Irrigation project
-
నాపై కక్ష సాధించుకోండి
సాక్షి ప్రతినిధి, మహబూబ్ నగర్: ‘‘ఉమ్మడి రాష్ట్రంలోనైనా, తెలంగాణలోనైనా వలసలకు మారుపేరు పాలమూరు జిల్లా. అలాంటి జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం గత పాలకుల నిర్లక్ష్యమే. తెలంగాణ వచ్చి పదేళ్లయినా వలసలు కొనసాగుతున్నాయి. పాలమూరు జిల్లా బిడ్డగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే నన్ను చరిత్ర క్షమించదు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తిచేసి పాడి పంటలతో విలసిల్లేలా మా ప్రభుత్వ నిర్ణయాలుంటాయి..’’అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ప్రకటించారు.ఆదివారం ఆయన రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దామోదర రాజనర్సింహలతో కలసి మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలో కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. అక్కడ రూ.110 కోట్ల వ్యయంతో చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్, ఘాట్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడారు. చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు నారాయణపేట– మక్తల్– కొడంగల్ ప్రాజెక్ట్ పూర్తి చేసి త్వరలోనే ఆయా నియోజకవర్గాలకు కృష్ణా జలాలు పారిస్తామని సీఎం రేవంత్ చెప్పారు. ఆరేడు దశాబ్దాలుగా వెనుకబడ్డ ఈ ప్రాంతంలో వలసలు ఆపాలని తాను చేస్తున్న అపర భగీరథ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు కొందరు ఆరోపణలతో, చిల్లర మల్లర రాజకీయాలు చేయాలని ప్రయతి్నస్తున్నారని ఆరోపించారు. తనపై కోపం ఉంటే రాజకీయంగా కక్ష సాధించుకోవాలని.. అంతేతప్ప ప్రాజెక్టులను, జిల్లా అభివృద్ధిని అడ్డుకోవద్దని పేర్కొన్నారు. అలా చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోక తప్పదని వ్యాఖ్యానించారు. కాళ్లలో కట్టెలు పెట్టి, కుట్రలు చేసి ఎవరైనా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే పాలమూరు బిడ్డలు క్షమించబోరని హెచ్చరించారు. అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు.. పాలమూరు జిల్లాలోని అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీలో రెండు వేల మంది స్థానిక నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడానికి అంగీకరించారని సీఎం రేవంత్ చెప్పారు. ఈ ప్రాంతంలో ఏ కంపెనీలు వచి్చనా ఇక్కడి నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తమదని తెలిపారు. జిల్లాలో అన్ని గ్రామాలు, తండాలకు బీటీ రోడ్లు వేస్తామన్నారు. ఈ మేరకు అంచనాలు రూపొందించాలని ఉమ్మడి జిల్లా పరిధిలోని కలెక్టర్లను ఆదేశిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు జీఎమ్మార్, యెన్నం శ్రీనివాస్రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.మాకు అవకాశం వచి్చంది.. అభివృద్ధి చేసుకోవద్దా..?నాడు పాలమూరు జిల్లా ప్రజలు పార్లమెంట్కు పంపినా, రాష్ట్రానికి రెండు సార్లు సీఎం అయినా ఈ జిల్లాను పట్టించుకోలేదని మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ విమర్శలు గుప్పించారు. ‘‘మీ ప్రాంతానికి నిధులు తీసుకెళ్లినా, మీ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకున్నా మేం ఏనాడూ ఏడవలేదు. ఈ రోజు మాకు అవకాశం వచ్చింది. ఈ జిల్లా ప్రజలు 12 మంది ఎమ్మెల్యేలు, ఒక పార్లమెంట్ సభ్యుడిని ఇచ్చారు. సీఎంగా కూడా అవకాశం ఇచ్చారు.. ఈ జిల్లాను అభివృద్ధి చేసుకునే బాధ్యత మాకు లేదా.. నేను ఎక్కడికి వెళ్లినా, ఏ పనిచేస్తున్నా నిరంతరం పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయాలన్నదే నా ఆకాంక్ష’’అని పేర్కొన్నారు. -
‘సాగునీటి’ అప్పులపై వడ్డీని తగ్గించేలా చూడండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం గత ప్రభుత్వం చేసిన అప్పులు ఆర్థికంగా భారంగా మారాయని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. ఆయా అప్పులపై వడ్డీని పూర్తిగా లేదా పాక్షికంగా తగ్గించేలా కేంద్ర ప్రభుత్వరంగ ద్రవ్య సంస్థలను ఒప్పించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న 8వ అంతర్జాతీయ నీటి వారం సదస్సు– 2024కు ఉత్తమ్ హాజరయ్యారు.రాష్ట్ర పతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించిన ఈ సదస్సు 4 రోజులపాటు కొనసాగనుంది. తొలిరోజు కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి ఉత్తమ్.. తెలంగాణలో ఈ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రా ధాన్యతను వివరించారు. ప్రతి ఏటా సుమారు ఆరు లక్షల ఎకరాల మేర కొత్త ఆయకట్టును సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో రూ.29 వేల కోట్లను ఈ రంగానికి కేటాయించిందని చెప్పా రు. రాష్ట్ర ప్రభుత్వ కృషికి తోడుగా కేంద్రం నుంచి తగిన సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.నిధుల రూపంలో సాయం అందించడంతో పాటు వివిధ రకాల క్లియరెన్సులను కూడా త్వరితగతిన ఇచ్చేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సమ్మక్క–సారలమ్మ ప్రాజెక్టుకు అన్ని రకాల క్లియరెన్సులు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలావుండగా మంత్రి.. పలు సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన రుణాలపై ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో 40 దేశాలకు చెందిన ప్రతినిధులతో పాటు మన దేశంలోని 20 రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ మంత్రులు, ఎన్జీవో సంస్థల ప్రతినిధులు, నిపుణులు పాల్గొన్నారు. -
సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు సిద్ధం: భట్టి
బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులన్నీ అవినీతిమయమని.. తమ ప్రాజెక్టులు ప్రజలపరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. వైరా సభలో ఆయన మాట్లాడారు. ‘‘ఈ రాష్ట్రంలో ఏయే ప్రాజెక్టులు ప్రారంభించాం, తక్కువ ఖర్చుతో ఏం పూర్తి చేశామనే చర్చకు ఎక్కడైనా, ఎప్పుడైనా నేను, మా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చర్చకు సిద్ధం. కేసీఆర్, హరీశ్రావు, కేటీఆర్ సిద్ధమా? పదేళ్లలో రూ.లక్ష రుణమాఫీ చేయలేని గత ప్రభుత్వం.. ఏకకాలంలో 15 రోజుల్లో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన మా ప్రభుత్వానికి పోలిక ఉందా? దేశంలో ఏ రాష్ట్ర చరిత్రలోనూ లేనట్టుగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు బడ్జెట్లో రూ.72 వేల కోట్లు కేటాయించాం.సీఎం ఆదేశించిన వెంటనే శుక్రవారం రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ అవుతాయి..’’ అని తెలిపారు. గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు తీసుకురావాలనే ఉద్దేశంతో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ఇందిరాసాగర్, రాజీవ్సాగర్లకు పునాది వేశారని గుర్తు చేశారు. వైఎస్ హయాంలోనే వీటికి రూ.1,500 కోట్లకు పైగా ఖర్చు చేశారని.. మరో రూ.1,548 కోట్లు ఖర్చు చేస్తే 4 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చేదని చెప్పారు. కానీ బీఆర్ఎస్ వీటిని పక్కనపెట్టి రీడిజైనింగ్ పేరిట సీతారామ ప్రాజెక్టును తెచ్చి దోపిడీ చేసిందని.. వేల కోట్లు దండుకునేందుకు, కమీషన్ల కక్కుర్తి కోసం ఐదేళ్ల ముందే మోటార్లను కొనుగోలు చేసిందని ఆరోపించారు.బీఆర్ఎస్ అసమర్థత వల్లే ప్రాజెక్టు ఆలస్యం: ఉత్తమ్కుమార్రెడ్డిపదేళ్లలో రూ. 7,500 కోట్లు ఖర్చు చేసినా, బీఆర్ఎస్ ప్రభుత్వ అస మర్థతతో సీతారామ ప్రాజెక్టు పూ ర్తికాలేదని మంత్రి ఉత్తమ్ మండి పడ్డారు. తమ మంత్రుల పర్యవేక్ష ణతోనే ప్రాజెక్టు పనులు ముందు కు సాగాయన్నారు. మరో 15 రో జుల్లో ప్రాజెక్టు ద్వారా 67 టీఎంసీల నీళ్లు వాడుకునేందుకు కేంద్రం నుంచి అనుమతులు వస్తాయని చెప్పారు. రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు.మేమే ప్రారంభించాం.. మేమే పూర్తి చేస్తాం: పొంగులేటిగతంలో కాంగ్రెస్ ప్రారంభించిన ఇందిరాసాగర్, రాజీవ్సాగర్ ప్రాజెక్టులను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే పూర్తి చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పా రు. వైఎస్సార్ హయాంలో చేప ట్టిన ప్రాజెక్టుల పనులు మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే జరుగుతున్నాయన్నారు. కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి చుక్కనీరు ఇవ్వకుండా కాలం వెళ్లదీశారని మండిపడ్డారు. ఇప్పటివరకు సీతారామ ప్రాజెక్టు పనులు 39 శాతమే పూర్తయ్యాయని వెల్లడించారు.రైతు రుణం తీర్చుకుంటున్నాం: తుమ్మలరాష్ట్రంలో ఇందిరమ్మ రా జ్యం కోసం ప్రజలు తపించారని, వారి రుణం తీర్చు కుంటున్నామని మంత్రి తు మ్మల చెప్పారు. ‘‘రైతులకు రూ.31 వేల కోట్లు రుణాలు మాఫీ చేసి మాట నిలబె ట్టుకున్నాం. కొన్ని పార్టీలు రుణమాఫీ రాలేదంటూ వా ట్సాప్ చేయాలంటున్నాయి. గత పదేళ్లలో చేయని హామీల గురించి వాట్సాప్ చేస్తే మంచిది’ అని పేర్కొన్నారు.ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొడతాం: మంత్రి కోమటిరెడ్డికాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని.. అందులో భాగంగా రైతు రుణమాఫీ చేశామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొట్టేందుకు సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో ఎన్ని వేల కోట్లు అయినా ఖర్చు చేస్తామన్నారు. -
కాళేశ్వరంపై లేనిపోని ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: ఒక బ్యారేజీలో ఒకటో రెండో పిల్లర్లు కుంగిపోతే దానిపై కాంగ్రెస్ నేతలు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు పీకుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. కాళేశ్వరం సమగ్ర స్వరూపం చాలా మందికి తెలియదని.. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగం, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల ఉపయోగం.. వీటన్నింటి సమాహారం కాళేశ్వరం అని వివరించారు. దీనిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో శాసనసభ్యులు కడియం శ్రీహరి, సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రాణహిత–చేవెళ్ల ఎందుకు కట్టలేదు? ఏదో జరిగిందని మేడిగడ్డ వెళ్లిన సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యేలు దారిలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కుడెల్లి వాగు, పచ్చటి పొలాలు చూడాలని హరీశ్రావు హితవు పలికారు. కాళేశ్వరంతో ఏం చేశారని అడుగుతున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.. రైతుల దగ్గరకు వెళ్లి అడగాలని సూచించారు. పక్క రాష్ట్రమైన కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రంగనాయక సాగర్ చూసి అద్భుతం అని మెచ్చుకున్నారని, నేర్చుకున్నారని గుర్తు చేశారు. కేంద్రం, మహారాష్ట్ర, ఏపీలో నాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ప్రాణహిత – చేవెళ్ల ఎందుకు కట్టలేదని నిలదీశారు. మేము నీళ్ళు లేని ప్రాంతం నుంచి నీళ్ళు ఉన్నచోటకు ప్రాజెక్టును మార్చి కట్టి నీళ్ళు అందించామని, మూడు కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండింది అంటే ఆ జలాల వల్లే అనే విషయం తెలుసుకోవాలని అన్నారు. తప్పులు జరిగితే చర్యలు తీసుకోండి మేము చేసిన పనుల్లో తప్పులు జరిగితే చర్యలు తీసుకోవాలని హరీశ్రావు అన్నారు. అదే సమ యంలో చేసిన పనులను ఆపకుండా పునరుద్ధ రణ పనులు చేపట్టాలని కోరారు. దురుద్దేశంతో ప్రాజెక్టు పునరుద్ధరణ చేయడం లేదని, మీ రు చేసే పనుల వల్ల రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చిందని, దీన్ని ప్రజలు క్షమించరని అన్నా రు. నల్లగొండలో బీఆర్ఎస్ సభ ఉందనే మేడి గడ్డ బ్యారేజీ టూర్ ప్రోగ్రాం పెట్టారని హరీశ్రా వు విమర్శించారు. మీ నీతిని ప్రజలందరూ గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించొద్దంటూ తాము నిద్ర లేపితే వారు లేచారని విమర్శించారు. -
మేడిగడ్డపై సీబీఐ విచారణ అంటే ఎందుకు భయం?
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు, అవినీతిపై గత సీఎం కేసీఆర్ సీబీఐ దర్యాప్తునకు ముందుకు రాలేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదో ముఖ్యమంత్రి చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే.. కాళేశ్వరంపై దర్యాప్తు చేయడానికి సీబీఐ సిద్ధంగా ఉందని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందించడం లేదు. మేడిగడ్డపై సీబీఐ విచారణకు ఆ రెండు పార్టీలు ఎందుకు ముందుకు రావడం లేదో చెప్పాలి’ అని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం వరంగల్లో పార్టీపార్లమెంట్ కార్యాలయం ప్రారంభం, వేయిస్తంభాల ఆలయం కల్యాణ మంటపం పనులను పరిశీలించిన అనంతరం కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నాటి బీఆర్ఎస్ సర్కారు, ఎన్నికల తర్వాత నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఉత్తరాలు పంపినా స్పందించలేదన్నారు. గత సంవత్సరం అక్టోబర్ 21 మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని వార్తలు రాగానే.. మరుసటి రోజు 22న తాను కేంద్ర జలశక్తి మంత్రికి ఉత్తరం రాశానని, ఆ తర్వాతి రోజే భారత ప్రభుత్వ జలశక్తి శాఖ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి.. మేడిగడ్డకు పంపిందని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. అక్టోబర్ 24, 25న ఆ రెండు రోజులు డ్యామ్ సేఫ్టీ అథారిటీ.. రాష్ట్ర అధికారులను వివరాలు అడిగి నవంబర్ 1న ప్రాథమిక నివేదిక తయారు చేసి రాష్ట్రానికి పంపిందన్నారు. ప్రాజెక్ట్ సర్వే, ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణం, ఆపరేషన్, నిర్వహణ అన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయని వెల్లడించిందన్నారు. ప్రమాదకర పరిస్థితిలో డ్యామ్ ఉన్నదని, నీటిని ఖాళీ చేయాలని డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిందని మంత్రి చెప్పారు. మేడిగడ్డపై కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు ప్రతిపక్ష, పాలక పార్టీలు ఆడుతున్నాయని కిషన్రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ డ్యామేజీ వ్యవహారాన్ని పొలిటికల్ మైలేజ్కి కాంగ్రెస్ వాడుకుంటున్నదన్నారు. అసెంబ్లీ బంద్ పెట్టి.. మేడిగడ్డకు ఎందుకు వెళుతున్నారో అర్థం కావడం లేదని, ఇంతకు ముందే మంత్రులు చూశారు. రేవంత్, రాహుల్గాంధీ చూశారు.. ఇప్పుడు మళ్లీ ఎందుకు వెళుతున్నారో చెప్పాలి? అని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ తీరు అలాగే ఉన్నదని, ప్రజాసమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి వెళ్లని కేసీఆర్, నల్లగొండ బహిరంగ సభకు వెళ్లారని ఎద్దేవా చేశారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కేసీఆర్ సభ ఏపీ పోలీసులను పెట్టి బలవంతంగా కృష్ణా నీళ్లు తీసుకెళ్తే.. ఏం చేయాలో ఇప్పటివరకు యాక్షన్ప్లాన్ ఏంటో, మీ వైఖరి ఏమిటో.. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుంటారో చె ప్పాలని నిలదీశారు. మీరు పరిష్కరించుకుంటే.. కేంద్రం జోక్యం చేసుకోదన్నారు. ప్రాజె క్టుల సమస్య వస్తే పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పా రు. కేంద్రంపై నిందలు వేస్తూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని కేసీఆర్ నల్లగొండ సభ పెట్టారని, ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలను ప్రజలు పట్టించుకోరన్నారు. ఒకరు కృష్ణా జలాలపై, మరొకరు కాళేశ్వరంపై రచ్చ చేస్తూ ఎంపీ ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణలో ఈసారి బీజేపీ డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తుందన్నారు. -
తప్పు తేలితే తగిన శిక్ష!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ సహా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితులపై అ ధ్యయనం జరిపి రూపొందించిన శ్వేతపత్రాన్ని ఒక ట్రెండు రోజుల్లో శాసనసభలో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో అసలేం జరిగిందో ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. మేడిగడ్డ విషయంలో తప్పు జరిగిందా? జరిగినట్టు తేలితే బాధ్యులెవరు? అనేది తేలుస్తామని.. వారికి తగిన శిక్ష ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరే ముందు శాసనసభలో రేవంత్ ప్రసంగించారు. రాష్ట్ర తాగు, సాగునీటి అవసరాలకు కృష్ణా, గోదావరి జలాలే కీలకమని.. కృష్ణాజలాలపై ఇప్పటికే శాసనసభలో చర్చించామని, గోదావరి జలాలపై త్వరలో చర్చిస్తామని తెలిపారు. సభలో రేవంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు వైఎస్సార్ హయాంలో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టారు. తెలంగాణ ఏర్పాటయ్యే నాటికే వేల కోట్ల విలువైన పనులు కూడా జరిగాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రీడిజైనింగ్ పేరిట ప్రాజెక్టుకు మార్పులు చేసి.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల అంటూ బ్యారేజీలను కట్టుకుంటూ పోయింది. రూ.38,500 కోట్ల వ్యయ అంచనాతో ప్రాణహిత– చేవెళ్లను రూపొందిస్తే.. కాళేశ్వరం పేరిట రూ.1.47 లక్షల కోట్లకు పెంచేశారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.2.5 లక్షల కోట్లు అవుతుందా? ఇంకెంత అవుతుందోనన్న దానిపై స్పష్టత లేదు. పిట్టగూడులా కట్టారా? బాంబులతో పేల్చారా? మ్యాన్ మేడ్ వండర్ అంటూ కాళేశ్వరం ప్రాజెక్టుపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ ప్రాజెక్టు బీఆర్ ఎస్ నేతలకు ఏటీఎంలా మారిందని మేం ఇక్కడ అనడం లేదు. కాళేశ్వరం గొప్పతనాన్ని కేసీఆర్ స్వయంగా వివరిస్తే బాగుంటుంది. మేడిగడ్డ బ్యారేజీ సంద ర్శనకు మాజీ సీఎం కేసీఆర్, కాళేశ్వర్రావు (హరీ శ్రావును ఉద్దేశించి)తోపాటు కడియం శ్రీహరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ రావాలి. బ్యారేజీకి ఏం జరిగిందో చూసి, తెలంగాణ ప్రజలకు వివరించాలి. బస్సులో ప్రయాణించడానికి కష్టమైతే.. కేసీఆర్ కోసం ప్రత్యేకంగా హెలికాఫ్టర్ను సిద్ధంగా ఉంచాం. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై ఆందోళన చేసిన ప్రతిపక్షాలను అప్పట్లో అడ్డుకున్నారు. అప్పటి మంత్రి ప్రశాంత్రెడ్డి అయితే.. ప్రతిపక్షాలే బ్యారేజీని బాంబులు పెట్టి పేల్చేశాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవన్నీ చూడటానికే ప్రభుత్వం మేడిగడ్డ టూర్ ఏర్పాటు చేసింది’’ అని రేవంత్ చెప్పారు. కాగా మేడిగడ్డ బ్యారేజీ డిజైన్లో లోపాలున్నట్టుగా విజిలెన్స్ రిపోర్టు ఇచ్చిందని మంత్రి శ్రీధర్బాబు పేర్కొనగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇసుకలో పేకమేడలు కట్టారా? పునాదుల కింద ఇసుక కదలడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని గత ప్రభుత్వ నేతలు అంటున్నారు. వాళ్లు ఇసుకలో పేకమేడలు కట్టారా? సభలో ప్రాజెక్టులపై శ్వేతపత్రం పెట్టాక.. కాళేశ్వరంపై, కాళేశ్వర్రావుగా పిలుచుకున్న హరీశ్రావుపై, ప్రాజెక్టు ఎవరెవరికి ఏటీఎంలా మారిందన్న అంశంపై చర్చిద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొందరు అధికారులు కార్యాలయాల నుంచి ఫైళ్లు మాయం చేశారని వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించాం. ఏమేం ఫైళ్లు మాయమయ్యాయి? ఎవరు మాయం చేశారన్న దానిపై ప్రాథమిక నివేదిక అందింది. -
ఆయకట్టు ఎకరా పెరగలేదు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని రాష్ట్ర మంత్రులు ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల రీఇంజనీరింగ్ వల్ల ఎకరా ఆయకట్టు అదనంగా పెరగలేదని, కేవలం వ్యయం మాత్రమే పెరిగిందని విమర్శించారు. రాష్ట్ర సచివాలయంలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాంబర్లో గురువారం ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల సాగునీటి ప్రాజెక్టులపై ఇరిగేషన్ అధికారులతో భట్టి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సీతారామకు పర్యావరణ అనుమతులు రావాలి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.2,400 కోట్లతో చేపట్టిన ఇందిరా, రాజీవ్సాగర్ ప్రాజెక్టుల అంచ నా వ్యయాన్ని రీ డిజైనింగ్ పేరిట రూ.13 వేల కో ట్లకు ఎందుకు పెంచాల్సి వచ్చిందని భట్టి విక్రమా ర్క అధికారులను ప్రశ్నించారు. అదనంగా ఆయక ట్టు పెరిగిందా? అని ప్రశ్నించగా, పెరగలేదని అధికారులు బదులిచ్చారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఇందిరా సాగర్ ప్రాజెక్టును రీ డిజైనింగ్ చేశామని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బ్యారేజీ నిర్మాణానికి ఇంకా పర్యావరణ అనుమతులు రావాల్సి ఉందని, రెండు నెలల్లో వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రాజెక్టులపై నివేదికలు ఇవ్వండి గత ప్రభుత్వం రూ.వేల కోట్లతో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడంతో ప్రజలపై భారం పడిందని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శించారు. ఆరు నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్టులు, ఏడాదిలోగా పూర్తయ్యేవి, 18 నెలల్లోగా పూర్తయ్యేవి, 24 నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్టులు గుర్తించి, వాటి కావాల్సిన బడ్జెట్ అంచనా వ్యయాన్ని రూపొందించి వెంటనే నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఇరిగేషన్ శాఖలో ఎన్నికలకు ముందు పిలిచిన టెండర్లను వెంటనే నిలిపివేయాలని, వర్క్ అలాట్మెంట్ చేసిన వాటిని కూడా ఆపి వేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వం రీడిజైనింగ్ చేసిన సీతారామ ప్రాజెక్టు విషయంలో వెనక్కి పోలేము, ముందుకు పోలేమన్నట్టుగా ఉందని ఉత్తమ్ అన్నారు. బ్యారేజీ హెడ్ వర్క్ నుంచి చివరి కెనాల్ వరకు ఫేజ్ల వారీగా జరిగిన పనుల గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆరా తీశారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి గత ప్రభుత్వ హయాంలో నల్లగొండ జిల్లా రైతులకు సాగునీటిని అందించేందుకు కనీస ప్రయత్నం కూడా జరగలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు, ఉదయ సముద్రం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదని ఈఎన్సీ మురళీధర్ను ప్రశ్నించారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సింగరాజుపల్లి రిజర్వాయర్, పాకాల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, గొట్టెముక్కుల రిజర్వాయర్, పిల్లాయిపల్లి కెనాల్, నెల్లికల్ లిఫ్ట్ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయాయని అన్నారు. నల్లగొండ జిల్లా ప్రాజెక్టుల పూర్తికి కావాల్సిన అనుమతులు, నిధులు తీసుకొస్తానని, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా సస్యశ్యామలం కావాలంటే గత ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టుల పనులు ఆపకుండా త్వరగా పూర్తి చేయాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. -
‘సాగునీటి’లోనూ అక్రమాల ప్రవాహం
సాక్షి, అమరావతి : సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసే ముసుగులో చంద్రబాబునాయుడు ప్రభుత్వ ఖజానాను అడ్డగోలుగా దోచేశారు. ఐదేళ్లలో రూ.68,293.94 కోట్లు ఖర్చుచేసినా ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేకపోయారు. ఇంత ఖర్చుచేసినా కొత్త, పాత కలిపి కేవలం 3.4 లక్షల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీళ్లందించగలిగారు. వీటిని పరిశీలిస్తే.. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో చంద్రబాబు ఏ స్థాయిలో దోపిడీ చేశారో అర్థంచేసుకోవచ్చు. టీడీపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి రాగానే.. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా జలయజ్ఞం కింద చేపట్టి, పూర్తికాని 40 ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను పూర్తిచేయడానికి కేవలం రూ.17,368 కోట్లు మాత్రమే అవసరమని 2014, జూలై 28న నాటి సీఎం చంద్రబాబు శ్వేతపత్రంలో ప్రకటించారు. ఈ ప్రాజెక్టుల కోసం 2014, జూన్ 8 నుంచి 2019, మే 29 వరకూ రూ.68,293.94 కోట్లను ఖర్చుచేసినట్లు చంద్రబాబు ఘనంగా ప్రకటించుకుంటున్నారు. ఇందులో పోలవరంపై ఖర్చుపెట్టిన రూ.10,860.67 కోట్లు, నీరు–చెట్టు పేరుతో కాజేసిన రూ.12,400.23 కోట్లు.. కమీషన్ల కోసం చేపట్టిన పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతలపై వ్యయం చేసిన రూ.3,199.92 వెరసి.. రూ.26,460.82 కోట్లను మినహాయిస్తే.. జలయజ్ఞం కింద చేపట్టిన 40 ప్రాజెక్టులకు రూ.41,833.12 కోట్లు వ్యయం చేసినట్లు స్పష్టమవుతోంది. అంటే.. చంద్రబాబు చెప్పిన ప్రకారం ఆ ప్రాజెక్టులను పూర్తిచేయడానికి అవసరమైన దానికంటే రూ.24,465.12 కోట్లను అధికంగా వ్యయం చేశారు. పోనీ.. ఒక్క ప్రాజెక్టునైనా పూర్తిచేశారా అంటే అదీ లేదు. దీన్నిబట్టి చూస్తే.. కేవలం జలయజ్ఞం ప్రాజెక్టుల్లో మాత్రమే కాంట్రాక్టర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి రూ.24 వేల కోట్లను దోచిపెట్టి.. అందులో చాలావరకూ ముడుపుల రూపంలో చంద్రబాబు రాబట్టుకున్నారన్నది బహిరంగ రహస్యం. ‘పోలవరం’తో కేంద్ర ఖజానాను సైతం.. ఇక కేంద్రమే నిరి్మంచాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను చంద్రబాబు దక్కించుకుని.. కేంద్ర ప్రభుత్వ ఖజానాను దోచేశారు. దేశ చరిత్రలో ఎక్కడాలేని రీతిలో పోలవరం హెడ్వర్క్స్లో రూ.2,917 కోట్ల విలువైన పనులను రామోజీరావు వియ్యంకుడికి చెందిన నవయుగకు.. ఎడమ కాలువలో ఐదో ప్యాకేజీలో రూ.142 కోట్ల విలువైన పనులను అప్పటి ఆర్థికమంత్రి యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్కు కట్టబెట్టి అక్రమాల్లో రికార్డు నెలకొల్పారు. అందుకే చంద్రబాబు కమీషన్ల కోసం పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని మోదీ సైతం ఆరోపించారు. -
నీళ్లు ఊరికే రావు!
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రస్తుతం నీటికి భారీగా డిమాండ్ పెరుగుతోంది...అయితే నీటి లభ్యత పరిమితంగా ఉన్న దృష్ట్యా ఉచితంగా సరఫరా చేయొద్దు. గృహ, సాగు, పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేసే నీటికి ధరలు ఖరారు చేయాలి. కనీసం సాగునీటి ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడితోపాటు నిర్వహణ, పర్యవేక్షణ(ఓఅండ్ఎం) వ్యయాలు రాబట్టుకునే విధంగా నీటి ధరలు ఉండాలి’’...అని కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అన్ని రాష్ట్రాలకు సిఫారసు చేసింది. ‘ప్రైసింగ్ ఆఫ్ వాటర్ ఇన్ పబ్లిక్ సిస్టమ్ ఇన్ ఇండియా–2022’పేరుతో రూపొందించిన పంచవర్ష నివేదికలో నీటికి చార్జీలు వసూలు చేయాల్సిందేనని నొక్కి చెప్పింది. నీటి ధరలపై ప్రతి ఐదేళ్లకోసారి ఈ నివేదిక విడుదల చేస్తుండగా, గతేడాది రావాల్సిన నివేదిక తాజాగా బయటకొచ్చింది. ఉచితంగా/తక్కువ ధరలకు నీరు సరఫరా చేస్తే దుర్వినియోగం అవుతుందని, ఆదాయం రాక ప్రభుత్వంపై పెనుభారం పడుతుందని ఆ నివేదికలో స్పష్టం చేసింది. రాష్ట్రాలకు సరైన పాలసీ ఉండాలి పన్నులు, ఇతర మార్గాల్లో ప్రజల నుంచి వసూలు చేస్తున్న డబ్బు ద్వారా ప్రభుత్వాలు మధ్యతరహా, భారీ సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయి. దీంతో ఆయకట్టు రైతులు భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ ప్రాజెక్టుల పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవడానికి రాష్ట్రాలు సరైన పాలసీలు కలిగి ఉండాలి. తిరిగి వచ్చిన రాబడులతో కొత్త ప్రాజెక్టులు చేపట్టి సమాజంలోని ఇతర వర్గాలకు లబ్ధి చేకూర్చాలి. సాగునీటి చార్జీలు... రెండు రకాల వ్యయాలు పంట రకాలు, విస్తీర్ణం, తడుల సంఖ్య, మొత్తం నీటి పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకొని సాగునీటి ధరలు ఖరారు చేయాలి. నీటి టారీఫ్ ఖరారు విధానాన్ని అన్ని రాష్ట్రాలు హేతుబద్దీకరించాలి. పంట దిగుబడి విలువ ఆధారంగా సాగునీటి చార్జీలు వసూలు చేయాలని ఇరిగేషన్ కమిషన్(1972) కోరింది. ప్రాజెక్టుల పెట్టుబడి వ్యయంలో కొంత భాగంతోపాటు పూర్తిగా నిర్వహణ వ్యయం రాబట్టుకోవాలని వైద్యనాథన్ కమిటీ కోరింది. ► సాగునీటి చార్జీల వసూళ్లతో ప్రాజెక్టుల మొత్తం నిర్వహణ వ్యయాన్ని రాబట్టుకోవాల్సిందే. దీనికి అదనంగా.. ఆహార పంటలైతే హెక్టారులో వచ్చిన దిగుబడుల విలువలో కనీసం ఒక శాతం, వాణిజ్య పంటలైతే ఇంకా ఎక్కువ శాతాన్ని వసూలు చేయాలి. ఈ మేరకు సాగునీటి వినియోగానికి సంబంధించి రెండు రకాల చార్జీలు విధించాలి. నిర్వహణ చార్జీలతో ప్రాజెక్టుల నిర్వహణకు, దిగుబడుల విలువ ఆధారిత చార్జీలను ప్రాజెక్టుల ఆధునికీకరణకు వినియోగించాలి. నీటి లభ్యత లెక్కల ఆధారంగా 75శాతం, ఆపై లభ్యత ఉన్న ప్రాజెక్టుల కింద పూర్తిస్థాయిలో సాగునీటి చార్జీలు వసూలు చేయాలి.75 శాతానికి తక్కువ లభ్యత ఉన్న ప్రాజెక్టుల కింద 50 శాతం మేరకు చార్జీలు తగ్గించాలి. ఎత్తిపోతల పథకాల నీటిచార్జీలు ఎక్కువే.. ఎత్తిపోతల పథకాలతో సరఫరా చేసే నీటికి చార్జీలు ఆయా ప్రాజెక్టుల పెట్టుబడి, నిర్వహణ వ్యయాల ఆధారంగా ఖరారు చేయాలి. ఎత్తిపోతల పథకాల ద్వారా సరఫరా చేసే నీటికి కచ్చితమైన లెక్కలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎంత నీరు సరఫరా చేస్తే ఆ మేరకు చార్జీలు వాల్యూమెట్రిక్ (నీటి పరిమాణం) ఆధారంగా వసూలు చేయాలి. ఎత్తిపోతల పథకాల నిర్వహణ వ్యయం ఎక్కువే కాబట్టి గ్రావిటీ ప్రాజెక్టుల నీటిచార్జీల కంటే వీటి ద్వారా సరఫరా చేసే నీటి చార్జీలు అధికంగా ఉంటాయి. నీటి ధరల ఖరారుకు రెగ్యులేటరీ కమిషన్ తాగు, పారిశుద్ధ్యం, సాగు, పారిశ్రామిక, ఇతర అవసరాలకు సరఫరా చేసే నీటికి సరైన ధరలు ఖరారు చేసేందుకు ప్రతి రాష్ట్రంలో చట్టబద్ధంగా స్వయంప్రతిపత్తి గల వాటర్ రెగ్యులేటరీ ఆథారిటీని ఏర్పాటు చేయాలి. నీటి పరిమాణం ఆధారంగా చార్జీలు వసూలు చేయడానికి 100 శాతం ఇళ్లలోని నల్లాలకు మీటర్లు, కాల్వలకు నీటిని కొలిచే యంత్రాలు బిగించాలి. పేదలకు రాయితీపై నీరు సరఫరా చేయవచ్చు. పూర్తి నిర్వహణ వ్యయంతోపాటు పెట్టుబడిలో కొంత భాగం వసూలు చేసేలా నీటిచార్జీలు ఉండాలి. వీటితో పాటుగా పెట్టుబడి రుణాల తిరిగి చెల్లింపులు, ఇతర అవసరాలకు నిధులు నిల్వ ఉండేలా చార్జీలు ఖరారు చేయాలి. సాగునీటి ప్రాజెక్టుల నీటిని వినియోగిస్తే హెక్టారుకు రూ.600, వినియోగించని పక్షంలో హెక్టారుకు రూ.300 చొప్పున నిర్వహణ చార్జీలు వసూలు చేయాలని జల వనరుల 11వ పణ్రాళిక సిఫారసు చేసింది. పేద, బలహీనవర్గాలకు రాయితీ కొనసాగాలి. నిర్వహణ, పెట్టుబడి రాబట్టుకోవాలి దేశంలో ప్రస్తుతం వసూలు చేస్తున్న నీటి ధరలు భారీ రాయితీతో ఉన్నాయి. దీంతో ఆదాయానికి గండిపడుతోంది. రైతుల శక్తిసామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని నీటి ధరలు రాష్ట్రాలు ఖరారు చేస్తున్నాయి. కనీసం సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ వ్యయం కూడా రావడం లేదు. దీంతో నిర్వహణ సరిగా ఉండడం లేదు. పూర్తి నిర్వహణ వ్యయంతో పాటు పాక్షికంగా పెట్టుబడి ఖర్చు రాబట్టుకునేలా నీటి ధరలు ఉండాలి. సెకండ్ ఇరిగేషన్ కమిషన్(1972), డాక్టర్ వైద్యనాథన్ కమిటీ(1991), వివిధ ఫైనాన్స్ కమిషన్లు, ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్–2016 నిబంధనలు సైతం సరైనరీతిలో నీటి ధరలు ఖరారు చేసి నీటిపారుదల చార్జీల రూపంలో కనీసం నిర్వహణ వ్యయం వసూలు చేసుకోవాలని సిఫారసులు చేశాయి. -
వేగంగా ప్రాజెక్టులు
-
ఆకుపచ్చ హామీ ఏమైంది?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ప్రాంతంలో 1.75 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే డిండి ఎత్తిపోతల పథ కాన్ని ఒకటిన్నరేళ్లలో పూర్తిచేసి మునుగోడును ఆకుపచ్చగా చేసే బాధ్యత తనదేనని చెప్పిన సీఎం కేసీఆర్ హామీ ఏమైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. 2018 ఎన్నికల ప్రచారానికి ప్రజా ఆశీర్వాద సభ పేరుతో వచ్చి గాలిమాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. రాజగోపాల్రెడ్డి రాజీనామాతో సీఎం కేసీఆర్ ఇప్పుడు మళ్లీ తాయిలాలకు తెరలేపార న్నారు. ప్రగతిభవన్, ఫాం హౌస్ దాటని కేసీఆర్.. రాజగోపాల్రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నికల కోసం పరుగులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. సీసీరోడ్లకు ప్రతిపాదనలు, మునుగోడు నియోజకవర్గంలో 9 వేల ఆసరా పెన్షన్లు, డిండి లిఫ్టు నిర్వాసితులకు రూ.116 కోట్లు, చేనేత కార్మికులకు బీమా, పెన్షన్లు వస్తున్నాయని, రోడ్లు, బ్రిడ్జి పనులకు రూ.7 కోట్లు వస్తున్నా యని తెలిపారు. -
‘ఆర్ఆర్ఆర్’ పరిహారం లెక్క చదరపు మీటర్లలో..!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రీజినల్ రింగ్ రోడ్డులో భూసేకరణ పరిహారం చదరపు మీటర్లలో లెక్కించి ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. సాధారణంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఇతర ప్రజాప్రయోజనాల కోసం సేకరించి భూములకు సంబంధించిన పరిహారాన్ని ఎకరాల్లో లెక్కించి చెల్లిస్తారు. ఆయా గ్రామాల్లో ఇటీవల జరిగిన భూక్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ రేటుకు నెగోషియేషన్ చేసి ధర నిర్ణయిస్తారు. కానీ ఈ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతులకు ఇందుకు భిన్నంగా చదరపు మీటర్లలో లెక్కించి పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎకరానికి 4,046.85 చదరపు మీటర్లుగా లెక్కించి పరిహారం ఇవ్వనున్నారు. రెండు రోజుల్లో నోటిఫికేషన్... ఈ రహదారి భూసేకరణకు సంబంధించి రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అలైన్మెంట్పై ప్రైవేట్ ఏజెన్సీ చేసిన సర్వే నివేదికను ఆ సంస్థ ఇటీవలే రెవెన్యూ అధికారులకు అప్పగించింది. ఏజెన్సీ ఇచ్చిన సర్వేనంబర్లను జిల్లా రెవెన్యూ అధికారులు మరోసారి క్రాస్ చెక్ చేస్తున్నారు. భూమికి సంబంధించిన పట్టాదారు పేరు, సర్వే నంబరు, గ్రామం, మండలం, జిల్లా, విస్తీర్ణం వంటి వివరాలను ప్రత్యేక ప్రొఫార్మాలో పొందుపరుస్తున్నారు. ఈ ప్రక్రియను రెండు రోజుల్లో ముగించి, వెంటనే స్థానిక భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం 158.64కి.మీ.ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం సంగారెడ్డి, జోగిపేట్, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓలు, యాదాద్రి భువనగిరి అదనపు కలెక్టర్ను భూసేకరణ అథారిటీగా నియమించిన విషయం విదితమే. నేషనల్ హైవే అథారిటీ అధికారులు విడుదల చేసిన అలైన్మెంట్ ప్రకారం ఆర్డీఓలు 113 గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభించారు. -
అప్పర్ భద్ర లెక్కలు తప్పు
సాక్షి, అమరావతి : అప్పర్ భద్రకు నీటి కేటాయింపులపై కర్ణాటక చెప్పిన మాయ లెక్కలను నమ్మి, ఆ ప్రాజెక్టుకు అనుమతులిచ్చారని, వాటిని పునఃసమీక్షించాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), జల్ శక్తి శాఖలను రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కోరింది. బేసిన్ పరిధిలోని మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభిప్రాయాలు తీసుకోకుండానే సీడబ్ల్యూసీ హైడ్రాలజీ విభాగం అధికారులు అనుమతులిచ్చారని వెల్లడించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని తుంగభద్ర ఆయకట్టుతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్కు రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి ఇటీవల లేఖ రాశారు. చుక్క నీరూ కేటాయించకుండానే.. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–1 నీటి కేటాయింపులు చేయకున్నా, కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమల్లోకి రాకపోయినా, అప్పర్ భద్ర ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు ఉన్నట్లుగా కేంద్ర జల సంఘాన్ని (సీడబ్ల్యూసీ) కర్ణాటక ప్రభుత్వం నమ్మించింది. అప్పర్ భద్రకు నీటిని కేటాయించాలన్న కర్ణాటక ప్రతిపాదనలను 1976లోనే కేడబ్ల్యూడీటీ–1 తోసిపుచ్చింది. తుంగభద్రలో ఆ మేరకు నీటి లభ్యత లేదని స్పష్టం చేసింది. కానీ.. తుంగ ఆనకట్ట ఆధునికీకరణ వల్ల 6.25 టీఎంసీలు, భద్ర ఆనకట్ట ఆధునికీకరణ వల్ల 0.5, విజయనగర చానల్స్ ఆధునికకీరణ వల్ల 6.25, కృష్ణా డెల్టాకు పోలవరం ద్వారా మళ్లించిన జలాల్లో వాటా నీరు 2, కృష్ణా బేసిన్లో అదనపు మిగులు జలాలు 6 టీఎంసీలు వెరసి 31 టీఎంసీల లభ్యత ఉందని కర్ణాటక పేర్కొంది. ఇందులో ప్రవాహ, ఆవిరి నష్టాలుపోనూ 29.90 టీఎంసీలను అప్పర్ భద్ర ద్వారా వాడుకుంటామని తెలిపింది. అప్పర్ తుంగ ప్రాజెక్టు నుంచి 17.40 టీఎంసీలను భద్ర ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తామని, భద్ర నుంచి 29.90 టీఎంసీలను తరలించి.. దుర్భిక్ష ప్రాంతాల్లో 2.25 లక్షల హెక్టార్లకు నీళ్లందిస్తామని పేర్కొంది. కానీ, అప్పర్ తుంగ, భద్ర, విజయనగర ఛానల్స్ ఆధునికీకరణ వల్ల నీటి వినియోగం ఏమాత్రం తగ్గలేదని, కృష్ణా బేసిన్లో అదనపు మిగులు జలాలు లేవని కేడబ్ల్యూడీటీ–2 స్పష్టం చేసింది. అయినా, కర్ణాటక చెప్పిన తప్పుడు లెక్కలనే నమ్మిన సీడబ్ల్యూసీ దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల అభిప్రాయం తీసుకోకుండానే గతేడాది డిసెంబర్ 24న అప్పర్ భద్రకు హైడ్రలాజికల్ క్లియరెన్స్ ఇచ్చేసింది. ఈ అనుమతులను చూపిస్తూ కర్ణాటక సర్కారు అప్పర్ భద్రకు రూ.16,125.48 కోట్ల (2018–19 ధరల ప్రకారం)తో పెట్టుబడి అనుమతి ఇవ్వాలని గత మార్చి 25న కేంద్ర జల్ శక్తి శాఖకు ప్రతిపాదన పెట్టింది. దీనికి కేంద్ర జల్ శక్తి శాఖ ఆమోదించింది. ఈ అనుమతుల ఆధారంగా.. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి.. 90 శాతం నిధులు (రూ.14,512.94 కోట్లు) ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై కేంద్రానికి ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేకపోవడాన్ని ఎత్తిచూపింది. మూడు రాష్ట్రాలకూ నష్టమే తుంగభద్ర డ్యామ్కు 230 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–1 కేటాయించింది. కానీ 1976–77 నుంచి 2007–08 వరకూ ఏనాడూ 186.012 టీఎంసీలకు మించి ప్రవాహాలు రాలేదు. దాంతో దామాషా పద్ధతిలో కర్ణాటక, ఏపీ, తెలంగాణలకు తుంగభద్ర బోర్డు నీటి కేటాయింపులు చేస్తోంది. అప్పర్ భద్ర పూర్తయితే తుంగభద్ర డ్యామ్కు వచ్చే ప్రవాహాలు మరింత తగ్గుతాయి. ఇది తుంగభద్ర డ్యామ్తోపాటూ కేసీ కెనాల్, ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం) ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే హగరి (వేదవతి)పై కర్ణాటకలోని వాణివిలాసాగర్, ఏపీలోని బీటీపీ (భైరవానితిప్ప ప్రాజెక్టు) మధ్యలో ఎలాంటి ప్రాజెక్టు నిర్మించకూడదని కేడబ్ల్యూడీటీ–1 స్పష్టంగా చెప్పింది. కానీ.. ఇప్పుడు అప్పర్ భద్రలో అంతర్భాగంగా ఆ రెండు జలాశయాల మధ్య వేదవతిపై మరో జలాశయం నిర్మిస్తే బీటీపీ ఆయకట్టు ఎడారిగా మారుతుంది. ఈ అంశాలన్నింటినీ విపులీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే అప్పర్ భద్రకు ఇచ్చిన అనుమతులను పునఃసమీక్షించాలని డిమాండ్ చేసింది. -
నీళ్లు లేని ప్రాజెక్టుకు జాతీయ హోదానా?
సాక్షి, అమరావతి: అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కర్ణాటక సర్కార్ చేసిన ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎలా ప్రతిపాదిస్తారని ప్రశ్నించింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమలులోకి రాకముందే ఈ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతివ్వడాన్ని ఆక్షేపించింది. దీన్ని తక్షణం రద్దు చేయాలని పట్టుబట్టింది. దీంతో రెండు రాష్ట్రాలతో చర్చించాకే అప్పర్ భద్రకు జాతీయ హోదా కల్పనపై తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ స్పష్టం చేశారు. దేశంలో 16 జాతీయ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించేందుకు పంకజ్కుమార్ అధ్యక్షతన హైపవర్ కమిటీ సోమవారం వర్చువల్ విధానంలో సమావేశమైంది. రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ఇందులో పాల్గొన్నారు. అప్పర్ భద్ర నుంచి 29.90 టీఎంసీలను తరలించి దుర్భిక్ష ప్రాంతాల్లో 6.25 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా ప్రాజెక్టు చేపట్టామని కర్ణాటక జలవనరులశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి అంచనా వ్యయంలో 90 శాతం నిధులివ్వాలని కేంద్రాన్ని కోరారు. చదవండి: ఏపీలో అపర్ణ రూ.100 కోట్ల పెట్టుబడి దీనిపై ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. అప్పర్ భద్రకు నీటి కేటాయింపులే లేవని స్పష్టం చేశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేవలం 9 టీఎంసీలే కేటాయించిందని, ఆ తీర్పు ఇప్పటివరకు అమలులోకి రాలేదని గుర్తు చేశారు. అప్పర్ భద్ర వల్ల కృష్ణా బేసిన్లో దిగువ రాష్ట్రమైన ఏపీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే డిజైన్లు ఆమోదించాలి.. పోలవరం పనుల పురోగతిని హైపవర్ కమిటీకి అధికారులు వివరించారు. పెండింగ్ డిజైన్లను తక్షణమే ఆమోదించేలా డీడీఆర్పీ(డ్యాం డిజైన్ రివ్యూ ప్యానల్), సీడబ్ల్యూసీని ఆదేశించాలని కోరగా కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి పంకజ్కుమార్ సానుకూలంగా స్పందించారు. ఎప్పటికప్పుడు నిధుల రీయింబర్స్మెంట్ ద్వారా పనులను మరింత వేగంగా చేయడానికి ఆస్కారం ఉంటుందన్న రాష్ట్ర అధికారుల అభిప్రాయంతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఏకీభవించారు. విభాగాల వారిగా పరిమితులు విధించకుండా అంచనా వ్యయాన్ని గంపగుత్తగా భావించి నిధులు విడుదల చేయాలని జలవనరులశాఖ అధికారులు కోరారు. డిస్ట్రిబ్యూటరీ పనులకు సంబంధించిన సర్వే పూర్తయిందని త్వరలోనే టెండర్లు పిలుస్తామని తెలిపారు. -
ప్రాజెక్టుల నిర్వహణ పనులా.. మాకొద్దు!
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పనులంటేనే కాంట్రాక్టర్లు బెంబేలెత్తుతున్నారు. ఎందుకంటే.. చేసిన పనులకు బిల్లులు రావనే భయం వారిని వెంటాడుతోంది. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో ఇకపై ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం)కే అధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కాంట్రాక్ట్ ఏజెన్సీలు నమ్మడంలేదు. చాలాఏళ్ల కిందట చేసిన పనులకే ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. పైగా, ఏడాది బడ్జెట్లో నిధులు కేటాయించినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అధికారమున్నా నిధులు సున్నా రాష్ట్రంలోని ప్రధాన డ్యామ్లు, రిజర్వాయర్ల పరిధిలో గేట్లు, జనరేటర్లు, రోప్వైర్లు, మరమ్మతులు, లీకేజీలు, కలుపుమొక్కల తొలగింపు, పెయింటింగ్, గ్రీజింగ్, గ్యాంట్రిక్ క్రేన్లు, ఎలక్ట్రీషియన్, డిస్ట్రిబ్యూటరీల నిర్వహణ వంటివన్నీ ఓ అండ్ ఎంలో భాగంగా చేపట్టాలి. వీటి నిర్వహణకు ఏటా రూ.280 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధులను గ్రీన్చానల్లో విడుదల చేస్తామని కూడా గతంలో హామీ ఇచ్చింది. అత్యవసర పనులకు వ్యక్తిగత స్థాయిలోనే నిధులు విడుదల చేసే అధికారాన్ని ఈఎన్సీ మొదలు ఈఈల వరకు కట్టబెట్టింది. కోటి వరకు ఈఎన్సీ (జనరల్), రూ.50 లక్షల వరకు సీఈ, రూ.25 లక్షల దాకా ఎస్ఈలకు, రూ.5 లక్షల వరకు ఈఈలకు పరిపాలనా అనుమతులు ఇచ్చే అధికారాన్ని కట్టబెట్టింది. అయితే ఇంతవరకు ఒక్క రూపాయి విడుదలైన దాఖలాలు కూడా లేవు. ఇప్పటికే నాగార్జునసాగర్, జూరాల, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల పరిధిలో ఓ అండ్ ఎంకు సంబంధించిన బిల్లులు రూ.20 కోట్ల మేర పెండింగ్లో ఉన్నాయి. ఈ ఏడాది సైతం... ఈ ఏడాది 19 డివిజన్ల పరిధిలో 613 రకాల ఓ అండ్ ఎం పనులను రూ.65 కోట్లతో చేపట్టాలనే ప్రతిపాదనలు వచ్చాయి. అయితే చాలాచోట్ల ఇంజనీర్లు టెండర్లు పిలుస్తున్నా స్పందన రావడం లేదు. నాగార్జునసాగర్ పరిధిలో రూ.35 లక్షల సివిల్ పనులకు రెండుసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాకపోవడంతో మూడోసారి టెండర్ పిలిచారు. ఎస్సారెస్పీ పరిధిలో మరమ్మతులు, మట్టి పనులకు రూ.50 లక్షలతో రెండుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లలో ఉలుకూపలుకూలేదు. ఇక జూరాల పరిధిలో మెకానికల్ పనులు, హెడ్రెగ్యులేటర్, షట్టర్ల పనులకు రూ.25–30 లక్షలతో మూడుసార్లు టెండర్లు పిలిచినా స్పందన కరువైంది. సూర్యాపేట జిల్లాలో ఎస్సారెస్పీ స్టేజ్–2 పనులకూ ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు జీవో 20 కింద పంప్హౌస్ల నిర్వహణ నిమిత్తం రూ.100 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. వీటికి సంబంధించి ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేసినా, నిధుల విడుదల ఉంటుందా.. ఉండదా.. అనే సంశయం మాత్రం వారిని వెంటాడుతోందని ఇరిగేషన్ వర్గాలే అంటున్నాయి. -
గోదావరి జలాలతో సస్యశ్యామలం
సాక్షి ప్రతినిధి, వరంగల్: గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా ఆయకట్టు భూములను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రాజెక్టుల కోసం భూసేకరణ, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై ఆదివారం హన్మకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రులతో పాటు సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీ మురళీధర్రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు డాక్టర్ టి.రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి ఇందులో పాల్గొన్నారు. మంత్రులు మాట్లాడుతూ 5.18 టీఎంసీల సామర్థ్యంతో 1,22,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు దేవాదుల ప్రాజెక్టుకు రూపకల్పన చేయగా.. ఆ మేరకు పూర్తి చేయకుండా నాటి పాలకులు నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో దేవాదుల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. జనగామ జిల్లా ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను పూర్తి చేయాలని సూచించారు. ఎత్తైన ప్రదేశంలో ఉన్న వేలేరుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, పాలకుర్తి, ఘన్పూర్లో ఆగిన 6వ ప్యాకేజీ పనులు ప్రారంభించాలని చెప్పారు. మధ్యలోనే వెళ్లిపోయిన ముత్తిరెడ్డి దేవాదులపై సమీక్ష సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. చెరువులకు నీటి విడుదల సంబంధిత సమస్యలను స్మితా సబర్వాల్కు ముత్తిరెడ్డి వివరిస్తూ అధికారుల తీరుపై విమర్శలు చేశారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి ఆయన్ను వారించారు. ఇందుకు నిరసనగా ఎమ్మెల్యే సమావేశం నుంచి వాకౌట్ చేశారు. -
నిధులపై నీళ్లు.. సాగునీటి ప్రాజెక్టులపై గెజిట్ దెబ్బ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధుల కొరత వెంటాడుతోంది. ఇప్పటికే అనేక ప్రాజెక్టుల పరిధిలో భారీగా బకాయిలు పేరుకుపోగా.. కృష్ణా, గోదా వరి బోర్డులపై కేంద్రం తీసుకొచ్చిన గెజిట్తో కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. అనుమతుల్లేవని చెబుతున్న ప్రాజెక్టులకు రుణాల విడుదలలో రుణ సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు నిధుల విడుదలను నిలిపివేయడంతో, ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలు నిర్ణీత గడువులోగా చేరుకునే పరిస్థితి లేకుండా పోతోంది. పేరుకుపోయిన బకాయిలు రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో గతంలో ఎన్నడూ లేనంతగా బకాయిలు పేరుకుపోయాయి. కరోనా ప్రభావంతో రాష్ట్ర ఆదాయానికి గండి పడటం, మరోవైపు ఇతర ప్రాధాన్యత రంగాలకు నిధుల వెచ్చింపు పెరగడంతో ప్రాజెక్టులకు రాష్ట్ర నిధుల నుంచి కేటాయింపులు తగ్గాయి. కొత్త ఆర్థిక ఏడాదిలో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులపై రూ.4,925 కోట్లు వెచ్చించగా, ఇందులో రాష్ట్ర నిధుల నుంచి ఇచ్చింది కేవలం రూ.1,887 కోట్లు మాత్రమే. ఇక రుణాల రూపేణా వచ్చిన సొమ్ముతో మరో రూ.3,038 కోట్లు మేర ఖర్చు చేశారు. అయినప్పటికీ ఇంకా రూ.11,396 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో నిర్మాణ పనులు (వర్క్స్)కు సంబంధించిన బిల్లులే రూ.5,710 కోట్ల మేర పెండింగ్లో ఉన్నాయి. పనులకు సంబంధించిన బకాయిల్లో కాళేశ్వరం పరిధిలోనే రూ.1,200 కోట్ల మేర చెల్లించాల్సి ఉండగా, మల్లన్నసాగర్ రిజర్వాయర్ పరిధిలోనివి రూ.300–400 కోట్ల వరకు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ రిజర్వాయర్ పనులు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా, చివరి దశలో ఉన్న పనులకు నిధుల కొరత కారణంగా కనీసం డీజిల్ ఖర్చులకు సైతం ఇక్కట్లు తప్పట్లేదు. పాలమూరు–రంగారెడ్డి పరిధిలో మరో రూ.2 వేల కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. జూలై తొలివారం వరకు వచ్చిన నిధులు ప్రాజెక్టులకు నిధుల కొరత రావద్దనే ఉద్దేశంతోనే కాళేశ్వరం కార్పొరేషన్, తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్లకు ప్రైవేటు బ్యాంకులతో పాటు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్, నాబార్డ్ వంటి సంస్థలు రుణాలిస్తున్నాయి. ఈ ఆర్థిక ఏడాది జూలై తొలివారం వరకు కాళేశ్వరానికి రూ.1,624 కోట్లు, పాలమూరు–రంగారెడ్డికి రూ.1,039 కోట్లు, కంతనపల్లికి రూ.40 కోట్లు, దేవాదులకు రూ.127 కోట్లు, సీతారామకు రూ.136 కోట్లు మేర రుణాలు విడుదలయ్యాయి. అయినప్పటికీ కాళేశ్వరం, పాలమూరుతో పాటు సీతారామలో పనులకు సంబంధించి రూ.563 కోట్లు, దేవాదులలో రూ.10 కోట్లు బకాయిలున్నాయి. మున్ముందు పనులకు రూ.2 వేల కోట్ల మేర నిధుల అవసరాలున్నాయి. గెజిట్తో రుణ సంస్థల వెనుకంజ ప్రస్తుతం కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్ల కారణంగా రుణ సంస్థలు రుణాల విడుదలపై సందిగ్ధంలో పడ్డాయి. అనుమతుల్లేని ప్రాజెక్టులు, వాటికి అనుమతుల విషయమై గెజిట్లో కేంద్రం పలు సూచనలు చేసిన నేపథ్యంలో రుణాల విడుదలపై సంస్థలు వెనుకంజ వేస్తున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం అదనపు టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, దేవాదుల, సీతమ్మసాగర్ బ్యారేజీ వంటి ప్రాజెక్టులకు కేంద్ర సంస్థల నుంచి అనుమతి తీసుకోవాలని గెజట్లో పేర్కొన్న నేపథ్యంలో రుణ సంస్థలు ఈ అంశాలపై రాష్ట్రానికి ప్రశ్నలు సంధిస్తున్నాయి. ప్రాజెక్టులకు ఆమోదం ఎప్పటిలోగా తీసుకుంటారు, ఒకవేళ అనుమతులు రాకుంటే పరిస్థితి ఏంటీ, రుణాల చెల్లింపు విషయంలో ప్రభుత్వ విధానం ఏంటని ఆరా తీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గెజిట్ వెలువడిన నాటి నుంచి కార్పొరేషన్లకు రుణ సంస్థలు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుకు నాబార్డ్ నుంచి రూ.400 కోట్ల మేర రావాల్సి ఉన్నా.. ప్రస్తుత పరిస్థితులతో వాటిని వాయిదా వేస్తోంది. ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ రుణాలే కీలకం కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత మేర రుణాలు లభిస్తాయన్నది ప్రశ్నార్ధకంగా మారింది. -
‘సీతమ్మ’కు రూ.3,426 కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై దుమ్ముగూడెం ఆనకట్టకు దిగువన నిర్మించనున్న సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణానికి రూ.3,426.25 కోట్ల రుణం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. రాష్ట్ర జలవనరుల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఈ రుణాలు తీసుకునేలా ఆమోదించింది. గతంలోనే ఈ ప్రాజెక్టు రుణాలకు ఓకే చెప్పిన ప్రభుత్వం.. తాజాగా సవరణ ఉత్తర్వులు జారీచేసింది. 37 టీఎంసీల నిల్వ, 320 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రూ.3,481 కోట్లతో గతేడాది పరిపాలనా అనుమతులిచ్చింది. ఈ ప్రాజెక్టు టెండర్లను ఎల్అండ్టీ సంస్థ దక్కించుకోగా పనులు ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నారు. అయితే, ఈ ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం నుంచి ఎలాంటి అనుమతులు అవసరమున్నా.. తీసుకోవాలని.. ఒకవేళ అనుమతిలేని కారణంగా పనులు నిలిపివేస్తే.. రుణాన్ని బేషరతుగా వెన క్కి తీసుకుంటామని పీఎఫ్సీ తన పేర్కొంది. ఇటీవల కేంద్రం విడుదల చేసిన గెజిట్లో సీతమ్మసాగర్ను అనుమతి లేని ప్రాజెక్టుగా తెలిపింది. ఆరు నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని అందులో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పీఎఫ్సీ ఈ నిబంధనలను పెట్టింది. -
ఫలాలకు దీటుగా పునరావాసం
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ప్రయోజనం పొందే ఆయకట్టు రైతులకు దీటుగా త్యాగం చేస్తున్న నిర్వాసితుల జీవన ప్రమాణాలు పెంపొందించేలా ప్రభుత్వం పునరావాసం కల్పిస్తోంది. భూసేకరణ చట్టం– 2013 ప్రకారం పరిహారం చెల్లించడంతోపాటు కాలనీల్లో నిర్మించిన ఇళ్లల్లో పునరావాసం కల్పిస్తోంది. రక్షిత మంచినీరు, రహదారి, మురుగునీటి కాలువలు, విద్యుత్ సరఫరాను పూర్తి స్థాయిలో కల్పిస్తోంది. నిర్వాసితులకు చేతివృత్తులతోపాటు నైపుణ్యాలను అభివృద్ధి చేసేలా శిక్షణ ఇస్తూ.. ఉపాధి కల్పిస్తోంది. గతేడాది గండికోట, చిత్రావతి జలాశయాల్లో ముంపునకు గురైన గ్రామాల్లో 19,688 కుటుంబాలకు రూ.1166.57 కోట్లు ఖర్చు చేసి పునరావాసం కల్పించింది. దేశంలో ఒక ఏడాది ఇంత భారీ ఎత్తున నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ఇదే తొలిసారి. ఈ ఏడాది పోలవరం, వెలిగొండలో 22,070 నిర్వాసిత కుటుంబాల పునరావాసానికి రూ.5,452.52 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించడం ద్వారా పులిచింతల, సోమశిల, గండికోట, చిత్రావతి, వామికొండసాగర్, సర్వారాయసాగర్, పైడిపాళెం రిజర్వాయర్ల చరిత్రలో తొలిసారిగా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేసింది. పోలవరంలో శరవేగంగా.. వెలిగొండను ఈ ఏడాదే పూర్తి చేసేలా చర్యలు చేపట్టిన ప్రభుత్వం పోలవరాన్ని 2022 నాటికి పూర్తి చేసే దిశగా పనులను వేగవంతం చేసింది. 194.6 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో ఉభయ గోదావరి జిల్లాల్లో 373 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఈ గ్రామాల్లో 1,05,601 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పనకు ఓ.ఆనంద్ను ప్రభుత్వం అడ్మినిస్ట్రేటర్గా నియమించింది. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం ఈ ఏడాది 41.15 కాంటూర్ మీటర్ల పరిధిలోని 20,870 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఇప్పటికే 3,417 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. మిగిలిన 17,453 కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి రూ.3,942.97 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. పునరావాసం కల్పించడం కోసం 73 కాలనీలను నిర్మిస్తోంది. 27 కాలనీల నిర్మాణాన్ని పూర్తి చేసింది. పూర్తి స్థాయి నీటి మట్టం అంటే 45.72 మీటర్ల కాంటూర్ పరిధిలోని 84,731 కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి రూ.25,539.18 కోట్లు అవసరం. ఈ కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి 140 కాలనీలను నిర్మించనుంది. వెలిగొండలో వేగవంతం.. వెలిగొండలో అంతర్భాగంగా 53 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న నల్లమలసాగర్ జలాశయంతో ప్రకాశం జిల్లాలో 11 గ్రామాలు ముంపునకు గురవుతాయి. 4,617 నిర్వాసిత కుటుంబాలు, 18 ఏళ్లు నిండిన 2,938 మంది యువతకు ఏకకాల పరిష్కారం కోసం రూ.1510.05 కోట్లు అవసరం. ఇప్పటికే రూ.1411.56 కోట్లను మంజూరు చేశారు. ఏడు పునరావాస కాలనీల్లో ఇళ్లను నిర్మిస్తున్నారు. -
రాయలసీమ ప్రాజెక్టుల ఎస్పీవీకి గ్రీన్సిగ్నల్
సాక్షి, అమరావతి: రాయలసీమ కరువు నివారణ ప్రణాళిక అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీఆర్ఎస్డీఎంపీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుల అభివృద్ధి సంస్థ)కు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ సంస్థ రిజిస్ట్రేషన్ (రిజిస్ట్రేషన్ నంబర్ 116293)పై ఆమోదముద్ర వేసింది. దీంతో సంస్థ మొదటి బోర్డు సమావేశాన్ని నిర్వహించడానికి ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కసరత్తు చేస్తున్నారు. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా బ్యాంకులో ఆ సంస్థ పేరుతో ఖాతాను ప్రారంభిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా తొలి విడతగా రూ.ఐదు కోట్లను అందులో జమ చేస్తారు. ఆ తర్వాత అంతర్జాతీయ, జాతీయ ఆర్ధిక సంస్థలతో సంప్రదింపులు జరిపి.. తక్కువ వడ్డీకే రుణాలు తెచ్చి, వాటికి బడ్జెట్ ద్వారా కేటాయించే నిధులను జత చేసి రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుణాలకు ఆర్ధిక సంస్థలు రెడీ ప్రాజెక్టులకు అవసరమైన నిధుల్లో 30 శాతాన్ని అంటే రూ.11,994 కోట్లను ప్రభుత్వం తన వాటాగా సమకూర్చుతుంది. మిగిలిన 70 శాతం అంటే రూ.27,986 కోట్లను జాతీయ, అంతర్జాతీయ ఆర్ధిక సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాల రూపంలో సమకూర్చుకోనున్నారు. ఆ మేరకు సంప్రదింపుల నేపథ్యంలో.. రుణాలు ఇచ్చేందుకు పలు సంస్థలు ప్రాథమికంగా అంగీకారం తెలిపాయి. రూ.39,980 కోట్ల వ్యయంతో 27 ప్రాజెక్టులు కృష్ణా నదికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులను నింపేలా కాలువల వ్యవస్థను అభివృద్ధి చేయడం, అవసరమైన కొత్త ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా వరద జలాలను మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రణాళిక కింద రూ.39,980 కోట్ల వ్యయంతో 27 ప్రాజెక్టులను చేపట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఇప్పటికే మూడు ప్యాకేజీల పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ను ఏర్పాటు చేయాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఆ మేరకు ఏపీఆర్ఎస్డీఎంపీసీఎల్ ఏర్పాటయ్యింది. -
ఈ శాఖలన్ని ఒకే గూటికి
సాక్షి, ఖమ్మం: నీటిపారుదల శాఖల పునర్వ్యవస్థీకరణ శరవేగంగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటివరకు జిల్లాలో ఉన్న నీటిపారుదల శాఖలైన ఎన్నెస్పీ, ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్, ఐడీసీ, దుమ్ముగూడెం ప్రాజెక్టు ఇంజనీరింగ్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి జలవనరుల శాఖగా మార్చేందుకు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఉమ్మడి జిల్లాలోని వనరులు, ఆయకట్టు, నియోజకవర్గాల పరిధిని పరిగణనలోకి తీసుకొని పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. రీ ఆర్గనైజేషన్ కమిటీ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయకట్టు, ప్రస్తుతం ఉన్న పోస్టులు, ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి సమగ్ర సమాచారం తెప్పించుకొని దాని ఆధారంగా రీ ఆర్గనైజేషన్లో తీసుకున్న నియమ నిబంధనల ప్రకారంఅమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. వచ్చే నెలలో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల నాటికి ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి ఆమోదం పొందే విధంగా పనులు సాగిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో సాగులో ఉన్న ఆయకట్టు, ప్రతి నియోజకవర్గాన్ని హద్దుగా పరిగణనలోకి తీసుకుంటారు. ఒక్కో ఈఈ పరిధిలో సుమారు లక్ష ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి దాని పరిధిలో 25వేల ఎకరాల వరకు ఒక డీఈ స్థాయి అధికారిని నియమించే విధంగా రూపకల్పన చేశారు. శాఖలన్నింటినీ ఏకం చేసిన తర్వాత ఇంజనీర్లను కేటాయిస్తారు. ఎన్నెస్పీ, ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్, దుమ్ముగూడెం, సీతారామ ప్రాజెక్టు, మధ్యతరహా ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టుకు నీటి పర్యవేక్షణ వారే చేపట్టాల్సి ఉంటుంది. తొలుత ఉమ్మడి జిల్లాలో ఖమ్మం కేంద్రంగా ఒక సీఈ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎస్ఈలు, ఈఈ, డీఈలు, ఏఈలను కేటాయించే విధంగా ప్రతిపాదించినట్లు సమాచారం. తాజాగా రెండు సీఈ పోస్టులను ఏర్పాటు చేసే విధంగా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఖమ్మం జిల్లా పరిధికి ఒక సీఈ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధికి ఒక సీఈని కేటాయించే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 10లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. అనధికారికంగా మరికొంత ఉంది. ఆ ప్రకారం ఇంజనీర్ పోస్టులను కేటాయించే విధంగా కసరత్తు సాగుతోంది. గతంలో ఉన్న పోస్టులు ఇలా.. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ ఇరిగేషన్ శాఖల పరిధిలో ఒక సీఈ, మూడు ఎస్ఈ, 12 మంది ఈఈలు కొనసాగుతున్నారు. ఇరిగేషన్ శాఖలో దుమ్ముగూడెం ప్రాజెక్టుకు ఒక సీఈ, ఇద్దరు ఎస్ఈ, ఎన్నెస్పీలో ఒక ఎస్ఈ, ముగ్గురు ఈఈలు, ఐడీసీలో ఒక ఈఈ, మిగిలిన ఈఈలు దుమ్ముగూడెం, మైనర్ ఇరిగేషన్ పరిధిలో 8 మంది కొనసాగుతున్నారు. ఒకే పరిధిలోకి వస్తే.. ఇరిగేషన్లోని అన్ని శాఖలు ఒకే పరిధిలోకి వస్తే ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో పోస్టులను కేటాయిస్తారు. రెండు సీఈ, నాలుగు ఎస్ఈ, లక్ష ఎకరాల ఆయకట్టుకు, నియోజకవర్గ పరిధికి ఒక ఈఈ, 25వేల ఎకరాల ఆయకట్టుకు ఒక డీఈని కేటాయించే అవకాశం ఉంది. -
రాయలసీమ ఎత్తిపోతల పాతదే: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. కొద్ది రోజుల క్రితం షెకావత్ రాసిన లేఖకు జగన్ నేడు సమాధానమిచ్చారు. ఏపీ స్పందన లేదంటూ ఈనెల 7న షెకావత్ రాసిన లేఖ కరెక్ట్ కాదని సీఎం అభిప్రాయపడ్డారు. కృష్ణానదీ జలాల ట్రిబ్యునల్ కేటాయింపుల ఆధారంగానే ప్రాజెక్ట్లు నిర్మిస్తున్నట్లు జగన్ చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పాతవాటికి కొనసాగింపు మాత్రమే అన్నారు. అదనంగా నీటి మళ్లింపు, నీటి నిల్వ, అదనపు ఆయకట్టు లేదని సీఎం స్పష్టం చేశారు. పునర్వ్యవస్థీకరణ చట్టంప్రకారం ఏపీకి రావాల్సిన నీటి వాటా సమర్థ వినియోగానికే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అని సీఎం జగన్ స్పష్టం చేశారు. (కొత్త ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దు) కేఆర్ఎంబీ ఆదేశాలకు విరుద్ధంగా తెలంగాణ కొత్త ప్రాజెక్ట్లు చేపడుతోందని సీఎం జగన్ ఆరోపించారు. కృష్ణానదిపై తెలంగాణ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్ట్లకు సంబంధించి.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైనట్లు ఆయన లేఖలో తెలిపారు. ఆ రెండు ప్రాజెక్ట్లు తెలంగాణలో కొత్త కాల్వ వ్యవస్థను, ఆయకట్టును సృష్టిస్తున్నాయన్నారు. మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ఇచ్చిన నీటి వాటాకు బద్దులై ఉంటామని తెలంగాణ చెప్పిందన్నారు. కానీ తర్వాత మాట మార్చి పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల నిర్మాణాలను చేపట్టిందని తెలిపారు. ఈ నిర్మాణాలను నిలుపుదల చేయాల్సిందిగా అపెక్స్ కౌన్సిల్ తెలంగాణను ఆదేశించలేదన్నారు. రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనైనా ఈ అంశాలు పరిష్కారమవుతాయని భావించాను అన్నారు. కానీ రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగకుండా ఆగిపోయిందని లేఖలో సీఎం జగన్ తెలిపారు. -
జలయజ్ఞంతో ప్రాజెక్టులకు రూపం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్నో అభివృద్ధి పనులతో జిల్లాకు జవజీవాలిచ్చారు. సీఎం అంటే ఇలా ఉండాలి అనిపించేలా జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఆ మహానేత కనుమరుగై దశాబ్దం దాటినా జిల్లా ప్రజలు ఆయన జ్ఞాపకాలను ఇంకా మరువలేకున్నారు. వైఎస్సార్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. బుధవారం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆ జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకుందాం.. సాక్షి, ఒంగోలు: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా సాగు, తాగునీటి ప్రాజెక్టులకు జీవం పోశారు. రైతులు, రైతు కూలీలు పడుతున్న ఇబ్బందులను తన పాదయాత్రలో కళ్లారా చూసిన ఆయన అధికారంలోకి వచ్చాక జలయజ్ఞంలో భాగంగా జిల్లాలో కూడా పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. వాటిలో ప్రధానమైనది పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు. వెలిగొండ ప్రాజెక్టు.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టు ఆ తరువాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అప్పుడు వేసిన శిలాఫలకం కాలగర్భంలో కలిసిపోయింది. 2004లో డాక్టర్ వైఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి సంకలి్పంచారు. శ్రీశైలం జలాశయం నుంచి 43.58 టీఎంసీల కృష్ణా వరద నీటిని మళ్లించి జిల్లాలోని 23 మండలాల్లో 3,36,100 ఎకరాలకు, వైఎస్సార్ కడప జిల్లాలోని 2 మండలాలకు చెందిన 27,200 ఎకరాలకు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలకు చెందిన 84 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా రూపొందించారు. మొత్తం కలిసి 4,47,300 ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. అదే విధంగా 15.25 లక్షల మంది ప్రజానీకానికి తాగునీరు అందించటానికి ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు అంచనాలు రూ.8,840 కోట్లకు చేరింది. అప్పట్లో రూ.5,150 కోట్లు కేటాయించి ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారు. వైఎస్ అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. మళ్లీ 2014లో సీఎం అయిన చంద్రబాబు ప్రజల సొమ్మును కాంట్రాక్టర్ల రూపంలో పిండుకొని వాటాలు వేసుకున్నారే తప్ప ప్రాజెక్టు మాత్రం ముందుకు కదలలేదు. వైఎస్ జగన్తో మళ్లీ పనుల్లో వేగం.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ వెలిగొండ పనులు వేగం పుంజుకున్నాయి. చంద్రబాబుకు చెందిన బినామీ కాంట్రాక్టర్లను తప్పించారు. వెలిగొండ ప్రాజెక్టు టెండర్లలో కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. రివర్స్ టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లను ఆహా్వనించారు. వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని రెండో టన్నెల్కు నిర్వహించిన రివర్స్ టెండర్లో ప్రభుత్వ ఖజానాకు రూ.84 కోట్లు జమయ్యాయి. ఒకటో టన్నల్ తవ్వటం దాదాపు పూర్తయింది. అక్టోబర్ ఆఖరుకు ఆ టన్నెల్ నుంచి వెలిగొండ ప్రాజెక్టుకు చెందిన నల్లమల సాగర్కు నీళ్లు వదలనున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు... గుండ్లకమ్మ నది నుంచి జలాలు వృథాగా సముద్రం పాలు కావటాన్ని గుర్తించిన వైఎస్సార్ మద్దిపాడు మండలం మల్లవరం గ్రామం వద్ద ప్రాజెక్టు నిర్మించాలని తలచారు. అందు కోసం రూ.543.43 కోట్లు కేటాయించారు. 3.859 టీఎంసీల నీటి సామర్ధ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేశారు. 9 మండలాల పరిధిలోని 80 వేల ఎకరాలకు సాగునీరు, జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు 43 గ్రామాల పరిధిలోని 2.56 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించటమే లక్ష్యంగా గుండ్లకమ్మ ప్రాజెక్టును రూపొందించారు. 2008 నవంబర్ 24న డాక్టర్ వైఎస్సార్ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం: యర్రం చినపోలిరెడ్డి కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కూడా వైఎస్సార్ పుణ్యమే. గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి కొరిశపాడు, నాగులుప్పలపాడు మండలాల్లో ప్రజలను ఆదుకునేందుకు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. రెండు మండలాల్లోని 20 వేల ఎకరాలకు సాగు నీరు అందించేలా 1.33 టీఎంసీల సామర్ధ్యంతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మొత్తం రూ.177 కోట్ల వ్యయ అంచనాలతో నిర్మాణం చేపట్టారు. ౖవైఎస్సార్ అకాల మరణం చెందిన తరువాత ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. తిరిగి వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభమయ్యాయి. పాలేరు రిజర్వాయర్.. కొండపి నియోజకవర్గ ప్రజల కష్టాలు తీర్చేందుకు వైఎస్సార్ పొన్నలూరు మండలం చెన్నుపాడు గ్రామం వద్ద పాలేరుపై రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 0.584 టీఎంసీల నీటి సామర్ధ్యంతో 9,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4 మండలాల పరిధిలోని 15 గ్రామాలకు చెందిన 30 వేల మంది ప్రజలకు తాగునీరు అందించటమే లక్ష్యంగా రూ.50 కోట్ల వ్యయ అంచనాలతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రులెవ్వరూ ఈ ప్రాజెక్టు ఊసే పట్టించుకోలేదు. ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం కాంట్రాక్టర్ను మార్చి పనులు ప్రారంభించే పనిలో నిమగ్నమైంది. రూ.400 కోట్లతో సాగర్ కాలువల అభివృద్ధి: జిల్లాలో ఆయకట్టుకు సాగర్ కాలువలు ప్రధాన ఆధారం. సాగర్ కుడి కాలువ ద్వారా జిల్లాలో దాదాపు 4.40 లక్షల ఎకరాలలో సాగు భూమి ఉంది. వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన తరువాత సాగర్ కాలువల అభివృద్ధికి రూ.400 కోట్లు కేటాయించారు. అంతకు ముందు కనీసం లక్ష ఎకరాలకు కూడా సాగర్ నీరు జిల్లాకు వచ్చేది కాదు. అలాంటి సాగర్ కాలువల అభివృద్ధితో సాగర్ ఆయకట్టు చివరి భూముల వరకు నీరు వచ్చేలా ఆధునికీకరణ చేపట్టారు. రూ.250 కోట్లతో ఒంగోలులో రిమ్స్.. జిల్లా ప్రజలు వైద్యం కోసం గుంటూరు, నెల్లూరు, లేకుంటే చెన్నై వెళ్లేవారు. వైఎస్సార్ అధికారం చేపట్టాక జిల్లాకు రిమ్స్ వైద్య కళాశాలను మంజూరు చేశారు. రిమ్స్ ఏర్పాటు కోసం రూ.250 కోట్లు కేటాయించి భవన నిర్మాణాలను ప్రారంభించారు. ఒంగోలు రిమ్స్ రాజన్న చలువే. ఆరోగ్యశ్రీ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి జిల్లాలోని లక్షలాది మంది పేదలకు ఆరోగ్య ప్రదాతగా నిలిచారు. కందుకూరులో రూ.110 కోట్లతో ఎస్ఎస్ ట్యాంకు.. కందుకూరు ప్రజల దాహార్తి తీర్చేందుకు చీమకుర్తి సమీపంలో నిర్మించిన రామతీర్ధం జలాశయం నుంచి కందుకూరుకు నీరు మళ్లించేందుకు రూ.110 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒంగోలు నగర ప్రజల దాహార్తిని తీర్చటానికి కూడా రామతీర్థం జలాశయం నుంచే నీటిని ఒంగోలు ఎస్ఎస్ ట్యాంకులను నింపుతున్నారు. రూ.80 కోట్లతో సోమశిల ఉత్తర కాలువ అభివృద్ధి: రాళ్లపాడు ప్రాజెక్టు రైతుల కష్టాలు తెలుసుకున్న వైఎస్సార్ ఎగువనున్న నెల్లూరు జిల్లా సోమశిల నుంచి నీటిని రాళ్లపాడుకు నీరు మళ్లించేందుకు అంచనాలు రూపొందించాలని అప్పట్లో అధికారులను ఆదేశించారు. సోమశిల ఉత్తర కాలువను పొడిగించటం ద్వారా దాదాపు రూ.80 కోట్లు ఖర్చవుతాయని వ్యయ అంచనాలు రూపొందించారు. వెంటనే పరిపాలనా అనుమతులు ఇచ్చి ఉత్తర కాలువ పనులను ప్రారంభింపజేశారు. కనిగిరిలో రూ.175 కోట్లతో రక్షిత మంచినీటి పథకం: కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ నీటితో అనారోగ్యం పాలవుతున్నామని అక్కడి ప్రజలు వైఎస్సార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రూ.175 కోట్ల వ్యయ అంచనాలతో రక్షిత మంచినీటి పథకాన్ని సిద్ధం చేశారు. నిధులు కూడా మంజూరు చేశారు. ఆ పథకం వలన కనిగిరి ప్రాంతంలో కొంతమేర మంచినీటి కష్టాలు తీరాయి. కనిగిరి ప్రాంత ప్రజలు ఫ్లోరైడ్ పీడితులుగా మారుతున్నారని ఫ్లోరైడ్ నివారణ కోసం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రూ.800 కోట్లతో చర్యలు చేపట్టారు. -
అప్పటికి ఎగువమానేరుకు గోదావరి జలాలు
సిరిసిల్ల: సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి నిధుల కొరత లేదని, ప్రాధాన్యత ప్రకారం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్ట్–9 ప్యాకేజీ పనులను మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్–19 కారణంగా రాష్ట్ర ఖజానాకు రాబడి తగ్గినా.. ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. 9వ ప్యాకేజీ పనులను సెప్టెంబర్లోగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. 12 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తి అయ్యాయని, మరో 50 మీటర్లు పెండింగ్లో ఉందని అధికారులు వివరించారు. పంప్హౌస్ నిర్మాణం పూర్తిచేసి మధ్యమానేరు నుంచి ఎగువమానేరుకు నీటిని పంపింగ్ చేసేలా పనులు పూర్తి చేయాలన్నారు. రోజువారీగా పనుల ప్రగతి ఫొటోలను తనకు పంపించాలన్నారు. అక్టోబర్ 15 నాటికి ఎగువమానేరుకు గోదావరి జలాలు చేరాలని రజత్కుమార్ ఆదేశించారు. ఇది పూర్తి అయితే లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా గుర్తించి పనులను వేగవంతం చేయాలని కోరారు. సొరంగంలో మూడు కిలోమీటర్ల మేర ఆయన ప్రయాణించి పనుల ప్రగతిని సమీక్షించారు. ఆయన వెంట ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ మురళీధర్రావు, ఈఎన్సీ హరిరామ్, ట్రెయినీ కలెక్టర్ రిజ్వాన్ షేక్బాషా, ఎస్ఈ ఆనంద్, ఆర్డీవో శ్రీనివాస్రావు, ఈఈ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. మల్లన్నసాగర్ పనుల పరిశీలన.. తొగుట (దుబ్బాక): సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో నిర్మిస్తున్న మల్లన్న సాగర్ కాల్వ నిర్మాణ పనులను నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో కలసి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా రంగనాయకసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్కు వెళ్తున్న గోదావరి జలాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. రోజుకు ఎన్ని మోటార్ల ద్వారా నీటిని తోడుతున్నారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు 12వ ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న దుబ్బాక నియోజకవర్గానికి సాగునీరు అందించే మల్లన్న సాగర్ కాల్వ పనులు పరిశీలించారు. కాల్వ పనుల్లో ఎందుకు ఆలస్యం జరుగుతుందని, పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఖరీఫ్కు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఆయన వెంట సీఎం సలహాదారు శ్రీధర్రావు దేశ్పాండే, ఎస్ఈ ఆనందర్రావు తదితరులు ఉన్నారు. -
పోల‘వరం’లో తొలి అడుగు
సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లావాసుల కలల సౌధం పోలవరం ప్రాజెక్టు పరుగులు పెట్టే రోజులు వచ్చేశాయి. గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టు నిర్వాసితులకు స్వర్ణ యుగం వచ్చేసింది. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ప్యాకేజీకి ఎట్టకేలకు మోక్షం కలిగింది. సీఎంగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించి ఏడాది తిరగకుండానే నిర్వాసితులకు పునరవాస ప్యాకేజీ రూ.79 కోట్లు కేటాయించారు. నిర్వాసితులు సంతోషంగా ఉంటేనే ప్రాజెక్టు నిర్మాణం ముందుకు వెళుతుందనే ఉద్దేశంతో సీఎం తొలి విడత ప్యాకేజీ ప్రకటించి ... ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఏటా కడలిపాలవుతున్న వేల టీఎంసీలను ఒడిసిపట్టే బహుళార్థక సాధక ప్రాజెక్టును సాకారం చేయాలనే చిత్తశుద్ధి ఉండడడంతో సీఎం ముందుగా తమ గోడు పట్టించుకుంటున్నారని నిర్వాసితులు సంబరపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కారానికి జలవనరులశాఖా మంత్రి అనిల్కుమార్ యాదవ్ బుధ, గురువారాల్లో జిల్లా పర్యటనకు వస్తున్నారు. (అన్ని వర్గాల ఆర్థిక ప్రగతికి..సంక్షేమ రథం) కమీషన్ల కోసం బాబు యావ గత పాలకుల నిర్లక్ష్యానికి సాక్షీభూతంగా నిర్వాసితులు మిగిలిపోయారు. వారి బాధలను గాలికొదిలేసి కమీషన్లు వచ్చే పనులను భుజానకెత్తుకున్నారు. పరిహారం ఇచ్చి ఇళ్లు నిర్మిస్తే ఖాళీచేసి వెళ్లిపోతామని మొత్తుకున్నా పట్టించుకోలేదు. పునరావాస చర్యలు తీసుకున్న తరువాతే ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టాలని నిర్వాసితులు, నిపుణులు కమిటీ సూచించినా చంద్రబాబు అండ్ కో పెడచెవిన పెట్టారు. ఫలితంగా ప్రతి ఏటా 69 వేల పైచిలుకు కుటుంబాలు గోదావరి వరదల్లో ముంపు బారిన పడుతున్నాయి. నష్టపరిహారం చెల్లించి, ప్రాజెక్టు పనులు చేపట్టాలని ఐదేళ్లు మొత్తుకున్నా కనీసం పట్టించుకోకుండా బాబు సర్కార్ అనాలోచితంగా పర్సంటేజీలకు కక్కుర్తిపడి కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టి గ్రామాలను ముంచేశారు. (కోవిడ్ పట్ల భయాందోళనలు పోవాలి) కాఫర్ డ్యామ్తో కొద్దిపాటి వరదకే గతేడాది మూడుసార్లు గిరిజన గ్రామాలు ముంపునకు గురై నిర్వాసితులు మూడు నెలలు ఇబ్బందులు పడ్డారు. భద్రాచలంలో గోదావరికి మూడో ప్రమాద హెచ్చరిక జారీచేస్తేనే దేవీపట్నంతోపాటు విలీన మండలాల్లో ముంపునకు గురవుతాయి. అటువంటిది కాఫర్ డ్యామ్ కారణంగా భద్రాచలంలో ఒకటో ప్రమాద హెచ్చరిక జారీచేసే సరికే ఏజెన్సీ మండలాలు ముంపునకు గురయ్యే పరిస్థితి. ఇంతా చేసి అధికారం కోల్పోయాక తగదునమ్మా అంటూ చంద్రబాబు తనయుడు, లోకేష్ ముంపు గ్రామాల పర్యటనకు వచ్చినప్పుడు బాధితుల ఆగ్రహానికి తోకముడిచి వెనుతిరగక తప్పింది కాదు. వైఎస్ హయాంలో... మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించినప్పుడు ముందుగా నిర్వాసితుల ప్రయోజనాలకే పెద్దపీట వేసేవారు. ముందు ముంపునకు గురయ్యే గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. హామీ ఇచ్చినట్టే ముంపు బాధితులకు ప్యాకేజీ ప్రకటించి పునరావాస కాలనీలకు తరలించేవారు. ఆ తరువాతే ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టేవారు. నాడు దేవీపట్నం మండలం వీరవరంలంక, గొందూరు, పరగసానిపాడు, అంగుళూరు, బోడిగూడెం గ్రామాల ప్రజలను ఇందుకూరిపేట–ఫజుల్లాబాద్కు మధ్య నిర్మించిన కాలనీలకు తరలించారు. భూమికి, భూమి, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, కాలనీలు నిర్మాణం పూర్తి చేశారు. ఈ రకంగా వైఎస్ హయాం 2004–2009 మధ్య సుమారు 1500 నిర్వాపిత కుటుంబాలకు మంచి చేశారు. ఆ బాటలోనే తనయుడు గతేడాది జూలైలో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం జగన్ మోహన్రెడ్డి వచ్చినప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో కాఫర్ డ్యామ్ కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాన్ని ఏరియల్ సర్వేలో వీక్షించారు. అనంతరం మంత్రులు, అ«ధికారులతో సమీక్షించిన సందర్భంలో నిర్వాసితులకు పునరావాసం ప్యాకేజీ, ఇల్లు ఖాళీ చేయించే ప్రక్రియను 2020 జూన్ నాటికి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. నాడు ఇచ్చిన మాట ప్రకారం నిర్వాసితులకు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. అనాలోచితంగా చంద్రబాబు సర్కార్ నిర్మించిన కాఫర్ డ్యామ్ కారణంగా ముంపునకు గురవుతున్న గ్రామాలకు తొలి ప్రాధాన్యంగా ప్యాకేజీని విడుదల చేశారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, ఇళ్లకు నష్టపరిహారం కోసం ఇటీవలనే రూ.79 కోట్లు విడుదల చేశారు. మహానేత వైఎస్ తరువాత ఇంత కాలానికి మళ్లీ ప్యాకేజీని ప్రకటించి మనసున్న నాయకుడిగా సీఎం నిలిచారని నిర్వాసితులు ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు. కాఫర్ డ్యామ్కు సమీపాన ఉన్న ఆరు గ్రామాలకు పూర్తి స్ధాయి ప్యాకేజీ, ఇళ్ల నష్టపరిహారం చెల్లించేందుకు నిధులు విడుదల చేయడంతో ప్రాజెక్టు పనులు ముందుకు వెళ్లడానికి మార్గం సుగమమైందని చెప్పొచ్చు. శరవేగంగా కాలనీలు... ప్రాజెక్టు నిర్మాణం కారణంగా తొలివిడతలో దేవీపట్నం మండలంలో ముంపునకు గురవుతున్న నిర్వాసితులకు యుద్ధ ప్రాతిపదికన కాలనీల నిర్మాణం జరుగుతున్నాయి. గిరిజనేతరులకు గోకవరం మండలం కృష్ణునిపాలెంలోను, గిరిజనులకు దేవీపట్నం మండలంలోని పలు గ్రామాల్లో నిర్మాణం చురుగ్గా జరుగుతున్నాయి. వాస్తవానికి గత చంద్రబాబు సర్కార్లోనే వీరికి ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ ఐదేళ్ల పాలనలో ఏనాడూ నిర్వాసితులను పట్టించుకున్న దాఖలాలు లేవు. వైఎస్ ఆలోచనే వేరు మాజీ ముఖ్యమంత్రి వెఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ప్రాజెక్టు నిర్మాణ ఆలోచన రాగానే ముందుగా నిర్వాసితుల ప్రయోజనాలకే పెద్దపీట వేసేవారు. ముంపునకు గురయ్యే గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. బాధితులకు ప్యాకేజీ ప్రకటించి పునరావాస కాలనీలకు తరలించేవారు. ఆ తరువాతే ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టేవారు. కమీషన్లకే బాబు ప్రాధాన్యం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కమీషన్ల కోసమే పోలవరం పనులు చేపట్టేవారు. ఇందుకు ఉదాహరణ కాఫర్ డ్యాం నిర్మాణం. పరిహారం ఇచ్చి ఇళ్లు నిర్మిస్తే ఖాళీచేసి వెళ్లిపోతామని బాధితులు మొత్తుకున్నా అప్పటి సర్కారు పట్టించుకోలేదు. దీని ఫలితంగా ప్రతి ఏటా 69 వేల పైచిలుకు కుటుంబాలు గోదావరి వరదల్లో ముంపు బారిన పడుతున్నాయి. ఈ పాపం ఆయనదే. జగన్దీ తండ్రిబాటే... గత ఏడాది జూలైలో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం జగన్ మోహన్రెడ్డి వచ్చినప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో కాఫర్ డ్యామ్ కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాన్ని ఏరియల్ సర్వేలో వీక్షించారు. పునరావాసం ప్యాకేజీ, ఇల్లు ఖాళీ చేయించే ప్రక్రియను 2020 జూన్ నాటికి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. కాఫర్ డ్యామ్ కారణంగా ముంపునకు గురవుతున్న గ్రామాలకు తొలి ప్రాధాన్యంగా ప్యాకేజీని విడుదల చేసి మాట నిలబెట్టుకుంటున్నారు. ‘బాబు సర్కార్ పట్టించుకోలేదు’ నిర్వాసితులకు ముందుగా పునరావాసం కల్పించాలనే ఆలోచనే చంద్రబాబు సర్కార్కు రాలేదు. గ్రామాల నుంచి తరలించేందుకు అంత ప్యాకేజీ ప్రకటించడాన్ని ఎప్పుడూ పట్టించు కోలేదు. కాఫర్ డ్యామ్కు దగ్గరగా ఉన్న గ్రామాల్లో మాకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం కాళ్లరిగేలా తిరిగాం. టీడీపీ ప్రభుత్వం నిర్వాసితులను అసలు మనుషులుగా కూడా చూడ లేదు. కమీషన్ల కోసం కాఫర్ డ్యామ్ నిర్మాణం చూసుకున్నారు తప్ప వరదలు వస్తే నిర్వాసితులు ఇబ్బందులు పడతారనే విషయాన్ని పట్టించుకోలేదు. – పోలిశెట్టి శివరామకృష్ణనాయుడు, తొయ్యేరు ‘ప్యాకేజీ సంతోషంగా ఉంది’ ఈ ఏడాది వరదలు వచ్చినా నిర్వాసితులు ఎవరు ఇబ్బంది పడకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేస్తున్న ఏర్పాట్లు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. గత వరదలు వలన నిర్వాసితులు అష్ట కష్టాలు పడ్డారు. గత ప్రభుత్వం చేసిన తప్పులకు మేమంతా బలయ్యాం. ప్రస్తుతం అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే పునరావాస కాలనీలు పూర్తి చేసి నిర్వాసితులను తరలించే ఏర్పాటు చేయడం ఊరటనిస్తోంది. కాలనీలకు తరలించి వరద ముంపు నుంచి తప్పిస్తారని ఎదురుచూస్తున్నాం. – వెంకటరమణ, సీతారామం -
మాంద్యంలోనూ నిధుల వరద!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ప్రభావం తీవ్రంగా ఉన్నా.. ప్రభుత్వం ప్రాధాన్యత రంగంగా తీసుకున్న నీటి పారుదలకు మాత్రం నిధుల కొరత రానివ్వడం లేదు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎత్తిపోతల పథకాలన్నింటినీ నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసే లక్ష్యంగా ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు సమకూరుస్తూనే రుణాల రూపేణా సేకరించిన వాటినీ ఖర్చు చేస్తోంది. తొమ్మిది నెలల వ్యవధిలో ప్రాజెక్టులపై ప్రభుత్వం ఏకంగా రూ.17,285 కోట్ల నిధులు ఖర్చు చేయగా, మరో మూడు నెలల వ్యవధిలో ఐదారు వేల కోట్ల మేర వ్యయం చేయనుంది. నెలకు రూ.1,920 కోట్లు.. 2019–20 ఆర్థిక ఏడాదిలో తొలి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. ఎక్కడా నిధుల కొరత లేకుండా చూస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో 9 నెలల వ్యవధిలో రూ.8,586 కోట్ల మేర ఖర్చు చేసింది. ఇందులో రుణాల ద్వారా రూ.5,945 కోట్ల మేర ఖర్చు చేయగా, ప్రభుత్వ ఖజానా నుంచి రూ.2,641 కోట్లు ఖర్చు చేశారు. దీంతో మిడ్మానేరు వరకు గోదావరి నీటి ఎత్తిపోతల సాధ్యమైంది. మిడ్మానేరు దిగువన కొండపోచమ్మసాగర్ వరకు నీటిని తరలించే వ్యవస్థ ప్రస్తుతం సిద్ధంగా ఉంది. దీంతోపాటే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సైతం రూ.2,021 కోట్లు మేర ఖర్చు చేశారు. ఇందులో మెజార్టీ నిధులు భూసేకరణ, సహాయ పునరావాస పనులకు వెచ్చించారు. సీతారామ ఎత్తిపోతల పథకం కింద ఈ ఏడాది జూన్ నాటికి గరిష్ట ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి నాటికి తొలి పంప్హౌస్, మార్చి నాటికి రెండో పంప్హౌస్, మే చివరికి మూడో పంప్హౌస్ నిర్మాణ పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా నిర్ణయించారు. దీనికి సైతం రుణాల రూపేణా రూ.1,500 కోట్ల మేర ఖర్చు జరిగింది. వీటితో పాటే దేవాదులకు రూ.800 కోట్ల మేర, వరద కాల్వ ప్రాజెక్టుకు రూ.వెయ్యి కోట్ల మేర ఖర్చు చేశారు. చిన్న నీటి పారుదల రంగానికి సైతం పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపులకు రూ.873 కోట్లు ఖర్చు చేశారు. మొత్తంగా రాష్ట్రం తన బడ్జెట్ నుంచి రూ.7,434 కోట్లు ఖర్చు చేయగా, రుణాల ద్వారా రూ.9,851 కోట్లు ఖర్చు చేసింది. నెలకు రూ.1,920 కోట్లకు తగ్గకుండా 9 నెలల్లో 17,825 కోట్లు ఖర్చు చేసినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. అయినా ప్రాజెక్టుల పరిధిలో నిర్మాణ పనులు.. పూర్తయిన పనులకు సంబంధించి చెల్లించాల్సిన బకాయిలు మరో రూ.10,000 కోట్ల మేర ఉండటం విశేషం. ఆర్థిక ఏడాది ముగిసే నాటికి మూడు నెలల వ్యవధిలో మరో రూ.5 వేల నుంచి రూ.6 వేల కోట్ల మేర ఖర్చు చేసే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. -
రాయలసీమ రుణం తీర్చుకునే అవకాశం: సీఎం జగన్
-
సీమ రుణం తీర్చుకునే అవకాశం: సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్: వెనుకబడిన రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో ముందడుగు వేశారు. సోమవారం వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించిన సీఎం పలు నీటిపారుదుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కుందూ నదిపై మూడు ప్రాజెక్టులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా దువ్వూరు మండలం నేలటూరు వద్ద సీఎం వైఎస్ జగన్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నేలటూరు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టినట్టు తెలిపారు. దువ్వురు నుంచి బ్రహ్మంసాగర్ నీటి తరలింపుతో తెలుగుగంగా ఆయకట్టు స్థిరీకరణ చేస్తామని అన్నారు. బ్రహ్మంసాగర్ కింద 90 వేల ఎకరాలను నీరు అందించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీపీపీకి 1.4 టీఎంసీల నీటిని కేటాయిస్తామన్నారు. టీడీపీ హయాంలో ప్రాజెక్టులను ఏమాత్రం పట్టించుకోలేదని సీఎం విమర్శించారు. (మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తాం : సీఎం జగన్) సభలో సీఎం ప్రసంగిస్తూ.. ‘బ్రహ్మంసాగర్ ప్రాజెక్టులో 17 టీఎంసీ లు పూర్తి సామర్థ్యం వైఎస్సార్ హయాంలో జరిగింది. గతంలో భారీ వరదలు వచ్చినా డ్యాంలు నిండలేదు. బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు కింద 90 వేల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. ఆర్టీపీపీకి 1.4 టీఎంసీల కేటాయింపు చేస్తాం. 2008లో వైఎస్సార్ జారీ చేసిన 224 జీవోపై చంద్రబాబు నిర్లక్ష్యం వహించారు. కుందూ నదిపై చేపట్టిన మూడు ప్రాజెక్టుల వల్ల వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలకు మేలు జరుగుతుంది. రూ.2300 కోట్ల తో ఈ పనులు చేపడుతున్నాం. ఈ ఏడాది భారీ వరదలు రావడంతో.. శ్రీశైలం గేట్లు ఎనిమిది సార్లు ఎత్తాం. ప్రకాశం బ్యారేజీ నుంచి 800 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసింది. వరద నీటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రధాన ప్రాజెక్టు కాలువలను వెడల్పు చేయలేదు. అందుకే వరద నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తోంది. రాయలసీమ ఇరిగేషన్ కాలువల సామర్థ్యం చంద్రబాబు పెంచి ఉంటే వరద నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకునే వాళ్లం. రూ.23000 కోట్ల రూపాయలతో సీమలోని అన్ని సాగునీటి కాలువ సామర్థ్యం పెంచుతున్నాం. మొత్తం 60 వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టుల పనులు చేపడుతున్నాం. గోదావరి నది నుంచి 3000 టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా వెళ్తోంది. కృష్ణ, గోదావరి జలాలతో ఏపీని సస్యశ్యామలం చేస్తాం. రాయలసీమ రుణం తీర్చుకునే అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు’ అని అన్నారు. ప్రాజెక్టులో భాగంగా జోలరాసి వద్ద 0.8 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే రాజోలి ఆనకట్టకు ఎగువన 2.95 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించనున్నారు. జొన్నవరం వద్ద ఆనకట్ట నిర్మాణం చేపట్టి.. వరద సమయంలో 8 టీఎంసీ ల నీటిని దువ్వూరు చెరువులోకి ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి బ్రహ్మంసాగర్కు తరలించి తెలుగుగంగ ఆయకట్టు స్థిరీకరణ చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా మైదుకూరు, బద్వేలు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల తాగునీటి సమస్య తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అలాగే కేసీ, తెలుగు గంగ ఆయకట్టు స్థిరీకరణ దిశగా చర్యలు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ. 2234 కోట్ల రూపాయల వ్యయం చేయనున్నారు. దీంతో రాయలసీమకు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘సాగునీటి’ పటిష్టానికి మేధోమథనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటిశాఖ పునర్వ్యవస్థీకరణపై మేధోమథనం జరిపేందుకు ఖైరతాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో శనివారం నిర్వహించిన ఒక్కరోజు వర్క్షాప్ విజయవంతమైంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు ఆ శాఖ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం)పాలసీ తయారు చేయడం, సాగునీటి శాఖ పునర్వ్యవస్థీకరణ, శాఖ ఆస్తులు, ఇతర సాంకేతిక అంశాల జాబితా రూపకల్పన, శాఖ కార్యకలాపాలను ప్రభావితం చేసే చట్టాలు, ఇతర శాఖలతో సమన్వయం వంటి అంశాలపై సదస్సులో కూలంకషంగా చర్చించారు. కార్యాచరణపై ఇంజనీర్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సాగునీటి శాఖ ఈఎన్సీ మురళీధర్ అధ్యక్షతన జరిగిన ఈ వర్క్షాప్లో ఈఎన్సీ స్థాయి నుంచి ఈఈ స్థాయి వరకు 250 మంది ఇంజనీర్లు పాల్గొన్నారు. సదస్సు లక్ష్యాలను, ప్రభుత్వ ఆలోచనను పరిపాలనా విభాగపు ఈఎన్సీ నాగేందర్రావు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 1.25 కోట్ల ఎకరాల ఆయకట్టులో 75 లక్షల ఎకరాల ఆయకట్టు ఎత్తిపోతల పథకాల కిందే ఉందని, రానున్న రోజుల్లో వీటి నిర్వహణ కీలకం కానుందని తెలిపారు. సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే మాట్లాడుతూ, కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా ఈఎన్సీల మధ్య పని విభజన జరగాలని సీఎం అభిలషించారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ఎత్తిపోతల పథకాల్లో 80కి పైగా పంప్హౌస్ల నిర్వహణకు దీర్ఘకాలిక దృష్టితో ఒక సమగ్ర ‘ఓఅండ్ఎం’పాలసీని తయారు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎత్తిపోతల సలహాదారులు పెంటారెడ్డి పథకాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. పంప్హౌస్లు, విద్యుత్ పరికరాలు, విద్యుత్ సరఫరా వ్యవస్థల నిర్వహణ, షిఫ్ట్ ఇంజనీర్ల బాధ్యతలు, సిబ్బంది అవసరాలు తదితర అంశాలపై వివరించారు. పదోన్నతుల సంగతి సీఎం దృష్టికి తీసుకెళ్లాలి ఈ సందర్భంగా ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రాజెక్టుల నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేయడానికి తాము కష్టించి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని సదస్సులో పాల్గొన్న ఇంజనీర్లు తెలిపారు. అయితే గత రెండేళ్లుగా కోర్టు కేసుల కారణంగా ఆగిపోయిన పదోన్నతులకు హైకోర్టు తీర్పుతో అన్ని అడ్డంకులు తొలగిపోయినందున వెంటనే పదోన్నతులు ఇవ్వాలని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని సూచించారు. దీని తర్వాత జనవరిలో మరో సదస్సును కూడా నిర్వహిస్తామని, అవసరమైతే సీఎం స్థాయిలో మరో విస్తృత స్థాయి సదస్సును నిర్వహిస్తామని ఈఎన్సీ మురళీధర్ అన్నారు. సదస్సులో ఈఎన్సీలు హరిరాం, నల్లా వెంకటేశ్వర్లు, అనిల్ కుమార్, చీఫ్ ఇంజనీర్లు, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనరావు, బంగారయ్య, వీరయ్య, శంకర్, హమీద్ ఖాన్, నరసింహా, అనంత రెడ్డి, శ్రీదేవి, శ్రీనివాస రావు, అజయ్ కుమార్, మోహన్ కుమార్, శంకర్ నాయక్, వి.రమేశ్, వి.సుధాకర్, డీసీఈలు అజ్మల్ఖాన్, నరహరిబాబులు పాల్గొన్నారు. -
‘సీతారామ’...పూడిక తీసేద్దామా..!
సాక్షి, హైదరాబాద్ : పూర్వ ఖమ్మం జిల్లా సాగునీటి అవసరాలు తీర్చేందుకు చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకానికి పూడికమట్టి సమస్య వెన్నాడుతోంది. ఈ ఎత్తిపోతలకు అవసరమయ్యే నీటిని తీసుకునే దుమ్ముగూడెం ఆనకట్ట ఎగువ ప్రాంతంలో భారీగా మట్టి, ఇసుక మేటలు వేయడంతో అది పంప్హౌస్లోకి చేరి, పంపులు, మోటార్లకు సమస్యలు తెచ్చే అవకాశం ఏర్పడనుంది. దీన్ని గుర్తించిన నీటి పారుదల శాఖ డ్రెడ్జింగ్ ద్వారా పూడికతీత తీయాలని నిర్ణయించింది. కేవలం 50 రోజుల వ్యవధిలో సుమారు 35వేల క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని తీయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక క్యూబిక్ మీటర్ పూడికను తీసేందుకు రూ.800 ఖర్చు కానుంది. ప్రస్తుతం నీటి పారుదల శాఖ ఫిబ్రవరి రెండో వారానికి మొదటి పంప్హౌస్లో 3 మోటార్లను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్లే పనులు జరుగుతున్నాయి. -
ఘనపూర్ ప్రాజెక్ట్ మారని రూపురేఖలు
మెతుకుసీమ జీవన వాహిని.. జిల్లాలో ఉన్న ఏకైక మధ్య తరహా సాగు నీటి ప్రాజెక్ట్ ఘనపూర్. ఎన్నో ఏళ్లుగా జిల్లాలోని సుమారు 21,625 ఎకరాలను సస్యశ్యామలం చేస్తూ.. రైతుల కల్పతరువుగా మారిన ఈ ఆనకట్ట కీర్తి అంతా ఇంతా కాదు. ప్రస్తుతం చుక్క నీరు లేని ఈ ప్రాజెక్ట్కు సంబంధించి ఆనకట్ట ఎత్తు పనులు భూసేకరణలో అవరోధాలతో నిలిచిపోయాయి. దీని పరిధిలోని రెండు కాల్వలకు సంబంధించి సిమెంట్ లైనింగ్ పనులు 2005లో మొదలు కాగా.. ఇప్పటివరకు పూర్తి కాలేదు. సాక్షి, మెదక్: జిల్లా రైతాంగానికి పెద్దదిక్కుగా నిలుస్తోన్న ఘనపురం ప్రాజెక్ట్ అభివృద్ధి పనులు ఏళ్లకేళ్లుగా కొనసా.. గుతూనే ఉన్నాయి. ప్రస్తు తం చుక్క నీరు లేని పరిస్థితుల్లో మంజీర పరవళ్ల కోసం ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్కు సంబంధించి అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. సుమారు 14 సంవత్సరాలుగా ఆయకట్టు రైతులను వెక్కిరిస్తూనే ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్పై దృష్టిసారించింది. నిధులు సైతం కేటాయించినప్పటికీ.. ఆశించినంత అభివృద్ధి జరగడం లేదని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయకట్టు విస్తీర్ణం 21,625 ఎకరాలు మంజీరా నదిపై కొల్చారం–పాపన్నపేట మం డలాల మధ్య ఏడుపాయల ప్రాంతంలో 1905 లో ఘనపూర్ మధ్య తరహా ప్రాజెక్టును నిర్మించారు. ఆనకట్ట పొడవు 2,337 అడుగులు కాగా.. నీటి నిల్వ సామర్థ్యం 0.2 టీఎంసీలు. దీని పరిధిలో రెండు కాల్వలు (మహబూబ్నహర్, ఫతేనహర్) ఉండగా.. ఆయకట్టు విస్తీర్ణం 21,625 ఎకరాలు. మహబూబ్నహర్ (ఎంఎన్) కెనాల్ పొడవు 42.80 కిలోమీటర్లు కాగా.. దీని ద్వారా కొల్చారం, మెదక్, హవేళిఘనపూర్ మండలాల పరిధిలోని 18 గ్రామాల్లో 11,425 ఎకరాలకు సాగు నీరు అందుతోంది. ఫతేనహర్ (ఎఫ్ఎన్) కెనాల్ పొడవు 12.80 కి.మీ కాగా.. పాపన్నపేట మండలంలోని 11 గ్రామా ల్లో 10,200 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ‘తెలంగాణ’లో నిధుల వరద ఘనపూర్ కాల్వల ఆధునికీకరణ కోసం 2005లో అప్పటి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జైకా పథకం కింద రూ.25 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులు వినియోగించకపోవడంతో వెనక్కిమళ్లాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ అభివృద్ధిపై దృష్టి సారించారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన స్వయంగా 2014 డిసెంబర్ 17న ఘనపూర్ ప్రాజెక్ట్ బాట పట్టారు. సందర్శించిన సమయంలోనే ప్రాజెక్ట్ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి కృషి, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సహకారంతో వెనక్కి మళ్లిన జైకా నిధులు తిరిగివచ్చాయి. సీఎం హామీ మేరకు ఓసారి రూ.21.64 కోట్లు, ఆ తర్వాత రూ.43.64 కోట్లతోపాటు మరో రూ.1.64 కోట్లు మంజూరయ్యాయి. కాల్వల ఆధునికీకరణ, గేట్ల మరమ్మతులు, ఆనకట్ట ఎత్తు పెంపు, భూసేకరణకు ఈ నిధులు మంజూరయ్యాయి. తాజాగా ఇటీవల బడ్జెట్లో ఘనపూర్ ప్రాజెక్ట్కు రూ.34 కోట్లు కేటాయించారు. సా..గుతున్న పనులు మహబూబ్నహర్, ఫతేనహర్ కెనాల్ ఆధునికీకరణలో భాగంగా సిమెంట్ లైనింగ్ పనులు చివరి వరకు కాలేదు. ఫతేనహర్ కెనాల్ పొడవు 12.80 కిలో మీటర్లు కాగా.. దౌలాపూర్ వరకు.. మహబూబ్నహర్ కాల్వ పొడవు 42.80 కిలోమీటర్లు కాగా మత్తాయిపల్లి వరకు (32 కి.మీలు) మాత్రమే సిమెంట్ లైనింగ్ పనులు పూర్తయ్యాయి. మహబూబ్నహర్ కెనాల్ కింద శాలిపేట నుంచి జక్కన్నపేట వరకు.. ఫతేనహర్ కెనాల్ కింద 11 కి.మీల మేర పాపన్నపేట వరకు బ్రాంచ్ కాల్వ పనులు, గైడ్ వాల్ నిర్మించాల్సి ఉంది. ఫతేనహర్ కెనాల్ కింద గాంధారిపల్లి, జయపురం, లక్ష్మీనగర్, అబలపూర్, అన్నారం, యూసుఫ్పేట్, కుర్తివాడ, మిన్పూర్, పాపన్నపేట, నాగ్సానిపల్లి, పొడిచంపల్లిలో సీసీ లైనింగ్ పనులు పూర్తి కాలేదు. ఇలా ఏళ్లకేళ్లుగా పనులు కొనసాగుతుండగా.. మొదట చేసినవి శిథిలావస్థకు చేరాయి. దీంతో చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొంది. భూసేకరణలో అవరోధాలు ఆనకట్ట ఎత్తు పెంపునకు సంబంధించి ఒక్క అడుగూ ముందుకు పడలేదు. పలు ప్రాంతాల్లో భూసేకరణలో ఇబ్బందులు తలెత్తడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. గత బడ్జెట్లో మంజూరైన వాటిలో సుమారు రూ.13 కోట్లు భూసేకరణకు కేటాయించగా.. అవి అలానే ఉన్నట్లు సమచారం. మొత్తం 290 ఎకరాల భూమి అవసరం కాగా.. ఇప్పటివరకు 230 ఎకరాలను క్లియర్ చేసినట్లు అధికారిక సమాచారం. 60 ఎకరాలకు సంబంధించి ఆర్డీఓ తదితరులు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. చిన్న ఘనపూర్, సంగాయిపల్లితోపాటు పలు గ్రామాలకు చెందిన రైతులు భూములు ఇచ్చేందుకు నిరాసక్తత ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది. తాజాగా ఈ బడ్జెట్లో భూసేకరణకు నిధులు కేటాయించడంతో ఈ సమస్య పరిష్కారమైనట్లేనని అధికారులు భావిస్తున్నారు. చుక్క నీరు లేదు.. ప్రస్తుతం ఘనపురం ప్రాజెక్ట్లో చుక్క నీరు లేదు. మంజీర నది ప్రవాహం లేకపోవడం.. సింగూరు ప్రాజెక్ట్లో నీటి నిల్వ ఉంచకపోవడంతో ఈ దుస్థితి దాపురించింది. గత ఏడాది సింగూరు నుంచి 15 టీఎంసీల నీళ్లను ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా నిజామాబాద్ జిల్లా అవసరాలకు తరలించడంతో ప్రస్తుతం ఎకరా కూడా సాగు చేయని దుస్థితి నెలకొందని స్థానిక రైతులు వాపోతున్నారు. ఆ నీళ్లు ఉంటే కనీసం ఒక్క పంటయినా వెళ్లేదని గోడు వెళ్లబోసుకుంటున్నారు. భూసేకరణ కొనసాగుతోంది.. ఘనపూర్ ప్రాజెక్ట్ సామర్థ్యం 0.2 టీఎంసీలు. పూడిక పేరుకుపోవడంతో సామర్థ్యం 0.135కి తగ్గింది. మిషన్ కాకతీయలో పలు చోట్ల పూడిక తీశాం. ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ఎత్తు పెరిగితే నీటి నిల్వ సామర్థ్యం 0.3 టీఎంసీలకు చేరుకుంటుంది. మరో సుమారు ఆరు వేల ఎకరాల వరకు నీరందుతుంది. ఒక్కసారి నిండితే ఆయకట్టు రైతులు సులువుగా రెండు పంటలు తీయొచ్చు. ప్రభుత్వం తాజాగా బడ్జెట్లో కేయించిన నిధులను భూసేకరణ, గేట్ల బిగింపు, ఇతర ఆధునికీకరణ పనులకు వినియోగిస్తాం. – ఏసయ్య, నీటి పారుదల శాఖ ఈఈ -
బంజరు భూములను బంగారు చేద్దాం
-
రుణాలతోనే గట్టెక్కేది?
సాక్షి, హైదరాబాద్: పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు మరోమారు అగ్రతాంబూలం దక్కనుంది. గతంలో మాదిరే ఈ ఏడాది నిర్వహణ పద్దు, ప్రగతి పద్దు కలిపి రూ.25 వేల కోట్లకు తగ్గకుండా బడ్జెట్ కేటాయింపులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బడ్జెట్ అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపిన నీటిపారుదల శాఖ రూ.26 వేల కోట్లతో అంచనాలు వేసింది. ఇందులో ఇప్పటికే కార్పొరేషన్ల ద్వారా రూ.12 వేల కోట్లు ఖర్చు చేసేలా అంచనాలు సిద్ధమైనట్లు సమాచారం. రుణాలే ఆధారం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్న ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయాలన్న లక్ష్యంతో భారీగా నిధులు కేటాయిస్తూ వస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్లో ఆరు నెలల కాలానికి రూ.10 వేల కోట్ల కేటాయింపులు చేశారు. ఇందులో ఇప్పటికే రూ.3,500 కోట్ల మేర ఖర్చు జరిగింది. పనులకు సంబంధించి మరో రూ.5వేల కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. కాగా ఈ నెలలో ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్లో రూ.26 వేల కోట్ల అంచనాతో ప్రతిపాదనలు పంపగా రూ.25 వేల కోట్లు కేటాయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ముగింపు దశకొచ్చిన నేపథ్యంలో కేటాయింపుల్లో తొలి ప్రాధాన్యం పాలమూరు–రంగారెడ్డికి దక్క నుంది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.10 వేల కోట్ల మేర రుణాలను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తీసుకునేందుకు అనుమతి రాగా ఇందులో రూ.7 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్లమేర ఖర్చు చేసేలా కేటాయింపులు చేసే చాన్సుంది. ఇక కాళేశ్వరానికి రూ.6వేల కోట్ల మేర కేటాయింపులతో అంచనాలు వేయగా, ఇందులో రుణాల ద్వారానే అధిక ఖర్చు చేయనున్నారు. దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, వరద కాల్వ ప్రాజెక్టులకు కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.17 వేల కోట్ల రుణాలు తీసుకునే నిర్ణయం జరగ్గా, రుణాల ద్వారా సేకరించిన మొత్తంలో రూ. 6 వేల కోట్ల మేర ఖర్చు జరిగింది. ఇక పూర్వ మహబూబ్నగర్ ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించనున్నారు. -
పోటెత్తుతున వరదలు
సాక్షి, అమరావతి/నెట్వర్క్ :ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల్లో వరద ప్రవాహం పోటెత్తుతోంది. నాలుగురోజుల పాటు ఉగ్రరూపం ధరించిన గోదావరి గురువారం శాంతించినట్లు కనిపించి మళ్లీ ఉధృతమైంది. శ్రీశైలంలోనూ అంతకంతకూ వరదపోటు పెరిగిపోతుండడంతో శుక్రవారం జలాశయంలోని పలు గేట్లను ఎత్తేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి నదులు కొంత శాంతించాయి. ఇక్కడ గొట్టా బ్యారేజీకి చెందిన 22 గేట్లను ఎత్తివేశారు. గోదావరి మళ్లీ ఉగ్రరూపం కాగా, నదీ పరివాహక ప్రాంతాల్లో బుధవారం రాత్రి భారీ వర్షాలు కురవడంతో గురువారం మధ్యాహ్నానికి గోదావరి ఒక్కసారిగా మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద 44.20 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. మధ్యాహ్నం 12 గంటలకు పోలవరం వద్ద గోదావరి వరద ప్రవాహం 13 లక్షల క్యూసెక్కులకు చేరింది. కాఫర్ డ్యామ్ వద్ద వరద నీటి మట్టం 28.15 అడుగులకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి గురువారం ఉదయం ఆరు గంటలకు 9,96,503 క్యూసెక్కుల ప్రవాహం రాగా.. సాయంత్రం 6 గంటలకు ఆ ప్రవాహం 13,62,041 క్యూసెక్కులకు చేరింది. ఇక్కడ నీటి మట్టం 14.25 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. రాత్రి 7 గంటలకు 14.30 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. ఇక్కడ వచ్చిన వరదను వచ్చినట్టుగా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కాగా, వరద పోటుతో దిగువ లంక గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. కోనసీమలోని వైనతేయ గోదావరి నదీతీరంలోని లంక గ్రామాలను వరద మళ్లీ ముంచెత్తింది. రాజోలు నియోజకవర్గంలో వరద తగ్గుతున్నట్టే తగ్గి మళ్లీ పెరగడంతో ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దేవీపట్నంలో వరదనీరు మరోసారి పెరిగింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలోని కడెమ్మ వంతెనపై నాలుగు అడుగులకు పైగా వరద నీరు ప్రవహిస్తోంది. నర్సాపురం వద్ద వశిష్ట గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. గోదావరి గట్టును ఆనుకుని ఉన్న పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. శాంతించిన వంశధార, నాగావళి ఇక ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదులు గురువారం కొంత శాంతించాయి. గొట్టా బ్యారేజీకి చెందిన 22 గేట్లు ఎత్తేశారు. బ్యారేజీలోకి ఉదయం 1,12,210 క్యూసెక్కుల ప్రవాహం రావడంతో మూడో ప్రమాద హెచ్చరికను ఎగురవేసి అంతేస్థాయిలో ప్రవాహాన్ని సముద్రంలోకి వదులుతున్నారు. ఆ తర్వాత వరద తగ్గుముఖం పట్టి రాత్రి 8 గంటలకు 70 వేల క్యూసెక్కులకు చేరింది. వరదల కారణంగా గార మండలంలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. జిల్లాలో మొత్తం 8.600 హెక్టార్లు నీట మునిగాయని అధికారులు తెలిపారు. 12మండలాలు వరద ప్రభావానికి గురయ్యాయి. ఎన్టీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. రేపు శ్రీశైలంలో పలు గేట్లు ఎత్తివేత? కృష్ణా నదిలో ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి మరింత పెరిగింది. శ్రీశైలం జలాశయంలోకి గురువారం రాత్రి ఏడు గంటలకు 3,71,014 క్యూసెక్కులు చేరుతోంది. కుడి, ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా నాగార్జునసాగర్కు.. హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ల ద్వారా 96,401 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ 877 అడుగుల్లో 173.06 టీఎంసీలకు చేరుకుంది. వరద ఉధృతి ఇదే రీతిలో కొనసాగితే.. శనివారం శ్రీశైలం జలాశయంలోని నాలుగు గేట్లను ఒక్కొక్కటి 10 అడుగుల మేర తెరిచి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. అలాగే, సాగర్లో ప్రస్తుతం 514.2 అడుగుల్లో 138.91 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇది పూర్తిస్థాయిలో నిండాలంటే.. ఇంకా 174 టీఎంసీలు అసవరం. ఎగువ నుంచి వరద ప్రవాహం ఇలానే కొనసాగితే మరో వారం రోజుల్లో సాగర్ జలాశయం నిండే అవకాశం ఉంది. -
అడ్డగోలు దోపిడీ..!
గత టీడీపీ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి చోటుచేసుకుంది. ముఖ్యంగా హంద్రీ–నీవా కాలువ పనుల్లో దోపిడీ ఇష్టారాజ్యంగా సాగింది. అధిక అంచనాలతో టెండర్లు నిర్వహించి దోచుకున్నారు. అధికారి అనుకూలంగా లేకపోవడంతో పనులను వేరే సర్కిల్కి బదిలీ చేసి తమకు అనుకూలంగా చేసుకున్నారు. ఈ దోపిడీపై వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిపుణుల కమిటీ ద్వారా విచారణ చేపట్టనుంది. తద్వారా హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండోదశ పనుల్లో గత ప్రభుత్వం సాగించిన లీలలు వెలుగులోకి రానున్నాయి. సాక్షి, బి.కొత్తకోట : 2014లో అధికారంలోకి రాగానే హంద్రీ–నీవా రెండో దశ పనులను టీడీపీ నేతలు వారి సంస్థలకే దక్కేలా చక్రం తిప్పారు. 60సీ నిబంధనను ప్రయోగించి పాత కాంట్రాక్టుల నుంచి పనులు తొలగించారు. అతి తక్కువ విలువ కలిగిన పనులను కోట్లకు పెంచుకొని దోపిడీ సాగించారు. ఈ వ్యవహారంలో అడ్డం తిరిగిన ఓ అధికారిపై కక్షగట్టి ఆయన పరిధిలోని ప్యాకేజీలను తొలగించారు. అనుకూలమైన అధికారులతో ఆడింది ఆటలా అంచనాలు పెంచుకుని అయినవారికే పనులు కట్టబెట్టారు. మాట వినలేదని ప్యాకేజీల మార్పు.. హంద్రీ–నీవా ప్రాజెక్టు 2వ దశకు చెందిన చిత్తూరు జిల్లా మదనపల్లె సర్కిల్–3 పరిధిలోని 14 ప్యాకేజీలను ఒక్కసారిగా తప్పిస్తూ 2015 జూలై 29న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు పనులు చేపట్టినప్పటి నుంచి మదనపల్లె సర్కిల్ పరిధిలోని పనులను అనంతపురం జిల్లాలోని సర్కిల్కు మార్పు చేసింది. 2014 డిసెంబర్లో మదనపల్లె ఎస్ఈగా మురళీనాథరెడ్డి బాధ్యతలు చేపట్టారు. అప్పటిదాక పడకేసిన పనుల్లో కదలిక తెచ్చారు. అనంతపురం జిల్లా పరిధిలోని 6, 8, 9, 10, 11, 14, 15, 16, 18, 24, 25, 26, 52, 53 ప్యాకేజీ పనులు మదనపల్లె సర్కిల్ పరిధిలో ఉన్నాయి. ఈ ప్యాకేజీల్లోని పనులను రద్దు చేయించి, అధిక అంచనాలతో కొత్తగా టెండర్లు నిర్వహించాలని టీడీపీ ముఖ్యనేతలు ఎస్ఈపై ఒత్తిడి తెచ్చారు. దీనికి అంగీకరించని ఆయన, పనుల్లో పురోగతి ఉందని, రద్దువల్ల ప్రభుత్వానికి నష్టమని సలహా ఇస్తే.. వారి ఆగ్రహానికి గురయ్యారు. అప్పటీ సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి 14 ప్యాకేజీలను అనంతపురం జిల్లాలోని సర్కిల్–2 పరిధిలోకి బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. ఆమోదం లేకున్నా చెల్లింపులు.. 2014, 2015 మధ్యలో మదనపల్లె సర్కిల్ నుంచి తొలగించిన, అనంతపురం జిల్లా పరిధిలోని రెండోదశకు చెందిన 15 ప్యాకేజీల పనుల్లో కొంత భాగం రద్దు చేశారు. ఈ ప్యాకేజీల్లో రూ.292.52 కోట్ల పనులు పెండింగ్లో ఉండగా, అందులో కొంత మేర పని రద్దుచేసి పనులకు కొత్తగా 2బీ, 3బీ, 4బీ, 5బీ, 6బీ, 7బీ, 10బీ, 13బీ, 14బీ, 15బీ, 17బీ, 25బీ, 26బీ, 54బీ, 57బీ ప్యాకేజీలుగా మార్చి రూ.779.61కోట్లకు అంచనాతో టెండర్లు నిర్వహించారు. పనుల తొలగింపు, రద్దు, రీటెండర్లు పద్ధతి ప్రకారం సాగలేదని గత ప్రభుత్వమే వీటికి ఆమోదం తెలపలేదు. దీన్ని పట్టించుకోని ఉన్నతాధికారుల చర్యలు ముందుకే సాగాయి. ఈ టెండర్ల నిర్వహణలో అత్యధిక ప్యాకేజీలు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్కు చెందిన రిత్విక్ ప్రాజెక్టŠస్ సంస్థకే దక్కాయి. ఈ సంస్థ 2 నుంచి 5శాతం వరకు అదనంగా టెండర్లు వేసినా.. పనులు ఆ సంస్థకే అప్పగించారు. ఎక్సెస్ కారణంగా పనుల విలువ రూ.800 కోట్లు దాటింది. అలాగే 11, 14, 56 ప్యాకేజీ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల డిపాజిట్లు, బ్యాంకు గ్యారెంటీ సొమ్మును స్వాధీనం చేసుని పనులు రద్దు చేశారు. ఇలావుండగా గత ప్రభుత్వ ఆమోదం లేకున్నా రీటెండర్లతో జరిగిన పనులకు కోట్ల బిల్లులు చెల్లించారు. ఇంకా పనులు, పెండింగ్ బకాయిలు ఉన్నాయి. ఈ విషయమై అనంతపురం ఎస్ఈ వెంకటరమణ వివరణ కోరగా, రీటెండర్ల నిర్వహణకు గత ప్రభుత్వం పాలనాపరమైన ఆమోదం ఇచ్చిందని చెప్పారు. చిత్తూరు రీటెండర్లకు ఆమోదం.. అనంతపురం జిల్లాలో సాగిన రీటెండర్ల వ్యవహారానికి గత ప్రభుత్వం ఆమోదించలేదని తెలుస్తుండగా, చిత్తూరు జిల్లాలో జరిగిన రీటెండర్లు, పనుల రద్దుకు గత ప్రభుత్వం 2018 జూలై 5న ఆమోదించి జీఓ నంబర్ 473 జారీ చేసింది. తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాలకు చెందిన 21, 22, 27, 28, 29, 62, 63, 64 ప్యాకేజీల్లో ఆగిపోయిన పనుల్లో కొంతభాగం పనులకు అంచనాలు పెంచి రీటెండర్లు నిర్వహించారు. ఈ ప్యాకేజీ పనులకు రూ.760.410 కోట్లతో అనుమతి ఇవ్వగా, రూ.521.390 కోట్లతో పనులు చేసేందుకు కాంట్రాకర్లతో ఒప్పందం జరిగింది. ఇందులో రూ.504.290 కోట్ల పనులు పూర్తి చేశారు. మిగిలిన రూ.17.100కోట్ల పనులు అసంపూర్తి కావడంతో వాటికి రూ.95.920 కోట్లకు అంచనాలు పెంచి రీటెండర్లు నిర్వహించారు. దీనిపై అప్పటి మదనపల్లె ఎస్ఈ మురళీనాథరెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, ప్యాకేజీ అంచనాలకు లోబడి ఉండటం, అదనపు భారం లేనందున ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే పద్ధతిని అనంతపురం ఉన్నతాధికారులు పాటించకపోవడంతోనే ఆమోదం ఇవ్వలేదని జలనవరులశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. కాగా దీనిపై అనంతపురం జిల్లా ప్రాజెక్టు అధికారులు ప్రభుత్వం నియమించిన కమిటీకి సంబంధిత వివరాలను అందిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు కమిటీ సభ్యులను కలిసి వివరాలను అందించారని సమాచారం. ప్యాకేజీ పనుల రద్దు, వాటి అంచనాల పెంపు, ఆమోదం, దానికి సంబంధించిన చర్యలను సమర్థిచుకునేందుకు రికార్డులను కమిటీకి సమర్పించాల్సి ఉంటుంది. -
ఒకే సంస్థకు అన్ని పనులా!
సాక్షి, అమరావతి : టీడీపీ సర్కార్ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల్లో 60–సీ నిబంధన కింద 268 పనుల నుంచి పాత కాంట్రాక్టర్లను తొలగించటం.. వాటి అంచనా వ్యయం పెంచాక రూ.1,600 కోట్ల విలువైన పనులను సీఎం రమేష్కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్కు అప్పగించడంపై నిపుణుల కమిటీ విస్మయం వ్యక్తం చేసింది. ఒకే సంస్థకు అన్ని పనులు ఎలా అప్పగించారని హంద్రీ–నీవా, గాలేరు–నగరి అధికారులను ప్రశ్నించింది. గురువారం హంద్రీ–నీవా పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి.. శుక్రవారం, శనివారం విజయవాడలో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. గత సర్కార్ హయాంలో చేపట్టిన ఇంజనీరింగ్ పనుల్లో అక్రమాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ బుధవారం హైదరాబాద్లోని పోలవరం అతిథి గృహంలో సమావేశమైంది. పోలవరం కుడి, ఎడమ కాలువలు, అనుసంధానాల పనులను పర్యవేక్షించే ఎస్ఈలు, ఈఈలు, హంద్రీ–నీవా, గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాల సీఈలు, ఎస్ఈలు, ఈఈలు ఈ సమావేశానికి హాజరయ్యారు. హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టుల్లో అధిక శాతం పనులను పాత కాంట్రాక్టర్ల నుంచి 60–సీ నిబంధన కింద తప్పించి.. వాటి అంచనా వ్యయాన్ని పెంచేసి ముగ్గురు కాంట్రాక్టర్లకే అప్పగించడాన్ని నిపుణుల కమిటీ గుర్తించింది. హంద్రీ–నీవాలో పెంచిన అంచనా వ్యయంతో చేపట్టిన పనులను గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నిర్ణయించింది. పోలవరం ఎడమ కాలువ పనుల్లో ఎనిమిది ప్యాకేజీల కాంట్రాక్టర్లను 60–సీ నిబంధన కింద తొలగించి.. కొత్త కాంట్రాక్టర్లకు నామినేషన్ పద్ధతిలో అప్పగించడాన్ని గుర్తించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ అనుమతి లేకుండా నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు పనులు ఎలా అప్పగించారని నిలదీసింది. పోలవరం కుడి కాలువ పనుల్లోనూ ఇదే రీతిలో వ్యవహరించడాన్ని తప్పుబట్టింది. శుక్రవారం, శనివారం విజయవాడలో నిర్వహించే సమావేశానికి పూర్తి సమాచారంతో హాజరుకావాలని ప్రాజెక్టుల అధికారులను కమిటీ ఆదేశించింది. -
అవినీతిపై రాజీలేని పోరు
ప్రథమ ప్రాధాన్యంగా పోలవరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలి.ఆ తర్వాత పట్టణ నిరుపేదల ఇళ్లు, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వంశధార ప్రాజెక్టుల పనులపై విచారించండి. అనంతరం ప్రాధాన్యతల వారీగా వివిధ రంగాల్లో చోటు చేసుకున్న కుంభకోణాలపై విచారణ చేయండి. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన టెండర్లపై ఎవరైనా ఆరోపణలు చేసినా, అసత్య కథనాలు ప్రచురించినా పరువు నష్టం దావా వేస్తాం. జ్యుడిషియల్ కమిషన్కు సాంకేతిక సలహాలు అందించడం కోసం నిపుణుల కమిటి సేవలు వినియోగించుకుంటాం. ప్రతి 15 రోజులకు ఒకసారి మీతో భేటీ అవుతా. విచారణ పురోగతిని సమీక్షించి ఏవైనా సమస్యలుంటే అప్పటికప్పుడు పరిష్కరిస్తా. వంద రూపాయల వస్తువు రూ.80కే వస్తుందంటే.. రూ.80కే కొంటామా? లేక రూ.వందకు కొంటామా? కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన చంద్రబాబు సర్కార్ మాత్రం రూ.వందకే కొనుగోలు చేసింది. రాజధానిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.పది వేలు ఖర్చు చేశారు. ఇటీవల మరమ్మతుల కోసం గోడలను పరిశీలిస్తే ఒక్క ఇటుక కూడా కనిపించ లేదు. ఫ్లైవుడ్తో గోడలు కట్టారు. – నిపుణులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు వ్యవస్థీకృతం చేసిన అవినీతిని కూకటి వేళ్లతో పెకలించడమే లక్ష్యంగా పోరాటం ప్రారంభించానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత అవినీతి దేశంలో మరెక్కడా ఉండదని ఢిల్లీలో చర్చ జరుగుతోందన్నారు. దేశంలో అత్యంత అవినీతి సీఎంగా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారని, ఆయన తీరు వల్లే జాతీయ స్థాయిలో రాష్ట్ర పరువు, ప్రతిష్టలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తాను కూడా కళ్లు మూసుకుంటే రాష్ట్రం భవిష్యత్ అధోగతిపాలవుతుందన్నారు. దేశంలోనే అత్యున్నత పారదర్శక విధానాలకు ఆంధ్రప్రదేశ్ను కేంద్రంగా మార్చే వరకు విశ్రమించే ప్రశ్నే లేదని తెగేసి చెప్పారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ పనుల్లో అక్రమాలపై విచారణ చేయడానికి ప్రభుత్వం ఈనెల 14న నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ కమిటీ సభ్యులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటిసారి సమావేశమయ్యారు. నిపుణుల కమిటీ ఏర్పాటు చేయడానికి దారితీసిన పరిస్థితులను వివరించారు. రాష్ట్రంలో 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. అక్రమార్జన కోసం అవినీతిని వ్యవస్థీకృతం చేశారన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అప్పటి వరకు పని చేస్తున్న కాంట్రాక్టర్లపై 60సీ నిబంధన కింద వేటు వేయడం.. మిగిలిపోయిన పని అంచనా వ్యయాన్ని అమాంతం పెంచేయడం.. కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు కుదిరితే నామినేషన్ పద్దతిలో కట్టబెట్టడం, కుదరకపోతే టైలర్ మేడ్ నిబంధనలతో టెండర్ నిర్వహించి అప్పగించడం.. అవసరం లేకపోయినా జీవో 22, జీవో 63 ద్వారా అదనపు నిధులు దోచిపెట్టడం ద్వారా చంద్రబాబు భారీ ఎత్తున దోచుకున్నారని, ఈ దోపిడీ వల్ల రాష్ట్ర ఖజానా అతలాకుతలమైందని వివరించారు. ప్రజా ధనాన్ని మిగిల్చే అధికారులకు సన్మానం చెడిపోయిన వ్యవస్థను బాగు చేయడానికి తాను సిద్ధమైతే, అవినీతిని పట్టించుకోకుండా కళ్లు మూసుకోవాలని కొందరు తనకు ఉచిత సలహాలు ఇచ్చారని సీఎం వైఎస్ జగన్ వివరించారు. ఈ వ్యవస్థలో మార్పు తీసుకురాకపోతే రాష్ట్రానికి భవిష్యత్ ఉండదని, అందుకే అత్యంత పారదర్శకత కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ‘కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన చంద్రబాబు భారీ ఎత్తున కమీషన్లు దండుకుని.. అంచనా వ్యయాన్ని పెంచాలని ఒత్తిడి చేస్తే అధికారులు ఏం చేస్తారు.. ఆ ఒత్తిళ్లకు తలొగ్గి అంచనా వ్యయాన్ని పెంచేశారు.. ప్రజాధనాన్ని ఒకరు దోచేస్తే ఆ తప్పు అధికారులపై పడుతోంది’ అని చెప్పారు. ఉన్నత స్థానంలో ఉన్న వారు నిజాయితీగా ఉంటే దిగువ స్థాయిలో ఉన్న వారు కూడా అలాగే ఉంటారని అభిప్రాయపడ్డారు. అవినీతిని నిర్మూలించడం కోసం తాము కృత నిశ్చయంతో పని చేస్తున్నామని, ఇదే అంశాన్ని కార్యదర్శుల నుంచి విభాగాల అధిపతుల(హెచ్వోడీ) వరకూ స్పష్టం చేశానని.. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలూ తప్పవని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ ఒత్తిడి వల్ల అంచనా వ్యయం పెంచేసి.. ఖజానాకు జరిగిన నష్టాన్ని బయటపెట్టి.. ప్రజాధనాన్ని మిగిల్చే అధికారులకు ప్రజల సమక్షంలో ఘనంగా సన్మానం చేస్తామని పునరుద్ఘాటించారు. శనివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ సభ్యులతో సమావేశమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కళ్లు.. చెవులూ మీరే.. చెడిపోయిన వ్యవస్థను బాగు చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం కోసం అనేక తర్జనభర్జనలు పడ్డామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ‘విభిన్న రంగాల్లో అత్యంత నిష్ణాతులు, నిజాయితీపరులు, నిబద్ధత కలిగిన వారైన మీ ఏడుగురిని నిపుణుల కమిటీకి ఎంపిక చేశాం. మా ప్రభుత్వ కళ్లూ, చెవులూ మీరే. నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా, పారదర్శకంగా విచారణ చేయండి. ఏ ప్రాజెక్టులు అవసరమో.. ఏవి అనవసరమో తేల్చి చెప్పండి.. రివర్స్ టెండరింగ్ నిర్వహించాల్సిన ప్రాజెక్టులు ఏవో సూచించండి.. విచారణకు అవసరమైన సాంకేతిక, మానవ వనరులు.. ఇతరత్రా అన్ని వసతులు సమకూర్చుతాం’ అంటూ నిపుణుల కమిటీకి దిశానిర్దేశం చేశారు. అత్యంత ప్రధానమైన ప్రాజెక్టులకు విచారణ పేరుతో ఆటంకం కలిగించకూడదన్నారు. సాగునీటి ప్రాజెక్టులే కాదు.. పీఏంఏవై పథకం కింద పట్టణ పేదలకు నిర్మిస్తున్న ఇళ్లు మొదలు.. రాజధాని వరకు చంద్రబాబు భారీ కుంభకోణాలకు పాల్పడ్డారని వివరించారు. పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం వాటా రూ.1.50 లక్షలు, రాష్ట్రం వాటా రూ.1.50 లక్షలు.. వెరసి రూ.మూడు లక్షలతో ఇళ్లు నిర్మించి ఇవ్వవచ్చని చెప్పారు. ఇసుక, భూమి ఉచితంగా ఇస్తున్న నేపథ్యంలో చదరపు అడుగు రూ.1,100కే నిర్మించి ఇవ్వవచ్చని, అయితే కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన చంద్రబాబు చదరపు అడుగు రూ.2,200 చొప్పున పనులు కట్టబెట్టడం వల్ల పేదలపై భారం పడిందన్నారు. ఉచితంగా రావాల్సిన ఇంటికి ఒక్కో లబ్ధిదారుడు నెలనెలా రూ.మూడు వేల చొప్పున బ్యాంకుకు కిస్తులు కట్టాల్సిన దుస్థితిని కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులకు పారదర్శకంగా టెండర్లు నిర్వహించేందుకు నమూనా టెండర్ డాక్యుమెంట్ను రూపొందించి ఇవ్వాలని కోరారు. జ్యుడిషియల్ కమిషన్ నేతృత్వంలో టెండర్లు విచారణ అనంతరం రివర్స్ టెండరింగ్ చేయాల్సిన ప్రాజెక్టులను సూచిస్తే, వాటి అంచనా వ్యయాన్ని అలానే ఉంచి.. ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడేలా నిబంధనలు సడలించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. దీని వల్ల ప్రజాధనం ఎంత ఆదా అయిందో ప్రజలకు వివరిస్తామన్నారు. ఇందుకు కారణమైన నిపుణులు, అధికారులకు ప్రజల సమక్షంలో సన్మానం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా భారీ ఎత్తున ప్రాజెక్టులు.. మౌలిక సదుపాయాల కల్పన పనులు తదితరాలు చేపడతామని.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి ప్రసారమాధ్యమాలు లేనిపోని ఆరోపణలు చేయడానికి సిద్ధంగా ఉంటాయన్నారు. రాష్ట్రంలో నిర్వీర్యమైన టెండర్ల వ్యవస్థకు జీవం పోసేందుకు జ్యుడిషియల్ కమిషన్ నేతృత్వంలో టెండర్లు నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. ఇప్పటికే హైకోర్టు చీఫ్ జస్టిస్ను కలిసి ఇందుకోసం జడ్జిని కేటాయించాలని కోరామని గుర్తు చేశారు. రూ.వంద కోట్ల కంటే ఎక్కువ విలువైన పనుల టెండర్ డాక్యుమెంట్ను జ్యుడిషియల్ కమిషన్కు పంపుతామని.. దాన్ని ఏడు రోజులపాటు పబ్లిక్ డొమైన్లో ఉంచుతామని.. ప్రజలు చేసే సూచనల ఆధారంగా టెండర్ డాక్యుమెంట్లో జ్యుడిషియల్ కమిషన్ మార్పులు చేర్పులు చేసి ఎనిమిది రోజుల్లోగా సర్కార్కు అందిస్తుందని చెప్పారు. జ్యుడిషియల్ కమిషన్ ఖరారు చేసిన డాక్యుమెంట్తోనే టెండర్లు నిర్వహిస్తామని, దీని వల్ల అక్రమాలకు తావు ఉండదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నిపుణుల కమిటీ సభ్యులు రిటైర్డు ఈఎన్సీలు ఎల్.నారాయణరెడ్డి, అబ్దుల్ బషీర్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు పి.సూర్యప్రకాశ్, రిటైర్డు ఈఎన్సీ సుబ్బరాయశర్మ (రహదారులు, భవనాల శాఖ), రిటైర్డు ఈఎన్సీ ఎఫ్సీఎస్ పీటర్ (రహదారులు, భవనాల శాఖ), ఏపీ జెన్కో రిటైర్డ్ డైరెక్టర్ ఆదిశేషు, సీడీవో రిటైర్డు సీఈ ఐఎస్ఎన్ రాజు, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉప్పొంగిన ‘మేఘా’ మేడిగడ్డ
కాళేశ్వరం: రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కీలక ఘట్టం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఆవిష్కృతం అయ్యింది. అరుదైన దృశ్యం కనువిందు చేసింది. గోదావరి జలాలు మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రం నుంచి అన్నారం బ్యారేజీ వైపు ఉరకలు వేశాయి. గోదావరి తన సహజసిద్ధ ప్రవాహానికి విరుద్ధంగా దిగువ నుంచి ఎగువకు ప్రవహించింది. ఇది అరుదైన దృశ్యం. మేడిగడ్డ (కన్నెపల్లి) పంపుహౌస్లోని ఆరో నంబర్ యూనిట్ ను తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్విచ్ ఆన్ చేయడంతో మెషీన్ నుంచి 40 క్యూమెక్స్ గోదావరి జలాలు 1.053 కిలో మీటర్ ప్రెషర్ మేయిన్స్ ద్వారా ప్రయాణించి డెలివరీ సిస్టర్న్ ద్వారా కాలువలోకి విడుదలయ్యింది. ఈ దృశ్యం కనువిందు చేసింది. పుడమి తల్లిని పులకరింపజేసింది. బీడువారిన తెంగాణ భూములను పచ్చని పంటలతో బంగారు తెలంగాణగా రూపుదిద్దేందుకు పంపుహౌస్ నుంచి నీళ్లు పరుగు తీశాయి. ఈ దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. అందులోనూ మేడిగడ్డ నీళ్లు అన్నారం వైపు పరుగులు తీసే తొలి దృశ్యం కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం కాళేశ్వరం పథకం ప్రారంభంలో భాగంగా మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) సంస్థ నిర్మించిన మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రం నుంచి మూడు మెషీన్ల ద్వారా గోదావరి నీళ్లు ఉరకలేశాయి. ఈ కార్యక్రమంలో ఇఎన్సి వెంకటేశ్వర్లు, ఇరు రాష్ట్రాల మంత్రులు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మేఘా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పివి కృష్ణారెడ్డి, డైరెక్టర్ బి. శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిధిగా హాజరుకాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మేడిగడ్డ పంప్ హౌస్ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రపంచంలోనే అరుదైన, అతిపెద్దదైన ఎత్తిపోతల పథకంగా విశిష్టత సంతరించుకోగా అందులో మేడిగడ్డకు మరో ప్రత్యేకత ఉంది. ఈ ఎత్తిపోతల పథకంలో మొత్తం 22 పంపింగ్ స్టేషన్లు ఉండగా అందులో మేడిగడ్డ మొదటిది కావటం విశేషం. మేడిగడ్డ పంపింగ్ కేంద్రంలో 17 మెషీన్లు ఉండగా, ఒక్కో మెషీన్ 40 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేసి 60 క్యుమెక్స్ నీటిని డెలివరీ సిస్ట్రన్ ద్వారా గురుత్వాకర్షణ కాలువలోకి (13.5 కిలోమీటర్స్) నీటిని విడుదల చేస్తుంది. అంతకుముందు పంప్ నుంచి (ప్రెషర్ మెయిన్) 1.53 కిలోమీటర్ల డెలివరీ మెయిన్ ద్వారా ప్రయాణించి కాలువలోకి చేరిన నీరు అన్నారం బ్యారేజ్లోకి చేరుతుంది. కాళేశ్వరం పథకంలో మొత్తం 22 ఎత్తిపోతల కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. అందులో 17 కేంద్రాలను ఎంఈఐఎల్ నిర్మిస్తున్నది. మొదటి దశ కింద లింక్-1లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌస్లను నీటిని పంపు చేసేందుకు సిద్ధం చేసింది. అదే విధంగా లింక్-2 లోని ప్రపంచంలోని అతిపెద్దదైన భూగర్భ పంపింగ్ కేంద్రం ప్యాకేజీ-8 నుంచి రోజుకు 2 టిఎంసీల నీటిని పంపుచేసే విధంగా సిద్ధం చేసింది. మేడిగడ్డ పంప్హౌస్లో ఒక్కొక్క యూనిట్ 40 మెగావాట్ల సామర్థ్యంతో 60 క్యూమెక్స్ నీటిని ఎత్తిపోసే విధంగా నిర్మించారు. 91 మీటర్ల ఎత్తున గోదావరికి ఆనుకుని నిర్మించిన ఈ కేంద్రంలో మొత్తం 660 క్యూమెక్స్ నీటిని ఎత్తిపోయానేది లక్ష్యం. ఇందులో మొదటిదశ కింద 11 యూనిట్లతో 440 మెగావాట్ల పంపింగ్ కేంద్రం పనిచేస్తుంటుంది. దాదాపు ఏడాదిన్నర కాలంలో అతిపెద్దదయిన ఈ ఎత్తిపోతల కేంద్రాన్ని నిర్మించడంలో ఎలక్ట్రోమెకానికల్ పనులతో పాటు సివిల్ పనులకు ప్రత్యేకత ఉంది. అప్రోచ్ కాలువ 9.75 లక్షల ఘనపు మీటర్ల సామర్థ్యంతోనూ, వీటి గోడలు 51వేల ఘనపు మీటర్లతోనూ, పంప్హౌస్ ముందుభాగం 45.73 లక్షల ఘనపు మీటర్లతోను నిర్మించారు. ఇంత తక్కువ కాలంలో వీటిని నిర్మించడం ఎంఈఐఎల్కు మాత్రమే సాధ్యమైంది. ప్రెషర్ మెయిన్కు 10.56, డెలివరీ సిస్టర్న్కు 10.50, మొత్తం అన్నీ కలిపి 77.07 లక్షల ఘనపు మీటర్ల పనిని ఎంఈఐఎల్ పూర్తి చేసింది. మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన నీటిని మళ్లీ అన్నారం బ్యారేజీ ఎగువ భాగంలోకి చేర్చడానికి అవసరమైన భారీ కాలువను కోటి యాభై లక్షల ఘనపు మీటర్ల సామర్థ్యంతో పూర్తి చేసింది. గోదావరి నీటిని ఎత్తిపోయడం మేడిగడ్డ నుంచే మొదవుతుంది. పైగా భూ ఉపరితంపైన ఇంతవరకు ఎక్కడా లేని స్థాయిలో తొలిసారిగా భారీ ఎత్తిపోత కేంద్రం మేడిగడ్డ వద్ద నిర్మితమై పాక్షికంగా వినియోగంలోకి వచ్చింది. ఇప్పటి వరకు దేశం మొత్తం మీద అత్యధిక సామర్థ్యం కలిగిన ఎత్తిపోతల పంపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత ఎంఈఐఎల్ దక్కించుకుంది. ఇప్పుడు తాజాగా భూ ఉపరితంపైన అతిపెద్ద ఎత్తిపోత కేంద్రం మేడిగడ్డ వద్ద 440 మెగావాట్లతో ఏర్పాటు చేసిన ఘనత కూడా ఈ సంస్థకే దక్కింది. ఇప్పటికే లింక్-1లోని దాదాపుగా అన్ని యూనిట్లను ఎంఇఐఎల్ పంపింగ్ కు సిద్ధం చేసింది. ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్ట్లో 4627 మెగావాట్ల సామర్థ్యంతో 120 పంపింగ్ యూనిట్లు ఏర్పాటవుతుండగా అందులో 105 యూనిట్లను ఎంఈఐఎల్ నిర్మిస్తోంది. దీనిని బట్టి కాళేశ్వరంలో ప్రధాన పాత్రను ఎంఈఐఎల్ నిర్వహిస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన పంప్లు, మోటార్లను బీహెచ్ఈఎల్, ఆండ్రిజ్, జైలమ్ లాంటి ఎలక్ట్రోమెకానికల్ సంస్థలు సమకూరుస్తున్నాయి. అయితే నిర్మాణ పని మొత్తం ఎంఈఐఎల్ చేస్తోంది. ఇంతవరకూ ప్రపంచంలో ఒకేచోట 17 మెషీన్లతో పంపింగ్ కేంద్రం ఏర్పాటు కావడం ఎక్కడా లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ హంద్రీనీవా ఒక్కటే అతిపెద్దది కాగా, నిర్మాణంలో వున్న దేవాదుల కూడా పెద్దదే. కాగా, వాటిలో ఏ పంపింగ్ కేంద్రంలోనూ లేనంతగా మేడిగడ్డ పంపింగ్ కేంద్రంలో 17 మెషీన్లు ఏర్పాటు అవుతున్నాయి. ఇందులో మొదటిదశ ఇప్పుడు వినియోగంలోకి రాగా, రెండవ దశ పనులు కొనసాగుతున్నాయి. మొత్తం 17 మెషీన్ల ద్వారా 868 మెగావాట్ల పంపింగ్ సామర్ధ్యం వుండటం మరో ప్రత్యేకత. మెషీన్ల సంఖ్య రీతా.. ఇంతపెద్ద పంపింగ్ కేంద్రం ఇంతవరకూ ఎక్కడా ఏర్పాటు కాలేదు. ఎంఈఐఎల్ ప్రపంచంలోనే అతితక్కువ సమయంలో మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రాన్ని కాళేశ్వరం సమీపంలో కన్నెపల్లి గ్రామం వద్ద నిర్మించింది. ప్రపంచంలో పెద్ద ఎత్తిపోతల పథకాలుగా పరిగణించే కొలరాడో (అమెరికా), గ్రేట్ మ్యాన్మేడ్ వండర్ (లిబియా) పథకాలతో పాటు దేశంలోని హంద్రీ-నీవా, కల్వకుర్తి, ఏఎమ్ఆర్పీ, దేవాదుల మొదలైన పథకాలు పూర్తి కావడానికి ఏళ్ళు పట్టింది. కొన్ని పథకాలైతే రెండు, మూడు దశాబ్దాల సమయం పట్టింది. కానీ మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రాన్ని కేవలం ఏడాదిన్నర సమయంలోపే ఎంఈఐఎల్ పూర్తి చేసింది. భారీ విద్యుత్ వ్యవస్థ: కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ విద్యుత్ వ్యవస్థను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. రోజుకు 3 టిఎంసీ నీటిని పంపు చేసేందుకు గరిష్టంగా 7152 మెగావాట్ల విద్యుత్ అవసరం. మొదటిదశలో రెండు టిఎంసీల నీటినిసరఫరా చేసేందుకు 4992 మెగావాట్ల విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయగా.. ఇందులో 3057 మెగావాట్ల విద్యుత్ సరఫరా వ్యవస్థను, అందులో సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ట్రాన్స్మిషన్ లైన్లను ఎంఇఐఎల్ ఏర్పాటు చేసింది. తాగు, సాగునీటి అవసరా కోసం ఇంత పెద్ద విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. -
జలవనరుల శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
జలవనరుల శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
సాక్షి, అమరాతి : వివిధ విభాగాల పనితీరును సమీక్షిస్తూ దిశానిర్దేశం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జలవనరుల విభాగం పనితీరుపై మరోసారి సమీక్ష నిర్వహించారు. గతవారం కూడా జలవనరుల విభాగం అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. సాగు, తాగు నీటి ప్రాజెక్టులతో అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదంటూ అధికారులకు స్పష్టం చేశారు. సమగ్ర నివేదిక, వివరాలతో మరోసారి రావాలని ఆధికారులను ఆదేశించడంతో గురువారం తాడేపల్లి క్యాంపు ఆఫీస్లో మరోసారి సమావేశమయ్యారు. సాగు నీటి ప్రాజెక్టులపై థర్డ్పార్టీ విచారణ చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అవసరమైతే కొన్ని ప్రాజెక్టులలో రీటెండరింగ్కు వెళ్లాలని సీఎం జగన్ సూచించారు. ప్రధాన ప్రాజెక్టుల కాంట్రాక్టుల మంజూరు, ఖర్చులపై థర్డ్ పార్టీ విచారణ చేయించాలని సీఎం జగన్ యోచిస్తున్నారు. థర్డ్ పార్టీ సభ్యులుగా నీటిపారుదలరంగ, సాంకేతిక నిపుణులు ఉండాలని ఆదేశించారు. ప్రాజెక్టుల్లో అవినీతి ఉండకూడదని, రైతులకు ప్రయోజనాలే ముఖ్యమని సీఎం వైఎస్ జగన్ అధికారులకు తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పి.వి.రమేష్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్. రావత్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి కె.ధనంజయ్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. -
సాగు నీరు.. నిధుల జోరు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పరుగులు పెట్టించే క్రమంలో భాగంగా వచ్చే బడ్జెట్లోనూ భారీగా నిధులు పారించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రెండున్నరేళ్లలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి కోటి ఎకరాలకు నీరు అందించాలన్నదే తమ ముందున్న ప్రధాన లక్ష్యమంటున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అందుకు తగ్గ్గట్టే నిధుల కేటాయింపు చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. గడిచిన రెండు, మూడు బడ్జెట్ల్లో కేటాయించిన మాదిరే ఈసారి కూడా రూ.25 వేల కోట్లకు తగ్గకుండా కేటాయింపులు చేసి సాగునీటికి అగ్రపీఠం కట్టబెట్టాలని, అందుకు తగ్గట్లే పనులు చేయించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా రూ.26,452 కోట్లతో ఇప్పటికే ప్రాథమిక బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిని ప్రభుత్వ పరిశీలనకు పంపిన అనంతరం రూ.25 వేల కోట్లకు సర్దుబాటు చేసే అవకాశాలున్నాయని నీటి పారుదల వర్గాలు తెలిపాయి. రుణాలతో గట్టెక్కారు... 2018–19 ఆర్థిక ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో సాగునీటి రంగానికి రూ.25వేల కోట్లు కేటాయించారు. ఇందులో ఇప్పటికే రూ.18,450 కోట్ల మేర ఖర్చు చేశారు. మరో రూ.5,535 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. మొత్తంగా సుమారు రూ.24 కోట్ల మేర పనులు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో ఎక్కువగా కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధుల సమీకరణ కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా రూ.10,476 కోట్ల రుణాలు తీసుకొని బిల్లులు చెల్లించారు. ఇక సీతారామ, దేవాదుల, ఎఫ్ఎఫ్సీ, ఎస్సారెస్పీ–2లను కలిపి ఏర్పాటు చేసిన మరో కార్పొరేషన్ ద్వారా రూ.2,439 కోట్ల రుణాలు తీసుకున్నారు. మొత్తంగా సుమారు రూ.13 వేల కోట్లు రుణాల ద్వారా సేకరించగా, రాష్ట్ర ప్రభుత్వం తన పద్దు నుంచి కేవలం రూ.5,535కోట్లు కేటాయించింది. మొత్తంగా రుణాల ద్వారానే ఈ ఏడాది బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులన్నీ గట్టెక్కాయి. మొదటి ప్రాధాన్యత కాళేశ్వరానికే... సీఎం ఆలోచనలకు తగినట్లుగా ప్రస్తుత బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మొత్తంగా రూ.26,452 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ఇందులో మళ్లీ తొలి ప్రాధాన్యం కాళేశ్వరం ప్రాజెక్టుకే దక్కనుంది. ప్రాజెక్టుకు గత ఏడాది రూ.6,157 కోట్ల మేర నిధులు కేటాయించారు. అందుకు తగ్గట్లే పనులు జరుగుతున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఖరీఫ్ నాటికి నీళ్లందించాలని సీఎం లక్ష్యంగా నిర్ణయించారు. ఆ మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ, పంప్హౌజ్లతో పాటు ఎల్లంపల్లి దిగువన మల్లన్నసాగర్ వరకు ఉన్న అన్ని బ్యారేజీల నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నారు. దీని కోసం వచ్చే బడ్జెట్లో ఏకంగా రూ. 9,205 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తర్వాతి స్థానంలో పాలమూరు–రంగారెడ్డికి రూ.3,214 కోట్లు కేటాయించాలని కోరారు. దేవాదుల పరిధిలో లింగంపల్లి బ్యారేజీతో పాటు ఇతర పైప్లైన్ల నిర్మాణం చేపట్టాల్సి ఉన్నందున ఇక్కడ రూ.2,052 కోట్లు, ఖమ్మం జిల్లాలోని సీతారామ సహా ఇతర చిన్న తరహా ప్రాజెక్టులకు కలిపి రూ.1,346 కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటితో పాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా వంటి ప్రాజెక్టులను వంద శాతం పూర్తి చేసేందుకు రూ.1,346 కోట్ల నిధులు అవసరమని అంచనా వేశారు. ఇక మైనర్ ఇరిగేషన్ కింద చిన్న నీటి వనరుల అభివృద్ధి, మిషన్ కాకతీయకు రూ.2,727 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి. సీతారామ, పాలమూరుపై ఫోకస్.. ఇక కొత్త ఏడాదిలో జనవరి నుంచి పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఏడాదిన్నరలో ఈ ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టిన ముఖ్యమంత్రి అందుకు తగ్గట్టే ఆర్థిక వనరులను సమకూర్చేలా ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రాజెక్టు పరిధిలో ఈ ఏడాది మార్చి నుంచి సుమారు రూ.1,500 కోట్ల మేర బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ దృష్ట్యా నిధుల కొరత లేకుండా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.17వేల కోట్ల మేర రుణాలు తీసుకునేందుకు నిర్ణయం జరగ్గా, చర్చల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ చర్చలను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసి ఏప్రిల్ నుంచి పనులను వేగిరం చేయాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. ఇక సీతారామ ఎత్తిపోతలకు రుణాల ప్రక్రియ కొలిక్కి వచ్చినందున ప్రాజెక్టును వేగిరం చేసే దిశగా కేసీఆర్ ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరికొన్ని రోజుల్లో స్వయంగా ప్రాజెక్టు పరిధిలో పర్యటించనున్నారు. ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో ప్రతిపాదనలు ఇలా..(రూ.కోట్లలో) ప్రాజెక్టు బడ్జెట్ ప్రతిపాదన కాళేశ్వరం 9,205 పాలమూరు–రంగారెడ్డి 3,214 కంతనపల్లి 845 ఖమ్మం జిల్లా ప్రాజెక్టులు 1,346 ఆదిలాబాద్ ప్రాజెక్టులు 922 వరద కాల్వ, ఎల్లంపల్లి 1,121 దేవాదుల 2,052 నల్లగొండ ప్రాజెక్టులు 1,621 ఎస్సారెస్పీ 338 మైనర్ ఇరిగేషన్ 2,727 -
భూమాయలో ఎన్నెన్ని సిత్రాలో!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ భూములను మాయం చేయడంలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా బరితెగించారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ భూములను వినియో గించుకుంటే, అవి తమవేనని నకిలీ పత్రాలు సృష్టించి, నష్టపరిహారం కాజేస్తున్నారు. అసైన్మెంట్ కమిటీలతో నిమిత్తం లేకుండా అసైన్డ్ పట్టాలు సృష్టించి సర్కారు భూములను మింగేస్తున్న వారు కొందరైతే వాటిని వంశపారంపర్యంగా సంక్రమించిన ప్రైవేటు జిరాయితీ పట్టా భూములుగా వెబ్ల్యాండ్లో నమోదు చేయించి, అమ్మేసుకుంటున్న మాయగాళ్లు ఇంకెందరో! నిబంధనలతో, సర్కారు ఉత్తర్వులతో ఎలాంటి సంబంధం లేకుండా ముడుపులిస్తే చాలు రాత్రికి రాత్రే అసైన్మెంట్ పట్టాలు చేతుల్లోకి వచ్చేస్తున్నాయి. అసైన్మెంట్ రిజిస్టర్లే మారిపోతున్నాయి. ఖాళీగా ఉన్న బంజరుకు ఎన్ని పట్టాలో... గతంలో అసైన్మెంట్ పట్టాలు తీసుకుని సాగు చేయకుండా బంజరుగానే ఉంచిన భూములు అన్ని గ్రామాల్లో ఉన్నాయి. ఇలాంటి భూములకు ప్రస్తుత అధికారులు, రిటైర్డు అధికారులు కుమ్మక్కై రికార్డులను తారుమారు చేసి ఇతరులకు మళ్లీ పట్టాలు ఇచ్చేస్తున్నారు. దీంతో ఒకే భూమికి ఇద్దరు ముగ్గురి చేతుల్లో అసైన్డ్ పట్టాలు ఉంటున్నాయి. ఒక సర్వే నంబరు (కంపార్టుమెంట్)లో 50 ఎకరాల భూమి ఉంటే సబ్ డివిజన్ చేయకుండానే 130 ఎకరాలకు పట్టాలు ఇచ్చిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. సబ్ డివిజన్ చేయకుండా రెవెన్యూ కార్యాలయాల్లోని పుస్తకాల్లో నమోదు చేయకుండా రిటైర్డు అధికారులు నకిలీ పట్టాలు ఇవ్వడంవల్లే ఈ సమస్య ఏర్పడిందని కొందరు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత అధికారులు కూడా రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయి, కాసులకు కక్కుర్తిపడి ఇలా చేస్తున్నారని ఒక జిల్లా కలెక్టర్ చెప్పారు. పట్టాలిప్పించే ముఠాల హల్చల్ డబ్బులు తీసుకుని అసైన్మెంట్ పట్టాలు సృష్టించి ఇచ్చే ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఇలాంటి ముఠాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న కొందరు రెవెన్యూ ఉద్యోగులతోపాటు కొందరు రిటైర్డు అధికారులు కీలక భూమిక పోషిస్తున్నారు. వారి వద్ద ఖాళీ పట్టాదారు పాసుపుస్తకాలు, భూయాజమాన్య హక్కు పత్రాలు, రెవెన్యూ కార్యాలయ స్టాంపులు ఉన్నాయి. నకిలీ పట్టాలు, రికార్డులు సృష్టించే ఈ ముఠాలకు అధికార పార్టీ నాయకుల ఆశీస్సులు దక్కుతున్నాయి. అధికార టీడీపీ నాయకులు అడిగిన పనులు చేసిపెడుతూ భారీగా ఆర్జిస్తున్నారు. సర్కారు భూములపై నకిలీ హక్కు పత్రాలు ఇచ్చేస్తున్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడంతోపాటు భూ అనుభవపత్రం (అడంగల్), భూ యాజమాన్యపత్రం (1బి)లో కూడా పేర్లు చేర్పిస్తున్నారు. వీటి జిరాక్స్ పత్రాలతో మీ–సేవలో, వ్యక్తిగతంగానూ తహసీల్దార్లకు దరఖాస్తు చేసి అన్ని రికార్డులు పక్కాగా ఉన్నాయంటూ మ్యుటేషన్ (వెబ్ల్యాండ్లో నమోదు) చేయిస్తున్నారు. చాలామంది తహసీల్దార్లకు ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు తెలిసినా వారికి ముట్టాల్సింది ముడుతున్నందున రికార్డులన్నీ సక్రమంగా ఉన్నాయంటూ ప్రొసీడింగ్స్ ప్రకారం ఆన్లైన్ చేస్తున్నారు. జిరాయితీ జాబితాలో అసైన్డ్ భూములు అసైన్మెంట్ కమిటీల ఆమోదం లేకుండానే అసైన్మెంట్ (డీకేటీ) పట్టాలు ఇవ్వడమే కాదు, కొందరు అక్రమార్కులు మరో అడుగు ముందుకేసి ఈ డీకేటీ భూములను జిరాయితీ పట్టా భూములుగా వెబ్ల్యాండ్లో, రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. వంశపారంపర్యంగా వచ్చిన జిరాయితీ పట్టా భూములని వెబ్ల్యాండ్లో నమోదు చేయించి అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. అసైన్డ్ భూములకు అనుభవ హక్కులు తప్ప విక్రయ హక్కులు ఉండవు. అందువల్ల అధికార పార్టీ నాయకులు అసైన్డ్ భూములను వంశపారంపర్యంగా సంక్రమించిన పట్టా భూములుగా మ్యుటేషన్ పేరుతో వెబ్ల్యాండ్లో నమోదు చేయించుకుంటున్నారు. బినామీ పేర్లతో ఇలా కొట్టేసిన భూములను అమ్మేసి చోటా నాయకులు సైతం రూ.లక్షలు దండుకుంటున్నారు. ఫోర్జరీ పత్రాలతో నష్టపరిహారం స్వాహా వైఎస్సార్ జిల్లాలో గండికోట ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించిన నష్టపరిహారం చెల్లింపులో అక్రమాలు బయటపడ్డాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం మండలం బుక్కపట్నం మాజీ సర్పంచి, టీడీపీ నాయకుడు చెక్కా పెద్ద ఓబుళరాజు, చెక్కా ఓబుళమ్మ, చెక్కా రత్నమ్మ, చెక్కా కాంతమ్మ, దాసరి జయలక్ష్మి( ఓబుళరాజు బంధువులు) పేర్లతో ప్రభుత్వ భూమికి నకిలీ డీకేటీ పట్టాలు సృష్టించారు. తమకే చెందిన ఈ భూములు గండికోట ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యాయంటూ ప్రభుత్వం నుంచి రూ.27.78 లక్షల నష్టపరిహారం కొట్టేశారు. నాలుగు రోజుల క్రితమే వారిపై ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో అధికారులు కేసు నమోదు చేశారు. ఆ రికార్డులన్నీ బోగస్ వైఎస్సార్ జిల్లా బి.కోడూరు మండలం కామకుంటలో డీవీ పార్థసారథి, చిలకపాటి రత్నకుమారికి స్వాతంత్య్ర సమరయోధుల కోటా కింద 19.50 ఎకరాలకు డీకేటీ పట్టాలు ఇచ్చారు. వీరికి పాసు పుస్తకాలు కూడా జారీ అయ్యాయి. ఇవే భూములకు అవే సర్వే నంబర్లతో దేవర్ల శివశంకర్రెడ్డి, కుంబాల భాస్కర్రెడ్డి, గాజులపల్లె చెన్నకేశవరెడ్డి, వర్ధిరెడ్డి శ్రీనివాసులు పేరిట స్వాతంత్య్ర సమరయోధుల కోటా కింద మళ్లీ పట్టాలు ఇచ్చారు. పైగా స్వాతంత్య్ర సమరయోధుల కోటా కింద పట్టాలు పొందిన వారెవరూ ఉన్న దాఖలాలు కూడా లేవు. దీన్నిబట్టి అప్పట్లోనే ఈ పట్టాలు ఉద్దేశపూర్వకంగా సృష్టించినవేనని తేటతెల్లమవుతోంది. మాజీ సైనికులకు ఇచ్చిన పట్టాలైతే పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చనే వెసులుబాటు ఉంది. అందువల్లే ఇలా సృష్టించారు. అప్పట్లో స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికుల పేరిట జారీ చేసిన రికార్డులన్నీ బోగసేనని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. (బాక్స్లో పెట్టుకోవాలి) + నెల్లూరు జిల్లాలో ఒకే భూమిని తమ పేర్లతో ఆన్లైన్లో నమోదు చేయాలంటూ ఇద్దరు ముగ్గురు అసైన్మెంట్ పట్టాలు తీసుకొచ్చి అర్జీలు పెడుతున్నారు. దీంతో ఏంచేయాలో తెలియని తహసీల్దారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయకుడు 100 ఎకరాల భూమికి బినామీ పేర్లతో అసైన్మెంట్ పట్టాలు పొందాడు. + విజయనగరం జిల్లాకు చెందిన ఒక స్వాతంత్య్ర సమరయోధుడికి ఇచ్చిన డి పట్టా భూమి తనదంటూ మరో మాజీ సైనికుడు అధికారులను ఆశ్రయించాడు. + విశాఖ జిల్లాలో ఇద్దరు మాజీ సైనికులకు చెందిన భూమిని అధికార పార్టీ నాయకులు కొనుగోలు చేసినట్లు రికార్డులు సృష్టించారు. + కృష్ణా జిల్లాలో ఒక మాజీ సైనికుడికి ఇచ్చిన పట్టా భూమికే తనకూ పట్టా ఉందంటూ ఒకరు వీలునామా రాయించారు. + వైఎస్సార్ జిల్లాలో ఒక వ్యక్తి సాగు చేసుకుంటున్న భూమి తనదంటూ మరొకరు పట్టాదారు పాసుపుస్తకం, భూమి హక్కు యాజమాన్య పత్రం అధికారుల వద్దకు తీసుకెళ్లాడు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలే. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇలాంటి బాగోతాలు చోటుచేసుకుంటున్నాయి. -
‘పులకుర్తి’ మరోసారి ప్రారంభం
కర్నూలు సిటీ: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాప్రయోజనాల కంటే ప్రచారార్భాటానికే తెలుగు దేశం పార్టీ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల్లో ఈ విషయం తేటతెల్లమవుతోంది. ఏ పనైనా పూర్తయిన తరువాత ప్రారంభోత్సవం చేస్తుంటారు. అయితే టీడీపీ మాత్రం తమ ప్రచార అవసరాల కోసం పూర్తికాని పులకుర్తి ఎత్తిపోతల పథకాన్ని రెండు సార్లు జాతికి అంకితం చేసి ఔరా అనిపించింది. గతంలో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం విషయంలోనూ ఇదే జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన సమయంలో ఏ ఒక్క రోజు కూడా సాగునీటి ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు. ప్ర‘జల’ కష్టాలు తెలుసుకున్న దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి..సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. తన హయాంలో తుంగభద్ర దిగువ కాలువ చివరి ఆయకట్టుకు నీరు రావడం లేదని గుర్తించి, తుంగభద్ర నది నుంచి నీటిని ఎత్తిపోసేందుకు పులకుర్తి ఎత్తిపోతల పథకానికి అనుమతులు జారీ చేశారు. అదే విధంగా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి 2008లో శంకుస్థాపన చేశారు. ఈ రెండు పథకాల గురించి టీడీపీ అధినేత చంద్రబాబు ఏ రోజూ అలోచించ లేదు. అయితే అంతా తానే చేసినట్లు..పూర్తికాని ప్రాజెక్టులను రెండు సార్లు ప్రారంభోత్సవం చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గతేడాది జనవరి 1వ తేదీన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పూర్తికాకపోయినా ఒక మోటర్తోనే ప్రారంభోత్సవం చేశారు. అదే ఏడాది సెప్టెంబరు 7వ తేదీన రెండో సారి రెండో మోటర్ ఏర్పాటు చేసి ప్రారంభించారు. పులకుర్తి ఎత్తిపోతల పథకాన్ని గత నెల 23వ తేదీన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావులు ప్రారంభించారు. మళ్లీ శుక్రవారం.. శ్రీశైలం దగ్గర సీఎం చంద్రబాబు చేత ఎత్తిపోతల పథకాన్ని శుక్రవారం ప్రారంభింపజేశారు. సాగునీటి విషయంలో టీడీపీకి చిత్తశుద్ధి కరువు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో టీడీపీ మొదటి నుంచి నిర్లక్ష్యమే చేస్తోంది. కేసీ కెనాల్ వాటాగా టీబీ డ్యాంలో నిల్వ ఉన్న 5 టీఎంసీల నీటిని 2004 జనవరి 21వ తేదీన అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు.. పెన్నా అహోబిలం రిజర్వాయర్కు మళ్లించారు. కేసీ ఆయకట్టు రైతులను పట్టించుకోలేదు. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్..కేసీ ఆయకట్టు రైతుల ఇబ్బందులు గమనించి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు 2008లో శంకుస్థాపన చేశారు. మొదట్లో వేగంగానే పనులు జరిగినా మహానేత మరణం తరువాత మందగించాయి. పూర్తిస్థాయిలో పనులు చేపట్టకుండానే చంద్రబాబు ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం విమర్శలకు తావిచ్చింది. ఎల్లెల్సీ చివరి ఆయకట్టు అయిన కోడుమూరు సబ్ డివిజన్ పరిధిలోని 9,830 ఎకరాలకు నీరు అందడం లేదని వైఎస్సార్ దృష్టికి వచ్చింది. దీంతో పులకుర్తి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు మహానేత ఉత్తర్వులు ఇచ్చారు. 2014లోనే పూర్తి కావాల్సిన ఈ స్కీమ్ను టీడీపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. టీడీపీ నాయకుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో నేటికి పూర్తి స్థాయిలో çపనులు కాలేదు. అంసపూర్తి పనులతోనే ప్రారంభించిన పది రోజులకే లీకేజీలు, మోటర్లలోని సాంకేతిక సమస్యలతో నిలిచి పోయింది. నిలిచి పోయిన స్కీమ్ను, ఇప్పటికే మంత్రుల చేత ప్రారంభోత్సవం అయిన స్కీమ్ను సీఎం మరో సారి ప్రారంభించడం విమర్శలకు తావిచ్చింది. -
జూరాల నుంచే ‘గట్టు’ ఎత్తిపోతలు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను ఆధారం చేసుకొని గద్వాల జిల్లాలో చేపట్టిన గట్టు ఎత్తిపోతల పథకంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా ఉన్న రేలంపాడు రిజర్వాయర్ నీటిని తీసుకుంటూ ఈ పథకాన్ని చేపట్టాలని మొదట నిర్ణయించగా, ప్రస్తుతం నేరుగా జూరాల నుంచే తీసుకునే దిశగా తుది ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల నేపథ్యంలో జూరాల నుంచి నేరుగా తీసుకునేలా అధికారులు కొత్త ప్రతిపాదన రూపొందించారు. ఈ నేపథ్యంలో అంచనా వ్యయం రూ.553.98 కోట్ల నుంచి రూ.1,597 కోట్లకు చేరుతోంది. 4 టీఎంసీలతో రిజర్వాయర్.. గద్వాల జిల్లాలోని గట్టు, ధారూర్ మండలాల పరిధిలోని 33 వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా గట్టుకు ఈ ఏడాది జూన్ 29న సీఎం ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. దీన్ని రెండు విడతలుగా చేపట్టాలని నిర్ణయించారు. తొలి విడత రూ.459.05 కోట్లు, రెండో విడతను రూ.94.93 కోట్లకు ప్రతిపాదించారు. అయితే, గట్టుకు అవసరమయ్యే 4 టీఎంసీల నీటిని రేలంపాడ్ రిజర్వాయర్ నుంచి తీసుకోవాలని భావించారు. అక్కడి నుంచి నీటిని తీసుకుంటూ 0.7 టీఎంసీల సామర్థ్యమున్న పెంచికలపాడు చెరువును నింపాలని, దీనికోసం అవసరమైతే దాన్ని సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. అయితే, 4 టీఎంసీల మేర నీటిని రేలంపాడ్కు బదులుగా నేరుగా జూరాల ఫోర్షోర్ నుంచి తీసుకుంటేనే ప్రయోజనం ఎక్కువని శంకుస్థాపన సమయంలోనే ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఆ దిశగా అధికారులు అధ్యయనం చేశారు. అనంతరం జూరాల నుంచే నేరుగా నీటిని తీసుకునేలా ప్రతిపాదించారు. దీనికోసం కొత్తగా 4 టీఎంసీల సామర్థ్యంతో గట్టు రిజర్వాయర్ను ప్రతిపాదించారు. జూరాల నుంచి నేరుగా 50 రోజులపాటు 926 క్యూసెక్కుల నీటిని తీసుకునేలా పథకాన్ని రూపొందించారు. కొత్తగా నిర్మించే రిజర్వాయర్ పొడవు 8 కిలోమీటర్లు ఉండనుంది.ఈ మట్టికట్ట నిర్మాణానికి రూ.396.60 కోట్లు ఖర్చు కానుంది. రెండు పంపులను ఉపయోగించి జూరాల నుంచి గట్టు రిజర్వాయర్కు నీటిని తరలిస్తారు. పంప్హౌస్ల నిర్మాణానికి మరో రూ.90 కోట్లు అవసరమవుతుంది. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో మొత్తం 3,825 ఎకరాల మేర ముంపునకు గురికానుంది. ఎకరాకు రూ.6 లక్షల పరిహారం చొప్పున లెక్కగట్టగా భూసేకరణకే రూ.231 కోట్లు అవసరమవుతున్నాయి. ఈ పథకానికి రూ.1,597 కోట్లతో తుది అంచనాలు సిద్ధమయ్యాయి. ఇక టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. -
2 కోట్ల ఎకరాలకు నీళ్లందించాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించకోవడం ద్వారా రెండు కోట్ల ఎకరాలకు నీళ్లందించడానికి చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. జలాశయాలు, చెరువులతో పాటు భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. సోమవారం సచివాలయంలో పోలవరం ప్రాజెక్టుతో పాటు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 86 జలాశయాల్లో 380.68 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని.. చెరువులు, భూగర్భ జలాలు ఇతర వనరులతో కలిపి మొత్తం 867 టీఎంసీలు అందుబాటులో ఉందని అధికారులు వివరించారు. ఈ జలాలను వినియోగించుకుని రెండు కోట్ల ఎకరాలకు నీరు అందించడంపై లోతుగా అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటిదాకా 57.41 శాతం పూర్తయ్యాయని అధికారులు చెప్పారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఇప్పటి వరకూ లక్ష మంది సందర్శించారన్నారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. వంశధార ప్రాజెక్టు రెండో దశ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆ ప్రాజెక్ట్ ఇంజినీర్లను ప్రశంసించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బచ్పన్ విద్యార్థులకు సీఎం అభినందనలు గుంటూరులోని బచ్పన్ ప్లేస్కూల్ విద్యార్థులు గ్రీవెన్స్ భవనంలో సీఎం చంద్రబాబును కలిశారు. రాష్ట్రంలోని ఇతర ప్లేస్కూళ్ల కంటే తమ స్కూల్ ముందువరుసలో ఉందని ఆ పాఠశాల ఉపాధ్యాయులు సీఎంకు చెప్పారు. చిన్నప్పటినుంచే అన్ని విషయాల్లో బాలబాలికలకు అవగాహన కలిగిస్తున్నామని తెలిపారు. గ్రామ కంఠాల సమస్య పరిష్కరించాలి గ్రామ కంఠాల సమస్యను పరిష్కరించకపోవడం వలన పిల్లలకు చదువులు, పెళ్లిళ్లు చేసుకోలేకపోతున్నామని, ఆర్థికంగా చితికిపోతున్నామని రాజధాని పరిధిలోని 29 గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు అవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆ గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో గ్రీవెన్స్ భవన్కు వచ్చారు. సీఎంకు వినతిపత్రం ఇచ్చి తమ బాధలను వెళ్లబోసుకున్నారు. రాజధాని నిర్మాణానికి తామంతా కోట్లాది రూపాయల ఖరీదు చేసే వ్యవసాయ భూములను ప్రభుత్వానికి ఇచ్చామని, అయితే ప్రభుత్వం తమ సమస్యను ఇప్పటి వరకు పరిష్కరించలేదని వాపోయారు. వారి నుంచి వినతి పత్రం స్వీకరించిన సీఎం అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నాలుగేళ్లలో ప్రాజెక్టులపై రూ.45,035 కోట్లు ఖర్చు: దేవినేని రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తిచేస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు పనులను రైతులకు ప్రత్యక్షంగా చూపిస్తున్నామని తెలిపారు. నాలుగేళ్లలో ప్రాజెక్టులపై రూ. 45,035 కోట్లు ఖర్చు చేశామని, రూ. 10,884 కోట్లు ఉపాధి హామీ, జలసంరక్షణ, చెక్ డ్యామ్లకు ఖర్చు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఫారెస్టు డిపార్టుమెంట్లో రూ. 139 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన చెప్పారు. -
కేసీ కెనాల్కు నీటిని విడుదల చేయాలి
కడప కార్పొరేషన్: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కేసీ కెనాల్కు వెంటనే నీటిని విడుదల చేయాలని మైదుకూరు ఎమ్మెల్యే ఎస్ . రఘురామిరెడ్డి, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కమలాపురం, కడప ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్రెడ్డి, అంజద్బాషా, కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్బాబు, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జురెడ్డిలతో కలిసి వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 125ఏళ్ల చరిత్ర కలిగి బ్రిటిషు హయాంలో నిర్మించిన కేసీ కెనాల్కు నీరివ్వకపోవడం దురదృష్టకరమన్నారు. వర్షాలు లేక వేలాది ఎకరాలు బీళ్లుగా మారాయని, రైతులు నష్టాలపాలయ్యే సూచనలు కన్పిస్తున్నాయన్నారు. జిల్లాపై టీడీపీ ప్రభుత్వం ఎందుకింత కక్ష సాధిస్తోందో అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన వర్షాల వల్ల శ్రీశైలంలో 870 అడుగుల నీటిమట్టం ఉందని, అంటే సుమారు 150 టీఎంసీలు నిల్వ ఉందని తెలిపారు. కేసీ కెనాల్ పరిధిలో ఖరీఫ్కు నీరిస్తున్నామని చెప్పి టీడీపీ నాయకులు పది రోజుల క్రితం రాజోలి స్లూయిస్ వద్దకు వెళ్లి ఆర్భాటంగా నీటిని వదిలారన్నారు. టీడీపీ నాయకుల మాటలు విని రైతులు నారుమళ్లు వేసుకున్నారని, కుందూ పరివాహక ప్రాంతంలో నాట్లు నాటేందుకు సిద్దమవుతున్నారన్నారు. ఈలోపే ఉన్నట్టుండి నీరు ఆపేశారన్నారు. లక్ష ఎకరాల ఆయకట్టు ఉన్న కేసీ కెనాల్కు 2వేల క్యూసెక్కుల చొప్పున ఖరీఫ్ వరకు వదలాలని డిమాండ్ చేశారు. దీనిపై కర్నూలు సీఈకి, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇరిగేషన్ మంత్రితో మాట్లాడితే ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారన్నారు. పైర్లు ఎండిపోయాక నిర్ణయం తీసుకొని ఏం లాభమని ఆయన ప్రశ్నించారు. శ్రీశైలంలో పుష్కలంగా నీరున్నప్పటికీ వదలకపోవడం సరికాదన్నారు. విద్యుదుత్పత్తి పేరుతో 40వేల క్యూసెక్కులను నాగార్జున సాగర్కు వదులుతున్నారని, నికర జలాలు కలిగిన కేసీకి ఇవ్వకపోవడం సరికాదన్నారు. ఈ పరిస్థితి వస్తుందనే 2008లో దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి 2.95 టీఎంసీ సామర్థ్యంతో రాజోలి, 0.95టీఎంసీల సామర్థ్యంతో జొలదరాసి రిజర్వాయర్లకు శంకుస్థాపన చేశారన్నారు. వీటి నిర్మాణం పూర్తి చేయాలని ఎన్ని ఆందోళనలు చేసినా, దీక్షలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వెలుగోడు నుంచి 0–18 కీ.మీ వరకు కాలువలు సరిగా లేవని, ఆ పనులు పూర్తి చేస్తే తెలుగుగంగకు నీరు ఇవ్వచ్చన్నారు. దీనిపై తాము కర్నూలు ఐఓబీ సమావేశంలో చెప్పినా, అసెంబ్లీలో లేవనెత్తినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే కడుపు కాలిన రైతులు ప్రభుత్వంపై తిరగబడతారని హెచ్చరించారు. వెంటనే ఇరిగేషన్ మంత్రి సీఎంతో మాట్లాడి కేసీ కెనాల్కు 2వేల క్యూసెక్కులు, వెలుగోడు నుంచి 4వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గాలేరు నగరి, సర్వరాయసాగర్, వామికొండ, పైడిపాళెం రిజర్వాయర్లకు కూడా నీటిని విడుదల చేయాలన్నారు. వర్షాకాలం ఇంకా చాలా ఉందని, సాగునీటికి నీటిని వదలకుండా విద్యుత్ ఉత్పత్తికి తరలించడం ఎంతమాత్రం సరికాదన్నారు. పదివేల క్యూసెక్కులు విడుదల చేస్తే జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు నీరు వస్తాయన్నారు. నీటిని విడుదల చేయకపోతే రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. కేసీకి నీరిచ్చి రైతులను ఆదుకోవాలి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎస్ .రఘురామిరెడ్డి, పి. రవీంద్రనాథ్రెడ్డి, అంజద్బాషా, నగర మేయర్ కె. సురేష్బాబు కోరారు. సోమవారం సాయంత్రం వారు జిల్లా కలెక్టర్ హరికిరణ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.అలాగే జిల్లాలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గుంపగుత్తగా తొలగించిన ఓట్లను మళ్లీ చేర్చాలని వారు కోరారు. ఈ విషయాలపై కలెక్టర్ స్పందిస్తూ ఇరిగేషన అ««ధికారులతో మాట్లాడి నీటి విడుదలకు కృషి చేస్తానని, ఓట్ల తొలగింపుపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. -
సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై ఆ శాఖ మంత్రి హరీశ్రావుతో బహిరంగ చర్చకు తాను సిద్ధమని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే ఎ.రేవంత్రెడ్డి తెలిపారు. అది గన్పార్కు అయినా, ప్రెస్క్లబ్ అయినా తాను రెడీ అని, తమ వాదన తప్పని హరీశ్ నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని ఆయన ప్రకటించారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. హరీశ్కు నిజాయితీ ఉంటే నీళ్లు–నిజాలపై చర్చకు రావాలని సవాల్ చేశారు. నీళ్లను అడ్డుపెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు దోచుకుంటోందని వ్యాఖ్యానించారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.34 వేల కోట్ల అంచనాతో ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు ప్రారంభించి రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పేరు, డిజైన్ మార్చి కాళేశ్వరం పేరుతో వేల కోట్లకు అంచనాలను పెంచింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. అల్లుడు ఆణిముత్యంలా మామ స్వాతిముత్యంలా కేసీఆర్, హరీశ్లు నిత్యం పొగుడుకుంటున్నారని, కేసీఆర్ ప్రారంభించిన ఒక్క సాగునీటి ప్రాజెక్టు పేరేంటో హరీశ్ చెప్పగలరా అని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టర్లు కమీషన్లు ఇవ్వనందుకు ఎస్సెల్బీసీ టన్నెల్ తవ్వకం పనులు నిలిపివేశారని ఆరోపించారు. -
పెరిగిన అంచనాలకు ఓకే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కేబినెట్ సమావేశంలో సాగునీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న సీతారామ ఎత్తిపోతల, ఇందిరమ్మ వరద కాల్వ(ఎఫ్ఎఫ్సీ)ల అంచనా వ్యయాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలో రీ డిజైనింగ్ జరిగిన నేపథ్యంలో మార్పులు జరగడంతో సీతారామ అంచనా వ్యయం రూ.7,926.14 కోట్ల నుంచి రూ.13,057 కోట్లకు పెరగ్గా, ఎఫ్ఎఫ్సీ అంచనా వ్యయం రూ.4,729.26 కోట్ల నుంచి రూ.9,886.27 కోట్లకు పెరిగింది. ఈ పెరిగిన అంచనా వ్యయాలకు కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మార్పులకు తగ్గట్టే పెరిగిన వ్యయాలు శుక్రవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరిగింది. ముఖ్యంగా సీతారామ, ఎఫ్ఎఫ్సీ పరిధిలో జరిగిన మార్పులు, పెరిగిన వ్యయాలపై చర్చించింది. సీతారామ ఎత్తిపోతలతో మొదట 50 టీఎంసీల గోదావరి నీటితో 5 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని భావించారు. దీనికోసం రూ.7,926.41 కోట్లతో పరిపాలనా అనుమతి ఇచ్చారు. అనంతరం సీతారామ ద్వారా 9.30 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. తొలి దశలో 70 టీఎంసీల నీటిని తీసుకుని 6.74 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. దీంతో మార్పులు అనివార్యమయ్యాయి. ప్రధాన కాల్వ ద్వారా తొలుత 4,545 క్యూసెక్కుల నీటిని తీసుకోవాలని భావించగా, దాన్ని 9 వేల క్యూసెక్కులకు పెంచారు. దీంతో భూసేకరణ అవసరం 5,800 హెక్టార్ల నుంచి 7,402 హెక్టార్లకు పెరిగింది. భూసేకరణకు రూ.1,342 కోట్లు లెక్కించగా, అది ప్రస్తుతం రూ.2,011 కోట్లకు పెరిగింది. కాల్వ వ్యవస్థలో మార్పులకు అదనంగా మరో రూ.1,615 కోట్ల వ్యయం పెరుగుతోంది. నీటిసామర్థ్యం పెంచడంతో గతంలో 380 మెగావాట్ల విద్యుత్ అవసరాలను లెక్కించగా ప్రస్తుతం 715 మెగావాట్లుగా లెక్కించారు. దీంతో ఈ విద్యుత్ సరఫరా అవసరాల వ్యయం రూ.1,298 కోట్ల నుంచి రూ.3,264 కోట్ల మేర పెరుగుతోంది. మొత్తంగా ప్రాజెక్టు వ్యయం రూ.13,057 కోట్లకు చేరగా దీన్ని శుక్రవారం కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపారు. 51 ప్యాకేజీలకు గడువు పొడిగింపు ఇక ఎఫ్ఎఫ్సీ వరద కాల్వను రూ.4,729.26 కోట్లతో చేపట్టగా, రీ ఇంజనీరింగ్లో దీని పరిధిలోని గౌరవెల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.4 టీఎంసీ నుంచి 8.23 టీఎంసీలకు, గండిపల్లి సామర్థ్యాన్ని 0.15 నుంచి 1 టీఎంసీ సామర్థ్యానికి పెంచారు. ఆయకట్టు సైతం 2.20 లక్షల ఎకరాలు ఉండగా మరో 32 వేల ఎకరాలకు పెంచారు. దీంతో వ్యయం రూ.9,886.27 కోట్లకు పెరగ్గా, దీనికి కేబినెట్ ఓకే చేసింది. దీంతో పాటే మిడ్మానేరు పరిధిలోని మన్వాడ గ్రామాన్ని పునరావాస గ్రామంగా గుర్తించేందుకు అనుమతించింది. ఇక వీటితో పాటే జీవో 146 కింద ఎస్కలేషన్ ఇచ్చిన 51 ప్యాకేజీల పనులు భూసేకరణతో పూర్తి కాకపోవడంతో వాటి గడువును మరింత కాలం పొడిగించాలని కేబినెట్ నిర్ణయించింది. -
వంచనపై 30న అనంతలో నిరసన దీక్ష
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ముమ్మాటికీ బీజేపీతో కలిసి లాలూచీ రాజకీయాలు నడుపుతోందని, ఆ పార్టీ కనుసన్నల్లోనే చంద్రబాబు నడుస్తున్నారనడంలో సందేహం లేదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన బుధవారం విశాఖపట్నంలోని ఆ పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఇటీవల ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రధానితో వ్యవహరించిన తీరు తీరు ఇందుకు నిదర్శనమన్నారు. ఆ సమావేశంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కనీసం నిరసన తెలియజేయలేదని, అక్కడ ఏం మాట్లాడారో మీడియాకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఇది రాష్ట్ర ప్రజలను సీఎం మరోసారి వంచించినట్టేనన్నారు. చంద్రబాబు వంచనలకు నిరసనగా, విభజన చట్టంలో హామీల అమలు కోరుతూ ఈ నెల 30న అనంతపురంలో వంచనపై నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు చెప్పారు. ఈ దీక్షకు పదవులకు రాజీనామాలు సమర్పించిన వైఎస్సార్సీపీ ఎంపీలు సహా రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు హాజరవుతారన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో రూ.2 లక్షల కోట్ల అప్పులు పెరిగాయని, తలసరి ఆదాయంకంటే అప్పులే ఎక్కువయ్యాయన్నారు. సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండానే వాటిని తాకట్టు పెట్టి నిధులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. సీఎంకు బీసీలంటే చులకనని, నాయీ బ్రాహ్మణులను తోక కత్తిరిస్తానని, గతంలో మత్స్యకారుల తోలుతీస్తానని నోరు పారేసుకోవడం ఇందుకు తార్కాణమని చెప్పారు. 15 రోజుల్లో పదవి ముగుస్తుందనగా పరకాల ప్రభాకర్ రాజీనామా చేయడం పెద్ద డ్రామాగా అభివర్ణించారు. ఎన్డీయే నుంచి టీడీపీ మార్చిలో బయటకు రాగా ఇన్నాళ్లూ పరకాల ఎందుకు ఆ పదవిలో కొనసాగారని ప్రశ్నించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు వైఎస్సార్సీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోందని విలేకరులు ప్రస్తావించగా.. ఆ విషయం ఆయన్నే అడగండని బదులిచ్చారు. విశాఖ భూకుంభకోణాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారని, దీనిపై వేసిన సిట్ నివేదికను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాము అధికారంలోకి వచ్చాక బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. విలేకరుల సమావేశంలో విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ జిల్లాల అధ్యక్షులు తైనాల విజయ్కుమార్, గుడివాడ అమర్నాథ్, సమన్వయకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
దోచుకున్న సొమ్ముతో ఎన్నికలకు: వరప్రసాద్
సాక్షి, హైదరాబాద్: ఇచ్చిన హామీలు నెరవేర్చ మని అడుగుతున్న బడుగు, బలహీన వర్గాలపై చంద్రబాబు దూషణ లకు దిగుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆయనకు బుద్ధిచెబు తారని హోదా కోసం రాజీనామా చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ అన్నారు. బుధవారం వరప్రసాద్ హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్లు అధికారంతో దోచుకున్న సొమ్ముతో ఎన్నికలకు సిద్ధమవుతున్న బాబు బీసీలు, ఎస్సీ, ఇతర వర్గాలను చిన్నచూపు చూస్తున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో వారే ఆయనకు తగిన రీతిలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ఎన్నికల హామీని నెరవేర్చాలని కోరిన మత్స్యకారులను మీ అంతు చూస్తానని చంద్రబాబు బెదిరించారని, తాజాగా కనీస వేతనాలు అడిగిన నాయీబ్రాహ్మణులను బెదిరించారని, దీన్ని బట్టి ఆయనకు ఎంత అహంకారమో స్పష్టమవుతోందన్నారు. సాగునీటి ప్రాజెక్టులను తనఖా పెడతారా? రాష్ట్రంలోని పది సాగునీటి ప్రాజెక్టులను బ్యాంకులకు తనఖా పెట్టడానికి వీలుగా ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ రైతువిభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర రైతాంగాన్ని ఏం చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని ఆయన ప్రశ్నించారు. -
24న గట్టు ఎత్తిపోతలకు శ్రీకారం
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా జలాలను ఆధారం చేసుకుని గద్వాల జిల్లాలో చేపడుతున్న గట్టు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ నెల 24 న శంకుస్థాపన చేయనున్నారు. అక్కడ ఏర్పాటు చేయనున్న పైలాన్ను ఆవిష్కరించి, బహిరంగ సభలో సీఎం మాట్లాడనున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా ఉన్న రేలంపాడు రిజర్వాయర్ నీటిని తీసుకుంటూ కొత్తగా ఈ పథకాన్ని చేపట్టనున్నారు. రూ.553.98 కోట్లతో గద్వాల జిల్లాలోని గట్టు, ధరూర్ మండలాల పరిధిలోని 33 వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా చేపట్టే ఈ పథకాన్ని తొలి విడతలో రూ.459.05 కోట్లతో, రెండో విడతలో రూ.94.93 కోట్లతో చేపట్టనున్నారు. -
ప్రాజెక్టుల ఘనత వైఎస్దే
‘రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదే. ఆయన చేపట్టిన ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు లష్కర్లా గేట్లు ఎత్తుతూ తానే పూర్తి చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం దగాకోరుతనానికి నిదర్శనం. ఈ విషయంలో టీడీపీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవ’ని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు. మంగళవారం శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం సిద్ధాపురం ఎత్తిపోతల పథకం వద్ద వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఆ నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ‘వైఎస్సార్ గంగాహారతి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 1,200 మంది మహిళలతో గంగమ్మకు బోనాలు సమర్పించారు. అనంతరం జరిగిన సభలో పార్టీ నేతలు మాట్లాడారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ముందుగా వారికి వారు శుద్ధి చేసుకోవాలని హితవు చెప్పారు. వారికి దమ్మూ ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీ తరఫున గొలుపొందాలని సూచించారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు)/ఆత్మకూరు: కరువు కోరల్లో చిక్కుకున్న రైతన్నలను ఆదుకునే లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్ట్లను నిర్మించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి దక్కుతుందని వైఎస్ఆర్సీపీ నాయకులు ఉద్ఘాటించారు. మంగళవారం ఆత్మకూరు మండలం సిద్ధాపురం ఎత్తి పోతల పథకం దగ్గర నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ గంగాహారతి కార్యక్రమం పండుగలా సాగింది. గంగమ్మకు పూజలు చేసి.. మహానేతను మనసారా స్మరించుకుంటూ.. రైతు సంక్షేమాన్ని విస్మరించిన అధికార పార్టీ పాలకులను తూర్పారబట్టారు. తరలివచ్చిన నేతలు వైఎస్ఆర్ గంగా హారతి కార్యక్రమానికి జిల్లా నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. సిద్ధాపురం చెరువు ప్రాంతం జనసంద్రంగా మారింది. ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, సాయిప్రసాద్రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఎమ్మిగనూరు, కోడుమూరు ఇన్చార్జీలు ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, మురళీకృష్ణా, నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి, శిల్పా కార్తీక్రెడ్డి, డాక్టర్ మధు సూదన్, ప్రదీప్రెడ్డి, తోట వెంకటకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఉదయభాస్కర్, రాజా విష్ణువర్ధన్రెడ్డి, తెర్నేకల్ సురేందర్రెడ్డి, సీహెచ్ మద్దయ్య, నాగరాజుయాదవ్, వంగాల భరత్కుమార్రెడ్డి, పోలూరు భాస్కరరెడ్డి, చెరకుచెర్ల రఘురామయ్య, ఆయుష్మాన్ హాస్పిటల్ అధినేత సంజీవరావు, కరుణాకరరెడ్డి, పర్ల శ్రీధర్రెడ్డి, పీపీ నాగిరెడ్డి, పీపీ మధుసూదన్రెడ్డి, జాకీర్, హబీబుల్లా, ఇషాక్, మల్కిరెడ్డి రాజగోపాల్రెడ్డి, పలుచని బాలిరెడ్డి, ధనుంజయాచారి, డీకే రాజశేఖర్ పాల్గొన్నారు. -
‘ఎత్తిపోతల’కు ఊరట కొంతే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ఎత్తిపోతల పథకాలకు సరఫరా చేస్తున్న విద్యుత్ ధరలపై స్వల్ప ఊరటే లభించింది. యూనిట్ ధరను రూ.6.40 నుంచి రూ.4.88కి తగ్గించాలని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రతిపాదించగా... విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) 60 పైసలు మాత్రమే తగ్గించి, యూనిట్ ధరను రూ.5.80గా నిర్ణయించింది. దాంతో ఎత్తిపోతల పథకాల విద్యుత్ ఖర్చులో కేవలం రూ.146.77 కోట్లకు మాత్రమే ఉపశమనం లభించనుంది. జూన్ నుంచి భారీగా వినియోగం రాష్ట్రంలో ప్రస్తుతం అలీసాగర్, గుత్ప, ఎల్లంపల్లి, నెట్టెంపాడు, కోయిల్సాగర్, కల్వ కుర్తి వంటి మొత్తం 14 ఎత్తిపోతల పథకాలు పనిచేస్తున్నాయి. వాటికి ప్రస్తుతం ఏటా 1,359 మెగావాట్ల మేర విద్యుత్ వినియోగిస్తున్నారు. యూనిట్కు రూ.6.40 చొప్పున లెక్కిస్తే.. ఏటా వీటికి రూ.1,565.57 కోట్ల మేర ఖర్చవుతోంది. తాజాగా ధర రూ.5.80కు తగ్గించడంతో ఖర్చు 1,418.80 కోట్లకు తగ్గనుంది. అంటే రూ.146.77 కోట్ల మేర మాత్రమే భారం తగ్గుతోంది. అదే డిస్కంలు కోరిన మేర రూ.4.88కి తగ్గిస్తే.. భారం ఏకంగా రూ.371.82 కోట్లు తగ్గేదని అంచనా. ఇక ఈ ఏడాది జూన్–జూలై నాటికి మరిన్ని ఎత్తిపోతల పథకాలు వినియోగంలోకి వస్తుండడంతో.. విద్యుత్ అవసరం 3,331 మెగావాట్లకు పెరుగుతుందని నీటి పారుదల శాఖ అంచనా వేసింది. యూనిట్ ధర రూ.4.88కి తగ్గించి ఉంటే.. భారం ఏకంగా రూ.911.36 కోట్ల మేర తగ్గేదని అంచనా. -
సాగు ప్రాజెక్టులకు ‘దివాలా’ కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: భారీగా రుణాలు తీసు కుని తిరిగి చెల్లించని కంపెనీలకు షాకిచ్చేలా కేంద్రం తీసుకొచ్చిన దివాలా చట్టం.. రాష్ట్రం లో సాగునీటి ప్రాజెక్టులపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. దీంతో రుణాలిచ్చిన బ్యాంకులు మొండి బకాయిలను వసూలు చేసుకునేందుకు అలాంటి కంపెనీలను దివా లా కోర్టు ముందుకు తేనున్నాయి. ఈ జాబితాలో రాష్ట్రంలో పలు సాగునీటి ప్రాజెక్టుల పనులు చేస్తున్న హైదరాబాద్ కంపెనీ ఐవీఆర్సీఎల్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల పనులపై పడే ప్రభావాన్ని నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది. ఈ మేర కు ఐవీఆర్సీఎల్ కంపెనీ స్వయంగా, ఇతర కంపెనీలతో కలిసి చేస్తున్న పనుల జాబితాను సిద్ధం చేసింది. 4 ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో రూ.759 కోట్ల విలువైన పనులపై ప్రభావం పడొచ్చని తెలుస్తోంది. ఏయే పనులపై ప్రభావం? ఇప్పటివరకు అధికారులు సిద్ధం చేసిన నివేదిక ఆధారంగా పరిశీలిస్తే.. ఐవీఆర్సీఎల్ కంపెనీ ఇందిరమ్మ వరద కాల్వ ప్యాకేజీ–5 పరిధిలో రూ.290.73 కోట్ల విలువైన పనులు చేస్తుండగా.. ఇంకా రూ.57.51 కోట్ల విలువైన పనులు చేయాలి. ఇదే ప్యాకేజీ పరిధిలో రీఇంజనీరింగ్లో భాగంగా కొత్తగా రూ.288.65 కోట్ల పనులు చేయాలి. ఎల్లంపల్లి స్టేజ్–2 కింద ఫేజ్–1లో రూ.41.63 కోట్ల పనులు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–20లో రూ.365.62 కోట్ల పనులు, నిజాంసాగర్ ఆధునీకరణ ప్రాజెక్టులో రూ.6 కోట్ల పనులు.. మొత్తంగా రూ.759 కోట్ల పనులు చేయాలని గుర్తించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏదైనా కంపెనీ దివాలా తీస్తే.. ప్రభుత్వాల నుంచి వాటికి రావాల్సిన నిధు లు నేరుగా బ్యాంకులకు వెళతాయి. దీనివల్ల ఆ కంపెనీతో కలసి పనిచేస్తున్న కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతుందని.. పనులన్నీ ఆగిపోయే ప్రమాదముందని నీటి పారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. -
‘పాలమూరు’కు నికరజలాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: దేశంలోనే అతిపెద్ద లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుగా రూపొందుతున్న పాలమూరు–రంగారెడ్డికి త్వరలోనే నికరజలాలు రావడం ఖాయమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు ధీమా వ్యక్తంచేశారు. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్లో కేసు నడుస్తోందని త్వరలో కృష్ణాజలాల్లో తెలంగాణ వాటా అవార్డు పాస్కానుందని, తీర్పు రాష్ట్రానికి అనుకూలంగా వస్తుం దని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. తద్వారా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు నికరజలాలు లభించనున్నాయని అన్నారు. మహబూబ్నగర్ జిల్లా నారాయణపేటలో శనివారం స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ‘సాగునీటి సాధన సభ’లో మంత్రి హరీశ్రావు ప్రసంగించారు. ప్రస్తుతం వరద జలాల ఆధారంగా చేపడుతున్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు నికర జలాల కేటాయింపు ఉంటుందన్నారు. అప్పుడు నీటి పంపింగ్ ప్రక్రియ 60 రోజుల నుంచి 120 రోజులకు పెరుగుతుందన్నారు. అయితే కోర్టులో కేసు ఉన్నందున బహిరంగంగా అన్ని విషయాలు చెప్పలేమన్నారు. కృష్ణాలో లభ్యమయ్యే నీటి ద్వారా ప్రప్రథమంగా ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు లాభం చేకూరుతుందని వెల్లడించారు. అలాగే గోదావరి జలాల ద్వారా ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని మెజార్టీ భాగానికి నీరందిస్తామన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో వలసల జిల్లా పాలమూరును సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని హరీశ్రావు వివరించారు. ఉత్తమ్ క్షమాపణ చెప్పాలి రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి సాగునీరి వ్వడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ నేతలు కేసులు వేస్తూ అడ్డు పడుతున్నారని, అందుకు పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు వల్ల నల్లమల అటవీప్రాంతం దెబ్బతింటుందని కాంగ్రెస్ నేత హర్షవర్ధన్రెడ్డి గ్రీన్ట్రిబ్యునల్ లో కేసు వేశారని, ప్రాజెక్టు కింద భూములను సేకరించవద్దంటూ మరో కాంగ్రెస్ నేత హైకోర్టులో కేసు వేశారన్నారు. వీరి వల్లే ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయన్నారు. కేసును ఉపసంహరించుకుంటే కేవలం 3 నెలల్లోనే లైనింగ్కాల్వల పనులు చేపడతామన్నారు. కాంగ్రెస్ నేతలకు రైతులపై ప్రేమ ఉంటే కేసును ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలన్నారు. -
సాగునీటికి రూ.9 వేల కోట్ల రుణం!
సాక్షి, హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు వచ్చే రాష్ట్ర బడ్జెట్లో నిధు ల కేటాయింపుపై ఆర్థికశాఖ కొంత స్పష్టతనిచ్చింది. సాగునీటి కోసం రూ.29 వేల కోట్లు కేటాయించేందుకు సుముఖత తెలిపింది. బడ్జెట్ నుంచి రూ.20 వేల కోట్ల కేటా యింపుకు సూచనప్రాయంగా అంగీకరించింది. మిగతా రూ.9 వేల కోట్లను బడ్జెటేతర నిధుల నుంచి సమకూర్చుకోవాలని, రుణా ల ద్వారా తీసుకోవాలని పేర్కొంది. మంగళవారం సచివాలయంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు నేతృత్వంలో నీటి పారుదల శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై జరిగిన సమావేశంలో నీటి పారుదల శాఖ తరఫున ఈఎన్సీ మురళీధర్, వివిధ∙ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. తమ శాఖ అవసరాలను ఆర్థిక శాఖ ముందుంచారు. రూ.29,208 కోట్ల మేరకు ప్రతిపాదనలు సమర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రతిపాదించిన రూ.9 వేల కోట్లను మొత్తం బడ్జె ట్ ప్రతిపాదన నుంచి వేరు చేయాలని ఆర్థిక శాఖ అధికారులు సూచించారు. రూ.20 వేల కోట్లను బడ్జెట్ నుంచి కేటాయిస్తామని, మిగ తా వాటిని బ్యాంకుల నుంచి సమకూర్చుకోవాలని సూచించగా నీటి పారుదల శాఖ ఓకే అన్నట్లు తెలిసింది. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఫిబ్రవరి 10న 15వ ఆర్థిక సంఘం సభ్యులు పర్యటించనున్నారు. సంఘం సభ్యులు శక్తికాంతదాస్, అనూప్సింగ్, రమేశ్ చంద్, అశోక్ లహిరి ప్రాజెక్టు పరిధిలో పర్యటించే అవకాశముంది. -
మన వాడే రూ.13.27 కోట్లు ఇచ్చేయ్..!
సాక్షి, అమరావతి: చిన్న పనే చేయలేక చేతులెత్తేసిన కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి చెందిన సంస్థకు పెద్ద పనిని అప్పగించడం ద్వారా అక్రమాలకు తెరలేపిన సర్కారు.. అధికారులపై ఒత్తిడి తెచ్చి చేయని పనులకు రూ. 11.67 కోట్లను అక్రమంగా బిల్లులు చెల్లించింది. ఈ అక్రమాలకు వెలిగొండ ప్రాజెక్టు వేదికగా మారింది. వెలిగొండ హెడ్ రెగ్యులేటర్, అప్రోచ్ ఛానల్, మొదటి సొరంగంలో 150 మీటర్లు, రెండో సొరంగంలో 108 మీటర్ల పనులను 60సీ కింద పాత కాంట్రాక్టర్ నుంచి మినహాయించకుండానే రూ.91.52 కోట్ల విలువైన పనులను సింగిల్ బిడ్ దాఖలైన టెండర్లను గతేడాది ఆగస్టు 9న శ్రీనివాసరెడ్డికి చెందిన ఆర్కే ఇన్ఫ్రా సంస్థకు ఖరారు చేశారు. అయితే హంద్రీ–నీవాలో మూడు మీటర్ల వ్యాసార్థంతో కూడిన చిన్న సొరంగం పనులే చేయలేని సంస్థకు వెలిగొండ ప్రాజెక్టులో 9.2 మీటర్ల వ్యాసార్థంతో భారీ సొరంగం తవ్వకం పనులను అప్పగించడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్కుమార్ హైపవర్ కమిటీ సమావేశంలో తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఈ అక్రమాలకు తాను బాధ్యత వహించలేనని, హైపవర్ కమిటీ నుంచి తనను తప్పించాలంటూ సర్కార్కు ప్రతిపాదించడం అప్పట్లో సంచలనం రేపింది. అయినా సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమా ఒత్తిళ్లతో ఆ పనులు శ్రీనివాసరెడ్డికే దక్కాయి. సొరంగం తవ్వకుండానే బిల్లులు: వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన సొరంగాలు తవ్వాలన్నా.. హెడ్ రెగ్యులేటర్ పనులు ప్రారంభించాలన్నా శ్రీశైలం రిజర్వాయర్ మీదుగా పడవపై కొల్లంవాగుకు చేరుకోవాలి. యంత్ర సామాగ్రిని అక్కడికి తరలించాలంటే భారీ పడవలు అవసరం. కానీ.. భారీ పడవలు లేకుండానే యంత్రాలను తరలించకుండానే చేయని పనులను చేసినట్లుగా మాయాజాలం చేశారు. సొరంగాల తవ్వకం, హెడ్ రెగ్యులేటర్ పనుల పునాదుల కోసం 31,312 క్యూబిక్ మీటర్ల మట్టి పని, 1,87,645 క్యూబిక్ మీటర్ల రాతి తవ్వకం పనులు పూర్తి చేసినట్లు చూపి రూ.11.67 కోట్లను చెల్లించేశారు. కానీ.. వీటిని ఎం–బుక్లో రికార్డు చేయలేదు. సొరంగం పనులు ఎన్ని మీటర్లు, ఎంత ఎత్తులో చేశారన్న లెక్కలు కూడా తీయలేదు. ఎం–బుక్లో రికార్డు చేయకుండా పీఏవో(పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్) బిల్లులు చెల్లించరు. కానీ.. ఉన్నతస్థాయి ఒత్తిడి రావడంతో నిబంధనలకు విరుద్ధంగా పీఏవో బిల్లులు చెల్లించినట్లు స్పష్టమవుతోంది. కోటరీ కాంట్రాక్టు సంస్థ ఫిర్యాదుతో.. శ్రీనివాసరెడ్డి సంస్థకు కట్టబెట్టిన పనుల కోసం సీఎం కోటరీలోని ఎంపీకి చెందిన కాంట్రాక్టు సంస్థ పోటీ పడింది. కానీ సీఎం సూచనల మేరకు ఆ తర్వాత వెనక్కు తగ్గింది. వెలిగొండ సొరంగాల పనుల కాంట్రాక్టర్లపై వేటు వేసి.. అంచనా వ్యయాన్ని పెంచి.. మిగిలిన పనులకు తాజాగా టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ పనులపై కన్నేసిన ఎంపీ సంస్థ ప్రతినిధులు ఇటీవల వెలిగొండ సీఈ జబ్బార్తో సమావేశమైనట్లు తెలిసింది. ఆ తర్వాత శ్రీశైలం జలాశయం మీదుగా కొల్లంవాగు వద్దకు వెళ్లి సొరంగాలను పరిశీలించారు. అనంతరం శ్రీనివాసరెడ్డి సంస్థకు పనులు అప్పగించి ఆర్నెళ్లయినా పనులు ప్రారంభించలేదని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై రంగంలోకి దిగిన సీఈ జబ్బార్ అధికారులను ఆరా తీయగా రూ.11.67 కోట్ల విలువైన పనులను చేసినట్లు ఈఈ వివరించారు. ఆ సంస్థ పనులే ప్రారంభించలేదు కదా.. బిల్లులు ఎలా చెల్లిస్తారని సీఈ జబ్బార్ నిలదీయడంతో అసలు విషయం బయటపడిందని అధికారవర్గాలు వెల్లడించాయి. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) చీఫ్ ఇంజనీర్ నుంచి సాంకేతిక అనుమతి లేకుండా ప్రారంభించిన సన్నాహక పనులకు మరో రూ.13.27 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. ఇంతలోనే మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రంగంలో దిగడంతో విచారణ అటకెక్కినట్లు అధికారవర్గాలు తెలిపాయి. దీనిపై వెలిగొండ ఎస్ఈ రెడ్డెయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే బిల్లులు చెల్లించామని చెప్పారు. చేసిన పనులకే బిల్లులు చెల్లించామన్నారు. పనులకు సీడీవో సీఈ నుంచి అనుమతి రానిమాట వాస్తవమేనని వివరణ ఇచ్చారు. ఉన్నతాధికారులకు తెలియకుండా తామేమీ నిర్ణయాలు తీసుకోలేదని ఆయన తెలిపారు. -
గోడు వినరు.. గూడు కట్టరు!
సాక్షి, హైదరాబాద్ : ఏళ్లు గడుస్తున్నా రాష్ట్రంలో నిర్వాసితుల వెతలు మాత్రం తీరడం లేదు! ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింద సహాయ, పునరావాస ప్రక్రియ పదేళ్లయినా ఇంకా సాగుతూనే ఉంది. మిడ్ మానేరు, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, ఇందిరమ్మ వరద కాల్వ వంటి ప్రాజెక్టుల కింద సహాయ, పునరావాస పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నా... పునరావాస ప్రక్రియ మాత్రం నత్తనడకను తలపిస్తోంది. నిధుల కేటాయింపు, పట్టాల పంపిణీ, గృహ వసతి కల్పన, ఇప్పటికే నిర్మించిన పునరావాస కాలనీల్లో వసతుల లేమి.. ఇలా ఒక్కటేమిటీ అన్నింటా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇళ్లు కట్టేది ఇంకెప్పుడు? పద్నాలుగేళ్ల క్రితం చేపట్టిన ఎస్ఎల్బీసీ, ఎస్సారెస్పీ స్టేజ్–2, దేవాదుల, వరద కాల్వ, ఎల్లంపల్లి, సుద్దవాగు, కొమురం భీం, గొల్లవాగు, నీల్వాయి, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టు కింద 65 గ్రామాలు పూర్తిగా, 19 పాక్షికంగా కలిపి మొత్తంగా 84 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ గ్రామాలలో 44,794 మంది నిర్వాసితులవుతున్నారు. వీరందరికీ పునరావాస (ఆర్అండ్ఆర్) కేంద్రాలు ఏర్పాటు చేసి.. గృహాల నిర్మాణం, రోడ్లు, తాగునీరు, కరెంట్ కనెక్షన్ల వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. అయితే ఇప్పటివరకు 84 ముంపు గ్రామాలకుగానూ 77 గ్రామాల్లోనే సామాజిక ఆర్థిక సర్వే (ఎస్ఈఎస్) పూర్తయింది. 44వేల పైచిలుకు మందిలో 24,891 మందిని మాత్రమే ఇప్పటివరకు పునరావాస కేంద్రాలకు తరలించారు. వీరికోసం 16,859 నివాస గృహాలను నిర్మించారు. ఇంకా 18,526 గృహాలు, ఇతర వసతుల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. దీనికోసం మరో రూ.1,262 కోట్ల మేర నిధులు అవసరం కానున్నాయి. అయితే ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటంతో ఎప్పటిలోగా పునరావాసం పూర్తవుతుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ప్రాజెక్టుల కింద అన్నీ సమస్యలే.. రానున్న జూన్ నాటికి పనులు పూర్తి చేసి సాగుకు నీటిని అందించాలని భావిస్తున్న ప్రాజెక్టుల్లో పాలమూరు జిల్లా ప్రాజెక్టులు కీలకం. ఇక్కడి భీమా ప్రాజెక్టు కింద 8 ముంపు గ్రామాలుండగా, మొత్తంగా 6,156 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. అయితే ఇందులో 3,500 మందికి మాత్రమే పట్టాల పంపిణీ పూర్తయింది. మౌలిక వసతుల పనులు ఇంకా మధ్యలోనే ఉన్నాయి. కనాయిపల్లి, శ్రీరంగాపూర్, నేరేడ్గావ్, భూత్పూర్, ఉజ్జెల్లి గ్రామాలలో నిర్వాసితులకు గృహాల నిర్మాణం వేగిరం చేయాల్సి ఉంది. సంగంబండలో ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. నెట్టెంపాడు కింద ముంపునకు గురయ్యే చిన్నానిపల్లి, ఆలూర్, రేతామ్పాడ్ గ్రామాల నిర్వాసితులకు పట్టాలు ఇచ్చినప్పటికీ అక్కడ ఈ ఏడాది చివరికి రోడ్లు, నీరు, విద్యుత్ సదుపాయాలు సమకూర్చాల్సి ఉంది. కాలనీల్లో వసతులేవీ..? రాజన్న సిరిసిల్ల జిల్లాలో 25 టీఎంసీల సామర్థ్యంతో మిడ్మానేరు ప్రాజెక్టు నిర్మిస్తుండగా, బోయినపల్లి మండలంలో కొదురుపాక, వరదవెల్లి, నీలోజిపల్లి, శాభాష్పల్లి, తంగళ్లపల్లి మండలంలో చీర్లవంచ, చింతలఠాణా, వేములవాడ రూరల్ మండలంలో అనుపురం, రుద్రవరం, కొడుముంజ, సంకెపెల్లి గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఆయా గ్రామాల్లో 11,731 కుటుంబాలు నిర్వాసితులవుతున్నాయి. వీరందరికి పునరావాసం కోసం సుమారు రూ.100 కోట్లతో ఆర్అండ్ఆర్ కాలనీలు ఏర్పాటు చేశారు. ఒక్కో నిర్వాసిత కుటుంబానికి 242 చదరపు గజాల ఇంటి స్థలం ఇచ్చారు. ఆర్అండ్ఆర్ కాలనీల్లో సుమారు మూడు వేలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. మరో 1,500 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇదే ప్రాజెక్టు కింద కొదురుపాక, నీలోజిపల్లి ఆర్అండ్ఆర్ కాలనీల్లో రూ.80 లక్షల అంచనాలతో నీటి పథకాలు నిర్మించారు. అయితే సీసీ రహదారులు నిర్మించాక పైప్లైన్లు వేయడానికి కందకాలు తవ్వారు. కొన్ని చోట్ల రోడ్లు బ్లాస్ట్ చే«శారు. దీంతో పలు సీసీ రహదారులు పగుళ్లు బారాయి. ఆర్డబ్ల్యూఎస్ అధికారుల అనాలోచిత చర్యతో శాభాష్పల్లి వాగులో నీటి వసతి కోసం మంచినీటి బావులు తవ్వించారు. అయితే వాగులో నీరు చేరడంతో బావులు మునిగిపోయాయి. రోడ్డు నిర్మాణంలో పైప్లైన్ వ్యవస్థ ఛిన్నాభిన్నం అయింది. దీంతో పునరావాస కాలనీల్లో నీరు దొరక్క నిర్వాసితులు పుట్టెడు కష్టాలు ఎదుర్కొంటున్నారు. పలు పునరావాస కాలనీల్లో నిర్వాసితులకు ఇళ్లను అప్పగించడంలో తీవ్ర జాప్యం వల్ల మురుగు కాలువలు మట్టి, పిచ్చి చెట్లతో పూడుకు పోయాయి. పలుచోట్ల విద్యుత్ సదుపాయం లేక నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నారు. అరిగోస పడుతున్నారు మిడ్మానేరు ప్రాజెక్టులోకి నీరు చేరిందని.. పునరావాస కాలనీలకు తరలాలని అధికారులు ఆదేశించడంతో కట్టు బట్టలతో ఊళ్లు వదిలి ఆర్అండ్ఆర్ కాలనీలకు చేరాము. ఇక్కడ నీటి వసతి లేదు. వాగులో బావులు తవ్వితే మునిగి పోయాయి. సీసీ రోడ్లు పగుళ్లు బారాయి. మౌలిక వసతులు లేక నిర్వాసితులు అరిగోస పడుతున్నారు. – కూస రవీందర్, ముంపు గ్రామాల ఐక్యవేదిక అధ్యక్షుడు ఇళ్ల బిల్లులు చెల్లించలేదు సంగంబండ ఆర్ఆర్ సెంటర్లో ఇళ్లు కట్టుకోవాలంటే బిల్లులు ఇవ్వడంలేదు. జీవో విడుదల చేసి సంవత్సరాలు గడిచినా కొంతమందికి ప్లాట్లు రాలేదు. సర్వం కోల్పోయిన తమను ఆదుకుంటామని చెప్పడం తప్ప సమస్యలు పరిష్కరించడంలేదు. – అనంతరెడ్డి, సంగంబండ, బీమా ప్రాజెక్టు నిర్వాసితుడు ఇంటి నిర్మాణ బిల్లులు చెల్లించాలి ఆర్అండ్ఆర్ కాలనీల్లో వేల మంది నిర్వాసితులు రూ.లక్షలు వెచ్చించి ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసిన వారికి బిల్లులు విడుదల చేయాలి. – ఆడెపు రాజు, వరదవెల్లి, మిడ్మానేరు నిర్వాసితుడు -
పెద్దల కోసం సర్దుబాటు రూ.4,000 కోట్లు!
-
సరదాగా కాసేపు..
సాక్షి, సిద్దిపేట: కరవు ప్రాంతంగా ఉన్న తెలంగాణకు గోదావరి నీళ్లతో కాళ్లు కడిగి కష్టాలు తీర్చాలన్న తపనతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మహా యజ్ఞం మాదిరి చేపట్టామని రాష్ట్ర భారీనీటిపారుదల, మార్కెటింగ్శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం జిల్లాలోని చంద్లాపూర్ ప్రాంతంలో నిర్మిస్తున్న రంగనాయకసాగర్ రిజర్వాయర్ పనులను రెండో రోజు పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి బైక్పై ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. కాళేశ్వరం నుంచి నీటిని తరలించే విధానం, పంపులు పనిచేయడం, అక్కడి నుంచి రంగనాయక సాగర్, మల్లన్నసాగర్ రిజర్వాయర్లకు నీళ్లు నింపడం మొదలైన అంశాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకొన్నారు. ఇంజనీర్లు, కార్మికులు, అధికారులు అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. అందరి కష్టం, శ్రమ అంతా కరువును తరమి కొట్టాలన్నదే అని మంత్రి వివరించారు. అదేవిధంగా రంగనాయక సాగర్ రిజర్వాయర్లో కట్టను మంత్రి పరిశీలించి నీటి సామర్థ్యం తట్టుకునేందుకు చేపట్టిన అధునాతన పద్దతులు, నల్లమట్టి, ఇసుకతో నిర్మాణలతో ఉపయాగాలను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని, వచ్చే ఖరీఫ్ నాటికి రైతులకు నీళ్లు ఇచ్చేలా పనులు జరగాలని మంత్రి ఆదేశించారు. -
‘పెద్దల’ కోసం సర్దుబాటు రూ. 4,000 కోట్లు!!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయి, రైతుల పొలాల్లోకి నీరు ఎప్పుడు పారుతుందో తెలియదు గానీ, ప్రభుత్వ పెద్ద ల జేబుల్లోకి కమీషన్ల ప్రవాహం మాత్రం ఆగ డం లేదు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అందినంత మింగేస్తున్నా రు. ఇందుకోసం కొత్తకొత్త వ్యూహాలను తెరపై కి తెస్తున్నారు. 2014 తర్వాత దక్కించుకున్న ప్రాజెక్టుల పనులు చేయకుండా మొండి కేస్తున్న కాంట్రాక్టర్లపై జరిమానా విధించాల్సి న ప్రభుత్వం అందుకు భిన్నంగా అంతులేని మమకారం ప్రదర్శిస్తోంది. ధరల సర్దుబాటు కింద కాంట్రాక్టర్లకు అదనపు నిధులు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. అక్రమం ఇక సక్రమం తాజాగా చేపట్టిన పనులకు ‘ధరల సర్దుబాటు’ నిబంధనలను వర్తింపజేసి, కాంట్రాక్టర్లకు అదనపు నిధులు ఇచ్చేయాలంటూ జలవనరుల శాఖ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. 2013 ఏప్రిల్ 1కి ముందు చేపట్టిన పనులకు మాత్రమే ధరల సర్దుబాటును వర్తింపజేస్తామని.. ఆ తర్వాత చేపట్టిన పనులకు అమలు చేయలేమని అధికారులు తేల్చిచెప్పారు. దాంతో బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్(బీవోసీఈ)ను రంగంలోకి దించి, తమకు అనుకూలంగా నివేదిక వచ్చేలా చక్రం తిప్పారు. బీవోసీఈ నివేదికను అమలు చేయడానికి వీలుగా శనివారం (20వ తేదీ) నిర్వహించే కేబినెట్ సమావేశానికి ప్రతిపాదనలు పంపాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. కేబినెట్ తీర్మానం ద్వారా అక్రమాన్ని సక్రమం చేసుకుని, కాంట్రాక్టర్లతో కలిసి రూ.4 వేల కోట్లకు పైగా లబ్ధి పొందడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఆ రెండు జీవోలతో భారమే ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో స్టీల్, సిమెంట్, డీజిల్తోపాటు లేబర్, మెటీరియల్కు ధరల సర్దుబాటును వర్తింపజేస్తూ కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం 2014 ఫిబ్రవరి 7న జారీ చేసిన జీవో 13ను గవర్నర్ నరసింహన్ తాత్కాలికంగా నిలిపివేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జలవనరులు, ఆర్థిక శాఖల అధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ.. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు చేసిన సూచనలను తుంగలో తొక్కుతూ ధరల సర్దుబాటు కింద కాంట్రాక్టర్లకు అదనపు నిధులు కట్టబెడుతూ 2015 మార్చి 22న జీవో 22ను జారీ చేశారు. అంతటితో ఆగకుండా... పనుల పరిమాణాల ఆధారంగా అదనపు బిల్లులు చెల్లించేలా 2015 జూన్ 12న జీవో 63ను జారీ చేశారు. ఈ రెండు జీవోల వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.20 వేల కోట్లకు పైగా భారం పడింది. ఆ సొమ్మంతా ప్రభుత్వ పెద్దలు, కాంట్రాక్టర్ల పాలైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోటరీ కాంట్రాక్టర్లతో ప్రతిపాదన ధరల సర్దుబాటు నిబంధనలు 2013 ఏప్రిల్ 1కి ముందు చేపట్టిన పనులకే వర్తిస్తాయి. రాష్ట్రంలో 2014 జూన్ 8 తర్వాత చేపట్టిన పనులకు వర్తించవు. తాజా ధరల ప్రకారం చేపట్టిన పనులను పూర్తి చేయలేకపోతే ఈపీసీ లేదా ఎల్ఎస్–ఓపెన్ విధానాల్లోని నిబంధనల ప్రకారం సంబంధిత కాంట్రాక్టర్కు జరిమానా విధించవచ్చు. కానీ, తాజాగా చేపట్టిన పనులకు కూడా ధరల సర్దుబాటు నిబంధనలను వర్తింపజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోటరీలోని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి చెందిన కాంట్రాక్టు సంస్థలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి. హంద్రీ–నీవా రెండో దశలో భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్లో చేసిన పనులకు అదనంగా రూ.169.71 కోట్లు ఇవ్వాలని కోరాయి. 2015–16 ధరల ఆధారంగా కుప్పం బ్రాంచ్ కెనాల్కు టెండర్లు పిలిచామని, వాటికి జీవో 22, జీవో 63లను వర్తింపజేయలేమని రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ(ఎస్ఎల్ఎస్సీ) పలుమార్లు తేల్చిచెప్పింది. చంద్రబాబు ఒత్తిళ్లకు ఎస్ఎల్ఎస్సీ లొంగకపోవడంతో వ్యూహం మార్చారు. తాజాగా చేపట్టిన పనులకూ ధరల సర్దుబాటు నిబంధనను వర్తింపజేసే ప్రతిపాదనపై నివేదిక ఇవ్వాలంటూ బీవోసీఈని ఆదేశించారు. ఒత్తిళ్లకు తలొగ్గిన బీవోసీఈ.. 2013 ఏప్రిల్ 1 తర్వాత ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్(ఈపీసీ) విధానంలో చేపట్టిన పనుల్లో.. అంతర్గత అంచనా విలువ(ఐబీఎం) కంటే 25 శాతం ఎక్కువ పనులు చేసి ఉంటే ధరల సర్దుబాటు నిబంధనను వర్తింపజేయవచ్చని 2017 నవంబర్ 29న నివేదిక ఇచ్చింది. ఐబీఎంలో పేర్కొన్న మట్టి లేదా కాంక్రీట్ పనుల కంటే 50 శాతం ఎక్కువ చేసి ఉన్నా అదనపు నిధులు ఇవ్వొచ్చని ఆ నివేదికలో పేర్కొంది. ఈ నివేదికను అమలు చేయాలంటూ సీఎం చంద్రబాబు నెల రోజులుగా ఒత్తిడి తెస్తున్నారని జలవనరుల శాఖ అధికార వర్గాలు తెలిపాయి. కేబినెట్లో ఆమోద ముద్ర తాజా ధరలతో చేపట్టిన పనులకు ధరల సర్దుబాటు నిబంధనను వర్తింపజేయలేమని జలవనరులు, ఆర్థిక శాఖల అధికారులు తేల్చి చెప్పారు. 2015–16, 2016–17, 2017–18 ధరల్లో పెద్దగా మార్పు లేదని చెప్పిన జలవనరుల శాఖ ఉన్నతాధికారులపై సీఎం చంద్రబాబు మండిపడినట్లు తెలిసింది. బీవోసీఈ నివేదికను అమలు చేసేలా ఈ నెల 20న నిర్వహించే కేబినెట్ సమావేశానికి ప్రతిపాదనలు పంపాలని ఆయన ఆదేశించారు. యథావిధిగా ఆ నివేదికపై కేబినెట్లో ఆమోదముద్ర వేసి.. కాంట్రాక్టర్లకు అదనపు నిధులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. 2014 జూన్ 8 తర్వాత చేపట్టిన పనులకు జీవో 22, జీవో 63లను వర్తింపజేస్తే ఖజానాపై రూ.4 వేల కోట్లకుపైగా భారం పడుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో సింహభాగం టీడీపీ ఎంపీ సీఎం రమేశ్, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు భాగస్వామిగా ఉన్న హెచ్ఈఎస్–పీఎస్కే, నవయుగ వంటి సంస్థలకే దక్కనుంది. అ‘ధనం’ ఇవ్వాల్సిందేనట! టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వంశధార, చింతలపూడి తదితర ప్రాజెక్టుల్లో పాత కాంట్రాక్టర్లపై వేటు వేశారు. ఆ పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి.. టెండర్ నిబంధనలను అడ్డం పెట్టుకుని కోటరీ కాంట్రాక్టర్లకు అప్పగించారు. తాజాగా ఆ పనులకే ధరల సర్దుబాటును వర్తింపజేసి అదనపు నిధులు కట్టబెట్టడానికి పావులు కదుపుతున్నారు. హంద్రీ–నీవా రెండో దశలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల అంచనా విలువ తొలుత రూ.207 కోట్లే. కానీ, అంచనా వ్యయాన్ని పెంచి.. రూ.430.26 కోట్లకు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిల సంస్థలకు కట్టబెట్టారు. ఒప్పందం ప్రకారం తొమ్మిది నెలల్లోగా ఈ పనులు పూర్తి కావాలి. కానీ, కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయలేకపోయారు. గడువు పెంచాలంటూ కాంట్రాక్టర్లు పంపిన ప్రతిపాదనపై ఉన్నతస్థాయి ఒత్తిడి మేరకు ఎస్ఎస్ఎల్సీ ఆమోదముద్ర వేసింది. తాజాగా పెంచిన గడువు కూడా పూర్తయింది. మట్టి పనులు పూర్తయ్యాయి. కానీ 66,139 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు మిగిలిపోయాయి. ఒప్పందంలో పేర్కొన్న దాని కంటే అధికంగా పనులు చేశామని, రూ.169.71 కోట్లు అదనంగా ఇవ్వాలని వారు ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు. వంశధార ప్రాజెక్టు రెండో దశలో 87 ప్యాకేజీ పనులు చేస్తున్న సీఎం రమేశ్, 88 ప్యాకేజీ పనులు చేస్తున్న చంద్రబాబు కోటరీలోని సంస్థ ఇప్పటికే అదనపు నిధులు ఇవ్వాలంటూ సర్కార్కు ప్రతిపాదనలు పంపించాయి. హంద్రీ–నీవా ప్రధాన కాలువ వెడల్పు పనులను 2016–17 ధరలతో చేపట్టారు. గతేడాది చేపట్టిన ఈ పనులకు సైతం ధరల సర్దుబాటు కింద అదనపు నిధులు ఇవ్వాలంటూ సీఎం రమేశ్, చంద్రబాబు కోటరీలోని కాంట్రాక్టర్లు ప్రతిపాదనలు పంపారు. గడువులోగా పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం..నిబంధనలకు విరుద్ధంగా భారీగా ప్రయోజనం చేకూర్చడానికి రంగం సిద్ధం చేయడం గమనార్హం. -
‘గవ్వలసరి’ అయ్యేనా..?
పొగిళ్ల..చందంపేట మండలంలోని ఓ మారుమూల పల్లె. అక్కడ అంతా గిరిజనులే. భూమి ఉంది..పక్కనే కృష్ణానది జల సవ్వడులు. కానీ సాగునీరు లేదు. తాగేందుకూ దొరకని పరిస్థితి. దీనిని అధిగమించేందుకు బ్యాక్వాటర్నుంచి నీటిని తీసుకునేందుకు ప్రతిపాదించిన ప్రాజెక్టే గవ్వలసరి. కానీ ఇది ప్రతిపాదనలకే పరిమితం కావడంతో గిరిజనులు వలసబాట పడుతున్నారు. – చందంపేట చందంపేట (దేవరకొండ) : చుట్టూ ఆకుపచ్చని వర్ణం... పక్కనే కృష్ణమ్మ పరవళ్లు... గిరిజన సంస్కృతి... ఇవన్నీ గవ్వలసరి గ్రామం సొంతం... కానీ ఈ ప్రాంతంలో వలసలు తప్పడం లేదు... ఉన్న ఇళ్లు, పొలా లను వదులుకొని ఇతర ప్రాంతాలకు గిరిజనులు వలసపోతున్నారు. ఇందుకు కారణం సాగు, తాగునీరు అందకపోవడమే. జిల్లాలోనే మారుమూల గిరిజన ప్రాంతం చందంపేట. సు మారు 90 శాతం మంది గిరిజనులే ఉన్నారు. ఈ ప్రాంతంలో గిరిజనులంతా వ్యవసాయాన్నే నమ్ముకొని జీవనం సాగిస్తుం టారు. వ్యవసాయ సాగుకు నీరు లేకపోవడం, వర్షాలు సంవృద్ధిగా కురువకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక మళ్లీ అప్పులు చేయలేక పొట్ట చేతపట్టుకొని వలసబాటపడుతున్నారు. నాగార్జునసాగర్ వెనుక జలాలను ఆనుకొని ఉన్న ఈ ప్రాంతంలో సాగు, తాగు నీరు అందకపోవడంతో ఒక్కో రైతు సుమారు పదికి పైగా బోర్లు వేసి నీరు పడకపోవడంతో అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నాడు. దీనికి ప్రత్యామ్నాయ మార్గమైన గవ్వలసరి ప్రాజెక్టును నిర్మిస్తే మూడు వేల ఎకరాలకు సాగు, తాగునీరు అందుతుందని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నా రు. గత ఏడాది ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పొగి ళ్ల స రిహద్దుల్లోని నాగార్జునసాగర్ వెనుక జలాల్లో మరబోటులో ప్ర యాణించి అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నారు. గవ్వలసరియే ప్రత్యామ్నాయం పొగిళ్ల గ్రామ సమీపంలోని లోతట్టు ప్రాంతంలో గవ్వలసరి వద్ద కృష్ణా బ్యాక్ వాటర్ ప్రవహిస్తుంది. ఏడాది పొడవునా ఈ ప్రవాహం కొనసాగుతుంది. ఈ ప్రాంతంలోనే గవ్వలసరి ప్రాజెక్టు నిర్మించాలనే ప్రతిపాదనలుఉన్నాయి. గవ్వలసరి ప్రాజెక్టు నుంచి పొగిళ్ల, రేకులవలయం, ఉస్మాన్కుంట, కంబాలపల్లి, గువ్వలగుట్ట, మంగళితండా, సర్కిల్తండా, చౌటుట్ల, చాపలగేటు, యల్మలమంద, దేవరచర్ల, యాపలపాయతండా, రేకులగడ్డ, నేరుట్ల, మంగళితండా, పెద్దమ్మగడ్డతం డా, బిల్డింగ్తండా, కాచరాజుపల్లి గ్రామాల్లోని ఆయా చెరువులకు నీటిని అందించి అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్న కరువును పారదోలేందుకు గవ్వలసరి ప్రాజెక్టు ఒక్కటే ప్రత్యామ్నాయం. అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావన ఇదే విషయమై గత శీతాకాల సమావేశాల్లో కూడా ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సభ దృష్టికి తీసుకొచ్చారు. సీఎం కేసీఆర్, భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరిశ్రావు దృష్టికి కూడా ఎమ్మెల్యే తీసుకెళ్లారు. వారు కూడా ప్రాజెక్టు నిర్మాణానికి సానుకూలంగా ఉన్నారని పలు సభల్లో, సమావేశల్లో కూడా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం సానుకూలంగా ఉంది గవ్వలసరి ప్రాజెక్టు కోసం నా శాయశక్తులా కృషి చేస్తున్నాను. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంత రైతులకు సాగు నీటికి ఇబ్బందులు తీరతాయి. వ్యవసాయన్నే నమ్మకున్న రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. ప్రభుత్వం కూడా గవ్వలసరి ప్రాజెక్టు పట్ల సానుకూలంగా ఉంది. – రమావత్ రవీంద్రకుమార్, ఎమ్మెల్యే -
పాత ప్రాజెక్టులను పూర్తి చేసే అదృష్టం నాకు దక్కింది: సీఎం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: గతంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసే అదృష్టం తనకు దక్కిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని 27 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఇంటింటా నీటి వినియోగంపై ఆడిట్ జరగాల్సిన అవసరముందన్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. డెల్టాకు ఇవ్వాల్సిన శ్రీశైలం నీటిని హంద్రీ–నీవాతో పాటు సిద్ధాపురానికి ఇస్తున్నామని చెప్పారు. ఈ నెలలో సూర్యారాధన అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు సీఎం తెలిపారు. ఇదిలాఉండగా, సమయం దాటిన తర్వాత అనధికార వ్యక్తులు దుర్గమ్మ గుడిలోకి వెళ్లినట్టు రుజువయ్యిందని సీఎం చెప్పారు. అధికారుల నిర్లక్ష్యాన్ని గుర్తించి, వారిపై చర్యలు తీసుకున్నామన్నారు. అయితే తాంత్రిక పూజలపై మాత్రం నోరుమెదపలేదు. ఫొటోల కోసం నిలదీయడం అలవాటైంది..: శనగపంటకు గిట్టుబాటు ధర కల్పించి.. కొనుగోలు చేయాలని సభకు హాజరైన రైతులు డిమాండ్ చేశారు. దీంతో సీఎం చంద్రబాబు వారిపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోల కోసం నిలదీయడం అలవాటైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’పై సీఎం తన అక్కసు వెళ్లగక్కారు. ఎవరైనా ప్రశ్నించగానే.. ఫొటోలు తీసి వేస్తోందంటూ నోరుపారేసుకున్నారు. -
ప్రభుత్వ అసమర్థతే ప్రాజెక్టులకు గండం
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలపై నిందలు మోపుతోందని సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. పునరావాస ప్యాకేజీలు లేకుండా, నిర్వాసితులను ఆదుకోకుండా ప్రాజె క్టులను పూర్తి చేయాలనుకుంటే ఎవరూ హర్షించరన్నారు. ప్రాజెక్టులు పూర్తికాకుండా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయ ని అధికార టీఆర్ఎస్ నేతలు, మంత్రులు చేస్తున్న ప్రకటనలు సరికాదని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులకు నిధుల కొరతే ప్రధాన అడ్డంకి అని, ఆ ప్రాజెక్టుకు ఏ ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయని ప్రశ్నించారు. సాగర్ వరదకాల్వ, ఎస్సారెస్పీ ఫేజ్ టూ పనులకూ అరకొర నిధులు కేటాయించడం వల్లే పనులు పూర్తికావడం లేదన్నారు. -
మార్చిలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతాం
తుని: 2018–19కి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ను మార్చిలో ప్రవేశపెట్టనున్నామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ బడ్జెట్ ముసాయిదా రూపకల్పన కోసం త్వరలో మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. సీఎం దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలకు నిధులు కేటాయిస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు ఇచ్చి, 13 జిల్లాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. -
మాటలే మిగిలాయి..
సాలూరురూరల్ (పాచిపెంట): సాగునీటి ప్రాజెక్ట్లకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తాం.. రైతు సంక్షేమమే తమ ధ్యేయమని గొప్పలు చెప్పుకునే టీడీపీ నాయకులు ఆచరణలో చేసి చూపించలేకపోతున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హాయంలో నిర్మించిన ఎన్నో సాగునీటి ప్రాజెక్ట్లను పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు. సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్న పట్టించుకున్న దాఖలాలు లేవు. మూడు కాలాల్లోనూ పంటలు పండాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అప్పట్లో జలయజ్ఞం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పాచిపెంట మండలంలో పెద్దగెడ్డ రిజర్వాయర్ నిర్మించి 2006లో ప్రారంభించారు. సుమారు 12 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ రిజర్వాయర్ నిర్మించి కుడి కాలువ ద్వారా 8500 ఎకరాలకు, కర్రివలస ఆనకట్ట ద్వారా 3500 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం వల్ల పాచిపెంట, సాలూరు, రామభద్రాపురం మండలాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా కొన్నాళ్లుగా ప్రాజెక్ట్ నిర్వహణను పట్టించుకోకపోవడంతో సమస్యలు మొదలయ్యాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీరు వృథాగా పోతున్నా ఏ ఒక్కరూ పట్టించుకున్న దాఖాలాలు లేవని వాపోతున్నారు. అందని మెయింటినెన్స్ బిల్లులు టీడీపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి పెద్దగెడ్డ ప్రాజెక్ట్ మెయింటినెన్స్ నిధులు మంజూరు కావడం లేదు. అయినప్పటికీ అటు అధికారులు గాని ఇటు పాలకులు గాని ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే ప్రాజెక్ట్ పరిధిలో లష్కర్ల కొరత ఉంది. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో 9 మంది లష్కర్లను నియమించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారితోనే కాలం నెట్టుకొస్తున్నారు. వాస్తవానికి ప్రస్తుతమున్న వారికంటే రెట్టింపు సంఖ్యలో లష్కర్లు ఉండాలి. కాని ఆ దిశగా ఎవ్వరూ ఆలోచించకపోవడంతో ఉన్నవారు ప్రాజెక్ట్ నిర్వహణను పక్కాగా చేపట్టలేకపోతున్నారు. షట్టర్లు పాడవుతున్నా మరమ్మతులు సకాలంలో చేయడం లేదు. ముఖ్యంగా పెద్దగెడ్డలో రెండు గేట్లు పాడవ్వడంతో మాన్యువల్ పద్ధతిలో పైకి లేపుతున్నారు. షట్టర్ అడుగున రబ్బర్ ఫిట్ చేయకపోవడంతో అడుగు నుంచి నీరు లీకవుతోంది. గురునాయుడుపేట ప్రాంత సమీపంలో ఉన్న 7ఎల్ లైన్ షట్టర్ పోయింది. ఇక్కడ కూడా నీరు వృథాగా పోతోంది. స్పందించాలి ప్రాజెక్ట్ అధికారులు, పాలకులు స్పందించి పెద్దగెడ్డ ప్రాజెక్ట్ నిర్వహణకు నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. గ్రామాలకు వస్తున్న ప్రతిసారీ రైతుల గురించే ఆలోచిస్తున్నామని చెబుతున్న నాయకులకు నీటి వృథా కనిపించడం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
హవ్వ.. జనం నవ్వరా!?
తొమ్మిదేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోని చంద్రబాబు - ఎన్నికలప్పుడు శంకుస్థాపన చేసి చేతులు దులుపుకోవడమే ఆయన ఘనత - సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డే సాక్షి, అమరావతి: రాయలసీమను సస్యశ్యామలం చేసింది తానేనని, హంద్రీ–నీవాను పూర్తి చేసిందీ తానేనని ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడంపై సాగు నీటి రంగం నిపుణులు, రైతులు, రాజకీయ పార్టీల నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దాదాపు పూర్తయిన ప్రాజెక్టులకు ఇప్పుడు గేట్లు ఎత్తుతూ ఆ ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత తనదేనంటుండటంపై టీడీపీ నేతలు సైతం నోరెళ్లబెడుతున్నారు. వాస్తవానికి దుర్భిక్ష రాయలసీమను సస్యశ్యామలం చేయాలన్న డిమాండ్తో దివంగత సీఎం, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో అఖిలపక్షం 1985లో ఉద్యమాలు చేసింది. పాదయాత్ర నిర్వహించింది. ఆ ఫలితంగా అప్పటి సీఎం ఎన్.టి.రామారావు తెలుగు గంగ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టు పనులను 1989 నుంచి 94 వరకు అప్పటి ప్రభుత్వం కొనసాగించింది. 1995లో ఎన్.టి.రామారావుకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన బాబు.. సాగునీటి ప్రాజెక్టులపై శీతకన్ను వేశారు. ఎన్నికలప్పుడే బాబు శంకుస్థాపనలు అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద హంద్రీ – నీవా సుజల స్రవంతి పనులకు 1996 లోక్సభ మధ్యంతర ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఎన్నికలు పూర్తయ్యాక పనులు చేపట్ట్టకుండా అటకెక్కించారు. 1999 సాధారణ ఎన్నికలకు ముందు హంద్రీ – నీవా ప్రాజెక్టును కేవలం ఐదు టీఎంసీల సామర్థ్యంతో తాగునీటి ప్రాజెక్టుగా మార్చి.. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం కాలువపల్లి వద్ద రెండో సారి పునాదిరాయి వేశారు. జనం నమ్మరనే భావనతో పునాదిరాయి అటు వైపు.. ఇటు వైపు మూడు మీటర్ల మేర కాలువ తవ్వారు. ఎన్నికలు ముగియగానే ఆ ప్రాజెక్టునూ అటకెక్కించారు. గాలేరు – నగరి ప్రాజెక్టు పనులకు 1996 లోక్సభ మధ్యంతర ఎన్నికలప్పుడు వామికొండ రిజర్వాయర్ వద్ద.. 1999 ఎన్నికల సమయంలో గండికోట రిజర్వాయర్ వద్ద చంద్రబాబు శంకుస్థాపన చేశారు. శరవేగంగా పూర్తి చేసిన వైఎస్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో సీఎంగా బాధ్యతలు స్వీకరించాక హంద్రీ–నీవా, గాలేరు–నగరి, శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్సార్బీసీ), ముచ్చుమర్రి ఎత్తిపోతలను చేపట్టి సింహభాగం పనులను పూర్తి చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే శ్రీశైలం నుంచి 40 టీఎంసీలను తరలించి 6.05 లక్షల ఎకరాలకు సాగునీరు.. 33 లక్షల మందికి తాగునీళ్లు అందించేందుకు రూ.6,850 కోట్లతో హంద్రీ – నీవా తొలి దశను పూర్తి చేశారు. రెండో దశ పనుల్లో కూడా 50 శాతం పనులను పూర్తి చేశారు. అప్పట్లో ఎకరానికి నీళ్లందించేందుకు రూ.16,750 వృథాగా ఖర్చు చేస్తున్నారంటూ చంద్రబాబు వ్యతిరేకించడం గమనార్హం. శ్రీశైలం జలాశయం నుంచి 38 టీఎంసీల ను తరలించి ప్రస్తుత వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీళ్లందించడానికి గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాన్ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. తొలి దశ అంచనా వ్యయం రూ.2,155.45 కోట్లు. ఇందులో దాదాపు రూ.రెండు వేల కోట్ల విలువైన పనులు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పూర్తయ్యాయి. రెండో దశ పనులనూ ఓ కొలిక్కి తెచ్చారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 19 టీఎంసీలను తరలించి శ్రీశైలం కుడిగట్టు కాలువ(ఎస్సార్బీసీ) కింద కర్నూలు జిల్లాలో 1.90 లక్షల ఎకరాలకు సాగు నీళ్లందించే పనులనూ చేపట్టి.. శరవేగంగా పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందించారు. నాడు తీవ్రంగా వ్యతిరేకించిన బాబు రాయలసీమ, ప్రకాశం జిల్లాల ప్రాజెక్టులకు నీళ్లందించడం కోసం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి పనులను ప్రారంభిస్తే.. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు వ్యతిరేకించారు. ప్రస్తుత జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, సభాపతి కోడెల శివప్రసాదరావు తదితర టీడీపీ నాయకులు పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ సామర్థ్యం పెంపును వ్యతిరేకిస్తూ కృష్ణా, గుంటూరు తదితర జిల్లాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం గమనార్హం. -
ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమేనా?
-
ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమేనా?: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్, అంచనాల పెంపు, అక్రమాలు, ప్రజాభిప్రాయ సేకరణ తీరుపై బహిరంగ చర్చకు సిద్ధమేనా.. అని సీఎం కేసీఆర్కు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సవాల్ విసిరారు. హైదరాబాద్లో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఎర్రవల్లి ఫామ్ హౌస్కు, ప్రగతిభవన్కు పలువురు నేతలను పిలిపించుకొని కేసీఆర్ పొగిడించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులు పూర్తి, రైతాంగానికి సాగునీరు అందించాలనే చిత్తశుద్ధి సీఎం కేసీఆర్కు లేదన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ జీవో ఇచ్చినా న్యాయస్థానాల నుంచి మొట్టికాయల్లేకుండా ఉంటున్నాయా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరంకుశ, గఢీల పాలన సాగిస్తున్నారని విమర్శించారు. -
పైప్లైన్ భారం 1,100 కోట్లు
- కాళేశ్వరం ప్యాకేజీ–21లో కాల్వలకు బదులు మళ్లీ పైప్లైన్లే - రూ. 2,243 కోట్లకు పెరగనున్న ప్యాకేజీ–21 అంచనా సాక్షి, హైదరాబాద్: పెట్టుబడి వ్యయం పెరుగుతుందన్న భయంతో పక్కనపెట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్యాకేజీ–21లోని పైప్లైన్ వ్యవస్థ ప్రతిపాదనను ప్రభుత్వం మళ్లీ తెరపైకి తెచ్చింది. డిస్ట్రిబ్యూటరీలు, పంట కాల్వల స్థానంలో పైప్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఇటీవలి ‘జల్ మంథన్’లో కేంద్ర జలవనరులశాఖ నిర్ణయించడంతో దానివైపే సర్కారు మొగ్గుతోంది. అయితే పైప్లైన్ వ్యవస్థ వల్ల సర్కారుపై రూ.1,100 కోట్ల అదనపు భారం పడనుంది. మొదట పక్కన పెట్టి... వాస్తవానికి సాగునీటి ప్రాజెక్టుల్లో కాల్వల నిర్మాణానికి ఎకరాకు ఖర్చు రూ. 25 వేల వరకు ఉంటే, పైప్లైన్ వ్యవస్థ ద్వారా ఖర్చు ఎకరాకు రూ. 23,500 ఉంటుంది. అలాగే కాల్వల ద్వారా ఒక టీఎంసీ నీటితో 10 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉండగా, పైప్లైన్ వ్యవస్థలో 20 వేల ఎకరాలకు నీరు అందించవచ్చు. నీటి వృథా సైతం గణనీయంగా తగ్గుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే పైలట్ ప్రాజెక్టు కింద కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ–21లో ఈ విధానాన్ని సర్కారు అమల్లోకి తేవాలనుకుంది. రూ. 1,143.78 కోట్ల విలువైన ఈ ప్యాకేజీలో 1.70 లక్షల ఎకరాలకు నీరివ్వాల్సి ఉంది. ఇందులో లక్ష ఎకరాలకు నీరివ్వాలంటే 4 వేల ఎకరాల భూసేకరణ అవసరమవుతుంది. ప్రస్తుతం ప్యాకేజీ–21 కింద నష్టపోతున్న భూమి ధర ఎకరాకు రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షల మధ్య పలుకుతోంది. ఈ లెక్కన భూసేకరణకే రూ. 320 కోట్లు అవసరం. అదే పైప్లైన్ వ్యవస్థ ద్వారా అయితే భూసేకరణ అవసరం ఉండదు. ఈ ఏడాది మార్చిలో దీనిపై చర్చించిన కేబినెట్ పెట్టుబడి వ్యయం అధికంగా ఉంటుందన్న కారణంతో ఈ ప్రతిపాదనను పక్కనపెట్టింది. కేంద్రం నిర్ణయంతో మారిన ఆలోచన.. అయితే నీటి వృథాను అరికట్టడంతోపాటు పలు ప్రయోజనాలున్న పైప్లైన్ డిస్ట్రిబ్యూటరీల వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రం ఇటీవల గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రధాన కాలువ స్థానంలో పైప్లైన్ వ్యవస్థ ఏర్పాటు చేయడం సాధ్యం కా>నందున డిస్ట్రిబ్యూటరీలు, పంట కాల్వల స్థానంలో దీన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. పలు పథకాల కింద రాష్ట్రాల్లో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులకు ఆర్ధిక సాయం చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. దీంతో మళ్తీ పాత ప్రతిపాదనకు నీటిపారుదల శాఖ తెరపైకి తెచ్చింది. పైప్లైన్ వ్యవస్థ ద్వారా అదనంగా మరో లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరందించవచ్చని తేల్చింది. అయితే ఈ మేరకు ఆయకట్టు లేకపోవడంతో కొండం చెరువు, మంచిప్ప చెరువును కలిపి రిజర్వాయర్లుగా మార్చి అదనంగా లక్ష ఎకరాలకు నీరందించాలని నిర్ణయించారు. ఇందుకోసం డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ అంతా పైప్లైన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ పనికి మొత్తం రూ. 2,242.60 కోట్లు ఖర్చవుతుందని తేల్చారు. పాత అంచనా రూ. 1,143.78 కోట్లతో పోలిస్తే రూ.1,098.82 కోట్ల మేర అదనంగా ఉంటుందని లెక్కగట్టారు. ఈ ప్రతిపాదనపై త్వరలోనే కేబినెట్ ఆమోదం పొందేందుకు నీటిపారుదలశాఖ కసరత్తు చేపట్టింది. -
ప్రాజెక్టుల పాత పనులకు వ్యాటే!
జూలై నుంచి జరిగిన కొత్త పనులకే 18 శాతం జీఎస్టీ సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై జీఎస్టీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొంత మేరకు మినహాయించింది. జూలై ఒకటో తేదీకి ముందు జరిగిన పనులు, వాటికి చెల్లించాల్సిన బిల్లులన్నింటికీ పాత వ్యాట్ అమలు చేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత చేపట్టి న కొత్త పనులకు మాత్రమే జీఎస్టీ వర్తింప జేసేలా తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. నీటిపారుదల శాఖ చేసిన సిఫార్సుల మేరకు వాణిజ్య పన్నుల శాఖ ఈ వెసులుబాటును ఇచ్చింది. దీంతో సాగునీటి కాంట్రాక్టర్లకు భారీగానే లాభం చేకూరనుంది. సాగు నీటి ప్రాజెక్టుల పరిధిలో ఉపయోగించే సిమెంటు, ఇనుము, భారీ పైపులు, యంత్ర సామగ్రిపై గతంలో 5 శాతం వరకు వ్యాట్ ఉండేది. ఈ భారాన్ని ప్రభుత్వమే భరించేది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక వ్యాట్, సెంట్రల్ ఎక్సైజ్ పన్నులన్నీ విలీనమై అవన్నీ 18 శాతం శ్లాబులోకి వచ్చి చేరాయి. నిర్మాణ రంగంలో వినియోగించే సామగ్రిపై జీఎస్టీ విధిం చడంతో ప్రాజెక్టుల అంచనా వ్యయం కూడా పెరిగిపోనుంది. గతంలో ఉన్న వ్యాట్తో పోలిస్తే 13 శాతం అదనంగా పన్ను భారం పడటంతో కాంట్రాక్టర్లలో ఆందోళన వ్యక్తమైంది. దీనిపై ఇటీవల సమీక్షించిన నీటి పారుదల శాఖ జూలై ఒకటికి ముందు ఒప్పందాలు జరిగిన ప్రాజెక్టు పనులను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాలని వాణిజ్య పన్నుల శాఖను కోరింది. ఈ సిఫారసులను పరిశీలించిన వాణిజ్య పన్నుల శాఖ ఒప్పందాలతో సంబంధం లేకుండా జూలై ఒకటి వరకు జరిగిన పనులు, చెల్లించాల్సిన బిల్లులన్నింటికీ గతంలో ఉన్న వ్యాట్ అమలయ్యేలా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల పరిధిలో దాదాపు ఆరు నెలలకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో ప్రస్తుత వెసులుబాటు ఈ బిల్లులన్నీ చెల్లించేంత వరకు కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం కాంట్రాక్టు ఏజెన్సీలకు కలిసొచ్చే అంశమేననే అభిప్రాయాలున్నాయి. జీఎస్టీ కౌన్సిల్లో మరోసారి చర్చకు... మరోవైపు సాగునీటి ప్రాజెక్టులకు జీఎస్టీ మిన హాయించాలని శనివారం ఢిల్లీలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తమ వాదనను వినిపించనుంది. అందులో ఈ అంశం చర్చకు రానుందని, కేంద్రం సైతం వర్క్స్ అండ్ కాంట్రాక్టు పను లకు 18 శాతం నుంచి 12 శాతానికి శ్లాబ్ తగ్గించే అవకాశాలు లేకపోలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి మంత్రి కేటీఆర్ హాజరవుతారు. -
ప్రాజెక్టుల కోసం 40 వేల కోట్లు ఖర్చు
సాక్షి, అమరావతి: మూడేళ్లలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకోసం రూ.40 వేల కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం ఎన్.చంద్రబాబునాయుడు చెప్పారు. రాబోయే రోజుల్లో మరో రూ.పదివేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. పోలవరంతోసహా ఏడు ప్రాధాన్య ప్రాజెక్టుల నిర్మాణాన్ని 2018 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. నవ నిర్మాణ దీక్షల్లో భాగంగా మూడోరోజైన ఆదివారం విజయవాడలోని ఎ కన్వెన్షన్ హాలులో వ్యవసాయం, అనుబంధ రంగాలపై జరిగిన సదస్సు ముగింపులో ఆయన మాట్లాడారు. ఆగస్టు 15వ తేదీకల్లా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే చరిత్ర తిరగరాసిన వారమవుతామని.. ప్రపంచంలో అలాంటి ప్రాజెక్టు ఎక్కడా లేదని అన్నారు. ఎండిపోయిన కృష్ణా డెల్టాకు నీరిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా గోదావరి నీటిని డెల్టాకిస్తామని, రైతులు నారుమళ్లు పోసుకోవాలని కోరారు. కృష్ణా డెల్టాకు కృష్ణానది నుంచి ఇచ్చేనీటిని పులిచింతల వద్ద నిల్వ చేస్తామన్నారు. మొబైల్ లిఫ్టుల ద్వారా రాష్ట్రంలోని చెరువులకు నీరిస్తామని చెప్పారు. అన్ని రాష్ట్రాలకంటే మిన్నగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తానని చెప్పారు. వేరే దేశాలు, రాష్ట్రాలతో పోటీపడి గతంలో పనిచేశానని, అందుకే ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి సాధించానని చెప్పుకొచ్చారు. తనకు ఏ కోరికా లేదని, ఆశ కూడా లేదని అన్నారు. రాష్ట్రంలో ఎవరికీ ఇవ్వని గౌరవాన్ని తనకిచ్చారని, అదే తాను ఇంకా కోరుకుంటున్నానని చెప్పారు. మళ్లీ కల్లబొల్లి కబుర్లు చెప్పేందుకు వస్తున్నారు.. కౌరవ సభలో ద్రౌపదికి అన్యాయం చేసినట్లు పార్లమెంటు తలుపులు మూసేసి రాష్ట్రానికి అన్యాయం చేశారని, రాజకీయలబ్ధికోసం కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారం వ్యవహరించిందని చంద్రబాబు మండిపడ్డారు. అప్పుడు అధికారంలో ఉండి దెబ్బకొట్టారని, ఇప్పుడు అధికారం లేకపోయినా మళ్లీ కల్లబొల్లి కబుర్లు చెప్పేందుకు వస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికొచ్చే ఆదాయంలో 32 శాతం వ్యవసాయం నుంచే వస్తుందని, అలాంటి వ్యవసాయం జరిగే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఆస్పత్రుల్లో చనిపోయినవారిని వాళ్ల ఇళ్లకు తీసుకెళ్లేందుకు త్వరలో మహాప్రస్థానం వాహనాల్ని ప్రవేశపెడుతున్నామని సీఎం చెప్పారు. చనిపోయిన వారిని ఈ వాహనాల్లో వారింటికి తీసుకెళ్లడంతోపాటు కుటుంబానికి రూ.30 వేలు చొప్పున ఇస్తామన్నారు. -
ఎస్కలేషన్ జీవో–146లో మార్పులు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఇదివరకే వెలువరించిన జీవో–146లో పలు మార్పులు చేసింది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా సోమవారం ఈ మేరకు నీటి పారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి జీవో–146లోని కొన్ని అంశాలపై స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పుల మేరకు, ప్రాజెక్టుల్లో ఐబీఎంలో వేసిన అంచనాలకు అదనంగా కొత్త కాంక్రీటు నిర్మా ణాలు, అదనపు నిర్మాణాలు, లైనింగ్ పనులు చేరితే ఆ పనులకనుగుణంగా అంచనా వ్యయాన్ని పెంచుకునేందుకు ఆమోదం తెలిపారు. ఇక 2013 ఏప్రిల్ తర్వాత నిర్మాణ మవుతున్న, అయిన ప్రాజెక్టులన్నింటికీ ఐబీఎంలో వేసిన దానికన్నా ఎస్కలేషన్ ఎంత ఎక్కువ అవుతుందన్నది అంచనా వేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డిజైన్ సమయంలో.. ప్రస్తుత మార్పుల తర్వాత పెరిగే వ్యయాన్నీ అంచనా వేయాలి. 60(సి) నిబంధన కింద ఎవరైనా కాంట్రాక్టర్ను తొలగిస్తే వారికి చెల్లించాల్సినవి చెల్లించాలని వివరించారు. నెట్టెంపాడు, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల పనుల్లోని ప్యాకేజీల్లో కొన్ని అంశాలను విస్మరించారని, వాటిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. -
28 ప్రాజెక్టులకు ‘క్యాడ్వామ్’ నిధులు
- కేంద్ర జలవనరులశాఖ నిర్ణయం - మూడు నెలల్లో డీపీఆర్లు సమర్పించాలని ఆదేశం - ‘పీఎంకేఎస్వై’ కింద ఇప్పటికే 11 ప్రాజెక్టులకు రూ. 943 కోట్లు ఇచ్చేందుకు ఓకే సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల కింద వాస్తవ ఆయకట్టు, నీరందుతున్న ఆయకట్టుకు మధ్య అంతరాన్ని పూడ్చేందుకు ఉద్దేశించిన కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ పథకం (క్యాడ్వామ్) కింద పలు రాష్ట్ర ప్రాజెక్టులకు నిధులిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇప్పటికే ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్వై)లో చేర్చిన 11 సాగునీటి ప్రాజెక్టులకు రూ. 943 కోట్లు ఇచ్చేందుకు సమ్మతించిన కేంద్ర జల వనరులశాఖ... కొత్తగా రాష్ట్రం నుంచి మరో 28 ప్రాజెక్టుల పరిధిలో నీరందని ఆయ కట్టుకు నిధులిచ్చేందుకు రెండ్రోజుల కిందట సానుకూలత తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టుల్లో చాలా చోట్ల కాల్వలు పూడుకుపోవడం, ఫీల్డ్ చానల్స్ దెబ్బతినడం, కాల్వలకు లైనింగ్ వ్యవస్థలేని కారణంగా నీటి వృథా అవుతుండటంతో చివరి ఆయకట్టు వరకు నీరందడం లేదు. నీటి లభ్యత, ప్రాజెక్టు వ్యయం సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని సాగునీటి ప్రాజెక్టుల ఆయకట్టును నిర్ణయించినప్పటికీ సాంకేతిక కారణాలతో ప్రతి ప్రాజెక్టు పరిధిలో నీరందని ఆయకట్టు 25 శాతం మేర ఉంటోంది. ప్రస్తుతం భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద నిర్ణీత ఆయకట్టు 24.68 లక్షల ఎకరాలుండగా, నీరందుతున్న ఆయకట్టు 18.91 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అంటే నీరందని ఆయకట్టు 5.77 లక్షల ఎకరాలుగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 28 ప్రాజె క్టులకు క్యాడ్వామ్ పథకం కింద 60 శాతం నిధులు ఇవ్వనుంది. మిగతా నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుల డీపీఆర్లు, నీరందని ఆయకట్టుకుగల కారణాలు, అవసరమయ్యే నిధుల వివ రాలను మూడు నెలల్లోగా సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ‘క్యాడ్వామ్’ కింద రాష్ట్రం ప్రతిపాదించిన ప్రాజెక్టులివే... జూరాల, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు–1, అలీసాగర్, గుత్ప, డిండి, నిజాంసాగర్, ఆర్డీఎస్, కడెం, మూసీ, గుండ్లవాగు, ఆసిఫ్నహర్, కోటిపల్లి వాగు, నల్లవాగు, ఘన్పూర్ ఆనకట్ట, పోచారం, కౌలాస్ నాలా, సాత్నాల, స్వర్ణ, వట్టివాగు, ఎన్టీఆర్ సాగర్, పీపీ రావు ప్రాజెక్టు, అప్పర్ మానేరు, శనిగరం, బొగ్గులవాగు, ముల్లూరువాగు, పాకాల చెరువు, పెద్దవాగు ప్రాజెక్టులు. -
డిండి ఎత్తిపోతలకు విద్యాసాగర్ పేరు!
జలసౌధలో కాంస్య విగ్రహం... ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఇటీవల అనారోగ్యంతో మరణించిన రాష్ట్ర ప్రభుత్వ సాగునీటి సలహాదారు ఆర్.విద్యాసాగర్రావు సేవలకు గుర్తింపుగా నల్లగొండ జిల్లాలో చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకానికి ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో పాటే ఆయన కాంస్య విగ్రహాన్ని జలసౌధలో ఏర్పాటు చేయాలని నిశ్చయించింది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం తరఫున ప్రకటన వెలువడనుందని నీటి పారుదల శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత నీటి పారుదల ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్, కొత్త ప్రాజెక్టుల రూపకల్పనతో విద్యాసాగర్రావు విశేష సేవలందించారు. ఇందులో భాగంగానే పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకా లను చేపట్టడంలో ఆయన విశేష కృషి చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే గత నెల 29న విద్యాసాగర్రావు మరణం తర్వాత రాష్ట్రంలోని ఒక ప్రాజెక్టుకు ఆయన పేరు పెడతామని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన పుట్టిన నల్లగొండ జిల్లాలోని డిండి ఎత్తిపోతల పథకానికి విద్యాసాగర్రావు పేరు పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిసింది. దీనిపై శనివారం జరగనున్న ఆయన సంస్మరణ సభలో ప్రభుత్వం ఓ ప్రకటన చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఆయన కాంస్య విగ్రహాన్ని జలసౌధలో అలీ నవాబ్ జంగ్ బహదూర్ పక్కన ఏర్పాటు చేయాలని సైతం నిర్ణయించినట్లుగా సమాచారం. -
రాజకీయాల కోసం రైతులతో ఆడుకోవద్దు
కాంగ్రెస్పై మంత్రి ఈటల రాజేందర్ ధ్వజం సాక్షి, హైదరాబాద్: ‘ కొత్త రాష్ట్రంలో కొత్త ఆలోచనలతో రైతుల సంక్షే మాన్ని అమలు చేస్తున్నాం. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ రైతుల సంక్షేమంలో భాగమే. ప్రాజెక్టులు పూర్తయితే తమకు భవిష్యత్ ఉండదనే దుగ్ధతోనే కాంగ్రెస్ నేతలు కాళ్లలో కట్టెబెట్టేట్టు వ్యవహరిస్తున్నారు..’అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఆదివారం సహచర మంత్రులు పోచారం శ్రీనివాస్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డిలతో కలసి విలేకరులతో మాట్లాడారు. రాజకీయాల కోసం రైతులతో ఆడుకోవద్దని కాంగ్రెస్కు హితవు పలికారు. కాంగ్రెస్, టీడీపీల ప్రభుత్వాలు రైతులకు ఒరగబెట్టింది ఏమీలేదన్నారు. స్వల్ప కాలంలోనే కోతల్లేని నాణ్యమైన కరెంటు ఇచ్చి రైతుల మన్ననలు పొందామని తెలిపారు. అదే ఉత్సాహంతో సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వం రైతుల కోసం వినూత్న పథకాలతో ముందుకు వెళుతోందని పోచారం అన్నారు. తమ ప్రభుత్వ పథకాలతో కాంగ్రెస్కాళ్ల కింద భూమి కదలుతోందని, ఆ భయంతోనే కాంగ్రెస్ నేతలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘మా భూమి – మా పంట ’పేరిట భూములపై త్వరలో సమగ్ర సర్వే చేయనున్నామని చెప్పారు. -
ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్ర
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. అందులో భాగంగానే అసెంబ్లీలో కాంగ్రెస్ నాటకాలు ఆడిందని మండిపడ్డారు. విప్ గొంగిడి సునీతతో కలసి ఆయన మాట్లాడారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రవర్తించిందని విమర్శిం చారు. తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని అడ్డుకో వడం కాంగ్రెస్ నేతల వల్ల కాదని, రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను పుట్టించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పారిపోయింది: శ్రీనివాస్ గౌడ్, బాలరాజు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతంతో ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. కరెంటు, విత్తనాలు, ఎరువుల పరిస్థితిని మెరుగు పర్చడం రైతు సంక్షేమం కాదా అని నిలదీశారు. మరో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలసి మాట్లాడారు. అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చించే అవకాశం ఉన్నా కాంగ్రెస్ పారిపోయిందని ఎద్దేవా చేశారు. దమ్ముంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎవరైనా ఒకరు రాజీనామా చేసి గెలవాలని, గెలిస్తే దేనికైనా తాము సిద్ధమే అని సవాలు విసిరారు. భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై చర్చను అడ్డుకోవడమంటే సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవడమేనని ఆయన చెప్పారు. -
ప్రాజెక్టులకు భూసేకరణ సమస్య
నాలుగు నెలలుగా నిలిచిన ప్రక్రియ ఇంకా కావాల్సిన భూమి 90 వేల ఎకరాల సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకింద భూసేకరణ ప్రక్రియ నిలిచిపోవడంతో నిర్మాణ పనులకు తీవ్ర ఆటకం కలుగుతోంది. భూసమస్యకు పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో 123ని తెరపైకి తెచ్చినా దానికి నిర్వాసితులు, ప్రజా సంఘాల నుంచి వ్యతిరేకతకు తోడు హైకోర్టు సైతం స్టే ఇవ్వడంతో నాలుగు నెలలుగా భూసేకరణ ప్రక్రియ ఎక్కడిక్కడ నిలిచిపోయింది. ఇంకా వివిధ ప్రాజెక్టుల పరిధిలో సుమారు 90వేల ఎకరాల మేర భూసేకరణ అవసరం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలుపనున్న భూసేకరణ సవరణ చట్టంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. దీనికి సంబంధించిన బిల్లు చట్టంగా మారితేనే మిగిలిన భూసేకరణ సాధ్యంకానుంది. రాష్ట్రంలోని భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులకు మొత్తంగా 3,67,218.03 ఎకరాల భూమి అవసరం కాగా, ఇప్పటివరకు మొత్తంగా 2,77,409.23 ఎకరాలు సేకరించారు. మరో 89,808.80 ఎకరాలు సేకరించాల్సిఉంది. ప్రధాన ప్రాజెక్టులకు ఎంత?... ప్రధాన ప్రాజెక్టుల పరంగా చూస్తే కాళేశ్వరం పరిధిలో 35,729 ఎకరాలు, పాలమూరు కింద 12,445 ఎకరాలు, ప్రాణహిత కింద 4,505 ఎకరాలు, దేవాదుల కింద 5,642 ఎకరాల మేర సేకరించాల్సి ఉంది. అయితే 2013–కేంద్ర భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సి వస్తే మార్కెట్ విలువ నిర్ణయించడం, గ్రామసభల ఆమోదం తీసుకోవడం, ప్రభావితం అయ్యే కుటుంబాలకు రూ.5లక్షల వరకు పరిహారం, చేతి వృత్తుల వారికి, చిరు వ్యాపారులకు ఏకమొత్తంగా పరిహారం ఇవ్వాల్సి రావడం.., ఈ మొత్తం అంశాలను కొలిక్కి తెచ్చేందుకు సుమారు 6 నుంచి 8 నెలల సమయం పట్టనుండటంతో ప్రభుత్వం జీవో 123తో సేకరణ చేస్తూ వచ్చింది. అయితే ఈ ఏడాది జనవరిలో జీవో 123పై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్ర భూసేకరణ బిల్లును తెచ్చినా, కేంద్రం మరిన్ని సవరణలు సూచించడంతో అది తిరిగొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 30న సవరణలతో కూడిన బిల్లును రాష్ట్ర శాసనభ ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నారు. అది చట్టంగా మారాకే మిగతా భూసేకరణ చేపట్టే అవకాశాలున్నాయి. -
పులిచింతలపై నిలదీద్దాం
♦ పరిహారంపై ఏపీ తీరును ఎండగట్టేందుకు సిద్ధమైన తెలంగాణ ♦ ఇప్పటికే అక్రమ ప్రాజెక్టులపై గరంగరం ♦ పురుషోత్తపట్నం, శివభాష్యం సాగర్పై బోర్డుకు, కేంద్రానికి ఫిర్యాదులు ♦ మున్నేరు బ్యారేజీపైనా అభ్యంతరం ♦ తాజాగా పులిచింతలను తెరపైకి తెస్తున్న తెలంగాణ సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రం, బోర్డుల వద్ద అడ్డుపుల్లలు వేస్తున్న ఆంధ్రప్రదేశ్పై తెలంగాణ ముప్పేట దాడి చేస్తోంది. ఇప్పటికే ఏపీ గోదావరిపై చేపట్టిన పురుషోత్తపట్నం, కృష్ణా నదిపై చేపట్టిన శివభాష్యం సాగర్, మున్నేరు బ్యారేజీ నిర్మాణంపై అభ్యంతరాలు తెలిపిన తెలంగాణ... తాజాగా పులిచింతల పరిహారం అంశాన్ని లేవనెత్తేందుకు సిద్ధమైంది. ఏటా పులిచింతల పరిహారంపై ప్రశ్నిస్తున్నా స్పందన లేకపోవడంతో దీనిపై ఏపీని గట్టిగా నిలదీయాలన్న పట్టుదలతో ఉంది. వరుసగా అస్త్రాలు.. తెలంగాణ చేపడుతున్న అనేక ప్రాజెక్టుల విషయంలో ఏపీ జోక్యం పెరిగింది. కృష్ణా, గోదావరి జలాల్లో వాటాల మేరకు నీటి వినియోగం చేస్తున్నామని చెబుతున్నా... ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేంద్ర జల సంఘం, బోర్డుల వద్ద ఫిర్యాదులు చేస్తోంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ.. పోలవరం ఎడమకాల్వపై ఏపీ చేపట్టిన పురుషోత్తపట్నంపై గోదావరి బోర్డుకు ఫిర్యా దు చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. కర్నూలు జిల్లాలో చేపడుతున్న శివభాష్యం సాగర్పైనా ఇటీవలే కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేసిం ది. కృష్ణా జిల్లాలో చేపట్టిన మున్నేరు బ్యారేజీ నిర్మాణంపై కూడా అభ్యంతరాలు లేవనెత్తింది. ఈ బ్యారేజీ నిర్మాణంతో తెలంగాణ ప్రాంతం లో ముంపు ఉంటుందని సీడబ్ల్యూసీకి లేఖ రాసింది. ఇప్పుడు పులిచింతలపై దృష్టి సారించింది. అసంపూర్ణ పునరావాసంతో ఏటా పులిచింతల కింద తెలంగాణ గ్రామాలు ముంపు బారిన పడుతున్నా ఏపీ స్పందన సరిగా లేదని తెలంగాణ గుర్రుగా ఉంది. పులిచింతలలో 45.7 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఈ నీటితో నల్లగొండ జిల్లాలో 13 గ్రామాలు ముంపునకు గురవుతు న్నాయి. ఈ గ్రామాల పునరావాసానికి పరిహా రం కింద రూ.381 కోట్లు ఖర్చవుతుందని లెక్కలు వేశారు. ఈ నిధుల విడుదలలో జాప్యం కారణంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదం రేగింది. ఓ దశలో గవర్నర్ జోక్యం చేసుకోవడంతో పరిహార చెల్లింపులకు ఓకే చెప్పిన ఏపీ.. రూ.53 కోట్లు ఒకమారు, రూ.75 కోట్లు ఇంకోమారు విడుదల చేసింది. ఇవిపోను ఇంకా భూసేకరణకు రూ.20 కోట్లు, దేవాలయాల పునర్నిర్మాణానికి రూ.15 కోట్లు, మౌలిక వసతుల కల్పనకు రూ.25 కోట్లు, ఎత్తిపోతల పథకాలకు రూ.50 కోట్లు, ఇతర వసతులకు మొత్తంగా రూ.115 కోట్లు రావాల్సి ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని గతేడాది అక్టోబర్లో ఏపీకి విన్నవించింది. రూ.49 కోట్లు మాత్రమే ఇచ్చిన ఏపీ రాష్ట్రం విన్నవించిన ఆరు నెలలకు స్పందించిన ఏపీ.. పులిచింతల జలాశయంలో ముంపునకు గురైన నాలుగు ఎత్తిపోతల పథకాలను మరోచోటుకు తరలించడానికి రూ.49 కోట్ల పరిహారాన్ని గత నెల చివరి వారంలో విడుదల చేసింది. మిగతా రూ.66 కోట్లపై పేచీ పెడుతోంది. భూనిర్వాసితులు, సహాయ పునరావాస ప్యాకేజీ కింద పరిహారం ఇప్పటికే చెల్లించామని, తెలంగాణకు బకాయిలేమీ లేమని చెబుతోంది. దీనిపై రెండు, మూడు రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం.. ఏపీకి లేఖ రాసేందుకు సిద్ధమవుతోంది. దీనిపై స్పందించకుంటే బోర్డులోనే తేల్చుకోవాలని భావిస్తోంది. -
తూర్పుగోదావరిలా పాలమూరు
18 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తాం: కేసీఆర్ - పాలమూరు ఎత్తిపోతల కట్టితీరుతాం - ఖరీఫ్ నాటికి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం - ముఖ్యమంత్రిని కలసిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సాక్షి, హైదరాబాద్: సమైక్య పాలకుల నిర్లక్ష్యం, వివక్షతో వలసల జిల్లాగా మారిన పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు సమగ్ర జల విధానం అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వెల్లడించారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతోపాటు కొత్త, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి 18 లక్షల ఎకరాలకు సాగునీరందించడం ద్వారా మహబూబ్నగర్ పాత జిల్లాను తూర్పుగోదావరి జిల్లాకు ధీటు గా తయారు చేస్తామని చెప్పారు. ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్కు చెందిన ఆ జిల్లా ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మె ల్యేలు డి.కె.అరుణ, చిన్నారెడ్డి, సంపత్, వంశీ చంద్రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తదితరులు బుధవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమయ్యారు. నీటి పారుదల ప్రాజెక్టులతోపాటు జిల్లాకు చెందిన ఇతర సమస్యలపై చర్చించారు. పాలమూరు జిల్లా కున్న నీటి వనరులు, ప్రాజెక్టుల డిజైన్ తదితర అంశాలను సీఎం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెం టేషన్ ద్వారా వివరిం చారు. రాజకీయాలకతీతంగా పాలమూరు జిల్లాను కాపాడటమే తమ అభిమతమని అన్నారు. ‘‘గోదావరిలో 3000, కృష్ణాలో 1200 టీఎంసీల లభ్యత ఉంది. ఈ నీటిని సద్విని యోగం చేసుకుంటే చాలు. రెండు రాష్ట్రాల్లో ప్రతీ ఎకరానికి నీరివ్వొచ్చు. పంచాయితీలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఇదే విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా చెప్పాను. పాలమూరు జిల్లాకు నూటికి నూరు శాతం కృష్ణా నది ద్వారానే సాగునీరు అందించాలి. అందుకే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేశాం. ఏపీ ప్రభుత్వం కొర్రీలు పెట్టినా అపెక్స్ కమిటీ సమావేశంలో వారి అనుమానాలు నివృత్తి చేశాం. పాల మూరు, డిండి ఎత్తిపోతల పథకాలు పూర్తవు తాయి. పాలమూరు ద్వారానే రంగారెడ్డి జిలా ్లకు కూడా నీరందుతుంది’’ అని ముఖ్యమంత్రి వివరించారు. శ్రీశైలం వద్ద వంద టీఎంసీల లభ్యత ఉంది. అక్కణ్నుంచి ఏడాది పొడవునా నీరు తోడుకోవచ్చు. అందుకే శ్రీశైలం నుంచి పాలమూరు ఇన్టేక్ ప్లాన్ చేశాం. పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, నెట్టెం పాడు, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టుల నిర్మా ణాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రాధా న్యమిచ్చింది. తుమ్మిళ్ల, గట్టు లిఫ్టు పనులు త్వరగా పూర్తయ్యే ట్లు చూస్తాం..’’ అని సీఎం చెప్పారు. గద్వాల–మాచర్ల రైల్వే లైన్ అత్యవసరం ‘‘గద్వాల–మాచర్ల రైల్వే లైన్ పనులు చేపట్టాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరాం. మరోసారి ఢిల్లీకి వెళ్లి రైల్వే మంత్రిని కలుస్తాను. ఈ లైన్ అత్యవసరం. గద్వాలలో నేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. వారికోసం హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు చేస్తున్నాం. గద్వాల íపీజీ సెంటర్లో మరిన్ని కోర్సులు పెట్టి అభివృద్ధి చేస్తాం. మహబూబ్నగర్ జిల్లాలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు మరిన్ని ఏర్పాటు చేస్తాం..’’ అని సీఎం వెల్లడించారు. పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ప్రజా సమస్యల పరిష్కారంలో కలసి రావాలని నేతలను కోరారు.