story
-
Kabir Das గడ్డిపోచ కూడా...!
కబీర్ దాస్ ఆధ్యాత్మిక కవి. సాధువు. మధ్యయుగ భక్తి ఉద్యమ కారుల్లో ఆయన ఒకరు. ముస్లిం కుటుంబంలో పుట్టిన ఆయన... రామానంద బోధనలకు ప్రభావితమై ఆయన్ని గురువుగా స్వీకరించారు. కబీర్ అన్ని మతాల అర్థరహిత, అనైతిక పద్ధతులను ప్రధానంగా ప్రశ్నించారు. ఆయన మరణించినప్పుడు హిందువులు– ముస్లింలు ఇరువురూ ఆయనను తమవారంటే తమవారని చెప్పుకున్నారు.కబీర్ సత్యాన్ని తెలుసుకోవడానికి, ‘అహాన్ని‘ వదిలివేయమని సూచించారు. ఆయన రాసిన దోహాలు నాటి సమాజాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. అటువంటి కబీర్ జీవితంలో జరిగిన సంఘటనగా చెప్పే ఉదంతం ఇది: ఒకానొకరోజు కబీర్ తన కొడుకుని ఆవులకు మేత కోసం గడ్డి కోసుకు రమ్మన్నారు. సరేనని వెళ్లిన కుమారుడు చాలాసేపటి వరకు తిరిగి రాలేదు. దీంతో కబీర్ కొడుకును వెతుక్కుంటూ వెళ్లారు. పచ్చిక బయళ్ల మధ్యలో నిల్చుని ఉన్న కొడుకు కనిపించాడు. చల్లటి గాలి వీస్తోంది. గడ్డి అటూ ఇటూ ఊగుతోంది. కబీర్ తన కొడుకు కూడా అది చూసి మైమరచిపోయి హుషారుగా ఊగుతూ ఉండడాన్ని చూశారు. దగ్గరకువెళ్లి ఎందుకు ఊగుతున్నావని అడిగారు. అప్పుడతను ‘నాన్నా! నేనిక్కడికి వచ్చేసరికి ఈ గడ్డంతా ఏకాంతంలో గాలికనుగుణంగా కదలాడుతోంది. ఆ దృశ్యం చూడటానికి ఎంతో బాగుంది. నాకు కూడా గడ్డితోపాటు అలా కదలాలనిపిస్తోంది. ఆహా! ఏమానందం? ఏమానందం?’ అన్నాడు. ఇదీ చదవండి : బిలియనీర్తో పెళ్లి అని చెప్పి, రూ.14 కోట్లకు ముంచేసింది : చివరికి!అతని మాటలకు దిగ్భ్రాంతి చెందిన కబీర్, ‘నేను నిన్ను గడ్డి కోసుకురమ్మన్నాను కదా? మరచిపోయేవా?’ అన్నారు. అందుకు ‘ఏమిటీ? పచ్చికను కోయాలా? నేనెప్పటికీ అలా చేయలేను. నాకీ పచ్చిక ఎనలేని ఆనందాన్నిచ్చింది. నేను పచ్చికతో సన్నిహిత సంబంధాన్నిపెంచుకున్నాను. ప్రస్తుతానికి నేను వేరే ప్రపంచంలో ఉన్నాను’ అన్నాడతను. ‘ఈ భగవంతుని సృష్టిలో ప్రతిదీ విలువైనదే... ఆనందమిచ్చేదే’ కదా అంటూ కబీర్ కుమారునితో కలిసి వెనుదిరిగారు. (Safer Internet Day 2025 భద్రత... బాధ్యత... గౌరవం!)– యామిజాల జగదీశ్ -
అవకాశానికే అవకాశం ఇచ్చింది
కొంతమంది గురించి చెప్పడానికి మాటలు అక్కర్లేదు. వాళ్ల పని చూస్తే చాలు! అలాంటి ప్రతిభావంతురాలే థెమిస్ వెనెస్సా! అవకాశాలను ఆమె వెదుక్కోలేదు.. అవకాశాలే థెమిస్ని వెదుక్కుంటూ వచ్చాయి. అలా వచ్చిన ప్రతి అవకాశంతో మరో చాన్స్ని క్రియేట్ చేసింది ఆమె విలక్షణమైన స్టయిలింగ్!థెమిస్ స్వస్థలం చెన్నై. చిన్నప్పుడే ఫ్యాషన్ పట్ల ఆసక్తి పెంచుకుంది. అందుకే స్కూల్కి వెళ్లే వయసులోనే నిశ్చయించుకుంది పెద్దయ్యాక తను ఫ్యాషన్ డిజైనర్ కావాలని! అనుకున్నట్టుగానే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. చదువయ్యాక బెంగళూరులోని ఓ ఫ్యాషన్ మేగజీన్లో చేరింది. ఆ సమయంలోనే ఒక ఫ్రెండ్ ద్వారా అప్పటికే సెలబ్రిటీ స్టయిలిస్ట్గా పాపులర్ అయిన అర్చా మెహతాను కలిసింది. ఆమె దగ్గర ఇంటర్న్గా చేరింది. తర్వాత తమిళ చిత్రం ‘రెమో’తో ఫ్రీలాన్స్ కాస్ట్యూమ్స్ డిజైనర్గా సినీ ప్రయాణం మొదలుపెట్టింది. ఆమె విలక్షణ శైలికి సినీ ఇండస్ట్రీ ముచ్చటపడి అవకాశాలను అందిచ్చింది. వాటిల్లో ‘ద రోడ్’, ‘మారా’, ‘వేలైక్కారన్’, ‘పొన్నియిన్ సెల్వన్ ’ వంటి సినిమాలున్నాయి. వాటికి ఆమె అసిస్టెంట్ స్టయిలిస్ట్గా చేసింది. ఎన్నో ఫొటో షూట్స్, యాడ్స్కూ పనిచేసింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఏ ప్రాజెక్ట్ వచ్చినా.. పర్సనాలిటీని హైలైట్ చేసే స్టయిలింగ్తో వారిని గ్లోబల్ స్టార్స్లా చూపింది. ఆ సిగ్నేచర్ స్టయిల్ ఎంతోమంది స్టార్స్కి నచ్చింది. శ్రీనిధి, త్రిష, శోభితా ధూళిపాళ, శ్రద్ధా శ్రీకాంత్, చిన్మయిలతో పాటు శివ కార్తికేయన్, విజయ్, జయం రవిలాంటి మేల్ సెలబ్రిటీలకూ స్టయిలింగ్ చేసింది థెమిస్. -
చిట్టి రచయితలు.. అందమైన కథలతో అలరిస్తున్నారు..
పెద్దల కోసం పిల్లలు రచయితలుగా మారి కథలు రాస్తున్నారు. ‘ఆహా’ అనిపించేలా వినసొంపుగా వినిపిస్తున్నారు. పేదింట్లో పుట్టిన చెన్నై శివారులోని కన్నగినగర్ విద్యార్థులు రచయితలుగా, వెంట్రిలాక్విస్ట్లుగా మారి పెద్దలకు కథలు చెబుతున్నారు. వినోదాన్ని పంచుతున్నారు. యూట్యూబ్ నుంచి ఎఫ్ఎం రేడియో వరకు రకరకాల వేదికలపై తమ ప్రతిభను చాటుకుంటున్నారు...‘ఈ ఘనతకు కారణం ఎవరు?’ అనే ప్రశ్నకు జవాబు....చెన్నైకి చెందిన వెంట్రిలాక్విస్ట్ ఎల్ థామస్. ‘క్యారీ విత్ లవ్’ ట్రస్ట్ నిర్వాహకుడైన థామస్ వన్నత్తు పూచ్చిగల్ (సీతాకోక చిలుకలు) పేరుతో పిల్లలలోని సృజనాత్మక ప్రతిభకు మెరుగులు దిద్దుతున్నాడు. కన్నగిరినగర్లో ఉండే శ్రీ అనే బాలుడు లాస్ట్ బెంచ్ స్టూడెంట్. అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. ఇక చదవడం తన వల్ల కాదు అనుకుంటున్న సమయంలో ‘వన్నత్తు పూచ్చిగల్’ వాట్సాప్ గ్రూప్ తన నిర్ణయాన్ని మార్చేలా చేయడమేకాదు రచయితగా మార్చింది. జంతువులు ప్రధాన పాత్రలుగా ‘బొమ్మలాటం’ అనే నాటకం రాశాడు. స్వీయ ఆలోచన అవసరం గురించి ఈ కథలో చెప్పాడు.ఇదే ప్రాంతానికి చెందిన సంజన స్టోరీ క్రియేటర్గా ప్రశంసలు అందుకుంటుంది. పొట్టలం(గంజాయి) అనర్థాలను కళ్లకు కడుతూ రాసిన కథ అందరినీ ఆకట్టుకుంది. జ్యోతిశ్రీ అనే అమ్మాయి రాస్తే... ఎన్నో అక్షర దోషాలు కనిపించేవి. ఇప్పుడు అలా కాదు. చక్కని భాషలో రాస్తుంది. కథలతో మెప్పిస్తోంది. జ్యోతిశ్రీ చిన్న అక్క దివ్యదర్శిని కూడా రచనలు చేస్తోంది. ఆటో డ్రైవర్గా తండ్రి పడుతున్న కష్టాలు, గృహిణిగా తల్లి వేదనకు కథా రూపం ఇచ్చింది. ఈ కథలకు జ్యోతిశ్రీ పెద్ద అక్క నర్మద బొమ్మలు వేసింది. వీరు మచ్చుకు కొద్దిమంది మాత్రమే. ఇంకా ఎంతోమంది ఉన్నారు.కథలు రాయడమే కాదు తమ వాక్చాతుర్యంతో ‘వన్నత్తు పూచ్చిగల్’ పేరుతో డిజిటల్ వేదికలపై కూడా సందడి చేస్తున్పారు. తమ అనుభవాలు, స్నేహితుల అనుభవాలు, ఎక్కడెక్కడో విన్న కథలను వినసొంపుగా చెబుతున్నారు. వారి మాటల్లో వినోదమే కాదు విజ్ఞానం, సామాజిక స్పృహ కూడా ఉంటాయి.కళల వెలుగులో..కళ అనేది కేవలం వినోదం కాదని భవిష్యత్ తరాలకు దిక్సూచి అని నిరూపిస్తున్నాడు ఎల్ థామస్. ‘వన్నత్తు పూచ్చిగల్’ ప్రభావంతో చదువులో వెనకబడిన పిల్లల్లో ‘బాగా చదువుకోవాలి’ అనే పట్టుదల పెరిగింది. తమకు ఇష్టమైన కళలో అక్షరాభ్యాసం చేసి ప్రతిభ చాటుకుంటున్నారు. – అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నై(చదవండి: మేకప్ వేసుకుంటున్నారా..? ఈ పొరపాట్లు చెయ్యకండి..) -
మంజుమ్మల్ బాయ్స్ నటుడి ప్రేమ కావ్యం.. ఎలా మొదలైందంటే? (ఫోటోలు)
-
ఆమె... ఒక హి‘స్టోరీ’ : ఎవరీ గోపీ సిద్ధి
ఆ అవ్వని చూస్తే కర్ణాటక వాసి అని ఎవరూ అనుకోరు. ‘ఆఫ్రికన్’ అనే అనుకుంటారు. గోపీ సిద్దీ పూర్వీకులు వందల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి ఇండియాకు తీసుకురాబడ్డారు. ఇక్కడికి వచ్చిన తరువాత స్థానిక సంస్కృతులతో కలిసిపోయినప్పటికీ, తమ మూల సంస్కృతిని కాపాడుకుంటున్నారు. సిద్దీస్ జాతి ప్రజలు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలతో పాటు తమ సంస్కృతిని తన కథల ద్వారా లోకానికి చాటుతోంది గోపి సిద్దీ.తులసికొండ (కర్నాటక) ప్రాంతానికి చెందిన కుంటగని గ్రామానికి చెందిన గోపి సన్నా సిద్దీ జనాలకు ఒక వింత. ఒక పురాగాథ. విలువైన కథల చెట్టు. గోపి సిద్దీస్ అనేది ఆఫ్రికన్ సంతతికి చెందిన ఒక ప్రత్యేక జాతి. బానిసలు, కిరాయి సైనికులుగా, నావికులుగా వీరిని భారతదేశానికి తీసుకువచ్చారు. కాలక్రమంలో వీరు స్థానిక భాషలు నేర్చుకున్నారు. ఇక్కడి సంస్కృతిలో భాగం అయ్యారు. అదే సమయంలో తమ ఆఫ్రికన్ వారసత్వ మూలాలను కాపాడుకున్నారు. సంగీతం నుంచి నృత్యరూపాల వరకు అందులో ఎన్నో ఉన్నాయి.ఈ సిద్దీలు కర్నాటక, మహారాష్ట్రలలో ఎక్కువగా కనిపిస్తారు. గోపి సిద్దీ బాల్యంలో కొత్త ప్రాంతానికి వెళితే... ‘ఆఫ్రికన్’ ‘నీగ్రో’ అని పిలిచేవారు. ‘అలా ఎందుకు పిలుస్తున్నారు?’ అని అడిగితే తమ పూర్వీకులు ఆఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చారు అని తల్లి చెబుతుండేది. ఎప్పుడూ ఏవో కథలు వినిపించే గోపి సిద్దీకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. భర్త ఆమెను వదిలేసి మూడు దశాబ్దాలు దాటింది. ఆక్రమణదారుల చెర నుంచి తన వ్యవసాయ భూమిని తిరిగి పొందాలి... ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ తన కథల పుస్తకాలను ప్రచురించాలనే ఉత్సాహం, ఉక్కు సంకల్పంలో మాత్రం మార్పు లేదు. తన పుస్తక ప్రచురణ కోసం నగలు కూడా తాకట్టు పెట్టింది.తమ జాతి ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు తనలో నుంచి రచయిత్రి బయటికి రావడానికి కారణం అయ్యాయి. ‘స్వేచ్ఛ గురించి తపించే దృఢమైన వ్యక్తిత్వం గోపి సిద్దీ సొంతం. జీవితంలో ఆమె ఎన్నో పోరాటాలు చేసింది. గోపి సిద్దీ కథల్లో బాధ మాత్రమే కాదు జ్ఞానం కూడా ఉంటుంది. పర్యావరణ స్పృహ ఉంటుంది. తన తాతల కాలం నుంచి వింటూ పెరిగిన కథలు అవి. తనకు పరిచయం అయిన వారికల్లా ఆ కథలను చెబుతుంది. ఆమె శక్తిమంతమైన రచయిత్రి’ అంటుంది ‘బుడా ఫోక్లోర్’ అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకు రాలైన సవితా ఉదయ్.పది సంవత్సరాల క్రితం తన ఇంట్లో పని చేయడానికి ఒక పనిమనిషిని వెదుకుతున్న సమయంలో ఉదయ్కు గోపీతో పరిచయం ఏర్పడింది. మారుమూల గ్రామానికి పరిమితమైన గోపి సిద్దీ జీవిత కథను తన డాక్యుమెంటరీ ద్వారా అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాడు బెంగళూరుకు చెందిన నిశాంత్ గురుమూర్తి. తన స్వచ్ఛంద సంస్థ ‘బుడా ఫోక్లోర్’ ద్వారా జానపదల కథానిలయమైన గోపి సిద్దీతో కర్ణాటక అంతటా పాఠశాల విద్యార్థులతో కథా సెషన్లు నిర్వహిస్తోంది సవితా ఉదయ్. కొంకణీ, కన్నడ భాషలలో ఆమె చెప్పే కథలకు పిల్లలు ఫిదా అవుతుంటారు.ఆ బాధ భరించలేనంత!భాషపరమైన అడ్డంకులు ఉన్నప్పటికి పట్నం పిల్లలు నా కథలను ఇష్టపడుతుంటారు. వారి అభిమానం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. కథలు చెప్పడం పూర్తయిన తరువాత నన్ను ఆ΄్యాయంగా కౌగిలించుకొని వీడ్కోలు చెబుతారు. బరువెక్కిన హృదయంతో ఇంటికి వస్తాను. వారిని విడిచి ఇంటికి వస్తుంటే... ఒక్కోసారి ఆ బాధ భరించలేనంతగా ఉంటుంది. – గోపి సిద్దీ -
చూపును మించిన ‘దృష్టి’ : గంగాధర్ స్ఫూర్తిదాయక స్టోరీ
కాకినాడలోని ముతానగర్ తీరప్రాంత గ్రామానికి చెందిన 35 ఏళ్ల గంగాధర్ను కలుద్దాం. అతను ధైర్యం, నాయకత్వం, సేవకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు. దృష్టి లోపం ఉన్న గంగాధర్ తన జీవితాన్ని తన సమాజానికి, ముఖ్యంగా సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకార సంఘాలకు సహాయం చేయడానికి అంకితం చేశాడు.ఆయన శారీరక వైకల్యం ఉన్న నూకరత్నంను వివాహం చేసుకున్నారు, వారు ప్రభుత్వ దివ్యాంగుల పింఛను, అతని తల్లిదండ్రుల సహాయంతో తమ కుటుంబ ఖర్చులను వెళ్లదీస్తున్నారు.2013 నుండి రిలయన్స్ ఫౌండేషన్తో లబ్ది పొందుతున్న గంగాధర్, ఈ ఫౌండేషన్ హెల్ప్లైన్, వాయిస్ మెసేజ్లను ఉపయోగించి వాతావరణ హెచ్చరికలు, అల్లకల్లోలమైన సముద్రజలాలు, చేపలు బాగా లభ్యమయ్యే ప్రాంతాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు. ఈ ముఖ్యమైన సమాచారాన్ని స్థానిక మత్స్యకార సంఘాలతో పంచుకుంటాడు. తద్వారా వారు సురక్షితంగా ఉండటానికి, జీవనోపాధిని సంపాదించుకోవడానికి సహాయం చేస్తాడు. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ మరియు సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి భారతదేశ తీరప్రాంతంలో డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా సమాచార మద్దతుతో భారతదేశ తీరప్రాంతంలో ఉన్న మత్స్యకారులకు చేపలవేట మరింత సురక్షితమైందిగా, సుస్థిరమైందిగా, లాభదాయకంగా ఉండేలా చేయడానికి రిలయన్స్ ఫౌండేషన్ ప్రయత్నిస్తోంది.అంతేకాదు బయోమెట్రిక్ కార్డ్ల పెన్షన్ దరఖాస్తులు నింపడంలో సాయం చేస్తాడు. అర్హతలున్నప్పటికీ ఆయా పథకాలు పొందలేకపోయిన వారి సమస్యలను పరిష్కరించడంలో తన సంఘానికి సహాయం చేస్తాడు. అలాగే కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి, ప్రభుత్వ రాయితీల కోసం దరఖాస్తు చేసు కోవడానికి మత్స్యకార సంఘంలోని యువకులకు మార్గనిర్దేశం చేస్తాడు గంగాధర్.అంకితభావం, కృషితో గంగాధర్ తన కమ్యూనిటీకి సహాయం చేస్తున్న తీరు, ఒక వ్యక్తి సవాళ్లను ఎలా అధిగమించగలడు, ప్రపంచంలో ఎలా మార్పు తీసుకురాగలడనే దానిపై అందరికీ స్ఫూర్తినిస్తుంది. గంగాధర్ కథ సంకల్పం, దయ శక్తిని గుర్తు చేస్తుంది, నిజమైన ‘దృష్టి’ హృదయం నుండి వస్తుందని రుజువు చేస్తుంది, అది చూపును మించిన దృష్టి.దివ్యాంగుల సమస్యలపై అవగాహన పెంపొందించడానికి మరియు వైకల్యాలున్న వ్యక్తుల గౌరవం, హక్కులు, శ్రేయస్సు కోసం మద్దతును సమీకరించడానికి డిసెంబరు 3వ తేదీన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నిర్వహిస్తాం. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవితంలోని ప్రతి అంశంలో దివ్యాంగుల ఏకీకరణ మొదలుకొని వారు పొందగలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచడానికి కూడా ఇది ప్రయత్నిస్తుంది. 2024 లో ఈ దినోత్సవం థీమ్ సమగ్రమైన, సుస్థిరమైన భవిష్యత్తు కోసం దివ్యాంగుల నాయకత్వాన్ని విస్తరించడం. -
కథల ఫ్యాక్టరీ! అక్కడ కథలు డ్యాన్స్ చేస్తాయి, చిత్రాలు ..
ఆ ఫ్యాక్టరీలో కథలు డ్యాన్స్ చేస్తాయి. చిత్రాలు గీస్తాయి. సంగీత పరికరాలతో ఆటలు ఆడిస్తాయి. ఆ ఫ్యాక్టరీలో కథలు ఎంతో సహజాతిసహజంగా తయారవుతాయి. చిన్నా పెద్ద అందరినీ నవ్వులలో ముంచెత్తుతాయి. పేరు ‘ది గుడ్ టాక్ ఫ్యాక్టరీ.’ ఫౌండర్ రఘుదత్. హైదరాబాద్ వాసి అయిన రఘు ఆరేళ్లుగా చేస్తున్న ఈ ప్రయాణంలో ‘నా స్టోరీ మీకు స్ఫూర్తినివ్వాలి, నా శరీరం కాదు’ అంటూ సృజనాత్మక ఆలోచనలనూ, ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు... ‘‘ఇటీవల వృద్ధాశ్రమంలో ఒక ప్రోగ్రామ్ చేశాం. అక్కడ ఒక పెద్దావిడ తన చిన్ననాటి స్టోరీ ఒకటి అందరి ముందు పంచుకుంది. చిన్నప్పుడు స్కూల్లో వేదికపైన మాట్లాడాలన్నా, పాట ΄పాడాలన్నా చాలా సిగ్గుపడేవారంట. ఇప్పుడు నలుగురిలో పాడటానికి సిగ్గుపడుతూ అప్పటి రోజులు గుర్తుకు తెచ్చుకుంటూ తన చిన్ననాటి కథను పంచుకున్నారు. తాత వయసున్న ఒకతను ముందుకు వచ్చి డ్యాన్స్ చేస్తూ తన కాలేజీ రోజులను గుర్తుచేసుకుంటూ నాటి కథను షేర్ చేశారు. అవన్నీ ఎంత అద్భుతంగా ఉంటాయంటే అక్కడ ఉండి వారి కథల్లో మనమూ గెంతులు వేయాల్సిందే. కొందరు పెయింట్ ద్వారా, మరికొందరు మ్యూజిక్ ద్వారా తమ కథలను పరిచయం చేస్తుంటారు. ఈ విధానం వల్ల అంతర్లీనంగా వారిలో ఉన్న కళ, ఆనందం తమ చుట్టూ ఉన్నవారికి పంచుతారు. ‘ది గుడ్ టాక్ ఫ్యాక్టరీ’ ఉద్దేశ్యం కూడా అదే. అందరూ కథ ద్వారా బోలెడంత ఆనందాన్ని పొందాలి. అందరిలోనూ ఒక ఇన్నర్ చైల్డ్ ఉంటుంది. నెలకు ఒకసారైనా మనలో ఉన్న ఆ చైల్డ్ను బయటకు తీసుకువచ్చి, ఎంజాయ్ చేయిస్తే ఇన్నర్లైఫ్ అంతా హ్యాపీగా మారి΄ోతుంది. అందుకే ‘ది గుడ్ టాక్ ఫ్యాక్టరీ కింద ‘లివ్ యా స్టోరీ’ అని ఉంటుంది. రిజెక్ట్ చేశారనే... పదేళ్లుగా విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కౌన్సెలర్గా ట్రెయినింగ్ ఇస్తున్నాను. స్పోర్ట్స్ సైకాలజీలో కోర్సు చేశాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో మాస్టర్స్ చేశాను. క్రికెట్ అసోసియేషన్స్, క్రికెట్ పర్సన్స్కి కౌన్సెలర్గా చేశాను. నా స్టూడెంట్స్ కొందరు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలలో పాల్గొనేవారు. ఒక స్టోరీ టెల్లింగ్ ఫ్లాట్ఫామ్ వాళ్లు నేను డిజేబుల్డ్ అని, సోషల్ మీడియాలో ఎక్కడా లేనని నన్ను రిజెక్ట్ చేశారని తెలిసి బాదనిపించింది. దీంతో నేనే ఓ కొత్త ఫ్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనుకున్నాను. అప్పటికే, పేరెంట్స్ని లేని ఒక అమ్మాయిని దత్తతు తీసుకొని చదివిస్తున్నాను. ఆ అమ్మాయి పేరు ఆఫియా. ఇప్పుడు ఇంటీర్మడియెట్ చేస్తుంది. ఆ అమ్మాయి స్టోరీకి మించినదేదీ ఉండదని తనతోనే ఫస్ట్ స్టోరీ స్టార్ట్ చేశాం. అక్కణ్ణుంచి స్కూళ్లు, కాలేజీలు, ఎన్జీవోలకు, వృద్ధాశ్రమాలకు వెళ్లి స్టోరీ ఈవెంట్స్ చేయడం మొదలుపెట్టాం. 2018లో మొదలు పెట్టిన ఈ ప్రోగ్రామ్లో దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్జెండర్లు.. ఇలా ఒక వర్గానికి మాత్రమే చెందినవారు ఉండకూడదని, మానవత్వంతో కూడిన కథలే ఉండాలని నియమం పెట్టాం. మా ΄్లాట్ఫామ్ పైన ఆటిజమ్ కిడ్స్ కూడా తమ స్కిల్స్ను ప్రదర్శించేలా వేదికను సిద్ధం చేశాం. లైఫ్స్కిల్స్లో శిక్షణ...‘టిజిటిఎఫ్ విద్య’ పేరుతో ఇప్పుడు 20 మంది పేద పిల్లలకు స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. పాతికమంది వాలంటీర్లు ఉన్నారు. స్కాలర్షిప్స్ ఇవ్వడమే కాకుండా లైఫ్ స్కిల్స్, వాల్యూస్, కమ్యూనికేషన్స్పై పిల్లలకు, యూత్కి స్కిల్డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాం.స్వచ్ఛందంగా... ఈ యేడాది గోవాలో ఆరు రోజుల పాటు పర్పుల్ ఫెస్ట్ జరిగింది. ప్రపంచంలో ఉన్న దివ్యాంగులు అందరూ ఒక చోట చేరే సందర్బం. అందులో ‘ది గుడ్ టాక్ ఫాక్టరీ’ ఒక వాలంటీర్గా పనిచేసింది. ముందే 1200 స్టూడెంట్స్కి ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ట్రెయినింగ్ ఇచ్చాం. ఆరు రోజుల ఈవెంట్లో 60–70 వేల మంది పాల్గొన్నారు. అందులో టిజిటిఎఫ్ పెద్ద పాత్ర పోషించింది.వైకల్యం ఉన్న వ్యక్తి ఏదైనా సాధిస్తే గొప్పగా చూడరు. వారి బాడీలో లోపాన్ని చూపిస్తూ అదొక స్ఫూర్తిగా పరిచయం చేస్తారు. జాలిగా చూస్తారు. చాలా కష్టంగా అనిపిస్తుంది. నా స్టోరీ స్ఫూర్తినివ్వాలి, నా శరీరం కాదు’’ అంటున్నారు ‘ది గుడ్ టాక్ ఫ్యాక్టరీ’ రఘు. కథ ఎన్జీవో అయితే... స్వచ్ఛందంగా ఓ పది మందిమి కలిసి ఆరేళ్లుగా ఈ కథల ఫ్యాక్టరీకి పనిచేస్తున్నాం. దీని ద్వారా కొంత మంది పేద పిల్లలకు చదువు చెప్పిస్తే బాగుంటుంది కదా అనుకున్నాం. మూడేళ్ల క్రితం ‘టిజిటిఎఫ్ విద్య’ పేరుతో ఎన్జీవోగా తీసుకొచ్చాం. ఈ సంస్థ ద్వారా చైల్డ్ ఎడ్యుకేషన్లో భాగంగా 20 మంది నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేస్తున్నాం. యువతకు, మహిళలకు స్కిల్ డెవలప్మెంట్లో ట్రెయినింగ్స్ ఇస్తున్నాం. ఈ కథల జర్నీలో ఏరుకున్న కథలెన్నో ఉన్నాయి. – రఘు – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: తీవ్ర కాలుష్యం నడుమ..మెరుగైన వాయునాణ్యతతో కూడిన ఇల్లు..!) -
సోషల్ మీడియాకు దూరం.. సివిల్స్కు దగ్గర.. ఐఏఎస్ అధికారి నేహా సక్సెస్ స్టొరీ
ఈ ఆధునికయుగంలో మొబైల్ ఫోన్, సోషల్ మీడియా.. ఈ రెండూలేని మన రోజువారీ జీవితాన్ని ఊహించలేం. అయితే సాంకేతిక పరిజ్ఞానం సృష్టిస్తున్న అద్భుతాలు మన దృష్టిని లక్ష్యాల నుంచి పక్కకు మళ్లీస్తున్నాయి. దీంతో చాలామంది తమ కెరియర్, జీవిత లక్ష్యాల సాధనలో వెనుకబడుతున్నారు. దీనిని గుర్తించిన నేహా బయద్వాల్ తన కెరియర్ ఉన్నతి కోసం కఠిన నిర్ణయం తీసుకున్నారు.యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ)లో తన మొదటి ప్రయత్నం విఫలమైనప్పుడు నేహా బయద్వాల్ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దేశంలోని అత్యంత కష్టతరమైన పరీక్షల్లో ఒకటైన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో విజయం సాధించేందుకు మూడేళ్ల పాటు మొబైల్ఫోన్కు దూరంగా ఉంటూ, ప్రిపరేషన్ కొనసాగించాలని ఆమె నిశ్చయించుకున్నారు.రాజస్థాన్లోని జైపూర్లో జన్మించిన నేహా.. జైపూర్లో తన పాఠశాల విద్యను, భోపాల్లో హైస్కూల్ విద్యను పూర్తి చేశారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగం కారణంగా నేహా తరచుగా పాఠశాలలు మారవలసి వచ్చేది. నేహా తండ్రి, శ్రవణ్ కుమార్ సీనియర్ ఆదాయపు పన్నుశాఖ అధికారి. ఆయనే నేహా ఐఏఎస్ అధికారి కావడానికి ప్రేరణగా నిలిచారు. యూనివర్సిటీ టాపర్గా నిలిచిన ఆమె యూపీఎస్సీ సీఎస్ఈ కోసం ప్రిపరేషన్ ప్రారంభించారు. తన మొదటి మూడు ప్రయత్నాలలో నేహా పరీక్షను క్లియర్ చేయడంలో విఫలమయ్యారు.ఈ నేపధ్యంలో సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ వినియోగం తన దృష్టిని మరలుస్తున్నాయని గ్రహించిన ఆమె వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మూడేళ్ల పాటు యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం వాటికి దూరంగా ఉన్నానని నేహా మీడియాకు తెలిపారు. తన ప్రిపరేషన్ సమయంలో నేహా స్నేహితులు, బంధువులకు కూడా దూరంగా ఉన్నారు. ఇలా అనేక ఒడిదుడుకులతో పోరాడి, తన సామాజిక జీవితాన్ని కూడా త్యాగం చేసిన నేహా.. 2021లో తన నాల్గవ ప్రయత్నంలో యూపీఎస్సీ సీఎస్ఈని ఛేదించి, 569 ఆల్ ఇండియా ర్యాంక్ (ఏఐఆర్) సాధించి, తన కలను సాకారం చేసుకున్నారు. నేహా ఐఎస్ అధికారిగా ఎంపికైనప్పుడు ఆమె వయసు 24 మాత్రమే. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలో నేహా ఇంటర్వ్యూలో 151 మార్కులతో కలిపి మొత్తం 960 మార్కులు సాధించారు. ఈ విజయం తరువాత నేహా బయద్వాల్ సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయారు. ఆమె ఇన్స్టాగ్రామ్లో 28 వేల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు.ఇది కూడా చదవండి: ఐపీఎల్లోకి అడుగుపెట్టిన సిక్కోలు తేజం.. ఇదో సువర్ణావకాశం -
మీ చేతి ఉన్నివస్త్రం
‘తపాలా బండి గంటల చప్పుడుకు ఏ పడుచు పిల్లయినా నిద్ర లేచినా మళ్లీ అటు తిరిగి పడుకుని తియ్యటి కలలు కంటుంది’ అని ఉంటుంది చెహోవ్ రాసిన ‘ఒక చలి రాత్రి’ కథలో! ఊహించండి. దట్టమైన చలికాలం. రాత్రి మూడు గంటల సమయం. ఏ వెధవ ప్రాణమైనా ముడుక్కుని పడుకుని కాసింత సుఖాన్ని అనుభవించే వేళ. ఒడలు మరిచే వేళ. వెచ్చదనమూ భోగమే అని భావించే వేళ. పొట్టకూటి కోసం, రోజూ చేయాల్సిన పని కోసం తపాలా మూటలను బగ్గీలో వేసుకుని స్టేషనుకు చేర్చక తప్పని మెయిల్మేన్ మనసులో ఎలా ఉంటుంది? నిశ్శబ్దాన్ని కప్పుకొని గాఢ సుషుప్తిలో ఉన్న ఊరి వీధుల గుండా అతడొక్కడే చలికి వణుకుతూ, కన్ను పొడుచుకున్నా కానరాని చీకటిలో వెళుతూ ఉంటే అతడి అంతరంగ జగాన ఏముంటుందో ఆ సమయాన ఇళ్లల్లోని గదుల్లో రగ్గుల చాటున శయనిస్తున్న మనుషులకు తెలుస్తుందా?శ్రీమంతులు కూడా భలే వాళ్లులే! చలి రాత్రుళ్లలో వారికి మజాలు చేయాలనిపిస్తుంది. అతిథులను పిలవాలనిపిస్తుంది. పార్టీలూ గీర్టీలూ. పనివాళ్లను తొందరగా ఇళ్లకు పోండి అంటారా ఏమి? లేటు అవర్సు వరకూ పని చేయాల్సిందే! బయట చలి ఉంటుంది. పాకల్లో పసిపిల్లలు ‘కప్పుకోవడానికి ఇవాళైనా దుప్పటి కొనుక్కుని రా నాన్నా’ అని కోరడం గుర్తుకొస్తూ ఉంటుంది. ఒంటి మీదున్న ఈ కనాకష్టం బట్టలతో ఇంతరాత్రి చలిలో ఇంటికి ఎలా చేరాలనే భీతి ఉంటుంది. వెచ్చటి ద్రవాలు గొంతులో ఒంపుకునే శ్రీమంతులు ‘ఒరే... ఆ రగ్గు పట్టుకుపో’ అంటారా? ‘ఈ పాత స్వెటరు నీ కొడుక్కు తొడుగు’ అని దయతో పారేస్తారా? ఆ సోయి ఉంటే కొందరు ఎప్పటికీ శ్రీమంతులు కాలేరు. పాపం పనివాడు రంగడు పార్టీలో యజమాని ఉండగా ఆ అర్ధరాత్రి రగ్గు దొంగిలిస్తాడు. పేదవాణ్ణి దొంగను చేసింది లోపలి పెద్దమనిషా... బయటి చలా? డి.వెంకట్రామయ్య ‘చలి’ కథ ఇది.దర్శకుడు బి.నరసింగరావు కథలు కూడా రాశారు. ‘చలి’ అనే కథ. నగరానికి వచ్చిన వెంటనే మొగుడు పారిపోతే ఆ వలస కూలీ చంకన బిడ్డతో వీధుల్లో తిరుగుతూ చలిరాత్రి ఎక్కడ తల దాచుకోవాలా అని అంగలారుస్తుంటుంది. అక్కడ నిలబడితే ఎవరో కసురుతారు. ఇక్కడ నిలబడితే ఎవరో తరుముతారు. నోరూ వాయి లేని చెట్టు ‘పిచ్చిదానా... నిలుచుంటే నిలుచో. నీకేం వెచ్చదనం ఇవ్వలేను’ అని చిన్నబోతూ చూస్తుంది. చెట్టు కింద తల్లీబిడ్డా వణుకుతుంటారు. చలి. చెట్టు కింద తల్లీ బిడ్డా కొంకర్లు పోతూ ఉంటారు. శీతలం. చెట్టు సమీపంలోని చాటు అటుగా వచ్చి ఆగిన కారులోని యువతీ యువకులకు మంచి ఏకాంతం కల్పిస్తుంది. బయట చలి మరి. ఒకే తావు. చెట్టు కింద చావుకు దగ్గరపడుతూ తల్లీబిడ్డ. అదే తావులో ఏమీ పట్టని వెచ్చని సరస సల్లాపం. చలి ఒకటే! బహు అర్థాల మానవులు.శతకోటి బీదలకు అనంతకోటి ఉపాయాలు. పేదవాడు బతకాలంటే నోరు పెంచాలి. లేదా కండ పెంచాలి. కండ పెంచిన మల్లయ్య రైల్వేస్టేషన్ దగ్గర సగం కట్టి వదిలేసిన ఇంటి వసారాను ఆక్రమించుకుంటాడు. తక్కిన కాలాల్లో దాని వల్ల లాభం లేదు. చలికాలం వస్తే మాత్రం రాత్రిళ్లు తల దాచుకోవడానికి అలగా జనాలు ఆ వసారా దగ్గరికి వస్తారు. తలకు ఒక్కరూపాయి ఇస్తే వెచ్చగా పడుకునేందుకు చోటు. కొందరి దగ్గర ఆ రూపాయి కూడా ఉండదు. దీనులు. పేదవాడు మల్లయ్య దయ తలుస్తాడా? తరిమి కొడతాడు. లేచిన ప్రతి ఆకాశహర్మ్యం నా ప్రమేయం ఏముందని నంగనాచి ముఖం పెట్టొచ్చుగాని అది ఎవడో ఒక పేదవాడిలో మంచిని చంపి రాక్షసత్వం నింపుతుంది. వి. రాజా రామమోహనరావు ‘చలి వ్యాపారం’ కథ ఇది.చలిరాత్రి ఎప్పటికీ అయిపోదు. అది పేదవాళ్లకు తామెంత నగ్నంగా జీవిస్తున్నారో గుర్తు చేయడానికే వస్తుంది. చలికి వణికే కన్నబిడ్డల్ని చూపి బాధ పెట్టడానికే వస్తుంది. మనందరం మధ్యతరగతి వాళ్లమే. ఇంటి పనిమనిషిని అడుగుదామా ‘అమ్మా... నీ ఇంట ఒక గొంగళన్నా ఉందా... పిల్లలకు ఉన్ని వస్త్రమైనా ఉందా?’.... ‘చలికి వ్యక్తి మృతి’ అని వార్త. మనిషి చలికి ఎందుకు చనిపోతాడు? ప్రభుత్వం అతనికి ఇస్తానన్న ఇల్లు ఇవ్వకపోతే, ఇల్లు ఏర్పాటు చేసుకునేంత ఉపాధి చూపకపోతే, నీ దిక్కులేని బతుకును ఇక్కడ వెళ్లదీయమని వింటర్ షెల్టరైనా చూపకపోతే, తన నిర్లక్ష్యాన్ని తోడు చేసుకుని చలి హత్యలు చేయగలదని గ్రహించకపోతే అప్పుడు ఆ వ్యక్తి ‘చలికి చనిపోయిన వ్యక్తి’గా వార్తలో తేలుతాడు. విలియమ్ సారోయాన్ అనే రచయిత రాస్తాడు– చలి నుంచి కాపాడటానికి కనీసం శవాల మీదున్న వస్త్రాలనైనా తీసివ్వండ్రా అని! అతని కథలో ఒక యువకుడు ఆకలికి తాళలేక ఓవర్కోట్ అమ్మి చలితో చచ్చిపోతాడు.పగిలిన గాజుపెంకుతో కోసినట్టుగా ఉంటుందట చలి. అదంత తీవ్రంగా ఉండేది మను షుల్లో నిర్దయను పెంచడానికా? కాదు! దయను పదింతలు చేయడానికి! పాతదుప్పట్లో, పిల్లలు వాడక వదిలేసిన స్వెటర్లో, నాలుగు కంబళ్లు కొనేంత డబ్బు లేకపోలేదులే అని కొత్తవి కొనో వాటిని స్కూటర్లో, కారులో పడేసి ఆఫీసు నుంచి వచ్చేప్పుడు ఒక్కరంటే ఒక్కరికి ఇచ్చి వస్తే ఎలా ఉంటుందో ఈ చలికాలంలో చూడొద్దా? ఉబ్బెత్తు బ్రాండెడ్ బొంతలో నిద్రపోయే వేళ మన చేతి ఉన్నివస్త్రంతో ఒక్కరైనా నిద్ర పోతున్నారన్న భావన పొందవద్దా? అదిగో... అర్థమైందిలే... మీరు అందుకేగా లేచారు! -
నోరూరించే కేక్ వెనుక ఇంత హిస్టరీ ఉందా? ఇంట్రస్టింగ్ స్టోరీ
పుట్టిన రోజంటే కేక్ కోయాల్సిందే! ఏదైనా వేడుక జరిగినా కేక్ కోయడం తప్పనిసరి. లోపల బ్రెడ్తో, పైన క్రీమ్తో నోరూరించే కేక్ అంటే అందరికీ ఇష్టమే. అయితే ఈ కేక్ చరిత్రేమిటో తెలుసుకుందామా?కేక్ ఎప్పుడు ఎక్కడ పుట్టిందో కచ్చితమైన ఆధారాలు లేవు. అయితే క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దంలో ఈజిప్టులో కేక్ తయారు చేసినట్లు చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఇవాళ మనం చూసే కేక్కు భిన్నంగా తేనె, గోధుమపిండితో దాన్ని తయారు చేసేవారు. అప్పట్లో సంపన్నులు వారింటి వేడుకల్లో అతిథులకు కేక్ను ఇచ్చేవారని, కేక్ రుచికరంగా మారేందుకు తేనె, తృణధాన్యాలు వాడేవారని చరిత్రకారులు అంటున్నారు. రోమ్ సామ్రాజ్యంలో సైతం కేక్ తయారీ ఉందని చరిత్ర చెబుతోంది. అప్పట్లో కేక్లు తయారు చేసి పూలు, ఇతర ఆకులతో అలంకరించేవారు. అందువల్లే ఆ కాలంలో అవి ఆలివ్ కేక్, ప్లమ్ కేక్గా ప్రసిద్ధి పొందాయి. మొదట్లో కేక్ తయారీకి తేనె వాడేవారు. చక్కెర అందుబాటులోకి వచ్చిన తర్వాత చక్కేతో తయారుచేయడం మొదలుపెట్టారు. అయితే అప్పట్లో చక్కెర ఖరీదైన వస్తువు కావడం వల్ల కేక్లు కేవలం సంపన్నవర్గాల వారికే పరిమితమయ్యేవి. పుట్టినరోజులు, పెళ్లిరోజుల సమయంలో కేకు కోసి అందరికీ పంచడం అప్పట్లో ఆనవాయితీగా మారి నేటికీ కొనసాగుతోంది. 1764లో డాక్టర్ జేమ్స్ బేకర్, జాన్ హానోన్ కలిసి కోకో గింజలను పొడి చేసి పేస్ట్లా మార్చి తొలిసారి చాక్లెట్ కేక్ తయారు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న కేక్ రూపానికి వారు అంకురార్పణ చేశారు. దీంతో కేక్ను వివిధ పదార్థాలతో తయారు చేయొచ్చన్న ఆలోచన అందరికీ వచ్చింది. ఆ తర్వాత 1828లో డచ్కు చెందిన శాస్త్రవేత్త కోయెనెరాడ్ జోహన్నెస్ వాన్ హౌటెన్ కోకో గింజల్లో పలు రకాల పదార్థాలు కలిపి, అందులోని చేదును ΄ోగొట్టి కేక్ను మరింత రుచికరంగా తయారు చేసే పద్ధతిని కనుగొన్నారు. ఆ తర్వాత బ్రిటిష్ వంటవాళ్లు మరిన్ని ప్రయోగాలు చేసి రకరకాల ఫ్లేవర్లలో కేక్లు తయారుచేయడం మొదలుపెట్టారు. అందులో గుడ్డు, చక్కెర, వైన్, బాదం, జీడిపప్పు వంటివి కలిపి సరికొత్త ప్రయోగాలు చేశారు. 1947 తర్వాత మైక్రోవేవ్ అవెన్స్ రావడంతో కేక్ను బేక్ చేసే ప్రక్రియ సులభంగా మారింది. ప్రస్తుతం వందలాది ఫ్లేవర్లలో కేక్లు దొరుకుతున్నాయి. గుడ్డు తినడం ఇష్టపడని వారికోసం ‘ఎగ్లెస్ కేక్’ తయారుచేస్తున్నారు. రోజూ ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో కేక్లు తయారై అమ్ముడు΄ోతున్నాయి. -
ఊరికే ఇచ్చే డబ్బు వద్దంటూ.. గంగానదిని ఈదాడు
పిల్లలూ! మీరెప్పుడూ అందరూ మెచ్చుకునే స్థితిలోనే ఉండాలి తప్ప ఎవరూ మీ మీద జాలి పడే స్థితిలో ఉండకూడదు. ఈ విషయం మీకు అర్థమవ్వాలంటే ఈ సంఘటన తెలుసుకోండి.అనగనగా ఓ పిల్లవాడు తన తోటివారితో కలిసి గంగానది అవతలి ఒడ్డున జరిగే జాతర చూసేందుకు వెళ్లాడు. అతనిది పేద కుటుంబం. తండ్రి మరణించడంతో బంధువుల వద్ద ఉంటూ తల్లి అతణ్ని పెంచుతోంది. పడవ ఖర్చుల కోసం ఆమె అతనికి కొంత డబ్బు ఇచ్చింది. దాన్ని అతను జాతరలో ఖర్చుపెట్టాడు. తిరిగి వచ్చేటప్పుడు పడవ ఎక్కేందుకు అతని వద్ద డబ్బు లేదు. మేమిస్తామని స్నేహితులు అతనికి చెప్పారు. కానీ ఆత్మగౌరవం కలిగిన అతను ఆ డబ్బు తీసుకోలేదు. స్నేహితులను పడవలో వెళ్లమని చెప్పి, తనొక్కడే నదిలో ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. చూశారా! ఎవరి వద్దా ఊరికే డబ్బు తీసుకోకూడదని అతనికెంత పట్టుదలో! ఆ పిల్లాడెవరో కాదు, మన దేశానికి రెండో ప్రధానిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి. ‘జై జవాన్.. జై కిసాన్’ అన్న నినాదం ఆయన ఇచ్చిందే. అయితే మీరు ఇలాంటి సాహసాలు చేయొద్దు. బాగా ఈత వచ్చిన వారే ఇలాంటివి చేయాలి. స్ఫూర్తిని గ్రహిస్తే చాలు.ఇదీ చదవండి : మెగా మ్యూజియం గురించి తెలుసా? -
బార్బీ డాల్.. ఈ సంగతులు తెలుసా మీకు?
ఇదీ బార్బీ బొమ్మ కథ!హాయ్! నేనే.. మీకెంతో ఇష్టమైన బార్బీ బొమ్మని. నా గురించి చె΄్పాలని వచ్చాను. నా పూర్తి పేరు బార్బరా మిలిసెంట్ రాబర్ట్స్. నేను పుట్టింది మార్చి 19, 1959లో. మా ఊరు న్యూయార్క్. నేను మొదటిసారి మీ ముందుకు బ్లాక్ అండ్ వైట్ స్విమ్సూట్లో వచ్చాను. నేను 11.5 అంగుళాల ఎత్తుతో ఉంటాను. నా మొదటి ధర మూడు డాలర్లు. నాకో ప్రత్యేకమైన రంగు ఉంది. ఆ రంగు పేరు ’బార్బీ పింక్’. నన్ను మీరు రకరకాల రూ΄ాల్లో చూసి ఉంటారు. డాక్టర్, లాయర్, ఇంజినీర్, పైలెట్.. ఇలా 250 రకాల రూపాల్లో నేను మీకు కనిపిస్తాను. మనిషి చంద్రుడి మీద అడుగు పెట్టే నాలుగేళ్ల ముందే, అంటే 1965లో నేను అంతరిక్షానికి వెళ్లాను తెలుసా? అమ్మాయిలు ఏయే రంగాల్లో అయితే తక్కువగా ఉన్నారో ఆ రంగాల్లో నేను కనిపించి వారిలో స్ఫూర్తి నింపాను. అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలన్నదే నా కల. ప్రపంచంలోని అన్ని దేశాల వారూ నన్నెంతో ఇష్టపడతారు. నన్నింకా వైవిధ్యంగా తయారు చేసేందుకు నాకోసం సుమారు వెయ్యి మందికిపైగా రకరకాల ఫ్యాషన్లు తయారు చేశారు. మొదట్లో చిన్నపిల్లలు మాత్రమే నన్ను ఇష్టపడేవారు. ఆ తర్వాత 6 నుంచి 99 ఏళ్లవారు కూడా నా మీద ఇష్టం చూపడం మొదలుపెట్టారు. 1997లో నా పేరు మీద ’బార్బీ గాల్’ అనే పాట కూడా తయారు చేశారు. అది ఇప్పటికీ ఎంతో ఫేమస్. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికీ 100 బార్బీ బొమ్మలు అమ్ముడు΄ోతున్నాయి. మొత్తం 150 దేశాల్లో నా బొమ్మలు అమ్ముతున్నారు.నా పేరిట అనేక సోషల్మీడియా అకౌంట్లు ఉన్నాయి. అందులో నాకు 19 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నా పేరిట ఉన్న యూట్యూబ్ ఛానెల్కి ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. నా పేరిట ఉన్న యూట్యూబ్ ఛానెల్లో నాకు సంబంధించి రకరకాల వీడియోలుంటాయి. ఇప్పటిదాకా 151 మిలియన్ల నిమిషాల సేపు ఆ వీడియోలను జనం చూశారు. నా పేరుతో 2023లో ’బార్బీ’ అనే విడుదలైంది. -ఇదీ నా కథ. ఇక ఉంటాను. బై! -
రైల్లో యాచకుడు.. మూడు ఆటోలకు యజమాని
మధుబని: ఎవరైనా ఇష్టంగా ఒక వృత్తిలో చేరాక దానిని మానివేయడం కష్టంగా మారుతుందని అంటారు. ఇదేవిధంగా యాచనను వృత్తిగా ఎంచుకున్న ఒక వ్యక్తి మూడు ఆటోలకు ఓనర్గా మారాడు. బీహార్లోని దర్భంగా, మధుబని రైల్వే సెక్షన్లో భిక్షాటన సాగించే బంభోలా అలియస్ సూరదాస్ ఇప్పడు వార్తల్లో నిలిచాడు.సూరదాస్ 25 ఏళ్ల క్రితం రైలులో భిక్షాటన చేయడం ప్రారంభించాడు. అంధత్వం కలిగిన సూరదాస్ రైలులో పాటలు పాడుతూ యాచిస్తుంటాడు. తాను ఏ పనీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని, తనకు భిక్షాటన మాత్రమే ఆసరా అని సూరదాస్ మీడియాకు తెలిపాడు. యాచనే తనకు జీవితమని పేర్కొన్నాడు.ఇప్పుడు సూరదాస్ కథ భిక్షాటనకే పరిమితం కాలేదు. ఇప్పుడు అతను మూడు ఆటోలకు యజమాని. తనకు వచ్చే ప్రతీపైసా కూడబెట్టి ఆటోలను కొనుగోలు చేసినట్లు సూరదాస్ తెలిపాడు. తన యాచనతో వచ్చిన సంపాదనతోనే కుటుంబం నడుస్తుందని, యాచనను తన ఊపిరి ఉన్నంతవరకూ కొనసాగిస్తానని తెలిపాడు. కష్టాలు ఎదురైనా మనిషి తన కలలను నెరవేర్చుకునేందుకు కృషి చేయాలని ఆయన చెబుతుంటాడు. ఇది కూడా చదవండి: కనువిందు చేస్తున్న విదేశీ వలస పక్షులు -
‘మా అమ్మాయికి బుద్ధి చెప్పండి స్వామీ’
Moral Story: చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి రోజంతా గాలి కబుర్లు చెప్పుకుంటూ గడిపేసేది. ఇక్కడ మాట అక్కడా, అక్కడి మాట ఇక్కడా చెబుతూ వుంటే చూసి వాళ్ళమ్మ చాలా బాధ పడేది. ఇలా గాలి కబుర్లు చెప్పడం తప్పని ఎంత చెప్పినా ఆ అమ్మాయి మట్టుకు పట్టించుకునేది కాదు. ఈ గాలి కబుర్ల వల్ల లేనిపోని తగాదాలు కూడా వచ్చేవి.ఒక రోజు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆయన దర్శనానికి వెళ్లిన ఆ అమ్మాయి వాళ్ల అమ్మ తన బాధ చెప్పుకుంది. ‘మా అమ్మాయికి బుద్ధి చెప్పండి స్వామీ’ అని కోరుకుంది. సాధువు మర్నాడు అమ్మాయిని తన దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు.మర్నాడు పొద్దున్నే అమ్మ తన కూతురుని సాధువు వద్దకు తీసుకుని వెళ్ళింది. సాధువు చారుమతికి ఒక కోడిని చూపించి ‘రోజంతా ఆ కోడి ఈకలు తీసి వూరు మొత్తం చల్లమ్మా’ అని చెప్పాడు.ఎక్కడ తిడతాడో అని భయపడుతూ వచ్చిన అమ్మాయి ‘ఇంతేనా?’ అనుకుంటూ కోడి ఈకలతో వూరంతా తిరుగుతూ కనిపించిన వారందరికి కబుర్లు చెపుతూ ఇక్కడో ఈక, అక్కడో ఈక విసిరేసింది. సాయంత్రం సూర్యాస్తమయం అవుతుంటే ఆ అమ్మాయిని తల్లి మళ్ళీ ఆ సాధువు దగ్గిరకు తీసుకెళ్లింది.‘ఈ రాత్రి నిద్రపోయి మళ్ళి తెల్లవారగానే రండి’ అని పంపాడు సాధువు.మర్నాడు పొద్దున్నే వాళ్లు వెళితే సాధువు అమ్మాయితో, ‘నిన్న రోజంతా విసిరేసిన కోడి ఈకలు వెతికి తీసుకు రామ్మా’ అన్నాడు.అమ్మాయి సరేనని ఊరంతా వెతకడం మొదలెట్టింది. సాయంత్రం దాక ఊరిలో ప్రతి అంగుళం వెతికినా ఒక్క ఈక కనిపించలేదు. దిగాలుగా సాయంత్రానికి ఆ సాధువు దగ్గరకు వెళ్ళి ‘స్వామి, నన్ను క్షమిచండి. నాకు ఒక్క ఈక కూడ దొరకలేదు’ అని చెప్పింది.చదవండి: ‘నలుగురు కూతుళ్లేనా..’ కాదు డాక్టర్ డాటర్స్..!అప్పుడు సాధువు ‘చూశావా... మన మాటలు కూడా ఆ ఈకల లాంటివే. ఒక్క సారి నోరు జారితే ఆ మాటలను మనం యెన్నటికీ తిరిగి తీసుకోలేము’ అని చెప్పాడు. ‘నోరు అదుపులో ఉంటే సమయం వృధా కాదు. చేయవలసిన పనులు పూర్తవుతాయి. జీవితంలో పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు’ అన్నాడు.ఆ రోజు నుంచి ఆ అమ్మాయి గాలి కబుర్లు మానేసి చక్కగా చదువుకుని వాళ్ల అమ్మను సంతోషపెట్టింది. -
సాహస యాత్రల్లో దిట్ట,, అనంతపురం నివాసి సమీరా
అనంతపురం: చిరుప్రాయంలోనే తల్లిదండ్రుల మరణంతో కుటుంబ బాధ్యతలు తలకెత్తుకుంది. జీవితంలో ఎత్తు పల్లాలను సునాయశంగా అధిగమించింది. పట్టుమని పాతికేళ్లు కూడా దాటకుండానే ప్రపంచంలోని ఎత్తైన శిఖరాల అధిరోహణకు సిద్ధమైంది. ఇప్పటికే పలు శిఖరాలను అధిరోహించింది. నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన సమీరాఖాన్... తన పేరుకు తగినట్లుగానే ఓ ప్రభంజనాన్నే సృష్టిస్తోంది. ఏ ఆధారం లేకుండా ఒంటరి పోరు సాగిస్తున్న సమీరాఖాన్ విజయ ప్రస్తానం... ఆమె మాటల్లోనే...మాది అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఉన్న విద్యారణ్య నగర్. నాన్న జాఫర్ ఖాన్, అమ్మ ఖాతూన్బీ. ఓ చిన్నపాటి ఇంట్లో ఉండేవాళ్లం. ఇప్పటికీ నేను అదే ఇంట్లో ఉంటున్నా. మేము మొత్తం ఐదుగురం ఆడపిల్లలమైతే... నేనే అందరికంటే చిన్నదాన్ని. నా చిన్నప్పుడే అమ్మ అనారోగ్యంతో మరణించింది. మా పోషణ కోసం నాన్న ఓ చిన్న వ్యాపారం మొదలు పెట్టాడు. నలుగురు అక్కలకీ నాన్న పెళ్లిళ్లు చేశాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాం.బతుకు తెరువు కోసం వలస పోయా నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో వయస్సు మీద పడి నాన్న ఏ పనీ చేయలేక ఇబ్బంది పడసాగారు. ఇది చూసి చివరకు నేనే ఇంటి బాధ్యతలన్నీ చూసుకుంటూ వచ్చా. సంపాదన అంతంత మాత్రమే ఉండడంతో చదువు మానేసి బెంగళూరుకు చేరుకున్నా. ఓ కాల్ సెంటర్లో ఉద్యోగం వచ్చింది. అయితే చాలా తక్కువ సమయంలోనే పదోన్నతులు అందుకున్నా. అలాగని చదువును పక్కన పెట్టేయలేదు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే.. మరో వైపు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేరి 2015లో డిగ్రీ పూర్తి చేశాను. ఇక జీవితం కుదుట పడుతోంది... పరిస్థితలన్నీ చక్కబడ్డాయి అనుకుంటుండగానే నాన్న మాకు శాశ్వతంగా దూరమయ్యారు. ఆ బాధ నుంచి కోలుకోలేకపోయాను. ఆ పరిస్థితుల్లో నన్ను చూసిన అక్కయ్య వాళ్లు... నన్ను పెళ్లి చేసుకోమన్నారు. అయితే నేను ఒప్పుకోలేదు. మలుపు తిప్పిన ఒంటరి ప్రయాణం నాన్న జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు నా స్నేహితులతో కలసి సైక్లింగ్, పర్వతారోహణపై దృష్టి పెట్టాను. నా సంపాదనలోనే కొంత దాచుకుంటూ వస్తూ ట్రెక్కింగ్పై శిక్షణ పొందాను. ఓ సారి సైక్లింగ్ చేస్తూ దేశమంతా తిరిగా. అలా ఓ ప్రయాణంలో కొంతమంది విదేశీయులు కలిశారు. ‘ఒంటరి ప్రయాణం సాహసంతో కూడుకున్నది. నీ ధైర్యానికి ఆశ్చర్యమేస్తోంది’ అనే వారన్న మాటలు నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచాయి. వారితో కలసి ఉన్న సమయంలో వారి ఆచార వ్యవహారాలను చాలా క్లోజ్గా పరిశీలించాను. చాలా ఇంట్రెస్ట్ కలిగింది. దీంతో విదేశీ ఆచార వ్యవహారాలపై అధ్యయనం చేయాలని అనుకున్నా. అలా మొదలైనా నా ఒంటరి ప్రయాణం... చివరకు దేశ సరిహద్దులు దాటించింది. థాయ్లాండ్, కంబోడియా, మయన్మార్, జపాన్, మాల్దీవులు, మలేసియా, సింగపూర్ తదితర 18 దేశాల్లో సైకిల్ యాత్రతో పాటు ఆయా దేశాల్లోని పర్వతాలను అధిరోహిస్తూ వచ్చా. నేపాల్ టూర్ మరవలేను నా సహచరులతో కలసి నేపాల్లో చేసిన పర్వతారోహణను నేను మరవలేను. అదే సమయంలో అక్కడి మౌంట్ ఐస్ల్యాండ్, మౌంట్ అమా దబ్లామ్ అనే రెండు పర్వతాలను అధిరోహించాలనుకున్నా. ఇది సాధ్యమయ్యే పనికాదని చాలా మంది నిరుత్సాహ పరిచే ప్రయత్నం చేశారు. అయినా నేను వినలేదు. ఎవరూ రాకపోతే ఒంటరిగానే పోతానన్నా. దీంతో కొంతమంది నాతో పాటు వచ్చేందుకు సిద్ధమయ్యారు. మౌంట్ అమా దబ్లామ్ పర్వతం పైకి ఎక్కే కొద్ది వాతావరణ పరిస్థితుల్లో శరవేగమైన మార్పులు రాసాగాయి. మంచు పర్వతాల్లో ఈ పరిస్థితులు సర్వసాధారణమే. ఓ వైపు రక్తం గడ్డ కట్టించే చలి, మరో వైపు మంచు తుఫానులు.. . ఇలా అడగడునా సవాళ్లే. కనీస అవసరాలు తీర్చుకోవడం కూడా పెద్ద సమస్యే. అంత ఎత్తైన ప్రదేశంలో నిద్ర కూడా దాదాపు అసంభవం. అలసట, ఆకలి లేకపోవడం వంటి సమస్యలూ ఎన్నో అనుభవించా. అయినా సరే అన్నింటినీ దాటుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించా. స్నేహితుడి మరణం కలిచివేసింది అమా దబ్లామ్ పర్వతంపై ట్రెక్కింగ్ అత్యంత ప్రమాదకరమని అక్కడి వాళ్లూ చెప్పారు. అయినా వినకుండా మా సహచర బృందం నేపాల్లోని లుకా గ్రామానికి చేరుకుని అక్కడ నుంచి గతేడాది అక్టోబర్ 29న 6,189 మీటర్ల ఎత్తున్న మౌంట్ ఐస్ల్యాండ్కు బయలుదేరింది. పైకి వెళ్లే కొద్దీ ప్రయాణం కష్టమైంది. 4,800 మీటర్ల ఎత్తు చేరుకున్నాక విడిది శిబిరం వేసుకునే అవకాశం లేకపోవడంతో అక్కడి నుంచి మిగిలిన 1,389 మీటర్ల ఎత్తును తప్పని పరిస్థితిల్లో పూర్తి చేయాల్సి వచ్చింది. చివరకు అనుకున్నది సాధించాం. ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకుని మళ్లీ బయలుదేరాం. అమా దబ్లామ్ పర్వతంపై దాదాపు లక్ష్యానికి దగ్గరయ్యే సమయంలో మాతో పాటు వచ్చిన ఆ్రస్టియా యువకుడు మైఖేల్పై రాళ్లు పడి, అక్కడే చనిపోయాడు. నాకైతే నోట మాట రాలేదు. తేరుకునేందుకు చాలా సమయం పట్టింది. ఆ తర్వాత చేయాల్సిన కార్యక్రమాలన్నీ దగ్గరుండి చేసి, స్నేహితుడి మృతదేహాన్ని సాగనంపి మళ్లీ ప్రయాణాన్ని కొనసాగించాం. చివరకు ఐదు రోజుల పాటు శ్రమించి 6,812 మీటర్ల ఎత్తైన అమా దబ్లామ్ పర్వతాన్ని అధిరోహించాం. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు దక్కడం చాలా సంతోషంగా ఉంది. ఈవెంట్ ఆర్గనైజర్గా.. ప్రస్తుతం నేను బెంగళూరులో ఈవెంట్ ఆర్గనైజర్గా పనిచేస్తున్నా. ఏటా రెండు సార్లు రెండేసి నెలల్లో హిమాలయాల్లో ఒంటరిగానే ట్రెక్కింగ్ చేస్తుంటాను. మధ్యలో ఒక వారం రోజుల పాటు అనంతపురానికి వచ్చి అక్కయ్యలతో కలసి వెళుతుంటాను. మరో రెండు నెలలు విదేశాల్లో సైక్లింగ్ చేస్తూ అక్కడి ఆచార వ్యవహారాలపై అధ్యయనం చేస్తుంటా. ఇందుకు అవసరమైన డబ్బును ఈవెంట్ ప్లానింగ్ చేయడం ద్వారా సమకూర్చుకుంటుంటాను. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలనే నా ఆకాంక్ష. ఇందుకు అవసరమైన డబ్బును పొగు చేసుకుంటున్నా. నా కష్టాలే ఇంతటి సాహసానికి పురిగొల్పాయి. భవిష్యత్తులో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఓ పాఠశాల ఏర్పాటు చేయాలని అనుకుంటున్నా. దేవుడి సహకారంతో ఈ లక్ష్యాన్ని కూడా సాధిస్తాననే నమ్మకం నాలో ఉంది. -
దసరా సరదాలు: "ప్యారీ మనవరాలు... పూరీ ముచ్చట్లు"
‘‘నానమ్మా... అనవసరంగా స్ట్రెస్సు పెంచుకోకు. తగ్గే మార్గం చెబుతా విను గ్రానీ డ్యూడ్’’ అంది నా కూతురు. ‘‘ఏం చెబుతావో ఏమో... ఈమధ్య అంతా సైన్సు మాట్లాడుతున్నావ్. స్ట్రెస్సు ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు పిండిపైన ఉండే అప్పడాల కర్ర అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు కిందనుండే రౌండు పీట అండ్ బీటా టీటా అల్ఫా ఒమెగా అంటూ అదేదో అంటుంటావ్. నా పాట్లేవో నన్ను పడనీ మనవరాల్ డ్యూడ్’’ అంది మా అమ్మ. మా అమ్మకూ ఈమధ్యే బీటెక్లో చేరిన నా కూతురికీ మధ్య భలే ఫ్రెండ్షిప్. ఒకరంటే ఒకరికి ఇష్టం. ఇద్దరిమధ్యా ‘షోలే’ వీరూ, జైయంత చనువు. టైము దొరికినప్పుడల్లా ఇప్పటి సినిమాల్ని ఓటీటీలో మా అమ్మకు చూపిస్తూంటే, మా అమ్మ అప్పటి సినిమాల్ని టీవీలో నా బిడ్డకు చూపిస్తూ యమా టైంపాస్ చేసేస్తుంటారు ఇద్దరూ! ఈ వైభోగానికి తోడు సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్స్టీ, లోకల్ టాక్సెస్ ఎక్స్ట్రాల్లాగా నానమ్మా, మనవరాళ్లిద్దరి మధ్యా ఎక్స్ట్రా వాదులాటలూ, కీచులాటలూ, గొడవలూ... ఆ తర్వాత ఎదుటాళ్లను గెలిపించి తామోడిపోవడానికి పోటీలూ, పేచీలు! ఫరెగ్జాంపుల్... ‘‘హే యూ ఓల్డ్ లేడీ... చూస్తుండగానే అన్నపూర్ణవు కాస్తా నిర్మలమ్మ అయిపోతున్నావు నువ్వు’’ అంటూ నా కూతురంటే... ‘‘మీ అమ్మ మాత్రం అవ్వడం లేదా... రమ్యకృష్ణలాంటిది కాస్తా వదినమ్మ వేషాల సుధాలాగా’’ అంటుంది మా అమ్మ. ఇదెలా ఉంటుందంటే హీరోని పొడవలేని విలన్ అనుచరుడు కాస్తా చివరకు సెకండ్ హీరోయిన్ని పొడిచేసినంత చిత్రంగా. ఇలా ఎందుకంటే... తన మనవరాల్నేమీ అనలేకా... అందమైన హీరోయిన్లతోనే గాక... ఇంకెవ్వరితోనూ పోల్చలేక! ఆ కూతురితో పోల్చదగ్గది మరొకరుండరూ... ఉండకూడదనే అత్యాశకొద్దీ!!అసలీ సంభాషణకు కారణం... దసరా సెలవలు కదా. అమ్మమ్మ గారి ఇంటికంటూ మా అక్కవాళ్ల పిల్లలు మా ఇంటికి రావడమూ... పండక్కి మా అమ్మను కొన్ని కోర్కెలు కోరడమూనూ. మనవరాళ్లు కదా! వాళ్ల వరాలు తీర్చకుండా ఎలా ఉంటుంది మా అమ్మ. అవేమిటంటే... మా పిల్లలకేమో చిట్టిగారెల్లో మటన్ కూర కావాలట. అక్క పిల్లలేమో ‘గారెలు మేం మామూలుగానే తినేస్తాం. మటన్లో పూరీలు ముంచుకుతింటాం. కాబట్టి ఎక్స్ట్రాగా పూరీలు చేయమంటు’న్నారు. దాంతో రెండూ చేసే పనిలో బోల్డెంత ఒత్తిడికి లోనవుతోంది మా అమ్మ. ఆమెను అనునయిస్తూ స్ట్రెస్సును తగ్గించే పనిలో ఉంది నా బిడ్డ. ‘‘అయినా... పూరీలు టైముకు ప్రిపేర్ అవ్వాలంటే... అసలెంతో కొంత స్ట్రెస్ ఉండాల్సిందేలే నానమ్మా’’ అంది నా కూతురు. ‘‘అదేందోగానీ పిల్లా... ఈ స్ట్రెస్సొచ్చినప్పుడల్లా నా కిడ్నీల్లో హార్ట్ ఎటాక్ వచ్చినట్టుంటుంది బ్రో. ఈ ఒత్తిడి అనేది ఉంది చూశావూ... మొదట ‘అగ్నిపర్వతం’ ‘ఈగాలిలో...’పాటలోలాగా కృష్ణ పాస్పోర్టు ఫొటోంత సైజులో ఉంటుందా! కాసేపటికే విజయశాంతి పట్టుకున్న సూపర్స్టార్ కటౌటంతగా పెరుగుతుంది. అబ్బో... అలా పెరిగినప్పుడు నాకెంత దాహం వేస్తుంటుందో తెలుసా పిల్లా? ‘దేవత’లో శోభన్బాబు, శ్రీదేవీ పాటలోని అన్ని బిందెల్లోకీ ఎల్లువొచ్చిన గోదారి నీళ్లన్నీ తాగీ తాగీ ఇంకా తాగుతున్నా ఇంకా దాహమేస్తున్నట్టే అనిపిస్తుంటది’’ ‘‘నీకెందుకు నానమ్మా. నీ నర్వస్నెస్ను ‘రోబో–2’లో పావురమ్మీద స్వారీ చేసే రజినీకాంత్ సైజుకు తగ్గిస్తా’’ ‘‘ఓహో... భైరవద్వీపం ‘నరుడా ఓ నరుడా’ పాటలో మరుగుజ్జుల సైజుకా?’’ అంటూ తన పాత సినిమా ఎగ్జాంపుల్కు వెళ్తూనే... ‘‘అయినా పెద్ద చెప్పొచ్చావ్ గానీ... స్ట్రెస్సుంటే వంట వీజీగా ఎలా అవుతుందే అమ్మాయ్?’’ అడిగింది. ‘‘నా ఇంజనీరింగ్ మ్యాథ్స్లా కాకుండా మీ ΄ాతసినిమాల భాషలోనే చెబుతా విను. కొద్దిగా స్ట్రెస్సుంటే... అప్పట్లో మీ ఓల్డుమూవీసులో పోగరుమోతు హీరోయిన్ని ఒక్క టీజింగుసాంగుతోనే హీరో లొంగదీసినంత వీజీగా చేసేగలవు పూరీలన్నీ’’ అంటూ మా అమ్మకు తన ఉపదేశాన్ని మొదలుపెట్టింది నా కూతురు. ∙∙ ‘‘అన్నట్టు నానమ్మా... ఈ స్ట్రెస్సూతో హెల్త్ సమస్యలూ అవీ వస్తాయని దాన్ని ఆడిపోసుకుంటుంటారు గానీ... ఒక్క వంటే కాదు. ఏ పనైనా హాయిగా జరిగి΄ోవాలంటే కాస్త ప్రెషరో, గిషరో వర్కవుట్ అవుతూ ఉండాలి. అదెంతుండాలంటే... కడాయిలో పూరీని పొంగించడానికీ, కుక్కరులోని రైసును ఉడికించడానికీ ఎంత కావాలో... పని సజావుగా జరగడానికి అంతే స్ట్రెస్సుండాలి’’ ‘‘ఎందుకే పాపం ఒత్తిడితో ఆ పూరీల్ని అంతలా పొంగించడం? ఎంత పొంగినా చివరకు పూరీకి బొక్కెట్టే కదా తింటారు. విజిళ్లతో ఎంతగా మిడిసిపడ్డా ఆవిరి ΄ోయాకే కదా కుక్కర్లోంచి అన్నాన్ని దించుతారు!’’ ‘‘నువ్వన్నది కరెక్టేగానీ నానమ్మా... ఎలాగూ తొక్క వలిచే తింటాంగదా అని తొడిమ ఊడిన అరటిపండు తినగలమా? అలాగే పొంగని పూరీతో పూరీ చేయగలమా చెప్పు. పొంగినదానికీ, పొంగనిదానికీ టేస్టులో ఏమాత్రం తేడా లేక΄ోయినప్పటికీ పొంగినదాన్నే కదా ప్లేట్లో వేసుకోబుద్ధవుతుంది! అలా పూరీలోకి చేరి పొంగేలా చేయడమే గాలి గొప్ప. అండ్... వంటలో ఆయొక్క ఐడియల్ ఒత్తిడి ఎంతుండాలంటే... పూరీపొరను చీల్చకూడదూ – అన్నాన్ని మాడ్చకూడదు. సమ్ఝే నానమ్మా డ్యూడ్?!’’ ‘‘నువ్వు ఎన్నైనా చెప్పవే... ఒత్తిడిలో పని జరగదు గాక జరగదు. పైగా నువ్వుంటే ఇంకా డిస్ట్రబెన్సు. కాబట్టి.... రాకమ్మా మనవరాలా రాకమ్మా.... నీ కోవేలా కాలేజీ... కిచేనెందుకూ నీకూ కొలువై ఉండేందుకూ...’’ ‘‘నేనేమీ రాన్లేగానీ... నువ్వనుకునేది కరెక్ట్ కాదు. ఒత్తిడి ఎంతుండాలంటే... భోజనం విషయానికి వస్తే అన్నం మాడి ఆకలితో మనల్ని మాడ్చకూడదు... ఆబగా ఓ ముద్ద ఎక్కువ తినేస్తే ఒంటిని జ్వరంతో కాల్చకూడదు. తలనొప్పి రానీకుండా చూసే కాఫీ అనే అమృతానికీ... అమృతాంజనానికీ సరిగ్గా మధ్యన గీత గీసేంత ఒడుపు కలిగి ఉండటమే ఐడియల్ ఒత్తిడి. దాన్ని నువ్వు స్ట్రెస్సనూ, ప్రెషరను. ఆ నర్వస్నెస్సులో ఓ వైబ్రేషనుంది. ఓ ఎమోషనుంటది. అది ఉండి తీరాలి నానమ్మా. కాబట్టి చపాతీలా చతికిల పడకు. పూరీలా ΄ పొంగనీ ఉత్సాహం నీలో’’ ‘‘అమ్మో అమ్మో... పైకి చూడ్డానికి పూరీలోని పైపొరలా సాఫ్ట్గా కనిపిస్తదిగానీ... కింది పొరలా భయంకరమైన టఫ్రా నీ కూతురూ. ప్రతి జనరేషన్లోనూ ఓ కొత్త థాట్ను ముందుకు తీస్కెళ్లడానికి అప్పుడప్పుడూ వంటగదిలోకి ఒకతొస్తుంది. ఆ పిల్లనే అప్పడాలకర్ర బేరర్ అంటార్రా’’ అపూరూపంగా మనవరాల్ని చూసుకుంటూ నాతో అబ్బురంగా అంది మా అమ్మ. – యాసీన్ -
పెంపుడు శునకాలు అనారోగ్యంతో ఉన్నాయని..
న్యూఢిల్లీ: రతన్ టాటా ఇప్పుడు మన మధ్య లేరు. అయితే అతని జ్ఞాపకాలు, రచనలు నిత్యం మనతోనే ఉంటాయి. రతన్ టాటా చూపిన దాతృత్వానికి సంబంధించిన అనేక ఉదాహణలు మనకు కనిపిస్తాయి. ప్రముఖ వ్యాపారవేత్త సుహైల్ సేథ్.. రతన్ టాటా చాటిన మానవత్వానికి సంబంధించిన ఒక ఘటనను పంచుకున్నారు.ఫిబ్రవరి 2018లో బ్రిటీష్ రాజకుటుంబం రతన్ టాటాను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించాలనుకుంటున్నట్లు సుహైల్ సేథ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రిన్స్ చార్లెస్ స్వయంగా రతన్ టాటాకు ఈ బిరుదును ఇవ్వాలనుకున్నారు. అయితే రతన్ టాటా బ్రిటన్ వచ్చేందుకు నిరాకరించారు. అయితే దీని వెనుకగల కారణాన్ని తెలుసుకున్న ప్రిన్స్ చార్లెస్ రతన్ టాటాను మానవతావాదిగా కొనియాడారు.ఈ ఆసక్తికరమైన కథనాన్ని సుహైల్ సేథ్ వివరించారు. 2018, ఫిబ్రవరి 6న ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్లో రతన్ టాటాను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించాలనుకున్నారు. బకింగ్హామ్ ప్యాలెస్లో ఈ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించాలని భావించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సుహైల్ సేథ్ ఫిబ్రవరి 3న లండన్ విమానాశ్రయానికి చేరుకున్నారు.ఈ సమయంలో సుహైల్ సేథ్ తన ఫోన్ని చూసుకున్నప్పుడు అతని మొబైల్ ఫోన్లో రతన్ టాటా నుండి 11 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వీటిని చూసిన సుహైల్ సేథ్ వెంటనే రతన్ టాటాకు ఫోన్ చేయగా, రతన్ టాటా తాను ఆ అవార్డుల ఫంక్షన్కి రాలేనని చెప్పారు. తన పెంపుడు శునకాలు టాంగో, టిటోలు అనారోగ్యంతో ఉన్నాయని వాటిని విడిచిపెట్టి, ఈ అవార్డుల ఫంక్షన్కి రాలేనని చెప్పారు. ఈ సమాధానం విన్న సుహైల్ సేథ్ ఆశ్చర్యపోయారు. ఈ విషయం తెలుసుకున్న ప్రిన్స్ చార్లెస్.. రతన్ టాటాను మానవత్వం కలిగిన మహనీయునిగా జంతు ప్రేమికునిగా పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: నా స్నేహితుడు, మంచి మనిషి: మోదీపై ట్రంప్ ప్రశంసలు -
రతన్ టాటా లవ్ స్టోరీ
న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా (86) కన్నుమూశారు. ఆయన విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరొందారు. అయితే రతన్ టాటా ఏనాడూ తన వ్యక్తిగత జీవితం గురించి బహిరంగంగా మాట్లాడలేదు. కానీ 1997లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో రతన్ టాటా అసంపూర్ణంగా మిగిలిపోయిన తన ప్రేమకథ గురించి ప్రస్తావించారు.తాను 1960లలో అమెరికాలో చదువుకున్న తర్వాత అక్కడే ఉద్యోగం చేయడం ప్రారంభించానని రతన్ టాటా నాటి ప్రముఖ నటి సిమి గ్రేవాల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ సమయంలో రతన్ టాటా తాను ప్రేమలో పడిన అమ్మాయిని కలుసుకున్నారు. అయితే ఇంతలోనే అతనిని నాన్నమ్మ అతనిని ఇండియాకు తిరిగి రావాలని కోరారు.దీంతో రతన్ తాను లాస్ ఏంజెల్స్లో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి భారత్కు తిరిగి వచ్చేశారు. రతన్టాటా భారత్కు తిరిగి రావడానికి ప్రధాన కారణం అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం. ఆ సమయంలో రతన్ టాటా సోదరుడు చాలా చిన్నవాడు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఆయన నాన్నమ్మ మాటను కాదనలేక భారత్ తిరిగి వచ్చారు.తాను భారత్కు వచ్చిన తర్వాత తాను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి కూడా ఇక్కడికి వస్తుందని భావించానని రతన్ టాటా ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే 1962లో భారత్-చైనా యుద్ధం కారణంగా రతన్ టాటా భావించినట్లు జరగలేదు. భారత్-చైనా యుద్ధం కారణంగా, రతన్ టాటా ప్రేమించిన అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు భారతదేశానికి పంపడానికి ఇష్టపడలేదు. ఈ వివాహానికి వారు సమ్మతించలేదు. ఫలితంగా రతన్ టాటా ప్రేమ కథ అసంపూర్ణంగా మిగిలిపోయింది. ఇది కూడా చదవండి: రతన్ టాటాకు ప్రధాని మోదీతో పాటు ప్రముఖుల నివాళులు -
కథ విన్నారా?
హీరో ఎన్టీఆర్, తమిళ దర్శకుడు ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్కుమార్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల ఎన్టీఆర్ను నెల్సన్ దిలీప్కుమార్ కలిసి ఓ కథ వినిపించారని, ఈ కథకు ఎన్టీఆర్ అంగీకారం తెలిపారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో తెరపైకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ హిందీ చిత్రం ‘వార్ 2’ (ఇందులో హృతిక్ రోషన్ మరో హీరో)తో బిజీగా ఉన్నారు. త్వరలోనే ప్రశాంత్ నీల్తో చేయనున్న ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా సెట్స్లో జాయిన్ అవుతారు. మరోవైపు ‘జైలర్ 2’ సినిమా స్క్రిప్ట్ను మరింత మెరుగుపరిచే పనుల్లో ఉన్నారు నెల్సన్. ‘జైలర్’లో హీరోగా నటించిన రజనీకాంత్ ‘జైలర్ 2’లోనూ నటిస్తారు. ఇలా... ‘వార్, డ్రాగన్’ సినిమాలను ఎన్టీఆర్ పూర్తి చేశాక, అటు ‘జైలర్ 2’ను నెల్సన్ కంప్లీట్ చేశాక... కానీ ఎన్టీఆర్–నెల్సన్ కాంబోలోని సినిమా సెట్స్పైకి వెళ్లే చాన్సెస్ కనిపించడం లేదు. దీంతో ఈ సినిమా పై అధికారిక ప్రకటన రావడానికి, ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లడానికి చాలా సమయం పడుతుందని ఊహించవచ్చు. -
గుట్టు విప్పిన సమాధి..
‘తండ్రి సమాధి దగ్గర అన్నదమ్ముల తన్నులాట. ఉత్తరప్రదేశ్లోని అజీజ్పూర్లో జరిగిన ఈ సంఘటన ఊళ్లో వాళ్లందరినీ విస్మయానికి గురి చేసింది. శిథిలావస్థకు చేరిన తండ్రి సమాధికి మరమ్మతులు చేయాలని తమ్ముడు, అవసరంలేదు.. ఎలా ఉందో అలాగే ఉంచాలని అన్న పట్టుబట్టడంతో వాదన తగువుగా మారి, చేయి చేసుకోవడం వరకు వెళ్లింది. అన్న మొండిపట్టుపై అనుమానం వచ్చిన తమ్ముడు, అన్న మీద నిఘా పెట్టాడు. ఓ రాత్రివేళ అన్న.. తండ్రి సమాధి పక్కనున్న గుంతలోంచి ఒక కుండను తీసుకెళ్లడం తమ్ముడి కంటబడింది. అన్నకు ఎదురెళ్లి ఆ కుండను లాక్కొని చూశాడు. అందులో బంగారం ఉంది. హతాశుడయ్యాడు. అన్న మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. ’ అంటూ చదువుకుపోతున్నాడు ఐటీ ఆఫీస్లో.. ఓ ఉద్యోగి.నవ్వుతూ ఆ వార్తను వింటున్న ఓ మహిళా ఉద్యోగికి ఏదో అనుమానం వచ్చినట్టుంది. వెంటనే తన కొలీగ్ చేతుల్లోంచి ఆ పేపర్ లాక్కొని తమ ఆఫీసర్ క్యుబికల్ వైపు పరుగెత్తినట్టే వెళ్లింది. ఆమె చర్యకు ఆశ్చర్యపోయాడు అప్పటిదాకా వార్త చదివిన కొలీగ్. బాస్ దగ్గరకు వెళ్లిన ఆ మహిళా ఉద్యోగి ‘సర్.. మన లాస్ట్ రైడ్లో..’ అని ఏదో చెప్పబోతుండగా..‘లీవిట్ .. ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఓ పెద్ద వ్యక్తిని ఇన్సల్ట్ చేసినట్టయింది. డిపార్ట్మెంట్ పరువుపోయింది’ అన్నాడు బాస్ అసహనంగా!‘సర్.. అతని సొంతూరులో.. ’ అని మళ్లీ ఆమె ఏదో చెప్పబోతుండగా.. ‘ఆ విషయాన్ని వదిలేయండి అన్నాను కదా..’ అన్నాడు ఫైల్లోంచి ముఖం బయటపెట్టకుండానే!‘అదికాదు సర్.. అతని సొంతూరు.. ’ అని తన మాటను పూర్తి చేయాలని ఆమె ప్రయత్నిస్తుండగా.. బాస్ మళ్లీ అడ్డుపడుతూ ‘సొంతిల్లు, బంధువుల ఇళ్లు, ఫ్యాక్టరీ, గోదామ్లు అన్నీ సర్చ్ చేశాం. ఎక్కడా చిల్లి గవ్వ, చిరిగిన డాక్యుమెంట్ కూడా దొరకలేదు’ అన్నాడు కాస్త చిరాగ్గా. ‘బట్ సర్ అతని తండ్రి సమాధి సర్చ్ చేయలేదు కదా’ స్థిరంగా అన్నది ఆ ఉద్యోగిని. అప్పుడు తలెత్తి ఆమె వంక చూశాడు అతను. ఆమె అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ.. ‘సర్.. ఆ బడాబాబు, రీసెంట్గా తన తండ్రి పదిహేనో వర్ధంతి సందర్భంగా.. తన పొలంలో ఉన్న తండ్రి సమాధిని రెనోవేట్ చేశాడని మొన్ననే పేపర్లో చదివాను. దాన్నో విశ్రాంతి మందిరంలా తీర్చిదిద్దాడని పేపర్లు తెగ పొగిడాయి’ అంటూ ఆగింది. ‘అయితే ఏంటీ?’ అన్నట్టుగా చూశాడు. వెంటనే అతని చేతుల్లో తను లాక్కొచ్చిన పేపర్ పెట్టి, ఇందాక తన కొలీగ్ చదివిన వార్తను చూపించింది ఆమె. ఆ వార్త మీద దృష్టిసారించాడు ఆఫీసర్. రెండు నిమిషాల తర్వాత ‘యెస్.. ఎలా మిస్ అయ్యాం ఈ పాయింట్ని?’ అన్నాడు పేపర్ను మడిచేస్తూ!‘సర్.. ఇప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు!’ అంది ఆమె ఉత్సాహంగా!నాలుగు రోజలకు.. బడాబాబు సొంతూరులోని పొలానికి చేరుకుంది ఐటీ టీమ్. పేపర్లు పొగిడినట్టే అది నిజంగానే సమాధిలా లేదు. వాచ్మన్ ఉన్నాడు. తామెవరో చెప్పి, ముందుకు మూవ్ అయ్యారు. ఆ సమాధిని పరిశీలిస్తుండగానే బడాబాబు తన పరివారంతో రెండు కార్లలో అక్కడికి చేరుకున్నాడు. కారు పార్క్ అవుతుండగానే హడావిడిగా కారు దిగి, పరుగెడుతున్నట్టుగా ఐటీ టీమ్ని చేరాడు. ‘మా కుటుంబానికి మాత్రమే పర్మిషన్ ఉన్న ప్లేస్ ఇది’ అంటూ బడాబాబు.. ఐటీ ఆఫీసర్ మీదకు పళ్లునూరుతుండగానే ‘కూల్ సర్, మీకు సంబంధించిన అన్ని చోట్లా ఇన్క్లూడింగ్ ఈ సమాధి.. సర్చ్ చేసుకునే పర్మిషన్ మాకుంది’ అంటూ అనుమతుల పత్రం చూపించాడు ఐటీ ఆఫీసర్. ప్యాంట్ జేబులోంచి కర్చీఫ్ తీసుకుని నుదుటికి పట్టిన చెమట తుడుచుకున్నాడు బడాబాబు. పక్కనే ఉన్న అతని అíసిస్టెంట్తో ‘సర్కి మంచినీళ్లు’ అంటూ సైగ చేశాడు ఐటీ ఆఫీసర్. ‘నో థాంక్స్’ అంటూ కోపంగా అక్కడే ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూలబడ్డాడు బడాబాబు. సమాధి చుట్టూ పరిశీలించారు ఐటీ వాళ్లు. అనుమానం ఉన్న చోటల్లా తట్టారు. ఏమీ కనిపించలేదు. రహస్య అరలేవీ తెరుచుకోలేదు. ఇదీ వృథా ప్రయాసే కాదు కదా అనుకుంటూ బడాబాబు వైపు చూశాడు ఐటీ ఆఫీసర్. అతని ముఖంలో చాలా కంగారు కనపడుతోంది. అయితే అంతా కరెక్ట్గానే జరుగుతోంది అనే భరోసాకు వచ్చాడు ఐటీ ఆఫీసర్. అతను అలా అనుకుంటున్నాడో లేదో.. ‘సర్’ అంటూ పిలిచాడు ఉద్యోగి. ఒక్క అంగలో అక్కడికి వెళ్లాడు ఆఫీసర్. సరిగ్గా సమాధికి ముందు ఫ్లోరింగ్లోని నాలుగు మార్బుల్స్ డిజైన్లో ఏదో తేడాగా ఉంది. చూపించాడు ఉద్యోగి. చూశాడు ఆఫీసర్. ప్రత్యేక డిజైన్లా కనపడుతోంది కానీ.. సమ్థింగ్ ఫిషీ అనుకున్నాడు. బడాబాబు వైపు చూశాడు. అతనిలో కంగారు ఎక్కువైంది. కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. క్లారిటీ వచ్చేసింది ఆఫీసర్కి.‘సర్..’ పిలిచాడు ఆఫీసర్. ‘ఏంటీ?’ అన్నట్టుగా చూశాడు బడాబాబు. ‘కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ఇట్?’ అడిగాడు ఆఫీసర్. ‘ఓపెన్ చేయడానికి అదేమన్నా తలుపా?’ బడాబాబు సమాధానం.‘డోర్ అయితే మేమే ఓపెన్ చేసేవాళ్లం. ప్లీజ్ ఓపెన్ ఇట్..’ స్థిరంగా చెప్పాడు ఆఫీసర్. అట్టే బెట్టు చేయక జేబులోంచి రిమోట్ తీసి ఓపెన్ చేశాడు. టెన్ బై టెన్ సైజులోని నేలమాళిగ అది. అందులో అన్నీ లాకర్లే! డబ్బు, బంగారం, వెండి, బంగారు విగ్రహాలు, వజ్రాలు ఎట్సెట్రా చాలానే దొరికాయి. అయినా ఆ ఆఫీసర్ ముఖంలో విజయం తాలూకు ఆనవాళ్లు లేవు. ఎందుకంటే ఆయనకందిన లెక్కలో దొరికినవాటి లెక్క సగం కూడా లేదు. ఫార్మాలిటీస్ పూర్తిచేసుకొని, తిరుగు ప్రయాణమవుతూ ‘ఇంకేదో క్లూ మిస్ అయి ఉంటాం’ అనుకున్నాడు.ఇవి చదవండి: ఈ కిక్కిరిసిన అపార్ట్మెంట్ ఎక్కడుందో తెలుసా!? -
కాకి హంసల కథ! పూర్వం ఒకానొక ద్వీపాన్ని..
పూర్వం ఒకానొక ద్వీపాన్ని ధర్మవర్తి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుగారు ఉండే నగరంలోనే ఒక సంపన్న వర్తకుడు ఉండేవాడు. అతడు ఉత్తముడు. ఒకరోజు ఒక కాకి అతడి పెరటి గోడ మీద వాలింది. వర్తకుడి కొడుకులు ఆ కాకికి ఎంగిలి మెతుకులు పెట్టారు. అప్పటి నుంచి కాకి ఆ ఇంటికి అలవాటు పడింది. వర్తకుడి కొడుకులు రోజూ పెట్టే ఎంగిలి మెతుకులు తింటూ బాగా బలిసింది. బలిసి కొవ్వెక్కిన కాకికి గర్వం తలకెక్కింది. లోకంలోని పక్షులేవీ బలంలో తనకు సాటిరావని ప్రగల్భాలు పలుకుతుండేది.ఒకనాడు వర్తకుని కొడుకులు ఆ కాకిని వ్యాహ్యాళిగా సముద్ర తీరానికి తీసుకెళ్లారు. సముద్రతీరంలో కొన్ని రాజహంసలు కనిపించాయి. వర్తకుని కొడుకులు ఆ రాజహంసలను కాకికి చూపించి, ‘నువ్వు వాటి కంటే ఎత్తుగా ఎగరగలవా?’ అని అడిగారు. ‘చూడటానికి ఆ పక్షులు తెల్లగా కనిపిస్తున్నాయే గాని, బలంలో నాకు సాటిరాలేవు. అదెంత పని, అవలీలగా వాటి కంటే ఎత్తుగా ఎగరగలను’ అంది కాకి.‘సరే, వాటితో పందేనికి వెళ్లు’ ఉసిగొల్పారు వర్తకుడి కొడుకులు. ఎంగిళ్లు తిని బలిసిన కాకి తారతమ్యాలు మరచి, హంసల దగ్గరకు డాంబికంగా వెళ్లింది. తనతో పందేనికి రమ్మని పిలిచింది. కాకి తమను పందేనికి పిలవడంతో హంసలు పకపక నవ్వాయి. ‘మేం రాజహంసలం. మానససరోవరంలో ఉంటాం. విహారానికని ఇలా ఈ సముద్రతీరానికి వచ్చాం. మేం మహాబలవంతులం. హంసలకు సాటి అయిన కాకులు ఉండటం లోకంలో ఎక్కడైనా విన్నావా?’ అని హేళన చేశాయి.కాకికి పౌరుషం పొడుచుకొచ్చింది.‘నేను నూటొక్క గతులలో ఎగరగలను. ఒక్కో గతిలో ఒక్కో యోజనం చొప్పున ఆగకుండా వంద యోజనాలు అవలీలగా ఎగరగలను. మీరెలా కావాలంటే అలా ఎగురుదాం. కావాలంటే పందెం కాద్దాం’ కవ్వించింది కాకి.‘మేము నీలా రకరకాల గతులలో ఎగరలేం. నిటారుగా ఎంతదూరమైనా ఎగరగలం. అయినా, నీతో పోటీకి మేమంతా రావడం దండగ. మాలో ఏదో ఒక హంస నీతో పోటీకి వస్తుంది’ అన్నాయి హంసలు.ఒక హంస గుంపు నుంచి ముందుకు వచ్చి, ‘కాకితో పందేనికి నేను సిద్ధం’ అని పలికింది.పందెం ప్రారంభమైంది.కాకి, హంస సముద్రం మీదుగా ఎగరసాగాయి.హంస నెమ్మదిగా నిటారుగా ఎగురుతూ వెళుతుంటే, కాకి వేగంగా హంసను దాటిపోయి, మళ్లీ వెనక్కు వచ్చి హంసను వెక్కిరించసాగింది. ఎగతాళిగా ముక్కు మీద ముక్కుతో పొడవడం, తన గోళ్లతో హంస తల మీద జుట్టును రేపడం వంటి చేష్టలు చేయసాగింది. కాకి వెక్కిరింతలకు, చికాకు చేష్టలకు హంస ఏమాత్రం చలించకుండా, చిరునవ్వు నవ్వి ఊరుకుంది. చాలాదూరం ఎగిరాక కాకి అలసిపోయింది. అప్పుడు హంస నిటారుగా ఎగసి, పడమటి దిశగా ఎగరసాగింది. కాకి ఎగరలేక బలాన్నంతా కూడదీసుకుని ఎగురుతూ రొప్పసాగింది. హంస నెమ్మదిగానే ఎగురుతున్నా, కాకి ఆ వేగాన్ని కూడా అందుకోలేక బిక్కమొహం వేసింది. ఎటు చూసినా సముద్రమే కనిపిస్తోంది. కాసేపు వాలి అలసట తీర్చుకోవడానికి ఒక్క చెట్టయినా లేదు. సముద్రంలో పడిపోయి, చనిపోతానేమోనని కాకికి ప్రాణభీతి పట్టుకుంది. కాకి పరిస్థితిని గమనించిన హంస కొంటెగా, ‘నీకు రకరకాల గమనాలు వచ్చునన్నావు. ఆ విన్యాసాలేవీ చూపడం లేదేం కాకిరాజా?’ అని అడిగింది.కాకి సిగ్గుపడింది. అప్పటికే అది సముద్రంలో పడిపోయేలా ఉంది. ‘ఎంగిళ్లు తిని కొవ్వెక్కి నాకెవరూ ఎదురులేరని అనుకునేదాన్ని. నా సామర్థ్యం ఏమిటో ఇప్పుడు తెలిసి వచ్చింది. సముద్రంలో పడిపోతున్నాను. దయచేసి నన్ను కాపాడు’ అని దీనాలాపాలు చేసింది. కాకి పరిస్థితికి హంస జాలిపడింది. సముద్రంలో పడిపోతున్న కాకి శరీరాన్ని తన కాళ్లతో పైకిలాగింది. ఎగురుకుంటూ వెళ్లి ఒడ్డుకు చేర్చింది.‘ఇంకెప్పుడూ లేనిపోని డాంబికాలు పలుకకు’ అని బుద్ధిచెప్పింది హంస. ఈ కథను కురుక్షేత్రంలో శల్యుడు కర్ణుడికి చెప్పాడు.‘కర్ణా! నువ్వు కూడా వర్తకుడి పుత్రుల ఎంగిళ్లు తిన్న కాకిలాగ కౌరవుల ఎంగిళ్లు తిని అర్జునుణ్ణి ధిక్కరిస్తున్నావు. అనవసరంగా హెచ్చులకుపోతే చేటు తప్పదు! బుద్ధితెచ్చుకుని మసలుకో’ అని కర్ణుణ్ణి హెచ్చరించాడు. – సాంఖ్యాయన -
రెక్కలు..
చెరువు ఏమీ ఎరగనట్టుగా ఉంది. లేత మట్టిరంగు నీరు గాలికి అలలను ఏర్పరుస్తూ ఉంది. చాలా పెద్ద చెరువే అది. ఎంత లోతు ఉంటుందో. లోతును తలుచుకునే సరికి రాఘవకు కొంచెం భయం వేసింది. మళ్లీ తెగింపు వచ్చింది. ఆ తెగింపును చెదరగొడుతున్నట్టుగా గుడి గంట టంగుమని మోగింది. రాఘవ తల తిప్పి చూశాడు.చెరువు గట్టునే ఉన్న గుడికి పనుల మీద వెళుతున్నవాళ్లు ఆగి నమస్కారాలు పెట్టి వెళుతున్నారు. కొందరు దర్శనం కోసమే వచ్చి లోపలికి వెళుతున్నారు. ఉదయం తొమ్మిది అయి ఉంటుంది. అక్కడికి కాస్త దూరంలోనే ఉన్న స్కూల్ ఫస్ట్ బెల్ కూడా టంగుమని మోగింది.రాఘవ అదేమీ పట్టనట్టుగా దృష్టిని చెరువు వైపు మళ్లించాడు. గుడి వైపు చెరువు ఒడ్డు ఉండటంతో నీళ్లు తక్కువగా ఉన్నాయి. గట్టు మీద నడుచుకుంటూ వెళితే కుడి చివర నీళ్లు ఎక్కువగా ఉన్నాయి. అంచు నుంచి జారినా దూకినా గల్లంతే. రాఘవకు చెమట పట్టింది. వెంటనే ఆకలి కూడా వేసింది. స్టవ్ మీద ఇడ్లీ ఉడుకుతుంటే తల్లి ‘ఆగరా’ అంటున్నా వచ్చేశాడు. తండ్రి గొంతు వెనుక నుంచి వినిపిస్తూనే ఉంది ‘పోనీ వెధవనీ’ అని.వెధవా తను? టెన్త్లో ఎన్ని మార్కులొచ్చాయి. ఇంటర్లో ఎన్ని మార్కులొచ్చాయి. బీటెక్ పూర్తి చేశాక కాలేజీలో అందరూ ‘నువ్వే టాప్. క్యాంపస్ సెలక్షన్లో నీకు ఉద్యోగం వస్తుంది’ అనంటే నిజమే అనుకున్నాడు. మార్కెట్ డౌన్లో ఉందట. క్యాంపస్ సెలక్షన్సే జరగలేదు. ఒక చిన్న కంపెనీ ముంబై నుంచి ఉద్యోగం ఇస్తానని అందిగాని అది బోగస్దని తేలింది. ఆరు నెలలుగా ఖాళీగా ఉన్నాడు. తండ్రిని చేతి ఖర్చులు అడగాలన్నా నామోషీగా ఉంది. తండ్రి మాత్రం ఏం చేయగలడు. చిన్న ఊరు. చిన్న ఉద్యోగం.చేతికందొస్తాడనుకున్న కొడుకు ఖాళీగా ఉంటే బాధ ఉంటుంది. విసుక్కుంటున్నాడు. రాత్రి ఫోన్ చూసుకుంటూ పడుకుని ఉంటే తిట్టాడు. ‘దేశంలో అందరికీ ఉద్యోగాలొస్తుంటే నీకెందుకు రావడం లేదురా. ముప్పొద్దులా తింటూ ఫోను చూసుకుంటూ వుంటే ఎవడిస్తాడు’ అన్నాడు. బాధ కలిగింది. థూ ఎందుకీ జన్మ అనిపించింది. హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్కు ఫోన్ చేశాడు. ‘మేమే బెంచ్ మీద ఉన్నాం బ్రో. ప్రాజెక్ట్లో దూరడం చాలా కష్టంగా ఉంది’ అన్నారు. ఏ ఆశా మిగల్లేదు. ఆ అర్ధరాత్రే వెళ్లి చెరువులో దూకుదామా అనుకున్నాడు. ధైర్యం చాల్లేదు. ఉదయాన్నే లేచి టిఫిన్ కూడా చేయకుండా ఇటొచ్చేశాడు. వచ్చి? దూకాలి. దూకాలంటే మాటలా?ఏదో అలికిడిగా కేరింతలుగా వినిపించింది. గుడి దగ్గర ఎవరో తాత. గుడ్డ పరిచి జామకాయలు అమ్ముతున్నాడు. స్కూలుకెళ్లే పిల్లలు చుట్టూ మూగి ఉన్నారు. పిల్లలు అంతగా మూగడానికి కారణం ఏమిటో చూద్దామని అటుగా అడుగులు వేశాడు. అతనికి తెలియకుండానే పెదాల మీద చిరునవ్వు వచ్చింది. తాత భుజం మీద చిలుక. పిల్లలతో ముద్దు ముద్దు మాటలు చెబుతోంది. ఆ మాటలకు పిల్లలు సంతోషంతో కేరింతలు కొడుతుంటే అది తన రెండు రెక్కల్ని అటు ఇటు ఆడిస్తూ ముక్కుతో శబ్దం చేస్తూ వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. పిల్లలు ‘హాయ్’ అని పలకరిస్తే అది దాని రెండు రెక్కల్ని కలిపి వందనం చేసింది. జామకాయలు అమ్ముతున్న తాత ‘చిలకమ్మా.. గుడి ఎటువైపుంది’ అనగానే కుడి రెక్కతో గుడి వైపు చూపిస్తూ శబ్దం చేసింది. ‘బడి ఎక్కడుందో చెప్పు’ అనగానే తన ఎడమ రెక్కతో బడివైపు చూపిస్తూ శబ్దం చేసింది. ‘బడి, గుడి అంటే నీకు ఇష్టమా తల్లీ?’ అని తాత అనగానే చిలకమ్మ అవునన్నట్లు బుర్ర ఊపుతూ శబ్దం చేసింది.తాత చిలకమ్మకి ఎంత చక్కగా ట్రైనింగ్ ఇచ్చాడో అనుకున్నాడు రాఘవ. ఓ పిల్లవాడు తాత భుజాన్ని బలంగా తాకడంతో భుజంపైన ఉన్న చిలకమ్మ కింద పడింది. ‘అయ్యో’ అంటూ దాన్ని చేతిలోకి తీసుకున్న రాఘవకి తెలిసింది దాని రెండు కాళ్లలో బలం లేదని. అది తన పొట్ట మీద తాత భుజం మీద కూచుని ఉందని. తాత వెంటనే చిలకమ్మని తన చేతిలోకి తీసుకుని దాని వీపు మీద నిమురుతూ మరల తన భుజం పైకి ఎక్కించుకుని ప్రేమగా జాంపండు తినిపించసాగాడు.రాఘవ కళ్లల్లోని బాధను చూసి ‘మనుషులకే కాదు పక్షులకు కూడా పక్షవాతం వస్తుంది బాబూ. ఇది ఇంతకు ముందు బానే ఉండేది. ఏమైందో ఏమో ఒకరోజు ఉన్నట్టుండి కాళ్లు పడిపోయాయి. కాళ్లు పడిపోయాక రెక్కలున్నా లాభం లేదు. అయినా మా చిలకమ్మ బాధ పడదు. సందడి చేయడం ఏ మాత్రం ఆపదు. దానికి తెలుసు అది సందడి ఆపేస్తే ఈ తాత దగ్గర పిల్లలు మూగరు. జామకాయలు కొనరు. అందుకే ఎగిరే శక్తి పోయినా ఎగరగలననే ఆశను చావనివ్వదు’ అన్నాడు తాత.ఆ మాటలకు చిలకమ్మ తనకి ఏదో అర్థమైనట్టుగా తాత బుగ్గ మీద ముక్కుతో అటు ఇటు రాస్తూ ముద్దాడింది. దానికి వచ్చిన కష్టంతో పోలిస్తే తనకు వచ్చిన కష్టాలు ఏమంత పెద్దవి? తల్లిదండ్రుల ఆశ తీర్చలేకపోయినందుకు బాధ కలిగి, వారికి తన మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.నిజంగా అలా చేస్తే వాళ్లు ఏమైపోతారు? వాళ్లు మాత్రం సంతోషంగా జీవిస్తారా? నిజంగా అది వాళ్లకి చావు కంటే పెద్ద నరకం. అంటే తన చేతులారా తన కన్న తల్లిదండ్రులని తనే చంపుకున్నట్టు కదా... ఇంతకంటే ఘోర పాపం ఉంటుందా?ఇంత ముసలివాడైన తాత జామకాయలు అమ్ముతూ ఎవరి మీద ఆధారపడకుండా జీవిస్తున్నాడే... యువకుడైన తనకీ నిరాశ ఏమిటి? తాత రాఘవ వైపు చూస్తూ ‘చెరువులో దూకడానికి వచ్చావు గదా బాబూ’ అన్నాడు.రాఘవ ఉలిక్కి పడ్డాడు.‘నీకెలా తెలుసు?’ అన్నాడు.‘ఉదయమే చూశాను బాబూ నిన్ను చెరువు గట్టున. నీలాంటి కుర్రాళ్లు ఒంటరిగా వచ్చి హైరానా పడుతుంటే ఆ మాత్రం కనిపెట్టలేనా బాబూ. నేను ముసలాణ్ణయినా ఇప్పటికీ చెరువులో ఆ చివర నుంచి ఈ చివరకు ఈదగలను. ఒకవేళ నువ్వు దూకితే లటుక్కున దూకి జుట్టు పట్టుకుని లాక్కొద్దామని ఒక కన్ను వేసే ఉంచాను. నువ్వే వచ్చావు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది నాయనా.. వెతకాలి. కష్టమొచ్చిన ప్రతి ఒక్కరూ చనిపోతే ఈ లోకంలో మనుషులే ఉండరు‘ అన్నాడు.రాఘవ మనసులో ఇప్పుడు ఉదయపు కోరిక పూర్తిగా చచ్చిపోయింది. కొత్త రాఘవ అయ్యాడు.‘ఈ జామకాయ తిను బాబూ’ అంటూ తన జామకాయల బుట్టలో నుంచి ఓ కాయని తీసి తాత రాఘవ చేతిలో పెట్టాడు. రాఘవ ‘అయ్యో.. నా దగ్గర పైసా కూడా లేదు తాతా’ అనగానే ‘మరేం పర్వాలేదు బాబూ’ అన్నాడు. జామకాయ చాలా రుచిగా ఉంది. చిన్న ముక్క అరచేతిలో ఉంచి చిలకమ్మ దగ్గర పెడితే స్వతంత్రంగా పొడిచి గుటుక్కుమనిపించిందది. నవ్వుకున్నాడు.‘కాయ చాలా రుచిగా ఉంది తాతా’‘ఊరవతల తోటలోవి బాబూ. వాళ్లు నాకు తెలిసినవాళ్లే. మంచి కాపొచ్చే తోట. డబ్బున్నోళ్లు. చేసుకోవాలని లేదు. ఎవరికైనా గుత్తకు ఇద్దామనుకుంటున్నారు. ఈ కాయలను ఒక ఆటోలో వేసుకొని టౌన్కు తీసుకెళ్లి అమ్మితే ఇక్కడ పది రూపాయలకు అక్కడ యాభై వస్తాయి. నేనా చేయలేను’ అన్నాడు తాత.రాఘవకు ్రౖడైవింగ్ వచ్చు. చిన్న ట్రాలీ అద్దెకు తీసుకోగలడు. ‘తోట యజమానితో మాట్లాడి నన్ను పరిచయం చేయి తాతా. తర్వాతి కథ నేను చూసుకుంటాను. రేపటి నుంచి మన బిజినెస్ టౌన్లోనే. నువ్వు తోడుండు చాలు’ అన్నాడు రాఘవ.‘ఏంటి బాబూ నువ్వనేది’‘అవును తాతా’ అన్నాడు రాఘవ.తాత కూడా చిరునవ్వు నవ్వాడు.‘ఏం చిలకమ్మా’ అన్నాడు.అది కిచకిచమని అంగీకారం తెలిపింది.ముగ్గురూ లేచి అక్కడ నుంచి కదిలారు. గుడి గంట మరోసారి టంగుమంది. కొత్త రెక్కలతో రాఘవ, తాత, చిలకమ్మ ముందుకు సాగిపోయారు. – నేదూరి భాను సాయి శ్రేయ -
పరివర్తనం: ‘దేవరపాలెం.. దేవరపాలెం..’
‘దేవరపాలెం.. దేవరపాలెం..’ అంటూ కండక్టర్ కనకరాజు రాబోయే స్టాపులో దిగబోయే ప్రయాణికులను అలర్ట్ చేస్తూ గట్టిగా అరిచాడు. కనకరాజు అరుపులకు కొంతమంది సీట్లలోంచి లేచి, హడావిడిగా తమ సామాన్లను తీసుకుంటున్నారు. ‘రావాలి.. రావాలి..’ అంటూ కనకరాజు వారిని మరింత వేగిరపెట్టాడు. కొంతమంది దిగిపోయాక, కొంతమంది ఎక్కారు. కనకరాజు టికెట్స్ కొట్టే కట్టర్తో ఎదురుగా ఉన్న ఇనుప రాడ్ మీద ‘రైట్.. రైట్..’ అంటూ గట్టిగా కొట్టాడు. అతను ఇచ్చిన శబ్దసందేశానికి బస్సు పొగలు చిమ్ముకుంటూ బయల్దేరింది.ఆ బస్టాపుకి కొద్దిదూరంలో వున్న ఒకావిడ మర్రిచెట్టు కింద కూర్చుని, బస్సులోంచి దిగుతున్న ప్రయాణికులను ఆత్రంగా చూడటం కనకరాజు కొద్దిరోజులుగా గమనిస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వచ్చే ఆ బస్ కోసమే ఆమె రెండు పూటలా వస్తోంది. ఆమెకు సుమారుగా నలభై ఐదేళ్లుంటాయి. ఆమె కళ్ళు తీక్షణంగా మెరుస్తూ, దేనికోసమో వెతుకుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. ప్రతిరోజు ఇదే ఆమె క్రమం తప్పని దినచర్య!‘ఆమె ఎవరు? రోజూ ఎవరి కోసం ఎదురుచూస్తోంది?’ అనే ప్రశ్నలు ఆమెని చూసినప్పుడల్లా కనకరాజు మదిని తొలిచేస్తున్నాయి. కనకరాజు తన ఆలోచనల్లోంచి బయటికి వచ్చి, ఓ పెద్దాయనకు టికెట్ కొడుతూ ‘బాబాయ్, ఎవరావిడ?’ తన మనసుని కుదిపేస్తున్న ప్రశ్నని అతని ముందు పెట్టాడు.‘ఆవిడో పిచ్చి మాలోకమయ్యా..!’ అతను ముక్తసరిగా బదులిచ్చాడు. కనకరాజు ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు.తన డ్యూటీ ముగించుకొని ఇంటికి చేరుకున్న కనకరాజు నిస్సత్తువగా హాల్లోని సోఫాలో వాలిపోయాడు. భర్త రాకను గమనించిన అతని భార్య సరోజ వంటగదిలోంచి వస్తూ ‘టీ పెట్టమంటారా?’ అని అనునయంగా అడిగింది.‘వద్దు సరోజా.. అలేఖ్యకి ఇప్పుడెలా వుంది? నిద్రపోతోందా?’ దుఃఖాన్ని గుండె లోతుల్లోనే దిగమింగుకుని నెమ్మదిగా అడిగాడు కనకరాజు.‘జ్వరం కొంచెం కూడా తగ్గుముఖం పట్టడంలేదు. ఏమి తిన్నా వాంతులు చేసుకుంటోంది. ఇప్పుడే పడుకుంది’ చెప్పింది సరోజ బాధని పంటితో బిగబట్టుకుని.కనకరాజుని ఈ మధ్యకాలంలో బాగా వేధిస్తోన్న అతిపెద్ద సమస్య తన ఎనిమిదేళ్ల కూతురి అనారోగ్యం! అతని కూతురు సంవత్సర కాలంగా అంతుచిక్కని కొత్త తరహా న్యుమోనియాతో నరకాన్నే చూస్తోంది. ఏడాదిగా స్కూలుకి కూడా పోవడంలేదు. తెలిసిన వాళ్లు చెప్పిన స్పెషలిస్టులందరికీ చూపించాడు. డాక్టర్లు సూచించిన అన్నిరకాల టెస్టులు చేయించాడు, చేయిస్తూనే వున్నాడు. ఫలితం మాత్రం శూన్యం!కనకరాజుకి ఎప్పటిలాగే ఆరోజు కూడా దేవరపాలెం బస్టాపు దగ్గర రెండు దఫాలూ అదే దృశ్యం ఎదురైంది. ఈసారి ఎవరినీ అడగకూడదని, తనే స్వయంగా ఆమెని కలిసి, విషయమేంటో ఆరా తీయాలని గట్టిగా తీర్మానించుకున్నాడు. తన సెలవు రోజున దేవరపాలెం వెళ్లాడు. బస్టాపు దగ్గర్లోని ఓ బడ్డీ కొట్టులో ఒక వాటర్ బాటిల్ కొంటూ, మర్రిచెట్టు కింద కూర్చున్న ఆవిడను చూపిస్తూ ‘ఎవరండీ ఆవిడ? రోజూ అక్కడ కూర్చుని, ఎవరి కోసం ఎదురు చూస్తుంది?’ అడిగాడు కాస్త చొరవతీసుకుని.‘ఆవిడా? ఎప్పుడో చిన్నప్పుడే పారిపోయిన కొడుకు తిరిగొస్తాడని.. అవిడో పిచ్చిది సార్!’ క్లుప్తంగా బదులిచ్చాడతడు.‘ఈ మాత్రం చాలు. ఆమెని చేరుకోవడానికి’ అనుకుంటూ, ఆ పక్కనే వున్న చెక్కబల్ల మీద కూర్చున్నాడు. ఆ కాసేపటికి బస్సు రావడం, వెళ్లిపోవడం జరిగిపోయాయి. బస్సు వచ్చేటప్పుడు ఆమె కళ్లల్లో అదే వెలుగు. బస్సు వెళ్లిపోయిన మరుక్షణమే నిరాశగా ఇంటిదారి పట్టింది. కనకరాజు దూరం నుంచే ఆమెను అనుసరించసాగాడు. ఆమె వెళ్తూవెళ్తూ ఓ ఇంటి ముందు ఆగిపోయింది. అదే.. తన నివాసం కాబోలు అనుకున్నాడు. అది ఓ సెంటు స్థలంలో కట్టిన చిన్న పాత పెంకుటిల్లు.కనకరాజు ధైర్యాన్ని కూడగట్టుకుని, మరో ఆలోచన చేయకుండా గబగబా ఆమె దగ్గరకు వెళ్లి ‘అమ్మా..! నా పేరు కనకరాజు. మీ బిడ్డకోసం ఎదురు చూస్తున్నారని విన్నాను. నేను డ్యూటీ మీద చాలాచోట్లకు తిరుగుతుంటాను. మీ అబ్బాయి గురించి వివరాలు చెప్తే, నా శాయశక్తులా వెతికిపెడతాను’ నిజాయితీగా తన మనసులోని మాటని ఆమె ముందు పెట్టాడు. ఆమె కనకరాజు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ‘ఎవరు బాబూ మీరు? మీరు చెబుతున్నది నిజమేనా? నా బిడ్డ నిజంగా నా చెంతకొస్తాడా?’ ఆత్రంగా అడిగింది.‘అవునన్నట్లు’ తలూపాడు కనకరాజు. ఆమె మొహం ఒక్కసారిగా కాంతివంతమైంది.‘బాబూ.. నా కొడుకు పారిపోయి పదిహేనేళ్లు గడిసిపోనాయి. కానీ ఇంతవరకు ఎవ్వరూ యివ్వని భరోసాని యిత్తున్నావు. అందరూ నన్ను ‘పిచ్చిది’ అనేటోళ్లే గానీ, ఎవరూ యిలా చెప్పలేదు బాబూ..’ తన పట్టరాని సంతోషాన్ని, కన్నీళ్ల రూపేణా వ్యక్తపరచింది.ఆమె భావోద్వేగానికి కనకరాజు ఎంతోగానో చలించిపోయాడు. అతని కంట్లో కూడా నీళ్లూరాయి.‘మీ పేరెంటమ్మా..’ అడిగాడు. ‘ఎర్రయ్యమ్మ..’ చెప్పింది.మిగతా వివరాలూ అడిగాడు కనకరాజు. తన కొడుకు పేరు రాజు అని చెప్పింది ఆమె. పదేళ్లప్పుడు మాస్టారు కొట్టారని పుస్తకాల సంచిని అక్కడే విసిరికొట్టి, ఇంటికొచ్చేశాడట. కొడుక్కి బుద్ధి రావాలని రెండు దెబ్బలు వేసిందట ఎర్రయ్యమ్మ. అంతే..కోపంతో రాజు ఊరొదిలి పారిపోయాడు. అది మొదలు ఎర్రయ్యమ్మ పిచ్చిదానిలా చుట్టుపక్కల ఊళ్లే కాదు, సిటీలోని వీథులు, రోడ్లనూ గాలించిందట. తిరిగి తిరిగి కాళ్లు అరిగాయి కానీ కొడుకు జాడ మాత్రం తెలియలేదు. అదో తీరని వెతగా మారిపోయింది. కొడుకు కోసం ఎదురుచూస్తూ లోకం దృష్టిలో పిచ్చిదైపోయింది. ప్రభుత్వం అందిస్తోన్న ఫించనుతోపాటు రెండు ఇళ్లల్లో పాచిపనులు చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తోంది. తను వుంటున్నది అద్దె ఇల్లే! అయితే ఒకప్పుడు అది తనదేనట. తాగుబోతు భర్త తన వ్యసనాల కోసం ఆ ఇంటిని అమ్మేశాడట. అయితే పెళ్లయిన మూడేళ్లకే చనిపోయాడట అతను. త్వరలోనే తన కొడుకు తనని వెతుక్కుంటూ ఇంటికి వస్తాడని ఈమధ్యనే ఓ సాధువు ఆమెకు జోస్యం చెప్పాడట.ఆమె నోట ఆ వివరాలన్నీ విన్న కనకరాజు ‘ఎర్రయ్యమ్మా, అప్పుడెప్పుడో పారిపోయిన నీ కొడుకు ఇన్నేళ్ల తర్వాత కనిపిస్తే ఎలా గుర్తుపడతావు?’ అనుమానంగా అడిగాడు. అంతే.. ఆమె గబగబా ఇంట్లోకెళ్లి, పోస్టుకార్డు సైజులో వున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఒకటి తెచ్చి, ‘మా రాజుగాడి కుడి చెంప మీద కంది గింజంత పుట్టుమచ్చ వుంది.. చూశావా బాబూ..?’ అంటూ ఆ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోన్న పుట్టుమచ్చని చూపించింది.కనకరాజు ఆ ఫొటోని అడుగుదామనుకునేలోపే ఎర్రయ్యమ్మే ‘ఈ ఫొటో నీ దగ్గర ఉంచు బాబూ.. మా వాడిని గుర్తుపట్టడానికి.. ఇంకా ఇలాంటి ఫొటోలు నాలుగైదు నా దగ్గరున్నాయిలే’ అంటూ ఆ ఫొటోని కనకరాజు చేతిలో పెట్టింది.ఆ ఫొటోని భద్రంగా జేబులో పెట్టుకుంటూ, చిన్న కాగితం మీద తన మొబైల్ నెంబరు రాసి ఆమెకిచ్చాడు కనకరాజు. అలా ఎర్రయ్యమ్మకు అంతులేని విశ్వాసాన్ని కలిగించి, కొండంత ధైర్యాన్ని నూరిపోసి ఆమె దగ్గర సెలవు తీసుకున్నాడు.తర్వాత కొన్ని రోజులకే డిపోవారు కనకరాజు డ్యూటీ రూటు మార్చేయడంతో అతనికి ఎర్రయ్యమ్మను చూసే వీలు చిక్కలేదు. కూతురిని తరచుగా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి రావడం వల్ల కూడా అతనికి ఎర్రయ్యమ్మను కలిసే తీరిక దొరకలేదు. అలా రెండునెలలు గడిచిపోయాయి. ఒకరోజు ఎర్రయ్యమ్మే అతనికి ఫోన్ చేసింది తన కొడుకు ఇంటికి వచ్చేశాడంటూ! ఆనందాశ్చర్యాలకు లోనయ్యాడు కనకరాజు. డ్యూటీకి సెలవు పెట్టి, ఉన్నపళంగా దేవరపాలెం బయలుదేరాడు.కనకరాజుని చూడగానే సంతోషంతో ఉప్పొంగిపోయింది ఎర్రయ్యమ్మ.‘అయ్యా! మీరు చెప్పినట్టుగానే నా బిడ్డ నాకు దక్కాడు.. మీరు నా పాలిట భగమంతుడే! తమరు కలకాలం చల్లగా ఉండాలయ్యా..’ అంటూ ఆనందబాష్పాలతో కృతజ్ఞతలు చెప్పుకుంది.‘నీ కొడుకు ఎక్కడమ్మా..?’అంటూ ఆత్రంగా అడిగాడు కనకరాజు.‘వంట సరుకులు కొనుక్కొత్తానని వెళ్లాడు బాబూ, వచ్చేత్తాడు..’ ఎర్రయ్యమ్మ అంటుండగానే ఓ పాతికేళ్ల యువకుడు రెండు చేతులతో రెండు సంచులను మోసుకుంటూ ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు.అతను ఎర్రయ్యమ్మలాగే సన్నగా, పొడవుగా వున్నాడు. ఇంకా పసితనపు ఛాయలు పోలేదు. ఏదో తేజస్సు ఆ కుర్రాడి ముఖంలో! ఎర్రయ్యమ్మ ‘రాజూ, నేను చెప్పానే, గొప్ప మనసున్న మారాజు అని.. ఈ బాబే’ అంటూ కొడుక్కి కనకరాజుని పరిచయం చేసింది.ఆ అబ్బాయి తన రెండు చేతులెత్తి కనకరాజుకి దండం పెట్టాడు. ఎర్రయ్యమ్మ, కొడుక్కి ఏదో చెప్తున్నట్టుగా సైగచేసింది. ఆ యువకుడు చెక్క బెంచీపై కూర్చున్న కనకరాజు కాళ్లకి నమస్కరించాడు.అనుకోని ఆ పరిణామానికి కనకరాజు బిత్తరపోతూ, ఆ కుర్రాడిని పైకి లేపుతూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు. భోంచేసి వెళ్లాలని ఎర్రయ్యమ్మ పట్టుపట్టింది. భోంచేసి, వాళ్లిద్దరి దగ్గర వీడ్కోలు తీసుకుని బస్సులో కూర్చున్న కనకరాజు మనసుకి ఎంతో ఊరటగా ఉంది. కానీ.. ఎక్కడో ఏదో తెలియని వెలితి!ఆ వెలితికి సాక్షీభూతంగా నిలిచిన ఓ సంఘటన కళ్ల ముందు కదుల్తూ అతన్ని రెండు వారాల వెనక్కు తీసుకువెళ్లింది.రాజు ఫొటోతో ఎర్రయమ్మ ఇల్లు దాటిన నాటి నుంచి ఎక్కడికి వెళ్లినా.. ఏ కుర్రాడు కనిపించినా ఆ ఫొటోతో పోల్చి చూసుకోవడం కనకరాజు దినచర్యలో భాగమైపోయింది. అలా ఎర్రయ్యమ్మ వేదన గురించే ఆలోచిస్తోన్న కనకరాజుకి ఒకరోజు.. బస్సులో ఓ పాతికేళ్ల యువకుడు బేల ముఖంతో చిన్నగా శోకిస్తూ కనిపించాడు. అది చివరి ట్రిప్ కావడంతో బస్సంతా ఖాళీగావుంది. అతన్ని గమనించిన కనకరాజు, అతని పక్కనే కూర్చుని ‘ఏమైంది బాబూ.. అంతగా కుమిలిపోతున్నావు?’ అంటూ అనునయంగా అడిగాడు. ఆ అనునయానికి కదిలిపోయిన ఆ కుర్రాడు నెమ్మదిగా గొంతు విప్పాడు.‘నా పేరు డేవిడ్ రాజు. ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్నాను. మా అమ్మను చూడాలని, ఆమెతో కబుర్లు చెప్పుకోవాలని ఆశ! మా అమ్మ గురించి నా శక్తి మేర చాలా సమాచారం సేకరించాను. అమ్మ నాకు తిండిపెట్టలేని దీనావస్థలో నన్ను మిషనరీ ట్రస్ట్లో వదిలేసిందట. ఏడాది పాటు అమ్మ ఆచూకీ కోసం చాలాచోట్లకి తిరిగాను. చాలామందిని కలిశాను. చిట్టచివరికి తన అడ్రస్ పట్టుకోగలిగాను. కానీ, నాలాంటి దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు సార్! తను ఓ నెల కిందటే ఎవరూలేని అనాథలా చనిపోయింది. నన్ను నిజంగానే అనాథని చేస్తూ..’ అంటూ బొటబొటా కన్నీళ్లుకార్చాడు.తను చదివిన ‘లా ఆఫ్ అట్రాక్షన్’ ప్రత్యక్షంగా ఎదురుకావడంతో మాటల్లో చెప్పలేని వింతానుభూతికి లోనయ్యాడు కనకరాజు. ‘మనం ఏదైనా బలంగా కోరుకుంటే.. అది జరిగితీరుతుంది!’ అని ఆ పుస్తకంలో చదివినట్టు జ్ఞాపకం. కుర్రాడి కళ్ల కిందుగా జారిపోతున్న కన్నీళ్లను తుడుస్తూ ‘నీకు అమ్మ ప్రేమ దక్కేటట్టు చేసే బాధ్యత నాది!’ అంటూ తిరుగులేని హామీనిచ్చాడు.ఆ కుర్రాడు తన్నుకొస్తోన్న దుఃఖాన్ని ఆపుకుంటూ, కుతూహలంగా కనకరాజు వైపు చూశాడు. ‘అయితే, నీ కుడి చెంప మీద చిన్న పుట్టుమచ్చ ఒక్కటే లోటు’ అన్నాడు కనకరాజు ఏదో ఆలోచిస్తూ!ఆరోజు ఆలా రెండు హృదయాల వేదనలను ‘ఒక సంతోష సాఫల్యం’గా రూపకల్పన చేశాడు కనకరాజు.ఎర్రయ్యమ్మ, రాజును కలిసిన కనకరాజు తన ఇంటికి చేరుకునేసరికి సాయంత్రమైంది. మెయిన్ గేటు తీసి, లోనికి అడుగుపెడుతుండగా ఎదురుగా కనిపించిన దృశ్యం అతన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అతని కూతురు ‘నాన్నా..’ అంటూ కిలకిలా నవ్వుతూ తనకేసి పరుగుతీస్తోంది లేడిపిల్లలా. పట్టరాని భావోద్వేగంతో కూతుర్ని చేతుల్లోకి తీసుకుని గుండెకు హత్తుకున్నాడు. కళ్లు కన్నీటి సంద్రాలయ్యాయి. ఎదురుగా వస్తోన్న అతని భార్య, తల్లి ముఖాల్లో వెల్లివిరిసిన వసంతకాలపు వెలుగులు!ఆశ్చర్యంగా భార్య వైపు చూశాడు. ‘ఉదయాన్నే మీరు అలా వెళ్లారో లేదో.. ఎప్పుడూ తిననని మొండికేసే పిల్ల ‘ఆకలీ.. ఆకలీ..’ అంటూ ఒకటే గొడవ. జ్వరం ఉందేమోనని చూశాను. ఏదో మంత్రం వేసినట్టుగా పూర్తిగా మాయం! అప్పటికప్పుడు టిఫిన్ చేసి, వేడివేడిగా తినిపించాను. తిన్నప్పటి నుంచి ఒకటే అల్లరి! ఇల్లంతా ఉరుకులు, పరుగులు! ఉదయం నుంచి పది నిమిషాలకొకసారి ఏదో ఒకటి అడిగి తింటూనే ఉంది. ఒక్క వాంతి కూడా కాలేదు. నాకే ఆశ్చర్యంగా ఉందండీ..’అంటూ ఆమె సంబరంగా జరిగినదంతా చెప్పుకుపోయింది. ‘సాటి మనిషికి సాయం చేసే నీ తత్త్వమేరా నీ బిడ్డకు ఆయుష్షు పోసుంటుంది..!’ అంది కనకరాజు తల్లి, కొడుకు వైపు మెచ్చుకోలుగా చూస్తూ. తల్లి మాటలకు చిన్నగా నవ్వేస్తూ, కూతురిని మురిపెంగా చూసుకుంటూ ఇంట్లోకి నడిచాడు కనకరాజు.ఎర్రయ్యమ్మని రాజు ఎలా చూసుకుంటున్నాడో తెలుసుకోవాలన్పించి, ఒకరోజు దేవరపాలెం వెళ్లాడు కనకరాజు. సాదరంగా ఆహ్వానించింది ఎర్రయ్యమ్మ. రాజు ఇంట్లో లేడు. ఆఫీస్ పని మీద సిటీకి వెళ్లాడని చెప్పింది. సాఫ్ట్వేర్ అయిన రాజు.. వారానికి ఒకటీ, రెండ్రోజులు మాత్రమే ఆఫీసుకి వెళ్తుంటాడు. మిగతా రోజులన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్. ఎర్రయ్యమ్మ కట్టూబొట్టూ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆమె ఒంటి మీదకి బంగారం కూడా చేరింది. కొడుకు కోరిక మేరకు పాచిపనులకు స్వస్తి చెప్పింది.ఎర్రయ్యమ్మ చెప్పిన మరో విషయం రాజు మీద కనకరాజుకి తిరుగులేని నమ్మకాన్ని కలిగించింది. తన భర్త ద్వారా పోగొట్టుకున్న, ఒకప్పటి తన సొంతిల్లు అదే ఇప్పుడు అద్దెకున్న ఆ ఇల్లు, దాన్ని ఆనుకొని వున్న మరికొంత ఖాళీస్థలాన్నీ కొని, ఎర్రయ్యమ్మ పేరిట కాగితాలు రాయించాడని చెప్పింది. విన్న కనకరాజు తన ప్రయత్నం సంపూర్తిగా సఫలీకృతమైంది అనుకున్నాడు. మనసు నిండింది.‘ప్రతి జీవితానికి చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉండాలంటారు. నా జీవితానికిది చాలు!’ అనుకుంటూ బయల్దేరడానికి సమాయత్తమయ్యాడు కనకరాజు.కుర్చీలోంచి లేచిన కనకరాజు కాళ్లకి ఎర్రయ్యమ్మ నమస్కరించబోయింది. ఆ హఠాత్పరిణామానికి అతను బిత్తరపోయి దూరం జరుగుతూ ‘ఎర్రయ్యమ్మా, నేను నీ తమ్ముడు లాంటివాడిని. నువ్వు నా కాళ్లకు నమస్కరించడం ఏంటీ?’ అన్నాడు ఇబ్బందిపడుతూ.‘సాటిమనిషి కోసం ఆలోచించే తీరికలేని ఈ కాలంలో.. అనామకురాలైన ఈ ఎర్రయ్యమ్మ కోసం నువ్వు ఎంత తాపత్రయపడ్డావో నాకెరుకే బాబూ..! పారిపోయిన నా కొడుక్కి కుడి చెంప మీద కంది గింజంత పుట్టుమచ్చ ఉందని చెప్పాను. కానీ, వాడి ఛాతీ మీదున్న పాపిడి బిళ్లంత మరొక పుట్టుమచ్చ గురించి చెప్పలేదు! అది నీకు తెలియదు కదా బాబూ..’ అంటోన్న ఆమెకు బదులేం ఇవ్వాలో తెలియక నిశ్శబ్దంగా ఉండిపోయాడు కనకరాజు.‘నా బాధ చూడలేక, నా కొడుకు రూపంలో ఈ అబ్బాయిని, నువ్వే పంపించావని నాకు ఎరుకే బాబూ! రాజు నా కడుపున కాయకపోయినా అంతకన్నా ఎక్కువే! ఇలాంటి మారాజు బిడ్డని నాకు చూపించినందుకు నీకు ఈ ఎర్రయ్యమ్మ జనమ జనమలకు రుణపడి ఉంటాది బాబూ..! నా కొడుకు మొన్ననే నీ గురించి ఓ మాట చెప్పినాడు.. ‘కండక్టర్’ అంటే నడిపించేవాడని అర్థమట! నువ్వు, నిజంగా మా బతుకులను నడిపించిన దేవుడివయ్యా..’ అంటూ చేతులెత్తి దండం పెట్టింది.‘ఎర్రయ్యమ్మా.. నీ రాజును నీ దరికి చేర్చే క్రమంలో నిన్ను ఒక అబద్ధంతో మభ్యపెడుతున్నానని ఎంతో అపరాధభావానికి గురయ్యాను. ఆ వెలితిని కాస్త దూరం చేశావు. నేనే నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి’ అన్నాడు కనకరాజు. తేలికపడిన మనసుతో తన ఇంటి దారి పట్టాడు. – శ్రీనివాసరావు తిరుక్కోవుళ్ళూరు -
రాతి కోటల్లో.. గాంధారి ఖిల్లా!
తెలంగాణలోని రాతి కోటల్లో వరంగల్, భువనగిరి కోటల తర్వాత చెప్పుకోదగ్గది గాంధారి ఖిల్లా. అపారమైన బొగ్గు నిక్షేపాలతో విరాజిల్లుతున్న మంచిర్యాల జిల్లాలో.. వేల సంవత్సరాల క్రితమే మానవ జీవనం ఉన్నట్లు తెలియజేసే సజీవ సాక్ష్యం ఈ గాంధారి ఖిల్లా. మంచిర్యాల పట్టణానికి పన్నెండు కి.మీ. దూరంలో మందమర్రి మండలం, బొక్కలగుట్ట అడవుల్లో ఈ కోట ఉంది. గుట్టపైన నాగశేషుడి ఆలయం, శివుడు, ఏనుగు, విఘ్నేశ్వరుడు, హనుమంతుడు, కాలభైరవుడి విగ్రహాలు, ద్వారాలు, దేవతా మూర్తుల ప్రతిమలు ఉన్నాయి. శత్రువుల రాకను పసిగట్టే నగారా గుండూ కనిపిస్తుంది. కొండను తొలిచి నిర్మించిన నాగశేషుడి ఆలయం, కాలభైరవ విగ్రహాలు ఆకర్షిస్తాయి. గుట్ట పైన ‘సవతుల బావులు’, కాలువలు ఉన్నాయి. కింద నీటి చెలమలో ఎండాకాలంలోనూ నీటి ఊట పైకి వస్తుంది.చారిత్రక వైభవం..అరుదైన గోండ్వానా రాతి గుట్టలపైన మానవ నిర్మిత నీటి గుండాలతో అద్భుతమైన చారిత్రక సంపద కనిపిస్తుంది. ఈ గుట్టలను ఎవరు తొలిచారనేదానికి స్పష్టతలేదు. పూర్వయుగపు పనిముట్లు, చిత్రలేఖనాలు చరిత్రకారులకు లభ్యమయ్యాయి. కొన్ని ఆధారాల ప్రకారం ఆరవ శతాబ్దంలో కందారపురం పేరుతో గాంధారి కోట రాజధానిగా సోమదేవరాజు రాజరికం చేశారని తెలుస్తోంది. ఆయన కొడుకు మాధవ వర్మ కాకతీయుల మూల పురుషుడనే ప్రస్తావన సిద్ధేశ్వర, ప్రతాప చరిత్రలో ఉన్నట్లు చరిత్రకారులు గుర్తించారు. రాష్ట్రకూటుల సామంతుడైన మేడరాజు ఈ గాంధారి కోటను పటిష్ఠం చేశాడు. ఆయన పేరుతో ఉన్న మేడ చెరువు నేటికీ కనిపిస్తుంది. పద్మనాయక రాజులు రాచకొండ కేంద్రంగా పాలిస్తూ, వైష్ణవమతం వ్యాప్తికోసం పెద్దిరాజు అనంతరాజు, రఘు నాయకులు కోటలో హనుమంతుడి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. దీన్ని ధ్రువీకరించే 15వశతాబ్దపు తెలుగు శాసనం ఉంది. పెద్దిరాజును పాండవుల పెద్దనాన్న ధృతరాష్ట్రుడిలా, పెద్దమ్మను ధృతరాష్ట్రుడి భార్య గాంధారిలా భావించి, ఈ కోటను ‘గాంధారి కోట’గా పిలిచారని చరిత్రకారుల అభిప్రాయం. క్రీ.శ.1300లో కథాగేయంగా ‘గాంధారి కథ’ రచన చేసినట్లు చరిత్రకారులు గుర్తించారు. కాని కవి విషయంలో స్పష్టత లేదు. నిజాం కాలంలో పన్ను వసూళ్ల కోసం స్థానిక గోండు మొకాశీలను నియమించుకున్నట్లు కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. 1928లో తొలిసారి గాంధారి కథను ప్రచురించినట్లు ఆధారాలున్నాయి. ఇప్పటికీ గిరిజన కథా గేయాల్లో, జానపదాల్లో ఈ కథ వినిపిస్తుంది.అరుదైనది..గుట్టను తొలిచి కట్టిన కోటగా గాంధారి ఖిల్లాకు దక్షిణ భారతదేశంలోనే ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ లోహయుగం నాటి ఆనవాళ్లున్నాయి. కాకతీయ, రాష్ట్రకూటుల కాలం నాటి చారిత్రక సంపద ఉంది. ఇలాంటి అరుదైన కోటలను రక్షించుకుంటే చారిత్రక సంపదతోపాటు, పర్యాటక వనరులనూ కాపాడినట్లవుతుంది. – డా.ద్యావనపల్లి సత్యనారాయణ, తెలంగాణ చరిత్రకారుడు.పర్యాటక కేంద్రంగా..ఎంతో చరిత్ర కలిగిన గాంధారి ఖిల్లాను అద్భుతమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధిపరచాలి. దానికి అవసరమైన ఏర్పాట్ల మీద ప్రభుత్వం దృష్టిపెట్టాలి. – మేసినేని రాజయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, ఆదివాసీ నాయకపోడ్ సాంస్కృతిక కళాభివృద్ధి సంఘం. మాఘమాసం జాతర..అనాదిగా గాంధారి ఖిల్లా నాయక్పోడ్ తెగకు ఆరాధ్య ప్రాంతంగా కొనసాగుతోంది. తెలంగాణలో ఇదొక ప్రధాన గిరిజన తెగ. వీరిక్కడ ప్రతి మాఘమాసం (ఫిబ్రవరి) భక్తి, శ్రద్ధలతో జాతర జరుపుతారు. ఇది మూడురోజులు సాగుతుంది. మొదటిరోజు సాయంకాలం దేవతా మూర్తులను సదర్భీమన్న నుంచి గోదావరికి తీసుకొచ్చి, స్నానం చేయిస్తారు. ఆ రాత్రి ఆటపాటలతో గడిపి, మరుసటిరోజు మధ్యాహ్నం డప్పు చప్పుళ్లతో జాతర ప్రాంతానికి తీసుకెళ్తారు. చివరిరోజు ఖిల్లా పైభాగంలో ఉన్న మైసమ్మ తల్లి వద్ద పట్నాలు వేసి, నైవేద్యం పెట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. చరిత్రలో నాటి పాలకులు గాంధారి ఖిల్లాను అష్టదిగ్బంధనం చేసిన ఆనవాళ్లున్నాయి. దాని గుర్తుగా పాలకాయలు (కొబ్బరికాయలు), కోడిగుడ్లు, మేకలు, కోళ్లు (గతంలో దున్నపోతులను) బలి ఇచ్చే సంప్రదాయం నేటికీ ఈ జాతరలో కొనసాగుతోంది. దీనికి నాయక్పోడ్లే ప్రధాన పూజారులు. ముగింపులో జీడికోట వద్ద జరిగే దర్బార్(సభ)లో గిరిజనుల కష్టసుఖాలు, గాంధారి ఖిల్లా అభివృద్ధిపై చర్చిస్తారు. ఈ జాతరకు మహారాష్ట్ర నుంచి కూడా గిరిజనులు వస్తారు. జాతర తిరుగువారం మాత్రం నాయకపోడ్లే జరుపుకుంటారు.ప్రకృతి రమణీయతకు నెలవు..మంచిర్యాల వరకు రైల్లో వచ్చి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఈ కోటను చేరుకోవచ్చు. గుట్టపైకి మాత్రం కాలినడకనే వెళ్లాలి. కోట పరిసర ప్రాంతంలో చెప్పులతో అనుమతించరు. చుట్టూ అడవి, కాలువలు, చెరువులతో రమణీయంగా ఉంటుందీ ప్రాంతం. వన్యప్రాణుల నిలయం. ట్రెక్కింగ్కి అనువైన చోటు. పర్యాటకుల సౌకర్యాల కోసం ప్రణాళికలు వేసినా, అవి ముందుకు సాగలేదు. ఎన్హెచ్ 363ని ఆనుకుని గాంధారి వనం పేరుతో అటవీ శాఖ ఓ పార్కును అభివృద్ధి చేసింది. ప్రస్తుతం సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్, వెడ్డింగ్ షూట్లు జరుగుతున్నాయి. ‘పరేషాన్’ అనే సినిమాలో టైటిల్ సాంగ్ ‘గాంధారి ఖిల్లా కత్తవా’ అంటూనే మొదలవుతుంది. – ఆకుల రాజు, సాక్షి ప్రతినిధి, మంచిర్యాలఇవి చదవండి: Health: అంతా మెదడులోనే ఉంది.. -
మెదడు.. మోకాల్లోకి..
కలో.. భ్రమో.. రాత్రి తోకచుక్క కనపడింది. తోకచుక్క సంఘ సంస్కరణ ప్రయాణ పతాక కదా. ఏం జరుగుతుందో ఏం జరగదో.. మెలకువను స్వప్నించి నిద్రలోనే లేచినట్టు.. తిరిగినట్టు.. మాట్లాడినట్టు.. చీకటి తెరలు పూర్తిగా తొలగిపోలేదు. తెల్లవారిన సందడి ఇపుడిపుడే మేల్కొంటోంది. పలుచని మంచు పొగలా చుట్టుకుంటోంది.లేచాను. రోజూ లేచే ఉదయపు నడకల సమయమే. అడుగు ముందుకేశాను. ఒకరకమైన తూలింపు. పట్టించుకోలేదు. లుంగీ మడిచి బాత్రూమ్కు వెళ్ళాను. అపుడు చూశాను, మోకాలు కొద్దిగా వాచినట్లుంది. నొప్పి లేదు. ఎత్తుగా ఉబ్బిన చోట చేతితో నొక్కాను. మెత్తగా నునుపుదేరి ఉంది, రబ్బరు బంతిలా. ఏమైందీ? ఎక్కడైనా తగిలిందా? ఏదైనా కుట్టిందా? గిల్లి మాత్రం చూడలేదు. నడక దుస్తుల్లోకి మారాను. నడుస్తుంటే ఇబ్బందేమీ లేదు. సలుపు కూడా లేదు. ఆటల మైదానంలో పదిసార్లు వలయంగా తిరిగాను. రెండు కిలోమీటర్లు తిరిగినట్టు లెక్క. ‘అలా నడుస్తున్నారేంటీ? కాలు ఈడుస్తున్నట్టు..’ ఇంటికొస్తుంటే సుబ్బారాయుడు పలకరించాడు.‘ఏమీ.. లేదే..’ అన్నాను జాగ్రత్తగా అడుగులేస్తూ. ప్రతిక్షణం నడక దగ్గర్నుంచి మాట దగ్గర్నుంచి అందరికీ కావాలి. రోజువారీకి భిన్నంగా ఎవరూ ఉండకూడదు. ఉంటే ఒకటే ప్రశ్నలు.. ఎందుకు, ఏమిటి, ఎలా.. ఆరా! అరే.. ఎదురైన చాలామంది నడకల్లో ఏదో తేడా స్పష్టంగా కనబడుతోంది. కుంటి నడక కాదు గానీ నేలకు పాదం ఈడుస్తూ.. ఎవర్నీ అడగలేదు. తీరా ఇంట్లోకి చేరగానే ఉమ ఎదురొచ్చింది. ఆమె నడక తీరూ అలాగే ఉంది. ఉన్నట్టుండి నన్ను ఆట పట్టించడానికన్నట్టు గాలిలోకి ఎగిరింది. పైగా నవ్వుతోంది. ఆశ్చర్యంగా చూశాను. ‘ఏమీ లేదండి. నొప్పేం లేదు. అయితే నేలకు తాకించి నడుస్తుంటే బావుంది’ ఇంకేం ప్రశ్నలు వేయలేదు. మొత్తమ్మీద లోకమంతా తెలియని రాగమేదో ఆలపిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి అంటుకునేదా? కాదేమో. స్నానానికి వెళ్ళినపుడు తేరిపారి పరిశీలనగా చూశాను. మోకాలు చిప్ప ఉబ్బి నల్లగా తాటికాయలా ఒకవిధమైన గరుకుగా మారింది. రెండో కాలు మామూలుగానే ఉంది. కూరగాయలు కొనడానికి మార్కెట్టుకెళ్ళాను. అందరూ తెలిసినవారే. కొంచెం పట్టుబట్టి జాగ్రత్తగా అడుగులేస్తూ తిరుగుతున్నాను. చాలామంది ముఖాలు నీరసంగా కనిపిస్తున్నాయి. ఏదో పోగొట్టుకుని దాచినా దాగని సత్యాన్ని మోస్తున్నట్టుగా భారంగా అడుగులేస్తున్నారు. లోకం వింతగా కనిపిస్తోంది.రెండురోజుల క్రితం రామంగాడి గృహప్రవేశం సందర్భంగా సత్యనారాయణ ప్రతం చేయించిన పురోహితుడు కనిపించాడు. ఆయన పంచె ఎగదోసి మోకాలు చిప్ప కనిపించేలా ఎత్తి ఎత్తి అడుగులేస్తూ నడిచి వస్తున్నాడు. అసింటా అన్నట్టు దూరంగా జరుగుతూ అడుగులేస్తున్నాడు. ఆయనకు కూడా అదే చోటులో నల్లగా చర్మం చిట్లినట్లుగా ఉంది. మొన్నటి దృశ్యం కళ్ళ ముందు కనిపించింది. వ్రతం అయిపోయింది. ఇక కథ చెప్పాలి. చెప్పడం మొదలెట్టగానే అది ఎప్పుడూ చెప్పే పాతకథ అని తెలిసిపోయింది. ఆగమని సైగ చేశాను.‘అయ్యా.. పురోహితులు గారూ.. మన్నించండి. ఎపుడూ అదే కథా? మీరు కథలో చెబుతున్న సముద్ర వ్యాపారాలు గట్రా ఇపుడు లేవు కదా. వ్రతం చేయకపోతే వచ్చే నష్టం మా రామం గాడికి వర్తించదు. వాడిది రియలెస్టేటు బిజినెస్. దానికి సంబంధించిన కథ అల్లి చెబితే సబబుగా అర్థవంతంగా ఉంటుంది. వాడు జాగ్రత్తలేవో పడతాడు. అలాగే సాఫ్టువేర్ ఇంజనీరు.. గవర్నమెంటు ఉద్యోగం.. సారా వ్యాపారం.. ఎగుమతులు దిగుమతులు, వాణిజ్యం.. వగైరాల కథలు రెడీమేడ్గా తయారుచేసుకుని ఉంచుకుని చెప్పొచ్చు కదా! ఎపుడూ పాత పురాణమేనా.. ఎవరు మెచ్చుకుంటారు?’ అన్నాను సూటిగా చూస్తూ.పురోహితుడు ఒక్కక్షణం మాట్లాడలేదు. ఎదుట వ్యక్తి చెప్పేవి కొందరికి సహించవు. అహం దెబ్బతింటుంది కాబోలు. రామాన్నీ నన్నూ చూస్తూ ఉండిపోయాడు. ఆలోచిస్తున్నట్టుగా ఆగాడు. కాసేపటికి తేరుకున్నాడు. ఆ తర్వాత తనకు సహజసిద్ధమైన లౌక్యం ప్రదర్శించాడు.‘నిజమే సుమండీ.. మహ బాగా చెప్పారు. మీరన్నట్టుగా మహ బేషుగ్గా ఉంటుంది. మీరు చెప్పింది చక్కగా ఉంది. కానీ కథలెక్కడ్నుంచి వస్తాయండీ’ అంటూ దీర్ఘం తీస్తూ అన్నాడు. ఇందాక మొదలెట్టిన కథను తిరిగి చెప్పడం ప్రారంభించాడు. అంతేకాదు వెళుతూ వెళుతూ నా ముఖం కేసి చూసి నాలో ఏ దైన్యం సూచిక కనిపించిందో ఏమో ఒక ఉచిత సలహా విసిరాడు.‘ఏడు ఏలకులను పసువు గుడ్డలో చుట్టి దిండు కింద పెట్టుకుని పడుకోండి. మీ అప్పులన్నీ తీరిపోతాయి. మీరూ బ్రహ్మాండమైన ఇంతకుమించిన గృహం కట్టుకుంటారు’ అన్నాడు. ఆయన వృత్తికి నేనేమైనా ఆటంకం కలిగించానా? ఏమో మరి. ఇది జరిగి మూడురోజులైంది. ఇంతలో ఇట్లాంటి మోకాలుతో కనిపించాడు. తిరిగొస్తుంటే కామేశ్వరరావు కనిపించాడు. వాళ్ళ అమ్మాయికి ఇంకా పెళ్ళి ఘడియలు రాలేదనుకుంటాడు. వయసొచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంది. భారం దేవుడి మీద వేసేశాడు. అసలు జరిగిందేమిటంటే కళ్యాణ యోగం గురించి ఒక జ్యోతిష్యుడ్ని సంప్రదించాడు. అతగాడేమో ‘రెండు సంవత్సరాలు ఆగాలి. ఈలోపు ఎంత ప్రయత్నించినా మీ అమ్మాయికి పెండ్లి చేయలేవు’ అని చెప్పాడట.అంతే ఇక మౌనంగా ఉండిపోయాడు. సరిగ్గా అదే సమయంలో మంచి సంబంధాలు కోరి వచ్చినా ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయాడు. ఆ తర్వాత కుజదోషమనీ వరనిరూపణ కుదరలేదనీ.. అదనీ ఇదనీ జాతకాల పిచ్చిలోపడి కాలయాపన చేసేశాడు. పోనీ ఆ జ్యోతిష్యుడు చెప్పిన ఆ రెండేళ్ళు ఊరుకుని తర్వాత కాలంలో గట్టి ప్రయత్నం చేస్తే ఈపాటికి కూతురుకు పెళ్ళి జరిగిపోయేదేమో. కార్యసాధనకు ప్రయత్నం తోడుగా ఉండాలి. గీచి గీచి జాతకాలు పట్టించుకుని చెడగొట్టుకుంటున్నాడు. పలకరించాను. చేతితో మోకాలు దగ్గర తడుముకున్నాడు. ఎత్తుగా గాలి బుడగలా కనిపిస్తోంది. అతని పరిస్థితి అర్థమైపోయింది.ఇంటికెదురుగా శంకరయ్య ఉన్నాడు. భార్య పేరు భారతమ్మ. బయటికెళితే చాలు ప్రతిరోజూ పెళ్ళాం ఎదురు రావాలి. వీధిలోంచి గట్టిగా రమ్మని అరుస్తాడు. ఇంటి లోపల ఎక్కడున్నా ముసిముసి నవ్వులు నవ్వుతూ చీర చెంగుతో ముఖం తుడుచుకుంటూ వచ్చేస్తుంది భారతమ్మ. ఎదురురావడాన్ని మొగుడు ప్రసాదిస్తున్న అరుదైన గౌరవంగా భావిస్తుంది. ఆ అవకాశం ఇచ్చి అర్ధాంగి దగ్గర మంచి మార్కులు కొట్టి బంధం గట్టిగా ముడిపెట్టే చిట్కాను శంకరయ్య పాటిస్తున్నాడేమో. ఆవేళ చూద్దును కదా శంకరం కుంటుకుంటూ నడుస్తున్నాడు. ఓహో .. అనుకున్నాను.జబ్బకూ మెడలోనూ తాయెత్తులు కట్టుకునే వీరయ్య, మెడనిండా ఏవో పసుపు, ఎరుపు రంగుల తాళ్ళూ, ఒంటి మీద కాషాయం దుస్తులూ ముఖం నిండా ఎర్రటి పెద్ద బొట్టూ నుదుటన విభూది పూసుకునే నారాయణ, రాహు కాలం, వర్జ్యం, ముహూర్తం చూసుకుంటే గానీ ఇల్లు కదలని వీరబాబు, ప్రతిరోజూ టెంకాయ కొట్టి దేవుని దర్శనం చేసుకునే సూరిబాబు, నలుపు ఎరుపు దుస్తుల్లో కనిపిస్తున్న సీజనల్ భక్తులు, నిత్యం నదీ స్నానం చేసే వీరభద్రాచార్యులు, దూరపు బంధువెవరో చనిపోతే నిష్ఠగా ఎండుగడ్డితో తలగడ చేసుకుని నేల మీద పడుకుంటూ మైల పడుతున్న రామచంద్రం.. వీళ్ళందరూ అదేరోజు తారసపడ్డారు. అందరూ మోకాలు వాచినవాళ్ళే.ఈవేళే ఎందుకు అకస్మాత్తుగా పాదాలు ఎగేస్తూ కనిపిస్తున్నారు? అసలు నేనెందుకు ఇదే బాధ అనుభవిస్తున్నాను? మనిషి నాగరీకం అయ్యే కొలదీ కొత్త కొత్త బలహీనతల్ని ఎందుకు మోస్తున్నాడు? తాతగారి నాన్నగారి బామ్మగారి భావాలతో కునారిల్లి సొంత ఆలోచనల్ని చంపుకుని బతకడం సరైనదేనా? ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఏ పని అయినా విజయం సాధిస్తుందనీ మూఢనమ్మకాలతో కాలాన్ని వృథా చేసుకోవడం తగదనీ ఎంతమందికి చెప్పగలం? ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నాకు తత్వం బోధపడింది. నడవడికలో అమలు చేయాలి.ఉదయం తొమ్మిది గంటలు. బైకు తీసుకుని రోడ్డు మీదకు రాగానే తెల్లని బట్టలతో అచ్చమ్మ ఎదురు పడింది. నన్ను చూసింది. అశుభం అని తలచి వెనక్కి తిరిగి నిలబడింది. తన వల్ల ఎవరికీ మనసులో కూడా ఏ బాధా ఇబ్బంది కలగకూడదనే తలంపుతో చేసిన పని అది. ఆవిడెందుకలా చేసిందో తెలుసు. నేను ఊరుకుంటానా? నేనూ ఆగాను. వారగా తల తిప్పి చూసింది. ఆమె వంకే చూస్తున్నాను. ‘నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. మీరు ఎదురొస్తేనే ముందుకు వెళతాను. లేకపోతే ఇక్కడ్నుంచి కదలను’ అన్నాను. ఆమె కళ్ళు మెరిశాయి. ముఖంలో కాంతులు. గబగబా నా దగ్గరకొచ్చి నిలబడింది.‘నా బాబే.. నా నాయనే.. నా ఆయుస్సు కూడా పోసుకుని నిండు నూరేళ్ళూ సుఖసంతోషాలతో బతుకు తండ్రీ..’ అని తటాలున తన తలలోంచి తెల్ల వెంట్రుకను పీకి నా తలలో వేసి తెల్లని స్వచ్ఛమైన నవ్వుతో అనేక రకాలుగా దీవించింది. మనస్ఫూర్తిగా ఎదురొచ్చి ‘అంతా శుభమే జరుగుతుంది’ అంది. వెనక్కి చూడకుండా వెళ్ళిపోయింది. ఎన్నాళ్ళ నుండో గుట్టగా దాచిన శుభాశీస్సుల బలం.. నాకొక్కడికే చెందుతుందనుకోడం ఎందుకు? దీవెనలు, ఆశీస్సులను ఒక సానుకూల దృక్పథ సంకేతంగానే చూడాలి. పాఠశాల చేరాను. మనసు ఎంతో ఎపుడూ లేనంత ఉల్లాసంగా ఉంది. రోజంతా నెగటివ్ భావనలు రానీయకుండా మసలుకున్నాను. నా వైపు నుండి కాకుండా ప్రతి వ్యక్తినీ అతని దృష్టి కోణంలోంచి పరిశీలిస్తున్నాను. నాలోని మార్పుకు నాకే ఆనందం అనిపించింది. హాయిగా ఉంది.మోకాలు వాపు విచిత్రంగా కొద్దిగా తగ్గింది. ఫలితం అపుడే కనిపించిందా? మనిషి నడవడికను బట్టే రోగాలొస్తాయి. ప్రవర్తనలు ఆలోచనలు దేహానికీ మససుకూ చెందినవేనా? ఖాళీ పీరియడ్లో మళ్ళీ ఆలోచనలు చుట్టుముట్టాయి. ఇంతకీ నాకెందుకు మోకాలు వాచింది? తటాలున బుర్రలో ఒక వెలుగు.. మిత్రుడి బలవంతం మీద శంకుస్థాపన జరిగినరోజున కొబ్బరికాయ కొట్టడం గుర్తుకొచ్చింది. అంతేనా? ఇంకా ఏమైనా ఉందా? ఆలోచనలు సాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఏమీ గుర్తుకు రావడంలేదు.ఏదో అపసవ్యంగా ఉండే ఒక చెడు నమ్మకాన్ని మనసులో దూర్చే ఉంటాను. లేకపోతే ఎంతో కొంత శాస్త్రీయంగా ఆలోచించే నాకీ తిప్పలు ఎందుకొచ్చాయి? స్కూలు అయ్యింతర్వాత అట్నుంచి అటే జిల్లా పరిషత్కు వెళ్ళాల్సి వచ్చింది. కార్యాలయం హడావుడిగా ఉంది. క్యాంటీను నిండుగా ఉంది. ఉద్యోగుల్లో చాలామంది ఒక కాలు కుంటుకుంటూనో ఈడ్చుకుంటూనో మోకాలు నిమురుకుంటూనో నడుస్తున్నవారే. ఇంటికి చేరేటప్పటికి రాత్రి ఎనిమిది అయ్యింది. వాకిట్లోనే చిన్నాన్న ఎదురయ్యాడు. ఆందోళనగా ఉన్నాడు. నలిగిన ముఖం. నుదుటన చెరిగిన ఎర్రని నిలువు బొట్టు. చెదిరిన జుట్టు. కొద్దిగా కుంటుతూ దగ్గుతూ దగ్గరకొచ్చాడు.‘నీ కోసమే ఎదురు చూస్తున్నాను. నీవేం కంగారుపడకు. పద.. పద.. లోపలికి..’చిన్నాన్న ఎప్పుడూ అంతే. ఏదీ సరిగ్గా చెప్పడు. విషయం కొస అందిస్తాడు. సాగదీసి గానీ అసలు సంగతి చెప్పడు. మా ఇద్దరిదీ ఒకే ఇల్లు. అన్నదమ్ముల పంపకం. ఇంట్లో వెనుక వైపు వాటాలో ఉంటాడు. భక్తిపరుడు. సకల సెంటిమెంట్లనూ గౌరవిస్తాడు. పాటిస్తాడు. రోజూ పంచాంగం చూస్తాడు. అడిగినవాళ్ళకు అడగనివాళ్ళకు మంచిచెడ్డలు చెప్పడమే పనిగా పెట్టుకుంటాడు. ఎవరింటికైనా వెళితే దిక్కుల్ని చూసి వాస్తు గురించి ఉచిత సలహాలిస్తాడు.‘ఏమైంది?’ గాభరాగా లోపలికెళ్ళాను. గుండెల మీద చేతులేసుకుని సీలింగు చూస్తున్నాడు నాన్న. నన్ను చూసి తల పక్కకు తిప్పి నీరసంగా నవ్వాడు. నోరు విప్పి నెమ్మదిగా గుసగుసగా మాట్లాడుతున్నాడు. మాట స్పష్టంగా లేదు. దగ్గరగా ముఖం పెట్టి వినడానికి ప్రయత్నం చేశాను. ఏదో చెప్పాలనుకుంటున్నాడు. చెప్పలేకపోతున్నాడు. కాసేపటికి చూపు నిలబడిపోయింది. చిన్నాన్నకు అర్థమైంది. ‘ఒరేయ్.. రండి.. వాకిట్లో పడుకో పెడదాం..’ చిన్నాన్న ఉద్దేశం తెలిసింది. ఆయనకేసి కోపంగా చూశాను. చేయి అడ్డంగా పెట్టి వారించాను. ‘మీరాగండి, చిన్నాన్నా.. ఇక్కడ్నుంచి ఆయన్ని కదల్చడానికి వీల్లేదు. ఏమొచ్చింది మీకు? ఇప్పటి దాకా బాగానే ఉన్న వ్యక్తి.. ఇంతట్లోనే ఇంటికి చెడ్డ అయిపోయాడా?’ అన్నాను.‘ఏమంటున్నావు? నీకేమైనా తెలుస్తుందా? ఇంట్లో పోతే ఇల్లు పాడు పెట్టాల్సి వస్తుంది. నా మాట విను..’ బాబాయి హోదా, వయసు తెచ్చిన అధికారంతో నన్ను గదమాయించాడు. ఆయనను దూరంగా గది మూలకు తీసుకెళ్ళి చెప్పడం మొదలెట్టాను. ‘ఆయన ఇన్నాళ్ళూ ఉన్న ఇల్లు ఇది. ఈ ఇంట్లో ఈ గదిలో ఆఖరి ఊపిరి తీసుకునే హక్కు ఆయనకు ఉంది. ఎక్కడికెళ్ళినా ఎంత రాత్రయినా చేరుకునే చోటు ఇది. నా ఊరూ నా ఇల్లూ అంటూ నిత్యం పలవరించేవాడు. మరోచోట నిద్ర పట్టదనేవాడు. మీరెన్నైనా చెప్పండి.. ఇక్కడ్నుంచి కదపడానికి ఒప్పుకోను. పొద్దుట దాక ఇక్కడే ఉంటారు’ స్థిర స్వరంతో చెప్పాను.‘ఈ సమస్య నీ ఒక్కడిదే కాదు. మాది కూడా. ఇదే ఇంట్లో నేనూ కాపురం ఉంటున్నానని గుర్తు పెట్టుకో. మంచి ఘడియలు కావు ఇవి. ఆరుమాసాలో సంవత్సరమో ఇల్లు మైల పడితే ఎక్కడికెళ్ళాలి? ఇంటి పెద్దగా చెబుతున్నాను. చెప్పింది చేయి’ అంటూ వంగి మోకాలు చిప్ప దగ్గర పాముకుంటూ నొక్కుకుంటూ అన్నాడు చిన్నాన్న.నేను రాజీ పడలేదు. పట్టుదలను వీడలేదు. ‘రోజులకు పేర్లు, తిథులు మనం కల్పించుకున్నవే. ఇందులో మంచి చెడ్డలంటూ ఉండవు. అన్ని రోజులూ ఒకలాంటివే. ఆయన ఇంట్లో ఆయన బతకడానికి ఎంత హక్కు ఉందో చావడానికీ అంతే హక్కు ఉంది. ఆ హక్కును కాపాడటానికి కొడుకుగా ఎంతకైనా తెగిస్తాను’ చివర మాట గట్టిగా అన్నాను. ఈ మాటలు పలికానో లేదో మోకాలు చిప్ప వాపు పూర్తిగా తగ్గిపోయింది. ఆయన మాటను విననని అర్థమైపోయింది. నసుక్కుంటూ వెళ్ళిపోయాడు.‘పెద్దాళ్ళు సరే కుర్రాళ్ళు పుట్టుకతో వృద్ధులైపోతున్నారు. మనుషులు చేసిన దేవుళ్ళారా.. మీరెక్కడ? మిమ్మల్ని పోగుచేసి వ్యాపారం చేసే వాళ్ళనీ అసలు మూఢవిశ్వాసాల్ని ఎగదోసేవాళ్ళనీ వినియోగదారుల చట్ట పరిధిలోకి తీసుకు రావాలి. భవిష్యత్తు చెప్పేవాళ్ళకు చెప్పింది జరగనపుడు కఠినశిక్ష విధించి తీరాలి. కనీసం వందేళ్ళ తర్వాత కాలం వీటన్నింటినీ మాన్పుతుందనే నమ్మకం నాది’ అనుకుంటూ సన్నగా లోలోపల మూలిగాను. మామూలు స్థితికి వచ్చిన మోకాలును ప్రేమగా నిమిరాను. ఇంతట్లో మెలకువ తట్టి లేపింది. – దాట్ల దేవదానం రాజుఈ కథను వినడానికి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. ఇకపై ప్రతివారం ‘ఈవారం కథ’కు క్యూఆర్ కోడ్ ఇక్కడ ఉంటుంది.ఇవి చదవండి: సింగరేణి తంగలాన్..! -
తనొక అద్భుతం: ఆమె ఆత్మవిశ్వాసం ముందు విధి చిన్నబోయింది (ఫొటోలు)
-
ఇంద్రుడితో గృత్సమదుడి మైత్రి..
శౌనక మహర్షి వంశంలో సునహోత్రుడు అనే తపస్వి ఉన్నాడు. ఆయన వేదవేదాంగ శాస్త్ర పారంగతుడు, ధర్మనిరతుడు, శమదమాది సంపన్నుడు. సంసారాశ్రమంలో ఉన్నా, నిత్య కర్మానుష్ఠానాన్ని నియమం తప్పక ఆచరించేవాడు. అతడికి ముగ్గురు కొడుకులు పుట్టారు. వారు: కౌశుడు, శాల్ముడు, గృత్సమదుడు. సునహోత్రుడి ముగ్గురు కొడుకుల్లోనూ గృత్సమదుడు మహాతపస్విగా ప్రఖ్యాతి పొందాడు.వేదవేత్త అయిన గృత్సమదుడు అగ్నిదేవుడిని ప్రసన్నం చేసుకోదలచాడు. వేదమంత్రాలతో అగ్నిదేవుడిని భక్తిగా స్తుతించాడు. అగ్నిదేవుడికి ప్రీతికరమైన మంత్ర సప్తకాన్ని పఠిస్తూ, యజ్ఞం చేశాడు. గృత్సమదుడి నిష్కళంక భక్తితత్పరతలకు అగ్నిదేవుడు అమిత ప్రసన్నుడయ్యాడు. అతడి ఎదుట దివ్యరూపంలో ప్రత్యక్షమయ్యాడు. గృత్సమదుడు వరమేదీ కోరకపోయినా, అతడికి అగ్నిదేవుడు దివ్యశరీరాన్ని అనుగ్రహించాడు. ముల్లోకాలలో మూడు శరీరాలతో ఒకేసారి సంచరించగల దివ్యశక్తిని ప్రసాదించాడు.అగ్నిదేవుడి కటాక్షంతో దివ్యశరీరధారి అయిన గృత్సమదుడు సాక్షాత్తు ఇంద్రుడిలా ప్రకాశించసాగాడు. భూమిపైన, ఆకాశంలోను, గాలిలోను ఒకేసారి మూడు దివ్యశరీరాలతో స్వేచ్ఛగా తిరుగాడసాగాడు. అలా తిరుగుతూ ఒకనాడు గృత్సమదుడు స్వర్గానికి వెళ్లాడు. ఇంద్రుడి శత్రువులైన ధుని, చమురి అనే ఇద్దరు రాక్షస సోదరులు స్వర్గంలోని నందనవనంలో ఉల్లాసంగా విహరిస్తున్న గృత్సమదుడిని చూశాడు. ఇంద్రుడిలాంటి దివ్యతేజస్సుతో వెలిగిపోతున్న గృత్సమదుడిని చూసి, అతడే ఇంద్రుడనుకున్నారు. ‘మన అదృష్టం కొద్ది ఇంద్రుడు ఒంటరిగా దొరికాడు. ఇదే తగిన అదను. ఇక్కడే అతణ్ణి మట్టుబెట్టేద్దాం’ అని రాక్షస సోదరులిద్దరూ ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఆయుధాలు పట్టుకుని, ఒక్కుమ్మడిగా అతడిపై దాడికి విరుచుకుపడ్డారు.హాయిగా విహరిస్తున్న తన ఎదుట ఇద్దరు రాక్షసులు ఆయుధాలతో ప్రత్యక్షమవడంతో గృత్సమదుడు ఒకింత ఆశ్చర్యపోయాడు. దివ్యదృష్టితో వారి ఆంతర్యాన్ని కనుగొన్నాడు. ఏమాత్రం తొణకకుండా, తన క్షేమం కోసం, వారి నాశనం కోసం ఇంద్రుడి గుణగణాలను ప్రశంసించే వేదమంత్రాలను పఠించాడు. ఇంద్రుడి గుణగణాలను వినగానే దాడికి తెగబడ్డ ఇద్దరు రాక్షసులకూ భయంతో గుండె జారినంత పనైంది. ‘అనవసరంగా పొరపాటు చేశామా’ అని ఆలోచనలో పడ్డారు. వారు ఇంకా తేరుకోక ముందే ఇంద్రుడు అక్కడకు ఐరావతంపై వచ్చాడు. రాక్షస సోదరులు ధుని, చమురి ఒకేసారి ఇంద్రుడి మీదకు ఆయుధాలు ప్రయోగించారు. ఇంద్రుడు వాటిని తన వజ్రాయుధంతో తుత్తునియలు చేశాడు. ఇద్దరు రాక్షసులనూ తన వజ్రాయుధంతోనే మట్టుబెట్టాడు.ఆ సంఘటనతో ఇంద్రుడిని ప్రత్యక్షంగా చూసిన గృత్సమదుడు పరమానందం పొందాడు. మళ్లీ ఇంద్రుడిని స్తుతిస్తూ వేదమంత్రాలను పఠించాడు. ఇంద్రుడి శౌర్యప్రతాపాలను, గుణగణాలను వేనోళ్ల పొగిడాడు. గృత్సమదుడి స్తోత్రానికి ఇంద్రుడు సంతోషించాడు. ‘మునివర్యా! నేటితో నువ్వు నాకు మిత్రుడివయ్యావు. నువ్వు చేసిన ప్రశంస నీ నిష్కల్మషమైన అంతఃకరణకు సాక్షి. నీ స్తోత్రం నాకు ప్రీతి కలిగించింది. నువ్వు చేసిన స్తుతి నీ సమస్తమైన కోరికలనూ ఈడేరుస్తుంది. నీకేం కావాలో కోరుకో!’ అన్నాడు.‘దేవేంద్రా! నీ కటాక్షంతో నాకు దివ్యమైన వాక్చమత్కృతి, సకల ఐశ్వర్యాలు కలగనివ్వు. నిరంతరం నా హృదయంలో నీ స్మరణనే ఉండనివ్వు. ఎల్లప్పుడూ నీ అనుగ్రహాన్ని పొందనివ్వు’ అని కోరాడు. ఇంద్రుడు ‘తథాస్తు!’ అన్నాడు. అంతే కాకుండా, గృత్సమదుడి చేయి పట్టుకుని, తనతో పాటు తన ప్రాసాదానికి తీసుకుపోయాడు. అతిథి మర్యాదలు చేశాడు. గృత్సమదుడికి ఇంద్రుడు అతిథి మర్యాదలు చేస్తుండగా, దేవగురువు బృహస్పతి అక్కడకు వచ్చాడు. బృహస్పతిని చూసిన గృత్సమదుడు ఆయనను స్తుతిస్తూ వేదమంత్రాలను పఠించాడు. బృహస్పతి సంతోషించి, ‘సురేశ్వరుడిని, సురగురువును విద్యా వినయాలతో సంతృప్తి పరచినవాడి కంటే మేధావి మరొకడు లేడు’ అని పలికాడు. కొన్నాళ్లు ఆతిథ్యం పొందాక గృత్సమదుడు ఇంద్రుడి వద్ద సెలవు తీసుకుని, తన ఆశ్రమానికి బయలుదేరాడు.అగ్నిదేవుడి వరప్రభావంతో గృత్సమదుడు కోరుకున్నప్పుడల్లా త్రిలోక సంచారం చేస్తూ కాలక్షేపం చేసేవాడు. క్రమం తప్పకుండా ఆచరించే నిత్యానుష్ఠానాలలో అగ్నిని, ఇంద్రుడిని, బృహస్పతిని స్తుతిస్తూ వేదమంత్రాలను పఠిస్తుండేవాడు. ఇలా ఉండగా, ఒకనాడు ఇంద్రుడికి గృత్సమదుడి భక్తిని పరీక్షించాలనే ఆలోచన పుట్టింది.వెంటనే ఇంద్రుడు ఒక పక్షిరూపం ధరించాడు. అడవిలో అరణిని, దర్భలను ఏరుకుంటూ ఉన్న గృత్సమదుడి భుజం మీద వాలాడు. గృత్సమదుడు కొంత దూరం ముందుకు కదిలినా, భుజం మీద వాలిన పక్షి ఎగిరిపోలేదు. గృత్సమదుడు దివ్యదృష్టితో తన భుజం మీద వాలిన పక్షి ఇంద్రుడేనని గ్రహించాడు. పక్షిరూపంలో ఇంద్రుడి ఆకస్మిక ఆగమనానికి సంతోషభరితుడై, ఇంద్రుడిని ఖగేంద్రుడిగా, సురేంద్రుడిగా స్తుతిస్తూ స్తోత్రం పఠించాడు.గృత్సమదుడికి తనపైనున్న అనన్యభక్తికి సంతోషించిన ఇంద్రుడు నిజరూపంలో అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు. ‘మిత్రమా! నీ భక్తి తత్పరతలపై నాకిక ఎటువంటి సందేహమూ లేదు. సర్వకాల సర్వావస్థలలోనూ నీవు నాకు మిత్రుడవై ఉంటావు. నాకు నిన్ను మించిన ఉత్తమ భక్తుడెవరూ లేరు. నీ కోసం స్వర్గద్వారాలు, ఇంద్రభవన ద్వారాలు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి. నీవు ఎప్పుడు కోరుకున్నా, యథేచ్ఛగా, నిరాటంకంగా నా వద్దకు వచ్చిపోతూ ఉండు’ అని పలికి, సెలవు తీసుకుని స్వర్గానికి పయనమయ్యాడు. – సాంఖ్యాయన -
'బేరం'.. బెండకాయలెంత కిలో..?
‘బెండకాయలెంత కిలో?’ బుట్ట తీస్తూ అడిగింది అమ్మ.‘నలభై రూపాయలమ్మ’‘నలభై రూపాయలా!’ సాగదీస్తూ పావుకేజీ చికెన్ వస్తుంది తెలుసా.. నలభైకి’ అంది.‘పోనీ అదే కొనుక్కోండమ్మా.. నేనేం మిమ్మల్ని పిలవలేదుగా!’ దురుసుగా సమాధానం వచ్చింది అటు నుండి.‘అదేనా సమాధానం చెప్పే పద్ధతి?’ అమ్మ కోపం ఎక్కువైంది.‘ఎందుకు ఉమా ఆ బేరాలు? కావల్సినవి తీసుకో డబ్బుల సంగతి నీకెందుకు?’ సలహా ఇచ్చారు నాన్న.‘ఏం ఇంట్లో ఏమైనా డబ్బుల చెట్టు నాటరా ఏంటి? అసలందుకే మిమ్మల్ని నాతో రావద్దంది’ కూరగాయలావిడ మీద కోపం నాన్న మీదకి మళ్లించింది ఘాటుగా.ఇదెప్పుడూ ఉండేదే! నాన్నకసలు నోరు ఊరికే ఉండదు వద్దన్నా సలహాలిస్తూనే ఉంటారు. ‘కాసేపు కామ్గా ఉండొచ్చు కదా నాన్న! ఎందుకిక్కడ కూడా యుద్ధం?’ సలహా ఇచ్చా! నాది కూడా నాన్న పోలికెనేమో?‘నేనా మాత్రం కలుగజేసుకోకుంటే ఈ రోజంతా వాళ్లతో బేరాలాడుతూ ఇక్కడే ఉంటుంది’‘ఉఫ్.. ఎప్పటికి పూర్తవుతుందో?’ ఆలోచిస్తూ ఆసీనురాలినయ్యా బెంచ్ మీద. మార్కెట్ అంతా తిరిగి, కూరగాయల వాళ్లతో బేరాలాడి.. వాళ్లను విసిగించి, తనూ విసుక్కుని మొత్తానికి రెండు గంటల తర్వాత వచ్చింది.‘ఉమా ఎంత మిగిలించావ్? ఛ.. రెండు గంటలు వేస్ట్.. ’ నుదురు రుద్దుకున్నారు నాన్న.‘నా టైమ్ అంత ఖరీదైనది కాదు కానీ పదండి’ అంటూనే ఓ కవర్ నాన్న చేతిలో, మరో కవర్ నా చేతిలో పడేసి ఆటోస్టాండ్ వైపు నడిచింది. నోరు మూసుకుని అమ్మని అనుసరించాం. ‘మరో ఘట్టం మొదలవుతుందిప్పుడు’ మెల్లగా అన్నారు నాన్న.‘ఈ రోజుకిదే చివరి అంకమేమో’ అంతే మెల్లగా చెప్పాను. ‘శ్రీరాం నగర్ కాలనీకి ఎంత తీసుకుంటావ్?’‘అరవై రూపాయలమ్మ’‘నలభై రూపాయలే కదా?’‘పోనీ యాభై ఇవ్వండమ్మ’‘లేదు, లేదు నలభై రూపాయలే’ బేరం సాగీ, సాగీ ఇంటికెళ్లేసరికి పది గంటలు దాటింది.‘దేవుడా!’ అనుకుంటూ సోఫాలో పడిపోయాం నీరసంగా.‘ఉమా! నువ్వెంత మిగిల్చావోనాకు తెలియదు కానీ ఈ టైమ్ తప్పిన భోజనంతో నా షుగర్ కూడా కంట్రోల్ తప్పుతుంది. ఆ మిగిలించిన డబ్బంతా నా హాస్పిటల్ బిల్కి సరిపోతుంది’ అరిచారు నాన్న.‘అవునులే అలా మిగిలించిన డబ్బుతోనే ఈ నగలన్నీ చేయించుకున్నాను’వాదన మొదలైంది. ఇదిప్పట్లో ఆగదు. ఎందుకో గానీ ఈసారి నాన్నకి సపోర్ట్ చేయాలనిపించలేదు. అమ్మది మాత్రం ఏం తప్పుంది? సగటు మధ్యతరగతి గృహిణిలానే ఆలోచిస్తోంది. ఆ చేసేదంతా ఎవరి కోసం? ఇంటి కోసం.. ఇంట్లో ఉన్న మా కోసమేగా? నాన్న పూర్తిగా వ్యతిరేకం అమ్మకి. బేరం అనే పదం కూడా నచ్చదు. సమయం వృథా, అంతకన్నా ముఖ్యంగా అలా బేరమాడటం ఆ వస్తువుల విలువను తగ్గించటమే అని వాదన. ఎవరి కోణంలోంచి చూస్తే వాళ్ళదే సరనిపిస్తుంది.‘ఏంటా ఆలోచన? దేని కోసం?’ ఉలిక్కిపడి చూశాను నాన్న వైపు.‘మీ ఇద్దరి గురించే..’‘మా గురించా?’ అర్థంకానట్టు చూశారు.‘అవును, అసలు మీ ఇద్దరూ గొడవపడకుండా ఉన్న రోజేదైనా ఉందా?’ అని నవ్వాను.‘అది కష్టమమ్మా! ఇంకా చెప్పాలంటే అసాధ్యం కూడా!’ గట్టిగా నవ్వారు నాన్న కూడా.‘అసాధ్యం కాదే మీ నాన్నని మౌనవ్రతం చేయమను’ లోపలి నుండి వచ్చింది అమ్మ.‘ అప్పుడు మాత్రం నీ నోరు ఊరుకుంటుందంటావా?’ ‘అయితే ఇద్దరూ చేయండి. నాకు మనశ్శాంతిగా ఉంటుంది చెప్తూనే లోపలికి పరిగెత్తాను.‘దానర్థం నోరు మూసుకుని ఉండమనేగా?’ మాటలు బాగా ఎక్కువయ్యాయి. రూమ్లోకెళ్లినా అమ్మ మాటలు వినిపిస్తున్నాయి.‘రేపు క్లాస్ లేదుగా?’ లోపలికొస్తూ అడిగారు నాన్న.‘ఎందుకు? స్పెషల్ క్లాస్ ఉంది, రికార్డ్ వర్క్ కూడా ఉంది’ ‘నీతో కొంచం వర్క్ ఉంది. ఎక్కువసేపు కాదు, మహా అయితే ఓ గంటన్నర అంతేలే’‘అది సరే కానీ ఆ గంటన్నర ఏం చేయాలి?’ విసుగొచ్చింది. ‘నోరు ముసుకుని, కుదురుగా కూర్చోవాలి’‘ఎక్కడ? ఎందుకు?’ విసుగు ఎక్కువైంది. ‘పెళ్లిచూపుల్లో’ నవ్వేసి వెళ్లిపోయారు.నాకు మాత్రం నవ్వు రాలేదు. ఉత్సాహం, కుతూహలం ఏవీ రాలేదు. గొప్ప కార్యక్రమం మరి! తలనొప్పికి బోనస్గా మెడనొప్పి కూడా. ‘ఇప్పుడప్పుడే ఇలాంటి ప్రోగ్రామ్స్ వద్దని చెప్పా కదా? ఇంజనీరింగ్ అవలేదు, జాబ్ రాలేదు. మీకెందుకంత తొందర?’ ఇలాంటి డైలాగ్స్ నాన్న మీదకేం విసరాలనిపించలేదు. అలాంటి వాటి వల్ల ప్రయోజనమేం ఉండదు. పైగా నాన్న సంగతి నాకు తెలియంది కాదు. ఎలాంటి వారినైనా ఒప్పించగల నైపుణ్యం కలిగిన వారు. ‘చూద్దాం ఏం జరుగుతుందో?’ అనుకోవటమే నాకు మిగిలిన ఆప్షన్.‘హరీ టైమెంతయిందో తెలుసా?’ సూర్యుడు పూర్తిగా డ్యూటీ ఎక్కక ముందే లేపింది అమ్మ.‘అబ్బా! వాచ్ చూడొచ్చుకదమ్మా! లేపి మరీ అడగాలా?’ తలకొట్టుకున్నాను.‘వేశావులే పెద్ద జోక్, నోరు మూసుకుని లేచి రెడీ అవ్వు’ బాత్రూమ్లోకి తోసింది.వాళ్లొచ్చేసరికి పదిన్నర దాటుతుంది. ఇప్పుడింకా ఆరు కూడా కాలేదు. ఇప్పటి నుండి రెడీ అవుతూ ఉండాలా? ఈ దృక్పథం ఎప్పటికి మారుతుంది? అసలు మారుతుందా?‘ఏంటమ్మా ఉదయం నుండి అమ్మ చెప్పిందంతా కీ ఇచ్చిన బొమ్మలా చేస్తున్నావు? ఏంటో?’ దీర్ఘం తీశారు నాన్న. చేయకపోతే తిట్లు, చేస్తే అనుమానాలు. వాళ్లెంత మంది వస్తారో? ఎన్ని ప్రశ్నలడుగుతారో? ఆలోచిస్తుండగానే వాళ్లు రావటం, అతిథి సత్కారాలు, మరబొమ్మలా వాళ్ల ముందు కూర్చోబెట్టడం.. అన్నీ సెకెన్ల ముల్లులా చకాచకా సాగిపోయాయి. పెద్దల ప్రశ్నలు, నా సమాధానాలు సాగుతూన్నాయి.ఈ అబ్బాయికి మాటలు రావా? మొహమాటమా? నోరే విప్పటం లేదు. మరీ తెగించి చూడటం బాగుండదేమో? ఏవేవో సినిమా సన్నివేశాలు చకచకా కదిలిపోతున్నాయి. ఎంత మధురంగా ఉంటాయో పెళ్లి చూపుల సన్నివేశాలు! నాలాగే చాలా మంది అమ్మాయిలు వాటిని చూసి అలాగే ఉంటాయని భ్రమపడి, పెళ్లి చూపులయ్యాక నిరాశపడతారు.‘ఏరా? అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా?’ పెళ్లికొడుకు తండ్రనుకుంటా.. ఎంత దర్పమా గొంతులో!అప్రయత్నంగా కళ్లు తిప్పాను నాన్న వైపు. ఇప్పుడు నాన్న కూడా అబ్బాయితో మాట్లాడతావా? అంటే అందరి మొహాలు ఎలా ఉంటాయో? ఒక్కసారిగా షాకవుతారేమో?‘మాట్లాడకపోతే.. పోనీ నచ్చిందో? లేదో?’ చెప్పు సీరియస్గా అడిగాడాయన.‘మీ ఇష్టం నాన్నా’ మంద్రంగా వినిపించిందో స్వరం.ఏం సమాధానం..? అవుననా? కాదనా? ఇప్పుడు నేను షాకయ్యాను. అసలెలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రుల మాట మీద గౌరవం ఎక్కువనా? తనకి వ్యక్తిత్వం తక్కువనా?ఏ మూలో మిగిలున్న కాస్త ఆసక్తి కూడా ఎగిరిపోయింది. ముళ్ళ మీద కూర్చున్న ఫీలింగ్!‘నువ్వేమంటావమ్మా?’ దగ్గర్లో గట్టి వస్తువులేం లేవు కానీ, ఉండుంటేనా వాటితో తల కొట్టుకోవాలనిపించింది.అంతా నా వైపే చూస్తున్నారు. ‘మా నాన్న ఇష్టం’ అనే నా డైలాగ్ కోసం. అలా అంటేనే కదా అమ్మానాన్నల పెంపకాన్ని పదిమందీ మెచ్చుకునేది! వాళ్ళ మెప్పు కోసం, అమ్మానాన్నల ఆనందం కోసం అలా చెప్పటం కరెక్టా కాదా? మరి నా సంగతేంటి తన గురించి ఏం తెలియకుండా ఎలా నిర్ణయించుకోవాలి? ఎక్కువ సమయం తీసుకుంటే బాగుండదు. ఏం తెలియటంలేదు. ‘పర్లేదు చెప్పమ్మా..’ మరోసారి అడిగేసరికి నాన్న వైపు చూశాను నిస్సహాయంగా.‘ఉమా! తనని లోపలికి తీసుకెళ్లు’ నాన్న మాటకి నిజంగానే ప్రాణం వచ్చినట్టయింది. లోపలికెళ్తూ నెమ్మదిగా కళ్లు తిప్పాను అబ్బాయి వైపు. ఓ నవ్వు కాదుకదా! కనీసం చూడను కూడా చూడలేదు. ‘మొహమాటమంటే ఒప్పుకుంటాను. కానీ దీపు చాలా మంచివాడు చిన్నప్పటి నుండి చూస్తున్నా కదా! ఒక్క చెడలవాటు కూడా లేదు’ ఆపకుండా చెప్పుకుపోతోంది అమ్మ. ‘చిన్నప్పటి నుండి చూస్తున్నావా?’ ఇంకో షాక్ నాకు.‘ఆ! ఎప్పుడైనా ఏ ఫంక్ష¯Œ కైనా, పెళ్లికైనా వస్తేగా చుట్టాలో, స్నేహితులో తెలియడానికి! ఎంతసేపూ ఇంటినే అంటిపెట్టుకునుంటే ఏం తెలుస్తుంది?’‘అమ్మా! ఒక ప్రశ్నకి మరో ప్రశ్న సమాధానమా?’‘వాడు నాకు మేనల్లుడి వరస. మా పెద్దమ్మ కొడుకు తెలుసు కదా.. శేఖరన్నయ్య.. వాడి కొడుకు. మంచి ఉద్యోగం కూడా! ఒప్పుకోవచ్చు కదే?’కిటికీ తెరిచి దీపు వైపు చూశాను. హుందాగా ఉన్నా అమాయకత్వం నిండి ఉన్న మొహం. అమ్మ సర్టిఫికేట్కి తిరుగులేదు. ‘పైగా తనకి నువ్వంటే చాలా ఇష్టం కూడా ’ అనేసి వెళ్లిపోయింది.అదేంటో ఇప్పటి వరకూ ఉన్న చిరాకంతా టక్కున మాయమైపోయింది. ‘ఏంటి బావా? వీళ్లిద్దరూ సరిగ్గా చెప్పకుండా దాటేస్తున్నారు. ఏం చేద్దాం?’ వాళ్ల మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.‘మౌనం అంగీకారమేనేమో?’ ఇంకెవరో అన్నారు. ‘అంతవరకూ లాంఛనాల గురించి ఒక మాటనుకుంటే సరిపోతుందేమో?’ మరొకరి సలహా.‘అబ్బాయిది గవర్నమెంట్ ఉద్యోగం. ఉన్న ఆస్తికి ఒక్కడే వారసుడు. మీరెంత వరకు ఇద్దామనుకుంటున్నారు?’‘మా అమ్మాయిది డిగ్రీ అవుతుంది. తెలివైనది కూడా!’ మా పిన్ని నన్ను పొగడటం మొదలుపెట్టింది.‘ఇరవై లక్షలు, అబ్బాయికి నాలుగు తులాల బంగారం. అమ్మాయి కెంత బంగారం పెడతారో మీ ఇష్టం, బైక్ ఎలాగూ పెడతారుగా?’బట్టీ పట్టిన సమాధానంలా టకటకా చెప్పేశాడు మధ్యవర్తి. ‘అదేంటి బావా? మా స్థాయి తెలిసి కూడా..’ ఆపేశారు నాన్న. ‘పదిలక్షల వరకూ అయితే పరవాలేదు’ ఓ క్షణమాగి మెల్లగా అన్నారు.భూకంపం వచ్చిన ఫీలింగ్. మొదటిసారి వింటున్నా నాన్న బేరమాడటం. ఆటో డ్రైవర్ల కష్టానికి విలువనిచ్చే నాన్న, కూరగాయలకి విలువిచ్చి బేరమాడని నాన్నేనా.. ఈ రోజు నా గురించి బేరమాడుతోంది!? అదేంటో చిత్రంగా కోపం రాలేదు.. నవ్వొచ్చింది. నా జీవితంలో ఎప్పటికీ చూడలేననుకున్నది చూశాను. దీపక్ అలాగే కూర్చున్నాడు విగ్రహంలా! ఆ బేరసారాలలో పాలుపంచుకోలేదు. అరగంటసేపు సాగుతూనే ఉందా కార్యక్రమం. నాన్నకి నా మీదెంత ప్రేమున్నా తలకి మించిన భారాన్నెలా మోయగలరు?మరోవైపు నా జీవితం.కేవలం నా కోసమేగా తనకిష్టంలేని బేరమాడింది! పోనీ నా కోసమేదైనా చేస్తారని ఎంతలా సముదాయించుకున్నా ఏదో గుచ్చుతోంది మనసులో.నాన్న నా విలువను తగ్గించారా? అంగీకరించలేని నిజం!దీపక్ని నేను కొనుక్కుంటున్నానా? లేదు, లేదు డబ్బిచ్చి మరీ నన్నే అమ్ముతున్నారా? బాగుంది వాళ్ళ కొనుగోలు, నాన్న అమ్మకం!క్రమక్రమంగా మాట్లాడే ధోరణి నుండి బతిమాలే స్థాయికి దిగిన నాన్న గొంతు. అమ్మాయిగా పుట్టినందుకు మొదటిసారి కలిగిన బాధ! నా కారణంగానే నాన్న తగ్గాల్సి వచ్చిందన్న గిల్టీ ఫీలింగ్!నాలాగే ప్రతి అమ్మాయి ఎప్పుడో ఒకసారి ఎదుర్కోవాల్సిన సందర్భమేమో!‘కంగ్రాట్స్ హరీ’ అరుస్తున్నట్టే లోపలికొచ్చింది అమ్మ. ‘అదృష్టమంటే నీదేనే ..’ ఇంకా ఏదేదో చెప్తున్నా ఆ మాటలేం వినిపించట్లేదు.‘నాకు నచ్చలేదు’ సూటిగా, స్పష్టంగా చెప్పేశాను.‘ఏంటి?’ కోపంగా మారిపోయింది అమ్మ గొంతు. ‘ఏం నచ్చలేదే?’ ‘ఈ బేరం, బేరంలో కూర్చున్న ఆ అబ్బాయి’‘నోరు మూసుకో.. అర్థంలేని మాటలు’‘అమ్మా! ప్లీజ్ నన్నిలా వదిలేస్తావా?’ నా గొంతు నరాలు తెగిపోయాయేమో అన్నంత గట్టిగా వచ్చిందా అరుపు.‘ఉమా! దాన్నింకా విసిగించకు’ నాన్న అమ్మని తీసుకెళ్ళారు.ఎందుకీ విపరీతమైన అలజడి? గందరగోళం మనసంతా! నాకు తెలుసు. ఈ కోపం అమ్మ మీద కాదు, నాన్న మీదా కాదు, దీపు మీదసలు కాదు. మరెవరి మీద? ఆలోచిస్తూండిపోయానలా ఎంతసేపో?!‘హరీ..’ మంద్రమైన అమ్మ పిలుపు ఈ లోకానికి తీసుకొచ్చింది నన్ను. ‘నిన్ను అర్థం చేసుకోగలను కానీ మార్పు నువ్వనుకున్నంత సులభంగా రాదు. దానికి ఎన్నో ఏళ్ల కష్టంకావాలి. జడివానలా ఒక్కసారిగా వస్తుందనుకున్నావా? చిరుజల్లులా నిదానంగానే వస్తుంది. నీ కోపం పక్కన పెట్టి ఒక్కసారి ఆలోచించు’ చెప్పి వెళ్లిపోయింది.నిజమే మార్పు ఆవేశం వలనో, ఆక్రోశం వలనో రాదు. రాజారామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం వంటి మహానుభావులు పుట్టిన దేశంలో అబ్బాయిలందరూ దీపక్ లాగానే ఉంటారనుకోవటం నా పొరపాటు. తల్లిదండ్రులపై గౌరవంతో పాటు భార్య వ్యక్తిత్వానికి విలువనిచ్చే వారూ ఉంటారు. అమ్మాయిలు వంటిల్లు దాటి ఉద్యోగం దాకా రావటానికి శతాబ్దకాలం పట్టింది. కట్నకానుకలు, బేరసారాలు లేకుండా పెళ్లి జరగటానికి మరో రెండు శతాబ్దాలు పూర్తవ్వాలేమో .. ఆలోచిస్తూ కొత్త ప్రాజెక్ట్ హెడ్డింగ్ పెట్టాను..‘40 వ శతాబ్దం.. భారతీయ వివాహా వ్యవస్థ!’ – ధనలక్ష్మి. ఎమ్ -
జెనెట్ టేట్.. రెండు పల్లెటూర్ల మధ్యలో పెద్ద హైవే రోడ్డు.. ఒక్కసారిగా..?
రెండు పల్లెటూర్ల మధ్యలో పెద్ద హైవే రోడ్డు. ఇటువారు అటు వెళ్లాలన్నా, అటువారు ఇటు రావాలన్నా ఆ హైవే దాటాల్సిందే. ఉన్నట్టుండి ఆ రెండు ఊళ్లనూ పెద్దసంఖ్యలో పోలీసులు చుట్టుముట్టారు. పైనుంచి హెలికాప్టర్తో గాలింపూ మొదలైంది. చుట్టుపక్కల గుంతలు, చెరువులు అన్నీ జల్లెడపడ్తున్నారు. పొదలు, పొలాలు అన్నింటినీ వెతుకుతున్నారు. జనాలు కూడా ఆ వెతుకులాటలో భాగమయ్యారు. డిటెక్టివ్ అధికారులు ఒకవైపు, డాగ్ స్క్వాడ్ మరోవైపు పరుగులు తీస్తున్నారు.ఇద్దరు అమ్మాయిలు మాత్రం జరిగేదంతా బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. అధికారులంతా ఒకరి తర్వాత ఒకరు ఆ ఇద్దరినీ రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు. ఇంతలో ఒక కానిస్టేబుల్ పరుగున వచ్చి, ‘క్రైమ్ సీన్ రీ క్రియేషన్ కి అంతా రెడీ సార్’ అన్నాడు. అప్పటికే పోలీసులంతా ఏది ఎక్కడ ఎలా జరిగింది అనేది ఆ అమ్మాయిల నోట చాలాసార్లు విన్నారు. దాంతో ఆ అధికారుల్లో ఒకడు ఆ అమ్మాయిల వైపు చూసి, ‘పదండి! అసలేం జరిగిందో వివరంగా చూపించాలి. తేడా రాకూడదు. అబద్ధం చెప్పకూడదు, సరేనా?’ అంటూ కాస్త గంభీరంగా గద్దించాడు. ‘సరే సార్’ అంటూ భయపడుతూనే ఆ ఇద్దరూ పోలీస్ జీప్ ఎక్కారు.జీప్ వేగంగా కంకర రోడ్డు వైపు పరుగుతీసింది. హైవే నుంచి ఊరుని కలిపే దారి అది. కారు వెళ్తుంటే స్కూటర్ పక్కనే ఆగేంత చిన్న తోవ అది. చుట్టూ గుబురు మొక్కలు, పొదలు. దారి పొడవునా మలుపులే! ఏ మలుపు తిరిగినా అవతల దారి ఇవతలకు కనిపించదు. ఓవైపు పొలాలు, మరోవైపు పిల్లకాలువలు, వాటిపై చిన్న చిన్న వంతెనలు. ఒంటరిగా వెళ్లాలంటే కాస్త భయపడేలానే ఉంటుందా ప్రదేశం. ఇద్దరిలో ఒక అమ్మాయి, ‘ఇక్కడే సార్! ఈ వంతెనే!’ అంటూ జీప్ ఆపించింది. ‘సరిగ్గా చెబుతున్నావా?’ అన్నాడు అందులో ఓ అధికారి. ‘యస్ సర్ ఇదే ఇదే!’ అంది మరో అమ్మాయి. దాంతో జీప్లో ఉన్నవారంతా వంతెన మీదే దిగారు.‘ఇక్కడే సర్! నిన్న మధ్యాహ్నం 3 అయ్యేసరికి జెనెట్ తన సైకిల్ మీద వెళ్తూ వెళ్తూ మమ్మల్ని కలిసింది’ అంది ఒక అమ్మాయి. ‘మరి మీకు ఆ సైకిల్ ఎక్కడ కనిపించింది?’ అడిగాడు ఒక అధికారి. ‘అదిగో ఆ మలుపు దాటాక కనిపించింది సర్.! తను మా దగ్గరకు వచ్చేసరికే తన దగ్గర చాలా న్యూస్ పేపర్స్ ఉన్నాయి. దారిలో మేము కనిపించామని ఆగింది. వెళ్తూ వెళ్తూ చదువుకోమని మాకూ ఓ న్యూస్ పేపర్ ఇచ్చింది సర్’ అంది మరో అమ్మాయి. అధికారులతో పాటు ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా ఆ మలుపువైపే నడిచారు. జెనెట్ సహా ముగ్గురి వయసూ 13 ఏళ్లే. అంతా ఒకే స్కూల్లో స్నేహితులు. జెనెట్ చూడటానికి టామ్ బాయ్లా కనిపించేది. స్కూల్ అయిపోగానే న్యూస్ పేపర్స్ వేస్తూ పార్ట్టైమ్ చేసుకునేది. హైవే దాటి ఆ ఊరు నుంచి ఈ ఊరికి.. ఈ ఊరు నుంచి ఆ ఊరికి సైకిల్ మీద తిరగడం ఆమెకు కొత్తేం కాదు.‘జెనెట్ మాతో మాట్లాడాక మా ముందే సైకిల్ ఎక్కి వెళ్లడం కొంత దూరం వరకూ మాకూ కనిపించింది. మేము తనిచ్చిన పేపర్ చదువుకుంటూ, మాట్లాడుకుంటూ జెనెట్ వెళ్లిన దారిలోనే నడుచుకుంటూ.. మా ఇళ్లకు బయలుదేరాం. సరిగ్గా ఐదారు నిమిషాలకు ఇదిగో ఈ మలుపు దాటి కాస్త దూరం నడిచేసరికి జెనెట్ సైకిల్ కిందపడున్నట్లు కనిపించింది. సైకిల్ బుట్టలోని న్యూస్ పేపర్స్ అన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయి. సైకిల్ వెనుక టైర్ గిర్రున తిరుగుతూనే ఉంది. పేపర్స్ గాలికి రెపరెపలాడుతూ ఉన్నాయి. మాకు భయం వేసింది. పరుగున దగ్గరకు వెళ్లాం. ఇదిగో ఇక్కడే. సైకిల్ పడి ఉంది. ‘జెనెట్! జెనెట్!’ అని పెద్దగా అరిచాం. చుట్టూ చూశాం. అదిగో ఆ పొదల వెనుక కూడా వెతికాం.ఎక్కడా తన అలికిడి లేదు. దాంతో సైకిల్ని పైకి లేపి, నడిపించుకుంటూ వాళ్ల ఇంటికి వెళ్లాం. అక్కడ జెనెట్ వాళ్ల డాడ్కి విషయం చెప్పాం’ అంటూ ఆ అమ్మాయిలు ప్రతి సీన్ ని క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నించారు. ఓ అధికారి ‘సరిగ్గా జెనెట్ సైకిల్ దొరికిన చోట నిలబడి, సైకిల్ ఏ పొజిషన్ లో పడింది? అప్పుడు మీకు జెనెట్ అరుపులు వినించలేదా?’ అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు. దాంతో ఆ ఇద్దరు అమ్మాయిలు సైకిల్ పడి ఉన్న పొజిషన్ ని న్యూస్ పేపర్స్ పడి ఉండటాన్ని ఆ అధికారులకు వివరించారు. రోజులు గడిచినా జెనెట్ ఆచూకీ దొరకలేదు.అప్పుడే ఒక రైతు షాకిచ్చాడు. ‘సైకిల్తో పాటు ఆ ఇద్దరు అమ్మాయిలు నడిచి వెళ్లడం నేను చూశాను. అయితే వాళ్లిద్దరూ ఏ అరుపులు అరవలేదు. ఎలాంటి ఆందోళనలోనూ కనిపించలేదు’ అని సాక్ష్యమిచ్చాడు. మరోవైపు ఓ కానిస్టేబుల్ భార్య ఆరోజు మధ్యాహ్నం మూడు దాటాక అటుగా వెళ్తూవెళ్తూ, ఆ ఇద్దరు అమ్మాయిలతో పాటు ఒక టామ్బాయ్లాంటి అమ్మాయి (జెనెట్) ఒక ముప్పయ్యేళ్ల వ్యక్తితో అదే వంతెన మీద నిలబడి మాట్లాడుకోవడం చూశానని సాక్ష్యమిచ్చింది. దాంతో ‘ఆ అబ్బాయి ఎవరు?’ అనే కోణంలో కూడా దర్యాప్తు సాగింది. కానీ పనికొచ్చే ఎలాంటి సమాచారం దొరకలేదు.అయితే జెనెట్ సైకిల్ దొరికిన ప్రాంతంలో సుమారు 70 న్యూస్ పేపర్స్ దొరికాయి. నిజానికి జెనెట్ తిరిగే జోన్ లో అన్ని పేపర్స్ అవసరం లేదు. సైకిల్ బుట్టలో కూడా అన్ని పేపర్స్ పట్టడం కష్టమే! కిడ్నాపర్స్ కావాలనే న్యూస్ పేపర్స్ అక్కడ వదిలి, కేసుని డైవర్ట్ చేయాలనుకున్నారా? అనేది కూడా తేలలేదు. పైగా జెనెట్ మిస్ అయిన రోజు మరో పేపర్ బాయ్ లీవ్లో ఉండటంతో, అతడు అందివ్వాల్సిన న్యూస్ పేపర్స్ కూడా జెనెటే తీసుకుందట! ఆ విషయం తెలియగానే జెనెట్ కిడ్నాప్ని ముందే ప్లాన్ చేశారా? అని కూడా విచారించారు. కానీ క్లారిటీ రాలేదు. పాపం జెనెట్ తండ్రి జాన్ సుమారు 40 ఏళ్ల పాటు పోరాడి ఆ దిగులుతోనే మరణించాడు.జెనెట్ స్నేహితులకు అంతా తెలిసే నాటకం ఆడారా? లేక లీవ్లో ఉన్న పేపర్ బాయ్కి జెనెట్ కిడ్నాప్కి ఏదైనా సంబంధం ఉందా? ఇలా వేటికీ సమాధానం లేదు. 1978లో బ్రిటన్ , ఐల్స్బరీలో జరిగిన యదార్థ సంఘటన ఇది. ఆ ఏడాది ఆగస్ట్ 19న సైకిల్ మీద వెళ్తున్న పదమూడేళ్ల జెనెట్ టేట్– ఎక్సెటర్ సమీపంలో కిడ్నాప్ అయ్యింది. 46 ఏళ్లు గడిచినా కేసు తేలలేదు. ఎన్నో నేరాలు చేసి దొరికిన రాబర్ట్ బ్లాక్ అనే సీరియల్ కిల్లర్, తానే జెనెట్పై అత్యాచారం చేసి హత్య చేశానని చెప్పాడట. అయితే విచారణ పూర్తి కాకుండానే జైల్లో అతడు మరణించాడు. కొందరు మాత్రం.. ‘రాబర్ట్ ఒప్పుకోవడమనేది.. పోలీసుల కట్టుకథ’ అంటారు. దాంతో ఈ కేసు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మన -
సంక్రాంతి.. రామవ్వ నోటి నుండి మొదటిసారి!
రామవ్వ నోటి నుండి మొదటిసారి ఆ పేరు విన్నంతనే శంకరంలో ఏదో అలజడి మొదలయ్యింది. ఆ ఒక్క పేరు అతడిలో రేకెత్తించిన కలవరం బహుశా ఏ అమ్మాయి పేరూ కలిగించి ఉండదు. శంకరం ఇంతకు ముందు ఆ అమ్మాయిని చూడకపోయినా ఆ పేరు చాలా ఆత్మీయంగా అనిపించింది. రామవ్వ నెలకు రెండు మూడు పేర్లను కొడుకుతో ప్రస్తావిస్తూనే ఉంది. ‘కానీ.. చూద్దాం’ అని ఆమె మాటను తోసిపుచ్చుతున్నాడే తప్ప ఆమె వెదుకుతున్న పెళ్ళికూతుళ్ళ సంగతిని తలకెక్కించుకోలేదు. ఉబలాటానికైనా వారిని చూసిరావడానికి వెళ్ళలేదు. కానీ సంక్రాంతి విషయంలో ఎందుకో అలా ఉండటం అతనికి అసాధ్యంగా అనిపించింది.చిత్తడి నేలలో పడ్డ బీజం మొలకెత్తినట్లు అతని మనసులో పడిన సంక్రాంతి అనే పేరు పాతుకుపోయి ఇక ఉండబట్టలేక ‘అమ్మా.. నేను ఆ అమ్మాయిని చూసివస్తాను’ అన్నప్పుడు రామవ్వ ముఖం వికసించింది. ‘సంతోషం బిడ్డా.. ఈ సంబంధం కలిసిరానీ’ అని తన ఆనందాన్ని ప్రకటించింది. దాంతో మరింత ఉత్సాహాన్ని పొందిన శంకరం తనకు వీలుగా ఉన్న ఒక తేదీని ఎన్నుకుని ఆ రోజు అమ్మాయిని చూడడానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. అయినా కుతూహలం చంపుకోలేక సామాజిక మాధ్యమాల్లో ఆమె గురించిన సమాచారానికై వెదికాడు. ఏమీ దొరకక నిరాశ చెందాడు. ఇంతలో శంకరం ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. రామవ్వను పిలిచాడు. ఆమె అతనితో రావడానికి ఒప్పుకోని కారణంగా తనొక్కడే ప్రయాణానికి సిద్ధమయ్యాడు. కారులో కూర్చుని అమ్మవైపు చూశాడు. ఆమె ముఖంలో సంతోషాన్ని నింపుకుని వాకిట్లో నిలబడి ఉంది. ఆమెను కదిలిస్తే ఆనందాశ్రువులు చిప్పిల్లేలా ఉన్నాయి ఆమె కళ్లు. వెళ్ళివస్తానని కనుకొనల నుండి సైగ చేశాడు. అలాగే కానీ అని ఆమె తలవూపాక శంకరం బయలుదేరాడు.తుమకూరు నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉండే సంక్రాంతి ఊరైన నిడసాలకు శంకరం వెళ్ళాల్సి ఉంది. ఆ ఊరేమీ అతనికి అపరిచితమైనది కాదు. అలా అని అంతగా పరిచితమైనది కూడా కాదు. రామవ్వ పుట్టిన హిత్తలపుర పక్కనే ఉన్న ఊరు. పుట్టిన ఊరులోనే తెలిసినతడిని పెండ్లి చేసుకున్న రామవ్వ, శంకరం పుట్టిన నాలుగేళ్ళకు వైధవ్యాన్ని పొందింది. వివాహేతర సంబంధపు ఆరోపణలను ఎదుర్కొన్నది. బంధువులు చేస్తున్న అవమానాలను తట్టుకోలేక శంకరాన్ని తీసుకుని తుమకూరు వచ్చేసింది. మళ్ళీ తన ఊరివైపు చూడలేదు. ఇళ్ళల్లో పనిచేస్తూ కొడుకును చదివించుకోవడంలో నిమగ్నమయ్యింది. అప్పుడప్పుడూ తన ఊరి గురించి సమాచారం తెలిసినా ఎప్పుడూ ఆ ఊరికి వెళ్ళాలని రామవ్వకు మనస్కరించలేదు. ఆమెకు కొడుకే లోకం అయ్యాడు. తల్లి కష్టాన్ని అర్థం చేసుకున్న శంకరం ఆమెకే బాధా కలగకుండా చూసుకుంటున్నాడు. ఆమె ఇష్టప్రకారమే బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకున్నాడు. తలచెడి తెలియని ప్రాంతానికి వచ్చిన రామవ్వ ఇప్పుడు పెద్ద ఇంటికి యజమానురాలు. ఈ మధ్యే.. శంకరానికొక జోడీ కుదర్చాలని వధువును వెదికేపనిలో పడింది. ఓటమినీ చవిచూసింది. చివరకు ఆమె వెదికిన, అతడిని ఆకట్టుకున్న అమ్మాయి ఎవరంటే సంక్రాంతి.ఎందుకో ఆ అమ్మాయిని చూడకుండానే అతని మనసు సంక్రాంతిని కోరుకుంటోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఇంక రెండు నెలలలో పెళ్ళి. ఏడాది తిరగకుండానే పిల్లాడు.. తన ఆలోచనలకు తానే నవ్వుకున్నాడు. దారిపొడుగునా సంక్రాంతి ఆలోచనే వెంటాడసాగింది. ఇంకొక కిలోమీటరు దూరం ఉందనగా కారు వేగం తగ్గించి, కిటికీ నుండి బయటకి దృష్టి సారించాడు. చెరువు సౌందర్యానికి ఆకర్షితుడై రోడ్డు పక్కగా కారును ఆపి చెరువుకట్టపైకి చేరుకున్నాడు. గట్టు మీద కూర్చున్న ఒక యువకుడు చెరువు నీటిపై రాళ్ళను రువ్వుతున్నాడు. ఆ రాళ్ళు సృష్టించిన అలల వలయాలను కాసేపు చూసిన శంకరం అతని దృష్టిలో పడటానికి ‘హలో’ అన్నాడు. తిరిగి చూసిన ఆ యువకుడు మళ్ళీ రాళ్ళు విసరడంలో నిమగ్నమయ్యాడు. చూడటానికి స్థితిమంతుడిలానే కనిపిస్తున్నాడు. అయితే అతని ముఖం వాడిపోయి ఉంది. అతడిని మళ్ళీ పలకరించడానికి మనసురాక శంకరం తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఊరి మొదట్లో కారు నిలిపి, కిటికీ నుండి తల బయటకుపెట్టి గడ్డిమోపుతో వెళుతున్న వ్యక్తిని అడిగాడు.‘అన్నా.. సంక్రాంతి ఇల్లెక్కడ?’‘ఓ.. అమ్మాయిని చూడటానికి వచ్చినారా? అదిగో అక్కడ కనిపిస్తున్నాయి కదా పారిజాతం, సంపంగి చెట్లు.. ఆ ఇల్లే!’‘సరే’ అని ఆ వ్యక్తి నుండి వీడ్కోలు తీసుకుని సంక్రాంతి ఇంటికి చేరాడు శంకరం. ఆ ఇంటి ముందు కారు ఆపాడు. పారిజాతాల పరిమళం అతని ముక్కుకు తాకి హాయిగా అనిపించింది. శంకరం అరుగు వద్దకు వెళ్లగానే ఒక అవ్వ కళ్ళు విప్పుకుని చూస్తూ ‘ఎవరూ?’ అంది.‘నేను శంకరం. సంక్రాంతిని చూడటానికి వచ్చాను’ చెప్పాడు కాస్త సంకోచంతో.‘మా రామి కొడుకువా?’‘మా అమ్మ తెలుసా మీకు?’‘నా బిడ్డ రత్న స్నేహితురాలే కదా మీ అమ్మ? దాని కూతురే కదయ్యా సంక్రాంతి. ఏం తలరాతో ఇద్దరిదీ!’తన తల్లి ప్రస్తావన రాగానే శంకరం చిన్నగా నవ్వాడు.‘పోయిన వారం నుండి నీకోసం కాచుకున్నాం. రా.. రా..’ అని అతన్ని నట్టింటిలోకి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టింది. కూర్చోగానే ఇంటిని పరిశీలనగా చూశాడు. పాత ఇల్లే అయినా కంటికి ఇంపుగా కనిపించింది. ఇంటి మధ్యలో వేలాడుతున్న ఉయ్యాల బల్ల అతనికి బాగా నచ్చింది. సూర్యకిరణాలు నేల మీద కట్టిపడేసినట్టున్నాయి. ఏనుగు కళ్ళలా చిన్నగా ఉన్న కిటికీల వైపు నిండిన చెరువులోని చేపపిల్లలా అతని కళ్ళు పారాడటం చూసి ‘సంక్రాంతి ఇంట్లో లేదు బిడ్డా..’ అంది శివజ్జి. ‘ఔనా?’ నిరాశతో అన్నాడు.‘ఆమె మద్దూరులో చదువుకొంటోంది. విషయం తెలిపాను. ఇంకేం వచ్చేస్తూ ఉంటుంది.’శంకరం కోపాన్ని దిగమింగుకుని మౌనంగా ఉన్నాడు.‘నీ కోపం అర్థమవుతోంది నాయనా. ముందు తిండి తిను’ అని శివజ్జి.. తిండి తెచ్చి ముందుపెట్టింది. ‘అది కాదు అవ్వా.. నేను నా పనులన్నీ వదులుకుని వచ్చాను. ఫోను చేసినప్పుడే ఈ రోజు కుదరదని చెప్పివుంటే మరొక రోజు వచ్చేవాణ్ణి కదా’ అనే మాటలు నోటివరకూ వచ్చి ఆగిపోయాయి. మౌనంగా ఫలహారం ముగించిన శంకరం.. సంక్రాంతి కోసం నిరీక్షించసాగాడు. శివజ్జి మాట్లాడుతోనే ఉంది. ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకపోయాడు. చివరకు అక్కడ కూర్చోవడం విసుగనిపించి ‘అవ్వా.. కొంచెంసేపు అలా బయట తిరిగివస్తాను’ అన్నాడు. ‘సరే! నంజన్నను కూడా తీసుకువెళ్ళు. నీకు ఊరు తెలియదు కదా..’ అని, ‘ఏయ్ నంజన్నా’ అంటూ కేకేసింది. ‘వస్తున్నానమ్మా’ పెరటి నుండి పరిగెత్తుకొచ్చాడు నంజన్న. పశువులకు గడ్డి పెడుతున్నాడో ఏమో వాడి తలపై గడ్డిపరకలు చిక్కుకుని ఉన్నాయి. శంకరం వస్తున్న నవ్వును అదిమిపెట్టుకున్నాడు.‘వీరిని తోట దగ్గరికి తీసుకెళ్ళు..’‘అలాగే అమ్మా’ అని చెప్పి, ‘రండి సామీ’ అంటూ శంకరానికి దారి చూపించాడు.ముందు నడుస్తున్న వాడిని అనుసరించాడు శంకరం. పాదాల పరుగులో ఊరు వెనుకపడింది. నంజన్న ఒక్క మాటా పలకలేదు. వాడి ముఖం బిగుసుకున్నట్టు ఉంది. ఇద్దరూ కొబ్బరితోట చేరుకున్నారు. నంజన్న సరసరా చెట్టెక్కి కొబ్బరి బోండాన్ని తెంపాడు. పొదలో దాచిన మచ్చుకత్తిని తీసుకుని అతను వస్తున్న తీరు శంకరాన్ని భయపెట్టింది. కొబ్బరికాయ తలనరికి రంధ్రం చేసి శంకరం చేతిలోపెట్టి తాను దూరంగా కూర్చున్నాడు. తోటను దుక్కి దున్నిన కారణంగా మట్టి పాంటుకు అంటుకుంటుందని శంకరం కింద కూర్చోవడానికి సందేహించాడు. దీనిని గమనించిన నంజన్న లేచి కొబ్బరిమట్టను కత్తిరించి తెచ్చి కిందపరిచాడు. దానిమీద శంకరం నిశ్చింతగా కూర్చున్నాడు.‘నువ్వు కొబ్బరినీళ్ళు తాగవా?’ ‘ఊహూ.. మాకేం కొబ్బరినీళ్ళకు కరువా? మీరు తాగండి సామీ’ జవాబిచ్చాడు నంజన్న.కొబ్బరినీళ్ళు తాగుతూ శంకరం వాడిని గమనించాడు. నంజన్న కాళ్ళు మడుచుకుని తల మోకాళ్ళకు ఆనించుకుని కూర్చున్నాడు. అతని నిక్కరు మోకాళ్ళను పూర్తిగా కప్పివుంది. చూడటానికి కాస్త నలుపుగా ఉన్నా లక్షణంగా ఉన్నాడు. శరీరం దృఢంగా ఉంది. చేతిలోని మచ్చుతో నేలమీద ఉన్న కొబ్బరాకులను గెలుకుతూ కూర్చున్నాడు. ఆమె గురించి తెలుసుకోవడానికి సరైన సమయం ఇదే అని భావించిన శంకరం ‘సంక్రాంతి నీకు తెలుసా?’ అని అడిగాడు.‘తెలియకపోవడం ఏమి?’‘ఏం తెలుసు?’‘అంతా తెలుసు. ఆమెను ఎత్తుకుని ఆడించింది నేనే. చివరకు నాకు చాలా నొప్పి కలిగించింది..’‘ఏం చేసింది?’‘మీరు ఇక్కడే మరిచిపోతాను అంటే మీకొక విషయం చెప్పనా?’‘హూ..’‘సంక్రాంతిని నేను ప్రాణంకన్నా ఎక్కువగా చూసుకున్నాను. చిన్నప్పుడు నన్నే పెళ్ళి చేసుకుంటాననేది. నన్ను విడిచి ఒక్కరోజూ ఉండేది కాదు. పెద్దయ్యాక అంతా మరిచిపోయింది. పెళ్ళి విషయం ఎత్తితే కయ్యిమనేది. తరువాత ఆమె దక్కదు అని తెలిసి నేనూ మరిచిపోయాను. ఇప్పుడేమీ విచారం లేదు. మా అమ్మ చందుళ్ళిలో ఒక అమ్మాయిని చూసింది. వచ్చే నెలలోనే నా పెళ్ళి’ బాధతో మొదలైన అతని మాటలు దరహాసంతో ముగిశాయి.‘మా సంక్రాంతి పసిపాపలాంటిది. అయినా లోకాన్ని అంతే బాగా తెలుసుకుంది.’‘ఔనా? అయితే నువ్వు పేదవాడివని నిన్ను విడిచిపెట్టి ఉండాలి..’ అన్నాడు శంకరం.‘ఉండాలి కాదు విడిచిపెట్టింది అనండి సామీ..! నిరంజన్ తెలుసా?’‘లేదు.’‘మా ఊరికంతా పెద్ద ధనికుడు. అతనూ ఈమె మీద ప్రేమను పెంచుకున్నాడు. ఇద్దరూ బాగానే ఉండేవారు. తరువాత ఏమయ్యిందో?’‘ఇప్పుడతను ఏం చేస్తున్నాడు?’‘చెరువులో రాళ్ళు విసురుతూ కూర్చున్నాడు.’‘పాపం.. ఆ పిల్లోడినే అనుకుంటా నేనీ రోజు చెరువు దగ్గర చూసింది’ శంకరం తాను చూసిన వ్యక్తిని గుర్తుచేసుకున్నాడు.‘పాపమేమీ కాదు సామీ.. అతనికీ అతడి అత్త కూతురితో పెళ్ళి కుదిరింది. కొద్ది రోజుల్లోనే పెళ్ళి!’ ‘అయితే సంక్రాంతి..’ ఇంకేదో అనబోయాడు.‘ఇంకొక కొబ్బరి బోండాం తాగుతారా?’‘వద్దు.’‘అయితే మీరిక్కడే కూర్చోండి.. నేను పశువులకు పచ్చిగడ్డి కోసుకొస్తాను.’‘లేదు నేను ఇంటికి వెళ్తాను.’‘దారి తెలుస్తుందా?’‘హూ..’శంకరం ఊరి ముఖంగా నడిచాడు. ఎందుకో అతనికి సంక్రాంతి పట్ల మొదట ఉన్న ఉత్సాహం ఇప్పుడు ఉన్నట్లు లేదు. విసుగుతోనే ఇంటికి చేరాడు. వెంటనే ఇంట్లోకి వెళ్ళకుండా క్షణకాలం ఆలోచించి కారును నీడలో నిలపడానికి ముందుకుసాగాడు.‘బిడ్డా.. రా.. రా.. తోట చూశావా? నంజన్న ఎక్కడ?’‘వస్తున్నాడు.’వెళ్ళాలో, వద్దో అని సంశయిస్తూనే అవ్వ వెనుకే వెళ్ళి మళ్ళీ నట్టింట్లోకి వెళ్లి కూర్చున్నాడు. ‘చూడు బిడ్డా.. నా కూతురు రత్నకు ఇష్టం లేకుండానే పెళ్ళి చేశాను. అల్లుడు ఎవతినో ఉంచుకున్నాడంట. నా కూతురు ఈ పిల్ల పుట్టే వరకూ ప్రాణాన్ని చేతుల్లో పెట్టుకుని, బావిలో దూకి చచ్చిపోయింది. వాడు పెళ్ళాం చచ్చిన మూడు నెలలు నిండేలోపలే ఇంకో పెళ్ళి చేసుకున్నాడు. నా కూతురు పోయింది. కనీసం మనవరాలైనా బాగుండాలి! అందుకే అది ఒప్పుకున్న వాడితోనే పెళ్ళిచేస్తాను’ అంటూ శివజ్జి మళ్ళీ కథను మొదలుపెట్టాక శంకరానికి కంపరం అనిపించింది. తానిప్పుడు లేచి వెళ్ళిపోతే జీవితాంతం ఆమె కేవలం ఒక ప్రశ్నలాగే మిగిలిపోతుంది. అలా కావడం ఇష్టంలేక అక్కడే ఆగిపోయాడు.ఇంతలో ఘల్.. ఘల్.. ఘల్.. అంటూ గజ్జెల శబ్దం వినిపించింది. మల్లెపూల ఘుమఘుమలు చుట్టుపక్కల వ్యాపించాయి. సంక్రాంతి నట్టింట్లోకి ప్రవేశించింది. శంకరం కళ్ళు విప్పారాయి. ఆమె విశేషంగా అలంకరించుకుంది. ముదురుగోధుమ వర్ణపు చాయ కలిగిన ఆ పడతిని శంకరం కళ్ళార్పకుండా చూడసాగాడు.‘ఎందుకే ఇంత ఆలస్యం చేశావు?’ శివజ్జి గదిరించింది. బదులివ్వకుండా నవ్వి శంకరం వైపు తిరిగి,‘వేచి ఉండేలా చేసినందుకు కోపంగా ఉందా?’ అంది.ఈ ప్రశ్నను ఊహించని శంకరం తబ్బిబ్బవుతూ ‘ఏం లేదు’ అని బదులిచ్చాడు. ‘అవ్వా.. తాగడానికేమైనా పెట్టావా?’‘హూ..’ వంటగదిలోకి నడిచిన సంక్రాంతి పానకం గ్లాసులతో బయటకు వచ్చింది. ‘వెళదామా?’ ఖాళీ గ్లాసును కిందపెడుతూ ఆమె శంకరాన్ని అడిగినప్పుడు ‘ఎక్కడికి?’ అన్నాడు.‘నా గురించి ఏమీ తెలుసుకోరా?’‘సరే పదండి..’‘మీ కారులోనే వెళదామా?’ అన్నప్పుడు శంకరం అంగీకారంగా తలవూపాడు. కారు ఊరి నుండి ఒక మైలు దూరం సాగాక ఆపమని అడిగింది. కారు నుండి దిగిన ఆమెను అనుసరించాడు శంకరం. కొంతసేపు మౌనం తరువాత ఆమే మాట్లాడటం ప్రారంభించింది. ‘నేను కన్నడ ఎం.ఎ. చేస్తున్నాను. నాకు అమ్మ లేదు. నాన్న ఉన్నా లేనట్లే. అవ్వే నా సర్వస్వం.’‘హూ.. తెలుసు!’‘అయితే తెలియని విషయాన్ని చెబుతాను’ అని కొంత సమయం తీసుకుని మాట్లాడసాగింది. ‘పెళ్ళి విషయంలో నానొక నిర్దిష్టమైన వైఖరి ఉంది. బొమ్మలాడుకొనే వయసులో నంజన్ననే పెళ్ళి చేసుకోవాలి అనుకున్నాను. ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంటుంది. ఆ తరువాత నిరంజన్. నాకు జ్ఞానం పెరిగాక అతనూ సరైన ఎంపిక కాదని తెలిసింది!’‘అయితే మీరు వాళ్ళను ప్రేమించింది నిజమేనా?’‘అవును నిజమే. ఎప్పుడో వాళ్ళ మీద ప్రేమ ఉందనే కారణంతో ఇప్పుడు పెళ్ళి చేసుకోవడం కుదురుతుందా? నేను ఎంత ఎత్తులో నిలబడి చూసినా నాముందు మరుగుజ్జు అనిపించని వ్యక్తినే నేను పెళ్ళి చేసుకునేది’ అంటూ పెద్దగా నవ్వుతున్న ఆమెను చూసి శంకరం లోలోపలే మండిపడ్డాడు.‘హూ.. హిమాలయం ఎక్కి నిలబడ్డా ఎత్తుగా అనిపించే ఒక వ్యక్తి ఉన్నాడు!’‘ఎవరతను?’‘ఆకాశం! మీరు అతడినే పెళ్ళి చేసుకోండి’ అని నవ్వి శంకరం ‘నమస్కారం! నేను ఇక వెళ్ళివస్తాను’ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు.‘శంకరా.. చూడు సంక్రాంతికి పెళ్ళంట. లగ్నపత్రిక పంపించారు. నేనెంత చెప్పినా వినకపోతివి. వాళ్ళ నాన్నను మనసులో పెట్టుకుని తన జీవితం అమ్మలాగా కాకూడదని కావచ్చు నీకేదో కథ చెప్పి ఉంటుంది. నువ్వు దాన్నే పెద్దగా చూసి వద్దన్నావు. ఆమె అపురూపమైన పిల్ల బిడ్డా. నేను పెళ్ళికైనా వెళ్ళివస్తాను’ అంటూ రామవ్వ లగ్నపత్రికను అక్కడ పెట్టి వంటింట్లోకి వెళ్ళింది. కుతూహలంతో శంకరం లగ్నపత్రికలో వరుడి పేరు మీద దృష్టి నిలిపాడు. ‘ఆకాశ్’మళ్ళీ మళ్ళీ పేరు చదువుకున్న శంకరం నవ్వలేదు.– కన్నడ మూలం : విద్యా అరమనె– తెలుగు అనువాదం: కోడీహళ్ళి మురళీమోహన్ -
ఫ్లాట్ నెం-420.. అదొక గేటెడ్ కమ్యూనిటీ..
‘మేడం.. టీ’ అంటూ కస్తూరికి టీ ఇచ్చింది వంటమనిషి. ‘థాంక్స్’ అన్నట్టుగా నవ్వుతూ ట్రేలోంచి టీ కప్ తీసుకుంది కస్తూరి. వంటమనిషి వంటింట్లోకి వెళ్లేవరకు ఆగి, టీ సిప్ చేస్తూ ‘మొత్తానికి మీకు బాగానే ఆసరా అయినట్టుంది కదండీ ఈమె?’ అంది కస్తూరి ఎదురుగా సింగిల్ సీటర్లో కూర్చున్న ఆ ఫ్లాట్ ఓనర్ మంగళతో. ‘బాగానే ఏంటండీ.. చాలా బాగా! అందుకు మీకే థాంక్స్ చెప్పాలి. అమ్మాయి డెలివరీకి వచ్చింది.. ఆమె అత్తగారు వాళ్లు, చుట్టాల హడావిడి.. నా ఒక్కదానితో అయ్యేనా అని టెన్షన్ పడ్డాను. కరెక్ట్ టైమ్లో ఆ దేవుడు పంపించినట్లే మీరు ఆమెను మా ఇంటికి పంపారు. తనకు రాని వంట, రాని పనంటూ లేదండీ బాబూ! మా అమ్మాయికైతే ఎంత నచ్చిందో! ఆయిల్ మసాజ్ దగ్గర్నుంచి , అమ్మాయికి తినాలనిపించినవన్నీ వండి పెట్టేవరకు పనంతా తన మీదే వేసేసుకుంటోంది. డెలివరీ అయ్యి తనింటికి వెళ్లేప్పుడు వంటమనిషిని తోడు తీసుకెళ్లిపోతానంటోందండీ అమ్మాయి’ అంటూ నిశ్చింతగా నవ్వింది మంగళ. ‘మీ అమ్మాయికి నచ్చితే మరింకేం అండీ.. బ్రహ్మాండం’ అంటూ టీ కప్ టీ పాయ్ మీద పెడుతూ వంటింటి వైపు చూసింది కస్తూరి. వంటమనిషీ కస్తూరిని చూసింది.అదొక గేటెడ్ కమ్యూనిటీ. మంగళ, కస్తూరి వాళ్లవి పక్కపక్క ఫ్లాట్లే! ఆ వంటమనిషిది బీదర్ అని, భర్తపోయి పుట్టెడు దుఃఖం, అంతకన్నా పుట్టెడు అప్పుల్లో మునిగిపోయిందని, వంటపని బాగా చేస్తుందంటూ ఆమెను కస్తూరి వాళ్ల పనమ్మాయి అన్నపూర్ణ తీసుకొచ్చింది. మంగళ అవసరాన్ని గ్రహించి, ఆమె మాతృభాష కూడా కన్నడ కావడంతో కన్నడ వంటమనిషైతే ఆమెకు చక్కగా సరిపోతుందని ఆ వంటమనిషిని మంగళ ఇంటికి పంపింది కస్తూరి. మంగళకు ఆ వంటమనిషి చురుకుదనం, పర్ఫెక్షన్, మర్యాద, మన్నన బాగా నచ్చాయి. అందుకే ఆమె త్వరగా మంగళకు ఆప్తురాలైపోయింది.ఒకరోజు.. ‘అమ్మా.. ఈ రోజు సాయంకాలం అన్నపూర్ణ వాళ్లతో కలసి బిర్లా మందిర్కి వెళ్లొస్తానమ్మా’ రిక్వెస్ట్ చేసింది వంటమనిషి.. దిండు గలీబులు మారుస్తూ. ‘వాళ్లతో ఎందుకూ? మన డ్రైవర్తో కార్లో పంపిస్తాలే’ చెప్పింది మంగళ తమ బెడ్రూమ్లోని స్విచ్ బోర్డ్లా కనిపిస్తున్న సీక్రెట్ సేఫ్ తెరిచి అందులో ఏవో డాక్యుమెంట్స్ సర్దుతూ! ‘అయ్యో కార్లో ఎందుకమ్మా.. చక్కగా అన్నపూర్ణ వాళ్లతో వెళ్తాలే! వాళ్లతో సరదాగా గడిపినట్టు ఉంటుంది’ అంది బెడ్ కిందున్న సొరుగులాగి కొత్త బెడ్షీట్ తీస్తూ! దాన్ని బయటకు తీయబోతుంటే బెడ్షీట్ పోగొకటి ఏదో స్క్రూకి తట్టినట్టయింది. షీట్ చిరగకుండా పోగును తెంపబోతుండగా గబగబా మంగళ వచ్చి వంటమనిషిని నెమ్మదిగా పక్కకు నెట్టి, సొరుగును లోపలికి తోసేసి, ‘ఆ బెడ్ షీట్ వద్దులే.. ఇంకోటి ఇస్తా’ అంటూ వార్డ్ రోబ్ దగ్గరకు వెళ్లింది. అయోమయంగా నిలబడిపోయింది వంటమనిషి.ఆమె మొహంలోని ఫీలింగ్ని ఇంకోలా అర్థం చేసుకున్న మంగళ కూతురు ‘తన ఫ్రెండ్స్తో పోతానంటోంది కదా.. పోనీలే మమ్మీ..’ అంటూ వంటమనిషి తరపున తల్లికి సిఫారసు చేసింది.‘సరే వెళ్లిరా..’ అంటూ వార్డ్రోబ్లోంచి తీసిన మరో బెడ్ షీట్ని వంటమనిషి చేతుల్లో పెట్టింది మంగళ. ఆరోజు సాయంకాలం అయిదింటికి అన్నపూర్ణ వాళ్లతో కలసి బయటకు వెళ్లింది వంటమనిషి. రాత్రి తొమ్మిది అయినా తిరిగిలేదు. కంగారు పడిపోయారు మంగళ కుటుంబ సభ్యులు. కస్తూరికి ఫోన్ చేసి అన్నపూర్ణ వివరం అడిగి, ల్యాండ్ లైన్ ఫోన్ రిసీవర్ను క్రెడిల్ చేసిందో లేదో ఆ ఫోన్ మోగింది. క్షణంలో లిఫ్ట్ చేసి ‘హలో.. ’ అంది మంగళ. ‘హలో అమ్మగారేనా..’ అంటూ మంగళ స్వరాన్ని నిర్ధారించుకుని, ‘అమ్మా.. బిర్లా మందిర్ దగ్గర మా చుట్టాలమ్మాయి కలిసింది.బలవంతపెడితే వాళ్లింటికి వచ్చానమ్మా! ఈ రాత్రికి ఉండిపొమ్మంటున్నారు. రేప్పొద్దున్నే వచ్చేస్తానమ్మా.. వాళ్లు దిగబెడతామంటున్నారు’ అంటూ వంటమనిషి ఠక్కున ఫోన్ పెట్టేసింది.. మంగళ ఏదో అడగబోయేంతలోనే! వంటమనిషి ఆ తీరు ఆమెకు కోపాన్ని తెప్పించింది. ‘చూశావుగా.. అందుకే పంపనన్నా..’ అంది కూతురితో అసహనంగా. ‘వాట్ హ్యాపెండ్?’ అడిగింది సోఫాలో పడుకుని ఏదో మ్యాగజీన్ చదువుతున్న కూతురు లేచి కూర్చుంటూ. ‘వాళ్ల చుట్టాలమ్మాయి కలిసిందట, వాళ్లింటికి వెళ్లిందట, రేపు ఉదయం వస్తుందట’ చెప్పింది మంగళ విసురుగా. ‘అబ్బా మమ్మీ.. వస్తుందిలే రేపు.. కూల్’ అని సర్దిచెప్పింది కూతురు. ‘అన్నీ కథలు.. అది నీ అలుసే తీసుకుంది’ హెచ్చు స్వరంతో అంటూ బెడ్రూమ్లోకి వెళ్లింది మంగళ. తెల్లవారి ఆరు గంటలు.. అది చలికాలం కావడం వల్ల ఇంకా చీకటిగానే ఉంది. మంగళ వాళ్ల ఫ్లాట్ కాలింగ్ బెల్ మోగింది. రెండుసార్లకు.. మంగళ వచ్చి తలుపు తీసింది. ఎదురుగా ఒక స్త్రీ, ఇద్దరు మగవాళ్లున్నారు. మంగళకేం అర్థంకాలేదు. ‘ఎవరు మీరు?’ అంది. ‘ఫ్రమ్ ఐటీ’ అంటూ ఐడీ కార్డ్స్ చూపిస్తూ లోపలికి వెళ్లారు. ఆ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్లోని వంటిల్లు, రెండు బెడ్రూమ్స్ గోడల్లోని సీక్రెట్ సేఫ్స్, మంచం కింది సొరుగులోని సీక్రెట్ అరలను సోదా చేస్తే 70 తులాల బంగారం, ల్యాండ్ డాక్యుమెంట్స్, నాలుగు కోట్ల క్యాష్ బయటపడింది. అది ఒక ఆర్డీవో ఫ్లాట్. నంబర్ 420.అతని బ్లాక్ మనీ గురించి ఐటీ డిపార్ట్మెంట్కి టిప్ అందించింది కస్తూరే! ఆమె రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగి. ఆమె సహకారంతోనే ఐటీ మహిళా ఉద్యోగి వంటమనిషిగా మంగళ వాళ్లింట్లోకి చేరింది. ఆ ఫ్లాట్ని కళ్లతోనే స్కాన్ చేసి, అన్నపూర్ణ ద్వారా డిపార్ట్మెంట్కి చేరవేసింది. అన్నపూర్ణకూ తెలియదు తాను ఏవో వివరాలను ఐటీ డిపార్ట్మెంట్కి మోస్తున్నట్లు వంటమనిషి, తన కొలీగ్ ఓ కోడ్ లాంగ్వేజ్ పెట్టుకుని అన్నపూర్ణ ద్వారా ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకున్నారు. సెర్చ్ వారంట్ సిద్ధమయ్యాక.. బిర్లామందిర్ మిషతో ఆ ఇంట్లోంచి బయటపడింది ఆ వంటమనిషి. కాయిన్ బాక్స్ ఫోన్స్ కాలం నాటి ఈ ఆపరేషన్ అప్పట్లో ఓ మోస్తరు సంచలనాన్ని సృష్టించింది. – శరాది -
వయనాడ్ విలయం : ఆ చిన్నారి చెప్పిందే నిజమైంది! కానీ తండ్రి దక్కలేదు
కేరళలోని వయనాడ్ ప్రకృతి ప్రకోపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఈ ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది ఆచూకీ తెలుసు కునేందుకు సహాయక బృందం, అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ విపత్తు గురించి ఓ చిన్నారి ముందే ఊహించిందా? గత సంవత్సరం తన పాఠశాల మ్యాగజైన్లో, 8వ తరగతి విద్యార్థిని లయ, జలపాతంలో మునిగిపోయిన బాలిక గురించి ఒక కథ రాసింది. అచ్చం వయనాడ్ విధ్వంసాన్ని పోలిన ఈ కథ బెస్ట్ స్టోరీగా ఎంపికైంది. ప్రస్తుతం ఈ స్టోరీ వైరల్గా మారింది.వయనాడ్ జిల్లాలోని గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో 8 వ తరగతి చదువుతున్న లయ అనే బాలిక రాసిన కథ ప్రస్తుత విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించింది. జలపాతంలో మునిగి ఒక అమ్మాయి మరణిస్తుంది. చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి పక్షిగా మారి, తిరిగి అదే గ్రామానికి తిరిగి వచ్చి రానున్న పెను ముప్పు గురించి హెచ్చరిస్తుంది. "వర్షం కురిస్తే, కొండచరియలు జలపాతాన్ని తాకుతాయి, ఆ ధాటికి అపుడు మానవ జీవితాలతో సహా మార్గంలో ఉన్న ప్రతిదానిని ముంచెత్తుతాయి" ఇదీ ఆమె కథ సారాంశం. కథలో భాగంగా అనశ్వర, అలంకృత అనే ఇద్దరు స్నేహితులు తల్లిదండ్రులకు చెప్పకుండా జలపాతం చూడటానికి వెళతారు. అపుడు "పిల్లలూ ఈ ఇక్కడి నుంచి పారిపోండి. ఇక్కడ పెద్ద ప్రమాదం జరగబోతోంది" అని వార్నింగ్ ఇస్తుంది. దీంతో ఆ పిల్లలు పారిపోతారు. వెనక్కి తిరిగి చూసేసరికి కొండపై నుంచి భారీగా వర్షపు నీరు, మట్టి, బురద వేగంగా ఆ గ్రామం వైపు దూసుకొస్తూ ఉంటుంది. అలా తనలాగా ఆ పిల్లలు జీవితాలు బలికాకుండా కాపాడుతుంది. ఆ తర్వాత విచిత్రంగా ఆ పక్షి అందమైన అమ్మాయిగా మారిపోతుంది. వయనాడ్ జిల్లాలోని చురల్మల ప్రాంతం ప్రస్తుతం కొండచరియలు సృష్టించిన విధ్వంసంలో లయ తండ్రి లెనిన్ను ప్రాణాలు కోల్పోవడం విషాదం. అంతేకాదు లయ చదువుతున్న పాఠశాల పూర్తిగా ధ్వంసమైంది. మొత్తం 497 మంది విద్యార్థుల్లో 32 మంది ప్రకృతి బీభత్సానికి బలయ్యారు. మరో ఇద్దరు విద్యార్థులు వారి తండ్రి, అక్కాచెల్లెళ్లను కోల్పోయారు. అయితే స్కూల్ హెడ్ మాస్టర్ వి ఉన్నికృష్ణన్, ఇతర ఉపాధ్యాయులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని బయటపడ్డారు. ఈ ప్రాంతంలోని రెండు పాఠశాలల నుండి నలభై నాలుగు మంది పిల్లలు తప్పిపోయారు. చాలామంది విద్యార్తులు తమ స్నేహితులను కోల్పోయిన షాక్లో ఉన్నారు. -
ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన..!
తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారికి దగ్గరగా బంగాళాఖాతం సముద్ర తీరం వద్ద ఉన్న కుగ్రామం అది. అక్కడినుంచి ఓ యువకుడు స్వామి వారి దర్శనార్థం తిరుమల బయలుదేరాడు. ఏడు పదుల వయస్సు నిండిన తండ్రి కూడా తిరుమల వస్తానన్నాడు. అయితే, కూర్చుంటే లేవలేని, లేస్తే కూర్చోలేని ఆ వృద్ధుడి శరీరం ప్రయాణానికి సహకరించలేదు. కొండకు రాలేక పోతున్నందులకు తండ్రి చాలా బాధపడ్డాడు. ఇంటిలోని స్వామి వారి పటాన్ని చూస్తూ ‘‘మహిమలున్న స్వామివారి కొండనుంచి ఎన్నాళ్ళయినా చెడనిది, నీటిలో కరగనిది, ఎన్నటికీ వాడనిది ఏదైనా ఒకటి తీసుకుని రా! అయితే అది పవిత్రమైనదిగా ఉండాలి!!’’ అని చెప్పాడు.‘‘అలాగే నాన్నా!’’ అని చెప్పి రైలు ఎక్కాడు ఆ యువకుడు. ఆ రోజు గురువారం కావడంతో అతి నిరాడంబర స్వరూపంతో నొసటన చాలా సన్నని నామం మాత్రమే కలిగి ఉన్నారు స్వామివారు. గురువారం మాత్రమే కనిపించే ‘నేత్ర దర్శనం’ తృప్తిగా చేసుకున్న ఆ యువకుడు ఆనంద నిలయం నుంచి బయటికి వచ్చాడు. లడ్డూ ప్రసాదాలూ, కలకండ, తులసి చెట్టు లాంటివి తీసుకున్నాడు. గబుక్కున తండ్రి చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. అయితే, తండ్రి చెప్పినట్లు ‘చెడనిది, కరగనిది, వాడనిది, ఏదై ఉంటుందా?’ అని ఆలోచించాడు. తను తీసుకున్న లడ్డూ ప్రసాదం వైపు చూశాడు. ‘ప్రసాదం ఎక్కువ కాలం నిల్వ ఉండదు కదా’ అనుకున్నాడు. కలకండ వైపు చూశాడు. ‘ఇది నీటిలో సులభంగా కరిగి΄ోతుంది కదా’ అని భావించాడు. తులసి చెట్టు వైపు చూశాడు. ‘కొన్నేళ్ళకైనా చెట్టు వాడినొతుంది కదా’ అని తలచాడు. ‘మరి తండ్రి చెప్పినట్లు వేరే ఏదైనా ఇక్కడ దొరుకుతుందా?’ అని మాడ వీధుల్లో వెదికాడు. ఆలాంటి వస్తువు ఏదీ అతడికి కనిపించలేదు. ‘నాన్నకి సులభంగా మాట అయితే ఇచ్చాను కానీ, అది నేరవేర్చలేకపోతున్నానే...’ అని బాధగా నడవటం ప్రారంభించాడు. రైల్లో వెళ్ళడానికి మరింత సమయం ఉండటంతో నామాల మిట్ట వద్దకు వెళ్ళి కూర్చున్నాడు. ‘పరిష్కారం ఏమిటా?’ అని పరిపరి విధాలా ఆలోచించాడు. అయితే పరిష్కారం ఏదీ దొరకలేదు. అక్కడినుంచి శిలా తోరణం వద్దకు నడుచుకుంటూ వెళ్ళాడు. సహజసిద్ధమైన ఆ తోరణాన్ని కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఓ కారు వచ్చి అక్కడ ఆగింది. అందులో హిందీ భాష మాట్లాడుతూ ఉన్న ఉత్తర భారత దేశీయులు ఉన్నారు. వాళ్ళు కారులో నుంచి దిగిందే ‘గోవిందా గోవిందా’ అని నామస్మరణ చేస్తూ నేలకు నమస్కరించారు. అక్కడే ఉన్న చిన్న రాళ్ళకు కూడా దండాలు పెట్టారు. అప్పుడు అతడి మనసులో మెరుపులాంటి ఆలోచన వచ్చింది.తిరుమల కొండలోని చెట్టూ పుట్టా, రాయీ ర΄్పా... అన్నీ పవిత్రమైనవే! ఈ నేలంతా స్వామి వారి పాద స్పర్శతో పునీతమైనదే. కాబట్టి ఇక్కడి రాయిని తీసుకెళ్ళి నాన్నకి ఇస్తాను. నాన్న చెప్పినట్లు ‘చెడనిది, కరగనిది, వాడనిది... పవిత్రమైనదీ ఇదే’ అని భావించి ఒక గుండ్రటి రాయిని తీసుకుని సంచిలో వేసుకున్నాడు. గోవింద నామ స్మరణలు చేస్తూ ఊరికి ప్రయాణం కట్టాడు. కొడుకు తెచ్చిన రాయిని చేతిలోకి తీసుకున్న ఆ వృద్ధుడి కళ్ళు తన్మయత్వంతో తడి అయ్యాయి. ఆ రాయికి పాలతో, నీళ్ళతో అభిషేకం చేసి, నామాలు పెట్టి, తులసి మాల వేసి దేవుడి గదిలో ఉంచారు. ‘స్వామే మన ఇంటికి నడిచి వచ్చాడు!’’ అనుకుంటూ భక్తిశ్రద్ధలతో పూజ చేసి, కొండ లడ్డును ఊరంతా పంచిపెట్టారు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం : అర్థము అంటే..!!!
సుఖాన్ని... కామాన్ని ధర్మము చేత కట్టాలి. అప్పుడు ధర్మబద్ధమైన అర్థం ప్రభవిస్తుంది. అందుకే కన్యాదాత కన్యను తీసుకొచ్చి ధర్మపత్నిగా ఇచ్చేటప్పుడు వరుడితో... ‘కన్యామిమాం ప్రదాస్యామి పితౄణాం తారణాయవై’ అంటాడు. ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది. ఆకలితో ఉన్నవాడికి అన్నం, దాహంతో ఉన్నవాడికి నీరు... అలాగే కామం ఒక ప్రయోజనం కోసం... అందువల్ల అది ధర్మంచేత కట్టబడాలి. ఆయనకు సంతానం కలిగి పితృరుణంనుండి విముక్తుడు కావాలి. ఆయన యజ్ఞం చేయాలంటే పక్కన భార్య ఉండాలి. వివాహం చేయాలంటే పత్ని ఉండాలి. ఆమె లేనప్పుడు ఈ కార్యక్రమాలు వేటికీ కూడా ఆయన అర్హుడు కాడు... ఈ నియమాలు ఎవరో ఒకరు పెట్టినవి కావు. శాస్త్రం నిర్దేశించినవి. అంటే ధర్మపత్నిని స్వీకరించకుండా పుణ్యకార్యాలు చేయడం, తరించడం ఎలా సాధ్యం? అందుకే జీవితం పండించుకోవడానికి అవసరమయిన సాధనాన్ని కన్యాదాత ఇస్తున్నాడు. నిజం చె΄్పాలంటే ... కొడుకు పుడితే.. వాడు ప్రయోజకుడయితే.. వాడు ధార్మికంగా బతికితే... అప్పుడు తల్లీదండ్రీ, ఆపైన ఉన్నవాళ్ళు .. తరువాత అత్తగారు, మామగారు తరిస్తారు. పుత్ అను పేరుగల నరకం నుంచి త్రాయతే.. రక్షిస్తాడు కాబట్టి పుత్రుడు అన్నారు. కుమార్తెను కన్యాదానం చేశాను.. అనుకోండి. అప్పుడు నాకు పది తరాల ముందూ, పది తరాల వెనకా నాతో కలిపి 21 తరాలు తరించి΄ోతాయి. ఈ సంతానం కలగడానికి కారణం ఎవరు? నా ధర్మపత్ని. ఆమె వల్ల సంతానం కలిగితే ఇంత గొప్ప ప్రయోజనం సిద్ధించింది. అందువల్ల కామము ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉండాలంటే.. భార్యాభర్తలు చెలియలికట్ట దాటకూడదు. విశ్వనాథ సత్యనారాయణ గారు ‘చెలియలికట్ట’ అనే సాంఘిక నవల రాశారు. అందులో... వివాహం ద్వారా కామము ధర్మం చేత ఎందుకు కట్టబడుతుందో ప్రతి΄ాదించారు. సముద్రం అనంత జలరాశి. చాలా శక్తిమంతం. అది అనుకుంటే ఊళ్ళను సునాయాసంగా ముంచేయగలదు. అయినా దానికదిగా .. చెలియలికట్ట దాటకూడదని.. ఒక నియమం పెట్టుకుంది. ఆడుకుంటున్నట్లుగా అక్కడిదాకా వస్తాయి. ఎదురుగా వచ్చిన వాళ్ళ ఆచారాలు కడిగి అలలు వెనక్కి వెళ్ళిపోతాయి. కాళ్ళు కడిగాయి కదా అని అతి చేసి తెగించి మరింత ముందుకు వెడితే.. ప్రమాదం ముంచుకొస్తుంది.‘ధర్మేచ, అర్థేచ, కామేచ ఏషా నాతి చరితవ్యా..’ – ఇది ప్రమాణం. ‘మామగారూ! ఇప్పుడు నాకు అర్థమయింది. మీరు నాకు ఇంతటి మహోపకరణాన్ని ఇచ్చారు. నేను ఈమెను అతిక్రమించను. ఈమె నాకు ప్రధానంగా ధర్మబద్ధ జీవితానికి ఒక సాధనం. ఈమెను నేను ధర్మపత్నిగా స్వీకరించినందుకు నా జీవితం పండాలి. చేయగలిగిన పుణ్యకార్యాలు చేయాలి. అసలు నేను నా భార్యతో కలిసి చేయవలసివేమిటో నాకు తెలియాలి. మేమిద్దరం చేయీచేయీ పట్టుకుని ప్రయాణించాలి. తద్వారా నేనూ తరించాలి, ఆమే తరించాలి.’ అనుకుని ఆచరిస్తాడు. అలా కామము ధర్మము తో కలిసినప్పుడు అర్థము ప్రభవిస్తుంది. అర్థము – అంటే? బంగారం, ఇళ్ళు, వస్తు, వాహనాలు కాదు... మరి నిజమైన సంపద ఏది? పిల్లలకు తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు పిల్లలే అసలు సిసలైన సంపద. అదే అర్థము ప్రభవించడం అంటే.-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
'అనాగరికుడు'! గేటుతీసుకుని లోపలికొచ్చి..
గేటుతీసుకుని లోపలికొచ్చి వరండాలో స్తంభానికి ఆనుకుని కూర్చున్నాడు పీరయ్య. మాసిన గళ్లచొక్కా, నలిగిన ప్యాంటు, చెదిరిన జుట్టు, పెరిగిన గడ్డం, లోతుకుపోయిన ఎర్రటి కళ్లు, వొంగిన కడ్డీలాంటి గరుకు శరీరం. జైలు నుంచి విడుదలైన సంవత్సరకాలంలో ఇంకా సన్నబడ్డాడు. ఈమధ్య అంతగా రావడంలేదు.‘మనవూర్లోనే వుంటున్నావా?’ అడిగాను న్యూస్ పేపరు పక్కనపెట్టి. ‘వొకవూరని లేదు వాసుబాబూ’ ఉదయపుటెండలో పూల మీద ఎగురుతున్న సీతాకోకచిలుకను చూస్తూ అన్నాడు. ‘యెందుకని?’‘యేడేండ్లలో కాలం మారలేదా? నేను యిడుదలైవొచ్చే లోపల రాజకీయాలూ మారిపోయినాయి. మా పెదలింగయ్య, ఆయన దాయాదీ రాజీపడి ఫ్యాక్చన్ వైరాలు నిలిపేసిరి. వాల్ల పిల్లోళ్లు డాకటర్లు, యింజనీర్లై సిటీలకు, యిదేసాలకు యెళ్లిపోయిరి. యింగ మందీమార్బలంతో, జీపులతో, నా మాదిరి డ్రైవర్లతో పనేముండాది? పెదలింగయ్య బెంగుళూరులో కొడుకు దెగ్గిరికి యెళ్లిపోయినాడు’మార్పువచ్చి ఉపాధి పోయినందుకు అతనిలో నిరాశ కనిపించలేదు. పోరాట వాతావరణంలో ఉండేవాళ్లు ఎలాంటి నష్టానికైనా సిద్ధంగా ఉంటారేమో అనుకున్నా. ‘డ్రైవరు పని లేకపోతే సేద్యం చేసుకోవచ్చు. నీక్కొంచెం చేనుండాలిగదా?’ అన్నా. ‘నేను జైలుకుబోయి, మాయమ్మ కాలమైపోయినాక సేనంతా కంపసెట్లు మొల్చి నా మాదిరే తరంగాకుండా ఐపోయిండాది’ ‘బాగుచేసుకోలేకపోయినావా?’ ‘వూళ్లో వుండలేక పోయినాను. ఫ్యాక్చన్లో యెదుటోణ్ణి సంపితే వోడు యీరుడు. పెండ్లాన్ని సంపిన కేసు మీద యేడేండ్లు జైలుకు పోయొచ్చినోడికి మర్యాదేముంటాది?’ పీరయ్య తన భార్య సంగతి మాట్లాడినప్పుడు గొంతు జీరగా పలుకుతుంది. అందులో దుఖంతోపాటు తను నిర్దోషిననే భావన ఉంటుంది. ‘నువ్వాపని చెయ్యలేదని, అది ప్రమాదం వల్ల జరిగిందని వూళ్లో నమ్మడంలేదా?’‘యెవురు నమ్మినారో యెవురు లేదో. అందురూ నీమాదిరుంటారా? తల్లీ, బార్యా యిద్దురూ పోయినారు. కోర్టు సెప్పిన సిచ్చ ఐపోయినా ప్రెపంచం యేసిన సిచ్చ యింగా నడస్తావుంది. పెదలింగయ్య నీడ గూడా పాయె. జెనం సైలెంటుగా వుండేదానికి నేనేమన్నా డబ్బు, పలుకుబడీవుండే బడాబాబునా? నా గురించి సెప్పినాక యాడా కుదురుగా పని యియ్యడంలేదు, ఆడా యీడా తిరగతావుండా’ ఉదాసీనంగా అన్నాడు.‘తను తప్పు చెయ్యలేదనే భావన ఒక్కటే పీరయ్య జీవితేచ్ఛేను కొనసాగిస్తున్నట్టుంది’ అనుకున్నా.నా శ్రీమతి తెచ్చిపెట్టిన ఉప్మాతిని, కాఫీతాగి ‘సిటీలో నాకేదైనా డ్రైవరుద్యోగం సూపించు వాసుబాబూ. నీలాంటి మంచోడు సెప్తే యిస్తారు’ అని వెళ్లిపోయాడు. పీరయ్య గురించిన ఆలోచనల్లో పడ్డాను.ఆర్థిక నేపథ్యాలు వేరైనా పీరయ్యా నేనూ చిన్నతనంలో స్నేహితులం. తండ్రి అనారోగ్యంతో చనిపోయాక పీరయ్య చదువును ఐదోతరగతిలోనే ఆపేసి తల్లి అంకమ్మతో పొలం పనులకు, యెనుములను మేపడానికి వెళ్లేవాడు. పీరయ్యకు మొదట్నుంచి డ్రైవింగ్ అంటే మోజు. అతనికి పన్నెండేళ్లప్పుడే ఊరి దగ్గర కడుతున్న పెద్దచెరువు పనికోసం వచ్చే టిప్పర్లు, జీపులకు క్లీనరుగా వెళ్తూండేవాడు. పెద్దయ్యాక డ్రైవింగ్ నేర్చుకుని మా పక్కవూర్లోని ఫ్యాక్షన్ లీడర్ పెదలింగయ్య దగ్గర జీపుడ్రైవరుగా స్థిరపడ్డాడు.మా కుటుంబం ఊరొదిలేశాక పీరయ్యను కలవడం తగ్గిపోయింది. ఎప్పుడైనా కలసినప్పుడు తన సాహసంతో, డ్రైవింగ్ ప్రతిభతో పెదలింగయ్యను ప్రత్యర్థుల నుంచి ఎలా రక్షించాడో ఉద్వేగంగా చెప్పేవాడు. పోరాటంలో హింస తప్పుకాదని, ఐతే అది న్యాయం కోసం అయివుండాలి అనేవాడు. నమ్మినవాళ్ల కోసం త్యాగానికి సిద్ధంగా ఉండాలనేవాడు. పైకి అనాగరికంగా, నిర్లక్ష్యంగా, రఫ్గా కనపడ్డం, ఫ్యాక్షనిస్టు నాయకుడితో ఉండడంవల్ల లోకం అతన్ని ఒక రౌడీగానే చూసేది. పీరయ్యకూడా తన వృత్తికి ఆ ఇమేజ్ అవసరమని భావించి దాన్నే బహుముఖంగా ప్రదర్శించేవాడు.పీరయ్యకు పెదలింగయ్య పొలాలు చూసే ఓబయ్య కూతురు గౌరితో పెళ్లైంది. గౌరి చక్కగా వుంటుంది. ‘తండ్రికి ఇష్టంలేకపోయినా, తను మోటుగా వున్నా జానపద కథల్లోలా తన నైపుణ్యం, తెగువ చూసి గౌరే పట్టుబట్టి పెళ్లిచేసుకుందని’ నమ్మాడు పీరయ్య. అదే బయట గర్వంగా చెప్పుకుని వ్యతిరేకులను పెంచుకున్నాడు. భార్యాభర్తలు అన్యోన్యంగానే ఉండేవాళ్లు. ఐతే గౌరికి ముక్కు మీద కోపమని, తన తల్లి అంకమ్మతో పడదని వాపోయేవాడు. క్రమంగా అత్తాకోడళ్లకు తగవులు పెరిగిపోయాయి. తగవులైనప్పుడు పీరయ్య నలుగురి ముందు భార్య మీదే కేకలేసి పైకి తన ఆధిక్యతను ప్రదర్శించేవాడు. ఒక్కోరోజు విసుగెత్తి ఇంటికి రాకుండా పెదలింగయ్య బంగళా దగ్గరే ఉండిపోయేవాడు.పెళ్లైన కొన్నేళ్ల తరువాత ఒక తుఫాను రాత్రి పీరయ్య జీవితంలోనే తుఫాను తెచ్చింది. పెద్దవర్షంలో అతను ఆలస్యంగా ఇంటికొచ్చేసరికి కోడలితో పోట్లాట జరిగి అంకమ్మ యెనుముల కొట్టంలో తడుస్తూ చలికి ముడుచుకుపోయి ఏడుస్తూ కనపడింది. పీరయ్య ఆవేశంగా ఇంట్లోకెళ్లి ఒక్కతేవున్న గౌరితో గొడవ పడ్డాడు. పెనుగులాటలో గోడకున్న పెద్దమేకు తలవెనక దిగి, రక్తంకారి గౌరి స్పృహ తప్పి పడిపోయింది.పీరయ్య జీపులో ఆమెను దగ్గర్లోని చిన్నాసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టరు సెలవులో ఉండడంతో ఆ వర్షంలో, కిందామీదా పడి పొంగుతున్న వాగులుదాటి, ఆలస్యంగా టౌనుకు తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స జరిగింది గాని గౌరి స్పృహలోకి రాలేదు. రెండురోజుల తరువాత చనిపోయింది. పీరయ్య డ్రైవింగ్ నైపుణ్యం తుఫాను చేతిలో ఓడిపోయింది. పీరయ్య షాక్ కి గురై కొన్నాళ్లపాటు అచేతనంగా ఉండిపోయాడు.అల్లుడే తనకూతుర్ని హత్య చేశాడని ఓబయ్య కేసు పెట్టాడు. పీరయ్య వ్యతిరేకులే అతన్నలా ఎగదోశారని కొందరన్నారు. ఓబయ్య కూడా తన మనిషే కాబట్టి పెదలింగయ్య తటస్థంగా ఉండిపోయాడు. పీరయ్య సానుభూతిపరుల సాయం సరిపోలేదు. కేసు రెండేళ్లు నడిచాక పీరయ్యకు రిమాండుతో కలిపి ఎనిమిదేళ్లు శిక్షపడింది.పీరయ్యను జైల్లో కలిసినప్పుడు ‘మంట ఆరిన కాగడాలా’ కనిపించేవాడు. ‘నేను ఫ్యాక్చన్ మనిసిగా వుండడం, రౌడీగా ఔపడ్డం, గౌరితో మనువాసించి బంగపడిన యెదవలు మాపెదలింగయ్య మనుసు యిరిసేయడమే గాక నాకు యెతిరేక సాచ్చమివ్వడం వల్ల సెయ్యని నేరానికి సిచ్చపడింది’ అని వాపోయేవాడు. ‘ఆడికీ ‘కోర్టు సానుభూతిగా సూసి తక్కవలో పోగొట్టిందని’ మా వకీలుసారు సెప్పినాడు’ అని సమాధానపడేవాడు. మళ్లీ అంతలోనే ‘ఐనా నేను గౌరిని సంపడమేంది, నాకీ సిచ్చేంది వాసుబాబూ’ అని ఏడ్చేవాడు.‘ఆరాత్రి ఏం జరిగిందో ఇంకెవరూ చూడలేదు. పీరయ్యకు హింసాప్రవృత్తి లేదని అనుకునే నాలాంటి వాళ్లు కొందరు తప్ప మిగతావాళ్లెవరూ అతని మాటలు నమ్మినట్టు కనపడదు. దానికి చాలావరకూ కారణం అతనే. పీరయ్య ఏ ధర్మాన్ని నమ్ముకున్నాడో అదే అతన్ని దెబ్బతీసింది’ అనుకున్నా.‘గౌరి ప్రెమాదం వల్లే సచ్చిపోయిందని లోకం యేపొద్దుటికైనా తెల్సుకుంటాది. ఐనా గౌరి ఆత్మకు నిజెం తెల్సు, అదేసాలు’ అని శిక్ష చివరి రోజుల్లో గాలిలోకి చూస్తూ అనేవాడు. జైలు జీవితంలో పీరయ్య చూడ్డానికి మరింత గరుకు తేలినా, మొహంలో మునుపటి రౌడీ కవళికలు పోయాయి. మంచి ప్రవర్తన కారణంగా సంవత్సరం ముందే విడుదలయ్యాడు.‘మీ ఆఫీసుకు టైమౌతోంది’ అన్న శ్రీమతి పిలుపుతో వర్తమానంలోకి వచ్చాను.నెలరోజుల తరువాత ఒక సాయంత్రం నేను డాబా మీద కుండీల్లో మొక్కలకు నీళ్లు పోస్తూంటే వచ్చాడు పీరయ్య. మంచి ప్యాంటు షర్టు వేసుకున్నాడు, తల దువ్వుకుని, తేట మొహంతో నీట్గా ఉన్నాడు. సూర్యుడు దిగిపోయాడు, గుళ్లోని సుబ్బులక్ష్మి పాటకి చెట్లు తలలూపుతున్నాయి, జమ్మిచెట్టు మీది పక్షులు ముందే గూళ్లు చేరుకుంటున్నాయి. ‘మీ కాలనీలో దేవరాజుసారు దెగ్గిర డ్రైవరుద్యోగం దొరికింది. రెండురోజులాయె. మకాం యింటెనకాల అవుటౌసులోనే’ గట్టు మీద కూర్చుంటూ చెప్పాడు. ‘మా కాలనీ ప్రెసిడెంటు దేవరాజుగారు నీకు తెలుసా?’ అడిగాను ఆశ్చర్యపోయి. ‘మా పెదలింగయ్య కొమారుడు నితీషుబాబూ యీయనా వొకే కాలేజీలో సదూకున్నారంట. ఆయన సిఫార్సు సేసినారు’ ‘దేవరాజుగార్తో నాకంత పరిచయంలేదు గాని ఆయన్నందరూ పెద్దమనిషిగా గౌరవిస్తారు. గుడి ధర్మకర్త కూడా ఆయనే. బాగా డబ్బు, పలుకుబడి వున్నా మృదువుగా మాట్లాడతారు, అన్నదానం లాంటి కార్యాలకు వుదారంగా సాయం చేస్తారు. యెత్తుగా, తెల్లగా, చక్కగా వుంటారు’ ‘ఆయన్ని సూస్తే అట్లాగే అనిపిస్తాది. యెందుకైనా మంచిదని మా నితీషుబాబు దేవరాజుసారుకి నా సంగతంతా సెప్పినాడు. అంతా యిన్నాక గూడా నన్ను డ్రైవరుగా తీసుకున్నాడంటే ఆయన శానా మంచోడనేగదా! అంతేగాదు, నన్ను ఆయన భార్య అనసూయమ్మగారి కారు తోలమన్నాడు, దర్మాత్ముడు. ఆయమ్మది సామనసాయ. ఆయనంత సక్కగా వుండదు. కానీ దయాగునంలో మహాతల్లి’ చేతులు జోడించి కళ్లు సగం మూశాడు పీరయ్య.‘ఆయనకు తగ్గ యిల్లాలని చెప్తారు. కాని ఆమెకు యీమధ్య ఆరోగ్యం అంత బావుండడం లేదని, మనిషి కూడా చిక్కిపోయిందనీ విన్నాను. దాన్ని గురించి ఆయన తిరగని ఆసుపత్రి, వెళ్లని గుడీ లేదంటారు’ గుడిగంట పెద్దగా మోగింది. పక్షులు కలకలంగా లేచి మళ్లీ చెట్లల్లో సర్దుకున్నాయి. ‘ఆయిల్లెట్లుంది బాబూ? యింద్రబొవనమే! యిల్లంతా పాలరాయి, టేకు వొస్తువులే, గోడలకు పేద్ద పటాలు, మూలల్లో సెందనం బొమ్మలు, కనపడని లైట్లు! దీనిముందు మా పెదలింగయ్య బంగళా పాతబడిన మహలే’ ‘మా కాలనీలో వుండాల్సిన యిల్లు కాదంటారు. నీ తిండితిప్పల సంగతేమిటి?’ ‘ఆయమ్మ పనోళ్లనట్లా వొదిలేస్తాదా బాబూ? మూడుపూట్లా తిండి ఆణ్ణే. మాయమ్మగూడా నన్నట్లా సూడలేదు’ తృప్తిగా చెప్పాడు, ‘మరింకేం, వుద్యోగం జాగ్రత్తగా చేసుకో’ ‘సరేగాని బాబూ, పెండ్లాన్ని సంపిన కేసులో నేను యేడేండ్లు జైలుకు బోయి వొచ్చినా యీసారు నాకెట్లా వుద్యోగమిచ్చినాడు?’ అడిగాడు పీరయ్య.‘కాలం మారింది పీరయ్యా, యిప్పుడు పనిలో నైపుణ్యం, విధేయత ఇవే చూస్తారు. అవి నీ దగ్గరున్నాయి. వుద్యోగమిచ్చేవాళ్లకి అంతకుమించి అక్కర్లేదు. నీకవి వున్నన్నాళ్లూ నీ వుద్యోగం నిలుస్తుంది’ అన్నా. అర్థం అయ్యీ కానట్టుగా తలవూపి ‘ఖాలీ దొరికినప్పుడు వొస్తా’ అంటూ వెళ్లిపోయాడు.‘హఠాత్తుగా తనకు పూర్తిగా కొతై ్తన నాగరిక ప్రపంచంలో పడ్డాడు పీరయ్య, యెలా నెట్టుకొస్తాడో’ అనుకున్నా. ఒక ఉదయం నేను బస్టాపులో వెయిట్ చేస్తుంటే పీరయ్య కారాపి ‘యెక్కుబాబూ అఫీసుదెగ్గిర దింపతా’ అని బలవంతం చేసి వెనకసీట్లో ఎక్కించాడు. దారిలో ఒక హోటల్ దగ్గర చెట్టుకింద ఆపి ‘టీ తాగుదాం బాబూ, తలనొప్పిగా ఉండాది’ అని రెండు పేపరు కప్పుల్తో టీ పట్టుకొచ్చాడు. ‘యెలావుంది వుద్యోగం’ అడిగాను టీ తాగుతూ. ‘బాగుంది బాబూ. జీతమంతా మిగులే. వూర్లో సేను బాగసేయించి మా సిన్నాయన కొడుకును దున్నుకోమని సెప్పినా. నేనింగ ఆవూర్లో వుండలేను గాబట్టి యిల్లుగూడా రిపేరు జేయించి బాడుక్కిచ్చేసినా’ అన్నాడు. ‘వొక గాడిలో పడినట్టే’ టీ తాగాక పీరయ్య గొంతు తగ్గించి ‘దేవరాజుసారు ఆస్తి, యాపారాలు మొత్తం అమ్మగారివేనంట బాబూ. యీ అయ్యగారు కాలేజీలో ఆమె యెంటబడి ప్రేమించి ఆమె నాయనకు యిష్టం లేకపొయ్యినా పెండ్లి సేసుకున్నాడంట’ అన్నాడు. ‘అవన్నీ నీకెందుకు?’ అన్నా, ‘గాసిప్ లేకపోతే మనుషులు ఎలా వుండేవారో’ అనుకుంటూ. ‘నాకేమీ కుశాల లేదు, ఆయింట్లో పాత నౌకరొకామె వొద్దన్నా రోజూవొచ్చి అన్నీ సెప్తాది. కొన్ని కండ్లకు కనబడతానే వుండాయి. అమ్మగారు శానా మంచిదా? అంత డబ్బుండాదా? పెద్ద డాకటర్లే సూస్తావున్నారా? బాగవడం లేదెందుకు? అది మనసులో ఖాయిలా గాబట్టి. గుండె, నరాలు వీకైపోయినాయని సెప్తావున్నారంట’ ‘కొన్ని జబ్బులలాగే వుంటాయి’‘మొన్నమొన్నటి దాంకా ఆమె సక్కగా, నవ్వతా తిరగతా వుండేదంట. దేవరాజుసారు అనుకున్నంత మంచోడు కాదు. శాన్నాళ్లుగా ఆతల్లిని లోలోపల బాదపెడతా వుండాడని నాకనిపిస్తా వుండాది’ ‘నువ్వు నీ వుద్యోగానికి విశ్వాసంగా వుండాలి, నీ అభిప్రాయాలు, కోపతాపాలకు కాదు. యిది ఆధునికానంతర ప్రపంచం. పద, యికవెళ్దాం’నా మాటలు అర్థంకానట్టుగా చూసి ‘అమ్మగారు వొక్కోతూరి వొంటరిగా రూములో కూస్సోని యేడ్సేది సూసినా. ఆయమ్మను సూస్తే ‘రగతంకారి పడిపోయిన గౌరి’ గుర్తుకొచ్చి మనసు యికలమైతాది. వుండలేక నీకు సెప్తావున్నా’ అని కారు స్టార్ట్ చేశాడు పీరయ్య. మళ్లీ కొన్నాళ్లు పీరయ్య కనిపించలేదు.తుఫాను మూలంగా ఆరోజు సాయంత్రంనుంచే పెద్దవర్షం మొదలైంది. ఈదురుగాలి, వణికించే చలి. కరెంటు పోయింది. తెల్లవారు ఝామున ఐదవుతూండగా వీధితలుపు కొట్టిన చప్పుడు రావడంతో టార్చిలైటు వేసి తలుపు తెరిచాను. వరండాలో తడిసిన బట్టల్తో చేతిలో బ్యాగుతో నిలబడివున్నాడు పీరయ్య. మొహం గంభీరంగా ఉంది. ఆశ్చర్యపోయి అతన్ని హల్లోకి రమ్మని తువ్వాలు, పంచె ఇచ్చాను. అప్పటికి ఉద్ధృతి తగ్గి సన్నటి వర్షపుధార మిగిలింది.కాఫీచేసి ఇచ్చాను. పీరయ్య పొడిబట్టలు కట్టుకుని మౌనంగా తాగాడు. ‘అర్జెంటుగా యెక్కడికన్నా వెళ్తున్నావా?’ నిదానంగా అడిగాను.‘నేనుద్యోగం సాలించి వూరికి యెళ్లిపోతావుండా. సెప్పిపోదామని వచ్చినా’ అన్నాడు పీరయ్య బొంగురు గొంతుతో. ‘యేమైంది? మనవూరికిక వెళ్లనన్నావు గదా?’పీరయ్య తటపటాయించాడు ‘దేవరాజుసారు మంచోడు కాదు బాబూ. నేను సెప్తావచ్చిందే నిజం. అమ్మగారిని శానా బాధపెడతా వున్నాడు. ఆమె యెక్కవ రోజులు బతకదు. బైట యెంత ఫ్యాక్చనిస్టైనా పెదలింగయ్యగారే మేలు, యేదున్నా పైక్కనపడతాడు, యింట్లో అమ్మయ్యదే పెత్తనం. యీసారు యేరే మనిసి’‘అందుకని రాకరాక వచ్చిన మంచి వుద్యోగం మానేసి వెళ్తున్నావా?’ ‘నా తల్లట్లాటి అమ్మగారికి అంత సెడు జరగతావుంటే సూస్తా ఆయింట్లో వుండలేను. యేమైండాదో విను. నిన్న అయ్యగారి డ్రైవరు లేడు, కారు నన్ను తోలమన్నాడు. మాటేల వొర్సం మొదులయ్యేతలికి మేం యాభైమైళ్ల దూరంలోవున్న వూరేదో యెళ్లినాం. వూరిబైట తోటలో గెస్టౌసు, అయ్యగార్దే అనుకుంటా. అప్పుటికే ఆడ రెండు పెద్దకార్లొచ్చి వుండాయి’‘వుంటే?’ ‘నేను రాత్రి తొమ్మిదైనాక మంచినీళ్ల కోసమని యింటి యెనకపక్కకు యెళ్లా, వొరండాలో అయ్యగారు, యిద్దురు దోస్తులు కూస్సోని మందు తాగతావుండారు. వోళ్ల మాటలు యినబడినాయి. ‘ఆమెకు ఖాయిలా అనీ, యింగేయో సాకులు సూపి అమ్మగార్ని వొప్పించేదానికి సూస్తావుండానని, తొందర్లోనే యెట్లైనా యేదోవొకటి సేసి సంతకాలు పెట్టిస్తానని, ఆనక వోళ్లనుకున్న యాపారాల్లో యెంత డబ్బైనా పెడ్తానని అయ్యగారు సెప్తావున్నాడు’‘అవునా?’ ‘నాకు కోపం తన్నుకోనొచ్చింది. ‘అర్జెంటు పనుండాదని’ అయ్యగార్ని పక్క రూంలేకి తీసకపోయి ‘నువ్విట్లా సేస్తావుండేది శానా తప్పయ్యగారూ, దేవతట్లాటి అమ్మగార్ని పోగొట్టుకోవద్దు’ అని యినయంగానే సెప్పినా. ఆయన నన్ను తిట్టినాడు, బెదిరిచ్చినాడు, నేను బైపడలేదు. జీతం పెంచుతానని అశ పెట్టినాడు’ అని చీకట్లోకి చూస్తూ ఆగాడు. నేను ఏమనాలో తెలియక అలాగే చూస్తూండిపోయాను.పీరయ్యే మళ్లీ ‘నాకు యిరక్తొచ్చింది. కారు బీగంచెవులు ఆయనముందు యిసిరేసి బైటికొచ్చేసినా. వానలో రెండుమైళ్లు నడిసి, రోడ్డుమీదికొచ్చి పాలయాను, లారీ యెక్కి వూర్లేకొచ్చి యింటికి సేరినాను. టైము నాలుగుదాటింది. అమ్మగారు అప్పుడే లేచినారు. యేదైతే అదైందని అమెకు జెరిగిందంతా సెప్పి వచ్చేసినా‘ అని అలసినట్టుగా గోడకు తలానించి కళ్లు మూసుకున్నాడు.హింసను ఒక మార్గంగా ఒప్పుకుని, భార్యను చంపినవాడిగా శిక్షను అనుభవించి, అనాగరికుడని ముద్రపడ్డ పీరయ్య నాగరిక సమాజంలోని పరోక్ష గృహహింసను చూసి తట్టుకోలేకపోవడం నాకు ఆశ్చర్యమనిపించింది. వర్షం ఆగింది, చీకటి ఇంకా విడలేదు. ‘మనపల్లెలోనే యెట్నో బతుకుతా. యెప్పుడైనా వొచ్చి నిన్ను సూసిపోతుంటా. వస్తా బాబూ’ అని బ్యాగు బుజానికి తగిలించుకుని బయటికి వెళ్లిపోయాడు పీరయ్య. – డా.కె.వి. రమణరావు -
నాడు చిన్నారి పెళ్లి కూతురు..నేడు డాక్టర్గా..!
బాల్య వివాహాల కారణంగా ఎంతోమంది అమ్మాయిల జీవితాలు చిదిగిపోతున్నాయి. వయసుకు మించిన కుటుంబ బాధ్యతలతో అనారోగ్యం పాలై జీవితాలను కోల్పోతున్నారు. అందుకే ప్రభుత్వం సైతం ఇలాంటి వాటిని కట్టడి చేసేలా చట్టాలు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా అవగాహాన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయినా భారత్లోని ఇంకా కొన్ని గ్రామాల్లో నేటికి బాల్య వివాహాలు జరుగుతూనే ఉంటున్నాయి. అలానే రూపా యాదవ్ అనే మహిళకు ఎనిమిదేళ్ల వయసులోనే పెళ్లైపోయింది. నిజానికి రూపా చిన్ననాటి నుంచే మంచి మెరిటి స్టూడెంట్ కావడంతో ఉన్నత చదువులు చదవాలని ఎన్నో కలలకు కంది. కానీ ఈ పెళ్లితో తన ఆశలన్నీ కల్లలైపోకుండా అన్ని రకాల ఒత్తిడులను తట్టుకుంటూ అనుకున్నది సాధించింది. పైగా తన గ్రామానికి, కుటుంబానికి ఆదర్శంగా నిలిచింది.రాజస్థాన్లోని కరిరి అనే చిన్న గ్రామానికి చెందిన రూపా యాదవ్ ఎనిమిదేళ్ల ప్రాయంలోనే వివాహం అయిపోయింది. ఆమె పెదనాన్న రూపా మామాగారి ఇద్దరు కొడుకులకు తనను, ఆమె అక్కను ఇచ్చి పెళ్లి చేస్తామని వాగ్దానం చేశారు. దీంతో రూపాకి చిన్న వయసులోనే పెళ్లి అయిపోయింది. అయితే రూపా తండ్రికి ఆమెను బాగా చదివించాలనే కోరిక ఉండేది. కానీ తన అన్న ఇచ్చిన మాట కారణంగా ఏమి చేయలని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. అయితే ఆమె చిన్నిపిల్ల కావడంతో మెచ్యూర్ అయ్యేంత వరకు పుట్టింట్లోనూ ఉండేలా పెద్దలు నిర్ణయించడంతో పదోతరగతి వరకు పుట్లింట్లో హాయిగా నిరాటకంగా చదువుకుంది. పదోతరగతిలో ఏకంగా 86 శాతం మార్కులతో పాసయ్యి అందర్నీ ఆశ్చర్యపరించింది. ఆ గ్రామంలో ఎవరికి ఇన్ని మార్కులు రాకపోవడంతో ఒక్కసారిగా గ్రామం అంతా రూపాను గౌరవంగా చూడటం మొదలుపెట్టింది. అంతేగాదు ఎన్నో అవార్డులు, ప్రశంసలు వచ్చాయి. బాగా చదివించమని గ్రామ ప్రజలంతా రూపా తండ్రిని ప్రోత్సహించారు. ఇంతలో రూప పెద్ద మనిషి అవ్వడం అత్తారింటికి వెళ్లేందుకు ఏర్పాట్లు జరగడం అన్ని చకచక జరిగిపోయాయి. ఇక ఇక్కడితో ఆమె చదువు ఆగిపోతుందని తండ్రి బాగా దిగులు చెందాడు. అయితే రూపా బావగారు ఆమె చదువుకు ఎలాంటి ఆటంకం రానివ్వమని ఆమె తండ్రికి హామి ఇచ్చారు.ఆ వాగ్దానాన్ని రూపా మెట్టినిల్లు నిలబెట్టుకుంది. అప్పులు చేసి మరీ ఆమెను ఉన్నత చదువులు చదివించారు. ఇలా చేస్తున్నందుకు సమజం నుంచి హేళనలు, అవమానాలు ఎదురయ్యేవి కూడా. అయినా వాటిని పట్టించుకోకుండా కోచింగ్ క్లాస్లకు పంపించి మరి మంచి చదువులు చదివించారు. అలా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో చేరి చదువుకుంటూ నీట్ ఎగ్జామ్లకు ప్రిపేర్ అయ్యింది. ఆమె ఫీజుల కోసం రూపా భర్త, బావగారు ఎక్కువ గంటలు పని చేయాల్సి వచ్చేది కూడా. అంతలా రూపాకు తన కుటుంబం నుంచి మంచి ప్రోత్సహం లభించింది. వారి ప్రోత్సహానికి తగ్గట్టుగానే రూపా బాగా చదివి నీట్లో పాసై బికినీర్లోని సర్దార్ పటేల్ మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ పొందింది. అలా తన తన అత్తమామలు, భర్త, బావగారి సాయంతో డాక్టర్ అవ్వాలనే కలను సాకారం చేసుకుంది. ఐదేళ్ల ఎంబీబీఎస్ కోర్సును ఆ కళాశాలలో సాగిస్తుండగా..రెండేళ్లు హాయిగా గడిచిపోయాయి. లాక్డౌన్ సమయంలో ఇంటి వచ్చాక మూడో ఏడాది ఫైనల్ పరీక్షల టైంలో ప్రెగ్నెంట్ అయ్యింది. అయితే ఆమె ఇంకా రెండేళ్ల చదువు సాగించాల్సి ఉంది. అయినా ఆమె చదువుని, మాతృత్వాన్ని రెండింటిని వదులుకోకుడదని గట్టిగా నిశ్చయించుకుంది. ఫైనలియర్ పరీక్షల టైంలో రూపా కుమార్తె వయసు కేవలం 25 రోజులు. అలానే బాలింతరాలిగా కాలేజ్కి వచ్చి పరీక్షలు రాసి మంచి మార్కులతో పాసయ్యింది. తన కూతురు పుట్టిన రోజున శస్త్ర చికిత్సకు సంబంధించిన చివరి పరీక్ష..మూడు గంటల్లో పరీక్ష రాసి వచ్చి తన కూతురు పుట్టిన రోజుని జరుపుకుంది రూపా. ఎక్కడ అటు కుటుంబ బాధ్యతలను, కెరీర్ పరంగా తన చదవుకి ఆటంకం రానివ్వకుండా రెండింటిని చాలచక్యంగా బ్యాలెన్స్ చేసింది. అలా ఆమె 2022లో సర్టిఫైడ్ డాక్టర్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి సన్నద్దమవుతూనే డాక్టర్ వృత్తిని కొనసాగిస్తుంది. ఈ మేరకు రూపా మాట్లాడుతూ..మనం కోరుకున్నది చేయాలి అనుకుంటే ఎలాంటి స్థితిలోనూ వదిలిపెట్టని పట్టుదల ఉంటే అనుకున్నది సాకారం చేసుకోగలరు. అంతేగాదు ఆ పట్టుదలే ఆ ఆటంకాలు, అవాంతరాలని పక్కకు పోయేలా చేస్తుంది అని చెబుతోంది రూపా యాదవ్. చివరిగా ఎవ్వరికీ ఏది కష్టం కాదని, ప్రతిఒక్కరూ అన్ని సాధించగలరని అందుకు తానే ఓ ఉదాహరణ అని అంటోంది రూపా. రియల్లీ రూపా గ్రేట్ కదూ.! తన కలను సాకారం చేసుకుంది, అలాగే తన అత్తమామలకు, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టి మంచి పేరు తెచ్చుకుంది.(చదవండి: సివిల్స్లో విజయం సాధించిన మిస్ ఇండియా ఫైనలిస్ట్! కోచింగ్ లేకుండా తొలి..) -
మిలమిల మెరిసే మిణుగురు చేపలు గురించి విన్నారా..?
చేపలు రంగురంగుల్లో ఉంటాయని తెలుసు... కానీ మిణుగురుల్లా... రాత్రి పూట వెలిగే చేపల్ని చూశారా? అదే ఫ్లోరోసెంట్ ఫిష్! అక్వేరియంలో చేపలు సందడి చేస్తేనే సంబర పడతాం. మరి అవి మిలమిలా కాంతులతో మెరిసిపోతే? కేరింతలు కొడతాం కదూ! అలాంటి చేపలు ఎక్కడున్నాయో తెలుసా? తైవాన్లో సందడి చేస్తున్నాయి ఈ చేపలు. మరి ఇన్నాళ్ల నుంచి సముద్రం అడుగున మన మన కంటపడకుండా ఉన్నాయా..? అంటే కానేకాదు. ఎందుకంటే ఈ చేపల్ని శాస్త్రవేత్తలే సృష్టించారు. జన్యు మార్పిడి విధానం తెలుసుగా. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జన్యు మార్పిడి పరిజ్ఞానంతో చేసిన అతిపెద్ద చేపలు ఇవే. ఎందుకీ ప్రయోగం అంటే?ఈ ప్రక్రియ వల్ల జంతువుల్లోను, మనుషుల్లోను జన్యుపరంగా వచ్చే వ్యాధులను ఎలా నివారించవచ్చో తెలుస్తుంది. సుమారు ఆరు అంగుళాల వరకు పెరిగే ఏంజెల్ చేపల్ని తీసుకుని ప్రయోగాలు చేసి, వాటి శరీరానికి మెరిసే లక్షణం వచ్చేలా చేశారు. వీటిని ఏంజెల్ ఫ్లోరోసెంట్ ఫిష్ అని పిలుస్తారు. తైవాన్లో ఓ బయోటెక్నాలజీ సంస్థ వారు ఎన్నో పరిశోధనలు చేసి ఇది సాధించారు. నిజానికి ఇలాంటి ప్రయోగాలు 2001 నుంచే జరిగాయి. అయితే ఆ చేపలు పూర్తి స్థాయిలో వెలుగులు విరజిమ్మలేదు. తర్వాత ఏడేళ్లు శ్రమించి ఇలాంటి ఏంజెల్ చేపలను సృష్టించి శరీరం మొత్తం మెరిసిపోయేలా చేశారు. వీటి ప్రత్యేకతేంటో తెలుసా? వీటికి పుట్టే పిల్లలకి కూడా ఇలా మెరిసే లక్షణం వచ్చేస్తుంది. అలా మొత్తం అయిదు తరాల వరకు ఈ జన్యు లక్షణాలు వస్తాయని చెబుతున్నారు. అంటే వీటి మనుమలు, మనవరాళ్లు కూడా వాటి తాతల్లాగే వెలిగిపోతాయన్నమాట.తినొచ్చా అంటే..వీటిని నిక్షేపంలా వండుకుని తినొచ్చు అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు . మిగతా చేపల్ని తిన్నట్టే వీటినీ లొట్టలేసుకుంటూ ఆరగించొచ్చు. కాకపోతే ధరే ఎక్కువ. ఒక్కోటి రూ.1300 పైనే పలుకుతాయట. ఇంకో రెండేళ్లలో వీటిని అక్వేరియాల్లో పెంచుకోవచ్చు. మీకు జెల్లీ ఫిష్ తెలుసుగా? దానిపై ఏదైనా వెలుతురు పడినప్పుడు మెరుస్తూ కనిపించడానికి కారణం దాంట్లో సహజంగా ఉండే ఫ్లోరోసెంట్ మాంసకృత్తులే. దాన్ని వేరు చేసి ఈ చేపల్లో ప్రవేశపెట్టారన్నమాట. అన్నట్టు... ఈ జన్యువును గతంలో పిల్లులు, ఎలుకలు, పందుల్లోకి ప్రవేశపెట్టారు. అయితే వాటికి కూడా శరీరంలోని కొద్ది భాగం మాత్రమే వెలుగులీనింది. ఇప్పుడు ఈ ఏంజెల్ చేపలు మాత్రం పూర్తి స్థాయిలో మెరిసిపోతూ ముచ్చట కలిగిస్తున్నాయి.(చదవండి: ఎవరీ సావిత్రి ఠాకూర్? ఏకంగా కేంద్ర మంత్రి వర్గంలో..!) -
మీ ఇంటి దగ్గర పుస్తకాలను అద్దెకు ఇచ్చే షాపులు ఉన్నాయా?
మన పక్కింటికో, ఎదురింట్లోకో పండగ సెలవులకని ఎవరైనా కొత్తపిల్లలు వచ్చినపుడు మాటా మాటా కలిసినపుడు మీ ఊరు పెద్దదా మా ఊరు పెద్దదా అని ఒక అంచనా వేసుకొవడానికి అడిగే మొదటి ప్రశ్న మీ ఊర్లో సినిమా టాకీసులు ఎన్ని ఉన్నాయి? అని అయి ఉండేది. నా కటువంటి సమస్యే ఎదురయ్యేది కాదు. నాకు కావలసిన భోగట్టా అల్లా మీ ఊర్లో, మీ ఇంటి దగ్గర పుస్తకాలకు అద్దెకు ఇచ్చే షాపులు ఎన్ని ఉన్నాయని మాత్రమే.నాకు ఊహ తెలిసాకా తరుచుగా ఎమ్మిగనూరుకు వెల్తుండే వాడిని. ఊర్లో దిగి మా మేనత్త ఇంటికి వెళ్ళే రిక్షా ఎక్కాకా దారికి అటూ ఇటూ చూస్తూ ఆ ఊరిలో పుస్తకాల బంకులు ఎన్ని ఉన్నాయా ? ఎక్కడెక్కడ ఉన్నాయా అని బుర్రలో గురుతులు పెట్టుకునేవాడిని . మా నూనెపల్లె లో భద్రయ్య బంకు అద్దె పుస్తకాలకు పేరెన్నికది. నూనెపల్లె సెంటరు లో గుర్రాల షెడ్డుకు ఎదురుగా ఉండేదది. ఆ బజారు అంతా కోమట్ల ఇల్లు ఎక్కువగా ఉండేవి. భద్రయ్య గారు కూడా కొమట్లే. ఆయన కొడుకు భాస్కర్ ఆ బంకులో ఎక్కువగా కూచునేవాడు. బంకు సీలింగు కు ఒక చిన్న ప్యాన్ బిగించి ఉండేది. బంకులో ఒక మూల రేడియో కూడా. అక్కడ నాకు పుస్తకాల తరువాత అత్యంత ప్రీతిప్రాత్రమైన వస్తువు బెల్లంపాకపు వేరుసేనగ గట్టా. ఎంతో రుచిగా ఉండేదది . ఇప్పుడు అటువంటి గట్టాలే ఆల్మండ్ హౌస్ లో కనపడతాయి. రూపం ఒకటే కాని ధర మాత్రం హస్తిమశకాంతరం. పుస్తకాలు, గట్టాల తరువాత నాకు ఫేవరెట్ అనదగ్గది గుడ్ డే బిస్కత్తు. గాజు సీసాలలో చక్కగా అమర్చి పెట్టి ఉండేవి. సుతారంగా అల్యూమినియం మూత తిప్పి అడిగిన వారికి బిస్కట్లు ఇచ్చేవాడు భద్రయ్య . అపుడు ఆ సీసాలోనుంచి బిస్కెట్ల వాసన ఎంత కమ్మగా వచ్చేదో. ఇప్పుడు అప్పుడప్పుడూ రత్నదీప్ సూపర్ మార్కెట్ కు ఏదయినా సరుకులు కొనడానికి వెడతానా, బిస్కెట్ కౌంటర్ దగ్గర గుడ్ డే ప్యాకెట్ పుచ్చుకుని ఆ చిన్ననాడు తగిలిన చక్కని వాసన వస్తుందా లేదా అని చూస్తా, రానే రాదు. ఆ వాసన లేని బిస్కెట్ కూడా రుచిగా అనిపించదు నాకు . నేను భద్రయ్య అంగట్లో పుస్తకం తీసుకుంటే కూడా ఉన్న ఫ్రెండ్ ఎవరో ఒకరు బిస్కెటో , బుడ్డల గట్టానో కొనేవాడు అది ఇద్దరం పంచుకుని తినుకుంటూ నడిచే దారిలోనే పుస్తకాన్ని నమిలేస్తూ కదిలేవాడ్ని.పుస్తకాలు అద్దెకిచ్చే షాపులో ఆ గోడల నిండా వందలుగా పుస్తకాలను నిలువ వరుసల్లో నింపేవారు. స్కెచ్చు పెన్నులతో పుస్తకాల మీద పేర్లు రాసి ఉండేవి. ఏ పుస్తకం కోసం కష్టపడి వెదుక్కోనక్కరలేదు. చక్కని చేతి రాతలో ఆ పేర్లు కళ్ళని ఆకర్షించేవి. చాలా షాపుల్లో అయితే పత్రికలో సీరియల్ గా వచ్చిన నవల పేజీలని చించి పుస్తకంగా బైండ్ చేసి అద్దెకు ఇచ్చెవారు. కొత్తగా రిలీజ్ అయిన పుస్తకాలయితే డిమాండ్ ఎక్కువ కాబట్టి వాటిని జనం కంట పడకుండా సెపరేట్ గా ఉంచేవాళ్ళు. నియమిత ఖాతాదారుల కోసం ఆ పుస్తకాలు పక్కకు తీసిపెట్టేవారు. షాపు వాళ్ళు ఏ పుస్తకాన్ని కూడా ఒకటి ఒకటిగా కొనేవాళ్ళు కాదు. ప్రతి పుస్తకం రెండు మూడు ఉండేవి సూపర్ స్టార్లయిన మధుబాబు, మల్లాది, యండమూరి పుస్తకాలయితే అయిదు లెక్కన కొనేవారు. ఆ పుస్తకాలు వచ్చిన కొత్తలో అయిదేం ఖర్మ పది కొన్నా అంత సులువుగా పాఠకుల చేతికి వచ్చేవి కావు. త్రిమూర్తులకు డిమాండ్ ఎక్కువ. ఎవరు ఎంత గీ పెట్టి చచ్చినా ఒకానొక కాలంలో హైస్కూలు పిల్లవాళ్ళ దగ్గరి నుండి సకుటుంబ సపరివారం వరకు తెలిసిన రచయితలంటే వీరే . పెరిగిపెద్దయి అతి పెద్ద చదవరులయిన ఆ రోజుల చదువరులు చాలామందికి అక్షర ప్రాశన చేసింది వీరే. వీరిలో యండమూరి కాస్త హట్ కే. రాసింది కమర్షియల్, పాపులర్ సాహిత్యమే కావచ్చు. అయినా ఆయన తన పుస్తకాల్లో ఎక్కడో ఒకక్కడ బుచ్చిబాబు, తిలక్ , విశ్వనాథ సత్యనారాయణ, చలం... ఇత్యాదుల ప్రస్తావన తెచ్చేవారు. నాకయితే ఈ మహారచయితల తొలి పరిచయం వీరేంద్రనాథ్ గారి పుస్తకాల్లోనే. ఒక పుస్తకంలో ఆయన ఇట్లావాక్యం వ్రాశారు "తెలుగు సాహిత్యంలో ఒకే ఒక హీరో తంగిరాల శంకరప్ప" ఆ వాక్యాన్ని పట్టుకుని నేను పెద్దయ్యాకా శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి సాహిత్యాన్ని మొత్తం చదువుకునే భాగ్యం కలిగింది. లేకుంటే ఎక్కడి చిన్న పల్లె నూనెపల్లె? దానికి అద్భుతమైన సాహిత్యం ఎంతెంత దూరం?షాపు పెట్టాము కదాని వచ్చిన ప్రతి ఒక్కరికి పుస్తకాలు ఇవ్వబడవు. బ్యాంకులో అకవుంట్ తెరవడానికి సాక్షి సంతకం కావాలన్నట్లు, షాపువారికి తెలిసిన వారినెవరినయినా తోడుగా తీసుకెడితేనే పుస్తకాలు ఇస్తారు. లేదా పుస్తకం ధరమొత్తం అడ్వాన్సుగా కట్టాలి. నాకు గుర్తు ఉండి కొందరు 20 రూపాయలు బయానా గా పుచ్చుకునేవారు. అంత డబ్బు ఎలా వస్తుంది? ఎవరు ఇస్తారు? అందుకని నేను ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి అడ్వాన్స్ కట్టే వాణ్ని, అద్దె చెల్లించే వాడిని. పుస్తకాలు నాకు దొంగతనం నేర్పాయి. అలవాటు ఐయింది కదాని ప్రతిఎప్పుడూ దొంగతనం చేయకూడదు. పట్టుబడి పోతాం. అందుకే పుస్తకాలకు అద్దె అప్పు పెట్టడం నేర్చుకున్నాను. ఈ రోజుల్లో చోరీ చేస్తూ పట్టుబడిన పిల్లలు ఎవరైనా పుస్తకాలు కొనడానికి దొంగతనం చేసాను అని ఏడుపుముఖంతో అంటే వాళ్ళని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోబుద్ది వేస్తోంది. నేను పెరిగి పెద్దయ్యాక ఒకసారి నాకెంతో ఇష్టమైన ఆర్టిస్ట్ పుస్తకాలు కొనడానికి డబ్బులు లేక దిగాలుగా ఉంటే ఏమిటి విషయమని అడిగి తెలుసుకుని చిత్రకారులు శ్రీ బాపు గారు దగ్గరకు పిలిచి ముద్దు పెట్టుకోలేదు కానీ ఇరవైవేల రూపాయలు ఇచ్చి నా ముఖంలో నవ్వు చూశారు . అద్దెకు తీసుకున్న పుస్తకాన్ని తమ వద్దనున్న రిజిస్టరు పుస్తకంలో తేది, సమయం వేసి , మళ్ళీ ఆ పుస్తకాన్ని రేపటి రోజున అదే సమయం లేదా అంతకంటే ముందుగా తెచ్చి ఇస్తే ఒక రోజు అద్దె, రోజు మారిన కొద్దీ అద్దె రెట్టింపు అయ్యేది ,ఒక్కొక్క సారి అద్దె కట్టడానికి కి డబ్బులు లేక పుస్తకాన్ని అట్లానే అట్టిపెట్టేసుకుని పుస్తకం ధరకన్నా ఎక్కువ అద్దె డబ్బులు ఇచ్చిన రోజులు ఉన్నాయి. అప్పుడప్పుడు షాపు యజమానికి ఏదయినా పనిపడో , భోజనానికి వెళ్ళవలసి వచ్చినపుడో పుస్తకాల షాపు మూసి ఉండేది. షాపు మూసి ఉన్నదేమి అని ఖంగారు పడకూడదు. అంగడి చెక్కలకు సన్న సందులు ఉంటాయి . అందు గుండా పుస్తకాన్ని పడెయ్యాలి. షాపు ఆయన తిరిగి వచ్చాక మన పుస్తకం నెంబరు , పేరూ చూసి పుస్తకం ముట్టినట్టుగా పద్దు వేసుకుంటాడు. అద్దె బకాయి రాసుకుంటాడు.మా ఇంటి దగ్గరలోనే, శివశంకర విలాస్ దగ్గర ఒక క్రైస్తవ కుటుంబం పుస్తకాల బంకు పెట్టుకున్నారు. అమ్మా, నాన్న, ఒక అబ్బాయి. ఒకరు లేనప్పుడు ఒకరు ఆ షాపు చూసుకునేవారు. నేను వాళ్లదగ్గర పుస్తకాలు అద్దెకు తీసుకునేవాడిని. యండమూరి వీరేంద్రనాథ్ "’రక్తసింథూరం" పుస్తకం అక్కడే తీసుకున్న గుర్తు నాకు. ఆ పుస్తకానికి చిత్రకారులు చంద్ర గారు వేసిన బొమ్మని చూసి మంత్రముగ్దుణ్ణి అయ్యాను ఆ కాలల్లోనే. ఒకసారి పుస్తకాలకు అద్దె చెల్లించడానికి డబ్బులు లేనప్పుడు ఒక ఉపాయం చేశా. కొడుకు ఆ షాపులో ఉన్నపుడు పుస్తకం తీసుకున్నాను అనుకో, పుస్తకం తిరిగి ఇచ్చేటప్పుడు అతను కాకుండా వాళ్ళ అమ్మగారో , నాయనో ఉన్నప్పుడు పుస్తకం వాపసు ఇచ్చి అద్దె ముందే కట్టా అని చెప్పేవాడిని. కొన్ని సార్లు పుస్తకం అద్దె ముందే కట్టించుకునేవారు. పుస్తకాలు నాకు మోసాన్ని కూడా నేర్పాయి. ఆ కుటుంబం వారు కడు బీదవారు. వారి రూపు, వేసుకున్న బట్టలు ఆ విషయాన్ని యథాతంగా చూపేవి. ఇప్పుడు ఎప్పుడయినా నాకు ఏదయినా అన్యాయం జరిగింది అనిపించినపుడు నేను ఆ కుటుంబాన్ని గుర్తు చేసుకుని వారిని మోసం చేసినందుకు ఇదంతా నాకు తగినదే జరిగింది అనుకుంటాను. ఇపుడు ఆ బంకు వాళ్ళు ఎవరూ కనపడరు కానీ కనపడితే బావుండు, వాళ్ళ చేతులు పట్టుకుని మన్నించమని ప్రాధేయపోయేవాడినే. పుస్తకాల చదువు వలన నేను దొంగతనం, మోసం నేర్చుకుంటే నా ప్రెండు బాషా అనేవాడికి పుస్తకాలు వ్యాపారం నేర్పాయి. ఆ రోజుల్లో ఎంత పెద్ద పుస్తకాన్నయినా ఒక దెబ్బకు గంటా రెండు గంటల్లో చదివేసేవాళ్లం. మరి చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లొక లెక్క. మా బాషాగాడు ఏం చేసేవాడంటే వాడు ఒక పిల్లల పుస్తకాన్ని అద్దెకు తెచ్చుకుని చదివేసి , ఒకోసారి చదవకుండా కూడా మాకు అద్దెకు ఇచ్చేవాడు. గంటకు పావలా పుచ్చుకునేవాడు . షాపులో అయితే పుస్తకాన్ని ఒక గంటకు వెనక్కి ఇచ్చినా, ఒక రోజుకు వెనక్కి ఇచ్చినా రూపాయో, రూపాయిన్నరనో కట్టక తప్పదు . బాషగాడి పావలా పథకం హాయిగా ఉండేది. వాడు ఇచ్చినంత మందికి అద్దెకు ఇచ్చి , అద్దె చెల్లించి ఆ పై దర్జాగా మిగిలిన డబ్బులు జేబులో వేసుకునే వాడు.చిన్న చిన్న బంకుల్లో కుదరదు కానీ, కాస్త పెద్ద షాపుల్లో అయితే పుస్తకాలు చూస్తూన్నట్టుగా నటిస్తూ, షాపు యజమాని తల తిప్పగానే చేతిలో ఉన్న పుస్తకాన్ని చొక్కా ఎత్తి లటుక్కున నిక్కరుకు పొట్టకు మధ్యలో దాచేవాళ్లం. పుస్తకం చదివెయ్యగానే మళ్ళీ వెనక్కి వచ్చి పుస్తకాన్ని ఆ అరల మధ్యనే ఇరికించి వెళ్ళేవాళ్లం. చెప్పుకుంటూ పొతే చాలా సంగతులు ఊరుతూనే ఉంటయి. నిజానికి ఎలా కనుమరుగయ్యాయో, ఎప్పుడు కనుమరుగయ్యాకో కూడా ఊహకు అందడం లేదు ఆ పుస్తకాలని అద్దెకు ఇచ్చే షాపులు. టెంత్ క్లాస్ లోనా? కాదేమో ! ఇంటర్ మీడియట్ లోనా , లేక డిగ్రీ రోజుల్లోనా? ఏమో గుర్తు లేదు. సినిమా థియేటర్ టికెట్ కౌంటర్ బయట నిలబడ్డంత పెద్ద బారు వరుస కాకపోయినా , అద్దె పుస్తకాల షాపు, బంకుల బయట వరుసలో నాలుగురయిదుగురే ఉన్నా, కొత్త నవల కోసం విపరీతమయిన ఒత్తిడి తోనో , నాలుగురోజులుగా తెగ తిరుగుతున్నా ఇంకా దొరకని అభిమాన రచయితా పుస్తకం ఈరోజైనా దొరుకుతుందా లేదా అనే మనోదౌర్బల్యం తోడుగానో నిలబడి ఉండేవారు పాఠకులు. వట్టి అద్దె పుస్తకాలే కాదు. ఊరి మెయిన్ సెంటర్లలోనూ, సందు చివర, వీధి మలుపులో ప్రతిచోటా దినపత్రికలు, వార పత్రికలూ, పక్షపత్రికలు, పిల్లల పత్రికలూ , పాకెట్ నవల్స్ కనపడుతూనే ఉండేవి, ఈరోజు ఒక దినపత్రిక కోసమో, వార పత్రిక కోసమో కిలోమీటర్లకు కిలో మీటర్లు నడిచినా ఒక్క పుస్తకమూ రోడ్డు మీద కనపడుత లేదంటే అత్యంత సాంస్కృతిక లేమి నడుస్తున్న రోజులవి . ఆరోజుల్లో కథలు, నవలలు, పాటలు , పద్యాలు అనేకాలు పుస్తకాలుగా దొరికేవి. రచయితల ముక్కు మొహంతో అవసరం లేని రోజులవి. రాసిందే భాగ్యం. కంటపడిన అచ్చు కాగితమే వరం. ఈ రోజున వద్దన్నా వీధికొక, సందుకోక, నగరం నాలుగు వైపులా రచయితలూ, కవులు ఊరికూరికే కనపడుతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. సరస్వతి మీద ఒట్టు రచయితల పేర్లు తెలుసు , వారు వ్రాసిన ఒక్క వాక్యం కూడా తెలీదు. రాసేవారు మాత్రమే తెలుస్తున్నారు రచన అందడం లేదు . ఏం రాశారో ఆనవాలు లేదు, చూసిన తనని పోల్చుకుంటే చాలన్నంత అల్పసంతోషి అయిపోయినాడు సృజనకారుడు.-అన్వర్ -
'కిడ్నాప్..'! ఓరోజు సాయంత్రం.. ఆఫీసు నుండి తిరిగి వస్తుండగా..
ఆమెతో బోసుకి చిత్రంగా పరిచయం అయింది. ఒక సాయంత్రం, అతని ఇంటికి కొద్ది దూరంలో, ఆఫీసు నుండి తిరిగి వస్తుండగా.. అతనిని ఆపి, ఒక డజను అరటిపండ్లు కొనమని అడిగింది. అలా ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఒక్క రోజు కనిపించక పొతే ఆపి మరీ ‘ఏంటి బొత్తిగా నల్లపూస అయ్యావు?’ అనడిగేసేది. ఆ గదమాయింపులో అతనికి ఏదో ఆత్మీయత కనిపించేది.బోసు మొదటి అంతస్తులోని తన పోర్షన్కి వెళ్ళి తలుపు తెరిచాడు. భుజమ్మీద నుంచి ఆఫీస్ బ్యాగ్ తీసేసి పక్కనే ఉన్న దివాన్ మీద పెట్టాడు. అరటిపండ్లు ఉన్న బాగ్, పులిహోర ఉన్న ప్లాస్టిక్ డబ్బా తీసుకుని మళ్ళీ ఇంటికి తాళం వేసి బయటకి వచ్చాడు.వీధి చివరి వరకు నడిచిన తర్వాత, ఎదురుగా వస్తున్న ఆమెను గుర్తించాడు. పీలగా, బలహీనంగా ఉన్న ఆమె అతని వైపు వచ్చింది. బోసు కదలలేదు. కానీ ఆవిడ అతని ముందు అలాగే నిలబడి ఉంది. కొన్ని సెకన్ల పాటు! ఆమె ముఖం అభావంగానే ఉంది. ఆమె చూపులు అతని చేతిలో ఉన్న బాగ్ మీద పడ్డాయి. అంతే ఆమె ముఖం వెలిగిపోయింది. ఇప్పుడు ఆమె ఏం చెప్పబోతుందో బోసుకు తెలుసు. అందుకే అతను ఆ చేతిని పట్టుకున్నాడు. ఆమె చూపులు మటుకు అతడు పట్టుకున్న గుడ్డ సంచిపైనే ఉన్నాయి.‘ఇదిగో మీ అరటిపండ్లు’ బోసు అన్నాడు. ‘ఓ! మళ్ళీ అడగకుండానే తెచ్చావు’ అంది ఆమె. బోసు ‘ఎస్’ అంటూ అభిమానంగా నవ్వాడు. ఎందుకో తెలియదు కానీ ఆమెతో గడపడం అతనికి చాలా ఇష్టం. ఎవరో అన్నట్లు కొన్నింటికి లాజిక్కులు ఉండవు. ఆమె తోడు కోసం కింద భాగం ఇంటిని అద్దెకు ఇచ్చింది. ఆమెకు వంట చేసుకోవడం కుదరకపోవడంతో, పనివాళ్ళ మీద ఆధారపడింది. వాళ్ళు కారాలు ఎక్కువేయడంతో ఆమెకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. అందుకే ఎక్కువ పండ్లు మాత్రమే తింటోంది. వాటిల్లో అరటిపండ్లు అంటే ఆమెకు ఎంతో ఇష్టం. రోజూ ఆఫీసు నుండి వచ్చాక బోసు.. ఆమెతో కలసి వాకింగ్కి వెళ్ళేవాడు. ఆ వాకింగ్ ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచింది. ఆమె తన వ్యక్తిగత వివరాలను కొన్ని అతనికి చెప్పింది. ఆమె ఒక టీచర్. నార్త్ ఇండియాలో పుట్టి పెరిగింది. ఆమెకు సుడోకు అంటే ఇష్టం.‘నేను మీ కోసం ఇంకోటి తెచ్చాను’ అంటూ బోసు మళ్ళీ బ్యాగ్ తీశాడు. ‘అదేంటో?’ ఆమె ముఖం చిన్నపిల్లలా అయోమయంగా కనిపించింది.‘అప్పుడెప్పుడో మీరు పిజ్జా తినాలనుంది అన్నారుగా! తెచ్చాను’ బోసు చెప్పాడు. ఆమె ముఖంలో చిరునవ్వు కనిపించి, ‘థాంక్యూ.. థాంక్యూ’ సంబరపడిపోయింది.అయితే బోసుకి నిరాశగా అనిపించింది. తానేమి ఆశించాడు? ఉద్వేగంతో గెంతుతుందనా? ఆప్యాయంగా దగ్గర తీసుకుంటుందనా? కొన్నిసార్లు ఆఫీస్ వేళల్లో అతని మనస్సు ఆమె వైపు మళ్లుతుంది. అయితే ఇవేమీ తెలియని ఆమె తన ప్రపంచంలో తానుంటుంది. నిజానికి ఆమె నిశ్శబ్దాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంది.కొన్నిసార్లు ఆమెను కలుసుకోవడానికి ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తాడు. ఆమె ఒంటరిగా ఉంటోంది. బోసు ఆమె నుంచి ఏం ఆశిస్తున్నాడో అతనికే తెలియదు. తెలియకుండానే అనుబంధం పెంచుకున్నాడు. ఏదో తెలియని పాశం ఆమె వైపు సూదంటు రాయిలా లాగుతుంది. ఆమె గురించి తెలుసుకోవాలని బోసు చాల తహతహలాడుతున్నాడు. అడిగేతే బావుంటుందా? తననూ మగవాళ్లందరిలో ఒకడిగా జమకట్టి.. తనతో స్నేహం మానేస్తే..! ఆ ఆలోచనే భరించలేకపోయాడు. కాని అతని కుతూహులం నస పెడుతూనే ఉంది.. ఆమె కథ ఏమై ఉండొచ్చు? అని! అయితే ఈమధ్యనే ఆమె గురించి ఒక విషయం తెలిసింది. అప్పటి నుంచి మనిషి మనిషిగా లేడు. తన వస్తువును తనకు కాకుండా చేస్తున్న ఫీలింగ్. ఒక రకమయిన పొసెసివ్నెస్ వచ్చేసింది.రెండు రోజులుగా ఆమెను కలవలేదు. ఆ రోజు ఆదివారం.. ఆఫీస్కి సెలవు. దానికి తోడు పెద్ద వాన. కిటికీలోంచి ముత్యాల సరాలులా పడే వానని చూస్తూ కాఫీ తాగుతున్నాడు. ఇంతలో ఆమె ఇంట్లో ఉండే అమ్మాయి వచ్చింది. ఆమెకి బాగా జబ్బు చేసిందని చెప్పింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మనిషి నీరసించి ఉంది. అసలే బక్కపల్చటి మనిషి.. ఈ రెండు రోజుల అనారోగ్యం ఆమెను మరింతగా కుంగదీసినట్టుంది. దగ్గరగా వెళ్ళి సన్నగా పుల్లలా ఉన్న చేయి పట్టుకుని ఆప్యాయంగా అడిగాడు ‘ఎలా ఉంది? నాకు కబురు పంపిస్తే వచ్చేవాడిని కదా! నేను నీకేమీ కానా?’ అంటూ.ఆ ప్రేమకి అభిమానానికి కరిగిపోయింది ఆమె. అదేం కాదననట్లు తల అడ్డంగా ఊపింది. అతని చేయి గట్టిగా పట్టుకుంది. ‘కాసేపు కింద గార్డెన్లోకి వెళదాం. నాకు ఇక్కడ ఊపిరి ఆడటం లేదు’ అంది.‘సరే’ అని చేయి పట్టుకుని తీసుకెళ్ళాడు. ఆ సాయంకాలం.. వాళ్ళు మెల్లగా నడుస్తున్నారు. ఇద్దరి మధ్య బోలెడు కబుర్లు దొర్లాయి. ఆమె బలహీనమైన చేయి అతని చేతిలో ఉంది.‘నేను పెళ్ళి చేసుకోలేదు!’ ‘మీకు పెళ్ళయిందా? మీ వాళ్ళంతా ఎక్కడున్నారు?’ కాసేపటి క్రితం బోసు అనాలోచితంగా అడిగిన ఆ ప్రశ్నకు ఇప్పుడు జవాబు ఇచ్చింది.ఆశ్చర్యపోయాడు బోసు. మరి తను ఆ రోజు చూసిందేమిటి? ఆ దృశ్యాలు తనకిప్పటికీ గుర్తున్నాయి. ఆమె ఆ పిల్లలను కలుసుకోవడం గురించి ఎందుకు చెప్పటం లేదు? ఆమె ఎప్పుడైనా అలా చెప్పిందా, లేదా తను ఊహించుకున్నాడా? ఆమె డిమెన్షియాతో బాధపడుతోందా? అని మథనపడుతూనే ‘మరి ఆ పిల్లలు?’ అడిగాడు అప్రయత్నంగానే! ‘వాళ్ళు నావాళ్ళు కాదు’ అని చెప్పి వెంటనే ‘అంటే నా పిల్లలే, కానీ నేను వాళ్ళకి బయోలాజికల్ మదర్ని కాను’ అన్నది.బోసుకి గందరగోళంగా అనిపించింది, ‘మీరు వారిని దత్తత తీసుకున్నారా? క్లారిటీగా చెప్పండి’ బతిమాలుతున్నట్టుగా అడిగాడు.ఆమె నీరసంగా అతని వైపు చూస్తూ, ‘ఎక్కడయినా కూర్చుందాం. నా కాళ్ళు లాగుతున్నాయి’ అన్నది. ‘ఓ! సారీ.. పదండి’ అంటూ దగ్గరే ఉన్న బెంచ్ వైపు కదిలారు. ‘నేను ఎక్కువసేపు ఒకే చోట నిలబడలేను’ బెంచ్ మీద కూర్చుంటూ చెప్పింది. ‘అయ్యో సారీ.. నాకు తట్టనే లేదు’ నొచ్చుకుంటూ అన్నాడు. ఇద్దరూ ఒక్క క్షణం మౌనం వహించారు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆమె, ‘వారు నా పిల్లలే.. కానీ నేను వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిని కాను’ ఆమె మళ్ళీ చెప్పింది. ‘స్కూల్ టీచర్గా పనిచేసే దాన్ని. అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని ఉండేదాన్ని. అమ్మ వాళ్ళు ఊర్లో ఉండేవారు. నాకెందుకో పెళ్ళి అనే బంధం మీద ఇష్టం యేర్పడలేదు. దాంతో నా తల్లిదండ్రులు చాలా అసంతృప్తి చెందారు. ఆ కాలంలో ఒంటరిగా బతుకుతున్న స్త్రీని మీరు ఊహించుకోవచ్చు. నేను పెళ్ళి చేసుకుని, సెటిల్ అవ్వాలని మా పేరెంట్స్ కోరిక.కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేకపోయారు. నేను వారిని ఏమనలేకపోయాను. అసలు పెళ్ళి మీద నాకు దృష్టే లేదు. ఏదో చెయ్యాలనే తపన. పెళ్ళి చేసుకుంటే చేయలేను. నా ఈ ఆలోచన మా పేరెంట్స్కి అర్థంకాలేదు. ఇందులో నా తప్పు కూడా కొంత ఉంది. వాళ్ళకు అర్థమయ్యే రీతిలో చెప్పలేకపోయాను’ ఆయాసం రావడంతో కాసేపు ఆగి మళ్ళీ కొనసాగించింది,‘రోజూ స్కూల్ నుండి ఇంటికొచ్చాక.. మా ఏరియా చుట్టుపక్కలంతా చుట్టొస్తుండేదాన్ని. అలా నడుస్తున్నప్పుడు ఒక మురికివాడను చూశాను’ అంటూ ఆమె కళ్ళు మూసుకుంది. ‘ఏమైందప్పుడు?’ బోసు ఆత్రుతగా అడిగాడు.‘హు..?’ అంటూ ఆమె అయోమయంగా అతని వైపు తిరిగింది. ‘అదే మీ సాయంత్రం నడకలో ఒక మురికివాడలోకి వచ్చానని చెబుతున్నారు’ బోసు గుర్తుచేశాడు.‘ఆ.. అవును.. మురికివాడలో ఒక గుడిసె బయట.. ఒక మగ మనిషి, ఓ ఆడ మనిషి తీవ్రంగా కొట్టుకుంటున్నారు. మిగతావాళ్ళంతా నవ్వుతూ, ఆ దృశ్యాన్ని ఆస్వాదిస్తున్నారు. నేను గబగబా వాళ్ళ దగ్గరకు వెళ్ళాను. వాళ్ళను వారిద్దామనుకునే లోపల అక్కడ వినిపించిన కొంతమంది పిల్లల ఏడుపులు నన్ను ఆపేశాయి. అయిష్టంగానే వెనక్కి తిరిగాను. ఆ ఆడమనిషి ఆ పిల్లలను చెత్త కుప్ప మీదకు తోసేసింది. ఆమె మనసులోని దరిద్రమేదో ఆమె చేత ఆ పని చేయించి ఉండవచ్చు. ఏమైనా వాళ్ళు ఆమె పిల్లలు!తల్లిదండ్రులను భయంతో చూస్తున్నారు. ఏం జరుగుతుందో బహుశా.. వాళ్ళకు తెలుసు కాబోలు’ అని చెబుతూ ఆమె ఆపేసింది. మళ్ళీ కళ్ళు మూసుకుంటూ మౌనం వహించింది. ఆమె చెప్పిన కథలోని శకలాలు బోసును ఆశ్చర్యపరచాయి. అతను కూడా ఆందోళన చెందాడు. ఆమె తన గతం చెప్పటం అయిపోయిందా లేక కొనసాగిస్తుందా? అతనికి వేచి ఉండే ఓపిక లేదు. కానీ వినాలనే కుతూహలం అతను వేచి ఉండేలా చేసింది. బోసు టైమ్ చూసుకున్నాడు.. దిక్కులు చూశాడు. ఆమె తిరిగి చెప్పడం ఎప్పుడు మొదలుపెడుతుందా అని ఎదురుచూస్తున్నాడు. ఆవె కళ్ళు తెరిచింది. హమ్మయ్య అనుకున్నాడు బోసు. ‘నేను మళ్ళీ ఆ స్లమ్ ఏరియాకి వెళ్ళాను. అదే దృశ్యం రిపీట్ అయింది. కానీ ఈసారి ఆ ఆడమనిషి తన పిల్లలను కొడితే నేను జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. చేసుకున్నాను కూడా. పిల్లల్ని కొట్టొద్దని ప్రాధేయపడ్డాను. ఆమె వినలేదు. అయితే ఆ బస్తీలో వాళ్ళు మటుకు ‘ఇది వీళ్ళు రోజూ ఆడే నాటకమే. మీరు పట్టించుకోకండి’ అని చెప్పారు. నా కన్సర్న్ అంతా ఆ అమాయకమైన పిల్లల గురించే.కొన్ని రోజుల తర్వాత.. ఒకసారి నేను స్కూల్కి వెళుతూండగా ఆ పిల్లలు రోడ్డు మీద అడుక్కుంటూ కనిపించారు. మనసు చివుక్కుమంది. స్కూల్కి ఆలస్యమవుతున్నా.. వాళ్ళను వదిలి ముందుకు వెళ్ళలేకపోయాను’ అంటూ గట్టిగా ఊపిరి పీల్చుకుని, ‘నేను ఆ పిల్లల దగ్గరకు వెళ్ళడం నాకిప్పటికీ గుర్తుంది. అంత చిన్న పిల్లలని ఆ తల్లిదండ్రులు అలా ఎలా రోడ్డు మీద వదిలేశారని ఆశ్చర్యపోయాను. అప్పుడే తెలిసింది. వాళ్ళంతా అనాథలని! దగ్గరలోని ఒక రెస్టారెంట్ నుండి వాళ్ళకు కావలసినవి తెచ్చిపెట్టాను. ఆ క్షణమే ఓ నిర్ణయానికి వచ్చేశాను. ముందు వాళ్ళతో ఎక్కువ సమయం గడుపుతూ.. వాళ్ళు నాతో సన్నిహితంగా మెదిలేలా అలవాటు చేశాను’ అంటూ బోసు వైపు చూసింది.‘తర్వత ఏమైంది?’ ఉత్కంఠగా అడిగాడు బోసు. అచ్చు రాత్రిపూట.. తన అమ్మమ్మను కథ చెప్పమని అడిగే చిన్న పిల్లవాడిలా! ‘నేను వాళ్ళను నా అపార్ట్మెంట్కు తీసుకొచ్చాను.’బోసు ఆమె వైపు చూశాడు. ఆమె భుజాలు వంచి.. కళ్ళు మూసుకునుంది. ‘తర్వాత?’ అడిగాడు అదే ఉత్కంఠతో! కళ్ళు తెరుస్తూ ఆమె బోసు వైపు తిరిగి ‘వాళ్ళు నాతోనే ఉన్నారు’ చెప్పింది నెమ్మదిగా. బోసులో అయోమయం.. ‘వారికి తల్లిదండ్రులు ఉన్నారు కదా! వాళ్ళ పిల్లలను మీరెలా తెచ్చుకున్నారు? వాళ్ళు అనుమతించారా? దత్తత గురించి మీరు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడారా?’ఆమె.. అతని నుండి కళ్ళు తిప్పుకుని, ముడుచుకున్న తన చేతులను చూసుకుంటూ ‘నేను వారి తల్లిదండ్రులతో మాట్లాడలేదు. అసలు మళ్ళీ ఆ బస్తీకే వెళ్ళలేదు’ అని చెప్పింది స్థిరంగా. ‘అంటే కిడ్నాప్ చేశారా వాళ్ళను? చెప్పకుండా తీసుకెళ్ళడమంటే అదే కదా?’ విస్తుపోతూ బోసు. ‘ఎంతమందిని తెచ్చారు?’ తేరుకుని అడిగాడు. ‘ఒక పన్నెండు మందిని! వాళ్ళకు ఒక హోమ్ ఏర్పాటు చేశాను. అది వాళ్ళిల్లు. కుక్, కేర్టేకర్ని పెట్టాను. చిన్నవాళ్ళు చదువుకుంటున్నారు. పెద్దవాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు’ చెప్పింది. ‘అయినా సరే.. అది కిడ్నాప్’ అంటూ గట్టిగా అరిచాడు బోసు. మళ్ళీ వెంటనే ‘కాదు.. కాదు ఒకవేళ వాళ్ళు అక్కడే ఉంటే వాళ్ళ జీవితం ఎలా ఉండేదో!’ సాలోచనగా అన్నాడు. ఆమె వణుకుతూ మెల్లగా లేచింది. బోసు అలాగే నిశ్చేష్టుడై ఉన్నాడు.‘నేను ఇంక ఇంటికి వెళ్ళాలి. వాళ్ళు రోజూ రాత్రి ఫోన్ చేస్తారు’ అంటూ అడుగులు వేసింది. ఆ మాటకి బోసు ఈ లోకంలోకి వచ్చాడు. గబుక్కున బ్యాగ్ తీసి ఆమెకు ఇచ్చాడు.‘థాంక్యూ మై డియర్ బాయ్’ అంటూ అతని చేతిని ముద్దు పెట్టుకుంది. ‘నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ మనవడు ఉన్నాడు గ్రానీ..’ అంటూ ఆమె బుగ్గలు పుణికాడు బోసు. ఆమె ఇంట్లో ఉండే అమ్మాయి వచ్చి బోస్ని చూసి నవ్వింది. ఆ పెద్దామె చేయి పట్టుకుని ముందుకు నడిపించసాగింది. పెద్దావిడ వెళుతూ వెళుతూ వెనక్కితిరిగి బోసును చూసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది.బోసుకి ఆమెను చూసినప్పుడల్లా ఏదో అనుబంధం లాగుతున్నట్టనిపిస్తుంది. బహుశా.. తన జీవితంలో ఎప్పుడూ చూడలేని అమ్మమ్మ , నాన్నమ్మలని ఆవిడలో చూసుకుంటూ ఉండొచ్చు. అమ్మ చిన్నప్పుడే అమ్మమ్మ, తాతయ్య ఇద్దరూ పోయారు. అలా అమ్మమ్మ పరిచయమే లేకుండా పోయింది. తన అయిదవ ఏట నానమ్మ పోయింది. అలా నానమ్మ జ్ఞాపకమూ మిగల్లేదు. చిన్నప్పటి నుంచి హాస్టల్ చదువుతో అమ్మానాన్నలకూ దూరంగానే ఉన్నాడు. అంత బాండింగ్ లేదు.వాళ్ళు చూపించే ప్రేమానురాగాలు తనకు అతిగా అనిపించేవి. అందుకే వాళ్ళ నుంచి ప్రైవసీ కోరుకున్నాడు. సొంతూళ్ళో ఉద్యోగం వచ్చినా ఇలా ఇంకో ఊరికి మార్పించుకుని వచ్చాడు. అతని తల్లిదండ్రులు కొడుకు కోసం మొహం వాచిపోయున్నారు. ఉండబట్టలేక ఫోన్లు చేస్తే.. విసుక్కుంటాడు. పొడిపొడిగా మాట్లాడి సెకన్లలో కాల్ ముగించేస్తాడు. వాళ్ళెప్పుడు రమ్మన్నా వెళ్ళకుండా సాకులు వెదుక్కుంటుంటాడు. అలాంటి తనకు ఆ ఎనభై ఏళ్ల ఆ వృద్ధురాలు కనువిప్పు కలిగించింది. అనాథల కోసం అవివాహితగా మిగిలిపోయింది. వాళ్ళకు అమ్మ అవడం కోసం తన కుటుంబాన్ని వదులుకుంది.ఫోన్ మోగుతోంది. పనిలో ఉన్న శ్యామల గబగబా వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి ‘హెలో..’ అంది. ‘ఎవరూ?’ అని ఆత్రంగా అడుగుతూ ఆమె భర్త శ్రీనివాస్ వచ్చాడు. ‘హుష్..’ అని భర్తకు సైగ చేసింది. ‘వాడేనా?’ కుతుహులం పట్టలేక గుసగుసగా అడిగాడు శ్రీనివాస్. కళ్ళల్లో ఆనందం మెరుస్తుండగా అవునన్నట్టుగా తలూపింది. ‘ఎలా ఉన్నావు నాన్నా?’ ఫోన్ మాట్లాడుతూ అక్కడే టేబుల్ మీదున్న బోసు ఫొటోను ప్రేమగా స్పృశించింది శ్యామల. – మణి వడ్లమానిఇవి చదవండి: 'అంధకాసుర వధ'! ఒకనాడు కైలాస పర్వతంపై.. -
శిబు సోరెన్ రాజకీయ జీవితంలో విజయాలెన్ని?
దేశ రాజకీయాల్లో అత్యంత జనాకర్షణ కలిగిన నేతలు అరుదుగా కనిపిస్తారు. వారిలో ఒకరే జార్ఖండ్ అధికార ప్రాంతీయ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత శిబు సోరెన్. పొడవాటి జుట్టు, మాసిన గడ్డంతో కనిపించే ఈ నేతకు 80 ఏళ్లు. ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శిబు సోరెన్ అక్కడి బహిరంగ సభల్లో ప్రతీకాత్మకంగా కనిపిస్తుంటారు. అంటే మోర్చా వేదికల్లో పోస్టర్లు, బ్యానర్లలో ఆయన ఫొటో తప్పక కనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేయనప్పటికీ ఆయన పేరు జార్ఖండ్లో వాడవాడలా వినిపిస్తుంటుంది. వడ్డీ వ్యాపారుల ఆగడాలు, మాదక ద్రవ్యాల విముక్తిపై పోరాటంతో శిబు సోరెన్ రాజకీయ ప్రయాణం మొదలైంది. ధన్బాద్కు ఆనుకుని ఉన్న తుండి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని శిబు తన పోరాటాన్ని ప్రారంభించారు. తొలుత పాఠశాలలో విద్యపై గ్రామీణులకు అవగాహన కల్పించారు.1977లో శిబు సోరెన్ తొలిసారిగా లోక్సభ ఎన్నికల్లో పోటీచేసి విఫలమయ్యారు. అయితే 1980లో లోక్సభలో మొదటి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత 1986, 1989, 1991, 1996లలో విజయాన్ని హస్తగతం చేసుకుంటూ వచ్చారు. 1998 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేత బాబులాల్ మరాండీ చేతిలో ఓటమి చవిచూశారు. అయితే 2004, 2009, 2014లలో దుమ్కా పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి తిరిగి విజయాన్ని దక్కించుకున్నారు.శిబూ సోరెన్ మొత్తం ఎనిమిది సార్లు దుమ్కా లో విజయపతాకం ఎగురవేశారు. శిబు సోరెన్ రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 1984లో ఒకసారి జామా అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ సీటులో ఆయన పెద్ద కోడలు సీతా సోరెన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. శిబు సోరెన్పై పలు హత్యారోపణలు ఉన్నాయి. అయితే విచారణ తర్వాత అతనిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. శిబు సోరెన్ వివిధ కాలాల్లో మూడుసార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రి అయ్యారు. 2009లో ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. -
51 ఏళ్ల వయసులో మరోసారి ప్రభుత్వ ఉద్యోగం!
రాజేంద్ర సింగ్.. మొదట భారత ఆర్మీలో సైనికుడు. తరువాత బ్యాంకులో సెక్యూరిటీ గార్డు. ఇప్పుడు బ్యాంకులో క్లర్కు. 51 ఏళ్ల వయసులో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి.. విజయానికి వయసు అడ్డంకి కాదని నిరూపించాడు.వయసు మీదపడ్డాక మరోసారి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన రాజేంద్ర సింగ్ రాజస్థాన్లోని సికార్ జిల్లా లక్ష్మణగఢ్ పట్టణంలో కుటుంబంతో పాటు ఉంటున్నాడు. రాజేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబ సభ్యులలోని ఐదుగురు భారతీయ సైన్యంలో చేరారని, మొదట తన తండ్రి, తరువాత ముగ్గురు సోదరులు, ఇప్పుడు తన పెద్ద కుమారుడు సైన్యంలో చేరారన్నారు.ఇండియన్ ఆర్మీలో 18 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన తర్వాత రాజేంద్ర సింగ్ వీఆర్ఎస్ తీసుకున్నారు. తర్వాత 2014లో ఎస్బీఐ లక్ష్మణ్గఢ్లో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు ఆల్వార్ అండ్ సికార్ జోన్లోని బ్యాంకులో క్లర్క్ పోస్ట్ దక్కించుకున్నారు. ఇందుకు నిర్వహించిన పోటీ పరీక్షలో రాజస్థాన్లో నాల్గవ ర్యాంక్ సాధించారు.సైన్యం నుంచి రిటైర్ అయ్యాక చాలామంది ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతారు. అయితే రాజేంద్ర సింగ్ తన భార్య అమృతా దేవి ప్రోత్సాహంతో 51 ఏళ్ల వయస్సులో మరోమారు ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారు. ఇందుకోసం ఎస్బిఐ నిర్వహించిన పోటీ పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. తన సక్సెస్ క్రెడిట్ అంతా తన భార్యకే దక్కుతుందని రాజేంద్ర సింగ్ తెలిపారు. రాజేంద్ర సింగ్ 1991లో భారత సైన్యంలో సైనికుడిగా నియమితులయ్యారు. సైన్యంలో 18 ఏళ్లపాటు సేవలందించిన తర్వాత 2009లో హవల్దార్ పదవి నుంచి వీఆర్ఎస్ తీసుకున్నారు. 2014లో ఎస్బీఐలో గార్డ్గా నియమితులయ్యారు. 2024, మార్చి 28న జరిగిన ఎస్బీఐ బ్యాంక్ క్లర్క్ పరీక్షకు హాజరై, ఉత్తీర్ణత సాధించారు. రాజేంద్ర సింగ్కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నితేష్ బీఎస్ఎఫ్లో సైనికుడు. చిన్న కుమారుడు కార్తీక్ బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నాడు. -
రామోజీ.. ఈ కథనం నువ్వు వేసిందేగా!
సాక్షి, అమరావతి: ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని వక్రీకరించి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్న రామోజీరావు 7 నెలల క్రితం దాన్ని జగన్ ప్రభుత్వం అమల్లోకి తేలేకపోతుందంటూ ఈటీవీ భారత్లో ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేశారు. గతేడాది ఆగస్టు 11న ఈటీవీ భారత్లో ‘వైసీపీ ప్రభుత్వ ప్రచారాలకే పరిమితమైన చట్టాలు.. ఖాతాలో మరో యాక్ట్’ అంటూ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి పంపించిన బిల్లులకు కూడా కేంద్రం నుంచి ఆమోదం తెచ్చుకోలేకపోతున్నారని అందులో వివరించారు. అసెంబ్లీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ను ఆమోదించినా కేంద్రం నుంచి అనుమతి తేలేకపోతున్నారని ఆక్షేపించింది.అనేకసార్లు దిల్లీలో ప్రదక్షిణలు చేసిన సీఎం జగన్ ల్యాండ్ టైటిల్ యాక్ట్కు కేంద్రం నుంచి ఆమోదం పొందడంలో విఫలమయ్యారని ఆ కథనంలో రామోజీ గుండెలు బాదుకున్నారు. ఆ కథనం వచ్చిన కొద్దినెలలకే కేంద్రం ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ఆమోదముద్రా పడింది. ఇప్పుడు ఏకంగా విష ప్రచారం చేయడం రామోజీ ద్వంద్వ నీతికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది. ఎంతో విజన్ ఉన్న చట్టం అని చెప్పిన దాని గురించి ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అప్పుడు ఈ చట్టం వస్తే భూ యజమానులకు వరంగా మారుతుందని చెప్పిన ఈటీవీ ఇప్పుడు అది వస్తే భూములు పోతాయని రైతులను భయభ్రాంతులకు గురిచేసే కథనాలు వండి వారుస్తోంది. ఈ చట్టం గురించి వ్యతిరేక ప్రచారం చేసి భూములకు సంబంధించి వారిలో భయాలు సృష్టించి తద్వారా ఎన్నికల్లో చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేందుకు రామోజీ ఈ దిగజారుడు పాత్రికేయానికి తెగబడ్డారు. భూ హక్కుల చట్టంతో భూములకు భద్రత వస్తుందని ఈటీవీలో పలు కథనాలు ప్రసారం చేసి ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఇష్టమొచ్చినట్లు బురద జల్లడం ద్వారా తనకు కుట్రలు, కుతంత్రాలు తప్ప విలువలు, నీతి అనేదే లేదని రామోజీ నిరూపించుకున్నారు. -
'ఆశకు స్ఫూర్తి ఆమె'!..ఏకంగా 33 వేల అడుగుల ఎత్తు నుంచి విమానం కూలినా..!
మన కళ్లముందే దారుణ ప్రమాదాలను ఫేస్ చేసి మరీ మృత్యుంజయులై బయటపడిన కొందరూ వ్యక్తులును చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. నమ్మశక్యం కానీ నిజంలా అద్భుతంగా కనిపిస్తారు ఆయా వ్యక్తులు. అలాంటి మిరాకిల్ లాంటి ఘటనే ఈ మహిళ జీవితంలో చోటు చేసుకుంది. ఆ సంఘటన కారణంగానే ఆమె వార్తల్లో నిలిచింది. పైగా గిన్నిస్ బుక్ ఆప్ రికార్డులకు కెక్కింది కూడా. ఏంటా మిరాకిల్ సంఘటన అంటే..వివరాల్లోకెళ్తే..ఆ మహిళ పేరు వెన్నా వులోవిచ్. ఫ్లైట్ అటెండెంట్గా పనిచేస్తోంది. సరిగ్గా జనవరి 26, 1972న యుగోస్లావ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 367లో ఫైట్ అటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఒక భయానక ప్రమాదం జరిగింది. ఓ అనుమానాస్పద బాంబు కారణంగా ఆమె ప్రయాణిస్తున విమానం చెకోస్లోవేయా పర్వతాల మీదుగా కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న మొత్తం 27 మంది ప్రయాణికులు, సిబ్బంది అక్కడికక్కడే చనిపోయారు. ఒక్క ఫైట్ అటెండెంట్ వులోవిక్ మాత్రమే ప్రాణాలతో బయటపడింది. నిజం చెప్పాలంటే వులోవిక్ ప్రయాణిస్తున్న విమానం గాల్లోనే పేలింది. ఏకంగా 33 వేల అడుగుల నుంచి కూలిపోయింది. ఇక్కడ వులోవిక్ కనీసం పారాచూట్ లేకుండా అంత ఎత్తు నుంచి పడిపోయినా..బతికిబట్టగట్ట గలిగింది. ఇదే అందర్నీ ఒకింత ఆశ్చర్యచకితులను చేసింది. అయితే దర్యాప్తుల బృందం విమానం భూమిపై కూలిపోతున్నప్పుడూ తోక భాగంలోని ఫుడ్ రూమ్లో వులోవిక్ చిక్కుపోవడంతో సేఫ్గా ఉన్నట్లు తెలిపింది. ఆ తోక భాగం అటవీ ప్రాంతలో పడిపోయి మంచుతో కప్పబడి ఉండటంతో ఆమె అరుపులు అరణ్యరోదనగా మారాయి. ఆమె అదృష్టం కొద్ది అక్కడ పనిచేస్తున్న అటవీ వర్కర్లకు ఆ అరుపులు వినపడ్డాయి. వెంటనే వారు ఆమెను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె ఏకంగా పదిరోజులకు పైగా కోమాలోనే ఉండిపోయింది. ఈ ప్రమాదంలో వులోవిక్ పుర్రెకి తీవ్ర గాయం, రెండు వెన్నుపూసలు చితికిపోవడం, కటి, పక్కటెముకలు, రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నడుము తాత్కలికి పక్షవాతానికి గురయ్యి కొన్ని రోజులు బెడ్కే పరిమితం కావాల్సి వచ్చింది. ఇంతటి స్థితిలో కూడా ఆమె ఆశను వదులుకోలేదు. పైగా నిరాశను దగ్గరకు రానివ్వలేదు. నెమ్మదిగా వులోవిక్ పూర్తి స్థాయిలో కోలుకుంది. ఆ తర్వాత ఎయిర్లైన్లో డెస్క్ జాబ్లో విధులు నిర్వర్తించేందుకు తిరిగి వచ్చింది. ఇలా వులోవిక్. మృత్యంజయురాలై నిలవడమే గాక మళ్లీ తన కాళ్లమీద నిలబడి అద్భుతంగా జీవించడంతో .. 1985లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ల కెక్కింది. ఆశకు అసలైన నిర్వచనం ఇచ్చి.. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది ఈ సెర్బియా మహిళ వులోవిక్. తనకు దేవుడిచ్చిన మరో జీవితాన్ని విభిన్న నేపథ్యాల ప్రజల మధ్య అవగాహన పెంచి ,శాంతిగా ఉండేలా చేసేందుకు అంకితం చేసింది. ఇక వుల్విక్ 2016లో 66 ఏళ్ల వయసులో మరణించింది. ఇది మాములు మిరాకిల్ స్టోరీ కాదు కదా..!(చదవండి: అమిత్ షా నివాసంలో పద్మగ్రహీతలకు విందు....మెనులో ఎలాంటి రెసిపీలు ఉన్నాయంటే..) -
మధిర టు తిరుపతి.. ‘సారూ.. ఆ రైలేదో చెబితే ఎక్కుదామని..!'
‘సారూ..’ అన్న శబ్దం నా చెవి గూబను కాస్త గట్టిగానే చరిచింది. నా భార్యతో మాటలకు మధ్యలో కామా పెట్టి, ఎవరాని అటు దిరిగి చూశాను. వయస్సు అర్ధసెంచరీకి అవతలిగట్టు. అరవై ఏళ్లవరకూ ఉండొచ్చు. మాసిన చొక్కాకు అక్కడక్కడా చిన్నపాటి చిరుగులు. కింద లుంగీ.. ఇంకొంచెం పెద్ద చిరుగులతో చొక్కాను డామినేట్ చేస్తోంది. నెత్తిన జుట్టు దుమ్మును పులుముకొని చిందరవందరగా వుంది. కుడికాలికి పిక్క మునిగే వరకు కట్టు. కట్టుకట్టి చాలారోజులైందన్నట్టు తెల్లటి కట్టు మట్టి పులుముకొని కనిపించింది. మనిషిని చుట్టుముట్టిన పేదరికం ఛాయలు.‘ఏంటన్నట్లు?’ అతనివైపు చూశాను. ‘సారూ.. నేను హైదరాబాద్కు పొయ్యే రైలెక్కాలి. ఆ రైలేదో చెబితే ఎక్కుదామని..!’ బతిమిలాడుతున్నట్లు మాట, అభినయం. ‘సరే చెబుతా! అక్కడ కూర్చోనుండు’ పక్కనే ఉన్న అరుగు చూపించి అన్నాను. ‘మర్చిపోవద్దు సారూ.. నీ కాళ్లు మొక్కుతా’ అంటూ మరింత దగ్గరగా వచ్చి నా కాళ్లపైకి వంగాడు.అతన్నుంచి జారి మందు వాసన నా ముక్కు పుటాలను తాకింది.ముఖం చిట్లించి ‘చెప్పాను కదా.. అక్కడ కూర్చో, రైలొచ్చినప్పుడు చెబుతా’ కాస్త విసుగ్గా అన్నాను.‘గట్లనే సారూ ..’ రెండడుగులు వెనక్కువేసి నిలుచున్నాడు.నేను, నా భార్య హైదరాబాద్ వెళ్లేందుకు బాపట్ల రైల్వేస్టేషన్ లో రైలు కోసం వెయిట్ చేస్తున్నాము. మా కూతురు, అల్లుడు హైదరాబాదులో కాపురంపెట్టి నెలన్నర. ప్రసవం పూర్తయి బిడ్డకు జన్మనిచ్చాక అయిదవ నెల వచ్చేవరకు కూతురు గాయత్రి మాతోనే ఉంది. అప్పటికే మనవడు గిర్వాన్ కాస్త వొళ్లుచేశాడు. కాళ్లు, చేతులు హుషారుగా ఆడించడం, కనుగుడ్లు పెద్దవిచేసి చూడడం, బోర్లా తిరగడం, మనం నవ్వితే.. నిశితంగా పరిశీలించి నవ్వడం, హెచ్చరికలకు స్పందించడం మొదలు పెట్టాడు.మనవడి మురిపెంలో అయిదు నెలలు అయిదు రోజుల్లా గడిచాయి. అల్లుడిది ప్రైౖవేటు కంపెనీలో ఉద్యోగం. తానెలాగోలా బాబును సగదీరుకుంటానని చెప్పి కూతురు హైదరాబాద్కు వెళ్లిపోయింది. మనవడి జ్ఞాపకాలు మరువలేక బుడ్డోన్ని చూడాలని నా శ్రీమతి తహతహలాడిపోయింది. నాకూ కాస్త అలానే ఉన్నా బయటపడలేని స్థితప్రజ్ఞత.ఇంతలో ఆరవనెల అన్నప్రాశన అని కూతురు కబురుపెట్టింది. కాగలకార్యం కాలం తీర్చినట్లు హైదరాబాద్ ప్రయాణం ఖరారైంది. రాత్రి పది గంటలకు సింహపురి ట్రైన్ లో ప్రయాణం. మనవడి కోసం బట్టలు, పెద్ద దోమతెరతో పాటు ఏమేమి తీసుకురావాలో కూతురు రెండు రోజులుగా పదేపదే లిస్ట్ చదివింది. నా శ్రీమతి.. కూతురు వద్దన్న వాటిని కూడా బ్యాగుల్లో బలవంతంగా కూర్చి ఉరువుల సంఖ్యను అయిదుకు పెంచింది.‘బయలుదేరేటప్పుడు, రైలు ఎక్కేటప్పుడు బ్యాగులను కౌంట్ చేయండి’ అన్న కూతురు ముందుచూపు సూచనలతో ఉరువులు లెక్కగట్టి రైల్వేస్టేషన్కు చేరుకునేసరికి రాత్రి తొమ్మిదిన్నర గంటలైంది. ప్లాట్ఫారంపై మరోమారు బ్యాగులు లెక్కగట్టి సంతృప్తి చెందాక అక్కడే ఉన్న అరుగుపై కూర్చుంది మా ఆవిడ. రైలు రావడానికి అరగంట సమయముంది. ‘అన్నీ సర్దావా? ఏవైనా మరచిపోయావా?’ అన్నమాటకు ‘గుర్తున్నకాడికి’ అంది. ఇంతలో కూతురు ఫోన్ . లగేజీల ప్రస్థానంపై ఆరా.ఆమె కొడుకు అన్నప్రాశన కోసం తీసుకున్న వెండి గిన్నె, స్పూన్, గ్లాసు ఎక్కడ మరచి పోతామో? అన్నది ఆమె టెన్షన్ . ఒకపక్క రైళ్ల రాకపోకల అనౌన్స్మెంట్లు, ప్రయాణికుల ఉరుకులు, పరుగులు. రైళ్లు ఎక్కి, దిగే ప్రయాణికుల రద్దీతో ప్లాట్ఫారాలు సందడిని నింపుకోగా, ఈ మధ్యే రంగులద్దుకున్న రైల్వేస్టేషన్ రాత్రిపూట ఎల్ఈడీ కాంతుల వెలుగుల్లో కన్నులకింపుగా కనపడుతోంది.‘సార్.. సార్’ అంటూ పెరుగెత్తుకుంటూ వచ్చాడు మళ్ళీ ఆ వ్యక్తి. ‘ఏమిటన్నట్లు?’ చూశాను.‘రైలు వస్తున్నట్టుంది సార్! హైదరాబాద్ దేనా?’ అన్నాడు. సీరియస్గా ముఖం పెట్టి ‘నువ్వెక్కడికెళ్లాలి?’ అన్నాను. ‘హైదరాబాద్ పొయ్యే రైలుకే సార్’‘ఎక్కడ దిగాలి?’ ఊరి పేరు చెప్పాడు. ఏపీ సరిహద్దులో ఉన్న తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఊరు.‘మేమూ ఆ రైలుకే వెళుతున్నాము, మాతో పాటు ఎక్కుదువులే’ అన్నాను. ‘దండాలు దొరా.. ఈ ఒక్క సాయం చెయ్యి.. మా అయ్య కదూ’ అని మరీ వంగి కాళ్లను తాకుతూ దండం పెట్టాడు. మందు వాసన నాతోపాటు పరిసరాలనూ పలకరిస్తోంది. నేను వెనక్కు తగ్గాను. ‘మర్చిపోబాకు సారూ రైలు రాగానే నాకు చెప్పు.. ఏమీ అనుకోకు’ అంటూ చేతులు జోడించాడు.తను పదేపదే దగ్గరగా రావడం నన్ను మరింతగా ఇబ్బంది పెడుతోంది. కోపం, చిరాకు తెప్పిస్తోంది. ‘సరే.. చెబుతానన్నా గదా, రైలు రాంగానే చెబుతా, పొయ్యి అరుగు మీద కూర్చో’ అన్నాను.‘కోప్పడకు సారూ.. మరచిపోతావేమోనని చెపుతాండాలే ’ కొంచెం దూరం జరిగాడు. మరికొద్దిసేపట్లో గూడూరు– సింహపురి ఎక్స్ప్రెస్ మూడవ నంబర్ ప్లాట్పారంపైకి రానుందని తెలుగు, ఇంగ్లిష్, హిందీలో అనౌన్స్మెంట్. అప్పటికే కిక్కిరిసిన జనం అలర్ట్ అయ్యారు. రైలు వస్తుందంటూ తోటి ప్రయాణికులతో చర్చలు. కొందరు షాపుల్లో వాటర్ బాటిళ్లు కొంటున్నారు, ఇంకొందరు పిల్లలకు బిస్కెట్లు, కూల్డ్రింక్స్ కొనిపిస్తున్నారు, మరికొందరు ఫోన్లో రైలు వచ్చిందంటూ ఇంటికి కబురు చెబుతున్నారు, కొందరు బయలుదేరుతున్నామంటూ గమ్యంలోని వారికి సమాచారం చేరవేస్తున్నారు. ప్రయాణికుల కోలాహలం పెరిగింది.మరోమారు నా భార్య మా లగేజీ బ్యాగులు లెక్కగట్టింది. మా కూతురు కౌంటింగ్ సూచనల ప్రభావం ఆమెను వీడనట్లుంది. ‘బ్యాగులు అన్నీ ఉన్నాయా?’ అన్న అర్థం వచ్చేలా ఆమెవైపు చూశాను. ఈసారి ఆమె నవ్వింది. ‘సార్..సార్ ఇదో టీ తీసుకోండి, వేడివేడి టీ..’ పరుగులాంటి నడకతో వచ్చాడు ఆ వ్యక్తి. సీరియస్గా చూశాను. ‘మీ కోసమే తెచ్చాను, టీ తాగండి సర్’ అన్నాడు. నాకు కోపం నసాలానికెక్కింది. చుట్టుపక్కల ప్రయాణికుల దృష్టి చాలాసేపటి నుంచి మా ఇద్దరిపైనే ఉంది. ప్రతిసారీ అతను వేరెవరి దగ్గరకు వెళ్లకుండా నావద్దకు వచ్చి బతిమిలాడుతుండడంతో అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. మరోమారు అందరూ నావైపు చూశారు. కోపం కంట్రోల్ చేసుకున్నాను.‘ఇప్పుడే ఇంట్లో అన్నం తిని వస్తున్నాను, ఇప్పుడు టీ తాగను, నువ్వు తాగు’ ఒక్కో అక్షరం గట్టిగా నొక్కి పలికుతూ కళ్లెర్ర చేశాను.నా ఆగ్రహం పసిగట్టినట్లున్నాడు, దూరంగా వెళ్లి టీ తాగి అక్కడే నిల్చున్నాడు. ట్రైన్ వస్తోందంటూ మరోమారు అనౌన్్సమెంట్. ప్లాటుఫారంపై డిస్ప్లేలలో రైలు నంబర్, బోగీ నంబర్లు వేస్తున్నారు. అది చూసి ప్రయాణికుల్లో హడావుడి. అటూ ఇటూ వేగంగా కదులుతున్నారు. ‘సార్ రైలొచ్చిందా?’ ఈసారి కాస్త దూరం నుంచే అడిగాడు ఆ వ్యక్తి.‘ఆ.. వస్తాంది. ఇక్కడే ఉండు ఎక్కుదాం’ అన్నాను. ‘సరే.. సరే’ అంటూ నాకు దగ్గరగా వచ్చి నిల్చున్నాడు.నా భార్య మరోమారు బ్యాగులను చూపుడు వేలితో లెక్కించడం కనిపించింది. రైలు కూతతోపాటు దాని వెలుతురు తోడుగా ప్లాట్ఫారం పట్టాలపైకి భారంగా వచ్చి ఆగింది. మేమున్న దగ్గరకి కొంత అటు ఇటుగా మేము ఎక్కాల్సిన బీ–5 ఏసీ స్లీపర్ బోగి ఉంది. నా భార్య, నేను చెరో రెండు బ్యాగులు చేతికి తీసుకున్నాం. ఆదరబాదరగా వచ్చి ‘ఇటివ్వు తల్లీ’ అంటూ నా భార్య చేతిలోని రెండు బ్యాగులు తీసుకున్నాడా వ్యక్తి. ఆమె ఇంకో బ్యాగు తీసుకుంది. నా వెంటే బ్యాగులు మోసుకొచ్చాడు. బోగీలో మాకు కేటాయించిన సీట్ల వద్ద బ్యాగులు పెట్టాను. నా భార్యకు సీటు చూపించి కూర్చోబెట్టి.. ‘నీది యే బోగి?’ అడిగాను ఆ వ్యక్తిని. ‘నాదిక్కడ కాదు సారూ..’ అన్నాడు. ‘పద నీ బోగీలో దిగబెడతా’ అన్నాను. ‘నాదిక్కడ కాదులే సారూ..’ అన్నాడు మళ్లీ. ‘ఏదీ.. నీ టిక్కెట్ చూపించు? సీటెక్కడో చెబుతా’ అన్నాను. ‘టికెట్ లేదు సారూ..’ అన్నాడు.‘అదేంటి! టికెట్ తీసుకోలేదా?’ ‘లేదు సారూ.. అయినా మాకెందుకు సారూ టికెట్, మమ్మల్ని టికెట్ అడగరులే’ అన్నాడు. ‘టీసీ వచ్చి చెక్ చేస్తే?’ ‘అది మీకు సారూ.. మాకు కాదులే’ నసగుతూ అన్నాడు‘ఎందుకు?’ అన్నట్లు చూశాను. ‘నేను అడుక్కునేటోన్ని సారూ.. మాకు టిక్కెట్ గట్ల లేదులే’ అన్నాడు. ఆశ్చర్యమేసింది. మాసిన బట్టలు, ఆహార్యం చూస్తే అచ్చమైన పల్లెటూరి అమాయకుడిలా ఉన్నాడు తప్పించి మరీ అడుక్కునేవాడిలా కనిపించలేదు.‘నువ్వు అడుక్కుంటావా?’ అన్నాను. ‘అవును సారూ.. నేను బిచ్చగాన్ని’ అన్నాడు.నాముందు దాదాపు గంటపాటు రైల్వేస్టేషనులో ఉన్నాడు, నాకే టీ ఇవ్వబోయాడు, ఎవ్వరినీ డబ్బులు అడుక్కోలేదు. మనస్సు ఏదోలా అయ్యింది. తను అబద్ధం చెబుతున్నాడేమో! ‘నిజం చెప్పు నువ్వు అడుక్కుంటావా?’ అడిగాను. ‘నిజం సారూ.. నేను బిచ్చగాన్నే, ఆరేళ్లుగా అడుక్కుంటున్నాను’ అన్నాడు. ‘అంతకుముందు?’‘రైతును సారూ’ అన్నాడు. ఉలిక్కి పడ్డాను. తనవైపు తేరిపార చూశాను. రైతు కుటుంబంలో పుట్టిన నాకు తన మాటలు మనస్సులో అలజడి సృష్టించాయి. నా భార్యకు మళ్లీ వస్తానని చెప్పి తనతో పాటు బోగీల వెంట నడుస్తున్నాను. నాగటి చాళ్లలో నడచినట్లు కాలి పాదాలు తొసుకుతున్నాయి. సరిగ్గా అడుగులు వేయలేకపోతున్నాను. మనసుదీ అదే స్థితి. మెదడు గతితప్పింది.‘యే.. టిఫినీ.. టిఫినీ.. ఇడ్లీ వడా, ఇడ్లీ వడా... సార్ వాటర్.. వాటర్, కూల్డ్రింక్స్..’రైలు బోగీల్లో అరుపుల గోల. నా మనసు ఘోషపై ధ్యాసపెట్టిన నా చెవులు వాటిని పట్టించుకోలేదు. ఎలాగోలా జనరల్ కంపార్ట్మెంట్ కొచ్చాను. ఖాళీగా ఉన్న సీటుపై కూర్చున్నాను. ‘కూర్చో’ ఆ వ్యక్తికి సీటు చూపించాను.‘పర్లేదు సారూ నేను నిలుచుంటా’ అన్నాడు. చెయ్యిపట్టి కూర్చోబెడుతూ ‘నీ పేరు..?’ అడిగాను. ‘సోమయ్య సారూ..’‘నీ కథ వినాలని ఉంది చెప్పు సోమయ్యా..’ అన్నాను. ఒక్కక్షణం.. మొదలుపెట్టాడు.‘మాది మధిర దగ్గర పల్లెటూరు సారూ. చిన్న రైతు కుటుంబం. ఒక కొడుకు, ఒక కూతురు. రెండెకరాల మెట్ట. వానొస్తేనే పైరు, లేకుంటే బీడు. రెక్కలు గట్ల కట్టెలు జేసుకొని పని చేసేటోల్లం. అప్పులతో పెట్టుబడి, కరువులతో కష్టాలు. ఒక పంటొస్తే నాలుగు పంటలు పొయ్యేటియి. వడ్డీలు పెరిగొచ్చి అప్పులు కుప్పబడె. తీర్చే దారి దొరక్కపాయ.ఎదిగొచ్చిన కూతురును ఇంట్లో పెట్టుకోలేంగద సారూ.. ఎకరం అమ్మి బిడ్డ పెండ్లిజేస్తి. నా కష్టం పిల్లోడికొద్దని వాన్ని డిగ్రీ దాకా చదివిస్తి. అప్పులోల్లు ఇంటిమీద పడి ఆగమాగం జేస్తిరి. నానా మాటలు పడితి. అయి భరించలేక ఉరిపోసుకుందామని తీర్మానం జేసుకుంటి. భార్యా, కొడుకు దావలేని రీతిన వీధిన పడ్తరని మనసు మార్చుకుంటి. సేద్యం ఇక కుదిరేకత లేదని తీర్మానం జేసుకుంటి. ఉన్న అప్పు వడ్డీలతో గలిపి అయిదు లక్షలకు ఎగబాకె. ఎకరం అమ్మి లొల్లిజేసేటోల్లకు కొంత అప్పుగడ్తి. మా ఊర్లో నా దోస్తుగాల్లు కొందరు సేద్యం ఎత్తిపెట్టి చిన్నచిన్న యాపారాలకు బొయ్యి బాగానే సంపాదిస్తున్నారు. వో దినం నా బాధ వారికి మొరపెట్టుకుంటి.‘మాతో వస్తావా?’ అనిరి. అట్టే అని జెప్పి వొకనాడు వాల్లతో పాటు తిరుపతి రైలెక్కితి. ఎట్టోకట్ట గడ్డనెయ్యి స్వామీ అని ఎంకన్న స్వామికి మొక్కుకుంటి. తిరపతి బొయ్యి చూస్తే నా దోస్తుగాల్లు జేసే యాపారం బిచ్చమెత్తకోవడమని తెలిసె సారూ. పొద్దున లేచింది మొదలు రాత్రి దాకా అడుక్కోడమే. ‘ఇదేందయ్యా ఇట్టాంటిదానికి దెస్తిరే’ అని తొలిరోజు మనసురాక యాతనపడితి.కలోగంజో కలిగిన కాడికి నలుగురికి పెట్టినోల్లం, ఇప్పుడు అడుక్కునే రోజులొచ్చే అని కుమిలిపోతి. అప్పుతీర్చాల, కొడుకును దారిలో పెట్టాల. మనకాడ యేముందని యేం యాపారం జేస్తాం! మనసుకు నచ్చజెప్పుకుంటి. ఆ రోజు నుంచి అడుక్కోడం మొదలు పెడ్తి సారూ. రెండువారాలు బిచ్చమెత్తడం ఇంటికి రాడం, రెండు రోజులుండి మల్లీ పోడం, నెలాఖరుకు రావడం రెండు రోజులుండి మల్లీ పోడం. ఆరేండ్ల కాలం గడచిపాయ దొరా.’మనసు బాధను పంచుకొనేదానికి దోస్తానా దొరికిండనుకున్నాడేమో? ఏకబిగిన తన కథ చెప్పాడు సోమయ్య. మనసును పిండేసే కథ. నేలను కదలించే కథ. కొన్ని నిమిషాలపాటు మా మధ్యన మాటల్లేవు. అంతా నిశ్శబ్దం. రైలు ఇనప చక్రాల రోదనా నా చెవికెక్కడం లేదు.కొద్దిసేపటి తరువాత.. ‘ఇప్పుడెలా ఉంది పరిíస్థితి’ అడిగాను. ‘బాగుందిసారూ .. అప్పులు తీర్చాను, ఊర్లో పాత ఇంటిని రిపేర్ చేసుకున్నాను. కొడుకు హైదరాబాద్లో కంపెనీలో చేరాడు’ చెప్పాడు.‘రైతుగా పదిమందికి పెట్టినోడివి బిచ్చమెత్తడం ఇబ్బందిగా లేదా సోమయ్యా..’ ‘ఎందుకుండదు సారూ.. ఎదుటి మనిషి ముందు చేయిచాచగానే కొందరు చీదరించుకుంటారు, కొందరు పనిజేసుకొని బతకొచ్చుగా అంటారు. కొందరు అసహ్యంగా చూస్తారు. కొందరైతే నానాతిట్లు తిడతారు’ అన్నాడు.‘మాటలు పడ్డప్పుడు బాధనిపించదా?’ అన్నాను.‘అనిపిస్తుంది సారూ.. కచ్చితంగా అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడల్లా రైతుగా నేను పడిన కష్టాలు కళ్ల ముందేసుకుంటాను. పంట కోసం తెచ్చిన అప్పులు గట్టమని అప్పులిచ్చినోల్లు తిట్టిన తిట్లు గుర్తుకు తెచ్చుకుంటాను. తోటి మనిషన్న జాలి లేకుండా ఇంటి మీదకొచ్చి పరువు బజారుకీడ్చినప్పుడు పడ్డ యాతన గుర్తుకు తెచ్చుకుంటాను.పెండ్లాన్ని అమ్మైనా బాకీ తీర్చాలన్న మాటలకు గుండెపగిలి ఏడ్చిన ఏడుపు గుర్తుకు తెచ్చుకుంట సారూ. చుట్టుపక్కోల్లు గుమిగూడి ఓదార్చకుండా మాట్లాడిన వెకిలి మాటలకు పడ్డ యాతన, వేదన గుర్తుకు తెచ్చుకుంటా, ఆ మాటలు పడలేక ఉరిపోసుకొని చచ్చిపోదామనుకున్న రోజులు యాదికి తెచ్చుకుంట. ఆ కష్టాలు, అవమానాల కంటే బిచ్చమెత్తుకొనేటప్పుడు పడే మాటలు సిన్నయిగా అగుపిస్తాయి సారూ. రైతుగా ఉన్న నాటి కష్టాలతో పోలిస్తే ఇప్పటి నొప్పి గుండెను పిండదు సారూ.’సోమయ్య మాటలు ఆర్ద్రంగా మారాయి. చొక్కా చెరుగుతో కళ్లను తుడుచుకున్నాడు. నా కళ్లకు సోమయ్య మసగ్గా కనపడుతున్నాడు. మనస్సు బాధగా మూలిగింది. ‘సోమయ్యా .. ఉద్యోగం చాలించి నేనూ రానా..’ ఆయన మనస్సు తేలిక చేయాలన్న ఉద్దేశంతో అన్నాను. ఒక్కసారి నావైపు చూసి చిన్నగా నవ్వాడు. ‘మీకెందుకు సారూ ఆ కర్మ? ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు’ అన్నాడు. ‘అవును సోమయ్యా! తిరుపతికే ఎందుకు వెళ్లడం అంతదూరం?’ అన్నాను.‘భక్తులు దేశం నలుమూలల్నుంచి వచ్చేతావు సారూ, పాపాలు చేసి పుణ్యం పట్టకపోయేటందుకు మొక్కులతో వస్తరు, దండిగా డబ్బులతో వస్తరు, ఖర్చుపెట్టేందుకు సిద్దపడే వస్తరు, దేవుడికింత , మాకింత’ చెప్పాడు. ‘అయితే బిక్షమెత్తి పాపులకు పుణ్యం పంచే దేవుడి ఉద్యోగం అన్నమాట’ అన్నాను. ‘ఊరుకొండి సారూ.. వెంకన్నస్వామే దేవుడు, నేను కాదు’ నవ్వుతూ అన్నాడు. సోమయ్యలో నవ్వు చూశాను. కొంచెం బాధ తగ్గింది. సెల్ఫోన్ లో టైమ్ చూశాను. పన్నెండు కావస్తోంది. ఎవరిగోడూ పట్టని సింహపురి ఎక్స్ప్రెస్ విజయవాడ దాటి మధిర వైపు వేగంగా పరుగెడుతోంది.‘మీరెల్లిపడుకోండి సారూ.. మేడం ఒక్కరే ఉంటారు, నేను ఇంకో గంటలో దిగిపోతా ’ అన్నాడు. ‘అవును సోమయ్యా.. నువ్వు బాపట్లలో ఎందుకున్నావు?’ అన్నాను. ‘తిరపతిలో తొందరతొందరగా రైలెక్కాను సారూ.. తీరాచూస్తే అది మావూరి దగ్గర ఆగదంట. అందుకే ఇక్కడ దిగాను, దసరా పండక్కు కొడుకు, కూతురు పిల్లలు ఊరికి వచ్చిండ్రు సారూ.. రేపే పండగ, మల్లీ రైలెక్కడ పోగొట్టుకుంటానో అని బయపడి మిమ్మిల్ని ఇబ్బంది పెట్టాను’ అన్నాడు.‘సరే’ అని లేచాను. ఇప్పుడు సోమయ్య దగ్గర నాకు మందు వాసన రావడం లేదు, మట్టి వాసన వస్తోంది, రైతు చమట వాసన వస్తోంది. చేయి కలిపాను. పాలకుల ఆదరణ కరువై వో రైతు కాడిదించాడు. వందల మంది జనం ఆకలి ఆర్తనాదాలు నా చెవుల్లో మారు మోగుతున్నాయి. అన్యమనస్కంగానే నా బోగీవైపు అడుగులు వేశాను. — బిజివేముల రమణారెడ్డి -
భార్యాభర్తలిద్దరూ స్టార్ క్రికెటర్లే.. అతడు కాస్ట్లీ.. ఆమె కెప్టెన్!(ఫొటోలు)
-
Funday Story: 'వనప్రస్థపురం'.. మరెప్పుడైనానా? ఎన్నేళ్ల నుంచి ఇదే..!?
హాలిడే ట్రిప్కు పిల్లలు, మనవళ్ళతో ఓలా కార్లు బయల్దేరిపోయాయి. తలుపు దగ్గరగా వేసి వచ్చి, హాల్లో సోఫా మీద కూర్చున్నాను. డైనింగ్ టేబులు మీద ఆఖరు మనవడు చివరి క్షణం వరకూ తిననని మారాం చేస్తూ వదిలేసిన పప్పు, నేయి అన్నం. దాని పక్కనే హడావుడిలో మరచిపోయిన మంచినీళ్ళ బాటిల్. ఇల్లంతా నిశ్శబ్దం కరెంటు పోయినట్టుగా. గదిలో సుభద్ర ఒత్తిగిల్లుతూ, దుప్పటి పైకి లాక్కున్న చప్పుడు. ఎంగిలి కంచం సింకులో వేసి, బెడ్రూమ్లోకి తొంగిచుశాను. ‘ఎట్లా ఉంది’ ‘తగ్గుతున్నది జ్వరం. పిల్లలు చాలా డిసప్పాయింట్ అయ్యారు నావల్ల’ ‘మరెప్పుడైనా వెళదాంలే ఏం పోయింది’ ‘మరెప్పుడైనానా? ఎన్నేళ్ల నుంచి అనుకుంటున్నాము తాజ్మహల్ చూద్దామని. అందరికీ కుదిరి, వాతావరణం బాగుండి, సెలవులు దొరికి, పరీక్షలు లేకుండా, ఇదిగో ఇన్నాళ్ళకి వీలయితే, ఈ వైరల్ ఫీవర్ మొత్తాన్ని దెబ్బతీసింది’ నిస్పృహగా నవ్వింది సుభద్ర. చేయి పట్టుకుని నిమిరాను. పలుచటి ముఖం. జ్వరంలోనూ తగ్గని ఆ ముఖంలోని నిర్మలత. కాకుంటే ఒత్తుగా ఉండే జుట్టొకటే ఈ మధ్య పలచబడింది. కాసేపటికి కునుకులోకి జారింది. బయటకు వచ్చి సోఫాలో కూర్చుని, క్రాస్వర్డ్ చేయటం మొదలు పెట్టాను. ఇరవై నిముషాలు పట్టింది. అలవాటయితే తేలికయిన ప్రక్రియే. సాయంత్రం నాలుగు గంటలు కావస్తోంది. ఫ్రిజ్ నుంచి పాలు తీసి బయటపెట్టాక, టీ డబ్బా కోసం వెతుకుతుంటే అకస్మాత్తుగా లాసా–లమ్సా చాక్లెట్ టీ గుర్తుకొచ్చింది. ఈ రోజుల్లో ఎవరయినా తాగుతున్నారా? అనుమానమొచ్చింది. ఫోను చేశాను. త్రివేణి సూపర్ మార్కెటులో ఆశ్చర్యకరంగా స్టాక్ ఉంది. పదినిమిషాల్లో పిల్లవాడితో పంపాడు. కొంచెం పాలతో, తక్కువ పంచదారతో, లైట్గా పెట్టిన టీ మరుగుతుంటే, వాసన కాస్త బలంగానే తగులుతోంది. రెండు మగ్గుల్లో పోసి బెడ్ రూమ్కు తీసుకువెళ్ళాను. చూస్తూనే లేచి కూచుంది సుభద్ర. మొదటి సిప్కే ముఖం విప్పారింది. ‘ఇదెక్కడిది’ ఆశ్చర్యంగా అడిగింది. ‘తెప్పించాను ఇప్పుడే’ టీ కప్పును చేతితో తిప్పుతూ చూస్తుండి పోయింది తాగడం మానేసి. ‘చల్లారిపోతుంది తాగు’ ‘ఈ రుచి, వాసన నీకు ఏం గుర్తుకు తెస్తున్నాయి’ ‘ముంబైలోని మాతుంగా కింగ్స్ సర్కిల్. అక్కడి పూలమాలలు. పక్కనే శృంగేరి మఠం. గిరి బుక్ స్టోర్’ ‘ఇంకా’ ‘బొంబాయ్ బ్లాస్ట్స్... మోకాళ్ళలోతు నీటిలో పెద్దవాడి బస్సు కోసం మెయిన్ రోడ్డు వరకూ చుడీదార్ ఎగగట్టి నడచిపోవడం’ జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా జాగ్రతగా నెమరువేస్తూ అవి అయిపోతాయేమో అన్న భయంతో కొంచెం కొంచెంగా టీ తాగాం. ‘ఎన్నేళ్ళయింది చాక్లెట్ టీ తాగి’ ‘1982లో ఆఖరిసారి తాగాము. బాంబే నుంచి స్విట్జర్లాండ్. వెనక్కు చెన్నై. కొన్ని రోజులు అమెరికా మళ్ళీ చెన్నై. ఎక్కడా దొరకలేదు మనకు’ అందామె. ‘మనం ప్రయత్నించలేదుగా’ ‘అంటే అత్తగారికి ఇష్టం లేదు. రెండు రకాల టీలు పెట్టే ఓపిక నాకు లేదు. మామయ్య, అత్తయ్య పోయాక, ఎప్పుడూ రుచిచూడని పిల్లలకు ఈ రుచి నచ్చలేదు’ ‘హోటల్స్లో దొరకదు’ నేను ముక్తాయింపుగా అన్నాను. మరుసటి రోజు ఉదయం ఢిల్లీ నుంచి ఫోను చేశారు పిల్లలు. అమ్మ ఎట్లా ఉంది. వంట ఏం చేసుకున్నారు వగైరా వగైరా. అమ్మ జ్వరం తగ్గిందనగానే వాళ్లకు కాస్త రిలీఫ్. కార్న్ ఫ్లేక్స్ను బౌల్స్లో తీసుకుని వేడి పాలు ఒంపుకొని డైనింగ్ టేబులు మీద కూర్చున్నాము. అల్మారాలో పై తంతెలో గోధుమ రంగులో ఉంది పెళ్లి ఆల్బమ్. దుమ్ము తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. దాదాపు నలభై ఏళ్ళ క్రితం ఆల్బమ్. పసి పిల్లలుగా ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళయినారు. చిన్న గొలుసు రెండు పిలకలతో అక్కయ్య ఎత్తుకొని ఉన్న రమ్య ఇవాళ అమెరికాలో సెటిల్ అయింది. కళకళలాడుతున్న ముఖాల్తో అత్తయ్యలు, మామయ్యలు, బాబాయిలు, పిన్నులు. కండువాతో తాతయ్య, అమ్మమ్మ. ఫ్యామిలీ ఫొటోలో దాదాపు 65 మందిమి ఉన్నాము. మనిషి మనిషిని లెక్కపెడితే ప్రస్తుతం అందులో నలభయి అయిదు మంది ప్రపంచంలోనే లేరు. పది మంది ఇండియాలో లేరు. ‘పెళ్ళిలో మామయ్య పాడిన పాట జ్ఞాపకముందా. భక్ష్యాలతో పాల మీగడ లేదని మీ ఆత్తకు కోపం వచ్చింది’ సుభద్ర జ్ఞాపకం చేసింది. ఆల్బమ్స్ వెనక్కి పెట్టేయబోతుంటే, సుభద్ర టీపాయి మీద ఉంచమన్నది– మధ్యాహ్నం తీరికగా చూసుకోవడానికి ఇద్దరం కలిసి. రోజుకు రెండుసార్లు పిల్లల ఫోనులు కొనసాగుతూనే ఉన్నాయి. టాక్సీ ప్రయాణం, హోటల్స్లో తందూరీ రోటీ రుచి. ఆగ్రా దారిలో ధాబాలు.. పుల్కాలు.. మజా కూల్డ్రింకు... బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరుసటి రోజు స్నానం చేసి స్లీవ్లెస్ నైటీలో బయటకు వచ్చింది సుభద్ర. చేతిలో కాగితాల కట్ట. ‘ఎన్నేళ్ళయింది నువ్వీ పింక్ స్లీవ్ లెస్ వేసుకొని’ అశ్చర్యంగా అడిగాను. ‘ఏమో! అల్మారా తెరిస్తే వేసుకోవాలనిపించింది’ ‘ఇన్నేళ్ళయినా ఎంత బాగుందో’ పెద్దగా అనేసి నాలిక కరుచుకొని చుట్టూ తిరిగి చూశాను. ఇంట్లో మేమిద్దరమే అన్న సత్యం మరోసారి గుర్తొచ్చింది. ‘ఏమిటి కాగితాల కట్ట’ ‘ఉత్తరాలు’ ‘ఏ ఉత్తరాలు’ ‘పెళ్ళికి ముందు ఆరు నెలలు మీరు నాకు, నేను మీకు రాసినవి’ నవ్వుతూ టేబుల్ మీద పెట్టింది సుభద్ర. ఒక కట్టకు గ్రీన్ బాండు. అవి సుభద్ర రాసినవి. రెడ్ రబ్బర్ బాండ్తో నావి. ‘ఉప్మా చేయమంటారా?’ ‘నువ్వేం చేయద్దు. కాస్త తొందరగా భోజనం చేద్దాము. ఉత్తరాలిచ్చి సోఫాలో కూర్చో’ సుభద్ర ఉత్తరాలు నేను, నా ఉత్తరాలు సుభద్ర తీసుకున్నాము. ఎన్ని ఆశలు. ఎన్ని ఆలోచనలు. ఎంత అర్థం లేని కవిత్వం. ఎప్పటి సినిమా పాటలు. మూడు వేలతో హనీమూన్ ఎక్కడికంటూ ఎన్ని చర్చలు. పెళ్ళికి ముందు ఎదుర్కోలులో కట్టుకోబోతున్న కాఫీ రంగు కంచి పట్టుచీర వర్ణన. రాసి కొట్టేసిన చిలిపి మాటలు. అప్పుడు చదివిన నవలల ప్రశంస. కనబోయే పిల్లల మీద బెరుగ్గా సాగిన చర్చలు. తెలుగు రాత అర్థం కావడానికి కూడా కొంచెం సమయం పడుతోంది. నాకు మాత్రం ఆ ఉత్తరాలు కృష్ణబిలం కన్నా లోతుగా, ఎంకి పాటల కన్నా మధురంగా అనిపించాయి. గంట తరవాత ఉత్తరాల కట్ట మార్చుకున్నాము. ఉత్తరాలు చదువుతూ అరవయి ఏళ్ళు దగ్గర పడుతున్న సుభద్రలో అప్పుడప్పుడు అణచిపెట్టుకున్న నవ్వు, ముంచెత్తుతున్న సిగ్గు చూస్తుంటే ఒక్కసారి గుండె పొరలో ఏదో కదిలింది. శిథిలమయిన దేవాలయం తలుపులు తీస్తే, చెక్కు చెదరని అమ్మవారి విగ్రహం కనబడినట్లు అనిపించింది నాకు. పుస్తకాలు చదవడం మొదలెట్టాం. ఒకరోజు ‘మిడ్ నైట్స్ చిల్ట్రన్’ కొంతభాగం నేను చదివాను. సుభద్ర విన్నది. మరుసటి రోజు ‘వెన్నెల్లో ఆడపిల్ల’ యండమూరి రచన సుభద్ర చదివింది. చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి దగ్గరి సుధా హోటల్లో మసాలా దోశె. మూడోరోజు ఎన్నేళ్ళుగానో పోలేకపోతున్న శర్మ ఇంటికి సాయంత్రం ఓ గంటసేపు టీకి. ఎప్ప్పుడో టీటీడీ నుంచి తెప్పించిన పోతన భాగవతం తీసి చదవడం ప్రారంభించాం ఇద్దరం. ఉదయాన్నే ఐదున్నరకల్లా లేచి ఒక అరగంట ఐ.ఎం.లో నేర్చుకున్న యోగా చేయడం, ఆ తరువాత మరో అరగంట పాటు ఏ ఆలోచనా లేని మౌనం కోసం ధ్యానంలో కూర్చోవడం. మనవళ్ల స్కూలు, పిల్లల ఆఫీసు తొందర లేకపోవడంతో, పనిమనిషిని కూడా లేట్గా రమ్మన్నాము. ఒక విధమైన నిర్వా్యపారత్వంతో చాలారోజుల నుంచి వెతుకుతున్నది, కొంచెం కొంచెం దొరుకుతున్న తృప్తి మొదలైంది. వారం రోజులు త్వరగా గడిచిపోయాయి. ఆదివారం వచ్చేసింది. పిల్లలు సాయంత్రం దిగుతారు. ఉదయాన్నే లేచి కాఫీ కూడా తాగకుండా, కాలనీ పార్కులో మౌనంగా అరగంట కూచున్నాము. శరీరాలు కొంచెం తగులుతున్నాయి. మనసులు పెనవేసుకున్నాయి. నెమ్మదిగా లేచి ఇంటికి వచ్చేశాము. పిల్లలు వచ్చేశారు. ఇల్లంతా మళ్ళా సందడి. పొద్దున స్కూలుకు తయారయ్యేవాళ్ళు, హోమ్వర్క్ మరచిపోయిన వాళ్ళు, స్కూలు బాగ్ దొరకని వాళ్ళు, బ్రేక్ఫస్ట్, లంచ్, డిన్నర్ అన్నిటికి హడావుడి.. పూర్తి బిజీ రొటీన్ మళ్ళీ మొదలయింది. మనవళ్ల బస్సు కోసం రోడ్డు మీద నిలుచోవడం, ఎన్డీటీవీలో ఊదరగొట్టే రాజకీయ చర్చలు, పాత సినిమా పాటలను కొత్త వాళ్ళతో పాడించే కార్యక్రమాలు. అప్పుడప్పుడు రాని నీళ్ళు, ఎప్పుడూ ఎగ్గొట్టే పనిమనిషి. పాత మూసలోకి క్రమంగా జారిపోతున్నాము. ఒంటరిగా ఉన్న వారం రోజులు వెనక్కి తిరిగి చూసుకుంటే, అవి ఒకసారి ఏడాది లాగా, మరోసారి ఏదో కలలాగా అనిపించడం ప్రారంభించాయి. నెలరోజుల తరువాత రెండోవాడి కొలీగ్ పెళ్ళికి పిలుపు వచ్చింది. పెళ్ళి చేసుకునే అమ్మాయి మాకు కూడా బాగా పరిచయం. ఇంటికి వచ్చి కాళ్ళకు దణ్ణం పెట్టి కార్డు ఇచ్చి రమ్మనమంటూ పిలిచింది. ఇంటిల్లిపాది బయలుదేరారు. ‘నాకెందుకో రావాలని లేదురా’ ప్రయాణానికి గంట ముందర చెప్పాను. ‘ఏం నాన్నా? ఒంట్లో బాలేదా’ ఆదుర్దాగా అడిగాడు మా రెండోవాడు. ‘ఒంట్లో బానే ఉంది. అక్కడికొచ్చి క్యూలో నిల్చుని, బఫే తినే ఇంట్రెస్టూ, రాను పోను నాలుగు గంటలు కార్లో కూచునే ఓపిక రెండూ లేవు’ నేనూ రానంటూ సుభద్ర ఉండిపోయింది. మమ్మల్ని వదిలి వాళ్లకు వెళ్లక తప్పలేదు. ఆ పైవారం బంధువుల ఇంట్లో సత్యనారాయణ వ్రతం. కుటుంబసమేతంగా వనభోజనాలు. మరో వారం బిర్లామందిర్ ప్రయాణం. అన్నీ ఆఖరి క్షణంలో మానేశాము నేను, సుభద్ర. మమ్మల్ని, మా ప్రవర్తనని, ఆలోచనలను చిన్నప్పటి నుండి ఎరిగి ఉన్న పిల్లలకు, ముఖ్యంగా కోడళ్ళకు, ఏం జరుగుతున్నదో అంతుపట్టడం లేదు. మేమేమీ కోపంగా లేము. సాధింపులు లేవు. పిల్లలతో చిరాకు పడటం లేదు. పైపెచ్చు పూర్వం కన్నా కొంచెం సంతోషంగా ఉన్నట్లు కూడా వాళ్ళకు, మాకూ తెలుస్తూనే ఉంది. ఆదివారం ఉదయం. అందరం బ్రేక్ఫస్ట్ కానించి కూర్చున్నాము. పిల్లలు ఆడుకోడానికి వెళ్లారు. పెద్దకొడుకు, కోడలు, చిన్నకొడుకు, కోడలు హాల్లో సోఫాల్లో కూర్చొని ఉన్నారు. సుభద్ర వంటింట్లో టీ పెడుతోంది. పేపరుతో బయటకు వచ్చిన నన్ను చూసి, సింగల్ సీటరు సోఫా ఖాళీ చేసి కూర్చొమన్నాడు పెద్దవాడు. ‘అమ్మా నువ్వు కూడా ఇటురా’ పిలిచాడు. టీ కప్పులు ట్రేలో పట్టుకొని వచ్చింది సుభద్ర. మా దగ్గరున్న స్వతంత్రం వల్ల, ఇంట్లో ఉండే మంచి వాతావరణం వల్ల, ఏ ఉపోద్ఘాతం, డొంక తిరుగుడు లేకుండా సూటిగా అడిగాడు పెద్దవాడు. ‘నాన్నా ఈ మధ్య మీరు ఇద్దరూ మాతో బయటికి రావడాన్ని ఎవాయిడ్ చేస్తున్నారు. ఒంట్లో బాలేదా? మనసు బాలేదా?’ ‘అదేమీ లేదురా’ మాట దాటేశాను. ‘పోనీ పిల్లలతో, పనితో బాగా అలసిపోతున్నారా? వంటకు సహాయంగా మనిషిని పెడదామంటే మీరేగా వద్దన్నారు’ ‘పనిలో ఏ ప్రాబ్లమ్ లేదురా’ ‘ఎందులోనూ ఏ ప్రాబ్లమ్ లేకపోతే మరి ఈ మార్పు ఎందుకు వచ్చింది. తాజ్మహల్ ట్రిప్ కాన్సిల్ అయినప్పటి నుంచి మీరు దేనికీ మాతో కలిసి రావట్లేదు. ఎందుకు?’ సుభద్ర, నేను మార్చి మార్చి చూసుకున్నాము. ఏమీ మాట్లాడవద్దన్నట్లు తల ఆడించింది సుభద్ర. నామటుకు నాకు, ఈ మౌనం, ముసుగులో గుద్దులాట కొనసాగితే, మనస్పర్థలు మొదలయితాయేమో అనిపించింది. ఆలోచించుకొని నెమ్మదిగా అన్నాను. ‘మేము వనస్థలిపురంలోని మన పాత ఇంట్లో ఉందామనుకుంటున్నాము. కనీసం ఓ ఆర్నెల్లు’ కొడుకులు, కోడళ్ళు అందరూ ఉలిక్కిపడ్డారు. ‘ఎందుకు నాన్నా? ఏమయింది’ చిన్నవాడి ప్రశ్న. ‘ఏమీ కాలేదు. మీరు మమ్మల్ని ఒక్కమాట అనలేదు. పిల్లలు కూడా ఏమీ నోరుజారలేదు. అంతా ఎంతో ప్రేమగా ఉంటున్నారు’ ‘మరి?’ ‘నేను చెప్పే కారణాలు కొన్ని మీకు నవ్వు తెప్పించవచ్చు. కొన్ని మీకు అర్థం కూడా కాకపోవచ్చు. మా అమ్మ చెప్పేది... రామాయణ వనవాస ఘట్టంలో దశరథుడి ఆక్రోశం అర్థం కావాలంటే పిల్లలుండాలని. అట్లాగే నేను చెప్పేవి, అనుకునేవి, మీకు అరవై, డెబ్బై ఏళ్ళు వస్తేగాని పూర్తిగా అర్థం కావు. వయసు పైబడ్డాక భార్య భర్తలకు ఏకాంతం యవ్వనంలో కన్నా ఎక్కువ అవసరం అని నా అభిప్రాయం. పెళ్ళయిన మొదటి రెండేళ్లలో ఎట్లా ఉన్నామో, ఏం మాట్లాడుకున్నామో కూడా జ్ఞాపకం లేదు నాకు. మీ చదువులు, మా అమ్మ, నాన్న, బంధువులు, రోగాలు, ప్రయాణాలు కొన్ని దశాబ్దాలు హాడావుడిగా గడిచిపోయాయి. మీ అందరి మధ్య ఎంత ప్రేమగా ఉన్నా, మేమిద్దరం నిశ్శబ్దంగా పక్కపక్కన కూర్చోవడమో, మా పెళ్లి ఆల్బమ్ చుసుకోవడమో, మాకు ఎంతో సహాయం చేసిన స్నేహితుల విషయం మాట్లాడుకోవడమో, ఇప్పుడు దాదాపు అసంభవం అయింది. కృష్ణశాస్త్రి పాటలు వింటుంటే మనవరాలు చానల్ మార్చేస్తుంది. తలత్ మెహమూద్ గజల్ చిన్నకోడలికి మలేరియా వణుకుపాట. పాత ఆల్బం టీపాయ్ మీద పెడితే పిల్లల పుస్తకాల్లో కలసిపోతుంది. ఏమీ చేయకుండా ఉండటం, చేయదలచుకున్నది మాత్రమే చేయడం, ఈ స్వతంత్రం కాస్త కావాలి అనిపిస్తోంది రా’ నా మాటలకు చిన్నకోడలు కాస్త గిల్టీగా తలదించుకుంది. ‘ఓ పదిహేను రోజులు ఎక్కడి కన్నా వెళ్ళిరండి నాన్నా!’ చిన్నవాడు సలహా ఇచ్చాడు. ‘నేను కోరుకునేది ఎక్కడికీ పోనక్కరలేని స్థిరత్వం, ప్రశాంతత. నాకు అరవై అయిదు ఏళ్ళు. మహా అయితే మరో పదిహేనేళ్ళు, ఆరోగ్యం బాగుంటే ఇరవై. మా ఇద్దరిలో ఒకరు ముందు, ఒకరు వెనక పోక తప్పదు. మా ఇద్దరిలో ఒంటరిగా మిగిలిన వాళ్ళకి మనుమలు, మనవరాళ్ళు తప్ప, ఏ జ్ఞాపకాల గుబాళింపు, ఏ మాటల మంద్రధ్వని ఆలంబనగా ఉండనక్కరలేదా? కళ్ళు మూసుకొని మీ అమ్మను తలచుకుంటే కాఫీ పెడుతూనో, పసిపిల్లకు పాలు పడుతూనో కనబడుతున్నది. ఆ రూపం తప్ప మరే రూపమూ ఎంత ప్రయత్నించినా నా కళ్ళ ముందుకు రావడం లేదు’ ఉద్యోగం చేస్తున్న పెద్దకోడలు తలదించుకొని నెమ్మదిగా అన్నది – ‘పోనీ మేమే ఎక్కడికన్నా మారిపోమా’ ‘మళ్ళా అదే మాట. మీరు మమ్మల్ని కష్టపెట్టడం లేదు. కాని మనమలు మనవరాళ్ళతో ఉండే సుఖం కన్నా కొంచెం వేరే సుఖం, శాంతి కావలసిన సమయం వచ్చిందేమో అనిపిస్తున్నది. ఏదో పొద్దున లేచి, గబగబా దీపం పెట్టి, హాడావుడిగా చేసే పూజ తప్ప, అరగంట ప్రశాంతంగా ఆత్మావలోకనం చేసుకునే తీరిక, వ్యవధి లేకుండా ఉన్నది జీవితం. తండ్రిగా, తాతగా, భర్తగా, ఉద్యోగిగా కాకుండా భగవంతుడు ఇచ్చిన జన్మకు ఒక వ్యక్తిగా నేను సాధించినదేమిటి? నన్ను, నేను ఎంతవరకు తెలుసుకున్నానన్న ప్రశ్న నన్ను ఒక్కొక్కసారి కలవరపెడుతున్నది.’ ‘అయితే వెళ్ళిపోతారా’ కూతురు లేని లోటును తీర్చిన చిన్నకోడలు ఒక్కసారి బావురుమంది. ‘అదేమిటమ్మా, ఆరునెలలు అనుకుంటున్నాము. ఉండగలమో, లేదో? మనసంతా ఇక్కడికే లాగుతుందేమో? చంటివాణ్ణి జోకోట్టకపోతే నాకు నిద్ర పట్టదేమో? ఏ అవసరం వచ్చినా చెప్పండి రెండు గంటల్లో హైటెక్ సిటీలో వచ్చివాలతాము. ఏం తినాలనిపించినా, మమ్మల్ని చూడాలనిపించినా, వెంటనే బయలుదేరి రండి. మన పూర్వులు నిర్ణయించినట్లు వానప్రస్థ ఆశ్రమాన్ని కొన్ని నెలలు అయినా వనస్థలిపురంలో గడుపుదామని మా ప్రయత్నం. భగవంతుడి దయ వల్ల మొదటి రెండు నెలలు ఈ ప్రయత్నం సఫలమయితే, తరువాతి రెండు నెలలు ఉత్తరాలు రాసుకునే వెనకటి రోజులకు పోదామనుంది. వీలయితే వాట్సప్ని ఫోను నుంచి తీసేద్దామనీ ఉంది. రోజువారీ వ్యవహారంలో మీరంతట మీరు నిర్ణయాలు తీసుకోవడం, బాగా అవసరమనుకుంటేనే మా సలహాను అడగడం మీకూ మంచిది. మాకూ మంచిది. ఎవరు చూడొచ్చారు? ప్రతిరోజు కనబడకపోతే మూడు దశాబ్దాల క్రింది నా యూరోపియన్ అనుభవాలు మీకు వినాలనిపిస్తుందేమో! మనవరాలు సంగీతం క్లాసు టయిమ్కి వాకింగ్ పెట్టుకోకుండా నేను ఇంట్లోనే ఉండి దాని ముద్దు పాటలు వింటానేమో’ ‘అహంకారమడగించి మమకారం తొలగించి చేయూతనిచ్చి మమ్ము చేరతీసుకో అన్న పాట అంతరార్థం తెలుసుకోవాలని ఉందిరా మీ నాన్నకు’ సుభద్ర వత్తాసు పలికింది. తేలికపడిన మనసుతో కుర్చీలోంచి ఉత్సాహంగా లేచాను. — బారు శ్రీనివాసరావు ఇవి చదవండి: Psychological Facts: 'తెలివైనవారి' పది అలవాట్లు ఏంటో మీకు తెలుసా! -
మేకల వల్లే కాఫీ గురించి తెలిసిందా? ఆ స్టోరీ తెలిస్తే షాకవ్వుతారు!
ఎర్లీ మార్నింగ్ కాస్త కాఫీ తాగితే ఆ ఫీలింగే వేరు. పొద్దుపొద్దునే కాఫీ గుమాళింపుతో ముక్కుపుటలకు తాకుతుంటే అబ్బా ప్రాణం లేచించింది అనిపిస్తుంది. చాలా మందికి ఇది తాగితే చాలు టిఫిన్లతో కూడా పనిలేదు. అలాంటి కాఫీ ఎలా మన దైన జీవితంలో భాగమయ్యింది?. ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు తయారు చేశారు అనే వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా!. మనం ఎంతో ఇష్టంగా తాగే కాఫీని ఎనిమిదవ శతాబ్దంలో ఆఫ్రికాలో కనిపెట్టారట. దీన్ని కనిపెట్టింది ఒక మేకల కాపరి అట. మేకల కాపరి కాఫీని తయారు చేయడమేమిటి? అనే కదా..!. ఆఫ్రికాకి చెందిన ఆ మేకల కాపరి ప్రతిరోజు మేకలను మేపుకుంటూ బయటకు వెళ్తుండేవాడు. ఒకరోజు ఎప్పటిలా మేకలను బయట మేపుకుని పొద్దుపోయాక ఇంటికి వచ్చాడు. అందులో ఓ మేకపిల్ల చాలా డల్గా ఉండేదట. అయితే మరుసటి రోజు కూడా యథాలాపంగా మేతకు వెళ్లి వచ్చిన తర్వాత చూస్తే..అదే మేకపిల్ల చురుకుగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఇక ఆ తర్వాత రోజు కూడా.. అదే మేకపిల్ల మరింత ఉత్సాహంగా గంతులు వేయడం చూసి ఏంటిదీ అని విస్తుపోతాడు. అసలు ఏం చేస్తుంది..? ఈ మేకపిల్ల. మాములుగా మేతకు వెళ్లి ఇంటికి వచ్చాక కాస్త చలాకితనం తక్కువుగా ఉంటుంది. కానీ ఈ మేకపిల్ల మొదట్లో చాలా డల్గా అయిపోయి రాను రాను ఎలా ఉత్సాహంతో ఉరకలేస్తోంది?.. అసలు ఇది ఏం తింటుంది..?, ఏం చేస్తుంది..? తెలసుకోవాలన్న ఆరాటంతో.. దాన్ని గమినించడం మొదలు పెట్టాడు. ఆ మేక అడవిలో ఉండే ఓ మొక్క గింజలను ఎక్కువుగా తినడం చూశాడు. దీన్ని తినడం వల్లే ఈ మేకపిల్ల యాక్టివ్గా ఉంటుందేమో..! అన్న అనుమానంతో ఆ మేకల కాపరి ఆ గింజలను కోసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. అతడు వాటిని పౌడర్ చేసుకుని నీటిలో కలుపుకుని తాగాడు. ఎంతో రుచిగాను, పైగా తాగాక ఏదో ఉత్సాహం ఉరకలేస్తున్నట్లు ఉండటం గమనించాడు. దీంతో ఈ విషయాన్ని గ్రామస్తులకు ఈ గింజలు చూపించి అసలు విషయం చెబుతాడు. అయితే ఎవ్వరూ ఈ గింజలను తినేందుకు మొదట్లో సాహసం చేయలేదు. అయితే అతను తాగినా ఏం కాలేదు, పైగా హుషారుగా ఉంటున్నాడు కదా! అని నెమ్మదిగా వాళ్లు కూడా తాగడం ప్రారంభిస్తారు. అలా క్రమక్రమంగా కాఫీగా తయారయ్యింది. అలా మొదలైన కాఫీ ప్రయాణం ప్రపంచ దేశాలన్నింటికీ చేరింది. ఇంతకీ ఈ మేక తిన్న గింజలు ఏంటంటే..కాఫీ బీన్స్ గింజలట. అలా మేక నుంచి కాఫీ గురించి మానవులకు తెలిసిందిట. ఆ తర్వాతా ఆ కాఫీ మన దైనందిన జీవితంలో భాగమైపోయిందట. (చదవండి: ఒలింపిక్స్లో భారత అథ్లెట్లకు దేశీ భోజనం..హయిగా పప్పు, అన్నం..!) -
మిస్టరీ: అక్కడికి ఒంటరిగా వెళ్తే తిరిగిరారా? ప్రాణాలనే కోల్పోతారా?
ప్రపంచాన్ని వణికించే ప్రదేశాల్లో ‘దార్గాస్’ ఒకటి. రష్యాలోని ‘నార్త్ ఒసీషియా– అలానియా’ రిపబ్లిక్లో గిజెల్డన్ నది సమీపంలో ఉన్న ఓ చిన్న పర్వతం మీద ఉన్న దార్గాస్ గ్రామాన్ని ‘సిటీ ఆఫ్ ది డెడ్’ అని పిలుస్తారు. దీన్ని గ్రామం అనే కంటే శ్మశానాల దిబ్బ అనడమే కరెక్ట్. అక్కడి స్థానికులు పగటి పూట కూడా ఆ పర్వతం మీదకు ఒంటరిగా వెళ్లరు. ఆ దరిదాపుల్లో ఒంటరిగా తిరగరు. రాత్రి అయితే ఆ పర్వతం వైపు చూడను కూడా చూడరు. ‘నార్త్ ఒసీషియా–అలానియా’లో అత్యధికంగా నివసించే ఒసీషియన్ గిరిజన తెగకు చెందిన చరిత్రను చెబుతుంది ఈ ప్రాంతం. మధ్యయుగం నాటి ఒసీషియన్స్.. మరణించిన తమ కుటుంబసభ్యుల మృతదేహాలను ఇక్కడ పాతిపెట్టేవారట! ఇక్కడి శిథిల నిర్మాణాలు ఇంకెన్నో భయపెట్టే కథనాలతో బెదరగొడతాయి. దార్గాస్లో 99 సమాధులు చిన్నచిన్న ఇళ్ల మాదిరి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని దగ్గరదగ్గరగా.. ఇంకొన్ని దూరం దూరంగా.. మరికొన్ని ఒకదాని వెనుక ఒకటిగా.. కనిపిస్తాయి. వాటికి ఒకవైపు సుమారు నాలుగు అంతస్తుల ఎత్తులో ఒక పొడవాటి స్థూపం కూడా ఆకట్టుకుంటుంది. దాని లోపలికి దిగడానికి పెద్దపెద్ద నిచ్చెనలు ఏటవాలుగా ఉంటాయి. ఈ నిర్మాణాలన్నీ రాళ్లతో కట్టినవే! అక్కడ సుమారు 10 వేలకుపైనే అస్థిపంజరాలు ఉన్నాయని అంచనా వేశారు పరిశోధకులు. అయితే అక్కడున్న శవపేటికలు పడవ ఆకారంలో ఉన్నాయట. చనిపోయిన వారి ఆత్మ.. నదులను దాటుకుని స్వర్గానికి వెళ్లడానికి పడవ అవసరమని అక్కడి స్థానిక పురాణాలు చెబుతాయి. ఆ సమాధుల్లో వాళ్లకు ఇష్టమైన దుస్తులు, వస్తువులను కూడా ఉంచేవారు. అయితే దార్గాస్ పర్వతం మీదకు వెళ్లినవారు తిరిగిరారనే ప్రచారం కూడా ఉంది. కొందరు సాహసవంతులు ఆ పర్వతం మీదకెక్కి, అక్కడి సమాధుల మధ్యకు వెళ్లి, ఇక తిరిగి రాలేదట! దార్గాస్లో ఏవో అతీంద్రియ శక్తులు ఉన్నాయని చెబుతుంటారు. నిజానికి అక్కడ కేవలం 99 సమాధులే ఉన్నా, పదివేలకు పైగా అస్థిపంజరాలు ఎలా వచ్చాయి? అనే ప్రశ్నకు బదులుగా ఒక విషాదగాథ వినిపిస్తుంది. 18వ శతాబ్దంలో ఒసీషియాలో ప్లేగు వ్యాపించింది. ఆ సమయంలో ఆ వ్యాధి వ్యాప్తిని అరికట్టడం కోసం.. ఈ పర్వత సమాధుల మీదున్న నిర్మాణాలను పునరుద్ధరించి.. అక్కడ ప్లేగు వ్యాధిగ్రస్తులను ఉంచేవారట. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని.. వారికి కావాల్సిన ఆహారాన్ని, వస్తువులను అందించేవారట. వ్యాధి సోకిన వారు తిరిగి ఊళ్లోకి రావడానికి లేకుండా ఎన్నో ఆంక్షలు ఉండేవట. దాంతో ఆ పర్వతం మీదే ఎంతోమంది ప్రాణాలు విడిచారు. వారి మృతదేహాలు కనీసం ఖననానికి కూడా నోచుకోకపోవడంతో మిగిలిన వ్యాధిగ్రస్తులు కుళ్లిన మృతదేహాల పక్కనే జీవిస్తూ నరకం అనుభవించారని చరిత్ర చెబుతోంది. వరుస మరణాలతో నాటి పరిస్థితి చాలా ఘోరంగా గడిచిందట. నిజానికి దార్గాస్ పరిసర ప్రాంతాల్లోని ప్రకృతి అందాలను చూడటానికి రెండు కళ్లు చాలవు. ఒక పక్క నది.. మరో పక్క ఎత్తయిన కొండలు, కొన్నిసార్లు నేలమీద దట్టంగా పేరుకున్న మంచు, మంచు కరిగినప్పుడు బయటపడే ఆకుపచ్చని గడ్డి నేల.. ఇలా కాలానికి తగ్గట్టుగా మారే దార్గాస్ ప్రకృతి ప్రేమికులను ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే ఇక్కడికి వెళ్లడానికి అందరూ సాహసించరు. కొందరు సాహసికులు మాత్రమే ఇక్కడికి Ðð ళ్లి.. ఫొటోలు, వీడియోలు తీసుకుని.. సోషల్ మీడియాలో తమ అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా రాత్రిపూట దార్గాస్ కొండల మీదకు వెళ్లేందుకు అనుమతి లేదు. మరి నిజంగానే అక్కడకి ఒంటరిగా వెళ్తే తిరిగిరారా? ప్రాణాలనే కోల్పోతారా? అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. — సంహిత నిమ్మన ఇవి చదవండి: ఎవరూ.. బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రి అది.. -
మూణ్నాళ్ల మురిపెం!ఆ సిరా గురుతు!!
కాకినాడ: ‘నీ వేలిపై సిరా చుక్క దేశ ప్రగతికి వేగు చుక్క’ అంటూ ఎన్నికల సంఘం ఓటు విలువను తెలియజేస్తుంటుంది. ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి వ్యక్తికీ ఎడమచేతి బొటన వేలిపై సిరా చుక్క పెడతారు. చేతి వేళ్లులేని దివ్యాంగులకు కాలి వేళ్లకు సిరా చుక్క పెడతారు. ఇది ఓటేశామని గుర్తు మాత్రమే కాదు. దొంగ ఓట్లను నిరోధించే ఆయుధం. ఎన్నికలలో వాడే ఇండెలిబుల్ ఇంక్ వేలిపై పెడితే 72 గంటల పాటు చెరిగిపోదు. ఈ సిరాను 1962 నుంచి కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ అండ్ వారి్నష్ కంపెనీ తయారు చేస్తోంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ కంపెనీ నుంచే సిరా సరఫరా అవుతుంది. సిరాలో 7.25 శాతం సిల్వర్ నైట్రేట్ ఉండడంతో ఎక్కువ కాలం చెరిగిపోకుండా ఉంటుంది. -
ఈవారం కథ: 'తరలి వచ్చిన వసంతం'!
ఆమె నన్ను ఎప్పటికీ క్షమించదు : రమాకాంత్ సెప్టెంబర్ 3.. 2023 సంవత్సరం.. సాయంత్రం నాలుగు గంటలు. ఆసుపత్రి నుంచి డిశ్చారై్జ నేటికి మూడోరోజు. రియల్లీ సర్ప్రైయిజింగ్. భూమ్మీద నాకింకా నూకలున్నందుకు ఆనందించాలో.. విచారించాలో తెలియడం లేదు. నాలో ఇప్పుడు ఎలాంటి ఆశలు గానీ అసంతృప్తులు గానీ లేవు. డాక్టర్ నోటి వెంట వచ్చిన ఆ మూడుముక్కలు నా చెవిన పడ్డాక మనసు తేలికైంది. ఇక ఏ గొడవా లేదు. రోజులు లెక్కపెట్టుకుంటూ కాలం గడిపేయాల్సిందే. చివరిరోజుల్లో మనిషికి.. తనకు బాగా దగ్గరైన మిత్రులు గానీ, శత్రువులు గానీ గుర్తొస్తుంటారట. అందుకనేమో నాలో ఇప్పుడీ ఆలోచనలు.. ఏభైఆరేళ్ల నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు. వందల చిత్రాల్లో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బహుభాషా చిత్రాల్లో నటించాను. అవార్డులెన్నో గెలుచుకున్నాను. పేరు, గౌరవం, డబ్బు, సెలబ్రిటీ స్టేటస్.. ఇవేవీ నాకు తెలియనివి కావు. వేషాల కోసం ప్రొడక్షన్ హౌస్ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాను. వెన్ను తట్టి ప్రోత్సహించిన వాళ్లకంటే తిరస్కరించిన వాళ్ళే ఎక్కువ. తర్వాత వాళ్ళే నా డేట్స్ కోసం నా ఇంటిచుట్టూ తిరగడం నేనెరుగుదును. దానికి నేనేం గర్వంగా ఫీలవ్వను. ఎందుకంటే ఎవరి టైమ్ ఎప్పుడొస్తుందో చెప్పలేం గదా! కానీ ప్రతినాయక పాత్రల్లో ఆదరించి నన్నో స్టార్ని చేసిన ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రం ఎప్పటికీ మరచిపోను. అందుచేత కృతజ్ఞతలు చెప్పాల్సివస్తే అది మొదట ప్రేక్షకులకే. తర్వాత సినీ రంగానికి! పరిశ్రమలోని ఎందరో ప్రముఖులు.. వారితో గల స్నేహాలూ, నైట్ పార్టీలూ నాకో కొత్త ఫిలాసఫీని పరిచయం చేశాయి. చివరకు అదే నా జీవితాన్ని తల్లకిందులు చేసింది. లోపలకు ఎవరో వచ్చినట్టున్నారు.. మంచంపై నిస్తేజంగా పడున్న నేను కళ్ళు తెరచి చూశాను. నా భార్య లత..ఆమెతో పాటు ఎవరో ఇద్దరు పరిచయస్తులు. నా అచేతనావస్థను చూసి సన్నగా వాళ్లలో గుసగుసలు.. ‘ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు? ప్చ్.. అంతా అతని కర్మ!’ ‘అతని కర్మ కాదు.. ఆమె చేసిన కర్మ!’ ‘ష్.. అవన్నీ ఇప్పుడెందుకులే..’ మాటలు ఆగిపోయాయి. లతకు ధైర్యం చెప్పి వాళ్ళ మానాన వాళ్ళు వెళ్లిపోయారు. వారి సంభాషణలో దొర్లిన ‘ఆమె’ మాత్రం ఈమె కాదు. ఆమె ఒకప్పటి నా కలల ప్రపంచం. నా జీవన మాధుర్యం. పాతికేళ్ళనాటి ఆమె జ్ఞాపకాలు ఒక్కటొక్కటిగా నాలో.. తన తమిళ చిత్రంలోని హీరోయిన్ పాత్ర కోసం నాట్యం తెలిసిన అమ్మాయి గురించి నా దర్శక మిత్రుడొకడు అన్వేషిస్తున్న కాలమది. అంతకు మునుపు రవీంద్రభారతిలో నాట్య ప్రదర్శనతో అమితంగా ఆకట్టుకున్న ఓ అమ్మాయి చప్పున గుర్తొచ్చింది. ఆమె పేరు మధురిమ. ఆమె వివరాలను కనుక్కొని అతనికి పంపించాను. ఆమె హీరోయిన్గా సెలెక్టయ్యి నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ కృతజ్ఞతాభావంతో ఓ రోజు ట్రీట్ ఇస్తానని రెస్టారెంట్కు ఆహ్వానించడంతో వెళ్లాను. ఒకే టేబుల్పై ఎదురెదురుగా కూర్చొని దగ్గరగా అలా చూడటం అదే తొలిసారి. విరిసిన మందారంలా.. స్వచ్ఛంగా.. ముగ్ధమనోహరంగా ఉందామె. ‘చెప్పండి.. ఏం తీసుకుంటారు?’ తేనెలొలుకుతున్నట్టు మధురంగా వినిపించిందామె గొంతు. ‘ఏదైనా చెప్పండి.. నో ప్రాబ్లెమ్’ అన్నాను. ‘ఐతే.. నాకిష్టమైనవన్నీ చెప్పేస్తా. ఫర్వాలేదా?’ అంది. సమ్మోహనమైన ఆమె నవ్వు నాలోని సీరియస్నెస్ను బద్దలు కొట్టింది. నవ్వాను తొలిసారి మనసు నిండుగా. ఆర్డర్ చేసినవి వచ్చాయి. తింటున్నంతసేపూ వసపిట్టలా మాట్లాడుతూనే ఉందామె. సొట్టబుగ్గల నడుమ ఆమె నవ్వు ముత్యాలహారంలా తళుక్కుమంటోంది. కలువకళ్ళ ఆమె ఓరచూపు ఆయస్కాంతంలా ఆకర్షిస్తూనే ఉంది. ఆమెతో గడిపిన ప్రతీక్షణం.. అద్భుత ఊహాలోకంలో హాయిగా విహరిస్తోన్న ఆనందపరవశం. ప్రేమిస్తున్నానని చెప్పేశాను ఒకరోజు ఆమోదించిందామె. ప్రపంచానికి చక్రవర్తినైనంత సంబరం నాలో! ఫోన్ కబుర్లూ.. షికార్లూ.. లాంగ్డ్రైవ్ల ద్వారా ఒకరి సాన్నిహిత్యాన్ని ఒకరం ఇష్టపడేవాళ్ళం. అప్పటికే పరిశ్రమలో మాపై రకరకాల కథనాలు ఇద్దరి ఇళ్ల వరకూ పాకాయి. అభ్యంతరాలేవి ఎటువైపు నుంచీ లేవు. కానీ ఆమెకు నామీద ఒకే ఒక్క విషయంపై అభ్యంతరమో.. ఆగ్రహమోగానీ తీవ్రంగా ఉండేది. ఎన్నోసార్లు దాన్ని బహిరంగంగా ప్రదర్శించింది. నన్ను మార్చాలని చూసింది. సున్నితంగా హెచ్చరించింది. మగాణ్ణి కదా.. అహం. గ్రహించలేకపోయాను. ఆ రోజు కార్తీక పౌర్ణమి. తన పుట్టిన రోజు. టెర్రస్ నుంచి విశాఖసాగర తీరం ఉరకలేస్తూ కనిపించసాగింది. పండు వెన్నెల వెలుగుల్లో ఇసుక తిన్నెలు బంగారు వర్ణంతో మెరుస్తున్నాయి. వీటన్నిటి సమక్షంలో తన పుట్టినరోజు వేడుక ఒక మధుర స్మృతిలా జరుపుకోవాలనేది మధు చిరకాల కోరిక. అది నెరవేరేసరికి రాత్రి తొమ్మిదయ్యింది. టేబుల్పై డిన్నర్ ఐటమ్స్ వున్నాయి. ‘మధూ.. ఇక భోంచేద్దామా’ అదుపు తప్పి తడబడిన మాటకు నా వైపు దూరం నుంచి సీరియస్గా చూసిందామె. ‘ఆకలిగా లేదు. నువ్వు భోంచెయ్’ అయిష్టంగానే అంది. ‘ఏం..ఎందుకని?’ ‘తినాలని లేదు’ ముఖంలోని గాంభీర్యం గొంతులో చేరి కఠినంగా వినిపించింది. ‘పోనీ.. నేను తినిపించనా?’ ‘ఎందుకు? నీ నోటి నుంచి వచ్చే వాసన భరించి తినడం కన్నా ఖాళీ కడుపుతో పడుకోవడం బెటర్.’ విసిరిన ఈటెలా వచ్చిపడిన ఆమె సమాధానానికి మత్తు దిగిపోయింది. కిందకు వెళ్లి సాయంత్రం నేను చేసిన ఘనకార్యమేమిటో గుర్తొచ్చింది. ‘సారీ మధు..’ అన్నాను. ‘మందు మానేస్తానని చేసిన ప్రామిస్ చేసిన సంగతి గుర్తుందా?’ ఆవేశంగా అంది. ‘ఉంది..కానీ ఈరోజు నీ పుట్టిన రోజు కదా అని..’ నసిగాను. ‘నీకెన్నిసార్లు చెప్పాలి.. డ్రంకర్డ్స్ అంటే నాకసహ్యమని! ఐనా నువ్వు మారడంలేదు. మారతావనే నమ్మకం కూడా లేదు. నీలాంటివాణ్ణి ప్రేమించినందుకు సిగ్గు పడుతున్నా.’ కళ్ళల్లో చేరిన సన్నటి కన్నీటిపొరను మునివేళ్ళతో తుడుచుకుంటూ అంది. ‘మధూ.. ఈ ఒక్కసారికి నమ్ము.. ప్లీజ్’ చిన్న పిల్లాడిలా అభ్యర్థించాను. ‘లేదు రమా.. ఈ రోజునుంచి మందు మానేస్తానని ఇదే లాస్ట్ ప్రామిస్ అని చెప్పి మరీ ఈ పని చేశావంటే నిన్నెలా నమ్మేది? ఇదిగో.. నువ్విచ్చిన గొలుసు. నాకవసరం లేదు. గుడ్ బై!’ గొలుసును నా చేతిలో పెట్టి రూమ్లోకి వెళ్లి తలుపేసుకుంది. ఎంతసేపు పిల్చినా.. బతిమాలినా స్పందన లేదు. ఉండుండి వినిపిస్తోన్న ఆమె ఏడుపు తప్ప! ఉదయాన్నే రూమ్ ఖాళీ చేసి నాకంటే ముందు వెళ్ళిపోయింది. ఇక అప్పటినుంచి నన్ను కలవడానికి గానీ, మాట్లాడానికి గానీ ఇష్టపడలేదు. సెట్లో కనిపించినా ‘మనిద్దరి ఆలోచనలు వేరు. మనస్తత్వాలు వేరు. అవి కలవవు. మరిచిపో నన్ను’ అని కటువుగా చెప్పేసి దూరం పెట్టేసింది. నిర్వీర్యుడినయ్యాను. నాలో సగభాగం తెగిపడినట్టుగా కుంగిపోయాను. నిజమే. తప్పు నాదే. తన ఇష్టాయిష్టాలను ఏమాత్రం పట్టించుకోని అబ్బాయిని ఏ అమ్మాయైనా ఎందుకు ఇష్టపడాలి? డిప్రెషన్లో కూరుకుపోయాను. పెళ్ళయితే నాలో మార్పు వస్తుందని భావించిన అమ్మ పెళ్లి చేసుకోమంది. ఆమె సంతోషం కోసం పెళ్లి చేసుకున్నాను. మూడేళ్లకు నాకో కొడుకు. మధురిమ గురించిన సమాచారం పత్రికల ద్వారా కొన్నాళ్లకు తెలిసింది. హీరో అభిజిత్ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనీ.. అతని భార్యగా జూబ్లీహిల్స్లోని ఖరీదైన భవంతిలో మహారాణిలా ఉంటోందని! విన్నాక నాకేం బాధనిపించలేదు. తనపై కోపం కూడా రాలేదు. జీవితం తనది.. దాన్ని ఎప్పుడు ఎవరితో ఎలా పంచుకోవాలో నిర్ణయించుకునే హక్కు ఆమెది. తనేం చిన్నపిల్ల కాదు గదా. కానీ ఎంతో ఇష్టంగా ప్రేమించిన మధురిమ జ్ఞాపకాల్ని ఎన్నాళ్ళైనా వదులుకోలేక పోయాను. ఆమెతో పంచుకున్న ప్రేమకబుర్లు చేసే గాయాల నుంచి తప్పించుకోలేకపోయాను. అదే నా పొరపాటు. నటనలో ఏకాగ్రత పోయింది. షూటింగ్లకు గైర్హాజరయ్యేవాడిని. రోజులు కాదు.. నెలలు. కొత్త తరంతో పోటీలో వెనకబడి పోయాను. అవకాశాలు కరువైపోయాయి. పార్టీలు ఎక్కువయ్యాయి. తాగుడికి బానిసనైపోయాను. భరించలేక మంచం పట్టి చనిపోయింది అమ్మ. లివరు పూర్తిగా, కిడ్నీలు పాక్షికంగా దెబ్బతిన్నాయని నేనిక బతకడం కష్టమని డాక్టర్లు తేల్చేశారు. వారంరోజుల చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు. అందరూ వచ్చి చూసి పోతున్నారు. చనిపోయేలోగా మధునొకసారి చూడాలనీ వీలైతే మాట్లాడాలనీ ఎక్కడో మనసు మూలల్లో కోరిక ప్రబలంగా ఉంది. ఐనా నా పిచ్చి గానీ తనిక్కడికి వస్తుందా.. మనసారా మాట్లాడుతుందా.. ఇది జరిగే పనేనా? నా భార్య లత చాలా మంచిది. నా గురించి, మధురిమతో నాకున్న ఎఫైర్ గురించి తెలిసే పెళ్ళికి సిద్ధపడింది. ఎప్పటికైనా ఈ వ్యసనం నుంచి బయటపడి మారతాననేది ఆమె నమ్మకం. వమ్ము కావడానికి ఎంతో కాలం పట్టలేదు. ఐనా సరే.. నన్నామె ఏనాడూ తక్కువగా చూడలేదు. నా అభిమానిగా అదామె గొప్పతనం. అందుకు సదా ఆమెకు రుణపడి వుంటాను. స్వతహాగా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆ సంపాదనతోనే కుటుంబ బాధ్యతను తన నెత్తికెత్తుకుంది. కొడుకును చదివించింది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో దర్శకత్వ శిక్షణ నిప్పించింది. వాడి ప్రయత్నాలేవో సాగుతున్నాయి. ఎప్పటికైనా వాడిని దర్శకుడిగా చూడాలనేది మా ఇద్దరి కల. అది ఎప్పటికి నెరవేరుతుందో.. మా ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో, నా ప్రాణం ఎంతవరకు నిలుస్తుందో కాలమే సమాధానం చెప్పాలి. నిజాయితీ లోపించిన ప్రేమ ఎప్పటికీ సఫలం కాదు : మధురిమ సెప్టెంబర్ 20.. 2023 సంవత్సరం.. ఉదయం పన్నెండు గంటలు.. ‘హలో మధూ..’ ‘చెప్పండి..’ ‘నీకీ విషయం తెల్సా ..’ ‘ఏంటి?’ ‘రమాకాంత్ చనిపోయాడట..’ ‘ఈజ్ ఇట్ ట్రూ?’ ‘యస్.’ ‘ఎప్పుడు?’ ‘నిన్న సాయంత్రం నాలుగు గంటలకు.. వాళ్లింట్లోనే..’ ‘మై గాడ్.. ఎంత ఘోరం..’ ‘కంట్రోల్.. ఐ కెన్ అండర్ స్టాండ్ యువర్ పెయిన్. ఎంతైనా నీ మాజీ లవర్ కదా!’ ఎప్పటిలాగే సూదుల్లా గుచ్చే అతని మాటలు. బాధనిపించలేదు. నాకివి మామూలే. ‘అంతేకాదు. ఒకప్పుడతను మన కోస్టార్. అది మరిచిపోకు. మనసు రాయి చేసుకుని ఉండలేం కదా నీలాగ!’ నావైపు కౌంటర్ ఇచ్చి ఫోన్ పెట్టేశాను. టీవీ ఆన్ చేశాను. రమాకాంత్ మరణవార్త ప్రసారమవుతోంది. కృష్ణానగర్లోని అతనింట్లో ఫ్రీజర్లో ఎముకల పోగులా అతని శరీరం.. చుట్టూ అతని బంధుమిత్రులు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎలా ఉండేవాడు రమాకాంత్.. ఆరడుగుల ఎత్తుతో బలిష్టమైన దేహం.. చురుకైన కళ్ళతో.. ఎలాంటి పాత్రనైనా కొట్టి పిండి చేయగల సత్తాతో! అతని వెరైటీ విలనిజానికి ప్రత్యేక అభిమానవర్గం ఉండేది. సినిమాల్లో ఎంత క్రూరంగా ఉంటాడో బయట అంత సౌమ్యుడు. శత్రువుకైనా సాయం చేసే మనస్తత్వం! చిన్నప్పటినుంచి నాకు డాన్ ్స అంటే పిచ్చి. ఆ ఇష్టంతోనే ఐదేళ్లు కష్టపడి కూచిపూడి నేర్చుకుని ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాను. ఒక డాన్స్ ప్రోగ్రామ్లో నన్ను చూసిన రమాకాంత్ ఓ తమిళ సినిమాలో హీరోయిన్ పాత్రకోసం సంప్రదించారు. అమ్మకు ఇష్టంలేకపోయినా నా బలవంతమ్మీద సరేనంది. ఆ సినిమా సక్సెసయ్యి సుమారు పాతిక సినిమాల్లో నటించాను. రమాకాంత్తో ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఎక్కడకు వెళ్లాలన్నా ఏ ఫంక్షన్కు హాజరవ్వాలన్నా కలిసి వెళ్లి.. కలిసే వచ్చేవాళ్ళం. ఆ చనువును ఎప్పుడూ ఆసరగా లేదు. అమ్మకూ అతనంటే అభిమానమే. అందుకే అతన్ని పెళ్లిచేసుకునేందుకు సిద్ధపడ్డాను. కానీ అతనికి ఒకే ఒక బలహీనత ఆల్కహాల్. ఏమాత్రం ఖాళీ దొరికినా స్నేహితులతో మందు పార్టీకే తొలి ప్రాధాన్యత. మానెయ్యమని ఎన్నోసార్లు చెప్పాను. బతిమాలాను. ‘పరిశ్రమలో మనుగడ సాగించాలంటే అందరితో టచ్లో ఉండాలి. కలిసి మెలిసి తిరగాలి. కనుక పార్టీలు తప్పవు’ అనే ఒక విచిత్రవాదనను వినిపించేవాడెప్పుడూ. ‘అదే నిజమైతే సినిమాలు మానేయ్. సంపాదించిన దాంతో ఏదైనా బిజినెస్ మొదలుపెట్టు. జీవితాంతం నేన్నీకు తోడుంటాను’ అని చాలాసార్లు హామీ నిచ్చాను. అతను పట్టించుకోలేదు. అమ్మ బెంగాలీ. నాన్నది ఇక్కడే. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. డాడీకున్న తాగుడు వ్యసనం వలన అమ్మ ఎంత బాధ పడిందో.. ఎన్ని ఇబ్బందులు.. అవమానాలు ఎదుర్కొందో నాకు తెలుసు. అందుకే తాగేవాళ్లంటే భయం. అసహ్యం. మందు మానేస్తానని ఎన్నోసార్లు రమాకాంత్ మాటిచ్చాడు. కానీ కట్టుబడిలేడు. అందుకే అతన్ని పూర్తిగా నమ్మలేకపోయాను. ఎక్కడైనా నమ్మకమూ, ప్రేమా ఉన్నచోటే గదా అభిమానం, ఆరాధన ఉండేవి. వాళ్ళమ్మ కూడా ఈ విషయంలో చేసేదేంలేదని చేతులెత్తేసింది. నా మనసు విరిగిపోయింది. నా నిర్ణయాన్ని అతనితో కరాఖండీగా చెప్పేశాను అదీ నా పుట్టిన రోజునాడే. అలా చెప్పడానికి నాలో నేనెంత వేదన పడ్డానో! మరచిపోవడం అతనికే కాదు. నాకూ కష్టమే! కానీ తప్పదు. నేను చాలా ప్రాక్టికల్. ప్రేమ పేరిట భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేంత పిచ్చితనం నాలో లేదు. ఆ తర్వాత అతను ఇల్లు ఎక్కడికో మార్చాడట. అదెక్కడో కూడా నాకు తెలియదు. కొన్నాళ్లకు హీరో అభిజిత్ లవ్ ప్రపోజల్ తెచ్చాడు.అతన్ని పెళ్లి చేసుకున్నాను. మరో ఏడాదికి అబ్బాయి పుట్టాడు. వాడిప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్నాడు. నా భర్త చెడ్డవాడు కాదు. అలాగని మంచివాడూ కాదు. అతనొక మగాడు. అంతే! రమాకాంత్తో నా ప్రేమవ్యవహారాన్ని ముల్లులా గుచ్చుతూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు.. అమ్మాయిలతో అతనికిగల సంబంధాల్ని ప్రశ్నించినపుడల్లా! రమాకాంత్ పూర్తిగా మద్యానికి బానిసయ్యాడనీ, భార్య సంపాదనతోనే ఇల్లు నడుస్తోందని తెల్సి చాలా బాధపడ్డాను. చేయి దాటిన పరిస్థితిని ఎవరు మాత్రం చక్కదిద్దగలరు? కేవలం సానుభూతి చూపించడం తప్ప. అతనలా మారడానికి కారణం నేనేనని ఎక్కడెక్కడో విని ఎన్నో రోజులు కుమిలిపోయాను. అతనికా వ్యసనం నా మూలంగా అబ్బలేదు. దాన్ని నేను ప్రోత్సహించనూ లేదు. అలాంటపుడు నన్నెలా నిందిస్తారు? మనుషులు గానీ, బంధాలు గానీ దక్కనపుడు కలిగే దుఃఖాన్ని భరించగలిగే మానసిక స్థితి లేదని తెలిసినపుడు మనిషి ఎంత జాగ్రత్తగా ఉండాలి? సంబంధాల్ని ఎంత సున్నితంగా నెరపగలగాలి? ఒక పక్క భర్త ప్రవర్తనకూ మరోపక్క లోకం అపవాదుకూ మధ్యన నలిగిపోతూ ఎన్నో నిద్రలేని రాత్రుళ్ళు గడిపాను. ఆ మానసిక ఒత్తిడి నుంచి త్వరగా బయటపడి నగరంలోని ఒక రిచెస్ట్ ఏరియాలో డాన్ ్స స్కూల్ పెట్టాను. డాన్స్ చేస్తూ.. చూస్తూ.. నేర్పిస్తూ.. ఏళ్లుగా కోల్పోయిన నన్ను నేను అక్కడ పొందుతున్నాను. వారం క్రితం మేమిద్దరం నటించిన తొలి చిత్రాన్ని పాతికేళ్ళు నిండిన సందర్బంగా రీరిలీజ్ చేశారు. ఐమాక్స్ థియేటర్లో మళ్ళీ ఆ సినిమా చూసి నాటిæ షూటింగ్ అనుభూతుల్ని.. మధురస్మృతుల్ని ప్రెస్ మీట్ పెట్టి అందరం పంచుకున్నాం. మెయిన్ విలన్ ఒక్క రమాకాంత్ తప్ప. అతను తీవ్ర అనారోగ్యంతో బయటకురాలేని స్థితిలో ఉన్నాడనీ.. తెలిసి హృదయం ద్రవించింది. అతని చిరునామా ఎలాగోలా తెలుసుకొని చూసి రావాలనిపించింది. అంతలోనే హఠాత్తుగా ఈరోజు మరణ వార్త.. ‘రమాకాంత్ సర్ వాళ్లింటి దగ్గరకు వచ్చేశామమ్మా..’ డ్రైవర్ అన్నమాటతో ఈ లోకంలోకి వచ్చాను. కారు దిగి చుట్టూ చూశాను. జనంతో రద్దీగా వుంది. అభిజిత్కు కాల్ చేశాను. రమాకాంత్ చివరిచూపు కోసం వెళ్తున్నానీ.. రావడం లేటవుతుందనీ చెప్పి కాల్ కట్ చేశాను. లేకపోతే అటు నుంచి ఏం జవాబొస్తుందో నాకు తెలుసు. అది వినడం ఇష్టం లేదు. జనాల్ని తప్పించుకుంటూ లోపలకు నడిచాను. ఇంటి బయట టెంట్ వేసి ఉంది. రమాకాంత్ అంతిమ సంస్కారం పూర్తయినట్టుంది. బాధనిపించింది. గది మూలన అతని ఫొటో, దాని కింద దీపం వెలుగుతూ ఉంది. లీలగా వినిపిస్తోన్న బంధువుల రోదనలు తప్ప ఇల్లంతా ప్రశాంతం. నన్ను చూడగానే వచ్చారా అన్నట్టుగా చూసిందతని భార్య. బాగా తెలిసినవాడిలా కుర్రాడొకడు నన్ను లోపలకు తీసుకెళ్ళాడు. విశాలమైన రూమ్లో.. షెల్ఫ్లో షీల్డులూ, ఫొటోలూ, సన్మాన పత్రాల మెమెంటోలూ, కొన్ని పెయింటింగ్స్ కొలువుదీరి ఉన్నాయి. మరోపక్క నా బస్ట్ సైజ్ రూపం వాటర్ పెయింట్ ఒకటి గోడపై ఉంది. పుట్టిన రోజున నేను తిరిగిచ్చిన గోల్డ్ చైన్ పూదండలా దానిపై వేలాడుతోంది. ‘అదృష్టం ఒక్కసారే తలుపు తడుపుతుంది. దురదృష్టం తలుపు తీసేవరకూ తడుతూనే ఉంటుందట. ఆ అదృష్టం నేను చేజార్చుకున్న నీ సాహచర్యం. దురదృష్టం నన్ను కౌగిలించుకున్న ఈ వ్యసనం. మధూ.. క్షమించానని ఒక్క మాట చెప్పవూ..’ అని పెయింటింగ్ కింద రాసి ఉంది. చదివేసరికి గుండెను పిండేసినట్టయింది. కనుకొలకుల్లో నీళ్లు. ‘స్వఛ్చమైన, నిర్మోహమైన ప్రేమ కోసం జీవితపర్యంతం పరితపించి ప్రాణాలొదిలిన ప్రియ సఖుడా.. ఇదే నా కన్నీటి నివాళి. మనస్ఫూర్తిగా మన్నించా! వెళ్లి రా.. ప్రియనేస్తమా.. వేచి ఉంటా.. మరుజన్మలో నీ కోసం!’ నా మనసు ఆర్తిగా రోదించింది. ‘డాడీ ఎప్పుడూ మీ గురించే చెప్తుండే వారండీ.. యు ఆర్ ఏ వండర్ఫుల్ యాక్ట్రెస్ అంటూ!’ అన్నాడా కుర్రాడు. ఆ కుర్రాడెవరో అప్పుడర్థమైంది. కళ్ళు తుడుచుకొని నిశితంగా అతన్ని చూశాను. యుక్త వయసు రమాకాంత్ కనిపించాడు. పేరు హరీష్ అని చెప్పాడు. అతనితో చాలాసేపు మాట్లాడాను. మూగగా ఏడుస్తున్న రమాకాంత్ భార్య దగ్గరకు వెళ్లాను. ‘చనిపోయారనే వార్త ఈరోజు ఉదయమే తెల్సింది. అసలు రమాకాంత్ పరిస్థితి విషమంగా ఉందని ఈ మధ్యే విన్నాను. వద్దామని అనుకునేలోపే ఇలా.. ఆఖరికి చివరిచూపు కూడా దక్కలేదు’ వేదనగా అన్నాను. నా వైపే నిశ్చలంగా చూస్తూ వింటోందామె. ‘ఆయన ఉన్నప్పుడు కలిసుంటే బావుండేదండీ’ ముక్తసరిగా అందామె. కళ్లు దించుకున్నాను. ఇద్దరి మధ్యా కాసేపు నిశ్శబ్దం. తర్వాత ఆమెతో మాట్లాడాను. ఈలోపు కాఫీ తెచ్చిచ్చాడు హరీష్. తాగడం మొదలుపెట్టాను. ‘హరీష్.. నీకో గుడ్ న్యూస్. ఇందాకే మేడమ్ చెప్పారు’ అందామె. తెలుసన్నట్టు చిన్నగా నవ్వాడతను. తల్లీ కొడుకుల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. ఆ వెలుగు నాలో కూడా కొంత ప్రసరించింది. స్తబ్ధత, నైరాశ్యం ఒక్కసారిగా మాయమై రీలీఫ్గా అనిపించింది. లేచి నిలబడ్డాను. ‘రేపు ఆఫీస్లోనే ఉంటాను. హరీష్ను పంపించండి. అతనిదే ఆలస్యం. మా బ్యానర్లోనే.. నేనే ప్రొడ్యూసర్ని. అతన్ని దర్శకుణ్ణి చేసే బాధ్యత నాది. సరేనా?’ అన్నాను.. అంతకుముందు ఇద్దరితో చెప్పిన మాటను మళ్లీ ఒక్కసారి నిర్ధారిస్తున్నట్టుగా. ఆమె నా రెండు చేతుల్ని తన గుప్పిట్లోకి తీసుకొని కళ్ళకు అద్దుకుంటూ ‘థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్’ అంది.. ఆమె గొంతు సన్నగా వణికింది. కారెక్కి కూర్చొని చూస్తే ఆమె చెంపల పైనే కాదు నా రెండు చేతుల పైన కూడా ఆమె కన్నీటి బొట్లే! ఇవి చదవండి: నిజాలతో నిమిత్తం లేని.. 'అదొక అబద్ధాల అట్టహాసం'! -
మిస్టరీ: 'డోంట్ టచ్’ అనే హెచ్చరికతో.. 'చెచెన్, చాకా' ట్రీస్
'మధ్య అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే ప్రతి చెచెన్ చెట్టుకు ‘డోంట్ టచ్’ అనే హెచ్చరిక బోర్డ్ మీద డేంజర్ బొమ్మ గీసి మరీ ఉంటుంది. అవును ఆ చెట్టు బెరడు తాకితే.. భయంకరమైన దద్దుర్లు వస్తాయి. తట్టుకోలేనంత దురద పుడుతుంది. భరించలేనంత మంట వస్తుంది. దాని బెరడు నుంచి నల్లటి జిగురు పొంగుతుంది. కొన్నేళ్లక్రితమే ఆ చెట్టుపై ఎన్నో ప్రయోగాలు జరిపి.. అది విషపూరితమని, పట్టుకుంటే ప్రమాదమని నిపుణులు తేల్చేశారు. అందుకే ఆ చెట్టుకు ‘బ్లాక్ పాయిజన్ వుడ్ ట్రీ’ అని పేరు పెట్టారు. కొన్నిసార్లు ఆ చెట్టు సమీపంలో తిరిగితే.. దద్దుర్లు వచ్చేవరకు తెలియదట ఆ చెట్టును మనం తాకామన్న సంగతి'. అయితే విచిత్రమేమిటంటే.. ఆ చెట్టుకు పక్కనే లేదా సమీపంలో ‘చాకా’ అనే మరో చెట్టూ కచ్చితంగా పెరుగుతుంది. చెచెన్ చేసిన గాయాలకు.. చాకా చెట్టు బెరడు విరుగుడుగా పనిచేస్తుంది. దద్దుర్లు రాగానే.. చాకా బెరడును కత్తిరించి.. దాని నుంచి వచ్చే జిగురును దద్దుర్లొచ్చిన చోట రాయాలి. బాడీ లోపలి నుంచి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే.. ఈ చాకా బెరడుతో టీ పెట్టుకుని తాగొచ్చు. చెచెన్ ట్రీ బెరడు తగిలిన వెంటనే చాకా ట్రీ బెరడును ఔషధంలా ఉపయోగించకపోతే.. వైద్యుల్ని సంప్రదించాల్సిందే. అయితే ఒక ప్రమాదం, దానికి పరిష్కారం రెండూ ఒకేచోట పుట్టిపెరగడం విశేషం. నిజానికి ఈ చెచెన్ – చాకా ట్రీస్ పుట్టుక వెనుక పెద్ద చరిత్రే ఉంది. కొన్ని వందల ఏళ్లక్రితం ఆగ్నేయ మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పంలో ముగిసిన ఓ విషాద ప్రేమగాథే ఈ చెట్ల వెనుకున్న పురాణం. మాయన్ యోధులైన ఇద్దరు అన్నదమ్ముల కథ ఇది. టిజిక్, కినిచ్ అనే సోదరులు.. గొప్ప యుద్ధవీరులు.. ఆ రాజ్యానికి యువరాజులు కూడా. అయితే కినిచ్ దయా హృదయంతో, మంచివాడిగా ఉండేవాడు. ప్రేమతో, నిస్వార్థంగా జీవించేవాడు. అందరినీ ఆదరించేవాడు. పేదలకు, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసేవాడు. చెచెన్ చెట్టు, పక్కపక్కనే ఉన్న చెచెన్, చాకా చెట్లు కానీ అతని సోదరుడు టిజిక్ మాత్రం.. కోపంతో, ఆవేశంతో నిత్యం అసహనంతో జీవించేవాడు. అందరి పట్ల అమర్యాదగా ప్రవర్తించేవాడు. అహంకారం ప్రదర్శించేవాడు. ఒకరోజు కినిచ్, టిజిక్లు రాజ్యపర్యటనలో ఉండగా.. ‘నిక్టే హా’ అనే అందమైన అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నారట. ‘ఆమె నాకు సొంతమంటే నాకు సొంతం’ అని అన్నదమ్ములిద్దరూ వాదులాటకు దిగారు. అది కాస్తా గొడవకు దారితీసి.. యుద్ధానికి సిద్ధమయ్యారు. చివరికి నిక్టే కళ్లముందే.. ఇద్దరు అన్నదమ్ములు యుద్ధానికి తెగబడ్డారట. కొన్నిరోజుల పాటు జరిగిన ఆ భయంకర యుద్ధంలో.. నల్లటి మేఘాలు ఆకాశాన్ని కమ్మేసిన ఒకనాడు.. సోదరులిద్దరూ ఒకరి చేతుల్లో ఒకరు చనిపోయారు. తనను ప్రేమించిన ఇద్దరు మహాయోధులు చనిపోయారన్న బెంగతో నిక్టే కూడా మరణించింది. మరణానంతరం స్వర్గానికి వెళ్లిన ఇద్దరు సోదరులూ.. దైవాన్ని క్షమాపణ కోరి, మళ్లీ పుట్టించమని కోరుకున్నారు. అనుగ్రహించిన దేవతలు వారికి పునర్జన్మను ప్రసాదించారు. టిజిక్.. చెచెన్ చెట్టులా.. కినిచ్.. చాకా చెట్టుగా తిరిగి జన్మించారు. అప్పుడే వారికి సమీపంలోనే నిక్టేహా అందమైన తెల్లటి పువ్వులా జన్మించిందట. నిజానికి టిజిక్ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా.. చెచెన్ చెట్టు విషాన్ని చిమ్మితే.. దాన్ని సరిచేసే ఔషధంలా కినిచ్.. చాకాలా ప్రేమను పంచుతున్నాడట. అందుకే ఈ పురాణగాథలో చెప్పినట్లే.. అన్నదమ్ములిద్దరూ ఆ చెట్ల రూపంలో ఎక్కడ పుట్టినా కలసే పుడతారట. వారి సమీపంలో నిక్టే కూడా అందమైన పువ్వు రూపంలో జన్మిస్తుందని నమ్ముతారు. ఏదేమైనా.. చెచెన్, చాకా చెట్ల జన్మరహస్యం నేటికీ ఓ మిస్టరీనే. ఈ సృష్టిలో అద్భుతమే. — సంహిత నిమ్మన -
భగీరథ యమధర్మరాజ సంవాదం
పూర్వం భగీరథ చక్రవర్తి సమస్త భూమండలాన్ని పరిపాలిస్తుండేవాడు. ధర్మాత్ముడు, పరాక్రమవంతుడు అయిన భగీరథుడు నిత్యం తన రాజ్యంలో యజ్ఞయాగాది క్రతువులను జరిపించేవాడు. ఆయన రాజ్యం సర్వసుభిక్షంగా ఉండేది. రాజ్యంలోని ప్రజలెవరూ ధర్మం తప్పేవారు కాదు. భగీరథుడి కీర్తిప్రతిష్ఠలు ముల్లోకాలకూ వ్యాపించాయి. భగీరథుడి కీర్తిప్రతిష్ఠలు విని యమధర్మరాజు ఒకసారి ఆయనను స్వయంగా కలుసుకోవాలనుకున్నాడు. ఒకనాడు యమధర్మరాజు భగీరథుడి వద్దకు వచ్చాడు. భగీరథుడు ఎదురేగి యమధర్మరాజుకు స్వాగతం పలికాడు. ఘనంగా అతిథి సత్కారాలు చేశాడు. భగీరథుడి సేవలకు యమధర్మరాజు సంతృప్తి చెందాడు. ‘భగీరథా! నువ్వు చాలా ధర్మాత్ముడివి. నీ కీర్తి ముల్లోకాలకూ వ్యాపించింది. అది వినే నేను నిన్ను స్వయంగా కలుసుకోవాలని వచ్చాను. నీ జీవితం మానవులందరికీ ఆదర్శప్రాయం’ అని ప్రశంసించాడు. ‘సమదర్శీ! నా మీద నీ అనుగ్రహానికి ఆనందభరితుణ్ణవుతున్నాను. అయితే, నాకు కొన్ని ధర్మసందేహాలు ఉన్నాయి. సకలలోక ధర్మాధర్మ విచక్షణాదక్షుడవైన నువ్వే నా సందేహాలను తీర్చగలవు. అవేమిటంటే, ధర్మాలంటే ఏవి? ధర్మాచరణ చేసేవారికి ఎలాంటి లోకాలు ప్రాప్తిస్తాయి? దయచేసి వివరించు’ అని వినయంగా అడిగాడు భగీరథుడు. ‘ధర్మం అనేది రకరకాలుగా ఉంటుంది. ధర్మం గురించి సంపూర్ణంగా చెప్పాలంటే లక్ష సంవత్సరాలైనా సరిపోవు. అయినా నువ్వు అడిగావు కాబట్టి సూక్ష్మంగా చెబుతున్నాను విను. లోకంలో బ్రాహ్మణులకు, ఆధ్యాత్మికవేత్తలకు చేసే దానం అత్యుత్తమమైనది. స్వయంగా కూప తటాకాది జలాశయాలు తవ్వినా, ఇతరులను నియమించి తవ్వింపచేసినా వచ్చే పుణ్యఫలం అనంతం. బావులు, చెరువులు తవ్వే పనిలో స్వల్పమైన సాయం చేసినా గొప్ప పుణ్యఫలం దక్కుతుంది. ఇందుకు ఉదాహరణగా నీకు వీరభద్ర మహారాజు కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పాడు: పూర్వం గౌడదేశాన్ని వీరభద్రుడనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతడు మహాదానశీలి, ధర్మాత్ముడు, అమిత పరాక్రమవంతుడు. వీరభద్రుడి భార్య చంపకమంజరి. వీరభద్రుడు ప్రతినిత్యం యజ్ఞయాగాదులు నిర్వర్తించేవాడు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడేవాడు. వీరభద్రుడి రాజ్యంలో ప్రజలందరూ ధర్మబద్ధులై ఉండేవారు. అతడి మంత్రులందరూ విద్యావంతులు, ధర్మాధర్మ విచక్షణ కలిగిన విజ్ఞులు కావడంతో పరిపాలన సజావుగా సాగేది. వీరభద్రుడి రాజ్యం భూతలస్వర్గంగా ప్రసిద్ధి పొందింది. ఒకనాడు వీరభద్రుడు తన మంత్రులు, పరివారంతో కలసి సమీప అరణ్యానికి వేటకు బయలుదేరాడు. మధ్యాహ్నం వరకు వేట కొనసాగించారు. మధ్యాహ్నవేళ వీరభద్రుడు సహా అతడి పరివారమంతా బాగా అలసట చెందారు. అందరికీ విపరీతమైన దాహం వేయసాగింది. సమీపంలో నీటిజాడ ఎక్కడైనా కనిపిస్తుందేమోనని అందరూ వెదకసాగారు. కొంత దూరం ముందుకు వెళ్లాక కొండ మీద ఒక చెరువు కనిపించింది. అక్కడకు వెళ్లి చూశారు. చెరువులో చుక్క నీరైనా లేదు. ‘అసలు ఇంత ఎత్తులో ఎవరు ఈ చెరువు తవ్వించారు? ఇందులో నీళ్లు ఎందుకు లేవు?’ అని స్వగతంగా అన్నాడు వీరభద్రుడు. అక్కడే ఉన్న వీరభద్రుడి మంత్రి బుద్ధిసాగరుడు చెరువును మరికొంత లోతుకు తవ్వమని భటులను పురమాయించాడు. మూడడుగులు తవ్వేసరికి చెరువులోకి నీళ్లూరాయి. చెరువు కొంతవరకు నీళ్లతో నిండింది. అందరూ ఆ చెరువులో నీళ్లు తాగి సేదదీరారు. ‘మహారాజా! ఈ చెరువు వానాకాలంలోనే నిండేలా ఎవరో తవ్వించారు. మరికొంత లోతుకు తవ్విస్తే సర్వకాలాల్లోనూ ఇందులో నీళ్లు నిలిచి ఉంటాయి. బాటసారులకు దాహార్తి తీర్చేలా ఈ చెరువు మరింత లోతుకు తవ్వించేందుకు అనుమతించండి’ అన్నాడు బుద్ధిసాగరుడు. అందుకు వీరభద్రుడు సరేననడంతో మంత్రి బుద్ధిసాగరుడు దగ్గర ఉండి భటులతో చెరువును మరింత లోతుగా తవ్వించాడు. దానికి పటిష్ఠంగా రాతిగోడలు నిర్మించారు. కొంతకాలానికి ఆయుష్షుతీరి బుద్ధిసాగరుడు, వీరభద్రుడు నా లోకానికి వచ్చారు. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యాల చిట్టాను పరిశీలించి, కొండ మీద తటకాన్ని తవ్వించిన వారి మహత్కార్యాన్ని నాకు చెప్పాడు. ధర్మవిమానంలో వారు స్వర్గానికి వెళ్లడానికి అర్హులని గ్రహించి, వారిని విమానంలో స్వర్గానికి పంపాను. స్వర్గానికి బయలుదేరే ముందు వారు నన్ను కొండ మీద ఆ చెరువు చరిత్ర చెప్పమని అడిగారు. ‘పూర్వం సైకతపర్వతం మీద ఈ చెరువు ఉన్నచోట ఒక లకుముకి పిట్ట తన ముక్కుతో రెండంగుళాలు తవ్వింది. కొంతకాలానికి ఒక వరాహం అక్కడకు వచ్చి, తన ముట్టెతో రెండు మూరలు తవ్వింది. దాంతో అందులోకి అప్పుడప్పుడు కొంత నీరు చేరసాగింది. చుట్టుపక్కల వన్యప్రాణులు అందులోని నీరుతాగుతూ దాహార్తి తీర్చుకునేవి. మూడేళ్లు గడిచాక ఒక ఏనుగుల గుంపు వచ్చి, దానిని మరింత లోతుగా తవ్వడంతో చిన్న చెరువుగా మారింది. అప్పటి నుంచి ఏటా వానాకాలంలో ఆ చెరువు పూర్తిగా నీటితో నిండసాగింది. మీరు వేసవి ప్రారంభంలో వేటకు వెళ్లడం వల్ల ఆ చెరువు ఎండిపోయి కనిపించింది. అంతకు ముందు అందులోకి నీరు ఇంకి ఉండటం వల్ల కొద్ది లోతు తవ్వగానే నీరు దొరికింది. వీరభద్రా! నీ మంత్రి సూచనతో నువ్వు ఆ చెరువును మరింత లోతుగా తవ్వించి, పటిష్ఠంగా గోడ నిర్మించి, ఏడాది పొడవునా నీరు నిలిచేలా చేశావు. ఈ పనిచేసినందుకు నువ్వు, నీ మంత్రి, నీ పరివారం అభినందనీయులు’ అని చెప్పి ధర్మవిమానంలో వారిని స్వర్గానికి సాగనంపాను. ‘భగీరథా! తటాకాలను తవ్వించిన వారికి సమస్తపాపాలూ నశించి, అనంత పుణ్యఫలం లభిస్తుంది’ అని చెప్పాడు యమధర్మరాజు. భగీరథుడు ప్రణమిల్లి, అతడికి సాదరంగా వీడ్కోలు పలికాడు. ఇవి చదవండి: హెల్త్: గుటక వేయడం కష్టమవుతోందా? అయితే ఇలా చేయండి.. -
మిస్టరీ: ఓక్చా వోర్ట్మన్!
జీవితంలో అసంపూర్ణంగా ఆస్వాదించిన కొన్ని మధురక్షణాలు.. మళ్లీ తిరిగిరాని జ్ఞాపకాలుగా మిగిలిపోతుంటాయి. అలాంటప్పుడు పొంగుకొచ్చే భావోద్వేగాన్ని వర్ణించడం మహా కష్టం. ఇక ఆ తర్వాత అంతకుమించిన సంతోషాలెన్నొచ్చినా.. మనసు మాత్రం గతాన్నే నెమరువేసుకుంటుంది. కాలాన్ని వెనక్కి తీసుకెళ్లమని కోరుకుంటుంది. ‘స్టెల్లా హట్’ జీవితంలో కూడా అదే జరిగింది. ఆమె ఆలాపన, అన్వేషణ, ఆవేదన అంతా తన కన్నతల్లి కోసమే. అసలేంటా కథ? స్టెల్లా కథ.. ఓ అమెరికన్ అయిన ఆమె తండ్రి రాబర్ట్ వోర్ట్మన్ కథతోనే మొదలవుతుంది. అది 1971, జపాన్ . అప్పుడు రాబర్ట్కి 22 ఏళ్లు. తను జపాన్ లో ఎయిర్మన్ గా పనిచేసేవాడు. ఒకరోజు ఓ ప్రయాణంలో.. ఓక్చా అనే 20 ఏళ్ల కొరియన్ అమ్మాయితో పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారి.. పెళ్లి కావడానికి ఎంతో సమయం పట్టలేదు. పెళ్లి అయిన ఏడాదికే స్టెల్లా పుట్టింది. రాబర్ట్.. తన భార్య ఓక్చాను ముద్దుగా ‘సన్నీ’ అని పిలుచుకునేవాడు. కొన్ని నెలలకు జపాన్ కి చెందిన ఒక అమెరికన్ ఎయిర్ ఫోర్స్కు.. రాబర్ట్ సెలెక్ట్ అయ్యాడు. దాంతో స్టెల్లాను సన్నీ(ఓక్చా)కి అప్పగించి.. అతడు అమెరికాలోని న్యూయార్క్కు వెళ్లాల్సి వచ్చింది. మధ్యమధ్యలో వచ్చి.. భార్యాబిడ్డలతో గడిపేవాడు. తండ్రి దూరంగా ఉండటంతో.. స్టెల్లాకు తల్లితో మరింత అనుబంధం పెరిగింది. ఐస్క్రీమ్ పార్లర్లో ఉద్యోగం చేసే సన్నీ.. కూతురు స్టెల్లాను చాలా ప్రేమగా చూసుకునేది. చాలా ప్రదేశాలకు తిప్పేది. వాటన్నిటినీ తల్లి ప్రేమకు గుర్తుగా గుండెలో దాచుకుంది స్టెల్లా. కొంతకాలానికి సన్నీకి బార్లో వెయిట్రెస్ జాబ్ వచ్చింది. అది నైట్ డ్యూటీ కావడంతో.. స్టేల్లాను న్యూజెర్సీలో ఉండే రాబర్ట్ బంధువులకు అప్పగించాల్సి వచ్చింది. తనతో స్టెల్లా కూడా లేకపోవడంతో.. సన్నీకి బయట స్నేహాలు పెరిగాయి. ఇంట్లో గడిపే సమయం తగ్గి.. బయట గడిపే సమయం పెరిగిపోయింది. దాంతో ఫ్యామిలీ వెకేషన్ ్స తగ్గిపోయాయి. రాబర్ట్తో గొడవలు మొదలయ్యాయి. కాల్ చేసుకున్నా, కలుసుకున్నా.. ఆ రోజంతా గొడవలతోనే ముగిసేది. పరిస్థితి చేయిదాటిపోతుందని గుర్తించిన రాబర్ట్.. సామరస్యంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే భార్యతో ఓ ఒప్పందానికి వచ్చాడు. ‘ఇక నుంచి మనం కలసే ఉందాం.. నాతో పాటు అమెరికా వచ్చెయ్. న్యూజెర్సీ వెళ్లి స్టెల్లాతో సంతోషంగా ఉందాం’ అని కోరాడు. అందుకు సన్నీ సరే అంది. ఇద్దరూ న్యూజెర్సీలో సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు. దాంతో తన జాబ్ని న్యూయార్క్ నుంచి న్యూజెర్సీకి మార్పించుకున్నాడు రాబర్ట్. సన్నీని తీసుకెళ్లడానికి తిరిగి జపాన్ చేరుకున్నాడు. అయితే భర్త వెంట వెళ్లడానికి అభ్యంతరం చెప్పింది సన్నీ. ‘నేను ఇప్పుడే నీతో రాలేను. ఒకసారి మా కుటుంబాన్ని కలుస్తాను. వచ్చాక మనం న్యూజెర్సీ వెళ్లిపోదాం’ అని చెప్పి.. దక్షిణ కొరియాలోని సియోల్కి వెళ్లింది. కానీ తిరిగి రాలేదు. ఆమె గురించి ఎంత వెతికినా ఎలాంటి సమాచారం దొరకలేదు. ‘ఆమె అసలు పేరు ఓక్చా అని, ఆమె సొంత ఊరు దక్షిణకొరియాలోని సియోల్’ అని తప్ప.. మరే వివరాలూ రాబర్ట్కి తెలియవు. ఆ మాటకొస్తే తను వెళ్లింది సియోల్కేనో కాదో కూడా తెలియదు. ఆ తర్వాత సన్నీ ఎప్పుడూ కూతురు స్టెల్లాని కలవలేదు. కానీ.. స్టెల్లా మాత్రం తల్లి జ్ఞాపకాలతో తల్లడిల్లిపోయేది. సరిగ్గా రెండేళ్లకు.. రాబర్ట్ తల్లి ఓ ఫోన్ లిఫ్ట్ చేసింది. ‘స్టెల్లా స్టెల్లా’ అనే పిలుపుతో ఓ ఆడ గొంతును అవతలి నుంచి విన్నది. మరే మాట ఆమెకు అర్థం కాలేదు. దానికి కారణం.. రాబర్ట్ తల్లికి ఇంగ్లిష్ మాత్రమేవచ్చు. దాంతో ఫోన్ లో వినిపించిన మాటలేవీ రాబర్ట్ తల్లికి అర్థం కాలేదు. ఒక్క స్టెల్లా అనే పేరు తప్ప. అందుకే ఆ కాల్ చేసింది సన్నీయే కావచ్చు అన్న అనుమానం కలిగింది ఆ కుటుంబానికి. ఎందుకంటే.. సన్నీకి కొరియన్ మాత్రమే వచ్చు. తన తల్లి మాట్లాడే భాష అర్థంకాకే ఆ రోజు సన్నీ కాల్ కట్ చేసుంటుందనుకున్నాడు రాబర్ట్. 1985లో స్టెల్లాకు 4 గౌన్లు, ఓ కుక్కపిల్ల గిఫ్ట్గా వచ్చాయి. అయితే ప్యాకింగ్ మీద కాలిఫోర్నియా పోస్ట్ మార్క్ ఉంది. అది కచ్చితంగా తన తల్లే తనకోసం పంపించిందని ఇప్పటికీ నమ్ముతుంది స్టెల్లా. అయితే సన్నీ గురించి ఎలాంటి ఆధారం దొరకలేదు. కొన్నాళ్లకు తండ్రి రాబర్ట్.. మరో పెళ్లి చేసుకున్నాడు. అతడికి మరో పాప పుట్టింది. సవతి తల్లి కూడా స్టెల్లాను ప్రేమగా చూసుకునేది. కానీ కన్నతల్లిని చూడాలనే ఆశ.. స్టెల్లాలో చావలేదు. స్టెల్లాకు పెళ్లి అయ్యి.. ఒక బాబు కూడా పుట్టాడు. పెరిగి పెద్దవాడయ్యాడు. అయినా తన తల్లిని చూడలేకపోయానన్న వెలితి.. ఆమెను ఇప్పటికీ వెంటాడుతోంది. సన్నీ అలియాస్ ఓక్చాకి ప్రస్తుతం 73 ఏళ్లు దాటే ఉంటాయి. అసలు ప్రాణాలతో ఉందో లేదో తెలియని తల్లి కోసం స్టెల్లా మాత్రం ఇంకా అదే ఆశతో ఎదురుచూస్తోంది. మరి సన్నీ ఏమైంది? ఎందుకు చెప్పాపెట్టకుండా వాళ్ల జీవితాల్లోంచి వెళ్లిపోయింది.? ఒకవేళ మోసం చేయాలని తనకు లేకపోయినా.. అనుకోకుండా ఏదైనా ప్రమాదానికి గురైందా? అలా అయితే.. స్టెల్లా గురించి కాల్ చేసింది ఎవరు? స్టెల్లాకు గిఫ్ట్స్ పంపించింది ఎవరు?’ లాంటి ఎన్నో ప్రశ్నలకు నేటికీ సమాధానాలు లేవు. దాంతో ఓక్చా కథ ఓ మిస్టరీగా మిగిలిపోయింది. — సంహిత నిమ్మన ఇవి చదవండి: ఈ వారం కథ: శుభశకునం! 'నువ్వు చెప్పింది అక్షరాలా నిజం' -
Inspirational Stories: పృథుచక్రవర్తికి అత్రి మహర్షి అనుగ్రహం!
బ్రహ్మ మానసపుత్రుడైన అత్రి మహర్షికి కర్దమ మహర్షి కుమార్తె అనసూయతో వివాహం జరిగింది. అనసూయ భర్తను సేవించుకుంటూ ఉండేది. అత్రి మహర్షి సంసారయాత్ర కొనసాగిస్తూనే, జపతపాది విధులను యథాప్రకారం కొనసాగించేవాడు. వారి దాంపత్యాన్ని పరీక్షించడానికి ఒకసారి త్రిమూర్తులు వచ్చారు. అత్రి మహర్షి వారికి సాదరంగా స్వాగతం పలికాడు. తన ఆశ్రమంలో ఆతిథ్యం స్వీకరించాలని కోరాడు. ఆతిథ్యం స్వీకరించడానికి త్రిమూర్తులు ఒక షరతు విధించారు. తమకు భోజనం వడ్డించే స్త్రీ వివస్త్రగా ఉండాలని కోరారు. అత్రి మహర్షి ఈ సంగతిని అనసూయకు చెప్పాడు. ఆమె సమ్మతించింది. వారు స్నానం చేసి వస్తే, భోజనం వడ్డిస్తానని చెప్పింది. త్రిమూర్తులు స్నానం చేసి వచ్చి, విస్తర్ల ముందు కూర్చున్నారు. అనసూయ వారిపై మంత్రాక్షతలను చల్లింది. వారు ముగ్గురూ చంటిబిడ్డల్లా మారిపోయారు. అప్పుడు అనసూయ వివస్త్రగా మారి వారికి భోజనం వడ్డించింది. తర్వాత ఆమె వస్త్రాలు ధరించి, తిరిగి వారిపై మంత్రాక్షతలు చల్లడంతో వారు తిరిగి యథారూపాల్లోకి మారారు. అనసూయ మహిమకు చకితులైన త్రిమూర్తులు అత్రి మహర్షిని, అనసూయను ఆశీర్వదించారు. వారికి లోకోత్తరులైన ముగ్గురు కొడుకులు పుడతారని వరమిచ్చారు. త్రిమూర్తుల వరప్రభావాన అత్రి మహర్షి, అనసూయ దంపతులకు చంద్రుడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు పుత్రులుగా కలిగారు. బిడ్డలు ముగ్గురు దినదిన ప్రవర్ధమానంగా పెరగసాగారు. ఒకనాడు అత్రి మహర్షి అనసూయను పిలిచి, ‘నువ్వు కోరుకున్నట్లుగానే నీకు పుత్రులు జన్మించారు. ఇక నేను తపోజీవనాన్ని సాగించాలనుకుంటున్నాను. నువ్వు నాతో వస్తావా లేదా బిడ్డల దగ్గరే ఉంటావా?’ అని అడిగాడు. ‘స్వామీ! మన పుత్రులు ఇంకా పెద్దవాళ్లు కాలేదు. ఎదగని బిడ్డలను వదిలేసి తపోజీవనానికి వెళ్లిపోవడం ధర్మం కాదు. పుత్ర పోషణార్థం పృథు చక్రవర్తి వద్దకు వెళ్లి, ధనం తీసుకురండి. పిల్లలు పెద్దవాళ్లయ్యాక వానప్రస్థానానికి వెళ్లిపోదాం’ అని చెప్పింది. అనసూయ చెప్పిన మాటలు న్యాయంగానే తోచాయి. వెంటనే అత్రి మహర్షి ధనం కోరడానికి పృథు చక్రవర్తి వద్దకు బయలుదేరాడు. అప్పుడు పృథు చక్రవర్తి అశ్వమేధయాగం చేస్తున్నాడు. యాగం పూర్తయ్యాక యాగాశ్వాన్ని విడిచిపెట్టి, దాని సంరక్షణ కోసం పృథు చక్రవర్తి తన కొడుకును పంపుతూ, అతడికి సహాయంగా వెళ్లవలసినదిగా అత్రి మహర్షిని ప్రార్థించాడు. అత్రి మహర్షి అందుకు ‘సరే’నని సమ్మతించి, పృథు చక్రవర్తి కొడుకుతో కలసి యాగాశ్వం వెంట బయలుదేరాడు. పృథు చక్రవర్తి యాగవైభవాన్ని చూసి ఓర్వలేని ఇంద్రుడు పాషాండ వేషంలో వచ్చి, యాగాశ్వాన్ని అపహరించుకుని ఆకాశమార్గాన వెళ్లిపోయాడు. ఇది చూసి పృథు చక్రవర్తి కొడుకు నిశ్చేష్టుడయ్యాడు. యాగాశ్వాన్ని అపహించుకుపోతున్నది సాక్షాత్తు దేవేంద్రుడని గుర్తించడంతో అతడిపై బాణం వేసేందుకు సంశయించాడు. అప్పుడు అత్రి మహర్షి, ‘కుమారా! యజ్ఞయాగాదులకు భంగం కలిగించేవాడు ఎంతటి వాడైనా వాడిని శిక్షించవచ్చు. నిస్సంశయంగా నువ్వు ఇంద్రుడిని ఎదిరించు’ అని బోధించాడు. పృథు చక్రవర్తి కుమారుడు వెంటనే దేవేంద్రుడిపై శరపరంపరను కురిపించాడు. ఆ బాణాల దెబ్బకు తాళలేని ఇంద్రుడు యాగాశ్వాన్ని అక్కడే విడిచిపెట్టి, పలాయనం చిత్తగించాడు. రాకుమారుడు అశ్వాన్ని తీసుకుని అత్రి మహర్షితో కలసి ఇంటికి తిరుగుముఖం పడుతుండగా, ఇంద్రుడు మాయరూపంలో మళ్లీ యాగాశ్వాన్ని అపహరించాడు. పృథుచక్రవర్తి కుమారునికి యాగాశ్వం ఎలా అదృశ్యమైందో అర్థంకాలేదు. కంగారు పడ్డాడు. అత్రి మహర్షి అతడికి ధైర్యం చెప్పాడు. దివ్యదృష్టితో చూశాడు. దేవేంద్రుడే మళ్లీ దుశ్చేష్టకు పాల్పడ్డాడని గ్రహించాడు. ‘నాయనా! ఇంద్రుడే మళ్లీ యాగాశ్వాన్ని తస్కరించుకుపోయాడు’ అని రాకుమారుడితో చెప్పాడు. కోపోద్రిక్తుడైన పృథు కుమారుడు ఇంద్రుడిని తరుముతూ బాణాలు గుప్పించాడు. అతడి ధాటికి తాళలేని ఇంద్రుడు యాగాశ్వాన్ని విడిచిపెట్టి, మళ్లీ పారిపోయాడు. ఈసారి పృథు కుమారుడు యాగాశ్వాన్ని సురక్షితంగా తీసుకువచ్చాడు. అత్రి మహర్షితో కలసి యాగశాలకు చేరుకున్నాడు. తండ్రితో జరిగినదంతా చెప్పాడు. యాగాశ్వ సరంక్షణలో అత్రి మహర్షి చేసిన సాయానికి పృథు చక్రవర్తి వేనోళ్ల పొగిడి, కృతజ్ఞతలు తెలిపాడు. అశ్వమేధాన్ని దిగ్విజయంగా నిర్వర్తించినందుకు పృథు చక్రవర్తిని అత్రి మహర్షి ప్రశంసించాడు. ఇదంతా నచ్చని గౌతమ మహర్షి ‘ఒక మానవమాత్రుడిని ఇంతగా పొగడటం తగదు’ అంటూ వాదులాటకు దిగాడు. ఇంతలో కశ్యప మహర్షి లేచి, ‘ఈ వాదులాట ఇక్కడ పరిష్కారం కాదు గాని, దీనిలోని ధర్మాధర్మాలను సనత్కుమారుడొక్కడే తేల్చగలడు’ అన్నాడు. కశ్యపుని మాట మేరకు అందరూ సనత్కుమారుని వద్దకు చేరుకున్నారు. అత్రి, గౌతములిద్దరూ అతడి వద్ద తమ తమ వాదనలను వినిపించారు. సనత్కుమారుడు అంతా విని, ‘ఇందులో అత్రి మహర్షి దోషమేమీ లేదు. నా విష్ణుః పృథివీపతిః అనే భావన ప్రకారం అత్రి మహర్షి మాటలు ధర్మసమ్మతమే’ అని అన్నాడు. పృథు చక్రవర్తి సంతోషించి, అత్రి మహర్షిని ఘనంగా సత్కరించి, ఆయనకు కోరిన ధనరాశులనిచ్చి, సాదరంగా సాగనంపాడు. — సాంఖ్యాయన ఇవి చదవండి: అమ్మా, నాన్న ఆనంద విహారం -
‘హషిమా’ దీవి.. ఈ చీకటి చరిత్రను తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది!
విమానంలో వెళుతూ పైనుంచి చూస్తే, ఈ దీవి యుద్ధనౌకలా కనిపిస్తుంది. అలాగని, ఇదేమీ పర్యాటకులను ఆకట్టుకునే ఆహ్లాదకరమైన దీవి కాదు. దీని వెనుకనున్న చీకటి చరిత్రను తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. ప్రస్తుతం జపాన్లోని నాగసాకి నగరం పరిధిలోనున్న ‘హషిమా’ అనే ఈ దీవిని ఒకప్పుడు యుద్ధఖైదీల బందిఖానాగా ఉపయోగించేవారు. వేలాదిమంది చైనీస్, కొరియన్ ఖైదీలను ఈ దీవిలో నిర్బంధించేవారు. ఇక్కడ బొగ్గు నిల్వలు బయటపడటంతో రెండో ప్రపంచయుద్ధం ముగిసిన కొన్నేళ్ల వరకు ఖైదీలతో వెట్టిచాకిరి చేయించుకుంటూ, బొగ్గు నిల్వలను వెలికితీసేవారు. బొగ్గు గనులు మొదలయ్యాక ఇక్కడ ఇళ్లు, స్కూళ్లు వెలిశాయి. వాటితో పాటే ఒక ఆలయం, షాపింగ్ సెంటర్ ఏర్పడ్డాయి. ఈ దీవిలో తొలిసారిగా 1887లో బొగ్గు నిల్వలను గుర్తించారు. వాహనాల తయారీ సంస్థ ‘మిత్సుబిషి’ ఈ దీవిని 1890లో కొనుగోలు చేసింది. జపాన్ ప్రభుత్వం ఇక్కడకు తరలించే యుద్ధఖైదీలనే కార్మికులుగా ఉపయోగించుకుని, వారితో వెట్టిచారికి చేయించుకుని, భారీగా లాభాలు గడించింది. మిత్సుబిషి సంస్థ 480 అడుగుల మీటర్ల పొడవు, 160 మీటర్ల వెడల్పు గల స్థావరంలో గని కార్మికులుగా పనిచేసే 5,300 మంది ఖైదీలను నిర్బంధంలో ఉంచేది. గని తవ్వకాల్లో జరిగే ప్రమాదాల వల్ల, పోషకాహార లోపం వల్ల, జపాన్ సైనికులు అమలు జరిపే మరణ శిక్షల వల్ల దాదాపు 1,700 మంది ఖైదీలు అర్ధాంతరంగా ఇక్కడే మరణించారు. ఇక్కడి బొగ్గు నిల్వలు 1974 నాటికి అంతరించిపోవడంతో, వెట్టిచాకిరి చేసే కార్మికులకు విముక్తి దొరికింది. వారు ఈ దీవిని ‘జైలు దీవి’ అని, ‘యుద్ధనౌక దీవి’ అని పేర్లు పెట్టారు. గడచిన ఐదు దశాబ్దాలుగా ఖాళీగా ఉన్న ఈ దీవిలోని కట్టడాలన్నీ ఇప్పుడు శిథిలమైపోయాయి. మిత్సుబిషి సంస్థ నుంచి నాగసాకి నగరపాలక సంస్థ 2005లో ఈ దీవిని స్వాధీనం చేసుకుంది. ఈ దీవిలోనే 2012లో జేమ్స్బాండ్ సినిమా ‘స్కై ఫాల్’ షూటింగ్ జరిగింది. యునెస్కో 2015లో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. నాగసాకి నగరపాలక సంస్థ ఈ దీవి అభివృద్ధికి ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. అయినా, కుతూహలం ఉన్న కొద్దిమంది పర్యాటకులు అరుదుగా ఇక్కడకు వచ్చి, ఫొటోలు దిగి వెళుతుంటారు. ఇవి చదవండి: పాతాళవనం కాదు! అదొక 'నేలమాళిగలో ఉద్యానవనం..!' -
సిద్ధి ఇద్నానీ: ‘ద కేరళ స్టోరీ’ మూవీయే అందుకు సాక్ష్యం!
'చేసే పని పట్ల నిబద్ధత.. నిజాయితీ ఉంటే చాలు.. ఫలితం ఏదైనా గ్రాఫ్ స్టడీగానే ఉంటుంది. సిద్ధి ఇద్నానీ విషయంలో అదే జరిగింది. ఆమె నటించిన ఎన్నో సినిమాలు ఫ్లాప్ అయినా నటిగా ఆమె మాత్రం ఫెయిల్ అవలేదు. కెరీర్లో గ్యాప్ వచ్చింది కానీ ఆమె తెరమరుగు కాలేదు. ఆమె నటించిన ఇటీవలి ‘ద కేరళ స్టోరీ’ మూవీయే అందుకు సాక్ష్యం. జయాపజయాలతో సంబంధంలేని పాపులారిటీని సొంతం చేసుకున్న సిద్ధి వివరాలు కొన్ని..' సిద్ధి.. ముంబైలో పుట్టి పెరిగింది. తండ్రి.. సింధీ, తల్లి.. గుజరాతీ. వాళ్లది ప్రేమ వివాహం. అమ్మ.. హిందీ టెలివిజన్ సీరియల్స్, గుజరాతీ చిత్రాల్లో నటించేవారు. నాన్న బిజినెస్ మేన్. చిన్నతనంలో అమ్మతో కలసి సీరియల్ సెట్స్కి వెళ్లేది. ఆ ప్రభావంతోనే తనూ నటి కావాలనుకుంది. 2014లో క్లీన్ అండ్ క్లియర్ బాంబే టైమ్స్ ఫ్రెష్ ఫేస్ పోటీలో థర్డ్ రన్నరప్గా నిలిచింది. దాంతో ‘గ్రాండ్ హాలీ’ అనే గుజరాతీ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. తర్వాత గ్రాడ్యుయేషన్ ఇంపార్టెంట్ అనుకొని మాస్ మీడియాలో డిగ్రీ పూర్తి చేసింది. సీరియల్స్, కమర్షియల్స్ చేస్తున్నప్పుడే ఒకసారి.. ఓ ఏజెన్సీ వాళ్లు సిద్ధికి ఫోన్ చేసి సినిమా ఆడిషన్కి పిలిచారు. అలా ఆమె తెలుగులో ‘జంబలకిడి పంబ’తో హీరోయిన్గా మారింది. తర్వాత ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’, ‘ప్రేమకథా చిత్రం 2’ సినిమాల్లో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. ‘వెందు తనిందది కాడు’ చిత్రంతో తమిళ్లోనూ ఎంట్రీ ఇచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంది. వరుసగా కొన్ని చాన్స్లైతే వచ్చాయి కానీ.. విజయం ఇంకా ఎదురుచూపుల్లోనే చిక్కుకుపోయింది. కొంచెం గ్యాప్ తీసుకొని.. దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన ‘ది కేరళ స్టోరీ’లో నటించింది. అందులోని ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈసారి సక్సెస్ ‘గ్రాండ్’ అనే విశేషణాన్ని జత చేర్చుకుని తన పాత బాకీలనూ తీర్చేసుకుంది. ఈ చిత్రం జీ 5లో స్ట్రీమింగ్లో ఉంది. 'నా దృష్టిలో యాక్టింగ్ అంటే యాక్టింగే. భావమే దాని భాష. అందుకే భాష కన్నా కథ.. నా పాత్రే నాకు ముఖ్యం.' – సిద్ధి ఇద్నానీ ఇవి చదవండి: అవమానించిన వాళ్లే అభినందిస్తున్నారు! -
మృగశృంగుడి కథ
పూర్వం కుత్సురుడు అనే విప్రుడు ఉండేవాడు. అతడు ధార్మికుడు. నియమబద్ధంగా జీవించేవాడు. కుత్సురుడి యోగ్యతను గమనించి, కర్దమ మహర్షి అతడికి తన కూతురునిచ్చి వివాహం చేశాడు. కొంతకాలానికి కుత్సురుడికి ఒక కొడుకు కలిగాడు. కుత్సురుడి కొడుకు గనుక కౌత్సుడని పేరు పొందాడు. అతడు దినదిన ప్రవర్ధమానంగా పెరగసాగాడు. కొడుకుకు ఐదేళ్ల వయసు రాగానే కుత్సురుడు అతడికి ఉపనయనం చేశాడు. తండ్రి వద్ద కౌత్సుడు సకల శాస్త్రాలనూ అభ్యసించాడు. యుక్తవయసు రాగానే దేశాటనకు వెళ్లాలనే అభిలాషతో తండ్రి వద్ద అనుమతి తీసుకుని బయలుదేరాడు.ఇంటి వద్ద నుంచి బయలుదేరి ఊళ్లు, అడవులు దాటుకుంటూ ప్రయాణించిన కౌత్సుడు కొంతకాలానికి కావేరీ తీరానికి చేరుకున్నాడు. అది మాఘమాసం. కావేరీ పరిసరాలు ప్రశాంతంగా ఉండటంతో అక్కడే ఉంటూ, అనుదినం నదిలో స్నానం చేస్తూ, తపస్సు చేసుకోవడం ప్రారంభించాడు. తపస్సులో నిమగ్నమై ఉన్న కౌత్సుడిని జింకలు తమ కొమ్ములతో నిమురుతూ ఉండేవి. మృగశృంగాలను ఆకట్టుకున్నవాడు కావడం వల్ల అతడికి మృగశృంగుడనే పేరు వచ్చింది. కొన్నాళ్లకు మృగశృంగుడికి శ్రీహరి దర్శనమిచ్చాడు. ‘వత్సా! ఏమి కావాలో కోరుకో’ అన్నాడు శ్రీహరి.‘ఆపద్బాంధవా! జగద్రక్షకా! ఇక్కడ నన్ను అనుగ్రహించినట్లే, నువ్వు ఇక్కడే కొలువుంటూ భక్తులను కటాక్షిస్తూ ఉండాలి. అంతకు మించి నాకే కోరికా లేదు’ అన్నాడు మృగశృంగుడు. శ్రీహరి సమ్మతించాడు. శ్రీహరి దర్శనం పొందిన తర్వాత మృగశృంగుడు ఇంటికి చేరుకున్నాడు. యుక్తవయసుకు వచ్చిన మృగశృంగుడికి వివాహం జరిపించాలని తల్లిదండ్రులు భావించారు. భోగాపురంలో దైవజ్ఞుడైన బ్రాహ్మణుడికి సుశీల అనే కుమార్తె ఉంది. ఆమె అన్ని విధాలా అనుకూలవతి అని తెలుసుకోవడంతో మృగశృంగుడు ఆమెనే వివాహం చేసుకోవాలని తలచాడు. తల్లిదండ్రుల అనుమతితో ఆమెను చూడటానికి బయలుదేరాడు. సుశీల తన ఇద్దరు చెలికత్తెలతో కావేరీ నదిలో స్నానం చేయడానికి బయలుదేరింది. వారు ముగ్గురూ నది వైపు వెళుతుండగా, ఒక మదపుటేనుగు ఘీంకరిస్తూ వారిని తరమసాగింది. ప్రాణభయంతో ముగ్గురూ హాహాకారాలు చేస్తూ పరుగులు తీస్తూ, తోవలో ఉన్న దిగుడుబావిలో పడిపోయారు. ఈ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి, చూడటానికి వచ్చేసరికి వారు ముగ్గురూ దిగుడుబావిలో చనిపోయి ఉన్నారు. వారు కన్నీరు మున్నీరుగా విలపించసాగారు. అదే సమయానికి మృగశృంగుడు అక్కడకు చేరుకున్నాడు. జరిగినదంతా తెలుసుకున్నాడు. ముగ్గురు యువతుల మృతదేహాలను అప్పటికే గ్రామస్థులు వెలికితీశారు. తాను వచ్చేంత వరకు ఆ మృతదేహాలను కాపాడుతూ ఉండమని చెప్పి, మృగశృంగుడు కావేరీ నదిలో మెడలోతు వరకు దిగి, యమధర్మరాజు గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు. అతడి తపస్సుకు యముడు దిగివచ్చాడు. ‘కుమారా! నన్ను గురించి ఇంత దీక్షగా తపస్సు చేసిన వారెవరూ ఇంతవరకు లేరు. ఏమి కావాలో కోరుకో. నీ అభీష్టాన్ని తప్పక నెరవేరుస్తాను’ అన్నాడు యముడు.‘మహానుభావా! అకాల మరణానికి ప్రాణాలు పోగొట్టుకున్న ఆ ముగ్గురు కన్యలనూ బతికించు’ అని కోరుకున్నాడు మృగశృంగుడు. ‘నీ పరోపకార బుద్ధికి సంతసిస్తున్నాను’ అంటూ యముడు సుశీలను, ఆమె చెలికత్తెలిద్దరినీ బతికించాడు.తర్వాత మృగశృంగునికి సుశీలతో వివాహం జరిగింది.సుశీలతో పాటు తమను కూడా పునర్జీవితులను చేయడంతో సుశీల ఇద్దరు చెలికత్తెలూ మృగశృంగునిపై మనసు పడ్డారు. వారు అతడి వద్దకు వచ్చి, ‘సుశీలను పునర్జీవితురాలిని చేసినట్లే, నువ్వు మమ్మల్ని కూడా పునర్జీవితులను చేశావు. హాయిగా సుశీలను పెళ్లాడావు. నిన్నే నమ్ముకుని ఉన్నాం. మా గతి ఏమిటి?’ అన్నారు. ‘ఒకరికి ఒక భార్య ఉండటమే ధర్మం’ అన్నాడు మృగశృంగుడు.‘ఒకరికి ఒక భార్య మాత్రమే ఉండాలనే నియమం ఏ శాస్త్రంలోనూ లేదు. దశరథునికి ముగ్గురు భార్యలు లేరా? ఆ కృష్ణ పరమాత్ముడికి ఏకంగా ఎనిమిది మంది భార్యలు ఉన్నారే! చివరకు ఆదిభిక్షువైన ఆ పరమశివునికి కూడా గంగ, గౌరి ఇద్దరూ భార్యలుగా ఉన్నారు కదా!’ అని వాదించారు.మృగశృంగుడు వారికి బదులివ్వలేక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.ఈలోగా పెద్దలైన కొందరు మునులు కలగజేసుకుని, ‘మృగశృంగా! అభ్యంతరం చెప్పకు. ఈ కన్యలిద్దరిని కూడా వారి మనోభీష్టం మేరకు పెళ్లాడు. బహుభార్యలను కలిగి ఉండటం శాస్త్రవిరుద్ధం కాదు. మొండిగా నువ్వు వారిని తిరస్కరిస్తే, వారు బాధపడి కన్నీరుపెడితే నీకు జయం కాదు’ అని నచ్చచెప్పారు.పెద్దలందరూ నచ్చజెప్పడంతో చివరకు మృగశృంగుడు సుశీల చెలికత్తెలిద్దరిని కూడా వివాహమాడాడు. ∙సాంఖ్యాయన -
నటి నుంచి సీఎం వరకూ.. ‘అమ్మ’ జీవితం సాగిందిలా!
పలువురు మహిళలు దేశ రాజకీయాల్లో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. చరిత్రను పరిశీలిస్తే.. సరోజినీ నాయుడు, ఇందిరా గాంధీ, సుచేతా కృపలానీ, సుష్మా స్వరాజ్, ప్రతిభా పాటిల్, మమతా బెనర్జీ, మాయావతి, ప్రియాంక గాంధీ సహా ఎందరో మహిళల పేర్లు దేశ ప్రజల నోళ్లలో మెదులుతాయి. దేశ రాజకీయాల్లో సత్తా చాటుతున్న నటీమణుల విషయానికొస్తే స్మృతి ఇరానీ, నుస్రత్ జహాన్, జయప్రద హేమమాలిని తదితరుల పేర్లు వినవస్తాయి. అయితే అమోఘమైన ప్రజాదరణ పొందిన మహిళా నేతల జాబితాను పరిశీలిస్తే ఒక నాటి నటీమణి, ఆ తరువాత తమిళనాట సీఎంగా సత్తా చాటిన జయలలిత తప్పుకుండా గుర్తుకువస్తారు. తమిళనాడు ప్రజలు జయలలితను ‘అమ్మా’ అని పిలిచేంతటి ఆదరణ ఆమె సొంతం చేసుకున్నారు. ఈరోజు(ఫిబ్రవరి 24) దివంగత సీఎం జయలలిత జన్మదినం. 1948 ఫిబ్రవరి 24న జన్మించిన జయలలిత జీవితానికి సంబంధించిన ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ నేపధ్యం జయలలిత.. ప్రస్తుతం కర్ణాటకలో భాగంగా ఉన్న మైసూర్లోని మాండ్య జిల్లాలోని పాండవపురా తాలూకాలోని మేలుర్కోట్ గ్రామంలో అయ్యర్ కుటుంబంలో జన్మించారు. జయలలిత అసలు పేరు ‘కోమలవల్లి’. ఆమె తండ్రి పేరు జయరామ్. ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. ఆమె తల్లి పేరు వేదవల్లి. జయలలిత తల్లి వేదవల్లి ప్రముఖ నటిగా పేరు సంపాదించారు. బాల్యంలో జయలలితకు సినిమాలపై అంతగా ఆసక్తి లేదు. ఆమె ఎప్పుడూ నటి కావాలని కోరుకోలేదు. బలవంతంగా ఆమె సినీ రంగంలోకి వచ్చారని చెబుతుంటారు. సినీ జీవితం చదువులో జయలలిత ఎంతో ప్రతిభ కనబరిచారు. జయలలిత తండ్రి ఆమెను లాయర్గా చూడాలనుకున్నారు. అయితే ఆమె తల్లి.. జయలలితను చిన్నతనంలోనే సినీ రంగంలోకి తీసుకువచ్చారు. జయలలిత కేవలం తన 15 ఏళ్ల వయసులోనే అడల్ట్ సినిమాలో నటించారు. ఆమె సినీ జీవితం అక్కడి నుంచే మొదలైంది. ఆమె సినిమాల్లో తన అద్భుత ప్రతిభను ప్రదర్శించారు. జయలలిత తన కెరీర్లో మొత్తం 85 సినిమాలు చేయగా, అందులో 80 సినిమాలు అమోఘ విజయం సాధించాయి. సినిమాల్లో స్లీవ్లెస్ బ్లౌజ్ ధరించిన తొలి నటిగా ఆమె గుర్తింపు పొందారు. రాజకీయ ప్రయాణం నాటి రాజకీయ నేత ఎంజీ రామచంద్రన్ నటి జయలలితను సినిమాల నుంచి రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. ఎంజీఆర్, జయలలిత ప్రేమించుకున్నారని కానీ పెళ్లి చేసుకోలేదని, పైగా వారు తమ బంధాన్ని ఏనాడూ బహిరంగపరచలేదని చెబుతుంటారు. జయలలిత 1982లో ఎంజీ రామచంద్రన్తో పాటు అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నా డీఎంకే)లో సభ్యురాలయ్యారు. నాటి నుంచే ఆమె రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1984 నుండి 1989 వరకు జయలలిత తమిళనాడు నుండి రాజ్యసభ సభ్యురాలిగా వ్యవహరించారు. ఎంజీఆర్ మరణానంతరం అన్నాడీఎంకే పార్టీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. సాధించిన విజయాలు తమిళనాడులో జయలలిత ప్రజాదరణ పొందిన నటిగా మాత్రమే కాకుండా మహిళా నేతగా, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందారు. ఆరు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రి కావడం ఆమె రాజకీయాల్లో సాధించిన అమోఘ విజయంగా చెబుతుంటారు. భ్రూణహత్యల నివారణకు ఆమె ‘క్రెడిల్ టు బేబీ స్కీమ్’ను ప్రారంభించారు. ‘అమ్మ’ బ్రాండ్ ప్రారంభించి, ఈ పేరుతో దాదాపు 18 ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేశారు. అమ్మ పేరుతో అమలయిన ఈ పథకాలు పూర్తిగా ఉచితం. లేదా భారీగా రాయితీలు అందించేవి. పట్టణ పేదలకు ఒక్క రూపాయికే ఆహారం అందించేందుకు ఆమె ‘అమ్మ క్యాంటీన్’ను ప్రారంభించారు. జయలలిత తన 68వ ఏట 2016 డిసెంబర్ 5న కన్నుమూశారు. -
మనిషి మొదటి శాలరీ ఉప్పు?
ఉద్యోగం చేసే వ్యక్తి జీవితంలో శాలరీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఉద్యోగులు ప్రతినెలా తమ శాలరీ కోసం ఎదురుచూస్తుంటారు. అయితే ఈ శాలరీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఒకానొక కాలంలో శాలరీ పేరుతో ఉప్పును ఇచ్చేవారనే సంగతి మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పురాతన రోమ్లో డబ్బుకు బదులుగా ఉప్పును ఉపయోగించేవారు. ఆ సమయంలో రోమన్ సామ్రాజ్యంలో పనిచేసే సైనికులకు వారి పనికి ప్రతిఫలంగా ఉప్పును ఇచ్చేవారు. ‘ఉప్పు ఋణం’ లాంటి సామెతలు ఆ కాలం నుంచే ఉద్భవించాయని చెబుతుంటారు. ప్రముఖ మీడియా సంస్థ అందించిన ఒక నివేదిక ప్రకారం రోమన్ చరిత్రకారుడు ప్లినీ ది ఎల్డర్ తన ‘నేచురల్ హిస్టరీ’ పుస్తకంలో.. రోమ్లో సైనికులకు ఉప్పు రూపంలో శాలరీ ఇచ్చేవారని పేర్కొన్నారు. శాలరీ అనే పదం ఉప్పు నుండి వచ్చిందని దానిలో తెలిపారు. సోల్జర్ అనే పదం లాటిన్ పదం 'సల్ డేర్' నుండి ఉద్భవించిందని, దీని అర్థం ‘ఉప్పు ఇవ్వడం’ అని పలు నివేదికలు పేర్కొన్నాయి. రోమన్లో ఉప్పును సలారియం అంటారు. దీని నుండి శాలరీ అనే పదం ఉద్భవించింది. 10,000 బీసీ, 6,000 బీసీ మధ్య మొదటిసారి శాలరీ ఇచ్చారని ఫ్రెంచ్ చరిత్రకారులు భావిస్తున్నారు. పురాతన రోమ్లో పనికి బదులుగా బదులుగా ఉప్పు ఇచ్చేవారు. ఆ సమయంలో రోమన్ సామ్రాజ్యంలోని సైనికులకు శాలరీగా వారి చేతినిండా ఉప్పు ఇచ్చేవారు. అప్పట్లో ఉప్పు వ్యాపారం కూడా బాగా జరిగేది. -
నెలకు రూ. 60 లక్షలు సంపాదిస్తున్న ‘పోహె వాలా’
నిజాయతీగా కష్టపడే వారి విజయాన్ని ఎవరూ ఆపలేరనడానికి ‘పోహెవాలా’ ఫుడ్ స్టార్టప్ వ్యవస్థాపకులు, మహారాష్ట్రకు చెందిన చాహుల్ బల్పాండే, పవన్ వాడిభాస్మే ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచారు. చాహుల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాక, పవన్ ఎంబీఏ డిగ్రీ అందుకున్నాక ఒక కంపెనీలో ఉద్యోగాల్లో చేరారు. సదరు కంపెనీ వారికి సకాలంలో జీతాలు ఇవ్వలేదు. దీంతో ప్రతి నెలా డబ్బుకు ఇబ్బంది ఎదురయ్యేది. దీంతో వారిద్దరూ పగటిపూట అదే ఆఫీసులో పనిచేస్తూ, రాత్రి పూట నాగపూర్లో పోహె విక్రయాలు ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే వీరు తయారు చేసే పోహెకు ఆహార ప్రియుల నుంచి విశేష ఆదరణ లభించింది. దీంతో వీరిద్దరూ 2018లో తమ ఉద్యోగాలను వదిలేసి, పూర్తిస్థాయిలో పోహె విక్రయాలు ప్రారంభించారు. వీరు తమ బ్రాండ్కు ‘పోహె వాలా’ అనే పేరు పెట్టారు. అనంతరం అనేక రకాల పోహెలను అందుబాటులోకి తీసుకువచ్చారు. కేవలం ఆరు సంవత్సరాలలో, వారు దేశంలోని 15 నగరాల్లో తమ అవుట్లెట్లను ప్రారంభించారు. ప్రస్తుతం పవన్, చాహుల్ ప్రతి నెలా రూ.60 లక్షలకు పైగా మొత్తాన్ని సంపాదిస్తున్నారు. చాహుల్, పవన్లు ఫుడ్ స్టార్టప్ ప్రారంభించాలని అనుకున్నప్పుడు తొలుత రాత్ర వేళ చిన్నగా పోహె విక్రయాలు ప్రారంభించారు. దీంతో ఈ వ్యాపారంలో సాధ్యాసాధ్యాలను తెలుసుకోవడంతో పాటు కస్టమర్లు ఏం కోరుకుంటున్నారనేది గ్రహించారు. 2018 మేలో వీరు నాగ్పూర్లో తమ పోహె వ్యాపారాన్ని ప్రారంభించారు. మొదట్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పోహె విక్రయించేవారు. ఇది వారికి మార్కెట్పై లోతైన అవగాహన కలిగేందుకు ఉపయోగపడింది. ప్రస్తుతం భారీ స్థాయిలో వ్యాపారం సాగిస్తున్న వీరు మొత్తం 13 రకాల పోహెలను తయారు చేస్తుంటారు. ఆర్గానిక్ పోహె అమ్మకాలు ప్రారంభించినది కూడా వీరే కావడం విశేషం. నేడు పోహెవాలా బ్రాండ్ పనీర్ పోహె, ఇండోరి పోహె, నాగ్పూర్ స్పెషల్ తారీ పోహె, చివ్దా పోహె, మిశ్రా పోహె చాలా ప్రసిద్ధి చెందాయి. ఒక ఇంటర్వ్యూలో చాహుల్ బాల్పాండే మాట్లాడుతూ నిజానికి ఏ వ్యాపారానికీ హెచ్చు తగ్గులుండవని, వ్యాపారం విజయవంతం కావడానికి వినూత్న ఫార్ములా, నాణ్యత, మార్కెటింగ్ నైపుణ్యాలు అవసరమని అన్నారు. వ్యాపారాన్ని ప్రారంభించే ముందు సరైన వ్యూహాన్ని రూపొందించడం ముఖ్యమన్నారు. వీరు ‘పోహెవాలా’కు సొంత వెబ్సైట్ను కూడా ప్రారంభించారు. దీని సాయంతో ఆన్లైన్లోనూ పోహె విక్రయాలు కొనసాగిస్తున్నారు. -
ఎవరీ మోలీ? నూటపాతిక ఏళ్ల నుంచి భయపెడుతూనే ఉంది!
అది అమెరికా, అలబామాలోని ఆబ్విల్ పట్టణం. అక్కడ సూర్యాస్తమయం తర్వాత.. పిల్లలున్న ప్రతి ఇంట్లోనూ ఓ హెచ్చరిక జారీ అవుతుంది. ‘మోలీ వస్తోంది.. అల్లరి చేస్తే తీసుకెళ్లిపోతుంది, మోలీ వస్తోంది.. మాట వినకపోతే లాక్కుపోతుంది’ అని! మోలీ.. ఓ దయ్యం పేరు. ఆమె 7 అడుగుల ఎత్తుతో బలిష్ఠంగా ఉంటుందని.. నల్ల దుస్తులు ధరిస్తుందని చూసినవాళ్లు, తెలిసినవాళ్లు చెబుతుంటారు. ఆమె తలకు ముసుగు లేదా తలపాగా లేదా టోపీ పెట్టుకుని.. భయపెట్టే రూపంలో ఉంటుందని వర్ణిస్తుంటారు. చీకటి వేళ చల్లగాలిలో అమాంతం దూసుకొస్తుందట మోలీ. ఎంత వేగంగా పారిపోవడానికి ప్రయత్నించినా వెంటాడి పట్టుకోగలదట. ముఖ్యంగా ఆమె టార్గెట్ పిల్లలేనట. తరిమి తరిమి పట్టుకున్న తర్వాత గట్టిగా కౌగిలించుకుని.. చెవిలో చాలా పెద్దగా అరిచి.. అదృశ్యమవుతుందట. అంటే ‘ఆమె హానికరమైన దయ్యం కాదు’ అనేది అక్కడి వారి మాట. అయితే పిల్లల్ని అదుపు చేయడానికి పెద్దలు మాత్రం మోలీ పేరు చెప్పి బెదరగొడుతూంటారు. మోలీ ఎదురుపడిందంటూ.. రెండుమూడు రోజులు మంచం పట్టిన పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ మోలీ గతం గురించి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం మోలీ బాలింతగా ఉన్నప్పుడు.. తన పసిబిడ్డను కొంతమంది పిల్లలు ఎత్తుకుని, కౌగిలించుకున్నప్పుడు ఇన్ఫెక్షన్ సోకి ఆ బిడ్డ చనిపోయిందని.. అప్పటి నుంచి పిచ్చిదైపోయిన మోలీ.. ఆ తర్వాత చనిపోయి, దయ్యమైందని చెబుతారు. ఆ దయ్యమే ఇలా పిల్లల వెంటపడుతుందని కొందరు నమ్ముతారు. అయితే మరికొందరు మాత్రం.. మోలీ ఒక స్కూల్లో ప్రొఫెసర్గా పనిచేసేదని.. ఆమెకు పిల్లలంటే చాలా ఇష్టమని.. అందుకే చనిపోయిన తర్వాత దయ్యమై.. రాత్రి పూట పిల్లల్ని భద్రంగా కాపాడటానికి తాపత్రయపడుతుందని చెబుతుంటారు. 1900 సంవత్సరం నుంచి ఈ కథలు వినిపిస్తూనే ఉన్నాయి. అంటే మోలీ.. సుమారు నూటపాతిక ఏళ్ల నాటి దయ్యమన్నమాట. అయితే ఈ కథల్లో ఏది నిజం? ఎంతవరకు నిజం అనేదానిపై స్పష్టత లేదు. ఏది ఏమైనా.. మోలీ ఊసెత్తితే.. చాలామంది పెద్దలు కూడా ఉలిక్కిపడుతుంటారు. ఎందుకంటే తమ బాల్యంలో తమనూ మోలీ వెంటాడి పట్టుకుందని, చెవిలో గావుకేక పెట్టిందని చెబుతుంటారు. ఏదీ ఏమైనా నిజంగానే మోలీ ఆత్మ రూపంలో అక్కడ వీథుల్లో తిరుగుతోందా? లేక కేవలం భ్రమలు, పుకార్లేనా? అనేది నేటికీ మిస్టరీనే. (చదవండి: ఆ గుహలోకి వెళ్లడమంటే.. ప్రాణాలపై ఆశ వదిలేసుకోవడమే!) -
బౌద్ధవాణి : మాకు పిచ్చుకలతో పోలికా..!?
"వసంతకాలం వచ్చేసింది. చివురులు తొడిగిన చెట్లన్నీ పుష్పించాయి. పూత పిందెలుగా మారుతోంది. ప్రకృతి పూల పరిమళాలతో పరవశించి పోతోంది. ఆ మామిడితోటలో చల్లదనానికి తోడు చక్కని పరిమళాలు వీస్తున్నాయి. ఆ తోట ఒక అంచున పెద్ద కాలువ. నీరు బాగా ఇంకిపోయి ఉంది. పాయలు పాయలుగా సన్నని ధారలు ప్రవహిస్తున్నాయి. ఆ కాలువ గట్టు మీద పెద్ద మామిడిచెట్టు. సమయం మధ్యాహ్నం దాటింది. పొద్దు పడమటికి వాలింది. ఆ చెట్టు కింద భిక్షుగణంతో కూర్చొని ఉన్నాడు బుద్ధుడు. భిక్షువులకి తాము తీసుకోవలసిన ఆహార నియమాల గురించి బోధిస్తున్నాడు." ‘‘భగవాన్! నేను రోజుకు మూడు పూటలా తినేవాణ్ణి. చిన్నతనం నుండి అదే అలవాటు. బౌద్ధసంఘంలో చేరాక ఉదయం, సాయంత్రం కొన్నాళ్ళు తిన్నాను. మధ్యాహ్నం క్రమంగా మానేశాను. కొన్నాళ్ళు చాలా బాధ అనిపించింది. ఆకలికి తాళలేకపోయాను. కానీ.. కొన్నాళ్ళకు అదే అలవాటైంది. ఆ తరువాత మీరు.. ‘రాత్రి భోజనం మానండి’ అన్నారు. నెమ్మదిగా మానేశాను. ఇప్పుడు రోజుకి ఒక్కపూట భోజనం చేస్తున్నాను. ఆరోగ్యంగా ఉన్నాను. ఉత్సాహంగా ఉన్నాను. తేలికపడ్డాను. చదువు పట్ల శ్రద్ధ పెరిగింది.’’ అన్నాడు ఉదాయి అనే భిక్షువు. అంతలో ఆ పక్కనే ఉన్న తుమ్మచెట్లు మీదనుండి పిచ్చుకల అరుపులు వినిపించాయి. కొందరు అటుకేసి చూశారు. అరుపులు నెమ్మదిగా సద్దుమణిగాయి. చిక్కని కొమ్మల్లో చిక్కుకుపోయిన పిచ్చుక నెమ్మదిగా బైటపడి, రెక్కలు దులుపుకుని లేచిపోయింది. ‘‘భగవాన్! రాత్రిపూట చీకటిలో భిక్ష కోసం తిరగాలంటే.. ఎన్నో ఇబ్బందులు వచ్చేవి. ఒకసారి నేను మురికి గుంటలో పడ్డాను. మన ధర్మపాలుడైతే ముళ్ళ పొదలో చిక్కుకున్నాడు’’ అన్నాడు ఒక భిక్షువు. ‘‘నేనైతే.. ఒకసారి దొంగలమూకతో కలసిపోయాను’’ అన్నాడు ఇంకో భిక్షువు. ‘‘భగవాన్! నా అనుభవం చెప్పడానికి మరీ ఇబ్బందికరం. ఆరోజు రాత్రి మబ్బు పట్టింది. నేను ఒకరి ఇంటికి వెళ్ళే సమయానికి పెద్ద మెరుపు మెరిసింది. ఇంటి పెరట్లో ఉన్న స్త్రీ నన్ను ఒక్కసారి చూసి భూతం అనుకొని భయపడింది. పెద్దగా అరిచింది. తెగ తిట్టి పోసింది. నేను ‘‘చెల్లీ! నేను భిక్షువుని’’ అని సర్ది చెప్పి బైటపడ్డాను’’ అన్నాడు మరో భిక్షువు. కానీ కొందరు భిక్షువులు మాత్రం అసహనంగా కూర్చొని ఉన్నారు. వారికి ఒంటిపూట భోజనం అలవాటు కావడం లేదు. మూడుపూటలా తింటే గానీ.. ఆకలి శాంతించదు. కొందరు కనీసం రెండు పూటల’’ అన్నారు. అంతలో.. తుమ్మచెట్టు మీద మరలా పిచ్చుకల అలజడి.. చిక్కని కొమ్మల మధ్య చిక్కుకుపోయిన ఎండు పీచుల మధ్య చిక్కుకుపోయింది ఒక పిచ్చుక. అది అటూ ఇటూ కొట్టుకుంటుంది. కొట్టుకున్న కొద్దీ ఇంకా ఇంకా చిక్కుకు పోతోంది. బుద్ధుడు నెమ్మదిగా.. ‘‘భిక్షువులారా! మీలో ఒకరు వెళ్లి ఆ బంధనాలు విడిపించండి’’ అన్నాడు. ఒక భిక్షువు లాఘవంగా చెట్టెక్కి పిచ్చుక బంధనాల్ని తొలగించాడు. అది భయంతో తుర్రున ఎగిరిపోయింది. ‘‘భిక్షువులారా! చూశారా! ఆ పిచ్చుక చిక్కుకున్న బంధాలు చిన్న చిన్న పీచులు. ఎండిపోయినవి. బలహీనమైనవి. కానీ, ఆ పిచ్చుక దాన్ని తెంచుకోలేక పోయింది.. కారణం?’’ అని అడిగాడు. ‘‘ఆ పిచ్చుక ఆ బంధనాల కంటే బలహీనమైంది’’ అన్నాడు ఉదాయి. ‘‘మరి, చాలా బలమైన గొలుసులతో తాళ్ళతో బంధించిన ఏనుగు ఆ బలమైన బంధనాన్ని సైతం తెగ తెంచుకోగలదు. ఆహారం విషయంలో మీలో కొందరు ఆ పిచ్చుకలాంటి వారే. మరికొందరు ఏనుగు లాంటివారు. కోరికల్ని తెగ తెంచుకోగలిగారు’’ అన్నాడు. ‘‘బుద్ధుడు, ఇంకా ఎందరో భిక్షువులు ఒంటిపూట భోజనంతో సంతోషంగా, ఆరోగ్యంగా, శక్తిమంతంగా ఉంటున్నారు. మేమెందుకు పిచ్చుకలంత బలహీనులం కావాలి?’’ అనుకున్నారు ఆకలికి ఆగలేనివారు. వారూ నెమ్మదిగా దాన్ని సాధించుకున్నారు. మాకు పిచ్చుకలతో పోలికా? అన్నట్లు దృఢచిత్తులయ్యారు. – డా. బొర్రా గోవర్ధన్ -
ఊహా ప్రపంచాలు.. కొత్త కథలతో స్టార్ హీరోల ప్రయోగాలు
మంచి ఊహలు ఎప్పుడూ బాగుంటాయి. నేరుగా చూడలేని ప్రపంచాలను ఊహించుకున్నప్పుడు ఓ ఆనందం దక్కుతుంది. ఇక కొత్త ప్రపంచాలను సిల్వర్ స్క్రీన్పై చూసినప్పుడు కనువిందుగా ఉంటుంది. అలా ఊహా ప్రపంచం నేపథ్యంలోని కథలకు కొందరు స్టార్స్ ఊ అన్నారు. కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను రా రమ్మంటున్న ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం... పది సెట్స్లో విశ్వంభర ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ (1990), ‘అంజి’ (2004) వంటివి చిరంజీవి కెరీర్లోని సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్స్. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ జానర్ను టచ్ చేశారు చిరంజీవి. ఈ కోవలో ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నారు. దర్శకుడిగా తొలి సినిమా ‘బింబిసార’ను సోషియో ఫ్యాంటసీ జానర్లో తీసిన వశిష్ఠ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా మేజర్ షూటింగ్ అంతా ఓ కల్పిత ప్రాంతంలో జరుగుతుందట. చిత్రీకరణకు తగ్గట్లుగా పదికి పైగా సెట్స్ తయారు చేయిస్తున్నారట. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్లో జాయిన్ అవుతారట చిరంజీవి. ఈ చిత్రంలో హనుమంతుని భక్తుడు దొరబాబు పాత్రలో చిరంజీవి కనిపిస్తారని, త్రిష హీరోయిన్గా నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఓ చైల్డ్ ఎపిసోడ్ కూడా ఉంటుందట. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది. జనవరి 10న ఈ చిత్రం రిలీజ్ డేట్ అనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. కల్కి లోకం భారతీయ ఇతిహాసాల ఆధారంగా సైంటిఫిక్ అంశాల మేళవింపుతో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్ట్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా కథలో ఇతిహాసాల ప్రస్తావన ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి కాబట్టి ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయని ఊహించవచ్చు. ఓ నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఇండియా ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపిస్తాం అన్నట్లుగా ఈ చిత్రదర్శకుడు నాగ్ అశ్విన్ ఇటీవల సందర్భంలో పేర్కొన్నారు. ప్రభాస్ హీరోగా దీపికా పదుకోన్ హీరోయిన్గా రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దిశా పటానీ కీ రోల్స్లో కనిపిస్తారు. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘సలార్’ తర్వాత హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘రావణం’ అనే మైథలాజికల్ ఫిల్మ్ రానుందని, ఈ సినిమాను ‘దిల్’ రాజు నిర్మిస్తారనే వార్తలు గతంలో వచ్చిన సంగతి తెలిసిందే. ఇది కూడా ఊహాజనిత ప్రపంచంలో జరిగే చిత్రం అని టాక్. ట్రాక్ మారింది ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల.. వైకుంఠపురములో’... హీరో అల్లు అర్జున్– దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఇవి. కమర్షియల్ అంశాలతో రూపొందిన ఈ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఈ మూడు సినిమాల తర్వాత అల్లు అర్జున్–త్రివిక్రమ్ కాంబినేషన్లో నాలుగో సినిమా గురించిన ప్రకటన వెల్లడైంది. కానీ ట్రాక్ మారింది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో ఈ చిత్రం ఉండదట. ఇది పూర్తి స్థాయి సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ అని, మహాభారతం రిఫరెన్స్ ఈ సినిమాలో ఉంటుందనే టాక్ తెరపైకి వచ్చింది. అల్లు అరవింద్, సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారు. కాగా ఈ సినిమా ్రపారంభం కావడానికి కాస్త సమయం పట్టేలా ఉందని తెలిసింది. కంగువ ప్రపంచం ‘కంగువ’ టీజర్ చూస్తున్నప్పుడు ఏదో కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నట్లుగా ప్రేక్షకులకు అనిపిస్తుంటుంది. సూర్య హీరోగా నటించిన చిత్రం ఇది. పూర్తి స్థాయి ఫ్యాంటసీ ఫిల్మ్ కాకపోయినప్పటికీ ‘కంగువ’లో ఆడియన్స్ ఆశ్చర్యపోయే, అబ్బురపరచే విజువల్స్ చాలానే ఉన్నాయన్నది కోలీవుడ్ టాక్. కథ రీత్యా కాస్త సైంటిఫిక్ టచ్ ఉన్న ఈ సినిమాలో సూర్య పదికి పైగా గెటప్స్లో కనిపిస్తారని సమాచారం. దిశా పటానీ, బాబీ డియోల్, యోగిబాబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శివ దర్శకుడు. కేఈ జ్ఞానవేల్ రాజాతో కలిసి ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుందట. తొలి భాగం ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. కేరాఫ్ భైరవకోన గరుడ పురాణంలో మిస్ అయిన ఓ నాలుగు పేజీల కథే ‘భైరవకోన’ అట. మరి.. ఈ గరుడ పురాణం పూర్తి వివరాలు, ఈ నాలుగు పేజీల మిస్టరీ ఏంటో తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 16న థియేటర్స్లో విడుదలయ్యే ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా చూడాలి. సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్ ఇది. అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా నిర్మించిన ఈ చిత్రంలో వర్షా బొల్లమ్మ, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటించారు. అఘోరా శంకర్ యంగ్ హీరోల్లో ఒకరైన విశ్వక్ సేన్ చేస్తున్న తాజా చిత్రాల్లో ‘గామి’ ఒకటి. ఇందులో శంకర్ అనే అఘోరా పాత్రలో విశ్వక్ కనిపిస్తారు. కథ రీత్యా శంకర్కు మానవ స్పర్శ తెలియదు. కానీ ఆ స్పర్శను అనుభూతి చెందాలన్నది అతని ఆకాంక్ష. ఈ క్రమంలో ఏం జరగుతుంది? అనేదే ‘గామి’ కథ అట. ఈ సినిమాలో అఘోరా ట్రాక్ మాత్రమే కాకుండా మరో స్టోరీ ట్రాక్ కూడా ఉందని చిత్ర యూనిట్ చెబుతోంది. భారీ స్థాయిలో వీఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతున్న ఈ చిత్రాన్ని దాదాపు నాలుగు సంవత్సరాలుగా తీస్తున్నారు. ఈ సినిమాలో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయని ఊహించవచ్చు. విద్యాధర కాగిత దర్శకత్వంలో కార్తీక్ శబరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జై హనుమాన్ ఈ సంక్రాంతికి ‘హను–మాన్’ సూపర్హిట్. అంజనాద్రి అనే ఊహాజనితప్రాంతం నేపథ్యంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజ సజ్జా హీరో. కె. నిరంజన్రెడ్డి నిర్మించారు. కాగా ‘హను–మాన్’ సినిమాకు సీక్వెల్గా ‘జై హనుమాన్’ తీస్తున్నారు ప్రశాంత్ వర్మ. స్క్రిప్ట్ వర్క్ మొదలైంది. ‘జై హను–మాన్’ సినిమాలో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉండేట్లు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో నటించే నటీనటులపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. అఖిల్ నెక్ట్స్ సినిమా గురించిన ఓ వార్త అక్కినేని ఫ్యాన్స్లో ఆసక్తిని కలిగిస్తోంది. అఖిల్ హీరోగా యూవీ క్రియేషన్స్, హోంబలే ఫిలింస్ కలిసి ఓ సోషియో ఫ్యాంటసీ సినిమాను నిర్మించనున్నాయట. ప్రస్తుతం ప్రీప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని తెలిసింది. ఈ సినిమాతో అనిల్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతారని భోగట్టా. ఈ మూవీపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇలా ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్లో మరికొన్ని సినిమాలు రానున్నాయి. -
'రా.. ఇటువైపు రా.. ఇక్కడే, ఈ క్షణమే చచ్చిపో..' కథ కాదు నిజం..
‘జీవితం విలువైన బహుమతి, ఒక్కసారి మీ కుటుంబం గురించి ఆలోచించండి. దయచేసి ఒంటరిగా ఇక్కడ తిరగొద్దు.. వెంటనే క్షేమంగా తిరిగి వెళ్లిపోండి’ ఇవి ఔకీగహారా సమీపంలో కనిపించే ప్రమాద హెచ్చరికలు. ‘పో.. దూరంగా పో.. తిరిగి వెళ్లిపో.. బతుకు..’ అంటూ గమనిక బోర్డులనిండా రాతలు. అవి స్పష్టంగా కనిపిస్తున్నా.. అడవి మాత్రం ‘రా.. ఇటువైపు రా.. ఇక్కడే, ఈ క్షణమే చచ్చిపో’ అని పిలుస్తుందట. టోక్యోకు పశ్చిమంగా దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో.. ఫుజి అనే ఎత్తైన పర్వతానికి ఆనుకుని.. ఔకీగహారా అనే ఫారెస్ట్ ఉంది. అక్కడ ప్రతి మొక్కలో, ప్రతి మలుపులో విషమ గీతమే వినిపిస్తుంది. ఏదో తెలియని క్రూరత్వం రారమ్మంటూ వల విసురుతున్నట్లుగా ఉంటుంది. ‘అవన్నీ ఆత్మహత్యలకు ఆహ్వానాలే’ అంటుంటారు చాలామంది. ఈ అడవి భూమ్మీద అత్యంత భయంకరమైన ప్రదేశాల్లో ఒకటి. ప్రపంచంలోనే ఆత్మహత్యల రేటులో ఈ అడవిది రెండో స్థానం. ఏటా ఇక్కడి నుంచి సుమారు వందకు పైగా మృతదేహాలను వెలికితీస్తుంటారు. ఇది ఇంత ప్రమాదకరమైన ప్రదేశమని తెలిసి కూడా కొందరు .. ఇక్కడికే హైకింగ్కి వస్తుంటారు. పురాణ కథనం పురాణాల ప్రకారం.. కొన్నేళ్ల క్రితం కొంతమంది పేదలు ఇక్కడ ఆకలితో మరణించి ఆత్మలుగా మారారని ఒక కథనం. ఆ ఆత్మలు కొత్త ఆత్మల కోసం వెదుకుతూ ఉంటాయని.. అందుకే అవి అడవి సమీపానికి వచ్చిన మనుషుల్ని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుంటాయని చాలామంది నమ్ముతారు. అయితే ఈ అడవిలో చనిపోయిన శవాలు కదులుతాయని.. భీకరంగా కేకలు వేస్తుంటాయని స్థానికులు చెబుతుంటారు. మరో కథనం ప్రకారం.. పూర్వం స్థోమత లేని కుటుంబాల్లోని వృద్ధులు లేదా అనారోగ్యంతో బాధపడే బంధువులను ఈ అడవికి తీసుకొచ్చి వదిలేసేవారని.. వారంతా అక్కడే ఆకలితో చనిపోయేవారని.. వారి ఆత్మఘోషే ఈ విషాదానికి కారణమని మరో కథనం. 'సీచో మాట్సిమోటో' అనే రచయిత.. 1961లో రచించిన ‘ది టవర్ ఆఫ్ వేవ్స్’ అనే నవల వల్ల.. ‘ఔకీగహారా’ అడవి విశేషాలు బాగా పాపులర్ అయ్యాయని కొందరి అభిప్రాయం. అప్పటి నుంచే ఈ అడవి మిస్టరీని కథాంశంగా తీసుకుని.. అనేక చిత్రాలు, కథనాలు పుట్టుకొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. శాస్త్రవేత్తల మాట్లలో.. కొందరు శాస్త్రవేత్తలు మాత్రం.. ‘ఇక్కడి ఇనుప నిక్షేపాల కారణంగా అవి దిక్సూచిగా మారి దారి తప్పించడంతో అడవిలోనే చనిపోతున్నారు. అందుకే ఈ అడవిలోకి వెళ్లాలి అనుకునే హైకర్స్.. టేప్ లేదా స్ట్రింగ్ని ఉపయోగించడం మంచిది’ అని సూచిస్తున్నారు. అడవి ప్రాంతం విస్తారంగా, దట్టంగా ఉండటంతో.. ఇక్కడ అడుగుపెట్టిన చాలామంది శవాలు కూడా దొరకట్లేదు. మిస్ అయిన వాళ్లని కనిపెట్టడంలో రెస్క్యూ టీమ్ కూడా ఫెయిల్ అవుతూ వచ్చింది. దాంతో ఆత్మహత్యలను, మిస్సింగ్లను నివారించడానికి.. అటవీ ద్వారాల ముందు భద్రతా కెమెరాలతో పాటు.. సెక్యూరిటీనీ పెంచారు. నిర్మానుష్యమైన ఈ అడవిలో.. నిర్ఘాంత పోయే దృశ్యాలు భయపెడుతూ ఉంటాయి. చెల్లాచెదురుగా పడి ఉన్న షూలు, బట్టలు, టోపీలతో పాటు భీతికలిగించే బొమ్మలు కూడా ఉంటాయి. అవన్నీ చెట్టు కొమ్మలతో తాళ్లు మెలిపెట్టి బొమ్మల్లా అల్లినట్లు ఉంటాయి. చూడటానికి రాక్షసుల్లా కనిపిస్తూ ఉంటాయి. అయితే వాటిని ఎవరు అలా పెట్టారో ఎవరికీ తెలియదు. మనిషి పుర్రెలు, ఎముకలు అక్కడక్కాడా అగుపిస్తూ హడలెత్తిస్తుంటాయి. చనిపోయిన వారి శవాలు కూడా దిష్టిబొమ్మల్లా.. ఊడలమర్రిపై దయ్యాల్లా వేలాడుతూ భయపెడుతూ ఉంటాయి. ఏదిఏమైనా ఈ అడవి.. మనుషుల్ని ఆత్మహత్యలకు ఎలా ప్రేరేపిస్తోంది? అక్కడ తాళ్లతో రాక్షసుల రూపాలను ఎవరు తయారు చేశారు? వంటివన్నీ మిస్టరీలుగానే మిగిలిపోయాయి. - సంహిత నిమ్మన -
హనుమ హృదయంలో సీతారాములు
రామ రావణ యుద్ధంలో రావణుడు అంతమొందాడు. రాముడు విభీషణుణ్ణి లంకకు రాజుగా అభిషిక్తుణ్ణి చేశాడు. సీతా సమేతంగా వానర వీరులను, విభీషణుణ్ణి తోడ్కొని పుష్పక విమానంలో అయోధ్యకు చేరుకోవడానికి బయలుదేరాడు. రాముడి రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న భరతుడు అయోధ్య పొలిమేరల్లోనే సపరివారంగా నిలబడి, నెత్తి మీద పాదుకలను ఉంచుకుని రాముడికి స్వాగతం పలికాడు. అయోధ్యవాసుల జయజయ ధ్వానాల నడుమ, పురోహితుల వేద మంత్రాలతో రాముడికి పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం తర్వాత రాముడు తనకు అడుగడుగునా సహకరించిన వారందరికీ విలువైన కానుకలను బహూకరించాడు. సుగ్రీవుడు, అంగదుడు, నలుడు, నీలుడు, సుషేణుడు, జాంబవంతుడు తదితర వానర యోధులకు, విభీషణుడికి కానుకలతో సత్కరించాడు. హనుమంతుడికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. సీతమ్మవారికి ఒక విలువైన రత్నాల హారాన్ని ఇచ్చాడు. ‘నీకు ఇష్టమైన వారికి దీనిని బహూకరించు’ అని చెప్పాడు రాముడు. ‘మహారాజా! మానసపుత్రుల మధ్య భేదభావాన్ని కలిగించాలనుకుంటున్నారా? తల్లికి బిడ్డలందరూ సమానమే కదా!’ అంది సీత. ‘సమానులెలా అవుతారు? బిడ్డలు అందరూ సమానులే అయితే శాస్త్రాల్లో సుపుత్రులు, కుపుత్రులు అని ఎందుకు వర్ణించారు?’ ప్రశ్నించాడు రాముడు. ‘ఏ వేలికి గాయమైనా నొప్పి సమానంగానే కలుగుతుంది. తల్లికి పుత్రులందరూ సమానమే. తల్లి మమత పుత్రులందరి మీద సమానంగానే ఉంటుంది. అయితే, సద్గుణాల కారణంగా, భక్తి కారణంగా కొంత తారతమ్యం కలుగుతుంది. ఆ తారతమ్యం గుణాలకు సంబంధించినది మాత్రమే!’ అని పలికింది సీత. ‘నా అభిప్రాయం కూడా అదే! గుణాలలో ఎక్కువగా ఎవరిని భావిస్తావో వారికే ఈ కానుక ఇవ్వు’ అన్నాడు రాముడు. ‘అందరూ గుణవంతులే! అందరూ భక్తులే!’ అంది సీత. ‘అయినా కొద్ది తారతమ్యం ఉండనే ఉంటుంది. నువ్వు సంకోచిస్తున్నట్లున్నావు. నువ్వు ఇవ్వదలచుకున్న వాళ్లకు నిస్సంకోచంగా ఈ కానుక ఇవ్వు’ అన్నాడు రాముడు. సభలో ఉన్నవారంతా సీతారాముల మధ్య జరిగిన ఈ సంభాషణను అత్యంత ఉత్కంఠతో ఆలకిస్తూ, ఆ హారాన్ని సీతమ్మవారు ఎవరికి ఇస్తుందా అని ఆత్రంగా చూస్తున్నారు. హనుమంతుడు మాత్రం ఏమీ పట్టనట్లుగా నిశ్చలంగా రాముణ్ణే చూస్తూ ఉన్నాడు. సీతమ్మవారు హనుమంతుడిని పిలిచి, రాముడు తనకు ఇచ్చిన హారాన్ని అతడికిచ్చింది. హనుమంతుడు ఆ హారాన్ని మెడలో ధరించాడు. సభాసదులందరూ హర్షధ్వానాలు చేశారు. తర్వాత హనుమంతుడు తన ఆసనంపై యథాప్రకారం ఆసీనుడయ్యాడు. సీతమ్మవారు తనకు ఇచ్చిన హారంలోని రత్నాలను ఒక్కొక్క దాన్నే పరిశీలనగా చూస్తూ, ఒక్కొక్క రత్నాన్నే కొరికి నేల మీద పడేయసాగాడు. సభాసదులందరూ హనుమంతుని చేష్టను వింతగా చూడసాగారు. ఇంతలో విభీషణుడు ధైర్యం చేసి, ‘కోతికేం తెలుసు అల్లం రుచి’ అన్నాడు. హనుమంతుడు విభీషణుడివైపు చూసి, ‘లంకాధిపా! అయితే ఏమంటావు? మీ లంకలోని రాక్షసులు ఎక్కువగా అల్లం తింటారు. అందుకే మీకు తెలిసినంతగా అల్లం రుచి మా వానరులకు ఎలా తెలుస్తుంది?’ అన్నాడు. ‘తినకపోతే మాత్రం నీలా ఉన్నామా? సీతమ్మవారు విలువైన హారాన్ని కానుకగా ఇస్తే, నువ్వు చేస్తున్న పనేమిటి?’ అని కాస్త కోపంగానే అడిగాడు విభీషణుడు. ‘సీతమ్మ ఎంతో విలువైనదిగా భావించే ఈ హారాన్ని నాకు ఇచ్చింది కదా, ఇందులో నా దేవుడు ఉన్నాడో లేడోనని చూస్తున్నాను. ఏ ఒక్క రత్నంలోనూ నా దేవుడైన రాముడు కనిపించలేదు. నా దేవుడు లేని వస్తువు ఏదైనా అది నాకు విలువ లేనిదే’ అన్నాడు హనుమంతుడు. ‘సరేనయ్యా! ఈ మణులలో నీ దేవుడైన రాముడు లేడు. పర్వతంలాంటి శరీరంతో తిరుగుతున్నావు కదా, అందులో మాత్రం ఉన్నాడేమిటి?’ అన్నాడు విభీషణుడు. ఆ మాటకు ఆవేశభరితుడైన హనుమంతుడు, తన పదునైన గోళ్లతో రొమ్ము చీల్చి గుండె తెరిచాడు. నివ్వెరపోతూ చూస్తున్న సభాసదులకు హనుమ హృదయంలో సీతారాములు కనిపించారు. వారంతా దిగ్భ్రాంతులయ్యారు. రాముడు హుటాహుటిన సింహాసనం దిగివచ్చి, హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. -సాంఖ్యాయన -
మందపాలుడి కథ
పూర్వం మందపాలుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయనకు లపిత అనే భార్య ఉండేది. అయితే, వారికి సంతానం లేదు. మందపాలుడికి తపస్సు చేయాలనే కోరిక కలిగింది. వెంటనే బ్రహ్మచర్య దీక్ష వహించి, ఒక కీకారణ్యంలోకి చేరుకున్నాడు. అక్కడ వెయ్యేళ్లు ఘోర తపస్సు చేశాడు. తర్వాత యోగమార్గంలో ప్రాణత్యాగం చేశాడు. ప్రాణాలు వదిలిన తర్వాత ఊర్ధ్వ లోకాలకు పయనమయ్యాడు. పుణ్యలోకాల్లోకి ప్రవేశించకుండా దేవదూతలు అతడిని అడ్డుకున్నారు. ‘నన్నెందుకు అడ్డుకుంటున్నారు? వెయ్యేళ్లు తపస్సు చేసిన నాలాంటి తపస్సంపన్నుడైన మహర్షికి పుణ్యలోకాల్లో ప్రవేశం లేకపోవడానికి కారణం ఏమిటి? నేనే పాపం చేశాను?’ అని మందపాలుడు దేవదూతలను నిలదీశాడు. ‘ఎంత తపస్సు చేసినా ఏం ప్రయోజనం? సంతానం లేనిదే సద్గతులు సంప్రాప్తించవు. నువ్వు తిరిగి భూలోకానికి వెళ్లి, సంతానం పొంది వస్తే, అప్పుడు పుణ్యలోకాల్లోకి ప్రవేశించగలవు’ అని బదులిచ్చారు దేవదూతలు. మందపాలుడు మళ్లీ భూలోకానికి వచ్చేశాడు. త్వరితగతిన సంతానం పొందడం భూమ్మీద పక్షులకే సాధ్యమని, పక్షుల్లో లావుక పిట్టలు మరింత త్వరితగతిన సంతానం పొందగలవని గుర్తించి, లావుక పిట్టగా మారాడు. జరిత అనే లావుక పిట్టతో కాపురం చేసి, సంతానం పొందాడు. పక్షుల రూపంలో పుట్టినా, మందపాలుడి నలుగురు కుమారులూ బ్రహ్మజ్ఞానులు. సంతానం కలిగిన తర్వాత మందపాలుడు జరితకు, ఆమె నలుగురు కుమారులకు ఖాండవవనంలో ఒక గూడును ఏర్పరచాడు. కొంతకాలం అక్కడ ఉన్న తర్వాత తన మొదటి భార్య లపిత దగ్గరకు బయలుదేరాడు.ఒకరోజు అతడికి మార్గమధ్యంలో ఖాండవవనం వైపు వస్తున్న అగ్నిదేవుడు ఎదురయ్యాడు. అగ్నిని చూడగానే, అతడు ఖాండవవనాన్ని దహించడానికే వస్తున్నాడని మందపాలుడికి అర్థమైపోయింది. అగ్నికీలల్లో తన భార్యకు, సంతానానికి ప్రాణగండం తప్పదని గ్రహించి, అగ్నిసూక్తాలు పఠిస్తూ ఎదురేగి, అగ్నికి నమస్కరించాడు. మందపాలుడి స్తోత్రాలకు అగ్నిదేవుడు ప్రసన్నుడయ్యాడు. ‘మహర్షీ! ఏమి కోరిక?’ అని అడిగాడు. ‘అగ్నిదేవా! ఈ ఖాండవవనంలోనే నా భార్య, నా నలుగురు కొడుకులు లావుక పిట్టల రూపంలో ఉన్నారు. ఖండవవనాన్ని దహించేటప్పుడు వాళ్ల మీద దయచూపు. వాళ్లకు ప్రాణహాని లేకుండా కాపాడు’ అని ప్రార్థించాడు. ఈ సంగతి జరితకు, ఆమె పిల్లలకు తెలియదు. సరేనంటూ అగ్నిదేవుడు మందపాలుడికి అభయమిచ్చాడు. కృష్ణార్జునుల అండతో అగ్నిదేవుడు ఖాండవవనాన్ని దహించడం ప్రారంభించాడు. అగ్నిని నిలువరించడానికి వచ్చిన దేవేంద్రుడితో కృష్ణార్జులు యుద్ధం సాగించారు. వనాన్నంతటినీ అగ్నికీలలు దహించివేస్తూ దూసుకొస్తుండటంతో జరిత భయపడింది. రెక్కలు రాని కూనలను ఎలా రక్షించుకోగలననుకుని ఆమె దుఃఖించసాగింది. కూనలను వదిలేసి, తన మానాన తాను ఎగిరిపోవడానికి ఆమెకు మనసు రాలేదు. అందుకని ఆమె తన కొడుకులకు ఒక ఉపాయం చెప్పింది.‘బిడ్డలారా! ఈ చెట్టు కిందనే నేల మీద ఎలుకలు చేసిన బొరియ కనిపిస్తోంది. మీరు నెమ్మదిగా వెళ్లి అందులో దాక్కోండి. నేను బొరియ ప్రవేశమార్గాన్ని మట్టితో కప్పేస్తాను. అప్పడు మీకు అగ్ని వేడి సోకదు. అగ్ని చల్లారిన తర్వాత మనం మళ్లీ కలుసుకుందాం’ అంది.జరిత కూనలలో పెద్దవాడు జరితారి ‘అమ్మా! ఎలుకల బిలంలోకి వెళితే, అక్కడ మమ్మల్ని ఎలుకలు చంపి తినేస్తాయి. ఎలుకలకు ఆహారం కావడం కంటే, అగ్నికి ఆహుతైపోవడమే పుణ్యం. గాలితో పాటు అగ్ని మరోవైపు మళ్లితే, ఇక్కడే మేం బతికే అవకాశం ఉంటుంది. కనుక మేం ఇక్కడే ఉంటాం. నువ్వు ఎగిరి పారిపో! కనీసం నీకైనా ప్రాణాపాయం తప్పుతుంది. మేం కాలిపోయినా, నీకు మళ్లీ సంతానం కలుగుతుంది. ప్రాప్తముంటే మళ్లీ మేమే నీకు సంతానంగా కలగవచ్చు. నీ పుణ్యం వల్ల మేం బతికి బయటపడ్డామంటే మనం మళ్లీ కలుసుకోవచ్చు’ అని చెప్పాడు. ఇలా రకరకాలుగా నచ్చచెప్పి, నాలుగు కూనలూ తల్లిని సాగనంపాయి. ఇంతలో వనమంతా దహించేస్తూ ఉన్న అగ్ని పక్షికూనలు వైపు వచ్చాడు. మందపాలుడి కుమారులైన నలుగురూ వేదమంత్రాలతో అగ్నిదేవుడిని స్తుతించారు. అగ్ని వారికి అభయమిచ్చి, వారికి ఏ అపాయం లేకుండా కాపాడాడు.ఖాండవ దహనం పూర్తయి, అగ్ని చల్లారిన తర్వాత జరిత తిరిగి వచ్చింది. తన గూడు, పిల్లలూ క్షేమంగా ఉండటం చూసి సంతోషించింది. -
రింకూ సిక్సర్ సింగ్
అహ్మదాబాద్లో కోల్కతా నైట్రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్.. గుజరాత్ 204 పరుగులు చేయగా.. భారీ లక్ష్యంతో కేకేఆర్ బరిలోకి దిగింది. మ్యాచ్ ముగింపు దశకు వచ్చే సరికి కోల్కతా ఓటమి దాదాపు ఖాయమైంది. విజయంపై ఎవరికీ ఎలాంటి అంచనాల్లేవు. ఆట ఆఖరి ఓవర్కు చేరింది. చివరి 5 బంతుల్లో 28 పరుగులు కావాలి. అంటే కచ్చితంగా ప్రతి బంతికీ సిక్సర్ రావాల్సిందే. ఐపీఎల్ చరిత్రలో గానీ అంతర్జాతీయ టి20ల్లో గానీ ఇది ఎప్పుడూ సాధ్యం కాలేదు. దాంతో గుజరాత్ ఆటగాళ్లు తమ గెలుపు ఖాయమైందని భావించి నిశ్చింతగా ఉన్నారు. అయితే బ్యాటింగ్ చేస్తున్న ఆ యువకుడు అందరికంటే భిన్నంగా ఆలోచించాడు. తన ఆటపై అచంచల విశ్వాసం ఉన్న అతను ఆ పరుగులు ఎందుకు సాధ్యం కావు అనుకున్నాడు. మానసికంగా కూడా ఎంతో దృఢమైన అతను బయటకు ఎలాంటి భావోద్వేగాలు చూపించలేదు. సిక్సర్ల కోసం సిద్ధమైపోయాడు. గుజరాత్ బౌలర్ యశ్ దయాల్ ఒక్కో బంతిని వేస్తూ వచ్చాడు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు.. ఇలా బంతి స్టాండ్స్లోకి వెళుతూనే ఉంది. అనూహ్యం, అద్భుతం, అసాధారణం..లాంటి ఏ విశ్లేషణలకూ సరిపోని రీతిలో ఆ వీరంగం సాగింది. 6, 6, 6, 6, 6 .. ఐదు సిక్సర్లతో 30 పరుగులు రాబట్టి ఆ బ్యాటర్ జట్టును గెలిపించాడు. తన సత్తాతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆ యువకుడే 26 ఏళ్ల రింకూ సింగ్. అతను ఒక్క రోజులో స్టార్గా మారేందుకు ఆ ఐపీఎల్ మ్యాచ్ ఒక వేదిక అయింది. అయితే ఈ ఐదు సిక్సర్లతో మాత్రమే రింకూ గొప్ప ఆటగాడిగా మారిపోలేదు. ఈ మ్యాచ్కంటే ముందు కూడా అతను ఈ స్థాయికి ఎదిగేందుకు కష్టపడిన తీరు, పోరాటం, పట్టుదల అతనిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇక్కడి వరకు సాగిన అతని ప్రయాణం ఆసక్తికరం, స్ఫూర్తిదాయకం. -మొహమ్మద్ అబ్దుల్ హాది కొంతకాలం కిందటి వరకూ క్రికెట్ అందరి ఆట. సామాన్యుడు కూడా తన ఆటతో ఉన్నత స్థాయికి చేరేందుకు మంచి అవకాశాలు మెండుగా ఉండేవి. అయితే ఐపీఎల్ కారణంగా క్రికెట్లో బాగా డబ్బు చేరడంతో అందులో అడుగుపెట్టి పైస్థాయికి చేరడం కష్టంగా మారిపోయిన పరిస్థితి. మంచి నేపథ్యం లేదా డబ్బు ఉండటం లేదా పెద్ద పరిచయాలు.. ఇలాంటివేవీ లేకుండా క్రికెట్ ప్రపంచంలో మనుగడ కష్టం. ఇది స్కూల్ క్రికెట్, అండర్ –13 స్థాయి నుంచే కనిపిస్తుంది. ఆటలో సత్తా ఉన్నా జట్టులో చోటు దక్కించుకోవడం, ప్రాథమిక దశలో ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశాలు రావడం అంత సులువు కాదు. ఉత్తరప్రదేశ్లాంటి రాష్ట్ర సంఘాల్లో ఇది చాలా చాలా ఎక్కువ. అలాంటి చోట నెగ్గాలంటే అసాధారణ ప్రతిభ ఉండాలి. ఆ ప్లేయర్ ఆటను చూసి ఇక అతనిని ఆపలేమని, అవకాశం కల్పించక తప్పదనే పరిస్థితి కల్పించాలి. ఇక్కడే రింకూ సింగ్లాంటి కుర్రాడు అందరికీ ఆదర్శంగా నిలుస్తాడు. తనలోని ఆట, ఆత్మవిశ్వాసమే అతడిని పైస్థాయి వరకు చేర్చింది. ఏ రకంగా చూసినా రింకూది కనీసం మధ్య తరగతి కూడా కాదు. అతని తండ్రి గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్లు సరఫరా చేసే ఉద్యోగి. అది తప్ప మరో ఆదాయవనరు లేదు. అలాంటి నేపథ్యంలో అతను క్రికెట్ను ఎంచుకోవడం పెద్ద సాహసమే. తండ్రి కూడా ఫలానాది చేయమని, వద్దని వారించే స్థితిలో లేడు. దాంతో చిన్న వయసులోనే అన్నీ తానై రింకూ సొంత నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. కొందరు మిత్రుల కారణంగా క్రికెట్ వైపు ఆకర్షితుడైన రింకూ కొద్ది రోజుల్లోనే అద్భుత ఆటగాడు అనే దశకు చేరాడు. తన నేపథ్యం కారణంగా స్కూల్ క్రికెట్ ఆడే అవకాశం అతనికి రాలేదు. కానీ క్లబ్ క్రికెట్లో రింకూ అనే ఒక కుర్రాడు ఉన్నాడని, భారీ షాట్లతో విరుచుకుపడతాడనే గుర్తింపు వచ్చింది. మరోవైపు సహజంగానే రోజూవారీ ఖర్చులకు సంబంధించి సమస్యలు వద్దనుకున్నా తోడొచ్చాయి. తనూ ఏదైనా పని చేస్తే తప్ప తనకూ, ఇంటికీ ఉపయోగపడలేడని అర్థమైంది. క్రికెట్ ఆడే టైమ్ మినహా తతిమా సమయాల్లో ఎలాంటి పని దొరికినా చేయడానికి సిద్ధపడ్డాడు. ఒక కోచింగ్ సెంటర్లో చిన్న చిన్న పనులతో పాటు స్వీపర్గా ఆఫీస్ను శుభ్రం చేసే పని కూడా చేశాడు. అయితే ఏనాడూ అతను ఈ విషయంలో చింతించలేదు. ఎట్టి పరిస్థితుల్లో తన క్రికెట్ ఆట మాత్రం ఆగకూడదని ఆశించాడు. తన భవిష్యత్తుపై గట్టి నమ్మకం ఉంచాడు. అలా మొదలైన ఆట.. రింకూ దూకుడైన ఆట గురించి యూపీ క్రికెట్ వర్గాల్లో బాగా చర్చకు వచ్చింది. దాంతో 2013లో తొలిసారి యూపీ అండర్–16 జట్టులో చోటు లభించింది. ఆ ఎంపికతో అధికారికంగా అతని ఆటకు ఆమోద ముద్ర పడింది. ఆ తొలి అవకాశాన్ని అతను వృథా చేసుకోలేదు. బంతిని చూడటం, బలంగా బాదడం.. తనకు తెలిసిన విద్యనే అంతటా ప్రదర్శించి యూపీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా యూపీ అండర్–19 టీమ్లోకి రావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. దేశవ్యాప్తంగా అందరి దృష్టీ ఉండే అండర్–19 స్థాయికి వచ్చాక రింకూ ప్రదర్శనలే అతని విలువేంటో చూపించాయి. ఆపై వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేని రీతిలో రింకూ ఆట సాగింది. మరోవైపు అండర్–16 స్థాయి నుంచే తనకు డైలీ అలవెన్స్ల రూపంలో వచ్చే చిన్న చిన్న మొత్తాలను కూడా పొదుపు చేసుకుంటూ.. ఇంటి ఖర్చుల కోసం దాచుకునే విషయంలో సగటు దిగువ మధ్య తరగతి మనస్తత్వాన్నే అనుసరించాడు. భారీ షాట్లు కొట్టడం, ఏ బౌలర్నైనా లెక్క చేయకుండా ఆధిపత్యాన్ని ప్రదర్శించడం, కీలక సమయాల్లో కూడా ఒత్తిడి లేకుండా ఆడటం వంటి అర్హతలు రింకూ స్థానాన్ని సుస్థిరం చేశాయి. ఈ క్రమంలో 17 ఏళ్ల వయసులోనే యూపీ సీనియర్ వన్డే జట్టులో, టి20 టీమ్లో చోటు సంపాదించుకున్నాడు. త్రిపురతో జరిగిన వన్డేలో 44 బంతుల్లోనే 91 పరుగులు బాదడంతో అతను నిలబడగలడనే నమ్మకం కలిగింది. రెండేళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో ఆడే అవకాశం రావడంతో దేశవాళీ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో రింకూ ప్రధాన ఆటగాడిగా మారిపోయాడు. ఐపీఎల్ ప్రస్థానం.. తమ టీమ్లోకి తీసుకునేందుకు ఐపీఎల్ జట్లు టాలెంట్ సెర్చ్ క్యాంప్లు నిర్వహిస్తుంటాయి. అందులో భాగంగా ముంబై ఇండియన్స్ కూడా సెలక్షన్స్ ఏర్పాటు చేసింది. ఒక మ్యాచ్లో 18 ఏళ్ల రింకూ 31 బంతుల్లోనే 95 పరుగులు బాది సంచలనం సృష్టించాడు. చివరకు వేర్వేరు కారణాలతో ముంబై అవకాశం ఇవ్వకపోయినా కొద్దిరోజులకే అతని ప్రతిభ గురించి తెలిసిన పంజాబ్ జట్టు రూ. 10 లక్షలకు రింకూను సొంతం చేసుకుంది. తర్వాతి సీజన్లోనే 2018లో జరిగిన ఐపీఎల్ వేలంలో రూ. 20 లక్షల కనీస విలువతో అతను బరిలో నిలవగా, నాలుగు రెట్లు ఎక్కువగా రూ. 80 లక్షలకు కోల్కతా ఎంచుకుంది. ఇదే అతని కెరీర్లో మేలి మలుపు. తొలి మూడు సీజన్లలో తగినన్ని అవకాశాలు రాకపోయినా 2022లో ఫినిషర్గా ఇచ్చిన పాత్రలో అతను చెలరేగిపోయాడు. ముఖ్యంగా లక్నోతో జరిగిన మ్యాచ్లో 15 బంతుల్లో 40 పరుగులు చేయడంతో అతని విలువ తెలిసింది. ఈ సీజన్లోనైతే తన మెరుపు బ్యాటింగ్తో ప్రత్యేక ముద్ర వేసిన రింకూ కేకేఆర్ తరఫున టాప్స్కోరర్గా నిలవడం విశేషం. ఇదే ఆట రింకూకు భారత టి20 జట్టులో చోటు కల్పించగా అక్కడ చెలరేగిపోయిన ఈ యూపీ బ్యాటర్ 2024 టి20 వరల్డ్ కప్ కోసం తన అవకాశాలు మెరుగుపరచుకున్నాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 6 ఇన్నింగ్సే ఆడిన రింకూ 96 బంతుల్లోనే 180 పరుగులు సాధించాడు. ఇందులో 134 పరుగులు ఫోర్లు, సిక్సర్ల ద్వారానే వచ్చాయి. హాస్టల్ సౌకర్యం కల్పించి.. భారత జట్టు క్రికెటర్గా ఎదిగినా రింకూ తన మూలాలను మర్చిపోలేదు. డబ్బు విలువ బాగా తెలిసినవాడిగా దానిని సమర్థంగా వాడుకోవడం కూడా ముఖ్యమని భావించాడు. ముందుగా తన ఇంటి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దిన అనంతరం అతను చేసిన పని రింకూపై మరింత గౌరవాన్ని పెంచింది. తన స్వస్థలమైన అలీగఢ్లో.. తాను ఓనమాలు నేర్చుకున్న కోచింగ్ సెంటర్లో క్రికెట్ నేర్చుకునేందుకు వచ్చే పేద ఆటగాళ్ల కోసం రూ. 50 లక్షలు వెచ్చించి.. హాస్టల్ బిల్డింగ్ కట్టించాడు. ఆట కోసం వచ్చి.. భారీ అద్దెలు కడుతున్నవారి కోసమే ఈ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు అతను చెప్పాడు. -
బాయి దాహం
‘ఈ బాయికి దాహం జాస్తి! ఎబ్బుడు తీర్తాదో ఏమో!’ హఠాత్తుగా అంది వెంకటలక్ష్మి. ‘బావికి దాహం ఏందే ఎర్రి ఎంకటమ్మా’ నవ్వేసింది రోజా. ‘అసలు ఈ బావే ఎంతమంది దాహం తీర్చిందో.. ఎన్ని పంటలకు నీళ్లిచ్చిందో కదా!’ బావి చుట్టూ ఉన్న పచ్చటి పంట పొలాలను చూస్తూ అంది. అది చాలా పెద్ద దిగుడు బావి. దాని లోతు ఎన్ని మట్లో ఎవరికీ తెలీదు. పేరే పెద్ద బావి! నిండు వేసవిలో కూడా అందులో నీళ్లు తగ్గవు. వేసిన ప్రతి పంటా సిరుల పంటే! ఒకప్పుడు.. తాతల కాలంలో.. ఏతం తొక్కడం, కపిల బానలతో బావిలో నుండి నీళ్లు తోడి పొలాలకు పారించే వాళ్ళట. ఇప్పుడు తండ్రి హయాంలో మోటర్లు బిగించారు. స్విచ్ వేయడం ఆలస్యం నీళ్లు పైపుల నుండి దూకుతాయి. కరెంటు కోతే తప్ప నీళ్ల కొరత ఎప్పుడూ లేదు. ‘పద్దన అమ్మ నన్ను ‘ఎంకటా’ అని పిలిస్తే నువ్వేమంటివీ?’ నడుం మీద రెండు చేతులు పెట్టుకొని గంభీరంగా చూస్తూ నిలదీసింది వెంకటలక్ష్మి. ‘ఏమన్నానబ్బా?’ గుర్తు తెచ్చుకుంది రోజా. ‘ఎంకటి వుండబట్టిగానీ లేపోతే నేనేం చేసుందును? మీ అప్పను చూసేదానికి వచ్చేవాల్లు .. పోయేవాల్లు.. ఇల్లంతా తిరనాల మాదిరి ఉండె. ఇంట్లో పని.. వంట పని మొత్తమంతా ఆ బిడ్డే సమాళించింది.’ అమ్మ మాటలకు తను చిరాకు పడింది వెంకటలక్ష్మి వేపు మెచ్చుకోలుగా చూస్తూనే! ‘ఎంకటి ఏంది మా సంకటి మాదిరి. దాని పేరు వెంకటలక్ష్మి. మా వెంకటరెడ్డి సారు దానికి ఆ పేరు పెట్టి రిజిస్టర్లో రాసినారు తెల్సా!’ ‘ఆ! ఆ! తెల్సులే! బడిలో చేరిన చానామంది పిల్లోల్లకి ఆ పేరే పెట్టినాడంట కదా ఆ ఎంకట్రెడ్డి సారు? ఆడపిలకాయలకు ఎంకటలక్ష్మి.. మగ పిలకాయలకు ఎంకటేసూ అనీ! ఆ యప్పకు ఆయన పేరు అంటే ఇస్టమో లేపోతే ఆ ఎంకటేస్పర సామంటే భకితో మల్ల!’ అమ్మ నవ్వుతూ అంది. ‘అది నిజమే! అయినా నేను తప్ప దీన్ని ‘వెంకటలక్ష్మి’ అని ఎవరూ పిలవలా! ఆఖరికి పేరు పెట్టిన మా సారు కూడా! అందరూ ఎంకటా.. ఎంకటమ్మా అనేవాళ్ళే!’ కినుకగా అంటున్న తన మాటలకు అందరూ నవ్వేసుకున్నారు. ఇప్పుడు నవ్వొచ్చేసింది ఇద్దరికీ. ‘సారీ బా! అలవాట్లో పొరపాటు. అవునూ.. మన వెంకట రెడ్డి సారు ఎలా ఉన్నారు? బాగున్నారా? తిరగలాడుతారా?’ ఆసక్తిగా అడిగింది రోజా. ‘ఆహా! బొంగరం మాదిరి. మొన్నో దినం మీ అప్పని చూసేదానికి కూడా వొచ్చినారు. పక్క పల్లెలోనే సారు ఉండేది.’ ‘అవునా! ఒకసారి పోయి చూసి వద్దామే సారును! మనకు అక్షరాభ్యాసం చేసిన గురువు కదా!’ ‘ఎబ్బుడొచ్చినా పట్టు పట్టుమని పోడమే గాని నాలుగు దినాలుండినావా ఎబ్బుడన్నా? ఉడుకు నీల్లు కాల్ల మింద పోసుకొని వొచ్చినట్టు వొస్తావు. ఇబ్బుటికో మాపటేలకో మీ ఇంటాయన పోన్ చేస్తే తెల్లారే బస్సెక్కెయ్యవూ?’ నవ్వింది వెంకటలక్ష్మి. ‘లేదులేవే! పద్దినాలు రానని చెప్పొచ్చినాలే! అప్పను చూస్తేనే బాధగా వుందే! పెద్దపులి మాదిరి ఉండేవాడు.. ఇప్పుడు ఇట్లా మంచాన పడి ఉంటే చూడలేకపోతున్నా!’ రోజా కళ్ళు చెమర్చాయి. ‘సావాల్సింది’ వెంకటలక్ష్మి మాట పదునుకు అదిరిపడింది రోజా. ‘ఏమంటివే?’ రోజా గొంతులో కోపం కళ్ళల్లో ఎరుపును నింపింది. ‘ఆ! డాక్టర్ చెప్పిండ్లా! బీపీ తలక్కొడితే సానామంది గుండాగి సత్తారంట కదా! మీ అప్ప అదృస్టం.. కాలు సెయ్యి పడిపోయినా ప్రానంతో వుండాడు కదా మనిసి’ వెంకటలక్ష్మి మాటల్లో అమాయకతకు రోజా లజ్జపడింది తన తొందరపాటు కోపానికి. ‘అవును అమ్మ అయిదోతనమే అప్పను కాపాడిందన్నారు అందరూ! కానీ ఇంటికి, పొలానికి, పట్నానికి తిరుగుతూ ఉండే కాలు.. అడుగు వేయలేని ఇప్పటి పరిస్థితికి.. హూంకరింపులతోనే దడిపించే నోరు.. వంకర పోయి మాట స్పష్టంగా పలకలేని నిస్సహాయతకు అప్ప ఎంత నరకయాతన అనుభవిస్తున్నాడో..’ అనుకుంటుంటే కడుపులో దేవినట్లైంది రోజాకు. ‘వెంకటలక్ష్మి! మా అప్పకు మీ అప్ప చేసే సేవ.. నువ్వు అమ్మకు అన్ని విధాలా సహాయంగా ఉండటం.. నిజంగా మీ ఇద్దరికీ చాలా థాంక్సే! మీ రుణం తీర్చలేనిది’ రోజా మనస్ఫూర్తిగా అంది వెంకటలక్ష్మి చేయి తీసుకుని ఆప్యాయంగా నొక్కుతూ. ‘అయ్యో! అదేంమాట? అమ్మ సేతి కూడు తిని బతికే మాకు తాంక్స్ ఎందుకు? అమ్మ మల్లిపూలు కోసుకు రమ్మనింది. కోద్దాం రా!’ అంటూ వెంకటలక్ష్మి మల్లెచెట్టు వైపు నడిచింది. ‘అమ్మకీ దొంతు మల్లిపూలంటే సానా ఇస్టం!’ పంటల నాట్లు, కోతలప్పుడు, చెరుకు గానుగలాడేనప్పుడు తండ్రి ఎక్కువగా పొలం దగ్గరే ఉండేవాడు. భోజనం చేయడానికి.. కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడే ఓ చిన్న గది కట్టించాడు.. ఇదివరకు ఉన్న పాకను పీకేయించి. రోజా మెల్లగా గది తలుపు తీసి లోపలికి వెళ్ళబోయి ఆగిపోయింది. ఆమె చూపులు క్షణం పాటు గదిని పరిశీలనగా చూసి చికిలించుకుపోయాయి. వెంటనే తలుపు మూసేసి మల్లెచెట్టు వైపు నడిచింది. మల్లెపొద కింద కూర్చుని వెంకటలక్ష్మి ఏడుస్తోంది. రోజా గాభరాగా వెళ్లి పక్కన కూర్చుని వెంకటలక్ష్మి భుజం చుట్టూ చెయ్యేసి ‘ఏంటిది వెంకటలక్ష్మి! ఊర్కో!’ అంది. ‘ఈ బాయికి ఎంతమంది ఉసుర్లు తీస్కొన్నా దాహం తీరలే! కడాకు నా రాముడ్ని కూడా..’ వెక్కివెక్కి ఏడుస్తున్న వెంకటలక్ష్మిని ఓదార్చడం రోజా వల్ల కాలేదు. ‘పోయినోళ్లు పుణ్యాత్ములు! ఉన్నోళ్లు పోయినోళ్ళ తీపి గుర్తులు అంటారు. రాముడు ఎక్కడికి పోతాడు? నీ కడుపులో పెరుగుతున్నాడు కదా! బాధపడకు వెంకటలక్ష్మీ! బిడ్డ కోసమన్నా నువ్వు మనసు నిబ్బరం చేసుకోవాలి’ ఓదార్పుగా అంది రోజా. ‘అవును మా! నా బిడ్డ కోసమే బతికుండా. లేపోతే రాముడ్తో పాటే పొయుండనా?’ ఏడుస్తూనే ఉంది వెంకటలక్ష్మి. బావి దగ్గర బురదలో జారి.. బావిలో పడబోతున్న తండ్రిని లాగి పడేసి తను బావిలోకి జారిపోయాడని చెప్పారు. ఆ షాక్లో.. హై బీపీతో అప్పకు పక్షవాతం వచ్చింది. వెంకటలక్ష్మి అరుపులకు.. కాస్త దూరంగా పొలాల్లో పనులు చేసుకుంటున్న వాళ్లు వచ్చి అప్పను ఇంటికి తీసుకుపోయే హడావిడిలో పడ్డారు. కానీ నీళ్లలో పడ్డ రామున్ని గుర్తించలేదు. వెంకటలక్ష్మి భయంతో, దుఃఖంతో సొమ్మసిల్లి పడిపోయింది.తనకు తెలివి వచ్చేసరికి రాముడు వాకిట్లో దీపం ముందు పడుకోబెట్టబడి ఉన్నాడు. ఆమె దుఃఖ సముద్రమే అయింది. ఇప్పటికీ విచారం, విషాదం నిండిన దుఃఖపు అలలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. కడుపులో బిడ్డ కోసం గుండెలవిసే దుఃఖానికి కంటి రెప్పల చెలియలికట్ట వేసుకొని భారంగా శరీరాన్ని, మనసును మోస్తోంది. చిన్నప్పుడు తాము ఈ బావి దగ్గర ఎన్ని ఆటలు ఆడుకునే వాళ్ళు? ఎండాకాలం సెలవుల్లో మగ పిల్లలంతా ఈ బావిలోనే ఈత కొట్టేవాళ్ళు. పెద్ద పిల్లలు చిన్న పిల్లలకు బెండు కట్టి ఈత నేర్పేవాళ్లు. పెద్ద పిల్లలకు కూడా ఈత నేర్పేంత ఈతగాడు రాముడు. వాడు బావిలోకి దూకే విధానం, నీళ్లలో వేసే మునకలు వేగంగా ఈత కొట్టడం.. చాలా ముచ్చటగా, థ్రిల్లింగ్ గానూ ఉండేది చూసే తమకు. వెంకటలక్ష్మి మరీ మురిపెంగా చూసేది. రాముడు తనకు మేనమామ కొడుకే. ఎల్లమ్మ జాతరకు వచ్చిన రాముడి తల్లి ప్రమాదవశాత్తు ఇదే బావిలో పడి చనిపోతే రాముడ్ని తమ ఇంట్లోనే పెట్టుకొని పెంచారు వెంకటలక్ష్మి తల్లిదండ్రులు. తర్వాత కొంత కాలానికే అనూహ్యంగా ఇదే బావిలో పడి వెంకటలక్ష్మి తల్లి కూడా చనిపోతే ఇద్దర్నీ వెంకటలక్ష్మి నానమ్మే సాకింది. ‘ఒరేయ్! మాకు కూడా ఈత నేర్పీరా!’ అని తను, వెంకటలక్ష్మి కూడా రాముడ్ని బతిమిలాడే వాళ్ళు. ‘దీనికి నేర్పిస్తా! నీకు మాత్తరం నేర్పీను. అమ్మో! మీ అప్ప పెద్దపులి. నాకు భయమబ్బా’ అనేవాడు రాముడు. వెంకటలక్ష్మికి నేర్పాడు కూడా. ఈత కొడుతూ కేరింతలాడే వాళ్ళని చూస్తూ తను ఉక్రోష పడేది. వాళ్ళిద్దరి చిన్ననాటి నెయ్యం మూడుముళ్ల బంధం అయింది. చూడ చక్కని జంట! చిలుకాగోరింకల్లా అన్యోన్యంగా, ఆనందంగా వున్న ఆ జంటను చూసి విధికే కన్ను కుట్టిందేమో! మృత్యువు .. బావి రూపంలో వచ్చి రాముడ్ని మింగేసింది. ‘వెంకటలక్ష్మీ! రాముడు గజ ఈతగాడు కదా? వాడు నీళ్లలో మునిగి చనిపోవడం ఏమిటి?’ హఠాత్తుగా అడిగింది రోజా. ‘మొక్కే దేముడే యముడై ముంచేస్తే ఏం చేస్తాములే మా!’ నిర్లిప్తంగా అంది వెంకటలక్ష్మి కళ్ళు తుడుచుకుంటూ. ‘అదేమట్లంటావు? అసలేం జరిగిందా రోజు? నువ్విక్కడే వున్నావుగా?’ రోజా దీర్ఘంగా చూస్తూ అడిగింది. ‘ఏమి జరక్కూడదో అదే జరిగిపోయినంక ఇంగిపుడు ఏంజేస్తాములే మా!’ నిర్వేదంగా అంది వెంకటలక్ష్మి. ‘బాయిలో పడేనబ్బుడు గోడకు తగిలి తల పగిలిందన్నారు’ శుష్కహాసం చేసింది. ‘అయినా గడా ఈ బాయికి ఎంత దాహమో! మాయమ్మ, అత్త, ఊర్లో చానా మంది ఆడవాళ్ల ఉసుర్లు.. కడాకు నా రాముడి ఉసురు గడా పోసుకొనింది. దీనికి వాయి వరసా లేదు’ వెంకటలక్ష్మి మాటలు కోపం, దుఃఖం, బాధ కలగలిపి జీరగా ఉన్నాయి. ‘అది కాదు వెంకటలక్ష్మీ..’ రోజా ఏదో అనబోయేంతలో మధ్యలో కలగజేసుకుంది వెంకటలక్ష్మి.. ‘అంతంత పెద్ద సదువులు సదివినావు కదా! ఏదొక దినం నీకే అర్తమవుతాది లే. పదమా! అమ్మ ఎదురు సూస్తాంటాది’ అంటూ ముందుకు నడిచింది.. కోసిన మల్లెమొగ్గలు కొంగులో మూటకట్టుకొంటూ!‘కుప్పా! రెడ్డప్ప బాయికాడ ఏమి లిబ్బి పెట్టిండాడో! ఎంచేపూ ‘బాయి.. బాయి..’ అని కలవరిస్తానే ఉండాడు. ఏందో నీ పున్యాన.. ఆ ఆయురేద మందులు, నువ్వు చేసే నూనె మర్తన.. పని చేస్తుండబట్టి ఇబ్బుడు నాలుగు అడుగులు ఏస్తా వుండాడో లేదో.. బాయి కాడికి పోవాలని పల్లాయి ఎత్తుకొన్యాడు. పోయీ మెల్లంగా తీస్కపోరా!’ రెడ్డెప్పకు కాలు, చెయ్యి నూనె మసాజ్, స్నానం చేపించి.. బట్టలు తొడిగి.. టిఫిన్ తినిపించి.. టీవీ ముందు వాలు కుర్చీలో కూర్చోబెట్టి వచ్చిన కుప్పడికి చద్దన్నం పెడుతూ అంది సావిత్రమ్మ. కుప్పడు ఇడ్లీలు, దోశలు తినడు. మూడు పూటలా అన్నమే కావాలంటాడు. ఆ రోజు శుక్రవారం. తలారా స్నానం చేసి తన పొడవాటి జుట్టును కింద జారుముడి వేసి ఇంత మల్లెపూల దండ పెట్టుకుంది. పసుపు రాసిన మొహంలో పావలా కాసంత నిండు ఎరుపు కుంకుమ బొట్టుతో లక్ష్మీదేవిలా కళకళ్ళాడుతున్న సావిత్రమ్మను అలా చూస్తూ ఉండిపోయాడు కుప్పడు తినడం కూడా మర్చిపోయి. ‘పర్వాలేదు లేరా బాద, కస్టం, ఏడుపూ.. అన్నీ మర్చిపోతిన్లేరా! అసలుకు అయ్యన్నీ అలవాటైపోయిండ్లా? ఎదిరించడం, ఎదురు మాటాడటం.. తెలీకుండానే మన కాలం గడిచిపోయ కదా! మన బిడ్డలు బాగుంటే సాలనుకుంటిమి. కానీ.. దేముడని నమ్మితే.. నీకు, నీ బిడ్డకు గడా అన్నాయమే చేసినాడా ముండా దేముడు. ఆ పొద్దు నీ పెండ్లాన్ని, చెల్లిని, ఇబ్బుడు నీ అల్లుడ్ని గడా తీస్కపోయి’ గద్గదంగా అంది సావిత్రమ్మ. ఆమె కళ్ళు ఉబ్బి, మంకెన పువ్వుల్లా ఎర్రగా ఉన్నాయి. కుప్పడు మాటా పలుకు లేకుండా చూస్తున్నాడు గానీ గుండెలో అదురు పుట్టింది. సావిత్రమ్మ మాటలు వింటున్న వెంకటలక్ష్మి కూడా బొమ్మలా అయిపోయి అలా చూస్తోంది. ఇద్దరి కళ్ళూ ధారాపాతంగా వర్షించడం మొదలెట్టాయి. అది చూసి ‘ఏంరా కుప్పా? ఏమైందీ’ సావిత్రమ్మ కంగారుగా అడిగింది. ఏమీ లేదన్నట్లు అడ్డంగా తలూపుతూ చేతిలోని పచ్చిమిరపకాయ చూపించాడు కుప్పడు. ‘నువ్వెందుకు ఏడస్తాండావే ఎంకటమ్మా?’ వెంకటలక్ష్మి వేపు తిరిగింది సావిత్రమ్మ. వెంకటలక్ష్మి ఒడిలో ఉన్న చాటలో తను తొక్క తీస్తున్న ఉల్లిపాయలు చూపింది. ‘బాగుండాదిలే మీ కత! నిన్ను మిరపకాయ, దాన్ని ఎర్రగడ్డ ఏడ్పిస్తాండాయా?’ నిట్టూర్చింది సావిత్రమ్మ. ‘అది సరే.. చిన్న బిడ్డ.. ఎర్రగడ్డ గాటు తట్టుకోలేదు. నీకేందిరా కుప్పా? ఇంత జీవితం చూసినంక గడా అంతంత కారం మింగినాక గడా ఇంగా ఏడుస్తాంటే ఎట్లా ? తిను. తిను. తినేసి రెడ్డెప్పను బాయి కాడికి తొడ్కో పో! ఎంకటమ్మను నీ కూడా తీస్కపో! తోడుంటాది. ఇద్దురూ భద్రం! ముందూ ఎనకా చూస్కోండి’ జాగ్రత్తలు చెప్తూనే సావిత్రమ్మ దేవుని గదిలోకి వెళ్ళిపోయింది. ‘అప్పా! నెలలు నిండిపోయినాయంట. రెండు మూడు దినాల్లో పురుడొచ్చేస్తాదని సెప్పింది నర్సమ్మ. పుట్టేది రాముడే. వాడీ భూమ్మీద పడేలోగా..’ పొద్దున గొడ్లచావిట్లో తండ్రిని పట్టుకొని ఏడుస్తున్న వెంకటలక్ష్మి.. సావిత్రమ్మను చూసి మాట మింగేసింది. ఆమె ప్రతి శుక్రవారం గోపూజ చేస్తుంది. పూజా సామగ్రి పళ్ళెంతో వచ్చింది. ‘తొలి కాపు కదమా! బిడ్డ బయపడతాంది’ కుప్పడు సావిత్రమ్మను చూసి తడబడ్డాడు. ‘తల్లి లేని బిడ్డ. తొలి కానుపు భయం ఉంటాదిలే! ఇంట్లో ఆడదిక్కు లేదు. తోడుగా మీ చెల్లిని రమ్మన్నానంటివే! ఇంగా రాలేదా?’ కుప్పడు ఒళ్ళంతా తోమి, కడిగి తయారుగా వుంచిన ఆవు నొసట్న పసుపు కుంకుమ పెడుతూ అడిగింది. ‘చెనిగి చెట్లు పెరకతాండారంటమా! ఈ పొద్దు అయిపోతాది రేపటికంతా వొచ్చేస్తానని చెప్పింది’ చెప్పాడు కుప్పడు. ‘సరే! అయినా గడా ఎంకట్లక్ష్మి పే..ద్ద ధైర్నవంతురాలని రోజమ్మ అంటాంటాంది. నువ్వేమిట్లా ఎర్రిగొడ్డులా ఏడస్తాండావు?’ అంది సావిత్రమ్మ ఆవు చుట్టూ ప్రదక్షణాలు చేస్తూ! ‘మనూరి నర్సమ్మ చెయ్యివాసి మంచిది. నీకేం కాదులేమే! మంచిగా కానుపైతాదిలే! ఆ దేముడు, రాముడు నీకు తోడుంటార్లే!’ ధైర్యం చెప్పింది. సావిత్రమ్మ.. రెడ్డెప్పను బావి దగ్గరకు తీసుకుపొమ్మని చెప్పి లోపలికి వెళ్ళిపోయాక ఒకరి మొహాలొకరు చూసుకున్నారు తండ్రీ కూతుళ్ళు! కూడబలుక్కున్నట్లుగా ఇద్దరూ ఒకేసారి లేచి నిలబడ్డారు కళ్ళు తుడుచుకొంటూ! ‘అప్ప ఆరోగ్యం పూర్తిగా కుదుట పడనేలేదు. కర్రసాయం లేకండా నడవలేడు. ఆయన అడిగితే మాత్రం నువ్వు ఎట్లా పంపించినావు మా బావి దగ్గరకు? అక్కడేమి పుట్టి మునిగిపోతా ఉందని?’ రోజా తల్లిని నిలదీసింది నిష్ఠూరంగా. తండ్రి చనిపోయి దశ దిన కర్మలు ముగిశాక.. బంధువులంతా ఎక్కడి వాళ్ళక్కడ వెళ్లిపోయాక తల్లి కూతుర్లు మిగిలారు ఇంట్లో. బావి దగ్గరికి వెళ్లిన తండ్రి కాలుజారి బావిలో పడిపోయాడు. కాపాడాలని కుప్పడు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ‘ఏం చేసేది రోజమ్మా? ఆయనే పొద్దు నా మాట యిన్నాడని? అసలుకు ఏమన్నా ఎదురు చెప్పే ధైర్నమన్నా నాకుండేనా? అయినా.. కిష్ణుడు గీతలో చెప్పినట్టు నా మాట నిమిత్తమాత్తరమే! ఆయన సావు ఆయనే తెచ్చుకొన్యాడు.’ ‘నువ్వే తీసుకుపొమ్మన్నావని చెప్పినాడే కుప్పడు?’ సాలోచనగా చూసింది తల్లి వైపు. ‘అవునుమా! చెప్పినా. వాల్లిద్దరి దుక్కం సూడ్లేకపోయినా. వాల్లు తాతల తరాల నుండి మన ఇంటినే నమ్ముకొని బతికే సేద్దిగాల్లు. వాల్లకు అన్నాయమే జరిగింది. ఎంకటమ్మ నీ ఈడే కదా? అంటే మాక్కూడా బిడ్డ మాదిరే కదా? అమా.. అమా.. అనుకుంటా నా కూడా తిరగతా ఇంట్లో పెరిగిన బిడ్డ కదా! ఇబ్బుడు కడుపుతో వుండాదా? అది సంతోసంగా వుండాల్సిన టయమిది. కానీ దాని ఖర్మానికి.. కడుపులో బిడ్డతోపాటు.. గుండెలో మొగుడు పోయిన దుక్కం గడా మోస్తాంది. ముందు దాని దుక్క బారం తీరాల. అబ్బుడే అది కనే బిడ్డను సంతోసంగా సాకతాది అన్పించె నాకు. కడుపుతో వున్న.. తల్లి లేని బిడ్డ కోరికను తల్లి మాదిరి తీర్చల్ల కదా!’ సావిత్రమ్మ శూన్యంలోకి చూస్తూ నిర్లిప్తంగా, నిర్విచారంగా, నిర్వేదంగా చెబుతుంటే రోజా గుడ్లప్పగించి చూస్తోంది. తానేం అడిగింది.. తల్లి ఏం చెబుతోంది? అర్థంకాని అయోమయం! హఠాత్తుగా ఆమె కళ్ళల్లో తానా రోజు బావి దగ్గర గదిలో చూసిన చిందరవందర సామాను, ఎండిపోయిన మల్లెపూల దండలు, పగిలిన గాజు ముక్కల దృశ్యం కదలాడింది. ‘బాయిలో వున్న ఎంతోమంది ఉసుర్లు సంతోసంగా, ప్రెసాంత బడిన దినాన బాయి దాహం తీర్తాది’ వెంకటలక్ష్మి కసి మాటలు గుర్తొచ్చాయి. ఊర్లో వాళ్ళు, బంధువులు, సేద్యగాళ్ళు, పొలం పనులకు వచ్చే కూలి వాళ్ళు ‘లక్ష్మీదేవి, అన్నపూర్ణమ్మ తల్లి’ అని పొగుడుకొనే అమ్మలో దుష్టశిక్షణ చేసే ఒక కాళికా మాత కనిపించింది రోజా కళ్ళకి. తల్లి దగ్గరగా జరిగి గట్టిగా కౌగిలించుకొని బుగ్గపై ముద్దు పెడుతుంటే ఆమె బుగ్గ తడి తియ్యగా తగిలింది. ‘కుప్పా! రెడ్డప్ప బాయికాడ ఏమి లిబ్బి పెట్టిండాడో! ఎంచేపూ ‘బాయి.. బాయి..’ అని కలవరిస్తానే ఉండాడు. ఏందో నీ పున్యాన.. ఆ ఆయురేద మందులు, నువ్వు చేసే నూనె మర్తన.. పని చేస్తుండబట్టి ఇబ్బుడు నాలుగు అడుగులు ఏస్తా వుండాడో లేదో.. బాయి కాడికి పోవాలని పల్లాయి ఎత్తుకొన్యాడు. పోయీ మెల్లంగా తీస్కపోరా! ‘ఈ బాయికి దాహం జాస్తి! ఎబ్బుడు తీర్తాదో ఏమో!’ హఠాత్తుగా అంది వెంకటలక్ష్మి. ‘బావికి దాహం ఏందే ఎర్రి ఎంకటమ్మా’ నవ్వేసింది రోజా. ‘అసలు ఈ బావే ఎంతమంది దాహం తీర్చిందో.. ఎన్ని పంటలకు నీళ్లిచ్చిందో కదా!’ బావి చుట్టూ ఉన్న పచ్చటి పంట పొలాలను చూస్తూ అంది. అది చాలా పెద్ద దిగుడు బావి. దాని లోతు ఎన్ని మట్లో ఎవరికీ తెలీదు. పేరే పెద్ద బావి! నిండు వేసవిలో కూడా అందులో నీళ్లు తగ్గవు. వేసిన ప్రతి పంటా సిరుల పంటే! ఒకప్పుడు.. తాతల కాలంలో.. ఏతం తొక్కడం, కపిల బానలతో బావిలో నుండి నీళ్లు తోడి పొలాలకు పారించే వాళ్ళట. ఇప్పుడు తండ్రి హయాంలో మోటర్లు బిగించారు. స్విచ్ వేయడం ఆలస్యం నీళ్లు పైపుల నుండి దూకుతాయి. కరెంటు కోతే తప్ప నీళ్ల కొరత ఎప్పుడూ లేదు. ‘పద్దన అమ్మ నన్ను ‘ఎంకటా’ అని పిలిస్తే నువ్వేమంటివీ?’ నడుం మీద రెండు చేతులు పెట్టుకొని గంభీరంగా చూస్తూ నిలదీసింది వెంకటలక్ష్మి.‘ఏమన్నానబ్బా?’ గుర్తు తెచ్చుకుంది రోజా.‘ఎంకటి వుండబట్టిగానీ లేపోతే నేనేం చేసుందును? మీ అప్పను చూసేదానికి వచ్చేవాల్లు .. పోయేవాల్లు.. ఇల్లంతా తిరనాల మాదిరి ఉండె. ఇంట్లో పని.. వంట పని మొత్తమంతా ఆ బిడ్డే సమాళించింది.’అమ్మ మాటలకు తను చిరాకు పడింది వెంకటలక్ష్మి వేపు మెచ్చుకోలుగా చూస్తూనే! ‘ఎంకటి ఏంది మా సంకటి మాదిరి. దాని పేరు వెంకటలక్ష్మి. మా వెంకటరెడ్డి సారు దానికి ఆ పేరు పెట్టి రిజిస్టర్లో రాసినారు తెల్సా!’ ‘ఆ! ఆ! తెల్సులే! బడిలో చేరిన చానామంది పిల్లోల్లకి ఆ పేరే పెట్టినాడంట కదా ఆ ఎంకట్రెడ్డి సారు? ఆడపిలకాయలకు ఎంకటలక్ష్మి.. మగ పిలకాయలకు ఎంకటేసూ అనీ! ఆ యప్పకు ఆయన పేరు అంటే ఇస్టమో లేపోతే ఆ ఎంకటేస్పర సామంటే భకితో మల్ల!’ అమ్మ నవ్వుతూ అంది. ‘అది నిజమే! అయినా నేను తప్ప దీన్ని ‘వెంకటలక్ష్మి’ అని ఎవరూ పిలవలా! ఆఖరికి పేరు పెట్టిన మా సారు కూడా! అందరూ ఎంకటా.. ఎంకటమ్మా అనేవాళ్ళే!’ కినుకగా అంటున్న తన మాటలకు అందరూ నవ్వేసుకున్నారు. ఇప్పుడు నవ్వొచ్చేసింది ఇద్దరికీ. ‘సారీ బా! అలవాట్లో పొరపాటు. అవునూ.. మన వెంకట రెడ్డి సారు ఎలా ఉన్నారు? బాగున్నారా? తిరగలాడుతారా?’ ఆసక్తిగా అడిగింది రోజా. ‘ఆహా! బొంగరం మాదిరి. మొన్నో దినం మీ అప్పని చూసేదానికి కూడా వొచ్చినారు. పక్క పల్లెలోనే సారు ఉండేది.’ ‘అవునా! ఒకసారి పోయి చూసి వద్దామే సారును! మనకు అక్షరాభ్యాసం చేసిన గురువు కదా!’ ‘ఎబ్బుడొచ్చినా పట్టు పట్టుమని పోడమే గాని నాలుగు దినాలుండినావా ఎబ్బుడన్నా? ఉడుకు నీల్లు కాల్ల మింద పోసుకొని వొచ్చినట్టు వొస్తావు. ఇబ్బుటికో మాపటేలకో మీ ఇంటాయన పోన్ చేస్తే తెల్లారే బస్సెక్కెయ్యవూ?’ నవ్వింది వెంకటలక్ష్మి. ‘లేదులేవే! పద్దినాలు రానని చెప్పొచ్చినాలే! అప్పను చూస్తేనే బాధగా వుందే! పెద్దపులి మాదిరి ఉండేవాడు.. ఇప్పుడు ఇట్లా మంచాన పడి ఉంటే చూడలేకపోతున్నా!’ రోజా కళ్ళు చెమర్చాయి. ‘సావాల్సింది’ వెంకటలక్ష్మి మాట పదునుకు అదిరిపడింది రోజా. ‘ఏమంటివే?’ రోజా గొంతులో కోపం కళ్ళల్లో ఎరుపును నింపింది. ‘ఆ! డాక్టర్ చెప్పిండ్లా! బీపీ తలక్కొడితే సానామంది గుండాగి సత్తారంట కదా! మీ అప్ప అదృస్టం.. కాలు సెయ్యి పడిపోయినా ప్రానంతో వుండాడు కదా మనిసి’ వెంకటలక్ష్మి మాటల్లో అమాయకతకు రోజా లజ్జపడింది తన తొందరపాటు కోపానికి. ‘అవును అమ్మ అయిదోతనమే అప్పను కాపాడిందన్నారు అందరూ! కానీ ఇంటికి, పొలానికి, పట్నానికి తిరుగుతూ ఉండే కాలు.. అడుగు వేయలేని ఇప్పటి పరిస్థితికి.. హూంకరింపులతోనే దడిపించే నోరు.. వంకర పోయిమాటస్పష్టంగా పలకలేని నిస్సహాయతకు అప్ప ఎంత నరకయాతన అనుభవిస్తున్నాడో..’ అనుకుంటుంటే కడుపులో దేవినట్లైంది రోజాకు. ‘వెంకటలక్ష్మి! మా అప్పకు మీ అప్ప చేసే సేవ.. నువ్వు అమ్మకు అన్ని విధాలా సహాయంగా ఉండటం.. నిజంగా మీ ఇద్దరికీ చాలా థాంక్సే! మీ రుణం తీర్చలేనిది’ రోజా మనస్ఫూర్తిగా అంది వెంకటలక్ష్మి చేయి తీసుకుని ఆప్యాయంగా నొక్కుతూ. ‘అయ్యో! అదేంమాట? అమ్మ సేతి కూడు తిని బతికే మాకు తాంక్స్ ఎందుకు? అమ్మ మల్లిపూలు కోసుకు రమ్మనింది. కోద్దాం రా!’ అంటూ వెంకటలక్ష్మి మల్లెచెట్టు వైపు నడిచింది. ‘అమ్మకీ దొంతు మల్లిపూలంటే సానా ఇస్టం!’ పంటల నాట్లు, కోతలప్పుడు, చెరుకు గానుగలాడేనప్పుడు తండ్రి ఎక్కువగా పొలం దగ్గరే ఉండేవాడు. భోజనం చేయడానికి.. కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడే ఓ చిన్న గది కట్టించాడు.. ఇదివరకు ఉన్న పాకను పీకేయించి. రోజా మెల్లగా గది తలుపు తీసి లోపలికి వెళ్ళబోయి ఆగిపోయింది. ఆమె చూపులు క్షణం పాటు గదిని పరిశీలనగా చూసి చికిలించుకుపోయాయి. వెంటనే తలుపు మూసేసి మల్లెచెట్టు వైపు నడిచింది. మల్లెపొద కింద కూర్చుని వెంకటలక్ష్మి ఏడుస్తోంది. రోజా గాభరాగా వెళ్లి పక్కన కూర్చుని వెంకటలక్ష్మి భుజం చుట్టూ చెయ్యేసి ‘ఏంటిది వెంకటలక్ష్మి! ఊర్కో!’ అంది. ‘ఈ బాయికి ఎంతమంది ఉసుర్లు తీస్కొన్నా దాహం తీరలే! కడాకు నా రాముడ్ని కూడా..’ వెక్కివెక్కి ఏడుస్తున్న వెంకటలక్ష్మిని ఓదార్చడం రోజా వల్ల కాలేదు. ‘పోయినోళ్లు పుణ్యాత్ములు! ఉన్నోళ్లు పోయినోళ్ళ తీపి గుర్తులు అంటారు. రాముడు ఎక్కడికి పోతాడు? నీ కడుపులో పెరుగుతున్నాడు కదా! బాధపడకు వెంకటలక్ష్మీ! బిడ్డ కోసమన్నా నువ్వు మనసు నిబ్బరం చేసుకోవాలి’ ఓదార్పుగా అంది రోజా. ‘అవును మా! నా బిడ్డ కోసమే బతికుండా. లేపోతే రాముడ్తో పాటే పొయుండనా?’ ఏడుస్తూనే ఉంది వెంకటలక్ష్మి. బావి దగ్గర బురదలో జారి.. బావిలో పడబోతున్న తండ్రిని లాగి పడేసి తను బావిలోకి జారిపోయాడని చెప్పారు. ఆ షాక్లో.. హై బీపీతో అప్పకు పక్షవాతం వచ్చింది. వెంకటలక్ష్మి అరుపులకు.. కాస్త దూరంగా పొలాల్లో పనులు చేసుకుంటున్న వాళ్లు వచ్చి అప్పను ఇంటికి తీసుకుపోయే హడావిడిలో పడ్డారు. కానీ నీళ్లలో పడ్డ రామున్ని గుర్తించలేదు. వెంకటలక్ష్మి భయంతో, దుఃఖంతో సొమ్మసిల్లి పడిపోయింది.తనకు తెలివి వచ్చేసరికి రాముడు వాకిట్లో దీపం ముందు పడుకోబెట్టబడి ఉన్నాడు. ఆమె దుఃఖ సముద్రమే అయింది. ఇప్పటికీ విచారం, విషాదం నిండిన దుఃఖపు అలలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. కడుపులో బిడ్డ కోసం గుండెలవిసే దుఃఖానికి కంటి రెప్పల చెలియలికట్ట వేసుకొని భారంగా శరీరాన్ని, మనసును మోస్తోంది. చిన్నప్పుడు తాము ఈ బావి దగ్గర ఎన్ని ఆటలు ఆడుకునే వాళ్ళు? ఎండాకాలం సెలవుల్లో మగ పిల్లలంతా ఈ బావిలోనే ఈత కొట్టేవాళ్ళు. పెద్ద పిల్లలు చిన్న పిల్లలకు బెండు కట్టి ఈత నేర్పేవాళ్లు. పెద్ద పిల్లలకు కూడా ఈత నేర్పేంత ఈతగాడు రాముడు. వాడు బావిలోకి దూకే విధానం, నీళ్లలో వేసే మునకలు వేగంగా ఈత కొట్టడం.. చాలా ముచ్చటగా, థ్రిల్లింగ్ గానూ ఉండేది చూసే తమకు. వెంకటలక్ష్మి మరీ మురిపెంగా చూసేది. రాముడు తనకు మేనమామ కొడుకే. ఎల్లమ్మ జాతరకు వచ్చిన రాముడి తల్లి ప్రమాదవశాత్తు ఇదే బావిలో పడి చనిపోతే రాముడ్ని తమ ఇంట్లోనే పెట్టుకొని పెంచారు వెంకటలక్ష్మి తల్లిదండ్రులు. తర్వాత కొంత కాలానికే అనూహ్యంగా ఇదే బావిలో పడి వెంకటలక్ష్మి తల్లి కూడా చనిపోతే ఇద్దర్నీ వెంకటలక్ష్మి నానమ్మే సాకింది. ‘ఒరేయ్! మాకు కూడా ఈత నేర్పీరా!’ అని తను, వెంకటలక్ష్మి కూడా రాముడ్ని బతిమిలాడే వాళ్ళు. ‘దీనికి నేర్పిస్తా! నీకు మాత్తరం నేర్పీను. అమ్మో! మీ అప్ప పెద్దపులి. నాకు భయమబ్బా’ అనేవాడు రాముడు. వెంకటలక్ష్మికి నేర్పాడు కూడా. ఈత కొడుతూ కేరింతలాడే వాళ్ళని చూస్తూ తను ఉక్రోష పడేది. వాళ్ళిద్దరి చిన్ననాటి నెయ్యం మూడుముళ్ల బంధం అయింది. చూడ చక్కని జంట! చిలుకాగోరింకల్లా అన్యోన్యంగా, ఆనందంగా వున్న ఆ జంటను చూసి విధికే కన్ను కుట్టిందేమో! మృత్యువు .. బావి రూపంలో వచ్చి రాముడ్ని మింగేసింది. ‘వెంకటలక్ష్మీ! రాముడు గజ ఈతగాడు కదా? వాడు నీళ్లలో మునిగి చనిపోవడం ఏమిటి?’ హఠాత్తుగా అడిగింది రోజా. ‘మొక్కే దేముడే యముడై ముంచేస్తే ఏం చేస్తాములే మా!’ నిర్లిప్తంగా అంది వెంకటలక్ష్మి కళ్ళు తుడుచుకుంటూ. ‘అదేమట్లంటావు? అసలేం జరిగిందా రోజు? నువ్విక్కడే వున్నావుగా?’ రోజా దీర్ఘంగా చూస్తూ అడిగింది. ‘ఏమి జరక్కూడదో అదే జరిగిపోయినంక ఇంగిపుడు ఏంజేస్తాములే మా!’ నిర్వేదంగా అంది వెంకటలక్ష్మి. ‘బాయిలో పడేనబ్బుడు గోడకు తగిలి తల పగిలిందన్నారు’ శుష్కహాసం చేసింది. ‘అయినా గడా ఈ బాయికి ఎంత దాహమో! మాయమ్మ, అత్త, ఊర్లో చానా మంది ఆడవాళ్ల ఉసుర్లు.. కడాకు నా రాముడి ఉసురు గడా పోసుకొనింది. దీనికి వాయి వరసా లేదు’ వెంకటలక్ష్మి మాటలు కోపం, దుఃఖం, బాధ కలగలిపి జీరగా ఉన్నాయి. ‘అది కాదు వెంకటలక్ష్మీ..’ రోజా ఏదో అనబోయేంతలో మధ్యలో కలగజేసుకుంది వెంకటలక్ష్మి.. ‘అంతంత పెద్ద సదువులు సదివినావు కదా! ఏదొక దినం నీకే అర్తమవుతాది లే. పదమా! అమ్మ ఎదురు సూస్తాంటాది’ అంటూ ముందుకు నడిచింది.. కోసిన మల్లెమొగ్గలు కొంగులో మూటకట్టుకొంటూ! ‘కుప్పా! రెడ్డప్ప బాయికాడ ఏమి లిబ్బి పెట్టిండాడో! ఎంచేపూ ‘బాయి.. బాయి..’ అని కలవరిస్తానే ఉండాడు. ఏందో నీ పున్యాన.. ఆ ఆయురేద మందులు, నువ్వు చేసే నూనె మర్తన.. పని చేస్తుండబట్టి ఇబ్బుడు నాలుగు అడుగులు ఏస్తా వుండాడో లేదో.. బాయి కాడికి పోవాలని పల్లాయి ఎత్తుకొన్యాడు. పోయీ మెల్లంగా తీస్కపోరా!’ రెడ్డెప్పకు కాలు, చెయ్యి నూనె మసాజ్, స్నానం చేపించి.. బట్టలు తొడిగి.. టిఫిన్ తినిపించి.. టీవీ ముందు వాలు కుర్చీలో కూర్చోబెట్టి వచ్చిన కుప్పడికి చద్దన్నం పెడుతూ అంది సావిత్రమ్మ. కుప్పడు ఇడ్లీలు, దోశలు తినడు. మూడు పూటలా అన్నమే కావాలంటాడు. ఆ రోజు శుక్రవారం. తలారా స్నానం చేసి తన పొడవాటి జుట్టును కింద జారుముడి వేసి ఇంత మల్లెపూల దండ పెట్టుకుంది. పసుపు రాసిన మొహంలో పావలా కాసంత నిండు ఎరుపు కుంకుమ బొట్టుతో లక్ష్మీదేవిలా కళకళ్ళాడుతున్న సావిత్రమ్మను అలా చూస్తూ ఉండిపోయాడు కుప్పడు తినడం కూడా మర్చిపోయి. ‘పర్వాలేదు లేరా బాద, కస్టం, ఏడుపూ.. అన్నీ మర్చిపోతిన్లేరా! అసలుకు అయ్యన్నీ అలవాటైపోయిండ్లా? ఎదిరించడం, ఎదురు మాటాడటం.. తెలీకుండానే మన కాలం గడిచిపోయ కదా! మన బిడ్డలు బాగుంటే సాలనుకుంటిమి. కానీ.. దేముడని నమ్మితే.. నీకు, నీ బిడ్డకు గడా అన్నాయమే చేసినాడా ముండా దేముడు. ఆ పొద్దు నీ పెండ్లాన్ని, చెల్లిని, ఇబ్బుడు నీ అల్లుడ్ని గడా తీస్కపోయి’ గద్గదంగా అంది సావిత్రమ్మ. ఆమె కళ్ళు ఉబ్బి, మంకెన పువ్వుల్లా ఎర్రగా ఉన్నాయి. కుప్పడు మాటా పలుకు లేకుండా చూస్తున్నాడు గానీ గుండెలో అదురు పుట్టింది. సావిత్రమ్మ మాటలు వింటున్న వెంకటలక్ష్మి కూడా బొమ్మలా అయిపోయి అలా చూస్తోంది. ఇద్దరి కళ్ళూ ధారాపాతంగా వర్షించడం మొదలెట్టాయి. అది చూసి ‘ఏంరా కుప్పా? ఏమైందీ’ సావిత్రమ్మ కంగారుగా అడిగింది. ఏమీ లేదన్నట్లు అడ్డంగా తలూపుతూ చేతిలోని పచ్చిమిరపకాయ చూపించాడు కుప్పడు. ‘నువ్వెందుకు ఏడస్తాండావే ఎంకటమ్మా?’ వెంకటలక్ష్మి వేపు తిరిగింది సావిత్రమ్మ. వెంకటలక్ష్మి ఒడిలో ఉన్న చాటలో తను తొక్క తీస్తున్న ఉల్లిపాయలు చూపింది. ‘బాగుండాదిలే మీ కత! నిన్ను మిరపకాయ, దాన్ని ఎర్రగడ్డ ఏడ్పిస్తాండాయా?’ నిట్టూర్చింది సావిత్రమ్మ. ‘అది సరే.. చిన్న బిడ్డ.. ఎర్రగడ్డ గాటు తట్టుకోలేదు. నీకేందిరా కుప్పా? ఇంత జీవితం చూసినంక గడా అంతంత కారం మింగినాక గడా ఇంగా ఏడుస్తాంటే ఎట్లా ? తిను. తిను. తినేసి రెడ్డెప్పను బాయి కాడికి తొడ్కో పో! ఎంకటమ్మను నీ కూడా తీస్కపో! తోడుంటాది. ఇద్దురూ భద్రం! ముందూ ఎనకా చూస్కోండి’ జాగ్రత్తలు చెప్తూనే సావిత్రమ్మ దేవుని గదిలోకి వెళ్ళిపోయింది. ‘అప్పా! నెలలు నిండిపోయినాయంట. రెండు మూడు దినాల్లో పురుడొచ్చేస్తాదని సెప్పింది నర్సమ్మ. పుట్టేది రాముడే. వాడీ భూమ్మీద పడేలోగా..’ పొద్దున గొడ్లచావిట్లో తండ్రిని పట్టుకొని ఏడుస్తున్న వెంకటలక్ష్మి.. సావిత్రమ్మను చూసి మాట మింగేసింది. ఆమె ప్రతి శుక్రవారం గోపూజ చేస్తుంది. పూజా సామగ్రి పళ్ళెంతో వచ్చింది. ‘తొలి కాపు కదమా! బిడ్డ బయపడతాంది’ కుప్పడు సావిత్రమ్మను చూసి తడబడ్డాడు. ‘తల్లి లేని బిడ్డ. తొలి కానుపు భయం ఉంటాదిలే! ఇంట్లో ఆడదిక్కు లేదు. తోడుగా మీ చెల్లిని రమ్మన్నానంటివే! ఇంగా రాలేదా?’ కుప్పడు ఒళ్ళంతా తోమి, కడిగి తయారుగా వుంచిన ఆవు నొసట్న పసుపు కుంకుమ పెడుతూ అడిగింది. ‘చెనిగి చెట్లు పెరకతాండారంటమా! ఈ పొద్దు అయిపోతాది రేపటికంతా వొచ్చేస్తానని చెప్పింది’ చెప్పాడు కుప్పడు. ‘సరే! అయినా గడా ఎంకట్లక్ష్మి పే..ద్ద ధైర్నవంతురాలని రోజమ్మ అంటాంటాంది. నువ్వేమిట్లా ఎర్రిగొడ్డులా ఏడస్తాండావు?’ అంది సావిత్రమ్మ ఆవు చుట్టూ ప్రదక్షణాలు చేస్తూ! ‘మనూరి నర్సమ్మ చెయ్యివాసి మంచిది. నీకేం కాదులేమే! మంచిగా కానుపైతాదిలే! ఆ దేముడు, రాముడు నీకు తోడుంటార్లే!’ ధైర్యం చెప్పింది. సావిత్రమ్మ.. రెడ్డెప్పను బావి దగ్గరకు తీసుకుపొమ్మని చెప్పి లోపలికి వెళ్ళిపోయాక ఒకరి మొహాలొకరు చూసుకున్నారు తండ్రీ కూతుళ్ళు! కూడబలుక్కున్నట్లుగా ఇద్దరూ ఒకేసారి లేచి నిలబడ్డారు కళ్ళు తుడుచుకొంటూ! ‘అప్ప ఆరోగ్యం పూర్తిగా కుదుట పడనేలేదు. కర్రసాయం లేకండా నడవలేడు. ఆయన అడిగితే మాత్రం నువ్వు ఎట్లా పంపించినావు మా బావి దగ్గరకు? అక్కడేమి పుట్టి మునిగిపోతా ఉందని?’ రోజా తల్లిని నిలదీసింది నిష్ఠూరంగా. తండ్రి చనిపోయి దశ దిన కర్మలు ముగిశాక.. బంధువులంతా ఎక్కడి వాళ్ళక్కడ వెళ్లిపోయాక తల్లి కూతుర్లు మిగిలారు ఇంట్లో. బావి దగ్గరికి వెళ్లిన తండ్రి కాలుజారి బావిలో పడిపోయాడు. కాపాడాలని కుప్పడు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ‘ఏం చేసేది రోజమ్మా? ఆయనే పొద్దు నా మాట యిన్నాడని? అసలుకు ఏమన్నా ఎదురు చెప్పే ధైర్నమన్నా నాకుండేనా? అయినా.. కిష్ణుడు గీతలో చెప్పినట్టు నా మాట నిమిత్తమాత్తరమే! ఆయన సావు ఆయనే తెచ్చుకొన్యాడు.’ ‘నువ్వే తీసుకుపొమ్మన్నావని చెప్పినాడే కుప్పడు?’ సాలోచనగా చూసింది తల్లి వైపు. ‘అవునుమా! చెప్పినా. వాల్లిద్దరి దుక్కం సూడ్లేకపోయినా. వాల్లు తాతల తరాల నుండి మన ఇంటినే నమ్ముకొని బతికే సేద్దిగాల్లు. వాల్లకు అన్నాయమే జరిగింది. ఎంకటమ్మ నీ ఈడే కదా? అంటే మాక్కూడా బిడ్డ మాదిరే కదా? అమా.. అమా.. అనుకుంటా నా కూడా తిరగతా ఇంట్లో పెరిగిన బిడ్డ కదా! ఇబ్బుడు కడుపుతో వుండాదా? అది సంతోసంగా వుండాల్సిన టయమిది. కానీ దాని ఖర్మానికి.. కడుపులో బిడ్డతోపాటు.. గుండెలో మొగుడు పోయిన దుక్కం గడా మోస్తాంది. ముందు దాని దుక్క బారం తీరాల. అబ్బుడే అది కనే బిడ్డను సంతోసంగా సాకతాది అన్పించె నాకు. కడుపుతో వున్న.. తల్లి లేని బిడ్డ కోరికను తల్లి మాదిరి తీర్చల్ల కదా!’ సావిత్రమ్మ శూన్యంలోకి చూస్తూ నిర్లిప్తంగా, నిర్విచారంగా, నిర్వేదంగా చెబుతుంటే రోజా గుడ్లప్పగించి చూస్తోంది. తానేం అడిగింది.. తల్లి ఏం చెబుతోంది? అర్థంకాని అయోమయం! హఠాత్తుగా ఆమె కళ్ళల్లో తానా రోజు బావి దగ్గర గదిలో చూసిన చిందరవందర సామాను, ఎండిపోయిన మల్లెపూల దండలు, పగిలిన గాజు ముక్కల దృశ్యం కదలాడింది. ‘బాయిలో వున్న ఎంతోమంది ఉసుర్లు సంతోసంగా, ప్రెసాంత బడిన దినాన బాయి దాహం తీర్తాది’ వెంకటలక్ష్మి కసి మాటలు గుర్తొచ్చాయి. ఊర్లో వాళ్ళు, బంధువులు, సేద్యగాళ్ళు, పొలం పనులకు వచ్చే కూలి వాళ్ళు ‘లక్ష్మీదేవి, అన్నపూర్ణమ్మ తల్లి’ అని పొగుడుకొనే అమ్మలో దుష్టశిక్షణ చేసే ఒక కాళికా మాత కనిపించింది రోజా కళ్ళకి. తల్లి దగ్గరగా జరిగి గట్టిగా కౌగిలించుకొని బుగ్గపై ముద్దు పెడుతుంటే ఆమె బుగ్గ తడి తియ్యగా తగిలింది. అవునుమా! చెప్పినా. వాల్లిద్దరి దుక్కం సూడ్లేకపోయినా. వాల్లు తాతల తరాల నుండి మన ఇంటినే నమ్ముకొని బతికే సేద్దిగాల్లు. వాల్లకు అన్నాయమే జరిగింది. ఎంకటమ్మ నీ ఈడే కదా? అంటే మాక్కూడా బిడ్డ మాదిరే కదా? అమా.. అమా.. అనుకుంటా నా కూడా తిరగతా ఇంట్లో పెరిగిన బిడ్డ కదా! ఇబ్బుడు కడుపుతో వుండాదా? అది సంతోసంగా వుండాల్సిన టయమిది. కానీ దాని ఖర్మానికి.. కడుపులో బిడ్డతోపాటు.. గుండెలో మొగుడు పోయిన దుక్కం గడా మోస్తాంది. - యం.ఆర్ అరుణకుమారి -
జీవిత భాగస్వామి విషయంలో ఆ తప్పిదమే ఆ సైనికుడి జీవితాన్ని..!
ఏ దేశంలోనైనా బంధాలకు విలువనిచ్చే జీవితాలు ఎప్పటికీ ఆదర్శంగానే నిలుస్తాయి. అయితే ఒక బంధాన్ని ఏర్పరచుకునేటప్పుడు ‘ఎవరి చేతిని పట్టుకుని నడవబోతున్నాం?’ అనేదాని పట్ల స్పష్టత అవసరం. లేదంటే జీవితం ఊహించని మలుపులు తిరిగి ఉక్కిరిబిక్కిరవుతుందని చెప్పే ఉదంతమే ఇది. 1978 డిసెంబర్ 19, డెరెల్డ్ టేసీ అనే సైనికుడి జీవితంలో అదో చీకటి రోజు. జార్జియా, రిచ్మండ్ కౌంటీలోని కార్నివాల్కి చెందిన అతను.. ప్రాణంగా ప్రేమించిన భార్యను పోగొట్టుకున్నాడు. అప్పటికే కొన్ని నెలలుగా ఎన్యూరిజం వ్యాధికి గురైన ఆమె (జార్జియా బోయిడ్) కోమాలోకి వెళ్లిపోయి.. చివరికి 22 ఏళ్ల వయసులో మరణించింది. కళ్లముందు చిన్న చిన్న పిల్లలు నలుగురు.. మెదడులో అంతుచిక్కని ప్రశ్నలు.. డెరెల్డ్ని కుదురుగా ఉండనివ్వడంలేదు. భార్య మరణం నాటి నుంచి మొదలైన అతడి అన్వేషణ.. చివరికి అసంపూర్తిగానే మిగిలిపోయింది. అప్పటికి మూడేళ్ల క్రితం వరకూ డెరెల్డ్ జీవితం బిందాస్గానే సాగింది. 1975లో జార్జియా బోయిడ్ పరిచయమైన తర్వాత అతని జీవితమే ఆమె అయిపోయింది. బోయిడ్ అగస్టాలోని ఒక బార్లో గోగో డాన్సర్గా పని చేస్తుందని తెలుసుకున్నప్పటి నుంచి.. అతని ప్రతి ప్రయాణం ఆమె కోసమే సాగింది. ఆమెతో స్నేహం, ప్రేమ, పెళ్లి, పిల్లలు ఈ క్రమంలో చాలా ట్విస్ట్లనే చూశాడు డెరెల్డ్. ‘చిన్నప్పటి నుంచి నార్త్ కరోలినాలో పెరిగాను. మా నాన్న చెరోకీ ఇండియన్. నన్నంతా జెరీ అని ముద్దుగా పిలుస్తారు’ అంటూ పరిచయమైన రోజునే డెరెల్డ్కి చెప్పింది బోయిడ్. స్నేహం బలపడిన తర్వాత తనకు అంతకుముందే పెళ్లి అయిందని చెప్పింది. తర్వాత ఒకరోజు ‘నాకిద్దరు ఆడపిల్లలు, భర్తతో విడిపోయాను’ అని చెబుతూనే.. డెరెల్డ్ని తన ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ మొదటిసారి ఆమె కూతుర్లు సాలీ, ఏంజెల్లను కలుసుకున్నాడు డెరెల్డ్. ‘మాతో పాటు ఈ గ్రానీ (నాయనమ్మ) ఉంటుంది’ అంటూ ఒక పెద్దావిడను పరిచయం చేసింది. అయితే ఆమె రక్తసంబంధీకురాలు కాదని తెలిపింది. రోజులు, వారాలు గడిచాయి. డెరెల్డ్, బోయిడ్ల మధ్య స్నేహం.. ప్రేమగా మారింది. తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని డెరెల్డ్తో లివిన్ రిలేషన్ మొదలుపెట్టింది బోయిడ్. అయితే కలసి జీవించే క్రమంలో.. బోయిడ్ కొన్నిసార్లు మతిస్థిమితం లేని దానిలా ప్రవర్తించడం.. డెరాల్డ్ని కాస్త భయపెట్టింది. పగలు కూడా తలుపులు, కిటికీలు మూసుకుని ఇంట్లో ఉండటం, ఫోన్ రాగానే ముందుగా తను చెప్పిన కోడ్ని అవతల వ్యక్తి చెబితేనే మాట్లాడటం.. ఇదంతా డెరెల్డ్కి నెమ్మది నెమ్మదిగా అలవాటైపోయింది. ఒకరోజు బోయిడ్ని కూర్చోబెట్టి ‘ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావ్?’ అంటూ ఆరా తీశాడు డెరాల్డ్. ‘నా మాజీ భర్త చాలా దుర్మార్గుడు. అతను సాలీ, ఏంజెల్లను కిడ్నాప్ చేస్తాడని భయంగా ఉంది’ అంటూ ఏడ్చేసింది. రెండు వారాల తర్వాత.. ఒకరోజు రాత్రి బోయిడ్ని ఇంటికి తీసుకురావడానికి వెళ్లిన డెరెల్డ్కి.. ఆమె తను పనిచేసే బార్ ముందు భయపడుతూ కనిపించింది. కారణం అడిగితే.. ‘డెవిల్స్ గ్యాంగ్ అనే పేరున్న మోటర్ సైకిల్ ముఠాలోని ముగ్గురు సభ్యులు నన్ను బంధించి తీసుకెళ్లిపోవడానికి బార్కి వచ్చారు. గతంలో నేను వారి దగ్గర నుంచి తప్పించుకు వచ్చాను’ అని చెప్పింది. ఆమె చెప్పినట్లుగానే ఓ వ్యాన్.. వారి బండిని వెంబడించడం డెరెల్డ్ గుర్తించాడు. లక్కీగా దారిలో ఓ పోలీస్ అధికారి ఎదురుపడటంతో.. ఆ వ్యాన్ కాసేపటికి మాయం అయ్యింది. అయితే చాలాసార్లు తన మాజీ భర్త మంచివాడు కాదని.. తనను చాలా వేధింపులకు గురిచేశాడని చెప్పేది. ఇక ఒకరాత్రి చీకట్లో ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడటం చూసిన డెరెల్డ్.. ఆ ఆగంతకుడ్ని పట్టుకోవడానికి విఫలయత్నం చేశాడు. ఇలా ఎన్ని సమస్యలు వచ్చినా బోయిడ్ని మాత్రం వదిలిపెట్టలేదు. కొన్ని రోజులకు ఆమెను పెళ్లిచేసుకున్నాడు. పని ఒత్తిడి కారణంగా రాత్రిళ్లు ఆలస్యంగా ఇంటికి రావడాన్ని కూడా ఆమె తట్టుకోలేకపోయేది. భయంగా ఉంటోందని, ఎవరో.. తలుపులు వేసుకుని ఉన్నా ఇంటి చుట్టూ తిరుగుతూ వేధిస్తున్నారని చెప్పేది. కొన్ని రోజులకు ‘ఐ విల్ గెట్ యు డియర్’ అనే పెయింటింగ్ మెసేజ్ ఆమెని మరింత కుంగదీసింది. కొన్నాళ్లకు బోయిడ్, డెరెల్డ్ జంటకు ఒక కొడుకు పుట్టాడు. ఆ తర్వాత బోయిడ్ తీవ్రమైన తలనొప్పితో సతమతమయింది. ఆరోగ్యం కుదుటపడేలా చెయ్యాలని డెరెల్డ్.. తన భార్య బోయిడ్ని మిషిగన్లోని స్వస్థలానికి తీసుకెళ్లాడు. ఆమె అక్కడ రెండో కొడుక్కి జన్మనిచ్చింది. అయితే రెండో బిడ్డ పసికందుగా ఉన్నప్పుడే బోయిడ్ మంచం పట్టింది. ఆ తర్వాత కోమాలోకి వెళ్లి.. చనిపోయింది. ఆమె మరణం తర్వాత డెరెల్డ్.. ఆమె బంధువుల కోసం విస్తృతంగా అన్వేషించాడు. అయితే ఎవ్వరూ ఆమె గురించి ఏ సమాచారమూ ఇవ్వలేదు. పైగా అగస్టా బార్కి వెళ్లి ఆరా తీస్తే.. ఆమె గురించి విచారించడం మానేస్తే మంచిదనే సలహా ఇచ్చేవారు ఎక్కువయ్యారు. కొందరైతే ఆమె గురించి మాట్లాడటానికే ఇష్టపడలేదు. దాంతో స్థానిక టీవీ చానెల్లో ఆమె ఫొటోని 24 గంటలు ప్రసారంలో ఉంచమని.. తెలిసివారు తనని సంప్రదిస్తారని డీల్ మాట్లాడుకున్నాడు డెరెల్డ్. ముందు సరేనన్న ఆ చానెల్.. తర్వాత ప్రసారం చేయలేదు. ఏవో బెదిరింపుల వల్ల ఆ చానెల్ వెనక్కి తగ్గిందని డెరెల్డ్ కొన్నాళ్లకు తెలుసుకున్నాడు. అగస్టా పోలీసులు కూడా డెరెల్డ్కి సాయం చేయలేదు. ఎందుకంటే ‘విచారించడానికి ఇదేం మర్డర్ కేసు కాదుగా?’ అన్నారు. ఆ నలుగురు పిల్లల్ని.. బోయిడ్ కుటుంబంతో కలపాలనేది డెరెల్డ్ కోరిక. ఇక అతడి విచారణలో.. ఏంజెల్, సాలీల తండ్రి గ్యారీమూర్ను కలుసుకుని.. బోయిడ్ అసలు పేరు.. ‘ఎడిత్ గెరాల్డిన్ జాన్స్ మూర్’ అని తెలుసుకున్నాడు. ఇక కొన్నాళ్లకు బోయిడ్ బంధువుల్లో ఇంకొందరిని కూడా కలిశాడు. అయితే డెరెల్డ్కి.. మరో నిజం తెలిసింది. ఏంజెల్, సాలీ కంటే ముందే బోయిడ్కి 11 ఏళ్ల వయసులో.. యూజీన్, రోండా అనే కొడుకు, కూతురు పుట్టారని తెలుసుకున్నాడు. అయితే బోయిడ్ గురించి పూర్తి వివరాలు చెప్పడానికి.. సొంతవాళ్లు కూడా వెనకాడటం డెరెల్డ్ని కాస్త ఆశ్చర్యపరిచింది. కానీ ఆమె ఎందుకు తన దగ్గర అన్ని నిజాలను గోప్యంగా ఉంచింది? ఎవరి కారణంగా ఆమె అంతగా భయపడింది? ఆమెని ఎవరు అంతగా వేధించారు? అనే సందేహాలకు అతను సమాధానాలు రాబట్టలేకపోయాడు. నిజానికి ఒక సైనికుడై ఉండి.. జీవితభాగస్వామి వ్యక్తిగత విషయాలు పూర్తిగా తెలుసుకోకుండా పెళ్లి చేసుకోవడం సరికాదనే విమర్శలు చాలానే వచ్చాయి. అయినా అతను బంధాలకు ఇచ్చే విలువ, పిల్లల్ని చేరదీసి పెంచిన విధానం అంతా ఆదర్శనీయంగా నిలిచింది. ఏదేమైనా 22 ఏళ్లకే ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన బోయిడ్ అలియాస్ ఎడిత్ జీవితంలో.. ఆమెకు మాత్రమే తెలిసిన నిజాలు, భయాలు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. ∙సంహిత నిమ్మన (చదవండి: దెయ్యాలు కట్టిన గుడి కాకన్మఠ్ టెంపుల్ !..అక్కడ ప్రతి అంగుళం ఓ మిస్టరీ..!) -
మిలీనియం టవర్స్పై రామోజీ విలనీయం!
సాక్షి, అమరావతి: ‘ఈనాడు’కు, దాన్ని నడిపేవాళ్లకు మతిస్థిమితమేమైనా తప్పిందా? ఎక్కడికి పోతున్నారు వీళ్లసలు? ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలంటే ఇదేనా పద్ధతి? ప్రభుత్వ భవనాల్ని ప్రభుత్వం తన అవసరాల కోసం వాడుకుంటే.. దాన్ని ‘సర్కారు వారి కబ్జా’ అని రాయడానికి సిగ్గుండక్కర్లా? అదేమైనా ప్రయివేటు వాళ్ల భవనమా? లేక రామోజీరావు సొంత ఆస్తినా? అయినా బంధువుల భూముల్ని లీజుల పేరిట కబ్జాలు చేసే రామోజీరావుకు ఇలా నీతులు చెబుతూ పత్రిక నడిపే అర్హత ఉందా అసలు? విశాఖలో మిలీనియం టవర్స్కు సంబంధించి శుక్రవారం పతాక శీర్షికల్లో ‘ఈనాడు’ వండి వార్చిన కథనంలో వీసమెత్తయినా నిజం ఉందా? ఎందుకింత అక్కసు? ప్రభుత్వాన్ని నడిపేది మీ వాడు కాకపోతే మరీ ఇంతలా దిగజారిపోవాలా? రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్నకొద్దీ ‘ఈనాడు’ సహా ఎల్లో మీడియా ఆక్రోశానికి హద్దుల్లేకుండా పోతోంది. చంద్రబాబు పాలనతో పోలిస్తే విశాఖపట్నంలో గడిచిన నాలుగున్నరేళ్లుగా ఐటీ రంగం వేగంగా విస్తరించినా... దాన్ని మరుగునపరుస్తూ, యువతలో విషబీజాలు నాటడమే లక్ష్యంగా ‘ఈనాడు’ శుక్రవారం విషం కక్కింది. మిలినియం టవర్స్లో ఉన్న ఐటీ కంపెనీ ‘కాండ్యుయెంట్’ అక్కడే కొనసాగుతుండగా.. ఖాళీగా ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వం తన కార్యాలయాల కోసం వాడుకోవాలని సంకల్పించింది. కానీ కాండ్యుయెంట్ను ఖాళీ చేయమని నోటీసులిచ్చారని, అది హైదరాబాద్కు వెళ్లిపోతోందని ఎల్లో బ్యాచ్ ఫేక్ ప్రచారానికి దిగింది. దీంతో పాటు హెచ్ఎస్బీసీ వంటి కంపెనీలూ విశాఖ నుంచి వెళ్లిపోయాయని, కొత్తవి ఇంకెక్కడ వస్తాయని ప్రశ్నిస్తూ కథనాన్ని వార్చేసింది. నిజానికి కాండ్యుయెంట్ అక్కడే ఉంది. దానికి నోటీసులివ్వటమనేది పచ్చి అబద్ధం. కేవలం ఎల్లో మీడియా సాగించిన ఫేక్ ప్రచారం. పైపెచ్చు హెచ్ఎస్బీసీ ఇండియాలో తన కార్యకలాపాలకు స్వస్తిచెప్పి 2016లోనే వెళ్లిపోయింది. కాకపోతే వీటన్నిటినీ వైఎస్ జగన్ ప్రభుత్వానికి అంటగడుతూ ఎల్లో మీడియా సాగిస్తున్న విషప్రచారమే... యువతకు అత్యంత ప్రమాదకరం. ప్రభుత్వ అవసరాలకు కేటాయిస్తే తప్పా? ఐటీ సంస్థల కోసం చంద్రబాబు నాయుడు మిలీనియం టవర్స్ నిరి్మస్తే దాన్ని వేరే అవసరాలకు ముఖ్యమంత్రి జగన్ వాడుకుంటున్నారని.. ఇది ఐటీ అభివృద్ధికి అడ్డంకి అని ‘ఈనాడు’ వాపోయింది. నిజానికి టవర్–ఎ, టవర్–బి పేరిట ఉన్న రెండింటినీ మిలీనియం టవర్స్ పేరుతో పిలుస్తున్నారు. దీన్లో ఒక్కదాన్ని కూడా చంద్రబాబు పూర్తి చేయలేకపోయారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.60 కోట్లకుపైగా నిధులు వెచి్చంచి అసంపూర్తిగా ఉన్న టవర్–ఎను పూర్తి చేయటమే కాక, కొత్తగా టవర్–బిని నిరి్మంచింది. టవర్–బి ఈ ఏడాదే పూర్తయింది. ప్రస్తుతం ఖాళీగా ఉంది. మరి దాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా తన అవసరాల కోసం వాడుకుంటే తప్పా? ఇదెక్కడి వాదన? ప్రభుత్వ విభాగానికైనా, ప్రభుత్వ విద్యా సంస్థలకైనా ప్రత్యేక భవనాలు నిరి్మంచే పరిస్థితి లేకుంటే తాత్కాలికంగా అందుబాటులో ఉన్న భవనాలు కేటాయించడం తప్పెలా అవుతుంది? చంద్రబాబు మాదిరి ప్రభుత్వ విభాగాలను సైతం ఫైవ్స్టార్ హోటళ్లలో పెట్టి భారీ అద్దెలు చెల్లించాలనా రామోజీ ఉద్దేశం? క్యాండ్యూయెంట్కు నోటీసులంటూ పచ్చి అబద్ధాలు.. ‘టవర్–ఏ’లో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన ఐటీ సంస్థ కాండ్యుయెంట్కు విస్తరణ కోసం అదనపు స్థలం అడిగినా ఇవ్వలేదని, పైపెచ్చు ఖాళీ చేయమంటూ నోటీసులు జారీ చేశారని ఈనాడుతో పాటు సోషల్ మీడియా వేదికగా ఎల్లో బ్యాచ్ విపరీతమైన దు్రష్పచారం చేస్తోంది. నిజానికి ప్రభుత్వం తమకెలాంటి నోటీసులూ ఇవ్వలేదని, హైదరాబాద్కు షిప్ట్ అయ్యే ఆలోచన తమకు లేనే లేదని కాండ్యుయెంట్ ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేసినా... ఈ విషప్రచారానికి మాత్రం తెరపడటం లేదు. నిజానికి ఈ టవర్లో కాండ్యుయెంట్ తప్ప వేరే కంపెనీలేవీ కార్యకలాపాలు కొనసాగించడం లేదు. ఐటీ కంపెనీలను ఆకర్షించడం కోసం ప్రభుత్వం ఐటీ ఇన్ఫ్రాను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. అదానీ గ్రూప్ డేటా సెంటర్తో పాటు భారీ ఐటీవర్ను నిర్మిస్తోంది. రహేజా గ్రూపు ఇనార్బిట్ మాల్ నిర్మాణంతో పాటు ఐటీ టవర్ను కడుతోంది. ఏపీఐసీసీ రూ.2,300 కోట్ల వ్యయంతో మధురవాడలో 19 ఎకరాల విస్తీర్ణంలో ‘ఐ స్పేస్’ పేరిట ఐటీ టవర్ను నిరి్మస్తోంది. కానీ రామోజీ ఈ నిజాలన్నిటికీ ముసుగేసి అబద్ధాలే ఆలంబనగా చెలరేగిపోయారు. హెచ్ఎస్బీసీ వెళ్లిపోయిందెప్పుడో తెలియదా? ‘ఈనాడు’ ఎంతలా దిగజారిపోయిందో తెలియటానికి ఈ అంశం ఒక్కటీ చాలు. చైనాకు చెందిన హెచ్ఎస్బీసీ తన విధానపరమైన నిర్ణయంలో భాగంగా భారతదేశ కార్యకలాపాల నుంచి వైదొలుగుతున్నట్లు 2016లో ప్రకటించింది. అందులో భాగంగా విశాఖ, హైదరాబాద్, ఢిల్లీల్లోని తన కార్యకలాపాలను ఉపసంహరించుకుంది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడే. దీన్ని కూడా వైఎస్ జగన్ ప్రభుత్వానికి అంటగట్టి దు్రష్పచారం చేస్తున్నారంటే వీళ్లనేమనుకోవాలి? కొత్త కంపెనీలు కనిపించటం లేదా? కంపెనీలు వెళ్లిపోవటమే గానీ కొత్తవి రావటం లేదంటూ ఆక్రోశించారు రామోజీ. నిజానికి ఐటీకి ఆద్యుడినంటూ డబ్బాకొట్టుకొనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో విశాఖకు చెప్పుకోదగ్గ పేరున్న ఒక్క కంపెనీ కూడా రాలేదు. కానీ ఈ ప్రభుత్వం బీచ్ డెస్టినీ పేరిట ఐటీ కంపెనీలను విశాఖకు రప్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇన్ఫోసిస్ ఇప్పటికే డేటా సెంటర్ను ప్రారంభించగా, విప్రో డేటాసెంటర్ను ప్రారంభించడానికి వీలుగా విశాఖలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న ఉద్యోగుల సమాచారాన్ని సేకరిస్తోంది. ఇక అమెజాన్, బీఈఎల్ , రాండ్స్టాడ్ వంటి సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయి. మరికొన్ని సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 24,,350 మంది ఐటీ ఉద్యోగులుండగా ఇపుడా సంఖ్య 53,850 దాటింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉన్నంతకాలం రామోజీకి ఈ వాస్తవాలు కనిపించనే కనిపించవు. -
అడవి బాట... బాక్సాఫీస్ వేట
బాక్సాఫీస్ వసూళ్ల వేట కోసం తెలుగు హీరోలు కొందరు అడవి బాట పట్టారు. అడవి నేపథ్యంతో కూడిన కథలతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధం అవుతున్నారు. ఆ అడవి కథలపై కథనం. అడవిలో ఈగల్ ‘ఎక్కడుంటాడు? అని రవితేజను ఉద్దేశిస్తూ అవసరాల శ్రీనివాస్ను అనుపమా పరమేశ్వరన్ అడగ్గానే అడవిలో ఉంటాడు అని సమాధానం చెబుతారు. ఈ సంభాషణ ఇటీవల విడుదలైన ‘ఈగల్’ సినిమా టీజర్లోనిది. రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. కథ రీత్యా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు అడవి నేపథ్యంలో ఉంటాయని టీజర్ స్పష్టం చేస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. ఆఫ్రికన్ అడ్వెంచర్ ఆఫ్రికన్ అడవుల్లో వేటకు సిద్ధమౌతున్నారు మహేశ్బాబు. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. రచయిత–దర్శకుడు కె. విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ఈ చిత్రంలోని ప్రధాన కథాంశం ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగుతుందని, సహజమైన లొకేషన్స్లోనే చిత్రీకరించేలా రాజమౌళి అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు స్క్రిప్ట్కు మరింత పదును పెడుతున్నారని తెలిసింది. వచ్చే ఏడాది వేసవి తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభించడానికి ప్లాన్ చేస్తున్నారట. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. అడవుల్లో దేవర ‘జనతా గ్యారేజ్’ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘దేవర’. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. దేశంలో విస్మరణకు గురైన తీర ప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమా ప్రధాన కథనం సాగుతుంది. అయితే కథ రీత్యా ‘దేవర’లో ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ సీన్స్ ఉన్నాయని, ఈ సన్నివేశాల చిత్రీకరణ అడవుల్లో జరుగుతుందని, ఇవి ‘దేవర పార్ట్ 2’లో ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో హిందీ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నారు. కల్యాణ్ రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ‘దేవర’ సినిమా తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. పుష్పరాజ్ రూల్ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ అల్లుకున్న ఊహాత్మక కథ ‘పుష్ప’. ఇందులో పుష్పరాజ్గా అల్లు అర్జున్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ‘పుష్ప’ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ ఇప్పటికే విడుదలై, సూపర్హిట్గా నిలిచింది. దీంతో మలి భాగం ‘పుష్ప: ది రూల్’ కోసం ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. కాగా ‘పుష్ప: ది రైజ్’ సినిమాలోని కీలక సన్నివేశాలు, కొన్ని యాక్షన్ సీక్వెన్స్ల మాదిరిగానే ‘పుష్ప: ది రూల్’లోనూ ప్రధాన సన్నివేశాలు అడవుల నేపథ్యంలోనే సాగుతాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. న్యూజిల్యాండ్లో కన్నప్ప శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు టైటిల్ రోల్ చేస్తుండగా మోహన్బాబు, ప్రభాస్, మోహన్లాల్, శివరాజ్కుమార్, శరత్కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మేజర్ షూటింగ్ న్యూజిల్యాండ్లో జరుగుతుంది.ప్రస్తుతం అక్కడి లొకేషన్స్లోనే ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది. కథ రీత్యా ‘కన్నప్ప’ సినిమాలోని చాలా సన్నివేశాలు అడవి నేపథ్యంలోనే ఉంటాయి. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇలా అడవి నేపథ్యంలో సాగే చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. -
ఇదో ఆధునిక రా.కీ.నే! కుమారులూ... ఏడు చేపల కథ!
ఇదో కథ. తరతరాలుగా తెలిసిందే. ఎంతోమంది రాజకీయ నేతలకు తరచూ అనుభవంలోకి వచ్చిన కథే. తరం తర్వాత తరం... ఇలా తర్వాతితరానికి తెలియాలనే ఉద్దేశంతో విచిత్ర వింత తంత్ర, కాతంత్ర, కుతంత్ర, బహుళతంత్రాలు రాసిన మహామునుల్లాంటి రాజకీయ విశ్లేషకులు దీన్ని గ్రంథస్థం చేసిన కథ. కేవలం ప్రైవేట్ సర్క్యులేషన్లో ఉంచిన ఈ ఓపెన్ సీక్రెట్గాథ సారాంశమేమిటంటే... అనగనగనగా ఓ రాజకీయనేత. రాజులాంటి ఆ రా.కీ. నేతకు ఏడుగురు కొడుకులు. ఓ రోజున రా.కీ. నేత ఇలా అన్నాడు. ‘‘కుమారులారా... ఎన్నాళ్లు నా పంచనబడి ఇలా బతికేస్తారు. ఇక మీరు కూడా స్వతంత్రంగా ఓటర్లకు గాలమేసి, వాళ్లను చేపల్లా పట్టుకునే టైమొచ్చింది’’ అని చెప్పాడు. ఇలా చెబుతూనే..ఓటర్ల ను చేపల్లా పట్టేసి, తమ ‘బుట్టలో పడేయడానికి’ ఏమేమి ఎర వేయాలో, ఎలాంటి ఎరలు వాడాలో లాంటి టెక్నిక్స్ కూడా వివరించాడు. ఏడుగురు కొడుకులూ గేలాలు తీసుకుని, ఓటర్ల వేటకు బయల్దేరారు. (ఒకడైతే మరీనూ. చేపల్లాంటి తన ఓటర్లను తాను ‘కాల్చుకు తినడాని’కంటూ ఓ ప్రెషర్ కుక్కర్నూ వెంట తీసుకొని బయల్దేరాడు. సదరు కుక్కరు..చేపల్నీ వండుతుంది, పనిలోపనిగా అది వేసే విజిళ్లతో తనకు ఎంకరేజ్మెంటూ దక్కుతుందనేది అతడి వాదన. ఒకే పనిలో బహుళ ప్రయోజనాల కోసం ప్లానింగ్ చేసే, అలాంటివాడే తనకు సరైన వారసుడంటూ మురిసిపోతాడా నేత. అది వేరే కథ). ఆరుగురు రా.కీ.నేత కుమారులకు ఓటర్లు పడ్డారుగానీ... ఒకడికి మాత్రం పడలేదు. అప్పుడా రా.కీ.నేత కుమారుడిలా ప్రశ్నించాడు. ‘‘ఓటరూ..ఓటరూ..నా గేలానికి నువ్వు ఎందుకు పడలేదు?’’ ‘‘నువ్వు నీ గేలానికి డబ్బు ఎరగా వేయలేదు’’ అతడు మళ్లీ తన పీఏ దగ్గరికెళ్లి అడిగాడు. ‘‘పీయ్యే..పీయ్యే.. గేలానికి ఎరగా డబ్బును ఎందుకు పెట్టలేదు?’’ ‘‘అదే టైముకు ఈడీ, ఇన్కమ్ట్యాక్సు వాళ్లు దాడులు చేసి, డబ్బు ఫ్రీజ్ చేశారు’’ అని జవాబిచ్చాడు పీయ్యే. ఈసారి రా.కీ. నేత కుమారుడు ఈడీ, ఇన్కమ్ట్యాక్స్ వాళ్ల దగ్గరికి వెళ్లి అడిగాడు. ‘‘ఈడీ వాళ్లూ, ఐటీ వాళ్లూ... మా మీద దాడి ఎందుకు చేశారు?’’ ‘‘మా పైవాళ్లు మాకు ఆదేశాలు ఇచ్చారు’’ చెప్పారు ఈడీ, ఐటీ సిబ్బంది. ‘‘పైవాళ్లూ..పైవాళ్లూ..ఇలా ఆదేశాలు ఎందుకిచ్చారు?’’ ‘‘సార్... మేమేముంది చిన్న చీమల్లాంటి వాళ్లం. మీకు అధిష్టానం ఉన్నట్లే మాకు ప్రధానమైన పైపైవాళ్లు ఒకరుంటారు. వారిని కాదంటే మమ్మల్ని చీమల్లా నలిపేయగలరు కాబట్టి ‘చీమల్లాంటివాళ్లం’ అంటూ మమ్మల్ని మేము అభివర్ణించుకున్నాం. ఆ పైపైవారంటే.. వాళ్లు గతంలోలా కాంగ్రెస్ కావొచ్చు, లేదా ఇప్పట్లోలా బీజేపీ కావొచ్చు. అలా పవర్లో ఉన్నది యూపీఏ అయినా, లేదా ఎన్డీఏ అయినా..కుట్టాల్సింది పొరుగునున్న కర్ణాటక అయినా, పక్కనున్న మహారాష్ట్ర అయినా మరో రాష్ట్రమైనా ఫరక్ పడేదీ ఏదీ ఉండదు, ప్రాసెస్ సేమ్ టు సేమ్. అసలు కేంద్రంలో అధికారంలో ఉన్నది ఏ ప్రభుత్వమైనా..వాళ్ల స్టార్ క్యాంపెయినర్లం మేమే. ఆ అధికారగణాల బంగారు పుట్టలో ఎవరైనా వేలు పెడితే..వాళ్లను మేం కుట్టకుండా ఉంటామా?’’ అంటూ గుట్టు విప్పి, గుసగుసగా చెప్పారు. -
చీకటి నీడ!..ఒక బాస్ జంటల మధ్య సాగే థ్రిల్లింగ్ కథ!
వర్షం ధారగా కురుస్తూ రాత్రిని చల్లగా తడుపుతోంది. కన్నీటి వాన నా మనసును బాధతో తడుముతోంది. కొద్దిసేపటికో లేదా మరునాటికో వర్షం ఆగిపోయి వాతావరణం సాధారణ స్థితికి వస్తుంది. నా కన్నీరు కూడా అలాగే ఆగిపోతుందేమో. కానీ నా మనసులోని బాధ ఎప్పటికి తగ్గుతుంది? నేను మళ్లీ సాధారణ స్థితికి రాగలనా..! ఎదురుగా కనిపిస్తున్న పిస్తా రంగు వెడ్డింగ్ కార్డుపై గోల్డ్ కలర్లోని ‘మానస వెడ్స్ తరుణ్’ అనే అక్షరాలను చూస్తుంటే నా బాధ రెట్టింపు అవుతోంది. ఇన్ని సంవత్సరాల నా రిలేషన్షిప్ని ఎలా వదులుకోగలుగుతోంది మానస. ఆ తరుణ్ అనే వాడితో అంత సులువుగా పెళ్లికి ఎలా ఒప్పుకుంది? ఎంత ఆలోచించినా కారణం అంతుబట్టడం లేదు. కార్డు ఇస్తున్నప్పుడు అదే విషయం అడిగాను. ‘చిల్ యార్. తరుణ్తో పెళ్ళి అమ్మా..నాన్న, సొసైటీ కోసమే! నా మనసులో నీ స్థానం ఎప్పటిలాగానే పదిలంగా ఉంటుంది. నా పెళ్లి తరువాత కూడా మనం మునుపటిలాగానే కలుసుకుందాం..’ అని ఎంత ఈజీగా చెప్పేసింది. నా మనసులో మానసకు తప్ప మరో మనిషికి చోటు లేదు. కానీ తనెందుకు ఇలా చేసింది! బాల్కనీలోకి వచ్చి సిగరెట్ వెలిగించాను. ఆమె పరిచయం, సాన్నిహిత్యం తరువాత నేనొక అనాథనని మరచిపోయాను. ఇప్పుడు నేను మళ్ళీ ఒంటరినని తలుచుకుంటే దుఃఖం ముంచుకొస్తోంది. బెడ్ పై వాలి కళ్ళు మూసుకుంటే నిద్ర దరి చేరటం లేదు. నాలుగేళ్ల క్రితం నాటి మా మొదటి పరిచయం గుర్తుకు వచ్చింది. ∙∙ చురుకుగా ఉండటం, సమయస్ఫూర్తి, కంప్యూటర్ సైన్స్లో మాస్టర్ డిగ్రీతో పాటు చూడగానే ఆకర్షించే నా రూపం.. చిన్న వయసులోనే.. పేరున్న కంపెనీలో టీమ్ లీడర్గా ఎదగటానికి దోహదపడింది. అది నా రెండో ప్రాజెక్ట్ అనుకుంటా. కొత్తగా ఒక జావా డెవలపర్ అవసరం పడింది. షార్ట్ లిస్ట్ చేసిన ముగ్గురిలో ఒకరిని ఫైనల్ చేసి రిక్రూట్ చేసుకొనే బాధ్యతను నాకు అప్పగించారు. ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. ప్రొఫైల్స్ చూస్తే ముగ్గురూ టాలెంటెడ్ అనిపించింది. ఇంటర్వ్యూ కోసం ఒక్కొక్కరినీ నా క్యాబిన్లోకి పంపించమన్నాను. మొదట వచ్చిన అమ్మాయిది.. బంగారు వర్ణం. ఒకసారి చూస్తే ఏ మగాడికైనా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సోయగం. కొన్ని కోడ్స్, ప్రాబ్లెమ్ ఎనాలిసింగ్ టెక్నిక్స్ డిస్కస్ చేశాక ఎందుకో సంతృప్తి కలగలేదు నాకు. తరువాత వచ్చిన అబ్బాయి ఎన్.ఐ.టి గ్రాడ్యుయేట్. కానీ అతనిలోని కొంచెం నిర్లక్ష్యపు దోరణి నచ్చక రిజెక్ట్ చేశాను. చివరగా వచ్చింది మానస. చామనఛాయ రంగు దేహం.. ఆ కళ్ళలోని మెరుపు సమ్మోహనంగా ఉంది. ‘గుడ్ మార్నింగ్’ అంటూ సన్నని నవ్వు. అదేంటి ఆశ్చర్యంగా ఆ నవ్వు నాలో చక్కిలిగింతలు పెడుతోంది. ఇదేమి వింత! ఇది కరెక్ట్ కాదు కదా అని అనిపించింది. కానీ ఆ పొడవాటి మొహంలోని కాంతి, మెడ దగ్గరి నునుపు నన్ను కళ్ళు తిప్పుకోనివ్వ లేదు. తమాయించుకొని ప్రోగ్రామింగ్ మాడ్యూల్స్ డిస్కస్ చేశా. అన్ని ప్రశ్నలకూ సరైన సమాధానాలే. ఆటిట్యూడ్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తే ముచ్చటేసింది. ‘యూ ఆర్ సెలెక్టెడ్’ అని చెప్పాను. ‘థాంక్ యూ సో మచ్ ఫర్ సెలెక్టింగ్ మీ. ఈ జాబ్ నాకు రావటానికి మీరే కారణం. మీ గైడెన్స్లో పనిచెయ్యటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆ మెత్తని స్పర్శకు నా నరనరాల్లో వేల వోల్ట్ల విద్యుత్ ప్రవహించిన అనుభూతి. సర్దుకొని ‘బై ద వే.. నీ డేట్ అఫ్ బర్త్ చూశాను. నువ్వే నా కన్నా ఆరు నెలలు పెద్ద. సో నేను నీ బాస్ అయినప్పటికీ మీరు అనొద్దు. నువ్వు అని సింగిలర్ యూస్ చెయ్యి. నో ప్రాబ్లెమ్’ అన్నాను. కళ్ళతోనే నవ్వింది. ఆ చూపు గుచ్చుకొని నా హృదయంలో తియ్యని అలజడి మొదలయ్యింది. అలా తొలి పరిచయంలోనే తను నాకు బాగా కావాల్సిన వ్యక్తిలా కనిపించింది. తరువాత నుండి ప్రతిరోజు తనను చూడాలనే తహ తహ మొదలయ్యింది. అయితే ఒకటే టీమ్ అయినా ఆఫీస్లో ఇద్దరం కలిసి మాట్లాడుకునే టైమ్ అస్సలు ఉండేది కాదు. మీటింగ్స్ కుడా జూమ్లోనే అయ్యేవి. కానీ నాకు మాత్రం రోజుకి ఒక్కసారైనా మానసని చూడాలని, చలాకీగా తను మాట్లాడుతుంటే వినాలని అనిపించేది. మానస ఇదేమీ గమనించేది కాదు. నాలో తన పట్ల కలుగుతున్న ప్రేమ పూరిత భావనలు తను కనిపెట్టే అవకాశం అస్సలు లేదు. ‘నువ్వు సిగరెట్లు తగ్గించు. పెదాలు కొంచెం నలుపు రంగులోకి మారేలా కనిపిస్తున్నాయి’ అంది ఒక రోజు. ‘ఇంత అందంగా ఉంటావు. ఆఫీస్లో ఇప్పటివరకు ఎవ్వరూ ప్రపోజ్ చెయ్యలేదా నీకు?’ చొరవగా అడిగింది ఇంకో రోజు. ‘నువ్వు మామూలు డ్రెస్లో కంటే జీన్స్.. టీ షర్ట్లో సూపర్ ఉంటావు’ మరో రోజు కాంప్లిమెంట్. ఎప్పుడూ క్యాంటీన్లోనే తినే నాకోసం అప్పుడప్పుడు తన లంచ్ బాక్స్ షేర్ చేసేది. కొద్ది రోజుల్లోనే ఒక స్నేహితురాలిగా దగ్గరయ్యింది. ఆఫీస్ విషయాలు, ఇంట్లో సంగతులే కాకుండా పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకునేది. ఎప్పుడైనా తను లీవ్ పెడితే ఆ రోజంతా నా మనసు విలవిల్లాడేది. తను పరాయి మనిషి కాదు అని నా కోసమే పుట్టిందేమో అనే తీవ్రమైన భావన నాలో! నేను తనకి ఇంకా దగ్గర అవ్వకముందే మంచి ఆపర్చునిటీ వచ్చిందని ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగానికి మారిపోయింది. మా ఆఫీస్లో తన లాస్ట్ వర్కింగ్ డేనాడు వీడ్కోలు పలుకుతున్నప్పుడు నా కళ్ళలోని తడిని చూసి ‘హే.. ఇప్పుడు ఏమైంది? నేను వేరే కంట్రీకి ఏమీ పొవట్లేదు. ఈ సిటీలోనే ఉంటున్నా. ఇంకా చెప్పాలంటే మనిద్దరి ఆఫీస్ల మధ్య దూరం పది నిమిషాలే. రెగ్యులర్గా టచ్లో ఉందాం. ఓకే నా’ అంటూ హగ్ చేసుకొంది. ఆ కౌగిలి తను కాజువల్గా ఇచ్చినా అప్పుడు మా రెండు దేహాల స్పర్శలో నేను పొందిన ఆనందం అనిర్వచనీయం. అలారం క్లాక్, మొబైల్ రెండూ ఒకేసారి మోగుతుండగా నిద్ర లేచాను. టైమ్ చూస్తే పది. మానస గురించి ఆలోచిస్తూ లేట్గా పడుకున్నానేమో మెలకువ రాలేదు. మొబైల్ చూస్తే తన నుండే కాల్. ‘హలో.. గుడ్ మార్నింగ్ ’ అన్నాను. నా గొంతులో విషాదం నాకే తెలుస్తోంది. ‘హే గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచావా? కమాన్ క్విక్గా రెడీ అయ్యి బేగంపేట షాపర్స్ స్టాప్కి వచ్చేయ్. చిన్న షాపింగ్. తరుణ్ కూడా వస్తున్నాడు. నువ్వుంటే నాకు బాగుంటుంది’ అని చెప్పేసి ఫోన్ కట్ చేసింది. ఏమనుకుంటుంది ఈ మనిషి అసలు! మా ఇద్దరి మధ్య ఏమీ లేనట్లు ఇంత క్యాజువల్గా ఎలా మాట్లాడుతుంది? తరుణ్తో షాపింగ్ చెయ్యటానికి నన్నెందుకు రమ్మంటోంది? వాళ్ళిద్దరినీ పక్క పక్కన చూస్తే నేను తట్టుకోగలనా! అలా ఆలోచిస్తూనే రెడీ అయ్యి కిందకి వచ్చి కార్ స్టార్ట్ చేశాను. రాత్రి తగ్గిన వర్షం మళ్ళీ సన్నని తుంపరతో మొదలయ్యింది. కొన్ని జ్ఞాపకాలకు మరణమే ఉండదు. కొన్ని జ్ఞాపకాలు అస్సలు పురుడు పోసుకోవు. డ్రైవ్ చేస్తూ మళ్ళీ పాత జ్ఞాపకాలను వెతుక్కొన్నాను. మొదటిసారి తను నా కార్ ఎక్కటానికి కూడా ఇలాంటి వర్షమే కారణం. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుండి బయటకు వచ్చేసరికి చిన్న ముసురు. నా కార్ దగ్గరికి వెళ్తూ, నీటి బిందువులతో ఆనందంగా పరవశిస్తున్న చెట్ల ఆకుల సోయగాన్ని చూస్తే ఎందుకో మానస గుర్తుకు వచ్చింది. స్కూటీ పై ఆఫీస్కి వచ్చే తను ఈ వర్షంలో ఇంటికి ఎలా వెళ్తుందో అనిపించి మొబైల్ తీసి కాల్ చేశా. నేనేం మాట్లాడక ముందే ‘హే.. హౌ అర్ యూ? ఒక్క మెసేజ్ లేదు, కాల్ లేదు. మర్చిపోయావనుకున్నా బేబీ’ అన్నది గారాలు పోతూ. ఆ గొంతులో ఆ చనువుకి నా వొళ్ళు సంతోషంతో పులకరించింది. ‘ఐ యామ్ గుడ్. వర్షం వస్తుంది కదా ఎలా వెళ్తావు? ఫైవ్ మినిట్స్లో వస్తా. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా’ అన్నాను. ‘థాంక్ గాడ్. క్యాబ్ కోసం ట్రై చేస్తుంటే రెస్పాన్స్ రావట్లేదు. కమాన్ తొందరగా వచ్చేయ్. నీతో కబుర్లు చెప్పుకొని చాలా రోజులు అవుతోంది. వెయిటింగ్ ఫర్ యూ..’ అన్న తన మాటలకి కొత్త ఉత్సాహం ఆవరించింది నన్ను. రెడ్ కలర్ చుడీదార్ పై కొన్ని వర్షపు చినుకులు అద్దుకొని మంచి పరిమళాన్ని మోసుకుంటూ వచ్చి కార్లో కూర్చుంది. ఆ కళ్ళు చూస్తేనే మైకం కమ్ముకుంటుంది నాలో. ఎప్పటిలాగానే గలగలా మాట్లాడుతుంటే ముందున్న అద్దంలో మెరిసే తన పెదాలనే చూస్తున్నా. ‘హే.. ఈ వర్షాన్ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నాకైతే చల్లటి ఐస్క్రీమ్ చప్పరించాలని ఉంది’ అంది. ‘నిజం చెప్పనా! నాకైతే నిన్ను చూస్తూ చిల్డ్ బీర్ కొట్టాలని ఉంది’ అన్నాను. ‘అబ్బా.. నీకెప్పుడూ బోల్డ్ థాట్స్ వస్తాయి.. లెట్స్ డూ ఇట్..’ అంటూ కన్ను గీటింది. తను అలా చేస్తే ఏదో తెలియని థ్రిల్ ఫీలింగ్ కలిగింది నాకు. ‘అయితే చలో నా ఫ్లాట్కే పోదాం. ఫ్రిజ్లో ఐస్క్రీమ్, బీర్ రెండూ ఉన్నాయి’ అంటూ నేను కూడా కన్ను గీటాను కావాలని. ‘డన్..’ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాల్కనీలో కూర్చొని, వర్షాన్ని ఆస్వాదిస్తూ తను బటర్ స్కాచ్ని, నేను బడ్వైజర్ని రుచి చూస్తున్నాం. ఎలా మొదలు పెట్టాలో అర్థంకావటం లేదు నాకు. డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటుందా? ఒప్పుకోకుంటే భరించలేను. నా గురించి అందరికీ చెపితే ఆ అవమానాన్ని తట్టుకోలేను. బాల్కనీ కుండీల్లో రకరకాల మొక్కలు ఉంటే, వాటివైపు చూస్తూ ఏదో ఆలోచిస్తోంది మానస. బీర్తో పాటు నైట్ క్వీన్ గుబాళింపు ఒక వైపు, మరువం పరిమళం ఇంకో వైపు నాకు మత్తుని కలిగిస్తున్నాయి. ధైర్యం చేసుకొని తన దగ్గరగా వెళ్లి కళ్ళలో కళ్ళు పెట్టి చూశాను. అదే మెరుపు. నవ్వుతూ నన్ను ఆహ్వానిస్తున్నట్లుగా..చప్పున తన భుజాలు పట్టుకొని ముద్దు పెట్టి ‘లవ్ యూ మానసా..’ అన్నాను. ఊహించని ఈ పరిణామానికి బిత్తరపోయి నిలుచుంది తను. నా వొంట్లో భయం కలిసిన ఉద్విగ్నత. ‘నీకు ఎందుకు ఇలా అనిపించింది. ఇది కరెక్టేనా?’అని అడిగింది. ముద్దు పెడితే ఏమీ అనకుండా ఆ ప్రశ్న అడగటంతో నాకు ధైర్యం వచ్చింది. ‘కరెక్టో కాదో అన్నది ప్రశ్న కాదు. నీకు నేనంటే ఇష్టమా కాదా చెప్పు. నాకు నువ్వు కావాలి. జీవితాంతం నీ తోడు కావాలి’ అన్నాను. అంతే లతలా నన్ను పెనవేసుకొని ‘లవ్ యూ టూ డియర్’ అని నా నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టింది. ఆ క్షణం ఈ ప్రపంచాన్ని జయించిన అనుభూతి కలిగింది నాకు. ఆ రోజు నుండి మా ఇద్దరి ప్రపంచం కొత్తగా మొదలయ్యింది. ఎన్నో కబుర్లు, సినిమాలు, పార్టీలు, అలకలు, ఆనందాలతో జీవితం రంగుల హరివిల్లులా సాగుతూ.. ఒక్క క్షణం కూడా ఒకరిని విడిచి ఇంకొకరం ఉండలేని ప్రేమలోకంలో విహరించసాగాం. అలా అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో ఇలా సడన్గా తరుణ్తో నా పెళ్లి అంటూ వెడ్డింగ్ కార్డు ఇచ్చింది. నా ఆలోచనలకు బ్రేక్ వేస్తూ బేగంపేట్ వచ్చింది. ∙∙ నేను వెళ్లేసరికి వెడ్డింగ్ డ్రెస్ సెలక్షన్లో బిజీగా ఉన్నారు ఇద్దరూ. ‘తరుణ్.. మీట్ మై బాస్ ఇన్ మై ఫస్ట్ జాబ్. అఫ్కోర్స్ ఇప్పుడు మాత్రం తనే నాకున్న ఒకే ఒక్క క్లోజ్ ఫ్రెండ్ అనుకో’ అని నన్ను పరిచయం చేసింది. ఆ మాటకు నా హృదయం భగ్గుమంది. ‘ఎంతకు తెగించావే రాక్షసి. నేను క్లోజ్ ఫ్రెండ్ అంతేనా? ఇంకేమీ కానా? అయినా ఎలా చెపుతావు లే!’అని మనసులో అనుకున్నాను. మొహం మీద బలవంతంగా నవ్వు పులుముకొని ‘హాయ్’ అన్నాను. ఇంకేం మాట్లాడబుద్ధి కాలేదు. వాళ్లిద్దరినీ అలా చూస్తుంటే బాధ, కోపం, కసి, చిరాకు.. మనసంతా చేదుగా అయిపోయింది. మానస లేకుండా నేను అసలు జీవించగలనా! ఎక్కడి నుండి ఊడిపడ్డాడు ఈ ఇడియట్ తరుణ్ గాడు? మమ్మల్ని వేరు చెయ్యటానికే పుట్టినట్లున్నాడు. నాకు వాడంటే అసూయ, అసహ్యం రెండూ కలిగాయి. షాపింగ్ అయిపోయింది. వస్తుంటే ‘మా పెళ్ళికి మీరు తప్పకుండా రావాలి. ఇది నా నుండి ఇన్విటేషన్’ అన్నాడు తరుణ్. ‘ష్యూర్.. సీ యూ’అని చెప్పి బయట పడ్డాను. మానస ఎప్పటికైనా నాకే సొంతం కావాలి. తను లేకుంటే నాకు చావే దిక్కు అనిపించింది. దేవుడా ఎలాగైనా ఈ పెళ్లి ఆపు అని జీవితంలో మొదటిసారి దేవుడికి మొక్కుకున్నాను. కానీ దేవుడు నా మొర ఆలకించలేదు. వైభవంగా వాళ్ళిద్దరి పెళ్లి జరిగిపోయింది. ఆ రోజు ఏడ్చి ఏడ్చి నా కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. నా కళ్ల ముందు అంతా శూన్యం. ఇంత చేసినా ఆశ్చర్యంగా నాకు మానస మీద కోపం మాత్రం రావట్లేదు. ప్రతిరోజు తన గొంతు వినాలని, తనని చూడాలని అనిపించి పిచ్చెక్కేది. కాల్ చేస్తే జస్ట్ హాయ్, బాయ్ అని రెండు మూడు మాటలు మాట్లాడి ఫోన్ కట్ చేసేది అంతే. ఇప్పుడు నా భవిష్యత్తు గురించి నేనో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. అది ఎంత కఠినమయినా కచ్చితంగా ఆచరణలో పెట్టాలని డిసైడ్ అయ్యాను. వాళ్ళ పెళ్ళైన వారం రోజుల తరువాత ఒక రోజు ఉదయాన్నే ఫోన్ చేసింది మానస. ‘హేయ్.. ఏం చేస్తున్నావ్? మరిచిపోయావా మమ్మల్ని? ఈ రోజు నేను ఆఫీస్కి వెళ్లట్లేదు. ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను. వచ్చేయ్ ఇంటికి’ అంది. అడ్రస్ అడిగి జుట్టు కూడా సరిగ్గా దువ్వుకోకుండా బయటపడ్డాను. ఎందుకు రమ్మంది? క్యాజువల్గానా లేక ఇంకేదైనా చెప్పటానికా? నాలో అంతులేని ప్రశ్నలు. నేను వెళ్లేసరికి తరుణ్ ఇంకా పోలేదు. రెడీ అయ్యి షూ వేసుకుంటున్నాడు. నన్ను చూసి ఆశ్చర్యంగా ‘అరే చెప్పకుండా వచ్చారు? ముందే చెపితే నేను కూడా లీవ్ పెట్టే వాడిని కదా! ఎనీవే ఆఫ్టర్ నూన్ వచ్చేస్తాను. లంచ్ ముగ్గురం కలిసే చేద్దాం. బాయ్’ అంటూ వెళ్ళిపోయాడు. వీడికి మా ఇద్దరి మీద డౌట్ వచ్చే అవకాశం అస్సలు లేదులే అనుకున్నాను. నన్ను చూస్తూనే గట్టిగా కౌగిలించుకొని ‘మిస్ యూ బేబీ..’ అంటూ ముద్దు పెట్టింది మానస. నాకు ఏడుపు ఆగలేదు. ‘ఎందుకిలా చేశావ్? నన్ను ఒంటరిగా ఎందుకు వదిలేశావ్? నువ్వు నిజంగా నన్ను ప్రేమించావా?’ నిలదీశాను. నా నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటూ ‘ఇప్పుడేమైంది? నిన్ను దూరం పెట్టను అని చెప్పాగా. నువ్వంటే నాకు ఎప్పటికీ ప్రేమే’ అంది. ‘మరి అలాంటప్పుడు ఆ తరుణ్గాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నన్నెందుకు పెళ్లి చేసుకోలేదు?’ కొంచెం కోపంగా అడిగాను. ‘ఎందుకంటే ఇద్దరు ఆడవాళ్లు పెళ్లి చేసుకుంటే లోకం ఒప్పుకోదు కాబట్టి. చూడు అమృతా.. నాకు నీ ప్రేమ కావాలి. సోషల్ లైఫ్ కావాలి. అలాగే పిల్లలు కూడా కావాలి. అందుకోసం తరుణ్ని పెళ్లి చేసుకున్నాను. కానీ నా మనసులో మాత్రం నువ్వే ఉంటావు..’ అని చెప్పుకుంటూ పోతోంది. తన నుండి దూరంగా జరిగి ‘ప్రేమంటే రెండు దేహాల కలయిక మాత్రమే కాదు. రెండు మనసుల అపూర్వ సంగమం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నా మనసులో నువ్వు మాత్రమే ఉంటావు. ఇంకో వ్యక్తికి చోటు ఉండదు. కానీ నువ్వు అలా కాదు. నీది నిజమైన ప్రేమ కాదు’ అన్నాను. ‘అమృతా.. ప్లీజ్ అలా అనకు. నన్నర్థం చేసుకో’ నా చేతులు పట్టుకుంటూ అడిగింది. ‘ఒకే జెండర్ అయినా, జెండర్స్ వేరైనా.. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉన్నప్పుడు మూడో వ్యక్తితో రిలేషన్ అంటే అది మొదటి ప్రేమికుడు లేదా ప్రేమికురాలికి ద్రోహం చేసినట్లే అవుతుంది. ఇంకా చెప్పాలి అంటే అది మానసిక వ్యభిచారం లాంటిదే’ స్థిరంగా చెప్పాను. ‘అమృతా.. చెప్పానుగా.. సమాజం కోసం.. ఇంకా చెప్పాలంటే మా పేరెంట్స్ కోసమే నేను తరుణ్ని పెళ్లి చేసుకుంది. నాకు నువ్వే ప్రాణం’ అంది. ‘నేను నీ ప్రాణమే అయితే నన్నిలా వదిలేసే దానివి కాదు. జీవితాంతం నాకు తోడుగా ఉండేదానివి. నీ కోసం ఎవ్వరినైనా ఎదిరించి బతకటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు? నీది స్వార్థం. నిజమైన ప్రేమకు కావాల్సింది నమ్మకం. అది నీ మీద నాకు ఇప్పుడు లేదు. మళ్ళీ నా జీవితంలో ప్రవేశించాలని చూడకు. గుడ్ బై’ అని చెప్పి బయటకు నడిచాను. --మొగలి అనిల్ కుమార్ రెడ్డి (చదవండి: -
పిల్లల కథ! వ్యాపారానికి కావాల్సిన స్ట్రాటజీ!
అంజి అనే కోతి కొత్తగా మూలికలతో ఔషధాలు తయారుచేసి అడవిలో అమ్మటం మొదలుపెట్టింది. అది కొంతకాలం పక్క అడవిలో ఉండే తన మిత్రుడు మారుతి అనే కోతి దగ్గర మూలికలతో ఔషధాలు తయారుచేయడం నేర్చుకుంది. తిరిగి తన అడవికి వచ్చి మొక్కల వేర్లు, కాండం, బెరడు, ఆకులు, మొగ్గలు, పూలు, కాయలు, పండ్లు, గింజలు, చిగుళ్లను.. ఉపయోగించి ఎత్తుపెరగటానికి, బరువు తగ్గడానికి, జుట్టు పెరగటానికి, అందంగా అవడానికి.. ఇలా చాలావాటికి మందులు తయారు చేసేది. ఏ మొక్క దేనికి ఉపయోగపడుతుంది.. ఏ ఆకును ఏ రకంగా వాడాలో అంజికి పూర్తిగా తెలుసు. తన మూలికల ఔషధాలను అడవంతా విస్తరింపచేయాలనే ఆలోచనతో నలుగురు అమ్మకందారులనూ నియమించాలనుకుంది. వెంటనే అడవి అంతా చాటింపు వేయించింది. అంజి తయారుచేసే మందులను అమ్మి పెట్టేందుకు ఏనుగు, ఎలుగుబంటి, నక్క, పంది ముందుకు వచ్చాయి. ఔషధాలను తీసుకుని నాలుగూ నాలుగు దిక్కులకు వెళ్ళాయి. పదిరోజులైనా ఒక్క మందూ అమ్ముడుపోలేదు. అంజి తయారుచేసిన మందుల అడవిలోని జంతువులకు గురి కలగలేదు. దాంతో అంజి ఔషధాల తయారీని నిలిపివేయాలనుకుంది. విషయం తెలుసుకున్న మారుతి.. అంజిని కలసి ‘మిత్రమా! నీకు ఔషధాల తయారీలో మంచి నైపుణ్యం ఉంది. లోపం ఎక్కడుందో రేపు కనిపెడతాను’ అంటూ ధైర్యం చెప్పింది. మరునాడు అంజి వెంట మారుతి వెళ్ళి ఏనుగు, ఎలుగుబంటి, నక్క, పంది మందులను ఎలా విక్రయిస్తున్నాయో గమనించింది. అవి ఎండలో పెద్దగా అరుస్తూ ఔషధాలు కొనమని వాటి గుణాలను వివరిస్తున్నాయి. ఆ అరుపు విని జంతువులు, పక్షులు వస్తున్నాయి. ఏనుగు, ఎలుగుబంటి, నక్క, పందిని.. వాటి చేతుల్లో ఉన్న మందులను చూసి వెళ్ళిపోతున్నాయి. కానీ కొనటంలేదు. లోపం ఎక్కడుందో మారుతికి తెలిసిపోయింది. కాసేపు అలాగే పరిశీలించి.. అంజి, మారుతి రెండూ తిరిగి ఇంటికి బయలుదేరాయి. దారిలో ‘మిత్రమా! నువ్వు చేసిన మందులు సరైనవే’ అంది మారుతి. ‘మరి అమ్మకందారుల్లో లోపమా?’ అడిగింది అంజి. ‘పాపం నిజానికి అవి ఎండలో పెద్దగా అరుస్తూ, కష్టపడుతున్నాయి. వాటి శ్రమలోనూ ఎలాంటి లోపం లేదు’ అంది మారుతి. ‘మరి కారణం ఏంటీ?’ అడిగింది అంజి. ‘సరైన ఔషధాన్ని సరైన అమ్మకందారు అమ్మటం లేదు’ అంది మారుతి. అర్థంకాలేదు అంజికి. గ్రహించిన మారుతి ‘మిత్రమా! మొదట మన మీద నమ్మకం కుదిరితేనే మనం ఎదుటివారికి అమ్మగలం. ఒంటినిండా జుట్టుండే ఎలుగుబంటి జుట్టు పెరగటానికి ఔషధం అమ్మితే ఎలా ఆకర్షితులౌతారో.. సన్నబడడం గురించి ఏనుగు మాట్లాడితే అలాగే పారిపోతారు’ అంది మారుతి. ‘ఔషధం ఎంత గొప్పదైనా నమ్మకం లేకపోతే పనిచేయనట్లు.. తను ఔషధాన్ని ఎంత చక్కగా తయారుచేసినా సరైన వారు విక్రయించకపోతే అది వినియోగదారుడిని ఆకర్షించదని అర్థమైంది అంజికి. ‘మిత్రమా! ప్రతిజీవిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. దాన్ని సరైన సమయంలో, సరైన పనికి, సరిగ్గా వినియోగించుకోవాలి’ అని చెప్పింది మారుతి. ఆ సూచన పాటించి చిన్న చిన్న మార్పులతో పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగింది అంజి. పైడి మర్రి రామకృష్ణ (చదవండి: పుట్టుకతో ఎవరూ మోసగాళ్లు కాదు! కానీ ఆ మోసం విలువ..!) -
పుట్టుకతో ఎవరూ మోసగాళ్లు కాదు! కానీ ఆ మోసం విలువ..!
జోరున వర్షం కురుస్తోంది.. ఆకాశానికి చిల్లు పడిందాన్నట్టుంది. దట్టంగా మేఘాలు అలుముకోవడంతో పగలే చీకటి ఆవరించింది. సాయంత్రం నాలుగింటికే అర్ధరాత్రిని తలపిస్తోంది. అచ్చం నా మనఃస్థితిలానే ఉంది వాతావరణం కూడా! ఆ వర్షానికి తడిచిన చీర.. కాళ్ళకడ్డం పడుతున్నా అలానే నడుస్తున్నాను. చినుకులు సూదంటు రాళ్ళలా గుచ్చుతున్నాయి. అవి నా మనసుకు తగులుతున్నాయి. రోడ్డుకి అడ్డంగా నడుస్తున్న నా ముందు, కార్ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. ‘ఏమ్మా.. చావాలనుకుంటున్నావా? పక్కనే సముద్రముంది, వెళ్ళి అందులో దూకు. మమ్మల్నెందుకు చంపుతావ్?’ విసుగ్గా అని వెళ్ళిపోయాడు. కార్ డ్రైవర్ మాటలకి పక్కకు తిరిగి చూశాను. వర్షానికి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. గమ్యం లేని నా నడకకు, అదే చివరి మజిలీ అనిపించిందా క్షణం. నా అడుగులు అటువైపు పడ్డాయి. వర్షంలో సముద్రాన్ని చూడాలనేది ఒకప్పటి నా కోరిక. ప్రళయకాల రుద్రుడిలా విరుచుకుపడుతున్న అలలు.. నన్నేం భయపెట్టడం లేదు. నిన్నటి వరకు చిన్న బొద్దింక కనబడినా భయపడే ఆ మహిత ఇప్పుడు లేదు. చేతిలో ఫోన్ రింగ్ అవుతుండటంతో తీసి చూశాను. 143వ కాల్ కట్ అయ్యి, మిస్డ్ కాల్గా మారిపోయింది. ∙∙ ఒకప్పుడు ఆ నంబరంటే విపరీతమైన క్రేజ్. ఆ నంబర్ వెనుకున్న శౌర్య అంటే ఇష్టం. శౌర్యతో జీవితం, ఇదిగో ఇక్కడే మొదలైంది. నాలుగేళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలో కలసి చదువుకున్న క్లాస్మేట్. ఈ అనంతసాగరం ఒడ్డున ఫైనలియర్లో చుట్టూ స్నేహితుల సాక్షిగా.. మోకాళ్ళపై కూర్చుని ప్రపోజ్ చేశాడు. అందరూ చెయ్యడం వేరు.. శౌర్య ప్రపోజ్ చెయ్యడం వేరు అనిపించింది నాకు. అందగాడు.. చదువుల బిడ్డ.. అమ్మాయిలు కోరుకునే లక్షణాలన్నీ శౌర్యలో పుష్కలంగా ఉన్నాయి. అలాంటి శౌర్య.. నాకు ప్రపోజ్ చెయ్యడమనేది నేను ఉహించనిది కావడంతో వెంటనే ఎగిరి గంతేసి కౌగిలించుకుని మరీ ఒప్పుకున్నాను. ఆ తరువాత ఐస్క్రీమ్ పార్లర్ నుంచి బీచ్, కొత్త సినిమా ఇలా ప్రతిచోటా తిరిగి, ప్రేమికులుగా మా ముద్ర వేశాం. నాకు అందంగా కనిపించిన ప్రేమ.. నా తల్లిదండ్రులకు కనిపించలేదు. కులం నుంచి అంతస్తుల వరకు ఎత్తి చూపించారు. ఏడు తరాలు చూడాలన్నారు. అరే..మనిషి ఎదురుగా తన గుణం కనిపిస్తుంటే, కనబడని ఏడు తరాలు గురించి మీకెందుకన్నాను. వాళ్ళు మెట్టు దిగలేదు. నేను మాత్రం ఆ ఇంటి మెట్లు దిగి, శౌర్య భార్యగా మెట్టినింట అడుగుపెట్టాను తల్లిదండ్రులను వద్దనుకుని! నేనంటే ఎంతో ప్రేమ చూపించే అత్తగారు, ప్రాణంలా చూసుకునే శౌర్య. నా అంత అదృష్టవంతురాలు లేదనుకున్నాను. నా ఆనందాన్ని కాలదన్నబోయిన తల్లిదండ్రులపై ద్వేషం పెంచుకుని, కనీసం ఫోనైనా చెయ్యలేదు. ఈనాడు శౌర్య కాకుండా నాకు మరో కుటుంబం, స్నేహం ఏదీ లేదు. నిన్నటి నుంచి ఏడుస్తూనే ఉన్నానేమో, ఇప్పుడిక కన్నీళ్ళు రావడం లేదు. మనిషికి ఎక్స్పైరీ డేట్ ముందే తెలిస్తే అది ఇంత బరువుగా ఉంటుందని నాకిప్పుడే తెలిసింది. అవును!! నేను చనిపోబోతున్నాను. నాకున్నది కొన్ని సంవత్సరాలు మాత్రమే. ఎన్ని కోరికలు, ఆశలు, ఆశయాలుండేవో వాటన్నిటికీ తెర పడింది. ఇంత బాధను అనుభవిస్తూ పోయేకన్నా ఇప్పుడే పోతే? నా ఆలోచనలానే విశాలమైన సంద్రం, రెండు చేతులు చాచి.. ‘నా గర్భంలో నీకు చోటుంది మహితా’ అని చెబుతున్నట్టుంది. వర్షం తగ్గి, మనుషులు తిరగడం ఎప్పుడు మొదలుపెట్టారో గమనించలేదు. సాగర గర్భంలోకి వెళుతున్న నా చేతిని పట్టుకుందో చిట్టి చెయ్యి. బోడిగుండుతో ముద్దుగా, బుజ్జి వామనుడిలా ఉన్నాడు. కిందికి వంగి కళ్ళెగరేశాను. వర్షానికి తడవకుండా, తన చొక్కాలో దాచుకున్న డిబ్బీ తీసి చూపించాడు వాడు. ‘కల్పతరువు’ దాని మీద ఉన్న పేరు అదే! ‘అనాథాశ్రమమా?’ మాట జారి బాధపడ్డాను. బుజ్జి వామనుడు తలూపాడు. మెడలో వేలాడుతున్న మంగళ సూత్రాలతాడు తీసి, డిబ్బీలో వేసేశాను. వాడు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూశాడు. నవ్వి తల నిమిరాను. చేతికి కుట్లు తాలుకు గోతులు తగిలాయి. వామనుడ్ని వెనక్కి తిప్పి చూసి, ‘ఏంటివి?’ అడిగాను. ‘ఇంకొద్ది క్షణాల్లో చనిపోయే నీకెందుకు?’ అంటూ అంతరాత్మ ప్రశ్నించింది. ‘వాడికి బ్రెయిన్లో కణితి ఉందంట అక్కా! ఆపరేషన్ చేసి తీశారు. కానీ మళ్ళీ ఇంకొకటి వచ్చిందట. ఈసారి ఆపరేషన్ అనవసరమంటా’ అంది.. వాడి కూడా వచ్చిన అమ్మాయి వాడిని ఎత్తుకుని వెళుతూ. ఎక్స్పైరీ డేట్ మెడలో వేసుకుని కూడా నవ్వుతూ తిరుగుతున్న బుజ్జి వామనుడు.. తనవంకే చూస్తుండిపోయాను. ‘నిన్ను వ్యాన్ దిగొద్దని చెప్పాను కదా? ఈ సారి ఇలా చేశావంటే బయటకు తీసుకురాను చెబ్తున్నా’ అంది ఆ అమ్మాయి వాడిని బెదిరిస్తూ. బుజ్జి వామనుడు నవ్వుతున్నాడు. ఎక్స్పైరీ డేట్ పూర్తయ్యేవరకు కూడా నవ్వుతూ బతకచ్చని చెప్పిన వాడి పరిచయంతో నా గమ్యం మారింది.వాళ్ళ వెనకే వెళ్ళాను. వాళ్ళందరినీ జాగ్రత్తగా వ్యాన్ ఎక్కిస్తున్న వాలంటీర్ ‘ఏమ్మా, ఆశ్రమానికి వస్తావా?’ అడిగింది. ఆమెకది అలవాటనుకుంటా.. బహుశా విధివంచితలెందర్నో చూసిన అనుభవమయ్యుంటుంది. అప్రయత్నంగానే తలూపాను. ∙∙ వ్యాన్ పెద్ద ఆశ్రమంలోకడుగుపెట్టింది. కల్ప తరువు పేరు మెరుస్తోంది. ఊరికి దూరంగా, విశాలంగా ఉంది. చాలా బిల్డింగ్స్ తరువు శాఖల్లా విస్తరించాయి.‘పేరేంటమ్మా?’ నా కన్నా చిన్నదే రిసెప్షనిస్ట్.. ఆత్మీయంగా అడిగింది. నా పేరు చెప్పాను.ఒక గదిలోకి తీసుకెళ్ళి.. ‘ఇక్కడే కూర్చోండి! మేడమ్గారు వచ్చి మీతో మాట్లాడతారు’ అని వెళ్ళిపోయింది. మళ్ళీ మొదలైన వర్షాన్ని, కిటికీలోంచి చూస్తున్నాను. నాలానే వర్షం కూడా ఆగి ఆగి తన బాధను ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టుంది. ‘నీ మజిలీ ఈ అనాథాశ్రమమా!’ అంతరాత్మ ప్రశ్నిస్తోంది. ‘హాయ్ మహితా! ఐయాం గౌరీ’ చక్కటి కాటన్ చీరలో పొందికగా ఉంది వచ్చినామె. నా కన్నా ఐదేళ్ళు పెద్దదేమో బహుశా! నా చూపులో నిర్లిప్తత చూసి.. నా పక్కకొచ్చి నుంచుంది గౌరీ.‘నేను.. నీలానే ఈ కల్పతరువుకి వచ్చాను. వర్షం చూస్తూ ఇదే గదిలో బెరుగ్గా, భయంగా నుంచున్నాను. ఇప్పుడిక్కడే పని చేస్తున్నాను. ఇక్కడ మనలా చాలా మంది ఉంటారు మహితా! అదిగో ఆ బ్లాక్లో అనాథపిల్లలు ఉంటారు.. దాంట్లో వృద్ధులు.. ఇదిగో ఇందులో మోసపోయిన ఆడవాళ్ళుంటారు. అందులోనేమో హెచ్ఐవీ బాధితులు ఉంటారు.’ఉలిక్కిపడ్డాను ఆమాటకు! ‘నువ్వు ఏ బ్లాక్లో ఉంటావ్ మహితా?’ మాట సౌమ్యంగా ఉన్నా..‘ నువ్వు ఏ జాతి పక్షివి’ అని నన్ను ప్రశ్నిస్తున్నట్టే ఉంది. భయంగా చివర్లో చెప్పిన బ్లాక్ వైపు చూపించాను. ఓదార్పుగా నా చుట్టూ చెయ్యి వేసి ‘ఎప్పటినుంచి?’ అడిగింది గౌరీ. ‘నిన్నటి నుంచి’ నా ప్రమేయం లేకుండానే బుగ్గలను కన్నీళ్ళు తడిపాయి.‘చూడు మహితా.. నువ్వు బాధపడుతుంటే ఓదార్చగలను. కానీ పరిష్కారం చూపించలేను. జరిగింది చెప్పు. చెప్పలేనంటవా అదిగో అక్కడ చాలా మంది ఉన్నారు. నీలానే వాళ్ళకూ కథలున్నాయి. వెళ్ళు.. కలువు, మాట్లాడు. నీకెప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు సరేనా!’ అనునయించింది గౌరీ. తలూపాను కానీ వెళ్ళలేదు. ఏం చెప్పాలి? నాలాంటి కథ ఇంకొకరికి ఉంటుందా? ఈ లోకంలో నా అంత చెత్త కథ ఎవరికీ ఉండదేమో..!? ∙∙ మూడు వారాల ముందు ఆఫీసులో, హెల్త్ ఇన్సూరెన్స్ కోసం బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. అందరిలానే నేనూ ఇచ్చాను. కానీ వచ్చిన రిజల్ట్స్ నన్ను షాక్ చేశాయి. ఆ విషయం శౌర్యకి ఎలా చెప్పాలో తెలియక నాలో నేనే కుమిలిపోతూ, ఏడుపును దిగమింగుకుంటూ నాకసలు హెచ్ఐవీ ఎలా అంటుకుందో అర్థంకాక ప్రతీ సందర్భాన్ని గుర్తుచేసుకుంటుంటే.. రెండు నెలల క్రితం నేను బ్లడ్ డొనేట్ చెయ్యబోతే అడ్డుకున్న శౌర్య గుర్తొచ్చాడు. ‘ఆడవాళ్ళకు పీరియడ్స్ సమయంలోనే బోలెడంత బ్లడ్ పోతుంది. మళ్ళీ నువ్వేం ఇవ్వక్కర్లేదు’ అని అందరిముందు నుంచి నన్ను లాక్కొచ్చాడు. శౌర్యకి నా మీదున్న ప్రేమకి మురిసిపోయాను ఆ క్షణం. కాని సన్నగా మొదలైన అనుమానం.. నన్ను గదంతా వెతికేలా చేసింది. నా అనుమానం నిజమయ్యే సాక్ష్యాలు కనబడటంతో శౌర్య మీదకు విసిరికొట్టి అడిగాను అవేంటని!‘మహా.. సారీ మహా! కావాలని చేసిందికాదు’ కోపంగా మూసేసిన తలుపులు బాదుతూ, బతిమాలడం మొదలుపెట్టాడు. ‘నీకెప్పుడు తెలుసు శౌర్యా?’ ఇంకా ఎక్కడో మిణుకుమంటూ ఆశ.. కన్నీళ్ళను తుడుచుకుని, కిటికీ దగ్గరకొచ్చి అడిగాను.‘మన పెళ్ళికి రెండు రోజుల ముందు. కానీ, నేను తప్పు చెయ్యలేదు మహా! ఇదిగో ఈ టాటూ వలన వచ్చింది. ప్రామిస్! నా జీవితంలో ఉన్న అమ్మాయివి నువ్వొక్కదానివే. ప్లీజ్ మహా, తలుపు తీయ్యి’ కిటికీ దగ్గర నుంచుని అడిగాడు. మరి నన్నెలా పెళ్ళి చేసుకోవాలనిపించింది శౌర్యా? నిన్నట్నుంచి నేనెంత బాధపడుతున్నానో తెలుసా! నీకెక్కడ నా వలన వస్తుందో, ఇప్పటికే వచ్చిందో తెలియక.. నరకం అనుభవిస్తున్నాను. నాకు హెచ్ఐవీ అని తెలిసినప్పటి నుంచి నాకన్నా నీకోసమే ఎక్కువ ఆలోచించాను. నన్నెలా మోసం చెయ్యాలనిపించిందిరా?’ ఏడుస్తూ చేరగిలపడ్డాను.‘చెప్పాలనే అనుకున్నాను మహా..! ధైర్యం సరిపోలేదు. అప్పటికే నువ్వు నా కోసం ఇంటి నుంచి వచ్చేశావ్. నిన్ను వదిలి నేనుండలేను. అందుకే పెళ్ళి చేసుకున్నాను. కానీ నీకు గుర్తుందా మహా..! రెండు నెలల వరకు నిన్ను కనీసం ముట్టుకోలేదు. ఆ తరువాత డాక్టర్ని అడిగి సేఫ్టీ వాడాను. కానీ నా దురదృష్టం.. నీకు వచ్చేసింది’ తల బాదుకుని ఏడుస్తూ చెప్పాడు శౌర్య. ఎంత సులువుగా చెప్పేశాడో..!? నిన్నటి నుంచి ఎన్నో ఆలోచనలు! శౌర్యకి టెస్ట్ చేయించి నెగెటివ్ వస్తే.. ఇక అతని జీవితంలో నుంచి తప్పుకోవాలనుకున్నాను. ఆ నిర్ణయం ఎంత బాధ కలిగించినా సరే.. పాజిటివ్ మాత్రం రాకూడదని ఎంతమంది దేవుళ్ళను మొక్కుకున్నాను!? ఇదే మాటా పెళ్ళికి ముందు చెప్పినా నేను ఒప్పుకునేదాన్ని. శౌర్య అంటే నాకంత ఇష్టం. ‘మోసం చేశావ్ శౌర్యా.. దారుణంగా మోసం చేశావ్!’ గోడకానుకుని ఏడుస్తుండగా.. అత్తయ్య వచ్చినట్టుంది. శౌర్య ఏవేవో చెబుతున్నాడు కానీ నాకేం వినిపించడం లేదు. సగం సగం మాటలు.. ఏవో చెబుతుంటే.. అనుమానంగా తలుపు దగ్గర నుంచి విన్నాను. పలుచటి మంచు పొర కరిగిపోయింది. అత్తయ్య కిటికీ దగ్గరకు వచ్చి ‘అమ్మా మహితా! వాడి మాటలు విను. నిన్ను మోసం చెయ్యాలని కాదు, నిన్ను వదులుకుని బతకలేక అలా చేశాడు.’ శౌర్య కన్నా ఆవిడ మాటలే నాకెక్కువ గుచ్చుకున్నాయి. ఆమెకూ ముందే తెలుసు. ఎంత మోసం! ‘హు..! నేను కోడల్ని కదా?’ చాలా నిస్పృహగా ఉంది. ఇక అక్కడ ఉండబుద్ధవ్వలేదు. బట్టలు, సర్టిఫికెట్స్ అన్నీ సర్దుకుని వెనుక గుమ్మం తలుపు తీసుకుని.. బయటకొచ్చేశాను. ‘మహితక్క అంటే నువ్వేనా?’ చిన్న పాప వచ్చి అడిగింది. తలూపాను. ‘గౌరీ అక్క నిన్ను మా దగ్గరికి తీసుకెళ్ళమంది. దా.. బ్యాగ్ ఎక్కడుంది?’ చెయ్యి పట్టుకుని లాక్కెళుతూ అడిగింది. ఆ అమ్మాయి వెనుకే అప్రయత్నంగా కదిలాను. చిన్న గది, మూడు మంచాలున్నాయి ఆ గదిలో. ‘అదేమో నాది, ఇదేమో మా తమ్ముడిది. నువ్వు ఈ మంచం తీసుకో!’ ముద్దుగా పంపకాల లెక్కలు చెప్పింది పాప. అవేం పట్టనట్టు పరధ్యానంగా నాకు చూపించిన మంచంపై వాలాను. మనుషుల్ని ఎలా మోసం చేస్తారు? అంత సులువుగా ఎలా మోసపోయాను? ‘నువ్వు నీ తల్లిదండ్రులను చేసింది మోసం కాదా?’ అంతరాత్మ ప్రశ్నించింది. ప్రేమంటేనే మోసమా? సమాధానం లేని ప్రశ్న. ఒక్క రోజులో మారిపోయిన నా జీవితం.. నాకే విచిత్రంగా అనిపిస్తోంది. మర్నాడు యోగా హాల్ అని.. అక్కడకు తీసుకెళ్ళింది పాప. అందరూ ఆసనాలు వేస్తున్నారు. నేను బయటికొచ్చి బెంచ్పై కూర్చున్నాను. మొహం మీద సూర్య కిరణాలు పడుతున్నాయి. ‘హాయ్ ఐయాం కిరణ్’ నా మీద కాస్తా పెద్దవాడేమో.. నవ్వుతూ చెయ్యిచ్చాడు.‘మహిత’ దూరంగా ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ చెప్పాను. కవలలు.. ముద్దుగా ఉన్నారు. ‘వాళ్ళకి అమ్మ, నాన్న లేరా?’ కిరణ్ని అడిగాను. ‘ఇద్దరూ చదువుకుని జాబ్ చేస్తున్న వాళ్ళే. డెలివరీ టైమ్లో హెచ్ఐవీ అని తెలిసింది. ఆమె ఆ దిగులుతో చనిపోతే, అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు.’‘అంటే ఆ పసిపిల్లలకు..?’ లేదని చెప్పాలి అని మనసులోనే వేడుకుంటూ అడిగాను. ‘ఇంచుమించు ఇక్కడున్న ప్రతి పిల్లలవీ ఇలాంటి కథలే మహితా! వాళ్ళకు ఏ మాత్రం సంబంధం లేకుండానే చావును మోస్తూ తిరుగుతున్నారు. కొందరిది అమాయకత్వం, కొందరిది మూర్ఖత్వం. ఇంకొందరు డబ్బు కోసం ఒళ్ళమ్ముకుని ఇప్పుడు ఆ దారి కూడా లేక వీథిపాలైన వాళ్ళు. విచిత్రం ఏమిటంటే చదువుకోని వాళ్ళ కన్నా చదువుకుని మోసపోయిన వాళ్ళే ఎక్కువిక్కడ’ అన్నాడు. ‘నువ్వెందుకున్నావ్ కిరణ్?’ ఆ చిన్న పరిచయం ఇచ్చిన చనువుతో ఏకవచనంలోనే ప్రశ్నించాను. ‘మీరా.. తన పేరు! ప్రేమించుకున్నాం. ఒక మైకంలో హద్దులు దాటాం. తనకి నేనే అంటించానని నా మీద తోసేసి పారిపోయింది. తల్లిదండ్రులు అసహ్యించుకున్నారు. ఇంతమంది వద్దనుకున్న బతుకు నాకు మాత్రం ఎందుకనిపించింది. హెచ్ఐవీ అనేది జస్ట్ ఒక చిన్న ఇన్ఫెక్షన్ అంతే మహిత. మందులు వాడితే కొన్ని ఇన్ఫెక్షన్లు వెంటనే తగ్గిపోతాయి, కొన్నింటికి సమయం పడుతుంది. దీని వ్యవధి మాత్రం జీవితకాలం అంతే! మన కోరికలు, ఆశలు ఏవీ నాశనమయిపోవు. హ్యాపీగా మన లైఫ్ మనం లీడ్ చెయ్యొచ్చు. ఇదే నేను తెలుసుకున్నాను. చాలామందికి ఇప్పుడు అవగాహన కల్పిస్తున్నాను’ అన్నాడు కిరణ్. కిరణ్ సమాధానం.. నిన్నటి నుంచి భయపడుతున్న నా ప్రశ్నలన్నింటికీ సమాధానమైంది. ఇంచుమించు ఇద్దరం ఒకే సిట్యుయేషన్లో ఉన్నామనిపించింది. ‘మీరా మోసం నీకు బాధ కలిగించలేదా?’ అడిగి.. కిరణ్ జవాబు కోసం ఎదురుచూడసాగాను. ‘పుట్టుకతోనే ఎవరూ మోసగాళ్ళు కాదు. పరిస్థితుల దృష్ట్యా కొన్ని జరిగాకనే.. వారు లోకం ముందు మొసగాళ్ళలా నుంచుంటారు’ అంటూ లేచి నిలబడి చేతులు విశాలంగా చాపి ఆ బిల్డింగ్ ఆవరణను చూపిస్తూ ‘మీరా మోసం విలువ ఈ ఫాండేషన్’ అని చెప్పి.. ‘ఐయాం వన్ ఆఫ్ ది ఫౌండర్స్ ఆఫ్ కల్పతరువు.. వెల్కమ్ మహితా!’ అని నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నాకు కర్తవ్య బోధచేస్తున్నట్టుగా అనిపించింది. 420వసారి మోగుతున్న ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి కిరణ్కి షేక్ హ్యాండ్ ఇచ్చాను. -నార్కిడిమిల్లి జ్యోతి శ్రీ (చదవండి: వంద గుడిసెలకు ఇదే పెద్ద చదువా!) -
నకిలీ న్యాయవాది విజయగాథ.. 26 కేసులు గెలిచి..
వ్యక్తి సామర్ధ్యం అనేది అతని విద్య, లేదా నైపుణ్యాల ద్వారా వెలుగులోకి వస్తుంది. అలాగే మనిషి ఎంత విద్యావంతుడైతే అతను తన వృత్తిలో అంత మెరుగ్గా ఉంటాడని అంటుంటారు. అయితే ఇటువంటి బలమైన నమ్మకాలను సైతం వమ్ము చేస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. వృత్తిపరమైన విజయంతో అందరినీ ఆశ్చర్యపరిచిన నకిలీ న్యాయవాది ఉదంతం ఇప్పుడు వైరల్గా మారింది. ఈ కథ కెన్యాకు చెందిన ఒక వ్యక్తిది. అతను ఒక ఉన్నత న్యాయవాద సంస్థలో లాయర్గా తన పేరు నమోదు చేసుకోవడమే కాకుండా తన క్లయింట్ల తరపున వాదించి 26 కేసులలో విజయం సాధించాడు. ఈ నకిలీ లాయర్ పేరు బ్రియాన్ మ్వెండా న్జాగి. అతను నిజమైన న్యాయవాది కాదని న్యాయమూర్తులు కూడా గుర్తించలేకపోవడం విశేషం. లా కోర్సు చేయకుండానే బ్రియాన్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. కెన్యా లా సొసైటీ అతనిని అనుమానించిన నేపధ్యంలో అతని మోసపూరిత చర్యలు వెలుగు చూశాయి. బ్రియాన్ అనే నిజమైన న్యాయవాది తాను ప్రాక్టీస్ చేయకపోయినా తన ఖాతా యాక్టివ్గా ఉండటాన్ని చూసి, అతను కెన్యా లా సొసైటీకి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుదారు అటార్నీ జనరల్ కార్యాలయంలో పని చేస్తున్నాడు. అందుకే అతనికి ప్రాక్టీస్ సర్టిఫికెట్ అవసరం లేకపోవడంతో అతను తన ఖాతాను ఎప్పుడూ ఉపయోగించలేదు. అయితే ఒకరోజు అతను తన ఖాతా లాగిన్ చేసినప్పుడు, అతనికి అనుమానం వచ్చింది. దీంతో అతను లా సొసైటీకి ఫిర్యాదు చేశాడు. దీంతో అతని పేరు మీద మరొకరు లాయర్గా వ్యవహరిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ నేపధ్యంలో నకిలీ న్యాయవాదిని అరెస్ట్ చేశారు. అయితే సోషల్ మీడియాలో అతని వృత్తి నైపుణ్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. ఇది కూడా చదవండి: హఠాత్తుగా నాగుపాము తిరగబడితే... -
సీక్వెల్కు రెడీ అయిన హిట్ సినిమాలివే!
ఒక కథ హిట్టయితే... ఆ కథని కంటిన్యూ చేస్తే బాగుంటుందని ఆ కథలోని హీరో, ఆ కథని తెరకెక్కించిన దర్శకుడు, తీసిన నిర్మాత, చూసే ప్రేక్షకులు అనుకోవడం సహజం. కానీ ఆ కథను కొనసాగించడానికి స్కోప్ ఉంటేనే ఇంకో కథ రెడీ అవుతుంది. అలా కొనసాగింపుకి ఆస్కారం ఉన్న కొన్ని కథలు రెడీ అయ్యాయి. ఇలా తమిళంలో పదికి పైగా రానున్న చిత్రాల రెండో భాగం విశేషాలు తెలుసుకుందాం. సేనాపతి తిరిగొస్తున్నాడు కమల్హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్’ (‘భారతీయుడు’ – 1996) బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఎప్పట్నుంచో ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని ప్లాన్ చేస్తున్న శంకర్ 2017లో ‘ఇండియన్ 2’ని ప్రకటించారు. షూటింగ్ సెట్లో జరిగిన ప్రమాదం, నిర్మాణపరంగా నెలకొన్న సమస్యలను అధిగమించుకుని, ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. లైకా ప్రోడక్షన్తో కలిసి ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 1920 నేపథ్యంలో సాగే ‘ఇండియన్ 2’ వచ్చే ఏడాది విడుదల కానుంది. ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ పోస్టర్ మూడు సీక్వెల్స్లో ధనుష్ పుష్కరకాలం క్రితం విడుదలైన ‘ఆయిరత్తిల్ ఒరువన్ (‘యుగానికి ఒక్కడు’ – 2010) సంచలన విజయం సాధించింది. కార్తీ, రీమా సేన్, ఆండ్రియా, పార్తిబన్ లీడ్ రోల్స్ చేయగా, సెల్వ రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రానికి సీక్వెల్గా ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ను ప్రకటించి, హీరోగా తన తమ్ముడు ధనుష్ నటిస్తారని, 2024లో ఈ సినిమాను విడుదల చేసే ప్లాన్లో ఉన్నామని తెలిపారు సెల్వ రాఘవన్. ఇంకా ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం కాలేదు. అలాగే హీరో ధనుష్–దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్లో వచ్చిన ‘అసురన్’, ‘వడ చెన్నై’ చిత్రాలకు వీరి కాంబినేషన్లోనే సీక్వెల్స్కి ప్లాన్ జరుగుతోందని సమాచారం. రెండు సీక్వెల్స్లో కార్తీ ‘ఖైదీ’ (2019)గా కార్తీ సూపర్ హిట్టయ్యారు. లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలనుకుంటున్నారు. మరోవైపు పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన ‘సర్దార్’ కూడా హిట్ ఫిల్మ్. ‘సర్దార్ 2’ కూడా దాదాపు ఖరారైంది. కార్తీ ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తి కాగానే ‘సర్దార్ 2’ మొదలవుతుంది. ఈలోపు రజనీకాంత్ హీరోగా తెరకెక్కించనున్న చిత్రాన్ని పూర్తి చేసి, ‘ఖైదీ 2’ సీక్వెల్ కథ రెడీ చేస్తారట లోకేశ్. అలాగే భవిష్యత్లో ‘జైలర్ 2’, కమల్హాసన్తో ‘విక్రమ్ 2’, ‘బీస్ట్ 2’ చిత్రాలను తెరకెక్కించే ఆలోచన కూడా లోకేశ్ కనగరాజ్కి ఉందట. ‘తుప్పరివాలన్’లో విశాల్ మళ్లీ డిటెక్టివ్.. విశాల్ కెరీర్లో ఉన్న ఓ డిఫరెంట్ హిట్ ఫిల్మ్ ‘తుప్పరివాలన్’ (‘డిటెక్టివ్’ – 2017). మిస్కిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో హిట్ సాధించింది. ఆ తర్వాత విశాల్, మిస్కిన్ల కాంబినేషన్లోనే ‘డిటెక్టివ్’కు సీక్వెల్గా ‘డిటెక్టివ్ 2’ను ప్రకటించారు. నిజానికి ‘డిటెక్టివ్ 2’ ఈపాటికే విడుదల కావాల్సింది. కానీ ఈ సీక్వెల్ స్క్రిప్ట్, బడ్జెట్ విషయాల్లో విశాల్కు, మిస్కిన్కు భేదాభిప్రాయాలు తలెత్తడంతో ‘డిటెక్టివ్ 2’ షూటింగ్ నిలిచిపోయింది. ‘డిటెక్టివ్ 2’కు తానే దర్శకత్వం వహించి, నటిస్తానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు విశాల్. ఈ సినిమా షూటింగ్ ప్రధానంగా విదేశాల్లో జరగనుంది. ‘తని ఒరువన్’లో నయనతార, ‘జయం’ రవి ఎనిమిదేళ్ల తర్వాత... ‘జయం’ రవి కెరీర్లో ‘తని ఒరువన్’ (ఈ సినిమా తెలుగు రీమేక్ ‘«ధృవ’లో రామ్చరణ్ హీరోగా నటించారు) బ్లాక్బస్టర్. ‘జయం’ రవి అన్నయ్య, దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కించారు. 2015లో విడుదలైన ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించారు. ఈ సినిమాకు సీక్వెల్ను తెరకెక్కించాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నారు మోహన్ రాజా. ఫైనల్గా ‘తని ఒరువన్’ విడుదలై, ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 28న సీక్వెల్ను ప్రకటించారు. తొలి భాగంలో నటించిన ‘జయం’రవి, నయనతారలే మలి భాగంలోనూ నటిస్తారు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. ‘మాయవన్’లో సందీప్ కిషన్ మరో మాయవన్ ఐదేళ్ల క్రితం సందీప్ కిషన్ హీరోగా సీవీ కుమార్ దర్శకత్వంలో ‘మాయవన్’ అనే సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ రూపొందిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ‘మాయవన్’కు సీక్వెల్గా ‘మాయవన్ 2’ తీస్తున్నారు మేకర్స్. సందీప్ కిషన్, సీవీ కుమార్ కాంబినేషన్లోనే ఈ చిత్రం రూపొందుతోంది. ‘సార్పట్ట’లో ఆర్య పరంపర కొనసాగుతోంది టెడ్డీ, సార్పట్ట పరంపర.. ఆర్య కెరీర్లో ఈ రెండూ సూపర్హిట్ సినిమాలే. అయితే ఈ రెండు చిత్రాలూ డైరెక్ట్గా ఓటీటీలోనే విడుదల అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాల సీక్వెల్స్ను మాత్రం వెండితెరపైనే చూపించనున్నారు. ‘సార్పట్ట పరంపర’కు దర్శకత్వం వహించిన పా. రంజిత్తోనే ఇటీవల ‘సార్పట్ట పరంపర 2’ను ప్రకటించారు ఆర్య. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. ఇక దర్శకుడు శక్తి సౌందర్ రాజన్తోనే ‘టెడ్డీ’ సినిమా సీక్వెల్ను ఆర్య ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ సమాచారం. ‘7/జి...’లో రవికృష్ణ బృందావన కాలనీ ప్రేమ దాదాపు 20 ఏళ్ల క్రితం వచ్చిన ‘7/జి బృందావన కాలనీ’ (2004) యూత్ని బాగా ఆకట్టుకున్న విషాద ప్రేమకథ. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్. కాగా, ‘7/జి బృందావన కాలనీ’కి సీక్వెల్ ప్లాన్ చేశారు సెల్వ రాఘవన్. తొలి భాగంలో హీరోగా నటించిన రవికృష్ణ మలి భాగంలోనూ నటిస్తారు. కథానాయిక పాత్ర కోసం ఇవానా, దర్శకుడు శంకర్ కుమార్తె అదితీ శంకర్ పేర్లను పరిశీలిస్తున్నారట. తొలి భాగాన్ని నిర్మించిన ఏఎమ్ రత్నం సీక్వెల్ని కూడా నిర్మించనున్నారు. జిగర్తాండ 2 కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 2014లో విడుదలైన సినిమాల్లో హిట్గా నిలిచినవాటిలో ‘జిగర్తాండ’ ఒకటి. సిద్ధార్థ్, బాబీ సింహా, లక్ష్మీ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సీక్వెల్గా ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ తెరకెక్కింది. రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా దీపావళి సందర్భంగా విడుదల కానుంది. జెంటిల్మేన్ మారారు దర్శకుడు శంకర్ తెరకెక్కించిన తొలి చిత్రం ‘జెంటిల్మేన్’ (1993). యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించారు. ఈ చిత్ర నిర్మాత కేటీ కుంజుమోన్ ఇటీవల ‘జెంటిల్ మేన్ 2’ని ్రపారంభించారు. అయితే ఈ సీక్వెల్కి దర్శకుడు, హీరో మారారు. ఏ. గోకుల్ కృష్ణ దర్శకత్వంలో చేతన్ శ్రీను హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీత దర్శకుడు.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో అరుళ్ నిధి హీరోగా రూపొందిన ‘డిమాంటీ కాలనీ’కి సీక్వెల్ వీరి కాంబినేషన్లోనే రానుంది. ఇంకా సీక్వెల్ లిస్ట్లో మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. -
సింహం వద్ద సలహదారు ఉద్యోగం!
ఉదయగిరి దగ్గర వున్న అడవికి భైరవ అనే సింహం రాజుగా ఉండేది. సుబుద్ధి అనే నక్క దానికి సలహాదారుగా ఉండేది. ఒక రోజు సాయంత్రం సుబుద్ధి.. దిగాలుగా ఇల్లు చేరింది. ‘అలా ఉన్నావేం? ఒంట్లో బాగా లేదా?’ అంటూ ఆతృతగా అడిగింది సుబుద్ధి భార్య. పెద్దగా నిట్టూర్చి సుబుద్ధి ‘రాజుగారు రేపటి నుంచి రావద్దని చెప్పారు. నా పదవి ఊడింది’ అంది. ‘అయ్యో, ఇప్పుడెలా? ఇంతకీ ఉద్యోగం ఎందుకు పోయినట్లు?’ అడిగింది సుబుద్ధి భార్య. ‘నాకు వయసు మీద పడిందట. ఇదివరకటిలా చురుగ్గా లేనట. ఇక ఇంటి దగ్గర ఉండి విశ్రాంతి తీసుకోమన్నారు రాజుగారు’ విచారంగా చెప్పింది సుబుద్ధి. ‘అలా ఎలా? పోనీ మన అబ్బాయిని సలహాదారుగా పెట్టుకోమని అడగండి’ అన్నది సుబుద్ధి భార్య. ఆ సలహా నచ్చి మర్నాడే తన కొడుకు వీరబుద్ధితో సింహం గుహకి వెళ్ళింది సుబుద్ధి. ‘మహారాజా.. వీడు నా కొడుకు వీరబుద్ధి. వీడిని మీ సలహాదారుగా పెట్టుకోండి. ఎన్నో ఏళ్ళుగా మీ దగ్గర నమ్మకంగా పని చేశాను. అన్యాయం చేయకండి’ అని వేడుకుంది సుబుద్ధి. సింహం నవ్వి ‘అలాగే.. చూస్తాను. వీడిని నా దగ్గర వదిలి వెళ్ళు’ అంది. వీరబుద్ధి రోజంతా గుహ బయటే కూర్చుంది. దానికి ఏ పనీ లేదు. తిండికీ లోటు లేదు. రాత్రి ఇంటికి వస్తూనే వీరబుద్ధి..‘అమ్మా.. ఇన్నాళ్లూ నాన్న చేసిన ఉద్యోగం.. రోజంతా గుహ బయట కూర్చుని, మూడు పూటలా భోంచేసి రావడం.. అంతే!’ అన్నది పెద్దగా నవ్వుతూ. మర్నాడు సింహం గుహ బయట పచార్లు చేస్తూండగా గూఢచారిగా పనిచేసే గద్ద ఒక దుర్వార్త మోసుకుని వచ్చింది. భైరవకోనలో ఉండే సింహం.. అక్కడ కరువు నెలకొనడంతో పొరుగున సుభిక్షంగా ఉన్న ఉదయగిరి అడవి మీదకు దండయాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.. మహారాజా!’ అంటూ. ‘సమాచారం చేరవేసినందుకు ధన్యవాదాలు. ఏం చేయాలో మేం ఆలోచిస్తాం. ఇక నువ్వు వెళ్లొచ్చు’ అంది సింహం గంభీరంగా. ‘చిత్తం’ అంటూ రివ్వున ఎగిరిపోయింది గద్ద. దీర్ఘంగా నిట్టూరుస్తూ ‘నీ సలహా ఏమిటి? ఇప్పుడు మనం ఎలా ముందుకు వెళ్లాలి?’ అంటూ అక్కడే ఉన్న వీరబుద్ధిని అడిగింది. వీరబుద్ధి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. ఏం చెప్పాలో తోచక బుర్ర గోక్కుంటూ ఉండిపోయింది. ‘మన అడవిని కాపాడుకోడానికి మనం యుద్ధానికి సిద్ధం అయితే ఎలా ఉంటుంది ?’ అని అడిగింది సింహం. ‘భేషుగ్గా ఉంటుంది మహారాజా.. యుద్ధంలో చచ్చిన వాళ్ళు స్వర్గానికి వెళతారు అని చెప్పేవాడు మా తాత’ అన్నది వీరబుద్ధి. సింహం కాసేపు అటూ ఇటూ తిరిగి ‘కానీ యుద్ధం అంటే ప్రాణ నష్టం తప్పదు. పోనీ మనం వాళ్ళతో సంధి కుదుర్చుకొతువులుని ఆ అడవిలోని జనం కూడా స్వేచ్ఛగా మన అడవిలో తిరుగుతూ, చెలమల్లో నీళ్ళు తాగడానికి అనుమతిస్తే ఎలా ఉంటుంది?’ అని అడిగింది సింహం. ‘ఈ ఆలోచన బాగుంది. అవి మన అడవిలో తిరిగితే మనకు నష్టం ఏమీ ఉండదు’ అన్నది వీరబుద్ధి. ‘అప్పుడు మనం స్వతంత్రం కోల్పోయినట్లే! అలాకాదు.. ఇంకా వాళ్ళు దండయాత్ర చేసే ఆలోచనలోనే ఉన్నారు కాబట్టి ముందు మనమే వాళ్ళ మీదకు దండయాత్ర చేస్తే? ఇంకా పూర్తిగా సిద్ధంగా లేని వాళ్ళను ఒడించవచ్చు కదా?’ అంది సింహం. ‘అవునవును.. మనం అలాగే చేయాలి. అప్పుడే వాళ్లకు బుద్ధి వస్తుంది’ అన్నది వీరబుద్ధి. ‘సరే.. నువ్వు ఇంటికి వెళ్ళి మీ నాన్నను తీసుకుని రా’ అని పురమాయించింది సింహం. వీరబుద్ధి పరుగు పరుగున ఇంటికి వెళ్ళి తండ్రి సుబుద్ధితో తిరిగి వచ్చింది. అప్పటికి సింహం ఇంకా గుహ బయటే పచార్లు చేస్తోంది. అది పాత సలహాదారును చూస్తూనే.. ‘చూడు సుబుద్ధీ.. వంశపారంపర్యంగా చేసుకునేందుకు సలహాదారు ఉద్యోగమేమీ వ్యవసాయం కాదు. ఆలోచనా శక్తి, సమయస్ఫూర్తి.. సమస్యను సరిగ్గా అర్థం చేసుకునే తెలివి వంటి లక్షణాలు అన్నీ ఉండాలి. నీ కొడుకుకి సమస్య మనమే వివరించి.. దానికి పరిష్కారమూ మనమే అందించాలి. మనమేం చెబితే దానికి తలాడించే వాడు సలహాదారుడు కాలేడు. వాడు చురుగ్గా తిరగ్గలడు. అందుకు తగిన ఉద్యోగం చూస్తానులే’ అన్నది సింహం. ‘అలాగే మహారాజా, నాది కూడా ఒక విన్నపం. నాకు వయసు మీద పడి చురుకు తగ్గినా.. ఆలోచన శక్తి మాత్రం తగ్గలేదు. సలహాదారు ఉద్యోగానికి బుద్ధితో తప్ప వయసుతో సంబంధం లేదు. ఆ మాటకు వస్తే వయసుతో తెలివి, అనుభవం పెరుగుతాయి. మరోసారి నా విషయం ఆలోచించండి’ అన్నది సుబుద్ధి వినయంగా. సింహం తల పంకించి కొత్తగా వచ్చిన సమస్యను వివరించి ‘ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పు’ అని అడిగింది. సుబుద్ధి కాసేపు ఆలోచించి ‘నా సలహా మీకు కోపం తెప్పించే విధంగానే ఉంటుంది. మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. భైరవకోన యువరాణికి ఒక కన్ను లేదు. ఆమె పెళ్ళి చేయలేకపోతున్నానన్న దిగులు ఆ రాజుగారిని పట్టి పీడిస్తోంది. మీరు పెద్ద మనసు చేసుకుని మన యువరాజుకు భైరవకోన యువరాణితో పెళ్ళి జరిపిస్తానని కబురు పంపితే రాబోయే ఈ కయ్యం కాస్తా వియ్యంగా మారుతుంది. ఈ అడివి కోసం మీ రాజ కుటుంబం త్యాగం చేయకతప్పదు. అలా జరిగిననాడు మన యువరాజు ఈ రెండు అడవులకు చక్రవర్తి అవుతాడు’ అన్నది.‘భేష్.. సుబుద్ధి తెలివితేటలకు, ఆలోచన శక్తికి వయసుతో పనిలేదని నిరూపించావు. నీ సలహా ప్రకారమే చేస్తాను. రేపటి నుంచి కొలువులోకి వచ్చేయ్’ అంది సింహం సంతోషంగా! (చదవండి: వంద గుడిసెలకు ఇదే పెద్ద చదువా!) -
వంద గుడిసెలకు ఇదే పెద్ద చదువా!
ప్రభుత్వం నన్ను విచారణాధికారిగా నియమించింది. నా కమిటీలో సభ్యులుగా ఒక ఎస్పీ, ఒక మహిళా డిఎస్పీ కూడా వున్నారు. ఆమె పేరు సౌమ్య. ముగ్గురం కారులో బయల్దేరాం. లక్నో నుంచి ఆరు గంటల ప్రయాణం. అది చిత్రకూట్ జిల్లా. దాని ముఖ్యాలయం కర్వీ. అక్కడ ప్రభుత్వ అతిథి గృహంలో వసతి ఏర్పాటు చేశారు. అల్పాహారం తీసుకొని, ఉదయం తొమ్మిది గంటలకు బయల్దేరాం. మాకు మార్గం చూపించేందుకు ఒక ఎస్సైను పైలెట్గా పెట్టారు. ఎటు చూసినా కొండలు. వింధ్యాచల పర్వతాలు. పచ్చటి చీర కట్టుకున్న కొండల మేనిపై సూర్యోదయ కిరణాలు మరింత తళతళలాడుతున్నాయి. రాళ్ళూ రప్పలతో ఎప్పుడూ ఎండిపోయిన ముఖంతో దీనంగా వుండే బుందేల్ఖండ్ నేల.. పచ్చని పొలాలతో, చెట్లతో యవ్వన చైతన్యంతో వెలుగుతోంది. ఆ ప్రకృతిని చూస్తుంటే, చాన్నాళ్ల నా కళ్ల ఆకలి తీరిపోయిందనిపించింది. కారు నత్తనడక నడుస్తోంది. డ్రైవర్ తప్పు కాదు. రోడ్డు లోపం అంతకన్నా కాదు. అన్నా ఆవుల వల్ల. వందల కొలది ఆవులు రోడ్డుకు అడ్డంగా తిరుగుతుంటాయి. పాలివ్వని ఆవుల్ని యిలా గాలికి వదిలేస్తారు. బుందేల్ఖండ్ ప్రాంతంలో ఎక్కడ చూసినా కనిపించే ముఖచిత్రం యిది. అన్నా ఆవులు, నీలి ఆవులు కలిసి పంటల్ని నాశనం చేస్తుంటాయి. రైతులు తమ కన్నీళ్లను కడుపులోనే దాచుకుంటున్నారు. మా కారు కొండల పాదాల వద్ద వున్న గుడిసెలకు రెండు కిలోమీటర్ల దూరంలో ఆగింది. అక్కడి నుండి నడక. అక్కడ సుమారు వంద గుడిసెలు. మట్టితో కట్టినవి. విద్యుత్తు లేని వూరులుంటాయా అన్న అనుమానం రాకుండా అవి సాక్ష్యంగా నిలబడ్డాయి. శ్రీశ్రీ వర్ణించిన ‘భిక్షు వర్షీయసి’ ని గుర్తు చేస్తున్నట్లున్నాయి ఆ గుడిసెలు. నడుచుకుంటూ ఆ వూరి మధ్యలోంచి వెళ్తున్నాం. ఇళ్ల చూర్ల మధ్య ముఖాలు పెట్టి, మమ్మల్ని చూస్తున్నారు జనం. ఒకరిద్దరిని పిలిచి హిందీలో అడిగాం. ‘ఇవాళ పనిలోకి వెళ్ళలేదా?’ అని. ‘పని లేదు సాబ్ ’ హిందీలోనే నిర్లిప్త సమాధానం. పోలీసుల్ని చూసి వాళ్ళ కళ్లు భయపడలేదు. ఇందరు అధికారులు ఆ గుడిసెల దగ్గరకి ఎందుకు వచ్చారన్న ఆశ్చర్యం లేదు. నాకు ఆశ్చర్యమనిపించింది. ఏ హావభావాలు లేని వాళ్ళ పెదాలు చూసి. దేశాన్ని ఒక్క కుదుపు కుదిపిన ఘటన. విభిన్న విచారణ సంస్థలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఘటన. అగ్ని పర్వతం పుట్టిన చోటును వీసమంతయినా కదపలేకపోయింది. వచ్చిన పని వెదుక్కుంటూ బాధితురాలు బబ్లీ ఇంటికి చేరాం. పన్నెండేళ్ల బాలికను తీసుకొని, వాళ్లమ్మ బయటకొచ్చింది. తల్లి కొంగు చాటున అమాయకంగా నిలబడింది. ఎటు చూసినా పేదరికం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. మా కమిటీ సభ్యురాలు సౌమ్య ఆమెను వివరాలు అడుగుతున్నది. అన్నింటికీ వాళ్ళమ్మే సమాధానం చెబుతోంది. పని వెదుక్కుంటూ మీర్జాపూర్ జిల్లా నుండి ముప్పై ఏళ్ల క్రితం వలస వచ్చారట. వాళ్లందరికీ గుడిసెలు కట్టుకోవడానికి ఒక భూస్వామి మూడెకరాల పొలాన్ని కేటాయించాడట. ఒకరి తర్వాత ఒకరు చేరి, ఇప్పటికి వంద కుటుంబాలయ్యాయి. గత పదేళ్లలో ఇసుక తవ్వకాల పనులు బాగా ఎక్కువయ్యాయని చెప్పింది. అందులో కూలీ పని నిత్యం వుంటుందని చెప్పింది. ‘ఈ చిన్న పిల్లలు కూడా కూలి పనికి వస్తారా?’ అడిగాం. లేదు. వీళ్ళు ఇంటి దగ్గరే వుండి, వంట చేస్తారు.’ ‘వీళ్ళు ఇసుక పని దగ్గరకు అస్సలు రారా?’ ‘అప్పుడప్పుడు భోజనం తీసుకుని వస్తారు.’ ‘అంటే, రోజూ మీరు వెళ్ళేప్పుడే భోజనం తీసుకెళ్తారా?’‘అవును.’‘గుత్తేదారు జీతం యివ్వడానికి యిబ్బంది పెడతాడా?’‘ లేదు. ప్రతి సోమవారం పేమెంట్ చేస్తారు. ’‘ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఒక్కటే జీతమా?’‘ రోజుకి ఆడవాళ్ళకి రెండొందలు. మగవాళ్లకు మూడొందలు.’ ఇద్దరు ముగ్గురు ఆడవాళ్లు అక్కడ పోగయ్యారు. ఆసక్తిగా వింటున్నారు. ‘ఎక్కువ జీతం ఎర చూపి, ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ఎప్పుడైనా ప్రవర్తించారా?’ ‘లేదు సాబ్. అలాంటిదెప్పుడూ లేదు. పనిలో మేమందరం కలిసే వుంటాం. కలిసే వస్తాం’ అంది మరొక ఆమె. ‘ఈమెవరు?’ అని అడిగాను. ‘గుడియా వాళ్ళమ్మ’ అని బదులిచ్చింది మరొకామె. మేం దర్యాప్తు చేస్తున్న మరొక బాధితురాలు గుడియా. మహిళా అధికారి.. బబ్లీని దగ్గరకు పిలిచింది. బిక్కు బిక్కుమంటూ వచ్చింది. భోజ్పురిలో అడగడం మొదలు పెట్టింది. ‘ఎవరికీ భయపడనక్కర లేదు. జరిగింది జరిగినట్లు చెప్పమ్మా!’ మౌనంగా నిలుచుంది. ఏ ప్రశ్న లేని వుత్తరంలా వుంది ఆమె ముఖం. ‘మేమున్నాం. నీకే భయం లేదు. గుత్తేదారు నిన్నేం చేశాడో చెప్పు.’ ‘కుచ్∙నహీ కియా’ నూతిలో నుండి ఒడ్డుకు వచ్చినట్లుగా, ఆమె పెదాలను దాటి వచ్చింది ఆ మాట. మహిళా అధికారి మరింత సౌమ్యాన్ని ప్రదర్శించింది. ‘చెప్పమ్మా. ఆ రాక్షసుడు నీ చెయ్యి పట్టుకు లాగాడా?’‘ నహీ.. కుఛ్∙నహీ హువా.’ అదే వ్యక్తీకరణ. ‘గుత్తేదారిని ఎప్పుడన్నా చూశావా?’ ‘నహీ’ ‘నువ్వు ఆ ఇసుక తవ్వకం పని చేశావా?’ ‘నహీ.’ ‘నిన్ను గుత్తేదారు మనుషులెవరన్నా రమ్మన్నారా?’ ‘నహీ’ ‘మరి నువ్వు ఏం చేస్తావు?’ ‘ఖానా బనాతీ హూ’ ‘చదువుకున్నావా?‘ ‘నహీ’‘టీవీ వాళ్లకు అలా ఎందుకు చెప్పావు?’ ‘పైసా కే లియే’‘అలా చెబితే డబ్బులు యిస్తానన్నారా?’ ‘హా!’ అక్కడ నుండి బబ్లీ వాళ్లమ్మ దగ్గరకు వెళ్ళిపోయింది. ‘ఈ వూరిలో చదువుకున్నవాళ్ళెవరైనా వున్నారా?’ అని అడిగాం. ‘ఆ! యిదిగో ఈ దుర్గే పెద్ద చదువు చదివింది’ అన్నారు. మూడేళ్ళ పాపను ఎత్తుకుని నిలబడ్డ దుర్గ గర్వంగా చూసింది. ‘ఏం చదువుకున్నావమ్మా?’ అడిగాను నేను. ముసి ముసిగా నవ్వుతోంది. పరవాలేదు, చెప్పమ్మా అన్నట్లుగా ఆమె వైపే చూస్తున్నాను. ‘పాంచ్’ అంది మెల్లగా ముసి ముసి నవ్వులో నుంచి బయట పడుతూ. నా గుండె ఆ క్షణం కొట్టుకోవడం మానేసింది. వంద గుడిసెలకు ఇదే పెద్ద చదువు. ఆరా తీశాను. చదువు మీద వాళ్లకు నమ్మకం లేదు. చదువు కూడు పెట్టదంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఆవారాగా తిరుగుతున్న చదువుకున్నోళ్లను లెక్కబెడుతున్నారు. ‘ఇంతకీ, ఏం జరిగిందో నువ్వు చెప్పు’ అంటూ ఆ చదువుకున్న అమ్మాయిని అడిగాను. ఏమీ జరగలేదంది. మా కమిటీలో మహిళా సభ్యురాలు సౌమ్య గుడియాను పిలిచింది. ఏం జరిగిందో చెప్పమని అడిగింది. ‘బతాదియానా’అంది మెల్లగా. ఎవరికి చెప్పావంటూ మళ్ళీ అడిగింది సౌమ్య. ‘బహుత్ బార్’ అంది. ఆ తర్వాత దేనికీ సమాధానం చెప్పలేదు. ‘అదేం చెబుతుంది చిన్నపిల్ల. నేను చెబుతాను రాసుకోవమ్మా’ అంటూ నోరు తెరచి బిగ్గరగా మున్నీదేవి కూతుర్ని వెనక్కి నెట్టి నిలబడింది. ‘నా పేరు మున్నీ. నాకు అక్షరం ముక్క రాదు. అయినా పూస గుచ్చినట్లు చెబుతాను’ అంటూ భోజ్పురిలో మొదలు పెట్టింది. ‘నాకు ఆరుగురు పిల్లలు. నా వయస్సెంతో నాకు తెలీదు. నేను అబద్ధం చెప్పను’ అంటూ ధారాప్రవాహంగా సాగిపోతున్నాయి ఆమె మాటలు. ‘మా వూరిలోకి ఒక సంస్థ నుంచి అంటూ ఒక మహిళ వచ్చింది. ఆమెతో పాటు ఒక వీడియో కెమెరా పట్టుకుని ఒక కుర్రాడు, మాట్లాడేది చేత్తో పట్టుకుని ఒక అమ్మాయి వచ్చారు.’ ఆమె గుక్క తిప్పుకోకుండా చెప్పుకు పోతోంది. ‘మొదట మా గుమ్మం దగ్గరికి వచ్చారు. సంస్థ తాలూకు మహిళ మీకు మేలు జరుగుతుందని మమ్మల్ని ప్రలోభ పెట్టింది. మేం చెప్పినట్లు కెమెరా ముందు చెప్తే, మీకు బోల్డు డబ్బులు వస్తాయంది. మావి కాలుతున్న కడుపులు కదా. పైగా చదువూ సంధ్యాలేని బతుకులు. ఎవరేది చెప్పితే, అది నమ్మేస్తాం. డబ్బు ఎర చూసే సరికి సరే అన్నాం.’ ఆమె గొంతులో కొంచెం బాధ, కొంచెం పశ్చాత్తాపం తొంగి చూశాయి. గొంతు సవరించుకుంది. ‘వాళ్ళు మా గుడియాకు ఎలా మాట్లాడాలో చెప్పారు. వాళ్ళు చెప్పినట్లే కెమెరా ముందు చెప్పింది.’ ‘ఏం చెప్పింది?’ సౌమ్య అడిగింది. ‘జీతం కోసం శరీరం యివ్వాల్సి వస్తుందని. గుత్తేదారు మాతో పాటు, మా లాంటి ఆడపిల్లల్ని పాడు చేస్తున్నాడని.’‘అందులో నిజం లేదా?’ సౌమ్య ఆమె కళ్ళల్లోకి నేరుగా చూస్తూ అడిగింది. నిమిషం పాటు మౌనం. ఆ తర్వాత అందుకుంది. ‘కేసులు పెట్టొచ్చు. మీరు కోల్ జాతి వాళ్ళు కాబట్టి దళిత చట్టం కింద పరిహారం వస్తుంది అని సంస్థ మహిళ నమ్మబలికింది.’‘మా ఇంటి దగ్గర నుండి బబ్లీ ఇంటికి వెళ్లారు. అవే మాటలు చెప్పించారు. దాన్నే టీవీల్లో తెగ చూపించారంట.’ఆమె సహజ వక్త. ఎక్కడ నొక్కి పలకాలో, ఎక్కడ తగ్గి పలకాలో, ఎక్కడ ఆగాలో, ఎక్కడ గొంతు పెంచాలో స్వాభావికంగా చేస్తోంది. ‘ఇప్పటి దాకా మీలా ఐదు బృందాలు వచ్చాయి. అందరికీ చెప్పిందే చెబుతూ విసిగిపోయాం.’ మానవధికార సంఘం, చైల్డ్ లేబర్, మహిళా హక్కుల సంఘం, హైకోర్టు బృందం, జిల్లా కలెక్టరు బృందం వచ్చి వెళ్లినట్లు నాకు తెలుసు. ఈ అన్ని కమిటీలు కూడా టీవీలో, పేపర్లలో వచ్చిన వార్తల ఆధారంగానే వచ్చాయి. ఎవరి ఫిర్యాదు వల్లనో వచ్చినవి కావు. ‘ఆ సంస్థ వాళ్ళు మీకు డబ్బులేమైనా యిచ్చారా?’ అనడిగింది సౌమ్య. ‘చెరో రెండు వేలు చేతిలో పెట్టి వెళ్లిపోయారు. మీరే చెప్పండి యిప్పుడు ఈ పిల్లల భవిష్యత్తు ఏం కాను?’ అంటూ ఆమె కళ్లు చెమ్మగిల్లాయి. ఇక ఆమె మాట్లాడలేదు. నెమ్మదిగా వెనక్కి జారుకుంది. వూరంతా గాలించాం. సాక్ష్యం కోసం. ఆడ, మగా అంతా ఖాళీగా వున్నారు. గుసగుసలు. అక్కడక్కడ ఏవగింపులు. గుంపులు గుంపులుగా కూర్చున్నారు. కొరోనా భయం కూడా లేకుండా. ‘పనిలోకి వెళ్ళలేదు ఏం?’ అని ఒకరిద్దరి మగాళ్లను అడిగాం. ‘పని ఆగిపోయింది’ అన్నారు. టీవీలో వచ్చిన విషయం గురించి అడిగాం. ఒక్కరు కూడా దాన్ని సమర్థించలేదు. అబద్ధం అన్నారు. గుడిసెల మధ్యలో నుండి మాలో మేం మాట్లాడుకుంటూ మెల్లగా కారు దగ్గరికి వచ్చాం. నేను కారులో కూర్చుంటుండగా మున్నీదేవి వేగంగా నడుచుకుంటూ వచ్చింది. నా చేతిలో ఒక చిన్న భరిణ పెట్టింది. ‘ఏంటిది?’ అని అడిగాను. ‘కారులో కూర్చొని చూడండి’ అని వూరిలోకి వెళ్ళిపోయింది. మా కారు ఆ గుడిసెల్ని విడిచిపెడుతూ కదిలిపోయింది. భరిణ తెరచి చూశాను. ఇంకిపోయిన రెండు కన్నీటి బొట్లు..! (చదవండి: ఇంట్లో వాళ్లే కాదు... మొత్తం ఊరంతా) -
చీకట్లో చిరుదీపం! ఆ యాక్సిడెంట్ ఓ కొత్త బంధాన్ని..
‘ఫ్లైట్లో భలే ఉంది డాడీ! ఇప్పుడు జుయ్య్ మంటూ పైకి ఎగిరి పోతుందా? మబ్బుల్లోకి దూరిపోతుందా? మనం మబ్బులను తాకవచ్చా?’ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది పింకీ. ‘ఫ్లైట్ పైకి ఎగిరిపోతుంది కానీ మనం మబ్బులను తాకలేము. నువ్వు అల్లరి చేయకుండా కూర్చోవాలి. లేకపోతే ఎయిర్ హోస్టెస్ నిన్ను కిందకు దింపేస్తుంది’ అన్నాడు వశిష్ట. ‘అమ్మా! మనం అమెరికా వెళ్ళగానే జార్జ్ మామయ్య ఎయిర్ పోర్ట్కి వచ్చి మనల్ని తీసుకెళ్తారా? ఒకవేళ మామయ్య రాకపోతే మనం ఏం చేద్దాం?’ సందేహంగా అంది పింకీ.‘జార్జ్ మామయ్య తప్పకుండా వస్తాడు పింకీ!’ నమ్మకంగా అన్నాను. ‘లేఖా! ఎప్పుడయినా ఇలా అమెరికా వెళ్తాము అని అనుకున్నామా?’ ఆనందంగా అన్నాడు వశిష్ట. ‘అలాంటి పగటి కలలు కనే అలవాటు మనకు లేదు కదండీ! మనం ఊహించనిది జరగడమే జీవితం’ నవ్వుతూ అన్నాను. అంతలో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతోంది అని ఎయిర్ హోస్టెస్ అనౌన్స్మెంట్ వినిపించడంతో ప్రయాణికులు అందరూ సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారు. మేము కూడా వాళ్ళను అనుసరించాం. సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకొని కొద్ది రోజుల వెనక్కి వెళ్ళాను. ∙∙ నేను ప్రభుత్వ ఆస్పత్రిలో హెడ్ నర్సుగా పని చేస్తున్నాను. ఆస్పత్రికి వెళ్ళే దారిలో రైల్వే పట్టాలు ఉంటాయి. వాటిని దాటి వెళ్తే దారి కలిసి వస్తుందని ఎక్కువగా అటువైపు నుండే నడిచి వెళ్తాను. ఆలస్యం అయినరోజు చుట్టూ తిరిగి ఆటోలో వెళ్తాను. సరిగ్గా రైల్వే పట్టాల దగ్గరకు వచ్చేసరికి చాలా మంది జనం గుమిగూడి కనిపించారు. ఏమైందోనని జనం మధ్యలో నుండి తొంగిచూశాను. ‘ఎవరో ఒక యువకుడు పడిపోయి ఉన్నాడు. తలకు కట్టు కట్టి ఉంది. బట్టలన్నీ చినిగిపోయి అర్ధనగ్నంగా ఉన్నాడు. ఆ అబ్బాయి మా ఆస్పత్రిలో నిన్నటి దాకా ఉన్న పేషెంట్గా ఉన్నట్టు అనిపిస్తోంది. బయటకు ఎలా వచ్చాడు? ఎప్పుడు స్పృహ వచ్చిందో? నుదుటి మీద దెబ్బలున్నాయి. ఎవరో రాళ్లతో కొట్టినట్లున్నారనుకుని, గబగబా దగ్గరకు వెళ్ళి చూశాను. స్పృహలోనే ఉన్నాడు కానీ మాటా పలుకు లేకుండా చూస్తున్నాడు. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి అతన్ని మళ్ళీ ఆస్పత్రిలో చేర్పించాను.. చికిత్స కోసం! సరిగ్గా ఒక పదిహేను రోజుల క్రితం ఆ ప్రాంతంలోనే ఒక రైలు పట్టాలు తప్పి పడిపోయింది. ఆ ప్రమాదంలో దెబ్బలు తగిలిన వాళ్ళను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చాలామందికి చిన్న చిన్న గాయాలే అయ్యాయి. ప్రాణనష్టం జరగలేదు. కానీ పది మందికి మాత్రం తీవ్రంగా గాయాలు అయ్యాయి. అందులో తొమ్మిది మంది సమాచారం వాళ్ళ వాళ్లకు చేరింది. కానీ ఒకే ఒక యువకుడి తాలూకు అడ్రస్ మాత్రం తెలియలేదు. అతని దగ్గర బ్యాగ్ కానీ, ఫోన్ కానీ.. అతని ఉనికిని తెలిపే ఏ వస్తువు కానీ లేవు. తలకు బలమైన దెబ్బలు తగిలాయి. నిన్నటి వరకు పూర్తి స్పృలో కూడా లేడు. ‘అతను బయటకు ఎలా వెళ్ళిపోయాడు?’ అంటూ డాక్టర్ గారు స్టాఫ్ అందరినీ గట్టిగా కేకలు వేశారు. ఆ తరువాత అతనికి స్పృహ వచ్చిందని మీడియాకి సమాచారం అందించారు. కాంపౌండర్కి చెప్పి అతని బట్టలు మార్పించి గాయాలు తుడిచి కట్టు మార్చి, మందులు వేశాను. అతను కళ్ళు తెరిచి చూస్తున్నాడు కానీ ఏమీ మాట్లాడటం లేదు. అసలు మనం మాట్లాడేది అర్థం అవుతోంది లేనిది కూడా తెలియడం లేదు. ‘బహుశా తలకు తగిలిన దెబ్బ వల్ల మాట పోయిందా? లేక మతి భ్రమించిందా? అసలు చెవులు వినబడుతున్నాయా? లేదా?’ అనుకున్నాను. ‘శ్రీలేఖా.. ఏక్సిడెంట్తో ఇతను షాక్లోకి వెళ్లినట్లున్నాడు. వాళ్ల వాళ్లు వచ్చే వరకు మనమే టేక్ కేర్ చేద్దాం, జాగ్రత్తగా చూసుకోండి’ అని చెప్పారు డాక్టర్ గారు ఆ యువకుడిని పరీక్షించాక. ∙∙ మీడియా వచ్చి అతని ఫొటోస్ తీసుకొని.. వివిధ రకాల ప్రశ్నలు వేసింది. అతడి నుండి ఎటువంటి సమాధానమూ రాకపోయేసరికి నిరాశతో వెనుదిరిగింది. ‘నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పదిహేను రోజుల క్రితం జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన ఒక యువకుడికి రెండు రోజుల క్రితమే స్పృహ వచ్చిందని డాక్టర్ గారు సమాచారం ఇచ్చారు. అతను షాక్కి లోనయి ఉండటం వల్ల మాట్లాడటం లేదు. ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి వివరాలు తెలిసిన వారు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిని సంప్రదించగలరు.’ అంటూ పేపర్లో వార్తగా వచ్చింది ఆ యువకుడి విషయం. రెండు.. మూడు.. వారం రోజులు గడిచాయి. ఎవరూ రాలేదు. అతడు ఎవరితో మాట్లాడటం లేదు. తిండీ తినడం లేదు. ఎవరయినా పలకరించినా అలా చూస్తూ ఉంటున్నాడు. కానీ సమాధానం చెప్పడం లేదు. డ్యూటీలోకి రాగానే ముందు అతడిని చూడటం.. అలాగే డ్యూటీ నుండి వెళ్లిపోయే సమయంలో నైట్ డ్యూటీ స్టాఫ్కి అతడి గురించిన జాగ్రత్తలు చెప్పి వెళ్లడం నా దినచర్యలో భాగమైంది. ఒకరోజు డాక్టర్ గారు రొటీన్ చెకప్లో భాగంగా ఆ అబ్బాయిని చూసి.. ‘శ్రీలేఖా.. అతని తాలూకు ఎవరూ రావడం లేదు కదా! మనం మాత్రం ఎన్నాళ్లని అతని బాధ్యత తీసుకోగలం? అందుకే డిశ్చార్జ్ చేసేద్దాం’ అన్నారు. ‘సర్.. అతనికి ఆకలి, దాహం కూడా తెలియడం లేదు. ఈ పరిస్థితుల్లో బయటకు పంపిస్తే ఎలా? అతని వల్ల మనకు సమస్యేమీ లేదు కదా! ఇంకొన్నాళ్లు చూద్దాం సర్’ అన్నాను రిక్వెస్టింగ్ ధోరణిలో. ఇక ఆయన ఏమీ మాట్లాడలేదు. ∙∙ ఒకరోజు ఉదయం నేను వచ్చేసరికి నర్సు కమల అతని మీద అరుస్తోంది. ‘ఏమైంది కమలా.. ఎందుకు కోప్పడుతున్నావు?’ అడిగాను కంగారుగా. ‘ఇతను తిండి తిని రెండు రోజులు అవుతోంది మామ్! ఎంత చెప్పినా మెతుకు ముట్టడు. కాంపౌండర్ అన్న వచ్చి స్నానం చెయ్యమంటే చేస్తాడు. రెండు జతల బట్టలు ఆస్పత్రిలో ఉంటే ఇచ్చాం. అవి ఉతుక్కోమంటే మా ముఖాలు చూస్తాడు. వినపడదో.. చెప్పింది అర్థంకాదో తెలీట్లేదు. ఈ గోల ఎక్కడ పడం మామ్.. పంపించేస్తే సరిపోతుంది కదా!’ అంది కమల. అతని వైపు చూశాను. ముఖం కిందకు దించుకొని చూడసాగాడు. నేను దగ్గరకు వెళ్లి అక్కడున్న ఇడ్లీ ప్లేటు అతని ముందుకి జరిపి అక్కడే కూర్చున్నాను. ఒక ముక్క తుంపి అతని చేతికి ఇచ్చి ‘తీసుకో! తిను’ అన్నాను మెల్లిగా. కాసేపు అలాగే చూసి ఇడ్లీ ముక్క తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. అలాగే నెమ్మదిగా మొత్తం తినేశాడు. నేను తెచ్చుకున్న అరటి పండునూ ఇచ్చాను నా బ్యాగ్లోంచి తీసి. మౌనంగానే ఆ అరటి పండునూ తిన్నాడు. ‘మామ్! ఎవరం ఎంత చెప్తున్నా అతను వినడం లేదు. తిండి తినడం లేదు. కానీ మీరు చెప్పగానే భలే తినేశాడే! అలాగే అతను శుభ్రత విషయంలోనూ కాస్త సాయం చేద్దురూ.. ’ అంది కమల నవ్వుతూ. ‘సరే, ప్రయత్నిస్తాను కమలా!’ అని.. కాంపౌండర్ గోపిని పిలిచాను. ‘గోపీ.. ఇతన్ని స్నానానికి తీసుకెళ్లు. తర్వాత ఓ రెండు నైట్ డ్రెసెస్ కొనుక్కురా. ఆ.. సాయంత్రం నీ డ్యూటీ అయ్యాక సెలూన్కి తీసుకెళ్లు. అతని మానాన అతన్ని వదిలేయకుండా కాస్త జాగ్రత్తగా చూసుకో. నేను డాక్టర్ గారికి చెప్తాను’ అని పురమాయిస్తూ నా బ్యాగ్లో నుండి డబ్బులు తీసి గోపి చేతిలో పెట్టాను. ఆ రోజు ఇంటికి వెళ్ళాక ఆసుపత్రిలో జరిగినదంతా మా ఆయనతో చెప్పాను. ‘లేఖా! అతను ఎవరో అనాథై ఉండాలి. లేకపోతే ఏక్సిడెంట్ జరిగి ఇన్నాళ్ళయినా అతని కోసం ఎవరూ రాకపోవడం ఏంటీ! నువ్వు చెప్పేది వింటున్నాడు అంటే కచ్చితంగా మూగవాడు అయ్యుండడు. ఏదో ఒకరోజు నార్మల్ అవుతాడులే’ ప్రోత్సహకరంగా మాట్లాడాడు వశిష్ట. హోమ్వర్క్ చేస్తున్న పింకీ ‘అమ్మా.. అమ్మా!’ పిలిచి.. నా అటెన్షన్ తన మీద పడగానే తన చేతిలో ఉన్న నోట్బుక్ను చూపిస్తూ..‘నా పేరును కలరింగ్ చేసి తీసుకు రమ్మన్నారు మా టీచర్. చూడు బాగుందా?’ అంది. ‘చాలా బాగుంది’ అంటూ పింకీని ముద్దు పెట్టుకొని కిచెన్లోకి వెళ్లాను. పింకీ పేరు చూడగానే నాకు మళ్లీ అతను గుర్తొచ్చాడు. అతని పేరు ఏంటీ? ఎలా తెలుసుకోవడం? ∙∙ మరుసటి రోజు ఉదయం ఆస్పత్రికి వెళ్ళగానే అతను ఎదురొచ్చాడు. గోపి అతనికి క్రాఫ్, గడ్డం చేయించినట్లున్నాడు. ముక్కు, ముఖం స్పష్టంగా కనిపిస్తున్నాయి. బట్టలు కూడా కొత్తవి వేసుకున్నాడు. చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. అతన్ని చూస్తే చదువురాని వాడిలా అనిపించడం లేదు. నన్ను చూసి చెయ్యి చాపాడు. నాకు ముందు అర్థం కాలేదు.. తరువాత అర్థమయింది. బ్యాగ్లో నుండి అరటి పండు తీసి ఇచ్చాను. తిన్నాడు. అంటే నిన్న నేను అరటిపండు ఇచ్చింది గుర్తుందన్నమాట! సాయంత్రం డ్యూటీ పూర్తి అయ్యాక అతని కోసం వెతికాను. పేషంట్స్ ఉండే రూమ్స్లో ఒక చోట కూర్చొని ఉన్నాడు. లోపలికి వెళ్లాను. నన్ను చూశాడు. కానీ నవ్వలేదు. ముఖం మాత్రం ప్రసన్నంగా మారింది. బయటకు రమ్మని సైగ చేశాను. కదల్లేదు. అలాగే చూస్తున్నాడు. అక్కడ ఉన్న కుర్చీలో కూర్చొని నాతో తెచ్చుకున్న పుస్తకం మీద ‘శ్రీ లేఖ’ అని తెలుగులో, ఇంగ్లిష్లో, హిందీలో రాశాను. ఎప్పుడు వచ్చి నిలబడ్డాడో అతను నా కుర్చీ దగ్గర.. నేను రాసేది చూస్తున్నాడు. గమనించీ గమనించనట్టుండిపోయా. నా చేతిలో ఉన్న పెన్ను ఇవ్వమని చెయ్యి చాపుతూ ఏదో అన్నాడు. అదేంటో నాకు అర్థం కాలేదు. యాసతో వచ్చిన మాట! స్పష్టత లేదు. కానీ మొదటిసారి అతను నోరు తెరిచాడు. అతనికి పెన్ను ఇచ్చాను. నా చేతిలోని పుస్తకం తీసుకున్నాడు. దాని మీద ‘జార్జ్’ అని రాశాడు ఇంగ్లిష్లో. ఆ నిముషంలో నాకు ఎగిరి గంతులు వేయాలి అన్నంత సంతోషం కలిగింది.. నా ఆలోచన సరిగ్గానే పని చేసిందని! ‘జార్జ్’ అతని పేరు అయ్యుంటుంది. ఇక ఇతర వివరాలు తెలియాలి. పెన్నును పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రైలు ఏక్సిడెంట్ అయిన రోజు నుండి వచ్చిన న్యూస్ పేపర్లు అన్నీ అటెండర్తో తెప్పించాను. ఎక్కడ కూడా జార్జ్ అన్న పేరుతో ఒక్క వార్తా లేదు. గాలిలోకి బాణం వేస్తున్నానేమో అనిపించింది. అంతలోనే నా దృష్టి ‘హైదరాబాద్లో విలియమ్స్ అనే ఓ విదేశీయుడు అమీర్పేట్లోని ఒక స్టార్ హోటల్లో రాత్రివేళ రూమ్ తీసుకొని మరుసటి రోజు ఉదయం లాక్ చేసుకొని బయటకు వెళ్ళాడు. తిరిగి రాలేదు. అతను ఇచ్చిన ఫోన్ నంబర్ కూడా అందుబాటులో లేదు. హోటల్ వాళ్ళు మారు తాళం చెవితో రూమ్ తెరిచి చూస్తే అతని బట్టల సూట్కేస్ ఉంది. అవి అమీర్పేట్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు’ అన్న చిన్న న్యూస్ మీద పడింది. ఈ వార్తకు, జార్జ్కి ఏదయినా సంబంధం ఉందేమో అనిపించింది ఎందుకో! రోజంతా ఆలోచిస్తూనే ఉన్నాను దాని గురించి. నా అనుమానాలన్నిటినీ సాయంత్రం ఇంటికి వెళ్ళాక వశిష్ట దగ్గర వెలిబుచ్చాను. ‘నువ్వు నర్సు ఉద్యోగం మానేసి సీఐడీలో చేరితే బాగుంటుందేమో!’ అన్నాడు నవ్వుతూ వశిష్ట. ‘అలా ఎగతాళి చేయకండీ! ఆ అబ్బాయి చూస్తే తమ్ముడిలా అనిపిస్తున్నాడు. అతనికంటూ ఒక కుటుంబం ఉండుంటే.. అతను ఇలా జ్ఞాపకశక్తి కోల్పోవడం వల్ల తన వాళ్లను చేరుకోలేక.. అనాథలా మిగిలిపోతాడేమో!’ అన్నాను బాధగా. ‘హోటల్ మేనేజ్మెంట్ వాళ్లకు ఫోన్ చేసి చూద్దాం!’ అన్నాడు వశిష్ట నన్ను అనునయిస్తూ. గూగుల్లో హోటల్ నంబర్ చూసి రిసెప్షనిస్ట్తో మాట్లాడాడు వశిష్ట..‘మామ్! మేము నిజామాబాద్ జిల్లా నుండి మాట్లాడుతున్నాం. పేపర్లో మీరు ఇచ్చిన వార్త చూశాం. మొన్న ఇక్కడ జరిగిన రైలు ఏక్సిడెంట్లో ఒక వ్యక్తి గతం మరచిపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. అతనికీ, మీ హోటల్ నుండి మాయమైన విలియమ్స్కీ ఏదయినా సంబంధం ఉందేమోనని ఫోన్ చేశాను’ అంటూ. రిసెప్షనిస్ట్ మేనేజర్కి కనెక్ట్ చేసింది. మేనేజర్ కూడా వెంటనే స్పందించాడు. ‘విలియమ్స్ వచ్చిన రోజు సీసీ కెమెరాలో క్యాప్చర్ అయిన ఆయన ఫొటోను పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఇచ్చాం. అది ఒకటి నా దగ్గరా ఉంది. మీ నంబర్కి వాట్సప్ చేస్తాను’ అని చెప్పి.. మరికొద్ది సేపట్లోనే విలియమ్స్ ఫొటోను వశిష్టకు వాట్సాప్ చేశాడు హోటల్ మేనేజర్. అందమైన ఓ పాతికేళ్ల యువకుడు.. చేతిలో ఒక లెదర్ సూట్ కేస్, క్యాబిన్ బ్యాగ్తో ఉన్న ఫొటో అది. పరీక్షగా చూస్తే అతనిలో జార్జ్ పోలికలు కనిపించాయి. ‘అతనే ఇతను!’ ఆనందంగా అరిచాను. ‘అయితే నీకు సీఐడీ పదవి గ్యారంటీ’ నవ్వుతూ అన్నాడు వశిష్ట. ∙∙ మరుసటి రోజు ఉదయం ఆస్పత్రికి వెళ్ళగానే మా చీఫ్ డాక్టర్ గారికి విలియమ్స్ ఫొటో చూపించి జరిగిందంతా చెప్పాను. ఆయన నిజామాబాద్లోని పోలీస్ స్టేషన్కి కాల్ చేసి సమాచారం అందించారు. వాళ్ళు అంతా విన్నాక అమీర్పేట్ పోలీసులతో మాట్లాడి అక్కడ ఉన్న జార్జ్ లగేజ్ నిజామాబాద్కి పంపించే ఏర్పాట్లు చేశారు. మరుసటి రోజు హైదరాబాద్ నుంచి పోలీసులు లగేజ్తో ఆస్పత్రికి వచ్చారు. జార్జ్ని తీసుకురమ్మని అటెండర్కి పురమాయించారు డాక్టర్ గారు. అప్పుడు నేనూ అక్కడే ఉన్నాను. జార్జ్ని తీసుకొచ్చాడు అటెండర్. వచ్చీరావడంతోనే జార్జ్ దృష్టి పోలీసుల దగ్గరున్న సూట్కేస్ మీద పడింది. అలా చూస్తూ నిలబడిపోయాడు. నేను అతనినే గమనిస్తున్నాను. సూట్కేస్ను పోలీసులు ఇదివరకే ఓపెన్ చేసి చూశారు. అందులో కొన్ని జతల బట్టలు తప్ప ఇంకేమీ లేవు. అందుకే వాళ్లకు వివరాలు తెలియలేదు. పిచ్చివాడిలా.. అయోమయంగా చూస్తుండే జార్జ్ చురుకుగా మారాడు. గబగబా వెళ్ళి సూట్కేస్ తీసుకొని ఓపెన్ చేశాడు. ‘వేర్ ఈజ్ మై ఫోన్?’ అడిగాడు అమెరికన్ యాసలో. అక్కడున్న అందరం తుళ్ళిపడ్డాం. ‘మీ ఫోన్ పోయింది. మీరు ఫోన్ చేసుకోవాలి అనుకుంటే ఇదిగో’ అని ఇంగ్లిష్లో చెబుతూ తన ఫోన్ ఇచ్చాడు ఒక పోలీస్. జార్జ్కి ఆ పోలీస్ ఇంగ్లిష్ అర్థం కాలేదని అతని ముఖ కవళికలు చెప్పాయి. భావం అర్థమైనట్టుంది అందుకే పోలీస్ చేతిలోని ఫోన్ తీసుకున్నాడు. వెంటనే ఎవరికో కాల్ చేశాడు. అటు వైపు ఉన్నవారు జార్జ్ గొంతు విని చాలా సంతోషించినట్లు తెలుస్తోంది. జార్జ్ మాట్లాడలేకపోతున్నాడు. సమాధానం చెప్పలేక అయోమయంగా చూస్తున్నాడు. నేను అది గ్రహించి అతని దగ్గర నుండి ఫోన్ తీసుకొని.. జరిగింది అంతా అవతలి వైపున వ్యక్తికి వివరించాను. ఆ మాటలను బట్టి ఆ వ్యక్తి జార్జ్ తండ్రని అర్థమైంది. ఆయన నా ఫోన్ నంబర్, ఆస్పత్రి అడ్రస్ తీసుకున్నాడు. జార్జ్కి ఫోన్లోని నా సంభాషణ ద్వారా కాస్త ఊరట దొరికినట్టయింది తప్ప భరోసా అందినట్టు లేదు. అందుకే పూర్తిగా మామూలు స్థితికి రాలేదు. పోలీసులు జార్జ్కి సూట్కేస్ అందచేసి వెళ్లిపోయారు. ఏదో ఒక పెద్ద విజయం సాధించిన భావం నాలో! అనామకుడు అనుకున్న వ్యక్తిని తన కుటుంబంతో కలుపుతున్న ఆనందం! ఇంటికి వెళ్లగానే అడిగాడు వశిష్ట.. ‘ఏమైంది నీ ఇన్వెస్టిగేషన్?’ అంటూ కాస్త వెక్కిరించినట్టుగానే. జరిగిందంతా పొల్లు పోకుండా చెప్పాను. ‘అయితే జార్జ్ విలియమ్స్ పూర్తి కథ తెలుసుకునే సమయం దగ్గరకు వచ్చేసిందన్నమాట!’ అన్నాడు. ‘అవును’ అన్నాను సంతోషంగా! ∙∙ ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఉదయం తొందరగా లేచి మా ముగ్గురి లంచ్ బాక్స్లతో పాటు జార్జ్కి కూడా బాక్స్ సర్దాను. వశిష్ట వెక్కిరించినా పట్టించుకోలేదు. నేను ఆస్పత్రికి వెళ్ళగానే జార్జ్ కోసం వెతికాను. ఎప్పటిలా నాకు ఎదురు రాలేదు. నేనే అతను కూర్చున్న చోటుకు వెళ్ళాను. నేను దగ్గరకు వెళ్ళగానే ఎప్పటిలా చెయ్యి చాచలేదు. నేనే అరటి పండు తీసి ఇచ్చాను. తీసుకున్నాడు. ఏదో మాట్లాడాలని ప్రయత్నించి ఆగిపోయాడు. మధ్యాహ్నం నేను తెచ్చిన లంచ్ బాక్స్ అతనికి ఇచ్చి, నేను కూడా అక్కడే కూర్చుని తిన్నాను. సాయంత్రం జార్జ్ తండ్రి హైదరాబాద్ వచ్చాక నాకు ఫోన్ చేశాడు. డాక్టర్ గారు సహా స్టాఫ్ అంతా ఆయన కోసం ఎదురు చూడసాగాం. అంతలోనే ఓ కారు వచ్చి ఆగింది. ఇద్దరు మగవాళ్ళు, ఒక ఆడమనిషి దిగారు. ఆ ఆడమనిషికి.. జార్జ్కి పోలికలు కనిపించాయి. ఆమె అతని తల్లి అయ్యుంటుంది. అమెరికన్ల రంగు కాదు ఆవిడది. ఇండియన్ల కలరే. అందుకే మేమెవ్వరం జార్జ్ని అమెరికన్ అని అనుకోలేకపోయాం. జార్జ్ని చూడగానే అతని కుటుంబం భావోద్వేగానికి లోనయింది. జార్జ్ తల్లితండ్రుల ద్వారా మాకు తెలిసిన విషయం ఏమిటంటే.. ‘జార్జ్ విలియమ్స్.. ఎమ్మెస్ పూర్తి చేసి భారతీయుల జీవన విధానం మీద ఆసక్తితో రీసెర్చ్ కోసం ఇండియా వచ్చాడు. పేరెంట్స్కి అతను ఒక్కగానొక్క సంతానం. కోట్లకు అధిపతి. హైదరాబాద్ వచ్చి హోటల్లో దిగిన తరువాత నిజామాబాద్ జిల్లా పర్యటన కోసం రైల్లో బయలుదేరాడు. అనుకోకుండా ఏక్సిడెంట్లో అతని బ్యాగ్.. అందులో ఉన్న ఫోన్ పోయాయి. అతని తలకి బలమైన గాయం తగలడం వల్ల షాక్కి లోనయ్యాడు. ఇక్కడి భాష, మనుషులు.. వాతావరణం.. అతన్ని మరింత అయోమయంలోకి నెట్టాయి. ఈ కాంటాక్ట్ లేక జార్జ్ సమాచారం అందక అతని తల్లితండ్రులు ఆందోళన పడ్డారు’ అని. ‘శ్రీలేఖ మా ఆస్పత్రిలో హెడ్ నర్స్గా పని చేస్తోంది. తను పేషంట్స్ను సొంత మనుషుల్లా చూస్తుంది. మీ అబ్బాయి కోసం ఎవరూ రాలేదు కాబట్టి నేను అతన్ని డిశ్చార్జ్ చేసెయ్యమని చెప్పాను. కానీ తను ఒప్పుకోలేదు. అతడి వివరాలు తెలిసేవరకు ఎదురుచూద్దాం అంది. ఈ అమ్మాయి వల్లే మీ అబ్బాయి మీకు దొరికాడు’ చెప్పారు చీఫ్ డాక్టర్ గారు జార్జ్ తల్లి తండ్రులకు. ‘అమ్మా! నీ ఋణం తీర్చుకోలేను’ అంటూ నా రెండు చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది జార్జ్ తల్లి. ఖాళీ చెక్ పైన సంతకం చేసి ‘అమ్మా ఇది నా కొడుకు మమ్మల్ని చేరేలా చేసినందుకు మా బహుమానం. తప్పుగా అనుకోకుండా తీసుకో.. నీకు కావలసినంత రాసుకో’ అంటూ నా చేతుల్లో చెక్ లీఫ్ని పెట్టాడు జార్జ్ తండ్రి. దాన్ని ఆయనకు తిరిగి ఇస్తూ ‘నా డ్యూటీ నేను చేశాను. దీన్ని నేను తీసుకుంటే డబ్బు కోసం చేసినట్లు అవుతుంది. జార్జ్ను చూస్తుంటే నాకు నా తమ్ముడిలా అనిపించింది. ఆ వాత్సల్యంతో అతడి వివరాల కోసం ప్రయత్నం చేశాను’ అన్నాను. ఆ మాటలు వింటున్న జార్జ్ వచ్చి నా చెయ్యి పట్టుకున్నాడు. అతని కళ్ళల్లో కృతజ్ఞతా భావం. నా ఫోన్ నంబర్ తీసుకున్నాడు. వాళ్ళు ఎంత బలవంతం చేసినా నేను డబ్బు తీసుకోలేదు. వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు. కానీ మా మధ్య బంధం రోజురోజుకీ బలపడుతూనే వచ్చింది. ఇదిగో ఇలా మేం అమెరికా వెళ్లిదాకా! ∙∙ ఫ్లైట్ ల్యాండ్ అవుతోంది అని ఎయిర్ హోస్టెస్ అనౌన్స్మెంట్ వినిపించడంతో నేను వాస్తవంలోకి వచ్చాను. వశిష్ట, పింకీ ముఖాలలో చాలా ఉత్సాహం కనిపిస్తోంది. జార్జ్ని చూడబోతున్నానన్న ఆనందంతో నా మనసు నిండిపోయింది. (చదవండి: గజరాజు గర్వభంగం!)