలన్నాడు. దీంతో శ్రీరామ్.. గేమ్లో కాజల్ కన్నింగ్ అని చెప్పుకొచ్చాడు. కాజల్.. సిరి గురించి చెప్తూ ఆమెకు రెండు ముఖాలున్నాయని, టాస్క్లో ఒక ఫేస్, సాధారణంగా ఒక ఫేస్ ఉంటుందని తెలిపింది. ఇవి కాకుండా సిరి తనకు మూడో ఫేస్ కూడా ఉందని చెప్తూ ఉంటుందని, అది హౌస్ బయటకెళ్లాక చూపిస్తానందని పేర్కొంది. తర్వాత సన్నీ.. రవి మాట మార్చుతాడంటూ అతడు ఫేక్ అని చెప్పాడు. దీంతో చిర్రెత్తిపోయిన రవి.. ఎంత చెప్పినా వినకుండా నాకు నచ్చింది చేస్తా, ఎవ్వడు చెప్పినా నేను వినను అంటే అది యారోగెంటే కదా అంటూ ఆ ట్యాగును సన్నీ మెడలో వేశాడు. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు అందరూ కరెక్ట్ ట్యాగులిచ్చుకుంటున్నారని కామెంట్లు చేస్తున్నారు. -
బ్యాడ్ బిహేవియర్, సన్నీని దోషిగా తేల్చిన నాగ్
Bigg Boss Telugu 5, Episode 70: సన్నీ నోటికొచ్చినట్లు వాగాడంటూ సిరి.. షణ్నును పట్టుకుని ఏడ్చేసింది. ఓ పక్క అతడి మీదున్న కోపాన్ని బయటకు కక్కుతూనే మరోపక్క షణ్నుకు హగ్గులిస్తూ ఐ లవ్యూ చెప్పింది. కాజల్ పేరు తీస్తేనే బుసలు కొడుతున్న యానీ బిగ్బాస్ ఇంట్లో ఉన్నంతవరకు ఆమెతో మాట్లాడనని, ముఖం కూడా చూడనని భీష్మించుకు కూర్చుంది. అటు మానస్ కూడా పింకీ ప్రవర్తనలో ఏదో తేడా కొడుతోందని ఆమెను కట్ చేయాలని చూస్తున్నాడు. కంటెస్టెంట్లు పలుచబడే కొద్దీ కంటెస్టెంట్ల మధ్య వైరాలు పెరుగుతున్నాయి. తర్వాత ఓ టాస్క్లో ప్రియాంక గెలిచి రామ్చరణ్ ఆటోగ్రాఫ్ అందుకుని మురిసిపోయింది. సీక్రెట్ రూమ్లో ఉన్న జెస్సీ తన శరీరం లావైతున్నట్లుగా, ఎవరో బాడీని పట్టుకున్నట్లుగా ఉందని, చూపు షేక్ అవుతుందని చెప్పుకొచ్చాడు. అతడిని పరీక్షించిన వైద్యులు జెస్సీకి మరింత మెరుగైన చికిత్స అవసరమని అభిప్రాయపడ్డారు. భీమ్లా నాయక్ పాటతో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఇంటిసభ్యులతో ఎఫ్ఐఆర్ గేమ్ ఆడించారు. మొదటగా యానీ.. కాజల్పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. నాగ్ ముందే నాగిణి డ్యాన్స్ చేస్తూ ఆమెను వెక్కిరించింది. అయినప్పటికీ మెజారిటీ కంటెస్టెంట్లు యానీకే సపోర్ట్ చేశారు. తర్వాత రవి.. వెరీ బ్యాడ్ బిహేవియర్, లూజ్ టంగ్ అంటూ సన్నీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. తంతా, అప్పడం చేసి అమ్మేస్తా అన్నాడని రవి చెప్పడంతో తాను అనలేదని బుకాయించాడు సన్నీ. దీంతో నాగ్ వీడియో ప్లే చేశాడు. సన్నీ మొదట తంతానన్నాడని, కానీ ఎవరిని అనడంతో టవర్ను తంతానని కవర్ చేశాడని నాగ్ చెప్పడంతో అతడి పరువు పోయినట్లైంది. అయితే సన్నీ మాత్రం తాను బ్రిక్స్నే తంతానన్నానని మరీమరీ చెప్పాడు. అమ్ముతానని సిరిని అన్నావంటూ మరో వీడియో చూపించాడు నాగ్. సన్నీ తరపున వాదించిన కాజల్ అతడు సిరిని అమ్ముతానని అనలేదని బల్లగుద్ది చెప్పింది. తర్వాత సన్నీ.. సిరిని బోనులో నిలబెట్టి ఎఫైఆర్ ఫైల్ చేశాడు. కానీ మానస్, కాజల్ తప్ప అందరూ సిరిని నిర్దోషి అని పేర్కొన్నారు. మానస్.. యానీ మాస్టర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ అది వీగిపోయింది. శ్రీరామచంద్ర.. ప్రియాంకను బోనులో పెట్టాడు. ఎన్ని పాటలు పాడినా 100 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వలేదని ఆరోపించాడు. శ్రీరామ్ ముందుగానే ఫ్లాట్ అయిపోయి పాట పాడితే నాది తప్పా? అని రాగాలు తీసింది. హౌస్మేట్స్ సగం మంది తనను గిల్టీ, మిగతావాళ్లు గిల్టీ కాదని చెప్పారు. మానస్ గట్టిగా అరవడం నచ్చలేదని అతడిని ప్రియాంక బోనులో పెట్టింది. అయితే హౌస్మేట్స్ మానస్ను నిర్దోషిగా తేల్చారు. తర్వాత కాజల్.. యానీ తనను వెక్కిరిస్తుందంటూ బోనులో నిలబెట్టింది. అయితే ఆమె వెక్కిరించలేదని, అది తన బాడీ లాంగ్వేజ్ అని సిరి వాదించింది. మెజారిటీ కంటెస్టెంట్లు సిరి వాదనతో ఏకీభవించడం విశేషం. తర్వాత షణ్ను.. నేను ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని ఆడతాననడం, నన్ను యూట్యూబ్ వరకే అని చెప్పడం నచ్చలేదంటూ సన్నీని బోనులో నిలబెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్లే చేసి చూపించగా రవి, శ్రీరామ్, సిరి, యానీ.. అతడు షణ్నును యూట్యూబ్ వరకే అన్నాడని చెప్పగా మిగిలిన ముగ్గురు షణ్నును అనలేదని, కామెంట్లు యూట్యూబ్ వరకే అని చెప్పాడని వివరించే ప్రయత్నం చేశారు. కానీ మెజారిటీ కంటెస్టెంట్లు షణ్నును సమర్థించారు. అందరూ మధ్యలో రావడం వల్లే గొడవలు వస్తున్నాయని కాజల్ ఉన్నమాట చెప్పింది. సిరి సన్నీ గొడవ పడుతుంటే షణ్ను మధ్యలోకి రావడం వల్లే గొడవ పెద్దదైందని తెలిపింది. అయితే నాగ్ మాత్రం కాజల్.. యానీకి గిలిగింతలు పెట్టడం వల్లే అసలు గొడవ మొదలైందన్నాడు నాగ్. మొత్తంగా సన్నీ మెడలో గిల్టీ బోర్డు వేలాడదీశారు. తర్వాత సన్నీ సేవ్ అయినట్లు వెల్లడించాడు నాగ్. -
కళ్లు లేవా? కామన్ సెన్స్ లేదా? ఫాల్తూ, తంతా: కంటెస్టెంట్ల తిట్ల దండకాలు
Bigg Boss Telugu 5, Episode 69: బీబీ హోటల్ టాస్క్లో కాజల్ డబ్బులు దొంగిలించిన రవి వాటిని ఆమెకు తిరిగిచ్చేశాడు. మరోవైపు టిప్పు కోసం యానీ సన్నీనెత్తుకుని తిప్పింది. తర్వాత బిగ్బాస్ కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ముగిసిందని ప్రకటించాడు. టాస్క్ ముగిసే సమయానికి హోటల్ సిబ్బంది దగ్గర రూ.9,500 మాత్రమే ఉన్నాయి. అతిథులు దగ్గర నుంచి 15 వేల రూపాయలు రాబట్టనందున హోటల్ సిబ్బంది ఓడిపోయిందని, అతిథుల టీమ్ గెలిచిందని ప్రకటించాడు బిగ్బాస్. ఇక రాత్రిపూట ముచ్చట్లు పెట్టిన రవి, షణ్ను, సిరి.. మానస్ ఎక్కువ పని చేస్తాడు కానీ సన్నీ మాత్రం ఏ పనీ చేయడని గుసగుసలాడారు. ఎప్పుడూ తప్పించుకు తిరుగుతాడని అభిప్రాయపడ్డారు. షణ్ముఖ్ ప్రెస్టీజ్ చాంపియన్ ఆఫ్ ది వీక్గా ఎంపికై రూ.25,000 గిఫ్ట్ వోచర్ అందుకోవడం విశేషం. ఇదిలా వుంటే సీక్రెట్ టాస్క్ విజయవంతంగా పూర్తి చేసిన రవిని కెప్టెన్సీ పోటీదారుడిగా ప్రకటించాడు బిగ్బాస్. అతిథుల టీమ్లో నుంచి ఇద్దరిని అనర్హులుగా ప్రకటించాలని హోటల్ సిబ్బందిని ఆదేశించగా వారు ఏకాభిప్రాయంతో మానస్, పింకీలపై వేటు వేశారు. దీంతో వారు కెప్టెన్సీకి పోటీపడే అవకాశాన్ని కోల్పోయారు. మిగిలిన సిరి, కాజల్, సన్నీ, రవి కెప్టెన్సీకి పోటీ పడ్డారు. వీరికి 'టవర్లో ఉంది పవర్' అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. ఇందులో పోటీదారులు టవర్ కట్టి అది కూలిపోకుండా చూసుకోవాలి. మొదటి లెవల్లో ఓడిపోయిన కాజల్.. రవికి సపోర్ట్ చేస్తున్న యానీకి గిలిగింతలు పెట్టింది. దీంతో మండిపోయిన యానీ.. ఓవరాక్షన్ చేయకని హెచ్చరించింది. మరోపక్క తనను గేమ్ ఆడనీయకుండా అడ్డుకున్న సిరిపై మండిపడ్డాడు సన్నీ. నీ టవర్ను తంతానని చెప్పాడు. నన్ను పట్టుకున్నప్పుడు తోసేస్తే అప్పడం అయిపోయేదానివన్నాడు. దీంతో మధ్యలో కలగజేసుకున్న షణ్ను ఏదీ, తన్ను చూద్దామంటూ మరింత రెచ్చగొట్టాడు. అలా వీరిద్దరి మధ్య పెద్ద వారే జరిగింది. సిరి, షణ్ను ఒకరి కోసం ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఇద్దరూ కలిసి సన్నీ మీదకు దూసుకెళ్లారు. కళ్లు లేవా? కామన్సెన్స్ లేదా? ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని ఆడుతున్నావ్ అని ఎలా అంటావ్? అని సిరి సన్నీని ఏకిపారేసింది. సన్నీ కూడా ఆవేశంలో మాటలు తూలాడు కానీ నాగ్కు ఇచ్చిన మాట కోసం ఎవరికీ వేలు చూపించలేదు. ఇక యానీ.. ఈ గేమ్లో ఎవరికి సపోర్ట్ చేశావని కాజల్ను ప్రశ్నించగా ఆమె తెలివిగా సన్నీకి అని కాకుండా రవికి అని చెప్పింది. దీంతో చిర్రెత్తిపోయిన యానీ.. అన్ని ఫాల్తూ గేమ్ ఆడతావ్, నువ్వు గేమ్లో నన్ను టచ్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చింది. ఒక్క గేమ్ నిజాయితీగా ఆడలేదంటూ ఆమె ముందుకెళ్లి నాగిణి డ్యాన్స్ చేసింది. ఆమెను వెక్కిరిస్తూ మరింత రెచ్చగొట్టింది. ఇదిలా వుంటే పింకీ చీర తగిలి టవర్ కూలిపోవడం సన్నీ గేమ్ నుంచి అవుట్ అయ్యాడు. అయితే పింకీ కావాలనే టవర్ను కూల్చిందని సన్నీ, మానస్ అభిప్రాయపడ్డారు. నమ్మినవాళ్లే మోసం చేస్తే ఇంకేం చేయాలని తెగ ఫీలయ్యారు. మొత్తానికి ఈ టవర్లో ఉంది పవర్ టాస్క్లో రవి గెలిచి కెప్టెన్గా అవతరించాడు. -
ఎట్టకేలకు నామినేషన్ నుంచి తప్పించుకున్న రవి!
Bigg Boss Telugu 5, Ravi New Captain!: బుల్లితెర మీద హీరో అయిన యాంకర్ రవి బిగ్బాస్ హౌస్లో హీరో కాలేకపోతున్నాడు. బోలెడంత పాపులారిటీ, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. మొదట్లో ఆడవాళ్ల గొడవల్లో ఇరుక్కుని, మాటలు మార్చుతూ, అమ్మ మీద ఒట్టేసి అబద్ధం చెప్పుతూ జాతీయ ఛానల్లో తన పరువు తానే తీసుకున్నాడు. ఇలా చాలాసార్లు అబద్ధం చెప్తూ అడ్డంగా దొరికిపోయిన రవిపై హౌస్మేట్స్ ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతున్నారు. తాజాగా హౌస్లో జరిగిన బీబీ హోటల్ టాస్క్లో హోటల్ సిబ్బంది సేవలను చెడగొట్టాలని రవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. ఇందుకోసం అతడు కావాలని సన్నీ బెడ్ మీద నీళ్లు పోయడం, కాజల్ డబ్బులు దొంగిలించడం, కాజల్ వాటర్ బాటిల్లో కారం కలపడం వంటి పనులు చేశాడు. అయితే ఇవన్నీ రవియే చేశాడని అందరూ అనుమానపడ్డారు. పైగా అతడికి పైసా టిప్పు ఇవ్వద్దని ఓ నిర్ణయానికి వచ్చారు, కానీ ఈ మాట మీద ఎవరూ నిలబడలేదు అది వేరే విషయం. సీక్రెట్ టాస్క్ అంటేనే ఎవరికీ అనుమానం రాకుండా అప్పగించిన పనిని పూర్తి చేయడం. కానీ ఇక్కడ అందరికీ రవి సీక్రెట్ టాస్క్ చేస్తున్నాడని తెలిసిపోయింది. అయినప్పటికీ అతడు కెప్టెన్సీ పోటీదారుడిగా సెలక్ట్ అవడం, తర్వాతి గేమ్లో కెప్టెన్ అవడం చకచకా జరిగిపోయాయని తెలుస్తోంది. ఏదేమైనా ప్రతివారం నామినేషన్లో ఉంటున్న రవి ఎట్టకేలకు కెప్టెన్ అయి ఇమ్యూనిటీ సాధించాడు. దీంతో వచ్చేవారం రవి నామినేషన్ టెన్షన్ లేకుండా హాయిగా గుండెల మీద చేతులేసి నిద్రపోవచ్చు. -
జెస్సీకి తిరగబెట్టిన రోగం, కొత్త లక్షణాలతో సతమతం!
Bigg Boss 5 Telugu, Episode 68: బిగ్బాస్ షోలో బీబీ హోటల్ టాస్క్ నడుస్తోంది. ఇందులో హోటల్కు విచ్చేసిన అతిథులు సన్నీ, సిరి, కాజల్, ప్రియాంక, మానస్.. అక్కడి సిబ్బందితో సపర్యలు చేయించుకుంటూ టిప్పులివ్వకుండా విసిగించారు. వీరి ప్రవర్తనతో చిర్రెత్తిపోయిన హోటల్ స్టాఫ్ ముందు పైసలు తీయండి, కావాల్సినంత సేవలు చేయించుకోండి అని అభ్యర్థించినప్పటికీ వారు వినిపించుకోలేదు. రవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారని తెలిసిపోయింది! చేసేదేం లేక సిబ్బంది అతిథుల సేవల్లో తరించారు. హనీమూన్ కపుల్ ప్రియాంక- మానస్ల కోసం యానీ మాస్టర్ పూలతో బెడ్ అలంకరించింది. మీ శోభనం కోసం అన్నీ సిద్ధం చేశానని చెప్తుండగా సన్నీ వెళ్లి ఆ బెడ్మీద పడి దొర్లి దాన్ని నాశనం చేశాడు. మరోపక్క షణ్ముఖ్.. నువ్వు దొంగతనం చేశావన్న విషయం తనకు తెలుసంటూ రవితో నేరుగా చెప్పాడు. అడ్డంగా దొరికిపోయినప్పటికీ రవి మాత్రం తాను తీయలేదని బుకాయించాడు. టాస్క్ చెడగొట్టే పనిలో భాగంగా కాజల్ వాటర్ బాటిల్లో కారం పోశాడు. అయితే హౌస్మేట్స్ ఇది చేసింది రవే అని పసిగట్టారు. అతడికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారని, ఇక నుంచి రవికి డబ్బులు ఇవ్వకూడదని ఓ నిర్ణయానికి వచ్చారు. డబ్బులివ్వడం లేదని ఏడ్చేసిన యానీ మరోపక్క సన్నీ.. పింకీ-మానస్ల క్యాండిల్ లైట్ డిన్నర్ను సర్వనాశనం చేశాడు. దీంతో అలకమంచం ఎక్కిన పింకీని బుజ్జగించి కూల్ చేశాడు మానస్. ఇదిలా వుంటే తన డబ్బులు కొట్టేశారన్న బాధలో ఉన్న కాజల్ ఎలాగైనా వాటిని సంపాదించుకోవాలనుకుంది. ఇందుకోసం యానీ బ్యాగులో నుంచి డబ్బులు దొంగిలించింది. కానీ హౌస్మేట్స్ మాత్రం ఇది కచ్చితంగా రవి పనే అయ్యుంటుందని అతడి మీద అనుమానం వ్యక్తం చేశారు. బండెడు పనులు చేయించుకుని చారానా వంతు టిప్పు ఇస్తున్నారని అసహనానికి లోనైన యానీ ఇన్ని పనులు చేయిస్తున్నారు.. నేను మనిషినా? పశువునా? అని ఆవేశపడింది. కుక్కల్లా పనులు చేయిస్తున్నారు, కానీ డబ్బులు ఇవ్వరు అంటూ ఏడ్చేసింది. జెస్సీకి తిరగబెట్టిన రోగం ఇలాగైతే తమకు డబ్బులు రావని అర్థమైన సిబ్బంది మాకు 10 వేల రూపాయలు ఇచ్చేవరకు అతిథులెవరికీ ఫుడ్ పెట్టమని తేల్చి చెప్పారు. దీంతో అతిథులు ఓ మెట్టు దిగి వచ్చి డబ్బులు ఇచ్చి ఆహారం అందుకున్నారు. ఇక సీక్రెట్ రూమ్లో ఉన్న జెస్సీ తను సరిగా చూడలేకపోతున్నానని, ఒక వైపుకు నెట్టేసినట్లు పడిపోతున్నానని బిగ్బాస్కు చెప్పుకున్నాడు. పడుకున్నప్పుడు స్నేక్ ఉన్నట్లుగా అనిపిస్తుందన్నాడు. దీంతో అతడిని చెకప్ చేసేందుకు డాక్టర్ రాగా.. జెస్సీ తన చేతులు లావైనట్లు అనిపిస్తోందని ఇలా ఇంతకుముందెన్నడూ అనిపించలేదని తెలిపాడు. నీకు మెరుగైన వైద్యం అవరసరమన్న డాక్టర్, అందుకు తగ్గట్టు మంచి ట్రీట్మెంట్ ఇస్తామని, ధైర్యంగా ఉండమని జెస్సీకి భరోసా ఇచ్చాడు. -
కాజల్కు షాకిచ్చిన రవి, మేడమ్ మేడమ్ అంటూనే..
Bigg Boss 5 Telugu, Episode 67: కేక్ తినే అర్హత ఎవరికి ఉందని కంటెస్టెంట్లు చర్చోపచర్చలు పెట్టారు. ఈ తొక్కలో మీటింగ్ ఏంటో అర్థం కాని సన్నీ తినేస్తే పోలా అని కేక్ తీసుకుని లాగించాడు. ఖరాబవుతుందని తిన్నానంటూనే ఇప్పుడు ఏం పంచాయితీ అవుతుందోనని మథనపడ్డాడు. అన్నట్లుగానే యానీ మాస్టర్ వచ్చి సన్నీ స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడని, నువ్వెలా తింటావని తిట్టుకుంటూ వెళ్లి ఏడ్చేసింది. బిగ్బాస్ బీబీ హోటల్ అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇచ్చాడు. ఇందులో హౌస్ కీపింగ్ స్టాఫ్లో ఉంటూనే అతిథులకిచ్చే సర్వీసులను చెడగొట్టమని రవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. బీబీ హోటల్లో శ్రీరామ్, షణ్ముఖ్ చెఫ్స్, వెయిటర్లుగా, యానీ మాస్టర్ మేనేజర్, రిసెప్షనిస్ట్గా, రవి ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న హౌస్ కీపింగ్, మానస్- ప్రియాంక హనీమూన్కు వచ్చిన జంట, కాజల్.. హోటల్ ఓనర్కు స్నేహితురాలు, సన్నీ తొలిసారి 5 స్టార్ హోటల్కు వచ్చిన అతిథిగా, సిరి.. ఎంతో గారాబంగా పెరిగిన డాన్ కూతురుగా నటించాల్సి ఉంటుంది. ఈ టాస్క్లో హోటల్ సిబ్బంది అతిథుల నుంచి రూ.15 వేల రూపాయలు గెలిస్తే వారు గెలిచినట్లు లెక్క! టాస్క్ మొదలవగానే ఇంటిసభ్యులు రెచ్చిపోయి మరీ ఆడారు. సన్నీ, సిరి అయితే పాత్రలో జీవించారు. దొరికిందే ఛాన్స్ అనుకున్న సిరి షణ్ముఖ్ను ముప్పుతిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగించింది. సిరితో ఈజీ కాదు అని పాట పాడుతూ స్విమ్మింగ్ పూల్లోని నీటిని స్పూన్తో తీస్తూ కాఫీ కప్పు నింపాడు షణ్ను. దీంతో అతడికి టిప్పిచ్చింది సిరి. సన్నీ తనను టచ్ చేస్తుంటే సైలెంట్గా ఉన్నావేంటని మానస్ మీద చిర్రుబుర్రులాడింది పింకీ. మరోపక్క రవి.. కాజల్ బ్యాగులోంచి డబ్బులు కొట్టేసి ఏమీ ఎరగనట్లున్నాడు. దీంతో కాజల్ డబ్బులు పోయాయంటూ మొత్తుకుంది. మరి రేపటి ఎపిసోడ్లో అతిథులు హోటల్ సిబ్బందిని ఇంకెన్ని తిప్పలు పెడతారో చూడాలి! చదవండి: బిగ్బాస్ షోలో షాకింగ్ ఘటన, కంటెస్టెంట్ సూసైడ్ అటెంప్ట్! -
రవికి సీక్రెట్ టాస్క్, షణ్నును ఆడేసుకున్న సిరి
Bigg Boss Telugu 5 Today Promo: మరీ ఎక్కువగా ఆలోచిస్తే అన్నీ అనుమానాలే పుట్టుకొస్తాయి. బిగ్బాస్ కేక్ పంపించి ఇది తినే అర్హత మీలో ఎవరికి ఉంది? అని అడిగితే ఏ ఒక్కరూ టచ్ చేయలేకపోయారు. దీనివల్ల నామినేషన్లో పడతామేమో, లేదంటే నేరుగా ఎలిమినేట్ చేస్తారేమో అని రకరకాలుగా ఆలోచించారు. అయితే సన్నీ మాత్రం ఏదైతే అది అవుతుందని ఆ కేక్ను చటుక్కుమని తీసి లటుక్కున తినేశాడు. ఖరాబైతదని తింటున్నానంటూ కవరింగ్ ఇచ్చాడు. మరో ప్రోమోలో గత సీజన్లోని బీబీ హోటల్ టాస్క్ మరోసారి ప్రవేశపెట్టాడు. ఈ టాస్క్లో శ్రీరామచంద్ర, షణ్ముఖ్ చెఫ్స్ అండ్ వెయిటర్లుగా, మానస్- ప్రియాంక హనీమూన్ జంటగా, సన్నీ మొదటిసారి ఫైవ్స్టార్ హోటల్కు వచ్చిన గెస్ట్గా నటించాల్సి ఉంటుంది. దొరికిందే ఛాన్స్ అని రెచ్చిపోయిన సిరి.. షణ్నుతో సపర్యలు చేయించుకుంది. దీంతో అతడు సిరితో అంత ఈజీ కాదు అని ఉన్నమాటనే పాట రూపంలో పాడుకున్నాడు. మరోవైపు బిగ్బాస్ యాంకర్ రవికి మరోసారి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. మరి రవి ఆ సీక్రెట్ టాస్క్ను విజయవంతంగా పూర్తి చేశాడా? లేదా? బీబీ హోటల్లో కంటెస్టెంట్లు ఏ రేంజ్లో రచ్చ చేసారో చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! -
Bigg Boss: చివరి క్షణంలో బిగ్బాస్ ట్విస్ట్.. నామినేషన్స్లో ఐదుగురు
Bigg Boss 5 Telugu,10th Week Nomination List: బిగ్బాస్ హౌస్లో సోమవారం వచ్చిందంటే నామినేషన్స్తో హోరెత్తిపోతుంది. నామినేషన్స్ నుంచి తప్పించుకునేందుకు ఇంటి సభ్యులు చేయని ప్రయత్నాలు, కుట్రలు ఉండవు. అయితే పదోవారం మాత్రం నామినేషన్ ప్రక్రియని కాస్త డిఫరెంట్గా ప్లాన్ చేశాడు బిగ్ బాస్. కాజల్కు చెక్ పెట్టేందుకు ప్రయత్నించిన సిరి, రవిలో చివరకు బకరాలయ్యారు. యానీ మాస్టర్పై ప్రేమను పెంచుకున్న బిగ్బాస్.. ఆమెకు వరుసగా స్పెషల్ పవర్ ఇస్తూ ఇంటి సభ్యులకు షాకిచ్చాడు. దీంతో పదోవారం నామినేషన్స్లో ఐదుగురు ఉన్నారు. ఆ ఐదుగురు ఎవరు? వారు ఎలా నామినేట్ అయ్యారు? సిరి, రవిలు వేసిన ప్లాన్ ఏంటి? బిగ్బాస్ ఇచ్చిన ట్విస్టులేంటి? చదివేయండి. ప్రస్తుతం హౌజ్కి కెప్టెన్గా ఉన్నయానీ మాస్టర్ని ఎవరైన నలుగురు కంటెస్టెంట్స్ని నామినేట్ చేసి జైలులో కూడా పెట్టాలని ఆదేశించారు బిగ్ బాస్. దీంతో యానీ.. మానస్, కాజల్, సన్నీ, షణ్ముఖ్లను నామినేట్ చేసి జైలులో పెట్టింది.యానీ మాస్టర్ చేసిన నామినేషన్ని మార్చే అవకాశాన్ని మిగిలిన ఇంటి సభ్యులకు ఇచ్చారు బిగ్ బాస్. దీనిలో భాగంగా.. బజర్ మోగిన ప్రతిసారి లివింగ్ ఏరియాలో ఉన్న తాళాలను పట్టుకుని వాటి ద్వారా తమకి ఇష్టమైన వ్యక్తిని బయటకు తీసుకురావొచ్చు. అలా బయటకు వచ్చిన వ్యక్తి మరో ఇద్దరిని నామినేట్ చేస్తే.. వారిలో ఒకరి నామినేట్ అయి జైలుకు వెళ్లాలి. అయితే మొదట బజర్ మోగేసరికి పింకీ పరుగున వెళ్లి సంకెళ్లను చేజిక్కించుకుంది. వెంటనే మానస్ని జైలు నుంచి విముక్తి కల్పించింది. అయితే మానస్.. రవి, జెస్సీలను నామినేట్ చేయగా.. చివరికి ప్రియాంక, మానస్లు చర్చించి జెస్సీని జైలుకి పంపి నామినేట్ చేశారు. ఆ తర్వాతి బజర్కి సిరి తాళాలను దక్కించుకొని షణ్ముఖ్ని కాదని జెస్సీని బయటకు తీసుకొచ్చింది. అయితే తనను బయటకు తీసుకురావొద్దని ముందు సిరికి చెప్పాడు షణ్ముఖ్. అందుకే అతన్ని కాదని జెస్సీని విడిపించింది. బయటకు వచ్చిన జెస్సీ.. తిరిగి మానస్, ప్రియాంకలను నామినేట్ చేశాడు. ఫైనల్గా ఆ ఇద్దరిలో సిరి అందరూ ఊహించినట్టే సిరి మానస్ని నామినేట్ చేసింది. ఆ తరువాత జెస్సీ సంకెళ్లను చేజిక్కించుకుని షణ్ముఖ్ జైలు నుంచి బయటకు తీసుకుని వచ్చాడు. షణ్ముఖ్కి నామినేట్ చేసే చాన్స్ రావడంతో.. పింకీ, సిరిలను నామినేట్ చేశాడు. వారిలో ప్రియాంక జైలుకు వెళ్లింది. ఇక్కడ పింకీ, షణ్ముఖ్ల మధ్య చిన్నపాటి మాటల యుద్దం జరిగింది. కెప్టెన్గా ఉన్నప్పుడు ఆమె వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, కాబట్టి ఆమెను ఈ వారం ఎలిమినేషన్కి నామినేట్ చేస్తున్నానని చెప్పడం పట్ల బాగా హర్ట్ అయిన పింకీ.. ‘ఉన్న నలుగురిలో వేరే ఆప్షన్ లేదని నన్ను నామినేట్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. నా పాయింట్లో నువ్వు కరెక్ట్ కాదు. తరువాత ఎప్పుడైనా నన్ను నామినేట్ చేయాలనుకుంటే సరైన కారణం ఇవ్వు’అంటూ అసహనం వ్యక్తం చేయగా.. ‘నా పాయింట్లో ఇదే కరెక్ట్.. నేను ఇలానే నామినేట్ చేస్తా. అది నా ఇష్టం’అంటూ షణ్ముఖ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక కాజల్పై పగ పెంచుకున్న సిరి ఈ సారి ఎలాగైనా ఆమెను నామినేషన్స్కి పంపాలని కుట్రపన్నింది. కాజల్ని నామినేషన్స్లో ఉంచాలంటే ఇలా గేమ్ ఆడాలంటూ.. రవి, శ్రీరామ్, షణ్ముఖలకు ట్రైనింగ్ ఇచ్చింది. సిరికి మద్దతుగా నిలిచాడు రవి. బజర్ మోగగానే తాళాలను దక్కించుకొని ప్లాన్ ప్రకారం.. పింకీని బయటకు తీసుకొచ్చాడు. ఆమె షణ్ముఖ్, జెస్సీలను నామినేట్ చేయడంతో ఫైనల్గా రవి జెస్సీని సేవ్ చేసి షణ్ముఖ్ని మళ్లీ జైలు లోపలికి పంపాడు. రవి ఇచ్చిన ప్లాన్ ప్రకారం.. శ్రీరామ్ తాళలను దక్కించుకొని కాజల్ని సేవ్ చేశాడు. దీంతో బయటకు వచ్చిన కాజల్.. సిరి, రవిలను నామినేట్ చేయగా.. శ్రీరామ్ సిరిని ఫైనల్ చేసి జైలుకు పంపాడు. ఇలా కాజల్ని జైలులో ఉంచాలని కుట్ర పన్నిన సిరి... చివరకు ఆమె వల్లే జైలుపాలై నామినేషన్స్లో నిలిచింది. మరోవైపు ఎలాంటి ఒప్పందం లేకుండా నిన్ను బయటకు తెచ్చానని.. నీకు చాన్స్ వస్తే సిరిని సేవ్ చేయాలని కాజల్పై ఒత్తిడి తెచ్చాడు శ్రీరామ్. దీనికి కాజల్ ఒప్పుకోలేదు. తన స్నేహితులైన మానస్, సన్నీలలో ఒకరిని బయటకు తెస్తానని చెప్పింది. అలా చెయ్యొద్దని, గతంలో లెటర్ త్యాగం చేసిన షణ్ముఖ్ని అయినా బయటకు తీసుకురా అని శ్రీరామ్ చెప్పడంతో.. కాజల్ అదే పని చేసింది. బయటకు వచ్చిన షణ్ముఖ్.. ట్విస్ట్ ఇస్తూ రవి, శ్రీరామ్లను నామినేట్ చేశాడు. ఈ ఇద్దర్లో కాజల్ చివరికి రవిని నామినేట్ చేసి జైలుకు పంపింది. చివరికి జైలులో మిగిలిన మానస్, సిరి, సన్నీ, రవిలు నామినేట్ కాగా.. అప్పుడే అయిపోలేదు.. ఇంకా ఉంది అన్నట్టు చివరిలో మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్బాస్. కెప్టెన్ అయిన యానికి మరో పవర్ ఇచ్చాడు. నామినేట్ అయిన సభ్యులు కాకుండా మిగిలిన వారిలో ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేయమని ఆదేశించాడు. దీంతో యానీ అంతా ఊహించినట్లే కాజల్ని నామినేట్ చేసింది. దంతో పదోవారం నామినేషన్స్లో మానస్, సిరి, కాజల్, రవి, సన్నీ ఉన్నట్లు బిగ్బాస్ ప్రకటించారు. మరి ఈ ఐదురురిలో ఎవరు పదోవారం బయటకు వెళ్లారో చూడాలి. -
విన్నర్, టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరో చెప్పేసిన విశ్వ
Bigg Boss 5 Telugu, 9th Week Vishwa Eliminated: విశ్వ ఎలిమినేషన్తో ఇంటిసభ్యులు డల్ అయిపోయారు. బెస్ట్ సంచాలకుడు, బెస్ట్ రేషన్ మేనేజర్, బెస్ట్ కెప్టెన్, బిగ్బాస్ హౌస్కు సూపర్ హీరో విశ్వ అని అతడిని ఆకాశానికెత్తారు. ఎంతో బాగా గేమ్ ఆడే విశ్వ వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. ఇక విశ్వ వెళ్లిపోతూ కంటెస్టెంట్లకు ర్యాంకులివ్వడంతో పాటు వారికి సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఇంట్లోకి వెళ్లాక నా మనసుకు కనెక్ట్ అయిన మొదటి వ్యక్తి ప్రియాంక అంటూ ఆమెకు 10వ ర్యాంక్ ఇచ్చాడు. కాజల్ బాగా ఆడుతుందని, కానీ తను ధైర్యాన్ని కోల్పోతుందంటూ 9వ ర్యాంకిచ్చాడు. నువ్వు స్ట్రాంగ్, కానీ గేమ్లో గివప్ ఇవ్వకూడదని జెస్సీకి సలహా ఇస్తూ అతడిని 8వ స్థానంలో ఉంచాడు. యానీ ఫైటర్ అని మెచ్చుకుంటూ ఆమెకు 7వ ర్యాంకిచ్చాడు. గెలుపోటములు సహజమని, ఓడిపోయినప్పుడు అతిగా బాధపడొద్దని మానస్కు సూచిస్తూ 6వ ర్యాంక్ ఇచ్చాడు. తర్వాత టాప్ 5 కంటెస్టెంట్లను వెల్లడించాడు. సిరి టాప్ 5లో ఉండాలన్నాడు. సన్నీ ఇలా కూల్గా ఉంటే బాగోలేడని, నువ్వు నీలాగే ఉండంటూ అతడికి నాల్గో ర్యాంకిచ్చాడు. గెలిస్తే చిల్ అవుతూ ఓడిపోతే కింద కుంపటి పెట్టినట్లు ఫీల్ అయ్యే షణ్ముఖ్కు 3వ స్థానం ఇచ్చాడు. రవిని అందరూ గుంటనక్క అనుకుంటారు, కానీ అతడు అలాంటివాడు కాదంటూ రవిని 2వ స్థానంలో నిలబెట్టాడు. ఇక శ్రీరామ్ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు విశ్వ. తాను కోల్పోయిన తమ్ముడిని శ్రీరామ్లో చూసుకుంటున్నాననంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడిని ఈ సీజన్కు విన్నర్గా మొదటి స్థానంలో నిలబెట్టాడు. -
షణ్ను మీద ప్రతీకారం తీర్చుకున్న రవి!
ప్రతివారం యాంకర్ రవి మీద విరుచుకుపడే నాగార్జున ఈసారి మాత్రం అతడిని మెచ్చుకున్నాడు. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్లో రవి కష్టాన్ని అభినందిస్తూ చప్పట్లు కొట్టాడు. నీకు నరకం అంటే ఏంటో చూపించారు కదా! ఇప్పుడు నువ్వు ప్రతీకారం తీర్చుకోవచ్చు అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడు నాగ్. ఇంకేముందీ.. ఏది దొరికితే అది కలిపి వరుసగా నాలుగైదు గ్లాసుల డ్రింక్ తాగిపించి తనను అష్టకష్టాలు పెట్టిన షణ్ముఖ్ను ఓ ఆటాడుకున్నాడు రవి. నచ్చినవి, నచ్చనవి అన్నీ కలిపి జ్యూస్ తయారు చేశాడు. ఆ జ్యూస్ను షణ్ను కళ్లు మూసుకుని తాగి అవస్థలు పడ్డాడు. తర్వాత శ్రీరామ్ తను ప్రతీకారం తీర్చుకోవడానికి సన్నీని ఎంచుకున్నాడు. ఉల్లిపాయ తింటూ జ్యూస్ తాగమని శ్రీరామ్ చెప్పగా ఏదో జన్మలో నువ్వు నాకు మొగుడివయ్యుంటావన్నాడు సన్నీ. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు ఇంకా ఎవరెవరు ఎలా పగ తీర్చుకున్నారో చూడాలని ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. -
రవిని టార్గెట్ చేసి టార్చర్ పెట్టారు: మండిపడ్డ అషూ రెడ్డి
ప్రస్తుతం బిగ్బాస్ హౌస్లో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ నడుస్తోంది. ఎలాగైనా కెప్టెన్ అయి ఇమ్యూనిటీ సాధించాలని గట్టి పట్టుదల మీదున్నారు కంటెస్టెంట్లు. వీరిని రెండు టీమ్లుగా విభజించిన బిగ్బాస్.. టాస్క్ ముగిసే సమయానికి ఎవరు ఎక్కువ పాయింట్లు సాధిస్తే ఆ టీమ్ గెలిచినట్లని ప్రకటించాడు. గెలిచిన టీమ్లోని సభ్యులు కెప్టెన్సీ కంటెండర్లు అవుతారని తెలిపాడు. సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్ అనే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్లో శ్రీరామ్, షణ్ముఖ్, ప్రియాంక, కాజల్, మానస్ సూపర్ హీరోల టీమ్ కాగా మిగిలిన వారంతా విలన్స్ టీమ్లో ఉంటారు. సమయానుకూలంగా ఒక్కో టీమ్ అవతలి టీమ్లోని ఇంటిసభ్యుడిని టార్గెట్ చేస్తుంది. వారికి చిత్ర విచిత్ర టాస్కులిచ్చి వాటిలో ఓడిపోయేట్లుగా చేసి ఐ క్విట్ అనిపిస్తేనే పాయింట్ దక్కుతుంది. ఈ క్రమంలో సూపర్ హీరోస్ టీమ్ రవిని టార్గెట్ చేసింది. అతడిని ఓడిస్తే ఆట సులువు అవుతుందని ప్లాన్ రచించాడు షణ్ముఖ్. ఇందుకోసం అతడితో ఎలాగైనా ఐ క్విట్ అనిపించాలని ఎన్నో కష్టతరమైన టాస్కులిచ్చారు. ఒంటి మీదున్న దుస్తులతో సహా తనకు చెందిన అన్ని బట్టలకు పేడ అంటించాలని చెప్పారు. ఇది విన్న రవి ఏమాత్రం తటపటాయించకుండా రెడీ అంటూ టాస్క్ మొదలుపెట్టాడు. అతడి ధైర్యాన్ని చూసి వెనకడుగు వేసిన అవతలి టీమ్ సభ్యులు అన్ని బట్టలకు పేడ అంటించడం వద్దనేశారు. తర్వాత ఏవేవో పదార్థాలు కలిపి తయారు చేసిన జ్యూస్ను తాగాలని చెప్పగా రవి గుటగుటా తాగేశాడు. డ్రింక్ తాగిన వెంటనే స్క్వాడ్స్ చేయమన్నారు. రవికి బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ ఉంది, కాబట్టి ఆ టాస్క్ చేయనని చేతులెత్తేస్తాడనుకున్నారు, కానీ రవి వెనకడుగు వేయలేదు. దాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేశాడు. View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) ఆ తర్వాత రవితో మరో జ్యూస్ తాగించి గుండ్రంగా తిరగమని చెప్పి మళ్లీ మరో జ్యూస్ను చేతికందించారు. ఇవన్నీ పూర్తి చేసినప్పటికీ హీరోస్ టీమ్ ఊరుకోలేదు. ఏదేమైనా అతడితో క్విట్ అనిపించాలని డిసైడ్ అయింది. మరోసారి తాగడానికి వీలు లేని విచిత్ర జ్యూస్ను రవితో తాగిపించారు. ఇదంతా చూసి రవి అభిమానులే కాదు పలువురు సెలబ్రిటీలు సైతం ఫీలవుతున్నారు. బిగ్బాస్ బ్యూటీ అషూ రెడ్డి అయితే హౌస్మేట్స్ మీద ఓ రేంజ్లో ఫైర్ అయింది. 'వాళ్లు అతడిని టార్గెట్ చేస్తున్నారు. అది అక్కడ క్లియర్గా కనిపిస్తోంది. దీన్ని టార్చర్ అంటారు, కానీ గేమ్ అనరు' అని మండిపడింది. పలువురు రవి ఫ్యాన్స్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రవికి వెన్ను నొప్పి ఉందని తెలిసీ అతడిని చిత్రహింసలకు గురి చేశారని అంటున్నారు. View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) -
మీరు నా బేబీలు.. ఇద్దరూ చెరో ముద్దివ్వొచ్చుగా: జెస్సీ
Bigg Boss Telugu 5, Episode 60: పింకీ గురించి అందరి నోటా ఒకటే మాట.. ఆమె మానస్ ధ్యాసలో పడి గేమ్ ఆడటం లేదని! తాజాగా ఇదే మాటను సన్నీ కూడా అన్నాడు. పింకీ.. నీ జోన్లో ఉందని మానస్తో చెప్పుకొచ్చాడు సన్నీ. నీ ఆట నువ్వాడని ఆమెకు సలహా ఇచ్చానన్నాడు. దీనిపై మానస్ స్పందిస్తూ.. 'ఆమె ఎవరి మాటా వినదు, తాను చేయాలనుకుందే చేస్తుంది. నువ్వు చెప్పినప్పుడు కూడా సరే అన్నయ్య అంటుంది కానీ ఆ వెంటనే పోరా బచ్చాగా అని లైట్ తీసుకుంటుంది' అని చెప్పుకొచ్చాడు. అయితే పింకీ గేమ్ను తాను డిస్టర్బ్ చేయడం లేదన్నాడు మానస్. ఇక మెడలు పట్టేసిన జెస్సీ హాయిగా రెస్ట్ తీసుకోకుండా ఓవైపు సిరి, మరోవైపు ప్రియాంకను కూర్చోబెట్టుకుని పులిహోర కలపడం మొదలుపెట్టాడు. 'బుగ్గలు రెండు ఒకలా మాసిపోతున్నాయి. ఇద్దరూ కలిపి ఒక ముద్దు పెడితే బాగుంటుంది' అని కోరిక వెలిబుచ్చాడు. ఇది విని షాకైన సిరి కెమెరా నుంచి కాలి వచ్చి తంతుందని సెటైర్ వేసింది. ఏంటీ ముద్దులు పెట్టరా? అని మరోసారి అడగ్గా ఇద్దరూ ససేమీరా అనడంతో వాళ్లిద్దరినీ తన బేబీలని చెప్పాడు. అనంతరం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ను ప్రవేశపెట్టాడు బిగ్బాస్. ఇందులో ఇంటిసభ్యులు రెండు టీములుగా విడిపోయారు. రవి, జెస్సీ, యానీ, విశ్వ, సిరి, సన్నీ నల్ల గులాబీలను ఎంచుకుని సూపర్ విలన్స్ టీమ్గా, ఎర్ర గులాబీలను ఎంచుకున్న మిగిలిన వారంతా సూపర్ హీరోస్ టీమ్గా విడిపోయారు. ఇతర టీమ్లోని సభ్యులతో ఐ క్విట్ అని చెప్పేలా చేయడమే గేమ్. అలా చెప్పించడం కోసం ఏమైనా చేయవచ్చు! గేమ్ స్టార్ట్ అయ్యాక హీరోస్ టీమ్లోని కాజల్ గార్డెన్ ఏరియాలో ఉన్న బాక్స్ తాళాలన్నీ ఓపెన్ చేసింది. ఇది చూసిన విలన్స్ టీమ్లోని విశ్వ వెంటనే వచ్చి తన టీమ్వైపు ఉన్న డోర్ తాళాలను తెరిచి హౌస్లోకి పరిగెత్తాడు. దీంతో ప్రియాంక అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఎంత ప్రయత్నించినప్పటికీ విశ్వ మొదటగా స్టోర్ రూమ్లో అడుగుపెట్టి తాళాలు అక్కడ పెట్టేశాడు. ఈ క్రమంలో తనను నెట్టేశాడని, గట్టిగా పట్టుకున్నారంటూ పింకీ చిర్రుబుర్రులాడింది. మీరు ఫిజికల్ అయితే నేను దాని అమ్మ మొగుడినవుతానని విలన్స్ టీమ్కు వార్నింగ్ ఇచ్చింది. మొదటి రౌండ్లో విలన్స్కు ఛాన్స్ రాగా వాళ్లు హీరోల టీమ్ నుంచి శ్రీరామ్ను సెలక్ట్ చేశారు. అతడికి పెయింట్ నెత్తిన పూసుకోవడం, విచిత్ర జ్యూస్లు తాగడం వంటి టాస్క్లిచ్చారు. అన్నింటినీ విజయవంతంగా పూర్తి చేయడంతో హీరోల టీమ్కు ఒక పాయింట్ లభించినట్లైంది. తర్వాతి రౌండ్లో పింకీ తనను తోసిందని సిరి ఆరోపించింది. తనను అందరూ చుట్టుముట్టేస్తే తోయకుండా ఏం చేయాలంది పింకీ. ఈ ఇద్దరి వాదనలు విన్న షణ్ను.. పింకీ, సిరి ఇద్దరిదీ తప్పేనంటూ పెదరాయుడిలా తీర్పునిచ్చాడు. తర్వాతి రౌండ్లో హీరోలు.. విలన్స్ టీమ్లోని రవిని టార్గెట్ చేశారు. రవి తన బట్టలన్నింటికీ పేడ అంటించాలని చెప్పాడు షణ్ను. కానీ జాలేసి కేవలం ధరించిన బట్టలకు మాత్రమే పేడ అంటిస్తే సరిపోతుందన్నారు. తర్వాత అన్ని మిక్స్ చేసిన జ్యూస్ను తాగాలని చెప్పారు. ఆ వెంటనే స్క్వాడ్స్ చేయాలన్నారు. అయితే రవి దేనికీ జంకకుండా, వెనకడుగు వేయకుండా, తన వెన్నునొప్పిని సైతం పక్కనపెట్టి వీటన్నింటినీ విజయవంతంగా పూర్తి చేశాడు రవి. మరోసారి జ్యూస్ ఇవ్వగా దాన్ని కూడా గడగడా తాగేశాడు. అయితే అతడికి బ్యాక్ ప్రాబ్లమ్ ఉందని తెలిసినా కూడా అలాంటి కష్టమైన టాస్కులు ఎలా ఇస్తారని ఫైర్ అయింది యానీ. ఇవన్నీ గుర్తుపెట్టుకుని తిరిగి మీకే ఇస్తానని చెప్పింది. అయినప్పటికీ లెక్క చేయని విలన్లు అతడితో గుండ్రంగా తిరగమని చెప్పారు. ఆ వెంటనే మరో జ్యూస్ గ్లాస్ను సైతం గడగడా తాగాడు. అయినప్పటికీ వారూ మరో డ్రింక్ను తాగమని పురమాయించగా అతడు బాగోలేదంటూనే కళ్లు మూసుకుని తాగాడు. తన టీమ్ను గెలిపించడం కోసం సాయశక్తులా పోరాడి అందరి మన్ననలు పొందాడు -
Bigg Boss 5 Telugu: దుస్తులిప్పి నిలబడటానికైనా రెడీ: రవి
Bigg Boss 5 Telugu Latest Promo: బిగ్బాస్ హౌస్లో తొమ్మిదోవారం ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కెప్టెన్ మినహా ఇంటి సభ్యులందరిని నామినేషన్స్కి పంపిన బిగ్బాస్.. టాస్క్పేరుతో ఇద్దరిని సేఫ్ జోన్లోకి పంపాడు. దీంతో ఈ వారం నామినేషన్లో ఎనిమిదిమంది ఉన్నారు. ఇలా నామినేషన్ ప్రక్రియ ముగిసిందో లేదో.. ఇంటి సభ్యులకు మరో గండం వచ్చిపడింది. అదే కెప్టెన్సీ టాస్క్. ఇందులో భాగంగా ఈ వారం ‘సూపర్ హీరోస్ vs సూపర్ విలన్స్’అనే టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. దీనికోసం ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విడదీశాడు. విలన్స్ టీమ్లో రవి, యానీ, సన్నీ, విశ్వ, జెస్సీ ఉన్నారు. టీమ్ని రవి లీడ్ చేస్తున్నాడని, అతన్ని పడగొడితే టీమ్ మొత్తం సెట్ అయిపోతుందని షణ్ముఖ్ తన టీమ్ సభ్యులకు చెబుతున్నారు. మరోవైపు యాంకర్ రవి టాస్క్ కోసం దుస్తులిప్పి నిలబడమన్నా నిలబడతా’అని తన సభ్యుల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్నాడు. రవిని టార్గెట్ చేసిన హీరోస్ టీమ్.. అతనికి ప్రత్యేక టాస్క్లు ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారు. అయితే రవి మాత్రం అన్నింటికీ తెగించి టాస్క్లు ఆడుతున్నాడు. మరి ఈ టాస్క్లో ఎవరు గెలిచి కెప్టెన్ అయ్యారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
డబ్బుల కోసం రాలేదు, నన్ను బయటకు పంపండి: రవి ఆవేదన
Bigg Boss Telugu, Episode 53: కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్లో అందరూ పాల్గొనడానికి వీల్లేనందున ఎవరు డ్రాప్ అవుతారన్న దానిపై హౌస్మేట్స్ చర్చించారు. ఈ సందర్భంగా కెప్టెన్ సన్నీ మాట్లాడుతూ.. టాస్క్లో డ్రాప్ అవుతానన్న జెస్సీ.. మళ్లీ వచ్చి ఆడతానన్నాడంటూ ఇంటిసభ్యుల దగ్గర ప్రస్తావించాడు. జెస్సీకి ఆడాలని ఉన్నందున అతడి కోసం టాస్క్లో నుంచి వైదొలగడానికి యానీ, సన్నీ సిద్ధమయ్యారు. కానీ జెస్సీ మాత్రం తను అన్ఫిట్ అని, తనే డ్రాప్ అవుతానని చెప్పాడు. తనకోసం యానీ టాస్క్ నుంచి తప్పుకోవడం ఇష్టం లేదన్నాడు. ఆమె గేమ్ ఆడి గెలవాలని, ఎందుకంటే ఆమె అందరికీ వండి పెడుతుందని, ఒకవేళ కెప్టెన్ అయితే మరిన్నివారాలు ఆమె హౌస్లో ఉన్నవాళ్లకు వంట చేస్తుందని చెప్పుకొచ్చాడు. రంగు పడుద్ది.. 'అభయహస్తం' అనే కెప్టెన్సీ టాస్క్లో 'రంగు పడుద్ది' అనే నాలుగో ఛాలెంజ్ఇచ్చాడు బిగ్బాస్. ఈ ఛాలెంజ్లో కాన్వాస్పై ఎవరి రంగు ఎక్కువగా ఉంటుందో వాళ్లు గెలిచినట్లు. ఈ టాస్క్లో ప్రియాంకపై యానీ గెలవడంతో పాటు హౌస్లోకి అడుగుపెట్టే అవకాశాన్ని పొందింది. మరోపక్క షణ్ను మీద ఉన్న చనువుతో మనిద్దరం కలిసి ఓ సాంగ్ చేద్దాంరా అని తన మనసులోని మాటను బయటపెట్టింది సిరి. దీంతో చికాకుపడ్డ షణ్ను.. 'హమీదా కూడా ఇంతే.. వర్క్ అనేసరికి నేను గుర్తొస్తాను. బయటకు వెళ్లి వీడియోలు చేద్దాం అనేసరికి నేను గుర్తొస్తాను' అని అసహనం ప్రదర్శించాడు. దీంతో హర్ట్ అయిన సిరి 'నీతో సాంగ్ చేయడానికే నేనిదంతా చేస్తున్నానా?' అని చిర్రుబుర్రులాడింది. ఆమె అలకబూనిందని అర్థమైన షణ్ను వెంటనే సారీ చెప్పాడు. కానీ అప్పటికే పీకల్లోతు కోపంలో ఉన్న సిరి.. 'ఎవడిక్కావాల్రా సారీ, ఇష్టమొచ్చినట్లు మాట్లాడేసి.. నాకు ఒళ్లు మండిపోతుంది' అని ఫైర్ అయింది. ఇక ఎప్పటిలాగే కాసేపటికే ఇద్దరూ తిరిగి మామూలైపోయారు. నేను డబ్బుల కోసం రాలేదు: రవి బిగ్బాస్ ఇచ్చిన 5వ చాలెంజ్ 'కారులో హుషారుగా' టాస్క్లో భాగంగా పోటీదారులు బొమ్మ కారును నడిపిస్తూ పూల కుండీలను వారి బాక్స్లో పెట్టాల్సి ఉంటుంది. ఈ టాస్క్లో కాజల్పై సన్నీ విజయం సాధించాడు. అయితే కాజల్ గేమ్ లైట్ తీసుకుందని షణ్ను, సిరితో చెప్పుకొచ్చాడు రవి. ఈ క్రమంలో హౌస్లో కొద్దివారాలుగా ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణను వారిముందుంచాడు. 'నేను డబ్బుల కోసం రాలేదు. నా భార్య నిత్య, కూతురు వియా ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఉంది. వాళ్లు ఎలా ఉన్నారో చెప్పండి, లేదంటే నన్నైనా బయటకు పంపండి. దానిక్కూడా నేను సిద్ధమే, కానీ ఈ ఒత్తిడి నా వల్ల కావడం లేదు' అని వాపోయాడు. మరోపక్క మానస్.. రవి గేమర్ అని అభిప్రాయపడ్డాడు. అతడు ఎప్పుడు? ఎవరిని ఎలిమినేట్ చేయాలి? అని ప్లాన్ చేస్తుంటాడని కాజల్తో చెప్పుకొచ్చాడు. మానస్ అడుగుపెట్టాక వార్ వన్సైడ్ 'బంతిలో ఉంది భాగ్యం' అనే స్పెషల్ టాస్క్తో కెప్టెన్సీ పోటీదారులయ్యేందుకు హౌస్మేట్స్కు మరో ఛాన్స్ ఇచ్చాడు బిగ్బాస్. ఈ గేమ్లో బజర్ మోగినప్పుడు సర్కిల్లో ఉన్న బంతి సాధించిన ప్రతిసారి కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయవచ్చు. ఈ గేమ్లో వరుసగా బంతి సాధించిన మానస్.. విశ్వ, రవి, జెస్సీ, లోబో, కాజల్, పింకీలను ఎలిమినేట్ చేసి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. ఫైనల్గా ఈ వారం కెప్టెన్సీ కోసం షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, యానీ, సన్నీ, మానస్ పోటీపడుతున్నట్లు బిగ్బాస్ ప్రకటించాడు తెలిపాడు. అంతేకాకుండా బిగ్బాస్ హౌస్లో లాక్డౌన్ ఎత్తేస్తున్నట్లు వెల్లడించాడు. -
బిగ్బాస్: ఎట్టకేలకు గెలిచిన షణ్ముఖ్.. చెమటలు కక్కిన శ్రీరామ్.
Bigg Boss Telugu 5, Episode 52: బిగ్బాస్ ఇంట్లో ఎనిమిదోవారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇంటి సభ్యులకు చుక్కలు చూపిస్తోంది. కెప్టెన్ అయ్యేందుకు కంటెస్టెంట్స్ నానా కష్టాలు పడుతున్నారు. లోబో, షణ్ముఖ్ ఆవుపేడతో ఆటలాడగా.. సిరి, రవి స్విమ్మింగ్ఫూల్లో సీసాలు ఏరారు. మరోవైపు మానస్, శ్రీరామచంద్రలు చమటలు పట్టేలా తాళ్లను ఊపారు. మరి ఈ టాస్కుల్లో ఎవరుగెలిచారు. హౌస్ని లాక్డౌన్ చేస్తున్నట్లు బిగ్బాస్ ఎందుకు ప్రకటించారు. ఇంట్లోకి వెళ్లేందుకు కంటెస్టెంట్స్ పడ్డ కష్టాలేంటో నేటి ఎపిసోడ్ చదివేద్దాం. సిరికి షణ్ముఖ్ గోరు ముద్దలు నామినేషన్ ప్రక్రియలో విశ్వ ప్రవర్తన తనకు నచ్చలేదని సిరికి చెప్పాడు షణ్మఖ్. ఆమెకు గోరుముద్దలు తినిపిస్తూ.. తన గోడునంతా చెప్పుకున్నాడు. అందరిలాగే తనకు కూడా అమ్మ మొదటిసారే లెటర్ రాసిందని.. అందరు చెపుకుంటారు, మనం చెప్పుకోము అంతే తేడా అన్నాడు. అలాగే విశ్వ చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడని, నామినేషన్ అంటే ఆయన భయమని చెప్పాడు. టాప్ 5లో నేను, మానస్ ఉంటాం : ప్రియాంక బెడ్రూమ్ ఏరియాలో పింపీ, సిరి, మానస్ ముచ్చట్లు పెట్టారు. ఈ సారి నామినేషన్లో ఆరుగురు ఉన్నారు కదా అని మానస్ అడగ్గా.. అవును ఒక గర్ల్, ఐదుగురు బాయ్స్ ఉన్నారని సిరి చెప్పింది. పింకి ఈ సారి కూడా నామినేషన్లో లేరని సిరి అనగా.. నేను మానస్ టాప్ 5లో ఉంటామని ప్రియాంక చెప్పింది. దానికి సిరి నవ్వుతూ.. 'మేమేంటి అడుక్కోవాలా..?' అని ప్రశ్నించించగా.. మా పక్కన మీ ముగ్గురు కూడా ఉంటారులేని కౌంటర్ ఇచ్చింది పింకి. ఇక మానస్ అయితే.. అంకుల్స్ అంతా బయటకు వెళ్లిపోవాలి.. కుర్రాళ్లంతా లోపలే ఉండాలని మాసన్ కోరుకోగా.. ఒకవేళ ఆంటీలను బయటకు పోవాలని చెబితే.. పింకీ వెళ్తుందని సిరి నవ్వుతూ కౌంటర్ వేయగా.. మొహం పగిలిపోద్దని ప్రియాంక ఫన్నీ వార్నింగ్ ఇచ్చింది. షన్ను అంటే.. ఇన్ మోజ్ రూమ్ విత్ త్రీ: యాంకర్ రవి ఇక రవి ఏమో ఎప్పటిమాదిరే.. ఇతరులను ఇన్ఫ్లూయన్స్ చేసే పనిలో పడ్డాడు. షణ్ముఖ్ దగ్గరకు వెళ్లి.. 'నాకు తెలిసి నేను చూసిన దాంట్లో వేర్ ఈజ్ షన్ను అంటే.. ఇన్ మోజ్ రూమ్ విత్ త్రీ.. ఆన్ బెడ్ విత్ త్రీ..' అంటూ షన్ను పరువు తీశాడు రవి. కెప్టెన్సీ పోటీదారుల టాస్క్..‘అభయహస్తం’ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం ఇంటిని లాక్డౌన్ చేసినట్లుగా ప్రకటించారు బిగ్ బాస్. ఇందులో భాగంగా అభయహస్తం టాస్కులో గెలిచి కెప్టెన్సీ కంటెస్టెంట్ గా సెలక్ట్ అయిన సభ్యులు మాత్రమే ఇంట్లోకి వెళ్లాల్సి ఉంటుందని కండిషన్ పెట్టాడు. ఇందులో భాగంగా గార్డెన్ ఏరియాలో కెప్టెన్సీ టాస్క్ కోసం ఏర్పాట్లు చేశారు. ఈ వారం కెప్టెన్సీ పోటీదారులు అవ్వడానికి, అలాగే ఇంట్లోకి వెళ్లడానికి ఐదు చాలెంజ్లు ఎదుర్కొవాల్సి ఉంటుందని చెప్పారు బిగ్బాస్. ఈ చాలెంజ్లో భాగంగా ఎవరెవరు పోటీ పడతారనేది ఇంటి సభ్యులంతా ఏకాభిప్రాయంతో చెప్పాలి. అలాగే ఒక చాలెంజ్లో ఓడినవారు ఇంటి సభ్యులను ఒప్పించి మిగతా చాలెంజ్లలో కూడా పోటీపడొచ్చు. మొదటి చాలెంజ్..మట్టిలో ముత్యాలు ఈ చాలెంజ్లో భాగంగా గార్డెన్ ఏరియాలో బాత్టబ్లో మట్టి, పేడ, ముత్యాలు కలిపి ఉన్నాయి. దాని నుంచి ఎవర ఎక్కువ ముత్యాలు తీస్తారో వారే విజేతలు. ఒక్కోసారి ఒక్కో ముత్యాన్ని మాత్రమే వేయాలి. ఈ టాస్క్కి ఇంటి సభ్యులందరూ ఏకాభిప్రాయంతో ఇప్పటివరకూ కెప్టెన్ పోటీదారులుగా అర్హత సాధించలేకపోయిన షణ్ముఖ్, లోబోలు వెళ్లారు. ఇందులో టాస్క్లో షన్నూ 101 ముత్యాలను ఏరి లోబో(74)పై విజయం సాధించాడు. అయితే షణ్ముఖ్ తీసిన ముత్యాలు సరిగా లేవని విశ్వ, శ్రీరామచంద్ర, రవి అనగా.. నీట్గా ఉండటం మ్యాటర్ కాదు.. ఎక్కువ తీయాలంతే అంటూ అడ్డంగా వాదించింది సిరి. చివరకు సంచాలకులుగా ఉన్న సన్నీ.. షణ్ముఖ్ని విన్నర్గా ప్రకటించడంతో సిరి ఎగిరిగంతేసి షణ్ముఖ్ని గట్టిగా కౌగిలించుకుంది. రెండో చాలెంజ్ గాలం మార్చే మీ కాలం రెండో చాలెంజ్గా ‘గాలం మార్చే మీ కాలం’టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. ఈ టాస్క్లో భాగంగా స్విమ్మింగ్ ఫూల్ అడుగున ఉన్న బాటిల్స్ని ఫిషింగ్ రాడ్తో బయటకు తీయాలి. ఎండ్ బజర్ మోగేలోపు ఎవరు ఎక్కువ బాటిల్స్ని బయటకు తీస్తారు వారే విజయం సాధించినట్లు. దీని కోసం రవి, సిరి హోరా హోరిగా పోటీపడ్డారు. చివరకు సిరి 15 బాటిల్స్ని బయటకు తీసి రవి(12)పై విజయం సాధించింది. మూడో చాలెంజ్.. తాడులు తకదిమి మూడో చాలెంజ్గా తాడుల తకదిమి టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా ఎవరైతే రోప్లను ఎక్కువగా వేగంగా కదుపుతూ ఆపకుండా ఉంటారో వారే గెలుస్తారు. ఆపేసిన వారు ఓడిపోతారు. దీని కోసం శ్రీరామచంద్ర, మానస్ పోటీ పడ్డారు. ఇద్దరు చెమటలు వచ్చేలా తాడులను ఊపారు. చివరకు మానస్ భరించలేక తాడులను వదిలేయడంతో శ్రీరామ్ విజయం సాధించాడు. అయితే మిగిలిన టాస్క్లతో పోల్చితే ఈ టాస్క్ కోసం శ్రీరామచంద్ర చాలా కష్టపడ్డాడు. చెమటలు వచ్చినప్పటికీ.. తాడులను ఊపడం ఆపలేదు. దీంతో మూడో విజేతగా నిలిచి ఇంట్లోకి ప్రవేశించాడు. మొత్తంగా ఇప్పటివరకు కెప్టెన్సీ దారులుగా షణ్ముఖ్, సిరి, శ్రీరామచంద్రలు గెలిచి, బిగ్బాస్ హౌస్లోకి వెళ్లారు. మిగిలి సభ్యులంతా బయటే ఉన్నారు. మరి వారిలో ఏ ఇద్దరు చాలెంజ్లు గెలిచి కెప్టెన్సీ పోటీదారులైన షన్నూ, సిరి, శ్రీరామ్లతో పోటీపడ్డారు? ఈ వారం కెప్టెన్గా ఎవరు ఎంపికయ్యారో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. -
నా కొడుకు నాకు పుట్టలేదు, నీ బాధ అర్థం చేసుకోగలను: సిరి
Bigg Boss Telugu 5, Episode 51: రవి లోబోకు చాలా సపోర్ట్ చేస్తాడు, కానీ అతడు మాత్రం రవికి సపోర్ట్ చేయడు, ఫ్రెండంటాడు, కానీ పదేపదే నామినేట్ చేస్తాడు అని పింకీతో చెప్పుకొచ్చింది యానీ మాస్టర్. ఇంతలో లోబో నమాజ్ చేసుకుంటూ ఏడ్చేశాడు. దీంతో రవి అతడిని దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. బిగ్బాస్ హౌస్లో కంటెస్టెంట్లు అడుగుపెట్టి 50 రోజులు పూర్తయిందన్న బిగ్బాస్.. మీకు ఎంతో ప్రియమైనవారి నుంచి లేఖను పొందే అవకాశం లభిస్తుందని ఊరించాడు. కానీ.. ఏదైనా దక్కించుకోవాలంటే ఇంకేదైనా వదులుకోవాల్సి వస్తుందని నామినేషన్ గురించి హింటిచ్చాడు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా పోస్ట్ మ్యాన్ ఇద్దరు ఇంటిసభ్యులను పవర్ రూమ్కు పిలుస్తుంటాడు. వారి ముందున్న బ్యాగ్లోని రెండు లేఖల్లో ఒక్కరికి మాత్రమే లేఖ ఇచ్చి మిగతాది చింపివేయాల్సి ఉంటుంది. లెటర్ అందుకోలేనివాళ్లు నామినేట్ అయినట్లు లెక్క! నాకు పుట్టకపోయినా నా దగ్గర కూడా ఒక బాబు ఉన్నాడు మొదటగా పవర్ రూమ్లోకి వెళ్లిన మానస్, శ్రీరామ్లకు లోబో, ప్రియాంక లేఖలు అందాయి. దీంతో లోబో మాట్లాడుతూ.. తన భార్య గర్భవతి అని, అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందంటూనే పింకీ కోసం తన లేఖను త్యాగం చేశాడు. కానీ ఉబికి వస్తున్న కన్నీళ్లను మాత్రం ఆపుకోలేకపోయాడు. తర్వాత షణ్ను- రవిలకు విశ్వ, సిరి లేఖలు అందాయి. అయితే విశ్వ కోసం తన ప్రియుడు శ్రీహాన్ రాసిన లేఖను ముక్కలు చేయడానికి సిద్ధపడింది సిరి. 'నాకు పుట్టకపోయినా నా దగ్గర కూడా ఒక బాబు ఉన్నాడు, కాబట్టి నీకు పుట్టిన పిల్లల కోసం ఎంత తపన ఉంటుందో నేను అర్థం చేసుకోగలను' అంటూ విశ్వకు లేఖ అందించమని చెప్తూ ఎమోషనల్ అయింది. ఏడ్చేసిన శ్రీరామ్, ఓదార్చుతూ ముద్దులు పెట్టిన పింకీ తర్వాత పింకీ- కాజల్కు యానీ మాస్టర్, మానస్ల లేఖలు అందాయి. యానీ పరిస్థితి అర్థం చేసుకున్న మానస్ తన లేఖను త్యాగం చేశాడు. కానీ పింకీ మాత్రం మానస్ లెటర్ ముక్కలవుతున్నందుకు ఎంతగానో బాధపడిపోయింది. విశ్వ-లోబోలకు రవి, శ్రీరామ్ లెటర్స్ వచ్చాయి. అయితే పెద్ద మనసు చేసుకున్న శ్రీరామ్.. రవి కోసం తన లెటర్ను వదులుకునేందుకు సిద్ధపడిపోయాడు. కానీ లోబో మాత్రం రవి తన ఫ్యామిలీని గుర్తు చేసుకునేందుకు బొమ్మ, టీ షర్ట్, లెటర్ ఉన్నాయి కాబట్టి శ్రీరామ్కే లెటర్ ఇవ్వాలన్నాడు, ఇందుకోసం రవిని ఒప్పించేందుకు ప్రయత్నించాడు. దీంతో రవి తన లెటర్ను చింపివేసి శ్రీరామ్కు వచ్చిన లేఖను చదివి వినిపించాడు. తర్వాత కాసేపటికి ఆ లేఖను పట్టుకుని ఒంటరిగా కూర్చున్న శ్రీరామ్ ఇల్లు గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇది చూసిన పింకీ అతడి కన్నీళ్లు తుడిచి, హగ్గిచ్చి, బుగ్గపై ముద్దులు పెట్టింది. అమ్మా, నువ్వే నా ఇన్స్పిరేషన్: షణ్ముఖ్ తర్వాత యానీ- సిరిలకు షణ్ముఖ్, కాజల్ లెటర్స్ వచ్చాయి. దీంతో మొదటిసారి కాజల్ తన కన్నీళ్లు ఆపుకోలేక గక్క్క పెట్టి ఏడ్చేసింది. ఇది చూసి కరిగిపోయిన షణ్ను కాజల్ను లెటర్ తీసుకోమన్నాడు. అయితే సిరి మాత్రం 'నేనెలాగో అందుకోలేకపోయాను, కనీసం నువ్వైనా తీసుకో' అంటూ ఏడ్చేసింది. కానీ షణ్ను అందుకు ఒప్పుకోకపోవడంతో అతడి లేఖ తునాతునకలైంది. ఇది చూసి దుఃఖాన్ని దిగమింగుకున్న షణ్ను.. 'అమ్మా, క్యాన్సర్ను జయించావు, అమ్మమ్మ చనిపోయినప్పుడు ఆ బాధ నుంచి కోలుకున్నావు, నువ్వే నా ఇన్స్పిరేషన్, నేను ఈ బాధలో నుంచి బయటపడతాను' అని చెప్పుకొచ్చాడు. కానీ లోపలకు వెళ్లి గుండెలోని భారాన్ని దించుకుంటూ గట్టిగా ఏడ్చేశాడు. జెస్సీ కోసం త్యాగానికి పూనుకున్న శ్రీరామ్.. ఇక కెప్టెన్ సన్నీకి స్పెషల్ పవర్ లభించింది. దీని ద్వారా జెస్సీ లెటర్ను సన్నీ చేతిలో పెట్టాడు బిగ్బాస్. జెస్సీకి లెటర్ ఇచ్చి సేవ్ చేయాలంటే ఆల్రెడీ సేవ్ అయినవాళ్ల దగ్గరి నుంచి లేఖ అందుకోవాలని చెప్పాడు. దీంతో శ్రీరామ్.. జెస్సీ కోసం తన లేఖను త్యాగం చేసి నామినేట్ అయ్యేందుకు రెడీ అయ్యాడు. కానీ షణ్ను, సిరి, జెస్సీ.. శ్రీరామ్కు హగ్గిచ్చి దూరాన్ని చెరిపేసుకోవాలని రవి కండీషన్ పెట్టాడు. ఈ కండీషన్కు త్రిమూర్తులు ఒప్పుకోకపోగా మా మధ్య డిస్టబెన్స్ అంతా క్లియర్ అయిపోయిందని చెప్పడంతో రవి వెనక్కు తగ్గాడు. అలా శ్రీరామ్ నామినేషన్లోకి వెళ్లి జెస్సీని సేవ్ చేశాడు. తర్వాత కెప్టెన్ సన్నీకి లేఖ అందడంతో ఆనందంలో మునిగి తేలాడు. ఇంతటితో నామినేషన్ ప్రక్రియ పూర్తవగా రవి, లోబో, శ్రీరామ్, సిరి, షణ్ముఖ్, మానస్ నామినేట్ అయ్యారు. -
'రవి కన్నింగ్, స్ట్రాంగ్ కంటెస్టెంట్లను పంపించేస్తున్నాడు'
Bigg Boss 5 Telugu, Priya Elimination Interview: బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్లో పాపులర్ కంటెస్టెంట్ ప్రియ. అదరకుండా, బెదరకుండా గేమ్ ఆడే ప్రియ ఒకే ఒక్క గొడవతో ఎలిమినేట్ అయిపోయింది. ఒక టాస్కులో సన్నీని రెచ్చగొట్టడం, చెంప పగలగొడతానంటూ నోరు జారడం, అనవసరంగా కయ్యం పెట్టుకోవడం లాంటి వింత ప్రవర్తనను బిగ్బాస్ ప్రేక్షకులు సమ్మతించలేకపోయారు. ఫలితంగా అప్పటిదాకా ఓటింగ్లో టాప్లో దూసుకెళ్లిన ప్రియ ఆ ఒక్క ఎపిసోడ్తో కిందకు పడిపోయింది. వెరసి.. ఏడోవారం బిగ్బాస్ హౌస్కు గుడ్బై చెప్పేసింది. తాజాగా ఆమె అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్బాస్ బజ్ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా హౌస్మేట్స్ గురించి తన అభిప్రాయాలను వెల్లడించింది. యాంకర్ రవి గురించి చెప్తూ.. అతడు ఎత్తుకు పై ఎత్తులు వేయగలడని తెలిపింది. 'రవితో కలిసి గేమ్ ఆడినవాళ్లు ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నారో, మరేంటో తెలీదు కానీ నెక్స్ట్ వీక్ వాళ్లు పక్కా ఎలిమినేట్ అవుతున్నారు, ఎందుకు?' అని ప్రశ్నించింది అరియానా. దీనికి ప్రియ బదులిస్తూ.. అందుకే అతడిని వెరీ కన్నింగ్, వెరీ స్మార్ట్ అంటుంటాను. 'ఎవరెవరు స్ట్రాంగో, వాళ్లను పంపించే ప్లాన్లో ఉన్నాడు రవి' అని అతడి గేమ్ను బయటపెట్టింది. కాజల్ గేమ్ప్లాన్కు అందరూ భయపడాల్సిందేనన్న ప్రియ ఆమె టాప్ 5లో ఉండకూడదని కోరుకోవడం గమనార్హం. 'ఒక వ్యక్తిని టార్గెట్ చేయాలనుకుంటే వారి అంతు చూసేంతవరకు వదలరా?' అని అరియానా సూటిగా ప్రశ్నించగా 'అది నా గేమ్ ప్లాన్' అంటూ తెలివిగా బదులిచ్చింది ప్రియ. స్టేజీమీద షణ్ముఖ్ను ఆకాశానికెత్తేసిన ప్రియ ఇంటర్వ్యూలో మాత్రం అతడు భయంకరమైన వ్యక్తి అని చెప్పుకొచ్చింది. అతడు ఏం మాట్లాడతాడో తనకే తెలియదని పేర్కొంది. సిరి మాట్లాడేదంతా ఫేకే అని, ఆమె మాటలేవీ తనకు నచ్చవని చెప్పింది. సిరి గేమ్ కోసం ఏదైనా చేస్తుందని చెప్పుకొచ్చింది. ప్రియాంకను దూరం పెడితే ప్రేక్షకులు ఏం అనుకుంటారోనని మానస్ ఆమెను భరిస్తున్నాడా? అని అరియానా క్వశ్చన్ చేయగా.. అదంతా ఫేక్ అని తేల్చే పారేసింది ప్రియ. మొత్తానికి ఈ ఈ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. అయితే ప్రియ బిగ్బాస్ స్టేజీపై మాట్లాడినదానికి, బజ్ ఇంటర్వ్యూలో మాట్లాడినదానికి పొంతనే లేదంటూ షాక్ అవుతున్నారు నెటిజన్లు. -
ప్రియాంకతో మానస్ పెళ్లి, టెన్షన్లో యానీ!
Bigg Boss Telugu 5, Episode 49: వీజే సన్నీ.. కాజల్ను రేషన్ మేనేజర్గా ఎన్నుకున్నాడు. తన కెప్టెన్సీని గతవారం ఎలిమినేట్ అయిన సెట్ శ్వేతకు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. అనంతరం బిగ్బాస్ ఇంటిసభ్యులకు 'సరైన మ్యాచ్ను వెతకండి' అనే టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. ఇందులో భాగంగా హౌస్లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ వారికి కాబోయే భాగస్వామికి ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పాల్సి ఉంటుంది. ముందుగా శ్రీరామ్.. తనను పెళ్లాడే అమ్మాయి బబ్లీగా, దేన్నైనా అల్లుకుపోయేలా ఉండాలన్నాడు. సన్నీ.. నమ్మకం, నిజాయితీ, అర్థం చేసుకునే స్వభావం తనకు కాబోయే అమ్మాయిలో తప్పకుండా ఉండాలన్నాడు. ఎంతో కేరింగ్ చూపించే పింకీలాంటి అమ్మాయిని ఎవరు చేసుకున్నా అదృష్టవంతులేనని చెప్పుకొచ్చాడు. నా గర్ల్ఫ్రెండ్ నన్నే చూడాలి: షణ్ముఖ్ మానస్ తను చేసుకోబోయే అమ్మాయికి ఉండాల్సిన లక్షణాల గురించి చెప్తూ.. 'నేను ఎక్కువ అలుగుతాను, అప్పుడు తనే ముందుగా నన్ను బుజ్జగించాలి. ఇద్దరి కుటుంబాలను ప్రేమగా చూసుకోవాలి' అని తెలిపాడు. అతడు మాట్లాడుతున్నంత సేపు ప్రియాంక తెగ సిగ్గుపడిపోవడం గమనార్హం. పింకీ వంతు వచ్చేసరికి.. 'అబ్బాయి నాకంటే ఎక్కువ హైట్ ఉండాలి. మంచివాడై ఉండాలి, అర్థం చేసుకోవాలి, వాళ్ల ఫ్యామిలీని నా ఫ్యామిలీలా చూసుకుంటాను, నా దగ్గర బోలెడంత ప్రేమ ఉంది, అది అతడికి ఇచ్చేస్తాను' అని చెప్పుకొచ్చింది. నా గర్ల్ఫ్రెండ్ నన్నే చూడాలి, ఇంకెవర్నీ చూడొద్దని షణ్ముఖ్. నా దగ్గర పొగరు చూపించొద్దని సిరి వారి అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. జెస్సీ మినహా మిగతా అందరూ పింకీ-మానస్ను బెస్ట్ కపుల్గా పేర్కొన్నారు. దీంతో బిగ్బాస్ వారిద్దరూ పూలదండలు మార్చుకునేలా చేసి పెళ్లి జరిపించేశాడు. అనంతరం వీళ్లిద్దరూ 'గువ్వా గోరికంతో..' పాటకు జంటగా స్టెప్పులేశారు. రవి గేమ్ ఆడట్లేదు, మనతో ఆడుతున్నాడు అయితే పింకీ మానస్ ధ్యాసలో పడి తన గేమ్ కూడా పట్టించుకోవట్లేదని భయపడిపోయింది యానీ. దీంతో రవి.. నాకు మానస్ మదర్ కూడా తెలుసు. ఆమె ఎలా రియాక్ట్ అవుతుందోనని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో 'బంగారు కోడిపెట్ట' టాస్క్లో సిరి స్టిక్కర్లు తానే తీశానని సీక్రెట్ బయటపెట్టాడు. దీంతో ప్రియ ఈ విషయాన్ని సిరి చెవిలో ఊదింది. కానీ తాను చెప్పానని మాత్రం ఎవరికీ చెప్పొద్దని సిరితో ఒట్టేయించుకుంది. ఇదిలా వుంటే రవి గేమ్ ఆడటానికి ప్రయత్నించట్లేదని, మనతో ఆడటానికి ట్రై చేస్తున్నాడని కాజల్తో గుసగుసలాడాడు షణ్ను. శ్రీరామ్ కూడా రవికి లొంగిపోయాడని, లోబో, విశ్వ రవి కోసమే ఆడుతున్నారని అభిప్రాయపడ్డాడు. మరోపక్క రవి.. తానే స్టిక్కర్లు తీశానని నేరుగా సిరితో చెప్పేశాడు. అడ్డంగా దొరికిపోయిన రవి, ఏకిపారేసిన నాగ్ నాగార్జున.. ఈవారం వరస్ట్ పర్ఫామర్ ఎవరో చెప్పమని ఇంటిసభ్యులను ఆదేశించాడు. రేషన్ మేనేజర్గా ప్రియాంక సింగ్ ఫెయిలైందని రవి ఆమెను వరస్ట్ పర్ఫామర్గా పేర్కొన్నాడు. ఈ సందర్భంగా నాగ్.. సిరి స్టిక్కర్లు దొంగతనం చేయడం సరైందే కానీ అమ్మతోడు ఎందుకు వేశావని రవిని నిలదీశాడు. దీంతో అడ్డంగా దొరికిపోయిన రవి.. అది తప్పేనని ఒప్పుకుంటూనే కావాలని చేయలేదని బుకాయించాడు. తర్వాత షణ్ముఖ్.. సిరిని వరస్ట్ పర్ఫామర్ అని తెలిపాడు. సిరి.. కాజల్ను, విశ్వ.. టాస్క్ల్లో జీరో అంటూ ప్రియాంకను వరస్ట్ పర్ఫామర్లుగా సూచించారు. ప్రియాంక, జెస్సీ, ప్రియ.. విశ్వను వరస్ట్ పర్ఫామర్గా పేర్కొన్నారు. ఎన్నిసార్లు చెంప పగలగొడతావు?: నాగ్ చెంప పగలగొడతాను అని ఎన్నిసార్లు అంటావని ప్రియను నిలదీశాడు నాగ్. దీనికి వివరణ ఇచ్చేందుకు ప్రియ ప్రయత్నిస్తూ.. 'బుట్టలో ఎగ్స్ తీయబోతుంటే సన్నీ నన్ను నెట్టేయగా ముందుకు పడిపోయాను. అతడు నానా మాటలు అనడంతో నాతో ఫిజికల్ అయితే మాత్రం చెంప పగలగొడతాను అని తిట్టాను' అని ఒప్పుకుంది. మరీ అన్నిసార్లు తిట్టకని సుతిమెత్తగా హెచ్చరించాడు నాగ్. తర్వాత యానీ మాస్టర్.. జెస్సీని, శ్రీరామ్.. మానస్ను, కాజల్.. ప్రియను, మానస్.. షణ్ముఖ్ను వరస్ట్ పర్ఫామర్గా చెప్పుకొచ్చారు. చెత్త ఆటగాడిగా ఎంపికైన విశ్వ ఇక బంగారు కోడిపెట్ట టాస్క్లో సన్నీ గ్రూప్ సహాయం తీసుకుని ఆడినందుకు కెప్టెన్సీ రద్దైందని ప్రకటించి చిన్న ఝలుక్ ఇచ్చాడు నాగ్. ఇండివిడ్యువల్ టాస్క్ అని రాసి ఉన్నా కూడా సన్నీ- కాజల్, మానస్- ప్రియాంక కలిసి ఆడారని, దానివల్ల తాను కెప్టెన్ కాలేకపోయానని ఎమోషనల్ అయింది యానీ..సన్నీ ధైర్యం చేసుకుని ప్రియను వరస్ట్ పర్ఫామర్ అని చెప్పాడు. దీంతో ప్రియ, సన్నీ ఒకరికొకరు గాల్లో ముద్దులు పంపుకున్నారు. ఇక మెజారిటీ సభ్యులు విశ్వను చెత్త ఆటగాడిగా పేర్కొనడంతో సోమవారం అతడిని జైల్లోకి పంపిస్తారని చెప్పాడు నాగ్. తర్వాత శ్రీరామ్ సేఫ్ అయినట్లు ప్రకటించాడు. కాజల్ లాంటి వాళ్లు నాకు నచ్చరు: లోబో బిగ్బాస్ హౌస్ను శుభ్రంగా ఉంచుకోలేదని తిట్టిపోశాడు నాగ్. హౌస్ను ఎంత గలీజ్ చేశారో చూడండి అంటూ కంటెస్టెంట్లకు హౌస్నంతా వీడియోలో చూపించాడు. తర్వాత లోబోను కన్ఫెషన్ రూమ్లోకి పిలిచిన నాగ్.. 'తోపు, డూపు' గేమ్ ఆడించాడు. లోబో ముందుగా ఆరుగురు డూపుల గురించి చెప్తూ.. కాజల్ లాంటి జనాలు నాకు నచ్చరు, ఆమె ఊసరవెళ్లి అన్నాడు. ప్రియ.. వేరేవాళ్లతో అంతా చేపిస్తూ సైలెంట్గా కూర్చుంటది, వెనకాల ఒకమాట, ముందొకమాట మాట్లాడుతుందని చీదరించుకున్నాడు. రవికి అవసరమున్నప్పుడే ఈ లోబో గుర్తొస్తాడని బాధపడ్డాడు. యానీ.. స్మార్ట్ అని, షణ్ముఖ్ యాటిట్యూడ్ నచ్చదని, అతడు యాక్టింగ్ చేస్తున్నాడని తెలిపాడు. వీళ్లు కాకుండా మిగిలిన ఆరుగురు తోపులని చెప్పాడు. అనంతరం నాగార్జున కాజల్ సేఫ్ అని వెల్లడించాడు. ఇక ఈ వారం ప్రియ వెళ్లిపోతుందని నాగ్ కన్నా ముందే లీకువీరులు నెట్టింట ప్రచారం మొదలెట్టిన విషయం తెలిసిందే! -
బిగ్బాస్-5: లోబోకి స్పెషల్ పవర్.. పాపం ఆ దురదృష్టవంతులు ఎవరు?
బిగ్బాస్ హౌస్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కంటెస్టెంట్స్ అంతా ఒకటి ఆలోచిస్తే.. బిగ్బాస్ మరోకటి ఆలోచిస్తాడు. తాజాగా కెప్టెన్సీ పోటీదారుల కోసం పెట్టిన‘బంగారు కోడిపెట్ట’టాస్క్లో ఊహించని ట్విస్ట్ ఇచ్చి ఇంటి సభ్యులకు షాకిచ్చాడు బిగ్బాస్. ‘బంగారు కోడిపెట్ట’టాస్క్లో భాగంగా రెండు రోజుల నుంచి ఇంటి సభ్యులు గుడ్లను సంపాదించి, దాచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంటి సభ్యుల మధ్య గొడవలు కూడా జరిగాయి. ముఖ్యంగా సన్నీ, ప్రియలు అయితే ఫిజికల్ అటాక్ వరకు వెళ్లారు. ఎలాగైన కెప్టెన్ కావాలనే కసితో టాస్క్ ఆడుతున్నారు కంటెస్టెంట్స్. అయితే టాస్క్ల్లో గెలవడం అనేది కేవలం కష్టం మీదనే ఆధారపడి లేదని, కొంచెం అదృష్టం కూడా ఉండాలని నిరూపిస్తున్నాడు బిగ్బాస్. మధ్య మధ్యలో స్పెషల్ పవర్ ఉన్న ఎగ్స్ ఇస్తూ.. అదృష్ట పరీక్షలు పెడుతున్నాడు. (చదవండి: బిగ్బాస్: ఆడు, ఈడు అంటూ రెచ్చిపోయిన ప్రియ..ఏయ్ అంటూ సన్నీ ఫైర్) ఇదిలా ఉంటే.. తాజాగా ఈ గేమ్లో నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసే అవకాశం రీఎంట్రీ ఇచ్చిన లోబో చేతికి ఇచ్చాడు బిగ్బాస్. అతని చేతిలో బ్లాక్, గొల్డెన్ కలర్ ఎగ్స్ ఉన్నాయి. వాటి ద్వారా ఒకరిని గేమ్ నుంచి తొలగించొచ్చు, మరొకరిని నేరుగా కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపిక చేయ్యొచ్చు. బ్లాక్ ఎగ్ ఎవరికిస్తే వారు ఈ టాస్క్ నుంచి ఔట్ అయినట్లు. గొల్డెన్ ఎగ్ పొందిన వారు డెరెక్ట్గా కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపికైతారు. మరి లోబో ఈ రెండు గుడ్లను ఎవరెవరికి ఇచ్చారో తెలియాలంటే.. నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
రవి అలాంటి వాడు..విశ్వ పైకి అలా కనిపిస్తాడు కానీ!: అలీ రెజా
Bigg Boss Fame Ali Reza About Anchor Ravi: టెలివిజన్ చరిత్రలోనే అతిపెద్ద రియాలిటీ షో బిగ్బాస్ చాలామందికి ఫేమ్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పటివరకు గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా బిగ్బాస్ షోతో ఓవర్ నైట్ స్టార్డం వస్తుంది. అదే స్థాయిలో కొందరి పాపులారిటీ అమాంతం తగ్గిపోతుంది. షోలో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల కొందరు డీఫేమ్తో బయటకు రావడం చూస్తుంటాం. ప్రస్తుతం బిగ్బాస్ తెలుగు సీజన్-5లో అందరి కన్నా ఎక్కువ పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్లలో యాంకర్ రవి ఒకరు. అయితే ప్రియ-లహరి ఎపిసోడ్ తర్వాత రవిపై నెగిటివిటి సైతం పెరిగిపోయింది. మొన్నటికి మొన్న శ్వేత సైతం రవికి దూరంగా ఉండాలంటూ హౌస్ మేట్స్ను హెచ్చరించిన సంగతి తెలిసిందే. చేసిన తప్పులు ఒప్పుకోకపోవడం సహా ఇతరులపై నిందలు వేస్తాడంటూ రవిని సోషల్ మీడియాలోనూ నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. దీనిపై బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్, రవి స్నేహితుడు అలీ రెజా స్పందించాడు. షోకు వెళ్లేముందే ఈ విషయాల గురించి మాట్లాడుకున్నామని, ఇలా అవుతుందని తనకు ముందే తెలుసని అలీ పేర్కొన్నాడు. ఎవరితోనైనా గొడవలు వస్తే అది పరిష్కరించుకోవాలని రవి భావిస్తాడని, అయితే కొందరు అపార్థం చేసుకుంటున్నారన్నాడు. రవి తనకు వ్యక్తిగతంలో తెలుసని, కాబట్టి షో చూసి జడ్జ్ చేయనని రవికి కితాబిచ్చాడు. ఇక మరో కంటెస్టెంట్ విశ్వ పైకి చాలా పహిల్వాన్లా కనిపించినా తను చాలా ఎమోషనల్ పర్సన్ అని, బయట కూడా అతను అలాగే ఉంటాడని చెప్పుకొచ్చాడు.