movement
-
19 ఏళ్ల క్రితం దీపావళి ఆనందాలను చిదిమేసిన బాంబు పేలుళ్లు
న్యూఢిల్లీ: ఈరోజు (అక్టోబరు 29) దేశ చరిత్రలో ఒక విషాద సంఘటన నమోదైంది. 19 ఏళ్ల క్రితం ఇదేరోజున ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్లు దీపావళి ఆనందాన్ని హరింపజేశాయి. అక్టోబర్ సాధారణంగా ఢిల్లీలో పండుగల సీజన్. మొదట రామలీల ప్రదర్శనలు తరువాత దసరా కోలాహలం ఇది ముగిసిన వెంటనే ధన్తేరస్ షాపింగ్, దీపావళి, చివరిగా గోవర్ధన పూజ, భయ్యా దూజ్... ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా పండుగలు వస్తూనే ఉంటాయి. ఈ నేపధ్యంలో మార్కెట్లలో కొనుగోలుదారుల సందడి నెలకొంటుంది.2005 అక్టోబరు 29న ధన్తేరాస్ నాడు ఢిల్లీ నగరంలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. రద్దీగా ఉండే మార్కెట్లలో జరిగిన ఈ పేలుళ్లలో 60 మంది మరణించగా, 200 మందికి పైగా జనం గాయపడ్డారు. నాడు ఢిల్లీలోని సరోజినీ నగర్, పహర్గంజ్, కల్కాజీ ప్రాంతాల్లోని మూడు చోట్ల డీటీసీ బస్సుల్లో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో చాలా మంది అయినవారిని కోల్పోయారు. నేటికీ సరోజినీ నగర్ మార్కెట్లోని దుకాణదారుల నాటి ఘటనను గుర్తుకు తెచ్చుకుని భయపడుతుంటారు.30 ఏళ్లుగా సరోజినీ నగర్ మార్కెట్లో దీపావళి వస్తువులు విక్రయిస్తున్న ఓ దుకాణదారుడు నాటి రోజును గుర్తు చేసుకుంటూ మీడియాతో మాట్లాడారు. నేటికీ నాటి భయానక దృశ్యం కళ్ల ముందు మెదులుతోందని, ఆరోజు ధన్తేరస్ రోజు కావడంతో మార్కెట్ అంతా కొనుగోలుదారులతో నిండివుందన్నారు. పేలుడు సంభవించినప్పుడు తాను ఘటనా స్థలానికి సమీపంలోని తన కొవ్వొత్తుల దుకాణంలో ఉన్నానని, అకస్మాత్తుగా భారీ పేలుగు శబ్ధం వచ్చి, అంతటా చీకటి అలుముకుందన్నారు. తొలుత తాను దుకాణంలో అమర్చిన బల్బు పేలివుంటుందని భావించానని తెలిపారు. అయితే ఆ పేలుడులో తన తలకు బలమైన గాయమైందని, స్పృహలోకి వచ్చేసరికి అక్కడ కుప్పలుగా పడి ఉన్న మృతదేహాలను చూసి భయపడ్డానన్నారు. బాంబు పేలుడు సంభవించిన దుకాణం యజమాని మృతదేహం రెండు భాగాలుగా విడిపోయి కనిపించిందన్నారు. నాటి ఘటనతో పలువురు సజీవదహనమయ్యారని అతను ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ఇకలేదు -
అణచివేతపై భగ్గుమన్న స్టీల్ప్లాంట్ కార్మికులు
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ప్లాంట్ ఉద్యమంపై కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై కార్మిక లోకం భగ్గుమంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసనకు కార్మికులు పిలుపునివ్వగా.. పోలీసులు అడ్డుకున్న పరిస్థితులు చూస్తున్నాం. పోలీసులు అనుమతి తీసుకున్న తర్వాత ధర్నా చేపట్టాలంటూ ప్రభుత్వం ఆదేశించినట్లు స్పష్టం అవుతోంది. ఈ క్రమంలో ఉద్యమకారులకు దువ్వాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఇవాళ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నడు నోటీసులు ఇవ్వలేదన్న కార్మికులు.. ప్రభుత్వం మారితే రూల్స్ మారుతాయా అంటూ పోలీసులను కార్మికులను ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యమానికి పూర్తిగా సహకరించింది. స్టీల్ ప్లాంట్స్ను కాపాడుతామన్న చంద్రబాబు పవన్ కల్యాణ్ మాట నిలబెట్టుకోవాలన్నారు.రాస్తారోకోకు అనుమతి తీసుకునేది లేదని తేల్చి చెప్పిన కార్మికులు.. అవసరమైతే అరెస్టు చేసుకోవాలన్నారు. నోటీసులకు భయపడేది లేదన్నారు. పోలీసుల నోటీసులు లెక్కచేయకుండా కార్మికులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది.ఐదేళ్ల ఉద్యమంలో మొట్టమొదటిసారిగా కార్మిక సంఘాల నేతలు అరెస్ట్ఐదేళ్ల ఉద్యమంలో మొట్టమొదటిసారిగా కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాలతో కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ పెద్దల సూచనతో కార్మికుల రాస్తారోకోను పోలీసులు నిరీర్వర్యం చేశారు. కార్మికులను అరెస్టు చేసేందుకు పెద్ద ఎత్తున సీఐఎస్ఎఫ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు పవన్ కల్యాణ్ నిలబెట్టుకోలేదని కార్మికులు మండిపడుతున్నారు. 3 నెలలు సమయం ఇచ్చిన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వారి కృషి చేయలేదు. అమరావతిపై చూపిస్తున్న శ్రద్ధను స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు చూపించలేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రగులుతున్న క్యాంపస్లు!
గాజాలో ఇజ్రాయెల్ అమానుష హత్యాకాండ మొదలైనప్పటినుంచీ అమెరికన్ విద్యాసంస్థల్లో అలుముకున్న అశాంతి ఈ వారం తీవ్ర రూపం దాల్చింది. ప్రపంచంలోనే పేరెన్నికగన్న విశ్వవిద్యా లయాలు విద్యార్థి ఉద్యమాలతో అట్టుడుకుతున్నాయి. వియత్నాంను వల్లకాడు చేస్తున్న అమెరికా సైనిక దురాక్రమణకు వ్యతిరేకంగా 1968లో తిరుగుబాటు జెండా ఎగరేసిన విద్యార్థుల పోరాటాన్నీ, 1980ల్లో దక్షిణాఫ్రికా జాత్యహంకార ప్రభుత్వం నెల్సన్ మండేలాను దీర్ఘకాలం చెరసాలలో బంధించటాన్ని నిరసిస్తూ సాగిన ఉద్యమాలనూ గుర్తుచేస్తున్నాయి. అప్పటిమాదిరే ఈ ఉద్యమాలు అట్లాంటిక్ మహా సముద్రం ఆవలితీరాల్లోని యూనివర్సిటీ క్యాంపస్లకు సైతం విస్తరించాయి.ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాల్లో మాత్రమేకాదు... పశ్చిమాసియాలోని బీరూట్, కువైట్, లెబనాన్, ట్యునీ సియా యూనివర్సిటీలు కూడా రగులుతున్నాయి. లాఠీచార్జిలు, బాష్పవాయు గోళాలు ఎవరినీ భయపెట్టడం లేదు. వేలాదిమంది విద్యార్థులను అరెస్టుచేస్తూ ఉద్యమాలను చల్లార్చాలని పోలీసులు ప్రయత్నిస్తున్నా సాగటం లేదు. వీటి తీవ్రత పెరుగుతున్నదే తప్ప తగ్గటం లేదు. ప్రజాస్వామ్యం గురించి ప్రపంచానికి ప్రవచనాలు చెప్పే అమెరికా తన క్యాంపస్లను ప్రస్తుతం పోలీసు శిబిరాలుగా మార్చింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు 1,200మంది పౌరులను కాల్చిచంపి, దాదాపు 250 మందిని బందీలుగా తీసుకెళ్లిన ఉదంతాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందరూ తీవ్రంగా ఖండించారు. స్వతంత్ర పాలస్తీనా కోసం సాగుతున్న ఉద్యమాలను ఇలాంటి దుందుడుకు చర్యలు బలహీనపరుస్తాయని హెచ్చరించారు. దాన్ని సాకుగా తీసుకుని ఇజ్రాయెల్ గత ఆర్నెల్లుగా సాగిస్తున్న మారణహోమం తక్కువేమీ కాదు. ఇంతవరకూ 35,000మంది పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ సైనిక దళాల దాడుల్లో మరణించారని చెబుతున్నారు.ఇందులో అత్యధికులు నిరాయుధులైన స్త్రీలు, పిల్లలే. చివరికి బాంబుదాడుల్లో శిథిలమైన జనావా సాల్లో బాధితులకు అండగా నిలబడుతున్న ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలను సైతం ఇజ్రాయెల్ సైన్యం వదిలిపెట్టడం లేదు. కావాలని ఉద్దేశపూర్వకంగా వారిని కాల్చిచంపుతూ పాలస్తీనా పౌరులకు బాసటగా నిలబడాలన్న సంకల్పంతో వచ్చేవారిని భయభ్రాంతుల్ని చేసేందుకు ప్రయత్నిస్తోంది. మరోపక్క అనేకమంది హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టా మని చెప్పుకుంటోంది. ఇజ్రాయెల్కు ఎడాపెడా మారణాయుధాలు సరఫరా చేస్తూ, భద్రతామండలి వంటి అంతర్జా తీయ వేదికలపై అది సాగిస్తున్న నరమేథాన్ని నిలువరించే అన్ని రకాల ప్రయత్నాలకూ మోకా లడ్డుతూ మద్దతుగా నిలబడుతున్న అమెరికా అప్పుడప్పుడు కోమానుంచి నిద్రలేచిన రోగి మాదిరిగా శాంతి వచనాలు వల్లిస్తోంది. ఇది సబబేనా? నిరాయుధ సాధారణ పౌరులను కాల్చిచంపటం ప్రపంచమంతా మౌనంగా వీక్షిస్తూ ఉండాల్సిందేనా? ఈ ప్రశ్నలే విశ్వవిద్యాలయాల విద్యా ర్థులను కలవరపరిచాయి. తాము మూగసాక్షులుగా మిగిలిపోలేమంటూ ఆ విద్యార్థులు గొంతెత్తటం వెనకున్న నేపథ్యం ఇదే. జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ఏంజెలస్ (యూసీఎల్ఏ), కొలంబియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వగైరా ఉన్నతశ్రేణి విద్యాసంస్థలు నినాదాలతో మార్మోగుతున్నాయి. పేరెన్నికగన్న హార్వర్డ్, బర్క్లీ, యేల్ వర్సిటీలు సైతం రణక్షేత్రాలయ్యాయి. అమెరికా ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నాయి. ఈ విశ్వవిద్యాల యాలు సాధారణమైనవి కాదు. పేరెన్నికగన్న ప్రపంచశ్రేణి సంస్థలు. ఉదాహరణకు యూసీఎల్ఏ 16 మంది నోబెల్ బహుమతి గ్రహీతలను తయారుచేసింది. ఆ సంస్థనుంచి ఇంతవరకూ 15 మంది మెక్ఆర్థర్ ఫెలోషిప్లను అందుకున్నారు. అసాధారణ ప్రతిభాపాటవాలున్నవారికి ఈ ఫెలోషిప్లు ఇస్తారు. ఇక్కడి పట్టభద్రుల్లో క్రీడల్లో రాణించి ఒలింపిక్స్లో పతకాలు అందుకున్నవారెందరో! ఎన్నో దేశాలు అందుకునే పతకాల సంఖ్యతో పోలిస్తే ఈ యూనివర్సిటీ పట్టభద్రులు సాధించే పతకాలే ఎక్కువంటారు. ఇలాంటిచోట చదువుకునే పిల్లలు సమాజ పరిణామాలపట్ల ఇంతగా కలవరపడటం బహుశా మన దేశంలో చాలామందిని ఆశ్చర్యపరిచి వుండొచ్చు. విద్యార్థి ఉద్యమ కేంద్రాలుగా ముద్రపడిన ఢిల్లీలోని జేఎన్యూ, జమియా మిలియా, కోల్కతాలోని జాదవ్పూర్ యూనివర్సి టీలను ఛీత్కరించటం అలవాటు చేసుకున్న మర్యాదస్తులకు ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయాల వర్త మాన పోకడలు మింగుడుపడకపోవచ్చు. అయోమయానికి గురిచేయవచ్చు. కానీ అమెరికా తదితర దేశాల విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఎప్పుడూ ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహిస్తూనే వున్నాయి. ఇప్పుడు సాగుతున్న విద్యార్థి ఉద్యమాలతో ప్రొఫెసర్లు సైతం గొంతు కలపటం, అరెస్టుకావటం యాదృచ్ఛికం కాదు. ఈ నిరసనలను యూదు వ్యతిరేక ఆందోళనలుగా చిత్రించి అధికారుల, రిపబ్లి కన్ పార్టీ శ్రేణుల ప్రాపకంతో పోటీ ఉద్యమాలను నిర్వహిస్తున్న విద్యార్థులు లేక పోలేదు. పాలస్తీనా సంఘీభావ ఉద్యమకారులపై వారు దాడులకు కూడా వెనకాడటం లేదు. ఇది విచారకరం.పిల్లి కళ్లు మూసుకుని పాలుతాగుతూ ఎవరూ చూడటంలేదని భ్రమపడుతుంది. అమెరికా ప్రభుత్వం ఈ ధోరణిని విరమించుకోవాలి. తన ఆయుధ పరిశ్రమ లాభార్జనకు తోడ్పడుతున్నా యన్న ఏకైక కారణంతో ఇజ్రాయెల్, ఉక్రెయిన్ తదితర దేశాలకు అమెరికా భారీగా సైనిక సాయం అందించటం అనైతికం, అమానుషం. విద్యార్థి ఉద్యమాలు పంపుతున్న సందేశాన్ని సక్రమంగా అర్థం చేసుకుని ప్రపంచశాంతికి దోహదపడటం అగ్రరాజ్యంగా తన బాధ్యతని ఇప్పటికైనా ఆ దేశం గుర్తించాలి. లేకుంటే మున్ముందు ఈ ఉద్యమాలు మరింత విస్తరిస్తాయి. -
ప్రతి ధర్నాకు ఓ రేటు... అదే వాళ్ల రూటు
ఆఖరుకు రాజకీయాలు అలా తయారయ్యాయి.. ప్రజలు.. కార్మికులు.. ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడాల్సిన ఉద్యమ పార్టీలు డబ్బుకు అమ్ముడుపోయాయి. రాష్ట్రంలో లేని కారణాలు సృష్టించి.. ఉద్యోగుల్లోనూ, అంగన్ వాడీల్లోనూ లేని అసంతృప్తిని రేకెత్తించి వాళ్లను ఉద్యమాలవైపు నడిపిస్తున్నారు. తద్వారా రాష్ట్రంలో కార్మిక.. ఉద్యోగ.. విద్యార్ధివర్గాల్లో అసంతృప్తి ఉందన్న భావనను విస్తృతం చేయడం.. ప్రభుత్వ వ్యతిరేకతను మరింత రాజేయడం వారి లక్ష్యం. అయితే ఇదంతా ఊరకనే చేయరు.. అటు ప్రతిపక్ష తెలుగుదేశానికి లబ్ది చేకూర్చడానికి వారు ఎన్నికల్లో గెలవడానికి తమవంతు పాత్ర పోషించే క్రమంలో ఫీజు తీసుకుని ఇలా ఉద్యమాలు చేస్తుంటారు అన్నమాట. అన్ని వర్గాల ప్రజలకు బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు అందుతుండడంతో వాళ్లంతా సంతోషంగా ఉన్నారు. వారినుంచి ఎలాంటి అసంతృప్తి లేదు. ఉద్యోగుల్లో అంగన్ వాడీలు.. ఇంకా ప్రభుత్వ సిబ్బందికి సైతం ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది. మరి అలాంటపుడు ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం తెలుగుదేశం వల్లకాదని అర్థం చేసుకున్న ఆ పార్టీ పెద్దలు.. నేరుగా ఉద్యమపార్టీలను లైన్లో పెట్టారని విశ్వసనీయ సమాచారం. ఇందుకుగాను వారికి కోట్లకు కోట్లు ప్రతిపక్ష టీడీపీ ముట్టజెప్పినట్లు తెలిసింది. ఈ డబ్బును జిల్లాల యూనిట్ల బాధ్యులకు కాస్త పంపించి ఉద్యమాలకు ఉసిగొల్పుతున్నట్లు తెలిసింది. అందుకే కారణం లేకుండానే అంగన్ వాడీలు సైతం ఆందోళనలకు దిగారు. వారికి గతంలో ఎన్నడూ లేనంత ప్రోత్సాహాన్ని సీఎం వైఎస్ జగన్ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న జీతాలను జగన్మోహన్రెడ్డి పెంచి.. వారికి ఉద్యోగభద్రత కల్పించడమే కాకుండా పదోన్నతుల్లో వారికి మరిన్ని వెసులుబాట్లు ఇచ్చారు. అయినా సరే అకస్మాత్తుగా వారు సమ్మెకు దిగారు. గతంలో జగన్కు క్షీరాభిషేకాలు చేసినవాళ్లే ఇప్పుడు ఇలా ప్రవర్తించడాన్ని సందేహిస్తున్న వారికి అసలు కారణం తెలుస్తోంది. వాస్తవానికి 2014-19 మధ్య అంగన్ వాడీలు.. ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు పెద్దగా చేసిందేమి లేదు కానీ ఆనాడు ఉద్యమాలు పెద్దగా చేసింది లేదు. అంటే అప్పుడు మిన్నకుండడానికి సైతం పేమెంట్ ముట్టిందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఇన్నేళ్లు ఊరుకున్న ఉద్యోగులు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రోడ్లెక్కడం వెనుక ఆ పార్టీల పెద్దల వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయన్నది అవగతం అవుతున్నది. చంద్రబాబు హయాంలో ఉద్యోగులకు ఏమీ చేయకపోయినా పల్లెత్తుమాట అనలేదు కదా చంద్రబాబుని.. పల్లెత్తు మాట అనలేదు. ఇప్పుడు మాత్రం.. ఉపాధ్యాయ.. విద్యార్ధి.. ఇతర ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టి వారి ఖర్చులు.. ధర్నాల టెంట్లకు డబ్బులు ఇచ్చి మరీ ఆందోళనలు చేయిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. -- సిమ్మాదిరప్పన్న చదవండి: ప్రజా సంకల్ప పాదయాత్రకు ఐదేళ్లు -
బీఆర్ఎస్లోకి గాయకుడు ఏపూరి సోమన్న
సాక్షి, హైదరాబాద్: ఉద్యమ గాయకుడు, వైఎస్సార్టీపీ నాయకుడు ఏపూరి సోమన్న బీఆర్ఎస్లో చేరనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రగతిభవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావును కలిశారు. ఉద్యమంలో కలసి పనిచేసిన రీతిలోనే బీఆర్ఎస్ వెంట నిలిచేందుకు సోమన్న సుముఖత వ్యక్తం చేయగా.. కేటీఆర్ స్వాగతించారు. ఈ భేటీలో ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, పార్టీ నాయకులు దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. ఒకట్రెండు రోజుల్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో సోమన్న గులాబీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. కేటీఆర్ తనను పార్టీలోకి స్వాగతించారని, కుటుంబ సభ్యుడిలా చూసుకుంటామని హామీ ఇచ్చారని ఏపూరి సోమన్న ‘సాక్షి’కి వెల్లడించారు. పార్టీలో తగిన ప్రాధాన్యత, గుర్తింపు ఇస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, తెలంగాణ ఉద్యమంలో భాగమైన తరహాలోనే అభివృద్ధిలోనూ భాగస్వామ్యం అయ్యేందుకు బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. సాయిచంద్ లేని లోటు పూడ్చేందుకే? బీఆర్ఎస్ సాంస్కృతిక విభాగానికి వెన్నెముకగా పనిచేసిన కవి, గాయకుడు సాయిచంద్ ఈ ఏడాది జూన్లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ సభలు, సమావేశాల సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలను సాయిచంద్ ముందుండి నడిపించేవారు. ఆయన లేని లోటును పూడ్చేందుకు.. జనాలను ఆకట్టుకునే శక్తి ఉన్నందుకే సోమన్నను చేర్చుకునేందుకు బీఆర్ఎస్ మొగ్గు చూపినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచార సభల్లో సాంస్కృతిక ప్రదర్శనలకు సోమన్న నేతృత్వం వహించే అవకాశం ఉందని అంటున్నాయి. బీఆర్ఎస్లోకి బీజేపీ హైదరాబాద్ నేతలు బీజేపీ హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా, కార్పొ రేటర్గా పనిచేసిన వెంకట్రెడ్డి, ఆయన భార్య కార్పొరేటర్ పద్మ శుక్రవారం ప్రగతిభవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంబర్పేటలో కాలేరు వెంకటేశ్ గెలుపు కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. -
ఎన్నికలొస్తేనే కేసీఆర్కు హామీలు గుర్తొస్తాయి: బండి సంజయ్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/తొర్రూరు: ఎన్నికల సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్కు హామీలు గుర్తుకొస్తాయని, మోసాలు చేయడంలో ఆయన పీహెచ్డీ పూర్తయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన ‘రైతుగోస– బీజేపీ భరోసా’సభలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని, ఉద్యమాల గడ్డ మాత్రమే కాక కేసీఆర్ దొంగ దీక్షను బయటపెట్టిన జిల్లా అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దొంగ పాస్పోర్టులు చేసిన దుబాయ్ శేఖర్ అని, ఆయన కొడుకు పేరు అజయ్రావు అయితే టికెట్ కోసం ఎన్టీఆర్ మెప్పు పొందడానికి తారక రామారావు అనే పేరు పెట్టాడని ఆరోపించారు. ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందంతో ముందుకొస్తున్నాయన్నారు. అప్పుల రాష్ట్రం ధనిక రాష్ట్రం కావాలన్నా, ప్రజల బాధలు పోవాలన్నా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పారు. కాగా ఖమ్మం వెళుతూ మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో సంజయ్ కొద్దిసేపు ఆగారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన పార్టీ నాయకుడు అలిసేరి రవిబాబును పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్యాన్సర్ కంటే కేసీఆరే డేంజర్ అని వ్యాఖ్యానించారు. హామీలను విస్మరిస్తూ ప్రజలను నట్టేట ముంచిన బీఆర్ఎస్కు ఓటేయవద్దని, సామాన్యుల కోసం కొట్లాడుతున్న బీజేపీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ చేతల ప్రభుత్వం కాదు: ఈటల బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలతోనే సరిపెడుతుంది తప్ప చేతల ప్రభుత్వం కాదని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ విమర్శించారు. ఎన్నికలు వస్తుండడంతో రైతులను మోసం చేసేందుకు కేసీఆర్ కొత్త మాటలు చెబుతున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక తరుగు లేకుండా ధాన్యం కొంటామని, రైతుల హక్కుగా అందాల్సిన అన్ని సబ్సిడీలు అందిస్తామని హామీ ఇచ్చారు. -
ప్రిగోజిన్ మృతిపై క్రెమ్లిన్ రియాక్షన్..
వాగ్నర్ చీఫ్, తిరుగుబాటు నాయకుడు ప్రిగోజిన్ను రష్యానే హతమార్చిందని పశ్చిన దేశాల నాయకుల ఆరోపణలపై తాజాగా క్రెమ్లిన్ స్పందించింది. అదంతా పచ్చి అబద్దం అని తెలిపింది. ప్రిగోజిన్ ఖచ్చితంగా చనిపోయాడనే విషయాన్ని తెలపడానికి నిరాకరిచింది. దర్యాప్తు పరీక్షల ఫలితాలు రావాలని స్పష్టం చేసింది. అటు.. ప్రైవేటు విమానం ప్రమాదానికి గురైన సమయంలో వాగ్నర్ చీఫ్ అందులోనే ఉన్నారని రష్యా విమానయాన అథారిటీ వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని పేర్కొంది. విమాన ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సానుభూతి తెలిపారు. ప్రిగోజిన్, ఆయన సహచరులను పొగుడుతూనే.. కొన్ని తప్పులు కూడా చేశారని అన్నారు. వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మరణంపై పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్పై తిరుగుబాటు చేసినందుకు ప్రతీకారంతోనే అతన్ని అంతం చేశారని ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన రష్యా అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలని అన్నారు. దర్యాప్తులోనే అసలైన నిజాలు బయటకొస్తాయని చెప్పారు. ఇదీ చదవండి: Wagner Chief Plane Crash Video: అంతా 30 సెకన్లలోనే.. వాగ్నర్ చీఫ్ విమానం పేలుడు.. వీడియో వైరల్ -
తొలి దశ ఉద్యమకారులను తెలంగాణ చరిత్రలో చేర్చాలి
గచ్చిబౌలి: తొలి దశ ఉద్యమకారులను తెలంగాణ చరిత్రలో చేర్చాలని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్లో 82వ వర్ధంతిని పురస్కరించుకొని కేంద్ర మాజీ మంత్రి డాక్డర్ మల్లిఖార్జున్ గౌడ్ విగ్రహన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలంగాణ సేఫ్ గార్డ్స్ అనే నినాదంతో మల్లిఖార్జున్ గౌడ్ విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చాడని గుర్తు చేశారు. ఆ ఉద్యమమే తెలంగాణ ఉద్యమంగా మారిందని మర్రి చెన్నారెడ్డి, వెంకట స్వామి, మదన్ మోహన్, మల్లిఖార్జున్ గౌడ్లు తొలిదశ ఉద్యమకారులని ఆయన పేర్కొన్నారు. వారి పేర్లను తెలంగాణ చరిత్రలో ఎక్కించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ చరిత్ర అంటె ఉద్యమాలు, ఉద్యోగులు, బలిదానాలని తెలంగాణ చరిత్ర దాన్ని ప్రతిభింభించే విధంగా ఉండాలన్నారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణరావాలని ఉద్రేకంగా మాట్లాడిన వారిలో వెంకట స్వామితో పాటు మల్లిఖార్జున్ గౌడ్ ఉన్నారని తెలిపారు. రక్షణ, రైల్వే మంత్రిగా పని చేసిన ఆయన మంచికి మారు పేరని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను ప్రోత్సహించిన నేతగా అయన అభివర్ణించారు. మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
''మాకు పెళ్లి అవసరం లేదు'' అనుకునేవారు ఇది చదవాల్సిందే..
దమ్మారో ధం... జీనత్ అమన్ నటించిన హరే రామ హరే కృష్ణ సినిమా లోని పాట. హిప్పీలు గంజాయి కొడుతూ ఎంజాయ్ చేసే సీన్ ఇది. వాసిరెడ్డి సీత రచించిన మారీచిక నవలను, కొంతకాలం ఆనాటి ప్రభుత్వం నిషేధించింది.ఇందులో ఒక అమ్మాయి హిప్పీగా మారిపోతుంది.. మరో అమ్మాయి నక్సల్స్లో చేరిపోతుంది. కోర్టు ఆదేశాల మేర ఆ నిషేధాన్ని ప్రభుత్వం తొలగించింది. అప్పుడు ఆ నవలను చదివాను. అసలే చిన్న వయసు. రెండు రోజులు పిచ్చెక్కిపోయింది.హిప్పీ ఉద్యమం..1965లో అమెరికాలో మొదలయ్యింది. 1970 కల్లా ప్రపంచంలోని అనేక దేశాలకు పాకింది. సమాజం ధోరణి నచ్చని యువత చేసిన ఒక రకమయిన తిరుగుబాటు ఇది. తిరుగుబాటు అనడం కన్నా దారి తప్పిన పెడధోరణి అనడం సబబు. పొడవాటి చింపిరి జుట్టు .. బెల్ బాటమ్ పాంట్స్ .. ఇల్లు వదలి పెట్టి తనలాంటి తిక్క సన్నాసులతో చేరి గ్రూప్ లు గ్రూప్ లుగా దిమ్మరిలా ఊరూరా తిరగడం. నీది నాది అనేది లేదు. అంతా మనదే అనే ఫిలాసఫీ. సామూహిక జీవనం, నచ్చిన వారితో సెక్స్, మాదక ద్రవ్యాలు... 1970లలో తెగ నడిచింది. అప్పట్లో ఓ ట్రెండ్ అయ్యింది. గోవాలో అయితే ఆరంభోల్ బీచ్ అంతా వీరే ఉండేవారట. వీరు తయారు చేసిన వస్తువుల అమ్మకం కోసం అంజునా మార్కెట్ ఉండేది. ఇక భవిషత్తు అంతా ఇలాగే ఉంటుంది అని అప్పట్లో మేధావుల అంచనా. ఏమయ్యింది? 1980 వచ్చేటప్పటికి హిప్పీ ఉద్యమం మాయమయింది. ఆ నాటి హిప్పీ హీరోలు హీరోయిన్లు మాయమయిపోయారు. మాదక ద్రవ్యాలు తిని అప్పుడే ఎంతో మంది పోయారు. ఎవరైనా బతికున్నా వృద్ధాప్యంతో పోయుంటారు. యాభై ఏళ్ళ నాడు వారు 25 ప్లస్ వయసు వారు.. అంటే ఇప్పుడు 75 ప్లస్. ఏ వెర్రి అయినా కొంత కాలం ట్రెండింగ్ కావొచ్చు. కానీ అదే భవిషత్తు కాదు. ఇక పై పెళ్లిళ్లు వుండవు .. కుటుంబాలు ఉండవు అనుకొనే వారు ఈ నిజాన్ని గమనించాలి.ఆ నాటి హిప్పీలు శారీరక సమస్యలు, వివిధ రోగాలతో పోయారు. నేటి వివాహ కుటుంబ వ్యవస్థపై తిరుగుబాటు చేసిన కొత్త తరం హిప్పీలు మానసిక రోగాలతో పోతారు. ప్రకృతి అనేది ఒకటుంటుంది. అన్ని విషయాలను అది చూసుకొంటుంది. కాలం అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. సొంత అనుభవంతో ప్రతి విషయాన్ని నేర్చుకోవాలనుకునే వాడు వెబ్ పేజీలలో కేసు స్టడీ కీర్తి శేషుడిగా మిగిలిపోతాడు. మిగతా వారి అనుభవం నుంచి నేర్చుకొనేవాడు తెలివయినవాడు. బతకడం తెలిచినవాడు. మీరు కేస్ స్టడీ అవుతారా? తెలివిగా బతుకుతారా? తేల్చుకోండివాసిరెడ్డి అమర్ నాథ్మానసిక శాస్త్ర పరిశోధకులు, ప్రముఖ విద్యావేత్త -
దిద్దుబాటు కొనసాగొచ్చు.. మార్కెట్ గమనంపై నిపుణుల అంచనాలు
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారమూ దిద్దుబాటు (కరెక్షన్) కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కరెక్షన్ పరిమితంగా ఉంటూ.., తీవ్ర ఒడిదుడుకుల ట్రేడింగ్కు అవకాశం ఉందంటున్నారు. బక్రిద్ సందర్భంగా బుధవారం సెలవు కావడంతో నాలుగురోజులే ట్రేడింగ్ జరుగుతుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ డెరివేటివ్ల గడువు ముగింపు గురువారం ఉంది. గతవారం(జూన్ 22న) మొదలైన విప్రో రూ.12,000 బైబ్యాక్ ఇష్యూ గురువారమే ముగియనుంది. ఇదే వారంలో చిన్న, మధ్య తరహా కంపెనీలతో మొత్తం ఏడు కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. అంతర్జాతీయంగా రష్యాలో అంతర్యుద్ధ పరిణామాలు, ఈసీబీ ఫోరమ్ నిర్వహించే సమావేశంలో ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించవచ్చు. వీటితో పాటు రుతుపవనాల వార్తలు, ఎఫ్ఐఐల పెట్టుబడులు, రూపాయి విలువ కీలకం కానున్నాయి. ‘‘మార్కెట్ స్థిరీకరణలో భాగంగా అమ్మకాల ఒత్తిడి కొనసాగొచ్చు. దేశీయంగా బలమైన స్థూల ఆర్థిక డేటా నమోదు, కమోడిటీ ధరలు దిగిరావడం తదితర సానుకూలాంశాల ప్రభావంతో దిద్దుబాటు పెద్దగా ఉండకపోవచ్చు. దిద్దుబాటు కొనసాగితే నిఫ్టీకి దిగువున 18,600–18,650 శ్రేణిలో తక్షణ మద్దతు స్థాయి కలిగి ఉంది. కొనుగోళ్లు నెలకొంటే ఎగువున 18,750 స్థాయిని చేధించాల్సి ఉంటుంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. క్రితం వారం సెన్సెక్స్ 405 పాయింట్లు, నిఫ్టీ 160 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ప్రపంచ పరిణామాలు... రష్యాలో తిరుగుబాటు పరిణామాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ పోర్చుగల్లోని సింట్రాలో కేంద్ర బ్యాంకింగ్ వ్యవస్థ(2023)పై ఈసీబీ ఫోరం నిర్వహించే పాలసీ చర్చలో పాల్గొనున్నారు. అమెరికా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు క్యూ1 జీడీపీ గణాంకాలు గురువారం విడుదల కానున్నాయి. అదే రోజున మే జపాన్ రిటైల్, వినిమయ విశ్వాస డేటా వెల్లడికానున్నాయి. ఈ వారంలో 7 ఐపీఓలు.. ఈ వారంలో ఏడు కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. ఇడియాఫోర్జ్, సియెంట్ డీఎల్ఎమ్, పీకేహెచ్ వెంచర్స్తో మరో నాలుగు చిన్న, మధ్య తరహా కంపెనీలు మొత్తం రూ.1600 కోట్లు సమీకరించనున్నాయి. ఐడియాఫోర్జ్ టెక్నాలజీ ఐపీఓ సోమవారం(నేడు) ప్రారంభమై జూన్ 29(గురువారం) ముగుయనుంది. ధరల శ్రేణిని రూ.632–672గా ఉంది. మొత్తం రూ.576 కోట్లు సమీకరించనుంది. సైయంట్ డీఎల్ఎం ఐపీఓ మంగవారం(రేపు) ప్రారంభం కానుంది. శుక్రవారం(జూన్ 30న) ముగుస్తుంది. చిన్న, మధ్య తరహా కంపెనీలైన కన్వేయర్ బెల్ట్ తయారీ సంస్థ పెంటగాన్ రబ్బర్(జూన్ 26 – 30), సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సర్వీసెస్ సంస్థ(జూన్ 30 – జూలై 5), త్రివిద్య టెక్, సినోఫిట్స్ టెక్నాలజీ ఐపీఓలు రెండూ జూన్ 30న మొదలై.., జూలై అయిదున ముగియనున్నాయి. మూడు వారాల్లో రూ.30,600 కోట్లు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐటు) భారత ఈక్విటీల్లో పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. ఈ జూన్లో ఇప్పటివరకు వారు రూ. 36,600 కోట్ల పెట్టుబడులు పెట్టారు. భారత ఆర్థికవ్యవస్థ ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండటం, కార్పొరేట్ రంగం ఆదాయం పటిష్టంగా ఉండటమే దీనికి కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ‘‘ఎఫ్ఐఐల పెట్టుడబడులు రానున్న రోజుల్లో నెమ్మదించవచ్చు. అమెరికా ద్రవ్యోల్బణాన్ని లక్ష్యం కంటే దిగువకు చేర్చేందుకు మరింత వడ్డీ పెంపు అవసరమని భావిస్తుంది. ఇటీవలే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ నేపథ్యంలో ఎఫ్పీఐలు అప్రమత్తంగా వహించవచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్(రిటైల్) హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. -
International Yoga Day: భారతీయులకు ప్రధాని వీడియో సందేశం
International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రజలకు ఒక వీడియో సందేశాన్ని పంపించారు. ఈ సందేశంలో భారతీయులు కొత్తదనాన్ని స్వాగతించడంలోనూ, సాంప్రదాయాలను కాపాడుకోవటంలోనూ గొప్ప స్ఫూర్తిని కనబరిచారని అన్నారు. ఏక్ భారత్ - శ్రేష్ట్ భారత్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆయన సతీమణి ఆహ్వానం మేరకు అమెరికా పయనమైన భారత ప్రధాని ప్రపంచ యోగా దినోత్సవం రోజును పురస్కరించుకుని భారత ప్రజానీకానికి ఒక వీడియో సందేశాన్ని పంపించారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. మానవ సంబంధాలను మెరుగుపరచి ఐక్యతను పెంపొందించే యోగా వంటి సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది భారతదేశం. యోగా మనలోని అంతర్గత ద్దృష్టిని మెరుగుపరచి మనలోని ఐక్యత పెరిగే లా చేస్తుందని దీని ద్వారా వైరుధ్యాలను చెరిపేసి, అడ్డులన్నిటినీ అధిగమించి, ఆటంకాలను తొలగించుకోవచ్చని, మనమంతా కలిసి "ఏక్ భారత్ - శ్రేష్ట్ భారత్" స్ఫూర్తిని ప్రపంచానికి చాటాలని ఆయన అన్నారు. ఆర్కటిక్, అంటార్కటిక్ ప్రాంతాల్లోని పరిశోధకులు కూడా యోగా దినోత్సవాల్లో పాల్గొంటున్నారని, "మహాసముద్రాల వలయంగా యోగా" నిర్వహిస్తున్నందున ఈ ఏడాది యోగా దినోత్సవం చాలా ప్రత్యేకమైనదిగా వర్ణించారు. భారత దేశంలోని కోట్లాది ప్రజలు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేకమంది యోగా దినోత్సవ వేడుకలు జరుపుకోవడంతో యోగా కీర్తి దశదిశలూ వ్యాప్తి చెందుతోందని ఆయనన్నారు. #WATCH | At around 5:30 pm IST, I will participate in the Yoga program which is being organised at the headquarters of the United Nations. The coming together of more than 180 countries on India's call is historic. When the proposal for Yoga Day came to the United Nations General… pic.twitter.com/oHeehPkuZe — ANI (@ANI) June 21, 2023 అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధాని ఈరోజు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారీ యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇది కూడా చదవండి: నేను మోదీ అభిమానిని: ఎలన్ మస్క్ -
రుతుపవనాల్లో కదలిక
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల్లో ఎట్టకేలకు కదలిక వస్తోంది. వారం రోజుల కిందట ఈ రుతుపవనాలు అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోకి సకాలంలోనే ప్రవేశించాయి. తర్వాత అవి ఊహించిన దానికంటే నెమ్మదిగా కదులుతున్నాయి. గురువారం నుంచి అవి చురుకుదనాన్ని సంతరించుకోనున్నాయి. ఒకటి, రెండురోజుల్లో ఈ రుతుపవనాలు మాల్దీవులు, కొమరిన్ ప్రాంతాలతో పాటు నైరుతి, ఆగ్నేయ, మధ్య బంగాళాఖాతాల్లోని కొన్ని ప్రాంతాలకు, అనంతరం మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) మంగళవారం రాత్రి వెల్లడించింది. ఐఎండీ ముందుగా అంచనా వేసినట్టుగా జూన్ 4వ తేదీకల్లా నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశాలు మెరుగుపడ్డాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు మరఠ్వాడా, కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఏపీ, యానాంలలో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయి. ఫలితంగా రానున్న మూడురోజులు రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. బుధవారం కోస్తాలో అక్కడక్కడ భారీవర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. రానున్న మూడురోజులు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో పాటు ఒకటి, రెండుచోట్ల పిడుగులు పడొచ్చని వివరించింది. -
జీవన చలనం
చలనం ఉండాలి; మనకు చలనం అన్నది కావాలి. చలనంతో మనం సాగుతూ ఉండాలి. మనలోని రక్తంలో చలనం లేకపోతే మనం ఉండం. మన రక్తంలో ఉన్న చలనం మన తీరులోనూ ఉండాలి. చలనం లేకుండా ఆగిపోయిన నీరు బురద అయిపోతుంది. చలనం లేకపోతే ఎవరి జీవనం అయినా ఎందుకూ పనికి రాకుండా పోవడమే కాదు హానికరం అయిపోతుంది కూడా. చలనం పరంగా ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు మనకు తొలిపాఠాలు. ఉచ్ఛ్వాస నిశ్వాసాల చలనం లేకపోతే మనం మనకే చెందం కదా? శ్వాసకు చలనం ఉండడంవల్లే మనం బతుకుతూ ఉన్నాం; మనకు ఉన్నవి ఉండడానికి కారణం శ్వాసకు చలనం ఉండడమే. మనం చలనంతో ఉండాలి అన్న ఆలోచన శ్వాసలాగా మనకు ఎప్పుడూ ఉంటూనే ఉండాలి. మనిషికి ప్రధానమైన వ్యాధి స్తబ్దత. ఈ స్తబ్దతకు వైద్యం, విరుగుడు చలనం. అడుగు వేస్తే పడిపోతాం అనుకుని స్తబ్దతలో ఉండిపోవడం సరికాదు. భద్రత కోసం అనో, జరిగిపోతోంది కదా అనో స్తబ్దతలో, స్తబ్దతతో ఉండిపోవడం పెనుదోషం. ఆ దోషం ముదిరితే అది పాపంగా కూడా పరిణమిస్తుంది. ‘జీవితం వెనక్కు వెళ్లదు; అది నిన్నటితో ఉండిపోదు’ అని కవి–తాత్త్వికుడు ఖలీల్ జిబ్రాన్ ఒక సందర్భంలో అంటారు. చలనం అన్నది ఉంటుంది, ఉండాలి కాబట్టి ఆయన అలా అన్నారు. చలనం లేకుండా స్తబ్దతలో ఉండిపోతే జీవితం వెనక్కు, ఆ వెనక్కు పడిపోతుంది, జీవితం నిన్నటితో ఉండిపోవడం కాదు మొన్నటికీ, అటు మొన్నటికీ జారిపోతుంది. జీవితం నుంచి జీవనం జారిపోకూడదు; జీవనానికి జీవితం లేకుండా పోకూడదు. అందుకు స్తబ్దత కాదు చలనం కావాలి; చలనం ఉండాలి. సేద తీరచ్చు కానీ స్తబ్దతలో ఉండిపోకూడదు. అలిసిపోవడం సహజమైందే కానీ బిగుసుకుపోవడం అసహజమైంది. స్తబ్దతకు మలిదశ బిగుసుకుపోవడం. స్తబ్దత, బిగుసుకుపోవడం మనుగడలో ఉన్న మనిషి లక్షణాలు కావు, కాకూడదు. మరణించిన వ్యక్తి లక్షణాలు స్తబ్దత, బిగుసుకుపోవడం. మరణించాక తప్పనిసరిగా వచ్చేవి అవి. కాబట్టి మరణం రానంత వరకూ అవి మన దగ్గరకు రాకూడదు. మనుగడ ఉన్నంతవరకూ మనం వాటిని రానివ్వకూడదు. స్తబ్దత కారణంగా మనుగడలో ఉన్న మనం మరణించిన వ్యక్తులంలాగా మారిపోకూడదు. మరణించాక కూడా జీవించి ఉండేందుకు మనం చలనాన్ని ఒంటపట్టించుకోవాలి. మెరుపు మెరుపయింది చలనం వల్లే. గాలికి చలనం లేకపోతే మన పరిస్థితి ఏమిటి? మేఘాలకు, భూమికి చలనం అన్నది లేకపోతే మనకు ఉండేది ఏమిటి? మనకు మనగడే ఉండదు. చలనం అన్నది లేకపోతే మనం ప్రపంచానికి ఉండం; మనకు ప్రపంచం ఉండదు. చలనం లేకపోతే గమనం ఉంటుందా? ఉండదు. జీవనం అంటేనే గమనం. గమనానికి ఆరంభం చలనం. గమనానికి మాత్రమే కాదు ఏ గమ్యానికైనా తొలిచుక్క చలనమే. జీవితానికి జీవనం ఉన్నప్పుడు జీవనానికి చలనం ఉండాలి. స్తబ్దతలో మనల్ని మనం మోసుకుంటూ ఉండిపోవడం జీవనం కాదు; స్తబ్దతతో మనం మనకే బరువైపోవడం జీవితం కాదు. చలనం ఇంధనం కాగా జీవితం పండాలి. జీవితానికి జ్వలనం కావాలంటే జీవనానికి చలనం కావాలి. నది నది అయ్యేది చలనం వల్లే. చలనమే లేకపోతే నది అన్నదే లేదు; నది లేకపోతే జరగాల్సిన మేలు జరగదు. చలనం వల్ల ఏం మేలు జరుగుతుందో, ఎంత మేలు జరుగుతుందో నది మనకు తెలియజెబుతునే ఉంది. నదిని మనం స్ఫుర్తిగానూ, ఆదర్శంగానూ తీసుకోవాలి. మనం చలనంతో నదిలాగా బతకాలి; బతుకే గెలుపై మనం మునుముందుకు నడుస్తూ ఉండాలి. జీవనం అంటేనే గమనం. గమనానికి ఆరంభం చలనం. గమనానికి మాత్రమే కాదు ఏ గమ్యానికైనా తొలిచుక్క చలనమే. – రోచిష్మాన్ -
త్రిపుర ఎన్నికల వేళ ఊహించని ట్విస్ట్.. బీజేపీకి కొత్త సవాల్!
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ గ్రేటర్ టిప్రాల్యాండ్ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం వేడెక్కుతోంది. ఒకప్పుడు త్రిపురని ఏలిన మాణిక్య వంశానికి చెందిన ప్రద్యోత్ మాణిక్య డెబ్బార్మాన్కు చెందిన టిప్రా మోతా పార్టీ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తోంది. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ చేస్తున్న సంస్థలన్నీ కలిసి టిప్రా ఇండీజెనస్ ప్రోగ్రసివ్ రీజనల్ అలయెన్స్ (టిప్రా మోతా)గా ఏకతాటిపైకి వచ్చారు. ఇన్నాళ్లూ సామాజిక సంస్థగా ఉన్న ఈ కూటమి, రాజకీయ పార్టీగా రూపొంతరం చెందింది. అధికారంలోకి వస్తే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తామని లిఖితపూర్వక హామీ ఇచ్చిన వారితోనే తాము పొత్తు పెట్టుకుంటామని ప్రద్యోత్ తేల్చి చెబుతూ అధికార బీజేపీకి సవాల్ విసురుతున్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్న గిరిజనులు, స్థానిక తెగల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకి మద్దతుగా ఉంటూ గత రెండేళ్లలోనే ఢిల్లీ వేదికగా ప్రద్యోత్ ఎన్నో ధర్నాలు, ఉద్యమాలు చేశారు. గత వారంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షాతో ప్రద్యోత్ నేతృత్వంలోని టిప్రా మోతా ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లి చేసిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ప్రద్యోత్ తాము ఒంటరిపోరాటానికి సిద్ధమై 35 నుంచి 40 సీట్లలో పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్రం అంశం అత్యంత ప్రభావం చూపించబోతోంది. ఏమిటీ గ్రేటర్ టిప్రాల్యాండ్ ? 1949లో త్రిపురభారత దేశంలో విలీనం అవడానికి అంగీకరించింది. అప్పటికే తూర్పు బంగ్లాదేశ్ నుంచి త్రిపురలోకి భారీగా బెంగాలీల తాకిడి మొదలైంది. 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధం సమయంలో కూడా బెంగాలీ శరణార్థులు భారీగా వచ్చి చేరారు. ఫలితంగా స్థానికంగా నివసించే గిరిజనులు మైనార్టీలో పడిపోయారు. 1881లో 63.77శాతం ఉండే గిరిజనుల జనాభా 2011 నాటికి 31.80శాతానికి పడిపోయింది. 2011 నాటి భాషాపరమైన జనాభా లెక్కల ప్రకారం త్రిపుర మొత్తం జనాభా 36.74 లక్షలైతే, వారిలో బెంగాలీ మాతృభాష కలిగిన వారి సంఖ్య ఏకంగా 24.14 లక్షలు. స్థానిక ఆదివాసీల మాతృభాష కొక్»ొరాక్ మాట్లాడేవారు 8.87 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అంటే బయట నుంచి వలస వచి్చన బెంగాలీలే వీరి కంటే మూడు రెట్లు ఎక్కువ. దాంతో స్థానికంగా ఉండేవారి హక్కులు, సంస్కృతి సంప్రదాయాలు, భూమిపై హక్కులు ప్రమాదంలో పడ్డాయి. దాంతో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ పుట్టింది. ఏయే ప్రాంతాలతో ప్రత్యేక రాష్ట్రం త్రిపురలో గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాలన్నింటితో 1985లో త్రిపుర ట్రైబల్ ఏరియాస్ అటానమస్ డి్రస్టిక్ట్ కౌన్సిల్ (టీటీఏఏడీసీ) ఏర్పాటైంది. రాష్ట్ర వైశాల్యంలో మూడింట రెండువంతుల్లో విస్తరించింది. గిరిజన తెగల హక్కులు, సంస్కృతి కాపాడడం కోసం ఏర్పాటైన టీటీఏడీసీకి శాసన, కార్యనిర్వాహక అధికారాలున్నాయి. టీటీఏఏడీసీ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం చేయాలన్న డిమాండ్ ఉంది. ఎప్పట్నుంచి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్? 2000 సంవత్సరంలో ఏర్పాటైన ఇండిజెనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ) పార్టీ తొలిసారిగా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్పై గళమెత్తింది. రెండేళ్ల తర్వాత ఐపీఎఫ్టీ గిరిజనుల మరో పార్టీ త్రిపుర ఉపజాతి జ్యూబా సమితి(టీయూజేఎస్)లో విలీనమై నేషనలిస్ట్ పార్టీ ఆఫ్ ట్విప్రా (ఐఎన్పీటీ)గా ఆవిర్భవించింది. వేర్పాటు వాద నాయకుడు బిజోయ్ కుమార్ హరంగ్ఖ్వల్ నేతృత్వం వహించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పెద్దగా ముందుకు వెళ్లకపోవడంతో 2009లో ఎన్సీ డెబ్రామా ఆధ్వర్యంలో మళ్లీ ఐపీఎఫ్టీను పునరుద్ధరించారు. ˘ ఎన్నికల్లో ప్రభావం ఎంత? మొత్తం 60 శాసనసభ స్థానాలున్న రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం ఆశిస్తున్న ఆదివాసీలు 20 నియోజకవర్గాల్లో ప్రభావం చూపించగలరు. ఇప్పటివరకు ఐపీఎఫ్టీయే ఈ నియోజకవర్గాల్లో అత్యంత కీలకంగా ఉంది. త్రిపురలో అద్భుతమైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుని రెండు దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని ఏలిన మాణిక్ సర్కార్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వివిధ స్థానిక పార్టీలతో జత కలిసింది. దీంతో ఈ ప్రాంతంలోని 20 స్థానాలకు గాను బీజేపీ 10సీట్లు, ఐపీటీఎఫ్ 8 ,, సీపీఐ(ఎం) రెండు స్థానాల్లోనూ గెలుపొందింది. మాణిక్ సర్కార్ ఓటమికి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను నిర్లక్ష్యం చేయడం కూడా ఒక కారణంగా మారింది. ఎన్నికలకు ముందు ప్రత్యేక రాష్ట్రం కోసం విస్తృతంగా ప్రచారం చేసిన ఐపీటీఎఫ్ ఎన్నికల తర్వాత అధికార బీజేపీలో చేరింది. ఆ పార్టీ నాయకుడు ఎన్సీ డెబర్మా మంత్రిగా కూడా పని చేసి 2022 జనవరి 1న కన్నుమూశారు. గిరిజన హక్కుల మండలి (టీటీఏఏడీసీ)కి 2021 ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో టిప్రా మోతా పార్టీ 28 స్థానాల్లో పోటీ చేస్తే 18 నెగ్గింది. ప్రస్తుత అసెంబ్లీలో 36 స్థానాలతో ఉన్న అధికార బీజేపీ, 16 స్థానాలతో ప్రతిపక్ష పార్టీగా ఉన్న సీపీఐ(ఎం) ఉంటే, ఐపీటీఎఫ్ ఎనిమిది స్థానాలను నెగ్గింది. టిప్రా మోతా ఒంటరిపోరాటానికి సిద్ధమై అధికార బీజేపీకి వణుకు పుట్టిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వికేంద్రీకరణకు మద్దతుగా పాడేరులో రౌండ్ టేబుల్ సమావేశం
-
వికేంద్రీకరణకు మద్దతుగా గిరిజనుల ఉద్యమాలు...
-
మహోజ్వల భారతి ఉద్యమ రత్నం రాజాజీ
రాజాజీగా ప్రఖ్యాతి గాంచిన చక్రవర్తి రాజగోపాలాచారి స్వతంత్ర భారతదేశ తొలి, చివరి గవర్నర్ జనరల్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు ఇది. ఆయన 1948 జూన్ 21న ఆ పదవిని చేపట్టి, 1950 జనవరి 26 వరకు కొనసాగారు. అక్కడితో గవర్నర్ జనరల్ పదవి రద్దయి, రాష్ట్రపతి హోదా మొదలైంది. స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రానంతరం కొన్ని దశాబ్దాల పాటు రాజాజీ భారత దేశ రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషించారు. ప్రాథమికంగా ఆయన కాంగ్రెసువాది. స్వాతంత్య్రానంతరం నెహ్రూ సోషలిస్టు విధానాల పట్ల వ్యతిరేకతతో స్వంతంగా పార్టీ కూడా నెలకొల్పారు. మద్రాసుకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజాజీ రాజకీయ ప్రస్థానం సేలం పట్టణం నుంచి ప్రారంభమైంది. 22 ఏళ్ల వయసులో జాతీయవాది బాలగంగాధర తిలక్ పట్ల ఆకర్షితుడయ్యారు. అప్పుడే సేలం పట్టణ మునిసిపాలిటీకి చైర్మన్గా ఎన్నికయ్యారు. లాయర్ కూడా అయిన రాజాజీ 1908 లో వరదరాజులు నాయుడు అనే స్వాతంత్య్ర పోరాట యోధుడి తరపున ప్రభుత్వ ధిక్కారం కేసుకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో వాదించారు. జాతీయవాది వీఓ చిదంబరం పిళ్ళై, రాజాజీ మంచి స్నేహితులు. అనిబిసెంట్ కూడా రాజాజీని అభిమానించేవారు. మహాత్మాగాంధీ స్వాతంత్య్రోద్యమంలోకి ప్రవేశించినపుడు రాజాజీ ఆయన్ని అనుసరించారు. ఉద్యమం కోసం న్యాయవాదిగా ప్రాక్టీసు కూడా మానేశారు. 1921 లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఎన్నికయ్యారు. ఆ పార్టీకి జనరల్ సెక్రెటరీగా కూడా వ్యవహరించాడు. 1930 లో తమిళనాడు కాంగ్రెస్లో నాయకుడయ్యారు. అదే సమయంలో మహాత్మాగాంధీ దండియాత్ర నిర్వహించినపుడు రాజాజీ నాగపట్టణం దగ్గర్లోని వేదారణ్యం అనే ప్రాంతంలో ఉప్పు పన్నును వ్యతిరేకించి జైలుకి వెళ్లారు. తరువాత తమిళనాడు కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్నను పొందిన తొలివ్యక్తులలో రాజాజీ ఒకరు. సేలం జిల్లా, తోరపల్లి గ్రామంలో 1878 డిసెంబరు 10 న జన్మించిన రాజాజీ, 1972 డిసెంబర్ 25న తన 94 ఏళ్ల వయసులో కన్నుమూశారు. (చదవండి: చైతన్య భారతి నెహ్రూ యోగా గురువు) -
జైహింద్ స్పెషల్: తెల్లవారిని తుపాకులతో కాల్చుట
జాతీయతా భావాలనే మనసావాచా నమ్మిన మేధోవర్గాన్నీ, ఉద్యమ సారథ్యాన్నీ ఇచ్చిన పరిణామం వందేమాతరం ఉద్యమం. ఆ ఉద్యమం తెలుగువారికి అందించిన మేధో సంపన్నుడు, పత్రికా రచయిత ముట్నూరి కృష్ణారావు. ఆయన సంపాదకీయాల సంకలనం ‘లోవెలుగులు’ ఆధునిక జాతీయతా చైతన్యానికి గీత వంటిది. జాతిలో ఆ పెను నిద్రను వదిలించడానికి ఆయన ‘కృష్ణాపత్రిక’ను సాధనంగా చేసుకున్నారు. 1902 ఫిబ్రవరి 1న మచిలీపట్నంలో ప్రారంభమైన ‘కృష్ణాపత్రిక’కు 1907లో బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం నుంచి తిరిగి వచ్చిన తరువాత ముట్నూరివారు సంపాదకులయ్యారు. కృష్ణాపత్రికలో ‘తెల్లవారిని తుపాకులతో కాల్చుట’ అన్న వ్యాసం ప్రచురించినందుకు నాలుగేళ్ల పాటు సంపాదకత్వానికి దూరంగా ఉన్నా, మళ్లీ వచ్చి కొన ఊపిరి వరకు పత్రికను నడిపించారు. చదవండి: జైహింద్ స్పెషల్: పెన్నులతో గన్నుల పైకి కాశీనాథుని నాగేశ్వరరావు 1908లో ఆంధ్రపత్రిక వారపత్రిక, 1914లో ఆంధ్రపత్రిక దినపత్రిక స్థాపించిన స్వాతంత్య్ర సమరయోధుడు. భారతీయ పత్రికా రంగ చరిత్రను చేర్చకుండా ఎలాగైతే భారత స్వాతంత్య్ర సమర చరిత్ర సంపూర్ణం కాదో, తెలుగుప్రాంతాలలో జరిగిన ఉద్యమ చరిత్ర పరిపూర్ణం కావాలంటే ఆంధ్రపత్రిక చరిత్రను అలాగ అధ్యయనం చేయాల్సిందే. స్వాతంత్య్ర పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇచ్చిన పత్రిక ఇది. స్వాతంత్య్ర సమరయోధులను ఎన్నో విధాలుగా ఆదుకున్న సంస్థ కూడా. గాడిచర్ల హరిసర్వోత్తమరావు బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమంలో లాల్, పాల్, బాల్ ఇచ్చిన సందేశాలతో ఉత్తేజితుడైన గాడిచర్ల విద్యార్థి దశలోనే నేరుగా ఉద్యమంలో చేరారు. 1907లోనే బెజవాడ నుంచి ‘స్వరాజ్య’ వారపత్రికను ఆరంభించారు. పింగళి లక్ష్మీనారాయణ, బోడి నారాయణరావు ఆయనకు సహకరించారు. 1908లో గాడిచర్ల ‘విపరీత బుద్ధి’ పేరుతో సంపాదకీయం రాశారు. దానితో మూడేళ్లు కారాగార శిక్ష విధించారు. ఈ కేసులో అరెస్టు చేసినప్పుడు ఆయనకు సంకెళ్లు వేసి బెజవాడ వీధుల నుంచి తీసుకువెళ్లారని చెబుతారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో జాతీయ భావాల వ్యాప్తికి శ్రమించిన ‘ఆంధ్రపత్రిక’ తొలి సంపాదకుడు గాడిచర్ల వారే. అలాగే మద్రాస్ ప్రెసిడెన్సీలో జైలుకు వెళ్లిన తొలి స్వాత్రంత్య సమరయోధుడూ ఆయనేనని కూడా అంటారు. వెల్లూరు కారాగారంలో ఆయన కఠోర అనుభవాలు చవిచూశారు. దత్తమండలాలుగా పేరొందిన ప్రాంతానికి రాయలసీమ పేరు ఇచ్చినది, ఎడిటర్ అన్న ఇంగ్లిష్ పదానికి సంపాదకుడు అన్న అనువాదాన్ని ఇచ్చిందీ గాడిచర్ల వారే. చిలకమర్తి లక్ష్మీనరసింహం బిపిన్ చంద్ర పాల్ 1907లో రాజమండ్రి వచ్చినప్పుడు వారి ఉపన్యాసాన్ని అనువదించినవారు చిలకమర్తి లక్ష్మీనరసింహం. గొప్ప కవి, నాటకకర్త, జాతీయవాది. ఆనాటి సభలో ఆశువుగా వినిపించినదే, ‘భరతఖండంబు చక్కని పాడియావు..’ పద్యం. 1906లో ఆయన రాజమండ్రిలో ‘మనోరమ’ పేరుతో పత్రిక స్థాపించారు. 1909లో ‘దేశమాత’ పత్రికను నెలకొల్పారు. మనోరమ సాహిత్యానికి పరిమితమైనా, దేశమాతను పేరుకు తగ్గట్టే వెలువరించారు. చిలకమర్తి బెంగాల్ సంఘ సంస్కర్తల జీవితాలను తన పత్రికల ద్వారా తెలుగువారికి పరిచయం చేశారు. దేశమాత పత్రిక ప్రారంభించడానికి ఆయన ప్రభుత్వం నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ సంపాదక వర్గం గాంధీజీ పిలుపుతో స్వరాజ్య సమరంలోకి వచ్చినా, తన వార్తాపత్రిక ‘కాంగ్రేసు’ను మాత్రం తీవ్ర జాతీయవాదుల భావాలకు వేదికగా చేశారు మద్దూరి అన్నపూర్ణయ్య. 1921 మే మాసంలో, మద్దూరి సంపాదకునిగా మొదట సైక్లోస్టయిల్డ్ పత్రికగా అది ఆరంభమైంది. రాజమహేంద్రవరం నుంచి ప్రచురణ ప్రారంభించి, తరువాత సుబ్రహ్మణ్యం ప్రారంభించిన సీతానగరం గౌతమీ సత్యాగ్రహాశ్రమానికి తరలింది. రాజమండ్రికి 23 కిలోమీటర్ల దూరంలోని ఈ ఆశ్రమానికి దక్షిణాది సబర్మతి అని పేరు. ఇంకా క్రొవ్విడి లింగరాజు, శ్రీరామచంద్రుని వెంకటప్ప, చండ్రుపట్ల హనుమంతరావు సంపాదక మండలిలో ఉన్నారు. కానీ పత్రిక వెలువడిన ఒక దశాబ్దకాలంలో (1921–1932) వీరిలో ఎవరో ఒకరు కారాగారంలో ఉంటూ వచ్చారు. 1929 మే నెల కాంగ్రేసు 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ సంస్మరణ సంచికగా వెలువడింది. ఇందులోనే అచ్చయిన ‘చిచ్చుర పిడుగు’ అన్న నాటిక అప్పుడే ఆ ఆశ్రమాన్ని సందర్శించిన గాంధీజీని కలవరపరచడమే కాదు, మద్దూరిని రెండున్నరేళ్లు కారాగారంలో ఉంచింది. నిజానికి అది రామచంద్రుని వెంకటప్ప రచన. రచయిత పేరు వేయలేదు. కానీ పోలీసులు కేసు పెట్టడంతో సంపాదకుడు కాబట్టి మద్దూరి బాధ్యత వహించి జైలుకు వెళ్లారు. భగత్సింగ్ బలిదానాన్ని శ్లాఘిస్తూ ‘వీరబలి’ పేరుతో సంపాదకీయం రాసినందుకు, వాడపల్లి (తూర్పు గోదావరి జిల్లాలో ఊరు. వెంకటేశ్వరస్వామి ఉత్సవంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఏడుగురు చనిపోయారు) కాల్పుల వార్తలు ఇచ్చినందుకు ప్రభుత్వం ఈ పత్రిక మీద నిఘా ఉంచింది. చివరికి 1932 జనవరిలో మద్రాస్ గెజెట్ ‘కాంగ్రేసు’ చట్ట వ్యతిరేకమని ప్రకటించింది. జనవరి 12న పోలీసులు ఆశ్రమం మీద దాడి చేసి పత్రిక ఆస్తులన్నీ ధ్వంసం చేశారు. సురవరం ప్రతాపరెడ్డి మే 10, 1926న ప్రతాపరెడ్డి సారథ్యంలో ప్రారంభమైన ‘గోలకొండ పత్రిక’ సంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని భయపెట్టేవి. రాజ్యంలో వాస్తవాలను తెలియచేసేందుకు సురవరం ప్రతాపరెడ్డి ఈ పత్రిక స్థాపించారు. సంపాదకునిగా మొదట్లో ఆయన పేరు లేకున్నా, అన్నీ ఆయనే. సురవరం బహుభాషావేత్త, సాహిత్యవేత్త. నిజాం సంస్థానంలో నవాబు నడిపిన ‘మీజాన్’ తెలుగు వెర్షన్కు అడవి బాపిరాజు సంపాదకులు. అందులో నవాబు వ్యతిరేకోద్యమ వార్తలకూ ఆయన చోటిచ్చారు. మందుముల నరసింగరావు ‘రయ్యత్’ పత్రిక పూర్తిగా నిజాం వ్యతిరేక పత్రిక. ఇక ‘ఇమ్రోజ్’ ఉర్దూ పత్రిక నిర్వాహకుడు, రచయిత షోయబుల్లా ఖాన్ను రజాకార్లు హైదరాబాద్లో హత్యచేశారు. ఇక్కడ ప్రస్తావించిన పత్రికలు, పత్రికా రచయితల పేర్లు చరిత్ర అనే సాగరం నుంచి తీసిన ఒక్క బొట్టులో భాగం మాత్రమే. స్వాతంత్య్ర సమరం, పత్రికలు సాగించిన ఉద్యమం వేరు చేసి చూడడం సాధ్యం కాదన్నది చారిత్రక వాస్తవం. వందలాది పత్రికలు, వందలాది మంది పత్రికా రచయితలు స్వాతంత్య్రోద్యమానికి అంకితం కావడం తిరుగులేని వాస్తవం. 1947 వరకు ఏ పత్రిక ఆశయమైనా దేశ స్వాతంత్య్ర సాధనే. దీనికి భూమికను అందించిన నిన్నటి సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమంలో పత్రికలు నిశ్శబ్ద కర్తవ్యాన్ని నిర్వహించాయి. స్వాతంత్య్రోద్యమానికి గళం ఇచ్చాయి. పత్రికా రచన ఇంకొక మహత్కార్యం కూడా నెరవేరుస్తూ ఉంటుంది. చరిత్ర రచనకు ఆలంబన నిన్నటి వార్తాపత్రికలే. జాఫ్రీ సి వార్డ్ అన్నట్లు... ‘జర్నలిజం ఈజ్ మియర్లీ హిస్టరీస్ ఫస్ట్ డ్రాఫ్ట్’ . – డా. గోపరాజు నారాయణరావు, ఎడిటర్, ‘జాగృతి -
చైనా పౌరుల ప్రతి కదలికపై గట్టి నిఘా! ఎక్కడికి వెళ్లినా..చెప్పాల్సిందే!
increasing attacks targeting Chinese citizens in Pakistan: పాకిస్తాన్లోని చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు పెరుగుతున్న నేపథ్యంలో పౌరులు తమ భద్రతకై వారి కదలికలను ముందుగా ఇస్లామాబాద్ పోలీసులకు తెలియజేయలాని కోరినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు విదేశీయుల భద్రత కోసం ఇస్లామాబాద్ పోలీసుల ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ ఫారిన్ సెక్యూరిటీ సెల్ పనితీరును సమీక్షించేందుకే నిర్ణయించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇస్లామాబాద్లో సుమారు వెయ్యి మంది చైనా పౌరులు ఉన్నారు. అంతేకాదు వీళ్లంతా వివిధ కంపెనీలు, వ్యాపారాలకు సంబంధించిన దాదాపు 36 ప్రాజెక్టులలో పనిచేస్తున్నారని సర్వే తెలిపింది. బహుళ మిలియన్ డాలర్ల చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) ప్రాజెక్టులకు సంబంధించిన చైనీయులకు పారామెలటరీ దళాలు, భద్రతా దళాలు రక్షణ కల్పిస్తున్నాయని అధికారులు తెలిపారు. పోలీసు స్టేషన్ల ఎస్హెచ్ఓలు, సెక్యూరిటీ డివిజన్ లేదా పెట్రోలింగ్ యూనిట్ సుమారు వెయ్యి మందికి పైగా చైనా పౌరుల కదలిక సమయంలో భద్రత కల్పించాలని సమావేశంలో నిర్ణయించామని చెప్పారు. వారి కదలికల వివరాలను సేకరించే బాధ్యత కూడా ఎస్హెచ్ఓలకు అప్పగించామని అధికారులు తెలిపారు. చైనా పౌరుల నివాసాలతో పాటు వారి ఇళ్లకు వెళ్లే మార్గాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు సేఫ్ సిటీ పోలీస్ ఫెసిలిటేషన్లో ఒక డెస్క్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకుని దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో ఈ అధికారులు ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదీగాక ఈ ఏడాది ఏప్రిల్ 26న కరాచీ యూనివర్సిటీలోని కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్ షటిల్ వ్యాన్పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ)కి చెందిన మహిళ ఆత్మాహుతి బాంబర్ జరిపిన దాడిలో ముగ్గురు చైనా టీచర్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. పైగా వేర్పాటువాద పాకిస్తాన్లోని బులిచిస్తాన్ ప్రావిన్స్లో స్థానికులు చైనా పెట్టుబడులను వ్యతిరేకిస్తున్నట్లు అధికారులు తెలిపారు. (చదవండి: అదానీని ఆపండి...మళ్లీ శ్రీలంకలో మొదలైన నిరసన సెగ) -
విరాటపర్వం నాకో చాలెంజ్
‘‘విరాటపర్వం’ చిత్రంలో ఉద్యమంతో పాటు ఒక గొప్ప ప్రేమకథ ఉంది. వేణు ఊడుగులగారు అద్భుతంగా రాశారు.. తీశారు. ఇలాంటి బలమైన కథలో నాకు మంచి పాత్ర దక్కింది’’ అని నవీన్ చంద్ర అన్నారు. రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన నవీన్ చంద్ర విలేకరులతో మాట్లాడుతూ– ‘‘విరాటపర్వం’లో సీనియర్ ఉద్యమకారుడు రఘన్న పాత్రలో కనిపిస్తా. కథను తలకిందులు చేసే పాత్ర నాది. నాతో మొదటిసారి తెలంగాణ యాసని అద్భుతంగా చెప్పించారు వేణుగారు. ఈ సినిమా చేయడం ఒక చాలెంజ్. రానాగారి వ్యక్తిత్వం గొప్పది. ఓ రకంగా ఆయన బిగ్ ఇన్ఫర్మేషన్ బాక్స్’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నన్ను చాలా మంది హీరోగా ఫిక్స్ అయిపోయారు. హీరోగా చేయాల్సిన సినిమాలు వస్తే చేస్తున్నాను. సినిమా ఆడినా ఆడకపోయినా నేను చక్కగా చేశాననే గుర్తింపు వస్తోంది. నాపై నమ్మకంతో మంచి పాత్రలు ఇస్తున్న దర్శకులకు కృతజ్ఞతలు. హీరోగా చేయడం సెపరేటు. నాలుగు నెలలు ఒకే కథపై ఉంటాం.. దానికి వచ్చే పేరు, రెమ్యూనరేషన్ వేరుగా ఉంటాయి. కానీ మంచి కథ ఉన్న సినిమాల్లో పాత్రలు చేయడం కూడా నటుడిగా తృప్తి ఇస్తోంది. నేను చేసిన కొన్ని ఓటీటీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. యూవీ కాన్సెప్ట్స్లో హీరోగా ఒక సినిమా చేశాను. రామ్చరణ్–శంకర్గారి సినిమా, బాలకృష్ణ– గోపీచంద్ మలినేనిగారి సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
సీఎం మమతా బెనర్జీ విమానానికి కుదుపులు
కోల్కతా: ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం తీవ్ర కుదుపులకు లోనుకావడంపై నివేదిక ఇవ్వాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)ను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోరింది. సమాజ్వాదీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వారణాసి వెళ్లిన సీఎం మమత శుక్రవారం సాయంత్రం చార్టర్డ్ విమానంలో తిరిగి వస్తున్నారు. ఒక్కసారిగా బలమైన ఈదురుగాలులు వీయడంతో ఆ విమానం తీవ్ర కుదుపులకు లోనయింది. దీంతో పైలట్ అప్రమత్తమై సుభా‹ష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అకస్మాత్తుగా విమానం పైకి, కిందికి ఊగిసలాడటంతో మమతా బెనర్జీ వెన్నెముకకు గాయమైంది. ఈ ఘటనను బెంగాల్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానం ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకోవడానికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలని డీజీసీఏను కోరింది. ఈ మేరకు రిపోర్టు సిద్ధం చేస్తున్నట్లు డీజీసీఏ అధికారి ఒకరు వెల్లడించారు. సీఎం మమత భద్రతపై అధికార టీఎంసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆమె ప్రయాణిస్తున్న విమానాలు గతంలోనూ ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నాయని, దర్యాప్తు చేపట్టాలంది. -
ఆ మాత్రం ఎవరైనా చేస్తారు.. రాబియా వేరే పని కూడా చేసింది!
ఆమె క్లాస్లో ఆమె అమ్మ, అమ్మమ్మ విద్యార్థుల్లా పాఠాలు విన్నారు. అమ్మమ్మ తన మనవరాలిని ‘టీచర్’ అంటూ పిలిచేది. ఆ పల్లెటూళ్లో చదువురాని గృహిణులందరూ ఆమె స్కూల్లో బుద్ధిగా చదువుకునేవారు. కేరళ ప్రభుత్వం అక్షరాస్యత ఉద్యమం చేపట్టడానికి ఆమె కూడా స్ఫూర్తి. జీవితం ఆమెను చిన్నప్పుడే చక్రాల కుర్చీకి పరిమితం చేసింది. కాని చదువే మనిషికి చలనం ఇస్తుందని అందరికీ చదువు అందే పనిని చూసింది. కె.వి.రాబియా కేరళలో ఎందరికో స్ఫూర్తి. నేడు పద్మశ్రీ ప్రకటనతో దేశానికి కూడా స్ఫూర్తిగా నిలిచింది. 56 ఏళ్ల రాబియా జీవితం కేరళలో స్కూలు పిల్లల టెక్ట్స్బుక్స్లో పాఠ్యాంశంగా ఉంది. కేరళ అనే ఏముంది... దేశంలో ఏ భాషలోని పిల్లలలైనా ఆమె జీవితాన్ని పాఠంగా చదువుకోవాలి. స్ఫూర్తి పొందాలి. ఎందుకంటే అలాంటి పోరాటం చేసిన వారు చాలా తక్కువ ఉంటారు. స్త్రీలలో మరీ తక్కువగా ఉంటారు. అందుకే ప్రతి చిన్నారి, యువతి, గృహిణి, ఉద్యోగిని రాబియాను చూసి జీవితంలో అలుపెరగని పోరాటం ఎలా చేయవచ్చో నేర్చుకోవచ్చు. ఎందుచేత ఆమె స్ఫూర్తి? ఆమె మలప్పురం జిల్లాలోని తిరురంగడి అనే ఊరికి దగ్గరలోని ‘వెల్లిలక్కడు’ అనే ఊరిలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టింది. ఆమె తండ్రికి రేషన్షాప్ ఉండేది. రాబియాకు చదువుకోవాలని బాగా కోరిక. కాని 9వ క్లాసుకు రాగానే ఆమెకు రెండు కాళ్లకూ పోలియో వచ్చింది. అయినా సరే ఇంటర్ వరకూ మేనమామ సహాయంతో కాలేజీకి వెళ్లింది. కాని ఇంటర్లో నడుము కింద నుంచి పూర్తిగా చచ్చుబడి వీల్చైర్కు పరిమితం అవ్వాల్సి వచ్చేసరికి ఇక కాలేజీ మానుకుంది. కాని చదువంటే ఇష్టం. ఎలా? ఇంట్లోనే ఉంటూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ ఆ తర్వాత పిజి చదవడం మొదలెట్టింది. ఆ మాత్రం ఎవరైనా చేస్తారు? రాబియా వేరే పని కూడా చేసింది. ఆడవాళ్ల స్కూలు రాబియా ఉన్న పల్లెటూళ్లో అందరూ పేదవాళ్లు. చిన్న చిన్న పనులు చేసుకునేవారు. ఆ ఇళ్ల ఆడవాళ్లకు అక్షరం ముక్క చదువు లేదు. నేను ఇంటి దగ్గరే ఉన్నా కదా వీరికి ఎందుకు చదువు చెప్పకూడదు అని డిగ్రీలోనే రాబియాకు అనిపించింది. వెంటనే ఆమె తన ఇంటిలోనే స్కూల్ ప్రారంభించింది. కేవలం ఆడవాళ్లకే ఆ స్కూలు. ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు. ఆమె ఇల్లు ‘కడలుండి’ అనే నది ఒడ్డున ఉంటుంది. మెల్లగా అదొక గురుకులంలాగా తయారైంది. రాబియా టీచర్ అసలు ఏమాత్రం రాజీ పడకుండా ఆడవాళ్లకు చదువు చెప్పడం, వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉపాధి అవకాశాలు అందుతాయో తెలియచేసి, ప్రతి ఇంటికి ఏదో ఒక దారి చూపడం మొదలెట్టింది. రాబియా తల్లి, అమ్మమ్మ ఇది గమనించి ఆఖరుకు వారు కూడా ఆమె స్టూడెంట్స్గా మారక తప్పలేదు. తనను ఎత్తుకుని ఆడించినవారు తన దగ్గర బుద్ధిగా పాఠాలు వినడం రాబియాకు చాలా సంతోషం కలిగించింది. ఈ వార్త అటూ ఇటూ వెళ్లి ప్రభుత్వానికి చేరింది. ఒకరోజు అధికారులు వచ్చేసరికి రాబియా క్లాసులో 80 ఏళ్ల పెద్దామె నుంచి 8 ఏళ్ల పాపాయి వరకూ చదువుకుంటూ కనిపించారు. అధికారులు చాలా సంతోషించి ఏం కావాలి అని అడిగితే మా ఊరికి రోడ్ వేయండి అంది రాబియా. వెంటనే రోడ్ వేసిన అధికారులు దానికి ‘అక్షర రోడ్’ అని పేరు పెట్టారు. అంతే కాదు లైట్లు, నీటి వసతి ఇలాంటివన్నీ రాబియా వల్ల ఆ ఊరికి వచ్చాయి. ‘చలనం’ సంస్థ రాబియాకు తెలుసు... తాను తన కాళ్ల మీద నడవలేనని. కాని తన చదువు సమాజాన్ని నడిపించగలదు... తాను చెప్పే చదువు నలుగురికీ చలనం ఇవ్వగలదు... అందుకే ఆమె ‘చలనం’ అనే సంస్థను స్థాపించి ముఖ్యంగా దివ్యాంగులకు, మానసిక అవస్థలు ఉన్న పిల్లలకు స్కూళ్లు తెరిచింది. అంతే కాదు... తన ఇంటిని ఒక నాలెడ్జ్ సెంటర్గా మార్చింది. లైబ్రరీ, కౌన్సెలింగ్... అన్నీ అక్కడే. తన్నుకొని తనదగ్గరకు వచ్చిన భార్యాభర్తలకు ఆమె కౌన్సెలింగ్ ఇచ్చేది. అయితే ఆమె జీవితానికి ఇంకా పరీక్షలు ఎదురయ్యాయి. కేన్సర్ సర్వయివర్ 32 ఏళ్ల వయసులో ఆమెకు కేన్సర్ వచ్చింది. దానిని ఆమె విజయవంతంగా ఎదుర్కొంది. శరీర బలం కంటే మనోబలంతోనే ఆమె దానిని జయించింది. ఆ తర్వాత 40 ఏళ్ల వయసులో ఆమె బాత్రూమ్లో పడటంతో వెన్నుపూస ఆమె శరీరాన్ని మరింత చలనం లేకుండా చేసింది. ఆ సమయంలో ఆమె పూర్తిగా మంచం మీద ఉండి ‘మౌన రోంబనంగల్’ (నిశ్శబ్ద కన్నీరు) అనే తన జ్ఞాపకాల గ్రంథాన్ని రాసింది. అది హిట్ అయ్యి వచ్చిన డబ్బుతో ఆమె వైద్యం చేయించుకుంది. ఆ తర్వాత ‘స్వప్నాలకు రెక్కలుంటాయి’ అనే పేరుతో ఆత్మకథను రాసింది. మనిషి ఎంత వీలుంటే అంత చదువుకోవాలని జ్ఞానమే సమాజాన్ని మరింత వికాసంలోకి తీసుకెళుతుందని రాబియా గట్టిగా నమ్ముతుంది. ప్రచారం చేస్తుంది. ఆమె కృషి వల్ల ఆమె ఊరి చుట్టుపక్కల 8 గ్రామాలు పూర్తిగా అక్షరాస్యతలోకి ప్రయాణించాయి. ప్రజలు రాబియాను ఎంతో అభిమానిస్తారు. ఏ కృషీ వృధా పోదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆమెను ‘పద్మశ్రీ’తో సత్కరించింది. గొప్పవాళ్లు కొందరు చక్రాల కుర్చీకి పరిమితం కావచ్చు. కాని వారి సంకల్పం ప్రపంచాన్ని చుట్టేస్తూ ఉంటుంది. ఆ సంకల్పం అందరికీ దక్కాలి. రాబియాను అభినందిస్తున్న పలువురు ప్రముఖులు -
బీజేపీ కుట్రలను తిప్పి కొడదాం: తమ్మినేని వీరభద్రం
సాక్షి, సూర్యాపేట(నల్లగొండ): వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో తెలంగాణ గడ్డ మీద హిందూమతం పేరుతో బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పి కొడదామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో సీసీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని హాజరై తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారిని సన్మానించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, నాగార్జునరెడ్డి, ఎం.రాములు, కె.యాదగిరిరావు, ధీరావత్ రవినాయక్, బి.శ్రీరాములు, కోట గోపి, గోవిందు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: సెప్టెంబరు 17: సాయుధ చరిత్రకు సాక్ష్యాలు -
సెప్టెంబరు 17: సాయుధ చరిత్రకు సాక్ష్యాలు
ఓ వైపు దేశం మొత్తం స్వాతంత్య్ర సంబురాలు చేసుకుంటుంటే తెలంగాణ మాత్రం నిజాం కబంధ హస్తాల్లోనే మగ్గిపోయింది. ఉమ్మడి జిల్లాలో సామంతరాజులు స్థానికంగా గడులు నిర్మించుకుని గడ్చిరోలి జిల్లా సిరొంచా, ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూర్, ఆసిఫాబాద్, వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, కరీంనగర్ జిల్లా పెద్దపల్లి, వేములవాడ తదితర ప్రాంతాల్లో శిస్తు వసూలు చేసేవారు. నాడు చెన్నూర్, ఆసిఫాబాద్, ఇందారం, తాండూర్ తదితర ప్రాంతాల్లో నిర్మించిన భవనాలు, గడులు, చెరువులు చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. తాండూర్లో ఠాణా భవనం తాండూర్(ఆదిలాబాద్): నిజాం పాలనలో తాండూర్ ఓ ముఖ్య పట్టణంగా ఉండేది. ఆసిఫాబాద్–చెన్నూర్ ప్రాంతాలకు మధ్యలో, మహారాష్ట్రలోని చంద్రాపూర్కు సమీపంలో ఉండటంతో తాండూర్లో పోలీస్ ఠాణాను ఏర్పాటు చేశారు. 1912–1920 మధ్యకాలంలో అక్కడ ఓ భవనాన్ని నిర్మించారు. రెండేళ్ల క్రితం వరకు భవనాన్ని మాదారం పోలీసుస్టేషన్గా వినియోగించగా.. ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. అదేవిధంగా తాండూర్లో పోస్టాఫీసు నిర్వహణ కోసం ప్రత్యేకంగా నిజాం ప్రభుత్వం 1912 సంవత్సరంలో భవనం నిర్మించారు. ఇప్పడు కూడా ఈ భవనాన్ని పోస్టాఫీసుగా వినియోగిస్తుండటం విశేషం. రెండేళ్లు అజ్ఞాతంలో.. పట్టణానికి చెందిన సాయుధ పోరాట యోధుడు సుడిగాల విశ్వనాథ సూరి రజాకార్ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. పోరాటయోధులను రజాకార్లు అరెస్ట్ చేస్తున్నారనే విషయం తెలుసుకున్న అధిష్టానం విశ్వనాథ సూరిని అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో ఆయన రెండేళ్లపాటు అజ్ఞాత జీవితాన్ని గడిపాడు. 1946లో సుభాశ్ చంద్రబోస్ అధ్వర్యంలో మహారాష్ట్రలోని సిరొంచా గ్రామంలో ఏర్పాటు చేసిన రహస్య శిబిరానికి హాజరయ్యారు. అక్కడే ఏడాదిపాటు శిక్షణ పొందారు. బల్లార్ష శిబిరంలో కూడా పాల్గొన్నారు. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జనజీవనంలోకి వచ్చారు. 1952లో చెన్నూర్, లక్సెట్టిపేట ఉమ్మడి అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో సోషలిస్ట్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. 1952 నుంచి 1957 వరకు పదవిలో ఉన్నాడు. ఆ తర్వాత చెన్నూర్ నియోజకవర్గాన్ని 1957లో ఎస్సీ రిజర్వు చేశారు. ఆనాటి నుంచి నేటి వరకు చెన్నూర్కు ప్రతినిధ్యం వహించిన స్థానికుడు కేవలం విశ్వనాథ సూరి మాత్రమే. నస్పూర్లో దొరల గడి పట్టణ పరిధిలోని ఊరు నస్పూర్లో సుమారు 1927–30 మధ్య కాలంలో నస్పూర్ దొరలు నిర్మించిన గడి నాటి చరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యంగా మిగిలింది. నస్పూర్కి చెందిన గోనె రాజ వెంకట ముత్యంరావు దీనిని నిర్మించారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ముత్యంరావు నాటి నిజాం ప్రభుత్వానికి నమ్మకమైన బంటుగా ఉంటూ ప్రభుత్వానికి సంబంధించి కార్యకలాపాలను ఈ గడి నుంచే పర్యవేక్షించేవారు. జన్నారం, తపాలాపూర్, నస్పూర్, ఇందారం, పెద్దపల్లి, భూపాలపల్లి, సిరొంచా గడులను కలుపుతూ ప్రత్యేక దారి ఉండేదని చెప్పుకుంటారు. తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత ముత్యంరావు కుటుంబం గడిని వదిలి హైదారాబాద్లో స్థిరపడ్డారు. కాగా.. ఈ కుటుంబంలో నుంచి జీవీ సుధాకర్రావు అప్పటి లక్సెట్టిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మర్రి చెన్నారెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. సాయుధ పోరులో ఆసిఫాబాద్ యోధులు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆసిఫాబాద్ సమరయోధుల పాత్ర కీలకం. ఆసిఫాబాద్, సిర్పూర్, చెన్నూర్, లక్సెట్టిపేట, పెద్దపల్లి ప్రాంతాలకు చెందిన వేలాది మంది యువకులు కాంగ్రెస్ అతివాద నాయకులతో కలిసి పోరాటంలో పాల్గొన్నారు. ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన బోనగిరి వెంకటేశం, చీల శంకర్, చీల విఠల్, ఖాడ్రే శంకర్, రాంసింగ్, రేవయ్య, తాటిపెల్లి తిరుపతి, ఏకబిల్వం శంకరయ్య, చందావార్ విఠల్, జగన్నాథ్ మహారాష్ట్రలోని చాందా సాయుధ శిక్షణ శిబిరంలో ఏడాది పాటు శిక్షణ పొందారు. వీరికి ఆసిఫాబాద్కు చెందిన రాంచందర్ రావు పైకాజీ, సుబ్బబాబురావు, దండనాయకుల గోపాల్ కిషన్రావు, వామన్రావు వైరాగరే, ప్రభాకర్ రావు మసాదే సహకరిస్తూ వచ్చారు. క్యాంపు ఇన్చార్జీలుగా కేవీ నర్సింగరావు, కేవీ కేశవులు, వి.రాజేశ్వరరావు ఉండేవారు. మహారాష్ట్ర నుంచి సైనిక బలగాలు పది యుద్ధ ట్యాంకులు, పది ట్రక్కులు, 20 ఠానే గాఢ్లు, వందలాది మంది సైనికులతో చాందా, బల్లార్షా క్యాంపుల్లో సుశిక్షితులైన పౌరులు ఆసిఫాబాద్ వైపు ముందుకు కదిలారు. నాటి పోరాటంలో పాల్గొన్న యోధులను ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించింది. కీలక సంఘటనలు.. ► 1948 సెప్టెంబర్ 13న హైదరాబాద్ సంస్థానాన్ని చుట్టుముట్టిన భారత సైన్యం పోలీస్ యాక్షన్ ప్రకటించింది. ►సెప్టెంబర్ 13 పొద్దుపోయాక చంద్రాపూర్, బల్లార్షా, దాభా (ఉపక్యాంపు, సిరొంచా క్యాంపుల నుంచి సాయుధ సమరయోధులు భారత సైన్యం బాటలో నిజాం పోలీసులు రజాకార్లపై విరుచుకు పడేందుకు చర్యలు ప్రారంభించారు. ► రాత్రి భారత సైన్యం హైదరాబాద్ సంస్థాన హద్దులో ప్రవేశించకుండా రాజూరా సమీపంలోని రైల్వే వంతెనకు బాంబులు అమర్చారు. ► 14న రాత్రి 11 గంటలకు రైల్వే వంతెన పేల్చివేతకు రజాకార్లు చేపట్టిన ప్రయత్నాలను సమరయోధులు గుర్తించారు. రాత్రి 12 గంటలకు ఈ విషయం కొరియర్ వ్యవస్థ ద్వారా మిలటరీకి సమాచారం అందించారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో విద్రోహులపై మిలటరీ దాడి, రజాకార్ల హతం, బాంబుల తొలగింపు. 3 గంటలకు మహారాష్ట్రలోని విరూర్ రైల్వేస్టేషన్పై ఆసిఫాబాద్కు సాయుధ యోధుల దాడి, ఈ ఘటనలో వెంకటేశం కాలికి గాయమైంది. ► 15 తెల్లవారుజామున 4 గంటలకు దాబా మీదుగా వచ్చిన మరో మిలటరీ క్యాంపు, సాయుధ పోరాట వీరులు పెన్గంగా సరిహద్దులోని లోన్వెల్లినాకాపై దాడితో మిలటరీ మార్గం సుగమం. రాత్రి 10 గంటలకు ఆసిఫాబాద్ సమీపంలోని బుజల్ఘాట్ వంతెనను రజాకార్లు పేల్చివేశారు. మరునాడు స్థానికులు ఈ వంతెనపై తాత్కాలిక మార్గం ఏర్పాటు చేసుకున్నారు. ► 16న అర్ధరాత్రి దాటాక సిరొంచా నుంచి వచ్చిన మిలటరీ, స్థానిక సమరయోధులు బెజ్జూర్ ఔట్పోస్టుపై దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున సాయుధ పోరాటయోధులు దహెగాం సమీపంలో పెసరకుంట వద్ద రజాకార్లపై దాడి చేశారు. ఈ సంఘటనలో 19 మంది మృతి చెందారు. అనంతరం బీబ్రా పోలీస్ స్టేషన్పై దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ► ఇదేరోజు ఆసిఫాబాద్ జిల్లా జైలులో పదుల సంఖ్యలో సమరయోధులను నిర్భందించారు. 17న నిజాం లొంగుబాటు వార్తతో ఆసిఫాబాద్ జైళ్లోని సమరయోధులు ఇతర ఖైదీలతోపాటు బయటికి వచ్చారు. చదవండి: నేడు జలసౌధలో కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సబ్ కమిటీ సమావేశం -
పది నెలలుగా సాగుతున్న అభివృద్ధి వికేంద్రీకరణ ఉద్యమం
-
ఉద్యమ స్ఫూర్తితో ముందడుగు
మార్చి 8 శ్రామిక మహిళల పోరాటానికి సంకేతం. 19వ శతాబ్దంలో న్యూయార్క్ నగరంలో సమాన వేతనానికి, పది గంటల పనికోసం మహిళల పోరాటాలు, త్యాగాల ఫలితంగా 1910లో మార్చి 8కి అంతర్జాతీయ మహిళా దినంగా గుర్తింపు వచ్చింది. వివిధ సందర్భాల్లో మహిళలు తమ హక్కుల కోసం, ఉనికి కోసం అనేక ఉద్యమాలు నిర్వహించారు. రష్యాలో జార్ చక్రవర్తి ఆగడాలకు వ్యతిరేకంగా రొట్టె కోసం 1917 విప్లవ కాలంలో మార్చి 8న పెట్రోగార్డ్లో వేలాది మహిళలు బ్యానర్లతో ప్రదర్శన చేశారు. మహిళలు బుర్ఖా వేసుకోకుండా బయటకు రాకూడదని 1970లో ఇరాన్ అధ్యక్షుడు అయతుల్లా ఖోమేని మార్చి 7న ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ వేలాది మహిళలు ప్రదర్శనలు జరిపారు. 2018 మార్చి 8న 170 దేశాల సమన్వయంతో అంతర్జాతీయంగా మహిళల సమ్మె జరిగింది. హింసకు, ఇంకా అనేక రకాల అణచివేతలకు వ్యతిరేకంగా ఎనిమిది రకాల డిమాండ్లతో రోడ్లన్నీ నిండిపోయాయి. మన దేశంలో 2012లో ఢిల్లీ రాజధాని నడిబొడ్డున నిర్భయపై అత్యంత పాశవికంగా జరిగిన అత్యాచారం, హత్యకు నిరసనలు వెల్లువెత్తాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, తెభాగా పోరాటంలో మహిళలు, పురుషులతో సమానంగా భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడి అమరులైనారు. 1970లో నాటి ఉత్తరప్రదేశ్లోని అడవులను పారిశ్రామికవేత్తల నుంచి రక్షించడానికి దశౌలీ గ్రామ స్వరాజ్య సంఘం ఆధ్వర్యంలో 2,500 చెట్లను నరకడాన్ని అడ్డుకున్నారు. మహిళలు చెట్లను హత్తుకొని కాపాడటం వల్ల దీనికి ‘చిప్కో’ ఉద్యమమనే పేరు వచ్చింది. 1995లో హరియాణాలోని ఖాప్ పంచాయతీ ఒక కుటుంబానికి శిక్ష వేసే క్రమంలో పన్నెండేళ్ల బాలికను అత్యాచారం చేయాలనే తీర్పునిచ్చింది. దీనికి వ్యతిరేకంగా గ్రామంలోని వెయ్యి మంది మహిళలు సంఘటితంగా ఉద్యమించారు. మణిపూర్లో 2004లో సాయుధ బలగాల చట్టానికి వ్యతిరేకంగా ముప్పైమంది మహిళలు నగ్నంగా ఇంఫాల్లో నిరసన ప్రదర్శన చేశారు.1992లో సారా వ్యతిరేక ఉద్యమం చరిత్ర సృష్టించింది. 1991లో నూతన ఆర్థిక సంస్కరణల ప్రభావం వల్ల మహిళలపై మరింత భారం పడింది. సామ్రాజ్యవాద సంస్కృతి కొత్త రూపాలలో మహిళలపై హింసను పెంచింది. రోజూ 88 మంది మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. 2019లో రాజస్తాన్లో 6,000, యూపీలో 3,165 అత్యాచార సంఘటనలు జరిగితే, రికార్డు కెక్కనివి ఎన్నో. 2019లో నమోదైన 32,033 అత్యాచార కేసుల్లో ఉత్తరప్రదేశ్లోనే 18 శాతం నమోదైనాయి. బాధితుల్లో 11 శాతం దళిత మహిళలే. 2017 డిసెంబర్లో భీమా కోరేగావ్ దళితుల ఆత్మగౌరవ పోరాటం, పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని వేలాది ముస్లిం మహిళల షాహిన్బాగ్ పోరాటం, నేటి కోట్లాది రైతుల పోరాటం దేశ చరిత్రలో 3 ప్రధాన పోరాటాలు. 40 సంవత్సరాల్లో అత్యధిక స్థాయికి నిరుద్యోగిత చేరింది. డీమానిటైజేషన్, జీఎస్టీ అసంఘటిత రంగాన్ని ఆర్థికంగా దెబ్బతీశాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ మాత్రమే కాదు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. దీనికితోడు లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. కుటుంబ భారాన్ని మోయలేక మహిళలు ఆర్థిక ఒత్తిడికి లోనవుతున్నారు. భరించినంత కాలం మహిళలపై భారం పడుతూనే ఉంటుంది. మన ముందున్నది రైతాంగ వ్యవసాయ కార్మిక మహిళా ఉద్యమం. కార్పొరేట్ హిందూత్వ శక్తులకు వ్యతిరేకంగా అన్ని రంగాల మహిళలు మార్చి 8 స్ఫూర్తితో చేయి చేయి కలిపి అడుగులు వేయడమే కర్తవ్యం. – అనిత, చైతన్య మహిళా సంఘం -
వికేంద్రీకరణకు మద్దతుగా విద్యార్థుల పోస్టు కార్డు ఉద్యమం
సాక్షి, తిరుపతి: మూడు రాజధానులకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి నేతృత్వంలో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. తిరుపతిలో ఎస్వీయులో గురువారం చేపట్టిన ఈ ఉద్యమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ క్రమంలో మూడు రాజధానులు కావాలంటూ విద్యార్థులు పోస్టు కార్డుల ద్వారా నినాదాలు చేస్తూ రాష్ట్రపతికి వినతి చేసుకున్నారు. -
హాంకాంగ్ ఉద్యమం.. చైనా కలవరం
20 ఏళ్ల క్రితం వరకూ బ్రిటిష్ వలస దేశంగా ఉన్న హాంకాంగ్ని చైనా మెయిన్ల్యాండ్లో కలపవటాన్ని వ్యతిరేకిస్తూ హాంకాంగ్ విద్యార్థులు ఈ పోరు ప్రారంభించారు. ఉద్యమాన్ని అణచివేయాలని చైనా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. అంతర్జాతీయంగా గతవారం హాంకాంగే హాట్ టాపిక్. స్వయం పరిపాలన కోసం అక్కడ జరుగుతున్న ఉద్యమం తీవ్రమవుతోంది. 20 ఏళ్ల క్రితం వరకూ బ్రిటిష్ వలస దేశంగా ఉన్న హాంకాంగ్ని చైనా మెయిన్ల్యాండ్లో కలపటాన్ని వ్యతిరేకిస్తూ హాంకాంగ్ విద్యార్థులు ఈ పోరు ప్రారంభించారు. ఈ ఉద్యమాన్ని అణచివేయాలని చైనా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించినా ఉద్యమం చల్లారకపోగా తిరిగిపుంజుకుంది. ఇది మరింత విస్తృతమై పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు, సాధారణ ప్రజలు వీధుల్లోకొచ్చారు. దేశం ఒక్కటే, వ్యవస్థలు రెండు.. 1997 జూలై 1న బ్రిటన్ హాంకాంగ్పై ఆధిపత్యాన్ని చైనాకు అప్పగించింది. హాంకాంగ్ చైనాలో భాగమైనప్పటికీ హాంకాంగ్కి పాలనాంశాల్లో, కొన్ని ఇతర విషయాల్లో స్వయంప్రతిపత్తి ఉంటుంది. ఆర్థిక, విదేశాంగ విధానాలు మాత్రం చైనా ప్రభుత్వ అ«ధీనంలోనే ఉంటాయి. చైనా అధ్యక్షుడి పాలనలోనే ఉన్నప్పటికీ.. పరిపాలనలోనూ, ఇతర విధానాల రూపకల్పనలోనూ హాంకాంగ్కు ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. ఈ స్వతంత్రత ప్రధాన భూభాగమైన చైనాకన్నా అధికంగా ఉన్నదనీ, చైనా ప్రజలకన్నా హాంకాంగ్ ప్రజలు ఎక్కువ హక్కులు అనుభవిస్తున్నారనీ చైనా ఆరోపిస్తోంది. అందుకే ఇక్కడి నేరస్తులను చైనా మెయిన్ల్యాండ్కు అప్పగించేందుకు చట్టసవరణకు చైనా సిద్ధమైంది. హాంకాంగ్ ప్రజలను ఈ చర్య మరింత రెచ్చగొట్టింది. తక్షణమే చట్టసవరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలని ఆందోళనలు మొదలయ్యాయి. పార్లమెంటు ముట్టడి.. జూలైలో ఆందోళనకారులు పార్లమెంటును చుట్టుముట్టడంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఎట్టకేలకు చట్టసవరణ బిల్లుని చైనా ప్రభుత్వం విరమించుకుంది. ఇంకా... ఈ ఉద్యమాన్ని దొమ్మీలుగా, అల్లర్లుగా భావించొద్దని, అరెస్టు చేసిన ఉద్యమకారులను విడుదల చేయాలని, పోలీసుల హింసాకాండపై స్వతంత్ర న్యాయవిచారణ జరిపించాలని, సార్వత్రిక ఓటు హక్కు కల్పించాలనే డిమాండ్లు నెరవేరలేదు. -
అవిగో టాయ్లెట్స్.. అందులో కూర్చొని ఇవ్వొచ్చు!
గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చిన పల్లెజనం పట్టణాల నుంచి ఏం నేర్చుకుంటున్నారో తెలియదు కానీ చాలా విషయాల్లో గ్రామీణ ప్రజల్లోని మానవత్వం, అమాయకత్వం, ప్రేమా మన మనసుల్ని పల్లెలవైపు పరుగులు తీయిస్తుంటుంది. అది గుర్తొచ్చినప్పుడల్లా మననుంచి దూరమైనవేవో మనసుని నొప్పిస్తుంటాయి. ఇటీవల ఆగస్టు తొలివారంలో తల్లిపాల ప్రాధాన్యతను చాటిచెప్పే వారోత్సవాలను గురించి చదివినప్పుడు గుండెల్లో అలాంటిదే ఏదో నొప్పి బయలుదేరింది. కొద్దినెలల క్రితం చదివిన ఓ విషయం గుర్తొచ్చింది. బహుశా అలాంటి నొప్పినే, అలాంటి బరువునే గుండెల్లో నింపుకొని భారంగా, బాధగా బతుకులీడుస్తోన్న లక్షలాది మంది పట్టణాల్లోని పసిబిడ్డల తల్లులు గుర్తొచ్చి నాగరికత పేరుతో, అభివృద్ధి పేరుతో కుప్పలు తెప్పలుగా నిర్మితమౌతోన్న అమానవీయ, అనాగరిక కట్టడాలపై ఏహ్యభావం ఏర్పడింది. బహుళంతస్తుల సెంట్రలైజ్డ్ ఏసీ భవనాల్లో ఆరోగ్యం కోసం కూడా నాలుగు మెట్లు ఎక్కే బాధే లేకుండా ఎస్కులేటర్లు చాలా సుఖవంతమైనవే. అలాంటి చాలా సౌకర్యవంతమైన ఎన్నో షాపింగ్ కాంప్లెక్స్లూ, మల్టీప్లెక్స్లూ నగరం నిండా జనానికి చోటే లేకుండా అవే భవనాలు. అలా సకల సౌకర్యాలతో విలసిల్లుతోన్న షాపింగ్ ‘పెద్ద’ బజారుల్లో ఓ తల్లి కళ్లు దేనికోసమో వెతుకుతూనే ఉన్నాయి. షాపింగ్ కాంప్లెక్స్లోని ట్రయల్ రూం ముందున్న సింగిల్ స్టూల్పై కూర్చొని జీన్స్ పైన సౌలభ్యం కోసం వేసుకున్న లూజ్ టీషర్టుని ఓ వారగా గబగబా పైకి లాగి చిన్నారి నోటికి స్థనాన్ని అందించిందో చిన్నపిల్ల తల్లి. అంతే! అంతలోనే అక్కడికొచ్చిన ఓ వ్యక్తి అది పిల్లలకు పాలివ్వడం కోసం ఏర్పాటుచేసిన స్థలం కాదనీ, తక్షణమే ఖాళీ చేయాలనీ నిస్సిగ్గుగా తేల్చి చెప్పాడు. మరి ఏడుస్తున్న బిడ్డకి పాలెక్కడివ్వాలి? ఆమె ప్రశ్నకి సమాధానంగా ప్రతీకాత్మక చిత్రం : ‘పాలిచ్చే తల్లులకుకాస్త చోటు చూపించండి’ అంటూ ఇటీవలేఆన్లైన్ వేదికగా ఒక ఉద్యమం మొదలైంది. ‘అదిగో అక్కడుంటాయి టాయ్లెట్స్.. అందులో కూర్చొని ఇవ్వొచ్చు’ అని ఉచిత సలహా ఒకటి పారేసి వెళ్లాడు. తల్లిపాలు కల్తీ లేనివి. కల్తీ చేయలేనివి. గుండెల్నిండుగా హత్తుకుని ఇచ్చే తల్లిపాలు బిడ్డ ఆకలి మాత్రమే తీర్చవు. ప్రేమతో నిండిన పాలిండ్ల స్పర్శ బిడ్డకూ, తల్లికీ కూడా ఆరోగ్యాన్నిస్తాయి. అలాంటిది అపరిశుభ్రమైన ప్రాంతంలో, దుర్గంధంతో నిండిన విసర్జిత ప్రాంతంలో బిడ్డకు పాలివ్వమని చెప్పే పరిస్థితి ఈ పట్టణాల్లో మనం మిస్సవుతోన్నదేమిటో మనకు గుర్తు చేస్తోంది. అంతెందుకు చాలా రోజుల క్రితం రోడ్డుపక్కగా (మిగిలిన వాహనదారులకు ఏ ఆటంకం లేకుండా) కారు ఆపుకుని బిడ్డకు పాలిస్తోన్న తల్లిపై ట్రాఫిక్ కానిస్టేబుల్ చేసిన రుబాబూ, రాద్ధాంతం టీవీ చూసినవారందరికీ గుర్తుండే ఉంటుంది. రోడ్డుపైన అడ్డదిడ్డంగా కార్లు పార్కుచేసినా కిమ్మనకుండా వెళ్లిపోయే వాళ్లు కూడా పసిబిడ్డకు పాలిచ్చేప్పుడు ఆటంక పరచకూడదనే ఇంగితం లేకుండా పోయింది. అయితే ఆ ఇంగితం ఉండాల్సిందెవరికి? నిజానికి నగరాలకే. పర్యావరణాన్ని గాలికి వదిలేసి, అనుమతులకు చెల్లుచీటీ ఇచ్చేసి, కుప్పలుతెప్పలుగా కట్టేసోన్న బహుళంతస్థుల భవనాల్లో మహిళలకు కావాల్సిందేమిటో ఎవ్వరైనా ఆలోచించారా? పసిబిడ్డలకు పాలిచ్చే ఓ రెండడుగుల ప్రైవసీ స్థలం. ఓ చిన్ని కుర్చీ. ఇంత చిన్న విషయం కొన్ని వేల మంది సమస్య అయినప్పుడు ఇదెందుకు తట్టదు ఎవరికీ? అంటే అది స్త్రీల సమస్య మాత్రమే కాబట్టి. ఆడపిల్లలకి ఏరకంగానూ అక్కరకు రాని నగరాలను నాగరికంగా మార్చగలమా? – అరుణ అత్తలూరి -
హక్కెక్కడిది?!
‘నాక్కూడా ఇలా జరిగింది’ అని చెప్పుకోవడం ‘మీటూ’.‘మగజాతికి కూడా ఇలా జరుగుతోంది’ అని ప్రతిధ్వనిగా నినదించడం ‘మెన్టూ’. ‘నాక్కూడా’ అని ఒక్కరే ధైర్యం చేసి బయటికి రావడం, ‘మేము కూడా’ అని నలుగుర్ని పోగేసుకుని రావడం ఒకటే అవుతుందా?! మాధవ్ శింగరాజు బాలీవుడ్ పూర్వపు నటి పూజాబేడీ బర్త్డే ఇవాళ. అయితే పూజ గురించి అకస్మాత్తుగా మనమి ప్పుడు మాట్లాడుకోడానికి కారణం ఆమె బర్త్డే కాదు. పూజ త్వరలో ‘మెన్ టూ’ అనే ఉద్యమాన్ని లాంచ్ చెయ్యబోతున్నారు! ‘మీటూ’ వంటిదే ‘మెన్టూ’. మీటూలో బాధిత మహిళలు ఉంటారు. ‘మెన్టూ’ లో బాధిత పురుషులు ఉంటారు. రెండూ భిన్నమైన ఉద్యమాలు. ఈ ‘వార్ ఆఫ్ సెక్సెస్’ ఎప్పుడూ ఉన్నదే. అయితే పురుషుల తరఫున ఒక మహిళ.. మహిళలపై ఇలా యుద్ధ శంఖారావం పూరించడం మునుపెన్నడూ లేనిది! తన బెస్ట్ ఫ్రెండ్ కరణ్ ఒబెరాయ్పై అన్యాయంగా అత్యాచారం కేసు పెట్టి, జైలు పాలు చేశారని పూజ ఆవేదన. ఆ ఆవేదనలోంచి ఆవిర్భవించినదే ‘మెన్టూ’ అనే ఆలోచన. కరణ్ ఒబెరాయ్ టీవీ యాక్టర్. యాంకర్, సింగర్. ‘ఇండీపాప్ బాయ్ బ్యాండ్’, ‘ఎ బ్యాండ్ ఆఫ్ బాయ్స్’ బృందంలో సభ్యుడు. నలభై ఏళ్లుంటాయి. ముంబైలోని అంథేరీ కోర్టు గురువారం నాడు అతడిని పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఫ్యాషన్ డిజైనర్–కమ్– హీలర్ అయిన ఒక యువతి.. కరణ్ తనపై అత్యాచారం చేశాడని, లక్షల్లో డబ్బును దోచుకున్నాడని ఫిర్యాదు చేయడంతో మే 6న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కరణ్కి అండగా పూజాబేడీ నిలబడ్డారు. అతడు అలాంటి వాడు కాదని, ఆ అమ్మాయే అతడి వెంట పడిందని ఆమె వాదన. అందుకు సాక్ష్యంగా పూజ.. వాళ్లిద్దరి మధ్య (కరణ్, యువతి) సాగిన మెసేజ్ సంభాషణల్లో ఒకదానిని సాక్ష్యంగా చూపిస్తున్నారు. అదే సాక్ష్యాన్ని చూపించి కరణ్కు బెయిల్ తెప్పించడం కోసం అతడి న్యాయవాది దినేష్ తివారి ప్రయత్నిస్తున్నారు.ఒక డేటింగ్ యాప్ ద్వారా 2016 చివర్లో కరణ్, ఆ యువతి ఒకరికొకరు పరిచయం అయ్యారు. గత ఏడాది డిసెంబరులో ఆ యువతి మీద కరణ్ లైంగిక వేధింపుల కేసు పెట్టాడు. ఈ నెల మొదటి వారంలో ఆమె అతడి మీద కేసు పెట్టింది. మత్తుమందు కలిపి తనపై అత్యాచారం చేశాడని, దానిని కెమెరాలో చిత్రీకరించాడని ఆమె ఫిర్యాదు. ఆ ఫిర్యాదులో 2017లో అత్యాచారం జరిగినట్లుగా ఉంది. మరి ఈ మధ్యకాలంలో ఏం జరిగింది, అప్పుడే ఆమె ఎందుకు బయటపడలేదు అని పూజ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రశ్నించారు. 2017 జనవరి 13న కరణ్కి ఆ యువతి పంపిన మెసేజ్ని, దానికి కరణ్ ఇచ్చిన సమాధానాన్ని పైకి చదివి వినిపించారు. ‘ఏ బంధాన్నీ, అనుబంధాన్ని ఏర్పడనివ్వకుండా మన రెండు దేహాలను.. కొంత సమయం స్వేచ్ఛగా మాట్లాడుకోనిద్దామా? అందుకు నా దేహం సిద్ధంగా ఉంది. ఏమంటావ్?’ అని యువతి పంపినట్లుగా పూజ చూపించిన మెసేజ్లో ఉంది. అందుకు కరణ్ ఇచ్చిన సమాధానం.. తనకు కెరీర్ పట్ల తప్ప ఇక దేనిపైనా ఆసక్తి లేదని. ఆ తర్వాతనైనా ఒకవేళ ఆ ఇద్దరిదేహాలు మాట్లాడుకున్నా.. అది ఆమె తరఫు నుంచి వచ్చిన ప్రేరేపణ అవుతుంది తప్ప, రేప్ ఎలా అవుతుందని పూజ పాయింట్ అవుట్ చేస్తున్నారు. ఈ సందర్భంలోనే ‘మెన్టూ’ అనే కొత్త ఉద్యమ కాన్సెప్ట్ని పైకి తెచ్చారు. పూజ కూడా ఒకప్పుడు స్త్రీల హక్కుల కోసం పోరాడినవారే. స్త్రీ స్వేచ్ఛను, స్త్రీ విముక్తిని ఆకాంక్షిస్తూ పూజ మంచి మంచి ఆర్టికల్స్ రాశారు. మరి ఇప్పుడేమిటి ఇలా?! పైగా.. ‘మనమిలా వీకర్ సెక్షన్ అంటూ స్త్రీలను సమర్థించుకుంటూ పోతే సమసమాజం ఏనాటికీ సిద్ధించదు. అందుకనే ‘మెన్టూ’ ఉద్యమం ప్రారంభించి అమాయకులైన పురుషుల వైపు నిలబడతాను’ అని ప్రతిన పూనారు! మెన్టూ అనే ఆలోచనకు పూజాబేడీని పురికొల్పిన కారణాలు ఏవైనా కానివ్వండి. పూజ అనే ఏముంది.. మగవాళ్లలోనే చాలామందికి ఈ ఆలోచన ఇప్పటికే వచ్చి ఉంటుంది. అయితే ‘మీటూ’లా.. ‘మెన్టూ’ నిలబడుతుందా? మీటూ సబ్జెక్టివ్. ‘నాక్కూడా ఇలా జరిగింది’ అని చెప్పుకోవడం. ‘మెన్టూ’ ఆబ్జెక్టివ్. ‘మగజాతికి కూడా ఇలా జరుగుతోంది’ అని ప్రతిధ్వనిగా నినదిం చడం. ‘నాక్కూడా’ అని ఒక్కరే బయటికి రావడం, ‘మేము కూడా’ అని నలుగుర్ని పోగేసుకుని రావడం ఒకటే అవుతుందా? కరణ్ గుడ్ బాయ్ అనుకున్నా.. అతడు చేసిన బ్యాడ్ థింగ్స్ కొన్ని కనిపిస్తున్నాయి. కెరీర్ తప్ప ఏమీ ఇంట్రెస్ట్ లేనివాడు ఆ అమ్మాయిని అన్నాళ్లు ఎందుకు ‘భరించినట్లు’? కెరీర్ తప్ప అసలేమీ ఇంట్రెస్ట్ లేనివాడు మొదట్లోనే ఆ అమ్మాయి స్నేహాన్ని ఎందుకు తుంచేయనట్లు? కెరీరే సర్వస్వం అనుకున్నవాడు ఎప్పటివో మెసేజ్లను తనకు తను ఇచ్చుకున్న సర్టిఫికెట్లలా ఎందుకు భద్రంగా ఉంచుకున్నట్లు?‘పాపం.. కొంతమంది మగాళ్లు’ అని పూజాబేడీ అంటున్నవాళ్లలో కరణ్ కూడా ఒకడని అనుకున్నా.. ఆ కొంతమంది కోసం కాదు కదా ఉద్యమాలు నడవాల్సింది, అసలు ఉద్యమాన్ని ఒకరెక్కడి నుంచో వచ్చి నడిపించడం ఏంటి? ఉద్యమమే నడిపిస్తుంది బాధితుల్నంతా ఒక చోటకు రప్పించి! అలాంటి ఉద్యమమే ‘మీటూ’. కరణ్ నిజంగా ఇన్నోసెంట్ అయుండీ, ఆ అమ్మాయి నాట్ ఇన్నోసెంట్ అయి ఉన్నా కూడా.. ‘మెన్టూ’ అని పిడికిలి బిగించే హక్కు మగాళ్లకేం వచ్చేయదు.. బాధింపును ఒక హక్కుగా వినియోగించుకుంటున్నవాళ్లే ఎక్కువమంది ఉన్నప్పుడు. -
మాటల పాట.. కొండల్ ఆట
పోరాటాల పురిటిగడ్డ మన నల్లగొండ ..ఎంతో మంది కవులు, కళాకారులకు పుట్టినిళ్లుగా తెలంగాణ ఉద్యమాలకు ఊపిరిపోసింది. ప్రజల్లో పోరాట స్ఫూర్తిని కలిగించిన ఘనత కళాకారులదే. గజ్జెకట్టి తెలంగాణ ధూంధాంతో హోరెత్తించి ప్రజా చైతన్యంతో పాలకులను మేలుకొల్పింది కళాకారులే. రేయింబవళ్లు పాటే ప్రాణంగా బతికిన ముద్దు బిడ్డ ఈ నాగిళ్ల కొండల్. సాక్షి, మిర్యాలగూడ టౌన్ : నిరుపేద కుటుంబంలో నాగిళ్ల కొండలు జన్మించాడు. చిన్నప్పటి నుంచి పల్లె పాటలు.. జానపదాలు అంటే.. ఆ యువకుడికి ప్రాణం. తన మాటలే పాటలుగా వినిపిస్తాయి. ‘పల్లెకు వందనం.. కన్నతల్లికి వందనం... పాట నేర్పిన పల్లెకు వందనం...’ అంటూ పుట్టిన పల్లెకు ..కన్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపాడు. రచయితగా.. గాయకుడిగా తెలంగాణ ఉద్యమంలోని అన్ని జిల్లాల్లో సుమారు 800 వరకు ప్రదర్శనలు ఇచ్చాడు. కాలుకు గజ్జకట్టి భూజాన గొంగడి వేసుకొని రాత్రనక, పగలనక తెలంగాణ సం స్కృతి, సంప్రదాయాలు, వెనుకబాటు తనం, తెలంగాణ యాస, భాష, గోసలపై తన పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపాడు త్రిపురారం మండలంలోని సత్యనారాయణపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల అన్నరావు క్యాంపుకు చెందిన నాగిళ్ల బక్కయ్య–బుచ్చమ్మల దంపతులు నిరుపేద దళిత కుటుంబానికి చెందిన వారు. వీరికి రెండవ సంతానం అయిన నాగిళ్ల కొండలుకు చిన్నప్పటి నుంచి పాఠశాలల్లో పాటలను పాడుతూ ఆకట్టుకునే వాడు. నల్లగొండతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ ‘తల్లి నీ ఒడినిండా .. త్యాగాల మూట... పల్లె నీ బతుకంతా...ఉద్యమాల బాట...గాయాలు గుండెనిండా..ఎత్తేను పోరాట జెండా...అలుపన్నది ఎరుగకుండా కదిలేను నా.. నల్లగొండా...’ అనే జిల్లా చరిత్ర పాటలను వరంగల్లో జరిగిన ధూం ధాంలో పాడితే ప్రజలు జేజేలు పలికారు. తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగక కాలుకు గజ్జెకట్టి..భుజాన గొంగడి వేసి తెలంగాణ రాష్ట్రం రావాలని, తెలంగాణ వెనుకబాటుపై గళమెత్తి దగాపడ్డా తెలంగాణపై దండు కదలాలని తమ వంతుగా పాత్రను పోషించి.. పాటమ్మ..నాకు ప్రాణా మా.. అంటూ ఉర్రూతలూగించాడు. ఇతను పాటగాడే కా దు.. రాతగాడు కూడా... ప్రజల మాటలను పాట లు గా అల్లి.. పాడే ప్రజా కళా కారుడు నిరుపేద కుటుం బం నుంచి..వచ్చి... పాటే తన ప్రాణంగా.. నేటి వరకు ఎన్నో గీతాలు, పాటలను రచించి పాడాడు. చిన్నతనం నుంచే పాటలు పాడటంతో పాటు పల్లెల్లో దండోరాను మోగించేవాడు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలపై పల్లెల్లో ప్రజలకు పాటలను వినిపించేవాడు. 800 వరకు ప్రదర్శనలు ప్రజా యుద్ధనౌక గద్దర్ పాడిన పాటలకు అడుగులు కలిపినా... విమలక్క ధూంధాం జాతరలో దుముకులాడిన... ఫైలం సంతోష్, గిద్దె రామనర్సయ్య పాటలతో గొంతు కలిపినా...అన్నీ తెలంగాణ జన సైన్యం కోసమే. ప్రజా కళాకారుడిగా గత 10 ఏళ్లుగా సుమారు 800 వరకు ప్రదర్శనలను ఇచ్చి ప్రజలందరి మన్ననలను పొందాడు. తెలం గాణ ఉద్యమంలో విస్తృతంగా పనిచేసిన ఇతను పలు జిల్లాలతో పాటు ముంబయి, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రముఖ పట్ట ణాల్లో తన ఆట పాటలను ప్రదర్శించారు. మిత్ర రాసే పాటలను మితిమీరంగా అభిమానించే కొండలు విమలక్క ఆటా పాటలకు జతకట్టాడు. ఉద్యమాలకు పుట్టినిళ్లు నల్లగొండ వెలుగొందుతున్న నాగిళ్ల కొండలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాంçస్కృతిక కళా వేదిక రాష్ట్ర కన్వీనర్గా పనిచేశాడు. కలంనుంచి జాలు వారిన పాటల ఒరవడి తన కలం ..గళం నుంచి వెలువడిన పాటలు పేదోళ్ల బతుకు చిద్రంను చూపించేవి. పేదోళ్ల వెతలపై అతని కలం కవాతు చేసేది. ‘పల్లె యాడికొస్తుందంటూ’ చిన్నతనంలో తన గ్రామంలో పద్దులు, ఉయ్యాల పాటలను పాడి అమ్మలక్కలను. బాగోతం చెప్పే పెద్దమనుషులను, సారా తాగి ఊగోళ్ల తంతును నమ్మకాలు, జానపదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ నిబంధనలతో పాటు అనేక అంశాలపై పాటలను రాసి ఆల్బం తయారు చేశాడు. తెలంగాణ సాంస్కృతిక సారధిగా పని చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పతకాలపై పాటలను రాసి బంగారు తెలంగాణ కోసం పల్లెపల్లెల్లో ప్రజలను చైతన్యం చేశాడు. ఈ సంక్షేమ పథకాలపై ఆల్భంను తయారు చేసి మంత్రి జగదీశ్రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అంతే కాకుండా హరితహారం వంటి కార్యక్రమాలకు కలెక్టర్ల చేతుల మీదుగా ప్రశంసలు పొందాడు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుందాం ప్రస్తుతం కనుమరుగు అవుతున్న సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాల్సి ఉంది. నాడు జనపదాలకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. కానీ నేటి కాలానికి అనుగుణంగా సంస్కృతి, సంప్రదాయాలను కూడా మారుస్తున్నారు. తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపైన ఉంది. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయిన ప్రతి కళాకారుడిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. – నాగిళ్ల కొండల్ -
‘అయోధ్య’ కోసం ఉద్యమానికి సిద్ధం
ఉత్తాన్(మహారాష్ట్ర): అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం అవసరమైతే ఉద్యమ బాటపడతామని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) హెచ్చరించింది. అయోధ్య కేసు కన్నా తమకు ఇతర ప్రాధమ్యాలున్నాయన్న సుప్రీంకోర్టు ప్రకటనను హిందువులు అవమానంగా భావించారని ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మందిర నిర్మాణానికి అన్ని మార్గాలు మూసుకుపోతే ఆర్డినెన్స్ తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు. ఈ విషయంలో కేంద్రంపై తాము ఒత్తిడి పెంచడంలేదని, రాజ్యాంగం, చట్టాలను గౌరవిస్తామని అన్నారు. సుప్రీంకోర్టు అంటే తమకు గౌరవం ఉందని, హిందువుల సెంటిమెంట్లను కూడా కోర్టు దృష్టిలో పెట్టుకోవాలని తెలిపారు. ‘అయోద్యలో రామ మందిర నిర్మాణంపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ సాగుతోంది. అక్టోబర్ 29న జరిగిన విచారణలో హిందువులకు అనుకూలంగా తీర్పు వెలువడుతుందని భావించారు. కానీ సుప్రీం తీర్పు అందుకు విరుద్ధంగా ఉండటంతో వారు ఆవేదన చెందుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. శబరిమల వివాదంపై స్పందిస్తూ.. మహిళల పట్ల తమకెలాంటి వివక్ష లేదని, కానీ ఆలయ నియమాలను గౌరవించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శబరిమల ఆలయంలోనికి మహిళల ప్రవేశానికి తాము వ్యతిరేకమని స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా, రామ మందిర నిర్మాణానికి చట్టం చేయాలని కేంద్ర మంత్రి విజయ్ గోయల్ అభిప్రాయపడ్డారు. మరి ప్రభుత్వాన్ని కూల్చేయొచ్చు కదా.. రామ మందిరం కోసం ఉద్యమిస్తామన్న ఆరెస్సెస్ వ్యాఖ్యలను శివసేన ఎద్దేవా చేసింది. ఇప్పుడు కేంద్రం గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముందని, ప్రభుత్వాన్ని కూల్చేయొచ్చు కదా అని ఘాటుగా వ్యాఖ్యానించింది. అయోధ్య తీర్పుపై నిరసన మాత్రమే వ్యక్తం చేస్తామని చెప్పిన ఆరెస్సెస్ ఇప్పుడు హడావుడిగా ఉద్యమం చేస్తామని ప్రకటిస్తోందని హేళన చేసింది. -
అణచివేత నుంచే ఉద్యమాలు: విమలక్క
తొగుట (దుబ్బాక): పాలకుల అణచివేత నుంచే ప్రజా ఉద్యమాలు పుట్టుకొస్తాయని ప్రజా గాయకురాలు విమలక్క అన్నారు. సిద్దిపేట జిల్లా వేములఘాట్ గ్రామస్తులు చేపట్టిన సంవిధాన్ సమ్మాన్ యాత్ర (రాజ్యాంగ గౌరవయాత్ర)కు శనివారం ఆమె సంఘీభావం ప్రకటిం చారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ మైదాన ప్రాంతంలో 50 టీఎంసీల రిజర్వాయర్ నిర్మించడం సాధ్యంకాదని నిపుణులు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం మల్లన్న సాగర్ విషయంలో మొండిగా వ్యవహరిస్తోందన్నారు. మహిళలు ముందుండి పోరాడితే విజయం మనదేనన్నారు. వేములఘాట్ ను రక్షించుకునేందుకు గ్రామస్తులు 875 రోజులుగా దీక్షలు చేయడం అభినందనీయమన్నారు. -
కేరళ కుట్టికి అత్యున్నత పురస్కారం
‘ఇది ప్రతి స్త్రీ జీవితంలో అనుభవమయ్యే పునరుత్పత్తి పునాది ప్రక్రియ. కానీ ఏ దేశంలోనైనా చర్చించేందుకు ససేమిరా ఇష్టపడని విషయం కూడా ఇదే. రక్తస్రావమనే అత్యంత సహజ ప్రక్రియకి స్త్రీలంతా శిక్షకు గురవుతున్నారు’ అంటూ పట్టుమని 18 ఏళ్లు కూడా లేని కేరళ కుట్టి అమికా జార్జ్ బ్రిటన్ వీధుల్లో ప్రారంభించిన ‘ఫ్రీ పీరియడ్స్’ ఉద్యమం ఆమెకు గోల్కీపర్స్ గ్లోబల్ అవార్డు దక్కేలా చేసింది. సామాజిక అభివృద్ధి రంగంలో ఈ అవార్డును ఆస్కార్ అవార్డుతో పోలుస్తారు. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ప్రగతిని పర్యవేక్షించే కార్యక్రమంలో భాగంగా బిల్, మెలిండా ఫౌండేషన్ 2017లో గోల్కీపర్స్ అనే సామాజిక చైతన్య ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్రారంభించారు. 18 ఏళ్ల అమికా జార్జ్ పేద బాలికలకు ఉచిత శానిటరీ న్యాప్కిన్స్ కోసం బ్రిటన్ వీధుల్లో పూరించిన శంఖారావం ఆమెకు ఈ అవార్డు దక్కేలా చేసింది. సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైన ఈ ఉద్యమం చివరకు బ్రిటన్ వీధుల్లో స్త్రీ, పురుష భేదం లేకుండా సాగింది. దాదాపు 2 వేల మంది యువతీయువకులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. చివరకు బ్రిటన్ ప్రభుత్వం పేద బాలికల రుతుక్రమ అవసరాలను తీర్చేందుకు ఉచిత శానిటరీ ప్యాడ్స్ కోసం 1.5 మిలియన్ పౌండ్లు వెచ్చించేలా చేసింది. అభివృద్ధి చెందిన బ్రిటన్లాంటి దేశాల్లోనే ప్రతి 10 మంది బాలికల్లో ఒకరు శానిటరీ ప్యాడ్స్ని కొనుగోలు చేయలేని పేదరికంలో మగ్గుతున్నారని ప్లాన్ ఇంటర్నేషనల్ సర్వేలో చదివిన అమికా జార్జ్ ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఉద్యమ క్రమంలో బ్రిటన్ పేద బాలికలు శానిటరీ న్యాప్కిన్స్ కొనుక్కోలేని స్థితిలో ఆ అవసరానికి కాగితాలనూ, పాత న్యూస్ పేపర్స్నీ, సాక్స్నూ వాడుతుండటం తన హృదయాన్ని కలిచివేసిందంటోంది అమికా జార్జ్. ఇదే ఆమె చేపట్టిన ‘ఫ్రీ పీరియడ్’ ఉద్యమానికి పునాది అంటోంది. కేంబ్రిడ్జి వర్సిటీలో చదువుకు నేందుకు వెళ్లిన అమికా ఈ ఉద్యమంతో చరిత్రే సృష్టించింది. 2017 డిసెంబర్లో జరిగిన ఈ ఉద్యమం ఫలితంగా అక్కడి పేద బాలికలకు దక్కిన ఫలితాన్ని గుర్తించిన గోల్కీపర్స్ సోషల్ ప్రోగ్రెస్ ఆస్కార్ అవార్డుతో సత్కరించింది. ప్రపంచవ్యాప్తంగా ముగ్గురు మహిళలను ఈ అవార్డుకి ఎంపిక చేశారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, మహిళల పిల్లల హక్కుల కార్యకర్త గ్రేస్ తదితర ప్రముఖులు అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యూయార్క్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఇరాక్కు చెందిన 24 ఏళ్ల నదియా మురద్, కెన్యాకు చెందిన 28 ఏళ్ల డిస్మస్ కిసీలు ఈ అవార్డులు అందుకున్నారు. -
ఉదృతమవుతున్న వెలిగోండ ప్రాజెక్ట్ ఉద్యమం
-
పెంకా.. బతుకుతుంది ఇంకా..
పెంకా బతకనుంది.. మరికొన్ని రోజుల్లో మరో బుల్లి పెంకాకు బతుకునివ్వనుంది. అక్రమంగా దేశ సరిహద్దును దాటినందుకు పెంకా అనే ఆవుకు బల్గేరియా ప్రభుత్వం మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే, పెంకాను రక్షించాలంటూ అన్నివైపుల నుంచి వచ్చిన ఒత్తిడికి ఆ దేశ సర్కారు తలొగ్గింది. గర్భంతో ఉన్న పెంకాకు ఇటీవల నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లోనూ దానికి ఏ విధమైన వ్యాధులు సోకలేదని నిర్ధారణ అయింది. ఇప్పటికే అన్ని వర్గాల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవడంతోపాటు పెంకాను రక్షించాలంటూ పెద్ద ఎత్తున సంతకాల ఉద్యమమూ మొదలైంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం పెంకాకు విధించిన మరణశిక్షను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తోడేళ్లు వెంటబడటంతో పెంకా సరిహద్దును దాటి సెర్బియాలోకి వెళ్లింది. విషయం తెలుసుకున్న దాని యజమాని తిరిగి తెస్తున్నప్పుడు సరిహద్దు భద్రతాధికారులు అడ్డుకున్నారు. సరైన పత్రాలు లేకుండా యూరోపియన్ యూనియన్లో సభ్యదేశం కాని సెర్బియాకు వెళ్లడం.. తిరిగి రావడం సహించరాని నేరమంటూ పెంకాకు మరణశిక్ష విధించారు. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
తమిళనాట మరో ఉద్యమం
చెన్నై: తమిళనాట మరో ఉద్యమం మొదలైందంది. తీత్తుకుడిలోని స్టెరిలైట్ కాఫర్ ప్లాంట్ను మూసివేయాలని వేలాది మంది నిరవధిక దీక్షలకు పూనుకున్నారు. ప్లాంట్ నుంచి విడుదలయ్యే కలుషిత నీటి ద్వారా పంటలు, ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నాయని ఆందోళనకు దిగారు. ఎండీఎంకే అధ్యక్షుడు వైగో, మక్కల్ నీది మయ్యం అధినేత, సినీ నటుడు కమల్హాసన్ ఈ దీక్షలకు మద్దతు తెలిపారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు తెలిసింది. -
ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి ఉద్యమం
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి ఉద్యమం చేపడతామని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. దీని కోసం యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలతోపాటు సామాజిక అం శాలపై పోరాడుతున్న సంఘాలతో కలసి పనిచేస్తామన్నారు. ఆదివారం బీసీ భవన్లో జరిగిన నిరుద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నా యని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 4 లక్షలకుపైగా ఖాళీలున్నాయని, అలాగే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల్లోనూ ఖాళీల సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. ఉమ్మడి ఉద్యమం ద్వారానే ఖాళీలు భర్తీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలమని తెలిపారు. యూనివర్సిటీలు, జిల్లాల వారీగా కార్యాచరణ సిద్ధం చేయాలని విద్యార్థి, నిరుద్యోగ సంఘాలకు సూచించారు. క్షేత్రస్థాయి నిరసనలు ముగిసిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. -
లంబాడాలను తొలగించేదాకా.. లడాయే
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు లడాయి ఆగదని పలువురు ఆదివాసీ నేతలు స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని గుడిహత్నూర్లో తుడుందెబ్బ ఆధ్వర్యంలో గురువారం ఆదివాసీ మహిళా పోరుగర్జన సభ నిర్వహించారు. కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీ మహిళలు భారీగా తరలివచ్చారు. అలాగే ఆదివాసీ ప్రొఫెసర్లు, వివిధ రాష్ట్రాలకు చెందిన ఆదివాసీ నేతలు, ప్రజాప్రతినిధులు హాజరై తమ గొంతుక వినిపించారు. మా అస్తిత్వం, స్వాభిమానం కోసమే మా పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల ఆదివాసీ నాయకుల రాక ఆదివాసీ మహిళా పోరు గర్జన సభకు ఇతర రాష్ట్రాల నుంచి హాజరయ్యారు. వీరిలో ప్రొఫెసర్ ఉయిక అమ్రాజ్, దుర్వ సుశీల, ప్రొఫెసర్ సువ ర్ణ వార్కెడె, అసిస్టెంట్ ప్రొఫెసర్ కంచర్ల వాలంటిన ఉన్నారు. వీరితో పాటు ఉమ్మడి జిల్లా ఆది వాసీ మహిళా నాయకులు కుమ్ర ఈశ్వరీబాయి, దుర్వ చిల్కుబాయి, మర్సకోల కమల, మ డావి కన్నీబాయి, సోందేవ్బాయి, లక్ష్మీబాయి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ జెడ్పీ చైర్మన్ సిడం గణపతి, తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాక కా ర్యదర్శి ఉయిక సంజీవ్, ఆదివాసీ విధ్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాక కార్యదర్శి వెడ్మబొజ్జు, కార్యదర్శి కొడప నగేష్, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కొడప జాలంజాకు, కార్యదర్శి బాపురావు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు వెంకటేశ్, ఉమ్మడి జిల్లా ఆది వాసీ నాయకులు విజయ్, గోపిచంద్, కుడ్మెత తిరుపతి, భూమయ్య, పాండురంగ్, మారుతి, జలపతి,ఖమ్ము, భాస్కర్, అశోక్, వెంకటేశ్ హైమన్డార్ఫ్ యూత్ అధ్యక్షులు పాల్గొన్నారు. అస్తిత్వం కోసమే పోరాటం మా అస్తిత్వం, స్వాభిమానం కోసమే పోరాడుతున్నామని ప్రొఫెసర్ ఉయిక అమ్రాజ్ అన్నారు. ప్రకృతి ఒడిలో స్వచ్ఛంగా బతికే మా అమాయకత్వాన్ని చేతకాని తనంగా తీసుకుని ప్రభుత్వాలు తమతో ఆడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజుల వంశం మాది. అలాంటి మాకు సమాజంలో మనుషులుగా కూడా పరిగణించడం లేదు. ఉద్యమించక పోతే మనల్ని క్షమించరు ఆదివాసీల హక్కులను హరిస్తూ విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో పెత్తనాన్ని అనుభవిస్తున్న లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు ఉద్యమిద్దామని ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావు పిలుపు నిచ్చారు. ఉద్యమంలో కలిసిరావాలని కోరారు. రాష్ట్ర సాధనలో ఆదివాసీ త్యాగాలను మరిచారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆదివాసీలు తమదైన శైలిలో ఉద్యమించి చేసిన త్యాగాలు ముఖ్యమంత్రి మరిచారని ఆదివాసీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్రం సుగుణ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం సాధించాక పోలవరం ప్రాజెక్టులో లక్షల మంది ఆదివాసీలు నిరాశ్రయులయ్యారని తెలిపారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం ఆదివాసీలు చేస్తున్న ఉద్యమాన్ని చట్ట విరుద్ధంగా లంబాడాలు ఎస్టీలో కొనసాగుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. ఇతర రాష్ట్రాల్లో వారికి ఉన్న హోదా, రాజ్యాంగ అధికారాలు తదితర అంశాలను పరిశీలించి సమస్యను పరిష్కరిద్దామని హామీ ఇచ్చారని తెలిపారు. ఆ దిశగా అందరం సామరస్యంగా కృషి చేద్దామని ఆమె కోరారు. – ఎమ్మెల్యే కోవ లక్ష్మి -
ధరలపైనే జనాగ్రహం! ఇరాన్ను కుదిపేస్తున్న ఉద్యమం
‘‘గాజా కాదు, లెబనాన్ కాదు. ఇరాన్ కోసం నేను ప్రాణం ఇస్తా!’’ అనే నినాదంతో జనం ఇరాన్ అంతటా ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. నిరసన ర్యాలీలతో తిరగబడిన ప్రజలపై ప్రభుత్వం బలప్రయోగానికి దిగింది. మంగళవారం వరకూ జరిగిన హింసలో దాదాపు 22 మంది మరణించారు. కిందటి గురువారం ఇరాన్లో ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలకు సవాలుగా మంగళవారం నుంచి సర్కారుకు అనుకూలంగా ర్యాలీలు మొదలయ్యాయి. స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో కూడిన ప్రజాస్వామ్యం కోసం టునీసియా మొదలు ఈజిప్ట్ వరకూ అరబ్ దేశాల్లో ‘అరబ్ వసంతం’ వంటిదే ఇరానీల ఆందోళన అని పాశ్చాత్య మీడియా ప్రచారం చేస్తోంది. అయితే, దాదాపు ఎనిమిది కోట్లకు పైగా జనాభా ఉన్న ఇరాన్లో ప్రస్తుత అశాంతికి దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులే కారణమన్నది అందరూ అంగీకరిస్తున్న సత్యం. ప్రాచీన నాగరికతకు ప్రసిద్ధిగాంచిన ఇరాన్లో ప్రభుత్వంపై ఆగ్రహించిన జనం వీధుల్లోకి రావడం ఇది మొదటిసారి కాదు. 2009 అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని నిరసిస్తూ సాగిన ఉద్యమంలో దాదాపు 34 మంది మరణించారు. ప్రజాగ్రహానికి ఆజ్యం పోసిన డిసెంబర్10 బడ్జెట్! అధ్యక్షుడు హసన్ రూహానీ కిందటి డిసెంబర్10న ప్రవేశపెట్టిన బడ్జ్ట్ ప్రతిపాదనలు నిత్యావసరాలతోపాటు అనేక వస్తువుల ధరలు బాగా పెంచేలా ఉండడంతో ప్రజల్లో అసంతృప్తి లేచింది. ఓ పక్క జనంపై ధరల భారం పెంచుతూనే మరో పక్క మత సంస్థలకు ఇతోదికంగా నిధుల కేటాయింపులకు బడ్జెట్ వీలు కల్పించింది. ముడి చమురు అమ్మకాల విషయంలోనేగాక, పశ్చిమాసియా రాజకీయాల్లో ఆధిపత్యానికి అరబ్ దిగ్గజం సౌదీఅరేబియాతో పోటీపడడం వల్ల కూడా ఇరాన్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతోంది. ‘ప్రాంతీయ పెద్దన్న’ హోదా కోసం షియా ముస్లింల జనాభా ఉన్న దేశాలు, షియా పాలకులున్న రాజ్యాలకు శక్తికి మించి సాయపడడం కూడా ఇరాన్ను సంక్షోభంలోకి నెట్టింది. దేశంలో పెట్రోలు వంటి నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం పెరుగుతుండగా ఇరాన్ విదేశాంగ విధానం ప్రజల్లో అసంతృప్తి జ్వాలలను ఎగదోస్తోంది. పాలస్తీనా గెరిల్లా రాజకీయ సంస్థ హమస్, లెబనాన్కు చెందిన హిజ్బుల్లా, సిరియా అసద్ ప్రభుత్వం, యెమెన్ హౌతీలకు ఇరాన్ సర్కారు అడిగినంత నిధులు సమకూర్చడం ఇరానియన్లకు నచ్చడంలేదు. ఆంక్షలు, ఇతర కారణాలతో అంతర్గత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇలాంటి సాయం చేయడం అనవసరమనీ, ఓ రకంగా చూస్తే ఇది దేశద్రోహంతో సమానమని ప్రజలు భావిస్తున్నారు. నాయకుడు లేని ప్రజా ఉద్యమం! ఇరాన్లో రాజధాని టెహరాన్ తర్వాత రెండో పెద్ద నగరం మాషాద్లో డిసెంబర్28న మొదలైన సర్కారు వ్యతిరేక నిరసన ప్రదర్శనలు దేశంలోని 27 నగరాలు, పట్టణాలకు వారంలోపే వ్యాపించాయి. ఈసారి జనాందోళన ప్రత్యేకత ఏమంటే ప్రజలు ఏ నాయకుడి పేరు ప్రస్తావించడం లేదు. ఏ సంస్థ గొడుగు కింద పోగవడం లేదు. అధ్యక్షుడు రూహానీ, అగ్ర(మత)నాయకుడు అలీ హొసేన్ ఖమేనీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
నీకూడా నేనున్నట్లే
గాయాన్ని దాచిపెట్టమని చెబితే గాయం మానదు. రేగుతుంది! గాయం పెడుతున్న బాధను పంచుకుంటే... అదే గాయం.. ఉద్యమానికి ఓ గేయం అవుతుంది. హ్యాష్టాగ్ ‘మీటూ’ ప్రపంచంలో ఉన్న గాయాలను ఇప్పుడు యుద్ధభేరిగా వినిపిస్తోంది. ‘నేను సైతం’ అనేది ఒక యజ్ఞంలో సమిధ అవడం అయితే.. ‘నేను కూడా’ అనేది.. నీకూడా నేనున్నానని చెప్పడం. పద్నాలుగేళ్ల అమ్మాయి, ఇరవై నాలుగేళ్ల యువతి ఒకేలా ఉండరు. వేధింపులను భయపడడంలో మాత్రం ఇద్దరూ ఒకేలా ఉంటారు! ‘అక్కా.. వాడు ఏదోలా చూస్తున్నాడు’. అవునా! వాడి వైపు చూడకు. ‘అక్కా.. వాడు నన్ను కామెంట్ చేశాడు’. ‘తిరిగి కామెంట్ చేయలేదు కదా’ ‘అక్కా.. వాడు నన్ను టచ్ చేశాడు’. నాతో చెప్తే చెప్పావ్.. ఎక్కడా అనకు. ‘అక్కా.. వాడు గెస్ట్హౌస్కి రమ్మన్నాడు’ ‘మానేయ్.. ఇది కాకపోతే ఇంకో ఉద్యోగం’ 1996. బ్రూక్లిన్, న్యూయార్క్. తరానా బర్క్ (24) తన ఆఫీస్ నుంచి బయటికి వచ్చింది. ఎవడో విజిల్ వేసుకుంటూ, ఆమెను రాసుకుని పోయాడు. కెవ్వుమంది. ‘స్టుపిడ్’ అని తిట్టుకుంది. ‘గర్ల్స్ ఫర్ జెండర్ ఈక్విటీ’ అనే సంస్థలో ఆమె ప్రోగ్రామ్ డైరెక్టర్. భయంతో గుండె వేగంగా కొట్టుకోవడం ఆమె ప్రొఫెషన్కే తలవంపు. కానీ డైరెక్టర్ కన్నా ముందు.. ఆమె ఒక ఆడపిల్ల. ఆడపిల్లకన్నా ముందు.. ఆమె ఒక నల్లవాళ్ల పిల్ల. ఆఫ్రికా నుంచి వచ్చి అమెరికాలో సెటిల్ అయిన వాళ్ల అమ్మాయి. అయితే మాత్రం? అమెరికాలోనే పుట్టింది కాబట్టి అమెరికా ఆమెది కూడా అవదా? అవుతుంది. అమెరికాలో ఉన్నవాళ్లందరికీ ఉన్న స్వేచ్ఛ ఆమెకూ ఉండాలి కదా! ఉంటుంది. మరెందుకంత భయం? స్త్రీ ధైర్యంగా బయటికి వచ్చి ఏ స్వేచ్ఛనైనా సాధించగలదు. మగవాడి వేధింపుల నుంచి స్వేచ్ఛ కోసం మాత్రం అంత తేలిగ్గా బయటికి రాలేదు. బయటికి రావడం అంటే పరువును బజారుకు ఈడ్చుకోవడం మరి! రెండో రోజు.. డ్యూటీలో ఉంది బర్క్. ‘‘నీ కోసం ఎవరో వచ్చారు బర్క్. నీతో మాట్లాడాలట!’’ గుండె ఝల్లుమంది అంత పెద్ద అమ్మాయికి! ‘‘ఎవరు వాడు?’’ అంది. ‘‘వాడు కాదు. అమ్మాయి. హెవన్ అట పేరు. నీతో పర్సనల్గా ఏదో చెప్పుకోవాలట’’. బర్క్ అంతకు ముందు రోజు ‘ఆల్–గర్ల్’ బాండింగ్ సెషన్లో అమ్మాయిలకు ధైర్యం నూరిపోయింది. అబ్బాయిల కన్నా మనం ఎందులోనూ తక్కువకాదు అని కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆ సెషన్కు వచ్చిన అమ్మాయిలలో ఒక అమ్మాయి హెవెన్. పద్నాలుగేళ్లుంటాయి. బ్లాక్ హెయిర్. బ్లాక్ ఐస్. సన్నగా అందంగా ఉంది. కానీ ‘బ్లాక్’. అమెరికాలో బ్లాక్ అంటే చిన్నచూపు. హెవెన్ది కూడా అలాంటి ప్రాబ్లమే అయివుంటుంది అనుకుంది బర్క్. ‘‘అక్కా.. నేను చెప్పేది వినే టైమ్ ఉందా నీకు’’ అంది హెవెన్ నేరుగా. బర్క్ అప్పటికే పని ఒత్తిడిలో బాగా అలసిపోయి ఉంది. ఏముంటుంది ఆ పిల్ల కొత్తగా చెప్పుకునేది? నిన్న వాడెవడో తనని రాసుకుంటూ వెళ్లినట్లే.. ఇంకొకడెవరో ఈ అమ్మాయిని హెరాస్ చేసి ఉంటాడు అనుకుంది. ‘‘అక్కా నాకు చచ్చిపోవాలనిపిస్తోంది’’ అంది హెవన్. బర్క్ అలసట ఒక్కసారిగా ఎగిరిపోయింది. హెవెన్ని దగ్గరకు లాక్కుని గట్టిగా తన గుండెలకు అదుముకుంది. తల నిమిరింది. ‘‘వాట్ హ్యాపెండ్ బేబీ’’ అని అడిగింది బర్క్. ‘‘అక్కా.. ఇక్కడ కాదు. నీ గదిలోకి వెళ్దాం’’ అంది హెవెన్. ఇద్దరూ లోపలికి వెళ్లారు. ‘‘తలుపెయ్ అక్కా..’’ అంది హెవన్. బర్క్ తలుపు వేసింది. ఒంటి మీద ఉన్న బట్టలు తీసి బర్క్ ఎదురుగా నిలబడింది హెవెన్. బర్క్ అదిరిపడింది. హెవెన్ శరీరంలో ఎదుగుతున్న సున్నిత భాగాలు కమిలిపోయి ఉన్నాయి! హెవెన్ తల్లికి ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఆ వ్యక్తి తనకెంత నరకం చూపిస్తున్నదీ, తన దేహంపై ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నదీ ఒకటొకటిగా చెప్పడం మొదలు పెట్టింది హెవెన్. బర్క్ వినలేకపోతోంది. ఆమెకు కళ్లు తిరుగుతున్నట్లుగా, కడుపులో దేవినట్లుగా అనిపిస్తోంది. ‘‘హెవెన్.. నేను అర్థం చేసుకోగలను.. అయితే నాకు కాదు.. ఇంకొక ఫిమేల్ కౌన్సెలర్ ఉంది. ఆమెకు చెప్పు. ముందు బట్టలు వేసుకో’’ అని చెప్పింది. ఇంకే ఘోరాలు వినవలసి వస్తుందో అని ఆమె అలా చెప్పింది. బర్క్ సున్నిత మనస్కురాలు. హెవెన్ హర్ట్ అయింది. ‘అక్కా.. నేనింత బాధపడుతున్నాను కదా.. నువ్వు కనీసం నా బాధను వినలేవా?’’ అన్నట్లు చూసింది. గాయాన్ని విప్పి చూపిస్తున్నప్పుడు.. విప్పకు కట్టేయ్ అనడం అంటే.. గాయాన్ని మరింత రేపడమే. బర్క్ చేసింది అదే పని! హెవెన్ వెళ్లిపోతుంటే.. ఆమెను వెనకనుంచి చూస్తూ ఉండిపోయింది బర్క్. ‘మీటూ’ అని ఆ అమ్మాయికి చెప్పాలనుకుంది కానీ.. చెప్పలేకపోయింది. 2006. హార్లెమ్, న్యూయార్క్. పదేళ్లు నలిగిపోయింది బర్క్. కౌన్సెలింగ్ డైరెక్టర్గా బాధితురాళ్లైన యంగ్ గర్ల్స్ని చాలామందినే చూసింది, మాట్లాడింది బర్క్. వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు హెవనే గుర్తుకొచ్చేది. చిన్న పిల్ల! ఇప్పుడెలా ఉందో? ఇరవై నాలుగేళ్లు వచ్చి ఉంటాయి తనకు. అంటే పదేళ్ల క్రితం తన వయసెంతో ఇప్పుడు హెవెన్ వయసు అంత. ఆ పిల్లే నయం! బాధను చెప్పుకునే ధైర్యం ఉంది. ఆ బాధను వినడానికి తను భయపడింది. మనసును ముల్లులా గుచ్చుతోంది బర్క్ను ఆ ఆలోచన. బర్క్ ఆలోచిస్తూనే ఉంది. ఆడపిల్లలకు అండగా ఉండాలనుకున్న వాళ్లెవరైనా.. ముందు, వాళ్లు ధైర్యంగా ఉండాలి. దేనికీ అవమానంగా ఫీల్ అవకూడదు. నేను ఒంటరిదాన్ని అనుకోకూడదు. ఆ తర్వాత, సహాయం కోరి వచ్చినవారిని ఆదుకోవాలి. ‘నిన్ను చూడ్డానికే, నువ్వు చెప్పింది వినడానికే, నిన్ను అర్థం చేసుకోడానికే నేనిక్కడ ఉన్నాను. నీ కోసం ఉన్నాను’ అని చెప్పగలగాలి. ఒకే బాధను అనుభవిస్తున్న వాళ్ల మధ్య బంధం ఏర్పడుతుంది. ఆ విధంగా చూస్తే ఈ లోకంలో వివక్షకు, లైంగిక వేధింపులకు గురవుతున్న అమ్మాయిలంతా ఒకరికొకరు రక్తసంబంధీకులే. అప్పుడు ఒకరి బాధ.. ఆ ఒక్కరి బాధే కాదు. ఒకరి ఆలోచన ఆ ఒక్కరి కోసమే ఆలోచన కాదు. ఒక నిర్ణయానికి వచ్చింది బర్క్. ఒక ఉద్యమంలా బాధితులందరినీ ఒక చోటికి తేవాలనుకుంది. ‘మీటూ’ అనే ఉద్యమాన్ని ప్రారంభించింది. ‘అయ్యో.. నీకలా జరిగిందా?’ అని బాధపడడానికీ, ‘నాక్కూడా అలా జరిగింది’ అని బాధను పంచుకోడానికి మధ్య చాలా తేడా ఉంది. టీనేజర్ల నుంచి అరవైకి చేరువవుతున్న వాళ్ల వరకు ఆడవాళ్లంతా ఒక్కొక్కరుగా బయటికి వచ్చి తన అనుభవాన్ని మిగతావారితో షేర్ చేసుకోవడంతో ‘మీటూ’ ఉద్యమానికి ఊపు వచ్చింది. ఆ రోజు ఆ పద్నాలుగేళ్ల అమ్మాయితో అనలేకపోయిన ‘మీటూ’ అనే మాటనే తన తన కాంపెయిన్కి పేరుగా పెట్టుకున్నారు బర్క్. ‘మైస్పేస్’ అనే వెబ్సైట్లో మీటూ అనే స్లాట్ తీసుకుంది. మరి.. ‘మీటూ’ అని ఆ పద్నాలుగేళ్ల అమ్మాయి హెవెన్తో ఆ రోజున ఆమె చెప్పుకోలేకపోయిన ఆ అనుభవం ఏమిటి? రేప్ అండ్ సెక్సువల్ హెరాస్మెంట్. పదమూడేళ్ల వయసులో దగ్గరి బంధువు ఒకరు బర్క్ను రేప్ చేశాడు. బయటికి చెప్తే చంపేస్తానని అతడు అనలేదు. ‘‘చెప్పుకో.. నీ ఇష్టం. నీ పరువే పోతుంది’’ అన్నాడు. ‘పరువు పోయిన ఆడపిల్లను ఈ లోకం బతకనివ్వదు’ అని అన్నాడు. ‘ఒకసారి పరువు పోయాక మగవాళ్లంతా ఇప్పుడు నేను ఏదైతే చేశానో అదే చేయడానికి నిన్ను వెంటాడతారు’ అని కూడా అన్నాడు. బర్క్ భయపడింది. ఆ మాటలు ఆమెలో నాటుకుపోయాయి. బయటికి చెప్పలేదు. అలా చెప్పకపోవడంతో ఆ బంధువుకి అనుమతి పత్రం లభించినట్లయింది. తర్వాత మరో రెండుసార్లు ఆమెను రేప్ చేశాడు. ఎప్పటికో కానీ అతడి పీడ వదల్లేదు బర్క్కి.ఇదైనా బర్క్ చెప్పుకుంటే బయట పడిన విషయం కాదు! ‘మీటూ’ కథల్లో ఓ అజ్ఞాత కథ ఆమెను పట్టించింది. నిజానికి ఆమె ‘మీటూ’ కూడా సోషల్ మీడియాలో అజ్ఞాతంగానే కొనసాగుతోంది. మొన్న అక్టోబర్ 15 వరకు కూడా బర్క్ గురించీ, బర్క్ మీటూ గురించి ఎవరికీ తెలీదు. 2017 అదే హార్లెమ్. అదే న్యూయార్క్. బర్క్ మాత్రం ఇప్పుడు కొత్త మనిషి! నలభై నాలుగేళ్ల బర్క్కు అక్టోబరు నెలలో ఓ ఉదయం ప్రముఖ హాలీవుడ్ నటి అలిస్సా మిలానో నుంచి ఫోన్ వెళ్లింది. ఆమె వయసు కూడా నలభై నాలుగేళ్లే. ఆ ఇద్దరు సమవయస్కుల మధ్య సంభాషణ ఇది. ‘‘గుడ్ మార్నింగ్ తరానా బర్క్. ఐ యామ్ అలిస్సా మిలానో’’. ‘‘వావ్.. చెప్పండి అలిస్సా’’. ‘‘కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో నేను పెట్టిన హ్యాష్ట్యాగ్.. ‘మీటూ’ పేరుతోనే పదేళ్ల క్రితమే మీరు కాంపెయిన్ నడిపారని తెలిసి ఎగై్జట్మెంట్తో ఫోన్ చేస్తున్నాను’’. ‘‘యా చూశాను మిస్ అలిస్సా. దటీజ్ గుడ్. మీటూ అన్న కాన్సెప్ట్ నా ఒక్కరిదే కాదు. మనందరిదీ. ఒకే బాధ.. ఒకే భావం.. (నవ్వుతూ). ‘‘ధన్యవాదాలు మిస్ బర్క్’’ ‘‘ధన్యవాదాలు మిస్ అలిస్సా’’. సంభాషణ పూర్తయింది. దీనిని అలిస్సా ఇంటర్నెట్లో షేర్ చెయ్యడంతో.. మీటూ అనే ఒక మహోద్యమానికి, మహిళా ఉద్యమానికి ఆద్యురాలిగా బర్క్ వెలుగులోకి వచ్చారు. అయితే ఆ వెలుగులో తను కాకుండా.. బాలికలు, యువతులు పడుతున్న లైంగిక వేధింపులు ఈ లోకానికి కనిపించాలని, ఆ పాడు లోకం కళ్లు తెరుచుకోవాలని ఆమె కోరుకుంటున్నారు. ఏంటీ.. ‘మీటూ’? ప్రపంచ వ్యాప్తంగా మహిళలందరినీ ఏకం చేస్తున్న సోషల్ మీడియా ఉద్యమం. హార్వీ వైన్స్టీన్ అనే 65 ఏళ్ల హాలీవుడ్ నిర్మాత సినిమా చాన్సులు ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిలను కొన్నేళ్లుగా లైంగికంగా వేధించుకుని తింటూ, వారిపై అత్యాచారాలు జరుపుతున్నాడని పన్నెండు మంది మహిళలు గత అక్టోబర్లో బయటికి వచ్చి బాహాటంగా చెప్పడంతో.. ఇంకా ఇలాంటి సంఘటనలు ఎన్ని ఉన్నాయోనన్న చర్చ మొదలైంది. అలాంటి వాళ్లెవరైనా ఉంటే తమ అనుభవాలను పంచుకోవడం కోసం అలిస్సా మిలానో అనే హాలీవుడ్ నటి సోషల్ మీడియాలో ఏర్పాటు చేసిన హ్యాష్ ట్యాగే.. ‘మీటూ’. తొలి గంటలోనే..! ‘మీటూ’ హ్యాష్ ట్యాగ్ ఇంటర్నెట్లో ప్రత్యక్షం అయిన తొలిగంటలోనే ఫేస్ బుక్లో 40 లక్షల 70 వేల మంది దీనిని ఉపయోగించారు! కోటీ 20 లక్షల పోస్టులు వెల్లువెత్తాయి. ఇండియా, పాకిస్థాన్, బ్రిటన్లతో పాటు మొత్తం 85 దేశాలలో ఈ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. ఐరోపా పార్లమెంట్ అయితే ‘మీటూ’ పై ఒక ప్రత్యేక సమావేశాన్నే నిర్వహించింది! మన వాళ్లు ‘మీటూ’ అంటూ మన సెలబ్రిటీలు ఇంతవరకు లోపలికి రాలేదు. కానీ బయటి నుంచి సపోర్ట్ చేశారు. రాధికా ఆప్టే, కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా.. ‘మీటూ’ ఉద్యమానికి మద్దుతు పలికారు. -
రోడ్డు కోసం.. రోడ్డెక్కారు !
♦ వైవీయూ మార్గంలో రోడ్డు పనులు త్వరగా చేయాలంటూ విద్యార్థుల బైఠాయింపు ♦ ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయం మార్గంలో రోడ్డును త్వరితగతిన పూర్తిచేయాలంటూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వైవీయూ వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ నాయకులు, పరిశోధక విద్యార్థులు బాలా జీ నాయక్, శ్రీనివాసులు మాట్లాడుతూ కడప–పులివెందుల మార్గంలో వైవీయూకు వెళ్లే రహదారిని తవ్విన ఆర్అండ్బీ అధి కారులు పనులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. రోడ్డు సరిగా లేక ఇటువైపు వాహనాలు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పదిరోజులుగా బ స్సులు, ఆటోలు విశ్వవిద్యాలయంవైపుగా రావడం లేదని.. దీంతో కిలోమీటర్పైగా రోజు నడిచిరావాల్సి వస్తోందని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం పూర్తి చేసి వాహనాలను పునరుద్ధరించాల ని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న వైవీయూ ప్రిన్సిపల్ ఆచార్య కె.సత్యనారాయణరెడ్డి, పెండ్లిమర్రి ఎస్ఐ ఎస్.కె. రోషన్ అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. దీంతో విద్యార్థులు ఆందోళన వీడారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. -
భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా సంతకాల ఉద్యమం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కాకినాడ సిటీ : భూసేకరణ చట్టం-2013 బిల్లును అసెంబ్లీలో పెట్టేందుకు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా సంతకాల ఉద్యమం చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు రావుల వెంకయ్య వెల్లడించారు. కాకినాడ ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో జిల్లా పార్టీ కార్యదర్శి తాటిపాక మధు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూపీఏ-2 ప్రభుత్వం తెచ్చిన 2013 భూసేకరణ చట్టంలో రైతులకు మేలు చేసే అంశాలను తొలగించేందుకు బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో చట్టç సవరణ చేయడానికి ప్రయత్నించి విఫలమైందన్నారు. రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా బిల్లుకు సవరణలో చేసుకోవచ్చంటూ ఆర్డినెన్స్ జారీ చేసిందన్నారు. ఈ బిల్లును యధాతథంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని 13 జిల్లాలలో రైతుల నుంచి సంతకాలు సేకరించి, వాటిని రాష్ట్రపతికి అందజేస్తామన్నారు. అలాగే మంత్రి వర్గ విస్తరణలో కమ్మ, రెడ్డి వర్గీయులకే అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. పోలవరం నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ ప్రాజెక్టులో అనేక అవకతవకలు జరిగాయని, కాగ్ నివేదిక ప్రభుత్వానికి మొట్టికాయ వేసినా చీమకుట్టినట్లు లేదని విమర్శించారు. పట్టిసీమ, పురుషోత్తంపట్నం ప్రాజెక్టుల వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. -
సమస్యలు పరిష్కరించకుంటే..
► ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ జెడ్పీసెంటర్: లారీ యాజమాన్యాల డిమాండ్లను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. గురువారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సింగిల్ పర్మిట్ విధానం లేకపోవడం వల్ల లారీ యజమాన్యం తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. లారీలు నడిచే ఆయా రాష్ట్రాల్లో పన్నులు చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. సింగిల్ పర్మింట్ విదానాన్ని అమలుచేయాలని కోరారు. ప్రైవేట్ బీమా సంస్థల ఒత్తిడి మేరకు థర్డ్పార్టీ బీమాను ఏప్రిల్ నుంచి 50 శాతం పెంపు ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు ఏకీకృతంగా ఉండేలా చూడాలని కోరారు. 15ఏళ్లు నిండిన లారీల పర్మిట్ల రద్దుపై పునరాలోచించాలని కోరారు. తెలుగు రాష్ట్రల్లో అమలయ్యేలా సింగిల్ పర్మిట్కు అవకాశం కల్పించాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రానికి చెల్లుబాటయ్యేలా చెల్లించిన క్వార్టర్లీ ట్యాక్స్ను తగ్గించి తెలంగాణ పరిధికి అనుగుణంగా కొత్త పన్ను విధానాన్ని అమలు చేయాలన్నారు. అనంతరం సమ్మె పోస్టర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బేగ్, ఆర్టీఏ మెంబర్ జావిద్బేగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటుకు కోట్లు కేసుపై ఆన్లైన్ ఉద్యమం
-
చర్చలు విఫలం
♦ కమిటీ సమావేశం రద్దు ♦ కొనసాగుతున్న ఉద్యమం ♦ సంతకాల సేకరణ ♦ రాజ్ భవన్ ముట్టడి యత్నం – అరెస్టు ♦ కమలనాథులపై గరం గరం నెడువాసల్ ఉద్యమకారుల్ని బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. కలెక్టర్, ఎస్పీ నేతృత్వంలో సాగిన తొలి విడత చర్చలు విఫలమయ్యాయి. సోమవారం కూడా ఉద్యమాన్ని ఆ పరిసర గ్రామాల ప్రజలు కొనసాగించారు. రాజ్ భవన్ ముట్టడికి యత్నించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. సాక్షి, చెన్నై: హైడ్రో కార్బన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పుదుకోట్టై జిల్లా నెడు వాసల్లో 20 రోజులుగా ఉద్యమం సాగుతోంది. ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు సాగినా, అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థి, యువ సమూహం మద్దతుతో ఉప్పెనలా ఎగసి పడుతున్నది. ఉద్యమకారుల్ని బుజ్జగించేందుకు ఆ జిల్లా కలెక్టర్ రాజేష్, ఎస్పీ లోకనాథన్ నేతృత్వంలో అధికారుల బృందం రంగంలోకి దిగింది. ఆదివారం రాత్రంతా ఈ బృందం ఉద్యమ కమిటీతో సమావేశమైంది. ఉద్యమకారులు ఉంచిన అనేక డిమాండ్లకు, సంధించిన ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానాలు కరువైనట్టు సమాచారం. పలు రకాలుగా హామీలు గుప్పించినా, ఏ మాత్రం ఉద్యమకారులు వెనక్కు తగ్గలేదు. ఉద్యమ కమిటీ సమావేశానంతరం సోమవారం మధ్యాహ్నం నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఉద్యమకారులు అధికారులకు హామీ ఇచ్చారు. అయితే ఉద్యమ కమిటీ సమావేశం రద్దు కావడం, ఉద్యమం కొనసాగడం గమనార్హం. ఆ పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఉద్యమ వేదిక వద్ద బైఠాయించారు. దీక్ష ఉప సంహరించుకుంటారని అధికారులు భావించినా, ఉద్యమకారులు ఏ మాత్రం తగ్గని దృష్ట్యా, మళ్లీ చర్చల కసరత్తుల్లో పడ్డారు. ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణకు నెడువాసల్ నుంచి తమిళనాడు సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ సంఘం శ్రీకారం చుట్టింది. తమ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించే విధంగా, తమకు వ్యతిరేకంగా రాష్ట్రంలో బీజేపీ వర్గాలు గళాన్ని వినిపిస్తుండడం ఉద్యమకారుల్లో ఆక్రోశాన్ని రగుల్చుతోం. బీజేపీ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా తాము స్పందించాల్సి ఉంటుందన్న హెచ్చరికల్ని నెడువాసల్ వేదికగా ఉద్యమకారులు చేశారు. తాత్కాలిక హామీలు కాదు అని, తమకు భవిష్యత్తు ముఖ్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. బీజేపీ నేత హెచ్ రాజా అక్కడికి రాగా, ఆయన్ను అడ్డుకునే విధంగా యువత వ్యవహరించడం గమనార్హం. రాజ్భవన్ ముట్టడి: నెడువాసల్ ఉద్యమానికి మద్దతుగా చెన్నైలో పురట్చి కరై ఇలైంజర్ ఇయక్కం కదిలింది. ఆ ఇయక్కంకు చెందిన వారు రాజ్భవన్ ముట్టడి నినాదంతో ఉదయం దూసుకెళ్లారు. హైడ్రో కార్బన్ ప్రాజెక్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే విధంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్ను డిమాండ్ చేస్తూ చలో రాజ్ భవన్ తో ముందుకు సాగారు. వీరిని మార్గమధ్యలో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వారిని బలవంతంగా పోలీసులు అరెస్టు చేశారు. -
ఉద్యమ బాట
► తగ్గేది లేదన్నఉద్యమ నేతలు ► బెడిసి కొట్టిన సీఎం ప్రయత్నాలు ► ఇక మరింత ఉధృతం ► అణగదొక్కేందుకు కసరత్తులు ► బలగాల మోహరింపు ► ఒక్కో గ్రామంలో ఒక్కో కన్నీటి గాథ సీఎం ఎడపాడి పళనిస్వామి ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఉద్యమాన్ని కొనసాగించేందుకు నెడువాసల్ ఉద్యమకారులు నిర్ణయించారు. హైడ్రోకార్బన్ ప్రాజెక్టు రద్దు ప్రకటన వెలువడే వరకు ఉద్యమం కొనసాగుతుందని, మరింత ఉధృతం చేయనున్నట్టు ఉద్యమ నేతలు ప్రకటించారు. ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నాలుసాగుతున్నాయి. నెడువాసల్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సాక్షి, చెన్నై:పుదుకోట్టై జిల్లా నెడువాసల్ వేదికగా హైడ్రో కార్బన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతున్న విషయం తెలిసిందే. ఉద్యమకారులతో బుధవారం సీఎం ఎడపాటి కే పళనిస్వామి భేటీ అయ్యారు. అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదన్న భరోసా ఇచ్చారు. అయితే సీఎం ప్రయత్నాలు బెడిసి కొ ట్టాయి. ఆయన హామీలు సంతృప్తికరంగా లేని దృష్ట్యా, ఉద్యమాన్ని ముం దుకు తీసుకెళ్లేందుకు ఉద్యమకారులు నిర్ణయించారు. కేంద్రం దిగి వచ్చి ఆ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్టు ప్రకటించేవరకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి తీరుతామన్న ప్రతిజ్ఞను గురువారం నెడువాసల్ పరిసర గ్రామాల్లోని ప్రజలు చేశారు. పాఠశాల స్థాయి పిల్లలు, యువత సైతం తరలి వచ్చి ఉద్యమానికి సంఘీభావం తెలియజేశారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ, వివిధ రూపాల్లో నిరసనలు, పరిస్థితిని బట్టి ఆమరణ దీక్ష సైతం చేపట్టేందుకు తగ్గ కసరత్తులతో ఉద్యమకారులు ముందుకు సాగుతుండడంతో ఉత్కంఠ బయల్దేరింది. ఈ ఉద్యమానికి మద్దతుగా చెన్నై వళ్లువర్కోట్టం వద్ద సినీనటుడు లారెన్స్ నేతృత్వంలో నిరసనకు పిలుపునిచ్చారు. అయితే పోలీసులు చివరి క్షణంలో అనుమతి నిరాకరించారు. ముందుగానే అక్కడకు చేరుకున్న యువతను పోలీసులు బలవంతంగా తొలగించారు. బలగాల మోహరింపు: నెడువాసల్ ఉద్యమాన్ని అణగొక్కేందుకు తగ్గ ప్రయత్నాలు సాగుతున్నట్టుంది. సీఎం హామీ ఇచ్చినా ఉద్యమకారులు వెనక్కు తగ్గక పోవడంపై కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అదే సమయంలో నెడువాసల్ పరిసరాల్లోకి బయటి వ్యక్తులు రాకుండా అడ్డుకునే విధంగా చెక్ పోస్టులు ఏర్పాటు అయ్యాయి. బలగాల్ని మరింత కట్టుదిట్టం చేయడంతో ఉత్కంఠ బయల్దేరింది. ఒక్కో గ్రామంలో ఒక్కో కన్నీటి గాథ: హైడ్రో ప్రాజెక్టు నిమిత్తం చాప కింద నీరులా తవ్విన బోరు బావుల రూపంలో ముప్పు ఇప్పటికే బయల్దేరినట్టు అనేక గ్రామాల్లోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ వేదికపై ప్రసంగించే ఆయా గ్రామాల ప్రజలు తమ తమ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనలను వివరిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్టైకాడు పరిసరాలను ‘సిటిజన్’ సినిమా తరహాలో కనుమరుగు చేయడానికి ప్రయత్నాలు జరిగినట్టు, ఇక్కడ జరిగిన తవ్వకాల పరిశోధనల కారణంగా పిల్లలు మానసిక వికలాంగులుగా, అంతు చిక్కని వ్యాధులతో బాధ పడాల్సి ఉందని కన్నీటి పర్యంతం కావడం అక్కడి వారిని కలచి వేసింది. వనక్కాడులో గతంలో పదిహేను వందల అడుగుల లోతులో ఏర్పాటు చేసిన బోరు బావి కారణంగా, క్యాన్సర్ బారిన పడి పది మంది మరణించి ఉన్నట్టు, మరో 25 మంది ఆ వ్యాధితో బాధ పడుతున్నట్టు అక్కడి ప్రజలు పూర్తి వివరాలను ఉద్యమ వేదిక ముందుకు తీసుకురావడం గమనించాలి్సన విషయం. -
ఉపాధ్యాయ ఉద్యమ పితామహుడు ’చెన్నుపాటి’
అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయ ఉద్యమ పితామహుడు చెన్నుపాటి లక్ష్మ య్య అని యూటీఎఫ్ నాయకులు కొని యాడారు. ఆదివారం స్థానం యూ టీఎఫ్ జిల్లా కార్యాలయంలో చెన్ను పాటి లక్ష్మయ్య 18వ వర్ధంతిని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఎం. సుధాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జిలాన్ తదితరులు మాట్లాడారు. బ్రిటీష్ పాలకుల నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఉపా« ద్యాయుల ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ హక్కుల సాధనకు లక్ష్మయ్య పోరాడారని గుర్తు చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్వీవీ రమణయ్య మాట్లాడుతూ చెన్నుపాటి లాంటి వారి త్యాగాల ఫలితంగానే నేడు ఉపాధ్యాయులు మెరుగైన వేతనాలు పొందుతున్నారన్నారు. జిల్లా గౌరవాధ్యక్షుడు సీకే నాగేంద్రబాబు జిల్లా కార్యదర్శి కోటేశ్వరప్ప యూటీఎఫ్ నాయకులు సురేష్, సలావుద్దీన్, గోపాల్, రూత్, నల్లప్ప, పాల్గొన్నారు. -
ఉద్యమ పాదంపై పుట్టుమచ్చ
...థర్టీ ఇయర్స్ రివల్యూషన్! ఉద్యమం చేయడం ఎంత నిజమో... నిజం చెప్పడం అంతే ఉద్యమం! నారాయణమూర్తికి... నిజం అంటే ఏంటి? ఉద్యమం అంటే ఏంటి? మనసులో మాట... పెదాల మీద ఉంటే అదే నిజం! అదే ఉద్యమం అంటాడు. సత్యవాక్కు పలికేవాడు... సత్యపథం పట్టక మానడు కదా! సిల్వర్ జూబ్లీ సినిమాలిచ్చినా, కోట్ల కలెక్షన్లు కొట్టినా ఇప్పటికీ... షేర్ ఆటోలో తిరుగుతాడు. కాలిబాట పడతాడు. మరి అదే కదా.. సత్యపథం! గాంధీ ఉద్యమంలో... ‘అహింస’ సత్యాగ్రహం అయితే... ఆర్. నారాయణమూర్తి గుండెల్లో... ‘విప్లవం’ సత్య ఆగ్రహం. నిప్పులా రగిలే సత్యం... జ్వాలలా ఎగసిపడే ఆగ్రహం. తెర మీద బొమ్మ పడింది! అదిగో... నారాయణమూర్తి నడుచుకుంటూ వస్తున్నాడు.ఆ ఉద్యమపాదంపై ప్రజలు పెట్టిన కాటుక చుక్కే ఈ పుట్టుమచ్చ. ఆడియన్స్... ఈలలు, చప్పట్లు, కేరింతలు... ఎర్రటి విప్లవంలా తెర మీద భగభగమండుతున్నాడు. ఇదిగో... ఈ ఇంటర్వ్యూలో... అలాగే మాట్లాడుతున్నాడు.భగ భగ ఎంజాయ్ చేయండి. హ్యాపీ సండే. ‘అర్ధరాత్రి స్వతంత్రం’తో హీరోగా మొదలై, ఇప్పటికి 30 ఏళ్లయింది. సంపాదించింది ఎంత? పోగొట్టుకున్నది ఎంత? ఆర్. నారాయణమూర్తి: 30 ఏళ్లుగా దేశంలో జరుగుతున్న సమస్యలే నా సినిమాలు. కార్మిక, ఆదివాసీ, దళితుల, స్త్రీ, రైతు, భూ పోరాటం.. ఇలా ఎన్నో విషయాలపై సినిమాలు తీస్తున్నా. పోగొట్టుకున్నది ఏం ఉంటుంది? ప్రజా సమస్యల్ని చర్చిస్తున్నా కాబట్టి, అభిమానం సంపాదించుకున్నా. 30 ఏళ్లయ్యాయని గుర్తు పెట్టుకుని, ఇంటర్వ్యూ కోసం ‘సాక్షి’ వచ్చిందంటే, అది నేను సంపాదించుకున్నదే. సమస్యల్ని చూపిస్తే మార్పొస్తుందా? మార్పు అనేది వస్తుంది. సమాజం గ్యారంటీగా మారుతుంది. మార్పు కోసం డాక్టర్, సైంటిస్ట్, కార్టూనిస్ట్, పొలిటిషీయన్, మీ జర్నలిస్టులు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో యాంగిల్లో పోరు చేస్తారు. కళాకారుడిగా నేను నా సినిమాల ద్వారా మార్పు కోసం ఫైట్ చేస్తున్నా. నా ‘అర్ధరాత్రి స్వతంత్రం’ చూసి ఎందరో ఉద్యమబాట పట్టారు. ‘ఎర్రసైన్యం’ చూసి భూపోరాటం చేశారు. ‘దండోరా’ చూసి సారాకొట్లు బద్దలు కొట్టారు. అది మంచి మార్పేగా. గాంధీ ‘శాంతి’ అంటే మీవి పోరాటం వైపు మళ్లిస్తున్నాయి... మళ్లిస్తున్నాయంటే పొరపాటు. ఒక్క గాంధీ వల్లే మనకు స్వాతంత్య్రం రాలేదుగా? సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ పోరాటం చేయమన్నారు కదా. ఎందరో వీరుల త్యాగఫలితమే ఈ స్వాతంత్య్రం. ఓ విషయం చెబుతాను. ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో అభివృద్ధి పేరు చెప్పి, ఇండస్ట్రియలైజేషన్ చేసేస్తున్నారు. అంతా మలినం. రొయ్యల వ్యాపారానికి గండిపడింది. పర్యావరణం నాశనం. భూములు లేకుండా పోయాయి. రైతుల పరిస్థితేంటి? ఉద్యమాలు చెయ్యాలా? వద్దా? చేసినా పోలీసులు కొడుతుంటే తిరుగుబాటు చేయరా? చేయకపోతే ఆ వాయిస్ ఎలా తెలుస్తుంది? మీ ఆర్థిక లావాదేవీలన్నీ వైట్లోనే ఉంటాయా? సీ మై ఫ్రెండ్... ‘అర్ధరాత్రి స్వతంత్రం’ నుంచి ‘వేగు చుక్కలు’ వరకూ 20 ఏళ్లపాటు నేను తీసిన సినిమాలన్నీ బ్రహ్మాండంగా ఆడాయి. అది చూసి కొంతమంది ఇలాం టివి తీశారు. ఒకటీ రెండు తీశాక మొనాటనీ వచ్చిందని మానేశారు. నేను మాత్రం తీస్తూనే ఉన్నా. సముద్రాన్ని ఈదుతూనే ఉన్నా. జనం దయ నాపై ఉంది కాబట్టి సక్సెసవుతున్నా. మొదట్నుంచీ నా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారు. కథ, స్క్రీన్ప్లే, యాక్షన్, డెరైక్షన్, మ్యూజిక్ - అంతా నేనే కాబట్టి, బడ్జెట్ అక్కడే తగ్గిపోతుంది. సినిమా మొదలుపెట్టే ముందు ఫ్రెండ్స్ దగ్గర్నుంచి అప్పు తెచ్చుకుంటా. సినిమా రిలీజయ్యాక తిరిగిచ్చేస్తా. ‘ఆల్ వైట్.. నో బ్లాక్’. మొనాటనీ అని కొంతమంది మానేశారన్నారు. మరి ఎప్పుడూ ఒకే టైప్ సినిమాలు తీస్తే.. మీకు విసుగు రాలేదా? నా బతుకు ఇంతేనా? మార్పు లేదా? అనే ఆలోచన ఏ మనిషి మనసులోనైనా వస్తే, అతడికి విసుగొస్తుంది. అప్పుడు ముందుకు సాగలేడు. ఇన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా, సినిమా తల్లిపై ఉన్న అభిమానం, ఆరాధన, ఇష్టం, గౌరవం తగ్గలేదు. సినిమాలపై అయిష్టం రాలేదు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువా? ఆటోల్లో తిరుగుతుంటారు. కారుల్లో తిరిగినా మిమ్మల్ని అడిగేవాళ్లు ఎవరుంటారు? అవును. ఎందుకు అడుగుతారు? సిల్వర్, డైమండ్ జూబ్లీ సినిమాలు తీసి, కోట్లు గడించినవాణ్ణి. నా దగ్గర బ్యాలెన్స్ ఎందుకుండదు? అది తీసిపారేయండి. చిన్నప్పటి నుంచి నాకిలా ఉండడం అలవాటు. ఏదో పోజు కొట్టడం కోసం ఇలా ఉంటాననుకుంటున్నారేమో? నేనలా ఆత్మవంచన చేసుకోను. నాకిప్పుడు 62 ఏళ్లు. కాలేజీ డేస్లో కూడా నాకు రెండు జతల బట్టలే. వాచీలు, గొలుసులు ఎప్పుడూ పెట్టుకోలేదు. చిన్నప్పటి నుంచి నాది ఉద్యమ బాటే. ప్రజల పక్షానే. నా లైఫ్ స్టైల్ ఇది. ఎవరి మెప్పుకోలు కోసమో ఉండట్లేదు. ఇలా ఉండటమే నాకు ఆనందం. నా సినిమా కోట్లు తెచ్చినప్పుడు నాకు బీరువా లేదు. డాక్యుమెంట్లు లేవు. చాప, దిండు మాత్రమే. డబ్బులు తేనప్పుడూ నా దగ్గర ఉండేది చాపా, దిండూనే. ఊళ్లో బంగ్లా, స్థలాలు కొన్నారని విమర్శ. దానికేమంటారు? ఓసారి మా ఊరు వెళ్లండి. నేను చేసిన మంచి పనులు కనిపిస్తాయి. ఆస్పత్రి కట్టించా. విద్యాలయాలకు డొనేట్ చేశా. పీపుల్స్ కమిటీ హాల్స్ కట్టించా. ఆంధ్ర, తెలంగా ణాల్లో బోర్లు వేయించా. కానీ ఎక్కడా చెప్పుకోను. మీర న్నట్లు మా ఊళ్లో నా సంపాదన ఉందనుకుంటే.. బంగ్లా కట్టించానేమో చూడండి. మా అమ్మా నాన్న ఏ ఇంట్లో ఉన్నారో చూడండి. రీసెంట్గా మా నాన్న చనిపోయాడు. అమ్మ ఒకతే ఉంది. ఊళ్లో నాకు ఎకరం స్థలం లేదు. థియేటర్లు లేవు. దొంగచాటు వ్యాపారాలేవీ చేయట్లేదు. ఒకవేళ మీరన్నది నిజమైతే ఇక ‘సాక్షి’ నన్ను ఇంటర్వ్యూ చేయొద్దు. ‘ప్రజల్ని మోసగిస్తూ, పేదోడిలా నటిస్తున్న నారాయణమూర్తి’ అని హెడ్లైన్స్ పెట్టి రాయండి. నేను చెప్పినది కరెక్టని భావిస్తే, ‘ఎలా చెబుతున్నాడో అలానే బతుకు తున్న ఆర్. నారాయణమూర్తికి సెల్యూట్’ అని రాయండి. మీ సినిమాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. కానీ... సమాజం అందుకు దాదాపు విరుద్ధంగా ఉంటోంది. యస్.. ఇవాళ పాశ్చాత్య సంస్కృతి ప్రభావం బాగా పెరుగుతోంది. యువత ఆ సంస్కృతికి అలవాటు పడడం, ఆకర్షితులు కావడం సహజం. అంతెందుకు? విశాఖ బీచ్లో లవర్స్ను ఆహ్వానిస్తున్నారంట. దేశ, విదేశీ ప్రేమికుల ముద్దులాట, కౌగిలింతలను చూసి, ఎంజాయ్ చేయమంటారా? ఎంత దుర్మార్గమైన చర్య. మనకి ఆ సంస్కృతిని అలవాటు చేయడమే కదా! ఓసారి హైదరాబాద్లో బ్రహ్మానందరెడ్డి పార్క్లో నడుస్తుంటే.. ఓ అమ్మాయి కౌగిలించుకోబోయింది. ఏంటని అడిగితే, ‘హగ్ కల్చర్’ అట. ‘నీది ఏ దేశం?’ అనడిగా. హైదరాబాదే అని చెప్పింది. ఈ హగ్ కల్చర్, ముద్దులు, ఇవన్నీ మనకు కాదు, యూరోపియన్లకు అనే విషయం ప్రజలు తెలుసుకోవాలి. శీతల మండలాల్లో సంస్కృతిని మనకు అలవాటు చేస్తే ఎంత భ్రష్టు పడుతుంది. కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేపట్టిన బీచ్ ఫెస్టివల్ను వ్యతిరేకిస్తున్నా. అందాల పోటీలూ డబ్బు కోసమే. ఆర్థిక విలువలు డామినేట్ చేస్తున్న పరిస్థితుల్లో ఎలాగైతే మానవ సంబంధాల్ని కోల్పోతున్నామో, అలాగే వెస్ట్రన్ కల్చర్తో మన సంస్కృతి, భాషలను విచ్ఛిన్నం చేసుకుంటున్నాం. రేపులు, గట్రా పెరగడానికి యూరోపియన్ కల్చర్ ప్రభావమే కారణం. చిన్నపిల్లలతో టీవీల్లో డ్యాన్సులు ఏంటమ్మా? పసిపిల్లలకేం తెలుసు? చివరికి వాళ్లు ఈ సంస్కృతికి అలవాటు పడతారు. మీరు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది కదా? కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయమని చంద్రబాబు మూడుసార్లు అవకాశమిచ్చారు. తుని నియోజకవర్గంలో ప్రజలు నా పేరు సూచించారని జక్కంపూడి రామ్మోహనరావు గారు చెప్పడంతో వై.ఎస్. రాజశేఖర్రెడ్డిగారు ఎమ్మెల్యేగా పోటీ చేయమని స్వయంగా పిలిచారు. 2009లో పీఆర్పీ పిలిచింది. అందరికీ దండాలు పెట్టా. ఎందుకంటే, నేను సినిమా పిచ్చోణ్ణి. రాజకీయాల్లోకి వెళితే.. సినిమాల్లో ఉండకూడదు. ప్రజాసేవ అంటే దేవుడు మనకిచ్చిన వరంగా ఫీలవ్వాలి. నిద్ర, తిండి మినహాయిస్తే మిగతా టైమంతా జనం కోసమే ఆలోచించాలి. ఓ కాలు సినిమా పడవపై, మరో కాలు రాజకీయమనే పడవపై వేసి ప్రయాణించలేను. నేను ఏ రాజకీయ పార్టీ వ్యక్తినీ కాను. ‘అయామ్ ఎ కామన్ మ్యాన్’. ప్రజల పార్టీ వ్యక్తిని. రాజకీయాల్లోకెళ్తే పొల్యూట్ అవుతామేమోనని భయమా? మీరు మీరుగా ఉన్నప్పుడు ఎవరూ మార్చలేరు. మరోలా ఉండాలనుకున్నప్పుడు మారిపోతారు. అది వాళ్ల వీక్నెస్. సినిమాల్లోకి, పాలిటిక్స్లోకెళితే నాశనమవుతారనేది కరెక్ట్ కాదు. ఓ కమిట్మెంట్తో నిజాయతీగా ఉన్నవాణ్ణి, ఉండాలనుకునేవాణ్ణి ఏదీ ప్రభావితం చేయలేదు. 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా. నేనేమైనా మారానా? తెలంగాణ ఉద్యమానికి మద్దతునిచ్చారు. మరి, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై మీ అభిప్రాయం? 1969లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఎన్టీఆర్గారు ధైర్యంగా ‘నేను సమైక్యాంధ్రా’ అన్నారు. అది ఆయన క్యారెక్టర్. 1972లో ‘జై ఆంధ్రా’ ఉద్యమ సమయంలో ఇండస్ట్రీ అంతా సెలైంట్గా ఉంటే.. కృష్ణగారు ధైర్యంగా ముందుకొచ్చి ‘జై ఆంధ్రా’ అన్నారు. అది కృష్ణగారి క్యారెక్టర్. ఇప్పుడు నేను ‘జై తెలంగాణ’, ‘జై ఆంధ్రా’ అన్నాను. ఇది నా క్యారెక్టర్. తెలంగాణ అనేది ధర్మబద్ధమైన, న్యాయబద్ధమైన ఉద్యమం అని నమ్మినవాణ్ణి. అందుకే, మద్దతుగా నిలిచా. విడిపోతే, అక్కడ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ తెలంగాణ అభివృద్ధి చెందుతాయని ఉద్యమానికి మద్దతిచ్చా. అన్నదమ్ముల్లా రెండు రాష్ట్రాలు విడిపోయినందుకు హ్యాపీ. అయితే... ఈ రెండు రాష్ట్రాలను విభజించిన యూపీఏ ప్రభుత్వం ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. మొదట్నుంచి తెలంగాణ కోరుకుంటున్న బీజేపీ, వెంకయ్య నాయుడు కూడా ప్రతేక హోదా తప్పకుండా ఇచ్చి తీరాలన్నారు. ఎన్నికల ముందు తిరుపతి సభలో మోదీగారు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఎన్నికల్లో మోదీ నెగ్గారు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు? రాజ్యాంగం ప్రకారం, గత ప్రభుత్వం (యూపీఏ) ప్రకటించిన ప్రత్యేక హోదా ఇవ్వవలసిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది. ‘ప్రత్యేక హోదా వస్తే మీకు లాస్. ప్యాకేజీ ఇంపార్టెంట్’ అంటూ మీడియా సహాయంతో ఊదరగొడుతున్నారు. మాట తప్పడం మహా దుర్మార్గం. పాలకులకు ప్రజలంటే భయం, భక్తులు ఉండాలి. లేనప్పుడు మోనార్కిజం వస్తుంది. ఇప్పుడు మోనార్కల్లా ప్రవర్తిస్తున్నారు. వెంకయ్యనాయుడి మాటలు, చంద్రబాబు స్ట్రాంగ్గా ఫైట్ చేయకపోవడం కరెక్ట్ కాదు. పలు మీటింగుల్లో ప్రత్యేక హోదా కావాలని నేనూ చెప్పా. ఈరోజు ముఖ్యంగా వై.ఎస్. జగన్మోహన్రెడ్డిగారు బీభత్సంగా ఫైట్ చేస్తున్నారు. హోదా కోసం ఫైట్ చేస్తున్నవాళ్లందర్నీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. ఇప్పుడు బయటి బేనర్లో ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ సినిమా చేస్తున్నారు. సడన్గా బయట సినిమా చేయడానికి కారణం? యాక్టర్గా డిఫరెంట్ క్యారెక్టర్లు చేయాలనుంది. యాక్టింగ్ పిచ్చితో మద్రాస్ వెళ్లినోణ్ణి. గతంలో పలువురు మిత్రులు మంచి వేషాలు ఆఫర్ చేశారు. కానీ, మొనాటనీ ఉంటే జనాలు సినిమా చూడడం మానేస్తారు. అది బ్రేక్ చేస్తూ డిఫరెంట్ వేషాలు వేయాలనుంది. ఇప్పటి వరకూ ఉద్యమకారుడు, రైతు, కార్మికుడు, నిరుద్యోగి, రిక్షావోడు, దళితుడు - ఇలా అనేక వేషాలు వేశా. ఇప్పుడు కానిస్టేబుల్, ప్యూన్, జవాను, గుమస్తా, బక్కరైతు, కులవృత్తులకు సంబంధించిన హీరో పాత్రలు చేయాలనుంది. దేవుడి దయ వల్ల ఆర్.నారాయణ మూర్తి అనే మార్క్ వచ్చింది. ముసలోణ్ణి అయినా ‘త్రిశూల్’లో దిలీప్కుమార్, ‘శంకరాభరణం’లో సోమయాజులుగారి తరహాలో నటిస్తా. ఏ మనిషికైనా తన అర్హత, అనర్హతలు ఏంటో ఇతరుల కంటే తనకే బాగా తెలుస్తుంది. ఇండస్ట్రీలో మహా అయితే మరో నాలుగైదేళ్లు ఉంటా. అప్పటివరకూ నటిస్తా. ‘నా రాజ్యానికి నేనే రాజు’ అనేది నా పాలసీ. హ్యాపీగా ఉండాలంటే... అమ్మానాన్నలను మించిన దైవం లేదు. పిల్లలకు వాళ్ల తల్లితండ్రులు, తల్లితండ్రులకు వాళ్ల పిల్లలు గొప్పోళ్లు. మా అమ్మానాన్నలు పాజిటివ్గా ఆలోచించేవాళ్లు. చిన్నప్పటి నుంచి కళ్ల ముందు ఏదైనా అన్యాయం జరిగితే వెళ్లడం, దెబ్బలు తినడమే నా పని. మళ్లీ ఉద్యమాల్లోకి వెళ్లేవాణ్ణి. వాళ్ల జీన్స్ నాలో ఉండడమే ఈ ప్రవర్తనకు కారణం అనుకుంటున్నా. నేను నా యాంగిల్లో వెళ్తున్నాను. మా అమ్మా నాన్న నన్ను అర్థం చేసుకున్నారు. మన అంతరాత్మ ప్రకారం నడుచుకున్నప్పుడు హ్యాపీగా ఉంటాం. ఓకే సార్... మోదీగారు పెద్ద నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో కొంతమంది సినీ పెద్దలు ‘బ్లాక్’ని వైట్ చేసుకోవడానికి ఇబ్బందులపాలవుతున్నారట. మీ సంగతేంటి? (గట్టిగా నవ్వుతూ)... నాకు బ్లాక్ అండ్ వైట్ తేడా తెలియదు. నల్లధనం ఉండకూడదనే ఆశయంతో మోదీగారు చేసిన ప్రయత్నం మెచ్చుకోదగ్గది. కానీ, మోదీగారిని నేనేం ప్రశ్నిస్తున్నానంటే... ఎన్నికలకు ముందు విదేశీ బాం్యకుల్లో ఉన్న నల్ల డబ్బుని జనానికి పంచేస్తానన్నారు కదా. ముందా పని చేయమంటున్నా. ఎందుకు చేయలేకపోయారు? 500, 1000 రూపాయిల నోటుని రద్దు చేసినప్పుడు 2000 రూపాయి నోటు ఎందుకు? మోదీ హఠాత్ నిర్ణయం సినిమా ఇండస్ట్రీని ఇబ్బందులపాలు చేస్తోంది. లోయర్, మిడిల్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ల పరిస్థితి అంతకన్నా దయనీయంగా ఉంది. అంటే.. పెద్ద నోట్ల రద్దు తప్పంటారా? ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మధ్యతరగతి వాళ్ల ఇబ్బందుల గురించి ఆలోచించాలి. దీన్నే అదనుగా తీసుకుని పెట్రోల్ బంకుల్లో, కొన్ని కిరాణా కొట్లలో 500 నోటిస్తే.. నోటుకు సరిపడా కొనాల్సిందేనంటున్నారు. మోదీగారు వాగ్దానం చేసినట్లుగా స్విస్ బ్యాంకుల్లో ఉన్న డబ్బు తెచ్చి, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. అది ఎందుకు చేయలేకపోతున్నారని ఆయనను ప్రశ్నిస్తున్నా. గెలవడానికి ఎన్నికల ముందు ప్రజల్ని మభ్య పెడుతున్నారు. ప్రజలు ‘తాత్కాలిక’ అవసరాల కోసం ఓటేసి నంతవరకూ సమాజం బాగుపడదు. అందుకే ఓటేసే ముందు ‘శాశ్వతాన్ని’ దృష్టి పెట్టుకోవాలి. వారసులేనా వచ్చేది? వ్యాపారస్థుడి కొడుకు వ్యాపారస్థుడు.. డాక్టర్ కొడుకు డాక్టర్.. అవుతున్నప్పుడు హీరో కొడుకు హీరో కావడంలో తప్పేంటి? రాజకీయ నేత కొడుకు రాజకీయ నేత అయితే తప్పేంటి? అనే చర్చ ఈ ప్రజాస్వామ్యంలో జరుగుతోంది. ఎవరి అభిరుచి, ఆసక్తి ప్రకారం వాళ్లు నడుచుకోవచ్చనేది నా అభిప్రాయం. ప్రజాస్వామ్యంలో ఆ వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. అయితే సినిమాల్లో నటించాలని, రాజకీయాల్లో రాణించాలని, అనేక రకాలుగా అభివృద్ధి చెందాలని 90 శాతం మందికి ఉంది. వారసత్వం సరైనదని మీరే వస్తుంటే.. బయటవాళ్లెప్పుడు హీరోలవుతారు? మంత్రులవుతారు? జనాభా దామాషాలో అట్టడుగు వర్గాలూ అందలం ఎక్కాలి. - డి.జి. భవాని -
జిల్లా కోసం ఉద్యమం ఉధృతం
నేడు హైదరాబాద్కు వెళ్లనున్న బృందం జాతీయ రహదారిపై బతుకమ్మ ఆటలు l 5న డివిజ¯ŒS వ్యాప్తంగా సామూహిక నిరాహార దీక్షలు జనగామ : జనగామ జిల్లా సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు కార్యాచరణ రూపొందించినట్లు జేఏసీ చైర్మ¯ŒS ఆరుట్ల దశమంతరెడ్డి తెలిపారు. స్థానిక జూబ్లీ ఫంక్ష¯ŒS హాల్లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని ముందుకు వెళ్తామన్నారు. ముసాయిదా ప్రకటన నేపథ్యంలో శనివారం జేఏసీలోని ఓ బృందం మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కలిసేందుకు హైదరబాద్కు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు జాతీయ రహదారి ఆర్టీసీ చౌరస్తాలో మహిళల బతుకమ్మ ఆ టలతో నిరసన తెలుపుతామన్నారు. 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహిం చి, మొమోరాండం ఇస్తామన్నారు. 5న డివిజన్ లోని మండలాలు, గ్రామాల్లో సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించి ప్రభుత్వానికి నిరసన తెలిపాలన్నారు. ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి రాజీనామా చేసి ఉద్యమంలో కలిసి రావాలని డిమాండ్ చేశారు. ఓయూ జేఏసీ అధికార ప్రతినిధి బాలలకీ‡్ష్మ మాట్లాడుతూ చేర్యాల ను రెవెన్యూ డివిజ¯ŒSగా చేసి, జనగామను జిల్లా చేయాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజరెడ్డి, డాక్టర్ లకావత్ లక్షి్మనారాయణ నాయక్, లింగయ్య, సతీష్, శ్రీరాములు, శశిధర్, కైలాసం, రాజు, సురేష్, వి జయ్, ప్రకాష్, సోమేశ్వరాచారి, రమేష్, ఎల్లయ్య, శ్రీను, కిరణ్, శేఖర్ పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్య ఉద్యమాలకు విశేష కృషి
నల్లగొండ టౌన్ : దళితులు, పౌర హక్కులు, ప్రజాస్వామ్య ఉద్యమాల కోసం బొజ్జా తారకం విశేషంగా కృషి చేశారని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.రఘునాథ్ అన్నారు. శుక్రవారం స్థానికంగా దళిత విద్యావంతుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన బొజ్జా తారకం సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. చుండూరు దళితుల కోసం న్యాయస్థానంలో రాజీలేని పోరాటం నిర్వహించారన్నారు. ఫోరం కన్వీనర్ దర్శనం నర్సింహ అధ్యక్షతన జరిగిన సంస్మరణ సభలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి జి.మోహన్, టీడీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ బండి దుర్గాప్రసాద్, చింత సుధాకర్, రవినాయక్, కొండమడుగు నర్సింహ, అనుదీప్, రంజిత్, సత్యనారాయణ, కామేష్, రాజశేఖర్రెడ్డి, వెంకన్న, ప్రభాకర్, పాలడుగు నాగార్జున, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్య ఉద్యమాలకు విశేష కృషి
నల్లగొండ టౌన్ : దళితులు, పౌర హక్కులు, ప్రజాస్వామ్య ఉద్యమాల కోసం బొజ్జా తారకం విశేషంగా కృషి చేశారని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.రఘునాథ్ అన్నారు. శుక్రవారం స్థానికంగా దళిత విద్యావంతుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన బొజ్జా తారకం సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. చుండూరు దళితుల కోసం న్యాయస్థానంలో రాజీలేని పోరాటం నిర్వహించారన్నారు. ఫోరం కన్వీనర్ దర్శనం నర్సింహ అధ్యక్షతన జరిగిన సంస్మరణ సభలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి జి.మోహన్, టీడీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ బండి దుర్గాప్రసాద్, చింత సుధాకర్, రవినాయక్, కొండమడుగు నర్సింహ, అనుదీప్, రంజిత్, సత్యనారాయణ, కామేష్, రాజశేఖర్రెడ్డి, వెంకన్న, ప్రభాకర్, పాలడుగు నాగార్జున, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ డివిజన్ సాధన ఉద్యమంలో పాల్గొనాలి
హుజూర్నగర్ : రెవెన్యూ డివిజన్ సాధన కోసం చేపట్టిన ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పాలక ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి బొబ్బా భాగ్యరెడ్డి అన్నారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ ఆ«ధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం 16వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా దీక్షలలో కూర్చున్న వారికి ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ కిసాన్మోర్చాజిల్లా కార్యదర్శి వేణుగోపాల్రెడ్డి,పట్టణ అధ్యక్షుడు తూముల శ్రీను, శీలంనాగరాజు, కస్తాలరామకృష్ణ, ప్రతాప్, రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల మానవహారం... హుజూర్నగర్ను రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ గురువారం రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో చౌరస్తాలో స్థానిక పలు విద్యాసంస్థల విద్యార్థులు మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో రెవిన్యూ డివిజన్ సాధన కమిటీ నాయకులుఎండి.అజీజ్పాషా, గల్లావెంకటేశ్వర్లు, చింతిర్యాల నాగయ్య, బాచిమంచి గిరిబాబు, కస్తాలముత్తయ్య, కస్తాలశ్రావ ణ్కుమార్, ఇట్టిమళ్లబెంజిమన్, మందావెంకటేశ్వర్లు, బరిగెలచంద్రశేఖర్, నందిగామ ముక్కంటి, రెడపంగు వెంకటేశ్వర్లు, దాసరి పున్నయ్య,దేవభిక్షం, నరేందర్, సైదులు, మట్టయ్య, దావీద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
అడవిలో అలజడి
రేపు మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వేడుకలు ∙సరిహద్దు ప్రాంతాలకు తరలిన పోలీసు బలగాలు చర్ల: మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వేడుకలను ఈ నెల 21వ తేదీన నిర్వహిస్తామని ఆ పార్టీ బాధ్యులు పిలుపునిచ్చిన నేపథ్యంలో వెంకటాపురం సర్కిల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే చర్ల మండలంలోని పలు ప్రాంతాల్లో మావోల పోస్టర్లు వెలవడంతో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్, కోబ్రా బలగాలను రంగంలోకి దించుతున్నారు. గ్రామాల్లో పోలీసు బలగాలు గస్తీ తిరుగుతున్నాయి. సరిహద్దు ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారుల్లో ప్రత్యేక నిఘాను పెంచారు. సరిహద్దున ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోకి వెళ్లే మార్గాల్లో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానిత వ్యక్తుల కదలికలు గుర్తిస్తున్నారు. మాజీ మిలిటెంట్లు, మిలీషియా సభ్యులు, సానుభూతిపరులను అదుపులోకి తీసుకుంటున్నారు. మావోయిస్టుల కదలికలను పోలీసులు తెలుసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేష¯ŒS చేపట్టేందుకు సంసిద్ధులవుతున్నారు. మావోయిస్టులు విధ్వంసకర ఘటనలకు పాల్పడకుండా గట్టి భద్రతా చర్యల్లో నిమగ్నమయ్యారు. అయితే..అటు పోలీసులు, ఇటు మావోయిస్టుల మధ్య అడవిబిడ్డలైన ఆదివాసీలు వణికిపోతున్నారు. ఉనికిని చాటుకునేందుకు చేసే చర్యలతో ఎలాంటి ఆపదను ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయపడుతున్నారు. -
రైల్వేగేట్ను తెరిచేవరకూ ఉద్యమం
ఆలేరు : ఆలేరులోని రైల్వేగేట్ను తెరిచేవరకు ఉద్యమిస్తామని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, డీసీసీ అధ్యక్షులు బూడిద భిక్షమయ్యగౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఆలేరులో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గేట్ మూసివేతతో ఆలేరు రెండు భాగాలుగా విడిపోయిందన్నారు. గేట్ అవతల వైపు ఉన్న ప్రజలకు ఇబ్బందులు కల్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నిర్మించిన ఆర్వోబీతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని.. ఆర్యూబీ నిర్మించే వరకూ రైల్వేగేట్ను తెరిపించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా ఆలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆలేరు, రాజాపేట, గుండాల మండలాలను భువనగిరిలోనే యథావిధిగా కొనసాగించాలన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ జనగాం ఉపేందర్రెడ్డి, నీలం పద్మ, పులిపలుపుల మహేష్, జెట్ట సిద్దులు, కందగట్ల నరేందర్, ఎనగందుల సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమాలకు సిద్ధం కావాలి
సూర్యాపేట : సీపీఐ బలోపేతానికి బలమైన ఉద్యమాలను నిర్వహించేందుకు శాఖ స్థాయి నుంచే పార్టీ శ్రేణులు చిత్తశుద్ధితో కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మగాని ప్రభాకర్ పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని ధర్మబిక్షం భవన్లో పార్టీ నిర్మాణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బొమ్మగాని ప్రభాకర్, జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి, రాష్ట్ర సమితి సభ్యుడు కేవీఎల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో అసహనం పెరిగిపోయిందన్నారు. భావప్రకటన స్వేచ్ఛపై దాడులు జరుగుతున్నాయని, రాజ్యాంగం ఇచ్చిన హక్కులపై ఆంక్షలు పెడుతున్నారని పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను, సంక్షేమాన్ని కాపాడుకోవడానికి ప్రపంచీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు కమ్యునిస్టు పార్టీ కార్యకర్తలు బలపడాలని కోరారు. దోరెపల్లి శంకర్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో బొమ్మగాని శ్రీనివాస్, బొమ్మగాని వెంకటయ్య, అనంతుల మల్లీశ్వరి, ఖమ్మంపాటి అంతయ్య, జానిమియా, పొలగాని వీరభద్రం, పాషా, రాము, సత్యనారాయణ, మురళి, పద్మరేఖ, రాములు, విద్యాసాగర్, బూర వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలి
సంస్థాన్ నారాయణపురం: ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డిలు అన్నారు. సీపీఐ మండల నిర్మాణ సభ మంగళవారం సంస్థాన్ నారాయణపురంలో జరిగింది. పార్టీ జెండాను ఎగురవేశారు. అంతకుముందు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలతో ఎన్నికైన టీఆర్ఎస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా సాగిందన్నారు. దళితులకు 3ఎకరాల భూపంపిణీ, డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాలు జిల్లాలో ఇప్పటి వరకు మొదలు కాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని ఆరోపించారు. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, మండల కార్యదర్శి బచ్చనగోని గాలయ్య, నెల్లికంటి సత్యం, కె.లింగయ్య, వీరమళ్ల యాదయ్య, దుబ్బాక భాస్కర్, ఎర్ర మల్లేష్, సుజాత, ఎంఏ.హమీద్, మంచాల సైదులు, లోడె యాదయ్య, కలకొండ సంజీవ తదితరులున్నారు. -
ఓబీసీ సాధన కోసం ఆరె కులస్తులు ఉద్యమించాలి
ఖిలా వరంగల్ : ఆరె కులస్తులను ఓ బీసీల్లో చేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమించాలని ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర ఆధ్యక్షుడు సోమిడి అంజన్రావు పిలుపునిచ్చారు. వరంగల్ శివనగర్లోని ఫెర్టిలైజర్ అసోసియేషన్ భవనంలో జిల్లా ఆధ్యక్షుడు హింగ్లీ శివాజీ ఆధ్యక్షతన ఆరె సంక్షేమ సంఘం జిల్లా కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో అంజన్రావు ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ రాష్ట్రంలో నివస్తున్న ఆరె కులస్తులు ఓబీసీ జాబితాలో లేకపోవడంతో యువత విద్య, ఉ ద్యోగ, ఉపాధి రంగాలతో పాటు నష్టపోవడమే కాకుండా సంక్షేమ పథకాలు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల 86 కులాలను ఓబీసీల్లో చేర్చినా ఆరె కులస్తులకు చోటు దక్కడం గర్హనీయమన్నారు. ఈ మేరకు ఆరె కులస్తులంతా ఏకతాటిపైకి వచ్చి దశల వారీగా ఉద్యమాలు చేపట్టాలని కోరారు. సమావేశంలో బలేరావు మనోహర్రావు, డాక్టర్ సిందె రాంనర్స య్య, ఓండా రాజేష్, గుండెకారి రంగారావు, మాసంపెల్లి లింగాజీ, గుండెకారి రవికుమారి, రఘుపతి, సోమిడి శ్రీనివాస్, జులమేటి రాజు, దామెరగిద్ద ప్రభాకర్, పగిడే సాంబరావు, వీర న్న, దౌలత్బాజీ యుగేందర్ పాల్గొన్నారు. -
లోక్సత్తా పార్టీ రద్దు కాలేదు
దేవీచౌక్ (రాజమహేంద్రవరం) : రానున్న ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయరాదని మాత్రమే లోక్సత్తా పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుందని, దీని అర్ధం పార్టీ రద్దయినట్టు కాదని లోక్సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర కన్వీనర్ బండారులంక రామ్మోహనరావు తెలిపారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇకపై లోక్సత్తా ఉద్యమ సంస్థ ద్వారా పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళతామని పేర్కొన్నారు. పార్టీ అంశాలపై వివిధ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేస్తామని వివరించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఎంవీ రాజగోపాల్, ఎన్ఎస్ రామచంద్రమూర్తి, బి.శ్రీనివాస్, సీఎస్ కామేశ్వరరావు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
యాదాద్రి జిల్లా సాధించే వరకు ఉద్యమం
యాదగిరిగుట్ట : భువనగిరి కేంద్రంగా యాదాద్రిని జిల్లాగా ప్రకటించే వరకు ఉద్యమం చేస్తామని టీడీపీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. జిల్లా సాధన కోసం సీపీఐ, బీజేపీలతో కలిసి చేపట్టిన ప్రజాభిప్రాయ సంతకాల సేకరణ కార్యక్రమం ముగింపు సందర్భంగా యాదగిరిగుట్టలోని శ్రీనృసింహుడి వైకుంఠద్వారం వద్ద పోస్టుకార్టులకు పూజలు చేసి, తపాల కార్యాలయం ద్వారా సీఎం క్యాంప్ కార్యాలయానికి పంపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రిని జిల్లాగా ప్రకటించనుండడం హర్షణీయమన్నారు. ఆలేరు నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండాలంటే గోదావరి జలాలే శరణ్యమని, ఈ జలాలు ఈ ప్రాంతానికి ఇవ్వాలనే రెండవ డిమాండ్తో సైతం పోస్టుకార్డుల్లో రాసినట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గోద శ్రీరాములు, తెలుగు మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, ముంకుదరెడ్డి, పల్లెపాటి బాలయ్య, దడిగె ఇస్తారి, ఆకుల రాజేష్, బొలగాని సత్యనారాయణ, గుంటి మధుసూదన్రెడ్డి, జిల్లా భిక్షపతి, ఆరె రాములు, అమరేందర్రెడ్డి, గొట్టిపర్తి శ్రీనివాస్గౌడ్, అమరేందర్, సీత నారాయణ, మోత్కుపల్లి రఘు, ఆంజనేయులు, పోశంరెడ్డి, సుధాకర్రెడ్డి, బాల్రెడ్డి, పద్మనాభం, పూర్ణచందర్ రాజు తదితరులున్నారు. -
తొలిదశ ఉద్యమమే కీలకం
నల్లగొండ కల్చరల్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో 1969లో నిర్వహించిన ఉద్యమమే కీలకమైందని 69 తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చక్రహరి రామరాజు, మారం సంతోష్రెడ్డి అన్నారు. గురువారం స్థానిక పెన్షనర్స్ భవన్లో నిర్వహించిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 2004 నుంచి మొదలైన తెలంగాణ మలి విడత ఉద్యమానికి 69 ఉద్యమమే స్ఫూర్తిదాయకమన్నారు. అప్పటి ఉద్యమకారులను తెలంగాణ ప్రభుత్వం సముచితంగా గౌరవించడం లేదని, వారందరిని గుర్తించి వెంటనే వారికి గుర్తింపు కార్డులను ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమానికి సంఘం జిల్లా అధ్యక్షుడు పోతుల మల్లయ్య అధ్యక్షత వహించగా జిల్లా ప్రధాన కార్యదర్శి నీలకంఠం చలమంద, ఏళ్ల చంద్రారెడ్డి, కంది సూర్యనారాయణ, లక్ష్మారెడ్డి, మనోహర్రావు, టి.సుజాత, ఎ.జయమ్మ, సీతారాంరెడ్డి, వెంకటయ్య, కాశయ్య, హమీద్ఖాన్, సురేష్, లక్ష్మయ్య, ముస్తఫా, రాములు, సత్యనారాయణ, సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు శ్రీహరి పాల్గొన్నారు. -
బీసీ బిల్లు కోసం దశలవారీ ఉద్యమం
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి బీసీ, కులసంఘాల విస్తృతస్థాయి సమావేశం డిమాండ్ ఈ నెల మూడోవారంలో ఇందిరాపార్కు వద్ద మహాభేరి హైదరాబాద్: బీసీ బిల్లు కోసం బీసీ, కుల సంఘాలు ఏకమయ్యాయి. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. పార్లమెంట్లో బిల్లు పెట్టాలని, రాష్ట్రంలో బీసీ కులాల ఫెడరేషన్లకు నిధులు కేటాయించాలని, దశలవారీగా ఉద్యమించాలని నిర్ణయించాయి. ఈ మేరకు బుధవారం ఇక్కడ జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు, బీసీ, కుల సంఘాలు పాల్గొన్నాయి. బీసీల్లోని కులానికి ఒకటి చొప్పున రెసిడెన్షియల్ స్కూలు ఏర్పాటు చేయాలని, ర్యాంకులతో నిమిత్తం లేకుండా బీసీ విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేయాలని, అత్యంత వెనుకబడిన, సంచారజాతులకు రూ. వెయ్యి కోట్లు కేటాయించాలని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మాదిరిగా బీసీలకు పారిశ్రామిక విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఈ నెల 7న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా పార్లమెంట్లో బీసీ బిల్లు, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు, కేంద్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.50 వేల కోట్ల కేటాయింపు, జాతీయ బీసీ కమిషన్కు చట్టబద్ధత తదితర డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తె చ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ అఖిలపక్ష బృందాన్ని, బీసీ సంఘాల ప్రతినిధులను ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేసింది. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, సీపీఐ నేత టి.వెంకట్రాములు, టీటీడీపీ నేత బుచ్చిలింగం, బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, గంగపుత్ర సంఘం నేత ఏఎల్ మల్లయ్య, విశ్వబ్రాహ్మణ సంఘం నేత గణేష్చారితోపాటు 70 కుల సంఘాలు, 30 బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. డిమాండ ్ల సాధనకు ఈ నెల మూడోవారంలో ఇందిరాపార్కు వద్ద బీసీల మహాభేరి నిర్వహించాలని, వచ్చే నెలలో కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాలను ముట్టడించాలని తీర్మానించారు. పోరాడే సమయం: కృష్ణయ్య బీసీలుగా వాటాల కోసం పోరాడే సమయం ఆసన్నమైందని ఆర్.కృష్ణయ్య అన్నారు. డిమాండ్ల సాధనకు దశలవారీగా ఉద్యమించాలని, అంతిమంగా రాష్ర్టబంద్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. బీసీ ఫెడరేషన్లవారీగా కాకుండా 80 శాతం సబ్సిడీతో వ్యక్తిగత రుణాలివ్వాలని, బీసీలకు 500 రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. -
ఉద్యమంలా హరితహారం
♦ నాటిన మొక్కలకు రక్షణగా ముళ్ల కంప నాటండి ♦ మానవాళికి చెట్లు ఎంతో అవసరం ♦ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ధారూరు: రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతుందని, నాటిన ప్రతి మొక్కకు రక్షణగా ముళ్ల కంపను ఏర్పాటు చేయాలని జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి అన్నారు. ధారూరు మండలంలోని జైదుపల్లి అడవిలో జిల్లా అటవీశాఖ అధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన చెట్లు నాటే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మొక్కలను నాటి నీరు పోశారు. అనంతరం జైదుపల్లి సర్పంచు తాళ్లపల్లి సంతోష అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మానవత్వం లేకుండా చెట్లను నరికివేస్తున్నారని, ఒక చెట్టు నరికితే 10 చెట్లను నాటి పెంచాలని సూచించారు. చెట్ల తరుగుదల వల్ల వాతావరణ కాలుష్యం పెరిగి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు చెట్లు లేక వాతావరణ సమతుల్యం దెబ్బతిని వర్షాలు కురువకపోవడంతో వ్యవసాయం కుంటుపడుతుందని జెడ్పీ చైర్పర్సన్ అన్నారు. వర్షాలు లేక జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండక రైతులతో పాటు ప్రజలు, పశువులు, జంతువులు నీటి కోసం అలమటిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతగిరిగుట్ట అడవులు అందంగా ఉన్నాయని, ఇక్కడ సినిమా షూటింగ్లు నిరంతరం జరుగుతున్నాయంటే చెట్లు ఉండటమే కారణమని అన్నారు. ఇక్కడి అడవుల్లో వివిధ రకాల పూలమొక్కలను నాటాలని పర్యాటక ప్రాంతంగా ఆకర్షించబడుతుందని సునీతారెడ్డి అన్నారు. అడవుల్లో పండ్ల మొక్కలు కూడా నాటించాలని ఆమె హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డివిజన్ ఫారెస్టు అధికారి శ్రీనివాస్కు సూచించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే బి. సంజీవరావు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డివిజన్ ఫారెస్టు అధికారి శ్రీనివాస్, జిల్లా సోషల్ ఫారెస్టు అధికారి నాగభూషణం, సబ్ డీఎఫ్ఓ రేఖాభాను, ఫారెస్టు రేంజర్ నర్సింగ్రావు, డిప్యూటీ ఫారెస్టు రేంజర్ యూసూఫ్పాష, జైదేపల్లి, తరిగోపుల గ్రామాల సర్పంచులు టి.సంతోష, రవికుమార్, ఎంపీపీ ఉమాపార్వతి, ధారూరు పీఏసీఎస్, మార్కెట్ కమిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు హన్మంత్రెడ్డి, రాజునాయక్, వేణుగోపాల్రెడ్డి, సంతోష్కుమార్, వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, జైదుపల్లి ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మమ్మ, మాజీ ఎంపీపీ నర్సింహారెడ్డి, కోఆప్షన్ సభ్యుడు హఫీజ్, టీఆర్ఎస్ నాయకులు శుభప్రదపటేల్, భీంసేన్చారి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమానికి తాత్కాలిక విరామం
-
ఉద్యమానికి తాత్కాలిక విరామం
29 నుంచి విధుల్లో చేరతామని తెలంగాణ న్యాయవాదుల ప్రకటన హైకోర్టు ఏర్పాటుపై ప్రధాని, సీజేఐ హామీని విశ్వసిస్తున్నట్టు వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు తెలంగాణ న్యాయవాదులు చేపట్టిన ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు. హైకోర్టు ఏర్పాటు చేయడంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన హామీని, అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హామీని విశ్వసించి ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ నెల 29న విధుల్లో చేరుతున్నామని తెలంగాణ న్యాయవాదులు మంగళవారం ఏపీ భవన్లో మీడియాకు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల ముగింపులోపు హైకోర్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. అప్పటికీ కాకుంటే మరోసారి ఉద్యమిస్తామని హెచ్చరించారు. హైకోర్టు విభజన కోరుతూ తెలంగాణ న్యాయవాదులు సోమవారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద మహాధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ సంఘాలు, టీఆర్ఎస్ ఎంపీలతో చర్చించిన తరువాత ఉద్యమానికి తాత్కాలిక విరామం ఇస్తున్నట్టు న్యాయవాదులు ప్రకటించారు. హైకోర్టు తప్పక ఏర్పాటవుతుంది: ఎంపీ సీతారాం నాయక్ ప్రత్యేక హైకోర్టు కోసం ఉద్యమించిన తెలంగాణ న్యాయవాదులు ప్రధాని మోదీ, సీజేఐ హామీలతో ఉద్యమాన్ని విరమించడం అభినందనీయమని ఎంపీ సీతారాం నాయక్ కొనియాడారు. హైకోర్టు ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, తెలంగాణ హైకోర్టు కచ్చితంగా ఏర్పాటవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై అన్ని రకాలుగా ఒత్తిడి తెస్తోందన్నారు. బంజారాల పెద్ద పండుగైన తీజ్ను ఢిల్లీలో జరపడానికి స్థానికంగా ఉంటున్న బంజారా సోదరులు డా.రవి, డా.ఆర్య ముందుకు రావడం ఆహ్వానించదగిందన్నారు. విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్, వరంగల్ జిల్లా పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు శ్రీధర్రావ్ తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్ల కోసం ఉద్యమం
ఆదిలాబాద్ రిమ్స్ : రిజనులకు పది శాతం నిరజ్వేషన్లు కల్పించాలని ఉద్యమాలకు సిద్ధం కావాలని గిరిజన రిజర్వేషన్ సాధన సమితి జిల్లా అధ్యక్షుడు పెందూర్ ప్రబాకర్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రింట్మీడియ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. కనీసం గిరజన జనాభా నిష్పత్తి ప్రకారం 10 శాతం రిజ్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల కోసం ఈనెల 25న కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ ధర్నాకు 12 తెగలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో సమితి జిల్లా చెర్మైన్ మడావిరాజు, ప్రధాన కార్యదర్శి బానోవత్ రామరావు, ఉపాధ్యక్షుడు కడిమెతతిరుపతి, సభ్యులు కుర్సెంగ సూర్యబాను, జోడిదివాకర్, తుకారం, తానాజీలు ఉన్నారు. -
కల్లుతాగి వ్యక్తి మృతి
♦ కల్తీ కల్లే కారణమని బంధువుల ఆందోళన ♦ కల్లు కంపౌండ్ ధ్వంసం, మృతదేహంతో రాస్తారోకో ♦ పోలీసుల జోక్యంతో శాంతించిన కుటుంబసభ్యులు వికారాబాద్ రూరల్ : కల్లుతాగి కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడి కుటుంబీకులు ఆగ్రహంతో కల్లు కంపౌండ్ ధ్వంసం చేసి మృతదేహంతో రాస్తారోకో నిర్వహించారు. ఈ సంఘటన వికారాబాద్ మున్సిపల్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు.. మున్సిపల్ పరిధిలోని కొత్తగడి గ్రామానికి చెందిన నూరోద్దీన్(30) శుక్రవారం ఉదయం సమీపంలోని కంపౌండ్లో కల్లు తాగి బయటకు వచ్చి కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించే యత్నం చేయగా అంతలోనే మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన మృతుడి కుటుంబీకులు, స్థానికులు కల్లు కంపౌండ్ను ధ్వంసం చేశారు. కల్లు సీసాలు పగులగొట్టారు. కల్తీకల్లుతోనే నూరోద్దీన్ మృతిచెందాడని మండిపడ్డారు. మృతదేహంతో వికారాబాద్-సదాశివపేట రో డ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. సుమారు రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు సముదాయించినా ఆందోళనకారులు వినిపించుకోలేదు. న్యాయం జరిగేలా చూస్తామని సీఐ రవి వారికి సర్దిచెప్పారు. దీంతో మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికుల ఇబ్బందులు రాస్తారోకోతో దాదాపు రెండు గంటల పాటు వాహనాలు పూర్తిగా స్తంభించిపోయాయి. సుమారు 2 కిలో మీటర్ల మేర నిలిచిపోయాయి. ఈ రహదారి వికారాబాద్, సదాశివపేటకు ప్రధాన రహదారి కావడం మరో దారి వెళ్లడానికి లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ను పునరుద్ధరించారు. -
అన్నదాత కన్నెర్ర
♦ రుణమాఫీ కావడం లేదంటూ తాండూరులో ఆందోళన ♦ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన రైతులు ♦ బ్యాంకు భవనంపై నుంచి ఆత్మహత్యాయత్నం చేసిన రైతు ♦ రాస్తారోకోతో తీవ్ర ఉద్రిక్తత, భారీగా స్తంభించిన ట్రాఫిక్ తాండూరు: పంట రుణమాఫీ వర్తించడంలేదని, కొత్తగా బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదని ఆగ్రహించిన రైతులు మంగళవారం తాండూరులో ఆందోళనకు దిగారు. పంటల సాగుకు ప్రైవేట్గా అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, కలెక్టర్, సబ్ కలెక్టర్, తహసీల్దార్, ఎంపీడీఓలకు ఎన్ని సార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం ఉండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తాండూరులోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఎదురుగా తాండూరు -కోడంగల్ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో తాండూరు -కోడంగల్ మార్గంలో ఐదు కి.మీ. మేరకు వాహనాలు నిలిచిపోయాయి. సీఐతో వాగ్వాదం రాస్తారోకో విరమించాలని తాండూరు అర్బన్ సీఐ వెంకట్రామయ్య ఆందోళనకారులను కోరినా ససేమిరా అన్నారు. సబ్ కలెక్టర్ వచ్చి హామీ ఇస్తేనే విరమిస్తామని తేల్చిచెప్పారు. నాయకులను అక్కడి నుంచి బలవంతంగా తరలించేందుకు సీఐ సిబ్బందితో ప్రయత్నించగా తీవ్ర వాగ్వాదం జరిగింది. డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి రోడ్డుమీద పడుకున్నారు. పోలీసులు డౌన్ డౌన్, సీఎం డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. పుల్స్టాప్కు బదులు కామతో సమస్య కంప్యూటర్లో లక్ష తరువాత పుల్స్టాప్కు బదులు కామ పెట్టడం రుణమాఫీ వర్తించకపోవడానికి కారణమని బ్యాంకు అధికారులు చెబుతున్నారని రైతులు వివరించారు. ఈ సాంకేతిక కారణం వల్లే విడతలవారీగా రుణం అందలేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్ద ఫైల్ పరిశీలనతో ఉందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఆందోళనలో కాంగ్రెస్ నాయకులు రమేష్, లక్ష్మారెడ్డి, నరేష్, ధారాసింగ్, అపూ, సీసీఐ రాములు, పట్లోళ్ల నర్సింహులు, సునీత, శ్రీనివాసాచారి, హేమంత్, రాజారత్నం, రాజ్కుమార్, ఎం.శ్రీనివాస్, సీ.మల్లికార్జున్, లింగదళ్లి రవి, సంతోష్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. రైతు ఆత్మహత్యాయత్నం.. పెద్దేముల్ మండలం హన్మాపూర్ గ్రామానికి చెందిన రైతు సాయప్ప ఆందోళన చేస్తున్న ప్రాంతం నుంచి సమీపంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు భవనం మీదకు వెళ్లి దూకే ప్రయత్నం చేశాడు. రైతులు, నాయకులు సర్ధిచెప్పి కిందకు దించారు. స్థానిక సీఐ సూచన మేరకు తాండూరు తహసీల్దార్ రవీందర్తో రైతుల వద్దకు వచ్చి మాట్లాడారు. అనంతరం తహసీల్దార్ సబ్ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. చివరకు 15 రోజుల్లో సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో నాయకులు రాస్తారోకో విరమించారు. -
ఉద్యమంలా హరితం
♦ 11న పెద్దఎత్తున మొక్కలు నాటాలని ♦ కలెక్టర్ రఘునందన్రావు ఆదేశం ♦ 11న పెద్దఎత్తున మొక్కలు నాటాలని ఆదేశం ♦ మండలాల్లో హరితహారం బాధ్యత ఎంపీడీఓలకు అప్పగింత ♦ ప్రత్యేకాధికారుల సమావేశంలో కలెక్టర్ రఘునందన్రావు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లాలో హరితహారం ఉద్యమంలా నిర్వహించాలని కలెక్టర్ రఘునందన్రావు పిలుపునిచ్చారు. ఈ నెల 11న పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. శనివారం కలెక్టరేట్లో మండలాల ప్రత్యేకాధికారులతో ‘హరితహారం’ కా ర్యక్రమంపై చర్చించారు.మహోద్యమంలా సాగే ఈ కార్యక్రమంలో అన్నివర్గాల ప్రజలను భాగస్వామ్యులను చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, పారిశ్రామిక వాడలు, రోడ్లకు ఇరువైపులా ఖాళీ స్థలాల్లో.. మిషన్ కాకతీయ చెరువుగట్లపైనా మొక్కలు నాటడానికి వీలుగా ముందుగానే గుంతలు తీసి సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో హరితహారం కొనసాగాలని చెప్పారు. గుంతలు తీయడం మొద లు, మొక్కలు నాటడం, వాటి సంరక్షణకు బా ధ్యులను నియమించాలని ఆదేశించారు. మం డల స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమానికి స్థానిక ఎంపీడీఓలను బాధ్యులను చేయాలని జెడ్పీ సీఈఓ రమణారెడ్డికి స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో మొ క్కలు నాటే బాధ్యత డీ ఈఓకు అప్పగించారు. రైతులకు సంబంధించి ఆధార్ సీడింగ్ ప్రక్రియను వేగిరం చేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కాట ఆమ్రపాలి, సబ్కలెక్టర్ శ్రుతి ఓజా, అసిస్టెంట్ కలెక్టర్ పమేలా సత్పతి తదితరులు పాల్గొన్నారు. -
సర్కారుపై సమరం
♦ టీపీసీసీ సమన్వయ కమిటీ, విస్తృతస్థాయి భేటీలో నిర్ణయం ♦ హామీల అమలు కోసం క్షేత్ర స్థాయిలో ఉద్యమం ♦ టీపీసీసీ నేతలకు పని విభజన.. శిక్షణా శిబిరాలు ♦ మరింత క్రియాశీలకంగా క్రమశిక్షణా సంఘం సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలు కోసం క్షేత్రస్థాయిలో ఉద్యమం చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) నిర్ణయించింది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే దాకా గాంధీభవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం, సమన్వయ కమిటీ భేటీ జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్సింగ్, కార్యదర్శి ఆర్.సి.కుంతియా, ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ అలీ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ, పార్టీ సంస్థాగత నిర్మాణం, జిల్లాల వారీగా పని విభజన, ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు, హామీల అమలు కోసం క్షేత్రస్థాయిలో చేయాల్సి పోరాటాలు వంటి వాటిపై సమావేశంలో సుదీర్ఘం గా చర్చించారు. ఇందులో తీసుకున్న నిర్ణయాలను టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి మీడియాకు వివరించారు. జిల్లాకు ఒక ఉపాధ్యక్షుడు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తారని చెప్పా రు. గ్రామస్థాయి నుంచి పార్టీ కమిటీల పునర్వ్యవస్థీకరణ, టీఆర్ఎస్ హామీల అమలుపై పోరాటాల పర్యవేక్షణ, పార్టీ వ్యవహారాలకు వీరు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తారన్నారు. పార్టీ శ్రేణులకు శిక్షణా శిబిరాలు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయిదాకా పార్టీ శ్రేణులకు శిక్షణ శిబిరాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టుగాా ఉత్తమ్ వెల్లడించారు. కాంగ్రెస్ చరిత్ర, దేశ నిర్మాణంలో పార్టీ పాత్ర, వర్తమాన రాజకీయ పరిణామాలు, పార్టీ వైఖరి వంటి వాటిపై ఈ శిక్షణ శిబిరాల్లో అవగాహన కల్పిస్తామని వివరించారు. టీపీసీసీ క్రమశిక్షణా సంఘం పాత్రను మరింత క్రియాశీలకంగా, కఠినంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టుగా చెప్పారు. రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితులున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ైరె తుల సమస్యలపై క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికార టీఆర్ఎస్కు అనుకూలంగా, కాంగ్రెస్కు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న నమస్తే తెలంగాణ, టీ న్యూస్ చానెల్ను బహిష్కరించాలని నిర్ణయించినట్టుగా ఉత్తమ్ తెలిపారు. ఇకపై వాటిలో వచ్చే కథనాలను కాంగ్రెస్ శ్రేణులు పట్టించుకోవద్దని సూచిం చారు. ఆ వార్తాసంస్థలతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని పేర్కొన్నారు. ఎంత పెద్దవారైనా రీఎంట్రీకి నో అధికారం ఉన్నంతకాలం పెద్దపెద్ద పదవులను అనుభవించి, అధికారం పోగానే కాంగ్రెస్ను వీడి వెళ్లిపోయిన నాయకులను తిరిగి రానివ్వొద్దని పలువురు నాయకులు ఈ సమావేశంలో సూచించారు. పార్టీని వీడిన వారు ఎంత పెద్దవారైనా పార్టీలోకి తిరిగి తీసుకోవద్దని కోరారు. పార్టీలోనే ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేవారిపై వెంటనే క్రమశిక్షణా చర్యలను తీసుకోవాలన్నారు. భూసేకరణ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై పోరాటం చేయాలని, డబుల్బెడ్ రూమ్ ఇళ్లు, రైతులకు రుణమాఫీ, దళితులకు మూడెకరాల భూమి, కరువు విషయంలో ప్రజల కష్టాలపైనా నిలదీయాలని పలువురు నేతలు సూచించారు. -
తెలంగాణ లాయర్ల ‘ఉద్యమ’ బాట!
చిచ్చు రేపిన న్యాయాధికారుల కేటాయింపులు సాక్షి, హైదరాబాద్: న్యాయాధికారుల విభజనపై మరో ఉద్యమానికి తెలంగాణ న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. తెలంగాణ న్యాయాధికారులు ఇందుకు పరోక్షంగా మద్దతిస్తున్నారు. భావి కార్యాచరణ కోసం తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అత్యవసర కార్యవర్గ సమావేశం గురువారం జరగనుంది. జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్షులతో తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కూడా శనివారం భేటీ జరపనుంది. తెలంగాణ న్యాయాధికారులు కూడా ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. న్యాయాధికారుల విభజనకు మార్గదర్శకాలు రూపొందించిన హైకోర్టు, కేటాయింపులను మాత్రం వాటికి విరుద్ధంగా చేసిందంటూ లాయర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన వారిలో 141 మంది ఏపీ చెందిన న్యాయాధికారులున్నారని తెలిసి కూడా హైకోర్టు ప్రాథమిక జాబితాను విడుదల చేసిందని, ఇది సరికాదన్నారు. కేటాయింపుల్లో అన్యాయంపై అంతా కలిసి తమ వాదనలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ‘‘ఈ కేటాయింపులను ఆమోదిస్తే వచ్చే రెండేళ్లల్లో ఏపీలో భారీగా ఖాళీలు ఏర్పడతాయి గానీ తెలంగాణలో మాత్రం అందుకు ఆస్కారముండదు. తెలంగాణ న్యాయాధికారులకు పదోన్నతుల్లోనూ తీరని అన్యాయం జరుగుతుంది. న్యాయం జరిగేదాకా దీనిపై పోరాటం చేస్తాం’’ అని వారంటున్నారు. -
మరో ఉద్యమం చేపడుతాం..
హన్మకొండ : సీమాంధ్ర ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమ తరహాలో మరో ఉద్యమాన్ని చేపట్టాల్సి వస్తుందని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల అసోసియేషన్ల జేఏసీ ఎన్పీడీసీఎల్ కంపెనీ పరిధి కన్వీనర్ బి.సామ్యానాయక్ హెచ్చరించారు. సీమాంధ్ర ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవద్దని, వారిని ఆంధ్రప్రదేశ్కు తిరిగి పంపాలనే డిమాండ్తో తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల అసోసియేషన్ల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం హన్మకొండలోని విద్యుత్ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాలో సామ్యానాయక్ మాట్లాడుతూ సీమాధ్ర ఉద్యోగులు ఇక్కడ విధుల్లో చేరితే ఎలా అడ్డుకోవాలో తెలుసునన్నారు. ధర్నాలో ఎన్పీడీసీఎల్ సీఈలు సదర్లాల్, వేణుగోపాలచారి, మోహన్రావు, రామకృష్ణ, అశోక్కుమార్, ఎస్ఈలు మధుసూదన్, రాజేష్చౌహాన్, నారాయణ, ఇంజనీర్ల జేఏసీ నా యకులు సుభ్రమణ్యేశ్వర్రావు, తిరుమల్రావు, మల్లయ్య, రణధీర్రెడ్డి, బి. కిశోర్, సురేష్, ప్రభావతి, జమున, రాంబాబు, కిరణ్ పాల్గొన్నారు. -
కేసీఆర్ ‘ఉద్యమం’పై పుస్తకం
సీఎంకు బహూకరించిన రచయిత రాంజీ సింహ సాక్షి, హైదరాబాద్: తెలుగులోకి అనువదించిన హిందీ రచన ‘తెలంగాణ ఆందోళన-గాంధీవాదం పునఃస్థాపన’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు ఆ పుస్తక రచయిత రాంజీ సింహ ఉదయన్ గురువారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. వారణాసికి చెందిన రాంజీ తెలంగాణ ఉద్యమం సమయంలో హిందీ మిలాప్ దినపత్రికకు హైదరాబాద్ చీఫ్ ఎడిటర్గా పనిచేశారు. ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ నడిపించిన తీరు, కేసీఆర్ ఆమరణ దీక్ష, తదనంతర పరిణామాలు, రాష్ట్ర ఏర్పాట్లను సునిశితంగా పరిశీలించాక ఈ పుస్తకాన్ని రచించినట్లు రాంజీ తెలిపారు. గాంధేయమార్గంలో శాంతియుతంగా నడిచిన తెలంగాణ ఉద్యమం దేశంలో గాంధీవాదాన్ని తిరిగి స్థాపించిందని పేర్కొన్నారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించగా కేసీఆర్ అంగీకరించారు. -
తెరిపించాలి
♦ నిజాం షుగర్స్ను స్వాధీనం చేసుకోవాలి ♦ వేతన బకాయిలు చెల్లించాలి ♦ లేకపోతే ఉద్యమం ఉధృతం ♦ కార్మిక కుటుంబాల ఆందోళన బాట ♦ నేడు రోడ్డు దిగ్బంధం ఎన్డీఎస్ఎల్ లే ఆఫ్ ఎత్తివేసి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలనీ, ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని పూర్వవైభవం తెస్తామన్న సీఎం కేసీఆర్ హామీ నెరవేర్చాలన్న ప్రధాన డిమాండ్లతో నిజాంషుగర్స్ రక్షణ కమిటీ చేపట్టిన ఉద్యమం ఉధృతమవుతోంది. తొమ్మిది నెలల క్రితం తెలంగాణ ప్రజాఫ్రంట్, తొమ్మిది వామపక్ష పార్టీలు కలిసి నిజాంషుగర్స్ రక్షణ కమిటీని ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్, బీజేపీ, శివసేన, టీడీపీలు మద్దతు పలికాయి. ఫ్యాక్టరీ రక్షణ కోసం కొన్ని నెలల నుంచి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అఖిల పక్షం అధ్వర్యంలో శనివారం బోధన్ మండలం సాలూర వద్ద అంతర్రాష్ట్ర రహదారిని దిగ్బంధం చేయనున్నారు. బోధన్ : 2015-16 క్రషింగ్ సీజన్ను నవంబర్, డిసెంబర్ మాసాల్లో ప్రారంభించాల్సి ఉండగా ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం చేతులెత్తేసింది, ప్రభుత్వం ఫ్యాక్టరీ నిర్వహణ బాధ్యతలు తీసుకునేందుకు వెనుకంజ వేసింది. బోధన్లోని శక్కర్నగర్, ముత్యంపేట (కరీంనగర్) ముంజోజిపల్లి (మెదక్) ఫ్యాక్టరీల పరిధిలోని చెరకును ప్రైవేట్ చక్కెర ఫ్యాక్టరీలకు మళించారు. ముడిసరుకు కొరత సాకు చూపి ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం 2015 డిసెంబర్ 23న లేఆఫ్ నోటీసు జారీ చేసి ఫ్యాక్టరీలను తాత్కాలికంగా మూసివేసింది. దీంతో మూడు యూనిట్ల పరిధిలోని కార్మికులు ఉపాధి కోల్పో యి రోడ్డున పడ్డారు. అప్పటి నుంచి కార్మికులు ఆందోళన బాటపట్టారు. కార్మికుల ఆందోళనకు నిజాంషుగర్స్ రక్షణ కమిటీ అండగా నిలిచింది. నిజాంషుగర్స్ రక్షణ కమిటీ, ఎన్డీఎస్ఎల్ కార్మిక సంఘాలు ఐక్యతతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్డీఎస్ఎల్ లేఆఫ్ ప్రకటించి మూడు నెలలు కావస్తున్నా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంలో జాప్యం చేస్తోంది. దీంతో కార్మికులు, రైతుల్లో ప్రభుత్వం పై అసహనం, ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఎన్నికల సమయంలో ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని ప్రస్తావిస్తూ.. ఫ్యాక్టరీ భవిష్యత్తు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లు పూర్తి కావస్తున్నా నిజాంషుగర్స్ స్వాధీనం పై ప్రభుత్వం విధాన పరమైన సానుకూల నిర్ణయం తీసుకోకుండా కమిటీల అధ్యయనం పేరుతో కాలయాపన చేస్తోందని అఖిల పక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. 129 రోజులుగా రిలే నిరహార దీక్షలు నిజాంషుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడుపాలని ప్రధాన డిమాండ్తో ఏర్పడిన నిజాంషుగర్స్ రక్షణ కమిటీ ఒక వైపు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు, సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తునే, మరో వైపు రిలే నిరహార దీక్ష శిబిరాన్ని కొనసాగిస్తోంది. 2015 నవంబర్ 18 పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రిలే నిరహార దీక్షను ప్రారంభించా రు. అప్పటి నుంచి ఫ్యాక్టరీ కార్మికులు, రైతులు, వామపక్ష పార్టీలు, రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల ప్రతినిధులు వంతుల వారీగా రిలే నిరహార దీక్షలో కూర్చుంటున్నారు. శుక్రవారం నాటికి రిలే నిరహార దీక్షలు 129 రోజులు పూర్తికాగా.. కార్మికుల కుటుంబాలు పిల్లాపాపలతో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం ప్రకటించే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని రక్షణ కమిటీ సంకల్పంతో ముందుకెళ్తోంది. సాలూర వద్ద అంతర్రాష్ట్ర రోడ్డు దిగ్బంధం కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని నిజాంషుగర్స్ రక్షణ కమిటీ కన్వీనర్ రాఘవులు కోరారు. -
సామాజిక తెలంగాణ కోసం మరో ఉద్యమం
♦ ఈ నెల 13న హైదరాబాద్లో సదస్సు ♦ ప్రొఫెసర్ ప్రభంజన్యాదవ్ తెయూ(డిచ్పల్లి): సామాజిక తెలంగాణ కోసం బహుజనులు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని సామాజిక తెలంగాణ సాధన సమితి కన్వీనర్ ప్రొఫెసర్ ప్రభంజన్యాదవ్ పిలుపునిచ్చారు. గురువా రం తెలంగాణ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం లో కూడా బహుజనులకు సమన్యాయం దక్కడం లేదన్నా రు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో త్యాగాలు బహుజను లు చేస్తే, బహుకొద్ది మంది మాత్రమే దాని ఫలాలు అనుభవిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా అధికారంలోని ఉన్నవాళ్లు వ్యవహరిస్తు న్నారని అన్నారు. తెలంగాణలో 60 శాతం ఉన్న బీసీలకు సరైన ప్రాతినిధ్యం లభించలేదన్నారు. ఒకటి, రెండు అగ్ర కులాలే లెక్కకు మించి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఉన్నారని అన్నారు. ఇతర నామినేటెడ్ పోస్టులు, అధికారిక పదవుల్లో సైతం అగ్ర కులాల వారినే నియమిస్తున్నారని ఆరోపించారు. నిజానికి బహుజనులు లేని ఊరు, ఉద్యమం లేదన్నా రు. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నత పదవులన్నీ అగ్రకులాల వారికే అంటగడుతున్నారని అన్నారు. 1600లకు పైగా బహుజన విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేస్తే, మిలియన్ మార్చ్లు, సాగర హారాలు, సకల జనుల సమ్మె చేస్తే స్వరాష్ట్రంలో అధికార బోగాలన్నీ రెండున్నర కులాల వారే అనుభవిస్తున్నారని మండి పడ్డారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం లేక పోవడాన్ని ఆయన తప్పు బట్టారు. ఈ నెల 13న హైదరాబాద్లోని బీసీ సెం టర్లో ‘సామాజిక తెలంగాణ సాధించుకోవడం ఎలా’ అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రభంజన్యాదవ్ తెలిపారు. రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి బహుజన మేథావులు, ఉద్యమకారులు హాజరై ఐక్య కార్యాచరణ రూపొందించాలన్నారు. అనంతరం సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో అధ్యాపకులు దామెర జాన్సన్, ప్రవీణాబాయి, పున్నయ్య, రమణచారి, వెంకటేశ్వర్లు, రాజారాం, విజయలక్ష్మి, దత్తహరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మాతృబాష ఉద్యమానికి YSRCP అండగా ఉంటుంది
-
ఆ మహిళలు.. అసమానతను గెలిచారు..!
వీపుపై వెదురు బుట్టలు కట్టుకొని పచ్చని ప్రకృతి మధ్య టీతోటల్లో ఆకులు తుంచుతూ కనిపించే ఆ మహిళలను చూస్తే మనకు ఎంతో అందంగా కనిపిస్తుంది కదూ.. కానీ వారి జీవితాల్లో బాధలు ఆగాధాల్లా పేరుకొన్నాయి. వారికి అంతులేని వేదనలు మిగులుస్తున్నాయి. అయితే ఏళ్ళదరబడి జీవన పోరాటంలో గెలిచేందుకు వారు చేసిన ప్రయత్నం ఇప్పుడు విజయవంతమైంది. టీ తోటల్లో కనిపించని కష్టాలను గట్టెక్కేందుకు నెరపిన ఉద్యమం ఎందరో మహిళలకు స్ఫూర్తి దాయకంగా మారింది. రాజకీయాలకు అతీతంగా, పురుషుల అండదండలు అవసరం లేకుండా యాజమాన్యాలపై పోరాడి అనుకున్నది సాధించారు. కన్నన్ దేవన్ హిల్స్ టీ తోటల్లోని మహిళలు తమ సత్తా చాటుకున్నారు. కేరళరాష్ట్రం మున్నార్ కొండప్రాంతం టీ తోటల పెంపకానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ పనిచేసే మహిళా కూలీల శ్రమను మాత్రం దశాబ్దాలు గడుస్తున్నా గుర్తించేవారే లేకుండా పోయారు. దీంతో మహిళలంతా ఒక్కటయ్యారు. మేం బుట్టలను వీపుపై కట్టుకొని టీ ఆకులు కోస్తాం.. మీరు ఆ బుట్టల్లోంచి డబ్బు దండుకుంటున్నారు.... అంటూ టీ తోటల్లో మొదలైన మహిళల ఉద్యమం రోడ్డుపైకి చేరింది. కనీసం తమ నిరసనల్లో రాజకీయ నాయకులను, పురుషులను అనుమతించలేదు. ఎటువంటి సంఘాలను జోక్యం చేసుకోనివ్వలేదు. యూనియన్ నాయకులు యాజమాన్యాలతో కుమ్మక్కై వారి బోనస్ ను తగ్గించడాన్ని నిరసించారు. నాలుగు నుంచి ఆరువేల మంది మహిళలు తొమ్మిది రోజులపాటు.. యాజమాన్యాలతో అధిక బోనస్ కోసం పోరాడి చివరికి కేవలం మహిళా శక్తితో గెలుపు సాధించారు. పార్టీలకు ప్రభావితమైన యూనియన్ లీడర్లు, ఆధిక్యం ప్రదర్శించే పురుషులకు దీటుగా... ఉద్యమించిన మహిళా శక్తి నేడు ఈ ప్రాంతంలోని పలు ఎస్టేట్స్ లోని మహిళా కూలీలకు, ఉద్యోగినులకు స్ఫూర్తిగా మారింది. దీంతో వీరంతా ఇప్పుడు వేతనాలకోసం పోరాటాన్ని ప్రారంభించారు. ఒక్క టీ తోటల్లోనే కాదు వరి చేలల్లోనూ, అగరబత్తి, బీడీ రోలింగ్, రొయ్య పొట్టు, పట్టు పురుగు పెంపకం, జీడి గింజల ఫ్యాక్టరీల్లోనూ ఈ మహిళా గళం ప్రతిధ్వనించింది. ఉద్యోగాల్లోనూ, వృత్తుల్లోనూ మహిళలు సమానంగా పనిచేస్తున్నా పురుషులకంటే తక్కువ వేతనాలు ఇవ్వడం, పురుష ఆధిక్యతతో ఉండటం ఎందుకు జరుగుతోందంటూ వీరు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత మున్నార్ మహిళల తిరుగుబాటు ఒక్క వారి సమస్యలు సాధించేందుకే కాదు... ఏకంగా భారత ఆర్థిక వ్యవస్థ పైనే పడనుంది. కులం, రంగు, రాజకీయాలు మొదలైన అనేక వివక్షల్లో మార్పును తెచ్చేందుకు, అందరికీ సమన్యాయం జరిగేందుకు ఉపయోగ పడనుంది. ఇటువంటి స్త్రీ వాద ఉద్యమాలు సమన్యాయం జరిగేందుకు దోహదపడనున్నాయి. ఆర్థిక అసమానతలను తొలగించేందుకూ సహాయపడే అవకాశం ఉంది. ప్రస్తుత మున్నార్ ఉద్యమం ఓ చిన్న నిప్పు రవ్వ అగ్గిని రాజేసినట్లుగా ఇంతింతై.. మొత్తం ప్రపంచాన్ని తాకనుంది. అసురక్షిత కార్మికులు, శ్రామిక ఒప్పందాలు, యజమానుల ద్రోహం, వంటి అనేకమైన ఆర్థిక అంశాలను విమర్శించేందుకు తావునిచ్చింది. అనేక సమస్యలు స్త్రీలు పురుషులకంటే సమర్థవంతంగా నిర్వర్తించగలరని నిరూపించింది. ఇండియా రాజధాని ఢిల్లీలో జరిగిన అభయ అత్యాచార ఘటనలోనూ మహిళా ఉద్యమం తారాస్థాయికి చేరి, ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపింది. అప్పట్లో జరిపిన అతి పెద్ద ఉద్యమం ఏకంగా చట్టాల్లోనే కీలకమైన మార్పును తెచ్చాయి. అనంతర పరిణామంలో ఇటీవల లైంగిక హింసలపై మహిళలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నారు. లైంగిక హింస కేసులు నమోదు చేసేందుకు ధైర్యం చేస్తున్నారు. అదే రీతిన మున్నార్ ఉద్యమం.. ప్రపంచంలోనే మహిళా వివక్షను ప్రశ్నించేందుకు ఓ స్ఫూర్తిగా మారనుంది. -
హోదా కోసం వైఎస్ఆర్సిపి ఉద్యమం ఉధృతం
-
రైవాడ నీటి కోసం మరో ఉద్యమం
శృంగవరపుకోట: రైవాడ నీటి కోసం రైతులు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. రైవాడ నీటిని తమకివ్వాలంటూ 18 ఏళ్ల కిందట రైతులు నిర్వహించిన పోరాటం రాష్ర్టవ్యాప్తంగా సంచలనం సృషించింది. అయితే ఇప్పుడు అదే రైవాడ నీటి కోసం మరో ఉద్యమం ఊరికిపోసుకుంది. 1975లో అప్పటి సీఎం జలగం వె ంగళరావు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, జీఓ నంబర్ 417తో పాత శృంగవరపుకోట తాలూకాకు రెండువేల ఎకరాలు, విశాఖ జిల్లా చోడవరం, వియ్యంపేట తాలూకాలకు నాలుగువేల ఎకరాలకు నీరందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే 14 ఎంజీడీ నీటిని విశాఖపట్నం తరలించాలని ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్ని గతంలో చంద్రబాబు ప్రభుత్వంతుంగలో తొక్కేసింది. జీఓనెం.160తో 27ఎంజీడీ నీటిని ఓపెన్ కెనాల్ ద్వారా విశాఖ పట్టుకుపోతున్నారు. మళ్లీ చంద్రబాబు హాయాంలోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.216 కోట్ల ప్రపంచ బ్యాంక్ నిధులో ఓపెన్ కెనాల్ స్థానంలో పైప్లైన్వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. భగ్గుమంటున్న రైతాంగం రైతుల నోట్లో మట్టికొట్టి రిజర్వాయర్ల నీటి ని దోచుకెళ్లి ప్రభుత్వం యధేచ్ఛగా వ్యాపారం చేసుకుంటోందని వేపాడ, కోటపాడు , దేవరాపల్లి, సబ్బవరం మండలాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లోంచి రైవాడ నీరు వెళ్తున్నా, కాలువ పక్క పొలాలు బీటలు వారి వ్యవసాయంలేక వలసలు పోయే పరిస్థితి ఏర్పడిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్ కెనాల్ స్థానంలో పైప్లైన్ ఏర్పాటు చేసే యోచనను వారు వ్యతిరేకిస్తున్నారు. పంచాయతీ స్థాయి నుంచి మండల, జిల్లా సమావేశాల్లో ప్రబుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించేలా తీర్మానించేందుకు సిద్ధమవుతున్నారు. ఈనేపథ్యలో పైపు లైన్ నిర్మాణం ప్రతిపాదనలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం వేపాడ మండలం నీలకంఠరాజపురం గ్రామసమీపంలో రైవాడ కాలువ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో రైతులు నిరసన తెలిపారు. -
రాజ్యాధికారం కోసం ఐక్య ఉద్యమం: ఆర్. కృష్ణయ్య
నల్లగొండ టౌన్: రాజ్యాధికారంతోనే బీసీల అభివృద్ధి సాధ్యమని, ఆ దిశగా బీసీ కులాలన్నీ ఐక్యం గా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండలో నిర్వహించిన బీసీ సమరభేరి మహాసభలో ఆయన మాట్లాడారు. అన్ని పార్టీలు బీసీలను జెండాలు మోసే కూలీలుగా చూస్తున్నాయని ధ్వజమెత్తారు. బీసీలకు రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వకుంటే మనమే ఒక పార్టీని పెట్టుకొని, వచ్చే ఎన్నికల్లో బీసీలను ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిపించుకోవాలని కోరారు. పార్లమెంట్లో బీసీ బిల్లును పెట్టి చట్టసభల్లో రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 119 ఎమ్మెల్యే స్థానాలకు బీసీలు కేవలం 12 మంది మాత్రమే ఉండడం దారుణమన్నారు. 107 కులాలు నేటికీ అసెంబ్లీ గేటును దాటకపోవడం శోచనీయన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ర్ట అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, జాతీయ సెక్రటరీ జనరల్ కృష్ణమోహన్, నీలం వెంకటేశ్ మాట్లాడారు.