World Bank
-
ప్రపంచ బ్యాంక్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ 2025.. అర్హతలివే..
ప్రపంచ బ్యాంకు(World Bank)లో పనిచేస్తూ కెరియర్ను ప్రారంభించాలని చూస్తున్నారా? ఎకనామిక్స్, ఫైనాన్స్, హ్యూమన్ డెవలప్మెంట్, సోషల్ సైన్సెస్, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్, ఇంజినీరింగ్, అర్బన్ ప్లానింగ్.. వంటి ఎన్నో రంగాల్లో అనుభవం పొందడానికి విద్యార్థులు, గ్రాడ్యుయేట్లకు ‘ప్రపంచ బ్యాంక్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ 2025’ ద్వారా అవకాశం కల్పిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్కు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం.అర్హతలు ఇవే..ప్రపంచ బ్యాంక్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ 2025కు అర్హత సాధించడానికి అభ్యర్థులు అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసుండాలి. లేదా ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్లో చేరాలి. ఇంగ్లిష్లో పట్టు ఉండాలి. కంప్యూటింగ్, ఇతర సాంకేతిక నైపుణ్యాలు కలిగి ఉండాలి. ఫ్రెంచ్, స్పానిష్, రష్యన్, అరబిక్, పోర్చుగీస్, చైనీస్ వంటి అదనపు ల్యాంగ్వేజీలపై పట్టు ఉంటే ఈ ప్రోగ్రామ్కు ఎంపికయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి.స్టైపెండ్, అలవెన్సులు, దరఖాస్తు ప్రక్రియఈ ప్రోగ్రామ్లో చేరిన ఇంటర్న్లకు గంటలవారీగా స్టైపెండ్, అలవెన్స్లు ఉంటాయి. ఇంటర్న్షిప్ మేనేజర్ విచక్షణ మేరకు అభ్యర్థులు ప్రయాణ ఖర్చుల కింద 3,000 డాలర్ల వరకు అలవెన్స్లు అందుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ 2025 ఫిబ్రవరి 14 వరకు కొనసాగుతుంది. ఆన్లైన్లో ప్రపంచ బ్యాంక్ అధికారిక వెబ్సైట్లోని వివరాల ప్రకారం రెజ్యూమె అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: మార్కెట్ పతనానికి కారణం ఈ వ్యాఖ్యలేనా..?ఎంపిక విధానంఇంటర్న్షిప్లో చేరాలనుకునే అభ్యర్థులను వెబ్సైట్లో అప్లోడ్ చేసిన వివరాల ప్రకారం షార్ట్లిస్ట్ చేస్తారు. వారికి 2025 మార్చి నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. 2025 ఏప్రిల్లో తుది ఎంపిక ఉంటుంది. 2025 మేలో ఇంటర్న్ గ్రూప్ ప్రారంభం అవుతుంది. ఇంటర్న్షిప్ వ్యవధి 2025 మే నుంచి ఆగస్టు వరకు ఉంటుంది. -
వచ్చే రెండేళ్లూ 6.7 శాతం వృద్ధి
వాషింగ్టన్: భారత్ ఎకానమీ వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2025–26, 2026–27) 6.7 శాతం వృద్ధి సాధిస్తుందని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక పేర్కొంది. దక్షిణాసియా వృద్ధికి సంబంధించి బహుళజాతి సంస్థ ఒక నివేదిక విడుదల చేస్తూ, 2025–26లో దక్షిణాసియా వృద్ధి అంంచనా 6.2 శాతంగా పేర్కొంది. సేవలు, తయారీ రంగాలు పటిష్ట వృద్ధిని నమోదుచేసుకుంటాయని పేర్కొంది. 2024–25లో వృద్ధి రేటును 6.5 శాతంగా సంస్థ అంచనా వేసింది. -
అమెరికా సుంకాలు ప్రపంచానికే ప్రమాదం
అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంచాలనే నిర్ణయం వల్ల ప్రపంచ వృద్ధి ప్రభావం చెందుతుందని ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా విడుదల చేసిన గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ నివేదిక ప్రకారం, వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు, వాణిజ్య భాగస్వాములు తమ సొంత టారిఫ్లను పెంచుతూ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఇప్పటికే మందకొడిగా 2.7%గా ఉన్న ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 2025లో 0.3 శాతం పడిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.ఇతర దేశాలు అనుసరిస్తే ప్రమాదంఅమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన వివరాల ప్రకారం.. ప్రపంచ దిగుమతులపై 10 శాతం సుంకం, కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం, చైనా వస్తువులపై 60 శాతం సుంకాన్ని విధించబోతున్నట్లు సమాచారం. ప్రపంచ స్థూల ఆర్థిక నమూనా ప్రకారం ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రపంచ వృద్ధి 0.3 శాతం తగ్గిపోనుంది. ఇతర దేశాలు కూడా ఇదే పంథాను అనుసరిస్తే మరింత ప్రమాదం వాటిల్లుతుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది.కుంటుపడనున్న వృద్ధిరేటుఅభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు 2000 సంవత్సరం తర్వాత అత్యంత బలహీనమైన దీర్ఘకాలిక వృద్ధి సమస్యను ఎదుర్కొంటున్నాయని నివేదిక ఎత్తిచూపింది. అధిక రుణ భారాలు, బలహీనమైన పెట్టుబడులు, ఉత్పాదకతలో తగ్గుతున్న వృద్ధి, పెరుగుతున్న వాతావరణ మార్పుల ఖర్చుల కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 2025-26 ఏడాదికిగాను వృద్ధి రేటు 4%గా ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: భారత్లో టాప్ 5 బ్రాండ్ లిస్ట్లోకి యాపిల్వచ్చే 25 ఏళ్లు మరిన్ని సవాళ్లుపెట్టుబడులను ప్రోత్సహించడానికి, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి వివిధ దేశాలు మెరుగైన సంస్కరణలను అవలంబించాలని ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎకనమిస్ట్ ఇందర్మిత్ గిల్ నొక్కి చెప్పారు. గత 25 సంవత్సరాలతో పోలిస్తే వచ్చే 25 ఏళ్లు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు కఠినమైన అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. వీటిని తగ్గించుకునేందుకు క్రియాశీల చర్యలు తీసుకోవాలని కోరారు. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ సైతం ప్రపంచ వాణిజ్యంలో పెరుగుతున్న అనిశ్చితుల గురించి హెచ్చరించింది. -
పసిడి కాంతుల్లో సెంట్రల్ బ్యాంకులు
ముంబై: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ధోరణులు, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం భయాల వంటి అంశాలతో ప్రపంచ బ్యాంకులు తమ పసిడి నిల్వలను పెంచుకోవడంపై దృష్టి సారించాయి. 2024 నవంబర్లో ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల 53 టన్నుల పసిడి నిల్వలను పెంచుకోగా, ఇందులో భారత్ రిజర్వ్ బ్యాంక్ వాటా 8 టన్నులు. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. → 2024లో ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని స్థిరమైన, భద్రమైన అసెట్గా భావించి, కొనుగోళ్లకు ఆసక్తి ప్రదర్శించాయి. ముఖ్యంగా 2024 చివరి భాగాన్ని పరిశీలిస్తే, ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లకు మొగ్గుచూపాయి. → అమెరికా ఎన్నికల అనంతరం నవంబర్లో బంగారం ధరలు తగ్గాయి. దీనిని కొనుగోళ్లకు ఒక మంచి అవకాశంగా సెంట్రల్ బ్యాంకుల భావించాయి. → నవంబర్లో జరిగిన కొనుగోళ్లతో 2024లో ఆర్బీఐ 73 టన్నుల బంగారం కొనుగోలు చేసినట్లు అయ్యింది. దీనితో భారత్ సెంట్రల్ బ్యాంక్ వద్ద మొత్తం బంగారం నిల్వలు 876 టన్నులకు చేరాయి. → 2024లో రెండవ అతిపెద్ద కొనుగోలుదారుగా భారత్ కొనసాగింది. మొదటి స్థానంలో పోలాండ్ ఉంది. పోలాండ్ నేషనల్ బ్యాంకు నవంబర్లో 21 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా, 2024లో మొత్తం 90 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. → ఉజ్బెకిస్తాన్ కేంద్ర బ్యాంకు 9 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా, 2024లో మొత్తం 11 టన్నుల బంగారం కొనుగోలు చేసింది.దీనితో ఈ దేశం వద్ద మొత్తం పసిడి నిల్వలు 382 టన్నులకు చేరాయి. → కజికిస్గాన్ నేషనల్ బ్యాంక్ నవంబర్లో 5 టన్నుల పసిడిని కొనుగోలు చేయగా, మొత్తం దేశ బంగారం నిల్వలు 295 టన్నులకు చేరాయి. → చైనా పీపుల్స్ బ్యాంక్ (పీబీఓసీ) ఆరు నెలల విరామం తర్వాత బంగారం కొనుగోళ్లను పునఃప్రారంభించి, నవంబర్లో 5 టన్నులు కొనుగోళ్లు జరిగింది. వార్షికంగా నికర కొనుగోళ్లు 34 టన్నులు. మొత్తం పసిడి నిల్వలు 2,264 టన్నులకు (మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వలో 5 శాతం) చేరాయి. → జోర్డాన్ నవంబర్లో 4 టన్నుల పసిడి కొనుగోళ్లు జరిగింది. జూలై తర్వాత దేశం పసిడి కొనుగోళ్లు జరిపింది నవంబర్లోనే కావడం గమనార్హం. దేశం మొత్తం పసిడి నిల్వలు 73 టన్నులకు ఎగశాయి. → టర్కీ నవంబర్లో జరిపిన కొనుగోళ్ల పరిమాణం 3 టన్నులు. → చెక్ నేషనల్ బ్యాంక్ వరుసగా 21 నెలలుగా కొనుగోళ్లు జరుపుతోంది. నవంబర్లో జరిపిన కొనుగోళ్లు 2 టన్నులు. వార్షికంగా కొనుగోళ్లు 20 టన్నులు. దీనితో బ్యాంకు వద్ద మొత్తం నిల్వలు 50 టన్నులపైకి ఎగశాయి. → ఘనా నేషనల్ బ్యాంక్ నవంబర్లో టన్నుల కొనుగోళు చేయగా, వార్షికంగా చేసిన కొనుగోళ్లు 10 టన్నులు. దీనితో దేశం వద్ద మొత్తం పసిడి నిల్వలు 29 టన్నులకు చేయాయి. ఎకానమీ స్థిరత్వానికి పసిడి నిల్వలు కీలకమని ఘనా భావిస్తోంది.సింగపూర్ అమ్మకాలు.. కాగా, సింగపూర్ మానిటరీ అథారిటీ నవంబర్లో 5 టన్నుల బంగారాన్ని విక్రయించింది. 2024లో ఇప్పటి వరకు 7 టన్నుల నికర అమ్మకాలు జరిపింది. దీనితో మొత్తం నిల్వలు 223 టన్నులకు తగ్గాయి. -
విద్యా రంగంలో ‘సాల్ట్’ అమలు భేష్
సాక్షి, అమరావతి : రాష్ట్ర విద్యా రంగంలో సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ (సాల్ట్) ప్రాజెక్టు అమలు విజయవంతంగా కొనసాగుతోందని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. విద్యా రంగంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల అమలుకు ప్రపంచ బ్యాంకు ఈ ప్రాజెక్టుకు 250 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించింది. ఇందులో భాగంగా.. దీని పురోగతిపై తాజాగా మధ్యకాల సమీక్ష నిర్వహించి గణనీయమైన పురోగతి సాధించిందని బ్యాంకు వెల్లడించింది. 2020 జాతీయ విద్యా విధానాన్ని అమలుచేయడంలో రాష్ట్రం ముందంజలో ఉందని కిలారించింది.పాఠశాలల్లో అభ్యాస వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపింది. ప్రాజెక్టు ముగింపు కాలపరిమితి డిసెంబరు 31, 2026 నాటికల్లా మిగిలిన మైలురాళ్లను చేరుకోవడానికి చేపట్టిన కార్యకలాపాలు చాలావరకు ట్రాక్లో ఉన్నాయని వెల్లడించింది. విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరిచేందుకు వీలుగా డిజిటల్ లెర్నింగ్ అసెస్మెంట్ వ్యవస్థనూ విజయవంతంగా అమలుచేసిందని బ్యాంకు మెచ్చుకుంది.మొత్తమ్మీద ఏపీలో విద్యార్థుల అభ్యాస ఫలితాలు మెరుగుపడుతున్నాయని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఉదా.. గణితంలో 4వ తరగతి విద్యార్థుల ప్రావీణ్యం గత రెండేళ్లలో గణనీయంగా మెరుగుపడిందని.. అలాగే, ప్రాథమిక, మా«ద్యమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంచేందుకు టీచ్ టూల్ను కూడా ఆవిష్కరించారని బ్యాంకు తెలిపింది. అంతేకాక.. రెండేళ్లలో బోధనా పద్ధతులు మెరుగుపరిచారని పేర్కొంది. జాతీయ విద్యా విధానం అమలులోనూ భేష్..ఇక జాతీయ విద్యా విధానాన్ని అమలుచేయడంలో రాష్ట్రం చాలాబాగా అభివృద్ధి చెందినట్లు ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. గ్రేడ్–3 ద్వారా పిల్లల పునాది అభ్యాసన కొనసాగుతోందని.. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో ఈ వాతావరణాన్ని, పనితీరును మెరుగుపరిచే చర్యల పురోగతి కూడా కొనసాగుతోందని తెలిపింది. మొత్తం మీద సాల్ట్ ప్రాజెక్టు అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించిందని వెల్లడించింది.తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి ఫీడ్బ్యాక్కు, ఫిర్యాదులకు ఆన్లైన్ పోర్టల్ను కూడా అమల్లోకి తీసుకొచ్చారని, విద్యార్థుల లెర్నింగ్ లెవెల్స్, టీచర్లకు మెరుగ్గా పాఠ్యప్రణాళిక రూపకల్పన చేసినట్లు బ్యాంకు తెలిపింది. ప్రారంభ బాల్య విద్య, గ్రేడ్–1, 2 ఉపాధ్యాయులు, అంగన్వాడీ వర్కర్లకు ముందస్తు శిక్షణ ప్రారంభించారని కూడా పేర్కొంది.అంతేకాక.. విద్యార్థుల అభ్యాస సమస్యలను పరిష్కరించేందుకు అనుకూల చర్యలూ కొనసాగుతున్నాయని.. 700 రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను మెరుగుపరిచే చర్యలూ తీసుకుంటున్నారని, ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం మౌలిక సదుపాయాల కార్యకలాపాలను ఖరారుచేశారని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఇక పాఠశాలల నిర్వహణ, పనితీరుపై నిరంతరం సమాచారం అందించడానికి తల్లిదండ్రుల కమిటీలను మరింత పటిష్టం చేసిందని బ్యాంకు ప్రశంసించింది. -
అప్పులతోనే అమరావతి.. పెండింగ్ పనులకు 30వేల కోట్లు!
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ అప్పులు చేయడంలో ఫుల్ బిజీ అయిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పులతోనే అమరావతిలో నిర్మాణాలకు ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఏడీబీ, ప్రపంచ బ్యాంక్ ద్వారా కేంద్రం అప్పులు ఇప్పిస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతి కోసం బాబు సర్కార్ 30వేల కోట్ల అప్పులు చేస్తోంది.అప్పులతోనే అమరావతి చేస్తున్నారు చంద్రబాబు. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంకు నుండి రూ.6,800 కోట్ల అప్పు తీసుకునేందుకు నిన్న బోర్డు మీటింగ్లో ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే, ఏడీబీ ద్వారా అమరావతి కోసం ప్రభుత్వం రూ.6700 కోట్లు అప్పు తెస్తోంది. ప్రపంచబ్యాంకు, ఏడీబీ అప్పులు కలుపుకుంటే అమరావతి కోసమే బాబు సర్కార్ రూ.13,500 కోట్లు అప్పులు చేస్తోంది.ఈ నేపథ్యంలో అమరావతికి కేంద్రం ఇచ్చేది గ్రాంట్ కాదు అప్పు మాత్రమేనని మరోసారి తేలింది. కేంద్రం నిధులు ఇస్తోందంటూ ఇన్నాళ్లూ చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే. కానీ, కేంద్రం కేవలం.. ఏడీబీ, ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులు మాత్రమే ఇప్పిస్తోంది. ఈ అప్పులన్నింటీనీ కూటమి సర్కార్.. అమరావతి కోసం మళ్లిస్తోంది. మరోవైపు.. హడ్కో ద్వారా 11వేల కోట్లు, కేఎఫ్డబ్ల్యూ ద్వారా 5 వేల కోట్లను బాబు సర్కార్ అప్పుగా తీసుకుంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అమరావతి కోసం సుమారు 30 వేల కోట్ల అప్పు చేస్తోంది. అమరావతిలో పెండింగ్ భవనాల కోసం అప్పులు చేస్తూ.. ప్రభుత్వం అన్ని జిల్లాల్లో అభివృద్ధి పనులను నిలిపి వేసింది. ప్రస్తుతం అప్పులన్నీ అమరావతికే కేటాయిస్తోంది. -
నెలకు రూ.20 వేల లోపు ఆదాయం ఉంటే నిరుపేదలు
నిరు పేదలు, మధ్య తరగతి ప్రజలు అంటే ఎవరు? నెలవారీ ఆదాయం ఎంతుంటే మధ్య తరగతి? మధ్య తరగతిలో ఎన్ని వర్గాలు? నిరు పేదల ఆదాయమెంత? వీటిపై ప్రపంచ బ్యాంకు స్పష్టతనిచి్చంది. ప్రపంచ దేశాల్లో మార్కెట్ ఆధారిత ఆరి్థక వ్యవస్థలను అధ్యయనం చేసే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ)తో కలిసి ప్రపంచ బ్యాంక్ అధ్యయనం చేసింది. ప్రజాస్వామ్య దేశాలలో ప్రభుత్వాల స్థిరమైన ఆర్థిక వృద్దిని ప్రోత్సహించడానికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పర్చేందుకు ఓఈసీడీ 37 దేశాలతో కలిసి పనిచేస్తోంది.ప్రపంచ బ్యాంకు, ఓఈసీడీ కలిసి ప్రజల జీవన ప్రమాణాలపై అధ్యయనం చేశాయి. మారుతున్న సామాజిక, ఆరి్థక స్థితిగతులను అనుసరించి జరిపిన ఈ అధ్యయనం నివేదికను ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజల జీవన ప్రమాణాలు గతంతో పోలిస్తే మెరుగుపడుతున్నట్టుగా ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ప్రజల ఆదాయ ప్రమాణాలు పెరిగినట్టు ప్రకటించింది. ఈ అధ్యయనంలో అల్పాదాయ, మధ్య తరగతి ప్రజల ఆరి్థక స్థితిగతులపై లోతైన పరిశీలన జరిపింది. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల ఆర్థిక స్థితిగతులను బట్టి మూడు వర్గాలుగా విభజించింది. ఇక నుంచి నెలకు రూ.40 వేల నుంచి రూ.లక్ష లోపు ఆదాయం ఆర్జించే వారిని మధ్య తరగతిగా పరిగణించాలని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. రూ.లక్ష కు పైబడి ఆదాయం ఆర్జించే వారిని ఎగువ మధ్యతరగతి వర్గీయులుగా పరిగణించాలని పేర్కొంది. రూ.20 వేల నుంచి రూ.40 వేల లోపు ఆర్జించే వారిని దిగువ మధ్య తరగతిగా గుర్తించాలని ప్రకటించింది. ఇక రూ.20 వేల లోపు ఆదాయం ఉన్న వారిని నిరుపేద వర్గానికి చెందిన వారిగా పరిగణించాలని పేర్కొంది. గతంలోకంటే మెరుగైన ఆర్థి క పరిస్థితిగతంలో నెలకు రూ.20 వేల నుంచి రూ.40 వేల లోపు ఉన్న వారిని మధ్య తరగతిగా, రూ.40 వేల నుంచి రూ.60 వేల లోపు ఉన్న వారిని ఎగువ మధ్యతరగతిగా, రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు ఉన్న వారిని దిగువ మధ్యతరగతిగా పరిగణించేవారు. రూ.10 వేలకు తక్కువగా ఆర్జించే వారిని నిరుపేదలు, అల్పాదాయ వర్గాలుగా గుర్తించే వారు. ప్రపంచ బ్యాంకు తాజా అధ్యయనం ప్రకారం అల్పాదాయ, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు గతంతో పోలిస్తే కొంత మెరుగు పడినట్టు తేలింది. జాతీయ తలసరి ఆదాయాన్ని బట్టి అంచనా.. జాతీయ తలసరి ఆదాయంతో పోలిస్తే 75 శాతం నుంచి 200 శాతం ఆదాయం ఆర్జిస్తున్న వారిని మధ్య తరగతి ప్రజలుగా, 200 శాతం కంటే ఎక్కువ ఆర్జించే వారిని ఉన్నత వర్గాలుగా, 75% కంటే తక్కువ ఆదాయం ఆర్జించే వారిని అల్పాదాయ వర్గాలుగా ప్రపంచ బ్యాంకు విభజించింది. 75 శాతం నుంచి 50 శాతం ఆదాయం పొందే వారిని నిరుపేదలే అయినప్పటికీ, తక్కువ ఆదాయం (నాన్–పూర్ లోయర్ ఇన్కమ్) ఆర్జించే వర్గాలుగా పేర్కొంది. 50 శాతంకంటే తక్కువ ఆర్జించే వారిని మాత్రం నిరుపేదలుగా అభివర్ణించాలని పేర్కొంది. అదే విధంగా స్థూల జాతీయ ఆదాయం సగటున రూ.97,192 (1145 డాలర్లు) ఆర్జన కలిగిన దేశాలను తక్కువ ఆదాయ దేశాలుగా, రూ.3,82,917 (1146–4515 డాలర్లు) ఆర్జన కలిగిన దేశాలను దిగువ మధ్య ఆదాయ దేశాలుగా, రూ.11,87,764 (4516–14వేల డాలర్లు) ఆర్జించే దేశాలను ఉన్నత మధ్య ఆదాయ దేశాలుగా అభివరి్ణంచింది. భారత దేశం దిగువ మధ్య ఆదాయ ఆర్జన కలిగిన దేశాల జాబితాలో ఉంది. -
రాజధాని అమరావతికి ముంపు తప్పదు
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతికి ముంపు ముప్పు తప్పదని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. భారీ వర్షాలు, వరదలతో ఆ ప్రాంతమంతా ముంపునకు గురవుతుందని పేర్కొంది. వరద నియంత్రణకు కచ్చితమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ఉన్నప్పటికీ.. కొండవీటి వాగుతోపాటు, పాలవాగు నుంచి వచ్చే వరద నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందేనని తేల్చింది. ఈ నేపథ్యంలో ముంపు నివారణకు భారీ వ్యయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.వరద నివారణ పనులు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఏకంగా రూ.8,014.61 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసినట్టు ప్రపంచ బ్యాంకు రుణ డాక్యుమెంట్లో స్పష్టం చేసింది. గతంలోనే చంద్రబాబు ప్రభుత్వం వరద నియంత్రణ పేరుతో కొండవీటి వాగు పంపింగ్ స్టేషన్ను రూ.450 కోట్లతో నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి అదనంగా మొత్తం 20 ప్యాకేజీలలో వరద నియంత్రణ, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులకు టెండర్లు ఆహ్వానించనున్నట్టు ప్రపంచ బ్యాంకు డాక్యుమెంట్లో స్పష్టం చేసింది. విస్తుపోతున్న అధికారులు, నిపుణులువరద నివారణకు రూ.8,014.61 కోట్లు ఖర్చవుతుందని తెలిసి.. ఆ పనులు ప్రతిపాదించడం పట్ల అధికార యంత్రాంగం విస్తుపోతోంది. వరద ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం చేపట్టాలనే ప్రభుత్వ ఆలోచనే లోపభూయిష్టంగా ఉందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వరద నియంత్రణకు వెచ్చించే నిధుల్లో సగం ఖర్చుతోనే వరద ముంపులేని ప్రాంతంలో పరిపాలన భవనాలను నిర్మించవచ్చని అధికారులు, నిపుణులు పేర్కొంటున్నారు. రాజధాని పేరుతో అమరావతిలోనే రూ.వేల కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం చూస్తుంటే.. మిగతా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవనే విషయం స్పష్టమవుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.వరద నివారణ ప్రతిపాదనలు ఇలా..ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు అమరావతి ప్రాంతంలో వరద ముంపును నివారించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ ప్రతిపాదనల్లో ముఖ్యాంశాలు ఇవీ.⇒ కొండవీటి వాగును (23.60 కి.మీ.) వెడల్పు, లోతు చేయాలి.⇒పాల వాగు (16.70 కి.మీ.) వెడల్పు, లోతు చేయాలి.⇒ శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో 50 ఎకరాల్లో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి.⇒ కొండవీటి వాగు వరద నీటిని గ్రావిటీ కెనాల్ (7.82 కి.మీ,) నిర్మాణం ద్వారా కృష్ణా నదికి మళ్లించాలి.⇒ వర్షాకాలంలో అదనపు నీటిని డ్రెయినేజీలకు మళ్లించేందుకు కరకట్ట వద్ద పంపింగ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలి. ⇒ ఉండవల్లి వద్ద 7,500 క్యూసెక్యుల సామర్థ్యంతో వరద పంపింగ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలి.⇒ వరద నీటిని నిలుపుదల చేసేందుకు కృష్ణాయపాలెంలో 1.7 మీటర్ల ఎత్తు కట్టతో 90 ఎకరాల్లో 0.1 టీఎంసీ నిల్వ సామర్థ్యంతో రిటెన్షన్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి.⇒ శాఖమూరు వద్ద 50 ఎకరాల్లో 0.03 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి.⇒ నీరుకొండలో 400 ఎకరాల్లో 0.4 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలి. -
తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యతలు భేష్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు బాగున్నాయని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంసించింది. గత నెలలో వాషింగ్టన్లో ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భేటీ అయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తదుపరి చర్చల కోసం ప్రపంచబ్యాంకు దక్షిణాసియా ప్రాంత ఉపాధ్యక్షుడు మార్టీన్ రైజర్ నేతృత్వంలో వరల్డ్ బ్యాంక్ కంట్రీ ఆపరేషన్ హెడ్ పాల్ ప్రోసీ, అర్బన్ ఇన్ఫ్రా, ప్రాజెక్ట్ లీడ్ నటాలియా కె, డిజిటల్ డెవలప్మెంట్ సీనియర్ స్పెషలిస్ట్ మహిమాపత్ రే శనివారం హైదరాబాద్ వచ్చారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రితో వారు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా, వైద్య, సాగునీటి రంగాలను తమ ప్రభుత్వ ప్రాధాన్యాలుగా పెట్టుకున్నామని, ఆయా రంగాల్లో తాము తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వారికి వివరించారు. తాము ప్రాధాన్యంగా తీసుకుంటున్న ప్రాజెక్టులకు ఆర్థిక సహకారంతో పాటు అత్యుత్తమ ప్రమాణాలతో తెలంగాణ ప్రాజెక్టులు నిలిచేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. విద్యా, వైద్య రంగాల్లో రేవంత్రెడ్డి దార్శనికత బాగుందని, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని మార్టీన్ రైజర్ ప్రశంసించారు. ప్రపంచ బ్యాంకు ఏ రంగాలను ప్రాధాన్య అంశాలుగా ఎంచుకుందో అవే తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్య అంశాలుగా ఉన్నాయని మార్టిన్ రైజర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి సహకరించేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని ఆయన తెలిపారు. సమావేశంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు.‘ఏటీసీల్లో సిబ్బంది కొరతను అధిగమించాలి’రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో సిబ్బంది కొరతను అధిగమించాలని సీఎం ఎ.రేవంత్ అధికారులను ఆదేశించారు. శనివారం సచివాల యంలో కార్మిక, ఉపాధి కల్పన శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్న నేపథ్యంలో సిబ్బంది కొరత లేకుండా చూడాలని స్పష్టం చేశారు.ప్రస్తుత ఇండస్ట్రీ అవసరాలకనుగుణంగా సిలబస్ను అప్గ్రేడ్ చేయాలని, మార్కెట్ అవసరాలకనుగుణంగా ఏటీసీల్లో సిలబస్ ఉండాలని, ఈ మేరకు సిలబస్ మార్పునకు ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించి నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించాలని ఆదేశించారు. వృత్తి నైపుణ్యం అందించే ఏటీసీలను, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చేలా విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో సీ.ఎస్ శాంతికుమారి, కారి్మక శాఖ ముఖ్యకార్యదర్శి సంజయ్ కుమార్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ప్రపంచ బ్యాంక్ వద్దన్నది.. అయినా అమరావతే రాజధాని
అమరావతి ప్రాంతం రాజధానికి పనికిరాదని, ఇక్కడ నిర్మాణాలు చేపట్టొద్దని ప్రపంచ బ్యాంకు చెప్పింది. అయినా ఇక్కడే రాజధాని నిరి్మస్తాం. నవంబర్లో పనులు ప్రారంభిస్తాం. ఇక్కడ ముంపు భయం లేకుండా వచ్చే వర్షాకాలానికల్లా వాగులు, కాలువలను విస్తరిస్తాం. నెదర్లాండ్స్ టెక్నాలజీ వినియోగించి అమరావతిలోని వాగులు, కాలువలపై రిజర్వాయర్లు నిరి్మస్తాం. – రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణసాక్షి, అమరావతి/తాడికొండ: అమరావతి ప్రాంతం రాజధానికి పనికిరాదని, ఇక్కడ నిర్మాణాలు చేపట్టొద్దని ప్రపంచ బ్యాంకు చెప్పిందని, అయినప్పటికీ ఇక్కడే రాజధాని నిర్మిస్తామని, నవంబర్లో పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గతంలో అమరావతి ప్రాంతాన్ని పరిశీలించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, నిపుణులు ఈ ప్రాంతం రాజధాని నిర్మాణానికి పనికిరాదని నివేదిక ఇచ్చినట్టు మంత్రి గుర్తు చేశారు. ఇటీవలి వరదల్లో దాదాపు 11.43 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా 2,017 చదరపు కిలోమీటర్ల అమరావతి ప్రాంతానికి ఏమీ కాలేదని చెప్పారు. మంత్రి సోమవారం విజయవాడలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో, గుంటూరు జిల్లా తాడికొండలో మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేసిందన్నారు. 2014–19 మధ్య 30 వేల మంది అమరావతిలో పనిచేశారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. కృష్ణానది, బుడమేరు వరదలు విజయవాడలోని 32 డివిజన్లు, కొన్ని గ్రామాలను ముంచేసినా అమరావతికి ఏమీ కాలేదని చెప్పారు. గత ప్రభుత్వం అమరావతి మునిగిపోతుందని ప్రచారం చేసిందని, కానీ కృష్ణా నది వల్ల రాజధానికి ఎలాంటి ఇబ్బందీ లేదని అన్నారు. ఇక్కడ ముంపు భయం లేకుండా వచ్చే వర్షా కాలానికల్లా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్ను విస్తరిస్తామని తెలిపారు. అమరావతి సేఫ్ జోన్లో ఉందని, రాజధాని డిజైన్ సమయంలోనే వరద సమస్య లేకుండా కాల్వలు, రిజర్వాయర్లకు ప్రతిపాదనలు చేశామని అన్నారు. -
ఒలింపిక్స్లో మహిళల రెజ్లింగ్ 50 కేజీల కేటగిరీలో.. ఫైనల్కు చేరిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు తీవ్ర నిరాశ..
-
భాగస్వామ్యానికి సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు తాము సంసిద్ధమని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ఈ మేరకు పలు అంశాలపై ఆసక్తి చూపింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అక్కడ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై గంట పాటు చర్చించారు. తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, నెట్ జీరో సిటీ, ఆరోగ్య సంరక్షణ, డయాగ్నస్టిక్స్, హెల్త్ ప్రొఫైల్ రంగాల్లో ప్రపంచ బ్యాంకుతో భాగస్వామ్యానికి సంబంధించి ఈ భేటీలో సంప్రదింపులు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులపై సంయుక్తంగా రోడ్ మ్యాప్ రూపొందించాలని నిర్ణయించారు. ప్రజల జీవన ప్రమాణాలు, పర్యావరణం, జీవనోపాధి, నైపుణ్యాల వృద్ధి, ఉద్యోగాలు, ఆర్థిక సుస్థిరత తదితర అంశాలపైనా వారు చర్చించారు.యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తాం: రేవంత్తమ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఉందని.. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వాటిని యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత పాటిస్తామని చెప్పారు. ప్రాంతాల వారీగా చేపట్టే ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలపై నిపుణుల బృందం ఏర్పాటు ఆలోచనను ప్రపంచ బ్యాంకు బృందంతో సీఎం పంచుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధికి రేవంత్ అనుసరిస్తున్న సమతుల దృక్పథం సానుకూల ఫలితాలు ఇస్తుందని ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరమేశ్వరన్ అయ్యర్ ప్రశంసించారు. గతంలో భారత్లో తమ భాగస్వామ్యంతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు సానుకూల ఫలితాలు అందించాయని గుర్తు చేశారు.అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో ఇదే తొలిసారి!ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో కలసి పనిచేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం ఇదే తొలిసారి అని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, స్కిల్ యూనివర్సిటీ, సిటిజన్ హెల్త్కేర్, హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ తదితరాలపై సీఎం ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించారని.. ఈ ప్రాజెక్టులకు, భవిష్యత్తు వ్యూహాలకు ప్రపంచ బ్యాంకు మద్దతు మరింత ఊతమిస్తుందని అంటున్నాయి. ఈ భేటీలో మంత్రి శ్రీధర్బాబు, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.కొత్త ఆవిష్కరణల కోసం కార్నింగ్తో ఒప్పందంతెలంగాణలో నైపుణ్యాభివృద్ధితోపాటు నూతన ఆవిష్కరణలు లక్ష్యంగా దిగ్గజ సంస్థ కార్నింగ్ ఇన్ కార్పొరేషన్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మేరకు అడ్వాన్స్డ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో కార్నింగ్ సంస్థ సహకారం అందిస్తుంది. ఫార్మాస్యూటికల్, కెమికల్ రంగాల్లో అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి తోడ్పడుతుంది. ఫార్మా, కెమికల్ పరిశ్రమలలో ఆవిష్కరణతోపాటు ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీలోనూ సహకారం అందించనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఫార్మా గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం స్థాపనపైనా చర్చ జరిగింది. 2025లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఈ మేరకు సీఎం రేవంత్ సమక్షంలో అవగాహన ఒప్పందంపై కార్నింగ్ ప్రతినిధులు సంతకాలు చేశారు.జీనోమ్ వ్యాలీలో రూ.400 కోట్లతో ‘వివింట్’ విస్తరణవివింట్ ఫార్మా కంపెనీ హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. రూ.400 కోట్ల పెట్టుబడితో నేరుగా వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది. జీనోమ్ వ్యాలీలో ఇప్పటికే పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఉన్న వివింట్ సంస్థ తాజాగా సీఎం రేవంత్తో చర్చల అనంతరం విస్తరణ ప్రణాళికను వెల్లడించింది. అంకాలజీ, క్రిటికల్ కేర్ విభాగాలకు సంబంధించి నాణ్యమైన ఇంజెక్టబుల్స్, ఔషధాలను ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. -
భారత్ వృద్ధికి 3i స్ట్రాటజీ!.. వరల్డ్ బ్యాంక్ సూచన
భారత్, చైనా వంటి సుమారు 106 దేశాలు మధ్య ఆదాయ ఉచ్చు (మిడిల్ ఇన్కమ్ ట్రాప్)లో పడే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొంది. దీని నుంచి తప్పించుకోవడానికి పెట్టుబడులు, ఆవిష్కరణలతో పాటు.. కొత్త టెక్నాలజీలను కూడా అభివృద్ధి చేయడం మీద దృష్టి సారించే 3i (ఇన్వెస్ట్మెంట్, ఇన్నోవేషన్, ఇన్ఫ్యూజన్) విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ.. ప్రస్తుత ట్రెండ్ ఇలంగో కొనసాగితే దేశ తలసరి ఆదాయం అమెరికా ఆదయ స్థాయిలలో నాలుగింట ఒక వంతుకు చేరుకోవడానికి దాదాపు 75 సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని వరల్డ్ బ్యాంక్ తన నివేదికలో స్పష్టం చేసింది.2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను ప్రపంచ బ్యాంక్ తన 'వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024'లో.. స్వాతంత్య్ర శతాబ్దిగా ప్రస్తావించింది. భారతదేశం ఆర్థిక వ్యవస్థలో పరివర్తన సాధించాలని ఆశిస్తున్నప్పటికీ.. అది కొంత క్లిష్టంగా కనిపిస్తున్నట్లు వెల్లడించింది.ఇప్పటికి కూడా అనేక దేశాలు గత శతాబ్దానికి చెందిన ప్లేబుక్ను ఉపయోగిస్తున్నాయి. ప్రధానంగా పెట్టుబడులను విస్తరించేందుకు రూపొందించిన విధానాలపై ఆధారపడుతూ ఉన్నయని.. ప్రపంచ బ్యాంక్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ ఇండెర్మిట్ గిల్ పేర్కొన్నారు. ఇది మొదటి గేర్లోనే కారు నడుపుతూ వేగంగా ముందుకు వెళ్లాలనుకోవడంలాంటిదని అన్నారు.ఇది ఇలాగే కొనసాగితే.. అమెరికా తలసరి ఆదాయంలో నాలుగింట ఒక వంతుకు చేరుకోవడానికి ఇండియాకు 75 ఏళ్ళు, చైనాకు 10 సంవత్సరాలు, ఇండోనేషియా దాదాపు 70 సంవత్సరాలు పడుతుందని గిల్ అన్నారు. చైనా, ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు రాబోయే కొన్ని దశాబ్దాల్లో తీవ్రమైన అడ్డంకులను ఎదుర్కునే అవకాశం ఉందని ఆయన అన్నారు. 1990 నుంచి కేవలం 34 దేశాలు మాత్రమే మిడిల్ ఇన్కమ్ ట్రాప్ నుంచి తప్పించుకోగలిగాయని ఆయన అన్నారు. -
రూ.10 లక్షల కోట్లు! స్వదేశానికి మనోళ్లు పంపించిన నిధులివి..
వాషింగ్టన్: ప్రవాస భారతీయులు స్వదేశం పట్ల అపారమైన అభిమానం చాటుతున్నారు. కష్టార్జితాన్ని తాముంటున్న చోటే దాచుకోకుండా, స్వదేశానికి పెద్ద ఎత్తున పంపిస్తున్నారు. స్వదేశంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మాతృభూమికి నిధులు పంపించడంలో (రెమిటెన్స్లు) ప్రపంచదేశాల్లోనే ప్రథమ స్థానంలో నిలుస్తున్నారు.2023లో 120 బిలియన్ డాలర్ల (రూ.10లక్షల కోట్లు సుమారు) రెమిటెన్స్లను భారత్ అందుకున్నట్టు ప్రపంచబ్యాంక్ తాజాగా ప్రకటించింది. అదే ఏడాది మెక్సికోకు వెళ్లిన 66 బిలియన్ డాలర్ల రెమిటెన్స్లతో పోల్చిచూస్తే భారత్కు రెట్టింపు వచ్చినట్టు తెలిపింది. ఆ తర్వాత చైనాకు 50 బిలియన్ డాలర్లు, ఫిలిప్పీన్స్కు 39 బిలియన్ డాలర్లు, పాకిస్థాన్కు 27 బిలియన్ డాలర్ల రెమెటెన్స్లు వెళ్లాయి.భారత్కు 2023లో అత్యధికంగా అమెరికా, యూఏఈ నుంచే రెమిటెన్స్లు వచ్చాయి. సీమాంతర చెల్లింపులకు దీర్హామ్–రూపీలను అనుమతించడంతో అధికారిక ఛానళ్ల ద్వారా వచ్చే రెమిటెన్స్లు పెరిగినట్టు ప్రపంచబ్యాంక్ తెలిపింది. ఇక 2024 సంవత్సరంలో భారత్కు 3.7 శాతం అధికంగా 124 బిలియన్ డాలర్ల రెమిటెన్స్లు రావచ్చని ప్రపంచబ్యాంక్ అంచనా వేసింది. 2025లో మరో 4 శాతం పెరిగి 129 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని పేర్కొంది.భారత్ తన యూపీఐని యూఏఈ, సింగపూర్తో అనుసంధానించేందుకు చేపడుతున్న చర్యలు వ్యయాలను తగ్గిస్తుందని, ఇది రెమిటెన్స్లను మరింత వేగవంతం చేయవచ్చని తెలిపింది. వలసపోవడం, వారి ద్వారా స్వదేశానికి నిధుల తరలింపు అన్నది ఆర్థిక, మానవాభివృద్ధికి అత్యవసరమని ప్రపంచబ్యాంక్లో సామాజిక పరిరక్షణ విభాగం గ్లోబల్ డైరెక్టర్ ఇఫత్ షరీఫ్ పేర్కొన్నారు. -
సచివాలయాలతో సమున్నత సేవలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం పౌర సేవలు, ప్రభుత్వ పథకాల అమలు స్వరూపాన్నే మార్చేసింది. గ్రామ గ్రామాన సరికొత్త చిత్రం ఆవిష్కృతమైంది. పల్లె రూపురేఖలే మారిపోయాయి. విద్య, వైద్యం, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు సాకారమయ్యాయి. ఎక్కడా లంచాలు, వివక్ష, పడిగాపులకు తావులేకుండా పారదర్శకంగా ప్రతి ఇంటికీ ప్రయోజనాలను అందచేసింది. గ్రామం నుంచి కదలాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ యంత్రాంగాన్నే పల్లె చెంతకు తీసుకొచ్చింది. దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో సాకారమైన విప్లవాత్మక మార్పులివి. నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంకు నిర్వహించిన సంయుక్త సదస్సు ఈ అంశాలను ప్రముఖంగా ప్రస్తావించడం గమనార్హం. పాలనా వికేంద్రీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ అద్భుతమని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ అవిక్ సర్కార్ ప్రశంసించారు. ఇంటింటికీ పౌర సేవలు, అర్హులకు సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ అద్భుతంగా పని చేస్తోందని, ప్రధానంగా నీతి ఆయోగ్ నిర్దేశించిన ఎస్డీజీ (సుస్థిరాభివృద్ధి) లక్ష్యాల సాధనకు సచివాలయాలతో క్షేత్రస్థాయి నుంచి కృషి చేశారని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సభ్యురాలు భావనా వశిష్ఠ పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల ఆవిష్కరణ డేటా అధారిత పాలన, ప్రణాళికల కోసం డేటా సేకరణపై ఇటీవల లక్నోలో నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంకు సంయుక్త సదస్సు నిర్వహించాయి. డేటాను నాలెడ్జ్గా మార్చడం, 2047 భారత్ విజన్ లక్ష్యాలను సాధించడం, డేటాను పరిపాలనలో వినియోగించడం తదితర అంశాలపై వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధానాలపై చర్చాగోష్టి నిర్వహించారు. సదస్సులో నీతి ఆయోగ్, ప్రపంచబ్యాంకుతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొని ఆయా రాష్ట్రాల్లోని ఆవిష్కరణలపై ప్రముఖంగా చర్చించారు.ప్రతి పౌరుడికీ అందుబాటులో సేవలు..సమగ్ర డేటా సేకరణ ద్వారా పాలనను మెరుగుపరిచే లక్ష్యంతో 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థను ప్రారంభించిందని, పాలన వికేంద్రీకరణలో భాగంగా తెచ్చిన ఈ వ్యవస్థ అద్భుతమని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ అవిక్ సర్కార్ ప్రశంసించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాలనను వికేంద్రీకరించడంతోపాటు విధాన రూపకర్తలకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు గ్రామాలు, వార్డులలో ఆధునిక పరిజ్ఞానంతో సౌకర్యాలు కల్పించారన్నారు. ఏపీలోని ప్రతి గ్రామంలో ప్రతి పౌరుడికీ ఈ వ్యవస్థ అందుబాటులో ఉందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పెన్షన్లు, నెలవారీ కేటాయింపులు లాంటి సంక్షేమ ప్రయోజనాలను అందజేయడంతోపాటు పౌరుల అవసరాలను గుర్తించి తీర్చుతున్నట్లు తెలిపారు. పరిపాలనాపరమైన ఫిర్యాదులను సింగిల్ విండో వ్యవస్థ ద్వారా పరిష్కరిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్లో గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం వివిధ టెక్ పోర్టల్లను ఏర్పాటు చేయడం వల్ల పైస్థాయి నుంచి కింద స్థాయి వరకు పనులను సమన్వయంతో వేగంగా పూర్తి చేసే వెసులుబాటు కలిగిందన్నారు. విప్లవాత్మక పాలనలో భాగంగా డేటా సేకరణ, క్రోడీకరణ, మార్పిడి ద్వారా సచివాలయాల వ్యవస్థతో ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలను అమలు చేశారన్నారు. నీతి ఆయోగ్ రూపొందించిన 116 సూచికల ఆధారంగా 16 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సచివాలయాల వ్యవస్థ దోహదం చేసిందని అభినందించారు. అన్ని పోర్టల్లలో డేటాను సేకరించడంతో పాటు విశ్లేషించి మెరుగైన ఫలితాలు సాధించారన్నారు. పాఠశాలలకు వెళ్లే బాలికల్లో రక్తహీనత నిర్మూలన లాంటి సామాజిక లక్ష్యాలతో పాటు బడికి దూరమైన పిల్లలను తిరిగి స్కూళ్లలో చేర్చడం లాంటి వాటిని సచివాలయాల వ్యవస్థ ద్వారా గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా అమలు చేసిందని ప్రస్తావించారు.ఎస్డీజీ లక్ష్యాల సాధన..నీతి ఆయోగ్ నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా క్షేత్రస్థాయిలో పటిష్ట వ్యవస్థను తెచ్చిందని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సభ్యురాలు భావనా వశిష్ఠ పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు అవసరమైన డేటా సేకరణ, విశ్లేషణ గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచే జరుగుతోందన్నారు. పథకాలు, కార్యక్రమాల అమలుకు యాప్లు తీసుకొచ్చి అన్ని స్థాయిల్లో పకడ్బందీగా పర్యవేక్షించారన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి పౌరుల అవసరాలను తీర్చడం, గ్రామంలోనే సేవలు అందించడం లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రారంభించిందన్నారు. అవి సింగిల్ విండో విధానం ద్వారా పంచాయతీలు, స్థానిక సంస్థలకు సహాయ విభాగంగా పనిచేయడంతో పాటు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా విధానాలను అమలు చేస్తున్నాయన్నారు. సచివాలయాల స్థాయిలోనే పౌరుల ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తున్నారని ప్రశంసించారు. ఎస్డీజీ లక్ష్యాల సాధనకు సచివాలయాల వ్యవస్థ టెక్ పోర్టల్తో బలమైన నెట్వర్క్ను కలిగి ఉందన్నారు. ఎస్డీజీ లక్ష్యాల సాధనలో భాగంగా ఆరోగ్యం, విద్య సంబంధిత కార్యక్రమాలను గ్రామ, వార్డు సచివాలయాలతో అనుసంధానించినట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో కార్యక్రమాల పర్యవేక్షణకు ఇంటిగ్రేటెడ్ డాష్ బోర్డ్ ఏర్పాటైందని, వీటన్నింటినీ ప్రతిబింబించేలా రాష్ట్ర స్థాయి డేటా రూపొందించడం కార్యక్రమాలు విజయవంతంగా అమలుకు దోహదం చేసిందన్నారు. అన్ని స్థాయిల్లో అధికారులు పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. బాలికలలో రక్తహీనత నిర్మూలనకు విద్యాసంస్ధల్లో డేటాను సేకరించి సంబంధిత విభాగాల ద్వారా క్రోడీకరించారని తెలిపారు. వలంటీర్ల ద్వారా భారీ సర్వేతో బడికి దూరమైన పిల్లల డేటాను సేకరించడంతోపాటు తిరిగి స్కూళ్లకు వెళ్లేలా ప్రోత్సహిస్తూ విద్యార్ధి సమాచార పోర్టల్ను నిర్వహిస్తున్నారన్నారు. నవశకం ద్వారా ప్రభుత్వ పథకాలకు అర్హులను పారదర్శకంగా గుర్తించి క్రోడీకరించిన లబ్ధిదారుల డేటాతో పోర్టల్ను నిర్వహిస్తున్నారని తెలిపారు. -
విశాఖ పోర్టుకు అరుదైన ఘనత
విశాఖ సిటీ: విశాఖ పోర్టు అథారిటీ మరో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ బ్యాంక్ రూపొందించిన కంటైనర్ పోర్టుల పనితీరు సూచీ(సీపీపీఐ)లో టాప్–20లో స్థానం సంపాదించింది. విశాఖ కంటైనర్ టెర్మినల్ అద్భుత ప్రతిభ కనబరిచి 18వ స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా కంటైనర్ పోర్టుల పనితీరును సీపీపీఐ పరిగణనలోకి తీసుకోగా.. ఇందులో విశాఖ పోర్టు సరికొత్త మైలురాయిని అందుకుంది. ఈ సూచీల ద్వారా వ్యాపారవేత్తలు పోర్టులను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. పోర్టు సామర్థ్యం, నౌక టర్న్ అరౌండ్ సమయాలు ఎంతో ముఖ్యమైన ప్రమాణాలుగా నౌకల యజమానులు భావిస్తారు. విశాఖ కంటైనర్ టెర్మినల్లో క్రేన్లు గంటకు 27.5 కదలికలను నమోదు చేస్తుంటాయి. బెర్త్లో షిప్ నిలిపే సమయం 13 శాతంగా ఉంటోంది. అలాగే పోర్టులో టర్న్ రౌండ్కు 21.4 గంటల రికార్డు సమయం ద్వారా అత్యుత్తమ సూచీలను నెలకొల్పింది. 65కు పైగా కంటైనర్ లైన్లు కలిగి ఉంది.కంటైనర్ టెర్మినల్కు 8 నిరంతర సర్వీసులున్నాయి. ఈ అసాధారణ ఘనతను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్టేక్ హోల్డర్లు, రైల్వేలు, కస్టమ్స్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు అభినందించాయి. భవిష్యత్లో మరిన్ని రికార్డులు సాధించడానికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చాయి. ఈ ఘనతను సాధించడంలో కీలకంగా పనిచేసిన సిబ్బందిని విశాఖ పోర్టు చైర్పర్సన్ డాక్టర్ ఎం.అంగముత్తు అభినందించారు. పోర్టు సమర్థతను ఈ ఘనత చాటి చెప్పిందన్నారు.సరుకు రవాణాలో 4వ స్థానం2023–24వ ఆర్థిక సంవత్సరంలో విశాఖ పోర్టు సరుకు రవాణాలో మెరుగైన పనితీరును కనబరిచి దేశంలోని మేజర్ పోర్టులలో 4వ స్థానంలో నిలిచింది. 2024–25 ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లోనే సరుకు రవాణాలో 13.5 శాతం వృద్ధిని కనబరిచింది. ఈ ఘనత పట్ల కేంద్ర పోర్టులు, నౌక, జలరవాణా శాఖ సంతృప్తి వ్యక్తం చేసింది. పోర్టు చైర్పర్సన్ డాక్టర్ ఎం.అంగముత్తును ప్రశంసించింది. -
భారత్కు మరోసారి ప్రపంచ బ్యాంకు భారీ సాయం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనావైరస్ సంక్షోభ సమయంలో భారత దేశానికి ప్రపంచ బ్యాంకు భారీ ఊరట నిచ్చింది. దేశంలోని పట్టణ పేదలు , వలస కార్మికులకు సామాజిక భద్రతా రక్షణ నిధిగా 1 బిలియన్ డాలర్లు సహాయాన్ని అందించనుంది. ఆరోగ్యానికి సంబంధించి ఇదే అతిపెద్ద ప్రాజెక్టు అని ప్రపంచ బ్యాంకు తెలిపింది. దీంతో భారతదేశం అతిపెద్ద లబ్ధిదారుగా నిలిచింది. కోవిడ్-19, లాక్డౌన్ వలస కార్మికుల తీవ్ర ఇబ్బందులు, ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న సమయంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. సోషల్ సెక్యూరిటీ టెక్నాలజీ ప్యాకేజీ కింద భారత్లోని 400కు పైగా సామాజిక భద్రతాపథకాల అమలుకు ఈ వంద కోట్ల డాలర్లు ఉపయోగపడనున్నాయని బ్యాంకు పేర్కొంది. "గ్రామీణ ప్రాంతాల మాదిరిగానే పట్టణ పేదల పట్ల సామాజిక భద్రతను తిరిగి సమతుల్యం చేయడానికి ఈ ప్రాజెక్ట్ చాలా కీలకమని ప్రపంచ బ్యాంక్ డైరెక్టర్ జునైద్ అహ్మద్ అన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర్ మిషన్ చాలా ముఖ్యమైనదని ప్రశంసించారు. కోవిడ్ -19 తరువాత దేశంలో జీవితం, జీవనోపాధి పరిస్థితుల్లో పెద్ద తేడా ఉండబోదని భావిస్తున్నాన్నారు. నగదు బదిలీ విధానం చాలా కీలకమైందని, దాని వల్ల జీవణ ప్రమాణాలు చాలా వేగంగా, సులువుగా అభివృద్ధి చెందుతాయని వరల్డ్ బ్యాంకు సోషల్ ప్రొటెక్షన్ గ్లోబల్ డైరక్టర్ మైఖేల్ రుట్కోస్కీ తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో పేదలకు నగదు లభ్యత, ఆహార ప్రయోజనాలతో భదత్రను కల్పించాలనేది ఈ ప్రాజెక్టు ఉద్దేశమని వరల్డ్ బ్యాంకు తెలిపింది. ప్రభుత్వ సహకారంతో ప్లాట్ఫామ్లను ఏకీకృతం చేయడమే ప్రపంచ బ్యాంకు లక్ష్యం, తద్వారా ప్రజలు అనేక సామాజిక పథకాలను పొందటానికి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లవలసిన అవసరం ఉండదని ప్రపంచ బ్యాంకు సీనియర్ అధికారి భట్టాచార్య అన్నారు. (మూడ్ లేదు.. ఇక తెగతెంపులే ) కరోనావైరస్ మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కోవటానికిగాను భారత్కు ఏప్రిల్ ప్రారంభంలో 1 బిలియన్ డాలర్ల అత్యవసర సహాయాన్ని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. తాజాగా మరో బిలియన్ డాలర్లు అందివ్వనుంది. అలాగే ఎంఎస్ఎంఈ ల కోసం మూడవ ప్యాకేజీ కూడా రానుందని భావిస్తున్నారు. సోషల్ ప్రొటక్షన్ పథకం కింద ఆయా దేశాలకు వరల్డ్ బ్యాంకు నిధులను సమాకూరుస్తున్నసంగతి తెలిసిందే. (లాక్డౌన్ : మహారాష్ట్ర కీలక నిర్ణయం) World Bank today announced a $1 billion support to accelerate India’s social assistance to the most vulnerable households across the country. With increased cash and food benefits, the program will ensure a safety net for the poorest during this crisis. 👉https://t.co/Ehenr5FhAz pic.twitter.com/yOJFwle8v0 — World Bank India (@WorldBankIndia) May 15, 2020 -
అదే ఫిక్స్ : వృద్ధి 5 శాతమే..
వాషింగ్టన్ : 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికే పరిమితమవుతుందని ఆపై ఏడాది 5.8 శాతంగా నమోదవుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. రుణాల జారీ మందగించడం, ప్రైవేట్ వినిమయం పడిపోవడం, ప్రాంతీయ సమస్యలతో వృద్ధి రేటు తగ్గుతుందని పేర్కొంది. బంగ్లదేశ్లో వృద్ధి రేటు 7 శాతానికి పైగా నమోదవుతుందని, పాకిస్తాన్లో మూడు శాతం వృద్ధి చోటుచేసుకుకోవచ్చని అంచనా వేసింది. టారిఫ్ల పెంపు ప్రభావం, అనిశ్చితి కొనసాగడం వంటి కారణాలతో అమెరికా వృద్ధి రేటు 1.8 శాతంతో మందగించవచ్చని స్పష్టం చేసింది. యూరప్లోనూ వృద్ధి రేటు 1 శాతానికే పరిమితమవుతుందని పేర్కొంది. ఇక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2.5 శాతంగా ఉంటుందని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి రేటు మందగిస్తున్న క్రమంలో పేదరిక నిర్మూలనకు అవసరమైన వ్యవస్ధాగత సంస్కరణలకు విధాన నిర్ణేతలు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి సీలా పజర్బాసిగ్ అన్నారు. వ్యాపార వాతావరణం, చట్టాల పనితీరు, రుణ నిర్వహణ, ఉత్పాదకతలను మెరుగుపరిచే చర్యలు చేపట్టాలని సూచించారు. చదవండి : రిస్క్ కు వెరవడమే మందగమనానికి కారణం -
ప్రధాని మోదీతో వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ భేటీ
న్యూఢిల్లీ: భారత్ ప్రపంచ పోటీని ఎదుర్కోవాలంటే భూ వినియోగాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలని వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్ అన్నారు. ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆదివారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ పలు కీలక అంశాలపై చర్చించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో నీటి సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి తదితర సవాళ్లను ప్రముఖంగా చర్చించారు. వృద్ధి రేటు పెరగాలంటే కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించాలని మాల్పస్ సూచించారు. ఇటీవల ప్రకటించిన సులభతర వాణిజ్య నివేదికలో భారత్ మెరుగైన స్థానాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మాల్పాస్ మాట్లాడుతూ... జిల్లా స్థాయిలో వాణిజ్య కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. మరోవైపు భూ సంస్కరణల అమలు, భూ వినియోగానికి సంబంధించిన డేటాను డిజిటలైజేషన్ చేయడం ద్వారా భూముల కొనుగోలు, అమ్మకాలు సులభతరం అవుతాయని అన్నారు. భారత్లో ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్టులకు సంబంధించి.. 97 ప్రాజెక్టులు, 24బిలియలన్ డాలర్ల పెట్టుబడులు కొనసాగుతున్నాయని తెలిపారు. మరోవైపు నీతి అయోగ్ సమావేశంలో ఆస్తుల పర్యవేక్షణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశంసించారు. కాగా, మూలధన మార్కెట్ల ప్రోత్సహకాన్ని గొప్ప సంస్కరణగా ఆయన అభివర్ణించారు. -
డబ్బు పంపిస్తున్న వారిలో అత్యధికులు భారతీయులే!
వాషింగ్టన్ : విదేశాల్లో జీవనం సాగిస్తూ స్వదేశంలో ఉండే తమ కుటుంబ సభ్యులకు డబ్బు పంపే వలసదారుల్లో అత్యధికులు భారతీయులేనని ప్రపంచ బ్యాంకు గణాంకాలు వెల్లడించాయి. ప్రపంచంలో దేశాలతో పోల్చితే భారతదేశం నుంచే అత్యధికంగా వర్కర్లు విదేశాలకు వలసలు వెళ్లారని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. ఆ లెక్క ప్రకారం దాదాపు 17 మిలియన్ల వర్కర్లు భారత్ నుంచి వెళ్లి వివిధ విదేశాల్లో జీవనం కొనసాగిస్తున్నారు. ఆశ్చర్యకర విషయమేమంటే, ఈ రకంగా విదేశాల్లో జీవనం కొనసాగిస్తూ దేశంలోని తమ తమ కుటుంబాలకు పంపిస్తున్న డబ్బు మొత్తం కూడా ఇక్కడే ఎక్కువగా ఉంటోందని ప్రపంచబ్యాంకు తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది సుమారు 79 బిలియన్ డాలర్ల మేరకు సంపద విదేశీ రెమిటెన్స్ రూపంలో భారత్కు చేరినట్టు పేర్కొంది. మిగతా ప్రపంచ దేశాలన్నింటితో పోలిస్తే ఇదే అత్యధికమని తెలిపింది. అదే విధంగా వలస వెళ్లి విదేశాల్లో జీవనోపాధి పొందుతున్న వారిలో కూడా అత్యధికులు భారతీయులేనని ఉన్నారని ఆ నివేదిక పేర్కొంది. వలసదారుల నుంచి విదేశీ రెమిటెన్స్ రూపంలో అత్యధిక జనాభా కలిగిన చైనా 67 బిలియన్ డాలర్లతో (10 మిలియన్ వలసదారులు) రెండో స్థానంలో ఉందని వెల్లడించింది. ఇంత పెద్ద మొత్తంలో భారతీయలు డబ్బు పంపిస్తున్నా.. అది దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) లో 2.7 శాతానికి మాత్రమే సమానంగా ఉందని వెల్లడించింది. వలసదారులు వారివారి దేశానికి పంపిస్తున్న డబ్బు చిన్న చిన్న దేశాలతో పోలిస్తే ఇది చాలా స్పల్పమని తేలింది. వలస, అభివృద్ధి పేరిట రూపొందించిన నివేదికలో దిగువ మధ్య తరగతి ఆదాయ దేశాలు 2018 ఏడాదికి గానూ రికార్డు స్థాయిలో పెరుగుదలను నమోదు చేసినట్లు ఆ నివేదిక వెల్లడించింది. 2017 లో ఈ దేశాలన్నీ కలిపి 483 బిలియన్ డాలర్లను విదేశీ చెల్లింపులుగా పొందగా, గతేడాది ఈ సంఖ్య 529 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు పేర్కొంది. అదే విధంగా విదేశీ చెల్లింపులపై ప్రధానంగా ఆధారపడుతున్న దేశాలకు ప్రపంచ బ్యాంకు ర్యాంకులు ప్రకటించింది. ఇందులో 2017 లో రెండున్నర బిలియన్ డాలర్లను ప్రవాసుల ద్వారా పొందిన కిర్గిస్తాన్ మొదటి స్థానంలో నిలిచింది. ఇది ఆ దేశ స్థూల జాతీయోత్పత్తిలో మూడు శాతానికి సమానమని పేర్కొంది. అయితే విదేశాల్లో ఉన్న నేపాల్ పౌరులు మాత్రం 6.9 బిలియన్ డాలర్ల (28 శాతం) తో స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలలో కీలక పాత్ర పోషించారని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. -
జీడీపీలో 7కు తగ్గిన భారత్ ర్యాంక్
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంకు 2018 జీడీపీ ర్యాంకుల్లో భారత్ ఒక ర్యాంకు కోల్పోయి ఏడో స్థానానికి దిగజారింది. 2018లో జీడీపీ పరంగా 2.72 ట్రిలియన్ డాలర్ల పరిమాణంతో బ్రిటన్, ఫ్రాన్స్ల తర్వాత స్థానానికి వెళ్లింది. టాప్ 6 దేశాల్లో... అమెరికా (20.5 ట్రిలియన్ డాలర్లు), చైనా (13.6 ట్రిలియన్ డాలర్లు), జపాన్ (4.9 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (3.9 ట్రిలియన్ డాలర్లు), బ్రిటన్ (2.82 ట్రిలియన్ డాలర్లు), ఫ్రాన్స్ (2.77 ట్రిలియన్ డాలర్లు) భారత్ కంటే ముందున్నాయి. 2024 నాటికి జీడీపీని 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరికి 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలని లక్ష్యాన్ని పెట్టుకుంది. 2017లో భారత్ ఫ్రాన్స్ను అధిగమించి ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. స్వల్ప తేడాతో బ్రిటన్ను కూడా దాటేసింది. 2017లో భారత జీడీపీ 2.65 ట్రిలియన్ డాలర్లుగా ఉంటే, బ్రిటన్ జీడీపీ 2.64 ట్రిలియన్ డాలర్లు, ఫ్రాన్స్ జీడీపీ 2.59 ట్రిలియన్ డాలర్లకే పరిమితం కాగా, తిరిగి 2018లో భారత్ను దాటి ఈ రెండు దేశాలు ముందుకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో దేశ జీడీపీ ఐదేళ్ల కనిష్ట స్థాయికి( 5.8%) పడిపోవడం గమనార్హం. 2018–19 సంవత్సరానికి కూడా జీడీపీ 6.8%కి క్షీణించింది. కరెన్సీ విలువల్లో హెచ్చుతగ్గులు, జీడీపీ వృద్ధి నిదానించడం అంతర్జాతీయ జీడీపీ ర్యాంకుల్లో భారత్ కిందకు రావడానికి కారణాలుగా ఈఅండ్వై ముఖ్య విధాన సలహాదారు డీకే శ్రీవాస్తవ తెలిపారు. ఎగుమతులు తగ్గడం, డిమాండ్ పడిపోవడం వంటి పరిస్థితులను గుర్తు చేశారు. వృద్ధి తిరిగి గాడిన పడాలంటే ద్రవ్య ప్రోత్సాహకాలు అవసరమని అభిప్రాయపడ్డారు. -
దొంగ లెక్కలు ఎలా ఉంటాయంటే..!
సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్ కార్డులతో ప్రభుత్వ సంక్షేమ పథకాల దుర్వినియోగాన్ని అడ్డుకోవడం ద్వారా కేంద్రానికి ఏటా వేలాది కోట్ల రూపాయలు మిగులుతున్నాయని ఉన్నతాధికారులు ఊకదంపుడుగా ఊదరకొట్టడం మనం వినే ఉంటాం. అంతెందుకు సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఏటా ప్రభుత్వానికి 77 వేల కోట్ల రూపాయలు మిగులుతున్నాయని పదే పదే చెప్పడమే కాకుండా, ఈ విషయాన్ని సాక్షాత్తు ప్రపంచ బ్యాంకు తన ‘2016 వార్షిక నివేదిక’లోనే ధ్రువీకరించిందని చెప్పారు. అంతేకాకుండా ఆధార్ కార్డుల రాజ్యాంగబద్ధతను సుప్రీంకోర్టులో సవాల్ చేసినప్పుడు ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్లో కూడా ఈ ‘ప్రపంచ బ్యాంకు లెక్కల’ను పేర్కొన్నారు. ఈ లెక్కలు నిజమేనా? ఆధార్ కార్డుల ద్వారా ఏటా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో ఏ మేరకు దుర్వినియోగాన్ని అరికట్ట గలిగారో, ఆర్థికంగా దాని విలువెంతో మన ఆర్థికవేత్తలకే ఇంతవరకు అంతు చిక్కడం లేదు. అలాంటప్పుడు ప్రపంచ బ్యాంకు అంత కచ్చితంగా ఎలా లెక్కకట్టింది? దానికి ఆ లెక్కలు ఎవరు చెప్పారు? ఈ సందేహం ఎవరికైనా వచ్చిందా? సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు ఆనంద్ వెంకట నారాయణన్కు ముందుగా వచ్చింది. ఆయన భారత పొదుపు మీద ‘2016 ప్రపంచ బ్యాంకు నివేదిక’ను రూపొందించిన అధికారులకు ‘ఈ 77 వేల కోట్ల రూపాయలు మిగులుతున్నాయని ఎలా లెక్కించారు?’ అంటూ 2017, సెప్టెంబర్లో ఈమెయిల్ ద్వారా ఓ లేఖ రాశారు. వారి వద్ద నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. 2018, ఫిబ్రవరి 9వ తేదీన ఆ ప్రశ్నకు మరిన్ని అనుబంధ ప్రశ్నలను జోడించి వెంకట నారాయణన్ మళ్లీ ఈ మెయిల్ పంపించారు. ఈసారి బ్యాంకు నుంచి సమాధానం వచ్చింది. అయితే అందులో అధికారుల పేర్లను పేర్కొనలేదు. ‘ మొట్టమొదటి అంశం 11 బిలియన్ డాలర్లు (దాదాపు 77 వేల కోట్ల రూపాయలు) వాస్తవ లెక్క కాదు. అంత మిగిలే అవకాశం ఉందన్న అంచనా. రెండోది ఇది ప్రపంచ బ్యాంకు సిబ్బంది వేసిన అంచనా కాదు. విద్యావేత్తలు, ఆర్థిక వేత్తలు వేసిన అంచనా. మూడవది భారత ప్రభుత్వం 11 బిలియన్ డాలర్ల దుర్వినియోగాన్ని అరికట్టాలన్నది ప్రపంచ బ్యాంకు ఆకాంక్ష. నివేదిక పీఠికలో ఇది ఒక అంచనా అన్నది సూచించాం’ అని ప్రపంచ బ్యాంకు సమాధానం ఇచ్చింది. ఆ మరుసటి రోజే వెంకట నారాయణన్ మరో అనుబంధ పశ్నను పంపించారు. ప్రపంచ బ్యాంకు సీనియర్ అధికారులు.. ఆధార్ మంచి పథకం, దాని వల్ల కోట్లాది రూపాయలు మిగులుతున్నాయని ఎందుకు మాట్లాడుతున్నారన్నది ఆ ప్రశ్న. దానికి కూడా ప్రపంచ బ్యాంకు నుంచి సమాధానం వచ్చింది. అందులో ‘ ఆధార్ లాంటి డిజిటల్ గుర్తింపు వ్యవస్థ ప్రయోజనాల గురించి ప్రపంచ బ్యాంకు సీనియర్ అధికారులు మాట్లాడడం సహజమే. ఏ దేశంలోనైనా అభివృద్ధి ప్రక్రియ సమ్మిళితంగా, సమర్థంగా జరగాలి. అభినందించడమనేది లేకపోవడం వల్ల అది జరగడం లేదు. అభినందనల వల్ల జవాబుదారీ ప్రభుత్వమే కాకుండా సంస్థలు కూడా సానుకూలంగా స్పందిస్తాయన్నది మా విశ్వాసం’ అని పేర్కొంది. ఇది తమ దేశంలో గందరగోళానికి దారితీసిందని, 77 వేల కోట్ల ఆదా అన్నది వాస్తవం కాదని, అది ఒక అంచనా అంటూ ఓ బహిరంగ ప్రకటన చేయాల్సిందిగా వెంకట నారాయణన్ ఎన్నిసార్లు ప్రపంచ బ్యాంకు అధికారులను కోరినా ‘త్వరలో విడుదల చేస్తాం’ అన్న వ్యాక్యం తప్పిస్తే ఇంతవరకు ప్రకటన వెలువడలేదు. ఆయన ఇటీవల కూడా ప్రపంచ బ్యాంకు అధికారులను సంప్రతించగా, ఢిల్లీలోని ప్రపంచ అధికారులను సంప్రతించాల్సిందిగా సూచించారట. ప్రస్తుతం ఆయన ఆ పనిలో ఉన్నారు. 77 వేల కోట్ల రూపాయలు కేవలం అంచనా అన్నది అలహాబాద్ ఐఐఎం అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆర్థిక వేత్త, సామాజిక శాస్త్రవేత్త రీతికా ఖెరా 2016, జూలై 21వ తేదీన ఎన్డీటీవీ వెబ్సైట్కు రాసిన వ్యాసంలో కూడా ఉంది. 77 వేల కోట్ల రూపాయల అంచనా కూడా తప్పేనని బెల్జియంలో పుట్టి ఢిల్లీలోని ‘ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్’ పీహెచ్డీ చేసి భారత్లోని పలు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేస్తూ.. ప్రముఖ ఆర్థికవేత అమర్త్యసేన్కు సహా రచయితగా ఉంటున్న జాన్ డ్రెచ్ తేల్చారు. ఆధార్ కార్డు ప్రయోజనాలను పక్కన పెడితే ఆధార్ కార్డు లేకపోవడం వల్ల, వేలిముద్రలు గుర్తించని సాంకేతిక లోపం కారణంగా రేషన్ కార్డులు అందక మరణించిన వారు.. 2017 నుంచి ఇప్పటివరకు దాదాపు 30 మంది. ఒక్క జార్ఖండ్లోనే 14 మంది మరణించగా, ఢిల్లీలో పదేళ్లలోపు ముగ్గురు అక్కాచెల్లెళ్లు మరణించడం విషాదకరం. -
భారీగా పుంజుకున్న భారత ఆర్థిక వృద్ధి రేటు
-
‘సాగర్’పై ప్రపంచబ్యాంకు బృందం సంతృప్తి
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఆధునీకరణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. శుక్రవారం ఇక్కడ జలసౌధలో ఇరిగేషన్ మంత్రి హరీశ్రావుతో బృందం సమావేశమైంది. సాగర్ చివరి ఆయకట్టు వరకూ నీరందించే లక్ష్యంతో పదేళ్ల కిందట ప్రపంచబ్యాంక్ నిధులతో ఆధునీకరణ పనులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు పరిధిలో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయని సభ్యులు తెలిపారు. సాగునీటి పంపిణీ సమర్ధవంతంగా జరుగుతున్నట్లు తాము గమనించామని చెప్పారు. ఆధునీకరణ పనులు 98 శాతం పూర్తి అయ్యాయని, మిగతా పనులు జూలై నాటికి పూర్తి అవుతాయని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఆధునీకరణ పనుల కారణంగా ప్రాజెక్టు ఆయకట్టు గ్యాప్ 25 శాతం నుంచి 5 శాతానికి తగ్గిందన్నారు. రాష్ట్ర పరిధిలో సాగర్ కింద 6,40,814 ఎకరాల ఆయకట్టు ఉందని, ఇందులో నీరందని ఆయకట్టు 1.64 లక్షల ఎకరాల ఉందన్నారు. ప్రస్తుతం ఆ ఆయకట్టూ సాగులోకి వచ్చిందని తెలిపారు. ఆధునీకరణ పనులతో సాగర్ నుంచి పాలేరు రిజర్వాయర్కు నీరు చేరే సమయం 72 గంటల నుంచి 48 గంటలకు తగ్గిందని చెప్పారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను మంత్రి హరీశ్ కోరారు.ఈ ప్రాజెక్ట్ గురించి తాము ఇప్పటికే తెలుసుకున్నామని, త్వరలోనే సందర్శిస్తామని తెలిపారు. -
ప్రజారోగ్యం కోసం ప్రపంచబ్యాంకు రుణం
-
2018లో భారత్ వృద్ధి 7.3 %
వాషింగ్టన్: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2018లో 7.3 శాతంగా నమోదవుతుందని ప్రపంచబ్యాంక్ అంచనా వేస్తోంది. అటుపై రెండేళ్లలో వృద్ధి 7.5 శాతంగా ఉంటుందనీ విశ్లేషిస్తోంది. ఇతర వర్ధమాన దేశాలతో పోల్చితే, భారత్కు మంచి వృద్ధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్న ప్రపంచబ్యాంక్ ఈ సందర్భంగా కేంద్రం చేపడుతున్న ఆర్థిక సంస్కరణలను ప్రస్తావించింది. 2018 గ్లోబల్ ఎకనమిక్స్ ప్రాస్పెక్టస్ పేరుతో ప్రపంచబ్యాంక్ విడుదల చేసిన తాజా నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ♦ 2017లో భారత్ వృద్ధి 6.7 శాతం అంచనా. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను అమలుకు తొలిదశలో ఏర్పడుతున్న ఇబ్బందులు దీనికి ప్రధాన కారణాలు. ♦ వృద్ధి మందగమనంలో ఉన్న చైనాతో పోల్చి చూస్తే, భారత్లో వృద్ధి వేగం క్రమంగా పుంజుకుంటోంది. 2017లో భారత్కన్నా (6.7 శాతం) కొంచెం ఎక్కువగా ఉన్న చైనా వృద్ధి రేటు (6.8 శాతం), 2018లో 6.4 శాతానికి తగ్గే వీలుంది. అటుపై వచ్చే రెండేళ్లలో వృద్ధి 6.3 శాతం, 6.2 శాతానికి తగ్గవచ్చు ♦ వచ్చే పదేళ్లలో భారత్ వృద్ధి సగటున 7 శాతం ఉండచ్చు. కొన్ని ఇబ్బందులు తలెత్తినా, మొత్తంగా ఆర్థిక వ్యవస్థ సానుకూలంగా ఉంటుంది. ♦ ఉత్పాదనాపరంగా సానుకూల స్థితిలో ఉన్న భారత్, బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య పరిష్కారానికి తగిన కృషి చేస్తోంది. ఈ సవాలునూ అధిగమించగలిగితే, దేశంలో వృద్ధి మరింత ఊపందుకుంటుంది. మొండిబకాయిలతోపాటు ఉద్యోగ కల్పన, ప్రైవేటు పెట్టుబడుల పెంపు వంటి అంశాలూ కీలకమైనవి. ♦ ఇక దేశంలో మహిళా కార్మిక శక్తి కూడా మరింత పటిష్టమవ్వాల్సి ఉంది. ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినా భారత్ ఈ విషయంలో వెనుకబడి ఉంది. ఆర్థికాభివృద్ధిలో మహిళా కార్మిక శక్తి ప్రాధాన్యత ఎంతో ఉంటుంది. 2018–19లో వృద్ధి 7.3%: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కాగా వచ్చే ఆర్థిక సంవత్సరం (2018 ఏప్రిల్– 2019 మార్చి మధ్య) భారత్ వృద్ధి 7.3 శాతం నమోదవువుతుందని దేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం– హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అంచనావేసింది. గ్రామీణాభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు, పెరుగుతున్న వినియోగం దీనికి కారణాలుగా విశ్లేషించింది. రీక్యాప్ బాండ్లతో బ్యాంకులకు భరోసా: ఫిచ్ ఇదిలావుండగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల పటిష్టతకు కేంద్ర రీ–క్యాపిటలైజేషన్ ప్రణాళిక మంచి ఫలితాలను అందిస్తుందని క్రెడిట్ రేటింగ్ సంస్థ– ఫిచ్ తన తాజా నివేదికలో పేర్కొంది. రుణ వృద్ధికీ ఈ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొంది. ఆదాయ వృద్ధి ఐదేళ్ల గరిష్టానికి...: క్రిసిల్ ఇక భారత కంపెనీల ఆదాయ వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఐదేళ్ల గరిష్ట స్థాయికి చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ కాలానికి కంపెనీల ఆదాయాలు 9 శాతానికి పైగా పెరుగుతాయని పేర్కొంది. అయితే లాభాల క్షీణత మాత్రం కొనసాగుతుందని వివరించింది. -
ఆరు నెలల తర్వాతే తేలుస్తాం
-
ఆరు నెలల తర్వాతే ‘అప్పు’ తేలుస్తాం!
సాక్షి, అమరావతి బ్యూరో: అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చే అంశాన్ని ఆరు నెలల తర్వాతే తేలుస్తామని ప్రపంచబ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు స్పష్టం చేసింది. ముందుగా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులందరికీ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా సహాయ పునరావాస ప్యాకేజీని అమలు చేయాలని కోరింది. రాజధాని నిర్మాణం వల్ల పర్యావరణానికి హాని జరగదని, స్థానికుల జీవనోపాధికి విఘాతం కలగదని, ఆహార భద్రతకు ముప్పు రాదని తేలితే... ఆరు నెలల తర్వాత రుణం మంజూరు గురించి నిర్ణయం తీసుకుంటామంది. ఈ మేరకు ఈ నెల 12న ప్రపంచ బ్యాంకు కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. వాటిని బ్యాంకు వెబ్సైట్లో ఉంచింది. గడువులోగా స్థానిక రైతులు, కూలీల అభ్యంతరాలకు సీఆర్డీఏ సమాధానం ఇచ్చే విధంగా బ్యాంకు నుంచి సహకారం అందిస్తామని, అప్పటికీ ఉపాధికి, పర్యావరణానికి, ఆహారభద్రతకు ముప్పు తొలగిపోలేదని స్థానికుల నుంచి ఫిర్యాదులు అందితే.. తనిఖీ బృందం నివేదికలో పేర్కొన్న విధంగా అన్ని అంశాల్లో లోతైన దర్యాప్తునకు బ్యాంకు అనుమతి ఇస్తుందని యాజమాన్యం పేర్కొంది. ఈ హామీతో సంతృప్తి చెందినట్లు తనిఖీ బృందం వెల్లడించింది. లోతైన విచారణ జరగాలని తాము చేసిన సిఫార్సు అమలును ఆరు నెలలపాటు వాయిదా వేసుకుంటున్నామంది. 6 నెలల్లో యథాతథస్థితి కొనసాగితే.. రాజధా ని నిర్మాణం వల్ల పర్యావరణానికి జరుగుతున్న హాని, స్థానికుల జీవనోపాధికి కలుగుతున్న విఘాతం తదితరాలపై విచారణకు బ్యాంకు యాజమాన్యం ఆదేశిస్తుందంది. తనిఖీ విభాగం నివేదికను ప్రపంచ బ్యాంకు పరిగణనలోకి తీసుకోవడంతో రుణం మంజూరు ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది? -
భారత్వైపు ప్రపంచ దేశాల చూపు
సాక్షి ప్రతినిధి, చెన్నై: భారతదేశంపై ప్రపంచ దేశాలకు నమ్మకం పెరిగిందని, పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ఉత్సాహం చూపుతున్నాయని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. చెన్నైలో మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ 90వ వార్షికోత్సవంలో వెంకయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ప్రపంచ బ్యాంకు సైతం ‘ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్’ అని కితాబిచ్చిందన్నారు. దేశ పురోభివృద్ధికి అవసరమైన సంస్కరణలను కేంద్రం అమలు చేస్తోందని, జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు అందులో భాగమేనన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్కు ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును వెంకయ్య ప్రదానం చేశారు. పారిశ్రామికవేత్త వనితా దాట్లను సన్మానించారు. సంగీత ప్రపంచానికి ఎంఎస్ సుబ్బులక్ష్మి సేవలు అజరామరంగా నిలిచిపోయాని వెంకయ్య కీర్తించారు. చెన్నైలో మంగళవారం జరిగిన ఎంఎస్ సుబ్బులక్ష్మి శతజయంతి వేడుకల్లో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. -
సింధు జలాలపై సందిగ్ధతే
వాషింగ్టన్: సింధు నదీజలాల ఒప్పందంపై భారత్–పాక్ మధ్య జరిగిన తాజా చర్చలు సత్ఫలితాలనివ్వలేదు. వాషింగ్టన్లో ప్రపంచబ్యాంకు కార్యాలయంలో భారత్, పాకిస్తాన్ మధ్య రాత్లే, కిషన్గంగ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై రెండ్రోజులపాటు జరిగిన రెండో విడత చర్చలూ ఫలితం తేలకుండానే ముగిశాయి. చర్చల్లో సయోధ్య కుదిరేంతవరకు తమ ప్రయత్నం కొనసాగుతోందని ప్రపంచబ్యాంకు తెలిపింది. సింధు నదీ జలాల ఒప్పందానికి లోబడి కిషన్గంగ, రాత్లే జలవిద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక అంశాలపై ఇరుదేశాల మధ్య కార్యదర్శి స్థాయి చర్చలు జరిగాయి. భారత్–పాక్ దేశాల మధ్య 9 ఏళ్లపాటు సుదీర్ఘమైన చర్చలు జరిగిన అనంతరం ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లో సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా ఇరుదేశాల మధ్య వివాదాలు, భేదాభిప్రాయాలు తలెత్తినపుడు పరిష్కరించే విషయంలో ప్రపంచబ్యాంకు పాత్ర పరిమితంగానే ఉంటుంది. భారత్, పాక్లలో ఎవరైనా ఒకరు కోరితే తప్ప ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉండదు. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్ సింగ్ నేతృత్వంలో భారత బృందం ఈ చర్చల్లో పాల్గొంది. ఇందులో సింధు నదీ జలాల కమిషనర్, విదేశాంగ శాఖ, కేంద్ర జల సంఘం ప్రతినిధులున్నారు. ఆగస్టు ఒకటిన జరిగిన తొలి విడత చర్చలూ ఎటూతేలకుండానే ముగిశాయి. -
ప్రపంచబ్యాంక్ దృష్టికి ఏపీ రాజధాని అక్రమాలు
-
నోరు నొక్కేశారు
♦ ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల ముందు ఎవరూ మాట్లాడొద్దు ♦ రాజధానికి భూములు ఇవ్వనివారికి మాట్లాడే హక్కే లేదు ♦ రైతులను బెదిరించిన టీడీపీ నేతలు ♦ నేలపాడు సదస్సులో మూగబోయిన రైతువాణి సాక్షి, అమరావతి బ్యూరో/తుళ్లూరు రూరల్ : అన్నదాతల నోరు నొక్కేశారు. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన రైతులను అవమానించి పంపేశారు. రాజధానికి భూములివ్వని రైతులకు అసలు మాట్లాడే హక్కే లేదని హుకుం చేశారు. ఎవరైనా రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడితే సహించేది లేదని తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే హెచ్చరించారు. ప్రపంచ బ్యాంకు తనిఖీ విభాగానికి చెందిన నలుగురు బృంద సభ్యులు తుళ్లూరు మండలం నేలపాడు గ్రామంలో బుధవారం ఉదయం రాజధాని ప్రాంత రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ప్రారంభానికి ముందు తెలుగు తమ్ముళ్లు వేదిక ఎక్కి ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల ముందు రైతులు ఎలా వ్యవహరించాలో పాఠాలు చెప్పారు. భూసమీకరణకు గానీ, రాజధాని నిర్మాణ విషయంలో గానీ వ్యతిరేకంగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇతర విషయాలు ఏ ఒక్కరూ ప్రస్తావించరాదన్నారు. ఎవరికైనా సమస్యలుంటే కలిసి చర్చించుకుందామని, రాజధాని నిర్మాణానికి అనుకూలంగా మాత్రమే మాట్లాడాలని ఆదేశించారు. దీంతో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన కొద్దిమంది రైతులు కూడా చేసేదేమీలేక మౌనంగా ఉండిపోయారు. కూలీల ఆశ.. అడియాసే.. అధికార పార్టీకి చెందిన రైతుల ప్రతినిధులు ప్రపంచబ్యాంకు ముందు తమ వాదనలు వినిపించారు. రాజధాని ఏర్పాటుతో అనేక రకాలుగా లబ్ధి పొందామని చెప్పుకొచ్చారు. కొండవీటి వాగుతో ముంపు ఉన్న మాట వాస్తవమంటూనే 1999లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సమస్య పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా వారి నోట పలుమార్లు రాజధాని ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు ఇస్తున్న పరిహార భృతి ప్రస్తావనకు వచ్చింది. ఈ సదస్సులో తమ గోడును వెళ్లబోసుకునేందుకు దాదాపు అధిక సంఖ్యలో వ్యవసాయ కూలీలు హాజరయ్యారు. కొందరు ప్రభుత్వం ఇస్తున్న పరిహార భృతి సరిపోవడంలేదంటూ వినతిపత్రాలు తెచ్చారు. వీరెవరూ ప్రపంచబ్యాంకు బృందానికి వినతి పత్రాలు ఇవ్వకుండానే వెనుదిరిగారు. కేవలం ముగ్గురు నాయకులు మాట్లాడటంతోనే సమయం ముగియడం.. తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన వారిని కనీసం ఒక్కరిని కూడా వేదిక సమీపానికి కూడా రానివ్వకపోవడంతో రైతులు, కూలీలు తీవ్ర అసహనంతో వెనుదిరిగారు. ప్రపంచ బ్యాంక్ బృందం చర్చలు సాక్షి, అమరావతి బ్యూరో : అమరావతి భూసమీకరణ విధానంపై రాజధాని రైతులు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు బృందం బుధవారం సీఆర్డీఏ ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది. మొత్తం రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజున సీఆర్డీఏ అధికారులతోపాటు రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి, పెనుమాక, నేలపాడు, ఎర్రబాలెం గ్రామాల్లో పర్యటించి రైతులతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ఉదయం సీఆర్డీఏ ప్రధాన కార్యాలయానికి వచ్చిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ప్రతిపాదిత రాజధాని ప్రాంతంలో మౌలిక వసతులు, ల్యాండ్పూలింగ్, మాస్టర్ప్లానింగ్, నిధుల సమీకరణ, సంస్థాగత స్వరూపం తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాజెక్టులు చూపే సాంఘిక, పర్యావరణ ప్రభావాలపై కూడా బృంద సభ్యులు సునిశిత దృష్టి సారిస్తారు. పింఛన్ల ఎర నేలపాడులో జరిగిన సమావేశానికి రైతులు, కూలీలు, మహిళలను పెద్ద ఎత్తున తరలించడానికి టీడీపీ నేతలు ప్రయత్నించారు. ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో చివరకు బెదిరింపు అస్త్రాన్ని ప్రయోగించారు. రాజధానిలో ఎవరికైతే ఇళ్లు కావాలో వారంతా సమావేశానికి రావాలని, పింఛన్లు కొనసాగాలంటే తప్పనిసరిగా హాజరవ్వాలని బెదిరించడంతో రాక తప్పలేదని సమావేశానికి వచ్చిన కొందరు రైతు కూలీలు, నిరుపేదలు చర్చించుకోవడం కనిపించింది. ఉద్ధండరాయునిపాలేనికి చెందిన పదుల సంఖ్యలో మహిళలను ఇలాగే తీసుకొచ్చారు. కుట్టు శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతున్న మహిళలకు.. కుట్టు మిషన్లు కావాలంటే సమావేశానికి వచ్చి తీరాల్సిందేనని చెప్పారు. అమరావతి అభివృద్ధికి సహకరించండి రాజధానికి భూములు స్వచ్ఛందంగా ఇచ్చిన ప్రతి రైతుకు, భూములపై ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ కూలీలకు లబ్ధి చేకూరేలా భూసమీకరణ విధానాన్ని అమలు చేశామని స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ అన్నారు. అమరావతిని ప్రపంచస్థాయి నగరాల్లో ఒకటిగా నిలిపేందుకు ఆర్థికంగా చేయూత అందించాలని ప్రపంచ బ్యాంకు బృందాన్ని కోరారు. నిధులు మంజూరుచేస్తే త్వరలోనే మా రాష్ట్రంలోనూ వాషింగ్టన్ వంటి నగరాన్ని నిర్మించుకుంటామన్నారు. – శ్రావణ్కుమార్, ఎమ్మెల్యే -
హైదరాబాద్–బీజాపూర్.. ఓ రోడ్డు కథ
► ప్రమాద రహిత రహదారిగా అభివృద్ధికి 2011లో నిర్ణయం ► ఉచితంగా రూ.59 కోట్లు ఇచ్చిన ప్రపంచ బ్యాంకు ► ఆరేళ్లుగా పడకేసిన పనులు ► ఇప్పుడదే రోడ్డుకు జాతీయ హోదా.. 450 కోట్లతో అంచనా ► మరి ఈ పనులు ఎప్పటికి చేస్తారనే సందేహాలు సాక్షి, హైదరాబాద్: ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక సౌకర్యాలు తప్పనిసరి. అందులోనూ మంచి రోడ్లు ఉండాల్సిందే. మరి మంచి రోడ్డు అంటే ఏంటి..? కేవలం రోడ్డు నిర్మించడం మాత్రమేగాకుండా దానిని పూర్తిగా ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలి. ప్రమాదాలు జరిగినా వెంటనే పూర్తిస్థాయిలో అత్యవసర వైద్యం అందజేసే ఏర్పాట్లు ఉండాలి. ఇలాంటి నమూనా రహదారిని చూపుదామంటూ ప్రపంచబ్యాంకు ముందుకొచ్చింది. 2011లో ‘హైదరాబాద్–బీజాపూర్’ రహదారిని ఎంపిక చేసి.. ఉచితంగా నిధులు కూడా ఇచ్చింది. కానీ ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంతో ఆరేళ్లయినా పనులు పూర్తికాలేదు. 2011 నుంచి సాగుతూనే.. తన వద్ద రుణాలు తీసుకున్న దేశాలు/రాష్ట్రాలకు ప్రపంచ బ్యాంకు అప్పుడప్పుడు నజరానాలు ఇస్తుంటుంది. ఆ క్రమంలోనే 2011లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రమాదరహిత రహదారుల అభివృద్ధి కోసం ఉచితంగా నిధులిచ్చింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులతో ఆంధ్రా ప్రాంతంలో రెండు రోడ్లను, తెలంగాణలో ఒక రోడ్డును అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇలా హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని బీజాపూర్ వరకు ఉన్న రహదారిని ఎంపిక చేయగా.. ప్రపంచబ్యాంకు రూ.59 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో హైదరాబాద్ శివార్లలోని పోలీస్ అకాడమీ దగ్గరి నుంచి మొయినాబాద్, చేవెళ్ల, మన్నెగూడ, కొడంగల్ మీదుగా కర్ణాటక సరిహద్దు వరకు 126 కిలోమీటర్ల రహదారిని మెరుగుపర్చాలి. సరిహద్దు నుంచి బీజాపూర్ వరకు పనులను కర్ణాటక నిర్వహిస్తుంది. ఏం చేయాలి..? ఈ ప్రమాద రహిత రహదారుల్లో అకస్మాత్తు మలుపులు ఉండొద్దు, కూడళ్లు విశాలంగా ఉండాలి, అతివేగంగా వెళ్లే వాహనాలను గుర్తించేందుకు లేజర్ గన్స్ ఏర్పాటు చేయాలి, హైవే పెట్రోలింగ్ వాహనాల పహారా ఉండాలి, ప్రమాదాలు జరిగితే వెంటనే అత్యవసర చికిత్స అందేలా ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి, అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలి.. ఈ మేరకు హంగులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రహదారుల శాఖ, పోలీసు, వైద్య ఆరోగ్యం, రవాణా తదితర విభాగాల ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. పనులు కూడా ప్రారంభమయ్యాయి. కానీ ఆ తర్వాత పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది. మూడు పెద్ద కూడళ్లు, 21 మలుపులను గుర్తించినా.. కొన్ని మాత్రమే పూర్తయ్యాయి. ఇక అవసరమైన ఎనిమిది హైవే పెట్రోలింగ్ వాహనాలు ఎలా సమకూర్చాలా అన్న తర్జనభర్జనలోనే పోలీసు శాఖ ఉండిపోయింది. రెండు అంబులెన్సులు, ట్రామాకేర్ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి వైద్యారోగ్య శాఖ ఇంకా మీనమేషాలు లెక్కిస్తోంది. ఇంతలో ఆరేళ్లు గడిచి.. గడువు పూర్తికావడంతో.. విజ్ఞప్తి చేసి మరింత సమయం పొందారు. అయినా పనులేవీ సరిగా జరగడం లేదు. అంబులెన్సులు కొంటే నిర్వహణ బాధ్యత ఎలాగో తేలక చివరకు 108కే అప్పగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఆగిపోయారు. కొత్త ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు సాధ్యం కాదని తేల్చి.. ఈ రోడ్డుతో సంబంధంలేని తాండూరు ఆసుపత్రిని వాడుకోవాలని నిర్ణయించారు. ఇక పోలీసుశాఖ రెండు చోట్ల ఔట్పోస్టు భవనాలు నిర్మించినా.. వాటిల్లో సిబ్బందిని, పరికరాలను ఏర్పాటు చేయలేదు. మొత్తంగా ‘ప్రమాద రహిత’ పనులు ప్రమాదంలో పడిపోయాయి. జాతీయ రహదారి సంగతేం చేస్తారో..? ఇటు ‘ప్రమాద రహిత రహదారి’ పనులు పూర్తికానే లేదు. ఈ ఏడాది మార్చిలో ఈ రోడ్డుకు జాతీయ రహదారి హోదా వచ్చింది. ఇది రూ.450 కోట్ల ప్రాజెక్టు. ఆ ప్రక్రియ అయితే ఇప్పటికీ మొదలుకాలేదు. దీనిని రెండు భాగాలుగా విభజించగా.. తొలి భాగానికి సంబంధించి కావాల్సిన భూమి ఎంతో కూడా తేల్చకపోవడం గమనార్హం. -
రూ.33,500 కోట్లు
రానున్న ఏడేళ్లలో బాల్య వివాహాలు, కౌమార దశ ప్రసవాలకు అడ్డుకట్ట వేస్తే ఆదా అయ్యే మొత్తం - దేశంలో భారీగా తగ్గనున్న ఆరోగ్య సంబంధిత ఖర్చులు - ప్రపంచ బ్యాంకు, ఐసీఆర్డబ్ల్యూ సర్వేలో వెల్లడి దేశంలో రానున్న ఏడేళ్లలో బాల్య వివాహాలు.. కౌమార దశలోనే ప్రసవాలకు అడ్డుకట్టవేస్తే.. ఆరోగ్యం దానికి సంబంధించిన ఖర్చులను భారీగా తగ్గించుకోవచ్చట. వీటిని నియంత్రిస్తే ఆదా అయ్యే మొత్తం రూ.33,500 కోట్లకు పైనేనట. ఈ మొత్తం 2017–18 కేంద్ర బడ్జెట్లో ఉన్నత విద్యకు కేటాయించిన నిధుల(రూ.33,329 కోట్లు)తో సమానం. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ పరిశోధక సంస్థ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఉమెన్(ఐసీఆర్డబ్ల్యూ) తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల్లో బాల్య వివాహాలను.. కౌమార దశలోనే శిశు జననాలను నియంత్రించడం వల్ల రూ.1.14 లక్షల కోట్లు ఆదా అవుతాయని ఈ సర్వే స్పష్టం చేసింది. ఇందులో భారత్ నుంచి ఆదా అయ్యే మొత్తం సుమారు రూ.65,000 కోట్లు(62 శాతం) అని పేర్కొంది. –సాక్షి, తెలంగాణ డెస్క్ బడ్జెట్పైనా తగ్గనున్న ఒత్తిడి బాల్య వివాహాలను, కౌమార దశ ప్రసవాలను అడ్డుకోగలిగితే.. జనాభా వృద్ధి రేటు తగ్గుతుందని, తద్వారా ప్రభుత్వ బడ్జెట్లపై ఒత్తిడి తగ్గుతుందని విశ్లేషించింది. మొత్తంగా 106 దేశాల్లో బాల్య వివాహాలను తగ్గించడం వల్ల 2030 నాటికి ఏటా రూ.37 లక్షల కోట్లు ఆదా అవుతాయని వెల్లడించింది. 2015లో దేశంలో సుమారు 1.7 కోట్ల మంది చిన్నారులకు 10 నుంచి 19 ఏళ్ల మధ్య వివాహాలు జరుగుతున్నాయి. వీరు 60 లక్షల మంది శిశువులకు జన్మనిచ్చారు. ప్రస్తుతం దేశంలో వివాహాలు జరుగుతున్న వారిలో ఇది 47 శాతం కావడం గమనార్హం. ఇలా చిన్న వయసులోనే జరుగుతున్న పెళ్లిళ్లలో 76 శాతం లేదా 1.27 కోట్ల మంది బాలికలవే. 2016లో 15–19 ఏళ్ల వయసులో పెళ్లిళ్లు చేసుకున్న సుమారు 2,80,000 మంది బాలికలు.. ఇప్పటికే నలుగురు పిల్లలకు జన్మనిచ్చారు. 2001తో పోలిస్తే ఇది 65 శాతం పెరిగింది. మెరుగైన చర్యతో సత్ఫలితాలు ఆర్థిక కారణాల వల్లే బాల్య వివాహాలు, కౌమార దశ ప్రసవాలు ఎక్కువ జరుగుతున్నాయని, వీటిని అధిగమించేందుకు భారత్తో పాటు ఇతర దేశాలు మెరుగైన చర్యలు తీసుకోవాలని ప్రపంచ బ్యాంకు–ఐసీఆర్డబ్ల్యూ సర్వే పేర్కొంది. బాల్య వివాహాలను, కౌమార దశ ప్రసవాలను అడ్డుకోవడం మొదలుపెట్టిన తొలినాళ్లలో పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఎటువంటి మార్పూ ఉండదని, అయితే ఆ తర్వాత నుంచి పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని, దీని వల్ల విద్యా రంగంలోనూ నిధులు ఆదా అవుతాయని వివరించింది. -
రైతుల వాదన నిజమే
రాజధాని అన్నదాతల వేదనతో ఏకీభవించిన ప్రపంచ బ్యాంకు - అందువల్లే తనిఖీ, విచారణకు ఆదేశిస్తున్నామని వెల్లడి - రాష్ట్ర ప్రభుత్వం బలవంతపు పూలింగ్, సేకరణ చేస్తోంది.. - జీవనోపాధి, ఆహార భద్రతకు ముప్పు.. సామాజిక సర్వే లోపభూయిష్టం - 1,27,505 మంది ప్రభావితం.. 150 మంది అభిప్రాయాలే సేకరిస్తారా? - రెతుల విన్నపాలను లోతుగా అధ్యయనం చేశాకే ఈ నిర్ణయం - వచ్చే నెల 13లోగా తనిఖీ, విచారణ పూర్తి చేయాలంటూ తలంటిన వైనం సాక్షి, అమరావతి : ‘అయ్యా.. అన్యాయం చేయమాకండయ్యా.. ఆ భూములమీదే ఆధారపడి బతుకుతున్నాం.. మూడు కార్లు పండే పచ్చటి పొలాలను లాగేసి మా కడుపు కొట్టొద్దు’ అని నవ్యావంధ్ర రాజధాని అమరావతి ప్రాంత రైతులు ఎంతగా నెత్తీనోరు కొట్టుకున్నా స్పందించని రాష్ట్ర సర్కారు తీరును ప్రపంచ బ్యాంకు తప్పు పట్టింది. బలవంతంగా రైతుల నుంచి భూములు సేకరిస్తూ వారి జీవనోపాధికి భంగం కలిగిస్తున్నారని, తద్వారా పర్యావరణం, ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఎత్తి చూపింది. సామాజిక ఆర్థిక సర్వే అంతా లోపభూయిష్టంగా సాగిస్తూ.. కొంత మంది అభిప్రాయాన్ని అందరి అభిప్రాయంగా చెప్పడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఈ నెల 12వ తేదీన ప్రపంచ బ్యాంకు తనిఖీ ప్యానల్ చైర్మన్ గోంజలో కాస్ట్రోడెలా మాటా సంతకంతో ఒక డాక్యుమెంట్ విడుదల చేశారు. అన్ని అంశాలపై తనిఖీ, విచారణ పూర్తి చేసి, వచ్చే నెల 13వ తేదీలోగా తమకు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు రుణం కోరిన నేపథ్యంలో రూ.3,334 కోట్లు ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆ ప్రాంతంతో సామాజిక స్థితిగతులు, పర్యావరణం తదితర అంశాలను ప్రపంచ బ్యాంకు తనిఖీ ప్యానల్ పరిశీలించి వాస్తవాలను నిర్ధారించుకుంటుంది. ఈ తరుణంలోనే ప్రభుత్వం బలవంతంగా భూములు సేకరిస్తోందని పెద్దఎత్తున రైతులు ఫిర్యాదు చేశారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వాస్తవాలను గమనించిన తనిఖీ ప్యానల్ ప్రభుత్వానికి తలంటింది. మాకే లోపభూయిష్టమైన సమాచారం ఇస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని, పారదర్శకత పాటించలేదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సమాచారాన్ని తాము విశ్వసించడం లేదని పరోక్షంగా స్పష్టం చేసింది. రాజధానిలో భూములు కోల్పోయిన, కోల్పోతున్న రైతుల ఆవేదనలో న్యాయం ఉందని తేల్చి చెప్పింది. రైతులకు జరుగుతున్న అన్యాయానికి ఆధారాలున్నాయని వెల్లడించింది. ఆకాశ రామన్నలు చెబితే విచారించడం లేదు.. రైతుల విన్నపాలపై లోతుగా అధ్యయనం చేసిన తరువాతే విచారణకు ఆదేశించామని ప్రపంచ బ్యాంకు తనిఖీ ప్యానల్ వెలువరించిన డాక్యుమెంట్లో స్పష్టం చేసింది. ఆకాశ రామన్న లేదా పస లేని ఫిర్యాదుల ఆధారంగా విచారణకు ఆదేశించలేదని వివరించింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సమాచారం లేకపోవడంతోపాటు అమరావతి ప్రాజెక్టు తొలి దశలోనే ఉన్నందున రైతుల విన్నపాలపై విచారణ, తనిఖీలకు ఆదేశించలేదని పేర్కొంది. రాజధానిలో భూములు కోల్పోయిన, కోల్పోతున్న రైతులు కోర్టు డాక్యుమెంట్లతో సహా మొత్తం 22 ఆధారాలు సమర్పిస్తూ.. న్యాయం చేయాల్సిందిగా తమకు విన్నవించుకున్నారని వెల్లడించింది. రైతులు లేవనెత్తిన అంశాలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే తనిఖీలు, విచారణకు ఆదేశించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది. ప్రపంచ బ్యాంకు ప్యానెల్ విడుదల చేసిన డాక్యుమెంట్లో ఇంకా చెప్పారంటే... అభిప్రాయాలు చెప్పకుండా నిరోధించారు.. ‘రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణ(ల్యాండ్ పూలింగ్) విధానం ప్రజల జీవనోపాధి, ఆహార భద్రత, పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సహాయ, పునరావాసంపై ప్రభుత్వం తమను సంప్రదించలేదని వారు అభ్యంతరం తెలిపారు. ఈ విషయాన్ని మా(ప్రపంచ బ్యాంకు) దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా భూములను లాగేసుకుంటోందని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం తగినంత పరిహారం చెల్లించడం లేదని, తాము జీవనోపాధి కోల్పోతామని వారు ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ భూములు కోల్పోతున్న వారికి అంతే మొత్తంలో మరోచోట భూములు కేటాయించాలని రైతులు కోరుతున్నారు. సహాయ, పునరావాస ప్రాజెక్టును ప్రపంచ బ్యాంకు నిబంధనల మేరకు అమలు చేయడం లేదని అంటున్నారు. రాజధాని ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యే వారిపై ప్రభావ తీవ్రతను సరిగా అంచనా వేయడం లేదని బ్యాంకు దృష్టికి రైతులు తీసుకెళ్లారు. సామాజిక ఆర్థిక సర్వే లోపభూయిష్టంగా నిర్వహించారని, ఒక కన్సల్టెంట్ ద్వారా నిర్వహించిన సర్వేలో వాస్తవాలు ప్రతిబింబించలేదని రైతులు పేర్కొన్నారు. రాజధాని ప్రాజెక్టు వల్ల 1,27,505 మంది ప్రభావితం అవుతుంటే కేవలం 150 మందిని మాత్రమే సర్వేలో సంప్రదించారని, మరో ఐదు ఆన్లైన్ అభిప్రాయాలు మాత్రమే వచ్చాయని రైతులు పేర్కొన్నారు. సెక్యూరిటీని పెట్టి అభిప్రాయాలు చెప్పడానికి రాకుండా చాలా మందిని నిరోధించారని రైతులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘనలను నిరోధించడంతో పాటు రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రపంచ బ్యాంకును కోరారు. గతంలో పలుసార్లు వినతులు చేసినప్పటికీ బ్యాంకు మేనేజ్మెంట్ వాటిపై చర్యలను తీసుకోవడంలో వైఫల్యం చెందిందని పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్పై అనేక అభ్యంతరాలు రైతుల వినతులపై ప్రపంచ బ్యాంకు ప్యానల్ గత నెల 24వ తేదీన ప్రపంచ బ్యాంకు మేనేజ్మెంట్తో సమావేశమై పలు అంశాలపై సమాచారం, వివరణ కోరింది. రైతులు ప్రస్తావించిన అంశాలు బ్యాంకు మేనేజ్మెంట్ దృష్టిలో ఉన్నాయని, అందుకు సంబంధించిన సమాచారాన్ని ప్యానల్కు సమర్పించామన్నారు. సహాయ పునరావాస ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని, ప్రస్తుతం కేవలం ఉప ప్రాజెక్టుల పరిధిలో మాత్రమే అమలయ్యే చర్యలను తీసుకుంటున్నట్లు బ్యాంకు మేనేజ్మెంట్ ప్యానల్ దృష్టికి తీసుకువచ్చింది. ప్రపంచ బ్యాంకు సాయం అందించే మొత్తం ప్రాజెక్టులో ప్రస్తుతం 30 శాతం మాత్రమే అంటే పది రహదారులకు సంబంధించి సహాయ పునరావాస కార్యాచరణ ప్రణాళికలను రూపొందించినట్లు బ్యాంకు మేనేజ్మెంట్ ప్యానల్ దృష్టికి తీసుకువచ్చింది. ఈ రహదారుల ప్రాజెక్టుకు 400 కుటుంబాలు ప్రభావితం అవుతాయని, కన్సల్టేషన్ సమావేశంలో కేవలం 150 మంది మాత్రమే పాల్గొన్నారని, ల్యాండ్ పూలింగ్పై అనేక అభ్యంతరాలు, అభిప్రాయాలు వచ్చాయని బ్యాంకు మేనేజ్మెంట్ ప్యానల్కు వివరించింది. ల్యాండ్ పూలింగ్పై మూడవ పార్టీ అంచనా కొనసాగుతోందని, త్వరలోనే ఆ నివేదికను ప్యానల్కు సమర్పిస్తామని బ్యాంకు మేనేజ్మెంట్ పేర్కొంది. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తనిఖీ, విచారణకు ఆదేశించాము’ అని డాక్యుమెంట్లో స్పష్టం చేసింది. -
ప్రపంచ బ్యాంకుతో కేంద్రం ఒప్పందం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో 24 గంటలు విద్యుత్ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంక్ నుంచి 240 మిలియన్ డాలర్లు, ఏఐఐబీ నుంచి 160 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి రాజ్ కుమార్, ప్రపంచ బ్యాంక్ తరఫున ఆపరేషన్స్ మేనేజర్ హిషం అబ్డో, ఏఐఐబీ ఉపాధ్యక్షుడు డీజే పాండ్యన్ గురువారం సంబంధిత ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమం అమలు ఒప్పందంపై ఏపీ ప్రభుత్వ విద్యుత్ సలహాదారు కె.రంగనాథం, ప్రపంచ బ్యాంక్, ఏఐఐబీ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 570 మిలియన్ డాలర్లు కాగా, మిగిలిన వ్యయాన్ని ఏపీ ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. -
ఈ ఏడాది భారత్ వృద్ధి 7.2%!
⇔ ప్రపంచబ్యాంక్ అంచనా ⇔ డీమోనిటైజేషన్ ప్రభావం నుంచి బయటపడుతోందని విశ్లేషణ వాషింగ్టన్: భారత్ డీమోనిటైజేషన్ ప్రభావం నుంచి బయటపడుతోందని ప్రపంచబ్యాంక్ తన తాజా నివేదికలో అంచనావేసింది. 2016లో వృద్ధి 6.8 శాతంగా నమోదయితే, 2017లో 7.2 శాతానికి చేరుతుందని విశ్లేషించింది. 2017లో కూడా వృద్ధి 6.8 శాతంగానే ఉంటుందని జనవరిలో ప్రపంచబ్యాంక్ అంచనావేసింది. అయితే అప్పటి అంచనాను ఇప్పుడు 40 బేసిస్ పాయింట్లు పెంచడం గమనార్హం. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాతుందని తాము భావిస్తున్నట్లు ప్రపంచబ్యాంక్ అధికారులు తెలిపారు. 2018లో 7.5 శాతం 2019లో 7.7 శాతం మేర భారత్ వృద్ధి నమోదవుతుందని తన తాజా ‘గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్స్’లో ప్రపంచబ్యాంక్ అభిప్రాయపడింది. అయితే ఈ అంచనాలను ఇంతక్రితం (జనవరి 2017)తో పోల్చితే వరుసగా 0.3 శాతం, 0.1 శాతం మేర తగ్గించడం గమనార్హం. ప్రైవేటు పెట్టుబడులు ఊహించినదానికన్నా తక్కువగా ఉండడం దీనికి కారణంగా పేర్కొంది. ముఖ్యాంశాలు చూస్తే... ⇔ ఈ ఏడాది భారత్ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవస్థలో ద్రవ్య లభ్యత మెరుగుపడ్డం, ఎగుమతుల్లో వృద్ధి దీనికి ప్రధాన కారణాలు. ప్రభుత్వ వ్యయాలూ పెరుగుతున్నాయి. ⇔ దేశీయ డిమాండ్ పటిష్టంగా కొనసాగుతోంది. ప్రభుత్వ విధాన సంస్కరణలు దీనికి ప్రధాన కారణం. ప్రత్యేకించి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలుకు ప్రభుత్వ చొరవను ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ⇔ రాష్ట్ర ఎన్నికల్లో కేంద్రంలోని పాలక పార్టీ గణనీయ విజయాలు, ప్రభుత్వ ఆర్థిక అజెండాను కొనసాగించడానికి దోహదపడతాయి. సరఫరాల అడ్డంకుల సమస్యలను అధిగమించడం, తగిన వాతావరణ పరిస్థితుల సృష్టి వంటి అంశాల్లో సానుకూల పరిస్థితులు ఏర్పడే వీలుంది. ⇔ బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రపంచబ్యాంక్ అభివృద్ధి విభాగ డైరెక్టర్ అహాన్ కోస్ తెలిపారు. -
అమెరికాతో బంధం మరింత బలోపేతం
ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వాషింగ్టన్: గత కొన్ని దశాబ్దాలు భారత్– అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వృద్ధి చెందడంతో పాటు బలోపేతమయ్యాయని, ఇరు దేశాల్లో ప్రభుత్వాలు మారినా ద్వైపాక్షిక సంబంధాలపై పెద్దగా ప్రభావం పడలేదని ఆర్థిక మంత్రి జైట్లీ అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా శనివారం భారత రాయబారి నవ్తేజ్ సర్నా ఇచ్చిన విందులో జైట్లీ పాల్గొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం ట్రంప్ సర్కారుతో కలసి పనిచేసేందుకు భారత ప్రభుత్వం ఎదురుచూస్తోందని జైట్లీ అన్నారు. భారత్–అమెరికాల మధ్య సంబంధాలకు ఇరు దేశాల్లోను మద్దతు ఉందని, అమెరికాలోని కొత్త ప్రభుత్వంతో సంబంధాలు కొనసాగించడం భారత్కు లాభిస్తుందనే నమ్మకం వ్యక్తంచెప్పారు. ఆదివారం అమెరికా రెవెన్యూ మంత్రితో జైట్లీ భేటీ కానున్నారు. ఆశాజనకంగా ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సమావేశాలు అమెరికాలో పర్యటిస్తోన్న భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న జైట్లీ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. అలాగే జీ–20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశంలోను పాల్గొంటారు. గత మూడేళ్లతో పోల్చితే ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు సమావేశాలు ఈ ఏడాది ఆశాజనకంగా జరిగాయని జైట్లీ చెప్పారు. భారతదేశ వృద్ధి రేటుపై మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతున్నా సరే... గత మూడేళ్లలో ఏడు నుంచి 8 శాతం వృద్ధి రేటుతో భారత్ ముందుకు సాగిందని, ఇతర ఆర్థిక సూచీలు ఆశాజనకంగానే ఉన్నాయన్నారు. -
పల్లె ‘ప్రగతి’ ఇంతేనా?
- ప్రపంచ బ్యాంకు అసంతృప్తి - రూ.300 కోట్లకు రూ.21 కోట్ల కేటాయింపులా? - ప్రాజెక్ట్ లక్ష్యాలను చేరుకునేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని సీఎస్కు లేఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమం అమలు తీరుపై ప్రపంచ బ్యాంక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒప్పందం ప్రకారం నిధులు కేటాయించలేదని ప్రభుత్వం తీరును తప్పుబట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద రైతు కుటుంబాల సంక్షేమానికి రూపొందించిన ఈ ప్రాజెక్ట్ను ప్రపంచ బ్యాంక్ సౌజన్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. గతేడాది జనవరి 27న ప్రపంచ బ్యాంక్తో రాష్ట్ర ప్రభుత్వం అవగా హన ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం లో పేర్కొన్న విధంగా ప్రాజెక్ట్ అమలు జరగ డం లేదని ప్రపంచ బ్యాంకు విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రపంచ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్(ఇండియా) జునైద్ కమల్ అహ్మద్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్కు ఘాటుగా లేఖ రాశారు. ‘‘ప్రాజెక్టును నిర్వహించే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)కు రాష్ట్ర ప్రభుత్వం తగినన్ని నిధులు విడుదల చేయలేదు. గతేడాది ఏప్రిల్ 18 నుం చి ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ రాష్ట్ర స్థాయిలో కీలకమైన ప్రాజెక్టు అధికారుల నియామకం చేపట్టలేదు. ఒప్పందంలో పేర్కొ న్న విధంగా మొత్తం రూ.642 కోట్ల అంచనా తో చేపట్టిన ఈ ప్రాజెక్ట్కు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.192 కోట్లు ఖర్చు చేయాలి. 2020 కల్లా ప్రాజెక్ట్ పూర్తి కావాలని లక్ష్యంగా నిర్ధేశించింది. కానీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక శాతానికి మించి నిధులు విడుదల చేయలేదు’’అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దృష్టికి తెచ్చినా ప్రాజెక్ట్ అమలుకు సంబంధించిన సమస్య లను తమ బృందం వివిధ స్థాయిల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారానికి నోచుకోలేదని లేఖలో ప్రస్తావించింది. గతేడాది బడ్జెట్లో రూ.40 కోట్లు కేటాయించిన ప్రభుత్వం కేవలం రూ.10కోట్లు విడుదల చేయగా.. ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ.11 కోట్లు కేటాయించడం బాధాకరమని పేర్కొంది. రెండేళ్లలో రూ.300 కోట్లు ఖర్చు చేయాల్సిన ప్రాజెక్టుకు, కేవలం రూ.21 కోట్లు కేటాయించిన తీరుపై తీవ్ర అసంతృప్తిని ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్కు ‘అసంతృప్తి’ రేటింగ్ను ఇవ్వాలని టాస్క్ టీమ్ నిర్ణయిం చిందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులు పెంచాలని, నియామక ప్రక్రియను వెంటనే చేపట్టాలని సూచించారు. పల్లె ప్రగతి ప్రణాళిక ఇలా.. ఈ పథకం ద్వారా అయిదేళ్లలో 10,621 గ్రామాల్లోని 37.50 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలనేది లక్ష్యం. ఇందులో జీవనోపాధులకు అత్యం త ప్రాధాన్యత కల్పించింది. ప్రధానంగా పలు రకాల పంటలు పండించే రైతులతోనే ఉత్పత్తి దారుల సంస్థ (ప్రొడ్యూసర్స్ గ్రూప్)లను ఏర్పాటు చేసి, వారి ఆదాయాన్ని 50శాతం పెంపొందేలా చర్యలు చేపటాలి. సాగు పద్ధతులపై అవగాహన కల్పన, ఉత్పత్తులకు మార్కెట్లో మెరుగైన ధర పొందేలా సెర్ప్ శిక్షణ కార్యక్రమాలను అమలు చేయాలి. మానవాభివృద్ధిలో కీలకమైన ఆరోగ్యం, పౌష్టికాహార భద్రత, మెరుగైన ఉద్యోగ అవకాశాలకు నాణ్యమైన విద్యను అందించాలనేది లక్ష్యం. నిధుల కొరత, తగిన సిబ్బంది లేకపోవడంతో ఇవేవీ ముందుకు సాగలేదు. -
వృద్ధి అవకాశాలపై చిన్న సంస్థల ధీమా
ఫేస్బుక్, ప్రపంచ బ్యాంక్ అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ : దేశీయంగా చిన్న సంస్థలు (ఎస్ఎంఈ) తమ వ్యాపారాల వృద్ధి అవకాశాలపై ధీమాగా ఉన్నాయి. అలాగే నియామకాలపరంగానూ ఆశావహంగా ఉన్నాయి. ఫేస్బుక్, ఓఈసీడీ, ప్రపంచ బ్యాంక్ సంయుక్తంగా రూపొందించిన అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాల్గొన్న వ్యాపార సంస్థల్లో 48 శాతం ఎస్ఎంఈలు.. ప్రస్తుత పరిస్థితులపై, 62 శాతం సంస్థలు భవిష్యత్ అవకాశాలపైనా సానుకూలంగా స్పందించాయి. గత ఆర్నెల్లల్లో ఉద్యోగుల సంఖ్య పెరిగిన సంస్థలు 28 శాతం కాగా.. వచ్చే ఆర్నెల్లలో సంఖ్యను పెంచుకోవాలనుకుంటున్న ఎస్ఎంఈలు 56 శాతం ఉన్నాయి. చిన్న సంస్థలు.. డిజిటల్ ఇండియా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నట్లు అధ్యయనం వెల్లడించింది. ఎస్ఎంఈల కార్యకలాపాలు, అవి ఎదుర్కొంటున్న సవాళ్లు మొదలైన వాటిపై అవగాహన కోసం ఇది తోడ్పడనుంది. -
వృద్ధి జోరుకు నోట్ల రద్దు బ్రేక్!
-
వృద్ధి జోరుకు నోట్ల రద్దు బ్రేక్!
2016–17లో వృద్ధి 7 శాతమే • అంచనాలు తగ్గించిన ప్రపంచబ్యాంక్ • నోట్ల రద్దు కారణమని విశ్లేషణ • క్రితం అంచనా 7.6 శాతం • భవిష్యత్తుపై ఆశావహ అభిప్రాయం వాషింగ్టన్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి స్పీడ్కు రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తక్షణం బ్రేకులు వేస్తుందని ప్రపంచబ్యాంక్ స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016–17, ఏప్రిల్–మార్చి)లో వృద్ధి కేవలం 7 శాతంగానే ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు తన క్రితం 7.6 శాతం అంచనాలను కుదించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) 7.1 శాతం అంచనాలకన్నా ప్రపంచబ్యాంక్ తాజా అంచనాలు తక్కువ కావడం గమనార్హం. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి తగ్గినా... రానున్న సంవత్సరాల్లో మళ్లీ వృద్ధి 7.6 శాతం, 7.8 శాతానికి పుంజుకుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలే దీనికి కారణమనీ పేర్కొంది. ప్రపంచ ఆర్థిక ధోరణులపై ప్రపంచబ్యాంక్ తాజా నివేదిక విడుదల చేసింది. నవంబర్ 8వ తేదీన దేశంలో డీమోనిటైజేషన్ ప్రభావం, తదుపరి పరిణామాలను ప్రపంచబ్యాంక్ తన తాజా నివేదికలో విశ్లేషించింది. ముఖ్యాంశాలు చూస్తే... ⇔ పెద్ద నోట్ల రద్దు 2016లో వృద్ధిని మందగించేట్లు చేస్తుంది. చమురు ధరల అనిశ్చితి, వ్యవసాయ, తయారీ రంగాలు వృద్ధి తీరుపై ప్రభావం చూపుతాయి. 2016–17 చివరి త్రైమాసికంలో ఆర్థిక క్రియాశీలత కొరవడనుందని తయారీ, మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్లు (పీఎంఐ) కూడా పేర్కొనడం గమనార్హం. ⇔ భారత్ వృద్ధి రేటు తగ్గినా... అది చైనాకన్నా ఎక్కువగానే ఉండడం వల్ల ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగనుంది. ⇔ దేశంలో సరఫరాల సమస్యల పరిష్కారానికి, ఉత్పాదకత మెరుగుకు ప్రభుత్వం తీసుకుంటున్న చొరవలు దోహదపడతాయని భావిస్తున్నాం. వచ్చే రెండేళ్లలో వృద్ధి పెరుగుదల అంచనాలకు ఇది ప్రధాన కారణం. ⇔ సమీపకాలంలో వ్యాపార విశ్వాసం మెరుగుపడ్డానికి, పెట్టుబడులు పెరగడానికి మౌలిక రంగంలో భారీ వ్యయాలు దోహదపడతాయి. ⇔ మేక్ ఇన్ ఇండియా ప్రచారం... భారత తయారీ రంగానికి దోహదపడుతుంది. దేశంలో నెలకొన్న డిమాండ్, ప్రభుత్వం తీసుకొస్తున్న నియంత్రణపరమైన సంస్కరణలు ఈ దిశలో ప్రయోజనాలకు దారితీస్తుంది. ⇔ ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం, వేతనాల పెంపు... వాస్తవ ఆదాయాలు, వినియోగం పెరగడానికి దోహదపడతాయి. తగిన వర్షపాతంతో పంట దిగుబడి పెరగడం ఆర్థిక వృద్ధికి దోహదపడే అంశం. ⇔ పెద్ద నోట్ల రద్దు వల్ల బ్యాంకింగ్ వద్ద ద్రవ్య లభ్యత పెరిగింది. ఇది కనిష్ట వడ్డీరేట్ల వ్యవస్థకు దారితీస్తుంది. ఇది దీర్ఘకాలంలో ఆర్థిక క్రియాశీలత మెరుగుపడ్డానికి దోహదపడుతుంది. అయితే దేశం నగదు ఆధారితమైనందున, తక్షణం వ్యాపార అవరోధాలకు, కుటుంబ కొనుగోళ్లు తగ్గడానికి దారితీస్తుంది. ⇔ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో నిజానికి భారత్ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు మందగించాలి. పారిశ్రామిక వృద్ధి బాగోలేదు. ఎగుమతులూ పెరగలేదు. అయితే ప్రైవేటు, ప్రభుత్వ వ్యయాలు పెరగడం ఆర్థిక వ్యవస్థకు లాభించింది. దిగువస్థాయి ఇంధన ధరలు, వేతనాలు, పెన్షన్ల పెరుగుదల, తగిన వర్షపాతం వంటి అంశాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆదాయాలు పెంచాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) పెరగడం కూడా ఆర్థిక క్రియాశీలతకు దోహదపడింది. మౌలిక రంగంలో ప్రభుత్వ వ్యయాలు ఎగశాయి. ⇔ గడచిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పెట్టుబడులు 21 శాతం పెరిగితే, ప్రైవేటు పెట్టుబడుల్లో అసలు వృద్ధిలేకపోగా 1.4 శాతం క్షీణించింది. ⇔ తయారీ రంగంసహా పలు విభాగాలకు సంబంధించి విదేశీ డిమాండ్ బలహీనత, కొత్త ప్రాజెక్టులకు ప్రోత్సాహం లేకపోవడం, విధానపరమైన అనిశ్చితి ప్రైవేటు పెట్టుబడుల మందగమనానికి కారణం. ఉదాహరణకు భూ సేకరణలకు సంబంధించి నష్టపరిహార చెల్లింపులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం తగిన విధంగా లేదు. ఇందుకు సంబంధించి చట్ట సవరణల విషయంలో జాప్యం జరుగుతోంది. ఇక ఇప్పటికే రుణ భారంతో ఉన్న మౌలిక రంగ కంపెనీలకు బ్యాంకింగ్ రుణాలు అందుబాటులో ఉండడం లేదు. ముఖ్యంగా ఇక్కడ విద్యుత్, స్టీల్, సిమెంట్ వంటి రంగాలను ప్రస్తావించుకోవచ్చు. ⇔ దక్షిణ ఆసియా మొత్తంగా పెట్టుబడులు మందగిస్తున్నాయి. -
రాజధానిలో భూమి ఎత్తు పెంచాలి
లోతట్టు ప్రాంతం ఉందని ప్రభుత్వ నివేదిక సాక్షి, అమరావతి: నూతన రాజధాని లోతట్టు ప్రాంతాల్లో వరద ముప్పు నివారణకు నిర్మాణ ప్రాంతాల్లో భూమి ఎత్తు పెంచాల్సి ఉందని సామాజిక, ఆర్థిక, పర్యావరణ ప్రభావ అధ్యయన నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచ బ్యాంకు రుణం కోసం సామాజిక పర్యావరణ ప్రభావ అధ్యయన నివేదికను సీఆర్డీఏ ప్రకటించింది. వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ముఖ్యంగా రవాణా కారిడార్, యుటిలిటి, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణాలకు భూమి ఎత్తు (ప్లాట్ఫాం) పెంచాలని నివేదికలో స్పష్టం చేసింది. కృష్ణా కరకట్టలను మరింత పటిష్టం చేయడం ద్వారా వరద ముప్పు నివారించవచ్చని పేర్కొంది. కొండవీటివాగు వరద అంచనాలపై జలవనరులశాఖ అధ్యయనం చేస్తోందని, త్వరలోనే నివేదిక వస్తుందని తెలిపింది. జలవనరులశాఖ నివేదిక వచ్చిన తరువాత చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది. రాజధాని ప్రాంతంలో అత్యధికంగా సారవంతమైన వ్యవసాయ భూమి ఉందని, ఈ భూమిని కోల్పోవడంతో ఉపాధి లేకుండా పోయిందని సామాజిక, ఆర్థిక సర్వేలో ప్రజలు స్పష్టం చేశారని తెలిపింది. అసైన్డ్ భూములకు తగిన పరిహారం చెల్లించలేదని కూడా వెల్లడించింది. ప్రజారవాణా వ్యవస్థ లేదని, మంచి నీటి సౌకర్యం లేదని, విద్య, వైద్య సౌకర్యాలు లేవని పేర్కొంది. -
ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల పర్యటన
అమరావతి: మండలంలోని జూపూడిలో గురువారం ప్రపంచబ్యాంకు ప్రతినిధులు, అధికారులు పర్యటించి పేదల జీవన స్థితిగతులపై అధ్యయనం చేశారు. వరల్డ్బ్యాంకు ప్రతినిధులు సాహితి, జాన్సన్, అభిషేక్ గుప్తా సయ్యద్, పాల్ ఆదాయ వనరులు, కుటుంబ పరిస్థితి, సామాజిక అభివృద్ధి వంటి అంశాలపై ప్రజల నుంచి వివరాలు సేకరించారు. డీఆర్డీఏ పీడీ హబీబ్బాషా మాట్లాడుతూ వరల్డ్ బ్యాంకు సహకారంతో వెలుగు ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో నిరుపేదలు ఎక్కువగా ఉన్న 150 మండలాలను ఎంపిక చేశారన్నారు. అందులో భాగంగా జూపూడి గ్రామాన్ని పరిశీలించినట్లు తెలిపారు. ఐదేళ్లపాటు ఈ గ్రామాలాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారని వెల్లడించారు. అనంతరం అమరావతి వెలుగు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ఏరియా కో-అర్డినేటర్ సత్యసాయి, డీపీఎం గౌరీనాయుడు, కిరణ్కుమార్, శర్మ, ఏపీఎం సునీత పాల్గొన్నారు. -
అమరావతికి వరద ముప్పు: టీడీపీ ఎంపీ
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో 13,500 ఎకరాలకు వరద ముప్పు పొంచి ఉందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వరద ముంపుపై మొదటి నుంచి పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేసినా ఈ విషయాన్ని చంద్రబాబునాయుడు సర్కార్ కొట్టిపారేసింది. అయితే ఇప్పుడు మాత్రం వరద ముప్పు ఉందని పరోక్షంగా టీడీపీ నేతలు అంగీకరిస్తున్నారు. వరద ముంపు నిర్వహణ నిమిత్తం రూ.1096 కోట్లు అవసరమన్న ఎంపీ గల్లా జయదేవ్.. లోక్సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రపంచ బ్యాంకు రుణం కోసం ఆమోదం తెలపాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రిజర్వాయర్ల నిర్మాణం, వరదనీరు మళ్లింపునకు వందల కోట్లు ఖర్చవుతుందని ప్రపంచ బ్యాంకు రుణాల కోసం కేంద్ర జలవనరులశాఖకు ఫైలు పంపిన టీడీపీ ఎంపీలు ఆమోదం తెలపాలంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. -
అమరావతికి వరద ముప్పు: టీడీపీ ఎంపీ
-
ఇబ్బందిలేని మదుపును కోరుకుంటున్నారా..
• సేవింగ్స్ అకౌంట్స్ నుంచి ఎన్పీఎస్ వరకూ ఎన్నో మార్గాలు • అవసరార్థం డబ్బుకు ఢోకాలేదు • ఆందోళన అక్కర్లేదు భారతీయులు గొప్ప మదుపరులు. 2014లో ప్రపంచబ్యాంక్ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం– మన స్థూల దేశీయ పొదుపు రేటు 31.1 శాతం. ఇది ప్రపంచంలోనే అత్యధికం. భారత్ ప్రజలు మదుపునకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. మెజారిటీ ప్రజలు తమ డబ్బు భద్రతకు తొలి ప్రాముఖ్యత ఇస్తారు. ఎప్పుడు అవసరపడితే అప్పుడు డబ్బు చేతికి అందాలనీ కోరుకుంటారు. ఇది స్టాక్స్, కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ వంటి సాధనాల్లో సా ధ్యపడదు. మ్యూచువల్ ఫండ్స్ ఉన్నా... ఇక్కడా మార్కెట్ ఒడిదుడుకులు పొంచి ఉంటాయి. ఎలాంటి ఒడిదుడుకు లూ లేకుండా... పొదుపు చేసిన డబ్బుకు పూర్తి భరోసాను ఇస్తూ... ప్రణాళికలకు అనుగుణంగా డబ్బు చేతికి అందాలనుకునే చిన్న మదుపుదారులకు పలు ‘ఆర్థిక సాధనాల’ గురించి తెలియజేయడమే ఈ కథనం ముఖ్య ఉద్దేశం. ముందుగా చేయాల్సింది...! ‘ఇబ్బంది లేని మదుపు’ దిశలో చిన్న మదుపుదారుగా మీరు తొలుత ప్రధానంగా మూడు సూత్రాలపై దృష్టి పెట్టాలి. వీటి ఆధారంగానే మీ ‘ఆర్థిక మదుపు ఇన్స్ట్రమెంట్’ను ఎంచుకోవాల్సి ఉంటుంది. మీ వాటిని ఒక్కొక్కటిగా చూస్తే... ఆర్థిక లక్ష్యాలు... అసలు పొదుపునకు సంబంధించి మీ లక్ష్యాలు ఏమిటన్న అంశంపై తొలుత దృష్టి పెట్టాలి. రిటైర్మెంట్ ప్లానింగ్ లేదా ఇళ్లు కొనడం ఇదేమీ కాకుండా పిల్లల చదువులు. ఇంకా చెప్పాలంటే కారు కొనడం... సెలవులకు ఏదైనా పర్యటన చేయడం... ఇలా మీ స్వల్పకాల, దీర్ఘకాల లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. దీనిపైన ఒక స్పష్టతకు రావాలి. సమయ నిర్ణయం... ఆయా లక్ష్యాలకు అనుగుణంగా ఎంత సమయానికి మీ డబ్బు తిరిగి మీ చేతికి అందాలన్న అంశంపై అవగాహన ముఖ్యం. పన్ను అంశాల పరిశీలన ఇక మీ మదుపునకు సంబంధించి పన్ను అంశాలపైనా అవగాహన అవసరం. పన్ను భారాలు లేని ‘ఆర్థిక ఇన్స్ట్రమెంట్’ మీద దృష్టి ముఖ్యం. మీకు వచ్చే సంపదపై అధిక పన్ను పడే పరిస్థితుల్లో సంపద సృష్టి కష్టం. పన్నులు, ఈ అంశానికి సంబంధించి ప్రభావం దీర్ఘకాలం రిటర్న్స్పై ఎంతో ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆర్థిక సాధనాలు ఇవీ... సేవింగ్స్ అకౌంట్: ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదు అందుబాటులో ఉండడం... కచ్చితంగా 4 నుంచి 6 శాతం వరకూ వడ్డీరేటు ఇక్కడ లభిస్తున్న ప్రధాన అవకాశం. వడ్డీ 10,000 లోపు అయితే పన్ను మినహాయింపూ ఉంటుంది. స్వల్ప కాలానికి అంటే 1 నుంచి 6 నెలలకు ఈ బ్యాంకింగ్ ప్రొడక్ట్ అత్యుత్తమ సాధనం. స్థిర డిపాజిట్లు: మధ్య కాలానికి మంచిది. 9 నెలలు ఆపైన మదుపునకు ఇది మంచి సాధనం. 7 రోజుల నుంచి 7 సంవత్సరాలు (కొన్ని బ్యాంకులు ఆ పైన కూడా) నిర్దిష్ట వడ్డీరేట్లతో స్థిర డిపాజిట్లు మీ డబ్బుకు భరోసాను ఇస్తాయి. అయితే దీర్ఘకాలంలో చూస్తే ద్రవ్యోల్బణానికి విరుగుడు కాకపోవడం, పన్ను అంశాలు ఇక్కడ అవరోధాలు. ఎఫ్ఎంపీలు: ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్. క్లోజ్డ్ ఎండెడ్ డెట్ మ్యూచువల్ ఫండ్ పథకాలు. డెట్, మనీ మార్కెట్ ఇన్స్ట్రమెంట్లలోకి మీ నిధులు వెళతాయి. స్థిర డిపాజిట్ల పరిమాణంలోనే రిటర్న్స్ ఉంటాయి. మూడేళ్ల కాల వ్యవధికి పెట్టుబడులు పెట్టేందుకు వీలుంటుంది. పన్ను భారాలు ఉండవు. అయితే ఏఏఏ రేటెడ్ ఎఫ్ఎంపీలను ఎంచుకోవాలి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్: పదిహేళ్లను ప్రత్యేకించి రిటైర్మెంట్ ప్రణాళికలకు సంబంధించి ఈ ప్రొడక్ట్ ఎంతో ప్రయోజనకరం. రిటర్న్స్పై అసలు పన్ను భారం ఉండదు. ఈ పథకానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహమూ ఉంది. ప్రభుత్వ నిర్ణయానుసారం త్రైమాసికానికి రిటర్న్స్ రేటు మారే వీలుంది. ఏడాదికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ పెట్టుబడి పరిమితి ఉంది. నేషనల్ పెన్షన్ స్కీమ్: ఇది కూడా ఒక చక్కటి రిటైర్మెంట్ ప్రణాళికే. భారత్ ప్రభుత్వం ప్రమోట్ చేస్తోంది. పొదుపును ప్రోత్సహిస్తూ... రిటైర్మెంట్పై యాన్యుటీ ప్రణాళికగా ఏకమొత్తం డబ్బు పొందడానికి ఈ పథకం వీలు కల్పిస్తోంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ తరహాలో నేషనల్ పెన్షన్ స్కీమ్కు పెట్టుబడులు పెట్టడానికి సంబంధించి ఎటువంటి పరిమితీ లేదు. సిప్: మ్యూచువల్ ఫండ్స్లో క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక. ఈక్విటీల్లో క్రమానుగత పెట్టుబడులు ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఇక్కడ రాబడి బాగుంటుందని ఫలితాలు చెబుతున్నాయి. పిల్లల ఉన్నత విద్య, రిటైర్మెంట్ ప్రణాళికలకు ఈ ప్రొడక్ట్ ఎంతో దోహదపడుతుంది. ఈక్విటీలపై అవగాహన లేని వారు సిప్ ద్వారా ఆ ప్రయోజనం పొందవచ్చు. -
పాకిస్థాన్ కు షాక్ ఇచ్చిన ప్రపంచబ్యాంకు
673 కోట్ల రుణం ఇవ్వడానికి నిరాకరణ ఇస్లామాబాద్: దాయాది పాకిస్థాన్ కు ప్రపంచ బ్యాంకు గట్టి షాక్ ఇచ్చింది. పాకిస్థాన్ సహజవాయువు (నాచురల్ గ్యాస్) ప్రాజెక్టు కోసం ఉద్దేశించిన రూ. 630 కోట్ల (100 మిలియన్ డాలర్ల) రుణాన్ని నిరాకరించింది. ఈ ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడం, అంతేకాకుండా ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు గ్యాస్ పంపిణీ కంపెనీ పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కరాచీ, సింధ్, బలూచిస్తాన్ ప్రాంతాలలో సహజ వాయువు సరఫరాను మెరుగుపరిచేందుకు, గ్యాస్ పైప్ లైన్ వ్యవస్థలో వాణిజ్య,ఇతర లొసుగులను అధిగమించేందుకు సుయ్ సాదరన్ గ్యాస్ కంపెనీ (ఎస్ఎస్జీసీ) ఈ ప్రాజెక్టు తలపెట్టింది. అయితే, ఈ ప్రాజెక్టు చేపట్టడంలో విఫలం కావడం, అక్రమ గ్యాస్ లీకేజీలు అధికంగా కొనసాగుతూ విలువైన సహజ వనరు దుర్వినియోగమవుతుండటంతో ప్రపంచబ్యాంకు ఈ ప్రాజెక్టు ఇవ్వాలని ఉద్దేశించిన రుణాన్ని నిరాకరించాలని నిర్ణయించిందని డాన్ పత్రిక తెలిపింది. -
ఉత్పాదకతతోనే ఎగుమతుల వృద్ధి
భారత్కు ప్రపంచ బ్యాంక్ సూచన న్యూఢిల్లీ: దక్షిణాసియా ప్రాంతంలో ప్రధాన ఎగుమతుల దేశంగా అవతరించాలంటే.. భారత్ తప్పనిసరిగా తన ఉత్పాదకతను పెంపొందించుకోవాల్సి ఉందని ప్రపంచ బ్యాంక్ అభిప్రాయపడింది. దీనికి అనువుగా తగిన పాలసీ నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. ప్రస్తుతం భారతీయ కంపెనీలు ఎగుమతుల పరంగా చాలా అడ్డంకులను ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. దీంతోపాటు వీటికి ప్రపంచ దేశాల పోటీ కూడా ఒక సమస్యగా మరిందని తెలిపింది. ప్రపంచ బ్యాంక్ తన తాజా నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. ‘ఉత్పాదకతను పెంచుకుంటేనే పోటీలో నిలువగలం. ప్రపంచపు ఎగుమతుల హబ్గా దక్షిణాసియా ప్రాంతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందాలంటే భారత్ వంటి దేశాలు వాటి ఉత్పాదకతను ప్రతి ఏడాది రెండు శాతం పారుుంట్ల మేర పెంచుకుంటూ రావాలి’ అని వివరించింది.దక్షిణాసియా ప్రాంతంలోని ఆయా దేశాలు వ్యాపారానుకూల పరిస్థితులఏర్పాటుకు, వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి, నూతన పాలసీ అమలుకు కృషి చేయాలని సూచించింది. దేశంలో ఉత్పాదకతను పెంచాలంటే వ్యవసాయ రంగంపై ఆధారపడ్డ వారిని తయారీ, సేవల రంగం వైపు మరల్చాలని భారత్కు సూచించింది. టెక్నాలజీని పూర్తిస్థారుులో ఉపయోగించుకోవడం, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడం వంటి వాటి ద్వారా భారతీయ కంపెనీలు వాటి ఉత్పాదకతను పెంచుకోవచ్చని తెలిపింది. కార్మికులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడం, పట్టణాల అభివృద్ధి అంశాలపై దృష్టిసారిస్తే భారత్లో ఉత్పాదకత కచ్చితంగా పెరుగుతుందని పేర్కొంది. -
ఏ విలువలకీ విష సంస్కృతి?
రెండో మాట సంస్కరణల తదుపరి మొదలైన విశృంఖల పాలనా పద్ధతులలో భాగమే పర్యాటక పరిశ్రమకు ప్రోత్సాహం పేరిట పాశ్యాత్య విష సంస్కృతిని ప్రోత్సహించడం. ఏపీ ప్రభుత్వం దేశ విదేశాల నుంచి 9 వేల జంటలను ఆహ్వానించి బీచ్ లవ్ ఫెస్టివల్ను నిర్వహించబోవడం ఇందులో భాగమే. గోవాకే పరిమితమైన ‘బీచ్ లవ్’ సంస్కృతిని బీజేపీ మద్ధతుతో నడుస్తున్న టీడీపీ ప్రభుత్వం కూడా ఆశ్రయిస్తోంది. భారతీయ ప్రాచీన సంస్కృతిని ఆరాధకుల మనే బీజేపీ పాలకులకు ఈ ‘బీచ్ లవ్’ ఎలా నప్పిందో ప్రజలకు వారు వివరించాలి. పెట్టుబడిదారీ వ్యవస్థ విశృంఖల విహారాన్ని నేడు మన దేశంలో వివిధ స్థాయిలలో కళ్లారా చూస్తున్నాం. రకరకాల మార్గాలలో ఇది ప్రదర్శితమ వుతోంది. 1991లో ప్రపంచబ్యాంకు-అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు జమిలిగా ‘‘నూతన సమాచార వ్యవస్థ’’ వెన్నుదన్నుగా ప్రజా వ్యతిరేక ‘సంస్కరణ’లకు తెరఎత్తాయి. తద్వారా అమెరికా పతనమవుతున్న తమ సామ్రాజ్య పెట్టుబడి వ్యవస్థ ఆర్థిక చట్రాన్ని, కోల్పోతున్న మార్కెట్ను రక్షించుకునే ప్రయత్నంలో ‘ప్రపంచీకరణ’ మంత్రదండంతో వర్ధమాన దేశా లను తన సరుకులతో నింపదలచింది. పర్యవసానంగా భారత పాలకవర్గాలు (కాంగ్రెస్-బీజేపీ) ప్రపంచ బ్యాంకు ద్వారా అమలులోకి తెచ్చిన సంస్కర ణలలో భాగంగానే అన్నిరకాల అవలక్షణాలు ఆర్థికంగానే గాకుండా సాంస్కృ తికంగా కూడా మన దేశాన్ని ముప్పెరగొన్నాయి. వాటిలో భాగమే మన పాలకులు ఆ సంస్కరణలపై బేషరతుగా ముద్రవేయడం. ఆ ‘ముద్ర’ కాస్తా దేశం ఉసురు తీస్తోంది. యువతను పక్కదారులు పట్టించి చెడగొట్టే విష సంస్కృతిని వ్యాపింపజేయడంద్వారా, ప్రజావ్యతిరేక సంస్కరణల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను, సంస్కృతి, సంప్రదాయాలను వినాశనం వైపుగా మళ్లించి, తమకు శాశ్వత బానిసగా పడి ఉండే ఇండియాను తయారు చేయ డమే అమెరికా లక్ష్యం. సంస్కరణలవల్లే కుక్కమూతి పిందెల సంస్కృతి 1991లో ఈ ప్రక్రియను ప్రారంభించిన మన్మోహన్ సింగ్, నాటి ప్రధాని పీవీ నరసింహారావుకన్నా వరల్డ్ బ్యాంకు ‘సంస్కరణల’ను దేశంలోని ఇతర రాష్ట్రాలకన్నా మూడేళ్లు ముందుగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆచరణలో పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కాగా, బీజేపీ నాయకునిగా. ప్రధాన మంత్రి హోదాలో వాజ్పేయి మరొక అడుగు ముందుకు వేసి సంస్కరణ లను పెద్ద ఎత్తున అమలులోకి తెచ్చే ప్రక్రియను ‘‘వెలిగిపోతున్న భారతం’’ అన్నారు. నాయకులు, వారి అనుయాయులంతా ఆర్థికంగా ‘వెలిగి’పోయా రుగానీ, దేశ సామాన్య ప్రజాబాహుళ్యం బతుకులు మాత్రం చీకట్లోకి జారు కున్నాయి. ఆనాటి నుంచి ఈనాటి దాకా సామాజికంగానే గాక సాంస్కృతి కంగా కూడా ఈ సంస్కరణలు బతుకు విలువల్ని నైతిక విలువలను దిగజా రుస్తూనే వచ్చాయి. ఈ సర్వవ్యాపిత పతన సంస్కృతిలో భాగంగానే సాంస్కృ తిక రంగంలోనూ కుక్కమూతి పిందెలు మొలకెత్తి ఎదిగిపోతున్నాయి. ఇందుకు ఉదాహరణ దేశంలో పలు చోట్ల మహిళలు, విద్యార్థులు, వృత్తిదా రులు, కార్మిక, బలహీన వర్గాలపైన అనేక అత్యాచారాలు, దాడులూ పెరిగి పోతున్నాయి, హత్యల సంఖ్య రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతోంది. ముఖ్యంగా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఈ ప్రజా వ్యతిరేక కార్యకలాపాల్ని బహిర్గతం చేసే పాత్రికేయులపైన, పత్రికలపైన, విశ్వవిద్యాలయాలు, విద్యార్థి సంఘాలపైన, వాటి నాయకులపైన ప్రివెంటివ్ డిటెన్షన్, సెడిషన్ (రాజద్రోహ నేరం) చట్టాలను ప్రయోగించేందుకు పాలకులు సాహసిస్తు న్నారు. ఈ సంస్కరణల తదుపరి ఈ 20 ఏళ్లలోనే స్త్రీల మధ్యనే వివక్ష చూపే అందాల పోటీలు, బ్యూటీపార్లర్లు, క్యాట్వాక్లూ, ఆహార్యం, సౌందర్య పోషణ పేరిట వింత పోకడలూ చోటు చేసుకున్నాయి. సమానతా సూత్రం ప్రాతిపదికపై వనరుల పంపిణీ పద్ధతిలోగాక ప్రభుత్వాలు దుబారా పర్యటన లకు, మంత్రుల, ముఖ్యమంత్రుల విహార యాత్రలకూ మంచినీళ్లప్రాయంగా ఖర్చుపెడుతూ ప్రజల కనీస అవసరాలను తుంగలో తొక్కుతున్నారు. పర్యాటక వృద్ధి పేరిట విశృంఖలత ఈ విశృంఖల పాలనా పద్ధతులలో భాగమే పర్యాటక పరిశ్రమను ప్రోత్సహిం చడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి వనరులు సమకూర్చుకోవాలన్న యత్నం. స్థానిక, సంప్రదాయ కళల ద్వారా సంగీత, నృత్య విభావరులు పునాదిగా, దేశంలోని వివిధ స్థానిక సంస్కృతులకు ఆలవాలమైన జానపదుల కళారూపాల ద్వారా కూడా పర్యాటక రంగ ఆదాయ వనరులను పెంపొందించుకోవచ్చు. కానీ పాశ్చాత్య సంస్కృతి ద్వారా విష సంస్కృతిని పెంచి పోషించడం, స్థానిక యువత అభిరుచుల్ని పక్కదారులు పట్టించే ప్రయత్నాలు అభ్యంతరకరం. దేశ విదేశాల నుంచి 9 వేల జంటలను ఆహ్వా నించి, అందాల పోటీలు, హాలీవుడ్- బాలీవుడ్ తారల నృత్యాలు, వలంటైన్ (ప్రేమికుల) దినోత్సవాన్ని కలుపుకుంటూ ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 12 నుంచి 14 వరకూ ‘‘బీచ్ లవ్’’ ఉత్సవాలను నిర్వహించబోవడం ఇందులో భాగమే. అందుకే మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజా స్వామిక శక్తులూ ఈ ‘బీచ్ లవ్’ ఉత్సవాలను వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికి గోవాకే (బీజేపీ పాలన) పరిమితమైన ‘బీచ్ లవ్’ సంస్కృతిని బీజేపీ మద్ద తుతో నడుస్తున్న టీడీపీ ప్రభుత్వం కూడా ఆశ్రయిస్తోంది. నిత్యమూ భార తీయ ప్రాచీన సంస్కృతిని ఆరాధిస్తున్నట్టు కన్పించే బీజేపీ పాలకులకు ఈ ‘బీచ్ లవ్’ ఎలా నప్పిందో ప్రజలకు వారు వివరించాలి. ఆచరణలో రాజ్యాంగానికి, రాజ్యాంగంలోని ప్రాథమిక పౌర బాధ్యతల అధ్యాయంలో 51-ఎ (హెచ్) అధికరణకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాల కులు పాలనకు అనర్హులవుతారు. సెక్యులర్ వ్యవస్థను రక్షించలేని వారు రాజ్యాంగ వ్యతిరేకులు. బ్యాంకు సంస్కరణలు అమలులోకి వచ్చిన తరువాత సమాజంలోని వివిధ సామాజిక వర్గాలపైన వాటి చెడు ప్రభావం ఎలా విస్తరిస్తూ వచ్చిందో, ముఖ్యంగా దేశ మహిళల జీవితాలపైన ఎలాంటి ప్రభావానికి దారిదీశాయో ‘బ్యాంక్-ఐఎంఎఫ్ సంస్కరణల కింద భారత మహిళల పనిపాటపైన ఎలాంటి ప్రభావం పడిందో’ ప్రసిద్ధ పరిశోధకురాలు రజనీ దేశాయ్ (1998 ఏప్రిల్ 24) వివరించారు. ఆమె ఇలా అన్నారు: ‘‘ఈ సంస్కరణలవల్ల పని చేసుకుంటూ దోపిడీకి గురైన శ్రామిక వర్గ మహిళలు అత్యధికులు. కేవలం ఆర్థిక కారణాలవల్ల ఆహారం, ఇతర నిత్యావసరాలు అందని పేద కుటుంబాలున్నాయి. ఈలోగా ప్రపంచబ్యాంకు ‘పొదుపు’ కార్య క్రమాలూ, ‘పథకాలు’ దూసుకు వచ్చిన ఫలితంగా ఆహార ధాన్యాల రేషన్ ధరలు బహిరంగ సంతలో రెట్టింపుకు పెరిగిపోయాయి. ఈ మహిళా కార్మికుల్లో ఐదింట నాలుగు వంతులు వ్యవసాయ కూలీలు లేదా పేద రైతులు. వీరంతా అసంఘటిత కార్మికులు. ఈ ఆర్థిక దోపిడీకి తోడుగా నూతన ‘ఆర్థిక సంస్కరణల’ పేరు చాటున మహిళలపైన సాంస్కృతికం గానూ, సామాజికంగానూ దాడులు ముమ్మరం అయ్యాయి. సంస్కరణలు ప్రారంభమైన తరువాత అందాల పోటీల పేరిట మహిళల మధ్య ఒక రకమైన ఉన్మాద వాతావరణాన్ని ప్రేరేపిస్తున్నారు. ఈ ‘అందాల పోటీలు’ ఆధారంగా తమ సౌందర్యోపకరణ సరుకుల్ని విస్తృతంగా ప్రచారం చేసుకోవడానికి వీలు చిక్కింది. పట్టణాల్లోని మహిళల మనస్సులపైన, ముఖ్యంగా మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి యువతులపైన ఈ పోటీల ప్రభావం పడింది’’. దీంతో దేశ మంతటా బ్యూటీపార్లర్లు తామరతంపరగా వ్యాపించాయి. అందంగా ముఖాలు కనబడేలా చేసే ఫేసియల్ క్రీమ్స్ వచ్చాయి. అలా, మార్కెట్ ఎకా నమీ (సంత దోపిడీ) తత్వాన్నిబట్టి వ్యభిచార వృత్తిని కూడా ఒక ‘సేవా రంగం’గా పరిగణించే సంస్కృతిని పెంచేశారు. స్త్రీని విపణి సరకుగా మార్చే విష సంస్కృతి ఈ సంస్కరణల ప్రభావంతోనే కొన్ని దేశాల్లో విదేశీ మారక ద్రవ్య సంపాదన కోసం పర్యాటక పరిశ్రమలో భాగంగా ‘సెక్స్ టూరిజాన్ని’ ప్రవేశపెట్టారు. చివరికి పూర్వపు సోవియట్ యూనియన్, తూర్పు యూరప్ దేశాల్లో కూడా బ్యాంక్-ఐఎంఎఫ్ల సంస్థాగత మార్పుల పేరిట ఈ సెక్స్ టూరిజాన్ని ప్రవేశ పెట్టారు. అలాగే ఇండియాలో కూడా అవే సంస్కరణల పేరిట టూరిజం ద్వారా ఆదాయం సంపాదించేందుకు ప్రభుత్వాలు సిద్ధం అయిన కొద్దీ ఈ విష సంస్కృతి ప్రబలిపోయే అవకాశాలూ పెరిగాయని కూడా రజనీ దేశాయ్ వివరించారు. అలాగే ప్రపంచీకరణ జపం ఫలితంగా సౌందర్య పోషకాల (కాస్మెటిక్స్) పరిశ్రమ కూడా దూసుకు వచ్చింది. ఇందుకు కార్పొరేట్లు ప్రచార, ప్రసార మాధ్యమాలైన మీడియాను విస్తారంగా వాడుకోవడం ప్రారంభించారు. ఫలితంగా ఈ పరిశ్రమ పదేళ్ల వ్యవధిలోనే (1991-2000) రూ.2,311 కోట్ల వ్యాపారం నుంచి రూ. 18,900 కోట్లకు పెరిగిపోయింది. ఇక ‘మిస్ ఇండియా’ పోటీలూ పెరిగిపోయాయి. ఈ జాడ్యం కళాశాలల నుంచి ‘గల్లీల’కూ పాకిపోతూ వచ్చింది. ఈ పోటీలు స్త్రీల మధ్య వ్యత్యాస భావనను పనిగట్టుకుని మరీ పెంచేసిందని మరచిపోరాదు. అందుకే ఆనాడు గురజాడ స్త్రీల కన్నీటి గాథలకు కారణం నాకు తెలుసని అంటే, శ్రీశ్రీనే కాదు, ‘‘స్త్రీ స్త్రీ’’ని కూడా అన్నాడు. అలాగే ‘మనిషే బంగారమని’ వ్యత్యాస సంస్కృ తిని సాహిత్యపరంగా తుత్తునియలు చేసినవాడు మహాకవి రాబర్ట్ బర్న్స్. కానీ ప్రజా వ్యతిరేక ‘సంస్కరణ’లు దేశంలోనూ అంతర్జాతీయంగానూ ప్రవేశ పెట్టిన ఆంగ్లో-అమెరికన్ వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్లు మాత్రం ‘మహిళల్ని వ్యాపార వస్తువులు’గా పరిగణించే విష సంస్కృతికి తలుపులు తెరిచాయి. ఆ ఎంగిలిని మన పాలకులూ అభిమానించి, ఆదరించడం దుస్సహకారణమవు తోంది. బహుశా అందుకే వస్తుదాహ సంస్కృతిలో ఇంద్రజాల, మహేంద్ర జాల శక్తిని గుత్త పెట్టుబడిదారీ వ్యవస్థ శాశ్వత ప్రక్రియగా మార్చింది. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఏపీకి 'ప్రపంచ బ్యాంక్' 1వ ర్యాంక్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలోని ఆంధ్రప్రదేశ్ మరో ఘనత సాధించింది. ప్రపంచ బ్యాంకు ప్రకటించిన తాజా ర్యాంకుల్లో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇంధన పొదుపు అమలులో బాబు సర్కార్ అవలంభిస్తున్న చర్యలకుగానూ ఈ ర్యాంకు లభించింది. ఈ మేరకు ఏపీ ఇంధనపొదుపు సంస్థ సీఈవో చంద్రశేఖర్ రెడ్డి సంబంధిత వివరాలను శుక్రవారం మీడియాకు తెలిపారు. ఇంధనపొదుపు అమలులో ప్రపంచబ్యాంక్ ప్రకటించిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్కు మొదటి స్థానం లభించిదని, తర్వాత స్థానాల్లో వరుసగా రాజస్థాన్, కర్నాటక, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ ఉన్నాయని చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఓ అంతర్జాతీయ కార్యక్రమంలో ప్రపంచబ్యాంక్ ఎగ్జికూటివ్ డెరైక్టర్ సుభాష్చంద్ర గార్గ్ ఇంధన పొదుపుపై వరల్డ్బ్యాంక్ రూపొందించినర్యాంకుల నివేదికను ప్రకటించారని, 650 మెగావాట్ల ఇంధన పొదుపు వల్ల రాష్ట్రంలో గడిచిన రెండేళ్ళలో 1500 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయినట్టు గుర్తించారని, అందుకే ఏపీకి ఫస్ట్ ర్యాంక్ దక్కిందని ప్రకటనలో పేర్కొన్నారు. -
సత్తా చాటిన తెలుగు రాష్ట్రాలు
-
సరళ వ్యాపార సూచీలోభారత్కు 130వ స్థానం: ప్రపంచబ్యాంక్
వాష్టింగ్టన్: ఎటువంటి ఇబ్బందులూ లేకుండా దేశంలో వ్యాపార నిర్వహణ సరళత విషయంలో భారత్కు 130వ ర్యాంక్ లభించింది. గత ఏడాది ర్యాంకునే కొనసాగిస్తున్నట్లు ప్రపంచబ్యాంక్ వార్షిక నివేదిక తెలియజేసింది. అయితే గతంకంటే భారత్లో వ్యాపార నిర్వహణా పరిస్థితులు మెరుగుపడ్డాయని పేర్కొన్న నివేదిక, తీసుకుంటున్న ఆర్థిక సంస్కరణల చర్యలు, వృద్ధికి దోహదపడేవిగా రూపుదిద్దుకోవాల్సి ఉంటుందని వివరించింది. డిజిటలైజేషన్, విద్యుత్ సరఫరా, తయారీ రంగానికి మద్దతు వంటి అంశాలకు సంబంధించి దేశం గడచిన రెండేళ్లలో వేగవంతమైన సంస్కరణల చర్యలను ప్రారంభించిందని పేర్కొంది. ఎన్నికల అనంతరం ఏర్పడిన ప్రభుత్వం భారత్ వ్యాప్తంగా వ్యాపార నిర్వహణా పరిస్థితులు మార్చాల్సిన అవసరంపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని వివరించింది. వ్యాపారం ప్రారంభం, అనుమతులు, విద్యుత్, ప్రోపర్టీ రిజిస్ట్రేషన్, రుణ సౌలభ్యం, మైనారిటీ ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ, పన్ను చెల్లింపులు, విదేశీ వాణిజ్యం, సకాలంలో కాంట్రాక్టుల అమలు, దివాలా సమస్యల పరిష్కారం వంటి పది అంశాల ప్రాతిపదికన ప్రపంచబ్యాంక్ ర్యాంకింగ్ ఉంటుంది. కాగా ప్రపంచ బ్యాంక్ నివేదిక పట్ల కేంద్రం నిరుత్సాహాన్ని వ్యక్తం చేసింది. వచ్చే ఏడాది ర్యాంక్ మెరుగుపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. -
భూసమీకరణపై ప్రపంచ బ్యాంకు విచారణ!
స్వతంత్రంగా ‘ఆస్కి’ ద్వారా వివరాలు సేకరిస్తున్న వైనం సాక్షి, అమరావతి: రాజధానికి ప్రపంచ బ్యాంకు రుణం ఇచ్చేస్తుందని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో.. అందుకు విరుద్ధంగా దాని తరఫున ఆస్కి(అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి) అక్కడి గ్రామాల్లో విచారణ చేస్తుండడం హాట్ టాపిక్గా మారింది. ఇది ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు. దీంతో విచారణ నిర్వహిస్తున్న వారిపై సీఆర్డీఏ అధికారులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఫలితంగా ఆస్కి బృందం ఆదివారం తమ రూటు మార్చుకుని ముందుగా నిర్ణయించిన గ్రామాలకు వెళ్లలేదు. ప్రపంచ బ్యాంకుకూ వాస్తవాలు తెలియకుండా ప్రభుత్వం మభ్య పెడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజధానిలో చేపట్టే ప్రాజెక్టులకు రూ.6 వేల కోట్ల రుణమివ్వాలని ఆరు నెలల కిందట సీఆర్డీఏ ప్రపంచ బ్యాంకుకు దరఖాస్తు చేసుకుంది. దీనిపై బ్యాంకు ప్రతినిధులు రెండుసార్లు విజయవాడకు వచ్చి సీఆర్డీఏ ఉన్నతాధికారులతో చర్చించి రుణమిచ్చేందుకు ప్రాథమికంగా అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ బ్యాంకు తరఫున రెండురోజుల నుంచి ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఆస్కికి చెందిన ప్రొఫెసర్ రేష్మి నాయర్, డాక్టర్ లక్ష్మిలు రాజధాని గ్రామాల్లో తిరుగుతూ భూసమీకరణపై వివరాలు సేకరిస్తున్నారు. -
రెమిటెన్స్ లు తగ్గుతాయ్
ప్రపంచ బ్యాంక్ అంచనా వాషింగ్టన్: భారత్కు వచ్చే రెమిటెన్స్లు ఈ ఏడాది తగ్గుతాయని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. తక్కువ ముడిచమురు ధరలు సహా ఇండియాకు ఎక్కడి నుంచైతే రెమిటెన్స్ అధికంగా వస్తున్నాయో ఆయా ప్రాంతాల్లోని బలహీనమైన ఆర్థిక వృద్ధే రెమిటెన్స్ల తగ్గుదలకు ప్రధాన కారణంగా నిలుస్తుందని పేర్కొంది. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం.. ⇔ ఈ ఏడాది భారత్కు వచ్చే రెమిటెన్స్లు 5 శాతం క్షీణతతో 65.5 బిలియన్ డాలర్లకు పరిమితం అవుతాయి. ⇔ రెమిటెన్స్లు స్వల్పంగా తగ్గినప్పటికీ ప్రపంచంలో రెమిటెన్స్లు స్వీకరణలో భారత్ టాప్లోనే కొనసాగుతుంది. ⇔ ఇండియా తర్వాతి స్థానంలో 65.2 బిలియన్ డాలర్ల రెమిటెన్స్ల స్వీకరణతో చైనా రెండో స్థానంలో ఉంటుంది. ⇔ 20.3 బిలియన్ డాలర్ల రెమిటెన్స్ల స్వీకరణతో పాకిస్తాన్ ఐదో స్థానంలో నిలువొచ్చు. ⇔ బంగ్లాదేశ్కు వచ్చే రెమిటెన్స్ల్లోనూ 3.5 శాతం క్షీణత నమోదు కావొచ్చు. ⇔ పాకిస్తాన్, శ్రీలంక దేశాలకు వచ్చే రెమిటెన్స్లు వరుసగా 5.1 శాతం, 1.6 శాతం మేర పెరగొచ్చు. -
ఫార్ములాని మించి నిధులు ఇవ్వడానికి సిద్ధం
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వాషింగ్టన్: వినూత్నమైన ఆర్థిక సొల్యూషన్లను అందించడానికి ప్రపంచ బ్యాంక్ తన సభ్య దేశాలతో కలసి పనిచేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పిలుపునిచ్చారు. భారత వృద్ధి సాధనలో సాధించిన ఎన్నో చెప్పుకోదగ్గ ఘన విజయాలకు ప్రపంచబ్యాంక్ తగిన తోడ్పాటునందించిందని ఆయన పేర్కొన్నారు. మూలధనం పెంపు కోసం అనుసరిస్తున్న డైనమిక్ ఫార్ములా(జీడీపీ ఆధారిత, అభివృద్ధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని)కు మించి నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్తో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా భారత్కు, ప్రపంచ బ్యాంక్కు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్)ల వార్షిక సమావేశాల్లో పాల్గొనడానికి ఆయన కెనడా నుంచి వాషింగ్టన్కు వచ్చారు. -
ఆటోమేషన్తో ఉద్యోగాలకు ఎసరు
భారత్లో 69 శాతంగా ఉంటుంది: ప్రపంచ బ్యాంకు వాషింగ్టన్: ఆటోమేషన్తో భారత్లో 69 శాతం ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. ఇది చైనాలో 77 శాతంగా ఉంటుందని తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సంప్రదాయ ఆర్థిక విధానాలను టెక్నాలజీ పూర్తిగా మార్చేస్తుందని పేర్కొంది. వృద్ధిని పెంచుకునేందుకు మౌలిక రంగంలో మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహించాలని సూచించింది. అయితే, భవిష్యత్తు ఆర్థిక విధానాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి మౌలిక సదుపాయాలు అవసరమో ఆలోచన చేయాల్సి ఉందని పేర్కొంది. ‘ప్రపంచాన్ని టెక్నాలజీ సమూలంగా మార్చేస్తుందనే విషయం మనకు తెలిసిందే. అయితే, సంప్రదాయ ఆర్థిక విధానమైన వ్యవసాయం, తక్కువ స్థాయిలో తయారీ రంగం నుంచి పూర్తి స్థాయి పారిశ్రామిక దేశంగా మారిపోవడం అన్నది అన్ని వర్ధమాన దేశాలకు సాధ్యమయ్యేది కాదు’ అని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్కిన్ అన్నారు. వాషింగ్టన్లోని బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్లో పేదరికంపై జరిగిన చర్చా కార్యక్రమం సందర్భంగా జిమ్కిన్ ఈ అంశాలను వెల్లడించారు. కిమ్ ఏం చెప్పారంటే... ప్రపంచ బ్యాంకు పరిశోధన ప్రకారం ఆటోమేషన్ (మనుషులు చేసే పనిని యంత్రాలతో చేయించుకోవడం) వల్ల భారత్లో 69 శాతం, చైనాలో 77 శాతం, ఇథియోపియాలో 85 శాతం ఉద్యోగాలకు ముప్పు ఉంది. ఇదే గనుక వాస్తవ రూపం దాలిస్తే ఈ దేశాలు అధిక సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోతాయి. ఈ దృష్ట్యా ఆర్థికాభివృద్ధికి అందుబాటులో ఉన్న మార్గాలను అర్థం చేసుకుని అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలి. యాంత్రీకరణ, టెక్నాలజీలు సంప్రదాయ పారిశ్రామిక తయారీని దెబ్బతీశాయి. దీంతో మాన్యువల్ ఉద్యోగాలపై ప్రభావం పడింది. దీనికి ఏ దేశం కూడా అతీతం కాదు. భారత్లో చైల్డ్ స్టంటింగ్ (చిన్నారుల్లో ఎదుగుదల లోపం) 38.7 శాతంగా ఉంది. వీరంతా భవిష్యత్తు తరానికి ప్రతీకలు. వారిలో 40 శాతం మంది ప్రపంచ డిజిటల్ ఆర్థిక రంగంలో పోటీ పడలేకున్నారు. పక్కనే ఉన్న చైనా మాత్రం చైల్డ్ స్టంటింగ్ను చాలా కనిష్ట స్థాయికి తగ్గించిందని కిమ్ పేర్కొన్నారు. -
భారత జీడీపీ ఇకముందు బలంగానే
• ఈ ఏడాది 7.6%.. వచ్చే ఏడాది 7.7% • ప్రపంచ బ్యాంకు అంచనా వాషింగ్టన్: భారత జీడీపీ ఇక ముందూ జోరుగానే ఉంటుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. 2016లో 7.6 శాతం, 2017లో 7.7 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. వ్యవసాయ రంగం పుంజుకోవడం, ఉద్యోగుల వేతన సవరణలు వినియోగానికి ఊతమిస్తాయని... ఎగుమతుల నుంచి సానుకూల తోడ్పాటుతో పాటు ప్రైవేటు పెట్టుబడులు మధ్య కాలానికి కోలుకోవడం వంటివి వృద్ధికి మద్దతునిస్తాయని తెలియజేసింది. ఈ మేరకు దక్షిణాసియా ఆర్థిక రంగంపై ప్రపంచ బ్యాంకు తాజాగా ద్వైవార్షిక నివేదికను విడుదల చేసింది. భారత్లో పేదరికాన్ని వేగంగా తగ్గించటం, అన్ని వర్గాలనూ వృద్ధిలో భాగస్వాముల్ని చేయడం వంటి అనేక సవాళ్లున్నాయని బ్యాంకు తన నివేదికలో ప్రస్తావించింది. దక్షిణాసియా ప్రాంతం ప్రపంచ అభివృద్ధి కేంద్రంగానే కొనసాగుతుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. చైనా మందగమనం, ఉద్దీపనలపై అనిశ్చితి తదితర వెలుపలి ఒత్తిళ్లలను సైతం తట్టుకుని నిలబడిందని పేర్కొంది. స్వల్ప కాలంలో సమస్యలు స్వల్ప కాలంలో వృద్ధి రేటును మందగింపజేసే సమస్యలను కూడా నివేదిక ప్రస్తావించింది. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి నెలకొనడం, కమోడిటీ ధరల ఒడిదుడుకులు, ప్రపంచ వాణిజ్యంపై బ్రెగ్జిట్ ప్రభావం, చైనా ఆర్థిక రంగం మరింత నిదానించడం వంటివి ఆర్థిక రంగం కోలుకోవడాన్ని మరింత ఆలస్యం చేస్తాయని ప్రపంచ బ్యాంకు తెలిపింది. రెండేళ్లు ఇదే స్థాయిలో: ఐఎంఎఫ్ భారత్ జీడీపీ విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మరింత సానుకూలతను వ్యక్తం చేసింది. గత అంచనాలను పెంచింది. భారత జీడీపీ వృద్ధి వేగంగా పెరుగుతోందని, 2016, 2017 సంవత్సరాల్లో 7.6 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ తెలిపింది. ఐఎంఎఫ్ ఈ ఏడాది జూలైలో ప్రకటించిన వృద్ధి రేటు అంచనాల కంటే తాజా అంచనాలు 0.2 బేసిస్ పాయింట్లు ఎక్కువ కావడం గమనార్హం. -
పాకిస్థాన్ కుటిలత్వం
న్యూఢిల్లీ: భారత్ చేతిలో చావు దెబ్బలు తింటున్నా పాకిస్థాన్కు వంకర బుద్ధి మారడంలేదు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ను దోషిగా చూపాలని కుతంత్రాలు పన్నుతూనే ఉంది. జమ్మూ కశ్మీర్లోని జీలం నది బేసిన్లో భారత్ నిర్మిస్తున్న కిషన్గంగ జలవిద్యుత్ కేంద్రంపై అభ్యంతరాలు ఉన్నాయని, తమ అభ్యంతరాలు వినడానికి మధ్యవర్తిత్వ కోర్టును ఏర్పాటు చేయాలని ప్రాజెక్టు రుణదాత అయిన ప్రపంచ బ్యాంకును ఇటీవల కోరింది. సింధు జలాల ఒప్పందానికి వ్యతిరేకంగా భారత్ ఈ ప్రాజెక్టు నిర్మిస్తోందని ఫిర్యాదు చేసింది. దీనిపై భారత్ స్పందిస్తూ.. ఒప్పందం ప్రకారమే ఈ 360 మెగావాట్ల సామర్థ్యమున్న ప్రాజెక్టును నిర్మిస్తున్నామని, ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక విషయాలు ఉన్నందున వివాదాల పరిష్కారానికి తటస్థ నిపుణుడిని నియమించాలని ప్రపంచ బ్యాంకును కోరింది. ఇరు దేశాలు తమ తమ అభ్యంతరాలను, వివరాలను గతనెల 27న వాషింగ్టన్లోని ప్రపంచ బ్యాంకుకు సమర్పించాయని భారత అధికార వర్గాలు తెలిపాయి. న్యాయనిపుణుడి కన్నా ఇంజనీరింగ్ నిపుణుడైతే విషయాలు బాగా అర్థం చేసుకోగలడని ఆ వర్గాలు తెలిపాయి. నీటి ప్రవాహాన్ని అడ్డుకునేలా ప్రాజెక్టు డిజైన్ ఉందని పాకిస్తాన్ ఫిర్యాదు చేయగా.. భారత్ దానిని పూర్తిగా ఖండించింది. ఈ ప్రాజెక్టుపై 2010లో అంతర్జాతీయ న్యాయస్థానంలో కూడా పాక్ ఫిర్యాదు చేసింది. 2013లో భారత్కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ప్రస్తుతం యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో భారత్పై తన అక్కసును వెళ్లగక్కడానికి పాకిస్థాన్ ప్రపంచ బ్యాంకును ఆశ్రయించింది. పాక్ ఫిర్యాదు చేసినా పనులు ఆగవని భారత వర్గాలు తెలిపాయి. -
‘సింధు’ సంధికి గండి?
1960లో అమెరికాయే సింధు నదీజలాల పంపిణీ ఒప్పందంలో ప్రపంచ బ్యాంకు ద్వారా మధ్యవర్తిత్వం నెరపింది. అదే అమెరికా ఇప్పుడు భూభాగాలు, అంతర్జాతీయ జలాల సమస్యలను(సింధు జలాల పంపిణీ) మీరూ మీరూ పరిష్కరించుకోవాలని నంగనాచిలా కోరుతున్నది. ఇంకా కశ్మీర్ సమస్య మీద మధ్యవర్తిత్వాలు నిర్వహించి వివాదం చల్లారి పోకుండా కూడా జాగ్రత్త పడింది. ప్రధాని మోదీ నీరు, నెత్తురు కలసి ప్రవహించలేవని చెబుతున్నారు. కానీ ఉపఖండ వాసులంతా రక్తసంబంధీకులేనని మరచిపోరాదు. ‘పగ సాధింపు చర్యలు కట్టిపెడితే నిన్నటి శత్రువు నేడు మిత్రుడవుతాడు’ మహాత్మా గాంధీ ‘చూడబోతే ఇండియా, పాకిస్తాన్లు యుద్ధ మనస్తత్వంతో ముందుకు సాగుతున్నట్టుంది. ఈ సన్నద్ధత యుద్ధాన్ని ఎదుర్కొనడానికి జరిపే సన్నద్ధత అన్న భావంతో కాదు. అలా అని ఒకవేళ యుద్ధమే వస్తే సిద్ధంగా ఉన్నామన్న భావనతోనూ కాదు. కానీ నిజంగా మన రెండు దేశాలు యుద్ధాన్ని కోరుకుంటున్నాయా అన్నట్టుగా యుద్ధ మనస్తత్వం ఏదో ఆవహించినట్టు తోస్తోంది. ఈ సందర్భంగా రష్యన్ మహా రచయిత లియో టాల్స్టాయ్ మాటలని మనం రాజ్యాంగం పంచుకుంటోంది. ఆయన ప్రసిద్ధ రచన ‘యుద్ధము- శాంతి’. మన రాజ్యాంగంలోని యూనియన్ బాధ్యతలను నిర్దేశించే ‘ఎంట్రీ-15’ అనే అంశం ఉంది. దీనర్థం- కేవలం యూనియన్ ప్రభుత్వమే యుద్ధాన్ని ఎప్పుడు ప్రకటించాలో, శాంతిని తిరిగి ఎప్పుడు నెలకొల్పాలో నిర్ణయించే శక్తి అని’. గోపాలకృష్ణ గాంధీ (బెంగాల్ మాజీ గవర్నర్, చరిత్రకారుడు) ఈ హెచ్చరిక చేస్తూనే గోపాలకృష్ణ గాంధీ యూనియన్ జాబితాలో ‘యుద్ధము-శాంతి’ అనేది ఒక ఎంట్రీగా నమోదై ఉండవచ్చుగానీ; మనం మరొక యుద్ధాన్ని కూడా ఎదుర్కొనవలసిన అవసరం ఉందనీ- అదే యుద్ధ పిపాసకూ, యుద్ధాన్ని ప్రేరేపించే మనస్తత్వానికీ కూడా వ్యతిరేకంగా పోరాడవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఈ యుద్ధ పిపాస వల్ల ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకే కాకుండా, చాలా ఇతర అంశాలకు గండిపడింది. ఉపఖండ విభజన ఫలితంగా వేర్వేరు దేశాలుగా అవతరించిన ఈ రెండు భూభాగాల మధ్య సాధారణ సంబంధాలకూ, వాణిజ్య సంబంధాలకూ ఆరు దశాబ్దాలుగా పడిన అగాధం పూడే అవకాశం రావడం లేదు. ఈ విష పరిణామం ఎక్కడికి దారితీసింది? సాగుకూ, తాగేందుకూ అందవలసిన నదీజలాల పంపిణీని స్తంభింప చేసే స్థితికి తీసుకువెళుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణీ ఎలా ఛిన్నాభిన్నమైందో భారత్, పాక్ల మధ్య కూడా సింధు నదీజలాల పంపిణీ వ్యవస్థ ప్రమాదంలో పడింది. ఆంగ్లో- అమెరికన్ కుట్ర దేశ విభజన ఫలితం మన రెండు దేశాలకే కాదు, నిజానికి ఉపఖండానికే కాదు, ఆసియా ఖండానికే ప్రమాదకరంగా పరిణమించింది. ఈ పరిణామానికి కేంద్ర బిందువు కశ్మీర్ సమస్య అని అంతా గ్రహించాలి. సింధు నదీజలాల పంపిణీ మీద రెండు దేశాల మధ్య 1960లో కుదిరిన ఒప్పందాన్ని అమలు పరచడం ఉభయ దేశాల ప్రజా బాహుళ్యాల విశాల ప్రయోజనాలకు ఎంతో ప్రధానమని గుర్తించాలి. దేశాల మధ్య కుమ్ములాటలకు, ప్రాబల్యం కోసం ఏర్పడే స్పర్థలకు అతీతంగా ఈ అంశాన్ని గుర్తించాలి. కశ్మీర్ సమస్య రావణకాష్టంలా మండుతూ ఇప్పటికీ చల్లారకుండా ఉండడానికి దారితీసిన కారణాలలో ఒకటి- ఇరు దేశాల పాలకులను స్వతంత్రశక్తులుగా ఎదగకుండా, వారు తమ చేతులు దాటిపోకుండా నొక్కి ఉంచడంలో ఆంగ్లో-అమెరికన్ సామ్రాజ్యవాదశక్తుల ఎత్తుగడలు చాలావరకు సఫలం కావడమే. ఇంకా చెప్పాలంటే, విభజనకు బీజాలు వేయడం, తద్వారా భారత్, పాక్ల మీద తమ పట్టు సడలకుండా ఆంగ్లో-అమెరికన్లు పన్నిన వ్యూహ రచనలో భాగమే కశ్మీర్ సమస్య. సెప్టెంబర్ 11, 2001న అమెరికాలోని ట్విన్ టవర్స్ మీద జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం అమెరికా పన్నిన వ్యూహంలో ‘గుర్తు తెలియని ఉగ్రవాదుల’ వేట (ఈ విషయం మీద ఈ రోజుకీ అమెరికాలో భిన్నస్వరాలు ఉన్నాయి)లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఆరంభించిన ఉద్యమంలో ఏ దేశం, ఏ పాలకుడు భాగస్వాములు కాకుండా మిగిలారో వారిని కూడా టైస్టులుగా పరిగణిస్తామని అమెరికా పరంపరగా ప్రకటనలు జారీ చేసింది. ఆ మిష మీదే అఫ్గానిస్తాన్, ఇరాక్ల మీద భీకరమైన మెరుపుదాడులు చేసి, లక్షల సంఖ్యలో సాధారణ ప్రజలను చంపిన వైనాన్ని ప్రపంచం వీక్షించింది. ఆ తరువాత ఆ రెండు దేశాలను అమెరికా తన స్థావరాలుగా మార్చుకుంది. మొదట సైనిక శిబిరాలతో నింపేసింది. వీటిని మొదట తొలగిస్తానని ముహూర్తం పెట్టి, తరువాత సాధ్యం కాదని మొండికేసింది. కాబట్టి కశ్మీర్లో అమెరికా అడుగుపెట్టడానికి కూతవేటు దూరమే మిగిలింది. అసలు కశ్మీర్ సమస్యను ఐక్యరాజ్య సమితి ఆవరణలోకి ఈడ్చుకువెళ్లినవాళ్లు భారత్-పాక్ నేతలే. అక్కడ నుంచి ఉపసంహరించుకోవడానికి రెండుదేశాలు జరిపిన యత్నాలు అత్యంత పేలవమైనవి. ఇవి జగమెరిగిన సత్యాలు. కానీ, సమితి పరిధి నుంచి ఫిర్యాదులు ఉపసంహరించుకునే దాకా భారత్, పాక్ సంబంధాలు కశ్మీర్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయన్న సంగతి విస్మరించరాదు. ఇక మన రెండుదేశాల పాలనా వ్యవస్థలకు ఆయుధ వ్యాపారులుగా మారిన ఆంగ్లో-అమెరికన్లు, రష్యన్లు, చైనీయులు భారీ స్థాయిలో అటూ ఇటూ ఆయుధాలు అందిస్తూనే ఉంటారు. ఆసియా దేశాల మధ్య మైత్రీ సంబంధాలు చెడగొట్టే తీరులోనే ఆయుధ వ్యాపారులు వ్యవహరిస్తారు. మన బంగారం మంచిదైతే అన్న సామెత చందంగా నెపాన్ని ఎదుటివారి మీద నెట్టడం అసాధ్యం. విదేశీ పెట్టుబడులపైన, విదేశీ ఆయుధ సంపత్తిపైన ఆధారపడి ఉన్నంతకాలం ఈ బెడద తప్పదు. సింధు జలాల ఒప్పందం-నేపథ్యం 1960లో అమెరికాయే సింధు నదీజలాల పంపిణీ ఒప్పందంలో ప్రపంచ బ్యాంకు ద్వారా మధ్యవర్తిత్వం నెరపింది. అదే అమెరికా ఇప్పుడు భూభాగాలు, అంతర్జాతీయ జలాల సమస్యలను(సింధు జలాల పంపిణీ) మీరూ మీరూ పరిష్కరించుకోవాలని నంగనాచిలా కోరుతున్నది. ఈ అమెరికాయే కశ్మీర్ సమస్య మీద మధ్యవర్తిత్వాలు నిర్వహించి వివాదం చల్లారిపోకుండా నిన్న, నేడు కూడా జాగ్రత్త పడింది. ప్రథమ ప్రధాని నెహ్రూ, నాటి పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ఇరువురూ సామరస్య ధోరణితోనే నాడు సింధు నదీజాలాల పంపిణీ సంధి మీద సంతకాలు చేశారు. కానీ ఇరుదేశాల సరిహద్దులు శాశ్వత ప్రాతిపదికన ఖరారు కాకుండా ‘వాస్తవాధీన సరిహద్దు’గా మాత్రమే మిగిలి ఉన్నంతకాలం పరస్పర ఉల్లంఘనలూ, ఉద్రేకాలూ సమసిపోవని రుజువు చేస్తూ తాజాగా సింధు నదీజలాల పంపిణీ వ్యవస్థ మీద ఉద్రేకాలు, ఉగ్రవాదాలు ప్రబలుతున్నాయి. ఉభయత్రా పెరిగిన ఈ ఉద్రిక్తతలు ఉభయ దేశాల ప్రజలకూ, శాంతికీ కూడా విఘాతమే. కాబట్టి కశ్మీర్ సమస్య మూలంగా ఏర్పడిన అస్పష్ట సరిహద్దులు, తాత్కాలిక వాస్తవాధీన రేఖ చెరిగిపోయి సామరస్య పూర్వకంగా శాశ్వత పరిష్కారం కుదిరేదాకా 57 ఏళ్లుగా ఉన్న సింధు నదీజాలాల పంపిణీ ఒప్పందానికి పాలకులు తూట్లు పొడవడం సరికాదు. ప్రజలకు అన్యాయం చేయడం మంచిదికాదు. నీరూ, నెత్తురూ... బియాస్, సట్లెజ్, సింధు, జీలం, చీనాబ్ నదులతో కూడిన సింధు నదీజల వ్యవస్థను రెండు దేశాల మధ్య సహృద్భావం దృష్ట్యా పరస్పర ప్రయోజనాలు దెబ్బతినకుండా గరిష్ట స్థాయిలో వాడుకోవాలని ఒప్పందం ఆదేశించింది. ఏదో వియన్నా కన్వెన్షన్ 64వ అధికరణ ప్రకారం అంతర్జాతీయ ఒప్పందాల నుంచి ఏ దేశమైనా ఉపసంహరించుకోవచ్చునని, భట్టిప్రోలు పంచాయతీ లాంటి అవకాశం ఉందని చెప్పి ఉభయ దేశాల పాలకులు తలచరాదు. సింధు వ్యవస్థలో తూర్పున ఉన్న నదులను మనమూ, పశ్చిమాన ఉన్న నదీజలాల వ్యవస్థను పాకిస్తాన్ పూర్తిగా వినియోగించుకోవచ్చునని సింధు సంధి చెప్పింది. మనదేశం వాడుకోగలిగిన 20 శాతం వాటాను సాగు,తాగు, రవాణా, విద్యుదుత్పాదన ప్రయోజనాలకు వినియోగించుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఆ వాటాలో మనం వినియోగించుకుంటున్నది నాలుగు శాతమే. రావి, బియాస్, సట్లెజ్ వాటి ఉపనదులు కలసి తూర్పు నదులుగానూ, సింధు, జీలం, చీనాబ్ వాటి ఉప నదులు కలిపి పశ్చిమ నదులుగానూ ఏర్పడగా 1960 నాటి ఒప్పందం కింద తూర్పు నదుల నీటి వనరులను మనం పూర్తిగా వాడుకోవచ్చు. సగటున ఏడాదికి ఈ తూర్పు నదులలో 3 కోట్ల, 30 లక్షల ఎకరా అడుగుల నీరు (అమెరికా కొలమానాల ప్రకారం 3,26,000 గ్యాలెన్ల నీటిని ఒక ఎకరా అడుగు నీరుగా లెక్కిస్తారు) ప్రవహిస్తుంది. పశ్చిమ నదులలో సగటున ఏడాదికి 13 కోట్ల 50 లక్షల ఎకరా అడుగుల జలరాశి ప్రవహిస్తూ ఉంటుంది. మన దేశంలో ఈ పశ్చిమ నదులలో నిల్వ ఉంచదగినంత జలరాశి లేదు. కాబట్టి పారే నీటిని ఆపలేకపోతున్నామని నిపుణుల అంచనా. ఇక నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులు ఇలా ఉన్నాయి: మరుసాదర్ (చీనాబ్కు ఉపనది, కిస్త్నార్ జిల్లా), ఉదమ్పూర్లో జీలం నది మీద సవాల్కోట, చీనాబ్ మీద బుర్స్వార్ డ్యామ్లు, జల విద్యుదుత్పత్తి కోసం డ్యాములు. వీటిని మనం నిర్మించుకోగలిగితే నీటిని అవసరాలకు నిల్వ చేసుకోగలుగుతామని నిపుణులు చెబుతున్నారు. పశ్చిమ నదుల జలవిద్యుత్ ఉత్పాదన శక్తి 18,653 మెగావాట్లట. మనం జీలం నది మీద తుల్బుల్ బ్యారేజీ, కిషన్గంగ మీద జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మించడానికి ప్రయత్నిస్తే పాక్కు అభ్యంతరం. ఇలా చిన్న చిన్న విభేదాలు మినహా 56 ఏళ్లుగా సింధు నదీజలాల పంపిణీ సంధి ప్రకారం శాంతియుతంగా సాగుతూ ఉంటే ఇప్పుడు రాజకీయులు వేలుపెట్టి చెడగొట్టే కుట్రను ప్రజలు సహించరాదు. ప్రధాని నరేంద్రమోదీ ఒక పక్క భవిష్యత్తులో జరిగేవి నీటి యుద్ధాలే అంటూ, నీరు, నెత్తురు కలసి ప్రవహించలేవని కూడా చెబుతున్నారు. కానీ ఉపఖండ వాసులంతా రక్తసంబంధీకులేనని మరచిపోరాదు. - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ప్రపంచబ్యాంకును ఆశ్రయించిన పాక్
-
ప్రపంచబ్యాంకును ఆశ్రయించిన పాక్
సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారతదేశం రద్దు చేస్తుందని కథనాలు వస్తున్న నేపథ్యంలో.. పాకిస్థాన్ ప్రపంచ బ్యాంకును ఆశ్రయించింది. ఎలాగోలా భారతదేశాన్ని ఈ ఒప్పందం రద్దు చేసుకోనివ్వకుండా చూడాలని కోరింది. పాకిస్థాన్ అటార్నీ జనరల్ అష్తర్ ఔసఫ్ అలీ నేతృత్వంలో కొందరు సీనియర్ అధికారులు కలిసి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని ప్రపంచబ్యాంకు ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అంతర్జాతీయ కోర్టుకు కూడా పాకిస్థాన్ వెళ్లినట్లు జియో న్యూస్ వెల్లడించినా.. దానికి సంబంధించిన వివరాలేవీ బయటకు రాలేదు. నీలం, చీనాబ్ నదులపై భారతదేశం కడుతున్న కిషన్గంగ, రాటిల్ జలవిద్యుత్ ప్రాజెక్టుల గురించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పాకిస్థాన్ ఆగస్టు 19వ తేదీన ఒక లేఖ రాసింది. అంతర్జాతీయ కోర్టులో ప్రపంచ బ్యాంకుకు కూడా ప్రధాన పాత్ర ఉంది. ముగ్గురు జడ్జీలను ప్రపంచబ్యాంకు నియమించుకోవచ్చు. ప్రతి దేశం ఇద్దరు ఆర్బిట్రేటర్లను నియమించుకునే అవకాశం ఉంది. జడ్జీలను త్వరగా నియమిస్తే.. సింధు నదీ జలాల ఒప్పందాన్ని త్వరగా ఆ కోర్టు దృష్టికి తీసుకెళ్తామని ప్రపంచ బ్యాంకు అధికారులకు పాక్ అధికారులు చెప్పినట్లు తెలిసింది. అయితే.. తగిన సమయంలోనే తాము చేయాల్సిన పని చేస్తామని ప్రపంచబ్యాంకు చెప్పినట్లు సమాచారం. అయితే.. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తుండటంతో.. సాధారణంగా జరగాల్సిన వ్యవహారాలన్నీ ఆలస్యం అవుతున్నాయని భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సల్మాన్ హైదర్ చెప్పారు. ఉడీలో జరిగినది చాలా పెద్ద ద్రోహమని, కనీసం ఆ ఘటనను పాకిస్థాన్ ఖండించలేదని ఆయన అన్నారు. అలాంటిది మన కట్టడాలపై వాళ్లు ఇష్టం వచ్చినట్లు కోర్టుకు వెళ్లినంత మాత్రాన ప్రయోజనం ఉండదని చెప్పారు. -
జిమ్ యాంగ్ కిమ్ కే మళ్లీ పట్టం
వాషింగ్టన్: ప్రపంచ బ్యాంకు అధ్యక్షునిగా జిమ్ యాంగ్ కిమ్(56) తిరిగి నియమితులయ్యారు. కిమ్ ను ఏకగ్రీవంగా నియమిస్తున్నట్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ బోర్డు తెలిపింది. కొరియన్ అమెరికన్ అయిన కిమ్ 2012 లో అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2017 జులైతో ముగియనుంది. తనను రెండోసారి ఎన్నకున్నందుకు కిమ్ ధన్యవాదాలు తెలిపారు. -
అమరావతికి రూ. 3,324 కోట్ల రుణం!
-
అమరావతికి రూ. 3,324 కోట్ల రుణం!
ప్రాజెక్టు లక్ష్యాలకు ప్రపంచ బ్యాంకు ఆమోదం సాక్షి, హైదరాబాద్: అమరావతిలో 65 కిలోమీటర్ల మేర సబ్ ఆర్టీరియల్ రోడ్ల నిర్మాణం, వరద నియంత్రణ పనులు, నేలపాడు గ్రామంలో మౌలిక వసతుల స్థాయి పెంపునకు ప్రపంచబ్యాంకు రూ. 3,324 కోట్ల రుణం మంజూరు చేయనుంది. ఈ మేరకు ప్రాజెక్టు లక్ష్యాలకు ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపింది. మరో రూ. 1,425 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాగా సమకూర్చుకొని మొత్తం రూ. 4,749 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును చేపట్టనుంది. వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రపంచ బ్యాంకు నిధులను మంజూరు చేయనుంది. ప్రాజెక్టు కాలవ్యవధిని 2019గా నిర్ధారించారు. -
అమరావతికి వరల్డ్ బ్యాంకు అప్పు
హైదరాబాద్: ఏపీ నూతన రాజధాని అమరావతికి ప్రపంచబ్యాంకు రూ.3,324 కోట్ల రుణం మంజూరు చేయనుంది. అమరావతిలో రహదారులు, వరద నియంత్రణ, నేలపాడు గ్రామంలో వసతుల కోసం ప్రపంచబ్యాంకు రూ.3,324 కోట్ల రుణం ఇవ్వనుంది. ప్రాజెక్టు లక్ష్యాలకు ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపింది. 65 కిలోమీటర్ల మేర సబ్-ఆర్టీరియల్ రోడ్ల నిర్మాణం, వరద నియంత్రణ పనులు, నేలపాడు గ్రామంలో మౌలిక వసతుల స్థాయి పెంపునకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో కలిపి మొత్తం రూ.4,749 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. ఇందులో ప్రపంచ బ్యాంకు రూ.3,324 కోట్లను రుణంగా సమకూర్చుతుంది. మిగతా 1,425 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. వచ్చే ఏడాది మార్చి నుంచి నిధులను ప్రపంచ బ్యాంకు మంజూరు చేయనుంది. ప్రాజెక్టును 2019 కల్లా పూర్తిచేయాలని నిర్ధారించారు. ప్రపంచ బ్యాంకు రుణానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం ఆమోదం కూడా తెలిపింది. ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు కేంద్రానికి, అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను బడ్జెట్లో కేటాయించనున్నారు. అక్కడి నుంచి సీఆర్డీఏకు విడుదల చేస్తారు. సీఆర్డీఏ ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా వ్యక్తిగత ఖాతాలో ఆ నిధులను ఉంచుతుంది. ఆ ఖాతా నుంచి కన్సల్టెంట్లు, సిబ్బంది జీత భత్యాలకు అవసరమైన నిధులను విడుదల చేయనున్నారు. -
ఈ చిన్న లాజిక్ కూడా మరిచారా...బాబుగారూ
ప్రత్యేక హోదా వస్తే అప్పుల్లో 90 శాతం కేంద్రమే భరిస్తుంది ఇందులో రూ.26,253 కోట్లు విదేశీ సంస్థల నుంచి రుణం ప్రత్యేక హోదా ఇస్తే–ఇందులో 90 శాతం కేంద్రమే భరిస్తుంది అంటే 23,628.33 కోట్లు కేంద్రం భరిస్తుంది–రాష్ట్రం కేవలం రూ.2623.37 కోట్లే భరిస్తే చాలు రూ.11,525 కోట్లు రాష్ట్ర సర్కారు వాటా కేంద్రం వద్ద పెండింగ్లో 13 విదేశీ అప్పు ప్రాజెక్టులు హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం భారీ ఎత్తున విదేశీ ఆర్థిక సంస్థల నుంచి అప్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 13 ప్రాజెక్టులను రూపొందించింది. ప్రపంచ బ్యాంకుతో పాటు జైకా, తదితర విదేశీ ఆర్థిక సంస్థల నుంచి 37,778.80 కోట్ల రూపాయల విలువగల ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులన్నింటినీ కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. ఇందులో విదేశీ సంస్థల నుంచి 26,253.71 కోట్ల రూపాయలు అప్పు చేయాలని నిర్ణయించింది. ప్రత్యేక హోదా సాధించిన పక్షంలో ఈ అప్పులో కేంద్ర ప్రభుత్వం 90 శాతం భరిస్తుంది. రాష్ట్ర సర్కారు పది శాతం భరిస్తే సరిపోతుంది. 26,253.71 కోట్ల రూపాయల అప్పుల్లో కేంద్ర ప్రభుత్వం 23,628.33 కోట్ల రూపాయలు భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.2623.37 కోట్లు భరిస్తే సరిపోతుంది. ఐదేళ్ల పాటు అమలయ్యే ఈ విదేశీ ప్రాజెక్టులకు ప్రత్యేక హోదా వర్తింప చేస్తే రాష్ట్రంలో పలు మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి మార్గం సుగమం అవుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులన్నీ కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పెండింగ్లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులను కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధ్యయనం చేసిన తరువాత, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ఆధారంగాను, అలాగే వ్యయం చేసే సామర్ధ్యం ఆధారంగా ఆమోదం తెలుపుతుందని అధికార వర్గాలు తెలిపాయి. వ్యయం చేసే సామర్ధ్యంతో పాటు తిరిగి రుణాలు చెల్లించే సామర్ధ్యాన్ని కూడా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిగణనలోకి తీసుకునే ఎంత వరకు ఏ ప్రాజెక్టులకు అనుమతించాలో నిర్ధారిస్తుందని ఉన్నతాధికారి తెలిపారు. విదేశీ ఆర్థిక సంస్థల ద్వారా చేపట్టేందుకు 13 ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. మొత్తం 13 ప్రాజెక్టుల వ్యయం రూ.37,778.80 కోట్లు కాగా ఇందులో విదేశీ సంస్థల రుణం రూ.26,253.71 కోట్లుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ భరించనున్న వాటాగా రూ.11,525.09 కోట్లుగా పేర్కొన్నారు. ఈ 13 ప్రాజెక్టులకు సంబంధించిన వ్యయంలో 70 శాతం మేర విదేశీ సంస్థల నుంచి రుణంగా తీసుకుంటుండగా రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 30 శాతం భరించనుంది. -
‘ఈ–పోస్’ పనితీరును పరిశీలించిన ప్రపంచ బ్యాంక్ బృందం
ఆగిరిపల్లి : మండల కేంద్రమైన ఆగిరిపల్లిలో ఈ–పోస్ మిషన్ల పనితీరును ప్రపంచ బ్యాంకు బృందం సభ్యులు బుధవారం పరిశీలించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గౌసియాబేగం, తహసీల్దార్ సీహెచ్ ఉమామహేశ్వరరావును పింఛన్ల పంపిణీ చేసే విధానం, ఎన్ఆర్ఈజీఎస్ అమలు జరుగుతున్న తీరు, రేషన్ పంపిణీ విధానం, ఎరువుల దుకాణాల్లో పంపిణీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సత్రం సెంటర్లో గల ఎరువుల దుకాణంలో ఈ–పోస్ విధానం ద్వారా ఎరువుల పంపిణీని దుకాణదారుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రపంచ బ్యాంకు బృందం సభ్యులు సునీతచోప్రా, వసుమతి, మండల వ్యవసాయ విస్తరణ అధికారిణి బి.త్రివేణి, ఏపీవో రాజు, తహసీల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచ బ్యాంక్ ఇండియన్ డైరెక్టర్గా జునైద్
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంక్ ఇండియన్ డైరెక్టరుగా జునైద్ అహ్మద్ నియమితులయ్యారు. ఒన్నో రుహల్ నాలుగేళ్ల పదవీ కాలం ముగియడంతో అతని స్థానంలో అహ్మద్ను నియమించారు. అహ్మద్ బంగ్లాదేశ్ జాతీయుడు. అహ్మద్ సమర్థవంతంగా పనిచేయగలడని ప్రపంచ బ్యాంక్ గ్రూపు అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ తెలిపారు. భారత్ అభివృద్ధి చెందుతున్న దేశమని పేర్కొన్నారు. అహ్మద్ 1991లో ప్రపంచ బ్యాంకులో చేరారని, అనేక విభాగాల్లో ఆయన పనిచేశారని ఆయన వివరించారు -
ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల అసంతృప్తి
* ఏపీఎండీపీ పథకం పనుల పరిశీలన * డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశం గుంటూరు (నెహ్రూనగర్): ప్రపంచ బ్యాంకు నిధులతో ఏపీఎండీపీ (ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ డెవలప్మెంట్ ప్లాన్) పథకం కింద గుంటూరు నగరంలో జరుగుతున్న పనులను ప్రపంప బ్యాంకు ప్రతినిధులు శుక్రవారం పరిశీలించారు. ఉండవల్లి, నులకపేట, మంగళగిరి పంపుహౌస్, తక్కెళ్లపాడు, తక్కెళ్ళపాడు పంపింగ్ హౌస్, నేషనల్ హైవే, తక్కెళ్ళపాడు చెరువు, మానస సరోవరం ప్రాంతంలలో నాగార్జున కంపెనీ చేపట్టిన 42 ఎంఎల్డీ తాగునీటి శుద్ధీకరణ ప్లాంట్లను పరిశీలించారు. పనులు ఆగస్టు నాటికి పూర్తి చేయాల్సి ఉండగా, ఆలస్యం కావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారి వద్ద 1.5 కిలోమీటర్ల మేర ప్లాంట్ వరకు పైపులైను వేయుటకు స్థల సేకరణకు అడ్డంకులను త్వరితగతిన అధిగమించి పనులు వేగవంతం చేయాలన్నారు. నగరంలో 18 రిజర్వాయర్లు, 14 సంపుల నిర్మాణాలు జరుగుతున్నాయని, వాటిని కూడా వేగవంతం చేయాలన్నారు. సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాంట్రాక్టర్లపై ఆగ్రహం.. అనంతరం పాతగుంటూరులో మెగా ఇంజినీరింగ్ కంపెనీ చేపట్టిన పైపులైను ఇంటర్ కనెక్షన్, ఇంటింటికి ట్యాపు కనెక్షన్ల పనులను ప్రపంచబ్యాంకు ప్రతినిధులు పరిశీలించారు. ఈ పనుల్లోనూ తీవ్ర జాప్యం జరగుతుండటంతో ఏపీఎండీపీ ప్రాజెక్టు డైరెక్టర్ రాంనారాయణరెడ్డి కాంట్రాక్టర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లు, అధికారులు సమన్వయతో త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించి ఇంజినీరింగ్ అ«ధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రపంచ బ్యాంకు టాస్క్ఫోర్స్ టీమ్ లీడర్ రఘుకేశవ, ఇంజినీరింగ్ కన్సల్టెంట్ డాక్టర్ మోహన్, సీనియర్ సోషల్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ ఐ.యు.బి.రెడ్డి, నగరపాలకసంస్థ ఎస్ఈ గోపాలకృష్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు
ఏలూరు (మెట్రో) : ప్రపంచ బ్యాంక్ నిధులతో విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకున్నామని విద్యుత్ పంపిణీ సంస్థ వరల్డ్ బ్యాంకు డైరెక్టర్ రమేష్ ప్రసాద్ తెలిపారు. ఏపీఈపీడీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విధ్యుత్ పంపిణీ సంస్థ) ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఎంతో కాలంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను మార్పు చేసి నూతనంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందరికీ విద్యుత్ పథకంలో భాగంగా జిల్లాలో ప్రతి ఒక్క కుటుంబానికి విద్యుత్ సదుపాయాన్ని కల్పించామన్నారు. అంతే కాకుండా కొత్తలైన్లు ఏర్పాటు చేసి గృహ వినియోగానికి, వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగులందరూ ఉత్తమ పనితీరు చూపించి జిల్లాకు ఉన్నత పేరు తీసుకురావాలన్నారు. సమావేశంలో ఎస్ఈ సీహెచ్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ కొత్తగా జిల్లాలో సబ్స్టేçÙన్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో జనరల్ మేనేజర్ కేవీసీహెచ్ పంతులు, డీఈటీ కె.రఘునాథ్బాబు, ఏడీ అంబేడ్కర్ పాల్గొన్నారు. -
అగ్రస్థానాలు కోల్పోయిన తెలంగాణ, ఏపీ
సులభ వాణిజ్యం ర్యాంకుల్లో మూడు, నాలుగో స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాలకు సులభ వాణిజ్యం (ఈవోడీబీ)లో కేంద్ర పారిశ్రామిక విధానం, ప్రోత్సాహకాల విభాగం (డిప్) ఇచ్చే తాత్కాలిక ర్యాంకుల్లో తెలంగాణ, ఏపీకి మూడు, నాలుగో స్థానాలకు తగ్గాయి. తాత్కాలిక ర్యాంకుల్లో కొంతకాలంగా తెలంగాణ మొదటి స్థానంలో, ఏపీ రెండో స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈవోడీబీపై ప్రపంచ బ్యాంకు రూపొందించిన 340 ప్రశ్నలకు సంబంధించి రాష్ట్రాలు డిప్కు తమ సమాధానాలు సమర్పించాయి. ఆ సమాధానాల్లో సవరణలకు ఆగస్టు 16వ తేదీ వరకు గడువు పొడిగించారు. తాజాగా గురువారం ప్రకటించిన తాత్కాలిక ర్యాంకుల్లో తెలంగాణ 61.45 స్కోరుతో మూడో స్థానంలో, ఏపీ 56.05 స్కోరుతో నాలుగో స్థానంలో నిలిచాయి. 63.72 స్కోరుతో ఉత్తరాఖండ్ తొలిస్థానంలో, 62.94 స్కోరుతో రాజస్థాన్ రెండో స్థానంలో ఉన్నాయి. సెప్టెంబర్ నెలాఖరుకు కసరత్తు పూర్తి చేసి తుది ర్యాంకులు ప్రకటించేందుకు డిప్ సన్నాహాలు చేస్తోంది. అప్పటి వరకు తాత్కాలిక ర్యాంకుల్లో తరచూ మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. -
ఆర్థిక గండాన్ని అధిగమించిన భారత్
మన అవసరాలను, అవకాశాలను సమన్వయం చేసుకుంటూ వెళ్లినంత కాలం అంతర్జాతీయంగా ఎన్ని ఆర్థిక ఒడిదుడుకులు వచ్చినా మనపై పెద్దగా ప్రభావం చూపలేవు. ఎదుగుతున్న భారత్ సమర్థతను గుర్తించి సుపరిపాలనను అందించడమే ప్రస్తుత కర్తవ్యం. ప్రధాని మోదీ చేస్తున్నది కూడా అదే. బ్రెగ్జిట్.. ఆర్థిక వ్యవస్థల్ని కుదిపేసిన ఈ అంతర్జాతీయ పరిణామం తాలూకు భయాలు, అనుమానాలు మనదేశాన్నీ ప్రభావితం చేశాయి. కానీ, మనదేశ మార్కెట్లు, ఆర్థిక రంగం అందరూ ఊహించినట్లుగా భారీ పతనాన్ని చవిచూడలేదు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు సైతం మన దేశ పనితీరును ఈ సందర్భంగా అభినందించటం గమనార్హం. మరి ఆర్థిక విశ్లేషకుల అంచనాలన్నీ ఎందుకు తప్పయ్యాయి? ఆరు దశాబ్దాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ, నెహ్రూ కుటుంబం కానీ దేశాన్ని అభివృద్ధి చేయ లేకపోయింది. ప్రాచీన కాలం నుంచి మనకు అంత ర్లీనంగా ఉన్న శక్తి, సామర్థ్యాలను మనం సరిగ్గా వాడు కోలేదు. మన సంప్రదాయాలను ఆధారంగా చేసుకుని మన నైపుణ్యాలకు మెరుగులు దిద్ది ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు ఉన్న అవకాశాలను ఏనాడూ పట్టించు కోలేదు. కానీ, రెండేళ్లలో ప్రధాని మోదీ ఈ దిశగా చర్యలు చేపట్టిన ఫలితమే మన దేశానికి అంతర్జాతీయ ఆర్థిక పతనాల నుంచి లభిస్తున్న రక్షణ. మన దేశంలో సగం మందికి జీవనోపాధి వ్యవసాయ రంగమే కల్పిస్తోంది. కానీ, వ్యవసాయంలో వృద్ధి మాత్రం ఆశించినంత లేదు. సాగు లాభసాటిగా మారితే, రైతులకు చేతినిండా డబ్బు అందితే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం సస్యశ్యామలం అవుతుంది. అందుకే నరేంద్ర మోదీ రైతుల ఆదాయాన్ని పెంచేం దుకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. ప్రతి పొలానికీ నీరు ఇచ్చేందుకు ‘క్రిషి సించాయి యోజన’ ద్వారా జలా శయాల నిర్మాణం, ‘హర్ ఖేత్ కో పానీ’ నినాదంతో కాల్వల నిర్మాణం, నదుల అనుసంధానం చేపడుతు న్నారు. సంప్రదాయ పద్ధతుల్లో సేంద్రియ వ్యవసాయా నికి నిధులిస్తున్నారు. మనదేశ ఆశాకిరణాలు యువతీయువకులే. ఆ ఆశాకిరణాల భవిష్యత్తు ఏంటి? మన దేశంలో బీఏ, బీకాంలకు ఇంకా విలువ ఉందా? పోనీ బీటెక్, ఎంటెక్ చేస్తే జాబ్ గ్యారంటీయా? మరి మన యువత దేశానికి ఎలాంటి భవిష్యత్తునిస్తారు? 20 ఏళ్లు కష్టపడి చదివినా ఉద్యోగం రాకపోవచ్చు. కానీ, 20 వారాలు నైపుణ్యాన్ని మెరుగుపర్చుకుంటే జీవనోపాధికి ఢోకా ఉండదు. కంప్యూటర్ కోర్సు, షార్ట్హ్యాండు నుండి వెల్డింగ్, ప్లంబింగ్ వరకు ఎలాంటి స్కిల్ అయినా కొన్ని నెలల్లోనే మెరుగులు దిద్దుకోవచ్చు. అందుకే మోదీ స్కిల్ డెవలప్ మెంట్కు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేశారు. రాబోయే ఏడేళ్లలో 40 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. దేశంలోని 30 కోట్లమంది విద్యార్థులను భవిష్యత్ తారలుగా తీర్చిదిద్దేలా నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెటాలని మోదీ భావిస్తున్నారు. మనదేశ జనాభా 126 కోట్లు. నగరాలు, పట్టణాలు 4 వేలు. మన దేశంలో పట్టణాలు, నగరాలు అవ్యవ స్థలకు ప్రతిరూపాలుగా ఉన్నాయి. వాటిని చక్కదిద్దేం దుకు మోదీ నడుం బిగించారు. ఐదేళ్లలో వంద స్మార్ట్ సిటీల నిర్మాణాన్ని ప్రారంభించటం, అమృత్, హెరిటేజ్ పథకాల ద్వారా 4 వేల పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన చేపట్టారు. దీని ద్వారా పట్టణాలకు రూ. లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి ఆరు దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా మన దేశంలో కనీస మౌలిక సదుపాయాలైన... నివాసం, విద్యుత్, రోడ్లు ప్రతి ఒక్కరికీ అందుబాటులో లేవు. మారిన జీవన విధానాల కారణంగా ఇంటర్నెట్, మొబైళ్లు, రవాణా సదుపాయాలు కూడా అందరికీ అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందుకే మోదీ ప్రభుత్వం అందరికీ ఇళ్లు, అన్ని గృహాలకూ నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా, ప్రతి గ్రామానికీ రోడ్డు పథకాలను చేపట్టింది. డిజిటల్ ఇండియా పథకం ద్వారా ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తోంది. దేశంలో మరింత మెరుగైన జాతీయ రహదారుల్ని నిర్మిస్తోంది. రైల్వేలు ఇప్పుడు సరైన దిశలో పరుగులు పెడుతున్నాయి. రాష్ట్రాలతో కలిసి సంయుక్తంగా ప్రాజెక్టుల్ని నిర్మించే సరికొత్త ఆలోచ నకు శ్రీకారం చుట్టింది. పారిశ్రామిక రంగానికి కావాల్సినవి.. నిరంతర విద్యుత్, నాణ్యమైన కార్మికులు, సులభమైన నిబంధ నలు, అందుబాటులో ముడి వనరులు. మోదీ హయా ంలో మన దేశం విద్యుత్ మిగులు సాధించనుంది. కార్మిక సంస్కరణలు చేపట్టి అటు పరిశ్రమలకు, ఇటు కార్మికులకు మేలు చేస్తోంది. ఇక బొగ్గు, ఇనుము, గ్యాస్ వంటి వనరుల కేటాయింపుల్లో గత ప్రభుత్వాల అవినీతిని కడుగుతూ పారదర్శకంగా కేటాయింపులు చేస్తోంది. భారత్లో సునాయాసంగా వ్యాపారం చేసు కునే వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టిస్తోంది. కాబట్టే, మేకిన్ ఇండియా పథకంలో భాగంగా మన దేశానికి చైనాను మించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి. మన తలసరి ఆదాయం తక్కువ. ఖర్చు పెట్టగల స్తోమత తక్కువ. మన అవసరాలు ఎక్కువ. అవకాశాలు తక్కువ. వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లినంత కాలం అంతర్జాతీయంగా ఎన్ని ఆర్థిక ఒడిదు డుకులు వచ్చినా మనపై పెద్దగా ప్రభావం చూపలేవు. దేశం ఎదగాలంటే శక్తి సామర్థ్యాలను గుర్తించి.. వాటికి మెరుగులు దిద్ది, వ్యవస్థలోని లోపాలను సరిదిద్ది, సమ ర్థవంతమైన పాలన అందిస్తూ ముందుకెళ్లాలి. మోదీ చేస్తోంది కూడా అదే. ఒక్క మాటలో చెప్పాలంటే గత రెండేళ్లలో నరేంద్ర మోదీ ఇటు దేశీయంగానూ, అటు అంతర్జాతీయంగానూ భారతదేశ ప్రతిష్టను ఇనుమ డింపజేశారు. పెట్టుబడిదారుల్లోను, పరిశ్రమల్లోనూ విశ్వాసం పెంచారు. వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త - పురిఘళ్ల రఘురామ్ ఈమెయిల్ : raghuram.bjp@gmail.com -
ఆ ఆరోపణలన్నీ నిరాధారమైనవే!
ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ - తెలంగాణ సమాచారాన్ని ఏపీ చోరీ చేసిందనడం హాస్యాస్పదం - గతేడాది ఈవోడీబీ ర్యాంకుల్లో ఏపీ రెండో స్థానం, తెలంగాణది 13వ స్థానం - ఈసారి కూడా అధమ స్థానంలో నిలుస్తామనే కేటీఆర్ ఆరోపణలు సాక్షి, హైదరాబాద్ : ఈజ్ ఆఫ్ డూయింట్ బిజినెస్(ఈవోబీడీ) విధానంలో డీఐపీపీ(డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్), ప్రపంచ బ్యాంకు ర్యాంకు కోసం తమ సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా చోరీ చేసిందని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ కొట్టిపారేశారు. హైదరాబాద్లోని సచివాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గతేడాది డీఐపీపీ ప్రకటించిన ర్యాంకుల్లో ఈవోబీడీలో గుజరాత్ 71.14 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా, 70.12 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. 42.45 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచిన తెలంగాణ సర్కార్ సమాచారాన్ని రెండో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చౌర్యం చేసిందంటే ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు. ఈ ఏడాదీ అధమ స్థానంలో నిలుస్తామనే భావనతోనే తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి, అధికారులు ఇప్పటినుంచే సాకులు వెతుక్కుంటూ చంద్రబాబు సర్కార్పై చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈవోబీడీ విధానంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన సమాచారం తెలంగాణ సర్కార్కు ఎలా తెలి సిందని ప్రశ్నించారు. కేవలం వెబ్సైట్ను హ్యాక్ చేస్తేనే తమ ప్రభుత్వం కేంద్రానికి ఏ ప్రతిపాదనలు ఇచ్చిందన్నది తెలుస్తుందన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేస్తే నిజానిజాలు వెల్లడవుతాయని చెప్పారు. ఆధార్, పాన్, మొబైల్ నెంబర్లు వంటి వివరాలతో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పోర్టల్ సమగ్రంగా ఉందని.. తొమ్మిది వేల లావాదేవీలు జరిపిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అసమగ్రంగా ఉన్న వారి పోర్టల్ ద్వారా ఒక్క లావాదేవీ కూడా జరపలేదన్నారు. వ్యాపార, వాణిజ్య సంబంధాల వ్యాజ్యాల రుసుం ఆన్లైన్ ద్వారా కూడా చెల్లించే అంశంపై ఉమ్మడి హైకోర్టు ఉత్తర్వులు(ఆర్వోసీ 850/ఎస్వో/2015)ను జారీ చేసిందని.. ఇది రెండు రాష్ట్రాలకు వర్తిస్తుందని... దాన్ని పట్టుకుని తమ రిఫెరెన్స్ నెంబరుతో చౌర్యం చేశారంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు సింగపూర్లో ప్రఖ్యాత విశ్వవిద్యాలయం, వరల్డ్ ఎకనమిక్ ఫోరంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి తెలంగాణ సమాచారాన్ని చౌర్యం చేయాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. ఇవేవీ పట్టకుండా కేంద్రానికి ఫిర్యాదు చేసి చంద్రబాబు ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైట్ను తెలంగాణ ప్రభుత్వం హ్యాక్ చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారా? అని ప్రశ్నించగా సూటిగా చెప్పకుండా సమాధానాన్ని దాటవేశారు. -
సోలార్కు బిలియన్ డాలర్లు!
న్యూఢిల్లీ: దేశంలో సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంక్ దాదాపు రూ.6,750 కోట్ల (1 బిలియన్ డాలర్లు) మేర సాయం అందించనుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్, ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ జిమ్ యాంగ్ కిమ్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. భూతాపానికి (గ్లోబల్ వార్మింగ్) దారితీసే ప్రమాదకర వాయువుల విడుదలను నియంత్రించే దిశగా సాంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు భారత్... సోలార్ ఎన ర్జీ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. దీనికి ప్రపంచ బ్యాంక్ బాసటగా నిలుస్తోంది. 2022 నాటికి లక్ష మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం దేశంలో 2022 నాటికి సోలార్ ఎనర్జీ ద్వారా లక్ష మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని గోయల్ తెలిపారు. ఇందుకోసం పెట్టుబడులను ఆకర్షించడానికి పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. ‘పునరుత్పాదక ఇంధన వనరులు, రూఫ్ సోలార్ ప్రాజెక్ట్స్ వంటి తదితర అంశాల గురించి చర్చించాం. ఆర్థిక సాయం కోసం పలు వినూత్న మార్గాలను అన్వేషించాం’ అని చెప్పారు. సోలార్ రూఫ్ టాప్ టెక్నాలజీ, సోలార్ పార్క్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు, కొత్త సోలార్ హైబ్రిడ్ టెక్నాలజీ ఆవిష్కరణ, ట్రాన్స్మిషన్ లైన్స్ స్థాపన వంటి తదితర వాటికి ప్రపంచ బ్యాంక్ నిధులను ఉపయోగిస్తామని వివరించారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్ల నిధుల సమీకరణకు వీలుగా భారత్ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ సోలార్ భాగస్వామ్య బృందం (ఐఎస్ఏ)తో ప్రపంచ బ్యాంకు ఒప్పందం చేసుకుంది. ఐఎస్ఏలో 121 దేశాలకు భాగస్వామ్యం ఉంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు తన విభాగమైన ఐఎఫ్సీ ద్వారా భారత్లో పవన, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు రుణ సహకారం అందిస్తోంది. మధ్యప్రదేశ్లో 750 మెగావాట్ల అతిపెద్ద సోలార్ ప్రాజెక్టుకూ నిధులందిస్తోంది. 2030కి సోలార్ విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని మూడింతలు చేయడం సహా భారత్ తన ప్రతిష్టాత్మక లక్ష్యాలను చేరుకునేందుకు ప్రపంచ బ్యాంకు చేయగలిగినంతా చేస్తుందని కిమ్ స్పష్టం చేశారు. కాగా, కొత్తగా ఏర్పడిన బ్యాంకులు ఎన్డీబీ, ఏఐఐబీకు పుష్కల అవకాశాలు ఉన్నాయని, వీటితో పాతతరం సంస్థలకు సవాళ్లు పొంచి ఉన్నాయని కిమ్ వ్యాఖ్యానించారు. ఇక భారత్ 2015-16 మధ్యకాలంలో ప్రపంచ బ్యాంక్ నుంచి 4.8 బిలియన్ డాలర్ల రుణాన్ని తీసుకుంది. -
సౌర ప్రాజెక్టులకు బిలియన్ డాలర్ల నిధులు
lన్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు.భారత్ లో రెండు రోజుల పాటు పర్యటనలో భాగంగా ఆయన ప్రధానిని, ఆర్థికమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా దేశంలో సోలార్ ప్రాజెక్టుల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలను ఫండింగ్ చేయనున్నట్టు వరల్డ్ బ్యాంక్ ప్రకటించింది. పోషణ, పునరుత్పాదక శక్తి రంగాల్లో భారత ప్రభుత్వ పథకాలకు మద్దతు అందించే చర్యల్లో భాగంగా ప్రపంచ బ్యాంక్ ప్రధానిని కలిసినట్టు పీఎంవో వర్గాలు ట్విట్ చేశాయి. ప్రధాని కార్యాలయం ప్రధాన మంత్రి తో భేటీ అయిన కిమ్ ఫోటోను క ట్వీట్ చేశాయి. భారీ సౌర ఇంధన కార్యక్రమానికి 30 సోలార్ ప్రాజెక్టులకు ఒక బిలియన్ డాలర్ల (6వేల 750 కోట్లను) నిధులను ఇవ్వనున్నట్టు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్(ఐఎస్ఎ)తో దీనికి సంబంధించి ఒక ఒప్పందాన్ని కదుర్చుకుంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలొ ప్రపంచ బ్యాంక్ గ్రూప్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. దీని ప్రకారం ఐఎస్ఎ ఆర్థిక భాగస్వామిగా బహుపాక్షిక రుణ ఏజెన్సీ స్థాపిస్తుంది. క్లైమేట్ ఫ్రెండ్లీ భవిష్యత్తులో గ్లోబల్ ఉద్యమానికి ఇది దోహం చేస్తుందనే కిమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఇండియాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం న్యూ ఢిల్లీలోని స్కిల్ ఇండియా సెంటర్ ను సందర్శించారు. అనంతరం ఆ తర్వాత అంగన్ వాడి సెంటర్ కు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి చిన్నారులతో సరదాగా ముచ్చటించినసంగతి తెలిసిందే. -
అమరావతి అభివృద్ధికి రూ.41,225 కోట్లు
హడ్కో, ప్రపంచ బ్యాంకుల నుంచి రుణానికి సీఆర్డీఏ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ప్రపంచస్థాయి నీలి-హరిత (బ్లూ-గ్రీన్ సిటీ) నగరంగా రాజధాని అమరావతిని అభివృద్ధి చేయడానికి రూ.41,225.32 కోట్లు అవసరమని సీఆర్డీఏ ప్రాథమికంగా అంచనా వేసింది. గ్రామాల్లో మౌలిక వసతుల స్థాయిని పెంచేందుకు రూ.2,537 కోట్ల వ్యయం అవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 వరకు రూ.25,520 కోట్ల బడ్జెట్ నిధులు అవసరం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు ప్రపంచ బ్యాంకు, హడ్కో నుంచి తీసుకున్న రుణాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులను వ్యయం చేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.4,841 కోట్లు, హడ్కో నుంచి రూ.7,500 కోట్ల రుణం తీసుకోనున్నట్లు తెలిపింది. -
సంస్కరణలపై ‘రెగ్జిట్’ ప్రభావం పడదు
ప్రపంచబ్యాంక్ స్పష్టీకరణ * రేటింగ్ నిర్ణయాలు విధానాలపై తప్ప వ్యక్తులపై ఆధారపడి ఉండవని ఫిచ్ ప్రకటన న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ రెండవసారి ఈ బాధ్యతల్లో కొనసాగబోనని చేసిన ప్రకటన (రెగ్జిట్) ప్రభావం బ్యాంకింగ్ సంస్కరణలపై పడబోదని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ఆయా సంస్కరణలు కొనసాగుతాయని భావిస్తున్నట్లు ప్రపంచబ్యాంక్ భారత్ వ్యవహారాల డెరైక్టర్ ఓనో రుయాల్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్లోటు, విదేశీ మారక ద్రవ్య నిల్వల వంటి భారత్ స్థూల ఆర్థిక అంశాలు పటిష్టంగా ఉన్నట్లు కూడా తెలిపారు. కాగా రేటింగ్ సంస్థ- ఫిచ్ కూడా రెగ్జిట్పై ఒక కీలక ప్రకటన చేస్తూ... రేటింగ్ నిర్ణయాలు విధానాలపై ఆధారపడి ఉంటాయితప్ప, వ్యక్తులపై కాదని స్పష్టం చేసింది. రాజన్ పదవీ విరమణ ప్రభావం సావరిన్ రేటింగ్స్పై ఎంతమాత్రం ఉండబోదని స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణం, మొండిబకాయిల వంటి సమస్యల పరిష్కారానికి కేంద్రం, రాజన్ వారసుడు తగిన చర్యలను కొనసాగిస్తారన్న విశ్వాసాన్ని ఫిచ్ ఆసియా-పసిఫిక్ సావరిన్స్ గ్రూప్ డెరైక్టర్ థామస్ రుక్మాకర్ పేర్కొన్నారు. రాజన్ భారత్ బ్యాంకింగ్ వ్యవస్థకు చేసిన కీలకమైనవని కూడా ఆయన అన్నారు. ప్రస్తుతం ఫిచ్ భారత్ రేటింగ్ ‘బీబీబీ-’ జంక్ హోదాకు ఇది ఒక స్థాయి ఎక్కువ. ప్రైవేటు పెట్టుబడులు, డిమాండ్ కీలకం కాగా ప్రైవేటు పెట్టుబడులు, గ్రామీణ డిమాండ్ క్రియాశీలకంగా ఉండడం ద్వారానే భారత్ 7.6 శాతం వృద్ధి రేటు మున్ముందు కొనసాగుతుందని ప్రపంచబ్యాంక్ తన తాజా ద్వైవార్షిక నివేదికలో పేర్కొంది. ప్రతిష్టంభనలో ఉన్న రంగాల్లో వ్యవసాయం, గ్రామీణ గృహ వినియోగం, ప్రైవేటు పెట్టుబడులు, ఎగుమతులు ఉన్నట్లు తెలిపింది. 2015-16 తరహాలో 2016-17లో కూడా భారత్ వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. రానున్న రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఈ రేటు 7.7 శాతం, 7.8 శాతంగా అంచనా. -
ప్రపంచ సంస్థల్లో సమూల మార్పులు అవసరం: ప్రణబ్
ఆక్రా: ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ వంటి ప్రపంచ సంస్థల్లో సమూల మార్పులు రావాల్సిన అవసరాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నొక్కిచెప్పారు. కాలం చెల్లిన విధానాలను అనుసరిస్తున్న ఈ సంస్థలు నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించలేవన్నారు. ఘనా పర్యటనలో భాగంగా రాష్ట్రపతి సోమవారం ఘనా యూనివర్సిటీ క్యాంపస్లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టికల్, సోషల్, ఎకనమిక్ రీసెర్చ్కు చెందిన విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. నేటి ప్రపంచ అవసరాలను రెండో ప్రపంచయుద్ధం ముగిసిన నేపథ్యంలో 1945లో ఏర్పాటు చేసిన ఐరాస తీర్చలేదని అన్నారు. ఐరాస ఏర్పాటైనప్పుడు కొన్ని దేశాలే సభ్యులుగా ఉన్నాయని, అయితే రెండో ప్రపంచ యుద్ధానంతరం స్వాతంత్య్రం పొందిన ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు ఐరాసలో కీలకపాత్ర లేకుండా పోయిందన్నారు. ఘనా పర్యటన ముగించుకుని ప్రణబ్ ఐవరీ కోస్ట్ చేరుకున్నారు. -
దూసుకుపోతున్న తెలంగాణ
- పరిశ్రమలు, పెట్టుబడులకు అత్యంత అనుకూలంగా రాష్ట్రం - ప్రపంచ బ్యాంకు ఈఓడీబీ తాజా ర్యాంకుల్లో రెండో స్థానం - గతేడాది రాష్ట్రానికి 13వ ర్యాంకు - మొదటిస్థానంలో కొనసాగుతున్న బిహార్ - గతేడాది రెండోర్యాంకు సాధించిన ఏపీ ప్రస్తుతం 19వ స్థానంలో - జూలైలో తుది ర్యాంకులు ప్రకటించనున్న ప్రపంచ బ్యాంకు సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ పెట్టుబడులు, వ్యాపార అనుకూల వాతావరణం కోసం అమలు చేస్తున్న విధానాలను ప్రామాణికంగా తీసుకొని ప్రపంచ బ్యాంక్ ఏటా ప్రకటిస్తున్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’(ఈఓడీబీ) ర్యాంకుల్లో తెలంగాణ దూసుకుపోతోంది. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గతేడాది 13వ ర్యాంక్ను దక్కించుకొన్న తెలంగాణ.. ఈ ఏడాది తాజా ర్యాంకింగ్లో 6.48 శాతం స్కోర్తో రెండో ర్యాంక్కు దూసుకుపోయింది. 8.53 శాతం స్కోర్తో ఒకటో ర్యాంక్లో కొనసాగుతున్న బిహార్కు గట్టి పోటీ ఇస్తోంది. తెలంగాణ తర్వాత 6.18 శాతం స్కోర్తో ఝార్ఖండ్ మూడో ర్యాంక్లో కొనసాగుతోంది. మరోవైపు గతేడాది ర్యాంకింగ్లో 3వ ర్యాంక్ కైవసం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ 0 శాతం స్కోర్తో తాజా ర్యాంకింగ్లో ఏకంగా 19వ స్థానానికి పడిపోయింది. ఈ ర్యాంకులను ఇంకా మెరుగుపరుచుకోవడానికి ఈ నెల 30 వరకు రాష్ట్రాలకు అవకాశం ఉంది. ప్రపంచ బ్యాంక్ నిర్దేశించిన ప్రమాణాల మేరకు పెట్టుబడులు, వ్యాపార సరళీకరణ కోసం ప్రవేశపెట్టిన సంస్కరణ లు, తీసుకుంటున్న చర్యలను కేంద్ర పరిశ్రమల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు అన్ని రాష్ట్రాలు ఏరోజుకారోజు నివేదిస్తున్నాయి. రాష్ట్రాల నివేదికల ఆధారంగా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు రాష్ట్రాల తాజా ర్యాంక్లను అప్డేట్ చేస్తోంది. ఏ రాష్ట్రం ఏ ర్యాంకులో ఉందో తన వెబ్సైట్ ద్వారా బహిర్గతపరుస్తోంది. తుది ర్యాంక్ ను మెరుగుపరుచుకోవడానికి అన్ని రాష్ట్రాలకు అవకాశం కల్పిస్తోంది. వచ్చే నెలలో ప్రపంచ బ్యాంక్ తుది ర్యాంక్లను అధికారికంగా ప్రకటించనుంది. తాజా ర్యాంకులతో పోల్చితే రాష్ట్రాల తుది ర్యాంకుల్లో మార్పులకు అవకాశం ఉందని కేంద్ర పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది. మెరుగైన ర్యాంకు కోసం భారీ కసరత్తు సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు సత్వర అనుమతులు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘టీఎస్-ఐపాస్’ పేరుతో కొత్త పాలసీని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. పెట్టుబడులకు ఈ విధానం ద్వారా ఎర్రతివాచీ పరిచింది. అయినా గతేడాది జూలైలో ప్రపంచ బ్యాంక్ ప్రకటించిన ఈఓడీబీ ర్యాంకుల్లో తెలంగాణకు 13, పొరుగున ఉన్న ఏపీకి 2వ స్థానం వచ్చింది. దీంతో ఈ అంశా న్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ర్యాం కింగ్ను మెరుగుపరచుకోవడానికి గత 11 నెల లుగా భారీ కసరత్తు చేసింది. ప్రపంచ బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం ర్యాంకును మెరుగుపరుచుకోవాలంటే వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలోని పలు అంశా ల్లో సంస్కరణలు ప్రవేశపెట్టి 340 పాయింట్లు సాధించాల్సి ఉంటుందని అంచనా వేసుకుంది. సీఎం కేసీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మలు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను ఉరుకులు పెట్టించారు. గతనెల 14 నాటికి పలు సంస్కరణలు ప్రవేశపెట్టి 289 పాయింట్లు సాధించి 87 శాతం పురోగతి సాధించింది. గడిచిన నెల రోజుల్లో పాయింట్ల సంఖ్య మరింత పెరగడంతో తాజా ర్యాం కింగ్లో రాష్ట్రం 2వ స్థానానికి చేరుకుంది. ఒక్క న్యాయశాఖ తప్ప.. న్యాయ శాఖ మినహాయిస్తే.. పురపాలక, ఆర్థిక, రెవెన్యూ, అటవీ, ఇంధన, కార్మిక, ఉపాధి కల్పన, పరిశ్రమలు, వాణిజ్య పన్నుల శాఖలు, టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో తీసుకోవాల్సిన పలు చర్యలు తీసుకోవడంతో మెరుగైన ర్యాంకు సాధ్యమైందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల తరహాలో ‘ఈ-కోర్టుల’ విధానంతోపాటు న్యాయశాఖకు సంబంధించిన పలు అంశాల్లో సంస్కరణలను ప్రవేశపెట్టే అంశం హైకోర్టు పరిధిలో ఉండడంతో ఈ అంశాల్లో ఆశించిన పురోగతి లేదు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమావేశమై దీనిపై చర్చించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. పురోగతి చర్యలపై చర్చించేందుకు మంత్రి కేటీఆర్ ఒక ట్రెండు రోజుల్లో అన్ని శాఖల కార్యదర్శులతో మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రపంచ బ్యాంక్ జూలైలో ప్రకటించనున్న తుది ర్యాంకుల కోసం ప్రభుత్వం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.