wimbledon
-
తగ్గేదేలే..! టెన్నిస్ గ్రాండ్స్లామ్ టోర్నీల్లో సుదీర్ఘ మ్యాచ్లు ఇవే
టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టిన ఏ ఆటగాడైనా గెలవాలనే కసితోనే పోరాడతాడు. కొందరు ప్లేయర్లు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ చూస్తుండగానే మ్యాచ్ను లాగేసుకుంటే... మరికొందరు తుదికంటా పోరాడుతూ శక్తి మేరకు ప్రయత్నిస్తారు! టెన్నిస్ కోర్టులో అప్పుడప్పుడు సమఉజ్జీల సమరాలు అభిమానులను అలరిస్తూ ఉంటాయి. శరీరంలో శక్తి క్షీణిస్తున్నా... చెమట ధారగా కారుతున్నా లెక్కచేయకుండా మైదానంలో ఇరువురు ఆటగాళ్లు కొదమ సింహాల్లా పోరాడినపుడు ఆ మ్యాచ్లు గంటలకొద్దీ సాగుతూ ఉంటాయి. ఇరువురు ప్లేయర్లు ‘తగ్గేదేలే’ అన్నట్లు చెలరేగిన మ్యాచ్లు సుదీర్ఘ పోరాటాలుగా చరిత్ర పుటల్లో చోటు దక్కించుకుంటున్నాయి. టెన్నిస్ గ్రాండ్స్లామ్ టోర్నీల్లో అలా రికార్డుల్లోకెక్కిన మ్యాచ్లను ఓసారి పరిశీలిస్తే... శారీరక శ్రమ అధికంగా ఉండే టెన్నిస్ క్రీడలో అప్పుడప్పుడు కొన్ని మ్యాచ్లు సుదీర్ఘంగా సాగడం పరిపాటే. తాజాగా సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్లో డేనియల్ ఇవాన్స్ (బ్రిటన్), కరెన్ ఖచనోవ్ (రష్యా) మధ్య పోరు 5 గంటల 35 నిమిషాల పాటు సాగి అభిమానులకు ప్రత్యేక అనుభూతినిచ్చింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో ఇదే సుదీర్ఘమైన మ్యాచ్ కాగా.. గతంలో వింబుల్డన్ టోరీ్నలో ఇంతకుమించిన మ్యాచ్లు చాలా జరిగాయి. 2010 వింబుల్డన్ టోర్నీలో జాన్ ఇస్నెర్ (అమెరికా), నికోలస్ మహుత్ (ఫ్రాన్స్) మధ్య జరిగిన పోరు ఇందులో ముందు వరుసలో నిలుస్తుంది.వర్షం అంతరాయం కలిగించడంతో... వరుసగా మూడు రోజులు సాగిన ఈ మారథాన్ మ్యాచ్ టెన్నిస్ చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన పోరుగా రికార్డుల్లోకెక్కింది. ఇప్పటి వరకు ప్రొఫెషనల్ టెన్నిస్లో రెండు మ్యాచ్లు మాత్రమే 7 గంటలకు పైగా సాగగా... మరో 14 మ్యాచ్లు ఆరు గంటలకు పైగా జరిగాయి. ప్లేయర్ల అలసట, అభిమానుల అసౌకర్యం, నిర్వాహకులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రధాన టోర్నీల్లోని చివరి సెట్లోనూ ‘టైబ్రేకర్’ నిబంధనలు తీసుకొచ్చారు. 1970 నుంచి యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో ‘టైబ్రేకర్’ అమలు చేస్తున్నారు. దీంతో సుదీర్ఘ పోరాటాలకు ఒకింత బ్రేక్ పడింది. ఫ్రెంచ్ ఓపెన్లో... 6 గంటల 33 నిమిషాలుసీజన్ రెండో గ్రాండ్స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్లోనూ మారథాన్ మ్యాచ్లకు కొదువలేదు. 2004 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సుదీర్ఘ మ్యాచ్ జరిగింది. రెండు రోజుల పాటు సాగిన పోరులో ఫ్రాన్స్కే చెందిన ఫాబ్రిస్ సాంతోరో, ఆర్నాడ్ క్లెమెంట్ తుదికంటా పోరాడారు. 6 గంటల 33 నిమిషాల తర్వాత ఫాబ్రిస్ సాంతోరో 6–4, 6–3, 6–7 (5/7), 3–6, 16–14తో ఆర్నాడ్ క్లెమెంట్పై గెలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో ఇదే సుదీర్ఘ మ్యాచ్గా రికార్డుల్లోకెక్కింది. వింబుల్డన్లో ఇస్నెర్ డబుల్ ధమాకాటెన్నిస్ చరిత్రలో అత్యంత పురాతన గ్రాండ్స్లామ్ టోర్నీ అయిన వింబుల్డన్లో అమెరికా ఆటగాడు జాన్ ఇస్నెర్ ఒకటికి రెండుసార్లు ఇలాంటి సుదీర్ఘ మ్యాచ్ల్లో భాగస్వామి అయ్యాడు. 2010 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఇస్నెర్, నికోలస్ మహుత్ మధ్య పోరు వరుసగా మూడు రోజుల పాటు నడిచింది. వర్షం కారణంగా అంతరాయాల నడుము జరిగిన పోరులో ఇస్నెర్ 6–4, 3–6, 6–7 (7/9), 7–6 (7/3), 70–68తో మహుత్పై విజయం సాధించాడు. 11 గంటల 5 నిమిషాల పాటు సాగిన ఈ పోరాటం... ప్రొఫెషనల్ టెన్నిస్లో అత్యంత సుదీర్ఘ పోరుగా చరిత్రకెక్కింది. ఇరువురు ఆటగాళ్లు గంటలకొద్దీ పట్టు వదలకుండా పోరాడటంతో ఈ రికార్డు సాధ్యమైంది. మరో ఎనిమిదేళ్ల తర్వాత 2018 వింబుల్డన్ సెమీఫైనల్లో మరోసారి ఇలాంటి సుదీర్ఘ పోరాటమే జరిగింది. 6 గంటల 36 నిమిషాల పాటు సాగిన పోరులో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 7–6 (8/6), 6–7 (5/7), 6–7 (9/11), 6–4, 26–24తో ఇస్నెర్పై విజయం సాధించాడు. ఆస్ట్రేలియా ఓపెన్లో... 5 గంటల 53 నిమిషాలుటెన్నిస్ చరిత్రలో దిగ్గజ ప్లేయర్లుగా గుర్తింపు సాధించిన నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), రాఫెల్ నాదల్ (స్పెయిన్) కూడా సుదీర్ఘ పోరాటాల్లో భాగస్వాములయ్యారు. గిరిగీసి బరిలోకి దిగితే అంతుచూసేవరకు వదలని స్వభావం గల ఈ ఇద్దరూ ఎన్నో సార్లు హోరాహోరీగా తలబడ్డారు. అందులో 2012 ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ ఒకటి. 5 గంటల 53 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో జొకోవిచ్ 5–7, 6–4, 6–2, 6–7 (5/7), 7–5తో నాదల్ను ఓడించి గ్రాండ్స్లామ్ టైటిల్ గెలుచుకున్నాడు. ఓపెన్ శకంలో (1968 నుంచి)అత్యంత సుదీర్ఘంగా సాగిన గ్రాండ్స్లామ్ ఫైనల్గానూ ఈ పోరు చరిత్రకెక్కింది. 1975కంటే ముందు టైబ్రేక్ నిబంధన లేదు.ఫలితంగా డేవిస్కప్లోనూ ఎన్నో సుదీర్ఘ మ్యాచ్లు జరిగాయి. 1975 తర్వాత నిర్ణాయక ఐదో సెట్ మినహా ఇతర సెట్లలో టైబ్రేక్లను అమలు చేయడం మొదలుపెట్టారు. 12 పాయింట్ల టైబ్రేక్లో తొలుత ఏడు పాయింట్లు సాధించిన ప్లేయర్కు సెట్ లభించేది. ఒకవేళ మ్యాచ్ ఐదో సెట్కు వెళితే స్కోరు 5–5 తర్వాత రెండు గేమ్ల ఆధిక్యం సంపాదించిన ప్లేయర్ను విజేతగా ప్రకటించేవారు. 2016 నుంచి డేవిస్ కప్లోనూ నిబంధనలు మార్చారు. మ్యాచ్లను ‘బెస్ట్ ఆఫ్ 5 సెట్స్’ పద్ధతిలో కాకుండా ‘బెస్ట్ ఆఫ్ 3 సెట్స్’గా నిర్వహించడం ప్రారంభించారు. సెట్లో స్కోరు 6–6తో సమంగా నిలిస్తే టైబ్రేక్ను అమలు చేస్తున్నారు.డేవిస్ కప్లో సుదీర్ఘ పురుషుల సింగిల్స్ మ్యాచ్లుసమయం- విజేత -పరాజిత- ఏడాది- స్కోరు 👉6గం:43ని- లియోనార్డో మాయెర్ (అర్జెంటీనా)- జొవా సౌజా (బ్రెజిల్)- 2015- 7–6 (7/4), 7–6 (7/5), 5–7, 5–7, 15–13 👉6గం:22ని-జాన్ మెకన్రో (అమెరికా)-విలాండర్ (స్వీడన్) -1982- 9–7, 6–2, 15–17, 3–6, 8–6 👉6గం:21ని-బోరిస్ బెకర్ (జర్మనీ)-జాన్ మెకన్రో (అమెరికా)-1987-6–3, 6–2, 4–6, 14–12 👉6గం:15ని-జోస్ లూయిస్ క్లెర్క్ (అర్జెంటీనా)-జాన్ మెకన్రో (అమెరికా)-1980-6–3, 6–2, 4–6, 14–12 👉6గం: 04ని-హార్స్ స్కాఫ్ (ఆ్రస్టియా)- విలాండర్ (స్వీడన్)-1989-6–7 (5/7), 7–6 (9/7), 1–6, 6–4, 9–7 – సాక్షి క్రీడావిభాగం -
కస్టమ్ వింబుల్డన్ చీర గురించి తెలుసా..!
ఎన్నో రకాల చీరలు గురించి విని ఉంటారు. ఇలాంటి కస్టమ్ వింబుల్డన్ చీర గురించి ఎప్పుడైనా విన్నారా..?. ఇది కస్టమ్ టెన్నిస్ నేపథ్య చీర. దీన్ని వడోదర ఆధారిత కంటెంట్ క్రియేటర్ రిత్వి షా ధరించారు. ఇది తెలుపు, ఆకుపచ్చలతో కూడిన ఆరు గజాల చీర. భారతదేశంలో అంత్యంత క్రేజీ ఆట అయినా వింబుల్డన్ టెన్నిస్ సీజన్ కోసం ప్రత్యేక దుస్తులను ధరించింది రిత్వి షా. దీన్ని భారతీయ కళాకారులు చక్కగా నేశారు. అంతేగాదు ఆ చీరపై సానియా మీర్జా నుంచి నోవాక్ జొకోవిచ్ వరకు వివిధ దిగ్గజ టెన్నిస్ ఛాంపియన్ల పేర్లను బంగారు ధారాలతో ఎంబ్రాయిడరీ చేశారు. View this post on Instagram A post shared by Wimbledon (@wimbledon) ఈ చీర మన టెన్నిస్ ఆట సంస్కృతికి సంబంధించిన ప్రధాన అంశాలను వివరిస్తోంది. చీర పల్లు మొత్త వింబుల్డన్ ట్రోఫీతో పెయింట్ చేయబడింది. ఇక చీర మొత్తం చిన్న చిన్న టెన్నిస్ రాకెట్లతో జర్దోజీ ఎంబ్రాయిడీ చేశారు. దీనిపై చేతితే ఎంబ్రాయిడరీ చేసిన స్ట్రాబెర్రీలను కూడా ఆ చీరపై చూడొచ్చు. గుంజరాత్కి చెందిన ఈ కంటెంట్ క్రియేటర్ రిత్వి షా ధరించిన చీరపైనే అందరి దృష్టి నిలిచింది.సరికొత్త ఫాష్యన్ శైలికి ఈమె ఆటల నేపథ్యంతో ట్రెండ్ సెట్ చేసింది. ఒకరకంగా ఈ చీర క్రీడలు సంస్కృతిని వస్త్రధారణతో ఎలా మిళితం చేయొచ్చో చూపించింది. ఈ చీర డిజైనింగ్..చేతివృత్తుల వారి కృషిని గుర్తించాల్సిన ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Ritvi Shah | Content Creator (@aboutritvi) (చదవండి: ఆషాడ మాసంలో అనంత్ అంబానీ పెళ్లి..కారణం ఇదే..!) -
క్రెజికోవాకు కిరీటం
లండన్: ప్రతిష్టాత్మక గ్రాండ్స్లామ్ టోర్నీలో వింబుల్డన్ మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త విజేత అవతరించింది. చెక్ రిపబ్లిక్కు చెందిన బార్బరా క్రెజికోవా తన తొలి వింబుల్డన్ టైటిల్ను సొంతం చేసుకుంది. తొలి సారి వింబుల్డన్ ఫైనల్ చేరిన ఇద్దరు ప్లేయర్ల మధ్య శనివారం జరిగిన ఫైనల్లో క్రెజికోవా 6–2, 2–6, 6–4 స్కోరులో ఏడో సీడ్ జాస్మిన్ పావొలిని (ఇటలీ)పై విజయం సాధించింది. 1 గంటా 56 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మూడు సెట్ల సమరంలో 28 ఏళ్ల చెక్ ప్లేయర్ పైచేయి సాధించింది. 2021లో ఫ్రెంచ్ ఓపెన్ను గెలుచుకున్న క్రెజికోవా కెరీర్లో ఇది రెండో గ్రాండ్స్లామ్ టైటిల్. వింబుల్డన్లో 31వ సీడ్గా ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన క్రెజికోవా చివరకు టైటిల్తో ముగించింది. ఫైనల్ పోరులో ఆరంభంలో జాస్మిన్పై ఆమె ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి 11 పాయింట్లలో 10 గెలుచుకొని ముందంజ వేసింది. ఆ తర్వాత డబుల్ బ్రేక్తో 5–1తో ఆధిక్యంలో నిలిచిన ఆమె సునాయాసంగా సెట్ను ముగించింది. ఆమె జోరు చూస్తే రెండో సెట్లోనే మ్యాచ్ గెలిచేస్తుందని అనిపించింది. అయితే విరామ సమయంలో పావొలిని ఆట మారింది. చక్కటి గ్రౌండ్స్ట్రోక్స్తో దూసుకుపోయి 3–0తో నిలిచి ఇటలీ ప్లేయర్ ప్రత్యర్థి ని కోలుకోనీయకుండా సెట్ను ముగించింది. చివరి సెట్లో ఆట ఆసక్తికరంగా సాగింది. క్రెజికోవా 5–3 వద్ద ఉన్న దశలో పావొలిని గేమ్ గెలిచి కొంత పోటీనిచ్చినా...పదో గేమ్లో క్రెజికోవా తన సర్వీస్ను నిలబెట్టుకొని విజేతగా అవతరించింది. క్రెజికోవా ఖాతాలో రెండు సింగిల్స్ టైటిల్స్తో పాటు 7 డబుల్స్, 3 మిక్స్డ్ డబుల్స్ ట్రోఫీలు ఉన్నాయి. నేడు పురుషుల ఫైనల్ జొకోవిచ్ (సెర్బియా) గీ అల్కరాజ్ (స్పెయిన్) సా.గం.6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
Wimbledon 2024: సరికొత్త చాంపియన్ క్రిచికోవా
వింబుల్డన్ మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించింది. చెక్ రిపబ్లిక్కు చెందిన టెన్నిస్ ప్లేయర్ బార్బరా క్రిచికోవా వింబుల్డన్-2024 టైటిల్ సాధించింది.లండన్ వేదికగా శనివారం జరిగిన ఫైనల్లో క్రిచికోవా.. ఇటలీకి చెందిన జాస్మిన్ పావోలిపై గెలుపొందింది. 6-2, 2-6, 6-4 తేడాతో జాస్మిన్ను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్లో తొలి సెట్లో పూర్తి ఆధిపత్యం కనబరిచిన ప్రపంచ 31వ ర్యాంకర్ క్రిచికోవా.. వరల్డ్ సెవన్త్ ర్యాంకర్ జాస్మిన్కు చెమటలు పట్టించింది. అయితే, రెండో సెట్లో మాత్రం క్రిచికోవాను సమర్థవంతంగా ఎదుర్కొంది జాస్మిన్.ఈ క్రమంలో కీలకమైన మూడో సెట్లోనూ దూకుడుగా ఆడిన జాస్మిన్ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టగలిగింది. కానీ.. తిరిగి కోలుకున్న క్రిచికోవా .. జాస్మిన్కు మరో అవకాశం ఇవ్వలేదు.కాగా 28 ఏళ్ల క్రిచికోవా 2021లో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ సింగిల్స్ ట్రోఫీ గెలిచింది. మరోవైపు.. 28 ఏళ్ల జాస్మిన్ గత నెలలో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఇగా స్వియా టెక్ చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. తాజాగా వింబుల్డన్ వుమెన్స్ సింగిల్స్ ఫైనల్లోనూ ఆమెకు ఇలా చేదు అనుభవమే ఎదురైంది.The moment a dream became reality ✨#Wimbledon | @BKrejcikova pic.twitter.com/38xPz9pCin— Wimbledon (@Wimbledon) July 13, 2024Showing off the Venus Rosewater Dish to the adoring #Wimbledon fans 🤩 pic.twitter.com/GmMlsOPMWW— Wimbledon (@Wimbledon) July 13, 2024 -
రోహిత్ సూపర్ లుక్.. వింబుల్డన్లో హిట్మ్యాన్ సందడి (ఫోటోలు)
-
పిచ్చెక్కించే లుక్లో రోహిత్ శర్మ.. వింబుల్డన్ మ్యాచ్లో ప్రత్యక్షం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 వరల్డ్కప్ అనంతరం దొరికిన విరామాన్ని ఆస్వాదిస్తున్నాడు. హిట్మ్యాన్ తాజాగా ఓ వింబుల్డన్ మ్యాచ్కు హాజరయ్యాడు. కార్లోస్ అల్కరాజ్, డేనిల్ మెద్వెదెవ్ మధ్య జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన హిట్మ్యాన్ అదిరిపోయే డ్రెస్లో తళుక్కున మెరిశాడు. సూటు, బూటు, టై, కళ్ల జోడుతో రాయల్గా కనిపించిన రోహిత్.. వింబుల్డన్ రాయల్ బాక్స్లో ప్రత్యక్షమయ్యాడు. WIMBLEDON INSTAGRAM POST FOR INDIAN CAPTAIN ROHIT SHARMA. 🐐 - The Caption is "2024 T20 World Cup Winning Captain in the Royal Box". 🇮🇳 pic.twitter.com/nP5PZfmyC0— Tanuj Singh (@ImTanujSingh) July 12, 2024రోహిత్ రాయల్ లుక్కు సంబంధించిన ఫోటోలను వింబుల్డన్ తమ ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. "రాయల్ బాక్స్లో టీ20 వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్" అని ఇందుకు క్యాప్షన్ జోడించింది. పిచ్చెక్కించే లుక్లో ఉన్న రోహిత్ ఫోటోలు సోషల్మీడియాలో క్షణాల్లో వైరలయ్యాయి. హిట్మ్యాన్ అభిమానులు ఈ ఫోటోలు చూసి తెగ సంబరపడిపోతున్నారు. హిట్మ్యాన్ బ్యాట్ నుంచి జాలువారే సిక్సర్లలా కామెంట్ల వర్షం కురుస్తుంది.INDIAN CAPTAIN ROHIT SHARMA AT WIMBLEDON.- Frame of the Day. 🐐 pic.twitter.com/HCCc1dJv1s— Tanuj Singh (@ImTanujSingh) July 12, 2024ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్కప్ 2024లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో రోహిత్ సేన సౌతాఫ్రికాను ఓడించి రెండోసారి జగజ్జేతగా అవతరించింది. వరల్డ్కప్ అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు.The Swag and Aura of World Cup Winning Captain Rohit Sharma at Wimbledon. 🐐🔥 pic.twitter.com/SEncdeAwku— Tanuj Singh (@ImTanujSingh) July 12, 2024ప్రస్తుతం భారత్ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలి మ్యాచ్లో ఓడిపోయిన టీమిండియా.. వరుసగా రెండు, మూడు మ్యాచ్ల్లో గెలిచింది. నాలుగో మ్యాచ్ జులై 13న జరుగనుంది. ఈ పర్యటన కోసం భారత సెలెక్టర్లు యువ జట్టును ఎంపిక చేశారు. శుభ్మన్ గిల్ ఈ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. -
వింబుల్డన్ మ్యాచ్లో సందడి చేసిన గేమ్ ఛేంజర్ భామ.. ఫోటోలు
-
టాప్ సీడ్ సినెర్కు షాక్
లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ లో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ) క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. 4 గంటలపాటు జరిగిన మ్యాచ్లో ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6–7 (7/9), 6–4, 7–6 (7/4), 2–6, 6–3తో సినెర్ను బోల్తా కొట్టించి వరుసగా రెండో ఏడాది సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. మరో క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) 5–7, 6–4, 6–2, 6–2తో టామీ పాల్ (అమెరికా)ను ఓడించాడు. రెండో సీడ్ జొకోవిచ్ 6–3, 6–4, 6–2తో హోల్గర్ రూనె (డెన్మార్క్)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో 37వ ర్యాంకర్ డోనా వెకిచ్ (క్రొయేíÙయా) 5–7, 6–4, 6–1తో లులు సున్ (న్యూజిలాండ్)పై, ఏడో ర్యాంకర్ జాస్మిన్ (ఇటలీ) 6–2, 6–1తో 19వ సీడ్ ఎమ్మా నవారో (అమెరికా)పై నెగ్గి సెమీఫైనల్కు చేరారు. -
వింబుల్డన్లో వెల్స్పన్
ప్రస్తుతం జరుగుతున్న ప్రతిష్టాత్మక వింబుల్డన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో నగరానికి చెందిన వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్ తన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆకర్షణీయమైన రంగుల్లో సంస్థ రూపొందించిన కాటన్ ఉత్పత్తుల్ని వింబుల్డన్ పోటీల సందర్భంగా క్రీడాకారులు వినియోగిస్తున్నారు. ఐకాన్ మీట్స్ ఐకాన్స్ పేరిట దీనికి సంబంధించి ప్రచారం నిర్వహిస్తున్నామని వివరించారు. -
Wimbledon: బాంబ్రీ జోడీ ముందంజ.. తొలి రౌండ్లో ఘన విజయం
వింబుల్డన్ టోర్నీ-2024లో భారత టెన్నిస్ స్టార్ యుకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. మెన్స్ డబుల్స్లో బాంబ్రీ, అల్బనే ఒలివెట్టి జోడీ రెండో రౌండ్కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన తొలి రౌండ్లో డెన్మార్క్ జంట అలెగ్జాండర్ బుబ్లిక్ అలెగ్జాండర్ షెవ్చెంకోలను 6-4, 6-4 వరుస సెట్లలో బాంబ్రీ, ఒలివెట్టి జోడీ జోడించింది.‘బర్త్ డే బాయ్’ బాంబ్రీ గ్రాస్ కోర్టులో సంచలన ప్రదర్శన చేశాడు. అద్భుతమైన షాట్లతో బాంబ్రీ ప్రత్యర్ధులను ఉక్కిరి బిక్కిరి చేశాడు. భంబ్రీ, ఒలివెట్టి తమ రెండో రౌండీలో జర్మన్ జోడీ కెవిన్ క్రావిట్జ్ టిమ్ పుయెట్జ్తో తలపడనున్నారు.మరో భారత టెన్నిస్ ఆటగాడు ఎన్ శ్రీరామ్ బాలాజీ తొలి రౌండ్లోనే ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. శ్రీరామ్ బాలాజీ, ల్యూక్ జాన్సన్ జోడీ.. డబుల్స్ మొదటి రౌండ్లో నాల్గవ సీడ్ మార్సెలో అరెవాలో , మేట్ పావిక్ చేతిలో 4-6, 5-7 తేడాతో ఓటమి పాలయ్యారు. -
అరీనా సబలెంకాకు గాయం.. వింబుల్డన్ టోర్నీకి దూరం
వింబుల్డన్ -2024 నుంచి బెలారస్ టెన్నిస్ స్టార్, మూడో సీడ్ అరీనా సబలెంకా వైదొలిగింది. భుజం గాయం కారణంగా సబలెంకా ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీకు దూరం కానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. మెయిన్ డ్రాలో సబలెంకా స్ధానాన్ని రష్యన్ టెన్నిస్ స్టార్ ఎరికా ఆండ్రీవాతో భర్తీ చేశారు. ఇక ఈ విషయాన్ని అరీనా సబలెంకా సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది. గాయం కారణంగా వింబుల్డన్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు సబలెంక తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. "భుజం గాయం కారణంగా ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ నుంచి తప్పుకున్నాను.ఈ విషయాన్ని మీకు తెలియజేయాల్సి వచ్చినందుకు చాలా బాధగా ఉంది. కానీ నా భుజం గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. నొప్పితో బాధపడుతున్నప్పటకి ప్రతీ రోజు ప్రాక్టీస్ చేస్తున్నాను. వచ్చే ఏడాది ఇంతకంటే బలంగా తిరిగి వస్తానని మీకు మాటిస్తానని" ఎక్స్లో రాసుకొచ్చింది. కాగా వింబుల్డన్ టోర్నీ జూలై 1 నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం తొలి దశ పోటీలు జరుగుతున్నాయి. -
Wimbledon 2024: అందరి దృష్టి జొకోవిచ్పైనే
లండన్: టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన ప్లేయర్గా రికార్డు సృష్టించేందుకు సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరోసారి ప్రయతి్నంచనున్నాడు. ఇప్పటికే కెరీర్లో 24 గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జొకోవిచ్ ఆ్రస్టేలియా క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ (24 గ్రాండ్స్లామ్ టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. నేడు మొదలయ్యే సీజన్ మూడో గ్రాండ్స్లామ్ టోర్నీ వింబుల్డన్లో జొకోవిచ్ ఫేవరెట్గా బరిలోకి దిగనున్నాడు. ఇటీవల మోకాలి గాయం నుంచి కోలుకున్న జొకోవిచ్కు ప్రస్తుత ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ), డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. ఏడుసార్లు వింబుల్డన్ టైటిల్ నెగ్గిన జొకోవిచ్, రెండుసార్లు రన్నరప్గా నిలిచాడు. ఈసారి తొలి రౌండ్లో క్వాలిఫయర్, ప్రపంచ 123వ ర్యాంకర్ విట్ కొప్రివా (చెక్ రిపబ్లిక్)తో జొకోవిచ్ తలపడతాడు. మరోవైపు భారత నంబర్వన్, ప్రపంచ 72వ ర్యాంకర్ సుమిత్ నగాల్ సోమవారం జరిగే తొలి రౌండ్లో కెచ్మనోవిచ్ (సెర్బియా)తో ఆడతాడు. -
జకోవిచ్ స్టయిల్లో సెలబ్రేట్ చేసుకున్న రోహిత్ శర్మ
టీ20 వరల్డ్కప్ 2024ను కైవసం చేసుకున్న అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ...టెన్నిస్ లెజెండ్ నొవాక్ జకోవిచ్ స్టయిల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ అనంతరం హిట్మ్యాన్ పిచ్పై ఉన్న గడ్డిపరకలను నోట్లో పెట్టుకుని విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. టెన్నిస్ దిగ్గజం జకోవిచ్ సైతం గ్రాండ్స్లామ్ విజయానంతరం ఇలాగే చేస్తాడు. View this post on Instagram A post shared by ICC (@icc)జకో.. ఫైనల్ మ్యాచ్లో గెలిచాక కోర్టులోని గడ్డిపరకలను లేదా మట్టిని నోట్లో పెట్టుకుని గెలుపు సంబురాలు చేసుకుంటాడు. వరల్డ్కప్ విజయానంతరం రోహిత్ చేసుకున్న జకో స్టయిల్ సెలబ్రేషన్స్ నెట్టింట వైరలవుతున్నాయి. వింబుల్డన్ తమ అధికారిక ఫేస్బుక్ ఖాతాలో జకోవిచ్, రోహిత్ శర్మ గడ్డి తింటున్న ఫోటోలు పోస్ట్ చేసి.. GOATs eating grass అని కామెంట్ పెట్టింది. ఈ పోస్ట్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంది.Wimbledon's Facebook post - GOATs eating grass. Rohit Sharma 🤝 Novak Djokovic. pic.twitter.com/jrkCPBi7PX— Mufaddal Vohra (@mufaddal_vohra) June 30, 2024కాగా, నిన్న జరిగిన వరల్డ్కప్ 2024 ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి రెండో సారి టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. భారత్కు 11 ఏళ్ల తర్వాత లభించిన తొలి ఐసీసీ ట్రోఫీ ఇది. 2013లో టీమిండియా ధోని నేతృత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. వరల్డ్కప్ విషయానికొస్తే.. టీమిండియాకు 13 ఏళ్ల తర్వాత లభించిన తొలి వరల్డ్కప్ ఇది. 2011లో భారత్..ధోని నేతృత్వంలో వన్డే వరల్డ్కప్ సాధించింది. టీ20 వరల్డ్కప్ విషయానికొస్తే.. ధోని సారథ్యంలో మొట్టమొదటి టీ20 వరల్డ్కప్ టైటిల్ సాధించిన టీమిండియా.. 17 ఏళ్ల తర్వాత తిరిగి పొట్టి ప్రపంచకప్ను దక్కించుకుంది. ఈసారి రోహిత్ శర్మ టీమిండియాకు పొట్టి ప్రపంచకప్కు అందించాడు.ఫైనల్ మ్యాచ్ స్కోర్ వివరాలు..భారత్ 176/7సౌతాఫ్రికా 169/87 పరుగుల తేడాతో భారత్ విజయంప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్- విరాట్ కోహ్లి (59 బంతుల్లో 76; 6 ఫోర్లు, 2 సిక్సర్లు)ప్లేయర్ ఆఫ్ ద సిరీస్- జస్ప్రీత్ బుమ్రా (8 మ్యాచ్ల్లో 15 వికెట్లు) -
వింబుల్డన్ మెయిన్ ‘డ్రా’లో సుమిత్ నగాల్..
భారత టెన్నిస్ నంబర్వన్ సుమిత్ నగాల్ తన కెరీర్లో తొలిసారి ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీ మెయిన్ ‘డ్రా’కు నేరుగా అర్హత సాధించాడు.గ్రాండ్స్లామ్ టోర్నీ ప్రారంభానికి ఆరు వారాల ముందు ఏటీపీ ర్యాంకింగ్స్లో టాప్–104లో ఉన్న క్రీడాకారులకు నేరుగా మెయిన్ ‘డ్రా’లో చోటు లభిస్తుంది. సుమిత్ నగాల్ ప్రస్తుతం 94వ ర్యాంక్లో ఉన్నాడు. 2019లో చివరిసారి భారత్ తరఫున ప్రజ్నేశ్ గుణేశ్వరన్ వింబుల్డన్ టోరీ్నలో పాల్గొన్నాడు.ఇవి చదవండి: రాయల్స్ ముందుకు...చాలెంజర్స్ ఇంటికి... -
జొకోవిచ్కు షాక్.. వింబుల్డన్ సరికొత్త విజేత అల్కరాజ్ (ఫొటోలు)
-
చాలా సంతోషంగా ఉంది.. అల్కరాజ్కు అభినందనలు: రాఫెల్ నాదల్
ప్రతిష్టాత్మక వింబుల్డన్ 2023 పురుషుల సింగిల్స్ టైటిల్ను స్పెయిన్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ను మట్టికరిపించి.. అల్కరాజ్ తొలి వింబుల్డన్ టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన తుది పోరులో 1-6, 7-6, 6-1, 3-6, 6-4 స్కోరుతో నోవాక్ జకోవిచ్ను ఓడించి ఛాంపియన్గా నిలిచాడు. అంతకుముందు అల్కరాజ్ 2022లో యుఎస్ ఓపెన్ టైటిల్ను కూడా గెలుచుకున్నాడు. కాగా వింబుల్డన్ ఫైనల్కు చేరుకుని టైటిల్ను గెలుచుకున్న మూడో స్పానిష్ ప్లేయర్గా అల్కరాజ్ నిలిచాడు. ఇక తొలి వింబుల్డన్ టైటిల్ సొంతం చేసుకున్న కార్లోస్ అల్కరాజ్ను మరో స్పెయిన్ టెన్నిస్ లెజెండ్ రాఫెల్ నాదల్ అభినందించాడు. "ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్కు అభినందనలు. తొలి టైటిల్ను గెలుచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. స్పానిష్ టెన్నిస్కు మార్గదర్శకుడు మనోలో సాంటానా మనతో లేకపోయినా నీ విజయాన్ని కచ్చితంగా చూస్తుంటారు. అతని ఆశీర్వాదాలు మనకు ఎప్పటికీ ఉంటాయి. నీ విజయాన్ని దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది ఛాంపియన్" అంటూ నాథల్ ట్వీట్ చేశాడు. మనోలో సాంటానా.. స్పెయిన్ టెన్నిస్ దిగ్గజాల్లో ఒకరు. ఆయన తన కెరీర్లో నాలుగు గ్రాండ్స్లామ్ టైటిల్స్ను కైవసం చేసుకున్నారు. మనోలో సాంటానా(83) 2021 డిసెంబర్లో తుది శ్వాస విడిచారు. Enhorabuena @carlosalcaraz . Nos has dado una alegría inmensa hoy y seguro que nuestro pionero en el tenis español, Manolo Santana, también ha estado animando allá dónde esté como de Wimbledon al que hoy te has unido. Un abrazo muy fuerte y a disfrutar del momento ¡¡¡Campeón!!!… pic.twitter.com/y0j2GowX3O — Rafa Nadal (@RafaelNadal) July 16, 2023 చదవండి: IND vs WI: 'అలా జరగనందుకు చాలా బాధగా ఉంది.. అతడు ఇండియన్ క్రికెట్ను ఏలుతాడు' -
అల్కరాజ్ అద్భుతం
లండన్: వింబుల్డన్లో వరుసగా 35వ విజయంతో ఐదో టైటిల్, ఓవరాల్గా 24వ గ్రాండ్స్లామ్ను తన ఖాతాలో వేసుకోవాలనుకున్న నొవాక్ జొకోవిచ్ కోరిక నెరవేరలేదు. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో వరల్డ్ నంబర్వన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) చేతిలో రెండో సీడ్ జొకోవిచ్ (సెర్బి యా) ఓడిపోయాడు. 4 గంటల 42 నిమిషాల పాటు సాగిన పోరులో అల్కరాజ్ 1–6, 7–6 (8/6), 6–1, 3–6, 6–4 స్కోరుతో జొకోవిచ్పై నెగ్గాడు. 2022లో యూఎస్ ఓపెన్ సాధించిన అల్కరాజ్కు ఇది రెండో గ్రాండ్స్లామ్ టైటిల్. ఈ ఏడాది వరుసగా ఆ్రస్టేలియన్, ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి జోరు మీదున్న 36 ఏళ్ల జొకోవిచ్ మూడో గ్రాండ్స్లామ్ తుది పోరులో ఓటమితో నిరాశగా నిష్క్రమించాడు. విజేత అల్కరాజ్కు 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 25 కోట్ల 29 లక్షలు), రన్నరప్ జొకో విచ్కు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 12 కోట్ల 64 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. హోరాహోరీగా... అంచనాలకు తగినట్లుగా జొకోవిచ్ దూకుడుగా ఆటను మొదలు పెట్టాడు. 5–0తో దూసుకుపోయాడు. అదే జోరులో తొలి సెట్ను దక్కించుకున్నాడు. రెండో సెట్లో హోరాహోరీ సమరం సాగింది. అల్కరాజ్ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంతో జొకోవిచ్ కూడా ప్రతీ పాయింట్ కోసం శ్రమించాల్సి వచ్చింది. స్కోర్లు 4–4, 5–5, 6–6తో సమమవుతూ వచ్చాయి. టైబ్రేక్లో చివరకు బ్యాక్హ్యాండ్ విన్నర్తో పాయింట్ నెగ్గిన అల్కరాజ్ సెట్ను గెలుచుకున్నాడు. ఈ సెట్ 85 నిమి షాలు సాగడం విశేషం. ఈ సెట్ నాలుగో గేమ్లో 29 షాట్ల ర్యాలీతో స్టేడియం హోరెత్తింది. పట్టు కోల్పోయిన జొకో... రెండో సెట్ గెలిచిన ఉత్సాహంలో అల్కరాజ్ మూడో సెట్లో తన జోరును కొనసాగించాడు. 3–1తో అతను ముందంజ వేశాడు. అయితే ఐదో గేమ్ ఈ మ్యాచ్ మొత్తానికే హైలైట్గా సాగింది. 27 నిమిషాల పాటు 13 ‘డ్యూస్’లతో సాగిన ఈ గేమ్లో ప్రతీ పాయింట్ కోసం ఇద్దరు ఆటగాళ్లు తీవ్రంగా పోరాడారు. ఈ గేమ్ను గెలుచుకొని 4–1తో ఆధిక్యంలో నిలిచిన అల్కరాజ్కు మరో రెండు గేమ్లు గెలుచుకునేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఓడితే టైటిల్ కోల్పోయేస్థితిలో నాలుగో సెట్ బరిలోకి దిగిన జొకోవిచ్ తన స్థాయి ఆటను ప్రదర్శించి సెట్ సాధించాడు. నిర్ణాయక చివరి సెట్లో 1–1తో సమంగా నిలిచిన తర్వాత మూడో గేమ్లో జొకోవిచ్ సర్విస్ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్లను నిలబెట్టుకొని విజయం ఖరారు చేసుకున్నాడు. -
వింబుల్డన్కు ముందు అన్నీ అడ్డంకులే.. వండర్ వొండ్రుసోవా
అన్సీడెడ్...మణికట్టుకు రెండు శస్త్రచికిత్సలు...మెగా టోర్నీకి ముందు తప్పుకున్న స్పాన్సర్...వింబుల్డన్లో అడుగు పెట్టే సమయానికి మర్కెటా వొండ్రుసోవా పరిస్థితి ఇది. గ్రాస్ కోర్టు గ్రాండ్స్లామ్ ఈవెంట్లో గతంలో నాలుగు ప్రయత్నాల్లో రెండో రౌండ్ కూడా దాటలేకపోయింది... గత ఏడాది గాయంతో దూరమైన ఆమె ఈ సారీ మొదటి రౌండ్ దాటితే చాలనే ఆలోచనతోనే ఆమె బరిలోకి దిగింది.. అయితే ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో ఆమె అద్భుతం చేసింది. ఏకపక్షంగా సాగిన తుది పోరులో సంచలన విజయంతో చాంపియన్గా నిలిచింది. మహిళల విభాగం ఓపెన్ ఎరాలో వింబుల్డన్ గెలుచుకున్న తొలి అన్సీడెడ్గా వొండ్రుసోవా నిలిచింది. మరో వైపు వింబుల్డన్లో వరుసగా రెండో ఏడాది రన్నరప్గానే పరిమితమై అన్స్ జబర్ కన్నీళ్లపర్యంతమైంది. లండన్: వింబుల్డన్ మహిళల సింగిల్స్లో కొత్త విజేత అవతరించింది. చెక్ రిపబ్లిక్కు చెందిన 24 ఏళ్ల మర్కెటా వొండ్రుసోవా చాంపియన్గా ‘వీనస్ రోజ్వాటర్ డిష్’ను సగర్వంగా అందుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో వొండ్రుసోవా 6–4, 6–4 స్కోరుతో ఆరో సీడ్ అన్స్ జబర్ (ట్యునీషియా)పై విజయం సాధించింది. 80 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో ప్రపంచ 42వ ర్యాంకర్ వొండ్రుసోవా జోరు ముందు 6వ ర్యాంకర్ జబర్ నిలవలేకపోయింది. 2019 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఓడి రన్నరప్గా నిలిచిన వొండ్రుసోవాకు ఇది మొదటి గ్రాండ్స్లామ్ టైటిల్ కాగా... గత ఏడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ ఫైనల్లలో ఓడిన జబర్ మూడో ప్రయత్నంలోనూ గ్రాండ్స్లామ్ విజేతగా నిలవలేకపోయింది. టైటిల్ సాధించిన వొండ్రుసోవాకు 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 25 కోట్ల 29 లక్షలు), రన్నరప్ జబర్కు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 12 కోట్ల 64 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. నలుగురు గ్రాండ్స్లామ్ విజేతలు, వారిలో ముగ్గురు ప్రస్తుత టాప్–10 ప్లేయర్లను ఓడించి ఫైనల్ చేరిన జబర్పైనే అందరి అంచనాలు ఉన్నాయి. దానికి తగినట్లుగా శుభారంభం చేస్తూ తొలి సెట్లో ఆమె 2–0తో ముందంజ వేసింది. అయితే కోలుకున్న వొండ్రుసోవా 2–2తో స్కోరు సమం చేసింది. చక్కటి ఫోర్హ్యాండ్లలో మళ్లీ చెలరేగిన జబర్ ముందంజ వేస్తూ 4–2తో మళ్లీ ఆధిక్యం కనబర్చింది. అయితే ఇక్కడే ఆట మలుపు తిరిగింది. వరుస తప్పులతో జబర్ ఒత్తిడిలో పడిపోగా, దూకుడుగా ఆడిన చెక్ రిపబ్లిక్ ప్లేయర్ వరుసగా నాలుగు గేమ్లు గెలిచి 6–4తో తొలి సెట్ను తన ఖాతాలో వేసుకుంది. రెండో సెట్లో దాదాపు ఇదే ప్రదర్శన పునరావృతమైంది. అభిమానులు తనకు మద్దతు పలుకుతుండగా జబర్ 3–1తో దూసుకుపోయింది. అయితే బేస్లైన్ గేమ్తో ప్రశాంతంగా ఆడిన వొండ్రుసోవా 3–3కు, ఆపై 4–4కు స్కోరును చేర్చింది. తొమ్మిదో గేమ్లో పదే పదే నెట్పై ఆడి పాయింట్లు కోల్పోయిన జబర్ 4–5తో వెనుకబడింది. చివరి గేమ్లో తన సర్వీస్ను నిలబెట్టుకోవడంలో వొండ్రుసోవా సఫలమై ఆనందంలో కోర్టుపై కుప్పకూలిపోయింది. ఏకంగా 31 అనవసర తప్పిదాలు చేసిన జబర్ చేజేతులా తన ఓటమిని ఆహ్వానించింది. -
Wimbledon: మహిళల సింగిల్స్లో సంచలనం.. వొండ్రుసోవా సరికొత్త చరిత్ర
Wimbledon 2023, Women's Singles Winner Marketa Vondrousova: వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో అన్సీడెడ్, చెక్ రిపబ్లిక్ ప్లేయర్ మర్కెటా వొండ్రుసోవా సంచలన విజయం సాధించింది. ట్యునీషియా టెన్నిస్ స్టార్ ఆన్స్ జబర్ను ఓడించి కెరీర్లో తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ అందుకుంది. 6-4, 6-4 తేడాతో ప్రత్యర్థిపై గెలుపొంది సరికొత్త చరిత్ర సృష్టించింది. వింబుల్డన్ చరిత్రలో 60 ఏళ్ల తర్వాత చాంపియన్గా అవతరించిన తొలి అన్సీడెడ్ క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. రెండో గ్రాండ్స్లామ్ ఫైనల్ కాగా వొండ్రుసోవా చేతిలో ఓడిన 28 ఏళ్ల జబర్ గత ఏడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీల్లో ఫైనల్కు చేరి రన్నరప్తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఓపెన్ శకంలో (1968 తర్వాత) వింబుల్డన్ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి అన్సీడెడ్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన 24 ఏళ్ల వొండ్రుసోవా ఏకంగా విజేతగా నిలిచింది. కెరీర్లో ఆడిన రెండో గ్రాండ్స్లామ్ ఫైనల్లోనే టైటిల్ గెలిచింది. ప్రైజ్మనీ ఎంతంటే అంతకు ముందు 2019 ఫ్రెంచ్ ఓపెన్లో వొండ్రుసోవా ఫైనల్ చేరి రన్నరప్గా నిలిచింది. ఈ ఏడాది జబర్తో జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ గెలుపొందిన వొండ్రుసోవా తాజాగా ఆమెను ఫైనల్లో ఓడించి ట్రోఫీ గెలుచుకుంది. తద్వారా 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 25 కోట్ల 29 లక్షలు) ప్రైజ్మనీ గెలిచింది. ఇక రన్నరప్ ప్లేయర్ జబర్కు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 12 కోట్ల 64 లక్షలు) ప్రైజ్మనీ దక్కనుంది. POV: you just become a Wimbledon champion 🏆#Wimbledon pic.twitter.com/kf484DhHUt — Wimbledon (@Wimbledon) July 15, 2023 Marketa's magical moment 🏆 Marketa Vondrousova becomes the third Czech woman to win the ladies' singles title, defeating Ons Jabeur 6-4, 6-4#Wimbledon pic.twitter.com/AAHThI1ZYn — Wimbledon (@Wimbledon) July 15, 2023 Unseeded. Unstoppable.#Wimbledon pic.twitter.com/sgSwIWirDM — Wimbledon (@Wimbledon) July 15, 2023 -
అల్కరాజ్తో జొకోవిచ్ ‘ఢీ’
లండన్: రికార్డుస్థాయిలో 24వ గ్రాండ్స్లామ్ టైటిల్ కోసం నొవాక్ జొకోవిచ్... కెరీర్లో రెండో గ్రాండ్స్లామ్ టైటిల్ కోసం కార్లోస్ అల్కరాజ్... ఆదివారం జరిగే వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో తలపడనున్నారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్లో ప్రపంచ నంబర్వన్ అల్కరాజ్ (స్పెయిన్) గంటా 50 నిమిషాల్లో 6–3, 6–3, 6–3తో ప్రపంచ మూడో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై... డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 2 గంటల 47 నిమిషాల్లో 6–3, 6–4, 7–6 (7/4)తో ఆరో సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ)పై విజయం సాధించారు. జొకోవిచ్ తన కెరీర్లో 35వసారి గ్రాండ్స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరగా... అల్కరాజ్కిది రెండో గ్రాండ్స్లామ్ ఫైనల్ కానుంది. అల్కరాజ్ గత ఏడాది యూఎస్ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచాడు. సినెర్తో జరిగిన మ్యాచ్లో జొకోవిచ్ 11 ఏస్లు సంధించాడు. నెట్ వద్దకు 25 సార్లు దూసుకొచ్చి 17 సార్లు పాయింట్లు గెలిచాడు. 33 విన్నర్స్ కొట్టిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్విస్ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. తొమ్మిదోసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్ చేరిన జొకోవిచ్ ఏడుసార్లు విజేతగా నిలిచాడు. మెద్వెదెవ్తో జరిగిన మ్యాచ్లో అల్కరాజ్ నాలుగు ఏస్లు సంధించాడు. నెట్ వద్దకు 36 సార్లు దూసుకొచ్చి 28 సార్లు పాయింట్లు నెగ్గాడు. తన సర్విస్ను రెండుసార్లు కోల్పోయిన ఈ స్పెయిన్ స్టార్ మెద్వెదెవ్ సర్విస్ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. -
సంచలనం.. నెంబర్ వన్ స్వియాటెకు షాకిచ్చిన స్వితోలినా
లండన్: గత ఏడాది అక్టోబర్లో పాపకు జన్మనిచ్చి... ఏప్రిల్లో మళ్లీ రాకెట్ పట్టిన ఉక్రెయిన్ టెన్నిస్ స్టార్ ఎలీనా స్వితోలినా వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో పెను సంచలనం సృష్టించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో స్వితోలినా 7–5, 6–7 (5/7), 6–2తో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)ను బోల్తా కొట్టించింది. 2019 తర్వాత మళ్లీ వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ చేరిన స్వితోలినాకు వింబుల్డన్ నిర్వాహకులు ‘వైల్డ్ కార్డు’ కేటాయించారు. స్వియాటెక్తో 2 గంటల 51 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో స్వితోలినా ఐదు ఏస్లు సంధించింది. తన సర్వీస్ను మూడుసార్లు కోల్పో యి, స్వియాటెక్ సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 14 సార్లు దూసుకొచ్చి తొమ్మిదిసార్లు పాయింట్లు నెగ్గిన స్వితోలినా 25 విన్నర్స్ కొట్టింది. నాలుగు గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గి, తొలిసారి వింబుల్డన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరిన స్వియాటెక్ 41 అనవసర తప్పిదాలు చేసింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 76వ స్థానంలో ఉన్న స్వితోలినా సెమీఫైనల్ చేరిన క్రమంలో నలుగురు గ్రాండ్స్లామ్ చాంపియన్స్ను ఓడించడం విశేషం. తొలి రౌండ్లో వీనస్ విలియమ్స్ (అమెరికా)పై, రెండో రౌండ్లో సోఫియా కెనిన్ (అమెరికా)పై, నాలుగో రౌండ్లో విక్టోరియా అజరెంకా (బెలారస్)లపై స్వితోలినా గెలిచింది. సెమీఫైనల్లో చెక్ రిపబ్లిక్కు చెందిన మర్కెటా వొండ్రుసోవాతో స్వితోలినా తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో 42వ ర్యాంకర్ వొండ్రుసోవా 6–4, 2–6, 6–4తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, నాలుగో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా)పై సంచలన విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న జోడీ పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) ద్వయం 7–5, 4–6, 7–6 (10/7) తో డేవిడ్ పెల్ (నెదర్లాండ్స్)–రీస్ స్టాడ్లెర్ (అమెరికా) జంటను ఓడించింది. జూనియర్ బాలుర సింగిల్స్ రెండో రౌండ్లో మానస్ ధామ్నె (భారత్) 1–6, 4–6తో సియర్లీ (బ్రిటన్) చేతిలో ఓడిపోయాడు. A five-star performance 🌟@ElinaSvitolina defeats the world No.1 Iga Swiatek 7-5, 6-7(5), 6-2 to reach the semi-finals at #Wimbledon once again pic.twitter.com/l6nUu17KHj — Wimbledon (@Wimbledon) July 11, 2023 -
కసితో ఆడుతున్నాడు.. నెట్ను కూడా వదలడం లేదు!
వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ దూసుకెళ్తున్నాడు. కెరీర్లో 24వ గ్రాండ్స్లామ్ టైటిలే లక్ష్యంగా సాగుతున్న జొకోవిచ్ వింబుల్డన్లో 14వ సారి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. 2021 సెమీఫైనలిస్ట్, ప్రపంచ 18వ ర్యాంకర్ హుబెర్ట్ హుర్కాజ్ (పోలాండ్)తో జరిగిన మ్యాచ్లో రెండో సీడ్ జొకోవిచ్ 7–6 (8/6), 7–6 (8/6), 5–7, 6–4తో నెగ్గి క్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నాడు. కాగా మ్యాచ్లో రెండో సెట్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. హుర్కాజ్ సర్వీస్ చేసి డ్రాప్ షాట్ ఆడాడు. దీంతో బంతి జొకోవిచ్ నెట్ దగ్గర్లోనే పడేలా కనిపించింది. ఒక్క పాయింట్ కూడా వదలకూడదన్న ఉద్దేశంతో జొకోవిచ్ వేగంగా పరిగెత్తుకొచ్చి బాడీ బాగా స్ట్రెచ్ చేస్తూ షాట్ ఆడాడు. అయితే ఇదే సమయంలో బాడీ కంట్రోల్ కోల్పోయిన జొకోవిచ్ ఒక్కసారిగా నెట్పై పడిపోయాడు. అదృష్టవశాత్తూ జొకోకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే జొకోవిచ్ చర్య తన ప్రత్యర్థి హుర్కాజ్తో పాటు అభిమానులను ఆశ్చర్యపరిచింది. హుర్కాజ్ జొకోవిచ్ దగ్గరికి వెళ్లి అతన్ని పైకి లేపి జాగ్రత్త చెప్పి కాసేపు మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. కాగా జొకోవిచ్కు ఇది వింబుల్డన్లో వందో మ్యాచ్ కావడం విశేషం. కాగా మ్యాచ్ ఆదివారం, సోమవారం రెండు రోజులపాటు జరిగింది. టోర్నీ నిబంధనల ప్రకారం రాత్రి 11 గంటల వరకే ఆటను కొనసాగించాలి. ఆదివారం రెండు సెట్లు ముగిసిన తర్వాత మ్యాచ్ను సోమవారానికి వాయిదా వేశారు.సోమవారం ఆటను కొనసాగించగా... మూడో సెట్ను హుర్కాజ్ గెల్చుకున్నాడు. అయితే నాలుగో సెట్లో జొకోవిచ్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. ఏడో గేమ్లో హుర్కాజ్ సర్విస్ను బ్రేక్ చేసి ఎనిమిదో గేమ్లో తన సర్విస్ను కాపాడుకొని 5–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం పదో గేమ్లో జొకోవిచ్ తన సర్విస్ను కాపాడుకొని సెట్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. వింబుల్డన్ టోర్నీ చరిత్రలో జొకోవిచ్కిది 90వ విజయం కావడం విశేషం. Djokovic went for it 😅 #Wimbledon pic.twitter.com/q05cHyJJBt — SportsCenter (@SportsCenter) July 9, 2023 చదవండి: MS Dhoni Reaction To Fan: 'భయ్యా.. నొప్పి ఎలా ఉంది?'.. ధోని రియాక్షన్ వైరల్ #LakshyaSen: చరిత్ర సృష్టించిన లక్ష్య సేన్ -
జొకోవిచ్దే పైచేయి, 14వసారి క్వార్టర్ ఫైనల్లోకి డిఫెండింగ్ చాంపియన్
లండన్: కెరీర్లో 24వ గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించే దిశగా సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరో అడుగు వేశాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోరీ్నలో ఈ సెర్బియా స్టార్ 14వసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తొలి మూడు రౌండ్ మ్యాచ్ల్లో రెండున్నర గంటల్లోపే విజయాన్ని అందుకున్న జొకోవిచ్కు ప్రిక్వార్టర్ ఫైనల్లో మాత్రం అంత సులువుగా గెలుపు దక్కలేదు. 2021 సెమీఫైనలిస్ట్, ప్రపంచ 18వ ర్యాంకర్ హుబెర్ట్ హుర్కాజ్ (పోలాండ్)తో జరిగిన మ్యాచ్లో రెండో సీడ్ జొకోవిచ్ 7–6 (8/6), 7–6 (8/6), 5–7, 6–4తో నెగ్గి క్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నాడు. 3 గంటల 7 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో జొకోవిచ్ 18 ఏస్లు సంధించగా, హుర్కాజ్ 33 ఏస్లతో అదరగొట్టాడు. తొలి సెట్లో జొకోవిచ్ మూడుసార్లు సెట్ పాయింట్లను, రెండో సెట్లో రెండుసార్లు సెట్ పాయింట్లను కాపాడుకోవడం గమనార్హం. ఈ మ్యాచ్ ఆదివారం, సోమవారం రెండు రోజులపాటు జరిగింది. టోర్నీ నిబంధనల ప్రకారం రాత్రి 11 గంటల వరకే ఆటను కొనసాగించాలి. ఆదివారం రెండు సెట్లు ముగిసిన తర్వాత మ్యాచ్ను సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం ఆటను కొనసాగించగా... మూడో సెట్ను హుర్కాజ్ గెల్చుకున్నాడు. అయితే నాలుగో సెట్లో జొకోవిచ్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. ఏడో గేమ్లో హుర్కాజ్ సర్విస్ను బ్రేక్ చేసి ఎనిమిదో గేమ్లో తన సర్విస్ను కాపాడుకొని 5–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం పదో గేమ్లో జొకోవిచ్ తన సర్విస్ను కాపాడుకొని సెట్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. వింబుల్డన్ టోర్నీ చరిత్రలో జొకోవిచ్కిది 90వ విజయం కావడం విశేషం. మరోవైపు ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) కథ ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో అమెరికా ప్లేయర్ క్రిస్టోఫర్ యుబ్యాంక్స్ 3–6, 7–6 (7/4), 3–6, 6–4, 6–4తో సిట్సిపాస్ను ఓడించి తన కెరీర్లో తొలిసారి గ్రాండ్స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరాడు. జిరీ లెహెస్కా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6–4, 6–2తో తొలి రెండు సెట్లు గెల్చుకున్నాడు. అనంతరం లెహెస్కా గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలడంతో మెద్వెదెవ్కు క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కింది. మూడో రౌండ్లో బోపన్న జోడీ పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం 7–5, 6–3తో జేకబ్ ఫియరెన్లీ–జోనస్ మండే (బ్రిటన్) జోడీపై నెగ్గి మూడో రౌండ్కు చేరుకుంది. ఓటమి అంచుల నుంచి... మహిళల సింగిల్స్లో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) ఓటమి అంచుల నుంచి గట్టెక్కి తొలిసారి ఈ టోరీ్నలో క్వార్టర్ ఫైనల్ చేరింది. 14వ సీడ్ బెలిండా బెన్చిచ్ (స్విట్జర్లాండ్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ 6–7 (4/7), 7–6 (7/2), 6–3తో గెలిచింది. రెండో సెట్లో స్కోరు 5–6 వద్ద స్వియాటెక్ తన సర్విస్లో రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని స్కోరును 6–6తో సమం చేసింది. టైబ్రేక్లో సెట్ను నెగ్గి మ్యాచ్లో నిలిచిన ఆమె మూడో సెట్లోని నాలుగో గేమ్లో బెన్చిచ్ సర్విస్ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్లను కాపాడుకొని గెలిచింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్లో స్వితోలినా (ఉక్రెయిన్) 2–6, 6–4, 7–6 (11/9)తో మాజీ నంబర్వన్ అజరెంకా (బెలారస్)పై, రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6–4, 6–0తో ఎకతెరీనా అలెగ్జాండ్రోవా (రష్యా)పై, ఆరో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునిíÙయా) 6–0, 6–3తో రెండుసార్లు చాంపియన్ క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై, మాడిసన్ కీస్ 3–6, 7–6 (7/4), 6–2తో మిరా ఆండ్రీవా (రష్యా)పై గెలిచారు. డిఫెండింగ్ చాంపియన్ రిబాకినా (కజకిస్తాన్) తొలి సెట్లో 4–1తో ఆధిక్యంలో ఉన్నపుడు ఆమె ప్రత్యర్థి బీట్రిజ్ హదద్ మయా (బ్రెజిల్) గాయం కారణంగా వైదొలిగింది. -
Wimbledon 2023: మూడో రౌండ్కు చేరుకున్న బోపన్న జోడీ
వింబుల్డన్-2023 పురుషుల డబుల్స్లో భారత వెటరన్ రోహన్ బోపన్న తన ఆస్ట్రేలియా భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్తో కలిసి రౌండ్ ఆఫ్ 16కు (మూడో రౌండ్) చేరుకున్నాడు. ఈ ఇండో-ఆస్ట్రేలియన్ ద్వయం కేవలం 69 నిమిషాల్లోనే ఇంగ్లీష్ జోడీ, వైల్డ్ కార్ట్ ఎంట్రీ అయిన జాకబ్ ఫియర్న్లీ-జోహన్నస్ జోడీపై వరుస సెట్లలో (7-5, 6-3) విజయం సాధించింది. ఈ మ్యాచ్లో బోపన్న జోడీకి శుభారంభం లభించనప్పటికీ.. ఆతర్వాత బలంగా పుంజుకుంది. ఈ టోర్నీలో ఆరో సీడ్గా బరిలోకి దిగిన బోపన్న ద్వయం.. తదుపరి రౌండ్లో డేవిడ్ పెల్ (నెదర్లాండ్స్)-రీస్ స్టాల్డర్ (యూఎస్ఏ) జోడీతో తలపడనుంది. ప్రస్తుతం వింబుల్డన్లో భారత్ తరఫున బోపన్న మాత్రమే బరిలో ఉన్నాడు. ఈ టోర్నీలో బోపన్న 2013, 2015లో అత్యుత్తమంగా సెమీస్ వరకు (డబుల్స్) చేరుకున్నాడు. మిక్స్డ్ డబుల్స్లో తొలి రౌండ్లోనే ఓడిన బోపన్న జోడీ మిక్స్డ్ డబుల్స్లో బోపన్న జోడీ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. తొలి రౌండ్లో బోపన్న (భారత్)–డబ్రౌస్కీ (కెనడా) జోడీ 7–6 (7/5), 3–6, 4–6తో డోడిగ్ (క్రొయేషియా)–లతీషా చాన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్), జీవన్ నెడుంజెళియన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడీలు తొలి రౌండ్లోనే నిష్క్రమించాయి. సాకేత్–యూకీ ద్వయం 4–6, 6–4, 4–6తో ఫొకినా (స్పెయిన్)–మనారినో (ఫ్రాన్స్) జంట చేతిలో... బాలాజీ–జీవన్ జోడీ 6–7 (5/7), 4–6తో డోడిగ్ (క్రొయేషియా)–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) ద్వయం చేతిలో పరాజయం పాలయ్యాయి. -
Wimbledon 2023: రెండో రౌండ్లో మానస్
వింబుల్డన్ జూనియర్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ బాలుర సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ మానస్ ధామ్నే శుభారంభం చేశాడు. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన మానస్ ఆదివారం లండన్లో జరిగిన తొలి రౌండ్లో 6–2, 6–4తో ప్రపంచ జూనియర్ ర్యాంకింగ్స్లో 47వ స్థానంలో ఉన్న హేడెన్ జోన్స్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందాడు. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో మానస్ నాలుగు ఏస్లు సంధించడంతోపాటు 14 విన్నర్స్ కొట్టి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. రన్నరప్ సహజ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ25 మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి సహజ యామలపల్లి రన్నరప్గా నిలిచింది. థాయ్లాండ్లో జరిగిన సింగిల్స్ ఫైనల్లో సహజ 4–6, 0–6తో మన చాయ సావంగ్కెయి (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయింది. 65 నిమిషాలు జరిగిన ఈ మ్యాచ్లో సహజ ఒక ఏస్ సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్లు చేసింది. ప్రత్యర్థి సర్వీస్ను ఒకసారి బ్రేక్ చేసి, తన సర్వీస్ను ఐదుసార్లు కోల్పోయింది. చదవండి: నాకు నమ్మకం ఉంది.. టీమిండియాను మా జట్టు ఓడిస్తుంది: బ్రియాన్ లారా -
క్వార్టర్ ఫైనల్లో రుబ్లెవ్
లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) తన కెరీర్లో తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో రుబ్లెవ్ 7–5, 6–3, 6–7 (6/8), 6–7 (5/7), 6–4తో అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)పై గెలుపొందాడు. 3 గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రుబ్లెవ్ 21 ఏస్లు, బుబ్లిక్ 39 ఏస్లు సంధించడం విశేషం. మూడో సెట్ టైబ్రేక్లో మ్యాచ్ పాయింట్ చేజార్చుకున్న రుబ్లెవ్ చివరకు ఐదో సెట్లో విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్లో 26వ సీడ్ షపోవలోవ్ (కెనడా) 6–3, 3–6, 1–6, 3–6తో సఫీయులిన్ (రష్యా) చేతిలో ఓడిపోగా... ఎనిమిదో సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ) 7–6 (7/4), 6–4, 6–3తో గలాన్ (కొలంబియా)పై గెలిచాడు. మూడో రౌండ్లో పదో సీడ్ టియాఫో (అమెరికా) 2–6, 3–6, 2–6తో దిమిత్రోవ్ (బల్గేరియా) చేతిలో ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్లో నాలుగో సీడ్ పెగూలా (అమెరికా) 6–1, 6–3తో సురెంకో (ఉక్రెయిన్)పై, వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 2–6, 6–4, 6–3తో బుజ్కోవా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మూడో రౌండ్లో మిరా ఆండ్రీవా (రష్యా) 6–2, 7–5తో పొటపోవా (రష్యా)పై నెగ్గింది. పోరాడి ఓడిన సాకేత్–యూకీ జోడీ పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్), జీవన్ నెడుంజెళియన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడీలు తొలి రౌండ్లోనే నిష్క్రమించాయి. సాకేత్–యూకీ ద్వయం 4–6, 6–4, 4–6తో ఫొకినా (స్పెయిన్)–మనారినో (ఫ్రాన్స్) జంట చేతిలో... బాలాజీ–జీవన్ జోడీ 6–7 (5/7), 4–6తో డోడిగ్ (క్రొయేషియా)–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) ద్వయం చేతిలో పరాజయం పాలయ్యాయి. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న (భారత్)–డబ్రౌస్కీ (కెనడా) జోడీ 7–6 (7/5), 3–6, 4–6తో డోడిగ్ (క్రొయేషియా)–లతీషా చాన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడింది. -
18 ఏళ్లకే సంచలనాలు.. 70వ దశకాన్ని శాసించిన టెన్నిస్ దిగ్గజం
21 ఏళ్ల వయసు వచ్చే సరికే టెన్నిస్ చరిత్రలో దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా అతను గుర్తింపు తెచ్చుకోగలిగాడు. 26 ఏళ్ల వయసు వచ్చేసరికి ఎందరికో సాధ్యం కాని ఘనతలను అతను సొంతం చేసుకున్నాడు. ఆధునిక టెన్నిస్ తరంలో ఏ ఆటగాడి కెరీర్ కూడా అంత తక్కువ సమయంలో అంత అద్భుతంగా లేదు. చాంపియన్షిప్ విజయాలు, ఫలితాలు మాత్రమే కాదు.. అతను వాటిని సాధించిన తీరు కూడా అబ్బురపరచాయి. 18 ఏళ్ల వయసుకే ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి అప్పటికి అత్యంత పిన్న వయస్కుడిగా అతను గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండు పూర్తిగా భిన్నమైన వేదికలపై వరుసగా మూడేసి సార్లు గ్రాండ్స్లామ్ గెలవడం అతనికి మాత్రమే సాధ్యమైన ఘనత. ఆ పొడవాటి జట్టు, హెడ్ బ్యాండ్ సుదీర్ఘ సమయం పాటు ప్రపంచ టెన్నిస్పై చెరగని ముద్ర వేశాయి. వరల్డ్ టెన్నిస్లో ఆల్టైమ్ గ్రేట్గా నిలిచిన ఆ స్వీడిష్ స్టార్ ప్లేయర్ బోర్న్ బోర్గ్. టీనేజ్ సంచలనంగా తన కెరీర్ మొదలు పెట్టిన బోర్గ్ తన ఆకర్షణీయమైన ఆటతో 70వ దశకపు టెన్నిస్ ప్రపంచాన్ని శాసించాడు. 'మేమందరం టెన్నిస్ ఆడుతున్నాం. అతను మాత్రం అంతకు మించి ఆడుతున్నాడు'.. 1976 వింబుల్డన్ ఫైనల్లో బోర్గ్ చేతిలో ఓడిన తర్వాత అతని ప్రత్యర్థి, అప్పటి ఫేవరెట్ ఎలీ నాస్టెస్ చేసిన వ్యాఖ్య అది. 20 ఏళ్ల బోర్గ్ ఆ మ్యాచ్లో చూపిన ప్రదర్శన అలాంటిది మరి. మంచి ఫిట్నెస్.. చక్కటి నైపుణ్యంతో పాటు వైవిధ్యమైన శైలి బోర్గ్ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అటు ఫోర్హ్యాండ్ను, ఇటు బ్యాక్హ్యాండ్ను కూడా సమర్థంగా వాడగల ప్రతిభ బోర్గ్ అద్భుతమైన కెరీర్కి బలాలుగా నిలిచాయి. హాకీలో స్లాప్ షాట్ తరహాలో రెండు చేతులతో అతను ఆడే బ్యాక్హ్యాండ్కు ప్రత్యర్థి ఎవరైనా సరే.. ఓటమిని ఒప్పుకోవాల్సిందే. 13 ఏళ్ల వయసులోనే స్వీడన్ లో 18 ఏళ్ల ఆటగాళ్లందరినీ ఓడించి వచ్చిన బోర్గ్ ఆటపై ఆ దేశపు అభిమానులు పెట్టుకున్న అంచనాలు ఎప్పుడూ తప్పు కాలేదు. బోర్గ్ తండ్రి తనకు స్థానిక పోటీల్లో బహుమతిగా వచ్చిన ఒక రాకెట్ను కొడుకు చేతుల్లో పెట్టినప్పుడు అతనికి తొలిసారి ఆటపై ఆసక్తి కలిగింది. ఆ తర్వాత మొదలైన అతని సాధన బోర్గ్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. ఆటలో ఓనమాలు నేర్చుకున్నప్పుడు అతను బేస్లై¯Œ కే ప్రాధాన్యమిచ్చాడు. సుదీర్ఘ ర్యాలీలు ప్రాక్టీస్ చేయడంతో పాటు బ్యాక్హ్యాండ్పై దృష్టి పెట్టాడు. ప్రొఫెషనల్గా మారిన తర్వాత కూడా బోర్గ్ సర్వీస్ కాస్త బలహీనంగానే ఉండేది. అయితే వింబుల్డ¯Œ లాంటి పెద్ద టోర్నీలు నెగ్గాలంటే సాధారణ ఆట సరిపోదని భావించి తన సర్వ్ అండ్ వ్యాలీని పటిష్ఠపరచుకున్నాడు. చివరకు అది గొప్ప విజయాలను అందించింది. ఆటలో ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనూ ఒత్తిడిని దరి చేరనీయకుండా, ఓటమి తర్వాత కూడా ప్రశాంతంగా కనిపించగల అతని తత్వం బోర్గ్కు ‘ఐస్బర్గ్’ అనే పేరు తెచ్చి పెట్టింది. ఫ్రెంచ్ ఓపెన్తో మొదలు.. స్వీడన్ తరఫున డేవిస్ కప్ టీమ్లో ఆడే అవకాశం బోర్గ్కు పదిహేనవ ఏటనే వచ్చింది. కెరీర్ తొలి మ్యాచ్లో అతను చక్కటి విజయంతో శుభారంభం చేసినా టీమ్ ముందుకు వెళ్లలేకపోయింది. మరో రెండేళ్ల పాటు అక్కడక్కడా కొన్ని ఆకట్టుకునే ప్రదర్శనలు చేసినా.. చెప్పుకోదక్క టైటిల్ను మాత్రం అందుకోలేదు. అయితే 1974.. అతని కెరీర్ను మలుపు తిప్పింది. ఆక్లాండ్లో గ్రాస్కోర్టుపై తొలి టోర్నీ నెగ్గి సంబరాలు చేసుకున్న బోర్గ్ అదే ఏడాది గ్రాండ్స్లామ్ చాంప్గా కూడా అవతరించాడు. రోమ్లో ఇటాలియన్ ఓపెన్ గెలవడంతో అతనిపై అంచనాలు పెరిగిపోయాయి. వాటిని నిలబెట్టుకుంటూ అతను మరికొద్ది రోజులకే రోలండ్గారోస్లో సత్తా చాటాడు. ఫైనల్లో ఐదు సెట్ల సమరంలో మ్యాన్యూల్ ఒరెంటెస్ (స్పెయిన్)ను ఓడించి 18 ఏళ్లకే ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ అయ్యాడు. ఆ ఏడాది మొత్తం 8 టోర్నీల్లో విజేతగా నిలిచి బోర్గ్ తన రాకను ఘనంగా చాటాడు. తర్వాతి ఏడాది కూడా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను నిలబెట్టుకున్న అతను మరో నాలుగు ట్రోఫీలతో తన జోరును కొనసాగించాడు. 1975.. అతనికి మరో మధురానుభూతిని మిగిల్చింది. 19 ఏళ్ల వయసులో అతను స్వీడన్ను తొలిసారి డేవిస్ కప్ విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అదే సమయంలో డేవిస్ కప్లో 19 వరుస విజయాలు సాధించి ఆ ఘనత అందుకున్న తొలి ఆటగాడిగానూ కొత్త రికార్డు సృష్టించాడు. ట్రిపుల్ ధమాకా.. రెండు ఫ్రెంచ్ టైటిల్స్ సాధించినా గ్రాస్ కోర్టుపై ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గెలవని లోటు అప్పుడే బోర్గ్కు కనిపించింది. దాంతో తన ఆటలో స్వల్ప మార్పులతో ప్రత్యేక దృష్టి పెట్టాడు. చివరకు ఆ సాధన అద్భుతమైన ఫలితాలను అందించింది. 1976లో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా తొలిసారి అతను వింబుల్డన్ను సొంతం చేసుకున్నాడు. ఈ మెగా ఈవెంట్పై అతని హవా మరో నాలుగేళ్లు సాగడం విశేషం. 1976 నుంచి 1980 వరకు వరుసగా ఐదేళ్ల పాటు బోర్గ్ వింబుల్డన్ చాంపియన్గా నిలిచాడు. రెండో టైటిల్ సాధించిన సమయంలో మొదటిసారి ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ కూడా బోర్గ్ రాకెట్లో చిక్కింది. మరో వైపు రోలండ్ గారోస్ క్లే కోర్టుపై కూడా పట్టు కోల్పోలేదు. రెండేళ్ల విరామం తర్వాత 1978లో మూడో ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న అతను ఆ తర్వాత మరో మూడు టైటిల్స్ను తన కోర్ట్లో వేసుకున్నాడు. ఆ క్రమంలో బోర్గ్ ప్రపంచ టెన్నిస్ చరిత్రలో మరెవరికీ సాధ్యం కాని, ఈతరం ఆటగాళ్లు కూడా అందుకోలేని ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గ్రాండ్స్లామ్లో తక్కువ వ్యవధిలో పూర్తిగా రెండు భిన్న సర్ఫేస్ (క్లే, గ్రాస్)లపై జరిగే ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ లను అతను వరుసగా మూడేళ్ల పాటు గెలిచాడు. 1979లో ఏకంగా 13 టైటిల్స్తో అతను సంచలనం సృష్టించాడు. 1980.. వింబుల్డన్ ఫైనల్ అయితే చరిత్రలోనే అత్యుత్తమ మ్యాచ్లలో ఒకటిగా నిలిచిపోయింది. అందులో బోర్గ్ .. తన చిరకాల ప్రత్యర్థి జాన్ మెకన్రోపై 16, 75, 63, 67 (16/18), 86తో విజయం సాధించాడు. ముగింపు...పునరాగమనం... బోర్గ్ తన ఇరవై ఆరవ ఏట.. ఒక రోజు.. అనూహ్యంగా తాను టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. టెన్నిస్లో చక్కగా ఎదిగే వయసు.. ఎదుగుతున్న సమయంలో.. అతని ఆ ప్రకటన అందరికీ ఆశ్చర్యం కలిగించింది. 1982లో ఒకే ఒక టోర్నీ ఆడిన అతను సన్నిహితులు ఎందరు వారించినా తగిన కారణం కూడా లేకుండా రిటైర్మెంట్ ప్రకటించాడు. 1981లో గెలిచిన ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ అతని ఆఖరి గ్రాండ్స్లామ్. ఆ తర్వాత అతను తన బ్రాండ్ను వాడుకుంటూ వేర్వేరు వ్యాపారాల్లోకి వెళ్లిపోయాడు. అయితే దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఆటపై మనసు మళ్లడంతో తన పాత ఫ్యాషన్ స్టయిల్లో, పాతతరం వుడెన్ రాకెట్తో మళ్లీ కోర్టులోకి అడుగు పెట్టాడు. ఊహించినట్లుగానే ఆ ప్రయత్నం సఫలం కాలేదు. ఆ టైమ్కి టెన్నిస్ పూర్తిగా మారిపోయిందని బోర్గ్కు అర్థమైంది. ఆడిన 12 మ్యాచ్లలో ఒక్కటి కూడా గెలవకుండా ఈసారి శాశ్వతంగా గుడ్బై చెప్పేశాడు. అయితే 11 గ్రాండ్స్లామ్ సింగిల్స్ సాధించిన ఘనత, 66 టైటిల్స్, 109 వారాల పాటు వరల్డ్ నంబర్వన్... వీటన్నింటితో పాటు ఎన్నో గొప్ప మ్యాచ్లను అందించిన శాశ్వత కీర్తితో అభిమానుల మదిలో నిలిచిపోవడంలో మాత్రం బోర్గ్ సఫలమయ్యాడు. - మొహమ్మద్ అబ్దుల్ హాది చదవండి: Ashes 2023: ఇంగ్లండ్ కోచ్ మెక్కల్లమ్కు చేదు అనుభవం.. -
ప్రిక్వార్టర్స్లో జొకోవిచ్, స్వియాటెక్
లండన్: టాప్స్టార్లు నొవాక్ జొకోవిచ్, ఇగా స్వియాటెక్ వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో సెర్బియన్ దిగ్గజం, రెండో సీడ్ జొకోవిచ్ తనదైన శైలిలో స్విట్జర్లాండ్ ఆటగాడు స్టాన్ వావ్రింకాకు ఇంటిదారి చూపాడు. ఇప్పటికే ఈ సీజన్లో జరిగిన రెండు గ్రాండ్స్లామ్ టైటిళ్లను చేజిక్కించుకున్న జొకోవిచ్ 6–3, 6–1, 7–6 (7/5)తో వరుస సెట్లలో స్విస్ ఆటగాడిని ఓడించాడు. కేవలం 2 గంటల 7 నిమిషాల్లో మ్యాచ్ను ముగించాడు. 11 ఏస్లతో రెచ్చిపోయిన జొకో ఒక డబుల్ఫాల్ట్ చేశాడు. 26 అనవసర తప్పిదాలు చేసిన సెర్బియన్ 38 విన్నర్లు కొట్టాడు. ప్రపంచ నంబర్వన్ అల్కరాజ్ (స్పెయిన్) 6–3, 6–7 (6/8), 6–3, 7–5తో నికోలస్ జెర్రి (చీలి)పై గెలిచేందుకు కష్టపడ్డాడు. రష్యా స్టార్, మూడో సీడ్ మెద్వెదెవ్ 4–6, 6–3, 6–4, 6–4తో మార్టన్ ఫుక్సొవిక్స్ (హంగేరి)పై, ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 6–4, 7–6 (7/5), 6–4తో లాస్లొ జేర్ (సెర్బియా)పై నెగ్గారు. ఇతర మ్యాచ్ల్లో 19వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 5–7, 6–2, 6–2తో యోసుకె వాతనుకి (జపాన్)పై గెలుపొందగా, ఎనిమిదో సీడ్ జన్నిక్ సిన్నెర్ (ఇటలీ) 3–6, 6–2, 6–3, 6–4తో క్వెంటిన్ హేలిస్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్వన్, ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ స్వియాటెక్ (పోలాండ్)తో పాటు ఎలినా స్వితోలినా (ఉక్రెయిన్), బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్) ప్రిక్వార్టర్స్ చేరారు. స్వియాటెక్ 6–2, 7–5తో పెట్ర మార్టిచ్ (క్రొయేషియా)ను వరుస సెట్లలో ఓడించగా, స్వితోలినా 7–6 (7/3), 6–2తో మాజీ ఆ్రస్టేలియా చాంప్ సోఫియా కెనిన్ (అమెరికా)ను కంగుతినిపించింది. మారి బౌజ్కొవా (చెక్ రిపబ్లిక్) ఐదో సీడ్ కరోలిన్ గార్సియా (ఫ్రాన్స్)కు షాకిచ్చింది. చెక్ అమ్మాయి 7–6 (7/0), 4–6, 7–5తో సీడెడ్ ప్లేయర్ గార్సియాను మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టించింది. 14వ సీడ్ బెన్సిక్ 6–3, 6–1తో మగ్ద లినెటి (పోలాండ్)పై సునాయాస విజయంతో ముందంజ వేసింది. బోపన్న జోడీ శుభారంభం భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న పురుషుల డబుల్స్లో శుభారంభం చేశాడు. ఆస్ట్రేలియన్ మాథ్యూ ఎబ్డెన్తో జోడీకట్టిన బోపన్న ఆరో సీడ్ జంటగా బరిలోకి దిగింది. తొలిరౌండ్లో భారత్–ఆసీస్ జోడీ 6–2, 6–7 (5/7), 7–6 (10/8)తో గులెర్మో డ్యురన్– థామస్ ఎచెవెరీ (అర్జెంటీనా) జంటపై చెమటోడ్చి గెలిచింది. -
అల్కరాజ్ ముందుకు...
లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్ మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ఈ స్పెయిన్ స్టార్ 6–4, 7–6 (7/2), 6–3తో అలెగ్జాండర్ ముల్లర్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. 2 గంటల 33 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో అల్కరాజ్ ఐదు ఏస్లు సంధించాడు. 32 విన్నర్స్ కొట్టి, 41 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్ వద్దకు 29 సార్లు దూసుకొచ్చి 24 సార్లు పాయింట్లు గెలిచాడు. రెండు సార్లు ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేసిన అల్కరాజ్ తన సర్విస్లో మాత్రం ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. మరోవైపు ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) హోరాహోరీ పోరులో గట్టెక్కి మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. 2013, 2016 వింబుల్డన్ చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్)తో 4 గంటల 40 నిమిషాలపాటు జరిగిన రెండో రౌండ్ పోరులో సిట్సిపాస్ 7–6 (7/3), 6–7 (2/7), 4–6, 7–6 (7/3), 6–4తో విజయం సాధించాడు. 17 ఏస్లు సంధించిన సిట్సిపాస్ ఏకంగా 90 విన్నర్స్ కొట్టడం విశేషం. ఇతర రెండో రౌండ్ మ్యాచ్ల్లో మూడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6–3, 6–3, 7–6 (7/5)తో మనారినో (ఫ్రాన్స్)పై, ఆరో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్) 6–3, 7–6 (7/3), 6–4తో కార్బాలెస్ బేనా (స్పెయిన్)పై నెగ్గారు. అజరెంకా జోరు మహిళల సింగిల్స్లో మాజీ నంబర్వన్ అజరెంకా (బెలారస్), నాలుగో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్ మ్యాచ్ల్లో అజరెంకా 6–2, 6–4తో 11వ సీడ్ కసత్కినా (రష్యా)ను ఓడించగా... పెగూలా 6–4, 6–0తో కొకియారెటో (ఇటలీ)పై గెలిచింది. సుదీర్ఘ టైబ్రేక్... మహిళల సింగిల్స్లో సురెంకో (ఉక్రెయిన్), అనా బొగ్డాన్ (రొమేనియా) మ్యాచ్ చరిత్రకెక్కింది. 3 గంటల 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సురెంకో 4–6, 6–3, 7–6 (20/18)తో బొగ్డాన్ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. నిర్ణాయక మూడో సెట్లో టైబ్రేక్ ఏకంగా 37 నిమిషాలు సాగింది. తద్వారా మహిళల గ్రాండ్స్లామ్ టోర్నీల చరిత్రలో సుదీర్ఘంగా సాగిన టైబ్రేక్గా రికార్డు నమోదైంది. 38 పాయింట్ల తర్వాత టైబ్రేక్లో ఫలితం తేలడం కూడా రికార్డే. ఈ మ్యాచ్లో సురెంకో ఐదుసార్లు, బొగ్డాన్ ఆరుసార్లు మ్యాచ్ పాయింట్లు కాపాడుకోవడం గమనార్హం. -
వింబుల్డన్-2023లో సంచలనం.. టాప్ ప్లేయర్కు షాక్
లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగం రెండో రౌండ్లో సంచలనం నమోదైంది. బ్రిటన్ ప్లేయర్, వైల్డ్కార్డ్ ఎంట్రీ, ప్రపంచ 142వ ర్యాంకర్ లియామ్ బ్రాడీ 3 గంటల 27 నిమిషాల పోరులో 6–4, 3–6, 4–6, 6–3, 6–0తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే)ను బోల్తా కొట్టించాడు. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్లలో, ఈ సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్లో రన్నరప్గా నిలిచిన రూడ్ వింబుల్డన్ టోర్నీలో నాలుగో ప్రయత్నంలోనూ రెండో రౌండ్ను దాటలేకపోయాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్ల్లో ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–7 (4/7), 6–3, 6–4, 7–5తో కరాత్సెవ్ (రష్యా)పై, వావ్రింకా (స్విట్జర్లాండ్) 6–3, 4–6, 6–4, 6–2తో ఎచెవరి (అర్జెంటీనా)పై గెలిచారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్ లో ఐదో సీడ్ గార్సియా (ఫ్రాన్స్) 3–6, 6–4, 7–6 (10/6)తో లేలా ఫెర్నాండెజ్ (కెనడా) పై నెగ్గింది. తొలి రౌండ్ మ్యాచ్లో ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ ముకోవా (చెక్ రిపబ్లిక్) 4–6, 7–5, 1–6తో జూలీ నిమియెర్ (జర్మనీ) చేతిలో ఓడింది. -
వింబుల్డన్లో దారుణం.. స్కూల్లోకి దూసుకెళ్లిన కారు..
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ సమీపంలోని ఒక ప్రాధమిక పాఠశాల భవనంలోకి ల్యాండ్ రోవర్ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు, ఇద్దరు పెద్దవారు గాయపడినట్టు చెబుతున్నాయి స్థానిక మెట్రోపాలిటన్ పోలీసు వర్గాలు. మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లండన్లోని వింబుల్డన్ దగ్గర క్యాంపు రోడ్డులోని "ద స్టడీ ప్రిపరేటరీ స్కూలు"లోకి ఒక ల్యాండ్ రోవర్ వేగంగా దూసుకెళ్లింది. ఈ పాఠశాల 4-11 ఏళ్ల లోపు బాలికల కోసం ప్రత్యేకించబడినది. బ్రిటీషు కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దం చేసుకుంటూ గోల్డ్ కలర్ కార్ స్కూల్లోకి దూసుకుని రావడంతో ఏడుగురు చిన్నారులు, ఇద్దరు పెద్దవారు గాయపడ్డారని తెలిపారు. ఇది ఉగ్రవాద చర్య కాదని స్పష్టం చేసిన మెట్రోపాలిటన్ పోలీసులు ప్రమాద సమాచారం తెలియగానే సంఘటన స్థలానికి కనీసం 20 ఎమర్జెన్సీ ఎయిర్ అంబులెన్స్ లు చేరుకొని గాయపడిన వారికి తక్షణ చికిత్స అందిస్తున్నారని, ప్రమాదానికి కారణమైన మహిళా డ్రైవరును సంఘటన స్థలంలోనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. ఈ సంఘటన గురించి తెలియగానే లండన్ అధికారులు, నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక బృందాలను అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు బాధితుల క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఇది కూడా చదవండి: గమ్యానికి చేరువలో పొరపాటు.. ప్రైజ్ మనీ గోవిందా.. -
హ్యాపీ బర్త్ డే బాబాయ్.. ఉపాసన స్పెషల్ విషెస్!
ఉపాసన- రామ్ చరణ్ ఈ ఏడాది తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. జూన్ 20న అపోలో ఆస్పత్రిలో చేరిన మెగా కోడలు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇటీవలే తమ ముద్దుల కూతురి పేరును క్లీంకారగా నామకరణం చేశారు. ఈ విషయాన్ని మెగాస్టార్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత మెగా ఫ్యామిలీలో వారసురాలు అడుగు పెట్టడంతో పండుగ వాతావరణం నెలకొంది. (ఇది చదవండి: విజయ్ వర్మను ప్రేమించడానికి కారణమదే.. కానీ ఇది ఊహించలేదు: తమన్నా ) అయితే ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్కు ఆస్కార్ అవార్డ్ వరించిన సంగతి తెలిసిందే. అమెరికాలోని లాస్ఎంజిల్స్లో జరిగిన వేడుకలో ఎంఎం కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ అందుకున్నారు. అయితే ఇవాళ సంగీత దర్శకుడు కీరవాణి బర్త్డే సందర్భంగా ఉపాసన వినూత్నంగా విషెస్ తెలిపారు. ఈ మేరకు తన ఇన్స్టా స్టోరీస్లో ఓ ఫోటోను పంచుకున్నారు. నాటు నాటు పాట స్టెప్పులకు వింబుల్డన్లో టెన్నిస్ ఆటగాళ్లు డ్యాన్స్ చేస్తున్నట్లు ఫోటోను షేర్ చేశారు. అంతే కాకుండా హ్యాపీ బర్త్ డే బాబాయ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ఆస్కార్ అవార్డ్తో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. (ఇది చదవండి: డైరెక్టర్తో హీరోయిన్ సీక్రెట్ పెళ్లి.. యూటర్న్ తీసుకున్న కల్పికా గణేశ్) -
ఫేవరెట్గా జొకోవిచ్
లండన్: అల్కరాజ్ ప్రపంచ నంబర్వన్ అయినా... ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నమెంట్లో అందరి కళ్లూ జొకోవిచ్పైనే ఉన్నాయి. ఈ సెర్బియన్ స్టార్, డిఫెండింగ్ చాంపియన్ ‘హ్యాట్రిక్’తో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్లో ఎనిమిదో టైటిల్ చేజిక్కించుకుంటాడనే అంచనాలు పెరిగాయి. మరోవైపు స్పెయిన్ సంచలనం అల్కరాజ్ కూడా టాప్ ర్యాంకు ఉత్సాహంతో వింబుల్డన్ వేటకు సిద్ధమమయ్యాడు. మహిళల సింగిల్స్లో నిరుటి విజేత ఎలీనా రిబాకినా కూడా వింబుల్డన్ టైటిల్ను నిలబెట్టుకునేందుకు సమరానికి సై అంటోంది. సోమవారం నుంచి వింబుల్డన్ టోర్నీ జరుగుతుంది. ఇప్పటికే సీడింగ్స్, డ్రా విడుదల చేయగా... ఇప్పుడు కోర్టులో టైటిల్ వేటే మిగిలింది. ఇప్పటికే 23 గ్రాండ్స్లామ్ టైటిళ్ల రికార్డుతో ఉన్న జొకోవిచ్ ఇప్పుడు 24వ టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. రెండో సీడ్ సెర్బియన్ పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో పెడ్రొ కచిన్ (అర్జెంటీనా)తో తలపడతాడు. టాప్సీడ్ కార్లొస్ అల్కరాజ్... జెరెమి చార్డి (ఫ్రాన్స్)తో జరిగే మొదటి రౌండ్ పోరుతో వింబుల్డన్కు శ్రీకారం చుట్టనున్నాడు. మహిళల సింగిల్స్లో రిబాకినా వరుసగా రెండో టైటిల్పై ఆశలు పెట్టుకుంది. గతేడాది ఈ 24 ఏళ్ల కజకిస్తాన్ స్టార్ వింబుల్డన్ ట్రోఫీతో తొలి గ్రాండ్స్లామ్ విజయాన్ని చవిచూసింది. అయితే ఈ ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్ను తృటిలో కోల్పోయింది. ఆరంభ గ్రాండ్స్లామ్లో ఆమె రన్నరప్గా తృప్తిపడింది. టైటిల్ నిలబెట్టుకునేందుకు తొలి రౌండ్లో అమెరికన్ రోజర్స్తో ఆమె తలపడనుంది. ప్రపంచ నంబర్వన్ క్రీడాకారిణి, తాజా ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలండ్)... జు లిన్ (చైనా)తో గ్రాండ్స్లామ్ ఆటను మొదలుపెట్టనుంది. సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగుతున్న అమెరికన్ వెటరన్ స్టార్ వీనస్ విలియమ్స్ ఉక్రెయిన్కు చెందిన స్వితోలినాతో పోటీ పడుతుంది. -
అగ్రపీఠంపై అల్కరాజ్.. గ్రాస్ కోర్టుపై తొలి టైటిల్
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోరీ్నకి సన్నాహకంగా భావించే క్వీన్స్ క్లబ్ చాంపియన్షిప్లో స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్కరాజ్ 6–4, 6–4తో అలెక్స్ డి మినౌర్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. 99 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో స్పెయిన్ స్టార్ ఏడు ఏస్లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సరీ్వస్ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. గ్రాస్ కోర్టులపై అల్కరాజ్కిదే తొలి టైటిల్ కావడం విశేషం. ఓవరాల్గా అతని కెరీర్లో ఇది 11వ సింగిల్స్ టైటిల్. ఈ స్పెయిన్ స్టార్కు 4,77,795 యూరోల (రూ. 4 కోట్ల 26 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ గెలుపుతో అల్కరాజ్ నేడు విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్లో మళ్లీ నంబర్వన్ ర్యాంక్ను అందుకోనున్నాడు. దాంతోపాటు వచ్చే నెలలో మొదలయ్యే వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీ లో టాప్ సీడ్గా బరిలోకి దిగనున్నాడు. -
రష్యా, బెలారస్ టెన్నిస్ ఆటగాళ్లకు ఊరట.. నిషేధం ఎత్తివేత
Russia And Belarus Tennis Players: ఉక్రెయిన్తో రష్యా యుద్ధం నేపథ్యంలో గత ఏడాది రష్యా, బెలారస్ టెన్నిస్ క్రీడాకారులపై ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ క్లబ్ నిషేధం విధించింది. దాంతో ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో రష్యా, బెలారస్ క్రీడాకారులు పాల్గొనలేకపోయారు. అయితే ఈ ఏడాది రష్యా, బెలారస్ క్రీడాకారులపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తున్నామని, వారు తటస్థ క్రీడాకారుల హోదాలో పాల్గొనవచ్చని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ తెలిపింది. దాంతో పురుషుల విభాగంలో స్టార్స్ మెద్వెదెవ్, రుబ్లెవ్, ఖచ నోవ్ (రష్యా), మహిళల విభాగంలో విక్టోరియా అజరెంకా, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత అరీనా సబలెంకా (బెలారస్) వింబుల్డన్లో ఆడేందుకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ జూలై 3 నుంచి 16 వరకు జరుగుతుంది. చదవండి: IPL2023 Opening Ceremony: అట్టహాసంగా ఐపీఎల్ ఆరంభ వేడుకలు: దుమ్ములేపిన తమన్నా, రష్మిక.. తెలుగు పాటలతో -
Wimbledon 2022 Final: జబర్, రిబాకినా.. ఎవరు గెలిచినా చరిత్రే!
Wimbledon 2022 Women's Singles Final- లండన్: వింబుల్డన్ మహిళల సింగిల్స్లో కొత్త చాంపియన్ రావడం ఖాయమైంది. శనివారం జరిగే ఫైనల్లో అన్స్ జబర్ (ట్యునీషియా), ఎలీనా రిబాకినా (కజకిస్తాన్) తలపడనున్నారు. వీరిలో ఎవరు గెలిచినా కొత్త చరిత్ర సృష్టిస్తారు. జబర్ గెలిస్తే ఆఫ్రికా ఖండంనుంచి గ్రాండ్స్లామ్ సాధించిన తొలి మహిళ అయ్యే అవకాశం ఉండగా...రిబాకినా విజేతగా నిలిస్తే కజకిస్తాన్ తరఫున గ్రాండ్స్లామ్ గెలిచిన తొలి మహిళగా నిలుస్తుంది. గురువారం జరిగిన తొలి సెమీస్లో మూడో సీడ్ జబర్ 6–2, 3–6, 6–1తో తత్యానా మారియా (జర్మనీ)పై విజయం సాధించింది. దూకుడుగా ఆడిన జబర్ తొలి సెట్ను అలవోకగా గెలుచుకుంది. అయితే రెండో సెట్లో 17 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్ చేసిన ఆమె సెట్ను కోల్పోయింది. నిర్ణాయక సెట్లో మాత్రం మారియాపై జబర్ పూర్తిగా పైచేయి సాధించింది. మాజీ చాంపియన్కు ఓటమి... మరో సెమీస్లో 23 ఏళ్ల కజకిస్తాన్ క్రీడాకారిణి ఎలీనా రిబాకినా సత్తా చాటింది. 23 ఏళ్ల రిబాకినా తన రెండో వింబుల్డన్లోనే ఫైనల్ చేరింది. 76 నిమిషాల సాగిన సెమీస్లో రిబాకినా 6–3, 6–3తో 2019 వింబుల్డన్ విజేత సిమోనా హలెప్ (రొమేనియా)ను ఓడించింది. మాస్కోలో పుట్టి 2018 వరకు రష్యాకు ప్రాతినిధ్యం వహించిన రిబాకినా రష్యా ఆటగాళ్లపై వింబుల్డన్లో నిషేధం ఉన్న సమయంలో ఫైనల్కు చేరడం విశేషం. Rybakina roars onto the biggest stage The 23-year-old defeats Simona Halep 6-3, 6-3 to reach her first Grand Slam final#Wimbledon | #CentreCourt100 pic.twitter.com/u0jfhZlDEA — Wimbledon (@Wimbledon) July 7, 2022 "It's time to enjoy and really have fun on court" Elena Rybakina is excited to face @Ons_Jabeur in a Wimbledon final#Wimbledon | #CentreCourt100 pic.twitter.com/J0o9RlShFJ — Wimbledon (@Wimbledon) July 7, 2022 "I have no idea, I'm The Minister of Happiness" 😀 A very diplomatic answer from our first-time Wimbledon finalist, @Ons_Jabeur pic.twitter.com/ZPGFTE8WIY — Wimbledon (@Wimbledon) July 7, 2022 -
Wimbledon 2022: గెలిచినా నిష్క్రమించిన నాదల్.. ఎందుకంటే!
Rafael Nadal: పొత్తి కడుపు గాయంతో బాధపడుతున్న స్పానిష్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ వింబుల్డన్ సెమీఫైనల్ నుంచి తప్పుకున్నాడు. క్వార్టర్స్లో కూడా గాయంతోనే బాధపడుతూ ఆడిన అతనికి కండరాల్లో 7 మిల్లీమీటర్ల చీలిక వచ్చినట్లు తేలింది. దీంతో సెమీస్ ఆడరాదని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో దాంతో నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) ఫైనల్కు చేరుకు న్నాడు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి జరిగే మరో సెమీస్లో జొకోవిచ్ (సెర్బియా)తో నోరీ (బ్రిటన్)తో తలపడతాడు. ఇందులో గెలిచిన ఆటగాడు కిరియోస్తో తుదిపోరులో అమీతుమీ తేల్చుకుంటాడు. కాగా గతంలో నాదల్ రెండుసార్లు టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. చదవండి: IND vs ENG 1st T20: హార్దిక్ ఆల్రౌండ్ షో.. టీమిండియా ఘన విజయం 25 shots of pure tennis theatre 🎭@RafaelNadal 🤝 @Taylor_Fritz97#Wimbledon | #CentreCourt100 pic.twitter.com/KwZg3hpOye — Wimbledon (@Wimbledon) July 6, 2022 -
వింబుల్డన్కు గుడ్బై.. భావోద్వేగ నోట్ షేర్ చేసిన సానియా మీర్జా
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా వింబుల్డన్ ఛాంపియన్షిప్కు వీడ్కోలు పలికింది. బుధవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ సెమీ ఫైనల్లో ఓడిన సానియా మీర్జా భావోద్వేగంతో ఒక నోట్ను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. 2015 మహిళల డబుల్స్ విభాగంలో వింబుల్డన్ టైటిల్ను సానియా గెలుచుకుంది. అయితే సానియా తన కెరీర్లో ఇప్పటి వరకు వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో టైటిల్ మాత్రం సాధించలేకపోయింది. ఇక తన టెన్నిస్ కెరీర్లో ఆరు సార్లు గ్రాండ్స్లామ్ ఛాంపియన్గా సానియా నిలిచింది. ఇక డబ్ల్యూటీఏ సర్క్యూట్లో తనకిదే చివరి ఏడాది ఇంతకుముందు సానియా ప్రకటించిన సంగతి తెలిసిందే. "క్రీడలు మీ నుంచి చాలా తీసుకుంటాయి. క్రీడలు మనల్ని మానసికంగా, శారీరకంగా అలసటకు గురి చేస్తాయి. గంటల తరబడి కష్టపడి ఓడిపోయిన తర్వాత నిద్రలేని రాత్రులు మిగులుతాయి. కానీ ఇవన్నీ చాలా ప్రతిఫలాన్ని ఇస్తాయి.. ఏ ఇతర ఉద్యోగాలు ఇలాంటివి ఇవ్వలేవు. అందువల్ల నేను ఎప్పటికీ క్రీడలకు కృతజ్ఞరాలునే. కన్నీళ్లు,పోరాటం, ఆనందం నా క్రీడా జీవితంలో భాగం. వింబుల్డన్లో ఆడడం ఒక అద్భుతం. ఈసారి వింబుల్డన్లో ప్రేక్షకురాలిగా మాత్రమే మిగిలాను. ఇక గత 20 ఏళ్లుగా వింబుల్డన్లో ఆడడం గౌవరంగా భావిస్తున్నాను. ఐ విల్ మిస్ యూ ’’ అని సానియా పేర్కొంది. చదవండి: IND-W Vs SL-W: అఖరి వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్ View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) -
Wimbledon 2022: ముగిసిన సానియా పోరాటం.. సెమీస్లో నిష్క్రమణ
లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్లో భారత టెన్నిస్ యోధురాలు సానియా మీర్జా 21 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ఎండ్కార్డ్ పడింది.కెరీర్లో ఆఖరి వింబుల్డన్ ఆడుతున్న సానియా.. ఈ గ్రాండ్స్లామ్లో ఒక్క మిక్స్డ్ డబుల్స్ టైటిల్ కూడా గెలవకుండానే కెరీర్కు ముగింపు పలుకనుంది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో క్రొయేషియా ఆటగాడు మేట్ పావిచ్తో కలిసి బరిలోకి దిగిన సానియా బుధవారం అర్థరాత్రి జరిగిన ఈ సెమీఫైనల్లో ఆమెరికన్-బ్రిటిష జంట డెసిరే క్రాజిక్, నీల్ స్కుప్స్కీ చేతిలో 6-4, 5-7, 4-6తో పరాజయంపాలైంది. వింబుల్డన్ మినహా సానియా ఖాతాలో మిగిలిన మూడు గ్రాండ్స్లామ్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ (యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్) ఉన్నాయి. ఓవరాల్గా సానియా ఖాతాలో మొత్తం ఆరు గ్రాండ్స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఈ సీజన్ ఆఖరి గ్రాండ్స్లామ్ యూఎస్ ఓపెన్ తర్వాత సానియా టెన్నిస్కు గుడ్బై చెప్పనున్నట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. సానియా గెలిచిన గ్రాండ్స్లామ్ టైటిల్స్ వివరాలు.. మిక్స్డ్ డబుల్స్: 2009 ఆస్ట్రేలియా ఓపెన్ 2012 ఫ్రెంచ్ ఓపెన్ 2014 యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్: 2015 వింబుల్డన్ 2015 యూఎస్ ఓపెన్ 2016 ఆస్ట్రేలియా ఓపెన్ చదవండి: Malaysia Masters Badminton 2022: సింధు శుభారంభం -
Wimbledon 2022: జకోవిచ్ అద్భుత పోరాటం.. 11వ సారి సెమీస్కు అర్హత
పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జకోవిచ్ (సెర్బియా) 3 గంటల 35 నిమిషాల్లో 5–7, 2–6, 6–3, 6–2, 6–2తో పదో సీడ్ జానిక్ సినెర్ (ఇటలీ)పై గెలిచి 11వసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. గ్రాండ్స్లామ్ టోర్నీల మ్యాచ్ల్లో జకోవిచ్ తొలి రెండు సెట్లు కోల్పోయి ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచి విజయం అందుకోవడం ఇది ఏడోసారి కావడం విశేషం. రెండో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్లో 6–4, 6–2, 7–6 (8/6)తో జాండ్షుల్ప్ (నెదర్లాండ్స్)ను ఓడించి క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అన్సీడెడ్, 34 ఏళ్ల తాత్యానా మరియా (జర్మనీ) 4–6, 6–2, 7–5తో తన దేశానికే చెందిన జూల్ నిమియెర్పై గెలిచి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీఫైనల్కు చేరుకుంది. -
వింబుల్డన్లో సంచలనం.. సెమీస్కు దూసుకెళ్లిన సానియా జోడీ
లండన్: వింబుల్డన్ 2022లో భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సంచలన విజయం నమోదు చేసింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో క్రోయేషియాకు చెందిన మేట్ పావిక్తో జతకట్టిన హైదరాబాదీ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ సానియా-పావిచ్ జోడీ 6-4, 3-6, 7-5 తేడాతో నాలుగో సీడ్ గాబ్రియెల డబ్రోస్కీ(కెనడా)-జాన్ పీర్స్(ఆస్ట్రేలియా) ద్వయంపై అద్భుత విజయం సాధించింది. గంటా 41 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో సానియా జోడీ ఎనిమిది ఏస్లు సంధించడంతో పాటు పవర్ఫుల్ ఫోర్హ్యాండ్ షాట్లతో ప్రత్యర్ధిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ జోడీ సెమీస్లో రెండో సీడ్ డెసీరే క్రాజిక్-నీల్ స్కుప్స్కీ.. ఏడో సీడ్ జెలీనా ఓస్టాపెండో-రాబర్ట్ ఫరా జోడీల మధ్య పోటీలో విజేతను ఎదుర్కోనుంది. కెరీర్లో చివరి వింబుల్డన్ ఆడుతున్న సానియా.. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తొలిసారి సెమీస్లోకి ప్రవేశించడంతో కెరీర్ను టైటిల్తో ముగించాలని భావిస్తుంది. కాగా, ఈ టోర్నీ మహిళల డబుల్స్లోనూ పాల్గొన్న సానియా.. తొలి రౌండ్లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. చదవండి: ఎదురులేని జొకోవిచ్.. వింబుల్డన్లో 13వసారి..! -
ఎదురులేని జొకోవిచ్.. వింబుల్డన్లో 13వసారి..!
లండన్: వరుసగా నాలుగోసారి వింబుల్డన్ గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించే దిశగా టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) మరో అడుగు వేశాడు. పురుషుల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ 13వసారి ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–2, 4–6, 6–1, 6–2తో టిమ్ వాన్ రితోవెన్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించాడు. ఆరుసార్లు వింబుల్డన్ చాంపియన్గా నిలిచిన జొకోవిచ్ 2 గంటల 38 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఏడు ఏస్లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్లో ఆస్ట్రేలియా వివాదాస్పద ప్లేయర్ నిక్ కిరియోస్ 4–6, 6–4, 7–6 (7/2), 3–6, 6–2తో నకషిమా (అమెరికా)పై నెగ్గి 2014 తర్వాత మళ్లీ క్వార్టర్ ఫైనల్ చేరుకోగా... టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–3, 6–1, 6–4తో కుబ్లెర్ (ఆస్ట్రేలియా)పై, క్రిస్టియన్ గారిన్ (చిలీ) 2–6, 5–7, 7–6 (7/3), 6–4, 7–6 (10–6)తో డిమినార్ (ఆస్ట్రేలియా)పై నెగ్గి తొలిసారి తమ కెరీర్లో ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్కు అర్హత పొందారు. మహిళల సింగిల్స్లో మాజీ చాంపియన్ సిమోనా హలెప్ (రొమేనియా), మూడో సీడ్ ఆన్స్ జబర్ (ట్యూనిసియా), రిబాకినా (కజకిస్తాన్), అని సిమోవా (అమెరికా), తొమ్లాజనోవిచ్ (ఆస్ట్రేలి యా) క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. -
క్వార్టర్స్లో సానియా జంట
లండన్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా–మ్యాట్ పావిచ్ (క్రొయేషియా) జంట వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ లో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. రెండో రౌండ్లో డోడిగ్ (క్రొయేషియా)–లటీషా చాన్ (చైనీస్ తైపీ) జోడీ నుంచి సానియా–పావిచ్ (క్రొయేషి యా) జంటకు వాకోవర్లభించింది. -
స్వియాటెక్ ముందంజ
లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్వన్ స్వియాటెక్ మూడో రౌండ్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్సీడ్ ఇగా స్వియటెక్ (పోలండ్) 6-4, 4-6, 6-3తో లెస్లీ కెర్కోవ్ (నెదర్లాండ్స్)పై గెలుపొందగా, అన్సీడెడ్ కెటీ బౌల్టర్ (ఇంగ్లండ్) 3-6, 7-6 (7/4), 6-4తో ఆరో సీడ్ కరోలినా ప్లిస్కొవా (చెక్ రిపబ్లిక్)కు షాకిచ్చింది. నాలుగో సీడ్ పౌలా బడొసా (స్పెయిన్) 6-3, 6-2తో ఇరినా (రొమేనియా)పై, 12వ సీడ్ ఒస్టాపెంకొ (లాత్వియా) 6-2, 6-2తో విక్మయేర్ (బెల్జియం)పై అలవోక విజయం సాధించారు. మరో వైపు పురుషుల విభాగంలో రెండు సార్లు చాంపియన్ (2013, 2016), బ్రిటన్ స్టార్ అండీ ముర్రే ఈ సారి రెండో రౌండ్తోనే సరిపెట్టుకున్నాడు. ముర్రే 4-6, 6-7 (4/7), 7-6 (7/3), 4-6తో 20వ సీడ్ జాన్ ఇస్నర్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. రెండో రౌండ్లో స్పెయిన్ దిగ్గజం, రెండో సీడ్ నాదల్ 6-4, 6-4, 4-6, 3-0తో రికార్డస్ బెరంకిస్ (లిథువేనియా)పై ఆధిక్యంలో ఉన్న దశలో వర్షంతో మ్యాచ్ ఆగిపోయింది. నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 6-2, 6-3, 7-5తో జోర్డాన్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందాడు. 16వ సీడ్ సిమోన హలెప్ (రొమేనియా) 7-5, 6-4తో ఫ్లిప్కెన్స్ (బెల్జియం)పై, 25వ సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6-1, 7-6 (7/5)తో అన బొగ్దన్ (రొమేనియా)పై గెలుపొందారు. చదవండి: SL VS AUS 1st Test Day 2: వర్ష బీభత్సానికి అతలాకుతలమైన స్టేడియం -
పోరాడి ఓడిన సెరెనా విలియమ్స్..!
లండన్: అత్యధిక గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన ప్లేయర్గా ఆల్టైమ్ రికార్డును సమం చేసేందుకు సెరెనా విలియమ్స్ మరికొంతకాలం వేచి చూడక తప్పదు. ఇప్పటికే 23 గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఈ అమెరికా దిగ్గజం ఏడాది తర్వాత పునరాగమనం చేసిన టోర్నీలో తొలి రౌండ్ను దాటలేకపోయింది. గత సంవత్సరం జూన్ 29న వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీ తొలి రౌండ్లో గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే వైదొలిగిన 40 ఏళ్ల సెరెనా ఆ తర్వాత మళ్లీ రాకెట్ పట్టలేదు. ఏడాది తర్వాత వింబుల్డన్ టోర్నీ ద్వారా పునరాగమనం చేసిన ఈ నల్లకలువకు ఊహించని పరాజయం ఎదురైంది. ప్రపంచ 115వ ర్యాంకర్ హార్మనీ టాన్ (ఫ్రాన్స్)తో భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మ్యాచ్లో సెరెనా 5–7, 6–1, 6–7 (7/10)తో ఓడిపోయింది. 3 గంటల 11 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఏడుసార్లు చాంపియన్ సెరెనా 54 అనవసర తప్పిదాలు చేసింది. ప్రత్యర్థి సర్వీస్ను 17 సార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా ఆరుసార్లు మాత్రమే సద్వినియోగం చేసుకుంది. తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఆడుతున్న హార్మనీ... సెరెనా సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. నిర్ణాయక టైబ్రేక్లో సంయమనం కోల్పోకుండా ఆడిన హార్మనీ తన కెరీర్లోనే గొప్ప విజయం సాధించింది. తనకిదే చివరి వింబుల్డన్ టోర్నీనా కాదా అనేది చెప్పలేనని, ఆగస్టు–సెప్టెంబర్లలో జరిగే యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో పాల్గొంటానని సెరెనా వ్యాఖ్యానించింది. 2017లో చివరిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ రూపంలో గ్రాండ్స్లామ్ టైటిల్ నెగ్గిన సెరెనా ఆ తర్వాత నాలుగు గ్రాండ్స్లామ్ టోర్నీలలో (2018, 2019–వింబుల్డన్; 2018, 2019–యూఎస్ ఓపెన్) ఫైనల్కు చేరుకున్నా నాలుగింటిలోనూ ఫైనల్లో ఓడిపోయి రన్నరప్గా నిలిచింది. సంచలనాల మోత వింబుల్డన్ టోర్నీలో బుధవారం మహిళల సింగిల్స్లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. రెండో సీడ్ అనెట్ కొంటావీట్ (ఎస్తోనియా), తొమ్మిదో సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్), పదో సీడ్ ఎమ్మా రాడుకానూ (బ్రిటన్) రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. జూలీ నిమియెర్ (జర్మనీ) 6–4, 6–0తో కొంటావీట్పై, కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–3, 6–3తో 2021 యూఎస్ ఓపెన్ చాంపియన్ రాడుకానూపై, గ్రీట్ మినెన్ (బెల్జియం) 6–4, 6–0తో 2017 వింబుల్డన్ విజేత ముగురుజాపై గెలిచి మూడో రౌండ్కు చేరారు. రూడ్ అవుట్... పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బి యా) 6–1, 6–4, 6–2 తో కొకినాకిస్ (ఆస్ట్రేలియా)పై అలవోకగా గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. మూడో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–3, 2–6, 5–7, 4–6తో హంబర్ట్ (ఫ్రాన్స్) చేతిలో ఓడాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్ల్లో తొమ్మిదో సీడ్ కామెరాన్ నోరీ (బ్రిటన్) 3 గంటల 13 నిమిషాల్లో 6–4, 3–6, 5–7, 6–0, 6–2తో మునార్ (స్పెయిన్)పై, 22వ సీడ్ బాషిలాష్విలి (జార్జియా) 7–6 (9/7), 0–6, 7–5, 7–6 (7/5)తో క్వెన్టిన్ హెల్స్ (ఫ్రాన్స్)పై గెలిచారు. చదవండి: Malaysia Open 2022: సింధు ముందుకు.. సైనా ఇంటికి -
23 గ్రాండ్స్లామ్ల విజేతకు షాక్.. తొలి రౌండ్లోనే నిష్క్రమణ
23 గ్రాండ్స్లామ్ల విజేత, సెవెన్ టైమ్ వింబుల్డన్ ఛాంపియన్ సెరీనా విలియమ్స్కు వింబుల్డన్-2022లో ఘోర పరాభవం ఎదురైంది. ప్రపంచ 115 ర్యాంకర్, ఫ్రాన్స్ క్రీడాకారిణి హార్మొనీ టాన్ చేతిలో తొలి రౌండ్లోనే ఆమె ఓటమిపాలైంది. 3 గంటల 10 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో 5-7, 6-1, 6-7 (7)తో ఓటమిపాలై అభిమానులను దారుణంగా నిరాశపర్చింది. అయితే ఓటమి బాధను దిగమింగుతూ ఆమె మైదానంలో ప్రదర్శించిన హావభావాలు అభిమానుల మనసులను గెలుచుకున్నాయి. పరాజయం అనంతరం సెరీనా చిరునవ్వులు చిందిస్తూ గ్రాస్ కోర్టును వీడటం టెన్నిస్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంది. "She's beaten a legend."After three hours, 10 minutes, Harmony Tan beats Serena Williams in a first round epic#Wimbledon | #CentreCourt100 pic.twitter.com/IQst8AzXxv— Wimbledon (@Wimbledon) June 28, 2022 ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్తోనే వింబుల్డన్ అరంగేట్రం చేసిన హార్మొనీ టాన్ అద్భుతమై పోరాటపటిమ కనబర్చి దిగ్గజ క్రీడాకారిణిని మట్టికరిపించింది. పవర్ గేమర్పై గెలవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందంటూ మ్యాచ్ అనంతరం టాన్ భావోద్వేగానికి లోనైంది. కాగా, సెరీనా గతేడాది వింబుల్డన్లోనూ మొదటి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టింది. గాయం కారణంగా ఆమె వింబుల్డన్ 2021 నుంచి రిటైర్డ్ హార్ట్గా వైదొలిగింది. చదవండి: చరిత్ర సృష్టించిన జకోవిచ్.. ఆ ఘనత సాధించిన ఏకైక మొనగాడిగా రికార్డు -
చరిత్ర సృష్టించిన జకోవిచ్.. ఆ ఘనత సాధించిన ఏకైక మొనగాడిగా రికార్డు
వింబుల్డన్ 2022లో ప్రపంచ మూడో ర్యాంకర్, డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్కు శుభారంభం లభించింది. తొలి రౌండ్లో దక్షిణ కొరియా ఆటగాడు, ప్రపంచ 81వ ర్యాంకర్ సూన్వూ క్వాన్పై 6-3, 3-6, 6-3, 6-4 తేడాతో విజయం సాధించిన జకో.. రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ఈ క్రమంలో జకో ఓ అత్యంత అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. నాలుగు గ్రాండ్స్లామ్ టోర్నీలలో కనీసం 80 సింగిల్స్ విజయాలు సాధించిన తొలి పురుష ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గ్రాండ్స్లామ్ చరిత్రలో ఇప్పటివరకు ఏ పురుష ఆటగాడు ఈ ఫీట్ను సాధించింది లేదు. కాగా, గతేడాది మూడు గ్రాండ్స్లామ్ టైటిళ్లు (యూఎస్ ఓపెన్ మినహా) సాధించిన జకోవిచ్.. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా సాధించలేకపోయాడు. వ్యాక్సిన్ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వంతో వైరం కారణంగా అతను ఆస్ట్రేలియా ఓపెన్ బరిలోకి దిగని విషయం తెలిసిందే. అనంతరం ఫ్రెంచ్ ఓపెన్లో ఆడినా క్వార్టర్ ఫైనల్లో నదాల్ చేతిలో ఓడిపోయాడు. ప్రస్తుతం 20 గ్రాండ్స్లామ్ టైటిల్స్ సాధించిన జకో.. వింబుల్డన్లో వరుసగా నాలుగో టైటిల్పై కన్నేశాడు. జకో రెండో రౌండ్లో ఆస్ట్రేలియాకు చెందిన థనాసి కొక్కినాకిస్తో తలపడాల్సి ఉంది. చదవండి: Wimbledon 2022: వ్యాక్సిన్ విషయంలో తగ్గేదేలే: జకోవిచ్ -
Wimbledon 2022: వ్యాక్సిన్ విషయంలో తగ్గేదేలే: జకోవిచ్
Novak Djokovic : కోవిడ్ వ్యాక్సిన్ వేసుకునే విషయంలో ప్రముఖ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ పట్టు వీడడం లేదు. ప్రాణం పోయినా తాను వ్యాక్సిన్ వేసుకునే ప్రసక్తే లేదని మరోసారి తెగేసి చెప్పాడు. ఈ సీజన్ చివరి గ్రాండ్స్లామ్ యూఎస్ ఓపెన్కు వేదిక అయిన యునైటెడ్ స్టేట్స్లో అడుగుపెట్టాలంటే కోవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరి అని అక్కడి ప్రభుత్వం గైడ్లైన్స్ విడుదల చేసిన నేపథ్యంలో జకో ఈ మేరకు స్పందించాడు. యూఎస్ ఓపెన్ నుంచి వైదొలిగేందుకైనా సాహసిస్తాను కానీ వ్యాక్సిన్ మాత్రం వేసుకోనని ఖరాకండిగా తేల్చి చెప్పాడు. వ్యాక్సిన్ వేయించుకోవాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయమని, ఇష్టం లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవడం సహేతుకం కాదని వివరించాడు. వ్యాక్సిన్ వేయించుకోవడం తన వ్యక్తిగత నిర్ణయమని, అలా అని తాను వ్యాక్సిన్కు వ్యతిరేకం కాదని మరోసారి స్పష్టం చేశాడు. ప్రస్తుతం వింబుల్డన్ బరిలో ఉన్న జకో.. ఇవాళ (జూన్ 27) తొలి రౌండ్ మ్యాచ్ ఆడనున్నాడు. ఇదిలా ఉంటే, గతేడాది మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ (వింబుల్డన్ సహా) నెగ్గిన జకోవిచ్ ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా సాధించలేకపోయాడు. వ్యాక్సిన్ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వంతో వైరం కారణంగా అతను ఆస్ట్రేలియా ఓపెన్ బరిలోకి దిగని విషయం తెలిసిందే. అనంతరం ఫ్రెంచ్ ఓపెన్లో ఆడినా క్వార్టర్ ఫైనల్లో నదాల్ చేతిలో ఓడిపోయాడు. ప్రస్తుతం జకో ఖాతాలో 20 గ్రాండ్స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. చదవండి: Wimbledon 2022: జొకోవిచ్పైనే దృష్టి -
Wimbledon 2022: జొకోవిచ్పైనే దృష్టి
లండన్: టెన్నిస్ సీజన్ మూడో గ్రాండ్స్లామ్ టోర్నీ వింబుల్డన్ నేడు ప్రారంభంకానుంది. పురుషుల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) సోమవారం జరిగే తొలి రౌండ్ మ్యాచ్లో కొరియా ప్లేయర్ సూన్వూ క్వాన్తో ఆడనున్నాడు. ఈ సీజన్లో తొలి రెండు గ్రాండ్స్లామ్ టైటిల్స్ (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్) నెగ్గిన స్పెయిన్ స్టార్ నాదల్ వరుసగా మూడో గ్రాండ్స్లామ్ టైటిల్పై గురి పెట్టాడు. అయితే నాదల్కు ఆరుసార్లు చాంపియన్ జొకోవిచ్ నుంచి అసలు సవాలు ఎదురుకానుంది ‘డ్రా’ ప్రకారం వీరిద్దరు ఫైనల్లో తలపడే అవకాశముంది. మహిళల సింగిల్స్లో ఏడుసార్లు విజేత సెరెనా విలియమ్స్ ఏడాది తర్వాత ఈ టోర్నీతో పునరాగమనం చేయనుంది. గత సంవత్సరం ఇదే టోర్నీలో సెరెనా తొలి రౌండ్లోనే వైదొలిగింది. అనంతరం ఆమె సింగిల్స్ విభాగంలో ఏ టోర్నీలోనూ ఆడలేదు. -
నేను రష్యన్ను కాను.. నన్ను వింబుల్డన్ ఆడనివ్వండి..!
Natela Dzalamidze: ఉక్రెయిన్పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాను క్రీడా ప్రపంచం మొత్తం సామూహికంగా బహిష్కరించిన నేపథ్యంలో ఓ టెన్నిస్ క్రీడాకారిణి తన కెరీర్ కోసం రష్యా పౌరసత్వాన్ని వదులుకునేందుకు సిద్ధమైన వార్త ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 27 నుంచి ప్రారంభంకానున్న వింబుల్డన్-2022 పాల్గొనేందుకు రష్యాకు చెందిన నటేల జలమిడ్జే ఏకంగా తన జాతీయతను మార్చుకోవాలని డిసైడైంది. తాను రష్యన్ కాదని.. జార్జియా తరఫున ఆడతానని నటేల వింబుల్డన్ నిర్వాహకులను మొరపెట్టుకుంది. Tennis player Natela Dzalamidze, who was born in Moscow, will be able to get around the ban on Russians at Wimbledon this year Because she now represents the country of Georgia https://t.co/DySjBJtdIz — Bloomberg UK (@BloombergUK) June 20, 2022 రష్యా ఆటగాళ్లెవరూ వింబుల్డన్లో పాల్గొనడానికి వీళ్లేదని టోర్నీ నిర్వహకులు స్పష్టం చేసిన నేపథ్యంలో నటేల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 29 ఏళ్ల నటేల అలగ్జాండ్ర క్రునిక్ (సెర్బియా)తో కలిసి మహిళల డబుల్స్లో పాల్గొనేందుకు తన పేరును రిజిస్టర్ చేసుకుంది. కాగా, ఉక్రెయిన్పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాను, ఆ దేశానికి వంతపాడుతున్న బెలారస్ను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం సహా తైక్వాండో, ఫిఫా, ఎఫ్1 రేస్ వంటి ప్రఖ్యాత క్రీడా సంఘాలు ఇదివరకే వెలివేసిన (నిషేధం) విషయం తెలిసిందే. చదవండి: కోచ్పై గట్టిగా అరిచిన ప్రపంచ నంబర్1 ఆటగాడు.. వీడియో వైరల్..! -
రష్యా, బెలారస్ ప్లేయర్లపై నిషేధం అన్యాయం.. నదాల్, జకో, ముర్రే
ఉక్రెయిన్పై రష్యా దాడులను వ్యతిరేకిస్తూ వింబుల్డన్ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయంపై స్టార్ టెన్నిస్ ప్లేయర్లు రఫెల్ నదాల్, నొవాక్ జకోవిచ్, ఆండీ ముర్రే స్పందించారు. రష్యా, బెలారస్ ఆటగాళ్లను వింబుల్డన్లో పాల్గొనకుండా నిషేధించడాన్ని వారు తప్పుబట్టారు. ఈ నిషేధం అన్యాయమని, ఆల్ ఇంగ్లండ్ క్లబ్ తీసుకున్న ఈ కఠినమైన నిర్ణయం వల్ల చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు నష్టపోతారని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయాన్ని ఏటీపీ (అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్), డబ్ల్యూటీఏ (వుమెన్స్ టెన్నిస్ అసోసియేషన్) కూడా ఖండించింది. కాగా, రష్యా.. బెలారస్ సరిహద్దుల నుంచి ఉక్రెయిన్పై దాడుల చేస్తున్నందుకు గాను ఆ రెండు దేశాల ప్లేయర్లపై ఆల్ ఇంగ్లండ్ క్లబ్ నిషేధం విధించింది. వింబుల్డన్ నిర్వాహకులు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వరల్డ్ నంబర్ టూ ర్యాంకర్ డేనిల్ మెద్వెదెవ్, గతేడాది వుమెన్స్ సెమీ ఫైనలిస్ట్ (వింబుల్డన్ ), బెలారస్ క్రీడాకారిణి అరీనా సబలెంకా వంటి చాలామంది ప్రతిభావంతులైన క్రీడాకారులు వింబుల్డన్కు దూరం కానున్నారు. వింబుల్డన్ టోర్నీ ఈ ఏడాది జూన్ 27నుండి జూలై 10 వరకు జరగనుంది. చదవండి: Andre Russell: ఆఖరి ఐదు మ్యాచ్ల్లో మా తడాఖా ఏంటో చూపిస్తాం.. -
హర్ష్ గోయెంకా ఫన్నీ వీడియో, లక్కీ ఫెలో అంటున్న నెటిజన్లు
సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫన్నీ వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. 2014 వింబుల్డన్ లేడీస్ డబుల్స్ మ్యాచ్ సందర్భంగా అనూహ్య ఘటన ఒకటి చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ను గోయెంకా ట్విటర్లో రీట్వీట్ చేశారు. ఈ మిలియన్ డాలర్ల వీడియో నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తుతోంది. 2014లో జరిగిన వింబుల్డన్ మహిళల డబుల్స్ మొదటి రౌండ్ మ్యాచ్ మ్యాచ్లో టెన్నిస్ స్టార్లు సెరెనా, వీనస్ విలియమ్స్ ఒక్సానా కలష్నికోవా, ఓల్గా సావ్చుక్తో పోటీపడ్డారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి సర్వీస్ను ఎదుర్కొనే క్రమంలో వీనస్ వాలీ షాట్ను సెరెనా బ్యాలెన్స్ చేస్తూ బేస్లైన్పై పరుగెత్తుతూ పక్కనే ఉన్న ప్రేక్షకులపై పడపోయింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. అయితే ప్రేక్షకులలో ఒకరు ఆమెను పట్టుకున్నారు. ఈ ఘటన అక్కడున్నవారిలో నవ్వులు పూయించింది. అంతేకాదు ‘వావ్.. వాట్ ఏ లక్కీమాన్’అంటూ చమత్కరిస్తున్నారు. అతని టిక్కెట్ ధరకి చాలా విలువ వచ్చింది ఇలాంటి అదృష్టం లక్షల్లో ఒకరికే అంటూ అసూయపడుతున్నారు. కాగా సోషల్మీడియాలో యాక్టివ్గా ఉండే గోయెంకా తరచుగా అనేక విషయాలపై స్పందిస్తూ పలు వీడియోలు షేర్ చేస్తూ సందడి చేయడం తెలిసిందే. తాజాగా ఆయన మరో ట్వీట్ వైరల్ అవుతోంది. చదవండి : Zomato: యాడ్ల దుమారం, మండిపడుతున్న నెటిజనులు Fun clip from Wimbledon. That's why it's said that the front seat is always expensive 🤣😂😅😜. #tennis #wimbledon #fun #moment #cute #humour #smile @hvgoenka pic.twitter.com/k9062DNvBi — Tarana Hussain (@hussain_tarana) August 30, 2021 -
వింబుల్డన్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం
లండన్: వింబుల్డన్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్న అనుమానాలు కలకలం రేపుతున్నాయి. ఒక సింగిల్స్ మ్యాచ్, మరో డబుల్స్ మ్యాచ్పై ఫిక్సింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్ల్లో పెద్ద ఎత్తున బెట్టింగ్ జరిగినట్లు గుర్తించిన ఇంటర్నేషనల్ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) విచారణ జరుపుతోంది. విషయంలోకి వస్తే.. మెన్స్ డబుల్స్ ఫస్ట్ రౌండ్ మ్యాచ్ అనుమానాస్పద లిస్ట్లో ఉంది. లైవ్ బెట్స్ చాలా ఎక్కువగా ఉన్న సమయంలో ఈ మ్యాచ్ ఫేవరెట్ జోడీ ఓడిపోయినట్లు పలు బెట్టింగ్ సంస్థలు ఫిర్యాదు చేశాయి. ఈ జోడీ తొలి సెట్ గెలిచి తర్వాతి రెండు సెట్లను ఓడిపోయింది. ఇక మరొకటి జర్మన్ ప్లేయర్ ఆడిన ఫస్ట్ రౌండ్ సింగిల్స్ మ్యాచ్. అయితే ఆ ప్లేయర్ ప్రత్యర్థిపై ఈ మ్యాచ్లో అనుమానాలు ఉన్నాయి. సెకండ్ సెట్ తర్వాత పరిస్థితిపై ఐదు అంకెలలో బెట్టింగ్ నడిచినట్లు తేలింది. ఈ మ్యాచ్లో సర్వీస్ గేమ్స్ సంఖ్యపై కూడా ప్రత్యేక బెట్స్ నడిచాయి. దీంతోపాటు ఈ ఏడాది ఏప్రిల్, జూన్ మధ్య మొత్తం 11 మ్యాచ్లపై ఫిక్సింగ్ ఫిర్యాదులను ఐటీఐఏ అందుకుంది. -
వైరల్ వీడియో : చిన్నారి అభిమానికి రాకెట్ బహుమానం..!
లండన్: ఈ ఏడాది తన అద్వితీయ ఆటతీరు కొనసాగిస్తూ సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో ఆరోసారి చాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే వింబుల్డన్ గెలిచిన తరువాత జొకోవిచ్ ఓ చిన్నారి అభిమానికి తన రాకెట్ను బహుమతిగా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. స్టేడియంలోని చిన్నారి పట్టుకున్న ఓ పోస్టర్లో నోవాక్ జొకోవిచ్ పేరుతో పాటు.. అత్యుత్తమ, విజయవంతమైన, ప్రతిష్టాత్మక ప్రపంచ నెంబర్1 అని రాసి ఉంది. వింబుల్డన్ అధికారిక హ్యాండిల్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. "అందమైన చిన్నారి" అంటూ సోమవారం జొకోవిచ్ షేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 3.2 మిలియన్ల మంది నెటిజన్లు వీక్షించారు. అలాగే 2.32 లక్షల మంది లైక్ కొట్టగా.. వేలమంది కామెంట్ చేశారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ..‘‘ అందుకే జొకోవిచ్ వింబుల్డన్ నెం1 ఆటగాడయ్యాడు.’’ అంటూ కామెంట్ చేశాడు. ఇక ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ జొకోవిచ్ 3 గంటల 24 నిమిషాల్లో 6–7 (4/7), 6–4, 6–4, 6–3తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ బెరెటిని (ఇటలీ)పై గెలుపొందాడు. తద్వారా తన కెరీర్లో 20వ గ్రాండ్స్లామ్ టైటిల్ను సాధించాడు. View this post on Instagram A post shared by Wimbledon (@wimbledon) -
జొకోవిచ్ జైత్రయాత్ర
లండన్: ఈ ఏడాది తన అద్వితీయ ఆటతీరు కొనసాగిస్తూ సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో ఆరోసారి చాంపియన్గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ జొకోవిచ్ 3 గంటల 24 నిమిషాల్లో 6–7 (4/7), 6–4, 6–4, 6–3తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ బెరెటిని (ఇటలీ)పై గెలుపొందాడు. తద్వారా తన కెరీర్లో 20వ గ్రాండ్స్లామ్ టైటిల్ను సాధించాడు. ఈ క్రమంలో పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారులుగా ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్–20 చొప్పున) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్కు 17 లక్షల పౌండ్లు (రూ. 17 కోట్ల 61 లక్షలు), రన్నరప్ బెరెటినికి 9 లక్షల పౌండ్లు (రూ. 9 కోట్ల 32 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. ఈ సీజన్లో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్లోనూ చాంపియన్గా నిలిచిన 34 ఏళ్ల జొకోవిచ్ సెప్టెంబర్లలో జరిగే యూఎస్ ఓపెన్లోనూ గెలిస్తే రాడ్ లేవర్ (1969లో) తర్వాత ‘క్యాలెండర్ గ్రాండ్స్లామ్’ ఘనత సాధించిన ప్లేయర్గా రికార్డు సృష్టిస్తాడు. తొలి సెట్ కోల్పోయినా... కెరీర్లో తొలిసారి గ్రాండ్స్లామ్ ఫైనల్ ఆడుతున్న బెరెటిని ఆరంభంలో తడబడ్డాడు. కెరీర్లో 30వ గ్రాండ్స్లామ్ ఫైనల్ ఆడుతున్న జొకోవిచ్ నాలుగో గేమ్లో బెరెటిని సర్వీస్ను బ్రేక్ చేసి అదే జోరు కొనసాగించి 5–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే నెమ్మదిగా తేరుకున్న బెరెటిని వరుసగా మూడు గేమ్లు గెలిచి స్కోరును 5–5తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్లో బెరెటిని పైచేయి సాధించి తొలి సెట్ను సొంతం చేసుకున్నాడు. తొలి సెట్ కోల్పోయినా అపార అనుభవజ్ఞుడైన జొకోవిచ్ ఒత్తిడికి లోనుకాకుండా సహజశైలిలో ఆడాడు. వరుసగా మూడు సెట్లను సొంతం చేసుకొని బెరెటిని ఆశలను వమ్ము చేశాడు. జొకోవిచ్ 20 గ్రాండ్స్లామ్ టైటిల్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ (9): 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021 ఫ్రెంచ్ ఓపెన్ (2): 2016, 2021: వింబుల్డన్ (6): 2011, 2014, 2015, 2018, 2019, 2021 యూఎస్ ఓపెన్ (3): 2011, 2015, 2018 -
Wimbledon 2021: తొలిసారి టైటిల్ నెగ్గిన క్రొయేషియన్ జోడీ
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ ట్రోఫీని క్రొయేషియా ద్వయం నికోలా మెక్టిక్, మేట్ పావిక్ సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో ఈ క్రొయేషియా ద్వయం 6-4, 7-6(5), 2-6, 7-5తో మార్సెల్ గ్రానోల్లర్స్(స్పెయిన్)-హోరాసియో జెబలోస్ల(అర్జెంటీనా) జోడీపై విజయం సాధించింది. దీంతో వింబుల్డన్ టైటిల్ గెలిచిన మొదటి క్రొయేషియా డబుల్స్ జోడీగా మెక్టిక్-పావిక్ జోడీ చరిత్ర సృష్టించింది. కాగా, మెక్టిక్-పావిక్ జంటకు ఈ సీజన్లో ఇది ఎనిమిదో టైటిల్ కావడం విశేషం. ఇదిలా ఉంటే, 2018 ఆస్ట్రేలియా ఓపెన్, యూఎస్ ఓపెన్ను వేర్వేరు భాగస్వాములతో కలిసి గెలుపొందిన పావిక్కు.. మెక్టిక్తో కలిసి ఇదే తొలి టైటిల్. మరోవైపు మెక్టిక్కు మాత్రం ఇదే తొలి గ్రాండ్స్లామ్. ఈ క్రొయేషియా జోడీ టోక్యో ఒలింపిక్స్లోనూ జంటగా బరిలోకి దిగనున్నారు. మరోవైపు, శనివారమే జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సువే(తైవాన్)-ఎలిస్ మెర్టన్స్(బెల్జియం) జోడీ 6-3, 5-7, 7-9తో వెరోనికా కుడెర్మెటోవా- ఎలెనా వెస్నినా(రష్యా) ద్వయంపై విజయం సాధించి వింబుల్డన్ 2021 మహిళల డబుల్స్ టైటిల్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే, కెరీర్లో 20వ గ్రాండ్ స్లామ్ కైవసం చేసుకుని దిగ్గజ ఆటగాళ్లైన రోజర్ ఫెదరర్, రఫెల్ నదాల్ సరసన నిలిచేందుకు అడుగు దూరంలో ఉన్న సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్.. తుది పోరులో ఏడో సీడ్ ఇటలీ ఆటగాడు మాటియో బెరెటినితో అమీతుమీకి రెడీ అయ్యాడు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానుంది. -
Wimbledon: బార్టీ క్వీన్...
లండన్: పట్టుదలతో కష్టపడితే ఏనాటికైనా కలలు నిజమవుతాయని ఆస్ట్రేలియా టెన్నిస్ క్రీడాకారిణి, ప్రపంచ నంబర్వన్ యాష్లే బార్టీ నిరూపించింది. టెన్నిస్ రాకెట్ పట్టినప్పటి నుంచి ఒక్కసారైనా వింబుల్డన్ టైటిల్ సాధించాలని కలలు కన్నానని ఫైనల్కు ముందు బార్టీ తెలిపింది. ‘హౌస్ఫుల్’ సెంటర్ కోర్టులో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో అద్భుత ఆటతీరుతో 25 ఏళ్ల బార్టీ తన కలను నిజం చేసుకుంది. ఎనిమిదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన తుది పోరులో టాప్ సీడ్ యాష్లే బార్టీ 6–3, 6–7 (4/7), 6–3తో విజయం సాధించి వింబుల్డన్ చాంపియన్గా అవతరించింది. విజేతగా నిలిచిన బార్టీకి 17 లక్షల పౌండ్లు (రూ. 17 కోట్ల 61 లక్షలు), రన్నరప్ ప్లిస్కోవాకు 9 లక్షల పౌండ్లు (రూ. 9 కోట్ల 32 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. బార్టీ కెరీర్లో ఇది రెండో గ్రాండ్స్లామ్ టైటిల్. 2019లో ఆమె తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గింది. మరోవైపు 29 ఏళ్ల ప్లిస్కోవాకు రెండోసారి గ్రాండ్స్లామ్ ఫైనల్లో నిరాశ ఎదురైంది. 2016 యూఎస్ ఓపెన్ ఫైనల్లోనూ ప్లిస్కోవా రన్నరప్గా నిలిచింది. 2011లో జూనియర్ బాలికల వింబుల్డన్ టైటిల్ నెగ్గిన బార్టీ 2014లో ఆటపై ఆసక్తి కోల్పోయి రెండేళ్లపాటు టెన్నిస్ నుంచి బ్రేక్ తీసుకుంది. 2015–2016లో బిగ్బాష్ మహిళల టి20 క్రికెట్ లీగ్లో బ్రిస్బేన్ హీట్ జట్టు తరఫున బరిలోకి దిగింది. అయితే క్రికెటర్గా అంతగా సఫలం కాకపోవడంతో బార్టీ 2016లో టెన్నిస్లో పునరాగమనం చేసింది. తొలి సెట్లో రెండో గేమ్లో, నాలుగో గేమ్లో ప్లిస్కోవా సర్వీస్లను బ్రేక్ చేసిన బార్టీ 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. బార్టీ దూకుడు... ప్లిస్కోవా పేలవమైన ఆటతీరు చూశాక చెక్ రిపబ్లిక్ ప్లేయర్ ఒక్క గేమ్ అయినా గెలుస్తాందా అనే అనుమానం కలిగింది. అయితే ప్లిస్కోవా ఆట నెమ్మదిగా గాడిలో పడటంతో ఐదో గేమ్లో ఆమె బార్టీ సర్వీస్ను బ్రేక్ చేసి తొలి గేమ్ గెలిచింది. ఆ వెంటనే ఆరో గేమ్లో ప్లిస్కోవా సర్వీస్ను బ్రేక్ చేసిన బార్టీ 5–1తో ముందంజ వేసింది. అదే జోరులో బార్టీ తొలి సెట్ను సొంతం చేసుకుంది. రెండో సెట్లో ప్లిస్కోవా తన లోపాలను సరిదిద్దుకొని బార్టీకి గట్టిపోటీ ఇచ్చింది. పలుమార్లు స్కోరు సమమయ్యాక చివరికు సెట్ టైబ్రేక్ వరకు వెళ్లింది. టైబ్రేక్లో ప్లిస్కోవా పైచేయి సాధించింది. నిర్ణాయక మూడో సెట్లోని రెండో గేమ్లో ప్లిస్కోవా సర్వీస్ను బ్రేక్ చేసిన బార్టీ ఆ తర్వాత తన సర్వీస్ను నిలబెట్టుకొని 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ప్లిస్కోవా కోలుకునే ప్రయత్నం చేసినా బార్టీ దూకుడైన ఆటముందు ఆమె నిలువలేకపోయింది. బార్టీ సర్వీస్ చేసిన తొమ్మిదో గేమ్లో ప్లిస్కోవా కొట్టిన బ్యాక్హాండ్ షాట్ నెట్కు తగలడంతో బార్టీ విజయం ఖాయమైంది. వింబుల్టన్లో జూనియర్, సీనియర్ మహిళల సింగిల్స్ టైటిల్స్ గెలిచిన నాలుగో క్రీడాకారిణి బార్టీ. గతంలో యాన్ షిర్లే జోన్స్ (బ్రిటన్–1956, 1969), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్–1994, 1997), అమెలీ మౌరెస్మో (ఫ్రాన్స్–1996, 2006) ఈ ఘనత సాధించారు. వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన మూడో ఆస్ట్రేలియా క్రీడాకారిణి బార్టీ. గతంలో మార్గరెట్ కోర్ట్ స్మిత్ (1963, 1965, 1970), ఇవోన్ గూలాగాంగ్ (1971, 1980) ఈ ఘనత సాధించారు. ఫైనల్లో ఎలాంటి ఫలితం వస్తుందో అని ఆలోచిస్తూ శుక్రవారం రాత్రి సరిగ్గా నిద్ర కూడా పోలేదు. అంతా అద్భుతంలా అనిపిస్తోంది. స్టేడియంలో ఉన్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా కలను మీరు మరింత ప్రత్యేకం చేశారు. –బార్టీ -
Wimbledon 2021: ఆష్లే బార్టీ కొత్త అధ్యాయం
లండన్: పచ్చిక కోర్టులపై తన ప్రతాపం చూపిస్తూ వింబుల్డన్ చరిత్రలో ఆస్ట్రేలియా క్రీడాకారిణి, వరల్డ్ నంబర్వన్ ఆష్లే బార్టీ కొత్త అధ్యాయం లిఖించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో బార్టీ 6-3, 6-7(4/7), 6-3 తేడాతో కరోలినా ప్లిస్కోవాపై విజయం సాధించి టైటిల్ను ఎగురేసుకుపోయింది. ఇది బార్టీకి తొలి వింబుల్డన్ టైటిల్ కాగా, రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్. అంతకుముందు 2019ఫ్రెంచ్ ఓపెన్లో బార్టీ విజేతగా అవతరించగా, ఆ తర్వాత ఇదే ఆమెకు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ పోరులో టాప్సీడ్గా బరిలోకి దిగిన బార్టీ అంచనాలు తగ్గట్టు ఆడుతూ టైటిల్ను సాధించింది. తుదిపోరులో తొలి సెట్ను అవలీలగా గెలిచిన బార్టీకి రెండో సెట్లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. టైబ్రేకర్కు దారి తీసిన రెండో సెట్ను ప్లిస్కోవా దక్కించుకోగా, టైటిల్ నిర్ణయాత్మక మూడో సెట్లో బార్టీ మళ్లీ విజృంభించింది. ఎక్కడా కూడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకండా సెట్తో పాటు మ్యాచ్ను సొంతం చేసుకుని తొలి వింబుల్డన్ టైటిల్ను కైవసం చేసుకుంది. 1980 తర్వాత ఇప్పటి వరకు ఒక్క ఆస్ట్రేలియన్ ప్లేయర్ కూడా వింబుల్డన్ టైటిల్ను గెలవక పోగా, ఆ రికార్డును బార్టీ 41 ఏళ్ల తర్వాత బ్రేక్ చేసి కొత్త రికార్డు నమోదు చేసింది. -
చిన్న ఫోటో ఖరీదు రూ.1.3 కోట్లు!
ఆండీ ముర్రే 2013లో వింబుల్డన్ గెలిచిన క్షణానికి సంబంధించిన ఫోటోను నాన్-ఫంగిబుల్ టోకెన్(ఎన్ఎఫ్టీ)గా సోమవారం వేలంలో $177,777(సుమారు రూ. 1.3 కోట్లు)కు విక్రయించారు. స్కాటిష్ టెన్నిస్ స్టార్ గత నెలలో తన వింబుల్డన్ విజయానికి గుర్తుగా దిగిన ఈ ఫోటోను బ్లాక్ చైన్ ఆధారిత ఎన్ఎఫ్టీ రూపంలో వీన్యూ అనే వేదికపై అమ్మకానికి ఉంచినట్లు ప్రకటించారు. ఎన్ఎఫ్ టి అనేది క్రిప్టోకరెన్సీ లాగా ఒక రకమైన డిజిటల్ ఆస్తి. కొనుగోలుదారుడు మాత్రమే ఆ ఎన్ఎఫ్టీపై యాజమాన్య హక్కును పొందగలడు. ఆండీ ముర్రే 2013లో గెలిచిన వింబుల్డన్ "క్షణాన్ని" కొనుగోలుదారుడు వీడియో కాపీరైట్ ను కలిగి ఉండడు. కానీ దానిని చూపించడానికి ఒక చిన్న డిజిటల్ స్క్రీన్ ను పొందుతారు. అమెరికన్ డిజిటల్ ఆర్టిస్ట్ బీపుల్ మార్చిలో ఒక కళాఖండాన్ని ఎన్ఎఫ్టీ రూపంలో 69.3 మిలియన్ డాలర్లకు(సుమారు రూ. 514 కోట్లు) విక్రయించినప్పుడు తాను మొదటి సారి ఎన్ఎఫ్టీ గురించి తెలుసకున్నట్లు ముర్రే చెప్పారు. బీపుల్ అనే వ్యక్తి వెన్యూ వ్యవస్థాపకుల్లో ఒకరు. "నేను ఇంకా ఎన్ఎఫ్టీల గురించి నేర్చుకుంటున్నాను, కానీ ఇది ఒక ఉత్తేజకరమైన ప్రాంతంగా అనిపిస్తుంది. మరింత మంది అథ్లెట్లు, కంటెంట్ సృష్టికర్తలు దీనిలో పాల్గొంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను" అని ముర్రే ఈ-మెయిల్ ద్వారా రాయిటర్స్ కు చెప్పారు. -
39 ఏళ్ల వయసులో అరుదైన ఘనత.. ఓపెన్ ఎరాలో ఒకే ఒక్కడు
లండన్: అత్యధిక గ్రాండ్స్లామ్ విన్నర్(20), టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) అరుదైన రికార్డు నెలకొల్పాడు. వింబుల్డన్ ఓపెన్ ఎరాలో 39 ఏళ్ల వయసులో క్వార్టర్స్కు చేరిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుత టోర్నీలో ఇటలీకి చెందిన లోరెంజో సొనేగాపై గెలిచి క్వార్టర్స్లోకి అడుగుపెట్టడం ద్వారా ఆయన ఈ ఘనత సాధించాడు. 1968లో ఓపెన్ ఎరా ప్రారంభమైనప్పటి నుంచి వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్కు చేరుకున్న అతి పెద్ద వయసు ఆటగాడు ఫెదరర్ మాత్రమే కావడం విశేషం. కాగా, ఈ స్విస్ యోధుడు మరో ఐదు వారాల్లో 40వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో ఆరవ సీడ్ రోజర్ ఫెదరర్ 7-5, 6-4, 6-2తో లోరెంజో సొనేగా (ఇటలీ)పై అలవోకగా విజయం సాధించాడు. మోకాలి సర్జరీ కారణంగా ఇటీవలి కాలంలో ఫామ్ను కోల్పోయిన ఫెడెక్స్.. గ్రాస్ కోర్టుపై మాత్రం చెలరేగుతున్నాడు. ఈ క్రమంలో అతను వింబుల్డన్లో రికార్డు స్థాయిలో 18వ సారి క్వార్టర్స్కు చేరాడు. ఫెదరర్ తన తర్వాతి మ్యాచ్లో డానియల్ మెద్వెదెవ్ లేదా హుబెర్ట్ హుర్కాజ్తో తలపడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, పురుషుల సింగల్స్ విభాగంలో టాప్ సీడ్ జకోవిచ్, ఏడో సీడ్ బెరెటిని (ఇటలీ), పదోసీడ్ షపొవలోవ్ (కెనడా), కచనోవ్ (రష్యా), ఫుక్సోవిచ్ (హంగేరి) కూడా ప్రీక్వార్టర్స్ను అధిగమించారు. ఇక మహిళల విభాగంలో టాప్ సీడ్ ఆష్లే బార్టీ, రెండో సీడ్ సబలెంక (బెలారస్), ఆన్స్ జబేర్ (ట్యునీషియా), కెర్బర్ (జర్మనీ), ముచోవా (చెక్), గొల్బిచ్ (స్విట్జర్లాండ్)లు క్వార్టర్స్కు చేరారు. -
ప్రిక్వార్టర్స్లో సానియా–బోపన్న జంట
లండన్: నాలుగేళ్ల విరామం తర్వాత వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో బరిలోకి దిగిన సానియా మీర్జా మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. భారత్కే చెందిన రోహన్ బోపన్నతో జతకట్టిన సానియా మీర్జా భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో రౌండ్ మ్యాచ్లో 6–3, 6–1తో ఐడన్ మెక్హగ్–ఎమిలీ వెబ్లీస్మిత్ (బ్రిటన్) జోడీపై విజయం సాధించింది. 47 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సానియా ద్వయం ఐదు ఏస్లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీ స్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)–ఆండ్రియా క్లెపాక్ (స్లొవేనియా)లతో సానియా–బోపన్న ఆడతారు. మిక్స్డ్ డబుల్స్ మరో రెండో రౌండ్ మ్యాచ్లో భార్యాభర్తలైన దివిజ్ శరణ్ (భారత్)–సమంత ముర్రే శరణ్ (బ్రిటన్) జోడీ 6–3, 6–7 (1/7), 3–6తో రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)–దరియా జురాక్ (క్రొయేషియా) జంట చేతిలో ఓడింది. మెద్వెదేవ్ తొలిసారి... పురుషుల సింగిల్స్లో రెండో సీడ్ మెద్వెదేవ్ (రష్యా) అద్భుత పోరాటపటిమ కనబరిచి గట్టెక్కాడు. మూడో రౌండ్లో మెద్వెదేవ్ 6–7 (3/7), 3–6, 6–3, 6–3, 6–2తో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై నెగ్గి ఈ టోర్నీలో తొలిసారి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ మ్యాచ్లో మెద్వెదేవ్ 3 గంటల 36 నిమిషాల్లో గెలుపొందాడు. తొలి రెండు సెట్లు చేజార్చుకున్నాక మెద్వెదేవ్ కోలుకున్నాడు. వరుసగా మూడు సెట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. 16 ఏస్లు సంధించిన మెద్వెదేవ్ తన సర్వీస్ను ఐదుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేశాడు. బార్టీ ముందంజ... మహిళల సింగిల్స్లో టాప్ సీడ్, వరల్డ్ నంబర్వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మూడో రౌండ్లో బార్టీ 6–3, 7–5తో సినియకోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. గంటా 37 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో బార్టీ ఎనిమిది ఏస్లు సంధించింది. ఆదివారం విశ్రాంతి దినం తర్వాత సోమవారం నుంచి ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు మొదలవుతాయి. మంగళవారం నుంచి జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల నుంచి వంద శాతం ప్రేక్షకులకు అనుమతి ఇవ్వనున్నట్లు... ఈ మేరకు ఇంగ్లండ్ ప్రభుత్వం నుంచి తమకు అనుమతి లభించిందని నిర్వాహకులు తెలిపారు. ఇంతకుముందు కేవలం పురుషుల, మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్లకే వంద శాతం ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. -
బూట్లు మరిచిపోయి కోర్టులోకి ఎంట్రీ.. ఆడుకున్న నెటిజన్లు
లండన్: వింబుల్డన్ 2021లో భాగంగా శనివారం జరిగిన ఓ మ్యాచ్కు ముందు ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ కిర్గియోస్ ఫెలిక్స్, కెనెడా ఆటగాడు 16వ సీడ్ అగర్ అలియాస్సిమ్ మధ్య జరగాల్సిన మూడో రౌండ్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. నిక్ కిర్గియోస్.. తన గ్రాస్ కోర్ట్ బూట్లను లాకర్లో పెట్టి మర్చిపోయి కోర్టులోకి వచ్చేయడమే ఇందుకు కారణం. వివరాల్లోకి వెళితే.. నిక్, తన మూడవ రౌండ్ మ్యాచ్ కోసం అన్నీ సిద్ధం చేసుకుని కోర్టులోకి ఎంటరయ్యాడు. తీరా చూస్తే.. అతను తన గ్రాస్ కోర్ట్ షూస్కు బదులు సాధారణ బూట్లతో బరిలోకి దిగాడు. దీంతో వార్మప్ కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది. Special shoe delivery for @NickKyrgios #Wimbledon pic.twitter.com/UUhElrCv4s — Tennis GIFs 🎾🎥 (@tennis_gifs) July 3, 2021 దీనిపై వెంటనే స్పందించిన అతను.. ‘దుస్తులు, రాకెట్లు తనతో పాటు తెచ్చుకుని, బూట్లను మాత్రం లాకర్లో మర్చిపోయాను..’ అంటూ నవ్వుతూ అసలు విషయం చెప్పాడు. దీంతో అక్కడే ఉన్న ఓ మహిళా స్టాఫ్ మెంబర్ నిక్ షూస్ తీసుకుని పరిగెడుతూ అక్కడికి వచ్చింది. ఈ మొత్తం తతంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. యుద్ధానికి బయల్దేరేముందు కత్తిని మర్చిపోయినట్లు, నిక్ ఆటలో తప్పనిసరిగా తొడుక్కోవాల్సిన షూస్ను లాకర్లో మర్చిపోయాడంటూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. మరికొందరైతే.. ఈ ఆస్ట్రేలియన్ ప్లేయర్ కోసం షూస్ స్పెషల్ డెలివరీ అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్లో గాయం కారణంగా నిక్ టోర్నీ నుంచి అర్ధంతరంగా నిష్క్రమించాడు. తొలి రౌండ్లో 6-2తో దూసుకొచ్చిన అతను.. ఆతరువాతి రౌండ్ను 1-6తో కోల్పోయాడు. ఈ దశలో అతను గాయం బారిన పడటంతో ప్రత్యర్ధికి వాకోవర్ లభించింది. దీంతో అగర్ ప్రీక్వార్టర్స్కు ప్రవేశించాడు. -
ప్రిక్వార్టర్స్లో జొకోవిచ్
లండన్: ప్రపంచ నంబర్వన్ జొకోవిచ్ తన కెరీర్లో 20వ గ్రాండ్స్లామ్ టైటిల్ దిశగా ముందడుగు వేస్తున్నాడు. వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో టాప్సీడ్ సెర్బియన్ స్టార్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. పురుషుల సింగిల్స్లో శుక్రవారం జరిగిన మూడో రౌండ్లో జొకోవిచ్ 6–4, 6–3, 7–6 (9/7)తో డెనిస్ కుడ్లా (అమెరికా)పై గెలుపొందాడు. 2 గంటలా 17 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో తొలి రెండు సెట్లను జొకోవిచ్ అలవోకగానే కైవసం చేసుకున్నాడు. అయితే మూడో సెట్లో మాత్రం క్వాలిఫయర్ కుడ్లా నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. ఈ సెట్లో తొలి మూడు గేమ్లను సొంతం చేసుకున్న కుడ్లా 3–0తో ఆధిక్యంలో నిలిచాడు. వెంటనే తేరుకున్న జొకోవిచ్ ఏడో గేమ్లో ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేసి... అనంతరం తన సర్వీస్ను నిలబెట్టుకొని సెట్ను 4–4తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా తమ సర్వీస్లను నిలబెట్టుకోవడంతో సెట్ ‘టై బ్రేక్’కు దారి తీసింది. ఇక్కడ కూడా జొకోవిచ్ ఒక దశలో 1–4తో వెనుకబడ్డాడు. అయితే వరుసగా మూడు పాయింట్లు సాధించడంతో స్కోర్ను 4–4 వద్ద సమం చేశాడు. ఇక ఇదే దూకుడులో ‘టై బ్రేక్’ను గెలిచిన జొకోవిచ్ మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. ముగిసిన టియాఫె పోరాటం తొలి రౌండ్లో మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)కు షాకిచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన ఫ్రాన్సెస్ టియాఫె (అమెరికా) పోరాటం ముగిసింది. మూడో రౌండ్లో టియాఫె 3–6, 4–6, 4–6తో కరెన్ కచనోవ్ (రష్యా) చేతిలో ఓడాడు. తొమ్మిదో సీడ్ డియాగో స్వార్ట్జ్మన్ (అర్జెంటీనా)కు మూడో రౌండ్లో ఊహించని షాక్ తగిలింది. అతను 3–6, 3–6, 7–6 (8/6), 4–6తో అన్సీడెడ్ ఆటగాడు మార్టోన్ ఫుక్సోవిక్స్ (హంగేరి) చేతిలో ఓడాడు. మాజీ చాంపియన్ ముగురుజా అవుట్ మహిళల సింగిల్స్లో 2017 వింబుల్డన్ చాంపియన్ ముగురుజా (స్పెయిన్)కు చుక్కెదురైంది. మూడో రౌండ్లో ముగురుజా 7–5, 3–6, 2–6తో ఓన్స్ జేబుర్ (ట్యూనీషియా) చేతిలో పరాజయం పాలైంది. రెండో సీడ్ అరీనా సబలెంక (బెలారస్), ఏడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్), ఎనిమిదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) ప్రిక్వార్టర్స్కు చేరుకున్నారు. రెండో రౌండ్లో సానియా–బోపన్న జంట మిక్స్డ్ డబుల్స్ విభాగంలో జరిగిన తొలి రౌండ్లో భారత ద్వయం సానియా మీర్జా– రోహన్ బోపన్న 6–2, 7–6 (7/5)తో భారత్కే చెందిన రామ్కుమార్ రామనాథన్–అంకిత రైనా జంటపై గెలుపొంది రెండో రౌండ్లో ప్రవేశించింది. దివిజ్ శరణ్–సమంత శరణ్ (ఇంగ్లండ్) జోడీ 6–3, 5–7, 6–4 అరియల్ బెహెర్ (ఇజ్రాయెల్)–కలీనా ఒస్కబొయెవా (కజకిస్తాన్) జంటపై నెగ్గింది. -
Wimbledon 2021: సానియా జోడీ శుభారంభం
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా శుభారంభం చేసింది. నాలుగేళ్ల తర్వాత ఈ టోర్నీ బరిలోకి దిగిన హైదరాబాద్ టెన్నిస్ స్టార్.. అమెరికా ప్లేయర్ బెతాని మ్యాటెక్ సాండ్స్తో కలిసి అద్భుత విజయం సాధించింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా- బెతాని జోడీ 7-5, 6-3 తేడాతో ఆరో సీడ్ అలెక్సా గౌరచి(చిలీ)- డిసారియ క్రాక్జిక్(అమెరికా) జోడీపై వరుస సెట్లలో గెలుపొందింది. గంటా 28 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో సానియా జోడీ అలవోకగా విజయాన్నందుకుంది. సానియా కెరీర్లో ఇది 121 విజయం కాగా.. ఈ మ్యాచ్లో ఆమె ఒక్క ఏస్ మాత్రమే సంధించింది. సానియా.. వింబుల్డన్లో 2017లో చివరిసారిగా బరిలోకి దిగింది. కాగా, టోక్యో ఒలింపిక్స్కు ముందు జరుగుతున్న ఈ మెగా గ్రాండ్స్లామ్ టోర్నీ సానియాకు చాలా కీలకంగా మారింది. కెరీర్ చరమాంకంలో ఉన్న 34 ఏళ్ల సానియా.. ఈ వింబుల్డన్లో ఎలాగైనా విజయం సాధించి విశ్వక్రీడల బరిలో నిలవాలని ప్లాన్ చేస్తుంది. ఇక టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించడం ద్వారా భారత్తరఫున నాలుగు ఒలింపిక్స్లో పాల్గొన్న తొలి మహిళా అథ్లెట్గా ఆమె చరిత్ర సృష్టించనుంది. ఇదిలా ఉంటే, 2018లో ఇజాన్కు జన్మనిచ్చాక గతేడాది జనవరిలో హోబర్ట్ ఇంటర్నేషనల్ టైటిల్గెలిచి సెకండ్ఇన్నింగ్స్ఘనంగా ప్రారంభించిన ఈ పాక్ కోడలు.. ఆతర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. -
జొకోవిచ్ జోరు
లండన్: కెరీర్లో 20వ గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్పై గురి పెట్టిన వరల్డ్ నంబర్వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఆ దిశగా మరో అడుగు వేశాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఈ సెర్బియా స్టార్ మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. 2018 రన్నరప్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)తో బుధవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6–3, 6–3, 6–3తో గెలుపొందాడు. గంటా 41 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో జొకోవిచ్ ఒక్క బ్రేక్ పాయింట్ కూడా ఎదుర్కోలేదు. తొమ్మిది ఏస్లు సంధించిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. నెట్ వద్దకు పదిసార్లు దూసుకొచ్చి ఎనిమిదిసార్లు పాయింట్లు గెలిచాడు. అండర్సన్ 26 అనవసర తప్పిదాలు చేయగా... జొకోవిచ్ ఆరు మాత్రమే చేశాడు. మరోవైపు 11వ సీడ్ పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్), 12వ సీడ్ కాస్పెర్ రూడ్ (నార్వే) తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. సామ్ క్వెరీ (అమెరికా) 7–6 (8/6), 6–4, 7–5తో కరెనో బుస్టాను... జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా) 7–6 (8/6), 7–6 (7/3), 2–6, 2–6, 6–2తో రూడ్ను ఓడించారు. సబలెంకా ముందంజ మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) మూడో రౌండ్లోకి ప్రవేశించగా... నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) రెండో రౌండ్లో... ఐదో సీడ్ బియాంక ఆండ్రెస్కూ (కెనడా), తొమ్మిదో సీడ్ బెలిండా బెన్చిచ్ (స్విట్జర్లాండ్) తొలి రౌండ్లో ఇంటిముఖం పట్టారు. రెండో రౌండ్లో సబలెంకా 4–6, 6–3, 6–3తో కేటీ బౌల్టర్ (బ్రిటన్)పై గెలిచింది. తొలి రౌండ్ మ్యాచ్ల్లో అలీజె కార్నె (ఫ్రాన్స్) 6–2, 6–1తో ఆండ్రెస్కూపై, కాయా యువాన్ (స్లొవేనియా) 6–3, 6–3తో బెన్చిచ్పై సంచలన విజయం సాధించారు. రెండో రౌండ్ మ్యాచ్లో మాడిసన్ బ్రెంగల్ (అమెరికా) 6–2, 6–4తో సోఫియా కెనిన్ను బోల్తా కొట్టించింది. -
టాప్సీడ్గా జొకోవిచ్.. ఏడో సీడ్గా ఫెడరర్
లండన్: స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్న మెంట్లో ఏడో సీడ్గా బరిలోకి దిగుతున్నాడు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో ఫెడరర్ 8 టైటిల్స్ సాధించాడు. 2019లో రన్నరప్గా నిలిచిన ఫెడరర్ గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్ అనంతరం గాయాలతో సతమతమయ్యాడు. దీంతో అతని ఏటీపీ ర్యాంకు పడిపోయింది. కాగా పురుషుల సింగిల్స్లో ప్రపంచ నంబర్వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)కు టాప్ సీడింగ్ దక్కింది. ప్రపంచ మూడో ర్యాంకర్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) వ్యక్తిగత కారణాలతో ఈ టోర్నీకి దూరమయ్యాడు. మహిళల సింగిల్స్లో యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) టాప్ సీడ్గా బరిలోకి దిగనుంది. ఈ నెల 28 నుంచి వింబుల్డన్ ఓపెన్ జరగనుంది. గతేడాది కరోనా వల్ల ఈ టోర్నీని రద్దు చేశారు. -
నాదల్ బాటలోనే మరో స్టార్ ప్లేయర్
టెన్నిస్ స్టార్ ప్లేయర్ రఫెల్ నాదెల్ వింబుల్డన్-2021, టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనబోనని సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు జపాన్ టెన్నిస్ స్టార్, యువ సంచలనం నయోమి ఒసాకా అలాంటి నిర్ణయమే తీసుకుంది. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీలో ఆడబోనని తెలిపింది. ఈ మేరకు ఒసాకా ఏజెంట్ స్టువర్ట్ డుగుయిడ్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశాడు. అయితే టోక్యో ఒలింపిక్స్లో ఆమె ఆడే అవకాశాలున్నట్లు ఆయన స్పష్టం చేశాడు. కాగా, వ్యక్తిగత కారణాలతో నయోమి ఒసాకా వింబుల్డన్ టోర్నీలో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది. సన్నిహితులు, కుటుంబంతో కొద్దిరోజులు ఆమె గడపాలనుకుంటోంది. తద్వారా కొత్త ఉత్సహాంతో తర్వాతి టోర్నీల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఒలింపిక్స్లో ఆమె పాల్గొనే అవకాశాలు కొద్ది రోజుల తర్వాత పరిశీలిస్తాం అంటూ స్టువర్ట్ పేరు మీద ఒక స్టేట్మెంట్ రిలీజ్ అయ్యింది. చూడండి: జపన్ యువసంచలనం ఫొటోలు ఇదిలా ఉంటే గత నెలలో ఫ్రెంచ్ టోర్నీ నుంచి నాటకీయ పరిణామాల తర్వాత నెంబర్ వన్ ప్లేయర్ నయోమి ఒసాకా వైదొలగిన విషయం తెలిసిందే. మీడియా సమావేశం తన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపెడుతుందని పేర్కొంటూ ప్రెస్ మీట్కు ఆమె విముఖత వ్యక్తం చేసింది. ఈ చర్యపై టోర్నీ నిర్వాహకులు ఆమెకు 15 వేల డాలర్ల జరిమానా విధించడంతో పాటు వేటు హెచ్చరిక చేశారు. అయితే ఈ లోపే 23 ఏళ్ల యువ సంచలనం టోర్నీ నుంచి నిష్క్రమించి టెన్నిస్ అభిమానుల్ని విస్మయానికి గురి చేసింది. చదవండి: ఒసాకాకు భారీ ఝలక్ -
క్రికెట్ ప్లేయరా.. టెన్నిస్ ప్లేయరా?
హైదరాబాద్: భారత టెన్నిస్ చరిత్రలో తనదైన ముద్ర వేసిన హైదరాబాద్ మహిళా స్టార్ ప్లేయర్ సానియా మీర్జా.. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు.. ఈ క్రమంలోనే ప్రతీ ఒక్కరూ లాక్డౌన్ పాటించాలని ప్రజలకు సూచనలు చేస్తూనే సోషల్ మీడియాలో అభిమానుల్ని అలరిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం లాక్డౌన్ పాటిస్తున్న కొందరు మహిళా సెలబ్రిటీలు వంటలు చేసే ఫోటోలను నెట్లో పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సానియా.. తాజాగా తన ట్వీటర్ అకౌంట్లో కుమారుడు ఇజాన్స్ ఫొటోను పోస్ట్ చేశారు.(జనం చస్తుంటే ఈ వంటావార్పులేంటి: సానియా) చేతిలో టెన్నిస్ రాకెట్ను పట్టుకుని ఉన్న ఇజాన్స్ ఫోటో పెట్టిన సానియా.. ఏమి ఆలోచిస్తున్నాడో కచ్చితంగా చెప్పగలను అంటూ కామెంట్ చేశారు. అయితే దీనికి నెటిజన్లు భిన్నమైన ప్రశ్నలు సంధిస్తున్నారు. సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ క్రికెటర్ కావడంతో ఇజాన్స్ను ఏమి చేస్తారు అనే ప్రశ్నలను అభిమానులు సంధిస్తున్నారు. మీ ముద్దుల తనయుడు ఇజాన్స్ను క్రికెటర్ ప్లేయర్ చేస్తారా.. లేక టెన్నిస్ ప్లేయర్ చేస్తారా’ అని ఒక అభిమాని అడగ్గా, మరొక అభిమాని మాత్రం ఒక అడుగు ముందుకేసి ఎడమ చేతిలో కూడా బ్యాట్ ఉంది’ అని సరదాగా కామెంట్ చేశాడు. ఇక పాకిస్తాన్ పేసర్ వహాబ్ రియాజ్ మాత్రం చాలా క్యూట్గా ఉన్నాడని కామెంట్ చేశాడు. సుమారు మూడేళ్ల పాటు సానియా మీర్జా టెన్నిస్కు దూరమయ్యారు. ఇజాన్స్కు జన్మనిచ్చే క్రమంలో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. ఇటీవలే తన రీఎంట్రీ ఇచ్చిన సానియా.. కరోనా వైరస్ కారణంగా మరోసారి ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీలు రద్దు కావడంతో పాటు పలు క్రీడా ఈవెంట్లు కూడా వాయిదాలు పడ్డాయి. I am pretty sure he’s thinking what the fuss is all about ? 😂😏👶🏽🍼 #IzhaanMirzaMalik 🎾 pic.twitter.com/3VSyYLmyj4 — Sania Mirza (@MirzaSania) April 8, 2020 -
‘వింబుల్డన్’కు వెయ్యి కోట్ల బీమా సొమ్ము
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న జూన్లో జరగాల్సిన వింబుల్డన్ టెన్నీస్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదా పడిన విషయం తెల్సిందే. ఇందుకుగాను భీమా సౌకర్యం కింద ఈ పోటీలను నిర్వహించే ఆల్ ఇంగ్లండ్ క్లబ్కు 114 మిలియన్ పౌండ్ల (దాదాపు 1,079 కోట్ల రూపాయలు) సొమ్ము అందనుంది. వాస్తవానికి ఆ క్లబ్ పోటీలను నిర్వహించినట్లయితే 250 మిలియన్ డాలర్లు (దాదాపు 23,100 కోట్ల రూపాయలు) వచ్చేవి. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రీడా పోటీలను రద్దు చేస్తూ వస్తున్నారు. ప్రతిష్టాకరమైన ఒలింపిక్స్ పోటీలను కూడా రద్దు చేశారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం వింబుల్డన్ పోటీలను రద్దు చేయడం ఇదే మొదటి సారి. 2003లో సార్స్ వచ్చినప్పుడు వింబుల్డన్ పోటీలకు భీమా తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి ఏటా జీవిత భీమా కింద 1.6 మిలియన్ పౌండ్లు ప్రీమియం కింద చెల్లిస్తూ వస్తున్నారు. భీమా తీసుకున్నాక 15 ఏళ్ల తర్వాత మొదటి సారి వింబుల్డన్ పోటీలు వాయిదా పడ్డాయి. -
హలెప్ సంచలనం
లండన్: వింబుల్డన్ గ్రాండ్ స్లామ్లో కొత్త చాంపియన్ అవతరించారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రొమేనియా క్రీడాకారిణి, ఏడో సీడ్ సిమోనా హలెప్ విజయం సాధించారు. హలెప్ 6-2, 6-2 తేడాతో నల్లకలువ సెరెనా విలియమ్స్పై ఏకపక్ష విజయం సాధించి తొలిసారి వింబుల్డన్ ట్రోఫీని ముద్దాడారు. మరొకవైపు రొమేనియా తరఫున తొలి వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ సాధించిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. తొలి సెట్ను అవలీలగా గెలుచుకున్న హలెప్.. రెండో సెట్లో కూడా అదే జోరును కొనసాగించారు. ఏ దశలోనూ సెరెనాకు అవకాశం ఇవ్వకుండా ఆద్యంతం దూకుడును ప్రదర్శించి టైటిల్ను కైవసం చేసుకున్నారు. ఇది హలెప్కు రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్. గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను గెలిచిన హలెప్.. ఇప్పుడు తాజాగా వింబుల్డన్లో విజేతగా నిలిచారు.దాంతో అత్యధిక గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన మార్గరెట్(24 టైటిల్స్) రికార్డును సమం చేద్దామనుకున్న సెరెనా ఆశలు తీరలేదు. వరుస రెండు సెట్లలో దారుణంగా విఫలమైన సెరెనా విలియమ్స్ రన్నరప్గా సరిపెట్టుకున్నారు. -
వోజ్నియాకీ ఇంటిబాట
లండన్: వింబుల్డన్ టోర్నీలో మాజీ నెం.1, 14వ సీడ్ కరోలిన్ వోజ్నియాకీ(డెన్మార్క్) కథ ముగిసింది. శుక్రవారం మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్లో వోజ్నియాకీ 4–6, 2–6తో ప్రపంచ 50వ ర్యాంకర్ జంగ్(చైనా) చేతిలో పరాజయం చవిచూసింది. మహిళల విభాగంలోని ఇతర ప్రధాన మ్యాచ్ల్లో మూడో సీడ్ కరోలినా ప్లిస్కోవా(చెక్ రిపబ్లిక్) 3–6, 6–2, 4–6తో షీ వూ హీష్(తైవాన్)పై, ఎనిమిదో సీడ్ ఎలినా స్వితోలినా(ఉక్రెయిన్) 6–3, 6–7(1/7), 6–2తో సక్కరి(గ్రీస్)పై చెమటోడ్చి నెగ్గగా, వరల్డ్ నెం.20 కొంటావీట్(ఎస్తోనియా) 7–6(9/7), 6–3తో ముచుకోవా (చెక్రిపబ్లిక్) చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్లో గతేడాది రన్నరప్ కెవిన్ అండర్సన్(దక్షిణాఫ్రికా) 4–6, 3–6, 6–7(4/7)తో పెల్లా(అర్జెంటీనా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇతర ప్రధాన మ్యాచ్ల్లో మిలాస్ రావోనిక్(కెనడా) 6–7(7/1), 2–6, 1–6తో ఒపెల్కా(అమెరికా)పై, బెన్నెట్ పైర్(ఫ్రాన్స్) 5–7, 7–6(7/5), 6–3, 7–6(7/2)తో వెస్లీ(చెక్రిపబ్లిక్)పై చెమటోడ్చి నెగ్గి తదుపరి రౌండ్కు చేరుకున్నారు. పదో సీడ్ కచనోవ్(రష్యా) 3–6, 6–7(3/7), 1–6తో ప్రపంచ 22వ ర్యాంకర్ బటిస్టా అగట్(స్పెయిన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. ప్రిక్వార్టర్స్కు దివిజ్ జోడీ పురుషుల డబుల్స్లో భారత ఆటగాడు దివిజ్ శరణ్ జోడీ ప్రిక్వార్టర్స్కు చేరింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో దివిజ్(భారత్)–డెమోలైనర్(బ్రెజిల్) ద్వయం 7–6(1) 5–7 7–6(6) 6–4 తో సాండర్ గిల్లీ– జొరాన్ వెలీజెన్(బెల్జియం) జంటపై చెమటోడ్చి నెగ్గింది. కాగా, డబుల్స్లో ఇప్పటికే రొహన్ బొపన్న, లియాండర్ పేస్, పురవ్ రాజా, నెడుంజెళియన్ జోడీలు టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. -
గాఫ్ సంచలనాల జోరు
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ చాంపియన్ షిప్స్లో అమెరికా యువ తార కోరి గాఫ్ (అమెరికా) సంచనాల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే క్వాలిఫికేషన్ ద్వారా వింబుల్డన్ మెయిన్ డ్రాలో ప్రవేశించి, ఈ రికార్డు సాధించిన తొలి 15 ఏళ్ల అమ్మాయిగా చరిత్ర కెక్కిన గాఫ్... అనంతరం మెయిన్ డ్రాలో ఐదుసార్లు వింబుల్డన్ చాంపియన్, నాలుగు సార్లు రన్నరప్ వీనస్ విలియమ్స్ను ఇంటిదారి పట్టించిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో రౌండ్లోనూ అదే ఆటతీరును పునరావృతం చేసింది. వరల్డ్ నెం.313 గాఫ్ 6–3, 6–3తో 2017 వింబుల్డన్ సెమీఫైనలిస్టు మగ్దలినా రిబరికోవాపై గెలుపొందింది. తద్వారా 1991 తర్వాత ఈ ప్రతిష్టాత్మక చాంపియన్షిప్స్లో మూడో రౌండ్కు చేరిన యువ క్రీడాకారిణిగా మరో రికార్డు ఖాతాలో వేసుకుంది. మహిళల విభాగంలోని ఇతర ప్రధాన మ్యాచ్ల్లో తాజా నెం.1, టాప్ సీడ్ ఆష్లే బార్టీ(ఆస్ట్రేలియా) 6–1, 6–3తో వాన్ యుక్వాంత్(బెల్జియం)పై, తొమ్మిదో సీడ్ స్లోన్ స్టీఫెన్స్(అమెరికా) 6–0, 6–2తో యఫాన్ వాంగ్(చైనా)పై గెలిచి తదుపరి రౌండ్కు చేరారు. వోజ్నియాకీ(డెన్మార్క్), హలెప్ (రొమేనియా) కూడా ముందంజ వేశారు. పురుషుల విభాగంలో టాప్ సీడ్ జకోవిచ్(సెర్బియా), నాలుగో సీడ్ కెవిన్ అండర్సన్(దక్షిణాఫ్రికా), జాన్ మిల్మాన్(ఆస్ట్రేలియా) సైతం తదుపరి రౌండ్కు చేరారు. -
తొలి సెట్ కోల్పోయినా..
లండన్: సంచలన ఫలితాలతో మొదలైన వింబుల్డన్ రెండో రోజు కూడా అలానే కొనసాగుతుందా అనే రీతిలో సాగింది. 9వ టైటిల్పై కన్నేసిన స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మ్యాచే దీనికి కారణం. తన కెరీర్లోనే మొదటిసారి వింబుల్డన్ ఆడుతోన్న దక్షిణాఫ్రికాకు చెందిన 22 ఏళ్ల లాయిడ్ హారీస్ చేతిలో కేవలం 28 నిమిషాల్లోనే మొదటి సెట్ను ఫెడరర్ కోల్పోయాడు. దీంతో రెండో రోజు కూడా అతి పెద్ద సంచలనం నమోదవుతుందేమోనని అందరూ అనుకున్నారు. అయితే రెండో సెట్ నుంచి తన అసలైన గ్రాస్ కోర్టు ఆటను హారీస్కు చూపిస్తూ వరుసగా మూడు సెట్లను గెలిచిన ఫెడరర్ రెండో రౌండ్కు చేరుకున్నాడు. 6–3, 1–6, 2–6, 2–6తో హారిస్ను ఓడించాడు. నాదల్ విజయం రెండు సార్లు వింబుల్డన్ విజేత స్పెయిన్ బుల్ నాదల్ 6–3, 6–1, 6–3తో సుగిటా(జపాన్)పై గెలుపొంది రెండో రౌండ్కు చేరుకోగా...సెరెనా విలియమ్స్ 6–2, 7–5తో గులియా గుట్టో(ఇటలీ)ను ఓడించి ముందంజ వేసింది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్, ఐదో సీడ్ ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్ థీమ్ తొలి రౌండ్తోనే తన కథను ముగించాడు. అమెరికా అన్సీడెడ్ ఆటగాడు కొరి చేతిలో 7–6, 6–7, 3–6, 0–6 చేతిలో ఓటమి చెందాడు. మహిళల మొదటి రౌండ్ మ్యాచ్లో షరపోవా(రష్యా) గాయం కారణంగా ఆట మధ్యలోనే వైదొలిగింది. పౌలిన్ పరమెన్టైర్(ఫ్రాన్స్)తో జరిగిన మ్యాచ్లో ఇరువురు చెరో సెట్ను గెలిచారు. నిర్ణయాత్మక మూడో సెట్లో 0–5తో వెనుకబడిన సమయంలో షరపోవా మణికట్టు గాయంతో తప్పుకుంది. బార్టీ అలవోకగా.. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ విజేత ప్రస్తుత నంబర్ 1 క్రీడాకారిణి యాష్లే బార్టీ తొలి రౌండ్లో 6–4, 6–2తో జెంగ్(చైనా)పై విజయం సాధించి రెండో రౌండ్కు చేరుకుంది. ఇతర మ్యాచ్లలో డిఫెండింగ్ చాంపియన్ కెర్బర్(జర్మనీ) 6–4, 6–3తో తన దేశానికే చెందిన మరియాపై, 2017 యూఎస్ ఓపెన్ విన్నర్ స్లోన్ స్టీఫెన్(అమెరికా) 6–2, 6–4తో టిమియా బాసిన్స్కీపై గెలుపొందారు. -
వింబుల్డన్: బార్టీ అలవోకగా..
లండన్: ఫ్రెంచ్ ఓపెన్ విజేత, మహిళల సింగిల్స్లో తాజా నెం.1 ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో శుభారంభం చేసింది. మంగళవారం తొలి రౌండ్ మ్యాచ్లో బార్టీ 6–4, 6–2తో జంగ్ (చైనా)పై అలవోకగా గెలుపొంది రెండో రౌండ్కు చేరుకుంది. మహిళల సింగిల్స్లోని ఇతర ప్రధాన మ్యాచ్ల్లో తొమ్మిదో సీడ్ స్లోన్ స్టీఫెన్స్(అమెరికా) 6–2, 6–4తో బిసిన్స్కీ (స్విట్జర్లాండ్) పై, మాజీ నెం.1, ఐదో సీడ్ ఏంజెలిక్ కెర్బర్ (జర్మనీ) 6–4, 6–3తో మరియ (జర్మనీ)పై, వరల్డ్ నెం.13 బెనిసిచ్ (స్విట్జర్లాండ్) 6–2, 6–3తో పవ్లిచెంకోవా(రష్యా)పై గెలుపొందారు. పురుషుల సింగిల్స్లో ఎనిమిదో సీడ్ నిషికోరి(జపాన్) 6–4, 7–6(7/3), 6–4తో మౌంటెరియో(బ్రెజిల్)పై, నిక్ కిర్గియోస్ (ఆస్ట్రేలియా) 7–6(7/4), 3–6, 7–6(12/10), 0–6, 6–1తో తమ దేశానికే చెందిన జె.థాంప్సన్పై చెమటోడ్చి నెగ్గగా, ఐదో సీడ్ డొమెనిక్ థీమ్ (ఆస్ట్రియా) 7–6(7/4), 6–7(1/7), 3–6, 0–6తో అన్ సీడెడ్ క్వెర్రీ(అమెరికా) చేతిలో కంగుతిన్నాడు. -
జకోవిచ్, హలెప్ శుభారంభం
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ మాజీ నెం.1 సిమోనా హలెప్(రొమేనియా) శుభారంభం చేసింది. సోమవారం ప్రారంభమైన ఈ టోర్నీ తొలి రౌండ్ మ్యాచ్లో వరల్డ్ నెం.7 హలెప్ 6–4, 7–5తో సాస్నోవిచ్(బల్గేరియా)పై గెలుపొందింది. తొలి సెట్ను అలవోకగా గెల్చుకున్న హలెప్కు రెండో సెట్లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. మహిళల విభాగంలోని ఇతర ప్రధాన మ్యాచ్ల్లో మూడోసీడ్ కరోలినా ప్లిస్కోవా(చెక్ రిపబ్లిక్) 6–2, 7–6(7/4)తో జు లాంగ్(చైనా)పై, మాడిసన్ కీస్(అమెరికా) 6–3, 6–2తో ఖుమ్ఖుమ్(థాయ్లాండ్)పై, స్వితోలినా (ఉక్రెయిన్) 7–5, 6–0తో గవ్రిలోవా (ఆస్ట్రేలియా)పై గెలిచారు. జకోవిచ్ అలవోకగా.. పురుషుల విభాగంలో వరల్డ్ నెం.1 నొవాక్ జకోవిచ్ 6–3, 7–5, 6–3తో కొష్లిషెరిబర్ (జర్మనీ)పై అలవోకగా నెగ్గి తదుపరి రౌండ్కు చేరుకున్నాడు. జకోవిచ్కు ధాటికి రెండో సెట్లో మినహా ప్రత్యర్థి పూర్తిగా చేతులెత్తేశాడు. ఈ విభాగంలోని ఇతర ప్రధాన మ్యాచ్ల్లో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 6–3, 6–4, 6–2తో హెర్బర్ట్ (ఫ్రాన్స్)పై, స్టాన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6–3, 6–2, 6–2తో బెమెల్మెనాస్ (బెల్జియం)పై గెలుపొందారు. -
15 ఏళ్లకే వింబుల్డన్ బరిలోకి!
లండన్: అమెరికా టీనేజ్ సంచలనం కోరి గౌఫ్ ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో కొత్త రికార్డు సృష్టించింది. ఓపెన్ శకంలో (1968 నుంచి) మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందిన అతి పిన్న వయస్కురాలిగా (15 ఏళ్ల 122 రోజులు) ఆమె చరిత్ర సృష్టించింది. క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్లో కోరి గౌఫ్ 6–1, 6–1తో 19వ సీడ్ గ్రీట్ మినెన్ (బెల్జియం)పై విజయం సాధించింది. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో అమెరికా దిగ్గజం వీనస్ విలియమ్స్తో కోరి గౌఫ్ తలపడుతుంది. 2009 వింబుల్డన్లో బ్రిటన్కు చెందిన లారా రాబ్సన్ 15 ఏళ్ల వయసులో మెయిన్ ‘డ్రా’లో ఆడింది. అయితే లారా రాబ్సన్కు టోర్నీ నిర్వాహకులు నేరుగా మెయిన్ ‘డ్రా’లో ఆడేందుకు వైల్డ్ కార్డు ఇచ్చారు. -
ఇక వింబుల్డన్లో చివరి సెట్లో టైబ్రేక్లు
ఇకపై వింబుల్డన్ గ్రాండ్స్లామ్లో సుదీర్ఘ మ్యాచ్లకు చెల్లుచీటి పడనుంది. మ్యాచ్ ఫలితాన్ని తేల్చే చివరి సెట్లో స్కోరు 12–12 వచ్చాక టైబ్రేక్ను ఆడించేందుకు ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్ సిద్ధమైంది. వచ్చే ఏడాది నుంచి ఈ టైబ్రేక్ ఆట మొదలవుతుందని క్లబ్ చైర్మన్ ఫిలిప్ బ్రూక్ వెల్లడించారు. ‘టైబ్రేక్స్ పద్ధతిని ప్రవేశపెట్టే సమయం వచ్చింది. మ్యాచ్లకు ఇకపై అసాధారణ ముగింపుల్లేకుండా, నిర్ణీత సమయంలోనే పోటీలు ముగిసేందుకు ఈ టైబ్రేక్స్ దోహదపడతాయి’ అని ఆయన అన్నారు. ఏడాదిలో నాలుగు గ్రాండ్స్లామ్స్ జరుగుతుండగా... ఒక్క యూఎస్ ఓపెన్లోనే మ్యాచ్ చివరి సెట్లో టైబ్రేక్స్ను నిర్వహిస్తున్నారు. -
తగని ప్రశ్న తగిన జవాబు
ప్రశ్న : బిడ్డతల్లి అయ్యాక మీరు సరిగా ఆడడం లేదు. కాన్పుకోసం తీసుకున్న విరామం తర్వాత మీకన్నీ అపజయాలే. ఇటీవల మరియ షరపోవాతో ఆటను స్కిప్ చేశారు. అక్కడ తప్పించుకున్నా, వింబుల్డన్ ఫైనల్లో గెలవలేకపోయారు. ఇప్పుడు మళ్లీ డబ్లు్య.టి.ఎ. శాన్ జోస్ ఈవెంట్లో చిత్తు చిత్తుగా ఓడిపోయారు. షాక్ తిన్నట్లనిపిస్తోందా? సెరెనా విలియమ్స్ : నాకు తెలీదు. నా మదిలో అనేక అలోచనలు ఉంటాయి. ఓడిపోయినందుకు షాక్ తినేంత సమయం నాకు ఉండదు. -
చాంపియన్స్ డ్యాన్స్...
వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ చాంపియన్స్కు అధికారికంగా నిర్వహించిన విందు కార్యక్రమంలో కలిసి నృత్యం చేస్తున్న పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలు నొవాక్ జొకోవిచ్, ఎంజెలిక్ కెర్బర్. -
‘ఆ సమయంలో నా భార్యను చూసి..’
లండన్: గతేడాది తన బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో సెరెనా విలియమ్స్ చనిపోతుందేమోనని భయపడ్డానని ఆమె భర్త అలెక్సిస్ ఒహానియన్ తెలిపారు. ‘నా బిడ్డకు జన్మనిచ్చిన కొన్ని రోజుల తర్వాత సర్జరీ చేయించుకునేందుకు వెళ్తున్న నా భార్య సెరెనాకు ముద్దిచ్చి గుడ్బై చెప్పాను. అప్పుడామె ప్రాణాలతో తిరిగొస్తుందో లేదో మాకెవరికీ తెలియదు. ఆమె బతకాలని కోరుకున్నాం. ఆ తర్వాత 10 నెలలకే ఆమె వింబుల్డన్ ఫైనల్ చేరింది. సెరెనా విలియమ్స్ త్వరలోనే ట్రోఫీ అందుకుంటుంది. ఒక గొప్ప ఘనతను మళ్లీ ఆమె ఇంటికి తిరిగి తీసుకురావాలని కోరుకుంటోంది’ అని ఒహానియన్ ట్వీట్ చేశాడు. గతేడాది సెప్టెంబర్లో రక్తం గడ్డకట్టకుండా సెరెనా శస్త్రచికిత్స చేయించుకుంది. ఆ సమయంలో సెరెనా ఆరోగ్యంపై తీవ్రంగా కలత చెందిన విషయాన్ని తాజాగా ఒహానియన్ స్పష్టం చేశారు. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్లో సెరెనా రన్నరప్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఎంజెలిక్ కెర్బర్తో జరిగిన తుదిపోరులో సెరెనా ఓటమి చెందింది.