presidencial elections
-
రివైండ్ 2024: ప్రపంచం ఓటేసింది..
అత్యధిక దేశాల్లో ఎన్నికలు జరిగిన సంవత్సరంగా 2024 చరిత్రలో నిలిచిపోనుంది. అమెరికా నుంచి భారత్ దాకా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 73 దేశాలు ఓట్ల పండుగ జరుపుకోవడం విశేషం. 27 సభ్య దేశాలున్న యూరోపియన్ యూనియన్కు జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు వీటికి అదనం! ఈ దేశాల్లో దాదాపు 400 కోట్ల పై చిలుకు జనాభా ఉంది. అంటే ప్రపంచ జనాభాలో దాదాపుగా సగం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ఏడాది ఎన్నికల క్రతువులో పాల్గొన్నారు. వీటిలో చాలా ఎన్నికలు ఓటర్ల పరిణతికి అద్దం పట్టాయి. ఒక్కో దేశంలో ఒక్కోలా ప్రజలు తీర్పు వెలువరించడం విశేషం. పలు ఫలితాలు ఊహించినట్టు రాగా కొన్ని మాత్రం అనూహ్యాలతో ఆశ్చర్యపరిచాయి. అధికార పార్టీల అక్రమాల నడుమ ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేసినవీ ఉన్నాయి... భారత ఓటర్ల పరిణతి భారత్లో సాధారణ ఎన్నికలు ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామిక క్రతువుగా ఎప్పుడో రికార్డు సృష్టించాయి. ఇంతటి బృహత్తర కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ లేకుండా ప్రశాంతంగా జరిగే తీరు చూసి ప్రపంచమంతా ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటుంది. ఈసారి కూడా అందుకు తగ్గట్టే ఏప్రిల్ నుంచి ఆరు వారాల వ్యవధిలో ఏడు విడతల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 64.64 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. ఈసారి ఏకంగా ‘400కు మించి’అన్న బీజేపీ చివరికి మెజారిటీకీ కాస్త తక్కువగా 240 లోక్సభ స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలా ఈసారి ఫలితాలు కూడా అందరినీ ఆశ్చర్యపరచడమే గాక భారత ఓటర్ల పరిణతికి అద్దం పట్టాయి.ట్రంప్.. తగ్గేదేలే...! నానారకాల వాదాలతో విడిపోయిన అమెరికాలో ఈసారి జరిగిన అధ్యక్ష ఎన్నికలు ప్రపంచమంతటినీ అమితంగా ఆకర్షించాయి. డొనాల్డ్ ట్రంప్ హవాకు అద్దం పట్టిన ఎన్నికలుగా నిలిచిపోయాయి. రిపబ్లికన్ల అభ్యరి్థత్వం సాధించడం మొదలుకుని ప్రధాన పోరు దాకా ఆద్యంతం ఆయన కనబరిచిన దూకుడు ఓటర్లను అమితంగా ఆకర్షించింది. ఆయన ‘అమెరికా ఫస్ట్’నినాదం రెండోసారి ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తిమంతమైన అధికార పీఠం ఎక్కించింది. డెమొక్రాట్లకు అధ్యక్షుడు జో బైడెనే భారంగా మారారు. సకాలంలో తప్పుకోకపోవడం ద్వారా పార్టీ విజయావకాశాలకు తీవ్రంగా గండి కొట్టిన అప్రతిష్టను మూటగట్టుకున్నారు. భారత మూలాలున్న వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ శాయశక్తులా ప్రయత్నించినా, ఆమెదే పైచేయి అని ప్రధాన మీడియా ఎంతగా హోరెత్తించినా ట్రంప్ ‘తగ్గేదే లే’అన్నారు. 538 ఎలక్టోరల్ ఓట్లలో ఏకంగా 312 ఓట్లను ఒడిసిపట్టి భారీ మెజారిటీతో విజయ దరహాసం చేశారు. రిషికి ఓటమి సమస్యలతో సతమతమవుతున్న బ్రిటన్ ప్రజలు తమ ఆగ్రహమంతటినీ అధికార కన్జర్వేటివ్ పార్టీపై చూపించారు. ఆ పార్టీ 14 ఏళ్ల ఏలుబడికి తెర దించారు. భారత మూలాలున్న తొలి బ్రిటన్ ప్రధానిగా చరిత్ర సృష్టించిన రిషి సునాక్ సారథ్యంలో కన్జర్వేటివ్లు దారుణ ఓటమి మూటగట్టుకున్నారు. లేబర్ పార్టీ నేత కియర్స్టార్మర్కు జనం పట్టం కట్టారు.పాక్లో ప్రహసనం పాకిస్తాన్లో ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలు అత్యంత వివాదాస్పదంగా నిలిచాయి. ప్రధాని షహబాజ్ షరీఫ్ కుటుంబ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్–ఎన్) ఆద్యంతం ఎన్నికల అక్రమాలకు పాల్పడిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్ని చేసినా జైలుపాలైన ఇమ్రా న్ఖాన్ ఆధ్వర్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ (పీటీఐ)ను అడ్డుకోలేకపోయింది. పీటీఐ గుర్తింపునే రద్దు చేసినా స్వతంత్రులుగానే నిలబడి అన్ని పారీ్టల కంటే ఎక్కువ సీట్లు నెగ్గి సత్తా చాటారు. దాంతో నానా పారీ్టలను కలుపుకుని షహబాజ్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచి్చంది. లంకలో నవోదయం : కల్లోల శ్రీలంకలో సుదీర్ఘ వాయిదాల తర్వాత ఎట్టకేలకు నవంబర్లో జరిగిన ఎన్నికల్లో వామపక్షవాది అనూర కుమార దిస్సనాయకే సాధించిన విజయం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దేశ దుస్థితికి ప్రధాన కారకులని భావించిన రాజపక్స కుటుంబాన్ని జనం రాజకీయంగా సమాధి చేశారు. పుతిన్ ఐదోసారి చెప్పుకోదగ్గ ప్రత్యర్థే లేకుండా జరిగిన ఎన్నికల్లో రష్యాలో పుతిన్ రికార్డు స్థాయిలో ఐదోసారి అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గారు. అది కూడా ఏకంగా 87 శాతం ఓట్లు సాధించారు. సోవియట్ అనంతర కాలంలో రష్యాలో ఇదే అత్యధిక మెజారిటీ. పుతిన్కు ప్రధాన అడ్డంకిగా మారడం ఖాయమని భావించిన విపక్ష నేత అలెక్సీ నావల్సీ ఎన్నికలకు ముందు జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించడం పెను దుమారమే రేపింది. వెనెజువెలాలో అధ్యక్షుడు నికొలస్ మదురో విజయమూ వివాదాస్పదమైంది. పారిపోయిన నేతలుపొరుగు దేశం బంగ్లాదేశ్లో అనూ హ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అది కూడా జనవరిలో సాధారణ ఎన్నికలు ముగిసి షేక్ హసీనా రికార్డు స్థాయిలో ఐదోసారి ప్రధాని కావడం ద్వారా అధికారాన్ని నిలబెట్టు్టకున్న ఐదు నెలలకే! అజ్ఞాత శక్తి కనుసన్నల్లో సాగినట్టు కని్పంచిన ‘ప్రజా ఉద్యమం’దెబ్బకు ఆమె పదవీచ్యుతురాలయ్యారు. అధికార నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టడంతో దాదాపుగా కట్టుబట్టలతో ఉన్నపళంగా దేశం వీడి భారత్లో రాజకీయ ఆశ్రయం పొందారు. నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక సర్కా రు కొలువుదీరింది. నాడు మొదలైన అల్లర్లు, అరాచకాలు బంగ్లాలో నేటికీ కొనసాగుతున్నా యి. హిందువులతో పాటు మైనారిటీల భద్రతను ప్రమాదంలో పడేశాయి. అసద్లకు అల్విదా సిరియాలో అసద్ల 50 ఏళ్ల కుటుంబ పాలనకు తిరుగుబాటుదారులు డిసెంబర్లో తెర దించారు. అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కుటుంబంతో పాటు రష్యాకు పారిపోయారు. అలా నియంతృత్వ పాలనకు తెర పడ్డా దేశం మాత్రం అనిశ్చితితో కూరుకుపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నమీబియాకు తొలి అధ్యక్షురాలు
నమీబియా ఎన్నికల్లో అధికార స్వాపో పార్టీ విజయం సాధించింది. నెటుంబో నండీ ఎండైట్వా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. దేశ అత్యున్నత పీఠం అధిష్టించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. నమీబియా స్వాతంత్య్రం పొందిన నాటి నుంచి 30 ఏళ్లుగా స్వాపో పార్టీయే అధికారంలో కొనసాగుతోంది. నమీబియాలో అధ్యక్ష పదవికి, నేషనల్ అసెంబ్లీకి విడిగా ఓటింగ్ జరుగుతుంది. 72 ఎండైట్వా 57 శాతం ఓట్లు సాధించారు. శాంతి, సుస్థిరత కోసం దేశం ఓటేసిందని ఫలితాల అనంతరం ఆమె అన్నారు. 1960ల్లో దేశ స్వాతంత్య్ర పోరాట సమయంలో స్వాపో పార్టీలో చేరిన ఎండైట్వా విదేశాంగ శాఖ వంటి కీలక పదవుల్లో పనిచేశారు. 96 స్థానాలకు స్వాపో పార్టీ 51 స్థానాలు గెలిచి మెజారిటీ సాధించింది. ఇండిపెండెంట్ పేట్రియాట్స్ ఫర్ ఛేంజ్ (ఐపీసీ) పార్టీ 20 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఎన్నికల ప్రక్రియ లోపభూయిష్టంగా జరిగిందని, ఫలితాలను కోర్టులో సవాలు చేస్తామని ఆ పార్టీ తెలిపింది. నిష్కళంక నేత ఎన్ఎన్ఎన్ అని పిలుచుకునే ఎండైట్వా పార్టీలో దిగ్గజ నేత. ఆఫ్రికా ఖండంలోని అతి కొద్ది నాయకురాళ్లలో ఒకరు. దేశ స్వాతంత్య్ర పోరాట కాలం నుంచి ఏదో ఒక పదవిలో ఉంటూ వస్తున్నారు. పాస్టర్ కూతురు అయిన ఆమె గొప్ప రాజనీతిజ్ఞురాలిగా ఎదిగారు. గత ఫిబ్రవరిలో ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆర్థిక దౌత్యాన్ని ఉపయోగించి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఉద్యోగాలను సృష్టిస్తానని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు. పార్టీలోని అన్ని వర్గాలను ఏకం చేయగలిగారు. నిష్కళంక నేతగా ఆమెకున్న ప్రతిష్ట ఎన్నికల్లో గెలుపు వైపు నడిపించింది. బలమైన గ్రామీణ మూలాలతో 30 లక్షల మంది జనాభా ఉన్న నమీబియా ప్రధానంగా యురేనియం, వజ్రాల ఎగుమతిదారు. దేశంలో మెరుగైన మౌలిక సదుపాయాలు లేవు. నిరుద్యోగం అధికం. దేశ సంపద స్థానికులకు ఉపయోగపడటం లేదు. 15–34 ఏళ్ల మధ్య వయసు్కల్లో నిరుద్యోగం 46 శాతముంది. ఇది జాతీయ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువ. అధిక నిరుద్యోగం, అసమానతల కారణంగా స్వాపో పార్టీ గెలుపు కష్టమేనని విశ్లేషకులు భావించారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో బలమైన మూలాలు స్వాపోకు కలిసొచ్చాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హారిస్-ట్రంప్ హోరాహోరీ.. అదే జరిగితే..
న్యూయార్క్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే పలు సర్వే నివేదికలు.. ఈసారి ట్రంప్, హారిస్ మధ్య హోరాహోరీ పోటీ తప్పదని వెల్లడించిన విషయం తెలిసిందే. ఓటింగ్ సరళి పరిశీలిస్తే కూడా ట్రంప్-హారిస్ మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ట్రంప్, హారిస్ ఇద్దరిలో ఎవరికీ మెజారిటీ వస్తుంది? గెలుపెవరిదో చెప్పటం కష్టంగా ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. కనీసం 270 ఎలక్టోరల్ ఓట్లు రాని పక్షంలో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇద్దరికీ చెరో 269 ఓట్లు వచ్చే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే అధ్యక్షున్ని ఎన్నుకునే బాధ్యత అమెరికా కాంగ్రెస్పై పడుతుంది. దిగువ సభ అయిన ప్రతినిధుల సభ అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. ఇందుకోసం జనవరి 6న సమావేశమవుతుంది. ఒక్కో రాష్ట్రానికి ఒకటి చొప్పున 50 ఓట్లు కేటాయిస్తారు. 26, అంతకంటే ఎక్కువ ఓట్లు సాధించే వారే అధ్యక్షుడవుతారు.అయితే.. చివరిసారిగా రెండు శతాబ్దాల కింద, అంటే 1800లో ఇటువంటి పరిస్థితి తలెత్తింది. అధ్యక్ష బరిలోకి దిగిన థామస్ జెఫర్సన్, ఆరన్ బ్లర్ ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. దాంతో ప్రతినిధుల సభ ఓటింగ్ జరపగా.. జెఫర్సన్ విజేతగా నిలిచారు. 2020లో అధ్యక్ష ఎన్నికల పోలింగ్లో 66 శాతమే మాత్రమే పోలింగ్ నమోదైంది. అయితే.. అమెరికాలో 24 కోట్ల పై చిలుకు అర్హులైన ఓటర్లున్నారు. కానీ ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు మాత్రం 16.14 కోట్ల మందే. ఇది 2020 కంటే కూడా తక్కువ. 2020లో 16.8 కోట్ల మంది నమోదైన ఓటర్లుండగా వారిలో ఆ ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసింది 15.9 కోట్ల మంది మాత్రమే. ఈసారి ప్రచార సరళి ఆధారంగా పోటీ హోరాహోరీగా ఉన్నట్లు తెలుస్తోంది. -
అమెరికా ఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో ఓటర్లు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లలో నిల్చున్నారు. ఇక.. పోలింగ్ పాల్గొని ఓటు వేయాలని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా పౌరులకు విజ్ఞప్తి చేశారు. బ్యాలెట్ పేపర్ విధానంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. హ్యాండ్మార్క్డ్ పేపర్ బ్యాలెట్స్ ద్వారా కొందరు, బ్యాలెట్ మార్కింగ్ డివైజ్(BMD)లతో కూడిన పేపర్బ్యాలెట్తో మరికొందరు ఓటేసే ఛాన్స్ ఇచ్చారు. బీఎండీ డిజిటల్ బ్యాలెట్.. ఓటేసి అప్పటికప్పుడే ప్రింట్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈవీఎంల తరహా డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్(DRE) ద్వారా కేవలం ఐదు శాతం ఓటేసే ఛాన్స్ ఉంది. హ్యాకింగ్ ఆరోపణలు, ట్యాంపరింగ్ అనుమానాల నేపథ్యంలోనే డీఆర్ఈలకు అమెరికా ఓటర్లు దూరంగా ఉన్నారు.ఇక.. గత ఎన్నికల్లో కేవలం 66 శాతమే పోలింగ్ నమోదైంది. ఈసారి ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు నిలబడ్డారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇద్దరి మధ్యే పోటీ నెలకొంది. ట్రంప్-హారిస్ మధ్య పోటీతో అమెరికన్ల తీర్పు ఎలా ఉండనుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. కనెక్టికట్, ఇండియానా, కెంటకీ, న్యూజెర్సీ, మెయినే, న్యూహాంప్సైర్, న్యూయార్క్ వర్జీనీయాలో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ అయిన వెంటనే కౌంటింగ్ ప్రారంభం కానుంది.ఇక.. రేపు సాయంత్రం లేదంటే ఎల్లుండి కల్లా ఫలితంపై స్పష్టత రానుంది. -
అమెరికా ఎన్నికలు.. తొలి ఫలితం వచ్చేసింది!
అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభం కాకముందే తొలి ఫలితం వచ్చేసింది!. తాజాగా న్యూహ్యాంప్షైర్ రాష్ట్రంలోని డిక్స్విల్లే నాచ్లో తొలి ఫలితం వెల్లడైంది. డిక్స్విల్లే నాచ్లో ఆరుగురు ఓటర్లు ఉన్నారు. అందులో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్నకు మూడు చొప్పున ఓట్లు వచ్చాయి. న్యూహ్యాంప్షైర్ ఎన్నికల నిబంధనల ప్రకారం.. ఇక్కడ అర్థరాత్రి నుంచే పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఇద్దరు అమెరికా అధ్యక్ష అభ్యర్థులు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటాపోటీ నెలకొంది. న్యూ హాంప్షైర్లోని డిక్స్విల్లే నాచ్లో ఇద్దరూ మూడు బ్యాలెట్లను పొందారు. ఇది దశాబ్దాలుగా దేశంలోని మిగిలిన పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే ఇక్కడ ప్రారంభం కావటం గమనార్హం.ఇక.. 2020లో డిక్స్విల్లే నాచ్ ఓటర్లు జో బైడెన్ వైపు మొగ్గుచూపారు.This village in New Hampshire was the first to vote at 12 am on November 5th. There are only 6 voters here. All the 6 cast their votes and the votes were immediately counted. The results - Kamala Harris got 3 votes, and Donald Trump got 3 votes. So, it was a tie. pic.twitter.com/QlzBv8oaKd— Sam (@suddensam55) November 5, 2024 -
‘చెత్త ట్రక్’ నడిపిన ట్రంప్.. బైడెన్, కమలకు కౌంటర్
న్యూయార్క్: ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ‘చెత్త’ చూట్టూ రాజకీయం నడుస్తోంది!. తాజాగా.. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు కౌంటర్ ఇస్తూ బుధవారం ఓ చెత్త ట్రక్ను నడిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.‘నా చెత్త ట్రక్ మీకు నచ్చిందా?. కమలా, జో బిడెన్ల గౌరవార్థంతో ట్రక్ నడుపుతున్నా’ అని ట్రంప్ మీడియాతో అన్నారు. ‘‘హాస్యనటుడు టోనీ హించ్క్లిఫ్ ప్యూర్టోరీకోపై చేసిన వ్యాఖ్యలపై ప్రస్తావించాల్సిన అవసరం లేదు. నాకు ఆ హాస్యనటుడి గురించి ఏమీ తెలియదు. నేను ఆయన్ను ఎప్పుడూ చూడలేదు. ఆయన ఒక హాస్యనటుడు.. ఆయన గురించి చెప్పడానికి ఏం ఉంటుంది’ అని మీడియా ప్రశ్నలను ట్రంప్ దాటవేశారు.TRUMP ARRIVES FOR CAMPAIGN RALLY IN A GARBAGE TRUCK!“How do you like my garbage truck? This truck is in honor of Kamala and Joe Biden.”“For Joe Biden to make that statement — it’s really a disgrace” pic.twitter.com/jA9nEQKvCg— J Stewart (@triffic_stuff_) October 30, 2024ఇటీవల రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారీ బహిరంగ సభలో పాల్గొన్న స్టాండప్ కమేడియన్ టోనీ హించ్క్లిఫ్ మాట్లాడుతూ ప్యూర్టోరీకోను నీటిపై తేలుతున్న చెత్తకుప్పగా అభివర్ణించారు. దానిపై అమెరికావ్యాప్తంగా ఇప్పటికీ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. ప్యూర్టోరీకోపై టోనీ వ్యాఖ్యలను తిప్పికొట్టే క్రమంలో అధ్యక్షుడు జోబైడెన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిస్పానిక్ గ్రూప్ వోటో లాటినో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బైడెన్ మాట్లాడుతూ.. ‘నాకు తెలిసిన అసలైన చెత్త ఆయన (ట్రంప్) మద్దతుదారులు మాత్రమే. వారి రూపంలోనే అసలైన చెత్తాచెదారం కనిపిస్తోంది’’ అని అన్నారు. తాను చెత్త అన్నది ప్యూర్టోరీకోపై అసహ్యకర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ మద్దతుదారును ఉద్దేశించి మాత్రమేనంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. కానీ బైడెన్ వ్యాఖ్యలపై దుమారం చల్లారడం లేదు. -
USA Presidential Elections 2024: ఓట్లు తగ్గినా... గద్దెనెక్కవచ్చు!
అధ్యక్ష తరహా పాలన ఉన్న చాలా దేశాల్లో ఆ పదవికి ప్రత్యక్ష ఎన్నిక జరుగుతుంది. ప్రజలు తమ ప్రెసిడెంట్ను నేరుగా ఎన్నుకుంటారు. అత్యధిక ఓట్లు సాధించే వారే విజేతగా నిలుస్తారు. కానీ అగ్రరాజ్యమైన అమెరికాలో మాత్రం గమ్మత్తైన పరోక్ష ఎన్నిక విధానం అమల్లో ఉంది. అక్కడ అధ్యక్షున్ని ఎన్నుకునేది ఎలక్టోరల్ కాలేజీ. మరి పోలింగ్ తేదీన ప్రజలు ఓటేసేది ఎవరికంటారా? ఎలక్టర్లుగా పిలిచే ఈ ఎలక్టోరల్ కాలేజీ సభ్యులకు. అనంతరం వారంతా కలిసి అధ్యక్షున్ని, ఉపాధ్యక్షున్ని నేరుగా ఎన్నుకుంటారు.విన్నర్ టేక్స్ ఆల్! అధ్యక్ష ఎన్నిక విషయంలో అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 48 రాష్ట్రాలు విన్నర్ టేక్స్ ఆల్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. దానిప్రకారం ఒక రాష్ట్ర ఎలక్టోరల్ ఓట్లన్నీ ఆ రాష్ట్రంలో మెజారిటీ ఓట్లు సాధించే అభ్యరి్థకే దక్కుతాయి (మెయిన్, నెబ్రాస్కా మాత్రం అభ్యర్థులు సాధించే ఓట్ల ప్రకారం నైష్పత్తిక పద్ధతిలో వారికి ఎలక్టర్లను కేటాయిస్తాయి). దీనివల్ల దేశవ్యాప్తంగా కలిపి అత్యధిక ఓట్లు (పాపులర్ ఓట్) సాధించే అభ్యర్థి కూడా ఓటమి పాలయ్యే ఆస్కారం పుష్కలంగా ఉంది. గతంలో ఇలా జరిగింది కూడా. 2016లో డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే ఏకంగా 28 లక్షల పై చిలుకు ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అయినా ఆమె ఏకంగా 74 ఎలక్టోరల్ ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు! 2000లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి అల్ గోర్ కూడా తన రిపబ్లికన్ ప్రత్యర్థి జార్జి డబ్లు్య.బుష్ కంటే 5.5 లక్షల ఎక్కువ ఓట్లు సాధించారు. అయినా 271 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు సాధించిన బుష్కే పీఠం దక్కింది. 1876, 1888ల్లో కూడా పాపులర్ ఓట్ సాధించిన అభ్యర్థులు ఓటమి చవిచూశారు. కాకపోతే ఇప్పటిదాకా జరిగిన 59 అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా 54సార్లు పాపులర్ ఓట్ సాధించిన అభ్యర్థే విజేతగా నిలిచారు. ఎందుకీ ‘కాలేజీ’...? ఎలక్టోరల్ కాలేజీ వ్యవస్థ వల్ల చిన్న రాష్ట్రాలకు కూడా అధ్యక్షుని ఎన్నికలో తగిన ప్రాధాన్యం దక్కుతుంది. అంతేగాక అభ్యర్థులు దేశమంతటా కాలికి బలపం కట్టుకుని తిరిగే అవసరముండదు. గెలుపోటములను నిర్దేశించి ఆరేడు స్వింగ్ స్టేట్స్పై గట్టిగా దృష్టి పెడితే సరిపోతుంది. కాకపోతే ఈ విధానంలో లోపాలూ లేకపోలేదు. పాపులర్ ఓట్ సాధించిన వాళ్లు కూడా ఓడే ఆస్కారముండటం వాటిలో ప్రధానమైనది. తమ ఓట్లకు ప్రాధాన్యం లేదనే భావనతో జనం ఓటింగ్కు దూరమయ్యే ఆస్కారమూ ఉంటుంది.జనాభాకు తగ్గట్టు... ప్రతి రాష్ట్రానికి జనాభాకు అనుగుణంగా ఎలక్టర్ల సంఖ్యను కేటాయిస్తారు. ఇది ఆ రాష్ట్రానికి కేటాయించిన ప్రతినిధుల సభ, సెనేట్ సభ్యుల సంఖ్యకు సమానంగా ఉంటుంది. ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల సంఖ్య 538. అధ్యక్ష ఎన్నికలో నెగ్గాలంటే వీటిలో కనీసం 270 ఓట్లు అవసరం. కాలిఫోర్నియాలో అత్యధికంగా 54 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లుంటే వ్యోమింగ్, నార్త్ డకోటా, అలస్కా వంటి రాష్ట్రాల్లో కేవలం మూడే ఉన్నాయి. అమెరికాలోనూ అప్పుడప్పుడూ గోడదూకుళ్లు! ఎలక్టర్లు తమ పార్టీ అభ్యరి్థకే ఓటేయాలన్న రాజ్యాంగ నిర్బంధమేమీ అమెరికాలో లేదు! 2016లో ఏడుగురు ఎలక్టర్లు ప్రత్యర్థులకు ఓటేశారు. వీరిలో ఐదుగురు డెమొక్రాట్లు కాగా ఇద్దరు రిపబ్లికన్లు. అయితే వారి చర్య తుది ఫలితంపై ప్రభావం చూపలేదు. హిల్లరీ క్లింటన్కు 232 ఎలక్టర్ ఓట్లు రాగా 306 ఓట్లతో ట్రంప్ సునాయాసంగా విజయం సాధించారు. ఇలాంటి గోడదూకుడు ఎలక్టర్లకు సంబంధిత పారీ్టలు జరిమానా విధించడమే గాక వారిపై అనర్హత వేటు కూడా వేయొచ్చు. వారిపై చట్టప్రకారం చర్యలు కూడా చేపట్టమే గాక వారి స్థానంలో వేరేవాళ్లను ఎలక్టర్లుగా నియమించుకునేందుకు వీలు కల్పిస్తూ 32 రాష్ట్రాలు చట్టాలు చేశాయి. సుదీర్ఘ ప్రక్రియ అమెరికాలో అధ్యక్ష ఎన్నిక సుదీర్ఘ ప్రక్రియ. ముందుగా ప్రధాన పార్టీలు తమ అధ్యక్ష అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుడతాయి. ఇది పోలింగ్కు దాదాపు 9 నెలల ముందుగానే మొదలవుతుంది... -అధ్యక్ష అభ్యర్థులపై కాకస్లు, ప్రైమరీల ద్వారా పార్టీ సభ్యులు, ప్రతినిధులు తమ అభిప్రాయం వెలిబుచ్చుతారు. -అనంతరం ఆగస్టు/సెప్టెంబర్ నెల్లలో పార్టీ జాతీయ సదస్సులో అభ్యరి్థని అధికారికంగా ప్రకటిస్తారు. అక్కడినుంచి ఎన్నికల పోరు ఊపందుకుంటుంది. -ప్రచారం, ప్రధాన అభ్యర్థుల డిబేట్లతో పోరు పతాక స్థాయికి చేరుకుంటుంది. -నవంబర్లో తొలి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం పోలింగ్ ఉంటుంది. -విజేత ఎవరో పోలింగ్ ముగియగానే ఆ రాత్రే దాదాపుగా తేలిపోతుంది. -అయితే అంతకు కొద్ది నెలల నుంచే ముందస్తు ఓటింగ్ సదుపాయం కూడా ఉంటుంది. ఈసారి ఇప్పటికే 3.5 కోట్ల మందికి పైగా అమెరికన్లు ముందుగానే ఓటేయడం విశేషం.జనవరి 6న ఫలితం జనవరి 6న అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశం జరుగుతుంది. ఎలక్టోరల్ ఓట్ల లెక్కింపు జరిపి అధ్యక్ష, ఉపాధ్యక్షులను అధికారికంగా ప్రకటిస్తారు. అమెరికా ఉపాధ్యక్షుడు ఈ ప్రక్రియను సెనేట్ అధ్యక్షుని హోదాలో పర్యవేక్షిస్తారు. నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షుల పేర్లను కూడా ప్రకటిస్తారు. → ఎలక్టోరల్ ఓట్లలో ఏ అభ్యరి్థకీ మెజారిటీ రాకపోతే అధ్యక్షున్ని ఎన్నుకునే బాధ్యత ప్రతినిధుల సభపై పడుతుంది. దాని సభ్యులంతా కలిసి అత్యధిక ఎలక్టోరల్ ఓట్లు సాధించిన తొలి ముగ్గురు అభ్యర్థుల్లో నుంచి మెజారిటీ ఓటు ద్వారా ఒకరిని అధ్యక్షునిగా ఎన్నుకుంటారు. → ఉపాధ్యక్ష పదవికి కూడా అంతే. ఎవరికీ మెజారిటీ రాకపోతే అత్యధిక ఎలక్టోరల్ ఓట్లు సాధించిన తొలి ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరిని సెనేట్ సభ్యులు మెజారిటీ ఓటు ద్వారా ఉపాధ్యక్షునిగా ఎన్నుకుంటారు. → దాంతో అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ కొలిక్కి వచి్చనట్టే. చివరగా జనవరి 20న ప్రమాణస్వీకారం ఉంటుంది. ముందుగా ఉపాధ్యక్షుడు, అనంతరం అధ్యక్షుడు ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ రోజు ఆదివారమైతే కార్యక్రమాన్ని జనవరి 21న నిర్వహిస్తారు. → 1933 దాకా కొత్త అధ్యక్షుడు మార్చి 4న ప్రమాణస్వీకారం చేసేవారు. 1937 నుంచి జనవరి 20కి మార్చారు.అసలు ఎన్నిక డిసెంబర్ 16న!ఓటింగ్ ముగిశాక కూడా అమెరికా అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ఏకంగా మరో రెండు నెలల పాటు సాగుతుంది! → రాష్ట్రాల స్థాయిలో ఎలక్టర్ల ఎన్నిక ప్రక్రియ దాదాపు నెల పాటు జరుగుతుంది. మెయిన్, నెబ్రాస్కా మినహా మిగతా 48 రాష్ట్రాల్లోనూ మెజారిటీ ఓట్లు సాధించిన పారీ్టకే ఆ రాష్ట్రంలోని మొత్తం ఎలక్టోరల్ ఓట్లూ దక్కుతాయి. → అనంతరం తమ ఎలక్టర్లుగా ఎవరుండాలో సదరు పార్టీ తాలూకు రాష్ట్ర శాఖ నిర్ణయిస్తుంది. → ఎలక్టర్లుగా ఎన్నికైన వారంతా డిసెంబర్లో రెండో బుధవారం తర్వాత వచ్చే సోమవారం ఆయా రాష్ట్రాల రాజధానుల్లో భేటీ అవుతారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులకు విడివిడిగా ఓటేస్తారు. ఒకవిధంగా అధ్యక్షున్ని వాస్తవంగా ఎన్నుకునేది ఈ రోజే! ఈసారి ఎలక్టర్ల భేటీ డిసెంబర్ 16న జరగనుంది. → అనంతరం డిసెంబర్ నెల నాలుగో బుధవారం లోగా, అంటే ఎలక్టర్ల భేటీ జరిగిన 9 రోజుల్లోపు వారి ఓట్లన్నీ సెనేట్ అధ్యక్షునికి చేరాల్సి ఉంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్, హారిస్ ప్రచారంపై చైనా హ్యాకర్ల టార్గెట్!
న్యూయార్క్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇరుపార్టీల అధ్యక్ష అభ్యర్థులు, ఉపాధ్యక్ష అభ్యర్థల ప్రచారంపై చైనా హ్యాకర్లు టార్గెట్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ.. అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ప్రచారానికి అనుబంధంగా ఉన్న వ్యక్తులు ఉపయోగించే ఫోన్లను చైనా హ్యాకర్లు.. హ్యాక్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు శుక్రవారం వెల్లడించాయి.అదేవిధంగా రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ , ఉపాధ్యక్ష అభ్యర్థి జెడి వాన్స్ ప్రచారాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. అయితే.. ట్రంప్, వాన్స్ ప్రచారాన్ని చైనా హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నట్లు ట్రంప్ బృందం ధృవీకరించకపోవటం గమనార్హం. అయితే హ్యాక్ విషయంలో ట్రంప్ బృందం దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ అధ్యక్షుడిగా గెలవకుండా అడ్డుకోవడానికి వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ చైనా, ఇరాన్లను ప్రోత్సహించారని ట్రంప్ ప్రచార కమ్యూనికేషన్ డైరెక్టర్ స్టీవెన్ చియుంగ్ ఆరోపణలు చేశారు.ఈ వ్యవహారంపై వాషింగ్టన్లోని చైనా రాయబార కార్యాలయం స్పందించింది. ‘హ్యాకింగ్కు సంబంధించి నిర్దిష్టమైన సమాచారం మాకు తెలియదు. చైనా అన్ని రకాలుగా సైబర్ దాడులు, సైబర్ దొంగతనాలను వ్యతిరేకిస్తుంది. వాటికి వ్యతిరేకంగా పోరాడుతుంది’ అని పేర్కొంది. ‘‘అధ్యక్ష ఎన్నికలు అమెరికా దేశీయ వ్యవహారాలు. వాటిపై చైనాకు ఎటువంటి ఉద్దేశ్యం లేదు. అమెరికా ఎన్నికలలో చైనా జోక్యం చేసుకోదు’’ అని రాయబార కార్యాలయ ప్రతినిధి తెలిపారు. ఇక.. ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ ప్రచారంపై హ్యాక్ జరిగింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్లోని ముగ్గురు సభ్యులపై ఆమెరికా ఆరోపణలు చేసింది. వారు నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికలకు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నించారని పేర్కొంది.చదవండి: అడ్వాంటేజ్ డొనాల్డ్ ట్రంప్ -
అమెరికా ఎన్నికల సర్వేలో సూపర్ ట్విస్ట్.. లీడ్లోకి ట్రంప్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ఎన్నికలు గెలుపు ఎవరిది? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. విజయం కోసం ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఇద్దరు అభ్యర్థులు. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ మద్దతు కూడగట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు.. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుపై సర్వేలు ఆసక్తికర ఫలితాలను వెల్లడిస్తున్నాయి.అగ్ర రాజ్యం అమెరికాలో నవంబర్ 5వ తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ మధ్య ఆధిపత్యంపై వాల్ స్ట్రీట్ జర్నల్ చేపట్టిన సర్వేలో కీలక విషయాలను వెల్లడించింది. వీరిద్దరి మధ్య స్వల్ప తేడాతో పోటీ కొనసాగుతోందని స్పష్టం చేసింది. తాజా సర్వే ప్రకారం.. ట్రంప్నకు 47 శాతం, హారీస్కు 45 శాతం మంది ఆదరణ ఉన్నట్టు తెలిపింది. సర్వే మార్జిన్ ప్లస్ లేదా మైనస్ 2.5 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. దీంతో, ట్రంప్ లీడ్లోకి వచ్చినట్టు స్పష్టం చేసింది.ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకోవడం ఇద్దరు అభ్యర్థులు స్వరం పెంచారు. తాజాగా ట్రంప్పై కమల విరుచుకుపడ్డారు. ట్రంప్ అసమర్థుడని, అధ్యక్ష పదవికి కరెక్ట్ కాదని.. ఆయనో నియంత అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో రాజ్యాంగానికి కట్టుబడి ఉండే సైన్యం ట్రంప్కు నచ్చదు. అమెరికా రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని ఆయన చేసిన ప్రతిజ్ఞను గతంలో ఉల్లంఘించారు. గత వారమే తన సహచర అమెరికన్లను అంతర్గత శత్రువులుగా పేర్కొన్నారు అంటూ మండిపడ్డారు. ఇక, తనపై ఆరోపణలకు ట్రంప్ కౌంటరిచ్చారు. ఎన్నికల్లో ఒక వేళ కమలా హారీస్ గెలిస్తే.. అమెరికాలో చైనా ఆడుకుంటుంది. ఆమెకు చిన్న పిల్లను చేసి జిన్పింగ్ గేమ్ ఆడుకుంటారని సెటైర్లు వేశారు. -
ట్రంప్ గెలిస్తే.. పుతిన్ కీవ్లో కూర్చుంటారు: కమల
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే.. చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొవల్సి వస్తుందని ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ హెచ్చరించారు. విస్కాన్సిన్లోని పార్టీ మద్దతుదారులతో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.‘‘డొనాల్డ్ ట్రంప్ ప్రమాదకరమైన వ్యక్తి అని అమెరికా ప్రజలు గుర్తించటం చాలా ముఖ్యమని భావిస్తున్నా. ఇదే విషయాన్ని నేను చాలా బహిరంగంగా చెప్పాను. ట్రంప్ మళ్లీ అమెరికాకు అధ్యక్షుడిగా ఎంపికైతే కలిగే పరిణామాలు చాలా క్రూరంగా ఉంటాయి. నవంబర్ 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. అమెరికా మిత్రపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. ట్రంప్ పొగడ్తలకు సులభంగా తన ఆలోచనలను మార్చుకుంటారు. కోవిడ్ సమయంలో ఆయన ఏం చేశారో అందరికీ తెలుసు. తన వ్యక్తిగత ప్రయోజనం కోసం (రష్యన్ అధ్యక్షుడు) వ్లాదిమిర్ పుతిన్కు రహస్యంగా కోవిడ్ పరీక్షల పరికరాలు పంపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ పదేపదే చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఆయన ఒక రోజులో పరిష్కరిస్తానని చెప్పారు. లొంగిపోవడం ద్వారా అమెరికా ప్రెసిడెంట్ అటువంటి సమస్యను పరిష్కరించాలని అమెరికన్లుగా మనం భావిస్తున్నామని నేను అనుకోను. డోనాల్డ్ ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడైతే వ్లాదిమిర్ పుతిన్ ఏకంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్లో కూర్చుంటారు. ట్రంప్ తనను అభిమానించే వ్యక్తులను సంతోషపెట్టాలని అనుకుంటారు’’ అని అన్నారు. ఇక.. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి సంబంధించి ఇటువంటి వ్యాఖ్యలు ట్రంప్ గంతంలో కూడా చేసిన విషయం తెలిసిందే. -
నా పాలన బైడెన్కు కొనసాగింపుగా ఉండదు: కమల
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే తన అధ్యక్ష పాలన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలను కొనసాగిపు ఉండదని ఉపాధ్యక్షురాలు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిని కమలా హారిస్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంటే ప్రత్యేకంగా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ఏమీ చేయలేదని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘నేను నా జీవిత అనుభవాలు, వృత్తిపరమైన అనుభవాలు,ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా కొత్త ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటాను. నేను అమెరికాలోని కొత్త తరానికి చెందిన నాయకత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా.డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రజలను కించపరచేందుకు, ప్రజల గౌరవాన్ని తగ్గించేందుకు ఇష్టపడే వ్యక్తి’’ అని అన్నారు.Kamala Harris on what she would do differently from Biden’s presidency: “Let me be very clear: My presidency will not be a continuation of Joe Biden's presidency.” pic.twitter.com/zGzgvB9M20— Elizabeth Weibel (@elfaddis) October 16, 2024 ఇక.. ఇప్పటికే కమలా హరీస్ అధ్యక్షురాల గెలిస్తే తన సొంతమార్గం ఎంచుకుంటారని అధ్యక్షడు జో బైడెన్ పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు.. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కోపం ప్రదరిస్తూ అమెరికా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు బాధ్యత వహించకుండా మరోసారి తప్పుకున్నారని డొనాల్డ్ ట్రంప్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.చదవండి: ఐవీఎఫ్ తండ్రిని నేను: డొనాల్డ్ ట్రంప్ -
‘కమల మార్క్ పాలన వేరు’.. బైడెన్ కీలక వ్యాఖ్యలు
న్యూయార్క్: అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిని కమలా హారిస్ గెలిస్తే.. సొంత మార్గాన్ని ఎంచుకుంటారని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంటే ప్రత్యేకంగా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ఏమీ చేయలేదన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ప్రెసిడెంట్ జో బైడెన్ స్పందించారు.‘‘అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ గెలిస్తే.. ఆమె సొంత మార్గాన్ని ఎంచుకుంటారు. ప్రతి ప్రెసిడెంట్ కూడా సొంత మార్గాన్ని మాత్రమే ఎంచుకుంటారు. నేనే కూడా అదే చేశాను. నేను మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు విధేయుడిగా ఉన్నా. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన అడుగుజాడల్లో నడిచాను. కానీ నేను అధ్యక్షుడిగా నా స్వంత మార్గాన్ని ఎప్పుడూ తప్పలేదు. .. నాలాగే కమల కూడా చేస్తారు. ఆమె ఇంతవరకు నాకు విధేయంగా ఉన్నారు. అయితే.. ఆమె అధ్యక్షురాలి గెలిస్తే తన సొంత మార్గాన్ని ఎంచుకుంటారు. అమెరికా ప్రజల సమస్యలపై కమల అలోచన విధానం చాలా కొత్తగా ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ ఆలోచన విధానం పాతది, విఫలమైంది. ఆయన ఆలోచనల్లో ఎటువంటి నిజాయితీ ఉండదు’’ అని అన్నారు. ఇక.. 2009 నుంచి 2017 వరకు ఒబామా ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో జో బైడెన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న విషయం తెలిసిందే.చదవండి: కొరియా దేశాల మధ్య హైఅలర్ట్.. కిమ్ ఆర్మీలోకి భారీ చేరికలు -
రసవత్తర పోరు.. ‘అంకెల్లో’ అమెరికా అధ్యక్ష ఎన్నికలు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు ఎంతో రసవత్తరంగా సాగుతోంది. నవంబర్లో జరగబోయే ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్ది, అగ్ర రాజ్యంలో రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోంది. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన వివరాలు అంకెల్లో చూసుకుంటే..అధ్యక్ష పదవికి ఇద్దరు పోటీఅమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం పలువురు పోటీ పడ్డారు. చివరికి ఎన్నికల బరిలో ఇద్దరు నిలిచారు. వారు డెమోక్రాట్ కమలా హారిస్, రిపబ్లికన్ డోనాల్డ్ ట్రంప్.నవంబర్ ఐదున ఎన్నికలు2024, నవంబర్ 5 ఎన్నికల రోజు. నవంబర్ నెలలో మొదటి సోమవారం తరువాత వచ్చే మంగళవారం నాడు అమెరికాలో సాంప్రదాయకంగా ఎన్నికలు నిర్వహిస్తుంటారు.ఏడు స్వింగ్ స్టేట్స్స్వింగ్ స్టేట్స్ సంఖ్య ఏడు. ఈ రాష్ట్రాల్లో హోరాహోరీ పోరు జరగనుంది. ఈ జాబితాలో అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ ఉన్నాయి. అత్యంత రసవత్తరంగా సాగే అధ్యక్ష ఎన్నికల్లో ఈ రాష్ట్రాలు అత్యంత కీలకం. ఈ జాబితాలోని ఏ రాష్ట్రంలోనైనా కొద్ది ఓట్లు తేడాతో అభ్యర్థులు ఓడిపోయే అవకాశాలుంటాయి.ప్రతినిధుల సభలో 435 స్థానాలు ఖాళీ34 సెనేట్ స్థానాలు కలిగిన ప్రతినిధుల సభలో మొత్తం 435 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ కారణంగా ఓటర్లు అధ్యక్షుడిని ఎన్నిక చేయడమే కాకుండా, కాంగ్రెస్ సభ్యులను కూడా ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. సభలోని సభ్యుల పదవీకాలం రెండేళ్లు. ప్రస్తుతం రిపబ్లికన్లకు మెజారిటీ ఉంది. కమలా హారిస్కు చెందిన డెమోక్రాట్లు విజయంపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. సెనేట్లో ఆరేళ్ల పదవీ కాలానికి 100 సీట్లకు గాను 34 సీట్లు ఖాళీగా ఉన్నాయి. స్వల్పంగా ఉన్న డెమొక్రటిక్ మెజారిటీని తిప్పికొట్టాలని రిపబ్లికన్లు భావిస్తున్నారు.ఓటర్ల గణాంకాలుఅమెరికాలోని ప్రతి రాష్ట్రంలో వేర్వేరుగా ఓటర్ల సంఖ్య ఉంది. సభకు ఎంపికయ్యే వారి సంఖ్య జనాభా ప్రాతిపదికన మారుతుంది. ఉదాహరణకు, గ్రామీణప్రాంతమైన వెర్మాంట్లో కేవలం మూడు ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే ఉన్నాయి. కాగా కాలిఫోర్నియాలో 54 ఓట్లు ఉన్నాయి. 50 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో మొత్తం 538 మంది ఓటర్లు ఉన్నారు.పోల్ వర్కర్ల సంఖ్యప్యూ రీసెర్చ్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం 2020లో అమెరికా ఎన్నికలు సజావుగా జరిగేలా చూడటానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చిన పోల్ వర్కర్ల సంఖ్య 7,74,000. అమెరికాలో మూడు గ్రూపుల ఎన్నికల సిబ్బంది ఉంటారు. వారు ఓటర్లకు సహాయం చేయడం, ఓటింగ్ పరికరాలను ఏర్పాటు చేయడం, ఓటరు ఐడీలను, రిజిస్ట్రేషన్లను ధృవీకరించడం వంటి పనులు చేస్తారు. వీరిని పోల్ వర్కర్లు అని అంటారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వడం లాంటి ప్రత్యేక విధులను నిర్వహించడానికి ఎన్నికల అధికారులు ఉంటారు. బ్యాలెట్ లెక్కింపును పర్యవేక్షించేందుకు రాజకీయ పార్టీలు ఎన్నికల పరిశీలకులను నియమిస్తాయి. 2020లో ఎన్నిక ఫలితాలను అంగీకరించేందుకు నాటి అధ్యక్షుడు ట్రంప్ నిరాకరించిన నేపధ్యంలో ఇప్పుడు బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియపై మరింతగా దృష్టి కేంద్రీకరించనున్నారు.244 మిలియన్ ఓటర్లు2024లో ఓటు వేసేందుకు అర్హులైన అమెరికన్ల సంఖ్య 244 మిలియన్ (ఒక మిలియన్ అంటే 10 లక్షలు)అని ద్వైపాక్షిక పాలసీ సెంటర్ తెలిపింది. వీరిలో ఎంత మంది ఓటు వేస్తారనేది వేచి చూడాలి. 2018, 2022 మధ్యంతర ఎన్నికలు, 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ లేనంత అత్యధిక ఓటింగ్ నమోదైనట్లు ప్యూ రీసెర్చ్ సెంటర్ తెలిపింది. ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయి? -
ట్రంప్ ర్యాలీకి సమీపంలో కలకలం.. గన్లతో వ్యక్తి సంచారం
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ర్యాలీకి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి గన్లతో సంచరించటం కలకలం రేపింది. కాలిఫోర్నియాలోని కోచెల్లాలో నిర్వహించిన ట్రంప్ ర్యాలీ సందర్భంగా ఓ వ్యక్తి రెండు గన్లతో సంచరించాడని ట్రంప్ రక్షణ సహాయకుల బృందం షెరీఫ్ తెలిపింది. అక్రమ షాట్గన్ , లోడ్ చేసిన తుపాకీని స్వాధీనం చేసుకొని ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు రివర్సైడ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఆదివారం ప్రకటించింది.A man was arrested near Trump's rally in Coachella, California, on Saturday and charged with illegal possession of a loaded firearm and high-capacity magazine, according to the Riverside County Sheriff. pic.twitter.com/xFPVdUyMeo— ANI (@ANI) October 14, 2024 ఈ విషయంపై తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. తాము వెంటనే అప్రమత్తమయ్యాయని, ట్రంప్నకు, ర్యాలీకి హాజరైన వారికి గానీ ఎలాంటి ముప్పు వాటిల్లలేదని వెల్లడించారు. గన్లను పట్టుకొని సంచరించిన నిందితుడిని లాస్వెగాస్కు చెందిన వెమ్ మిల్లర్గా పోలీసులు గుర్తించారు. ట్రంప్పై ఇది మూడో హత్యాయత్నంగా అధికారులు అనుమానిస్తున్నారు.‘‘ఈ ఘటనలో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది’ అని అధ్యక్షులు, అధ్యక్ష అభ్యర్థులను రక్షించే కల్పించే ఎఫ్బీఐ, యూఎస్ అటార్నీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. లాస్ వెగాస్కు చెందిన 49 ఏళ్ల వెమ్ మిల్లర్ బెయిల్పై విడుదలయ్యాడని, జనవరి 2న కోర్టు విచారణను ఎదుర్కొంటాడని షెరీఫ్ బృందం తెలిపింది. జూలైలో పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరిగిన ప్రచార ర్యాలీలో ఓ యువకుడు జరిపిన కాల్పుల్లో బుల్లెట్ ట్రంప్ చెవికి తగులుతూ పక్కకు దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ట్రంప్ తృటిలో హత్యాయత్నం నుంచి తప్పించుకున్నారు. అదేవిధంగా సెప్టెంబరులో ఫ్లోరిడాలోని ట్రంప్కు చెందిన పామ్ బీచ్ గోల్ఫ్ కోర్స్ దగ్గర ఆయన్ను హత్య చేయడానికి 58 ఏళ్ల ర్యాన్ వెస్లీ రౌత్ వ్యక్తి రైఫిల్తో సంచరించినట్లు గుర్తించి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.చదవండి: యూఎస్ పౌరులను చంపిన వలసదారులకు మరణ శిక్ష: ట్రంప్ -
కమలా హారిస్ హెల్త్పై డాక్టర్ రిపోర్టు ఇదే..
న్యూయార్క్: అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఆరోగ్యంతో భేషుగ్గా ఉందని ఆమె డాక్టర్ యూఎస్ ఆర్మీ ఫిజిషియన్ జాషువా ఆర్. సిమన్స్ తెలిపారు. కమల ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్ ఇచ్చిన నివేదికను శనివారం వైట్ హౌస్ విడుదల చేసింది.‘‘కమలా హారిస్కు కాలానుగుణంగా వచ్చే అలెర్జీలు, దద్దుర్లు ఉన్నాయి. ఆమె ఇమ్యునైజేషన్లు , నివారణ సంరక్షణ సిఫార్సులు సరిగా ఉన్నాయి. ఆమె ఎప్రిల్నెలలో చేసుకున్న ఫిజికల్ పరీక్ష, సాధారణ రక్త పరీక్షల్లో కూడా ఎటువంటి సమస్య లేదు. కళ్లకు కాంటాక్ట్ లెన్స్లు ధరిస్తారు. విటమిన్ D3 సప్లిమెంట్ తీసుకుంటారు. కొన్ని సమయాల్లో అల్లెగ్రా, నాసల్ స్ప్రే , ఐ డ్రాప్స్తో పాటు అలెర్జీకి మందులను ఉపయోగిస్తారు. .. కమల తీసుకునే ఆహారం చాలా ఆరోగ్యకరమైంది. హారిస్ పొగాకు ఉత్పత్తులు, అల్కాహాల్ తీసుకోరు. ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే అదీకూడా చాలా మితంగా తీసుకుంటారు. అమెరికా అధ్యక్షురాలిగా పనిచేసేందుకు ఆమె చాలా ఫిట్గా ఉన్నారు. విధులు నిర్వహించేందుకు అవసరమైన శారీరక, మానసిక స్థితిని కమల కలిగి ఉన్నారు’’ అని డాక్టర్ సిమన్స్ నివేదికలో వివరించారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్ వైదొలిగి.. ఉపాధ్యక్షురాలు కమలను అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆరోగ్య సమస్యల కారణంగానే అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ వైదొలిగినట్లు గతంలో ఆరోపణలు ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కమలా హారిస్ తన ఆరోగ్యపరిస్థితి గురించి పూర్తి సమాచారాన్ని విడుదల చేశారు.చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయి? -
భారత్లో దిగుమతి సుంకాలు అత్యధికం
వాషింగ్టన్: భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా దిగుమతి సుంకాలు విధించే దేశమని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధ్యక్షుడిగా గెలిస్తే అమెరికాకు భారత్ ఎగుమతులపై తానూ సమానస్థాయిలో పన్నులు విధిస్తానని స్పష్టం చేశారు. విదేశీ వస్తువులపై భారత్లోనే దిగుమతి సుంకాలు అత్యధికమని, అయితే చిరునవ్వుతో పన్నులు విధిస్తుందని తనదైన శైలిలో ముక్తాయించారు.‘అమెరికాను అత్యంత సుసంపన్నం చేయడానికి నా ప్రణాళికలోని ముఖ్యమైన అంశం.. పరస్పర క్రయ విక్రయాలపై సమానస్థాయిలో పన్నులు విధించడం (ఒక దేశం అమెరికా వస్తువులపై ఎంత శాతమైతే పన్ను వేస్తుందో.. అదే స్థాయిలో అమెరికాకు వాటి ఎగుమతులపై పన్ను వేయడం). సాధారణంగా మనం దిగుమతి సుంకాలు వేయం. అధ్యక్షుడిగా ఉండగా నేనే పన్నులు వేసే ప్రక్రియను మొదలుపెట్టా. చైనా 200 శాతం దిగుమతి సుంకం వేస్తుంది. బ్రెజిల్ కూడా భారీగా పన్నులు విధిస్తుంది. అందరికంటే భారత్ అత్యధికంగా వసూలు చేస్తుంది’ అని ట్రంప్ డెట్రాయిల్లో గురువారం ఒక ఆర్థిక విధాన ప్రసంగంలో అన్నారు. అయితే ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించి.. తన మాటల్లోని కాఠిన్యాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ‘భారత్తో మనకు సత్సంబంధాలు ఉన్నాయి. నాకూ అంతే. ముఖ్యంగా నాయకుడు మోదీతో. ఆయన గొప్ప నాయకుడు. చక్కటిపాలన అందిస్తున్నారు. చాలావాటిల్లో చైనా కంటే ఎక్కువగా భారత్ పన్నులు వేస్తుంది. కాకపోతే చిరునవ్వుతో.. భారత్ వస్తువులు కొన్నందుకు ధన్యవాదాలు అని చెబుతారు’ అని ట్రంప్ అన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హార్లీ డేవిడ్సన్ మోటర్సైకిల్ కంపెనీ ప్రతినిధులు తనకిదే విషయం చెప్పారని వివరించారు. -
Donald Trump: అమెరికాకు గౌరవం తెస్తా
పెన్సిల్వేనియా: అవినీతి లేని వ్యవస్థను, అమెరికా విదేశాంగ విధానానికి తిరిగి ‘గౌరవం’ తీసుకొస్తానని రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. నేరాలకు మూలమైన ఓపెన్ బోర్డర్ను మూసేస్తామని హామీ ఇచ్చారు. జూలై 13న తనపై హత్యాయత్నం జరిగిన మళ్లీ పెన్సిల్వేనియాలోని బట్లర్లో శనివారం ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. వేలాదిగా గుమిగూడిన అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య మాట్లాడారు. రాజకీయ ప్రత్యర్థులు తనపై దు్రష్పచారం చేస్తున్నారని, చంపడానికి కూడా ప్రయతి్నంచారని ట్రంప్ ఆరోపించారు. జూలై 13న తనపై హత్యాయత్నం జరిగిన ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘ఓ 15 సెకన్ల పాటు కాలం ఆగిపోయింది. ఓ దుర్మార్గుడు చెడు చేద్దామని ప్రయతి్నంచాడు. కానీ విజయం సాధించలేకపోయాడు’’ అని వ్యాఖ్యానించారు. కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయమవడం, ఒక వలంటీర్ ఫైర్ చీఫ్ మరణించడం తెలిసిందే.చిందేసిన మస్క్ టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ ట్రంప్ ఎన్నికల ర్యాలీలో తొలిసారి కనిపించారు. ఆయనను ట్రంప్ పొగడ్తలతో ముంచెత్తుతూ వేదికపైకి ఆహా్వనించారు. ట్రంప్ మాట్లాడుతుండగా మస్క్ చిందేసి సభికులను అలరించారు. ట్రంప్కు ఓటేయడం కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని చెప్పారు. ట్రంప్ ఓడిపోతే 2024 ఎన్నికలే అమెరికన్లకు చివరివి అవుతాయని హెచ్చరించారు. -
ట్రంప్ ‘ఐ హేట్ టేలర్ స్విప్ట్’ పోస్ట్.. క్యాష్ చేసుకున్న పాప్ స్టార్
అమెరికన్ పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కమలా హారిస్ కి మద్దతుగా నిధులు సేకరిస్తున్నారు. ఐ హేట్ టేలర్ స్విప్ట్ అంటూ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ ను టేలర్ స్విప్ట్ అస్త్రంగా మలుచుకున్నారు. ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా స్విప్టీస్ ఫర్ కమలా అని పిలిచే టేలర్ స్విప్ట్ అభిమానుల సంస్థ కమలా హారిస్ ప్రచారం కోసం 40వేల డాలర్లకు పైగా నిధుల్ని సేకరించినట్లు ప్రకటించింది. అమెరికన్ పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్.. అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థి కమలా హారిస్కి తాను ఓటు వేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే టేలర్ స్విఫ్ట్ నిర్ణయంపై డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. ఐ హేట్ టేలర్ స్విప్ట్ అంటూ తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేశారు. అంతేకాదు హారిస్ కు మద్దతు పలికిన టేలర్ స్విఫ్ట్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అయితే ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ ను ఉపయోగించిన టేలర్ స్విప్ట్ అభిమానులు ఈ భారీ మొత్తంలో నిధులు సేకరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా .. ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ ను మేం ఒక అవకాశంగా మరల్చుకున్నాం. సోషల్ మీడియాలో ట్రంప్ కామెంట్స్ ను ఉపయోగించి ప్రచారం చేశాం. ప్రచారం మంచి ఫలితాల్ని అందించింది.మేము ప్రజల దృష్టిని ఆకర్షించడానికి మీమ్లను ఉపయోగిస్తాము. వాటి అనుగుణంగా నెటిజన్ల భావోద్వేగాల్ని తమకు అనుగుణంగా ఎలా మార్చుకోవాలో తెలుసు. వాస్తవానికి ద్వేషించేవారు ద్వేషిస్తారని మాకు (టేరల్ స్విప్ట్ అభిమానులు)తెలుసు. అలా ద్వేషించేవాళ్ల కంటే మేం ఇంకా మంచి పనులు చేయగలమని తెలుసు అని కమల ఫర్ స్విఫ్టీస్ కమ్యూనికేషన్స్ టీమ్ మెంబర్ కార్లీ లాంగ్ వ్యాఖ్యానించారు. -
Kamala Harris: నవతరం నాయకురాలిని
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంటే తాను భిన్నమైన నేతనని, ‘నవతరం నాయకత్వాన్ని’అందిస్తానని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. మార్పుకు ప్రతినిధిగా అమెరికన్ల ముందు తనను తాను ఆవిష్కరించుకుంటున్న డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ నవంబరు 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్తో తలపడుతున్న విషయం తెలిసిందే. ఫిలడెలి్ఫయాలో శుక్రవారం హారిస్ ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ట్రంప్ విద్వేష, విభజన రాజకీయాలతో అమెరికన్లు విసిగిపోయారన్నారు. తనకు తుపాకీ ఉందని, ఎవరి తుపాకీ హక్కులను తాను హరించాలనుకోవడం లేదని తెలిపారు. ఆసల్ట్ స్టైల్ ఆయుధాలపైనే నిషేధం తప్పనిసరని తాను భావిస్తునన్నారు. బైడెన్కు మీరెలా భిన్నమో చెప్పాలని యాంకర్ బ్రియాన్ టాఫ్ అడగ్గా.. ‘నైనేతే జో బైడెన్ను కాను. నవతరం నాయకత్వాన్ని అందిస్తా’అని కమలా హారిస్ స్పందించారు. గతంలో ఆ నడిచిపోతుందిలే అని తేలికగా తీసుకున్న అంశాలను ఇకపై ఎవరూ నిర్లక్ష్యం చేయలేరన్నారు. పిల్లల సంరక్షణ కోసం తల్లిదండ్రులకు ఇచ్చే చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్ను 6 వేల డాలర్లకు పెంచుతానన్నారు. ఒకరినొకరు వేలెత్తి చూపుకునేలా ప్రొత్సహిస్తున్న నాయకుడిలా (ట్రంప్లా) కాకుండా అమెరికన్లను ఏకతాటిపై నడిపే నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తనకు తెలుసన్నారు. -
మళ్లీ చర్చా.. ఆ చాన్సే లేదు: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్తో మరో డిబేట్లో పాల్గొనబోనని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన బిగ్ డిబేట్లో డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్పై తాను గెలిచానని, ఆమె ఓడిపోయినందునే మరో చర్చ అంటున్నారని తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్లో గురువారం ప్రకటించారు. జూన్లో అధ్యక్షుడు జో బైడెన్తో జరిగిన మొదటి డిబేట్, ఆ తర్వాత హ్యారిస్తో మంగళవారం జరిగిన డిబేట్ను ప్రస్తావిస్తూ ఇక మూడోది ఉండబోదని స్పష్టం చేశారు. గెలుపు తనదేనని, సర్వేలు కూడా అదే చెబుతున్నాయని ట్రంప్ చెప్పారు. కాగా, ప్రధాన మీడియా సంస్థల సర్వేల ఫలితాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. బిగ్ డిబేట్ను చూసిన వారిలో 63 శాతం మంది కమలా హారిస్ గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేయగా, 37 శాతం మంది మాత్రమే ట్రంప్ వైపు మొగ్గు చూపారని సీఎన్ఎన్ సర్వే వెల్లడించిన సంగతి తెలిసిందే. -
USA Presidential Elections 2024: కమలదే పై చేయి
డిబేట్ కోసం ప్రత్యర్థులిద్దరూ ఏబీసీ వేదికపైకి రాగానే హారిసే చొరవ తీసుకుని ట్రంప్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేశారు. తద్వారా ముందే పైచేయి సాధించారు. డిబేట్ చక్కగా సాగాలని ఆమె ఆకాంక్షించగా, ‘హావ్ ఫన్’ అంటూ ట్రంప్ స్పందించారు.గంటా నలభై ఐదు నిమిషాల పాటు సాగిన డిబేట్ ముగిశాక మాత్రం కరచాలనం వంటివేమీ లేకుండానే ఎవరికి వాళ్లు వేదిక నుంచి నిష్క్రమించారు.డిబేట్ పొడవునా హారిస్ పదేపదే ట్రంప్ను ఉడికించే వ్యాఖ్యలు చేశారు. పలు కేసుల్లో ఆయన దోషి అని ఇప్పటికే నిరూపణ అయిందంటూ ఎత్తిచూపారు. ఆయనపై మరెన్నో కేసులు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. ట్రంప్ మాట్లాడుతుండగా పదేపదే నవ్వులు, ప్రశ్నార్థక చూపులతో ఆయన్ను ఒత్తిడిలోకి నెట్టారు.ఈ ఎత్తుగడలన్నీ బాగా ఫలించాయి. హారిస్ ఇలాంటి విమర్శలు చేసినప్పుడల్లా ట్రంప్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఆగ్రహంలో అదుపు తప్పి పదేపదే అబద్ధాలు, అవాస్తవాలు చెప్పారు.ఆఫ్రో అమెరికన్ల ఓట్ల కోసం హారిస్ ఇటీవల ఆమె నల్లజాతి మూలాలను పదేపదే చెప్పుకుంటున్నారన్న తన గత వ్యాఖ్యలపై స్పందించేందుకు ట్రంప్ నిరాకరించారు. హారిస్ మాత్రం పలు సందర్భాల్లో ట్రంప్ చేసిన వివాదాస్పద జాతి వివక్షపూరిత, విద్వేష వ్యాఖ్యలన్నింటినీ ఏకరువు పెట్టారు.వాషింగ్టన్: అంతా అత్యంత ఉత్కంఠతో ఎదురు చూసిన తొలి, బహుశా ఏకైక ప్రెసిడెన్షియల్ డిబేట్లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59)దే పై చేయి అయింది. ఆమె దూకుడు ముందు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (78) వెలవెలబోయారు. మంగళవారం రాత్రి పెన్సిల్వేనియాలో ఏబీసీ వార్తా సంస్థ వేదికగా జరిగిన డిబేట్లో మాజీ అధ్యక్షునిపై హారిస్ ఆద్యంతం స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించారు. దాదాపుగా ప్రతి అంశంలోనూ ట్రంప్ను చిత్తు చేశారు. ఆమె పక్కాగా హోం వర్క్ చేసి వచి్చన తీరు డిబేట్లో అడుగడుగునా కని్పంచింది. తొలుత కాస్త తడబడ్డా డిబేట్ సాగుతున్న కొద్దీ హారిస్ దూకుడు కనబరిచారు. పదునైన పంచ్లతో, టైమ్లీ వన్ లైనర్లతో ఎక్కడికక్కడ ట్రంప్ను ఇరుకున పెట్టారు. ఆర్థిక వ్యవస్థ మొదలుకుని విదేశీ విధానం, వలసలు, అబార్షన్ల దాకా ప్రతి అంశం మీదా చర్చను తను కోరుకున్న దిశగా నడిపించడంలో విజయవంతమయ్యారు. పూర్వాశ్రమంలో లాయర్ అయిన హారిస్ వాదనా పటిమ ముందు ట్రంప్ నిలువలేకపోయారు. చాలావరకు ఆమె ప్రశ్నలకు, లేవనెత్తిన అంశాలకు వివరణలు ఇచ్చుకోవడానికే పరిమితమయ్యారు. తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్లో అధ్యక్షుడు జో బైడెన్ను ట్రంప్ ఓ ఆటాడుకోవడం తెలిసిందే. ట్రంప్ పచ్చి అబద్దాలు చెప్పినా బైడెన్ కనీసం వాటిని వేలెత్తి చూపలేకపోయారు. పైగా ప్రసంగం మధ్యలో పదేపదే ఆగుతూ, పదాల కోసం తడుముకుంటూ, వయోభారంతో వణుకుతూ అభాసుపాలయ్యారు. ఈ దారుణ వైఫల్యంతో చివరికి పోటీ నుంచే బైడెన్ తప్పుకోవాల్సి వచి్చంది. ఆయన స్థానంలో అధ్యక్ష రేసులోకి వచ్చిన హారిస్ మాత్రం తాజా డిబేట్లో ట్రంప్కు చెమటలు పట్టించారు. ‘‘మన దేశాన్ని ఎలా నడపాలన్న ప్రధానాంశంపై ఈ రాత్రి మీరు ఇంతసేపూ రెండు భిన్నమైన వాదనలు విన్నారు. ఒకటి భవిష్యత్తుపై దృష్టి పెట్టిన నా వాదన. రెండోది గతం గురించి మాత్రమే మాట్లాడిన, దేశాన్ని వెనక్కే తీసుకెళ్లజూస్తున్న ట్రంప్ వాదన’’ అంటూ డిబేట్ను అంతే ప్రభావవంతంగా ముగించారు హారిస్.అబార్షన్పై హారిస్ → ట్రంప్ గెలిస్తే అబార్షన్లను నిషేధిస్తూ చట్టం తెస్తారు. → గర్భధారణలు, అబార్షన్లను ప్రభుత్వం వేయి కళ్లతో గమనిస్తుంటుంది. → అమెరికన్ల శరీరాలకు సంబంధించిన కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోరాదన్నదే నా వైఖరి. → ట్రంప్ మాత్రం మహిళల శరీరాలపై హక్కులు ప్రభుత్వాలవేనంటున్నారు.ట్రంప్ → అబార్షన్లపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండాలన్నదే నా విధానం. → అదిప్పటికే అమల్లో ఉంది. కనుక దీనిపై అసలు గొడవ గానీ, భిన్నాభిప్రాయాలు గానీ లేవు. → అంతే తప్ప నేనేమీ అబార్షన్లను నిషేధించబోవడం లేదు. → ఈ విషయంలో హారిస్ చెప్పేవన్నీ అబద్ధాలే.ఎన్నికల ర్యాలీలపైహారిస్ → ట్రంప్ ఎన్నికల ర్యాలీలు ఆద్యంతం పరమ బోరుగా సాగుతున్నాయి.→ జనాన్ని ఆకట్టుకునేలా మాట్లాడటంలో ఆయన ఘోరంగా విపలమవుతున్నారు. → విండ్ మిల్లుల వల్ల క్యాన్సర్ వస్తుంది వంటి కామెంట్లతో అభాసుపాలవుతున్నారు. → ట్రంప్ ప్రసంగం వినలేక జనం మధ్యలోనే వెళ్లిపోతున్నారు.ట్రంప్ → అన్నీ శుద్ధ అబద్ధాలు. బైడెన్–హారిస్ విధానాలతో అమెరికా అన్ని రంగాల్లోనూ కుదేలవుతోంది. అందుకే అమెరికన్లు పాత రోజులను కోరుకుంటున్నారు.→ దాంతో నా ర్యాలీలకు జనం పోటెత్తుతున్నారు. → వాటికి అమెరికా చరిత్రలోనూ అపూర్వమైన ఆదరణ దక్కుతోంది. → హారిస్ తన ర్యాలీలకు డబ్బులిచ్చి జనాన్ని రప్పించుకుంటున్నారు.ఆర్థిక వ్యవస్థపైట్రంప్: ఈ విషయంలో నేనేం చేయబోతున్నదీ అందరికీ తెలుసు. నా హయాంలో కరోనా కల్లోలాన్ని తట్టుకుంటూ అమెరికా ఆర్థిక వ్యవస్థను గొప్పగా మలిచా. దాన్ని మరోసారి చేసి చూపిస్తా. పన్నులకు భారీగా కోత పెడతా. హారిస్ మార్క్సిస్టు. మార్క్సిస్టు తండ్రి నుంచి పాఠాలు నేర్చుకున్నారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థిక విధానాల్లో ఆమె ఇప్పుడు నా భాషనే మాట్లాడుతున్నారు. కానీ గెలిచారంటే మాత్రం దేశాన్ని సర్వనాశనం చేస్తారు. బైడెన్కు, ఆమెకు తేడా లేదు. హారిస్: నేను బైడెన్నూ కాను, ట్రంప్ను అంతకన్నా కాను. ఈ విషయంలో నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. దేశానికి కొత్త తరం నాయకత్వాన్ని అందిస్తా. ఉత్త మాటలే తప్ప నిజానికి ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచేందుకు ట్రంప్ వద్ద ఎలాంటి ప్రణాళికా లేదు. తన క్షేమం తప్ప ఆయనకు మీరెవరూ పట్టరు. మధ్యతరగతి నేపథ్యం నుంచి వచి్చన నాకు ఆర్థికంగా దేశానికి ఏం కావాలో బాగా తెలుసు.వలసలపైట్రంప్ సరిహద్దుల నుంచి లక్షలాది మంది చొరబడుతున్నారంటే వలసల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న హారిసే ప్రధాన కారణం. వాళ్లు మన పెంపుడు జంతువులను కూడా తినేస్తున్నారు. ఈ చొరబాట్లు అమెరికాకు చాలా చేటు చేస్తాయి.హారిస్ ట్రంప్ వల్లే వలసల బిల్లు బుట్టదాఖలైందని విమర్శించడం మినహా ఈ అంశంపై పెద్దగా ఏమీ మాట్లాడలేదు. వలసదారులు పెంపుడు జంతువులను తింటున్నారన్న ట్రంప్ వ్యాఖ్యలపై అమెరికన్లే పెదవి విరుస్తున్న నేపథ్యంలో వాటిపై వ్యూహాత్మక మౌనం పాటించారు.యుద్ధాలు, విదేశీ వ్యవహారాలపై... ట్రంప్ → నేను గెలిస్తే ఉక్రెయిన్ యుద్ధానికి ఒక్క రోజులో ముగింపు పలుకుతా. నేను ప్రెసిడెంట్గా ఉంటే యుద్ధం జరిగేదే కాదు. (ఉక్రెయిన్ గెలవాలనుకుంటున్నారా అన్న మోడరేటర్ల ప్రశ్నకు బదులు దాటవేశారు. పైగా యుద్ధానికి మిలియన్ల మంది బలయ్యారని అవాస్తవాలు చెప్పారు) → 2021లో అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సైన్యం వైదొలగడం దేశ చరిత్రలోనే అత్యంత సిగ్గుచేటైన సందర్భం. → ఇజ్రాయెల్ను హారిస్ ద్వేషిస్తారు. హారిస్ గెలిస్తే రెండేళ్లలోనే ఇజ్రాయెల్ సర్వనాశనం ఖాయం. అరబ్బులన్నా ఆమెకు ద్వేషమే.హారిస్ → అఫ్గాన్ నుంచి వైదొలగాలన్న బైడెన్ నిర్ణయం నాటి పరిస్థితుల్లో పూర్తిగా సబబే. ట్రంప్ తాలిబన్లతో అత్యంత బలహీన ఒప్పందం చేసుకున్నారు.→ నియంతలంటే ట్రంప్కు మహా ఆరాధన.→ నేను ఇజ్రాయెల్ను ద్వేషిస్తానన్నది పచ్చి అబద్ధం. యూదు రాజ్యాన్ని మొదటినుంచీ సమర్థిస్తున్నా. అక్టోబర్ 7 దాడి తర్వాత ఇజ్రాయెల్కు స్వీయరక్షణకు అన్ని హక్కులూ ఉన్నాయి. కానీ అమాయక పాలస్తీనియన్లు భారీ సంఖ్యలో యుద్ధానికి బలవుతున్నారన్నది కూడా వాస్తవమే. కనుక యుద్ధం తక్షణం ఆగాలి. కాల్పుల విరమణ, బందీల విడుదలే అందుకు మార్గం. దానికోసం కృషి చేస్తా.2020 ఎన్నికల ఫలితాలపైట్రంప్: వాటిలో నిజమైన విజేతను నేనే. క్యాపిటల్ హిల్ భవనంపై దాడితో నాకు సంబంధం లేదు. హారిస్: అమెరికా చరిత్రపై చెరగని మచ్చ ఏదన్నా ఉంటే అది కాపిటల్ హిల్పై దాడే. దాన్ని మర్చిపోయి ముందుకు సాగాలి. ట్రంప్పై హారిస్ పంచ్లు → ట్రంప్ ఓ బలహీన నాయకుడు. తప్పుడు నేత. ఆయన్ను చూసి ప్రపంచ దేశాధినేతలంతా నవ్వుతున్నారు. → అధ్యక్ష పదవికి ట్రంప్ కళంకమని ఆయనతో కలిసి పని చేసిన సైనిక ఉన్నతాధికారులే అంటున్నారు. → ట్రంప్ అంటేనే అబద్ధాలు, అభూత కల్పనలు. ఈ డిబేట్లో కూడా ఆయన చేసేదదే. → ట్రంప్ ఎంతసేపూ తన గురించే మాట్లాడతారు. ప్రజలు ఆయనకు అసలే పట్టరు. దేశానికి కావాల్సింది ప్రజల కోసం పాటుపడే నాయకుడే తప్ప ట్రంప్ వంటి స్వార్థపరుడు కాదు. → ఆయన 2020 ఎన్నికల్లో ఓడిపోయారు. 8.1 కోట్ల మంది ఆయనకు అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసన పలికారు (బైడెన్కు ఓటేసిన వారి సంఖ్యను ఉటంకిస్తూ). దాన్ని ట్రంప్ ఇప్పటికీ అస్సలు జీరి్ణంచుకోలేకపోతున్నారు.హారిస్కే 63 శాతం మంది ఓటు → డిబేట్లో ట్రంప్ను హారిస్ చిత్తు చేశారని సీఎన్ఎన్ వార్తా సంస్థ నిర్వహించిన ఫ్లాష్ పోల్లో 63 శాతం మంది పేర్కొన్నారు! → ట్రంప్కు బాగా అనుకూలమని పేరున్న ఫాక్స్ న్యూస్ కూడా డిబేట్ విజేత హారిసేనని అంగీకరించడం విశేషం. → చర్చకు వేదికైన ఏబీసీ న్యూస్ అభ్యర్థులిద్దరి వ్యాఖ్యలు, ప్రకటనలను లైవ్లో అప్పటికప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేసింది.ట్రంప్ చెప్పిన వాటిలో చాలావరకు అవాస్తవాలేనని తేలడం విశేషం. -
ట్రంప్ అమెరికాను చైనాకు అమ్మేశారు : హారిస్
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలి ప్రత్యక్ష డిబేట్ జరిగింది. ఈ డిబేట్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ, గర్భవిచ్ఛిత్తి అంశం, ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం,ఉక్రెయిన్పై రష్యా యుద్ధంతో పాటు ఇతర అంశాలపై చర్చ జరిగింది. డిబెట్లో ట్రంప్-హారిస్ల మధ్య మాటలు తూటాల్లా పేలాయి. అధ్యక్షుడిగా ట్రంప్ పాలనలో జరిగి తప్పిదాలను ప్రధాన అంశంగా చర్చిస్తూ హారిస్ పైచేయి సాధించారు. డిబెట్లో ఏబీసీ న్యూస్ యాంకర్లు డేవిడ్ ముయిర్,లిన్సే డేవిస్..ఆర్థిక వ్యవస్థ, కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో చెప్పాలంటూ హారిస్ను ప్రశ్నించారు. అందుకు హారిస్ ముందుగా పేదరికం గురించి మాట్లాడారు. తనని అమెరికా అధ్యక్షురాలిగా గెలిస్తే.. పేదరికంపై దృష్టిసారిస్తామని చెప్పారు. చిరు వ్యాపారాల్ని ప్రోత్సహిస్తామన్నారు. చిరు వ్యాపారం చేసే వారికి అండగా నిలుస్తాం. అందుకు వద్ద ప్రణాళికలు ఉన్నాయి’అని వాటి గురించి వివరించారు. అదే సమయంలో హారిస్..ట్రంప్ను టార్గెట్ చేశారు. ఒకానొక దశలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేసిన ఘోర తప్పిదాల్ని ప్రాస్తావిస్తూ ట్రంప్ను ఉక్కిరి బిక్కిరి చేశారు. మేం పేదలకు అండగా ఉంటే ట్రంప్ మాత్రం ధనికులకు, కార్పొరేట్ కంపెనీలకు అండగా నిలుస్తారు. ట్యాక్స్ కూడా తగ్గిస్తారు’ అని మండిపడ్డారు.అమెరికాను చైనాకి అమ్మేశారు : హారిస్అమెరికాను నెంబర్వన్గా నిలపడమే లక్ష్యం. తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ దేశాన్ని సమస్యల్లో వదిలేశారు. ప్రజాస్వామ్యంపై దాడి చేశారు. అమెరికా ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీశారు. దేశాన్ని చైనాకు అమ్మేశారు. ఇప్పటికే ట్రంప్ చేసిన తప్పుల్ని బైడెన్ నేనూ సరిచేశాం. అలాంటి ట్రంప్ మళ్లీ ఎన్నికైతే అమెరికాకు చిక్కులు తప్పువంటూ హారిస్ హెచ్చరించారు.జోబైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ట్రంప్ నాశనం చేసిన ఆర్ధిక వ్యవస్థ తిరిగి గాడిలోకి పెట్టామంటూ నాటి ఆర్థిక పరిస్థితుల్ని ప్రస్తావించగా..డొనాల్డ్ ట్రంప్కు ఎలాంటి ప్రణాళికలు లేవనన్నారు. ట్రంప్ ఏం మారలేదు ఆ తర్వాత ట్రంప్ సైతం కమలా హారిస్కు ధీటుగా బదులిచ్చారు. జోబైడెన్ ప్రభుత్వంలో రికార్డ్ స్థాయిలో పెరిగాయంటూ వ్యాఖ్యానిస్తుండగా.. హారిస్ అడ్డుతగిలారు. చూశారా? ట్రంప్ ఏం మారలేదు. అవే అబద్ధాలు. అవే మోసాలు. చెప్పిన అబద్దాల్ని పదే పదే చెబుతున్నారు. ప్రజల అంచనాలకు తగ్గట్లుగా వాదనల్ని వినిపించాలి. అలా కాకుండా ప్రజల్ని మోసం చేసేలా అవే పాత వ్యూహాలు, అబద్దాలు చెప్పడం.. ట్రంప్ వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రతిబింబిస్తున్నాయి.గర్భవిచ్ఛిత్తిపై.. ఇటీవలి కాలంలో అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గర్భవిచ్ఛిత్ (అబార్షన్)సహా పలు అంశాలు చర్చకు వచ్చాయి. డిబేట్ జరిగే సమయంలో ఇరువురు నేతలు పరస్పరం ఆరోపణలు, విమర్శలు గుప్పించుకున్నారు. అమెరికాలో గర్భవిచ్ఛిత్తిపై నిషేధాన్ని హారిస్ తప్పుబట్టారు. ఆ ప్రక్రియను అనుమతిస్తూ ‘రో వర్సెస్ వేడ్’ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పునకు మద్దతిస్తున్నట్లు చెప్పారు. మహిళల అభివృద్ధి ట్రంప్నకు గిట్టదు. అబార్షన్లపై ఆయన నిషేధం విధించాలనుకుంటున్నారు. ఇది మహిళలను అవమానించడమే’ అని హారిస్ అన్నారు.ఇదీ చదవండి : బీజేపీ అధ్యక్షుడి కుమారుడి కారు బీభత్సంఇజ్రాయెల్కే మా మద్దతుడిబేట్లో గాజాలో జరుగుతున్న ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంపై హారిస్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేయగా.. ఆమె అధ్యక్షురాలిగా ఉంటే సాధ్యం కాదంటూ ట్రంప్ విమర్శలు గుప్పించారు. హారిస్ ఇజ్రాయెల్తో పాటు అరబ్లను ద్వేషిస్తున్నారు’ అని అన్నారు. అందుకు హారిస్ కలగజేసుకుని.. ట్రంప్ చేస్తున్న వాదనలు నిజం కాదు. ఇజ్రాయెల్కు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మీ మద్దతు ఎవరికి ఉక్రెయిన్ యుద్ధంపై హారిస్ స్పందిస్తూ.. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నట్లైతే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఉండేవారు. పుతిన్ కీవ్లో కూర్చుని పోలాండ్తో ప్రారంభించి యూరప్లోని మిగిలిన ప్రాంతాలపై దృష్టి సారిస్తూ ఉండేవారు అని అన్నారు. యుద్ధంలో రష్యాపై ఉక్రెయిన్ విజయ సాధించాలని కోరుకుంటున్నారా? అని డిబేట్లో ట్రంప్ను ఏబీసీ యాంకర్లు ప్రశ్నించారు. అందుకు ట్రంప్ నేరుగా సమాధానం ఇవ్వలేదు. అయితే యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డెమోక్రటిక్, రిపబ్లికన్ అభ్యర్థులు కమలాహారిస్ , డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలి టీవీ డిబేట్ అమెరికా వార్తాసంస్థ ఏబీసీ న్యూస్ ఫిలడెల్ఫియాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్లో నిర్వహించింది. అమెరికా కాలమాన ప్రకారం రాత్రి 9.00 గంటలకు ప్రారంభం కాగా.. భారత్ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం సుమారు 6.30 గంటల సమయంలో ప్రారంభమైంది. ఇక డిబెట్ జరిగే న్యూస్ స్టూడియోలో ప్రేక్షకులు ఎవ్వరూ లేదు. ఏబీసీ న్యూస్ యాంకర్లు డేవిడ్ ముయిర్, లిన్సే డేవిస్ చర్చకు కోఆర్డినేటర్లుగా ఉన్నారు. 90 నిమిషాల పాటు జరిగిన ఈ డిబేట్లో రెండు సార్లు స్వల్ప విరామం ఇచ్చారు. డిబేట్ చివరలో చెరో రెండు నిమిషాలు ముగింపు ప్రసంగం చేసేందుకు అనుమతిచ్చారు. -
నేను గెలిస్తే.. వాళ్లు జైలుకే: డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ఓవైపు హోరాహోరీగా దూసుకువెళ్తోంది. మరోవైపు.. సెప్టెంబర్ 10న జరిగే డిబేట్కు ఇరు పార్టీల అభ్యర్థులు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ‘ఎక్స్’ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షుడిగా గెలిస్తే.. ఎన్నికల సమయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడినవారిని జైలుకు పంపుతానని హెచ్చరించారు.‘నేను గెలిస్తే మోసం, అధ్యక్ష ఎన్నికల సమయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడినవాళ్లు చట్టపరంగా పూర్తిస్థాయిలో విచారణ ఎదుర్కొంటారు. అంతే కాకుండా దోషులుగా తెలితే.. దీర్ఘకాల జైలు శిక్షలు కూడా అమలు చేస్తాం. ఈ విషయంలో మాత్రం న్యాయ ప్రక్రియలో ఎటువంటి దుర్వినియోగం జరగనివ్వను. కచ్చితంగా కఠినమైన శిక్షలను అమలు చేస్తాం. దయచేసి జాగ్రత్త వహించండి.. ఈ చట్టపరమైన చర్యలు అందరికీ వర్తిస్తాయి. న్యాయవాదులు, రాజకీయ నాయకులు, దాతలు, అక్రమ ఓటర్లు, అవినీతి ఎన్నికల అధికారులకు వర్తిస్తుంది. ఇంతకుముందు చూడని విధంగా అక్రమాలకు పాల్పడినవాళ్లను వెతికిమరీ విచారించి, శిక్షలు విధిస్తాం’’ అని ట్రంప్ అన్నారు. ఎన్నికల వేళ ట్రంప్ చేసిన హెచ్చరికలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.CEASE & DESIST: I, together with many Attorneys and Legal Scholars, am watching the Sanctity of the 2024 Presidential Election very closely because I know, better than most, the rampant Cheating and Skullduggery that has taken place by the Democrats in the 2020 Presidential…— Donald J. Trump (@realDonaldTrump) September 8, 2024ట్రంప్ హెచ్చరిక వ్యాఖ్యల ప్రకారం ఆయన రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే కచ్చితమైన అధ్యక్ష కార్యాలయాన్ని ప్రతీకారం తీర్చుకోవటం కోసమే వినియోగించుకుంటారేమో అని రాజకీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక.. 2020 అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించేందుకు అక్రమ, మోసపూరిత చర్యలకు పాల్పడినట్లు ఆధారాలు లభించకపోవటం గమనార్హం. గత ఎన్నికల్లో ట్రంప్ ఆయన అమలు చేసిన పరిపాన విధానాల వల్లే ఓడిపోయారని కోర్టులు, రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధికారులు పేర్కొన్న విషయం తెలిసిందే. -
ప్చ్.. డిబేట్లో కమలను ఓడించడం కష్టం!
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పోటాపోటీగా దూసుకుపోతున్నారు. సెప్టెంబర్ 10వ తేదీ ఈ ఇద్దరి మధ్య జరగబోయే డిబేట్ కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు ఎస్తోంది. తాజాగా ఈ డిబేట్పై కమలా హారిస్ భర్త డగ్లస్ ఎంహోఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమలా హారిస్తో ట్రంప్ డిబేట్ సమీపిస్తున్న నేపథ్యంలో మీ స్పందన ఏమిటని మీడియా అడిగిన ప్రశ్నకు డగ్లస్ ఎమ్హోఫ్ మాట్లాడారు. ‘ఇప్పటివరకు మా మధ్య జరిగే చర్చలు, వాదనల్లో నేను ఒక్కసారి కూడా గెలవలేదు. ఆమె చాలా గొప్ప డిబేటర్. ఫస్ట్ క్లాస్ ట్రయల్ లాయర్’ అని అన్నారు. కమలా హారిస్ రాజకీయాల్లోకి రాకముందు హారిస్ దంపతులు న్యాయవాదులుగా పని చేశారు. హారిస్ శాన్ ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా, కాలిఫోర్నియా అటార్నీ జనరల్గా విధులు నిర్వర్తించారు.ఇక.. ఏబీసీ న్యూస్ సెప్టెంబర్ 10న రాత్రి 9 గంటలకు ఉపాధ్యక్షురాలు హారిస్కు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అధ్యక్ష ఎన్నికల రెండో డిబేట్ను నిర్వహించనుంది. ఇరునేతలు ముఖాముఖి డిబేట్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఫిలడెల్ఫియాలోని జాతీయ రాజ్యాంగ కేంద్రంలో ఈ డిబేట్ జరుగుతుంది. తొలి డిబేట్లో అధ్యక్షుడు జో బైడెన్పై ట్రంప్ పైచేయి సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఎన్నికల నుంచి తప్పుకోవాలని సొంత పార్టీ నేతలే డిమాండ్ చేయటంతో వైదొలిగారు. అనంతరం అధ్యక్ష బరిలో దిగిన ఉపాధ్యక్షురాలు కమల ప్రస్తుతం ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. -
‘కమల గెలిస్తే.. భారత్, అమెరికా సంబంధాలు అస్థిరం’
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు ఇండో అమెరికన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎప్పటికప్పుడు ట్రంప్పై కమల పైచేయి సాధిస్తూనే ఉన్నారు. ఇండో-అమెరికన్లు అధికంగా ఉండే పలు రాష్ట్రాలోని ఓటర్లు కమలకు అనుకూలంగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు.. తాజాగా ‘‘హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్’’ అనే సంస్థ తమ పూర్తి మద్దతును మాజీ ప్రెసిండెంట్ డొనాల్డ్ ట్రంప్నకు ప్రకటించింది. అంతేకాకుండా కీలకమైన రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, జార్జియా , నార్త్ కరోలినాలో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్కు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉత్సవ్ సందుజా తెలిపారు. కమల అమెరికా అధ్యక్ష ఎన్నికల గెలుపొందితే.. భవిష్యత్తులో భారత-అమెరికా సంబంధాలు అస్థిరంగా మారుతాయని వ్యాఖ్యానించారు.‘‘కమల అమెరికా ప్రెసిడెంట్ అయితే పలు కీలకమైన పదువుల్లో ఆమె నియమించే వ్యక్తుల వల్ల ఆసియా-అమెరికా ఓటర్లపై తీవ్ర ప్రభావం ఎదుర్కొనున్నారు. ఇప్పటికే ప్రెసిడెంట్ జోబైడె ప్రభుత్వం దేశసరిహద్దు భద్రత, వలసదారులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వలసలు పెరగటం వల్ల క్రైం రేటు పెరిగింది. మైనార్టీలు ముఖ్యంగా ఆసియా-అమెరికా వ్యాపారులు ప్రతికుల ప్రభావాలు ఎదుర్కొటుంన్నారు’ అని అన్నారు.‘‘డొనాల్డ్ ట్రంప్ మాత్రం వలస విధానాలు అమలు చేయటంలో పక్కాగా ఉంటారని తెలిపారు. భారత్ నుంచి రక్షణ, టెక్నాలజీ, సహకారం పెంచుకోవటంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ట్రంప్ భారత అనుకూలవాది. భారత్ ప్రధాని నరేంద్ర మోదీతో సంబంధాలను పెంపొందించుకోగలిగారు. భారత్ ప్రధాని నరేంద్ర మోదీతో అద్భుతమైన సంబంధాన్ని పెంపొందించుకోగలిగారని, చైనాపై భారత్ను ఢీకొనేందుకు వీలుగా అనేక రక్షణ ప్రాజెక్టులకు సహకరించారు. చైనాను భారత్ ఢీకొనేందుకు వీలుగా అనేక రక్షణ ప్రాజెక్టులకు సహకరించారు. భారత ప్రభుత్వం, ప్రజల గురించి కమల అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్ మాత్రం భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. భారత్-అమెరికా సంబంధాలకు కమల అస్థిరత కలిగిస్తారు’’ అని అన్నారు. -
కమల ‘యాస’పై ట్రంప్ బృందం ట్రోల్స్
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. నువ్వా-నేనా అన్నట్లు మాజీ అధ్యక్షుడు రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. కమలా హారిస్పై ఇప్పటికే ట్రంప్, ఆయన ప్రచార బృందం పలు ఆరోపణలు, విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కమల మాట్లాడిన ‘యాస’పై కూడా ట్రంప్ ప్రచార బృందం పెద్దఎత్తున ట్రోల్ చేస్తోంది. ఆమె నకిలీ యాసతో ప్రసంగం చేసినట్లు ఆరోపణలు గుప్పిస్తోంది. కమల ప్రచారంలో భాగంగా మిచిగాన్లోని డెట్రాయిట్ స్కూల్లో ఏర్పాటు చేసిన లేబర్ డే ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. అయితే ఆమె అక్కడి టీచర్లు, యూనియన్ సభ్యులను ఉద్దేశిస్తూ.. ‘వారంలో ఐదు రోజుల పని. సిక్ లీవు, వేతనంతో కూడిన సెలవు, వెకేషన్ కోసం సెలవు ఇస్తున్న యూనియన్ మెంబర్స్కు మీరంతా కృతజ్ఞతలు తెలిపాలి’ అని అన్నారు.She’s turned into Foghorn Leghornpic.twitter.com/Z1OgJwh6Ht pic.twitter.com/xdXmiAYvEK— mjcmedic (@mjcmedic) September 2, 2024 అయితే ఆమె ఉద్దేశపూర్వకంగానే నకిలీ యాసతో మాట్లాడారని ట్రంప్ ప్రచారం బృందం సోషల్మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తోంది. కొంతమంది లూనీ ట్యూన్స్ పాత్ర అయిన ఫోఘోర్న్ లెఘోర్న్తో ఆమె యాసను పోల్చుతున్నారు. ఇక.. కమలా హారిస్ యాసపై విమర్శలు రావటం ఇదే మొదటిసారి కాదు. 2021లో అట్లాంటాలో ఓ ర్యాలీలో పాల్గొని మాట్లానప్పుడు యాసపై ఆమె విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పుడు ఏకంగా ఆమె ఫ్రెంచ్ యాసలో మాట్లాడారని ఆరోపణలు చేశారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ను పేరును అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించినప్పటి నుంచి ఆమెపై ట్రంప్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. జాత్యహంకార విమర్శలు మొదలుకొని ఆమె నవ్వుపై కూడా విమర్శలు చేశారు. ఇక.. ఇండో అమెరికన్ అయిన కమల కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో జన్మించారు. కమల తల్లి భారతీయురాలు కాగా, ఆమె తండ్రి జమైకన్ అన్న విషయం తెలిసిందే. -
ట్రంప్ వారిని అవమానించారు : కమలా హారిస్
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్లింగ్టన్ నేషనల్ స్మశానవాటిక సందర్శన చర్చనీయాంశంగా మారింది. సైనికుల స్మశానవాటిక సందర్శన వీడియోలు, ఫొటోలను ట్రంప్ బృందం అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి వినియోగించుకోవటంపై ఉపాధ్యక్షురాలు, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ తీవ్రంగా ఖండించారు. ఆఫ్ఘనిస్తాన్లో మరణించిన పలువురు యూఎస్ సైనికుల పవిత్రమైన స్థలాన్ని ట్రంప్ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారామె.‘‘ ఆర్లింగ్టన్ నేషనల్ స్మశానవాటిక.. అమెరికన్ హీరోలను గౌరవించటానికి పవిత్రమైన ప్రదేశం. రాజకీయాలకు సంబంధించిన స్థలం కాదు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ సైనికుల పవిత్రమైన స్థలాన్ని అవమానించారు. పోలిటికల్ స్టంట్ కోసం ట్రంప్ ఇలా చేశారు. ఇలా చేయటం ట్రంప్కు కొత్త కాదు. ఆయన దేశ సైనికులను ఓడిపోయినవారని పేర్కొన్నారు. ఇలా ఆయన ఎందుకు అన్నారో నాకు అర్థం కావటం లేదు. మెడల్ ఆఫ్ హానర్ గ్రహీతలను అవమానించారు. తనకు తాను సేవ చేసుకోవటం తప్ప మరొకటి తెలియని వ్యక్తి ట్రంప్. అమెరికన్లుగా మనమంతా ఏకీభవించాల్సిన విషయం ఏమిటంటే..దేశానికి సేవచేసిన అనుభవజ్ఞులు, సైనికులు, వారి కుటుంబ సభ్యులను గౌరవించాలి. ఎప్పుడూ అవమానించరాదు. అత్యున్నత గౌరవం, కృతజ్ఞత ఇచ్చేలా చూడాలి. సైనికుల త్యాగాన్ని నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. వారికి సంతాపం తెలియజేస్తున్నా. వారిని ఎప్పుడూ రాజకీయల కోసం ఉపయోగించుకోను’’ అని కమల అన్నారు.As Vice President, I have had the privilege of visiting Arlington National Cemetery several times. It is a solemn place; a place where we come together to honor American heroes who have made the ultimate sacrifice in service of this nation.It is not a place for politics.And…— Kamala Harris (@KamalaHarris) August 31, 2024 సోమవారం ఆర్లింగ్టన్ నేషనల్ స్మశానవాటికను ట్రంప్ సందర్శించారు. ఆఫ్ఘనిస్తాన్లో మరణించిన పలువురు యూఎస్ సైనికులకు ఆయన నివాళులు అర్పించి, మృతుల కుటుంబసభ్యులతో ఫొటోలు దిగారు. అయితే అది కేవలం ప్రచారం కోసమే ట్రంప్ యూఎస్ సైనికులకు నివాళులర్పించేందుకు వచ్చారని యూఎస్ ఆర్మీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆర్మీ ఆరోపణలను ట్రంప్ తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం స్మశానవాటిను సందర్శించలేదని తెలిపారు. తాను ఎన్నికల్లో గెలవడానికి అలాంటి ప్రచారం అవసరం లేదని పేర్కొన్నారు. -
Kamala Harris: ట్రంప్ శకం ముగిసింది!
వాషింగ్టన్: అమెరికా రాజకీయాల్లో ట్రంప్ శకం ముగిసిందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అభిప్రాయపడ్డారు. ఆయన్ను దాటి ప్రగతిబాటన ముందుకు సాగేందుకు అమెరికా ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థ్ధి అయిన ట్రంప్ది దేశాన్ని విభజించే ఎజెండా అని ఆరోపించారు. తన రన్నింగ్మేట్ టిమ్ వాల్జ్తో కలిసి గురువారం సీఎన్ఎన్ చానల్కు హారిస్ ఇంటర్వ్యూ ఇచ్చారు. డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థగా ఖరారయ్యాక ఆమె ఇచి్చన తొలి ఇంటర్వ్యూ ఇదే. వలసలు, వాతావరణ మార్పులతో పాటు చమురు వెలికితీత వంటి పలు అంశాలపై తన వైఖరిలో వచి్చన మార్పులను హారిస్ పూర్తిగా సమరి్థంచుకున్నారు. తాను మొదటినుంచీ పాటిస్తూ వచి్చన విలువల్లో మాత్రం ఇప్పటికీ, ఎప్పటికీ ఏ మార్పూ లేదని స్పష్టం చేశారు. తాను ప్రెసిడెంట్ అయితే రిపబ్లికన్ నేతకు ప్రభుత్వంలో స్థానం కల్పిస్తానని హారిస్ ప్రకటించారు. తద్వారా తాను అమెరికన్లందరికీ ప్రెసిడెంట్నని నిరూపిస్తానన్నారు. తన భారత, జమైకా మూలాలపై ట్రంప్ చేస్తున్న ఆరోపణలపై స్పందించేందుకు ఇష్టపడలేదు. దక్షిణాసియా వ్యక్తిగా చెప్పుకునేందుకు ఇష్టపడే హారిస్ అధ్యక్ష ఎన్నికల్లో లబ్ధి కోసం హఠాత్తుగా తన నల్లజాతి మూలాలను గురించి మాట్లాడుతున్నారని ట్రంప్ ఇటీవల పదేపదే ఆరోపిస్తుండటం తెలిసిందే. మెక్సికో నుంచి అక్రమ వలసలు అమెరికన్ల భద్రతకు ప్రధాన సమస్యేనని హారిస్ అన్నారు. వాటిపై కఠినంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. గాజా తదితరాలపై బైడెన్ విధానాలను కొనసాగిస్తానని ఆమె వెల్లడించారు. బైడెన్ ఫోన్ చేసిన వేళ... పోటీ నుంచి తప్పుకోవాలని అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించుకున్నాక ఆ విషయం తనకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి తెలిపారని హారిస్ వెల్లడించారు. ‘‘నేనప్పుడు నా కుటుంబీకులతో సరదాగా గడుపుతున్నా. పాన్కేకులు తినడం ముగించి పజిల్ సాల్వ్ చేస్తుండగా బైడెన్ ఫోన్ చేసి ఈ మాట చెప్పారు. నిజమేనా అని ఒకటికి రెండుసార్లు అడిగా. ఆయన అవునన్నారు. తన స్థానంలో నేనే అభ్యర్థి కావాలని స్పష్టంగా చెప్పారు’’ అని గుర్తు చేసుకున్నారు. -
మళ్లీ అవే నిబంధనలతో కమలతో డిబేట్కు సిద్ధం: ట్రంప్
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 10న అధ్యక్ష అభ్యర్థులు కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య జరగబోయే డిబేట్పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ డిబెట్పై ట్రంప్ స్పందిస్తూ.. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్తో డిబెట్ కోసం ఒప్పదం కుదుర్చుకున్నట్లు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో వెల్లడించారు.‘కామ్రేడ్ కమలా హారిస్తో సెప్టెంబర్ 10న ఫిలడెల్ఫియాలో జరిగే డిబేట్ కోసం నేను రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్లతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాను. ఈ డిబేట్ ఏబీసీ ఫేక్ న్యూస్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అయితే న్యూస్ సంస్థ మాత్రం చాలా అన్యాయమైంది’ అని అన్నారు. నిబంధనల విషయంలో ట్రంప్ ఈ డిబేట్ను రద్దు చేస్తారని వార్తలు వెలుడిన ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం చేసిన వ్యాఖ్యలపై ప్రాధాన్యత సంతరించుకుంది. జూన్ 27 సీఎన్ఎన్లో తాను, అధ్యక్షుడు జో బిడెన్తో తలపడిన డిబేట్ నియమాలే.. కమలతో జరిగే డిబేట్లో ఉంటాయని తెలిపారు. వాటిని తాను పాటించడానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నానని తెలిపారు.‘‘సీఎన్ఎన్ డిబేట్ నిబంధనలే ఉంటాయి. అయితే ఈ నిబంధనలు ప్రెసిడెంట్ జో బైడెన్కు మినహా అందరికీ బాగా అనిపించాయి. డిబేట్లో అభ్యర్థులు నిలబడి మాట్లాడుతారు. అభ్యర్థులు నోట్స్ లేదా షీట్లు తీసుకురావటం ఉండదు. ఇక.. ఈ డిబేట్ న్యాయమైన చర్చగా ఉంటుందని ఏ పక్షానికి ముందుగానే ప్రశ్నలు ఇవ్వటం జరగదని ఏసీబీ ద్వారా మాకు హామీ ఇచ్చింది’’ అని పేర్కొన్నారు. -
Kamala Harris: ట్రంప్ వస్తే వినాశనమే
షికాగో: రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ను ’ఏ మాత్రం సీరియస్నెస్ లేని వ్యక్తి’గా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అభివర్ణించారు. ‘పొరపాటున ఆయన మళ్లీ అధ్యక్షుడైతే అంతులేని వినాశనమే. దేశాన్ని ట్రంప్ అన్ని రంగాల్లోనూ పూర్తిగా వెనక్కు తీసుకెళ్తారు‘ అంటూ అమెరికన్లను హెచ్చరించారు. డెమొక్రాట్ల జాతీయ కన్వెన్షన్లో గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) చివరి రోజు పార్టీ తరఫున అధ్యక్ష అభ్యరి్థత్వాన్ని ఆమె లాంఛనంగా స్వీకరించారు. ‘జాతి, లింగ, భాషా భేదాలకు అతీతంగా, తమ కలల సాకారానికి అహరహం శ్రమిస్తున్న అమెరికన్లందరి తరఫున ఈ నామినేషన్ను స్వీకరిస్తున్నా‘ అంటూ కరతాళ ధ్వనుల నడుమ ప్రకటించారు. ఈ సందర్భంగా అత్యంత భావోద్వేగ పూరితంగా ప్రసంగించారు. నవంబర్ 5న జరగబోయే అధ్యక్ష ఎన్నికలను అమెరికా చరిత్రలోనే అత్యంత కీలకమైనవిగా హారిస్ అభివరి్ణంచారు. ‘నన్ను గెలిపిస్తే పార్టీ భేదాలు తదితరాలకు అతీతంగా, అమెరికన్లందరి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తా. దేశ మౌలిక విలువలను, సూత్రాలను సమున్నతంగా నిలబెడతా. రాజకీయంగా, సైనికంగా సూపర్ పవర్గా అమెరికా స్థానాన్ని అన్నివిధాలా సుస్థిరం చేస్తా. అమెరికన్ల ప్రయోజనాల పరిరక్షణకు శక్తివంచన లేకుండా పోరాడతా. గత పాలన తాలూకు విద్వేషాలు, విభజనవాదాలను రూపుమాపి దేశాన్ని ఒక్కటి చేస్తా‘ అని ప్రకటించారు. 59 ఏళ్ల హారిస్ వేదిక మీదకు వస్తుండగా పార్టీ ప్రతినిధులు కరతాళ ధ్వనులతో హోరెత్తించారు. పలు అంశాలను స్పృశిస్తూ 40 నిమిషాల పాటు ఏకధాటిగా సాగిన ఆమె ప్రసంగానికి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఆమె మాట్లాడుతున్నంతసేపూ, ’ఎస్, యూ కెన్ (నువ్వు సాధించగలవ్)’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. గురువారమే హారిస్ పదో పెళ్లి రోజు కూడా కావడం విశేషం. హిల్లరీ క్లింటన్ తర్వాత డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న రెండో మహిళగా ఆమె నిలిచారు. అమెరికా చరిత్రలో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న తొలి భారత, ఆఫ్రికన్ మూలాలున్న నేత హారిసే. ఆమె గెలిస్తే అగ్రరాజ్యానికి తొలి అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టిస్తారు.ట్రంప్పై నిప్పులు ట్రంప్పై హారిస్ తన ప్రసంగంలో నిప్పులు చెరిగారు. ఏ కోణంలో చూసినా ఆయన అత్యంత నాన్ సీరియస్ వ్యక్తి అని దుయ్యబట్టారు. ట్రంప్ హయాంలో దేశంలో అయోమయం, గందరగోళమే రాజ్యం చేశాయన్నారు. చివరికి ఓటమిని ఒప్పుకోకుండా పార్లమెంటు మీదికే అల్లరిమూకలను ఉసిగొలి్పన చరిత్ర ఆయనదని దుయ్యబట్టారు. హష్ మనీ మొదలుకుని ఫ్రాడ, లైంగిక వేధింపుల దాకా నానారకాల ఆరోపణలు, లెక్కలేనన్ని కోర్టు కేసులు ఎదుర్కొంటున్న విచి్ఛన్నకర శక్తిగా ట్రంప్ను అభివరి్ణంచారు. ‘ట్రంప్ రష్యాకు అన్ని అరాచకాలకూ లైసెన్సు ఇచ్చారు. అమెరికా మిత్రదేశాలపై దండెత్తేలా ప్రోత్సహించారు‘ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనను మళ్లీ గెలిపిస్తే కేవలం తనకోసం, తన బిలియనీర్ మిత్రుల ప్రయోజనాల కోసమే పాటుపడతారని దుయ్యబట్టారు. ‘నేనలా కాదు. అమెరికన్లందరి కోసం పోరాడతా. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ లాంటి నియంతలను ట్రంప్ మాదిరిగా నేను ఉపేక్షించను. అమెరికాను ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైనిక శక్తిగా తీర్చిదిద్దుతా. సైనికులు, వారి కుటుంబాల త్యాగాలను ట్రంప్లా ఎన్నటికీ కించపరచను‘ అని చెప్పారు. గాజా యుద్ధాన్ని ఆపేందుకు బైడెన్తో కలిసి నిరంతరం కృషి చేస్తున్నట్టు చెప్పారు. అదే సమయంలో ఇజ్రాయెల్ ఆత్మరక్షణకు సర్వ హక్కులూ ఉన్నాయని కుండబద్దలు కొట్టారు.కోర్టు హౌస్ నుంచి వైట్ హౌస్ దాకా... అనూహ్య ప్రస్థానాలు అలవాటేఅధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంతో అత్యంత అనూహ్యంగా తాను అధ్యక్ష రేసులోకి వచి్చన వైనాన్ని హారిస్ ప్రస్తావించారు. ఇలాంటి అనూహ్య ప్రస్థానాలు జీవితంలో తనకు కొత్తేమీ కాదన్నారు. అమెరికాను తిరిగి ఐక్యం చేసి నూతన దిశానిర్దేశం చేసే సత్తా ఉన్న నేతగా తనను తాను పరిచయం చేసుకున్నారు. కోర్టు హౌస్ నుంచి ఇప్పుడు వైట్ హౌస్కు పోటీపడే దాకా తన జీవనయానం ఆద్యంతం ఆసక్తికరంగా సాగిందన్నారు. ‘ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్య దేశ ఘన చరిత్రకు వారసులం మనం. అమెరికా అంటే అనంతమైన అవకాశాలకు, అంతులేని ప్రేమకు, అపరిమితమైన స్వేచ్ఛకు ఆలవాలమని ప్రపంచానికి మరోసారి చాటుదాం‘ అని అమెరికన్లకు పిలుపునిచ్చారు.తల్లీ నిన్ను తలంచి.. తన తల్లి శ్యామలా గోపాలన్ను ఈ సందర్భంగా హారిస్ గుర్తు చేసుకున్నారు. ఆమెను రోజూ మిస్సవుతున్నానని చెప్పారు. ముఖ్యంగా అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రధానమైన గాజుతెరను బద్దలు కొట్టే ప్రయత్నంలో ఉన్న ఈ సమయంలో అమ్మ మరీ మరీ గుర్తొస్తోందని చెప్పారు. ఆమె నూరిపోసిన విలువలే తనను నడిపిస్తున్నాయని చెప్పారు. ఏ పనీ సగంలో వదలొద్దని తల్లి తనకు మరీ మరీ చెప్పేదని గుర్తు చేసుకున్నారు. ‘నా తల్లి కేవలం 19 ఏళ్ల వయసులో సప్త సముద్రాలు దాటి ఎన్నో కలలతో భారతదేశం నుంచి అమెరికాలో అడుగు పెట్టింది. ఒక సైంటిస్టుగా రొమ్ము క్యాన్సర్కు మందు కనిపెట్టడమే లక్ష్యంగా శ్రమించింది. ఉన్నది ఐదడుగులే అయినా అనంతమైన ఆత్మవిశ్వాసం ఆమె సొంతం. భారత్ తిరిగి వెళ్లి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆ సమయంలో జమైకా నుంచి వచి్చన మా నాన్న డొనాల్డ్ హారిస్తో అమ్మకు పరిచయమైంది. అది ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. నన్నూ, చెల్లెలు మాయను అమ్మే పెంచింది. ఈస్ట్ బేలో అద్దెకు తీసుకున్న ఒక చిన్న ఫ్లాట్లో ఉండేవాళ్లం. శ్రామిక తరగతి వ్యక్తుల నడుమ పెరిగాం. అమ్మ రోజంతా పనిచేస్తే మా బాగోగులు ఇరుగుపొరుగు చూసుకునే వాళ్లు‘ అంటూ వారిని పేరుపేరునా హారిస్ గుర్తు చేసుకున్నారు. ‘వాళ్లంతా మాకు రక్త సంబం«దీకులు కాకున్నా ప్రేమ బాంధవులు. కలసికట్టుగా నెగ్గడం ఎలానో వారి మధ్య పెరగడం వల్లే నేర్చుకున్నా‘ అన్నారు. ‘ఈ క్షణం అమ్మ పైనుంచి నన్ను కచి్చతంగా నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఉంటుంది‘ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రిని కూడా ఈ సందర్భంగా ఆప్యాయంగా స్మరించుకున్నారు. -
‘కమల గెలిస్తే.. మూడో ప్రపంచ యుద్ధం ఖాయం’
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తనపై హత్యాయత్నం జరిగిన అనంతరం తొలిసారి బహిరంగ సభలో బుల్లెట్ ప్రూఫ్ రక్షణ గ్లాస్ వెనక నుంచి మాట్లాడారు. నార్త్ కరోలినా ఎన్నికల ర్యాలీలో పాల్గొన ట్రంప్ మరోసారి డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్పై విమర్శలు గుప్పించారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో కమల గెలుస్తే.. మూడో ప్రపంచ యుద్ధం రావటం ఖాయమన్నారు. ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ‘‘మీ(ప్రజలు) జీవితకాలపు పొదుపు చేసుకున్న డబ్బు మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. కమల అత్యంత ర్యాడికల్ భావాలు కలిగి ఉన్న వ్యక్తి. ఆమె గెలిస్తే.. అమెరికాలో మిలియన్ల ఉద్యోగాలు రాత్రికిరాత్రే ఊడిపోతాయి.నేను మీకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికాను చిన్నచూపు చూడన్విలేదు. ఆ విషయం మిగతా ప్రపంచదేశాధి నేతలకు కూడా తెలుసు. వచ్చే ఎన్నికల్లో కామ్రేడ్ కమల గెలిస్తే మాత్రం.. మూడో ప్రపంచ యుద్ధం జరగట ఖాయం’అని అన్నారు. అదేవిధంగా ఒక్కసారి ట్రంప్ ప్రసంగం ఆపేసి డాక్టర్ను పిలిచారు. ర్యాలిలో పాల్గొన్న ఒకరు నీరంగా ఉండటం గమనించి ట్రంప్ వైద్యం సాయం అందించాలని అన్నారు. ‘‘ఇక్కడ చాలా వేడిగా ఉంది. నేను గమనించాను. చాలా మంది ప్రజలు ఇక్కడికి రావడానికి రోజుల తరబడి వేచి ఉన్నారు. కాబట్టి నేను అర్థం చేసుకున్నాను. డాక్టర్ వారికి వైద్యసాయం అందించండి’ అని అన్నారు. -
Michelle Obama: అత్యంత అర్హురాలు హారిసే
షికాగో: ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకు నేతృత్వం వహించేందుకు అత్యంత అర్హురాలు, సమర్థురాలు కమలా హారిసేనని దేశ మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా అభిప్రాయపడ్డారు. ‘‘చాలామంది సగటు అమెరికన్ల మాదిరిగానే కమలా హారిస్ది కూడా మధ్యతరగతి నేపథ్యం. అక్కడినుంచి ప్రతి దశలోనూ నిరంతరం కష్టించి ఎదిగారు. తనను తాను మలచుకుంటూ ఉపాధ్యక్షురాలి స్థాయికి చేరుకున్నారు. అందుకే ఆమె కథ మీ కథ. నా కథ. మెరుగైన జీవితం కోసం కలలుగంటున్న అమెరికన్లందరి కథ!’’ అంటూ కొనియాడారు. షికాగోలో జరుగుతున్న డెమొక్రాట్ల జాతీయ కన్వెన్షన్లో మంగళవారం ఆమె ఆద్యంతం స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. హారిస్ రాకతో అమెరికాకు మెరుగైన భవితపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ‘‘అమెరికన్లందరికీ ఎదుగుదలకు అవకాశాలు దక్కేలా కమల నిరంతరం కృషి చేశారు. దేశం పట్ల తన నిబద్ధతను అలా చాటుకున్నారు. అంతే తప్ప ట్రంప్ మాదిరిగా జాతులపై విద్వేషం చిమ్మడం ద్వారానో, వ్యక్తులపై బురదజల్లడం ద్వారానో కాదు’’ అని రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యరి్థపై మిషెల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ట్రంప్ ప్రపంచం పట్ల విశాల దృష్టి లేని కురచ వ్యక్తి. బాగా చదువుకున్న, నిరంతరం కష్టించే స్వభావమున్న నల్లజాతీయులను చూస్తే ఆయనకు భయం’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘నన్ను, నా భర్త (మాజీ అధ్యక్షుడు) ఒరాక్ ఒబామాను ట్రంప్ ఎప్పుడూ ఆయన రాజకీయ మనుగడకే పెను ముప్పుగానే చూశారు. మేం అత్యంత విజయవంతమైన నల్లజాతి వ్యక్తులం కావడమే అందుకు కారణం’’ అని చెప్పుకొచ్చారు. కనుక హారిస్పై కూడా ట్రంప్ జాతి విమర్శలు, తప్పుడు ప్రచారాలు చేయడం ఖాయమన్నారు. వాటన్నింటినీ అమెరికన్లు తిప్పికొడతారని, హారిస్ను ప్రెసిడెంట్గా ఎన్నుకుని చరిత్ర సృష్టిస్తారని జోస్యం చెప్పారు. అయితే, ‘‘ఈసారి అధ్యక్ష ఎన్నిక అత్యంత హోరాహోరీగా సాగడం ఖాయం. చాలా రాష్ట్రాల్లో అతి తక్కువ ఓట్ల తేడాతో ఫలితాలు తారుమారు కావచ్చు. అందుకే భారీ సంఖ్యలో తరలిరండి. పార్టీ అభిమానాలను, రాగద్వేషాలను పక్కన పెట్టి కేవలం మీ మనస్సాక్షి ప్రకారం నడచుకోండి. అమెరికన్లు ప్రాణప్రదంగా భావించే స్వేచ్ఛను, మానవత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, హుందాతనాన్ని నిలబెట్టే హారిస్కే ఓటేయండి’’ అని అమెరికన్లకు పిలుపునిచ్చారు. ట్రంప్ రూపంలో మరో నాలుగేళ్ల అస్తవ్యస్త పాలనను నెత్తిన రుద్దుకునేందుకు అమెరికన్లు సిద్ధంగా లేరని, హారిస్ను ప్రెసిడెంట్గా ఎన్నుకుని కొత్త చరిత్ర సృష్టించనున్నారని బరాక్ ఒబామా అన్నారు. నల్లవాళ్లంటే ట్రంప్కు చులకన నల్లవాళ్లంటే ట్రంప్కు బాగా చిన్నచూపంటూ మిషెల్ మండిపడ్డారు. అసహ్యకరమైన స్త్రీ విద్వేష, జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం ఆయన నైజమన్నారు. ‘‘అందుకే ఆయన అమెరికా అధ్యక్షునిగా ఉన్న నాలుగేళ్ల కాలంలో నల్లజాతీయులంటే అందరికీ భయం కలిగించేందుకు ఎంతగానో ప్రయతి్నంచారు. నల్లజాతీయులు చేసే ఉద్యోగాలను బ్లాక్ జాబ్స్ అంటూ చులకనగా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ అర్రులుచాస్తున్న అమెరికా అధ్యక్ష పదవి కూడా బ్లాక్ జాబేనని ఆయనకు ఎవరు చెప్పాలి!’’ అంటూ ఎద్దేవా చేశారు. అమెరికా చరిత్రలో తొలి నల్లజాతి అధ్యక్షునిగా బరాక్ ఒబామా చరిత్ర సృష్టించడం తెలిసిందే.మా తల్లులు నేరి్పందదే ‘‘హారిస్ తల్లి, నా తల్లి సప్త సముద్రాలకు చెరోవైపున పుట్టి ఉండొచ్చు. కానీ వాళ్లు నిత్యం విశ్వసించిందీ, మాకు నిరంతరం నేరి్పంది ఒక్కటే. వ్యవస్థను విమర్శించే బదులు దాన్ని సరిచేసేందుకు మన వంతుగా శక్తివంచన లేకుండా కృషి చేయాలని’’ అని మిషెల్ అన్నారు. మిషెల్ ప్రసంగానికి డెమొక్రాట్ ప్రతినిధులంతా మంత్రముగ్ధులయ్యారు. ఆమె మాట్లాడటం ముగించిన చాలాసేపటిదాకా చప్పట్లతో అభినందించారు.హారిస్, నేను అలా కలిశాం: డగ్లస్ అమెరికన్లందరూ గరి్వంచేంత గొప్ప ప్రెసిడెంట్గా హారిస్ చరిత్రలో నిలిచిపోతారని ఆమె భర్త డగ్లస్ ఎమోఫ్ అభిప్రాయపడ్డారు. తనను తాను అమెరికా చరిత్రలో తొలి ‘సెకండ్ జంటిల్మన్ (ఉపాధ్యక్షురాలి భర్త)’గా సభకు పరిచయం చేసుకుని ఆకట్టుకున్నారు! 2013లో ఒక క్లయింట్ మీటింగ్ సందర్భంగా కమలతో తాను బ్లైండ్ డేట్కు వెళ్లడం, అది ప్రేమగా మారి, పెళ్లిగా పరిణమించిన వైనాన్ని ఆసక్తికరంగా వివరించారు. తొలి భార్యతో తనకు కలిగిన సంతానం కూడా కమలను ప్రేమగా మొమలా అని పిలుస్తారని డగ్లస్ వివరించారు. -
బైడెన్కు జీవితాంతం రుణపడి ఉంటా: కమల
న్యూయార్క్: తాను జీవితాంతం అధ్యక్షుడు జో బైడెన్కు రుణపడి ఉంటానని అమెరికా అధ్యక్ష ఎన్నిక డెమొక్రాటిక్ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల నేపథ్యలో చికాగోలో నాలుగు రోజుల పాటు జరనున్న డెమోక్రటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్ సమావేశాల్లో తొలిరోజు కమల మాట్లాడారు. అమెరికాకు జీవితకాలం సేవ చేసినందుకు జో బైడెన్కు కృతజ్ఞతలు తెలిపారు.‘మీ (జో బైడెన్) నేతృత్వంలో ఈ సమావేశాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ చారిత్రాత్మక నాయకత్వం, అమెరికాకు జీవితకాలం మీరు సేవ చేసినందుకు ధన్యవాదాలు. మేము మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. అమెరికాలోని నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చారు. వారందరి తరఫున వచ్చే నవంబర్లో మేమంతా ఒకే గళాన్ని వినిపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి నుంచి మనమంతా ఒక్కటే గుర్తు చేసుకుందాం. పోరాడినప్పుడు మనమే విజయం సాధిస్తాం’ అని అన్నారు.Democratic Convention erupts into cheers for Vice President Kamala Harris pic.twitter.com/94KB236X4F— Kamala HQ (@KamalaHQ) August 20, 2024 నాలుగు రోజుల పాటు జగిగే ఈ సమావేశాల్లో చిరవరి రోజు (ఆగస్ట్ 22) అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున కమలా హారిస్, ఆమె రన్నింగ్మేట్ మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ను అధ్యక్షుడు, ఉపాధ్యక్ష అభ్యర్థులుగా డెమొక్రాటిక్ పార్టీ నామినేట్ చేయనుంది. అధ్యక్షడు జో బైడెన్.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా తన డిప్యూటీ (కమల) సమర్థిస్తూ ప్రారంభ ప్రసంగంలో మాట్లాడతారని పార్టీ వర్గాలు భావిస్తున్నారు. ఆయన ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.Vice President Harris: In November, we will come together and declare as one voice we are moving forward with optimism, hope, and guided by love of country pic.twitter.com/inLuiUKQUM— Kamala HQ (@KamalaHQ) August 20, 2024 -
అలా మాట్లాడేది పిరికివాళ్లే.. ట్రంప్కు కమల కౌంటర్
న్యూయార్క్: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తనపై వ్యక్తిగత విమర్శలు చేయడంపై డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హరిస్ స్పందించారు. పిరికివాళ్లే అలా మాట్లాడుతారని ఆమె ట్రంప్పై విమర్శలు గుప్పించారు. తన రన్నింగ్మేట్ టిమ్ వాజ్తో కలిసి కమలా హారిస్ పెన్సిల్వేనియా ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. ‘ఇటీవలి కాలంలో రాజకీయాల్లో వక్రబుద్ధి కన్పిస్తోంది. ఎదుటివారిని దెబ్బ కొట్టడం అనేది ఒక నాయకుడి చతురత మీద ఆధారపడి ఉంటుంది. ఇతరులను తక్కువ చేసి చేసి మాట్లాడే వారంతా పిరికివాళ్లే. అలా మాట్లాడేది పిరికివాళ్లే’ అని ట్రంప్కు కమల కౌంటర్ ఇచ్చారు.ఆదివారం పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్ పాల్గొని కమలపై తీవ్ర విమర్శలు చేశారు. ‘చూడటానికి కమల కంటే నేను చాలా బాగుంటాను. ఆమెతో పోల్చితే.. నేను మంచిగా ఉంటానని భావిస్తున్నా. తెలివితేటలు గల వ్యక్తిగా కనిపిస్తాను’అని అన్నారు. ‘‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’’లో కమల అందాన్ని వర్ణిస్తూ కాలమిస్ట్ పెగ్గీ నూనన్ ఓ వ్యాసాన్ని రాశారు. అయితే వ్యాసాన్ని ఉద్దేశించి ట్రంప్.. ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. భిన్న ధ్రువాలు.. విభిన్న వైఖరులుఅలాగే.. రిపబ్లికన్ సెనేట్ అభ్యర్థి డేవిడ్ మెక్కార్మిక్ను ఉద్దేశించి.. ‘‘డేవిడ్.. దయచేసి స్త్రీని అందంగా ఉన్నారని ఎప్పుడూ పొగడకండి. ఎందుకంటే అది మీ రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతుంది’’ అని అన్నారు. టైమ్ మ్యాగజైన్ కవర్పై కమలా ఫొటోను ప్రస్తావిస్తూ.. అందులో ఉన్నది హీరోయిన్లు సోఫియా లోరెన్ లేదా ఎలిజబెత్ టేలర్ అనుకున్నానని సెటైర్లు వేశారు. -
నేను ఓడిపోతే ఆ దేశంలో కలుద్దాం.. ట్రంప్ వ్యాఖ్యలు వైరల్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇద్దరు ప్రధాన అభ్యర్థులు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోతే అమెరికాను వీడుతానని చెప్పుకొచ్చారు. వెనిజులాకు వెళ్లిపోతానని అన్నారు.కాగా, అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ను ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏదైనా జరిగి నేను ఓడిపోతే అమెరికాను వీడుతాను. మనం మళ్లీ వెనిజులాలో కలుద్దాం అంటూ మస్క్తో ట్రంప్ అన్నారు. ఎందుకంటే.. అమెరికా కంటే వెనిజులా సురక్షితమైన ప్రాంతం. మీరు కూడా అక్కడికి రండి.. ఇద్దరం కలిసి డిన్నం చేద్దాం అని చెప్పారు.ఇదే సమయంలో బైడెన్ సర్కార్పై సెటైరికల్ కామెంట్స్ చేశారు. వెనిజులాలో ప్రమాదకరమైన నేరస్థులను కూడా జైళ్ల నుంచి విడుదల చేస్తున్నారు. అనంతరం, వారిని అమెరికాకు అక్రమంగా వలస పంపిస్తున్నారు. అందుకే అక్కడ నేరాల రేటు బాగా తగ్గింది. అదే సమయంలో అమెరికాలో క్రైమ్ రేటు బాగా పెరిగిందన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మరో కామెంట్ కూడా చేశారు. తాను ఎన్నికల్లో గెలిస్తే అక్రమ వలసలను అడ్డుకుంటానని అన్నారు. అమెరికాలోకి అక్రమ వలసలను అడ్డుకోవడమే తన లక్ష్యం అని చెప్పుకొచ్చారు. ఇక, ట్రంప్ వ్యాఖ్యలపై డెమోకట్రిక్ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోతున్నట్టు తెలుసుకున్నారని కామెంట్స్ చేశారు. ఓటమిని ఒప్పుకున్నారు కాబట్టే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. -
ట్రంప్కు పుతిన్ భయపడ్డారా?
న్యూయార్క్: అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో దేశంపై యుద్ధం చేయలేదని రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి, సెనేటర్ జేడీ వాన్స్ అన్నారు. ఆయన ఆదివారం సీబీఎస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైనా, రష్యాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాను పోటీదారుగా, ప్రత్యర్థిగా గుర్తిస్తూ ఆ దేశాన్ని ఎదుర్కొవడానికి గల బలమైన అంతర్జాతీయ ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేయాలని తమ పార్టీ కోరుకుంటుందని అన్నారు. చైనాను నిరోధించగల అంతర్జాతీయ ఫ్రేమ్వర్క్ను ఏర్పాటే మా టార్గెట్గా భావిస్తున్నాం. మేము చైనాతో యుద్ధానికి చేయకూడదని అనుకుంటున్నాం. కానీ ఖచ్చితంగా చైనా మకు విరోధి దేశమే. ఆ విషయం చైనీయులకు కూడా తెలుసు. చైనా టన్నుల కొద్దీ ఫెంటానిల్ను తయారు చేస్తుందిని, అమెరికాలోకి అనుమతిస్తున్నారు. అయితే డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ఈ విషయంలో ఏమీ చేయలేదని అన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ కార్మికులతో కూడిన శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ అమెరికాకు ఉంది. చైనాను వాణిజ్యపరంగా ఎదుర్కొవల్సి వస్తే.. పోరాడి గెలుస్తాం. కానీ కమలా హారిస్ చేసిన పనిని మేము చేయలేము. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మంచి సంబంధాలను కలిగి ఉన్నందుకు కమలా హారిస్తో సహా డెమోక్రాట్లు డొనాల్డ్ ట్రంప్పై దాడి చేశారనే విషయం మనం గుర్తుంచుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, వ్లాదిమిర్ పుతిన్ మరో దేశంపై యుద్ధం చేయలేదని వాన్స్ అన్నారు. -
USA Presidential Elections 2024: ట్రంప్ హత్యకు కుట్ర!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యరి్థ డొనాల్డ్ ట్రంప్ను హత్య చేయడానికి జరిగిన కుట్రను ఎఫ్బీఐ అధికారులు అడ్డుకున్నారు. ట్రంప్తోపాటు మరికొందరు రాజకీయ నాయకులను, ప్రభుత్వ ఉన్నతాధికారులను అంతం చేయడానికి స్కెచ్ వేసిన పాకిస్తాన్ పౌరుడు అసిఫ్ మర్చెంట్(46)ను జూలై 12న అరెస్ట్ చేశారు. అతడిపై హత్య కేసు నమోదుచేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అసిఫ్ మర్చెంట్కు ఇరాన్ ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్నారు. న్యూయార్క్లోని బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో అధికారులు సమరి్పంచిన పత్రాలతో ఈ విషయం వెలుగులోకి వచి్చంది. జూలై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్ నగరంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్న ట్రంప్పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ట్రంప్పై తుపాకీతో కాల్పులు జరిపిన 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్తో అసిఫ్కు ఎలాంటి సంబంధం లేదని ఎఫ్బీఐ అధికారులు స్పష్టంచేశారు. ట్రంప్తోపాటు ఇతర పెద్దలను హత్య చేయడానికి అసిఫ్ నియమించుకున్న కిరాయి హంతకుడే అధికారులకు ఉప్పందించి, అతడిని చట్టానికి పట్టివ్వడం గమనార్హం. -
USA Presidential Elections 2024: అమెరికాకు అర్హుడైన ఉపాధ్యక్షుడు
ఫిలడెల్ఫియా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగిన కమలా హారిస్ ప్రచారం ముమ్మరం చేశారు. మంగళవారం పెన్సిల్వేనియాలో భారీ ప్రచార సభలో మాట్లాడారు. తన ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్ వాల్జ్ను దేశ ప్రజలకు పరిచయం చేశారు. ఆయన ఉన్నత స్థాయికి ఎదిగిన తీరును వివరించారు. ఆయన కేవలం గవర్నర్ మాత్రమే కాదు, అంతకుమించి ఎంతో గొప్ప వ్యక్తి అని చెప్పారు. అమెరికా ప్రగతి కోసం, ప్రజల సౌభాగ్యం కోసం తాము కలిసి పని చేయబోతున్నామని వెల్లడించారు. అమెరికాకు అన్నివిధాలా అర్హుడైన ఉపాధ్యక్షుడు టిమ్ వాల్జ్ అని ప్రశంసించారు. కమలా హారిస్ మాట్లాడిన అనంతరం టిమ్ వాల్జ్ ప్రసంగం ప్రారంభించారు. జనం చప్పట్లు, కేకలతో హర్షామోదాలు వ్యక్తం చేశారు. మనకు మరో 91 రోజులపాటు సమయం మాత్రమే ఉందని, ఎన్నికల్లో విజయం మనదేనని ధీమా వ్యక్తం చేశారు. అవిశ్రాంతంగా కష్టపడి పనిచేద్దామని పిలుపునిచ్చారు. మరణించిన తర్వాతే మనకు నిద్ర అని వ్యాఖ్యానించారు. మరోవైపు ఏబీసీ న్యూస్ సర్వేలో ఆసక్తికరమైన అంశం బయటపడింది. వాల్జ్ ఎవరో తమకు ఇప్పటిదాకా పెద్దగా తెలియదని ప్రతి 10 మందిలో 9 మంది చెప్పారు. ఉపాధ్యక్ష అభ్యరి్థగా పేరు ఖరారైన తర్వాతే ఆయనెవరో తెలిసిందని అన్నారు. -
USA Presidential Elections 2024: ఫాక్స్ డిబేట్కు రాను: కమల
వాషింగ్టన్: ఫాక్స్ న్యూస్ చానెల్లో డిబేట్కు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ తోసిపుచ్చారు. నిజానికి అధ్యక్షుడు జో బైడెన్ ఆ పార్టీ అభ్యర్థిగా ఉండగా ఆయనతో సెప్టెంబర్ 10న ఏబీసీ చానల్లో రెండో డిబేట్కు ట్రంప్ అంగీకరించారు. అనంతరం బైడెన్ బదులు హారిస్ అభ్యర్థి అవడం తెలిసిందే. ఏబీసీ బదులు ఫాక్స్ న్యూస్ చానల్లో సెప్టెంబర్ 4న డిబేట్కు సిద్ధమని ట్రంప్ శనివారం ప్రకటించారు. దీన్ని హారిస్ తప్పుబట్టారు. ‘‘ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధమన్న ట్రంప్ ఇప్పుడేమో ఫలానా సమయంలో, ఫలానా చోటే అనడం ఆశ్చర్యకరం. అంగీకరించిన మేరకు సెప్టెంబర్ 10న ఏబీసీ న్యూస్లో చర్చకు నేను సిద్ధం. ఆయన పాల్గొంటారని ఆశిస్తున్నా’’ అన్నారు. డిబేట్కు ట్రంప్ భయపడుతున్నారని హారస్ ప్రచార బృందం వ్యాఖ్యానించింది. ఆయన తమాషాలు మానుకోవాలని హితవు పలికింది. -
మొదటి భార్యను మోసం చేశా: కమలా హారిస్ భర్త
న్యూయార్క్: అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ భర్త డగ్లస్ ఎంహోఫ్ తన మొదటి భార్యను మోసం చేశానని అన్నారు. అయితే డగ్లస్ ఎంహోఫ్ గతంలో తన ఇద్దరు పిల్లలు చదివే ప్రైవేట్ స్కూల్ టీచర్తో వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని బ్రిటిష్ మీడియా ఓ నివేదిక వెల్లడించింది. ఆ మహిళ ప్రెగ్నెంట్ అయ్యిందని.. అయితే గర్భాన్ని ఉంచుకోలేదని పేర్కొంది.దీనిపై తాజాగా డగ్లస్ ఎంహోఫ్ స్పందించారు. ‘నా మొదటి వివాహం తర్వాత నా చర్యలతో నేను, కెరిస్టిన్ చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాం. దీనికి నేను పూర్తి బాధ్యత వహించాను. తర్వాత మేము ఇద్దరం కుటుంబం కోసం మా బంధాన్ని బలంగా నిలుపుకున్నాం. నేను నా మొదటి భార్యతో ఉన్న సమయంలో మరో మహిళతో వివాహేతర సంబంధంలో ఉన్నాను. ఈ విషయంలో నేను నా మొదటి భార్యను మోసం చేశాను’’ అని ఆయన సీఎన్ఎన్తో తెలిపారు. మొదటి భార్య కెరిస్టిన్తో ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంతకంటే ముందు ఎమ్హోఫ్ మొదటి భార్య కెరిస్టిన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘నేను ఎంహోఫ్ వ్యక్తిగతమైన కారణాలతో కొన్నేళ్ల క్రితం ఇద్దరి అంగీకారంతో వీడిపోయాం. ఆయన మా పిల్లలకు గొప్ప తండ్రి. అదేవిధంగా నాకు మంచిస్నేహితుడు. కమలా, నేను, పిల్లలు, ఎమ్హోఫ్తో కుటుంబం పట్ల చాలా గర్వపడుతున్నా’’ అని అన్నారు.ఇక కమలా హారిస్, హెమ్హోఫ్ 2014లో పెళ్లి చేసుకున్నారు. కమలా హారిస్కు ఇది మొదటి వివాహం కాగా.. హెమ్హోఫ్కు మాత్రం రెండోది. ఆయన వివాహేతర సంబంధం గురించి హారిస్కు ముందే తెలుసని సీఎన్ఎన్ పేర్కొంది. డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా ఖరారైన కమల.. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ల మధ్య సెప్టెంబరు 4వ తేదీన డిబేట్ జరిగే అవకాశం ఉంది. -
ట్రంప్కు భద్రత కల్పించడంలో విఫలమయ్యాం
వాషింగ్టన్: పెన్సిల్వేనియాలో జూలై 13వ తేదీన ఎన్నికల ర్యాలీ సమయంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం ఘటన తమ వైఫల్యమేనని అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగం పేర్కొంది. ఆయనకు భద్రత కల్పించడంలో వైఫల్యానికి తమదే బాధ్యతని తెలిపింది. బట్లర్ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న ట్రంప్పై ఓ యువకుడు కాల్పులకు పాల్పడటం తెల్సిందే. ఆ ఘటన నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. ఒక బుల్లెట్ మిల్లీమీటర్ దూరం నుంచి దూసుకెళ్లగా, మరో బుల్లెట్ ఆయన చెవిని గాయపర్చింది. అప్పటి ఘటనకు బాధ్యత వహిస్తూ సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ చియాటిల్ రాజీనామా చేయగా, ఆమె స్థానంలో రొనాల్డ్ రోవె తాత్కాలిక డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. -
మళ్లీ అదే పాతపాట: కమల
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ జాతి వివక్ష వ్యాఖ్యలకు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ మళ్లీ తన పాత విభజన సిద్ధాంతాన్నే ముందుకు తెస్తున్నారని, అగౌరవపరిచే ధోరణి కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి విభజనవాది కాకుండా, అమెరికాకు నిజాలు మాట్లాడే నాయకులు, వాస్తవాలను ఎదుర్కోవాల్సి వచి్చనప్పుడు.. శత్రుభావంతో, ఆగ్రహంతో ఊగిపోకుండా అర్థం చేసుకునే నాయకులు కావాలని ఆమె అభిప్రాయపడ్డారు. హూస్టన్లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రజల్లో ఉన్న వైరుధ్యాలు విభజనకు తావివ్వకూడదని, అవే మన బలమని తెలిసిన నాయకుడు అమెరికాకు కావాలని చెప్పారు. అమెరికా ప్రజలను విభజించడానికి ట్రంప్ ప్రయ్నతిస్తున్నారని హారిస్ ఎన్నికల ప్రచార డైరెక్టర్ మైఖేల్ టేలర్ విమర్శించారు. మాజీ అధ్యక్షుడి వ్యాఖ్యలు అవమానకరమైనవిగా వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ జీన్ పెర్రీ పేర్కొన్నారు. వ్యక్తులను ఎలా గుర్తించాలో చెప్పే హక్కు ఎవరికీ లేదని, అది ఎవరికి వారు సొంతగా తీసుకునే నిర్ణయమన్నారు. -
Donald Trump: భారతీయురాలా? బ్లాకా?
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జాతివివక్ష వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కానున్న కమలా హారిస్ భారతీయురాలా? లేక నల్ల జాతీయురాలా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఆమె చాలాకాలంగా భారతీయ సంతతికి చెందిన అమెరికన్గా తెలుసని, ఇప్పుడు హఠాత్తుగా నల్లజాతీయురాలినని చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. షికాగోలో బుధవారం జరిగిన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్స్ కన్వెన్షన్లో ట్రంప్ మాట్లాడారు. వేదికపై ట్రంప్ను ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్టులలో ఒకరు.. ‘హారిస్ ఎప్పుడూ నల్లజాతీయురాలిగానే గుర్తింపును కోరుకున్నారు. నల్లజాతీయుల యూనివర్సిటీలోనే చదువుకున్నారు’ అని చెప్పడానికి ప్రయత్నించగా ట్రంప్ అడ్డుపడ్డారు. ఆమె ఏదో ఒకదానికి కట్టుబడితే గౌరవిస్తానని, కానీ గతంలో భారతీయ వారసత్వం గురించి చెప్పుకున్న ఆమె అకస్మాత్తుగా నల్లజాతి వైపు మలుపు తిరిగారని, ఎవరైనా దానిని పరిశీలించాలని వ్యాఖ్యానించారు. న్యాయవాదిగా ఆమె బార్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదని, పాస్ అవుతానని కూడా ఆమె అనుకోలేదని, ఆ తరువాత ఏమి జరిగిందో తనకు తెలియదని ఎద్దేవా చేశారు. అంతకుముందు రోజు ఫాక్స్న్యూస్కు ఇచి్చన ఇంటర్వ్యూలో సైతం ట్రంప్ అభ్యంతరకరంగా మాట్లాడారు. కమల అధ్యక్షురాలిగా ఎన్నికైతే ప్రపంచవ్యాప్తంగా నేతలు ఆమెను ఆట బొమ్మలా చూస్తారని, ఆమె చుట్టూరా తిరుగుతారని వ్యాఖ్యానించారు. -
ట్రంప్ వ్యాఖ్యలకు కమలా హారిస్ కౌంటర్
న్యూయార్క్: రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కౌంటర్ ఇచ్చారు. ‘‘ డొనాల్డ్ట్రంప్ మళ్లీ తన పాత విధానాలైన విభజన సిద్ధాంతం, అగౌరవపర్చే ధోరణినే ప్రదర్శిస్తున్నారు. అందుకే ఇలాంటివారు కాకుండా అమెరికా ప్రజలకు ఉత్తమమైన నాయకులు రావాలి. .. మన వైవిధ్యాలు మనల్ని విడదీయకూడదు. ఐకమత్యంగా ఉంచాలి. అదే మన బలం. వాస్తవాలను చెప్పాల్సి వచ్చినప్పుడు శత్రుత్వం, కోపంతో స్పందించేవారు మనకు వద్దు. వాస్తవాలను అంగీకరించి వాటిని ధైర్యంగా చెప్పే నాయకులు కావాలి’’ అని కమలా గట్టిగా కౌంటర్ ఇచ్చారు.చదవండి: కమలా హారిస్ భారతీయురాలా? కాదా?: ట్రంప్ -
కమలా హారిస్ భారతీయురాలా? కాదా?: ట్రంప్
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరులో డెమోక్రటిక్ పార్టీ బరిలో నిలిచిన ఉపాధ్యక్షురాలు, ఇండియన్ అమెరికన్ అభ్యర్థి కమలా హారిస్పై విమర్శల స్థాయిని పెంచారు. అసలు కమలా హారిస్ భారతీయురాలా? లేదా నల్లజాతీయురాలా? అని ప్రశ్నించారు. తాజాగా కమలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ట్రంప్ చికాగోలో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్స్ సమావేశంలో మాట్లాడారు.‘‘ కమలా ఎప్పుడూ భారతీయ వారసత్వాన్ని ప్రదర్శిస్తారు. దానినే ఆమె ప్రచారం చేస్తారు.అయితే ప్రస్తుతం ఆమె నల్లజాతీయురాలిగా గుర్తించబడాలని కోరుకుంటున్నారు. నాకు మాత్రం ఆమె భారతీయురాలా? లేదా నల్లజాతీయురాలా? అనే విషయం తెలిదు. నేను అందరినీ గౌరవిస్తాను. కానీ ఆమె అలా చేయరు. ఎందుకంటే ఆమె ఒక భారతీయురాలుగా ఉండి అకస్మాత్తుగా నల్లజాతీయురాలుగా మారారు’’ అని ట్రంప్ అన్నారు. ట్రంప్ చేసిన విమర్శలన అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ తీవ్రంగా ఖండించింది. ట్రంప్ తన వ్యాఖ్యలతో కమలా హారిస్ను అవమానపరిచారని మండిపడ్డారు. ‘ఎదుటివాళ్ల గుర్తింపును ప్రశ్నించే హక్కు ఎవరీకి లేదు’ అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ అన్నారు. -
USA Presidential Elections 2024: 99 శాతం డెలిగేట్ల మద్దతు కమలకే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష స్థానానికి పోటీ చేసే దిశగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. కీలక ముందడుగు వేశారు. డెమొక్రటిక్ పార్టీ ప్రతినిధుల వర్చువల్ రోల్కాల్ ఓట్లు కోరే అర్హత సాధించారు. బరిలో ఆమె ఒక్కరే మిగలడంతో.. పార్టీ తరఫున అధ్యక్ష అభ్యరి్థగా కమలా హారిస్ ఎన్నిక ఇక లాంఛనమే కానుంది. డెమొక్రటిక్ పార్టీ అభ్యరి్థత్వాన్ని ఖాయం చేసుకునేందుకు కమలా హారిస్ నామినేషన్కు 3,923 మంది డెలిగేట్లు (99 శాతం) మద్దతు పలికారు. -
ఏదైనా ఉంటే ముక్కుసూటిగా.. ట్రంప్కు కమలా హారిస్ ఛాలెంజ్
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష పోటీకి సిద్ధమవుతున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంగళవారం ఆమె జార్జియాలోని అట్లాంటా సిటీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై విమర్శలు గుప్పించారు. అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన డిబేట్ విషయంలో ట్రంప్ ఎదైనా చెప్పదల్చుకుంటే ముఖం మీద సూటిగా చెప్పాలని ఛాలెంజ్ విసిరారు. తాను అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన తర్వాత ఎన్నికల స్వరూపం మారిపోయిందని అన్నారామె.‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మార్పు వచ్చింది. ఈ మార్పు సంకేతాలను డొనాల్డ్ ట్రంప్ గమనించారు. గతవారం సెప్టెంబర్లో డిబేట్ సిద్ధమన్న ట్రంప్.. ప్రస్తుతం వైదొలిగారు. నాతో డిబేట్లో పాల్గొనడానికి మీరు( డొనాల్డ్ ట్రంప్) పునరాలోచిస్తున్నానని తెలుస్తోంది. అయితే మీరు ఏదైనా చెప్పదల్చుకుంటే నా ముఖం మీద సూటిగా చెప్పాలి. ట్రంప్ ఆయన రన్నింగ్ మేట్(ఉపాధ్యక్ష అభ్యర్థి) డిబేట్ చేయలనుకోరు. కానీ, నా గురించి ఏదో ఒకటి మాట్లాడాలని వాళ్లు చూస్తారు’ అని అన్నారు. కమలా హారిస్ పాల్గొన్న ఈ ర్యాలీలో 10 వేల మంది ప్రజలు హాజరయ్యారు. జార్జియా ప్రజలు మద్దతు తెలిపితే అధ్యక్ష ఎన్నికల్లో గెలువటం సులువు అవుతుంది. 2020 ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా ఇక్కడి ప్రజలు తమకు మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నానని అన్నారు. ఈ ఎన్నికల్లో సైతం డెమోక్రటిక్ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు. ఈ ఎన్నికలు మనకు ట్రంప్కు మాత్రమే కాదని అన్నారు. దేశ భవిష్యత్తు గురించి ఆలోచించేవాళ్లకు, దేశాన్ని తిరోగమనంలోకి తీసుకువెళ్లారికి మధ్య జరగనున్నాయని కమలా హారిస్ అన్నారు.మరోవైపు.. ప్రచారం ప్రారంభించిన వారం వ్యవధిలోనే దాదాపు 20 కోట్ల డాలర్లను కమలా బృందం సేకరించడం గమనార్హం. దేశ అధ్యక్షుడు జో బైడెన్ రేసు నుంచి వైదొలిగిన అనంతరం.. కమలా హారిస్కు డెమోక్రటిక్ పార్టీ నుంచి పోటీకి మార్గం సుగమమైన విషయం తెలిసిందే. -
అండర్డాగ్నే.. అయినా గెలుపు నాదే: కమల
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో ఉంటానని ఎన్నడూ అనుకోలేదంటూ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘అండర్డాగ్గానే బరిలో దిగాను. అయితే ప్రజల అండ నాకుంది. వారి అభిమానంతో విజయం సాధిస్తా’’ అంటూ ధీమా వెలిబుచ్చారు. అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంతో డెమొక్రటిక్ పార్టీ అభ్యరి్థగా భారత సంతతికి చెందిన హారిస్ పేరు దాదాపుగా ఖరారవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మస్సాచుసెట్స్లోని పిట్స్ఫీల్డ్లో సుమారు 800 మంది దాతలతో తొలి సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు రెండు భిన్న విధానాల మధ్య పోటీగా సాగుతున్నాయి. ఒకటి దేశాన్ని భవిష్యత్తు వైపు నడిపేది. మరోటి దేశ ప్రగతిని నిలువరించేది’’ అని రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి చురకలు వేశారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యరి్థగా నామినేట్ అయేందుకు అవసరమైన సంఖ్యకు మించి డెలిగేట్లు తనకిప్పటికే మద్దతిచ్చారని సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ‘‘మనం ఎలాంటి దేశంలో నివసించాలని అనుకుంటున్నాం? స్వేచ్ఛ, ప్రేమ, చట్టబద్ధ పాలన కలిగిన దేశంలోనా? విద్వేషం, భయం, అశాంతి నెలకొన్న దేశంలోనా?’’ అని ప్రశ్నించారు. తనతో చర్చకు ట్రంప్ ఇప్పటికే వెనుకడుగు వేశారంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఆయన తనతో డిబేట్కు ముందుకు వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘‘లాయర్గా అన్ని రకాల వ్యక్తులను చూశా. మహిళలను వేధించిన వారిని, వినియోగదారులను మోసగించి నిలువునా దోచుకున్న వారిని, స్వార్థం కోసం చట్టాలను ఉల్లంఘించిన వారిని దగ్గర్నుంచి గమనించా. అందుకే ట్రంప్ ఏ టైపో కూడా నాకు బాగా తెలుసు’’ అని వ్యాఖ్యానించారు. తనపై ట్రంప్ అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. వారంలోనే 20 కోట్ల డాలర్ల విరాళాలు ఈ కార్యక్రమంలో 4 లక్షల డాలర్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా 14 లక్షల డాలర్లు పోగవడం విశేషం. హారిస్ ప్రచారం ప్రారంభించిన వారంలోనే ఏకంగా 20 కోట్ల డాలర్ల (సుమారు రూ.1,640 కోట్లు)ను విరాళాలుగా సేకరించారు. వీటిలో 66 శాతం తొలిసారిగా విరాళాలిచి్చన వారి నుంచే అందాయని ఆమె బృందం పేర్కొంది. నవంబర్ 5న జరగనున్న ఎన్నికలు హోరాహోరీ కానున్నాయని, కొన్ని రాష్ట్రాల్లోని కొందరు ఓటర్లే నిర్ణాయకంగా మారవచ్చని అభిప్రాయపడింది. ఎన్నికలకు 100 రోజులే ఉండటంతో కమల దేశవ్యాప్తంగా సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. 2,300 ప్రచార కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధమైంది. -
Astrologer Amy Tripp: ట్రంపే గెలుస్తారు
వాషింగ్టన్: ట్రంప్, కమలా హారిస్లమధ్య ఓటర్ల మద్దతు కేవలం ఒక శాతం తేడా ఉందన్న వార్తల నడుమ అక్కడి ప్రముఖ జ్యోతిష్యు రాలు అమీ ట్రిప్ ఆసక్తికరమైన భవిష్యవాణి వినిపించారు. అమెరికా అధ్యక్ష పగ్గాలు ట్రంప్ చేతి కొస్తాయని చెప్పారు. అధ్యక్షుడు జో బైడెన్ జూలై 21న రేసు నుంచి తప్పుకుంటారని ఆమె చెప్పిన జోస్యం ఫలించింది. దాంతో ఆమె పేరు మారుమోగిపోయింది. ‘సూర్యుడు ట్రంప్నకు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. ఈసారి గెలుపు ట్రంప్దే’ అంటూ ట్రిప్ చేసిన తాజా పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. అంతేకాదు, ‘‘హారిస్ శక్తిమంతమైన నాయకురాలిగా ఎదుగుతారు. నాలుగేళ్ల తర్వాత అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతారు’’ అంటూ 2020లోనే చెప్పారు. అదీ అక్షరసత్యమైనట్టే కన్పిస్తోంది.ఆగస్టులో అమెరికాలో విపరిణామాలు!అమీ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఆస్ట్రలాజికల్ రీసెర్చ్ (ఐసార్) నుంచి సర్టిఫైడ్ జ్యోతిష్యురాలు. లైసెన్స్డ్ థెరపిస్ట్ కూడా. నేషనల్ కౌన్సిల్ ఫర్ జియోకాస్మిక్ రీసెర్చ్, అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ ఆస్ట్రాలజర్స్లలో క్రియాశీలకంగా ఉన్నారు. గ్రహచారం తదితరాల ఆధారంగా బైడెన్ జూలై 21న అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటారు’’ అని అమీ జూలై 11వ తేదీన చెప్పారు. అది అచ్చంగా అలాగే జరిగింది. ‘‘ఈసారి ట్రంపే గెలుస్తారు. అయితే అధ్యక్షునిగా ఆయన అనూహ్య నిర్ణయాలతో అమెరికాలో రాజకీయ అనిశ్చితి ఏర్పడవచ్చు’’ అమీ చెప్పారు. ఆగస్టులో ప్రచారం, రాజకీయాల్లో విపరిణామాలు చోటుచేసుకుంటాయని హెచ్చరించారు! -
సొంత పార్టీ కుట్రకే బైడెన్ బలి
వాషింగ్టన్: సొంత డెమొక్రాటిక్ పార్టీ నేతల కుట్రలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బలయ్యారని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఆయన్ను తొలుత బ్రతిమాలి, చివరకు భయపెట్టి అధ్యక్ష బరి నుంచి తప్పించారన్నారు. శనివారం మిన్నెసోటాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ మాట్లాడారు. ‘‘బైడెన్కు 1.4 కోట్ల మంది ఓటర్ల అండ ఉంది. పోటీలో కొనసాగాలని కృతనిశ్చయంతో కన్పించారు. అలాంటి బలమైన నేతను బెదిరించి తప్పించారు. ‘మర్యాదగా తప్పుకుంటే మంచిది. లేదంటే అవమానభారంతో పంపిస్తాం. అధ్యక్షుడు మరణించినా, బాధ్యతలు నిర్వర్తించలేని స్థితిలో ఉన్నా 25వ రాజ్యాంగ సవరణ ద్వారా తప్పించగలమని బెదిరించారు. అలా ఇంటిదారి పట్టించారు. చేసేదేమీ లేక బైడెన్ తప్పుకున్నారన్నది వాస్తవం. కానీ మీడియాలో మాత్రం తప్పుడు కథనాలొచ్చాయి. ఆయన ధైర్యంగా ని్రష్కమించారంటూ అంతా ఆయనను పొగుడుతూ ఆకాశానికి ఎత్తేశారు. వాస్తవానికి ఆయనను బలవంతంగా పక్కకు నెట్టేశారు’’ అన్నారు. కమలపై తిట్ల దండకం డెమొక్రటిక్ పార్టీ నుంచి తన ప్రత్యరి్థగా దాదాపుగా ఖాయమైన కమలా హారిస్పై ట్రంప్ తిట్ల దండకానికి దిగారు. ‘‘ఆమె మితిమీరిన ఉదారవాది. స్థిరచిత్తం లేని నాయకురాలు. మతిలేని వామపక్షవాది. అమెరికా చరిత్రలోనే అత్యంత అసమర్థ ఉపాధ్యక్షురాలు. గతంలో మార్కిస్ట్ జిల్లా అటార్నీగా శాన్ఫ్రాన్సిస్కోను నాశనం చేశారు. ఇలాంటి నేత అమెరికా చరిత్రలో ఎన్నడూ అధ్యక్ష పోటీలో నిలబడలేదు. హారిస్ పొరపాటున దేశాధ్యక్షురాలైతే దేశంలో హింస, కల్లోలం నిత్యకృత్యాలవుతాయి. ఆమె పరిపాలనలో అమెరికా అంతటా అతివాదం, వైఫల్యాలు, ఉద్రిక్త పరిస్థితులు.. చివరకు మూడో ప్రపంచ యుద్ధమే రావొచ్చు. అందుకే ఈ ఎన్నికల్లో ఆమెను మనం గెలవకుండా అడ్డుకుందాం. ఆమె అమెరికాకు కాకుండా నేరగాళ్లకు అధ్యక్షురాలిగా మసులుకుంటారు. ఆమె గెలిస్తే గాజా నుంచి కూడా శరణార్థులు అమెరికాకు వచ్చి తిష్టవేస్తారు’ అని ట్రంప్ ఆరోపించారు. ‘నేను గెలిచి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే తొలి రోజే బైడెన్–హారిస్ హయాంలో తీసుకున్న సరిహద్దు విధానాలన్నింటినీ చెత్తబుట్టలో పడేస్తా. సరిహద్దును మూసేసి అక్రమ వలసలను అడ్డుకుంటా’ అని అన్నారు. అధికారంలోకి వస్తే క్రిప్టోకరెన్సీని సూపర్పవర్గా మలుస్తానని చెప్పారు. -
Trump Vs Kamala: ఎన్నికల సర్వేల్లో సూపర్ ట్విస్ట్
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల వేళ అగ్ర రాజ్యం అమెరికా రాజకీయం ఆసక్తికరంగా మారింది. డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారీస్ పోటీ నిలుస్తున్నారు. ఈ క్రమంలో డెమోక్రటిక్ పార్టీ నుంచి తన అభ్యర్థిత్వాన్ని నిర్ధారించే అధికారిక పత్రాలపై ఆమె సంతకాలు చేశారు. కాగా, ఆమె రేసులో వచ్చిన వెంటనే ట్రంప్ గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది. ఎన్నికల సర్వేల్లో కమలా హారీస్ దూసుకుపోతున్నారు.వివరాల ప్రకారం.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్తో సమానంగా కమల హారీస్ ప్రజామోదాన్ని పొందుతున్నారని న్యూయార్క్ టైమ్స్– సియానా కాలేజ్ తాజా పోల్స్లో వెల్లడించింది. ఇక, సర్వేలో పాల్గొన్న అమెరికా ఓటర్లలో 48 శాతం మంది ట్రంప్ వైపు మొగ్గగా, 47 శాతం మంది కమలా హారీస్కు మద్దతు తెలిపారు. ఇదే న్యూయార్క్ టైమ్స్ పత్రిక జూలై మొదటివారంలో నిర్వహించిన సర్వేలో బైడెన్పై ట్రంప్ ఏకంగా ఆరు పాయింట్ల ఆధిక్యాన్ని సాధించారు. దీన్ని హారీస్ ఒక పాయింటుకు తగ్గించడం గమనార్హం. రిజిస్టర్డ్ ఓటర్లలో ట్రంప్కు 48 శాతం, హారీస్కు 46 శాతం మద్దతు లభించింది. ఇదిలా ఉండగా.. రిపబ్లికన్లలో ట్రంప్ను 93 శాతం మంది బలపరుస్తుండగా, కమలా హారిస్కు సైతం డెమోక్రాట్లలో 93 శాతం మద్దతు లభించడం విశేషం. శ్వేతజాతియేతర, యువ ఓటర్లలో బైడెన్కు పెద్దగా ఆదరణ ఉండేది కాదు. ఇప్పుడు హారీస్కు మాత్రం ఈ వర్గాల నుంచి భారీగా మద్దతు లభిస్తోందని సర్వే తెలిపింది. లాటిన్ అమెరికా మూలాలున్న ఓటర్లు, 30 ఏళ్ల లోపు ఓటర్లలో హారిస్కు 60 శాతం మద్దతు లభించింది.మరోవైపు.. అధ్యక్ష ఎన్నికల రేసులో కమలా హరీస్ వచ్చిన వెంటనే ఆమెకు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తుంది. అంతకుముందు జరిపిన ఓ ఎన్నికల సర్వేలో కూడా ట్రంప్ కంటే కమలా హారీస్ ముందంజలోనే ఉన్నారు. దాదాపు రెండు శాతం ఓట్లతో కమలా దూసుకెళ్లారు. దీంతో, రాబోయే ఎన్నికల్లో విజయం తమదేనంటూ డెమోక్రాట్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక, సొంత పార్టీలో కూడా నేతల నుంచి హారీస్కు పూర్తి మద్దతు లభించడం విశేషం. -
నాటి ఈగే నేటి డేగ!
పన్నెండేళ్ల క్రితం ఓ రోజు – వెనిజులా నేషనల్ అసెంబ్లీలో ఆ దేశ అధ్యక్షుడు హ్యూగో చావెజ్.. దూకుడు మీదున్న దేశ పురోగతి గురించి గంభీరంగా ప్రసంగిస్తూ ఉన్నారు. స్వపక్షాలు, విపక్షాలు భయభక్తులతో వింటూ ఉన్నాయి. అంతలో అపోజిషన్ బెంచీల నుంచి మరియ కొరీనా మచాదో లేచి నిలబడి, ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు! ‘‘మీ విధానాలు నిజంగా బాగున్నాయనే మీరు అనుకుంటున్నారా?’’ అని ఆమె ప్రశ్నించారు. ఆ మాటకు చావెజ్ ఆమె వైపు డిస్టర్బ్ అయిన సింహంలా తలతిప్పి చూశారు. తీవ్రమైన ఆగ్రహంతో, అసహనంతో.. ‘‘ఈగను డేగ వేటాడదు.. కూర్చో’’ అని పెద్దగా అరిచారు. దానర్థం ‘నువ్వో పిపీలికం. నీకు నేను సమాధానం చెప్పటం ఏమిటి!’’ అని. చావెజ్ ఇప్పుడు లేరు. పదకొండేళ్ల క్రితమే ఆయన మరణించారు. ఆ ఈగ మాత్రం ఇప్పుడు డేగ అయింది! చావెజ్ మరణించిన నాటి నుంచి రెండు దశాబ్దాలుగా వెనిజులాను పాలిస్తూ ఆ సంపన్న దేశాన్ని తన నియంతృత్వ పోకడలతో బికారిగా మార్చిన నికొలస్ మోరోస్ను తాజా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డేగలా వేటాడి వేటాడి, ఆ సామ్యవాద సింహానికి కంట కునుకు లేకుండా చేసింది.ప్రజలు ఆమె వెన్నంటి...తెల్లని దుస్తులు. మెడలో జపమాల. ఆత్మవిశ్వాసపు చిరునవ్వు. రోజంతా ప్రయాణం. సొట్టలు పడిన కారు పైభాగంలోనే నిలుచుని, ఎక్కడికక్కడ ప్రజల్ని ఉద్దేశించి ఆత్మీయంగా నాలుగు మాటలు. ప్రజల దగ్గరకు ఆమె వెళ్లటం అటుంచి, ప్రజలే ఆమె వెన్నంటి నడవటం. ఆమె వైపు చెయ్యందివ్వటం. మహిళలు ఆమె దోసిళ్లలో తలపెట్టి రోదించటం. కాపాడమని పురుషులు ఆమెను ్ప్రాధేయపడటం. రోడ్లు కిక్కిరిసిపోవటం. ఆమె మాట కోసం, ఆమె చూపు కోసం ఒకర్నొకరు తోసుకోవటం. ఒక యువకుడైతే తను గీసిన ఆమె చిత్రాన్ని అందివ్వటం. ఫ్రేమ్ లేని ఆ చిత్ర పటంలో ఆమె భుజాల చుట్టూ వెనిజులా జాతీయ జెండా. జెండాతో పాటుగా జీసెస్ చేతుల్లో సురక్షితంగా ఆమె. ‘‘మరియా.. మాకు సహాయం చేయండి’’.. గుంపులోంచి ఒక ఉద్వేగం. 56 ఏళ్ల మరియ కొరీనా మచాదో ఇప్పుడు వెనిజులా వేగుచుక్క. అధికార పక్షం గుండెల్లో పిడి బాకు. ఈ కొద్ది నెలల్లోనే ఒక ఉద్యమకారిణిగా, వెనిజులాకొక ఆశాదీపంలా అవతరించారు వెనిజులా విపక్ష నేత మరియ. ఆమె సారథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇళ్లలోంచి బయటికి వచ్చిన వేలాది మంది.. నేడు జరుగుతున్న వెనిజులా అధ్యక్ష ఎన్నికల బ్యాలట్ల వైపు లక్షలాదిగా కదులుతున్నారు. నిరంకుశ సామ్యవాద అధ్యక్షుడు నికోలస్ మదురోను ఓడించటమే వారి లక్ష్యం. అయితే ఈ ఎన్నికల్లో మరియ పోటీ చేయటం లేదు. తన తరఫున అంతగా ఎవరికీ తెలియని మాజీ దౌత్యవేత్త ఎడ్మండో గొంజాలెజ్ను నికోలస్కు వ్యతిరేకంగా నిలబెట్టారు మరియ. గొంజాలెజ్ గెలిస్తే మరియ గెలిచినట్లే. నికోలస్ ఓడిపోతే మరియ చేతుల్లో అతడు ఓడిపోయినట్టే. మరియకు గత ఏడాది జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో 93 శాతం ఓట్లు రావటం చూసి అధ్యక్ష ఎన్నికల్లో తన అపజయాన్ని శంకించిన అధ్యక్షుడు నికోలస్ వెనువెంటనే ఆమెపై ఆరోపణలు మోపి, సుప్రీం కోర్టు ద్వారా ఆమెను ఈ ఎన్నికలకు అనర్హురాలిని చేయించారు.కేసులు.. భౌతిక దాడులుమరియకు వెల్లువెత్తుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక గతవారమే వెనిజులా ప్రభుత్వం మరియ అంగరక్షకుల్ని తొలగించింది. ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిని చేయటం, అంగరక్షకుల్ని ఉపసంహరించు కోవటం.. ఇవేకాదు, నికొలస్ గత పదేళ్లుగా మరియాకు వ్యతిరేకంగా అనేక కేసులు పెట్టించారు. కోర్టుకు ఈడ్చారు. భౌతిక దాడులు చేయించారు. అయినా ఆమె వెనకంజ వేయలేదు. నికొలస్ ఆర్థిక విధానాలతో నిరుపేద దేశంగా మారిన ఈ చమురు నిక్షేపాల సంపన్న దేశాన్ని ఒడ్డున పడేయటానికి ప్రభుత్వంతో పెద్ద యుద్ధమే చేస్తున్నారు మరియ. పిల్లలకు దూరంగా...కుటుంబానికి ్ప్రాణహాని ఉందంటే పోరాటాన్ని తీసి ΄÷య్యిలో పడేస్తారు ఎవరైనా. కానీ మరియ తన పోరాటం ఆపలేదు. ప్రజలే తన కుటుంబం అనుకున్నారు. తన ముగ్గురు పిల్లల్ని – ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి – వారి భద్రత కోసం విదేశాలకు పంపించారు. వారు అమెరికాలో ఉన్నారని, కాదు బ్రిటన్లో ఉన్నారని అనుకోవటమే కానీ కచ్చితంగా ఏ దేశంలో ఉన్నారన్నది ఆమెకు తప్ప ఎవరికీ తెలియదు. ఈ పోరాటాల పోరు పడలేకే భర్త ఆమెతో విడిపోయారని అంటారు. మరియ తండ్రి వెనిజులా రాజధాని కరాకస్లో పేరున్న స్టీల్ బిజినెస్మన్. మరియ పుట్టింది కారకస్లోనే. మరియ తల్లి సైకాలజిస్ట్. మొత్తం నలుగురు ఆడపిల్లల్లో మరియ పెద్దమ్మాయి. మరియ పూర్తి పేరు మరియ కొరీనా మచాదో పరిస్కా. తండ్రి పేరులోని మచాదో, తల్లి పేరులోని కొరీనా పరిస్కా కలిసి వచ్చేలా ఆమెకు ఆ పేరు పెట్టారు. మరియ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ చేశారు. కరాకస్లోని వీధి బాలల కోసం 1992లో ఒక అనాథాశ్రమం నెలకొల్పారు. 2002లో జాయిన్ అప్ అని అర్థం వచ్చేలా ‘సూమేట్’ అనే వాలంటీర్ల వ్యవస్థను ్ప్రారంభించారు. రాజకీయ హక్కులను స్వేచ్ఛగా వినియోగించుకోవటం, ప్రజా ప్రయోజన విషయాల మీద చర్చ వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటుంది ఆ సంస్థ. -
అందుకోసమే అధ్యక్ష రేసు నుంచి వైదొలిగా: బైడెన్
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ, దేశాన్ని ఏకం చేయటం కోసమే తాను అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. ఆయన అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి తప్పుకున్న అనంతరం తొలిసారి జాతిని ఉద్దేశించి మాట్లాడారు.‘‘ ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామాన్ని పరిరక్షించటం కంటే పదవులు ముఖ్యం కాదు. కొత్త తరానికి అవకాశాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నా. అమెరికాను ఏకం చేయటంలో ఇదే ఉత్తమైన మార్గం. యువ గళం వినిపించడానికి ఇదే సరైన సమయం. నేను అమెరికా అధ్యక్ష కార్యాలయాన్ని గౌరవిస్తాను. అంతకంటే ఎక్కువగా దేశాన్ని ప్రేమిస్తున్నాను. అమెరికా ప్రజలకు అధ్యక్షుడిగా పనిచేయడం నా జీవితంలో లభించిన గొప్ప గౌరవం. .. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఏకం కావాలి. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో పార్టీని ఏకం చేయాల్సిన అవసరం ఉంది. అధ్యక్షుడిగా, అమెరికా భవిష్యత్తు కోసం రెండోసారి ప్రెసిడెంట్గా పోటీ చేసే మెరిట్ నాకు ఉందని నమ్ముతున్నా. కానీ, ప్రజాస్వామ్యాన్ని రక్షించటంలో కూడా ఏది అడ్డురాకూడదని విశ్వాసం వ్యక్తం చేస్తున్నా’’అని బైడెన్ అన్నారు.ఆయన ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్నారు. ఆ సమయంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా జో బైడెన్ వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఉపధ్యక్షురాలు కమలా హారిస్కు అధ్యక్ష అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ మద్దతు తెలిపారు. -
Kamala Harris: మోసగాళ్లను ఓడించాలి
వాషింగ్టన్: ట్రంప్ లాంటి అవినీతిపరులను, ద్రోహులను ఎన్నికల పోరాటంలో మట్టికరిపించడమే తన ధ్యేయమని రిపబ్లికన్ అభ్యర్థిగా దాదాపు ఖరారైన కమలా హారిస్ ఉద్ఘాటించారు. మంగళవారం విస్కాన్సిన్ రాష్ట్రంలో డెమోక్రటిక్ పార్టీ సమావేశంలో ఆమె తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. అభ్యర్థిత్వానికి సరిపడా మద్దతు కూడగట్టుకున్నాక కమల మాట్లాడిన మొదటి సమావేశం ఇదే. గతంలో కాలిఫోరి్నయా ప్రాసిక్యూటర్గా పనిచేశానని, తన రికార్డు ఏమిటో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మహిళలను వేధించిన దుర్మార్గులను, అమాయక ప్రజలను దగా చేసిన మోసగాళ్లను, సొంత లాభం కోసం నిబంధనలు అతిక్రమించిన దుషు్టలను ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కాగా, డెమొక్రటిక్ అభ్యర్థిగా తొలుత బరిలోకి దిగిన బైడెన్కు ప్రజల నుంచి వచి్చన విరాళాలను హారిస్కు బదిలీ చేయడం ఆపాలని ట్రంప్ ప్రచార బృందం కోరింది. ఈ మేరకు ఫెడరల్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.సర్వేల్లో హారిస్దే పైచేయిలేటుగా వచ్చినా, లేటెస్ట్గా వచ్చారన్న నానుడిని హారిస్ నిజం చేస్తున్నారు. అధ్యక్ష రేసులో బైడెన్పై ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన ట్రంప్ జోరుకు ఆమె వచ్చీ రాగానే కళ్లెం వేశారు. మానసిక చురుకుదనం, సవాళ్లను దీటుగా ఎదుర్కోగల సత్తా విషయంలో ట్రంప్ కంటే హారిస్కే అమెరికన్లు జైకొట్టడం విశేషం! ఈ విషయమై రాయిటర్స్/ఇప్సోస్ చేసిన తాజా సర్వేలో 56 శాతం మంది హారిస్కు ఓటేయగా ట్రంప్కు 49 శాతమే దక్కాయి. తాజాగా సోమ, మంగళవారాల్లో సీఎన్ఎన్ జరిపిన దేశవ్యాప్త సర్వేలో కూడా ట్రంప్కు 49 శాతం రాగా, హారిస్ 46 శాతం ఓట్లు సాధించారు. -
USA Presidential Elections 2024: అడ్వాంటేజ్ హారిస్
వాషింగ్టన్: జో బైడెన్ డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా వైదొలగడంతో భారతీయ అమెరికన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్కు అవకాశాలు మెరుగయ్యాయి. అధ్యక్ష అభ్యర్థిగా కమలకు బైడెన్ మద్దతు ప్రకటించారు. ఇది ఆమెను అధ్యక్ష టికెట్ రేసులో ముందు వరుసలో నిలుపుతుంది. అయితే బైడెన్ మద్దతిచి్చనంత మాత్రాన ఆటోమేటిగ్గా కమల డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి అవ్వలేరు. డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్లో డెలిగేట్ల మద్దతును సంపాదించాల్సి ఉంటుంది. డేలిగేట్ల ఓటింగ్లో ఎవరైతే మెజారిటీ సాధిస్తారో వారే డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి అవుతారు. డెమొక్రాటిక్ పార్టీ టికెట్ కోసం కమలకు గట్టి పోటీదారులుగా మారతారని భావించిన పలు రాష్ట్రాల గవర్నర్లు తమ మద్దతు ఉపాధ్యక్షురాలికేనని బాహటంగా ప్రకటిస్తున్నారు. ప్రస్తుతానికైతే అధికారికంగా కమల ఒక్కరే రేసులో ఉన్నారు. బైడెన్ విరమణ ప్రకటన అనంతరం కమల తక్షణం రంగంలోకి దిగారు. పారీ్టలోని సహచరులకు ఆదివారమే 100 పైగా ఫోన్కాల్స్ చేసి మద్దతు కూడ గట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు భారతీయ అమెరికన్, ఆఫ్రికన్ అమెరికన్ చట్టసభ సభ్యులు, బైడెన్ అనుచరులు కమలకు మద్దతుగా ముమ్మర లాబీయింగ్ మొదలుపెట్టారు. వివిధ రంగాల్లోని మహిళలు కూడా ఆమెకు బాసటగా నిలుస్తున్నారు. బైడెన్ ప్రచార బృందం కూడా సోషల్ మీడియాలో తమ అకౌంట్ల పేర్లను హారిస్ పేరు మీదకు మార్చేసింది. ప్రచార టీమ్లోని 1,000 మంది ఉద్యోగులు తక్షణం ఆమె తరఫున పనిచేయనున్నారు. పెలోసి, క్లింటన్ల మద్దతు ప్రతినిధుల సభ మాజీ స్పీకర్, డెమొక్రాటిక్ పారీ్టలో కీలక నాయకురాలు నాన్సీ పెలోసి కూడా సోమవారం హారిస్కు మద్దతు ప్రకటించారు. శ్రామికవర్గ కుటుంబాల కోసం శ్రమించే, సునిశిత మేధోశక్తి గల రాజకీయ నాయకురాలిగా కమలను అభివరి్ణంచారు. బైడెన్ను వైదొలిగేలా ఒప్పించడంలో పెలోసిది కీలకపాత్ర. డజన్ల కొద్ది ప్రతినిధుల సభ సభ్యులు, సెనేటర్లు కూడా కమలకు మద్దతు తెలిపారు. గట్టి పోటీదారులైన పెన్సిల్వేనియా గవర్నర్ జోస్ షాపిరో, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఆదివారమే ఆమెకు మద్దతు ప్రకటించేశారు. అమెరికాలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడు, హయత్ హోటల్ గ్రూపు వారసుడు, ఇల్లినాయీ గవర్నర్ జె.బి.ఫ్రిట్జ్కర్, రెండుసార్లు కెంటకీ గవర్నర్ అండీ బెషియర్ అభ్యరి్థత్వ రేసులో ఉంటారని భావించినా సోమవారం వారిద్దరూ కమలకే జైకొట్టారు. మిషిగన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్ కూడా ఇదే బాటలో నడిచారు. మేరీలాండ్ గవర్నర్ వెస్ మూర్ కూడా కమలకే మద్దతు ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్ల మద్దతు కూడా లభించింది. కమలకు ఉదారంగా విరాళాలివ్వాలని హిల్లరీ సోమవారం పిలుపిచ్చారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమోదముద్ర కూడి పడితే ఆమెకు తిరుగు ఉండదు. కమల ప్రత్యర్థులుగా ప్రస్తుతానికి రాయ్ కూపర్ (67), అరిజోనా సెనేటర్ మార్క్ కెల్లీ పేర్లు వినిపిస్తున్నాయి. -
Donald Trump: దేవుడు నా వైపే.. గెలుపు నాదే
మిల్వాకీ: హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్న అమెరికా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(78) సమరోత్సాహంతో ముందుకు సాగుతున్నారు. భగవంతుడు తనవైపు ఉండడం వల్లే పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డానని చెప్పారు. భగవంతుడి దయతోనే మళ్లీ జనం ముందుకు వచ్చానని పేర్కొన్నారు. మరో నాలుగు నెలల్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు. హత్యాయత్నం ఘటన తర్వాత తొలిసారిగా మిల్వాకీలో గురువారం రాత్రి జరిగిన రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో ట్రంప్ భావోద్వేగంతో ప్రసంగించారు. రిపబ్లికన్ అభ్యరి్థగా తన నామినేషన్ను లాంఛనంగా ఆమోదించారు. తూటాల దాడి జరిగినా తన సంకల్పం చెక్కుచెదరలేదని, అమెరికా ప్రజలకు సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. దేశాన్ని కాపాడాలన్న నా తపనను ఏ ప్రమాదం, ఏ అవరోధం అడ్డుకోలేవని తేలి్చచెప్పారు. హత్యాయత్నం తర్వాత తనపై ప్రేమాభిమానాలు కురిపించి, మద్దతు ప్రకటించిన ప్రజలకు ట్రంప్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆత్మవిశ్వాసం, ఆశ, బలం అనే సందేశాన్ని మోసుకొని ఈరోజు అమెరికన్ల ముందుకు సగర్వంగా వచ్చానని అన్నారు. పార్టీ సదస్సులో ట్రంప్ ఇంకా ఏం మాట్లాడారంటే... నూతన యుగానికి ఆరంభం ‘‘మరో నాలుగు నెలల్లో మనం అద్భుతమైన విజయం సొంతం చేసుకోబోతున్నాం. అమెరికా చరిత్రలో నాలుగు అతిగొప్ప సంవత్సరాలకు శ్రీకారం చుట్టబోతున్నాం. మతం, రంగు, జాతితో సంబంధం లేకుండా ప్రజలందరికీ భద్రత, సౌభాగ్యం, స్వేచ్ఛ కలి్పంచే నూతన యుగాన్ని మనమంతా కలిసికట్టుగా ఆరంభిద్దాం. మన సమాజంలో ప్రజల మధ్య అడ్డుగోలకు తావు లేకుండా చేద్దాం. అమెరికన్లుగా మనది ఒకేబాట, ఒకేమాట. మనం ఐక్యమత్యంగా ఉండాలి. అందరం కలిసి పైకి ఎదగాలి. కలిసి ఉండలేకపోతే నష్టపోతాం. సగం అమెరికాకు కాదు, మొత్తం అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు బరిలో నిల్చున్నా. మనం ఒకే దేశం బిడ్డలం నాపై హత్యాయత్నం జరిగిన సంగతి అందరికీ తెలుసు. అసలేం జరిగిందని చాలామంది అడుగుతున్నారు. నా శరీరం నుంచి అంగుళంలో మూడోవంతు దూరంలో తుపాకీ తూటా దూసుకెళ్లింది. నా తల రక్తంతో తడిసిపోయింది. దేవుడి దయతో ప్రాణాలతో బయటపడ్డా. ఈ విషయం మరోసారి నేను పంచుకోలేను. ఎందుకంటే అది చాలా బాధాకరమైన అనుభవం. మాటల్లో చెప్పలేనిది. నాపై క్రూరమైన దాడి జరిగిన తర్వాత మన ఐక్యత మరింత పెరిగింది. మన సంకల్పం, ఉద్దేశం ఏమాత్రం మారలేదు. అమెరికాను మరోసారి గెలిపించాలి. అమెరికాను మళ్లీ సురక్షితమైన, స్వేచ్ఛాయుతమైన గొప్పదేశంగా మార్చాలి. మనం ఒకే దేశం బిడ్డలం. రాజకీయపరమైన అంశాలు మన మధ్య విభజన రేఖలు గీయకూడదు.ఈ ఎన్నికలు అత్యంత కీలకం యావత్తూ దేశానికి ఒక దార్శనికతను నిర్దేశించడానికి ఇక్కడికి వచ్చా. ఈ సందర్భంగా దేశంలో ప్రతి పౌరుడికీ స్నేహ హస్తం అందిస్తున్నా. వారికి విధేయత ప్రకటిస్తున్నా. ప్రపంచం ఎన్నడూ చూడని విధంగా అమెరికాను నూతన శిఖరాల వైపు నడిపిద్దాం. నా నాయకత్వంలో అమెరికా మళ్లీ గౌరవం పొందుతున్న విశ్వాసం ఉంది. మన బల సంపన్నతను ఏ దేశమూ ప్రశ్నించలేదు. మన శక్తి సామర్థ్యాలను ఏ శత్రువూ అనుమానించలేరు. మన సరిహద్దులు భద్రంగా ఉంటాయి. మన ఆర్థిక వ్యవస్థ ఉజ్వలంగా మారుతుంది. మన భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవాలంటే విఫలమైన నాయకత్వం నుంచి దేశాన్ని తొలుత రక్షించుకోవాలి. అమెరికా చరిత్రలో ఈ ఎన్నికలు అత్యంత కీలకం. శత్రుదుర్భేద్యంగా మారుస్తాఅక్రమ వలసలు అమెరికాకు పెద్ద సమస్యగా మారాయి. దక్షిణ సరిహద్దు నుంచి పోటెత్తుతున్న వలసలు, చొరబాట్లు దేశమంతటా కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అక్రమ వలసల కారణంగా నేరాలు, పేదరికం, వ్యాధులు, విధ్వంసం పెరుగుతున్నాయి. ప్రపంచమంతటా ఇలాంటి వలసల సంక్షోభం కనిపిస్తోంది. మరోవైపు యూరప్, మధ్యప్రాచ్యంలో యుద్ధాలు కొనసాగుతున్నాయి. తైవాన్, కొరియా, ఫిలిప్పైన్స్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. కేవలం ఆసియా ఖండమే కాదు, మొత్తం భూగోళం నేడు మూడో ప్రపంచ యుద్ధం అనే అంచుపై ఉందని చెప్పక తప్పదు. ఈ పరిస్థితి మారాలన్నదే నా ఆశ. తైవాన్ను చైనా చుట్టుముడుతోంది. అమెరికా సమీపంలో రష్యా యుద్ధ నౌకలు, అణు జలాంతర్గాములు చెక్కర్లు కొడుతున్నారు. ఈ విషయాలు ప్రస్తావించేందుకు మీడియా ఇష్టపడడం లేదు. నేను అధికారం చేపట్టిన తర్వాత మన భూభాగాలను శత్రు దుర్భేద్యంగా మారుస్తా.మార్పునకు సమయమిదే అమెరికాలో మార్పునకు సమయం ఆసన్నమైంది. ఇప్పుడున్న పరిపాలనను మరో నాలుగేళ్లు మనం భరించలేం. అందుకే మార్పునకు పట్టం కట్టాలి. అమెరికా పౌరుల ఎదుట ఈ క్షణాన ప్రతిజ్ఞ చేస్తున్నా. ద్రవ్యోల్బణ సంక్షోభాన్ని అంతం చేస్తా. వడ్డీ రేట్లను తగ్గిస్తా. మన సరిహద్దును మూసివేస్తా. గోడ నిర్మాణం పూర్తిచేస్తా. అక్రమ వలసలకు పూర్తిగా అడ్డుకట్ట వేస్తా. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, ఇజ్రాయెల్–హమాస్ యుద్ధానికి శుభం కార్డు వేసేస్తాం. నేను అధికారంలో ఉండి ఉంటే ఈ యుద్ధాలు అసలు జరిగేవే కాదు. నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో నా విజయానికి సహరించాలని అందరినీ సవినయంగా కోరుతున్నా. మిమ్మల్ని తలెత్తుకొనేలా, గర్వపడేలా చేయడమే నా ధ్యేయం. -
US Presidential Election 2024: ట్రంపే అమెరికా ఆశాకిరణం
మిల్వాకీ: అమెరికా శ్రామిక వర్గం అభ్యున్నతి కోసం చివరి శ్వాస దాకా పాటుపడతానని రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి, ఒహాయో సెనేటర్ జె.డి.వాన్స్ (39) అన్నారు. వారిని అధికార డెమొక్రటిక్ పార్టీ పూర్తిగా విస్మరించిందంటూ మండిపడ్డారు. మిల్వాకీలో జరుగుతున్న రిపబ్లికన్ల నేషనల్ కన్వెన్షన్లో వాన్స్ను ఉపాధ్యక్ష అభ్యరి్థగా బుధవారం లాంఛనంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాదాసీదా, నిరుపేద మూలాలున్న తాను ఇంత దూరం వస్తానని కల్లో కూడా ఊహించలేదని చెప్పారు. ‘‘జీవితంలో ఒక్క మెట్టూ ఎదుగుతూ వచ్చా. ఒకరకంగా సగటు అమెరికన్ కలగనే జీవితాన్ని ప్రస్తుతం జీవిస్తున్నా. వారంతా భద్రమైన, సురక్షితమైన జీవితం గడిపేలా చేస్తా. ఏ పారీ్టవారన్న దానితో నిమిత్తం లేకుండా ప్రతి అమెరికన్కూ నా సర్వస్వం ధారపోస్తా. అమెరికా ఎన్నడూ మరిచిపోలేని ఉపాధ్యక్షుడిగా పేరు తెచ్చుకుంటా’’ అంటూ ప్రతిజ్ఞ చేశారు. ట్రంప్పై ప్రశంసల వర్షం రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై వాన్స్ ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా మధ్యతరగతికి, శ్రామిక వర్గానికి ప్రస్తుతం ఆయనే ఏకైక ఆశాకిరణమన్నారు. ‘‘ట్రంప్ రాజకీయాల్లోకి రాకముందే ప్రపంచంలోకెల్లా అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరు. ఎవరైనా జీవితంలో కలలుగనేవన్నీ ఆయనకు అందుబాటులో ఉన్నాయి. అయినా అమెరికన్లకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని తపించారు. అందుకోసం తిట్లను, వేధింపులను, మరెన్నింటినో సహిస్తున్నారు. నిజానికి ట్రంప్కు ఆయనకు రాజకీయాలు అవసరం లేదు. అమెరికా ప్రజలకే ఇప్పుడు ట్రంప్ అత్యవసరం’’ అని చెప్పుకొచ్చారు. అధ్యక్షుడు జో బైడెన్ రాజకీయాలను కేవలం కెరీర్గా మలచుకున్న స్వార్థపరుడంటూ వాన్స్ దుయ్యబట్టారు. బైడెన్ మతిలేని వాణిజ్య ఒప్పందాలు, విదేశీ యుద్ధాలకు అర్థం లేని మద్దతు తన స్వస్థలం ఒహాయో వంటి నిరుపేద అమెరికా ప్రాంతాలను సర్వనాశనం చేశాయంటూ మండిపడ్డారు. పాలక వర్గ ప్రతినిధిగా బైడెన్ ప్రతి చర్యా అమెరికన్ల ఉద్యోగాలను విదేశాలపరం చేసింది. మన యువతను యుద్ధక్షేత్రాలకు బలిచి్చంది. ఇరాక్ నుంచి అఫ్గానిస్తాన్ దాకా, ఆర్థిక సంక్షోభం నుంచి మాంద్యం, అక్రమ వలసల దాకా ప్రస్తుత పాలక వర్గం అన్ని రంగాల్లోనూ పదేపదే విఫలమవుతూ వస్తోంది. ఈ సమస్యలన్నింటి నుంచి అమెరికాను గట్టెక్కించే చిట్టచివరి, అత్యుత్తమ ఆశాకిరణం ట్రంప్ మాత్రమే. సగటు అమెరికన్కు అగ్రతాంబూలమే ఆయన విజన్. ఆయనను పోగొట్టుకుంటే మనకిక భవిష్యత్తుండదు’’ అన్నారు. ‘‘దేశానికి తొలి ప్రాధాన్యమిచ్చే ట్రంప్నే అమెరికన్లు గెలిపించుకోబోతున్నారు’’ అని వాన్స్ జోస్యం చెప్పారు.దక్షిణాసియా వలసదారులపై వాన్స్ ప్రశంసలు దక్షిణాసియా నుంచి వచ్చినవారు అమెరికాను సుసంపన్నం చేశా రని వాన్స్ అన్నారు. భార్య ఉషా చిలుకూరిపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘దక్షిణాసియా నుంచి వలస వచి్చనవారి కుమార్తెను నేను పెళ్లాడాను. ఆమెకు పెళ్లి ప్రస్తావన చేసినప్పుడు లా స్కూల్ చదువు కోసం, ప్లాట్ కొనుగోలుకు చేసిన 1.2 లక్షల డాలర్ల అప్పులు నా నెత్తిన ఉన్నాయని చెప్పా. అయినా పెళ్లికి అంగీకరించింది’’ అని చెప్పారు. తన వ్యక్తిగత, ఆధ్యాతి్మక జీవితంపై భార్య ప్రభావం ఉందన్నారు. తల్లి బెవర్లీని సభకు పరిచయం చేస్తూ ఉద్వేగానికి లోనయ్యారు.భారతీయ వంటలు నేర్చుకున్నారు: ఉషవాన్స్ గొప్ప ఉపాధ్యక్షునిగా తనను తాను నిరూపించుకుంటారని భార్య ఉషా చిలుకూరి (38) విశ్వాసం వెలిబుచ్చారు. వాన్స్ ప్రసంగానికి ముందు ఆయనను రిపబ్లికన్ కన్వెన్షన్కు ఆమె లాంఛనంగా పరిచయం చేశారు. ‘‘జేడీది నిరుపేద స్థానిక శ్వేతజాతి కుటుంబం. నాదేమో భారతీయ వలసదారుల కుటుంబం. అలాంటి మేం కలుసుకోగలిగామన్నా, ప్రేమలో పడి పెళ్లి చేసుకోగలిగామన్నా కేవలం అమెరికా గొప్పదనమే అందుకు కారణం’’ అన్నారు. ‘‘నా భారతీయ జీవన శైలి గురించి జేడీ ఆసక్తిగా అన్ని విషయాలూ తెలుసుకున్నాడు. పక్కా మాంసాహారి అయినా నా శాకాహార జీవనశైలికి అలవాటు పడ్డాడు. మా అమ్మనడిగి భారతీయ వంటకాలు చేయడం నేర్చుకున్నాడు’’ అన్నారు. -
Kai Madison Trump: మా మంచి తాతయ్య!
మిల్వాకీ: అది రిపబ్లికన్ల నేషనల్ కాన్ఫరెన్స్. బుధవారం రాత్రి ఓ 17 ఏళ్ల అమ్మాయి వేదికనెక్కింది. తొలి ప్రసంగమే అయినా ఎక్కడా ఆ ఛాయలే లేవు. అనేకానేక అంశాలపై తడుముకోకుండా మాట్లాడి అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. దాంతో హాలంతా పదేపదే చప్పట్లతో మార్మోగింది. ార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తనను అబ్బురంగా, ఒకింత గర్వంగా చూసుకుంటూ మురిసిపోయారు. ఆ టీనేజర్ కాయ్ మాడిసన్. ట్రంప్ మనవరాలు. ‘‘తాతా! మీరే నాకు స్ఫూర్తి’’ అని కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారామె. 10 మంది మనవలూ, మనవరాళ్లలో కాయ్ అందరికంటే పెద్ద. ట్రంప్ పెద్ద కుమారుడు ట్రంప్ జూనియర్, ఆయన మాజీ భార్య వనెసా కూతురు. నేనూ ట్రంప్నే... తాతయ్య ఎప్పుడూ దేశం మంచినే కోరతారని కాయ్ చెప్పుకొచ్చారు. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చేందుకు పోరాడుతున్నారన్నారు. ఎందరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొని నిలిచారంటూ ప్రశంసలతో ముంచెత్తారు. ‘‘ఆయనలో బయటికి ప్రపంచానికి పెద్దగా తెలియని కోణాన్ని మీతో పంచుకోదలిచా. తాతగా ఆయనెంతో ప్రేమాస్పదుడు. మేం చిన్నపిల్లలుగా ఉండగా అందరు తాతల్లాగే మమ్మల్నెంతో గారాబం చేసేవారు. మా పేరెంట్స్ చూడకుండా చాక్లెట్లు, కూల్డ్రింకులు ఇప్పించేవారు. మేం ఆనందపడితే చూసి మురిసిపోయేవారు. స్కూల్లో ఎలా చదవుతున్నామో ఎప్పటికప్పుడూ తెలుసుకునేవారు. ఓసారి నాకు బాగా మార్కులొస్తే ఆ ప్రోగ్రెస్ కార్డును ప్రింట్ తీయించి మరీ మిత్రులందరికీ చూపించుకుని సంబరపడ్డారు. నాకు తరచూ కాల్ చేసి గోల్ఫ్ ఎలా ఆడుతున్నానో ఆరా తీసేవారు. తన గోల్ఫ్ కథలన్నీ పంచుకునేవారు. ‘స్కూల్లో ఉన్నా తాతయ్యా, మాట్లాడలేను’ అని చెప్పాల్సి వచ్చేది. ఇద్దరం కలిసి గోల్ఫ్ ఆడేప్పుడు నన్ను ఓడించడానికి ప్రయతి్నంచేవారు. కానీ పడనిచ్చేదాన్ని కాదు. నేను కూడా ట్రంప్నే తాతయ్యా అనేదాన్ని!’’ అంటూ గుర్తు చేసుకున్నారు. 2015లో ట్రంప్ తొలిసారి అధ్యక్ష అభ్యర్థి అయినప్పటి నుంచీ కాయ్ ఆయనతో కలిసి పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ప్రధాన ప్రచార వేదికపై కనిపించడం, మాట్లాడటం ఇదే తొలిసారి. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారామె. ట్రంప్పై కాల్పులు జరిగిన వెంటనే ఆయన పిడికిలెత్తి నినదిస్తున్న ఫొటోను పోస్ట్ చేసి, ‘‘తాతా, ఐ లవ్యూ. పోరాడుతూనే ఉండు!’’ అని రాశారు. ఆమెకు సొంత యూట్యూబ్ చానల్ ఉంది.మా నాన్నసింహసదృశుడు హత్యా యత్నాన్ని ట్రంప్ గొప్పగా ఎదుర్కొన్నారని ఆయన పెద్ద కుమారుడు ట్రంప్ జూనియర్ (46) అన్నారు. ‘‘రక్తం ధారగా కారుతున్నా రొమ్ము విరిచి నిలబడ్డారు. నేపథ్యంలో జాతీయ పతాకం రెపరెపలాడుతుండగా చెయ్యెత్తి పిడికిలి బిగించి పోరాట నినాదాలు చేశారు. అమెరికా పోరాట స్ఫూర్తికే ప్రతీకగా నిలిచారు. కాబోయే దేశాధ్యక్షుడు సింహసదృశుడని నిరూపించారు’’ అంటూ కొనియాడారు. ట్రంప్ భార్య మెలానియా, కూతురు ఇవాంకా, అల్లుడు జరేద్ కుష్నర్ తదితర కుటుంబ సభ్యులు గురువారం (అమెరికా కాలమానం ప్రకారం) సదస్సులో పాల్గొంటారు. -
Iran: ట్రంప్పై దాడిలో మా ప్రమేయం లేదు
టెహ్రాన్: అమెరికా ఎన్నికల ప్రచారంవేళ మాజీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యోదంతంలో తమ ప్రమేయం అస్సలు లేదని ఇరాన్ స్పష్టంచేసింది. రెండేళ్లక్రితం ఇరాక్లో ఇరాన్కు చెందిన సైన్యాధికారి జనరల్ ఖాసిం సులేమానీని ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సైనిక డ్రోన్ దాడిచేసి అంతంచేసింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఆనాడు ఇరాన్ చేసిన ప్రతిజ్ఞకు, ట్రంప్ హత్యకు సంబంధం ఉండొచ్చన్న ఆరోపణల నడుమ ఇరాన్ బుధవారం స్పందించింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి కసీర్ కనానీ ఇరాన్ అధికారిక ఐఆర్ఎన్ఏ వార్తాసంస్థతో మాట్లాడారు. ‘‘ ట్రంప్ మేం దాడి చేయించామంటున్న వార్తల్లో వీసమెత్తు నిజం లేదు. మా సైనిక కమాండర్ సులేమానీని అంతం చేసినందుకు ట్రంప్ను అంతర్జాతీయంగా చట్టప్రకారం శిక్షార్హుడిని చేస్తాం. అంతేగానీ ఇలా హత్య చేయబోం’’ అని ఆయన అన్నారు.ఇరాన్ నుంచి ముప్పు నేపథ్యంలో ఇప్పటికే భద్రత పెంపుట్రంప్ హత్యకు ఆగంతకుడు విఫలయత్నం చేయడంతో ట్రంప్పై గతంలో కక్షగట్టిన ఇరాన్ పేరు మరోసారి తెరమీదకొచ్చింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ కమాండర్ సులేమానీని అమెరికా బలగాలు నాటి అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకే అంతమొందించాయని ఇరాన్ ఆరోపిస్తోంది. దీంతో ట్రంప్ అంతానికి ఇరాన్ కుట్ర పన్ని ఉండొచ్చని అమెరికా నిఘా వర్గాలు భావించాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ట్రంప్కు కొన్ని వారాల క్రితమే భద్రతను మరింత పెంచారు. అయితే ఇరాన్కు, ఆగంతకుడి దాడి ఘటనకు మధ్య సంబంధాన్ని అమెరికా నిఘా, దర్యాప్తు వర్గాలు సహా ఎవరూ నిర్ధారించలేకపోతున్నారు. అయితే ఇరాన్ నుంచి ముప్పు ఉందని, జాగ్రత్తగా ఉండాలని అమెరికా సీక్రెట్ సర్వీస్, ట్రంప్ ప్రచార బృందానికి గతంలోనే ముందస్తు హెచ్చరికలు చేశామని అమెరికా జాతీయ భద్రతా అధికారి ఒకరు చెప్పారు. దాడి జరగొచ్చని, తగు భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని మాకు తరచూ సందేశాలు వస్తూనే ఉన్నాయని యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికార ప్రతినిధి ఆంటోనీ చెప్పారు. ‘ట్రంప్కు ఇరాన్ నుంచి ముప్పు ఉంది. సులేమానీని చంపేశాక ఇది మరింత ఎక్కువైంది’ అని అధ్యక్షభవనం వైట్హౌజ్లో జాతీయ భద్రతా మండలి మహిళా అధికార ప్రతినిధి ఆండ్రినీ వాట్సన్ చెప్పారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా జాన్ బోల్టన్ ఉండేవారు. ఆయనను చంపాలని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ కోర్ సభ్యుడు కుట్ర పన్నాడు. ఆ సభ్యునిపై 2022లో న్యాయశాఖ నేరాభియోగాలు మోపింది. ‘ట్రంప్ను కోర్టులో చట్టప్రకారం శిక్షపడేలా చేస్తాం. అంతేగానీ ఇలా చంపబోం’ అని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరావానీ తాజాగా స్పష్టంచేశారు. -
మళ్లీ తడబడ్డ బైడెన్
మిల్వాయుకీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తడబాట్ల పరంపర అంతులేకుండా కొనసాగుతూనే ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై దాడి తర్వాత ఆదివారం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఆయన మళ్లీ తప్పులు మాట్లాడారు. విభేదాలను బ్యాలెట్ బాక్సుల్లో పరిష్కరించుకుంటాం అనబోయి ‘బ్యాటిల్ (యుద్ధ) బాక్సుల్లో’ పరిష్కరించుకుంటామని అన్నారు. దాంతో ఆయన సొంత పార్టీ అయిన డెమొక్రాట్ నేతలు మరోసారి తలపట్టుకున్నారు. ట్రంప్పై దాడి నేపథ్యంలో ఇది రాజకీయంగా ఉద్రిక్తతలను తగ్గించుకోవాల్సిన సమయమని బైడెన్ అభిప్రాయపడ్డారు. ‘‘రాజకీయాలంటే యుద్ధ క్షేత్రం కాదు. పారీ్టలుగా నేతల మధ్య విభేదాలు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ మనం శత్రువులం కాదని, కలిసి పనిచేసే వారిమని, తోటి పౌరులమేనని గుర్తుంచుకోవాలి. చర్చలైనా, మరోటైనా శాంతియుతమైన జరగాలి. మన దేశంలో హింసకు తావు లేదు. జాతిగా మనమంతా ఒక్కటి కావాల్సిన సమయమిది’’ అంటూ పిలుపునిచ్చారు. -
USA Presidential Elections 2024: ‘ట్రంప్ ధిక్కార’ టీ షర్టుల జోరు
బ్యాంకాక్: అటు తూటాల వర్షం. ఇటు చెవి నుంచి చెంప మీదుగా బొటబొటా కారుతున్న రక్తం. అంతలోకే రక్షణ వలయంగా కమ్ముకున్న సీక్రెట్ సర్వీస్ సిబ్బంది. అంతటి భీతావహ పరిస్థితిలోనూ పిడికిలి గట్టిగా బిగించి పైకెత్తి ‘పోరాటమే’నంటూ గొంతెత్తి నినాదాలు. ట్రంప్పై దాడి జరిగిన క్షణాలకు శాశ్వతత్వం కలి్పంచిన ఫొటో ఇది. హత్యాయత్నం నుంచి త్రుటిలో బయటపడ్డ క్షణాల్లో కూడా ట్రంప్ ఆత్మనిబ్బరానికి, ఆయన ప్రదర్శించిన సాహసానికి ప్రతీకగా నిలిచిన ఈ ఫొటో అప్పుడే టీ షర్టులపైకి కూడా ఎక్కింది. అది కూడా దాడి జరిగిన రెండు గంటల్లోపే! అంత తక్కువ సమయంలోనే టావోబావో, జేడీ.కామ్ వంటి చైనా ఈ కామర్స్ దిగ్గజాలు ఆన్లైన్ దుకాణాలు ఆ ఫొటోలతో కూడిన టీ షర్టులను తయారు చేయడం, ఇ–కామర్స్ ప్లాట్ఫాంల్లో అమ్మకానికి పెట్టడం చకచకా జరిగిపోయాయి! వాటికి చూస్తుండగానే చైనా, అమెరికాల నుంచి 2,000 పై చిలుకు ఆర్డర్లు వచ్చాయి! -
Donald Trump: చనిపోయాననే అనుకున్నా
మిల్వాయుకీ (డెలావెర్): ప్రాణాంతకమైన దాడికి గురైన క్షణాలను అమెరికా మాజీ అధ్యక్షుడు గుర్తు చేసుకున్నారు. ‘‘ఆ సమయంలో నేను చనిపోయాననే అనుకున్నా. కేవలం అదృష్టమో, దైవమో నన్ను కాపాడాయి’’ అని చెప్పుకొచ్చారు. పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా 20 ఏళ్ల దుండగుడు ఆయనపై కాల్పులకు తెగబడటం తెలిసిందే. 78 ఏళ్ల ట్రంప్ కుడి చెవికి తూటా గాయంతో త్రుటిలో బయటపడ్డారు. తనను రిపబ్లికన్ అధ్యక్ష అభ్యరి్థగా అధికారికంగా ప్రకటించే మూడు రోజుల పార్టీ జాతీయ సదస్సుకు వెళ్తూ ఆయన న్యూయార్క్ పోస్ట్ వార్తా సంస్థతో మాట్లాడారు. సరిగ్గా కాల్పులు జరిగిన సమయంలోనే కుడివైపుకు తల తిప్పడం వల్లే బతికి బయటపడ్డానన్నారు. దీన్ని నమ్మశక్యం కాని అనుభవంగా అభివరి్ణంచారు. ‘‘గాయం తర్వాత పిడికిలి పైకెత్తి ఫైట్ అంటూ నేను నినదిస్తున్న ఫొటోను అంతా ఐకానిక్ ఫొటోగా అంటున్నారు. అలాంటి ఫొటో కావాలంటే మామూలుగానైతే చనిపోవాల్సిందే’’ అంటూ సరదా వ్యాఖ్యలు చేశారు. కాల్పుల తర్వాత కూడా ప్రసంగం కొనసాగించాలనే అనుకున్నట్టు వెల్లడించారు. అధ్యక్షుడు బైడెన్ తనకు ఫోన్ చేసి క్షేమం కనుక్కున్న తీరును అభినందించారు. ఈ సందర్భంగా ట్రంప్ కుడి చెవికి బ్యాండేజీ ధరించి కని్పంచారు. రిపబ్లికన్ సదస్సుకు భారీ భద్రత రిపబ్లికన్ల మూడు రోజుల జాతీయ సదస్సు మిల్వాయుకీలో సోమవారం మొదలైంది. ట్రంప్పై దాడి నేపథ్యంలో సదస్సుకు కనీవినీ ఎరగని స్థాయిలో వేలాది మంది సిబ్బందితో అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలి్పంచారు.పోలీసును బెదిరించాడు!ట్రంప్పై దాడికి దిగిన క్రూక్స్ కదలికల్ని కాల్పులకు ముందే ఓ పోలీసు అధికారి పసిగట్టాడు. క్రూక్స్ నక్కిన గోడౌన్పైకి ఎక్కి అతన్ని సమీపించబోగా తుపాకీతో బెదిరించాడు. దాంతో ఆ పోలీసు కిందికి దిగేశాడు. అదే సమయంలో ట్రంప్పై క్రూక్స్ తూటాల వర్షం కురిపించాడు. స్కూలు రోజుల నుంచీ ముభావేక్రూక్స్ స్కూలు రోజుల నుంచీ ఒంటరిగా, ముభావంగానే ఉండేవాడని తోటి విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. ‘‘క్రూక్స్కు పెద్దగా మిత్రులు కూడా లేరు. తోటి విద్యార్థులంతా అతన్ని బాగా ఏడిపించేవారు. రైఫిల్ గురి పెట్టడం చేతగాక స్కూల్ షూటింగ్ టీమ్లోకి ఎంపిక కాలేకపోయాడు’’ అన్నారు.జగన్నాథుడే కాపాడాడు: ఇస్కాన్ప్రాణాంతక దాడి నుంచి ట్రంప్ను పురీ జగన్నాథుడే కాపాడాడని ఇస్కాన్ పేర్కొంది. 48 ఏళ్ల కింద న్యూయార్క్లో తొలి జగన్నాథ రథయాత్ర విజయవంతం కావడంలో ఆయన ఎంతో సాయపడ్డారని చెప్పింది.పోలీసుల తప్పిదమే: ఎఫ్బీఐ ట్రంప్పై దాడి ఉదంతంపై దర్యాప్తు ముమ్మరమైంది. దీనిపై ఉన్నత స్థాయి స్వతంత్ర విచారణకు బైడెన్ ఆదేశించడం తెలిసిందే. దేశీయ ఉగ్రవాద చర్యగా దీనిపై ఎఫ్బీఐ విచారణ చేపట్టింది. దుండగుడు థామస్ మాథ్యూ క్రూక్స్ ఒంటరిగానే ఈ ఘాతుకానికి తెగబడ్డట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచి్చంది. భద్రతా లోపానికి స్థానిక పోలీసు విభాగానిదే బాధ్యత అని సీక్రెట్ సర్వీస్ విభాగం వాదిస్తోంది. క్రూక్స్ మాటు వేసిన గోడౌన్ తమ భద్రతా పరిధికి ఆవల ఉందని పేర్కొంది. కనుక అదంతా స్థానిక పోలీసుల బాధ్యతేనని వివరించింది. -
USA Presidential Elections 2024: ట్రంప్పై హత్యాయత్నం
పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా దుండగుడు కాల్పులకు తెగబడటంతో ట్రంప్ తల వెనుకగా దూసుకెళ్తున్న తూటా. ఆయనపై మొత్తం నాలుగైదు రౌండ్లకు పైగా కాల్పులు జరిగాయి.షికాగో/వాషింగ్టన్: అమెరికా చరిత్రపై మరో రక్తపు మరక. ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (78)పై హత్యా యత్నం జరిగింది. నవంబర్లో జరగనున్న ఎన్నికల్లో గెలిచి మరోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు రిపబ్లికన్ల అభ్యరి్థగా సర్వశక్తులూ ఒడ్డుతున్న ఆయన ఈ ప్రాణాంతక దాడి నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం పెన్సిల్వేనియాలోని బట్లర్ టౌన్లో ఔట్డోర్ ఎన్నికల ర్యాలీలో ఉండగా ఈ ఘోరం జరిగింది. భారీగా హాజరైన మద్దతుదారులు, అభిమానులను ఉద్దేశించి సాయంత్రం ఆరు గంటలకు ట్రంప్ ప్రసంగం మొదలు పెట్టారు. అప్పటికే సమీప గోడౌన్పై నక్కిన ఓ దుండగుడు ఏఆర్ శ్రేణి ఆటోమేటిక్ అసాల్ట్ రైఫిల్తో ట్రంప్పైకి కనీసం ఐదు రౌండ్లకు పైగా కాల్పులు జరిపాడు. దాంతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. అరుపులు, కేకలు, ఆక్రందనలు, పారిపోతున్న జనాలతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఒక తూటా ట్రంప్ కుడి చెవి పై భాగాన్ని గాయపరిచింది. మరిన్ని తూటాలు ఆయన తలకు అతి సమీపం నుంచి దూసుకెళ్లాయి. ట్రంప్ బాధతో తన చెవిని చేత్తో పట్టుకుంటూనే తూటాల నుంచి తప్పించుకునేందుకు వెంటనే డయాస్ కిందకు వంగారు. ఆలోపే సీక్రెట్ సరీ్వస్ సిబ్బంది టంప్ర్ను చుట్టుముట్టి రక్షణ కవచంలా నిలిచారు. చెవి నుంచి కుడి చెంప మీదుగా రక్తమోడుతున్న ట్రంప్ను హుటాహుటిన వేదిక నుంచి తీసుకెళ్లి కార్లో కూర్చోబెట్టి సురక్షితంగా తరలించారు. వేదికను వీడుతూ ట్రంప్ పిడికిలి బిగించి పైకెత్తి, సభికులనుద్దేశించి ‘ఫైట్’ అని పదేపదే భావోద్వేగంతో బిగ్గరగా నినాదాలు చేశారు. వారు కూడా తమ నేతకు మద్దతుగా ఫైట్ అంటూ పెద్దపెట్టున ప్రతి నినాదాలు చేశారు. అక్కణ్నుంచి ట్రంప్ను హుటాహుటిన పిట్స్బర్గ్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కారెక్కే ముందు కూడా ట్రంప్ మరోసారి పిడికిలి బిగించి నినాదాలు చేశారు. ఈ మొత్తం ఉదంతానికి సంబంధించిన వీడియో ప్రపంచమంతటా వైరలవుతోంది. ట్రంప్ క్షేమంగా ఉన్నట్టు అనంతరం ఆయన ప్రచార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దుండగుని కాల్పుల్లో సభికుల్లో ఒకరు దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమీప భవనాలపై మోహరించి ఉన్న సీక్రెట్ సరీ్వస్ స్నైపర్లు తక్షణం స్పందించి దుండగున్ని కాల్చి చంపారు. అతన్ని 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకునిగా గుర్తించారు. అతను కాల్పులకు తెగబడేందుకు కారణం తెలియాల్సి ఉంది. అమెరికా వంటి అగ్ర రాజ్యంలో మాజీ అధ్యక్షుని స్థాయి నేతపై ఇంత సమీపం నుంచి కాల్పులు జరగడం ఘోర భద్రతా వైఫల్యమేనంటున్నారు. ఈ ఘటనపై ఎఫ్బీఐ పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతోంది. ట్రంప్పై దాడితో ప్రపంచం నివ్వెరపోయింది. హత్యా యత్నాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ప్రధాని నరేంద్ర మోదీతో సహా దేశాధినేతలంతా ఈ ఘటనను ఖండించారు.దేవుడే కాపాడాడు: ట్రంప్ ప్రాణాంతక దాడి నుంచి తనను భగవంతుడే రక్షించాడని ట్రంప్ అన్నారు. కాల్పుల ఘటనపై తన సొంత సోషల్ మీడియా ‘ట్రూత్’లో ఆయన స్పందించారు. కాల్పుల్లో మరణించిన, గాయపడ్డ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘‘నిర్భయంగా ముందుకెళ్దాం. ఈ సమయంలో అమెరికన్లమంతా మరింత సమైక్యంగా నిలబడాల్సిన అవసరముంది. అమెరికన్లుగా మన వ్యక్తిత్వాన్ని చాటాల్సిన, దుష్టశక్తి గెలవకుండా అడ్డుకోవాల్సిన సమయమిది. మిమ్మలి్న, మన దేశాన్ని నేను త్రికరణశుద్ధిగా ప్రేమిస్తున్నా. త్వరలో విస్కాన్సిన్ సభ ద్వారా మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’’ అని రిపబ్లికన్ పార్టీ మూడు రోజుల సదస్సును ఉద్దేశించి అన్నారు. ఈ సదస్సులో అధ్యక్ష అభ్యరి్థని అధికారికంగా ప్రకటించనుండటం తెలిసిందే.120 మీటర్ల నుంచే కాల్పులు ట్రంప్పై కాల్పుల ఘటనపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. కేవలం 120 నుంచి 150 మీటర్ల దూరం నుంచి కాల్పులు జరిగినట్టు ప్రాథమికంగా తేలింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉండే అమెరికా మాజీ అధ్యక్షునిపైకి ఇంత సమీపం నుంచి కాల్పులు జరపడం నమ్మకశ్యం కాని విషయమని ఎఫ్బీఐ స్పెషల్ ఏజెంట్ కెవిన్ రోజెక్ అన్నారు. అంతమంది భద్రతా సిబ్బంది రక్షణలో ఉన్న ట్రంప్పైకి దుండగుడు అన్ని రౌండ్ల పాటు కాల్పులు జరపగలగడం వింతగా ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘దుండగుడు అంత సమీపానికి ఎలా రాగలిగాడు, ఎవరు సహకరించారు వంటి కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతుంది’’ అని చెప్పారు.దుండగుడు రిపబ్లికన్ ఓటరే ట్రంప్పై కాల్పులకు తెగబడ్డ థామస్ మాథ్యూ క్రూక్స్ రిపబ్లికన్ పార్టీ ఓటరుగా నమోదు చేసుకున్నట్టు తేలడం విశేషం. అయితే 2021లో డెమొక్రటిక్ పార్టీ అనుబంధ విభాగానికి 15 డాలర్ల విరాళం ఇచి్చనట్టు కూడా వెల్లడైంది. కొద్ది రోజుల ముందే ట్రంప్ను ద్వేషిస్తూ, రిపబ్లికన్ పార్టీని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడట. క్రూక్స్ది పెన్సిల్వేనియాలో పిట్స్బర్గ్ శివార్లలోని బెథెల్ పార్క్ అని తేలింది. బతికుంటే ఈ నవంబర్లో అతను తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేవాడు. మృతదేహం వద్ద గుర్తింపు కార్డుల వంటివేవీ లభించకపోవడంతో అతన్ని గుర్తించడం ఏజెంట్లకు కష్టంగా మారింది. దాంతో చివరికి డీఎన్ఏ పరీక్ష చేసి గుర్తించారు.దుండగుని ముందస్తు ఏర్పాట్లు! ట్రంప్పై కాల్పులకు తెగబడేందుకు దుండగుడు ముందుగానే పక్కాగా ఏర్పాట్లు చేసుకున్నట్టు భావిస్తున్నారు. దాడికి పాల్పడ్డ గోడౌన్ వంటి భవనం ర్యాలీకి అతి సమీపంలో ఉంది. దానిపైకి చేరుకునేందుకు ఒక నిచ్చెన కూడా ఏర్పాటు చేసి ఉంది. అతని మృతదేహం పక్కన పలు రకాలైన ప్యాకేజీలను పోలీసులు గుర్తించారు. వాటిలో పేలుడు పదార్థాలు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. భీతావహంగా ఘటనా స్థలి ట్రంప్పై హత్యా యత్నం జరిగిన బట్లర్ కేవలం 13 వేల జనాభా ఉండే చిన్న పట్టణం. పశి్చమ పెన్సిల్వేనియాలో పిట్స్బర్గ్కు 33 మైళ్ల దూరంలో ఉంటుంది. ఆరుబయట మైదాన ప్రదేశంలో ర్యాలీ జరిగింది. తన మార్కు ఎర్ర టోపీ, నల్ల సూటులో ట్రంప్ వేదికపైకి చేరుకుని ప్రసంగం మొదలు పెట్టారు. అమెరికాలోకి అక్రమ వలసలు పెరిగిపోయాయంటూ చార్ట్ సాయంతో వివరిస్తుండగా కాల్పులు మొదలయ్యాయి. దాంతో అంతా ప్రాణభయంతో కేకలు వేశారు. తూటాలను తప్పించుకునేందుకు నేలపై పడుకుండిపోయారు. ఆ ప్రదేశమంతా భీతావహంగా మారింది. ట్రంప్ను సురక్షితంగా తరలించాక కూడా చాలాసేపటిదాకా జనం నేలపై పడుకునే కని్పంచారు. అనంతరం భద్రతా సిబ్బంది రంగప్రవేశం చేసి ర్యాలీ వేదికను అదుపులోకి తీసుకున్నారు.ముందే చూసిన జనం...! ట్రంప్పై కాల్పులకు దిగిన దుండగుడు క్రూక్స్ను తాము ముందే చూసినట్టు సభికుల్లో పలువురు వెల్లడించారు. అతడు గోడౌన్పై నెమ్మదిగా కదులుతూ ట్రంప్కు వీలైనంత సమీపంగా వచి్చనట్టు ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కాల్పులకు ముందే క్రూక్స్ చేతిలో తుపాకీని స్పష్టంగా చూసినట్టు మరో ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. ‘‘దేవుడా! అతని చేతిలో తుపాకీ ఉందంటూ అరిచా. అంతలోనే కాల్పులకు తెగబడటంతో వెంటనే నేలపై పడుకుని తలెత్తి చూశా. ఏజెంట్ల తూటాలకు అతని తల పేలిపోవడాన్ని కళ్లారా చూశా’’ అని చెప్పుకొచ్చాడు. పెరిగిన ట్రంప్ విజయావకాశాలు! అధ్యక్ష ఎన్నికల రేసులో ఇప్పటికే దూసుకుపోతున్న ట్రంప్ విజయావకాశాలు కాల్పుల ఉదంతం నేపథ్యంలో మరింతగా పెరిగినట్టు చెబుతున్నారు. ఆయన విజయావకాశాలు గత 24 గంటల్లోనే 8 శాతం పెరిగి ఏకంగా 70 శాతానికి చేరినట్టు రాజకీయ అంచనాల వేదిక పాలీమార్కెట్ పేర్కొంది. అంతటి ప్రాణాపాయ పరిస్థితిలోనూ ట్రంప్ అత్యంత వీరోచితంగా వ్యవహరించారంటూ అన్నివైపుల నుంచీ ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘‘తల పక్కనుంచి తూటాలు దూసుకెళ్లాయి. ఒకటి చెవిని ఛిద్రం చేసింది. అయినా ట్రంప్ అస్సలు భయపడలేదు. ప్రాణాలు కాపాడుకోవడానికి మోకాళ్లపై పాక్కుంటూ పోవడం వంటివేవీ చేయలేదు. ఏ మాత్రం వెరవకుండా తిరిగి లేచి నుంచున్నారు. భద్రతా సిబ్బందిని నిలువరించి మరీ పిడికిలి బిగించి పోరాట నినాదాలు చేశారు’’ అంటూ పలువురు మద్దతుదారులు ప్రశంసిస్తున్నారు.ట్రంప్తో మాట్లాడిన బైడెన్ హత్యా యత్నంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విస్మయం వెలిబుచ్చారు. ఈ దారుణ ఘటనను అంతా తీవ్రంగా ఖండించాల్సిన అవసరముందన్నారు. ట్రంప్ క్షేమంగా ఉండటం పట్ల హర్షం వెలిబుచ్చారు. ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం బైడెన్ ప్రజలనుద్దేశించి కూడా మాట్లాడారు. ఇలాంటి హింసకు అమెరికాలో తావు లేదన్నారు. షెడ్యూల్ ప్రకారం వారాంతాన్ని గడిపేందుకు బైడెన్ డెలావెర్ వెళ్లాల్సి ఉన్నా పర్యటన రద్దు చేసుకుని వైట్హౌస్కు తిరిగొచ్చారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో పాటు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, జార్జి బుష్, డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీ నేతలు తదితరులు కూడా దాడిని తీవ్రంగా ఖండించారు.మోదీ ఖండన ట్రంప్పై హత్యా యత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో హింసకు తావు లేదని స్పష్టం చేశారు. ‘‘నా మిత్రుడు ట్రంప్పై దాడి పట్ల తీవ్రంగా ఆందోళన చెందా. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. దేశాధినేతలు మాక్రాన్ (ఫ్రాన్స్), స్టార్మర్ (బ్రిటన్), ఆల్బనీస్ (ఆస్ట్రేలియా), మెలోనీ (ఇటలీ), కిషిడా (జపాన్), ట్రూడో (కెనడా), జెలెన్స్కీ (ఉక్రెయిన్), నెతన్యాహూ (ఇజ్రాయెల్) తదితరులు కూడా దాడిని తీవ్రంగా ఖండించారు.ఎప్పుడు ఏమి జరిగిందంటేఅమెరికా స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఆరింటికి ర్యాలీని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగం మొదలైంది. తర్వాతేం జరిగిందంటే... 6:11:33 – ట్రంప్పై కాల్పులు జరిగాయి. ఒక తూటా కుడి చెవికి తాకడంతో బాధతో ముఖాన్ని తడుముకున్నారు 6:11:35 – తూటాల నుంచి తప్పించుకునేందుకు డయాస్ కిందికి వంగారు. ‘గెట్ డౌన్’ అని అరుస్తూ భద్రతా సిబ్బంది పోడియంపైకి దూసుకొచ్చారు. రక్షణ కవచంలా ట్రంప్ను చుట్టుముట్టారు. అంతలో మరిన్ని తూటాలు దూసుకొచ్చాయి. 6:11:41 – ‘ఏం చేస్తున్నాం మనం? ఏం జరుగుతోంది?’ అంటూ మహిళా ఏజెంట్ కేకలు. జనం కేకలు, అరుపులు. అంతటా గందరగోళం 6:11:50 – మళ్లీ కాల్పుల చప్పుడు. ఒక మహిళ ఆక్రందన 6:11:58 – ‘‘స్పేర్ (కారు) దగ్గరికి కదలండి’’ అంటూ ట్రంప్ భద్రతా ఏజెంట్ల పరస్పర హెచ్చరికలు 6:12:06 – ‘హాక్ఐ (కౌంటర్ అటాక్ టీం) వచ్చేసింది, కారు వైపు వెళ్దాం’ అన్న భద్రతా సిబ్బంది6:12:09 – సిద్ధంగా ఉండాలంటూ కార్లోని సిబ్బందికి సూచనలు6:12:21 – షూటర్ చనిపోయాడని నిర్ధారించుకున్న ట్రంప్ భద్రతా సిబ్బంది6:12:22 – కారువైపు కదిలేందుకు సేఫేనా అంటూ ఏజెంట్ల ఆరా6:12:23 – ‘అంతా సేఫ్, కారువైపు పదండి’ అన్న మరో ఏజెంట్. ట్రంప్ను పైకి లేపిన సిబ్బంది.6:12:35 – అంతా ఓకే అని ట్రంప్కు చెప్పిన ఏజెంట్లు6:12:36 – తన షూ వేసుకోనివ్వాలన్న ట్రంప్6:12:37 – ‘ఆగండి సర్. మీ తలంతా రక్తం’ అని ట్రంప్తో ఓ ఏజెంట్6:12:39 – ‘సర్, మనం కారువైపు కదలాలి’ అన్న మరో ఏజెంట్ 6:12:47 – ‘ఆగండి, ఆగండి’ అంటూ భద్రతా సిబ్బందిని నిలువరించిన ట్రంప్. జనంకేసి చూస్తూ పిడికిలి బిగించి ‘ఫైట్’ అంటూ బిగ్గరగా నినాదాలు. అంతే బిగ్గరగా బదులిచి్చన జనం 6:12:54 – ‘మనమిక వెళ్లాలి’ అంటూ ట్రంప్ను కారుకేసి తీసుకెళ్లిన భద్రతా సిబ్బంది. మరోసారి నినాదాలు చేస్తూ కార్లో కూర్చున్న ట్రంప్జుయ్మంటూ తూటాలు దూసుకెళ్తున్న శబ్దాలు స్పష్టంగా విని్పంచాయి. ఏదో జరుగుతోందని అనుకునేంతలో ఓ తూటా నా కుడి చెవి పై భాగాన్ని ఛిద్రం చేసింది. చర్మం తెగిపోయింది. విపరీతంగా రక్తం కారింది. ఏం జరుగుతోందో అప్పటికి నాకర్థమైంది. అమెరికా వంటి దేశంలో ఇలాంటి చర్య జరగడం అనూహ్యం. గాడ్ బ్లెస్ అమెరికా– తనపై కాల్పులను ఉద్దేశించి సొంత సోషల్ మీడియా ‘ట్రూత్’లో డొనాల్డ్ ట్రంప్ -
NATO Summit: బైడెన్.. మళ్లీ తడబడెన్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పట్టువీడటం లేదు. అధ్యక్ష బరి నుంచి తప్పుకోవాలంటూ ఇంటా బయటా డిమాండ్లు నానాటికీ పెరిగిపోతున్నా ఆ ప్రసక్తే లేదని మరోసారి కుండబద్ధ్దలు కొట్టారు. 81 ఏళ్ల వయసులోనూ రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ను ఓడించి మరోసారి అధ్యక్షునిగా పని చేసే సామర్థ్యం తనలో పుష్కలంగా ఉందని చెప్పుకొచ్చారు. నాటో శిఖరాగ్రం ముగింపు సందర్భంగా గురువారం బైడెన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తన వయసు, ఫిట్నెస్పై పెరిగిపోతున్న సందేహాల్లో పస లేదని నిరూపించేందుకు శాయశక్తులా ప్రయతి్నంచారు. అయితే గంటకు పైగా జరిగిన ఈ భేటీలోనూ ఆయన తడబాట్ల పర్వం కొనసాగడం డెమొక్రాట్ల శిబిరంలో ఆందోళనలను మరింత పెంచింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అనబోయి ట్రంప్ అంటూ బైడెన్ తికమకపడ్డారు! అధ్యక్ష రేసు నుంచి మీరు తప్పుకుంటే ట్రంప్ను ఓడించే సత్తా హారిస్కు ఉందా అని విలేకరులు ప్రశ్నించగా, ‘‘అధ్యక్షునిగా పని చేయగల అర్హత, సత్తా ట్రంప్కు ఉన్నాయి. కనుకనే ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నా’’ అన్నారు. దాంతో అంతా అవాక్కయ్యారు. అయినా బైడెన్ తన వ్యాఖ్యలను సరిచేసుకోలేదు. అంతకుముందు నాటో వేదికపై కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని సభ్య దేశాల ప్రతినిధులకు ‘అధ్యక్షుడు పుతిన్’ అంటూ పరిచయం చేశారు!! జెలెన్స్కీ దీన్ని తేలిగ్గా తీసుకుంటూ నవ్వేసినా ప్రతినిధులంతా తెల్లబోయారు. ఈ నేపథ్యంలో బైడెన్ మానసిక ఆరోగ్యంపై నెలకొన్న సందేహాలు మరింత పెరిగాయి. అయితే వైద్యులు సూచిస్తే మానసిక పరీక్షలకు సిద్ధమని ఆయన ప్రకటించారు. ‘‘అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఇప్పటిదాకా మూడుసార్లు న్యూరో పరీక్షలు చేయించుకున్నా. తాజా పరీక్ష గత ఫ్రిబ్రవరిలో జరిగింది. నేను మానసికంగా ఫిట్గా ఉన్నాననేందుకు అధ్యక్షునిగా నేను తీసుకుంటున్న రోజువారీ నిర్ణయాలే రుజువు. కానీ నేనెంత చేసినా ఎవరూ సంతృప్తి చెందడం లేదు’’ అంటూ వాపోయారు! అయితే తన అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నేతల్లో భయాలను దూరం చేయాల్సిన అవసరముందని అంగీకరించారు. బ్రహా్మండంగా పని చేశా అధ్యక్ష ఎన్నికల్లో తలపడేందుకు అత్యంత అర్హున్ని తానేనని బైడెన్ చెప్పుకున్నారు. ‘‘ట్రంప్ను ఓసారి ఓడించా. మళ్లీ ఓడించి తీరతా. అప్పుడే ఏమీ అయిపోలేదు. ప్రచారంలో ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది’’ అన్నారు. నాలుగేళ్లలో అమెరికాను అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చేశానంటూ గణాంకాలు ఏకరువు పెట్టారు. ఆర్థిక రంగంలో తన పనితీరు చాలా బాగుందని ఏకంగా 16 మంది నోబెల్ గ్రహీతలైన ఆర్థికవేత్తలు కితాబిచ్చారని చెప్పుకున్నారు. రాత్రి 8 గంటల తర్వాత ప్రచారంతో పాటు ఎలాంటి కార్యక్రమాలూ పెట్టుకునేది లేదని తానన్నట్టు వచి్చన వార్తలను బైడెన్ ఖండించారు. విదేశీ వ్యవహారాలు తదితరాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. గాజా ఆక్రమణ కూడదంటూ ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహూను, ఉక్రెయిన్పై యుద్ధంలో మద్దతివ్వొద్దంటూ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను హెచ్చరించానని చెప్పుకొచ్చారు. రష్యాతో సాన్నిహిత్యానికి చైనా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. లాడెన్ను చంపగానే అఫ్గాన్ నుంచి అమెరికా పూర్తిగా వైదొలగాల్సిందన్నారు.ట్రంప్ విసుర్లు బైడెన్ తనను ఉపాధ్యక్షునిగా పేర్కొనడంపై ట్రంప్ వ్యంగ్యా్రస్తాలు విసిరారు. ‘బిగ్ బోయ్ జో మీడియా భేటీ మొదట్లోనే నన్ను తన ఉపాధ్యక్షునిగా చెప్పుకు న్నారు’’ అని ఎద్దేవా చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు.పెరుగుతున్న వ్యతిరేకత తనకు వ్యతిరేకంగా గళమెత్తుతున్న సొంత పార్టీ నేతలు, ఎంపీల విశ్వాసాన్ని చూరగొనడమే లక్ష్యంగా తాజా మీడియా సమావేశంలో బైడెన్ సర్వశక్తులూ ఒడ్డారు. కానీ ఆ ప్రయత్నంలో ఆయన విఫలమయ్యారని పరిశీలకులు అంటున్నారు. బైడెన్ తప్పుకోవాలని సమావేశం ముగియగానే ముగ్గురు ప్రముఖ డెమొక్రాట్ ఎంపీలు జిమ్ హైమ్స్, స్కాట్ పీటర్స్, ఎరిక్ సొరెన్సన్ పిలుపునిచ్చారు! దాంతో ఆయన వైదొలగాలని డిమాండ్ చేస్తున్న సొంత పార్టీ ఎంపీల సంఖ్య 17కు పెరిగింది. నిజానికి గత నెల సీఎన్ఎన్ చానల్లో జరిగిన తొలి అధ్యక్ష డిబేట్లో ట్రంప్ ముందు బైడెన్ పూర్తిగా తేలిపోవడం తెలిసిందే. దానితో పోలిస్తే తాజా మీడియా భేటీలో ఆయన మెరుగ్గానే మాట్లాడారు. తాను తీరిక లేని షెడ్యూల్తో బిజీగా గడుపుతుంటే ట్రంప్ మాత్రం గోల్ఫ్ ఆడుతూ సేదదీరుతున్నారంటూ దుయ్యబట్టారు. ‘‘ట్రంప్ నాలుగేళ్ల పాలనలో అస్తవ్యస్తం చేసిననాటో కూటమిని ఎంతగానో శ్రమించి ఒక్కతాటిపైకి తెచ్చా. నాటో శిఖరాగ్రంలో పాల్గొన్న దేశాధినేతలెవరూ నా ఫిట్నెస్ను, మానసిక ఆరోగ్యాన్ని సందేహించలేదు. పైపెచ్చు ట్రంప్ మళ్లీ రావొద్దని, నేనే గెలవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు’’ అని అన్నారు.ఒబామా, పెలోసీ కూడా... బైడెన్ తప్పుకోవాలంటున్న డెమొక్రాటిక్ పార్టీ నేతల జాబితాలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా చేరుతున్న సూచనలు కని్పస్తున్నాయి. ట్రంప్ను ఓడించడం బైడెన్కు తలకు మించిన పనేనని వారిద్దరూ తాజాగా ప్రైవేటు సంభాషణలో అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. నాటో శిఖరాగ్రం అనంతరం బైడెన్ మీడియా సమావేశం చూసి వారు మరింతగా పెదవి విరిచినట్టు డెమొక్రటిక్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘బైడెన్ అధ్యక్ష అభ్యరి్థత్వం దాదాపుగా ముగిసిన కథే. ఆయనకు మనస్తాపం కలగకుండా, పార్టీ అవకాశాలు దెబ్బ తినకుండా దీన్ని ప్రకటించడం ఎలాగన్నది మాత్రమే తేలాల్సిలి ఉంది. బహుశా బైడెన్ తనంత తానుగా తప్పుకుంటారని ఒబామా, పెలోసీ భావిస్తున్నారు. లేదంటే ఆయనకు నచ్చజెప్పి తప్పించే బాధ్యత తీసుకోగలిగింది వారిద్దరే’’ అని పేర్కొంటున్నాయి. ఈ విషయమై ఉన్నత స్థాయి డెమొక్రాట్ నేతలు గురువారం ఉదయం పెలోసీతో సమావేశమైనట్టు అమెరికా మీడియా పేర్కొంది. ‘‘ఇక ట్రంప్ను ఓడించడం బైడెన్కు శక్తికి మించిన పనేనన్న అభిప్రాయంతో పెలోసీ కూడా ఏకీభవించారు. అయితే నాటో శిఖరాగ్రం జరుగుతున్న నేపథ్యంలో దేశాధినేతల ముందు బైడెన్ను ఇబ్బంది పెట్టడం సరికాదని, కనీసం ఒక రోజన్నా ఆగాలని సూచించారు. దాంతో బైడెన్ను తప్పించేందుకు ఆమె కూడా సుముఖంగానే ఉన్నట్టు తేలిపోయింది. అందుకే భేటీ తర్వాత పలువురు డెమొక్రాట్ ఎంపీలు బైడెన్ తప్పుకోవాలని బాహాటంగా డిమాండ్ చేశారు’’ అంటూ యూఎస్ మీడియాలో జోరుగా కథనాలు వెలువడుతున్నాయి. -
ఇరాన్ నూతన అధ్యక్షుడిగా డాక్టర్ మసూద్ పెజెష్కియాన్
టెహ్రాన్: ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాద అభ్యర్థి మసూద్ పెజెష్కియాన్ విజయం సాధించారు. అధ్యక్ష ఎన్నికల్లో అతివాద అభ్యర్థి సయీద్ జలీలీని ఓడించి మసూద్ పెజెష్కియాన్ ఘన విజయం అందుకున్నారు. దీంతో, పెజేష్కియాన్ మద్దతుదారులు శనివారం ఉదయం వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు.వివరాల ప్రకారం.. ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా వైద్యుడు(హార్ట్ సర్జన్) మసూద్ పెజెష్కియాన్ ఎన్నికయ్యారు. ఇక, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు దాదాపు 30 మిలియన్ల ఓట్లు పోలయ్యాయి. శుక్రవారం ఎన్నికల తర్వాత అధికారులు సమర్పించిన డేటా పెజెష్కియాన్ను 16.3 మిలియన్ ఓట్లతో విజేతగా ప్రకటించగా, జలీలీకి 13.5 మిలియన్ల ఓట్లు వచ్చినట్టు అక్కడి ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక, ఎంపీ మసూద్ పెజెష్కియాన్ ఎన్నికల ప్రచారంలో పశ్చిమ దేశాలతో సంబంధాలను బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రజలు మసూద్కు భారీ విజయాన్ని అందించారు.ఇదిలా ఉండగా.. ఇరాన్లో ఎవరు ఎన్నికల్లో పోటీ చేయాలన్నది ఆ దేశ గార్డియన్ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. నలుగురు అభ్యర్థుల పేర్లను గార్డియన్ కౌన్సిల్ ఆమోదించింది. ఇక, పెజెష్కియాన్ ఎంపీగానే కాకుండా మహ్మద్ ఖతామీ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా కూడా పనిచేశారు. 1980-89 వరకు డాక్టర్గా కొనసాగారు. ఇక, సయీద్ జలీలీ ఇరాన్ మాజీ చీఫ్ న్యూక్లియర్ నెగోషియేటర్.Masoud Pezeshkian wins Iran's presidential race with 16.3M votes, beating Saeed Jalili's 13.5M Pezeshkian promises outreach to the West. Analysts predict pragmatic foreign policy shifts. Known for his Pro-India & Anti-Pakistan standSupporters celebrate in Tehran & other… pic.twitter.com/n5JU2dtZgg— Nabila Jamal (@nabilajamal_) July 6, 2024మరోవైపు.. ఇరాన్ ఎన్నికల సంఘం నుంచి వచ్చిన డేటా ప్రకారం, ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించబడిన ఏకైక సంస్కరణవాద నాయకుడు పెజెష్కియాన్. ఆయన అభ్యర్థిత్వం గురించి ఇటీవల వరకు పెద్దగా చర్చ జరగలేదు. అయితే మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఖతామీ, ఉదారవాది హసన్ రౌహానీల మద్దతు అతని అభ్యర్థిత్వానికి బలాన్నిచ్చింది. ప్రచారం సందర్భంగా పెజెష్కియాన్.. ముఖ్యంగా పశ్చిమ దేశాలతో నిర్మాణాత్మక సంబంధాలను, ప్రపంచంలో ఒంటరిగా ఉన్న ఇరాన్ అణు ఒప్పందాన్ని పునరుద్ధరించాలని చెప్పుకొచ్చారు. దీంతో, ప్రజల్లో ఆయనపై ఓ నమ్మకం ఏర్పడింది. -
ట్రంప్తో డిబెట్.. అదో భయానక అనుభూతి: బైడెన్
వాషింగ్టన్: ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. ఈ డిబెట్లో ట్రంప్ ధాటికి బైడెన్ తేలిపోయారు. ఈ నేపథ్యంలో చర్చ రోజున ఏం జరిగిందో బైడెన్ క్లారిటీ ఇచ్చారు. తాను భయంకరమైన అనుభూతికి లోనైనట్టు బైడెన్ చెప్పుకొచ్చారు.కాగా, బైడెన్ తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడూతూ..‘ట్రంప్తో చర్చ రోజున నేను ఆనారోగ్యంతో ఉన్నాను. తీవ్రమైన జలుబు కారణంగా అస్వస్థతకు లోనయ్యారు. అది నాకు భయంకరమైన అనుభూతి. అనారోగ్యం కారణంగానే నేను బాగా మాట్లాడలేకపోయాను. కానీ, నేను రేసులో ఉన్నాను. ట్రంప్ను కచ్చితంగా ఓడించగలను’ అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. ట్రంప్తో చర్చలో భాగంగా బైడెన్ కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయారు. ఈ చర్చలో ట్రంప్ పైచేయి సాధించాడని పలు మీడియా సంస్థలు కూడా పేర్కొన్నాయి. దీంతో, ఎన్నికల నుంచి బైడెన్ తప్పుకోవాలనే చర్చ మొదలైంది. కానీ, వైట్ హౌస్ వర్గాలు మాత్రం బైడెన్ రేసులో ఉంటారని చెప్పుకొచ్చాయి. ఇక, బైడెన్ కూడా తాను పోటీలోనే ఉంటానని స్పష్టం చేశారు. I'm not letting one 90-minute debate wipe out three and a half years of work.I'm staying in the race, and I will beat Donald Trump. pic.twitter.com/5VZHf4N4xj— Joe Biden (@JoeBiden) July 5, 2024మరోవైపు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారపర్వంతో అలసిపోతున్నారట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా అంగీకరించారు. తాను నిద్రపోవడానికి మరింత సమయం కావాలని, రాత్రి ఎనిమిది తర్వాత ఎలాంటి ప్రచారంలో పాల్గొనలేనని, అర్ధరాత్రి కార్యక్రమాలు వద్దని చెప్పారు. డెమోక్రాటిక్ పార్టీకి చెందిన గవర్నర్లతో జరిగిన సమావేశంలో బైడెన్ తెలిపారు. డొనాల్డ్ ట్రంప్తో జరిగిన చర్చలో బైడెన్ తడబడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన తడబాటుకు గల కారణాన్ని బైడెన్ ఇదివరకే వెల్లడించారు. తన సిబ్బంది ఎంత వారించినా చర్చకు ముందు తాను పలు విదేశీ పర్యటనలకు వెళ్లానని తెలిపారు. దాని వల్ల వచ్చిన అలసట కారణంగానే వేదికపై దాదాపు నిద్రపోయినంత పనైందని పేర్కొన్నారు. అందుకే చర్చలో సరిగా వాదించలేకపోయినట్లు చెప్పారు. -
USA Presidential Elections 2024: బైడెన్ను.. మార్చొచ్చా?
డొనాల్డ్ ట్రంప్తో ముఖాముఖి చర్చలో జో బైడెన్ ఆద్యంతం తడబడటం, మాటల కోసం వెతుక్కోవడంతో డెమొక్రాట్లలో భయాందోళనలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 81 ఏళ్ల వయసులో బైడెన్ సమర్థుడైన అభ్యర్థి కాగలరా? మరో నాలుగేళ్లు అగ్రరాజ్యం అధినేతగా భారం మోయగలరా? అనే సందేహాలు ముప్పిరిగొన్నాయి. నవంబరు 5న అధ్యక్ష ఎన్నికలు ముంచుకొస్తుండటంతో వయోభారం రీత్యా అధ్యక్షుడి మానసిక సంతులతపై డెమొక్రాట్లలో అనుమానాలు తలెత్తుతున్నాయి. టెక్సాస్ నుంచి డెమొక్రాట్ ఎంపీ ఒకరు బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని పిలుపునిచ్చారు. డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థగా జో బైడెన్ను మార్చే అవకాశంఉందా? స్వయంగా ఆయన రేసు నుంచి తప్పుకోవచ్చా? అప్పుడు ఎవరు అధ్యక్ష అభ్యర్థి అవుతారు? అనే అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. బైడెన్పై తీవ్ర ఒత్తిడిఅవును.. తప్పుకోవచ్చు. కాకపోతే అందుకు ఆయన సిద్ధంగా లేరు. తానే డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థనని, వైదొలగాలని తననెవరూ ఒత్తిడి చేయడం లేదని బైడెన్ బుధవారం స్పష్టం చేశారు. డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యరి్థని ఆగస్టు 19–22 వరకు షికాగోలో జరిగే డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ (డీఎన్సీ)లో అధికారికంగా ఎన్నుకోనున్నారు. ఓహియో రాష్ట్రంలో బ్యాలెట్ పేపర్పై పేరుండటానికి వీలుగా జూలై 21 నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు జరిగే వర్చువల్ కన్వెన్షన్లో తమ అభ్యర్థిని ఖరారు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. వివిధ రాష్ట్రాల ప్రైమరీల్లో వచి్చన ఫలితాల ఆధారంగా.. ఆ నిష్పత్తిలో అభ్యర్థులకు డెలిగేట్లను కేటాయిస్తారు. దాదాపు 4,000 డెలిగేట్లలో 99 శాతం బైడెన్ గెల్చుకున్నారు. డీఎన్సీ నిబంధనల ప్రకారం వీరందరూ బైడెన్కు మద్దతు పలకాలి. ఒకవేళ రాబోయే రోజుల్లో ఒత్తిడి మరీ పెరిగిపోయి.. రేసు నుంచి వైదొలగాలని బైడెన్ నిర్ణయించుకుంటే.. అప్పుడు ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్తో పాటు ఇతరులెవరైనా డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం పోటీపడవచ్చు. అప్పుడు డెలిగేట్లు జాతీయ కన్వెన్షన్లో (ఓపెన్ కన్వెన్షన్ అంటారు) తమకు నచ్చిన అభ్యర్థులను సూచించి ఒకరికి మెజారిటీ వచ్చేదాకా రౌండ్ల వారీగా ఓటింగ్ చేయొచ్చు. 1968లో అప్పటి అధ్యక్షుడు లిండన్ బి.జాన్సన్ మళ్లీ పోటీచేయకూడదని నిర్ణయించడంతో ఓపెన్ కన్వెన్షన్ నిర్వహించారు. బలవంతంగా తప్పించొచ్చా? పారీ్టలో మెజారిటీ మార్పును కోరుకొని బైడెన్ ససేమిరా అంటే ఆయన్ను బలవంతంగా తప్పించడానికి ఆస్కారం ఉంది. డీఎన్సీ నియమావళిలో కొన్ని లొసుగులు ఉన్నాయి. ’జాతీయ కన్వెన్షన్లో డెలిగేట్లు తమను ఎన్నుకున్న వారి అభిప్రాయాన్ని/ మనోగతాన్ని ప్రతిబింబించాలి’ అని నిబంధనలు చెబుతున్నాయి. అంటే డెమొక్రాటిక్ పార్టీ డెలిగేట్లు ఇతరుల వైపు కూడా మొగ్గు చూపవచ్చు (అదే రిపబ్లికన్ పారీ్టలో అయితే డెలిగేట్లు ఎవరి తరఫున అయితే ఎన్నికయ్యారో వారికే బద్ధులై ఉండాలని స్పష్టంగా ఉంది). బైడెన్ తరఫున ఎన్నికైన 3,894 డెలిగేట్లలో 1,976 మంది పైచిలుకు డెలిగేట్లు వర్చువల్ కన్వెన్షన్లో ఓటింగ్కు దూరంగా ఉండాలి. అప్పుడు స్పష్టమైన తీర్పు రాక అదనపు రౌండ్ల ఓటింగ్ జరుగుతుంది. డెలిగేట్లు ఇంత పెద్ద సంఖ్యలో తిరుగుబాటు చేస్తారా? అని అమెరికా రాజకీయ పండితులు సందేహిస్తున్నారు. అయితే అధ్యక్ష అభ్యరి్థని ఎన్నుకొనే నిబంధనలను డీఎన్సీ రూల్స్ కమిటీ ఏ సమయంలోనైనా మార్చవచ్చు. కమలా హారిస్కు ఛాన్స్ ఉందా? నాలుగేళ్ల పదవీకాలంలో అధ్యక్షుడు ఎప్పుడైనా తప్పుకొంటే.. ఉపాధ్యక్షురాలైన కమలా హారిస్ ఆటోమెటిగ్గా పగ్గాలు చేపడతారు. కానీ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఇలాంటి ఆస్కారం లేదు. ఓపెన్ కన్వెన్షన్లో అందరి అభ్యర్థుల్లాగే భారతీయ–అమెరికన్ హారిస్ కూడా పోటీపడాల్సి వస్తుంది. మెజారిటీ డెలిగేట్ల ఓట్లను సంపాదించాల్సి ఉంటుంది. అధ్యక్ష డిబేట్ తర్వాత సీఎన్ఎన్ నిర్వహించిన పోల్లో ట్రంప్కు 47 శాతం మంది ఓటర్లు మద్దతు పలుకగా, కమలా హారిస్కు 45 శాతం మంది మద్దతు లభించడం విశేషం. హారిస్కు అనుకూలించే మరో అంశం ఏమిటంటే.. డెమొక్రాటిక్ పార్టీ ప్రచార ఫండ్ను బైడెన్ కాకుండా ఆమె మాత్రమే నేరుగా పొందగలరు. బైడెన్ స్వయంగా వైదొలిగితే తప్పితే ఆయన్ను అధ్యక్ష అభ్యరి్థగా తప్పించడం అంత సులభం కాదు. సాంకేతికంగా అవకాశాలు ఉన్నప్పటికీ ఆచరణలో కష్ట సాధ్యమే. – సాక్షి నేషనల్ డెస్క్ -
‘బైడెన్ ఇక చాలు.. ఎన్నికల నుంచి తప్పుకో’
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత అధ్యక్షుడు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఈ ఎన్నికల్లో పోటీ చేయవద్దని సొంత పార్టీ నేత కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. జో బైడెన్ డెమోక్రటిక్ అభ్యర్థిగా అధ్యక్ష పదవికి వెంటనే రాజీనామా చేయాలని కోరారు. కాగా, టెక్సాస్ చెందిన డెమోక్రటిక్ పార్టీ శాసనసభ్యుడు లాయిడ్ డాగెట్ మంగళవారం ఓ ప్రకటనలో..‘ఇటీవల ట్రంప్తో డిబెట్లో జో బైడెన్ విఫలమయ్యారు. అనేక ప్రశ్నలకు బైడెన్ సమాధానం ఇవ్వలేకపోయారు. అమెరికా ప్రజలు, పార్టీ కోసం బైడెన్ కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా బైడెన్ తప్పుకోవాలని కోరుతున్నాను.అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఇప్పటి వరకు ఎన్నో విజయాలు సాధించారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లా కాకుండా.. బైడెన్ అమెరికా ప్రజల కోసం ఎంతో మంచి చేశారు. నిబద్దతతో పనిచేశారు. ఆయన పట్ల ఎప్పటికీ గౌరవం తగ్గదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే, బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని బహిరంగంగా చెప్పిన వ్యక్తి డాగెట్ కావడం విశేషం.ఇదిలా ఉండగా.. ఇటీవల జో బైడెన్ తీరు సర్వత్రా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ట్రంప్తో బైడెన్ పోటీ పడలేరని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని సందర్భంగా బైడెన్ విచిత్రంగా ప్రవర్తించడం పలు అనుమానాలకు తావిచ్చింది. వయస్సు రీత్యా కూడా బైడెన్ ఎన్నికల నుంచి తప్పుకోవాలని పలువురు సూచిస్తున్నారు. దీంతో, ఈసారి అమెరికా ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.తడబాటుపై బైడెన్ వివరణట్రంప్తో ఇటీవల జరిగిన సంవాదంలో అధ్యక్షుడు బైడెన్ కాస్త తడబడిన విషయం తెలిసిందే. అయితే, దానికి కారణాన్ని ఆయన తాజాగా వెల్లడించారు. వర్జీనియాలో జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. నా సిబ్బంది ఎంత వారించినా చర్చకు ముందు నేను విదేశీ పర్యటనలకు వెళ్లా. దాని వల్ల వచ్చిన అలసట కారణంగానే వేదికపై దాదాపు నిద్రపోయినంత పనైంది. అందుకే అలిసిపోవడం వల్లే సంవాదంలో సరిగా వాదించలేకపోయా అని చెప్పారు. అయితే తాను మరింత చురుగ్గా వ్యవహరించాల్సిందని, అందుకు తనను క్షమించాలని, ఇది సాకు కాదని.. కేవలం తన వివరణ మాత్రమేనని పార్టీ మద్దతుదారులను ఆయన కోరారు. -
Iran presidential election 2024: ఫలితం తేల్చని ఇరాన్ ఎన్నికలు
దుబాయ్: ఇరాన్ అధ్యక్ష పదవికి శుక్రవారం జరిగిన పోలింగ్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. దేశ చరిత్రలోనే అతి తక్కువ ఓటింగ్ నమోదైన నేపథ్యంలో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్కు గానీ ఛాందసవాది సయీద్ జలీలీకిగానీ మెజారిటీ దక్కలేదు. దేశ రాజ్యాంగం ప్రకారం పోలైన ఓట్లలో 50 శాతం పైగా సాధించిన వారే అధ్యక్షుడవుతారు. శుక్రవారం జరిగిన పోలింగ్లో అతి తక్కువగా 39.9 శాతం మందే ఓటేశారు. 60 శాతం మందికి పైగా ఓటింగ్కు దూరంగా ఉండిపోయారు. మొత్తం 2.45 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోగా శనివారం వెలువడిన ఫలితాల్లో పెజెష్కియాన్కు 1.04 కోట్ల మంది, జలీలీకి 90.4 లక్షల మంది ఓటేశారని అధికారులు ప్రకటించారు. వీరితోపాటు బరిలో నిలిచిన పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బఘెర్ ఖలిబాఫ్కు 30.3 లక్షల ఓట్లు, షియా మత పెద్ద మొస్తాఫాకు 2.06 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఫలితాలు వెలువడ్డాక అధ్యక్ష బరి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఖలిబాఫ్ రెండో విడత పోలింగ్లో తన మద్దతు జలీలీకే ఉంటుందని ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో జులై 5వ తేదీన రెండో దశ పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్లో ఎక్కువ మందిని తన వైపు తిప్పుకోగలిగితేనే పెజెష్కియాన్కు గెలిచే అవకాశాలుంటాయి. లేకుంటే, సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మద్దతున్న జలీలీదే పైచేయి అవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇరాన్లో మరోసారి ఛాందసవాదులే అధికారంలోకి వస్తారని అంటున్నారు. ‘నిరసన తెలపడం ప్రజల హక్కు. ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండటం ద్వారా ఇరాన్ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. అధ్యక్ష అభ్యర్థులతోపాటు ప్రస్తుత వ్యవస్థతను సైతం వారు తిరస్కరించారు’ అని లండన్లోని చాతం హúస్లో మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా ప్రోగ్రాం డైరెక్టర్ సనమ్ వకీల్ విశ్లేషించారు. అక్కడి వ్యవస్థల పట్ల ప్రజల్లో ఏ మేరకు ఉదాసీనత, నిరాశ గూడుకట్టుకునే ఉన్నాయనేందుకు ఇదే ఉదాహరణ అని ఆమె పేర్కొన్నారు. -
Watch: బైడెన్ Vs ట్రంప్ వాడీవేడీ మాటల దాడి..
Live Updates..👉బైడెన్, ట్రంప్ మధ్య ముగిసిన డిబెట్.. Watch Joe Biden get escorted off the stage! What a stark contrast between how Trump left the stage and how Biden is exiting. #debate pic.twitter.com/Um9xhPAyMs— Donald Trump Jr. (@DonaldJTrumpJr) June 28, 2024 👉డిబెట్లో భాగంగా సహనం కోల్పోయిన బైడెన్.. ట్రంప్పై తీవ్ర వ్యాఖ్యలు VIDEO: Very horrible moment for Joe Biden, he loses control, and loses his train of thought and just froze. #biden #trump #debate #Debates2024 pic.twitter.com/nwa5J7at6Z— Prince Carlton 🇺🇸 (@_PrinceCarlton_) June 28, 2024 👉గత ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తారా?👉ట్రంప్ సమాధానిమిస్తూ.. ఇది న్యాయమైన, చట్టబద్ధమైన ఎన్నికలు అయితే ఖచ్చితంగా అంగీకరిస్తాను. కానీ ఈ ఎన్నికలు మోసం, హాస్యాస్పదంగా జరిగాయి.👉బైడెన్ స్పందిస్తూ.. ట్రంప్ నువ్వు ఓడిపోయావు. అనంతరం, దేశవ్యాప్తంగా కోర్టుల్లో అప్పీలు చేసుకున్నారు. మీ పిటిషన్లకు ఎలాంటి అర్హత లేదనే ఏ న్యాయస్థానాలు గుర్తించలేదు. మోసం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. మళ్లీ ఓడిపోతే దాన్ని అంగీకరిస్తారని నేను అనుకోవడం లేదు. VIDEO: Trump: "I really don't know what he said at the end of that sentence; I don't think he knows what he said either." #trump #biden #Debates2024 #debate pic.twitter.com/PX95oDF4Xy— Prince Carlton 🇺🇸 (@_PrinceCarlton_) June 28, 2024 👉ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం, పాలస్తీనా స్వతంత్ర దేశానికి మద్దతు ఇస్తారా? అన్న ప్రశ్నపై ట్రంప్ స్పందిస్తూ.. దానిపై ఆలోచిస్తాం అని చెప్పుకొచ్చారు.బైడెన్ బలహీనుడు. అతను ఇప్పుడు పాలస్తీనియన్ వ్యక్తిగా మారిపోయాడు. అయినప్పటికీ బైడెన్ను వారు ఇష్టపడటం లేదు. Donald Trump to Joe Biden during the Presidential debate:“He’s become like a Palestinian. They don’t like him because he’s a very bad Palestinian. He’s a weak one.” pic.twitter.com/pi9leLCmS8— Pop Base (@PopBase) June 28, 2024 👉అమెరికాలో చరిత్రలో బైడెన్ వంటి అసమర్థ నాయకుడిని ఎన్నడూ చూడలేదు: ట్రంప్ Donald Trump and Joe Biden get into an argument over golfing skills during the Presidential debate. pic.twitter.com/guuYjcLUSn— Pop Base (@PopBase) June 28, 2024 👉డిబెట్ సందర్భంగా పలు అంశాలపై ఇద్దరూ నేతలు మాటల దాడి చేసుకున్నారు. ముఖ్యంగా సరిహద్దుల గురించి, బైడెన్ తీసుకువచ్చిన పలు చట్టాలపై మాటల దాడి జరిగింది. 👉బైడెన్పై విరుచుకుపడిన ట్రంప్.. బైడెన్ కొడుకు విషయంలో ట్రంప్ మాటల దాడి చేశారు. గన్స్, డ్రగ్స్ విషయంలో బైడెన్ తన కుమారుడిని కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నలు చేశారు. అతడిని అరెస్ట్ కాకుండా కాపాడుకున్నారు. Donald Trump says he has “the biggest heart on this stage” during the Presidential debate. pic.twitter.com/hmKPtu2EXs— Pop Base (@PopBase) June 28, 2024 👉 ఉక్రెయిన్ అంశంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ అంశాన్ని ట్రంప్ ప్రస్తావిస్తూ.. నేను అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్పై దాడులు జరిగేవి కాదు. ఈ విషయంలో బైడెన్ విఫలమయ్యారు. 👉సరిహద్దుల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగా అమెరికా నష్టపోయిందని బైడెన్ ఫైరయ్యారు. 👉 చర్చ సందర్భంగా ఇరువురూ తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు. ట్రంప్ లూసర్ అంటూ బైడెన్ అన్నారు. Joe Biden calls Donald Trump a ‘sucker’ and ‘loser’ during the Presidential debate while defending his son. pic.twitter.com/ZpvyZv1DlM— Pop Base (@PopBase) June 28, 2024 👉ఆప్ఘనిస్థాన్ విషయంలో బైడెన్ తీసుకున్న చర్యల కారణంగా 13 మంది అమెరికా భద్రతా సిబ్బంది అమరులయ్యారని ట్రంప్ ఆరోపించారు. అమెరిక్లను కాపాడటంలో బైడెన్ దారుణంగా విఫలమయ్యారు. I can’t believe Joe Biden is actually BOASTING about his Afghanistan withdrawal. 13 servicemembers were kiIIed during his disastrous withdrawal!REMEMBER THEIR NAMES!Johanny Rosario PichardoNicole L. GeeDarin T. HooverHunter LopezDaegan W. PageHumberto A. SanchezDavid L.… pic.twitter.com/uQPHRrghPv— Libs of TikTok (@libsoftiktok) June 28, 2024 👉 ట్రంప్నకు ఓటు వేస్తే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్టేనన్న జో బైడెన్. ట్రంప్ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని విమర్శించారు. Joe Biden just declared that every single person who votes for Trump is voting against American democracy. He just vilified well over half the country. This is the most disgraceful thing he has said on the stage tonight. pic.twitter.com/KoEOqP9Z6U— Riley Gaines (@Riley_Gaines_) June 28, 2024 👉ద్రవ్యోల్బణం, అమెరికా ఆర్థిక వ్యవస్థ అనే అంశంపై చర్చ మొదలైంది.👉ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. ట్రంప్ తన హయాంలో సంపన్నులకు ప్రతిఫలమిచ్చారని, ఫ్రీఫాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థను తనకు అందించారని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగం రేటు 15%కి పెరిగింది, ఇది భయంకరమైనది అన్నారు. 👉దీనికి ప్రతిగా ట్రంప్ మాట్లాడుతూ.. చర్చ సందర్భంగా ముఖ్యంగా అమెరికాలో ద్రవ్యోల్బణం, ఉద్యోగాల కల్పన విషయంలో బైడెన్ ప్రభుత్వంపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఈ విషయంలో బైడెన్ విఫలమయ్యారని ఆరోపించారు. బైడెన్ పరిపాలనలో ఉద్యోగ వృద్ధి కేవలం అక్రమవలసదారులకు మాత్రమే జరిగిందన్నారు. దేశంలో ద్రవ్యోల్భణం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. 👉చర్చ సందర్భంగా ముఖ్యంగా అమెరికాలో ద్రవ్యోల్బణం, ఉద్యోగాల కల్పన విషయంలో బైడెన్ ప్రభుత్వంపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఈ విషయంలో బైడెన్ విఫలమయ్యారని ఆరోపించారు. 👉అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య వాడీవేడి చర్చా కార్యక్రమం జరుగుతోంది. ఇరువురు నేతలు ముఖాముఖి డిబెట్లో పాల్గొన్నారు.👉అమెరికా చర్రితలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు చర్చలో పాల్గొన్నారు. -
మెక్సికోలో కొత్త చరిత్ర
మెక్సికో సిటీ: మెక్సికో చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అంతా ఊహించినట్టుగానే అధికార మోరెనా వామపక్ష కూటమి అభ్యర్థి క్లాడియా షేన్బామ్ (61) ఘనవిజయం సాధించారు. 200 ఏళ్ల స్వతంత్ర మెక్సికో చరిత్రలో దేశ అధ్యక్ష పీఠమెక్కనున్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు. యూదు మూలాలున్న తొలి ప్రెసిడెంట్ కూడా ఆమే కానున్నారు! షేన్బామ్కు ఇప్పటికే దాదాపు 60 శాతం ఓట్లు లభించినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రత్యర్థులిద్దరూ నాకిప్పటికే ఫోన్ చేసి అభినందించారు. ఓటమిని అంగీకరించారు. దేశానికి తొలి అధ్యక్షురాలిని కాబోతున్నా’’ అంటూ చిరునవ్వులు చిందించారు. ‘‘ఇది నేను ఒంటరిగా సాధించిన విజయం కాదు. తల్లులు మొదలుకుని కూతుళ్లు, మనవరాళ్ల దాకా దేశ మహిళలందరి విజయమిది’’ అన్నారు. విపక్ష కూటమి మహిళకే అవకాశమిచి్చంది. రెండు ప్రధాన పారీ్టల నుంచీ మహిళలే తలపడటమూ మెక్సికో చరిత్రలో ఇదే తొలిసారి. విపక్ష కూటమి అభ్యర్థి సోచిల్ గాల్వెజ్కు 28 శాతం, మరో ప్రత్యర్థి జార్జ్ అల్వారిజ్ మైనేజ్కు 10 శాతం ఓట్లు వచి్చనట్టు ఈసీ పేర్కొంది. షేన్బామ్ నూతన చరిత్ర లిఖిస్తున్నారంటూ అధ్యక్షుడు ఆంద్రెజ్ మాన్యుయెల్ లోపెజ్ అబ్రేడర్ అభినందించారు. ఆరేళ్ల పదవీకాలంలో ఆయన పలు చరిత్రాత్మక నిర్ణయాలతో ప్రజల మనసు గెలుచుకున్నారు. షేన్బామ్ విజయంలో లోపెజ్ పాపులారిటీదే ప్రధాన పాత్ర. ఒకసారికి మించి అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు మెక్సికో రాజ్యాంగం అనుమతించదు. దాంతో ఆయన రెండోసారి బరిలో దిగలేకపోయారు. 2018లో లోపెజ్ గెలిచినప్పటి మాదిరిగా ఈసారి ప్రజల్లో పెద్దగా హర్షాతిరేకాలు వ్యక్తం కాకపోవడం విశేషం. అధ్యక్ష పదవితో పాటు పాటు 9 రాష్ట్రాల గవర్నర్లు, 128 మంది సెనేటర్లు, 500 మంది కాంగ్రెస్ ప్రతినిధులు, వేలాది మేయర్లు, స్థానిక సంస్థల ప్రతినిధి పదవులకు కూడా ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలపై ఆసక్తి నెలకొంది. మొత్తం 32 గవర్నర్ పదవుల్లో మెరేనా పార్టీకి 23 ఉన్నాయి. షేన్బామ్కు సవాళ్లెన్నో... షేన్బామ్ అక్టోబర్ 1న అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమెకు సవాళ్ల స్వాగతమే లభించనుంది. మహిళలపై హింసకు మెక్సికో ప్రపంచంలోనే పెట్టింది పేరు. ఈ సమస్యను రూపుమాపాల్సి ఉంది. సంక్షేమ పథకాలతో లోపెజ్ బాగా ఆకట్టుకున్నా అడ్డూ అదుపూ లేదని వ్యవస్థీకృత హింస, గ్యాంగ్ వార్లు, డ్రగ్ ట్రాఫికింగ్, పెట్రో ధరల పెరుగుదల తదితరాల కట్టడికి పెద్దగా చేసిందేమీ లేదన్న అసంతృప్తి ప్రజల్లో బాగా ఉంది. వీటిపై కొత్త అధ్యక్షురాలు దృష్టి పెట్టాలని వారు భావిస్తున్నారు. ప్రస్తుత పథకాలన్నింటినీ కొనసాగిస్తూనే దేశాన్ని పీడిస్తున్న అన్ని సమస్యలనూ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని షేన్బామ్ ప్రకటించారు. ఏ తారతమ్యాలూ లేకుండా ప్రజలందరినీ ఒకేలా చూస్తానన్నారు.లా డాక్టోరా... షేన్బామ్ విద్యార్హతలు అన్నీ ఇన్నీ కావు. ఎనర్జీ ఇంజనీరింగ్లో పీహెచ్డీ చేవారు. అందుకే ఆమెను అభిమానులు ముద్దుగా ‘లా డాక్టోరా’ అని పిలుచుకుంటారు. పర్యావరణవేత్తగా చాలా పేరుంది. నోబెల్ శాంతి బహుమతి పొందిన ఐరాస పర్యావరణ శాస్త్రవేత్తల బృందంలో షేన్బామ్ సభ్యురాలు. రాజధాని మెక్సికో సిటీ మేయర్గా చేసిన తొలి మహిళ కూడా ఆమే. షేన్బామ్ తాత, అమ్మమ్మ హిట్లర్ హోలోకాస్ట్ హింసాకాండను తప్పించుకోవడానికి యూరప్ నుంచి మెక్సికో వలస వచ్చారు. షేన్బామ్ మెక్సికో సిటీలోనే పుట్టారు. 2000లో రాజకీయ అరంగేట్రం చేశారు. -
రామఫోసా గద్దెదిగే ప్రసక్తే లేదు: ఏఎన్సీ
కేప్ టౌన్: దక్షిణాఫ్రికా ఎన్నికల్లో అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్కు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ రాకపోయినా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా రాజీనామా చేయబోరని పార్టీ స్పష్టం చేసింది. ఐక్య కూటమి ఏర్పాటు చేసి ఆయన సారథ్యంలోనే స్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తామని పేర్కొంది. ఎన్నికల్లో ఏఎన్సీకి 40 శాతం, డెమొక్రటిక్ అలయెన్స్కు 20 శాతం, మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా సారథ్యంలోని ఎంకే పార్టీకి 14 శాతం ఓట్లు రావడం తెలిసిందే. 1994లో వర్ణ వివక్ష అంతమైన ఎన్నికలు జరిగినప్పటి ఏఎన్సీకి మెజారిటీ రాకపోవడం ఇదే తొలిసారి. -
దక్షిణాఫ్రికా దక్కేదెవరికో?
సియాంకొబా. దక్షిణాఫ్రికాలో అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఊరూవాడా హోరెత్తించిన ఎన్నికల నినాదం. అంటే ‘మాదే ఘనవిజయం’ అని జులు భాషలో అర్థం. కానీ ఘనవిజయం దేవుడెరుగు, ఏఎన్సీ ఈసారి సాధారణ మెజారిటీ సాధించడం కూడా కష్టమేనని ఒపీనియన్ పోల్స్ అంటున్నాయి. వర్ణవివక్ష అంతమై తెల్లవారి పాలన ముగిశాక 1994లో ప్రజాస్వామిక పద్ధతిలో జరిగిన తొలి ఎన్నికల్లో గెలిచింది మొదలు 30 ఏళ్లుగా ఏఎన్సీయే అధికారంలో కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో దానికి తొలిసారి గట్టి పోటీ ఎదురవుతోంది... దక్షిణాఫ్రికాలో ఎన్నికలకు వేళైంది. 400 మందితో కూడిన నేషనల్ అసెంబ్లీతో పాటు 9 ప్రొవిన్షియల్ అసెంబ్లీలకు కూడా బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా ఏడో విజయం కోసం ఏఎన్సీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. కానీ పెచ్చరిల్లుతున్న అవినీతి, నిరుద్యోగం, కరెంటు కోతలు, నీటి కొరత, మౌలిక సదుపాయాల లేమి వంటివి పారీ్టకి బాగా ప్రతికూలంగా మారాయి. వీటిపై ప్రజాగ్రహం ప్రచారం పొడవునా స్పష్టంగా కన్పించింది. శనివారం అధ్యక్షుడు సిరిల్ రామఫోసా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్వహించిన చివరి ప్రచార సభ కూడా అనుకున్నంతగా విజయవంతం కాలేదు. సభకు వేదికైన చారిత్రక సొవెటో టౌన్షిప్లోని 90వేల మంది సామర్థ్యమున్న ఫుట్బాల్ స్టేడియం పూర్తిగా నిండకపోవడం ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తికి అద్దం పడుతోందని పరిశీలకులు చెబుతున్నారు. 71 ఏళ్ల రామఫోసాపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలున్నాయి. విచ్చలవిడిగా మనీ లాండరింగ్కు పాల్పడినట్లు విపక్షాలు ఆరోపించాయి. ఆయనను అభిశంసించాలని పార్లమెంట్ నియమించిన న్యాయ నిపుణుల కమిటీ కూడా సూచించింది. అయితే పార్లమెంట్లో ఉన్న మెజారిటీ సాయంతో ఆ ప్రక్రియను ఏఎన్సీ అడ్డుకుంది. రామఫోసాపై జరిగిన పోలీసు దర్యాప్తు వివరాలు బయటకు రాలేదు. వీటన్నింటి నేపథ్యంలో ఈసారి ఏఎన్సీ తన చరిత్రలో తొలిసారిగా 50 శాతం కంటే తక్కువ ఓట్లకు పరిమితమయ్యేలా కన్పిస్తోంది. అదే జరిగితే అతి పెద్ద పారీ్టగా నిలిచినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ దక్కదు. ఏఎన్సీ ఈసారి ఇతర పారీ్టల మద్దతుపై ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తుందని సర్వేలూ పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ ఆదివారం వెల్లడ య్యే ఫలితాలపైనే నెలకొంది. – సాక్షి, నేషనల్ డెస్క్ జాకబ్ జుమా పంచ్... మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా గతేడాది రామఫోసాతో విభేదించి సొంత పార్టీ పెట్టుకోవడం ఏఎన్సీకి పెద్ద దెబ్బ! 82 ఏళ్ల జుమా ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరాడుతున్నారు. ఆయన పార్టీ ఉంకొంతో వెసీజ్వె (ఎంకే) 13 శాతం దాకా ఓట్లు రాబట్టవచ్చని సర్వేల్లో వెల్లడయ్యింది. అధికారంలోకి రాకపోయినా ఏఎన్సీ అవకాశాలను బాగా దెబ్బ తీయడం ఖాయమని పరిశీలకులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా జుమా సొంత ప్రావిన్స్ క్వాజులూ నాటాల్లో ఏఎన్సీ ఆధిపత్యానికి ఎంకే పూర్తిగా గండికొట్టనుందని అంటున్నారు. క్వాజులూ ప్రావిన్స్లోని ఎంకే నేతల్లో తెలుగు మూలాలున్న విశి్వన్ గోపాల్రెడ్డి ప్రముఖ స్థానంలో ఉండటం విశేషం.బరిలో 51 విపక్షాలు దక్షిణాఫ్రికాలో ప్రధాన ప్రతిపక్షం డెమొక్రటిక్ అలయెన్స్ (డీఏ). ఈ కూటమికి 22 నుంచి 27 శాతం ఓట్లు రావచ్చని ఏప్రిల్లో ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైంది. అయితే పలువురు నేతలు డీఏను వీడి సొంత పార్టీలు పెట్టుకున్నారు. ఇది విపక్ష కూటమికి ప్రతికూలంగా మారింది. ఈసారి 51 ప్రతిపక్షాలు పోటీలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి ఏఎన్సీకి కలిసొచ్చేలా కని్పస్తోంది.ముస్లిం ఓట్లపై వల... జనాభాలో ముస్లింలు 2 శాతం కంటే తక్కువే ఉంటారు గానీ వారి ప్రతి ఓటూ విలువైనదే. అందుకే ముస్లింల ఓట్లపై పారీ్టలు వల విసురుతున్నాయి. పాలస్తీనా ఉద్యమానికి పోటీలు పడి మరీ మద్దతు ప్రకటిస్తున్నాయి. గాజాలో దాడులు ఆపాలంటూ ఇజ్రాయెల్ను డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాన సమస్యలివీ... → తీవ్ర కరెంటు కోతలు → పెచ్చరిల్లిన అవినీతి → పేదరికం (50 శాతం దాటింది) → 32 శాతం దాటిన నిరుద్యోగం (ప్రపంచంలోనే అత్యధికం) → తీవ్ర నీటి కొరత → మౌలిక సదుపాయాల లేమి → మితిమీరిన నేరాలు, హింసాకాండ → రాజకీయ హత్యలుదక్షిణాఫ్రికా పార్లమెంటులో రెండు సభలుంటాయి. 90 మంది సభ్యులతో కూడిన నేషనల్ కౌన్సిల్, 400 మంది సభ్యులుండే నేషనల్ అసెంబ్లీ. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో దీని సభ్యులను ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. మెజారిటీ సాధించే పార్టీ సారథి అధ్యక్షుడవుతారు. దేశ జనాభా 6.2 కోట్లు కాగా ఓటర్లు 2.8 కోట్ల మంది. జనాభాలో 80 శాతానికి పైగా నల్లజాతీయులే. ఈ ఎన్నికల్లో తొలిసారిగా స్వతంత్రులకు కూడా పోటీ చేసే అవకాశం కలి్పంచారు.ఎన్నికల నేపథ్యంలో దక్షిణాఫ్రికావ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ హత్యలు కలకలం సృస్టిస్తున్నాయి. 2023 జనవరి నుంచి 40 మందికి పైగా విపక్ష నేతలు, నిజాయతీపరులైన అధికారులు, హక్కుల కార్యకర్తలు హత్యకు గురయ్యారు. ఇది అధ్యక్షుడు రామఫోసా పనేనంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రచారంలో దీన్ని ప్రధానాంశంగా కూడా మార్చుకున్నాయి. వీటిపై ప్రజల్లో కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నేషనల్ అసెంబ్లీలో బలాబలాలు (మొత్తం స్థానాలు 400) ఏఎన్సీ 230 డెమొక్రటిక్ అలయన్స్ 84 ఎకనమిక్ ఫ్రీడం ఫైటర్స్ 44 ఇతరులు 42 -
USA Presidential Election 2024: ఒకే వేదికపైకి బైడెన్, క్లింటన్, ఒబామా!
న్యూయార్క్: డెమోక్రాటిక్ పార్టీ తరఫున మరోసారి అధ్యక్ష రేసులో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిధుల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. గురువారం రాత్రి న్యూయార్క్లోని రేడియో సిటీ మ్యూజిక్ హాల్లో జరిగిన ఈ కార్యమానికి మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ హాజరయ్యారు. బైడెన్కు ఏకంగా 26 మిలియన్ డాలర్ల (సుమారు రూ.216 కోట్లు) పైచిలుకు నిధులు సమకూరాయి. అమెరికా అధ్యక్ష ప్రచారంలో ఒక్క కార్యక్రమంలో ఇంత భారీ విరాళాలు రావడం ఇదే తొలిసారి! -
సుప్రీంలో ట్రంప్కు భారీ విజయం
వాషింగ్టన్: మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ ఊరట. కొలరాడో ప్రైమరీ బ్యాలెట్ పత్రాల నుంచి ఆయన పేరు తొలగించాలన్న రాష్ట్ర సుప్రీంకోర్టు తీర్పును అమెరికా సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఆయన పేరుండాల్సిందేనంటూ సంచలన తీర్పు వెలువరిచింది. దాంతో కొలరాడోతో పాటు ఇలినాయీ, మెయిన్ వంటి రాష్ట్రాల్లో బ్యాలెట్ పేపర్పై పేరు తొలగింపు ముప్పు ఎదుర్కొంటున్న ట్రంప్కు భారీ ఊరట లభించింది. ఆయా రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యరి్ధత్వం కోసం ప్రైమరీల్లో ట్రంప్ పోటీకి మార్గం సుగమమైంది. పార్లమెంట్పైకి మద్దతుదారులను ఉసిగొల్పారన్న ఆరోపణలపై రాజ్యాంగంలోని 14వ సవరణ మూడో సెక్షన్ను ఉపయోగించి ట్రంప్ను ప్రైమరీ నుంచి కొలరాడో సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. అధ్యక్ష అభ్యరి్థపై కోర్టు ఈ సెక్షన్ను వాడటం అమెరికా చరిత్రలో అదే తొలిసారి. 14వ సవరణను వాడే అధికారం పార్లమెంట్కే తప్ప రాష్ట్రాలకు లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఇది అమెరికా సాధించిన ఘన విజయంమని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
ట్రంప్ కంటే బైడెన్ నయం: పుతిన్
మాస్కో: తెంపరితనం, దూకుడుకు మారుపేరైన డొనాల్డ్ ట్రంప్తో పోలిస్తే జో బైడెన్ను మరోసారి అమెరికా అధ్యక్షుడిగా చూడాలనుకుంటున్నానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆశాభావం వ్యక్తంచేశారు. రష్యా అధికారిక టీవీ ఛానెల్కు బుధవారం ఇచి్చన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పుతిన్ పలు అంశాలపై మాట్లాడారు. ‘‘ రాబోయే అమెరికా ఎన్నికల్లో ఎవరు అధ్యక్షుడు అయినా వారితో రష్యా ప్రభుత్వం కలిసి పనిచేస్తుంది. రష్యా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే ట్రంప్ కంటే బైడెన్ గెలిస్తేనే మంచిదని అనుకుంటున్నా. ఎందుకంటే ఉపాధ్యక్షుడిగానూ, అధ్యక్షుడిగానూ పనిచేసిన బైడెన్కు అనుభవం ఎక్కువ. పాతకాలం విధానాలను అవలంభించే నేత ఆయన. ఆయనను కొంత అంచనావేయొచ్చు కూడా. ట్రంప్ ఆలోచనలు అనూహ్యం’ అని అన్నారు. బైడెన్ ఆరోగ్యం సరిగా లేదంటూ వస్తున్న వార్తలపై పుతిన్ను ప్రశ్నించగా.. ‘ నేనేమీ డాక్టర్నుకాదు. అయి నా ఇలాంటి ప్రశ్నకు వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. అయితే బైడెన్ ఆరోగ్య సమస్యలు వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావం చూపగలవు. నేను గమనించినంత వరకు బైడెన్ ఆరోగ్యంగానే ఉన్నారు. అధ్యక్షుడిగా కొనసాగే సత్తా ఆయనకు లేదు అని నేనైతే అనుకోను. పేపర్ వైపు చూసే ప్రసంగం చదువుతారనేది వాస్తవం. నేను కూడా కొన్ని సార్లు ప్రసంగపాఠాన్ని చూసే చదువుతా. అదేమంత పెద్ద విషయం కాదు. ఏదేమైనా బైడెన్ ప్రభుత్వ విధానాలు చాలా తప్పు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తోనే చెప్పా’’ అని పుతిన్ వెల్లడించారు. -
డొనాల్డ్ ట్రంప్ మానసికస్థితిపై నిక్కీ హేలీ విమర్శలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీదారుగా ఉన్న భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ మాజీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్పై విమర్శలు గుప్పించారు. ఆమె శనివారం మాట్లాడుతూ ట్రంప్కు కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ మానసిక స్థితిపై నిక్కీ హేలీ మండిపడ్డారు. జనవరి 6,2021న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన హింసాత్మక దాడిని ఆపటంలో తీవ్రంగా విఫలమయ్యారని విమర్శించారు. శుక్రవారం రాత్రి ట్రంప్ ఓ ర్యాలీలో పాల్గొన్నారని.. జనవరి 6, 2021న అమెరికా క్యాపిటల్ భవనంపైన జరిగిన దాడి విషయంలో తాను భద్రత కల్పించలేకపోయానని పార్టీ శ్రేణులు చేస్తున్న విమర్శలను పదే పదే ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. తాను ఎందుకు ఆ హింసాత్యక ఘటనకు తాను బాధ్యత వహిస్తావని ప్రశ్నించారు. కనీసం అప్పుడు తాను ఆఫీసులో కూడా లేనని పేర్కొన్నారు. ట్రంప్ అప్పటి అమెరికన్ హౌజ్( ప్రతినిధుల సభ) స్పీకర్ అయిన నాన్సీ పెలోసీని దృష్టిలో పెట్టుకొని పొరపాటుపడుతూ తనపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దీంతో ఆయన మానసికస్థితి ఏంటో తెలుస్తోందని మండిపడ్డారు. ట్రంప్ మానసిక ఆరోగ్యం దిగజారుతోందని తెలపడానికి ఇదే నిదర్శమని అన్నారు తాను ఎటువంటి అవమానకర వ్యాఖ్యలు చేయటం లేదన్నారు. కానీ, ఎంతో ఒత్తిడితో కూడుకున్న అగ్రరాజ్యం అధ్యక్ష పదవి చేపట్టడానికి ట్రంప్ మానసిక స్థితి సరిపోతుందా? అని సూటిగా ప్రశ్నించారు. ఇటువంటి సమయంలో ప్రజలు మరో వ్యక్తిని అమెరికా అధ్యక్షుడిగా కోరుకుంటారని నిక్కీ హేలీ తెలిపారు. చదవండి: US presidential election 2024: నిక్కీ హేలీ నా రన్నింగ్ మేట్ కాదు: ట్రంప్ -
US presidential election 2024: నిక్కీ హేలీ నా రన్నింగ్ మేట్ కాదు: ట్రంప్
వాషింగ్టన్: అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీదారుగా ఉన్న భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ తన రన్నింగ్ మేట్ (ఉపాధ్యక్ష పదవి అభ్యర్థి) కాదని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఆమెకు అంత సామర్థ్యం లేదని, ఉపాధ్యక్ష పదవికి ఆమెను ఎంపిక చేసుకోనని వ్యాఖ్యానించారు. అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ తరఫున అగ్రభాగాన ఉన్న ట్రంప్ శుక్రవారం కాంకార్డ్లో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. న్యూహ్యాంప్షైర్లో ట్రంప్కు సమీప ప్రత్యర్థిగా ఉన్న నిక్కీ హేలీ..తాను ఉపాధ్యక్ష పదవి రేసులో లేనని ఇప్పటికే ప్రకటించగా ట్రంప్ పైవిధంగా స్పందించడం గమనార్హం. అదేవిధంగా, ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్లో నిక్కీ హేలీని జాతిపరంగా హేళన చేశారు. పంజాబ్కు చెందిన సిక్కు తల్లిదండ్రుల కుమార్తె అయిన నిక్కీ హేలీని ‘నింబ్రా’అంటూ పలుమార్లు పేర్కొన్నారు. నిక్కీ తల్లిదండ్రులు అమెరికన్లు కానందున అధ్యక్ష పదవికి ఆమె అర్హురాలు కాదని ఇటీవల పేర్కొన్న ట్రంప్..ఆమె పేరును ‘నిమ్రద’అంటూ తప్పుగా ఉచ్చరించారు. సౌత్ కరోలినాకు రెండు పర్యాయాలు గవర్నర్గా పనిచేసిన నిక్కీ హేలీ అసలు పేరు నిమ్రతా నిక్కీ హేలీ. వివాహానంతరం నిక్కీ హేలీగా మార్చుకున్నారు. -
Donald Trump: మళ్లీ ఎన్నికైతే నియంతలా పరిపాలిస్తా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా తాను మళ్లీ ఎన్నికైతే ఒక నియంత తరహాలో పరిపాలన సాగిస్తానని మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. తనకు రెండు లక్ష్యాలు ఉన్నాయని, వాటిని నెరవేర్చవడానికి అవసరమైతే నియంతలా మారుతానని స్పష్టం చేశారు. మెక్సికో సరిహద్దు నుంచి నుంచి అమెరికాలోకి చొరబాట్లను అరికట్టడం, ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రోత్సాహం ఇవ్వడం తన లక్ష్యాలు అని వివరించారు. తనపై తప్పుడు ప్రచారం సాగిస్తూ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ట్రంప్ మండిపడ్డారు. ఒకవేళ తనపై అక్రమ కేసులు నమోదు చేసి, విచారణ చేపడితే అమెరికా మొత్తం స్తంభించిపోతుందని తేల్చిచెప్పారు. తనను నియంతగా చిత్రీకరించి, ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అధ్యక్షుడిగా అధికారంలో తాను యుద్ధాలు చేయలేదని, విదేశాల్లో ఉన్న అమెరికా దళాలను వెనక్కి రప్పించానని గుర్తుచేశారు. జో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇతర దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ యుద్ధాల నుంచి రాజకీయంగా లాభం పొందాలని బైడెన్ ఎత్తుగడలు వేస్తున్నారని ట్రంప్ ధ్వజమెత్తారు. -
US ELECTIONS : ట్రంప్ ప్రచారంలో ఆమె కీ రోల్ !
వాషింగ్టన్: వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై దేశ మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఫోకస్ చేశారు. త్వరలో ప్రారంభమవనున్న ప్రైమరీ ఎన్నికలకు ఆయన సిద్ధమవుతున్నారు. జనవరి నుంచి జులై వరకు మొత్తం 50 రాష్ట్రాల్లో ప్రైమరీ బ్యాలెట్ జరగనుంది. దీని కోసం ట్రంప్ ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. అయితే ఈ సారి అధ్యక్ష ఎన్నికల క్యాంపెయినింగ్లో ట్రంప్కు ఆయన కుటుంబ సభ్యులు పూర్తిస్థాయిలో అండగా నిలవాలని డిసైడయ్యారు. ఎక్కువగా తెర వెనుకే ఉంటూ పబ్లిసిటీ అంటే పెద్దగా ఇష్టపడని ట్రంప్ భార్య మెలానియా ఈసారి అధ్యక్ష ఎన్నికల క్యాంపెయిన్లో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగానే ఇటీవల ఆమె ఎక్కువగా పబ్లిక్ ప్రోగ్రామ్లలో పాల్గొంటున్నారని చెబుతున్నారు. ట్రంప్ మళ్లీ అధ్యక్షుడవడం ఖాయమని ఆయన కుటుంబ సభ్యులు బలంగా నమ్ముతున్నట్లు ఈ విషయంలో వారంతా పూర్తి విశ్వాసంతో ఉన్నారని ఆయన కుటుంబానికి సన్నిహితంగా ఉండే వర్గాలు చెబుతున్నాయి. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా విజయం సాధించిన 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ ఆయన భార్య మెలానియా కీలక పాత్ర పోషించినప్పటికీ తెరవెనుకే ఉండిపోయారు. ఈసారి మాత్రం ఆమె తెర వెలుపల కీ రోల్ పోషించనున్నారని టాక్. ఇదీచదవండి..ముంబై చేరిన ఆ విమానం.. 25 మంది ఇంకా ఫ్రాన్స్లోనే?!