DWCRA Group
-
కొలికపూడి కంపు.. డ్వాక్రా మహిళలు ఆగ్రహం
సాక్షి, ఎన్టీఆర్: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ రావుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా గ్రూప్కు సంబంధించి మాట్లాడేందుకు వెళ్లిన మహిళలతో ఎమ్మెల్యే కొలికిపూడి అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. దీంతో, మహిళలకు ఎమ్మెల్యే ఇచ్చే గౌరవం ఇదేనా అని వారు ప్రశ్నిస్తున్నారు.తమను బూతులతో దూషించారని మహిళలు ఆరోపించారు. డ్వాక్రా గ్రూప్నకు సంబంధించి బుక్ కీపర్లుగా పాతవారినే కొనసాగించాలని ఎమ్మెల్యే కొలికిపూడి వద్దకు వెళ్లిన మహిళలు. ఈ సందర్భంగా మహిళలను తీవ్ర పదజాలంతో దూషించిన కొలికపూడి. మిమ్మల్ని ఎవడు ఇక్కడికి పంపించాడు? అంటూ ఊగిపోయిన ఎమ్మెల్యే. మహిళలు అని కూడా వారిని బూతులు తిట్టాడని సదరు మహిళలు తెలిపారు. అనంతరం, పోలీసులను పిలిపించి మహిళలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి స్టేషన్లో తమకు కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, కూటమి ప్రభుత్వంలో మహిళల్ని గౌరవించే విధానం ఇదేనా అంటూ మండిపడుతున్నారు. -
TS: డ్వాక్రా మహిళలకు శుభవార్త
సాక్షి, ఖమ్మం జిల్లా: డ్వాక్రా మహిళలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. త్వరలో డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేయనున్నట్లు మధిర మండలం రొంపిమల్ల రోడ్డు శంకుస్థాపన సభలో ఆయన వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని పేర్కొన్నారు. -
విజయనగరం జిల్లాలో డ్వాక్రా సంఘాల మహిళలకు ఆర్థికసాయం
-
పొదుపు మహిళే బ్యాంకర్! సంఘాలే బ్యాంకులు
పేదింటి మహిళలు పది మంది చొప్పున కలిసి స్వయం సహాయక పొదుపు సంఘాలుగా ఏర్పడటం మననందరికీ తెలుసు. ఈ సంఘాలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని.. వ్యాపార, కుటుంబ అవసరాలకు వినియోగించుకోవడమూ తెలిసిందే. అయితే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ సంఘాలు ఇంకో అడుగు ముందుకు వేశాయి. ప్రతి నెలా పోగేసుకున్న సొమ్ముతో స్వయంగా రుణాలిచ్చే దశకు ఎదిగాయి. తద్వారా అంతర్గత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకుంటున్నాయి. ఈ పరిణామం రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక కార్యకలాపాల వేగాన్ని సూచిస్తోంది. ఇంత వేగంగా గ్రామీణ ఆర్థికాభివృద్ధి ఒక్క మన రాష్ట్రంలోనే కనిపిస్తోంది. సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బసినకొండ గ్రామంలో 18–19 ఏళ్ల క్రితం తొమ్మిది మంది మహిళలతో రాజరాజేశ్వరి స్వయం సహాయక పొదుపు సంఘం ఏర్పాటైంది. మొదట్లో ఒక్కొక్కరు నెలకు రూ.50 చొప్పున పొదుపు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు ప్రతి నెలా రూ.500 చొప్పున దాచుకుంటున్నారు. ఇలా జమ చేసుకున్న సొమ్ము రూ.ఆరున్నర లక్షలకు చేరుకుంది. ఈ డబ్బులను అవసరమైన వారికి నామమాత్రపు వడ్డీకి అప్పుగా ఇవ్వాలని ఈ సంఘం సభ్యులందరూ నిర్ణయించుకున్నారు. దీంతో ఈ సంఘంలో సభ్యులైన నలుగురు మహిళలు ఆరు నెలల క్రితం రూపాయిలోపు వడ్డీతో రూ.ఆరు లక్షలు రుణంగా తీసుకున్నారు. అప్పటి వరకు ఈ సొమ్ము పావలా వడ్డీ కూడా రాని బ్యాంకు సేవింగ్ ఖాతాకే పరిమితమై ఉండింది. ఈ సంఘం నిర్ణయం వల్ల ఇప్పుడు రూపాయి లోపు వడ్డీ వస్తోంది. వడ్డీ రూపంలో వచ్చే మొత్తం తిరిగి సంఘ నిధికే జమ అవుతుంది. సంఘం ఉమ్మడి నిధిలో జమ అయ్యే ఈ సొమ్ములో సభ్యులందరికీ వాటా ఉండటం వల్ల అప్పు తీసుకున్న సభ్యులకు మరింత ఉపశమనం కలుగుతోంది. ఈ విధానం వల్ల అందరం సంతోషంగా ఉన్నామని ఈ సంఘం లీడర్ సీహెచ్ లక్ష్మీకాంతం తెలిపారు. పి.అరుణ అనే సంఘ సభ్యురాలికి ప్రభుత్వం ఇంటి పట్టాతో పాటు ఇంటి నిర్మాణానికి సైతం ఆర్థిక సహాయం మంజూరు చేయగా, అనుకున్న విధంగా ఇల్లు అందంగా కట్టుకునేందుకు అదనంగా రూ.1.65 లక్షలు సంఘమే ఆమెకు అప్పుగా ఇచ్చిందని చెప్పారు. ఇంకొక సభ్యురాలికి ఇంటి నిర్మాణం కోసం రూ.1.65 లక్షలు, మరొకరికి కొత్త వ్యాపార దుకాణం ఏర్పాటుకు రూ.రెండు లక్షలు, ఇంకొకరికి కుటుంబ అవసరాల కోసం రూ.70 వేల రుణం అందజేశామని ఆమె వివరించారు. సంఘ సభ్యులలో ఎవ్వరికీ డబ్బులు అవసరం లేని పక్షంలో తమ చుట్టపక్కల ఉండే తెలిసిన వారికి తక్కువ వడ్డీకి అప్పులు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఇదే గ్రామంలోని కల్యాణ స్వయం సహాయక సంఘం సైతం ఇదే రీతిలో ఆర్థిక లావాదేవీలు సాగిస్తోంది. ఈ సంఘం వద్ద రూ.ఏడు లక్షల పొదుపు నిధి ఉండగా.. ఐదు నెలల క్రితం ఇద్దరికి, ఈ నెలలో మరో ఇద్దరు తమ సంఘ సభ్యులకే మొత్తం రూ.నాలుగు లక్షలు రుణంగా ఇచ్చామని సంఘం లీడర్ పద్మావతి తెలిపారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పొదుపు సంఘాలు మినీ బ్యాంకుల తరహాలో లావాదేవీలు సాగిస్తుండటం విశేషం. అంతర్గత రుణ వ్యవస్థ బలోపేతం రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో పేదింటి మహిళల్లో ఆర్థిక భద్రత తొణికిసలాడుతోంది. లక్షల సంఖ్యలో ఉన్న పొదుపు సంఘాలు ప్రస్తుతం ఒక్కొక్కరికి రూ.రెండు మూడు లక్షల చొప్పున అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగాయి. ఒకపక్క ఈ సంఘాల మహిళలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలను సద్వినియోగం చేసుకుంటూనే, మరోపక్క వేరుగా పెద్ద మొత్తంలో అంతర్గత రుణ వ్యవస్థను పెంపొందించుకున్నాయి. ప్రభుత్వం కల్పించే ప్రోత్సాహంతో ఏడాదిన్నరగా అంతర్గతంగా మినీ బ్యాంకుల తరహా రుణ లావాదేవీలు సాగిస్తుండటం ఆహ్వానించదగిన పరిణామమని ఆర్థిక రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 8,45,374 స్వయం సహాయక పొదుపు సంఘాలు ఉండగా.. కేవలం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 4.39 లక్షల సంఘాలు తమ సంఘ పొదుపు నిధి నుంచి రూ.866 కోట్లు అంతర్గతంగా రుణాలు ఇచ్చాయి. ఆగస్టులో 1,55,778 పొదుపు సంఘాలు రూ.297 కోట్లు, సెప్టెంబర్లో 1,21,672 సంఘాలు రూ.204 కోట్లు, అక్టోబర్లో 1,62,259 సంఘాలు రూ.365 కోట్లు రుణంగా ఇచ్చాయి. 3 నెలల్లో రూ.1,241 కోట్లు వసూలు మరోవైపు.. స్వయం సహాయక పొదుపు సంఘాలు అంతర్గత రుణాల రూపంలో ఇచ్చే రుణాలను నెల వారీ కిస్తీ రూపంలో లేదా ఒకే విడత చెల్లింపునకు వీలుగా అవకాశం కల్పిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాలు గతంలో అంతర్గత రుణాల రూపంలో ఇచ్చిన రుణాలకు సంబంధించి గత మూడు నెలల్లో ఏకంగా రూ.1,241 కోట్లు (అసలు, వడ్డీ కలిపి) జమ కావడం గమనార్హం. గతంలో సంఘం నుంచి అంతర్గత రుణాలు పొందిన మహిళలు ఆగస్టులో రూ.493 కోట్లు, సెప్టెంబర్లో రూ.386 కోట్లు, అక్టోబర్లో రూ.362 కోట్లు చెల్లించారు. మొత్తంగా గత మూడు నెలల్లో బ్యాంకులకు ఏ మాత్రం సంబంధం లేకుండా పేద మహిళలు ఏర్పాటు చేసుకున్న ఆయా పొదుపు సంఘాలలో ఏకంగా రూ.2,107 కోట్ల మేర అంతర్గత రుణ లావాదేవీలు కొనసాగడం ఈ వ్యవస్థలో కొత్తగా చోటు చేసుకున్న పరిణామం. ఇది మరిన్ని సంస్కరణలకు నాంది అని అధికారులు పేర్కొంటున్నారు. రూ.11,291 కోట్లకు పైగా పొదుపు నిధి గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 8.45 లక్షల స్వయం సహాయక మహిళా పొదుపు సంఘాల పేరిట పొదుపు నిధి రూపంలో ఏకంగా రూ. 11,291 కోట్ల మేర డబ్బులు ఉన్నాయి. ఇప్పటిదాకా పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణ మొత్తంలో నాలుగో వంతుకు పైబడి ఆయా సంఘాల పొదుపు డబ్బులు కేవలం ఆయా సంఘాల సేవింగ్ ఖాతాలలో నిరుపయోగంగా ఉండేవని అధికారులు చెబుతున్నారు. పొదుపు సంఘాలలో సభ్యులుగా ఉండే మహిళలు సగటున ఒక్కొక్కరు ప్రతి నెలా రూ.200 చొప్పున దాచుకుంటుంటారు. గ్రామీణ ప్రాంతంలో ఈ మొత్తం ప్రతి నెలా రూ. 110 కోట్ల నుంచి రూ.130 కోట్ల మధ్య ఉంటోంది. అక్టోబర్లో రూ.126 కోట్లు ఇలా పొదుపు చేశారు. ఇలా దాచుకున్న డబ్బులు కేవలం పావలా వడ్డీ చొప్పున కూడా రాని బ్యాంకు సేవింగ్ ఖాతాల్లో ఉండిపోవాల్సిన పరిస్థితి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది. ఇలా ఉండిపోయిన రూ. 11,291 కోట్ల మొత్తాన్ని రూపాయి దాకా వడ్డీ వచ్చేలా అంతర్గత రుణాలు రూపంలో వినియోగించుకునేలా ప్రభుత్వం మహిళలను ప్రొత్సహిస్తోంది. ఆర్థిక కార్యకలాపాల్లో కీలక అంశమైన దీనిపై పొదుపు సంఘాల మహిళలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తద్వారా మహిళలు ప్రతి నెలా పొదుపు రూపంలో దాచుకునే డబ్బులతో అంతర్గత రుణాలు ఇచ్చే వెసులుబాటు ఇవ్వడం వల్ల మొత్తం సంఘాల పొదుపు నిధి భారీగా పెరుగుతుంది. ఇది భవిష్యత్లో ఆయా సంఘాల్లోని మహిళలు రుణాల కోసం బ్యాంకుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆదుకుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సంఘాల్లోని సభ్యులు అవసరమైన మేర రుణాలు తీసుకునే స్థాయికి పొదుపు సంఘాల వ్యవస్థను బలోపేతం చేయడం ప్రభుత్వ ఉద్దేశం. పొదుపు నిధిలో 80–90 శాతం వినియోగం పొదుపు సంఘాల మహిళలు నెలనెలా దాచుకున్న డబ్బులు పెద్ద మొత్తంలో బ్యాంకుల్లో ఉంచుకొని కూడా అవసరాలకు అదే బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకోవడం ద్వారా ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇది గుర్తించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మహిళా సంఘాల పొదుపు డబ్బులపై ఎలాంటి ఆంక్షలు లేకుండా వాళ్ల అవసరాలకు ఉపయోగించుకునేలా వీలు కల్పించాలని ఎస్ఎల్బీసీ సమావేశాల్లో బ్యాంకర్లకు సూచించారు. ఉదాహరణకు ఒక పొదుపు సంఘం పేరిట రూ.రెండు లక్షల దాకా పొదుపు నిధి ఉండీ కూడా.. ఆ సంఘ సభ్యులు రూ.పది లక్షలు అవసరం ఉంటే రూ.పది లక్షలు అప్పుగా తీసుకునే బదులు, తమ పొదుపు డబ్బుల్లో రూ.లక్షన్నర వినియోగించుకొని, మిగిలిన రూ.8.50 లక్షలు అప్పుగా తీసుకోవచ్చు. తద్వారా ఆ మహిళలందరికీ ప్రయోజనం ఉంటుంది. ఇందుకు అనుగుణంగా పొదుపు సంఘాల మహిళలు తాము పొదుపు రూపంలో దాచుకున్న డబ్బులతో మొదట అంతర్గతంగా రుణాలు తీసుకుంటే, మిగిలిన మొత్తం బ్యాంకుల నుంచి అప్పు తీసుకునేలా సెర్ప్ ద్వారా మహిళలను ప్రొత్సహించే కార్యక్రమాలు చేపడుతున్నాం. పొదుపు సంఘాల పేరిట ఉండే మొత్తం పొదుపు నిధి రూ.11,291 కోట్లలో 80–90 శాతం నిధులను సంఘాల అంతర్గత రుణ వ్యవస్థలో వినియోగంలోకి తేచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం సెర్ప్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంపై నిరంతరం జిల్లాలతో సమీక్షిస్తున్నాం. – ఏఎండీ ఇంతియాజ్, సెర్ప్ సీఈవో -
‘పొదుపు’ డబ్బులపై మహిళలకు పూర్తి స్వేచ్ఛ!
సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల మహిళలకు మరింత ప్రయోజనం చేకూర్చే మరో చర్యకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. ఇప్పటివరకు ఆ మహిళలు బ్యాంకుల ద్వారా తీసుకుంటున్న రుణ మొత్తంలో దాదాపు మూడో వంతుకు సమానమైన డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో పొదుపు రూపంలో పోగుపడినప్పటికీ.. ఆ మొత్తానికి నామమాత్రపు వడ్డీని మాత్రమే పొందుతున్నారు. కానీ, బ్యాంకుల నుంచి మాత్రం అధిక వడ్డీకి అప్పులు తీసుకుంటున్నారు. మహిళలు తమ పొదుపు సంఘాల ఖాతాల్లో దాచుకున్న డబ్బులను వాడుకోవడానికి బ్యాంకులు ఆంక్షలు పెడుతున్నాయి. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 8.75 లక్షల పొదుపు సంఘాలు ఉండగా, వాటిల్లో మహిళలు ప్రతినెలా దాచుకున్న డబ్బులే ఇప్పుడు రూ.11,196 కోట్లకు పెరిగాయి. రాష్ట్రంలో మహిళా సాధికారిత కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత నాలుగేళ్లుగా తీసుకుంటున్న చర్యల ఫలితంగా మహిళలు గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రతినెలా క్రమం తప్పకుండా ఒకొక్కరు గరిష్టంగా నెలకు రూ. 200 వరకూ దాచుకుంటుండడంతో పొదుపు డబ్బులు భారీగా పెరిగాయి. మరోపక్క.. గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల మొత్తం రూ.30 వేల కోట్ల వరకూ ఉంటాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు తెలిపారు. అంటే మొత్తం పొదుపు సంఘాల రుణాల్లో మూడో వంతుకుపైగా పొదుపు సంఘాల మహిళలు దాచుకున్న డబ్బులు ఉన్నా, వాటిని వాళ్లు వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. సహజంగా పొదుపు ఖాతాలో ఉండే డబ్బులకు బ్యాంకులు నామమాత్రపు వడ్డీ ఇచ్చే పరిస్థితి ఉండగా, రుణాలపై వడ్డీ మాత్రం రెండు మూడింతల దాకా ఉంటోంది. ఈ రుణాలకు సంబంధించి ఆర్బీఐ నిబంధన 7.3.6 మేరకు సంఘాల పొదుపు డబ్బులపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని పేర్కొనప్పటికీ చాలా బ్యాంకులు ఆ నిబంధన పాటించడంలేదని సెర్ప్ కార్యాలయ దృష్టికి వచ్చింది. సీసీ విధానంలోనూ అదనపు భారంలేకుండా.. మహిళలు పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలకు సంబంధించి గత ఏడెనిమిది ఏళ్ల నుంచి సీసీ (క్యాష్ అండ్ క్రెడిట్ ) ప్రక్రియను బ్యాంకులు కొనసాగిస్తున్నాయి. ఈ విధానంలో రుణాలను గరిష్ట లోను మొత్తం మేరకు సీసీ ఖాతాలో అప్పుగా ఇచ్చినట్లు చూపి, ఆ మొత్తాన్ని సంఘం పొదుపు ఖాతాలో జమచేస్తున్నాయి. సీసీ విధానమంటే.. ఆ రుణ ఖాతాలోనే గరిష్ట లోను వరకు అవసరమైనప్పుడే డబ్బులు వినియోగించుకోవడం, ఆ వినియోగించుకున్న డబ్బులకు మాత్రమే వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే, బ్యాంకర్లు కొన్నిచోట్ల మహిళలు లోను మొత్తం అవసరంలేని సమయంలో కూడా రుణ ఖాతాలో మొత్తం లోను డబ్బులను తీసుకున్నట్లుగా చూపి, వాటిని ఆ సంఘ పొదుపు ఖాతాలో ఉంచేస్తున్నారు. దీనివల్ల అవసరంలేని డబ్బులకూ వడ్డీ భారం పడుతోంది. వడ్డీ తగ్గించాలన్న సీఎం జగన్.. ఇక పొదుపు సంఘాల మహిళలు తీసుకునే రుణాల అంశంలో రుణాలిచ్చే సమయంలో మహిళలపై వివిధ రకాల అదనపు భారాలేవీ లేకుండా చర్యలు తీసుకోవాలంటూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూణ్ణెళ్ల క్రితం బ్యాంకర్ల సమావేశంలో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా తీసుకుంటున్న చర్యలు కారణంగా మహిళల రుణాల చెల్లింపు ఇప్పుడు 99.5 శాతానికి పైగా పెరిగిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ తరుణంలో బ్యాంకర్లు వీలైనంత మేర పొదుపు సంఘాలకిచ్చే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలని సూచించారు. రుణాలు తీసుకునే ముందు సంఘాలలో ఉండే తమ పొదుపు డబ్బులను మహిళలు వినియోగించుకునే అవకాశం ఇవ్వకపోవడంతో పాటు.. చాలాచోట్ల సీసీ విధానంవల్ల జరుగుతున్న నష్టాన్ని ముఖ్యమంత్రి ఆ సమావేశంలో ప్రస్తావించి, పేద మహిళలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను కోరారు. ఈ విషయాన్ని కేంద్రానికి సైతం లేఖలు రాయడంతో కేంద్రం సైతం కదిలింది. క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్ర అధికారులు.. ఈ నేపథ్యంలో.. పొదుపు సంఘాల మహిళలు నష్టపోతున్న వైనంపై క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పొదుపు సంఘాల రుణ విభాగంలో పనిచేసే కీలక అధికారి రామ్బియాస్ గుప్తా రాష్ట్రానికి వచ్చారు. సెర్ప్ అధికారులతో కలిసి ఆయన గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పొదుపు సంఘాల మహిళలను కలిసి వివరాలు సేకరించారు. ఆ తర్వాత ఈనెల 12న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడిత రాజశేఖర్, రాష్ట్ర బ్యాంకర్ల సంఘం ఏజీఎం రాజాబాబుతో కలిసి ఆయన విజయవాడలో బ్యాంకర్ల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ మొత్తం వివరాలను ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ విభాగానికి సెర్ప్ కార్యాలయం తెలిపింది. 0.5 శాతం మహిళలు కూడా నష్టపోకూడదనే.. మన రాష్ట్రంలో ప్రత్యేకంగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ‘పొదుపు’ మహిళలు తీసుకునే రుణాలపై వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. సకాలంలో రుణ కిస్తీలు చెల్లించకుండా ఉంటున్న 0.5 శాతం మహిళలు సైతం నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సెర్ప్ అధికారులు వెల్లడించారు. త్వరలో సానుకూల నిర్ణయం వెలువడే అవకాశముందని వారు భావిస్తున్నారు. -
‘ఆసరా’ సంబరం.. ఊరూరా అంబరం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: వైఎస్సార్ ఆసరా రెండవ విడత సొమ్ము డ్వాక్రా సంఘాల మహిళల ఖాతాల్లో విజయవంతంగా జమ అవుతుండటాన్ని పురస్కరించుకుని అక్కచెల్లెమ్మలు ఊరూరా పండగ వాతావరణంలో సంబరాలు చేసుకుంటున్నారు. 2019 ఎన్నికల నాటికి వారి పేరిట బ్యాంకుల్లో అప్పు మొత్తాన్ని నాలుగు విడతల్లో ప్రభుత్వం చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 7వ తేదీ నుంచి శనివారం వరకు 6,10,262 పొదుపు సంఘాలకు రూ.4,923.33 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం రెండో విడతగా జమ చేసింది. శనివారం 1,35,430 సంఘాలకు సంబంధించి రూ.1,108 కోట్ల మొత్తాన్ని చెల్లించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ముందుగా ప్రకటించిన ప్రకారం.. సోమవారం మరో 1.45 లక్షల సంఘాలకు రూ.1,176 కోట్లు జమ చేసే అవకాశం ఉంది. దీంతో 12 జిల్లాల పరిధిలో లబ్ధిదారులందరికీ వైఎస్సార్ ఆసరా రెండో విడత డబ్బుల చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. బద్వేలు ఉప ఎన్నిక కారణంగా ఎన్నికల కోడ్తో వైఎస్సార్ జిల్లాలో ఈ చెల్లింపులు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. గతంలో చంద్రబాబులా మోసం చేయకుండా.. ఎన్నికల ముందు చెప్పినట్టు గత రెండేళ్లగా తమ పొదుపు సంఘాల అప్పు డబ్బును అందజేస్తున్న ముఖ్యమంత్రి పట్ల మహిళలు వివిధ రూపాల్లో తమ కృతజ్ఞతలు చాటుకుంటున్నారు. ఈ సొమ్ము పంపిణీ ప్రారంభమైన 7వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో లబ్ధిదారులు సంబరాలు కొనసాగిస్తున్నారు. శనివారం 12 జిల్లాల పరిధిలో 70 చోట్ల లబ్ధిదారుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఊరూరా సంబరాలు ► తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ తొర్రేడులో ఎంపీ, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్రామ్, కొత్తపేట మండలం వానపల్లిలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, అమలాపురం ఎంపీ చింతా అనురాధ, కాకినాడ డైరీ ఫారం సెంటర్, తుని మండలం గెడ్లబీడు, శంఖవరం వద్ద జరిగిన కార్యక్రమాల్లో కాకినాడ ఎంపీ వంగా గీత, అల్లవరంలో అమలాపురం ఎంపీ చింతా అనురాధ పాల్గొన్నారు. ఇతర ప్రాంతాల్లోనూ ఎమ్మెల్యేలు చెక్కులు పంపిణీ చేశారు. పలుచోట్ల సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ► పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేశారు. కొవ్వూరు మండలంలో మంత్రి తానేటి వనిత చెక్కులు పంపిణీ చేశారు. ► విశాఖ జిల్లా చోడవరంలో ఎంపీ బీవీ సత్యవతి, పెదబయలులో జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర చెక్కులు పంపిణీ చేశారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, విజయవాడలోని విద్యాధరపురం లేబర్కాలనీలో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక పాల్గొన్నారు. ► అనంతపురం జిల్లా సోమందేపల్లిలో మంత్రి శంకరనారాయణ, చిలమత్తూరులో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ► చిత్తూరు జిల్లా మదనపల్లె, పీలేరులో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. బంగారుపాళెం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి ఎంపీ రెడ్డెప్ప హాజరయ్యారు. ► ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందసలో మంత్రి సీదిరి అప్పలరాజు స్వయం సహాయక సంఘ సభ్యులకు వైఎస్సార్ ఆసరా చెక్కులు పంపిణీ చేశారు. -
మహిళా మార్ట్.. సరుకులు భేష్
ఒక్క ఆలోచన వేలాది మందికి తక్కువ ధరలకే నాణ్యమైన సరుకులు అందేలా చేసింది. అందరి చూపు ఆ మార్ట్పై నిలిచేలా పనితీరుతో ఆకట్టుకుంటోంది. ఎవరిపైనా పెట్టుబడి భారం పడకుండా చిన్నపాటి మొత్తంతో డ్వాక్రా సభ్యులే అంతాతామై నిర్వహించేలా ఆవిర్భవించిన జగనన్న మహిళా మార్ట్ ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.పేద ప్రజలకు తక్కువ ధరతో నాణ్యమైన వస్తువులు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఈ మార్ట్ ఏర్పాటైంది. సాక్షి, కడప: ప్రతి స్వయం సహాయక సంఘ సభ్యురాలి ద్వారా రూ.150 పెట్టుబడితో.. సుమారు రూ.12 లక్షల వ్యయంతో మహిళా మార్ట్ రూపుదిద్దుకుంది. బయట మార్కెట్ కంటే 20 శాతం తక్కువ ధరలకే సరుకులను అందిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇందులో కొంత మంది డ్వాక్రా సభ్యులకు ఉపాధి కల్పించడంతో పాటు సభ్యులందరికీ అదనంగా 2 శాతం రాయితీతో సరుకులను అందిస్తుండటం విశేషం. పెట్టుబడి పెట్టిన మహిళలందరికీ ఏడాదికి ఒకసారి బోనస్ రూపంలో సొమ్ము అందించాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ప్రణాళిక రూపొందించింది. పులివెందుల నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేలా పాత బస్టాండు సమీపంలోని మున్సిపల్ కాంప్లెక్స్లో ఈ మార్ట్ను ఏర్పాటు చేసి, స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా విజయవంతంగా నడుపుతున్నారు. తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందజేయడం ద్వారా పేదలకు అనుకూలంగా ఉంటుందన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు తోడు కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కృషితో ఈ మార్ట్ రూపుదిద్దుకుంది. ఏది కావాలన్నా హోల్ సేల్ ధరకే ప్రజల నిత్యావసరాలకు సంబంధించి ఏది కావాలన్న జగనన్న మహిళా మార్ట్లో లభిస్తుంది. డ్వాక్రా ఉత్పత్తులు, తిను బండారాలు (డ్వాక్రా మహిళలు తయారు చేసిన), ఒడియాలు, అప్పడాలు, డోర్ కర్టన్స్, నైటీలు, డోర్ మ్యాట్లు, చీపుర్లు అందుబాటులో ఉంచారు. పప్పుల దగ్గర నుంచి బెల్లం వరకు.. ఆవాల నుంచి అల్లం వరకు.. ప్రతి నిత్యావసర వస్తువు ఈ మార్ట్లో లభిస్తోంది. బయట మార్కెట్ కంటే ఇక్కడ ధర తక్కువ. హోల్సేల్ ధరకే సరుకులను అందించడంతో తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందింది. ప్రతినిత్యం డ్వాక్రా గ్రూపు సభ్యులతో పాటు ప్రజలు కూడా ఈ మార్ట్లో కొనుగోలు చేస్తుండటం నిత్యకృత్యంగా మారింది. 8 వేల మంది భాగస్వామ్యం పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 8 వేల మంది డ్వాక్రా గ్రూపు సభ్యులతో మాట్లాడి ఒక్కొక్కరి వద్ద రూ.150 చొప్పున వసూలు చేసి, రూ.12 లక్షల పెట్టుబడి సొమ్ముతో మార్ట్ను నెలకొల్పారు. 2021 జనవరి 3వ తేదీన కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్రెడ్డి, పాడా (పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ అనిల్కుమార్రెడ్డి, మెప్మా మేనేజింగ్ డైరెక్టర్ విజయలక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించారు. తర్వాత డ్వాక్రా గ్రూపులు పెరగడంతో మరో 5 వేల మంది సభ్యులు పెట్టుబడి సొమ్ము చెల్లించి భాగస్వాములయ్యేందుకు ముందుకు వచ్చారు. లాభాల్లో 60 శాతాన్ని రూ.150 చొప్పున పెట్టుబడి పెట్టిన ప్రతి మహిళకు ఏటా బోనస్ రూపంలో అందించనున్నారు. భారీగా వ్యాపారం ప్రస్తుతం ఈ మార్ట్లో వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రతి రోజు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు వ్యాపారం జరుగుతోంది. నెలలో ఐదారు రోజులు లక్ష రూపాయల వ్యాపారం సాగుతోంది. నెలకు సరాసరిన రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షల మేర వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయి. ప్రారంభించిన నాటి నుంచి ఈ రోజు వరకు ఎలాంటి సమస్యల్లేకుండా దినదినాభివృద్ధి చెందుతోంది. డ్వాక్రా సభ్యులకు రాయితీ కార్డులు పులివెందులలోని డ్వాక్రా మహిళలకు ప్రత్యేకంగా మార్ట్ పేరుతో గుర్తింపు కార్డులను ఇచ్చారు. జగనన్న మార్ట్కు వచ్చి సరుకులు కొనుగోలు చేసిన వారికి సొమ్ము మొత్తమ్మీద 2 శాతం రాయితీ ఇస్తున్నారు. ఉదాహరణకు రూ.3 వేల సరుకులు కొనుగోలు చేస్తే.. బయటి మార్కెట్తో పోలిస్తే అందరికీ 20 శాతం చొప్పున రూ.600 ఆదా అవుతోంది. దీనికి తోడు డ్వాక్రా మహిళలకు 2 శాతం అంటే రూ.60 అదనంగా మిగులుతోంది. మార్ట్లో ఏడుగురు డ్వాక్రా మహిళలకు ఉపాధి అవకాశం కల్పించారు. సరుకుల గ్రేడింగ్ మొదలు.. ప్యాకింగ్, బిల్లు కౌంటర్ వరకు డ్వాక్రా మహిళలే అన్ని పనులు చూస్తున్నారు. సరుకులు బాగున్నాయి జగనన్న మహిళా మార్ట్ అందరికీ అందుబాటులో ఉంది. ప్రధానంగా సరుకుల నాణ్యత చాలా బాగుంది. ఈ మార్ట్ను మహిళలే నిర్వహిస్తున్నారు కాబట్టి సరుకులు, వస్తువులను ఓపికగా అందిస్తున్నారు. ఏదీ కావాలన్న మార్ట్లో లభిస్తోంది. – ప్రియాంక (శ్రీసాయినగర్), పులివెందుల ఉపాధి లభించింది జగనన్న మహిళా మార్ట్ ప్రారంభించిన నాటి నుంచి ఇక్కడే పని చేస్తున్నా. సరుకుల గ్రేడింగ్ మొదలుకుని ప్యాకింగ్ వరకు అన్నీ చూసుకుంటాం. మెప్మా నుంచి ప్రతినెలా రూ.7,500 ఇస్తున్నారు. నాతోపాటు మరో ఆరుగురు ఇక్కడే ఉపాధి పొందుతున్నారు. నిత్యం సరుకుల కొనుగోలుకు ప్రజలు భారీగా వస్తున్నారు. – పుష్పలత, డ్వాక్రా గ్రూపు సభ్యురాలు, పులివెందుల తూకం, నాణ్యతలో కచ్చితత్వం జగనన్న మహిళా మార్ట్లో సరుకుల ధరలు తక్కువగా ఉన్నాయి. బయట మార్కెట్లతో పోలిస్తే చాలా వరకు ప్రయోజనం ఉంటోంది. తూకం, నాణ్యతలోనూ కచ్చితత్వం ఉంటోంది. మార్ట్ ప్రారంభించినప్పటి నుంచి మేము ఇక్కడే సరుకులు కొనుగోలు చేస్తున్నాం. ఈరోజు కూడా రూ.3 వేలతో సరుకులను కొనుగోలు చేశాం. – బోనాల కళావతి, పులివెందుల సరసమైన ధరలకే సరుకులు ఈ ఏడాది జనవరిలో జగనన్న మహిళా మార్ట్ను స్థాపించాం. డ్వాక్రా మహిళలకు కార్డులిచ్చి రాయితీపై సరుకులు అందిస్తున్నాం. ఇతర ప్రజలందరికీ కూడా తక్కువ ధరకే నాణ్యమైన వస్తువులు, సరుకులు అందిస్తున్నాం. డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించడమే కాకుండా వారి భాగస్వామ్యంతోనే ఈ మార్ట్ను ముందుకు నడిపిస్తున్నాం. ఏడాదికొకసారి పెట్టుబడి పెట్టిన ప్రతి డ్వాక్రా మహిళకు బోనస్ రూపంలో ఆదాయం పెంచుతాం. – పి.అబ్బాస్ ఆలీఖాన్,సిటీ మిషన్ మేనేజర్, మెప్మా, పులివెందుల -
‘సున్నా వడ్డీ’కి రూ.1,020 కోట్లు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల అప్పులపై వడ్డీ రూపంలో చెల్లించాల్సిన సుమారు రూ.1,020 కోట్లను అక్టోబర్ 2వ తేదీలోగా వారి అప్పు ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల కాలానికి మహిళల అప్పులపై వడ్డీగా చెల్లించాల్సిన డబ్బులను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఏ సంఘానికి ఎంత మొత్తం జీరో వడ్డీ కింద చెల్లిందన్న బ్యాంకు రశీదులను వలంటీర్ల ద్వారా అక్కచెల్లెమ్మల ఇంటి వద్ద అందజేయాలని నిర్ణయించింది. ‘ఎన్నికల రోజు వరకు అక్కచెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి నాలుగు దఫాలుగా నేరుగా వారికే అందిస్తాం. అంతేకాకుండా మళ్లీ సున్నా వడ్డీకి రుణాల విప్లవం తెస్తాం. బ్యాంకులకు ప్రభుత్వమే వడ్డీ డబ్బులు చెల్లిస్తుంది’ అని వైఎస్ జగన్ నవరత్నాల హామీల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఎన్నికలు జరిగిన ఏప్రిల్ 11వ తేదీ నాటికి పొదుపు సంఘాల పేరిట ఉన్న అప్పు మొత్తాన్ని ఏడాది తర్వాత నుంచి నాలుగు దఫాల్లో చెల్లించేందుకు ఇప్పటికే కసరత్తు మొదలైంది. వైఎస్సార్ ఆసరా పథకం అమలయ్యే వరకు అక్కచెల్లెమ్మలపై వడ్డీ భారం ఉండకూడదని ఆ డబ్బులను ప్రభుత్వమే ఎప్పటికప్పుడు బ్యాంకులకు జమ చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు తొలుత ఐదు నెలల డబ్బులను అక్టోబరు 2వ తేదీలోగా జమ చేయనుంది. ప్రతి నెలా వడ్డీ రూ.204 కోట్లు ఎన్నికలు జరిగిన ఏప్రిల్ 11 నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో రూ.27,168.83 కోట్ల అప్పులు ఉన్నట్టు బ్యాంకర్ల సంఘం నిర్ధారించింది. ఈ వివరాలతో సెర్ప్, మెప్మా అధికారులు రాష్ట్ర మంతటా సంఘాల వారీగా సమావేశాలు నిర్వహించి, ఏ సంఘానికి ఎంత అప్పు ఉందో తీర్మానం చేయించి, దానిని బ్యాంకు అధికారుల ద్వారా సర్టిఫై చేయిస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 99 శాతం సంఘాలతో సమావేశాలు నిర్వహించే ప్రక్రియ పూర్తయింది. సంఘాల వారీగా సమావేశాలు నిర్వహించిన అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో 6,01,132 సంఘాల పేరిట రూ.19,504 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 1,50,042 సంఘాల పేరిట రూ.4,587.71 కోట్లు అప్పు ఉన్నట్టు ఇప్పటి వరకు నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సంఘాల వారీగా ఉన్న అప్పుపై ప్రతి నెలా సుమారు రూ.204 కోట్లు వడ్డీ రూపంలో చెల్లించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. జీరోవడ్డీ పాస్ పుస్తకాలు సంఘం వారీగా ఉన్న అప్పు మొత్తం, దానిపై ప్రతి నెలా మహిళలు బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీ వివరాలతో పాటు ప్రభుత్వం ప్రతి నెలా వడ్డీగా బ్యాంకుకు చెల్లించిన రశీదు వివరాలు నమోదు చేయడానికి సెర్ప్, మెప్మా అధికారులు ప్రత్యేకంగా పాస్ పుస్తకాలను తయారు చేయిస్తున్నారు. అక్టోబరు 2వ తేదీ తర్వాత ప్రభుత్వం తొలి విడతగా సుమారు రూ.1,020 కోట్లు బ్యాంకుల్లో జమ చేసిన తర్వాత వాటికి సంబంధించిన రశీదులు మహిళలకు అందజేసే సమయంలోనే ఈ పాస్పుస్తకాలను కూడా పంపిణీ చేస్తారు. ఆ తర్వాత ప్రతి నెలా ప్రభుత్వం సంఘాల వారీగా బ్యాంకులకు చెల్లించిన జీరో వడ్డీ రశీదులను అందజేసి, సంఘాల వద్ద ఉండే ఆ పాస్ పుస్తకంలో ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. -
పొదుపు భేష్.. ఆరోగ్యమూ జాగ్రత్త
సాక్షి, ఇందూరు (నిజామాబాద్ అర్బన్): ఇప్పటి వరకు డ్వాక్రా మహిళలకు పొదుపు చేయడమే నేర్పించిన ఐకేపీ అధికారులు ఇకపై వారికి ఆరోగ్య సూత్రాలను నేర్పించనున్నారు. తీసుకునే ఆహారంతో పాటు ఎలాంటి జాగ్రత్తలు, పరిశుభ్రత పాటిస్తే మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడో వారికి అవగాహన కల్పించనున్నారు. మనిషి పుట్టిన నాటి నుంచి మరణించేంత వరకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే అసలైన ఆనందం, సంతోషం ఉంటుందని చెప్పడానికి, సామాజిక పరివర్తనలో మా ర్పు తేవడానికి ఆరోగ్యం–పోషణ అనే కార్యక్రమాన్ని ఐకేపీ శాఖ తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా ఒక గర్భిణీ తాను బిడ్డను ప్రసవించే వరకు, పుట్టిన బిడ్డ రెండు సంవత్సరాల వరకు పెరిగే వరకు మొత్తం వెయ్యి రోజుల ప్రాముఖ్యతను తెలియజెప్పనున్నారు. మొత్తం ఐదు అంశాలపై డ్వాక్రా మహిళలకు ప్రతీ నెలా వారి రెండవ సమావేశంలో ఐకేపీ సిబ్బంది అవగాహన కల్పిస్తారు. అయితే ఈ నెల నుంచే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఐకేపీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 11 మండలాలు ప్రాజెక్ట్గా.. జిల్లాలో 11 మండలాలను ప్రాజెక్టుగా తీసుకుని ఆ మండలాల్లోని మహిళా సంఘాల సభ్యులకు ఆరోగ్య సూత్రాలను తెలుపనున్నారు. ఆ మండలాల్లో ఆర్మూర్, బోధన్, డిచ్పల్లి, జక్రాన్పల్లి, కమ్మర్పల్లి, మాక్లూర్, మెండోరా, నవీపేట్, నిజామాబాద్ రూరల్, వేల్పూర్, ఎడపల్లి ఉన్నా యి. అయితే 11 మండలాలు కలిపి 787 వీవోలుండగా, 11,074 డ్వాక్రా గ్రూపులున్నాయి. ఈ మొత్తం గ్రూపుల్లో 1,13,216 మంది మహిళా సభ్యులున్నారు. అయితే ఐకేపీ అధికారులు ముందుగా జిల్లా స్థాయిలో ఏపీఎంలు, సీసీలకు శిక్షణ ఇస్తారు. జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన వారు మండల స్థాయిలో వీవోఏలకు శిక్షణ ఇవ్వనున్నారు. వీరు ప్రతీ నెలా డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పిస్తారు. వెయ్యి రోజుల ప్రాముఖ్యత మహిళ గర్భం దాల్చిన రోజు నుంచి బిడ్డకు రెండె సంవత్సరాలు నిండే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పిస్తారు. పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు తాగించాలి. ఆరు నెలల వరకు తల్లిపాలే పట్టాలి. ఆరు నెలలు నిండగానే తల్లిపాలతో పాటు తగినంత అనుబంధ పోషకాహారం అందించాలి. ఇను ము ఎక్కువగా ఉన్న ఆహారం, అయోడీన్ ఉప్పు, టీకాలు, శిశు సంరక్షణలో పరిశుభ్రతను వివరిస్తారు. పిల్లల పోషణకు పాటించే పద్ధతులు పిల్లల పోషణకై వారికి అందించే ఆహారం, టీకాలు, వయసుకు తగ్గ అందించే పోషకాల గురించి అవగాహన కల్పిస్తారు. ఎలాంటి ఆహారం పెట్టాలి, ఆహారం ఎలా ఇవ్వాలి, పరిశుభ్రతను వివరిస్తారు. శిశువుకు సరైన పద్దతిలో ఆహారం ఇస్తున్న తల్లులకు ‘స్టార్’ అమ్మ పేరుతో కండువా కప్పి సత్కరిస్తారు. చేతుల పరిశుభ్రత అనేక రుగ్మతలకు అపరిశుభ్రమైన వాతావరణం, చేతు లు సరిగ్గా కడగకపోవడం కారణాలవుతున్నాయి. చేతు లు సరిగ్గా కడుక్కోకున్నా క్రీములు మానవ శరీరంలోకి వెళ్లి వ్యాదుల సంక్రమణకు దారి తీస్తాయి. ఇందుకు ప్రతీ రోజు అన్నం తినే ముందు, మలమూత్ర విసర్జన, ఆటలాడిన తరువాత సబ్బుతో లేదా బూడిదతో చే తులు కడుక్కోవాలని సూచనలు చేస్తారు. చేతులు కడగడం వల్ల అంటు రోగాల సంక్రమణ, అతిసారం, ఊపిరితిత్తుల వ్యాధులను తగ్గిస్తుంది. శుభ్రమైన సమతుల్యమైన ఆహారం.. రోజు వారీగా తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు, న్యూట్రిన్లు, శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకునే విధానంపై మహిళా సభ్యులకు అవగాహన కల్పిస్తారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, కల్తీకి గురయ్యే ఆహారాలేంటీ ఇతర వివరాలను తెలియజేస్తారు. గుడ్లు, కోళ్లు, పప్పులు, పండ్లు, వెన్న, కూరగాయలు తీసుకోవడం వల కలిగే లాభాలను వివరిస్తారు. చెత్త నివారణ, పర్యావరణ పారిశుధ్యం అనేక సమస్యలకు మూల కారణం చెత్తే. ఈ చెత్తను నిర్మూలించడానికి, పర్యావరణ పారిశుధ్యం కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సభ్యులకు వివరిస్తారు. ఇళ్లను, పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవడం, తడి, పొడి చెత్తను వేరు వేరుగా వేయడంపై అవగాహన కల్పిస్తారు. -
వాస్తవాలు వెలుగులోకి
కొత్త ప్రభుత్వం వచ్చింది. సరికొత్త పథకాలు తీసుకువచ్చింది. ఎంతోమంది మహిళలకు ఆసరా కల్పించేందుకు తాజాగా పథకాలు ప్రారంభమవుతున్నాయి. ప్రతి పథకం సత్ఫలితాలనివ్వాలి. వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చాలి. అవినీతికి ఆస్కారం లేకుండా... పూర్తి పారదర్శకంగా... నిజమైన లబ్ధిదారులకే అవి చేరాలి. అందుకు పరిశీలన అవసరం. అందుకే ప్యూరిఫికేషన్ మొదలైంది. ఐటీడీఏ పరిధిలోని ఎనిమిది సబ్ప్లాన్ మండలాల్లో ఈ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. అసలైన సభ్యుల వివరాలు ఈ నెల 20లోగా కంప్యూటరీకరించే దిశగా పనులు కొనసాగుతున్నాయి. సాక్షి, కురుపాం(విజయనగరం) : ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సద్వినియోగం కావాలి. నిర్దేశించిన గడువులోగా వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలి. తద్వారా సర్కారు లక్ష్యం నెరవేరాలి. దానికి తగ్గట్టుగా డ్వాక్రా సంఘాలు పారదర్శకంగా ఉండాలి. అందులో లబ్ధిదారులు యాక్టివ్గా ఉండాలి. కానీ మరణించినవారు... స్థానికంగా లేనివారు... ఇంకా సంఘాల్లో కొనసాగుతున్నట్టే రికార్డుల్లో ఉన్నాయి. దానివల్ల కొన్ని చోట్ల అక్రమాలు కూడా జరుగుతున్నాయి. లేనివారి పేర్లతో లబ్ధిపొందుతున్న వారూ ఉన్నారు. వాటిని పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం పెద్దగా పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు ప్యూరిఫికేషన్ పేరుతో వాటిని చక్కదిద్దేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. మహిళా సంక్షేమమే లక్ష్యంగా పథకాలు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకోసం పెద్ద ఎత్తున పథకాలు ప్రవేశపెట్టారు. ప్రజాసంకల్ప పాదయాత్ర ద్వారా సమస్యలు తెలుసుకున్న వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తరువాత వాటిపై పథకాలు రూపొందించారు. నాలుగు విడతల్లో డ్వాక్రా రుణాల మాఫీ, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, అమ్మ ఒడి, నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50శాతం కేటాయింపు వంటివాటిపై చర్యలు చేపట్టారు. ఇవన్నీ నిజమైన లబ్ధిదారులకు అందితేనే సర్కారు లక్ష్యం నెరవేరుతుంది. ఇందులో భాగంగా 2009 నుంచి ప్రభుత్వ పథకాలను పొందుతున్న స్వయం సహాయక సంఘాల్లో వాస్తవాలు తేల్చేందుకు సెర్ఫ్ అధికారుల సూచనలతో వెలుగు అధికారులు రంగంలోకి దిగారు. గత ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపట్టక పోవడం వల్ల పసుపు కుంకుమ వంటి విషయాల్లో కొన్ని చోట్ల అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈసారి అలాంటి అవకాశం లేకుండా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల వివరాలు, వారి బ్యాంకు ఖాతాలు, ఆధార్, సంఘాలకు చెందిన కొత్త తీర్మానం, రేషన్ కార్డులు, ఫోన్ నంబర్ వంటివి సేకరించి కంప్యూటరీకరణ చేస్తున్నారు. సంఘాల్లో సభ్యులు మృతి చెందినా, మరొక ప్రాంతానికి వెళ్లిపోయినా వారి వివరాలను తొలగిస్తున్నారు. ఇలా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఎనిమిది సబ్ప్లాన్ మండలాల్లో ఉన్న 12,600 సంఘాలకు చెందిన 99,602 మంది స్వయం సహాయక సంఘ సభ్యుల వివరాలను సేకరించేందుకు అన్ని వెలుగు కార్యాలయాల్లో వెలుగు ఏపీఎం, సీసీ, వీఓఏలు, కంప్యూటర్ ఆపరేటర్లు నిమగ్నమయ్యారు. చురుగ్గా ప్యూరిఫికేషన్ సెర్ఫ్ సీఈఓ, ఐటీడీఏ అధికారులు ఇచ్చిన సూచనల మేరకు చురుగ్గా స్వయం సహాయక సంఘా ల ప్యూరిఫికేషన్ చర్యలు చేపడుతున్నాం. ఈ నెల 20వ తేదీలోగా లక్ష్యం పూర్తి చేయాల్సి ఉంది. ప్యూరిఫికేషన్ వల్ల ఇక సంఘాల్లో ఇప్పటికే మృతి చెందినవారు, వేరొక చోటకు వెళ్లిపోయిన వారిని తొలగించాల్సి ఉంటుంది. దీనివల్ల నిజమైన అర్హులకే ప్రభుత్వ పథకాలు వెలుగు ద్వారా పొందే అవకాశం ఉంది. – రామకృష్ణ, వెలుగు ఏపీఎం, కురుపాం మండలం -
నారీలోకం.. నీరాజనం
వైఎస్ఆర్ జిల్లా, బద్వేలు : డ్వాక్రా మహిళలు మాకే ఓటేశారు. పసుపు–కుంకుమతో వారిని ఆకట్టుకున్నాం... జనవరి నుంచి ఏప్రిల్ లోపు రూ.20 వేలు ఇచ్చాం... మాకు అడ్డులేదు. ఆడపడచులే మమ్మల్ని గెలిపిస్తారు... ఇది చంద్రబాబే కాదు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల ప్రచారం. ఇది వైఎస్సార్సీపీ నేతల్లో కొంత ఆందోళన కలిగించినా చివరకు వైఎస్ జగన్మోహన్రెడ్డికే నారీలోకం మద్దతు పలికారు. çపసుపు–కుంకుమతో వారిని ఏమార్చాలని చేసిన యత్నాలను తిప్పికొట్టారు. కనీసం డ్వాక్రా సంఘాల మహిళలు 5.66 లక్షల మంది ఓట్లు వేసినా టీడీపీకి ఓట్ల సంఖ్య కచ్చితంగా పెరిగేది. ఇదే జరిగితే లక్షల్లో పెరగాల్సిన ఓట్లు వేల సంఖ్యలో కూడా పెరగలేదు. ఆడపడుచులు చంద్రబాబు ఎత్తులను చిత్తు చేస్తూ పార్టీ అభ్యర్థులకు అండగా నిలిచారు. వైఎస్ జగన్ ప్రకటించిన వరాలకు ఆకర్షితులయ్యారు. చంద్రబాబుకు పసుపు పూసి వైఎస్ జగన్ను కుంకుమతో ఆశీర్వదించారని రాజకీయ విశ్లేషకులు చమత్కరిస్తున్నారు. వైఎస్సార్ సీపీకి జైకొట్టిన మహిళలు జిల్లాలో వైఎస్సార్సీపీ విజయం వెనుక మహిళమణులదే ప్రధాన భూమిక. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకోవాల్సిందే. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువమంది ఉన్నారు. జిల్లాలోని మొత్తం ఓటర్లు 20,56,660 ఉండగా అందులో పురుష ఓటర్లు 10,15,964, మహిళా ఓటర్లు 10,40,400, ఇతరులు 296 మంది ఉన్నారు. పురుషుల కంటే 24,436 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. గత నెల 11న జరిగిన ఎన్నికల్లో మొత్తం 17,02,981 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 8,29,063, మహిళలు 8,73,843 ఓటేశారు. పురుషుల కంటే మహిళలు 44,780 మంది అధికంగా ఉన్నారు. పోలైన ఓట్లలో వైఎస్సార్సీపీకి 10,18,141 మంది జై కొట్టగా టీడీపీకి 5,75,197 ఓట్లేశారు. పసుపు–కుంకుమతో మాయ జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ తరుఫున డ్వాక్రా సంఘాలు 35,856, మెప్మా తరుఫున 12,561 వేల సంఘాలున్నాయి. ఇందులో 4,66,440 మంది సభ్యులున్నారు. వీరిని లక్ష్యంగా చేసుకుని ఎన్నికల ముందు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో పసుపు–కుంకుమ–2 పథకాన్ని ప్రకటించి ఒక్కోకరికి రూ.10 వేల రూపాయల పోస్ట్ డేటేడ్ చెక్కులిచ్చి హంగామా చేశారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సభలు ఏర్పాటు చేసి గొప్పలు పోయారు. చంద్రబాబుకు అభినందనలంటూ మహిళలను బలవంతంగా విజయవాడ తీసుకెళ్లి నానా హింసలు పెట్టారు. మూడు చెక్కులను ఎన్నికలు సమీపించిన వేళ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో నగదును ఖాతాల్లో వేసేలా ప్రణాళిక వేశారు. మూడో విడత చెక్కులు ఎన్నికలకు ఆరు రోజులముందు బ్యాంకులో జమ చేసినా నగదు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఒప్పుకోలేదు. దీంతో అధికారులతో ఒత్తిడి చేయించి నగదు జమ చేయించాలని చూశారు. కొంతమందికి నగదు అందినా అధికశాతం మందికి మాత్రం ఖాతాల్లో జమ కాలేదు. బాబును నమ్మని మహిళలు 2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత వారికి మొండిచెయ్యి చూపారు. దీంతో మహిళలు తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారు. తిరిగి ఎన్నికలు సమీపించిన వేళ అధికారంలోకి వస్తే ఏటా పసుపు–కుంకుమ కింద రూ.10వేలు చొప్పున ఇస్తామని బూటకపుహామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి సెల్ఫోన్లు ఇస్తామని చెప్పుకొచ్చారు. మహిళలే లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వాగ్ధానాలను వారు నమ్మలేదు. తలకిందులైన అంచనాలు టీడీపీ అంచనాలు తలకిందుల చేస్తూ ప్రలోభాలతో తమను మాయ చేయలేరని ఓటర్లు నిరూపించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఓట్లు వేసి తగిన బుద్ధి చెప్పారు. గడిచిన ఎన్నికల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని, బ్యాంకుల్లో కుదువ పెట్టిన బంగారు నగలు, పుస్తెలతాడు పువ్వుల్లో పెట్టి ఇస్తామని ప్రచారంతో ఊదరగొట్టి గద్దెనెక్కాక హామీలను ఆటకెకికంచేసి వార్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. కనీసం వడ్డీలేని రుణ బకాయిలు చెల్లించలేదు. ఈ సొమ్ములనే పసుపు–కుంకుమ రూపంలో పంపిణీ చేసి లబ్ధి పొందాలని చూశారు. ఐదేళ్లలో పట్టించుకోకుండా ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన గిమ్మిక్కులను మహిళలు ఏ మాత్రం పట్టించుకోలేదు. మహిళల ఓట్లే అధికం పోలైన ఓట్లలో అధికశాతం డ్వాక్రా సభ్యులవే. పసుపు–కుంకుమ మాయలో మహిళల ఓట్లు పడిఉంటే టీడీపీకి అధికంగా ఓట్లు వచ్చేవి. జిల్లావ్యాప్తంగా వైఎస్సార్సీపీ, టీడీపీకి వచ్చిన ఓట్ల మధ్య వ్యత్యాసాన్ని చూస్తే ఇది స్పష్టమవుతోంది. డ్వాక్రా మహిళలే దాదాపు 4.66 లక్షలమంది ఉన్నారు. కానీ జిల్లాలోని టీడీపీ అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లు 5.76లక్షలు మాత్రమే. అదే సమయంలో వైఎస్సార్సీపీకి 10లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. వీటిని చూస్తే పురుషులతో పాటు మహిళలు అధికసంఖ్యలో వైఎస్ జగన్ను నమ్మారని అర్థమవుతోంది. పనిచేయని చంద్రబాబు ఎత్తులు మహిళామణుల ముందర పసుపు–కుంకుమ ఎత్తులు చిత్తు అయ్యాయి. ఎవరెన్ని చేసినా తాము అనుకున్నదే చేస్తామని నిరూపించారు. వైఎస్సార్సీపీ అఖండ విజయాన్ని అందించడంతో ముఖ్యపాత్ర పోషించారు. జిల్లా జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్న మహిళలు గెలుపు ఓటమిల్లో తమదైన పాత్ర ప్రదర్శించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్ని కుతంత్రాలు పన్నినా మగువలంతా వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పట్టం కట్టారు. చంద్రబాబును నమ్మలేకపోయారు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో డ్వాక్రా మహిళలు చంద్రబాబును నమ్మలేకపోయారు. ఈ ఎన్నికల్లో హామీలు ఇచ్చినా వాటి పరిస్థితి అంతేనని భావించారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ పార్టీ అభ్యర్థులకు భారీగా ఓట్లు వేశారు.– శారదమ్మ, జడ్పీటీసీ, పోరుమామిళ్ల -
పసుపు కుంకుమకు పైసల్లేవు..!
సాక్షి, అమరావతి/మైదుకూరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంత ఊదరగొట్టినా మూడో విడత పసుపు–కుంకుమ డబ్బులు డ్వాక్రా మహిళల చేతికి అందలేదు. అదిగో చెక్కు డబ్బులిస్తున్నారంటూ అధికార పార్టీ నేతలు, వారికి సహకరించే సెర్ప్ ఉన్నతాధికారులు డ్వాక్రా మహిళలపై ఒత్తిడి తెచ్చి బ్యాంకుల వద్దకు పరుగులు పెట్టించారు. తీరా అక్కడకు చేరుకున్న మహిళలు చివరకు ఉసూరుమన్నారు. రోజంతా బ్యాంకుల వద్ద పడిగాపులు పడేలా చేసి.. సాయంత్రానికి ఈ రోజు బ్యాంకులు చెక్కులే తీసుకుంటున్నాయి, డబ్బులు నాలుగైదు రోజుల్లో ఇస్తారని వెలుగు సిబ్బంది చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో కోప్రోదిక్తులైన మహిళలు బ్యాంకుల ముందు ధర్నాలు, ఆందోళనలు చేశారు. దీని ద్వారా ఎన్నికల్లో ఎంతో లబ్ధిపొందుదామనుకున్న టీడీపీ నేతలకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కానీ, ఏప్రిల్ ఐదవ తేదీతో ఇచ్చిన పోస్టు డేటెడ్ చెక్కులు మూడు నెలల్లోపు ఎప్పుడైనా బ్యాంకులో చెల్లుబాటు అవుతాయని డ్వాక్రా మహిళలకు నచ్చజెబుతున్నారు. చెక్కులు క్లియర్ అయితే డ్వాక్రా సంఘాలతో రాష్ట్రవ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు ఆదేశించారు. అందుకనుగుణంగా సెర్ప్ సీఈవో కృష్ణమోహన్ కూడా జిల్లాలో పనిచేసే ఏపీఎంలు, ఏరియా కోఆర్డినేటర్లు, సంఘమిత్ర–యానిమేటర్లకు సెల్ ఫోçను మేసేజ్ ద్వారా మెసేజ్లు పంపారు. లేని పక్షంలో ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. చెక్కులు వెనక్కి తీసుకున్న సిబ్బంది ఏకంగా సెర్ప్ సీఈవో పేరుతోనే ఆదేశాలు జారీ కావడంతో ఏప్రిల్ 8, 9 తేదీల్లో రాష్ట్రంలో డ్వాక్రా మహిళలను బ్యాంకుల వద్దకు రప్పించడానికి జిల్లాల్లో కిందిస్థాయి సిబ్బంది వారికి పంపిణీ చేసిన చెక్కులను బలవంతంగా వెనక్కి తీసేసుకున్నారు. ‘మేమే బ్యాంకుల్లో చెక్కులను జమ చేస్తాం.. మీరందరూ బ్యాంకులకు వచ్చి డబ్బులు తీసుకోండి’.. అని చెప్పారు. దీంతో సంఘాల్లో మహిళలు సోమవారం ఉ.10 గంటలకే బ్యాంకులకు క్యూకట్టారు. అక్కడ గంటల తరబడి పడిగాపులు పడ్డాక అధికారులు.. ‘ఇప్పుడు చెక్కులే తీసుకుంటాం.. డబ్బులు నాలుగు రోజులు ఆగాక ఇస్తాం’.. అని చెప్పడంతో మహిళలు తిట్టుకుంటూ వెనుతిరిగారు. ఎన్నికలయ్యాక మళ్లీ డబ్బులు ఇవ్వరేమోనని భయపడి తాము ఇంతమంది ఒకేసారి వచ్చామని విజయవాడ బందరు రోడ్డులోని టైమ్స్ ఆస్పత్రి సమీపంలో ఉన్న ఇండియన్ బ్యాంకు వద్ద కూలైన్లో నిలుచున్న భారతి అనే డ్వాక్రా సంఘం లీడరు ‘సాక్షి’కి వివరించారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని యర్రబాలెం, నవులూరు, బేతపూడి గ్రామాల్లో దాదాపు 420 డ్వాక్రా సంఘాల పేరిట ఇచ్చిన చెక్కులను యానిమేటర్లు వెనక్కి తీసుకున్నారు. సోమవారం వివిధ సంఘాలకు చెందిన 3.15 లక్షల చెక్కులను బ్యాంకుల్లో జమ అయ్యాయని సెర్ప్ సీఈవో కృష్ణమోహన్ తెలిపారు. మైదుకూరులో ధర్నా పసుపు–కుంకుమ కింద ఇచ్చిన మూడో విడత చెక్కులు చెల్లకపోవడంతో పొదుపు సంఘాల మహిళలు చంద్రబాబు సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని మైదుకూరులోని భారతీయ స్టేట్ బ్యాంకు సిబ్బంది చెప్పడంతో వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ బ్యాంకు ఎదుటే కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ.. రుణమాఫీ చేయకుండా చంద్రబాబు పసుపు–కుంకుమ పేరుతో చెక్కులు ఇవ్వడం శోచనీయమన్నారు. అయినా.. ఆ ఇచ్చేదేదో మూడు విడతల్లో ఇవ్వకుండా ఒకేసారి ఇచ్చి ఖాతాల్లో నేరుగా జమచేసి ఉంటే తమకు ఈ తిప్పలు ఉండేవి కావన్నారు. -
అక్క చెల్లెమ్మలకు వైఎస్సార్ ఆసరా
సాక్షి, విజయనగరం పూల్బాగ్: వైఎస్సార్ ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళల అప్పు మొత్తాన్ని నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికే ఇస్తామన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఒక్కొక్కరికి రూ.50వేల మొత్తాన్ని నాలుగు దఫాలుగా చెల్లిస్తారు. వడ్డీ లేని రుణాలను కూడా ఇప్పిస్తామని చెప్పడం మరింత ఊరట కలిగిస్తోంది. ఈ ప్రకటనపై నియోజకవర్గంలో ఉన్న డ్వాక్రా మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా జీవితాల్లో వెలుగులు వస్తాయని చెబుతున్నారు. చంద్రబాబును నమ్మి మోసపోయాం పొదుపు మహిళల రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పడంతో బ్యాంక్లో రుణాలు కట్టలేదు. నేటికీ రుణాలు మాఫీ చేయలేదు. నెల నెలా వడ్డీలు కడుతున్నాం. బాబు మాటలు నమ్మి మోసపోయాం. ఐదేళ్ల పాలనలో మహిళలకు మాయ మాటలు చెప్పి మోసగిస్తున్నారు. జగనన్న ప్రకటించిన వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాలతో మహిళలకు ఎంతో లబ్ది చేకూరుతుంది. – కాదులూరి లీలాత్రి, బూర్లి పేట, 38వవార్డు, విజయనగరం. బతుకులు బాగు పడతాయి.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా బతుకులు బాగుపడతాయి. రుణాలన్నీ మాఫీ చేస్తానని మాయ మాటలు చెప్పి చంద్రబాబు ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. పొదుపు రుణాలు మాఫీ అయితే కష్టాల నుంచి బయట పడినట్లు అవుతుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి మాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది. మహిళల కోసం జగన్ ప్రకటించిన పథకాలు బాగున్నాయి. – పండూరి మంగమ్మ, ఆబాద్వీధి, అశోక్నగర్ మహిళల జీవితాల్లో వెలుగు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితే మహిళల జీవితాల్లో వెలుగులు వస్తాయి. టీడీపీ మోసాలను మహిళలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. మా కష్టాలను తెలుసుకున్న జగనన్న అప్పు మొత్తాన్ని నాలుగు దఫాలుగా నేరుగా చేతికే అందజేస్తామని హామీ ఇవ్వడం శుభపరిణామం. వడ్డీ లేని రుణాలను అందించడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. – మహంతి లక్ష్మి, పూల్బాగ్కాలనీ, 3వవార్డు, విజయనగరం టీడీపీకి గుణపాఠం తప్పదు.. చంద్రబాబు మాటలు నమ్మి బ్యాంక్ రుణాలు కట్టకపోవడంతో వడ్డీలు చెల్లించాలని బ్యాంక్ అధికారులు మా పై ఒత్తిడి తీసుకువస్తున్నారు. చివరికి చేసేదేమీ లేక వడ్డీతో సహా చెల్లిస్తున్నాం. హామీ నెరవేర్చలేనప్పుడు మాఫీ చేస్తానని మాయ మాటలు చెప్పడం ఎందుకు? ఇచ్చిన డబ్బులు వడ్డీ చెల్లించేందుకు కూడా సరిపోలేదు. టీడీపీకి ఈ సారి గుణపాఠం తప్పదు. – పి.శ్రీదేవి, అశోక్నగర్, విజయనగరం -
ఎన్నికల తాయిలాలు షురూ..
సాక్షి,తిరుపతి తుడా: తిరుపతి నగరంలో ఎన్నికల తాయిలాలు అప్పుడే మొదలయ్యాయి. ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనే విషయంపై టీడీపీ అధిష్టానం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. అయినా ఎమ్మెల్యే సుగుణమ్మ మరోసారి తాను అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం వస్తుందనే నమ్మకంతో ప్రలోభాలకు తెరతీశారు. డ్వాక్రా సంఘాల రిసోర్స్ పర్సన్లు, ఆయా గ్రూపుల్లో కీలకంగా వ్యవహరించే లీడర్లను మచ్చికవేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. తమ మాట వినే ఒక్కో ఆర్పీకి, గ్రూప్ లీడర్లకు చీర, రవిక, స్వీట్ బాక్స్లను అందించారు. అలానే పార్టీ సానుభూతిపరులై ఆయా ప్రాంతాల్లో కీలకంగా ఉన్న మహిళలను గుర్తిం చారు. అలాంటి వారిని పార్టీ కార్యాలయానికి పిలిపించి గిఫ్ట్బాక్స్లను అందిస్తున్నారు. సీఎం సభకు రావాలని ఒత్తిడి.. రాష్ట్ర ప్రభుత్వం, పాలకులు డ్వాక్రా మహిళలను బానిసల్లా చూస్తున్నారు. టీడీపీ కార్యక్రమం జరిగినా, ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తున్నా సభలకు, సమావేశాలకు రావాలని డ్వాక్రా మహిళలపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తీసుకోవడంలేదా?, సభకు రాకుంటే పేరును బ్లాక్ సిస్ట్లో పెడతాం అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. మెప్మా సిబ్బందితోపాటు అధికార పార్టీ నాయకులు గ్రూపులు వారీగా ఫోన్ నెంబర్లను సేకరించి ఫోన్ చేస్తూ సోమవారం నిర్వహించే సీఎం సభకు రావాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. శివరాత్రి, సెలవు కావడంతో పిల్లలు ఇంట్లో ఉంటారు వచ్చేందుకు కుదరదని మహిళలు వేడుకుంటున్నా మెప్మా సిబ్బంది వేధిపులకు గురి చేస్తున్నారు. ‘మీ పేరు బ్లాక్ íలిస్ట్లో పెడతాం. చెక్ రాకుండా చేస్తాం’ అంటూ మహిళలకు వ్యక్తిగతంగా వేదిస్తున్నారు. గ్రూపుల వారీగా సీఎం సభకు వచ్చి ప్రాంగణంలో గ్రూప్ ఫొటోలు తీసుయించుకుని మెప్మా గ్రూప్లో పోస్టు చేయాలని హుకుం జారీ చేశారని కొంత మంది మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చెల్లింపులేవి బాబూ!
సాక్షి ప్రతినిధి, ఏలూరు, ఆకివీడు: ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న డ్వాక్రా సంఘాలకు అన్యాయం జరుగుతోంది. మహిళల కష్టార్జితానికి రెక్కలు వస్తున్నాయి. మహిళల సాధికారతకు కట్టుబడి ఉన్నట్టు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇవ్వాల్సిన డబ్బులు దారి మళ్లిస్తోంది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ నాయకులకు ఇసుక ర్యాంపులు అప్పగించి డబ్బులు కూడబెట్టుకునేలా చేశారు. ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ద్వారా వచ్చే డబ్బులను డ్వాక్రా సంఘాలకు ఇవ్వకుండా ప్రభుత్వమే వాడేస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 193 ధాన్యం కొనుగోలు కేంద్రాలు డ్వాక్రా మహిళల ఆధీనంలో నడుస్తున్నాయి. కొనుగోలు చేసిన ధాన్యం క్వింటాలుకు రూ.30 చొప్పున కమీషన్ రూపంలో కేంద్రాలకు చెల్లిస్తారు. నాలుగేళ్లుగా సుమారు లక్ష మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ ప్రకారంగా కేంద్రాలకు రూ.36 కోట్లు కమీషన్లుగా ఆయా డ్వాక్రా గ్రూపులకు మంజూరయ్యాయి. ఈ ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గత 2014–15, 15–16 సంవత్సరాల్లో రూ.16 కోట్లు కమీషన్ల రూపంలో సివిల్సప్లయిస్ శాఖ డీఆర్డీఏకు బదిలీ చేసింది. గ్రామ సంఘాల పరిధిలోని మహిళలు కమీషన్ సొమ్మును పంచుకోవలసి ఉంది. 2016–17, 17–18 సంవత్సరాలకు మరో రు.20 కోట్లు కమీషన్ల రూపంలో పౌరసరఫరాల శాఖ నుండి రావాల్సి ఉంది. వీటిని కూడా ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో కలిపి భవనాల నిర్మాణాలకు మళ్లించేశారు. ఐకేపీ కేంద్రాల నుంచి మిల్లర్లకు సరఫరా చేసేందుకు ఇవ్వాల్సిన రవాణా ఖర్చులను కూడా వారికి ఇవ్వడం లేదు. గత నాలుగున్నరేళ్లుగా మహిళలకు కమీషన్ల రూపంలో ఒక్క పైసా చెల్లించిన దాఖలాలు లేవు. కేంద్రాల్లో పనిచేసే మహిళలకు మాత్రం ప్రతి రోజూ రూ.500 చొప్పున కూలి కేటాయించి చెల్లిస్తున్నారు. వీటితో పాటు ఆఫీసు మెయింటెనెన్స్, అద్దెలు తదితర వాటికి బిల్లులు చెల్లిస్తున్నారు. మిగిలిన సొమ్ము ప్రభుత్వం దారి మళ్లించి, ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగిస్తోంది. ఒకొక్క గ్రామ సంఘ భవనానికి రూ. 6 లక్షలు, మరో రూ.6 లక్షలు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులు, మండల సమాఖ్య భవనానికి రూ.7 లక్షలు కమీషన్ సొమ్ముతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులు రూ.13 లక్షలు కలిపి రూ.20 లక్షలతో మండల సమాఖ్య భవనాలు నిర్మిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 700 భవనాల నిర్మాణం వివిధ దశల్లో ఉండగా, 184 గ్రామ సంఘ భవనాలు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. నిర్వహణ ఖర్చులపై ఆసక్తి ఉదయం 9 గంటల నుండి సాయింత్రం 5 గంటల వరకూ ఐకేపీ కేంద్రాల్లో ఉంటూ, ధాన్యం కొనుగోలు నిర్వహణ బాధ్యతలు చేపట్టడంతో మహిళలకు రూ.500 కూలి చెల్లిస్తున్నారు. దీంతో అక్కడ పనిచేసే మహిళలు కనీసం కూలి డబ్బు అయినా వస్తుందని ఆశతో పని చేస్తున్నారు. నిర్వహణ వ్యయం ప్రభుత్వం చెల్లించడంతో ఆ సొమ్ముతో డ్వాక్రా మహిళల్లో విభేదాలు కూడా తలెత్తుతున్నాయి. పర్మినెంట్ అవుతుందని ఆశ ఐకేపీ కేంద్రాల్లో పనిచేస్తే తమ ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తారని కొంత మంది మహిళలు ఆశతో కేంద్ర నిర్వహణకు ఆసక్తి చూపుతున్నారు. గ్రామ సమాఖ్యలోని సభ్యులు నిర్వహణా బాధ్యతల కోసం ఆరాటపడుతున్నారు. ఏటా నిర్వహణ బాధ్యతను కొత్త గ్రూపులకు ఇవ్వాల్సి ఉండగా, స్థానిక తెలుగుదేశం నాయకులు, ప్రజాప్రతినిధులు తమకు ఇష్టమైన గ్రూపులకు కేటాయించి కేంద్రాలపై అజమాయిషీ పొందుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయతీలకు కేటాయింపు పంచాయతీల్లో ఫర్నిచర్ కొనుగోలుకు రూ.2 లక్షల చొప్పున ఐకేపీ కమీషన్ల సొమ్మును దారి మళ్లించారు. పంచాయతీల పరిధిలో ఈపోస్, కంప్యూటర్లు, ఫర్నిచర్, ప్రింటర్ తదితర వాటిని కొనుగోలు చేశారు. ఆయా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పంచాయతీలకు చేరింది. ఇసుక అమ్మకాలపైనా ఇదే దందా! డ్వాక్రా మహిళలకు ఇసుక ర్యాంపులు కేటాయించి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామని ప్రభుత్వం భజన చేసింది. అయితే ఇసుక అమ్మకాలపై తెలుగు తమ్ముళ్లు మహిళా గ్రూపుల్లో తలదూర్చి వారిని పక్కనపెట్టి ఇసుక మాఫియాను ఏర్పాటు చేశారు. దీంతో ఇసుక ర్యాంపుల కేటాయింపును ప్రభుత్వం రద్దు చేసింది. తదనంతరం మాఫియా గుప్పిట్లోకి ఇసుక ర్యాంపులు వెళ్లిపోయాయి. కమీషన్ సొమ్ము ఉచితంగా ఇవ్వరు గ్రామ సంఘాలకు వచ్చే కమీషన్ సొమ్మును వ్యక్తిగతంగా పంపిణీ చేయరు. ఆ సొమ్ము గ్రామ సంఘాల ఖాతాల్లో నిల్వ ఉంటుంది. వడ్డీలకు తీసుకుని సభ్యులు వినియోగించుకోవచ్చు. నాలుగున్నర ఏళ్లుగా కమీషన్ సొమ్ము ఎవరికీ పంచలేదు. గ్రామసంఘాల, మహిళా సమాఖ్య భవనాలకు రూ. 6 లక్షలు, పంచాయతీలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ.2 లక్షలు చొప్పున కేటాయించాం. – వడ్డి రాజ్యలక్ష్మి, అధ్యక్షురాలు, మహిళా సమాఖ్య, ఆకివీడు -
‘మహానాయకుడు’ ఇంతగా దిగజారిపోయిందా..?
పశ్చిమగోదావరి, నిడదవోలు రూరల్: ఎన్టీఆర్ బయోపిక్ ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాకు ప్రజల నుంచి ఆశించినంతగా స్పందన లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి డ్వాక్రా మహిళలు, టీడీపీ నాయకులు కోసం ఉచిత షోలు వేస్తున్నారు. ఈనెల 25 ఉదయం, మ్యాట్నీ షోలతో పాటు, 26న నాలుగు షోలలో కూడా తమ పార్టీ నేతలకు, డ్వాక్రా మహిళలకు 50 శాతం టికెట్లు కేటాయించాలన్న టీడీపీ అదేశాలతో ఉషా పిక్చర్ డిస్ట్రిబ్యూటర్స్ సినిమా థియేటర్ల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆయా పట్టణాల్లోని కౌన్సిలర్లతో పాటు టీడీపీ నాయకులు, డ్వాక్రా యానిమేటర్లు, డ్వాక్రా మహిళలకు సినిమా చూపించేందుకు ఏర్పాట్లు చేశారు. సినిమాను టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ రాజకీయ ప్రయోజనాల కోసం తీయడంతోపాటు చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాన్ని తెరకెక్కించకపోవడంతో సినిమా డిజాస్టర్ అయిందని ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకులతో జరిగిన టెలి కాన్ఫరెన్స్లో ఈ సినిమాను అందరికీ చూపించాలని సీఎం చంద్రబాబు ఆదేశించటంతో టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఉచిత షోలు వేసేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిసింది. ఇప్పటికే డ్వాక్రా మహిళలను టీడీపీ కార్యక్రమాలను ప్రచారం చేసేందుకు సాధికార మిత్రలుగా నియమించారు. ఇటీవల పోలవరం, అమరావతి చూసేందుకు బస్సుల్లో తరలించగా, ఇప్పుడు సినిమాలకు తప్పనిసరిగా రావాలని ఆదేశాలు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. డ్వాక్రా గ్రూపులకు ఇచ్చిన పోస్ట్ పెయిడ్ చెక్కుల విషయంలో ఎక్కడ ఇబ్బంది పెడతారోనని తప్పని పరిస్థితుల్లో వారి మాట వినాల్సి వస్తోందని డ్వాక్రా సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
డ్వాక్రా మహిళలపై మంత్రి పరిటాల వర్గీయులు దాడి
-
ఫోర్జరీ కేసులో టీడీపీ మహిళా నేత అరెస్టు
సాక్షి, గన్నవరం: డ్వాక్రా గూపు సభ్యురాలి సంతకాల ఫోర్జరీతో ధాన్యం కొనుగోలు లావాదేవీలు చేసిన టీడీపీ జన్మభూమి కమిటీ సభ్యురాలు, ఆమె కుమార్తెపై కోర్టు ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. గన్నవరం మండలం దావాజిగూడెం ఉజ్వల గ్రామ సమాఖ్య సంఘంలోని రసూల్ స్వయం సహాయక సంఘంలో షేక్ రిజ్వానా సభ్యురాలిగా ఉన్నారు. ఆమె ఆంధ్రా బ్యాంక్ ఖాతాలో 2016, ఫిబ్రవరిలో మూడుసార్లు మొత్తం రూ.7.60 లక్షలు జమయ్యాయి. దీనిపై అప్పటి గ్రామ సమాఖ్య సంఘం అధ్యక్షురాలు, ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్చార్జి గొంది నాగరాజు(రాణి)ను ఆమె ప్రశ్నించగా.. . బ్యాంక్ ఖాతాలు లేని రైతుల ధాన్యం కొనుగోలు మొత్తాన్ని జమచేసేందుకు రిజ్వానా అకౌంట్ ఇచ్చినట్లు సమాధానమిచ్చింది. రిజ్వానా తన ఖాతాలోని నగదు డ్రా చేసి రాణికి, ఆమె కుమార్తె గొంది ప్రగతికి ఇచ్చింది. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రంలో రూ.కోట్ల అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో తన పేరిట జరిగిన ధాన్యం విక్రయ పత్రాల్ని రిజ్వానా పరిశీలించగా.. ట్రాక్షీట్, రైతు కొనుగోలు ధ్రువపత్రం, రైతు చెల్లింపు తదితర పత్రాలపై ఆమె సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించింది. దీనిపై జిల్లా కలెక్టర్, వెలుగు అధికారులకు ఫిర్యాదు చేయడంతో.. వెలుగు అధికారులు విచారణ జరిపి రిజ్వానా సంతకం ఫోర్జరీ చేసినట్లు నిర్ధారించారు. ఈ వ్యవహరంపై గతేడాది నవంబర్ 16న ఆమె గన్నవరం సీఐ, విజయవాడ సీపీతో పాటు జిల్లా కలెక్టర్, డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో గన్నవరంలోని 11వ మెట్రోపాలిటన్ కోర్టును ఆశ్రయించారు. సీఆర్పీసీ సెక్షన్ 200 కింద గొంది నాగరాజు(రాణి), ఆమె కుమారై గొంది ప్రగతిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గన్నవరం పోలీసులను కోర్టు ఆదేశించింది. రెండు వారాల అనంతరం పోలీసులు సోమవారం వీరిద్దరిపై సెక్షన్ 420, 468, 471, 477, 506, 120(బి) రెడ్విత్ 34 కింద కేసులు నమోదు చేశారు. -
అప్పు ఇస్తూ ఎన్నికల డప్పు!
సాక్షి, అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మహిళలను మోసగించడానికి ఎత్తులు వేస్తున్నారు. పట్టపగలే చుక్కలు చూపిస్తూ మరోసారి అధికారంలోకి రావడానికి పాచికలు విసురుతున్నారు. రుణాలు ఎవరూ కట్టాల్సిన అవసరం లేదని, అధికారంలోకి రాగానే ‘మాఫీ’ చేస్తామని 2014 ఎన్నికల ముందు చెప్పిన ఆయన అధికారంలోకి వచ్చాక మాఫీ చేసిన తీరు చూసి అటు రైతులు, ఇటు డ్వాక్రా సంఘాల మహిళలు నిర్ఘాంతపోయారు. ఆయన మాటలు నమ్మి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇప్పుడు నాలుగున్నరేళ్ల తర్వాత.. ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగనున్న సమయంలో మరోమారు మహిళలకు ఎన్ని‘కల’ తాయిలాలు ప్రకటిస్తున్నారు. అధికారంలోకి రావాలని కొత్త ఎత్తుగడ సీఎం చంద్రబాబు తాజాగా ‘పసుపు – కుంకుమ’ కింద ఒక్కో డ్వాక్రా మహిళకు రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ మొత్తం అప్పుగా ఇస్తున్నప్పటికీ, ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడం లేదు. రాష్ట్రంలోని 93.80 లక్షల మందికి రూ.9,380 కోట్లు ఇస్తామని చెప్పారు. ఫిబ్రవరిలో తొలిదఫాలో రూ.2,500, రెండో దఫాలో రూ.3,500, మూడో దఫాలో రూ.4 వేల చొప్పున మహిళల ఖాతాల్లో జమ అయ్యేలా పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తామని చెప్పారు. ఈ డబ్బును మూడు దఫాల్లో ఇస్తామని చెబుతున్న చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోయేందుకు తాము సిద్ధంగా లేమని డ్వాక్రా సంఘాల మహిళలు చెబుతున్నారు. ఫిబ్రవరి మూడు లేదా నాలుగో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ స్థితిలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తే ఎన్నికల కమిషన్ దీన్ని తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉందని ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ విషయం తెలిసే చంద్రబాబు దీనిని ప్రకటించారని, నెపం ఎన్నికల కమిషన్పై వేసి లబ్ధి పొందాలని చూస్తారని ఓ అధికారి అన్నారు. అప్పుల ఊబిలో మహిళలు విలవిల 2014 ఎన్నికల ముందు చెప్పిన విధంగా డ్వాక్రా రుణ మాఫీ సాధ్యం కాదని అధికారం చేజిక్కించుకున్నాక చంద్రబాబు చావుకబురు చల్లగా చెప్పారు. మాఫీకి బదులు పెట్టుబడి నిధిగా సంఘంలోని ఒక్కో మహిళకు రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ మొత్తం కూడా రూ.3 వేలు, 3 వేలు, 2 వేలు, 2 వేలు ఇలా నాలుగు దఫాలుగా అందజేశారు. బాబు వాగ్దానాన్ని నమ్మిన మహిళలు రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకర్లు నోటీసులిచ్చారు. నగలు వేలం వేశారు. కోర్టుల చుట్టూ తిప్పారు. ఖాతాల్లో ఉన్న డబ్బులను కూడా వడ్డీ రూపంలో జమ చేసుకున్నారు. దీంతో చాలా మంది మహిళలు తాము తీసుకున్న రుణాలపై వడ్డీలు చెల్లించేందుకే తిరిగి అప్పులు చేయాల్సి వచ్చింది. వైఎస్సార్ చేయూత, ఆసరా వైపే మహిళలు చంద్రబాబు ప్రభుత్వం ఇస్తానంటున్న రూ.10 వేల కంటే ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో ఒకటైన ‘వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా వైపే మహిళలు మొగ్గు చూపుతున్నారు. 45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి వరుసగా నాలుగేళ్లలో నాలుగు దఫాలుగా రూ.75 వేలు ఉచితంగా అందజేస్తామని జగన్ హామీ ఇచ్చారు. అలాగే ఎన్నికల రోజు వరకు డ్వాక్రా మహిళలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికే అందిస్తామని కూడా భరోసా ఇచ్చారు. ఈ హామీలపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాబు మాటలు నమ్మేది లేదని, నమ్మి మోసపోయింది చాలని అంటున్నారు. మళ్లీ మోసపోవడానికి సిద్ధంగా లేము డ్వాక్రా రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రూ.10 వేలు ఇస్తామని చెబుతున్నారు. ఈ డబ్బులు పూర్తిగా ఇస్తారనే నమ్మకం మాకు లేదు. ఒకసారి మోసపోయాం. మళ్లీ మళ్లీ మోసపోవడానికి సిద్ధంగా లేము. – కంచికచర్ల పద్మావతి, డ్వాక్రా మహిళ, పరిటాల, కృష్ణా జిల్లా నాటి హామీ ఏమైంది? ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోనే సీఎం చంద్రబాబుకు మహిళలు గుర్తుకు వస్తారు. నాడు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని వాగ్దానం చేసి తర్వాత మాట మార్చారు. ఇప్పుడు మళ్లీ రూ.10 వేలు అంటూ తాయిలాలు ప్రకటిస్తున్నారు. నిజంగా సీఎంకు చిత్తశుద్ధి ఉంటే రూ.10 వేలను ఒకేసారి ఇవ్వాలి. – కృష్ణా వీరనారాయణమ్మ, డ్వాక్రా మహిళ, గండేపల్లి, కృష్ణా జిల్లా ఎప్పుడో చేతికందేలా చెక్కులేంటి? ఎన్నికల ముందు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అని ఓట్లు వేయించుకున్న చంద్రబాబు ఆ తర్వాత నిండా ముంచారు. నాలుగున్నరేళ్ల పాటు ఏమాత్రం పట్టించుకోకుండా ఇప్పుడు తగుదునమ్మా అంటూ పసుపు–కుంకుమ పేరుతో మా వద్దకు వస్తున్నారు. రూ.10 వేలు ఇవ్వాలనుకుంటే ఒకేసారి నగదుగా ఇవ్వొచ్చుగా? ఎప్పుడో చేతికందేలా చెక్కులేంటి? ఇక చంద్రబాబును నమ్మే స్థితిలో డ్వాక్రా మహిళలు లేరు. – మూడెడ్ల ఉమా, డ్వాక్రా మహిళ, గుడివాడ, కృష్ణా జిల్లా జగన్ రూ.75 వేలు ఇస్తామంటున్నారు డ్వాక్రా రుణ మాఫీ చేస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన మాట తప్పే నాయకుడు కాదు. జగన్ అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళలకు మేలు జరుగుతుంది. చంద్రబాబు మాటలు నమ్మి ఇప్పటికే మోసపోయాం. ఇకపై మోసపోయే పరిస్థితి లేదు. రుణమాఫీని ఏమార్చి పసుపు–కుంకుమ అని ఎప్పుడో చెల్లేలా బాబు చెక్కులు ఇస్తే వాటిని ఏం చేసుకోవాలి? – మాదాసు వెంకటలక్ష్మి, గుడివాడ, కృష్ణా జిల్లా -
డ్వాక్రా మహిళలకు చంద్రబాబు మరో టోకరా
సాక్షి, అమరావతి : ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మహిళల ఓట్ల కోసం పదివేల పథకం పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు సరికొత్త డ్రామాకు తెరలేపారు. డ్వాక్రా మహిళలకు చంద్రబాబు మరో టోకరా ఇచ్చారు. నిన్నటి వరకు డ్వాక్రా మహిళలకు పదివేలు చొప్పున ఇస్తున్నట్టు విస్తృతంగా ప్రచారం చేశారు. ఈరోజు అమలు దగ్గరికి వచ్చే సరికి పోస్ట్ డేటెడ్ చెక్కులిచ్చి చేతులు దులుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరిలో చెక్కులు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక డబ్బులు ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. పదివేలను ఒక్కసారిగా ఇవ్వమని చెబుతున్న రాష్ట్రప్రభుత్వం మూడు విడతలుగా, అంటే ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు ప్రజలను ప్రభావితం చేసేలాగా ఈ ప్లాన్ రెడీ చేసింది. ఇందులో కూడా ఎక్కడా నగదు చెల్లింపులు లేకుండా ఫిబ్రవరిలో డ్వాక్రామహిళలకు మూడు చెక్కులు ఇవ్వబోతున్నారు. వీటిలో ఒక చెక్కు ఫిబ్రవరికి సంబంధించి రూ. 2500, మార్చినెలకు సంబంధించి రూ.3500, ఏప్రిల్ నెలకు సంబంధించి రూ. 4000 పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తామని చెబుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ పథకాల్లో పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి నిధులు ఇస్తామనే సందర్భాలు ఎక్కడా ఉండవు. ప్రభుత్వ తీరుపై డ్వాక్రామహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు సంవత్సరాల నుండి ఏపీలో వడ్డీలేని రుణాల పథకాన్ని అమలు చేయడం లేదు. ఆగిపోయిన వడ్డీలేని రుణాలు రూ.2200 కోట్ల బకాయిలనే ఇవ్వకుండా వాటినే ఫిబ్రవరిలో చెక్కురూపంలో పసుపుకుంకుమ అనే పేరుతో కొత్త పథకంగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. గతంలో కూడా రూ. 14200 కోట్ల రుణమాఫీకి ప్రభుత్వం ఎగనామం పెట్టిన విషయం తెలిసిందే. -
చంద్రబాబు డ్వాక్రా మహిళలకు మరో టోకరా
-
టీడీపీ సేవకు డ్వాక్రా!
సాక్షి, అమరావతి బ్యూరో: డ్వాక్రా సంఘాలను అధికార పార్టీ సానుభూతిపరులతో నింపేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధ మైంది. 60 ఏళ్లు దాటిన డ్వాక్రా మహిళలను సంఘాల నుంచి బలవంతపు తీర్మానాల ద్వారా తప్పిస్తూ ఆ స్థానంలో తనకు అనుకూలమైన వారిని చేర్చుకునే కార్యక్రమానికి తెర తీసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.70 కోట్ల కుటుంబాలు, 3.60 కోట్ల మంది ఓటర్లున్నారు. వీరందరినీ అధికార పార్టీకి అనుకూలంగా ప్రభావితం చేసేందుకు ప్రతి 100 మంది ఓటర్లకు ఆర్టీజీఎస్ ఆధ్వర్యంలో ఓ ఇన్చార్జిని నియమించారు. ఆ ఇన్చార్జి ఆధ్వర్యంలో పనిచేయాలంటూ డ్వాక్రా మహిళలపై తీవ్రంగా ఒత్తిళ్లు తెస్తున్నారు. అయితే ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసేందుకు పలువురు మహిళలు నిరాకరిస్తున్నారు. దీంతో వీరిని తొలగించి తమవారిని నియమించుకునే ఎత్తుగడ వేశారు. దీన్ని అమలు చేయటంలో భాగంగా 60 ఏళ్లు దాటిన డ్వాక్రా మహిళలను సంఘాల నుంచి తప్పించాలనే అంశాన్ని సర్కారు తెరపైకి తెచ్చింది. వీరి స్థానంలో తమకు అనుకూలమైనవారిని, టీడీపీ అనుబంధ సంఘాలకు చెందినవారిని, నేరుగా తమ మనుషులను సంఘాల్లో నియమించుకోవాలని సర్కారు ఎత్తుగడ వేసింది. కుప్పకూలుతున్న డ్వాక్రా వ్యవస్థ వయసు పైబడినా క్రియాశీలంగా ఉంటూ చిరు వ్యాపారాలతో తమ కాళ్ల మీద నిలబడుతున్న మహిళలను సైతం సంఘాల నుంచి సర్కారు తొలగిస్తోంది. ఇది వయో వృద్ధులైన 35 లక్షల మంది డ్వాక్రా మహిళల పాలిట శాపంగా పరిణమించింది. ఎన్నో ఏళ్లుగా డ్వాక్రా వ్యవస్థకు ఆసరాగా నిలిచిన మహిళలను సంఘాల నుంచి బలవంతంగా తొలగిస్తుండటంపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. బ్యాంకులపై నెపం వేస్తూ రాష్ట్రంలో 35 లక్షల మంది డ్వాక్రా మహిళలను తొలగించే ప్రక్రియను అధికారులు ఇప్పటికే చేపట్టారు. పొదుపు సంఘాల మహిళలతో సర్కారు ప్రచారం.. తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అధిగమించేందుకు అడ్డదారులు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని 9.32 లక్షల డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న 95 లక్షల మంది పొదుపు మహిళలతో అధికార పార్టీకి అనుకూలంగా రాజకీయ ప్రచారం నిర్వహిస్తోంది. వయోభారం తదితర కారణాలతో తమకు సహకరించని డ్వాక్రా మహిళలను సంఘాల నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగిస్తోంది. సీఎం సభలు, టీడీపీ కార్యక్రమాలకు కచ్చితంగా రావాల్సిందే.. రియల్టైమ్ గవర్నెన్స్ సెంటర్ (ఆర్టీజీఎస్) పర్యవేక్షణలో డ్వాక్రా మహిళల తొలగింపు కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అధికార పార్టీ వ్యూహాన్ని రచించింది. ప్రతి 100 మంది ఓటర్లకు ఓ ఇన్చార్జ్ని నియమించి ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాల ప్రచారం పేరుతో టీడీపీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలన్నది ప్రణాళిక. ఆ ఇన్చార్జ్కు స్థానిక డ్వాక్రా సంఘాల మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు సహకరించాలని అనధికారికంగా హుకుం జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనే సభలకు తప్పనిసరిగా హాజరు కావడంతోపాటు ఇతర టీడీపీ కార్యక్రమాల్లో డ్వాక్రా మహిళలు తప్పనిసరిగా పాల్గొనాలని స్పష్టం చేసింది. పరోక్షంగా వేటు.. టీడీపీకి అనుకూలంగా ఆర్టీజీఎస్ పర్యవేక్షణలో పనిచేసే ఇన్చార్జ్ల వెంట ఇంటింటికి తిరిగేందుకు పలువురు డ్వాక్రా మహిళలు సుముఖత వ్యక్తం చేయటం లేదు. గంటల తరబడి జాప్యంతో జరిగే సీఎం చంద్రబాబు సమావేశాలకు హాజరుకావడం కూడా వారికి ఎంతో ఇబ్బందిగా పరిణమించింది. దీంతో తమకు అనుకూలంగా ఉండేలా విధివిధానాలను సర్కారు అనధికారికంగా రూపొందించింది. మొదట వయో వృద్ధులైన డ్వాక్రా మహిళలను లక్ష్యంగా చేసుకుంది. 60 ఏళ్లు దాటిన సభ్యులను డ్వాక్రా సంఘాల నుంచి వెంటనే తొలగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వారి స్థానాల్లో కొత్తగా టీడీపీకి చెందిన వారు, పార్టీ అనుబంధ విభాగాల్లో పనిచేసే వారిని సభ్యులుగా చేర్చాలని మౌఖిక ఆదేశాల ద్వారా స్పష్టం చేసింది. నేరుగా ప్రభుత్వం తొలగిస్తున్నట్టు కాకుండా ఇతర మార్గాల ద్వారా వారిపై వేటు వేయాలని ఆదేశించారు. బ్యాంకులపై నెపం మోపి బలవంతపు తీర్మానాలు.. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వృద్ధులైన డ్వాక్రా మహిళలను తొలగించేందుకు అధికారులు వ్యూహాత్మకంగా రంగంలోకి దిగారు. బ్యాంకులపై నెపం మోపి 60 ఏళ్లు దాటిన మహిళలను డ్వాక్రా సంఘాల నుంచి తొలగించాలని ఎత్తుగడ వేశారు. 60 ఏళ్లు దాటిన మహిళలు రుణాలను సక్రమంగా చెల్లించలేకపోతున్నారనే వాదనను తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో పెద్ద వయసు మహిళలను తొలగించి వారిస్థానంలో కొత్త సభ్యులను చేర్చుకుంటున్నట్లు తీర్మానాలు చేయాలని సంఘాలకు సూచించారు. లేదంటే ఆ సంఘాలకు రుణాలు రావని తెగేసి చెప్పారు. జనవరి నుంచి డ్వాక్రా మహిళల ద్వారా విస్తృతంగా ప్రభుత్వ, పార్టీ ప్రచార కార్యక్రమాలను ప్రచారం చేయాలనేది ప్రభుత్వ పెద్దల ఉద్దేశం. అందుకే 60 ఏళ్లు దాటిన వారందర్నీ డిసెంబరు ఆఖరుకు తొలగించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సక్రమంగా రుణాలు చెల్లిస్తున్నా సరే... రాజకీయ కోణంలో టీడీపీ సర్కారు తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో 35 లక్షల మంది డ్వాక్రా మహిళల ఉపాధిని దెబ్బతీస్తోంది. వారిని తొలగిస్తే కానీ రుణాలు ఇవ్వరాదని ప్రభుత్వం చెప్పడంపై డ్వాక్రా సంఘాలు విస్తుపోతున్నాయి. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న 60 ఏళ్లు దాటిన మహిళలు క్రియాశీలంగా ఉన్నారు. పాలవ్యాపారం, కిరాణా వ్యాపారం, చేతివృత్తులు, అప్పడాలు తయారీ వంటివాటితో ఉపాధి పొందుతున్నారు. సక్రమంగా బ్యాంకు రుణాలు కూడా తీరుస్తున్నారు. టీడీపీ సర్కారు తమవారిని నియమించుకోవాలనే ఉద్దేశంతో పెద్ద వయసు మహిళలను సంఘాల నుంచి తొలగించడం అన్యాయమని వాపోతున్నారు. విధిలేక వేటేస్తున్న సంఘాలు... విధిలేని పరిస్థితుల్లో 60 ఏళ్లు దాటిన మహిళలను తొలగించే ప్రక్రియను డ్వాక్రా సంఘాలు చేపట్టాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 9.30 లక్షల డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. వాటిలో గ్రామీణ ప్రాంతాల్లో 7.31 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల సంఘాలున్నాయి. ఈ సంఘాల్లో దాదాపు 95 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఒక్కో సంఘంలో 60 ఏళ్లు దాటిన వారు ముగ్గురు నలుగురు సభ్యులున్నారు. ఆ ప్రకారం రాష్ట్రంలో 60 ఏళ్లు దాటిన డ్వాక్రా సంఘాల సభ్యులు దాదాపు 35 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో వారందర్నీ డిసెంబర్ ఆఖరునాటికి తొలగింపు ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఆసరా కోల్పోయి అల్లాడుతున్న మహిళలు.... ప్రభుత్వ అమానవీయ చర్యతో 35 లక్షలమంది డ్వాక్రా మహిళలు ఆసరా కోల్పోతున్నారు. ఆరోగ్యంగా ఉన్న తాము డ్వాక్రా రుణాలతో చిరు వ్యాపారాలు, ఇతరత్రా వృత్తులతో ఉపాధి పొందుతున్నామని పేర్కొంటున్నారు. రాజకీయ కార్యక్రమాలకు హాజరు కావటం లేదని తమను తొలగించడం అన్యాయమని వాపోతున్నారు. తొలగించే నిబంధన ఏదీ లేదు నిబంధనల ప్రకారం 18 ఏళ్లు దాటితే మహిళలకు డ్వాక్రా సంఘాల్లో సభ్యత్వం కల్పించవచ్చు. అయితే తొలగింపుపై నిర్దిష్ట వయో పరిమితి ఏదీ డ్వాక్రా నిబంధనల్లో లేదు. అయినప్పటికీ దీన్ని పట్టించుకోకుండా సర్కారు తన రాజకీయ అవసరాలకు ఉపయోగపడటం లేదనే అక్కసుతో 60 ఏళ్లు దాటిన వారిని సంఘాల నుంచి తొలగిస్తుండటం గమనార్హం. తన చేతికి మట్టి అంటకుండా బలవంతంగా సంఘాలతో తీర్మానం చేయిస్తూ లక్షల మంది మహిళలను తొలగిస్తోంది. గత ఆరేడు నెలలుగా తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. సర్కారు తీరుపై కొందరు అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు రుణాలు అందకున్నా పొదుపు మొత్తాలతో సంఘాల్లో సభ్యులుగా కొనసాగేలా అనుమతించాలని సూచిస్తున్నారు. బకాయిలు లేకుండా అప్పు తీర్చినా... నాకు 60 ఏళ్లు. ఎన్నో ఏళ్లుగా విస్సన్నపేట డ్వాక్రా సంఘం సభ్యురాలిగా ఉన్నా. కొద్ది నెలలుగా నేను సంఘం అప్పు గురించి అడుగుతుంటే లీడర్లు సమాధానం చెప్పడం లేదు. గట్టిగా అడిగితే అసలు విషయం చెప్పారు. నన్ను సంఘం నుంచి తొలగిస్తేనే రుణం ఇస్తామని అధికారులు చెప్పారట. నేను పొదుపు సక్రమంగా కడుతూ, బకాయిలు లేకుండా అప్పులు చెల్లించా. అయినా సరే నన్ను సంఘం నుంచి తొలగించారు. నా భర్త చనిపోయినందున వితంతు పెన్షను కోసం దరఖాస్తు చేస్తే అదీ మంజూరు కాలేదు. డ్వాక్రా గ్రూపు ఆసరా లేక, పెన్షను అందక వృద్ధాప్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. మందులు కొనుక్కోడానికి కూడా డబ్బు లేక అవస్థ పడుతున్నా. – కందుల భారతి (విస్సన్నపేట, తిరువూరు మండలం, కృష్ణా జిల్లా) అన్యాయంగా తొలగించారు.. లక్ష్మీమాతా డ్వాక్రా సంఘంలో ఎన్నో ఏళ్లుగా సభ్యురాలిగా ఉన్నా. బ్యాంకు అప్పు ఎప్పటికప్పుడు తీరుస్తూనే ఉన్నా. ఇన్నేళ్లలో రుణం చెల్లించకపోవడం అన్నదే లేదు. ఇప్పుడు హఠాత్తుగా నన్ను సంఘం నుంచి తొలగించేశారు. 60 ఏళ్లు దాటినవారిని తొలగిస్తున్నాం అని చెప్పారు. నేను ఆరోగ్యంగా ఉన్నా. చిరువ్యాపారం చేసుకుంటూ రుణాలు సక్రమంగా తీరుస్తున్నా అకారణంగా తొలగించారు. డ్వాక్రా రుణం ఇచ్చేముందు నన్ను తొలగించడం బాధేసింది. ఎవరి మీదా ఆధారపడకుండా బతుకుతున్న నేను ఉన్న ఆధారం కోల్పోయి ఇతరుల మీద ఆధార పడాల్సిన దుస్థితి వచ్చింది. – రాజులపాటి వెంకటేశ్వరమ్మ(మండవల్లి, కైకలూరు మండలం, కృష్ణా జిల్లా) -
వీవోయేల ఆందోళనకు వైఎస్సార్ సీపీ మద్దతు
సాక్షి, అమరావతి : డ్వాక్రా యానిమేటర్ల(వీవోయేల) ఆందోళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే డ్వాక్రా యానిమేటర్లు (వీవోయే)లు సోమవారం నుంచి తలపెట్టిన ఆందోళనలు, చలో కలెక్టరేట్ కార్యక్రమాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని సంఘీభావం ప్రకటించాలని పార్టీ పిలుపునిచ్చింది. ఆ ప్రకటనలో ‘‘వీవోయేలకు న్యాయబద్ధంగా జీతాలను చెల్లించకపోగా వారికి ఆర్థిక సహాయం అంటూ తాజాగా నెలకు రూ.3,000 సహాయం(సర్వీస్ ఛార్జ్) అంటూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎన్నికలు నాలుగైదు నెలలు ఉన్నాయనగా జారీ చేసిన ఈ జీవోకు, ఇంతకు ముందు ప్రభుత్వం వీవోయేలతో జరిపిన చర్చల సందర్భంగా ఇచ్చిన హామీలకు సంబంధం లేదు. ప్రమోషన్లు, ప్రమాద బీమా, సెర్ఫ్ నుంచి గుర్తింపు కార్డుల ప్రస్తావనే ఈ జీవోలో లేదు. ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న నేపథ్యంలో జూలై 15న పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ను కలిసి డ్వాక్రా యానిమేటర్లు తమ గోడును వెళ్ళబోసుకున్న సందర్భంగా, వారికి తమ ప్రభుత్వం వచ్చాక రూ.10,000 వేతనంగా చెల్లిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఇచ్చిన తరవాత యానిమేటర్ల జీతాలను నిలిపివేయటం... ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయన్న భయంతో రూ.3000, అదీ ఈ నవంబరు నుంచి ఏడాది కాలం మాత్రమే ఇస్తాం అంటూ జీవో జారీ చేయటం దుర్మార్గమన్న వీవోయేల వాదనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలపరుస్తోంద’’ పేర్కొంది. వీవోయేల ఆందోళనలకు జిల్లాల వారీగా మద్దతు పలకాల్సిందిగా వైఎస్సార్ సీపీ తమ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చింది. -
ఇచ్చేది అప్పు..చేసేది మోసం!
సాక్షి, అమరావతి: సొమ్మొకరిది సోకొకరిది! సొమ్ము ప్రజలది.. సోకు చంద్రబాబుది! పొదుపు సంఘాలకు పైసా కూడా రుణమాఫీ చేయకపోయినా డ్వాక్రా మహిళల ధన్యవాదాల పేరుతో రూ.15 కోట్ల ప్రజాధనాన్ని గోడల పాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజలకు ఇష్టం ఉన్నా లేకున్నా ముఖ్యమంత్రికి పొదుపు సంఘాల మహిళలు ధన్యవాదాలు చెబుతున్నట్లుగా రూపొందించిన ప్రచార స్టిక్కర్లను ఊరూరా, ఇంటింటికీ తిరిగి గోడలకు అతికించాలని టీడీపీ సర్కారు ఆదేశించింది. చంద్రబాబు గత ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మోసగించినా... ‘ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మా చంద్రన్నకు ధన్యవాదాలు..’ అంటూ సీఎం చంద్రబాబు ఫొటోతో స్టిక్కర్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. వీటిని నేడో రేపో టీడీపీ ఏజెంట్లు, సాధికార మిత్రలు ఇంటింటికీ తిరిగి గోడలకు అతికించనున్నారు. మహిళల నుంచి కృతజ్ఞతలు చెప్పించుకోవటానికి నానా ఇబ్బందులు, తంటాలు పడినా ఆశించిన ఫలితం లేకపోవటంతో స్టిక్కర్ల రూపంలో బలవంతంగా ధన్యవాదాలు చెప్పించుకునేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని పేర్కొంటున్నారు. డ్వాక్రా సంఘాలకు పెట్టుబడి నిధి కింద ఇచ్చే డబ్బులను అప్పు రూపంగా తీసుకోవాలంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులలోని ఓ భాగం, లబ్ధిదారుల ఇంటి వద్ద శనివారం (నేడు) లోగా ప్రభుత్వం ముద్రించిన స్టిక్కర్లను అతికించాలంటూ సెర్ఫ్ సీఈఓ జారీ చేసిన ఉత్తర్వులు పసుపు కుంకుమ పేరుతో వంచన ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ సర్కారు అసలు రంగు బయటపడుతోంది. గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయకుండా పెట్టుబడి నిధి, పసుపు కుంకుమ అంటూ నట్టేట ముంచింది. వాస్తవానికి 2015లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పెట్టుబడి నిధి కింద ఇచ్చే డబ్బులను అప్పుగానే పరిగణించాల్సి ఉంటుంది. సర్కారు ఇప్పుడు డ్వాక్రా మహిళలతో బలవంతంగా ధన్యవాదాలు చెప్పించుకుని పోస్టర్లను అతికిం చేందుకు సాధికార మిత్రలను టీడీపీ కూలీల మాదిరిగా వినియోగించుకోనుంది. ప్రజలంతా బాబుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టుగా రూపొం దించిన కోటిన్నర స్టిక్కర్ల కోసం రాష్ట్ర ఖజానా నుంచి ప్రభుత్వం రూ. 15 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం. పసుపు కుంకుమ మొత్తాన్ని తిరిగి చెల్లించవలసిన అవసరం లేదంటూ గోడలకు అతికించడానికి ప్రభుత్వం రూపొందించిన స్టిక్కర్లు ఒక్క మహిళకూ మాఫీ కాలేదని మంత్రే అంగీకరించారు డ్వాక్రా సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉన్న రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తానని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయి నాలుగున్నర ఏళ్లవుతున్నా ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. తమ ప్రభుత్వం ఏ ఒక్క డ్వాక్రా మహిళలకూ రుణమాఫీ చేయలేదని సంబంధిత శాఖ మంత్రి పరిటాల సునీత స్వయంగా అసెంబ్లీలో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. వాస్తవం ఇలా ఉండగా డ్వాక్రా సంఘాలకు ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకున్నారని పేర్కొంటూ, అందుకు ప్రజలంతా స్వచ్చందంగా ధన్యవాదాలు చెబుతున్నట్లు ప్రచార స్టిక్కర్లలో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీకి రాజకీయంగా ఉపయోగపడతారనే వ్యూహంతో రాష్ట్రంలో ప్రతి 35 ఇళ్లకు ఒకరు చొప్పున నియమించిన సాధికార మిత్రలకు ఈ ధన్యవాదాల ప్రచార స్టిక్కర్లను ఇంటింటికీ అతికించే బాధ్యత అప్పగించారు. శుక్ర, శనివారాల్లో కోటిన్నర ప్రచార స్టిక్కర్లను అన్ని ఇళ్లకు అతికించే బాధ్యతను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) జిల్లా అధికారులకు అప్పగించారు. పచ్చని పల్లెల్లో స్టిక్కర్ల చిచ్చు..? సీఎం చంద్రబాబు సొంత ప్రచారం కోసం తెరపైకి తెచ్చిన డ్వాక్రా ధన్యవాదాల స్టిక్కర్లు పచ్చని పల్లెల్లో చిచ్చు రేపనున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. రుణమాఫీ జరగక అప్పుల్లో కూరుకుపోయామని ఆగ్రహంతో ఉన్న డ్వాక్రా మహిళలు తిరగబడే అవకాశం ఉందని, అధికార బలంతో బలవంతంగా స్టిక్కర్లు అంటిస్తే ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని సెర్ప్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. సంఘాలు సకాలంలో చెల్లిస్తున్నా తప్పని వడ్డీ భారం.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేయకుండా మోసం చేసిన చంద్రబాబు సర్కారు కనీసం పావలా వడ్డీ, సున్నా వడ్డీ కూడా దక్కకుండా వారిని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. ప్రతి నెలా సకాలంలో వాయిదాలను చెల్లించే మహిళా సంఘాలకు సున్నా వడ్డీ వర్తింప చేయాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ డబ్బులను 2016 సెప్టెంబర్ నుంచి బ్యాంకులకు చెల్లించడం లేదు. దీంతో సున్నా వడ్డీ బకాయిలు ఇప్పటి వరకు రూ.2275 కోట్ల మేర పేరుకుపోయాయి. మహిళా సంఘాలు సకాలంలో ప్రతి నెలా వాయిదాలను చెల్లిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరాల తరబడి సున్నా వడ్డీ నిధులను బ్యాంకులకు ఇవ్వకపోవడంతో వాయిదాలతోపాటు వడ్డీని కూడా వసూలు చేస్తున్నాయి. ఈ విషయం ఇటీవల ముఖ్యమంత్రి అథ్యక్షతన జరిగిన బ్యాంకర్ల సమావేశంలోనే వెల్లడైంది. రూ.14,205 కోట్ల నుంచి రూ.22,174 కోట్లకు పెరిగిన రుణభారం డ్వాక్రా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మాట మార్చి రుణమాఫీ చేయబోనని, కేవలం పెట్టుబడి నిధి ఇస్తానంటూ ప్రకటించారు. దీంతో ఎన్నికల నాటికి మహిళా సంఘాలు రుణాలు 14,205 కోట్ల రూపాయలుండగా ఇప్పుడు వారి పేరిట రుణ భారం 22,174 కోట్ల రూపాయలకు పెరిగిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాల సున్నా వడ్డీకి కేవలం రూ.1,000 కోట్లనే కేటాయించారు. సున్నా వడ్డీ బకాయిలే రూ.2,275 కోట్లు ఉండగా ప్రస్తుత బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు ఏ మూలకు వస్తాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. బాబు హామీని అమలు చేయకపోవడం వల్ల సంఘాలకు ఎంత నష్టం? చంద్రబాబు హామీని అమలు చేసి ఉంటే 2014 నాటికి డ్వాక్రా సంఘాలకు ఉన్న రూ. 14,205 కోట్ల రుణాలన్ని మాఫీ అయ్యేవి. మళ్లీ ఆ సంఘాలకు రూ.14,205 కోట్లు లేదంటే అంతకంటే ఎక్కువగా 2014లోనే వాటి పేరిట బ్యాంకులు రుణాలిచ్చేవి. మాఫీ అయ్యే డబ్బులు, దానిపై వడ్డీ, కొత్తగా వచ్చే రుణం.. ఇలా మొత్తంగా ఈ నాలుగున్నర ఏళ్లలో 80 లక్షల మంది డ్వాక్రా మహిళలు సరాసరిన ఒక్కొక్కొరు రూ.35,500 దాకా నష్టపోయి ఉంటారని అంచనా. పెట్టుబడి నిధి డబ్బులు బకాయిల కింద జమ ఒకపక్క రుణమాఫీ చేయకపోగా మరోపక్క సున్నా వడ్డీ కూడా ఇవ్వకుండా మహిళా సంఘాలను బాబు సర్కారు దారుణంగా మోసగించింది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి నిధి కింద ఇస్తున్న డబ్బులను బ్యాంకులు మహిళా సంఘాల రుణ బకాయిల కింద జమ చేసుకుంటున్నాయి. పెట్టుబడి నిధి కింద ఇచ్చిన డబ్బులను మహిళా సంఘాలు డ్రా చేసుకోవడానికి అనుమతించాలని కోరితే రుణ బకాయిలు ఎవరు తీరుస్తారని బ్యాంకర్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే బాబు బాకా కోసం రూ.100 కోట్లు.... ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైనా ప్రభుత్వం నుంచి లబ్ది చేకూర్చాననే ప్రచారం చేసుకునేందుకు చంద్రబాబు ఊరూరా ప్రత్యేకంగా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్(సీఆర్పీ)ను నియమించి రూ.100 కోట్ల దుర్వినియోగానికి తెరతీశారు. టీడీపీ సర్కారుకు అనుకూలంగా ప్రచారం చేసేందుకు వీరిని నియమించారు. వీరికి రోజుకు రూ.850 చొప్పున పారితోషికం అందించనున్నారు. వీరు చేయాల్సిందిలా ఒక్కటే...జనంలోకి వెళ్లి చంద్రబాబును కీర్తించడమే. దీనికోసం రూ.వంద కోట్ల ప్రజాధనాన్ని సర్కారు దుర్వినియోగం చేస్తోంది. 15 నుంచి సమ్మెబాటలో సెర్ప్ సిబ్బంది... సెర్ప్ సిబ్బందికి టీడీపీ 2014 ఎన్నికల సమయంలో పలు హామీలను ఇచ్చింది. జీతాలు పెంచాలని, పర్మినెంట్ చేయాలని నాలుగేళ్లుగా కోరుతున్నా పట్టించుకోకపోవడంపై సెర్ప్ సీసీలు, ఏపీయంలు సమ్మెబాట పట్టనున్నారు. టీడీపీ సర్కారు మోసాలకు నిరసనగా ఈ నెల 15వతేదీ నుంచి సమ్మె చేయనున్నట్లు సెర్ప్ సిబ్బంది ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. బలవంతపు ధన్యవాదాలు... సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఓ సినిమాలో తనకు గుడ్మార్నింగ్ చెప్పించుకోవటానికి ఓ హాస్యనటుడు పడిన పాట్లు గుర్తుకొస్తున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఓ కాలేజీకి ప్రిన్సిపల్గా ఉన్న హాస్య నటుడు తనకు వచ్చిపోయే విద్యార్థులు గుడ్మార్నింగ్ చెప్పేవరకు అదేపనిగా వారి చుట్టూ తచ్చాడటాన్ని గుర్తు చేస్తున్నారు. ఇదంతా డబ్బు ఖర్చు లేని వ్యవహారం కాగా సీఎం చంద్రబాబు రూ.15 కోట్లు ఖర్చు చేసి మరీ ‘ధన్యవాదాల’ కార్యక్రమానికి తెరతీశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ తొలిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్, 2004లో సీఎంగా అధికారం చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల కోసం సంచలనాత్మకమైన సంక్షేమ పథకాలు అమలు చేసినా వారెప్పుడూ ఇలా వ్యవహరించలేదని పేర్కొంటున్నారు. డ్వాక్రా మహిళలకు చంద్రబాబు ఎన్నికల హామీ.. ఆర్థికంగా చిక్కుల్లో పడిన డ్వాక్రా సంఘాలను పునరుజ్జీవింపజేసే ప్రక్రియలో భాగంగా డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలన్నింటినీ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తాం. –టీడీపీ 2014 ఎన్నికల మేనిఫెస్టో (16వ పేజీ)లో చంద్రబాబు హామీ ప్రభుత్వం ఎన్నికల హామీ అమలు చేసిందా? డ్వాక్రా మహిళలకు పైసా కూడా రుణమాఫీ చేయలేదు డ్వాక్రా సంఘాలపై అప్పుల పెనుభారం చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టే నాటికి డ్వాక్రా సంఘాల పేరుతో రూ.14,205 కోట్లు బ్యాంకుల్లో అప్పులు ఉండగా ఈ ఏడాది జూన్ 30 నాటికి రూ. 22,174 కోట్లకు చేరింది. సున్నా వడ్డీకి మంగళం టీడీపీ సర్కారు జీరో వడ్డీ పథకానికి నిధులు విడుదల చేయకపోవడంతో 2016 సెప్టెంబరు నుంచి వడ్డీ రూపంలో రూ.2,275 కోట్లను డ్వాక్రా మహిళలే చెల్లించుకోవాల్సి వచ్చింది. పెట్టుబడి నిధి డబ్బులు అప్పు కిందే... 2015లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పెట్టుబడి నిధి కింద డ్వాక్రా సంఘాలకు ఇచ్చే డబ్బులను అప్పుగానే పరిగణించాల్సి ఉంటుంది. మాట నిలబెట్టుకున్నట్లు సర్కారు ప్రచారం.. డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయకపోయినా ‘ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రన్నకు ధన్యవాదాలు..’ అంటూ రూ.15 కోట్ల ఖర్చుతో ఇంటింటికీ స్టిక్కర్లు అతికించేందుకు తాజాగా ప్రభుత్వం సిద్ధమైంది. -
మంత్రి సునీత ఇలాకలో డ్వాక్రా మహిళల ఇబ్బందులు!
సాక్షి, అనంతపురం : మంత్రి పరిటాల సునీత ఇలాకలో డ్వాక్రా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రుణం మంజూరు అయినా వాటిని డ్రా చేయటానికి అనుమంతిచటం లేదు కొందరు అధికారులు. వివరాల్లోకి వెళితే.. అనంతపురానికి చెందిన 16 డ్వాక్రా సంఘాలకు దాదాపు కోటి రూపాయల రుణం మంజూరు అయ్యింది. అయితే డబ్బు డ్రా చేయటంలో వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాప్తాడు ఏపీఎం గోపాల్, సీసీ అన్నపూర్ణలు డబ్బు డ్రా చేయటానికి అనుమతించటం లేదు. దీంతో చిన్మయ్ నగర్కు చెందిన కొందరు డ్వాక్రా మహిళలు డీఆర్డీఏ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు వైఎస్సార్ సీపీ, సీపీఎం, బీజేపీ నేతలు తమ మద్దతు తెలిపారు. తొమ్మిది నెలలుగా సమస్య ఉన్నా మంత్రి పరిటాల సునీత పట్టించుకోవటంలేదని డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రుణ మాఫీ కాలేదు
-
డ్వాక్రా రుణాల మాఫీపై ఏపీ సర్కారు మోసం
-
డ్వాక్రా రుణమాఫీకి పైసా కూడా ఇవ్వలేదు
సాక్షి, అమరావతి: ఎన్నికల హామీ అయిన డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి ఒక్కపైసా కూడా మాఫీ చేయలేదని, అసలు అలాంటి ఆలోచనే లేదని టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయలేదని స్త్రీ,శిశు సంక్షేమ, సెర్ప్, మహిళా సాధికారిత మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో డ్వాక్రా రుణాల చెల్లింపులపై సమాధానం ఇస్తూ ఈ విషయం తెలిపారు. 2014–15, 2015–16, 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన డ్వాక్రారుణాల మాఫీ మొత్తం ఎంత? జిల్లాల వారీగా వివరాలు ఇవ్వాలని, రాష్ట్రంలో 2014 జూన్ నాటికి మిగిలి ఉన్న డ్వాక్రా రుణాల మొత్తం ఎంత, ఇప్పటి వరకూ మాఫీ చేసిన రుణాల మొత్తం ఎంత, డ్వాక్రా రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వం వద్ద ఏమైనా ప్రతిపాదన ఉందా? అయితే ఆ వివరాలు ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యులు పాముల పుష్ప శ్రీవాణి, ఆర్కే రోజా, గౌరు చరితారెడ్డి రాతపూర్వకంగా ప్రశ్నించారు. దీనికి మంత్రి సునీత సమాధానమిస్తూ.. 2014 నుంచి 2018 వరకూ ఎటువంటి డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదని, డ్వాక్రా రుణాల మొత్తం రూ. 11,069 కోట్లు ఉన్నాయని, దీనికి ఒక్క పైసా కూడా మాఫీ కింద చెల్లించలేదని, దీనికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రతిపాదనా కూడా లేదని జవాబిచ్చారు. అయితే మహిళలకు పసుపు కుంకుమల కింద ఒక్కొక్కరికి రూ.10 వేలు ప్రకటించామని, ఇప్పటికే రూ.8 వేలు ఇచ్చామన్నారు. డ్వాక్రా రుణమాఫీ కంటే పసుపు కుంకుమకే ఎక్కువ ఇచ్చామని ఈ సందర్భంగా ఆమె అన్నారు. 2014 మార్చి 31కి ముందు రిజిస్టర్ అయిన గ్రూపులకు మాత్రమే ఇచ్చామని, కొత్త గ్రూపులకు ఇవ్వలేదని స్పష్టంచేశారు. ప్రతిపక్షం మీ దగ్గరే ఉందికదా.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్ష శాసనసభ్యులు ఈ ప్రశ్న వేశారని టీడీపీ ఎమ్మెల్యే వెంకటేష్ అన్నారు. మంత్రి దీనిపై మరో రకంగా సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. వాస్తవానికి పసుపు కుంకుమ కింద అంతకంటే ఎక్కువే ఇచ్చామని, డ్వాక్రా రుణాల మాఫీ గురించి ప్రస్తావించకూడదని ఆయన సలహా ఇచ్చారు. దీనిపై బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్రాజు స్పందిస్తూ.. 22 మంది ప్రతిపక్ష సభ్యులు మీదగ్గరే ఉన్నారు కదా అని అన్నారు. అలాంటప్పుడు ప్రతిపక్షం బయట ఉందని ఎలా అంటారని ప్రశ్నించారు. దీంతో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఇరుకున పడ్డారు. వెంటనే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కలుగజేసుకుని ప్రతిపక్ష పాత్ర కూడా తామే పోషిస్తున్నామని చెప్పి టాపిక్ను మార్చేప్రయత్నం చేశారు. మహిళలు గట్టిగా ప్రశ్నిస్తున్నారు గ్రామ దర్శిని, నగర దర్శిని కార్యక్రమాల్లో ఊళ్లకు వెళ్లినపుడు మహిళలు డ్వాక్రా రుణాల మాఫీపై గట్టిగా ప్రశ్నిస్తున్నారని పలువురు సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆన్లైన్ ఇబ్బందులని, ఆధార్ ఎన్రోల్మెంటు లేదని, బ్యాంకు ఖాతాలు లేవని అధికారులు చెబుతున్నారని బోండా ఉమా, జోగేశ్వరరావు, వర్మ తదితరులు తెలిపారు. నాలుగేళ్లుగా డ్వాక్రా మాఫీపై అడుగుతూనే ఉన్నాం, మంత్రి చెబుతూనే ఉన్నారని, కానీ మాఫీ కాలేదని పేర్కొన్నారు. ఏ ఊరికి వెళ్లినా.. మేనిఫెస్టోలో పెట్టిన డ్వాక్రా రుణమాఫీ హామీని ఎందుకు నెరవేర్చడం లేదంటూ ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారని చెప్పారు. కమిటీ ఎందుకు వేయడంలేదు రాష్ట్రంలో అక్రమంగా మైనింగ్పై ఎందుకు కమిటీ వేసి నిగ్గుతేల్చలేక పోతున్నారని, దీనికి భయమెందుకని బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో పలు సిమెంటు కంపెనీలు అక్రమంగా మైనింగ్ చేస్తున్నాయని, ప్రభుత్వం దీనిపై కమిటీ వేస్తే సాక్ష్యాలు చూపిస్తానని, కానీ ఎందుకు ప్రభుత్వం వెనుకాడుతోందో అర్థం కాలేదని అన్నారు. దీనికి మంత్రి సుజయకృష్ణ రంగారావు ‘చర్యలు తీసుకుంటాం’ అని క్లుప్తంగా సమాధానం చెప్పారు. డ్వాక్రా రుణాలపై ఎమ్మెల్యేలు ఏమన్నారు మృణాళిని: పెట్టుబడి నిధి రావట్లేదని మహిళలు చెబుతున్నారు. తాము డ్వాక్రా కమిటీలో సభ్యులమైనా ఎందుకు రావడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. చాలామంది తమ ఖాతాల్లో డబ్బులు వెయ్యడం లేదని చెబుతున్నారు. వర్మ: గ్రామదర్శిని కార్యక్రమానికి ఎమ్మెల్యేలు వెళ్లినప్పుడు మహిళలు దీనిపైనే గట్టిగా నిలదీస్తున్నారు. ప్రతి గ్రామంలో గ్రూపుల నుంచి ఇలాంటి ఫిర్యాదులే. క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందిగా ఉంది. మంత్రిగారు దీనిపై చర్యలు తీసుకోవాలి. కూనరవికుమార్ గౌడ్: 2014 తర్వాత ఏర్పడిన గ్రూపులు ఏం కావాలి. పాత వారికి కూడా ఆన్లైన్లో సమస్యలని, ఆధార్ ఎన్రోల్లో సమస్యలని ఏదో ఒక కారణంతో పసుపు కుంకుమకు ఇచ్చే నిధులు ఇవ్వడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. జోగేశ్వరరావు: తమకు పసుపు కుంకుమ పథకం అందడంలేదని చాలా చోట్ల మహిళలు ఫిర్యాదు చేస్తున్నారు. -
చంద్రబాబు అబద్ధపు హామీలతో మోసం చేశారు
-
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
కుల్కచర్ల: డ్వాక్రా సంఘాల మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని, మహిళలు అభివృద్ధి చెందితేనే కుటుంబాలు బాగుపడుతాయని రాష్ట్ర సెర్ప్ సీఈఓ పౌసమిబసు తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని పెద్దఅంతారం గ్రామంలో డీఆర్డీఏ, సెర్ప్, తెలగాణ పల్లె ప్రగతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాడి, రైతు ఉత్పత్తిదారుల సంఘాల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ముందుగా గ్రామంలో శ్రీనిధి నిధులతో ఏర్పాటు చేసిన మేకల పెంపక కేంద్రాలను పరిశీలించారు. గ్రామంలో రూ. 9 లక్షలతో 18 మంది ఎస్సీ మహిళలకు మేకలు ఇప్పించి పెంపకం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె లబ్ధిదారులతో మాట్లాడారు. మేకల పెంపకంలో మంచి లాభాలు రావడానికి తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. మేకలను నిత్యం షెడ్లలోనే ఉంచి మంచి పోషకాలున్న మేతను అందించాలన్నారు. అందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని ఆమె డీఆర్డీఏ అధికారులకు సూచించారు. అనంతరం గ్రామంలోని డ్వాక్రా సంఘాల మహిళలతో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామాల్లో పండించే పంటలు, మార్కెటింగ్పై ఆరా తీశారు. ఇప్పటికీ చాలామంది పాతపద్ధతులతో వ్యవసాయం చేస్తున్నాని, దీంతో లాభాలు రావడం లేదన్నారు. పండించిన పంట దళారులు కొనుగోలు చేసి వాటి ద్వారా వారు మంచి లాభాలు ఆర్జిస్తున్నారన్నారు. రాగులు, జొన్నలు, పెసర, బెబ్బర, మొక్కజొన్న పండిస్తే ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నూతన పద్ధతులు పాటించేలా శిక్షణ ఇప్పిస్తామన్నారు. అభివృద్ధి చెందే పనులు చెప్పాలని సూచించారు. పింఛన్లు, రేషన్, బ్యాంక్ రుణాలు అందుతున్నాయా.. లేదా అని ఆరా తీశారు. అంతారంలో బ్యాంక్ రుణాలు తీసుకుని నిర్వహిస్తున్న చిరువ్యాపారాలను ఆమె పరిశీలించారు. అంతకుముందు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మానసిక వికలాంగుల కేంద్రాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ జాన్సన్, అంతారం సర్పంచ్ పుష్పలత, ఎంపీడీఓ తారీక్ అన్వర్, సూపరింటెండెంట్ ఇంద్రసేనా, ఏపీఎం మల్లికార్జున్, ఎపీఓ శోభ, సెర్ప్ అధికారులు ఉన్నారు. -
వైభవం.. ధ్వజారోహణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో జరుగుతున్న వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ధ్వజారోహణం కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఉత్సవాల్లో ఎలాంటి అవిఘ్నాలు చోటుచేసుకోకుండా, ఆలయానికి రక్షణగా ధ్వజస్తంభం వద్ద శ్రీ మహా విష్ణువుకు ప్రీతిపాత్రుడైన గరుత్మంతుడి చిత్రపటాన్ని పెట్టి పూజలు నిర్వహించడం ఆనవాయితీ. దీన్నే ధ్వజారోహణంగా వ్యవహరిస్తారు. ఆలయంలో ఉదయం తిరువారాధన సేవాకాలం, నివేదన, మంగళా శాసనం, తీర్థప్రసాద వినియోగం జరిగింది. అనంతరం ఎటువంటి విఘ్నాలు కలుగకుండా ఉండడానికి సేనాధిపతి, విఘ్ననాశకుడు అయిన విశ్వక్సేనార్చన చేశారు. కర్మణ, పుణ్యాహవచన, మూర్తి కుంభావాహన, భద్రక మండల ఆరాధన, తోరణ ఆరాధన నిర్వహించారు. అనంతరం నవాహ్నిక దీక్షకు అగ్ని మథనం గావించి యాగశాలలో అగ్ని ప్రతిష్ఠాపన జరిపి, హోమం చేశారు. గరుడాళ్వార్లకు ప్రత్యేక ఆహ్వానం.. ముందుగా ప్రధాన ఆలయం నుంచి వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల మధ్య సమస్త రాజ లాంఛనాలతో తిరుకల్యాణ ఉత్సవ మూర్తులైన శ్రీసీతారామ లక్ష్మణ స్వామివారిని ప్రధానాలయం చుట్టూ ప్రదక్షణ చేయించి ధ్వజస్తంభం వద్దకు తోడ్కొని వచ్చారు. అనంతరం యాగశాల నుంచి గరుడ పటాన్ని ఆలయం చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణం జరిపి అర్చక, పరిచారక, వేద పండితులు తీసుకొని రాగా.. బ్రహ్మోత్సవ రక్షణ నిమిత్తం గరుడాళ్వారులను ఆహ్వానించి ఆరాధన చేశారు. గరుడ మహా సంకల్పం, మంగళాష్టకాలను అర్చకులు పఠించగా, మంగళ వాయిద్య ఘోష నడుమ గరుడ పటాన్ని పైకి ఎగురవేశారు. అనంతరం బలిహరణం కార్యక్రమాన్ని నిర్వహించారు. సంతాన లేని వారికి గరుడ ముద్దలను అందజేశారు. ఈ ముద్ద తీసుకున్న వారికి సంతానం కలుగుతుందని భక్తుల అపార నమ్మకం. దీంతో ఈ ప్రసాదాలను స్వీకరించేందుకు మహిళలు ఆసక్తి చూపించారు. సాయంత్రం యాగశాలలో భేరీ పూజ నిర్వహించారు. అష్టదిక్పాలక, దేవతాహ్వానం గావించారు. ఉత్సవ మూర్తులతో పాటు ఎనిమిది దిక్కులకు బలిహరణం వేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో ప్రబాకర శ్రీనివాస్ దంపతులు, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, ఇతర అర్చకులు, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు. నేడు ఎదుర్కోలు ఉత్సవం... స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఎదుర్కోలు వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం చతుఃస్థానార్చన పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం స్వామి వారికి ఉత్తర ద్వారం ముందు భాగంలో ఎదుర్కోలు ఉత్సవం నిర్వహణకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతరం గరుడ సేవ జరపనున్నారు. -
నేడు స్వామివారి ధ్వజారోహణం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం మాఘబహుళ నవమిని పురస్కరించుకుని స్వామివారి ధ్వజారోహణం జరుగనుంది. ఆలయంలో స్వామి వారి సన్నిధికి ఎదురుగా ఉన్న ధ్వజస్తం భం వద్ద మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ధ్వజా రోహణ పూజలు ప్రారంభం కానున్నాయి. శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం భక్త కన్నప్ప ధ్వ జారోహణం వైభవంగా జరిగింది. సా యంత్రం కైలాసగిరుల్లోని భక్త కన్నప్ప ఆలయంలో ధ్వజారోహణంతో బ్ర హ్మో త్సవాలకు అంకురార్పణ జరిగింది. ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ పూజలు నిర్వహించారు. బ్రహ్మదేవుడి సారథ్యంలో జరిగే బ్రహ్మోత్సవాలకు దివి నుంచి దిగివచ్చి దీవించా లంటూ దేవతలను అర్చకులు శాస్త్రో క్తంగా ఆహ్వానించారు. భక్తుడైన భక్తకన్నప్ప ఉత్సవాల్లో ప్ర«థమ పూజను పరమశివుడు వరంగా ఇచ్చారు. సాయంత్రం 4.15గంటలకు ధ్వజారోహణ పూజలు ప్రారంభమయ్యాయి. గంట పాటు కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఆలయం నుంచి శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞానప్రసూనాంబ, భక్త కన్నప్ప ఉత్సవమూర్తులను సర్వాంగసుందరంగా అలంకరించి మేళతాళాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ ఊరేగింపుగా కైలాసగిరి కొండపై ఉన్న భక్త కన్నప్ప ఆలయానికి వేంచేపు చేశారు. ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.∙వేదమంత్రోచ్ఛారణల నడు మ శాస్త్రోక్తంగా దర్భతో తయారు చేసిన పవిత్ర దారాన్ని, వస్త్రాన్ని «ధ్వజస్తంభాని కి ఆరోహింపజేశారు. దీప,ధూçప, నైవే ద్యాలు సమర్పించారు. దీంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ పూర్తయింది. అనంతరం విద్యుద్దీపాల వెలుగులు, మేళతాళాలు నడుమ ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమ ర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ భ్రమరాంబ, అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు, మున్సి పల్ చైర్మన్ ముత్యాల పార్థసార«థి, దేవస్థానం మాజీ చైర్మన్లు శాంతా రామ్ జే పవార్, పీఆర్ మోహన్, కోలా ఆనంద్, ప్రముఖులు పాల్గొన్నారు. -
వడ్డీలేని రుణం.. అందనంత దూరం!
కోవెలకుంట్ల : అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళల రుణాలన్నీ భేషరుతుగా మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీలు గుప్పించి గద్దెనెక్కిన సర్కార్ అరకొరగా రుణమాఫీ చేసి చేతులు దులుపుకుంది. పొదుపు సంఘాల మహిళల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు వడ్డీ రుణాలు ఇస్తామని ప్రకటించి పట్టించుకోకపోవడంతో సంఘాలపై వడ్డీభారం పడి కుదేలవుతున్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో 4,770 పొదుపు సంఘాలు ఉన్నాయి. ఒక్కో గ్రూపులో పది నుంచి 15 మంది సభ్యులు ఉన్నారు. బ్యాంకు లింకేజి,ఎస్ఎస్జీ, స్త్రీనిధి, గ్రామైక్య సంఘం నుంచి రుణాలు తీసుకొని, ఆ రుణాలతో చీరెల వ్యాపారం, కిరాణ, కొవ్వొత్తుల తయారీ, పాడిపరిశ్రమ, తదితర యూనిట్లు స్థాపించి జీవనంసాగిస్తున్నారు. పొదుపు సంఘాలకు అరకొరగా వర్తింపు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను వడ్డీతో సహా సక్రమంగా చెల్లించే గ్రూపులకు ప్రభుత్వం వడ్డీలేని రుణం వర్తింప చేయాల్సి ఉండగా అరకొరగా వర్తింపజేస్తుండడంతో డ్వాక్రా సంఘాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు . ఐదవ విడత జన్మభూమిని పురస్కరించుకొని ప్రభుత్వం వడ్డీలేని రుణాలను మంజూరు చేయగా నియోజకవర్గంలో కొన్ని సంఘాలకు మాత్రమేవర్తించడంతో మిగతా గ్రూపులు సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 2016 జూన్ వరకు రుణాలు సక్రమంగా చెల్లించిన గ్రూపులకు ఈ రుణం విడుదల అయినట్లు చెబుతున్నారు. వడ్డీలేని రుణం వర్తించినా కొన్నిగ్రూపుల్లోని సభ్యుల ఖాతాల్లో జమ కాకపోవడంతో దిగాలు చెందుతున్నారు. సకాలంలో వడ్డీతో సహా రుణాలు చెల్లించినా నాలుగు మండలాల్లో 1,884 గ్రూపులకుమాత్రమే వడ్డీలేని రుణాలు వర్తించగా మిగిలిన గ్రూపులకు మంజూరు కాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడ్డీలేని రుణం వర్తిస్తుందని పొదుపు మహిళలు అప్పులు చేసి నెలనెలా వడ్డీతో సహా రుణాలు చెల్లించినా రుణం వర్తించకపోవడంతో దిక్కులు చూస్తున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని పొదుపు గ్రూపులన్నింటికీ వడ్డీలేని రుణంవర్తింపజేయాలని సభ్యులు కోరుతున్నారు. వడ్డీలేని రుణం వర్తించలేదు పొదుపు గ్రూపు ద్వారా రూ. 7 లక్షల రుణం తీసుకొని బర్రెలు కొనుగోలు చేసి పాడి పరిశ్రమ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నా. ప్రభుత్వం పసుపు, కుంకుమ పథకం కింద రూ. 6వేలు అందజేసింది. వడ్డీలేని రుణం ఇప్పటి వరకు వర్తించలేదు. వడ్డీలకు వడ్డీలు చెల్లించడం కష్టమవుతోంది. – లక్ష్మిదేవి, చందన గ్రూపు సభ్యురాలు, నిచ్చెనమెట్ల ఇప్పటికైనా రుణం అందించాలి పొదుపు గ్రూపులకు వడ్డీలేని రుణం వర్తింపజేసి సంఘాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు కృషి చేయాలి. మా గ్రూపు ద్వారా రూ. 5 లక్షలు రుణం తీసుకొని పశుపోషణతో జీవనంసాగిస్తున్నాం. అన్ని గ్రూపులకు వడ్డీలేని రుణం అందించి ఆదుకోవాలి. – వెంకటలక్ష్మి, రామలక్ష్మిగ్రూపు సభ్యురాలు, నిచ్చెనమెట్ల జమ అవుతోంది పొదుపు గ్రూపు సభ్యుల ఖాతాల్లో వడ్డీలేని రుణం జమ అవుతోంది. 2017 మార్చి నెలాఖరు వరకు గ్రూపులకు వడ్డీలేని రుణం మంజూరైంది. విడతలవారీగా అన్ని గ్రూపులకు వర్తిస్తుంది. – బాబు, ఏపీఎం, కోవెలకుంట్ల -
భారత్ ‘ఎ’ పరాజయం
ప్రిటోరియా: బ్యాట్స్మెన్ వైఫ ల్యంతో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో జరిగిన ముక్కోణపు వన్డే క్రికెట్ టోర్నీ తొలి మ్యాచ్లో భారత్ ‘ఎ’ జట్టు రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డ్వెయిన్ ప్రెటోరియస్ ఆల్రౌండ్ ప్రదర్శన చేశాడు. దక్షిణాఫ్రికా విజయంలో కీలకపాత్ర పోషించాడు. బౌలింగ్లో 24 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసిన ప్రెటోరియస్... బ్యాటింగ్లో 54 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 34 పరుగులు సాధించి తమ జట్టు విజయానికి దోహదపడ్డాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 41.5 ఓవర్లలో కేవలం 152 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ మనీశ్ పాండే (95 బంతుల్లో 55; 4 ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్మెన్ ఇలా వచ్చి అలా పెవిలియన్కు చేరుకున్నారు. మీడియం పేసర్ ప్రెటోరియస్తోపాటు ఎడంచేతి వాటం స్పిన్నర్ ఫాంగిసో (4/30), హెండ్రిక్స్ (2/15) భారత బ్యాటింగ్ ఆర్డర్ను దెబ్బ తీశారు. 153 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 37.4 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. 71 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దక్షిణాఫ్రికా జట్టును బెహర్దీన్ (62 బంతుల్లో 37 నాటౌట్), ప్రెటోరియస్ ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్కు 62 పరుగులు జోడించారు. ప్రెటోరియస్ అవుటయ్యాక మిగతా బ్యాట్స్మెన్ సహకారంతో బెహర్దీన్ దక్షిణాఫ్రికా విజయాన్ని ఖాయం చేశాడు. భారత బౌలర్లలో యజువేంద్ర చహల్ (3/41), అక్షర్ పటేల్ (35) రాణించగా... మొహమ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్, బాసిల్ థంపి ఒక్కో వికెట్ తీశారు. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్లో అఫ్ఘానిస్తాన్తో భారత్ ‘ఎ’ తలపడుతుంది. -
అలవిమాలిన నిర్లక్ష్యం
► డ్వాక్రా మహిళలకు పంపిణీ చేయాల్సిన విత్తనాలు నేలపాలు ► రెండేళ్లుగా మెప్మా భవనంలో హైబ్రీడ్ కూరగాయల విత్తనాలు నిల్వ ► ప్యాకెట్లను చిందర వందర చేసిన ఎలుకలు ► కాల పరిమితి తీరడంతో ప్రజాధనం వృథా ► పీడీ మెతక వైఖరితో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది ► మెప్మా అధికారులు, సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినా వాటిని సక్రమంగా అమలు చేసినప్పుడే సత్ఫలితాలు వస్తాయి. కానీ క్షేత్రస్థాయిలో కొంత మంది అధికారులు, సిబ్బంది అలవిమాలిన నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఎవరేం చేస్తారులే అన్న ధీమాతో విధులు నిర్వరిస్తున్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు, ఇతర ప్రయోజనాలను ప్రజలకు అందకుండా చేస్తున్నారు. ఒంగోలు నగరంలో మెప్మా (పట్టణ పేదిరక నిర్మూలన సంస్థ) పనితీరు కూడా ఇలానే ఉంది. ఒంగోలు అర్బన్ : డ్వాక్రా మహిళలు ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలు వారి చేరడం లేదు. కొంత మంది అధికారులు నిర్లక్ష్యం ఫలితంతో రూ.లక్షల ప్రజాధనం వృథా అవుతోంది. నగరంలో డ్వాడ్రా మహిళల గ్రూపులకు సంబంధించి పర్యవేక్షించాల్సిన మెప్మా ( పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ)ఆ దిశగా తీసుకున్న చర్యలు శూన్యమనే చెప్పాలి. విత్తన ప్యాకెట్లు నేలపాలు డ్వాక్రా మహిళలు కూరగాయలు పండించుకోవడంతో పాటు విక్రయించుకోవడానికి ప్రభుత్వం హైబ్రీడ్ కూరగాయల విత్తనాలను సరఫరా చేసింది. రెండ్లళ్ల క్రితం 2014–2015 సంవత్సరానికి గాను మహిళలకు ఈ విత్తనాలను పంపిణీ చేయాల్సి ఉంది. మెప్మా అధికారులు, సిబ్బంది వాటిని ఇంత వరకు పంపిణీ చేయకుండా నగరపాలక కార్యాలయంలోని మెప్మా భవనంలో నిల్వ ఉంచారు. రెండేళ్లుగా వాటి గురించి పట్టించుకోక పోవడంతో ఎలుకలు చేరి ఆ విత్తనాల ప్యాకెట్లను చిందర వందర చేశాయి. దీనికి తోడు ఆ విత్తనాల కాలSపరిమితి తీరడంతో నిరుపయోగంగా మారాయి. టమోట, సొరకాయ, ఉల్లిపాయ, చిక్కుడు వంటి హైబ్రిడ్ విత్తనాల ప్యాకెట్లు వేల సంఖ్యలో కాలపరిమితి తీరిపోవడంతో సిబ్బంది వాటిని భవనం వెనుక కుప్ప పోశారు. డ్వాక్రా మహిళల కోసం ప్రభుత్వం ఎంతో వెచ్చించి సరఫరా చేసినా వీటిని ఇలా నేలపాలు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ కొంత మెతక వైఖరి అవలంభించడం వలన మెప్మా అధికారులు, సిబ్బందిలో నిర్లక్ష్యం పెరిగిపోయిందంటున్నారు. ప్రాజెక్టు డైరెక్టర్కి అధికారులు, సిబ్బంది తప్పుడు సమాచారం పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రుణాల మంజూరులోనూ అవకతవకలే.. డ్వాక్రా మహిళలకు విత్తనాల పంపిణీలోనే మెప్మా సిబ్బంది ఇలా ఉండే డ్వాక్రా గ్రూపు, పలు కార్పొరేషన్లకు సంబంధించిన రుణాల విషయంలో కూడా భారీస్థాయిలో అక్రమాలు, అవినీతికి సిబ్బంది పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రుణాలకు సంబంధించి విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మాముళ్లు ఇచ్చే వారికి, తమకు అనుకూలంగా ఉన్న వారికే మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పేరుకే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అయినా పట్ణంలో పేదరిక నిర్మూలనకు చెప్పుకోదగ్గ చర్యలు తీసుకున్న దాఖాలాలు లేవు. అవినీతితో మెప్మా అధికారులు, సిబ్బంది మాత్రం పేదరికం పోగొట్టుకుంటున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. రెండు రోజుల క్రితమే మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఆధ్వర్యంలో మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా విత్తనాలు పారేసిన భవనంలోనే దోమ తెరల పంపిణీ చేపట్టారు. అదే రోజు ఆ విత్తనాల ప్యాకెట్లను బయటపడేయడం గమనార్హం. -
వైభవంగా నృసింహుడి ధ్వజారోహణం
మంగళగిరి: నృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణం ఉత్సవాన్ని శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవానికి భక్తజనులు, దేవతలను వాయు వేగంతో వెళ్లి ఆహ్వానించేందుకు భక్తాగ్రేశ్వరుడైన గరుత్మంతుడిని ధ్వజంపై ప్రతిష్టించడం ఉత్సవ ప్రత్యేకత. రాత్రి పొద్దుపోయాక భక్తజన కోటి సమక్షంలో ఉత్సవం నిర్వహించారు. ఈ వేడుకలలో మరో ప్రత్యేకత ఉంది. అష్టనాగాధిపతి అయిన గరుత్మంతునికి నివేదన చేసిన ప్రసాదాన్ని గరుడముద్దగా పిలుస్తారు. సంతానం లేని వారు ధ్వజారోహణ ఉత్సవంలో గరుడ ముద్దను ప్రసాదంగా స్వీకరిస్తే సంతానం కలుగుతారని భక్తుల నమ్మకం. గరుడముద్ద ప్రసాదం కోసం మహిళా భక్తులు పెద్ద ఎత్తున ఉత్సవానికి తరలివచ్చారు. ఉత్సవం అనంతరం ప్రత్యేక వాహనంపై ఉత్సవమూర్తులను అధిష్టంపచేసి పురవీధులలో విహరింపచేశారు. ఉత్సవ కైంకర్యపరులుగా మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోషియన్ వారు వ్యవహరించగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్న ఉత్సవంలో ధర్మకర్తల మండలి సభ్యులు ఊట్ల శ్రీమన్నారాయణ, అనుమోలె వెంకటసాంబశివరావు, క్రోసూరి శివనాగరాజు, రావుల శ్రీనివాసరావు, మోరంపూడి నాగేశ్వరరావు, ఆలేటి నాగలక్ష్మి, వెనిగళ్ళ ఉమాకాంతం, పంచుమరి ప్రసాద్, దీవి అనంతపద్మాచార్యులు పూజలు నిర్వహించగా ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణ అధికారి మండెపూడి పానకాలరావు పర్యేక్షించారు. -
అప్పుల్లేవ్.. తిప్పలే
ఏలూరు (మెట్రో) : కొత్త రుణాలు అందక.. పాత రుణాలు చెల్లించలేక డ్వాక్రా సంఘాల నిర్వహణ గాడి తప్పుతోంది. పకడ్బందీగా నడిచే వ్యవస్థ క్రమంగా బీటలువారుతోంది. సంఘాల పటిష్టత కోసం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన సిబ్బంది మొక్కుబడి తంతుగా ముగిస్తున్నారు. మరోవైపు రుణాలు అందక మహిళలు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 65 వేల మహిళా సంఘాలు ఉండగా.. దాదాపు సగం సంఘాలకు ఇప్పటికీ రుణాలు ఇవ్వలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని సంఘాలకు రూ.1,200 కోట్లను రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా.. రూ.660 కోట్లు మాత్రమే ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి. 2015–16 ఆర్థిక సంత్సరంలో రూ.వెయ్యి కోట్లను రుణాలివ్వాలని నిర్ణయించగా.. ప్రభుత్వం రూ.500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి ఎదురుకావడంతో మహిళా సంఘాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. లక్ష్యం మేరకు రుణాలిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రçస్తుత ఆర్థిక సంవత్సరం నెలన్నర రోజుల్లో ముగిసిపోనుంది. ఈలోగా రూ.540 కోట్లను రుణాలుగా ఇచ్చే అవకాశం ఉండదని పలువురు పేర్కొంటున్నారు. మొండి బకాయిలను తగ్గించామని అధికారులు పేర్కొంటున్నా.. ఇంకా వసూలు కావా ల్సిన మొత్తం రూ.40 కోట్ల వరకు ఉంది. చర్యలు చేపడతాం జిల్లాలోని మహిళా సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.660 కోట్లను బ్యాంకుల ద్వారా రుణాలు అందించాం. మొండి బకాయిల వసూళ్లకు చర్యలు తీసుకున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి లక్ష్యాన్ని చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. – కె.శ్రీనివాసులు, డిఆర్డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ -
సంఘాల బలోపేతానికి కృషి
కాకినాడ సిటీ : స్వయం సహాయక సంఘాల బలోపేతానికి కృషి చేస్తామని జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు తాడి నాగదుర్గ తెలిపారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన జిల్లా మహిళా సమాఖ్య కార్యవర్గ సభ్యులు శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలోని డ్వామా సమావేశ హాలులో విలేకర్ల సమావేశం నిర్వహించారు. నాగదుర్గ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 92,641 స్వయం సహాయక సంఘాల్లో 9,05,086 మంది సభ్యులు ఉండగా 69 మండల సమాఖ్యలు, 3,488 గ్రామైక్య సంఘాలతో జిల్లా సమాఖ్య ఉందన్నారు. వెలుగు సిబ్బంది సహకారంతో సంఘాల లోటుపాట్లు, సమస్యలను గుర్తించి వాటి నివారణకు చర్యలు తీసుకోవడంతో పాటు అన్ని పథకాల లబ్ధిని సభ్యులకు చేరేలా చూస్తామన్నారు. సంఘదర్శిని ఆరో విడత కార్యక్రమం ద్వారా ఈ నెల 15వ తేదీ నుంచి జిల్లాలోని సీ, డీ గ్రేడులలో ఉన్న సంఘాలను బలోపేతం చేసి సక్రమంగా సమావేశాలు, పొదుపులు, అప్పుల నిర్వహణ, చెల్లింపులు, పుస్తక నిర్వహణపై అవగాహన పెంచుతామన్నారు. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా నమోదుకాని ఎస్సీ, ఎస్టీ సభ్యులను గుర్తించి సంఘాలుగా ఏర్పాటు చేసి వారి ఆర్థికాభివృద్ధి, జీవనోపాధి పెరిగేలా కృషిచేస్తామన్నారు. ఇప్పటి వరకు మొబైల్ బుక్ కీపింగ్ లావాదేవీలు జరపని సంఘాలతో పాటు కొత్తగా ఎస్సీ, ఎస్టీ సభ్యులతో ఏర్పాటు చేయబోయే సంఘాల సభ్యులకు మొబైల్ బుక్ కీపింగ్లో శిక్షణ కల్పిస్తామన్నారు. సమాఖ్య కార్యదర్శి ఎస్.ముత్యాల లక్ష్మి, ఉపాధ్యక్షురాలు కె.కృష్ణవేణి, సంయుక్త కార్యదర్శి సీహెచ్ నళిని, కోశాధికారి ముప్పిడి మేరి పాల్గొన్నారు. -
మేసేస్తున్నారు
డ్వాక్రా మహిళల నుంచి బలవంతపు వసూళ్లు ప్రతి గ్రూప్ నుంచి రూ.1,300 చెల్లించాల్సిందే 65 వేల గ్రూపుల నుంచి రూ.8.45 కోట్లు లూటీ డ్వాక్రా మహిళలు అడుగడుగునా దగా పడుతున్నారు. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు చివరకు రిక్తహస్తం చూపించడంతో వడ్డీలు తడిసి మోపెడై మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తడంతో రుణమాఫీకి బదులుగా ఏటా రూ.3 వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గత ఏడాది పెట్టుబడి నిధి పేరిట రూ.3 వేల చొప్పున జమ చేసినా.. ఆ సొమ్మును బ్యాంక్ ఖాతాల నుంచి తీసుకునే అవకాశం లేకుండా చేశారు. ఈ ఏడాది పసుపు, కుంకుమ పేరిట రూ. 3 వేల చొప్పున ఇస్తున్నట్టు ప్రకటించగా.. ఆ సొమ్ము తీసుకోవాలంటే తమ చేతులు తడపాలని యానిమేటర్లు.. గ్రామ, మండల సమాఖ్యల అధ్యక్షులు డిమాండ్ చేస్తున్నారు. అదేమని అడిగితే.. ఆ సొమ్ములన్నీ పై అధికారులకు ముట్టజెప్పాల్సి ఉంటుందని చెబుతున్నారు. పాలకోడేరు : పసుపు, కుంకుమ పేరిట డ్వాక్రా మహిళలకు ఇస్తున్న సొమ్ములో కమీషన్లు గుంజుతున్నారు. ఒక్కొక్క మహిళ నుంచి రూ.130 చొప్పున వసూలు చేస్తున్నారు. ఆ సొమ్ము చెల్లిస్తేనే.. రూ.3 వేలను ఖాతాల్లో జమ అయ్యే ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇలా ప్రతి గ్రూపు నుంచి రూ.1,300 చొప్పున ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. జిల్లాలో 65 వేల గ్రూపులకు పసుపు, కుంకుమ నిధులు మంజూరు కాగా, ఒక్కొక్క గ్రూపు నుంచి రూ.130 చొప్పున రూ.8.45 కోట్లను మింగేసేందుకు జిల్లా స్థాయిలో పథకం రచించి.. వసూళ్ల కార్యక్రమాన్ని యానిమేటర్లతోపాటు గ్రామ, మండల సమాఖ్య అధ్యక్షులకు అప్పగించారు. వ్యక్తిగత ఖాతాల్లో జమకాని నిధులు పసుపు, కుంకుమ పేరిట ఇస్తున్న ఈ నిధులను డ్వాక్రా మహిళల వ్యక్తగత ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. ఈ మొత్తాలను గ్రూపు లీడర్ల ఖాతాల్లో వేస్తున్నారు. దీనిని ఆసరా చేసుకుని ప్రతి గ్రూపు నుంచి రూ.1,300 చొప్పున వసూలు చేస్తున్నారు. కమీషన్ నగదు ముట్టచెప్పిన అనంతరమే పసుపు, కుంకుమ సొమ్మును ఆ గ్రూపు ఖాతాలో జమ చేయిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో డ్వాక్రా సంఘం అధ్యక్షులు తమ గ్రూపులోని ప్రతి సభ్యురాలి నుంచి రూ.130 చొప్పున వసూలు చేసి ఐకేపీ సిబ్బందికి సమర్పించుకుంటున్నారు. డబ్బులిస్తేనే సొమ్ములిస్తారంట : విప్పర్తి జూలియమ్మ, మోగల్లు రుణమాఫీ పేరుతో ఒక్కొక్క మహిళ నుంచి రూ.130 చొప్పున యానిమేటర్లు వసూలు చేశారు. ఎందుకని అడిగితే ఇలా సొమ్ములిస్తేనే పసుపు, కుంకుమ నిధులు ఇస్తామంటున్నారు. ఈ ఒక్క దానికే కాదు.. ప్రతి పనికీ వాళ్ల చేయి తడపాల్సి వస్తోంది. డబ్బులు ఇవ్వకపోతే ఊరుకోవట్లేదు పెనుమాల మరియమ్మ , మోగల్లు వాళ్లు అడిగిన డబ్బులు ఇవ్వకపోతు ఏదో విధంగా ఇబ్బంది పెడుతున్నారు. మొదటి నుంచీ ఇలాగే వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే రాయితీల విషయాలు మాత్రం మాకు తెలియనివ్వడం లేదు. డబ్బులు తీసుకుంటారు.. రుణాలివ్వరు బి.మార్త, మోగల్లు ప్రభుత్వ పరంగా ఇచ్చే సబ్సిడీలు, పథకాల గురించి మాకు తెలియడం లేదు. డబ్బులు వసూళ్లకైతే ఇంటికొచ్చి వచ్చి మరీ అడుగుతారు. రాయితీలతో కూడిన రుణాలు మాత్రం మాకు ఇవ్వడం లేదు వసూళ్లకు ఆస్కారం ఉండదు డ్వాక్రా గ్రూపులకు మంజూరైన పసుపు, కుంకుమ నిధులు సభ్యుల వ్యక్తిగత ఖాతాల్లో జమ అయ్యాయి. అలాంటప్పుడు వసూళ్లకు ఆస్కారం ఉండదు. ఎవరైనా డబ్బులు అడిగినా, తీసుకున్నా.. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. కె.శ్రీనివాసరెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్, డీఆర్డీఏ -
డ్వాక్రాలపై అప్పు డప్పు
తక్షణమే రుణాలు చెల్లించాలంటూ మహిళా సంఘాలకు నోటీసులు లేదంటే ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరికలు ఆర్డీవో చెంతకు వెళ్లి వివరణ ఇచ్చుకోవాలంటూ ఆదేశాలు రుణమాఫీ ఊసెత్తొదంటున్న అధికారులు ః డ్వాక్రా మహిళలపై అప్పు డప్పు మోగుతోంది. రుణాలకు సంబంధించి బకాయిలు చెల్లించకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తామని.. గ్రామాల్లో టాం టాం వేయించి పరువు తీస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్లో అప్పులు పుట్టకుండా చేస్తామని.. వడ్డీ వ్యాపారులు కూడా ఆదుకోలేని స్థితి కల్పిస్తామని బెదిరిస్తున్నారు. ’అదేంటయ్యా.. డ్వాక్రా రుణాలు మాఫీ చేయమని మేం అడిగామా. చంద్రబాబు వీధివీధికీ వచ్చి మరీ రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఆయన మాటవల్లే కదా బకాయి పడ్డాం. అసలు కంటే వడ్డీ భారం ఎక్కువైపోయింది. ఎలా కట్టమంటారు’ అని మహిళలు అడుగుతుంటే.. ’ఆ మాటలేం చెల్లవ్. రుణమాఫీ గురించి మాట్లాడొద్దు’ అంటూ అధికారులు హుకం జారీ చేస్తున్నారు. కొవ్వూరు : రుణాలు కట్టాలంటూ డ్వాక్రా మహిళలపై నిన్నటి వరకూ బ్యాంకులు విరుచుకుపడితే.. ఇప్పుడు ఆ బాధ్యతను అధికారులు తీసుకున్నారు. బకాయిలు చెల్లించాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. కొవ్వూరులో సుమారు 400 మంది మహిళలకు బుధవారం ఇదే పరిస్థితి ఎదురైంది. మండలంలో 70 గ్రూపులకు చెందిన మహిళలకు ఇటీవల బ్యాంకుల నుంచి నోటీసులు అందాయి. తక్షణమే బకాయిలు చెల్లించకపోతే కోర్టుకెళ్లి ఆస్తులను జప్తు చేయిస్తామని అందులో పేర్కొన్నారు. గురువారంలోగా ఆర్డీవో ఎదుట హాజరై వివరణ ఇచ్చుకోవాలని.. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో సుమారు 400 మంది మహిళలు బుధవారం ఆర్డీవో కార్యాలయానికి తరలివచ్చారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కార్యాలయ ఆవరణలోని నీట్లనీడన పడిగాపులు పడ్డారు. ఆస్తులు జప్తు చేయిస్తామని హెచ్చరిక డ్వాక్రా మహిళలతో భేటీ అయిన ఆర్డీవో బి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. ’బకాయిలు కట్టకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తాం. గ్రామాల్లో టాం టాం వేయిస్తాం.అప్పుడు మీ గౌరవం పోతుంది. బ్యాంకులు నడవాలంటే సకాలంలో రుణాలు కట్టాలి. బకాయిలు చెల్లించకపోతే మీకు అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులే కాదు వడ్డీ వ్యాపారులు కూడా ముందుకు రారు. మీకు ఎక్కడా అప్పులు పుట్టవు’ అంటూ హెచ్చరించారు. ’అదేంటి సార్. చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు కదా. ఆయన మాటనమ్మి బాకీలు కట్టలేదు. ఇప్పుడేమో అసలు కంటే వడ్డీలు పెరిగిపోయాయ్. ఎలా కట్టగలం’ అని మహిళలు నిలదీశారు. ఆర్డీవో స్పందిస్తూ.. ’ఎవరు హామీ ఇచ్చారో వాళ్లను అడగండి. ఎవరో చెప్పిన మాటలు నమ్మి.. ఎవరికోసమో ఎదురుచూస్తూ రుణాలు చెల్లించడం మానేయవద్దు’ అన్నారు. ’బకాయిలు చెల్లించకపోతే ఆస్తులన్నీ వేలం వేస్తారు. మీకు ఇష్టమేనా’ అని ప్రశ్నించారు. బడికెళ్లే మీ పిల్లల్ని డ్వాక్రా బకాయిలు ఎగ్గొట్టారంటగా అని తోటి విద్యార్థులు అడిగితే వాళ్లు తలదించుకోవాల్సి వస్తుందని హితోపదేశం చేశారు. బ్యాంకు రుణాలను వాయిదాలు లేదా వన్టైమ్ సెటిల్మెంట్ ద్వారా చెల్లించాలని సూపించారు. నెల రోజుల తరువాత ఇలా మాట్లాడే అవకాశం తమకు ఉండదన్నారు. ’కాగితాలొస్తాయి. మా తహసీల్దార్లు వస్తారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం బకాయిలన్నీ ముక్కుపిండి వసూలు చేస్తారు’ అని హెచ్చరించారు. దీంతో అవాక్కవడం మహిళల వంతైంది. అధికారులకు లక్ష్యాలు డ్వాక్రా బకాయిలను రాబట్టుకునేందుకు మండల శాఖ అధికారులకు ప్రభుత్వం టార్గెట్లు ఇచ్చింది. మార్చినెలాఖరు నాటికి నూరు శాతం బకాయిలు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. డ్వాక్రా మహిళలపై ఒత్తిళ్లు పెరిగాయి. రంగంలోకి దిగిన అధికారులు సామదాన దండోపాయలను ప్రయోగిస్తున్నారు. బకాయిల వసూలు విషయంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపే ప్రయత్నంలో భాగంగా వేధింపులకు దిగుతున్నారు. జిల్లాలోని డ్వాక్రా మహిళలు తీసుకున్న మొత్తం రుణాల్లో 1.32 శాతం (సుమారు 20 కోట్లు) మాత్రమే బకాయిలు ఉన్నాయి. మార్చి నెలాఖరు నాటికి దీనిని సున్నాగా చూపించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఒక్క జీలుగుమిల్లి మండలంలోనే అత్యధికంగా రూ.3.50 కోట్ల మేర బకాయిలున్నాయి. పాత రుణాలు చెల్లిస్తే కొత్త రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని మహిళలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. హామీ ఇచ్చి నోటీసులు పంపుతారా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. నాలుగేళ్ల కిత్రం బ్యాంకు నుంచి మా గ్రూపు సభ్యులు రూ.2 లక్షల రుణం తీసుకున్నాం. రుణాలు కట్టవద్దని చంద్రబాబు హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి రాగానే మాఫీ చేస్తానన్నారు. ఇప్పుడు రుణాలు కట్టకపోతే ఆస్తులు జప్తు చేయిస్తామని నోటీసులు పంపారు. ఇది ఎంతవరకు సమజసం. చదలవాడ రూత్కుమారి, డ్వాక్రా మహిళ, తోగుమ్మి హామీలు నమ్మి వీధిన పడ్డాం డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి నమ్మించారు. ఎన్నికల సమయంలో ఎంపీ మురళీమోహన్ ఇంటింటికీ మరీ ఈ విషయం చెప్పారు. ఇప్పుడు బకాయిలు మాఫీ చేయకపోవడంతో వీధిన పడ్డాం. నోటీసులు ఇచ్చి బెదిరిస్తున్నారు. ఆర్డీవో వద్ద వివరణ ఇవ్వాలంటే కూలీ పనులు మానుకుని వచ్చాం. ముప్పిడి కుమారి, డ్వాక్రా మహిళ, తోగుమ్మి మోసం చేశారు డ్వాక్రా రుణాలు కట్టొద్దన్నారు. మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు .రుణం తీసుకుని మూడేళ్లయ్యింది. ప్రభుత్వం హామీ ఇవ్వకపోతే వాయిదాలు కట్టేసేవాళ్లం. ఇప్పుడు రుణాలపై వడ్డీలు పెరిగి తడిసిమోపెడయ్యాయి. ఇచ్చిన మాట నిలుపుకోలేనప్పుడు హామీ ఇవ్వడం ఎందుకు. పేదలను మురిపించి ముంచేశారు. రుణాలు మాఫీ చేయమని మేం అడిగామా. ఇప్పుడు కట్టకపోతే ఇళ్లకు తాళాలు వేస్తామని బెదిరిస్తున్నారు. కాకులపాటి మల్లేశ్వరి, డ్వాక్రా మహిళ బకాయిలు చెల్లించాల్సిందే బకాయిల చెల్లింపుల్లో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్ధానంలో ఉంది. ఇంకా సుమారు రూ.19 కోట్లు బకాయిలు ఉన్నాయి. వీటి వసూలు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. వడ్డీ లేని రుణాలు పొందాలంటే సకాలంలో రుణాలు చెల్లించాలి. జీలుగుమిల్లి మండలంలో అత్యధికంగా రూ.3.50 కోట్లు బకాయిలు ఉన్నాయి. మార్చి నెలాఖరు నాటికి బకాయిలన్నీ వసూలు చేయాలని ప్రయత్నిస్తున్నాం. కె.శ్రీనివాసులు, ప్రాజెక్టు డైరెక్టర్, డీఆర్డీఏ -
పసుపు.. కుంకుమ.. సొమ్మేదమ్మా!
డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి మొహం చాటేసిన ప్రభుత్వం మహిళల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తడంతో అడపాదడపా కొద్దిపాటి సొమ్మును విదిలిస్తోంది. ఇందులో భాగంగానే రెండో విడతగా పసుపు.. కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళల ఖాతాల్లో రూ.3 వేల చొప్పున జమ చేస్తున్నట్టు ప్రకటించింది. సంక్రాంతి కానుకగా ఈ సొమ్ములు ఇస్తున్నట్టు ప్రకటించడంతో ఆ మొత్తాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని గ్రూపుల ఖాతాల్లో సొమ్ములు జమ కాగా, కొన్ని గ్రూపులకు అందటం లేదు. సొమ్ము వచ్చిందో లేదో తెలుసుకునేందుకు మహిళలు రెండు రోజులుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని బ్యాంకుల్లో డ్వాక్రా మహిళలను లోనికి అనుమతించడం లేదు. దీంతో వారు గంటల తరబడి రోడ్లపైన.. బ్యాంకుల ఆవరణలోను వేచి ఉంటున్నారు. తమ ఖాతాల్లో నగదు జమ అయ్యిందో లేదో స్పష్టంగా తెలియజెప్పాలని.. జమ అయిన సొమ్మును తీసుకునేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మంగళవారం పెదవేగిలోని ఇండియన్ బ్యాంక్ వద్ద డ్వాక్రా మహిళలు పడిన అవస్థలకు అద్దం పట్టే చిత్రాలివి. పెదవేగి రూరల్ -
శ్రీమఠంలో ఘనంగా ద్వాదశి వేడుకలు
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో ఆదివారం ద్వాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో ధనుర్మాసం సందర్భంగా వేకువ జామునే పూజలు ప్రారంభమయ్యాయి. రాఘవేంద్రస్వామి మూలబృందావనానికి నిర్మల్య విసర్జన, జల, పుష్ప పంచామృతాభిషేకాలు, పట్టువస్త్ర సమర్పణ చేశారు. బృందావన ప్రతిమను బంగారుపల్లకీలో మాడా వీధుల్లో ఊరేగించారు. పీఠాధిపతి జయ, దిగ్విజయ, మూలరాముల పూజలో తరించారు. అన్నపూర్ణ భోజన శాలలో 8 గంటలకే భోజనాలు మొదలు పెట్టారు. భక్తులు వేలాదిమంది రావడంతో శ్రీమఠం, వ్యాపార దుకాణాలు కళకళలాడాయి. మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, జోనల్ మేనేజర్ శ్రీపతిఆచార్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. -
నాగేశ్వర జ్యోతిర్లింగం నమో నమామి!
ద్వాదశ జ్యోతిర్లింగాలలో నాగేశ్వర లింగం ఒకటి. ఇది గుజరాత్లోని దారుకావనంలో ఉంది. నేటి దారుకావనాన్నే పురాణాలలో కామ్యకవనం అని, ద్వైతవనమనీ పేర్కొన్నారు. దీని గురించిన గాథలు చాలా ఉన్నాయి కానీ, ముఖ్యమైనవాటిని చూద్దాం.. పూర్వం ఒక సముద్రతీరాన గల ఒక వనంలో దారుకుడనే రాక్షసుడుండేవాడు. వాడి భార్య దారుకి. వాళ్లు తపశ్శక్తి సంపన్నులు. వారికి బోలెడంత మంది సంతానం, మహాదుష్టులు, బలవంతులైన అనుచరగణం ఉన్నారు. వారి అండ చూసుకుని ఆ వనంలో ఉన్నవారినే కాదు, అటుగుండా వచ్చీపోయేవాళ్లని కూడా వదలిపెట్టకుండా హింసించనారంభించారు. దాంతో బాటసారులందరూ కలసి ఔర్వుడు అనే మహాముని పాదాలు పట్టుకుని, తమకు ఆ రాక్షస దంపతుల పీడ వదిలించమని ప్రాధేయపడ్డారు. అప్పుడు ఔర్వముని, ఆ రాక్షసులెవరైనా భూమిమీద ఉంటే, వారిలో హింసాప్రవృత్తి ఉంటే, వారు ఇక ప్రాణాలు కోల్పోవలసిందేనని శాపం పెట్టాడు. దాంతో దారుకుడు సముద్రంలోకి వెళ్లి, అక్కడ ఒక నగరాన్ని నిర్మించుకుని, అందులో ఉంటూ, సముద్ర ప్రయాణీకులను హింసించ డమే ప్రవృత్తిగా పెట్టుకున్నాడు. ఒకసారి వాడలా సుప్రియుడనే వర్తకుడిని, అతని బంధుమిత్రులను పట్టి బంధించి, వారిని సముద్రం అడుగున గల తన నగరంలో ఒక చెరసాలలో బంధించాడు. ఈ చెరసాలకు అసంఖ్యాకమైన జలసర్పాలు, రాక్షసులు కాపలా కాస్తూ ఉంటారు. సుప్రియుడు మహాశివభక్తుడు కావడంతో చెరసాలలోని మట్టినంతటినీ ఒకచోట చేర్చి, దానిలో కాసిని నీళ్లుపోసి, ఆ మట్టితోనే ఒక శివలింగాన్ని తయారు చేసుకుని, శివుణ్ణి పూజించనారంభించాడు. సుప్రియుని సలహామేరకు అతనితో కలసి ఉన్నవారందరూ కూడా మహా పవిత్రమైన, అత్యంత శక్తిమంతమైన శివపంచాక్షరీ మంత్రాన్ని తదేక దీక్షతో జపించసాగారు. అప్పుడు ఆ రాక్షసుడి అనుచరులు సుప్రియుడి వద్దకు వచ్చి, ‘‘నీవు శివారాధన చేయరాదు. చేస్తే, మా రాజు, రాణి అయిన దారుకా దారుకిల ఆరాధన మాత్రమే చేయాలి. తక్షణం నీ శివపూజ మానకుంటే నిన్ను చంపేస్తాం’’ అని బెదిరించారు. సుప్రియుడు అందుకు లొంగకపోవడంతో దారుకుణ్ణి పిలుచుకు వచ్చారు. దారుకుడు సుప్రియుడి భుజం మీద కత్తిపెట్టి, బెదిరించాడు. అయినా వినలేదు. ఇలా లాభం లేదని, కంఠాన్ని ఖండించబోయాడు. అప్పుడు ఆ పార్థివలింగం నుంచి శివుడు ప్రత్యక్షమై, ఆ రాక్షసుని తన త్రిశూలంతో ఒక్క దెబ్బకొట్టి, దుష్టులైన వాడి అనుచరగణాన్ని భస్మం చేశాడు. సుప్రియుని ప్రార్థన మేరకు అక్కడే జ్యోతిర్లింగరూపంలో కొలువయ్యాడు. అన్ని కథల్లా ఈ కథ ఇంతటితో ముగియలేదు. ఎందుకంటే ఆ రాక్షసుడి భార్య దారుకి పార్వతీదేవికి ప్రియభక్తురాలు కావడంతో తనకు లభించిన కొన్ని శక్తుల వల్ల తన అనుచరుల సాయంతో ఆ అడవినంతటి నీ తీసుకుపోయి సముద్రం అడుగుకు చేర్చింది.దాంతోపాటు ఆ వనంలోకి అడుగుపెట్టిన వారినందరినీ తమ అధీనంలోకి తీసుకుని, వారిని బలవంతంగా తమ రాజ్యప్రజలుగా మార్చసాగింది. శివపూజ చేస్తున్న సుప్రియుణ్ణి పూజమానవలసిందిగా నిర్బంధిస్తూ, ఆమె, ఆ రాక్షసగణం సుప్రియుని చిత్రహింసల పాలు చేయడం మొదలు పెట్టారు. మరల శివుడు ప్రత్యక్షమై, సుప్రియుడికి ఒక శక్తిమంతమైన ఆయుధాన్నిచ్చాడు. ఆ ఆయుధంతో సుప్రియుడు వారందరినీ జయించాడు. ఈసారి పరమేశ్వరుడు ఆ జ్యోతిర్లింగంలోనికి తన శక్తులను ప్రవేశపెట్టి, వారందరినీ ఏ దుష్టశక్తులూ ఏమీ చేయకుండా వారికి రక్షణగా అక్కడే కొలువుతీరాడు. పార్వతీదేవి అక్కడ నాగేశ్వరిగా కొలువుతీరి, భక్తులను అనుగ్రహించడం ఆరంభించింది. ఆ రాక్షసగణాన్ని అక్కడినుంచి దూరంగా పంపించి, వారు జనావాసాలలోకి రాకుండా చేసింది జగన్మాత. సుప్రియుడు రూపొందించిన ఆ లింగమే నాగేశ్వర జ్యోతిర్లింగం. నాగేశ్వరుడిగా తనను కొలిచిన వారికి తాను సరైన మార్గాన్ని చూపుతానని, మోక్షాన్నిస్తానని, భక్తి, వైరాగ్య జ్ఞానాలను అనుగ్రహిస్తానని శివుడు సుప్రియుడికి వాగ్దానం చేశాడు. ఈమేరకు శివపార్వతులు నాగేశ్వరుడు, నాగేశ్వరిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. అతి ప్రాచీన గాథ: పూర్వం వాలఖిల్యులనే మునులు దారుకావనంలో శివుని గురించి సుదీర్ఘకాలంపాటు ఘోర తపస్సు చేశారు. అయినప్పటికీ శివుడు వారి భక్తిని, సహనాన్ని మరిన్ని పరీక్షలకు గురి చేయాలనుకున్నాడు. దాంతో ఒక యువసన్యాసి రూపంలో వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ యువసన్యాసి వంటిమీద నాగులు తప్ప వేరే వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ లేవు. అత్యంత సుందరాకారంలో ఉన్న ఆ యువసన్యాసిని చూసి, మునిపత్నులు మనసు పారేసుకుని, భర్తలను వదిలేసి, ఆ దివ్యసుందరాకారుడి వెంట పరుగులు తీశారు. దాంతో సహనం చచ్చిపోయి, కోపం కట్టలు తెచ్చుకుంది ఆ మునులలో. ఆ యువసన్యాసి లింగం తెగిపోవాలని శపించారు. ఇంకేముంది, శివుడి లింగం కాస్తా జారి భూమి మీద పడింది. దాంతో లోకాలన్నీ కంపించిపోయాయి. బ్రహ్మ, విష్ణులు భూమి మీదకు వచ్చి, ఆ మునుల తప్పిదాన్ని మన్నించి, లింగాన్ని వెనక్కు తీసుకుని, లోకాలను కాపాడమని శివుని ప్రార్థించారు. శివుడు శాంతించి, భూమి మీద పడిన ఆ లింగంలో జ్యోతిర్లింగాకారంలో కొలువుదీరి, మునులను అనుగ్రహించాడు. వంటిమీద పాములనే వస్త్రాలుగా చుట్టబెట్టుకుని వచ్చాడు కాబట్టి, నాగేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు శివుడు. పతి వెంటే సతి అన్నట్లుగా... పార్వతీదేవి నాగేశ్వరిగా పక్కనే కొలువుదీరింది. మరోగాథ: తన ప్రియపత్ని అయిన సతీదేవి యోగాగ్నిలో దగ్ధం కావడంతో సతీవియోగాన్ని తట్టుకోలేక ఓ నదీతీరానికొచ్చి తాను కూడా దహించుకుపోయాడు. ఆ భస్మరాశి ఆ నదిలో కలిసిపోయింది. కొంతకాలానికి పాండవులు ఆ నది ఒడ్డున విశ్రాంతి తీసుకుంటుండగా, కొన్ని ఆవులు వచ్చి నదిలో స్నానానికి దిగగానే వాటి పొదుగులు పాలతో నిండిపోయి, ఆ నదీజలాలు వాటి పాలధారలతో తెల్లబడిపోసాగాయి. ఈ వింతను చూసి ఆశ్చర్యపోతున్న భీమార్జునులతో ధర్మరాజు, బహుశా ఈ నదిలో ఏదో మహిమ ఉండి ఉంటుంది. నదిలో దేవతలో, తపస్సులో ఉండి ఉండవచ్చు అని అన్నాడు. భీముడు నదీజలాలను తోడేసే ప్రయత్నం చేసి, సాధ్యం కాకపోవడంతో కోపంతో నదిమీద తన గదతో మోదాడు. ఆ దెబ్బకు నది రెండుగా చీలి పోయింది. నది మధ్యభాగంలో భీముడు తన గదతో మోదిన చోట రక్తపుచారికలు కనిపించాయి. నీళ్లు వేడెక్కిపోయి, నీటి అడుగున నాగేశ్వరుడి ఆకారంలో ఉన్న శివలింగం బయటపడింది. పాండవులు అక్కడ గుడిని నిర్మించారు. దారుకలు అంటే దేవదారు వృక్షాలు. ఇక్కడ దేవదారు వృక్షాలు విరివిగా ఉండటం వల్ల దారుకావనమనే పేరు వచ్చింది. ఈ వనంలో 20 మీటర్ల ఎత్తున్న శివుని విగ్రహం చూపరులను కన్నులు తిప్పుకోనివ్వదు. ఆలయం సుందరంగా ఉంటుంది. - డి.వి.ఆర్.భాస్కర్ -
అన్నకు మసక.. చెల్లెళ్లకు మస్కా
పేదలకు చౌక ధరలకు ఔషధాలు అందించేందుకు నెలకొల్పిన అన్నసంజీవని పథకం నిర్వహణ గాడి తప్పింది. జిల్లావ్యాప్తంగా 37 దుకాణాలను ఏర్పాటు చేసిన అధికారులు అరకొరగానే ఔషధాలను సరఫరా చేస్తున్నారు. అమ్మకాలు పడిపోవడంతో ఐకేపీ సిబ్బందికి, డ్వాక్రా మహిళలకు టార్గెట్లు పెడుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆచంట : పేదలకు చౌక ధరలకే ఔషధాలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నసంజీవని దుకాణాలు డ్వాక్రా మహిళల పాలిట శాపంగా మారాయి. ఒక పక్క పెద్ద నోట్ల రద్దుతో చిల్లరనోట్ల కోసం నానాఇబ్బం దులు పడుతుంటే.. మరోపక్క మందులు కొనాల్సిందేనంటూ ఒత్తిడి తీసుకువస్తున్నారు. అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచి అమ్మకాలు పెంచుకోవాల్సిందిపోయి అడ్డదారుల్లో అమ్మకాలకు ప్రభుత్వం వెంపర్లాడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 38 దుకాణాల ఏర్పాటు జిల్లాలోని పట్టణాలు, వివిధ మండలాల్లో మొత్తం 38 అన్న సంజీవని దుకాణాలు ఏర్పాటు చేశారు. ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రులు, నరసాపురం, భీమవరం, నిడదవోలులోని ప్రభుత్వాసుపత్రులు, పీహెచ్సీలతోపాటు ఆచంట, పోలవరం, బుట్టాయగూడెం తదితర మండలాల్లో ఈ దుకాణాలు ఏర్పాట య్యాయి. వీటి నిర్వహణ బాధ్యతను ఐకేపీ అధికారులకు అప్పగించారు. షాపుల నిర్వహణ మొక్కుబడిగా సాగడం.. రోగులకు అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడంతో అమ్మకాలు పడిపోయాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అధికారులు అది విస్మరించి డ్వాక్రా సంఘాలకు మందులు అంటగడుతున్నారు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన దుకాణాల్లో నెలకు రూ.2 లక్షల వరకూ అమ్మకాలు సాగించాలంటూ ఐకేపీ సిబ్బందికి లక్ష్యాలు విధించారు. ఏం చేయాలో పాలుపోని ఐకేపీ సిబ్బంది మందులు కొనుగోలు చేయాలంటూ గ్రామాల్లోని డ్వాక్రా సంఘాలపై ఒత్తిడి పెంచుతున్నారు. డ్వాక్రా సంఘాల్లో సభ్యులు రోగం లేకున్నా మందులు కొనాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఔషధాలు కొంటేనే రుణం ఒక్కో డ్వాక్రా సంఘంలో కనీసం పది మందికి తగ్గకుండా సభ్యులు ఉంటారు. ఒక్కొక్కరూ ప్రతి నెలా రూ.200 విలువైన మందులు కొనుగోలు చేయాలని ఐకేపీ అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. అంటే ఒక్కో గ్రూపులో పదిమంది సభ్యులు ఉంటే కనీసం రూ.2 వేల విలువైన మందులు కొనుగోలు చేయాలి. ఈ విధంగా రోజుకు ఒకటి లేదా రెండు గ్రూపుల చేత మందులు కొనుగోలు చేయిస్తూ కొంతకాలంగా టార్గెట్లు చేరుకుంటున్నారు. మందులు కొంటున్నారో లేదో తెలసుకునేందుకు మరో మెలిక పెడుతున్నారు. మందులు కొన్నట్టు సంబంధిత దుకాణం నుంచి రశీదులు తెచ్చి కార్యాలయాల్లో చూపించాలని షరతు పెడుతున్నారు. ఈ విధమైన బలవంతపు కొనుగోళ్ల వ్యవహారం జిల్లాలోని అన్ని మండలాల్లో చడీచప్పుడు కాకుండా కొంతకాలం నుంచి సాగిపోతోంది. ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే.. పైఅధికారులు నెలవారీ టార్గెట్లు పెడుతున్నారని నిర్వాహకులు చెప్పుకొస్తున్నారు. సబ్బులు.. పేస్టులు.. టానిక్లూ అధికారుల ఒత్తిడితో ఔషధ దుకాణం వద్దకు వెళుతున్న డ్వాక్రా సంఘాల మహిళలకు దిక్కుతోచడం లేదు. రోగం లేకుండా ఏం మందులు కొనాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుకాణానికి వెళ్లి తనకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేదని చెబితే.. మీకోసం ప్రత్యేకంగా మెడికేటెడ్ టూత్పేస్టులు, సబ్బులు, బలానికి టానిక్లు, మల్టీవిటమి¯ŒS టాబ్లెట్లు అందుబాటులో ఉంచామంటూ రూ.200కు సరిపడా సరుకులు అంటగడుతున్నారని మహిళలు వాపోతున్నారు. ఈ వ్యవహారాన్ని ఎవరికైనా చెప్పుకుంటే వారికి రుణం నఇవ్వరేమోన భయపడిపోతున్నారు. ఒక పక్క డ్వాక్రా సంఘాలకు ఆర్థిక పరిపుష్టినిచ్చి వారి కాళ్లమీద వారిని నిలబెడతామని చెబుతున్న పాలకులు.. ప్రభుత్వ పథకాన్ని మనుగడలో ఉంచడం కోసం చిరుద్యోగుల చేతి చమురు వదిలిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బలవంతపు కొనుగోళ్ల వ్యవహారానికి స్వస్తి చెప్పాలని డ్వాక్రా మహిళలు జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అంశంపై సంబంధిత శాఖ ఉన్నతాధికారిని ‘సాక్షి’ సంప్రదించగా టార్గెట్లు నిర్ణయించడం నిజమేననిన చెబుతూ.. తన పేరు మాత్రం రాయవద్దని కోరారు. -
‘రుణం’ తీర్చుకునేది ఇలాగేనా!
–రుణమాఫీ అని చెప్పి నోటీసులిస్తారా! –సర్కారుపై డ్వాక్రా మహిళల మండిపాటు అధికారాన్ని కట్టబెట్టిన ప్రజల రుణం తీర్చుకుంటామని, రుణమాఫీ చేసి తీరతామని ప్రగల్భాలు పలికిన అధికారపార్టీ ఆ మాటను తప్పింది. ఫలితంగా తీసుకున్న రుణాలు చెల్లించని డ్వాక్రా మహిళలకు బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయి. దీంతో రుణం తీర్చుకునే తీరిదేనా అంటూ మహిళలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇటీవల నరసాపురం మండలం, జంగారెడ్డిగూడెంలలో డ్వాక్రా మహిళలకు నోటీసులుజారీ చేసిన బ్యాంకులు తాజాగా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లికి చెందిన సుమారు వంద మందికి తాఖీదులు ఇచ్చాయి. దీంతో వారంతా లబోదిబోమంటున్నారు. జంగారెడ్డిగూడెం రూరల్ : రైతుమిత్ర రుణాలు తీసుకున్న జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లికి చెందిన సుమారు 100 మందికి రుణాలు చెల్లించాలంటూ నోటీసులు రావడంతో వారంతా లబోదిబోమంటున్నారు. బాధితుల కథనం ప్రకారం.. గ్రామంలో 50 గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపులన్నీ నాలుగేళ్ల క్రితం రైతుమిత్ర రుణాల కింద గ్రూపునకు రూ.3లక్షల చొప్పున లక్కవరం ఆంధ్రాబ్యాంకులో రుణాలు పొందాయి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ రుణమాఫీ చేస్తామని ప్రకటించడం, ఆ పార్టీనే అధికారంలోకి రావడంతో ఈ గ్రూపులు రుణమాఫీ అవుతుందనే ఆశతో తిరిగి చెల్లించడం మానేశాయి. ఈ నేపథ్యంలో నాలుగురోజుల క్రితం గ్రూపునకు రూ.ఐదులక్షలు చెల్లించాలని గ్రూపుల్లోని సభ్యులందరికీ నోటీసులు అందాయి. ఇలా సుమారు గ్రామంలో వందమందికి తాఖీదులు వచ్చాయి. ఇంకా చాలామందికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మహిళలు దేవులపల్లి వచ్చిన మంత్రి పీతల సుజాత దష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీంతో ఆమె దీనిని పరిశీలించాలని వ్యవసాయ శాఖ ఏడీఎ కమలాకర శర్మను ఆదేశించారు. ఈ సమస్యపై బ్యాంకర్లతో మాట్లాడతానని ఏడీఏ చెప్పుకొచ్చారు. దీంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు వేసిన ప్రజల రుణం తీర్చుకునేది ఇలాగేనా అంటూ పెదవివిరుస్తున్నారు. న్యాయం చేయాలి తీసుకున్న రుణాలకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదు. రుణాలను చెల్లించాలంటూ నోటీసులు పంపారు. మాఫీ అవుతుందని ఎదురుచూశాం. మాకు నిరాశే ఎదురైంది. ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలి – షేక్ మస్తాన్బీ, దేవులపల్లి రుణమాఫీ అవుతుందని ఆశగా ఎదురుచూశాం. కానీ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్నా తాము తీసుకున్న రైతుమిత్ర గ్రూపు రుణాలకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. ఒక పక్క రుణాలు చెల్లించాలని నోటీసులు వచ్చాయి. ఏం చేయాలో తెలియని దుస్థితి నెలకొంది. – బల్లే రమాదేవి, దేవులపల్లి -
సంఘాలను పటిష్టం చేద్దాం
గుంటూరు వెస్ట్ : స్వయం సహాయక సంఘాలు మరింత బలోపేతం కావడానికి కృషిచేయాల్సిన అవసరం ఉందని సెర్ప్ రాష్ట్ర డైరెక్టర్ (సంస్థాగత నిర్మాణం) ఉషారాణి చెప్పారు. సోమవారం జిల్లా సమాఖ్య కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉషారాణి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు పటిష్టం కావడం ద్వారానే స్త్రీనిధి నుంచి మరిన్ని రుణాలు పొందే అవకాశం కలుగుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 2200 మంది స్వయం సహాయక సభ్యుల ఆధార్ సీడింగ్ను తక్షణమే పూర్తిచేయాలని సూచించారు. రాజధాని ప్రాంతాలైన గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో సంఘాలను పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీఆర్డీఏ పీడీ హబీబ్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి సంబంధించి బ్రిక్స్ తయారీ పనులను స్వయం సహాయక సంఘాలకు అప్పగించడం గొప్ప అవకాశమన్నారు. వీటిని సక్రమంగా నిర్వహించడం ద్వారా సంఘాలు ఆర్థిక పరిపుష్టిని సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ రాష్ట్ర అధికారులు రామకృష్ణ, మాధవీలత, డీఆర్డీఏ ఏపీడీ జి.నాగేశ్వరరావు, డీపీఎం అశోక్కుమార్, నారాయణ, శారదాంబ, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కె.సౌభాగ్యం, ఏపీఎం సాంబశివరావు, జేడీఎం శివప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. -
డ్వాక్రా..టోకరా
డ్వాక్రా రుణ మంజూరు తీరు ఇలా... 2016–17 ఆర్థిక సంవత్సర లక్ష్యం రూ.1,346.24 కోట్లు అర్ధ సంవత్సరంలో ఇచ్చింది రూ.250 కోట్లే... ఇవ్వాల్సింది ఇంకా 1096 కోట్లు 2014–15లో రూ.1,240 కోట్లు లక్ష్యం ఆ ఏడాదిలో ఇచ్చింది రూ.367 కోట్లు సభ్యులకు చేరని సొమ్ము రూ.873 కోట్లు 2015–16లో రూ.1730 కోట్లు లక్ష్యం సభ్యులకు చేరిందీ రూ.1296 కోట్లు ఇవ్వగలిగారు... చేరని సొమ్ము...రూ.434 కోట్లు కాకినాడ సిటీ : జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా)కు మంజూరు చేసే రుణ లక్ష్య ప్రగతి అంతంతమాత్రంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 89,994 డ్వాక్రా సంఘాలుండగా, వీటి పరిధిలో 8,77,586 మంది సభ్యులుగా ఉన్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 59,587 సంఘాలకు రూ.1,346.24 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు 13,353 సంఘాలకు రూ.250 కోట్ల మేర మాత్రమే రుణాలివ్వగలిగారు. రుణ మంజూరులో ఈ అర్ధ వార్షిక ప్రగతిని పరిశీలిస్తే..ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వడం కష్టసాధ్యమే అనిపిస్తోంది. లక్ష్య సాధనలో విఫలం రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక మహిళా సంఘాలకు రుణాల కల్పనలో మొండిచేయి చూపించింది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 38,233 సంఘాలకు రూ.1,240.25 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించి, కేవలం 11,326 సంఘాలకు రూ.367.25 కోట్ల మేరకు మాత్రమే రుణాలిచ్చింది. దీంతో లక్ష్యసాధనలో అధికారులు చతికిలపడ్డారు. అలాగే 2015–16లో 46,986 సంఘాలకు రూ.1,730.71 కోట్లు లక్ష్యం కాగా, 42,835 సంఘాలకు రూ.1,296.71 కోట్ల రుణాలు ఇవ్వగలిగారు. రుణాలు కల్పన లక్ష్యం మేరకు ప్రగతి సాధించలేని పరిస్థితి జిల్లాలో నెలకొంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించడంతో, రుణ బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగలేదు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం చేతులెత్తేసింది. మ్యాచింగ్ గ్రాంటూ లేదు ఒక్క పైసా కట్టొద్దు, అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక మాఫీ కాదు, రూ.లక్ష మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామని ప్రకటించారు. ఆ మ్యాచింగ్ గ్రాంట్కూ దిక్కులేకుండా పోయింది. చివరికి సంఘంలోని ఒక్కో సభ్యురాలికి రూ.3 వేల చొప్పున మూల నిధిగా సంఘ ఖాతాలో జమచేసి చేతులు దులుపుకుంది. చంద్రబాబు మాయమాటలు నమ్మి æవాయిదాలు చెల్లించడం మానేసిన సంఘాలకు వడ్డీ లేని రుణం కాదు కదా, కనీసం పావలా వడ్డీ రాయితీ కూడా కోల్పోయారు. మరోపక్క బ్యాంకర్లు కొత్త రుణాల మంజూరు విషయంలో స్పందన అంతంత మాత్రంగానే ఉంటోంది. వడ్డీ వ్యాపారులే దిక్కు! గతంలో బ్యాంకులు ఇబ్బడిముబ్బడిగా రుణాలు మంజూరు చేసేవి. మైక్రో సంఘాలు, ప్రైవేటు వడ్డీ వ్యాపారులు కాళ్లావేళ్లా పడినా రుణాలు తీసుకునేందుకు మహిళలు ఆసక్తి చూపేవారు కాదు. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. బ్యాంకర్లు ముఖం చాటేస్తుండడంతో వ్యాపార, కుటుంబ అవసరాల కోసం డ్వాక్రా సంఘాలు మళ్లీ ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, మైక్రోఫైనాన్స్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఐదు, పది రూపాయల వడ్డీలు వసూలుచేస్తున్నా అవసరాల కోసం వారిని ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. లక్ష్యం మేరకు రుణాల మంజూరు డ్వాక్రా సంఘాలకు నిర్దేశిత లక్ష్యం మేరకు రుణాలు మంజూరుకు ముమ్మర చర్యలు తీసుకుంటున్నాం. తీసుకున్న రుణంతో ఆర్థికంగా సంఘాలు నిలదొక్కుకునేలా వివిధ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నాం. – శ్రీనివాస కుమార్, ఏపీడీ, డీఆర్డీఏ -
కన్నులపండువగా శ్రీవారి ధ్వజారోహణం
తిరుమల : తిరుమలలో శ్రీవారి బ్రహోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం స్వామి వారి ధ్వజారోహణ కార్యక్రమంతో ఉత్సవాలను వైభవంగా ప్రారంభించారు. అనంతరం తిరుమల మాడవీధుల్లో ధ్వజపటం ఊరేగించారు. నేటి నుంచి 9 రోజుల పాటు బ్రహోత్సవాలు జరుగుతాయి. ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. శ్రీ వారికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు. రాత్రి 9 గంటలకు పెద్ద శేషవాహనంపై స్వామి ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ నెల 11 వరకు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. -
ఆకట్టుకున్న డ్వాక్రా బజార్
సాక్షి, హైదరాబాద్: ‘డ్వాక్రా బజార్’ పేరుతో నెక్లెస్రోడ్లోని పీపుల్స్ప్లాజా వద్ద మంగళవారం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన హ్యాండ్క్రాఫ్ట్స్ ఉత్పత్తుల ప్రదర్శన పలువురిని ఆకర్షించింది. స్టాల్స్లో ఉంచిన పలు వస్తువులు, గృహోపకరణాలు, గాజులు, చీరలు చూపరులను కట్టిపడేశాయి. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అనితారామచంద్రన్ పాల్గొన్నారు. -
వసూల్రాజాలు!
డ్వాక్రా రుణాలపై 2 శాతం కమీషన్ గుంజుతున్న సీవోలు, ఆర్పీలు ప్రతి నెలా రూ.లక్షల్లో వసూళ్లు ఫిర్యాదు చేస్తే ఇబ్బందులని మిన్నకుండిపోతున్న సభ్యులు సీవోలను ఆడిస్తున్న కార్పొరేటర్లు సాక్షి, రాజమహేంద్రవరం : డ్వాక్రా సంఘాలకు రుణాల మంజూరులో వసూల్రాజాలు చెలరేగుతున్నారు. కొంతమంది కమ్యూనిటీ ఆర్గనైజర్లు(సీవో), కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు (సీఆర్పీ) రెండు శాతం చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వారు చెప్పినంత కమీషన్ ఇవ్వకపోతే రుణాలు ఎక్కడ ఆగిపోతాయోనన్న భయంతో డ్వాక్రా సంఘాల మహిళలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి వెనుకాడుతున్నారు. వసూల్రాజాలు డిమాండ్ చేసినంతా ముట్టజెప్పుకొంటున్నారు. ఈవిధంగా ఒక్క రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోనే ప్రతి నెలా రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. ‘రుణం మంజూరైన ప్రతిసారీ మామూళ్లు ఇవ్వాల్సిందే. లేదంటే రుణాలు ఇంకా మంజూరు కాలేదని నెలల తరబడి తిప్పుతున్నారు. ఇదంతా మాకు మామూలే’ అని ఓ డ్వాక్రా సంఘ సభ్యురాలు వాపోయింది. వారు చెప్పిందే వేదం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో 5,536 డ్వాక్రా సంఘాలున్నాయి. వీటికి రుణాల మంజూరు, పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఓ విభాగం ఏర్పాటు చేశారు. అవుట్ సోర్సింగ్ విధానంలో నియమించిన టౌన్ ప్రాజెక్టు ఆఫీసర్ (టీపీఆర్వో) ఈ ప్రక్రియనంతా పర్యవేక్షిస్తుంటారు. ఆయనకు సహాయంగా 10 మంది కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఉన్నారు. వీరంతా అవుట్సోర్సింగ్ విధానంలో విధులు నిర్వర్తిస్తున్నారు. నగరంలో ఉన్న 50 డివిజన్లను ఈ పదిమందికీ కేటాయించారు. 15 నుంచి 25 గ్రూపులను కలిపి ఓ సమాఖ్యగా ఏర్పాటు చేశారు. ఇలా నగరంలో 165 సమాఖ్యలున్నాయి. ప్రతి సమాఖ్యకు ఓ రిసోర్స్ పర్సన్ను టీపీఆర్వో నియమించారు. వీరు సీవోలకు సహాయకులుగా చలామణీ అవుతూంటారు. ఆ సమాఖ్యపై పెత్తనం అంతా వారిదే. వారి ద్వారా కొంతమంది సీవోలు కమీషన్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి గ్రూపునకు మంజూరు చేసే రుణంలో రూ.లక్షకు రూ.2 వేల చొప్పున గుంజుతున్నారు. గత ఏడాది నగర పరిధిలోని డ్వాక్రా గ్రూపులకు వివిధ బ్యాంకులు రూ.36 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.56 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే రూ.15 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. బ్యాంకు అధికారులు కూడా సీవోలు చెప్పనిదే రుణాలు మంజూరు చేయడం లేదు. దీంతో సీవోలు చెప్పిందే వేదంగా డ్వాక్రా సంఘాల సభ్యులు నడుచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. డివిజన్ కోసం నేతలకు ముడుపులు పేద, మధ్య తరగతి ప్రజలు నివసించే డివిజన్లలో అధిక సంఖ్యలో డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. ఈ డివిజన్లలో పని చేయడానికి పలువురు సీవోలు అమితాసక్తి చూపుతున్నారు. ఇదే అవకాశంగా కొందరు కార్పొరేటర్లు తమ డివిజన్లలోని సీవోలు సరిగా పని చేయడం లేదని మేయర్కు ఫిర్యాదు చేస్తున్నారు. ఇక్కడే కథ మొదలవుతోంది. సీవోలు ఆయా కార్పొరేటర్ల వద్దకు వెళ్లి బేరసారాలు సాగిస్తారు. తమను ఆయా డివిజన్లలో ఉంచేందుకు అక్కడ ఉన్న ఆదాయాన్నిబట్టి ముడుపులు ముట్టజెబుతున్నారు. సీఆర్పీలుగా ఆయా గ్రూపుల్లోని సభ్యులనే నియమిస్తారు. వీరిలో కొంతమంది అధికార పార్టీ నేతల బంధువులు, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అధికార బలం ఉన్నవారు ఆయా సమాఖ్యల్లో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. కొన్ని డ్వాక్రా గ్రూపుల అధ్యక్షులు, కార్యదర్శులతో కుమ్మక్కై గ్రూపులోని సభ్యులకు తెలియకుండా రుణాలు పంచుకుంటున్నారు. వాయిదాలు సరిగా కట్టనప్పుడే ఈ విషయం ఆయా గ్రూపు సభ్యులకు తెలుస్తూండడం గమనార్హం. ఆగిపోయిన కొన్ని గ్రూపుల అధ్యక్షులు, కార్యదర్శుల సంతకాలు ఫోర్జరీ చేసి రుణాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని డ్వాక్రా సంఘాల సభ్యులు కోరుతున్నారు. దందా సాగుతోందిలా.. డ్వాక్రా రుణాల మంజూరు, పర్యవేక్షణకు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో ప్రత్యేకంగా ఓ విభాగం ఉంది. ఇందులో అవుట్సోర్సింగ్ పద్ధతిలో 10 మంది కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఉన్నారు. నగరంలోని 50 డివిజన్లను ఈ పదిమందికీ కేటాయించారు. 15 నుంచి 25 గ్రూపులను కలిపి ఓ సమాఖ్యగా ఏర్పాటు చేశారు. ఇలా నగరంలో 165 సమాఖ్యలున్నాయి. ప్రతి సమాఖ్యకు ఓ రిసోర్స్ పర్సన్ను నియమించారు. సీవోలకు సహాయకులుగా చలామణీ అయ్యే వీరి ద్వారా కొంతమంది సీవోలు కమీషన్లు వసూలు చేస్తున్నారు. ప్రతి గ్రూపునకు మంజూరు చేసే రుణంలో రూ.లక్షకు రూ.2 వేల చొప్పున గుంజుతున్నారు. -
ప్రాణం తీసిన డ్వాక్రా అప్పు
♦ రుణం తీసుకొని సంఘం సభ్యులు ఇద్దరు పరారీ ♦ డబ్బులు చెల్లించాలని అధికారులు, మిగతా సభ్యులునుంచి ఒత్తిడి ♦ మనస్తాపంతో మహిళ ఆత్మహత్యహత్యాత్నం ♦ చికిత్స పొందుతూ మృతి తాండూరు రూరల్: డ్వాక్రా సంఘంలో రుణం తీసుకున్న ఇద్దరు పరారీ అయ్యారు. వారి డబ్బులు చెల్లించాలని అధికారులు, సంఘం సభ్యులు ఒత్తిడి చేయడంతో సంఘం రెండో అధ్యక్షురాలు ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండల పరిధిలోని మల్కాపూర్లో సోమవారం వెలుగు చూసింది. కరన్కోట్ ఎస్ఐ రేణుకారెడ్డి, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఫాతిమాబేగం (40) కూలీపనులు చేస్తూ జీవనం సాగిస్తుండేది. గ్రామంలోని హినా పొదుపు సంఘంలో ఆమె రెండో గ్రామ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తుండేది. ఈక్రమంలో కొంతకాలం క్రితం హినా పొదుపు సంఘం సభ్యులు మల్కాపూర్ ఎస్బీహెచ్లో బ్యాంక్ లీంకేజీ ద్వారా రూ.3 లక్షలు రుణం తీసుకున్నారు. పది మంది సభ్యులు కొన్ని వాయిదాలు చెల్లించారు. హినా సంఘం మరో అధ్యక్షురాలు మౌలన్బీతో పాటు సాలియాబీ చెప్పాపెట్టకుండా గ్రామం విడిచి వెళ్లిపోయారు. దీంతో వారి వాయిదాలు చెల్లించాలని మిగతా సభ్యులు, బ్యాంకు అధికారులు ఫాతిమాబేగంపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఈనెల 24న ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. కుటుంబీకులు చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి.. అక్కడి నుంచి హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం అర్ధరాత్రి ఫాతిమాబేగం మృతి చెందింది. ఆమె ఉస్మానియాలో చికిత్స పొందుతుండగా న్యాయమూర్తి ఆమెనుంచి వాంగ్మూలం సేకరించారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
కలెక్టరేట్లో డ్వాక్రా స్టాల్
కడప సెవెన్రోడ్స్ : కొత్త కలెక్టరేట్ ఆవరణంలో సోమవారం జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో డ్వాక్రా స్టాల్ ప్రారంభమైంది. బహిరంగ మార్కెట్లో లభించే వివిధ రకాల సరుకుల కంటే కొంత తక్కువ ధరలతో సరుకుల విక్రయాన్ని చేపట్టారు. మండల సమాఖ్యలు, గ్రామ సమాఖ్య ద్వారా సేకరించిన కందుల నుంచి కల్తీ లేని కందిపప్పును తయారు చేశారు. ప్రస్తుతం జిల్లాలో పది వేల కిలోల కందిపప్పు విక్రయానికి సిద్ధంగా ఉంది. ఇకపై నెలకు 30 వేల కిలోల కందిపప్పును సిద్దం చేయాలని జిల్లా సమాఖ్య నిర్ణయించింది. కందిపప్పు బహిరంగ మార్కెట్లో కిలో రూ. 130 కాగా, డ్వాక్రా బజారులో రూ. 110లకు విక్రయిస్తున్నారు. అలాగే పసుపు 200 గ్రాముల ప్యాకెట్ బయట రూ. 45 కాగా, ఇక్కడ రూ. 30, రాగిమాల్ట్ 200 గ్రాములు రూ. 50కి గాను రూ. 40, అరకిలో రాగిపిండి రూ. 45కుగాను రూ. 40, కొర్రబియ్యం కిలో రూ. 55కి గాను రూ. 50, జొన్న పిండి రూ. 45కుగాను రూ. 40లతో విక్రయాలు చేపట్టారు. కలెక్టరేట్ ఉద్యోగులతోపాటు వివిధ పనుల మీద వచ్చిన పలువురిని డ్వాక్రా స్టాల్ ఆకర్శిస్తోంది. -
15 రకాల వస్తువులతో ప్యాకింగ్
సిద్ధం చేస్తున్న డ్వాక్రా మహిళలు డీఆర్డీఏ ఆధ్వర్యాన ఘాట్ల వద్ద తక్కువ ధరకే విక్రయం హనుమాన్పాలెం(కొల్లిపర) : కృష్ణా పుష్కరాల సందర్భంగా పిండ ప్రదానానికి అవసరమైన వస్తువులను మండలంలోని హనుమాన్పాలెం గ్రామంలో ప్యాకింగ్ చేస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన ఘాట్ల వద్ద పిండ ప్రదానాలకు అవసరమైన వస్తువులను భక్తులకు తక్కువ ధరకే అందుబాటులో ఉంచనున్నారు. ఇందుకు అవసరమైన వస్తువులను చక్కగా ప్యాకింగ్ చేసే బాధ్యతను అధికారులు డ్వాక్రా మహిళలకు అప్పగించారు. క్రమంలో హనుమాన్పాలెం గ్రామానికి చెందిన ఆసంటి రత్నకుమారికి 20 వేల ప్యాకెట్ల తయారీ బాధ్యతను అప్పగించారు. ఆమె గ్రామానికి సమీపంలో ఉన్న సుగాలీకాలనీకి చెందిన మహిళలతో ప్యాకింగ్ పని చేయిస్తున్నారు. మొత్తం 15 రకాల వస్తువులతో 20 వేల ప్యాకెట్లను తయారు చేస్తున్నారు. ఇక్కడ 25 మంది మహిళలు మూడు రోజులుగా ఈ పనిలో నిమగ్నమయ్యారు. వీరికి కొందరు పురుషులు కూడా సాయం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రకాల వస్తువుల ప్యాకింగ్ను పూర్తి చేశారు. ఈ నెల 10వ తేదీలోపు లక్ష్యాన్ని పూర్తి చేస్తామని రత్నకుమారి చెప్పారు. ప్యాకెట్లో ఉండే వస్తువుల వివరాలు.. పసుపు, కంకుమ, హారతి కర్పూరం, సాంబ్రానీ కడ్డీలు, గంథం, ఇస్తరాకులు, బెల్లం, నూములు, బియ్యంపిండి, బియ్యం, వక్కలు, తమలపాకులు, అరటికాయ, అవునెయ్యి, అవుపాలు. వీటన్నింటిని విడివిడిగా ప్యాకింగ్ చేయడంతోపాటు అన్ని కలపి ఒక సంచిలో ప్యాకింగ్ చేస్తున్నారు. -
అనంతలో టీడీపీ మంత్రులకు చేదు అనుభవం
అనంతపురం: అనంతపురం జిల్లాలోని గుత్తిలో టీడీపీ మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. రుణమాఫీపై టీడీపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పల్లె రఘనాథరెడ్డి, పరిటా సునీతలను గురువారం అనంతపురంలో ఓ డ్వాక్రా మహిళ నిలదీసింది. ఎన్నికలకు ముందు రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు.. టీడీపీ అధికారం చేపట్టి రెండేళ్లైన ఒక్క రూపాయి మాఫీ కాలేదని సాలమ్మ అనే డ్వాక్రా మహిళ మంత్రులను నిలదీసింది. -
మహిళలను మోసం చేసిన కేసులో అరెస్ట్
ఖమ్మం : డ్వాక్రా మహిళలను మోసం చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలం బీబీపాలెం గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలను మోసం చేసి సుమారు రూ. కోటి 80 లక్షల నగదును ఆగంతకులు అపహరించుకుని పోయారు. దీంతో సదరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆక్రమంలో మంగళవారం నిందితులను బీబీపాలెం గ్రామంలో అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ సురేష్ కుమార్, సీఐ శ్రీధర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ నగదు దొంగతనం ఆరునెలల క్రితం చోటు చేసుకుంది. -
ఇన్నిమోసాలా..?
రుణమాఫీ హామీకి తిలోదకాలు ఇసుక రీచ్లను తప్పించే యత్నాలు ధాన్యం కొనుగోలు కమీషన్ ఇవ్వకుండా తాత్సారం ఆవేదనలో మహిళలు డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తామని ఊరూరా తిరిగి గొంతు అరిగిపోయేలా చెప్పారు. అధికారం వచ్చాక సవాలక్ష మెలికలు పెట్టి ఆ హామీని మాఫీ చేశారు. ధాన్యం కొనుగోలును మహిళా సంఘాలకు అప్పగించారు. అంత కష్టపడి కొనుగోళ్లు చేస్తే కమీషన్ ఇవ్వకుండా ఏడిపించారు. ఇసుక రీచ్ల విషయంలోనూ ఇదే ధోరణి. రీచ్ల నిర్వహణ నుంచి మహిళా సంఘాలను తప్పించడానికి శతథా ప్రయత్నిస్తున్నారు. ఇదీ ఇంటికి పెద్ద కొడుకులా ఉంటానని చెప్పిన నారా చంద్రబాబు నాయుడి నిర్వాకం. మాటివ్వడం ఆనక మరిచిపోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతలు అప్పగించి ఆఖరుకు తప్పులు తమపై నెట్టేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లా వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు రూ. 550 కోట్ల మేర రుణమాఫీ చేయాల్సి ఉండగా దాన్ని గాలికొదిలేసి పెట్టుబడి నిధి కింద రూ. 124 కోట్లు విడుదల చేసి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. జిల్లాలో మహిళలకు 50 ఇసుక రీచ్లను అప్పగించి, ఇప్పుడు సమస్యల నెపంతో వారిని రీచ్ల నిర్వహణ నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా గ్రామైక్య సంఘాలతో చాకిరీ చేయించుకున్న ప్రభుత్వం వాటికివ్వాల్సిన కమీషన్ రూ. ఆరు కోట్లకు గాను రూ.నాలుగు కోట్లు ఇచ్చి మిగతా సొమ్ము చెల్లించకుండా తాత్సారం చేస్తోంది. ఏదొక రకంగా మహిళల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నానికి ఒడిగగుతోంది. ఆదిలోనే రాజకీయం చేశారు. తమ పార్టీకి అనుకూలమైన సంఘాలతో మేక్ సొసైటీల్ని ఏర్పాటు చేసి, ఇసుక రీచ్లను అప్పగించారు. వాటి ముసుగులో అధికార పార్టీ నేతలు చెలరేగిపోయారు. రీచ్ల ద్వారా అధికారికంగా సుమారు రూ. 20కోట్లు ఆదాయం రాగా, అక్రమార్కులకు అంతకు రెండింతల ఆదాయం వచ్చింది. మరో 70 అనధికార రీచ్లైతే ఇసుకాసూరుల దందాకు అడ్డేలేకుండా పోయింది. దాదాపు రూ. 20కోట్ల ఇసుక ఈ రకంగా పక్కదారి పట్టిందన్న ఆరోపణలున్నాయి. తమ పార్టీనేతలే కావడంతో అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేందుకు మేక్ సొసైటీలు చొరవ చూపలేకపోయాయి. ఇప్పుడా అక్రమార్కుల జోలికి వెళ్లకుండా సమస్యలున్నాయని చెప్పి స్వయం సహాయక సంఘాల నుంచి రీచ్లను తప్పించేందుకుప్రభుత్వం ప్రయత్నిస్తోంది. లోపాలు సరిదిద్ది, సమస్యలను అధిగమించకుండా క్యూబిక్ మీటర్కు రూ. 25చొప్పున కమీషన్ పొందుతున్న మహిళా సంఘాలకు అన్యాయం చేసేందుకు సర్కార్ ప్రయత్నించడంపై మహిళా వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో ఇసుక విక్రయాల ద్వారా స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది రూ. కోటీ 14లక్షల వరకు కమీషన్ వచ్చింది. కొత్త విధానంలో భాగంగా రీచ్ల నిర్వహణ తప్పిస్తే ఇసుక విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని స్వయం సహాయక సంఘాల కోల్పోవల్సి వస్తోంది. అదే మేక్ సొసైటీలను రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేసి ఉంటే అక్రమాలకు తావుండేది కాదు. ధాన్యం...దైన్యం ధాన్యం కొనుగోలు బాధ్యతలను గ్రామైక్య సంఘాలకు అప్పగించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన క్వింటా ధాన్యానికి రూ. 31.25పైసలు కమీషన్, హమాలీ చార్జీ కింద రూ. 4.72పైసలు ఇస్తామని ప్రకటించింది. ఇంకేమంది మహిళలు రెట్టింపు ఉత్సాహంతో ధాన్యం కొనుగోలు చేపట్టారు. కమీషన్ కింద రూ. 5,25,75, 908, హమాలీ చార్జీల కింద రూ. 79,41,65 రావల్సి ఉంది. మొత్తంగా చూస్తే రూ. 6,05,16, 973 గ్రామైక్య సంఘాలకు రావల్సి ఉంది. కానీ దాంట్లో కేవలం రూ. 4కోట్లు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. ఇప్పుడా మొత్తంలో కంప్యూటర్లు, ప్రింటర్ అద్దె, రవాణా చార్జీలు, శిక్షణా ఖర్చులు, నెట్ కనెక్షన్, స్టేషనరీ, జెరాక్స్ ఇతరత్రా ఖర్చుల కింద అయ్యే సొమ్మును మినహాయించి మిగతాది జిల్లా, మండల, గ్రామ సమాఖ్యలు పంపిణీ చేసుకోవాలని సూచన ప్రాయ సలహా ఇచ్చింది. దీంతో క్వింటాకు రూ. 31. 25పైసలు వస్తుందనుకున్న చోట రూ. 10.45పైసలు వచ్చింది. ఎందుకింత మోసమని మహిళలు ఆవేదన చెందుతున్నారు. హామీ మాఫీ... రుణమాఫీ మామీ అటకెక్కింది. పెట్టుబడి నిధి పేరుతో కొంత మొత్తాన్ని ఖాతాలకు జమ చేసి చేతులు దులుపుకొంది. చంద్రబాబు ఎన్నికల సమయంలో చేసిన హామీ ప్రకారం జిల్లాలోని 41,997డ్వాక్రా సంఘాలకు రూ. 550కోట్ల వరకు రుణాలున్నాయి. రుణమంతా మాఫీ చేస్తామని ప్రకటించడంతో బ్యాంకులకు పైసా కూడా చెల్లించనక్కర్లేదని మహిళలు భావించారు. కానీ అధికారంలోకి వచ్చాక మాఫీ జాన్తానై అని ప్రకటించి పెట్టుబడి నిధి పేరుతో రూ. 136కోట్లు ఖాతాలకు జమ చేసి చేతులు దులుపుకొన్నారు. మాఫీ చేయవలిసిన డ్వాక్రా రుణం : రూ.550 కోట్లు పెట్టుబడి నిధిపేరిట చెల్లించింది : రూ 124 కోట్లు గ్రామైక్య సంఘాలకు చెల్లించవలసిన ధాన్యం కమీషన్ : రూ 6 కోట్లు చెల్లించింది : రూ.4కోట్లు -
డ్వాక్రాపై పేలిన తూటా..
‘అప్పు తిరిగి కట్టొద్దు.. డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేసేస్తా..’ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేసిన ఈ వాగ్దానాలే తమ ఆర్థిక స్వావలంబనకు తూట్లు పొడిచిన బాణాలయ్యూయని డ్వాక్రా మహిళలు లబోదిబోమంటున్నారు. సాఫీబాటలో సజావుగా నడుస్తున్న బండిని ముళ్లబాటకు మళ్లించాయని మొత్తుకుంటున్నారు. ఆయన మాట నమ్మి, ఎంతో కొంత భారం తగ్గుతుందని ఆశించడమే నేరమైందని, అందుకు శిక్షగా తమ పరపతి ఇగిరిపోరుుందని వాపోతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఆరాటంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఎడాపెడా ఇచ్చిన ఎన్నికల హామీలను నమ్మిన వారంతా ఇప్పుడు హతాశులవుతున్నారు. గ్రామాల్లో తమకు, బ్యాంకులకు ఆనవారుుతీగా వస్తున్న ‘రుణానుబంధాన్ని’ చావుదెబ్బ కొట్టింది బాబు రుణమాఫీ హామీయేనని రైతులు ఆక్రోశిస్తున్నారు. డ్వాక్రా మహిళలదీ అదే వ్యధ, అదే కథ. బాబు మాటలు నమ్మి రుణాలు చెల్లించనందుకు జిల్లాలో మహిళా సంఘాల సభ్యులకు కొత్త రుణాలు కూడా పుట్టడం లేదు. అన్ని అర్హతలుండి కూడా కొన్ని సంఘాలు రుణం పొందలేకపోతున్నాయి. ఇందుకు ఒకపక్క బ్యాంకుల సిబ్బంది, మరోవైపు అధికారులు ఎవరి కారణాలు వారు చెబుతున్నారు. ఇచ్చిన రుణం చెల్లించకుంటే కొత్త రుణం ఇవ్వలేమని బ్యాంకులు చేతులెత్తేస్తున్నాయి. రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు వాగ్దానం జిల్లా యంత్రాంగం నిర్దేశించుకున్న రుణప్రణాళికను తీవ్రంగా దెబ్బతీసింది. జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డ్వాకా సంఘాలకు నిర్దేశించిన రుణ ప్రణాళికలు, వాస్తవంగా మహిళల చేతికి దక్కిన పరపతిని నిశితంగా పరిశీలిస్తే పై కారణాలన్నీ వాస్తవమేనని తేలిపోతోంది. రుణాల కోసం డ్వాక్రా మహిళలు తిరగని బ్యాంకు అంటూ లేదు. ఏ బ్యాంకుకు వెళ్లినా ‘రుణం ఎంత ఉంది. ఎంత చెల్లించా’రనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. చివరకు పాత బకాయిలు చెల్లిస్తే కొత్త రుణాల సంగతి పరిశీలిస్తామంటూ బ్యాంకులు తప్పించేసుకుంటున్నాయి. లక్ష్యం.. రూ.1,730 కోట్లు.. ఇప్పటికి ఇచ్చింది.. రూ.66 కోట్లు జిల్లాలో 81,218 డ్వాక్రా సంఘాలున్నాయి. వీటి పరిధిలో సుమారు 8,52,789 మంది సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘాల్లో ఉన్న ప్రతి సభ్యురాలికి రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. దానిలో భాగంగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 45,523 సంఘాలకు రూ.1,730.70 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ లక్ష్యంలో ఇప్పటి వరకు కేవలం 2,076 సంఘాలకు రూ.66.40 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. ‘ఏడిచే పిల్లాడి చేతిలో బెల్లం ముక్క పెట్టిన’ మాదిరిగా కూడా లేదని మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నాలుగున్నర నెలలు గడుస్తున్నా.. లక్ష్యంలో కనీసం 5 శాతం కూడా ఇవ్వలేకపోయారని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అదే 2014-15 ఆర్థిక సంవత్సరంలో 38,233 సంఘాలకు రూ.1,240.25 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ 11,326 సంఘాల పరిధిలోని మహిళలకు రూ.367.25 కోట్ల మేర మాత్రమే రుణాలివ్వగలిగారు. అంతకు ముందు సంవత్సరం 2013-14లో 26,363 డ్వాక్రా సంఘాలకు రుణ లక్ష్యం రూ.687.88కోట్లుగా నిర్దేశించారు. ఆ ఆర్థిక సంవత్సరంలో అంతకు మించే రుణాలు ఇవ్వగలిగారు. ఆ ఆర్థిక సంవత్సరంలో 29,705 సంఘాలకు రూ.900.80 కోట్ల రుణాలు మంజూరు చేసి నిర్దేశించిన లక్ష్యాన్ని సునాయూసంగా అధిగమించేశారు. అంటే రుణాల మంజూరులో ఆ ఏడాది 131 శాతం లక్ష్యాన్ని సాధించారు. తర్వాత సంవత్సరం చతికిలబడడానికి కారణం రుణాలు మాఫీ చేస్తామన్న టీడీపీ అధినేత వాగ్దానమే. వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రరుుస్తున్న మహిళలు ‘ఒక్క పైసా కట్టొద్దు.. అధికారంలోకి వచ్చిన వెంటనే రుణాలన్నీ మాఫీ చేస్తా’మన్న ‘బాబు’ ఎన్నికలప్పుడు భారీ ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత డ్వాక్రా రుణాలు మాఫీ కాదని చెప్పకుండానే కాదన్నారు. జిల్లాలోని 71 వేల సంఘాలు పరిధిలో 2015 ఫిబ్రవరి నాటికి డ్వాక్రా రుణాలు రూ.1,200 కోట్లు పై మాటేనంటున్నారు. రుణమాఫీని అటకెక్కించి ఒక్కొక్క సంఘానికి లక్ష వరకు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామని ప్రకటించారు. ఆ క్రమంలోనే సంఘంలో సభ్యుడికి రూ.10 వేల చొప్పున రివాల్వింగ్ ఫండ్ అంటూ మూలనిధిని సంఘాల ఖాతాలకు జమచేశారు. కానీ అదే సమయంలో రుణమాఫీకి మంగళం పాడారని మహిళలు మండిపడుతున్నారు. 79 వేల డ్వాక్రా సంఘాలకు సర్కార్ మూలనిధి రూపంలో రూ.790 కోట్లు మంజూరు చేసింది. ఈ సొమ్మంతా బ్యాంకుల్లో తమ పేరున జమ అయిందే తప్ప చిల్లిగవ్వ ప్రయోజనం లేదని మహిళలు మథనపడుతున్నారు. కొత్తరుణాలు పుట్టక మహిళలు బయట వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం ఇప్పటికైనా మేలుకొని రుణాలను వేగవంతం చేయాలని మహిళలు కోరుతున్నారు. -
ఖాతాలో డబ్బులు.. తీసుకునే వీలు లేదు
కృష్ణా(మైలవరం): డ్వాక్రా రుణ మాఫీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాప్యం చేస్తుండటంపై డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మైలవరం మండల కేంద్రంలో పలువురు డ్వాక్రా సంఘాల మహిళలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ప్రభుత్వం తమ ఖాతాలో వేసిన రూ.3 వేలు కూడా తీసుకునే అవకాశం లేదంటూ వారు అధికారులను అడ్డుకున్నారు. ఏపీఎం, పీవో, ఎంపీడీవోలను డ్వాక్రా లబ్ధిదారులు అడ్డుకుని తమ సమస్యలు వివరించి ఆవేదన వ్యక్తం చేశారు. -
మా బ్యాంకు.. మా ఇష్టం
అనుమతి లేకుండా డబ్బు డ్రా చేసుకున్న అధికారులు అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ నిర్వాకం ప్రశ్నించిన డ్వాక్రా మహిళలపై మేనేజర్ చిందులు పత్రికల్లో వార్తలొస్తే ఇబ్బంది పడతారంటూ హెచ్చరిక మీకు అనవసరం అంటూ విలేకరులపై ఆగ్రహం వైఎస్ఆర్ జిల్లా(ప్రొద్దుటూరు) : డ్వాక్రా సంఘం సభ్యుల అనుమతి లేకుండా వారి ఖాతా నుంచి బ్యాంకు అధికారులు ఇష్టానుసారం డబ్బు డ్రా చేసుకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన మహిళలపై సదరు బ్యాంకు మేనేజర్ చిందులు వేశారు. విషయం తెలుసుకుని అక్కడకు వెళ్లిన విలేకరులనూ కేసు పెడతానంటూ బెదిరించారు. వివరాల్లోకి వెళితే.. ప్రొద్దుటూరు మండలంలోని కానపల్లె గ్రామానికి చెందిన వీరాంజనేయ స్వయం సహాయక సంఘానికి పట్టణంలోని అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ అధికారులు ఈ ఏడాది మే 18న రూ.5 లక్షలు రుణం మంజూరు చేశారు. జూన్ 1న 10 మంది గ్రూపు సభ్యులు కలిసి తీసుకున్న రుణానికి రూ.25 వేలు కంతు కట్టాల్సి ఉంది. ఈ విషయంపై మహిళలు సమావేశం నిర్వహించగా.. రుణం పొంది 12 రోజులే అయింది.. నెల పూర్తయ్యాక జూలై నుంచి కంతులు చెల్లిస్తే సరిపోతుందని ఆరుగురు మహిళలు చెప్పారు. దీంతో సభ్యులు జూన్ కంతు చెల్లించలేదు. గ్రూపు అధ్యక్షురాలు ఖాతాలోని డబ్బు తీసుకునేందుకు జూలై 3వ తేదిన బ్యాంక్కు వెళ్లగా ఖాతాల్లోంచి రూ.69 వేలు డ్రా చేసినట్లు ఆన్లైన్లో వెల్లడైంది. ఆందోళన చెందిన సభ్యులు బ్యాంక్ అధికారులను సంప్రదించగా మీకు బ్యాంక్ నిబంధనలు తెలియవని చెప్పారు. తమ గ్రూపు.. బ్యాంక్కు ఎలాంటి బాకీ లేదని, ఎందుకు కట్ చేశారని ప్రశ్నించారు. రుణం తీసుకుని 10 రోజులే కావడంతో జూన్ కంతు కట్టలేదని సభ్యులు చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఏ లెక్క ప్రకారం రూ.69 వేలు కట్ చేశారో ఎవరికీ అర్థం కాలేదు. - కానపల్లె గ్రామానికి చెందిన మరో గ్రూపునకు సంబంధించి గత ఏడాది బకాయిలు చెల్లించలేదని ప్రస్తుతం ప్రభుత్వం చెల్లించిన మూలధనం రూ.30 వేలు ఏడీబీ అధికారులు డ్రా చేసుకున్నారు. ఖాతాలో మరోమారు కూడా డబ్బు డ్రా చేసుకున్నారని సభ్యులు తెలిపారు. - ఖాదర్బాద్ గ్రామానికి చెందిన షేక్షావల్లి డ్వాక్రా గ్రూపునకు సంబంధించి మూలధనం రూ.30 వేలతో పాటు కొత్తగా మంజూరు చేసిన రుణంలో రూ.69 వేలు డ్రా చేసుకున్నారు. అగ్రికల్చల్ డెవలప్మెంట్ బ్యాంక్ పరిధిలో సుమారు ఆరేడు వందల డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. మున్సిపాలిటీతోపాటు రూరల్ పరిధిలోని గ్రూపులు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల డ్వాక్రా గ్రూపులకు రుణాలు మంజూరు చేసిన బ్యాంక్ అధికారులు ఇష్టారాజ్యంగా బ్యాంక్ ఖాతాల్లోంచి డబ్బు డ్రా చేసుకున్నారు. చాలా ఖాతాలదీ ఇదే పరిస్థితి. మాకో నిబంధన.. మీకో నిబంధనా? 'డ్వాక్రా గ్రూపు మహిళలు డబ్బు తీసుకోవాలంటే పది మంది సభ్యులు వచ్చి బ్యాంక్ అధికారులకు కనబడితేకానీ రుణం ఇవ్వడం లేదు. అలాంటపుడు మా సంతకాలు లేకుండా, మాకు తెలియకుండానే డబ్బులు ఎలా డ్రా చేసుకుంటార'ని పలువురు మహిళలు ఏడీబీ మేనేజర్ అనంతకుమార్ను ప్రశ్నించారు. ఖాతాల్లోంచి పెద్ద ఎత్తున డబ్బులు బ్యాంక్ అధికారులు డ్రా చేశారని తెలియడంతో మంగళవారం మహిళలంతా బ్యాంక్కు తరలి వచ్చారు. ఈ సందర్భంగా మేనేజర్ కార్యాలయంలోకి వెళ్లారు. అంత డబ్బు ఎలా డ్రా చేసుకున్నారని ప్రశ్నించగా.. తమకు సర్వ హక్కులు ఉన్నాయని తెలిపారు. ఎవరికీ లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మీరు ఏమైనా ఆస్తులు తనఖా పెట్టారా.. కేవలం మిమ్మల్ని చూసి రుణాలు మంజూరు చేశామని తెలిపారు. ఈ తతంగం జరుగుతుండగా విలేకరులు మేనేజర్ చాంబర్ వద్దకు వెళ్లి ఫొటో తీసుకున్నారు. అనుమతి లేకుండా లోపలకు వచ్చారని, కేసు పెడతానని మేనేజర్ బెదిరించారు. మీరే విలేకరులను తీసుకు వచ్చారని మహిళలపై మండిపడ్డారు. పత్రికల్లో వార్తలు వస్తే చాలా ఇబ్బందులు పడతారని వారినీ బెదిరించారు. కాసేపటి తర్వాత విలేకరులు మళ్లీ వెళ్లి ఆయన్ను సంప్రదించగా.. వాళ్లు (మహిళలు), మేము మాట్లాడుకున్నాం. ఈ సమస్య మీకు అనవసరం అని చెప్పారు. -
చెత్త ఫైటింగ్
కార్మికుల మధ్య తోపులాట నేడు ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి పారిశుధ్య విధుల్లో డ్వాక్వా మహిళలు విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో కార్మికుల మధ్య ‘చెత్త’ ఫైటింగ్ ఆరంభమైంది. కాంట్రాక్ట్ పద్ధతిపై విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన డ్వాక్రా మహిళలతో ఔట్సోర్సింగ్ సిబ్బంది వాదనకు దిగారు. మా పొట్టలు కొట్టొద్దంటూ విన్నపాలు చేశారు. కాంట్రాక్ట్ కార్మికులు ససేమిరా అనడంతో అడ్డుకున్నారు. ఈ క్రమంలో కార్మికుల మధ్య తోపులాటలు జరిగాయి. కృష్ణలంక, లంబాడీపేట, కుమ్మరిపాలె ం, పాయకాపురం, పటమట ప్రాంతాల్లో బుధవారం ఇలాంటి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మల్లికార్జునపేటలో కార్మికుల మధ్య వివాదం ముదరడంతో ప్రజారోగ్య శాఖాధికారులు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డ్వాక్వా మహిళల విధులకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని కమిషనర్ జి.వీరపాండియన్ హెచ్చరించారు. ఫలిస్తున్న ప్రయత్నాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా కమిషనర్ చేపట్టిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. డ్వాక్వా మహిళలు పారిశుధ్య విధుల్లో పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. సర్కిల్-1లో 102, 2-లో 130, 3-లో 60 మంది చొప్పున కాంట్రాక్ట్ కార్మికులు విధులకు హాజరయ్యారు. కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ కార్పొరేటర్లు, ఎన్సీసీ విద్యార్థులు వీధులను శుభ్రపరిచారు. కార్మిక సంఘాల అత్యవసర భేటీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు సాగించడంపై ట్రేడ్ యూనియన్ నాయకులు, కార్మికులు మండిపడుతున్నారు. ప్రెస్క్లబ్లో అత్యవసర భేటీ నిర్వహించారు. సమ్మె సెగను మరింత రగిలించాలని నిర్ణయించారు. గురువారం నుంచి నగరంలోని ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించాలని నిర్ణయించారు. 17న సీఎం క్యాంప్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని భారీఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఆసుల రంగనాయకులు మాట్లాడుతూ కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలపడం అభినందనీయమన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కార్మికుల హక్కుల్ని కాలరాసే విధంగా ప్రయత్నాలు సాగించడం సిగ్గుచేటన్నారు. పోలీసు కేసులకు వెరచేది లేదని స్పష్టం చేశారు. -
ఇసుక ‘డ్వాక్రా’ది, తైలం ‘తమ్ముళ్ల’ది
ఇసుక దందాలో తెలుగుదేశం శాసన సభ్యుడు చింతమనేని ప్రభాకర్ పతా కశీర్షికను సంపాదించుకున్నారు. ఎం దరో తెలుగు తమ్ముళ్లకూ ఇది దక్కాల్సింది, ఆయన ముందుగా దక్కించు కున్నారు. తనది దుందుడుకు స్వభా వమని తానే ప్రకటించుకున్నారు. ప్రతిపక్షంలో ఉంటే దుందుడుకుత నాన్ని ప్రజలు కొంతమేరకైనా ఆమో దిస్తారేమో కాని, అధికారపక్షంలో అధికార దుర్మదాంధతగా ఈసడించుకుంటారు. విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా రెవెన్యూ అధికారిని దుర్భాషలాడి, మహిళలతో కొట్టించే దాష్టీకం పోలీసుల సమక్షంలో జరగడం కంటే ప్రజాస్వామ్యానికి దుర్ది నం మరొకటి ఉండదు. మానవహక్కుల కమిషన్ తన స్వతంత్ర ప్రతిపత్తిని ప్రకటించుకుంది. తనంతట తానుగా కేసును నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించింది. ప్రజాస్వామ్య విలువలకు వన్నె తెచ్చింది. ఇతర ఉన్నతాధికార వ్యవస్థలను సంజాయిషీ ఇచ్చుకునేలా చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రేవంతరెడ్డి, చింతమనేని ప్రభాకర్, పీతల సుజాత వైగైరా అస్మదీయుల జాబితా ఉంది. సుజాత కేసు విచారణ దశలోనే ఆగి ఉంది. ఇప్పుడు ప్రభాకర్ కేసుకు పోటీగా రెవిన్యూ అధికారిణి మీద ఎదురు కేసులు పెట్టి ఉంచారు. ఏమి జరుగుతుందో ఊహిం చుకోవచ్చు. అసలు కథలోకి వద్దాం. రాష్ర్టంలో ఇసుక దందాలో చింత మనేని ప్రభాకర్ ఉదంతం సముద్రంలో మంచు కొండలాంటిది. కొండ కొన మాత్రమే మనకి కనిపించింది. కుంభకోణం కొండ లోపలే తన పని చే సుకుపోతున్నది. 2014 ఆగస్ట్లో చంద్రబాబు కొత్త ఇసుక పాలసీని ప్రకటించారు. ఇసుక అమ్మ కాలలో దళారులను లేకుండా చేస్తున్నట్టు, డ్వాక్రా గ్రూపులకే ఇసుక రీచ్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. దీనితో విని యోగదారులకు చౌకగా ఇసుక, డ్వాక్రా మహిళలకు లాభాలలో 25%శాతం వాటా దక్కుతాయని ప్రచారం చేశారు. అమలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. ఈ కొత్త ఇసుక పథకం అమలు కోసం రాష్ర్టంలో 353 ఇసుక రీచ్లను గుర్తించారు. వీటిని మహిళా సంఘాలకు కేటా యించడానికి జిల్లాస్థాయి సంఘాన్ని ఏర్పాటు చేసి 343 రీచ్ లను మహిళా గ్రూపులకు అప్పగించారు. 10 రీచ్లకు ఎవరూ రాక తవ్వకాలు జరగడం లేదు. డ్వాక్రా మహిళా సంఘాల సమన్వయ కర్తగా ఉన్న సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీకి అజమాయిషీ బాధ్యతలు అప్పగించారు. మొదటి అంశం. ఆంధ్రప్రదేశ్లో లభ్యమయ్యే మొత్తం ఇసుక మీద గుత్తాధిపత్యం ఈ మహిళా సంఘాలకే ఉంది. అలాంటప్పుడు వ్రైవేట్ మార్కెట్లో ఇసుక లభించకూడదు. కాని లభిస్త్తున్నది. ఇదెక్కడిది? ఈ 343 మహిళా సంఘాల రీచ్ల నుండి అక్రమంగా తరలించినదే కాని మరెక్కడ నుండో ఎగిరి వచ్చే అవకాశం లేదు. రెండవ అంశం. ఇసుక ధరలకు రెక్కలెందుకు వచ్చాయి? ప్రభుత్వం ఇసుక రీచ్లలో తవ్వకాలకు పెట్టాల్సిన ఖర్చులను వినియోగించే యంత్రాలు, కూలీలను బట్టి క్యూబిక్ మీటర్కు రూ. 157 నుండి 177 లుగాను, పూర్తిగా కూలీలే తవ్వితే రూ.211 గాను నిర్ణయించింది. దీనిని ఒడ్డుకు చేర్చడానికి రవాణా ఛార్జీ అదనం అని ప్రకటించింది. కేవలం కూలీలతోనే తవ్వే రీచ్లు దాదాపుగా లేవు. రీచ్ల దగ్గరే అమ్మకాలు చేస్తు న్నందున కొనుగోలుదారే లోపలి నుండే ఎగుమతి చేసు కుంటారు. గనుక అక్కడ రవాణా ఛార్జీలు ఉండవు. అయినా ప్రభుత్వం క్యూబిక్ మీటర్ ఇసుకకు రూ.650గా నిర్ణయిం చింది. ప్రతి లారీ మీద దాదాపు 4000 రూపాయలను ప్రభు త్వం దండుకొంటున్నది. ఇలా మధ్యతరగతి ప్రజల స్వంత ఇంటి కల మీద ప్రభుత్వమే ఇసుక పిడుగు వేసింది. మరో పక్క ప్రైవేటు ఇసుక దందా యథేచ్ఛగా సాగుతు న్నది. జిల్లాల పత్రికలు తిరగేస్తే అన్ని జిల్లాలలోను ఇసుక దందా వార్తలు ఏదో మూల దర్శన మిస్తూనే ఉన్నాయి. చాలా మంది శాసనసభ్యుల సారధ్యంలో, వారి అనుచరగణాల ఆధ్వ ర్యంలో ఇసుక అక్రమ వ్యాపారం సాగిపోతున్నది. రీచ్లలో తాత్కాలికంగా తవ్వకాలు ఆపించి కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలు రాబడుతున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్క రించి తవ్వకాలు సాగిస్త్తున్నారు. ఇసుక పధకం డ్వాక్రా మహి ళలకి -తైలం తెలుగు తమ్ముళ్లకి అన్న చందంగా కనిపిస్తున్నది. ఈ పధకం ఉద్దేశ్యమే అది అయినట్లు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తి నట్లు ఉంది. ఇక చింతమనేని కథ కంచికి చేరకుండా ఉం టుందా? (వ్యాసకర్త అధ్యక్షులు-ఏపీ లోక్సత్తా పార్టీ) మొబైల్: 98660 74023 - డీవీవీఎస్ వర్మ -
ఇది మోసకారి ప్రభుత్వం: జగన్
* రైతులు, డ్వాక్రా మహిళలు నష్టపోయారు * ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదు * ప్రజల ఉసురు తగిలి ఇప్పటికే అల్లాడుతోంది * మంచి రోజులు త్వరలోనే వస్తాయి * పింఛన్ రాని వారి తరఫున న్యాయ పోరాటం సాక్షి, కడప: ‘గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏదీ చేయలేక చతికిలపడ్డారు. అటు రైతులు, ఇటు డ్వాక్రా మహిళలను నమ్మించి నట్టేట ముంచారు. నిరుద్యోగభృతి ఊసే లేదు. ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతూ కాంట్రాక్టు ఉద్యోగుల్లో అభద్రతా భావం నెలకొల్పారు. ఇదంతా చూస్తుంటే ఇది మోసకారి ప్రభుత్వమని స్పష్టమైంది’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పారబట్టారు. వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, లింగాల మండలం మురారిచింతల గ్రామంలో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ను చూడగానే డ్వాక్రా మహిళలు రుణాల గురించి, వృద్ధులు పింఛన్ల గురించి ఆయన దృష్టికి తెచ్చారు. డ్వాక్రా రుణానికి కంతులు కట్టలేకపోతున్నామని మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని జగన్.. వారందరికీ ధైర్యం చెప్పారు. ‘రుణాలు కట్టవద్దు.. అధికారంలోకి రాగానే అన్ని రుణాలు మాఫీ చేస్తామ’ని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు చివరకు డ్వాక్రా మహిళలకు రూ. 10 వేలు ఇస్తానని ప్రకటించి.. ఖజానా ఖాళీ పేరుతో రూ.3 వేలకు దానిని పరిమితం చేశారన్నారు. అది కూడా పెట్టుబడి నిధి కింద జమ చేస్తామనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. అందరి తరఫున తాను ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తానన్నారు. కొద్ది రోజులు ఓపిక పట్టండి.. మంచి రోజులు త్వరలోనే వస్తాయని వారికి భరోసా ఇచ్చారు. పింఛన్ రాని వారి తరఫున పోరాటం వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్లు వచ్చేవని, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కమిటీల పేరుతో తొలగించడం అన్యాయమని వైఎస్ జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు పండుటాకులన్న కనీస మానవత్వం లేకుండా ఇష్టానుసారం తొలగించారన్నారు. ఎక్కడికి వెళ్లినా పెద్ద సంఖ్యలో వృద్ధులు పింఛన్ తొలగించారని చెబుతుంటే చాలా బాధేస్తోందన్నారు. అర్హులుగా ఉండి పింఛన్ రాని పండుటాకుల తరఫున న్యాయపోరాటం చేయనున్నట్లు ఆయన చెప్పారు. -
రుణమాఫీ కోసం రోడ్డెక్కిన మహిళలు
అనంతపురం: డ్వాక్రా రుణాలు మఫీ చేయలేదని మహిళలు రొడ్డెక్కారు. అనంతపురం జిల్లా రొద్దం మండలకేంద్రంలో గురువారం పెద్ద ఎత్తున మహిళలు రహదారిపై ధర్నా నిర్వహించారు. ఎన్నికలకు ముందు రుణమాఫీ పాట పాడిన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు డ్వ్రాక్రా రుణాల ఊసెత్తడంలేదని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారి పై వాహనాల రాకపోకలు నిలిపేశారు. (రోద్దం) -
డ్వాక్వా సంఘాలు ఢమాల్
రుణ లక్ష్యం రూ.140కోట్లు అందించింది రూ.71 కోట్లు తిరోగమనంలో పొదుపు సంఘాలు విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో డ్వాక్వా సంఘాలు నిర్వీర్యం అవుతున్నాయి. రుణమాఫీ దెబ్బకు కొత్త రుణాల్లో కొర్రీ పడింది. స్వయం సహాయక సంఘాల ఖాతాల నుంచి బ్యాంకర్లు ఇప్పటికే పొదుపు సొమ్మును జమచేసుకున్నారు. బ్యాంకర్ల వేధింపుల నేపథ్యంలో మిగిలిన రుణాలను సభ్యులే స్వచ్ఛందంగా చెల్లించారు. ఒక్కో గ్రూపునకు లక్ష రూపాయల మేర రుణమాఫీ ఇస్తానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా బడ్జెట్లో రివాల్వింగ్ ఫండ్ను తెరపైకి తెచ్చారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఏడు వేల గ్రూపులకు రూ.140 కోట్లు రుణాలుగా అందిచాలన్నది లక్ష్యం కాగా ఇప్పటివరకు 1,875 గ్రూపులకు రూ.71 కోట్ల మేర మాత్రమే రుణాలు పంపిణీ చేశారు. అంటే లక్ష్యంలో 50 శాతంతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. గడిచిన ఆరు నెలల్లో 355 గ్రూపులు రద్దయ్యాయి. మరిన్ని సంఘాలు ఇదే బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. హామీ మాఫీ అధికారుల అలసత్వం కారణంగానే డ్వాక్వా సంఘాలు పరిస్థితి అధ్వాన్నంగా తయారైందనే విమర్శలు ఉన్నాయి. ఏడాది నుంచి అధికారులు బ్యాంకర్లతో సమావేశాన్ని ఏర్పాటుచేసిన దాఖలాల్లేవు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.130 కోట్లు రుణ లక్ష్యం కాగా రూ.101 కోట్లు పంపిణీ చేశారు. దీనిపై నాటి కమిషనర్ సి.హరికిరణ్, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ పీవో ఎం.శకుంతల ఏమాత్రం దృష్టిసారించలేదు. రుణమాఫీ హామీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ హామీలను మాఫీ చేసి రుణాలను మిగిల్చింది. దీంతో బ్యాంకర్లు మహిళల పొదుపు ఖాతాల నుంచి బకాయిల్ని మినహాయించుకున్నారు. గతంలో 11,973 గ్రూపులు ఉండగా ప్రస్తుతం 11,618 పనిచేస్తున్నాయి. స్మార్ట్సిటీ, బ్యూటిఫికేషన్పై అధికారులు చూపుతున్న శ్రద్ధలో కనీసం పది శాతం డ్వాక్వా సంఘాలపై చూపడం లేదు. పీవో ఎం.శకుంతలను సరెండర్ చేసిన కమిషనర్ జి.వీరపాండియన్ ఇన్చార్జి బాధ్యతల్ని విజయలక్ష్మికి అప్పగించారు. నెల రోజుల క్రితమే ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ నెలాఖరు లోపు రూ.69 కోట్ల రుణాలను అందించాల్సి ఉంది. నేను కొత్తగా వచ్చా నెల రోజుల క్రితమే ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అంతకు ముందు ఏం జరిగిందో నాకు తెలియదు. సమీక్షలు, సమావేశాలతోనే టైం సరిపోతుంది. ఇప్పుడిప్పుడే సెక్షన్పై అవగాహన వస్తోంది. లక్ష్యసాధన దిశగా రుణాలు మంజూరు చేసేందుకు నావంతు కృషి చేస్తా. - విజయలక్ష్మి, యూసీడీ ఇన్చార్జి పీవో -
సర్కారు మెడలు వంచుదాం!
-
ఇది మోసపూరిత ప్రభుత్వం!: వైఎస్ జగన్
* ధ్వజమెత్తిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి * రుణాలు మాఫీ చేస్తామని చెప్పి రైతుల పేర్లను మాఫీ చేస్తున్నారు * హామీలివ్వడం, విస్మరించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య * ప్రతిపక్షంలో ఉన్నాం.. ప్రజల తరఫున పోరాటం చేస్తాం * అందరూ చేయీ చేయీ కలిపి సర్కారు మెడలు వంచుదాం సాక్షి, కడప: డ్వాక్రా రుణాలు, వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచార సభల్లో, మేనిఫెస్టోలో ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి రాగానే రుణాలు తీసుకున్న రైతుల పేర్లను మాఫీ చేస్తున్నారని వైఎస్సార్కాంగ్రెస్పార్టీ అధినేత, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఇది ప్రజలను వంచిస్తున్న మోసపూరిత సర్కార్ అని దుయ్యబట్టారు. ఆయన శనివారం వైఎస్సార్ జిల్లా పులివెందులతోపాటు ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. పలువురు పింఛన్లు కోల్పోయిన వృద్ధులు, రుణమాఫీ లిస్టులో పేర్లు లేని రైతులు, డ్వాక్రా మహిళలు ఆయనను కలిశారు. ఈ సర్కారు తమ జీవితాలను నాశనం చేసిందని వారు వాపోయారు. దీనిపై ఆయన స్పందిస్తూ... ప్రజలకు ఏవేవో చేస్తామని లెక్కలేనన్ని హామీలిచ్చి, ఈ రోజు చేతకాక ప్రజలను రోజుకొకమాటతో వంచనకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలప్పుడు హామీలివ్వడం తర్వాత విస్మరించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్యని, అందుకే రోజురోజుకూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని చెప్పారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాలు, పండుటాకుల పింఛన్లపై మడమ తిప్పకుండా పోరాటం చేస్తామని భరోసానిచ్చారు. ప్రజలు కూడా తమ ఆందోళనల్లో పాలుపంచుకుని ప్రభుత్వం మెడలు వంచేందుకు చేయి కలపాలని ఆయన పిలుపునిచ్చారు. అండగా ఉంటా... అధైర్యపడొద్దు... వరుసగా ప్రజలు ఆదిరిస్తున్నారనే అసూయతో పొట్టనపెట్టుకున్నారయ్యా... ముందు సర్పంచ్ అయ్యాడు, మా వదినా సర్పంచ్ అయ్యింది... ఎంపీటీసీ గెల్చినాం... ఒకర్ని కూడ పల్లెత్తుమాట అనని నా తోడబుట్టినోన్ని తెలుగుదేశమోళ్లు చంపేశారయ్యా.. అంటూ గత జూలైలో హత్యకు గురైన మర్రిబోయిన ఓబులేసు సోదరి ఓబులమ్మ జగన్ను చూడగానే బోరుమన్నారు. నీతిగా ఉన్నందుకే ఇంతటి ఘోరానికి పాల్పడ్డారు సామీ... అంటూ వాపోయారు. వారి రోదనలకు జగన్ చలించిపోయారు. నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని, అధైర్యపడొద్దు, అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఏ అవసరం వచ్చినా, తన సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అండదండగా ఉంటారని చెప్పారు. అధైర్య పడకుండా ప్రజాసేవలో పాలు పంచుకోవాలని ఓబులేసు కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అడుగడుగునా నీరాజనం... ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రొద్దుటూరు వెళ్తున్నారని తెలుసుకున్న ప్రజలు పులివెందుల నుంచి ప్రొద్దుటూరు వరకూ గ్రామగ్రామాన ఘన స్వాగతం పలికారు. ముద్దనూరు, చిలంకూరు, నిడ్జివి, యర్రగుంట్ల జనం రోడ్డుపై బారులు తీరారు. ప్రొద్దుటూరులో యువత పెద్ద ఎత్తున స్వాగతం పలికి కేరింతలు కొట్టింది. ఆయన వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యేలు జయరాములు, రాచమల్లు శివప్రసాదరెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, ఎస్బీ అంజాద్బాష, పి.రవీంద్రనాథరెడ్డి, కడప మేయర్ సురేష్బాబు, జెడ్పీ ఛెర్మైన్ గూడూరు రవి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
బాబూ.. డైలాగులొద్దు: రఘువీరారెడ్డి
గుడిబండ: డైలాగులు చెప్పడం మాని, పనితనాన్ని చేతల్లో చూపించాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని ఆయన స్వగ్రామం నీలకంఠాపురంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు బేషరతుగా రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు, టీడీపీ నేతలు కొన్ని వందల సభల్లో చెప్పారన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక రుణమాఫీ చేస్తామని, పింఛన్లు పెంచుతామని, అన్ని గ్రామాలకు ఎన్టీఆర్ సుజల స్రవంతి నీరు ఇస్తామని, బెల్టుషాపులు రద్దు చేస్తామని సంతకాలు చేశారన్నారు. అయితే నేడు రుణ మాఫీకి సవాలక్ష కొర్రీలు వేస్తూ.. ఎన్నెన్నో షరతులు పెట్టారని దుయ్యబట్టారు. అనంతపురం జిల్లాకు పంటల బీమా కింద విడుదలైన రూ. 226 కోట్లు రుణాలకు జమ వేసుకోవడం ఆపేసి, రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో రుణ మాఫీపై చంద్రబాబు మహిళలకు ఇచ్చిన హామీలను (తన ఫోన్లో రికార్డు చేసిన వాయిస్ను) అక్కడే ఉన్న మహిళలకు వినిపించారు. -
ఆన్లైన్ ఇసుక రెడీ !
సాక్షి, చిత్తూరు: ఇసుకను మీ-సేవ, ఆన్లైన్ ల ద్వారా వినియోగదారులకు అందించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఒక టి రెండు రోజుల్లోనే ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. ఇందుకోసం జిల్లావ్యా ప్తంగా 25 ఇసుక రీచ్లను డ్వాక్రా సంఘాలకు కేటాయించారు. ఇరిగేషన్ అధికారుల సూచనల మేరకు జిల్లా స్థాయి కమిటీ 37 ఇసుక రీచ్లను గుర్తించినా మొదటి విడతలో 25 రీచ్లను మాత్రమే ఆయా పంచాయతీల పరిధిలోని డ్వాక్రా సంఘాలకు అప్పగించారు. వినియోగదారుడు ట్రాన్స్పోర్ట్ చార్జీల సహా ధరను మీ-సేవ ద్వారా చెల్లిస్తే ప్రభుత్వమే ఇసుకను అతడి ఇంటికి సరఫరా చేస్తుంది. వినియోగదారుడు 9 క్యూబిక్ మీటర్ల ఇసుక వరకూ మీ-సేవలో... ఆ పైన ఇసుక కావలసి వస్తే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుకను సరఫరా చేయనున్నారు. ఇసుక ధర :ఒక్క క్యూబిక్ మీటరు ఇసుక ధర *300లుకాగా, సీనరీస్ చార్జెస్ *40తో కలిపి మొత్తం 340 రూపాయలు అవుతుంది. ఈ లెక్కన ట్రాక్టర్ ఇసుక (3 క్యూబిక్ మీటర్లు) ధర 1,020 రూపాయలు. కొన్ని చెరువులు,కాలువలు,చెక్డ్యామ్లలో దొరికే నాసిరకం ఇసుకను(సిల్ట్) మాత్రం క్యూబిక్ మీటర్ *260 చొప్పున విక్రయించాలని అధికారులు నిర్ణయించారు. ఇక ట్రాన్స్పోర్ట్కు సంబంధించి 5 కిలోమీటర్లలోపు దూరంలో అయితే ట్రాక్టర్ ఇసుకకు *350 బాడుగగా నిర్ణయించారు. ఆ పైన 10 కిలోమీటర్లలోపు ఉంటే 550 రూపాయలు,10 కిలోమీటర్ల పైన ఉంటే మాత్రం ప్రతి కిలోమీటర్కు అదనంగా *28 చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం గుర్తించిన ఇసుక రీచ్లు : చిత్తూరు,జీడీ నెల్లూరు మండలాల్లో గయారాంపల్లి,నందనూరు, అంగళ్లు, బీఎన్నార్పేట తదితర ప్రాం తాల పరిధిలో ఉన్న నీవా నదిలో 7 ఇసుక రీచ్లను గుర్తించగా, చిత్తూరు, పూతలపట్టు మండలాల పరిధిలో మరో 4 రీచ్లు, తొట్టంబేడు మండల పరిధిలో స్వర్ణముఖి నదిలో 3 రీచ్లు,బీఎన్ కండ్రిగ మండలం కాళంగి నదిలో 3 రీచ్లు, కలికిరి మండలంలో 6 రీచ్లు చొప్పున మొత్తం 37 రీచ్లను గుర్తించినట్లు జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకరరావు. తెలిపారు. తొలుత 25 రీచ్లను ప్రారంభించనున్నట్లు చెప్పారు. నేడో రేపే మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేతుల మీదుగా ఇసుక రీచ్లను ప్రారంభించాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. -
డ్వాక్రా మహిళల ముసుగులో టీడీపీ నేతల దందా!
-
ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట
కర్నూలు(అగ్రికల్చర్): ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసి.. డ్వాక్రా సంఘాలకు కేటాయించిన రీచ్ల నుంచి నిబంధనల ప్రకారం తరలిస్తామని జాయింట్ కలెక్టర్ కన్నబాబు అన్నారు. గురువారం ఆయన తన చాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు రెవెన్యూ, పోలీసు, మైనింగ్, రవాణా అధికారులతో ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి నిరంతర గస్తీ ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో నాలుగు ఇసుక రీచ్లను గుర్తించినా.. నిడ్జూరులో మాత్రమే తవ్వకాలు కొనసాగుతున్నాయన్నారు. ఇసుక ధర, రవాణా చార్జీలను ఇప్పటికే ఖరారు చేశామన్నారు. ఇప్పటి వరకు వినియోగదారులు డీడీలు చెల్లించి ఇసుక తరలిస్తున్నారని.. ఇకపై మీసేవ కేంద్రాల్లో నగదు చెల్లించి రశీదులను ఇసుక రీచ్ల వద్ద డ్వాక్రా సంఘాల ప్రతినిధులకు అందిస్తేనే ఇసుక సరఫరా అవుతుందన్నారు. వాల్టా చట్టాన్ని వంద శాతం అమలు చేస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఇందులో భాగంగానే రీచ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పత్తి కొనుగోలుకు చర్యలు పత్తి ధర పడిపోవడంతో కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ను రంగంలోకి దించుతున్నట్లు తెలిపారు. ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాలలో సీసీఐ కొనుగోలు కేంద్రాలతో ఎంఎస్పీతో పత్తిని కొనుగోలు చేస్తామన్నారు. రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రస్తుతం ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ, ఆముదం దిగుబడులను ఈ-టెండర్లతో కొనుగోలు చేస్తున్నారని.. త్వరలోనే పత్తిని కూడా అదేవిధంగా కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
పోలవరం ఎమ్మెల్యేకు చేదు అనుభవం
పోలవరం: పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ కు చేదు అనుభవం ఎదురైంది. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం గూటాల వద్ద ఇసుక ర్యాంపును ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యేను డ్వాక్రా మహిళలు అడ్డుకున్నారు. ఇసుక ర్యాంపు కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. మహిళలతో టీడీపీ కార్యకర్తలు వాగ్వదానికి దిగారు. మహిళలను పక్కకు తోసేశారు. తర్వాత ఎమ్మెల్యేతో ఇసుక ర్యాంపును ప్రారంభింపజేశారు. తమపై టీడీపీ కార్యకర్తల దౌర్జన్యానికి నిరసనగా మహిళలు అక్కడే బైఠాయించారు. -
రుణం చెల్లించాల్సిందే
సాక్షి, చిత్తూరు: రుణమాఫీ సంగతి దేవుడెరుగు. డ్వాక్రా రుణాలు తక్షణం వసూలు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సీఎం సొంత జిల్లాలో అటు వెలుగు అధికారులు ఇటు బ్యాంకర్లు వేర్వేరుగా డ్వాక్రా రుణాలను బల వంతంగా వసూలు చేస్తున్నారు. కాదూ కూడదంటే రుణం చెల్లించిన వారికే రుణమాఫీ అమలు చేస్తారని భయపెడుతున్నారు. పాతబకాయి తిరిగి చెల్లించకుంటే అధిక వడ్డీ వసూలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. రుణమాఫీ ఏమైందని ప్రశ్నిస్తే దాంతో మాకు సంబంధం లేదంటూ అధికారులు తప్పించుకుంటున్నారు. పాత బకాయి చెల్లిస్తేనే... పాత బకాయిలు చెల్లిం చకపోతే కొత్త రుణానికి జీరో వడ్డీ వర్తించదంటూ వెలుగు అధికారులు సంఘాల ను భయపెడుతున్నారు. సకాలంలో తిరిగి చెల్లిం చకపోతే ఐదు లక్షలకు నెలకు 5వేల వడ్డీ తప్పనిసరిగా చెల్లించాల్సిందేనంటూ అధికారులు తేల్చి చెబుతున్నారు. పాతబకాయిలు చెల్లించిన వారికే రుణమాఫీ వర్తిస్తుందని కొందరు వెలుగు అధికారులు అటు బ్యాంకు అధికారులు ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. రుణమాఫీలో భాగంగా ప్రభుత్వం ఇస్తామన్న లక్షపై మాత్రం అధికారులు నోరుమెదపడంలేదు. ప్రశ్నిస్తే దాని విషయం మాకు తెలియదు ప్రభుత్వం ఇచ్చినపుడు తీసుకోమంటూ, సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు. బాబువి మాయమాటలేనా? మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రంపైకి అక్కాచెల్లెళ్లు రుణాలు చెల్లించాల్సిన అవసరం లేదంటూ మాయమాటలు వల్లిస్తున్నారు. అన్నీ తానే కడతానంటూ మాటలతో మభ్యపెడుతుండడంతో డ్వాక్రా మహిళలు రుణాలు తిరిగి చెల్లించాలా వద్దా అనే మీమాంసలో పడ్డారు. సీఎం పైకి ఎన్ని మాటలు చెప్పినా రుణ వసూళ్లు పూర్తిచేయాలంటూ తమకు ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయంటూ వెలుగు అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి సొంతజిల్లాలో అధికంగా వసూళ్లుచేసి మెప్పు పొందేందుకు డ్వాక్రా రుణాల వసూళ్లలో అధికారులు కొంత కఠినంగా వ్యవహరిస్తూ బలవంత పు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 65 వేల వరకూ డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. దాదాపు 7 లక్షల 80 వేలమంది సభ్యులున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలోనే జిల్లాలో 230 కోట్ల రుణాలు ఇచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇవి కాకుండా 2013-14కు సంబంధించి 1387 కోట్లు రుణాలు ఇచ్చారు. ఇప్పటికే గ్రూపులు చెల్లించక పోవడంతో 154 కోట్ల బకాయిలు పెండింగ్లోపడ్డాయి. గడువు లోపు చెల్లించక నిలిచి పోయిన బకాయిలు మరో 55 కోట్లు ఉంది. మొత్తంగా ఈ ఏడాది ఇచ్చిన 230 కోట్లు కాక 1,596 కోట్ల బకాయిలు ఉన్నాయి. వీటిని తక్షణం వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లాలో బ్యాంకర్లు, వెలుగు అధికారులు డ్వాక్రా సంఘాలపై ఒత్తిడి పెంచి బలవంతంగా వసూళ్లకు దిగారు. ఇప్పటికే 60 శాతం బకాయిలు వసూలు చేశామంటూ అధికారులు హడావుడి చేస్తున్నారు. రూ.పది వేలు ఎప్పుడు ఇస్తారో మరోవైపు అక్కచెల్లెళ్లకు ఖర్చులకోసం ఒక్కో సభ్యురాలికి 10 వేలు ఉచితంగా ఇస్తానని ముఖ్యమంత్రి ఆర్భాటంగా ప్రకటించారు. ఈ విషయం జన్మభూమి సభల్లో పదేపదే చెబుతున్నారు. ఆ మొత్తాన్ని ఎప్పుడు ఇస్తారో మాత్రం చెప్పడంలేదు. జిల్లాలో 7లక్షల 80 వేలమంది సభ్యులకు ఒక్కొక్కరికీ 10 వేల వంతున మొత్తం 780 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. సీఎం మాటలు చెప్పడం తప్ప పైసా విదల్చలేదు. ఇది కూడా రుణమాఫీ మాదిరే ప్రచారార్భాటం తప్ప మరొకటి కాదని సంబంధిత అధికారులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తుండడం విశేషం. -
ఇసుక పెత్తనం తమ్ముళ్లకే
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: డ్వాక్రా రుణాలు మాఫీ అటకెక్కించడంతో.. మహిళలను సంతృప్తి పరచడానికి టీడీపీ ప్రభుత్వం ఇసుక రీచ్ల డ్రామా తెరపైకి తెచ్చింది. పోనీ మహిళలకే కట్టబెట్టారనుకుంటే పొరపాటే. మహిళల పేరు చెప్పి ఇసుక రీచ్లపై తమ్ముళ్లు పెత్తనం చెలాయిస్తున్నారు. పెపైచ్చు తెలుగుతమ్ముళ్ల దౌర్జన్యాలతో డ్వాక్రా మహిళలకు కన్నీళ్లు మిగిలాయి. అలాగే యథాతథంగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుండడం గమనార్హం. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. పథకం కొత్తదే అయినా.. జిల్లాలో మాత్రం పాత పద్ధతిలోనే ఇసుక రవాణా కొనసాగుతోంది. జిల్లాలో 72 ఇసుక రీచ్లను గుర్తించారు. అందులో ప్రస్తుతం 25 రీచ్లకు అనుమతులు వచ్చాయి. వీటిలో కొన్నిచోట్ల ఇసుక తవ్వకాలు ప్రారంభించారు. మరికొన్నిచోట్ల తమ్ముళ్ల బినామీలు అడ్డుతగులు తుండటంతో ప్రారంభం కాలేదు. కోవూరు నియోజక వర్గ పరిధిలో బుచ్చిరెడ్డిపాళెం మండల పరిధిలోని జొన్నవాడ, మినగల్లు, విడవలూరు మండలం ముదివర్తి, కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం ఇసుక రీచ్లు టీడీపీ నేతల కనుసన్నల్లో నడుస్తున్నట్టు సమాచారం. ‘అధికారులకు ఎవరైనా ఫిర్యాదు చేయాలని చూస్తే మీ అంతుచూస్తాం’ అని బెదిరిస్తున్నట్టు తెలిసింది. నెల్లూరు రూరల్ పరిధిలోని నవలాకులతోట ఇసుక రీచ్ బుధవారం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అక్కడ తమ్ముళ్ల బినామీలు అడ్డుతగిలి దౌర్జన్యం చేశారు. ఇసుక రీచ్ను తమకే ఇవ్వాలంటూ ప్రారంభాన్ని అడ్డుకున్నారు. షామియానాను పడదోసి మహిళలపై దౌర్జన్యం చేశారు. దీంతో స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో కొంత సద్దు మణిగింది. అయితే ‘రీచ్లో ఎవరైనా అడుగుపెడితే.. ఇసుకలోనే తొక్కేస్తాం’ అని బెదిరిస్తున్నట్టు మహిళలు భయపడుతున్నారు. దీంతో ఇక్కడ ఇసుక తవ్వకాలు ప్రారంభించలేదు. అదే విధంగా కోడూరుపాడు, ఎన్వీ గార్డెన్, పొట్టేపాళెం, గొల్లకందుకూరు, సజ్జీపురం, ముల్లుముడి తదితర ప్రాంతాల వద్ద స్థానికులు అభ్యంతరం చెప్పినట్టు తెలిసింది. బిల్లొకటే.. అనుమతి మూడింటికి కొన్నిచోట్ల ఇసుక తవ్వకాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. బుచ్చిరెడ్డిపాళెం మండల పరిధిలోని ఇసుక రీచ్ల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఒక వే బిల్లును చూపి మూడు ట్రాక్టర్ల నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా నాయుడుపేట పరిధిలోని ఇసుక రీచ్ల నుంచి పగలు నిబంధనల ప్రకారం తరలిస్తున్నా.. రాత్రి పూట మాత్రం ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం. అదే విధంగా సూళ్లూరుపేట పరిధిలోనూ టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
దూరం.. భారం
ఇసుక బంగారమే! సాక్షి, కర్నూలు: ఇసుక ధర అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్వహణ బాధ్యత డ్వాక్రా సంఘాలకు అప్పగించేందుకు నిర్ణయించడం తెలిసిందే. ఫలితంగా ఇసుక చౌక ధరకు లభించే అవకాశం ఏర్పడినా.. దూర ప్రాంత ప్రజలకు రవాణా ఖర్చు తడిసి మోపెడు కానుంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇసుక వ్యాపారంలో అత్యంత చురుగ్గా వ్యవహరిస్తున్న డ్వాక్రా సంఘాలకు ప్రాధాన్యతనిచ్చేందుకు తీర్మానించారు. ఆ మేరకు ఇప్పటికే పలు సంఘాలకు బాధ్యతలు కట్టబెట్టారు. జిల్లాలోని జి.సింగవరం-ఎదురూరు, నిడ్జూరు-బావాపురం, మంత్రాలయం పరిధిలో ఇసుక తవ్వకాలకు మూడు రీచ్లను ఎంపిక చేశారు. త్వరలోనే సంఘాల ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలకు రంగం సిద్ధమైంది. పశ్చిమ గోదావరి జిల్లా తరహాలో ఇక్కడా అదే పాలసీని అమలు చేసేందుకు జిల్లా నుంచి ఓ టీం అధ్యయనం చేసి వచ్చింది. పర్యావరణ అనుమతులు కూడా పూర్తి కావడంతో ఇక తవ్వకాలకు అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 3.40 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకానికి అనుమతి లభించింది. జి.సింగవరం-ఎదురూరు రీచ్, నిడ్జూరు-బావాపురం రీచ్లలో 50వేల క్యూబిక్ మీటర్లు చొప్పున.. మంత్రాలయం రీచ్లో 2.40 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వుకునే వీలుంది. ఇసుక ధర నిర్ణయంపై కసరత్తు జరుగుతోంది. అయితే అధికార వర్గాల సమాచారం మేరకు క్యూబిక్ మీటరు ఇసుకను రూ.650లకు విక్రయించనున్నట్లు తెలిసింది. ఈ లెక్కన యూనిట్ ఇసుక ధర రూ.2వేలు పలకనుంది. ఒక లారీలో రెండు యూనిట్ల ఇసుక తరలిస్తే రూ.4వేలు చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారులకు ఇదేమీ భారం కాకపోయినా.. రవాణా చార్జీ కాస్త ఇబ్బంది కానుంది. జిల్లా అధికారులు కిలోమీటరుకు రూ.65 చొప్పున ధర నిర్ణయించాలని భావిస్తున్నారు. ఆ మేరకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారు రెండు యూనిట్లకు రూ.2వేలు అధనంగా భరించాల్సి ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాలకు నిడ్జూరు-బావాపురం రీచ్ 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే ఆయా ప్రాంతాల ప్రజలు రవాణా చార్జీలే రూ.6500 పైగా భరించాల్సిన పరిస్థితి. ఈ మొత్తానికి ఇసుక ధర కలిపితే రెండు యూనిట్ల ఇసుక రవాణాకు రూ.10,500 వెచ్చించాల్సి రావడం గమనార్హం. ఇదిలాఉంటే మంత్రాలయంలో రీచ్ను నిర్ణయించినా ఆ ప్రాంతంలో ప్రజల తాగునీటి అవసరాలకు నిర్మించిన పథకం ఉండటంతో ఇసుక తవ్వకాలు ఎలా సాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో స్పష్టత వచ్చే వరకు తవ్వకాలకు అనుమతి అసాధ్యమని తెలుస్తోంది. అదే జరిగితే ఆదోని డివిజన్లోని ప్రజలకూ ఇసుక బంగారం కానుంది. ప్రభుత్వ తాజా విధానం పరిశీలిస్తే.. ఇసుక అవసరమైన వినియోగదారులు మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే, మహిళా సంఘాలు రవాణా చార్జీలు కలుపుకొని ఇసుక సరఫరా చేయనున్నాయి. ఆన్లైన్ బుకింగ్ కావడంతో ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకునే వెలసుబాటు ఉంది. ఇసుక రవాణాకు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసి వీటికి ప్రభుత్వ స్టిక్కర్లు అతికిస్తామని.. భవిష్యత్లో జీపీఎస్కు అనుసంధానం చేయనుండటంతో ఇసుక అక్రమ రవాణాకు ఆస్కారం ఉండబోదని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తంగా రవాణా చార్జీల విషయంలో ప్రభుత్వం పునరాలోచించకపోతే దూర ప్రాంత వినియోగదారులు ఆర్థికంగా నష్టపోవాల్సిందే. -
వ్యవసాయ, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేయూలి
వల్లూరు: ప్రభుత్వం వ్యవసాయ, డ్వాక్రా రుణాలన్నింటినీ తక్షణం మాఫీ చేయాలని కమలాపురం ఎమ్మెల్యే పీ.రవీంధ్రనాధ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక మండల పరిషత్ సభాభవనంలో ఎంపీపీ పొన్నోలు పిచ్చమ్మ అధ్యక్షతన బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్దపు హామీలతో అధికారాన్ని చేజిక్కించుకున్న టీడీపీ ప్రభుత్వం నేటికీ ప్రజలను మభ్యపెడుతూనే ఉందని విమర్శించారు. కనీసం వడ్డీలో కొంత భాగానికి కూడా సరిపోని విధంగా కేవలం 5 వేల కోట్లను విడుదల చేయడం దారుణమన్నారు. వారి అబద్దపు హామీతో నేడు రైతులు పంట రుణాలను పొందడానికి వీలు లేకుండా పోయిందని విమర్శించారు. దీని వలన ప్రస్తుతం తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పంటలు ఎండిపోతున్నప్పటికీ పంటల బీమా పొందలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్మన్ గూడూరు రవి మాట్లాడుతూ ఎవరైనా స్వార్థంతో ఇతరులకు హాని చేయరాదన్నారు. మంచి పనులు చేసి ప్రజాదరణ పొందడానికి కృషి చేయాలన్నారు. సమాజంలో మంచితనం, మార్పు అవసరమని పేర్కొన్నారు. కక్షలు ,కార్పణ్యాలకు దూరంగా ఉండి ప్రజాదరణ పొందడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. జెడ్పీటీసీ అబ్బిరెడ్డిగారి వీరారెడ్డి మాట్లాడుతూ వ ల్లూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరారు. ఈ మేరకు సమావేశంలో తీర్మాణాలను చేపట్టి ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మొగిలిచెండు సురేష్, తహశీల్దార్ వెంకటేష్, ఎంపీటీసీలు, సర్పంచ్లు , ఎంపీపీ తనయుడు శివకుమార్రెడ్డి , మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
డ్వాక్రా మహిళలకూ టోపీ..!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో ఇందిరాక్రాంతి పథం(ఐకేపీ) కింద 61,711 స్వయం సహాయక సంఘాలు(ఎస్హెచ్జీ) ఉన్నాయి. ఇందులో 6.45 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. మార్చి 31 నాటికి 55,602 సంఘాల్లోని 5.65 లక్షల మంది మహిళలు రూ.1611.03 కోట్లను బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకున్నారు. చంద్రబాబు హామీ మేరకు ఆ రుణాలన్నింటినీ మాఫీ చేయాలి. కానీ.. సీఎంగా బాధ్యతలు స్వీకరిం చగానే మాట మార్చారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేమని ఏకంగా చేతులెత్తేశారు. ఒక్కో సంఘానికి రూ.లక్ష వంతున ప్రోత్సాహకంగా మూలధనాన్ని అందిస్తామని సెలవిచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో 61,711 స్వయం సహాయక సంఘాలకు రూ.617.11 కోట్లను ప్రోత్సాహకం రూపంలో మూలధనంగా అందించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మూలధనం రూపంలో అందించే రూ.లక్షను ఎప్పటిలోగా సంఘాలకు విడుదల చేస్తారన్న అంశంపై స్పష్టత లేదు. మంగళవారం విజయవాడలో రైతు సాధికార సంస్థ ప్రారంభోత్సవం సమయంలో డ్వాక్రా మహిళలకు ప్రోత్సాహకం అందించేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేస్తామని చంద్రబాబు ప్రకటించారు. పంట రుణాలను చెల్లించినట్లుగానే ఏటా 20 శాతం వంతున డ్వాక్రా సంఘాలకు ప్రోత్సాహక మూలధనాన్ని అందించాలని నిర్ణయించారు. అంటే.. ఒక్కో డ్వాక్రా సంఘానికి రూ.లక్ష వంతున ఇచ్చే మూలధనంలో ఏటా రూ.20 వేల వంతున ఐదేళ్లపాటూ సంఘాల ఖాతాల్లో జమ చేస్తారన్న మాట. ఒక్కో సంఘంలో కనిష్టంగా పది నుంచి గరిష్టంగా 15 మంది వరకూ సభ్యులుగా ఉంటారు. సగటున ఒక్కో సంఘానికి పది మంది సభ్యులుగా ఉంటారని పరిగణించినా.. ఒక్కో మహిళకు ఏడాదికి రూ.రెండు వేలకు మించి దక్కదన్నది స్పష్టమవుతోంది. మండిపడుతున్న మహిళలు.. ప్రభుత్వ నిర్ణయంపై మహిళలు మండిపడుతున్నారు. జిల్లాలో సంపూర్ణ ఆర్థిక చేకూర్పు(టోటల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్) పథకం కింద జిల్లాలోని 55,602 సంఘాల్లోని 5.65 లక్షల మంది మహిళలకు బ్యాంకర్లు రూ.1611.03 కోట్లను రుణాలుగా అందించారు. ఆ రుణాలు మాఫీ అవుతాయనుకున్న మహిళల ఆశలను ప్రభుత్వం అడియాశలు చేసింది. సాధారణంగా మహిళా సంఘాలకు బ్యాంకులు ఏడు శాతం వడ్డీపై రుణాలు ఇస్తాయి. కంతులను మహిళలు సక్రమంగా చెల్లిస్తే వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేస్తుంది. కానీ.. రుణమాఫీ అవుతుందని భావించిన మహిళలు కంతులు చెల్లించకపోవడంతో 14 శాతం వడ్డీని బ్యాంకర్లు వసూలు చేస్తున్నారు. మోయలేని రీతిలో వడ్డీ భారం పడటంతో మహిళలు లబోదిబోమంటున్నారు. అప్పు కట్టకపోతే సీఐఎఫ్లో కట్.. డ్వాక్రా రుణాలను మాఫీ చేసేది లేదని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో బ్యాంకర్లు వసూళ్లకు శ్రీకారం చుట్టారు. రుణాలను చెల్లించకపోతే సీఐఎఫ్(సామాజిక పెట్టుబడి నిధి), పొదుపు మొత్తం నుంచి నిధులను కంతులకు మళ్లిస్తామని బ్యాంకర్లు తేల్చిచెబుతున్నారు. సీఐఎఫ్, పొదుపు నిధుల్లో ఒక్క రూపాయిని డ్రా చేయాలన్నా గ్రామైక్య సంఘం, ఆయా మహిళా సంఘాల అనుమతి తప్పనిసరి. కానీ.. బ్యాంకర్లు నిబంధనలను తుంగలోతొక్కి సీఐఎఫ్, పొదుపు నిధులను యథేచ్ఛగా అప్పుల కింద జమ చేసుకుంటున్నారు. జిల్లాలో సీఐఎఫ్(సామాజిక పెట్టుబడి) నిధి రూ.196 కోట్ల నుంచి రూ.95 కోట్లకు తగ్గిపోయినట్లు సమాచారం. -
తప్పు వారిది.. శిక్ష మాకా..!
* బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదంటున్న డ్వాక్రా మహిళలు * సంఘాల నుంచి తప్పుకుంటామని హెచ్చరికలు * తామేమీ చేయలేమంటున్న బ్యాంకర్లు జమ్మలమడుగు: బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో పూర్తి స్థాయిలో చెల్లించాం.. ప్రతి నెలా పొదుపు కూడా కట్టేసుకుంటున్నాం.. తిరిగి తమకు రుణాలు ఇవ్వాలని అడిగితే బ్యాంకర్లు పట్టించుకోవడం లేదు.. రుణాలను కట్టని వారిని చూపిస్తూ వారితో కట్టిస్తేరుణాలు ఇస్తామంటున్నారని.. ఇదేమి న్యాయమని డ్వాక్రా మహిళలు మండిపడుతున్నారు. సోమవారం స్థానిక మెప్మా కార్యాలయంలో మహిళ సంఘాల సర్వ సభ్య సమావేశాన్ని మున్సిపల్ చైర్పర్సన్ తాతిరెడ్డి తులసి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రుణాలు ఇవ్వక బ్యాంకుల చుట్టూ తమను తిప్పించుకుంటున్నారన్నారు. శ్రీనిధి నుంచి కూడా డబ్బులు తీసుకోనీయడం లేదన్నారు. రుణాలు ఏడాది దాటుతున్నా తమను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఇలాగైతే సంఘాలనుంచి తాము తప్పుకుంటామని హెచ్చరించారు. మెప్మా జిల్లా స్పెషలిస్ట్ రమణ మాట్లాడుతూ సక్రమంగా రుణాలు చెల్లించిన వారికి బ్యాంకర్లు సహకరించాలన్నారు. సక్రమంగా చెల్లించని వారిని సక్రమంగా చెల్లించేవారిని ఒకేవిధంగా చూడటం సరైంది కాదన్నారు. మానవతాదృక్పధంతో ఆదుకోవాలి... సక్రమంగా రుణాలు చెల్లించిన వారికి మానవతాదృక్పధంతో తిరిగి రుణాలు ఇవ్వలని చైర్పర్సన్ తాతిరెడ్డితులసి కోరారు. సమావేశంలో శ్రీనిధి ఏరియా కోఆర్డినేటర్ శశిధర్రెడ్డి, మెప్మా పీఆర్పీ భవాని పాల్గొన్నారు. -
ఇసుక రీచ్ల రాబడి స్థానిక సంస్థలకే కేటాయించాలి
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి పిడతాపోలూరు(ముత్తుకూరు): ఇసుక రీచ్ల ఆదాయంలో డ్వాక్రా మహిళా సంఘాలకు పోను మిగిలిన మొత్తం స్థానిక సంస్థలకు కేటాయించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జన్మభూమిలో భాగంగా శనివారం బ్రహ్మదేవి, పిడతాపోలూరులో జరిగిన గ్రామసభలో కాకాణి మాట్లాడారు. గతంలో ఇసుక రీచ్ల ద్వారా వచ్చే ఆదాయం పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్లకు కేటాయించిన విషయం ఆయన గుర్తు చేశారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాలు అమలు కావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా ఇసుక రీచ్ల రాబడి ప్రభుత్వ ఖజానాకు చేర్చకుండా స్థానిక సంస్థల బలోపేతానికి కేటాయించాలన్నారు. ఇప్పటికే గ్రావెల్ ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వం జమ చేసుకుంటోందన్నారు. దేశ ప్రధాని, రాష్ట్ర సీఎంలు ప్రకటించిన స్వచ్ఛభారత్, స్వచ్ఛాంధ్రలు గ్రామాల్లో అమలు కావాలన్నా, పారిశుధ్యం మెరుగుపడాలన్నా నిధులు, సిబ్బంది కొరత అవరోధంగా ఉందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా ‘పొలం పిలుస్తోంది’ అంటూ ప్రచారం చేయడంతో ప్రయోజనం లేదన్నారు. జిల్లాలో మొత్తం 2.16 లక్షల పింఛన్లలో 54,000 పింఛన్లకు కోత పెట్టారని విచారం వెలిబుచ్చారు. పేదలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఈ గ్రామసభల్లో కాకాణి పేదలకు పింఛన్లను పంపిణీ చేశారు. తహశీల్దార్ చెన్నయ్య, ఎంపీడీఓ సుజాత, ఎంపీపీ తేట్ల వెంకటసుబ్బమ్మ, సర్పంచ్లు కట్టా సుబ్రహ్మణ్యం, తిరకాల ప్రభాకర్, ఎంపీటీసీ సభ్యులు కె.రమేష్, దీనయ్య, కోటేశ్వరావు, వైఎస్సార్సీపీ మండల క న్వీనర్ మెట్టా విష్ణువర్ధనరెడ్డి పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలొదిలి ఇదేం రాద్ధాంతం?
ఏది న్యాయం? ► రుణమాఫీ, పింఛన్లపై నిరసనలు పట్టని టీడీపీ ►భూములు అమ్మేసిన రైతుల్ని రెచ్చగొట్టి ఆందోళనలు ►హెరిటేజ్, ‘రామోజీ’ భూముల్ని వెనక్కిచ్చేస్తారా? ►విపక్ష నేతనే టార్గెట్ చేసుకుని కదులుతున్న తీరు (సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఒకవైపు కోస్తా జిల్లాల్ని తుపాను భయపెడుతోంది. మరోవైపు నాలుగు నెలలు గడిచినా అతీగతీ లేని రుణమాఫీ కోసం రైతులు, డ్వాక్రా మహిళలు రోడ్డెక్కుతున్నారు. గతనెల వరకూ అందించిన పింఛన్లు ఉన్నట్టుండి ఆగిపోవటంతో వితంతువులు, వృద్ధులు గ్రామసభల్లో నిలదీస్తున్నారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలుండగా వీటన్నిటి నుంచీ జనాన్ని పక్కదోవ పట్టించడానికి తెలుగుదేశం పార్టీ కొత్త డ్రామాలు మొదలెట్టింది. ప్రజా సమస్యలపై నిలదీస్తున్న ప్రతిపక్ష నేతను లక్ష్యంగా చేసుకుని ఆయన కుటుంబీకులకు చెందిన ‘సరస్వతీ సిమెంట్స్’ను వేధిస్తోంది. ఆరేడేళ్ల కిందట ఈ సిమెంట్స్కు భూములు విక్రయించిన రైతుల్ని రెచ్చగొట్టి, సంస్థ ఇప్పటిదాకా ప్లాంటు పెట్టలేదు కాబట్టి ఆ భూముల్ని తిరిగి రైతులకిచ్చేయాలంటూ ఆందోళనలు చేయిస్తోంది. సంస్థకు 2009లో ఇచ్చిన సున్నపురాయి గనుల లీజును కూడా రద్దు చేసింది. అసలు ప్లాంటు పెట్టాలంటే అనుమతులుండాలి కదా? వాటి కోసం ఐదేళ్ల కిందట చేసిన దరఖాస్తుల్ని ఇప్పటికీ పరిష్కరించకుండా, నీటి వసతి కోసం పెట్టిన దరఖాస్తును నేరుగా సీఎం కార్యాలయంలోనే అట్టిపెట్టుకుని... మరోవైపు ప్లాంటు పెట్టలేదు కాబట్టి లీజు రద్దు చేశామనటాన్ని ఏమనుకోవాలి? ప్లాంటు రాలేదు కనుక కొనుగోలు చేసిన భూముల్ని రైతులకిచ్చేయాలని చేస్తున్న డిమాండ్లను ఏమనుకోవాలి? ఫిలిం సిటీ కోసం రామోజీరావు ఎకరాకు లక్షకు మించి ఎక్కడా వెచ్చించలేదు. మరిపుడు ఆయన భవనాలు నిర్మించిన ఐదారు ఎకరాల్ని వదిలేసి మిగిలిన 1900 పైచిలుకు ఎకరాలనూ తిరిగి రైతులకిచ్చేయాలని చంద్రబాబు ఎందుకు డిమాండ్ చేయటం లేదు? తన హెరిటేజ్ సంస్థ కోసం కొనుగోలు చేసిన వేల ఎకరాల భూముల్ని తిరిగి రైతులకు ఎందుకు అప్పగించటం లేదు? సిమెంట్ కంపెనీ కోసమని కొనుగోలు చేసి నిరుపయోగంగా వదిలిపెట్టిన టీడీపీ నేత జేసీ దివాకరరెడ్డి భూములపై ఎందుకు రాద్ధాంతం చేయటం లేదు?సరస్వతీ సిమెంట్స్ సమీపంలోనే సంఘీ సంస్థ సేకరించిన 2000 పైచిలుకు ఎకరాల్లో గానీ, గుజరాత్ అంబుజా, ఆంధ్రా సిమెంట్స్ సంస్థలు సేకరించిన భూముల్లో ఇప్పటిదాకా పనులు మొదలుపెట్టలేదే! వాటిని వెనక్కి ఇచ్చేయాలని ఎందుకు ధర్నాలు చేయించటం లేదు? లీజుల్ని ఎందుకు రద్దు చేయలేదు? మరీ ఇంత దిగజారుడు వ్యవహారమా? ఒకవైపు రుణమాఫీ చేయనందుకు రైతులకు మొహం చూపించలేని పరిస్థితుల్లో ఉన్న బాబు... రైతులకు న్యాయం చేస్తామంటూ తమ వర్గానికి చెందిన కొందరిని జగన్మోహన్రెడ్డిపైకి రెచ్చగొడుతుండటాన్ని ఏమనుకోవాలి? కొనుగోలు చేసిందీ అధిక ధరకే... నిజానికి 2008. 2009లో సరస్వతీ సిమెంట్స్ రైతుల నుంచి భూములు కొన్నపుడు గుంటూరు జిల్లా తంగెడ, వేమవరం, చెన్నాయపాలెం గ్రామాల్లో ధర ఎకరాకు రకాన్ని బట్టి రూ.1-3 లక్షల మధ్య ఉంది. రైతులకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో సరస్వతీ సంస్థ ఎకరాకు కనిష్టంగా రూ.3 లక్షల నుంచి గరిష్టంగా రూ.8.5 ల క్షలు చెల్లించింది. అందుకేఒక్క రైతు కూడా తనకు అన్యాయం జరిగిందనలేదు. ఇపుడు టీడీపీకి చెందిన వారిని రెచ్చగొట్టి ఆ భూముల్లో ఘర్షణలకు దిగుతూ... అడ్డుకున్న సరస్వతీ సంస్థ సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు సైతం ప్రభుత్వ పెద్దలే పెట్టిస్తున్నారంటే ఏమనుకోవాలి? ఎందుకీ దిగజారుడు రాజకీయాలు? -
‘అభయహస్తం’పై రాజకీయ క్రీనీడ
పలమనేరు: అధికార పార్టీ పింఛన్ల పరిశీలన కమిటీ తీరు అభయహస్తం లబ్ధిదారులకు భస్మాసుర హస్తంగా మారింది. కమిటీ పరిధిలో లేని ఈ పథకంలోనూ రాజకీయం ప్రదర్శించారు. ఒక సంతకంతో అన్ని పింఛన్లనూ రద్దు చేసేశారు. జన్మభూమి గ్రామసభల్లో అధికారులను మహిళలు నిలదీస్తుండడంతో పొరపాటు జరిగిందని తిరిగి ఆ పింఛన్లు ఇస్తామంటూ మభ్యపెట్టేందుకు నానా యాతన పడుతున్నారు. ఇదిగో సాక్ష్యం పలమనేరు పురపాలకసంఘ పరిధి లో 151 మందికి వైఎస్ఆర్ అభయహస్తం ద్వారా ప్రతినెలా రూ.500 పింఛన్ ఇచ్చేవారు. డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలు బీమా చేసుకుని, 60 ఏళ్లు నిండాక అభయహస్తం పింఛన్ తీసుకుంటున్నారు. ఇది పూర్తిగా గ్రూ పుల నిర్వహణలో సభ్యుల డబ్బుతో జరిగే కార్యక్రమం. ఇదేమీ పట్టించుకోని పింఛన్ల పరిశీలన కమిటీ సభ్యు లు మున్సిపాలిటీలోని అభయహస్తం లబ్ధిదారులందరినీ జాబితా నుంచి తొలగించేశారు. ఈ పథకం ద్వారా పలమనేరులో 151 మంది రూ. 3,650 ప్రీమియంగా చెల్లించారు. వీరి కి అప్పటి ప్రభుత్వం అంతే మొత్తం జమ చేసింది. దీంతో వీరు ప్రతి నెలా రూ.500 పింఛన్ తీసుకుంటున్నారు. ఇప్పుడేం జరిగిందంటే అభయహస్తం పింఛన్లపై అవగాహన లేని ఈ కమిటీ సభ్యులు ఏకపక్షంగా లబ్ధిదారులకు 65 ఏళ్లు నిండలేదనే సాకుతో జాబితా నుంచి తొలగించారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 1,600 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఆయా ప్రదేశాల్లో కూడా ఇదే పరిస్థితి చోటుచేసుకుందని తెలుస్తోంది. మండలాల్లో దాదాపు 9 వేల మంది అభయహస్తం పింఛన్దార్లలో ఏడు వేల మందిని తొలగించినట్టు సమాచారం. పొరపాటు జరిగిందంటున్న అధికారులు అభయహస్తం పింఛన్ల జోలికి వెళ్లొద్ద ని సాక్షాత్తు సీఎం ఆదేశించినా కమిటీ సభ్యులు ఏకపక్షంగా వ్యవహరించా రు. వైఎస్ఆర్ అభయహస్తం పథకం లో ఎంపికైన వారంతా వైఎస్ఆర్సీపీ కి చెందిన వారని తొలగించినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై పలమనేరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావ్ను వివరణ కోరగా మాకు కూడా తెలియకుం డానే జాబితాలో అభయహస్తం పింఛన్లన్నీ తొలగించారన్నారు. ఈ విషయమై డీఆర్డీఏ పీడీతో సంప్రదించామని తెలిపారు. వారందరికీ తిరిగి పింఛన్లు వచ్చేలా చూస్తామన్నారు.