Free
-
ఓటీటీలో భారీ యాక్షన్ మూవీ.. ఆ రోజు నుంచి ఫ్రీగా చూడొచ్చు
బాలీవుడ్ స్టార్ అక్షయ్కుమార్ నటించిన చిత్రం స్కై ఫోర్స్. ఈ యాక్షన్ మూవీని దర్శక ద్వయం సందీప్ కెవ్లానీ– అభిషేక్ అనిల్ కపూర్ తెరకెక్కించారు. జియో స్టూడియోస్, మాడ్డాక్ ఫిల్మ్స్, లియో ఫిల్మ్స్ యూకే ప్రొడక్షన్స్ పతాకాలపై జ్యోతి దేశ్పాండే, అమర్ కౌశిక్, భౌమిక్, దినేశ్ విజన్ దాదాపు రూ. 160 కోట్ల భారీ బడ్జెట్తో ఈ మూవీని నిర్మించారు. 1965లో జరిగిన ఇండియా–పాకిస్తాన్ వార్ నేపథ్యంలో భారతదేశపు మొదటి వైమానిక దాడి సంఘటనల ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. భారీ అంచనాల మధ్య రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు వరకు కలెక్షన్లు రాబట్టింది.ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం రెంటల్ పద్ధతిలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ మూవీని చూడాలంటే అదనంగా రూ.249 అద్దె చెల్లించాల్సిందే. ఈ మూవీ కేవలం హిందీ వర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. సబ్టైటిల్స్తో ఇతర భాషల వారు కూడా చూడొచ్చు.అయితే ఈ సినిమాను ప్రేక్షకులకు ఉచితంగా అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. ఈనెల 21 నుంచి ఉచితంగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. కాగా... ఈ సినిమాలో వీర్ పహారియా, సారా అలీఖాన్, నిమ్రత్ కౌర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో కమాండర్ కేవో అహుజా పాత్రలో అక్షయ్ కుమార్, టి. విజయ పాత్రలో వీర్ పహారియా నటించారు. -
ఈ వర్ణం సహజం
వస్త్ర తయారీ ప్రక్రియలో రంగుల అద్దకం అంతర్భాగం. రంగులు వేసే పద్ధతులుప్రాంతాన్ని బట్టీ మారుతుంటాయి. అయితే అసలు సమస్య... రసాయన రంగులతోనే. ఈ సమస్యకు పరిష్కారంగా జహీరాబాద్లోని దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) సహజ వర్ణాలకు పెద్ద పీట వేస్తోంది. మోదుగు, తంగేడు, నీలగిరి బెరడు... మొదలైన వాటి రంగులను దుస్తుల అద్దకంలో వాడేలా మహిళలకు శిక్షణ ఇచ్చింది.రసాయన రంగులతో తయారైన దుస్తులు చర్మానికి హానికరంగా మారుతున్నాయి. కొందరికి రసాయన రంగుల బట్టలు అసలు పడవు. హానికరమైన రంగులతో ఒక్కోసారి చర్మ సంబంధిత క్యాన్సర్కు సైతం దారితీసే అవకాశాలుంటాయి. వీటిని అధిగమించేందుకు సహజసిద్ధమైన రంగులతో ‘టై అండ్ డై’ పద్ధతిలో కృషి విజ్ఞాన కేంద్ర (కేవీకే)తో కలిసి మహిళలకు శిక్షణ ఇస్తోంది దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ.మిల్లెట్ సాగునుప్రోత్సహించే దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) సంస్థ ఇప్పుడు మారుమూలప్రాంతాల్లోని మహిళల్లో రకరకాల నైపుణ్యాలను పెంపోందించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అందులో సహజ రంగులతో అద్దకం కళ కూడా ఒకటి.ఈ టై అండ్ డై (అందమైన డిజైన్ల అద్దకం)లో ఉండే వివిధ రకాల పద్ధతులను గ్రామీణ మహిళలకు వివరిస్తున్నారు. లహరియ, చెవ్రాన్, ప్లీటింగ్, బండ్లింగ్, క్లమ్పింగ్, బాందిని వంటి వివిధ రకాల ‘టై అండ్ డై’ పద్ధతులలో శిక్షణ ఇస్తున్నారు.‘మనకు నిత్యం అందుబాటులో ఉండే వాటితో రంగులు తయారు చేయడం, వాటితో బట్టలపై అద్దకం (టై అండ్ డై) నేర్చుకోవడం సంతోషంగా ఉంది. రంగుల తయారీ, అద్దకంపై ప్రతి దశలోనూ మాకు సులభంగా అర్థం అయ్యేలా చెప్పారు. మేము సొంతంగా డిజైన్ లు చేయడం గర్వంగా ఉంది’ అంటుంది శ్రీవాణి.‘చెట్ల వేర్లు, కాండం నుంచి రంగులు ఎలా తీయవచ్చు అనేది నేర్చుకున్నాను. ఆ రంగులను బట్టలకు ఎలా అద్దాలి అనే దాని గురించి శిక్షణ పోందాము. ఇలాంటి విధానం పర్యావరణానికి మేలు చేస్తుంది. హానికరమైన రసాయనాల కంటే ప్రకృతి సిద్ధమైన రంగులు ఎంతో మేలు’ అంటుంది విజయలక్ష్మి.దేశవ్యాప్తంగా వస్త్ర తయారీ పరిశ్రమలో సహజ రంగులప్రాముఖ్యత పెరుగుతోంది. ప్రతిప్రాంతంలో వస్త్ర పరిశ్రమ తనదైన మూలాలను వెదుక్కుంటుంది. ఈ నేపథ్యంలో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ చేపడుతున్న కార్యక్రమాలు ఒకవైపు ప్రకృతికి మేలు చేస్తున్నాయి. మరోవైపు మహిళలలోని సహజ సృజనాత్మకతకు మెరుగులు దిద్దుతున్నాయి. – పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, సంగారెడ్డిసృజన ప్లస్ ఉపాధికృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. మహిళల్లో స్వయం ఉపాధిని పెంపోందించడానికి వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ‘టై అండ్ డై’పై గ్రామీణ మహిళలకు ఉచిత శిక్షణ కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. మహిళలు ఉత్సాహంగా నేర్చుకోవడం సంతోషంగా ఉంది. – హేమలత, శాస్త్రవేత్త -
మహిళలకు ఫ్రెష్బస్ ఫ్రీ కార్డులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న తమ బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు రూ. 500 వరకు పొదుపు చేసే ఫ్రెష్ కార్డులను ఉచితంగా ఇస్తున్నట్లు ఫ్రెష్బస్ తెలిపింది. వీటిని తదుపరి 10 రైడ్స్ కోసం ఉపయోగించుకోవచ్చని, ఒక్కో రైడ్పై రూ. 50 ఆదా చేసుకోవచ్చని వివరించింది.తమ వెబ్సైట్ లేదా యాప్లో బుక్ చేసుకున్న వారికి ఇది వర్తిస్తుందని పేర్కొంది. హైదరాబాద్, తిరుపతి, గుంటూరు, విజయవాడ, బెంగళూరు తదితర రూట్లలో సర్వీసులు నడిపిస్తున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు సుధాకర్ రెడ్డి చిర్రా తెలిపారు. సంస్థను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకూ తమ బస్సుల్లో 6.5 లక్షల మంది ప్రయాణించగా ఇందులో 30 శాతం అంటే 1.94 లక్షల మంది మహిళలు ప్రయాణించారని ఆయన తెలిపారు. మహిళలకు తమ సంస్థపై పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. -
ఎయిర్టెల్ కొత్త ఆఫర్.. ప్రముఖ ఓటీటీ ఫ్రీ
ఎయిర్టెల్ (Airtel) తమ కస్టమర్లకు కొత్త ఆఫర్ ప్రకటించింది. యాపిల్ టీవీ+, (Apple TV+) యాపిల్ మ్యూజిక్ (Apple Music) సేవలను అందించడానికి భారతీ ఎయిర్టెల్, యాపిల్ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. రూ.999తో ప్రారంభమయ్యే ప్లాన్లపై హోమ్ వై-ఫై వినియోగదారులందరికీ యాపిల్ టీవీ + కంటెంట్ ఉచితంగా లభిస్తుందని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది.ఇదే కాకుండా రూ .999 నుండి ప్రారంభమయ్యే ప్లాన్లపై పోస్ట్పెయిడ్ యూజర్లు యాపిల్ టీవీ + సదుపాయాన్ని పొందవచ్చు. 6 నెలల పాటు యాపిల్ మ్యూజిక్ను ఉచితంగా ఆస్వాదించవచ్చు. ఇందులో భారతీయ సంగీతంతోపాటు విదేశీ మ్యూజిక్ లిస్టింగ్ కూడా ఉంటుంది. ఎలాంటి కస్టమర్లు ఈ ప్రయోజనాన్ని పొందబోతున్నారు.. ఇందు కోసం వారు ఏ రీఛార్జ్ ప్లాన్ ను ఎంచుకోవాలో తెలుసుకుందాం.యాపిల్ మ్యూజిక్ ఉచిత సబ్స్క్రిప్షన్ఈ భాగస్వామ్యం కింద వినియోగదారులు యాపిల్ టీవీ+లోని అన్ని ఒరిజినల్ సిరీస్లు, సినిమాలను ఎటువంటి ప్రకటనలు లేకుండా యాక్సెస్ చేయవచ్చు. వీటిలో టెడ్ లాస్సో, సెవెరెన్స్, ది మార్నింగ్ షో, స్లో హార్స్, సిలో, ష్రింకింగ్, డిస్క్లయిమర్ వంటి అవార్డ్ విన్నింగ్ హిట్ సిరీస్లు ఉన్నాయి. వీటితో పాటు వోల్ఫ్స్, ది గోర్జ్ వంటి కొత్త సినిమాలు కూడా ఉన్నాయి. ఇది కాకుండా వినియోగదారులకు 6 నెలల పాటు యాపిల్ మ్యూజిక్ సర్వీస్ కూడా ఉచితంగా లభిస్తుంది. యాపిల్ టీవీ+, యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ కోసం ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవసరం లేదు.బెనిఫిట్స్ ఈ ప్లాన్లలో..రూ.1,099, రూ.1,599, రూ.3,999 ఎయిర్టెల్ వైఫై ప్లాన్లను ఎంచుకున్న వారికి వరుసగా 350కి పైగా టీవీ ఛానళ్లు, 200 ఎంబీపీఎస్, 300 ఎంబీపీఎస్, 1 జీబీపీఎస్ స్పీడ్ లభిస్తుంది. ఈ కొత్త ఆఫర్తో ఎయిర్టెల్ ఎంటర్టైన్మెంట్ పోర్ట్ఫోలియో మరింత బలంగా మారింది. ఇది ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, జీ5, జియో హాట్స్టార్తో భాగస్వామ్యం కలిగి ఉంది. దేశంలో డిజిటల్ కంటెంట్ అందించే పెద్ద సంస్థలలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. -
జియో కొత్త ప్లాన్.. జియోహాట్స్టార్ ఫ్రీ
రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం కొత్త రూ.195 డేటా-ఓన్లీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్ డేటా యాడ్-ఆన్ వోచర్గా వస్తుంది. ఇది అదనపు డేటాతోపాటు జియోహాట్స్టార్ ఉచిత సబ్స్క్రిప్షన్ను కలిగి ఉంటుంది. ప్రత్యేక సబ్స్క్రిప్షన్ కొనుగోలు చేయకుండా జియోహాట్స్టార్లో లైవ్ క్రికెట్, ఇతర కంటెంట్ను వీక్షించాలనుకునే వారి కోసం ఈ ప్లాన్ను రూపొందించారు.రూ.195 ప్లాన్ ప్రయోజనాలురూ.195 డేటా ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 15GB డేటాను అందిస్తుంది. క్రీడలు, వినోద ప్రియులకు ఇది తగిన ఎంపికగా ఉంటుంది. ఇతర ప్రామాణిక రీఛార్జ్ ప్లాన్ల మాదిరిగా ఈ ఆఫర్లో వాయిస్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. గుర్తించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో లభించే జియోహాట్స్టార్ సబ్స్క్రిప్షన్ 90 రోజుల మొబైల్ ప్లాన్ మాత్రమే. అంటే యూజర్లు జియోహాట్స్టార్ను మొబైల్లో మాత్రమే వీక్షించగలరు.రీచార్జ్ ఇలా..వినియోగదారులు ఈ ఆఫర్ను మైజియో (MyJio) యాప్, జియో వెబ్సైట్ లేదా అధీకృత జియో రిటైలర్ల ద్వారా పొందవచ్చు. రీఛార్జ్ ప్రక్రియ ఇతర జియో ప్రీపెయిడ్ ప్లాన్ల మాదిరిగానే ఉంటుంది. థర్డ్-పార్టీ రీఛార్జ్ ప్లాట్ఫామ్ల ద్వారా కూడా ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.మరో ప్లాన్రూ.195 డేటా ప్లాన్తోపాటు జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా వచ్చే మరో స్టాండర్డ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. అదే రూ.949 ప్లాన్. దీనికి 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. 2GB రోజువారీ డేటా, అపరిమిత 5G డేటా, 84 రోజుల పాటు జియో హాట్స్టార్ ఉచిత మొబైల్ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలను ఈ ప్లాన్ అందిస్తుంది. -
జియో హాట్స్టార్ ఫ్రీగా కావాలా?
రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్, జియోఫైబర్ ప్లాన్లను జియో హాట్స్టార్ (JioHotstar) సబ్స్క్రిప్షన్తో అప్డేట్ చేసింది. వీటిలో జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్తో ఒక కొత్త ప్లాన్ను తీసుకురాగా, డిస్నీ+ హాట్స్టార్కు బదులుగా జియోహాట్స్టార్ను చేర్చడానికి మరికొన్ని ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ జియోఫైబర్ ప్లాన్లను అప్డేట్ చేసింది.జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్తో జియో ప్రీపెయిడ్ ప్లాన్రిలయన్స్ జియో తన రూ.949 ప్రీపెయిడ్ ప్లాన్ను జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్తో అప్డేట్ చేసింది. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్, అపరిమిత 5G డేటా, రోజుకు 2GB 4G డేటాతో వస్తుంది. అదనంగా, ఇది జియో టీవీ, జియోక్లౌడ్తో పాటు 3 నెలల పాటు జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ను కలిగి ఉంటుంది. అయితే ఇందులో చేర్చిన జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ 'మొబైల్' ప్లాన్ అని గమనించడం ముఖ్యం.జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్తో జియోఫైబర్ ప్లాన్లుజియోఫైబర్ రూ.999 ప్లాన్: ఈ ప్లాన్ అపరిమిత డేటా, వాయిస్ కాలింగ్తో 150 Mbps వేగాన్ని అందిస్తుంది. అంతేకాకుండా వినియోగదారులు ఈ ప్లాన్తో అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్స్టార్తో పాటు 8 ఇతర ఓటీటీ సబ్స్క్రిప్షన్లను పొందుతారు. అలాగే ఈ ఆఫర్ ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ ప్లాన్లకు వర్తిస్తుంది.జియోఫైబర్ రూ.1,499 ప్లాన్: ఈ ప్లాన్ అపరిమిత డేటా, వాయిస్ కాలింగ్తో 300 Mbps వేగాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఈ ప్లాన్తో అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్స్టార్తో పాటు 8 ఇతర ఓటీటీ సబ్స్క్రిప్షన్లను అందుకోవచ్చు. ఈ ఆఫర్ ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ ప్లాన్లకు వర్తిస్తుంది.జియోఫైబర్ రూ.2,499 ప్లాన్: అపరిమిత డేటా , వాయిస్ కాలింగ్తో 500 Mbps వేగాన్ని అందిస్తుంది. దీంతోపాటు వినియోగదారులు ఈ ప్లాన్తో అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్స్టార్తో పాటు 8 ఇతర ఓటీటీ సబ్స్క్రిప్షన్లను ఆనందించవచ్చు. ఈ ఆఫర్ ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ ప్లాన్లకు వర్తిస్తుంది.రూ.3999, రూ.8499 ప్లాన్లు: అపరిమిత డేటా, వాయిస్ కాలింగ్తో 1 Gbps వేగాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, వినియోగదారులు ఈ ప్లాన్తో అమెజాన్ ప్రైమ్ లైట్, జియో హాట్స్టార్తో పాటు 8 ఇతర ఓటీటీ సబ్స్క్రిప్షన్లను పొందుతారు. ఈ ఆఫర్ ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ ప్లాన్లకు వర్తిస్తుంది.జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్తో జియో ఎయిర్ఫైబర్ ప్లాన్లుజియో ఎయిర్ ఫైబర్ రూ.599 ప్లాన్: 1000GB డేటా, 30Mbps వేగం, ఉచిత వాయిస్ కాలింగ్తో పాటు 800 టీవీ ఛానెల్లు, జియో హాట్ స్టార్ తో సహా మొత్తం 9 ఓటీటీలను అందిస్తుంది.జియో రూ.899, రూ.1199 ప్లాన్లు: 1000GB డేటా, 100Mbps వేగం, ఉచిత వాయిస్ కాలింగ్తో పాటు 800 టీవీ ఛానెల్లు, జియో హాట్స్టార్తో సహా మొత్తం 13 ఓటీటీలను అందిస్తుంది. -
ప్రైవేటు స్కూళ్లలో ‘ఉచిత’మెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించాలన్న చట్ట నిబంధన అమలుపై సందిగ్ధత నెలకొంది. విద్యా హక్కు చట్టంలోని ఈ నిబంధన అమలుచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపినప్పటికీ.. అందుకోసం ఇంకా కార్యాచరణ ప్రణాళిక మాత్రం రూపొందించలేదు. దీనిని ఎలా అమలు చేయాలనే అంశంపై అధ్యయనం చేస్తున్నామని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.మరోవైపు కొన్ని కార్పొరేట్ స్కూళ్లు వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు మొదలు పెట్టాయి. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లల్లో అడ్మిషన్లు ముగింపు దశకు చేరాయి. 25 శాతం ఉచితంపై తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని ఆ సంస్థలు అంటున్నాయి. ప్రభుత్వం ఫీజులను రీయింబర్స్ చేస్తే పేదలకు ఉచితంగా సీట్లు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. \ఎవరికి ఉచితం? రాష్ట్రంలో దాదాపు 10 వేలకుపైగా ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో 38 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం అనాథలు, వికలాంగులకు 5 శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 4, బీసీ, మైనారీ్ట, అల్పాదాయ వర్గాల పిల్లలకు 6 శాతం కలిపి మొత్తం 25 శాతం సీట్లను ఉచితంగా ఇవ్వాలి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధన అమలు తీరును విద్యాశాఖ పర్యవేక్షించాలి. స్థాయిని బట్టి ప్రైవేటు స్కూళ్లలో ప్రస్తుతం రూ.40 వేల నుంచి రూ.20 లక్షల వరకు వార్షిక ఫీజు వసూలు చేస్తున్నారు.రూ.40 వేల లోపు ఫీజులుండే ప్రైవేటు స్కూళ్లల్లో ఆశించిన మేర అడ్మిషన్లు జరగవు. కాబట్టి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ చేస్తే ఈ పథకం అమలుకు సిద్ధమేనని చెబుతున్నారు. కార్పొరేట్ స్కూళ్లు మాత్రం రూ.20 లక్షల ఫీజు లావాదేవీలను రికార్డుల్లో చూపించకుండా, స్కూల్ డెవలప్మెంట్ ఫీజుగా వసూలు చేస్తున్నాయి. వీటికి ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదు. ఉచిత సీట్లిస్తే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ చేసినా ట్యూషన్ ఫీజుగా వసూలు చేసే రూ.2 లక్షల లోపే వస్తుందని ఆ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర సిలబస్తో నడిచే సీబీఎస్సీ, ఐసీఎస్ఈ వంటి స్కూళ్లపై రాష్ట్రానికి అంతగా ఆధిపత్యం ఉండదని అధికారులు అంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో అమలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, మరో మూడు రాష్ట్రాల్లో మాత్రమే 25 శాతం ఉచిత సీట్ల కేటాయింపు అమలు జరగడం లేదని అధికారులు తెలిపారు. మిగతా రాష్ట్రాల్లో ఈ పథకం వివిధ మార్గాల్లో అమలవుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ చేస్తోంది. మరికొన్ని రాష్ట్రాల్లో ప్రైవేటు స్కూళ్లే స్వచ్ఛందంగా అమలు చేస్తున్నాయి. కాగా, విద్యాహక్కు చట్టం ప్రకారం ఆవాసాలకు కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నతపాఠశాల లేకపోతే ఆయా విద్యార్థులకు ప్రైవేట్ బడుల్లో 25 శాతం సీట్లను కేటాయించాల్సి ఉంటుందని కొన్ని ప్రైవేటు స్కూళ్లు వాదిస్తున్నాయి.అయితే, ఈ నిబంధనతో పనిలేదని విద్యాశాఖ చెబుతోంది. పథకం అమలుపై ఇటీవల ప్రభుత్వం నివేదిక కోరడంతో అధికారులు సమర్పించారు. 38 లక్షల్లో 25 శాతం మందికి ఉచితంగా సీట్లిస్తే దాదాపు 9 లక్షల మందికిపైగా విద్యార్థులు సీట్లు పొందుతారు. ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తే ఈ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాలి. ఇది ఆర్థికంగా గుదిబండ అవుతుందనే భావనతో ప్రభుత్వం ఉన్నదని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఫీజు రీయింబర్స్ చేయకుండా, ప్రైవేటు స్కూళ్లు సామాజిక బాధ్యతగా 25 శాతం ఉచితం అమలు చేసేలా చూడాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. -
హైదరాబాద్లో న్యూ ఇయర్ స్పెషల్: ఆటోలు, కార్లలో ఉచిత ప్రయాణం!
సాక్షి,హైదారబాద్ : నగర వాసులకు శుభవార్త. డిసెంబర్ 31 న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా తెలంగాణ ఫోర్ వీలర్స్ డ్రైవర్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలోని ప్రయాణికులకు ఉచిత రవాణా సదుపాయం అందించేందుకు సిద్ధమైంది.ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురవుతారని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫోర్ వీలర్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ సదుపాయాన్ని నగర వాసులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో 500 కార్లు 250 బైక్ టాక్సీలు అందుబాటులో ఉంటాయని, ప్రయాణికులే క్షేమమే లక్ష్యంగా ఉచిత రవాణా సదుపాయం అందుబాటులో తెచ్చినట్లు తెలంగాణ ఫోర్ వీలర్స్ డ్రైవర్ అసోసియేషన్ నిర్వాహకులు తెలిపారు. రేపు రాత్రి 10 గంటల నుంచి అర్దరాత్రి 1 గంట వరకు ఉచిత రవాణా సదుపాయం అందుబాటులో ఉండనుంది.మరోవైపు,న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా మంగళవారం(రేపు)హైదరాబాద్లో అర్దరాత్రి వరకు మెట్రో రైల్ సేవలు కొనసాగనున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం రేపు అర్ధరాత్రి 12:30 కి చివరి రైలు స్టేషన్ నుండి బయలుదేరి 1.15 వరకు చివరి స్టేజి వరకు అందుబాటులో ఉండనుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేందుకు మెట్రో రైలు విభాగం సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మంగళవారం రాత్రి 11గంటల నుండి ఉదయం 5గంటల వరకు వాహనాల పోకల్ని నిషేధిస్తూ ఓఆర్ఆర్,ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. భారీ వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. టాక్సీ , ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ తప్పనిసరి. బార్లు, పబ్బులు,క్లబ్లు నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపకుండా చూడాల్సిన బాధ్యత యజమానులదేనని, మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని,మైనర్ డ్రైవింగ్ చెస్తే వాహనాలు స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. పోలీసుల ఆంక్షలు రేపు రాత్రి 11నుండి జనవరి 1 ఉదయం వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు.న్యూఇయర్ వేడుకలపై మాదాపూర్ డీసీపీ వినీత్ సాక్షి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో భద్రత విషయంలో అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశాం.మాదాపూర్ జోన్లో 61 ఈవెంట్స్ జరగనున్నాయి. 43పబ్స్ ఉన్నాయి. 20 కమ్యూనిటీ ఈవెంట్స్ జరగనున్నాయి.నిర్వాహకులు తప్పని సరిగా సమయం, నిబంధనలు తప్పకుండా పాటించాలి. ఈవెంట్లో ఐడీకార్డ్లు తప్పని సరి.మైనర్లకి మద్యం సప్లయ్ చేయకూడదు. సౌండ్ ఎక్కువగా ఉండకూడదు.. స్థానికులను ఇబ్బందులు పెట్టొద్దు.ఎలాంటి ఇబ్బందులు లేకుండా న్యూఇయర్ వేడుకలు జరుపుకోవాలి.కెపాసిటీ మేరకు మాత్రమే కస్టమర్స్ ను అనుమతించాలి. ప్రతి ఈవెంట్స్ లో అన్నీ ఏర్పాట్లు నిర్వాహకులు చూసుకోవాలి. భద్రత ,పార్కింగ్, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండేలా చూడాలి. క్యాబ్, టాక్సీ,ఆటో డ్రైవర్లకు సూచనలు ఇచ్చాం. డ్రంక్ అండ్ డ్రైవ్ రాత్రంతా కొనసాగుతుంది. తాగి డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు. డ్రగ్స్ వినియోగంపై నిఘా ఉంటుంది.న్యూ ఇయర్ ఎంజాయ్ చెయ్యాలి కానీ ఇతరులకు ఇబ్బందులు కలిగించొద్దని విజ్ఞప్తి చేశారు. -
కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్: ఇవన్నీ ఉచితం..
ఇప్పుడు చాలామంది సినిమాలు, ఇతర వినోద కార్యక్రమాల కోసం వివిధ ఓటీటీ ప్లాట్ఫామ్లపై ఆధారపడతారు. అయితే దీని కోసం సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా ఇండియా పబ్లిక్ బ్రాడ్కాస్టర్.. ప్రసార భారతి ఓటీటీ ప్లాట్ఫామ్ తీసుకు వచ్చింది. ఇందులో కొన్ని కార్యక్రమాలు ఉచితం అంటూ ప్రకటించింది.గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ)లో ప్రసార భారతి కొత్త స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ 'వేవ్స్'ను ఆవిష్కరించింది. దీని ద్వారా రామాయణం, మహాభారతం వంటి వాటిని ఉచితంగా చూడవచ్చు. దీనిని ఆండ్రాయిడ్లో గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్లో యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.రామాయణ, మహాభారతం వంటి వాటితో పాటు.. రేడియో ప్రోగ్రామ్స్, గేమ్స్ వంటి వాటిని కూడా దీని ద్వారా ఆస్వాదించవచ్చు. ప్రస్తుతం ఈ వేవ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో 65 లైవ్ ఛానెల్స్ అందుబాటులో ఉన్నట్లు సమాచారం. తెలుగు, హిందీ, తమిళ వంటి 12 కంటే ఎక్కువ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ ప్లాట్ఫామ్ 10 కంటే ఎక్కువ కేటగిరీలలో కంటెంట్ అందిస్తోంది.ప్రసార భారతి కొత్త స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ 'వేవ్స్' కేవలం పెద్ద వారికి మాత్రమే కాకుండా.. పిల్లల కోసం కూడా చోటా భీమ్, అక్బర్ బీర్బల్, మ్యూజిక్ షోలు వంటి అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో అయోధ్య నుంచి రామ్ లల్లా హారతి లైవ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ వంటి ప్రత్యక్ష లైవ్ ఈవెంట్లను కూడా చూడవచ్చు. కొన్ని కార్యక్రమాలకు మినహా ఇతర కార్యక్రమాలకు డబ్బు చెల్లించి ప్లాన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.WAVES is finally here!Explore WAVES, the new OTT platform by Prasar Bharati, for FREE. Stream old Doordarshan favourites like Ramayan and Mahabharat and the latest releases like Fauji 2.O. What’s more? You can now listen to radio programs & devotional songs, read books, play… pic.twitter.com/MwBOZpuIKc— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) November 20, 2024 -
ఇంటెల్ ఉద్యోగులకు గుడ్న్యూస్.. ఆ సౌకర్యాలు మళ్లీ..
ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సిబ్బందికి ఉచితంగా కాఫీ, టీ వంటి పానీయాలు అందించే సౌకర్యాన్ని తిరిగి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. శ్రామికశక్తిని ఉత్తేజపరిచే ఈ నిర్ణయం అంతర్గత సందేశాల ద్వారా షేర్ చేసినట్లు తెలుస్తోంది.వ్యయ నియంత్రణ, నిర్వహణ సమస్యలతో సతమవుతున్న ఇంటెల్ దాదాపు ఏడాది తర్వాత తమ కార్యాలయ సంస్కృతిని మెరుగుపరచడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల రోజువారీ జీవితంలో చిన్న సౌకర్యాల ప్రాముఖ్యతను గుర్తిస్తున్నట్లు అంతర్గత సందేశంలో ఇంటెల్ పేర్కొంది."ఇంటెల్ ఇప్పటికీ ఖర్చు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, చిన్న సౌకర్యాలు మన దినచర్యలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మేము అర్థం చేసుకున్నాము. ఇది ఒక చిన్న అడుగు అని మాకు తెలుసు, కానీ మన కార్యాలయ సంస్కృతికి మద్దతు ఇవ్వడంలో ఇది అర్ధవంతమైనదని మేము ఆశిస్తున్నాము." అని వివరించింది.ఫ్రీ ఫ్రూట్స్కు నోఉచిత పానీయాల సౌకర్యాన్ని తిరిగి ప్రారంభిస్తున్నప్పటికీ, ఒకప్పుడు ఉద్యోగులకు అందుబాటులో ఉన్న ఉచితంగా పండ్లు అందించే సౌలభ్యాన్ని మాత్రం కంపెనీ పునఃప్రారంభించడం లేదు. కంపెనీ నిరంతర వ్యయ-తగ్గింపు ప్రయత్నాలలో భాగంగా ఈ వసతిని మళ్లీ కల్పించేందుకు ఇంటెల్ సిద్ధపడలేదు. -
మాట నిలబెట్టుకున్న టాలీవుడ్ హీరో.. చెప్పిన పని చేశాడు!
టాలీవుడ్ యంగ్ హీరో ప్రస్తుతం క మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. 1970వ దశకంలోని విలేజ్ బ్యాక్డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రానికి సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు. ఇందులో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు ఈ సినిమాని దీపావళి సందర్భంగా ఈ నెల 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు.అయితే కిరణ్ ఇటీవల లవ్ రెడ్డి అనే మూవీ ప్రీ రిలీజ్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానుల కోసం లవ్ రెడ్డి మూవీ షోలు ఉచితంగా వేస్తానని అభిమానులకు మాటిచ్చారు. అనుకున్నట్లుగానే ఇవాళ నాలుగు థియేటర్లలో లవ్ రెడ్డి సినిమా ఫ్రీ షోలు ప్రదర్శించారు. హైదరాబాద్ జీపీఆర్ మల్టిప్లెక్స్, వైజాగ్ శ్రీరామా థియేటర్ , తిరుపతిలో కృష్ణ తేజ థియేటర్, విజయవాడ స్వర్ణ మల్టిప్లెక్స్ ఉచితంగా సినిమాను వేశారు. ఈ సందర్భంగా లవ్ రెడ్డి మూవీ టీమ్ హీరో కిరణ్ అబ్బవరంకు కృతజ్ఞతలు తెలిపింది. మంచి సినిమాకు సపోర్ట్ గా నిలబడినందుకు ప్రశంసలు కురిపించింది.కాగా.. గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం "లవ్ రెడ్డి". ఈ సినిమాలో అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించారు. దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ రోజు థియేటర్స్లోకి వచ్చిన లవ్ రెడ్డి ఎమోషనల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ అందుకుంటోంది. As promised we have arranged 4 free shows.- Hyderabad : GPR Multiplex 7:45PM Show (Contact No : 8549955111)- Vizag : Srirama Theatre 6:30PM Show- Tirupathi - Krishna Teja Theatre 6:30Pm- Vijaywada - Swarna Multiplex 6:30PM Please go watch and show your support for all the…— Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 18, 2024 -
ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రిలో ఉచితంగా ఫుట్ స్క్రీనింగ్
హైదరాబాద్: ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి నెల రోజుల పాటు 500 మంది మధుమేహ బాధితులకు ఉచితంగా ఫుట్ స్క్రీనింగ్ పరీక్షలు చేయనుంది. మధుమేహ బాధితులకు కాళ్లు తొలగించాల్సిన అవసరం లేకుండా.. ముందుగానే ఫుట్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటే తగిన చికిత్సలతో నయం చేయవచ్చని ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి వాస్క్యులర్ సర్జరీ విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ జ్ఞానేశ్వర్ తెలిపారు.ఆస్పత్రి ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ జ్ఞానేశ్వర్ ఈ వివరాలు తెలిపారు. ఈ సేవలను వినియోగించుకోవాలనుకునేవారు 9010100536 నంబరుకు ఫోన్ చేయడం ద్వారా తమ పేర్లు నమోదుచేసుకోవచ్చు. సెప్టెంబరు 22 నుంచి నవంబరు 20వ తేదీ వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఈ ఆఫర్ ఉంటుంది. ఇంకా అదనపు పరీక్షలు అవసరమైతే వాటిమీద 50% రాయితీ వర్తిస్తుంది. ఈ పరీక్షలు చేయించుకోవడానికి మధుమేహ బాధితులు ఎవరైనా అర్హులే. అయితే తాజాగా మధుమేహం బయటపడినవారి కంటే నాలుగైదేళ్లుగా దీంతో బాధపడుతున్నవాళ్లకు అయితే వెంటనే బయటపడుతుంది. ఇప్పటికే కాళ్లలో కొంత ఇబ్బందులు ఉన్నవారు కూడా ఈ పరీక్షలు చేయించుకోవచ్చు. -
Uttar Pradesh: నేడు వందేభారత్ రైలులో ఉచిత ప్రయాణం
లక్నో: ఉత్తరప్రదేశ్లోని మీరట్-లక్నోల మధ్య నేటి నుంచి వందేభారత్ రైలు పరుగులు తీయనుంది. మీరట్-లక్నో-మీరట్(22490/22491) వందే భారత్ ఎక్స్ప్రెస్ ఛార్జీలు, రాకపోకల జాబితాను రైల్వేశాఖ విడుదల చేసింది.ఈరోజు (శనివారం) ఈ రైలు తొలిసారిగా పట్టాలు ఎక్కనుంది. నేడు అతిథి ప్రయాణికులకు రైల్వేశాఖ మీరట్-లక్నోల మధ్య ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. లక్నో-మీరట్(22491), మీరట్-లక్నో(22490) వందే భారత్ ఎక్స్ప్రెస్ల రెగ్యులర్ ఆపరేషన్ ఆదివారం నుండి ప్రారంభంకానుంది. శుక్రవారం ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఈ రైలు అప్డేట్ అయిన తర్వాత టికెట్ బుకింగ్ ప్రారంభమైంది. మీరట్-లక్నో వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించనున్నారు.బరేలీ జంక్షన్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ రైలు మీరట్-లక్నో మధ్య మొరాదాబాద్, బరేలీ జంక్షన్లలో మాత్రమే ఆగుతుంది. ఈ రైలుకు సంబంధించిన బుకింగ్ ప్రారంభమైన నేపధ్యంలో సెప్టెంబర్ 5 తర్వాత తేదీల ప్రయాణం కోసం సీట్లు వేగంగా బుక్ అవుతున్నాయి. ప్రస్తుతం బరేలీ జంక్షన్లో రైలుకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మీరట్-లక్నో వందే భారత్ మీరట్ నుండి ఉదయం 6:35 గంటలకు బయలుదేరి, 8:35 గంటలకు మొరాదాబాద్, 9:56 గంటలకు బరేలీ చేరుకుని మధ్యాహ్నం 1:45 గంటలకు లక్నో చేరుకుంటుంది. అలాగే లక్నో-మీరట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ లక్నో నుండి మధ్యాహ్నం 2:45 గంటలకు బయలుదేరి సాయంత్రం 6:02 గంటలకు బరేలీకి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి రాత్రి 7:32 గంటలకు మొరాదాబాద్, రాత్రి 10 గంటలకు మీరట్ చేరుకుంటుంది. -
నెట్ఫ్లిక్స్ ఫ్రీగా కావాలా? ఈ ప్లాన్లు ట్రై చేయండి..
ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్తో వచ్చే ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే.. ప్రధాన టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా రూ.199 విలువ చేసే నెట్ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ను ఉచితంగా అందిస్తున్నాయి.ఫ్రీ నెట్ఫ్లిక్స్ అందిస్తున్న ప్లాన్లు ఇవే..జియో రూ.1,299 ప్లాన్: ఈ ప్లాన్తో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత 5జీ డేటాతో 84 రోజుల పాటు (మొత్తం 168 జీబీ మొత్తం) రోజుకు 2 జీబీ డేటాను ఆస్వాదించవచ్చు.జియో రూ.1,799 ప్లాన్: 84 రోజుల పాటు (మొత్తం 252 జీబీ) 3 జీబీ రోజువారీ డేటాతో పాటు రూ .1,299 ప్లాన్ మాదిరిగానే అపరిమిత ప్రయోజనాలను పొందండి.వొడాఫోన్ ఐడియా రూ.1,198 ప్లాన్: ఈ ప్లాన్ మొత్తం 70 రోజుల పాటు 2 జీబీ రోజువారీ డేటాను అందిస్తుంది. అంటే మొత్తం 140 జీబీ. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి.వొడాఫోన్ ఐడియా రూ.1,599 ప్లాన్: ఈ ప్లాన్తో 84 రోజుల పాటు 2.5 జీబీ రోజువారీ డేటాను మొత్తంగా 210 జీబీ డేటాను పొందుతారు. ఇందులో అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లు కూడా ఉన్నాయి.ఎయిర్టెల్ రూ.1,798 ప్లాన్: ఈ ప్లాన్ 84 రోజుల పాటు రోజుకు 3 జీబీ డేటాను అందిస్తుంది. మొత్తం 252 జీబీ డేటా. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ 5జీ డేటా లభిస్తుంది. -
ఈ ఉచితం చాలా కాస్ట్లీ!
ఆక్స్ఫర్డ్ డిక్షనరీ చూసినా.. తెలుగు నిఘంటువులు,శబ్ద రత్నాకరం తిరగేసినా వాటిల్లో వాస్తవ అర్థాలే ఉంటాయి.కానీ సీఎం చంద్రబాబు డిక్షనరీ మాత్రం వేరే ఉంది. ప్రతి పదానికీ తనదైన అర్థాలు, నిర్వచనాలు ఉంటాయి! అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఎలాగంటే.. ఉచితం అంటారు.. కానీ దానికో ధర ఉందంటారు! ఇసుక ఉచితంగా ఇస్తామంటూనే ఊరికే ఏదీ రాదంటారు మరి!! ఉచితం అంటే టీడీపీ పెద్దల దృష్టిలో అమ్మకమే. రాష్ట్రవ్యాప్తంగా స్టాక్ యార్డుల వద్ద బోర్డు పెట్టి మరీ టన్నుల చొప్పున బహిరంగంగా విక్రయిస్తున్నా సరే అది ఉచితంగా ఇవ్వడమే!సీనరేజి ఫీజు, తవ్వకం, లోడింగ్, ఇతర పన్నులతోపాటు రవాణా చార్జీలు కూడా వినియోగదారుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. డబ్బులు చెల్లించి కొన్నా సరే ఇసుకను ఉచితంగా ఇస్తున్నారనే చెప్పాలి. లేదంటే సీఎం చంద్రబాబుకు కోపం వస్తుంది. ‘ఉచితం అంటే మీ ఇంటికి నేనే ఫ్రీగా తీసుకొచ్చి ఇవ్వాలా?’ అని ఎదురుదాడి చేస్తారు. డబ్బులిచ్చి కొంటున్నాం..కదా అని ఎవరైనా వినియోగదారుడు ఉచితం కాదని చెబితే టీడీపీ శ్రేణులు చితకబాదినా దిక్కుండదు. ఎందుకంటే అది టీడీపీ సర్కారు ఉచిత విక్రయ పథకం కాబట్టి! – సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్పల్నాడులో పచ్చనేతలు చెప్పిందే ధరమాచర్లలో.. 30,000పల్నాడు జిల్లాలో ఇసుక అక్రమ డంప్లు పెద్ద ఎత్తున ఉన్నాయి.కృష్ణానది, గుండ్లకమ్మ, వాగుల నుంచి అక్రమంగా ఇసుకను తరలించి డంపింగ్ యార్డులలో నిల్వ ఉంచారు. ఇటీవల వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం తలర్లపల్లిలో గుండ్లకమ్మ వాగు నుంచి టీడీపీ నేతలు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ఓ ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మరణించిన విషయం తెలిసిందే. కొండమోడులో టన్ను ఇసుక ధర రూ.564లు ఉండగా, వినుకొండలో రూ.793లు ఉంది. వీటికి రవాణా చార్జీలు అదనం. తాళ్లాయపాలెం నుంచి గుంటూరుకు ఇసుక లారీ రావాలంటే రూ.15,000 పైనే అవుతోంది. మాచర్లలో 18 టన్నుల ఇసుక రవాణాతో కలిపి రూ.30వేలు అవుతోంది.కడపలో కొల్లగొట్టేస్తున్నారు.. మదనపల్లెలో..28,300వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో ఉచిత ఇసుక పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. టీడీపీ, బీజేపీ నేతలు పోటాపోటీగా ఉచిత ఇసుకను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంపీ సీఎం రమేష్ వర్గీయులకు పోటీగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు ఇసుక అక్రమ అమ్మకాలు సాగిస్తున్నారు. మదనపల్లెకు 18 టన్నుల ఇసుక తరలించాలంటే రవాణా చార్జీలతో కలిపి రూ.28,300 వరకు ఖర్చవుతోంది. జమ్మలమడుగుకు అయితే రూ.20వేలకు పైగా అవుతోంది. కృష్ణమ్మ చెంతనే ఉన్నా వేలల్లో ధరలుఎన్టీఆర్ జిల్లాలో..25,200ఉచిత ఇసుక పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. రవాణా, లోడింగ్, సీనరేజీ, జీఎస్టీ చార్జీల పేరుతో స్టాకు యార్డుల వద్ద ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ట్రక్కు బాడుగ రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఉంది. కంచికచర్ల మండలం మోగులూరు స్టాక్ పాయింట్ వద్ద అధికారులు నామమాత్రంగా ఉండగా, 20 మందికి పైగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఒకే బిల్లుపై రెండు వాహనాల్లో లోడ్ చేసి తరలిస్తున్నారు. పెనమలూరు పరిధిలోని చోడవరంలో 50–70 లారీలకు పైగా ఇసుక నిల్వలను అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒకరు లారీ రూ.16 వేల నుంచి రూ.20 వేల చొప్పున అమ్మేశారు. స్టాకు యార్డుల్లో నిల్వలు లేవంటూ కృత్రిమ కొరత సృష్టించి ట్రాక్టరు లోడ్ రూ.6 వేల నుంచి రూ.7 వేలకు విక్రయిస్తున్నారు. దూరప్రాంతాలకు 18 టన్నుల ఇసుక లారీలో తేవాలంటే బాడుగ, పన్నులతో కలిపి రూ.20,835 నుంచి రూ.25,200 అవుతుంది. కర్నూలులో కొనలేం..శ్రీశైలంలో 32,000కర్నూలు జిల్లాలో ఇసుక ధరలు భారీగా ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు పెట్టి దోచుకుంటున్నారు. మరోవైపు కౌతాళం మండలం గుడికంబాళి రీచ్లోని ఇసుకను టీడీపీ నాయకులు ఇతరుల ఆధార్ కార్డులతో కొల్లగొట్టి డంపింగ్ చేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో 18 టన్నులు ఇసుక గరిష్టంగా లారీ రవాణా చార్జీలతో కలిపి రూ.32వేలు వరకు అవుతోంది. ఉత్తరాంధ్రలో విచ్చలవిడిగా లూటీ.. పెందుర్తిలో.. 28,800ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉచితం పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా.. ఆచరణలో మాత్రం అధిక ధరలు వసూలు చేస్తున్నారు. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 18 టన్నుల ఇసుక రవాణా చార్జీలతో కలిపి రూ.20వేల నుంచి 28,800 వరకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఇసుక డిమాండ్ ఎక్కువగా ఉండే విశాఖపట్నం నగర పరిసర ప్రాంతాల్లో రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అనంతలో అతి కష్టం పెనుకొండలో..25,000అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం జుంజురంపల్లి సమీపంలో వేదావతి హగరి నది వద్ద ఇసుక విక్రయాలు ప్రారంభించారు. ఇక్కడి నుంచి అనంతపురం లాంటి దూర ప్రాంతాలకు తరలించాలంటే ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. శ్రీసత్యసాయి జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. పెనుకొండలో గరిష్టంగా 18టన్నుల ఇసుక రవాణాచార్జీలతో కలిపి రూ.25,000 వరకు అవుతోంది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో చిత్ర విచిత్రాలు.. నెల్లూరు రూరల్..23,000 ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా ఇసుక ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చిత్తూరు మండలం దిగువ మాసపల్లి రీచ్లో టన్నుకు రూ.289 సీనరేజీ కింద చెల్లిస్తూ అదనంగా రూ200 వసూలు చేస్తున్నారు. నగరి, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల ప్రజలు చిత్తూరు రూరల్ మండలంలో ఏర్పాటు చేసిన ఇసుక డిపో వద్దకు వచ్చి తీసుకెళ్లేందుకు రవాణా చార్జీలతో కలిపి ట్రాక్టర్ లోడు ఇసుక రూ.7,500 వరకు ఖర్చు అవుతోంది. కుప్పం, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల ప్రజలు గంగవరం మండలం బైరెడ్డిపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న ఇసుక డిపోనకు వచ్చి ఇసుక తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వారికి రవాణా ఖర్చులతో కలిపి ట్రాక్టర్ లోడు రూ.8,500 వరకు ఖర్చు అవుతోంది. గూడూరుకు వెళ్లేందుకు ట్రాక్టర్ ఇసుకకు రూ.9 వేల నుంచి రూ.10వేలు వ్యయం అవుతోంది. చంద్రగిరికి లారీ ఇసుక రవాణా చార్జీలతో కలిపి రూ.21,600 వరకు అవుతోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి 18 టన్నుల ఇసుక లారీ తీసుకువెళ్లేందుకు రూ.23,000 అవుతోంది. -
ఎట్టకేలకు స్వేచ్ఛ.. లండన్ జైలు నుంచి ‘వికీలీక్స్’ జులియన్ అసాంజే విడుదల
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేకు ఎట్టకేలకు స్వేచ్ఛ లభించింది. లండన్ బెల్మార్ష్ జైలు నుంచి సోమవారం ఆయన విడుదల అయ్యారు. అమెరికా గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఆయన నేరం ఒప్పుకున్నారని, ఈ మేరకు అమెరికా ప్రభుత్వంతో జరిగిన ఒప్పందంలో భాగంగానే ఆయన బెయిల్ మీద విడుదలయ్యారని తెలుస్తోంది. దాదాపు ఐదేళ్ల తర్వాత స్వేచ్ఛా వాయువు పీల్చిన ఆయనకు.. సొంత దేశం ఆస్ట్రేలియా వెళ్లేందుకు అనుమతి సైతం లభించినట్లు తెలుస్తోంది. జులియన్ అసాంజే(52) విడుదలను వికీలీక్స్ సంస్థ ఎక్స్ ద్వారా ధృవీకరించింది. ఈ మేరకు ఓ సుదీర్ఘమైన పోస్టును ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘‘జులియన్ అసాంజే ఇప్పుడు స్వేచ్ఛా జీవి. బెల్మార్ష్ జైలులో 1901 రోజులు ఆయన గడిపారు. జూన్ 24 ఉదయం ఆయన విడుదలయ్యారు. లండన్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అక్కడి నుంచి ఆయన స్టాన్స్టెడ్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు అని వికీలీక్స్ ఎక్స్ ద్వారా తెలియజేసింది. JULIAN ASSANGE IS FREEJulian Assange is free. He left Belmarsh maximum security prison on the morning of 24 June, after having spent 1901 days there. He was granted bail by the High Court in London and was released at Stansted airport during the afternoon, where he boarded a…— WikiLeaks (@wikileaks) June 24, 2024అంతేకాదు.. అసాంజే విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా మద్దతు ఇచ్చిన వాళ్లకు వికీలీక్స్ కృతజ్ఞతలు తెలియజేసింది. ఇందులో ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థల కృషి కూడా ఉందని తెలిపింది. అయితే అమెరికా న్యాయవిభాగంతో ఒప్పందం జరిగిందని ధృవీకరించిన వికీలీక్స్.. ఆ ఒప్పందం తాలుకా వివరాలు అధికారికంగా ఫైనలైజ్ కాలేదని తెలిపింది. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది. ఈలోపు.. ఉత్తర మరియానా దీవులలోని(US) కోర్టులో దాఖలైన పత్రాల సారాంశం సోమవారం రాత్రి బయటకు వచ్చింది. అందులో.. బ్రిటన్లో కస్టడీలో ఉన్న అసాంజే.. అమెరికా గూఢచర్య చట్టం ఉల్లంఘనకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించాడు అని ఉంది. అంతేకాదు ఆయనపై మోపబడ్డ 18 అభియోగాలన్నింటిని(17 అభియోగాలు+వికీలీక్స్పై కంప్యూటర్ దుర్వినియోగం కేసు).. ఒక్క కేసుగానే కోర్టు విచారించనున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం సైపన్ కోర్టు ఎదుట అసాంజే విచారణకు హాజరవుతారని, కోర్టు ఆయనకు 62 నెలల శిక్ష విధించనుందని, అయితే బ్రిటన్లో ఆయన అనుభవించిన శిక్షా కాలాన్ని ఇందులో నుంచి మినహాయిస్తారని, ఆపై ఆయన్ను నేరుగా ఆస్ట్రేలియా వెళ్లేందుకు అనుమతిస్తారన్నది ఆ పత్రాల సారాంశం. అసాంజేను అమెరికాకు అప్పగించే విషయంపై బ్రిటన్ కోర్టులో ఇప్పటికే విచారణ జరుగుతోంది. మరో రెండు వారాల్లో ఈ అభ్యర్థనపై విచారణ జరగాల్సి ఉంది. ఈలోపే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. #JulianAssange is free!!! After 14 years of being detained, today he left the UK. I can’t wait to give him a hug and go on a walk with him. pic.twitter.com/sPwVrt1U9y— Juan Passarelli (@JuanAndOnlyDude) June 25, 2024భావ స్వేచ్చప్రకటన ద్వారా ప్రపంచవ్యాప్తంగా హీరోగా జేజేలు అందుకున్న అసాంజే.. అమెరికా పాలిట మాత్రం విలన్గా తయారయ్యాడు. ఇరాక్, అఫ్గనిస్థాన్ యుద్ధాలకు సంబంధించిన అమెరికా రక్షణ రంగ రహస్య పత్రాలను 2010లో ఆయన స్థాపించిన విజిల్ బ్లోయర్ వెబ్సైట్ వికీలీక్స్ విడుదల చేసింది. ఏప్రిల్ 2010లో.. హెలికాప్టర్ నుంచి చిత్రీకరించిన బాగ్దాద్ వైమానిక దాడికి సంబంధించిన వీడియో విడుదల చేసింది. అమెరికా చేసిన ఈ దాడిలో ఇద్దరు రాయిటర్స్ జర్నలిస్టులు సహా అనేక మంది పౌరులు మరణించారు. జులై 2010 - వికీలీక్స్ 91,000కు పైగా పత్రాలను విడుదల చేసింది. వీటిలో ఎక్కువగా అఫ్గానిస్థాన్ యుద్ధానికి సంబంధించి అమెరికా రహస్య నివేదికలు ఉన్నాయి. అక్టోబర్ 2010లో ఇరాక్ యుద్ధాన్ని వివరించే 4,00,000 రహస్య సైనిక ఫైళ్లను వికీలీక్స్ విడుదల చేసింది.ఈ లీక్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో అమెరికా ఆయనపై అబియోగాలు మోపి.. విచారించేందుకు సిద్ధపడింది. అయితే ఈ అభియోగాలే ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మద్ధతుదారుల్ని తెచ్చిపెట్టింది. అగ్రరాజ్య సైన్యంలోని లోపాలను ఎత్తి చూపేందుకు ఆయన ఓ జర్నలిస్టులా వ్యవహరించాడంటూ ప్రపంచవ్యాప్తంగా అసాంజేకు అభిమానులు పెరిగిపోయారు. మరోవైపు అసాంజేపై అమెరికా మోపిన నేరాభియోగాల్ని వాక్ స్వేచ్చకు తీవ్ర ముప్పుగా మేధోవర్గం అభివర్ణించింది. అమెరికా మాత్రం చాలా సున్నితమైన సమాచారాన్ని చట్టవిరుద్ధంగా పొంది లీక్ చేశారని ఆరోపిస్తూ వచ్చింది. అమెరికా వాదనకు సైతం ఓ వర్గం నుంచి మద్ధతు లభించింది. చివరకు.. 14 ఏళ్ల తర్వాత.. ఒక డీల్ ప్రకారమే ఆయన్ని విడుదల చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.అసాంజే మీద కేసు ఏంటంటే..2010-11 మధ్య అమెరికా రక్షణ విభాగానికి సంబంధించిన అత్యంత గోప్యమైన విషయాల్ని వికీలీక్స్ బయటపెట్టింది. అందులో బాగ్దాద్పై జరిపిన వైమానిక దాడుల ఫుటేజీ కూడా ఉంది. అమెరికా ఆర్మీ ఇంటెలిజెన్స్ అనలిస్ట్(మాజీ) చెల్సీ మేనింగ్ సహకారంతోనే అసాంజే ఈ లీకులకు పాల్పడ్డారని తేలింది. దీంతో ఆమెకు 2013లో 35 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే 2017లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమె శిక్షను తగ్గించారు. 2023లో ఓ ఇంటర్వ్యూలో చెల్సీ మేనింగ్ఇక.. 2019లో డొనాల్డ్ ట్రంప్ పాలనలో అసాంజేపై 18 నేరాభియోగాలు నమోదు అయ్యాయి. అమెరికా గూఢాచర్య చట్టం ఉల్లంఘించారనేది ప్రధాన అభియోగం. ఐదేళ్లుగా జైల్లో.. ఈ వ్యవహారంతో.. అమెరికా నుంచి ప్రాణభయం ఉందన్న కారణంతో లండన్లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో కొంతకాలం ఆశ్రయం పొందారు. అదే సమయంలో స్వీడన్ నుంచి ఆయనపై లైంగిక దాడి విచారణ జరిగింది. ఇక ఈక్వెడార్ ఆశ్రయాన్ని విరమించుకున్న తర్వాత బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2011లో తన న్యాయ బృందంలో పని చేసిన మోరిస్తో అసాంజేకు చనువు పెరిగింది. లండన్లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో నివసిస్తున్నప్పుడే.. ఆమెతో డేటింగ్ చేసి ఇద్దరుపిల్లల్ని కన్నారాయన. అసాంజే 2019 ఏప్రిల్ నుంచి లండన్లోని బెల్మార్ష్ జైలులో ఉన్నారు. జైల్లోనే ఆయన స్టెల్లా మోరిస్ను వివాహం చేసుకోవడం గమనార్హం. 14 ఏళ్లుగా నాటకీయ పరిణామాలుపదేళ్ల క్రితం అమెరికా సైనిక, దౌత్య కార్యకలాపాలకు సంబంధించి వికీలీక్స్ సంస్థ బయటపెట్టిన రహస్యాలు సంచలనం సృష్టించాయి. అసాంజేపై గూఢచర్యానికి సంబంధించి 17 అభియోగాలు ఉన్నాయని.. వికీలీక్స్ సంస్థపై కంప్యూటర్ దుర్వినియోగం కేసు ఉందని అమెరికా వాదించింది. ఈ గూఢచర్యం కేసుకు సంబంధించి.. అతడిని తమ దేశానికి రప్పించాలని అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది కూడా. ఈ క్రమంలో ఆయనపై అభియోగాలు నిజమని తేలితే.. ఏకంగా 175 ఏళ్ల శిక్ష పడేది. అయితే అటు ఆస్ట్రేలియా విజ్ఞప్తులు, ఇటు పాత్రికేయ సమాజం ఒత్తిళ్లకు తలొగ్గి బైడెన్ ప్రభుత్వం చివరకు ఆయన విడుదలకు సిద్ధమయ్యింది. -
ఇక ఎంత దూరం తొక్కినా నొప్పి లేని సైక్లింగ్
‘వెబ్స్ రైడర్’.. ప్రపంచంలోని మొట్టమొదటి వర్చువల్ యాక్సిస్ సైకిల్ సీటు. ఇది మరింత సౌకర్యవంతమైన రైడ్ కోసం ఉపయోగపడుతుంది. సైకిల్కు గల ఈ సీటుపై కూర్చుని పెడల్ తొక్కుతున్నప్పుడు శరీర బరువును ఇరువైపులా సమానంగా పంపిణీ చేసి, దానిని తొక్కుతున్న వ్యక్తి శరీరంలోని సీటు దగ్గర ఏమాత్రం నొప్పి కలుగకుండా చూస్తుంది. ఆస్ట్రేలియన్ ఇంజనీర్ రాబిన్ మకాన్ మరింత సౌకర్యవంతమైన సైకిల్ సీటును రూపొందించేందుకు ప్రయత్నిస్తుండేవాడు. మానవ శరీరంలోని స్వాభావిక నొప్పి పాయింట్లను సైకిల్కు ఉన్న కుషనింగ్ సీటు భర్తీ చేయలేదనే విషయాన్ని గమనించిన ఆయన శరీర బరువును ఇరువైపులా సమానంగా పంపిణీ చేసే సైకిల్ సీటును రూపొందించే దిశగా ముందుకు సాగాడు.తాను రూపొందించిన నమూనాను ‘ఇన్వెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా’ అనే సంస్థకు తెలియజేశాడు. ఇది నూతన ఆవిష్కర్తలకు మద్దతును అందించే స్వచ్ఛంద సంస్థ. అక్కడ రాబిన్ మకాన్ పారిశ్రామిక డిజైనర్ ఫిలిప్ గుయిచార్డ్ను కలుసుకున్నాడు. వీరిద్దరూ ఈ రెండేళ్ల పాటు కష్టపడి ఈ డిజైన్ను మరింతగా మెరుగుపరిచారు. ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ విజిల్ సహకారంతో వారు రూపొందించిన ‘వెబ్స్ రైడర్’ మార్కెట్లోకి తీసుకువచ్చారు.ఈ వెబ్రైడర్ స్ప్లిట్ సైకిల్ సీటు వినియోగదారులకు అత్యంత సౌకర్యవంతమైన సైకిల్ రైడ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ సీటుపై కూర్చుని సైకిల్ తొక్కుతున్నప్పుడు రెండు కాళ్లు సమానంగా కలిలేందుకు వీలు కల్పిస్తుంది. సీటు ఎముకల నుండి తొడ ఎముకలకు ఒత్తిడిని బదిలీ చేసి, కాళ్లకు నొప్పి కలుగుకుండా చూస్తుందని రాబిన్ మకాన్ తెలిపారు. This revolutionaly bike seat design.[🎞️ AtaraxyBSC]pic.twitter.com/cLOV3MWmuw— Massimo (@Rainmaker1973) June 11, 2024 -
ఫ్రీ పాస్పోర్ట్, నో ట్యాక్స్.. ఓ దేశం బంపరాఫర్!
సెంట్రల్ అమెరికా దేశం ఎల్ సాల్వడార్ అత్యంత నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులకు బంపరాఫర్ ప్రకటించింది. తమ దేశానికి వచ్చే ఇలాంటివారికి 5,000 ఉచిత పాస్పోర్ట్లను అందించనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు నయీబ్ బుకెలే ప్రకటించారు. దేశ పాస్పోర్ట్ ప్రోగ్రామ్లో ఈ సంఖ్య 5 బిలియన్ డాలర్లకు ( సుమారు రూ. 41 వేల కోట్లు) సమానం అని ఆయన తెలిపారు. "విదేశాల నుండి అత్యంత నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యులు, కళాకారులు, తత్వవేత్తలకు 5,000 ఉచిత పాస్పోర్ట్లను (మా పాస్పోర్ట్ ప్రోగ్రామ్లో 5 బిలియన్ డాలర్లకు సమానం) అందిస్తున్నాం. ఇది మా జనాభాలో 0.1 శాతం కంటే తక్కువే కాబట్టి వారికి పూర్తి పౌర హోదాను కల్పిస్తాం. ఓటింగ్ హక్కులతో సహా ఎటువంటి సమస్య లేకుండా చూసుకుంటాం" అని ఎల్ సాల్వడార్ ప్రెసిడెంట్ బుకెలే ‘ఎక్స్’లో ద్వారా ప్రకటించారు. అంతేకాకుండా విదేశాల నుంచి తమ దేశానికి తరలివచ్చే కుటుంబాలకు, ఇక్కడ వారు సంపాదించుకునే ఆస్తులపై ఎటువంటి పన్నులు, సుంకాలు లేకుండా చూసుకుంటామన్నారు. దీని గురించి త్వరలో మరిన్ని వివరాల ప్రకటిస్తామని బుకెల్ వెల్లడించారు. We're offering 5,000 free passports (equivalent to $5 billion in our passport program) to highly skilled scientists, engineers, doctors, artists, and philosophers from abroad. This represents less than 0.1% of our population, so granting them full citizen status, including… — Nayib Bukele (@nayibbukele) April 6, 2024 -
ఇక ఉచితంగా మాట్లాడను!
కొందరు వ్యక్తులు తన సమయాన్ని అనవసరంగా వృథా చేస్తున్నారని, అలాంటి వ్యక్తులతో ఇక ఉచితంగా మాట్లాడననీ అంటున్నారు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్. అందుకే ఇకనుంచి ఎవరికైనా సమయం కేటాయించాలనుకుంటే అందుకు తగ్గట్టుగా ‘చార్జ్’ చేస్తానని అంటున్నారాయన. ఈ విషయంపై అనురాగ్ ఓ నోట్ను సోషల్ మీడియాలో షేర్ చేయగా, బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ‘‘కొంతమంది కొత్త వ్యక్తులకు సహాయం చేయాలనుకుని వారితో సమావేశమై నేను నా సమయాన్ని చాలా కోల్పోయాను. ఆ సమావేశాలు నాకు ఏ మాత్రం వర్కౌట్ కాలేదు కూడా. చెప్పాలంటే ఇలా చాలామందితో మాట్లాడి నేను అలసిపోయాను. ఈ విధంగా జీవితంలో చాలా సమయాన్ని కోల్పోయాను. సక్సెస్కు షార్ట్ కట్స్ వెతికేవారితో, తాము క్రియేటివ్ జీనియస్లా ఫీలయ్యే కొందరు వ్యక్తులతో ఇకపై నేను ఉచితంగా మాట్లాలనుకోవడం లేదు. నేను ఓ స్వచ్ఛంద సేవా సంస్థను కాదలచుకోలేదు. ఇకపై ఎవరైనా నన్ను కలవాలనుకుంటే పది నుంచి పదిహేను నిమిషాలు అయితే లక్ష రూపాయలు, 30 నిమిషాలకు రెండు లక్షలు, గంట అయితే ఐదు లక్షలు చెల్లించాలి. ఒకవేళ ఎవరైనా ఇలా డబ్బులు చెల్లించలేని పక్షంలో వారు నన్ను కలవడానికి ప్రయత్నించవద్దు’’ అని ఆ నోట్లో పేర్కొన్నారు అనురాగ్ కశ్యప్. ఇక బాలీవుడ్లో వచ్చిన ‘బ్లాక్ ఫ్రైడే’, ‘ముంబై కటింగ్’, ‘బాంబే టాకీస్’ వంటి సినిమాలకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. -
ఇసుక కొరత ఉండొద్దు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక అవసరాలకు ఇసుక కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణాకు అనుమతించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి మహేశ్దత్ ఎక్కా ఉత్తర్వులు జారీ చేశారు. తమ ఇళ్ల నిర్మాణాలు, స్థానిక అవసరాలకు ఇసుక రవాణాకోసం అనుమతి ఇవ్వాలని గ్రామీణుల నుంచి ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు అందాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో నిర్మాణాలకు ఆటంకం లేకుండా సమీపంలోని వాగులు, వంకల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవసరమున్న వారు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా ఉచితంగా ఇసుకను తెచ్చుకునేందుకు అనుమతిస్తారు. అయితే నిబంధనలను ఉల్లంఘిస్తే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. గతంలోనూ వెసులుబాటు.. తెలంగాణ రాష్ట్ర ఇసుక వెలికితీత విధానం 2015 నిబంధనల ప్రకారం గతంలోనూ స్థానిక వనరుల నుంచి గ్రామాల్లో అవసరాలకు ఇసుకను తెచ్చుకోవడానికి వెసులుబాటు కల్పించారు. అయితే విచ్చలవిడి ఇసుక వెలికితీతతో భూగర్భ జల వనరులు దెబ్బతింటాయనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం స్థానిక అవసరాల కోసం ఇసుక వెలికితీత, రవాణాపై కఠినంగా వ్యవహరించడంతోపాటు ఇసుక వెలికితీత, అనుమతుల బాధ్యతను స్థానిక తహసీల్దార్లు, గ్రామపంచాయతీలకు అప్పగించింది. ఇసుక వెలికితీతకు అనువైన ప్రాంతాలను గుర్తించేందుకు రెవెన్యూ, భూగర్భ జల వనరులు, పంచాయతీ విభాగాలతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి అనుమతులు తప్పనిసరి చేసింది. మరోవైపు స్థానిక అవసరాలకు ఉపయోగించే ఇసుకకు కూడా డబ్బులు చెల్లించాలనే విధానాన్ని అనుసరించింది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై స్థానిక అవసరాల కోసం ఎలాంటి అనుమతులు లేకుండా డబ్బు చెల్లించకుండానే ఇసుకను తీసుకు వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది. -
మీ పేరు అదేనా?.. అయితే ఆ సినిమా టికెట్ ఫ్రీ!
కేరింతఫేమ్ పార్వతీశం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మార్కెట్ మహాలక్ష్మి. వీఎస్ ముఖేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రణీకాన్వికా హీరోయిన్గా పరిచయమవుతోంది. ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండంతో చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. మార్కెట్ మహాలక్ష్మి మూవీ ప్రమోషన్లలో భాగంగా చిత్రబృందం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ పేరుతో ఉన్నవారికి 200 టికెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. మీ ఇంట్లో ఎవరైనా మహాలక్ష్మి అనే పేరుతో ఉన్నారా? అంటూ హీరో, హీరోయిన్స్ ఆడియన్స్ను ప్రశ్నించారు. ఆ పేరుతో ఎవరైనా ఉంటే వెంటనే మీ ఐడీ ప్రూఫ్ను 9005500559కి వాట్సాప్ చేయండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టాప్-200 మహాలక్ష్ములకు మార్కెట్ మహాలక్ష్మి టిక్కెట్స్ ఫ్రీగా ఇస్తున్నామని ప్రకటించారు. ఇంకెందుకు ఆలస్యం ఎవరైనా మహాలక్ష్ములు ఉంటే వెంటనే వాట్సాప్ చేసి టికెట్స్ ఉచితంగా పొందండి. కాగా.. ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by VS MUKKHESH (@vsmukkhesh) -
పంజాబ్లో ‘ఉచిత రేషన్’ ఎలా అందిస్తున్నారు?
రాబోయే లోక్సభ ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే పంజాబ్లోని భగవంత్ మాన్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలకు ఉచిత రేషన్ అందిస్తోంది. పంజాబ్లో ఇంటింటికీ ఉచిత రేషన్ పథకాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. ఈ పథకం కింద లబ్ధిదారులు ఇంటి వద్దనే రేషన్ అందుకోవచ్చు. మొదటి దశలో పంజాబ్లోని 25 లక్షల మందికి ఈ పథకం ప్రయోజనాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద ఒక్కొక్కరికి ఐదు కిలోల గోధుమ పిండిని ఉచితంగా అందజేస్తారు. మిగిలిన రేషన్ సరుకులను దఫదఫాలుగా అందించనున్నారు. పంజాబ్లో 38 లక్షల మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు. 20, 500 ప్రభుత్వ రేషన్ దుకాణాలు ఉన్నాయి. 1,500 మందికి పైగా యూత్ డెలివరీ ఏజెంట్లు ఉన్నారు. మొదటి దశలో 25 లక్షల కుటుంబాలకు రేషన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద లబ్ధిదారులు ప్రతి నెలా ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందుకోవచ్చు. లబ్ధిదారులు గోధుమపిండి స్థానంలో ఇతర అందుబాటులో ఉన్న ఆహార ధాన్యాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. పంజాబ్ ప్రభుత్వం ప్రారంభించిన ఇంటింటికీ రేషన్ పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారు లబ్ధిపొందవచ్చు. -
రైతులకు ఉచితంగా పంటల బీమా!
సాక్షి, హైదరాబాద్: రైతులు పైసా ఖర్చు చేయకుండా ప్రభుత్వమే ఉచితంగా పంటల బీమాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రాష్ట్రంలో రైతులు చెల్లించాల్సిన వాటా ప్రీమియంను ప్రభుత్వమే భరిస్తుందని వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం సీజన్ నుంచి ఫసల్ బీమా పథకాన్ని తిరిగి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రైతులు చెల్లించాల్సిన ప్రీమియం చాలా ఎక్కువగా ఉన్నందున గత ప్రభుత్వం ఈ బీమా పథకం నుంచి బయటకు వచ్చింది. దీంతో కొంతకాలంగా రైతులకు పంటల బీమా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కొత్త సర్కారు రైతుల ప్రీమియం వాటాను తామే చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిసింది. క్లస్టర్ల వారీగా అమలు వ్యవసాయ శాఖ వర్గాల అంచనా ప్రకారం..రాష్ట్ర రైతులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సీజన్లకు కలిపి దాదాపు రూ.2 వేల కోట్లు బీమా కంపెనీలకు ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అందులో రైతుల వాటా దాదాపు రూ.300 కోట్లు ఉంటుందని అంచనా. కాగా ఫసల్ బీమా పథకంలో చేరే విషయమై కేంద్ర ప్రభుత్వానికి త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయనుంది. పంటల బీమా పథకాన్ని క్లస్టర్ల వారీగా అమలు చేయనున్నారు. రాష్ట్రంలోని జిల్లాలను ఆరు క్లస్టర్లుగా విభజిస్తారు. కాగా బీమా పథకంలో ఉన్న వివిధ రకాల అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ పథకాన్ని అమలు చేస్తారు. అకాల వర్షాలతో నష్టపోతే ఒక రకమైన ప్రీమియం, కోత కోసి కల్లాల్లో ఉన్నప్పుడు వర్షం పడి నష్టం జరిగితే మరో రకమైన ప్రీమియం, దిగుబడి తక్కువ వస్తే అందుకు సంబంధించి మరో ప్రీమియం ఇలా వివిధ రకాలుగా పథకంలో వెసులుబాట్లు ఉన్నాయి. దీంతో ఏ క్లస్టర్లలో ఎటువంటి వాతావరణం ఉంటుందన్న దానికి అనుగుణంగా పథకాన్ని అమలు చేస్తారు. బీమా కంపెనీలు కోట్ చేసే ధరలను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మూడు నెలల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఎన్నికల కోడ్ రావడానికి ముందే పథకానికి సంబంధించి మార్గదర్శకాలు వెలువడనున్నాయి. -
సమస్యతో బాధపడుతున్నారా..! అయితే ఇలా చేయండి..
ప్రతీరోజూ బిజీ బిజీగా గడుపుతున్న జీవితంలో మనం మన ఆరోగ్యాన్ని పట్టించుకోము. అందులో మన ముఖము, జుట్టుల గురించి అయితే అసలు ధ్యాసే ఉండదు. పలువురితో సాగుతున్న క్రమంలో వీటివలన ఎన్నో సమస్యలను ఎదుర్కుంటూ ఉంటాం. ఇతరులతో హేళనలను భరిస్తూ ఉంటాం. ఇకపై ఇలాంటి వాటికి చెక్ పెట్టేలా ఈ అద్భుతమైన బ్యూటీ టిప్స్ మీకోసమే..! పిగ్నెంటేషన్... కీరాతో కట్అరకప్పు కీరదోస గుజ్జు తీసుకుని అందులో కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ను ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు ఆరనిచ్చిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి. కీరదోస పిగ్మెంటేషన్ సమస్యను దూరం చేస్తుంది. దీనివల్ల ముఖంపైన ముడతలు, సన్నని చారలు వంటి సమస్యలు దూరం అవుతాయి. బార్లీతో మేని మిలమిల ఒక పాత్రలో బార్లీ గింజల పొడిని తీసుకుని అందులో కొద్దికొద్దిగా గోరువెచ్చటి నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. ఈ పేస్ట్ను ముఖానికి ప్యాక్లా అప్లై చేయాలి. పావుగంట తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచు చేస్తే.. మచ్చలు, మృత కణాలు తొలగిపోయి చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. మిరియాలతో చుండ్రుకు చెక్! మిరియాలు ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు. అయితే ఆరోగ్యానికే కాదు జుట్టు సంరక్షణకు సైతం మిరియాలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా చుండ్రు సమస్యను చాలా సులువుగా పోగొట్టే సత్తా మిరియాలకు ఉంది. ఇందుకోసం ఒక ఉల్లిపాయను తీసుకుని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని మిక్సీజార్లో వేసి వీటితోపాటు టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి జ్యూస్ను సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్లో టేబుల్ స్పూన్ ఆవనూనె, టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. దీంతో ఒక హెయిర్ టానిక్ రెడీ అవుతుంది. ఈ టానిక్ను మాడుకు పట్టించి 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. గంట తర్వాత మైల్డ్షాంపూతో శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా చేస్తే ఎంత తీవ్రంగా ఉన్న చుండ్రు అయినా మాయం అవడంతోపాటు తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇవి చదవండి: మార్చి వచ్చింది.. బోండాం కొట్టు... -
అక్కడ ఉచిత ఇళ్లు దక్కేదెవరికి? కీలక సర్వే చేపట్టనున్న అదానీ..
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడలలో ఒకటైన ముంబై ధారావి గురించి చాలా మంది వినే ఉంటారు. 640 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ధారవి మురికివాడ పునరాభివృద్ధి ప్రాజెక్టును మహారాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అదానీ గ్రూప్ దక్కించుకుంది. గౌతమ్ అదానీ ద్వారా నియమించిన ఒక కంపెనీ రీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా ఫిబ్రవరి నుంచి ముంబైలోని ధారవి స్లమ్లోని 10 లక్షల మంది నివాసితుల డేటా, బయోమెట్రిక్లను సేకరించడం ప్రారంభిస్తుంది. పునరాభివృద్ధి చేసిన ప్రాంతంలో ఉచిత గృహాలను పొందేందుకు ధారావి నివాసితుల అర్హతను నిర్ణయించడంలో ఈ సర్వే కీలకం. వీరే అర్హులు ధారావిలో చివరి సారిగా 15 సంవత్సరాల క్రితం ఓ సర్వే నిర్వహించారు. ధారావిలో 2000 సంవత్సరానికి ముందు నుంచి నివసిస్తున్నవారు మాత్రమే ఉచిత గృహానికి అర్హులు. ఈ సర్వే ఆధారంగా దాదాపు 7 లక్షల మంది పునరాస ప్రయోజనానికి అర్హత కోల్పోయి రోడ్డున పడతారని ఇక్కడి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అదానీ నేతృత్వంలోని సంస్థ ధారవి నివాసితులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ఇంటింటికీ వెళ్లి పక్కాగా సర్వేను నిర్వహించనుంది. సర్వే బృందాలు ప్రతి ఇంటికి వెళ్లి బయోమెట్రిక్ డేటా సేకరిస్తాయని ప్రాజెక్ట్ను పర్యవేక్షిస్తున్న ధారావి రీడెవలప్మెంట్ అథారిటీ అధిపతి ఎస్వీఆర్ శ్రీనివాస్ తెలిపారు. అర్హత ఉన్న వారందరికీ ఇళ్లు రావాలని, అదే సమయంలో అనర్హులు ఎవరూ ప్రయోజనం పొందకూడదని ఆయన పేర్కొన్నారు. 9 నెలల్లో సర్వే పూర్తి ధారావిలో నివాసితుల సర్వే రెండు దశల్లో జరగనుంది. మొదటగా మూడు నుంచి నాలుగు వారాల్లో కొన్ని వందల మంది నివాసితులతో సర్వే పైలట్ దశ ప్రారంభం కానుంది. ఆ తర్వాత పూర్తి సర్వే తొమ్మిది నెలల వ్యవధిలో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఉచిత గృహాలు లేదా పునరావాసం కోసం నివాసితుల తుది అర్హతను ధారావి రీడెవలప్మెంట్ అథారిటీ నిర్ణయిస్తుంది. సర్వేతోపాటు మొత్తం ప్రాజెక్ట్ నిర్వహణకు త్వరలో అదనపు సిబ్బందిని నియమిస్తామని శ్రీనివాస్ తెలిపారు. -
26న మెట్రోలో వారికి ఉచిత ప్రయాణం!
దేశంలోని వివిధ ప్రాంతాల్లో జనవరి 26, గణతంత్ర దినోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ కోసం రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ-ఎన్సీఆర్లో నిఘా మరింతగా పెంచారు. ఢిల్లీలోని అన్ని కూడళ్లలో పోలీసులను మోహరించారు. వారు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా రిపబ్లిక్ డే పరేడ్ దృష్ట్యా, జనవరి 26న ఢిల్లీ మెట్రో రాకపోకల సమయాలను మార్చారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) తెలిపిన వివరాల ప్రకారం గణతంత్ర దినోత్సవం నాడు ఉదయం నాలుగు గంటల నుండి మెట్రో రైళ్లు నడవనున్నాయి. ప్రజలకు పరేడ్ను చూసే అవకాశం కల్పించేందుకు డీఎంఆర్సీ మెట్రో రాకపోకల్లో మార్పులు చేసింది. 26న ఉదయం 4 గంటల నుంచి అన్ని రూట్లలో మెట్రో అందుబాటులో ఉండనుంది. రిపబ్లిక్ డే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఈ-టికెట్లు లేదా ఈ-ఇన్విటేషన్లు కలిగినవారికి ప్రత్యేక కూపన్లు జారీ చేయనున్నట్లు డిఎంఆర్సి ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూజ్ దయాల్ సమాచారం తెలిపారు. ఈ కూపన్లు కలిగిన ప్రయాణికులు ‘కర్తవ్య పథ్’ వరకూ మెట్రోలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఉచిత ప్రయాణం కోసం ప్రయాణీకులు తమ ఈ-టికెట్, ఈ-ఇన్విటేషన్ లేదా ఫోటో గుర్తింపు కార్డును మెట్రో స్టేషన్లోని సంబంధిత కౌంటర్లలో చూపించవలసి ఉంటుంది. ఇదిలావుండగా రిపబ్లిక్ డే సందర్భంగా రాజధానిలోని పలు బస్సుల రూట్లను కూడా మార్చారు. జనవరి 26న విజయ్ చౌక్, రాజ్పథ్, ఇండియా గేట్, తిలక్ మార్గ్-బహదూర్ షా జఫర్ మార్గ్-ఢిల్లీ గేట్-నేతాజీ సుభాష్ మార్గ్లలోకి ఎలాంటి వాహనాన్ని అనుమతించరు. Delhi Metro services to commence at 4:00 Am on 26th January. pic.twitter.com/DnK6Ak1sHh — Delhi Metro Rail Corporation (@OfficialDMRC) January 24, 2024 -
పెట్రోల్ బంకుల్లో ఈ సేవలుండాల్సిందే..! లేదంటే..
కరీంనగర్: 'కరీంనగర్కు చెందిన శ్రీధర్ కమాన్కు సమీపంలోని ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకునేందుకు వెళ్లాడు. పెట్రోల్ పోసుకుని, బైక్ టైర్లో గాలి నింపాలని అక్కడి సిబ్బందిని కోరగా.. ఇక్కడ అలాంటివేమీ ఉండవని, గాలి పంపు పనిచేయడం లేదని సమాధానం ఇచ్చారు. చాలాబంకుల్లో గాలి నింపేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు నగరంలో ఉన్నాయి. గాలే కాదు.. చాలా బంకుల్లో మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయాలు కానరావడం లేదు.' పెట్రోల్ బంకుల్లో ఉచిత సేవలకు అనుచితంగా వ్యవహరిస్తున్నారా అయితే ఇది మీ కోసమే. బంకుల్లో టైర్లలో గాలి, తాగునీరు, మూత్రశాలలు, ఫోన్ సౌకర్యం తదితర సేవలు ఉచితం. వీటిపై అవగాహన లేకపోవడంతో డబ్బులు వసూలు చేస్తున్నారు. అసలే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే అదనపు వ్యయం భారంగా మారుతోంది. చిల్లరే కదా అనుకుంటే నెలకు రూ.కోట్లలోనే సామాన్యుల జేబుకు చిల్లు పడుతోంది. మనం చెల్లించే డబ్బులే.. డీజిల్ అయినా పెట్రోలైనా లీటరుపై మనం పెట్రోలు బంక్కు 4 నుంచి 6 పైసలు కేవలం మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణ కోసం చెల్లిస్తున్నాం. ప్రతీ బంకులో టాయిలెట్, మంచినీరు, ఎయిర్ ఫ్రీగా అందించాలి. ఇలా అందిస్తేనే పెట్రోల్ బంకు నిర్వహణకు అనుమతి దొరుకుతుంది. చాలామంది ప్రయాణంలో ఉన్నవారు టాయిలెట్ అర్జంట్ అయినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ కోసమో.. నిర్మానుష్య ప్రదేశాల కోసమో వెతుకుతారు. కానీ పెట్రోల్ బంకుకు వెళ్లరు. ఇక మీద ఎమర్జెన్సీ టైంలో దర్జాగా బంక్లకు వెళ్లండి. అది మన హక్కు. సగటున ఒక బంకులో రోజుకు 10 వేల లీటర్ల చమురు అమ్మితే.. టాయిలెట్ మెయింటనెన్స్ కాస్ట్ కింద ఆ బంకుకు వచ్చే ఆదాయం రోజుకు రూ.600 అంటే నెలకు రూ.18వేలు. జిల్లాలో ఉన్న అన్ని బంకుల్లో కలిపి వాహనదారులు రోజువారీగా చెల్లిస్తున్న మొత్తం రూ.14లక్షలకు పైనే. ఈ డబ్బుతో టాయిలెట్, మంచినీరు అందించాల్సిన బాధ్యత ఆయా బంక్లదే. పెట్రోల్ పంపుల వద్ద స్వచ్ఛమైన తాగునీటి వసతి ఉండాలి. ఇందుకోసం ఆర్వోయంత్రం, వాటర్ కూలర్, వాటర్ కనెక్షన్ స్వయంగా పొందాలి. ఏ బంకుల్లోనైనా తాగునీటి వసతి లేకపోతే చమురు మార్కెటింగ్ సంస్థకు ఫిర్యాదు చేయొచ్చు. స్వచ్ఛభారత్లో భాగంగా అన్ని పెట్రోలు, డీజిల్ బంకుల్లో వాహనదారులు, ప్రజల సౌకర్యార్థం శుభ్రతతో కూడిన మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉంచాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో చరవాణి వినియోగించుకునే సదుపాయం పంపుల్లో ఉండాల్సిందే. మీరు వెళ్లే మార్గంలో ఏదైనా సమస్యలో చిక్కుకుంటే మీ వద్ద మొబైల్ ఫోన్ అందుబాటులో లేకపోతే భయపడాల్సిన పనిలేదు. ఏదైనా పెట్రోలు పంపును సందర్శించడం ద్వారా మీరు ఏ నంబర్కు అయినా కాల్స్ చేసుకోవచ్చు. వాహన టైర్లలో గాలి నింపడానికి, గాలి శాతం తనిఖీ చేసుకోవడానికి యంత్రాన్ని అందుబాటులో ఉంచాలి. గాలి నింపేందుకు ఓ వ్యక్తిని అందుబాటులో ఉంచాలి. ఈ సౌకర్యం పూర్తిగా ఉచితంగా పొందొచ్చు. ఇటీవల గాలికి ప్రత్యామ్నాయంగా నైట్రోజన్ నింపుతున్నారు. ప్రతి బంకులో ఫిర్యాదు పెటె్ట్ లేదా రిజిష్టరు అందుబాటులో ఉంచాలి. అందులో వినియోగదారులు తమ ఫిర్యాదులను నమోదు చేయొ చ్చు. ప్రఽథమ చికిత్స కిట్ సౌకర్యం ప్రతీ బంకు వద్ద ఉండాలి. ప్రజలకు అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకునే వీలుంటుంది. చమురు నాణ్యత, ప్రమాణాలను తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉంటుంది. పెట్రోలు, డీజిల్ నాణ్యత, పరిమాణాన్ని తెలుసుకునేందుకు ఫిల్టర్ పేపర్లు అందుబాటులో ఉంచాలి. వాటి ద్వారా నాణ్యతను పరీక్షించుకునే హక్కు మనకు ఉంటుంది. పెట్రోలు బంకుల్లో సంస్థ పేరు, యజమాని పేరు, సంప్రదింపుల నంబర్లు కచ్చితంగా ఏర్పాటు చేయాలి. పంపు యజమాని వాటిని ప్రజలకు కనిపించే విధంగా బంకుల ఎదుట ఏర్పాటు చేయాలి. పెట్రోలు బంకుల్లో బంకులు తెరిచే, మూసివేసే వేళలు తప్పనిసరిగా రాసి ఉంచాలి. పెట్రోలు, డీజిల్ తీసుకున్న తరువాత వినియోగదారులు వాటికి సంబంధించిన బిల్లులు తప్పనిసరిగా పొందాలి. ఇలా ఫిర్యాదు చేయండి పెట్రోలు బంకుల్లో వినియోగదారులకు అందించాల్సిన సౌకర్యాలను నిర్వాహకులు విస్మరిస్తే సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ పోర్టల్ను సంప్రదించడం ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. బంకులో కచ్చితంగా ఉండాల్సిన ఫిర్యాదు రిజిష్టరులో లిఖితపూర్వకంగా ఫిర్యాదు నమోదు చేయొచ్చు. లేదంటే సంబంధిత చమురు సంస్థ సేల్స్ మేనేజర్ పేరు, చరవాణి నంబర్లకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఇవన్నీ అందుబాటులో లేనట్లైతే సంబంధిత తహసీల్దారు కార్యాలయంలో ఫిర్యాదు చేయొచ్చు. -
డిసెంబరు 22 నుండి వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి డిసెంబరు 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి తిరుపతిలోని 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 90 కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు మంజూరు చేస్తామని టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి తెలిపారు. కౌంటర్లను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జడ్పి హైస్కూల్లో కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కౌంటర్లలో 4 లక్షలకు పైగా సర్వదర్శనం టోకెన్ల కోటా పూర్తయ్యేవరకు మంజూరు చేస్తామని వెల్లడించారు. కౌంటర్ల వద్ద ప్రత్యేకంగా క్యూలైన్లు, బారీకేడ్లు ఏర్పాటు చేశామని, వేచి ఉండే భక్తులకు తాగునీరు, అల్పాహారం, టీ, కాఫీ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులను 24 గంటలు ముందు మాత్రమే తిరుమలకు అనుమతిస్తామన్నారు. దర్శన టోకెన్లు ఉన్నవారిని మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని, టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వెళ్లవచ్చు గానీ దర్శనానికి అనుమతించబడరని, ఈ విషయాలను కౌంటర్ల వద్ద అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పారు. తిరుపతిలోని అన్ని కౌంటర్ల వద్ద క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తామని, త్వద్వారా భక్తులు ఇతర ప్రాంతాల్లోని కౌంటర్లకు సులువుగా చేరుకోవడానికి వీలు కలుగుతుందని చెప్పారు. సర్వదర్శనం టోకెన్ల సమాచారం తెలుసుకుని ప్రణాళిక ప్రకారం తిరుమలకు వచ్చి స్వామివారి అనుగ్రహానికి పాత్రులుకావాలని కోరారు. జేఈవో వెంట ఎస్ఈలు శ్రీ సత్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర్లు, డెప్యూటీ ఈవోలు శ్రీ గోవిందరాజన్, శ్రీ సుబ్రమణ్యం, ఐటి జిఎం శ్రీ సందీప్, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్కుమార్, ఎవిఎస్వో శ్రీ నారాయణ తదితరులు ఉన్నారు. -
పాపం పోయినట్లు సర్టిఫికేట్ ఇచ్చే ఆలయం! ఎక్కడుందంటే..?
ఎన్నో రకాల ఆలయాలు వాటి విశేషాల గురించి విని ఉన్నాం. కానీ ఇలాంటి ఆలయం గురించి వినే ఉండే అవకాశమే లేదు. ఇలాంటివి కూడా ఉన్నాయా?.. అని షాకింగ్ అనిపిస్తుంటుంది కూడా. పాపం పోగొట్టుకోవాలని దేవాలయాలకు వెళ్తాం. అలాగే సిద్ధాంతులు చెప్పే పరిహారాలను కోసం తెగ డబ్బు వెచ్చిస్తాం కూడా. కొన్ని రకాల దానాలతో కూడా పాపాలు పోగొట్టుకునే యత్నం కూడా చేస్తాం. కానీ అవేమీ అక్కర్లేకుండా నేరుగా ఈ ఆలయానికి వెళ్లి పాపం పోగొట్టుకోవడమే కాకుండా పోయినట్లు ఓ ధ్రువీకరణ పత్రం కూడా తెచ్చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ ఖర్చుతోనే. ఆ ఆలయం ఎక్కడుందంటే.. అలాంటి ఆలయం రాజస్థాన్లోని ప్రతాప్గఢ్లో ఉంది. శతాబ్దాలుగా తీర్థయాత్రలకు ప్రసిద్ధిగాంచిన ఆలయం. దీనిని గిరిజనుల హరిద్వార్ అని కూడా పిలుస్తారు. ఆ ఆలయంలో ఎన్నో ఏళ్లుగా పాపం పోయినట్లు ధ్రువీకరణ పత్రాలను ఇచ్చే ఆచారం ఉంది. దీన్ని గౌతమేశ్వర్ మహాదేవ్ పాపమోచన తీర్థంగా పిలుస్తారు. ఇక్కడ మందాకిని పాప మోచిని గంగా కుండ్ అనే రిజర్వాయర్ ఉంది. దీనిలో స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ గుడిలో కేవలం రూ. 12/-లు చెల్లించి వాటర్ ట్యాంక్లో స్నానం చేస్తే పాపవిమోచన పత్రం ఇస్తారు. ఈ మేరకు ఆలయ పూజారి మాట్లాడుతూ..చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వస్తుంటారు. వారందరికీ పాప విమోచర ధృవీకరణ పత్రం కూడా ఇస్తామని తెలిపారు. హృదయంలో పాపం చేశామన్నా భావమే ఆయా భక్తులను ఇక్కడకు రప్పిస్తుంటుందని అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు. వ్యవసాయం చేస్తున్నప్పుడూ తెలిసో తెలియక మనవల్ల కొన్ని రకాల సరీసృపాలు, కీటకాలు చనిపోతాయి. దీని వల్ల కూడా ఒక జీవిని బాధించిన పాపం మనలని వెంటాడుతుంది. అందుకే చాలామంది రైతులు ఇక్కడకు వచ్చి స్వామిని దర్శించుకుని ఈ గంగా కుండ్లో స్నానాలు ఆచరించి సర్టిఫికేట్ని తీసుకుంటారని చెబుతున్నారు ప్రజలు. ప్రతి ఏడాది ఈ గౌతమేశ్వరాలయంలో దాదాపు 250 నుంచి 300 దాక పాప విమోచన ధృవీకరణ పత్రాలు ఇవ్వడం జరగుతుందని ఆలయ పూజారి తెలిపారు. ఈ ఆచారం దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కొనసాగుతున్నట్లు అక్కడి దేవాలయ అధికారులు చెబుతున్నారు. ప్రతి ఏడాది వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారని, కేవలం పాపం పోగొట్టుకోవడం కోసమే గాక పూజలు కూడా నిర్వహిస్తుంటారని అన్నారు. (చదవండి: ఆరేళ్లక్రితం తప్పిపోయిన బాలుడిని 'ఆ ఫేస్బుక్ సందేశం'.. కుటుంబం చెంతకు చేర్చింది!) -
సీఎం సొంతూళ్లో సంబరాలు... రెస్టారెంట్లో చాయ్ ఫ్రీ!
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణస్వీకారం చేయడంతో ఆయన సొంత ఊరు ఉజ్జయినిలో సంబరాలు అంబరాన్ని అంటాయి. మోహన్ యాదవ్ మద్దతుదారులు నగరాన్ని సీఎం అభినందనల పోస్టర్లతో నింపేశారు. మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి అయినందుకు అతని అభిమాని ఒకరు తన రెస్టారెంట్లో రోజంతా ఉచితంగా టీ పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారోత్సవం భోపాల్లో జరిగినప్పటికీ, ఉజ్జయినిలో పండుగ వాతావరణం కనిపించింది. మోహన్ యాదవ్ అభిమాని ఆశిష్ రాథోడ్.. ఘాస్ మండిలోని తన హరిఓమ్ రెస్టారెంట్లో అందరికీ ఉచితంగా టీ అందించారు. మన దేశ ప్రధాని ఒకనాడు టీ విక్రయించారని, మోహన్ యాదవ్ కూడా కష్టపడి ఈ స్థానానికి చేరుకున్నారని రాథోడ్ పేర్కొన్నారు. మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి కావడంతో నగర కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరిగాయాన్నారు. ఈ సంబరాల నేపధ్యంలో తాను 300 లీటర్ల పాలు వినియోగించి, టీ తయారు చేసి, నగరవాసులకు ఉచితంగా అందిస్తున్నానన్నారు. ఇది కూడా చదవండి: లౌడ్ స్పీకర్లు బ్యాన్.. మాంసం విక్రయాలపై మార్గదర్శకాలు! -
Generative AI: చాట్ జీపీటీ-4కు ప్రత్యామ్నాయాలు ఇవిగో...
చాట్జీపీటీ.. ఆన్లైన్ సెర్చ్ను కొత్త పుంతలు తొక్కించిన తాజా సంచలనం. మెయిళ్లు రాయడం మొదలుకొని కథలల్లడం వరకూ ఎన్నో పనులను చిటికెలో చక్కబెట్టేయగలదీ కృత్రిమ మేధ ఆధారిత టెక్నాలజీ. అయితే జీపీటీ 4ను వాడటం పూర్తిగా ఉచితం కాదు. కొంతవరకూ ఫ్రీగా వాడుకోవచ్చు కానీ.. ఆ తరువాత మాత్రం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మరి సమాచారం ఉచితంగా పొందాలంటే? ప్రత్యామ్నాయ మార్గాలు బోలెడున్నాయి. బింగ్ ఏఐ గూగుల్కు బదులుగా ఏఐ ఆధారిత సెర్చింజన్ బింగ్నూ వాడుకోవచ్చు. మైక్రోసాఫ్ట్కు చెందిన దీనిలో ఏఐ ఆధారిత జీపీటీ-4 కూడా ఉంది. దీని వెబ్సైట్లోకి వెళ్లి బింగ్ చాట్తో బోలెడన్ని విషయాలు తెలుసుకోవచ్చు. యాప్ రూపంలోనూ దీని సేవలను పొందొచ్చు. కంటెంట్ను సృష్టించుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. బింగ్లోని రైటింగ్ అసిస్టెంట్ సాయంతో మెయిళ్లు రాసుకోవచ్చు. సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లాలంటే ప్రయాణం సాఫీగా సాగటానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూను ఎదుర్కోవటానికి సన్నద్ధం కావొచ్చు. ఇక ఇమేజ్ జనరేటర్ ద్వారా ప్రాంప్ట్ను అందించి ఉచితంగా బొమ్మలను గీయించుకోవచ్చు. దీనిలోని ట్రాన్స్లేటర్ బోలెడన్ని భాషలను ఇట్టే అనువదిస్తుంది. ఇక ఏఐ ఆధారిత కోపైలట్ క్రెడబులిటీ ఉన్న సమాచారాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ సహాయంతో మన ఉద్దేశాన్ని అర్థం చేసుకొని, కచ్చితమైన సమాచారాన్ని ముందుంచుతుంది. మన ప్రాధాన్యాలు, గతంలో జరిపిన చర్చలను దృష్టిలో పెట్టుకొని వాటికి తగ్గట్టుగా స్పందిస్తుంది. మెర్లిన్ ఇదో క్రోమ్ చాట్జీపీటీ ఎక్స్టెన్షన్. ఏ వెబ్సైట్ మీదైనా యాక్సెస్ చేయొచ్చు. మెర్లిన్ను ఇన్స్టాల్ చేసుకొని, ఖాతాను ఓపెన్ చేస్తే చాలు. కంట్రోల్/ కమాండ్ ప్రాంప్ట్ రూపంలో ఆదేశాలు ఇస్తూ మనకు కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు. చిటికెలో బ్లాగులు, యూట్యూబు వీడియోలు, వెబ్సైట్ల సారాంశాన్ని ముందుంచుతుంది. సోషల్ మీడియా కంటెంట్నూ సృష్టించుకోవచ్చు. ఈమెయిళ్లు, కోడ్స్ రాసి పెడుతుంది. దీనిలోని చాట్జీపీటీ ప్లగిన్లు ఉత్పాదకత పెంచటానికి ఎంతగానో తోడ్పడతాయి. మెర్లిన్లోని కృత్రిమ మేధ ఎంతటి సంక్లిష్టమైన ప్రశ్నలకైనా సైడ్బార్లో సమాధానాలిస్తుంది. పోయ్ ఇది కోరాకు చెందిన ఏఐ యాప్. ఆంత్రోపోనిక్ సంస్థ రూపొందించిన క్లౌడ్ దగ్గరి నుంచి ఓపెన్ఏఐకి చెందిన జీపీటీ వరకు రకరకాల ఏఐ మోడళ్లను వాడుకోవటానికి వీలు కల్పిస్తుంది. ప్రశ్నలను సంధించి జవాబులు రాబట్టుకోవచ్చు. అత్యంత అధునాతన ఏఐ టెక్నాలజీ దీని సొంతం. అంతరాయాలులేని సంభాషణ, సృజనాత్మక కంటెంట్ను దృష్టిలో పెట్టుకొని పోయ్ను రూపొందించారు. దీని ఇంటర్ఫేస్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఏదైనా బాట్ లేదా ప్రాంప్ట్తో తేలికగా వాడుకోవచ్చు. ఇదీ చదవండి: ‘కనీసం రూ.100 చెల్లించలేకపోతున్నాం’.. మాకు వారితోనే పోటీ: సీఈఓ -
గృహజ్యోతి @ 3,431కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలోకి రాగానే గృహజ్యోతి పథకం కింద ఇళ్లకు 200 యూనిట్లలోపు విద్యుత్ను ఉచితంగా సరఫరా చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలుకు(అందరికీ వర్తింపజేస్తే) ఏటా రూ.3,431.03 కోట్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సి ఉంటుందని విద్యుత్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకు అందిస్తున్న సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలను కొనసాగిస్తూ అదనంగా ఈ మేరకు నిధులివ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. ► రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి డిస్కంలు సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక 2023–24లోని ఫారం–12 ప్రకారం రాష్ట్రంలో మొత్తం గృహ కేటగిరీ విద్యుత్ కనెక్షన్లు 1.20 కోట్లు కాగా, అందులో 1.05 కోట్ల కనెక్షన్లు నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ను మాత్రమే వినియోగిస్తున్నాయి. అంటే రాష్ట్రంలోని 87.9 శాతం గృహాలు నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ను వాడుతున్నాయి. ► ఇందులో అన్ని గృహాలూ నెలకు 200 యూనిట్ల విద్యుత్ను వినియోగించవు. కొన్ని గృహాలు 0–50 యూనిట్లలోపు, మరికొన్ని 51–100 యూనిట్లలోపు, ఇంకొన్ని గృహాలు 101–200 యూనిట్లలోపు విద్యుత్ను వాడుతున్నాయి. డిస్కంల లెక్కల ప్రకారం.. ఈ మూడు శ్లాబుల్లోని గృహాలకు 2023–24లో మొత్తం 9,021.95 మిలియన్ యూనిట్ల విద్యుత్ను సరఫరా చేయాల్సి ఉంటుంది. ► గృహ వినియోగదారులకు జారీ చేసే విద్యుత్ బిల్లుల్లో వాడిన విద్యుత్ మేరకు ఎనర్జీ చార్జీలతో పాటుగా మినిమమ్ చార్జీలు, ఫిక్స్డ్ చార్జీలు, కస్టమర్ చార్జీలను విధిస్తారు. ఈ నాలుగు రకాల చార్జీలు కలిపి 1.05 కోట్ల గృహ వినియోగదారులకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.3,431.03 కోట్ల విద్యుత్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు ఇవ్వాల్సి ఉంటుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా, కాళేశ్వరం వంటి ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లులు, కొన్ని వర్గాల గృహాలకు సబ్సిడీ విద్యుత్ సరఫరా కోసం.. ఏటా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు రూ.11 వేల కోట్లకు పైగా నిధులను సబ్సిడీగా అందజేస్తోంది. గృహజ్యోతి పథకం అమలుతో విద్యుత్ సబ్సిడీల భారం రూ.15 వేల కోట్లకు చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
చకచకా కరెంటు.. కుళాయి
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద నిర్మిస్తున్న పేదల ఇళ్లకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు చకచకా విద్యుత్, కుళాయి కనెక్షన్లను ఇస్తోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు పక్కా గృహయోగం కల్పించేందుకు 30.75లక్షల మంది మహిళల పేరిట విలువైన ఇంటి స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా 21.75 లక్షల (19.13 లక్షల సాధారణ, 2.62 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. గత నెల 12వ తేదీ నాటికి 7.42 లక్షల (5.85 లక్షల సాధారణ, 1.57 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేసింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్లు నిర్మిస్తున్న 17వేల కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఏకంగా రూ.32 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. 6,655 కాలనీల్లో విద్యుత్ పనులు పూర్తి పేదల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్న 9,414 వైఎస్సార్–జగనన్న కాలనీల్లో విద్యుత్ ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 6,655 కాలనీల్లో విద్యుత్ స్తంభాలు నాటడం, వైర్లు లాగడం, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పూర్తయింది. ఇక నిర్మాణం పూర్తయినవాటిలో 5,02,654 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. మిగిలిన ఇళ్లకు కనెక్షన్లు ఇస్తున్నారు. అదే విధంగా నిర్మాణం పూర్తయిన ఇళ్లన్నింటికీ తాగునీటి సదుపాయం కల్పించారు. 1.15 లక్షల ఇళ్లకు ఇంకుడు గుంతలు కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాలైన డ్రెయిన్లు, రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించాలంటే ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తికావాల్సి ఉంది. అలా కాకుండా ముందుగానే సదుపాయాలు కల్పిస్తే ఇళ్ల నిర్మాణ సమయంలో భారీ వాహనాల రాకపోకలు, ఇతర సందర్భాల్లో డ్రెయిన్లు, కాలువలు ధ్వంసమవుతాయి. అందువల్ల ప్రస్తుతం నిర్మాణం పూర్తయిన ఇళ్లకు తాత్కాలిక డ్రెయినేజీ అవసరాల కోసం ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 1,15,973 ఇళ్లకు ఇంకుడు గుంతలను నిర్మించారు. అదేవిధంగా వైఎస్సార్, జగనన్న కాలనీలకు స్వాగత ఆర్చ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. 2,394 కాలనీలకు ఆర్చ్ నిర్మాణ పనులకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం 510 చోట్ల పనులను ప్రారంభించగా, 28 చోట్ల ఆర్చ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన చోట్ల వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మరోవైపు నిర్మించిన ఇళ్లు అన్నింటికీ విద్యుత్, నీటి ఇంకుడు గుంతల ఏర్పాటు చేశారా.. లేదా.. అని ఆడిట్ నిర్వహించాలని ఇటీవల గృహ నిర్మాణ శాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. -
భారత్ మ్యాచ్ గెలిస్తే చాట్ ఫ్రీ!
ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య పోరు ప్రారంభమయ్యింది. ఈ మ్యాచ్పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. యూపీలోని అమేథీకి చెందిన ఒక చిరు తినుబండారాల వ్యాపారి ఫైనల్ మ్యాచ్లో భారత్ గెలిస్తే తాను స్థానికులకు చాట్ ఉచితంగా పంచుతానని ప్రకటించాడు. దీనిని సంబంధించిన ప్రకటనను కూడా దుకాణం వద్ద అతికించాడు. అమేథీలోని గౌరీగంజ్ ప్రాంతానికి చెందిన సురేంద్ర గుప్తాకు క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. క్రికెట్లో రాణిస్తూ జిల్లా స్థాయిలో వివిధ టోర్నమెంట్లలో కూడా ఆడాడు. సురేంద్ర తన దుకాణం వద్ద ఒక పోస్టర్ అతికించాడు. భారత్ వరల్డ్ కప్ మ్యాచ్ గెలిచిన తర్వాత సోమవారం ఉదయం 10 గంటల నుంచి తన వద్ద సరుకు ఉన్నంతవరకు, కస్టమర్ల నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోకుండా చాట్ ఉచితంగా పంపిణీ చేస్తానని ప్రకటించాడు. ఇది కూడా చదవండి: పులితో పెట్టుకున్న కోతి.. మరి ఏది గెలిచింది? -
విద్యార్థినులకు మెట్రో ప్రయాణం ఉచితం!
సాక్షి, హైదరాబాద్: విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తామని, ల్యాప్టాప్లిస్తామని అంటున్న కాంగ్రెస్ పార్టీ ఆ వర్గానికే మరో కీలక హామీ ఇవ్వబోతోంది. 14 ఏళ్లు నిండి, చదువుకుంటున్న బాలికలందరికీ మెట్రో ప్రయాణాన్ని ఉచితం చేస్తామని చెప్పబోతోంది. పదో తరగతి చదువుకుంటున్న బాలికల నుంచి పీహెచ్డీలు చేసే విద్యార్థినుల వరకు అన్ని స్థాయిల్లోని కళాశాలలు, యూనివర్సిటీల్లో చదివే వారికి ఈ సౌకర్యాన్ని వర్తింపజేస్తామని చెపుతోంది. ఈ మేరకు తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీలను పొందుపర్చాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ‘ప్రజా మేనిఫెస్టో’పేరుతో తయారవుతున్న ఈ ప్రణాళిక కోసం కాంగ్రెస్ పార్టీ తన కసరత్తును పూర్తి చేసింది. మాజీ మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశమై అనేక అంశాలకు తుది రూపు తీసుకువచ్చింది. కమిటీ రూపొందించిన ముసాయిదా మేనిఫెస్టోను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే, పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు పరిశీలనకు పంపారని, ఈనెల 14న పార్టీ మేనిఫెస్టో అధికారికంగా విడుదలవుతుందని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి. అనివార్య కారణాల వల్ల వాయిదా పడితే ఒక రోజు ఆలస్యమవుతుందని అంటున్నాయి. ప్రజాకర్షకంగా రూపకల్పన.. ఈసారి ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించే పథకాలకు కాంగ్రెస్ పార్టీ అధిక ప్రాధాన్యమిస్తోంది. ఆరుగ్యారంటీల పేరుతో మహిళలు, వృద్ధులు, పేద వర్గాలకు చెందిన ఓట్లను రాబట్టుకునే పనిలో పడిన కాంగ్రెస్.. మేనిఫెస్టోలో కూడా అన్ని వర్గాల ఓట్లు సంపాదించేలా పథకాలను ప్రతిపాదిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న అమ్మ ఒడి తరహా పథకాన్ని ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ తరహాలో పెద్ద మొత్తంలో కాకుండా రూ.1,000 ఆర్థిక సాయం చేయాలనే ప్రతిపాదనపై మేనిఫెస్టో కమిటీ తీవ్ర కసరత్తు చేసింది. ఎంత మొత్తం ప్రతిపాదించాలన్న దానిపై తర్జనభర్జనలు ఓ కొలిక్కి రావడంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ పరిశీలనకు ఈ ప్రతిపాదనను పంపినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల వార్డు మెంబర్లకు నెలకు రూ.1,500 గౌరవవేతనం ఇస్తామనే హామీని కూడా కాంగ్రెస్ ఇవ్వబోతోంది. హైదరాబాద్పై ప్రత్యేక దృష్టి.. ఇక, విశ్వనగరం హైదరాబాద్ అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రత్యేక విభాగాన్ని రూపొందిస్తోంది. దినదినాభివృద్ధి చెందుతున్న నగరంలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక ప్రణాâళిక రూపొందిస్తోంది. ఇటు హైదరాబాద్తో పాటు అటు రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆకర్షణీయంగా ఉండేలా వాహన చలాన్లను ఏకకాలంలో రద్దు చేస్తామని ప్రకటించనుంది. హైదరాబాద్ చుట్టూ నాలుగువైపులా కార్పొరేట్ ఆసుపత్రులు, వరదల తాకిడి నుంచి బయటపడేందుకు లోతట్టు ప్రాంతాల్లో నిలిచే నీరు త్వరగా వెళ్లిపోవడం కోసం లింక్డ్ కెనాల్స్ ఏర్పాటు లాంటి ప్రతిపాదనలతో పాటు మూసీ ప్రక్షాళన అంశాన్ని ప్రధానాంశంగా ప్రస్తావించనుంది. మూసీ చుట్టూ రేడియల్ రోడ్ల నిర్మాణం, నల్లగొండ జిల్లా వరకు మూసీ కనెక్టివిటీ కారిడార్ ఏర్పాటు లాంటి అంశాలను కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించనుందని తెలుస్తోంది. -
80 కోట్లమంది పేదలకు ప్రయోజనం: ప్రధాని మోదీ కీలక ప్రకటన
కేంద్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు పొడిగించేందుకు బీజేపీ నేతృత్వంలోని రేంద్ర మోదీ సర్కార్ నిర్ణయించింది. తాజా నిర్ణయంతో ప్రభుత్వ అధికారుల అంచన ప్రకారం దాదాపు రూ. 2 లక్షల కోట్ల వ్యయం కానుంది. ఛత్తీస్గఢ్లో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ప్రకటించారు. తద్వారా 80 కోట్లమంది మరో ఐదేళ్లపాటు లబ్ధి పొందుతారని, అన్ని వర్గాలకు ఉచిత బియ్యం అందుతాయని ప్రధాని మోదీ వెల్లడించారు. మరోవైపు మహాదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా ‘అక్రమ డబ్బు'ను ఉపయోగిస్తోందంటూ కాంగ్రెస్పార్టీపై ప్రధాని విమర్శలు గుప్పించారు. ప్రజల్ని దోచుకొనే ఏ అవకాశాన్నీ కాంగ్రెస్ వదిలిపెట్టదు. చివరికి ఆన్లైన్బెట్టింగ్ యాప్ ‘మహదేవ్’ ను కూడా వదల్లేదంటూ ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ ప్రభుత్వంపై ప్రధాని విరుచుకు పడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నిందితులందరిపై చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఛత్తీస్గఢ్ను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటాం.. ప్రతి పైసా వారి నుంచి తీసుకుంటాం వారి జైలుకు పంపిస్తామన్నారు. కాంగ్రెస్ను ఓడించి బీజేపీని గెలిపించాలని ప్రధాని మోదీ కోరారు. (షాకింగ్ వీడియో: ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం, ఒకరు మృతి) కాగా 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలోపేద ప్రజలను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(PMGKAY)ను పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం లబ్దిదారులందరికీ, నెలకు ఉచితంగా ఒక్కో వ్యక్తికి 5 కేజీల ఆహార ధాన్యాలను అందిస్తోంది. దీన్ని జూలై 2013లో తీసుకొచ్చిన ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ (ఆహార భద్రత స్కీమ్) NFSAతో విలీనం చేసింది. ఈ పథకానికి అయ్యే ఖర్చును రాష్ట్రాలతో సంబంధం లేకుండా కేంద్రమే అందిస్తోంది. దీని ద్వారా 81.35 కోట్ల మందికి ఉచిత రేషన్ అందుతోంది. (కూరగాయల వ్యాపారి రూ.21 కోట్ల స్కాం: మాస్టర్ మైండ్ కోసం వేట) ఇటీవల, ఆహార మంత్రి, పీయూష్ గోయల్, PMGKAY కింద, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు (ఫేజ్ I నుండి ఫేజ్ VII వరకు మొత్తం) దాదాపు 1,118 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ప్రభుత్వం కేటాయించిందని పార్లమెంటుకు తెలియజేశారు. దీనికి సంబంధించి మొత్తం మంజూరైన బడ్జెట్ దాదాపు రూ. 3.91 లక్షల కోట్లు అని ఆయన పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. రెండు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో తొలి విడతలో 20 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 7న, రెండో విడతలో మిగతా 70 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరగనుంది. (డేంజర్ బెల్స్ : టెక్ కంపెనీల కీలక చర్యలు) -
ఆ టోకెన్తో థియేటర్లో జీవితాంతం ఉచితంగా సినిమాలు
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు. చాలామంది పాత వస్తువులను జాగ్రత్తగా దాచేందుకు ఇష్టపడతారు. అయితే కొన్నేళ్ల తర్వాత అవి బయట పడినప్పుడు వాటిని చూసినవారు తెగ ఆశ్యర్యపోతుంటారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకునేది దీనికి భిన్నం. 1766 నాటి ‘థియేటర్ టోకెన్’ ఇప్పుడు బ్రిటన్లో వేలం వేస్తున్నారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఆ టొకెన్ ఉంటే థియేటర్లో రోజూ సినిమాలను ఉచితంగా చూడవచ్చు. అయితే ఈ టోకెన్ కొనుగోలు చేయాలంటే భారీగా సొమ్ము చెల్లించాలివుంటుంది. గార్డియన్ తెలిపిన వివరాల ప్రకారం బ్రిటన్లోని బ్రిస్టల్ ఓల్డ్ విక్ థియేటర్ను నిర్మించివారు ముందుగా 50 ప్రత్యేకమైన టోకెన్లు తయారు చేశారు. ఈ టోకెన్లు కలిగినవారు థియేటర్లో ప్రదర్శించే ప్రతీ సినిమాను ఉచితంగా చూడవచ్చని ఆ టోకెన్లపై రాసి ఉంది. 250 ఏళ్లపాటు దాచివుంచిన ఈ టోకెన్లు ఇటీవల బయటపడ్డాయి. ఇప్పుడు వీటిని వేలం వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. థియేటర్ ప్రారంభ సమయంలో ఈ 50 టోకెన్లను తయారు చేశారు. కొందరు వాటిని వినియోగించారు. మరికొందరు విక్రయించారు. ఈ నేపధ్యంలో అనేక నకిలీ టోకెన్లు కూడా తయారయ్యాయట. విల్ట్షైర్లోని హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ వేలం హౌస్లో ఈ టోకెన్లు విక్రయిస్తున్నట్లు వేలం హౌస్ ప్రతినిధి మీడియాకు తెలిపారు. 1766లో థియేటర్ వాటాదారు విలియం జోన్స్కు టోకెన్ నంబర్ 35ను జారీ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. 1815 నాటికి ఇది ప్రముఖ బ్రిస్టల్ బ్లూ గ్లాస్ తయారీదారు అయిన జాన్ వాధమ్ దగ్గరకు చేరింది. ఈ టోకెన్ ఇప్పటికీ ఈ కుటుంబం వద్ద ఉంది. మరో టోకెన్ అష్టన్ కోర్ట్కు చెందిన స్మిత్ కుటుంబం దగ్గరుంది. వేలం నిర్వహిస్తున్న సంస్థ ఒక టోకెన్ ధరను 2,500 పౌండ్లు అంటే సుమారు రూ. 2.51 లక్షలుగా నిర్ణయించింది. బ్రిస్టల్ ఓల్డ్ విక్ థియేటర్ ప్రతినిధి మాట్లాడుతూ మేము ఈ టోకెన్ల వినియోగానికి అనుమతిస్తాం. వారికి జీవితాంతం ఉచితంగా సినిమాలు చూసే అవకాశాన్ని కల్పిస్తాం. కాగా ఈ థియేటర్ను ‘థియేటర్ రాయల్’ అని పిలుస్తారు దీనిని కింగ్ స్ట్రీట్లో 1764-1766 మధ్య కాలంలో నిర్మించారు. ఇది కూడా చూడండి: 21 ఏళ్లకు యాసిడ్ బాధితురాలికి న్యాయం! -
ఓటర్లను ‘ఉచిత’రీతినే గౌరవించుకుందాం
విదేశాలవాళ్లందరూ ఫ్రీ వల్చర్స్, మన దంతా ఫైన్ అండ్ రిఫైన్డ్ కల్చర్ అని గొప్పలు పోతుంటాం గానీ... నిజానికి మనదే నిజమైన ‘ఫ్రీ’ సంస్కృతి. ఇది వినగానే ఫెడేల్మంటూ గుండెలవీ బాదుకోనక్కర్లేదు. స్వేచ్ఛా, స్వాతంత్య్రాల్ని హాయిగా అనుభవించే ఫ్రీడమ్ కాదిది. ‘ఫ్రీగా వస్తే ఫినాయిలైనా’ అనే అద్భు త సంస్కృతి మనది. ఎన్నికలన్నప్పుడల్లా ‘అయ్యో... పింఛన్లంటూ, ఫ్రీలంటూ ఎడాపెడా పంచేస్తున్నారూ, దేశాన్ని వంచిస్తున్నారం’టూ శోకాలు పెడుతుంటారుగానీ అది సరి కాదు. ఉచితమనేది మన సంస్కృతిలో భాగమెలాగో గుర్తెరిగి... ఉచితరీతిన నడవాలి. మాంఛి హోటలుకెళ్లి డాబుగా బిర్యానీ ఏదో ఆర్డరిస్తామా! వాడిచ్చిన ‘నీంబూ, ప్యాజ్’ కాకుండా సిగ్గుపడకుండా ఎగస్ట్రా ‘ఫ్రీ’లడిగి మళ్లీ మళ్లీ తీసుకుంటుంటాం. అంతెందుకు... మొన్నెప్పుడో పంజాగుట్టలోని ఓ హోటల్లో ఫ్రీ రైతా (పెరుగు) అడిగినందుకు పంజా విసిరారు కొందరు బేరర్స్. బహుశా... ఉచితాలవీ ఇచ్చేసి ప్రజల్ని సోమరుల్ని చేయడం నచ్చని నికార్సైన కష్టజీవుల బ్యాచీ తాలూకు క్యాపిటలిస్టిక్, కార్పొరేటిక్, కన్సర్వేటిక్ (ఫ్లాగ్)‘బేరర్స్’ కాబోలు వాళ్లంతా. పాపం... అమాయకుడైన ఆ వినియోగదారుడు చచ్చిపోయి, ‘ఫ్రీ’ల కోసం ప్రాణాలర్పిం చిన త్యాగధనుల లిస్టులోకి చేరిపోయాడు. నిజానికి అందరి సానుభూతికీ ఎంతో అర్హుడతడు. ఎందుకంటే... హోటల్వాడు ఎంత ఫ్రీగా ఇచ్చి నా, లెక్కలుగట్టి చూస్తే... మొత్తం ఆ ఫ్రీ ఉల్లిముక్కలూ, నిమ్మచెక్కలూ, రైతా విలువ సదరు కస్టమరిచ్చే టిప్పు–డబ్బు కంటే చాలా చాలా తక్కువ. అదే లెక్క సోంపుకీ వర్తిస్తుంది. ఎంతగా ‘ఫిల్దీ రిచ్చు’ ఆసామైనా, ఎంతగా డబ్బున్న మొనగాడైనా... ఆ ఫ్రీ సోంపును ఆబగా, ఆత్రంగా తినేవాళ్లే అందరూ! కొందరైతే కక్కుర్తిగా కర్చిఫ్లోనో, టిష్యూలోనో పొట్లం కట్టుకుపోతారు. మోజంజాహి మార్కెట్టయినా, మోండా మార్కెట్టయినా, చింతలబస్తీ, చిల్కల్గూడా, చింతల్కుంటా మరెక్కడైనా... టమాటాలూ, పచ్చి మిరపకాయా, ఉల్లిగడ్డలూ, కూరగాయలూ కొన్నాక, కొసరడగని ఇల్లాలంటూ ఉంటుందా? ఫ్రీగా వస్తే సంతోషించని గృహిణులెవరైనా ఉంటారా? కేవలం మన నేటివ్స్యే కాదు, ఇక్కడే ఓటేసే ఉత్తర భారతీయులు సైతం ‘తర్కారీ కే సాథ్... ఫ్రీ ధనియా భీ’ అంటూ కూరగాయల్తో పాటూ కొసరి కొసరి కొత్తిమీర అడిగి మరీ తీసుకుంటుంటారు. అడక్కపోయినా వాళ్ళయినా ఇచ్చిపోతుంటారు. ఇన్ని ఉదాహరణల తర్వాత చెప్పేదొక్కటే... ‘ఫ్రీ’ కాన్సెప్టు ఇంతగా రక్తంలోకి ఇంకిపోయాక, ‘ఉచితాలం’టూ లేకుండా ఓటేద్దామా? ఓటేస్తామా? చివరగా ఒక్కమాట... సాక్షాత్తూ దేశ పాలకుల సొంత రాష్ట్రానికి చెందిన ‘సంజయ్ ఎఝావా’ అనే సామాజిక కార్యకర్తగారు... ఓ ‘ఆర్టీఐ’ అభ్యర్థన ద్వారా ఆర్బీఐని అడిగినప్పుడు వచ్చిన సమాధానం ప్రకారం... ఏలినవారి ఎన్డీయే ప్రభుత్వం కార్పొరేట్లకు ‘రైటాఫ్’ చేసిన మొత్తం రూ. 25 లక్షల కోట్లు! బ్యాంకు సొమ్ములెగ్గొట్టేసి సోగ్గా పారిపోయినవారి సొమ్ములకివి అదనం. కార్పొరేట్ ఇన్సెంటివ్లనీ ఇతర ప్రోత్సాహకాలనేవి మరో ఎక్స్ట్రా. ఇవన్నీ కలుపుకుంటే సంక్షేమానికి ఇచ్చేది... ఆ్రస్టిచ్గుడ్డు పక్కన ఆవగుండంత! -
ఉచితాలన్నీ.. అనుచితమేం కాదు
మేకల కల్యాణ్ చక్రవర్తి : ఎన్నికలు, రాజకీయాలు ఆర్థికాంశాలతోనే ముడిపడి ఉంటాయని.. ప్రజల ఆర్థిక ప్రయోనాలే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నికల ఎజెండాలు అవుతాయని ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ అందె సత్యం స్పష్టం చేశారు. అయితే రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలన్నీ అనుచితమేమీ కావని.. కొన్ని పైకి ఉచితంగానే కనిపిస్తున్నా ఉత్పత్తిని పెంచే సాధకాలుగా ఉపయోగపడతాయనే అభిప్రాయపడ్డారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం కన్నా.. ప్రజలను కొనుగోలు చేయడంపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఎన్నికలు, ప్రజల ఎజెండా, ఆర్థిక ప్రయోజనాలు, వాటి ప్రభావం, రాజకీయాల్లో వచ్చిన మౌలిక మార్పులపై అందె సత్యం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలివీ.. ఎన్నికలకు, ఆర్థిక ప్రయోజనాలకు అసలు సంబంధమేంటి? ఎన్నికల్లో ఒక భాగం రాజకీయాలైతే, మరోభాగం ఆర్థికఅంశాలు. ఎత్తుగడలు, పొత్తులు, విధానాలు రాజకీయ అంశాలైతే.. ఎన్నికల ప్రణాళికకు సంబంధించి నవి ఆర్థికాంశాలు. ఎన్నికల ప్రణాళికల్లో సంక్షేమం, ఉచితాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. సంక్షేమంతోపాటు ఉత్పత్తిని పెంచే విధానాలూ ఉంటాయి. ఓట్ల కోసం ఉచిత హామీలు ఉంటాయి. ఉచితాలు సరికాదనే చర్చపై మీ అభిప్రాయం? తమిళనాడులో మాదిరిగా మిక్సీలు, టీవీలు ఇస్తే అవి ఉచితాల కిందకు వస్తాయి. మన రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఆ దిశలో ఆలోచించడం లేదు. వారి ప్రణాళికల్లో అనుచితాలు లేవు. టీవీ ఇస్తే ప్రజలకు సంక్షేమమేమీ లేదు. ఉత్పత్తి రాదు. కేవలం వినోదం మాత్రమే వస్తుంది. అలాంటివి అనుచితం. అదే పేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకు సాయం చేయడం వారు అప్పుల బారినపడకుండా చూడటమే. వీటిని ఉచితాలుగా చూడొద్దు. ఇవి సాంఘిక సంక్షోభానికి పరిష్కార మార్గాల్లాంటివి. వ్యవసాయానికి ఆర్థిక సాయం మంచి అంశమేనా? ఏ దేశంలోనైనా వ్యవసాయం గిట్టుబాటుగా లేదు. చాలా దేశాలు వ్యవసాయాన్ని ప్రోత్సహించి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అమెరికాలో దశాబ్దకాలంగా రైతులకు అయ్యే ఖర్చులో సగ భాగం సబ్సిడీ ద్వారా ప్రభుత్వమే భరిస్తూ వస్తోంది. అయినా రైతుల సంఖ్య 60 లక్షల నుంచి 20 లక్షలకు తగ్గిందన్న విషయాన్ని గుర్తించాలి. వ్యవసాయానికి అన్నివిధాలా సాయం చేసి నిలబెట్టుకోవడం అవసరం. వ్యవసాయ సబ్సిడీలు, పెట్టుబడి సాయం, ఉచిత విద్యుత్, రుణమాఫీ కచ్చితంగా ఉత్పత్తి కోవలోకే వస్తాయి. ఆ ప్రణాళికల ఫలితం తెలంగాణలో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఆసరా పెన్షన్లు ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి. పేదల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఆరోగ్యశ్రీ పథకాలను విస్తృతం చేయడం ద్వారా మానవ వనరుల అభివృద్ధి జరుగుతుంది. విద్య, వైద్య రంగాల్లో ఖర్చుతో ప్రయోజనమేనా? విద్య, వైద్య రంగాల్లో ఖర్చు సమంజసమైనది. వైద్యంపై ఖర్చు జీవన ప్రమాణాలపై ప్రభావం చూపుతుంది. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ గురించి పార్టీలు మాట్లాడకపోవడం నిరుత్సాహాన్ని కలిగించేదే. ఉన్నత విద్యా రంగంలో డ్రాపౌట్స్ పెరుగుతున్నాయి. నేటికీ దేశంలో 30శాతం మంది మాత్రమే గ్రాడ్యుయేట్లు ఉన్నారు. కాబట్టి విద్యపై ఖర్చు అవసరం. కేరళలో ఆరోగ్య, విద్యా వనరుల కారణంగానే పేదరికం 0.7 శాతానికి తగ్గింది. పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టడం.. ఎన్నికల సమయంలో అభ్యర్థులు పెట్టే ఖర్చు కేరళ మినహా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. తెలంగాణలోనూ అసెంబ్లీ సెగ్మెంట్కు రూ.25 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చవుతుందన్న అంచనాలున్నాయి. ఇది ప్రజాభిప్రాయాన్ని హైజాక్ చేయడం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై మీ స్పందన? వ్యవస్థ పూర్తిగా వాణిజ్యపరమైనప్పుడు రాజకీయాలు కూడా వాణిజ్యపరం అవుతాయి. రాజకీయ పార్టీల నాయకులు గతంలో వ్యాపారుల దగ్గర ఆర్థిక సాయం తీసుకునేవారు. ఇప్పుడు రాజకీయ నాయకులే వ్యాపారులయ్యారు. ఈ లక్షణాన్నే ఎన్నికల్లోనూ ఉపయోగిస్తున్నారు. జమిలి ఎన్నికలతో... భారత్లో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మధ్యంతరంగా కూలిపోయినప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. జమిలి ఎన్నికల ప్రతిపాదన భవిష్యత్లో అధ్యక్ష తరహా పాలనకు దారితీయొచ్చు. ప్రజలు ఆర్థిక ప్రయోజనాల కోసం ఇలా ఎదురుచూడాల్సిందేనా? ఎప్పుడూ ప్రభుత్వాల వద్ద అడుక్కుని లబ్ధి పొందడమే ప్రజల పనిగా మారింది. భూపంపిణీతోపాటు సామాజిక సమస్యలను పరిష్కరించని కారణంగానే ఈ దుస్థితి. ప్రజల కొనుగోలు శక్తిని నిరంతరం పెంచే విధంగా కాకుండా ప్రజలను కొను గోలు చేసి రాజకీయ నాయకులు కుంభకోణాలకు పాల్పడుతున్నారు. అందుకే ఆర్థిక ప్రయోజనాల కోసం ఎన్నికల సమయంలో ప్రజలు పడిగాపులు కాయాల్సి వస్తోంది. నగదు బదిలీ పథకాలతో నష్టమా.. లాభమా? దేశంలో ఆకలి సూచీలు దిగజారిపోతున్నాయి. అంటే కింది స్థాయి పేదలకు ప్రభుత్వాల సాయం అవసరమే. పేదల కొనుగోలు శక్తి కారణంగా ప్రభుత్వానికి పన్నులు వస్తాయి. డిమాండ్, ఉత్పత్తి పెరుగుతాయి. ఇక మన దేశంలో ఉద్యోగులు, కార్మి కుల వాటా ఎక్కువ. పాత పింఛన్ ప్రభుత్వాలకు భారమనేది అభివృద్ధి నిరోధక ఆలోచన. బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా పాత పింఛన్ విధానాన్నే అమలు చేస్తున్నాయి. -
పేదల ఇళ్లల్లో.. ‘ఉచిత’ వెలుగులు
ఈ చిత్రంలో కనిపిస్తున్న వివాహిత పేరు.. జర్రిపోతుల పార్వతి. పెళ్లయిన పన్నెండేళ్ల నుంచి గున్నవానిపాలెం అగ్రహారంలో చిన్న ఇంటిలో ఉంటూ అవస్థలు పడుతోంది. సొంత ఇంటి కోసం గతంలో ఎంతో మంది నేతలకు, అధికారులకు విన్నవించినా ఫలితం శూన్యం. ఎట్టకేలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం అందడంతో సొంతింటి కలను నెరవేర్చుకుంది. విద్యుత్ శాఖ.. స్తంభాలు వేసి, వైర్లు లాగి ఆ ఇంటికి కనెక్షన్, మీటర్, బల్బులు ఉచితంగా అందించింది. ఎక్కడా ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వనవసరం లేకుండా పార్వతి సొంతింటిలో విద్యుత్ వెలుగులు ప్రసరించాయి. అమ్మఒడి సాయంతో పాటు తన పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్యను ఈ ప్రభుత్వం అందిస్తోందని పార్వతి సంతోషంతో చెబుతోంది. అనకాపల్లి జిల్లా లంకెలపాలెం విద్యుత్ సెక్షన్లోని మారేడుపూడి కాలనీ (బోణం గణేష్, అనకాపల్లి జిల్లా మారేడుపూడి కాలనీ నుంచి సాక్షి ప్రతినిధి) .. ఇలా ఒక్క పార్వతే కాదు.. ఎంతోమంది మహిళలు తమ కుటుంబంతో కలిసి జగనన్న ఇళ్లల్లో విద్యుత్ వెలుగుల మధ్య సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా అనకాపల్లి జిల్లా మారేడుపూడి కాలనీలో పర్యటించిన ‘సాక్షి’తో లబ్ధిదారులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీల్లో ఇళ్లకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యుత్ సౌకర్యాలను కల్పిస్తూ పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నారని, అందుకు తామే నిదర్శనమని చెబుతున్నారు. పచ్చని ప్రకృతి నడుమ, ఎతైన కొండల మధ్య ఉన్న మారేడుపూడి కాలనీలో 67 విద్యుత్ సర్విసులను అక్కడ కొత్తగా నిర్మించిన ఇళ్లకు అందించారు. ఇందుకోసం కాలనీ మొత్తం విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. స్తంభం నుంచి ఇంటి వరకు సర్విసు వైరును సమకూర్చారు. మీటర్తో సహా అన్ని పరికరాలు, సర్విసును ఉచితంగా ఇచ్చారు. ఆ విద్యుత్ సదుపాయంతో అక్కడి ప్రజలు తమ కొత్త ఇంటిలో రంగురంగుల ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసుకుని మురిసిపోతున్నారు. తమకు ఈ భాగ్యం కల్పించిన సీఎం వైఎస్ జగన్కు చెమర్చిన కళ్లతో కృతజ్ఞతలు చెబుతున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద తొలి దశలో పేదలకు ప్రభుత్వం నిరి్మస్తున్న లేఔట్లలో ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కంలు)ల ద్వారా ముందుగా 14,49,133 సర్విసులకు విద్యుత్ సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తోంది. ముఖ్యంగా లేఔట్లలో విద్యుత్ లైన్లు వేసి, పేదల ఇళ్లకు, బోర్లకు ఉచితంగా విద్యుత్ సర్విసులను అందిస్తోంది. ఈ పనులకు రూ.7,080 కోట్లు ఖర్చవుతోంది. ఇందులో మొదటి దశలో 10,741 లేఔట్లకు రూ.5,541.94 కోట్లతో విద్యుత్ సంస్థలు పనులు చేపట్టాయి. కోట్లాది రూపాయల ఖర్చుతో విద్యుత్ సౌకర్యం.. తూర్పు డిస్కంలో వాటర్ వర్క్స్కు సంబంధించి ఇప్పటివరకు 2,492 దరఖాస్తులు నమోదు కాగా రూ.50.36 కోట్లతో 2,386 బోర్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు అందించారు. లైన్ షిఫ్టింగ్ కోసం 76 ప్రాంతాలను గుర్తించారు. ఈ పనులకు రూ.1.85 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి పని మొదలుపెట్టారు. ఇక దక్షిణ డిస్కంలో రూ.49.17 కోట్లతో 2,555 బోర్లను విద్యుదీకరించారు. 435 ప్రాంతాల్లో లైన్లు మార్చడానికి రూ.9.73 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. జగనన్న కాలనీల్లో రెండు విధాలుగా విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. 550 ప్లాట్ల కంటే తక్కువ ఉన్న లేఔట్లకు ఓవర్ హెడ్, 550 ప్లాట్ల కంటే ఎక్కువగా ఉన్న లేఔట్లకు భూగర్భ విద్యుత్ను వేస్తున్నారు. ఇలా మొత్తం 389 లేఔట్లకు భూగర్భ, 9,678 లేఔట్లకు ఓవర్ హెడ్ విద్యుత్ అందిస్తున్నారు. ఓవర్ హెడ్ విద్యుదీకరణకు ఒక్కో ఇంటికి సగటున రూ.98,521 ఖర్చవుతుండగా, భూగర్భ విద్యుదీకరణకు ఒక్కో ఇంటికి సగటున రూ.1,32,284 ఖర్చవుతోంది. అందరం సంతోషంగా ఉన్నాం.. జగనన్న మాకు స్థలం ఇచ్చి.. ఇల్లు కట్టుకోవడానికి ఆరి్థక సాయం కూడా చేశారు. ఇంటికి విద్యుత్ సర్విసును కూడా ఉచితంగా అందించారు. మేం గతంలో పాతూరులో ఉమ్మడి కుటుంబంలో చాలా ఇబ్బందులు పడుతుండేవాళ్లం. ఇక్కడికి వచ్చాక నా భర్త, ఇద్దరు పిల్లలతో అందరం సంతోషంగా ఉన్నాం. –మౌనిక, మారేడుపూడి కాలనీ మా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.. పదేళ్లుగా సాలోపల్లిపాలెంలో అద్దెకు ఉన్నాం. నా భర్త, ఇద్దరు పిల్లలతో అద్దె ఇంటిలో అవస్థలు పడ్డాం. సీఎం జగనన్న చలువ వల్ల మాకు సొంతిల్లు వచి్చంది. వీధి లైట్లు వేశారు. మా ఇంటికి ఉచితంగా కరెంటు మీటర్, బల్బు ఇచ్చారు. మా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. –కనుమూరి దేవి, మారేడుపూడి కాలనీ ఉచితంగానే విద్యుత్ సర్విసులు.. పేదలందరికీ ఉచితంగా విద్యుత్ సర్విసులు అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దానికి తగ్గట్టుగానే జగనన్న కాలనీల్లో ఉచితంగా మీటర్లు అమర్చుతున్నాం. ఇందుకు అవసరమైన సబ్ స్టేషన్లు నిర్మించి విద్యుత్ స్తంభాలు, లైన్లు వేస్తున్నాం. –ఎల్.మహేంద్రనాథ్,ఎస్ఈ విశాఖ సర్కిల్, ఏపీఈపీడీసీఎల్ తాగునీటి అవసరాలకూ త్వరితగతిన విద్యుత్.. జగనన్న కాలనీల్లో నిరంతరం విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన విద్యుత్ పంపిణీ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం. అలాగే తాగునీటి అవసరాలకు బోర్లకు కూడా త్వరితగతిన విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నాం. కె.విజయానంద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంధనశాఖ -
పైసా లేకుండా జీవించడం ఎలా? 15 ఏళ్లుగా ‘మార్క్ బాయిల్’ ఏం చేస్తున్నాడు?
ప్రపంచంలో అధికశాతం మంది జీవితంలో వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించి, సుఖంగా జీవించాలని కలలు కంటారు. పేదరికంలో మగ్గిపోవాలని ఎవరూ కోరుకోరు. ఉన్నత చదువులు చదువుకుని, మంచి ఉద్యోగం చేస్తూ, అధికంగా సంపాదించగలిగే అర్హత కలిగిన ఒక వ్యక్తి భిన్నమైన నిర్ణయం తీసుకుని, ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ కథ యునైటెడ్ కింగ్డమ్ నివాసి మార్క్ బాయిల్కి సంబంధించినది. 2008లోనే బాయిల్ డబ్బును వినియోగించడం మానుకుని ఆనందంగా కాలం వెళ్లదీస్తున్నాడు. సాంకేతికతలాంటి విషయాల జోలికి వెళ్లకుండా ప్రకృతితో మమేకమై జీవించడాన్ని అలవర్చుకున్నాడు. మార్క్ బాయిల్.. బిజినెస్ అండ్ ఎకనామిక్స్లో డిగ్రీ తీసుకున్నాడు. చదువు పూర్తయిన వెంటనే బ్రిస్టల్లోని ఒక ఫుడ్ కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం సంపాదించాడు. జీవితంలో విజయం సాధించేందుకు ఏళ్ల తరబడి కష్టపడ్డాడు. అయితే 2007లో ఒకరోజు రాత్రి అకస్మాత్తుగా జరిగిన సంఘటన బాయిల్ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. హౌస్బోట్లో కూర్చున్న బాయిల్ అక్కడున్నవారు మాట్లాడుకున్న మాటలను విన్నాడు. అందరూ డబ్బు గురించే మాట్లాడుకుంటున్నారు. దీంతో అన్ని సమస్యలకు ఏకైక మూలం డబ్బు అని బాయిల్ గ్రహించాడు. అందుకే తాను డబ్బుకు అతీతంగా జీవించాలని, డబ్బు సంపాదించకూడదని, అలాగే ఖర్చు పెట్టకూడదని కఠినంగా నిర్ణయించుకున్నాడు. దీంతో మార్క్ బాయల్ తన ఖరీదైన హౌస్బోట్ను విక్రయించి, తన పాత కారవాన్లో నివసించడం మొదలుపెట్టాడు. డబ్బు లేకుండా జీవితాన్ని గడపసాగాడు. ఈ నేపధ్యంలో కొన్ని నెలలు పలు సమస్యలను ఎదుర్కొన్నాడు. టీ, కాఫీలతో పాటు ఇతర సౌకర్యాలను వదులుకున్నాడు. ప్రకృతి అందించేవాటిని మాత్రమే ఉపయోగించసాగాడు. ఇటువంటి ప్రకృతి సహజ జీవనం ప్రారంభించినప్పటి నుంచి తాను అనారోగ్యం బారిన పడలేదని, తనకు ఆరోగ్య రక్షణ అవసరం లేదని బాయిల్ తెలిపాడు. బాయిల్ జీవితాన్ని చూసిన చాలామంది అతనికి స్నేహితులుగా మారారు. తాను 2017లో టెక్నాలజీ జోలికి వెళ్లడాన్ని పూర్తిగా వదులుకున్నానని, సాంకేతికతతో ముడిపడిన పాత జీవితం కాకుండా, సహజసిద్దంగా ప్రకృతితో గడిపే భావి జీవితం గురించి నిరంతరం ఆలోచిస్తుంటానని బాయిల్ తెలిపాడు. ఇది కూడా చదవండి: ఎస్క్లేటర్పై నిషేధమున్న నగరం ఏది? గణాంకాలు ఎందుకు బెంబేలెత్తిస్తున్నాయి? -
ఇక గర్భిణులకు నిశ్చింత
సాక్షి, అమరావతి: నవ మాసాలు మోసి కన్న బిడ్డకు గ్రహణం మొర్రి, గుండెలో రంధ్రం, కాళ్లు, చేతులు వంకరగా ఉండటం, నయంకాని వ్యాధులుంటే ఆ తల్లి పడే బాధ వర్ణనాతీతం. ఇలా ఏ తల్లి క్షోభకు గురికాకుండా చర్యలు తీసుకోవడంలో భాగంగా అత్యాధునిక ‘టిఫా’ స్కానింగ్ సేవలను ఉచితంగా సీఎం జగన్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. గర్భంలో ఉండగానే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని, పిండం ఎదుగుదలలో లోపాలను గుర్తించేందుకు టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్(టిఫా) స్కాన్ దోహదపడుతుంది. ఖరీదైన ఈ స్కాన్ను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన గర్భిణులకు ఉచితంగా చేస్తోంది. ఈ ఏడాది మే నుంచి ఆరోగ్యశ్రీ కింద గర్భిణులకు ఒక టిఫా, రెండు అ్రల్టాసౌండ్ స్కాన్లు/మూడు అల్ట్రా సౌండ్ స్కాన్ సేవలను ప్రభుత్వం ప్రారంభించింది. మేనరికం వివాహాలు చేసుకున్న వారికి, బ్యాడ్ అబ్్రస్టెటిక్ హిస్టరీ(గర్భం దాల్చిన రోజు నుంచే వివిధ సమస్యలుండటం), క్రోమోజోమ్స్, మానసిక లోపాలు(మెంటల్ డిజబిలిటీ), సింగిల్ జీన్ డిజార్డర్స్, 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చిన వారికి, ఇతర సమస్యలున్న గర్భిణులకు వైద్యుడి సూచన మేరకు టిఫా స్కాన్ చేస్తున్నారు. పైసమస్యలేవీ లేని గర్భిణులకు మూడు అ్రల్టాసోనోగ్రామ్ స్కాన్లు చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ 1500 మందికి పైగా గర్భిణులు ఉచిత టిఫా, అల్ట్రా సౌండ్ స్కానింగ్ సేవలు పొందారు. టిఫా స్కానింగ్కు ప్రైవేట్గా అయితే రూ.1,500 నుంచి రూ.2,500 వరకూ ఖర్చవుతుంది. గర్భం దాల్చిన నాటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లే వరకూ మహిళలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోంది. ఆరోగ్యశ్రీ కింద ప్రసవించిన మహిళలకు విశ్రాంత సమయానికి భృతిగా రూ.5 వేల చొప్పున వైఎస్సార్ ఆసరా సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఇక 108 అంబులెన్స్ల ద్వారా ఉచితంగా ఆస్పత్రులకు తరలించడం, ప్రసవానంతరం వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల ద్వారా వారిని ఇంటికి చేరుస్తుండటం తెలిసిందే. ముందే గుర్తిస్తే నయమయ్యే అవకాశం మేనరికం వివాహాలు, జన్యు సంబంధిత లోపాలు, ఆలస్యంగా గర్భం దాల్చడం వంటి వివిధ కారణాలతో శిశువుల్లో లోపాలు తలెత్తుతుంటాయి. ఈ సమస్యలను ముందే గుర్తిస్తే అత్యధిక శాతం నయం చేయడానికి వీలుంటుంది. ఇలాంటి లోపాలను టిఫా స్కాన్తో గుర్తించే అవకాశముంటుంది. – డాక్టర్ అనిల్కుమార్, అదనపు సంచాలకులు, వైద్య, ఆరోగ్య శాఖ -
భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం
సాక్షి, అమరావతి: దేశంలోనూ, రాష్ట్రంలోనూ గడచిన ఐదేళ్లలో ఎన్నడూ లేనంత అత్యధిక స్థాయిలో సెప్టెంబర్ నెల విద్యుత్ వినియోగం నమోదైంది. జాతీయ స్థాయిలో డిమాండ్తో పోటీ పడుతున్నది మన రాష్ట్రం. 2019 సెప్టెంబర్ నెల మొత్తం వినియోగం 4,855.8 మిలియన్ యూనిట్లు కాగా రోజువారీ సగటు డిమాండ్ 161.86 మిలియన్ యూనిట్లుగా ఉంది. అదే ఈ ఏడాది అదే నెల మొత్తం డిమాండ్ 6,550.2 మిలియన్ యూనిట్లుకాగా, రోజువారీ సగటు వినియోగం 218.34 మిలియన్ యూనిట్లకు చేరింది.అంటే మొత్తం వినియోగం ఐదేళ్లలో 1,694.4 మిలియన్ యూనిట్లు, సగటు వినియోగం 56.48 మిలియన్ యూనిట్లు పెరిగింది. విద్యుత్ వినియోగం పెరుగుతున్నదంటే ఆ మేరకు రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు వృద్ధి చెందుతున్నాయని అర్థం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, పేదలకు ఉచిత, సబ్సిడీ విద్యుత్ను ఇవ్వడంతో పాటు వ్యవసాయానికి పూర్తిగా ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల కూడా విద్యుత్ వాడకం పెరిగింది. దీనివల్ల వ్యవసాయం సక్రమంగా జరిగి పంటలు సంవృద్ధి గా పండుతున్నాయి. వివిధ వర్గాల ప్రజలు తమ వృత్తులను నిర్వర్తిస్తూ, విద్యుత్ బిల్లుల భారం లేకుండా ఆర్థి కంగా స్థిరపడుతున్నారు. ఇవన్నీ రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. విదేశీ బొగ్గుకు అనుమతి పొడిగింపు.. దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ 142 బిలియన్ యూనిట్లకు చేరుకుంది. గడచిన ఐదేళ్లలో ఇదే గరిష్టం. ఆగస్టులో గరిష్ట విద్యుత్ డిమాండ్ 238 గిగావాట్లు జరిగితే సెప్టెంబరులో అది 240 గిగావాట్లకు చేరుకుంది. పెరుగుతున్న ఈ డిమాండ్ను తీర్చడానికి విద్యుత్ సంస్థలు స్వల్పకాలిక విద్యుత్ మార్కెట్లో తరచుగా విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. అయితే ఆగస్టులో బహిరంగ మార్కెట్లో యూనిట్ రూ.9.60 ఉండగా సెప్టెంబర్లో యూనిట్ రూ.9.37గా ఉంది. థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గాయి. రాష్ట్రంలోనూ, దేశంలోనూ వారం రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. దీంతో బొగ్గు కొరతను తీర్చేందుకు దిగుమతి చేసుకున్న బొగ్గు (విదేశీ బొగ్గు)ను సమకూర్చుకోవడానికి వచ్చే ఏడాది మార్చి 2024 వరకు కేంద్రం గడువు పొడిగించింది. -
ఓటీటీలో సూపర్హిట్ లవ్ స్టోరీ.. ఫ్రీగా చూసేయండి!
రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించిన చిత్రం 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ'. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించింది. అయితే ఇప్పటికే ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. అయితే కేవలం రెంట్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. తాజాగా ఉచితంగా చూసేందుకు మేకర్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జూలై 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకుముందు ఈ చిత్రం చూడాలంటే రూ.349 చెల్లించాల్సి ఉండగా.. ఇప్పుడు ఫ్రీగా చూసేయొచ్చు. కాగా.. ఈ చిత్రంలో ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ, తోట రాయ్ చౌదరి, ఆమీర్ బషీర్, చుర్ని గంగూలీ, అంజలి ఆనంద్ కీలక పాత్రలు పోషించారు. ప్రీతమ్ చక్రవర్తి సంగీతం అందించారు. ఓటీటీలో రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ మూవీలోని డిలీటెడ్ సన్నివేశాలను జోడించి మరి ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. దీంతో రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ మూవీ రన్ టైమ్ పది నిమిషాలకు పెరిగింది. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ పతాకంపై హిరో జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి సంయుక్తంగా నిర్మించారు. -
స్మార్ట్ మీటర్లతో రైతుపై పైసా భారం పడదు
సాక్షి, అమరావతి: రైతులకు పగటి పూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన పథకమే డాక్టర్ వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం. ఈ పధకం క్రింద రైతులు వ్యవసాయ విద్యుత్కు చెల్లించాల్సి న బిల్లుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, ఆ బిల్లు మొత్తాన్ని నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ప్రత్యేక రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తుందని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మాజనార్థనరెడ్డి, కె.సంతోషరావు చెప్పారు. స్మార్ట్ మీటర్లపై అపోహలను తొలగిస్తూ వాటి వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను సాంకేతిక అంశాల ఆధారంగా వారు ‘సాక్షి’ ప్రతి నిధికి వివరించారు. వారు తెలిపిన పూర్తి వివరాలు.. రైతులకు పైసా ఖర్చు లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం అమలుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్ ఎనర్జీ మీటర్లను అమర్చాలని ఆదేశించింది. వినియోగం ఆధారంగా వ్యవసాయ సబ్సిడీ మొత్తం రైతు బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుంది. ఆ తర్వాత అంతే మొత్తం డిస్కంలకు స్వయంచాలకంగా బదిలీ అవుతుంది. వ్యవసాయ సర్వీసులకు మీటర్ల ఖర్చును సబ్సిడీగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ పథకం ప్రస్తుతం ఉచిత విద్యుత్ పొందుతున్న అందరు రైతులకు (వ్యవసాయ వినియోగదారులకి) వర్తిస్తుంది. రైతులు జేబు నుండి ఒక్క పైసా చెల్లించవలసిన అవసరం లేదు. ప్రస్తుతం ఏ విధంగా ఉచిత విద్యుత్ పొందుతున్నారో, అదే విధంగా ఇక మీదట కూడా పొందుతారు. అలాగే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ వినియోగానికి ఎటువంటి పరిమితి లేదు. వినియోగించిన యూనిట్ల బిల్లు మొ త్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే వినియోగదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. మీటరు బిగించడానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. మీటరు మరమ్మతు ఖర్చులు పూర్తిగా విద్యుత్ కంపెనీలే భరిస్తాయి. మీటర్లు కాలిపోయినా, పనిచేయకపోయినా లేదా దొంగతనానికి గురైనా, వాటికి అయ్యే ఖర్చును విద్యుత్ కంపెనీలు భరిస్తాయి. మొదటిసారైనా, తర్వాత అయినా మొత్తం ఖర్చు విద్యుత్ కంపెనీలదే. రైతులపై పైసా భారం ఉండదు. రక్షణ పరికరాలతో లాభాలు వ్యవసాయ విద్యుత్ మీటర్తో పాటు ఏర్పాటు చేస్తున్న భద్రతా ఉపకరణాలతో అనేక ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉండే కెపాసిటర్, వో ల్టేజి హెచ్చు తగ్గులను నివారించి వ్యవసాయ విద్యుత్ మోటారు జీవితకాలాన్ని పెంచుతుంది. మోటారు పనితనం మెరుగవుతుంది. వ్యవసాయ విద్యుత్ మోటారు స్టార్టర్, మోటారు వైండింగ్, అనుసంధానించిన వైర్లలో వచ్చిన లోపాలతో మోటారు కాలిపోవడం గాని, షార్ట్ సర్క్యూట్తో ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ కావడం గాని జరగకుండా కాన్ఫిగరేషన్ కంట్రోల్ బోర్డ్ (సీసీబీ) కాపాడుతుంది. వర్షాలకు తడిసినప్పుడు ఇనుప బాక్స్ల ద్వారా కలిగే విద్యుత్ ప్రమాదాలను షీట్ మౌల్డింగ్ కాంపౌండ్ (ఎస్ఎంసీ) బాక్స్ నివారిస్తుంది. ఇది అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుని ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. పీవీసీ వైరు ఎండకు ఎండి త్వరగా పాడవడమే కాకుండా షార్ట్ సర్క్యూట్తో మోటారుకు, ట్రాన్స్ఫార్మర్కు ప్రమాదకారి అవుతుంది. డబ్ల్యూపీటీసీ (అల్యూమినియం) వైరుతో వీటిని నివారించవచ్చు. అల్యూమినియం ఎర్త్ వైరు, పైపులను ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేయడం, సరైన పద్ధతిలో అనుసంధానించడం వల్ల రైతులకు మోటారు స్టార్టర్, మీటరు బాక్సు తదితర ఉపకరణాల ద్వారా షాక్ తగలదు. తద్వారా ప్రాణాపాయాన్ని నివారించవచ్చు. పథకం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు స్మార్ట్ మీటరు బిగించడం వలన రైతు ఎంత కరెంటు ఉపయోగిస్తున్నది కచ్చితంగా లెక్క తేలుతుంది. ప్రభుత్వం డబ్బులు అతనికి ఎంత వస్తున్నాయో తెలుస్తుంది. రైతు డబ్బులు చెల్లించడం వలన సరఫరా నాణ్యత, మంచి సేవలను విద్యుత్ సంస్థ నుంచి డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. మీటర్ పెట్టడం వలన జేఎల్ఎం, లైన్మెన్ నెలనెలా మీటర్ రీడింగ్ కోసం మోటారు దగ్గరకు రావడం వలన ఏదైనా సమస్య ఉన్నచో అతని ద్వారా పరిష్కారం పొందే అవకాశం ఉంటుంది. మీటర్ రీడింగ్ ను బట్టి పంపు, మోటారు పనిచేసే విధానాన్ని వారు తెలుసుకోగలరు. -
Telangana: ఇక్కడా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితం!
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం’.. ఇప్పుడు ఈ అంశంపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. తమిళనాడులో సూపర్ సక్సెస్ అయిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటూ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఈ హామీ కూడా కీలకభూమిక పోషించిందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇప్పుడు కర్ణాటక తరహాలో తెలంగాణలో కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని మేనిఫెస్టోలో పెట్టే అంశం కాంగ్రెస్ పరిశీలనలో ఉంది. కర్ణాటకలో ఈ హామీ ఆ పార్టీకి సానుకూల ఫలితాన్ని అందించిన నేపథ్యంలో, ఇక్కడా ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్నందున మనం కూడా దీనిపై ఆలోచన చేయాలంటూ తాజాగా బీఆర్ఎస్ నేతలు కూడా మంత్రుల దృష్టికి తెస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చే లోపు రాష్ట్రంలో దీనిని అమలు చేయాలన్న అభిప్రాయం వారి ముందుంచుతున్నారు. చెన్నైకి వెళ్లిన ఆర్టీసీ అధికారులు ఎన్నికలతో ప్రమేయం లేకుండా, ఇటీవలే కొందరు అధికారులు దీనిపై ఉన్నతాధికారులకు ఓ నివేదిక అందజేశారు. కొద్ది రోజుల క్రితం అధికారులతో కూడిన ఓ బృందం తమిళనాడు ఆర్టీసీపై అధ్యయనానికి చెన్నై వెళ్లింది. అక్కడ ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం బాగా సక్సెస్ అయ్యిందని, దాని రూపంలో ఆక్యుపెన్సీ రేషియో బాగా పెరిగిందని, ఈ పథకం కోసం ప్రభుత్వం రీయింబర్స్ చేసే మొత్తం ఆర్టీసీకి లాభదాయకంగా మారిందంటూ అక్కడి అధికారులు స్పష్టం చేశారు. కర్ణాటక మోడల్తో పోలిస్తే, తమిళనాడు మోడల్ బాగుందని, దీనిని తెలంగాణలో కూడా అమలు చేస్తే బాగుంటుందని అధికారులు ఆర్టీసీ మేనేజ్మెంట్కు ఓ నివేదిక అందజేశారు. రెండు రాష్ట్రాల్లో ఈ పథకం అమలులోకి వచ్చాక మహిళా సాధికారత గణనీయంగా పెరిగిందని నివేదికలు పేర్కొంటున్నాయి. అటు అధికారుల సానుకూల నివేదిక, ఇటు రాజకీయపార్టీల ఎన్నికల ప్రణాళికలు.. వెరసి తెలంగాణ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం అంశం పెద్ద చర్చకు దారితీస్తోంది. తమిళనాడులో ఇలా.. స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ రాష్ట్ర ఆర్టీసీ ఆర్డినరీ బస్సుల్లో మహిళలు వయసుతో సంబంధం లేకుండా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు 2021లో ప్రారంభించారు. ♦ ఆ రాష్ట్రంలోని మొత్తం 22500 ఆర్టీసీ బస్సులు ఉండగా, 7500 ఆర్డినరీ బస్సుల్లో ఈ వసతి కల్పించారు. ♦ మహిళలకు బస్సుల్లో కండక్టర్లు జీరో టికెట్ జారీ చేస్తారు. దీనివల్ల ఎంతమంది మహి ళలు బస్సుల్లో ప్రయాణించిందీ లెక్క తేలుతుంది. ♦ ఇలా జారీ అయ్యే జీరో టికెట్లకుగాను ప్రభుత్వం ప్రతి టికెట్కు రూ.16 చొప్పున ఆర్టీసీకి రీయింబర్స్ చేస్తుంది. ♦ ఈ పథకం రాకముందు అక్కడి ఆర్టీసీ బస్సుల్లో నిత్యం 30 లక్షల మంది మహిళలు ప్రయాణించేవారు. తర్వాత వారి సంఖ్య 45 లక్షలకు పెరిగింది. అంటే 50 శాతం ఆక్యుపెన్సీ పెరిగిందన్నమాట. ♦ ఈ రూపంలో ప్రభుత్వం నుంచి నెలకు సగటున రూ.200 కోట్ల మొత్తం ఆర్టీసీకి అందుతోంది. కర్ణాటకలో ఇలా.. తమిళనాడు కంటే ఓ అడుగు ముందుకేసి కర్ణాటకలో శక్తి పథకం పేరుతో గత జూన్లో ఆర్డినరీ బస్సులతోపాటు ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా మహి ళలకు ఉచిత ప్రయాణ వెసులుబాటు కల్పించారు. ♦ మొత్తం 18609 బస్సుల్లో ఈ అవకాశం కల్పించారు. ఇందులో 6343 ఎక్స్ప్రెస్, 6308 సిటీ సర్వీసులు, 5958 ఆర్డినరీ బస్సులున్నాయి. ♦ తొలి నెల రోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 17.40 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. ఒక్క బెంగళూరు సిటీలోనే ఏకంగా 5.60 కోట్ల ట్రిప్పులు నమోదయ్యాయి. ♦ ఈ పథకం అమలులోకి రాకముందు, కర్ణాటక రాష్ట్రంలో రోజుకు సగటున 85 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో తిరిగేవారు. పథకం ప్రారంభమయ్యాక ఆ సగటు సంఖ్య 1.09 కోట్లకు పెరిగిందని తేలింది. అంటే నిత్యం అదనంగా 25 లక్షల మంది ప్రయాణికుల సంఖ్య పెరిగింది. వారంతా మహిళా ప్రయాణికులే అన్నది దాని సారాంశం. ♦ అంటే ఇది ప్రత్యక్షంగా ప్రైవేటు వాహన ప్రయాణాన్ని అరికడుతోంది. ♦ ఈ పథకం తాలూకు ఖర్చు భరించేందుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో ఏకంగా రూ.4 వేల కోట్లు కేటాయించింది. ♦ ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్ అందుతున్నందున, మహిళా ప్రయాణికుల రూపంలో ఆర్టీసీ బస్సుల్లో పెరిగే ఆక్యుపెన్సీ రేషియో మేరకు ఆర్టీసీకి ఆదాయం పెరగినట్టయ్యింది. ♦ ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ఈ పథకాన్ని అమలు చేస్తుండటం.. క్రమంగా ప్రభుత్వానికి భారంగా మారుతుందన్న విమర్శలు ఉన్నాయి. అందుకే తమిళనాడు తరహా ఆర్డినరీ బస్సుల వరకే దాన్ని పరిమితం చేయాలన్న వాదన ఉంది. -
కిలో టమాట రూ.200.. ఈ ఆటోవాలా ఆఫర్ చూడండి.. ఫ్రీ ఇస్తాడట!
దేశంలో ఇటీవల టమాటా సృష్టిస్తున్న లీలలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కడ చూసిన టమాటా గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే టమాటా ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయి. కిలో టమాటా ధర రూ.200కు పైగా అమ్ముడు పోయాయి. టమాటా ధరలు ఆకాశాన్నింటి.. కొందరు రైతులను కోటీశ్వరులను చేశాయి. టమాటా ఉచిత పథకాల ద్వారా మరికొందరు తమ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకుని లాభాల బాట పట్టారు. ఆటోవాలా సరికొత్త ఆఫర్.. వినియోగదారులు టమాటాలు కొనడానికి సంశయిస్తున్న సమయంలో చంఢీగర్కు చెందిన ఓ ఆటో డ్రైవర్ కొత్త ఆఫర్తో ముందుకొచ్చాడు. తన ఆటోలో ప్రయాణించినవారికి కేజీ టమాటాలు ఉచితంగా ఇస్తానని ఉచిత పథకాన్ని పెట్టాడు. కానీ అందుకు సదరు ప్రయాణికుడు కనీసం ఐదు రైడ్లు చేయాలని కండీషన్ పెట్టాడు. ఇదీ కాకుండా ఆర్మీలో పనిచేసే సైనికులకు ఆయన గత 12 ఏళ్లుగా ఉచితంగా సేవలు అందిస్తాడు. గర్భణీ మహిళలను కూడా ఉచితంగా ఆస్పత్రికి తరలిస్తాడు. తన జీవనోపాధికి ఆటో మాత్రమే ఏకైక మార్గమని తెలిపిన ఆయన.. ఈ సేవల వల్ల తనకు సంతృప్తి కలుగుతుందని అన్నారు. ఇదే కాకుండా పాకిస్థాన్పై ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలిస్తే ఐదు రోజుల పాటు ఉచితంగా ఆటో రైడ్లు అందిస్తానని చెప్పాడు. ఉచిత ప్రకటనలు.. ఆటోవాలానే మొట్టమొదటి వ్యక్తి కాదు. టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో ఇలాంటి ఆఫర్లతో పలువురు ముందుకొస్తున్నారు. ఇప్పటికే పంజాబ్లో ఓ చెప్పుల దుకాణం యజమాని రూ.1000కి పైగా కొనుగోలు చేస్తే రెండు కిలోల టమాటాలు ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటన చేశాడు. తన దుకాణంలో మొబైల్ కొనుగోలు చేస్తే కేజీ టమాటాలు ఉచితం అంటూ మరోచోట ఓ యజమాని ఆఫర్ పెట్టాడు. తాజాగా ఆటో డ్రైవర్ తన ఆటోలో ప్రయాణిస్తే టమాటాలు ఉచితం అంటూ కొత్త ఆఫర్తో ముందుకొచ్చాడు. టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఢిల్లీ, పట్నా, లక్నో సహా పలు ముఖ్య నగరాల్లో రూ.80 కే కేజీ టమాటా లభ్యమయ్యేలా చర్యలు చేపట్టింది. ఇదీ చదవండి: సీఎం నివాసంలోకి చొరబాటుకు దుండగుడి యత్నం.. మారణాయుధాలతో.. -
గుడ్న్యూస్! ఆధార్ ఉచిత అప్డేట్ గుడువు పొడగింపు
ఆధార్లో డాక్యుమెంట్లను ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) పొడిగించింది. మరో నెలలు అంటే జూన్ 14 నుంచి సెప్టెంబర్ 14 వరకు డాక్యుమెంట్లను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని యూఐడీఏఐ పేర్కొంది. ఆధార్కు సంబంధించి గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ కోసం ఇచ్చిన పత్రాలను సెప్టెంబర్ 14 లోపు ఉచితంగా అప్డేట్, అప్లోడ్ చేసుకోవాలని యూఏడీఏఐ తన వెబ్సైట్లో పేర్కొంది. డాక్యుమెంట్ల అప్డేట్, అప్లోడ్ కోసం జూన్ 14 వరకే గడువు ఉండేది. ఇప్పుడు దాన్ని యూఏడీఏఐ పొడిగించింది. ఈ అప్డేట్ సౌకర్యం https://myaadhaar.uidai.gov.in వెబ్సైట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక్కడ డాక్యుమెంట్లను స్వయంగా అప్డేట్, అప్లోడ్ చేసుకోవచ్చు. అదే ఆధార్ సీఎస్సీ (కామన్ సర్వీస్ సెంటర్) కేంద్రంలో అప్డేట్ చేయించుకుంటే రూ.25 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. -
సర్కారు స్కూలు పిల్లలకు ఫ్రీ
సాక్షి, హైదరాబాద్ః రాష్ట్రపతి నిలయం సందర్శనకు వచ్చే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్టు రాష్ట్రపతి భవన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కుమార్ సమ్రేశ్ వెల్లడించారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని ఏడాది పొడవునా సందర్శనకు అనుమతిస్తూ, ఆ మేరకు మార్చి 22 నుంచి సందర్శనకు అవకాశం కలి్పస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈనెల 14 వరకు రాష్ట్రపతి నిలయాన్ని దాదాపు 10 వేల మంది సందర్శకులు దర్శించారని పీఆర్ఓ సమ్రేశ్ తెలిపారు. రాష్ట్రపతి నిలయ సందర్శన సమాచారాన్ని ప్రజల్లోకి మరింత తీసుకెళ్లే ఉద్దేశంతో గురువారం రాష్ట్రపతి నిలయంలో ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి నిలయంలో తీసుకువచ్చిన మార్పులు, బుకింగ్ తదితర వివరాలను రాష్ట్రపతి నిలయం మేనేజర్ డా.కె రజనీప్రియతో కలిసి ఆయన వెల్లడించారు. డిసెంబర్ మినహా ఏడాది పొడవునా.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన జరిగే డిసెంబర్ నెల మినహా ఏడాది పొడవునా సాధారణ పౌరుల సందర్శనకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి సోమవారం, ప్రభుత్వ సెలవు దినాల్లో మినహా ఏ రోజైనా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శనకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఆన్లైన్లో టికెట్ బుకింగ్ కోసం http:// visit.rashtrapatibhavan.gov.in వెబ్సైట్లో లేదంటే నేరుగా రాష్ట్రపతి నిలయానికి వచ్చి అక్కడి రిసెప్షన్ సెంటర్లోనూ టికెట్ తీసుకోవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రవేశం పూర్తిగా ఉచితం అని, మిగిలిన వారికి ఒక్కొక్కరికి రూ.50 ప్రవేశ రుసుం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా సందర్శకుల బృందం 30 మందికి పైగా ఉంటే వారికి టికెట్ రుసుంలో 20 శాతం రాయితీ ఇస్తామన్నారు. సందర్శకులకు రాష్ట్రపతి నిలయంలోని విశేషాలను వివరించేందుకు 20 మంది గైడ్లను ప్రత్యేకంగా నియమించినట్టు వారు తెలిపారు. -
గూగుల్పే యూజర్లకు సర్ప్రైజ్.. ఫ్రీగా సిబిల్ స్కోర్
యూజర్లకు గూగుల్పే (Google pay) సర్ప్రైజ్ సర్వీస్ అందిస్తోంది. బ్యాంక్ లోన్లకు దరఖాస్తు చేసుకునేందుకు కీలకమైన సిబిల్ (క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్) స్కోరు (CIBIL Score)ను ఉచితంగా ఇస్తోంది. ఈ సిబిల్ స్కోరు వ్యక్తి ఆర్థిక పరిస్థితి గురించి తెలియజేస్తుంది. ఈ స్కోరు ఆధారంగానే బ్యాంకులు అప్పులు ఇస్తాయి. అనేక వెబ్సైట్లు, యాప్లు సిబిల్ స్కోర్ను ఉచితంగా అందిస్తున్నాయి. ఇప్పడు గూగుల్పే కూడా సిబిల్ స్కోరును ఉచితంగా ఇస్తోంది. (కష్టపడ్డాడు.. వీధుల్లో పుస్తకాలు అమ్మాడు.. నేడు రూ.18 వేల కోట్లకు అధిపతి!) సిబిల్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధీకృత క్రెడిట్ ఏజెన్సీ. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రతినెలా రుణ గ్రహీతల సమాచారాన్ని సిబిల్కు అందిస్తాయి. ఈ సమాచారం ఆధారంగా సిబిల్ స్కోరును తయారు చేస్తుంది. సిబిల్ స్కోర్ 300- 900 మధ్య ఉంటుంది. 600 కంటే తక్కువ ఉంటే ‘బ్యాడ్ సిబిల్ స్కోర్’గా, 750 కంటే ఎక్కువ ఉంటే మెరుగైన స్కోర్గా పరిగణిస్తారు. (ఫోన్పే దూకుడు.. కొత్త వ్యాపారాలకు నిధుల సమీకరణ) గూగుల్ పే ద్వారా సిబిల్ స్కోర్ తెలుసుకోవాలంటే యాప్ ఓపెన్ చేసి ‘మేనేజ్ యువర్ మనీ’ సెక్షన్లోకి వెళ్లాలి. అక్కడ కనిపించే ‘చెక్ యువర్ సిబిల్ స్కోర్ ఫర్ ఫ్రీ’ ఆప్షన్పై క్లిక్ చేయాలి. తర్వాత ‘A good CIBIL score gets you better interest rates on loans. Wonder if you will have a good score?’ అనే ప్రశ్న కనిపిస్తుంది. దాని కింద కనిపించే మూడు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకొని ‘Let’s check’ ట్యాబ్ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత పాన్ కార్డ్పై ఉన్న విధంగా పేరు నమోదు చేసి కంటిన్యూ ట్యాబ్పై క్లిక్ చేయగానే మీ సిబిల్ స్కోర్ కనిపిస్తుంది. (గూగుల్ చీకటి ‘గేమ్’! రూ.260 కోట్ల భారీ జరిమానా..) -
'ప్లాస్టిక్ ఇచ్చి బంగారం తీసుకోండి'.. దెబ్బకు 15 రోజుల్లోనే..
ఆ గ్రామ సర్పంచ్ వినూత్న ఆలోచనతో జస్ట్ 15 రోజుల్లోనే ప్లాస్టిక్ రహిత గ్రామంగా మారి ఆ ఊరు ఆదర్శంగా నిలిచింది. అతను అమలు చేసిన ఆ ఆలోచన త్వరితగతిన చక్కటి ఫలితం ఇవ్వడమేగాక ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చింది. వివరాల్లోకెళ్తే.. కాశీర్మర్లోని సదివార పంచాయితీ పర్యావరణ పరిరక్షణ చొరవలో భాగంగా ఒక సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆ గ్రామ సర్పంచ్, వృత్తి రీత్యా న్యాయవాది అయిన ఫరూక్ అహ్మద్ 'ప్లాస్టిక్ ఇచ్చి బంగారం తీసుకోండి' అనే నినాదంతో ఒక ప్రత్యేక కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ పథకం కింద ఎవరైనా 20 క్వింటాళ్ల ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించి ఇస్తే వారికి పంచాయితీ బంగారు నాణేలను అందజేస్తోంది. దీన్ని ఆ ఊరి గ్రామపెద్దలు ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా బాగా ప్రచారం చేశారు. ప్రచారం ప్రారంభించిన 15 రోజుల్లోనే ఊరంతా స్వచ్ఛంగా మారింది. అంతేగాక అధికారులు కూడా ప్లాస్టిక్ రహిత గ్రామంగా ప్రకటించడం విశేషం. ఈ నినాదం ప్రజాదరణ పొందడమే గాక అందరిచే ప్రశంసలందుకుంది. ఇతర గ్రామ పంచాయితీలు కూడా ఈ విధానాన్ని అమలు చేసేందుకు ముందుకు వచ్చాయి. ఈ మేరకు సర్పంచ్ ఫరూఖ్ మాట్లాడుతూ.. మా గ్రామంలోని వాగులు, నదులు శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నాను. అందులో భాగంగానే ఈ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకొచ్చాను. దీంతో గ్రామంలో ప్రతి ఒక్కరూ తమ ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోగలిగారు. అలాగే రోడ్డు, వీధుల్లో కుప్పలు తెప్పలుగా ప్లాస్టిక్ని పడేసిన గ్రామం ఇప్పుడూ పూర్తిగా క్లీన్గా ఉంది. ఈ గ్రామం ఆదర్శ గ్రామంగా నిలవడమే గాక ప్రభుత్వం కూడా దీన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని గ్రామల్లో అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆనందంగా చెప్పుకొచ్చారు. ఇది ప్రభుత్వ పథకం కాకపోయినా ప్రజలంతా ఆసక్తిగా ముందుకు వచ్చి మరీ ప్లాస్టిక్ సేకరించారని అనంత్నాగ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ అన్నారు. కాగా, ఈ గ్రామం దక్షిణ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలోని హిల్లర్ షహాబాద్ బ్లాక్లో ఉంది. (చదవండి: స్కూటీపై వెళ్తుండగా కుక్కలు వెంటపడ్డాయ్..స్పీడ్ పెంచేయడంతో..) -
ట్విటర్ బ్లూ టిక్ ఫ్రీ! ఎవరికో తెలుసా?
ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని ట్విటర్ పెయిడ్ సబ్క్రిప్షన్ విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పాత వెరిఫైడ్ బ్లూటిక్లను బంద్ చేసిన ట్విటర్ సబ్క్రిప్షన్ ఛార్జ్ చెల్లించినవారికి బ్లూటిక్లు అందిస్తోంది. అయితే కొంతమందికి మాత్రం ఉచితంగా బ్లూటిక్లు అందిస్తోంది. (ఈవీల జోరు.. అమ్మకాల హుషారు! ఎంతలా కొన్నారంటే..) ట్విటర్ గతంలో ఉన్న బ్లూ టిక్లను ఏప్రిల్ 1 నుంచి తొలగించి కొత్త సబ్క్రిప్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఫలితంగా ప్రసిద్ధ వార్తా సంస్థ న్యూయార్క్ టైమ్స్ దాని వెరిఫైడ్ బ్యాడ్జ్ను కోల్పోయింది. తమ ఉద్యోగుల ఖాతాలను వెరిఫై చేసేందుకు చెల్లించబోమని వైట్హౌస్ ఇప్పటికే ప్రకటించింది. వ్యాపార సంస్థలు తమ ఖాతాలను వెరిఫైడ్గా మార్చుకోవడానికి ప్రతి నెలా సుమారు రూ. 82,000 చెల్లించాలి. అయితే కొన్ని సంస్థలు నెలవారీ ఛార్జీలను చెల్లించకుండా మినహాయింపు పొందవచ్చని తెలుస్తోంది. ట్విటర్ను ఎక్కువగా వినియోగించే 500 మంది ప్రకటనకర్తలకు వెరిఫైడ్ బ్లూ టిక్ను ఉచితంగా అందిస్తోంది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం... ఫాలోవర్లు అధికంగా ఉన్న అగ్రశ్రేణి 10,000 సంస్థలకు కూడా ట్విటర్ ఉచితంగా వెరిఫైడ్ టిక్లు అందిస్తోంది. (ఫండ్స్ లాభాలపై పన్ను ఉంటుందా.. ఐటీఆర్లో కచ్చితంగా చూపాలా? ) మస్క్ ట్విటర్ను కొనుగోలు చేసినప్పటి నుంచి దాని ప్రకటనల ఆదాయం క్రమంగా తగ్గిపోయింది. కొన్ని భారీ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు తమ క్లయింట్లకు ట్విటర్ వినియోగంపై జాగ్రత్తలను సూచించాయి. ఈ నేపథ్యంలో వెరిఫైడ్ చెక్మార్క్లను ఉచితంగా అందిస్తే ఇబ్బంది ఉండదు. ఈ క్రమంలో ప్రకటనల ఆదాయాన్ని పెంచుకునేందుకు ట్విటర్ కొంతమంది ప్రకటనకర్తలకు ఈ ఉచిత వెరిఫైడ్ మార్క్లను అందిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఒక ఫోన్ కొంటే రెండు బీర్లు ఫ్రీ.. అరెస్ట్
క్రైమ్: స్మార్ట్ఫోన్ కొంటే బీర్లు ఫ్రీ అని అనౌన్స్ చేశాడు. ఊరంతా పోస్టర్లు అంటించి.. పాంప్లెట్స్ పంచాడు. ఆ ప్రకటనతో ఒక్కసారిగా ఆ సెల్ఫోన్ దుకాణం ముందు జనం ఎగబడ్డారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించడంతో పాటు అక్కడ రచ్చ రచ్చ చేశారు. ఇది కాస్త పోలీసుల దాకా చేరింది. రంగ ప్రవేశం చేసి ఆ బంపరాఫర్ ప్రకటించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. యూపీ భదోహిలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. చౌరీ రోడ్లో రాజేశ్ మౌర్య అనే వ్యక్తి సెల్ఫోన్ల షాప్ నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో తన దుకాణంలో మార్చి 3 నుంచి 7వ తేదీల మధ్య సెల్ఫోన్ కొంటే రెండు బీర్ క్యాన్లు ఇస్తానని ప్రకటించాడు. సెంటర్లలో పోస్టర్లు అతికించి, పాంప్లెట్స్ పంచాడు. దీంతో కస్టమర్లు ఒక్కసారిగా ఎగబడ్డారు. ట్రాఫిక్కు విఘాతం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి గుంపును చెదరగొట్టారు. ఐపీసీ సెక్షన్ 151 (ప్రజాశాంతికి విఘాతం కలిగించడం) నేరం కింద మౌర్యను అరెస్ట్ చేసి, దుకాణాన్ని సీల్ చేశారు. -
ఐపీఎల్ 2023: అంబానీ పవర్ ప్లే: ఫ్రీ స్ట్రీమింగ్!
సాక్షి,ముంబై: ఐపీఎల్ 2023 సందర్భంగా బిలియనీర్ రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ అదిరి పోయే ప్లాన్ వేశారు. క్రికెట్ క్రేజ్ను క్యాష్చేసుకునేలా రిలయన్స్ సొంతమైన వయోకామ్ 18 మీడియా ద్వారా ప్రధాన ప్రత్యర్థులను ఢీకొట్టి మరీ ఈ బిడ్డింగ్ను గెల్చుకోవడమే కాదు ఇపుడిక ఉచితంగా ప్రసారాలను అందించనున్నారు. ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని వయాకామ్ 18 దాదాపు రూ. 23,758 కోట్లతో ఐపీఎల్ 20223 రైట్స్ గెల్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా భారతదేశపు అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ని ఉచితంగా ప్రసారం చేయనుందని తెలుస్తోంది. ఫిఫా వరల్డ్ కప్ తరువాత 16వ ఐపీఎల్ లీగ్ ప్రసార హక్కులు దక్కించుకోవడం ఒక ఎత్తయితే ఉచితంగా అందించాలని భావించడం మరో ఎత్తు. డిస్నీ హాట్స్టార్ , అమెజాన్ ప్రైమ్ వంటి ప్రత్యర్థులను ఢీకొట్టి వయాకామ్ 18 స్ట్రీమింగ్ హక్కులను పొందడం ఇదే మొదటిసారి. డిస్నీ హాట్స్టార్ గత ఐదు సంవత్సరాలుగా ప్రసార హక్కులను కలిగి ఉంది. దీంతో అటు జియో 5జీ సేవ విస్తరణతో పాటు, పోటీ సంస్థలకు దెబ్బ అదిరిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వయాకామ్ 18 ఐపీఎల్ టోర్నమెంట్ను దాని రెండు OTT ప్లాట్ఫారమ్లు, వూట్, జియో సినిమా, ఒక TV ఛానెల్ ద్వారా ఉచితంగా ప్రసారం చేయాలని భావిస్తోందట. అదీ 4కే రిజల్యూషన్తో అందించనుందని తెలుస్తోంది. ఖతర్ ఫిఫా వరల్డ్ కప్-2022ను ఉచిత ప్రసారాలపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఐపీఎల్ను మాత్రం 4కే రిజల్యూషన్తో 12 భారతీయ భాషల్లో ఉచితంగా అందించాలని నిర్ణయించింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ సహా పలు భాషల్లో కామెంటరీ ఇస్తుందట. మరోవైపు ఈ ఐపీఎల్ను 550 మిలియన్ల కుపైగా మంది ప్రేక్షకులు చూస్తారని వయోకామ్ అంచనా వేస్తోంది. అయితే వయాకామ్ 18 మీడియా సీఈఓ (స్పోర్ట్స్), అనిల్ జయరాజ్ వ్యాఖ్యల్ని బట్టి ఐపీఎల్ మొదటి సంవత్సరం మాత్రమే జియో సినిమాలో ఉచితంగా చూడవచ్చని కూడా భావిస్తున్నారు. తాజా వార్తలపై వయాకామ్ 18 అధికారికంగా స్పందించాల్సి ఉంది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ వయాకామ్ 18 రిలయన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ (RPPMSL) యాజమాన్యంలో ఉన్న వయాకామ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ (Viacom18), జియో సినిమా OTT ప్లాట్ఫారమ్ల విలీనానికి గత ఏడాదే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. -
విద్యార్థులు, మహిళా ఉద్యోగులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఎక్కడంటే?
బెంగళూరు: పాఠశాల విద్యార్థులు, మహిళా ఉద్యోగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై మంగళవారం ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు. కేఎస్ఆర్టీసీ వోల్వో బస్సుల ప్రారంభోత్సవం సందర్భంగా ఈ హామీ ఇచ్చారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహిళా ఓటర్లను ఆకట్టునే ప్రయత్నం చేశారు. కొత్త పథకంలో భాగంగా విద్యార్థుల కోసం మరిన్ని మినీ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీఎం చెప్పారు. ఒక్కో తాలుకాలో కనీసం ఐదు బస్సులు నడిచేలా చూస్తామన్నారు. అవసరమైతే దీని కోసం అదనపు నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఆర్థిక అభివృద్ధిలో రవాణా ముఖ్య పాత్ర పోషిస్తుందని బొమ్మై చెప్పారు. అందుకే తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మహిళా ఉద్యోగులు, విద్యార్థులకు ఉచిత పాసులు ఇస్తామని బడ్జెట్ సమావేశాల్లోనే చెప్పినట్లు గుర్తుచేశారు. చదవండి: మనీశ్ సిసోడియాకు భారీ షాక్.. స్నూపింగ్ కేసు విచారణకు కేంద్రం ఆమోదం.. -
రాజకీయాల కోసం కాకుండా రాజ్యాంగ ఫలాలు అందేలా సాగుతున్న పాలన: మంత్రి ధర్మాన
-
గుడ్న్యూస్.. మరో ఏడాది పాటు రేషన్ బియ్యం ఫ్రీ..!
సాక్షి, సిటీబ్యూరో: ఆహార భద్రత కార్డుదారులకు శుభవార్త. మరో ఏడాది పాటు ఉచిత రేషన్ అందనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్Œఎఫ్ఎస్ఏ) కింద పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో జనవరి నుంచి కూడా ఉచితంగానే రేషన్ బియ్యం పంపిణీ కానున్నాయి. కేంద్రం కోటాకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత కలిపి ఉచితంగా పంపిణీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ కోటాపై నిర్ణయం తీసుకోలేదు. ఉచిత కోటాతో ఆరి్థక భారంపై తర్జనభర్జన పడుతోంది. దీంతో కేవలం కేంద్రం కేటాయించే యూనిట్కు 5 కిలోలు మాత్రమే వర్తింపజేస్తుందా..లేక గతంలో మాదిరిగా అదనంగా మరో ఐదు కిలోలు కలిపి 10 కిలోలు వర్తింప చేస్తుందా ? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. 2020 నుంచి ఉచితంగానే.. కేంద్ర ప్రభుత్వం కరోనా ఆర్థిక సంక్షోభం నేపధ్యంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజికేఎవై) పథకం కింద 2020 ఏప్రిల్ నుంచి యూనిట్æ(ఒక్కొక్కరికి) ఉచితంగా 5 కేజీల చొప్పున బియ్యం కోటా కేటాయిస్తూ వచి్చంది. అప్పటి నుంచి పలు పర్యాయాలుగా ఈనెల 31 దాకా పొడిగిస్తూ వచి్చంది.తాజాగా ఎన్ఎఫ్ఎస్ఏతో పీఎంజీకేఏవైని విలీనం చేసి ఆహార భద్రత చట్టం కింద ఉచితంగా అందించాలని నిర్ణయించింది. సగం కార్డుదారులు... మహానగర పరిధిలోని ఆహార భద్రత కార్డులు కలిగిన కుటుంబాల్లో సగానికి పైగా అనర్హత కలిగిన కుటుంబాలు ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా ఉచిత బియ్యం 70 నుంచి 80 శాతం కుటుంబాలు ప్రతి నెలా డ్రా చేస్తున్నారు. మిగిలిన 20నుంచి 30 శాతం మాత్రం కార్దులు రద్దు కాకుండా రెండు నెలలకు ఒకసారి సరుకులు డ్రా చేస్తూ వస్తున్నారు. మొత్తం మీద బియ్యం డ్రా చేసే కుటుంబాల్లో 10 శాతం మంది డీలర్లకే కిలో ఒక్కంటికి రూ. 8 నుంచి 10 లకు విక్రయిస్తుండగా, మిగిలిన 20 శాతం కటుంబాలు కిరాణం, ఇడ్లీ బండి, చిరు వ్యాపారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. చదవండి: తల్లి హీరాబెన్ పాడె మోసిన ప్రధాని మోదీ -
బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్ఫోన్!
భారత్లో స్మార్ట్ఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ క్రమంలో కొన్ని మొబైల్స్ కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆఫర్లతో వస్తుంటాయి. తాజాగా ట్రాన్స్పరెంట్ లుక్తో లక్షల మందిని ఆకర్షించిన ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ నథింగ్ ఫోన్ (1) కూడా ఓ బంపర్ ఆఫర్ని తీసుకొచ్చింది. నథింగ్ బ్రాండ్ ఫౌండర్ కార్ల్ పి ఉచితంగా నథింగ్ ఫోన్ 1అందిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఫ్రీ ఆఫర్ దక్కించుకోవడం కోసం ట్విట్టర్లో నడుస్తున్న ఒక కాంటెస్ట్లో పాల్గొనాలని తెలిపారు. కాంటెస్ట్ అంటే ఏదో కష్టంగా ఉంటుంది అనుకుంటే మీరు పొరపడినట్లే. మీరు చేయాల్సిందల్లా కార్ల్ పీ ట్వీట్కు కామెంట్ చేయడమే. మీ కామెంట్కు ఎవ్వరూ లైక్ కొట్టకపోతే మీకు నథింగ్ ఫోన్ 1ను ఉచితంగా గెలుచుకోవచ్చు. అలాగే ఎక్కువ లైక్స్ పొందిన కామెంట్కు ఉచితంగా నథింగ్ స్మార్ట్ఫోన్ 1 లభిస్తుంది. ఇందులో విజేతలను 24 గంటల్లోగా ప్రకటించనున్నారు. దీని బట్టి చూస్తే ఇద్దరు ఉచితంగా నథింగ్ స్మార్ట్ఫోన్లు పొందే అద్భుత అవకాశమని అనుకోవచ్చు. అయితే ఈ కాంపిటీషన్ వినడానికి ఈజీగానే ఉన్న కాస్త కష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తే ప్రతి కామెంట్కు లైక్స్ ఉన్నాయి. అందువల్ల ఉచితంగా స్మార్ట్ఫోన్ పొందటం కష్టమే అని చెప్పుకోవాలి. మరో వైపు ఎక్కువ లైక్స్ పొందిన వారికి కూడా ఫోన్ ఉచితంగా వస్తుంది. అందువల్ల ఎక్కువ లైక్స్ పొందే వారికి మాత్రం ఉచిత ఫోన్ పొందే అవకాశం ఉంది. భారత్లో నథింగ్ స్మార్ట్ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ. 27,499 (8GB RAM, 128GB స్టోరేజ్) నుంచి ప్రారంభమవుతుంది. 256GB స్టోరేజ్తో దాని మోడల్ ధర రూ. 30,499, టాప్-ఎండ్ మోడల్ 12GB RAM, 256GB స్టోరేజ్ ధర రూ.33,499. మూడు వేరియంట్లు కొన్ని ఆఫర్లు, డీల్స్తో ఫ్లిప్కార్ట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. చదవండి: బిలియనీర్కు భారీ షాక్.. ఒక్క రోజులో 63వేల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి! -
అక్కడ 25 ఏళ్లలోపు మహిళలకు కండోమ్స్ ఫ్రీ
పారిస్: లైంగిక వ్యాధుల బాధితుల సంఖ్య విపరీతంగా పెరగడంతో ఫ్రాన్స్ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. లైంగిక సాంక్రమిక వ్యాధుల (ఎస్టీడీ) నియంత్రణకు దేశంలో 25 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసు వారికి 2023 జనవరి నుంచి ఉచితంగా కండోమ్స్ అందిస్తామని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ శుక్రవారం ప్రకటించారు. వాటిని ఏ ఫార్మసీలోనైనా పొందొచ్చని చెప్పారు. పురుషులకు మాత్రం వాటిని ఉచితంగా ఇవ్వబోరు. ఫ్రాన్స్లో అదుపులోలేని ద్రవ్యోల్బణం కారణంగా ఖర్చులు పెరిగిపోయిన ఈ తరుణంలో అవాంఛిత గర్భం దాలిస్తే, అమ్మాయిలు, మహిళల ఆర్థిక కష్టాలు మరింత ఎక్కువయ్యే అవకాశముందని, అందుకే వారికే వీటిని ఉచితంగా అందివ్వనున్నారని తెలుస్తోంది. హెచ్ఐవీ, ఇతర లైంగిక వ్యాధుల నిర్ధారణ పరీక్షలు విస్తృత స్థాయిలో చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్రాన్స్లో 2020, 2021 ఏడాదిలో లైంగిక సాంక్రమిక వ్యాధు(ఎస్టీడీ)లు ఏకంగా 30 శాతం పెరిగాయి. 2018లో ఫ్రాన్స్ ఒక పథకం తెచ్చింది. పౌరులు కండోమ్స్ కొనుగోలు చేస్తే వాటికయిన ఖర్చును ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఈ ఏడాది తొలినాళ్లలో 26 ఏళ్లలోపు మహిళలకు గర్భనిరోధకాలు ఉచితంగా పంపిణీచేసింది. డాక్టర్ ప్రిస్రిప్షన్ లేకుండానే 26 ఏళ్లలోపు మహిళలకు ఉచితంగా లైంగికవ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఫ్రాన్స్లో అబార్షన్ ఉచితంగా చేస్తారు. ఇదీ చదవండి: నమ్మకమే మార్గం.. మోసమే లక్ష్యం -
ఓటీటీలో ఫ్రీగా సినిమా చూడాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే..!
ఓటీటీలో మీరు ఫ్రీగా సినిమా చూడాలనుందా? ఎలాంటి సబ్స్క్రిప్షన్ లేకుండా మూవీని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా?. అయితే ఇది మీకోసమే. ఓ చైనీస్ మూవీని తెలుగులో ఉచితంగా చూడవచ్చని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ప్రకటించింది. ఇంతకీ ఆ సినిమా వివరాలేంటో ఓ లుక్కేద్దాం. 'కింగ్ ఆఫ్ సర్పెంట్' అనే చైనీస్ సినిమాని ఫ్రీగా చూడవచ్చని జీ5 సంస్థ ట్వీట్ చేసింది. ఈ మూవీని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఉచితంగా చూసే అవకాశాన్ని ప్రేక్షకులకు కల్పించింది. ట్వీట్లో రాస్తూ.. 'ఈ చిత్రంలో మనుషుల ప్రాణాలను తీసే భయంకర సర్పం. క్షణక్షణం ఉత్కంఠ భరితం. ఈ రోజే చూసేయండి' అంటూ పోస్ట్ చేసింది . మనుషుల ప్రాణాలను తీసే భయంకర సర్పం... క్షణక్షణం ఉత్కంఠభరితం.. ZEE5 అందిస్తున్న world hits లో భాగంగా ఇవాళే చూడండి King of serpent #KingofSerpentOnZEE5 #KingofSerpent #ZEE5WorldHits pic.twitter.com/sS6apnFaL3 — ZEE5 Telugu (@ZEE5Telugu) November 25, 2022 -
ట్విటర్లాగా చార్జీలేమీ విధించం..
న్యూఢిల్లీ: యూజర్ల వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోసం ట్విటర్లాగా చార్జీలేమి విధించబోమని, ఇది పూర్తిగా ఉచితమేనని దేశీ మైక్రోబ్లాగింగ్ సైట్ ‘కూ’ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అప్రమేయ రాధాకృష్ణ చెప్పారు. ఆధార్ ఆధారిత స్వీయ ధృవీకరణతో పసుపు రంగు వెరిఫికేషన్ బ్యాడ్జ్ని ఉచితంగా పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. బాట్స్ (రోబో) సమస్యను సృష్టించినది ట్విటరే అని రాధాకృష్ణ ఆరోపించారు. మొదట్లో వాటిని ప్రోత్సహించిన ట్విటర్ ప్రస్తుతం నియంత్రించడానికి నానా తంటాలు పడుతోందని చెప్పారు. తాము సిసలమైన మనుషులమేనని యూజర్లు ధృవీకరించేందుకు, బ్లూ టిక్ పొందేందుకు .. వెరిఫికేషన్ పేరిట చార్జీలు వసూలు చేసే ప్రయత్నాల్లో ఉందని విమర్శించారు. కూ ఈ ఏడాది తొలి నాళ్ల నుండే స్వచ్ఛంద వెరిఫికేషన్ను యూజర్లకు చట్టబద్ధమైన హక్కుగా ఉచితంగా అందిస్తోందని రాధాకృష్ణ తెలిపారు. ఇప్పటివరకూ 1,25,000 మంది భారతీయ యూజర్లు దీన్ని ఉపయోగించుకున్నారని పేర్కొన్నారు. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా చీఫ్ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ను కొనుగోలు చేసిన తర్వాత పలు మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. భారీగా ఉద్యోగులను తొలగించడంతో పాటు వెరిఫైడ్ బ్యాడ్జ్ల కోసం 8 డాలర్ల ఫీజు విధించనుండటం మొదలైనవి వీటిలో ఉన్నాయి. -
టూరిస్టులకు పండగే: రూ.2వేల కోట్ల విలువైన విమాన టికెట్లు ఫ్రీ
న్యూడిల్లీ: కోవిడ్ సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా టూరిజానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. అయితే ఆంక్షల సడలింపు, ప్రస్తుతం నెలకొన్న సాధారణ పరిస్థితుల నేపథ్యంలో పర్యాటకులను ఆకర్షించేందుకు పలు దేశాలు నానా తంటాలు పడుతున్నాయి. తాజాగా పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ హాంకాంగ్ టూరిస్టులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 5 లక్షల విమాన టిక్కెట్లను ఉచితంగా అందించాలని హాంకాంగ్ టూరిజం బోర్డు నిర్ణయించింది. సుమారు రూ. 2,083 కోట్లు (254.8 మిలియన్ డాలర్లు) విలువైన విమాన టికెట్లను ఉచితంగా ఆఫర్ చేయనుంది. ఇదీ చదవండి : చిన్నారులను మింగేసిన దగ్గు మందు: సంచలన విషయాలు కోవిడ్-19 ఆంక్షలను తొలగిస్తామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత, ఉచిత విమాన టిక్కెట్ల ప్రకటనల ప్రచారాలను రూపొందిస్తామని హాంకాంగ్ టూరిజం బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డేన్ చెంగ్ మీడియాకు తెలిపారు. కేథే ఫసిఫిక్, కేథే డ్రాగన్, హాంకాంగ్ ఎయిర్లైన్స్, హాంకాంగ్ ఎక్స్ప్రెస్ లాంటి క్యారియర్ల ద్వారా ఈ టికెట్లను అందించనుంది. టిక్కెట్ల పంపిణీని హాంకాంగ్ ఎయిర్పోర్ట్ అథారిటీ నిర్వహిస్తుందని హాంకాంగ్ టూరిజం బోర్డు ప్రతినిధి వెల్లడించారు. (Infosys: మాజీ ఎగ్జిక్యూటివ్ ఫిర్యాదు, కోర్టులో ఇన్ఫోసిస్కు షాక్) కాగా కరోనా సమయంలో అక్కడి ప్రభుత్వం కఠినమైన ఆంక్షలను అమలు చేసింది. ముఖ్యంగా హాంకాంగ్ చేరిన మూడు రోజుల తర్వాత బహిరంగ ప్రదేశాలకు వారి కదలికలను పరిమితం చేసేలా రెండు వారాల హోటల్ క్వారంటైన్ తప్పని సరిచేసింది. సెప్టెంబరులో ఈ కరోనా ఆంక్షలు సడలించినప్పటికీ, పర్యాటకుల సంఖ్య తగినంత పుంజుకోకపోవడంతో హాంకాంగ్ తాజా నిర్ణయం తీసుకున్నట్టు సమచారం. దీనికి తోడు ఉక్రెయిన్ యుద్ధం, రష్యా గగనతలం మూత కారణంగా హాంకాంగ్ నుండి లండన్లోని హీత్రూకి దాదాపు రెండు గంటల సమయం పడుతోందట. ఈ సమస్యల కారణంగా హాంకాంగ్లో తన కార్యకలాపాలను నిలిపివేస్తామని బ్రిటిష్ ఎయిర్లైన్ వర్జిన్ అట్లాంటిక్ బుధవారం తెలిపింది. అలాగే అనేక విమానయాన సంస్థలు విమానాలను నిలిపివేసాయి లేదా ఆ ప్రాంతంపై ప్రయాణించకుండా ప్రత్యామ్నాయమార్గాలను ఎంచుకున్నాయి. ఇటీవలి గణాంకాలు ప్రకారం ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల(2022, జనవరి- ఆగస్టు) మధ్య హాంకాంగ్కు కేవలం 183,600 మంది మాత్రమే సందర్శకులు వచ్చారు. మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదలే. కానీ కరోనా ముందు (2019) నాటి 56 మిలియన్లతో పోలిస్తే చాలా తక్కువ. అందుకే హోటల్ క్వారంటైన్ నిబంధనలను తొలగించిన అక్కడి ప్రభుత్వం ఇన్బౌండ్ ప్రయాణికులపై మిగిలిన ఆంక్షలను కూడా రద్దు చేయాలని భావిస్తోంది. ఫలితంగా రానున్న ఒకటి లేదా రెండు త్రైమాసికాలలో పర్యాటకులు తమ దేశానికి తిరిగి వస్తారని అంచనా వేస్తోంది. (ఫెస్టివ్ బొనాంజా: కెనరా బ్యాంకు కస్టమర్లకు శుభవార్త!) -
ఎయిర్ ఏసియా బంపర్ ఆఫర్, 50లక్షల టికెట్లు ఉచితంగా
సాక్షి,ముంబై: ప్రముఖ ఎయిర్లైన్ ఎయిర్ ఏసియా విమాన ప్రయాణీకులకు భారీ ఆఫర్ ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ రూట్లలో ఏకం50 లక్షల ఉచిత విమాన టికెట్లను అందిస్తోంది. ఈమేరకు కంపెనీ ట్విటర్లో వివరాలను అందించింది కస్టమర్లు సెప్టెంబర్ 25 వరకు ఈ ఆఫర్లతో టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. ఇలా కొన్ని టికెట్ల ద్వారా జనవరి 1 అక్టోబర్ 28, 2023 మధ్య ప్రయాణించవచ్చని ఎయిర్ ఏసియా గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కరెన్ చాన్. తమ వెబ్సైట్, మొబైల్ఆప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. యాప్ లేదా వెబ్సైట్లో, ఈ ఆఫర్ను యాక్సెస్ కోసం "Flights" చిహ్నాన్ని ఎంచుకోవాలని తెలిపారు. అంతర్జాతీయంగా విమాన సేవలు క్రమంగా పునఃప్రారంభించడంతో పాటు, సంస్థ 21వ పుట్టినరోజు సందర్భంగా అందిస్తున్నఈ బిగ్ సేల్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని చాన్ కోరారు. థాయ్లాండ్, కంబోడియా, వియత్నాంతో సహా అనేక ASEAN దేశాల ప్రయాణికులు ఆఫర్కు అర్హులు. రెండు నెలల క్రితం ఎయిర్ఏషియా కస్టమర్లకు ఉచిత టికెట్లను అందించిన సంగతి తెలిసిందే. AirAsia's BIG Sale is back! Enjoy 5 Million FREE Seats* starting today until 25 September 🥳 **Domestic: All-in from RM23, Asean: All-in from RM54. *Includes airport taxes, MAVCOM fee, fuel surcharges and other applicable fees. T&C apply. Read more: https://t.co/Pe2kRcZC7L — airasia Super App (@airasia) September 19, 2022 -
పీరియడ్ ప్రొడక్టులు ఫ్రీగా అందిస్తున్న తొలి దేశం
పీరియడ్ పావర్టీ.. చాలా దేశాలను పట్టి పీడిస్తున్న సమస్య. ఆర్థికంతో ముడిపడిన విషయం కావడంతో.. చాలామంది పీరియడ్స్ ప్రొడక్టులకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అక్కడిదాకా ఎందుకు.. అసలు వాటి గురించి అవగాహన, మాట్లాడేందుకు మొహమాటం ప్రదర్శించే పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే మహిళలకు నెలసరి విషయంలో పరిశుభ్రత పాటించకపోతే.. ఇబ్బందులు, అనారోగ్యాలు ఎదురవుతాయి. అంతేకాదు దీర్ఘకాలికంగా ఆరోగ్యంపై ప్రభావం కూడా చూపిస్తుంది. అందుకే రుతుక్రమ విషయంలో ఓ అడుగు ముందుకు వేసి.. పీరియడ్ ప్రొడక్టులను ఉచితంగా అందిస్తున్న తొలి ప్రపంచ దేశంగా నిలిచింది స్కాట్లాండ్. ఎడిన్బర్గ్: అవును.. యూరోపియన్ దేశం స్కాట్లాండ్ ఇవాళ్టి(ఆగష్టు 15వ తేదీ) నుంచి దేశం మొత్తం పీరియడ్ ప్రొడక్టులను ఉచితంగా అందిస్తోంది. తద్వారా ప్రపంచంలోనే ఈ చర్యకు ఉపక్రమించిన తొలి దేశంగా నిలిచింది. ఈ మేరకు ముందస్తుగా ఆదివారమే ఓ ప్రకటన చేసింది స్కాట్లాండ్ ప్రభుత్వం. స్కాట్లాండ్ ఉచిత పీరియడ్ ప్రొడక్ట్స్ చట్టం 2020లోనే తెర మీదకు వచ్చింది. శానిటరీ ఉత్పత్తులతో పాటు టాంపన్స్, శానిటరీ ప్యాడ్స్ను సైతం బహిరంగ ప్రదేశాల్లో ఉచితంగా అందుబాటులో ఉంచాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నవంబర్ 2020లో స్కాటిష్ పార్లమెంట్ ఏకగ్రీవంగా చట్టానికి ఆమోదం కూడా వేసింది. అయితే.. విద్యార్థులు, ఉపాధ్యాయులకు రుసుము లేకుండా శానిటరీ ఉత్పత్తులు ఇప్పటికే అందించబడ్డాయి, అయితే ఇప్పుడు బిల్లు.. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా చూసుకునే బాధ్యత మంత్రులకు ఇచ్చింది. తద్వారా దేశంలో శానిటరీ ఉత్పత్తులు ఇకపై అందరికీ ఉచితంగా అందుబాటులోకి వస్తాయన్నమాట. అయితే ఈ చట్టం అంత ఈజీగా ఆచరణలోకి రాలేదు. చాలా పోరాటాలే జరిగాయి. ఉచిత పీరియడ్ ఉత్పత్తులకు ప్రాప్యతను అందించడం సమానత్వం, గౌరవానికి సంబంధించింది. వాటిని మహిళలు అంగీకరించడం ఆర్థిక అడ్డంకులను తొలగిస్తుంది అని సామాజిక న్యాయ కార్యదర్శి షోనా రాబిసన్ చెప్తున్నారు. జీవన వ్యయ సంక్షోభం కారణంగా ప్రజలు కష్టతరమైన ఎంపికలు చేస్తున్న సమయంలో.. ఇది(ఈ సమస్య) గతంలో కంటే ఇప్పుడు చాలా ముఖ్యమైందని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా పీరియడ్ ఉత్పత్తులకు ఎవరూ దూరంగా ఉండకూడదనే తమ ప్రభుత్వం ఉందని ఆమె తెలిపారు. ఇదీ చదవండి: బుజ్జి బుల్లిపిట్ట.. కానీ, నిలువెల్లా విషమే! -
ఆ వైద్యుడు పేదల కంటి వెలుగు.. వందల మందికి ఉచిత ఆపరేషన్లు
సాక్షి, కడప సెవెన్రోడ్స్: గోరంత సాయం చేసి కొండంత ప్రచారం పొందాలనుకునేవారు చాలామంది. తమను తాము ప్రముఖ సంఘ సేవకులుగా చెప్పుకునే ఈ కోవకు చెందిన వారిని నిత్యం చూస్తుంటాం. కానీ అందుకు భిన్నంగా నిస్వార్థ సేవలు అందిస్తూ కూడా పబ్లిసిటీకి ఇష్టపడని వ్యక్తులు సైతం ఉంటారంటే ఒకింత ఆశ్చర్యమేస్తుంది. రెండు దశాబ్దాలకు పైబడి పేదలకు ఉచిత వైద్య పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహిస్తున్న కడప నగరానికి చెందిన ప్రముఖ కంటి వైద్యులు గగ్గుటూరు ప్రదీప్కుమార్ ఇందుకు నిదర్శనం. కడప నగరం రమేష్ థియేటర్ ఎదురు వీధిలో డాక్టర్ ప్రదీప్ కుమార్ తన తండ్రిపేరిట శ్రీ గగ్గుటూరు పిచ్చయ్య నేత్ర వైద్యశాలను చాలా ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. తన ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎంతో ఓపికగా కంటి పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన సేవలు అందిస్తుంటారు. 20 ఏళ్లుగా ఉచిత సేవలు పేదలకు వారంలో ఒకరోజు ఉచిత వైద్య పరీక్షలు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు నిర్వహించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అలా 2001 నుంచి ప్రతి ఆదివారం ఉచిత కంటి పరీక్షలు, వైద్యం అందించేవారు. మాజీమంత్రి బిజివేముల వీరారెడ్డి అల్లుడు డాక్టర్ రవికుమార్రెడ్డి క్లాస్మేట్. దీంతో ప్రతి ఆదివారం బద్వేలులోని వీరారెడ్డి ఆస్పత్రికి వెళ్లి ఉచిత కంటి పరీక్షలతోపాటు అవసరమైన వారికి ఆపరేషన్లు చేసేవారు. ఇలా 19 సంవత్సరాలు అక్కడ సేవలు అందించారు. ఇప్పుడు ప్రతి శనివారం కడప నగరం ఎర్రముక్కపల్లెలోని తన ఇంటి వద్ద ఉచిత పరీక్షలు చేస్తున్నారు. ప్రారంభంలో ఉచిత ఆపరేషన్లు చేశారు. అయితే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వద్ద అనుమతులు పెండింగ్లో ఉన్నందున ప్రస్తుతానికి ఆపరేషన్లు నిర్వహించడం లేదు. కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లు అవసరమైతే ఇతర వైద్యుల వద్దకు పంపుతున్నారు. ప్రతి శనివారం ఉచిత క్యాంపునకు 60–90 మంది పేషంట్లు వస్తుంటారు. కడప నగరంతోపాటు కమలాపురం, మైదుకూరు, ఎర్రగుంట్ల, గుత్తి, బ్రహ్మంగారిమఠం ప్రాంతాల నుంచి రోగులు వస్తారు. గతంలో బద్వేలులో పనిచేయడం వల్ల ఆ ప్రాంతం వారు ఎక్కువ వస్తారు. ఉదయం 7 నుంచి 12 గంటల వరకు అవసరమైతే మరికొంత సమయాన్ని ఉచిత సేవలకు వినియోగిస్తున్నారు. చదవండి: (ఫలించిన ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి కృషి.. సీఎం జగన్కు కృతజ్ఞతలు) సామాజిక బాధ్యతగా భావించాను నేను పుట్టి పెరిగింది కడప నగరం ఎర్రముక్కపల్లె. వైద్య పట్టా పుచ్చుకున్నాక మా ఇంటి చుట్టుపక్కల ఉన్న పేదలకు ఉచిత పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహించడం బాధ్యతగా భావించాను. ఇప్పుడు కడపకు చెందిన వారేకాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా వస్తున్నారు. శుక్లాలు, అద్దాల చెకప్, గ్లాకోమా తదితర కంటి పరీక్షలు నిర్వహిస్తాను. – డాక్టర్ ప్రదీప్కుమార్, కంటి వైద్య నిపుణులు, కడప పేదలకు ఎంతో మేలు ఇప్పుడున్న పరిస్థితుల్లో వైద్యం ఖరీదై పోయింది. డబ్బున్న వారికే వై ద్యం అన్నట్లు తయారైంది. గతంలో ఒకటి లేదా రెండు రూపాయల నామమాత్రపు ఫీజు తీసుకునే వైద్యులను చూశాను. ఇప్పుడు డాక్టర్ ప్రదీప్కుమార్ వారంలో పూర్తిగా ఒకరోజు ఉచిత సేవలు అందించడం పేదలకు ఎంతో మేలు చేసే అంశం. – సీఆర్వీ ప్రసాద్రావు, నాగరాజుపేట, కడప -
ఆ ఊరిలో పాలు అమ్మరు!
తాగునీటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్న ఈ కాలంలో అక్కడ ఉచితంగా పాలు పోస్తున్నారు. ఎవరైనా డబ్బులు ఇవ్వడానికి వస్తే తీసుకోరు. పాలు అమ్మరు. గర్భిణులు, బాలింతలున్న ఇళ్లకు వారే అడిగి మరీ పంపిస్తారు. ఇలా చేసేది ఒకరో ఇద్దరో కాదు. ఆ ఊరంతా ఇదే సంప్రదాయం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా పిన్నాపురం గ్రామం ప్రత్యేకత ఇదీ.. కర్నూలు: నంద్యాల జిల్లా పాణ్యం మండల పరిధిలోని పిన్నాపురం ఓ మారుమూల గ్రామం. 421 ఇళ్లు 1800 జనాభా కలిగిన ఈ ఊరిలో 344 బర్రెలు, 815 ఆవులు, 2444 మేకలు ఉన్నాయి. ఇక్కడ తాతల కాలం నుంచి పశు పోషణ సంప్రదాయంగా వస్తోంది. గ్రామ జనాభాలో దాదాపు 80 శాతం మంది పాడిపెంపకందారులే. సమీపంలోని కొండ ప్రాంతాల్లో వాటిని పెంచుకుంటూ తమకున్న కొద్దిపాటి పొలాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం గ్రామంలో ఎవ్వరూ పాలు విక్రయించరు. పశుపోషకులు తమ కుటుంబ అవసరాలకు పోనూ మిగిలిన వాటిని గ్రామస్తులకు ఉచితంగా ఇస్తారు. ముఖ్యంగా గర్భి ణులు, బాలింతలు ఉన్న ఇళ్లకు వారే స్వయంగా పాలు పంపిస్తుంటారు. ఎవరైనా వారి ఇళ్లల్లో శుభకార్యాలు ఉన్నప్పుడు మాత్రమే సమీపంలోని పట్టణం నుంచి పాల ప్యాకెట్లు కొనుగోలు చేసి తెచ్చుకుంటారు. ఇక్కడి గ్రామ ప్రజలు పొద్దున్నే గ్లాసుడు కాఫీ లేదా టీ తాగడంతో దిన చర్య మొదలు పెడతారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో తప్పనిసరిగా పెరుగు లేదా మజ్జిగ వాడుతారు. ఇందుకు అవసరమైన పాలు గ్రామంలోనే ఉచితంగా లభిస్తుండటం విశేషం. అవసరాల్లో ఒకరికొకరు సహాయపడాలన్నదే ఈ సంప్రదాయం ప్రధాన ఉద్దేశమని గ్రామస్తులు తెలిపారు. ఉచితంగా పాలు పోస్తే మంచిదని.. మా గ్రామంలో పాలు ఉచితంగా పోసే ఆచారం మా తాతల కాలం నుంచి ఉంది. అలా మా పెద్దల నుంచి వచ్చిన ఆచారాన్ని కొనసాగిస్తున్నాం. చాలా కుటుంబాల్లో ఇంటి అవసరాలకు మించే పాలు ఉంటాయి. గ్రామంలో పాడిలేని వారు ఎవరైనా ఉన్నారని తెలిస్తే వారు అడగకుండానే పాలు పంపిస్తాం. దీని వల్ల మాకు మంచి జరుగుతుందని నమ్మకం. –మిద్దె నాగమ్మ, పిన్నాపురం పెద్దల నుంచి వస్తున్న ఆచారం మా పెద్దలు మాకు పాలను ఉచితంగా ఇచ్చే పద్ధతిని నేర్పారు. అందుకే పాడి ఉన్నంత వరకు పాలు, మజ్జిగ చుట్టు పక్కల వారి అవసరాలకు ఉచితంగానే పోస్తుంటాం. నెయ్యి మాత్రం పాణ్యం వెళ్లి అమ్ముకుంటాం. అది కూడా పండగ వచ్చే ముందు ఏడాదికి ఒకసారి మాత్రమే. –గని ఈశ్వరమ్మ, పిన్నాపురం ఒకరికొకరం సహాయపడతాం మాకు రెండు బర్రెలు ఉన్నాయి. ఇప్పటికీ చుట్టుపక్కల వారికి అడిగి పాలు పోస్తాం. అదే బాలింతలు, గర్భిణులుంటే వారి ఇళ్లకు వెళ్లి ఇస్తాం. ఎందుకంటే వారికి పాల అవసరం ఎక్కువగా ఉంటుంది. మాకు అవసరమైనప్పుడు కూడా గ్రామంలోని వారు ఇలాగే పంపిస్తారు. – మీదివేముల రామకృష్ణ, పిన్నాపురం -
ఈ ఫోన్లు కొంటే..షావోమీ బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: ప్రముఖ స్మార్ట్ఫోన్ మేకర్ షావోమీ ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్ యూట్యూబ్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశీయంగా మూడు నెలల యూట్యూబ్ ప్రీమియం సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తోంది. అయితే ఇందులో ఒక కండిషన్ ఉంది. అదేమిటంటే.. ఎంపిక చేసిన షావోమీ, రెడ్మి స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై మొదటి మూడు నెలలు ఈ అవకాశం అందుబాటులో ఉంది. ఈ మేరకు షావోమి ఇండియా ఒక ప్రకటన జారీ చేసింది. షావోమి ఇలాంటి ఆఫర్ ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు తన సబ్-బ్రాండ్లలో ఒకటైన పోకో కూడా ఇదే ఆఫర్ను వినియోగదారులకు అందిస్తోంది. సో..యూట్యూబ్ ప్రీమియం ఉచిత ఆఫర్ను ఇప్పటికే పొందినట్లయితే, షావోమీ ఫోన్ కొనుగోలుపై ఫ్రీ ఆఫర్ను పొందేందుకు అర్హుల కారు అనేది గమనించాలి. షావోమి 11, షావోమీ 12 ప్రో, షావోమీ 11టి,11 ఐ కొనుగోలుపై మూడు నెలలు, అలాగే రెడ్మి నోట్ 11, నోట్ 11 ఎస్ లాంటి కొన్ని స్మార్ట్ఫోన్లపై రెండు నెలల యూట్యూబ్ ప్రీమియం సబ్స్ర్రిప్షన్ ఉచితం. ఈ ప్రమోషనల్ ఆఫర్ జనవరి 31, 2023 వరకు అందుబాటులో ఉంటుంది. కాగా యూట్యూబ్ ప్రీమియం నెలకు రూ.129. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఉన్న ఇతర ఓటీటీ ప్లాట్ఫారమ్ల కంటే ఇదే చౌకగా లభిస్తోంది. -
ఓయో రూమ్స్ బంపరాఫర్, ఫ్రీగా హోటల్ రూమ్స్లో ఉండొచ్చు!
ఇండియన్ హోటల్ రూమ్స్ ఆగ్రిగ్రేటర్ ఓయో వినియోగదారులకు బంపరాఫర్ ప్రకటించింది. ట్రావెల్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఓయో రూమ్స్ ఫ్రీగా వినియోగించుకోవచ్చని అధికారికంగా తెలిపింది. ఇందుకోసం కొన్ని షరతులు విధించింది. పీటీఐ నివేదిక ప్రకారం..విజార్డ్ లాయల్టీ ప్రోగ్రామ్లోని గోల్డ్ సభ్యులు 5రాత్రులు(5రోజుల పాటు) ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఓయో విజార్డ్ దేశంలో తరుచూ ప్రయాణం చేసే వారికి అందుబాటులో ఉంది. ఇతర ప్రయోజనాల్ని అందించడంతో పాటు ఓయో రూమ్స్ విజార్డ్ సౌకర్యం ఉన్న హోటళ్లపై 10శాతం డిస్కౌంట్ను అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్ తో పాటు 92 లక్షలకు పైగా సభ్యులతో ఓయో విజార్డ్ అనేది అతిపెద్ద లాయల్టీ ప్రోగ్రామ్స్లో ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్కు చెందిన ట్రావెల్ కష్టమర్లు ఎక్కువగా ఉన్నారు. వారికి అదనపు సౌకర్యాల్ని కల్పించేందుకు ఓయో విజర్డ్ బ్లూ, విజర్డ్ సిల్వర్, విజర్డ్ గోల్డ్ స్కీమ్లను అందుబాటులోకి తెచ్చింది. వారికే లాభం ఫ్రీ రూమ్ నైట్స్, తగ్గింపు ఆఫర్లు వంటి మా ప్రోత్సాహకాల వల్ల కస్టమర్లు ఓయోలో పదే పదే ఉండేందుకు మరొక అవకాశాన్ని అందుబాటులో ఉంచాం. 2021 మార్చి 31తో ముగిసిన ఏడాదిలో 70 శాతానికి పైగా రిపీట్ కస్టమర్లు ఉన్నారు. తాజా కొత్త లాయల్టీ సర్వీసుల వల్ల వీరికి ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నట్లు ఓయో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ప్రొడక్ట్), చీఫ్ సర్వీస్ ఆఫీసర్ శ్రీరంగ్ గాడ్బోలే వివరించారు. -
మీ స్మార్ట్ఫోన్లో ఉచితంగా ఐపీఎల్-2022 మ్యాచ్లను ఇలా చూడండి..!
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ టీ20 లీగ్ ఐపీఎల్- 15వ ఎడిషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే.ఈ మ్యాచ్లు 29 మే 2022 వరకు కొనసాగుతాయి. ఐపీఎల్ మ్యాచ్లను స్టార్ స్పోర్ట్ లేదా డిస్నీ+హాట్స్టార్ ద్వారా వీక్షించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ అభిమానుల కోసం పలు దిగ్గజ టెలికాం సంస్థలు జియో, వోడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ సరికొత్త బండిల్ రీఛార్జ్ ప్లాన్స్ను అందుబాటులోకి తెచ్చాయి. వీటితో ఐపీఎల్-2022 మ్యాచ్లను ఉచితంగా చూడడమే కాకుండా ఇంటర్నెట్ డేటా కూడా లభిస్తోంది. టెలికాం సంస్థలే కాకుండా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు, ఫిన్టెక్ సంస్థలు కూడా పలు ఆఫర్లను అందిస్తున్నాయి. ఉచితంగా డిస్నీ+హట్స్టార్ సేవలను జియో అందిస్తోన్నరీఛార్జ్ ప్లాన్స్ రూ. 499 ప్లాన్: 2GB డేటా/రోజు: అపరిమిత కాల్స్, 100 SMS/రోజు, 28 రోజుల చెల్లుబాటు రూ. 601 ప్లాన్: 3GB డేటా/రోజు + 6GB అదనపు డేటా, అపరిమిత కాల్లు, 100 SMS/రోజు, 28 రోజుల చెల్లుబాటు రూ. 659 ప్లాన్: 1.5GB డేటా/రోజు, 56 రోజుల చెల్లుబాటు. రూ. 799 ప్లాన్: 2GB డేటా/రోజు, అపరిమిత కాల్స్, 100 SMS/రోజు, 56 రోజుల చెల్లుబాటు రూ. 1066 ప్లాన్: 2GB డేటా/రోజు + 5GB అదనపు డేటా, అపరిమిత కాల్లు, 100 SMS/రోజు, 84 రోజుల చెల్లుబాటు రూ. 3,199 ప్లాన్: 2GB డేటా/రోజు + 10GB అదనపు డేటా, అపరిమిత కాల్లు, 100/రోజు, 365 రోజుల చెల్లుబాటు రూ. 1,499 ప్లాన్: రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్లు, 100 SMS/రోజు, 84 రోజుల చెల్లుబాటు రూ. 4,199 ప్లాన్: రోజుకు 3GB డేటా, అపరిమిత కాల్లు, 100 SMS/రోజు, 365 రోజుల చెల్లుబాటు ఉచితంగా డిస్నీ+హట్స్టార్ సేవలను వోడాఫోన్ ఐడియా అందిస్తోన్నరీఛార్జ్ ప్లాన్స్ రూ. 601 ప్లాన్: 3GB డేటా/రోజు, అపరిమిత కాల్స్, 100 SMS/రోజు, 28 రోజుల చెల్లుబాటు రూ. 901 ప్లాన్: 3GB డేటా/రోజు, అపరిమిత కాల్స్, 100 SMS/రోజు, 70 రోజుల చెల్లుబాటు రూ. 3,099 ప్లాన్: 1.5GB డేటా/రోజు, అపరిమిత కాల్స్, 100 SMS/రోజు, 365 రోజుల చెల్లుబాటు ఉచితంగా డిస్నీ+హట్స్టార్ సేవలను ఎయిర్టెల్ అందిస్తోన్నరీఛార్జ్ ప్లాన్స్ రూ. 838 ప్లాన్: 2GB డేటా/రోజు, అపరిమిత కాల్స్, 100 SMS/రోజు, 56 రోజుల చెల్లుబాటు, ఈ ప్లాన్తో అమెజాన్ ప్రైం, ఎయిర్టెల్ వీంక్ సేవలను ఉచితంగా పొందవచ్చును. రూ. 839 ప్లాన్: 2GB డేటా/రోజు, అపరిమిత కాల్స్, 100 SMS/రోజు, 84 రోజుల చెల్లుబాటు రూ. 2,999 ప్లాన్: 2GB డేటా/రోజు, అపరిమిత కాల్స్, 100 SMS/రోజు, 84 రోజుల చెల్లుబాటు ► డిస్నీ+హాట్స్టార్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ సేవలను ప్రముఖ ఫిన్టెక్ సంస్థ స్లైస్ అందిస్తోంది. ఇది కేవలం స్లైస్ స్పార్క్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.ప్రీమియం సబ్స్క్రిప్షన్పై రూ. 250 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తోంది. ► టైమ్స్ ప్రైమ్ సబ్స్క్రైబర్లు డిస్నీ+ హాట్స్టార్ సూపర్ సబ్స్క్రిప్షన్ను ఉచితంగా పొందవచ్చు. టైమ్స్ ప్రైమ్ తన కొత్త కస్టమర్లకు డిస్నీ+ హాట్స్టార్ సూపర్ సబ్స్క్రిప్షన్ను ఉచితంగా అందిస్తోంది. టైమ్స్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్కు రూ. 1,199 చెల్లించడంతో కస్టమర్లు డిస్నీ+ హాట్స్టార్ సూపర్కి ఆరు నెలల సబ్స్క్రిప్షన్ను ఉచితంగా పొందుతారు. ► హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులు GyFTR వెబ్సైట్ని ఉపయోగించి డిస్నీ+ హాట్స్టార్ ప్రీమియం సభ్యత్వాన్ని ప్రత్యేక తగ్గింపు రేటుతో కొనుగోలు చేయవచ్చు. డిస్నీ+ హాట్స్టార్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ కొనుగోలుపై ఫ్లాట్ 15 శాతం తగ్గింపును అందిస్తోంది. ► ఫ్లిప్కార్ట్ వినియోగదారులు డిస్నీ+ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ను ఉచితంగా పొందవచ్చు. ఫ్లిప్కార్ట్లో తరచుగా ఆన్లైన్ షాపింగ్ చేసేవారైతే, మీ కొనుగోళ్లకు రివార్డ్లుగా సూపర్కాయిన్స్ను అందిస్తోంది. ఈ SuperCoins తో డిస్నీ+ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ పొందడానికి రీడీమ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు, మీరు 299 Flipkart SuperCoinsతో డిస్నీ+ హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ను ఉచితంగా పొందుతారు. చదవండి: అత్యంత సరసమైన ధరలో లగ్జరీ బైక్..! ట్రయంఫ్ నుంచి..! -
ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ను ఇలా పొందండి..!
ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎం తన యూజర్ల కోసం బంపర్ ఆఫర్ను ప్రకటించింది. పేటీఎం యాప్ నుంచి ఎల్పీజీ సిలిండర్స్ బుక్ చేసుకునే యూజర్ల కోసం అద్భుతమైన డీల్స్తో ముందుకొచ్చింది. ఈ ఆఫర్ కేవలం కొత్త యూజర్లకు మాత్రమే వర్తించనుంది. ఎల్బీజీ వినియోగదారులకోసం పేటీఎం మూడు సరికొత్త ప్రొమోకోడ్స్ను తీసుకొచ్చింది. పేటీఎం యాప్ను ఉపయోగించి గ్యాస్ బుక్చేసే సమయంలో ఈ ప్రొమోకోడ్స్ను అప్లై చేయడంతో క్యాష్బ్యాక్ను పొందవచ్చును. మొదటి ప్రొమో కోడ్(BANKBANG)లో భాగంగా పేటీఎం యూజర్లు రూ. 25 డిస్కౌంట్ను పొందవచ్చును. ఈ ఆఫర్ కేవలం డెబిట్ కార్డుతో చెల్లింపు జరిపినప్పుడే డిస్కౌంట్ వస్తోంది. రెండో ప్రోమో కోడ్(FIRSTCYLINDER)తో రూ.30 పేటీఎం క్యాష్బ్యాక్ యూజర్లకు రానుంది. మూడో ప్రొమో కోడ్లో భాగంగా ఉచితంగానే సిలిండర్ను పొందవచ్చును. ఉచితంగా సిలిండర్..! ఎల్పీజీ కస్టమర్లకోసం పేటీఎం సరికొత్త ప్లాన్తో ముందుకొచ్చింది. పేటీఎం యూజర్లకు ఎల్పీజీ సిలిండర్లను బుకింగ్ చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తోంది. హెచ్పీ గ్యాస్, భారత్ గ్యాస్, ఇంధనే వంటి గ్యాస్ సిలిండర్లను పేటీఎం యూజర్లు బుక్ చేసుకోవచ్చు. పేటీఎం యూజర్లు (FREECYLINDER) అనే ప్రోమోకోడ్ను సిలిండర్ బుక్ చేసుకునే సమయంలో అప్లై చేయడంతో ఉచితంగా సిలిండర్ను పొందే అవకాశం ఉంది. ఈ ప్రోమోకొడ్తో చెల్లించిన మొత్తాన్ని పేటీఎం క్యాష్బ్యాక్ రూపంలో పూర్తిగా అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం ప్రతి 100 వ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికి వర్తించనుంది. గరిష్టంగా వెయ్యి రూపాయల వరకు క్యాష్బ్యాక్ను యూజర్లు పొందవచ్చు. అంటే యూజర్లు కేవలం ఒక్క సిలిండర్ మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుది. ఫిబ్రవరి 28, 2022 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీరు 100వ లక్కీ కస్టమర్ అయితే.. 24 గంటల్లో మీకు క్యాష్బ్యాక్ లభిస్తుంది. ఇలా బుక్ చేయండి..! ముందుగా పేటీఎం యాప్ను ఒపెన్ చేయండి ‘బుక్ మై సిలిండర్’ ఆప్షన్పై క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ లేదా ఎల్పీజీ ఐడీ లేదా కస్టమర్ నెంబర్ను నమోదుచేసిన తర్వాత... మీ ఏజెన్సీ గురించి మీకు సమాచారం లభిస్తుంది. ఆ తర్వాత మీరు పేమెంట్ చేయడంతో మీ బుకింగ్ పూర్తవుతుంది. బుకింగ్ సమయంలో ప్రొమో కోడ్ అప్లై చేయడంతో క్యాష్బ్యాక్ను పొందవచ్చును. చదవండి: కేవలం నెలకు రూ. 125 చెల్లించి 12 ఓటీటీ సేవలను ఇలా పొందండి..! చదవండి: తళుక్కున మెరిసిన కల్యాణ్ జ్యువెలర్స్..! కోవిడ్-19 ముందుస్థాయికి మించి.. -
అక్కడ పాలు ఉచితం.. అమ్మితే అరిష్టమే..
సాక్షి, తాడిమర్రి (అనంతపురం): పాలు లీటరు రూ.40 నుంచి రూ.60 దాకా పలుకుతున్న రోజులివి. ఎవరికైనా పాలు కావాలంటే కొనాల్సిందే. కానీ ఆ గ్రామంలో పాలు అమ్మరు.. కొనరు. ఎన్ని కావాలన్నా ఉచితమే. అవును ఇది నిజం. ఆ కథాకమామీషు ఏంటో తెలుసుకుందాం. తాడిమర్రికి ఉత్తర దిశన 23 కిలోమీటర్ల దూరంలో చిల్లవారిపల్లి గ్రామం ఉంది. 400 కుటుంబాలు, 1900మంది జనాభా, 1100 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో దాదాపు 300 పాడి ఆవులు, గేదెలు ఉన్నాయి. ప్రతి రోజూ వందలాది లీటర్ల పాలు ఉత్పత్తవుతాయి. అయితే గ్రామంలో పాడి పశువులు లేని వారికి పాలు అవసరమైతే డబ్బు తీసుకోకుండా ఉచితంగా పోస్తారు. పాలకుండలో దేవుడు కనిపించాడని.. చిల్లవారిపల్లిలో పూర్వం కాటికోటేశ్వరస్వామి (కాటమయ్య) పాల కుండలో నవ యువకునిగా కనిపించాడని ప్రతీతి. దీంతో గ్రామంలో ఆలయం నిర్మించి స్వామి విగ్రహాలను ప్రతిష్టించారు. మహాశివరాత్రి సందర్భంగా రెండు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. సంక్రాంతి కనుమ పండుగ మరుసటి రోజున గ్రామంలో కాటికోటేశ్వరస్వామిని ఊరేగిస్తారు. దేవుడు పాలకుండలో కన్పించినందున ఆనాటి నుంచి పాలు అమ్మడం కానీ, కొనడం కానీ చేయడం లేదని గ్రామస్తులు తెలిపారు. ఈ ఆచారాన్ని విస్మరించి ఎవరైనా పాలు అమ్మితే వారి ఇంటికి అరిష్టం జరుగుతుందనేది గ్రామస్తుల నమ్మకం. చదవండి: (అర్హతలే భీమవరానికి వరం!) కోర్కెలు తీర్చే ఇలవేల్పు కాటికోటేశ్వరస్వామి కొలిచిన వారికి కొంగు బంగారమై నిలుస్తున్నాడు. కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా పూజలందుకుంటున్నాడు. మా గ్రామస్తులు కాటికోటేశ్వరస్వామిని తప్ప ఇంకొక స్వామిని ఎరుగరు. కాటికోటేశ్వరస్వామి అంటే గ్రామస్తులకు అపారమైన భక్తి. గ్రామంలో 80 శాతంపైగా పరమశివుని నామాలతోనే పేర్లు ఉండటం విశేషం. –పీ.పెద్దశివారెడ్డి, సర్పంచ్, చిల్లవారిపల్లి పాలు అమ్మిందే లేదు వందల ఏళ్ల నుంచి గ్రామంలో పాలు అమ్మింది లేదు. మా తాత, ముత్తాతల కాలం నుంచి పాలు అమ్మడమనేది చూడలేదు. మాకు 15 పాడి ఆవులు, గేదెలు ఉన్నాయి. ప్రతి రోజూ నాలుగు ఆవులు, ఒక గేదె సుమారు 15 లీటర్ల పాలు ఇస్తాయి. అయినా చుక్క కూడా పాలు, పెరుగు అమ్మం. అడిగిన వారికి ఉచితంగా పోస్తాం. – పి.బాలమ్మ, వృద్ధురాలు, చిల్లవారిపల్లి -
ఫొటోలు, వీడియోలతో ఫోన్ స్టోరేజ్ నిండిందా?
Full Phone storage Here's create more space: పండుగ టైంలో సరదాగా ఫొటోలు, వీడియోలు తీసుకోవాలని చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అయితే స్టోరేజ్ సమస్య చాలామందికి ఇబ్బందిగా అనిపించి ఉండొచ్చు. ఈ తరుణంలో ఫోన్లో ఫ్రీ స్పేస్ కోసం ఏం చేయొచ్చో తెలుసుకుందాం. ఫోన్ స్పేస్ ఫ్రీ చేయడం అంటే ఉన్న ఫొటోల్ని, వీడియోల్ని డిలీట్ చేయడం అనుకుంటారు చాలామంది. ఇందుకోసం వాటిని సెలక్ట్ చేసుకుంటూ.. టైం తీసుకుంటూ కుస్తీ పడుతుంటారు. కానీ, కింద చెప్పిన పద్ధతుల్లో వెళ్తే.. డివైజ్లో స్పేస్ కోసం అంత టైం పట్టదు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి.. చాలామంది వాడే స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ ఫోన్లే. గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి.. అక్కడ ప్రొఫైల్ ఓపెన్ చేయాలి. మేనేజ్ యాప్స్ అండ్ డివైజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ స్టోరేజ్ సెక్షన్లోకి వెళ్తే.. ఏ యాప్ ఎక్కువ రోజుల నుంచి నిరుపయోగంగా ఉందో.. ఏ యాప్వల్ల ఎక్కువ స్పేస్ పోతుందో స్పష్టంగా కనిపిస్తుంది. వాటిని అన్ఇన్స్టాల్ చేయడం ద్వారా స్పేస్ను క్రియేట్ చేసుకోవచ్చు. ఫైల్ మేనేజర్ & గూగుల్ ఫైల్స్ యాప్.. దాదాపు ప్రతీ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉంటోంది. అది ఓపెన్ చేయగానే అందులో .. ఇమేజెస్(ఫొటోలు), ఆడియో, వీడియోలు ఇతరాలు కనిపిస్తాయి. అక్కడ లార్జ్ ఫైల్స్లో అనవసరమైనవి ఎంపిక చేసుకుని డిలీట్ చేయొచ్చు. వాట్సాప్లో.. దాదాపు స్మార్ట్ ఫోన్ వాడే వాళ్లందరి ఫోన్లలో ఉంటున్న యాప్. ఈ యాప్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యే డాటాను కొంతమంది క్లియర్ చేసినా.. స్టోరేజ్లో అలాగే ఉండిపోతాయని తెలుసా? అందుకే వాట్సాప్ సెట్టింగ్స్లోకి వెళ్లి వాటిని క్లియర్ చేస్తూ ఉండాలి. సెట్టింగ్స్లో స్టోరేజ్ అండ్ డాటా ఆప్షన్ను క్లిక్ చేయగానే ‘మేనేజ్ స్టోరేజ్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయగానే ఎంత స్పేస్ అవసరం అనేది చూపిస్తుంది. అంతేకాదు అవసరం అనుకున్న ఫైల్స్ను అక్కడి నుంచి కూడా డిలీట్ చేసుకోవచ్చు. అక్కడ 5 ఎంబీ కంటే ఎక్కువ ఫైల్స్కనిపిస్తాయి కాబట్టి సులువుగా క్లియర్ చేసుకోవచ్చు కూడా. క్లౌడ్ సర్వీస్.. ఫొటోల్ని, వీడియోల్ని బ్యాక్అప్ చేసుకోవడం ద్వారా ఫోన్ స్పేస్ ఫ్రీ చేసుకోవచ్చు. ఇందుకోసం చేయాల్సిందల్లా గూగుల్ ఫోటోస్లో బ్యాకప్ అండ్ సింక్రనైజ్ ఫీచర్ని ఆన్లో పెట్టుకోవడమే. గూగుల్ ఫొటోస్ యాప్పై క్లిక్ చేసి సెట్టింగ్స్లో బ్యాకప్ అండ్ సింక్రనైజ్ ఆప్షన్ను ఎంచుకోవచ్చు. హైక్వాలిటీ రెజల్యూషన్ ఎంచుకుంటే గూగుల్ ఫొటోస్ అన్లిమిటెడ్ స్టోరేజ్ను అందిస్తుంది. గూగుల్ ఫొటోస్తో పాటు గూగుల్ డ్రైవ్ లాంటి వాటిలో సేవ్ చేసుకుంటే సరి. ఇవికాగా.. యాప్స్ క్యాచెని తొలగించడం ద్వారా స్టోరేజ్ స్పేస్ వస్తుంది. అయితే ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే.. డాటానే పోయే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్లి.. యాప్స్ ఆప్షన్ను క్లిక్ చేసి.. ఆవెంటనే ఏదైనా యాప్ మీద క్లిక్ చేసి, స్టోరేజ్ ఆపై క్లియర్ క్యాచెను క్లిక్ చేయాలి. డౌన్లోడ్స్పై లుక్. చాలావరకు మీకు అవసరం లేని ఫైల్స్ ఉంటాయి. అలాంటి వాటిని చూసి తొలగించండి. అలాగే పీడీఎఫ్ ఫైల్స్, హైడ్లో దాచిన ఫైల్స్ ఉంటే కూడా డిలీట్ చేయడం ద్వారా స్పేస్ దొరుకుతుంది. -
నెట్ఫ్లిక్స్, డిస్నీ+హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ సేవలను ఉచితంగా ఇలా పొందండి..!
పలు దిగ్గజ టెలికాం సంస్థలు కస్టమర్లను ఆకర్షించేందుకుగాను బండిల్ రీచార్జ్ ప్లాన్లను ప్రకటించాయి. ఈ ప్లాన్స్తో పలు ఓటీటీ సేవలను ఉచితంగా అందిస్తున్నాయి. కాగా ఆయా టెలికాం సంస్థలు బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసులపై కూడా ఆయా ఓటీటీ సేవలను కస్టమర్లు ఉచితంగా పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవెడర్లలో చౌవకైన, సూపర్ ప్లాన్స్ను జియో ఫైబర్ అందిస్తోంది. జియో ఫైబర్ బ్రాడ్బ్యాండ్ సేవలతో ఆయా ఓటీటీ సేవలను కస్టమర్లకు ఉచితంగా అందజేస్తోంది. జియో ఫైబర్ అందిస్తోన్న ఆయా బ్రాడ్బ్యాండ్ ప్లాన్స్ వివరాల గురించి తెలుసుకుందాం...! ఓటీటీ సేవలను ఉచితంగా అందిస్తోన్న జియో ఫైబర్ ప్లాన్స్ ఇవే..! జియో ఫైబర్ రూ. 999 బ్రాడ్బ్యాండ్ ప్లాన్: తక్కువ ధరకు బ్రాడ్బ్యాండ్ సేవలను అందిస్తోన్న ప్లాన్ ఇదే. ఈ ప్లాన్లో భాగంగా యూజర్లు 150Mbps వరకు డౌన్లోడ్, అప్లోడ్ వేగంతో నిజమైన అపరిమిత ఇంటర్నెట్ డేటాతో రానుంది. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్స్టార్, సోనీ LIV, Zee5, Alt బాలాజీతో సహా 14 ఓటీటీ యాప్లకు యాక్సెస్ చేయవచ్చును. ఈ సేవలను ఏడాది పాటు పొందవచ్చును. దీనిలో నెట్ఫ్లిక్స్ సేవలను పొందలేరు. జియో ఫైబర్ రూ. 999 బ్రాడ్బ్యాండ్ ప్లాన్ వ్యాలిడిటీ నెల రోజులు. జియో ఫైబర్ రూ. 1499 బ్రాడ్బ్యాండ్ ప్లాన్: ఎక్కువ మేర జియో ఫైబర్ కస్టమర్లు ప్లాన్ను వాడుతున్నారు. ఈ ప్లాన్లో భాగంగా 300 Mbps వరకు డౌన్లోడ్ , అప్లోడ్ వేగంతో అపరిమిత ఇంటర్నెట్ డేటాను పొందవచ్చును. అపరిమిత వాయిస్ కాలింగ్తో పాటుగా, అదనపు ఖర్చు లేకుండా 15 ఓటీటీ యాప్ సేవలను ఉచితంగా పొందవచ్చును. వీటిలో నెట్ఫ్లిక్స్ (బేసిక్), అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్స్టార్, సోనీ లివ్, జియో సినిమా, జీ5 వంటివి అందుబాటులో ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ తప్ప మిగతా సేవలను ఏడాది పాటు పొందవచ్చును. జియో ఫైబర్ రూ. 1,499 బ్రాడ్బ్యాండ్ ప్లాన్ వ్యాలిడిటీ నెల రోజులు. జియోఫైబర్ రూ. 2499 బ్రాడ్బ్యాండ్ ప్లాన్: ఈ ప్లాన్ 500 Mbps వేగం, 30 రోజుల చెల్లుబాటుతో అపరిమిత డేటాకు యాక్సెస్ చేయవచ్చును. జియో యాప్స్తో పాటుగా, ఈ ప్లాన్ నెట్ఫ్లిక్స్ (స్టాండర్డ్), అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్స్టార్, సోనీ లివ్, జియో సినిమా, జీ5, వూట్ కిడ్స్, సన్ నెక్స్ట్, HoiChoi, Universal+, Lionsgate Play, JioCinema, ShemarooMe, Eros Now, Alt Balaji, జియోసవన్ సేవలను ఉచితంగా పొందవచ్చును. జియో ఫైబర్ రూ. 3999 బ్రాడ్బ్యాండ్ ప్లాన్: ఈ ప్లాన్ 1Gbps వేగం, 30 రోజుల చెల్లుబాటుతో అపరిమిత డేటాను యాక్సెస్ను చేయవచ్చును. జియో యాప్స్తో పాటుగా, ఈ ప్లాన్ నెట్ఫ్లిక్స్ (స్టాండర్డ్), అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్స్టార్, సోనీ లివ్, జియో సినిమా, జీ5, వూట్ కిడ్స్, సన్ నెక్స్ట్, HoiChoi, Universal+, Lionsgate Play, JioCinema, ShemarooMe, Eros Now, Alt Balaji, జియోసవన్ సేవలను ఉచితంగా పొందవచ్చును. జియో ఫైబర్ రూ. 8999 బ్రాడ్బ్యాండ్ ప్లాన్: ఈ ప్లాన్ 1Gbps వేగం, 30 రోజుల చెల్లుబాటుతో 6600GB డేటాకు యాక్సెస్ లభిస్తోంది. జియో యాప్స్తో పాటుగా, ఈ ప్లాన్ నెట్ఫ్లిక్స్ (స్టాండర్డ్), అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్స్టార్, సోనీ లివ్, జియో సినిమా, జీ5, వూట్ కిడ్స్, సన్ నెక్స్ట్, HoiChoi, Universal+, Lionsgate Play, JioCinema, ShemarooMe, Eros Now, Alt Balaji, జియోసవన్ సేవలను ఉచితంగా పొందవచ్చును. చదవండి: వచ్చేస్తోంది..అమెజాన్ 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్'..! 70 శాతం మేర తగ్గింపు! -
బంపరాఫర్..! ఉచితంగా రూ. 20 వేల విలువైన 5జీ స్మార్ట్ఫోన్...!
స్వదేశీ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ లావా మొబైల్స్ అనూహ్యమైన ఆఫర్తో ముందుకొచ్చింది. ఉచితంగా 5జీ స్మార్ట్ఫోన్ను కొనుగోలుదారులు పొందే అవకాశాన్ని లావా మొబైల్స్ కల్పిస్తోంది. ఈ ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే..! స్మార్ట్ఫోన్ కొనుగోలుదారుల కోసం లావా ఆసక్తికరమైన ఆఫర్ను ప్రకటించింది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద న్యూ లావా అగ్ని 5జీ స్మార్ట్ఫోన్ను కంపెనీ ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్లో భాగంగా కొనుగోలుదారులు రియల్మీ 8ఎస్ స్మార్ట్ఫోన్ను ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ జనవరి 7 వరకు చెల్లుబాటులో ఉండనుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ను కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి పొందవచ్చును. ఎక్స్చేంజ్ ఆఫర్లో భాగంగా రిజిస్ట్రేషన్ వ్యవధిలో కొనుగోలుదారులు తమ పేరు, చిరునామా ఇతర ప్రాథమిక వివరాలను వెబ్సైట్లో నమోదుచేయాల్సి ఉంటుంది. లావా కంపెనీకి చెందిన ‘అగ్ని మిత్ర(ఎగ్జిక్యూటివ్)’ ఎక్స్చేంజ్ ఆఫర్లో భాగంగా రియల్మీ 8ఎస్ స్మార్ట్ఫోన్ను ధృవీకరించిన తరువాత కొత్త లావా అగ్ని 5జీ స్మార్ట్ఫోన్ను అందిస్తారు. లావా అగ్ని 5జీ స్మార్ట్ఫోన్ ధర సుమారు రూ. 20 వేలుగా ఉంది. 2021లో లావా మొబైల్స్ లావా అగ్ని 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. లావా అగ్ని 5జీ స్మార్ట్ఫోన్ ఫీచర్స్ 6.78-అంగుళాల పూర్తి హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే మీడియాటెక్ డైమెన్సిటీ 810 SoC ప్రాసెసర్ 16ఎంపీ ఫ్రంట్ కెమెరా 64ఎంపీ+5ఎంపీ+2ఎంపీ+2ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 5000 mAh బ్యాటరీ 8జీబీ ర్యామ్+ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ చదవండి: 5G Phones: జస్ట్ మూడేళ్ల కంపెనీ..! 5జీ స్మార్ట్ఫోన్స్లో దిగ్గజ కంపెనీలకు గట్టిపోటీ.! -
తెలంగాణ ఆర్టీసీ బంఫర్ ఆఫర్.. వాళ్లకి బస్ జర్నీ ఫ్రీ..
సాక్షి, హైదరాబాద్: చిన్నారులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నూతన సంవత్సర కానుక ప్రకటించింది. తల్లిదండ్రులతోకలిసి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే 12 ఏళ్లలోపు పిల్లలకు జనవరి 1 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సంస్థ చైర్మన్, ఎండీ సజ్జనార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదుపాయం ఆర్టీసీకి చెందిన అన్ని బస్సుల్లో ఉంటుందని చెప్పారు. (చదవండి: సాక్షి ఎఫెక్ట్: విష్ణువర్ధన్ వైద్యానికి భరోసా ) -
4 నెలల పాటు ఉచిత ఇంటర్నెట్ సేవలు...! ఎలాగంటే...
నాలుగు నెలల పాటు ఉచిత ఇంటర్నెట్ సేవలు అవును.. మీరు చూసింది నిజమే...! ఇది కేవలం బీఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్, భారత్ ఫైబర్, డీఎస్ఎల్, బీఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్, బ్రాడ్ బ్యాండ్ ఓవర్ వైఫై కస్టమర్లకు మాత్రమే...! ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్తో ముందుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు నాలుగు నెలల పాటు ఉచిత బ్రాడ్బ్యాండ్ సేవలను అందించనుంది. చదవండి: మహీంద్రా థార్కు పోటీగా మారుతి నుంచి అదిరిపోయే కార్...! భారత్ ఫైబర్, డిజిటల్ సబ్స్రైబర్లైన్ కస్టమర్లకు, బీఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్, బ్రాడ్బ్యాండ్ ఓవర్ వైఫై సబ్స్క్రైబర్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. కాగా ఈ ఆఫర్ను పొందాలంటే బీఎస్ఎన్ఎల్ ఓ చిన్న మెలిక పెట్టింది..! అదేంటంటే.. ఈ ఆఫర్ను పొందాలంటే 36 నెలల ఇంటర్నెట్ ప్లాన్ సేవల కోసం ఒకేసారి పేమెంట్ చేస్తే అదనంగా మరో నాలుగు నెలలపాటు ఉచిత ఇంటర్నెట్ సేవలను పొందవచ్చునని బీఎస్ఎన్ఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు ఇంటర్నెట్ సేవల కోసం 24 నెలల ప్యాకేజ్కు ముందుగానే చెల్లిస్తే మరో మూడు నెలల ఉచిత ఇంటర్నెట్ సేవలను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు 1800003451500 నెంబర్కు కాల్ చేసి ఈ ఆఫర్ను పొందవచ్చును. లేదా దగ్గర్లో ఉన్న బీఎస్ఎన్ఎన్ కస్టమర్ సేవా కేంద్రాన్ని సంప్రదించి కూడా ఆఫర్ను పొందవచ్చును. చదవండి: డీమార్ట్ జోరు..! లాభాల్లో హోరు...! -
స్మార్ట్ఫోన్ కొనుగోలుపై ఎయిర్పాడ్స్ ఉచితం...!
Free Airpods: భారత్లో దసరా, దీపావళి పండుగ సీజన్స్ మొదలైనాయి. దీంతో పలు ఈ కామర్స్ సంస్థలు భారీ ఆఫర్లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం ఆపిల్ కూడా దీపావళి సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ ఆపిల్ ఇండియా అధికారిక వెబ్సైట్లో లైవ్గా నడుస్తోంది. ఐఫోన్ 12 , ఐఫోన్ 12 మినీ స్మార్ట్ఫోన్ కొనుగోలుపై ఆపిల్ ఫస్ట్-జెన్ ఎయిర్పాడ్లను ఉచితంగా అందిస్తున్నట్లు ఆపిల్ గురువారం ప్రకటించింది. చదవండి: ఆ కంపెనీలో భారీగా ఇన్వెస్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ బ్యూటీ..! ఆపిల్ తన ఇండియా స్టోర్ పేజీలో దీపావళి సేల్ ఆఫర్ల వివరాలను ప్రకటించింది. ఐఫోన్ 13 సిరీస్ ప్రారంభించిన తర్వాత ఐఫోన్ 12 సిరీస్ స్మార్ట్ఫోన్ ధరలను ఆపిల్ భారీగా తగ్గించింది. ఐఫోన్ 12 మినీ 64 జీబీ మోడల్ రూ. 59,900 కే లభిస్తుంది. 128 జీబీ మోడల్ ధర రూ. 64,900. 256జీబీ మోడల్ రూ .74,900కు ఆపిల్ తన వెబ్సైట్లో విక్రయిస్తోంది. మరోవైపు,ఐఫోన్ 12 బేసిక్ మోడల్ 64జీబీ వేరియంట్ ధర రూ. 65,900, 128జీబీ వేరియంట్ ధర రూ. 70,900 వద్ద అందుబాటులో ఉంది. 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .80,900 వద్ద రిటైల్ అవుతోంది. సెప్టెంబర్ 14 న ఆపిల్ 13 సిరీస్ స్మార్ట్ఫోన్లను వినియోగించిన విషయం తెలిసిందే. చదవండి: కోకాకోలా ఇప్పుడు సరికొత్తగా ...! -
సైకిల్పై సీఎం సందడి: కొత్త స్కీం
చండీగఢ్: వరల్డ్ కార్ ఫ్రీ డే సందర్భంగా హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సైకిల్పై సందడి చేశారు. కాలుష్య నివారణపై అవగాహన కల్పించేలా తన మంత్రి వర్గ సహచరులు, ఇతర ఎమ్మెల్యేలతో సైకిల్యాత్ర చేపట్టారు. తన అధికారిక నివాసం నుండి సెక్రటేరియట్ వరకు సైకిల్పై వచ్చి పలువురిని ఆకట్టుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు వ్యవసాయ మంత్రి జేపీ దలాల్, రవాణా శాఖ మంత్రి మూల్చంద్ శర్మ సైకిల్పై పౌర సచివాలయానికి చేరుకోవడం విశేషం. (World Car Free Day: ఎంచక్కా సైకిల్పై షికారు చేద్దాం!) ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 75 సంవత్సరాల పైబడిన పాత చెట్ల నిర్వహణ నిమిత్తం, ప్రాణ వాయు దేవత పెన్షన్ యోజన పేరిట ఏడాదికి రూ.2,500 పెన్షన్ అందజేస్తామని చెప్పారు. మొత్తం రాష్ట్రంలో ఇటువంటి చెట్లను గుర్తించి, స్థానిక ప్రజలను ఈ పథకంలో చేర్చడం ద్వారా పరిరక్షణకు చర్యలు చేపడతా మన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ ఇస్తున్న హరియాణా ప్రభుత్వం త్వరలో ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని తీసుకురానుంది. ఈ సందర్భంగా సచివాలయం ఆవరణలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రదర్శనను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. కాగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో, ఖట్టర్ చండీగఢ్ నుండి కర్నాల్ వరకు రైలులో ప్రయాణించారు. అలాగే సైకిల్పై పోలింగ్ కేంద్రానికి చేరుకుని అందర్నీ ఆకర్షించిన సంగతి తెలిసిందే. #WATCH | Haryana Chief Minister Manohar Lal Khattar* rides a bicycle along with his cabinet colleagues and MLAs from his residence to the secretariat in Chandigarh to observe #Worldcarfreeday pic.twitter.com/ME0dt31MJl — ANI (@ANI) September 22, 2021 -
వరల్డ్ కార్ ఫ్రీ డే: ఈ విశేషాలేంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: రోజుకు రోజుకు కాలుష్యం పెను భూతంలా విస్తరిస్తోంది. విచ్చలవిడిగా విడుదలవుతున్న కర్బన ఉద్గారాలు భూతాపాన్ని మరింత పెంచేస్తున్నాయి. ఫలితంగా ఈ భూ ప్రపంచంపై మానువళి మనుగడే ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ పెను ముప్పుపై అవగాహన కల్పించేందుకు వచ్చిందే వరల్డ్ కార్ ఫ్రీ డే. ప్రతీ ఏడాది సెప్టెంబర్ 22 న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ విశేషాలేంటో మీకోసం వరల్డ్ కార్ ఫ్రీ డే. అంటే వాహనదారులు ఈ ఒక్కరోజు కార్లను పక్కనపెట్టేసి మన కాళ్లకు పని చెప్పడన్నమాట. నడుచుకుంటూ వెళ్లడమో లేదంటే ఎంచక్కా సైకిళ్లనో, లేదా ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించడం. తద్వారా పర్యావరణ వాయు కాలుష్యంపై అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశం. దీని వల్ల కలిగే ప్రయోజనాలను హైలైట్ చేసేలా ప్రతీ ఏడాది ఈ డేను పాటించడం ఆనవాయితీగా వస్తోంది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం (యూఎన్ఈపీ) అధికారిక వెబ్సైట్ ప్రకారం ఆ ఈవెంట్ పౌరులకు కారులేకుండా వెళ్లడాన్ని పోత్సహిస్తుంది. సురక్షితమైన వాతావరణంలో నడక సైక్లింగ్ను ప్రాధాన్యతను నొక్కి చెబుతుంది. ఫ్రాన్స్లోని పారిస్లో సెప్టెంబర్ 2015న ఈ డేను పాటించగా ఉద్గార ప్రభావం 40 శాతం తగ్గిందట.ముఖ్యంగా మనం రోజూ వాడే కార్లు, బైక్స్ నుంచి విడుదలయ్యే ఉద్గారాలు మొత్త కాలుష్యంలో 8శాతాన్ని ఆక్రమించాయంటేనే కాలుష్యతీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 1990ల నుండి ఐస్ల్యాండ్, యూకే మొదలైన దేశాలలో ఈ డేనునిర్వహిస్తుండగా, 2000లో కార్బస్టర్స్ (వరల్డ్ కార్ఫ్రీ నెట్వర్క్) ప్రారంభించిన వరల్డ్ కార్-ఫ్రీ డేతో ఈ ప్రచారం ప్రపంచవ్యాప్తమైంది. ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాల ద్వారా ఆయా సిటీ ప్లాన్లరు, రాజకీయ నాయకులు దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. 2007లో, ఇండోనేషియా రాజధాని నగరం జకార్తా, తన మొదటి కార్-ఫ్రీ డేని నిర్వహించింది. అంతేకాదు మే 2012 నుండి జకార్తాలో ప్రతి ఆదివారం కార్ రహిత దినోత్సవం నిర్వహించడం విశేషం. -
కూకట్పల్లిలో ఉచిత ఫిజియోథెరపీ సేవలు, టైమింగ్స్ ఇవే..
మోతీనగర్: ప్రస్తుత కాలంలో కాస్త అనారోగ్యానికి గురైనా రూ. వేలల్లో మొదలుకొని లక్షల్లో ఖర్చు అవుతున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తే వివిధ రకాల వైద్య పరీక్షలు, స్కానింగ్ల పేర్లతో ఇష్టానుసారంగా బిల్లులు వసూలు చేస్తున్నారు. నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో తమకు వంతు సాయంగా ఫిజియోథెరపీ అందిస్తున్నారు ఎన్ఆర్ఐ సేవా ఫౌండేషన్ సభ్యులు. సుమారు దశాబ్దంన్నర క్రితం కూకట్పల్లి వివేకానందనగర్ వ్యవస్థాపక అధ్యక్షుడు హరీష్, ప్రస్తుత అధ్యక్షుడు కొలసాని రాథా మోహన్రావు ఎన్ఆర్ఐ సేవా ఫౌండేషన్ను స్థాపించారు. ఎన్ఆర్ఐ సేవా ఫౌండేషన్, అమెరికా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మురికి వాడల్లో నివసిస్తున్న పేద బడుగు వర్గాల వారికి ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంగా నాటి నుంచి నేటి వరకూ ఫిజియోథెరపీ చేస్తున్నారు. ♦ సంచార ఫిజియోథెరపీ కేంద్రం ద్వారా, ఫిజియోకేర్, రీహాబిలేషన్ కేంద్రం ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నారు. అంతేకాక అనాథ, వృద్ధాశ్రమాల్లో ఉండే వారికి సైతం ఫిజియోథెరపీ చేస్తున్నారు. ♦ సహజంగానే ఎదుర్కొనే వ్యాధులలో ప్రధానంగా వెన్ను, అరికాళ్లు, పిక్కలు, మోకాళ్లు, భుజాలతో పాటు ఇతర నొప్పుల నివారణకు నిపుణులైన వైద్యులతో ఫిజియోథెరపీతో పాటు ప్రముఖ యోగా గురువుతో ఆసనాలు వేయిస్తున్నారు. ♦ రోగులు సూచించిన నొప్పిని బట్టి దాని నివారణకు వివిధ రకాల వ్యాయామాలతో పాటు పలువురు ప్రముఖ యోగా గురువులు ఆసనాలు చేయిస్తున్నారు. ♦ అంతేకాక వ్యాధి తగ్గిన తర్వాత కూడా వైద్యులు, ఫౌండేషన్ ప్రతినిధులు యోగక్షేమాలు తెలుసుకుని సలహాలు, సూచనలు చేస్తుంటారు. ♦ కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ పరిధిలోని మురికి వాడల్లో నివసించే వారితో పాటు నగరంలోని పలు వృద్ధాశ్రమాల్లోనూ ఉచితంగా సేవలు అందిస్తున్నారు. ♦ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. ఆదివారం మినహాయించి ఒక్కో ప్రాంతంలో రెండు వారాల పాటు శిబిరాలు నిర్వహిస్తున్నారు. కూకట్పల్లి సాయికృప ప్లాట్ నెంబర్ 332, శ్రీవివేకానందనగర్, డీఏవీ స్కూల్ రోడ్డులో శిబిరాలు నిర్వహిస్తున్నారు. ♦ మూసాపేట డివిజన్ మోతీనగర్లోని కమ్యూనిటీ హాల్లో గత నాలుగేళ్ల నుంచి నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నారు. ♦ కోవిడ్ కారణంగా గత కొన్ని రోజుల నుంచి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు మాత్రమే వైద్యులు అందుబాటు ఉంటున్నారు. అదే విధంగా గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియం ఆవరణలోనూ వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ♦ హ్యాండ్ గ్రిప్పర్, టెన్స్, ఐఎఫ్టీ, ఆల్ట్రాసౌండ్, స్విస్ బాల్, షోల్డర్ పుల్లీ, షోల్డర్ వీల్, డెలాయిడ్ మైల్ స్టోన్స్, సైక్లింగ్ వంటి సామగ్రితో వైద్యం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. చిన్నారికి ఫిజియో థెరపీ చేస్తున్న సిబ్బంది ఉచితంగా చేయడం సంతోషం.. : ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ. వేలకు వేలు చెల్లించి వైద్యం చేయించుకున్న నయం కాలేదు. మోతీనగర్ కమ్యూనిటీ హాల్లో ఉచితంగా ఫిజియోథెరపీ కేంద్రం కొనసాగుతుందని నా మిత్రుల ద్వారా తెలుసుకొని వచ్చిన తర్వాత వివిధ రకాల నొప్పులు తగ్గుముఖం పట్టాయి. వైద్యం అందని ద్రాక్షగా ఉన్న ఈ రోజుల్లో ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించటం సంతోషం -టి.నారాయణ చదవండి : రికార్డు కొట్టేసిన వంటలక్క, లక్కీ చాన్స్! అర్థమయ్యే రీతిలో కౌన్సెలింగ్.. చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి విసుగు చెంది మా వద్దకు వస్తుంటారు. అలాంటి వారికి ముందుగా అర్థమైన రీతిలో కౌన్సెలింగ్ ఇచ్చి వారికి ఏయే నొప్పులకు ఏ రకంగా వైద్యం చేయాలో పరిశీలిస్తాం. ఆ తర్వాత సుమారు వారం రోజుల నుంచి నెల పాటు నిత్యం క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేస్తాం. – డాక్టర్ కె. కామాక్షి, ఎంపీటీ న్యూరాలజీ ఆరోగ్యంగా ఇంటికెళ్లడమే మాకు ఆనందం.. చాలా మంది వివిధ నొప్పులతో బాధపడుతూ తమ కేంద్రానికి వస్తుంటారు. వయస్సు పై బడిన వారు నొప్పులతో బాధపడుతూ రావటం చూసి మాకే ఒక్కోసారి బాధ కలుగుతోంది. వారి సమస్యలు క్షుణ్ణంగా పరిశీలించి వైద్యం ప్రారంభిస్తాం. వారు వ్యాధి తగ్గిన తర్వాత సంతోషంగా వెళ్లటమే మాకు ఆనందం. మాకు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ అందిస్తున్న సేవలు అమోఘం. – డాక్టర్ బి. కృష్ణకుమారి, ఎంపీటీ స్పోర్ట్స్ -
ఈ మొబైల్ రీఛార్జ్తో ఏడాదిపాటు నెట్ఫ్లిక్స్, ప్రైమ్, డిస్నీ హట్స్టార్ ఉచితం..!
తమ యూజర్లను ఇతర నెట్వర్క్వైపు మళ్లకుండా ప్రముఖ టెలికాం కంపెనీలు యూజర్లకు తరుచుగా కొత్త మొబైల్ రీచార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ప్లాన్లో భాగంగా ప్రముఖ ఓటీటీ సేవలను కూడా యూజర్లకు ఉచితంగా ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా వోడాఫోన్ ఐడియా(వీఐ) తన పోస్ట్పెయిడ్ యూజర్లకు సరికొత్త ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. వీఐ రెడ్ఎక్స్ ఫ్యామిలీ ప్లాన్ల పేరిట రెండు కొత్త పోస్ట్పెయిడ్ రీచార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. వీఐ రెడ్ఎక్స్ ప్లాన్లో భాగంగా రూ.1699, రూ.2299 ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్లకు ఉచితంగా ఓటీటీ కనెక్షన్లను అందిస్తుంది. వీఐ రూ. 1699 రెడ్ఎక్స్ ఫ్యామిలీ ప్లాన్ వీఐ రెడ్ఎక్స్ ఫ్యామిలీ ప్లాన్ రూ. 1699 ఒక నెల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ ముగ్గురు సభ్యులు వాడుకోవచ్చును పోస్ట్పెయిడ్ ప్లాన్లో అపరిమిత లోకల్, ఎస్టీడీ, జాతీయ రోమింగ్ కాల్లు ఉంటాయి. అపరిమిత డేటా ప్రయోజనాలతో పాటు నెలకు 3,000 ఎస్ఎమ్ఎస్లను పొందవచ్చును. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్, నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ,డిస్నీ+ హాట్స్టార్ వీఐపీ సబ్స్క్రిప్షన్లను ఒక ఏడాదిపాటు పొందవచ్చును. వీఐ రూ. 2299 రెడ్ఎక్స్ ఫ్యామిలీ ప్లాన్: వీఐ రెడ్ఎక్స్ ఫ్యామిలీ ప్లాన్ రూ. 2299 ఒక నెల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ ఐదుగురు సభ్యులు వాడుకోవచ్చును పోస్ట్పెయిడ్ ప్లాన్లో అపరిమిత లోకల్, ఎస్టీడీ, జాతీయ రోమింగ్ కాల్లు ఉంటాయి. అపరిమిత డేటా ప్రయోజనాలతో పాటు నెలకు 3,000 ఎస్ఎమ్ఎస్లను పొందవచ్చును. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్, నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ,డిస్నీ+ హాట్స్టార్ వీఐపీ సబ్స్క్రిప్షన్లను ఒక ఏడాదిపాటు పొందవచ్చును. -
Samsung: ఈ స్మార్ట్ఫోన్ ప్రి-బుక్ చేస్తే స్మార్ట్ట్యాగ్ ఉచితం...!
ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ శాంసంగ్ కస్టమర్లకు గుడ్న్యూస్ను అందించింది. కొద్ది రోజుల్లోనే శాంసంగ్ భారత మార్కెట్లోకి నెక్ట్స్ జనరేషన్ ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ను రిలీజ్ చేయనుంది. కాగా శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లలోకి ఆగస్టు 11 న లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ స్మార్ట్ఫోన్ల ప్రీ బుకింగ్ను నేటి (ఆగస్టు 6) నుంచి ప్రారంభం కానుంది. ఫ్రీ బుకింగ్ కోసం కస్టమర్లు రూ. 2000 చెల్లించాల్సి ఉంటుంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను శాంసంగ్ ఇండియా ఈ-స్టోర్లలో లేదా శాంసంగ్ షాప్ యాప్లో బుక్ చేసుకోవచ్చును. ప్రీ బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు శాంసంగ్ ఉచితంగా శాంసంగ్ స్మార్ట్ట్యాగ్ను అందించనుంది. మార్కెట్లో శాంసంగ్ స్మార్ట్ట్యాగ్ ధర రూ. 2,699 గా ఉంది. రెండువేలతో ప్రీ బుక్ చేసుకున్న అమౌంట్ను ఈ స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేసే సమయంలో అడ్జస్ట్ చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ ధర రూ. 1,49,990గా ఉండనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ధర సుమారు రూ. 80 వేల నుంచి రూ. 90 వేల మధ్య ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ధరలు నిజమైతే మునుపటి శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లకంటే తక్కువ ధరలు ఉండనున్నాయి. -
చేపలు కొంటే.. లీటరు పెట్రోల్ ఫ్రీ
సాక్షి, చెన్నై: చేపలు కొంటే లీటరు పెట్రోల్ ఉచితం అంటూ మదురైలో ఓ వ్యాపారి చేసిన ప్రకటనతో జనం క్యూ కట్టారు. మదురై బీబీ కులంలో అతి పెద్ద చేపల దుకాణం ఉంది. ఈ వ్యాపారి వినూత్నంగా ఆలోచించాడు. పెరిగిన పెట్రోల్ ధరను దృష్టిలో ఉంచుకుని రూ.500లకు పైగా చేపలను కొంటే లీటరు పెట్రోల్ ఉచితం అంటూ దుకాణం ముందు బోర్డు పెట్టాడు. దీంతో ఆదివారం నుంచి ఈ దుకాణానికి జనం పోటెత్తారు. చేపలు కొన్న వారికి పెట్రోల్ కోసం కూపన్లు అందజేశారు. -
ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్..!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన కస్టమర్ల కోసం ప్రైమ్ మెంబర్ షిప్ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రైమ్ మెంబర్ షిప్తో పలు సేవలను ఉచితంగా పొందవచ్చును. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వారికి అమెజాన్ ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్, వేగవంతమైన డెలివరీ సేవలను అమెజాన్ అందిస్తోంది. ప్రైమ్ మెంబర్ షిప్ కోసం సంవత్సరానికి రూ.999 అమెజాన్ వసూలు చేస్తోంది. మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్కు ఎలాంటి డబ్బులను చెల్లించకుండా సేవలను ఉచితంగా పొందవచ్చును. అది ఎలా అంటే.. మీరు కచ్చితంగా ఎయిర్టెల్ లేదా జియో ఫైబర్ కల్గిఉన్న వినియోగదారుడై ఉండాలి. ఎయిర్టెల్ తన కస్టమర్లకు పలు రీఛార్జ్లపై అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ను నెల రోజులపాటు ఉచితంగా అందిస్తోంది. ఎయిర్టెల్ వినియోగదారులు రూ .349, రూ. 299 రిచార్జ్ చేస్తే 30 రోజులపాటు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ను ఉచితంగా పొందవచ్చును. ఎయిర్టెల్తో పాటుగా జియో ఫైబర్ కూడా ఉచిత అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ అందిస్తోంది. జియోఫైబర్కు సంబంధించిన 999,1499, 2499,3999,8499 ప్లాన్లతో రీచార్జ్ చేస్తే అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ను ఉచితంగా పొందవచ్చును. -
విద్యార్థులకు గుడ్న్యూస్..! ఆపిల్ బంపర్ ఆఫర్..!
అమెజాన్ విద్యార్థుల కోసం బ్యాక్ టూ కాలేజ్ పేరిట బంపర్ ఆఫర్ను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ‘బ్యాక్ టూ స్కూల్’ పేరిట విద్యార్థుల కోసం ఆపిల్ బంపర్ సేల్ను ప్రకటించింది. ఈ సేల్లో భాగంగా విద్యార్థులు ఆపిల్ మాక్ బుక్ లేదా ఐప్యాడ్ కొనుగోలు చేసిన వారికి ఉచితంగా ఎయిర్పాడ్స్ను అందించనుంది. ఈ ఆఫర్ను భారత అధికారిక ఆపిల్ ఆన్లైన్ స్టోర్లో పొందవచ్చును. ఆపిల్ అందిస్తోన్న సేల్ ప్రకారం.. విద్యార్థులు మాక్ బుక్ను కొనుగోలు చేస్తే ఉచితంగా వైర్డ్ ఛార్జింగ్ వెర్షన్ ఎయిర్పాడ్స్ను అందించనుంది. ఒక వేళ విద్యార్థులు వైర్ లెస్ ఛార్జింగ్ ఎయిర్పాడ్స్ను కోరితే అదనంగా రూ. 4000 ను చెల్లించాల్సి ఉంది. ఎయిర్పాడ్స్ ప్రోపై ఆసక్తి ఉన్న వారు అదనంగా రూ. 10,000 చెల్లిస్తే విద్యార్థులు వాటిని పొందవచ్చును. కాగా ఆపిల్ ఎయిర్పాడ్స్ ధరలు వరుసగా రూ. 14,900, ఎయిర్పాడ్స్ వైర్లెస్ ఛార్జింగ్ రూ. 18,900, ఎయిర్పాడ్స్ ప్రో రూ. 24, 900గా ఉన్నాయి. అంతేకాకుండా విద్యార్థులు మాక్బుక్ ఎయిర్, మాక్బుక్ ప్రో, ఐమాక్, మాక్ ప్రో, మాక్ మినీ, ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్ లాంటి ఆపిల్ ఉత్పత్తులపై 20 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ను పొందవచ్చును. విద్యార్థులకు ఆపిల్ పెన్సిల్, కీ బోర్డుపై ఎల్లప్పుడు డిస్కౌంట్లను అందించనుంది. అంతేకాకుండా విద్యార్థులు కేవలం నెలకు రూ. 49 చొప్పున ఆపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఆపిల్ టీవీ ప్లస్ సబ్స్క్రిప్షన్ను ఉచితంగా పొందగలరు. దాంతో పాటుగా ఈ సబ్స్క్రిప్షన్పై ఆపిల్ ఆర్కేడ్ను మూడు నెలల పాటు విద్యార్థులకు ఆపిల్ అందించనుంది. కాగా ఈ ఆఫర్ కేవలం ప్రస్తుతం ఉన్న, కొత్త కాలేజీలో ఉన్న విద్యార్థులకు వర్తించనుంది. బ్యాక్ టూ స్కూల్ ఆఫర్ను కాలేజీల ఐడీనుపయోగించి విద్యార్థుల అర్హతను ధృవీకరిస్తారని ఆపిల్ తన కంపెనీ అధికారిక వెబ్సైట్లో తెలిపింది. -
త్వరలోనే ఉచితంగా స్పుత్నిక్-వీ వ్యాక్సిన్
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాల్లో రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ఒకటి. ఈ టీకా ఒక్కో డోసు ధర రూ.1,145గా ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ వ్యాక్సిన్ కూడా ఉచితంగా లభించ నుంది. ఒకపక్క థర్డ్ వేవ్.. మరోపక్క డెల్టా ప్లస్ వేరియంట్ భయాలు వెంటాడుతున్న తరుణంలో దేశ ప్రజలకు మరో వ్యాక్సిన్ ఉచితంగా అందుబాటులోకి రానుండటం శుభపరిణామం. టైమ్స్ ఆఫ్ ఇండియా సమాచారం ప్రకారం స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ కూడా త్వరలో ప్రభుత్వ కేంద్రాలలో ఉచితంగా లభించనుంది ప్రస్తుతం, దేశంలో సీరం ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్, భారత్ బయోటెక్ కోవాక్సిన్ ప్రభుత్వ కేంద్రాలలో ఉచితంగా లభిస్తోంది. ఇపుడిక ఈ జాబితాలో రష్యా వ్యాక్సిన్ కూడా చేరనుండటం విశేషం. దేశంలో అత్యవసర వినియోగానికి రెగ్యులేటరీ అనుమతి పొందిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇక ప్రభుత్వ కేంద్రాల్లోనూ ఉచితంగా లభించే అవకాశం ఉందని కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్ ప్రెసెడింట్ డాక్టర్ ఎన్కే అరోరా తెలిపారు. తమ వ్యాక్సిన్ను సైతం ఉచితంగా అందుబాటులో ఉంచాలని కోరుకుంటున్నామని, అయితే టీకా సరఫరాపై ఇది ఆధారపడి ఉంటుందన్నారు. దీంతో దేశంలోవ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోనుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం వ్యాక్సిన్ సరఫరాలో కీలకంగా ఉన్న కోవీషీల్డ్, కోవాక్సిన్తోపాటు, స్పుత్నిక్-వీ, మోడర్నా, జైడస్ క్యాడిలాతో, రోజువారీ టీకాల పంపిణీ 8 నుంచి 10 మిలియన్లకు పెంచవచ్చన్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి, 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించినట్టు అరోరా చెప్పారు. -
‘ప్లాస్టిక్’ పరిష్కారం ఇదే!
వెబ్డెస్క్: న్యూ క్లియర్ వెపన్స్, గ్లోబల్ వార్మింగ్ స్థాయిలో ప్రపంచాన్ని భయపెడుతున్న మరో పెద్ద అంశం ప్లాస్టిక్. పర్యావరణ సమతుల్యత ప్లాస్టిక్ బ్యాగ్లతో దెబ్బతింటోంది. ముఖ్యంగా జంతువులు, పక్షులు ప్లాస్టిక్ కారణంగా తీవ్రంగా నష్టపోతున్నాయి. దీంతో ప్లాస్టిక్పై అవగాహన కల్పించేందుకు జులై 3న ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ డేని నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్.. ప్రమాదాలు నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకం తప్పనిసరి అవసరంగా మారింది. అయితే ప్లాస్టిక్తో ఉన్న అతి పెద్ద ప్రమాదం వాటి మన్నిక కాలం. ప్లాస్టిక్ బ్యాగులు సహజ పద్దతిలో తిరిగి భూమిలో కలిసి పోవాలంటే 100 నుంచి 500 ఏళ్ల సమయం పడుతుంది. అప్పటి వరకు అది భూమి మీద అలాగే ఉంటుంది. అంతేకాదు ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా నాలాలు మూసుకుపోయి... వరదలకు కూడా కారణం అవుతోంది. ప్రమాదంలో పశువుల ప్రాణాలు పెద్దపెద్ద నగరాలన్నీ సముద్ర తీరాల చుట్టే వెలిశాయి. ఈ నగరాల్లో ఉత్పత్తి అవుతున్న చెత్త కారణంగా సముద్ర జీవుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఇక పల్లె నుంచి మెట్రో సిటీ వరకు చెత్త కుప్పల్లో పేరుకు పోతున ప్లాస్టిక్ని తిని పశువులు మృత్యువాత పడుతున్నాయి. మొదట యూరప్లో ప్లాస్టిక్ బ్యాగులకు బదులు ఏకో ఫ్రెండ్లీ బ్యాగులు వాడాలనే ప్రచారం మొదట యూరప్లో మొదలైంది. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమాలు, ప్రచారాలు, అవగాహన కార్యక్రమాలు మొదలయ్యాయి. ‘ఏకో’ ధర తగ్గాలి ఎకో ఫ్రెండ్లీ బ్యాగులు వాడాలంటూ భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నా... క్షేత్రస్థాయిలో ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో ఏకో ఫ్రెండ్లీ బ్యాగులు ఉన్నా .. వాటి ఖరీదు ఎక్కువగా ఉండటంతో చాలా మంది తిరిగి ప్లాస్టిక్ బ్యాగుల వైపుకే మొగ్గు చూపుతున్నారు. కార్పొరేట్ బాధ్యత ప్లాస్టిక్ వాడకం తగ్గించడంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. స్టార్టప్లు ఈ దిశగా పని చేయాల్సి ఉంది. కార్పొరేట్ కంపెనీలు, భారీ వాణిజ్య సంస్థలు తమ వంతు బాధ్యతగా ప్లాస్టిక్ పరిశోధనలకు దన్నుగా నిలవాల్సిన సమయం వచ్చింది. వ్యాపారంలో కోట్లు గడిస్తున్న సంస్థలు ఇప్పటి వరకు ప్లాస్టిక్ నివారణపై పెద్దగా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. బడా సంస్థలు ప్లాస్టిక్పై దృష్టి సారించి... నూతన ఆవిష్కరణలకు ఊతం ఇస్తే మార్పులు త్వరగా వచ్చేందుకు ఆస్కారం ఉంది. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం మన్నిక ఉండేలా ఏకో ఫ్రెండ్లీ బ్యాగులు మార్కెట్లోకి తేవడం ద్వారా ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గించవచ్చు. చదవండి : అంతరిక్షంలో అద్భుతం.. తొలిసారిగా -
మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులకు శుభవార్త..!
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వినియోగదారులకు మైక్రోసాఫ్ట్ తీపి కబురు చెప్పింది. ప్రస్తుతం ఉన్న విండోస్ 10 యూజర్లకు మైక్రోసాఫ్ట్ నుంచి రాబోయే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 11 ను ఫ్రీ అప్గ్రేడ్గా చేసుకోవచ్చునని ఇది వరకే ప్రకటించింది. కాగా ప్రస్తుతం విండోస్ 10 యూజర్లకే కాకుండా విండోస్7, విండోస్ 8.1 ఆపరేటింగ్ యూజర్లకు కూడా ఉచితంగా విండోస్ 11ను అప్గ్రేడ్ చేసుకొవచ్చునని మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. విండోస్ 8 వాడుతున్న యూజర్లు మాత్రం డైరక్ట్గా ఆప్గ్రేడ్ను పొందలేరు. ఈ లేటేస్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో ఎక్కువ మంది యూజర్లను పాత ఆపరేటింగ్ సిస్టమ్లనుంచి దృష్టిమరల్చడానికి ఫ్రీ ఆప్గ్రేడ్ను మైక్రోసాఫ్ట్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఉన్న విండోస్ 7, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్లను మైక్రోసాఫ్ట్ భవిష్యత్తులో పట్టించుకపోవచ్చును. అనలిటిక్స్ ప్లాట్ఫామ్ స్టాట్కౌంటర్ అందించిన డేటా ప్రకారం..విండోస్ 10 తర్వాత విండోస్ 7 ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గా నిలిచింది. విండోస్ 7 వోఎస్ మే 2021 నాటికి మార్కెట్ వాటాలో 15.52 శాతం. విండోస్ 8.1 తరువాత 3.44 శాతం వాటాగా ఉంది. కాగా విండోస్ 8 మార్కెట్లో 1.27 శాతం వాటా ఉంది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ను జూన్ 24 న లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.కాగా ప్రస్తుతం విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ పాత ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న వారికి వెంటనే ఆప్గ్రేడ్ ఇచ్చే విషయంపై అస్పష్టత నెలకొంది. చదవండి: Microsoft Chairman 2021 : నూతన ఛైర్మన్గా సత్యనాదెళ్ల -
జియో మరో కీలక నిర్ణయం..! ఎలాంటి డిపాజిట్ లేకుండానే..
దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ ధరల్లో విప్లవత్మాక మార్పులు తీసుకువచ్చిన జియో మరో కీలక నిర్ణయం తీసుకుంది. జియో ఫైబర్ పోస్ట్ పెయిడ్ సేవలను జూన్ 17వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు కంపెనీ వర్గాలు ధృవీకరించాయి. ఇప్పటికే జియో ఫైబర్ ప్రీ పెయిడ్ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి కొత్తగా ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా ఇంటర్నెట్ బాక్స్ను అందించనుంది. అంతేకాకుండా జీరో ఇన్స్టాలేషన్ ఛార్జీలు వర్తించనున్నాయి. జియో ఫైబర్ ప్రీ పెయిడ్ బ్రాడ్బ్యాండ్ సేవలను వినియోగించుకోవడానికి కచ్చితంగా రూ.1,500 సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. జియో పోస్ట్ పెయిడ్లో రూ.399 నుంచి టారిఫ్ ఫ్లాన్లు ప్రారంభం కానున్నాయి. ఆటో పేమెంట్ ఆప్షన్తో వినియోగదారులకు మరింత సులువు కానుందని కంపెనీ పేర్కొంది. వినియోగదారులు రూ.1000 రిటర్నబుల్ సెక్యూరిటి డిపాజిట్తో 4K సెట్-టాప్ బాక్స్ను పొందవచ్చును. నెలకు రూ.999 ప్లాన్తో 15 ఓటీటీ యాప్స్ను అందిస్తుంది. చదవండి: జియో నుంచి అన్లిమిడెట్ డేటా ప్లాన్స్ -
‘వ్యాక్సిన్ తీసుకోండి..బీరు పట్టుకెళ్లండి’ వినూత్న ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్లో పలురాష్ట్రాల్లో శరవేగంగా విస్తరిస్తోంది. రోజువారీ వరుసగా లక్షకేసులకు తగ్గడం లేదు. అటు మరణాల సంఖ్య పెరుగుతోంది. అయినా కరోనా టీకాపై ప్రజల ఆసక్తి అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీకా వేయించుకున్న వారికి వినూత్న ఆఫర్తో ముందుకొచ్చిందో రెస్టారెంట్. బిజినెస్ ఇన్సైడర్ సమాచారం ప్రకారం, గుర్గావ్ గోల్డ్ రోడ్లోని రెస్టారెంట్ టీకా స్వీకరించిన తరువాత ఆ టీకా కార్డు చూపిస్తే ఉచిత బీరును ఆఫర్ చేస్తోంది. ఢిల్లీకి సరిహద్దున ఉన్న హార్యానాలోని గుర్గావ్లోని ఇండియన్ గ్రిల్ రూమ్ రెస్టారెంట్ యాజమాన్యం మందుబాబులకు ఈ ఆఫర్ ప్రకటించింది. కరోనా టీకా వేయించుకొని, సంబంధిత కార్డును చూపిన వారికి బీర్ ఉచితంగా ఇస్తామని తెలిపింది. ఏప్రిల్ 5, 2021 న ప్రారంభమైన ఈ ఆఫర్ కేవలం వారం వరకు మాత్రమే కొనసాగుతుందని వెల్లడించింది. టీకాలు వేయించుకునేలా ప్రజలను ప్రోత్సహించే ఉద్దేశంతో టీకా లగావో, బీర్ లేజావో అంటోంది. ‘ఇండియన్ గ్రిల్ రూమ్తో టీకా వేసుకున్న సంతోషాన్ని పంచుకోండి' అంటూ కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. గత వారం, గుజరాత్ రాజ్కోట్లోని స్వర్ణకారుల సంఘం టీకా తీసుకున్న మహిళలకు బంగారంతో చేసిన ముక్కు పుడకలను, పురుషులకు హ్యాండ్ బ్లెండర్లను అందించింది.అలాగే జాన్ విజన్ సంస్థ ఉచితంగా ఆహారం అందించింది. అల్పాహారం, లంచ్, రాత్రి భోజనం అందిస్తున్నాం కాబట్టి టీకా తీసుకున్న వారు ఇంటికి వెళ్ళిన తర్వాత పని చేయాల్సిన అవసరం లేదనీ, వారు విశ్రాంతి తీసుకోవచ్చుని విజన్ యాజమాన్యం ప్రకటించిన సంగతి తెలిసిందే. (కరోనా సెకండ్ వేవ్ : బ్యాంకులకు చిక్కులు) అయితే కరోనా టీకా తీసుకున్నాక మద్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే వైద్యులు హెచ్చరించారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత అల్కహాల్ వంటివి తీసుకుంటే.. వారిలో కరోనా ఇమ్యూనిటీ సమర్థవంతంగా పనిచేయదని సూచించారు. మరోవైపు కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 45 రోజుల వరకు తప్పనిసరిగా వీటికి దూరంగా ఉండాలని రష్యాకు చెందిన అడ్వైజరీ ఇటీవల ఒక ప్రకటన జారీ చేసింది. అయితే దీనిపై భిన్న అభిప్రాయాలున్నప్పటికీ, వ్యాక్సిన్ తీసుకున్నవారికి మద్యం ఆఫర్ చేయడంపై మాత్రం సామాన్యులనుంచి విమర్శలొస్తున్నాయి. -
షావోమి ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి,ముంబై: ప్రముఖ మొబైల్ తయారీదారు షావోమి ఇండియా తన ఉద్యోగులకు తీపికబురు అందించింది. హార్డ్షిప్ బోనస్కింద ఉద్యోగులకు15 రోజుల జీతాన్ని బోనస్ ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభంలో ఇబ్బందులను ఎదుర్కొన్న కార్పొరేట్ ఉద్యోగులతోపాటు ఇతరలకు వార్షిక బిజినెస్ బోనస్కు అదనంగా ఈ బోనస్ను అందించనుంది. అలాగే తన ఉద్యోగులందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్ను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. కుటుంబ సభ్యులతోపాటు, ఉద్యోగులందరికీ కరోనా వ్యాక్సిన్ ఖర్చులను తామే భరిస్తామని షావోమి ఇండియా ఎండీ మనుకుమార్ జైన్ తెలిపారు. వీరందరికీ అర్హత ప్రమాణాల ప్రకారం కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకునేలా అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం కంపెనీ 60వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగులను కలిగి ఉంది. కరోనా మహమ్మారి, లాక్డౌన్ తరువాత దేశీయ డిమాండ్ పెరగడంతో, ఎగుమతులను నిలిపివేయాలని భావిస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది. స్థానిక డిమాండ్కే తమ తొలి ప్రాధాన్యమని జైన్ తెలిపారు. డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక (పిఎల్ఐ) పథకంలో భాగంగా తన భాగస్వాములతో కలిసి దేశంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరిస్తున్నామని చెప్పారు. కాగా సీఎంఆర్ ఇండియా డేటా ప్రకారం 2020 మూడవ త్రైమాసికంలో భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో టాప్లో ఉంది షావోమి. 27 శాతం మార్కెట్ వాటాతో మార్కెట్ లీడర్గా ఉంది. దేశంలో స్మార్ట్ఫోన్లతో పాటు, ఎయిర్ ప్యూరిఫైయర్లు, ఫిట్నెస్ బ్యాండ్లు, వీఆర్ హెడ్సెట్లు వర్ బ్యాంక్లను షావోమి విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. -
ఫ్లిప్కార్ట్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి,ముంబై: ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ కూడా తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫ్లిప్కార్ట్ గ్రూపు ఉద్యోగులందరికీ కరోనా వైరస్ వ్యాక్సిన్న ఉచితంగా అందించాలని నిర్ణయించినట్టు తాజాగా ప్రకటించింది. ముగ్గురు డిపెండెంట్లతో సహా ఫ్లిప్కార్ట్, మింత్రా ఉద్యోగులందరికీ కోవిడ్-19 టీకా ఖర్చును 100 శాతం చెల్లిస్తామని ఉద్యోగులకు అందించిన సమాచారంలో ఫ్లిప్కార్ట్ తెలిపింది. అంతేకాదు టీకా తీసుకునేందుకు ఒక రోజు సెలవు తీసుకోవడానికి కూడా అవకాశం ఇస్తుంది. దీంతోపాటు టీకా అనంతరం ఏదైనా ఇబ్బంది తలెత్తితే అందుకు కోవిడ్ స్పెషల్ కేర్ లీవ్ కూడా ఆఫర్ చేస్తోందని ఫ్లిప్కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ కృష్ణ రాఘవన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. తరువాతి దశపై ప్రభుత్వ నిర్ణయం కోసం తాము ఎదురుచూస్తున్నామని, ముగ్గురు డిపెండెంట్లతోపాటు తమ ఉద్యోగులందరికీ టీకా ఖర్చులో 100 శాతం భరించాలని ఫ్లిప్కార్ట్ గ్రూప్ నిర్ణయించడం సంతోషంగా ఉందని ఫ్లిప్కార్ట్ వెల్లడించింది. ఉద్యోగులు టీకా ఖర్చును రీ ఎంబర్స్ చేసుకోవడం గానీ,తమ భాగస్వామి అసుపత్రిలో ఉచితంగా టీకా తీసుకోవడం గానీ చేయవచ్చని తెలిపింది. లేదా సంస్థ క్యాంపస్లో ఏర్పాటు చేసే టీకా డ్రైవ్లో పాల్గొనవచ్చని చెప్పింది. కరోనా నివారణకు గాను దేశవ్యాప్తంగా రెండోవద వ్యాక్సినేషన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
వారందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ : నీతా అంబానీ
సాక్షి, ముంబై: కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఉద్యోగులకు తీపి కబురు అందించింది. రిలయన్స్ గ్రూప్ ఉద్యోగులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించనుంది. ఈ మేరకు రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్, ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ కీలక ప్రకటన చేశారు. ఉద్యోగులతోపాటు, వారి జీవిత భాగస్వామి, పిల్లలు తల్లిదండ్రులతో సహా వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా వైరస్ టీకా పూర్తి ఖర్చులను తామే భరిస్తామని వెల్లడించారు. (నా అదృష్టం... గర్వంగా ఉంది : నిర్మలా సీతారామన్) ఈ నేపథ్యంలో కోవిడ్-19 టీకా కార్యక్రమానికి నమోదు చేసుకోవాలని ఉద్యోగులను నీతా అంబానీ కోరారు. రిలయన్స్ ఫ్యామిలీలో భాగమైన ఉద్యోగుల భదత్ర, శ్రేయస్సు తమ బాధ్యత అని ఉద్యోగులకు రాసిన ఈమెయిన్లో నీతా అంబానీ పేర్కొన్నారు. ఉద్యోగుల ఆరోగ్యం, ఆనందాన్ని కాపాడుకోవడమే ముఖేశ్ అంబానీ, తన బాధ్యత అని తెలిపారు. మహమ్మారి అంతం చివరి దశలో ఉన్నాం. కరోనా నిబంధనలు, జాగ్రత్తలు తీసుకుంటూనే మీ అందరి మద్దతుతో ఈ సామూహిక యుద్ధాన్ని గెలుద్దాం అని నీతా సందేశమిచ్చారు. దీంతో దేశంలోని తమ ఉద్యోగుల కోవిడ్-19 టీకా ఖర్చులను భరించే ప్రణాళికలను ప్రకటించిన టెక్-జెయింట్స్ ఇన్ఫోసిస్, టీసీఎస్, కాప్జెమినీ, యాక్సెంచర్ సరసన ఆర్ఐఎల్ చేరింది. రిలయన్స్ గ్రూప్తో పాటు దాని అనుబంధ సంస్థల లక్షలాది శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. కాగా మార్చి1నుంచి దేశవ్యాప్తంగా రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 ఏళ్లు నిండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా టీకా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ డ్రైవ్లో గురువారం వరకు దాదాపు 11 లక్షల వ్యాక్సిన్ మోతాదులను అందించింది.కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖగణాంకాల ప్రకారం, ఇప్పటికే వ్యాక్సిన్ స్వీకరించిన వారి మొత్తం సంఖ్య 1.77 కోట్లు దాటింది. మరోవైపు దేశంలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. ఒకవైపు, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతుండగానే కొత్త కేసులు 17వేలకు చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది. -
కేంద్రం కాదంటే..మేమే ఉచితంగా ఇస్తాం : ఢిల్లీ సీఎం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనరాష్ట్రప్రజలకు తీపి కబురుఅందించారు. కేంద్రం ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా అందించని పక్షంలో తమ ప్రభుత్వం ఢిల్లీ వాసులకు ఉచితంగా అందిస్తుందని బుధవారం వెల్లడించారు. ఢిల్లీ ప్రజలకు ఉచిత టీకా సరఫరా చేస్తానని ఇప్పటికే ప్రకటించిన ఆయన మరోసారి ఇదే విషయాన్ని ధృవీకరించారు. కోవిడ్-19 విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ హితేష్ గుప్తా కుటుంబాన్ని పరామర్శించిన కేజ్రీవాల్ వ్యాక్సిన్ గురించి ఎవ్వరూ తప్పుగా ప్రచారం చేయవద్దని కోరారు. కరోనా టీకాను అందరికీ ఉచితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశానని, కేంద్రం దీనికి అంగీకరించకపోతే ఢిల్లీ ప్రజలకు తామే ఉచిత టీకా సౌకర్యాన్నిఅందిస్తామని ప్రకటించారు. దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకాను సరఫరా చేయాలని గతంలోఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. కోవిడ్-19 వ్యాక్సిన్ను దేశ ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాలనిగతంలో ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు. టీకా ప్రతి ఒక్కరి హక్కు అని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ఈ నెల(జనవరి) 16 న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. -
వ్యాక్సిన్కు ఎఫ్డీఏ ఆమోదం : ట్రంప్ సంచలనం
వాషింగ్టన్: కరోనా మహమ్మారితో అతలాకుతలమైన అమెరికావాసులకు ఎట్టకేలకు ఊరట లభించనుంది. అమెరికా ఫార్మా సంస్థ ఫైజర్-జర్మనీకి చెందిన బయోఎన్టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వైరస్ టీకా అత్యవసర వినియోగానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ)అనుమతి లభించింది. గురువారం 8 గంటల పాటు జరిపిన బహిరంగ చర్చ అనంతరం ఈ ఆమోదం తెలిపింది. వ్యాక్సిన్ తొలి డోస్ను 24 గంటల్లో ఇవ్వనున్నారు. (ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి అమెరికా ఓకే) కోవిడ్-19 అంతానికి ఫైజర్ బయోఎన్టెక్ టీకా అత్యవసర వినియోగానికి ఆమోదం తెలుపుతున్నామని ఎఫ్డీఏ చీఫ్ సైంటిస్ట్ డెనైజ్ హింటన్ పేర్కొన్నారు. మరోవైపు అమెరికన్లందరికీ ఫైజర్ వ్యాక్సిన్ను ఉచితంగా అందించనున్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కేవలం తొమ్మిదినెలల్లోనే అద్భుతమైన విజయాన్ని సాధించామని, ఇది నిజంగా శుభవార్త అని ట్రంప్ వ్యాఖ్యానించారు. సైన్సుపరంగా చరిత్రలో ఇదొక చారిత్రాత్మక సందర్బమని పేర్కొన్నారు. మొదటి టీకాను ఎవరు వినియోగించాలనే విషయాన్ని ఆయా రాష్ట్రాల గవర్నర్లే నిర్ణయిస్తారని , వయోవృద్ధులకు, ఆరోగ్య కార్యకర్తలు మొదటివరుసలో ఉంటారని చెప్పారు. కఠినమైన పరీక్షల అనంతరం ఈ వ్యాక్సిన్కు అమోదం లభించిందని, 24 గంటల్లోపునే వాక్సినేషన్ ప్ర్రక్రియ మొదలవుతుందని ఆయన వెల్లడించారు. అంతకు ముందు ఎఫ్డీఏకు బయట నుంచి సలహాలు ఇచ్చే నిపుణుల కమిటీ అనుకూలంగా నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. pic.twitter.com/ofLq3OMicv — Donald J. Trump (@realDonaldTrump) December 12, 2020 -
నెట్ ఫ్లిక్స్ బంపర్ ఆఫర్
కొన్ని రోజులుగా సినిమా అభిమనులను నెట్ఫ్లిక్స్ ఊరిస్తూ బంపర్ ఆఫర్ అంటూ ప్రచారం చేస్తున సంగతి తెలిసిందే. సినిమా ప్రేమికుల ఎదురుచూపులకు తెరదించతూ రెండు రోజుల ఫ్రీ ఆఫర్ను ప్రకటించింది. స్ట్రీమ్ ఫెస్ట్లో భాగంగా భారత దేశమంతటా నేడు, రేపు ఫ్రీగా నెట్ఫ్లిక్స్ను వినియోగించుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది. ఈ రెండు రోజుల పాటు నెట్ఫ్లిక్స్ లో ఉచితంగా వీడియోలను వీక్షించవచ్చు. ఈ ఆఫర్ డిసెంబర్ 5 అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ ఆఫర్ను మొదటగా మనదేశంలోనే అందుబాటులోకి తీసుకొచ్చారు. నెట్ఫ్లిక్స్ చరిత్రలో ఇటువంటి ఆఫర్ పెట్టడం ఇదే మొదటిసారి. దీంతో ఈ ఆఫర్ను వినియోగించుకుంటున్న నెట్ఫ్లిక్స్ యూజర్లు తమ ఆనందాలను ట్విట్టర్ వేదికగా రకరకాల మీమ్స్ పెడుతూ నలుగురితో పంచుకుంటున్నారు. -
కరోనా వ్యాక్సిన్ : ఇన్ఫీ మూర్తి కీలక డిమాండ్
సాక్షి, ముంబై : కరోనా మహమ్మారి నివారణకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఆశలు చిగురుస్తున్నాయి. మరోవైపు ఈ వ్యాక్సిన్ ఖరీదు ఎంత ఉంటుంది సామాన్యులకు అందుబాటులో ఉంటుందా అనే ఆందోళన కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు గౌరవ ఛైర్మన్ ఎన్ఆర్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందుబాటులో ఉండాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యయాన్ని భరించేందుకు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని సూచించారు. ప్రధానంగా ఐరాస భద్రతా మండలి సభ్య దేశాలు ఈ ఖర్చులో ప్రధాన భాగాన్ని పంచుకోవాలని నారాయణమూర్తి కోరారు. (అడ్వాన్స్డ్ స్టేజ్లో రెండు కరోనా వ్యాక్సిన్లు) కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు, త్వరలోనే వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఇన్ఫోసిస్ మూర్తి వ్యాక్సిన్లను ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ల ఉత్పత్తికయ్యే ఖర్చును సంస్థలు భరించాలని, భారీ లాభాలను ఆశించకూడదన్నారు. ఐక్యరాజ్య సమితి లేదా దేశాలు చెల్లించాలని నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. అంతేకాదు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే అందరికీ ఉచితంగా కోవిడ్-19 వ్యాక్సిన్ అంటూ ఈ సందర్బంగా బిహార్ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన బీజేపి ఎన్నికల హామీని ఆయన గుర్తు చేయడం గమనార్హం. దీంతో పాటు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం విధానంపై ఆయన పెదవి విరిచారు. అలాగే తగిన జాగ్రత్తలు తీసుకొని స్కూళ్లను తిరిగి తెరవాలని కూడా మూర్తి సూచించారు. (కీలక దశకు దేశీయ కరోనా వ్యాక్సిన్) మోడెర్నా, ఫైజర్ తదితర విదేశీ కరోనా వైరస్ వ్యాక్సిన్లు 90-95 శాతం వరకు ఆశాజనకమైన పనితీరు కనబరిచినట్టు ప్రకటించాయి. మోడెర్నా, ఫైజర్ రూపొందించిన రెండు డోసుల వ్యాక్సిన్లను ప్రజలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన భారత ప్రజలకే దాదాపు 300 కోట్ల డోసులు అవసరం. మరోవైపు దేశీయంగా భారత్ బయోటెక్కు చెందిన కోవాక్సిన్ మూడవ దశ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
కరోనా వ్యాక్సిన్ ఉచితం : ఈసీ క్లీన్ చిట్
సాక్షి, పట్నా: ఎక్కడ చూసినా ప్రస్తుత ఎన్నికల పోరులో కరోనా వ్యాక్సిన్ ఉచితం అనేది ఓటర్లకు బంపర్ ఆపర్ గా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము తిరిగి అధికారంలోకి వస్తే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామంటూ బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది. దీనిపై ప్రతిపక్షాలు మండిపడటంతో వివాదం రాజుకుంది. దీనిపై సాకేత్ గోఖలే అనే ఆర్టీఐ కార్యకర్త ఈసీని ఆశ్రయించారు. అయితే కోవిడ్-19 వ్యాక్సిన్ ఉచిత హామీ ఎంత మాత్రమూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు రాదని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా స్పష్టం చేసింది. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో రాష్ట్ర ప్రజలకు ఉచిత కరోనా వ్యాక్సిన్ వాగ్దానం ప్రవర్తనా నియమావళి (ఎంసిసి) ఉల్లంఘన కిందకు రాదంటూ క్లీన్ చిట్ ఇచ్చింది. టీకా విధానం ఇంకా నిర్ణయించబని క్రమంలో ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నం అని ఆరోపిస్తూగోఖలే ఫిర్యాదు మేరకు ఈసీ స్పందించింది. అక్టోబర్ 28 న గోఖలేకు కమిషన్ ఇచ్చిన సమాధానంలో మూడు విషయాలను ప్రస్తావించింది. రాజ్యాంగానికి, విరుద్దంగా, కించపర్చేదిగా, ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛతను దెబ్బతీసేలా, విఘాం కలిగించేలా లేదా ఓటరుపై అనవసర ప్రభావాన్ని చూపే వాగ్దానాలు ఉండకూడదని స్పష్టం చేసింది. కాగా ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీపై ఆర్జేడీ కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు బీజేపీపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇంకా అందుబాటులోకి రాని వ్యాక్సిన్ను ఒక రాష్ట్ర ప్రజలకే ఉచితంగా ఎలా ఇస్తారని ప్రశ్నించాయి. కరోనా మహమ్మారిని బీజేపీ రాజకీయం చేస్తోందని, ప్రజల భయాలతో ఆడకుంటోందని మండిపడ్డాయి. అలాగే మిగతా రాష్ట్రాలు ఈ దేశంలో లేవా అని దుయ్యబట్టాయి. మరోవైపు బిహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ఈ నెల 28వ తేదీన ముగిసింది. రెండో విడత పోలింగ్ నవంబర్ 3న, చివరి విడత పోలింగ్ నవంబర్ 7న జరగనుంది. ఫలితాలు నవంబర్ 10 వెలువడనున్నాయి. -
ఐఫోన్ యూజర్లకు శుభవార్త : ఫ్రీ సెషన్లు
సాక్షి, న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ యూజర్లకు శుభవార్త అందించింది. ముందుగా ప్రకటించినట్టుగానే సంగీతం, ఫోటోగ్రఫీ, ఆర్ట్ పై ఆసక్తి ఉన్నవారి కోసం ఉచిత వర్చువల్ సెషన్లను షురూ చేసింది. ఇటీవల భారతదేశంలో ఆపిల్ స్టోర్ ఆన్లైన్ ప్రారంభించిన ఆపిల్ తన ఐఫోన్ వినియోగదారులలో అప్ కమింగ్ కళాకారులకు ఈ సెషన్లలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఈ వర్చువల్ సెషన్కు మీ ఐఫోన్ సిద్ధంగా ఉండండి అని ఆపిల్ పేర్కొంది. నవంబర్ 29 వరకు ఉచిత వర్చువల్ సెషన్లను ప్రకటించింది. ప్రముఖ స్థానిక ఫోటోగ్రాఫర్లు, ప్రసిద్ధ సంగీతకారులు వారి వారి విజయ గాథలను పంచుకుంటారు. ఈ ఆపిల్ ఈవెంట్ల కోసం నమోదు చేసుకున్న వినియోగదారులకు చిట్కాలు , సలహాలు అందిస్తారు. ఈ క్రమంలో ముందుగా ఫోటోగ్రఫీ సెషన్ల వివరాలను ఆపిల్ ప్రకటించింది. (ఆపిల్పై శాంసంగ్ సెటైర్లు) ఫోటోగ్రఫీ సెషన్లు ఉచిత వర్చువల్ ఫోటోగ్రఫీ సెషన్లు అక్టోబర్ 22 నుండి ప్రారంభం. వీటిని ఫోటో ల్యాబ్ అంటారు. ప్రధానంగా సిద్దార్థ జోషి, అవని రాయ్ వంటి ప్రముఖులు అక్టోబర్ 22, అక్టోబర్ 27 తేదీల్లో ఉదయం 7 నుండి 8 గంటల వరకు పాల్గొంటారు. డీఎస్ఎల్ఆర్, మిర్రర్లెస్ కెమెరాలను ఎలా ఉపయోగించాలో చెబుతారు. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ చిట్కాలను అందిస్తారు. ప్రసిద్ధి చెందిన డాక్యుమెంటరీలను కూడా ప్రదర్శిస్తారు. అక్టోబర్ 29 న, అనురాగ్ బెనర్జీ నాన్-ఫిక్షన్ ఫోటోగ్రఫీపై ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు, నవంబర్ 3 న, పోర్ట్రైట్ ఫోటోగ్రఫీపై ప్రార్థనా సింగ్ ఒక సెషన్ తీసుకోనున్నారు. ఆపిల్ అక్టోబర్ 28, నవంబర్ 1, నవంబర్ 2 న ఐఫోన్లలో ఫోటోగ్రఫీపై మూడు సెషన్లను ఉంటాయి. నవంబర్ 5 న హషీమ్ బదాని నిర్వహించే ఫోటోగ్రాఫిక్ సెషన్ ఉంటుంది. ఇందులో తన ప్రాజెక్టుల ప్లానింగ్, పరిశోధనలను వివరిస్తారు. ఈ సెషన్లకు రిజిస్టర్ చేసు కోవాలంటే ఆపిల్ కంప్యూటర్, ల్యాప్టాప్, మొబైల్ లేదా టాబ్లెట్, ఇంటర్నెట్ కనెక్షన్, ఉచిత సిస్కో వెబెక్స్ సమావేశాల యాప్ ఉండాలి. అలాగే యూజర్లు18 ఏళ్లలోపు వారైతే, తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు ఆమోదం కావాలని ఆపిల్ వెల్లడించింది. -
ఉండలేము.. వెళ్లలేము!
సాక్షి, హైదరాబాద్: కరోనా సృష్టించిన కల్లోలంతో స్వరాష్ట్రానికి రావాలనుకుంటున్న గల్ఫ్ వలస కార్మికులకు విమాన ప్రయాణ ఖర్చు, క్వారంటైన్ ఖర్చు గుదిబండగా మారింది. విపత్కర పరిస్థితుల్లో ఉపాధి కోల్పో యి ఇంటి బాట పట్టిన వారికి ఆర్థికంగా భారంగా పరిణమించింది. ఇతర రాష్ట్రాలు ఉచిత క్వారంటైన్ సౌకర్యం కల్పిస్తుండగా.. తెలంగాణ రాష్ట్రం మాత్రం పెయిడ్ క్వారంటైన్ తప్పనిసరి చేయడంతో లబోదిబోమంటున్నారు. గల్ఫ్ నుంచి తిరుగుముఖం పట్టేవారి ఖర్చులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జేఏసీ పోరుబాట పట్టింది. వలస కార్మికులకు సంఘీభావంగా వందేభారత్ గల్ఫ్ భరోసా దీక్షలు చేపడుతోంది.ఉచిత విమాన టికెట్టు, ఉచిత క్వారంటైన్ను కల్పించాలని కోరుతూ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి గల్ఫ్ జేఏసీ రంగం సిద్ధం చేస్తోంది. గల్ఫ్ యుద్ధ సమయంలో... గల్ఫ్ యుద్ధ సమయంలో అక్కడి నుంచి 1.70 లక్షల మంది భారతీయులను మన దే శానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. వీరి విమాన ప్రయాణ ఖర్చులను అప్పటి ప్రధాని వీపీ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వమే భరించింది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్న జేఏసీ.. రెక్కాడితేగానీ డొక్కాడని వలస కార్మికుల ప్రయాణ, క్వారంటైన్ ఖర్చులను కూడా ప్ర భుత్వాలే భరించాలని డిమాండ్ చేస్తున్నాయి. 3 రాష్ట్రాల్లో ఉచితంగానే క్వారంటైన్... విదేశాల నుంచి వచ్చే తమ రాష్ట్రాల వారికి ఆంధ్రప్రదేశ్, కేరళ, ఢిల్లీ ప్రభుత్వాలు ఉచితంగానే క్వారంటైన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. వలస కార్మికులకు ఉచిత క్వారం టైన్ కల్పిస్తామని, ఏర్పాట్లు కూడా చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఎందుకోగానీ పక్కనపెట్టేశారు. అంత ఎలా భరించాలి... ప్రవాసీలకు విమాన ప్రయాణం, క్వారంటైన్ ఫీజు భారంగా మారింది. విమాన టిక్కెట్ రెట్టింపు చేయగా, క్వారంటైన్కు రూ.15 వేల ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్లైన్స్ మాత్రమే విమానాలను నడుపుతోంది. ఇతర సంస్థలు నడపకపోవడంతో ఇండియన్ ఎయిర్లైన్స్ నే ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో ఆ సంస్థ నిర్దేశించిన భారీ చార్జీలను చెల్లించాల్సివస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతా ల్లో హోటళ్లలోగాకుండా.. స్వస్థలాలకు చేరువల్లోని హోటళ్లలో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల కొంతమేర భారం తగ్గుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రభుత్వాలు స్పందించే వరకు పోరాటం గల్ఫ్ నుంచి రావాలనుకుంటున్న కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగానే విమాన టికెట్లు, క్వారంటైన్ సౌకర్యం కల్పించాలి. ఈ అంశాలపై ప్రభుత్వాలు స్పందించే వరకు మా పోరాటం కొనసాగుతుంది. – గుగ్గిళ్ల రవిగౌడ్, గల్ఫ్ వర్కర్స్ జేఏసీ కన్వీనర్ ప్రవాసీయుల్లో చైతన్యం కోసం కృషి... గల్ఫ్ ప్రవాసీయుల సమస్యలపై అందరిలో చైతన్యం తీసుకురావడం కోసం జిందగి ఇమేజెస్ ఫేస్బుక్ పబ్లిక్ గ్రూప్ను ఏర్పాటు చేశాం. కార్మికుల సమస్యలపై ఫేస్బుక్ ద్వారా లైవ్ కార్యక్రమం నిర్వహించి సమస్యలపై చర్చలను కొనసాగిస్తున్నాం. – చేగొండి చంద్రశేఖర్, జిందగి ఇమేజెస్ ఫేస్బుక్ పబ్లిక్ గ్రూప్ వ్యవస్థాపకులు -
అనారోగ్యమా.. అయితే ఫోన్ చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్ సేవలు నిలిచి పోవడంతో ‘ఫోరం ఫర్ పీపుల్స్ హెల్త్ సంస్థ’ ఆన్లైన్లో ఉచిత వైద్య సేవలకు శ్రీకారం చుట్టింది. అందుకోసం హెల్ప్లైన్ను ఏర్పాటు చేసింది. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారైనా హెల్ప్లైన్ నెంబర్ : 040–48214595కు ఫోన్ చేస్తే సంబంధిత వైద్యులకు కనెక్ట్ చేస్తారు. తమకున్న సమస్యను డాక్టర్లకు వివరిస్తే ఫోన్లోనే మందులను సూచిస్తారు. అవసరమైతే మందుల చీటీ రాసిచ్చి వాట్సాప్లో పెడతారు. ఈ సంస్థ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ద్వారా దాదాపు 140 మంది వివిధ స్పెషలిస్ట్ వైద్యులు సూచనలు అందిస్తారు. ఇది రేయింబవళ్లు అందుబాటులో ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలంతా దీన్ని ఉపయోగించుకోవాలని సంస్థ తరపున ఆన్లైన్లో సేవలు అందిస్తున్న డాక్టర్ రవీంద్రనాథ్ తెలిపారు. ఈ సేవలన్నీ ఉచితం గానే ప్రజలకు చేస్తున్నట్లు ఆయన వివరిం చారు. లాక్డౌన్ వల్ల ఇళ్లలోనే ఉండిపోయిన ప్రజలకు ఇటువంటి సేవలు అందిస్తున్నట్లు ఫోరం తెలిపింది. కొందరు ఆసుపత్రులకు వెళ్లాలన్నా ఓపీ బంద్ కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఆన్లైన్లో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఒక్క రోజులో 275 ఫోన్ కాల్స్... బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ హెల్ప్లైన్కు ఒక్కరోజులోనే 275 ఫోన్కాల్స్ వచ్చాయి. ఫోన్ చేసిన బాధితులు, రోగులతో దాదాపు 957 నిమిషాలు డాక్టర్లు మాట్లాడి వారికి సూచనలు ఇచ్చారు. మందులు సూచించారు. కొందరికి వాట్సాప్ ద్వారా మందుల చీటీని పంపించారు. సగటున ఒక్కో కాల్కు 4 నిమిషాలు వైద్యులు కేటాయించినట్లు రవీంద్రనాథ్ తెలిపారు. మారుమూల గ్రామం నుండి నగరాలు, పట్టణాల వరకు కూడా ప్రజలు ఫోన్లు చేస్తున్నారన్నారు. ప్రధానంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య అధికంగా కాల్స్ వస్తున్నాయని ఆయన తెలిపారు. కొందరు వైద్యులు, సాంకేతిక వృత్తినిపుణులు తదితరులతో కలిసి దీన్ని ఏర్పాటు చేశామని జనవిజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల ప్రసాద్ తెలిపారు. -
ఏప్రిల్ వరకూ శ్రీలంకకు ఫ్రీ వీసా!
న్యూఢిల్లీ: భారతీయులకు ఇస్తున్న ఫ్రీ వీసా పథకాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 30 వరకూ కొనసాగించేందుకు శ్రీలంక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. గతేడాది జరిగిన ఈస్టర్ దాడుల వల్ల పర్యాటక రంగానికి కలిగిన నష్టాలను పూడ్చుకునేందుకు ఫ్రీ వీసా పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ గడువును ఏప్రిల్ 30 వరకూ పెంచే ముసాయిదా కేబినెట్ పరిశీలనలో ఉందని ఆ దేశ పర్యాటక మంత్రి ప్రసన్న రణతుంగ శుక్రవారం తెలిపారు. -
ప్లాస్టిక్ తీసుకొస్తే గుడ్లు ఫ్రీ
కామారెడ్డి క్రైం: జిల్లాలో ప్లాస్టిన్ను పూర్తిగా నిర్మూలించేందుకు అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఇందుకోసం త్వరలోనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. రెండు కిలో ల ప్లాస్టిక్ను సేకరించి ఇస్తే అర డజన్ గుడ్లు ఉచితంగా అందించనున్నట్లు కలెక్టర్ సత్యనారాయ ణ ప్రకటించారు. శనివారం అధికారులతో స మావేశమయ్యారు. జిల్లాలో ప్లాస్టిక్ను పూర్తిగా నిర్మూలించేందుకు ఈ కార్యక్రమాన్ని ఈ నెల 4 నుంచి అమలులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ప్రతి గ్రామపంచాయతీతో పాటు మున్సిపాలిటీల పరిధిలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. మండల రెవెన్యూ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను బ్యానర్లు సిద్ధం చేసి ప్రదర్శించాలని అధికారులకు సూ చించారు. రెండు కిలోల ప్లాస్టిక్ను ఏరివేసిన వారికి స్థానికంగా ఉండే కిరాణ షాపుల ద్వారా గుడ్లను అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తహసీల్దార్లు, ఎం పీడీవోలు, పోలీసు, రెడ్క్రాస్ సభ్యులు బృందాలుగా ఏర్పడి పర్యవేక్షించాలని సూచించారు. -
ఇక ఈజీ!
అమరచింత: జిల్లాలోని దివ్యాంగుల కోసం ఆర్టీసీ అధికారులు బస్ పాస్లు ఇచ్చేందుకు సరికొత్త ప్రణాళిక రూపొందించారు. వైకల్యం కలిగిన ప్రతిఒక్కరికీ 50శాతం రాయితీతో కూడిన బస్ పాస్లను నేరుగా వారికే అందించాలని భావిస్తున్నారు. ఇందుకోసం జిల్లాలోని అన్ని గ్రామాలు, మండల మహిళా సమాఖ్య కార్యాలయాల్లో ఏపీఎంల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. వారి నుంచి ఆధార్ జిరాక్స్ కాపీ, సదరం సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజు ఫొటోతో పాటు రూ.30 ఫీజును తీసుకుని దరఖాస్తు చేసుకున్నవారికి 24 గంటల వ్యవధిలోనే పాస్ అందజేస్తున్నారు. దివ్యాంగుల కష్టాలకు చెల్లు ! జిల్లాలో మొత్తం 15,847 మంది దివ్యాంగుల్లో ఆర్థోపెడిక్ లోపం కలిగిన వారు 9,904 మంది, చూపు లేనివారు 2,059, చెవిటివారు 1,151, మానసిక వ్యాధిగ్రస్తులు 1414, ఇతర దివ్యాంగులు 1,271 మంది ఉన్నారు. డీఆర్డీఏ ద్వారా 11,053 మంది దివ్యాంగులు ఆసరా పింఛన్లు పొందుతున్నారు. వీరందరికీ తప్పనిసరిగా ప్రభుత్వపరంగా ఆర్టీసీ రాయితీ బస్సు పాసులు ఇవ్వాలని భావిస్తున్నారు. జిల్లాలోని దివ్యాంగులు ఆర్టీసీ బస్ పాస్లను పొందాలంటే నరకయాతన అనుభవించేవారు. ప్రతినెలా 27, 28 తేదీల్లోనే సాధారణ బస్ పాస్లతో పాటు దివ్యాంగులకు సైతం పాసులు ఇచ్చేవారు. దీంతో దివ్యాంగులు ఆయా డిపోల వద్ద గంటల తరబడి వేచి ఉండేవారు. ఇక వాటిని పొందాలంటేకష్టసాధ్యమని తెలుసుకున్న దివ్యాంగులు వాటిని తీసుకునేందుకు చాలామంది ఆసక్తిచూపేవారు కాదు. ఈ క్రమంలో ఇప్పటివరకు కేవలం 3500 మంది దివ్యాంగులు మాత్రమే ఆర్టీసీ రాయితీ పాసులు పొందుతున్నారు. ప్రతి ఒక్కరికీ బస్పాస్ అందించాలి 40శాతం వైకల్యం ఉన్నవారికి మాత్రమే రాయితీ బస్ పాస్లు ఇస్తున్నారు. 40 కంటే తక్కువ శాతం ఉన్నవారికి కనీసం ఇవ్వాలి. దివ్యాంగులను ప్రభుత్వమే ఆదుకోవాలి. – కుర్మన్న, మస్తీపురం ఇన్నాళ్లూ ఇబ్బందిపడ్డారు.. గతంలో దివ్యాంగుల ఆర్టీసీ రాయితీ బస్ పాస్లను పొందడానికి ఇబ్బందులు పడేవారు. నెలలో రెండు రోజులు మాత్రమే సాధారణ బస్ పాస్లతో పాటు దివ్యాంగులకు సైతం ఇస్తుండటంతో గంటల తరబడి వేచిచూస్తూ బాధపడేవాళ్లం. ఆర్టీసీ అధికారులు తీసుకున్న నిర్ణయంతో ప్రతిఒక్కరూ పొందుతున్నారు. – మాకం శ్రీనివాసులు, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు, తిప్పుడంపల్లి -
కేక్ కొంటే పెట్రోల్ ఫ్రీ
సాక్షి, చెన్నై: పెట్రో ధరలు వినియోగదారులకు సెగ పుట్టిస్తోంటే.. వినియోగదారులకు ఆకట్టుకునేందుకు సంస్థలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. ఇపుడు ఈ కోవలోకి ఒక బేకరీ సంస్థ వచ్చి చేరింది. ఒక కిలో కేక్ కొంటే లీటరు పెట్రోలు ఉచితంగా ఇస్తామంటూ ఒక బేకరీ వినూత్న ఆఫర్ అందిస్తోంది. తమిళనాడులోని ఒక బేకరీ దుకాణం ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది. ఒక కిలో పుట్టినరోజు కేక్ లేదా రూ .495 బిల్లు చేస్తే 1 లీటరు పెట్రోలు ఉచితమని అని ప్రకటించింది. దీంతో ఇది వైరల్గా మారింది కాగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు బాగా పెరగడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటు తున్నాయి. రికార్డు ధరలతో వినియోగదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక పెళ్లి వేడుకలో వధూవరులకు 5 లీటర్ల పెట్రోలును బహుమతిగా ఇవ్వడం పరిస్థితికి అద్దం పడుతోంది. ముఖ్యంగా దేశంలో పెట్రోలు ధర మండుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. శుక్రవారం రాష్ట్ర రాజధాని చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు 86.01 రూపాయలకు చేరుకుంది. ఢిల్లీ, ముంబై రెండింటిలో 10 పైసలు పెరిగి రూ. 82.32 , 89.92 రూపాయలుగా ఉంది. -
విమ్స్ సేవలు పూర్తిగా ఉచితం
సాక్షి, విశాఖపట్నం : విమ్స్ సేవలు పూర్తిగా ఉచితమని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పూనం మాల కొండయ్య చెప్పారు. ఎవరి వద్ద పైసా కూడా వసూలు చేయబోమన్నారు. సాక్షిలో గురువారం కథనం ప్రచురితమైన నేపథ్యంలో ఆమె స్పందిస్తూ విమ్స్ను బలోపేతం చేస్తామే తప్ప ప్రైవేటుపరం చేయబోమని భరోసా ఇచ్చారు. విమ్స్లో ఖాళీగా ఉన్న వైద్యులు, ఇతర పోస్టులను పర్మినెంట్ రిక్రూట్మెంట్ పద్ధతిలోనే భర్తీ చేస్తామన్నారు. దీనిపై వచ్చే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ట్రామా సర్వీసెస్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ ప్రభుత్వపరంగా చేస్తున్నామన్నారు. కేజీహెచ్లో కూడా అందుబాటులో లేని సూపర్ స్పెషాలిటీ సేవలను విమ్స్లో అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. కార్డియాలజీతో సహా ఆరు విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ బ్లాకులను అందుబాటులోకి తీసుకొస్తున్నారన్నారు. ఇక్కడ ఎన్ని సౌకర్యాలు కల్పించినా పూర్తిగా ఉచితమే తప్ప ఏ అధునాతన సేవకు పైసా వసూలు చేసే ప్రసక్తే లేదన్నారు. విమ్స్లో టాటా క్యాన్సర్ సెంటర్ వస్తోందని, వాళ్లకు అవసరమైన సపోర్టు ఇస్తున్నామన్నారు. క్యాన్సర్లో స్టేజ్ స్టెమ్సెల్స్ రీసెర్చ్ ద్వారా మాత్రమే నివారించగలమని, ఈ అవకాశం రాష్ట్రంలో ఏ కార్పొరేట్ ఆస్పత్రిలోనూ లేదన్నారు. దీన్ని త్వరలో విమ్స్లో తీసుకొస్తున్నామన్నారు. ఈ సర్వీసులన్నీ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఏర్పాటు చేయడం లేదని, పూర్తిగా ప్రైవేటు పార్టనర్ షిప్తో ఏర్పాటు చేస్తున్నామన్నారు. చేసిన సేవలకుగాను వాళ్లకు పర్సంటేజ్ ఇస్తామే తప్ప రోగుల నుంచి ఆయా సంస్థలు పైసా కూడా వసూలు చేయనీయమన్నారు. ఇందుకయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్య రక్ష పరిధిలోకి రాని వ్యాధులకు కూడా విమ్స్లో ఉచితంగా సేవలందుతాయన్నారు. -
ఆరోగ్యమే మహాభాగ్యం
నెల్లూరు(బారకాసు): మారుతున్న ఆహారపు అలవాట్లు.. శారీరక శ్రమ లేకపోవడం.. పనిఒత్తిడి.. వెరసి చిన్న వయసులోనే అనారోగ్యాలకు గురువుతున్నారు. మూడు పదుల వయస్సులోనే మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు చుట్టముట్టడంతో గుండె, కిడ్నీ, లివర్, కంటి సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఆరోగ్యకర జీవన విధానం, ఆయా వ్యాధులను అధిగమించడం ఎలా? వ్యాధులు ఉన్న వారు ఎలాంటి చికిత్సలు తీసుకోవాలనే సందేహాలను నివృత్తి చేసేందుకు ‘సాక్షి’ చక్కటి వేదికను ఏర్పాటు చేసింది. నెల్లూరు అపోలో హాస్పిటల్ ప్రధాన స్పాన్సర్గా నిర్వహిస్తున్న గుడ్హెల్త్ మెగా షోని ఈ నెల 24, 25 తేదీల్లో మాగుంట లేఅవుట్లోని అనిల్గార్డెన్లో నిర్వహించనున్నారు. ఇందులో ఆరోగ్య సమస్యల గురించి వివరించడంతోపాటు పలు వైద్య పరీక్షలు ఉచితంగా చేసేందుకు నెల్లూరు నగరంలోని ప్రముఖ హాస్పిటల్స్ ముందుకొచ్చాయి. ‘సాక్షి’ గుడ్హెల్త్ మేగా షోలో పాల్గొనే ఆస్పత్రులు అపోలో హాస్పిటల్: గుండెజబ్బులు, నరాల, మూర్చ, పక్షవాతం, కిడ్నీ తదితర ప్రధాన వ్యాధులకు సంబంధించి ప్రముఖ వైద్య నిపుణులు అవగాహన కల్పించి పలు సూచనలు ఇస్తారు. సాయిపథం హాస్పిటల్: కాన్పులు, గర్భకోశవ్యాథులపై అవగాహన కల్పిస్తారు. సంతాన సాఫల్యం వంటి అంశాలతో పాటు జనరల్ సర్జరీలకు సంబంధించి వైద్యరంగంలో వచ్చిన నూతన వైద్యవిధానాల్లో భాగంగా ఎలాంటి కోత లేకుండా ల్యాప్రోస్కోపిక్ ద్వారా కేవలం చిన్న రంధ్రం వేసి ఆపరేషన్ చేసే సదుపాయం గురించి డాక్టర్ వంగిమళ్ల రాధామాధవి వివరిస్తారు. మాడరన్ ‘ఐ’ హాస్పిటల్: కంటి వ్యాధులు ఎలా, ఎందుకు వస్తాయి. రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కంటి సమస్యలు ఉన్న వారు ఎలాంటి చికిత్సలు పొందాలనే విషయాలపై డాక్టర్ పీఎల్.రావు అవగాహన కల్పిస్తారు. రత్నం హాస్పిటల్: శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల్లో నెమ్ము, ఆయాసం, ఉబ్బసం తదితర వ్యాధులకు సంబంధించిన జబ్బులపై డాక్టర్ పిట్టి మల్లికార్జునరావు అవగాహన కల్పించనున్నారు. ఆయుష్ దంతవైద్యశాల: ఉచితంగా దంత వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు నోటి ఆరోగ్యంపై ప్రముఖ దంత వైద్య నిపుణుడు డాక్టర్ ఉమ్రాన్ అవగాహన కల్పిస్తారు. రవి చిన్నపిల్లల హాస్పిటల్: చిన్నపిల్లల వ్యాధులకు సంబంధించి వైద్యులు పాల్గొంటారు. అవసరమైన చిన్నారులకు పలు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. పిల్లల్లో తరచుగా వచ్చే వ్యాధుల పట్ల ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ రవికుమార్తోపాటు తన వైద్య బృందం హాజరై అవగాహన కల్పించనున్నారు. అదేవిధంగా సందేహాలను నివృత్తి చేస్తారు. ఉమా మహేష్ న్యూరో హాస్పిటల్: నరాలు, మెదడుకు సంబంధించిన పక్షవాతం, మూర్ఛ, మతిమరుపు లాంటి జబ్బులు నివారణపై అవగాహన కలిగిస్తారు. ఈవ్యాధులు వచ్చే అవకాశాలు ఎలా ఉంటాయి, అవిరాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ ఉమామహేష్ వివరిస్తారు. మైధిలి హాస్పిటల్(మెటర్నిటి అండ్ ఫర్టిలిటి సెంటర్): కాన్పులు,గర్భకోశ వ్యాదులు, సంతానం లేని వారికి ఎటువంటి ప్రత్యేక చికిత్స ఉందనే విషయాలను వివరిస్తారు. మహిళలు తమకున్న అనారోగ్య సమస్యలపై ఉన్న సందేహాలను డాక్టర్ జి.మైధిలి నివృత్తి చేస్తారు. చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్: చెన్నైలోని ఉన్న అన్ని ప్రముఖ హాస్పిటల్స్కు సంబందించిన పూర్తి సమాచారాన్ని తెలియచేస్తారు. అక్కడున్న హాస్పిటల్స్లో ఏహాస్సిటల్లో ఎటువంటి వైద్య సదుపాయాలున్నాయనే విషయాలను కూడా తెలియచేయనున్నారు. కేబీఆర్ ఆర్థోపెడిక్ హాస్పిటల్: డాక్టర్ గరిక సతీష్ ఎముకలు, కీళ్లు, నరాల శస్త్రచికిత్సలకు సంబందించిన విషయాలపై అవగాహన కల్పించనున్నారు. మోకాలి చిప్పలు అరుగుదల వచ్చే సమస్యలపై వివరిస్తారు. బాలాజీ ఈఎన్టీ హాస్పిటల్: చెవి,ముక్కు, గొంతు వ్యాధులకు సంబందించిన పలు విషయాలపై డాక్టర్ దేసు మురళి అవగాహన కల్పిస్తారు. సహజ డయాబెటిస్ అండ్ థైరాయిడ్ క్లీనిక్: మధుమేహం, థైరాయిడ్ గ్రంథి సమస్యలు, పిల్లల్లో ఎదుగుదల లోపాలు, శారీరక వికాసలోపం, స్థూలకాయం, మోనోపాజ్, అధిక కొలెస్ట్రాల్ సమస్యలపై డాక్టర్ ఆలూరు సహజ అవగాహన కలిగిస్తారు. షుగర్, థైరాయిడ్కు సంబంధించిన పరీక్షలు ఉచితంగా చేస్తారు. నవ్య ఆయుర్వేదిక్ హాస్పిటల్: అన్ని రకాల వ్యాధులకు సంబందించి ఆయుర్వేదంలో ఉన్న వైద్య సదుపాయాలు గురించి డాక్టర్ రాజశేఖర్ వివరిస్తారు. ఆయుష్ ఆయుర్వేద వైద్యశాల: ఆయుర్వేద వైద్యం వలన ఎటువంటి ఫలితాలుంటాయనే విషయాలను డాక్టర్ స్వాతి పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తారు. విఘ్నేశ్వర స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్: పుట్టకతోను, చిన్నారుల్లో వచ్చే వినికిడి లోపాలు గురించి వివరిస్తారు. అందుకు ఎటువంటి చికిత్సలు తీసుకోవాలనే విషయాలపై అవగాహన కల్పించేందుకు ఆడియాలజిస్ట్ డాక్టర్ కిరణ్కుమార్ పాల్గొంటారు. -
పరీక్ష రాసే అభ్యర్థులకు బస్సులో ఉచితం
మెదక్ జోన్: పదవ తరగతి పరీక్షలు ఈ నెల 15(నేటి) నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఉచితంగా బస్సులో ప్రయాణించే సదుపాయం కల్పిస్తునట్లు ఆర్టీసీ డీఎం శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 2 వరకు పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. పదవ తరగతి విద్యార్థులకు ప్రీ బస్పాస్ కానీ లేదా సబ్సిడీతో కూడిన బస్పాస్ కానీ కచ్చితంగా ఉండాలని చెప్పారు. అలాంటి విద్యార్థు«లను మాత్రమే ఉచితంగా బస్సుల్లో తీసుకెళతారన్నారు. ఉదయం ఇంటి నుంచి పరీక్ష కేంద్రం వద్దకు, మధ్యాహ్నం పరీక్షలు ముగిశాక మళ్లీ ఇంటివరకు వెళ్లొచ్చని ఆయన చెప్పారు. జిల్లాలో 11,258 మంది పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఉన్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు తప్పని సరిగా హాల్ టికెట్తో పాటు బస్ పాస్ను సైతం వెంటతీసుకుని రావాలని ఆయన చెప్పారు. పరీక్షలు అయ్యేంత వరకు ఎక్స్ప్రెస్ బస్సుల్లో సైతం ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని ఆయన చెప్పారు. -
ఓలా ఆఫర్.. రెండు రైడ్స్ ఉచితం
బెంగుళూరు : క్యాబ్ సేవల సంస్థ ఓలా తన కస్టమర్లకు రెండు రైడ్లు ఉచితంగా ఇస్తున్నట్లు బుధవారం తెలిపింది. కానీ అది మన ఇండియాలో కాదు. ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో ఈ ఉచిత ఆఫర్ వర్తిస్తుంది. ఇటీవలే ఇండియాకు చెందిన ఓలా సంస్థ తన క్యాబ్ సేవలను ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్, సిడ్నీ, పెర్త్ నగరాలలో ప్రారంభించిన సంగతి తెల్సిందే. ట్రయల్లో భాగంగా పది డాలర్ల వరకు రెండు సార్లు ఉచితంగా తమ క్యాబ్లలో ప్రయాణించవచ్చని తెలిపింది. ప్రయాణికులకు తక్కువ చార్జీలు, డ్రైవర్లకు అధిక లాభంతో నాణ్యమైన ప్రయాణ అనుభవాన్ని కలిగించడమే తమ సంస్థ లక్ష్యమని ఓలా ప్రకటించింది. తమ సర్వీస్ను అభివృద్ధి పరుచుకోవడానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని కస్టమర్లను కోరింది. సిడ్నీ, మెల్బోర్న్, పెర్త్ నగరాల్లోని ప్రైవేటు అద్దె వాహనాల యజమానులు కంపెనీ వెబ్సైట్ drive.olacabs.comలో రిజిస్టర్ చేసుకోవచ్చునని తెలిపింది. -
కొందరికే కనెక్షన్!
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు షాక్ ఇవ్వనుంది. బోరుబావులకు నూతన విద్యుత్ కనెక్షన్ల మంజూరులో కొత్త మెలిక పెట్టింది. విద్యుత్ స్తంభాలు అవసరం లేని వారికే కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. మరి మిగిలిన రైతుల పరిస్థితి ఎలా అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఇప్పటికే దరఖాస్తు చేసుకుని కనెక్షన్ కోసం ఎదురుచూస్తున్న వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): తెలుగుదేశం ప్రభుత్వం ఉచిత విద్యుత్ను భారంగా భావిస్తోంది. వీలైనంత వరకు దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయి. అందులో భాగంగానే 2017 సెప్టెంబర్ నుంచి కొత్త కనెక్షన్ల మంజూరుపై నిషేధం విధించింది. 2015–16, 2016–17 ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం 17 వేల మంది రైతులకు మాత్రమే కనెక్షన్లు ఇచ్చింది. రైతుల ఒత్తిడి అధికమవడంతో... ఉచిత విద్యుత్ కనెక్షన్ కోసం జిల్లాలో 12856 మంది రైతులు రూ.5500 డీడీ కట్టి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో రెండు, మూడేళ్లు కిత్రం దరఖాస్తు చేసుకున్న వారూ ఉన్నారు. చాలామంది బోరు బావి, ఇతర ఖర్చుల కోసం రూ.1.50 లక్ష వరకు ఖర్చు చేసి విద్యుత్ కనెక్షన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఒక పక్క బోరు వేయించేందుకు చేసిన అప్పులకు వడ్డీల మీద వడ్డీ పెరిగిపోతోంది. అయినా, సర్కారు పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో రైతుల్లో అసహనం అధికమైంది. ఈ పరిస్థితుల్లో నూతన విద్యుత్ కనెక్షన్లపై ఉన్న బ్యాన్ను ఎత్తివేయకపోతే మరింత ప్రమాదంలో పడతామని భావించిన సర్కారు కొత్త ఎత్తుగడ వేసింది. విద్యుత్ స్తంభాలు అవసరం లేనివి, తప్పనిసరి అయితే ఒకటి, రెండు, మూడు స్తంభాలు అవసరం ఉన్న బోరుబావులకు మాత్రమే కనెక్షన్లను మంజూరు చేయనుంది. అందులో భాగంగా జిల్లాలో స్తంభాలు అవసరంలేని కనెక్షన్లు 2199, ఒకటి, రెండు, మూడు పోళ్లు అవసరం ఉన్నవి 1021 ఉన్నట్లు గుర్తించారు. వాటికి మత్రమే కొత్త కనెక్షన్లను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే మిగిలిన 9636 మంది రైతుల పరిస్థితి ఏమిటనేది అర్థం కావడం లేదు. 3220 కనెక్షన్లకు ప్రతిపాదనలు పంపాం ఇటీవల రాష్ట్రం ప్రభుత్వం విద్యుత్ స్తంభాలు అవసరం లేనివి, ఒకటి, రెండు పోళ్లు అవసరం ఉన్న కనెక్షన్ల వివరాలు పంపాం. ఒకటి, రెండు నెలల్లో మంజూరయ్యే అవకాశం ఉంది. జిల్లాకు మొత్తం 3220 మంది రైతులకు కొత్త కనెక్షన్లు వస్తాయి. మిగిలిన రైతుల పరిస్థితిపై ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాలి. – భార్గవ రాముడు, ఎస్ఈ కనెక్షన్కు దరఖాస్తు చేసి ఏడాదైంది ఏడాది క్రితం నా పొలంలో మూడు బోర్లు వేయించా. ఒకదానిలో మాత్రమే మంచి నీళ్లు పడ్డాయి. దాదాపు లక్షన్నర ఖర్చు అయింది. అప్పుడే కరెంట్ కోసం రూ.7వేలు ఖర్చు చేసి దరఖాస్తు చేశా. అప్పటి నుంచి కరెంట్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా. అధికారులెవరూ స్పందించడంలేదు. ఒకవైపు అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు.. – నాగరాజు, పొట్లపాడు -
ఉత్తరాఖండ్లో సినిమా షూటింగ్ ఉచితం
డెహ్రాడూన్: సినిమా నిర్మాతలు, దర్శకులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇకపై ఉత్తరాఖండ్లో ఉచితంగా సినిమా షూటింగ్లు జరుపుకోవచ్చని ఆ రాష్ట్ర సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ చెప్పారు. సినిమా షూటింగ్లకు ఉత్తరాఖండ్ను కేంద్రస్థానంగా మార్చడంలో భాగంగా చిత్రీకరణ ఫీజును రద్దుచేశామన్నారు. తెహ్రీ పట్టణంలో శుక్రవారం షాహీద్ కపూర్ నటిస్తున్న ‘బిజ్లీ గుల్ మీటర్ చాలూ’ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి రావత్ క్లాప్ కొట్టారు. ప్రకృతి సౌందర్యంతో అలరారే ఉత్తరాఖండ్ సినిమాల చిత్రీకరణకు అద్భుతమైన చోటని రావత్ వ్యాఖ్యానించారు. -
అమ్మాయిలకు బంపరాఫర్
సాక్షి, డెహ్రాడూన్ : కొత్త ఏడాది సందర్భంగా డిసెంబర్ 31, జనవరి 1న ఉత్తరాఖండ్లో మహిళలకు ఉచిత ప్రయాణ సేవలను ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తరాఖండ్లోని ప్రతి నాలుగురోడ్ల కూడలిలో..ఉచిత వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త ఏడాది సంబరాల సందర్భంగా మహిళలకు ఇబ్బంది కలగకుండా ఇటువంటి చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా తాగుబోతుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొనే మహిళలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. -
ఫ్రీ జంక్షన్స్..ఫ్రీ టర్న్
గోల్కొండ క్రాస్రోడ్డు నుంచి సచివాలయానికి వెళ్లేందుకు కిశోర్ వాహనంపై బయలుదేరగా యూటర్న్ చాలా దూరంలో కన్పించగా...రూట్ మార్చాడు. గాంధీనగర్ నుంచి వెళ్లి అశోక్నగర్, ఇందిరాపార్కు మీదుగా సచివాలయం వెళ్లాలనుకున్నాడు. కానీ అశోక్నగర్ జంక్షన్ దాటడానికి అతడికి 15 నిమిషాలు పట్టింది. ఇలా గమ్యం చేరేలోగా పలు జంక్షన్లలో ట్రాఫిక్ జామ్లతో దాదాపు 45 నిమిషాల సమయం వృథా అయింది. ♦ నగర జంక్షన్లలో ట్రాఫిక్ సమస్యల కారణంగా తలెత్తు్తతున్న ఇబ్బందులకు ఇదో ఉదాహరణ. ఇలాంటి వాటిని అధిగమించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు సమస్యాత్మకంగా ఉన్న 100 జంక్షన్లలో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించింది. తొలుత 34 జంక్షన్లలో విస్తరణ పనులు ప్రారంభించనుంది. ఇందుకు రూ.109 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. సాక్షి, సిటీబ్యూరో: నగరంలో పలు జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సమస్యల కారణంగా వాహనాలు సాఫీగా ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిని నివారించేందుకు జంక్షన్ల విస్తరణ..అభివృదిపనులు చేపట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. నగరవ్యాప్తంగా దాదాపు 250 జంక్షన్లుండగా, వాటిల్లో 100 చోట్ల అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించింది. అర్బన్ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ (యూజేఐపీ)లో భాగంగా ఈ జంక్షన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. చాలా ప్రాంతాల్లో భూసేకరణ జరపాల్సి ఉండటంతో అందుకు ఎంతో సమయం పట్టనుంది. దీంతో భూసేకరణ సమస్యలు లేని ప్రాంతాల్లో తొలిదశలో జంక్షన్ల అభివృద్ధి పనులు చేసేందుకు సిద్ధమైంది. అలాంటి 34 జంక్షన్లను గుర్తించారు. ఇప్పటి వరకు ఐదు ప్రాంతాల్లో మాత్రం పనులకు శ్రీకారం చుట్టారు. మిగతా ప్రాంతాలకు సంబంధించి అంచనాలు, అనుమతుల మంజూరు వంటి దశల్లో ఉన్నాయి. మలిదశలో భూసేకరణ సమస్యలు తక్కువగా ఉన్న 30 జంక్షన్లలో, మిగతావాటిని ఆతర్వాతి దశలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. తొలిదశలో చేపట్టనున్న పనులకు రూ.109 కోట్లు ఖర్చుకాగలదని ప్రాథమికంగా అంచనా వేశారు. జీహెచ్ఎంసీ బడ్జెట్ పరిస్థితి దయనీయంగా ఉండటంతో రూ.100 కోట్లు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ)నుంచి రుణంగా తీసుకోవాల్సిందిగా మునిసిపల్ మంత్రి కేటీఆర్ సూచించడంతో అధికారులు అందుకు సిద్ధమయ్యారు. జంక్షన్ల అభివృద్ధి ఇలా.. ⇒ ప్రధానంగా జంక్షన్చుట్టూ వంద మీటర్లకు తగ్గకుండా రోడ్లను వెడల్పు చేస్తారు. ⇒ ట్రాఫిక్ సాఫీగా సాగేలా నేరుగా వెళ్లే రోడ్డుతోపాటు కుడి, ఎడమవైపులకు వెళ్లే రోడ్లను కూడా విస్తరిస్తారు. ⇒ పాదచారులకు ప్రాధాన్యతనిస్తూ జంక్షన్ల వద్ద ఫుట్పాత్లు, రెయిలింగ్స్ ఏర్పాటుచేసి, నిర్దేశిత ప్రాంతంలోనే రోడ్డు దాటే ఏర్పాటు చేస్తారు. ⇒ జంక్షన్ల వద్ద ఏ దారి ఎటువైపు వెళ్తుందో సూచించేలా సైనేజీలతోపాటు పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తారు. ⇒ రెడ్సిగ్నల్ పడినప్పుడు పాదచారులు రోడ్డు దాటుతారు కాబట్టి, అప్పటి వరకు వారు వేచి ఉండేందుకు సదుపాయంగా తగిన ప్లాట్ఫామ్స్ కూడా నిర్మిస్తారు. తొలిదశలో అభివృద్ధిచేయనున్న జంక్షన్లు.. 1.సుచిత్ర 2. ఐడీపీఎల్ 3.సిటీకాలేజ్ 4.అశోక్నగర్ 5.సైబర్సిటీ(ఖానామెట్) 6. ప్యారడైజ్ 7. హిమ్మత్పురా(శాలిబండ) 8.పురానాపూల్ 9.ఎన్ఎఫ్సీ 10.హైదర్గూడ(అత్తాపూర్) 11. కర్మన్ఘాట్ 12. బీఎన్ రెడ్డి 13. షెనాయ్ నర్సింగ్హోమ్ 14. ఐఐఐటీ 15. నిజాం కాలేజ్ 16. వీఎస్టీ 17. ఆజామాబాద్ 18. హస్తినాపురం 19. కవాడిగూడ 20. ఫీవర్ హాస్పిటల్ 21. రాణిగంజ్ 22. ఎతెబార్ చౌక్ 23. బీబీ బజార్ 24. అలీ కేఫ్ 25. బోరబండ బస్టాప్ 26. శివాజీ బ్రిడ్జి(దారుల్షాఫా) 27. మదీన 28. కేపీహెచ్బీ టెంపుల్ బస్టాప్ 29. రోడ్ నెంబర్ 6(అంబర్పేట) 30. బాలాజీనగర్ 31. రామంతాపూర్ చర్చి టి 32. నర్సాపూర్ 33. వీటీ కమాన్ 34. జోహ్రాబీ దర్గా. నగరంలో మూడు రోడ్ల జంక్షన్ల నుంచి 12 మార్గాల నుంచి వచ్చి కలిసే జంక్షన్లు కూడా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా.... ⇒ నాలుగు కంటే ఎక్కువ రోడ్లు వచ్చి కలిసేవి ⇒ నాలుగు రోడ్ల జంక్షన్లు (చౌరస్తాలు) ⇒ మూడు రోడ్ల టీ జంక్షన్లు ⇒ మూడు రోడ్ల వై జంక్షన్లు ఈ జంక్షన్లలో వాహనదారులు ముందుకు కదిలేందుకు ఎంతో సమయం పడుతోంది. వీటిల్లో కొన్నింటికి ఇటీవల సిగ్నళ్లు లేకుండా కొంత దూరం ముందుకు తీసుకెళ్లి యూటర్న్ ఇచ్చినప్పటికీ సమస్య తగ్గకపోగా కొన్ని చోట్ల మరింత తీవ్రంగా మారింది. తార్నాక, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్రోడ్స్ తదితర ప్రాంతాల్లో యూటర్న్ సిస్టం ఫెయిలైంది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంకుసంచలన నిర్ణయం: చార్జీలు రద్దు
సాక్షి,ముంబై: ప్రయివేటు దిగ్గజం హెచ్డీఎఫ్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. డిజిటల్ ఆర్ధికవ్యవస్థను ప్రోత్సహించే లక్ష్యంతో ఉచిత ఆన్లైన్ లావేదేవీలకు అనుమతినిస్తున్నట్టు ప్రకటించింది. డిజిటల్ పేమెంట్స్కు ఊతమిస్తూ వినియోగదారులు ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా జరిపే నెఫ్ట్, ఆర్టీజీఎస్ లావాదేవీలకు రద్దు చేసింది. అలాగే చెక్ బుక్ జారీ, లావాదేవీల చార్జీలను కూడా సవరించింది. ఈ మేరకు కస్టమర్లకు సమాచారాన్ని అందించింది. బ్యాంకు ఖాతాల్లో సత్వర నగదు బదిలీకి ఉపయోగపడే రియల్ టైమ్ గ్రోస్ సెటిల్మెంట్ (RTGS) , నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (NEFT) సేవలను ఉచితంగా అందించనుంది. ఈ ఆదేశాలు నవంబర్ 1, 2017 నుంచి అమల్లోకి వచ్చినట్టుతెలిపింది. తద్వారా వినియోగదారులు జరిపే లావాదేవీలపై చార్జీలు వసూలు చేయబోమని సోమవారం ప్రకటించింది. సేవింగ్, సాలరీ ఖాతాలతోపాటు, ఇతర రీటైల్ కస్టమర్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయిని బ్యాంక్ వినియోగదారులకు అందజేసిన నోటీసులో తెలిపింది. మరోవైపు చెక్ఆధారిత లావాదేవీలపై అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నట్టు తెలిపింది. చెక్ ఆధారిత లావాదేవీలు, రికవరీ ఛార్జీలను, డిసెంబర్ 1, 2017 ను అమలు చేస్తామని తెలిపింది. చెక్ రిటర్న్కు రూ. 500 లు జరిమానా విధిస్తుంది. డిపాజిట్ చేసిన చెక్కులకు చెల్లించని సందర్భాల్లో పెనాల్టీని రూ. 100నుంచి రూ. 200 కు పెంచింది. దీంతోపాటు ఇకమీదట సం.రానికి ఒకచెక్బుక్ (25 లీఫ్స్) మాత్రమే ఉచితంగా అందిస్తుంది. ఇప్పటివరకు రెండు ఇచ్చేది. అయితే అదనపు చెక్బుక్ కోసం వసూలు చేసే చార్జిని రూ.75గానే ఉంచింది. సమర్థవంతంగా అమలు చేయని రెసిడెంట్ సేవింగ్స్ , సాలరీ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. కాగా గతంలో రెండు లక్షల లోపు ఆర్టీజీఎస్ లావాదేవీలపై రూ.25, 2-5 లక్షలపై రూ.50 వసూలు చేస్తుండగా, నెఫ్ట్ లావాదేవీలపై పది వేల లోపు అయితే రూ.2.50, లక్ష లావాదేవాపై రూ. 5, ఆపైన నిర్వహించే లావాదేవీలపై రూ.15 వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
కాలేజి విద్యార్థులకు వైఫై ఫ్రీ: జియో
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో మరో కొత్త సంచలనానికి తెరలేపనుందా?. తాజా రిపోర్టులు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. దేశంలోని మూడు కోట్ల కళాశాలలకు ఉచిత వైఫై సేవలు అందించేందుకు జియో సిద్ధపడుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు జియో ఇప్పటికే మానవవనరుల శాఖ(హెచ్ఆర్డీ)కు ఓ ప్రపోజల్ను కూడా పెట్టినట్లు సమాచారం. గత నెలలో హెచ్ఆర్డీకు ఇచ్చిన ప్రెజెంటేషన్లో దేశంలోని 38 వేల కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా వైఫై సేవలు అందిస్తామని చెప్పినట్లు తెలిసింది. భవిష్యత్తులో దేశంలోని మూడు కోట్ల కళాశాలలకు ఉచిత వైఫై సేవలు ఇస్తామని చెప్పినట్లు రిపోర్టులు వచ్చాయి. దీనిపై మాట్లాడిన ఓ హెచ్ఆర్డీ అధికారి.. వైఫై సేవలు ఉచితంగా అందిస్తామని రిలయన్స్ జియో చెప్తుండటంతో ప్రాజెక్టు దానికే వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. మిగిలిన కంపెనీలకు అవకాశం ఇవ్వకుండా జియోకే పట్టం కట్టడం సరికాదు కాబట్టి టెండర్ ప్రాసెస్ను అమలు చేస్తామని అన్నారు. అయితే, ఉచితంగా సర్వీసులు జియో ఇస్తుంది కాబట్టి టెంబర్ దానికే వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. -
ముకేశ్ మేజిక్!
ఉచితం ఒక ఫోన్–ఒక షేర్ ♦ 40వ ఏజీఎంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సంచలన ప్రకటన ♦ ఉచితంగా 4జీ ఫీచర్ మొబైల్ ‘జియో ఫోన్’ ♦ రూ. 1,500 సెక్యూరిటీ డిపాజిట్ కడితే చాలు; మూడేళ్ల తర్వాత మళ్లీ వెనక్కి ♦ నెలకు రూ.153 టారిఫ్; వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం.. అపరిమిత డేటా ♦ ఆగస్ట్ 15న ప్రయోగాత్మకంగా విడుదల... 24 నుంచి బుకింగ్స్ మొదలు ♦ 50 కోట్ల మంది అల్పాదాయ యూజర్లను ఆకర్షించడమే లక్ష్యం... ♦ వాటాదారులకు బంపర్ ఆఫర్; ఒక షేరుకు మరో షేరు ఫ్రీ ♦ గంటన్నరపాటు ఏజీఎంలో ప్రసంగించిన ముకేశ్.... ♦ తొలిసారి ఏజీఎం వేదికపైకి ఎక్కిన కుమారుడు ఆకాశ్, కుమార్తె ఇషా టెలికం రంగంలోకి అడుగుపెడుతూనే వినూత్న ఆఫర్లతో సంచలనం సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్... మరో సరికొత్త సంచలనంతో ప్రత్యర్థి కంపెనీల్లో దడ పుట్టించింది. కంపెనీ 40వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో ఆర్ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించిన ఆఫర్లతో రిలయన్స్ జియో కస్టమర్లతోపాటు రిలయన్స్ వాటాదారుల్లో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. రిలయన్స్ జియో కస్లమర్లుగా చేరేవారికి ఉచితంగా మొబైల్ ఫోన్ను ఇవ్వడంతోపాటు జీవితకాలంపాటు ఉచిత వాయిస్ కాల్స్, అతితక్కువ ధరకు అన్లిమిటెడ్ 4జీ డేటా ఆఫర్ ప్రకటించారు. అంతేకాదు ఆర్ఐఎల్ ఇన్వెస్టర్లకు ప్రతి ఒక్క షేరుకి మరో షేరును ఇవ్వనున్నట్లు ముకేశ్ ఏజీఎంలో వెల్లడించారు. మొత్తంమీద ఈసారి ఏజీఎంలో ముకేశ్ ప్రసంగం, అనూహ్య నిర్ణయాలను చూస్తే...ధీరూభాయ్ రోజుల్లో ఏజీఎంను తలపించిందనేది కార్పొరేట్ వర్గాల విశ్లేషణ. ముంబై శుక్రవారం, జూలై 21, ఉదయం 10.00... ముంబై మహానగరం ఎప్పటిలాగే బిజీబిజీగా రోజును మొదలుపెట్టింది. చిరు జల్లులు కురుస్తున్నాయి. న్యూ మెరైన్ లైన్ రోడ్డులోని బిర్లా మాతోశ్రీ ఆడిటోరియం వద్ద మాత్రం ఆ వర్షాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా కిక్కిరిసిన జనసందోహం లోనికి వెళ్లేందుకు క్యూ కట్టారు. వీళ్లంతా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్టర్లు. ఇక్కడ జరుగుతున్న కంపెనీ 40వ ఏజీఎంలో అధినేత ముకేశ్ అంబానీ ఎలాంటి ప్రకటనలు చేస్తారోనన్న ఉత్కంఠ అక్కడున్నవారిలోనే కాదు... దేశవ్యాప్తంగా కూడా నెలకొంది. అయితే, సన్నగా మొదలైన వర్షం.. ఆ తర్వాత ముకేశ్ అంబానీ ప్రకటించే ఆఫర్ల సునామీగా మారుతుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే ఏజీఎంలో ఆయన చేసిన అనూహ్య ప్రకటనలు అటు కంపెనీ వాటాదారులు, ఇటు టెలికం యూజర్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తే... పోటీ టెలికం సంస్థలకు మాత్రం మరోసారి గట్టి షాక్ తగిలేలా చేశాయి. తమ టెలికం అనుబంధ సంస్థ రిలయన్స్ జియో కస్టమర్లుగా మారేవారికి ఎవరికైనా ఉచితంగా టెలిఫోన్ను ఇస్తామని ముకేశ్ ఏజీఎంలో ప్రకటించారు. ‘జియో ఫోన్’ పేరుతో ఈ 4జీ ఫీచర్ ఫోన్ను ఏజీఎంలో ప్రవేశపెట్టారు. గంటన్నరపాటు ప్రసంగించిన ముకేశ్ అంబానీ... చివర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారులకు 1:1 బోనస్ షేర్లను ప్రకటించడంతో ఇన్వెస్టర్ల హర్షధ్వానాలతో ఆడిటోరియం దద్దరిల్లింది. గతేడాది సెప్టెంబర్లో రిలయన్స్ జియో సేవలను ప్రారంభించి ఉచిత వాయిస్, అన్లిమిటెడ్ డేటా ఆఫర్లతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. సేవలు ప్రారంభించిన 170 రోజుల్లోనే 10 కోట్ల మంది యూజర్లను దక్కించుకుని జియో కొత్త రికార్డును సృష్టించింది కూడా. ప్రస్తుతం జియోకు 12.5 కోట్లకుపైగా సబ్స్క్రయిబర్లు ఉన్నట్లు అంచనా. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కంపెనీ బిల్లింగ్ను కూడా మొదలుపెట్టింది. ప్రధానంగా ఉచిత జియో ఫోన్ ఆఫర్తో దేశంలోని 50 కోట్ల మందికిపైగా ఫీచర్ ఫోన్లను వాడే అల్పాదాయ వర్గాలను తమ కస్టమర్లుగా మార్చేసుకోవాలనేది రిలయన్స్ జియో లక్ష్యంగా కనబడుతోంది. ఫోన్ ఉచితమే కానీ.... జియో ఫోన్ను ముకేశ్ అంబానీ ‘ఇంటెలిజెంట్ ఫోన్’గా అభివర్ణించారు. అంతేకాదు ‘ఇండియా కా స్మార్ట్ఫోన్’ అనేది జియో ఫోన్ నినాదం కావడం గమనార్హం. అయితే, పైసా చెల్లించకుండానే ఈ 4జీ ఫోన్ను ఎవరైనా తీసుకోవచ్చని ప్రకటించిన ముకేశ్ అంబానీ.. ఒక మెలిక మాత్రం పెట్టారు. వన్టైమ్ సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.1,500 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. దీన్ని మూడేళ్ల తర్వాత(36 నెలలు) తిరిగి ఇచ్చేస్తామన్నారు. ‘జీవిత కాలం పాటు వాయిస్ కాలింగ్ అనేది ఉచితం. నెలకు రూ.153 చొప్పున టారిఫ్ను చెల్లిస్తే... అపరిమిత డేటా సేవలను పొందొచ్చు. ఆగస్ట్ 15న ప్రయోగాత్మకంగా ఈ ఫోన్లను ప్రవేశపెడతాం. 24 నుంచి ప్రీ–బుకింగ్స్ మొదలవుతాయి. ముందస్తు బుకింగ్ చేసుకున్నవారికి సెప్టెంబర్ నుంచి ఫోన్లను చేతికి అందిస్తాం’ అని అంబానీ వివరించారు. వారానికి 50 లక్షల జియో ఫోన్స్ను అందుబాటులోకి తీసుకొస్తామని... ఈ ఏడాది చివరి త్రైమాసికంనాటికి వీటిని పూర్తిగా ఇక్కడే తయారు చేయనున్నామని తెలిపారు. కాగా, ఆఫర్లో భాగంగా జియో ఫోన్లోని కంటెంట్ను టీవీలో చూసేవిధంగా కనెక్ట్ చేసుకోవడానికి ఒక కేబుల్ను కూడా కంపెనీ ఇవ్వనుంది. ప్రపంచ టాప్–50 కంపెనీల్లో చోటే లక్ష్యం...: ‘రిలయన్స్ 50వ ఏజీఎం నాటికి(ప్రస్తుతం 40వది) ప్రపంచంలో టాప్–50 కార్పొరేట్ కంపెనీల్లో ఒకటిగా రిలయన్స్ను నిలబెట్టాలనేది నా లక్ష్యం. వచ్చే పదేళ్లూ మనకు స్వర్ణయుగమే’ అని ముకేశ్ అంబానీ ప్రకటించగానే... హాల్ అంతా చప్పట్లు, ఈలలతో మార్మోగింది. ‘వచ్చే పదేళ్లలో రిలయన్స్ అసామాన్యమైన వృద్ధిని సాధిస్తుందన్న ప్రగాఢ విశ్వాసం నాకు ఉంది. అంతేకాదు భారత్ ఆర్థిక వ్యవస్థకు ఇతోధికంగా చేదోడు అందించనున్నాం కూడా. తద్వారా గడిచిన 40 ఏళ్లలో మన ఎకానమీ సాధించిన ప్రగతి వచ్చే పదేళ్లలో కొత్త పుంతలు తొక్కనుంది’ అని ముకేశ్ పేర్కొన్నారు. ఇంధన, మెటీరియల్ వ్యాపారాల్లో వచ్చే కొన్నేళ్లలోనే రూ.లక్ష కోట్ల స్థూల లాభాన్ని సాధించే సత్తా రిలయన్స్కు ఉందని చెప్పారు. ఆర్ఐఎల్ విజయ ప్రస్థానంపై ముకేశ్ ఏం చెప్పారంటే... ⇔ 1977లో అంటే కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీల్లో లిస్టయిన ఏడాది రిలయన్స్ టర్నోవర్ రూ.70 కోట్లు. ఇప్పుడిది రూ.3,30,000 కోట్లు. 4,700 రెట్లు ఎగబాకింది. ⇔ ఇక 1977లో నికర లాభం రూ.3 కోట్లు కాగా, ప్రస్తుతం ఇది రూ.30,000 కోట్లకు చేరింది. 10,000 రెట్లు దూసుకెళ్లింది. ⇔ కంపెనీ మొత్తం ఆస్తులు రూ.33 కోట్ల నుంచి రూ.7 లక్షల కోట్లకు ఎగిశాయి. 20 వేల రెట్ల వృద్ధి సాధించాం. ⇔ ఇక మార్కెట్క్యాప్ అయితే, దాదాపు 50 వేల రెట్లు పెరిగింది. 1977లో రూ.10 కోట్ల నుంచి ఇప్పుడు ఏకంగా రూ. 5లక్షల కోట్లకు ఎగబాకింది. దేశంలో అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. ⇔ ఇక 1977లో ఎవరైనా రిలయన్స్ షేర్లలో రూ.1,000 పెట్టుబడి పెట్టి ఉంటే... ఇప్పుడది రూ.16,54,500కు చేరినట్లు లెక్క. అదే రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులు అయినట్టే. అంటే ప్రతి రెండున్నరేళ్లకు పెట్టుబడి మొత్తం రెట్టింపు అయింది. ⇔ ఇక జియో విషయానికొస్తే... దేశంలో అతిపెద్ద 4జీ నెట్వర్క్ ఏర్పాటు కోసం రూ.2 లక్షల కోట్లను పెట్టుబడిగా వెచ్చించాం. జియో సేవలు ప్రారంభించిననాటి నుంచి ప్రతి సెకనుకు ఏడుగురు కస్టమర్లను జతచేసుకోగలిగాం. ⇔ కేవలం ఆరు నెలల్లోనే భారత్లో నెలవారీ డేటా వినియోగం 20 కోట్ల జీబీ నుంచి 120 కోట్ల జీబీకి ఎగబాకింది. డేటా వినియోగంలో మనం అమెరికా, చైనాలను అధిగమించాం కూడా. ⇔ జియో ప్రారంభానికి ముందు మొబైల్ బ్రాడ్బ్యాండ్ విస్తరణలో భారత్ 155 స్థానంలో ఉంది. రానున్న కొన్ని నెలల్లోనే నంబర్ వన్ స్థానానికి చేరేదిశగా దూసుకెళ్తున్నాం. డేటా వినియోగంలో ఇప్పటికే మనం టాప్ ర్యాంకుకు చేరిపోయాం. బోనస్ బొనాంజా... 40వ∙ఏజీఎంలో ఎవరూ ఊహించని ప్రకటనేదైనా ఉందంటే అది బోనస్ అనే చెప్పొచ్చు. ఎనిమిదేళ్ల వ్యవధి తర్వాత మళ్లీ తమ వాటాదారులకు రూ.10 ముఖ విలువగల ఒక్కో షేరుకు మరో షేరు(1:1 నిష్పత్తిలో)ను ఇవ్వనున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు. దేశ కార్పొరేట్ చరిత్రలో ఇదే అతిపెద్ద బోనస్ ఇష్యూ అవుతుందని కూడా ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా రూ.13 చొప్పున డివిడెండ్ను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రకటించడం విశేషం. కాగా, లిస్టెడ్ కంపెనీగా 40 ఏళ్ల రిలయన్స్ చరిత్రలో ఇది నాలుగో బోనస్ కావడం గమనార్హం. చివరిసారిగా కంపెనీ 2009లో బోనస్ షేర్లను ఇచ్చింది. తొలిసారిగా 1983లో 3:5 నిష్పత్తిలో(అంటే ప్రతి 5 షేర్లకు 3 షేర్లు ఉచితంగా) బోనస్ షేర్లను ప్రకటించింది. కాగా, గురువారం 10 నిమిషాల పాటు డైరెక్టర్ల బోర్డు సమావేశమై ఈ నిర్ణయం తీసుకుందని, బోనస్ షేర్లకు రికార్డు తేదీని తదుపరి ప్రకటించనున్నట్లు కంపెనీ ఎక్సే్ఛంజీలకు వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీ పెయిడ్–అప్ షేర్ క్యాపిటల్ రూ.3,251.74 కోట్లు(రూ.10 ముఖ విలువగల 325.17 కోట్ల ఈక్విటీ షేర్లు, ఇందులో 17.18 కోట్ల షేర్లు సబ్సిడరీ కంపెనీలకు చెందినవి). తాజా బోనస్ తర్వాత పెయిడ్–అప్ క్యాపిటల్ రూ.6,331.59 కోట్లకు చేరుతుంది(రూ.10 ముఖ విలువగల 633.15 కోట్ల షేర్లు). కాగా, ఈ ఏడాది ఇప్పటివరకూ 39 భారతీయ కంపెనీలు బోనస్లను ప్రకటించాయి. త్వరలో ల్యాండ్లైన్ సేవలు కూడా... రిలయన్స్ జియో వైర్లెస్ సేవల విస్తరణ అనంతరం.. ల్యాండ్లైన్(ఫిక్స్డ్ లైన్) సేవలను కూడా ప్రవేశపెట్టనున్నామని ముకేశ్ అంబానీ ఏజీఎంలో ప్రకటించారు. ‘తదుపరి దశలో గృహ, వాణిజ్య సంస్థలకు సబంధించి ఫిక్స్డ్ లైన్ కనెక్టివిటీపై దృష్టిపెడతాం. ప్రస్తుతానికైతే వచ్చే 12 నెలల్లో దేశంలోని 99 శాతం ప్రజలకు జియో వైర్లెస్ నెట్వర్క్ను చేరువచేయాలన్నది లక్ష్యం. 2జీ కవరేజీ స్థానంలో పూర్తిగా 4జీని తీసుకురావాలన్నదే మా ప్రయత్నమంతా’ అని వాటాదారులు అడిగిన ఒక ప్రశ్నకు ముకేశ్ సమాధానమిచ్చారు. కాగా, బాలాజీ టెలీఫిల్మ్స్లో 25 శాతం వాటా కొనుగోలువల్ల ప్రయోజనం ఏంటని కొంతమంది ప్రశ్నించగా.. మీడియా, ఎంటర్టైన్మెంట్ సబ్సిడరీ టీవీ18 పనితీరుపైనా మరికొందరు ఇన్వెస్టర్లు ప్రశ్నలు లేవనెత్తారు. టీవీ–18 పనితీరును మెరుగుపరిచి.. విలువను పెంచే ప్రణాళికలపై కసరత్తు జరుగుతోందని ముకేశ్ వెల్లడించారు. ఏజీఎంకు హాజరైన ముకేశ్, నీతా, ఇషా, అనంత్, ఆకాశ్ (వరుసగా కుడి నుంచి) ముకేశ్ భావోద్వేగం... రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు, తన తండ్రి ధీరూభాయ్ అంబానీ కంపెనీ దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు కంపెనీగా తీర్చిదిద్దిన విధానం, ఆయన మార్గనిర్ధేశం గురించి ప్రస్తావిస్తూ ముకేశ్ అంబానీ భావోద్వేగానికి గురయ్యారు. ‘ఇది కంపెనీకి 40వ వార్షికోత్సవం. నా తండ్రి రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ ఇప్పటికీ మనతోనే ఉన్నారని నేను భావిస్తా. భగవద్గీతలో చెప్పినట్లు ఆత్మకు పుట్టుక మరణం అనేవి ఉండవు. అందుకే ఆయన మన హృదయంలో చిరస్థాయిగా నిలిచే ఉంటారు. అందుకే ఆయనను మనం ఏజీఎంకు సాదరంగా ఆహ్వానిద్దాం’ అంటూ ముకేశ్ తీవ్ర భావోద్వేగంతో చెప్పారు. దీంతో వేదిక కింద ముందువరుసలో కూర్చున్న తల్లి కోకిలాబెన్ కంటతడి పెట్టారు. ఆమెను ముకేశ్ చిన్న కుమారుడు అనంత్ ఇతర అంతరంగికులు సముదాయించడంతో... కొద్ది క్షణాలు విరామం తర్వాత ముకేశ్ మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కాగా, ప్రసంగం కొనసాగుతుండగానే ధీరూభాయ్ అంబానీకి గత స్మృతులతో కూడిన ఒక లఘు చిత్రాన్ని వేదికవెనుకనున్న తెరపై ప్రదర్శించారు. ‘గడిచిన 40 ఏళ్లలో కంపెనీ సాధించిన విజయాలు (లాభాలు, మార్కెట్ క్యాప్, టర్నోవర్, వాటాదారులకు రాబడి ఇతరత్రా అంశాల్లో) అన్నింటినీ ధీరూభాయ్ అంబానీకి అంకితం ఇస్తున్నట్లు ముకేశ్ పేర్కొన్నారు. సందడి చేసిన ఆకాశ్, ఇషా... ఏజీఎంకు ముకేశ్ అంబానీ... తల్లి కోకిలాబెన్, భార్య నీతా అంబానీ, కుమారులు ఆకాశ్, అనంత్, కుమార్తె ఇషా అంబానీలతో కలిసి హాజరయ్యారు. కోకిలాబెన్, చిన్న కుమారుడు అనంత్లు మాత్రం వేదిక కింద తొలి వరుసలో కూర్చున్నారు. ఇప్పటికే ఆర్ఐఎల్ బోర్డులో డైరెక్టర్గా ఉన్న నీతా అంబానీతోపాటు తొలిసారిగా ఆకాశ్, ఇషా(వీళ్లిద్దరూ కవలలు. వయస్సు 25 ఏళ్లు) కూడా ముకేశ్తో పాటు వేదికపైన కనిపించారు. వాళ్లిద్దరినీ ఇన్వెస్టర్లకు పరిచయం చేసేందుకు ముకేశ్ కీలకమైన 40వ ఏజీఎంను ఉపయోగించుకున్నారు. ‘కంపెనీలో ఒక కొత్త తరం నాయకత్వం ఆవిర్భవిస్తోంది. రిలయన్స్ను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చడంలో వీళ్లిద్దరికీ మీ ఆశీస్సులు కోరుతున్నా’ అని ముకేశ్ పేర్కొన్నారు. కాగా, ఆకాశ్, ఇషాల నేతృత్వంలో రిలయన్స్ జియో లక్ష మంది ఉద్యోగులతో అత్యంత యవ్వన కంపెనీగా ఆవిర్భవించిందని కూడా వ్యాఖ్యానించారు. అంతేకాదు.. జియో ఫోన్ ప్రత్యేకతలను వివరించాల్సిందిగా ముకేశ్ వారిద్దరినీ ఆహ్వానించారు కూడా. ఆతర్వాత ఆకాశ్, నిషా అంబానీలు జియో ఫోన్ గురించి లైవ్ డెమో ఇచ్చారు. -
పేద ముస్లింలకు ఉచిత వివాహాలు
కల్లూరు (రూరల్): పేద ముస్లిం యువతీ, యువకులకు సెప్టెంబర్ మొదటి వారంలో ఉచితంగా సామూహిక వివాహాలు చేయనున్నట్లు ఆవాజ్ కమిటీ నగర అధ్యక్ష, కార్యదర్శులు షేక్ ఇస్మాయిల్, పి.ఇక్బాల్ హుస్సేన్, షరీఫ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన ఆల్హజ్ ఖ్వాజా అబ్దుల్ గఫూర్సాహెబ్, ఖమృన్నీసాబేగంలు నిరుపేద బాలికల మ్యారేజ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివాహాలు జరపనున్నామన్నారు. పిల్లలకు పెళ్లిళ్లు చేయాలనుకున్న ముస్లింలు ఆగస్టు 2,3వ తేదీలలోపు దరఖాస్తులతో పాటు వధూవరుల పాస్పోర్టు సైజు నాలుగు ఫొటోలు, రేషన్, ఆధార్కార్డు జిరాక్స్ కాపీలను చిత్తారివీధిలోని ఆవాజ్ కమిటీ కార్యాలయంలో అందజేయాలని కోరారు. మరిన్ని వివరాలకు 9948025509, 9000069147,9391610937,9440739794 నంబర్లకు సంప్రదించాలని కోరారు. -
ఏటా అదే తంతు..
వేసవిలో కాంట్రాక్ట్ అధ్యాపకుల ఉచిత సేవలు జిల్లాలో 348 మందికి తప్పని అవస్థలు నెరవేరని ప్రభుత్వ హామీ కాంట్రాక్టు అధ్యాపకులు.. విద్యా సంవత్సరం చివరి పనిదినం రోజున వారిని విధుల నుంచి తొలగిస్తారు. అలాగని వేసవి సెలవుల్లో వారిని ఖాళీగా కూర్చోనివ్వరు. ఏదో ఒక పని చేయిస్తూనే ఉంటారు. సెలవుల్లో వీరితో పనులు చేయించుకున్నారే తప్ప వారికి ఎలాంటి ప్రతిఫలం ఇవ్వడం లేదు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని చెబుతున్న ప్రభుత్వం.. వీరి విషయంలో మాత్రం చిన్న చూపు చూస్తోంది. ఏటా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల పరిస్థితి ఇదీ. రాయవరం (మండపేట) : జిల్లాలో 43 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 348 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. ఇంటర్మీడియేట్ పరీక్షలు పూర్తి కాగానే ఈ ఏడాది మార్చి 28 నుంచి వారిని విధుల నుంచి తొలగించారు. తిరిగి జూన్లో రెన్యువల్ చేస్తామంటూ అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విధుల నుంచి తొలగించినప్పటికీ పనుల నుంచి మాత్రం తొలగించలేదు. ఏప్రిల్ 7వ తేదీ వరకు వారు ఇంటర్మీడియేట్ మూల్యాంకన విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత విద్యార్థులను కళాశాలల్లో చేర్పించేందుకు క్యాంపైన్లలో నిమగ్నమయ్యారు. కళాశాలలో తగిన విద్యార్థుల సంఖ్య లేకుంటే పోస్టులు ఉండవన్న బెదిరింపుల నేపథ్యంలో, విద్యార్థులను చేర్పించేందుకు వారు కళాశాలల పరిధిలోని గ్రామాల్లో తిరుగుతున్నారు. ఇంటర్మీడియేట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను జూన్ 15 నుంచి నిర్వహించే సప్లమెంటరీ పరీక్షలకు వీరే సిద్ధం చేయాలి. ఉత్తీర్ణతా శాతం పెంపుదలకు, సప్లమెంటరీ పరీక్షలకు ఇన్విజిలేటర్ విధులు కూడా వారే నిర్వర్తించాలి. విధుల నుంచి తొలగించిన తర్వాత రెండు నెలలుగా ఇన్ని పనులు చేయించుకుంటున్నారు. ఈ పనులు చేసినందుకు వారికి ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదు. హామీలేమయ్యాయి? కనీస వేతనాలు చెల్లించాలంటూ గతేడాది డిసెంబర్ రెండు నుంచి జనవరి 4వ తేదీ వరకు 32 రోజుల పాటు కాంట్రాక్టు అధ్యాకులు ధర్నాలు, దీక్షలు చేపట్టారు. బెదిరింపులకు దిగినా దీక్షలు విరమించకపోవడంతో చేసేదీమీ లేక కనీస వేతనం, డీఏ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికి నాలుగు నెలలు గడిచినా ఆ హామీ నెరవేర్చలేదు. ఇటీవల కాంట్రాక్టు ఉద్యోగులకు 50 శాతం జీతాలు పెంచుతున్నట్టు ప్రకటించినా.. జీఓ మాత్రం విడుదల కాలేదు. అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. తెలంగాణలో కాంట్రాక్టు అధ్యాపకులకు కనీస వేతనం అమలు చేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఫైల్పై అక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేయడంతో ఆ రాష్ట్ర అధ్యాపకులు సంతోషంగా ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో ఇప్పటికే ఒకసారి రూ.18 వేల నుంచి రూ.26 వేలకు వేతనాలను పెంచారు. తిరిగి కనీస వేతనం రూ.37,100 చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మన రాష్ట్రంలో మాత్రం అటువంటి చర్యలు లేకపోవడంతో ఇక్కడి కాంట్రాక్టు అధ్యాపకుల్లో నిరాశ నిస్పృహలు చోటు చేసుకుంటున్నాయి. ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకుండా ప్రభుత్వం మోసగిస్తోందని కాంట్రాక్టు అధ్యాపకులు మండిపడుతున్నారు. 17 ఏళ్లుగా పనిచేస్తున్నాం.. కాంట్రాక్టు అధ్యాపకులుగా 17 ఏళ్లుగా పనిచేస్తున్నా కనీస వేతనానికి నోచుకోలేక పోతున్నాం. ఉద్యోగ భద్రత లేదు. అరకొర వేతనాలతో కుటుంబాలు గడవక ఇబ్బందులు పడుతున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న చెబుతున్న ప్రభుత్వం మా విషయంలో అమలు చేయకపోవడం దారుణం. – పందిరి సాంబశివమూర్తి, 475 కాంట్రాక్టు అధ్యాపకుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మండపేట జీఓ విడుదల చేయాలి.. వేతనాలు పెంచుతున్నట్టు ప్రభుత్వం జనవరిలో ఇచ్చిన హామీ మేరకు జీఓ విడుదల చేయాలి. పక్క రాష్ట్రంలో జీతాలు పెంచుతున్నప్పటికీ మన రాష్ట్రంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సెలవుల్లో విధుల్లో ఉన్నప్పటికీ రెండు నెలలుగా వేతనాలు లేక కాంట్రాక్టు అధ్యాపకులు ఇబ్బందులు పడుతున్నారు. – యార్లగడ్డ రాజాచౌదరి, 461 కాంట్రాక్టు అధ్యాపకుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, కాకినాడ -
అమెజాన్, వోడాఫోన్: 45 జీబీ డేటా ఫ్రీ
దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ ఓప్రత్యేకమైన ఆఫర్ను ప్రకటించింది. అమెజాన్ లో స్మార్ట్పోన్ కొనుగోలుపై 45జీబీ 4జీ డేటాను అందిస్తోంది. 4జీ డేటా ప్యాక్ లో 1జీబీ లేదా అంతకంటే ఎక్కువ 4జీ డేటా ప్యాక్ కొనుగోలుపై వినియోగదారులు అదనపు డేటా ప్రయోజనాలను అందించనుంది. ఐదు రీచార్జ్లపై 5 నెలల గరిష్ట ప్రామాణికతతో 9జీబీ 4జీ అదనంగా అందించనుంది. ఈ ఆఫర్ల వివరాలను ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ వెబ్సైట్లో పేర్కొంది. ఈ ఆఫర్ అమెజాన్ లో ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్ల కొనుగోలు పై అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. మే 11న ఈ ఆఫర్ ప్రారంభమైందనీ, జూన్ 30 లోపు వీటిని కొనుగోలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అమెజాన్ ఆఫర్ ఎంపిక స్మార్ట్ఫోన్లలో మాత్రమే లభిస్తుంది. వోడాఫోన్ నుండి ఆఫర్ పొందటానికి, జూన్ 30 వరకు అమెజాన్ ప్రత్యేకమైన హ్యాండ్సెట్ను కొనుగోలు చేయాలి. వెబ్సైట్ సమాచారం ప్రకారం జాబితాలో శాంసంగ్, వన్5 ప్రొ, వన్ ప్లస్ 3టి, హానర్ 6 ఎక్స్, మోటోజీ ప్లే(4జనరేషన్) తదితర స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. కాగా ఈ ఉచిత డేటా ఆఫర్ ఏ ఇతర ప్రత్యేకమైన డిస్కౌంట్లతో కలిపి ఉండదు. అమెజాన్ లో కొన్న కొత్త ప్రత్యేక హ్యాండ్ సెట్లో వోడాఫోన్ సిమ్ ఇన్సర్ట్ చేయాలి. వెంటనే అమెజాన్ 1 జీబీ ఆఫర్ లేదా 9జీబీ డేటా ఉచిత ఆఫర్కు(అయిదు రీచార్జ్లపై) కు అర్హులనే సందేశం వస్తుంది. ప్రీపెయిడ్ కనెక్షన్లకు 1 జీబీ రీ చార్జ్ లపై ఫ్రీ డేటా ఆటోమేటిగ్గా క్రెడిట్ అవుతుంది. 9జీబీ ఉచిత డేటా 28 రోజులు మాత్రమే చెల్లుతుంది. ఒక యూజర్ ఐదు సార్లు లేదా ఐదు నెలల వరకు ఆఫర్ పొందవచ్చు. పోస్ట్పెయిడ్ యూజర్ 1జీబీ ప్లాన్లో 9 గంటల ఉచిత డేటా 48 గంటల్లోపు క్రెడిట్ అవుతుంది. -
రేవు రేవునా.. కాసుల పంట
- ఉచిత ఇసుకలో దండిగా దండుకుంటున్న ‘తమ్ముళ్లు’ - గాల్లో కలుస్తున్న నిబంధనలు - గుల్లవుతున్న నదులు - రెట్టింపు రేట్లకు అమ్మకాలు ఆశకు హద్దే లేదన్నట్టుగా చెలరేగిపోతున్నారు ‘తమ్ముళ్లు’. ‘ఉచితం’ ముసుగులో ప్రజల కళ్లల్లో ‘ఇసుక’ కొడుతున్నారు. జిల్లాలోని గోదావరి, ఏలేరు, తాండవ నదులను ఇష్టానుసారం గుల్ల చేసేస్తూ.. నిబంధనలను తుంగలో తొక్కుతూ.. అనధికార ర్యాంపులు నిర్వహిస్తూ.. వేల లారీల ఇసుకను అక్రమంగా తరలించేస్తూ.. రేవురేవునా కాసుల పంట పండించుకుంటున్నారు. అధికారం అండతో కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. కళ్లముందే ఇదంతా జరుగుతున్నా అధికారులు ఏ కారణంచేతనో మిన్నకుండిపోతున్నారు. ఫలితంగా.. చంద్రబాబు ప్రభుత్వం ఇసుక ఉచితమని గొప్పగా ప్రకటించినా.. బండెడు ఇసుక పొందడం కూడా జనానికి భారంగా మారిపోయింది. గతంలో ఇచ్చుకున్నట్టుగానే.. ఇప్పుడూ సొమ్ములు వదిలిపోతున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు. అమలాపురం : ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం లోపభూయిష్టంగా మారింది. ఈ పథకం అమలు అడుగడుగునా అభాసుపాలవుతోంది. ఇసుక ఎగుమతి, బాట నిర్వహణకు ప్రభుత్వం విధించిన దానికన్నా రెట్టింపు ధరలు వసూలు చేయడంతో సామాన్యులకు ఉచిత ఇసుక భారంగా మారింది. ఉచిత ఇసుక ముసుగులో జిల్లాలో గోదావరితోపాటు, ఏలేరు, తాండవ నదులను కూడా ఇసుకాసురులు గుల్ల చేసేస్తున్నారు. ప్రతి ర్యాంపులోనూ అధికార టీడీపీకి చెందిన నియోజకవర్గ కీలక ప్రజాప్రతినిధులు పెత్తనం చేస్తూ దొరికినకాడికి దోచేస్తున్నారు. దోచేస్తున్నారిలా.. - జిల్లాలో గతంలో 38 రీచ్లు ఉండేవి. వీటిలో ప్రస్తుతం నాలుగు పని చేయడం లేదు. మరో 13 రీచ్లకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంది. దీంతో జిల్లాలోని 21 ఇసుక ర్యాంపుల ద్వారా ప్రభుత్వం ప్రస్తుతం ఉచిత ఇసుక అందిస్తోంది. వీటిల్లో 14 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు అనుమతి మంజూరు చేయగా, ఇప్పటివరకూ 4 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలు జరిగాయి. - జిల్లాలో ఇసుక ర్యాంపుల పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది కపిలేశ్వరపురం మండలమే. ఇక్కడ నాలుగు ర్యాంపులుండగా, రోజుకు 500 లారీల ఇసుక ఎగుమతి జరుగుతోంది. ర్యాంపులో మూడు యూనిట్ల ధర రూ.900 అని బోర్డు పెట్టినప్పటికీ, రూ.1,500 నుంచి రూ.2 వేల వరకూ అమ్ముతున్నారు. - 16వ నంబర్ జాతీయ రహదారికి 4 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో తాతపూడి ర్యాంపునకు, నాణ్యత బాగుంటుందన్న కారణంగా కోరుమిల్లి ర్యాంపునకు అధిక సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి. ఆయా ర్యాంపుల నుంచి రోజుకు 500 పైగా లారీల ఇసుక తరలిపోతోంది. - రాజమహేంద్రవరం కుమారి టాకీస్ ఇసుక ర్యాంపు వద్ద రెండు యూనిట్ల ఇసుకను రూ.1,750కి అమ్ముతున్నారు. ఇక్కడినుంచి నగరంలోకి రవాణాకు రూ.500 వరకూ ఖర్చవుతోంది. కొంతమంది లారీ యజమానులు క్వారీ సెంటర్ మార్కెట్ యార్డు సమీపంలో డంప్ చేసి, అక్కడి నుంచి రెట్టింపు రేట్లకు కాకినాడ, తునికి రవాణా చేస్తున్నారు. - రాజమహేంద్రవరం రూరల్ వేమగిరి వద్ద ఇసుక ర్యాంపుల్లో ఉచితంగా ఇస్తున్న ఇసుకకు ఎగుమతి, బాట చార్జీల పేరుతో బాదేస్తున్నారు. యూనిట్కు అదనంగా రూ.400 నుంచి రూ.500 చొప్పున వసూలు చేస్తున్నారు. - కొత్తపేట నియోజకవర్గంలో ఆత్రేయపురం, అంకంపాలెం, జొన్నాడ, మందపల్లి ర్యాంపుల్లో యూనిట్కు రూ.350 వసూలు చేయాల్సి ఉండగా రూ.200 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక్కడినుంచి ఒక్కో ర్యాంపు నుంచి 300 నుంచి 500 యూనిట్ల ఇసుక రవాణా జరుగుతోంది. ఒక్కో ర్యాంపువద్ద రోజుకు రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు దోపిడీ జరుగుతోంది. - తుని నియోజకవర్గ పరిధిలో తాండవ నదిలో ఉచిత ఇసుక అడుగడుగునా అభాసుపాలవుతోంది. టీడీపీకి చెందిన రాష్ట్రస్థాయి నేత సోదరుని ఆధ్వర్యాన ఇక్కడ ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయనేది బహిరంగ రహస్యం. రోజుకు రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల విలువైన ఇసుక తరలిపోతోంది. లారీకి రూ.2 వేలు, ట్రాక్టర్కు రూ.500, ఎడ్లబండికి రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. దీనికి రవాణా అదనం కావడంతో నిర్మాణదారులకు ప్రభుత్వ ఉచిత ఇసుక భారంగానే ఉంది. -
ఎస్బీఐ ఆఫర్: ఫ్రీ క్రెడిట్ కార్డ్
ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఖాతాదారులకు బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. రూ. 20 వేల నుంచి రూ.25 వేల వరకూ ఖాతాలో డబ్బు నిల్వ ఉంచుతున్న వినియోగదారులకు ఉచితంగా క్రెడిట్ కార్డు ఇవ్వనున్నట్లు పేర్కొంది. వినియోగదారుడి క్రెడిట్ హిస్టరీ ఎలా ఉన్నా ఖాతాలో డబ్బు నిల్వ ఉంచితే క్రెడిట్ కార్డు ఇస్తామని చెప్పింది. నాలుగేళ్ల పాటు ఎలాంటి వార్షిక ఫీజు లేకుండా కార్డును వినియోగించుకోవచ్చని తెలిపింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు 'ఉన్నతి' అనే పథకం కింద ఉచిత క్రెడిట్కార్డులను ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో క్రెడిట్ కార్డు వినియోగదారులు బకాయిలు పడి ఉన్నారని దీంతో కొత్త కార్డుల జారీ కావడం లేదని ఎస్బీఐ చీఫ్ అరుంధతి భట్టాచార్య చెప్పారు. ఎస్బీఐ తీసుకొస్తున్న ఉన్నతి కొత్త వినియోగదారులను క్రెడిట్కార్డులను వినియోగించేందుకు ప్రోత్సహిస్తుందని తెలిపారు. -
జియో మరో బంపర్ ఆపర్
న్యూఢిల్లీ: సంచలనానికి మారుపేరుగా నిలిచిన రిలయన్స్ జియో ఖాతాదారులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉచిత డేటా ఉచిత వాయిస్ కాలింగ్ సదుపాయాలనుంచి టారిఫ్ లలోకి ఎంట్రీ ఇచ్చిన జియో ఇపుడు ప్రైమ్ మెంబర్ షిప్ ను కూడా ఉచితంగా అందించే ప్లాన్ ను ఒక దాన్ని తన యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. హ్యాపీ న్యూ ఆఫర్లో రూ.99 ల చార్జితో ప్రైమ్ మెంబర్ షిప్ ద్వారా మార్చి 2018 వరకు జియో సేవలు ఉచితం. అయితే జియో మనీ ద్వారా ప్రత్యేక ఆఫర్లో ఉచితంగా ప్రైమ్ మెంబర్ షిప్ పొందే అవకాశాన్ని కల్పించింది. ఎలా అంటే.. 15 మార్చి నుండి ప్రారంభమైన ఈ ఆఫర్ పరిమిత కాలానికి అందుబాటులో ఉంది. జియోమనీ వాలెట్ లేదా మై జియో యాప్ లేదా www.jio.com లాగిన్ ద్వారా రూ.99+303 చెల్లించాలి. అనంతరం యాప్ లోరూ.50 డిస్కౌంట్ వోచర్ లభిస్తుంది. ఈ వోచర్ రూ.303లు, ఆ పైన విలువగల తరువాతి రీచార్జ్ సమయంలో వినియోగించుకోవచ్చు. 25 మార్చి నుంచి జూన్ 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ పరిమిత కాలంలో ఇలా యూజర్ 5 సార్లు మాత్రమే ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి వీలవుతుంది. సో.. ఇలా రెండుసార్లు రీచార్జ్ చేసుకొని, రెండు సార్లు 50 క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందడం ద్వారా ప్రైమ్ మెంబర్ షిప్ను ఉచితంగా పొందవచ్చన్నమాట. కాగా 303 రూపాయల ప్లాన్లో ప్రైమ్ మెంబర్స్కు 30జీబీ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 2.5జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ, 499 రూపాయల ప్లాన్ లో 28 రోజుల వ్యాలిడిటీతో 58జీబీ హై స్పీడ్ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 5జీబీ డేటా, 999 రూపాయల రీచార్జ్పై ప్రైమ్ మెంబర్స్కు 60జీబీ హై స్పీడ్ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 12.5జీబీ డేటా, 60రోజుల వ్యాలిడిటీ, 1999 రూపాయల ప్లాన్లో ప్రైమ్ మెంబర్స్కు 125 జిబి 90 రోజుల వ్యాలిడిటీ, నాన్ ప్రైమ్ యూజర్లకు 30 రోజుల వ్యాలిడిటీ 30 జీబీ ఆఫర్ సంగతి తెలిసిందే. -
ఎంసెట్కు ఉచిత శిక్షణ
కర్నూలు(ఆర్యూ) : సాయి అక్షర ఎడ్యుకేషనల్ రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంసెట్కు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. కొత్తబస్టాండ్ దగ్గరున్న శ్రీనివాస టాకీస్ బి.వి.రిజెంట్ ప్లాజాలో ఈనెల 24వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఇతర వివరాలకు ఫోన్(97039 96418, 89850 33927)లో సంప్రదించాలన్నారు. -
టెకీలకు గుడ్ న్యూస్ న్యూజిలాండ్ ఫ్రీ ట్రిప్
-
12న రజకుల వివాహ పరిచయ వేదిక
కడప రూరల్ : ఈనెల 12వ తేదిన రాజంపేట పట్టణం రెడ్డివారివీధి శ్రీ చౌడేశ్వరిదేవి దేవస్థానంలో వివాహ పరిచయ వేదిక కమిటీ ఆధ్వర్యంలో రజక కులస్థుల ఉచిత వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేసినట్లు వేదిక నాయకులు యు.యానాదయ్య, చేలో రవి శనివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవాలనే రజక సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ వేదికకు హాజరయ్యే వారు వధూవరుల ఫుల్ఫోటో, పూర్తి సమాచారంతో హాజరు కావాలన్నారు. వివరాలకు 96427 10496 నెంబరులో సంప్రదించాలన్నారు. -
ఉచిత ఇసుకతో వ్యాపారం చేస్తారా ?
ఇసుక ర్యాంపులు నిలిపే అధికారం ఎవరిచ్చారు? నేను ర్యాంపు తెరిపిస్తే అమాయక కూలీలపై అక్రమ కేసులా? దమ్ముంటే నాపై పెట్టండి బేషరతుగా లొంగిపోతా అధికారుల తీరుపై ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ధ్వజం కొత్తపేట : ఓ వైపు సీఎం ఇసుక ఉచితం అని హామీ ఇస్తే మరో వైపు అధికారులు ఆ హామీని గాలికొదిలేసి అధికార పార్టీతో కుమ్మక్కై వ్యాపారం చేస్తారా? అని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. కొత్తపేట మండలం మందపల్లి ఇసుక ర్యాంపును మూసివేయగా జట్టు కూలీల ఫిర్యాదుపై ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ర్యాంపు తెరిపించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి వీఆర్వో ఫిర్యాదు మేరకు ఐదుగురు కూలీలపై కేసులు నమోదు చేశారు. ఈ చర్యపై జగ్గిరెడ్డి తీవ్రంగా స్పందించారు. మంగళవారం సాయంత్రం కొత్తపేటలో రాష్ట్ర వైఎస్సార్ సీపీ సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్రాజు స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ జట్టు మేస్త్రీ కూడా కాని అధికార పార్టీ దళారికి కొమ్ము కాసి సుమారు 500 మంది కూలీలు కడుపు మాడ్చితే వారి ఆవేదన మేరకు తాను స్వయంగా వెళ్లి అక్కడి నుంచే అధికారులతో మాట్లాడి ర్యాంపు గేటు తీశానన్నారు. దానిని జీర్ణించుకోలేక సామాన్య కూలీలపై కేసులు పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు.15 రోజుల్లో ఆ ర్యాంపులో «బాట నిర్వహణ సొమ్ము పేరుతో దళారి ద్వారా తహసీల్దార్ రూ.లక్షలు వెనకేసుకున్నారని ఆరోపించారు.ఈ రోజు కూలీలందరూ కలిసి దానిని ప్రశ్నిస్తే..సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే ర్యాంపు మూసివేశారు. ఆ వ్యక్తులపైనే కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. ‘అసలు ర్యాంపు మూసేసే అధికారం ఆయనకెక్కడిది? ఉచిత ఇసుకకు తాళాలేమిటి? దళారిని పెట్టి కూలీల కష్టార్జితాన్ని దోచుకోవడమేమిటి? తాళం తీసింది నేను..దమ్ము ధైర్యం వుంటే నాపై కేసులు పెట్టండి? భేషరతుగా లొంగిపోవడానికి సిద్ధంగా వున్నానంటూ’ సవాల్ విసిరారు. ర్యాంపు తీయకపోయినా.. అక్రమ కేసులు తొలగించకపోయినా, సమగ్ర విచారణ జరపాలి. లేకుంటే రెవెన్యూ కార్యాలయాన్ని, పోలీస్ స్టేషన్ను ముట్టడిస్తామని జగ్గిరెడ్డి హెచ్చరించారు. గతంలో ఈ తహసీల్దార్ అనధికార ఫైర్ లైసెన్స్ల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారని దానిపై చర్యలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ దళారులతో కలిసి అవినీతికి అడ్డాగా మారారని తహశీల్దార్ తీరుపై జగ్గిరెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు.బాటా పేరుతో వసూలు చేసిన సొమ్ము కూలీలందరికీ చెందాలని, ఆ సొమ్ముకు లెక్కలు చెప్పాలని తహసీల్దార్ను జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మార్గన గంగాధరరావు, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యుడు బండారు కృష్ణమూర్తి, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి కముజు సత్యనారాయణమూర్తి, గ్రామ పార్టీ అధ్యక్షుడు పేపకాయల బ్రహ్మానందం, మండల న్యాయ విభాగం కన్వీనర్ చావలి సుబ్బరాయశాస్త్రి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు మాకే నరసింహమూర్తి, జిల్లా ఎస్సీ విభాగం సభ్యుడు కొంబత్తుల రామారావు, పార్టీ వివిధ విభాగాల నాయకులు దంగేటి సుబ్రహ్మణ్యం(డీఎస్), సలాది బ్రహ్మాజీ, యర్రంశెట్టి నాయుడు, ధర్నాల వెంకటేశ్వరరావు, మహ్మద్ హరుణ్ పాల్గొన్నారు. -
కరీంనగర్లో చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు
-
20 వేల ఎకరాలకు కంది విత్తనాల పంపిణీ
పెదనిండ్రకొలను (నిడమర్రు) : జిల్లావ్యాప్తంగా 20 వేల ఎకరాల విస్తీర్ణానికి సరిపడా కంది విత్తనాలు ఉచితంగా రైతులకు పంపిణీ చేయనున్నట్టు వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు వై.సాయిలక్షీశ్వరి అన్నారు. ఆదివారం పెదనిండ్రకొలనులో కంది పంట క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. గ్రామంలో వ్యవసాయశాఖ, ఆత్మ సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 100 ఎకరాల చేపల చెరువు గట్లపై సాగు చేసిన కంది పంట దిగుబడిని రైతులకు ప్రదర్శించారు. జిల్లాలో చేపల చెరువుల విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో చెరువు గట్లపై కంది సాగు చేయాలని ఆత్మ చైర్మన్ పసల గంగరామచంద్రం సూచించారు. చెరువు గట్టుపై కంది పంట యాజమాన్య పద్ధతులను అధికారులు వివరించారు. ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, సర్పంచ్ వంగా సీతాకుమారి, తాడేపల్లిగూడెం ఏఎంసీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
గ్రూప్–2 ఆన్ లైన్ లైన్ ఉచిత శిక్షణ
అనంతపురం టౌన్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్, డీఆర్డీఏ ఈజీఎం, జేకేసీ ఆధ్వర్యంలో గ్రూప్–2 అభ్యర్థులకు ఆ¯Œన్ లైన్ టెలీకాస్ట్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డీఆర్డీఏ–వెలుగు పీడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్లోని డాక్టర్ లక్ష్మయ్య స్టడీ సర్కిల్ సహకారంతో ఎస్సీ, ఎస్టీ, ఇతర నిరుద్యోగ అభ్యర్థులకు మూడు నెలలు శిక్షణ ఇస్తామన్నారు. ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ లో కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని స్కిల్ డెవలప్మెంట్ భవనంలో జరిగే శిక్షణకు ఇన్చార్జ్గా శ్యాం (సెల్ నంబర్ : 9701452775) వ్యవహరిస్తారు. తాడిపత్రిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రఘునాథరెడ్డి (సెల్ నంబర్ : 7702100249), హిందూపురంలోని ఎ¯ŒSఎస్పీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో లక్ష్మి (సెల్ నంబర్ : 7702100239), కళ్యాణదుర్గంలోని ఎస్వీజీఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓబుళేసు (సెల్ నంబర్ : 7702100246), ధర్మవరంలోని కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగే శిక్షణకు అనంతలక్ష్మి (సెల్ నంబర్ :7386763456) సెంటర్ ఇన్చార్జ్లుగా వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు. -
జియో ఎఫెక్ట్..ఎయిర్ టెల్ కూడా..
న్యూఢిల్లీ: జియో ఉచిత కాల్స్,ఉచిత డాటా సేవల పొడిగింపు నేపథ్యంలో మరో ప్రముఖ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్ టెల్ కూడా క్యూ కట్టేసింది. దేశవ్యాప్తంగా ప్రీ కాల్స్, ఫ్రీ డాటా అంటూ రెండు కొత్త ప్రీ పెయిడ్ పథకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉచిత వాయిస్ కాల్స్, డేటా సేవల్ని అందించే ఈ పథకాలను గురువారం ప్రకటించింది. రిలయన్స్ జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ప్లాన్ ప్రకటన నేపథ్యంలో ఎయిర్ టెల్ ఈ సరికొత్త ఆఫర్ ను అందుబాటులోకి తెస్తోంది. రూ.345 ప్యాక్ ప్రీపెయిడ్ వినియోగదారులకు భారతదేశం లో ఏ నెట్వర్క్ కైనా ఉచిత వాయిస్ కాల్స్,(లోకల్ అండ్ ఎస్టీడీ) చేయడానికి అనుమతిస్తోంది. అలాగే 1 జీబీ 4జీ డేటా ఉచితం. రూ. 145దేశవ్యాప్తంగా ఎయిర్ టెల్ టు ఎయిర్ టెల్ ఫ్రీ కాలింగ్ సదుపాయం. అలాగే 300ఎంబీ 4జీ డాటా స్మార్ట్ ఫోన్లకు అందిస్తోంది. దీంతోపాటు 50ఎంబీ డాటా బేసిక్ ఫోన్లకు అందిస్తున్నట్టు తెలిపింది. 28 రోజుల వాలిడిటీ ఈరెండు ప్లాన్లను ప్రకటించింది. అయితే కేరళ ఖాతాదారులకు 2/4 జీ నెట్ వర్క్ లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వినూత్న ఆఫర్లతో ఉన్నతమైన నెట్వర్క్ అనుభవాన్ని అందించే ప్రయత్నాల్లో మరో ఆకర్షణీయమైన ఆఫర్లని ఎయిర్ టెల్ మార్కెట్ ఆపరేషన్స్ (భారతదేశం మరియు దక్షిణ ఆసియా) డైరెక్టర్ పూరి తెలిపారు. కాగా రిలయన్స్ జియో సంచలన ఉచిత డాటా , కాలింగ్ సదుపాయం మార్చి 2017 పొడిగించింది. ఈక్రమంలో బీఎస్ ఎన్ఎల్, వోడాఫోన్ తన ఆపర్లను సవరించుకొని, వినియోగదారులకు కొత్త ప్రయోజనాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
కర్నూలు సిటీ: గ్రామీణ, పట్టణ ప్రాంత నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం కింద ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఓరియంటల్ స్కిల్స్ అండ్ సెఫ్టీ సర్వీసెస్ సంస్థ మేనేజర్ అభిషేక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర శివారులోని ఎస్ఎల్వీ బీఈడీ కాలేజీలో గౌండ(బెల్దార్), ఎలక్ట్రికల్, ప్లంబింగ్, వెల్డింగ్, మహిళలకు హౌస్కీపింగ్ తదితర రంగాల్లో 90 రోజుల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. శిక్షణకు వచ్చే వారికి ఉచిత భోజన సదుపాయంతో పాటు, హాస్టల్ వసతి, శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తామన్నారు. ఇందుకు 10వ తరగతి, ఐటీఐ, ఒకేషనల్, డిప్లమా, పాలిటెక్నిక్ విద్యార్హతలు కలిగి 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు 98666 82579, 94927 05795 నెంబర్లను సంప్రదించవచ్చన్నా -
మృతదేహాల తరలింపునకు ఫ్రీ అంబులెన్స్లు
గాంధీ ఆస్పత్రిలో 50 వాహనాలను ప్రారంభించిన మంత్రులు హైదరాబాద్: నిరుపేద రోగుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు 50 ఉచిత మార్చురీఅంబులెన్స్లు..‘హెర్సే’ అందుబాటులోకి వచ్చారుు. శుక్రవారం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో డిప్యూటీ సీఎం మెహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, టి.పద్మారావుతో కలసి వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వీటిని ప్రారంభించారు. 11 వాహనాలను బ్యాకప్గా ఉంచామని, అవసరమైతే మరిన్ని సమకూర్చుతామని లక్ష్మారెడ్డి చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదలు నిచిత్స పొందుతూ మరణిస్తే... వారి మృతదేహాలను ఈ ప్రత్యేక అంబులెన్సుల్లో తరలిస్తారన్నారు. ఆర్థిక స్థోమత లేక మృతుని కుటుంబ సభ్యులు పడుతున్న బాధలు తనను కలచివేశాయని, అందుకే వీటిని ప్రవేశపెట్టామని తెలిపారు. రిఫరల్పై కచ్చితమైన రిపోర్ట్... పీహెచ్సీ, ఏరియా ఆస్పత్రుల నుంచి ఇతర పెద్ద ఆస్పత్రులకు రోగులను రిఫర్ చేస్తే కచ్చితమైన వివరాలు పొందుపర్చేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలూ ఉన్నప్పటికీ అక్కడి వైద్యులు నిర్లక్ష్యంతో రోగులను ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు. వైద్యశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్శర్మ, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కరుణ, డీఎంఈ రమణి తదితరులు పాల్గొన్నారు. -
ఊరికి ఉపకారి
ఉచితంగా ప్రజలకు పిండి పట్టిస్తున్న షేక్షావలీ శివపురం(కొత్తపల్లి): చిల్లర లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రజలకు తన వంతు చేయూతను అందించేందుకు ఓ జిన్ను నిర్వాహకుడు ముందుకు వచ్చారు. ఒక కుటుంబంలో మూడు పళ్ల జొన్నలు తీసుకుని వస్తే ఉచితంగా పిండి జిన్ను ఆడించి ఇస్తానని గ్రామంలో దండోరా వేయించారు. శివపురం గ్రామానికి చెందిన కొండపల్లి షేక్షావలీ పిండి జిన్ను నిర్వహిస్తూ జీవనోపాధి సాగిస్తున్నారు. కేంద్రప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతోగ్రామస్తులు చిల్లర కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు రోజులుగా కొన్ని కుంటుంబాలు పస్తులు ఉండడం గమనించిన షేక్షావలీ.. గ్రామంలోని పేద, ధనిక తేడా లేకుండా అందరికీ తన పిండి జిన్నులో జొన్నలు పట్టించి ఉపకారం చేయడానికి ముందుకు వచ్చారు. గ్రామంలో దాదాపు 500లకు పైగా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. -
పేదల పాలిట దేవుడు!
సాధారణంగా ఎనభై ఏళ్ల వయసులో ఎవరైనా కాటికి కాళ్లు చాపుకొంటూ కూర్చుంటారు. సాయం పడితే తప్ప తమ పనులు చేసుకోలేని స్థితిలోకి జారుకుంటారు. అలాంటి వయసులో ఢిల్లీకి చెందిన ఓ పెద్దాయన గొప్ప సమాజసేవకు నడుం కట్టాడు. అత్యంత స్ఫూర్తిదాయకమైన ఈయన కథేంటో మనమూ తెలుసుకుందాం..! ఈ రోజుల్లో పేదోడికి జబ్బు చేస్తే అంతే సంగతులు. ఆసుపత్రులు శ్రీమంతులకే సేవలు చేస్తారుు. ఈ వివక్ష ఓంకార్నాథ్ శర్మను తీవ్రంగా బాధించింది. కనీసం ఒక మాత్ర కూడా కొనలేని నిస్సహాయులను చూసి కదిలిపోయాడు. వారికోసం ఇంటింటికీ తిరిగి, వాడకుండా కాలపరిమితి దాటని టాబ్లెట్లను, టానిక్కులను సేకరించే పనిలో పడ్డాడు. ఇలా.. గత ఏడేళ్లుగా పేదవాళ్లకు మందుగోలీలు ఉచితంగా ఇస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ నోరుుడాలోని కై లాష్ హాస్పిటల్ లో బ్లడ్బ్యాంక్ టెక్నీషియన్గా పనిచేసి రిటైరైన ఓంకార్నాథ్ను 2008లో జరిగిన ఒక ఘటన పూర్తిగా మార్చేసింది. ఒకసారి తూర్పు ఢిల్లీలో మెట్రో పనులు జరుగుతుంటే.. ఉన్నట్టుండి బ్రిడ్జి కూలిపోరుుంది. ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మరణించారు. చాలామందికి తీవ్ర గాయాలయ్యారుు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా.. సరైన వైద్యం లేకపోవడంతో నరకం చూశారు వాళ్లు! ఆరోజే పేదలకోసం ఏదో ఒకటి చేయాలని నిర్ణరుుంచుకున్నాడు. అలా మెడిసిన్ బాబాగా అవతారమెత్తాడు. మెడిసిన్ బాబా అడిగితే టాబ్లెట్లు లేవు అని ఎవరూ అనరు. అవసరం ఉన్నా సరే, వేరే తెచ్చుకుంటాంలే అని ఉన్నవన్నీ అతని చేతిలో పెడతారు. ఒకవిధంగా చెప్పాలంటే ఓంకార్ తమ వీధిలో కనిపించడమే మహాభాగ్యం అనుకుంటారంతా. అతనికి సాయపడుతున్నందుకు గర్వంగా కూడా ఉందని ప్రతీ ఒక్కరూ చెప్తుంటారు. ధనికులు ఉండే ఏరియాల కంటే.. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు, గవర్నమెంటు కాలనీవాసులే తన ఆశయానికి మద్దతు పలుకుతుంటారని చెబుతాడాయన. ఓంకార్ నాథ్ చేసే పని అంత సులభం కాదు. ఎన్నో అవాంతరాలు. అంతెందుకు అతను ఉంటున్న ఇల్లు కూడా సొంతం కాదు. భార్య, కొడుకు ఉన్నారు. విషాదం ఏంటంటే 45 ఏళ్ల తన కుమారుడు మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. నెలకు ఎంత లేదన్నా 4 నుంచి 6 లక్షల విలువైన మెడిసిన్స పంచుతాడు ఈ బాబా. ఆనోటా ఈనోటా విని మీడియా ఓంకార్నాథ్ని ప్రపంచానికి పరిచయం చేసింది. అలా మెడిసిన్ బాబాగా పాపులర్ అయ్యాడు. జనం కూడా అతన్ని స్ఫూర్తిగా తీసుకుని కాలేజీలు, గుళ్ల దగ్గర మెడిసిన్ కలెక్షన్ బాక్సులు పెట్టి మందులు సేకరిస్తున్నారు. ఈ మెడిసిన్ బాబాను పేదలపాలిట దేవుడు అంటే తప్పేం ఉండదేమో! -
జియో కస్టమర్లకు మరో గుడ్ న్యూస్!
రిలయన్స్ జియో ఉచిత సేవలనుభవిస్తున్న కస్టమర్లకు శుభవార్త. డిసెంబర్ 3తో ముగియనుందనే ఉచిత 4జీ డేటా, వాయిస్ కాల్స్ ఆఫర్, మరో మూడు నెలలు పాటు పొడిగించే అవకాశాలున్నట్టు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. పరిస్థితుల డిమాండ్ బట్టి ఉచిత సేవలను విస్తరించే అవకాశముందని పేర్కొంటున్నాయి. తాజా రిపోర్టు ప్రకారం ఉచిత డేటా, వాయిస్ కాల్స్ సర్వీసులను మార్చి 2017 వరకు విస్తరించనున్నామని విశ్లేషకులకు రిలయన్స్ జియో తెలియజేసినట్టు సమాచారం. ట్రాయ్ నిబంధనల మేరకు, ఏ టెలికాం ఆపరేటర్ కూడా వెల్కమ్ ఆఫర్ కింద ఉచిత సేవలను 90 రోజుల కంటే ఎక్కువ రోజులు అందించడానికి వీలులేదు. దీంతో ట్రాయ్ నిబంధనల మేరకు ఈ సేవల కటాఫ్ తేదీని డిసెంబర్ 3గా కంపెనీ నిర్ణయించింది. కానీ వినియోగదారులకు ఇచ్చిన వాగ్దానం మేరకు సేవలందించలేని పక్షంలో, కస్టమర్ల నుంచి చార్జీలను వసూలు చేయడం కూడా న్యాయవిరుద్ధమని కంపెనీ ఓ మేరకు ఉచిత సేవలు కటాఫ్ తేదీని పెంచే ఆలోచనలు ఉన్నట్టు సిగ్నల్స్ ఇచ్చింది. ఇంటర్కనెక్షన్ సమస్యలతో కస్టమర్లు నాణ్యమైన సేవలు అందుకోలేకపోతున్నారని, తాము అందింద్దామనుకున్న సేవలను కస్టమర్లు సరిగా వినియోగించుకోలేకపోతున్నారని రిలయన్స్ జియో స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ అధినేత అన్షుమాన్ థాకూర్ తెలిపారు. డిసెంబర్ తర్వాత ఉచిత సేవలు కొనసాగించడానికి ట్రాయ్ నుంచి తమకు అనుమతి అవసరం లేదని కూడా థాకూర్ వ్యాఖ్యానించారు. జియో సేవలు లాంచ్ చేసినప్పటి నుంచి ఎలాంటి ఆంక్షలు లేకుండా వివిధ రకాల ప్రమోషనల్ ఆఫర్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజ్మెంట్ అందిస్తుందని సిటీ రీసెర్చ్ రిపోర్టుచేసింది. సబ్స్క్రైబర్లను ఆకట్టుకోవడానికి ఉచిత వెల్కమ్ ఆఫర్ను మార్చి 2017వరకు కొనసాగిస్తారని మోతీలాల్ ఓస్వాల్ విశ్లేషకులు చెప్పారు. ఇంటర్కనెక్షన్ పాయింట్లో మెరుగుదల కనిపించని పక్షంలో, నాణ్యత మెరుగుపరిచే వరకు కస్టమర్లు ఎలాంటి చార్జీలను చెల్లించాల్సినవసరం ఉండదు. ఇది ట్రాయ్ నిబంధనలకు, రిలయన్స్ జియోలకు మధ్య కొంత సంఘర్షణకు దారితీసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. వెల్కమ్ ఆఫర్ పేరును మార్చి, ఉచిత డేటా, కాల్స్ను కస్టమర్లకు కొనసాగించడానికి జియో సన్నాహాలు చేస్తున్నట్టు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. -
జియో ఉచితం డిసెంబర్ 3 వరకే...
• తర్వాత కొనసాగిస్తే ఛార్జీలు చెల్లించాల్సిందే • కొనసాగించేవారికే డిసెంబర్ 31 వరకూ ఉచితం • ఆ రోజుతో అందరికీ ఉచిత సేవలు బంద్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తన కస్టమర్లందరికీ 4జీ డేటా, వాయిస్ కాల్స్ను అందరికీ ఉచితంగా ఇస్తున్న రిలయన్స్ జియో... ఈ ఉచిత సేవలకు కటాఫ్ తేదీగా డిసెంబరు 3ను నిర్ణయించింది. రిలయన్స్ జియో సేవలకు ఛార్జీలు చెల్లించకూడదని, జియో సిమ్ అక్కర్లేదని భావించేవారు డిసెంబరు 3లోగా ఆ విషయాన్ని జియో స్టోర్లలో తెలియజేసి, అధికారికంగా సిమ్ను సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సిమ్ను సరెండర్ చేయని పక్షంలో... వారికి డిసెంబరు 31వరకూ ఉచిత సేవలు కొనసాగుతాయి. ఆ తరవాత మాత్రం నిర్ణీత ఛార్జీలు వర్తిస్తాయి. జియో ఉచిత సేవలు దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 4 నుంచి అధికారికంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. నిబంధనల మేరకు జియో ఉచిత సేవలు 90 రోజులకే పరిమితమని, ఇవి డిసెంబర్ 3తో ముగిసిపోతాయని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. జియో ఈ విషయాన్ని ధ్రువీకరించింది. జియో వెల్కమ్ ఆఫర్ కింద ఉచిత కాల్స్, డేటా ప్రయోజనాలు కస్టమర్లందరికీ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటాయని జియో అధికార ప్రతినిధి తెలిపారు. అయితే, ఈ ఆఫర్ పొందే అవకాశం డిసెంబర్ 3 వరకే ఉంటుందని కూడా స్పష్టం చేశారు. ఆ లోపు కనెక్షన్ తీసుకోని వారు ఆ తర్వాత నుంచి అందుబాటులో ఉన్న నూతన టారిఫ్ ప్లాన్ల మేరకు సేవలు పొందాల్సి ఉంటుందన్నారు. జియో వినియోగదారులకు సౌకర్యంతో కూడిన స్నేహపూరిత సేవలు ఇకపైనా అందిస్తామన్నారు. రిలయన్స్ జియో సేవలను సెప్టెంబర్ 1న కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించటం తెలిసిందే. జియో కస్టమర్లకు జీవితకాలం పాటు కాల్స్ ఉచితంగానే అందిస్తామని, కేవలం డేటా చార్జీలు చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించారు. ట్రాయ్ ఆదేశాల నేపథ్యంలో ఉచిత కాల్స్ సేవలు డిసెంబర్ 31 తర్వాత అందుతాయా అన్న అనుమానాలు నెలకొన్నాయి. అయితే డిసెంబర్ 4 తర్వాత పొందే సేవలకు వసూలు చేసే ఛార్జీలెంతన్నది కంపెనీ ఇప్పటికీ పేర్కొనకపోవడం గమనార్హం. జియో టారిఫ్లు నిబంధనల మేరకే: ట్రాయ్ రిలయన్స్ జియోకు ట్రాయ్ క్లీన్చిట్ ఇచ్చింది. జియో టెలికం సేవల టారిఫ్ ప్లాన్లు ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని, ఎలాంటి ఉల్లంఘన లేదని ప్రత్యర్థి కంపెనీలకు తెలియజేసింది. జియో ఉచిత కాల్స్ సేవలు నిబంధలకు విరుద్ధమంటూ టెలికం సంస్థలు ట్రాయ్కు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ట్రాయ్ తాజా స్పష్టతనిచ్చింది. కాగా, టెలికం కంపెనీలు పోటీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయంటూ రిలయన్స్ జియో ప్రత్యర్థులపై తాజాగా ఆరోపణలుకు దిగింది. తమ నెట్వర్క్ నుంచి వెళుతున్న కాల్స్లో 75 శాతం ఫెయిల్ అవుతున్నాయని పేర్కొంది. తగినన్ని ఇంటర్ కనెక్షన్ పాయింట్లు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ సమస్య అని తెలిపింది. -
ఉచితంగా నోటరీ
అనంతపురం రూరల్ : నగరంలోని పేద ప్రజలకు, విద్యార్థులకు ఉచితంగా నోటరీ అందజేయడానికి శ్రీకారం చుట్టినట్లు న్యాయవాది వై శేఖర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్టాంప్ తీసుకువస్తే ఉచితంగా నోటీరీ అందజేస్తానన్నారు. నోటరీ కావాల్సినవారు 9392330176 నెంబర్లో సంప్రదించాలన్నారు. -
ఎయిర్ టెల్ 'జాక్ పాట్' 5 జీబీ డాటా ఫ్రీ
న్యూఢిల్లీ: జియో ఆవిష్కరణ తర్వాత భారత టెలికాం రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బిలియనీర్ ముకేష్ అంబానీ ఉచిత వాయిస్ కాల్స్, ఉచిత రోమింగ్ ఆఫర్ల నేపథ్యంలో డాటా టారిఫ్ లో ప్రధాన టెలికాం ఆపరేటర్ల ఆఫర్ల వరద కురుస్తోంది. తాజాగా ఎయిర్ టెల్ మరో బంపర ఆఫర్ ప్రకటించింది. ప్రీపెయిడ్ చందాదారులకోసం ఎయిర్ టెల్ 5 జీబీ ఇంటర్నెట్ డాటా ఉచితంగా అందించనుంది. అయితే ఈ ఆఫర్ ను పొందటానికి యూజర్లు కొన్ని ముఖ్యమైన సూత్రాలను , నిబంధనలను గమనించాల్సి ఉందని ఎయిర్ టెల్ ప్రకటించింది. ప్రధానంగా http://www.airtel.in/free?icid=home_jackpot_row_4_column_1 లింక్ డౌన్ లోడ్ చేసుకోవాలి. అనంతరం 'జాక్ పాట్' అనే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి. దేశంలోని ఎయిర్ టెల్ ఖాతాదారులందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు అర్హులు. ఈ ఫ్రీ డాటా ఆఫర్ ను రాత్రి 12 గం.లనుంచి ఉదయం 6గం.లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అతని / ఆమె ఇప్పటికే వాడుతున్న డేటా ప్యాక్ ఆధారంగా ఈ డేటా వేగం వుంటుంది. ఈ పరిమితి దాటిన గంటల తరువాత వినియోగానికి డ్యాటా ప్యాక్ నుంచి చార్జ్ చేయబడుతుంది. సెప్టెంబర్ 30 వరకు ఈ ఆఫర్ చెల్లుబాటులో ఉంటుంది. అలాగే ఈ సదుపాయాన్ని 28 రోజుల్లో వినియోగించుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ప్రీ పెయిడ్ యూజర్లకు ఇప్పటికే అందుబాటులో వున్న నైట్ టైం వినియోగానికిగాను 50శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ను జోడించడం కుదరదు. మై ఎయిర్ టెల్ యాప్ ద్వారా 300ఎంబీ రాత్రి డేటా ఆఫర్, వింక్ సంగీతం, వింక్ గేమ్స్, వింక్ సినిమాల ప్యాక్ కంబైన్డ్ కాదు. ఈ ఫ్రీ డాటా ఆఫర్ కోసం ఇప్పటికే వాడుతున్న అదే ఎయిర్ టెల్ మొబైల్ నెంబరుతో మాత్రమే రిజస్టర్ కావాలి. ఆఫర్ జాబితా ప్రతినెల చివరలో రిఫ్రెష్ చేయబడుతుంది. -
నేటి నుంచి ఉచిత సిమ్ మేళా
– రూ. 49కే ల్యాండ్లైన్ కనెక్షన్ – రూ. 249కే బ్రాడ్ బ్యాండ్ – బీఎస్ఎన్ఎల్ జీఎం పి.ఎస్.జాన్ కర్నూలు(ఓల్డ్సిటీ): జిల్లాలోని 54 చోట్ల శుక్రవారం నుంచి రెండు రోజులపాటు ఉచిత సిమ్ మేళా నిర్వహించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ జీఎం పి.శామ్యూల్ జాన్ తెలిపారు. గురువారం తన ఛాంబరులో విలేకరులతో మాట్లాడారు. రూ. 49కే ల్యాండ్లైన్ కనెక్షన్ ఇస్తామని, మేళా శిబిరాల్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయన్నారు. ఒక రూపాయికి ఒక జీబీ చొప్పున రూ. 249కే 300 జీబీ బ్రాండ్ బ్యాండ్ ఇస్తున్నామని, ఇన్స్టులేషన్ చార్జీలు మాఫీ చేస్తామన్నారు. రోజూ రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటల వరకు, ఆదివారం 24 గంటలూ ఏ నెట్వర్క్తోనైనా ఉచితంగా మాట్లాడవచ్చని తెలిపారు. నగరంలో ఎస్ఏపీ క్యాంప్, సీక్యాంప్, కలెక్టరేట్, జెడ్పీ కార్యాలయం, పున్నమి గెస్ట్హౌస్, పాతబస్టాండులోని టీఆర్ఏ కార్యాలయం వద్ద ఉచిత సిమ్ శిబిరాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. డీజీఎంలు నరసింహులు, నాగరాజు, ఎస్డీఈ నాగరాజు పాల్గొన్నారు. -
బీఎస్ఎన్ఎల్ సిమ్లు ఉచితం
అనంతపురం రూరల్: నేటి నుంచి రెండు రోజుల పాటు బీఎస్ఎన్ఎల్ సిమ్లను ఉచితంగా అందజేస్తున్నట్లు సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ వెంకటనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నానో సిమ్లు మినహా మిగిలిన అన్ని సిమ్లను బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సేవా కేంద్రాల్లో ఉచితంగా అందజేస్తామన్నారు. అనంతపురం నగరంలో రోడ్డు షోలో ఏర్పాటు చేసి సిమ్లు అందజేస్తున్నట్లు తెలిపారు. -
బీఎస్ఎన్ఎల్ ఉచిత కాల్స్..
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు తమ ల్యాండ్లైన్ ఫోన్ల నుంచి సోమవారం (ఆగస్ట్ 15) కూడా అన్ని రకాల మొబైల్, ల్యాండ్లైన్ నంబర్లకు ఉచితంగా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. అనంతరం ఈ అవకాశం ప్రతీ ఆదివారం కూడా అందుబాటులో ఉంటుందని టెలికం శాఖ మంత్రి మనోజ్సిన్హా ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల్లోపు ఏ నెట్వర్క్కు అయినా ల్యాండ్లైన్ ద్వారా ఉచితంగా కాల్స్ చేసుకునే అవకాశాన్ని బీఎస్ఎన్ఎల్ కల్పిస్తున్న విషయం తెలిసిందే. కొత్త ల్యాండ్లైన్ కస్టమర్లకు మొదటి ఆరు నెలల పాటు నెలవారీ అద్దె రూ.49 మాత్రమే వసూలు చేస్తున్నామని, అనంతరం రూ.99 నుంచి అందుబాటులో ఉన్న ఇతర ప్లాన్లలో ఒకదానికి మారవచ్చని బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. -
చిన్నారి గుండెకు భరోసా
విజయవాడ(లబ్బీపేట) : గుండె వ్యాధులతో బాధపడుతున్న 19 మంది చిన్నారులకు ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు ఆంధ్రా హాస్పిటల్ ఎండీ డాక్టర్ పీవీ రమణమూర్తి తెలిపారు. ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇంగ్లాండుకు చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్, యూకే చారిటీలు చిన్నారులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. నగరంలోని ఆం్ర«ధా హాస్పిటల్స్తో కలిసి ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు శిబిరం నిర్వహించినట్లు చెప్పారు. గత ఏడాది డిసెంబరు నుంచి ఇప్పటి వరకూ మూడు శిబిరాలు నిర్వహించి 52 మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ సాయం కోరనున్నట్లు వివరించారు. యూకే నుంచి వచ్చిన పిడియాట్రిక్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ కుడముల మాట్లాడుతూ తాము నిర్వహించిన శస్త్ర చికిత్సలన్నీ అత్యంత క్లిష్టతరమైనవేనన్నారు. కొంత మందికి గుండెలో రం్ర«థాలు, ఊపిరితిత్తుల రక్తనాళాల్లో వత్తిడి ఎక్కువుగా ఉండటం, మూడు లేక నాలుగు రకాల గుండె సమస్యలు ఉన్న చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. డాక్టర్ ప్రేమ్ మాట్లాడుతూ ఇండియాకు వచ్చి చిన్నారులకు శస్త్ర చికిత్సలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సమావేశంలో ఆంధ్రా హాస్పిటల్స్ పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పీవీ రామారావు, యూకే వైద్య బృందంలోని సభ్యులు డాక్టర్ నయన్సెట్టి, డాక్టర్ సైనుల్లా, మెరిజోనా, జూలి, రేచల్ ఉన్నారు. -
అన్నవరంలో అరగంట ఉచిత ‘వైఫై’
అన్నవరం దేవస్థానంతో బెంగళూరుకు చెందిన కంపెనీ ఒప్పందం సెల్ సిగ్నల్స్ స్పష్టంగా అందించేందుకు ఏంటెన్నాల ఏర్పాటు ట్రాన్స్పోర్టు, సహజ కాంట్రాక్ట్ సిబ్బంది వేతనాల పెంపు ఘాట్రోడ్ ముఖద్వారంలో హైమాక్స్ దీపాలు దేవస్థానం ట్రస్ట్ బోర్డు తీర్మానాలు అన్నవరం : అన్నవరం దేవస్థానానికి వచ్చే భక్తులు ఇకపై అరగంట పాటు ఉచితంగా ‘వైఫై’ సదుపాయం పొందవచ్చు. ఇందుకు బెంగళూరుకు చెందిన ‘బాల్గో ఇన్ఫ్రా’ సంస్థ దేవస్థానంతో ఒప్పందం కుదుర్చుకోనుంది. శనివారం దేవస్థా నం చైర్మన్ రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు, అధికారులతో జరిగిన ట్రస్ట్బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆ సంస్థ ఐదు ప్రముఖ సెల్ఫోన్ సర్వీస్ ప్రొవైడర్స్ సిగ్నల్స్ అందించేందుకు దేవస్థానంలో ఐదు ఏంటెన్నాలను ఏర్పాటు చేస్తుందని, ఏంటెన్నాకు నెల కు రూ.ఐదు వేలు అద్దె చెల్లిస్తుంది. తద్వారా భక్తులకు పూర్తి స్థాయిలో సెల్ఫోన్ సిగ్నల్స్ అందుబాటులోకి రావడంతో పాటు మొదటి అరగంట ‘వైఫై’ సిగ్నల్స్ ఉచితంగా వాడుకోవచ్చు. దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతి కూడా లభించింది. మున్ముందు మరో రెండు సెల్ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ల సేవలు కూడా ఆ కంపెనీ అందుబాటులోకి తెస్తుంది. సమావేశంలో పలు అంశాలను తీర్మానించారు. ముఖ్యమైన తీర్మానాలు –రత్నగిరి ఘాట్రోడ్లోని ఆర్చి గేటు ముందు రూ.6.60 లక్షలతో హైమాక్స్ విద్యుద్దీపాలు ఏర్పాటు l దేవస్థానం ట్రాన్స్పోర్టులో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కండక్టర్లు, కాంట్రాక్ట్ కండక్టర్ల వేతనం రూ.8,500కు, అలాగే కాంట్రాక్ట్ డ్రైవర్లకు వేతనం రూ.10,500కు పెంచేలా కమిషనర్కు నివేదిక. –సహజ ప్రకృతి చికిత్సాలయ సిబ్బందిలో మసాజర్స్, ఇతర స్కిల్డ్ ఉద్యోగుల వేతనాన్ని రూ.7,500కి, సెంట్రీ, నైట్ వాచ్మన్ వంటి అన్స్కిల్డ్ ఉద్యోగుల వేతనాన్ని రూ.6,500కు పెంచేందుకు నిర్ణయం. –దేవస్థానంలో విద్యుత్ ఆదా చర్యల్లో భాగంగా పాత మోటార్ల స్థానంలో 5స్టార్ రేటింగ్ కలిగిన 11 సబ్మెర్సిబుల్ మోటార్లను రూ.ఏడు లక్షలతో కొనుగోలు చేసేందుకు టెండర్ పిలించేందుకు నిర్ణయం. –సీతారామ సత్రం ఉత్తరం వైపు బ్లాక్లో రూ.9.90 లక్షలతో బాత్రూమ్స్లో కొత్తగా టైల్స్ ఏర్పాటు, కొత్త పైపులు వేయడం వంటి పనులకు టెండర్ల ఆహ్వానం. అనంతరం దక్షణం వైపు బ్లాక్ మరమ్మతులకు కూడా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. -
టిఫిన్ చేస్తే.. మెుక్క ఫ్రీ
పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న చిరువ్యాపారి వర్ధన్నపేట టౌన్ : ఆయన ఓ టిఫిన్ సెంటర్ నడుపుకునే చిరు వ్యాపారి. అయితే ఆయన అందరిలా కేవలం టిఫిన్ పెట్టి డబ్బులు మాత్రమే తీసుకోడు. ఒక మెుక్క ఇచ్చి వాగ్దానం కూడా తీసుకుంటాడు. ఎందుకు.. ఏమిటి అంటే పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం, అధికారులు మాత్రమే కృషి చేస్తే సరిపోదు అందరం శ్రమించాలి అంటూ మెుక్కలను ఉచితంగా అందజేస్తున్నాడు. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన పులుమాటి శంకర్, హైమావతి దంపతులు కొత్త బస్టాండ్ సమీపంలో ప్రధాన రహదారిపై ఓ చిన్న టిఫిన్ సెంటర్ను నిర్వహిస్తున్నారు. విభిన్న వంటకాలను రుచికరంగా చేయగలిగే ఆయనకు చెట్ల పెంపకం అంటే కూడా ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే తన ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే అయినా ఇంటి ఆవరణలో మొక్కలను పెంచి తన టిఫిన్ సెంటర్కు వచ్చే వినియోగదారులకు వాటిని అందజేస్తూ నాటి పరిరక్షించేలా వాగ్దానం తీసుకుంటున్నాడు. విశేషమేమిటంటే తను పెంచిన మొక్కలు సమయానికి సరిపడా లేకుంటే కూరగాయ విత్తనాలను సైతం ఇస్తూ వినియోగదారులను పర్యావరణం పట్ల చైతన్యవంతులను చేస్తున్నాడు. ఉన్నంతలో ఊరందరికీ ఉపయోగపడుతున్న ఈ వన ప్రేమికుడిని ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుంటే కాలుష్యం అనే మాటే ఉండదేమో. -
పీవోకే విముక్తికి ప్రచారం చేపట్టండి..!
రోఠక్ః పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) విముక్తికోసం భారీ ఎత్తున ప్రచారం చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. యోగాగురు రామ్ దేవ్ బాబా విన్నవించారు. ఎన్నికల్లో ఐఎస్ ఐ రిగ్గింగ్ చేసిందని ఆరోపిస్తూ స్థానికుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో పీవోకే విముక్తికోసం ప్రయత్నించాలని రామ్ దేవ్ ప్రధానిని కోరారు. పాకిస్తాన్ లాంటి దేశమే కశ్మీర్ ను ఆక్రమించగల్గినప్పుడు గొప్ప దేశమైన భారత్ ఎందుకు చూస్తూ ఊరుకోవాలని బాబా ప్రశ్నించారు. జూలై లో జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్ స్థానికులు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యోగా గురు రామ్ దేవ్ స్పందించారు. పీవోకే విముక్తికోసం ప్రయత్నించేందుకు వెంటనే ప్రచారం చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. కశ్మీర్ ఎలాగైనా తమ సొంతమేననడానికి నవాజ్ షరీఫ్ కు ఎన్నిగుండెలంటూ ప్రశ్నించారు. కశ్మీర్ లోని మన ప్రజలు కేవలం చెప్పుకోడానికేనన్నట్లుందని, పాకిస్తాన్ వారిని ఇప్పటికే ఆక్రమించేంసిందని అన్నారు. గొప్పదేశమైన భారత్ లోని భూభాగాన్ని పాక్ ఆక్రమిస్తుంటే చూస్తూ నెమ్మదిగా ఊరుకునేది లేదన్నారు. పీవోకే ఎలక్షన్లలో రిగ్గింగ్ జరిగిందంటూ ఆగ్రహించిన నీలం వ్యాలీ ప్రాంతంలోని స్థానికులు ఏకంగా పాకిస్తానీ జెండాను సైతం తగులబెట్టి, ఆందోళనలు చేపట్టిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో స్థానికులకు సహకరించి, ఆక్రమిత కశ్మీర్ విముక్తికి ప్రచారం చేపట్టాలని రామ్ దేవ్ బాబా ప్రధానిని కోరారు. -
అమ్మకు అభయం!
♦ పురుడుపోసుకున్న ‘పీఎంఎస్ఎంఏ’ ♦ మాతాశిశు సంరక్షణ బాధ్యత ఇక సర్కారుదే ♦ పేరు నమోదు చేసుకుంటే చాలు.. ♦ గర్భందాల్చిన నుంచి ప్రసూతి దాకా పరీక్షలన్నీ ఉచితం కామారెడ్డి : సురక్షిత ప్రసవాల కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం పీఎంఎస్ఎంఏను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రతి నెల తొమ్మిదో తేదీన సురక్షిత మాతృ దినోత్సవంగా పరిగణిస్తారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణులకు ఉచిత వైద్య సేవలందిస్తారు. ఈ పథకంలో భాగంగా మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం అయ్యే వరకు అన్ని రకాల సేవలను ఉచితంగానే అందిస్తారు. ఇందుకోసం ఆసుపత్రి రికార్డుల్లో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పేరు నమోదు చేసుకున్న వెంటనే వారి పేరున ఓ కార్డును అందిస్తారు. ఈ పథకంలో గర్భిణులకు అన్ని సేవలూ అందుతాయి. రక్త పరీక్షల్లో హిమోగ్లోబిన్ పరీక్ష, రేండమ్ బ్లడ్షుగర్, హెచ్ఐవీ, హెచ్బీఎస్ఏజీ, రక్త వీడీఆర్ఎల్, బ్లడ్ గ్రూప్ ఆర్హెచ్ టైపింగ్, మూత్రపరీక్ష, థైరాయిడ్, గ్లూకోజ్ చాలెంజ్ తదితర పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైతే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తారు. ఇవన్నీ ఉచితమే.. వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినా.. సకాలంలో వైద్య సేవలు అందక నేటికీ మాతాశిశు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. దీనిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో పథకాన్ని తీసుకొచ్చింది. గర్భిణులకు సకాలంలో వైద్య సేవలు అందించడానికి, సురక్షిత ప్రసవాలు జరిగేలా చూసేందుకు ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్(పీఎంఎస్ఎంఏ)ను అమలు చేస్తోంది. - కామారెడ్డి ప్రతి నెల 9వ తేదీన.. పీఎంఎస్ఎంఏ కింద ప్రతి నెల 9వ తేదీన గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ చేయించుకోని వారిని, డ్రాపవుట్ గర్భిణులను గ్రామాలలోని ఆశకార్యకర్తలు, ఏఎన్ఎంలు గుర్తించి ప్రతినెలా పీహెచ్సీలకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా గర్భిణులకు పీహెచ్సీలలో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికి వారంలో రెండుసార్లు వైద్య పరీక్షలు చేస్తారు. ప్రమాదకర లక్షణాలు కనిపిస్తే తీవ్రతను బట్టి జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేస్తారు. జననీ సంరక్షణ.. నిరుపేద కుటుంబాల్లో గర్భిణులకు సరైన పౌష్టికాహారం అందే అవకాశం తక్కువ. వైద్య పరీక్షలూ చేయించుకునే స్థోమత లేని కుటుంబాలెన్నో ఉన్నాయి. అలాంటి కుటుంబాలకు జననీ సంరక్షణ పథకం అండగా ఉంటోంది. ఈ పథకంలో గర్భిణులకు అవసరమైన పరీక్షలను ఉచితంగానే చేస్తారు. సాధారణ ప్రసవం అయిన వారికి మూడు రోజుల పాటు, శస్త్ర చికిత్స (సిజేరియన్) ద్వారా బిడ్డలకు జన్మనిచ్చిన తల్లులకు ఏడు రోజుల వరకు ఉచితంగా పౌష్టికాహారం అందజేస్తారు. సురక్షిత ప్రసవాల కోసం... ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ గర్భిణులకు వరంలాంటిది. ఈ పథకం పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తుంది. ఇందులో నిర్దేశించిన ప్రకారంగా గర్భిణులు వైద్యులు ఇచ్చే సూచనలు పాటిస్తే ప్రసవాలకు ఏ ఇబ్బందీ ఉండదు. గర్భిణులు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. అలాగే నెలనెలా ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి. వీటిని పాటిస్తే గర్భిణికి, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు మంచిది. మాతాశిశు మరణాలనూ నివారించవచ్చు. వ్యాయమం గర్భిణులు రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో 10 నిమిషాల చొప్పున వాకింగ్ చేయాలి. అయితే అలసట కలగకుండా చూసుకోవాలి. అలాగే కూర్చొని చిన్నచిన్న వ్యాయామాలు చేయవచ్చు. ఆహారం గర్భిణులు మాంసకత్తులు, పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. రోజూ ఉడకబెట్టిన రెండు గుడ్లు తినాలి. అయితే పచ్చసొనను తినకూడదు. ఖర్జూరం, కందిపప్పు, ఆకు కూరలు, బీట్రూట్, క్యారెట్, బీరకాయ, చిక్కుళ్లు, సోయాబీన్, మొలకెత్తిన గింజలు తినాలి. పాలు తాగాలి. గర్భిణులు చేయకూడనివి ♦ దుంపకూరలు తినకూడదు. అధిక నూనె వాడరాదు. కారం, మసాలా పదార్థాలు, తీసుకోకూడదు. మిఠాయిలు తగ్గించాలి. ఒకేసారి ఎక్కువ మోతాదులో కాకుండా మితంగా ఎక్కువసార్లు తినాలి. ♦ స్థూలకాయులు అధికాహారం తీసుకోరాదు. ♦ అధిక బరువులుఎత్తకూడదు. ♦ దూరప్రయాణాలు చేయరాదు. కుదుపులతో కూడిన మార్గాల్లో ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమం. ♦ ఒత్తిడికి దూరంగా ఉండాలి. గర్భిణులు ఏ నెలలో ఏం చేయాలి.. నెలసరి దాటిన ఒక వారానికి వైద్యుడిని సంప్రదించాలి. గర్భం దాల్చినట్లు నిర్ధారణైతే.. వెంటనే ఫోలిక్యాసిడ్ మాత్రలు వాడాలి. వీటిని మూడు నెలల వరకు విధిగా వాడాలి. దీని వల్ల గర్భంలో ఉన్న బిడ్డ నాడీవ్యవస్థలో అపసవ్యాలు తగ్గుతాయి. ♦ గర్భం దాల్చిన వారిలో కొందరికి ఐదోవారం నుంచి 12వ వారం వరకు వాంతులవుతాయి. వీటిని తగ్గించుకోవడానికి ఆహారంలో నూనె, మసాలాలు, కారం, పులుపు తగ్గించాలి. ♦ మొదటి మూడు నెలల్లో ఆరోగ్య తనిఖీతో పాటు స్కానింగ్, రక్త పరీక్షలు చేయించుకోవాలి. ♦ నాలుగో నెల నుంచి ప్రసవ సమయం వరకు వైద్యుల సూచనల మేరకు ఐరన్, కాల్షియం మాత్రలు వాడాలి. వీటి వల్ల రక్తహీనత తగ్గడంతో పాటు ఎముకలు బలపడతాయి. డీవార్మింగ్(నులి పురుగులు) నివారణకు అల్బెండజోల్ మాత్రను వేసుకోవాలి. నులి పురుగులను నివారిస్తే.. తీసుకున్న ఆహారం జీర్ణమవుతుంది. ఇదే నెలలో ఒక మోతాదు ధనుర్వాతం ఇంజక్షన్ చేయించుకోవాలి. ♦ ఐదో నెలలో స్కానింగ్ చేయించుకోవాలి. ఈ స్కానింగ్ ద్వారా బిడ్డ తల ఎలా ఉంది, వెన్నుపై కణతులేమైనా ఉన్నాయా, గుండె, మూత్రపిండాలు, ఇతర అవయవాలు ఎలా ఉన్నాయో తెలుస్తాయి. ముఖ్యంగా మధుమేహం, జన్యులోపాలు, వైకల్యంతో బాధపడుతున్నవారు. 30 ఏళ్ల తర్వాత గర్భం దాల్చినవారు, గతంలో అబార్షన్ అయినవారు, మేనరికం వివాహం చేసుకున్నవారు తప్పనిసరిగా స్కానింగ్ చేయించుకోవాలి. ఈ నెలలో రెండో మోతాదు ధనుర్వాతం ఇంజక్షన్ చేయించుకోవాలి. ♦ ఆరో నెలలో నెలసరి తనిఖీలు చేయించుకోవాలి. ♦ ఏడో నెల దాటిన తర్వాత ప్రసవించే వరకు ప్రతి 15 రోజులకోసారి ఆరోగ్య తనిఖీలు చేయించుకోవాలి. బరువు, రక్తపోటు, మూత్రపరీక్షలు, రక్తపరీక్షలు తప్పనిసరి.. ♦ రక్తపోటు, మధుమేహం, ఇతర సమస్యలు ఉన్నవారు ప్రసవ సమయానికన్నా ముందే ఆసుపత్రిలో చేరడం ఉత్తమం. ♦ గర్భిణులకు ఉమ్మనీరు పోవడం, తలనొప్పి, జ్వరం, కడుపునొప్పి రావడం, బ్లీడింగ్ అవడం, కడుపులో శిశు కదలికలు లేకపోవడం, ముఖం, కాళ్లు వాపులు రావడం.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. -
అభ్యర్థులకు ఉచిత అవగాహన
సూర్యాపేటటౌన్ : కానిస్టేబుల్ రాత పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు విజేత కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 28న పట్టణంలో ఉచిత అవగాహన తరగతులను నిర్వహిస్తున్నట్టు డైరెక్టర్ కల్లెట్లపల్లి యాదగిరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉచిత అవగాహన తరగతుల్లో నూతనంగా చేర్చిన తెలంగాణ చరిత్ర, జాగ్రఫీ తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్టు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
వన్యప్రాణులనుంచీ రక్షణకు టోల్ ఫ్రీ నెంబర్..
కర్ణాటకః అడవి జంతువులు తమ పంటపొలాలను నాశనం చేస్తున్నాయని, తమ ఖరీదైన పశువులను పులి చంపేసిందని, చెరకు పంటను ఏనుగుల గుంపు తొక్కేసిందంటూ ఆందోళన చెందే మారుమూల గ్రామాల ప్రజలను ఆదుకునేందుకు వైల్డ్ సేవా కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చారు. బాధితులకు ప్రభుత్వ పరిహారం వెంటనే అందేట్లుగా గ్రామసస్థుల్లో అవగాహన కల్పిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా గ్రామస్థుల్లో కొందరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, సమస్యలను వెంటనే తెలిపేందుకు టోల్ ఫ్రీ నెంబర్ అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. లబ్ధిదారులకోసం 'వైల్డ్ సేవ' ను కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లో అందుబాటులోకి తెచ్చారు. కార్యక్రమంలో భాగంగా గ్రామస్థుల్లో అవగాహన కల్పించేందుకు స్థానికులు కొందరికి 'ఫీల్డ్ ఏజెంట్ల పేరుతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. తాము నష్టపోయామంటూ రైతులు దరఖాస్తులు చేసుకొని కార్యాలయాలచుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన అవసరం లేకుండా.. లబ్ధిదారులకు వెంటనే పరిహారం అందేలా 'వైల్డ్ సేవ' కార్యక్రమం చేపట్టారు. నష్టపోయిన రైతులకు కేవలం నాలుగు రోజుల్లోనే పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వైల్డ్ లైఫ్ కంజర్వేషన్ సొసైటీ (డబ్ల్యూసీఎస్) ఆధ్వర్యంలో ఓ లాభాపేక్ష లేని స్వచ్ఛంద సేవకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ అటవీ శాఖతో కలసి కర్ణాటక, తమిళనాడుల్లోని సుమారు 284 గ్రామాల్లో వన్యప్రాణులనుంచి జనజీవనాన్ని రక్షించడంతోపాటు... వైల్డ్ సేవ కార్యక్రమంతో అంతరించిపోతున్న అడవి జంతువులను కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా జనాభా కలిగిన అటవీ ప్రాంతాలమీత దృష్టి సారించి.. అక్కడి ప్రజలకు, వన్యప్రాణులకు నష్టం కలగకుండా ప్రయత్సిస్తున్నారు. సుమారు 20 వేల రూపాయల ఖరీదు చేసే అవును పులి చంపేయడంతో పరిహారంకోసం దరఖాస్తు చేసుకున్నఓ రైతు.. వైల్డ్ సర్వీస్ తో 9 వేల రూపాయలు పొందాడు. అయితే పరిహారం తక్కువ వచ్చినా.. తనకు సంతృప్తిగానే ఉందన్న అతడు... గతంలో పరిహారంకోసం అధికారులచుట్టూ, కార్యాలయాలచుట్టూ తిరగడంతోపాటు పరిహారం పొందేందుకు డబ్బు ఎదురు చెల్లించాల్సి వచ్చేదని తెలిపాడు. అదీకాక ముందుగా పంటదాడులు, చనిపోయిన పశువుల ఫొటోలు తీసుకొని, గంటలకొద్దీ ప్రయాణం చేసి అటవీశాఖ కార్యాలయాలకు వెళ్ళాల్సి వచ్చేదని, సమయానికి అధికారులు లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని చెప్తున్నాడు. 'వైల్డ్ సేవ' కార్యక్రమం ప్రారంభమైన తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన ఏజెంట్ల ద్వారా సేవలు అందించడంతో వెంటనే పరిహారం పొందగల్గుతున్నట్లు స్థానిక రైతులు చెప్తున్నారు. అంతేకాదు 'వైల్డ్ సేవ' ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ తో తమకు జంతువులనుంచీ రక్షణతోపాటు, సమస్యలకు వెంటనే పరిష్కారం దొరుకుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ పంటలను అడవిజంతువులు నాశనం చేశాయనో, పశువులను చంపేశాయనో గ్రామస్థులు, రైతులనుంచీ తమకు రోజుకు ఒక్క ఫోన్ కాల్ అయినా వస్తుంటుందని, ఒక్కో ఏజెంట్ కు సుమారు 20 కిలోమీటర్ల పరిథిలో ఉన్న 70 గ్రామాలనుంచీ ఫోన్లు వస్తాయని, వచ్చిన ఎనిమిది గంటల్లోపు అక్కడికి వెళ్ళి సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తామని ఫీల్డ్ ఏజెంట్లు చెప్తున్నారు. ఏడుగురు ఫీల్డ్ ఏజెంట్లతో గత సంవత్సరం ప్రారంభించిన వైల్డ్ సేవా కార్యక్రమంలో భాగంగా పంటలు, ఆస్తుల నష్టం కేసుల్లో ఇప్పటిదాకా సుమారు 3,261 పరిష్కరించినట్లు 'వైల్డ్ సేవ' తెలిపింది. దీంతోపాటు.. 148 వరకూ పులులు, అడవికుక్కలద్వారా నష్టపోయిన పశుసంపద, తీవ్ర గాయాలైన 11 మంది, ఇద్దరు చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన కేసులను పరిష్కరించినట్లు 'వైల్డ్ సేవ' నివేదించింది. -
23 నుంచి ఉచిత పశువైద్య శిబిరాలు
కోరుట్ల పశువైద్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహణ 29 వరకు రోజుకు రెండు గ్రామాల్లో సేవలు జగిత్యాల అగ్రికల్చర్ : ఎన్ఎస్ఎస్లో భాగంగా కోరుట్ల పశువైద్య కళాశాలలో ఆధ్వర్యంలో జగిత్యాల డివిజన్లోని పలు గ్రామాల్లో ఈ నెల 23 నుంచి 29 వరకు ఉచిత పశు వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్లు కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ టి.రఘునందన్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ డి.కృష్ణ తెలిపారు. ఈ శిబిరాలను ఉదయం 7.30 గంటలకు ప్రారంభిస్తామని చెప్పారు. వ్యాధుల బారిన పడిన పశువులకు చికిత్స చేయడం, పశువుల్లో గర్భకోశ వ్యాధులకు చికిత్స–నిర్ధారణ, చూలు నిర్ధారణ పరీక్షలు, దూడలకు నట్టల నివారణ మందులు వేయడం, వ్యాధి నిరోధక టీకాలు వేయడం, పశు పోషణ–సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించడం, పశుగ్రాసాలపై చైతన్యం చేయడం వంటి తదితర కార్యాక్రమాలు ఉంటాయని వివరించారు. కార్యక్రమాల నిర్వహణ.. ఈ నెల 23న వెల్గటూర్ మండలంలోని పాత గూడూరు, ముంజంపల్లి గ్రామాలలో, 24న మల్యాల మండలంలోని మ్యాడంపెల్లి, తాటిపల్లి గ్రామాలలో, 25న పెగడపల్లి మండలంలోని రాములపల్లి, మద్దులపల్లి గ్రామాల్లో, 26న గొల్లపల్లి మండలంలోని రాఘవపట్నం, లోత్తునూర్ గ్రామాల్లో, 27న ధర్మపురి మండలంలోని సిరికొండ, బీర్సాని, 28న జగిత్యాల మండలంలోని తాటిపల్లి, రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామాలు, 29న జగిత్యాల మండలంలోని హబ్సీపూర్, గుట్రాజ్పల్లి గ్రామాల్లో వైద్య శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిబిరాల్లో కోర్సు చివరి సంవత్సరం విద్యార్థులతోపాటు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పశుసంవర్థక శాఖ అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. -
విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
కాగజ్నగర్ : విద్యార్థులు కష్టబడి చదవాలని, మంచి మార్కులు సాధించాలని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పిలుపునిచ్చారు. బుధవారం ఓల్డ్ కాలనీలోని ఇక్బాల్ స్కూల్ విద్యార్థులకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉచితంగా నోటు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని విధాల సహాయం అందిస్తామని, విద్యార్థులు పట్టుదలతో చదివి ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. మైనార్టీ విద్యార్థులకు చేయూతనందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వెల్లడించారు. గతంలో ఇక్బాల్ స్కూల్కు నూతన భవనం మంజూరు చేయించి పూర్తి చేయడం జరిగిందని, అయితే త్వరలోనే మిగిలిన తరగతి గదులను కూడా నిర్మించేందుకు కషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత విద్యార్థులు విద్యలో రాణించి టాపర్లుగా నిలిస్తే తనకు ఎంతగానో సంతోషం కలుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆ వార్డు కౌన్సిలర్ నియాజుద్దీన్ బాబా, టీఆర్ఎస్ నాయకులు దినేష్ అసోపా, స్కూల్ కరస్పాండెంట్ ముక్తియార్ అహ్మద్ రూమి, వైస్ ప్రసిడెంట్ ఇమాముద్దీన్ హబీబ్, కోశాధికారి ఫెరోజ్ ఖాన్, సభ్యులు జాకీర్, హెడ్ మాస్టర్ రజీయా జహా, విద్యార్థులు పాల్గొన్నారు.