RTC workers
-
‘కోడ్’ ముగిశాక ఆర్టీసీలో సమ్మె
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు సంస్థ యాజమాన్యంపై పోరుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే ఒక కార్మిక జేఏసీ సమ్మె నోటీసు ఇవ్వగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సమ్మె నోటీసు ఇవ్వాలని మరో జేఏసీ తాజాగా నిర్ణయించింది. మొదటి జేఏసీ నిరవధిక సమ్మెకు మొగ్గు చూపుతుండగా, రెండో జేఏసీ మాత్రం ఐదారు రోజులపాటు సమ్మె చేయాలని భావిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసేలోపు తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో సమ్మె అనివార్యమని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. అయితే, కార్మికుల్లో సమ్మెపై ఒకింత భయం కనిపిస్తుండగా, సంఘాల నాయకులు మాత్రం సమ్మెకు సిద్ధమని ప్రకటిస్తున్నారు. ప్రైవేటు సంస్థల పెత్తనంతో..ఇటీవల ఆర్టీసీ పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతోంది. అవన్నీ గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు పద్ధతిలో ప్రైవేటు సంస్థ నుంచి అద్దెకు తీసుకుంటోంది. ఆ బస్సుల నిర్వహణ కోసం కొన్ని డిపోలను సదరు సంస్థకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేయటంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇది ఆర్టీసీలో ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేయటమేనని మండిపడుతున్నారు. దీంతో అధికారులు వెనక్కు తగ్గి డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులతోపాటు సాధారణ సొంత బస్సులు కూడా కొనసాగుతాయని స్పష్టత ఇచ్చారు. అయినా ఉద్యోగుల్లో అనుమానాలు తొలగిపోలేదు. ఈ అంశంతోపాటు చాలా కాలంగా పెండింగులో ఉన్న ఇతర సమస్యలను తెరపైకి తెచ్చి కార్మిక సంఘాలు సమ్మెకు సై అంటున్నాయి. విలీనం, పీఆర్సీనే ప్రధాన ఎజెండాగా..గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించింది. అంతలోనే ప్రభుత్వం మారటంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పెండింగులో పెట్టింది. 2017 వేతన సవరణ బకాయిలు కూడా చెల్లించలేదు. 2021 వేతన సవరణపై ప్రభుత్వం స్పందించటంలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దుచేసిన గుర్తింపు యూనియన్ల పునరుద్ధరణ జరగలేదు. సీసీఎస్, పీఎఫ్లకు భారీగా బకాయిలు పేరుకుపోయాయి. వీటి సాధనే లక్ష్యంగా కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యాయి. ఎవరికి వారే..ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ చీలికవర్గం, బీడబ్ల్యూయూ, బీకేయూ, ఎన్ఎంయూ చీలిక వర్గం, కేపీ సంఘాలతో కూడిన తొలి జేఏసీ గత నెల 27న యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది. ఫిబ్రవరి 3న ఆ యూనియన్ల ప్రతినిధులను కార్మిక శాఖ చర్చలకు పిలిచి, తర్వాత ఎన్నికల కోడ్ కారణం చూపి సమావేశం రద్దు చేసింది. దీంతో, ఎన్నికల నోటిఫికేషన్ నుంచి ఆర్టీసీ సమ్మెకు మినహాయింపు ఇవ్వాలని ఆయా సంఘాల నేతలు ఎన్నికల కమిషనర్కు విన్నవించారు. టీఎంయూ, ఎన్ఎంయూ వర్గాలు, బీఎంఎస్, ఎస్టీ ఎంయూలతో కూడిన మరో జేఏసీ తదుపరి సమావేశం ఏర్పాటు చేసుకుని, ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రభు త్వానికి గడువు ఇస్తున్నట్టు ప్రకటించింది. కోడ్ ముగిసిన తర్వాత సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. మార్చి 7 వరకు కోడ్ అమలులో ఉంటుంది. ఐదారు రోజులపాటు సమ్మె చేసి, కొద్ది రోజుల గడువు ఇచ్చి మళ్లీ సమ్మె చేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఆర్టీసీ కార్మికుల్లో 10 వేల మంది మాత్రమే సమ్మెకు సిద్ధంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. -
ఆర్టీసీలో సమ్మె నోటీసు
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల విషయంలో ఆర్టీసీ(RTC) యాజమాన్యం, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ ఆర్టీసీలోని కొన్ని సంఘాలు, మరికొన్ని సంఘాల్లోని చీలిక వర్గాలు సోమవారం సాయంత్రం సమ్మె నోటీసు జారీ చేశాయి. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సెలవులో ఉండటంతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్ను కలిసి నోటీసు, డిమాండ్ల జాబితాను అందజేశాయి. ఆర్టీసీ యాజమాన్యం స్పందించని పక్షంలో ఫిబ్రవరి 9 నుంచి లేదా, ఆ తర్వాత ప్రకటించే తేదీ నుంచి సమ్మెకు దిగుతామని ప్రకటించాయి. ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ థామస్రెడ్డి వర్గం, ఎన్ఎంయూ మౌలానా వర్గం, బీకేయూ, బీడబ్ల్యూయూ, కార్మిక పరిషత్లు సమ్మె నోటీసు జారీ చేశాయి. 21 డిమాండ్లతో.. పెండింగ్లో ఉన్న వేతన సవరణ, బకాయిల చెల్లింపు, ఖాళీల భర్తీ జరగక ఉన్న సిబ్బందిపై అదనపు భారం, ఆర్టీసీలో అద్దె బస్సులు పెరిగి పోస్టుల సంఖ్య తగ్గిపోతుండటం, అద్దె ప్రాతిపదికన తీసుకునే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వాహకులకు డిపోలు అప్పగించే యోచన, ఆర్టీసీ సొంతానికి వాడుకున్న సహకార పరపతి సంఘం, పీఎఫ్ ట్రస్టు నిధులను తిరిగి చెల్లించకపోవటం... ఇలా మొత్తం 21 డిమాండ్లను సంఘాలు ఆర్టీసీ అధికారుల ముందుంచాయి. కార్మికుల్లో అయోమయం.. సమ్మె విషయంలో ఆర్టీసీలోని సంఘాలు ఐక్యంగా లేకపోవటం ఇప్పుడు కార్మికుల్లో అయోమయానికి కారణమైంది. ⇒ గతంలో ప్రధాన సంఘాలుగా ఉన్న ఎంప్లాయీస్ యూనియన్ నుంచి ముఖ్యనేత రాజిరెడ్డి వైదొలిగి కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్న ఎస్డబ్ల్యూయూలో ఉన్నారు. ఇప్పుడు ఆ సంఘం సమ్మెకు దూరంగా ఉంది. ⇒ మరో ప్రధాన సంఘం టీఎంయూలో అశ్వత్థామరెడ్డి, తిరుపతి వర్గం సమ్మెకు దూరంగా ఉంది. ⇒ ఎన్ఎంయూలో నరేందర్ వర్గం సమ్మెను వ్యతిరేకిస్తోంది. మిగతా సంఘాలు కూడా సమ్మెకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. ⇒ ఇప్పుడు సమ్మెకు దూరంగా ఉన్న ఎస్డబ్ల్యూయూ, ఎస్డబ్ల్యూఎఫ్లు ఈనెల 24, 25 తేదీల్లో డిపోల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ⇒ ప్రస్తుతం సమ్మెకు దూరంగా ఉన్న సంఘాల ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యలను కలుస్తూ డిమాండ్ల పరిష్కారానికి వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. ఇలా రెండు వర్గాలుగా విడిపోయిన సంఘాలు, వాటి చీలిక వర్గాల నేతలు పరస్పరం విమర్శలు, ఆరోపణలతో కార్మికుల్లో కూడా చీలిక ఏర్పడుతోంది. వచ్చే నెల 9 తర్వాత ఎప్పుడైనా సమ్మె మొదలు ‘చాలాకాలంగా ఉన్న సమస్యల విషయంలో యాజమాన్యం తీరుతో విసిగిపోయి సమ్మె నోటీసు ఇచ్చాం. వచ్చే నెల 9 తర్వాత ఎప్పుడైనా సమ్మె ప్రారంభిస్తాం. ఇప్పటికే సగం డిపోల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాం. మిగతా డిపోల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తాం’అని ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వెంకన్న తెలిపారు. -
కాంగ్రెస్తో చీకటి రోజులే!
కాంగ్రెస్తో 58 ఏళ్లు గోసపడ్డం.. ఆ రాజ్యం మళ్లీ కావాలా? వాళ్లది ‘భూమేత’.. మళ్లీ దళారులు, లంచాల రాజ్యం ఎన్నికలు కాగానే ఆర్టీసీ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పూర్తి ఆటోరిక్షాలపై ఫిట్నెస్, పర్మిట్ ట్యాక్స్ రద్దు డబుల్ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేస్తాం.. మానకొండూరులో హుజూరాబాద్ తరహాలో దళితబంధు అమలు చేస్తామని హామీ ప్రతి ఒక్కరికీ కచ్చితంగా ఇల్లు కట్టిస్తాం రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లు కొందరికి అందలేదు. ఇకపై అలా ఉండదు. ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తాం. రాబోయే రోజుల్లో ఓ ప్రాజెక్టు తరహా టాస్్కగా తీసుకుని ఇల్లులేని ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టిస్తాం. రాష్ట్రంలో ఇల్లు లేని మనిషి ఉండొద్దు. సొంత జాగా ఉన్న వారికి గృహలక్ష్మి అమలు చేస్తాం. ఆటోలపై ఫిట్నెస్, పర్మిట్ ట్యాక్స్ రద్దు దేశవ్యాప్తంగా ఆటోరిక్షాలకు ట్యాక్స్ ఉంటే.. తెలంగాణలో మినహాయింపు ఇచ్చాం. అయితే ఆటో ఫిట్నెస్ కోసం పోతే ఏడాదికి రూ.1,200 కట్టాలి. దీనిని కూడా ఎన్నికలు ముగియగానే రద్దు చేస్తాం. ప్రభుత్వానికి రూ.100 కోట్ల వరకు నష్టం వచ్చినా భరించి.. ఫిట్నెస్ ట్యాక్స్, పర్మిట్ ట్యాక్స్ రద్దు చేస్తాం. సాక్షి ప్రతినిధి, వరంగల్/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ పాలన అంటే చీకటి రోజులేనని, ఇందిరమ్మ రాజ్యమంటే దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యమని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వ్యాఖ్యానించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మెల్లమెల్లగా అభివృద్ధి చేసుకుంటుంటే.. కాంగ్రెస్ వాళ్లు తెస్తమంటున్న ఆ దిక్కుమాలిన ఇందిరమ్మ రాజ్యం మనకు కావాలా అని ప్రశ్నించారు. అభ్యర్థులతోపాటు వారి వెనుక ఉన్న పార్టీ చరిత్రను చూడాలని.. బాగా ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్, నల్లగొండ జిల్లా నకిరేకల్, నల్లగొండ, కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్ నేతలు మళ్లీ మోసం చేయాలని చూస్తున్నరు. ఇందిరమ్మ రాజ్యం తెస్తరట. ఏం జరిగింది ఇందిరమ్మ పాలనలో మనకు తెలియ దా? కరువు కాటకాలు, ఆకలి చావులు, ఎమర్జెన్సీ, నక్సల్స్ ఉద్యమం, యువత అటవీబాట, ఎన్కౌంటర్లు.. ఇవే కదా అప్పుడు జరిగింది. అది దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం. ఆ దిక్కుమాలిన రాజ్యంలో బలిసినోడు బలిసిండు. తిండికిలేనోడు లేనిలెక్కనే బతికిండు. ఇందిరమ్మ రాజ్యం సక్కగా ఉంటే ఎన్టీఆర్ టీడీపీ పుట్టకపోయేది. రూ.2కు కిలోబియ్యం ఇచ్చే పరిస్థితి వచ్చేది కాదు. ప్రజలు ఆగమాగం కాకుండా ఆలోచించాలి. ఆచరణ సాధ్యంకాని హామీలు, మోసపూరిత మాటలు చెప్తున్న పారీ్టలకు బుద్ధి చెప్పాలి. రైతాంగ సాయుధ పోరాటం ద్వారా సాధించుకున్న తెలంగాణను నాడు ఆంధ్రలో కలిపి తీరని నష్టం కలిగించింది కాంగ్రెస్. వాళ్లకు తిరిగి అధికారమిస్తే కరువు కాటకాలు పునరావృతమవుతాయి. వెంటనే రెగ్యులరైజ్ చేస్తాం ఆర్టీసీ కార్మికులు ఎప్పుడు ఉద్యోగం పోతదో తెలియని అభద్రతాభావంలో ఉంటే బిల్లు పాస్ చేశాం. గవర్నర్ ఆలస్యం చేయడం వల్ల ఆగింది. ఎన్నికలు అయిపోయిన తెల్లారే ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి గవర్నమెంట్ ఉద్యోగులుగా చేస్తాం. మూడోసారి అధికారంలోకి వస్తే.. ఆహార రంగానికి పెద్దపీట వేస్తాం. రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల వరి ధాన్యం పండుతున్న నేపథ్యంలో ఎక్కడిక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి. నల్లగొండను పట్టుబట్టి అభివృద్ధి చేస్తున్నం నల్లగొండ జిల్లా వట్టికోట ఆళ్వార్స్వామి పుట్టిన జిల్లా. చైతన్యవంతమైన ఉద్యమాల గడ్డ. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఇక్కడ మంచినీళ్లు వచ్చే వి కావు. కరెంట్ ఉండేది కాదు. పోచంపల్లి చేనేత కార్మికుల ఆకలిచావులు, రైతుల ఆత్మహత్యలు జరిగేవి. నేను నల్లగొండను దత్తత తీసుకున్న. పట్టుబట్టి అభివృద్ధి చేస్తున్నాం. రూ.1,400 కోట్ల అభివృద్ధి పనులు కళ్ల ముందు జరుగుతున్నాయి. రెండు దశాబ్దాలు పనిచేసిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కాలంలో మంచినీటి సమస్య, కరెంట్ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదు. బీఆర్ఎస్ సర్కారు వచ్చాక 3 మెడికల్ కాలేజీలు కట్టుకున్నాం. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పూర్తి కావచ్చింది. నల్లగొండ ఇంకా నా దత్తతలోనే ఉంది. మరింత అభివృద్ధి చేస్తా.. మానకొండూరులో అందరికీ దళితబంధు స్వాతంత్య్రం వచ్చాక దళితుల స్థితిగతులు మార్చేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు. హుజూరాబాద్ తరహాలో మానకొండూరు నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు అందిస్తాం. నాది హామీ, నేను స్వయంగా వచ్చి ప్రారంభిస్తా. రసమయి బాలకిషన్ను భారీ మెజారిటీతో గెలిపించాలి..’’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. స్టేషన్ ఘన్పూర్ సభలో ఎంపీ పసునూరి దయాకర్, కడియం శ్రీహరి, మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్రెడ్డి, టి.రాజయ్య.. మానకొండూరు సభలో మంత్రి గంగుల, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. ధరణి తీసేసి దళారులను తెస్తరట కాంగ్రెస్ నాయకులు ధరణిని బంగాళాఖాతంలో కలిపి మళ్లీ దళారులను తెస్తమంటున్నరు. వారు తెచ్చే పథకం భూమాత కాదు భూమేత! మళ్లీ వీఆర్వోలు, అగ్రికల్చర్ ఆఫీసర్ల సంతకాలు, సర్టీఫికెట్ల పేరిట లంచాలు, దళారుల రాజ్యం వస్తుంది. పహాణీ కావాలన్నా రూ.లక్షకు రూ.40 వేలు వసూలు చేస్తరు. ఆలోచించాలి. రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలి. రైతులు బాగుపడాలి. అందుకే నీటి తీరువా రద్దు చేశాం. 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నాం. రైతుబంధు సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెంచుతాం. కమ్యూనిస్టు సోదరులను కోరుతున్నా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి. -
రోడ్డెక్కని సిటీ బస్సు
హైదరాబాద్: సిటీ బస్సు స్తంభించింది. ఆర్టీసీ కార్మికులు చలో రాజ్భవన్ ప్రదర్శనకు తరలివెళ్లడంతో శనివారం ఉదయం నుంచే బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయాన్నే విధులకు హాజరు కావాల్సి ఉద్యోగులు, స్కూళ్లు, కళాశాలలకు వెళ్లాల్సిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ తదితర ప్రధాన రైల్వేస్టేషన్లకు వెళ్లాల్సిన ప్రయాణికులు, రైళ్లు దిగి ఇళ్లకు వెళ్లాల్సిన వారు సైతం బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఆటోలు, క్యాబ్లను ఆశ్రయించాల్సి వచ్చింది. ఉదయం 10 గంటల తర్వాత సర్వీసులను పునరుద్ధరించినట్లు అధికారులు చెప్పినప్పటికీ మధ్యాహ్నం వరకు బస్సులు రోడ్డెక్కలేదు. రెండో షిఫ్ట్లో మాత్రమే వివిధ డిపోలకు చెందిన బస్సులు రోడ్లపై కనిపించాయి. ఎలాంటి ముందస్తు ప్రణాళికలకు అవకాశం లేకుండా ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆకస్మికంగా చేపట్టిన చలో రాజ్భవన్ కారణంగా తెల్లవారు జామున విధులకు హాజరు కావాల్సిన కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు తదితర సిబ్బంది విధులను బహిష్కరించి ప్రదర్శనకు తరలివెళ్లారు. దీంతో డిపోల్లోంచి బస్సులు బయటకు తీసేవాళ్లు లేకుండాపోయారు. సుమారు మూడువేల మందికి పైగా కార్మికులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నట్లు అంచనా. విద్యార్థుల ఇక్కట్లు.. ► నగర శివార్లలోని ఇంజినీరింగ్ తదితర వృత్తివిద్యా కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఘట్కేసర్, హయత్నగర్, కీసర, ఇబ్రహీంపట్నం, బాచుపల్లి, మేడ్చల్, గండిమైసమ్మ, మొయినాబాద్ తదితర ప్రాంతాల్లోని కాలేజీలకు ప్రతిరోజు లక్షలాది మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తారు. ఉదయం, సాయంత్రం నగరశివార్లకు రాకపోకలు సాగించే సిటీ బస్సులు విద్యార్థులతో కిక్కిరిసిపోతాయి. కానీ శనివారం ఉదయమే ఎక్కడి బస్సులు అక్కడ ఆగిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సెవెన్ సీటర్ ఆటోలు, ప్రైవేట్ వాహనాలు, బైక్లపై ఆధారపడాల్సి వచ్చింది. ► నగరంలో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాల్సిన విద్యార్థులు కూడా సకాలంలో వెళ్లలేకపోయారు. గ్రేటర్ హైదరాబాద్లో సుమారు 3.5 లక్షల మంది విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. రూట్పాస్లు, సాధారణ నెలవారీపాస్లపై రాకపోకలు సాగిస్తారు. ఉదయాన్నే ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు వెళ్లాల్సినవారు కూడా ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల నుంచి ఉదయం పూట దూరప్రాంతాలకు బయలుదేరాల్సిన బస్సులు కూడా ఆగిపోవడంతో మహాత్మా గాంధీ, జూబ్లీ బస్స్టేషన్లలో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఠారెత్తించిన ఆటోవాలాలు.. గ్రేటర్ హైదరాబాద్లోని 28 డిపోల్లో వందలాది బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు అనివార్యంగా ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో ఆటోవాలాలు అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారు. సాధారణంగానే ఆటోడ్రైవర్లు ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేస్తారు. శనివారం బస్సులు ఆగిపోవడంతో మరింత దారుణంగా వసూళ్లకు దిగారు. బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, ఆస్పత్రులు తదితర ప్రాంతాలకు వెళ్లేవారు పెద్ద మొత్తంలో సమర్పించుకోవాల్సివచ్చింది. ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉండే సమయంలోనే బస్సులు అందుబాటులో లేకపోవడంతో రెట్టింపు వసూళ్లకు పాల్పడ్డారు. ఇక నగర శివార్లలో తిరిగే సెవెన్ సీటరుల, షేరింగ్ ఆటోలు కూడా సాధారణ రోజుల్లో కంటే ఎక్కువ చార్జీలు తీసుకున్నట్లు ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేశారు. -
కార్మికులకు అండగా ఉన్నా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బిల్లును హడావుడిగా ప్రవేశపెట్టడం సరికాదని, అందులోని అంశాలపై విస్తృత చర్చ కోసం భాగస్వామ్య పక్షాలకు తగిన సమయం ఇవ్వాల్సి ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు అనుమతి ఆపడం వెనక తనకు వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలేమీ లేవని.. ప్రజలు, ఆర్టీసీ ఉద్యోగులు, సంస్థ ప్రయోజనాలను రక్షించడమే తన ఉద్దేశమని చెప్పారు. తాను ఎల్లçప్పుడూ ఆర్టీసీ కార్మికుల పక్షాన ఉంటానని, గత సమ్మె సమయంలో కూడా కార్మికులకు అండగా నిలబడి అర్ధరాత్రి వారి సమస్యలను విన్నానని గుర్తు చేశారు. శనివారం ఆమె పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ, తెలంగాణ మజ్దూర్ యూనియన్ల ప్రతినిధులతో మాట్లాడారు. 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగుల భవిష్యత్తు పట్ల ఆందోళన, సానుభూతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన వివరణలు అందాక.. ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. పీఆర్సీ, గ్రాట్యుటీ చెల్లింపు ఎప్పుడు? ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణలు (పీఆర్సీలు), ఈపీఎఫ్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్ బకాయిల చెల్లింపు వంటివి పెండింగ్లో ఉండటంపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమ సహకార సొసైటీకి చెందిన రూ.3 వేల కోట్లకుపైగా నిధులను ప్రభుత్వం తీసుకుని ఇప్పటివరకు చెల్లించలేదని గుర్తు చేశారు. రాష్ట్రానికి రాజ్యాంగబద్ధ అధిపతిగా రాజ్యాంగ నియమాల పరిరక్షణతోపాటు ప్రజలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడే బాధ్యత తనపై ఉందన్నారు. ధర్నాకు మంత్రుల వ్యూహరచన: ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాలు ఎలాంటి సమ్మెకు పిలుపు ఇవ్వలేదని వీడియో కాన్ఫరెన్స్లో జేఏసీ ప్రతినిధులు గవర్నర్కు చెప్పారు. ప్రభుత్వ ప్రోద్బలంతో బలవంతంగా సమ్మె చేయించారని, మహిళా ఉద్యోగులను సైతం వదిలిపెట్టలేదని ఆరోపించారు. రాజ్భవన్ ముట్టడి జరపాలని తమపై ఒత్తిడి తెచ్చారని.. ధర్నాకు ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యూహరచన చేశారని పేర్కొన్నారు. -
ఆర్టీసీ కార్మికుల ‘చలో రాజ్భవన్’
సాక్షి, హైదరాబాద్/ పంజగుట్ట: ఆర్టీసీ కార్మికులు కదంతొక్కారు. గవర్నర్కు వ్యతిరేకంగా శనివారం ఉదయం భారీ ప్రదర్శన చేపట్టారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుపైన ఆమోదం తెలపాలని, గవర్నర్ సంతకం చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది ‘చలో రాజ్భవన్’పేరిట భారీ ర్యాలీ నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతృత్వంలో చేపట్టిన ఈ భారీ ప్రదర్శనకు నగరంలోని అన్ని డిపోలకు చెందిన కార్మికులు తరలివచ్చారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సిటీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఫలితంగా విద్యార్ధులు, ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు కార్మికుల భారీ ప్రదర్శనతో ఖైరతాబాద్ చౌరస్తా, రాజ్భవన్ తదితర మార్గాల్లో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. నాలుగైదు గంటల పాటు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ఆర్టీసీ కార్మికులు రోడ్డుపైనే బైఠాయించడంతో ఖైరతాబాద్ నుంచి రాజ్భవన్ వచ్చే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. దాంతో నాలుగు వైపులా విపరీతంగా ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులు గంటలతరబడి రోడ్లపైనే పడిగాపులు కాయాల్సివచ్చింది. గవర్నర్కు వ్యతిరేకంగా నినాదాలు రాజ్భవన్ వైపు వెళ్లకుండా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటుకొని ఆందోళనకారులు ముందుకు వెళ్లారు. గవర్నర్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘గవర్నర్ డౌన్ డౌన్’అంటూ నినదించారు. ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రదర్శనగా వెళ్లిన కార్మికులంతా రాజ్భవన్ ఎదుట బైఠాయించారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి అధ్యక్షతన ఐదుగురు ప్రతినిధుల బృందం రాజ్భవన్లోకి వెళ్లి గవర్నర్తో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత నిరసనను విరమించారు. గవర్నర్ సానుకూలంగా స్పందించారు ఆ తర్వాత «థామస్ రెడ్డి మాట్లాడుతూ గవర్నర్ ఎంతో సానుకూలంగా స్పందించారని చెప్పారు. కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ తనకు ఎంతో ముఖ్యమని గవర్నర్ చెప్పారని పేర్కొన్నారు. బిల్లులో కొన్ని సందేహాలు నివృత్తి కాగానే బిల్లుకు ఆమోదం తెలుపుతామన్నారని వివరించారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు కమలాకర్, ఉపాధ్యక్షులు జీపీఆర్ రెడ్డి, కోశాధికారి రాఘవరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.ఆర్.రెడ్డి, మహిళా నాయకురాలు నిర్మలా రెడ్డి, బీఆర్టీయూ అధ్యక్షులు రాంబాబు యాదవ్, ప్రధాన కార్యదర్శి పి.నారాయణ నిరసనకు నాయకత్వం వహించారు. కాగా, గవర్నర్తో సమావేశం అయిపోయాక అక్కడకు వచ్చిన ఆర్టీసీ జేఏసీ నాయకులను పోలీసులు రాజ్భవన్లోనికి అనుమతించకుండా వారిని తీసుకొని ఖైరతాబాద్లో వదిలేశారు. -
ఆర్టీసీ బిల్లుపై లొల్లి!.. గవర్నర్ వర్సెస్ సర్కార్గా సాగుతున్న వివాదం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రతిపాదించిన ‘ఆర్టీసీ చట్ట సవరణ బిల్లు–2023’ అంశం మలుపుల మీద మలుపులు తీసుకుంటోంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సాగుతున్న ఉత్తర, ప్రత్యుత్తరాలు, ప్రశ్నలు, సమాధానాలు, వివరణలు.. రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. శుక్రవారం గవర్నర్ తమిళిసై ఆర్టీసీ బిల్లుపై ఐదు ప్రధాన సందేహాలను లేవనెత్తుతూ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణలు కోరారు. ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆయా అంశాలపై వివరణలు ఇస్తూ గవర్నర్ కార్యదర్శికి శనివారం లేఖ పంపారు. కానీ ఈ వివరణలతో గవర్నర్ సంతృప్తి చెందకపోవడం, పలు అంశాలపై పూర్తిస్థాయి స్పష్టత కోరడం, ఇదే సమయంలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి.. వారి ప్రయోజనం కోసమే తాను ప్రయత్నిస్తున్నట్టు చెప్పడం వంటివి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం సంతృప్తికరమైన సమాధానాలు ఇస్తే.. రెండు గంటల్లోనే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి అనుమతిస్తానని గవర్నర్ పేర్కొన్నట్టు తెలిసింది. గవర్నర్ ఆదివారం ఉదయానికల్లా ఆర్టీసీ బిల్లుకు అనుమతిస్తే.. అసెంబ్లీ సమావేశాల చివరిరోజున సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకునే అవకాశాలు ఉన్నాయి. రాజుకుంటున్న రాజకీయాలు రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై గత నెల 31న సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో.. ఈ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అయితే ఆర్టీసీ బిల్లు ఆర్థిక సంబంధిత అంశాలతో ముడిపడి ఉండటంతో, అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి గవర్నర్ అనుమతి కోసం ఈనెల 2న రాజ్భవన్కు పంపించింది. గవర్నర్ ఆ బిల్లును పరిశీలించి.. పలు సందేహాలు వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, ప్రభుత్వంలో అలజడి మొదలైంది. గవర్నర్ కావాలనే బిల్లును ఆపారంటూ బీఆర్ఎస్ నుంచి రాజకీయ విమర్శలు వచ్చాయి. దీంతో కనీసం బిల్లును చదవనీయకుండా గవర్నర్పై ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ బీజేపీ నేతలు ప్రతివిమర్శలకు దిగారు. మరోవైపు బిల్లుకు అనుమతి ఇవ్వాలంటూ ఆర్టీసీ కార్మికులు రాజ్భవన్ను ముట్టడించగా.. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, వారి ప్రయోజనాల కోసమే ప్రభుత్వం నుంచి వివరణలు కోరానని గవర్నర్ తమిళిసై ప్రకటించారు. శనివారం రాత్రి తర్వాత కూడా ఈ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. తొలుత గవర్నర్ కోరిన వివరణలు, ప్రభుత్వమిచ్చిన సమాధానాలు ఇవీ.. 1. గవర్నర్: 1958 నుంచి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, రుణాలు, ఇతర సాయం గురించి బిల్లులో ఎలాంటి వివరాలు లేవు. ప్రభుత్వం: సమైక్య రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడి వాటాలు రూ.61.07 కోట్లు, రూ.140.20 కోట్లుగా ఉన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకే ఈ బిల్లు పరిమితం. ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఇతర అన్ని విషయాల్లో ఆర్టీసీ సంస్థ ప్రస్తుత స్వరూపం, రీతిలో యథాతథంగా పనిచేస్తుంది. వాటాలు, రుణాలు, గ్రాంట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయాలు, ఇతర అంశాల నిర్వహణ విషయంలో, ఆర్టీసీ చట్టం–1950 కింద అపెక్స్ బాడీగా ఆర్టీసీ బోర్డు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన అంశాలను బిల్లులో పొందుపర్చాల్సిన అవసరం లేదు. 2: రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ ఐగీ ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై సమగ్ర వివరాలు బిల్లులో లేవు. ప్రభుత్వం: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినా.. సంస్థ ప్రస్తుత స్వరూపంలోనే కొనసాగుతుంది. రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కారమయ్యే వరకు సంస్థ స్వరూపం మారదు. విభజన అంశం కేంద్రం పరిశీలనలో ఉంది. పూర్తయ్యే వరకు ఇదే విధానం కొనసాగుతుంది. 3: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తామని ప్రభుత్వం చెప్తోంది. మరి వారి సమస్యలకు పారిశ్రామిక వివాదాల చట్టం, కార్మిక చట్టాలు వర్తిస్తాయా? వారి ప్రయోజనాలు ఎలా కాపాడబడతాయి? ప్రభుత్వం: ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యాక.. వారికి పారిశ్రామిక వివాదాల చట్టం వర్తింపు అంశం అందులోని నిబంధనలకు లోబడి ఉంటుంది. ఈ విషయంలో బిల్లులో ఎలాంటి నిబంధనలు పొందుపర్చాల్సిన అవసరం లేదు. ప్రస్తుత ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తేనే వారికి అత్యుత్తమ ప్రయోజనాలు లభిస్తాయి. 4: ఆర్టీసీ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ ఇస్తారా? ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు ఇవ్వడానికి సంబంధించి స్పష్టమైన వివరాలు ఇవ్వండి. ప్రభుత్వం: ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ నిబంధనలు, ఇతర ప్రయోజనాల నిబంధనలను ఆర్టీసీ ఉద్యోగులకు వర్తింపజేసే విషయంలో బిల్లులో ఎలాంటి అస్పష్టత లేదు. ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా.. అలాంటి నిబంధనలను రూపొందించి, ప్రకటించే అధికారాలను బిల్లులోని 4, 5 సెక్షన్లు రాష్ట్ర ప్రభుత్వానికి కల్పిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం అన్ని భాగస్వామ్యపక్షాలతో విస్తృత చర్చలు జరిపి ఓ అభిప్రాయానికి వస్తుంది. అప్పటిదాకా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రస్తుత ఆర్టీసీ నియమ, నిబంధనలే వర్తిస్తాయి. 5: ప్రభుత్వ ఉద్యోగుల్లో కండక్టర్, కంట్రోలర్ వంటి పోస్టులు లేవు. మరి ప్రమోషన్లు, కేడర్ నార్మలైజేషన్ అంశాల్లో ఆర్టీసీ ఉద్యోగులకు జరిగే న్యాయం, ఇతర ప్రయోజనాలపై స్పష్టమైన వివరాలు ఇవ్వండి. ప్రభుత్వం: ఇలాంటి అంశాలపై నిర్ణయం తీసుకోవడానికి అవసరమైన నిబంధనలు బిల్లులోని సెక్షన్ 4, 5లలో పొందుపరిచాం. జీతాలు, అలవెన్సుల విషయంలో ఏ ఉద్యోగినీ ఇబ్బందిపెట్టం. విలీనం తర్వాత ఆర్టీసీలోని ప్రస్తుత కేటగిరీలు, కేడర్ల కొనసాగింపునకు ఎలాంటి అడ్డంకులు లేవు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని నిషేధించే.. ‘తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఇన్టూ పబ్లిక్ సర్వీస్ యాక్ట్ 1997’ నుంచి మినహాయింపు కల్పించడం కోసమే ఈ బిల్లును తెచ్చాం. మరిన్ని వివరణలు కావాలన్న గవర్నర్ గవర్నర్ తమిళిసై లేవనెత్తిన సందేహాలపై రాష్ట్ర ప్రభుత్వం తొలుత సమాధానం ఇచ్చినా.. ఆయా అంశాల్లో మరింత స్పష్టత, అదనపు వివరణలు కావాలని గవర్నర్ ప్రభుత్వాన్ని కోరారని రాజ్భవన్ ప్రకటించింది. ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న దీర్ఘకాలిక డిమాండ్కు అడ్డంకులు సృష్టించడం తమ ఉద్దేశం కాదని.. వారి సర్వహక్కులను పరిరక్షించడానికే వివరాలు కోరాల్సి వస్తోందని స్పష్టం చేసింది. ఆర్టీసీ ఉద్యోగుల సర్వీసు నిబంధనల విషయంలో భవిష్యత్తులో నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం సమాధానమిచ్చిన ఇచ్చిన నేపథ్యంలో.. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపర చిక్కులు రాకుండా, ఉద్యోగుల విలీన ప్రక్రియ సజావుగా జరిగేలా గవర్నర్ ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి అంశాలను ప్రతిపాదిత బిల్లు పరిష్కరించగలదా? అన్న అనుమానాలు ఉన్నాయని పేర్కొంది. ఈ క్రమంలో కింది వివరణలను ప్రభుత్వం నుంచి కోరినట్టు తెలిపింది. ► కేంద్రం నుంచి సమ్మతి పొందారా? కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీలో 30శాతం వాటా కలిగి ఉందని రాష్ట్ర ప్రభుత్వం వివరణలో పేర్కొంది. ఈ మేరకు కేంద్రం నుంచి సమ్మతి తీసుకున్నారా? ఒకవేళ సమ్మతి పొంది ఉంటే అందుకు సంబంధించిన ప్రతిని అందజేయాలి. లేనిపక్షంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా తీసుకున్న జాగ్రత్తలను తెలపాలి. ► డిపోల వారీగా అన్ని కేటగిరీల శాశ్వత ఉద్యోగుల సంఖ్య ఎంత? డిపోల వారీగా అన్ని కేటగిరీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, క్యాజువల్, ఇతర తాత్కాలిక ఉద్యోగుల సంఖ్య ఎంత? తాత్కాలిక ఉద్యోగుల విషయంలో అవలభించనున్న విధానం ఏమిటి? ► ఇకపైనా ఆర్టీసీ సంస్థ ప్రస్తుత స్వరూపంలోనే కొనసాగుతుందని ప్రభుత్వం వివరణ ఇచ్చిన నేపథ్యంలో.. సంస్థ చర, స్థిరాస్తులు సంస్థతోనే కొనసాగుతాయా? రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా? ముఖ్యంగా భవనాలు, భూములు ఎవరి వద్ద ఉంటాయి? ► బస్సు సర్వీసుల నిర్వహణ విషయంలో అజమాయిషీ, బాధ్యత ఎవరిది? ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం అవుతున్నందున వారి విధులను నియంత్రించే బాధ్యత ఎవరిది? ఉద్యోగులు, ప్రయాణీకులను దృష్టిలో పెట్టుకుని ఈ విషయంలో కార్పొరేషన్ బాధ్యత ఏమిటి? ► ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఆర్టీసీలో డిప్యూటేషన్పై కొనసాగుతారా? అలాంటి ఇతర ఏర్పాట్లు ఏమైనా చేస్తారా? రెండో దఫాలో గవర్నర్ కోరిన వివరణలు ► ఆర్టీసీలో కేంద్రానికి 30శాతం వాటా ఉంది. అలాంటప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసుకోవడంపై కేంద్రం నుంచి సమ్మతి పొందారా? ► ఆర్టీసీ చర, స్థిర ఆస్తులను ప్రభుత్వం స్వాదీనం చేసుకుంటుందా? ► ఆర్టీసీలో శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు మొత్తం ఎంత మంది ఉన్నారు? ► ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైతే.. వారిపై, బస్సు సర్వీసులపై అజమాయిషీ ఎవరికి ఉంటుంది? కార్పొరేషన్ ఏం చేస్తుంది? ఉద్యోగులను ఆర్టీసీలో డిప్యుటేషన్పై నియమిస్తారా? లేక ఏదైనా ఏర్పాటు చేస్తారా? -
రాజ్భవన్ వద్ద ఉద్రిక్తత.. గవర్నర్తో ముగిసిన ఆర్టీసీ కార్మికుల చర్చలు
►ఆర్టీసీ బిల్లులోని ఐదు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరిన గవర్నర్.. ఆ సంస్థ ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించారు. ఆర్టీసీ యూనియన్ నాయకులతో పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఆర్టీసీ యూనియన్ సభ్యుల బృందం గవర్నర్తో గంటపాటు చర్చించారు. గవర్నర్ తమ సమస్యలు విన్నారని, సానుకూలంగా స్పందించారని ఆ సంఘం నేత థామస్రెడ్డి తెలిపారు. ►గవర్నర్ లేవనెత్తిన ఐదు అభ్యంతరాలపై తెలంగాణ సర్కార్ వివరణ ఇచ్చింది. ఈనేపథ్యంలో ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్ తమిళిసై ఏం నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది. ►రాజ్భవన్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ రాజ్భవన్ ముట్టడికి ర్యాలీగా ఆర్టీసీ ఉద్యోగులు బయలుదేరారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్టీసీ యూనియన్ నేతలను చర్చలకు గవర్నర్ ఆహ్వానించారు. ►ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కారు. గవర్నర్ తీరును నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులను బహిష్కరించారు. రెండు గంటలపాటు బస్సులను బంద్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేసే బిల్లును వెంటనే గవర్నర్ ఆమోదించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళనకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా డిపోల్లో బస్సులన్ని ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు బంద్ పాటించారు. రెండు గంటల పాటు ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడ్డారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని పీవీ మార్గ్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లి రాజ్భవన్ను ముట్టడిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ వెంటనే అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల అందోళనతో బస్సులు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ ,ఉట్నూరు, బైంసా, నిర్మల్, అసిపాబాద్, మంచిర్యాల డిపోల ముందు ఆందోళన కొనసాగుతుంది. రెండు గంటల బంద్లో భాగంగా నల్లగొండ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు నిరసన తెలుపుతున్నారు. మరోవైపు డిపో వద్ద గురుకుల అభ్యర్థులు నిరసనకు దిగారు. పరీక్ష కోసం వెళ్లేందుకు బస్సులు లేవంటూ ఆందోళన వ్యక్తం చేశారు. బస్సు సర్వీసులు నిలిపివేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. -
నేడు ఆర్టీసీ ఉద్యోగుల రాజ్భవన్ ముట్టడి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం బిల్లు’ను గవర్నర్ తమిళిసై పరిశీలన కోసం ఆపడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్విసులను నిలిపివేయాలని ఉద్యోగులు, కార్మికులకు పిలుపునిచ్చాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని పీవీ మార్గ్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లి రాజ్భవన్ను ముట్టడిస్తామని ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ వెంటనే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశాయి. -
ఇక అప్పు పుట్టడం కష్టమే! సీసీఎస్ దివాలా.. ఆర్టీసీ కార్మికులకు కష్టాలు
‘ఆర్టీసీ ఉద్యోగులు రుణం కోసం అందించే దరఖాస్తులను మీరు బ్యాంకులకు, రుణాలు అందించే ఆర్థిక సంస్థలకు ఫార్వర్డ్ చేయొద్దు.. ఉద్యోగుల వేతన బిల్లుల నుంచి రుణ రికవరీలకు వీలు కల్పించవద్దు’ – ఇటీవల యూనిట్ అధికారులకు ఆర్టీసీ జారీ చేసిన ఆదేశం ఇది. ఆర్టీసీ కార్మికులకు రుణం పుట్టడం కష్టంగా ఉన్న సమయంలో ఈ ఆదేశం ఉద్యోగులకు అశనిపాతంగా మారింది. వాస్తవానికి ఇది కొత్త సర్క్యులర్ కాదు. 2003లోనే దీనిపై నిర్ణయం తీసుకున్నా ఇప్పటివరకు పెద్దగా అమలు కాలేదు. పాత సర్క్యులర్ను కోట్ చేస్తూ దాన్ని ఇప్పుడు కచ్చితంగా అమలు చేసేలా తాజాగా మరో సర్క్యులర్ను ఆర్టీసీ ఉన్నతాధికారులు జారీ చేశారు. కాగా, ఇప్పుడు నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఈ ఆదేశాలు తమపై తీవ్ర ప్రభావం చూపుతాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకీ ఆదేశం.. ఏమిటా విపత్కర పరిస్థితి.. ఆర్టీసీ ఉద్యోగులు గతంలో స్వేచ్ఛగా బ్యాంకుల నుంచి రుణం పొందేవారు. కొంతకాలం క్రితం వరకు వేతనాల ఖాతాలున్న బ్యాంకు వారికి రుణాలు ఇచ్చే విషయంలో కొంత ఉదారంగా వ్యవహరించేది. ఇటీవలే వేతనాల ఖాతాలు మరో బ్యాంకుకు మార్చారు. రుణాలిచ్చే విషయంలో కొత్త బ్యాంకు రకరకాల కొర్రీలు, కఠిన నిబంధనలు పెడుతోందని, దీంతో రుణాలకు ఇబ్బందిగా మారిందని కార్మికులు పేర్కొంటున్నారు. దీంతో వేరే బ్యాంకుల నుంచి రుణాలు పొందేవారు. సాధారణంగా ఆర్టీసీ అధికారుల ద్వారా రుణ దరఖాస్తు వస్తే బ్యాంకులు సులభంగా రుణమిస్తాయి. ఒకవేళ కార్మికులు తిరిగి చెల్లించకున్నా, ఆర్టీసీ పూచీగా ఉంటుందన్న ధీమా బ్యాంకులకు ఉంటుంది. ఇప్పుడు రుణాలకు సిఫారసు చేయొద్దని, వేతనాల నుంచి రికవరీకి బ్యాంకులకు అవకాశం ఇవ్వవద్దని పేర్కొంటూ పాత ఆదేశాలను తిరిగి తెరపైకి తేవడం విశేషం. సీసీఎస్ దివాలాతో.. గతంలో ఆర్టీసీ కార్మికులకు బ్యాంకు రుణాల అంశం పెద్ద సమస్యగా ఉండేది కాదు. ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్) సుభిక్షంగా ఉండటంతో దాని ద్వారానే కావాల్సిన రుణాలు పొందేవారు. కొంతకాలంగా దాని నిల్వ నిధులను ఆర్టీసీ సొంతానికి వాడేసుకుని, దాదాపు వేయి కోట్లకుపైగా బకాయి (వడ్డీతో సహా) పడటం, నెలనెలా దానికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకపోవటంతో సీసీఎస్ దాదాపు దివాలా దశకు చేరిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి నుంచి రుణాలు నిలిచిపోవడం కార్మికులకు పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు బ్యాంకుల నుంచి సులభంగా రుణం పొందే వీలు లేకపోవటంతో వారికి ప్రైవేటు వడ్డీ వ్యాపారులే దిక్కయ్యారు. గతంలో బ్యాంకుల నుంచి రుణం తీసుకుని సమయానికి చెల్లించిన రికార్డు ఉన్న వారు పాత పరిచయాలతో రుణాలు పొందగలుగుతున్నా... మిగతా వారికి మాత్రం ఆర్టీసీ నుంచి సిఫారసు లేకుండా రుణం రాని పరిస్థితి నెలకొంది. ‘ఇదేం ఘోరం’ అటు సీసీఎస్ను నిర్విర్యం చేసి రుణాలు అందని పరిస్థితి తెచ్చి, ఇటు బ్యాంకుల నుంచి రుణ సిఫారసులు లేకుండా చేసి కార్మికులను ఇబ్బంది పెట్టడం ఏమాత్రం సరికాదని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఎస్ను పునరుద్ధరించే దాకా బ్యాంకుల నుంచి స్వేచ్ఛగా రుణాలు పొందే వీలు కల్పించాలని, తాజా సర్క్యులర్ను తక్షణం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఆర్టీసీని రక్షించాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్దే
హస్తినాపురం: ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి సంస్థను రక్షించాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్పై ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి, ఎంప్లాయీస్ యూనియన్ పోరుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు. సంస్థలో యూనియన్లను పునరుద్ధరణకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ హస్తినాపురంలోని కేకే గార్డెన్స్లో మంగళవారం జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మిక సంఘాల కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతించాలని, కార్మికులకు బకాయి ఉన్న పేస్కేలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విదానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సీఎం కేసీఆర్కు.. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. మునుగోడు ఉపఎన్నిక సమయంలో తమ మద్దతు కోరినప్పుడు ఇదే అంశాన్ని స్పష్టం చేశామని, అందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని తెలిపారు. కార్మికుల డిమాండ్లన్నీ పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టీసీతో తమ పార్టీది పేగుబంధమని తెలిపారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే... నిరవధిక దీక్షకు సిద్ధమని ప్రకటించారు. సమావేశంలో ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు వి.ఎస్.బోస్, అధ్యక్షుడు బాబు, నాయకులు కె.రాజిరెడ్డి, పద్మాకర్ తదితరులు ప్రసంగించారు. -
ఆర్టీసీకి ఆక్సిజన్ వైఎస్ కుటుంబం
తిరుపతి అర్బన్: వెంటిలేటర్పై ఉన్న ఆర్టీసీకి ఆక్సిజన్ అందించింది వైఎస్ కుటుంబమేనని ఆర్టీసీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య తెలిపారు. తిరుపతిలో బుధవారం వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో చల్లా చంద్రయ్య మాట్లాడుతూ.. డిసెంబర్ 14న జరుగనున్న ఆర్టీసీ సీసీఎస్ ఎన్నికల్లో అసోసియేషన్ విజయ పతాకాన్ని ఎగురవేయాలని చెప్పారు. 1999లో అప్పటి నేతలు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలనే ప్రతిపాదనలు సిద్ధం చేశారని చెప్పారు. అయితే 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న 27వేల మందిని ఆర్టీసీలో భాగస్వాములు చేశారని చెప్పారు. అదేవిధంగా ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ పోరాటం చేయకపోయినా.. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం హర్షణీయమన్నారు. ఆర్టీసీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర, జోనల్, రీజనల్కు చెందిన లతారెడ్డి, టీవీ మురళీధరన్, అర్జున్, ఎంటీఆర్ రెడ్డి, రాంబాబు, పరంధామయ్య, మణితోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన డిపో కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కారం
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది. ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వంలో విలీనం మొదలు.. వారి ప్రయోజనాల్ని పరిరక్షిస్తూనే మరో వైపు పెండింగ్లో ఉన్న సమస్యలన్నింటినీ తీర్చింది. గతంలో ఏ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఈ విధంగా మేలు చేయలేదని యూనియన్లు పేర్కొంటున్నాయి. ఈ మేరకు యూనియన్ల ప్రతినిధులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి. ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు, వైఎస్సార్ ఆర్టీసీ యూనియన్ నేతలు.. గడిచిన ఏడాదిగా ఆర్టీసీ కార్మికులకు చేకూరిన లబ్ధిపై ప్రకటనలు జారీ చేశారు. ► కోవిడ్ కారణంగా ఆర్టీసీ కనీవినీ నష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ.. 52 వేల మంది ఉద్యోగులకు జీతాలు అందుతున్నాయి. ► కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులరైజ్ చేశారు. ► ఇటీవలే 2013 పే స్కేల్ బకాయిలు రూ.800 కోట్లు విడుదల చేశారు. ► విలీనం తరువాత.. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే కారుణ్య నియామకాలను ఆర్టీసీ ఉద్యోగులకు వర్తించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ► ఆర్టీసీలో పనిచేస్తూ చనిపోయిన కార్మికులకు ప్రభుత్వం కల్పించే ‘మరణానంతర ప్రయోజనాలు’ వర్తింపజేస్తూ గత వారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ► ఆర్టీసీలో మహిళా భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది. లైంగిక వేధింపులపై ప్రాంతీయ స్ధాయి కమిటీలు ఏర్పాటు చేసింది. ► రూ.10 లక్షల బీమా కల్పించింది. విధి నిర్వహణలో ఉన్నా.. లేకున్నా.. ప్రమాదవశాత్తు మరణిస్తే ఈ బీమా వర్తిస్తుంది. ఈ ఏడాది మే 31 నాటికి ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బందికి ఈ బీమా వర్తిస్తుంది. ► చంద్రబాబు హయాంలో యూనిఫాంకు కూడా డబ్బులు ఇవ్వలేదు. -
రేపటి నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులే
సాక్షి, అమరావతి: జనవరి 1 నుంచి ఆర్టీసీ కార్మికులందరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులేనని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ ఇప్పటికే రూ.6,400 కోట్ల మేరకు నష్టాల్లో ఉందన్నారు. దీనికితోడు ఏటా రూ.3,600 కోట్ల భారాన్ని ప్రభుత్వం తన భుజాన వేసుకుందని చెప్పారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నాని మీడియాతో మాట్లాడారు. 54 వేల ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందరూ జేజేలు పలకాలని కోరారు. సీఎం తీసుకున్న నిర్ణయం దేశంలోనే ఒక చరిత్రాత్మక సంఘటనగా నిలిచిపోతుందన్నారు. సంక్రాంతికి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి వచ్చే వారి నుంచి ప్రైవేటు ట్రావెల్స్ రెండు, మూడు రెట్లు అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికొచ్చిందని.. ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా అధికంగా చార్జీలు వసూలు చేస్తే 8309887955 నంబర్కు వాట్సాప్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. చంద్రబాబు మాటలే జర్నలిస్టులపై దాడికి కారణం రాజధాని ప్రాంతంలో మహిళా జర్నలిస్టు దీప్తి, మరికొందరిపై దాడి చేస్తే జర్నలిస్టు సంఘాలు ఎందుకు స్పందించలేదని మంత్రి నాని ప్రశ్నించారు. అక్రెడిటేషన్ కార్డుల కోసం బయలుదేరే జర్నలిస్టు సంఘాలు, యూనియన్లు.. హరీష్ (ఎన్టీవీ), వసంత్ (మహాటీవీ), కెమెరామెన్లు, డ్రైవర్లపై దాడి జరిగితే ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. దాడికి గురైన జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంటికి వెళ్లి చంద్రబాబు ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పిన మాటలే ఇలాంటి సంఘటనలకు కారణమని ధ్వజమెత్తారు. టీవీ9 ఇటీవల వరకూ వారు చెప్పినట్లు వార్తలు ఇచ్చిందని.. ఇప్పుడు అలా చేయడం లేదనే అక్కసుతోనే దాడి చేశారన్నారు. తమపై రోజూ విషం చిమ్మే ఏబీఎన్, టీవీ5 చానెళ్లను ఏనాడైనా వైఎస్సార్సీపీ కార్యకర్తలు ముట్టుకున్నారా? అని ప్రశ్నించారు. సుజనా చౌదరి భారతీయ తెలుగుదేశం పార్టీకి చెందిన వారని.. ఆయన మాటలు టీడీపీవేనని.. అందువల్ల ఆయన చెప్పే మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇక పవన్ నాయుడు ఎవరి కోసం పని చేస్తారో అందరికీ తెలిసిందేనని చెప్పారు. 51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ధి జనవరి 1 నుంచి ఆర్టీసీ సిబ్బంది ప్రజా రవాణా ఉద్యోగులుగా మారనున్నారు. దేశంలో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ మినహాయించి ఏ రాష్ట్రంలోనూ ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ఆ సంస్థలో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న 51,488 మందికి లబ్ధి చేకూరనుంది. ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ప్రజా రవాణా శాఖలో విలీనమైన వెంటనే చెల్లించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. విలీనంతో ఆర్టీసీ ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలు.. - సంస్థకు ఆర్థిక భద్రత చేకూరడం వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఉద్యోగ భద్రత ఉంటుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందుతాయి. - ఆర్టీసీ లాభనష్టాలతో సిబ్బందికి సంబంధం ఉండదు. పదవీ విరమణ వయసు 60 ఏళ్లుగా ఉంటుంది. - కార్మికులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను రెండేళ్లలో చెల్లిస్తారు. చంద్రబాబు హయాంలో ఆర్టీసీ ఉద్యోగులకు లీవ్ ఎన్క్యాష్మెంట్ కింద రూ.47 కోట్ల మేర బాండ్లు ఇచ్చారు. ఆ బాండ్లకు నగదు చెల్లిస్తారు. - ఆర్టీసీ సిబ్బందిపై అనవసర ఒత్తిళ్లు ఉండవు.. అధికారుల పెత్తనం తగ్గుతుంది. పనిష్మెంట్లు ఇష్టారీతిన ఇచ్చేందుకు కుదరదు. ప్రజా రవాణా శాఖ ఏర్పాటు రవాణా, ఆర్ అండ్ బీ పరిపాలన నియంత్రణలోనే పీటీడీ శాఖ రవాణా, ఆర్ అండ్ బీ పరిపాలన నియంత్రణలో ప్రజా రవాణా శాఖ (పీటీడీ)ను ఏర్పాటు చేస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రజా రవాణా శాఖ ఏర్పాటైంది. ఆర్టీసీ విలీనంపై రిటైర్డ్ ఐపీఎస్ ఆంజనేయరెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ సెప్టెంబర్లో ప్రభుత్వానికి నివేదిక అందించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పీటీడీ ఏర్పాటుపై కార్యదర్శుల కమిటీ కొన్ని సూచనలు చేసింది. పిదప ఆర్టీసీ బోర్డు కూడా విలీనాన్ని ఆమోదించింది. దీంతో జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం కానున్నారు. ఫిబ్రవరి 1న వీరికి ప్రభుత్వమే వేతనాలు చెల్లించనుంది. కార్యదర్శుల కమిటీ ఇచ్చిన నివేదికపై ఆర్థిక శాఖ చర్యలు చేపట్టనుంది. ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల చెల్లింపులు ఏపీసీఎఫ్ఎంఎస్ (ఆంధ్రప్రదేశ్ కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం) ద్వారా జరుగుతాయి. వేతన సవరణ అమలు చేసే వరకు ప్రస్తుతం ఆర్టీసీలో కొనసాగుతున్న అలవెన్సులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కార్యదర్శుల కమిటీ ప్రతిపాదించిన పే స్కేల్స్ను వేతన సవరణ కమిటీకి నివేదించి అనుమతి తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పీటీడీ వ్యవస్థాగత నిర్మాణం ఇలా.. రవాణా శాఖ మంత్రి.. ప్రజా రవాణా శాఖ మంత్రిగా, రవాణా, ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి.. ప్రిన్సిపల్ సెక్రటరీగా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కమిషనర్/డైరెక్టర్గా.. ఏపీఎస్ఆర్టీసీ ఎండీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రధాన కార్యాలయంలో ఈడీలు అదనపు కమిషనర్లుగా, రీజినల్ మేనేజర్లు జాయింట్ కమిషనర్లుగా, డివిజనల్ మేనేజర్లు డిప్యూటీ కమిషనర్లుగా, డిపో మేనేజర్లు అసిస్టెంట్ కమిషనర్లుగా వ్యవహరిస్తారు. జోనల్/రీజియన్లలో ఉండే ఈడీలు, ఆర్ఎంలు, డీవీఎంలు, డీఎంలకు ఇవే హోదాలు వర్తిస్తాయి. వీరు జిల్లాల్లో ఉంటారు. -
ఇది చరిత్రాత్మకమైన బిల్లు
-
ఆర్టీసీ ఉద్యోగుల విలీనం చరిత్రాత్మకం
ఆర్టీసీలో రిటైర్మెంట్ వయసు 58 ఏళ్లే. దానిని 60 ఏళ్లకు పెంచాలని చంద్రబాబును వేడుకున్నారు. మా జీవితాలు కూడా బాగుపడతాయి, మేం కూడా ప్రభుత్వ రంగ సంస్థలోనే ఉన్నాం కదా, మాక్కూడా రిటైర్మెంట్ వయస్సు పెంచండి అని అంటే చంద్రబాబు అస్సలు పట్టించుకోలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లు అడక్కపోయినా కూడా రిటైర్మెంట్ వయస్సు 60 సంవత్సరాలకు పెంచుతూ ముందుగానే ఆదేశాలు జారీ చేశాం. ఆ తర్వాతే విలీన ప్రక్రియ మొదలుపెట్టాం. సాక్షి, అమరావతి: జనవరి 1వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులేనని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చారిత్రాత్మకమని చెప్పారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లుకు శాసన సభ సోమవారం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. సుమారు 52 వేల మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు తెలిపారు. వీరంతా జనవరి 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా చలామణి అవుతారని అన్నారు. అధికారంలో ఉన్న అయిదేళ్లపాటు చంద్రబాబు ఆర్టీసీ కార్మికులను పట్టించుకోలేదని, ఇప్పుడు టీడీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం కాకుండా గతంలో చంద్రబాబు చట్టం తెచ్చిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. అందుకే ఆర్టీసీ విలీనం కోసం చారిత్రాత్మక బిల్లును ప్రవేశపెట్టామని తెలిపారు. ఇంకా సీఎం వై.ఎస్. జగన్ ఏమన్నారంటే.. సభలో ఇన్ని మేజర్ బిల్లులపై చర్చ జరుగుతుంటే చంద్రబాబు సభలో కనిపించరు. వాళ్ల ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు కాళ్లా, వేళ్లా పడ్డారు. ‘కనికరించండయ్యా.. విలీనం చేయండయ్యా’ అని వేడుకున్నా, ఏమాత్రం కూడా కనికరించకుండా ఈ పెద్ద మనుషులు వాళ్లకు పూర్తిగా అన్యాయం చేశారు. ఈరోజు మైక్ పుచ్చుకుని ఆర్టీసీ కార్మికులే కాదు, ఆర్టీసీలో ఉన్న కాంట్రాక్టు కార్మికులను కూడా విలీనం చేయండి అని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. విలువలతో, విశ్వసనీయతతో కూడినదే రాజకీయం అంటారు. కానీ వీళ్ల మాటలు, వీళ్ల చేతలు చూసినప్పుడు రాజకీయాలు ఏ మేరకు దిగజారిపోయాయో అని బాధనిపిస్తోంది. ఇది చరిత్రాత్మకమైన బిల్లు ఈ బిల్లు ఎందుకు ప్రవేశపెట్టాల్సి వస్తున్నదన్నది అందరూ ప్రశ్నించుకోవాలి. 1997లో చంద్రబాబు ఒక చట్టం చేశారు. దాని ప్రకారం ప్రభుత్వ రంగ సంస్ధల్లో ఉన్న ఏ ఒక్క ఉద్యోగీ ప్రభుత్వంలో విలీనం కావడానికి వీలు లేదు. అందుకే ఇవాళ విలీనం చేసేందుకు కొత్తగా ఇంకో బిల్లు తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. ఇది ఓ చరిత్రాత్మకమైన బిల్లు. దీని ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీలోని ఉద్యోగులందరూ ప్రభుత్వంలో విలీనం అవుతారు. ఏ రకంగా అయితే ఇరిగేషన్, హోం డిపార్ట్మెంట్ ఉన్నాయో, ఏ రకంగా అయితే సివిల్ సఫ్లైస్, మున్సిపాల్టీ, పంచాయితీ రాజ్, అలా డిఫరెంట్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అదే విధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కింద వీళ్లందరినీ తీసుకుంటాం. ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా ఆర్టీసీ సిబ్బంది సాక్షి, అమరావతి: ఆర్టీసీ సిబ్బంది ప్రజా రవాణా శాఖ (పీటీడీ) ఉద్యోగులుగా మారనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన బిల్లును శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో ప్రస్తుతం ఆర్టీసీలోని అన్ని విభాగాల్లో పని చేస్తున్న 51,488 మంది జనవరి 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారతారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో భాగంగా ఆ సంస్థ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లో చేర్చుకోవటానికి సంబంధించిన బిల్లును రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (పేర్ని నాని) సోమవారం శాసన సభలో ప్రవేశపెట్టారు. సభలో చర్చ అనంతరం సభ్యుల హర్షధ్వానాల మధ్య బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. పీటీడీలో అన్ని విభాగాల్లో మొత్తం 58,953 మంది ఉద్యోగులకు ఆమోదం లభించింది. ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు పీటీడీలో విలీనమైన వెంటనే చెల్లిస్తారు. విలీనం తర్వాత ప్రభుత్వంపై ఏడాదికి సుమారుగా రూ.3,600 కోట్లు (నెలకు రూ.300 కోట్లు) ఆర్ధిక భారం పడుతుంది. ప్రస్తుతం ఉన్న రూ.3,688 కోట్ల తక్షణ చెల్లింపుల బాకీలు 2019–20, 2020–21 సంవత్సరాల్లో తీరిపోతే, 2021–22 సంవత్సరానికి రూ.687 కోట్లు నికర మిగులు ఉంటుందని మంత్రి పేర్ని నాని అసెంబ్లీకి సమర్పించిన ఆర్ధిక మెమొరాండంలో వివరించారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీనం నభూతో.. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లును ఆమోదించడం నభూతో.. అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. రూ. 6934 కోట్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటే ఎంతో ధైర్యం, మానవత ఉండాలన్నారు. ‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో దాదాపు రూ.3,600 కోట్లు వేతనాల రూపంలో ప్రభుత్వం భారం తీసుకుంది. చిరునవ్వుతో ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ఉద్యోగుల జీవితాల్లో ఈ రోజు వెలుగులు నింపాలి. వారందరికీ పండగ దినం కావాలి’ -
విలీనానికి ముందే కీలక నిర్ణయాలు
సాక్షి, అమరావతి : విలీన వేళ ఆర్టీసీ కార్మికులకు అండగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సిబ్బంది సంక్షేమమే ధ్యేయంగా ఈ నిర్ణయాలు అమలుచేయనున్నారు. ప్రజా రవాణా శాఖ ఏర్పాటుచేసి ఆర్టీసీ సిబ్బంది మొత్తాన్ని ప్రభుత్వోద్యోగులుగా మార్చేందుకు రాష్ట్ర కేబినెట్ ఈ నెల 11న ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ విలీన ప్రక్రియకు సంబంధించి కొత్త చట్టాన్ని సోమ లేదా మంగళవారాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. దీనికి ముందే రాష్ట్ర ప్రభుత్వం సంస్థ ఉద్యోగులకు వరాలు ప్రకటించింది. కార్మికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 40 శాతం వేతన సవరణ బకాయిలు చెల్లించడానికి ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసింది. పెండింగ్లో ఉన్న ఈ బకాయిల మొత్తం రూ.210 కోట్లను విడుదల చేసింది. గత ఐదేళ్లుగా కార్మికులు ఎదురుచూస్తున్న కారుణ్య నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతోనే ఆర్టీసీ యాజ మాన్యం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. తొలి విడతలో 2015 డిసెంబర్ 31 వరకు 237 మంది పేర్లతో ఉన్న జాబితాను ఆమోదించింది. వీరందరికీ మెడికల్ పరీక్షలు నిర్వహించి శిక్షణకు పంపించారు. కండక్టర్ల అభ్యర్థుల ఎత్తును 153 సెం.మీల నుంచి 145 సెం.మీలకు తగ్గిస్తూ నిబంధనలు సవరించారు. అలాగే డిస్ ఎంగేజ్ (డ్యూటీకి గైర్హాజరైన వారు) అయిన మొత్తం 135 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. 2015 తర్వాత కారుణ్య నియామకాలను త్వరలో చేపట్టేందుకు.. కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో కార్మిక సంఘాలన్నీ హర్షం వ్యక్తంచేస్తున్నాయి. కార్మికులకు ముందస్తు వైద్య పరీక్షలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ విధి నిర్వహణలో మరణిస్తున్న ఘటనలపైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. కార్మికులకు ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఉత్తర్వులిచ్చింది. ఆర్టీసీలో సుమారు 52 వేల మందికి ముందస్తుగా అన్ని రకాల వైద్య పరీక్షలు అందనున్నాయి. ఇప్పటివరకు ఇలా కంటి పరీక్షలు మాత్రమే నిర్వహించే వారు. సర్కారు తాజా నిర్ణయంతో ఇకపై అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. -
ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్ లంచ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో భేటీ అయ్యారు. ఆదివారం మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని 97 డిపోల నుంచి డిపోకి ఐదుగురు చొప్పున సీనియర్ కార్మికులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశ అనంతరం కార్మికులతో కలిసి సీఎం కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని కార్మికులకు తెలియజేసేందుకే సీఎం కేసీఆర్ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే కార్మికుల సమస్యలు ఏంటో నేరుగా వారినే అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలను నేరుగా సీఎంకే వివరించామని, ఆయన సానుకూలంగా స్పందించి తమను ఆదుకుంటానని హామీ ఇచ్చారని కార్మికులు పేర్కొన్నారు. -
విధుల్లోకి చేరుతున్న ఆర్టీసీ కార్మికులు
సాక్షి, కరీంనగర్/ఆదిలాబాద్/నిజామాబాద్: ఆర్టీసీలో నవ శకం మొదలైంది. 55 రోజుల తర్వాత తెలంగాణ ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరుతున్నారు. ఎలాంటి షరతులు లేకుండా విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆనందం వ్యక్తం చేస్తూ కార్మికులు విధుల్లోకి చేరుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పది డిపోల పరిధిలో 3,800 మంది కార్మికులు పనిలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఆరు డిపోల వద్ద శుక్రవారం ఉదయం 3.30 గంటల నుంచి ఇప్పటివరకు దాదాపు 15 మంది కండక్టర్లు,డ్రైవర్లు విధుల్లోకి చేరారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు 5 గంటల నుంచే డ్రైవర్లు,కండక్టర్లు తొలి షిఫ్ట్ డ్యూటీలకు హాజరయ్యారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. సీఎం కేసీఆర్ కు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాల డిపోలో ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరారు. మెదక్ జిల్లాలో 2,890, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 4,098 మంది కార్మికులు విధుల్లోకి చేరారు. ఖమ్మం టౌన్: ఖమ్మం డిపోలో ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరవుతున్నారు. ఎటువంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవడం పట్ల సంతోషంగా ఉందని కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సుమారు 2600 మంది విధులకు హాజరుకానున్నారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో కార్మికులు విధులకు హాజరయ్యారు. చదవండి: డ్యూటీలో చేరండి -
ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలి: భట్టి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చర్చలు జరపాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీధర్బాబుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలతో ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి కమిటీ వేస్తామని హైకోర్టు చెప్పినా.. ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. -
కార్మికులు గెలవడం పక్కా కానీ..
సాక్షి, హైదరాబాద్ : ‘తెలంగాణ హైకోర్టు చెరో మెట్టు దిగమని ప్రభుత్వానికి, కార్మికులకు చెప్పింది. కానీ కార్మికులు మెట్టు దిగాల్సిన అవసరం లేదు. వారు మెట్టు మీద అసలే లేరు’ అని ఎమ్మార్మీస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అడ్డుకునేవారు ఉన్నంతసేపు కార్మికులు అనుకున్న ఫలితాలు రావు కానీ, చివరకు ధర్మమే గెలుస్తుందన్నారు. కేసీఆర్ తెలంగాణ కోసం దీక్ష చేసి విరమించిన రోజు కూడా అదే జరిగిందన్నారు. దీక్ష విరమించగానే తెలంగాణ రాలేదని, తర్వాత వచ్చిందని, అలాగే కార్మికుల లక్ష్యాలు కూడా తర్వాతి రోజుల్లో నెరవేరుతాయని అశాభావం వ్యక్తంచేశారు. ఎప్పుడు గెలుస్తారో చెప్పలేం కానీ కార్మికులు మాత్రం గెలవడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులకు ఎళ్లవేళలా ఎమ్మార్మీస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టిన చరిత్ర ఆర్టీసీకి ఉందని, కార్మికులు ఎవరూ ఆందోళన చెందొద్దని కోరారు. ఆర్టీసీ ఆస్తులు దోచుకోవడానికి సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్తో పోలిస్తే సమైక్యాంధ్ర నాయకులు వందశాతం నయమని చెప్పారు. ఉద్యోగాల పట్ల కార్మికులు ఎవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. -
భిక్షాటనతో ఆర్టీసీ కార్మికుల నిరసన
సాక్షి, సిద్దిపేట: జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. గురువారంతో 41వ రోజుకు చేరింది. జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో జేఏసీ పిలుపు మేరకు భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. హుస్నాబాద్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపి, వారికి మద్దతుగా భిక్షాటన చేశారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మతిస్థిమితం కోల్పోయి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కండక్టర్ నాగేశ్వర్(43) బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన నాగేశ్వర్ నారాయణఖేడ్ డిపోలో విధులు నిర్వర్తించేవాడు. ఆయన మృతితో జోగిపేటలో ఉద్రిక్తత నెలకొంది. -
తరుముతున్న డెడ్లైన్.. కార్మికుల్లో టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: గత 32 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు తిరిగి బేషరతుగా విధుల్లో చేరడానికి మంగళవారం అర్ధరాత్రి వరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు డెడ్లైన్ పెట్టిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ విధించిన డెడ్లైన్ గడువు మరికాసేపట్లో ముగియబోతుండటంతో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. సీఎం కేసీఆర్ విధించిన డెడ్లైన్కు కార్మికులు తలొగ్గుతారా? లేక సమ్మెను కొనసాగిస్తారా? కార్మికులు దిగిరాకపోతే.. కేసీఆర్ అన్నట్టే ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటు చేస్తారా? అన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆఫర్కు కార్మికుల నుంచి ఓ మోస్తరుగా స్పందన వస్తున్నట్టు కనిపిస్తోంది. సీఎం డెడ్లైన్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 208 మంది ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లోకి చేరినట్టు సమాచారం. బస్భవన్ కేంద్రంగా 100 మందికిపైగా విధుల్లో చేరినట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్పీ కార్యాలయాల్లో, ఆర్ఎం కార్యాలయాల్లో నేటి అర్ధరాత్రి వరకు కార్మికులు విధుల్లోకి చేరేందుకు అవకాశం కల్పించారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 5100 రూట్లను ప్రైవేటీకరించిన సంగతి తెలిసిందే. డెడ్లైన్లోపు కార్మికులు సమ్మె విరమించి విధుల్లోకి చేరకపోతే.. పూర్తిగా అన్నీ రూట్లను ప్రైవేట్ చేస్తామంటూ సీఎం కేసీఆర్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. మరోవైపు సీఎం కేసీఆర్ డెడ్లైన్ విధించినా కార్మికులు విధుల్లో చేరేది లేదని, ఇప్పటివరకు విధుల్లో చేరిన కార్మికులు కూడా తిరిగి వెనక్కి వస్తున్నారని ఆర్టీసీ జేఏసీ తెగేసి చెప్తోంది. కార్మికుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిందేనని, సమ్మె చేస్తున్న కార్మికులను చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేస్తోంది. ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ప్రైవేటీకరించలేదని, ఇందుకు కేంద్రం అనుమతి కూడా ఉండాలని అంటున్నారు. ఇప్పటివరకు విధుల్లో చేరిన కార్మికుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. -
సీఎం ‘ఆఫర్’ను అంగీకరించండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన ‘ఆఫర్’ను అంగీకరించాలని ఆల్ ఇండియా మజ్లిస్–ఏ–ఇత్తెహాదుల్–ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర, బిహార్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ సాధించిన విజయాల నేపథ్యంలో హైదరాబాద్ దారుస్సలాం మైదానంలో శనివారం రాత్రి నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో నిరవధిక సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికుల బాధ అర్థం చేసుకోదగిందేనని, అయితే బయట పేదరికం, ధరాఘాతం తీవ్రంగా ఉందని చెప్పారు. వీటిని దృష్టిలో పెట్టుకునైనా సీఎం కేసీఆర్ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని వాటిని అంగీకరించాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. సమ్మెలో కొందరు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మిమ్మల్ని మీరు చంపుకోవద్దని కోరారు. సీఎం కేసీఆర్తో చర్చలకు కూర్చోవాలని, కాంగ్రెస్, బీజేపీ మోసపూ రిత వలలో పడి జీవితాలను నాశనం చేసుకో వద్దని సూచించారు. కార్మికులందరికి తెలంగాణపై హక్కు ఉందని, చర్చలతో సమస్యను పరిష్కరించు కోవచ్చన్నారు. త్వరలో ప్రతిష్ఠంభన వీడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిఫ్టీ..ఫిఫ్టీ ఏంటి? మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఫిఫ్టీ–ఫిఫ్టీ ఫార్ములాను అసదుద్దీన్ తప్పుపట్టారు. ఈ ఫార్ములాపై ఇరు పార్టీల మధ్య నెలకొన్న వివాదాన్ని ఎద్దేవా చేశారు. మార్కెట్లో ఫిఫ్టీ–ఫిఫ్టీ పేరుతో కొత్త బిస్కట్ వచ్చిందా అని ప్రశ్నిం చారు. మహారాష్ట్ర ప్రజలకు ఏదైనా చేయాలనే తపన బీజేపీ, శివసేనకు లేదని, ఇరు పార్టీలు ఫిఫ్టీ–ఫిఫ్టీ గురించి మాట్లాడుతున్నాయన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ లేదా శివసేనకు తమ పార్టీ మద్దతు ఇవ్వబోదని తెలిపారు. శివసేనకు ఏం చేయాలో పాలుపోవడం లేదని, ఉద్ధవ్ ఠాక్రేకు ప్రధాని మోదీ భయం పట్టుకున్నట్టు కనిపిస్తోందన్నారు. ఈ సభలో మహారాష్ట్ర, బిహార్ నుంచి విజయం సాధించిన పార్టీ ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు. జెడ్ అక్షరం తొలగించొద్దు ఆర్టీసీని ప్రైవేటీకరించినప్పటికీ బస్సుల నంబర్ ప్లేట్లలోని ‘జెడ్’అక్షరం తొలగించవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్కు ఓవైసీ అభ్యర్థించారు. హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తల్లి జెహ్రా పేరు నుంచి ఆర్టీసీ నంబర్ ప్లేట్లలో జెడ్ అనే అక్షరం వచ్చిందని గుర్తు చేశారు. ఇది హైదరాబాద్ చరిత్రలో ఒక భాగమన్నారు. బస్సులో జెడ్ అక్షరాన్ని కొనసాగించా లని విజ్ఞప్తి చేశారు. -
కార్మికులను రెచ్చగొట్టే యత్నం: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు సహనంతో, గాంధీజీ అహింస సిద్ధాంతంతో సమ్మెను కొనసాగిస్తున్నారని, సీఎం కేసీఆర్ చేసే భయానక ప్రకటనలు వారిపై కించిత్తు ప్రభావం కూడా చూపడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టు చెబుతున్నా, ప్రజాసంఘాలు సూచిస్తున్నా సీఎం ఎగతాళి చేసే విధంగా మాట్లాడుతున్నారని, పిచ్చి ప్రేలాపణలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వచ్చాక కూడా ఆత్మహత్యలు దేనికి సంకేతమని ప్రశ్నించారు. కేసీఆర్ హైకోర్టునే ధిక్కరించే విధంగా మాట్లాడుతున్నారని, కోర్టులో పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. గురువారం సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా యూనిటీ ఫర్ రన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం లక్ష్మణ్ సమక్షంలో మేడ్చల్ జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు బీజేపీలో చేరారు. -
ఆర్టీసీ కార్మికులను వేధిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: తన మొండి వైఖరితో సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను వేధిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. ఇప్పటివరకు జరిగిన ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి తాము అండగా ఉంటామని, ఆర్టీసీ కార్మికుల పక్షాన కాంగ్రెస్ నిలుస్తుందని చెప్పారు. మంగళవారం గాందీభవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం మొండివైఖరితో సాగడం మంచిది కాదన్నారు. వెంటనే సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ఏఐసీసీ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్, శ్రీనివాసరావులు మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమన దిశలో పయనిస్తున్న తీరును పవర్పాయింట్ ప్రెజెంటేషన్ (పీపీపీ) ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు వివరించారు. ఈ సమావేశంలో దాసోజు శ్రావణ్, ఆర్.సి.కుంతియా, జానారెడ్డి, భట్టివిక్రమార్క, రేవంత్రెడ్డి, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, సంపత్కుమార్, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, సీతక్క, పొడెం వీరయ్య, పార్టీ నేతలు వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి చికిత్సకు ఉత్తమ్ ఉత్తమ్ ప్రకృతి చికిత్స తీసుకునేందుకు బెంగళూరుకు వెళ్లారు. బుధవారం నుంచి 10 రోజుల పాటు జిందాల్ నేచుర్కేర్ సెంటర్లో బసచేసి చికిత్స పొందుతారు. గత డిసెంబర్ నుంచి వరుసగా వస్తున్న ఎన్నికలతో కలిగిన మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం ఆయన చికిత్సకు వెళ్తున్నారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. -
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు
-
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా మావోయిస్టుల లేఖ
-
ఆర్టీసీ సమ్మె: సాయంత్రం 6 లోగా చేరాలి.. లేకపోతే అంతే!
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో తెలంగాణ ప్రభుత్వం కఠినమైన వైఖరిని అవలంబిస్తోంది. శనివారం సాయంత్రం 6 గంటల్లోగా ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని, ఒకవేళ వారు విధులకు హాజరుకాకపోతే.. వారిని ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించబోమని మరోసారీ టీఎస్ సర్కారు తేల్చిచెప్పింది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. విధుల్లో చేరని కార్మికులను భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ ఉద్యోగులుగా సంస్థ గుర్తించబోదని ఆయన తెలిపారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగనిరీతిలో శాశ్వత ప్రత్యామ్నాయ రవాణా విధానానికి రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ముఖ్యంగా మూడు ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం పరిశీలీస్తున్నదని పువ్వాడ చెప్పారు. మూడు నుంచి నాలుగు వేల ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకుని నడపడం, ఆర్టీసీ బస్సులు నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్సు కలిగిన యువతీ యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఉద్యోగావకాశం కల్పించడం.. వారికి తక్షణం తగు శిక్షణ ఇచ్చి, బస్సులను యధావిధిగా నడపడం తదితర చర్యలను తీసుకోనున్నట్టు ఆయన వివరించారు. సమ్మెను ఎదుర్కోవడంలో భాగంగా ఆరు నుంచి ఏడు వేల ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. శనివారం సాయంత్రం వరకు నెలకొన్న పరిస్థితిని ప్రభుత్వం గమనిస్తోందని, ఆదివారం ఆర్టీసీ సమ్మెపై ఉన్నతస్థాయి సమీక్షను ప్రభుత్వం నిర్వహించి.. ఆర్టీసీకి సంబంధించి ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేస్తుందని ఆయన వెల్లడించారు. సమ్మెపై సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. -
సీఎం జగన్ కీలక నిర్ణయం.. పాలాభిషేకాలు, హర్షాతిరేకాలు
సాక్షి, అమరావతి : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న సంచనలన నిర్ణయం పట్ల ఆ సంస్థ కార్మికులు, ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కల సాకారమయిదంటూ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ, స్వీట్లు పంచుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేందుకు అంగీకరించిన సీఎం జగన్కు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పేర్ని నానితో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఆర్టీసీని ప్రభుత్వంలో చేసినందుకుగాను మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో ఈయూ నాయకులు వలిశెట్టి దామోదరరావు(వైవీ రావు), ఎన్ఎమ్యూ నాయకులు వై శ్రీనివాసరావు, ఏ విష్ణు రెడ్డి, ఏ సుధాకర్, వెంకటరమణ తదితరులు ఉన్నారు. విజయవాడలో ఈయూ నేతల సంబరాలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల్లో సంబరాలు చేశారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పుష్పార్చన చేసి, స్వీట్లు పంచుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఇచ్చిన మాటలను నిలబెట్టుకునేందుకు సంతోషంగా ఉందన్నారు. ఆర్టీసీ విలీన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విలీనంతో పాటు ఆర్టీసీలోని ఇతర సమస్యలు, తమకు దక్కాల్సిన బెనిఫిట్స్పై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కోరారు. సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం ఆర్టీసీ కార్మీకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మచిలీపట్నం ఈయూ సంఘ నేతలు అనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని చిత్ర పటాలకు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను తెలిపారు. తిరువూరులో ఆర్టీసీ కార్మికుల సంబరాలు సీఎం వైఎస్ తీసుకున్న సంచలన నిర్ణయం పట్ల కృష్ణా జిల్లా తిరువూరు ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాల తమ కల నెరవేరిందంటూ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలు సంబరాలు చేసుకున్నారు. విలీనాన్ని హర్షిస్తూ సీఎం జగన్, రవాణా మంత్రి పేర్నినాని, ఎమ్మెల్యే కే.రక్షణనిది చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. తిరుపతిలో.. ఆర్టీసీ ఉదోగుల్లో సంబరాలు అంబరాన్ని తాకాయి. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న సంచలన నిర్ణయం పట్ల తిరుపతిలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. సీఎం వైఎస్ జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కేకులు కట్ చేసి సంతోషంగా ఒకరికి ఒకరు తినిపించుకొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువనేత భూమన అభినయ రెడ్డి కూడా పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ కు తాము జీవితాంతం రుణపడి ఉంటామని ఆర్టీసీ కార్మికులు అన్నారు. నెల్లూరులో.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటంపై ఎంఎంయూ నేత రమణ రాజు ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్ర పటానికి పూలాభిషేకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ మాట ఇస్తే నిలబెట్టుకొంటారనే దానికి ఇదే ఉదాహరణ అన్నారు. సీఎం జగన్కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. చిత్తూరులో.. ఆర్టీసి విలీనాన్ని హర్షిస్తూ మదనపల్లిలో ఎమ్మెలే నవాబ్ బాషా సమక్షంలో ఆర్టీసీ కార్మికులు బారీ కేక్ను కట్ చేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. తమ దశాబ్దాల కలను నెరవేర్చినందుకు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖలో.. ఆర్టీసీ ను ప్రభుత్వం లో విలీనం చేస్తూ కాబినెట్ ఆమోదముద్ర వేయడంతో మద్దిలపాలెం ఆర్టీసీ డిపోలో ఎన్ఎంయూ ఆధ్వర్యంలో కార్మికులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ చిత్ర పటానికి పుష్పాభిషేకం నిర్వహించారు. అనంతరం బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. గుంటూరులో.. విలీనాన్ని హర్షిస్తూ మాచర్ల ఆర్టీసీ కార్మికులు సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, వివిధ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. విజయనగరంలో.. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనాన్ని హర్షిస్తూ ఆర్టీసీ కార్మికులు జిల్లా వ్యాప్తంగా సంబరాలు నిర్వహించారు. మజ్దూర్ యూనియన్ నాయకులు ఆధ్వర్యంలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. -
‘పరపతి’ పోయింది!
నా జీతం నుంచి కట్ చేసి సహకార పర పతి సంఘం (సీసీఎస్)లో డిపాజిట్ చేసిన డబ్బు రూ.రెండున్నర లక్షలు ఉంది. అందులోంచి రూ. 2.5 లక్షల రుణం కోరితే లేదంటే ఎలా?. అత్యవసరమై పిల్లల చదువు కోసం బయట అప్పు చేశా. ప్రతినెలా రూ.10 వేలు వడ్డీ కట్టాల్సి వస్తోంది. వేతనంలో అంత మొత్తం అటు పోతే మేము బతికేదెట్లా – నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ గోడు కుటుంబ అవసరాల కోసం ఓ కండక్టర్ వడ్డీ వ్యాపారి వద్ద రూ.9 లక్షలు అప్పు చేశాడు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇప్పుడు ఆయన కుటుంబం అప్పు తీర్చేదెలా అని లబోదిబోమంటోంది. అదే ఆర్టీసీ సహకార పరపతి సంఘం నుంచి లోన్ వచ్చి ఉంటే, నిబంధనల ప్రకారం ఆ అప్పు మాఫీ అయి ఉండేది. – హైదరాబాద్కు చెందిన కండక్టర్ కుటుంబం ఆవేదన ఇలా ఎంతో మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులు ప్రతినెలా తమ జీతంలో నుంచి దాచి పెట్టుకున్న నిధిని ఆర్టీసీ యాజమాన్యం స్వాహా చేసేయటమే దీనికి కారణం. ఏడాది కాలంగా ఆ మొత్తాన్ని సొంత అవసరాలకంటూ ఆర్టీసీ వాడేసుకుని, ఇప్పుడు చెల్లించలేమంటూ చేతులెత్తేయడంతో అత్యవసరాలకు రుణాలు అందక కార్మికులు అవస్థలు పడుతున్నారు. ఇదీ ఆర్టీసీ సహకార పరపతి సంఘం దీనావస్థ. కాగా, యాజమాన్య తీరును నిరసిస్తూ ఆ సంఘం నిర్వాహకులు చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తలుపుతట్టారు. ఏమిటీ ఈ నిధి... ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు అవసరాల కోసం ప్రత్యేకంగా సహకార పరపతి సంఘం ఏర్పాటైంది. ప్రతి ఉద్యోగి జీతంలో బేసిక్పై 7 శాతం మొత్తాన్ని సంస్థ కట్ చేసి ఈ సంఘానికి జమ చేస్తుంది. అలా ప్రతినెలా తెలంగాణ ఆర్టీసీలో రూ.40 కోట్లు జమ కావాలి. అలా వచ్చే మొత్తం నుంచి కార్మికులు పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇళ్లు కట్టుకోవటం... తదితర అవసరాలకు రుణంగా పొందుతారు. ఆ మొత్తాన్ని బ్యాంకు వడ్డీ కంటే తక్కువ వడ్డీతో చెల్లిస్తారు. జరిగింది ఇదీ.. దాదాపు 12 నెలలుగా ఆర్టీసీ ఆ నిధులను సీసీఎస్లో జమ చేయటం లేదు. దీంతో ఏడు నెలలుగా సీసీఎస్ అధికారులు రుణాలు ఇవ్వలేకపోతున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులూ రావటం లేదని, విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చినా ఉపయోగం లేదని అధికారులు పేర్కొనటంతో గత్యంతరం లేక సీసీఎస్ హైకోర్టును ఆశ్రయించింది. గతంలో సీసీఎస్ నిధిని వాడుకుంటే ఆర్టీసీ వడ్డీతో సహా తిరిగి చెల్లించేది. కానీ టీఎస్ఆర్టీసీ ఏర్పడినప్పటి నుంచి వడ్డీ ఇవ్వక రూ.45 కోట్ల బకాయిలు పడింది. దీంతో సీసీఎస్ అంటేనే కార్మికులకు నమ్మకం సడలింది. కొంతకాలంగా దాదాపు 4 వేల మంది కార్మికులు సభ్యత్వాన్ని రద్దు చేసుకుని బయటకొచ్చారు. – సాక్షి, హైదరాబాద్ -
త్వరలో సీఎంను కలవనున్న ఆర్టీసీ కార్మికులు
-
ఆర్టీసీలో సమ్మె సైరన్
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. జూన్ 13 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నామని కార్మిక సంఘాలు ప్రకటించాయి. బుధవారం ఆర్టీసీ హౌస్లో యాజమాన్యంతో జరిపిన చర్చలు ఫలించలేదని కార్మిక నేతలు పేర్కొన్నారు. యాజమాన్యం నుంచి తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ రాకపోవడంతో సమ్మెకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. సమ్మె నోటీసులు ఇచ్చి 14 రోజులు అయినా ఎవరూ స్పందించలేదన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మొండి చేయి చూపుతుందని మండిపడ్డారు.తమ డిమాండ్లను నెరవేర్చేవరకూ సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లు 2013 కి వేతనాల సవరణకు సంబందించిన పెండింగ్ అరియర్సు వెంటనే చెల్లించాలి. 4000 మంది సిబ్బందిని తగ్గించాలంటూ వీసీ, ఎండీలు చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. అద్దెబస్సుల పెంపు నిర్ణయాలను ఉపసంహరించుకోవాలి ఆర్టీసీ బస్సులను పెంచాలి. ప్రభుత్వం నుంచి ఆర్టీసికి రావాల్సిన రూ.650 కోట్లు వెంటనే చెల్లించాలి. సీసీఎస్ నుంచి ఆర్టీసి యాజమాన్యం వాడుకున్న రూ.285 కోట్ల కార్మికుల సొమ్మును వెంటనే యాజమాన్యం చెల్లించాలి. గ్రాడ్యుటీ, వీఆర్ఎస్ సర్క్యులర్లో ఉన్న లోపాలు సరిచేయాలి. కారుణ్యనియామాకాలు వెంటనే చేపట్టాలి. మిగిలి ఉన్న కాంట్రాక్టు కార్మికులను తీసుకోవాలి. అందరినీ రెగ్యూలర్ చెయాలి. ఆర్టీసి పాలకమండలిలో కార్మిక సంఘాలకు బాగస్వామ్యం కల్పించాలి. చట్ట ప్రకారం కార్మిక సంఘాలకు ఇవ్వాల్సిన సౌకర్యాలలో వీసీ, ఎండీ తొలగించిన సౌకర్యాలను పునరుద్దరించాలి. -
‘ఎస్మా చట్టాలు సమ్మెను ఆపలేవు’
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు ఆటంకం కలిగించే విధంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల సమస్యలపై, సంస్థ పరిరక్షణ కోసం సమ్మె నోటీసులు ఇచ్చిన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం ఎస్మా చట్టాలను బయటకు తెచ్చి ఆరునెలలు సమ్మె నిషేధమంటారని విమర్శించారు. ఈ మేరకు ఎపీఎస్ ఆర్టీసీ కార్మిల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ పలిశెట్టి దామోదరరావు లేఖను విడుదల చేశారు. ఎస్మా చట్టాలు సమ్మెను ఆపలేవని, ఈనెల 20 తర్వాత ఎప్పుడైనా సమ్మె ఉండొచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వం కార్మికులను భయపెట్టే ప్రయత్నం చేస్తోందని, ప్రభుత్వం బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదనన్నారు. ఆర్టీసీ యాజమాన్య సిబ్బంది కుదింపుపై తీసుకున్న చర్యలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. కాగా ఏపీఎస్ఆర్టీసీలో కార్మిక సంఘాలు సమ్మెకు సన్నద్ధమైన విషయం తెలిసిందే. మొత్తం 19 డిమాండ్లతో కూడిన పత్రాన్ని ఇటీవల ఆర్టీసీ ఎండీకి అందించారు. ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు ప్రభుత్వంలో విలీనం చేయాలని, సిబ్బంది కుదింపు చర్యలు ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఆర్థిక భారం.. లేదు సాయం
సాక్షి, అమరావతి: సామాన్యుడి రవాణా సాధనమైన ఆర్టీసీ బస్సు నష్టాల ఊబిలో కూరుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది. గత ఐదేళ్లుగా నష్టాలు నానాటికీ పెరుగుతుండడం, సర్కారు నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. కాస్త చేయూతనందించి, కష్టాల కడలి నుంచి గట్టెక్కించండి అని పదేపదే విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం కనీసం స్పందించిన పాపానపోలేదని ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించాలంటే ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు చాలా ఏళ్లుగా కోరుతున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సంస్థను కాపాడుకోవాలంటే టిక్కెట్ చార్జీలు పెంచడం మినహా మరో గత్యంతరం లేదని ఆర్టీసీ యాజమాన్యం తేల్చిచెబుతోంది. సంస్థ ఆస్తులు హాంఫట్ ఆర్టీసీపై అప్పుల భారం ప్రస్తుతం రూ.6,445 కోట్లకు చేరింది. నష్టాలు ప్రతిఏటా పెరుగుతూ ఇప్పుడు రూ.1,029 కోట్లకు చేరాయి. ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోకపోగా, సంస్థ ఆస్తులను అస్మదీయులకు అప్పనంగా అప్పగించేసింది. బీవోటీ విధానంలో విలువైన ఆస్తులను కారుచౌకగా కట్టబెట్టి ఆర్టీసీ మనుగడను దెబ్బతీసింది. ప్రభుత్వ ప్రచారానికి, అధికార పార్టీ కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులను యథేచ్ఛగా వాడుకున్నారు. పోలవరం యాత్రలకు ఆర్టీసీ బస్సులను తిప్పారు. ఇందుకు గాను ఆర్టీసీకి ప్రభుత్వం రూ.75 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ నిధులు జల వనరుల శాఖ విడుదల చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయినా ఇప్పటిదాకా రూపాయి కూడా రాలేదు. ముఖ్యమంత్రి సభలకు, ధర్మపోరాట దీక్షలకు డ్వాక్రా మహిళలను, జనాన్ని తరలించడానికి ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకున్నారు. వాటికి సక్రమంగా బిల్లులు చెల్లించిన దాఖలాలు లేవు. ఫలితంగా ఆర్టీసీ రూ.కోట్లల్లో ఆదాయం కోల్పోయింది. ఆర్టీసీ సొమ్ముతో ముఖ్యమంత్రి సోకులు ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం ఆర్టీసీకి చెందిన రూ.9 కోట్ల నిధులతో అత్యాధునికమైన బుల్లెట్ ప్రూఫ్ బస్సును కొనుగోలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన సుబ్బారావు అనే పొగాకు రైతు తమకు గిట్టుబాటు కల్పించడం లేదు గానీ ముఖ్యమంత్రి కోసం బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఏటా రూ.281 కోట్ల వడ్డీ కట్టాల్సిందే.. ఆర్టీసీపై అప్పుల భారం పెరిగిపోవడంతో రుణాల కోసం బ్యాంక్లను ఆశ్రయించక తప్పడం లేదు. బస్టాండ్లను తనఖా పెట్టి మరీ రుణాలు పొందారు. ప్రస్తుతం బ్యాంకు రుణాలు రూ.2,026 కోట్లు ఉండగా, వీటికి వడ్డీ కింద ప్రతిఏటా రూ.281 కోట్లు బ్యాంకులకు చెల్లిస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ‘హడ్కో’ నుంచి పొందిన రుణం రూ.793 కోట్లు ఉంది. సంస్థకు చెందిన క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ, ప్రావిడెంట్ ఫండ్లో కార్మికులు దాచుకున్న రూ.1,232 కోట్లను ఆర్టీసీ వాడుకుంది. కనీసం ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన యూనిఫాంను మూడేళ్లుగా ఇవ్వడం లేదు. ఎంవీ ట్యాక్స్ ముక్కు పిండి మరీ వసూలు మోటార్ వాహన పన్ను(ఎంవీ ట్యాక్స్) ఆర్టీసీకి పెనుభారంగా పరిణమించింది. ఎంవీ ట్యాక్స్ తగ్గించాలని ఆర్టీసీ యాజమాన్యం పంపిన ప్రతిపాదనలను ప్రతిఏటా ప్రభుత్వం కొట్టిపారేసింది. ఆర్టీసీకి పన్ను మినహాయింపు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఎంవీ ట్యాక్స్ గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ ఆదాయంలో 13 శాతం ఉండేది. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత దాన్ని 7 శాతానికి తగ్గించారు. ప్రస్తుతం నష్టాల్లో కూరుకున్న ఆర్టీసీని ఆదుకోవాలంటే ఎంవీ ట్యాక్స్ నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది. ప్రభుత్వానికి ఏటా రూ.300 కోట్లు ఎంవీ ట్యాక్స్ కింద ఆర్టీసీ ఏటా ప్రభుత్వానికి రూ.300 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఆర్టీసీకి వచ్చే ఆదాయంలో ప్రతి మూడు నెలలకు 7 శాతం వంతున మోటార్ వాహన పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలి. ప్రతి రోజూ ఆర్టీసీకి సగటున రూ.12 కోట్ల ఆదాయం వస్తోంది. అంటే మూడు నెలలకు రూ.1,080 కోట్లు, ఏడాదికి రూ.4,320 కోట్లు. ఈ ఆదాయంలో రూ.302 కోట్ల వరకు ఎంవీ ట్యాక్స్ కింద ప్రభుత్వానికి చెల్లించాలి. 2015–16లో ఎంవీ ట్యాక్స్ రూ.280 కోట్లు ఉండగా, 2018–19 నాటికి అది రూ.316 కోట్లకు చేరింది. డీజిల్ భారం రూ.650 కోట్లు డీజిల్ ధర 2015–16లో లీటర్కు రూ.49 ఉండగా, 2018–19 నాటికి రూ.70.41కి చేరింది. డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా ఆర్టీసీపై భారం పెరిగిపోతోంది. డీజిల్ భారం ఆర్టీసీపై ఈ ఏడాది రూ.650 కోట్లు ఉంది. ఈ భారాన్ని భరించాలని యాజమాన్యం పలుమార్లు వినతి చేసినా ప్రభుత్వం లెక్కచేయలేదు. డీజిల్పై వ్యాట్ 17 వాతం వరకు ప్రభుత్వానికి చెల్లించాలి. దీన్ని తగ్గించాలని కోరుతున్నా సర్కారు ససేమిరా అంటోంది. ధనిక వర్గాలు ప్రయాణించే విమాన ఇంధనంపై ప్రభుత్వం కేవలం 1 శాతమే వ్యాట్ వసూలు చేస్తోంది. మిగిలిన 16 శాతాన్ని ప్రభుత్వమే భరిస్తుండడం గమనార్హం. -
సమ్మెకు రెడీ..!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)లో కార్మిక సంఘాలు సమ్మెకు సన్నద్ధమయ్యాయి. కార్మికసంఘాలు పోటాపోటీగా ఆర్టీసీ ఎండీ ఎన్వీ సురేంద్రబాబుకు సమ్మె నోటీసులు అందించనున్నాయి. బుధవారం నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) నాయకులు ఆర్టీసీ ఎండీని కలిసి సమ్మె నోటీసు అందించారు. ఎన్ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి నేతృత్వంలో ఆ యూనియన్ నాయకులు సమ్మెకు సిద్ధమని ప్రకటించారు. మొత్తం 19 డిమాండ్లతో కూడిన పత్రాన్ని ఎండీకి అందించారు. ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు ప్రభుత్వంలో విలీనం చేయాలని, సిబ్బంది కుదింపు చర్యలు ఆపేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీకి ఉన్న అప్పులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈక్విటీ కింద మార్పు చేయాలని, ఎంవీ ట్యాక్స్ను పదేళ్ల పాటు హాలిడే ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్టీసీలో గుర్తింపు సంఘంగా ఉన్న ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) గురువారం ఎండీకి మరోసారి సమ్మె నోటీసు ఇవ్వనుంది. గతంలో ఈయూ సమ్మె నోటీసిచ్చిన సందర్భంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో చర్చలు జరిపి సమ్మె నోటీసును ఉపసంహరించుకున్నారు. ఆర్టీసీ సమ్మెకు ఏఐటీయూసీ మద్దతు ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన నిరవధిక సమ్మెకు ఏఐటీయూసీ పూర్తి మద్దతు ప్రకటించింది. గత నవంబర్లో ఎంప్లాయీస్ యూనియన్తో ఆర్టీసీ యాజమాన్యం చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయడంలో విఫలమైందని పేర్కొంది. ఈయూ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ.. సమ్మెకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అన్ని యూనియన్లు కలిసి సమ్మె నోటీసు ఇవ్వనున్నాయని, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఏప్రిల్ 5వ తేదీలోపు ఇవ్వాల్సిన బకాయిలను, క్రెడిట్ సొసైటీకి చెల్లించాల్సిన రూ. 250 కోట్లు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒప్పందాన్ని అమలు చేయడానికి ఎన్నికల నిబంధనావళి అడ్డంగా ఉందని ఆర్టీసీ ఎండీ చెప్పడం సరికాదన్నారు. కార్మికులు సమ్మెకు దిగితే అందుకు ఆర్టీసీ యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్, ఈయూ అధ్యక్షుడు వైవీ రావు, కార్యదర్శి పి.దామోదరరావు తదితరులు ప్రసంగించారు. -
చక్రం తిరుగుతోంది చందాలతోనే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) పరిస్థితి అత్యంత దయ నీయంగా మారింది. గతంలో ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. కార్మికులకు జీతాలు ఇవ్వడానికే దిక్కులు చూస్తున్న సంస్థ.. ఏవైనా పనులు చేయించాలంటే వారి వద్దే చేయి చాస్తోంది. కార్మికులు తమ జేబులో నుంచి డబ్బులు తీస్తే తప్ప.. సంస్థలో అభివృద్ధి పనులు జరగని పరిస్థితి కనిపిస్తోంది. ఆర్టీసీ ఏర్పడిన తర్వాత 8 దశాబ్దాల్లో ఎన్నడూ ఇంతటి గడ్డు పరిస్థితి లేదు. నష్టాలు వచ్చినప్ప టికీ.. సిబ్బంది వేతనాలు, ఇతరత్రా అభివృద్ధి పనులకు అంతగా ఇబ్బంది ఉండేది కాదు. ప్రస్తుతం పరిస్థితి దారుణంగా మారింది. సంస్థ వద్ద చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో కొత్త బస్సులు కొనలేక డొక్కు బస్సులతోనే నెట్టు కొస్తోంది. కార్మికుల కోసం డిపోల పరిధిలో ఏవైనా పనులు చేయాల్సి వస్తే ‘బస్ భవన్’ నిస్సహాయంగా చూస్తోంది. దీంతో కార్మికులే చందాలు వేసుకుని పనులు చేసుకుంటున్నారు. డిస్పెన్సరీ ఏర్పాటుకు... వరంగల్ రీజియన్ పరిధిలోని కార్మికులందరి చేతిలో ‘క్లినిక్ డిస్పెన్సరీ డెవలప్మెంట్ ఫండ్’ కూపన్లే కనిపిస్తున్నాయి. హన్మకొండలో ఆర్టీసీ కార్మికుల కోసం విశాలమైన డిస్పెన్సరీ ఉంది. వరంగల్–1 డిపో మేనేజర్ కార్యాలయం ఉన్న భవనం రెండో అంతస్తులో దీనిని ఏర్పాటు చేశారు. అయితే, దీనికి లిఫ్టు వసతి లేదు. కనీసం ర్యాంపు కూడా లేకపోవడంతో అత్యవసర చికిత్స కోసం వచ్చే కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పైకి వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కార్మికుల డిమాండ్ మేరకు డిస్పెన్సరీని రీజినల్ మేనేజర్ కార్యాలయం ఉన్న భవనంలో కింద ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.లక్షల్లోనే ఖర్చవుతుందని అంచనా వేశారు. కానీ, ఆ నిధులు ఇచ్చేందుకు ఆర్టీసీ వద్ద ఎలాంటి ఫండ్ లేదు. ఏరోజుకారోజు టికెట్ల రూపంలో వచ్చే డబ్బులు తప్ప ఆర్టీసీ వద్ద ఎలాంటి నిధులూ లేవు. కార్మికుల భవిష్యనిధి, ఆర్టీసీ పరపతి సహకార సంఘం, పదవీ విరమణ, చనిపోయిన కార్మికులకు ఇచ్చే థ్రిఫ్ట్ అండ్ బెన్వలెంట్ ఫండ్ను కూడా వదలకుండా వాడేసుకుంటున్న దుస్థితి నెలకొంది. దీంతో ఇలాంటి అభివృద్ధి పనులకు ఇవ్వడానికి నయా పైసా కూడా సంస్థ వద్ద లేదు. ఆర్టీసీ కేంద్ర కార్యాలయం నుంచి డబ్బులు వచ్చే పరిస్థితి లేకపోవటంతో వరంగల్ రీజియన్ అధికారులు స్థానిక కార్మిక సంఘాలతో సమావేశమై చందాలు వేసుకుని ఈ పని చేయించుకోవాలని నిర్ణయించారు. వరంగల్ రీజియన్ పరిధిలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు రూ.50 చొప్పున చెల్లించే విధంగా రశీదు పుస్తకాలు ముద్రించారు. వాటిని డిపోలకు పంపిణీ చేసి చందాలు వసూలు చేస్తున్నారు. లక్కీ డ్రా తీసి విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తామంటూ కూపన్లపై ముద్రించారు. దీంతో కొందరు కార్మికులు పది వరకు కూపన్లు తీసుకుంటున్నట్టు తెలిసింది. డిస్పెన్సరీ చాలా ఉపయోగకరమైంది కావటంతో కొంతమంది స్వచ్ఛందంగా అదనంగా చందాలు రాస్తున్నారు. ఇలా వసూలు చేస్తున్న మొత్తంతో కొత్త డిస్పెన్సరీ పనులు చేయిస్తున్నారు. డ్రైవర్డేకు చందాలే దిక్కు... కార్మికుల సంక్షేమం, ఇతర ప్రత్యేక రోజులకు సంబంధించి కార్యక్రమాలు నిర్వహించటం ఆనవాయితీ. డ్రైవర్ దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. ఆ రోజు డ్రైవర్ల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవటంతోపాటు వారికి బహుమతులు ఇచ్చి, ఉత్తమ డ్రైవర్లను సన్మానిస్తారు. ఇలాంటి కార్యక్రమాలకు ఆర్టీసీనే ఖర్చు భరిస్తుంది. కానీ నిధులు లేక ఇటీవల కార్మికులే చందాలు వేసుకుని ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. వరంగల్ రీజియన్లో ఇలా రూ.50, రూ.100 చొప్పున చందాలు వేసుకుని అన్ని డిపోల పరిధిలో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం ఎండలు తీవ్రం కావడంతో అన్ని డిపోల్లో మంచినీటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఇందుకోసం చాలాచోట్ల భారీ ట్యాంకులు ఏర్పాటు చేసి కార్మికులకు మంచినీటిని అందుబాటులో ఉంచుతున్నారు. అయితే, ట్యాంకులు కొనడానికి నిధులు లేకపోవటంతో చాలాచోట్ల కార్మికులే చందాలు వేసుకున్నట్టు సమాచారం. అవినీతికి ఆస్కారం కాదా? అభివృద్ధి పనుల పేరుతో కార్మికుల నుంచి చందాలు వసూలు చేయటాన్ని కొందరు తప్పుపడుతున్నారు. అది అవినీతికి దారి తీస్తుందని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కార్మికుల నుంచి చందాలు వసూలు చేసి పనులు పూర్తి చేసిన తర్వాత, భవిష్యత్తులో ఆ ఖర్చు తాలూకు బిల్లులు పెట్టి ఆర్టీసీ నిధుల నుంచి వసూలు చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. తమ భాగస్వామ్యంలో ఇలాంటి పనులు జరగడం సంతోషంగా ఉందని అనేవారూ ఉన్నారు. గతంలో తమ జీతాల నుంచి కొంత మొత్తం మినహాయించి కొత్త బస్సులు కొన్నారని, ఇప్పటికీ అవి తిరుగుతున్నాయని, వాటిని చూస్తే ఆనందం కలుగుతుందని పేర్కొంటున్నారు. తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రి నిర్మాణ సమయంలో కూడా తాము చందాలు ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేలేం చేస్తున్నారు..? వాస్తవానికి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు తమ అభివృద్ధి నిధులను కేటాయించాల్సి ఉంటుంది. ఇందుకోసం గతంలోనే ఎమ్మెల్యేలకు ఆర్టీసీ లేఖలు రాసింది. గత ప్రభుత్వ హయాంలో ఈటల రాజేందర్, మధుసూదనాచారి, మహేందర్రెడ్డి, సోమారపు సత్యనారాయణ సహా పది పన్నెండు మంది మాత్రమే కొంతమేర ఆర్టీసీకి నిధులిచ్చారు. మిగిలినవారు ఎవరూ స్పందించలేదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఒక్కరు కూడా ఆర్టీసీకి నిధులు కేటాయించలేదు. కొన్ని చోట్ల అధికారులు విన్నవించినా ఎమ్మెల్యేలు స్పందించలేదు. -
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల ధర్నా
-
ఈ నెల 6నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె
-
కొనసాగుతున్న ఏపీఎస్ ఆర్టీసీ ఎన్నికలు
సాక్షి, అమరావతి : ఏపీఎస్ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు గురువారం తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది. దాదాపు 50వేల మంది ఆర్టీసీ కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఏపీలోని 128 డిపోల్లో పోలింగ్ జరుగుతోంది. హైదరాబాద్లోని ఎంజీబీఎస్, బస్ భవన్లలో 26 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. ఎన్ఎమ్యూ, ఈయూల మధ్యే ప్రధానంగా పోటీ నడుస్తోంది. రాత్రి 10.30 గంటల్లోపు ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. -
ఆర్టీసీలో యూనిఫాంల కొరత
సాక్షి, హైదరాబాద్: ఎండనకా.. వాననకా.. శ్రమించే కార్మికులు వారు. రుతువులతో సంబంధం లేకుండా.. ప్రజలందరినీ గమ్యస్థానాలకు చేర్చడమే వారిపని. ప్రగతి రథ చక్రాలను 24 గంటల పాటు నడిపిస్తూ ఆర్టీసీ మనుగడకు ఊపిరిగా నిలుస్తున్నారు. అలాంటి ఆర్టీసీ కార్మికులకు ఐదేళ్లుగా సంస్థ నుంచి యూనిఫాం అందట్లేదు. దీంతో ఇన్నేళ్ల నుంచి సిబ్బంది సొంత డబ్బులతో యూనిఫాం కొనుక్కుని విధులకు హాజరవుతున్నారు. నిబంధనల ప్రకారం రెండేళ్లకు మూడు యూనిఫాంలను సిబ్బందికి సంస్థ సరఫరా చేయాలి. (1.2 మీటర్ల ప్యాంటు, 2 మీటర్ల షర్ట్ క్లాత్). దాంతోపాటు కుట్టుకూలీ కింద రూ.200 చెల్లించాలి. చివరిసారిగా 2013లో సిబ్బందికి యూనిఫాంలు అందజేశారు. ఆర్టీసీ అధికారులను ఎప్పుడు అడిగినా.. ఇదిగో ఇస్తున్నాం.. అదిగో ఇస్తున్నాం.. అంటున్నారే తప్ప ఆచరణలో విఫలమవుతున్నారు. కాగా, ఇప్పటికే పలురకాల సమస్యలతో సతమతమవుతోన్న ఆర్టీసీ కార్మికులకు యూనిఫాం అదనపు భారంగా మారింది. సంస్థ ఇవ్వకపోవడంతో గత్యంతరంలేక వారే కుట్టించుకుంటున్నారు. అయితే ఈ దుస్తుల రంగుల్లో ఏకరూపత ఉండట్లేదు. ఒకే డిపోలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లు ధరించే దుస్తుల ఖాకీ రంగుల్లో పలు రకాల వ్యత్యాసాలు ఉంటున్నాయి. ఎవరు బాధ్యులు? 52 వేల మందికిపైగా ఉన్న సంస్థలో కిందిస్థాయి ఉద్యోగులకు చీఫ్ కంట్రోలర్ ఆఫ్ స్టోర్స్ కార్యాలయం యూ నిఫారాలను ఇస్తుంది. ఇందుకు ముందుగా టెండర్లు పిలుస్తుంది. అందులో ఎంపిక చేసిన కాంట్రాక్టరు నుం చి నాణ్యమైన దుస్తులను ఎంపిక చేస్తుంది. గుర్తింపు యూనియన్ నుంచి నాణ్యత కమిటీ దుస్తుల మన్నికను పరిశీలిస్తుంది. వీరు సంతృప్తి వ్యక్తం చేశాక, ఆ వస్త్రాన్ని ఎంపిక చేస్తారు. ఈ మొత్తం టెండర్ల వ్యవహారాలు ఆర్టీసీ ఈడీ (ఆపరేషన్స్) ఆధ్వర్యంలో జరుగుతుంది. రిటైరైన వారి సంగతేంటి? 2014 నుంచి 2018 ఆగస్టు వరకు ఏటా వందలాది కార్మికులు రిటైరయ్యారు. ఈ సంఖ్య 4 వేలకుపైనే ఉండొచ్చని సమాచారం. వారంతా ఈ ఐదేళ్లకాలానికి యూనిఫాంను సొంత డబ్బుతోనే కుట్టించుకున్నారు. ఇప్పుడు వీరికి యూనిఫాం అలవెన్సులు అందుతాయన్న విషయంలోనూ స్పష్టత లేదు. కాగా, ఐదేళ్ల కింద కుట్టుకూలీ కింద పురుషులకు ఒక్కోజతకు రూ.200, మహిళలకు రూ.100 చొప్పున చెల్లించాలి. ప్రస్తుతం ఈ ధరకు మార్కెట్లో ఎవరూ దుస్తులు కుట్టరని కార్మికులు చెబుతున్నారు. కనీసం ఈసారైనా మెరుగైన కుట్టుకూలీ చెల్లించాలని కోరుతున్నారు. 2013లో చివరిసారిగా కార్మికులకు (కొన్నిచోట్ల మాత్రమే) దుస్తులు అందజేశారు. అప్పటినుంచి ఐదో ఏడాది రెండో త్రైమాసికం కూడా పూర్తి కావొస్తోంది. ఇప్పటికీ దుస్తులు అందలేదు. దాదాపు రూ.20 కోట్లకుపైగా కార్మికుల దుస్తులు, కుట్టుకూలీ రూపంలో సంస్థ మిగుల్చుకుందని విమర్శలు వస్తున్నాయి. వేధింపులు సరేసరి.. ఆర్టీసీలో యూనిఫాంలు ఇవ్వట్లేదు. అయినా ఈ విషయంలో అధికారులు నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నారు. యూనిఫాం ధరించకుండా విధులకు హాజరైన సిబ్బందికి డ్యూటీలు వేయట్లేదు. కొందరికి తాఖీదులు జారీ చేస్తున్నారు. మరికొందరిని మానసికంగా వేధిస్తున్నారు. క్వాలిటీ కోసం అన్వేషణ తెలంగాణ ఏర్పడ్డాక విభజన సమస్యలు పరిష్కారం కాకపోవడం, ఇతర సాంకేతిక సమస్యల కారణంగా కార్మికులకు యూనిఫాం అందజేయలేకపోయాం. మంచి క్వాలిటీ దుస్తుల కోసం అన్వేషిస్తున్నాం. రెండు, మూడు నెలల్లో అందజేస్తాం. – శివకుమార్, ఈడీఏ దుస్తుల ఎంపిక జరుగుతోంది యూనిఫాం ఇవ్వడంలో జాప్యం జరిగిన మాట వాస్తవమే. టెండర్లకు సిద్ధమవుతున్నాం. ప్రస్తుతం దుస్తుల ఎంపిక జరుగుతోంది. గుర్తింపు యూనియన్ నాయకులకు శాంపిల్స్ చూపిస్తున్నాం. త్వరలోనే అందజేస్తాం. – అజయ్కుమార్, చీఫ్ కంట్రోలర్ ఆఫ్ స్టోర్స్ -
ఉద్యోగులు బాగుంటేనే సంస్థ బాగుంటుంది
సాక్షి, విజయవాడ : ఉద్యోగులు బాగుంటేనే సంస్థ బాగుంటుందని ఏపీఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే బస్సులు నష్టాల్లో నడుస్తున్నా సామాజిక బాధ్యతతో తిప్పుతున్నామని తెలిపారు. గత రెండు నెలలుగా కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాల్ని చేపట్టామని, సెలవుల్లో విషయంలో ఇబ్బంది లేకుండా అదనపు సిబ్బందిని సమకూర్చామని పేర్కొన్నారు. దాదాపు 20,200 మందికి పెన్షన్లు పెండింగ్లో ఉన్న విషయం గుర్తించామన్నారు. కార్మికులకు పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వాలని, జూన్ నెలలో రిటైరయ్యే వారికి అదేరోజున రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని ఆదేశించానని సురేంద్రబాబు అన్నారు. పాత బకాయిలు క్లియర్ చేసే పనిలో ఉన్నాం.. పాత బకాయిలు క్లియర్చేసే పనిలో ఉన్నామని సురేంద్రబాబు తెలిపారు. కార్మికులను చార్జిమెమోలతో వేధించే విధానానికి స్వస్తి పలికి సరికొత్త విధివిధానాలను రూపొందించామని పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా వేళలు మార్చడంద్వారా ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందన్నారు. విద్యార్థుల బస్పాస్లను నెలవారీ కాకుండా త్రైమాసికం, వార్షిక విధానానికి వెసులుబాటు కల్పించామన్నారు. రెండు వందల కోట్లతో 850 కొత్త బస్సులు కొనుగోలు చేస్తామని, డిమాండ్ ఉన్న రోజుల్లో టికెట్ల ధరలు పెంచుతామని పేర్కొన్నారు. పెరుగుతున్న డీజిల్ ధరలు ఆర్టీసీకి భారంగా మారాయని, టికెట్ల ద్వారానే కాకుండా ఇతన మార్గాల ద్వారా వెయ్యి కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఆర్టీసీ స్థలాల్ని వాణిజ్యపరంగా వినియోగంలోని తీసుకువస్తామన్నారు. -
‘ఆర్టీసీ నష్టాలకు అధికారులే బాధ్యులు’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ నష్టాలకు కార్మికుల పనితీరుకు ఏమాత్రం సంబంధం లేదని ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం నేతలు తేల్చి చెప్పారు. అధికారుల పనితీరు సరిగా లేకపోవటం, గతంలో తీసుకున్న అప్పులకు ఇప్పటికీ వడ్డీలు చెల్లిస్తుండటం, భారీగా పెరిగిన డీజిల్ ధరల వల్ల ఆర్టీసీ నష్టాల్లో ఉందని, దానికి కార్మికులను బాధ్యులను చేయటం సరికాదని స్పష్టంచేశారు. వాస్తవాలను దాచి అధికారులు తప్పుడు లెక్కలతో సీఎంనే తప్పుదారి పట్టించారని ఆరోపించారు. బుధవారం ఆర్థిక మంత్రి ఈటల అధ్యక్షతన మహేందర్రెడ్డి, జగదీశ్రెడ్డిలతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో మరోసారి ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ ప్రతినిధులతో భేటీ అయింది. ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్న సమయంలో జీతాల కోసం పట్టుపట్టడం, సమ్మె నోటీసు ఇవ్వటం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మంగళవారం మంత్రివర్గ ఉపసంఘం, ఆర్టీసీ అధికారులతో చర్చ సందర్భంగా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నాటి సమావేశంలో గుర్తింపు సంఘం నేతలు దానికి కౌంటర్ ఇచ్చారు. ఆర్టీసీ నష్టాలకు కార్మికులను బాధ్యులను చేయటం ఏమాత్రం సరికాదని, నష్టాల బూచి చూపి వేతన సవరణ నుంచి తప్పించుకునే ప్రయత్నం సరికాదని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఆర్టీసీ సిబ్బంది వేతనాలు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల కంటే తక్కువగా ఉన్నాయని సీఎం అన్న మాటలను ఖండించారు. మహారాష్ట్ర లాంటి చోట్ల ఆర్టీసీ కార్మికుల బేసిక్ తక్కువగా ఉన్నా అలవెన్సులు మనకంటే చాలా ఎక్కువని, మొత్తంగా చూస్తే వారి వేతనాలు తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది వేతనాల కంటే ఎక్కువే ఉంటాయని వివరించారు. ‘‘ఢిల్లీ, హరియాణ లాంటి చోట్ల ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోరు? కావాలంటే ఆర్టీసీ అధికారులతో కలసి తాము అధ్యయనానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. ఉద్యమంలో ముందున్న ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకోవాల్సిందే’’అని పేర్కొన్నారు. జాప్యమైతే 25% ఐఆర్ ప్రకటించండి వేతన సవరణ ఇవ్వటం సాధ్యం కాదనుకుంటే ఇంటీరియమ్ రిలీఫ్ (ఐఆర్) 25 శాతం ప్రకటించాలని కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. హరీశ్పై గుర్రు: టీఎంయూ గౌరవాధ్యక్షుడిగా ఉన్న మంత్రి హరీశ్రావు బుధవారం నాటి సమావేశానికి హాజరయ్యారు. కానీ ఆయన తమకు అనుకూలంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తాము డి మాండ్లపై మొత్తుకుంటున్నా ఏమీ పట్టనట్టు కూర్చున్నారని ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వాదనతో మంత్రులు ఏకీభవించారని, వేతన సవరణ విషయంలో సీఎంతో మరోసారి చర్చిస్తామని మంత్రులు హామీ ఇచ్చారని సమావేశానంతరం ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణరావు, సంఘం ప్రతినిధులు తిరుపతి, థామస్రెడ్డి, అశ్వత్థామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమ్మె చేస్తామంటే చేసుకోమనండి ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన ఉదంతం ఎప్పుడైనా ఉందా? మా ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని తరహాలో కార్మికులు అడిగినదాని కంటే ఎక్కువ ప్రకటిస్తే.. ఇప్పుడు ప్రభుత్వాన్నే బ్లాక్మెయిల్ చేస్తారా? వేతన సవరణ చేయకుంటే సమ్మె చేస్తామని హెచ్చరిస్తారా? అదీ రూ.750 కోట్ల మేర వార్షిక నష్టాలున్నప్పుడు... ఏమనుకుంటున్నారు..? చేస్తామంటే చేసుకోమనండి.. చేస్తే అట్నుంచి అటే పోతే?’’అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మరోసారి ఆర్టీసీ కార్మిక సంఘాల తీరుపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమంగా వేతన సవరణ కోసం ఆర్టీసీ కార్మికులు పట్టుబడుతున్న నేపథ్యంలో ఆయన వారి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి మంత్రివర్గ ఉపసంఘం, అధికారుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. బుధవారం రాత్రి మంత్రివర్గ ఉప సంఘం, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలోనూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెరసి కార్మిక సంఘాల డిమాండ్కు తగ్గట్టు వేతన సవరణ జరగదనే స్పష్టమైన సంకేతాలిచ్చారు. అయినా ఈ అంశం మంత్రివర్గ ఉపసంఘం పరిశీలనలో ఉందని, సంఘం ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ‘‘నేను ఓ దినమంతా ఆర్టీసీ సమీక్షలో గడిపాను. వేల ఆటోలు, బైకులు రోడ్డుమీదకు వచ్చిన తరుణంలో ఆర్టీసీ ఎలా మనుగడ సాగించాలో స్పష్టంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోమని చెప్పాను. ఆర్టీసీని రక్షించేందుకు రూ.3,400 కోట్ల మొత్తాన్ని విడుదల చేశాం. ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా నిధులు పెట్టాం. అయినా ఇంకా డిమాండ్లు చేస్తే ఏమనాలి? సమ్మె చేస్తామంటే చేసుకోమనండి. కార్మికులు, యాజమాన్యం అంతా కలిసి మునుగుతారు’’అని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లాంటి కొన్ని రాష్ట్రాల్లో అసలు ఆర్టీసీలే లేవని, కేరళలో బస్సుల సంఖ్య బాగా తగ్గిపోయిందని పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తుంటే వారు పట్టించుకోకుండా సమ్మెకు పోతామంటే చేసేదేముంటుందని ప్రశ్నించారు. అధికారులు తనకు ఇచ్చిన లెక్కలు తప్పులని, నన్ను తప్పుదోవ పట్టించారని కార్మిక సంఘాలు అనడం తప్పన్నారు. ఓ ముఖ్యమంత్రికి తప్పుడు లెక్కలు ఎలా ఇవ్వగలుగుతారని, వాస్తవ పరిస్థితిని తనకు అధికారులు వివరించారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ విషయంలో పూర్తి సానుకూలత వ్యక్తం చేయటమే కాకుండా ఉద్యోగుల పనితీరుపై అభినందనల వర్షం కురిపించిన సీఎం.. అదే వేదికపై ఆర్టీసీ కార్మిక సంఘాల తీరుపై విమర్శల వర్షం కురిపించటం విశేషం. -
ఆర్టీసీ వేతన సవరణపై నేడే చర్చలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల వేతన సవరణపై మంత్రుల కమిటీ ఆదివారం సంస్థ యాజమాన్యం, కార్మిక సంఘం నేతలతో చర్చించనుంది. ప్రస్తుత వేతన సవరణ గడువు 14 నెలల క్రితమే ముగిసిపోయినందున కొత్త వేతన సవరణను ప్రకటించాలని కొద్దిరోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. వేతన సవరణలో జాప్యం జరిగే పరిస్థితి ఉంటే 25% మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ప్రధాన సంఘాలన్నీ ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు కూడా అందజేశాయి. దీంతో ప్రభుత్వం స్పందించింది. ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు జరుపుతున్న నేపథ్యంలో.. ఆర్టీసీలో వేతన సవరణ అంశాన్ని కూడా దానికి అప్పగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్ ఆధ్వర్యంలోని మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి, మహేందర్రెడ్డిలతో కూడిన కమిటీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో ఆర్టీసీ ఎండీ రమణారావు, ఇతర అధికారులు, గుర్తింపు కార్మిక సంఘం నేతలతో చర్చించనుంది. పరిస్థితి సమ్మె వరకు వెళ్లకుండా చూడాలన్న అభిప్రాయం ప్రభుత్వం వైపు నుంచి కనిపిస్తోంది. మొత్తంగా 15 శాతం నుంచి 18 శాతం మధ్య ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది. -
ఆర్టీసీలో మళ్లీ వేతన సవరణ రగడ
-
వైఎస్ జగన్ను కలిసిన ఆర్టీసీ, చేతి వృత్తుల కార్మికులు
-
ఎమ్మెల్యేల జీతాలు పెంచుతారు కానీ..
సాక్షి, చెన్నై: తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఏడో రోజుకు చేరింది. తమ సమస్యలు పరిష్కరించనిదే సమ్మె విరమించే ప్రసక్తే లేదని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వేతనాలు పెంచాలని సమ్మెకు దిగిన కార్మికులు ఆందోళనను ఉద్రితం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం చర్చలకు పిలిస్తే సమ్మె విరమణకు సిద్ధమని మంగళవారం కార్మిక సంఘాలు ప్రకటించాయి. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో పళనిస్వామి ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేల వేతనాలు పెంచుకుంటారు కానీ.. తమ వేతనాలు గురించి పట్టించుకోరా అంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. -
బ్రీత్ ఎనలైజర్లతో కష్టాలు
ఆత్మకూరు: ఆర్టీసీ బస్సుల్లో కార్మికులకు బ్రీత్ ఎనలైజర్తో కష్టాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కడుపు మండిన ఆర్టీసీ కార్మికులు ఆదివారం తెల్లవారుజాము నుంచి ఆత్మకూరు డిపో ఎదుట ధర్నా చేపట్టారు. డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ చల్లా రవిరెడ్డి ఆదివారం తెల్లవారుజామున విధులకు హాజరయ్యే ముందు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయించుకున్నారు. ఈ క్రమంలో ఆయన మద్యం సేవించినట్లు 10 పాయింట్లు ఆ మిషన్లో కనబడడంతో సెక్యూరిటీ రిపోర్టు మేరకు అతడ్ని విధులకు హాజరుకాకుండా చేసేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు. అదే సమయంలో విధులకు హాజరైన కార్మికులందరూ అసలు మద్యమే ముట్టని రవిని బ్రీత్ ఎనలైజర్ ద్వారా మద్యం సేవించాడంటూ నిర్ణయించడం సరికాదని వాదులాడారు. అనంతరం అన్ని కార్మిక యూనియన్ల నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని రవికి ప్రభుత్వాస్పపత్రిలో పరీక్షలు నిర్వహించాలని పట్టుబట్టారు. అందుకు యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సమాచారమందుకున్న డిపో మేనేజర్ త్రినా«థ్రావు అక్కడికి చేరుకుని, విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. దీంతో దాదాపు మూడు గంటలకు పైగా బస్సులు డిపోలో నిలిచిపోయాయి. మీడియాపై రుసరుస విషయం తెలుసుకున్న మీడియా ఘటన స్థలానికి చేరుకోవడంతో డిపో మేనేజర్ త్రినా«థ్రావు వారిపై రుసరుసలాడారు. ఈ క్రమంలో కార్మికులు తామే మీడియాకు సమాచారమిచ్చామని చెప్పడంతో విధిలేక ఆయన ఉన్నతా«ధికారులను మరోసారి సంప్రదించారు. అనంతరం రెండోసారి బ్రీత్ ఎనలైజర్ ద్వారా రవిరెడ్డికి అందరి ఎదుట పరీక్ష నిర్వహించారు. ఆ సమయంలో సున్నా పాయింట్లు నమోదయ్యాయి. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ మిషీన్లో పొరపాటు పెట్టుకుని కార్మికులను మానసిక క్షోభకు గురిచేయడం సరికాదని, గతంలోనూ ఇలానే ఓ కార్మికుడిని సస్పెన్షన్కు గురిచేశారని తెలిపారు. చివరికి కార్మికులు విధులకు హాజరవడంతో వ్యవహారం సర్దుమణిగింది. నీరు తాగితే నమోదు కాదు కాగా మంచినీరు ఎక్కువగా తాగితే మద్యం తాగినట్లు బ్రీత్ ఎనలైజర్ గుర్తించలేదని డిపో మేనేజర్ సెలవిచ్చారు. బ్రీత్ ఎనలైజర్ అలా ఎందుకు రెండు విధాలుగా నమోదు చేసిందని త్రినాథ్రావును ప్రశ్నించగా రెండోసారి కార్మికుడు అధికంగా నీళ్లు తాగి పరీక్షలు చేయించుకోవడంతో అలా నమోదైందని వ్యాఖ్యానించారు. -
ప్రభుత్వ వైఖరిపై ఆర్టీసీ కార్మికుల ఆందోళన
అమరావతి: ఆర్టీసీ యాజమాన్యం ఆవలంభిస్తున్న నిర్లక్ష్యనికి వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టనున్నారు. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా ఈ నెల 14 న రాష్ర్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నామని ఆర్టీసీ కార్మిక సంస్థ ఎంప్లాయిస్ యూనియన్ తెలిపింది. ఆర్టీసీ బస్సుల సంఖ్యను, సిబ్బందిని కుదిస్తున్నందుకు నిరసనగా మొత్తం 13 జిల్లాల్లోని 128 డిపోలు, వర్కుషాపుల వద్ద ఆందోళనలు చేస్తామని ఈయూ పేర్కొంది. యాజమాన్యం సీసీఎస్, ఎస్ఆర్బీఎస్, పీఎఫ్ ట్రస్టులకు బకాయి డబ్బులను వెంటనే చెల్లించాలని కోరింది. పెండింగ్ రుణాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. -
ఆర్టీసీ సీసీఎస్ కార్యదర్శిని తొలగించండి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సహకార పరిపతి సంఘం (సీసీఎస్)లో అలజడి నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సొసైటీ కార్యదర్శిని వెంటనే తొలగిం చాలని కొందరు కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే హైకోర్టు తలుపు తట్టిన ఆ కార్మిక వర్గం.. ఇటీవల సహకార శాఖ విచారణ జరిపి చేసిన సిఫార్సులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. పదవీ విరమణ పొందినా నిబంధనలకు విరుద్ధంగా కార్యదర్శిగా నాగరాజు కొనసాగు తున్నారని, ఆంధ్రా ప్రాంతంలో ఆరు నుంచి పదో తరగతి వరకు చదివినందున తెలంగాణలో కొనసాగే అవకాశం లేనప్పటికీ కొనసాగు తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. స్థాయికి మించి అక్రమంగా అధిక వేతనం పొందుతున్నందున ఇప్పటివరకు పొందిన మొత్తాన్ని తిరిగి సంఘానికి చెల్లించాలని విచారణాధికారులు తేల్చారని పేర్కొంటున్నారు. ప్రత్యేక జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి ఆయనను తొలగించాలని సహకార శాఖ సిఫార్సు చేసిందని ఆర్టీసీ బహుజన కార్మిక సంఘం అధ్యక్షుడు ప్రేమ్నాథ్ సహా పలువురు కార్మికులు చెబుతన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో సహకార పరపతి సంఘం మంగళవారం అత్యవసర సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసింది. అయితే కార్యదర్శిని కాపాడుకునేందుకు కొందరు కుట్రపన్నారని, సమావేశంలో ఆయనకు అనుకూల తీర్మానం చేయబోతున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. కార్యదర్శిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. మరోవైపు సహకార శాఖ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సీసీఎస్ చైర్మన్, ఆర్టీసీ ఎండీ రమణరావు పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు: కార్యదర్శి నాగరాజు కార్మిక సంఘాల మధ్య ఉన్న విభేదాల వల్లే తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని సీసీఎస్ కార్యదర్శి నాగరాజు అన్నారు. సహకార శాఖ విచారణ జరిపి తనకు క్లీన్చీట్ ఇచ్చిందని, బ్లాక్మనీని వైట్గా మార్చుకునేందుకు నిబంధనలకు విరుద్ధంగా తాను రుణం పొందినట్లు తేలలేదన్నారు. -
సెలవు.. వివాదాల నెలవు
♦ ‘నెలలో మూడు రోజులు సెలవు’పై ఆర్టీసీలో రగడ ♦ అనుమతి లేకుండా డుమ్మా కొట్టే సిబ్బందిపై డిస్మిస్ కొరడా ♦ కార్మిక నేతలు, అధికారుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కార్మికులకు, అధికారులకు మధ్య సెలవుల రగడ మొదలైంది. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే డ్రైవర్లు, కండక్టర్లపై యాజమాన్యం కఠిన చర్యలకు దిగడం వివాదాస్పదమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు నెలలో మూడు రోజులు సెలవు తీసుకునే వెసులుబాటు ఉంది. చాలామంది సిబ్బంది ముందస్తు అనుమతి తీసుకోకుండా విధులకు గైర్హాజరై తర్వాత దాన్ని మూడు రోజుల సెలవు విధానంలోకి మార్చుకుంటున్నారు. అకస్మాత్తుగా విధులకు డుమ్మా కొడుతుండటంతో బస్సు సర్వీసు షెడ్యూళ్లకు తీవ్ర విఘాతం కలుగుతోంది. దీనిపై యాజమాన్యానికి డిపో మేనేజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి సిబ్బందికి మెమోలు జారీ చేయాలని, పరిస్థితి పునరావృతమయితే విధుల నుంచి తొలగించాలని యాజమాన్యం నిర్ణయించింది. దీంతో కొందరు కార్మిక నేతలు యాజమాన్యం వైఖరిని తప్పుపడుతూ ఆయా డిపోల్లో ఆందోళనలకు దిగుతున్నారు. వెరసి కార్మిక నేతలు, అధికారులకు మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతోంది. జిల్లా సర్వీసులకు తీవ్ర విఘాతం హైదరాబాద్లోని కొన్ని డిపోల పరిధిలో జిల్లా సర్వీసులు కూడా ఉన్నాయి. వీటిల్లో దూరప్రాంతాలకు వెళ్లేందుకు గరుడ బస్సులున్నాయి. ఈ ప్రీమియం కేటగిరీ బస్సులను ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రైవర్లు తప్ప సాధారణ డ్రైవర్లు నడపలేరు. ఇలాంటి డ్రైవర్లు పరిమితంగా ఉంటారు. తరచూ గరుడ బస్సు సర్వీసు బయలుదేరే వేళ వరకు కూడా సదరు డ్రైవర్ విధులకు రావడంలేదు. దీంతో అప్పటికప్పుడు మరో డిపో నుంచి డ్రైవర్ను పిలిపించటం లాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. ఈ లోపు సమయం మించిపోయి ప్రయాణికులు ఆందోళన చేసే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఫలితంగా కొన్ని దూరప్రాంత సర్వీసులు తరచూ ఆలస్యంగా నడపాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో రద్దు చేయాల్సి వస్తోంది. ప్రతి నెలా 16వ తేదీన మస్టర్స్ సిద్ధం చేసే సమయంలో కొందరు కార్మిక సంఘాల నేతలు రంగ ప్రవేశం చేసి, ముందస్తు అనుమతి లేకుండా విధులను ఎగ్గొట్టిన సిబ్బందికి మూడు రోజుల సెలవు నిబంధన వర్తింపజేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇలా ఒక్కో డిపోలో వంద వరకు సెలవుల పంచాయితీ నెలకొంటోంది. తాజాగా ఆదివారం ఓ డిపోలో 66 మంది విధులకు డుమ్మా కొట్టారు. అయితే, ఆరోజు అసెంబ్లీలో ముస్లిం రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడంతో కొన్ని రాజకీయపార్టీలు ఆందోళనకు దిగాయి. దీంతో అధికారులు సిటీలో ఏసీ బస్సులను నిలిపివేశారు. డుమ్మా కొట్టినవారి స్థానాల్లో ఇక్కడి డ్రైవర్లు, కండక్టర్లను ఆ రోజు విధుల్లోకి తీసుకోవాల్సి వచ్చింది. గత రెండు, మూడురోజులుగా డుమ్మా కొట్టిన పలువురు సిబ్బందిని డిస్మిస్ చేశారు. ఇప్పుడీ వ్యవహారం మరోసారి ఆర్టీసీలో వివాదానికి కారణమవుతోంది. -
ఆర్టీసీ కార్మికుల బీమా మొత్తం పెంపు
రూ. 3.60 లక్షల నుంచి రూ. 6 లక్షలకు.. సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు చనిపోతే చెల్లించే బీమా మొత్తాన్ని పెంచుతూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం సర్క్యులర్ జారీ చేసింది. ఈపీఎఫ్ బోర్డు ట్రస్టీలు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు యాజమాన్యం అంగీకరించటం విశేషం. ప్రస్తుతం విధి నిర్వహణలో ఉన్న కార్మికులు చనిపోతే బీమాగా రూ. 3.60 లక్షలు చెల్లిస్తున్నారు. దీన్ని రూ. 6 లక్షలకు పెంచుతూ గతేడాది మేలో కేంద్ర బోర్డు నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పటివరకు టీఎస్ఆర్టీసీ దాన్ని అమలు చేయలేదు. తాజా గా గత మే 24 నుంచి వర్తించేలా దాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అంటే.. గత మే 24 తర్వాత చనిపోయిన వారికి ఆ మొత్తం అందాల్సి ఉంటుంది. ఇప్పటికే పాత పద్ధతిలో చెల్లింపులు జరిగి ఉంటే.. మిగతా మొత్తాన్ని కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యంగానైనా దీన్ని అమలు చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకోవడం పట్ల ఎన్ఎంయూ నేత నాగేశ్వరరావు ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. -
ఆర్టీసీ కార్మికులు రోడ్డుపాలు
అన్సీజన్ పేరుతో 59 మంది తొలగింపు యాజమాన్యతీరుపై కార్మిక సంఘాల ఆగ్రహం అనంతపురం న్యూసిటీ: అన్సీజన్ పేరుతో ఆర్టీసీ యాజమాన్యం రీజియన్ వ్యాప్తంగా 59 మంది కార్మికులను రోడ్డుపాలు చేసింది. శనివారం నుంచి విధులకు హాజరుకావాల్సిన పనిలేదని తేల్చి చెప్పింది. దీంతో కార్మికులు రోడ్డున పడ్డారు. ఉన్నఫలంగా విధుల నుంచి తొలగిస్తే తమ బాధ ఎవరితో చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీజియన్లోని రెగ్యులర్గా తిరిగే 42 బస్సులను రద్దు చేసిన కారణంగా కార్మికులు వీధిన పడాల్సి వచ్చిందని కార్మిక సంఘాలంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అప్పటి సీఎం కిరణ్కుమార్ రెడ్డి కాంట్రాక్టు పద్ధతిన ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రీజియన్లో 109 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏడాదిన్నర గడిచిన తర్వాత 106 మంది విధుల్లో చేరారు. సమ్మె కాలంలోనూ విధులకు హాజరయ్యారని 28 మందిని ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. ఇక మిగితా వారిని కాంట్రాక్టు పద్ధతినే కొనసాగించింది. 42 సర్వీసుల రద్దు... రద్దీగా ఉండే బెంగళూరు, బళ్లారి, హిందూపురం, ధర్మవరం, పెనుకొండ, కళ్యాణదుర్గంలాంటి ప్రాంతాలకు సంబంధించి 42 బస్సు సర్వీసులను అధికారులు ఆపేశారు. ఈ కారణం చూపి యాజమాన్యం కాంట్రాక్టు సిబ్బందిని పక్కన పెట్టింది. అసలే ప్రైవేట్ వాహనాలతో ప్రజలకు భద్రత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఉన్న బస్సులను తొలగించి ప్రైవేట్ రవాణాకు ప్రభుత్వం పరోక్షంగా సహకరించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమ్మెలో పని చేసినా తొలగించారు : మల్లికార్జున డ్రైవర్, అనంతపురం సమ్మె కాలంలో పనిచేసిన తనను రెగ్యులర్ చేయలేదు. ఇప్పుడేమో విధులకు రావద్దని చెబుతున్నారు. 240 రోజులు విధుల్లో పని చేస్తే రెగ్యులర్ చేయాలి. ఆ నిబంధనను పాటించలేదు. మా పరిస్థితేమిటి? ప్రభుత్వం ఆదుకోవాలి. సరైన పద్ధతి కాదు : కొండయ్య, ఈయూ నాయకుడు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం అన్సీజన్ పేరుతో కార్మికులను తొలగించడం సరైన పద్ధతి కాదు. ఒక్కసారిగా 59 మందిని తొలగిస్తే వారెక్కడికి వెళ్లాలి. ప్రభుత్వం తక్షణం వారిని విధుల్లోకి తీసుకోవాలి. కార్మికులతో ఆడుకోవద్దు.. : సుందర్రాజు, వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ ప్రభుత్వం, యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులకు ఉద్యోగభద్రత లేకుండా పోయింది. కార్మికులతో ఆడుకోవద్దు. ఇప్పటికైనా ప్రభుత్వం, యాజమాన్యం స్పందించి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి. -
పట్టు వీడం..
ప్రధాన డిమాండ్లు ⇒35 శాతం వేతన పెంపు ⇒ఒక విభాగం నుంచి మరో విభాగానికి సిబ్బందిని బదిలీ చేయడానికి వీలుగా నూతన పాలసీ రూపకల్పన ⇒ఎనిమిది గంటల పని ⇒ఆరునెలల శిక్షణ కాలం తర్వాత కచ్చితంగా ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి. ⇒శిక్షణ కాలంలో రూ.18 వేల గౌరవవేతనం ⇒విశ్రాంత రవాణాశాఖ ఉద్యోగులకు కనిష్టంగా రూ.10 వేల పింఛన్, రూ.10 లక్షల వరకూ జీవితబీమా పాలసీ ⇒ఉన్నతాధికారుల తనిఖీల్లో టికెట్టు లేని ప్రయాణికులు పట్టుబడినప్పుడు కండక్టర్పై చర్యలు తీసుకోకూడదు. బెంగళూరు : అటు కార్మిక సంఘాల్లోను ప్రభుత్వంలోను పట్టువిడుపులు లేకపోవడంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో ప్రజల కష్టాలు వర్ణనాతీతం. తొలిరోజు కేఎస్ ఆర్టీసీ సమ్మె పూర్తిగా విజయవంతమైంది. తమ డిమాండ్లు పరిష్కరించాల్సిందే నంటూ కార్మికులు పట్టుబట్టగా ముందు సమ్మె విరమించండి ఆ తరువాత డిమాండ్ల గురించి ఆలోచిస్తాం అంటూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి చెప్పడంతో ఆర్టీసీ కార్మికులు స్పందించలేదు. 35 శాతం వేతన పెంపు అసాధ్యమంటూ సోమవారం మంత్రి రామలింగారెడ్డి మీడియాతో అన్నారు. ఇదిలా ఉంటే ఆదివారం అర్ధరాత్రి నుంచి కేఎస్ ఆర్టీసీ సిబ్బంది సమ్మెలోకి వెళ్లిపోవడంతో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో లక్షల మంది ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. మరోవైపు ప్రైవేట్ రవాణా సిబ్బంది అందినకాడికి దోచుకుంటున్నారు. వేతన సవరణతో ఇతర డిమాండ్లు పరిష్కరించాలని 1.25 లక్షల మంది సిబ్బంది ఒక్కసారిగా సమ్మె చేస్తుండటంతో 23 వేల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో సగటున రోజు ప్రభుత్వానికి రూ. 21 కోట్ల ఆదాయం గండిపడింది. ఇదిలా ఉండగా సమ్మె సందర్భంగా కొంతమంది దినసరి వేతనంపై కొంతమంది ప్రైవేటు వ్యక్తులతో కొన్ని చోట్ల బస్సులను నడపడానికి ప్రయత్నించగా ఆందోళకారులు బస్సులపై రాళ్లు రువ్వారు. దీంతో పదిమందికి గాయాలు కాగా 142 బస్సులు ధ్వంసమయ్యాయి. ఒక్కరోజే రూ. 12 లక్షల విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయి. ప్రైవేటు దోపిడీ : రెండు రోజుల పాటు ప్రైవేట్ రవాణాకు అనుమతి ఇవ్వడంతో వారు అందినకాడికి దోచుకున్నారు. వివిధ ఉపాధి, ఉద్యోగ నిమిత్తం పల్లెల నుంచి బెంగళూరు, మైసూరు, మంగళూరు వంటి నగరాలకు వచ్చేవారు ప్రైవేట్ బస్సులపైకి ఎక్కి గమ్యస్థానాలకు చేరుకోవడం కనిపించింది. ఇక వివిధ పట్టణాల్లో ఆస్పత్రులకు వచ్చే వారి పరిస్థితి వర్ణనాతీతం. సమ్మె విషయం తెలిసిన కొంతమంది రోగులు వారి సహాయకులతో ఆదివారం రాత్రికే ఆయా నగరాల బస్టాండ్లకు చేరుకున్నారు. అక్కడి నుంచి వెళ్లేందుకు రవాణా వ్యవస్థ లేకపోవడంతో ఆటోలు, క్యాబ్లకు రెట్టింపు చార్జీలు చెల్లించి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు బెంగళూరు శివారులోని అత్తిబెలె నుంచి ఫోరంమాల్ వరకూ సాధారణ రోజుల్లో రూ.35 వసూలు చేసే ప్రైవేటు బస్సులు సోమవారం ఒక్కొక్కరి నుంచి రూ.87 వసూలు చేసింది. ఇక ఆటోవాలాలు ఇదే అదనుగా తీసుకుని రూ. 200 నుంచి 800 వరకు వసూలు చేశారు. ఇక సమ్మె నేపథ్యంలో మంగళవారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మెట్రోకు పెరిగిన డిమాండ్... సమ్మెలో భాగంగా బెంగళూరులో బీఎంటీసీ సేవలు కూడా నిలిచిపోవడంతో ‘మెట్రో’కు డిమాండ్ పెరిగింది. తమ గమ్యస్థానాలను చేరుకోవడానికి మెట్రోరైలును ఆశ్రయించే ప్రయాణికుల సంఖ్య పెరగడంతో బీఎంఆర్సీఎల్ అధికారులు ప్రతి ఆరు నిమిషాలకు ఒక మెట్రో రైలును ప్రజల కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ ఉన్న మెట్రో సేవలను మరో గంట పాటు పెంచుతూ 11 గంటల వరకూ అందబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. అదనపు సర్వీసుల ఆలోచనలో... బెంగళూరులోని ‘శాంతలా సిల్క్స్’ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ సంస్థలు బస్సు సర్వీసులు నడుపుతున్న విషయం తెలిసిందే. సమ్మె ప్రభావం తమ సేవలపై కొంత మేర ప్రభావం చూపుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శాంతలా శిల్క్స్ చేరుకోవడానికి బీఎంటీసీ బస్సులు లేకపోవడంతో కొంతమంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో ప్రయాణికుల సంఖ్య తగ్గుతోంది. మరోవైపు మరోరెండురోజుల పాటు ఇక్కడి పరిస్థితులను చూసి ఏపీఎస్ ఆర్టీసీ అదనపు సర్వీసులను నడిపే ఆలోచనలో ఉంది. సాధారణంగా ప్రయాణాలను ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ వాయిదా వేసుకోలేరని అందువల్ల మరో రెండు రోజుల తర్వాత సాధారణం కంటే ఎక్కువగానే ప్రయాణికులు వస్తారని ఇక్కడి అధికారులు దీమా వ్యక్తం చేస్తున్నారు. అదే గనుక జరిగితే అదనపు సర్వీసులను కూడా నడిపే ఆలోచన ఉందని ఏపీఎస్ఆర్టీసీ బెంగళూరు విభాగం ఏటీఎం రవీంద్ర తెలిపారు. కార్మికులతో చర్చలు జరపాలి : మాజీ సీఎం కుమార మైసూరు: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమ్మెను విరమింపచేయాలని మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కోరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కార్మికులకు వేతనాలు పెంచితే సంస్థ నష్టాలపాలవుతుందని చెబుతున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముందు సంస్థలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వేతనాలు పెంచాలని ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నా పెడచెవిన పెట్టడంతో ఉద్యోగులు సమ్మెబాట పట్టారని పేర్కొన్నారు. ఇంధన ధరలు తగ్గినపుడు టికెట్ ధరలను తగ్గించ కుండా అటు ప్రజల్లోనూ, వేతనాలు పెంచకుండా ఇటు ఉద్యోగుల్లోనూ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని విమర్శించారు. -
ఈ నెల 23 నుంచి ఆర్టీసీ సిబ్బంది సమ్మె
కార్మికుల హక్కుల పరిరక్షణకోసం ఈ నెల 23న మొదటి డ్యూటీ నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారంభం అవుతుందని తెలంగాణ ఆరీ్టిసీ జాయింట్ యాక్షన్ కమిటీ స్పష్టం చేసింది. గురువారం ఆజామాబాద్లోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాబు, రాజిరెడ్డి, ఎన్ఎంయూ చైర్మన్ కమాల్ రెడ్డి, ఎస్డబ్ల్యుఎఫ్ కార్యదర్శి వి.ఎస్.రావు తదితరులు మాట్లాడారు. తమ సమస్యల పరిస్కారానికి ఆర్టీసీలోని 7 యూనియన్లుతో కూడిన జేఏసీ గత నెల 16న యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చినా ఎటువంటి స్పందన లేదని తెలిపారు. వేతన సవరణ సందర్భంగా పెరిగిన జీతాల ఖర్చు నెలకు రూ.75 కోట్లు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి తన హామీని తుంగలో తొక్కారన్నారు. వేతన సవరణ బకాయిలను రెండో విడత ఇంత వరకు చెల్లించలేదని, 50 శాతం ఏరియర్స్, బాండ్స్ నేటికి విడుదల కాలేదని చెప్పారు..రెండేళ్లు గడిచినా ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన ఆర్టీసీ కార్మికుల ఒప్పందాలు ఇంత వరకు అమలు కాలేదని విమర్శించారు. దీనికి నిరసనగా 7 సంఘాలతో కలిసి సమ్మె చేస్తున్నామని వారు చెప్పారు. -
ఆర్టీసీ కార్మికుల డీఏ పెంపుపై ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు మే నెలకు సంబంధించి 3.4 శాతం కరువు భత్యం(డీఏ) పెంచుతూ సంస్థ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. 21.5 శాతంగా ఉన్న కరువు భత్యాన్ని 24.9 శాతానికి పెంచుతూ గత సంవత్సరం నిర్ణయం తీసుకుంది. అయితే నిధుల కొరత వల్ల ఇప్పటి వరకు అమలు చేయలేదు. ప్రస్తుత నెలకు సంబంధించి దాన్ని కార్మికులకు అందజేయాలని నిర్ణయించి బుధవారం ఉత్తర్వు జారీచేసింది. అయితే గత సంవత్సరం జూలై నుంచి నవంబర్ వరకు ఐదు నెలలు, పెరిగిన కరువు భత్యానికి సంబంధించి ఈ జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఉన్న బకాయిలు ఇవ్వకుండా ఒక్కనెల కరువు భత్యం ఇవ్వడం సరికాదని, వెంటనే బకాయిలు మొత్తం విడుదల చేయాలని కార్మిక సంఘం నేతలు ఆర్టీసీ జేఎండీకి విజ్ఞప్తి చేశారు. డీఏ బకాయిలతో పాటు వేతన సవరణ బకాయిలు, లీవ్ ఎన్క్యాష్మెంట్ బకాయిలు కూడా విడుదల చేయాలని కోరారు. -
ఆర్టీసీ కార్మికులకు 3.4 శాతం డీఏ అమలు
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు 3.4 శాతం డీఏ అమలు కానుంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆర్టీసీ కార్మికులకు డీఏ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ కావడంపై తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యానికి టీఎమ్యూ నేత థామస్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
ఆర్టీసీ కార్మికులపై అదనపు వడ్డీ భారం
1 శాతం అదనపు వడ్డీ వసూలుకు సర్క్యులర్ 289 జారీ కదిరి: ఆర్టీసీ కార్మికులు క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ(సీసీఎస్) ద్వారా తీసుకున్న రుణాలపై ఒక శాతం అదనపు వడ్డీ వసూలు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు గతనెల 23న సర్క్యులర్ నంబర్ 289ను విడుదల చేసింది. ఇప్పటిదాకా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సీసీఎస్ ద్వారా పొదుపు చేసుకున్న మొత్తానికి పది శాతం వడ్డీ ఇచ్చేవారు. అదేవిధంగా సీసీఎస్ ద్వారా పొందిన స్వల్పకాలిక, విద్యా, గృహ రుణాలపై 11 శాతం వడ్డీ వసూలు చేసేవారు. తాజా సర్క్యులర్ మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 1 శాతం అంటే ఇకపై 12 శాతం వడ్డీ వసూలు చేయనున్నారు. సుమారు రూ.32 లక్షలకుపైగా అదనపు భారం కార్మికులపై పడనుంది. -
ఆర్టీసీ కార్మికులపై కక్ష సాధింపు సరికాదు
► టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి అశ్వత్థామరెడ్డి ► ఆర్ఎం తీరుపై మండిపాటు ► జిల్లాకేంద్రంలో నిరాహార దీక్ష ► తరలివచ్చిన కార్మికులు మహబూబ్నగర్ క్రైం: ఆర్టీసీ కార్మికులపై ఆర్ఎం కక్షసాధింపు సరికాదని టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి అశ్వత్థామరెడ్డి మండిపడ్డారు. కార్మికులు, సిబ్బంది యాజమాన్యం ఇంట్లో పనిచేసే పని మనుషులు కాదనే విషయం గుర్తించుకోవాలని హెచ్చరించారు. కార్మికుల సమస్యలపై ఆర్టీసీ యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఆయన మహబూబ్నగర్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ఆయన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. కొన్నిరోజులుగా కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. నెలరోజుల్లో 20మంది కార్మికులను సస్పెండ్ చేశారని, వారందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. జిల్లాలో కార్మికులతో 12నుంచి 14గంటల పాటు బలవంతపు విధులు నిర్వహింపజేస్తున్నారని, వాటిని మానుకోవాలని సూచించారు. డాక్టర్ ఇచ్చి సిక్ లీవ్లకు అనుగుణంగా సెలవులు మంజూరుచేయాలని డిమాండ్ చేశారు. 26 సమస్యలతో ఎజెండా ఇస్తే నేటికీ మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అన్ని జిల్లాల్లో కారుణ్య నియామకాలు జరిగినా ఇక్కడ మాత్రం జరగలేదన్నారు. సమ్మెకు కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అంతకుమందు స్థానిక బస్టాండ్ నుంచి ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాజసింహుడు, డీఎస్ చారి, కొండన్న, రవీందర్రెడ్డి, భానుప్రకాష్రెడ్డి, టీఎస్ఎస్రెడ్డి, విజయ్బాబు పాల్గొన్నారు. -
ఆర్టీసీ కార్మికులకు కరవు భత్యం
సర్క్యులర్ జారీ చేసిన యాజమాన్యం సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు ఈ ఏడాది జనవరి నుంచి రావాల్సిన 3.4 శాతం కరువు భత్యం ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. మే నెల జీతంతో కలిపి చెల్లిం చేందుకు మంగళవారం సర్క్యులర్ జారీ చేసింది. ఆర్టీసీ ఎండీ సాంబశివరావును ఎన్ఎంయూ నేతలు మంగళవారం కలసి కార్మికుల సమస్యలపై చర్చించారు. -
కార్మికులు నాయకత్వాన్ని నేర్పారు
► జీవిత కాలం ఆర్టీసీ కార్మికులకు రుణపడి ఉంటా ► ప్రజల మధ్య ఎలా ఉండాలో నేర్చుకున్నాను ► మేయర్, టీఎంయూ గౌరవాధ్యక్షుడు నరేందర్ హన్మకొండ : ఆర్టీసీ కార్మికులు తనకు నాయకత్వాన్ని నేర్పారని వరంగల్ మేయర్, టీఎంయూ వరంగల్ రీజియన్ గౌరవాధ్యక్షుడు నన్నపునేని నరేం దర్ అన్నారు. మంగళవారం హన్మకొండలోని జిల్లా బస్స్టేషన్లో టీఎంయూ ఆధ్వర్యంలో మేయర్ నన్నపునేని నరేందర్ సన్మాన సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్రావు అండదండలతో టీఎంయూ రీజియన్ గౌరవాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టానన్నారు. గౌరవాధ్యక్షుడిని కావడం వలన ప్రజల మధ్యఎలా ఉండాలో నేర్చుకున్నాని చెప్పారు. తాను కార్పొరేటర్గా గెలిచేందుకు ఆర్టీసీ కార్మికులు ఎంతగానో శ్రమించారని తెలిపారు. అందుకే జీవిత కాలం ఆర్టీసీ కార్మికులకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. వరంగల్ రీజియన్లో టి. మజ్దూర్ యూనియన్ బలంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ టీఎంయూకు వెన్నుదన్నుగా ఉన్నారన్నా రు. పేదింటి బిడ్డను గుర్తించి తనను సీఎం కేసీఆర్ మేయర్ను చేశారన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్రావుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. టీఎంయూ పై ప్రత్యర్థులు కావాలని దుష్ర్పచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. వచ్చే గుర్తింపు ఎన్నికలు ఏకపక్షంగా జ రుగుతాయని, వరంగల్ రీజియన్లోని అన్ని డి పోల్లో టీఎంయూ గుర్తింపును పొందుతుందనే ధీమా వ్యక్తం చేశారు. టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వథామరెడ్డి మాట్లాడుతూ టీఎం యూకు పెద్ద దిక్కుగా నిలిచి నిస్వార్థంగా సేవ చేసినందునే మేయర్గా అవకాశం వచ్చిందన్నారు. ప్రజలకు చక్కని పాలన అందించి ప్రజ ల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. టీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు థామస్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంప్లాయూస్ యూనియన్ మొత్తం తుడుచుకు పెట్టుకుపోయిందన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్, ప్రముఖ మెజీషియన్ జూలకుంట్ల శ్రీనివాస్రెడ్డిని టీఎంయూ సన్మానించింది. ఈ సందర్భంగా ఎన్ఎంయు, ఈయూ నుంచి కార్మికులు టీఎంయూలో చేరా రు. సభలో టీఆర్ఎస్ నాయకులు పెద్ది సుదర్శన్రెడ్డి, కె.వాసుదేవరెడ్డి, టీఎంయూ నాయకులు వి.ఎస్.రెడ్డి, పిఆర్ రెడ్డి, పి.లక్ష్మయ్య, ఎం.ఎన్.రావు, ఈఎస్ బాబు,తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ కార్మికులకు శుభవార్త
- పెండింగ్ బకాయిల చెల్లింపునకు యాజమాన్యం అంగీకారం సాక్షి, హైదరాబాద్: . దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్ఎంయూ నేతలు బుధవారం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ఎన్.సాంబశివరావును కలసి చర్చించారు. దీంతో బకాయిలను ఏప్రిల్ 5లోగా చెల్లించేందుకు ఎండీ హామీనిచ్చారు. వేతన బకాయిలు(2013 నుంచి) ఒక నెల అరియర్స్, 2015లో జులై, ఆగస్టు, సెప్టెంబరుకు సంబంధించి డీఏ అరియర్స్ను వచ్చే నెల 5లోగా చెల్లించడానికి ఎండీ అంగీకరించినట్లు ఎన్ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రయ్య, వర్కింగ్ అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి తెలిపారు. 2013 నుంచి పదవీ విరమణ చేసిన సిబ్బందికి రావాల్సిన వేతన బకాయిల్లో 50 శాతం ఏప్రిల్లో మంజూరు చేస్తామని చెప్పారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలకు ప్రత్యేక సెలవు, 2012కు ఇవ్వాల్సినలీవ్ ఎన్క్యాష్మెంటు ఈ ఏడాది మేలో ఇస్తామని ఎండీ తెలిపారని చెప్పారు. తిరుపతి, వైజాగ్, నెల్లూరు, కర్నూలులో స్టాఫ్ రెస్ట్ రూంలను ఏసీతో ఆధునికీకరించేందుకు, 126 డిపోల్లో ఆర్వో ప్లాంట్ల ద్వారా వాటర్ కూలర్స్ ఏర్పాటుకు ఆదేశాలిచ్చారని ఎన్ఎంయూ నేతలు తెలిపారు. అద్దె బస్సుల్లో డ్రైవర్లకు టిమ్స్ మిషన్లు ఇచ్చే విధానాన్ని విరమిస్తామని ఎండీ సాంబశివరావు అంగీకరించారని చెప్పారు. -
దూసుకుపోయిన ‘బస్సు’
విజయనగరం అర్బన్: ఆర్టీసీ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో రీజియన్ కమిటీని ఎంప్లాయీస్ యూనియన్ కైవసం చేసుకుంది. నార్త్ ఈస్ట్ కోస్ట్ (నెక్) రీజియన్లోని తొమ్మిది డిపోల్లో ఏడు చోట్ల సమీప నేషనల్ మజ్దూర్ (ఎన్ఎంయూ) కంటే ఓట్లు అధికంగా తెచ్చుకొని విజయఢంకా మోగించింది. వరుసగా మూడోసారి నెక్ రీజియన్లో విజయం సాధించి పాగావేసింది. తొమ్మిది డిపోలలో విజయనగరం, పార్వతీపురం, సాలూరు, ఎస్కోట, పాలకొండ, టెక్కలి, పలాస డిపోలలో ఎంప్లాయీస్ యూనియన్కి, శ్రీకాకుళం-1, శ్రీకాకుళం-2 డిపోల్లో ఎన్ఎంయూకి అధిక ఓట్లు లభించాయి. దీంతో నెక్ రీజియన్లో గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియన్ విజయం సాధించింది. ఈ మేరకు ఓట్ల వివరాలు కార్మిక శాఖ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. విజయనగరం డిపో పరిధిలో ఎంప్లాయీస్ యూనియన్కు 306, 309, ఎన్ఎంయూకు 205, 205, కార్మిక పరిషత్కు 41, 39, ఎస్డబ్ల్యూఎఫ్కు 12, 20, వైఎస్ఆర్సీఎంయూకు 1, 0, కార్మికసంఘ్కు 1, 1 పోలయ్యాయి. చెల్లనివి 1, 1. సాలూరు డిపో పరిధిలో 364 ఓట్లకు నూరు శాతం ఓట్లు పోలయ్యాయి. వీటిలో 181 ఓట్లు ఎంప్లాయీస్ సొంతం చేసుకోగా, నేషనల్ మజ్దూర్ యూనియన్కు 157, కార్మిక పరిషత్కు 19, వైఎస్సార్ అనుబంధ సం ఘానికి 4, ఎస్డబ్ల్యూకు 1 ఓటు వచ్చాయి. పార్వతీపురం డిపో పరిధిలో 454 మొత్తం ఓట్లకు 448 ఓట్లు పోలయ్యాయి. ఇందులో రెండు ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు, నాలుగు అన్ఫోల్డ్ ఓట్లు ఉన్నాయి. ఎంప్లాయీస్ యూనియన్ (బస్సు గుర్తు)కు 275, 278, ఎన్ఎంయూ (కాగడ గుర్తు)కు 123, 128, వైఎస్ఆర్ సీపీ బలపరిచిన (టేబుల్ ఫ్యాన్గుర్తు)కు 34, 30 ఓట్లువచ్చాయి. టీడీపీ బలపరచిన కార్మిక పరిషత్కు (టైరు గుర్తు)కు 6, 7, ప్రజాసంఘాలు బలపరిచిన ఎస్డబ్ల్యూఎఫ్కు (నక్షత్రం గుర్తు)కు 5, 3, యు వర్కర్కు 1, 0 ఓట్లు రాగా, 4, 2 ఓట్లు చెల్లలేదని ఎన్నికల అధికారులు తెలిపారు. ఎస్.కోట ఆర్టీసీ డిపోలో మొత్తం 293 ఓట్లు పోలవ్వగా ఎంప్లాయీస్ యూనియన్కు 256, నేషనల్ మజ్దూర్ యూనియన్కు 28, వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్కు 4, కార్మిక పరిషత్కు 3, కార్మికసంఘ్కు 1 మొత్తం 292 ఓట్లు రాగా ఒక ఓటు చెల్లలేదని ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన కొత్తవలస సహాయ కార్మిక అధికారిణి టి.సుజాత గురువారం సాయంత్రం వెల్లడించారు. -
ఇళ్ల స్థలాల పేరుతో భారీ స్కామ్
పీలేరు: చిత్తూరు జిల్లాలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఇళ్ల స్థలాల పేరుతో డబ్బులు వసూలు చేసి, ఎలాంటి కేటాయింపులు చేయకపోవడంతో పీలేరులో ఆర్టీసీ కార్మికులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఆర్టీసీ డిపో పక్కనే ఉన్న హౌసింగ్ సొసైటీ కార్యాలయం వద్ద కార్మికులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సుమారు 480 మంది కార్మికుల నుంచి రూ.2 కోట్ల మేర వసూళ్లు చేసినట్టు ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు. రెండేళ్లయినా ఇంతవరకూ ఇంటి స్థలాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమిటీలోని సీఐ రామచంద్రంనాయుడుతోపాటు మిగిలిన వారు వేధింపులకు పాల్పడుతున్నారని బాధితులు చెప్పుతున్నారు. -
'ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం విస్మరిస్తోంది'
కర్నూలు: ఆర్టీసీ కార్మికులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ప్రభుత్వం విస్మరిస్తోందని ఆర్టీసీ మాజ్దార్ యూనియన్ గౌరవ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్మికుల సమస్యల కోసం 5 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగనున్న ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ఎన్నికల్లో 126 స్థానాల నుంచి వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తుందని రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. -
మంచిర్యాల ఆర్టీసీ డిపోలో మెరుపు సమ్మె
ఆదిలాబాద్ జిలా మంచిర్యాల ఆర్టీసీ డిపోలో కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. కార్మికులపై పని భారం పెంచడాన్ని నిరసిస్తూ డ్రైవర్లు, కండక్టర్లు ఆకస్మికంగా మంగళవారం తెల్లవారుజాము నుంచివిధులు బహిష్కరించారు. దీంతో డిపో నుంచి ఒక్క బస్సు కూడా కదల్లేదు. ఈ డిపో నుంచి వివిధ ప్రాంతాలకు రోజూ 300 బస్సులు వెళుతుంటాయి. -
దసరా అడ్వాన్స్ కోసం ఆర్టీసీ కార్మికుల ధర్నా
కర్నూలు (రాజ్విహార్) : దసరా అడ్వాన్స్లను ఇవ్వాలని కోరుతూ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం కర్నూలు డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుసూదన్ మాట్లాడుతూ... పండుగ ముందే దసరా అడ్వాన్స్లను ఇవ్వాలని అలాగే, వేతన బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. -
సార్వత్రిక సమ్మె సక్సెస్
పరిగి : కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలు వీడాలని టీఎంయూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి హ న్మంతు, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి మాధవరం వెంకటయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి పీర్ మహ్మద్ తదితరులు పేర్కొన్నారు. ఆయా పార్టీలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం పరిగిలో చేపట్టిన సార్వత్రిక సమ్మె అందరి భాగస్వామ్యంతో విజయవంతం అ యింది. ఇందులో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా లు, వీఆర్ఏలు, ఏఎన్ఎంలు, ఆర్వీఎం కాం ట్రాక్టు ఉద్యోగులు, ఆశ వర్కర్లు సమ్మెలో పాల్గొని పరిగిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు మూసివేయించారు. సీపీఐ ఆధ్వర్యంలో బస్స్టాండు ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛం దంగా సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు. దీంతో బస్సులన్నీ డిపోకే పరిమిత మయ్యాయి. సమ్మెలో భాగంగా డిపో ఎదుట టీఎం యూ, టీఎన్ఎంయూ, ఎంప్లాయిస్ తదితర యూనియన్ల ఆర్టీసీ కార్మికులు బస్ డిపో ముం దు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆచా సంఘాలు, యూనియన్ల నాయకులు శ్రీశైలం, వెంకట్, ప్రశాంత్, రాజశేఖర్,రవి, వెంకట్రాములు, మల్లేశం, బాలు, నిరంజన్, ఎస్జేఎం రెడ్డి, శ్రీనివాస్, మంజుల, సక్కుబాయి, స్వరూప, పద్మ పాల్గొన్నారు. -
సమ్మె...సక్సెస్
నల్లగొండ : కార్మిక సంఘాల ఆధ్వర్యం లో తలపెట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సమ్మె ప్రశాంతంగా ముగి సింది. కార్మిక సంఘాలకు మద్దతుగా వివిధ రాజకీయ పక్షాలు తమ సంఘీభావాన్ని తెలిపాయి. సమ్మెలో కేంద్ర ప్రభు త్వ ఉద్యోగులు, సీఐటీయూ, ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాలు, ఆర్టీసీ కార్మికులు, ట్రేడ్ యూనియన్లు, ఆటో వర్కర్లు, హమాలీ, భవన నిర్మాణ రంగ కార్మికులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. సమ్మెకు మద్దతుగా బుధవారం జరగాల్సిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేశారు. కార్మికులకు సమ్మెకు మద్దతుగా సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. జిల్లా వ్యాప్తం గా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రైవేటు వాహనాలు, ఆటోలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు నిలిపేశారు. జిల్లా కేంద్రంలో భోజన విరామసమయంలో రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి సమ్మెకు మద్దతు తెలిపాయి. స్థానిక గడియారం సెంటర్ వద్ద కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించాయి. భువనగిరి నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలు ఆగిపోయా యి. అన్ని మండలాల్లో వివిధ కార్మిక సంఘాలు, అనుబంధ సంఘాలు కలిసి బైక్ ర్యాలీలు నిర్వహించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో విద్యాసంస్థలకు ముందుగానే సెలవు ప్రకటించారు. మిర్యాలగూడలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రాజీవ్ చౌక్ వద్ద సభ నిర్వహించారు. వేములపల్లిలో సీఐటీ యూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించగా....దామరచర్లలో అద్దంకి - నార్కట్పల్లి రహదారిపై కార్మికులు మానవహారం నిర్వహించారు. కోదాడ లో కార్మిక సంఘాలు, అనుబంధ సం ఘాలు కలిసి పట్టణంలో బైక్ ర్యాలీలు నిర్వహించాయి. ఆర్టీసీ బస్టాండ్, రంగా థియేటర్ సెంటర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. నకిరేకల్లో సీపీఐ ఎంఎల్ న్యూడెమాక్రసీ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యం లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు. ఆటోలతో ర్యాలీతో నిరసన తెలిపారు. అన్ని మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీ లు నిర్వహించారు. చౌటుప్పల్లో సీఐటీ యూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో వ్యాపార సంస్థలను బంద్ చేశారు. సంస్థాన్ నారాయణపురంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. మునుగోడులో ర్యాలీ తీశారు. చండూరులో తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆలేరు ఆత్మకూరు (ఎం), బొమ్మలరామారం, రాజాపేట, గుండా ల, తుర్కపల్లి మండలాల్లో కార్మిక సం ఘాలు ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిం చారు. హుజూర్నగర్లో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, ఐఎన్టీయూసీ, టీఆర్ఎస్కేవీ, వైఎస్సార్సీపీటీ యూ, కార్మిక సంఘాలు, అనుబంధ సం ఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేశారు. మఠంపల్లి, గరిడేపల్లి, నేరేడుచ ర్ల, మేళ్లచెర్వులో ప్రధాన రహదారులపై ర్యాలీలు నిర్వహించారు. తిరుమలగిరి, మోత్కూరు, నూతనకల్, తుంగతుర్తి, శాలిగౌరారం, అర్వపల్లి మండల కేం ద్రాల్లో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, టీడీపీ కార్మిక సంఘాలు, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించి రాస్తారోకో చేశారు. దేవరకొండలో కార్మి క సంఘాలు తలపెట్టిన సమ్మెలో ఎమ్మె ల్యే రవీంద్రకుమార్ పాల్గొన్నారు. -
తెలంగాణ ఆర్టీసీని కాపాడుకుందాం
ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హన్మకొండ: ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నాయకత్వాన్ని బలపరచాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గురువారం హన్మకొండలో జరిగిన ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ విజయోత్సవ సభలో కడియం శ్రీహరి మాట్లాడారు. కార్మికులు ఊహించని విధంగా సీఎం కేసీఆర్ 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని చెప్పారు. ఇది కేసీఆర్ అందించిన తెలంగాణ కానుక అని అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ఆర్టీసీ కార్మికులు భాగస్వాములు కావాలని సూచించారు. తెలంగాణ ఆర్టీసీని కాపాడుకుందామన్నారు. తెలంగాణను అడ్డుకొన్న శక్తులే.. ఏర్పాటైన రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు జేయాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. పాలమూరు బంద్కు టీఎంయూ మద్దతు.. పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాయడాన్ని నిరసిస్తూ మహబూబ్నగర్ జిల్లాలో ఈనెల 10వ తేదీన చేపట్టనున్న బంద్కు ఆర్టీసీ టీఎంయూ సంపూర్ణ మద్దతు ఇస్తోందని టీంఎంయూ వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్రెడ్డి చెప్పారు. బంద్లో ఆర్టీసీ కార్మికులు పాల్గొంటారన్నారు. టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ ఎంప్లాయూస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రాజిరెడ్డికి.. టీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్ను, టీఎంయూను విమర్శించే హక్కు లేదన్నారు. రాజిరెడ్డీ నువ్వెంత, నీ సెజైంత? నీ దమ్మెంత.. కేసీఆర్ను విమర్శించే స్థాయి నీది కాదు.. అని మండిపడ్డారు. -
చార్జీల పెంపునకు సిద్ధం..!
టికెట్ ధరల సవరణపై యాజమాన్యం దృష్టి సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు అడిగిన దానికంటే ఒక శాతం ఎక్కువగా ఫిట్మెంట్ ప్రకటించిన ప్రభుత్వం.. ఇక బస్సు చార్జీల పెంపుపై దృష్టి సారించనుంది. ఫిట్మెంట్ భారాన్ని అధిగమించే యత్నాల్లో చార్జీల పెంపు కూడా ఒకటని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. అయితే ప్రజలపై ఎక్కువగా భారం పడకుండా చూస్తామని పేర్కొన్నారు. కానీ, డీజిల్ ధరలు ఒక్కసారిగా భగ్గుమనడంతో ఆర్టీసీపై రూ.75 కోట్ల అదనపు భారం పడింది. ఇప్పటికే నష్టంతో కుంగిపోతున్న ఆర్టీసీ ఈ భారం మోయలేమని స్పష్టం చేస్తోంది. టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం లైన్ క్లియర్ చేసిన వెంటనే దాన్ని అమలు చేయడం ద్వారా ఆర్థిక భారం నుంచి కొంతైనా తప్పించుకోవాలని చూస్తోంది. కార్మికులకు ఫిట్మెంట్ ఇచ్చిన వెంటనే టికెట్ ధరలు పెంచితే.. ఆ భారాన్ని నేరుగా ప్రజలపై మోపిన భావన వస్తుందనే ఉద్దేశంతో చార్జీల పెంపును వెంటనే అమలు చేయొద్దని భావించింది. కానీ, డీజిల్ ధరలు పెరగడంతో ఇక టికెట్ ధరల పెంపు అనివార్యంగా మారింది. కార్మికులకు ఫిట్మెంట్ ప్రకటిస్తే 15 శాతం మేర టికెట్ రేటు పెంచుకోవడానికి అనుమతించాలని ఆర్టీసీ గత నెలలోనే ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అది ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దానికి వెంటనే పచ్చజెండా ఊపాలని ఇప్పుడు ఆర్టీసీ కోరబోతోంది. దీనికి సంబంధించి మరో రెండుమూడు రోజుల్లో కొత్త ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించే సమయంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీకి పలు వరాలు ప్రకటించారు. అందులో కొన్ని మినహా మిగతా వేటిపై స్పష్టత లేదు. ముఖ్యంగా.. 44 శాతం ఫిట్మెంట్ ప్రకటనతో పడే రూ.850 కోట్ల భారాన్ని ప్రభుత్వం నేరుగా భరిస్తుందా, ఆర్టీసీకి కొంతమేర గ్రాంట్ల ద్వారా సర్దుబాటు చేస్తుందా అన్న విషయంలో ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వలేదు. ఇక ఆర్టీసీకి తీవ్ర భారంగా మారిన రూ.1,900 కోట్ల అప్పుల విషయంలోనూ అలాంటి గందరగోళమే నెలకొంది. అప్పులకు సంబంధించి ఆర్టీసీ రూ.186 కోట్ల వడ్డీ చెల్లిస్తోంది. ఈ వడ్డీ భారం నుంచి బయటపడాలంటే ముందుగా అప్పులు లేకుండా చేయాల్సి ఉందని సీఎం పేర్కొన్నారు. కానీ, ఆ అప్పులను ఎవరు తీర్చాలనే దానిపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఆర్టీసీకి జరుపుతామన్న కేటాయింపులు ఎంత అనేదీ స్పష్టం కాలేదు. జూన్ నెల నుంచి ఫిట్మెంట్ను చెల్లించాల్సిన నేపథ్యంలో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు ప్రారంభించారు. కానీ, ముఖ్యమంత్రి హామీల్లో స్పష్టత వస్తేగానీ ఈ లెక్కలు తేలవు. దీంతో ఆర్టీసీ అధికారులు రవాణాశాఖ, ఆర్థిక శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆ రెండుచోట్ల కూడా స్పష్టత లేకపోవడంతో ముఖ్యమంత్రి కార్యాలయంతో సంప్రదించి చెప్తామనే సమాధానం వచ్చినట్టు తెలిసింది. -
కేసీఆర్కు రుణపడి ఉంటాం
టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి మోహన్లాల్ అచ్చంపేట రూరల్ : ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు 44శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షించదగ్గ విషయమని, సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని ఆర్టీసీ టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్. మోహన్లాల్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే బాలరాజును ఆర్టీసీ కార్మికులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్మికులకు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. ఇతర ప్రభుత్వాలు కార్మికులతో వెట్టిచాకిరీ చేయించాయన్నారు. 44శాతం ఫిట్మెంట్ ఇవ్వడంతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తామన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపిన మంత్రి హరీష్రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని మరోసారి నిరూపించిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు ఎంతో కష్టపడి ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించారన్నారు. అన్నివర్గాల ప్రజలకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎంయూ డిపో సెక్రటరీ దాసపత్రి వెంకటేష్, నాయకులు చంద్రయ్య, వీసీమౌళి, ఎ.జంగిరెడ్డి, కరీం, ఎంజీనాయక్, టీఆర్ఎస్ నాయకులు నర్సింహగౌడ్, సీఎం రెడ్డి, కటకం రఘురాం, అంతటి శివ, రహ్మతుల్లా తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం ఖరీదు రూ. 200 కోట్లు
యాదమరి: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించి నందుకు రూ.200 కోట్లు నష్టం వచ్చిందని పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్కుమార్ ఆరోపించారు. ఆయన గురువారం విలేకరితో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్మెంట్ 43 శాతం ఇవ్వాలని ముందే అడిగారనీ,ఇవ్వకపోతే సమ్మె చేస్తామని హెచ్చరికలు చేసినా ప్రభుత్వం వీరి సమస్యలు పట్టించుకోకుండా పోవడంతో వారు ఎనిమిది రోజులుగా సమ్మె చేశారు. ప్రయాణికుల సమస్యలను చూడలేక వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీ కార్మికుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తామని ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి ఆర్టీసీ కార్మికుల డిమాండ్ మేరకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చిందన్నారు. సమ్మె కాలంలో వాటిల్లిన దాదాపు రూ.200 కోట్ల నష్టం ప్రభుత్వం భరించాలని పేర్కొన్నారు. నేడు సప్లై ఛానల్ పరిశీలన మండలంలోని నేరేనగర్ ముస్లింవాడ గ్రామం నుంచి శ్మశాన స్థలానికి వెళ్లే సప్లై ఛానల్ను పూతలపట్టు నియోజక వర్గ ఎమ్మెల్యే సునీల్ కుమార్ జెడ్పీటీసీ ఉషారాణి, ఎంపీపీ రాధమ్మ , వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు,సర్పంచ్లు పరిశీలించనున్నట్లు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ధనంజయరెడ్డి తెలిపారు. -
ఏపీలో 43 శాతం ఫిట్మెంట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, ప్రయాణికుల కష్టాలకు ఫుల్స్టాప్ పడింది. ఆంధ్రప్రదేశ్లో గత బుధవారం నుంచి సమ్మెలోకి దిగిన ఆర్టీసీ కార్మికుల డిమాండ్ మేరకు ఎట్టకేలకు 43 శాతం ఫిట్మెంట్కు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో సమ్మె వీడి విధుల్లో చేరాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. బుధవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు సుదీర్ఘంగా చర్చలు సాగించాయి. చివరకు 43 శాతం వేతన సవరణకు అంగీకరిస్తూ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఎరియర్స్ను పదవీ విరమణ సమయంలో ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) తీసుకునే లోపే అందిస్తామని కార్మిక సంఘాలకు హామీనిచ్చింది. ఏప్రిల్, మే, జూన్ నెలల ఎరియర్స్ను దసరా, దీపావళి పండగులకు అందిస్తామని ప్రకటించింది. 43 శాతం ఫిట్మెంట్ వల్ల నెలకు రూ.73 కోట్లు, ఏడాదికి రూ.936 కోట్ల భారం పడుతుందని ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంది. ఆర్టీసీ కార్మికుల సమస్యలు నాలుగు రోజుల్లో పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరించిన మర్నాడే ప్రభుత్వం దిగొచ్చిందని, లేదంటే 8 రోజులుగా సమ్మె చేస్తున్నా తమను పట్టించుకోలేదని ఆర్టీసీ కార్మిక యూనియన్ నేతలు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆర్టీసీ చార్జీలు పెంచే యోచన లేదు ఆర్టీసీ కార్మికులతో జరిగిన చర్చలు సఫలమయ్యాయని, సమ్మె ముగిసినట్లేనని కార్మిక మంత్రి కె.అచ్చెన్నాయుడు తెలిపారు. కార్మిక సంఘాల నేతలతో చర్చల అనంతరం రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, శిద్ధా రాఘవరావు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావు, కార్మిక సంఘాల ప్రతినిధులు ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు. చార్జీలు పెంచే యోచనేదీ లేదని చెప్పారు. రూ.వంద కోట్ల నష్టం: మంత్రి శిద్ధా ఆర్టీసీ కార్మికులు ఎనిమిది రోజులుగా చేసిన సమ్మె వల్ల ఆర్టీసీకి రూ.వంద కోట్ల నష్టం వాటిల్లిందని రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు చెప్పారు. సమ్మె సమయంలో 70 శాతం బస్సులు నడిపామని, ఆర్టీసీ భవిష్యత్తు దృష్ట్యా 43 శాతం ఫిట్మెంట్కు ఓకే చెప్పామన్నారు. భారాన్ని వివిధ మార్గాల్లోసమకూర్చుకుంటాం: ఎండీ 43 శాతం ఫిట్మెంట్తో ఆర్టీసీకి రూ.936 కోట్ల భారం పడుతుందని, ఈ భారాన్ని వివిధ మార్గాల్లో సమకూర్చుకుంటామని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ప్రకటించారు. ఈ భారాన్ని ప్రజలపై మోపేది లేదన్నారు. చార్జీలు పెంచితే సహించం: వైఎస్సార్సీపీ ఆర్టీసీ సిబ్బందికి ఫిట్మెంట్ ఇవ్వడం వల్ల భారం పడిందనే పేరుతో ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు బస్సు చార్జీలను పెంచితే సహించేది లేదని వైఎస్సార్సీపీ హెచ్చరించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ తరువాత బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోరాడి తమ డిమాండ్లను సాధించుకున్న ఆర్టీసీ కార్మికులకు అభినందనలు తెలిపారు. కార్మికులు సమ్మెకు నోటీసు ఇచ్చినప్పుడే సమస్యలు పరిష్కరించి ఉంటే సంస్థపై మరింత భారం పడి ఉండేదే కాదని, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడే వారే కాదని పద్మ అన్నారు. ఈ సమస్యను రెండు ప్రభుత్వాలూ నాన్చి పెద్దది చేశాయని ఆమె విమర్శించారు. మరోవైపు ఆర్టీసీ సమ్మెలో కార్మికులు విజయవంతంగా తమ డిమాండ్లను సాధించుకోవడం పట్ల వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.రాజారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో బకాయిలు 1,548 కోట్లు సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్మెంట్ను 2013 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాల్సి ఉంది. పెంచిన వేతన సవరణ ఈ ఏడాది జూన్ నుంచి అమల్లోకి రానుంది. అయితే, 2013 నుంచి 2015 మార్చి వరకు ఎరియర్స్ రూ.1,548 కోట్లు మేర ఉన్నాయి. వీటికి సంబంధించి బాండ్లు జారీ చేయనున్నారు. ఆర్టీసీలో అన్ని స్థాయిల్లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రతి నెలా జీతాల రూపంలో రూ.180 కోట్లకు పైగా ఖర్చవుతుంది. రూ.10వేల మూల వేతనం ఉన్న ఉద్యోగికి 43 శాతం ఫిట్మెంట్తో రూ.4,300 పెరగనుంది. ఆనందంతో ఆగిన గుండె తొండూరు: ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందనే వార్త విని సంతోషం పట్టలేక ఉబ్బితబ్బిబైన ఓ డ్రైవర్ గుండెపోటుకు గురై మృతి చెందాడు. వైఎస్ఆర్ జిల్లా తొండూరుకు చెందిన పి. నారాయణ(46) పులివెందుల డిపోలో డ్రైవర్గా పని చేస్తున్నాడు. సమ్మెలో కూడా పాల్గొన్నాడు. 43% ఫిట్మెంట్కు ప్రభుత్వం అంగీకరించిందనే వార్తను టీవీలో చూసిన నారాయణ.. ఆనందంతో గుండెపోటుకు గురై కన్నుమూశాడు. -
సంబురం
సీఎం ప్రకటనతో ఆర్టీసీ కార్మికుల జోష్ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలభిషేకం రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని వెల్లడి నిజామాబాద్ నాగారం: ఎనిమిది రోజులపాటు జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు సాగించిన పోరాటానికి ఫలితం లభించింది. ఊహకందని విధంగా సీఎం కేసీఆర్ 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించడంతో కార్మికులు సంబరాలలో మునిగిపోయూరు. టీవీలలో ఈ వార్త ప్రసారమైన వెంటనే బస్సు డిపోలు, బస్టాండ్లు, రహదారుల పై టపాసులు పేల్చారు. బ్యాండ్, బాజాలతో నృత్యాలు చేస్తూ, తెలంగాణ పాటలు పాడుతూ ఆనందాన్ని వ్యక్తపరిచారు. కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.మిఠారుు లు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ ఆనంద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులకు ఊహకందని విధంగా కడుపు నిండా ఫిట్ మెంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక నుంచి మరింత రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామన్నా. సంస్థ అభివృద్ధి పయనించే విధంగా కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. కేసీఆర్ తమ కష్టాలను తెలుసుకొని న్యాయం చేసినందుకు ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో కో-కన్వీనర్లు సయ్యద్ అహ్మద్, వందేమా తరం శ్రీనివాస్, సాయిబాబా, సంజీవ్, పురుషోత్తం, సాయన్న, వివిధ కార్మిక సంఘాల నాయకులు, టీఎన్జీఓఎస్ నేత గైని గంగారాం తదితరులు పాల్గొన్నారు. రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు ఎనిమిది రోజుల సమ్మె తరువాత బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కారుు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించడంతో కార్మికులు సమ్మెను విరమించారు. దీంతో బస్సులన్నీ డిపోల నుంచి బస్టాండ్కు చేరుకున్నాయి. ఈ ఎనిమిది రోజులపాటు ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. ప్రైవేట్ వాహనాలు దోచుకున్నారుు. ఇది ఆర్టీసీ కార్మికుల విజయం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు సిద్దార్థరెడ్డి నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వం 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించడం ఆర్టీసీ కార్మికుల విజయమని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పెద్దపట్లోళ్ల సిద్ధార్థరెడ్డి పేర్కొ న్నారు. గత కొన్ని రోజులుగా కార్మికులు కలిసి పోరాడి తమ డిమాండ్లను నెరవేర్చుకున్నారన్నారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకవచ్చి నిరసనలు తెలిపి వి జయం సాధించారన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను విస్మరించిన సమయంలో ఆర్టీసీ సంఘాలు, కార్మికులు ఏకతాటిపైకి వచ్చి పోరాడడం అభినందనీయమ న్నారు. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వం తలొగ్గి డిమాండ్ల పరిష్కారం కోసం దిగి వచ్చిందన్నారు. భవిష్యత్తులో కూడా ఆర్టీసీ కార్మికులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటు ందన్నారు. కార్మికులకు ఎలాంటి నష్టం జరిగినా వారి కోసం పోరాడుతుందన్నారు. -
ఆనందోత్సాహం
నల్లగొండ : ఆర్టీసీ కార్మికులు సంబురాల్లో మునిగితేలారు. కార్మికుల డిమాండ్లు పరిష్కరించే దిశగా 8 రోజుల నుంచి చేస్తున్న సమ్మెకు బుధవారం బ్రేక్ పడింది. కార్మికులు డిమాండ్ చేసిన దానికంటే ఒక శాతం ఎక్కువ ఫిట్మెంట్ ప్రకటించడం పట్ల కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. 43 శాతం ఫిట్మెంట్ పెంచాలని సంఘాలు డిమాండ్ చేయగా...సీఎం 44 శాతం ఇస్తామని ప్రకటించారు. దీంతో బుధవారం మధ్యాహ్నం వరకు సమ్మెలో ఉన్న కార్మిక సంఘాలు ఒక్కసారిగా రోడ్డుమీదకు వచ్చి సంబురాలు నిర్వహించాయి. తెలంగాణ తెలుగు తల్లి విగ్ర హానికి పూలమాలలు, సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పలుచోట్ల కార్మికులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. కాగా ఈ సమ్మెలో కార్మికులకు అండగా ఉద్యోగులు సైతం కదలిరావడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఇదే క్రమంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టేంచేందుకు అధికారులు, కార్మికులు తమ వంతు కృషి చేయాల్సి ఉంటుంది. దీనిలో భాగంగానే రీజియన్ పరిధిలో ఖర్చు తగ్గించుకుని ఆదాయం పెంచుకునేందుకు వివిధ మార్గాలను అన్వేషించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ ఎనిమిది రోజుల సమ్మె కారణంగా నల్లగొండ రీజియన్కు రూ.5.6 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడంతో పాటు, మితిమీరిన ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కార్మికుల సంబురాలు...కదిలిన బస్సులు సీఎంతో జరిపిన చర్చలు సఫలీకృతం కావడంతో సాయంత్రం 4 గంటల నుంచే బస్సులు రోడ్డుమీదకు రావడం మొ దలుపెట్టాయి. గురువారం ఎంసెట్ ప్రవేశ పరీక్ష దృష్ట్యా బుధవార అర్ధరాత్రి అన్ని గ్రామాలకు బస్సులు పంపిం చారు. ప్రత్యేకంగా 115 బస్సులు ఏర్పాటు చేశారు. నల్లగొండ డిపో ఎదుట కార్మికులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ర్యాలీగా బయల్దేరి వెళ్లి క్లాక్ టవర్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి బాణాసంచా కాల్చారు. సూర్యాపేటలో డిపో ఆవరణ నుంచి మొదలుకొని తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ తీస్తూ బాణాసంచాలు కాల్చారు. అనంతరం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నార్కట్పల్లి, దేవరకొండలో కార్మికులు, ఉద్యోగులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి తమ హర్షం ప్రకటించారు. మిర్యాలగూడలో కార్మికులు స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు నిర్వహించారు. కోదాడలో కార్మికలు స్థానిక బస్టాండ్ నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. -
రైట్.. రైట్..
43 శాతం ఫిట్మెంట్కు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో పండిట్ నెహ్రూ బస్స్టేషన్లో ఆర్టీసీ కార్మికులు బుధవారం విజయోత్సవం జరుపుకొన్నారు. బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు.బస్సుల రాకపోకలు పూర్తిస్థాయిలో మొదలవడంతో బస్స్టేషన్ మళ్లీ కళకళలాడింది. విజయవాడ : ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఆర్టీసీ కార్మికులు న్యాయమైన కోర్కెలను పరిష్కరిస్తామని ప్రకటించింది. ఆర్టీసీ యూనియన్లు తన ముందు ఉంచిన డిమాండ్లలో కొన్నింటిని ప్రభుత్వం అంగీకరించడంతో బుధవారం మధ్యాహ్నం సమ్మె ముగిసింది. దీంతో ఆర్టీసీ కార్మికులు, వివిధ సంఘాల నాయకులు బస్స్టాండ్లో విజయోత్సవాలు జరుపుకొన్నారు. ఎనిమిది రోజు కార్మికులు సమ్మె విరమించి విధులకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం 5.30 గంటల నుంచి జిల్లాలో పూర్తిస్థాయిలో అన్ని సర్వీసులు నడిచాయి.ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రివర్గ ఉపసంఘం జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో సమ్మె ముగి సింది. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వటానికి ప్రభుత్వం అంగీకారం తెలి పింది. 2013 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉద్యోగ విరమణ చేసిన కార్మికులకు తక్షణం, సర్వీసుల్లో ఉన్న కార్మికులకు బాండ్ల రూపంలో ఏరియర్స్ ఇస్తామని ప్రకటించింది. జూలై పేస్కేల్ నుంచి ఫిట్మెంట్తో కలిసిన జీతం అమలులోకి రానుంది. ఉదయం నుంచి కొనసాగిన సమ్మె సమ్మెలో భాగంగా ఉదయం నుంచి జిల్లాలో పటుచోట్ల కార్మికుల నిరసన కార్యక్రమాలు యథాతథంగా కొనసాగాయి. విజయవాడ పాత బస్స్టాండ్ నుంచి కొత్త బస్స్టాండ్ వరకు సిబ్బంది నోటికి నల్లరిబ్బన్లు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. జగ్గయ్యపేట డిపోలో జరిగిన నిరసన కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సామినేని ఉదయభాను మద్దతు పలికారు. గుడివాడ, ఇబ్రహీంపట్నం, నూజివీడు, తిరువూరు తదితర డిపోల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. విజయోత్సవాలు కార్మికులు సమ్మె విరమణ అనంతరం విజయోత్సవాలు జరుపుకొన్నారు. పాత బస్స్టాండ్ నుంచి కొత్త బస్స్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్స్టాండ్లో రంగులు చల్లుకొని, స్వీట్లు పంచుకున్నారు. జిల్లాలోని ఇతర డిపోల్లోనూ కార్మికులు సంబరాలు జరుపుకొన్నారు. రూ.12 కోట్ల నష్టం ఆర్టీసీకి జిల్లాలో 8 రోజుల సమ్మెతో రూ.12 కోట్ల నష్టం వాటిల్లింది. మొదటి మూడు రోజు సమ్మె ప్రభావంతో ఎక్కువ సర్వీసులు నడవలేదు. బుధవారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 950 బస్సు సర్వీసులు నడిచాయి. బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, హైదరాబాద్ ఇతర దూరప్రాంతాలకు కూడా సర్వీసులు మొదలయ్యాయి. నేటి నుంచి పూర్తిస్థాయిలో ఆర్టిసీ సర్వీసులు బస్స్టేషన్ : ఆర్టీసీ సర్వీసులు గురువారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని రీజనల్ మేనేజర్ సుదేష్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్మికులు ఎనిమిది రోజులు సమ్మె నిర్వహించడంతో ప్రయాణికులకు సర్వీసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు. పలు రూట్లలో సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయని వివరించారు. ఈ నేపథ్యంలో 43 శాతం ఫిట్మెంట్ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో కార్మికులకు విధులకు హాజరవుతుని తెలిపారు. -
రైట్.. రైట్
44 శాతం ఫిట్మెంట్కు ఓకే.. సమ్మె విరమణ నెరవేరిన కార్మికుల కల.. కదిలిన రథచక్రాలు.. హన్మకొండ: ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చడంతో ఎనిమిది రోజులుగా కొనసాగిన సమ్మె బుధవారం ముగిసింది. 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించడంతోపాటు ఈ నెల 14వ తేదీ నుంచి కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తున్నట్లు... సమ్మెలో కార్మికులపై పెట్టిన కేసులను ఎత్తి వేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో కార్మికుల ఆనందోత్సవాలకు అవధుల్లేకుండా పోయాయి. జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ యూనియన్ల నాయకులు, కార్మికులు సమ్మె విరమించి సంబరాల బాటపట్టారు. రంగులు చల్లుకుని.. బాణ సంచా కాల్చి... స్వీట్లు పంచుకున్నారు. రోజు వారి నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఉదయం హన్మకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాలయం ఎదుట టీఎంయూ, జేఏసీ ఆధ్వర్యంలో వేర్వేరుగా ధర్నా చేసిన కార్మికులు.. అదే చోట సంబరాలు నిర్వహించుకున్నారు. హన్మకొండ జిల్లా బస్స్టేషన్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రులు కడియం శ్రీహరి, హరీష్రావు, నాయిని నర్సింహారెడ్డి, మహేందర్రెడ్డి, టీఎంయూ రాష్ట్ర నాయకులు అశ్వథ్థామరెడ్డి, థామస్రెడ్డి, తిరుపతయ్య ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఎంప్లాయూస్, నేషనల్ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రంగులు చల్లుకుని సంబ రాలు జరుపుకున్నారు. -
కార్మికుల బాధలు అర్థం చేసుకున్న కేసీఆర్
► జీతాలు తక్కువ ఉన్నందుకే 44 శాతం ఫిట్మెంట్ ► కేసుల ఎత్తివేత.. సస్పెన్షన్లు రద్దు ► రానున్న నెలరోజుల్లో డిపోల వారీగా సమీక్షలు ► రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి తాండూరు : ఆర్టీసీ కార్మికుల బాధలను అర్థం చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 44 శాతం ఫిట్మెంట్ను ప్రకటించారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్రెడ్డి పేర్కొన్నారు. తాండూరుకు వచ్చిన మంత్రికి బుధవారం రాత్రి ఆర్టీసీ కార్మికులు మిఠాయి తినిపించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో ఆర్టీసీ నష్టాలను చవిచూసిందన్నారు. రూ.18 వందల కోట్ల నష్టాలు ఉన్నప్పటికీ తెలంగాణ సర్కారు కార్మికుల కోర్కెలన్నీ తీర్చిందన్నారు. కార్మికులు కోరిన 43 శాతం కన్నా ఒక్క శాతం ఫిట్మెంట్ పెంచడంవల్ల సంస్థపై సుమారు రూ.8 వందల కోట్ల భారం పడుతున్నా.. కార్మికుల సంక్షేమానికే సీఎం ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చితే ఆర్టీసీ కార్మికుల జీతాలు తక్కువగా ఉన్నందుకే సబ్ కమిటీలో మంత్రులు సూచనల మేరకు సీఎం 43కు బదులు 44 శాతం ఫిట్మెంట్ను ప్రకటించారని మహేందర్రెడ్డి వివరించారు. వారం రోజుల సమ్మె కాలంలో తెలంగాణలో సుమారు రూ.80 నుంచి రూ.100 కోట్ల నష్టం వచ్చిందన్నారు. ఏడాదికి రూ.400 కోట్ల నష్టాలు ఉన్నాయన్నారు. ఏడాదికి రూ.9 కోట్ల ఆదాయం వస్తే రూ.10 కోట్ల ఖర్చు ఉంటుందన్నారు. సస్పెండయిన అధికారులు, ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామన్నారు. సమ్మె కా లాన్ని స్పెషల్ లీవ్గా పరిగణంలోకి తీసుకుంటామన్నా రు. తెలంగాణలో ఆర్టీసీని లాభాలబాటలోకి తీసుకువచ్చేందుకు కార్మికులు బాధ్యతగా పనిచేయాలన్నారు. వచ్చేనెల రోజుల్లో పది జిల్లాల్లో డిపోలవారీగా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. తాండూరు డిపో మేనేజర్ లక్ష్మీధర్మా, అధికారులు మంత్రిని కలిశారు. కార్మికులు, యూనియన్ నాయకులు మంత్రిని గజమాల, శాలువాతో సన్మానించారు. -
నేడు ఆర్టీసీ సమ్మెపై అటో.. ఇటో!
-
నిరసన హోరు
కొనసాగిన ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు ఇబ్రహీంపట్నంలో భిక్షాటన నగరంలో మానవహారం జిల్లా వ్యాప్తంగా 728 సర్వీసులు నడిపిన అధికారులు విజయవాడ : జిల్లాలో ఆర్టీసీ కార్మికులు మంగళవారం కూడా నిరసన కార్యక్రమాలతో హోరెత్తించారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల మద్దతుతో ఆర్టీసీ కార్మికులు అన్ని ప్రధాన డిపోల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కార్మికుల సమ్మె ఏడో రోజూ కొనసాగింది. అయితే అధికారులు జిల్లాలో 728 సర్వీసులను నడిపారు. దూర ప్రాంతాలైన చెన్నై, బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్, వైజాగ్ మినహా అన్ని ప్రాంతాలకు బస్సులు నడుస్తున్నాయి. బస్సులు సగటున 50 శాతం వరకు నడుస్తున్నా సంస్థకు నష్టాలు మాత్రం తప్పడం లేదు. నగరంలోని పండిట్ నెహ్రూ బస్స్టేషన్లో కార్మిక సంఘాల నేతలు మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం బస్స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి బయటకు వెళ్లే బస్సులను అడ్డుకున్నారు. పోలీసులు వెంటనే జోక్యం చేసుకోవడంతో బస్సులు యథావిధిగా నడిచాయి. అనంతరం కార్మికులు బస్స్టేషన్ నుంచి జాతీయ రహదారిపైకి చేరుకుని కొద్దిసేపు నిరసన తెలిపారు. అక్కడినుంచి కంట్రోల్ రూమ్ సెంటర్కు చేరుకుని మానవహారం నిర్మించారు. దీంతో బందరు రోడ్డులో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా కార్మిక సంఘ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులపై బెదిరింపు ధోరణిలో వ్యవహరించడం సరికాదని సూచించారు. 43 శాతం ఫిట్మెంట్ సాధించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టంచేశారు. అక్కడి నుంచి సబ్కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. జిల్లాలో.. తిరువూరు, గుడివాడ, జగ్గయ్యపేట, ఇబ్రహీంపట్నం తదితర బస్ డిపోల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. తిరువూరులో ఆర్టీసీ డిపో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి మౌనప్రదర్శన చేశారు. బస్టాండ్లో కార్మిక సంఘాలు సభ నిర్వహించాయి. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు చలసాని వెంకటరామారావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. జగ్గయ్యపేట డిపో వద్ద కార్మికులు చెవిలో పూలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం పట్టణంలో నిరసన ప్రదర్శన జరిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు, మునిసిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, వైస్చైర్మన్ అక్బర్ మద్దతు ప్రకటించారు. గుడివాడ బస్ డిపో ప్రధాన ద్వారం వద్ద కార్మికులు ధర్నా చేశారు. ఇబ్రహీంపట్నంలో కార్మికులు ప్రధాన రహదారుల్లో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. నూజివీడు డిపో అద్దె బస్సు డ్రైవర్పై మెర్సుపూడి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు రాయి విసిరిన సంఘటనలో డ్రైవర్ గాయపడ్డారు. కోర్టుకు రేపు చెబుతాం.. హైకోర్టుకు తమ నిర్ణయాన్ని న్యాయవాది ద్వారా బుధవారం వెల్లడిస్తాం. న్యాయపరంగా సాధించుకోవాల్సిన హక్కుల కోసం చట్టానికి లోబడే సమ్మె చేస్తున్నాం. దీనిపై అన్ని సంఘాల నేతలతో మాట్లాడుతున్నాం. బుధవారం 10.30 గంటలకు నేరుగా నిర్ణయం వెల్లడించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నాం. - వై.వి.రావు, ఈయూ రాష్ట్ర ఉపప్రధాన కార్యదర్శి -
ఆర్టీసీ సమ్మెపై అటో.. ఇటో!
* ఆర్టీసీ సమ్మెపై నేడు స్పష్టత వచ్చే అవకాశం * మంగళవారం రాత్రి వరకు చర్చలు.. తేలని ఫలితం * 40 శాతం వరకు ఫిట్మెంట్కు మంత్రుల కమిటీ సిఫారసు * బుధవారం మరోసారి అధికారులతో సమావేశమై నిర్ణయం * కార్మికుల సమక్షంలో ఫిట్మెంట్ ప్రకటించనున్న సీఎం! * 40 శాతానికిపైగానే ఇచ్చేదిశగా సంకేతాలు సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై బుధవారం అటో ఇటో తేలిపోనుంది. మధ్యాహ్నం సమయానికి పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది. కార్మికులు డిమాండ్ చేస్తున్న స్థాయిలోనే ప్రభుత్వం ఫిట్మెంట్ ప్రకటించేదిశగా సంకేతాలు కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు, అధికారులు, కార్మిక సంఘాలు మంగళవారం రాత్రి వరకూ సుదీర్ఘంగా చర్చలు జరిపినా.. తుది నిర్ణయం మాత్రం వెలువడలేదు. బుధవారం ఉదయం సీఎం కేసీఆర్ మరోసారి అధికారులతో భేటీకానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గం టల సమయంలో కార్మిక సంఘాలతో సమావేశం కానున్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రే స్వ యంగా ఫిట్మెంట్పై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. మరోవైపు సమ్మెపై బుధవారం ఉదయం 10.30లోగా తేల్చాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. ప్రభుత్వం వ్యూహాత్మకంగానే మంగళవారం తుది నిర్ణయాన్ని వెల్లడించలేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సుదీర్ఘంగా చర్చలు.. మూడు రోజుల పాటు కార్మిక నేతలతో చర్చలు జరిపిన మంత్రివర్గ ఉప సంఘం మంగళవారం సీఎంకు తుది నివేదికను అందజేసింది. ఫిట్మెంట్కు సంబంధించి 37 శాతం ఇస్తే ఎలా ఉంటుంది, 40 శాతం ఇస్తే పరిస్థితేమిటన్న వివరాలను క్రోడీకరించింది. మధ్యాహ్నం తర్వాత 40 శాతంపైనే చర్చలు జరిగాయి. తర్వాత అనూహ్యంగా 43 శాతం ప్రకటిస్తే పరిణామాలేమిటని సీఎం ప్రశ్నించడంతో ఆదిశగా చర్చలు కొనసాగాయి. దీనిపై ఆర్టీసీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎం మంత్రులు, అధికారులతో మాట్లాడారు. వరుసగా రెండు మూడేళ్లపాటు ఆర్టీసీ చార్జీల పెంపు, డీజిల్పై వ్యాట్ 4 శాతానికి తగ్గింపు, లేదా వ్యాట్ మొత్తం ఆర్టీసీకి రీయింబర్స్ చేయడం, విడిభాగాల కొనుగోలుపై పన్ను 5 శాతానికి తగ్గింపు, అతి తక్కువ వడ్డీ వసూలు చేసే విదేశీ రుణ సంస్థల నుంచి అప్పు పొందే వెసులుబాటు, ప్రస్తుత రుణాలను ప్రభుత్వం భరించటం.. ఇలాంటి అంశాలపై చర్చ కొనసాగింది. మీ సత్తా ఏమిటి? చర్చల సమయంలో ఆర్టీసీ అధికారులపై సీఎం ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘ఫిట్మెంట్ భారాన్ని ఈసారి ప్రభుత్వం భరిస్తుందనుకుందాం. దాని ప్రభావం ఇప్పటికిప్పుడు పడకుండా కొన్ని ఆర్థికపరమైన వెసులుబాట్లు కల్పిస్తుందనుకుందాం. మరి భవిష్యత్లో మళ్లీ సాయం కోసం రారనే గ్యారంటీ ఏమిటి? అంతర్గతంగా సామర్థ్యం పెంచుకునేందుకు ఆర్టీసీ సత్తా ఏమిటి?’’ అని సీఎం నిలదీసినట్లు సమాచారం. బస్సుల్లో జనాలు వేలాడుతూ ప్రయాణిస్తున్నా నష్టాలు రావటానికి కారణాలేమిటని అడిగినట్లు తెలుస్తోంది. దీనికి అధికారులు చెప్పిన సమాధానాలపై సీఎం సంతృప్తి వ్యక్తం చేయలేదని సమాచారం. బాండ్ల రూపంలో..? ఆర్టీసీ కార్మికుల వేతన సవరణ గడువు 2013 మార్చి 31తో పూర్తయింది. ఇప్పుడు ఎంత ఫిట్మెంట్ ప్రకటించినా.. ఆ తేదీ నుంచే అమలు చేయాలి. అయితే ఈ రెండేళ్ల బకాయిలు ఇప్పుడు పెద్ద సవాలుగా మారుతున్నాయి. 40 శాతమో లేదా 43 శాతమో ఫిట్మెంట్ ప్రకటి స్తే బకాయిల ఊసెత్తకుంటే మంచిదనే దిశగా కూడా చర్చ సాగింది. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఇప్పటికిప్పుడు ఆర్థిక భారం పడకుండా బాండ్ల రూపంలో ఇస్తే ఎలా ఉంటుందనే యోచన వచ్చింది. కాానీ తుది నిర్ణయానికి రాలేదు. కార్మికుల్లో ఉత్సాహం.. సీఎం స్వయంగా భారీగానే ఫిట్మెంట్ను ప్రకటించనున్నారన్న ప్రచారంతో మంగళవారం ఆర్టీసీ కార్మికులు భారీ సంఖ్యలో సచివాలయానికి చేరుకున్నారు. పరస్పరం అభినందించుకోవడం, సన్నిహితులకు ఫోన్లలో చెప్పుకోవడం కనిపించింది. కానీ రాత్రి పొద్దుపోతున్నా సీఎం నుంచి పిలుపు రాకపోవడంతో.. కార్మికుల్లో మళ్లీ ఆందోళన వ్యక్తమైంది. అయితే చర్చల అనంతరం వెలుపలికి వచ్చిన మంత్రి నాయిని ఫిట్మెంట్ బాగానే ఉంటుందన్నట్లుగా కార్మికులకు పరోక్ష సంకేతం ఇవ్వడంతో తిరిగి సంబరాలు మొదలయ్యాయి. మంగళవారం నాయిని పుట్టినరోజు కావటంతో కొందరు కార్మిక నేతలు ఆయనకు పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ‘మీకు కూడా శుభాకాంక్షలు, రేపు శుభవార్త వినబోతున్నారు’ అని నాయిని పేర్కొనడం గమనార్హం. సీఎం తుది నిర్ణయం పూర్తి సానుకూలంగా ఉండబోతోందంటూ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ కూడా కొందరు కార్మిక నేతలతో వ్యాఖ్యానించటం విశేషం. సమ్మె కొనసాగుతుంది: ‘‘సీఎం వద్ద చర్చలు కొలిక్కివచ్చినందున సమ్మెను ముగిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. వాటిని కార్మికులెవరూ నమ్మొద్దు. 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించేవరకు సమ్మె కొనసాగుతుంది. కూటమి నాయకత్వం నుంచి విరమణ ప్రకటన వచ్చేవరకు ఎవరూ వెనక్కుతగ్గొద్దు. సమ్మెను నిర్వీర్యం చేసేందుకు కొందరు వదంతులు సృష్టిస్తున్నారు. సమ్మె ప్రాధాన్యం, దాని రాజ్యాంగబద్ధతను బుధవారం కోర్టుకు వెల్లడించబోతున్నాం.’’ - టీఎంయూ, ఈయూ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి ఎంసెట్కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో గురువారం జరగనున్న ఎంసెట్కు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఎంసెట్ రాసే విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు చేర్చేందుకు వాహనాలు సమకూర్చే బాధ్యతను అధికారులు చేపట్టాలని ఆదేశించింది. సీఎం కేసీఆర్ సూచన మేరకు ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మ మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. మండలాల వారీగా ఎంత మంది విద్యార్థులున్నారు, వారు ఏయే సెంటర్లకు వెళ్లాలి, ఎన్ని వాహనాలు అవసరమన్న అంశాలను పరిశీలించారు. మంగళవారం రాత్రి వరకు జిల్లాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఎంసెట్ రాసే ప్రతి విద్యార్థినీ పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్లడానికి ఏర్పాట్లు జరిగాయి. -
ఆర్టీసీ సమ్మె ఆరో రోజు
-
ఆర్టీసీకి రూ.9 కోట్ల నష్టం
ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆరు రోజులుగా ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. మరోవైపు ఈ సమ్మె వల్ల రోజురోజుకూ ఆర్టీసీకి భారీ నష్టం వాటిల్లుతోంది. ఆరు రోజుల సమ్మె వల్ల జిల్లాలో సంస్థకు రూ.9 కోట్ల మేర నష్టం మిగిలింది. సాక్షి, విజయవాడ : జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సోమవారం కూడా నిరసన ర్యాలీలు, మౌన ప్రదర్శనలు, ధర్నాలు కొనసాగించారు. విజయవాడలోని పాత బస్స్టాండ్ సెంటర్లో ఆర్టీసీ కార్మికులు బహిరంగ సభ నిర్వహించారు. దీనికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ముఖ్యఅతిథులుగా హాజైరై కార్మికులకు మద్దతు తెలిపి, రాష్ట్ర ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ నాయకులు గుర్రం విజయ్కుమార్, ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి సుందరరామరాజుతో పాటు వామపక్ష పార్టీల జిల్లా, నగర కార్యదర్శులు, ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. జిల్లాలోని పలు డిపోల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. గుడివాడ బస్డిపో నుంచి కార్మిక సంఘాలు పట్టణంలో ర్యాలీ నిర్వహించి తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలని నినాదాలు చేశారు. ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తిరువూరులో ర్యాలీ, అనంతరం అఖిలపక్ష పార్టీల నేతలతో కలిసి తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. జగ్గయ్యపేటలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన, ఆ తరువాత మౌన ప్రదర్శన జరిపారు. నష్టాల ఊబిలో ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల రోజురోజుకు ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోతోంది. జిల్లాలోని 14 డిపోల్లో మొత్తం 1440 బస్సులు ఉన్నాయి. సమ్మె తొలి రోజు కేవలం పదిశాతం బస్సులు, రెండో రోజు నుంచి నాలుగో రోజు వరకు సగటున 40 శాతం బస్సులు, నాలుగు నుంచి ఆరు రోజులు 50 నుంచి 60 శాతం వరకు బస్సు సర్వీసులను కాంట్రాక్ట్ కార్మికులతో, హైయర్ బస్సుల డ్రైవర్లు, కండక్టర్లతో నడిపారు. అయినప్పటికీ బస్సులు పూర్తి స్థాయిలో తిరగకపోవడం వల్ల ఇప్పటి వరకు రూ.9 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. రోజుకు బస్సు సర్వీసుల ద్వారా ఆర్టీసీకి సగటున రూ.1.75 కోట్ల ఆదాయం వస్తుంది. డ్రైవర్కు రోజుకు రూ.1000, కండక్టర్కు రూ.800 చెల్లిస్తున్నారు. బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతూ ప్రయాణిస్తున్నా టికెట్లు ఇవ్వకపోవడంతో ఆదాయం ఆశించిన మేరకు రావడంలేదు. కదంతొక్కిన ఆర్టీసీ కార్మికులు అవనిగడ్డ : స్థానిక ఆర్టీసీ డిపో కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె ఆరో రోజూ కొనసాగింది. ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ ధోరణిని నిరశిస్తూ అఖిలపక్ష (బీజేపీ, టీడీపీ మినహా) నాయకులతో కలసి కార్మికులు బస్స్టాండు సెంటరులో సోమవారం రాస్తారోకో చేశారు. తొలుత డిపో నుంచి వంతెన సెంటరు వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి మాట్లాడుతూ మోసం, దగా, వెన్నుపోటు తప్ప ప్రజల సంక్షేమం పట్టని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీసీని ప్రయివేటు పరంచేసి టీడీపికి నిధులు సమకూర్చే నాయకులకు కట్టబెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల తరుణంలో ఆర్టీసీ యూనియన్ నాయకులు చంద్రబాబును కలిసిన తరుణంలో తాను మారిన మనిషినని, తనను నమ్మితే న్యాయం చేస్తానంటూ వాగ్దానాలు చేశారని గుర్తుచేశారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న డ్రైవర్లకు రూ.12 వేల వరకూ వేతనం చెల్లిస్తున్న ప్రభుత్వం ఆర్టీసీ డ్రైవర్లకు మాత్రం రూ.7180 ఇవ్వడం దారుణమన్నారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డితోపాటు తామంతా అండగా నిలుస్తామని సారథి భరోసా ఇచ్చారు. -
ఆ భారం ఎలా భరిద్దాం?
ఆర్టీసీ కార్మికులకు ఫిట్మెంట్పై ప్రభుత్వం మల్లగుల్లాలు సోమవారం సుదీర్ఘంగా మంతనాలు జరిపిన కేబినెట్ సబ్కమిటీ కమిటీలోకి కొత్తగా తలసాని, జగదీశ్రెడ్డి సమ్మెపై నేడు హైకోర్టు తీర్పు హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు భారీగా ఫిట్మెంట్ ప్రకటి స్తే సంస్థపై పడే భారాన్ని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆర్టీసీ నష్టాలను నియంత్రించడం, లాభాల బాటలోకి తీసుకురావడం, ప్రభుత్వపరంగా చేయూత వంటి అంశాలను పరిశీలిస్తోంది. ఈ మేరకు ఆర్టీసీ కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్కమిటీ సోమవారం ఆర్థిక, వాణిజ్య శాఖలు, ఆర్టీసీ అధికారులతో సమావేశమైంది. 43 శాతం ఫిట్మెంట్ ప్రకటిస్తే భారం చాలా ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో.. కొంతమేర తగ్గేలా ఒత్తిడి తేవాలని అభిప్రాయానికొచ్చింది. ఎంతశాతం వరకు ఫిట్మెంట్ ఇస్తే సంస్థపై ఇప్పటికిప్పుడు పెనుభారం పడబోదనే దిశలో చర్చలు జరిగాయి. ఆర్టీసీ కార్మికుల అంశంపై మంత్రులు నాయిని, ఈటల, మహేందర్రెడ్డిలతో ఆదివారం ఏర్పాటు చేసిన కమిటీలోకి సోమవారం మంత్రులు జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్లను కూడా సీఎం చేర్చారు. వారు ఆదివారం కార్మిక సంఘాలతో చర్చకు సంబంధించిన వివరాలను సోమవారం ఉదయం సీఎం కేసీఆర్కు వివరించారు. కార్మికులు 43 శాతం ఫిట్మెంట్పై పట్టు వీడడం లేదని వారు పేర్కొన్నారు. దీంతో సీఎం వెంటనే ఆర్థిక, వాణిజ్యపన్నులు, ఆర్టీసీ అధికారులను కూడా పిలిపించి మంత్రుల సమక్షంలో చర్చించారు. ఈ సందర్భంగా ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించడం, ప్రభుత్వ పరంగా చేయూత తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ అంశాలపై లోతుగా పరిశీలన జరిపి తనకు నివేదిక ఇవ్వాల్సిందిగా సీఎం కేసీఆర్.. మంత్రుల కమిటీని ఆదేశించారు. ఈ మేరకు కమిటీ సచివాలయంలో అధికారులతో భేటీ అయి దాదాపు రెండున్నర గంటల పాటు చర్చించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం చర్చించిన అంశాలివే ఫిట్మెంట్.. → సంఘాలు డిమాండ్ చేస్తున్నట్టుగా 43% ఫిట్మెంట్తో తీవ్ర భారం పడుతుంది. అది సాధ్యంకాదు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోగలిగితే ఫిట్మెంట్ను 36 శాతానికి కాస్త అటూఇటూ వరకు తీసుకెళ్లవచ్చు. →ఒకవేళ 43% ఫిట్మెంట్ ఇస్తే 40% వరకు బస్సు చార్జీలు పెంచాల్సిందే. ఇది ప్రయాణికులపై పెను భారమే. దీంతో ఏటా 15% చొప్పున మూడేళ్లపాటు లేదా 12-13% చొప్పున నాలుగేళ్లపాటు చార్జీలు పెంచాలి. ఇతర రాష్ట్రాల్లో మనకంటే ఆర్టీసీ చార్జీలు ఎక్కువగా ఉన్నందున దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఆర్టీసీపై భారం తగ్గింపు.. → ఆర్టీసీ డీజిల్పై 27 శాతం వరకు వ్యాట్ చెల్లిస్తోంది. దీనిని రీయింబర్స్ చేయాలని కోరుతోంది. ఈ మొత్తం ఎంత? దాన్ని ప్రభుత్వమే భరిస్తే పరిస్థితేమిటి? అనే విషయంలో వాణిజ్యపన్నులు, ఆర్థిక శాఖ అధికారులతో వాకబు చేశారు. విడిభాగాలపై ఆర్టీసీ 14.5 శాతం పన్ను చెల్లిస్తోంది. దీన్ని 5 శాతానికి తగ్గించాలి. → ఆర్టీసీకి రూ.3,000 కోట్ల అప్పులున్నాయి. ఇందులో తెలంగాణవాటా 1,200 కోట్లు. ఏటా చెల్లిస్తున్న వడ్డీ 150 కోట్లు. వన్టైం సెటిల్మెంట్ కింద దాన్ని పరిష్కరిస్తే మరో 15 ఏళ్లపాటు ఆర్టీసీకి ఇబ్బంది ఉండదు. నేడు సీఎంకు నివేదిక: సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని అందజేయాల్సిందిగా మంత్రుల కమిటీ అధికారులను ఆదేశించింది. వారు మంగళవారం ఉదయం కమిటీకి నివేదిక ఇవ్వనున్నారు. దీనిని కమిటీ ముఖ్యమంత్రికి అందించి, తదుపరి చర్యలపై చర్చించనుంది. ఈ సమయంలోనే ఫిట్మెంట్పై ఓ నిర్ణయాన్ని సీఎం వెల్లడించనున్నారు. దీనిని మంత్రుల కమిటీ ఆర్టీసీ కార్మిక సంఘాల ఎదుట ఉంచి చర్చించనుంది. ఆ చర్చల సారాంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళుతుంది. ఒకవేళ అప్పటికీ కార్మిక నేతలు సానుకూలంగా లేనిపక్షంలో నేరుగా ముఖ్యమంత్రే చర్చించే అవకాశముంది. సమస్యలు పరిష్కరించాలి: ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఆర్టీసీ, విద్యుత్ ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ఓ ప్రకటనలో కోరారు. నేడు హైకోర్టు తీర్పు.. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి మంగళవారం హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ ఒక ప్రజాహిత వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. దానిని పరిశీలించిన కోర్టు.. కార్మికులు విధుల్లో చేరాలంటూ మూడు రోజుల క్రితం మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. తాజాగా మంగళవారం జరుగనున్న విచారణలో కార్మిక సంఘాలు హైకోర్టు ఎదుట తమ వాదనను వినిపించబోతున్నాయి. అనంతరం హైకోర్టు తుదితీర్పు వెలువరించే అవకాశముంది. సమ్మె విరమించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేస్తే.. ప్రభుత్వం కార్మికులపై ఒత్తిడి పెంచుతుంది, ఇది ఫిట్మెంట్ ఖరారుపైనా ప్రభావం చూపే అవకాశముంది. ఎక్కడిబస్సులక్కడే ప్రభుత్వంతో కార్మిక సంఘాల చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.. మరోవైపు రోజురోజుకు ఆర్టీసీ సమ్మె ఉధృతమవుతూనే ఉంది. సోమవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆర్టీసీకి రాబడి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని యాజమాన్యం చెప్పడంతో అద్దె బస్సుల యజమానులు అన్ని బస్సులను తిప్పారు. కానీ వారు రద్దీ అధికంగా ఉండి, ఆదాయం ఎక్కువ ఉండే మార్గాలకే పరిమితమయ్యారు. ప్రైవేటు బస్సుల తరహాలో అడ్డగోలుగా చార్జీలు పెం చి వసూలు చేశారు. తాత్కాలిక సిబ్బందితో నడుస్తున్న ఆర్టీసీ బస్సులు కూడా ఇదే పంథాను కొనసాగించాయి. తాత్కాలిక సిబ్బంది వచ్చిన ఆదాయాన్ని ఆర్టీసీకి జమచేయడం లేదు. ఈ వ్యవహారాన్ని నియంత్రించాల్సిన అధికారులు కూడా సమ్మెలో ఉండడంతో డిపో మేనేజర్లు చేతులెత్తేశారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు నిరసన ప్రదర్శనలతో హోరెత్తించారు. సోమవారం జిల్లాల కలెక్టర్లు, తహసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పించారు. రాజధానిలో తప్పని ఇబ్బందులు.. హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా జరుగుతోంది. సోమవారం అధికారులు 671 బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ అవి ఏ మూలకూ చాలలేదు. ఉద్యోగులు, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. రోజూ తిరిగే 121 ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు మరో ఎనిమిది సర్వీసులను అదనంగా నడి పారు. మరోవైపు కార్మికులు సోమవారం కూడా వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగించారు. అన్ని డిపోల్లో ర్యాలీలు, ధర్నాలు జరిగాయి. -
ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తం
-
ఆర్టీసీ సమ్మెపై చర్చలు విఫలం
-
‘సమ్మె’ పాట్లు యథాతథం!
-
‘సమ్మె’ పాట్లు యథాతథం!
నాల్గో రోజు రోడ్డెక్కిన బస్సులు 631 అన్ని డిపోల్లో కార్మికుల వంటా-వార్పు 8 ఎంఎంటీఎస్ {పత్యేక రైళ్లు నడిపిన ద.మ.రైల్వే మే 14న ఎంసెట్కు {పత్యేక బస్సులపై ఆర్టీఏ కసరత్తు నగరంలో ‘సమ్మె’ పాట్లు కొనసాగుతున్నాయి. శనివారం కూడా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ యూనియన్ల ఆధ్వర్యంలో అన్ని డిపోల ఎదుట వంటా వార్పు నిర్వహించి నిరసన తెలిపారు. యథావిధిగా ప్రైవేట్ వాహనదారుల దోపిడీ కొనసాగింది. సిటీబ్యూరో : నాలుగు రోజులుగా అదేసీన్. ఒకవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతుండగా మరోవైపు ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. శనివారం నగరంలోని 28 డిపోలు, ప్రధాన బస్స్టేషన్లలో కార్మిక సంఘాలు వంట-వార్పు నిర్వహించి తమ ఆందోళన కొనసాగించాయి. అన్ని చోట్ల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ డిపో వద్ద జరిగిన కార్యక్రమంలో తెలంగాణ పొలిటికల్ జేఏసీ చెర్మైన్ కోదండరామ్ పాల్గొని ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 43 శాతం ఫిట్మెంట్ న్యాయమైన డిమాండ్ అని, యాజమాన్యం ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం,సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన మహత్తర పోరాటాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నగరంలోని మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్సుఖ్నగర్ బస్స్టేషన్లు, బర్కత్పురా, కాచిగూడ,పికెట్, హయత్నగర్, రాణిగంజ్, జీడిమెట్ల, కుషాయిగూడ తదితర అన్ని డిపోల వద్ద కార్మికులు వంటా వార్పు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు ప్రైవేట్ కండక్టర్లు, డ్రైవర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సహాయంతో 4వ రోజు 631 సిటీ బస్సులు రోడ్డెక్కినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. దీంతో ఉదయం,సాయంత్రం రద్దీ వేళల్లో నగర వాసులకు కొద్దిగా ఊరట లభించినప్పటికీ ఇబ్బందులు మాత్రం తప్పలేదు. లక్షలాది మంది ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. దీంతో ఆటోవాలాలు, ప్రైవేట్ ఆపరేటర్ల దోపిడీ పర్వం యధావిధిగా కొనసాగింది. కిక్కిరిసిన ఎంఎంటీఎస్ రైళ్లు... బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ఎంఎంటీఎస్ రైళ్లలో రద్దీ నెలకొంది. దీంతో దక్షిణమధ్య రైల్వే సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో 8 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాచిగూడ-నిజామాబాద్, మల్కాజిగిరి-మిర్యాలగూడ మార్గంలోనూ ప్రత్యేక రైళ్లు నడిచాయి. వేసవి సెలవులు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్లలో అనూహ్యమైన రద్దీ నెలకొంది. ఇక దూరప్రాంతాలకు నడిచే ప్రైవేట్ బస్సుల్లో రెట్టింపు చార్జీలు వసూలు చేశారు. ఒక్క బస్సులే కాకుండా కార్లు, టాటా ఏస్ వంటి వాహనదారులు సైతం నిలువుదోపిడీ కొనసాగించారు. ఎంసెట్కు 1000 బస్సులు: జేటీసీ రఘునాథ్ తెలంగాణలో ఈ నెల 14న ఎంసెట్ నేపథ్యంలో విద్యార్థులకు రవాణా సదుపాయాలపై ఆర్టీఏ అధికారులు శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటి వరకు కూడా కార్మికులు సమ్మె విరమించకుండా కొనసాగిస్తే చేపట్టవలసిన ఏర్పాట్లపై హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ రఘునాథ్ నేతృత్వంలో చర్చించారు. గ్రేటర్లోని 117 కేంద్రాల్లో ఇంజనీరింగ్, 30 కే ంద్రాల్లో మెడికల్ ఎంసెట్ పరీక్షలు జరుగనున్న దృష్ట్యా కనీసం 1000 బస్సులను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. ఆర్టీసీ బస్సులే కాకుండా, స్కూళ్లు, కళాశాలలు, కంపెనీలకు నడిచే బస్సులను కూడా సేకరించనున్నట్లు జేటీసీ రఘునాథ్ తెలిపారు. ఇప్పటి వరకు 500 మంది డ్రైవర్లను ఆర్టీసీకి అప్పగించినట్లు పేర్కొన్నారు. నగరంలో నడిచేందుకు ప్రైవేట్ బస్సులకు రూ.100 ల ఫీజుతో తాత్కాలిక పర్మిట్లను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె దృష్ట్యా ఎంసెట్కు రవాణా సదుపాయాలపై మే 13వ తేదీ నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. -
'ఆర్టీసీ కార్మికులు నివేదిక ఇస్తే.. పైస్థాయికి పంపుతాం'
చిత్తూరు:ఆర్టీసీ కార్మికులు ఏదైనా నివేదిక ఇస్తే.. పైస్థాయికి పంపుతామని ఏఎస్పీ రత్న తెలిపారు. విధి నిర్వహణలో భాగంగానే ఆర్టీసీ కార్మికులపై లాఠీచార్జ్ చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. చైనా స్మగ్లర్ హింగ్ యాంగ్ ను నెల్లూరు జైలుకు పంపామని.. తిరిగి పోలీసుల విచారణ కోసం అతన్ని అదుపులోకి తీసుకోనున్నట్లు తెలిపారు. వారంలోగా ఎర్రచందనం అక్రమ రవాణాతో సంబంధం ఉన్న అధికారుల పేర్లు వెల్లడిస్తామన్నారు. -
సమ్మెకు సంఘీభావం తెలిపిన వైఎస్సార్సీపీ
విజయనగరం(పార్వతీపురం): పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్సు ఎదుట ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు వైఎస్సాసీపీ ఎమ్మెల్యేలు సుజయకృష్ణా రంగారావు, పుష్పశ్రీవాణిలు సంఘీభావం తెలిపారు. శనివారం ఆర్టీసీ కాంప్లెక్సు ఎదుట ఆర్టీసీ కార్మికులు రోడ్డుపై వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సమ్మెలో వైఎస్సార్సీపీతో పాటు సీపీఐ, సీఐటీయూ, పలు విద్యార్థి, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులను డిపో నుంచి బయటకు వెళ్లకుండా కార్మికులు అడ్డుకుంటున్నారు. -
ప్రైవేట్ డ్రైవర్పై కార్మికుల దాడి
-
ఆర్టీసీ కార్మికులపై లాఠీప్రతాపం
-
ఆర్టీసీ కార్మికులపై లాఠీ ప్రతాపం
- ఆర్టీసీ కార్మికులపై పోలీసు జులుం - గాయపడ్డ మహిళా కండక్టర్లు - మూడో రోజు సమ్మె ఉద్రిక్తం - బస్సులను అడ్డుకున్న కార్మికులు - బలవంతంగా బస్సులు నడిపిన పోలీసులు - అన్యాయమన్న కార్మిక సంఘాలు న్యాయమైన కోర్కెల సాధన కోసం సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులపై చిత్తూరు పోలీసులు శుక్రవారం జులుం ప్రదర్శించారు. మహిళా ఉద్యోగులని కూడా చూడకుండా దొరికిన వారిని దొరికినట్టే కొట్టి రోడ్డున పడేశారు. పోలీసుల లాఠీల దెబ్బకు పలువురు ఆర్టీసీ కార్మికులు స్పృహతప్పి పడిపోయారు. పలువురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఉద్రిక్తతకు దారితీసిన ఈ ఘటనలో పోలీసు చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, చిత్తూరు: న్యాయమైన కోర్కెల సాధన కోసం సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులపై చిత్తూరు పోలీసులు శుక్రవారం జులుం ప్రదర్శించారు. మహిళా ఉద్యోగినులని కూడా చూడకుండా దొరికిన వారిని దొరికినట్టే కొట్టి రోడ్డున పడేశారు. పోలీసుల లాఠీల దెబ్బకు పలువురు ఆర్టీసీ కార్మికులు స్పృహతప్పి పడిపోయారు. పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఉద్రిక్తతకు దారితీసిన ఈ ఘటనలో పోలీసు చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఒత్తిడితో గురువారం నుంచే బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు యత్నించారు. ఆ మేరకు కాంట్రాక్ట్ కార్మికులపై ఒత్తిడి పెంచారు. ఆటోడ్రైవర్లతో బస్సులు నడిపించాలని చూశారు. ఆర్టీసీ కార్మికులు వారిని అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో బంద్ ప్రభావం కనిపించకుండా చేయాలన్న ఉద్దేశంతో ఆర్టీసీ అధికారులు పోలీసు బలగాల అండతో శుక్రవారం బస్సులను బలవంతంగా బయటకు పంపే ప్రయత్నం చేయడంతో ఘర్షణ తలెత్తింది. సమ్మె విఫలం కాకూడదన్న ఉద్దేశంతో ఉన్న కార్మికులు మండుటెండను సైతం లెక్కచేయక బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. భారీగా మోహరించిన పోలీసులు కార్మికులపై విచక్షణారహితంగా దాడికి దిగారు. ఊహించని ఈ ఘటనలో పలువురు కార్మికులు దెబ్బలు తినాల్సి వచ్చింది. మహిళా ఉద్యోగులు అని కూడా చూడకుండా మగ పోలీసులతో పాటు మహిళా పోలీసులు లాఠీలు ఝుళిపించారు. ఈ దాడిలో కండక్టర్లు ఉష, నిత్య తీవ్రంగా గాయపడ్డారు. నిత్య చెవి నుంచి రక్తస్రావం ఆగలేదు. పరిస్థితి ఇబ్బందికరంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయడమేగాక ఏకంగా పోలీసు స్టేషన్ను ముట్టడించి గంట పాటు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసేవరకు వచ్చింది. గాంధీబొమ్మ సెంటర్లో రాస్తారోకోతో గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. దాడికి పాల్పడ్డ పోలీసులను సస్పెండ్ చేయాలంటూ యూనియన్ నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. -
బాబు హామీ ఇచ్చారా?: మంత్రి శిద్ధా
‘ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలిస్తామని. సంస్థని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కమిటీ వేస్తామని.. ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారా? ఆ విషయం నాకు తెలీదు’ అని ఏపీ రవాణా శాఖా మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. ఆర్టీసీ ఎండీ సాంబశివరావుతో కలసి శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం మధ్యాహ్నం నాటికి 50 శాతం బస్సుల్ని(4,934) తిప్పామన్నారు. సమ్మెపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. మొండివైఖరి వీడి వారంతట వారే చర్చలకు రావాలన్నారు. చిత్తూరులో లాఠీఛార్జీపై బాధపడుతున్నామని, బస్సులను అడ్డుకుంటే కఠినంగానే వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రైవేటు వాహనాల నియంత్రణ అంశాన్ని దాటవేశారు. -
అదే సీన్ పరేషాన్
ఒక్క బస్సు బయటకు రావాలంటే ఇంత బందోబస్తు తప్పదు.. రోడ్డెక్కిన 531 బస్సులు అయినా ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు అన్ని డిపోల వద్ద కార్మికుల ఆందోళన అదనంగా ఎంఎంటీఎస్ సర్వీసులు యథావిథిగా ప్రైవేటు వాహనాల దోపిడీ మెట్టు దిగని ప్రభుత్వం.. పట్టు వీడని ఆర్టీసీ కార్మికులు.. వెరసి మూడో రోజూ ప్రయాణికులు అవస్థలు పడ్డారు. పోలీసుల రక్షణ మధ్య అధికారులు శుక్రవారం కొన్ని బస్సులను డిపోల నుంచి బయటకు తీశారు. అడ్డుకున్న కార్మికులను అరెస్టు చేశారు. నిరసనలు.. ఆందోళనల మధ్య 531 బస్సులను రోడ్డెక్కించారు. ప్రైవేటు వాహనాల దోపిడీ పర్వం కొనసాగింది. సిటీబ్యూరో: కార్మికుల సమ్మె కారణంగా నిలిచిపోయిన బస్సులు మూడో రోజుకు (శుక్రవారం) కొద్దిగా పెరిగాయి. రాత్రి వరకు సుమారు 531 బస్సులు నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. దీంతో ఏపీ ఎంసెట్కు హాజరైన విద్యార్థులు, ఉద్యోగులకు కొంత మేర ప్రయాణ సదుపాయం లభించింది. కాంట్రాక్ట్ ఉద్యోగులు, ప్రైవేట్ సిబ్బంది సహాయంతో ప్రధాన రూట్లలో కొన్ని బస్సులు తిప్పినప్పటికీ ప్రయాణికులకు ఇబ్బందులు మాత్రం తప్పలేదు. లక్షలాది మంది సెట్విన్ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు, ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ఆటోవాలాలు, ప్రైవేట్ వాహనదారులు యథావిథిగా తమ దోపిడీ పర్వాన్ని కొనసాగించారు. ద.మ.రైల్వే ప్రతి రోజు నడిపే 121 సర్వీసులతో పాటు సికింద్రాబాద్- లింగంపల్లి మార్గంలో మరో ఎనిమిది ఎంఎంటీఎస్ సర్వీసులు శుక్రవారం అదనంగా నడిపింది. రోజు వారి రాకపోకలు సాగించే లక్షా 60 వేల మందికి తోడు 40 వేల మంది ప్రయాణికులు అదనంగా ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకున్నట్టు అధికారులు తెలిపారు. నిరసనలు.. ఆందోళనలు.. మరోవైపు నగరంలోని 28 డిపోలు, ప్రధాన బస్స్టేషన్ల వద్ద కార్మిక సంఘాలు ధర్నాలు, ఆందోళనలు చేపట్టాయి. హయత్నగర్, కంటోన్మెంట్, ఉప్పల్, బర్కత్పురా తదితర డిపోల్లో జరిగిన ధర్నాల్లో టీఎంయూ నేతలు అశ్వద్ధామరెడ్డి, థామస్రెడ్డి తదితరులు పాల్గొని యాజ మాన్య వైఖరిని నిరసించారు. ‘ఎస్మా’ చట్టాలకు వెరవబోమని స్పష్టం చేశారు. ఎండీ సాంబశివరావు తమతో సంప్రదింపులు జరిపేం దుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే మరోసారి చర్చలకు ఆహ్వానించినట్లు పేర్కొనడం సరికాదన్నారు. ఫలక్నుమా డిపో వద్ద కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర చేశారు. 43 శాతం ఫిట్మెంట్ సాధించే వరకు సమ్మె విరమించమని హెచ్చరించారు. ఆగని ప్రైవేట్ దోపిడీ ఆర్టీసీ సమ్మెను అన్ని రకాల ప్రైవేట్ వాహనాలు సొమ్ము చేసుకున్నాయి. న గరంలో తిరిగే ఆటోరిక్షాలు మీటర్ రీడింగ్తో సంబంధం లేకుండా ప్రయాణికులపై దోపిడీ సాగించారు. దూరప్రాంతాలకు వెళ్లే టాక్సీ కార్లు, ఇతర వాహనాలు, ప్రైవేట్ బస్సులు సైతం రెట్టింపు చార్జీలతో జేబులు లూటీ చేశాయి. వరంగల్, హన్మకొండ, జనగామ, కరీంనగర్, సిద్ధిపేట్, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట్, ఏపీలోని విజయవాడ, గుంటూరు, కర్నూలు, కడప, చిత్తూరు తదితర ప్రాంతాలకు ప్రైవేట్ బస్సులు, కార్లలో బయల్దేరిన ప్రయాణికులు రెట్టింపు చార్జీలు చెల్లించుకోవలసి వచ్చింది. కిక్కిరిసిన రైళ్లు.. ఒకవైపు పెళ్లిళ్లు, మరోవైపు వేసవి సెలవులు కావడంతో నగరవాసులు దూర ప్రాంతాలకు పయనమయ్యారు. అసలే అరకొర రైళ్లు.. ఆకస్మాత్తుగా ఆర్టీసీ సమ్మెతో మూడు రోజులుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రైవేటు బస్సుల్లో వెళ్లలేనివారు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ నుంచి బయలుదేరే రైళ్లన్నీ కిక్కిరిసి వెళ్తున్నాయి. సమ్మె దృష్ట్యా కాచిగూడ- నిజామాబాద్, సికింద్రాబాద్ -కాజీపేట్, మల్కాజిగిరి- మిర్యాలగూడ రూట్లలో ప్యాసింజర్ రైళ్లను ఏర్పాటు చేశారు. వివిధ మార్గాల్లో నడిచే రెగ్యులర్ రైళ్లలో 2,200 అదనపు సీట్లు, బెర్తులు ఏర్పాటు చేసినట్లు ద.మ. రైల్వే సీపీఆర్వో ఎం. ఉమాశంకర్ కుమార్ తెలిపారు. టిక్కెట్ సొమ్ము తిరిగి చెల్లింపు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న కార్మికుల సమ్మెను దృష్టిలో ఉంచుకొని అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు టిక్కెట్ చార్జీలు పూర్తిగా చెల్లించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. టిక్కెట్ రిజర్వేషన్ కార్యాలయాల్లో విధులు నిర్వహించేందుకు తగినంత సిబ్బంది లేనందువల్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఆన్లైన్లో రిజర్వ్ చేసుకున్నవారు తమ మొబైల్కు ‘సర్వీస్ కాన్సిల్’ అయినట్లు మెసేజ్ వచ్చిన వెంటనే రెండు రాష్ట్రాల ఆర్టీసీ వెబ్సైట్(ఠీఠీఠీ.్చఞటట్టఛిౌజ్ఛీ.జీ), (ఠీఠీఠీ.్టటట్టఛిఛఠట.జీ)కు లాగిన్ అయి టిక్కెట్లు రద్దు చేసుకుంటే వారి బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ అవుతుంది. ఆదరైజ్డ్ టిక్కెట్ బుకింగ్ ఏజెంట్లు (ఏటీబీ), ఆర్టీసీ బస్ స్టేషన్ల లోని కౌంటర్లలో అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్న వారు సమ్మె విరమించిన తేదీ నుంచి 7 రోజుల్లో తమ టికెట్లను రద్దు చేసుకొని సొమ్ము పొందవచ్చు. కాన్సిలేషన్కు సంబంధించిన వివరాలకు 1800 200 4599 నంబర్లో సంప్రదించవచ్చని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికుడిపై దాడి హయత్నగర్: ఆర్టీసీ డిపో మేనేజర్ను కలిసేందుకు వచ్చిన కార్మికుడిపై తోటి కార్మికులు దాడిచేసిన సంఘటన హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీ సుల కథనం ప్రకారం.. హైదరాబాద్-2 డిపోకు చెందిన డ్రైవర్ రాములు హయత్నగర్-2 డిపో మేనేజర్ను కలిసేం దుకు సంస్థ జీపులో వచ్చాడు. డిపో వద్ద జీపును అడ్డగించిన కార్మికులు రాములుపై దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
'ఆర్టీసీ కార్మికుల సమ్మె బాధాకరం'
-
ఆర్టీసీ కార్మికులను చావబాదారు
-
ఎంసెట్ అభ్యర్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
- మండల కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులు - జిల్లా కలెక్టర్ సుజాతశర్మ ఒంగోలు ఒన్టౌన్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఎంసెట్ అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి వారిని పరీక్ష కేంద్రాలకు చేర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సుజాతశర్మ వెల్లడించారు. గురువారం రాత్రి జిల్లా ఎస్పీ చిరువోలు శ్రీకాంత్తో కలిసి ఆమె ఎంసెట్ ప్రత్యేక ఏర్పాట్ల గురించి విలేకర్లకు వివరించారు. జిల్లాలో ఎంసెట్ పరీక్షకు మొత్తం 11,440 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి ఉదయం 4 గంటల నుంచే ప్రత్యేక బస్సులను అవసరమైన పోలీస్ బందోబస్తుతో ఏర్పాటు చేస్తామన్నారు. 12 కేంద్రాల్లో రాత్రి బస ఎంసెట్కు హాజరయ్యే విద్యార్థులు గురువారం రాత్రికి ఒంగోలు చేరుకునే వారికి 12 కేంద్రాల్లో బస ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సుజాతశర్మ తెలిపారు. మొత్తం 1600 మంది బాల, బాలికలకు వేర్వేరుగా ఈ వసతి కల్పించారు. ఈ కేంద్రాలన్నింటికీ లైజన్ ఆఫీసర్లను నియమించారు. పోలీస్ వాహనాలు సిద్ధం ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం పోలీస్ వాహనాల సేవలు కూడా అందిస్తున్నట్లు ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ తెలిపారు. ఒంగోలు నగరంలోని 8 కూడళ్లలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 8 పోలీస్ హెల్ప్లైన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు అడిషనల్ ఎస్పీకి బాధ్యతలు అప్పగించామన్నారు. ఆర్టీసీ ఆర్ఎం నాగశివుడు మాట్లాడుతూ పోలీస్ బందోబస్తుతో గురువారం 50 శాతం ఆర్టీసీ బస్సులను తిప్పినట్లు చెప్పారు. హెల్ప్లైన్, కంట్రోల్ రూం ఒంగోలు టౌన్: ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం కంట్రోల్ రూమ్తో పాటు హెల్ప్లైన్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సుజాతశర్మ తెలిపారు. కంట్రోల్ రూమ్ (98482 25915) విద్యార్థులకు ఎలాంటి సహాయం అవసరమైన వెంటనే ఈ కంట్రోల్ రూమ్కు సంప్రదించాలని కలెక్టర్ కోరారు. అదే విధంగా ఒంగోలు రైల్వేస్టేషన్, బస్టాండ్ల వద్ద హెల్ప్లైన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైల్వేస్టేషన్ వద్ద కొత్తపట్నం డిప్యూటీ తహశీల్దార్ (88866 16035), ఆర్టిసి బస్టాండ్ మద్దిపాడు డిప్యూటీ తహశీల్దార్ (99499 14310) ఇన్చార్జులుగా నియమించామన్నారు. -
కదలని బస్సులు
సమ్మెకు మద్దతు తెలిపిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నేతలు ప్రోద్దుటూరు, కడప డిపోల వద్ద ఉద్రిక్తత కార్మిక సంఘాల నేతల అరెస్ట్ కిక్కిరిసిన రైళ్లు, కొనసాగిన ప్రైవేట్ వాహనాల దోపిడీ రెండు రోజుల్లో జిల్లాలో రూ.1.90 కోట్లు నష్టం సాక్షి, కడప : అనునిత్యం కష్టించి పనిచేసే వారి జాబితాలో ఆర్టీసీ కార్మికులు ముందు వరుసలో ఉంటారని, అలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వడానికి వెనుకాడటం తగదని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. రాజంపేటలో గురువారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి, ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, బద్వేలులో ఎమ్మెల్యే తిరువీధి జయరాములు, జమ్మలమడుగులో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి తదితరులు ఎక్కడికక్కడ ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల హక్కులను ప్రస్తుత ప్రభుత్వం కాల రాస్తోందని దుమ్మెత్తి పోశారు. చార్జీలు పెంచి ప్రజల నెత్తిన భారం వేయడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెంచడానికి ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. ప్రజలు రెండు రోజులుగా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేక పోవడం దురదృష్టకరమన్నారు. ఆందోళన చేస్తున్నారనే కారణంతో అరెస్టు చేసిన కార్మికులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనుభవం లేని డ్రైవర్లను తీసుకొచ్చి బస్సులు నడిపిస్తున్నారని..ఏదైనా జరిగితే బాధ్యత ప్రభుత్వానిదేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు, కడప డిపో వద్ద ఉద్రిక్తత ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపో వద్ద గురువారం ఆర్టీసి కార్మికులు ఆందోళన చేస్తుండగా.. యాజమాన్యం డిపో లోంచి బస్సులను బయటకు తీసుకు రావడంతో కార్మికులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు కొంత మంది ఆర్టీసి యూనియన్ నాయకులను అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. కడపలో కూడా డిపో ఆవరణంలో కార్మికులు బస్సులను అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొందరు కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆగిన బస్సులు.. ప్రయాణికుల ఇక్కట్లు ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగడంతో ఎక్కడికక్కడ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఎనిమిది డిపోలకు చెందిన సుమారు 600కు పైగా బస్సులు నిలిచిపోయాయి. 340 బస్సులను (100 ఆర్టీసీ, 240 అద్దె బస్సులు) ఆర్టీసీ అధికారులు నడిపించారు. రెండు రోజులుగా జిల్లాలో రూ.1.90 కోట్ల మేర నష్టం వచ్చినట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అత్యధిక శాతం బస్సులు డిపోలకే పరిమితమవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. రైళ్లు కిటకిటలాడాయి. ప్రైవేట్ వాహనాల దోపిడీ కొనసాగింది. -
డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: సమ్మెచేస్తున్న ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సికింద్రాబాద్ జేబీఎస్ ప్రాంగణంలోని కంటోన్మెంట్ డిపో ఎదుట ఓ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే పోలీసులు అతన్ని సమయానికి కాపాడారు. కంటోన్మెంట్ డిపోలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న ప్రభుదాస్ (45) రెండురోజులుగా ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్నాడు. సమ్మె రెండో రోజైన గురువారం కూడా ప్రభుత్వం స్పందించడంలేదనే మనస్తాపంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాగా.. ఇదే డిపోలో తాత్కాలికంగా కండెక్టర్గా చేరిన రవీందర్పై డిపో ఉద్యోగులు కొందరు గురువారం దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
కాన్వాయ్ విడిచి.. నడిచి వెళ్లిన మంత్రి
అనంతపురం : ఆర్టీసీ కార్మికులు సమ్మె నేపథ్యంలో కాలినడకన ర్యాలీ చేస్తుండగా.. ఎదురుగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కాన్వాయిని అడ్డుకున్నారు. గురువారం అనంతపురం రూరల్ పరిధిలోని శ్రీకంఠం సర్కిల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాలోని ఆర్టీసీ కార్మికులు సమ్మె నేపథ్యంలో గురువారం నగరంలో కాలినడకన ర్యాలీ చేపట్టారు. వారికి మంత్రి పల్లె రఘునాథరెడ్డి కాన్వాయ్ అడ్డురావడంతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో మంత్రి కారు దిగి అరగంట సేపు మంతనాలు జరిపినా వారు వినకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఏమీ చేయలేని పరిస్థితిలో.. మంత్రి అరమైలు దూరం కాలినడకన వెళ్లి అక్కడి నుంచి వేరే వాహనంలో వెళ్లిపోయారు. -
మా సమ్మె న్యాయబద్ధమైందే : కార్మికులు
-
ఆగమాగం
మంగళవారం అర్ధరాత్రి నుంచే నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు బస్టాండ్లలో పడిగాపులతో ప్రయాణికుల ఇబ్బందులు ఆర్టీసీకి తెలంగాణలో తొలి రోజు నష్టం రూ.2.5 కోట్లు హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెతో తెలుగు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. నిత్యం తిరుగాడే లక్షలాది మందిని ఆగమాగం చేసింది. 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలన్న డిమాండ్ను ప్రభుత్వం తోసిపుచ్చడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెను ప్రారంభించారు. బుధవారం ఉదయానికి ఒక్క బస్సు కూడా రోడ్డెక్కకపోవడంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం చెప్పినా.. బుధవారం అలాంటిదేమీ కనిపించలేదు. అత్యవసరంగా ప్రయాణాలు చేయాల్సి వచ్చినవారికి, కనీసం అద్దె బస్సులైనా తిరిగే అవకాశముందని భావించి ప్రయాణాలకు సిద్ధమైనవారికి తీవ్ర ఇబ్బందులు తప్పలేదు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించక తప్పలేదు. ఇక సందట్లో సడేమియాగా ప్రైవేటు వాహనాల యజమానులంతా అందినకాడికి దండుకున్నారు. అతి కష్టం మీద.. తెలంగాణలో నిత్యం 10,705 ఆర్టీసీ బస్సులు (అద్దెవాటితో సహా) తిరుగుతాయి. వాటిలో బుధవారం అతి కష్టం మీద 350 బస్సులను మాత్రం ఆర్టీసీ తిప్పగలిగింది. అంటే మొత్తం బస్సుల్లో ఇది 3.2 శాతమే. బస్సుల్లేక ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. పలు జిల్లాల్లో అద్దె బస్సులను తిప్పేందుకు డ్రైవర్లు వచ్చినా.. ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. దీంతో ఆర్టీసీ ఎండీ సాంబశివరావు అద్దె బస్సుల యజమానుల సంఘం ప్రతినిధులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. గురువారం నుంచి పోలీసు భద్రత కల్పించి, బస్సులకు, సిబ్బందికి ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని.. వారి అన్ని బస్సులను తిప్పాలని కోరారు. తిరిగిన కిలోమీటర్ల ఆధారంగా డబ్బు చెల్లించే పద్ధతిని తాత్కాలికంగా పక్కనపెట్టి, ఆ బస్సు తిరిగేందుకు మంజూరైన కిలోమీటర్ల ఆధారంగా లెక్కగట్టి చెల్లిస్తామని వారికి చెప్పారు. అంటే తక్కువ దూరం తిరిగినా, తిరగాల్సిన దూరం లెక్కన డబ్బు చెల్లిస్తారు. కండక్టర్ను కూడా వారే ఏర్పాటుచేస్తే రోజుకు రూ.800 చొప్పున అదనంగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గురువారం నుంచి అద్దె బస్సులు తిప్పేందుకు వారు అంగీకరించారు. తాత్కాలిక సిబ్బందీ కష్టమే.. తాత్కాలిక పద్ధతిలో సిబ్బందిని నియమించుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. భారీ సంఖ్యలో నిరుద్యోగ యువకులు దరఖాస్తు చేసుకునేందుకు వచ్చినా... వారి అర్హతా పత్రాలు పరిశీలిం చేందుకు డిపోల్లో సిబ్బందే లేకపోవడం గమనార్హం. దీంతో కొన్ని చోట్ల రవాణా శాఖకు చెందిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లను రప్పించి డ్రైవర్ల ఫిట్నెస్ను పరిశీలింపజేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 333 దరఖాస్తులు అందగా 186 మందికి రవాణాశాఖ అధికారులు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చారు. వారు గురువారం నుంచి ఆర్టీసీ బస్సులను నడపనున్నారు. మరోవైపు చాలా డిపోల వద్ద ఇలా దరఖాస్తు చేసేందుకు వచ్చిన యువకులను ఆర్టీసీ కార్మికులు అడ్డుకుని, పంపేశారు. హన్మకొండలాంటి కొన్ని చోట్ల వారిపై దాడికి కూడా దిగడంతో పోలీసులు వచ్చి చెదరగొటారు. ఇక డిపోల్లో పనిచేసేందుకూ తాత్కాలిక సిబ్బందిని నియమించాలని ఎండీ సాంబశివరావు నిర్ణయించారు. ఇక పోలీసు, అగ్నిమాపక శాఖ డ్రైవర్లు కూడా గురువారం నుంచి రంగంలోకి దిగనున్నారు. నష్టం భారీగానే.. సమ్మె తొలిరోజు ఆర్టీసీ రూ.10.50 కోట్ల ఆదాయం కోల్పోగా.. నికరంగా రూ.2.5 కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. తాత్కాలిక సిబ్బందికి 30 శాతం వెయిటేజీ సమ్మె సమయంలో తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్, కండక్టర్లుగా పనిచేసేవారికి భావి నియామకాల్లో ఇస్తున్న 5 శాతం వెయిటేజీని 30 శాతానికి పెంచాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. దీనికి సంబంధించి చట్ట సవరణకు సిద్ధమని ప్రకటించింది కూడా. దీంతో గురువారం నుంచి నిరుద్యోగ యువకులు పెద్ద సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నారు. ‘కాంట్రాక్టు’ క్రమబద్ధీకరణ ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లతోపాటు డిపోల్లో దాదాపు 5,000 మంది వరకు కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నారు. సమ్మెకాలంలో హాజరైతే వెంటనే వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారు విధులకు గైర్హాజరైతే వెంటనే విధుల నుంచి తొలగించాలని యోచిస్తోంది. గురువారం మధ్యాహ్నం వరకు విధులకు హాజరుకాని కాంట్రాక్టు ఉద్యోగులందరినీ తొలగించనున్నట్టు స్వయంగా ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ప్రకటించారు. ఓయూ పరిధిలోని నేటి పరీక్షలు యథాతథం ఓయూ పరిధిలో నేడు (7న) జరగాల్సిన అన్ని పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని గురువారం పరీక్షల నియంత్రణ అధికారి ప్రొ.భిక్షమయ్య తెలిపారు. ఆర్టీసీ సమ్మె ఉన్నా పరీక్షలు వాయిదా వేసేది లేదని స్పష్టం చేశారు. ఎస్మాకు రంగం సిద్ధం ఆర్టీసీ కార్మికులపై ఎస్మా ప్రయోగం ద్వారా ఒత్తిడి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసర సేవల పరిధిలో ఆర్టీసీ ఉన్నందున.. జనజీవనం అస్తవ్యస్తమవటానికి కారణమవుతున్న సమ్మెను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పేర్కొంది. కానీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక జరిగే సమయం అయినందున సంఘాలు సమ్మెను విరమించుకునే అవకాశం లేదు. ప్రభుత్వ ఈ బెదిరింపులకు తలొగ్గబోమని ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘాలైన ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రకటించాయి. కార్మికులను వేధించే ఉద్దేశం తమకూ లేదని ఎండీ సాంబశివరావు పేర్కొన్నారు. రైళ్లకు అదనపు బోగీలు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొన్ని రైళ్లకు 23 బోగీలను అదనంగా ఏర్పాటు చేశారు. దీంతో దాదాపు 20 రైళ్లలో 1,600 బెర్తులు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. వీలైతే గురువారం నుంచి అదనపు రైళ్లు నడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం అదనపు రేక్లు, బోగీలు ఇవ్వాల్సిందిగా ఇతర జోన్ల అధికారులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు హైదరాబాద్లోనూ ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిలిచిపోవడంతో.. ఎంఎంటీఎస్లు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ఇతర ప్రాంతాల నుంచి డెమూ, మెమూ సర్వీసులను రప్పించారు. వాటిని గురువారం నుంచి 4 ట్రిప్పుల చొప్పున తిప్పనున్నారు. రాజధానిలో పూర్తిగా... హైదరాబాద్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం పూర్తిస్థాయిలో కనిపించింది. సుమారు 3,800 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బుధవారం మొత్తంగా 70 బస్సులే రోడ్డెక్కగలిగాయి. టీఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్ల నేతృత్వంలో కార్మికులు డిపోల వద్ద ధర్నాలకు దిగారు. హైదరాబాద్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగించే మరో 3,500 బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లు వెలవెలపోయాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ బస్సులకు స్టేజీ క్యారేజీలుగా అనుమతినిచ్చారు. సెవెన్ సీటర్ ఆటోలను నగరంలోకి అనుమతించారు. స్కూల్ బస్సులు, కాలేజీ బస్సులలో ప్రయాణికులను ఎక్కించుకొనేందుకు అనుమతినిచ్చారు. -
ఆగిన ‘చక్రం’.. ప్రయాణం నరకం
సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులు డిపోలకే పరిమితమైన బస్సులు సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రగతిరథ చక్రాలు స్తంభించిపోయాయి. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 43 శాతం ఫిట్మెంట్ డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బుధవారం తెల్లవారుజాము నుంచే బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ కార్మికులు బస్డిపోల ఎదుట ఆందోళన చేపట్టారు. బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో రోజువారీ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంజినీరింగ్, ఓపెన్ టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ఉద్యోగులు, చిన్నవ్యాపారులు ప్రైవేటు ట్యాక్సీల ప్రయాణాన్ని నమ్ముకున్నారు. ఎక్కువ చార్జీలు వసూలు చేయడంతో సగటు ప్రయాణికుడి జేబుకు చిల్లుపడింది. కొన్నిచోట్ల ప్రైవేటు వాహనాల రాకపోకలను సైతం ఆర్టీసీ కార్మికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రైవేటు వ్యక్తులను ఏర్పా టు చేసి బస్సులు నడుపుతామని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొన్నప్పటికీ.. ఎక్క డా బస్సులు రోడ్డెక్కలేదు. సిబ్బంది వేతనాల పెంపుపట్ల ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో గురువారం కూడా సమ్మె యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. -
ప్రకాశం ఆర్టీసీ కార్మికుల సమ్మె
ప్రకాశం: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రైవేటు వ్యక్తులతో బస్సులను నడిపించి ప్రయాణికుల ఇక్కట్లు తీర్చాలనుకున్న అధికారుల ప్రయత్నాలు ఫలించలేదు. ప్రకాశం జిల్లా ఒంగోలులో బుధవారం ఉదయం నుంచి ఆర్టీసీ కార్మికులు డిపోల ఎదుట ధర్నాలు నిర్వహించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. -
నిజామాబాద్ ఆర్టీసీ కార్మికుల సమ్మె
నిజామాబాద్: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్మెంట్ ఇవ్వాలంటూ సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులు డిపోల ముందు ధర్నాలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ డిపో ఎదుట బుధవారం పలు కార్మికుల సంఘాల సభ్యులు బైఠాయించారు. ప్రైవేటు డ్రైవర్లతో ఆర్టీసీ వాహనాలు నడిపి ప్రజలను ప్రమాదాల బారిన పడేయడం తగదని... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
కరీంనగర్ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తం
కరీనంగర్: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చేసిన ఏర్పాట్లను అడ్డుకోవడానికి ఆర్టీసీ కార్మిక సంఘాలు యత్నిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలోని ఆర్టీసీ డిపోలో కార్మికుల సమ్మెతో నిలిచిపోయిన బస్సులను ప్రైవేటు వ్యక్తులతో నడపడానికి అధికారులు తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. దీంతో ఆగ్రహించిన ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రైవేటు డ్రైవర్లు నడుపుతున్న వాహనాలను అడ్డుకునే యత్నం చేశారు. డిపో నుంచి బస్సును బయటకు తీస్తున్న ప్రైవేటు డ్రైవర్పై దాడికి దిగి అతన్ని గాయపర్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ఆర్టీసీలో సమ్మె హారన్
రాజమండ్రి సిటీ : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఫిట్మెంట్ అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదే శ్, తెలంగాణా రాష్ట్రాల ఆర్టీసీ కార్మికులు బుధవారం తెల్లవారుజాము నుంచి సమ్మెకు సిద్ధమయ్యారు. రెండు రాష్ట్రాలలో కార్మికులు సమస్యల పరిస్కారం కోసం పనిచేయాల్చిన ఆర్టీసీ యాజమాన్యం తాత్సారం చేస్తుండటంతో మార్చి నెలలో హైదరాబాద్ సంస్థ ఎండీ నిర్వహించిన సమావేశంలో ఏప్రిల్లో అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటించినా... ప్రభుత్వం ఏమాత్రం చ ర్యలు చేపట్టకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వస్తోందని కార్మికులు చెబుతున్నారు. బుధవారం ఉదయం డిపో నుంచి ఒక్క బస్సు బయటకు రానివ్వబోమని కార్మికులు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా తొమ్మిది డిపోలలో బస్సులు తిరగనిచ్చేది లేదంటూ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయూస్ యూనియన్, తదితర యూనియన్ల కార్మికులు ప్రతిజ్ఞబూనారు. జిల్లాలో రూ.కోటికి పైగా నష్టం జిల్లాలో తొమ్మిది డిపోలకు సంబంధించి సుమారు 4200 మంది కార్మికులు ఉండగా, వారిలో 2000 మంది డ్రైవర్లు,1400 మంది కండక్టర్లుకాగా మిగిలిన వారంతా వివిధ విబాగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు. జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోడ్డెకపోవడంతో సుమారు నాలుగు లక్షల మంది ప్రయాణికులు ఇబ్బంది పడనున్నారు. దీంతో జిల్లాలో సుమారు రూ. కోటి పైగా నష్టం రానుందని అంచనా. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆంధ్రప్రదేశ్లో ఈ నెల ఎనిమిదో తేదీ శుక్రవారం జరగనున్న ఎంసెట్ పరీక్ష రాసే వేలాది మంది విద్యార్థులు తీవ్ర అవస్థలు పడనున్నారు. అదే విధంగా 14వ తేదీ గురువారం తెలంగాణాలో జరగనున్న ఎంసెట్ పరీక్షలు రాసే విద్యార్థులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేక తీవ్ర అవస్థలు పడనున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం : ఆర్ఎం రవికుమార్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెను ఎదుర్కొని ప్రయాణికులకు సరైన బస్సులు ఏర్పాటు చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించామని బుధవారం తెల్లవారు జాము నుంచి బస్సులను యథావిధిగా తిప్పే ప్రయత్నం చేస్తున్నట్టు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చింతా రవికుమార్ తెలిపారు. పోలీస్, హోంగార్డ్, సీనియర్ డ్రైవర్లు ,10 వతరగతి పాసైన వారిని బస్సులు నడిపేందుకు టికెట్లు ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు. -
నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలి
తిరుమలకు సైతం బస్సులు బంద్ ఆర్టీసీ ఈయూ రాష్ట్ర నేత దామోదరరావు పిలుపు తిరుపతి కల్చరల్: ఆర్టీసీ కార్మికులకు ఫ్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మే 6 నుంచి జరుగబోవు నిరవధిక ఆర్టీసీ సమ్మెకు కార్మికులందరూ సిద్ధం కావాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి మలిశెట్టి దామోదరరావు పిలుపు నిచ్చారు. ఆర్టీసీ బస్టాండ్లోని గ్యారేజ్ వద్ద ఏర్పాటు చేసిన సమ్మె సన్నాహాక సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఫిట్మెంట్ కల్పించాలని డిమాండ్ చేశామన్నారు. ఈ మేరకు ఈ నెల 2న సమ్మె ఎంప్లాయిస్ యూనియన్, ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు ఇచ్చామన్నారు. దీనిపై ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో ప్రభుత్వం, యాజమాన్యం ఎటువంటి ప్రకటన చేయకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ మే 6 నుంచి ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమ్మెలో తిరుమల కొండపైకి వెళ్లే బస్సులు కూడా నిలిచిపోతాయని, భక్తులు ఇందుకు సహకరించాలని కోరారు. ఆర్టీసీలో పని చేస్తున్న లక్షా ఇరవై వేల మంది కార్మికులందరికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన జీతభత్యాలు ఇవ్వాలన్నారు. అయితే ఎన్ఎంయూ నాయకులు యాజమాన్యంతో కుమ్మక్కై వేతనాల సవరణను ఆపివేసి, ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు జరిపించాలని లేబర్ కమిషనర్పై ఒత్తిడి చేయడం విడ్డూరమన్నారు. ఫిట్మెంట్పై సోమవారం ఆర్టీసీ అధికారులతోను, 30న లేబర్ కమిషనర్తో చర్చలు ఉన్నాయని పేర్కొన్నారు. కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఇవ్వాలంటే రెండు రాష్ట్రాల్లో 1800 కోట్లు ఏడాదికి అదనపు భారం పడుతుందన్నారు. రాష్ర్ట ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రకాష్ మాట్లాడుతూ వేతనాల సవరణ కోసం చేపడుతున్న నిరవధిక సమ్మెలో అన్ని యూనియన్లు పాల్గొని, 43 శాతం ఫిట్మెంట్ సాధించుకోవడంలో భాగస్వాములు కావాలని కోరారు. ఎంప్లాయిస్ యూనియన్ రీజనల్ అధ్యక్ష, కార్యదర్శులు టి.సత్యనారాయణ, ఎన్.విజయకుమార్, ఆర్టీసీ కో-ఆపరేటివ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యుడు క్రిష్ణమూర్తి, జోనల్ నాయకులు జ్యోతియాదవ్, పీఎస్ఎం.బాబురావు, ఎన్ఎస్ మణ్యం, డిపో అధ్యక్ష, కార్యదర్శులు వై.రాము, డీజే రామయ్య, గ్యారేజ్ కార్యదర్శి భాస్కర్, కార్మికులు పాల్గొన్నారు. -
కార్మిక సంఘాలతో ఆర్టీసీ యాజమాన్యం చర్చలు విఫలం
హైదరాబాద్: బస్ భవన్లో కార్మిక సంఘాలతో ఆర్టీసీ యాజమాన్యం శనివారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నెల 22న కార్మిక శాఖ కమిషనర్తో కార్మిక సంఘాలు తుది చర్చలు జరపనుంది. వేతన సవరణపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలనే డిమాండ్తో ఈయూ-టీఎంయూ నేతలు ఇటీవల ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
కార్మిక శాఖతో ‘ఆర్టీసీ’ చర్చలు విఫలం
22న సమ్మె తేదీ ప్రకటిస్తామన్న కార్మిక సంఘాల నేతలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలనే డిమాండ్తో సమ్మె నోటీసిచ్చిన ఈయూ-టీఎంయూ నేతలతో కార్మిక శాఖ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. చర్చల్ని ఈ నెల 22కి వాయిదా వేస్తూ కార్మిక శాఖ నిర్ణయం తీసుకోవడంతో అదే రోజు సమ్మె తేదీ ప్రకటిస్తామని కార్మిక సంఘాల నేతలుపేర్కొన్నారు. ఆర్టీసీ విభజన వెంటనే చేపట్టాలని, కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలను సవరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 2న ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్లు సమ్మె నోటీసిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై యూనియన్ల నాయకులను కార్మిక శాఖ సోమవారం చర్చలకు పిలిచింది. అయితే యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య స్పష్టత రాకపోవడంతో చర్చలు ఈ నెల 22కి వాయిదా పడ్డాయి. అయితే ఆర్టీసీ యాజమాన్యం ఈ నెల 18న కార్మిక సంఘాలను చర్చలకు పిలిచింది. ఆ రోజున చర్చల్లో ఆర్టీసీ ఎండీ పాల్గొంటారని యూనియన్ నేతలకు సమాచారం ఇచ్చింది. సోమవారం కార్మిక శాఖ రాష్ట్ర కన్సిలియేషన్ అధికారి ఆర్.రవి భూషణరావుతో జరిగిన చర్చల్లో యూనియన్ నేతలు కె.పద్మాకర్, ఇ.అశ్వత్థామరెడ్డి, బాబు, తిరుపతి, హన్మంతరావు, కె.రాజిరెడ్డి, ఎం.థామస్రెడ్డి, పలిశెట్టి దామోదరరావు, ఎల్.మారయ్య పాల్గొనగా, ఆర్టీసీ యాజమాన్యం తరఫున ఈడీ ఎ.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
చట్టప్రకారమే రవాణా పన్ను వసూలు
ఏపీపై ఎలాంటి కక్షా లేదు ఆర్టీసీ కార్మికుల ఫిట్మెంట్పై త్వరలో నిర్ణయం రవాణా మంత్రి మహేందర్రెడ్డి సాక్షి,హైదరాబాద్ : అంతరాష్ర్ట పన్ను వసూళ్ల విషయంలో ఏపీపై తమకు ఎలాంటి కక్ష లేదని, జీవో 43 ప్రకారమే రోడ్డు రవాణా పన్ను వసూలు చేస్తున్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డి తెలిపారు.శువ్రారం నగరంలో నిర్వహించిన తెలంగాణ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రవాణా పన్ను విషయంలో అనవసరంగా రాద్దాంతాలు చేయరాదన్నారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా తాత్కాలికంగా పన్ను వసూళ్లను వాయిదా వేశామన్నారు. తెలంగాణ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్స్ అసోసియేషన్ సంఘ అధ్యక్షుడు పాపారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ ఆర్టీసీ కార్మికులకు సైతం తాము అన్యాయం చేయబోమని, ఫిట్మెంట్పై త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.రాష్ర్టంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రవాణాశాఖ అధికారులు, ఉద్యోగులు ఉద్యమస్థాయిలో కృషి చేయాలన్నారు. రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు అసోసియేషన్ రూపొందించిన ‘ జర భద్రం కొడుకో’ సీడీని ఆయన ఆవిష్కరించారు.ఎంవీఐలు, ఇతర అధికారుల పదోన్నతులపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నామన్నారు. దేవీప్రసాద్ మాట్లాడుతూ, సకలజనుల సమ్మెతో ఆర్టీఏ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనతోనే తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగిందని, సకల జనుల సమ్మెగా అది విజయవంతమైందని గుర్తు చేశారు. రవీందర్రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగస్వాములైనట్లుగానే, తెలంగాణ పునర్నిర్మాణంలోనూ భాగస్వాములు కావాలన్నారు.రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్ శర్మ మాట్లాడుతూ రవాణా ఉద్యోగులంతా ఒక కుటుంబసభ్యుల్లా కలిసిమెలిసి పని చేయాలని సూచించారు. కమిషనర్ సుల్తానియా మాట్లాడుతూ, స్కూళ్లలో రోడ్డు సేఫ్టీ క్లబ్లు ఏర్పాటు చేయడం ద్వారా సత్ఫలితాలను సాధించగలమన్నారు. టీఎన్జీవోస్ గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్, అధ్యక్షుడు కారెం రవీందర్రెడ్డి, ఎంవీఐల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీనివాస్, డీటీసీలు రమేష్,ప్రవీణ్రావు,టీఆర్ఎస్ గ్రేటర్ అడ్హక్ కమిటీ కన్వీనర్ మైనంపల్లి హనుమంత రావు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
వేతన సవరణ చేయకుంటే సమ్మెకు సై
ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసు ఇచ్చినకార్మిక సంఘాలు 15వ తేదీ వరకు గడువు విధింపు స్పందన రాకుంటే 16 నుంచి సమ్మె ప్రభుత్వ విధానాల వల్లే ఆర్టీసీకి నష్టాలు ప్రభుత్వ ఉద్యోగులకంటే ఎక్కువ కష్టపడుతున్నాం వేల మంది కార్మికులతో బస్భవన్ ముట్టడి ముట్టడితో డిపోలకే పరిమితమైన బస్సులు సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మెకు సై అన్నారు. వేతన సవరణ గడువు దాటి రెండేళ్లు గడుస్తున్నా యాజమాన్యం నుంచి స్పందన లేకపోవటంతో సమ్మెబాట పట్టాలని గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఈ నెల 15 వరకు యాజమాన్యానికి గడువు విధించిన కార్మిక సంఘాలు.. అప్పటికీ స్పందనరాని పక్షంలో 16 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రకటించాయి. ఈ మేరకు గురువారం ఆర్టీసీ ఎండీ సాంబశివరావు, కార్మిక శాఖ కమిషనర్లకు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) సమ్మె నోటీసులను అందజేశాయి. 2013 ఏప్రిల్ 1న వేతన సవరణ జరగాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోకపోవటం, ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ప్రక టించి ఆర్టీసీ కార్మికుల విషయంలో నిర్ణయం తీసుకోకపోవటాన్ని కార్మికులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఫిట్మెంట్ ప్రకటించకముందే ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే ఆర్టీసీ కార్మికుల వేతనాలు తక్కువగా ఉండటంతో వాటిని సవరించాలనే డిమాండ్ పెండింగ్లో ఉంది. దాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్మెంట్ ప్రకటించటంతో ఆ తేడా మరింతగా పెరిగింది. దీనిపై మండిపడుతున్న కార్మిక సంఘాలు ఆందోళనబాట పట్టనున్నట్టు ప్రకటించటంతో కొద్దిరోజులుగా ఆర్టీసీ ఎండీ వారితో చర్చలు జరుపుతున్నారు. సర్వీస్ కండిషన్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న 273 అంశాలపై చర్చల్లో పురోగతి ఉన్నప్పటికీ.. వేతన సవరణ విషయంలో మాత్రం ఎండీ చేతులెత్తేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమంగా ఫిట్మెంట్ ప్రకటిస్తే రెండు రాష్ట్రాలకు సంబంధించి ఆర్టీసీపై సాలీనా రూ.1,800 కోట్ల భారం పడుతుందని లెక్కలేశారు. ఇంత భారం మోయటం నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి అసాధ్యమని ఎండీ తేల్చి చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దీన్ని భరిస్తే తప్ప ఆ మేరకు వేతన సవరణ సాధ్యం కాదని, ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. దీనిపై స్పష్టత రావాలంటే ఏప్రిల్ నెలాఖరువరకు గడువు ఇవ్వాలని బుధవారం జరిగిన చర్చల్లో ఎండీ కార్మికులకు సూచించారు. దీంతో సమ్మె బాటపట్టడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. కదం తొక్కిన కార్మికులు.. వేతన సవరణపై స్పష్టత రాకపోవడంతో ముందుగా ప్రకటించినట్టుగానే గురువారం ఆర్టీసీ కార్మికులు బస్భవన్ను ముట్టడించారు. గురువారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వేల సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు కదంతొక్కారు. ఏపీ, తెలంగాణల్లోని జిల్లాల నుంచి తరలివచ్చిన కార్మికులు ఉదయం 11 గంటలకు సుందరయ్య పార్కు నుంచి బస్భవన్ వరకు ర్యాలీగా వచ్చారు. అనంతరం బస్భవన్ ప్రాంగణంలో బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వేతన సవరణలో జరుగుతున్న జాప్యంపై కార్మికలోకం తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచి తమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమంగా వేతనాలు పెంచాల్సిందేనని, పక్షం రోజుల్లో ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే సమ్మెకు దిగి తీరుతామని ప్రకటించింది. నష్టాలకు కారణం ప్రభుత్వాలే.. ఆర్టీసీ తీవ్ర నష్టాలను మూటగట్టుకోవటానికి ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలే కారణమని ఈయూ ప్రధాన కార్యదర్శి పద్మాకర్, టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఇప్పుడు వాటిని బూచిగా చూపి వేతన సవరణను వాయిదా వేయటం సబబు కాదన్నారు. ఆ నష్టాలను సాకుగా చూపి కార్మికులకు అన్యాయం చేస్తే సహించబోమని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా కష్టించి పనిచేస్తున్నామని, అలాంటప్పుడు వారితో సమంగా వేతనాలు కోరుకోవటంలో తప్పేంటని ప్రశ్నించారు. రెండు ప్రభుత్వాలు దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. పరిపాలన పరంగా ఆర్టీసీని వెంటనే విభజించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఈయూ-టీఎంయూ కూటమికి కార్మికులంతా మద్దతు పలకాలని కోరారు. సభలో రెండు సంఘాల ప్రతినిధులు బాబు, థామస్రెడ్డి, రాజిరెడ్డి, బీవీ రెడ్డి, ఎస్వీబీ రాజేంద్రప్రసాద్, మారయ్య, హన్మంతరావు, రామకృష్ణ, ప్రసాదరెడ్డి, దామోదరరావు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడికక్కడ నిలిచిన బస్సులు.. బస్భవన్ ముట్టడి కోసం వేల సంఖ్యలో కార్మికులు హైదరాబాద్ చేరుకోవటంతో రెండు రాష్ట్రాల్లో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉదయం పూట నడవాల్సిన బస్సులు చాలావరకు డిపోలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్లో ఉదయం షిఫ్ట్ తిరగాల్సిన బస్సుల్లో దాదాపు 80 శాతం డిపోలకే పరిమితం కావటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో పరీక్షలకు హాజరవుతున్న పదో తరగతి విద్యార్థులు అవస్థలు పడాల్సి వచ్చింది. -
2న బస్సుల దిగ్బంధం
ఆర్టీసీ కార్మికుల పోరుబాట వేతన సవరణకోసం డిమాండ్ బస్భవన్ ముట్టడికి నిర్ణయం పదోతరగతి విద్యార్థులకు ఇబ్బంది సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఉద్యమబాట పడుతున్నారు. ఇందులో భాగంగా ఆర్టీసీ యాజమాన్యానికి హెచ్చరిక జారీ చేసేందుకు గుర్తింపు పొందిన సంఘాలు ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్లు ఏప్రిల్ 2న బస్భవన్ ముట్టడి నిర్వహించాలని నిర్ణయించాయి. దాదాపు 20 వేల మంది కార్మికులతో సుందరయ్య భవన్ నుంచి ఆర్టీసీ భవన్ వరకు ర్యాలీగా వచ్చి కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించాయి. ఆరోజు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యేలా దిగ్బంధం చేయబోతున్నారు. దీంతో పరీక్షలు రాస్తున్న పదో తరగతి విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. పదో తరగతి విద్యార్థులకు ఇబ్బందులు ఎదురైతే దానికి యాజమాన్యమే బాధ్యత వహించాలని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. దీంతో ఆందోళనకు గురవుతున్న అధికారులు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని కార్మిక సంఘాలను కోరుతున్నారు. కానీ తాము ఎట్టిపరిస్థితిలోనూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. నిజానికి అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే ఈ కార్యక్రమాన్ని తలపెట్టినప్పటికీ, పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఏప్రిల్ రెండుకు కార్యాచరణను వాయిదా వేసుకున్నారు. ఆ రోజు బహిరంగసభలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను కూడా సిద్ధం చేసుకుంటామని కార్మిక నేతలు పేర్కొంటున్నారు. ఎన్ఎంయూ నిరాహారదీక్షలు.. వేతన సవరణ, ఆర్టీసీ విభజన ప్రధాన డిమాండ్లుగా ఎన్ఎంయూ సోమ, మంగళవారాల్లో ఇందిరాపార్కు వద్ద రిలే నిరాహారదీక్షలు నిర్వహించనుంది. తమ డిమాండ్లపై యాజమాన్యం స్పందించటం లేదని, గుర్తింపు సంఘాలు గందరగోళంగా వ్యవహరిస్తున్నాయని ఎన్ఎంయూ రెండు రాష్ట్రాల ప్రతినిధులు నరేందర్, రమేశ్, చెన్నారెడ్డి, శ్రీనివాసరావు, చంద్రయ్య, రమణారెడ్డిలు ఓ ప్రకటనలో ఆరోపించారు. సమ్మె నోటీసులు ఇచ్చి వాటి గడువు ముగిసేదాక కాలయాపన చేసి ఇప్పుడు బస్భవన్ ముట్టడి పేర గుర్తింపు సంఘాలు అయోమయానికి గురిచేస్తున్నాయని ఆరోపించారు. సామూహిక సెలవులో వెళ్లాలని అధికారుల నిర్ణయం ఆర్టీసీ విభజనలో జరుగుతున్న జాప్యంతో విసిగిపోయిన తెలంగాణ అధికారులు ఆందోళనకు సిద్ధమయ్యారు. సంస్థ విభజనపై ప్రకటనలు తప్ప ఎలాంటి కసరత్తు జరగకపోవడంతో అధికారులు, సూపర్వైజర్ స్థాయి సిబ్బంది సామూహిక సెలవులో వెళ్లాలని నిర్ణయించారు. ఆదివారం ఆర్టీసీ తెలంగాణ అధికారుల సంఘం, సూపర్వైజర్ల సంఘ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఇందులో ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేశారు. వచ్చే నాలుగైదు రోజుల్లో విభజన పరిణామాలు పరిశీలించి తగిన స్పందన రాకపోతే ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ స్థాయి నుంచి డిపో సూపర్వైజర్ వరకు సామూహిక సెలవులో వెళ్లాలని తీర్మానించారు. విభజన జరగనప్పటికీ తెలంగాణలో ‘తెలంగాణ ఆర్టీసీ’ అంటూ ఉంచిన బోర్డులను తిరిగి ‘ఏపీఎస్ ఆర్టీసీ’గా మార్చాలని నిర్ణయించారు. విభజన జరగకపోవటం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ఉద్యోగులందరికీ వివరించి ఆందోళనకు సిద్ధం చేయాలని నిర్ణయించారు. అప్పటికీ చలనం రాకుంటే బస్భవన్ను ముట్టడించాలని తీర్మానిం చారు. దీనికి సంబంధించి రెండుమూడు రోజుల్లో తేదీలు ప్రకటించనున్నట్టు వెల్లడించారు. -
తక్షణం ఎన్నికలు జరపాలి
శ్రీకాకుళం అర్బన్ : ఏపీఎస్ ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సి.చంద్రయ్య డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని అంబేద్కర్ కూడలి వద్ద గల రెవెన్యూ అతిథి గృహంలో గురువారం ఎన్ఎంయూ నెక్ రీజియన్ అధ్యక్షుడు బీఎస్ రాములు అధ్యక్షతన రీజనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 1 నుంచి ఎంప్లాయీస్ యూనియన్ గడువు ముగిసిందని, ఇంతవరకూ ఎన్నికలు నిర్వహించకపోవడం శోఛనీయమన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఏప్రిల్ 1, 2013 నుంచి రావాల్సిన జీతభత్యాలు తక్షణమే పరిష్కరించాలన్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పి.వి.రమణారెడ్డి మాట్లాడుతూ యాజమాన్యం ఏకపక్షంగా ఎంప్లాయీస్ యూనియన్కు వత్తాసు పలుకుతూ నేషనల్ మజ్దూర్ యూనియన్ గౌరవ సభ్యులపై వేధింపులకు గురిచేస్తోందని పేర్కొన్నారు. కోపరేటివ్ క్రెడిట్ సొసైటీని ఎన్ఎంయూ కాలంలో లాభాలతో నడిపించి కార్మికులకు త్వరితగతిన లోన్స్ వచ్చేలా కృషి చేశామన్నారు. అయితే ఈయూ గుర్తింపు సంఘంగా వచ్చిన తరువాత సొసైటీని నష్టాలలో నడిపిస్తూ కార్మికులకు లోన్లు ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పీవీవీ మోహన్ మాట్లాడుతూ ఆర్టీసీ యాజమాన్యం ఎన్ఎంయూ కార్మికులపై జరుగుపుతున్న దమనకాండను ఖండిస్తున్నామన్నారు. ఎన్ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో అప్పులు, ఆస్తులను ఆంధ్రా, తెలంగాణాలకు 58:42 నిష్పత్తిలో పంచాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎన్ఎంయూ నాయకులు ఎస్.సిమ్మయ్య, ఎంవీఆర్ మూర్తి, జోనల్ చైర్మన్ వి.ప్రదీప్కుమార్, కేవీఆర్ నర్సింగరావు, శ్రీకాకుళం, విజయనగరం కార్మికులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ కార్మికులకు 4.9% డీఏ పెంపు
సాక్షి, హైదరాబాద్: ఇరు రాష్ట్రాల్లోని ఆర్టీసీ కార్మికులకు 4.9% డీఏ పెంచుతూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి డీఏ బకాయిలను ఈ నెల జీతంతో, పెండింగ్లోని మూడున్నర నెలల బకాయిలను మార్చి జీతం తో కలిపి చెల్లించనున్నారు. ఈ నిర్ణయంపై ఏపీఎస్, టీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూని యన్లు, తెలంగాణ మజ్దూర్ ప్రధాన కార్యదర్శులు కె.పద్మాకర్, కె.రాజిరెడ్డి, అశ్వత్థామరెడ్డి గురువారం హర్షం వ్యక్తం చేశారు. కాగా రాష్ట్ర విభజన సందర్భంగా సీమాంధ్రలో సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులకు ఆ కాలానికి స్పెషల్ క్యాజువల్ లీవ్గా వర్తింపజేయాలని ఆర్టీసీ ఈయూ ఉప ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు. -
త్వరలో స్పెషల్ ఇంక్రిమెంట్.
ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకుతెలంగాణ కానుక పది రోజుల్లో విభజన పూర్తి రాష్ట్ర రవాణా మంత్రి మహేందర్రెడ్డి ఉత్తమ డ్రైవర్లకు అవార్డుల ప్రదానం సిటీబ్యూరో: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో విజయవంతంగా పోరాడిన ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు త్వరలోనే తెలంగాణ ఇంక్రిమెంట్ అందజేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్రెడ్డి అన్నారు. ఆర్టీసీ, హెచ్పీసీఎల్ సంయుక్తంగా చేపట్టిన ఇంధన పొదుపు పక్షోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం ఆర్టీసీ కళాభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇంధన పొదుపు పాటించిన 94 మంది డ్రైవర్లకు బెస్ట్ కెఎంపీఎల్ అవార్డులు అందజేసిన సందర్భం గా మహేందర్రెడ్డి మాట్లాడారు. ఆర్టీసీలో ఏటా రూ. 1,150 కోట్ల ఇంధన భారం పడుతుందని, సరైన పొదుపు పద్ధతులను పాటించడం ద్వారా భారాన్ని తగ్గించేందుకు డ్రైవర్లు కృషి చేయాలన్నారు. వారం, పదిరోజుల్లో ఆర్టీసీ విభజన ప్రక్రియ పూర్తి కానుందని తెలిపారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ప్రతి జిల్లాకు రూ.10 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామన్నారు. సంస్థ వీసీ అండ్ ఎండీ ఎన్.సాంబశివరావు మాట్లాడుతూ... తెలంగాణలో రోజుకు రూ.2 కోట్ల నష్టం వస్తుందన్నారు. కార్మికులు, ఉద్యోగులు, అధికారులు కలిసికట్టుగా పని చేసి నష్టాలను అధిగమించాలని సూచించారు. తెలంగాణలో 94 డిపోలకు గాను 52 డిపోల్లో ఇంధన పొదుపు పాటించగా మిగతా 42 డిపోల్లో సగటు కన్నా తక్కువ కె ఎంపీఎల్తో బాగా వెనుకబడినట్టు జేఎండీ రమణారావు తెలిపారు. సదరు 42 డిపోల వారు ఇప్పటికైనా తమ పనితీరును మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ విజిలెన్స్ డెరైక్టర్ వేణుగోపాల్రావు, హెచ్పీసీఎల్ రీజనల్ మేనేజర్ పండా, ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరావు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ డ్రైవర్లు వీరే... ఖమ్మం డిపోలో పనిచేస్తున్న సీహెచ్ అప్పారావు ఈ ఏడాది ఇంధన పొదుపులో అద్భుతమైన ఫలితాన్ని సాధించి అత్యుత్తమ డ్రైవర్గా నిలిచారు. లీటర్ డీజిల్కు 7.92 కిలోమీటర్ల చొప్పున ఏడాది కాలంలో 71,182 కిలోమీటర్ల మేర బస్సు నడిపారు. ఆయన పాటించిన పొదుపు వల్ల 4,418 లీటర్ల డీజిల్ ఆదా అయింది. ఈ మేరకు అప్పారావును అధికారులు అభినందించారు. రంగారెడ్డి జిల్లా పరిగి డిపోకు చెందిన కె.బుచ్చయ్య లీటర్ డీజిల్కు 7.13 కిలోమీటర్లు నడిపి రెండో స్థానంలో నిలిచారు. కరీంనగర్ డిపోకు చెందిన ఏఎన్ చారి 6.72 కిలోమీటర్లతో మూడో స్థానంలో నిలిచారు. రాష్ట్ర స్థాయిలో మొత్తం 11 మంది డ్రైవర్లు అవార్డులు అందుకున్నారు. జోనల్, రిజియన్ స్థాయిల్లో మొత్తంగా 94 మంది డ్రైవర్లు, మెకానిక్లకు అవార్డులు లభించాయి. -
‘పచ్చ’ ముచ్చటకు రూ.10 కోట్లు
కార్మికుల సొమ్ముతో ఆర్టీసీ బస్సులకు పసుపు పచ్చ రంగు సాక్షి, హైదరాబాద్: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదే మరి! పల్లెవెలుగు బస్సులను ‘పచ్చ’ రంగుతో అలకరించేందుకు ఆర్టీసీ కార్మికుల సొమ్ముకు సర్కారు ఎసరు పెట్టింది. కొత్తగా ప్రవేశపెడుతున్న వాటితోపాటు పాత బస్సులకూ తమ పార్టీ రంగు పసుపు రంగులోకి మార్చాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మార్చి నాటికి రాష్ట్రంలోని 123 డిపోల్లోని పల్లెవెలుగు బస్సులతో పాటు హైటెక్, లగ్జరీ, సూపర్ లగ్జరీ బస్సులకు పసుపు పచ్చ రంగు పడనుంది. హైటెక్, లగ్జరీ బస్సులకు బోర్డర్ పసుపు రంగు వేయాలని నిర్ణయించారు. సుమారు రూ.10 కోట్ల వరకు ఖర్చయ్యే ఈ కార్యక్రమానికి ఆర్టీసీ కార్మికులు పొదుపు చేసి దాచుకున్న డబ్బును వాడుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. సరైన నిర్వహణ లేకుండా రంగులెందుకు? ఆర్టీసీకి రోజుకు రూ.2 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది. మరోవైపు ఆర్టీసీ బస్సుల నిర్వహణ సరిగా లేదు. సీట్లలో కూర్చొంటే నల్లులు బాధ తప్పడం లేదని స్వయానా రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావే ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో బస్సుల రంగు కోసం నిధులు వినియోగించటం సరికాదని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. విమాన ఇంధనంపై వ్యాట్ తగ్గించి ఆర్టీసీకి మొండిచేయి విమాన ఇంధనంపై వ్యాట్ శాతాన్ని ఇటీవలే ప్రభుత్వం 16 నుంచి 1 శాతానికి తగ్గించింది. దీనివల్ల రాష్ట్రంలో విమానయానం పెరుగుతుందని చెబుతోంది. ప్రభుత్వానికి ఏటా రూ.25 కోట్ల వరకు నష్టం వాటిల్లుతున్నా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొంటోంది. ఆర్టీసీకి కూడా ఇంధన రాయితీ కల్పించాలని ఎన్నో ఏళ్ల నుంచి కార్మిక సంఘాలు కోరుతున్నాయి. డీజిల్పై వ్యాట్ శాతం తగ్గించాలని కోరినా పట్టించుకోని ప్రభుత్వం సంపన్నులు ప్రయాణించే విమానాలపై మాత్రం ఇంధనం వ్యాట్ తగ్గించడాన్ని యూనియన్ నేతలు విమర్శిస్తున్నారు. ఆర్టీసీకి నష్టాలు రావడానికి కారణం కేవలం ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలేనని మండిపడుతున్నారు. -
ఆర్టీసీలో సమ్మెకు సై...
* 11 నుంచి సమ్మెపై వెనక్కు తగ్గేది లేదు: ఈయూ * ఆందోళనకు పార్టీలు, కార్మిక సంఘాల మద్దతు * 9న చర్చలకు ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వం రేపు చర్చలు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈనెల 9న ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు కార్మిక సంఘాల నాయకులను పిలిచారు. ఇప్పటికే ఒకసారి మంత్రి సిద్ధా రాఘవరావు చర్చలు జరిపినా ఎలాంటి పురోగతి లేదు. సాక్షి, విజయవాడ బ్యూరో, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కచ్చితమైన చర్యలు తీసుకునేవరకూ పోరాటం చేయాలని ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) నిర్ణయించింది. ఈనెల 11వతేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమైన నేపథ్యంలో ఈయూ ఆధ్వర్యంలో ఆదివారం అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఎస్డబ్ల్యూఎఫ్, సీపీఐ, సీపీఎం ప్రతినిధులు, వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ నేతలు దీనికి హాజరయ్యూరు. ఆర్టీసీ మనుగడ కోసం చేస్తున్న ఈ ఆందోళనకు అన్ని పార్టీలు, కార్మిక సంఘాలు బాసటగా నిలవాలని ఈయూ నేతలు విజ్ఞప్తి చేశారు. గతంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు సంస్థను నిలబెట్టుకునేందుకు ఉద్యమ బాట పడుతున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీకి రూ.250 కోట్లు ఇస్తానని ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణం బకారుులు చెల్లించాలి ఆర్టీసీ చట్టం 1950 ప్రకారం 1: 2 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1995-96 తరువాత విస్మరించాయని ఈయూ నేతలు పేర్కొన్నారు. వివిధ సంక్షేమ పథకాల కింద కార్మికులు దాచుకున్న రూ.444 కోట్లను యాజమాన్యం ఖర్చు చేసిందని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రూ.700 కోట్లు రావాల్సి ఉందన్నారు. బకారుుల విడుదల, ప్రైవేటీకరణను విరమించుకోవాలని, సీసీఎస్ సొమ్మును యాజమాన్యం నుంచి రికవరీ చేయాలనే 8 డిమాండ్లతో తీర్మానాలు చేశారు. సమ్మెకు పలు యూనియన్ల సంఘీభావం.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఈయూ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగారుు. కడపలో ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్రెడ్డి, ముఖ్య ఉపాధ్యక్షుడు పీవీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కడప మేయర్ కె.సురేష్బాబు, వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, టీడీపీ నేతలు దీనికి హాజరయ్యూరు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో టీడీపీ నేతలు గైర్హాజరుకాగా వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. గుంటూరు జిల్లాలో జోనల్ కార్యదర్శి ఎండీ ప్రసాద్ , సీపీఐ సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
టీటీఐలు.. టార్గెట్లు
- చిన్న చిన్న తప్పిదాలకూ కేసులు - అవసరం లేకపోయినా మెమోలు - ఆందోళన చెందుతున్న ఆర్టీసీ కార్మికులు - మానసిక ఒత్తిడికి గురవుతున్నామని ఆవేదన కామారెడ్డి: ‘దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు’ అన్నట్టుగా తయారైంది ఆర్టీసీ కండక్టర్ల పరిస్థితి. యాజమాన్యం టార్గెట్లు విధించడంతో కొందరు టీటీఐలు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్న చిన్న తప్పిదాలకు సైతం కేసులు రాస్తూ కండక్టర్లను రోడ్డుపాలు చేస్తున్నారని అంటున్నారు. శనివారం కామారెడ్డిలో టీటీఐ సామయ్య వేధించడంతోనే జీవన్ అనే కండక్టర్ షాక్తో ఆస్పత్రి పాలయ్యాడు. జీవన్కు ఇంతకు ముందే టీటీఐలతో రెండుసార్లు ఇబ్బందులపాలై ఇంక్రిమెంట్లు కోల్పో యా డు. మూడోసారి తీవ్రమైన ఒత్తిడి తేవడంతో షాక్కు గురయ్యా డు. ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఎక్కువ సమయం పనిచేస్తున్నా ఆర్టీసీలో కార్మికులకు అరకొర వేతనాలే ఉన్నాయి. దానికి తోడు పని భారం, అధికారుల ఒత్తిళ్లూ ఎక్కువే. ఇదే సమయంలో టీటీఐలు తనిఖీల పేరుతో హడలెత్తిస్తుండడంతో కండక్టర్లు ఆందోళనకు గురవుతు న్నారు. నాలుగు రకాల తనిఖీ బృందాలు ఆర్టీసీ బస్సులలో టిక్కెట్ల తనిఖీలకు సంబంధించి జిల్లా స్క్వాడ్, జోనల్ స్క్వాడ్, విజిలెన్స్ స్క్వాడ్, హెడ్ క్వార్టర్ స్క్వాడ్ అని నాలుగు రకాల బృందాలున్నాయి. జిల్లా స్క్వాడ్లో ఏడుగురు సభ్యులుంటారు. వారికి ఒక వాహనం ఉంటుంది. హెడ్క్వార్టర్ స్క్వాడ్లో కూడా ఏడుగురు సభ్యులుంటారు. వారికీ ఓ వాహనం ఉంటుంది. కండక్టర్లు, డ్రైవర్లు తప్పిదాలకు పాల్పడకుండా తనిఖీలు ఎంతగానో దోహదపడుతాయి. అయితే, తనిఖీ బృందాలకు యాజమాన్యం టార్గెట్లు విధించడంతో నిత్యం కొన్ని కేసులు రాయడం ద్వారా దానిని భర్తీ చేసుకుంటున్నారు. చిన్న తప్పిదాలకు సైతం కేసులు రాయడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆయా బృందాలకు నెలకు 90 మెమో లు, పది డిపో స్పేర్లు టార్గెట్లుగా ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో తనిఖీల అధికారులు దూకుడుగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు రాస్తున్నార ని కార్మికులు వాపోతున్నారు. అభద్రత నడుమ, మానసిక ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నామంటున్నారు. కండక్టర్, డ్రైవర్లు సంస్థకు మూల స్తంభాలని యాజమాన్యం పొగడ్తలతో ముంచెత్తుతూనే మరోవైపు సస్పెన్షన్లు, రిమూవల్స్ను బహుమానాలుగా అందిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో టీటీఐలు ప్రయాణికుల ముందే కండక్టర్లను నానా మాటలతో వేధిస్తున్నారని పేర్కొంటున్నారు. కార్మికునికి ఏడాదిలో ఒక మెమో వచ్చినా, ఏడాది కష్టం అంతా వృథా అవుతోంది. మెమో మూలంగా ఇంక్రిమెంటుకు దూరమవుతాడు. అధిక శాతం కార్మికులు మెమోలతో ఇంక్రిమెంట్లు కోల్పోతున్నారని పలువురు చెబుతున్నారు. అక్రమ కేసులు రాస్తున్న టీటీఐలు తనిఖీలకు వచ్చే టీటీఐలు కార్మికులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇందుకు శనివారం కామారెడ్డిలో జరిగిన సంఘటననే నిదర్శనంగా చెప్పవచ్చు. కండక్టర్కు ఉన్న స్పాట్ ఎక్స్ప్లెనేషన్ వ్యవధిని కూడా గుర్తించకుండా కేసులు నమోదు చేస్తున్నారు. టిక్కెట్ తీసుకుని పోగొట్టుకుంటే ప్రయాణికుడికే జరిమానా విధించాల్సి ఉండగా, కండక్టర్లకు మెమోలు ఇస్తున్నారు. టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే ఐదు వందల వరకు జరిమానా విధించవచ్చన్న విషయాన్ని పట్టించుకోకుండా కండక్టర్లనే టార్గెట్ చేస్తున్నారు. బస్టాండ్ పక్కన ఆపినందుకు, ఇన్కమింగ్ గేట్ నుంచి వెళ్లే బదులు ఔట్గేట్ నుంచి వెళ్లినందుకు డ్రైవర్లకు మెమో లు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఎస్ఆర్ సరి గ్గా రాయలేదని మెమో, బస్సులో వంద మంది ఉంటే ఒక్క ప్యాసింజర్ మిస్ అయినా కేసు, ఏ తప్పు దొరకకున్నా ఒక్కో సారి మెమో ఇచ్చేందుకు టీటీఐలు ఉత్సాహం చూపుతున్నారు. ఇదేమంటే టార్గెట్లని చెప్పుకుంటున్నారు. స్థానికులే టీటీఐలుగా పనిచేస్తున్నారు. టీటీఐలుగా పనిచేస్తున్నవారిలో స్థానికులు ఉండడంతో వారు తమతో స్నేహం చేసేవారి విషయంలో ఒక రకంగా, తమను పట్టించుకోని వారి విషయంలో మరో రకంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. చిన్న పొరపాట్లకు కూడా మెమోలు ఇవ్వడంతో ఇంక్రిమెంట్లు దూరమవుతుండడం, మానసిక ఒత్తిడికి లోనవుతున్న నేపథ్యంలో టీటీఐల వేదింపుల నుంచి కాపాడాలని కార్మికులు కోరుతున్నారు. -
టీ-ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకం
శామీర్పేట్ రూరల్: తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలకపాత్ర పోషించారని తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని హకీంపేట్ ఆర్టీసీ డిపో వద్ద టీఎంయూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. తెలంగాణ సాధించుకున్న కార్మికులు కష్టించి పనిచేసి సంస్థను లాభాల బాటలోకి తీసుకురావాలని కోరారు. కార్మికులు ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. 15 రోజుల్లో ఉద్యోగుల్లో విభజన జరుగుతుందని ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే కనకారెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించి ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. డిపోలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా డిపోనకు చెందిన దాదాపు 350 మంది ఎన్ఎంయూ సంఘం నాయకులు, కార్మికులు టీఎంయూలో చేరారు. కార్యక్రమంలో టీఎంయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ థమస్రెడ్డి, టీఎంయూ డిపో గౌరవ అధ్యక్షుడు వంగ పెంటారెడ్డి, టీఎంయూ నాయకులు ఎం.వి.రెడ్డి, కమలాకర్గౌడ్, ప్రసాద్, కృష్ణ, పి.ఆర్.రెడ్డి, రాజిరెడ్డి, చెన్నయ్య, పవన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఆస్పత్రిలో సమస్యల రోగం
- సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న కార్మికులు - పట్టని ఉన్నతాధికారులు ఆర్టీసీ కార్మికులు.. వారి కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటుచేసిన ఆస్పత్రికి సమస్యల రోగం పట్టుకుంది. దవాఖాన ఆధునికీకరణకు నోచుకోకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు. కరీంనగర్లో కార్మికుల కోసం ఏర్పాటుచేసిన ఈ ఆస్పత్రి రీజియన్లోని ఏడు వేల మంది కార్మికులు సహా చుట్టుపక్కల అరుుదు జిల్లాల కార్మికులకు సేవలందిచాల్సి ఉంది. - మంకమ్మతోట రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంలో 6 జోన్లు ఉండగా కరీంనగర్ జోన్లోనే జోనల్ ఆస్పత్రిని నిర్మించారు. గతంలో నగరంలోని బస్స్టేషన్ ఆవరణలో 6 గదుల్లో ఆస్పత్రి నిర్వహించేవారు. కార్మికుల కోరిక మేరకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలనే లక్ష్యంతో అధునాతన సౌకర్యాలతో 10 ఏళ్ల క్రితం ఆర్టీసీ వర్క్షాప్ ప్రాంతoలో దాదాపు ఎకరం స్థలంలో రూ. 10 లక్షలు వెచ్చించి 20 గదులు నిర్మించారు. నిర్మాణం పూర్తికాగానే బస్టాండ్ ఆవరణలోని ఆస్పత్రిని నూతన భవనంలోకి మార్చారు. అన్ని ఉన్నా... అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయూరైంది ఈ ఆస్పత్రి పరిస్థితి. ఇందులో రోగులకు అవసరపడే ఎలాంటి సౌకర్యాలు లేవు. సిబ్బంది నామమాత్రంగానే ఉన్నారు. రోజూ 100 మంది చికిత్సకు వచ్చే ఈ దవాఖానాలో రక్త, మూత్ర పరీక్షలు చేసే వారు ఎవరూ లేరని పలువురు కార్మికులు తెలిపారు. బీపీ, షుగర్, టీబీ తదితలాకు సంబంధించి ఎలాంటి మందులు ఇవ్వడంలేదని ఆరోపిస్తున్నారు. ఎక్స్రే, సిటీ స్కాన్ సదుపాయం కూడా లేదని పేర్కొంటున్నారు. వైద్యులు, సిబ్బందిని పెంచి ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు కార్మికులకు సేవలు అందుబాటులో ఉంటేవిధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఐదు జిల్లాల కార్మికులకు సేవలు... రాష్ట్రం మొత్తంలోనే ఏకైన ఆర్టీసీ జోనల్ ఆస్పత్రి కరీంనగర్ ఉంది. కరీంనగర్ జోన్లో ఏడు వేల మంది కార్మికులు సహా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన కార్మికుల కుటుంబాలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నా సేవాలందించాల్సి ఉంది. కాని ఇక్కడ రోగులకు సంపూర్ణంగా వైద్యం అందించే సౌకర్యాలు లేకపోవడంతో ప్రమాదాలు, సీరియస్ కండీషన్ పరిస్థితిలో ఉన్న వారిని నగరంలోని ప్రతిమ, అమృత నర్సింగ్ హోమ్లకు రెఫర్ చేస్తున్నారు. ఉన్న ఆస్పత్రిలోనే సౌకర్యాలు కల్పిస్తే రోగులకు ఇబ్బందులు తొలగడమే కాకుండా లక్షలాది రూపాయూలు ఆదా అవుతాయని కార్మికులు పేర్కొంటున్నారు. ఏడాదికి రూ.10 లక్షలు చెల్లింపు.. సీరియస్ కండీషన్ కేసులకు వెంటనే వైద్యం అందించేందుకు ఇతర ఆస్పత్రులకు తరలించడం వల్ల ఆయూ ఆస్పత్రులకు చెల్లించడం కోసం కార్మికులకు ఏడాదికి దాదాపు రూ. 10 లక్షలు రీఎరుుంబర్స్మెంట్ చెల్లిస్తున్నారు. రీరుుంబర్స్మెంట్ కింద పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లించడంకంటే ఉన్న ఆస్పత్రిని అభివృద్ధి పర్చుకుంటే లక్షలాది రూపాయూలు ఆర్టీసీకి ఆదా అయ్యే పరిస్థితి ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. సౌకర్యాలు లేక ఇబ్బందులు.. ఆస్పత్రిలో పూర్తి సౌకర్యాలు లేక వేరే హాస్పిటల్కు రెఫర్ చేస్తున్నారు. ఆస్పత్రి బిల్డింగ్ ఆధునాతన సౌకర్యాలు కల్పిచేందుకు వీలుగా ఉంది. ఇద్దరు డాక్టర్లు మాత్రమే ఉన్నారు. ఎక్స్రే, ఈసీజీ, స్కానింగ్ వంటి అన్ని ఏర్పాట్లు చేయూలి. కార్పొరేట్స్థారుులో 24 గంటల ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తే కార్మికులకు మేలు జరగుతుంది. - మాదాసు వెంకటేశ్, బహుజన కార్మిక యూనియన్ జిల్లా ఇన్చార్జ్జి నాణ్యమైన సేవలు అందించాలి.. నాణ్యమైన వైద్యం అందించాలి. రోగంతో ఆస్పత్రికి పోతే డాక్టర్ చేయిపట్టి చూడటానికి ఇబ్బంది పడుతుంటారు. డాక్టర్లను మార్చాలి. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే ప్రతిమ ఆస్పత్రికి పంపిస్తున్నారు. అక్కడ వైద్యం పేరిట ప్రాక్టికల్స్ చేస్తున్నారు. కార్మికులు, వారి కుంటుంబాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా యాజమాన్యం పట్టించుకోవడంలేదు. - గుర్రాల రవీందర్, కండక్టర్, వన్డిపో -
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఈయూ నాయకుల హెచ్చరిక శ్రీకాకుళం అర్బన్, న్యూస్లైన్: విశాఖపట్నం రీజియన్లోని ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని ఆర్టీసీ ఎంప్లాయూస్ యూనియన్ (ఈయూ) నాయకులు హెచ్చరించారు. సమస్యల పరిష్కారంలో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యవైఖరికి నిరసనగా శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శుక్రవారం ఈయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఈయూ రీజనల్ అధ్యక్షుడు బి.కృష్ణమూర్తి మాట్లాడుతూ విశాఖపట్నం అర్బన్ ట్రాఫిక్ డిప్యూటీ చీఫ్ మేనేజర్ ఎ.వీరయ్యచౌదరి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ యూనియన్పై పక్షపాత ధోరణి అవలంభిస్తున్నారని దుయ్యబట్టారు. విజయనగరం జోన్లోని నాలుగు రీజియన్లకు సంబంధించి 27 డిపోల్లో ఆర్టీసీ అధికారులు గుర్తింపు సంఘంతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో చార్టులు వేయాలని, టిమ్ డ్యూటీలు నిలుపుదల చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తక్షణమే అమలుచేయూలని డిమాండ్ చేశారు. పల్లెవెలుగు బస్సులకు డబుల్ డోర్లు తీసివేయాలనే నిబంధన అమలు చేయకపోవడం విచారకరమన్నారు. అద్దెబస్సుల డ్రైవర్లకు ఇన్సెంటివ్లు ఇస్తూ గుర్తింపు కార్డులు జారీ చేయాలని, కార్మికులకు పదోన్నతులు కల్పించాలని, ఏడీ, పీడీల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేయాలని, కార్మికులకు పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే జూన్ 3వ తేదీన ఛలో ఈడీ కార్యాలయం చేపడతామని హెచ్చరించారు. ధర్నా లో ఈయూ డివిజనల్ చైర్మన్ కొర్లాం గణేశ్వరరావు, పి.నానాజీ, కె.శంకరరావు, శ్రీకాకుళం ఒకటో డిపో అధ్య క్ష, కార్యదర్శిలు జి.త్రినాథ్, ఎస్.వి.రమణ, జి.బి. మూర్తి, పి.వి.రావు, కె.వి.రమణ, బి.జయదేవ్, ఎం.టి.వి.రావు, కె.బి.రావు, పి.రమేష్, కె.బాబూరావు, సీహెచ్.కృష్ణారావు, కె.గోవిందరావు, ఎ.త్రినాథ్, ఎస్.ఎస్.నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీకి బాబు యాక్సిడెంట్
కార్మికుల కడుపు కొట్టాడు ఆర్థిక సంస్కరణల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు అర్రులు చాచారు. కార్మికుల పొట్ట కొట్టేందుకు చూశారు. కడుపు కాలి నోరెత్తితే జీతం కట్చేసి కేసులు పెట్టారు. ఆందోళనకు దిగితే జైలుపాలు చేశారు. లక్షకుపైగా కార్మికులను రోడ్డుపాలు చేసేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై చూపించిన రాక్షసత్వం ఇదంతా. లోపభూయిష్ట విధానాలతో ఆర్టీసీని అధోగతి పాలుచేసి చార్జీల పెంపుతో ప్రయూణికుల నడ్డి విరవడమే కాదు.. కార్మికులను రోడ్డెక్కేలా చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో ఆరుసార్లు బస్సు చార్జీలు పెంచి ప్రయాణికుల ను ఉక్కిరిబిక్కిరి చేసిన బాబు నిర్వాకంపై ప్రత్యేక కథనం. షేక్ పోలుకల్ యూసుఫ్, కర్నూలు, ‘వద్దు బాబోయ్.. ఆ కష్టాల పాలన మళ్లీ మాకొద్దు.. ఆ తొమ్మిదేళ్లు అర్ధాకలితో అలమటించాం.. సంస్థ అభివృద్ధికి రెక్కలు ముక్కలయ్యేలా పనిచేసినా ఇల్లు గడిచేది కాదు. క్యాజువల్ పేరుతో ఉద్యోగులను తీసుకుని సక్రమంగా పనిచేయట్లేదని ఇంటికి పంపారు. న్యాయం కోసం ఆందోళన చేస్తే జైలుకు పంపారు. రెగ్యులర్ చేయాలని కోరితే నిలుపుదల చేస్తూ జీవోలిచ్చారు. వద్దు బాబోయ్ వద్దు.. చంద్రబాబు పాలన మాకొద్దు..’ అంటున్నారు ఆర్టీసీ కార్మికులు. ప్రైవేటీకరణ కోసం ఆర్టీసీని ముక్కలు చేయాలనుకున్న బాబు పాలన గుర్తుచేసుకుని భయపడిపోతున్నారు. జీతం పెంచమని 24 రోజులు సమ్మెచేస్తే జైలులో పెట్టించిన ఘటనలను వారు ఇప్పటికీ మరచిపోలేకపోతున్నారు. కార్మికులపై కాటు వేసిన కాంగ్రెస్ ఆర్టీసీని ప్రైవేటీకరించాలని చూసిన బాబు ఆలోచనల్ని అనుసరిం చాలని వైఎస్ మరణం తర్వాత అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఆర్టీసీని నాలుగు ముక్కలు చేయాలనే ఆలో చనకు కూడా వచ్చింది. దీంతో మళ్లీ కార్మికుల్లో అభద్రతాభావం ఏర్పడింది. ప్రైవేటు బస్సులు అద్దె ప్రతిపాదికన పెద్ద ఎత్తున తీసుకోవడం, రిజర్వేషన్, గుడ్విల్ కేంద్రాలతోపాటు గ్రౌండ్ బుకింగ్ కేంద్రాల ప్రైవేటీకరణకు టెండర్లు పిలవడం వంటి వాటితో పాటు డిస్ ఎంగేజ్ పేరుతో కార్మికులను ఇంటికి కూడా పంపింది. సత్తా ఉన్న నేతకే ఓటు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్టీసీ కూడా రెండు ముక్కలైంది. ఈ నేపథ్యంలో కష్టాలు తప్పవని భావించిన కార్మికులు, ఉద్యోగులు చంద్రబాబు వస్తే అవి అధికమై సంస్థ ప్రైవేటుపరం అవుతుందని భయాందోళనకు గురవుతున్నారు. వైఎస్ ఆశయ సాధన కోసం పనిచేసే నాయకుడిని గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నారు. బాబు హయాంలో... - తొమ్మిదేళ్లలో ఆరుసార్లు చార్జీలు పెంచారు. - నష్టాల సాకుతో ప్రైవేటీకరించాలనుకున్నారు. - రూ.480కోట్ల మేర భారం వేశారు. - 1995లో అరకొర డ్రైవర్లు, కండక్టర్లను క్యాజువల్ పద్ధతిలో తీసుకుని ఆ తరువాత ఉద్యోగుల భర్తీకి బ్రేక్ వేశారు. క్యాజువల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయరాదని యాక్ట్-2ను జారీ చేశారు. - వేతనాలు పెంచాలంటూ 24 రోజులు నిరవధికంగా సమ్మెచేసిన కార్మికులపై చంద్రబాబు ఉక్కుపాదం మోపారు. వారిపై కేసులు పెట్టించారు. ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో 9.5 శాతం పెంచి చేతులు దులుపుకొన్నారు. - పదివేల మంది కార్మికులను ఇంటికి పంపారు. - ఔట్ సోర్సింగ్ ఆన్ కాంట్రాక్ట్ సిస్టమ్, హైర్ బసెస్ వంటి ప్రపంచ బ్యాంకు విధానాలను ఆర్టీసీలో ప్రవేశపెట్టడమే కాకుండా ఉద్యోగులను తగ్గించి, ప్రైవేటుకు దారి సుగమం చేశారు. పెరిగిన చార్జీలు - 1994లో ఆర్డినరీ బస్సులో ప్రయాణించే వారి నుంచి కిలోమీటరుకు 17 పైసలు వసూలు చేస్తే, 2003 నాటికి 35 పైసలు చేశారు. - కిలోమీటరుకు 21 పైసలు ఉన్న ఎక్స్ప్రెస్ బస్సు చార్జీని 40 పైసలు పెంచారు. - సెమీ లగ్జరీ చార్జీని 45 పైసలు చేశారు. - 1995లో రూ.120కోట్లు, 1996లో 30 కోట్లు, 1997లో 60కోట్లు, 1999లో 150 కోట్లు, 2000లో 60 కోట్లు, 2003లో 60 కోట్ల చొప్పున ప్రయాణికులపై భారం వేశారు. వైఎస్ హయాంలో లాభాల బాట - మహానేత వైఎస్ పాలనలో రూ.117 కోట్ల లాభాలను ఆర్టీసీ ఆర్జించింది. - ఆర్టీసీని ప్రైవేటీకరిస్తానని చంద్రబాబు చెప్పడంతో కార్మికుల్లో ఏర్పడిన అభద్రతా భావాన్ని వైఎస్ తొలగించారు. - 2007, 2008, 2009లో కండక్టర్, డ్రైవర్ల పోస్టులు భర్తీ చేశారు. - బాబు చేసిన చట్టం-2ను ఎత్తేసి 240 రోజుల సర్వీసు పూర్తిచేసిన 12వేల మంది కాంట్రాక్టు - కార్మికులను రెగ్యులర్ చేయించారు. - వేతనాలు పెంచి ఉద్యోగుల మన్ననలు పొందారు. - రాజన్న తన పాలనలో ఆర్టీసీ చార్జీలు పెంచలేదు. - ఆర్టీసీ నష్టాల నివారణకు బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించారు. ఐఏఎం నివేదిక ప్రకారం రూ.600కోట్లు మంజూరు చేశారు. - పన్ను భారాన్ని రెగ్యులర్ సర్వీసులపై 12.5 నుంచి 7 శాతం, సిటీ సర్వీసులపై 10 నుంచి ఐదు శాతానికి తగ్గించి ఆర్టీసీకి రూ.250 కోట్ల ఆర్థిక సహాయం అందించారు. - పల్లెవెలుగు సర్వీసులు ప్రవేశపెట్టి గ్రామీణులకు మేలు చేశారు. రోశయ్య, కిరణ్ హయాంలో ధరాభారం - రోశయ్య అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపే బస్ చార్జీలు పెంచారు. ఆ తరువాత బాధ్యతలు స్వీకరించిన కిరణ్కుమార్రెడ్డి మూడేళ్లలో మూడుసార్లు పెంచారు. అంతటితో ఆగకుండా డెవలప్మెంట్ సెస్ పేరుతో మరో చార్జీ వేశారు. - నెలవారీ సీజన్ టికెట్, జెట్, జూబ్లీ హైటెక్ టికెట్లు, కపుల్ గిఫ్ట్ కార్డుల ద్వారా టోల్ప్లాజా చార్జీలను రూ.3 నుంచి రూ.5కు, ఇంద్ర, వెన్నెల, గరుడ, వెన్నెల ప్లస్ తదితర సర్వీసుల టోల్ప్లాజా చార్జీని రూ.3 నుంచి రూ.6కు పెంచారు. - పల్లె వెలుగు కనీస చార్జీ రూ.3 నుంచి రూ.5 చేశారు. - 2009లో లగ్జరీ బస్సుకు కిలోమీటరుకు 57 పైసల చొప్పున వసూలుచేస్తే, ఇప్పుడు ఆర్డినరీ బస్సుకే 59 పైసలు తీసుకుంటున్నారు. - వీరి హయాంలో ఆర్టీసీకి రూ.650 కోట్ల నష్టం వచ్చింది. కార్మికుల డిమాండ్లు ఇవీ.. - ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలి. - అధికారుల వేధింపులు అరికట్టడంతోపాటు పనిభారాన్ని తగ్గించేందుకు ఖాళీలు భర్తీ చేయాలి. - ప్రతి కార్మికుడు, ఉద్యోగికి స్థలం ఇచ్చి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలి. - పభుత్వాస్పత్రులతో పాటు అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందించాలి. - పిల్లలకు మెరుగైన, ఉన్నత విద్య కోసం చేయూతనివ్వాలి. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పింఛన్ ఇవ్వడంతోపాటు సమస్యలు పరిష్కరించాలి. వైద్య సేవలు మెరుగుపరచా లి. బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలి. చంద్రబాబు కార్మికద్రోహి చంద్రబాబు ఆర్టీసీతో ఆటలాడుకున్నారు. చాలా మండలాల్లో బస్టాపులకు దూరంగా బస్స్టేషన్లు నిర్మించారు. అన్ని రాజకీయ పార్టీలు, ఆర్టీసీ యూనియన్లు కలిసి 24 రోజులు సమ్మెచేస్తే కేవలం 2.5 శాతం టాక్స్ తగ్గించిన పిసినారి బాబు. తాను జారీచేసిన రాయితీల జీవోలకు ఒక్క పైసా కూడా విదల్చకుండా కుట్రలు పన్నారు. కండక్టర్లు, డ్రైవర్లను పర్మినెంట్ చేయకుండా క్యాజువల్గానే ఉంచిన కార్మికద్రోహి. ప్రస్తుతం ఉన్న రూ.5వేల కోట్ల అప్పులకు చంద్రబాబే బాధ్యుడు. వైఎస్ నిర్ణయాలు, చేయూతతో సంస్థకు రూ.5వేల కోట్ల మేలు చేకూరింది. కార్మికులు చేసిన సమ్మె కాలానికి జీతాలు చెల్లించి మన్ననలు పొందారు. - ఎ.రాజారెడ్డి, వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు -
ఆర్టీసీ సమ్మె యోచన విరమణ
-
ఆర్టీసీ సమ్మె యోచన విరమణ
27శాతం ఐఆర్ చెల్లించేందుకు ఎండీ అంగీకారం సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు మధ్యంతర భృతి చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించడంతో బుధవారం ఉదయం నుంచి నిర్వహించతలపెట్టిన సమ్మె యోచనను విరమించుకుంటున్నట్లు గుర్తింపు కార్మిక సంఘాలు ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్లు మంగళవారం రాత్రి ప్రకటించాయి. ఈ నెల జీతంతో పాటే మధ్యంతర భృతిని కలిపి చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. అదేవిధంగా ఇప్పటివరకు బకాయిపడిన ఐఆర్ను సప్లిమెంటరీ బిల్లు ద్వారా ఏప్రిల్ 15వ తేదీ నాటికి అందజేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ పూర్ణచందర్రావు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో కార్మిక సంఘాలు సమ్మె యోచనను విరమించుకున్నాయి. అంతకుముందు మంగళవారం మధ్యాహ్నం కార్మికశాఖ అదనపు కమిషనర్ మురళీసాగర్ ఆర్టీసీ అధికారులను, కార్మిక సంఘాల నాయకులను చర్చలకు ఆహ్వానించారు. 2 గంటలపాటు చర్చలు జరిగాయి. ప్రభుత్వం గ్రాంటు అందజేయడంలో జాప్యం కారణంగానే మధ్యంతర భృతిని చెల్లించలేకపోతున్నట్లు ఆర్టీసీ ఎండీ చెప్పారు. దాంతోసమ్మెకు వెళ్లనున్నట్లు కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ఉన్న దృష్ట్యా సమ్మె యోచనను విరమింపజేయాలనే ఉద్దేశంతో ఆర్టీసీ ఎండీ ప్రభుత్వ ఉన్నతాధికారులను సంప్రదించారు. అనంతరం మరోసారి కార్మిక నాయకులను చర్చలకు పిలిచారు. రాత్రి 10.30 గంటల వరకు చర్చలు జరిగాయి. ప్రభుత్వ ఉద్యోగులు కోరిన వెంటనే 27 శాతం మధ్యంతర భృతిని చెల్లించిన ప్రభుత్వం తమ విషయంలో వివక్ష ప్రదర్శించడం తగదని కార్మిక నాయకులు అన్నారు. దిగొచ్చిన యాజమాన్యం మధ్యంతర భృతిని ఈ నెల జీతంతోనే చెల్లించేందుకు అంగీకరించింది. ఈ మేరకు ఎండీ పూర్ణచందర్రావు లిఖితపూర్వక హామీ ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందిన ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పద్మాకర్, టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వథ్ధామరెడ్డి, దామోదర్లు సమ్మె యోచనను విరమిస్తున్నట్లు ప్రకటించారు. -
ఎగిసిన సమైక్యం
సాక్షి, నెల్లూరు : జిల్లాలో సమైక్య పోరు హోరెత్తుతోంది. ఎన్జీఓలు, సమైక్యవాదులు ఏడోరోజైన బుధవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. జాతీయ రహదారులపై రాస్తారోకోలు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసనలు కొనసాగించారు. పార్లమెంట్లో విభజన బిల్లు పెడుతున్నందుకు నిరసనగా గురువారం జిల్లాలో బంద్కు పిలుపునిచ్చా రు. ఎన్జీఓల ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించిన విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టడం దుర్మార్గమైన చర్యగా ఎన్జీఓలు అభివర్ణించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో చింతారెడ్డిపాళెం జాతీయ రహదారిపై ఆందోళనకారులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారిపై టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా సమైక్య నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా కన్వీనర్ అంజయ్య, కాంగ్రెస్ నేత రంగమయూర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరులో ఏపీఎన్జీఓలు బుధవారం ఆర్డీఓ, తహశీల్దార్, ఎంపీడీఓ, వ్యవసాయ శాఖ కార్యాలయాలను మూయించారు. వాకాడులో ఆర్టీసీ డిపో కార్మికులు డిపో ఎదుట నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర కోసం ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో కావలి రూరల్ మండలం మద్దూరుపాడు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఉదయగిరిలో ఆర్టీసీ డిపో ఎదుట ఎన్ఎంయూ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఆందోళనకారులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారిపై టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా సమైక్య నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా కన్వీనర్ అంజయ్య, కాంగ్రెస్ నేత రంగమయూర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరులో ఏపీఎన్జీఓలు బుధవారం ఆర్డీఓ, తహశీల్దార్, ఎంపీడీఓ, వ్యవసాయ శాఖ కార్యాలయాలను మూయించారు. వాకాడులో ఆర్టీసీ డిపో కార్మికులు డిపో ఎదుట నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర కోసం ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో కావలి రూరల్ మండలం మద్దూరుపాడు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఉదయగిరిలో ఆర్టీసీ డిపో ఎదుట ఎన్ఎంయూ కార్మికులు ధర్నా నిర్వహించారు. -
సమ్మెలోకి సీమాంధ్ర ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్ర ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభించారు. ఉద్యోగుల సమ్మెతో సీమాంధ్ర జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోనున్నాయి. ఏపీఎన్జీవోల నేతృత్వంలో దాదాపు 70 సంఘాలు సమ్మెకు సమాయత్తమవుతున్నాయి. రెవెన్యూ, ఎక్సైజ్, ట్రెజరీ, సహకార, వాణిజ్య పన్నులు, మెడికల్, విద్యుత్, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. ఫలితంగా సీమాంధ్రలో ప్రభుత్వ వ్యవస్థ పూర్తిగా స్తంభించనుంది. గ్రామ రెవెన్యూ అధికారుల నుంచి తహశీల్దారు వరకు.. రెవెన్యూ ఉద్యోగులు కూడా సమ్మెలో ఉన్నందువల్ల గ్రామస్థాయిలోనూ సమ్మె ప్రభావం కనిపించనుంది. ఉపాధ్యాయులూ సమ్మెలో వెళ్లనున్న నేపథ్యంలో పాఠశాలలు మూతపడనున్నాయి. విశ్వవిద్యాలయ, కళాశాలల బోధన, బోధనేతర సిబ్బంది కూడా సమ్మె లో చేరనున్నారు. దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని అంచనా. సమ్మెలో అత్యవసర సేవలకు మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే నిర్ణయించాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో లేనందువల్ల బస్సుల రాకపోకలు యథావిధిగా ఉంటాయి. సీఎం కిరణ్ ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు తాము సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్లు ఎన్జీవోలసంఘం అధ్యక్షుడు అశోక్బాబు చెప్పారు. రాష్ట్ర విభజన బిల్లును దొడ్డిదారిన రాజ్యసభకు పంపుతుండడం కేంద్రం దిగ జారుడుతనానికి నిదర్శనమన్నారు. సమైక్యవాదులను హైదరాబాద్ నుంచి పంపిస్తామంటున్న విభజన వాదులకు ఆ మాటను తెలంగాణ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వద్ద చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఈనెల 9న జరగనున్న టెట్ పరీక్షకు, ఇంటర్ పరీక్షలకు రెవెన్యూ ఉద్యోగులెవరూ హాజరు కావద్దని కోరామని రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. 10 నుంచి ప్రభుత్వం తలపెట్టిన రెవెన్యూ సదస్సులను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. అప్రజాస్వామికంగా పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న విభజన బిల్లును అడ్డుకోవాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ఎంపీలు, కేంద్ర మంత్రుల్లో కొరవడిందని దుయ్యబట్టారు. సమ్మెలో తాము పాల్గొనడం లేదని పంచాయతీరాజ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బుచ్చిరాజు, ప్రధాన కార్యదర్శి శరత్చంద్ర, కార్యదర్శి రాఘవన్ తెలిపారు. తమతో సంప్రదించకుండా ఎన్జీవోల సంఘం నాయకులు సమ్మె నిర్ణయం ప్రకటించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీఎన్జీవోలు ఆకస్మికంగా సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారని, ఈనెల 8వ తేదీన విజయవాడలో జరగనున్న మున్సిపల్ జేఏసీ సమావేశంలో ఉద్యోగులతో చర్చించి తాము నిర్ణయం తీసుకుంటామని జేఏసీ కన్వీనర్ కృష్ణమోహన్ తెలిపారు. -
నేటి అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు ఈనెల 5 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. ఈమేరకు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక తరఫున మంగళవారం ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చామని వేదిక అధ్యక్షుడు పి.అశోక్బాబు తెలిపారు. ఏపీఎన్జీవోలతోపాటు వివిధ ఉద్యోగ సంఘాల నేతలతో కలసి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ సంఘాల పేరిట కాకుండా సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక తరఫున సమ్మె నోటీసు ఇస్తే చెల్లుతుందా? అని కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... గతంలోనూ వేదిక తరఫునే సమ్మె చేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వేదిక కో కన్వీనర్ ఎన్.చంద్రశేఖర్రెడ్డితోపాటు పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారు ఏం చెప్పారంటే... అసెంబ్లీ తిరస్కరించిన తర్వాత కూడా కేంద్రం ప్రజాస్వామ్య విరుద్ధంగా రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో పెట్టేందుకు సమాయత్తమవుతోంది. ఇందుకు నిరసనగా ఉద్యోగులంతా నిరవధిక సమ్మెకు దిగాలని సోమవారం జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన విషయంలో మొండిగా ముందుకెళితే కేంద్ర వ్యవస్థలను మూసేస్తాం. రైల్రోకోలతోపాటు జాతీయ రహదారుల దిగ్బంధం చేస్తాం. ఈనెల 7, 8 తేదీల్లో అన్ని సంఘాల నేతలు సమావేశమై ఏయే రోజుల్లో ఏయే ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలో నిర్ణయిస్తాం. ఈనెల 17, 18 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నాం. ఇందుకు ప్రజాసంఘాలు, ప్రజలు, రాజకీయపార్టీలు కలసిరావాలి. రాష్ట్ర విభజనకు కేంద్రానికి సహకరించే ఎంపీలు, కేంద్ర మంత్రుల భరతం పడతాం. వారే పార్టీ తరఫున పోటీ చేసినా ఓడిస్తాం. రెండు వారాలుండే ప్రభుత్వం కావాలో, జీవిత కాలం ఉండే ప్రజలు కావాలో వారు తేల్చుకోవాలి. ఎన్నికల విధుల్లో కీలకమైన రెవెన్యూ, పంచాయతీరాజ్ వ్యవస్థలు సమ్మెలో పాల్గొంటున్నందున సాధారణ ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. విద్యార్థులకు ఇబ్బందులు వాటిల్లకుండా ఇంటర్మీడియెట్, టెట్ పరీక్షలకు సమ్మె నుంచి మినహాయింపు ఇచ్చే అంశాన్ని పరిశీస్తున్నాం. సమ్మెకు తాము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని, ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు కూడా పాల్గొంటున్నారని కాంట్రాక్టు ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు ప్రకటించారు. బదిలీ ఉత్తర్వులు తీసుకోవద్దు వీఆర్ఏ నుంచి తహశీల్దార్ల వరకు రెవెన్యూ యంత్రాంగమంతా సమైక్య సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల సేవల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఈ మేరకు భూపరిపాలన ముఖ్య కమిషనర్ ఐవైఆర్ కృష్ణారావుకు సమ్మె నోటీసును అందజేశామన్నారు. సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారమే తహశీల్దార్ల బదిలీ ఉత్తర్వులు పంపామని, సమ్మె నోటీసు నేపథ్యంలో వాటిని తీసుకోవద్దని కోరారు. సమ్మెలో పాల్గొనం: ఆర్టీసీ కార్మికులు ప్రస్తుతం ఆర్టీసీ నష్టాల్లో నడుస్తుండటం, తాము సమ్మెలోకి వెళ్తే ప్రైవేటు బస్సు ఆపరేటర్లు రెచ్చిపోయి ప్రయాణికుల జేబులు గుల్ల చేసే పరిస్థితి ఉండటంతో సమైక్య సమ్మెలో పాల్గొనరాదని నిర్ణయం తీసుకున్నట్టు సీమాంధ్ర ఆర్టీసీ కార్మికుల సంఘం ప్రకటించింది. అయితే ఈ సమ్మె గతంలో మాదిరిగా సకలజనుల సమ్మెగా మారే పరిస్థితి ఉంటే... తాము మరోసారి చర్చించుకుని సమ్మెలో పాల్గొనే విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని ఆ సంఘం కన్వీనర్ దామోదర్ ‘సాక్షి’తో చెప్పారు. -
ఆర్టీసీ కార్మికులను దగా చేసిన ఈయూ-టీఎంయూ
ఎన్ఎంయూ సహా ఇతర సంఘాల మండిపాటు సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు మధ్యంతర భృతి (ఐఆర్) సాధించుకునే విషయంలో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఈయూ-టీఎంయూల కూటమి చీకటి ఒప్పందం చేసుకుందని ఎన్ఎంయూ సహా పలు సంఘాలు ఆరోపించాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఐఆర్, వేతన సవరణ సాధిస్తామని గుర్తింపు సంఘం ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని పేర్కొన్నాయి. తక్కువ ఐఆర్కు ఒప్పుకోవటం ద్వారా కార్మికులకు అన్యాయం చేసిందని.. ఎన్ఎంయూ, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, కార్మిక సంఘ్, కార్మిక పరిషత్, వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, కాంట్రాక్టు డ్రైవర్స్ అండ్ కండక్టర్స్ యూనియన్లు విమర్శించాయి. 10 మాసాల వేతన సవరణ బకాయిలను కార్మికులు నష్టపోవాల్సి వచ్చిందని ఎన్ఎంయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగేశ్వరరావు, మహమూద్ ఆరోపిం చారు. 24,577 కాంట్రాక్టు కార్మికులందరినీ ఒకే దఫాగా రెగ్యులర్ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించడంలోనూ గుర్తింపు సంఘం విఫలమైందన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమంగా (27 శాతం) ఐఆర్ సాధించటం తమ విజయమేనని, ఇదే ఊపుతో వేతన సవరణ కూడా చేయిస్తామని గుర్తింపు సంఘం ఈయూ- టీఎంయూ కూటమి ప్రకటించింది. -
'27వ తేదీ అర్ధరాత్రి నుంచి ఒక్క బస్సు కూడా రోడ్డెక్కదు'
హైదరాబాద్:ప్రగతిరథ చక్రాలు మళ్లీ నిలిచిపోనున్నాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు.ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి నుంచి ఏ ఒక్క ఆర్టీసీ బస్సుకూడా రోడ్డెక్కదని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. కార్మికులకు రావాల్సిన మధ్యంతర భృతిపై ఆర్టీసీ యాజమాన్యం సరిగా స్పందించని కారణంగా తాము సమ్మెకు సమాయత్తమవుతున్నట్లు తెలిపాయి. శుక్రవారం ఆర్టీసీతో జరిగిన కార్మిక సంఘాల చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. చర్చల అనంతరం ఈయూ, టీఎంయూ సంఘ నేతలు మీడియాతో మాట్లాడారు. కార్మికలకు వెంటనే 46 శాతం ఐఆర్ ప్రకటించాలన్నారు. కాని పక్షంలో సమ్మెను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
ఆర్టీసీలో తాత్కాలిక కొలువులు
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్ట్ పద్ధతిలో కండక్టర్ల, డ్రైవర్ల నియామకాలకు ఆర్టీసీ ముగింపు పలికి, దానికి బదులుగా టెంపరరీ(తాత్కాలిక) విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు సంస్థ సిద్ధమవుతోంది. ఈమేరకు శుక్రవారం జరగనున్న పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఆలోచనను కార్మిక సంఘాలు స్వాగతించాయి. అయితే రెగ్యులర్ విధానంలో కాకుండా తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకోవడానికి అనుమతి ఇవ్వడం పట్ల కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. నియామకాలన్నీ రెగ్యులర్ పద్ధతిలోనే చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఐఆర్పై 17న ప్రకటన: ఆర్టీసీ యాజమాన్యం ఆర్టీసీ కార్మికులకు మధ్యంతర భృతి(ఐఆర్) ఇవ్వడానికి అభ్యంతరం లేదని, కానీ ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ఈనెల 17న నిర్ణయం వెలువరిస్తామని ఆర్టీసీ యాజమాన్యం కార్మిక సంఘాలకు తెలిపింది. సంస్థ ఎండీ జె.పూర్ణచంద్రరావు గురువారం ఈయూ, టీఎంయూ ప్రతినిధిబృందంతో చర్చలు జరిపారు. సంస్థ ప్రకటించే ఐఆర్ సంతృప్తికరంగా లేకుంటే.. అదే రోజు సమ్మె తేదీని ప్రకటిస్తామని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. -
బొత్స ఇచ్చిన మాట నిలుపుకోవాలి
మహబూబ్నగర్ అర్బన్, న్యూస్లైన్: టీఎంయూ కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటుందని, వారిని ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించే వరకు పోరాటం కొనసాగుతుందని టీఎంయూ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్రావు అన్నారు. రాష్ట్ర రవాణాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తమకు ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్ 31 వరకు ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులను పర్మనెంటు చేయకపోతే అదేరోజు అర్ధరాత్రి నుంచే నిరవధికంగా బస్సులను నిలిపేస్తామని హెచ్చరించారు. సోమవారం జిల్లాకేంద్రంలో జరిగిన ఆర్టీసీ టీఎంయూ జిల్లా మహాసభల ముగింపు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ..ఎన్నో ఉద్యమాల ద్వారా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతుల్లో పెడితేనే ఆశించిన ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రాణత్యాగానికి సిద్ధపడటమే కాకుండా పలు సందర్భాల్లో పదవులను త్యాగం చేయించి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నిర్మించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. కొత్తరాష్ట్రంలో మన తలరాతలను మనమే మార్చుకోవాల్సిన అవసరం ఉందని, దీని కోసం ఆర్టీసీ కార్మికుల తో పాటు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర లాభపడుతుందని, తెలంగాణకే నష్టం జరుగుతుందని సీఎం కిరణ్కుమార్రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఈ ప్రాంతాన్ని మరింత దోచుకోవడానికే రాయల తెలంగాణ కావాలంటున్నారని, వారి ఆటలను సాగనివ్వమన్నారు. తెలంగాణ గడ్డమీది నుంచి తరిమికొడతాం: శ్రీనివాస్గౌడ్ రాయల తెలంగాణ ప్రతిపాదన ఎవరు తెచ్చారో పాలకులు తేల్చాలని, కాంగ్రెస్ కొత్తపేచీ పెడితే ఆ పార్టీని, నేతలను ఈ గడ్డమీది నుంచి తరమికొడతామని టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్ అన్నారు. మీ సోపతే బాగా లేదని మేమంటుంటే, కర్నూలు, అనంతపూర్ జిల్లాలను తెలంగాణలో కలపాలని ఆలోచించడం దుర్మార్గమన్నారు. యూపీఏ ప్రభుత్వం ఏ మాత్రం మాట తప్పినా సకల జనుల సమ్మె కంటే ఉధృత ఆందోళనలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్రెడ్డి తెలంగాణ ఏర్పాటుపై జరుగుతున్న జాప్యాన్ని ఎండగట్టారు. అనంతరం జీఎల్గౌడ్ అధ్వర్యంలో ఎన్ఎంయూకు రాజీనామా చేసిన కార్మికులను టీఎంయూ చేర్చుకున్నారు. కార్యక్రమంలో టీఎంయూ రాష్ట్ర నేతలు అశ్వథ్థామరెడ్డి, థామస్రెడ్డి, తిరుపతి, టీఆర్ఎస్ నాయకులు ఇబ్రాహీం, గువ్వల బాలరాజు, బాలాజీ, ఇంతియాజ్ ఇసాక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ కార్మికులకు 50% ఐఆర్ ప్రకటించాలి: ఈయూ
సాక్షి, హైదరాబాద్: ఆప్రకటించాలని, ప్రభుత్వం ఇప్పటికే భృతిని నిర్ధారించి ఉంటే ఇతర శాఖల ఉద్యోగుల కంటే ఆర్టీసీ కార్మికులకు వేర్టీసీ కార్మికులకు 50 శాతం మధ్యంతర భృతి(ఐఆర్)ని వెంటనే తనంలో ఉన్న 19 శాతం వ్యత్యాసాన్ని కలపాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) సర్కారును డిమాండ్ చేసింది. జీతభత్యాల సవరణపై యూని యన్ నేతలతో పే కమిటీ శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఈయూ ఈ మేరకు డిమాండ్ చేసినట్టు ఈయూ ప్రధాన కార్యదర్శి పద్మాకర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శాశ్వత ప్రాతిపదికనే పోస్టుల భర్తీ: ఎన్ఎంయూ డిమాండ్ ఆర్టీసీలో శ్రామిక్, మెకానిక్స్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తూ డ్రైవర్, కండక్టర్ పోస్టులకు మాత్రం కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు జరపడం ఏమిటని ఎన్ఎంయూ ప్రశ్నించింది. ఈ విధానానికి వెంటనే స్వస్తి పలకాలని యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు నాగేశ్వరరావు, మహమూద్లు డిమాండ్ చేశారు. -
వేతన సవరణపై ఈయూతో నేడు చర్చలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జరగాల్సిన వేతన సవరణపై ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ)తో శుక్రవారం సంస్థ యాజమాన్యం చర్చలు జరపనుందని సంఘం ప్రధా న కార్యదర్శి పద్మాకర్ తెలిపారు. సీమాంధ్రలో సమ్మె కారణంగా నిలిచిపోయిన చర్చలను ఆర్టీసీ యాజమాన్యం మళ్లీ ప్రారంభించిందన్నారు. కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. -
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకం: హరీష్రావు
హైదరాబాద్, న్యూస్లైన్: తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు పోషించిన పాత్ర ఎంతో కీలకమైనదని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు. టీఎంయూ ఆవిర్భావ దినోత్సవ సభ మంగళవారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజైన కోదండరాం, హరీష్రావు జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు వేతనాలు చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు దేవీప్రసాద్, విఠల్, కత్తి వెంకటస్వామి, టీఎంయూ నాయకులు తిరుపతయ్య, థామస్రెడ్డి, అశ్వథ్థామరెడ్డి, న్యాయవాద జేఏసీ రాజేందర్రెడ్డి, దయానంద్గౌడ్, ప్రభాకర్రెడ్డి, రవీందర్రెడ్డి, ఆర్టీసీ ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్లు కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, రసమయి బాలకిషన్, దర్గ దయాకర్రెడ్డి, కాచం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. టాస్క్‘ఫోర్స్’ను సవరించండి : హరీశ్రావు రాష్ట్ర విభజన ప్రక్రియపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ బృందంలో అత్యధికులు తెలంగాణ వ్యతిరే కులే ఉన్నారని టీఆర్ఎస్ శాసనసభపక్ష ఉపనేత, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్రావు తెలిపారు. కేంద్ర హోంమంత్రి ఆ కమిటీని పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. మంగళవారం రవీంద్రభారతిలో జరిగిన ‘తెలంగాణ దళిత బహుజన శక్తి’ ఆవిర్భావ సదస్సు’లో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీ వివేక్, బీజేపీ నేత డాక్టర్ కె.లక్ష్మణ్, తెలంగాణ దళిత బహుజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు దేవి రవీందర్, సినీ దర్శక నిర్మాత శంకర్, టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యులు ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సడలని పోరు... ఎడతెరపి లేని వానలోనూ మిన్నంటిన జనోద్యమం
సాక్షి నెట్వర్క్ : సీమాంధ్ర జిల్లాల్లో నాలుగైదు రోజులుగా ఎడతెరపిలేని వాన.. ఊళ్లను ముంచెత్తిన భారీవర్షాలు.. జలమయమైన నగరాలు.. చాలాచోట్ల జనజీవనం అస్తవ్యస్తం.. అయినా సరే.. సమైక్యాంధ్ర జనోద్యమం ఏమాత్రం తగ్గడంలేదు. 87వ రోజైన శుక్రవారం కూడా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సమైక్య ఆందోళనలు హోరెత్తాయి. చిత్తూరు జిల్లా మదనపల్లెలో జేఏసీ, మిట్స్ కళాశాలల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మెడికల్ జేఏసీతో కలిసి విద్యార్థులు, ఎన్జీవోలు మానవహారం ఏర్పాటు చేశారు. పుంగనూరులో ప్రభుత్వాస్పత్రి సిబ్బంది ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతపురంలో జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఎస్కేయూ విద్యార్థులు రాస్తారోకో చేశారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సమైక్యవాదులు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా బద్వేలులో విద్యార్ధులు మానవహారం చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రైళ్లు, బస్సులకు సమైక్యాంధ్ర పోస్టర్లు అంటించారు. అమలాపురంలో ఆర్టీసీ ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు. పెద్దాపురం, కాకినాడ, రాజమండ్రిల్లో న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు నిరసన దీక్షలు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు వాహనాలకు ‘జై సమైక్యాంధ్ర’ స్టిక్కర్లను అతికించారు. భీమవరం పట్టణంలో విద్యార్థులు రాస్తారోకో చేశారు. రైతుల దీక్షలు : కృష్ణాజిల్లా చల్లపల్లిలో లక్ష్మీపురానికి చెందిన రైతులు దీక్ష చేశారు. అవనిగడ్డలో పాత ఇనుము వ్యాపారులు, సిబ్బంది, సిం హాద్రి కాలనీ వాసులు దీక్ష చేశారు. నెల్లూరులో సమైక్యవాదులు రాస్తారోకో నిర్వహించి అనంతరం సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. సమైక్య సభకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. కర్నూలు జిల్లా గూడూరులో రైతు గర్జన పేరిట జరిగిన బహిరంగసభకు రైతులు, రైతుకూలీలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఇప్పటికే ఎన్నో సాగు సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు... ఇక రాష్ట్రం విడిపోతే మరింత దుర్భర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు, ఆదోనిలో విద్యార్థులు తరగతులను బహిష్కరించి రాస్తారోకో చేశారు. ఆగని వైఎస్సార్ సీపీ దీక్షలు సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. ఈనెల 2వ తేదీ నుంచి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టిన దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వర్ష బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టిన పార్టీ నేతలు, కార్యకర్తలు సమైక్యాంధ్ర ఉద్యమ పథాన్ని మాత్రం వీడలేదు. శుక్రవారం జోరు వర్షంలోనూ నిరశన దీక్షలు కొనసాగించారు. -
ఆర్టీసీ సిబ్బందికి 8% డీఏ పెంపు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సిబ్బందికి శుభవార్త. కరువు భత్యాన్ని 8% పెంచుతూ ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై నుంచి ఇది అమలులోకి రానున్న నేపథ్యంలో గడచిన 4 నెలలకు సంబంధించి బకాయిల రూపంలో ఒకేసారి చెల్లించనున్నారు. ప్రస్తుతం 47.8%గా ఉన్న కరువు భత్యం ఈ పెంపు తో 55.8%కు చేరుకోనుంది. రెగ్యులర్ సిబ్బందికి ఈ లబ్ధి అందనుంది. దీపావళి కానుకగా ఆర్టీసీ యాజ మాన్యం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆర్టీసీ కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇటీవల సీమాంధ్ర ఉద్యమానికి మద్దతుగా కార్మికులు జరిపిన సమ్మెను విరమించే సమయంలో మంత్రి బొత్స సమక్షంలో జరిగిన చర్చలో డీఏ పెంపుపై ఒప్పందం కుదిరిందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పద్మాకర్, ఎన్ఎంయూ అధ్యక్షుడు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మహమూద్లు పేర్కొన్నారు. -
రోడ్డెక్కిన ప్రగతి రథ చక్రాలు
అనంతపురం అర్బన్, న్యూస్లైన్ : ఆర్టీసీ రథ చక్రాలు రోడ్డెక్కాయి. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం సమ్మెబాట పట్టిన ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో శనివారం నుంచి విధుల్లో చేరారు. జిల్లాలోని 12 డిపోల్లో ఉదయం 5.30 గంటల నుంచే బస్సులు తిరిగాయి. 74 రోజుల సమ్మె తర్వాత కార్మికులు రెట్టించిన ఉత్సాహంతో విధుల్లో కనిపించారు. అనంతపురంలో సీటీఎం మధుసూదన్, డీఎం రమణ నేతృత్వంలో బస్సుల కండీషన్ను చెక్ చేసి పంపించారు. బస్సుల కండీషన్ గురించి మెకానికల్ ఫోర్మన్ నారాయణస్వామిని అడిగి తెలుసుకున్నారు. అనంతపురం డిపో నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయంలో 74 సర్వీసులు పంపాల్సి ఉండగా, 69 సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారన్న సమాచారం తెలియగానే ప్రయాణికులు పెద్ద సంఖ్యలో బస్టాండ్కు చేరుకున్నారు. రెండున్నర నెలలపాటు కళావిహీనంగా ఉన్న బస్టాండ్ ఆవరణం ప్రయాణికుల రాకతో సందడిగా కనిపించింది. బస్టాండ్, డిపోను తనిఖీ చేసిన ఆర్ఎం అనంతపురం ఆర్టీసీ బస్టాండ్, డిపోను ఆర్ఎం జి.వెంకటేశ్వర రావు తనిఖీ చేశారు. డిప్యూటీ సీటీఎం మధుసూదన్, సీఐ వినయ్కుమార్, రాజవర్ధన్రెడ్డి నేతృత్వంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలుగుకుండా ఏర్పాట్లు చేశారు. పాయింట్లలో సకాలంలో బస్సులు ఉంచేలా చర్యలు తీసుకున్నారు. ఆర్ఎం మాట్లాడుతూ రెండు నెలలుగా బస్సులు తిరగగపోవడం కండీషన్పై ప్రభావం ఉంటుందన్నారు. ఉదయం నుంచి 70 శాతం బస్సులను తిప్పామన్నారు. పూర్తిస్థాయిలో బస్సులు తిప్పేందుకు మరో మూడు రోజుల సమయం పడుతుందన్నారు. ఆర్టీసీ విలీనంపై సంబరాలు ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు రంగం సిద్ధమవడంతో కార్మికులు సంబరాలు చేసుకున్నారు. శనివారం అనంతపురం డిపో ఆవరణలో కార్మికులు యూనియన్లకతీతంగా బాణాసంచ పేల్చి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం అధికారులు, కార్మికులు స్వీట్లు పంచుకున్నారు. కొంత మంది కార్మికులు నృత్యాలు చేశారు. జై సమైక్యాంధ్ర...జైజై సమైక్యాంధ్ర అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు ఖాన్, వీఎన్ రెడ్డి, సీఎన్ రెడ్డి, మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్టీసీ విలీన ప్రక్రియను వంద రోజుల్లో పూర్తి చేయాలని కోరారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఆర్పీ రావు, వాసుదేవరెడ్డి, కొండయ్య, శ్రీనివాస్రెడ్డి, గోపాల్, రవీందర్, చెన్నారెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు
కడప అర్బన్, న్యూస్లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి ఆందోళనల్లో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులు, ఆగస్టు 12 నుంచి ఏన్జీఓ సంఘ నాయకులతోపాటు నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. 73 రోజులుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు శనివారం తెల్లవారుజాము నుంచే బస్ సర్వీసులను ప్రారంభించారు. దీంతో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ప్రభుత్వం యూనియన్ల నాయకులతో రవాణా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, ఎండి ఏకె ఖాన్లు పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఈనెల 10వ తేదిన 954 జీఓను విడుదల చేశారు. ఆ జీఓలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటుందన్న విషయంలో స్పష్టత లేదని, ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు చర్చల నుంచి వెనక్కి వెళ్లిపోయారు. మరలా ఈనెల 11న జరిగిన చర్చల్లో 961 జీఓను విడుదల చేశారు. దీంతో చర్చలు సఫలమయ్యాయి. కార్మికులంతా ఉత్సాహంగా విధులకు హాజరయ్యారు. -
సీమాంధ్రలో కదిలిన బస్సు
-
సీమాంధ్రలో కదిలిన బస్సు
ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ - ఫలించిన సర్కారు చర్చలు ‘ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం’పై సవరణతో జీవో 9,500 మంది కాంట్రాక్టు సిబ్బంది క్రమబద్ధీకరణకు ఓకే కార్మికులకు పండగ అడ్వాన్సు ఇచ్చేందుకు సర్కారు సరే సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి యథావిధిగా బస్సు రథచక్రం కదిలింది. దాదాపు రెండు నెలలుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం రెండు రోజుల పాటు జరిపిన చర్చలు శుక్రవారం రాత్రికి కొలిక్కివచ్చాయి. బస్ భవన్లో రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్లతో జరిగిన సుదీర్ఘ చర్చలు సఫలమయ్యాయి. రాష్ట్ర విభజనను వ్యతిరేకించడంతో పాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ సీమాంధ్రలో గత 60 రోజులపాటు ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పలు డిమాండ్లపై మంత్రి బొత్స ఆధ్వర్యంలో బస్ భవన్లో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు మొదలైన చర్చలు రాత్రి 11 గంటల వరకూ ఏడు గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చల్లో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడంతో కార్మిక సంఘాలు సమ్మె విరమించేందుకు అంగీకరించాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్ను అంగీకరిస్తూ అధ్యయన కమిటీ ఏర్పాటు చేసేందుకు సర్కారు ముందుకు రావటంతో పాటు మరికొన్ని డిమాండ్లను కూడా అంగీకరించడంతో.. 60 రోజులుగా జరుగుతున్న సమ్మెకు తెరపడింది. మా డిమాండ్లకు అంగీకరించారు: కార్మిక సంఘాలు సమ్మె వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. ప్రస్తుత తుఫాను పరిస్థితిని పరిగణలోకి తీసుకుని సమ్మెను విరమిస్తున్నట్టు ఈయూ అధ్యక్షడు పద్మాకర్ తెలిపారు. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. ఇందుకోసం అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ గురువారం జారీచేసిన జీవో సంతృప్తికరంగా లేదన్న తమ అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని, దీనిని సవరిస్తూ శుక్రవారం కొత్త జీవోను జారీచేయటాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. దీనితో పాటు సీమాంధ్ర ప్రాంతంలో జరిగిన సమ్మె కాలాన్ని సెలవుగా పరిగణించటంతో పాటు.. కార్మికులకు పండుగ అడ్వాన్స్ చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించడంతో ఎలాంటి షరతులు లేకుండా సమ్మె విరమించేందుకు సిద్ధమయ్యామన్నారు. కార్మికులు వెంటనే విధుల్లోకి చేరతారని ఎన్ఎంయూ అధ్యక్షుడు మహ్మమూద్ తెలిపారు. సమ్మె విరమించారు: బొత్స ‘‘రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో గత 60 రోజులుగా జరుగుతున్న ఉద్యమం వల్ల ఆర్టీసీ తీవ్రంగా దెబ్బతిన్నది. ప్రజలు కూడా తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే సున్నితాంశ పరిష్కారం రాజకీయపరంగా జరగాల్సి ఉంది. దీనిని ప్రభుత్వంపై ఉంచి సమ్మె విరమించాలని చేసిన విజ్ఞప్తికి ఆర్టీసీ కార్మికులు అంగీకరించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే విధుల్లోకి వస్తామని హామీ ఇచ్చారు’’ అని మంత్రి బొత్స అనంతరం మీడియాకు తెలిపారు. డిమాండ్లు - పరిష్కారాలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ మేరకు సవరణ ఉత్తర్వులను శుక్రవారం ప్రభుత్వం జారీచేసింది. ఆర్టీసీలో ఉన్న అప్పులపై కోటి రూపాయలు వడ్డీ చెల్లిస్తోంది. ఈ వడ్డీని ప్రభుత్వమే భరించటంతో పాటు ఇప్పటివరకు ఉన్న అప్పులను మాఫీ చేసేందుకు ప్రభుత్వ సాయాన్ని పరిశీలిస్తున్నామని సర్కారు స్పందించింది. సకల జనుల సమ్మె సందర్భంగా మోటార్ వెహికల్ (ఎంవీ) ట్యాక్స్ను మినహాయించారని.. 2013-14 ఆర్థిక సంవత్సరానికి కూడా ఎంవీ ట్యాక్స్ను మినహాయించాలని కోరారు. ఇందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఆర్టీసీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న దృష్ట్యా డీజిల్పై ఉన్న వ్యాట్ను మినహాయించి ట్యాక్స్ హాలిడేగా ప్రకటించాలని కోరారు. అయితే, ట్యాక్స్ మొత్తాన్ని రీ-యింబర్స్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 10 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాలని, ఇప్పటికే కాలం చెల్లిన బస్సులను తొలగించి కొత్త బస్సులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయగా.. ఇందుకు కూడా అంగీకరిస్తూ 100 కోట్లు కేటాయించేం దుకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని కోరగా, నవంబర్1 నాటికి 9,500మంది కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. సమ్మెను దృష్టిలో ఉంచుకుని అడ్వాన్సు రూపంలో రెగ్యులర్ కార్మికులకు రూ.25వేలు, కాంట్రాక్టు కార్మికులకు రూ.15 వేలు చెల్లించనున్నారు. సీమాంధ్ర ప్రాంతంలోని కార్మికులకు దసరా అడ్వాన్స్ చెల్లించేందుకు యాజ మాన్యం అంగీకరించింది. 1-4-2013 నుంచి ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ అమల్లోకి వచ్చే విధంగా చర్యలను తీసుకోవాలని సంఘాలు కోరాయి. వచ్చే జనవరి 31 నాటికి వేతన సవరణ ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. -
పండుగ అడ్వాన్స్ ఇవ్వకపోతే 1 నుంచి సమ్మె
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే తెలంగాణలోని కార్మికులకు పండుగ అడ్వాన్స్లు ఎందుకు ఇవ్వరని తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రశ్నించింది. గురువారం బస్ భవన్ ముందు టీఎంయూ ఆధ్వర్యంలో పండుగ అడ్వాన్స్, డీఏ తదితర సమస్యలపై కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్రెడ్డి ప్రసంగిస్తూ, 30వ తేదీ లోపు దసరా పండుగ అడ్వాన్స్లు చెల్లించకపోతే 1 నుంచి సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు. కాగా, ఆర్టీసీ కార్మికులకు దసరా అడ్వాన్స్ ఇవ్వకపోతే పండుగకు తిప్పాల్సిన ప్రత్యేక బస్సులు నడిపేది లేదని ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.పద్మాకర్ హెచ్చరించారు. యాజమాన్యం వైఖరికి నిరసనగా శుక్రవారం అన్ని డిపోల ఎదుట ధర్నాలు నిర్వహించాస్తామన్నారు. అడ్వాన్స్ చెల్లించకపోతే.. ఎండీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఎన్ఎంయూ అధ్యక్షుడు నాగేశ్వరరావు హెచ్చరించారు. గురువారం ఎన్ఎంయూ నిరసనదినం పాటించింది. -
ఆర్టీసీకి ‘దసరా’ లేదు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు ఏటా ఇచ్చే దసరా అడ్వాన్స్ను ఈ ఏడాది రద్దు చేస్తూ ఆ సంస్థ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటికే ఏడాది కాలంగా ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీల నుంచి రుణాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు ఈ దసరా పండుగ ఎండగగా మారనుంది. కార్మికులకు దాదాపు ఏడాది కాలంగా ఆర్టీసీ సహకార సంఘం నుంచి రుణాలు అందలేదు. నష్టాల్లో ఉన్న యాజమాన్యం రుణాలకు నిధులు అందించకపోవటమే దీనికి కారణం. అదీగాక.. సీమాంధ్ర జిల్లాల్లో సమ్మె వల్ల కార్మికులకు ఆగస్టు నెల జీతం రాలేదు. సెప్టెంబర్ జీతం కూడా అందే అవకాశం లేదు. రెండు నెలలుగా జీతాల్లేక పీకల్లోతు కష్టాల్లో ఉన్న సిబ్బందికి ఇప్పుడు దసరా అడ్వాన్స్ రద్దు చేయటం అశనిపాతంగా మారింది. సీమాంధ్రలో సమ్మె కారణంగా సిబ్బందికి జీతాలు ఇవ్వటం, రుణాల మీద వడ్డీలు చెల్లించటానికే ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నందున దసరా అడ్వాన్స్ చెల్లించద్దంటూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో ఉన్న తెలంగాణ సిబ్బందికి కూడా అడ్వాన్స్ చెల్లించకూడదంటూ నిర్ణయం తీసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కార్మిక సంఘాలు.. యాజమాన్యం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేయాలని నిర్ణయించాయి. యాజమాన్యంపై ఎలాంటి ఆర్థిక భారం పడని అడ్వాన్స్ను చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశాయి. కార్మికుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం సకల జనుల సమ్మె 2011 సెప్టెంబర్లో జరిగింది. అప్పుడు దసరా అడ్వాన్సులు చెల్లించారు. సీమాంధ్రలో సిబ్బంది సమ్మె చేస్తుంటే అడ్వాన్స్ ఇవ్వకూడదని నిర్ణయించారు. యాజమాన్యం కార్మికుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోంది. యాజమాన్యం నిరంకుశ ధోరణిని నిరసిస్తూ ఈ నెల 27న భోజన విరామ సమయంలో ధర్నాలు చేపడతాం. - పద్మాకర్, దామోదరరావు, ప్రసాద్రెడ్డి, ఈయూ 26న డిపోలు, యూనిట్ల ఎదుట ధర్నా ఆర్టీసీలో ఉన్న దాదాపు లక్ష మంది హిందూ ఉద్యోగులకు దసరా పండుగ చాలా ముఖ్యమైంది. అడ్వాన్సులు ఇవ్వకపోవటం అన్యాయం. యాజమాన్యం అనుసరిస్తోన్న కార్మిక వ్యతిరేక ధోరణికి నిరసనగా ఈ నెల 26న అన్ని డిపోలు, యూనిట్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తాం. - నాగేశ్వరరావు, మహమూద్, ఎన్ఎంయూ అడ్వాన్సులతో సంస్థ మీద భారం పడదు అడాన్స్ను వాయిదాల్లో సిబ్బంది నుంచి రికవరీ చేస్తారు. సంస్థ మీద ఆర్థికంగా భారం పడదు. సెప్టెంబర్ జీతంతో పాటు అడ్వాన్స్ చెల్లించాలి. - వి.ఎస్.రావు, ఎస్డబ్ల్యూఎఫ్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి సమ్మెలో ఉన్న సిబ్బందికి అడ్వాన్స్లు ఇవ్వకపోతే సరే. తెలంగాణలో విధుల్లో ఉన్న సిబ్బందికి ఇవ్వకపోవటం అన్యాయం. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. - చంద్రశేఖర్, ఆర్టీసీ సూపర్వైజర్ల సంఘం -
కదలని ప్రగతి చక్రం
సాక్షి, అనంత పురం : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెలోకి వెళ్లడంతో ప్రగతి చక్రం ముందుకు కదలలేదు. 53 రోజులుగా ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. దూరప్రాంతాలకు వెళ్లేందుకు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. 50 కిలోమీటర్ల లోపు ప్రయాణం చేయాలంటే ప్రైవేటు వాహనాలపై ఆధారపడుతున్నారు. ఆర్టీసీ అనంతపురం రీజియన్లోని 12 డిపోల పరిధిలో 940 బస్సులు ఉండగా..880 బస్సులు మాత్రమే రోడ్డుపై తిరిగేవి. వీటిలో 151 వరకు ఎక్సెప్రెస్ సర్వీసులు, హైదరాబాద్కు 44, విజయవాడకు 10, బెంగళూరుకు 85, చెన్నై 8, నెల్లూరు నాలుగు బస్సు సర్వీసులు నడిపేవారు. జిల్లాలోని బస్సుల్లో ప్రతి రోజూ గరిష్టంగా 4.50 లక్షల నుంచి 5 లక్షల మంది ప్రయాణించే వారు. హైదరాబాద్ వెళ్లే వారి సంఖ్య ప్రతి రోజూ 2000 నుంచి 2500 మంది వరకు ఉంటుంది. ఆర్టీసీ వివిధ విభాగాలకు చెందిన 4,700 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటుండటంతో అన్ని రూట్లలోనూ బస్సులు నిలిచిపోయాయి. రోజుకు రూ.75 లక్షలు నష్టం సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి రోజుకు రూ.75 లక్షల చొప్పున ఇప్పటి వరకు రూ.40 కోట్ల మేర ఆర్టీసీ ఆదాయానికి గండిపడింది. సమ్మెలో ఉన్న కారణంగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు అందని పరిస్థితి. అయినప్పటి వారు జీతాల కోసం కాకుండా సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అయితే ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కావడంతో దూర ప్రాంత ప్రయాణికులు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. అనంతపురం, గుంతకల్లు, గుత్తి, ధర్మవరం, హిందూపురం రైల్వే స్టేషన్లలోని టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద ముందెన్నడూ లేనంత రద్దీ కనిపిస్తోంది. ప్రతి రోజూ హైదరాబాద్, బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు రైళ్లు సరిపోకపోవడంతో ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. ప్రయాణికుల అవసరాన్ని గుర్తించిన ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు మాములు రోజుల్లో ఉన్న టికెట్టుపై 30 శాతం పైగా అదనంగా చార్జి వసూలు చేస్తున్నాయి. ఇక జిల్లాలో 50 కిలోమీటర్లు వరకు ప్రయాణించాల్సిన వివిధ వర్గాలకు చెందిన ప్రజలు మినీ వ్యాన్లు, బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వీరు కూడా అధిక చార్జీలతో అందినకాటికి దోచుకుంటున్నారు. -
వెంకటగిరిలో మహిళల భారీ ర్యాలీ
సాక్షి, నెల్లూరు: పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా జిల్లా వ్యాప్తంగా సమైక్య నినాదం మార్మోగుతోంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకోవాలనే ఆకాంక్షతో అన్ని వర్గాల ప్రజలు 52 రోజులుగా ఉద్యమబాటలో అలుపెరగని పయనం సాగిస్తున్నారు. ఢిల్లీ వీధులు దద్దరిల్లేలా ఇక్కడి నుంచే సమైక్య శంఖారావం పూరిస్తున్నారు. రోజుకో వినూత్న కార్యక్రమంతో సమైక్య భేరి మోగిస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో శుక్రవారం నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. నెల్లూరులోని వీఆర్సీ సెంటర్లో ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు మొదలయ్యాయి. వీఆర్సీ సెంటర్లో ఉపాధ్యాయులు(యూటీఎఫ్), గాంధీబొమ్మ సెంటర్లో ఎస్యూపీఎస్ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు బస్సుకు తాళ్లు కట్టి ఆర్టీసీ బస్టాండ్ నుంచి వీఆర్సీ వరకు లాగారు. రెవెన్యూ అసోసియేషన్ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కావలి లోని జెండాచెట్టు సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు మత్స్యకారులు వలలు, బోట్లతో ర్యాలీ చేశారు. న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్, సోనియా, కోదండరామ్ మాస్క్లు ధరించిన వారితో ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. వైఎస్సార్సీపీ, సమైక్యాంధ్ర జేఏసీ, ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్డీఓ, జేబీ కళాశాల యాజ మాన్యం ఆధ్వర్యంలో జేబీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు సమైక్య క్రీడాజ్యోతి ర్యాలీ సాగింది. పొదలకూరులో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రిలేదీక్ష చేశారు. వీరికి తహశీల్దార్,ఎంపీడీఓ సంఘీభావం తెలిపారు. వెంకటగిరిలో జేఎసీ ఆధ్వ ర్యంలో మహిళాగర్జన నిర్వహించారు. పలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థినులు వేలాదిగా తరలివచ్చారు. ఎంపీడీఓ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా స్థానిక కాశీపేట కూడలిలో ఏర్పాటుచేసిన సభాస్థలికి తరలివచ్చారు. 50 రోజులుగా ఉద్యమం హోరెత్తుతున్న ప్రభుత్వం స్పందించకపోవడంపై వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ రాపూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మండిపడ్డారు. సైదాపురంలో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు చేపట్టారు. ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు రిలే దీక్ష చేశారు. వైఎస్సార్సీపీ నేతల దీక్షలు కొనసాగాయి. సీతారాంపురం బస్టాండు సెంటర్లో రిలే దీక్షలు 23వ రోజుకు చేరుకున్నాయి. వింజమూరులో ఉద్యోగ జేఏసీ దీక్షలు 45వ రోజుకు చేరుకున్నాయి. గూడూరు టవర్క్లాక్ సెంటర్లో రిలేదీక్ష లో ఉన్న వారికి లోక్సత్తా పార్టీ నేత కేవీ కృష్ణయ్య మద్దతు పలికారు. విద్యార్థులు రాస్తారోకో నిర్వహించి మానవహారంగా నిలిచారు.కోట, వాకాడు, చిట్టమూరు మండలాల క్రైస్తవులు కోటక్రాస్ రోడ్డు వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నాయకుడు బత్తిన విజయకుమార్ హాజరయ్యారు. వాకాడులో కేంద్ర ప్రభు త్వ కార్యాలయాలు మూతపడ్డాయి. చిట్టమూరులో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు మోకాళ్ల నిలిచి నిరసన తెలిపారు. ఆత్మకూరులోని బస్టాండు సెంటర్లో అధ్యాపకులు రిలేదీక్షలో కూర్చున్నారు. నెల్లూరుపాళెం సెంటర్లో ఆర్టీసీ జేఏసీ, సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. సంగంలో ర్యాలీ జరిగింది. చేజర్లలోని బస్టాండు సెంటర్లో ఉపాధ్యాయులు రిలేదీక్షలో కూర్చున్నారు. బుచ్చిలోని వైఎస్సార్ విగ్రహం వద్ద విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కోవూరులోని ఎన్జీఓ హోంలో షుగర్ఫ్యాక్టరీ కార్మికులు రిలేదీక్షలో కూర్చున్నారు.కొడవలూరులో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. ఇందుకూరుపేటలోని బస్టాండు సెంటర్లో మానవహారంగా నిలుచుని వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. సూళ్లూరుపేట, నాయుడుపేటలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. మంగళంపాడు సర్పం చ్తో పాటు పలుశాఖల ఉద్యోగులు దీక్షలో కూర్చున్నారు. తడలో రోడ్డుపైనే క్షవరం చేసి నాయీ బ్రాహ్మణులు నిరసన తెలిపారు. -
ఉద్యోగుల సమైక్య పోరుకు నెల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రారంభించి నేటికి నెల రోజులు పూర్తయ్యాయి. సీమాంధ్ర ఎంపీలు.. ప్రత్యేకించి లోక్సభ సభ్యులందరూ రాజీనామా చేయాలనే డిమాండ్తో ఆగస్టు 13 నుంచి ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఉద్యోగ సంఘాలతో రెండుసార్లు మంత్రివర్గ ఉపసంఘం తూతూమంత్రంగా చర్చలు జరిపి సమ్మె విరమించాలని కోరింది. అందుకు ఉద్యోగ సంఘాలు నిరాకరించాయి. ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు ప్రజల అండ లభించింది. సీమాంధ్ర ఎంపీలు అందరూ రాజీనామా చేయాలంటూ ఉద్యోగ సంఘాలు చేసిన ఏకైక డిమాండ్ను ఇద్దరు లోక్సభ సభ్యులు (వైఎస్సార్సీపీ ఎంపీలు వైఎస్ జగన్మోహన్రెడ్డి, మేకపాటి రాజమోహన్రెడ్డి) తప్ప మిగతావారు పట్టించుకోలేదు. సీమాంధ్ర ఎంపీల బలం లేకుండా కేంద్రంలో ప్రభుత్వం కొనసాగే అవకాశం లేదని, ఎంపీలు రాజీనామా చేస్తే విభజన నిర్ణయం వెనక్కిపోతుందంటూ ఉద్యోగ సంఘాలు ఎన్నిసార్లు ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకుండా పోయింది. సమ్మె నెల రోజులు దాటిన తర్వాత కూడా ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్నే మళ్లీమళ్లీ వినిపించాల్సి వస్తోంది. ఎంపీల రాజీనామాలకు ఒత్తిడి తీసుకురావడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని గురువారం కూడా ఉద్యోగుల జేఏసీ చైర్మన్, ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్బాబు చెప్పారు. పంచాయతీ నుంచి కలెక్టరేట్ దాకా.. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో పాలన పూర్తిగా స్తంభించిపోయింది. ఈ నెల రోజుల్లో ఒక్క ఫైలు కూడా కదల్లేదు. గ్రామ సచివాలయం మొదలు కలెక్టరేట్ వరకు.. ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. గ్రామ సేవకుల నుంచి జిల్లా రెవెన్యూ అధికారి దాకా అన్ని విభాగాల సిబ్బంది, అధికారులు సమ్మెలో పాల్గొంటున్నారు. జిల్లాల్లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు తప్ప.. మిగతా ఉద్యోగులెవరూ విధులకు హాజరుకావడం లేదు. ఉపాధ్యాయులూ సమ్మెలో ఉండటంతో స్కూళ్లు మూతపడ్డాయి. విద్యార్థులు కూడా వీధులుకెక్కి ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. ఆర్టీసీ కార్మికులు నెలరోజులుగా సమ్మెలో ఉండటంతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. సీమాంధ్రలోని 123 డిపోల్లో 122 డిపోల్లో బస్సులు గడప దాటలేదు. తిరుమల డిపోకు సమ్మె నుంచి మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. -
ఉద్యమపురి
సాక్షి, నెల్లూరు: జిల్లాలో సమైక్య జోరు రోజురోజుకూ రెట్టింపవుతోంది. జిల్లాలో నెల నుంచి సమైక్య ఉద్యమం కొనసాగుతోంది. ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. ఆర్టీసీ కార్మికులు గురువారం ర్యాలీతో ప్రదర్శన నిర్వహించారు. నగరంలో ఐకేపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఉద్యోగుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, రాస్తారోకోలు, సోనియా దిష్టిబొమ్మ దహనం తదితర కార్యక్రమాలు కొనసాగాయి. ఉపాధ్యాయుల సమ్మెతో ప్రభుత్వ పాఠశాలల బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు తిరగడంలేదు. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. నగరం, పట్టణం, ఊరూవాడా, చిన్నా పెద్ద అందరూ సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్నారు. నగరంలో ఎస్టీయూ భారీ ప్రదర్శన నిర్వహించింది. వీఆర్సీ, గాంధీబొమ్మ కూడలిలో మానవహారం నిర్వహించారు. వీఆర్సీ కూడలిలో వీఎస్యూ అధ్యాపక జేఏసీ రిలేనిరాహారదీక్షలు నిర్వహించింది. ఆర్టీసీ కార్మికులు భారీ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో హరనాథపురంలో రాస్తారోకో నిర్వహించారు. నగరపాలకసంస్థ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. డీఆర్డీఏ ఉద్యోగులు ఏబీఎం కాంపౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. విద్యుత్ ఉద్యోగులు కేంద్రమంత్రి పనబాక లక్ష్మి ఇంటిని ముట్టడించారు. ఉదయగిరిలో సమైక్యాంధ్ర, ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక పోరాట సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో గురువారం రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు. మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల జేఏసీ ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో రెండోరోజు నిరాహార దీక్షలో విద్యార్థులు పాల్గొన్నారు. ఉదయగిరి సీతారామపురం రోడ్డుపై క్యారమ్స్, చెస్, క్రికెట్, వాలీబాల్, తదితర ఆటలతో నిరసన తెలిపారు. సీతారామపురం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు విద్యార్థులు సంఘీభావం తెలిపారు. అంతకు ముందు హైస్కూల్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. దుత్తలూరులో అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు బస్టాండ్ సెంటర్లో నిరాహార దీక్షలు చేశారు. వింజమూరులోని పోలీస్స్టేషన్ సమీపంలో జరుగుతున్న ఉద్యోగ రిలే నిరాహార దీక్షలు 23వ రోజుకు చేరాయి. గూడూరు టవర్క్లాక్ కూడలి ప్రాంతం వద్ద మహిళలు రాస్తారోకో నిర్వహించారు. అలాగే యాదవ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీలు నిర్వహించారు. ఎద్దుల బండికి సోనియా, కేసీఆర్ల దిష్టిబొమ్మలు వేలాడదీసి వీరతాళ్లతో కొట్టుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కోట క్రాస్రోడ్డులో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. విద్యానగర్లో ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే నిరాహార దీక్ష కొనసాగించారు. వాకాడులో వైఎస్సార్సీపీ నేత నేదురుమల్లి ఉదయ్శే ఖర్రెడ్డి ఆధ్వర్యంలో వాకాడు స్వర్ణముఖి బ్యారేజిపై మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. సూళ్లూరుపేటలో తెలుగుదేశం నాయకుడు వేనాటి సుమంత్రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష రెండోరోజుకు చేరుకుంది. సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్ష 16వ రోజుకు చేరింది. యూటీఎఫ్ ఆధ్వర్యంలో గురువారం దీక్షలో కూర్చున్నారు. పట్టణంలో మెకానిక్స్ఆధ్వర్యంలో మోటార్సైకిల్ ర్యాలీ నిర్వహించారు. తడలో రెవెన్యూ ఉద్యోగులు రిలే నిరాహారదీక్ష చేశారు. నాయుడుపేటలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేశారు. ఆత్మకూరులోని మున్సిపల్ బస్టాండ్ సెంటర్లో విశ్రాంత ఉద్యోగులు రిలేనిరాహారదీక్ష చేశారు. ఆర్టీసీ కార్మికులు డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఆర్టీసీ కార్మికులు శరీరానికి చెట్ల కొమ్మలు చుట్టుకొని ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. సర్వేపల్లి నియోజకవర్గం టీపీ గూడూరు మండలంలోని నరుకూరు నుంచి ఉపాధ్యాయులు మోటారుసైకిళ్లతో ప్రదర్శన జరిపారు. రాష్ట్ర విభజనకు నిరసనగా చెన్నపల్లిపాళెం హైస్కూల్ విద్యార్థులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వెంకటాచలం మండలంలోని చెముడుగుంటలో ఎంపీడీఓ, తహశీల్దార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కోవూరు ఎన్జీఓహోంలో పెయింటింగ్ కార్మికులు రిలేనిరాహారదీక్ష చేపట్టారు. ఇందుకూరుపేట మండల పరిషత్ కార్యాలయంలో రెవెన్యూ, మండల పరిషత్, ఎంఈఓ దీక్ష చేపట్టారు. వెంకటగిరి నియోజవకర్గం సైదాపురంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో వినూత్నంగా శ్రీకృష్ణని వేషధారణతో ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాహారదీక్షకు వైఎస్సార్సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. టాటా ఏస్లతో ర్యాలీ నిర్వహించారు. కావలి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రిలేనిరాహారదీక్ష ప్రారంభించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యాన మౌనప్రదర్శన చేశారు. -
కాంగ్రెస్నేతలకు సమైక్య సెగ
సాక్షి నెట్వర్క్: ఎంపీ లగడపాటి రాజగోపాల్కు సొంతూరులోనే చుక్కెదురైంది. ఎంపీ పదవికి రాజీనామా చేసి పార్లమెంటు సమావేశాలకు ఎలా హాజరవుతారంటూ బెజవాడలో ఆర్టీసీ కార్మికులు నిలదీశారు. బుధవారం మహాత్మాగాంధీ రోడ్డులోని ఏపీ ఎన్జీవోల శిబిరం వద్దకు చేరుకున్న ఎంపీని చూడగానే ఆర్టీసీ కార్మికుల ఆవేశం కట్టలు తెంచుకుంది. సమైక్యం కోసం తాము జీతాలు, ఉద్యోగాలు కూడా పణంగా పెట్టి ఉద్యమం చేస్తుంటే రాజీనామా చేయకుండా డ్రామాలు ఆడతారా అంటూ ఆయనపై విరుచుకుపడ్డారు. లగడపాటి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ మోహరించిన పోలీసులు ఎంపీని సురక్షితంగా శిబిరం నుంచి బయటకు తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ తోపులాటలో నిరాహార దీక్ష కోసం ఏర్పాటు చేసిన షామియానాలు కుప్పకూలిపోయాయి. కాగా, మంత్రి కొలుసు పార్ధసారథిని సైతం మహిళలు కృష్ణలంకలో చుట్టుముట్టి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తులసిరెడ్డిపై చెప్పు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఏర్పాటైన సమావేశానికి వచ్చిన రాష్ట్ర 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ తులసిరెడ్డికి పరాభవం ఎదురైంది. ఆయన సమైక్యవాదుల వద్దకు వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించగా, రాజీనామాలు ఆమోదించుకుని వచ్చి మాట్లాడాలని జేఏసీ నేతలు అడ్డుకున్నారు. ఆ తర్వాత ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదికపైకి వచ్చి మాట్లాడేందుకు యత్నించగా అక్కడా అడ్డుకున్నారు. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపైకి చెప్పులు విసిరారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తులసిరెడ్డి కారుపైకి ఎక్కి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తొడగొట్టి మీసం తిప్పారు. కాగా, కేంద్ర సహాయమంత్రి పనబాకలక్ష్మి గత 50రోజుల నుంచి కనబడటం లేదంటూ గుంటూరు జిల్లా బాపట్ల రూరల్ పోలీస్స్టేషన్లో గుడుపూడి గ్రామానికి చెందిన సమాచార హక్కుచట్టం రాష్ట్ర కార్యదర్శి నలజాల వేదవ్యాస్ ఫిర్యాదు చేశారు.