ruling party
-
జపాన్లో పాలక పక్షానికి ఎదురుదెబ్బ
టోక్యో: జపాన్ పార్లమెంట్లోని శక్తిమంతమైన దిగువ సభకు ఆదివారం జరిగిన ఎన్నికల ఫలితాల్లో అధికార పక్షం మెజారిటీకి గండిపడింది. 465 సీట్లకు గాను మెజారిటీకి 233 సీట్లు అవసరం. చివరి ఫలితాలు అందేటప్పటికీ అధికార లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ, మిత్రపక్షం కొమెయిటో కలిపి 211 సీట్లు గెలుచుకున్నాయి. ఈ సంఖ్య కొంత పెరిగేలా ఉన్నా అధికార పక్షానికి మెజారిటీ కష్టమేనని భావిస్తున్నారు. ప్రతిపక్షం, ఇతరులు కలిసి 224 వరకు స్థానాలను దక్కించుకున్నారు. స్వతంత్రులుగా పోటీ చేసి, విజయం సాధించిన తమ వారిని కూడా కలుపుకుంటే అధికార పక్షం బలం పెరగొచ్చు. అయితే, అవినీతి ఆరోపణల నేపథ్యంలో వారిని చేర్చుకునేందుకు ఎల్డీపీ సిద్ధంగా లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షంలోని మరో పార్టీ సాయంతో ప్రధానమంత్రి షిగెరు ఇషిబా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. -
Lok sabha elections 2024: హిమజ్వాల!
పేరులో మంచు ఉన్నా హిమాచల్ప్రదేశ్లో రాజకీయాలు మాత్రం ఎప్పుడూ సెగలు కక్కుతుంటాయి. రాష్ట్రంలో అధికార పార్టీ ఓడిపోయే ఆనవాయితీ 1985 నుంచీ కొనసాగుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ సర్కారుపై ఎమ్మెల్యేల తిరుగుబాటు తాజాగా రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్, బీజేపీ మధ్య మారుతున్నా లోక్సభ ఎన్నికల్లో మాత్రం 2009 నుంచీ బీజేపీదే పై చేయి. గత రెండు ఎన్నికల్లో 4 సీట్లూ ఆ పార్టీయే క్లీన్స్వీప్ చేసింది. ఈసారి హ్యాట్రిక్పై కన్నేసింది. పదేళ్లుగా ఒక్క ఎంపీ సీటూ గెలవలేని పేలవమైన రికార్డును ఎలాగైనా మెరుగు పరుచుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది... ఆపరేషన్ కమలం... సుఖ్విందర్ సింగ్ సుఖు సీఎంగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచే రాష్ట్ర కాంగ్రెస్లో అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. బీజేపీ దీన్ని యథాశక్తి ఎగదోస్తూ ఆపరేషన్ కమలానికి తెర తీసింది. ఇటీవలి రాజ్యసభ ఎన్నికలు దీనికి మరింత ఆజ్యం పోశాయి. కాంగ్రెస్ నుంచి జంప్ చేసిన హర్‡్ష మహాజన్ను బలం లేకపోయినా బీజేపీ రాజ్యసభ పోటీలో నిలిపింది. ముగ్గురు స్వతంత్రులతో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ అనూహ్యంగా బీజేపీకి ఓటేయడంతో హర్‡్షకు, కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వికి 34 ఓట్లు వచ్చాయి. లాటరీలో హర్‡్షనే విజయం వరించింది. స్వతంత్ర ఎమ్మెల్యేలు ముగ్గురూ ఇప్పటికే బీజీపీలో చేరారు. ఆరుగురు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు కూడా తాజాగా కాషాయ కండువా కప్పుకున్నారు. దాంతో ప్రస్తుతం కాంగ్రెస్ బలం 34కు పడిపోయి సర్కారు సంక్షోభంలో పడింది. బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రభుత్వం కూలిపోయేలా ఉంది. ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. బీజేపీ టికెట్పై పోటీ చేస్తామని ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటేసిన ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. దాంతో ఆ ఆరు అసెంబ్లీ స్థానాల్లోనూ లోక్సభతో పాటే జూన్ 1న ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్కు ప్రాణసంకటం...! తాజా రాజకీయ సంక్షోభం నేపథ్యంలో లోక్సభ, 6 అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికలు కాంగ్రెస్కు విషమపరీక్షగా మారాయి. ఎమ్మెల్యే సీట్లు బీజేపీ పరమైతే రాష్ట్రంలో ప్రభుత్వం కమలనాథుల పరమవుతుంది. రామ మందిరం, హిందుత్వ, అభివృద్ధి నినాదాలతో బీజేపీ హోరెత్తిస్తోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, కార్పొరేట్లతో మోదీ కుమ్మక్కు, సామాజిక న్యాయం, సంక్షేమం తదితరాలను కాంగ్రెస్ నమ్ముకుంది. హమీర్పూర్ నుంచి రాజ్పుత్ సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఐదోసారి ఎంపీగా విన్నింగ్ షాట్ కొట్టేందుకు బరిలోకి దిగుతున్నారు. ఆయన హిమాచల్కు రెండుసార్లు సీఎంగా చేసిన ప్రేమ్కుమార్ ధుమాల్ తనయుడు. మండి స్థానంలో బాలీవుడ్ ఫైర్బ్రాండ్, ‘క్వీన్’ కంగనా రనౌత్ బీజేపీ తరఫున రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి రాజ వంశీయుడు, మాజీ సీఎం వీరభద్రసింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ పోటీలో ఉన్నారు. బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ ఆత్మహత్య చేసుకోవడంతో 2021లో మండికి ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ తరఫున విక్రమాదిత్య సింగ్ తల్లి ప్రతిభా సింగ్ విజయం సాధించడంతో బీజేపీ బలం మూడుకు తగ్గింది.సర్వేల మాటేంటి? దాదాపు అన్ని సర్వేలూ బీజేపీ హ్యాట్రిక్ క్లీన్స్వీప్ ఖాయమని అంచనా వేస్తున్నాయి.పర్యాటక స్వర్గధామమైన హిమాచల్లో ఓటర్ల మూడ్ ఒక్కో ఎన్నికల్లో ఒక్కోలా మారుతుంటుంది. కాంగ్రెస్, బీజేపీలే ఇక్కడ నువ్వా నేనా అంటూ తలపడుతున్నాయి. 2014లో లోక్సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పూర్తి మెజారిటీతో అధికారాన్ని దక్కించుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ మరోసారి క్లీన్స్వీప్ చేసింది. కానీ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటర్లు కాంగ్రెస్కు పట్టం కట్టారు. 68 అసెంబ్లీ స్థానాల్లో 40 చోట్ల నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని 4 లోక్సభ స్థానాల్లో సిమ్లాను ఎస్సీలకు కేటాయించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాతిపెడతామని తవ్వుకుంటూ వెళ్లి ఇంతవరుకూ రాలేదు!
పాతిపెడతామని తవ్వుకుంటూ వెళ్లి ఇంతవరుకూ రాలేదు! -
సీఎం రేవంత్రెడ్డి రెడ్డైరీలో బోధన్ ఏసీపీ పేరు..!
నిజామాబాద్: జిల్లాలో ఏళ్లుగా తిష్ట వేసిన పోలీస్ అధికారులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు పైరవీలు షు రూ చేశారు. ప్రస్తుతం ఉన్నవాళ్లంగా బీఆర్ఎస్ ఎ మ్మెల్యేల సిఫార్సుల ద్వారా జిల్లాలో పోస్టింగ్ పొందారు. గతంలో అధికార పార్టీకి అండగా ఉండి ప్రతిపక్షపార్టీలపై కఠినంగా ఉండటంతో కొంత మంది పోలీసు అధికారులకు బదిలీ తప్పదనే ప్రచారం ఉంది. జిల్లాలోని 6 నియోజకవర్గంలో రెండు స్థానా ల చొప్పున బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గెలుపొందాయి. జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ఎమ్మెల్యేల సి ఫార్సు లేఖలతో ఎస్సైలు, సీఐలు, ఎస్హెచ్వోలు, ఏసీపీలు పోస్టింగ్ తీసుకున్నారు. ప్రస్తుతం కమిషనరేట్ పరిధిలో సిఫార్సుతో వచ్చినవారే విధుల్లో ఉన్నారు. పదిహేను రోజుల్లో జిల్లాలో పోలీసుల బదిలీలు జరుగుతాయనే చర్చ కొనసాగుతుంది. సిఫార్సులతో వచ్చిన వారిపై ఆరా.. జిల్లాలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సిఫార్సులో వచ్చిన పోలీసులకు సంబంధించిన వివరా ల జాబితాను ప్రభుత్వం ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా తీసుకున్నట్లు తెలిసింది. వీరు పని చేసిన ప్రాంతంలో ప్రతిపక్షా పారీ్టలపై వ్యవహరించిన తీ రుపై జాబితాను తీసుకున్నట్లు సమాచారం. ఇటీవ ల అధికార పార్టీ ఎమ్మెల్యేను సీఐతో పాటు ఎస్సైలు వెళ్లి మర్యాద పూర్వకంగా కలవగా ఎన్నికల్లో అప్ప టి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన తీరుపై సదరు ప్రజాప్రతినిధి ప్రస్తావించడంతో పో లీసు అధికారులు ఖంగుతిన్నట్లు తెలిసింది. బీజేపీ, కాంగ్రెస్ వద్ద పోలీసుల జాబితా ఎన్నికల సమయంలో గత సీపీ సత్యనారాయణపై కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫి ర్యాదు చేయడంతో సీపీ కల్మేశ్వర్కు ఎన్నికల సంఘం పోస్టింగ్ ఇచ్చింది. ఎన్నికలప్పుడు అధికార పారీ్టకి అండగా ఉన్నారని ఎస్సై, సీఐలు, ఎస్హెచ్వోలు, ఏసీపీలకు సంబంధించిన జాబితాను కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఎన్నికల అధికారులకు, సీపీ కల్మేశ్వర్కు జాబితాను అందించినట్లు తెలిసింది. వారికి బదిలీ తప్పదనే చర్చ జరుగుతోంది. వ్యక్తిగత సెలవులో బోధన్ ఏసీపీ ఎన్నికల సమయంలో ఎడపల్లిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పులిశ్రీనివాస్తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలపై పోలీసులు లాఠీఛార్జీ చేసి కేసులు నమోదు చేశారు. అదే సమయంలో ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి కామారెడ్డిలో జరిగిన సమావేశంలో బోధన్ ఏసీపీ కిరణ్కుమార్ పేరును తన రెడ్డైరీలో రాసుకున్నట్లు సమాచారం. డిసెంబర్ 2న జిల్లా పర్యటనకు వచ్చిన ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాను కూడా కాంగ్రెస్ నాయకులు కలిసి సదరు పోలీసులపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. బోధన్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో బోధన్ ఏసీపీ కిరణ్కుమార్, ఎస్హెచ్వో ప్రేమ్కుమార్ వ్యక్తిగత సెలవులో వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బదిలీవేటు తప్ప దని భావించిన ఏసీపీ, ఎస్హెచ్వో వ్యక్తిగత సెలవులలో వెళ్లినట్లు పోలీస్వర్గాలలో ప్రచా రం జరుగుతుంది. -
ఫ్లెక్సీ వార్..! అధికార పక్షం హామీలపై ప్రతిపక్షాల యుద్ధం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార పార్టీపై విమర్శలు గుప్పించేందుకు విపక్షాలు ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం మొదలు క్షేత్రస్థాయిలో నువ్వానేనా అనే విధంగా పోటాపోటీ నడుస్తోంది. కొన్ని చోట్ల ప్రత్యక్ష పోరాటాలు, ఘర్షణలు సైతం చోటుచేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మీడి యా ద్వారా సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకోవడం పరిపాటిగా మారింది. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా సోషల్ మీడియా ద్వారా ఆయా పార్టీల శ్రేణులు, కార్యకర్తలు ప్రచారం చేసుకోవడంతో పాటు ప్రత్యర్థి పార్టీలను విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడా ది ఎన్నికలు జరుగనుండడంతో క్షేత్రస్థాయి పోరు లో సరికొత్తగా ఫ్లెక్సీల యుద్ధానికి దిగుతున్నారు. తెల్లారేపాటికి పట్టణాలు, గ్రామాల్లో పలుచోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లాలో ఈ ఫ్లెక్సీల వార్ రోజురోజుకూ పెరుగుతోంది. నాలుగు నెలల కిందట పసుపు బోర్డు విషయమై ఎంపీ అరవింద్ గురించి బీఆర్ఎస్ శ్రేణులు జిల్లాలో పలుచోట్ల ఫ్లెక్సీలు వేశారు. దీంతో బీజేపీ శ్రేణులు జిల్లాలోని అన్ని మండలాల్లో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై భారీ ఎత్తున ఫ్లెక్సీలు వేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మళ్లీ తాజాగా ఈ ఫ్లెక్సీల వార్ స్పీడందుకుంటోంది. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యేలు గ్రామాలకు వస్తున్న నేపథ్యంలో మంగళవారం జిల్లాలోని నందిపేట మండలం తల్వేద గ్రామం, మోపాల్ మండలం బాడ్సి గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీలు వేశారు. ఎమ్మెల్యే జీవన్రెడ్డి పర్యటన నేపథ్యంలో తల్వేదలో వేసిన ఫ్లెక్సీలో హామీలు మరిచిన ఎమ్మెల్యే తమ గ్రామానికి ఎందుకొస్తున్నావంటూ రాశారు. దీంతో ఎమ్మెల్యే జీవన్రెడ్డి పో లీసు బందోబస్తుతో గ్రామంలో పర్యటించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఎందుకు ఇవ్వలేదంటూ ఒక మహిళ జీవన్రెడ్డిని నిలదీసింది. పలు సమస్యలపై గ్రామ స్తులు నిలదీశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోల ను పోలీసులు డిలీట్ చేయించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక బాడ్సిలో సైతం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గ్రామ పర్యటన రద్దయ్యింది. ● మీడియా, సోషల్ మీడియా స్థాయి పోరు ఇప్పు డు ఫ్లెక్సీల వరకు రావడం గమనార్హం. ఈ ఫ్లెక్సీల అంశాలు సైతం మీడియాలో, సోషల్ మీడియాలో వస్తుండడంతో ఈ రకమైన సంస్కృతికి పలువురు ఉత్సాహం చూపిస్తుండడం విశేషం. రానున్న రోజుల్లో ఈ ఫ్లెక్సీల పోరుకు అన్ని పార్టీల శ్రేణులు రంగం సిద్ధం చేసుకుంటుండడం గమనార్హం. -
Karnataka election results 2023: వాడిపోయిన కమలం
సాక్షి, నేషనల్ డెస్క్: కర్ణాటకలో ఆనవాయితీ మారలేదు. అధికార పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేకపోయింది. శాసనసభ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఘోర పరాజయం చవిచూసింది. మొత్తం 224 స్థానాలకు గాను 2018లో 104 స్థానాలు సాధించిన ఆ పార్టీ ఈసారి కేవలం 65 స్థానాలతో సరిపెట్టుకుంది. కనీసం అధికారానికి చేరువగా కూడా రాలేదు. ఈ ఓటమిని బీజేపీ పెద్దలు ఏమాత్రం ఊహించలేకపోయారు. హేమాహేమీలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసినా ఫలితం లేకుండాపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా కూడా గట్టెక్కించలేదు. రాష్ట్రంలో బీజేపీ పేలవమైన పనితీరుకు ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. కర్ణాటకలో బీజేపీని ముందుండి నడిపించడానికి బలమైన నాయకులు లేకుండాపోయారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం దాకా.. అంతా అధిష్టానం కనుసన్నల్లోనే సాగింది. ముఖ్యమంత్రి పదవి నుంచి యడియూరప్పను తొలగించి బసవరాజ్ బొమ్మైని గద్దెనెక్కించడం బీజేపీకి నష్టం చేకూర్చింది. ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ప్రజలను ఏమాత్రం మెప్పించలేకపోయారు. బొమ్మై పరిపాలనపై రగిలిన అసంతృప్తి సెగలు బీజేపీ కొంపముంచాయి. ఇతర వర్గాలపై చిన్నచూపు రాష్ట్రంలో లింగాయత్, ఒక్కళిగ వంటి ప్రధాన సామాజిక వర్గాల ఓట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా బీజేపీ పలు హామీలు ఇచ్చింది. రిజర్వేషన్ల అస్త్రాన్ని ప్రయోగించింది. కానీ, దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మైనార్టీలను ఆకట్టుపోవడంలో విఫలమైంది. ఇంతచేసినా లింగాయత్లు, ఒక్కళిగలు బీజేపీని ఆదరించలేదు. ముస్లింలు, దళితులు, ఓబీసీలు మాత్రమే కాకుండా లింగాయత్లు, ఒక్కళిగలు సైతం కాంగ్రెస్కే ఓటేశారు. పెచ్చరిల్లిన అవినీతి.. కమీషన్లు దందా ‘40 శాతం ప్రభుత్వం’అంటూ బీజేపీ సర్కారు కమీషన్ల దందాపై కాంగ్రెస్ చేసి ప్రచారం ప్రజల్లోకి వేగంగా దూసుకెళ్లింది. ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో అవినీతి అంశం ప్రముఖంగా తెరపైకి వచ్చింది. జనంలో విస్తృతంగా చర్చ జరిగింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కేఎస్ ఈశ్వరప్ప మంత్రి పదవికి రాజీనామా చేయడం బీజేపీకి ఇబ్బందికరంగా పరిణమించింది. అవినీతి బాగోతం, కమీషన్ల వ్యవహారంపై కర్ణాటక కాంట్రాక్టర్ల సంఘం ప్రధానికి ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. ప్రభుత్వ వ్యతిరేకత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత నానాటికీ పెరిగింది. ఎన్నికల్లో ఓటమికి ఇదో ప్రధాన కారణమని చెప్పొచ్చు. నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడంతోపాటు బీజేపీ ఇచ్చిన హమీలు అమలు కాకపోవడం జనాన్ని నిరాశపర్చింది. ప్రజా వ్యతిరేకతను తగ్గించుకొనే ప్రయత్నాలేవీ బీజేపీ పెద్దలు చేయలేదు. బీజేపీ ఇంకా అధికారంలో కొనసాగితే ఒరిగేదేమీ లేదన్న నిర్ణయానికి ప్రజలు వచ్చారు. అందుకే ఇంటికి సాగనంపారు. ప్రధాని మోదీ కర్ణాటకలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రైల్వే ప్రాజెక్టులు, జలవనరుల పథకాలు, రోడ్డు నిర్మాణాలు, ఎక్స్ప్రెస్ వే వంటివి చేపట్టినా ప్రజలు పట్టించుకోలేదు. పనిచేయని హిందూత్వ కార్డు హలాల్, హిజాబ్, అజాన్, జై భజరంగబలి, హనుమాన్ చాలీసా.. ఇవన్నీ కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ నమ్ముకున్న ఆయుధాలు. కర్ణాటకలో తలెత్తిన హలాల్, హిజాబ్, అజాన్ వివాదాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారా యి. ఎన్నికల్లో నెగ్గడానికి బీజేపీ మతాన్ని వాడుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. కానీ, అవేవీ బీజేపీని కాపాడలేకపోయాయి. బీజేపీ హిందూత్వ కార్డు కర్ణాటకలో ఎంతమాత్రం పనిచేయలేదని స్పష్టంగా తేలిపోయింది. ఫలితాలపై స్పందన వచ్చే లోక్సభ ఎన్నికలతో మొదలయ్యే బీజేపీ అంతానికి ఆరంభం ఇది. దారుణ నిరంకుశ, ఆధిపత్య రాజకీయాలను జనం అంతంచేశారు. –తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ ఇకపై తమ పాచికలు పారవని బీజేపీ ఇకనైనా గుర్తించాలి. –ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. మెరుగైన ఎన్నికల వ్యూహం కాంగ్రెస్ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి కావొచ్చు –కర్ణాటక మాజీ సీఎం బొమ్మై ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతికి వ్యతిరేకంగా కొత్త సానుకూల భారత్ దిశగా ప్రజలిచ్చిన తిరుగులేని తీర్పు – ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడింది. మోదీతో ఏదైనా సాధ్యమనే నినాదాన్ని ప్రజలు తిప్పికొట్టారు. – ఎన్సీపీ చీఫ్ శరద్పవార్ కాంగ్రెస్కు చరిత్రాత్మక విజయాన్ని అందించిన కర్ణాటక ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఎన్నికల్లో గెలవడమంటే కర్ణాటక రాష్ట్రాభివృద్ధే ముఖ్యమన్న ఆలోచనకు జై కొట్టడమే. దేశాన్ని ఐక్యం చేసే రాజకీయ గెలుపు ఇది. పార్టీ కోసం చెమట చిందించి పనిచేసిన కార్యకర్తలకు ప్రజలు చెల్లించిన మూల్యమిది. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు పార్టీ అవిశ్రాంతంగా పనిచేస్తుంది. రాహుల్ భారత్ జోడో పాదయాత్ర వెంటే విజయం పాదం కదిపింది. – ప్రియాంక గాంధీ -
ట్విటర్ ఖాతా బ్లాక్.. మస్క్ తీరుతో అసంతృప్తి.. అధికార పార్టీ కీలక నిర్ణయం
ట్విట్టర్ కొత్త సీఈఓ ఎలాన్ మస్క్ తీరుపై అసంతృప్తితో స్లొవెేనియా అధికార పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ సామాజిక మాధ్యమానికి తాము దూరంగా ఉండనున్నట్లు తెలిపింది. ట్విట్టర్లో తమ పార్టీ కార్యకలాపాలు ఉండవని ప్రకటించింది. ప్రజలకు చేరువ కావడానికి ఈ వేదిక తప్పనిసరి అని తాము భావించడం లేదని చెప్పింది. స్లొవేనియాలో ప్రస్తుతం ఫ్రీడం మూమెంట్ పార్టీ(జీఎస్) అధికారంలో ఉంది. సాంకేతిక కారణాలు చూపి ఈ పార్టీ అధికారిక ఖాతాను ట్విట్టర్ మూడు వారాల పాటు బ్లాక్ చేసింది. ఆ తర్వాత కూడా తిరిగి పునరుద్ధరించలేదు. అదీ కాకుండా ట్విట్టర్లో విద్వేష ప్రసంగాలు, తప్పుడు వార్తలపై జోరుగా ప్రచారం జరగడం తమకు ఆందోళన కల్గిస్తోందని, ఎలాన్ మాస్క్ సీఈఓ అయ్యాక పరిస్థితి ఇంకా మారిపోయిందని పార్టీ శనివారం ప్రకటన విడుదల చేసింది. అందుకే తాము ఈ ప్లాట్ఫాంకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఇతర ప్రత్యామ్నాయాల ద్వారా ప్రజలకు చేరువవుతామని పేర్కొంది. మొత్తం 91 స్థానాలున్న స్లొవెేనియా పార్లమెంటులో 41 సీట్లు కైవవం చేసుకుని ఈ ఏడాది ఏప్రిల్లో అధికారంలోకి వచ్చింది జీఎస్ పార్టీ. అయితే మాజీ ప్రధాని రాబర్ట్ గాలోబ్ ట్విట్టర్ను బాగా వినియోగించుకునేవారు. ఈ ప్లాట్ఫాం ద్వారానే ప్రతిపక్షం, మీడియాపై తరచూ విమర్శలు గుప్పించేవారు. కానీ ఎన్నికల్లో ఓడిపోయారు. తాము అధికారంలోకి వస్తే రాజకీయాల్లో మళ్లీ మర్యాదపూర్వక వాతావరణాన్ని తీసుకొస్తామని, సమన్యాయ పాలన అందిస్తామని జీఎస్ పార్టీ హామీ ఇచ్చింది. రాబర్ట్ గాలోబ్ మాత్రం వీటిని విస్మరించి ఓటమి పాలయ్యారు. చదవండి: లాక్డౌన్ ఇంకా ఎన్నాళ్లు? చైనాలో వెల్లువెత్తిన నిరసనలు.. -
తైవాన్లో చైనా అనుకూల పార్టీ ప్రభంజనం!
తైపేయి: తైవాన్లో శనివారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికార పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. చైనా వ్యతిరేక నినాదం.. ప్రజల నుంచి ఓట్లు విదిలించలేకపోయింది. విశేషం ఏంటంటే.. చైనా నుంచి మద్ధతు ఉన్న ప్రతిపక్ష పార్టీ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటింది. దీంతో తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(DPP)ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో అధికార పార్టీ దారుణ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారామె. అయితే.. ఈ ఎన్నికల్లో చైనా అనుకూల పార్టీ ఘన విజయం సాధించింది. ‘‘ఎన్నికల ఫలితాలు మేం ఆశించినట్లు రాలేదు. తైవాన్ ప్రజల తీర్పును శిరసావహిస్తున్నాం. ఓటమికి అంతా నాదే బాధ్యత. డీపీపీ చైర్ఉమెన్ బాధ్యతల నుంచి ఇప్పటికిప్పుడే తప్పుకుంటున్నా’’ అని సాయ్ ఇంగ్-వెన్ మీడియాకు తెలియజేశారు. పార్టీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకునప్పటికీ 2024 వరకు ఆమె తైవాన్ అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. మేయర్లు, కౌంటీ చీఫ్లు, లోకల్ కౌన్సిలర్లు.. ఇలా జరిగింది స్థానిక సంస్థల ఎన్నికలే అయినా ఈ ఎలక్షన్స్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారామె. చైనా విధానాలకు, మిలిటరీ ఉద్రిక్తతల పట్ల తైవాన్ ప్రజల నుంచి ఏమేర వ్యతిరేకత ఉందో ప్రపంచానికి తెలియజేసేందుకు.. ఈ ఎన్నికలను ఉపయోగించుకోవాలని సాయ్ ఇంగ్-వెన్ భావించారు. కానీ, ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది. చైనా వ్యతిరేకత ప్రచారం వర్కవుట్ కాలేదు. ఇక చైనా నుంచి పరోక్ష మద్దతు ఉన్న కోమింటాంగ్ (KMT)పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ప్రచార సమయంలో డీపీపీ చైనా వ్యతిరేక గళం వినిపించగా.. కేఎంటీ మాత్రం చైనాతో డీపీపీ ప్రభుత్వ వైరం శ్రుతి మించుతోందని, అది దేశానికి ప్రమాదకరమని ప్రచారం చేసింది. అయినప్పటికీ తాము చైనాకు కొమ్ము కాయబోమని.. తైవాన్ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాల కోసం సంప్రదింపులు జరుపుతామన్న ప్రచారంతో జనాల్లోకి దూసుకెళ్లింది. ఇక శనివారం వెలువడిన తైవాన్ స్థానిక ఎన్నికల ఫలితాల్లో.. 21 నగర మేయర్ స్థానాలకు గానూ పదమూడింటిని కైవసం చేసుకుంది కేఎంటీ. అందులో రాజధాని తైపేయి కూడా ఉంది. కౌంటీ చీఫ్ సీట్ల సంఖ్యను సైతం పెంచుకుంది. అయితే.. గత ఎన్నికల్లో మాదిరే ఈ దఫా ఎన్నికల్లోనూ సైతం డీపీపీ పెద్దగా ప్రభావం చూపించలేదు. 2018లో డీపీపీ కేవలం ఐదు స్థానాలే దక్కించుకోగా.. చైనాను ఎదుర్కొంటున్న పరిణామాలు జనాల నుంచి సానుకూల ఫలితాలు తెప్పిస్తాయని భావించింది. అయితే.. ఇప్పుడు ఈ ఎన్నికల్లోనూ ఐదు స్థానాలే కైవసం చేసుకుంది. అందులో పెద్దగా ప్రభావితం చూపని ప్రాంతాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ ఫలితంపై చైనా ఇంకా స్పందించలేదు. కానీ, జిన్హువా వార్తా సంస్థ మాత్రం తైవాన్ స్థానిక ఎన్నికల్లో పార్టీ పనితీరుకు బాధ్యత వహిస్తూ సాయ్ రాజీనామా చేశారంటూ ఓ కథనం ప్రచురించింది. ఇదిలాఉంటే.. కరోనా సమయంలో తైవాన్ పేరు ప్రపంచమంతా మారుమోగిపోయింది. అందరికంటే ముందే మేల్కొని లాక్డౌన్ విధించకుండా.. కేసుల ట్రేసింగ్పై దృష్టి సారించారు ఆమె. తద్వారా తైవాన్లో కరోనాను సమర్థవంతంగా కట్టడి చేయగలిగారు. ఈ ఘనతకు గానూ 2020 ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళల జాబితాలో సాయ్ ఇంగ్-వెన్కి చోటు దక్కింది. ఇప్పటికీ తైవాన్ ప్రయాణాలకు కరోనా నెగెటివ్ ఫలితం.. అదీ ప్రయాణానికి మూడు రోజుల ముందు తీసుకున్న సర్టిఫికెట్ను ఎయిర్పోర్ట్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: పుతిన్కి భంగపాటు.. అస్సలు ఊహించి ఉండడు! -
ప్రజాస్వామ్యాన్ని రక్షించండి
కోల్కతా: ‘‘దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అధికారాలన్నింటినీ క్రమంగా అధికార పార్టీ నేతృత్వంలోని ఒకే ఒక వర్గం చెరబడుతోంది. ఈ పెడ ధోరణి ఇలాగే కొనసాగితే దేశం అంతిమంగా అధ్యక్ష తరహా పాలనలోకి వెళ్లేందుకు ఎంతో కాలం పట్టదు’’ అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆందోళన వెలిబుచ్చారు. ఈ పరిస్థితుల్లో దేశాన్ని కాపాడేందుకు న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడం తప్పనిసరని అభిప్రాయపడ్డారు. ఆదివారం నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిడికల్ సైన్సెస్ (ఎన్యూజేఎస్) స్నాతకోత్సవంలో మమత పాల్గొన్నారు. వర్సిటీ చాన్సలర్ అయిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్తో సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘దయచేసి ప్రజాస్వామ్యాన్ని, దేశ సమాఖ్య వ్యవస్థను కాపాడండి’’ అంటూ సీజేఐని అభ్యర్థించారు. ఏ అంశంపై అయినా కోర్టుల్లో తీర్పు వెలువరించడానికి ముందే మీడియా సొంత తీర్పులు ఇచ్చేస్తోందంటూ మండిపడ్డారు. ‘‘వారు ఎవరినైనా నిందించొచ్చా? ఎవరి మీదైనా అభియోగాలు మోపొచ్చా? మా ప్రతిష్ట మాకు ప్రాణం. అది పోతే సర్వం పోయినట్టే. ఇలా మాట్లాడుతున్నందుకు మన్నించండి. తప్పయితే క్షమాపణలు చెబుతా. ప్రజలు న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోయారని నేననడం లేదు. కానీ కొద్ది రోజులుగా పరిస్థితులు బాగా దిగజారుతున్నాయి. ప్రజలు నిశ్శబ్దంగా రోదిస్తున్నారు. వారి ఆక్రందనను న్యాయ వ్యవస్థ ఆలకించాలి. ఈ అన్యాయం బారి నుంచి కాపాడాలి’’ అని సీజేఐని కోరారు. -
పనిమంతుడికి అక్కర్లేదు ప్రచారం
‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజన్ వల్లే మేము తమిళనాడులో పెట్టాలను కున్న పెట్టుబడులను ఏపీకి తీసుకువచ్చాం. తొలుత 600 కోట్ల పెట్టుబడి అనుకున్నాం. ఇప్పుడు 2,600 కోట్లకు పెంచాం.’– ఇది సెంచరీ ప్లైవుడ్ సంస్థ యజమాని వ్యాఖ్య. ‘రావాలి జగన్, కావాలి జగన్... అనే నినాదం రాష్ట్రమంతా మారు మోగింది. ఇప్పుడు ఆ నినాదం మారింది. జగన్ వచ్చారు, అభివృద్ధి తెచ్చారు’. – కొప్పర్తిలో ఏఐఎల్ డిక్సన్ ప్రెసిడెంట్, సీవోవో పంకజ్శర్మ. ఇలాంటి వ్యాఖ్యలు గత టీడీపీ ప్రభుత్వంలో, ఆనాటి ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడుని ఉద్దేశించి ఎవరైనా చేస్తే, ఒక వర్గం మీడియా ఆహో ఓహో అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో రాసేవి. అంత కన్నా ఎక్కువగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ను ప్రశంసిస్తే వాటిని ప్రముఖంగా ఇవ్వకపోవడం ద్వారా ఆ వర్గం మీడియా తన ద్వేషాన్ని వెళ్లగక్కిందనుకోవాలి. రోజూ వ్యతిరేక వార్తలు ఇచ్చే ఈ మీడియా కడప జిల్లా కొప్పర్తిలో అంత పెద్ద ఎత్తున ఒక పారిశ్రామిక వాడ వస్తుంటే, దానిని తక్కువ చేసి చదువరుల దృష్టి పాజిటివ్ విషయాల మీద పడకుండా ఉండేందుకు రోడ్లు బాగోలేవు అంటూ బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. ఇప్పటికి పలుమార్లు అలాంటి వార్తలు రాసిన వీరు, పనిగట్టుకుని ఆ రోజు కూడా వేశారంటే అది డైవర్షన్ టాక్టిక్స్ అన్న విషయం ఇట్టే అర్థం అయిపోతుంది. గతంలో ఆ పరిశ్రమ వెళ్లిపోతోంది, ఈ పరిశ్రమ వెళ్లిపోతోంది అంటూ తెలుగుదేశం వారు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా వారు విస్తృతంగా ప్రచారం చేశారు. ఏకంగా కియా కార్ల ఫ్యాక్టరీ కూడా వేరే చోటికి తరలిస్తున్నారంటూ అసత్య వార్తలను ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే గగ్గోలుగా మాట్లాడారు. తీరా చూస్తే ఆ ప్లాంట్ అక్కడే ఉండటంతో పాటు, మరో 400 కోట్ల రూపాయల అదనపు పెట్టుబడి కూడా పెడుతున్నామని ప్రకటించారు. తాజాగా నెల్లూరు శ్రీసిటీలో సుమారు 1,500 కోట్ల వ్యయం చేసే ఏసీ తయారీ ప్లాంట్లను రెండు ప్రముఖ సంస్థలు నెలకొల్పు తున్నాయి. అంతకుమించి కడప జిల్లా కొప్పర్తిలో ఒక పారిశ్రామిక వాడనే జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేసిన తీరు అభినందనీయం. అక్కడకు ఎలక్ట్రానిక్స్ తదితర పరిశ్రమలు వస్తున్న వైనం గమనించ వచ్చు. చంద్రబాబు టైమ్లో ఇలాంటి పారిశ్రామికవాడను ఒక్కటైనా, ఎక్కడైనా అభివృద్ధి చేశారా అన్నదానికి జవాబు దొరుకుతుందా? కియా కార్ల ప్లాంట్ రావడం వరకు ఆయన కృషి ఉందంటే ఒప్పు కోవచ్చు. ప్రధాని మోదీ దానిని ఏపీకి ఎంపిక చేశారని బీజేపీ నేతలు చెబుతుంటారు. అది తప్ప మరొక ప్రధానమైన సంస్థ ఏదీ పెద్దగా ఏపీకి టీడీపీ హయాంలో రాలేదు. కాకపోతే తిరుపతిలో ఒకటి, రెండు చిన్న భవనాలలో, మంగళగిరి వద్ద రెండు చిన్న భవనాలలో ఏవో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని చెప్పారు. వాటిలో కొన్ని వెళ్లిపోయాయని అప్పట్లో ప్రచారం చేశారు. నిజంగా స్టాండర్డ్ సంస్థలు ఏవైనా అలా చేస్తాయా? ప్రభుత్వాలు ఏవి ఉన్నా వాటి పని అవి చేసుకు వెళ్లాలి కదా? అంటే వీటిలో కొన్నిటిని వేరే ఉద్దేశంతో ఏర్పాటు చేసి ఉంటారని అనుకోవచ్చు. చంద్రబాబు టైమ్లో విశాఖలో భారీ సెట్టింగులతో, పారిశ్రామిక సదస్సులు నిర్వహించారు. లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు అయ్యా యని అన్నారు. తీరా చూస్తే ఆచరణలోకి వచ్చింది అతి స్వల్పం. కొందరైతే ఉత్తుత్తి ఒప్పందాలు చేసు కున్నారు. విదేశాలకు పరిశ్రమలు తేవడానికి వెళుతున్నామని ప్రత్యేక విమానాలలో తిరిగి వచ్చారు. కాని ఏపీకి వచ్చిన పరిశ్రమలు ఏమిటో తెలియదు. ముఖ్యమంత్రి జగన్ ఒకసారి వివిధ దేశాల రాయ బారులతో సమావేశం అయి ఏపీలో పరిశ్రమలు పెట్టించాలని కోరారు. ఆ తర్వాత ఏమైనా సమావేశాలు ఉంటే మంత్రి గౌతం రెడ్డి చూసుకుంటున్నారు. జరగవలసిన పని జరిగేలా ముఖ్యమంత్రి కార్యా లయం పర్యవేక్షిస్తుంది. జగన్ సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. సుమారు పది నెలల వ్యవధిలో ఒక పారిశ్రామికవాడను పరిశ్రమల స్థాపనకు అనువుగా సిద్ధం చేశారన్నది కచ్చితంగా విశేష వార్తే అవుతుంది. ఒక వర్గం మీడియా దానికి ప్రాచుర్యం కల్పించనంత మాత్రాన జనానికి అర్థం కాకుండా ఉండదు. కొప్పర్తి వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ దేశంలోనే అత్యుత్తమ ఈఎంసీగా నిలుస్తుందని డిక్సన్ కంపెనీ ప్రెసిడెంట్, సీవోవో పంకజ్ శర్మ పేర్కొన్నారు. అలాగే బద్వేల్ వద్ద సెంచరీ ప్లైవుడ్ సంస్థ ఏర్పాటు అవుతోంది. ఈ ప్లాంట్ శంకుస్థాపన సభలోనే ఆ సంస్థ యజమానులు ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి సహకారం పారిశ్రామిక వేత్తలకు అందిస్తున్నది వివరించారు. పులివెందులలో ఆదిత్య బిర్లా గ్రూప్ ఆధ్వర్యంలో ఫాషన్ డిజైన్ సంస్థ వస్తోంది. ఈ గ్రూప్ రాష్ట్రానికి మొదటిసారి వచ్చింది. కడప జిల్లా ముఖ చిత్రాన్ని కొప్పర్తి పారిశ్రామికవాడ మార్చే అవకాశం ఉందని రాయలసీమ ప్రాంత ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇవి కాకుండా మరి కొన్ని ముఖ్యమైన సంస్థలు ఏపీలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వచ్చాయి. యునైటెడ్ టెలిలింక్ సంస్థ మౌలిక వసతులపై 1,500 కోట్లు, మొబైల్స్ ఉత్పత్తికి 600 కోట్లు వ్యయం చేయడానికి ప్రతిపాదించింది. ఆ కంపెనీ బృందం ముఖ్యమంత్రిని కలిసింది. సన్ ఫార్మా అధినేత దిలీప్ షాంగ్వి ఏపీలో ఒక భారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ముఖ్యమంత్రి జగన్ చొరవవల్లే తాము ఇక్కడ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. మొదటిసారి తాను జగన్ను కలిశాననీ, ఆయన విజన్ బాగా నచ్చిందనీ షాంగ్వి తెలిపారు.ఈ పరిశ్రమ వాస్తవ రూపం దాల్చితే ఏపీకి కొన్నివేల ఉద్యోగాలు వస్తాయి. అయితే ఇవే సరిపోతాయని కాదు. ఇలాంటివి ప్రతి జిల్లాలో ఒకటో, రెండో ఏర్పాటు కావాలి. విశాఖలో నెలకొల్పదలచిన ఆదాని డేటా సెంటర్ కనుక సత్వరమే కార్య రూపం దాల్చితే ఏపీ అంతటికీ అది ప్రయో జనం చేకూర్చుతుంది. జపాన్కు చెందిన యొకహోమా గ్రూపు కంపెనీ అలయన్స్ టైర్ గ్రూపు (ఏటీజీ) రాష్ట్రంలో భారీ వాహనాల టైర్ల తయారీ యూనిట్ను నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. విశాఖలోని అచ్యుతాపురం సెజ్లో సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,250 కోట్లతో ఈ యూనిట్ను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పనులు ప్రారంభించిన సంస్థ అనం తరం రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవతో పెట్టుబడుల ప్రతి పాదనను రూ. 2,500 కోట్లకు పెంచింది. విశాఖలోనే హార్ట్ వాల్వ్లు తయారు చేసే కర్మాగారం నెలకొల్పుతున్నారు. ఇప్పటికే ఏపీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఐటీ ఉద్యోగుల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇది వినూత్న ప్రయోగం. ఇది సఫలమైతే అనేక కంపెనీలు ఈ విధానానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ఏపీ ప్రభుత్వం కేంద్ర సహకారంతో పోర్టుల నిర్మాణానికి ప్రయత్నాలు సాగిస్తోంది. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ కారిడార్, పెట్రో కారిడార్ వంటివి రావాల్సి ఉంది. వ్యవసాయ రంగానికి సంబంధించి అగ్రి హబ్లు, ఆక్వాహబ్లను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం మరిన్ని వ్యవసాయాధార పరిశ్రమలు వచ్చేలా ప్రోత్సాహక చర్యలు చేపట్ట వలసిన అవసరం ఉంది. ఇలా ఆయా చోట్ల పరిశ్రమలు వస్తే ఆ ప్రాంతాలలో జనావాసాలు పెరిగి ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. ఒక వైపు సంక్షేమంపై దృష్టి పెడుతూనే, మరో వైపు ఇలాంటి ప్రగతి గురించి కృషి చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు ప్రచారమంతుడుగా మిగిలిపోతే, ప్రచారం లేకుండా తన పని తాను చేసుకు వెళితే జగన్ పనిమంతుడుగా నిలుస్తారని చెప్పడానికి కొప్పర్తి పారిశ్రామికవాడతో సహా పలు పరిశ్రమలకు శ్రీకారం చుట్టిన వైనం నిదర్శనం అవుతుంది. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఏం చేసినా ఆహా ఓహోలు కొట్టే మీడియా ఒకటుండేది. అది ఇప్పుడూ ఉంది. కానీ ఇప్పటి ప్రభుత్వం అంతకుమించిన పనులు చేస్తున్నప్పటికీ ఉస్సూరంటూ పెదవి విరుస్తుంటుంది. సంక్షేమమే చాలా, అభివృద్ధి అక్కర్లేదా అంటూ విమర్శించిన టీడీపీ, దాని మీడియా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆ అభివృద్ధికి కారణమయ్యే ఎన్నో పరిశ్రమలను తెస్తున్నప్పటికీ తమ తీరు మార్చుకోవడం లేదు. కానీ ఒకటి... పని చేయకుండా ప్రచారం మాత్రమే చేసుకున్న చంద్రబాబు ప్రచారమంతుడిగానే మిగిలిపోతే, ప్రచారంతో పనిలేకుండా పని చేసుకుంటూ పోతున్న జగన్ పనిమంతుడు అనిపించుకుంటున్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు -
నేపాల్ ప్రధాని ఓలి బహిష్కరణ
కఠ్మాండూ: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలిని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బహిష్కరిస్తూ మాజీ ప్రధాని ప్రచండ(పుష్ప కమల్ దహల్) నేతృత్వంలోని ప్రత్యర్థి వర్గం ఆదివారం నిర్ణయించింది. తాజా నిర్ణయంతో, పార్టీలో అంతర్గత పోరు తీవ్రస్థాయికి చేరింది. ఓలిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని పార్టీ సీనియర్ నేత గణేశ్ షా వెల్లడించారు. ఓలిని పార్టీ సహ అధ్యక్ష పదవి నుంచి కూడా డిసెంబర్ నెలలో తొలగిం చిన విషయం తెలిసిందే. ప్రచండతో పాటు, ఆయనకు సన్నిహితుడైన మాధవ్ నేపాల్ను ఆ స్థానంలో నియమించారు. ప్రచండ వర్గం ఆధిపత్యం ఉన్న స్టాండింగ్ కమిటీ జనవరి 15న పార్టీ వ్యతిరేక కార్యకలాపాల విషయంపై ఓలిని వివరణ కోరింది. ఆయన నుంచి ఎలాంటి వివరణ రాకపోవడంతో తాజా నిర్ణయం తీసుకున్నామని గణేశ్ షా తెలిపారు. -
దీపంతో మహమ్మారిని ఎలా ఆపుతారు?
సాక్షి, హైదరాబాద్: కరోనా నివారణకు అవసరమైన వస్తు సామగ్రిని అందించే బదులు ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు ఆర్పి కొవ్వొత్తులు పట్టుకోవాలని ప్రధాని చెప్పడం విడ్డూరంగా ఉందని వామపక్ష పార్టీలు పేర్కొన్నాయి. ఇప్పటికే దేశ ప్రజ లు, విపక్షాలు రాజకీయాల కు అతీతంగా కేంద్రానికి అం డగా నిలిచాయని, అయితే దీప నినాదం ఈ మహమ్మా రి నిరోధానికి ఎలా దోహదపడుతుందని ప్రశ్నించాయి. ప్రస్తుత ఆపత్కాల సమయంలో రాజకీయాలకు తావివ్వవద్దని చాడ వెంకటరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీరభద్రం (సీపీఎం), సాదినేని వెంకటేశ్వరరావు, పోటు రంగారా వు (సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రెండు గ్రూపులు) శనివారం ఒక సంయుక్త ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఆకస్మిక లాక్డౌన్తో అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా వలస కార్మికులు, దినసరి కూలీల బతుకులు ఛిద్రం అయ్యాయని వారు ఆ ప్రకటనలో విమర్శించారు. -
వైఎస్సార్ సీపీ నేతల వాట్సాప్ కాల్స్ ట్యాపింగ్
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అభ్యర్థులు, నేతలే లక్ష్యంగా ముఖ్యమంత్రి, లోకేశ్తో పాటు కొంతమంది రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అధికార దుర్వినియోగంతో అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే సీసీ కెమెరాల ద్వారా ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) వ్యవస్థతో వైఎస్సార్సీపీ అభ్యర్థులతో పాటు పార్టీ ముఖ్యనేతలపై నిఘా పెట్టిన ముఖ్యమంత్రి.. తాజాగా వారి వాట్సాప్ ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారు. వాట్సాప్ కాల్స్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా యూరప్ నుంచి సూక్ష్మ పరికరాలను తెప్పించారు. ఫోన్ ట్యాపింగ్లు, ప్రతిపక్ష అభ్యర్థుల కదలికలపై నిఘా ద్వారా సమాచారం సేకరించి.. ఎన్నికల ముందు ప్రతిపక్షంపై దుష్ప్రచారం చేసేందుకు చంద్రబాబు ఈ విధమైన అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా ట్యాపింగ్ ఈ విషయాన్ని అధికార వర్గాలతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నేతలే వెల్లడిస్తున్నారు. ఎన్నికల సంఘం వద్ద ఉండాల్సిన ఓటర్ల కలర్ ఫొటోలతో కూడిన మాస్టర్ జాబితాను దొంగలించడమే కాకుండా ప్రభుత్వ సాధికార సర్వే ద్వారా రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని హైదరాబాద్లోని ఐటీ గ్రిడ్స్ సంస్థకు ఇచ్చి, దానిద్వారా ఆ సమాచారాన్ని టీడీపీ సేవా మిత్ర యాప్కు ఇస్తూ ప్రభుత్వం, ఐటీ గ్రిడ్స్ దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటీ గ్రిడ్స్ కార్యకలాపాలను ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. విజయవాడ ఆటోనగర్లో ఐటీ కంపెనీలున్న భవనంలోని ఒక అంతస్తులో ఈ సంస్థను ఏర్పాటుచేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు.. గతంలో ఈవీఎంలు టాంపరింగ్ చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి దొరికిపోయిన చంద్రబాబు సన్నిహితుడు, బినామీ అయిన వేమూరి హరిప్రసాద్, పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్లు విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, ప్రభుత్వ లబ్ధిదారుల వివరాల సేకరణతో ఎన్నికల్లో టీడీపీకి లబ్ధి చేకూర్చే ఎత్తుగడలను సాగిస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్ ఐటీ గ్రిడ్స్లో పనిచేసే ఉద్యోగులను విజయవాడకు తరలించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎవరితో ఏమి మాట్లాడుతున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎక్కడ ఉన్నారనే వివరాలను సీసీ కెమెరాల ద్వారా ఇప్పటికే ఆర్టీజీఎస్కు చెందిన ఉన్నతాధికారి ఒకరు పర్యవేక్షిస్తున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు, ముఖ్యనేతల వాట్సాప్ కాల్స్ ట్యాపింగ్కు సైతం వారు పాల్పడుతున్నారు. యూరప్ నుంచి అధునాతన పరికరాలు ఇందుకోసం ప్రత్యేకంగా యూరప్ నుంచి సూక్ష్మ పరికరాలను తీసుకువచ్చారని అధికార పార్టీకి చెందిన ఒక నేత వెల్లడించారు. ఒకసారి వాయిస్ రికార్డు చేస్తే ఫోను మార్చి మాట్లాడినా ఆ వాయిస్ను రికార్డు చేసే టెక్నాలజీ ఆ పరికరాలకు ఉన్నట్టు సమాచారం. అలాగే సెల్ ఫోన్ నంబర్ తెలుసుకోవడం ద్వారా, అలాగే సెల్ఫోన్ తయారీ నంబర్ ద్వారా ట్యాపింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నారని, ఈ వ్యవహారం అంతా హరిప్రసాద్, అశోక్ కనుసన్నల్లోనే జరుగుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గత రెండురోజులుగా వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ల సమాచారం సేకరణ పనిలో నిమగ్నమయ్యారని, వారి ఫోన్ నంబర్లతో పాటు వారి బ్యాంకు అకౌంట్ల కోసం అన్వేషిస్తున్నారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం నుంచి పార్టీ సేవా మిత్ర యాప్కు ఇచ్చేసిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్లు.. ఇప్పుడు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ల బ్యాంకు ఖాతాల వివరాలను, వారి ఫోన్ నంబర్లను సేకరిస్తుండటం గమనార్హం. ఇప్పటికే సచివాలయంలోను, ఆర్టీజీఎస్ కార్యాలయంలోనూ సీసీ కెమెరాల ద్వారా వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్కు చేరవేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫోన్ ట్యాపింగ్లతో ప్రతిపక్షంపై దుష్ప్రచారానికి ఎత్తుగడ వేసిన చంద్రబాబు.. అందులో భాగంగానే డబ్బులున్న వ్యక్తులకే వైఎస్సార్సీపీ అంటూ దుష్ప్రచారం ప్రారంభించారు. పోలింగ్ సమయం దగ్గరపడే సరికి ఈ ప్రచారాన్ని తీవ్ర స్థాయికి తీసుకువెళ్లాలనేది వారి ఉద్దేశమని టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అధికారుల కోడ్ ఉల్లంఘనలపై చర్యలేవీ.. ఇలావుండగా ప్రభుత్వ సాంకేతిక పరిజ్ఞానాన్ని కొందరు పోలీసు ఉన్నతాధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వినియోగిస్తున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంత బరితెగింపుతో అధికార దుర్వినియోగం, ఇంత అధికార పార్టీ పిచ్చితో వ్యవహరిస్తున్న పోలీసు అధికారులను గతంలో ఎన్నడూ చూడలేదని పోలీసు శాఖలో పనిచేస్తున్న ఒక అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రతిపక్ష పార్టీతో పాటు ఇతర పార్టీలు పోలీసు యంత్రాంగం దురాగతాలపై ఫిర్యాదు చేస్తే.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆయా జిల్లా అధికార యంత్రాంగానికి పంపి వాటిపై నివేదికలు తెప్పించుకుంటున్నారు. జిల్లా అధికార యంత్రాంగం అలాంటివేమీ జరగలేదని నివేదిక పంపితే ఆ ఫిర్యాదులను పక్కన పడేస్తున్నారు తప్ప జిల్లా అధికార యంత్రాంగం నివేదికలో వాస్తవం ఉందా లేదా అనే విషయాన్ని ధ్రువీకరించుకోవడం లేదు. పశ్చిమగోదావరి జిల్లా, విశాఖపట్నం జిల్లాలకు కలెక్టర్లుగా తమకు అనుకూలంగా వ్యవహరించే వారిని చంద్రబాబు నియమించారు. ఇప్పుడు వారిద్దరూ అధికార పార్టీ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. అలాగే సచివాలయ స్థాయిలో కొందరు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కూడా అధికార పార్టీ నేతల్లా వ్యవహరిస్తూ యధేచ్చగా నియమావళిని ఉల్లంఘిస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలను తీసుకోవడం లేదు. గతంలో టీవీలు, పత్రికల్లో వచ్చే వార్తలు, కథనాల ఆధారంగా కోడ్ ఉల్లంఘనలను గుర్తించి చర్యలు తీసుకునేవారు. ఇప్పుడు ఆ విధంగా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
ఊళ్లపై గులాబీ జెండా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంచాయతీ పోరు ముగిసింది. గ్రామగ్రామాన గులాబీ జెండా ఎగిరింది. మూడు విడతలుగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పల్లె ప్రజలు అధికార పార్టీకే పట్టం కట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 12,730 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. వివిధ కారణాలతో 47 పంచాయతీల్లో పోలింగ్ నిలిచిపోయింది. రిజర్వేషన్ల కారణంగా 24 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 23 పంచాయతీల్లో ఎన్నికలు కోర్టు కేసులతో వాయిదా పడ్డాయి. ఫలితంగా 12,683 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్య స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 8,264 స్థానాల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు. 2,688 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. ఇక భారతీయ జనతాపార్టీ 170, తెలుగుదేశం పార్టీ 77, సీపీఐ 39, సీపీఎం 74 పంచాయతీలు కైవసం చేసుకోగా.. 1,371 పంచాయతీల్లో స్వతంత్రులు పాగా వేశారు. మూడో విడతలో 88.03% పోలింగ్... చివరి విడతగా బుధవారం జరిగిన ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 88.03% పోలింగ్ నమోదైంది. మూడోవిడతలో మొత్తం 4,116 పంచాయతీలకు గాను 4,083 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీటి పరిధిలో 45.23లక్షల మంది ఓటర్లుండగా.. 39.82 లక్షల మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓట్లు వేసిన వారిలో మహిళలు 20.14 లక్షలు, పురుషులు 19.68 లక్షల మంది ఉన్నారు. యాదాద్రి–భువనగిరి జిల్లాలో అత్యధికంగా 94.99% పోలింగ్ నమోదైంది. 94.56 శాతం పోలింగ్తో ఖమ్మం జిల్లా రెండో స్థానంలో ఉండగా.. సూర్యాపేట (92.6%), నల్లడొండ (91.73%), మహబూబాబాద్ (91.54%), సిద్ధిపేట (90.73%), మెదక్ (90.28%), సంగారెడ్డి (90.15%) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో అత్యల్పంగా 77.7% పోలింగ్ జరిగింది. కాగా మేడ్చల్ జిల్లాలో మూడో దశ పోలింగ్ జరగలేదు. -
ఆధికార పార్టీ నేతలు ఆయిల్ దోపిడి
-
పోలీస్ స్టేషన్ను ముట్టడించిన టీడీపీ నేతలు
ఒంగోలు: అధికార పార్టీ ఎమ్మెల్యే సహాయకుడు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం కాగితాలను చూపించాలని ట్రాఫిక్ ఎస్సై అడిగినందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ట్రాఫిక్ పోలీస్స్టేషన్ను ముట్టడించి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఎమ్మెల్యే సైతం స్టేషన్కు చేరుకుని పోలీసులపై చిందులు తొక్కారు. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వద్ద సహాయకుడిగా పనిచేస్తున్న గోపీచంద్ ఆదివారం ఒంగోలులో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అద్దంకి బస్టాండ్ వద్ద విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్సై మహేష్ ఆపి బండి కాగితాలు చూపించాలని కోరారు. అయితే అతడు కాగితాలు చూపకుండా వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. అంతేకాకుండా భారీ ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలసి ట్రాఫిక్ పోలీస్స్టేషన్కు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిబ్బందిని లోపలకు పోనీయకుండా, బయటకు రాకుండా అడ్డుకుని వారి విధులకు ఆటంకం కలిగించారు. కొద్దిసేపటికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సైతం అక్కడకు చేరుకుని ట్రాఫిక్ ఎస్సై అసభ్యంగా మాట్లాడారని అతన్ని సస్పెండ్ చేయాలంటూ అధికారులను డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రాకతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అప్పటివరకు అక్కడే బైఠాయించిన కార్యకర్తలు పోలీస్స్టేషన్ ఆవరణలోకి చొచ్చుకునివెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు, ట్రాఫిక్ డీఎస్పీ కృష్ణారెడ్డిలు ఎమ్మెల్యేతో చర్చించారు. ఎస్సై మహేష్ మాత్రం అతను ఎవరో తనకు తెలియదని, తాను అనుచితంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని ట్రాఫిక్ డీఎస్పీ కృష్ణారెడ్డి తెలిపారు. -
‘మార్కెట్’ సందడి!
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మళ్లీ మార్కెట్ కమిటీ నామినేటెడ్ పదవుల పందేరం మొదలైంది. గతంలో ఉమ్మడి జిల్లాలో 25 వ్యవసాయ మార్కెట్లు, 19 ఉప మార్కెట్లు ఉండగా.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కొత్తగా 13 చేర్చి వ్యవసాయ మార్కెట్ల సంఖ్య 38 చేసింది. 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 38 మార్కెట్లకు, జిల్లాల పునర్విభజన తర్వాత మూడు (హుస్నాబాద్, బెజ్జంకి, కోహెడ్) సిద్దిపేట జిల్లాకు, ఒకటి (కాటారం) జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వెళ్లాయి. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరిధిలో 34 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. మొత్తం 38 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు గాను 21 మార్కెట్ కమిటీల పాలకవర్గం పదవీకాలం మే 6, 12, 19, జూన్ 6, 8, 12 తేదీలలో ముగిసిపోగా, ఇందులో ఏడు కమిటీలకు రెండు నెలల నుంచి ఏడాది వరకు పొడిగించారు. మరో 17 కమిటీల పాలకవర్గం గడువు జూలై నుంచి అక్టోబర్ మాసాల వరకు ముగియనుంది. ఇదే సమయంలో మార్కెట్ కమిటీలకు రొటేషన్ పద్ధతిలోరిజర్వేషన్లు ప్రకటిస్తూ మే 17న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పదవీకాలం ముగిసిన మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాల నియామకం అనివార్యంగా మారింది. ఎమ్మెల్యే తర్వాత నియోజకవర్గం స్థాయిలో డిమాండ్ ఉన్న పోస్టు కావడంతో మారిన రిజర్వేషన్లకు అనుగుణంగా సీనియర్ నాయకులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొద్ది నెలల్లోనే సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ మార్కెట్ కమిటీలకు చైర్మన్లు, పాలకవర్గం ఎంపిక మంత్రులు, ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. మారిన రిజర్వేషన్లు.. తెరపైకి సీనియర్ నేతలు.. ప్రభుత్వం రొటేషన్ పద్ధతిలో వ్యవసాయ మార్కె ట్ కమిటీల రిజర్వేషన్లను గత నెల 17న ఖరారు చేసింది. ఈ జీవో విడుదలైన తర్వాత రెండేళ్ల పదవీకాలం ముగిసి.. వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాన్ని నియమించాల్సి ఉంది. ఈనెల 2 నుంచి ఉమ్మడి జిల్లాలో ఒక్కో కమిటీ పాలకవర్గాల పదవీకాలం ముగుస్తూ వస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడక ముందు పొడిగించిన కమిటీలను పక్కనబెట్టి స్పష్టంగా పదవీకాలం ముగిసిన మార్కెట్లకు కమిటీలను ఖరారు చేయాల్సి ఉంది. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తం గా ఈనెల 15 వరకు 159 మార్కెట్ కమిటీలకు కాలపరిమితి ముగియగా, ఇందులో ఉమ్మడి కరీం నగర్ జిల్లాకు చెందిన 14 కమిటీలు ఉన్నాయి. వీటికి తక్షణమే పాలక వర్గాలను ఖరారు చేయాల్సి ఉండగా, ఈసారి గత రిజర్వేషన్లకు భిన్నంగా మారడంతో కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. దీంతో అధికార పార్టీ నేతలకు తలనొప్పిలా పరిణమించింది. సాధారణంగా నామినేటెడ్ పదవులు అంటేనే తమకు ‘విధేయులు’గా ఉండే వారినే మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు అవకాశం ఉంటుంది. కాగా.. కాల పరిమితి తీరిన మార్కెట్ కమిటీ చైర్మన్లు, పాలకవర్గం స్థానంలో పదవుల కేటాయింపులకు సన్నాహాలు జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. విషయం తెలుసుకున్న తెలంగాణ ఉద్యమకారులు.. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆయా నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడెక్కడ నుంచి, ఎవరెవరు.. ‘మార్కెట్ కమిటీ’ల కోసం పోటాపోటీ.. మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్, సిరిసిల్ల నియోజకవర్గాల్లోని ప్రధాన మార్కెట్లకు తక్షణమే కమిటీలు వేయాల్సి ఉంది. ఆ తర్వాత కరీంనగర్, పెద్దపల్లి, వేములవాడ నియోజకవర్గాల్లోని మార్కెట్లకు కొత్త పాలకవర్గాన్ని ఖరారు చేయాలి. ఇప్పటికే కొత్త పాలకవర్గంపై కసరత్తు చేస్తున్నా ఆశావహులు రోజురోజుకూ పెరుగుతున్నారు. హుజూరాబాద్ మార్కెట్ కమిటీ పాలకవర్గం గడువు ఈ నెల 9న ముగిసింది. ఈసారి కూడా ఓసీ జనరల్కు కేటాయించడంతో అధ్యక్ష పద వి కోసం ప్రస్తుత చైర్మన్ ఎడవెల్లి కొండాల్రెడ్డి మరోసారి మంత్రి ఈటల రాజేందర్ ఆశీçస్సులతో ప్రయత్నాలు చేస్తున్నారు. సింగపూర్ సర్పంచ్ కౌరు రజిత భర్త కౌరు సుగుణాకర్రెడ్డి, సైదాపూర్ మండలం నుంచి పెరాల గోపాల్రావు ఎంపీ కెప్టెన్ లక్ష్మీ కాంతారావు ద్వారా ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం ఉంది. జమ్మికుంట మార్కెట్ చైర్మన్గా ఇప్పటి దాక పింగిళ రమేష్ వ్యవహరించారు. ఈసారి బీసీ మహిళకు రిజర్వు చేయడంతో గత చైర్మన్ పింగిళి రమేష్ ఆయన భార్య పింగిళి రమాదేవికి ఇవ్వాలని మంత్రి రాజేందర్ను కోరుతున్నట్లు సమాచారం. కాగా.. గతంలో జమ్మికుంట మార్కెట్ కోసం ప్రయత్నం చేసిన పొనగంటి మల్లయ్య ఈసారైనా తన భార్య పొనగంటి శారదకు ఇవ్వాలని మంత్రిని కోరినట్లు సమాచారం. కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ జనరల్ కోటాలో గోగూరి నర్సింహారెడ్డికి మొదటగా అవకాశం దక్కింది. రొటేషన్లో భాగంగా ఈ సారి కరీంనగర్ ఎస్సీ మహిళకు కేటాయించా రు. దీంతో పలువురు ప్రయత్నాలు చేస్తుండగా, ఇటీవల బావుపేట సర్పంచ్ దావా వాణి, తీగలగుట్టపల్లి సర్పంచ్ మల్లయ్య భార్య జంగపల్లి సుజాత, గోపాల్పూర్ మాజీ సర్పంచ్ బెజ్జంకి లలిత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను కోరినట్లు తెలిసింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం మే 6, 2016లో ఏర్పాటైంది. అప్పుడు ఎస్టీకి రిజర్వు కాగా, మాలోత్ బాసునాయక్ చైర్మన్గా చేశారు. మే 5తో పాలకవర్గం గడువు ముగిసింది. రొటేషన్లో ఇప్పుడు జనరల్కు రిజర్వు కాగా కనుకుంట్ల లింగారెడ్డి (ఉ పసర్పంచ్ గొల్లపల్లి), నేరెళ్ల గంగారెడ్డి (ఎంపిటీసీ, ఇబ్రహీంనగర్), ముస్కు కిష్టారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు (గొల్లపల్లి), పల్లె నల్లకొండం గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు (గొల్లపల్లి) ప్రయత్నాలు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మార్కెట్ కమిటీ రెండేళ్ల క్రితం పాలకవర్గం నియమించారు. ఈనెల 8తో గడువు ముగిసింది. కొత్తగా ఈసారి ఓసీకి రిజర్వేషన్ కేటాయించారు. ఇందుకోసం గడ్డమీది శ్రీకాంత్రెడ్డి, గౌరినేని నారాయణ, ప్రస్తుత టీఆర్ఎస్ అధ్యక్షుడు లింగన్నగారి దయాకర్ రావు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఆశీస్సులున్న లింగన్నగారి దయాకర్రావు పేరు దాదాపుగా ఖరారైనట్లు ప్రచారం. జగిత్యాల జిల్లా పెగడపల్లి మొట్టమొదటి మార్కెట్ కమిటీ పాలకవర్గం 2016 జూలై 6న ఏర్పాటైంది. జనరల్ రిజర్వు కావడంతో కోరుకంటి రాజేశ్వర్రావును చైర్మన్ చేశారు. ఈ నెల 6న పాలకవర్గం గడువు ముగియగా, ఈసారి ఇప్పుడు ఎస్టీకి రిజర్వు అయ్యింది. బక్కా నాయక్ (ఏడుమోటలపల్లి), తిరుపతినాయక్ (ఏడుమోటలపల్లి), అజ్మీర చిరంజీవి (మద్దుపల్లి) ప్రయత్నం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం గడువు ఈనెల 5న ముగిసింది. గతంలో ఎస్సీకి రిజర్వు చేయడంతో ముల్కల గంగారాంకు చైర్మన్గా అవకాశం ఇచ్చారు. ఈసారి వెల్గటూరు జనరల్ కోటా కింద రిజ ర్వు చేశారు. దీంతో ఆశవాహుల పేర్లు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఏలేటి చంద్రారెడ్డి(రాజరాంపల్లి), ఏలేటి క్రిష్ణారెడ్డి (ఎండపల్లి), రావు సుగ్రీవరావు (కొత్తపేట), పొనగోటి రాంమోహన్రావు (వెల్గటూర్), నూనె శ్రీనివాస్ (వెల్గటూర్), పత్తిపాక వెంటేష్ (వెల్గటూర్), ఏలేటి సత్యనారాయణ రెడ్డి (రాజరాంపల్లి) తదితరులు రేసులో ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జల్లా ఇల్లంతకుంట మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని గత 2016 జూన్12న ప్రభుత్వం నియామకం చేసింది. చైర్మన్గా గుండ సరోజన రెండేళ్లపాటు పాలన సాగించారు. ఈనెల 12న పదవీకాలం పూర్తయింది. ఈసారి ఓసీ రిజర్వు కావడంతో మల్లుగారి రవీందర్రెడ్డి, గుండ ముత్తయ్య, చల్ల నారాయణ, గొడుగు తిరుపతి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వద్దకెళ్లి ఎవరికి వారే వినతులు సమర్పించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మార్కెట్ కమిటీ పాలకవర్గం 2016 జూన్ 13న ఖరారు కాగా ఈ నెల 12న ముగిసింది. ప్రస్తుతం మనకొండూర్ మార్కెట్ యార్డ్ బాధ్యతలు డీఎంవో పద్మావతి చూస్తున్నారు. అయితే.. ఈసారి ఈ సీటును జనరల్కు కేటాయించగా మాడ తిరుపతిరెడ్డితోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. మెటపల్లి, మల్లాపూర్, కోరుట్ల, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీలను 2016 ఏప్రిల్ 21 నియమించారు. వీటి పదవీకాలం ఏప్రిల్ 21న ముగిసింది. మెట్పల్లి మార్కెట్ ఎస్సీ మహిళ కాగా జరుపుల భారతి, మలోవత్ కరుణ పోటీ పడుతున్నారు. ఇబ్రహీంపట్నం ఎస్సీ మహిళ కాగా గడసనంద లావణ్య, జంగ సరస్వతి పోటీ పడుతున్నారు. కోరుట్ల బీసీ మహిళ కాగా అన్నం లావణ్య, జనరల్ స్థానం మల్లాపూర్ నుంచి ఆదిరెడ్డి, నర్సారెడ్డి, శ్రీనివాస్రెడ్డి పోటీలో ఉన్నారు. కథలాపూర్ మార్కెట్కు జూలై 8 వరకు గడువుండగా, జనరల్కు రిజర్వు కావడంతో నాగం భూమయ్య, వర్థినేని నాగేశ్వరరావు, గడ్డం భూమారెడ్డి, చీటి విద్యాసాగర్రావు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు. అక్టోబర్ వరకు అన్ని మార్కెట్ కమిటీలు.. మంత్రులు, ఎమ్మెల్యేలే కీలకం.. ఈనెల 27 వరకు ఏడు మార్కెట్ కమిటీల పాలకవర్గం కాలపరిమితి తీరనుండగా, వచ్చే నెల నుంచి అక్టోబర్ వరకు మిగిలిన అన్ని మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాల నియామకం అనివార్యం. ఈ కమిటీల కూర్పులో మంత్రులు, ఎమ్మెల్యేలే కీలకం కాగా, ఆశావహులు సైతం వారినే ఆశ్రయిస్తున్నారు. కథలాపూర్ మార్కెట్ కమిటీ 2016 సంవత్సరం జూలైలో నియమించారు. అదే కమిటీ గడువును పెంచారు. వాటి గడువు 2018 జూలై 8 వరకు ఉంది. ధర్మపురి పాలకవర్గం 2016 అక్టోబర్ 6న ఏర్పాటు అయ్యింది. బీసీ మహిళ రిజర్వు కావడంతో అల్లం దేవమ్మను చైర్మన్ చేశారు. అక్టోబర్ 6, 2017కు ముగియగా, ఆరు నెలల చొప్పున రెండు పర్యాయాలు గడువు పెంచడంతో ఆమె పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్ 5 వరకు ఉంది. జగిత్యాల బీసీ రిజర్వేషన్ కాగా శీలం ప్రియాంక చైర్మన్గా వ్యవహరించారు. 2016 సెప్టెంబర్ 19న ఏర్పడింది. ఈ పాలకవర్గం కాల పరిమితి ఈ ఏడాది సెప్టెంబర్ 18న ముగియనుంది. ఇలా ఉమ్మడి జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్, జూలపల్లి, కాటారం, కాల్వశ్రీరాంపూర్, మంథని, హుస్నాబాద్, కోహెడ, బెజ్జంకి, గంగాధర, చొప్పదండితోపాటు పలు మార్కెట్ కమిటీల పాలకవర్గం ఈనెల 27 మొదలు అక్టోబర్ వరకు కాలపరిమితి ముగియనుండగా, ఇప్పటి నుంచే ఆశావహులు తొందరపడుతుండటం అధికార పార్టీ నేతలకు తలనొప్పిలా మారింది. -
వైఎస్సార్ను కేసీఆర్ ఆదర్శంగా తీసుకోవాలి
సాక్షి,కొత్తపల్లి (కరీంనగర్) : నిరుపేద ముస్లింలకు ఉద్యోగ, విద్య అవకాశాలు కల్పించేందుకు రిజర్వేషన్ల అమలులో వైఎస్ రాజశేఖరరెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శంగా తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.నగేశ్ సూచించారు. కొత్తపల్లి(హెచ్) మండలం చింతకుంట, శాంతినగర్ మసీదుల్లో ఆదివారం జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొని మాట్లాడారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేసి వారి అభ్యున్నతికి పాటుపడింది కేవలం వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. ప్రధానంగా టీఆర్ఎస్ ఎన్నికల మెనిఫెస్టోలో ఉన్న 12 శాతం రిజర్వేషన్ అమలుకు కేంద్రంపై కేసీఆర్ ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కేవలం దుస్తులు, విందులతో సంతృప్తిపరిస్తే ముస్లింల పేదరికం పోదని, ఓటు బ్యాంకుగా వినియోగించుకోకుండా వారికి ఉన్నత విద్యతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్ అని అన్నారు. జిల్లా కార్యదర్శి ఎండీ అహ్మద్ బేగ్, పట్టణ కార్యదర్శి సుంకరి సునీల్కుమార్, నాయకుడు ఎండీ సర్ఫోద్దీన్ పాల్గొన్నారు. తెలంగాణలో ఆర్థిక దోపిడీ గంగాధర(చొప్పదండి) : రాష్ట్రంలో అవసరం లేని నియామకాలు చేస్తూ రూ.లక్షల వేతనాలు, మంత్రి హోదాను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక దోపిడీకి పాల్పడుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నగేశ్ విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ఎంతోమంది ప్రభుత్వ ప్రతినిధులు, సలహాదారులున్నా.. రాజకీయ పునరావాసం కల్పించడానికి నియామకాలు జరుపుతున్నారని విమర్శించారు. ఇప్పటికే ఢిల్లీలో ఇరువురు ప్రభుత్వ ప్రతినిధులుండగా.. వారికే ఎలాంటి పనులు లేకున్నా మరో వ్యక్తి జగన్నాథంను ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పనులు మానుకొని ఇలాంటి నియామకాలు చేసుకుంటూ పోతే ప్రభుత్వం విశ్వాసం కోల్పోతుందని అన్నారు. -
ఓట్ల కోసం బోగస్ పట్టాలు
జయపురం : జయపురంలో ప్రజాస్వామ్యం హత్యకు గురవుతోంది. ఎన్నికలలో నెగ్గేందుకు అధికార పార్టీ రాజకీయ నేతలు ఎటువంటి నేరాలకైనా వెనుకాడడంలేదని జయపురం ఎంఎల్ ఏ, విధానసభలో కాంగ్రెస్ చీఫ్విప్ తారాప్రసాద్ బాహిణీపతి ధ్వజమెత్తారు. జయపురంలోని నివాస గృహంలో గల పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తారాప్రసాద్ బాహిణీపతి మాట్లాడుతూ జయపురం నియోజకవర్గంలో బోగస్ భూమి పట్టాలను ప్రజలకు అందజేసి మోసగించారని ఆరోపించారు. కేవలం జయపురం సమితిలో 10 వేల మందికి బోగస్ భూమి పట్టాలను అధికార పార్టీకి చెందిన మాజీమంత్రి అందజేశారని, పట్టాలు పొందిన లబ్ధిదారులు జయపురం తహసీల్దార్ వద్దకు వెళ్లి తమకు ఇచ్చిన పట్టాల భూములు అందజేయాలని అడుగగా అసలు ఆ పట్టాలు తాము ఎవరకీ ఇవ్వలేదని, ఆ పట్టాల వివరాలు తమ కార్యాలయం రికార్డులలో లేవని స్పస్టం చేయడంతో లబ్ధిదారులు కంగుతిన్నారని ఆయన వెల్లడించారు. 2011 పంచాయతీ ఎన్నికల సమయంలోను, 2014 విధానసభ ఎన్నికల సమయంలోను బోగస్ పట్టాలను ఆనాటి మాజీమంత్రి ప్రజలకు పంచారని ఆరోపించారు. బయటపడిన 10 వేల పట్టాలు ఇంతవరకు 10 వేల బోగస్ పట్టాలు బయటపడ్డాయని ఇంకా అనేకం బయటపడవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికలలో లబ్ధిపొందేందుకు బోగస్ భూమి పట్టాలతో ప్రజలను ప్రలోభపరిచారని ఎద్దేవా చేశారు. కేవలం జయపురం సమితిలోనే కాదని జయపురం నియోజకవర్గంలో అంతర్భాగమైన బొరిగుమ్మ సమితిలో కూడా ఎన్నికల సమయంలో ప్రజలకు బోగస్ భూమి పట్టాలు పంచి ఓటర్లను ప్రభావితం చేశారని ఆరోపించారు. జయపురం విధానసభ నియోజకవర్గంలో దాదాపు 25 వేల మందికి బోగస్ భూమిపట్టాలు పంచారని ధ్వజమెత్తారు. అనేక పట్టాలపై తహసీల్దార్ సంతకాలు లేవని, అలాగే పట్టాలపై తేదీలు కూడా లేవంటూ కొన్ని పట్టాలను విలేకరులకు చూపించారు. బాధితులకు పట్టాలు అందజేయాలి ఈ వ్యవహారం తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి తెలిసే జరిగిందా? లేదా పట్టాలు పంచిన వారు బోగస్ పట్టాలు ముద్రించి ప్రజలను మోసగించారా? అన్నది తేలాలని అందుచేత ప్రభుత్వం వెంటనే దర్యాప్తు జరిపించి బోగస్ పట్టాలు పంచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోసపోయిన లబ్ధిదారులకు వెంటనే భూములు, స్థలాలు సమకూర్చి అసలైన పట్టాలు అందజేయాలని కోరారు. జయపురం నియోజకవర్గంలో బోగస్ భూమి పట్టాల సంఘటనకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.15 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి సంబంధిత నిందితులను అరెస్టు చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాందోళన చేపట్టి జయపురం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తుందని హెచ్చరించారు. దర్యాప్తు జరిపి నిందితలను అరెస్టు చేయకపోతే బోగస్ పట్టాలు ప్రజలకు పంచి మోసగించిన వారిపై కాంగ్రెస్ పార్టీ తరఫున పోలీస్స్టేషన్లో కేసులు పెడతామని, అలాగే రాజధానిలో ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎంఎల్ఏ తారాప్రసాద్ విలేకరుల సమావేశం పూర్తిచేసిన తరువాత పలువురు గ్రామీణ ప్రజలు బోగస్ భూమి పట్టాలతో వచ్చి తాము మోసపోయినట్లు వాపోయారు. బోగస్ పట్టాలు ప్రజలు పంచిన నేత మాజీ మంత్రి రవినారాయణ నందో అని ఆయన పరోక్షంగా తారాప్రసాద్ బాహిణీపతి ఆరోపించారు. పట్టాలు పంచిన సమయంలో ఉన్న తహసీల్దార్ సిబ్బంది ఇతర నేతలు కూడా నిందితులేనని స్పష్టం చేశారు. సమావేశంలో జయపురం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేంద్ర కుమార్ మíహంతి, జిల్లా కాంగ్రెస్ కోశాధికారి నిహార్ బిశాయి పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే అనుచరుడా.. మజాకా!
పినిశెట్టి కుమారి.. ముగ్గురు పిల్లలతో జీవితాన్ని నెట్టుకొస్తోంది. దువ్వాడలో దయాళ్నగర్లో 133 గజాలు కొనుగోలు చేసింది. కొనుక్కున్న స్థలంలో 2017లో రేకుల షెడ్డు వేసింది. ఈ జాగాపై అధికార పార్టీకి చెందిన నాయకుడు, ఎమ్మెల్యే అనుచరుడు కన్నేశాడు. మార్చి 29, 2018లో సుమారు 30 మందితో ఆమె ఇంట్లోలేని సమయం చూసి తన అనుచరులతో కలిసి ఆ ఇంటిని నామరూపాల్లేకుండా కూల్చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు దువ్వాడ పోలీస్ స్టేషనుకు ఫిర్యాదు చేసింది. ఇలా అనేక రకాలు భూ కబ్జాలు, రాత్రికి రాత్రే నిర్మాణాలు వంటి అనేక ఫిర్యాదులు ఉన్నాయని స్వయంగా అధికార పార్టీ నాయకులే తలలు పట్టుకుని కూర్చుంటున్నారు. సాక్షి, విశాఖపట్నం : తలసరి ఆదాయంలోనే కాదు.. స్థూల వృద్ధి రేటులో కూడా గాజువాక నెం.1. అంతేకాదు.. అధికార టీడీపీ నేతల దందాలు..భూకబ్జాల్లో కూడా అదే స్థానంలో నిలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే అండదండలతో ఆయన అనుచరగణం జాగా కన్పిస్తే చాలు పాగా వేసేస్తున్నారు. ఎవరైనా నిలదీస్తే మీ అంతుచూస్తాం అంటూ బెదిరింపులకు సైతం పాల్పడుతున్నాడు. ఇక్కడ అధికారులు సైతం వీరి అడుగులకు మడుగులొత్తుతున్నారు. గాజువాకకు కూతవేటు దూరంలో 65వ వార్డు పరిధిలోని హరిజనజగ్గయ్యపాలెంలో ఉన్న మాజీ సైనికుల కాలనీలోని సర్వే నంబర్ 117/3లో సుమారు 15 సెంట్లకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. మార్కెట్లో రూ.2 కోట్లకు పైగా పలుకుతున్న ఈ ప్రభుత్వ భూమిపై స్థానిక టీడీపీ నేత కన్నేశాడు. ఎలాగైనా కాజేయాలని పక్కా స్కెచ్ వేసి దర్జాగా కబ్జా చేశాడు. పైగా తన బంధువైన ఓ అంగన్వాడీ కార్యకర్త పేరిట దొంగపత్రాలు సృష్టించాడు. టౌన్ప్లానింగ్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణం చేపట్టాడు. గతంలో ఈ నిర్మాణంపై వచ్చిన ఫిర్యాదుపై పరిశీలించేందుకు వచ్చిన ఆర్ఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టడంతో అటువైపు చూసేందుకు కూడా భయపడే పరిస్థితి నెలకొంది. గతంలో ఇతగాడి భూకబ్జాలపై ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన ప్రతిసారి హడావిడి చేయడం.. కొద్దికాలం పాటు నిర్మాణాలు ఆపమని ఉచిత సలహాలు ఇవ్వడం తప్ప అధికారులు ఏనాడు చర్యలు తీసుకున్న పాపాన పోవడం లేదు. డిప్యూటీ తహసీల్దార్ అండదండలతో... ఇటీవల గాజువాక తహసీల్దార్ బదిలీ అయ్యారు. అప్పటికే ఖాళీగా ఉన్న డిప్యూటీ తహసీల్దార్ పోస్టులో తన పీఏగా పని చేస్తున్న చేతన్కు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పోస్టింగ్ ఇప్పించారు. ఇన్చార్జి తహసీల్దార్ బాధ్యతలు కూడా ఆయనకే కట్టబెట్టేలా ఎమ్మెల్యే చక్రం తిప్పారు. ఇక 65వ వార్డు నాయకుడికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్లాన్ అప్రూవల్స్ అంటూ పొంతన లేని ఫ్లెక్సీలు నిర్మాణం వద్ద ప్లాన్ అప్రూవల్స్తో పాటు ఇతర అనుమతులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను ప్రదర్శించాలి. కానీ అందర్ని అయోమయానికి గురిచేసే విధంగా పొంతన లేని నోటీసులు ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు క్రమబద్ధీకరించే అంశం సంబంధిత అధికారుల పరిధిలో ఉందంటూ కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఆర్డర్, హౌసింVŠ శాఖ రుణాలు మంజూరు చేసినట్టుగా మరొకటి పొంతన లేని నోటీసులను భారీ ఫ్లెక్సీగా ఏర్పాటు చేసి అందర్నీ అయోమయానికి గురి చేస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై స్థానిక వీఆర్వో నుంచి జోనల్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్ వరకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ యంత్రాంగం నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి వచ్చి పరిశీలించింది. అంతే వారిపై వీరంగం సృష్టించటంతో అధికారులు అక్కడి నుంచి జారుకున్నారు. అధికారులు సదరు నాయకుడి అక్రమాలపై విచారణ జరిపి ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుని గ్రామానికి ఉపయోగపడే విధంగా వినియోగించాలని స్థానికులు కోరుతున్నారు. ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు ఈ వ్యవహారంపై డిప్యూటీ తహసీల్దార్ చేతన్ను వివరణ కోరగా అది పూర్తిగా ప్రభుత్వ స్థలమేనని, ఆ భూమి ఎవరికి కేటాయించలేదని, వాటిలో నిర్మాణాలకు తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, పైగా తమకు ఎలాంటి ఫిర్యాదులు ఇప్పటి వరకు రాలేదని చెప్పుకొచ్చారు. అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా తమ దృష్టికే రాలేదంటూ దాటవేశారు. ఆ నాయకుడి ఆగడాలకు అంతేలేదు అధికారపార్టీ నాయకుడు అక్రమంగా నిర్మిస్తున్న ఇంటి పక్కనే నా ఇల్లు జీవీఎంసీ అనుమతులతో ఉంది. నా ఇంటి మరమ్మతు కోసం గోడను తొలగించాను. తిరిగి కట్టుకుందామని అనుకుంటే అధికారపార్టీ నాయకుడు జీవీఎంసీ అధికారులతో ఇంటిని కట్టకుండా నరకాన్ని చూపిస్తున్నాడు. బిల్డింగ్ ఇన్స్స్పెక్టర్ నాయకుడు చెప్పినట్టు విని మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. – పి.ఈశ్వరమ్మ, బాధితురాలు అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అనుమతుల్లేని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే తిరిగి తమమీదే తప్పులు ఎత్తిచూపుతున్నారు. ఆ నాయకుడు అక్రమనిర్మాణం చేపట్టడమే కాకుండా అధికారులతో భయభ్రాంతులకు గురి చేయిస్తున్నాడు. – వై.శ్యామల, స్థానికురాలు -
అధికారులే టార్గెట్ ..!
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ పాలనా లోపాలను పక్కన పెట్టి అధికారులే టార్గెట్గా శనివారం నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సాగింది. అధికారులు సక్రమంగా పనిచేయడం లేదంటూ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు మండి పడ్డారు. ఆర్డబ్ల్యూఎస్, డ్వామా, డీపీఓ, వైద్య ఆరోగ్యశాఖ, విద్యశాఖలకు సంబం ధించిన అంశాలపై చర్చ సాగింది. జామిమండల కేంద్రం లో సొంత నిధులతో బోర్లు వేయించానని, బిల్లులు చెల్లిం చాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని జామి జెడ్పీటీసీ సభ్యుడు పెదబాబు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈపై మండిపడ్డారు. గుర్ల జెడ్పీటీసీ మాట్లాడుతూ గుర్ల మండలం గరికి వలస ఎస్సీ కాలనీలో తాగునీటి పథకాన్ని ప్రారంభించిన రెండు రోజుల తర్వాత నీటిసరఫరా నిలిచిపోయిందని సభ దృష్టికి తెచ్చారు. దీనిపై మంత్రి సుజయ్ స్పందిస్తూ పథక నిర్మాణం పూర్తయ్యాకే తాగునీరు సరఫరా చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. కురుపాంలో తాగునీటి పథకం పాడవ్వడంతో 10 రోజులుగా అక్కడ ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారని కురుపాం జెడ్పీటీసీ శెట్టి పద్మావతి తెలిపారు. సెప్టిక్ట్యాంక్ క్లీన్ చేయడానికి రూ.30 వేలు వసూలు చేస్తున్నారని, దీనివల్ల మరుగుదొడ్డి నిర్మించడానికి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని ఎల్.కోట జెడ్పీటీసీ కరెడ్డ ఈశ్వరావు సభలో ప్రస్తావించారు. దీనిపై మంత్రి కలుగుజేసుకుని ఆర్డబ్ల్యూఎస్, రవాణశాఖ, సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ తో సమావేశం నిర్వహించి సహజ ధర నిర్ణయిం చాలని జెసీ–2 నాగేశ్వరావుకు ఆదేశించారు. కొమరాడ జెడ్పీటీసీ పావని మాట్లాడుతూ ఉరిటి గ్రామానికి 293 మరుగుదొడ్లు మంజూరయ్యాయని, ఇందులో 150 వరకు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. వైడీఓ నెట్వర్స్ సంస్థ నిర్మాణాల పూర్తికి చొరవచూపడం లేదని తెలిపారు. డ్వామా పీడీపై మండిపడిన ఎమ్మెల్యే చిరంజీవులు.. ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు సకాలంలో డబ్బులు రావడం లేదని, దీనివల్ల వేతనదారులు ఇబ్బందిపడుతున్నారని డ్వామా పీడీ రాజ్గోపాల్ను ప్రశ్నించారు. దీనిపై మంత్రి రంగారావు కలుగుజేసుకుని ఎప్పటి నుంచి ఉపాధిహామీ వేతనదారులకు డబ్బులు ఆగిపోయాయో చెప్పాలని అడిగారు. పిభ్రవరి 19 నుంచి బిల్లులు చెల్లించాల్సి ఉందని, రూ.66 కోట్లు నిధులు పెండింలో ఉన్నాయని, త్వరలోనే «థర్డ్పార్టీ ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాకే నగదు జమ చేస్తామని రాజ్గోపాల్ బదులిచ్చారు. గుమ్మలక్ష్మీపురం జెడ్పీటీసీ అలజంగి భాస్కరరావు మాట్లాడుతూ ఉపాధిహామీ పథకం కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, షిప్ట్ ఆపరేటర్ పోస్టులు అమ్మేస్తుండడం వల్ల అర్హులకు అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. దీనిపై డ్వామా పీడీ కలుగుజేసుకుని నియామకాలు రాష్ట్ర స్థాయిలో జరిగాయని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో జరిగితే జిల్లాలో ఉన్న అభ్యర్థులకు అన్యాయం జరగదా అని ప్రశ్నించారు. డెంకాడ జెడ్పీటీసీ అప్పలనారాయణ మాట్లాడుతూ మోపాడ పీహెచ్సీలో స్టాఫ్ నర్సు పోస్టులు –3, ఒక ల్యాబ్ టెక్సీషియన్ పోస్టును భర్తీ చేయాలని కోరారు. రెండేళ్లుగా పోస్టులు ఖాళీగా ఉంటే సేవలు ఎలా అందుతాయని ప్రశ్నించారు. కురుపాం ఆస్పత్రికి మృతదేహాలను తరలించేందుకు అంబులెన్సు లేకపోవడం వల్ల రెండు, మూడు రోజులు మృత దేహాలను ఆస్పత్రుల్లో ఉంచేస్తున్నారని, చందాలు వేసుకుని మృతదేహాన్ని తరలించాల్సి వస్తోందని కురుపాం జెడ్పీటీసీ పద్మావతి అన్నారు. అలమండ ఎంపీటీసీకి నిబంధనలకు విరుద్ధంగా హెచ్డీఎస్ చైర్మన్ పదవి ఇచ్చారని, ఆస్పత్రి మధ్యలో కళ్యాణ మండపానికి అతను రోడ్డు వేసేసాడని, హెచ్బిఎస్ చైర్మన్ నుంచి అతన్ని తొలిగిస్తారా లేదా ఆస్పత్రిని కూడ అతనికే ఇచేస్తారా అని జామి జెడ్పీటీసీ పెదబాబు డిఎంహెచ్వోపై మండి పడ్డారు. రుణాలు మంజూరు చేయడంలేదు.. టీడీపీ కార్యకర్తలకు పీఏసీఎస్లలో రుణాలు మంజూరు చేయడం లేదని గజపతినగరం ఎమ్మెల్యే కె.ఏ.నాయుడు, పూసపాటిరేగ జెడ్పీటీసీ ప్రసాదరావు, జెడ్పీ వైస్ చైర్మన్ కృష్ణమూర్తినాయుడులు ఆరోపించారు. దీనిపై పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ శోభస్వాతిరాణి, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, ఎమ్మెల్యేలు మీసాలగీత, కోళ్ల లలితకుమారి, నారాయణస్వామినాయుడు, జెడ్పీ సీఈఓ వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు వ్యవహారం టీఆర్ఎస్లోనే అసంతృప్తిని రాజేస్తోందా? వీడియో ఫుటేజీల నేపథ్యంలో ఏజీ ప్రకాశ్రెడ్డి రాజీనామా అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికీ చెడ్డపేరు తెస్తుందని అధికార పార్టీ నేతలే భావిస్తున్నారా? వీటికి టీఆర్ఎస్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఈ వరుస పరిణామాలు ప్రభుత్వానికి ఇబ్బందికరమేనని మంత్రులే తమ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే గవర్నర్ ప్రసంగం సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో తలెత్తిన ఘటనలు మరిచిపోకముందే ఎమ్మెల్యేలపై వేటు వేయడాన్ని వివిధ పార్టీలే కాకుండా ఉద్యమంలో పాలుపంచుకున్న ప్రొఫెసర్లు, సామాజిక, ప్రజా సంఘాల నేతలు తప్పుబడుతున్నారు. వీడియో ఫుటేజీలను ప్రతిపక్ష పార్టీల నేతలకు చూపించకుండా, సరైన ప్రొసీజర్ పాటించకుండానే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడాన్ని ఒకరిద్దరు మంత్రులు తమ సన్నిహితుల వద్ద తప్పుబడుతున్నారు. ‘‘తెలంగాణ ఉద్యమం సందర్భంగా మనం వ్యవహరిం చిన తీరు ప్రపంచానికి అంతా తెలుసు. ఇదే గవర్నర్, ఇలాంటి ప్రసంగం సందర్భంగానే జరిగిన ఘటనలకు సభలో నేను ప్రత్యక్ష సాక్షిని. అప్పుడు అధికారంలో ఉన్నవారూ ఇలాంటి నిర్ణయమే తీసుకుంటే మేం సభలో ఉండేవాళ్లమా? ఇలాంటి నిర్ణయాన్ని ఊహించ లేదు’’అని మంత్రివర్గంలోని ముఖ్యుడొకరు తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. వేటు వేయడం ద్వారా ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందన్న విమర్శలకు తావిచ్చినట్టుగా ఉంటుందని, ఈ నిర్ణయాన్ని పున:సమీక్షించాలని ఒకరిద్దరు మంత్రులు సున్నితంగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారని ఆయన వెల్లడించారు. అయితే ఆ నిర్ణయంపై ఒత్తిడి పెంచే అవకాశం ఇవ్వకుండానే ఖాళీలను ప్రకటిస్తూ శాసనసభ కార్యాలయం నుంచి ఎన్నికల సంఘానికి అదేరోజు లేఖను పంపించారని వెల్లడించారు. కోమటిరెడ్డి, సంపత్లపై సానుభూతిని పెంచామేమో.. అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్కుమార్పై వివిధ వర్గాల్లో సానుభూతిని తామే పెంచామని టీఆర్ఎస్కు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. ఏకంగా అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో వారిపట్ల కాంగ్రెస్లోనే కాకుండా తెలంగాణవాదులు, ప్రజల్లో సానుభూతి పెరగడానికి కారణమైందని విశ్లేషించారు. ‘‘అణచివేతకు గురైనవారిపై ఏ సమాజానికైనా సానుభూతి ఉంటుంది. తెలంగాణలో ఇది కొంచెం ఎక్కువ. ఉద్యమం సందర్భంగా రాష్ట్ర ఆకాంక్షలతో పాటు వివిధ సందర్భాల్లో అప్పటి ప్రభుత్వం అనుసరించిన నిర్బంధం కూడా టీఆర్ఎస్పై సానుభూతి పెరగడానికి ప్రధాన కారణమే. అప్పుడు టీఆర్ఎస్పై నిర్బంధానికి వ్యతిరేకంగా పనిచేసిన వర్గాలు.. ఇప్పుడు టీఆర్ఎస్ తీసుకున్న అంతకంటే తీవ్రమైన నిర్ణయంతో ఏకీభవిస్తాయా? రాజకీయ వ్యూహం ఏమున్నా సభ్యత్వంపై వేటు వేయడం పార్టీలోనూ చాలామందికి నచ్చడం లేదు. దీంతో ఎవరు అధికారంలో ఉన్నా, ఎప్పుడైనా ప్రతిపక్ష సభ్యులను శాసనసభ్యత్వానికి అనర్హులుగా చేయొచ్చన్న సందేశాన్ని ఇచ్చినవాళ్లం అవుతున్నం. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అనర్హులను చేస్తే ఇక ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంది’’అని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. మరో ఎమ్మెల్యే కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. దాంతోనే ఎక్కువ నష్టం.. ఎమ్మెల్యేల అనర్హతపై న్యాయస్థానంలో ఎలాంటి నిర్ణయం వస్తుందో, శాసనసభ ఎలా ప్రతిస్పందిస్తుందో అన్న అంశాల కంటే ఏజీ రాజీనామా వ్యవహారమే ఎక్కువ నష్టం చేస్తుందని పార్టీ నేతలు అంటున్నారు. ఇది ఎమ్మెల్యేలపై వేటు విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పేనన్న సంకేతాలిస్తుందని అభిప్రాయపడుతున్నారు. అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు అనుచితంగా వ్యవహరిస్తే వీడియో ఫుటేజీని ఎందుకు బయటపెట్టడం లేదన్న ప్రశ్నకు ఏం సమాధానం ఇస్తామని ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామికంగా, ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యేలను ఇంత సునాయాసంగా తొలగించవచ్చన్న అభిప్రాయం కూడా మంచిది కాదని వారంటున్నారు. ఇదంతా ఏకపక్షంగా, నిరంకుశంగా వ్యవహరిస్తున్నామన్న విమర్శలకు అవకాశం కల్పించినట్టుగా ఉందంటూ అధికార పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
బీజేపీకి 69, కాంగ్రెస్కు 50
న్యూఢిల్లీ: రాజ్యసభలో అధికార పార్టీ బీజేపీ బలం పెరిగింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో 11 సీట్లు అదనంగా గెలుచుకుని తన సంఖ్యను 69కి పెంచుకుంది. కాంగ్రెస్ నాలుగు సీట్లు చేజార్చుకుని 50కి పడిపోయింది. శుక్రవారం 58 ద్వైవార్షిక రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించక ముందు బీజేపీకి 48, కాంగ్రెస్కు 54 సీట్లున్నాయి. వచ్చే వారం 17 మంది బీజేపీ సభ్యులు, 14 మంది కాంగ్రెస్ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. వారి స్థానంలో తాజాగా బీజేపీ నుంచి 28 మంది, కాంగ్రెస్ నుంచి 10 మంది ఎన్నికయ్యారు. అందులో రెండోసారి ఎన్నికైన వారూ కొందరున్నారు. కొత్త సభ్యులు ప్రమాణం చేసిన తరువాత రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 69కి, కాంగ్రెస్ బలం 50కి చేరుకుంటుంది. ఎన్డీయేలో భాగం కాని అన్నా డీఎంకే, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, బీజేడీ లాంటి పార్టీలు బీజేపీకి సభా కార్యకలాపాల్లో మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. లోక్సభలో ఆమోదం పొందిన పలు బిల్లులు..బీజేపీకి సరిపడా బలం లేకపోవడంతో రాజ్యసభలో పెండింగ్లో పడిపోతున్నాయి. 2014 నుంచి అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వరసగా గెలవడం వల్ల ఎగువ సభలో బీజేపీ సభ్యుల సంఖ్య పెరగ్గా, ఆయా రాష్ట్రాల్లో అధికారం కోల్పోవడంతో కాంగ్రెస్ బలం తగ్గుతూ వస్తోంది. -
అధికారం ఉంది...ఆక్రమించేద్దాం
అధికార బలంతో 2.75 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు రంగం సిద్ధం చేశారు. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసేసి పట్టాలు పుట్టించారు. తీరా.. ఆ భూమి పోరంబోకుగా అధికారులు నిర్ధారించినా.. మరోసారి మంత్రి అండదండలతో రూ.కోటి విలువైన భూమిని సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. అందులో స్టోన్ క్రషర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: అధికారం అడ్డంపెట్టుకొని అధికార పార్టీ నేతలు, వారి అనుచరులు భూ అక్రమాలకు తెర తీశారు. తాజాగా జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలం నిడగల్లులో పోరంబోకు భూములను కైవసం చేసుకునేందుకు మంత్రి అండదండలతో ఓ వ్యక్తి ప్రయత్నాలు చేస్తున్నారు. సర్వే నంబర్ 2లో దాదాపు రూ.కోటి విలువైన 2.75 ఎకరాల భూమిలో స్టోన్ క్రషర్ నెలకొల్పేందుకు అనుకూలంగా భూమిని బదలాయించాలని కోరుతూ అధికారులకు దరఖాస్తు చేశారు. బలిజిపేట మండల టీడీపీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి సుజయ్కృష్ణ రంగారావు సోదరుడు బేబీనాయనకు సన్నిహితుడైన పి.సత్యనారాయణరాజు ఈ భూమిని పొందేందుకు పట్టాదారు పాసుపుస్తకాలు కూడా పుట్టించారు. ప్రభుత్వ భూమి ఆక్రమణ యత్నాలను గతంలో అధికారులు అడ్డుకున్నా.. మళ్లీ ప్రయత్నాలు ఆరంభించడం గమనార్హం. ఇదీ పరిస్థితి... సీతానగరం మండలం నిడగల్లు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 4/1 నుంచి 5 సబ్డివిజన్ల వరకూ 40 ఎకరాలు పైబడి రెవెన్యూ లెక్కదాఖలా ప్రభుత్వ భూమిగా (గయ్యాలు) నమోదై ఉంది. సర్వే నంబర్–1 కొండ పోరంబోకు గానూ, సర్వే నంబర్–2 సాగునీటి చెరువు, సర్వేనంబర్ 3లో 8.5 ఎకరాలు గయ్యాలు భూమి కాగా, 4, 5 సబ్డివిజన్ సర్వే నంబర్లలోని భూములు గయ్యాలు భూమిగానే ఎఫ్సీవో (ఫాదర్ రికార్డు), ఎండీఆర్ (మండల్ పైక్లారిటికల్ రికార్డు) రికార్డుల్లో పొందుపరిచి ఉంది. ఈ భూముల్లో సర్వే నంబర్ 4లోని సబ్ డివిజన్ చేసి 4/3, 4/2 నంబర్లలో వ్యవసాయ భూములు, ఫలసాయాన్ని ఇచ్చే తోటలు ఉన్నాయి. ఈ భూములకు పూర్వం డి– నమూనాలు చేసి కొంత మంది రైతులకు జీవనోపాధి కోసం అప్పగించినట్లు రికార్డుల్లో ఉంది. అయితే ఈ 8 ఎకరాల భూమిని టీడీపీ నేత రైతుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశారు. దానిలో సర్వే నంబర్ 4/2లో ఉన్న భూమిని ఆయిల్ కన్వర్షన్ కోసం భూమి కొనుగోలుదారు బలిజిపేట మండల టీడీపీ అధ్యక్షులు, బేబీనాయనకు సన్హితుడు అయిన పి.సత్యనారాయణ రాజు అప్పటి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఇచ్చిన వినతిపత్రం మేరకు ఎఫ్ఎంబీ, ఫెయిర్ అడంగల్స్ పరిశీలించగా వేరొక యజమానుల పేరుతో ఉన్నప్పటికీ సత్యనారాయణరాజు భూమిని కొనుగోలు చేసి పట్టాదారు పాసుపుస్తకాలు పొందారు. భూ కన్వర్షన్ చేయడానికి ముందు భూమికి సంబంధించిన పూర్వం నుంచి ఉన్న ఎఫ్సివో, ఎండిఆర్ రికార్డులను అధికారులు పరిశీలించారు. పూర్వపరాలు తెలుసుకునేందుకు భౌతికంగా భూములను, రికార్డులను పరిశీలించారు. రికార్డు లెక్కదాఖలా గయ్యాలు భూమిగా నమోదై ఉన్నందున ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేయాలని అప్పటి తహసీల్దార్ ఉన్నతాధికారులకు నివేదిక పంపించినట్లు అప్పట్లో చెప్పారు. అయితే, నిడగల్లులో పోరంంబోకు భూములను ఎలాగైనా కైవసం చేసుకునేందుకు అధికార పార్టీకి చెందిన నేతలు పావులు కదుపుతున్నారు. ఆ భూమి రైతు చేతిలో ఉన్నప్పుటి నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసి స్టోన్క్రషర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. దాని కోసం 2.75 ఎకరాలను ఆయిల్ కన్వర్జేషన్ చేయాలని కోరుతూ అధికారులకు దరఖాస్తు చేశారు. అధికారులు కాదన్నా... నిడగల్లు రెవెన్యూ పరిధిలోని భూమి రైతులచేతిలో ఉన్నా.. వేరొకవ్యక్తి కొంత భూమిని కొనుగోలుచేసి స్టోన్ క్రషర్ నెలకొల్పడానికి సర్వేనంబర్ 2లో 2.75 ఎకరాల భూమిని భూ కన్వర్షన్ చేయాలని కోరుతూ దరఖాస్తు చేశారు. దరఖాస్తును స్వీకరించిన అప్పటి తహసీల్దార్, సిబ్బంది ఎఫ్సివో, ఎండీఆర్ రికార్డులతో భూములను భౌతికంగా పరిశీ లించారు. ప్రభుత్వ పోరంబోకు భూమిగా నిర్ధారించారు. జీవనోపాధికోసం పోరంబోకు భూమిపై వ్యవసాయం చేయడానికి ఇబ్బందిలేదని, రికార్డుల ప్రకారం భూ కన్వర్షన్ చేయడానికి సిఫార్స్ చేయలేమని అర్జీదారునికి లిఖిత పూర్వకంగా తెలియజేశారు. అయితే, పార్వతీపురం ఆర్డీవో, సీతానగరం ప్రస్తుత తహసీల్దార్లపై మంత్రి, అతని సోదరుడి ద్వారా సిఫార్సులు చేయించుకొని భూమిని కన్వర్షన్ చేయించుకోవడానికి చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఇతర ప్రయత్నాలను చూసిన మిగత నేతలు కొందరు తాము కూడా ఇదే పందాలో వెళ్లి పోరంబోకు భూములను కైవశం చేసుకోవాలని భావిస్తున్నారు. పేదలకు ఇచ్చిన ఈ పట్టా భూములను కొనడమే నేరమైతే వాటిని వ్యాపార అవసరం కోసం తమకు అనుగుణంగా మార్చాలని ప్రయత్నించడం అంతకన్నా పెద్దనేరం. పాలకులకు, అధికారులకు ఇదేమంత పెద్ద నేరంగానో, తప్పుగానో కనిపించకపోవడం విశేషం. సమాచారం అందజేస్తాం.. పార్వతీపురం ఆర్డీవో కార్యాలయంలో సత్యనారాయణరాజు గతంలో చేసిన అర్జీపై అప్పీల్ చేయడంతో పేరావైజ్డ్ రిమార్కులు ఇవ్వాలని ఆర్డీవో కార్యాలయం కోరింది. రికార్డులను పరిశీలించి అడిగిన సమాచారం అందజేస్తాం. – అప్పలరాజు, తహసీల్దార్, సీతానగరం -
‘కారు’ చిచ్చు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మరో ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. అధికార టీఆర్ఎస్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు దగ్గర పలుకుబడి ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోట టిక్కెట్లు ఆశిస్తున్న నాయకులు అవసరమైతే పార్టీ మారేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరి తమ స్థానాలను బలంగా చేసుకొని పాత గులాబీ నేతలను పక్కన పెట్టడంలో విజయం సాధించారు. ఖానాపూర్ వంటి నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న చోట అధికార పార్టీలోకి వచ్చిన నాయకులు ఈసారి పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. మొన్నటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆదిలాబాద్ పర్యటనతో ఆదిలాబాద్, మంచిర్యాల నియోజకవర్గాల్లో సిట్టింగ్ నేతల మనోబలం పెరగగా... పోటీ ఎక్కువగా ఉన్న చోట పట్టుకోసం ప్రయత్నాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఒరిజనల్ గులాబీ నేతలకు స్థానం లేనట్టే..! ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేంతా ప్రస్తుతం సాంకేతికంగా టీఆర్ఎస్ చెందిన వారే. బీఎస్పీ నుంచి గెలిచిన ఇంద్రకరణ్రెడ్డి(నిర్మల్), కోనేరు కోనప్ప(సిర్పూరు) ఏకంగా పార్టీనే విలీనం చేసి, అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా మారారు. ముథోల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన విఠల్రెడ్డి టీఆర్ఎస్లో చేరిపోయారు. మిగతా ఏడుగురు టీఆర్ఎస్ నుంచి గెలిచిన వారే. నిర్మల్, సిర్పూరు, ముథోల్ నియోజకవర్గాల్లో 2014లో ఓడిపోయిన టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు అక్కడ మళ్లీ పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా కేబినెట్ హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న సముద్రాల వేణుగోపాలాచారి ముథోల్ నుంచి ఓడిపోయినప్పటికీ, మళ్లీ ఆ నియోజకవర్గం వైపు దృష్టి సారించలేదు. రాజ్యసభకు పంపిస్తే వెళ్లే ఆలోచనలో ఉన్న వచ్చే ఎన్నికల్లో ముథోల్ నుంచి పోటీకి నిరాసక్తంగా ఉన్నట్లు సమాచారం. ఇక సిర్పూరు నుంచి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఈసారి టిక్కెట్టు ఆశిస్తున్నప్పటికీ... కోనేరు కోనప్ప పట్లనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సానుకూల ధృక్పథంతో ఉన్నారు. కోనప్ప సైతం ప్రజల మధ్య ఉంటూ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. నిర్మల్లో మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి సైతం టీఆర్ఎస్లో తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నారు. నిర్మల్ నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయిన కూచాడి శ్రీహరిరావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి టీఆర్ఎస్లో చేరిన తరువాత కార్పొరేషన్ చైర్మన్గా అవకాశాలు వస్తాయని భావించినప్పటికీ, మంత్రి ఏలుబడిలో పార్టీకే దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడింది. ఈ ముగ్గురిలో టిక్కెట్టు రాని పక్షంలో వేరే మార్గం చూసుకునే ఆలోచనలో మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఉన్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పోటీగా వ్యూహాలు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన ఏడుగురిలో ఒకరిద్దరి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సదాభిప్రాయంతో లేరనే ఊహాగానాలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. మరికొన్ని నియోజకవర్గాల్లో ‘వచ్చేసారికి అవకాశం ఇస్తా’ అనే హామీ పొందినట్లు కొందరు నాయకులు ప్రచారం చేసుకుంటూ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఆదిలాబాద్లో మంత్రి జోగు రామన్నకు ఎదురు లేని పరిస్థితి. ఇక్కడ వచ్చేసారి కూడా ఆయనకే అవకాశం అనడంలో అతిశయోక్తి లేదు. ఆసిఫాబాద్లో ప్రస్తుతం కోవ లక్ష్మి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే భర్త శ్యాంనాయక్ ఈసారి ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన ఆదిలాబాద్ ఎంపీ స్థానం లేదా ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ప్రస్తుత ఆసిఫాబాద్ సర్పంచ్, కోవ లక్ష్మి చెల్లెలు మర్సోకోల సరస్వతి కూడా టీఆర్ఎస్ టికెట్టు కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. ఖానాపూర్లో ఎమ్మెల్యే రేఖానాయక్కు మాజీ ఎంపీ రమేష్రాథోడ్ నుంచి గట్టి పోటీ ఎదురు కాబోతుంది. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన రోజే తాను వచ్చే ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి పోటీ చేయనున్నట్లు రమేష్రాథోడ్ ప్రకటించడం గమనార్హం. బోథ్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు స్థానంపై ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ కన్నేయడంతో బాపూరావు పరిస్థితి కూడా డోలాయమానంలో పడింది. మంచిర్యాల జిల్లాలో రసవత్తరం మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజవకర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ స్థానాలను బలం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు మాజీ మంత్రి జి.వినోద్కుమార్ నుంచి సీటు గండం పొంచి ఉంది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చి మళ్లీ కాంగ్రెస్లోకి వెళ్లి తిరిగి గులాబీ గూటికి చేరిన మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ సోదరులు ఈసారి తమ పూర్వ స్థానాల నుంచి పోటీ చేయాలని భావిస్తే ఓదెలుకు ఇబ్బందికరమే. అయితే వివేక్ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అడపాదడపా కనిపిస్తున్నా... వినోద్కుమార్ మాత్రం చెన్నూరుకు వచ్చిన దాఖలాలు లేవు. దీంతో తనకు ఢోకా ఉండదనే ధీమాతో ఓదెలు ఉన్నారు. బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు పోటీగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్కుమార్ టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఆయనకు పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మద్దతు ఉందనే ప్రచారం జరుగుతోంది. మంచిర్యాలలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు స్థానంలో సీటు కోసం సొంత పార్టీలో చాలా మందే పోటీ పడుతున్నారు. రాష్ట్ర టీవీ, చలనచిత్ర మండలి చైర్మన్ పుస్కూరు రామ్మోహన్రావు ఇటీవలి కాలంలో శుభాకాంక్షలు, అభినందనల ఫ్లెక్సీలతో ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరో ఎంపీపీ మొదలుకొని మంచిర్యాల మునిసిపాలిటీ పాలకవర్గంలోని ఇద్దరు నాయకులు కూడా టిక్కెట్టు ఆశిస్తున్నారు. అయితే ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరాంపూర్ పర్యటన సందర్భంగా వేదిక పైనుంచి ఎమ్మెల్యే కోరికల పేరుతో మంచిర్యాలకు వరాలు ప్రకటించడం దివాకర్రావు వర్గానికి బలాన్ని పెంచింది. అయితే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్రెడ్డి మళ్లీ టీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం కొంత గందరగోళానికి కారణమైంది. అయితే ఆయన గత నెల 24నే పార్టీలోకి వస్తారనే ప్రచారం జరిగినా, సీఎం సమక్షంలో కూడా టీఆర్ఎస్లో చేరకపోవడంతో ఎమ్మెల్యే వర్గం ఊపిరి పీల్చుకుంటోంది. -
అధికార పార్టీలో రాజ్యసభ హడావుడి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార పార్టీలో రాజ్యసభ అంతర్మథనం మొదలయింది. అర్థిక బలం, పార్టీలో పరపతి ఉన్న నేతలకే పదవులు అంటూ ముఖ్యుల నుంచి సంకేతాలు రావటంతో సీనియర్ నేతలు గళం విప్పేందుకు సన్నద్ధం అవుతున్నారు. ముఖ్యంగా రాజ్యసభ పదవి జిల్లా నేతల్లో ఒకరిని వరించే అవకాశం ఉండటంతో ఆర్థిక పరపతితో పాటు సామాజికవర్గాల వారీగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుతానికి జిల్లాలో పార్టీ నేతలు బీద మస్తాన్రావు, ఆదాల ప్రభాకర్రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి మిగిలిన సీనియర్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సామాజిక సమీకరణాలతో పాటు ఆశావాహుల్లోని లోటుపాట్లు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే చిన్నస్థాయి నామినేట్ పదవులు కూడా భర్తీ చేయకపోవటంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న క్యాడర్పై రాజ్యసభ కొత్త చిచ్చుపెట్టినట్లయింది. పోటీ తీవ్రం అధికార పార్టీలో రాజ్యసభ సీటు కోసం పోటీ తీవ్రమైంది. ఎవరి స్థాయిలో వారు పావులు కదుపుతూ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందిస్తూ ఆర్థిక పరపతిలేని నేతలు అనేక మంది ఉన్నారు. కనీసం వారి పేరును కూడా పరిశీలనలోకి తీసుకోకపోవటం జిల్లాలో వివాదాస్పదంగా మారింది. కావలి టీడీపీ ఇన్చార్జి బీద మస్తాన్రావు పేరు బీసీ కోటాలో తెరపైకి వచ్చింది. పార్టీలో సీనియర్ నేతగా, వివాదరహితుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. అలాగే ఆర్థికంగానూ స్థితిమంతుడు కావటంతో ఖర్చుకు వెనుకాడని పరిస్థితి. ఈ క్రమంలో అతని పేరు పరిగణనలో ఉంది. నెల్లూరు రూరల్ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక ఎస్సీ సామాజికవర్గ కోటాలో సూళ్లూరుపేట పార్టీ ఇన్చార్జి పరసా రత్నం కూడా ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు ఇప్పటికే బీద సోదరులు పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు, మంత్రి లోకేష్ను కూడా కలిసినట్లు సమాచారం. గతంలో టీటీడీ చైర్మన్ పదవి రేసులో బీద మస్తాన్రావు ఉన్నారు. బీద సోదరులపై వ్యతిరేకత ఇదిలా ఉండగా పార్టీలో బీద సోదరులపై వ్యతిరేకత ఉంది. జిల్లాలో బీసీ కోటాలో పార్టీ పదవులన్నీ వారికేనా అనే అసంతృప్తి స్వరం కొంత కాలంగా బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా చిన్నపాటి పదవి నుంచి రాజ్యసభ వరకు అన్నింటికీ వారే ప్రయత్నాలు చేసుకుంటే మిగిలిన బీసీ నేతల పరిస్థితి ఏంటనే చర్చ సాగుతోంది. ఇప్పటికే బీద మస్తాన్రావు గత ఎన్నికల్లో కావలి నుంచి పోటీ చేసి ఓటమి పాలై అక్కడ ఇన్చార్జిగా కొనసాగుతున్నాడు. దీంతోపాటు రాజధాని నిర్మాణకమిటీ సభ్యునిగా పనిచేస్తున్నారు. ఆయన సోదరుడు బీద రవిచంద్ర పార్టీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు శాసనమండలి సభ్యునిగానూ కొనసాగుతున్నారు. అలాగే పైడేరు ఎస్కేప్ చానల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ–2 చైర్మన్గా బీద గిరిధర్ వ్యవహరిస్తున్నారు. కొద్ది నెలల క్రితం వరకు బీద మస్తాన్రావు బావ దేవరాల సుబ్రహ్మణ్యం కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. బీదా మస్తాన్రావు సోదరి మస్తానమ్మ నగరంలో కార్పొరేటర్గా వ్యవహరిస్తున్నారు. ఇలా ఒకే కుటుంబంలో ఐదు పదవులు, అది కూడా పార్టీలో బీసీ కోటాలోని పదవులు కావటంతో పార్టీలోని సీనియర్ బీసీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలో మళ్లీ రాజ్యసభ సభ్యుడిగా బీద మస్తాన్రావు పేరు తెరపైకి రావటం చర్చనీయాంశంగా మారింది. -
త్రిపుర ప్రజల్ని బానిసలు చేశారు
సోనామురా/కైలాషహర్: త్రిపురలో అధికార కమ్యూనిస్టు పార్టీ ప్రజల జీవితాలను బానిస బతుకులు చేసిందని, ఆ పార్టీని గద్దె దించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. త్వరలో ఎన్నికలు జరగనున్న ఆ రాష్ట్రంలో మోదీ గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మాణిక్ సర్కార్పై దుమ్మెత్తిపోసిన మోదీ..బీజేపీ అధికారంలోకి వస్తే త్రిపురలో ‘హీరా’(హెచ్–హైవేలు, ఐ–ఇంటర్నెట్, ఆర్–రోడ్లు, ఏ–ఎయిర్వేస్) అభివృద్ధి చెందుతుందని అన్నారు. 25 ఏళ్లుగా నిరంతరాయంగా పాలిస్తున్న కమ్యూనిస్టులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, రేషన్ కార్డు లాంటి చిన్నాచితకా అవసరాలకూ ఆ పార్టీ తలుపులు తట్టాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఎవరైనా హత్యకు గురైతే ఆ పార్టీ నుంచి అనుమతి రానిదే ఎఫ్ఐఆర్ నమోదుచేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులు ప్రతి దానికీ ప్రజలు తమపైనే ఆధారపడేలా చేసారని, బానిసత్వానికి ఇది కొత్త రూపమని అభివర్ణించారు. లెఫ్ట్ పాలనలో త్రిపురలో అభివృద్ధి ఇసుమంతైనా కనిపించడం లేదని ఆరోపించారు. తామొస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సంఘం సిఫార్సులను అమలుచేస్తామన్నారు. -
‘పంచాయతీ’ ప్రతిష్టాత్మకం!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వస్తున్న గ్రామపంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పంచాయతీ ఎన్నికలు సవాలుగా మారాయి. ఈ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితమే అయినప్పటికీ శాసనసభ్యుల గెలుపోటములను ముందే నిర్ణయించేలా పకడ్బందీగా జరగనుండడంతో ఎమ్మెల్యేలకు సంకటంగా మారనున్నాయి. 2013లో జరిగిన ఎన్నికలు అప్పటి అ«ధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా జరిగాయనే చెప్పొచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో పోటీపడి నువ్వానేనా అన్నట్లు పోరాడింది. చివరకు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా తెలంగాణ ఆవశ్యకతను చాటిచెప్పింది. గత పంచాయతీ ఎన్నికలు జిల్లాలోని అప్పటి మెజారిటీ ఎమ్మెల్యేలకు ఇబ్బందులనే తెచ్చి పెట్టాయి. జిల్లాలో 13 శాసనసభ నియోజకవర్గాలు ఉంటే కేవలం ముగ్గురు మాత్రమే పంచాయతీ ఎన్నికల్లో తమ ఆధిక్యాన్ని నిలుపుకోగలిగారు. పేరుకు పార్టీ రహితమే అయినా గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తిగా రాజకీయ పార్టీల నాయకులే బరిలో దిగారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీల నియోజకవర్గ స్థాయి నేతలు ప్రచారం నిర్వహించారు. వచ్చే నెలలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించడం, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ప్రజాప్రతినిధులు పనితీరుకు గ్రేడింగ్గా పేర్కొనడం అధికార పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. 2013లో టీఆర్ఎస్, కాంగ్రెస్ల పోటాపోటీ.. 2014 నుంచి తారుమారైన ఫలితాల సంఖ్య.. గత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ కంటే టీఆర్ఎస్ స్వల్ప మెజారిటీ సాధించింది. అయితే.. తదనంతర పరిణామాలు ఫలితాల సంఖ్యను తారుమారు చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, టీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపట్టడంతో అప్పటివరకు వివిధ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సర్పంచులు అధికార టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో టీఆర్ఎస్ బలం అమాంతం పెరిగింది. పూర్వ కరీంనగర్ జిల్లాల్లో 1,207 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 379 గ్రామాల్లో టీఆర్ఎస్, 372 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందారు. 137 టీడీపీ, 37 బీజేపీ, 30 వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు సర్పంచులుగా ఎన్నికయ్యారు. అదేవిధంగా 17 చోట్ల సీపీఐ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా, 235 పంచాయతీల్లో స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించారు. అయితే.. 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘గ్రామాలు అభివృద్ధి బాటన నడవాలంటే అధికార పార్టీ పంచెన చేరడమే మేలని’ భావించిన చాలా మంది సర్పంచులు ప్లేట్ ఫిరాయించారు. మూడింట రెండు వంతుల గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసింది. జిల్లాలో ఇద్దరు మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, చీఫ్విప్ కొప్పుల ఈ«శ్వర్ ప్రాతినిధ్యం వహిస్తుండడం, సీఎం కేసీఆర్ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో నేతల్లో, ప్రజల్లో రాజకీయ చైతన్యం కూడా పెరిగింది. అయితే.. గత ఎన్నికల ఫలితాలపై సీఎం కేసీఆర్ విశ్లేషణ జరిపి ప్రస్తుతం తీసుకోవాల్సిన కార్యాచరణ రూపొందించి పంచాయతీకి కదులుతున్నట్లు తెలుస్తోంది. ‘పంచాయతీ’ల బాధ్యత ఎమ్మెల్యేలపైనే.. ఎమ్మెల్యేలకు సంకటంగా ‘పంచాయతీ’.. శాసనసభ ఎన్నికలకు ముందు వస్తున్న పం చాయతీ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సవాలుగా మారనున్నాయి. ఒక్క జగిత్యాల మినహాయిస్తే 12 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నా రు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అధిష్టానం ఎమ్మెల్యే పనితీరుపై గ్రేడిం గ్ విధానాన్ని అమలు చేస్తోంది. సర్వేల ఆధారంగా పనితీరును అంచనా వేస్తూ గ్రేడింగ్లు ఇస్తోంది. దీని ఆధారంగానే ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇస్తారనే ప్రచారం సైతం ఉండడంతో ఎమ్మెల్యేల్లో ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలకు పంచాయతీ ఎన్నికల గుబులు మొదలైంది. ఈ ఎన్నికల్లో సర్పంచులను గెలిపించుకునే బాధ్యతను ఎమ్మెల్యేల భుజాలకెత్తిన సీఎం కేసీఆర్, బలం నిరూపించుకునేందుకు బరిగీసినట్లు కనిపిస్తోంది. మెజారిటీ సర్పంచులను గెలిపిం చుకున్న వారికే ఎమ్మెల్యే టికెట్లు వస్తాయని పార్టీ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చి నట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలను పరోక్ష పద్ధతిలో నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోం ది. దీంతో ఎమ్మెల్యేలకు ఎన్నికల ఖర్చు తడిసిమోపెడు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా.. ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు, చీఫ్విప్ కొప్పుల ఈశ్వర్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్తోపాటు ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, దాసరి మనో హర్రెడ్డి, బొడిగె శోభ, పుట్ట మధు, వొడితెల సతీష్బాబు, కల్వకుంట్ల విద్యాసాగర్రావు, చెన్నమనేని రమేశ్బాబు ప్రాతినిధ్యం వహిస్తు న్న హుజూరాబాద్, సిరిసిల్ల, ధర్మపురి, రామగుండం, మానకొండూర్, కరీంనగర్, పెద్దపల్లి, చొప్పదండి, మంథని, హుస్నాబాద్, కోరుట్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ఇప్పటికే మెజారిటీ గ్రామాల్లో అధికార పార్టీకి చెందిన సర్పంచులే ఉన్నారు. అయితే.. రాబోయే ఎన్నికల్లో సైతం ఎక్కువ స్థానాలు గెలిపించుకోవాలని అధినేత కేసీఆర్ సీరియస్గా ఆదేశించడం.. ఆ ఎన్నికలు, ఖర్చు సంకటంగా మారనుందన్న చర్చ మొదలైంది. -
చిత్తూరులో ఆధికార పార్టీ నేతల ఆగడాలు
-
అధికార మెహర్బానీ
అధికార పార్టీ నేతల మెహర్బానీ చివరి ఆయకట్టు రైతులకు శాపంగా మారనుం. గెజిట్ నోటిఫికేషన్ రాకుండానే కనిగిరి రిజర్వాయర్ నుంచి 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నవంబరు రెండో తేదీ నుంచి విడుదల చేయాల్సిన నీటిని జిల్లా మంత్రి ఆదేశాలతో ముందుగా విడుదల చేయడంపై చివరి ఆయకట్టు రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది బుచ్చిరెడ్డిపాళెం: జిల్లాలో 4.98 లక్షల ఎకరాలను సాగునీరందించేలా శనివారం నెల్లూరు గోల్డెన్ జూబ్లీ హాల్లో జరిగిన ఐఏబీ సమావేశంలో తీర్మానించారు. నవంబరు రెండో తేదీన అధికారికంగా సోమశిల నుంచి నీటి విడుదల చేయాలని నిర్ణయించారు. చివరి ఆయకట్టు రైతులకు నీరందేలా చూడాలని తీర్మానం చేశారు. అయితే కనిగిరి రిజర్వాయర్ నుంచి ఇరిగేషన్ అధికారులు ఆదివారం ముందస్తుగానే నీటిని విడుదల చేశారు. మంత్రి ఆదేశాల మేరకు నీటిని విడుదల చేశామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం కనిగిరి రిజర్వాయర్ నుంచి పైడేర్ ఎస్కేప్ చానల్కు 300 క్యూసెక్కులు, ఈస్ట్రన్ చానల్కు 150 క్యూసెక్కులు విడుదల చేశారు. వాస్తవానికి ఐఏబీలో జరిగిన తీర్మానం కాపీ ప్రభుత్వానికి అంది అక్కడి నుంచి నీటి విడుదలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావాలి. అయితే మంత్రి మాటలతో ఇరిగేషన్ అధికారులు మాత్రం నీటిని ముందుగా విడుదల చేసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఆందోళనలో చివరి ఆయకట్టు రైతులు కనిగిరి రిజర్వాయర్ నుంచి నీటి విడుదల తెలుసుకున్న చివరి ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏడాదీ చివరి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందడం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ క్రమంలో సోమశిల జలాశయంలో నీరు పుష్కలంగా ఉండటంతో చివరి ఆయకట్టుకు నీరందుతుందని సంబరపడ్డారు. అయితే ముందస్తుగా నీటి విడుదల చేయడంతో తమ పొలాల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేతలు మెహర్బానీ కోసం చివరి ఆయకట్టు రైతులను ఇబ్బందులకు గురిచేశారని అంటున్నారు. చివరి ఆయకట్టుకు నీరందాలి ఐఏబీ తీర్మానం జరగడమే ఆలస్యమైంది. చివరి ఆయకట్టు వరకు నీరందాలి. గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా నీటిని విడుదల చేయడం సరికాదు. అయితే నారుమళ్లు వేసుకున్న రైతులకు మంచిదే. చివరి ఆయకట్టుకు నీరందేలా ఇరిగేషన్ అధికారులు నీటి విడుదలపై తగిన జాగ్రత్తలు పాటించి, రైతులకు నీరందేలా చూడాలి. –జొన్నలగడ్డ వెంకమరాజు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మిగిలిన కాలువలకు ఎందుకు వదల్లేదు డెల్టా ప్రాంతంలో అన్ని కాలు వలకు సాగునీరందాలి. కొంతమంది ఒత్తిళ్లకు లొంగి కొన్ని కాలువలకు నీరు వదలడం సరికాదు. ఐఏబీ సమావేశంలో తీర్మానాలను గౌరవించాలి. రైతులందరినీ సమాన దృష్టితో చూడాలి. –నెల్లూరు నిరంజన్రెడ్డి, కోశాధికారి, జిల్లా రైతు సంక్షేమ సమాఖ్య కమిటీ చైర్మన్ల కోరిక మేరకు నీటి విడుదల ఈస్ట్రన్ చానల్, పైడేరు కాలువ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ల కోరిక మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రెండు కాలువలకు నీటిని విడుదల చేశాం. రైతులు ముందుగానే నారుమడులు పోసుకుంటారన్న చైర్మన్ల వాదతో నీటిన విడుదల చేశాం. –షేక్ అహ్మద్బాషా, ఇరిగేషన్ ఏఈ, కొడవలూరు -
స్వపక్షంలో విపక్షం
రాయగడ(ఒడిశా): జిల్లాలో ప్రతి అభివృద్ధి పనిలో అధికారపార్టీ నాయకుల జోక్యంతో అవినీతి పెరిగిపోతోంది. ప్రతి ఒక్క సంఘటనలో అధికార పార్టీ నాయకులు కలుగచేసుకుని శాంతిభద్రతలకు సంపూర్ణంగా విఘాతం కలిగిస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులు కలుగచేసుకోవాలని రాయగడ జిల్లా పరిషత్ సభ్యుడు అధికార పార్టీకి చెందిన పట్నాన గౌరీశంకర్ నిలదీశారు. జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్గా లాల్బిహారీ హిమరికను నియమించిన తరువాత రాయగడ డీఆర్డీఏ కాన్ఫరెన్స్ సమావేశ భవనంలో ఆయన అధ్యక్షతన తొలి సమావేశాన్ని(16వ జిల్లా ప్రణాళిక కమిటీ) శనివారం నిర్వహించారు. గోపబంధు గ్రామీణ యోజన 2017–18 యాక్షన్ ప్లాన్ ఆమోదానికి సంబంధిత కమిటీ సమావేశాన్ని నిర్వహించగా ప్రజాప్రతినిధుల చర్చలు, సమస్యలు, వివరించే సమయంలో బీజేడీకి చెందిన జెడ్పీ సభ్యుడు మాట్లాడుతూ భారీపరిశ్రమల్లో అధికార పార్టీ నాయకులు కలుగచేసుకోవడం వల్ల జిల్లాలో వేదాంత అల్యుమిన, ఇంఫా, పరి శ్ర మ, జేకే పరిశ్రమ, ఉత్కళ అల్యుమిన పరిశ్రమల్లో జిల్లాకు సంబంధించి ఏ ఒక్క నిరుద్యోగికీ ఉద్యోగావకాశం లభించడం లేదని వాపోయారు. ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగావకాశాలు కల్పించగా ఈ జిల్లాలో యువత నిరుద్యోగులుగా మారి స మాజంలో సంఘవిద్రోహలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒత్తిళ్లకు అధికారులు లొంగొద్దు జిల్లాలో దాదాగిరి, గుండాయిజం, దౌర్జన్యాలు, పెరిగిపోయాయి. జిల్లా అధికారులు అధికారపార్టీ నాయకుల ఒత్తిడికి లొంగకూడదు. పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసి రాజకీయ ఒత్తిడి లేకుండా అధికారులు విధులను నిర్వహిస్తూ జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని నేరుగా అధికారపార్టీ నాయకులను ఉద్దేశించి ఆవేదన వెలిబుచ్చారు. సబ్సిడీలు అందుకుని మూసివేత చిన్నతరహా పరిశ్రమలకు ప్రభుత్వం రుణాలు, సబ్సిడీలు ఇస్తుండగా ఏ ఒక్క చిన్న తరహా పరిశ్రమలో కూడా స్థానిక విద్యార్థులకు ఉద్యోగావకాశం కల్పించలేదని సబ్సిడీ అందిన పిదప పరిశ్రమలను మూసివేస్తున్నారని గౌరీశంకర్ ఆరోపించారు. కంపెనీలో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం నడుస్తోందని కూలీలు, కార్మికులను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి పనిచేయిస్తున్నారని స్థానికులకు అవకాశం కల్పించడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. అధికార పార్టీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చేపట్టే అభివృద్ధి పథకాలు తక్కువ రోజుల్లో కూలిపోతున్నాయని జిల్లా అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలవంచకుండా పనిచేయాలని అభ్యర్థించారు. ఈ సమయంలో వేదికపై ఉన్న అధికారపార్టీ రాజకీయ నాయకుల ముఖాలు కళావిహీనంగా మారాయి. -
‘చర’ చిక్కాడు
♦ పోలీసులకు లొంగిపోయిన బెట్టింగ్ సూత్రధారి ♦ నెలన్నరపాటు సింగపూర్లో మకాం ♦ అధికార పార్టీ అండతో తప్పించుకునేందుకు విఫలయత్నం ♦ ఇంకా అజ్ఞాతంలోనే శరత్చంద్ర కుమారుడు సుభాష్ సాక్షి ప్రతినిధి, నెల్లూరు : క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో కీలక సూత్రధారిగా ఉన్న టీడీపీ నేత, మాజీ కౌన్సిలర్ దువ్వూరి శరత్చంద్ర అలియాస్ చరను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే విదేశాలకు పరారైన చర, టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుడు బాలకృష్ణనాయుడు సోమవారం పోలీసులకు లొంగిపోయారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న చర కుమారుడు సుభాష్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతడు కూడా దొరికితే బెట్టింగ్ కేసు దాదాపు ముగింపు దశకు వస్తుంది. సీఎం పేషీ స్థాయిలో పైరవీలు రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లా పోలీసులు క్రికెట్ బెట్టింగ్ రాకెట్పై దృష్టిపెట్టి కీలక వ్యక్తులతోపాటు పంటర్లనూ కలుగుల్లోంచి బయటకు లాగారు. మొక్కుబడి అరెస్ట్లకు పరిమితం కాకుండా మూలాలను గుర్తించి 300 మంది బుకీలు, పంటర్లను అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాన బుకీలుగా ఉన్న 40 మందికిపైగా నిందితులపై నాన్బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచీ టీడీపీ మాజీ కౌన్సిలర్, జిల్లా మంత్రికి సన్నిహితుడు అయిన దువ్వూరు శరత్చంద్ర పలాయన మంత్రం జపిం చాడు. అధికార పార్టీ నేత కావడం, మంత్రి అండదండలు ఉండటంతో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు సీఎం క్యాంపు కార్యాలయ స్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకు అందరి ద్వారా పోలీసులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు. అయినా ప్రయోజనం లేకపోవడంతో దేశం విడిచి పారి పోయాడు. తన కుమారుడు సుభాష్తో కలిసి సింగపూర్లో చక్కర్లు కొట్టాడు. అతడి ప్రయత్నాలేవి ఫలించకపోవడంతో సోమవారం ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. తండ్రీ కొడుకులే కీలకం జిల్లాలో బెట్టింగ్ రాకెట్పై పోలీసులు సీరియస్గా దృష్టి సారించడానికి చర, అతని కుమారుడు సుభాష్ సాగించిన వ్యవహారాలే కారణమని తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ చివరి వారంలో నగరానికి చెందిన దారం మల్లికార్జునరావు తన కుటుంబ సభ్యులతో కలిసి రామేశ్వరం వెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డారు. మల్లికార్జునరావు, అతని భార్య మాధురి, కుమారుడు ప్రణవ్ జూలై 1న రామేశ్వరంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మల్లికార్జునరావు టీడీపీ నేత దువ్వూరు శరత్చంద్ర, అతని కుమారుడు సుభాష్ వద్ద పలు మ్యాచ్లపై బెట్టింగ్లు కట్టాడు. ఆస్తిపాస్తులన్నీ ధారబోసినా ఇంకా లక్షలాది రూపాయలు బకాయి పడ్డాడు. దీంతో శరత్చంద్ర, అతని కుమారుడు కలిసి మల్లికార్జునరావును మానసికంగా వేధించడంతోపాటు అతడి ఇంటికెళ్లి బకాయిల కోసం తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే అతని కుటుంబమంతా అసువులు తీసుకుంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దీనిపై పోలీసులు ప్రాథమికంగా విచారణ నిర్వహించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ బెట్టింగ్ మూలాల్లోకి వెళ్లారు. వందల మందిని అరెస్ట్ చేశారు. దీంతో టీడీపీ నేత శరత్చంద్ర, అతని కుమారుడు సుభాష్, బాలకృష్ణనాయుడు జూలై రెండో వారం నుంచి పరారీలో ఉన్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు అధికార పార్టీ నేతల ద్వారా వివిధ రూపాల్లో పోలీసులపై ఒత్తిడి తెచ్చినప్పటికీ చివరకు లొంగిపోక తప్పలేదు. హైకోర్టులో బెయిల్ పిటీషన్! నెల్లూరు (క్రైమ్): బెట్టింగ్ కేసులో రిమాండ్ అనుభవిస్తున్న కీలక సూత్రధారి దేవళ్ల కృష్ణసింగ్, మరికొందరు నిందితులు హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే జిల్లా కోర్టులో పలు దఫాలుగా బెయిల్ పిటీషన్ వేయగా.. కోర్టు నిరాకరించింది. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. వీటిని మంగళవారం విచారించే అవకాశం ఉందని సమాచారం. -
ప్రతిపక్షంపై ఆగని అధికార పార్టీ దౌర్జన్యం
-
అజ్ఞాతంలో కీలక బు‘కీ’లు..!
♦ బుకీలకు అండగా నిలుస్తున్న అధికార పార్టీ నేతలు ♦ బాధితుల ఫిర్యాదుతో గతంలో ఐదుగురి అరెస్ట్ ♦ మరో బుకీని బుధవారం అరెస్ట్ చూపిన వైనం ♦ అరెస్టయినవారిలో అధికార పార్టీ ఎమ్మెల్యే బంధువులు, అనుచరులు ♦ ఎస్పీలు దృష్టి సారించడంతో నెలరోజులుగా అజ్ఞాతంలోనే బుకీలు సాక్షి, గుంటూరు : జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ మహమ్మారికి ఎన్నో కుటుంబాలు రోడ్డుపాలయ్యాయి. బెట్టింగ్లలో సొమ్ము పోగొట్టుకుని అప్పుల పాలై తెనాలికి చెందిన కుటుంబం మొత్తం మాచర్లకు వెళ్లి పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. సర్వం కోల్పోయి తల్లిదండ్రులకు ముఖం చూపలేక ఇల్లు వదిలి వెళ్లిన ఘటనలూ ఉన్నాయి. ఇంత జరుగుతున్నా క్రికెట్ బు‘కీ’లను మాత్రం పట్టలేకపోతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు దీనిపై సీరియస్గా ఉన్న సమయంలో మాత్రం బెట్టింగ్లు కాసే వారిని అదుపులోకి తీసుకుని తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి వదిలేయడం మినహా డొంకను కదల్చలేకపోతున్నారు. కుటుంబాలను బలి తీసుకుంటున్న క్రికెట్ మహమ్మారికి సీరియస్గా వ్యవహరించాల్సిన పాలకులే కీలక బుకీలకు అండగా నిలుస్తూ పోలీసులు వారి జోలికి రాకుండా రక్షిస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీగా పనిచేసిన పీహెచ్డీ రామకృష్ణ అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గకుండా కీలక బుకీలను అదుపులోకి తీసుకుని చర్యలకు ఉపక్రమించిన క్రమంలోనే ఆయనపై బదిలీ వేటు వేశారంటే జిల్లాలో బుకీలకు ప్రభుత్వ పెద్దల నుంచి ఏ స్థాయిలో ఆశీస్సులు ఉన్నాయో అర్థమవుతుంది. ఎస్పీలు క్రికెట్ బెట్టింగ్లపై సీరియస్గా దృష్టి సారించిన సమయంలో అధికార పార్టీ నేతల అండతో అండర్గ్రౌండ్కు వెళ్లిపోవడం, వారితో పోలీసు అధికారులకు చెప్పించుకుని యథావిధిగా బెట్టింగ్లకు పాల్పడడం గమనార్హం. బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి... జిల్లాలో గత నెలలో క్రికెట్ బెట్టింగ్లలో తీవ్రంగా నష్టపోయి బుకీల దౌర్జన్యానికి పొలాలు, స్థలాలు కోల్పోయిన అనేక మంది బాధితులు గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ విజయారావుకు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కీలక బుకీ బాలాజీతో పాటు, మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కీలక బుకీలు అధికార పార్టీకి చెందిన రాజధాని ఎమ్మెల్యేకు దగ్గరి బంధువులు, అనుచరులు కావడంతో వారిపై సరైన చర్యలు లేకుండా వదిలేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఆ కేసులో మరో బుకీ గంజికుంట సాంబశివరావును బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచిన పోలీసులు క్రికెట్ బుకీలను వదిలేది లేదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పోలీసు అధికారులపైనే ఒత్తిళ్లు... గుంటూరు రూరల్, అర్బన్ ఎస్పీలు క్రికెట్ బుకీలపై దృష్టి సారించారనే విషయం తెలుసుకున్న అనేక మంది కీలక బుకీలు నెలరోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో కీలక బుకీలుగా ఉన్న ఐదుగురు అధికార పార్టీ నేతల స్థావరాల్లో తలదాచుకున్నట్లు సమాచారం. అధికార పార్టీ ముఖ్య నేతలకు భారీ మొత్తంలో ఆఫర్లు ఎర వేసి పోలీసులు తమ జోలికి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది. వీరంతా పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే, ముఖ్యనేత తనయ, తనయుడు, రాజధాని ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే, ఓ మంత్రి వద్దకు వెళ్లి పోలీసు ఉన్నతాధికారులు తమను అదుపులోకి తీసుకోకుండా ఒత్తిడి తెచ్చినట్లు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా క్రికెట్ బుకీలు, బెట్టింగ్లు నిర్వహించే వారంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పనిచేస్తుండటంతో పోలీసులు సైతం వీరికి జోలికి వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఢిల్లీ ఎందుకు వెళ్లినట్లు..?
♦ కార్పొరేటర్ల పయనం వెనుక రాజకీయం ♦ అంతా అధికార పార్టీకి చెందినవారే ♦ ఓ కీలక నేత వైఖరి నచ్చకేనని ప్రచారం ♦ ఏలూరు నగరంలో జోరుగా చర్చలు ఏలూరు (సెంట్రల్): నగరపాలక సంస్థ కార్పొరేటర్ల ఢిల్లీ ప్రయాణం చర్చనీయాంశమైంది. వారంతా అధికార పార్టీకి చెందిన వారే కావడం, నగరంలోని ఓ కీలక నేత పనితీరుపై అసంతృప్తి ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆ నేతను తొలగించే ప్రయత్నమే ఈ ప్రయాణమని ప్రచారం జరుగుతోంది. నగరంలో మొత్తం 44 మంది అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో 25 మంది ఈనెల 2న ఢిల్లీ వెళ్లారు. వీరు తిరిగి ఈనెల 8న రానున్నట్లు సమాచారం. ఓ వర్గానికి చెందిన కార్పొరేటర్లంతా ఢిల్లీ వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. కీలక పదవిలో ఉన్న నేతను తొలగించే ప్రయత్నంలో భాగమే ఢిల్లీకి ప్రయాణమని అధికార పార్టీ నాయకుల్లో చర్చ నడుస్తోంది. ఓ నేత తీరుపై అసంతృప్తి నగరపాలక సంస్థ కీలక పదవిలో ఉన్న ఓ నేత తీరుపై పలువురు కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ నేత వ్యతిరేక వర్గం ఢిల్లీకెళ్లింది. వచ్చిన తరువాత ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించి ఆవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. సదరు నేత స్థానిక ప్రజాప్రతినిధికి తెలియకుండా సొంత నిర్ణయాలు తీసుకోరనేది కార్పొరేటర్లు, నాయకులకు తెలిసిందే. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధి ఓ సీనియర్ నాయకుడైన కార్పొరేటర్ను మందలించి, పార్టీకి ఎంతగానో సహకరించే వ్యక్తిపై ఇటువంటి వైఖరిని మానుకోవాలని సూచించినట్లు సమాచారం. అభివృద్ధి పనుల్లో వివక్ష నిత్యం ఎమ్మెల్యే, మేయర్ వెనుక పదుల సంఖ్యలో తిరిగే కార్పొరేటర్లు ప్రస్తుతం ఇద్దరు ముగ్గురికే పరిమితమయ్యారు. ఇందుకు తమ డివిజన్లలో పనులు పూర్తి స్థాయిలో జరగకపోవడమే కారణంగా తెలుస్తోంది. ఇటీవల పలు డివిజన్లలో ఎస్సీ సబ్ప్లాన్ నిధులు నగరానికి ఇవ్వడంతో పనులు వేగంగా జరిగాయి. ఈ డివిజన్లకు అనుకొని ఉన్న డివిజన్లలో పనులు అంతంతమాత్రంగానే ఉండడంపై ప్రజలు కార్పొరేటర్లను ప్రశ్నిస్తున్నారు. తమ డివిజన్లోని సమస్యలను పాలకులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో ఆయా కార్పొరేటర్లు తీవ్ర అసంత్తృప్తితో ఉన్నట్లుగా తెలిసింది. -
నయీం కేసును నీరుగార్చిన సర్కార్
నేరెళ్ల ఘటనపై స్పందించని ప్రభుత్వం: చెరుకు పెద్దపల్లిరూరల్: అధికార పార్టీ సహా ఇతర పార్టీల నేతల తో సంబంధాలుండటం వల్లే సీఎం కేసీఆర్ నయీం కేసు ను నీరుగార్చారని తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఆరోపించారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేటలో శుక్రవారం ఆయన విలేకరు లతో మాట్లాడారు. నయీం ఎన్కౌంటర్ జరిగిన తర్వాత లభ్యమైన డైరీలో లభించిన ఆధారాలు, ఆయన స్థావరాల్లో లభ్యమైన సొమ్ము ను ఏం చేశారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. నేరెళ్ల ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడాన్ని బట్టి చూస్తే ఇసుక మాఫియాకు సర్కార్ అండగా ఉంటోదనే సంకేతాలను ఇస్తోందని ఆరోపించారు. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోకుండా సామాన్యులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం టీఆర్ఎస్ సర్కార్కే చెల్లిందన్నారు. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబీకులు రాష్ట్రాన్ని సొంత జాగీరులా భావిస్తున్నారన్నారు. హోంమంత్రి నాయిని ప్రారం భోత్సవ కార్యక్రమాలకు తప్ప దేనికి పనికిరాడన్నారు. -
‘దందా’ పోలీసు!
♦ పోలీసుస్టేషన్లలో ప్రైవేట్ సెటిల్మెంట్లు ♦ అధికార పార్టీ నేతల కనుసన్నల్లో విధులు ♦ ఆరోపణలొస్తున్నా బదిలీ లేకుండా తిష్ఠ ♦ స్టేషన్ల సుందరీకరణ ముసుగులో నొక్కుళ్లు ♦ వ్యవస్థకే మచ్చ తెస్తున్నారని తోటి పోలీసుల్లో ఆవేదన ♦ కొత్త బాస్ త్రివిక్రమ వర్మ ఓ లుక్ వేయాల్సిందే! సీఎం త్రివిక్రమవర్మ... జిల్లా పోలీసు బాస్గా బ్రహ్మారెడ్డి స్థానంలో బాధ్యతలు స్వీకరించి బుధవారానికి నెల పూర్తవుతోంది! తొలి రోజు నుంచే ఆయనకు సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి! వాటిలో మిగతావాటి మాటెలా ఉన్నా సొంత శాఖనే ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితి ఎదురైంది! అధికార పార్టీ నేతల అండదండలతో చెలరేగిపోతున్న ఇద్దరు పోలీసు అధికారులను ఇటీవలే వీఆర్కు పంపించిన ఆయన తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు! కేసు నమోదులో నిర్లక్ష్యం వహించిన మరో ఇద్దరు పోలీసులపై కొరడా ఝుళిపించారు! వారే గాకుండా కొంతమంది స్టేషన్ అధికారులు ఏళ్ల తరబడి పాతుకుపోయి పోలీసు శాఖకే మచ్చ తెస్తున్నారని తోటి పోలీసులే లోలోన ఆవేదన చెందుతున్నారంటే పరిస్థితి ఊహించవచ్చు! అలాంటివారిని కొత్త బాస్ ఎలా దారిలో పెడతారో వేచి చూడాల్సిందే! సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: జిల్లా పోలీసు శాఖను సంస్కరించాలనే డిమాండ్లు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. కొన్ని పోలీసుస్టేషన్లు ప్రైవేట్ సెటిల్మెంట్లకు వేదికగా మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాధితులెవ్వరైనా స్టేషన్కొచ్చి ఫిర్యాదు ఇస్తే చాలు... ఇరు పార్టీల నుంచి దండిగా వసూళ్లకు పాల్పడుతున్న పోలీసు అధికారులు ఉన్నారు. కేసులు నీరుగార్చేస్తున్నారు. తాము చెప్పినదానికల్లా తలూపుతూ అడుగులకు మడుగులొత్తుతారనే ఉద్దేశంతోనే అధికార పార్టీ నాయకులు కూడా వారికి అండగా నిలబడుతున్నారు! ఎస్పీ బంగళా, జిల్లాలో పలు పోలీసుస్టేషన్ల ఆధునికీకరణ ముసుగులో వ్యాపారులు, పారిశ్రామికవేత్తల నుంచి భారీగా వసూలు చేసి దిగమింగిన పోలీసు అధికారులపై సైతం ఈగ కూడా వాలకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కొంతమందికి నేరగాళ్లతో తెరవెనుక సంబంధాలున్నాయనే ఆరోపణలు ఇటీవల కాలంలో వినిపిస్తున్నాయి. లీలల్లో మచ్చుకు కొన్ని.... జిల్లా కేంద్రం శ్రీకాకుళం నగరంలోని రెండు పోలీసుస్టేషన్లలో ఇటీవలి వరకూ పనిచేసిన ఇద్దరు పోలీసు అధికారులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. శ్రీకాకుళం రూరల్, గార మండలాల్లోని ఇసుక ర్యాంపుల్లో అక్రమార్కుల నుంచి ఓ అధికారి బాగానే వసూలు చేశారట! తన జేసీబీని వమరవల్లికి చెందిన ఓ జేసీబీ యాజమానికి అప్పగించి అద్దె రూపేణా బాగానే ఆర్జించారు. రియల్ఎస్టేట్ వ్యాపారం కూడా ఆయనకు బాగానే కలిసొచ్చింది. అలాగే మరో సర్కిల్ స్థాయి అధికారిది ముడుపుల వసూళ్లలో అందెవేసిన చేయి. ఇరు పార్టీల నుంచి ఒకరికి తెలియకుండా మరొకరి నుంచి వసూళ్లు చేస్తున్నారనే విమర్శలు వచ్చినా దీర్ఘకాలం నగరంలో తిష్ట వేయడం ఆయనకే చెల్లింది. అంతకాలం ఉన్నా పరిష్కారమైన, దర్యాప్తు పూర్తయిన కేసు ఒక్కటీ లేదంటే ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. ఐదేళ్ల క్రితం జిల్లా పోలీస్ కార్యాలయంలోనే ఇద్దరు గుమస్తాలు రూ.70 లక్షల వరకు స్వాహా చేసిన కేసు ఈయన హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. ఇటీవల రిమ్స్లో సుమారు రూ.3 లక్షల విలువైన ఎండోస్కోపీలో ఒక ముఖ్య పరికరం మాయమైన కేసునూ నీరుగార్చేయడం ఆయనకే చెల్లింది. నగరంలోని ఓ హోటల్లో విశ్రాంత పోలీస్ ఉద్యోగి కుమారుడి హత్యలో కూడా నిందితుల నుంచి భారీగా నొక్కేశాడనే విమర్శలూ ఆయనపై వచ్చాయి. ఎచ్చెర్ల పోలీసుస్టేషన్లో పనిచేసిన ఓ ఎస్సైపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఓ ఐపీఎస్ అధికారితో విచారణకు డీఐజీ కార్యాలయం నుంచే ఆదేశాలు రావడం గమనార్హం. ఇసుక అక్రమ రవాణాదారుల నుంచే గాకుండా పెట్రోల్ బంకులు, మద్యం దుకాణాల యజమానుల నుంచి వసూళ్లు, పరిశ్రమల యాజమాన్యాలకు తొత్తుగా వ్యవహరించడం వంటి ఆరోపణలు అతనిపై వెల్లువెత్తాయి. ∙ రాజాం సర్కిల్ స్టేషన్ పరిధిలో కేసు పెట్టినా, కేసు ఉపసంహరించుకోవాలనుకున్నా ఓ సర్కిల్ స్థాయికి ముడుపులు చెల్లించాల్సిందే. ఇదే అదనుగా కొంతమంది కానిస్టేబుళ్లు సాయంత్రం సమయాల్లో పట్టణానికి సమీపంలో వాహనాలను తనిఖీ సాకుతో ఆపి వసూళ్లకు అలవాటు పడ్డారు. రాత్రివేళల్లో దాబాల వద్దకు చేరి నిర్వాహకుల నుంచి వసూళ్లు జరపడం షరా మామూలుగా మారింది. రూరల్ స్టేషన్కు చెందిన ఓ అధికారి కూడా మామూళ్లకు మారుపేరుగా మారారు. రోడ్డు ప్రమాదం జరిగితే చాలు ఇటు నిందితులు, అటు బాధితుల నుంచి ఎంతోకొంత నొక్కేయడంలో ఆయన సిద్ధహస్తుడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ∙టెక్కలి సర్కిల్ స్టేషన్లో మూడేళ్లుగా పాతుకుపోయిన ఓ అధికారిపై అవినీతి ఆరోపణలు అనేకం వస్తున్నాయి. ఆయనకు అధికార పార్టీలో ఓ ముఖ్య నేత అండదండలు పుష్కలంగా ఉన్నాయి. వైన్స్, మైన్స్ వ్యాపారుల నుంచి నెలవారీ మామూళ్లు భారీగానే దండేస్తున్నా ఆయనను దండించేవారే కరువయ్యారనేది బాధితుల ఆవేదన. కాశీబుగ్గ డివిజనల్ సర్కిల్ పరిధిలో కొంతమంది పోలీసు అధికారులు ఒక్కటై దందా కొనసాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. భూమి కబ్జాలు, స్థల వివాదాలు, అక్రమ వ్యాపారాలు, దొంగ రవాణా... ఇలా ఏదైనా సరే సెటిల్మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జీడిపప్పు రైలులో రవాణా చేయాలన్నా, పశువులను అక్రమంగా లారీలోకి ఎక్కించాలన్నా, గుట్కా గుట్టుగా సరిహద్దు దాటిపోవాలన్నా అక్రమార్కులు వారిని కలిస్తే సరిపోతుందట! కాశీబుగ్గ పోలీస్స్టేషన్కు కార్పొరేట్ హంగుల పేరుతో ఓ అధికారి అన్ని రకాల వ్యాపారుల నుంచే గాకుండా చివరకు రాజకీయ నాయకుల నుంచి కూడా భారీగానే వసూలు చేశారంట! వజ్రపుకొత్తూరు పోలీస్స్టేషన్ పూర్తిగా అధికార పార్టీ కార్యాలయంగా మారిపోయందనే విమర్శలు మార్మోగుతున్నాయి. ఇక్కడి అధికారి ఒకరు ఏకంగా ఇసుక, మద్యం, గనుల వ్యాపారుల నుంచి నెలనెలా మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితుల నుంచి, వారు ఫిర్యాదు ప్రకారం నిందితుల నుంచి ఇరువైపులా కేసు తీవ్రతను బట్టి రూ.2 వేల నుంచి రూ.50 వేల వరకూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ అధికారిని రెడ్హ్యాండెడ్గా పట్టుకొనేందుకు ఏసీబీ ఇటీవల వలవేసినా చివరి నిమిషంలో తప్పించుకున్నారని తెలిసింది. అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తడంలో పాతపట్నం, మెళియాపుట్టి పోలీసుస్టేషన్లలో కొంతమంది పోలీసులను మించినవారు లేరనే విమర్శలు వస్తున్నాయి. గంజాయి, ఎర్ర చందనం అక్రమంగా సరిహద్దు దాటిపోతున్నా వీరిపై ఈగ కూడా వాలకపోవడానికి కారణం కూడా అదేనన్న ఆరోపణలు ఉన్నాయి. -
పంచేశారు
► రూ.14.67 కోట్ల నీరు– చెట్టు నిధులు బూడిదలో పోసినట్లే ► నేతల పందేరానికే రూ.10 లక్షల లోపునకు కుదించారు ► నాయకులకు లబ్ధే తప్ప ప్రయోజనం శూన్యం ► పునర్నిర్మించాల్సిన చోట మరమ్మతులతో సరి ► ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే పోలంరెడ్డి తొలి విడతలో కోవూరు నియోజకవర్గానికి రూ.14.67 కోట్లు కేటాయించారు. ఈ పనులను రూ.10 లక్షలకు మించితే టెండరు పిలవాల్సి వస్తుందని దానికి మించకుండా ఆ లోపు నిధులతోనే పనులు చేపట్టేలా 187 పనులుగా ముక్కలు చేశారు. నీటి సంఘాల అధ్యక్షులకు లబ్ధి చేకూరేలా ముక్కలు చేసిన పనులను అధికార పార్టీ నాయకులకు అప్పగించేశారు. పునర్నిర్మించాల్సిన వంతెనలకు సైతం పైపై పూతలు పూసి సరిపుచ్చేస్తున్నారు. కొడవలూరు(కోవూరు): కోవూరు నియోజకవర్గంలో తూర్పు, దక్షిణ, జాఫర్ సాహెబ్ కాలువలు ప్రధాన పంట కాలువలుగా ఉన్నాయి. తూర్పు, దక్షిణ కాలువలు కోవూరు, కొడవలూరు, విడవలూరు, బుచ్చిరెడ్డిపాళెం మండలాల్లోని ఆయకట్టుకు, జాఫర్ సాహెబ్ కాలువ ఇందుకూరుపేట మండలంలోని ఆయకట్టుకు సాగు నీరందిస్తాయి. వీటికింద లక్ష ఎకరాలకుపైఆ ఆయకట్టు ఉంది. ఈ కాలువలు, వాటి బ్రాంచి కాలువలపై 307 చిన్న, పెద్ద కల్వర్టులు ఉన్నాయి. బ్రిటిష్ కాలంలో నిర్మించిన కల్వర్టు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. వీటిలో సింహభాగం కల్వర్టులను పూర్తి స్థాయిలో పునర్నిర్మించాల్సి ఉంది. పీఆర్లో రూ.5 లక్షలు దాటితే టెండరు పిలవాల్సి ఉండగా, ఇరిగేషన్లో రూ.10 లక్షల వరకు నామినేషన్పై పనులు కట్టబెట్టే అవకాశం ఉంది. దీనిని కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి టీడీపీ నేతలకు వరంగా మార్చారు. కల్వర్టు నిర్మాణానికి రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుందని, రూ.10 లక్షలలోపు నిధులతో కల్వర్టులకు మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. పలు చోట్ల షట్టర్ల పునర్నిర్మాణం, దెబ్బతిన్న కాలువలకు రివిట్మెంట్లు అవసరమైనా రూ.10 లక్షలు దాటిన పనులకు టెండర్లు పిలవాల్సి వస్తుందని, వాటిని పక్కన పెట్టారు. తొలి విడతలో మంజూరైన నీరు–చెట్టు నిధుల 14.67 కోట్లను నీటి సంఘాల అధ్యక్షులకు 187 పనుల కింద విభజించి కట్టబెట్టేశారు. తమ్ముళ్లకు లబ్ధి్ద చేకూర్చేందుకు చర్యలు తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులకు కనువిప్పు కలిగేనా? కల్వర్టులకు మరమ్మతుల వల్ల ఒనగూరే ప్రయోజనమేమీ ఉండదని ఇంజినీరింగ్ అధికారులకు తెలిసినా ఎమ్మెల్యే ఒత్తిడితో విభజించి అంచనాలు వేసేశారు. పనుల నాణ్యత విషయంలోనూ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో అధికార ఒత్తిడిలకు తలొగ్గి అవకతవకలకు పాల్పడిన హౌసింగ్ ఏఈలు ఇద్దరు సస్పెండ్ అయ్యారు. అయినా అధికారులకు కనువిప్పు కలుగలేదు. ఈ పనులకు 187 శిలాఫలకాలు వేయాల్సి వస్తుందని, నాలుగైదు పనులకు కలిపి ఒకటి వంతున వేశారు. ఎమ్మెల్యే ప్రోత్సాహం ఈ ఏడాది మే 12న నీటి సంఘాల అధ్యక్షులతో ఎమ్మెల్యే పోలంరెడ్డి సమావేశమై పనుల్లో అవకతవకలకు పాల్పడకుండా చేపట్టాలని సూచించారు. ఎమ్మెల్యే ఇలా పైపై ప్రకటనలు చేస్తూ రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పనులను ముక్కలు చేసి తమ్ముళ్లకు కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. -
అరాచకం
►వైఎస్సార్ సీపీ నేతలపై పోలీసు జులుం ►దేవరపల్లి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు ►శనివారం అర్ధరాత్రి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని గృహ నిర్బంధం ►ఆదివారం ఉదయం ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున అరెస్ట్ ►జిల్లా వ్యాప్తంగా పలువురు వైఎస్ఆర్సీపీనేతల అరెస్టులు, గృహ నిర్బంధాలు ►పోలీసుల తీరుపై సర్వత్రా ఆగ్రహం ►అధికారపార్టీ నియంతలా వ్యవహరిస్తోందంటూ నేతల ధ్వజం ఒంగోలు: జిల్లాలో అధికారపార్టీ నేతల ఆగడాలు శ్రుతిమించాయి. పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచక పాలన సాగిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. విపక్ష నేతలు ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా ఉండేందుకు ఎమర్జె్జన్సీని తలపించేలా వ్యవహరిస్తున్నారు. మాట వినకుంటే అక్రమ కేసులు బనాయించి లోపల వేస్తామంటూ బెదిరింçపులకు పాల్పడుతున్నారు. ఆదివారం పర్చూరు మండలంలోని దేవరపల్లి దళితుల భూ వివాదాన్ని పరిశీలించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ గ్రామాన్ని సందర్శించాల్సి ఉంది. విషయం తెలుసుకున్న అధికారపార్టీ నేతలు ప్రతిపక్ష పార్టీ నేతలపై పోలీసులను ప్రయోగింపచేశారు. శనివారం అర్ధరాత్రి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్టులు చేయించి పోలీసు స్టేషన్లలో నిర్బంధించడమే కాకుండా కీలకమైన నేతలను గృహ నిర్బంధంలో ఉండేలా చూశారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని పోలీసులు ఒంగోలులోని ఆయన స్వగృహంలో నిర్బంధించారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హౌస్ అరెస్టు చేస్తున్నట్లు ఒంగోలు ఒన్టౌన్ సీఐ రామారావు బాలినేనికి చెప్పారు. ఆదివారం సాయంత్రం వరకు ఇంటి నుంచి బయటకు రాకూడదని ఆంక్షలు విధించారు. బాలినేని గృహ నిర్బంధం వార్త క్షణాల్లో జిల్లావ్యాప్తంగా వ్యాపించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, పార్టీ సీనియర్ నేత పులుగు అక్కిరెడ్డి, పటాపంజుల అశోక్, రేణు నాగరాజు తదితర నేతలు వెంటనే బాలినేని ఇంటికి చేరుకున్నారు. సింగరాజు వెంకట్రావు, పులుగు అక్కిరెడ్డిలను సైతం అరెస్టుచేసి పోలీసుస్టేషన్లో ఉంచేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఇరువురు నేతలు బాలినేనితో కలిసి ఆయన స్వగృహంలోనే ఉండటంతో వారిని కూడా గృహ నిర్బంధంలోనే ఉంచారు. ఆదివారం ఉదయానికే బాలినేని నిర్బంధంతోపాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న వార్త వ్యాపించడంతో మార్కాపురం శాసనసభ్యుడు జంకె వెంకటరెడ్డి, దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ ఇన్ఛార్జి బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, నాయకులు చుండూరి రవిబాబు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆనందరావు, బడుగు కోటేశ్వరరావు, గంగాడ సుజాత, బడుగు ఇందిర, పోకల అనురాధ, చిన్నపరెడ్డి అశోక్రెడ్డి, సూరే మణికంఠారెడ్డి, యశ్వంత్వర్మ, కాకుమాను సునీల్రాజు, యనమల నాగరాజు, డీఎస్ క్రాంతికుమార్ తదితరులతోపాటు వందలాదిమంది నేతలు, కార్యకర్తలు బాలినేని గృహానికి చేరుకున్నారు. అధికారపార్టీ నియంతృత్వ పోకడలతోపాటు పోలీసుల చర్యలను ఈ సందర్భంగా ఖండించారు. ఆదివారం ఉదయానికి దేవరపల్లిని సందర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరువ నాగార్జున బయలుదేరగా ఆయనను మార్గమధ్యలోనే పర్చూరు మండలంలోని బోడవాడ గ్రామం వద్ద సీఐ శ్రీనివాసులు అదుపులోకి తీసుకొని యద్దనపూడి పోలీసు స్టేషన్కు తరలించారు. సాయంత్రం వరకు పోలీసు స్టేషన్లోనే నిర్బంధించారు. నాగార్జునతోపాటు ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు డొక్కుమల్ల రవి, డేవిడ్, సుబ్బయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ను శనివారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆదివారం సాయంత్రంవరకు ఒంగోలు ఒన్టౌన్ పోలీసు స్టేషన్లోనే నిర్బంధించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డిని పోలీసులు ఒంగోలులోని ఆయన స్వగృహంలోనే ఆదివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు గృహ నిర్బంధంలో ఉంచారు. పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గొట్టిపాటి భరత్ను పోలీసులు దేవరపల్లిలో అదుపులోకి తీసుకొని ఇంకొల్లు పోలీసు స్టేషన్కు తరలించారు. వీరితోపాటు పర్చూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కృష్ణమోహన్, మాజీ ఎంపీపీ యద్దనపూడి హరిప్రసాద్, మార్టూరు మండల కన్వీనర్ కాలేషావలి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ముకుందరావు, జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, నాయకులు శ్రీనివాస్, అనీల్, మస్తాన్వలి, సురేష్, సులేమా తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పర్చూరు మాజీ ఎంపీపీ కొల్లా వెంకట్రావు తదితరులను అరెస్టు చేసేందుకు శనివారం అర్ధరాత్రి పోలీసులు వారి ఇళ్లవద్దకు చేరుకున్నారు. అయితే కొల్లా బాలినేనితో కలిసి దేవరపల్లి వెళ్లేందుకు ఒంగోలుకు చేరుకొని ఆయనతోపాటు గృహ నిర్బంధంలో ఉండిపోయారు. అలాగే చీరాల నియోజకవర్గ ఇన్చార్జ్ యడం బాలాజీ, పార్లమెంటరీ పార్టీ ఇన్చార్జ్ వరికూటి అమృతపాణిలను అదుపులోకి తీసుకుని వేటపాలెం పోలీస్స్టేషన్లో నిర్బంధించారు. -
వారిపై అధికార పార్టీ కక్ష సాధింపు..
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలలో అధికార పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. 17మంది రేషన్ డీలర్లపై కక్షసాధింపునకు పాల్పడ్డారు. వీరి రేషన్ షాపులపై రెవెన్యూ అధికారులు దాడులు చేసి బయో మెట్రిక్ మిషన్లను తీసుకెళ్లారు. డీలర్లపై ఫిర్యాదులొచ్చాయని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తుండడంతో వీరిపై అధికారులు దాడులు చేశారు. కాగా, అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష కౌన్సిలర్లను కూడా వదలడంలేదు. స్థానిక 18వ వార్డు కౌన్సిలర్ సుబారాయుడు ఇంటిపై గత రాత్రి వందల సంఖ్యలో పోలీసులు దాడులు చేశారు. ఇంట్లో ఉన్న రూ.5.5 లక్షలను తీసుకెళ్లారు. ఆ డబ్బుకు ఆధారాలు చూపినా పట్టించుకోకుండా తీసుకెళ్లారని కౌన్సిలర్ వాపోయారు. నంద్యాల ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీ ఈ విధమైన దారుణాలకు ఒడిగట్టిందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. -
అధికారం ఆడిందే ఆట
♦ అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పేకాట ♦ రాజధానిలో యథేచ్ఛగా నిర్వహణ ♦ అనధికార క్లబ్బుల్ని ఏర్పాటు చేసి ఆడిస్తున్న వైనం ♦ ఫిర్యాదులు అందినా పట్టించుకోని స్థానిక పోలీసులు సాక్షి, గుంటూరు: జిల్లాలో పేకాట క్లబ్బులకు పోలీసు ఉన్నతాధికారులు అనుమతివ్వకపోవడంతో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల బంధువులు, కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు అనధికారికంగా పేకాట స్థావరాల్ని ఏర్పాటు చేసి ఆడిస్తున్నారు. ప్రతి రోజూ బంకిణీల పేరుతో వేలాది రూపాయలను పేకాట రాయుళ్ల నుంచి వసూలు చేస్తున్నారు. ‘పోలీసులతో ముందే మాట్లాడుకున్నాం.. వారికి నెలవారీ మామూళ్లు ముట్టజెపుతూనే ఉన్నాం.. మీరు ఎటువంటి అనుమానాలు లేకుండా నిర్భయంగా ఇక్కడకు వచ్చి పేకాట ఆడుకోవచ్చు’ అంటూ ఓపెన్ ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. దీంతో జూదగాళ్లు ‘డబ్బు పోయినా పర్వాలేదు, పోలీసుల బెడద లేకుండా ఉంటే చాలం’టూ ఆ స్థావరాలకు వెళ్లి హాయిగా ఆడేసుకుంటున్నారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఈ తంతు కొనసాగుతోంది. గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలోని మంగళగిరి, నూతక్కి, యర్రబాలెం, పేరేచర్ల, రూరల్ జిల్లా పరిధిలోని నాదెండ్ల, యడ్లపాడు, నర్సరావుపేట, దాచేపల్లి వంటి ప్రాంతాల్లో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పేకాట కేంద్రాలు నడుస్తున్నాయి. రాజధానిలో ప్రాంతంలో.. రాజధాని ప్రాంతమైన మంగళగిరి పట్టణంతోపాటు ఆ మండలంలోని నూతక్కి, యర్రబాలెం వంటి గ్రామీణ ప్రాంతాల్లో సైతం అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పేకాట కేంద్రాలు నడుస్తున్నాయి. మంగళగిరి మండలం రామచంద్రాపురం, తాడేపల్లి మండలాల్లో కేంద్రాలు నడుస్తున్న విషయం గతంలో ‘సాక్షి’ కథనాలు ప్రచురించగా ఉన్నతాధికారుల ఆదేశాలతో స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. దీంతో ఆ గ్రామాల్లో తాత్కాలికంగా పేకాట నిలిచిపోయింది. మిగతా ప్రాంతాల్లో పేకాట కేంద్రాలు నడుస్తుండటంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పేకాట రాయుళ్లు తరలి వస్తున్నారు. మేడికొండూరు మండలంలోని పేరేచర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో సైతం జోరుగా సాగుతోంది. ఇళ్లను క్లబ్బులుగా మార్చుకుని.. నరసరావుపేట రూరల్ మండలంలో ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో గతంలో ముఖ్యనేత తనయుని అనుయాయులు పేకాట కేంద్రాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పట్లో స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో దానిపై గుంటూరు స్పెషల్ పార్టీ పోలీసులు దాడి చేసి 15 మందిని అరెస్టు్ట చేసి నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక కారు, రూ. 7.95 లక్షల నగదు స్వాధీనం చేసుకొన్నారు. ప్రస్తుతం కోటప్పకొండ పరిసర ప్రాంతాలు, మండల సరిహద్దుల వద్ద రోజుకో స్థావరం మారుస్తూ పేకాట ఆడిస్తున్నట్లు సమాచారం. పల్నాడు ప్రాంతంలోని దాచేపల్లిలో కొన్ని నెలల క్రితం క్లబ్బు మూతపడటంతో ఇళ్లలోనే పేకాట కేంద్రాలు నడుస్తున్నాయి. రోజుకో ప్రాంతంలో తమకు అనువుగా ఉన్న ఇళ్లలో పేకాట నిర్వహిస్తున్నారు. నాదెండ్ల మండలంలోని ఓ రైస్ మిల్లో, యడ్లపాడు మండలంలోని కొన్ని గ్రామాల్లో టీడీపీ నేతలే పేకాట కేంద్రాల్ని నడుపుతుండటంతో పోలీసులు వాటి జోలికి వెళ్లడం లేదు. కొందరు పోలీస్ అధికారులు నెలవారీ మామూళ్లు పుచ్చుకుంటూ శిబిరాల వైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేకాట నిర్వాహకులు నిత్యం పోలీస్స్టేషన్లలోనేæ కూర్చుని పంచాయితీలు సైతం చేస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది రైతులు, చిరు ఉద్యోగులు పేకాటలో లక్షలు పోగొట్టుకుని అప్పులపాలై బలవన్మరణాలకు పాల్పడుతున్న సంఘటనలూ లేకపోలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ వ్యవహారంపై రహస్య విచారణ జరిపి పేకాట నిర్వాహకులకు సహకరిస్తున్న పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
అంతా మాయ!
♦ రిజర్వ్ ఫారెస్ట్ను అన్ రిజర్వ్డ్గా చూపించేందుకు విశ్వ ప్రయత్నాలు ♦ దేవరకొండ దోపిడీకి సర్కారు అండ ♦ జియో కో ఆర్డినేట్స్ను మార్చేసిన పెద్దలు ♦ క్వారీ తవ్వకాలకు అనుకూలంగా మారిపోయిన మ్యాపులు ♦ అది అటవీ శాఖ భూమి అని తేల్చి చెప్పిన ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ♦ ఈ నెల 22న న్యాయ స్థానానికి నివేదిక అందజేయనున్న అధికారులు తిమ్మిని బమ్మిని చేసి... బమ్మిని తిమ్మిని చేసే కుతంత్రాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. సర్కారు ఆస్తుల్ని దర్జాగా అప్పగించేసేందుకు పెద్ద స్థాయిలో పైరవీలు నడుస్తున్నాయి. గిరిజనుల మనోభావాలను పట్టించుకోకుండా... వారి ఆందోళనలు లెక్క చేయకుండా... తమకు అనుకూలంగా నివేదికలు రూపొందించుకునేందుకు ఆ కొండలపై వాలిన డేగలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఎక్కడ కొల్లగొట్టేందుకు అవకాశం ఉంటుందో అక్కడ దోపిడీ చేసేయడానికి పక్కా వ్యూహాలు తయారైపోతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బడానేతల కనుసన్నల్లో అధికారుల నివేదికలు సిద్ధమైపోతున్నాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో బడేదేవరకొండ గ్రానైట్ నిక్షేపాలను దోచుకునేందుకు అధికార పార్టీ నేతల యత్నాలు తారాస్థాయికి చేరాయి. ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు చెందిన మంత్రే అందుకు పరోక్షంగా సహకారం అందిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సర్వే రికార్డులు మార్చిన దగ్గర నుంచి తాజాగా తప్పుడు మ్యాపులు తయారీ వరకూ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, మంత్రి అనుచర గణం చేస్తున్న తెర వెనుక కుట్రలు విస్తుగొలుపుతున్నాయి. మరో భారీ కుంభకోణానికి తెరదీస్తున్నాయి. పార్వతీపురం మండలంలో కోరి సర్వే నెం.1లో అత్యంత విలువైన కాశ్మీరీ గ్రానైట్ నిక్షేపాలను తవ్వుకోవడానికి టీడీపీ ప్రభుత్వం తమిళనాడుకు చెందిన ఫళనివేల్ అనే బడా వ్యాపార వేత్తకు అనుమతులిచ్చింది. 41.25 ఎకరాల్లో గనులు తవ్వుకోవచ్చని చెప్పడంతో ఆయన రోడ్లు కూడా వేసుకున్నాడు. అయితే అతనికి అనుమతిచ్చిన చోట కాకుండా మరోచోట తవ్వుకునేందుకు అక్కడ భారీ అక్రమాలకు తెరదీశారు. సీఎం పేషీలోని కొందరు పెద్దల ద్వారా అధికారులను గుప్పిట్లో పెట్టుకుని, జిల్లా మంత్రి అండదండలతో పథకం ప్రకారం జరిగిన ఈఅక్రమాల్లో రూ.కోట్లు చేతులుమారుతున్నాయి. అసలేం జరుగుతోందంటే... అటవీ భూములను గుర్తించడానికి ఉన్న ప్రధాన మార్గం జియో కో ఆర్డినేట్స్. వాటి ఆధారంగానే ఏ ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది. ఏ ప్రాంతం అన్ రిజర్వ్లో ఉందనే విషయాలను తెలుసుకుంటుంటారు. ఫళనివేల్ ఇక్కడే తన బుద్ధి కుశలతను ఉపయోగించారు. తమకు అనుమతి ఉన్న కోరి ప్రాంతంలో కాకుండా ములగ ప్రాంతంలోని సర్వే నెం.1లో జియో కో ఆర్డినేట్స్ను సృష్టించారు. నిజానికి ఈ భూముల్లో దేవరకొండ ఊటనీటితో అక్కడి గిరిజనులు 10వేల ఎకరాలను సాగు చేసుకుంటున్నారు. 1993లో అటవీ భూములను డిజిటలైజ్ చేశారు. దాని ప్రకారం 2005లో ఈ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్ అని తేల్చారు. అదే విషయాన్ని తాజాగా ఢిల్లీలోని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా కూడా తన నివేదికలో స్పష్టం చేసింది. రిజర్వ్ ఫారెస్ట్కు అటవీ శాఖ లేయర్స్ను తయారు చేస్తుంది. వాటి ప్రకారం చూసినా ఈ భూమి రిజర్వ్ ఫారెస్ట్గానే ఉంది. సర్వే పేరుతో సరికొత్త ఎత్తుగడ గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో హైలెవెల్ కమిటీ హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైంది. గతనెలలో చీఫ్ కమిషనర్ సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ ఆ కమిటీలోని డైరెక్టర్ ఆఫ్ మైన్స్(ఇన్చార్జ్) శ్రీధర్, డైరెక్టర్ ఆఫ్ సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ విజయమోహన్, ఫారెస్ట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పి.కె.సారంగి జిల్లాకు వచ్చి అధ్యయనం చేశారు. ఆ సమయంలో తెర వెనుక జరిగిన అంశాలను రహస్యంగా ఉంచి కోర్టుకు నివేదిక ఇస్తామని ప్రజలకు చెప్పి వారు వెళ్లిపోయారు. ఆ రోజు అటవీ శాఖ నుంచి వారికి అనేక ఆధారాలు లభించాయి. ఆ భూమి రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పడానికి ఉన్న అన్ని డాక్యుమెంట్లను ఆ శాఖ అధికారులు చూపించారు. ప్లాన్ బెడిసికొడుతుందని భావించిన ప్రభుత్వం, మంత్రి, ఫళనివేల్తో కుమ్మక్కైన ఓ అధికారి కొత్త మెలిక పెట్టారు. ఫారెస్ట్, రెవెన్యూ శాఖలు విడివిడిగా సర్వే చేయించుకోవడం కాదు రెండూ కలిసి సర్వే చేయాలని చెప్పి కమిటీని తప్పుదోవ పట్టించి పంపించేశారు. దీని వెనుక అసలు కారణం తాజాగా తయారు చేస్తున్న మ్యాపుల్లో తమకు అనుకూలంగా మార్పులు చేయాలనుకోవడమేనని తెలుస్తోంది. నిజానికి ఇప్పటికే పాత మ్యాపులో జియో కో ఆర్డినేట్స్ను మార్చేశారు. దానిపై అప్పటి అధికారులు కనీసం చూసుకోకుండా సంతకాలు చేసేశారు. ఇప్పుడు అంతకు మించి పక్కా మ్యాపులు తయారు చేయడానికి మొదటి పాయింట్ నుంచి చేయాల్పిన సర్వేను కేవలం మైనింగ్ ప్రాంతంలో మాత్రమే చేస్తూ మమ అనిపిస్తున్నారు. -
గుండెచెరువు
►వరిని మింగేస్తున్న ఆక్వా ►పడిపోతున్న వరి సాగు విస్తీర్ణం ►అంతా చెరువుల మయం ►ఆక్వాకు అధికారపార్టీ వత్తాసు ►నిబంధనలకు తూట్లు ►అధికారుల చర్యలకు ప్రజాప్రతినిధుల మోకాలడ్డు ►ఆహార భద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదం ►రైతు సంఘాల ఆందోళన జిల్లాకు గుండెలాంటి గోదావరి డెల్టా.. ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారంగా పేరొందింది. ప్రస్తుతం దైన్యాగారంగా మారింది. నానాటికీ వరి విస్తీర్ణం తగ్గిపోతోంది. ఆక్వా సాగు పెరుగుతోంది. నిబంధనలకు నీళ్లొదిలి అక్రమార్కులు చెరువులు తవ్వేస్తున్నారు. వారికి అధికారపార్టీ నేతలు వత్తా సు పలుకుతున్నారు. ఏలూరు (మెట్రో) : ‘అనుమతులు లేని చేపల, రొయ్యల చెరువులను ధ్వంసం చేయండి. అక్రమంగా అనుమతులు ఇస్తే మత్స్యశాఖ అధికారులపై చర్యలు తప్పవు. ఉద్యోగాల నుంచి తొలగించేందుకూ వెనుకాడను’ ఇదీ గత వారం కలెక్టరేట్లో నిర్వహించిన చేపల చెరువుల అనుమతుల కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ పలికిన మాటలు.. అయితే వాస్తవ పరిస్థితులు దీనికి విరుద్ధంగా ఉన్నాయి. ప్రజాప్రతినిధుల అండ అడ్డదిడ్డంగా ఆక్వా చెరువుల తవ్వకానికి అధికార తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు వత్తాసు పలుకుతున్నారు. నిబంధనలు పాటించని అక్రమార్కులపై అధికారులు చర్యలకు ఉపక్రమిస్తుంటే వారు అడ్డుతగులుతున్నారు. అధికారులపై దూషణల పర్వానికీ పూనుకుంటున్నారు. ‘ప్రభుత్వం మాదే.. అనుమతులు ఇవ్వకుంటే అంతు చూస్తాం’ అంటూ బెదిరిస్తున్నారు. ఫలితంగా ఏమీ చేయలేని దయనీయ స్థితిలో అధికారులు ఉండిపోతున్నారు. ఉండి, భీమవరం, ఉంగుటూరు నియోజకవర్గాలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇవిగో.. ఉదాహరణలు.. ఉండి నియోజవకర్గం ఆకివీడు మండలంలో ఇటీవల మండల స్థాయి టీడీపీ కార్యకర్తలు, అధికారులతో ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిధి సమావేశాన్ని ఏర్పాటు చేసి.. చేపల చెరువుల అనుమతులు ఎందుకు రద్దుచేశారంటూ అధికారులను మందలించారు. కార్యకర్తల ముందే నిలబెట్టి దూషణలకు దిగారు. ఉంగుటూరు నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ నేత నిడమర్రు మండలంలో చెరువుల అనుమతులపై మండల స్థాయి అధికారులపై విరుచుకుపడ్డారు. భీమవరానికి మంచినీటిని సరఫరా చేసే వేండ్ర మార్గంలో తాగునీటి చెరువు సమీపంలో చేపల చెరువులు తవ్వుతున్నారని నిలిపేందుకు యత్నించిన అధికారులకు అక్కడి ప్రజాప్రతినిధి నుంచి చివాట్లు ఎదురయ్యాయి.దీంతో అధికారులు నలిగిపోతున్నారు. చెరువులకు అనుమతులు ఇవ్వకుంటే.. ప్రజాప్రతినిధులు, ఇస్తే కలెక్టర్ తమపై విరుచుకుపడుతుండడంతో ఏమి చేయాలో పాలుపోక తీవ్ర వేదన అనుభవిస్తున్నారు. ఇలా అయితే ఉద్యోగాలు ఎలా చేయాలని మదన పడుతున్నారు. నాయకులే చెరువుల దళారులు చేపల చెరువులకు మండల స్థాయి నుంచి, జిల్లాస్థాయి వరకూ అనుమతులు తీసుకొచ్చేందుకు టీడీపీ నేతలే దళారులుగా మారారు. వీరు గతంలో ఎకరా చెరువు అనుమతికి రూ.25వేలు వసూలు చేసేవారు. ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా అనుమతులిప్పించేందుకు తమ కమీషన్ను తగ్గించుకున్నారు. ప్రస్తుతం రూ.15వేలకు అన్నిరకాల అనుమతులూ తీసుకొస్తామని రైతుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారు. నిబంధనలకు పాతర.. మాగాణి భూములను చేపలు, రొయ్యలు చెరువులుగా మార్చాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. వీటిని కచ్చితంగా అమలు చేయాల్సిందే. అయితే అక్రమార్కులు, దళారులు వీటిని పట్టించుకోవడం లేదు. అక్రమ మార్గాల్లో అనుమతులు తెచ్చుకుని చెరువులు తవ్వేస్తున్నారు. కొందరు అనుమతులు లేకుండానే అనధికార సాగుచేపట్టేస్తున్నారు. నిబంధనలు ఇవి.. వరి, ఇతర పంటలకు పనికిరాని భూములను మాత్రమే చేపల చెరువులుగా మార్చాలి.తమ భూములకు సాగునీటి వసతి లేదని, పంటలకు పనికి రావని ధ్రువీకరించే ఆధారం చూపించాలి.పంట, కాలువలు, డ్రెయిన్లకు దగ్గరలో చెరువులు తవ్వకూడదు. ఉప్పునీటి రొయ్యల సాగుకు అనుమతి లేదు. నిర్దేశించిన ఆరు రకాల చేపలను మాత్రమే పెంచాలి.అయితే ఈ నిబంధనలేమీ అక్రమార్కులకు పట్టడం లేదు. అక్రమ చెరువులపై ఫిర్యాదుల వెల్లువ ఇదిలా ఉంటే జిల్లాలో అక్రమంగా తవ్విన చెరువులపై కలెక్టరేట్కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రతివారం మీకోసం, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాలకు సుమారు 20 నుంచి 50 ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో కలెక్టర్ అక్రమంగా తవ్విన చెరువులపై దృష్టిపెట్టారు. మండల స్థాయి అధికారులకు దీనిపై ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే నియోజకవర్గాల్లో అధికారపార్టీ నేతల వల్ల చెరువుల తవ్వకాల నియంత్రణ అధికారులకు సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో కలెక్టర్ మరింతగా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా కళ్లు తెరవాలి! ఇప్పటికైనా జిల్లా అధికారులు కళ్లు తెరవాల్సిన అవసరం ఉందని రైతు సంఘాలు చెబుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వరి మాయమవుతుందని, ఆహారభద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే మత్స్యశాఖ ఆధ్వర్యంలో అధికారులు వరి ప్రాధాన్యం, ఆక్వా చెరువుల వల్ల కలిగే అనర్థాలపై సదస్సులు నిర్వహించారు. ఇప్పటికైనా నష్టనివారణ చర్యలు చేపట్టాలని, అప్పుడే వరిసాగు వర్థిల్లుతుందని రైతు సంఘాలు, పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. -
మా రూటే సెపరేటు!
∙ అధికారులు, అధికార పార్టీ నేతల కుమ్మక్కు ∙ పునరావాస నిధులను బొక్కేస్తున్న వైనం ∙ టెండర్లలో అక్రమాలు.. ∙ కాంట్రాక్టర్లను బెదిరింపులు.. బలవంతంగా లేఖలు ∙ ప్రజాధనానికి భారీగా గండి ∙ నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు పేరుకు మాత్రం ఈ–టెండర్లు..కానీ జిల్లాలో వాటి రూటే సెపరేటు. టెండర్లలో పాల్గొన్న కాంట్రాక్టర్లను అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు బెదిరించి అబౌ రేట్లకు పనులను దక్కించుకోవడం మామూలైపోయింది. కాంట్రాక్టర్లతో ఈ పనులు మాకొద్దంటూ బలవంతంగా లెటర్లు రాయించడం ఆ తర్వాత అదే పనులను తమ అనుకూలురైన కాంట్రాక్టర్లకు అప్పగించి 12 నుంచి 15 శాతం కమీషన్లు పుచ్చుకుంటున్నారు. ఇందుకు జిల్లా స్థాయి అధికారులే సహకారం అందిస్తున్నారు. అందుకు ప్రతిఫలంగా వారు 12 శాతానికి తగ్గకుండా కమీషన్లు పుచ్చుకుంటున్నారు. మొత్తంగా అధికార పార్టీ శాసనసభ్యులు, అధికారులు కలిపి పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని బొక్కుతున్నారు. జిల్లా భారీ నీటిపారుదల శాఖ (ప్రాజెక్టుల విభాగం)లో జరుగుతున్న టెండర్ల వ్యవహారం చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. తాజాగా వెలిగొండ పునరావాస పనుల టెండర్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. కాంట్రాక్టర్లు పోటీ టెండర్లలో పాల్గొనకుండా అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు అడ్డుకుంటున్నప్పటికీ జిల్లా పాలనాధికారి తనకేమి పట్టన్నట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఒంగోలు :వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో తోకపల్లె గ్రామ పునరావాస పనులకు సంబంధించి ప్రభుత్వం గతేడాది అక్టోబర్లో రూ.2 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో సంబంధిత గ్రామంలో డ్రైయిన్స్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. రూ.2 కోట్ల పనులకు 14 మంది కాంట్రాక్టర్లు పోటీ పడి ఆన్లైన్లో టెండర్లు దాఖలు చేశారు. వీరిలో ఇద్దరిని అధికారులు డిస్క్వాలిఫై చేశారు. ఇందులో యర్రగొండపాలెం ప్రాంతానికి చెందిన ఓ కాంట్రాక్టర్ 20.06 లెస్కు టెండర్ వేశారు. పని తనకే కావాలంటూ యర్రగొండపాలెం ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఇరిగేషన్ (ప్రాజెక్టులు) ఎస్ఈపై ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడికి తలొగ్గిన ఎస్ఈ రూ.2 కోట్ల పనిని ఆయనకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రెండు నెలల పాటు టెండర్ ఖరారు చేయలేదు. ఇదే సమయంలో కాంట్రాక్టర్లు టెండర్లు ఎందుకు తెరవలేదంటూ ఎస్ఈపై ఒత్తిడి తెచ్చారు. అనుకోకుండా ఒక్కసారిగా ఆన్లైన్లో టెక్నికల్ బిడ్ ఓపెన్ అయింది. ప్రైజ్ బిడ్ ఓపెన్ కావాల్సి ఉంది. అప్పటికే ఎవరూ ఎక్కువ లెస్ వేశారన్న విషయంపై స్పష్టత వచ్చింది. 20.06 ఎక్కువ లెస్కు వేసినందున పని తనకే వచ్చిందని కాంట్రాక్టర్ ఎస్ఈని కలిసి చెప్పాడు. పని అగ్రిమెంట్ చేయాలంటూ ఎస్ఈని కోరారు. అసలు తాము టెండర్లే ఓపెన్ చేయలేదని అవి ఎలా ఓపెన్ అయ్యాయో... తెలియదంటూ ఎస్ఈ అడ్డం తిరిగారు. ఇదే సమయంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకు ఇరిగేషన్ ఎస్ఈ కాంట్రాక్టర్లతో బలవంతంగా పని తమకు వద్దంటూ లెటర్ రాయించుకున్నారు. కొద్దిరోజులు ఆగి ఆ తర్వాత మరోమారు టెండర్లు ఓపెన్ చేసినట్లు ఎస్ఈ ప్రకటించారు. ఈ లోపు 12 మంది కాంట్రాక్టర్లను డిస్ క్వాలిఫై చేశారు. కేవలం ఎస్టిమెట్ రేట్లకు టెండర్ వేసిన ఒక కాంట్రాక్టర్తో పాటు 4.4 అబౌ వేసిన మరో కాంట్రాక్టర్ను మాత్రమే క్వాలిఫై చేశారు. అబౌ రేటుకు టెండర్ వేసిన కాంట్రాక్టర్కు పనిని ఓకే చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకే ఈ వ్యవహారం మొత్తం నడిచింది. తొలుత టెండర్ ప్రకారం 20.06 లెస్లో పని ఖరారై ఉంటే.. ప్రభుత్వానికి 42 లక్షల నిధులు ఆదా అయ్యేవి. అలా కాకుండా అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధి కలిసి మొత్తం నిధులను బొక్కేందుకు ప్రణాళిక రచించారు. పని దక్కించుకున్న ప్రజాప్రతినిధి 15 శాతం కమీషన్ పుచ్చుకున్నట్లు సమాచారం. ఇక అధికారులకు సైతం 12 శాతం వరకు కమీషన్ను ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. అక్రమార్కులపై చర్యలేవీ.. పునరావాస పనుల్లో అక్రమాలకు ఈ టెండర్ల వ్యవహారమే ఉదాహరణగా నిలుస్తోంది. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. వీటితో పాటు ఇటీవల టెండర్లు పిలిచిన వెలిగొండ, గుండ్లకమ్మ పునరావాస పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయి. టెండర్ల వ్యవహారంలో అక్రమాలు జరగడమే కాకుండా పనుల నాణ్యత కూడా ప్రశ్నార్థకంగా మారింది. పర్సంటేజీలు పుచ్చుకొని అధికారులు మిన్నకుండిపోతున్నారు. దీంతో కాంట్రాక్టర్లు మొక్కుబడిగా పనులు చేసి అందినకాడికి దండుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ సదరు పనుల్లో వాస్తవాలను పరిశీలించి, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టర్లకు బెదిరింపులు జిల్లాలో అభివృద్ధి పనులకు పోటీ టెండర్లు వేసే కాంట్రాక్టర్లకు బెదిరింపులు తప్పడం లేదు. తాము చెప్పినట్లు వినకపోతే భవిష్యత్తులో పనులు రావని, ఒక వేళ వచ్చిన చేయలేరంటూ అధికారులు నిస్సిగ్గుగా కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. పోటీ టెండర్లు వేసిన కాంట్రాక్టర్ల ద్వారా బలవంతంగా లెటర్లు రాయించడం గమనార్హం. తోకపల్లె పునరావాస పనికి టెండర్లు దాఖలైన తర్వాత అధికార పార్టీ ప్రజాప్రతినిధి కాంట్రాక్టర్లతో బలవంతంగా లెటర్లు రాయించారు. ‘టెండర్ ఖరారు కావడం రెండు నెలలు ఆలస్యమైనందున గతంలో వేసిన రేట్లకు తాము పనులు చేయలేమని, నష్టపోతామని కాబట్టి టెండర్ క్యాన్సిల్ చేయాలంటూ అధికారులకు కాంట్రాక్టర్లకు లెటర్ రాసుకున్నట్లుగా’ బలవంతంగా లెటర్లు రాయించారు. అధికారులు పూర్తిగా అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ బెదిరింపులకు దిగుతున్నారని పలువురు కాంట్రాక్టర్లు సాక్షితో వాపోయారు. కాదూ... కూడదంటే కాంట్రాక్టర్లపై అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తోకపల్లె రూ.2 కోట్ల పనికి 20.06 శాతం లెస్ వేసిన కాంట్రాక్టర్పై ఇరిగేషన్ ఎస్ఈ కక్ష కట్టినట్లు తెలుస్తోంది. సదరు కాంట్రాక్టర్ అద్దంకి ఏరియాలో 1.13 కోట్ల పనితో పాటు మరో 67 లక్షల పనులకు టెండర్లు దాఖలు చేయగా ఎస్ఈ అతనిని డిస్క్వాలిఫై చేయడం ఇందుకు ఉదాహరణ. అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఆడమన్నట్లు జిల్లా ఇరిగేషన్ ఎస్ఈ ఆడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘అధికార పార్టీ తొత్తులైన అధికారులు’
పీలేరు: పార్టీలకతీతంగా విధులు నిర్వర్తించాల్సిన అధికారులు బరితెగింపుతో అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీపై ప్రత్యేక మక్కువ ఉన్న అధికారులు నేరుగా ఆ పార్టీలో చేరితే తమకు అభ్యంతరం లేదని కొంతమంది అధికారుల తీరు దుర్మార్గమని అన్నారు. పలుమార్లు హెచ్చరించినా పలువురు అధికారులు తమ తీరు మార్చుకోకపోవడం శోచనీయమన్నారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద నెలవారీ ఆస్తుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ప్రత్యేకాధికారి అధ్యక్షతన ఆరు మండలాలకు చెందిన అన్ని శాఖల అధికారులతో ఈ కార్యక్రమం జరిగింది. అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులు ఎమ్మెల్యే సమావేశానికి హాజరు కాకుండానే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే వచ్చేసరికి స్టేజిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉండడాన్ని చూసి ఇది ప్రభుత్వ కార్యక్రమమా? లేక టీడీపీ సమావేశమా అని అధికారులను ప్రశ్నించారు. ఏ అధికారం ఉందని టీడీపీ నేతలను స్టేజిపైకి ఆహ్వానించి అసలైన ప్రజాప్రతినిధులను ఎందుకు విస్మరించారని నిలదీశారు. ఎమ్మెల్యే రావటం గమనించిన అధికారులు స్టేజిపైకి రావాలిన మైక్లో పిలిచారు. దీనికి స్పందించిన రామచంద్రారెడ్డి కనీసం ప్రొటోకాల్ పాటించాలన్న ఇంగిత జ్ఞానం లేనపుడు తాను పైకి రానని జనంలోనే కూర్చుంటానంటూ పక్కన ఉన్న కూర్చీలో పార్టీ ఎంపీపీలు, జెడ్పీటీసీలతో కలిసి కూర్చున్నారు. ఎమ్మెల్యేను విస్మరించి టీడీపీ కార్యక్రమం తరహాలో కొనసాగించారు. ఇంతలో లబ్దిదారులకు యూనిట్లు పంపిణీ చేసే సమయంలో ఎమ్మెల్యే పేరు ప్రస్తావించగా ప్రొటోకాల్ పాటించని అధికారుల వైఖరికి నిరసనగా కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఇంతలో టీడీపీ నేతలు కేరింతలు, బిగ్గరగా కేకలు వేయడంతో ఎమ్మెల్యే అనుచరులు అధికారులను నిలదీశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలను ఎందుకు ఆహ్వానించలేదని, వారు వస్తే ఎక్కడ కూర్చోవాలో చూపాలంటూ అధికారులను నిలదీశారు. టీడీపీ నేతల కేకలకు నిరసనగా ఎమ్మెల్యే ఎంపీడీవో కార్యాలయం ప్రవేశ గేటు వద్ద నేలపై గంటకుపైగా బైఠాయించారు. ఎమ్మెల్యే ధర్నాకు కూర్చున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం టీడీపీ నేతల సూచనల మేరకు కార్యక్రమాన్ని ముగించారు. పీలేరు అర్బన్, రూరల్ సీఐలు డీ. నాగరాజు, మహేశ్వర్, ఎస్ఐ సుధాకర్రెడ్డి ఇతర పోలీస్ అధికారులు ధర్నా వద్దకు చేరుకొని శాంతి భద్రతలను పర్యవేక్షించారు. కార్యక్రమం అనంతం నియోజక వర్గ ప్రత్యేకాధికారి గోపీచంద్, పీలేరు ఎంపీడీవో, తహశీల్దార్ ఏ. వసుంధర, మునిప్రకాశంలు సుదీర్గంగా ఎమ్మెల్యేతో చర్చించి ఇలాంటి పొరపాటు భవిష్యత్తులో జరగకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే స్పందిస్తూ ఇప్పటికే అనేక సార్లు ఇలానే చెప్పా, కనీస మర్యాద కూడా పాటించకుండా వ్యవహరించడం దారుణమన్నారు. పోలీసులు, అధికారుల సూచనల మేరకు ఎమ్మెల్యే ధర్నా విరమించారు. -
అడ్డొస్తే అంతమే..!
►ఏలూరులో హత్యారాజకీయాలు ►ప్రత్యర్థులను హతమార్చడానికి సుపారీలు ►రెచ్చిపోతున్న రౌడీషీటర్లు విష సంస్కృతికి శ్రీకారం ►అధికారపార్టీ అండదండల వల్లే.. కొత్త ఎస్పీకి సవాలే..! పైరుపచ్చని పశ్చిమ సీమ.. ప్రశాంతతకు ఆలవాలం.. సమైక్య జీవనం.. సమతకు, మమతకు తార్కాణం.. ఇదంతా గతం.. ఇప్పుడు పరిస్థితి మారింది. విద్వేషాలు పెచ్చుమీరుతున్నాయి. హత్యారాజకీయాలు పేట్రేగిపోతున్నాయి. జిల్లా కేంద్రం ఏలూరు పరిసరాల్లో విష సంస్కృతి పురుడుపోసుకుంటోంది. దీనికి అధికారపార్టీ కూడా వత్తాసు పలుకుతోంది. హత్యాకాండలకు అండదండలందిస్తోంది. ఈ ప్రమాదకర పోకడ సర్వత్రా ఆందోళన రేపుతోంది. ఏలూరు : అడ్డొస్తే అంతమొందించేయ్.. ఇదీ జిల్లా కేంద్రం ఏలూరు, పరిసరాల్లో ప్రస్తుతం వినిపిస్తున్న మాట. గతంలో ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో ఎవరైనా తమ కార్యకలాపాలకు అడ్డొస్తున్నారని భావిస్తే.. వారిని బెదిరించడం, మహా అయితే దాడి చేయడం వరకూ ఉండేది. అయితే రెండేళ్లలో ఏలూరులో శాంతిభద్రతలు క్షీణించాయి. అధికార పార్టీ నేతల అండదండలతో రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు. ప్రత్యర్థులను మట్టుబెట్టడమే లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే అంతమొందించేందుకు కుట్ర పన్నే దుస్థితి నెలకొంది. ఇది ఇక్కడి శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోంది. ఏడాదిన్నర క్రితం న్యాయవాది రాయల్ హత్య కేసుతో మొదలైన హత్యా రాజకీయాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పోలీసులు వీటి నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదు. పైపెచ్చు అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్నారు. దీనికి ఈ ఉదాహరణలే నిదర్శనం.. ఇసుక దందాకు అడ్డమని..! తాజాగా దెందులూరు మండలానికి చెందిన అ«ధికార పక్ష నేత ఒకరు.. తన అక్రమ ఇసుక దందాకు అడ్డం వస్తున్నాడనే కారణంతో ఒక వ్యక్తిని అంతమొందించడానికి కిరాయి రౌడీలతో ఒప్పందం కుదుర్చుకోవడం సంచలనంగా మారింది. పోలీసులు అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతుండటంతో ఆ పార్టీ నేతలు చెలరేగిపోతున్నారు. దెందులూరు మండలం శ్రీరామవరం గ్రామానికి చెందిన అధికార పార్టీ ఎంపీటీసీ సభ్యుడు మోతుకూరి శోభన్బాబు తనకు అన్ని విషయాల్లో అడ్డు వస్తున్న ఫొటోగ్రాఫర్ కొత్తపల్లి రమేష్ను చంపడం కోసం ఏలూరుకు చెందిన రౌడీషీటర్ బ్రహ్మానందంతో రూ.లక్షకు ఒప్పందం కుదుర్చుకుని రూ. 25 వేలు అడ్వాన్సు ఇచ్చారు. అయితే బ్రహ్మానందం ఈ విషయాన్ని రమేష్కు చెప్పడంతో రమేష్ వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకూ పోలీసులు నిందితులను అరెస్ట్ చేయలేదు. సరిహద్దు తగాదాల నేపథ్యంలో.. సరిహద్దు తగాదాల నేపథ్యంలో ఈ నెల 10న చొదిమెళ్ల గ్రామానికి చెందిన బండి రాంబాబు, బాబూరావును అదే గ్రామానికి చెందిన వారు ఏలూరు పాతబస్టాండ్ ప్రాంతంలో కత్తులతో దాడి చేసి చంపబోయారు. ఈ కేసులో ప్రధాన సూత్రదారిని పోలీసులు అరెస్టు చేయకపోవడంతో అతను మళ్లీ బెదిరిస్తున్నాడని గ్రామస్తులంతా టూటౌన్ పోలీసు స్టేషన్ ముందు బైఠాయించాల్సి వచ్చింది. ఆధిపత్యపోరుతో హత్య ఇటీవల గుడివాకలంక మాజీ సర్పంచ్ భద్రగిరి స్వామిని ఏలూరు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట అగంతకులు కత్తులతో నరికి చంపారు. ఈ హత్య అధిపత్య పోరుతోనే జరిగింది. ఏకంగా ఎమ్మెల్యే హత్యకే కుట్ర! దెందులూరు శాసనసభ్యునితోపాటు మరో ఇద్దరిని హత్య చేయడానికి కుట్ర పన్నిన ఘటన ఈ నెలలోనే వెలుగు చూసింది. ఈ కేసులో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న వెంకటాపురం మాజీ సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.. అప్పలనాయుడు భార్య ఏలూరు ఎంపీపీగా పనిచేశారు. ఎన్నికల సమయంలో పదవిని రెండున్నరేళ్ల చొప్పున పంచుకోవడంతో ఆమె పదవీ కాలం ఇటీవలే పూర్తయింది. అయితే పదవీకాలాన్ని ఇంకో ఏడాది పెంచాలని రెడ్డి అప్పలనాయుడు కోరారు. దీనికి చింతమనేని నిరాకరించారు. దీంతో రెడ్డి అనురాధ తన పదవికి రాజీనామా చేశారు. మోరు హైమావతి ఎంపీపీ పదవి దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో పదవి దక్కలేదని, పైపెచ్చు తమను ఆర్థికంగా చింతమనేని ఇబ్బంది పెడుతున్నారని అక్కసు పెంచుకున్న రెడ్డి అప్పలనాయుడు ఎలాగైనా ఆయనను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో విషయాన్ని పసిగట్టిన పోలీసులు చింతమనేని ప్రభాకర్కు 3 ప్లస్ 3 సెక్యూరిటీని కల్పించారు. దిలా ఉంటే అధికార పార్టీలోని భీమవరపు సురేష్, కొల్లి శంకరరెడ్డి వర్గాలు ఒకరినొకరు చంపుకునేందుకు రెక్కీలు కూడా జరుపుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరిలో కొల్లి శంకరరెడ్డి చింతమనేని హత్యకు కుట్ర పన్నిన కేసులో కూడా ముద్దాయిగా ఉన్నాడు. ఇతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భీమవరపు సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిన్నచిన్న విషయాలకే హత్యలవైపు మొగ్గుచూపుతున్న ఈ విష సంస్కృతికి కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ రవిప్రకాష్ ఎలా అడ్డుకట్ట వేస్తారో వేచి చూడాల్సిందే! -
‘తమ్ముళ్ల’కే ట్రాక్టర్లు!
- ‘రైతురథం’ కింద జిల్లాకు 520 సబ్సిడీ ట్రాక్టర్లు – మండలానికి 6–10 వరకు కేటాయించే అవకాశం – దందాకు తెరలేపిన అధికార పార్టీ నేతల అనుచరులు – మార్గదర్శకాలు రాకనే పైరవీలు సాక్షి ప్రతినిధి, కర్నూలు : రైతులకు సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీకి ఉద్దేశించిన ‘రైతురథం’ పథకం కాస్తా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లకు బ్రహ్మరథంగా మారుతోంది. తాము చెప్పిన వారికే ట్రాక్టర్లు ఇవ్వాలంటూ ఇప్పటికే అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. వారి అనుచరులు ఒకడుగు ముందుకేసి.. ట్రాక్టర్లు ఇచ్చేది తమ వారికేనంటూ మండలాల వారీగా జాబితాలు తయారుచేసే పనిలో పడ్డారు. ఇదే అదనుగా ట్రాక్టర్లు ఇప్పిస్తామంటూ కొందరు అధికార పార్టీ నేతల అనుచరులు కమీషన్లు దండుకునే పనిలో పడ్డారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఆరు వేల ట్రాక్టర్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాకు 520 ట్రాక్టర్లు వచ్చే అవకాశముందని అధికారులు అంటున్నారు. జిల్లాలో 54 మండలాలను లెక్కిస్తే ఒక్కో మండలానికి 6 నుంచి 10 ట్రాక్టర్లు వచ్చే అవకాశముంది. వీటిని దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే పోటీ ప్రారంభమయ్యింది. దీన్ని అదనుగా చూసుకుని కొద్ది మంది అమ్యామ్యాలకు తెరలేపారు. దీనికితోడు జిల్లాలో మొత్తం అర్హుల జాబితాను ఇన్చార్జ్ మంత్రి ఆధ్వర్యంలో సిద్ధం చేయనుండడంతో నిజమైన రైతులకు ట్రాక్టర్లు దక్కేది అనుమానమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇన్చార్జ్ మంత్రికే అధికారాలు! రైతురథం పథకం కింద ట్రాక్టర్తో పాటు వ్యవసాయ పనిముట్లకు ఒక్కో దానికి రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకూ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హుల జాబితాను ఇన్చార్జ్ మంత్రి ఆధ్వర్యంలో వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీఏ)తో కలిసి తయారుచేయాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. దీంతో నియోజకవర్గాల వారీగా జాబితాల తయారీని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లు చేపడుతున్నారు. ఇదే అదనుగా కొద్ది మంది వారి అనుచరులు కమీషన్లకు తెరలేపారు. మీ–సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోండి... మీకు ట్రాక్టర్ ఇప్పిస్తామని ఆశలు రేపుతున్నారు. మరికొంత మంది అధికార పార్టీ నేతలు బినామీ పేర్లతో దరఖాస్తు చేయించేందుకు సిద్ధమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా.. ట్రాక్టర్ల పంపిణీకి ఇంకా నిర్దిష్ట మార్గదర్శకాలు రాలేదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఏ నియోజకవర్గానికి ఎన్ని ట్రాక్టర్లు కేటాయించిన విషయమూ ఇంకా తమకు తెలియలేదని అంటున్నారు. ఇవీ నిబంధనలు –రైతురథం పథకానికి దరఖాస్తు చేసుకునే రైతుకు కనీస రెండెకరాల పొలం ఉండాలి. – అప్పటికే సబ్సిడీ కింద ట్రాక్టర్లను తీసుకుని ఉండరాదు. – దరఖాస్తుదారుడి పేరు మీద ఇప్పటికే ట్రాక్టర్ ఉంటే అనర్హుడు. – ఆధార్, పాస్బుక్లను చూపించి మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేయాలి. – దరఖాస్తు సమయంలో రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. – వచ్చిన దరఖాస్తులను స్క్రూటినీ చేసి అర్హులను ఎంపిక చేస్తారు. ఇన్చార్జ్ మంత్రి, జేడీఏ కలిసి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇన్చార్జ్ మంత్రి కాస్తా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్లు చెప్పిన వారినే ఎంపిక చేసే అవకాశముంది. -
భూరాబందులు
తిరుపతి/మదనపల్లె: మదనపల్లెలో అధికార పార్టీ నేతల భూ ఆక్రమణలు పెచ్చుమీరిపోయాయి. కంటికి కనిపించిన ఖాళీ స్థలాలన్నింటినీ టీడీపీ నేతలు కబ్జా చేస్తున్నారు. ఇప్పటికే మదనపల్లెలోని మాజీ సైనికుల స్థలాన్ని ఆక్రమించిన అధికార పార్టీ నేతలు తమ ఆక్రమణల పరంపరను కొనసాగిస్తూ పట్టణంలో మిగిలిన ప్రభుత్వ భూములపై కన్నేశారు. ఎవ రి పరిధిలో వారు తమదైన శైలిలో ఆక్రమణలకు పాల్పడుతున్నారు. తాజాగా పట్టణ నడిబొడ్డున ఉన్న ఆర్టీసీకి చెందిన కోట్ల విలువ చేసే స్థలంపై వీరి కన్ను పడింది. టెండరు ద్వారా ఆర్టీసీ నుంచి స్థలాన్ని లీజుకు తీసుకు న్న వ్యాపారి నిర్మిస్తున్న గదుల నిర్మాణాలను శనివారం రాత్రి అడ్డుకుని దౌర్జన్యానికి పాల్ప డ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మదనపల్లె ఆర్టీసీ డిపో పక్కన మెయిన్ రోడ్డుకు ఆనుకుని సర్వే నంబరు 294/1, 294ఏ, 294బీలలో 1,535 చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉంది. గతంలో ఆర్టీసీ నిర్మాణాలు పూర్తి కాగా మిగిలిన స్థలాన్ని అధికారులు తమ పరిధిలోనే ఉంచుకున్నారు. ఆదాయ వనరులు పెంచుకునే క్రమంలో ఈ స్థలాన్ని లీజుకివ్వాలని మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. సుమారు రూ.1.50 కోట్ల విలువైన ఈ స్థలా న్ని ఎలాగైనా దక్కించుకోవాలని పక్కనే ఉన్న ఓ చోటా టీడీపీ నేత కన్నేశాడు. తనకున్న అధికార బలంతో ఇప్పటికే పలుమార్లు కోర్టుకెళ్లి ఆర్టీసీ టెండర్లను అడ్డుకునేందుకు స్టేలు తెచ్చారు. దీంతో మూడేళ్లుగా ఆర్టీసీ టెండర్ల ద్వారా గదుల నిర్మాణం చేపట్ట లేక లక్షలాది రూపాయల ఆదాయాన్ని నష్టపోయింది. అయితే రెండు నెలల కిందట హైకోర్టు ఆర్టీసీకి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని అమల్లో పెట్టేందుకు మదనపల్లె డిపో అధికారులు సదరు స్థలాన్ని లీజుకిచ్చేందుకు టెండర్లు పిలిచారు. ఏప్రిల్లో ఈ స్థలాన్ని వెంకటేశ్ అనే వ్యాపారి లీజుకు పొందాడు. నెలకు రూ.42 వేలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుని హోటల్ నిర్మాణ పనులు చేపట్టాడు. అయితే పక్కనే ఉన్న ఓ ప్రయివేటు హోటల్ యజమాని దీన్ని అడ్డుకుని ఆ స్థలా న్ని ఆక్రమించేందుకు ప్రయత్నం చేశాడు. శని వారం రాత్రి నిర్మాణ పనులను అడ్డుకుని అక్కడున్న సిబ్బందిపై దౌర్జన్యం చేశారు. పట్టణ టీడీపీలో క్రియాశీలకంగా ఉండే సదరు యు వ నాయకుడు పార్టీ అండ చూసుకుని ఆక్రమణలకు సిద్ధపడినట్లు సమాచారం. అధికారుల హెచ్చరికలు బేఖాతరు ఆ స్థలం ఆర్టీసీదనీ ఎవరూ జోక్యం చేసుకోవద్దని డిపో మేనేజర్ పెద్దన్నశెట్టి చెప్పినా వినని టీడీపీ నేత తనదైన దందాను ప్రదర్శించారు. స్థలం జోలి కొస్తే సహించేది లేదంటూ హెచ్చరికలు చేయడమే కాకుండా అక్కడున్న సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. అంతేకాకుండా నిర్మాణానికి సిద్ధం చేసిన ఇటుకలు ఇతరత్రా సామాగ్రిని ట్రాక్టర్లలో బలవంతంగా తీసుకెళ్లారు. ఇదేమిటని ప్రశ్నించిన ఆర్టీసీ సిబ్బందిపై గొడవకు దిగి దుర్భాషలాడారు. ఆర్టీసీ సిబ్బందిపై జరిగిన దాడులకు, స్థల ఆక్రమణపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు డిపో మేనేజర్ పెద్దన్నశెట్టి తెలిపారు. ఆ స్థలం మాది ఆర్టీసీ ఆర్ఎం నాగశివుడు మదనపల్లెలోని ఖాళీ స్థలం ఆర్టీసీదనీ, ఎవరో ఆక్రమించేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని తిరుపతి ఆర్టీసీ ఆర్ఎం నాగశివుడు పేర్కొన్నారు. ఈ విషయంలో పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారం తీసుకుని ఆక్రమించేందుకు యత్నించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
అధికార పార్టీ
♦ గుర్రప్పడియలో గెలుపే లక్ష్యం ♦ పోలీసులను అడ్డుపెట్టి దౌర్జన్యం ♦ సర్పంచ్ అభ్యర్థితో పాటు ఓటర్లను భయపెడుతున్న వైనం ♦ సోదాల పేరుతో ఇళ్లపై దాడులు ♦ గుర్రప్పడియ సర్పంచ్ ఎన్నికల్లో గెలిచేందుకే ♦ అధికార పార్టీ అడ్డదారులు ♦ సజావుగా ఎన్నికకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేనా? సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కొండపి మండలం గుర్రప్పడియ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార పార్టీ నానా రకాల అడ్డదారులు తొక్కుతోంది. కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి దత్తత గ్రామం కావడంతో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ అరాచకానికి తెర తీసింది. పోలీసులను అడ్డుపెట్టి పోటీలో ఉన్న ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులతో పాటు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు కూడా అనుమతించటం లేదు. పైగా ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ ప్రతిపక్ష పార్టీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. సోదాల పేరుతో దౌర్జన్యానికి దిగి అరాచకం సృష్టిస్తున్నారు. గుర్రప్పడియ గత పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన బీసీ మహిâ¶ళ బాపట్ల కొండమ్మ 11 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. తరువాత ఆమె మృతి చెందారు. ఉపసర్పంచ్ ఇన్చార్జి సర్పంచ్గా ఇప్పటి వరకు కొనసాగారు. అయితే గుర్రప్పడియ సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది. ఈ మేరకు గురువారం సర్పంచ్ ఎన్నికకు పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. కాగా టీడీపీ మద్దతుదారుగా బీసీ వర్గానికి చెందిన మాదాల శాయమ్మ, వైఎస్సార్సీపీ మద్దతుదారుగా అదే వర్గానికి చెందిన బాపట్ల లక్ష్మమ్మ పోటీలో నిలిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయంపై ధీమాతో ఉండగా ఎన్నికలు ఎలాగైనా నెగ్గేందుకు అధికార పార్టీ సామదానభేదదండోపాయలు ప్రయోగిస్తోంది. గుర్రప్పడియ కొండపి ఎమ్మెల్యే స్వామి దత్తత గ్రామం కావడంతో ఎమ్మెల్యే ఆ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో పోలీసులను అడ్డుపెట్టి వైఎస్సార్సీపీ మద్దతుదారులను బెదిరిస్తున్నారు. ఓటర్లను రకరకాల ప్రలోభాలకు గురి చేస్తున్నారు. తమకు ఓట్లేయకపోతే పింఛన్లు, రేషన్కార్డులు తొలగిస్తామంటూ బెదిరింపులకు దిగారు. పక్కా గృహాలు రాకుండా చేస్తామని, ఎటువంటి ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తామంటూ మరింతగా బెదిరింపులకు గురి చేశారు. ఇక పోలీసులను అడ్డుపెట్టి వైఎస్సార్సీపీ మద్దతుదారులు ప్రచారం చేసుకోకుండా అడ్డుకున్నారు. నలుగురు కనిపిస్తే చాలు పోలీసులు దౌర్జన్యానికి దిగుతున్నారు. అసలు ఇళ్లలో నుంచి బయటకు రానివ్వకుండా నిర్బంధిస్తున్నారు. పోలింగ్ను ఏకపక్షంగా నిర్వహించుకోవడంతో పాటు అవసరమనుకుంటే తమ అభ్యర్థిని దౌర్జన్యకరంగానైనా గెలిచినట్లు డిక్లేర్ చేసేందుకు కూడా అధికార పార్టీ సర్వం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో గురువారం జరిగే పోలింగ్, కౌంటింగ్లను సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ, కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, అభ్యర్థితో పాటు ఓటర్లకు రక్షణ కల్పించాలని పంచాయతీకి చెందిన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, ఓటర్లు కోరుతున్నారు. గురువారం జరిగే పోలింగ్లో అధికారులు ఏ మాత్రం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే ! -
రెచ్చిపోయిన తణుకు ఎమ్మెల్యే
-
రెచ్చిపోయిన తణుకు ఎమ్మెల్యే
♦ ఎస్సై, రైటర్ని నిర్బంధించి టీడీపీ ఎమ్మెల్యే దుర్భాషలు ♦ ‘మావాళ్లపై కేసులు పెడతారా’ అంటూ చిందులు ♦ తన కార్యాలయంలో నేలపై కూర్చోబెట్టి తిట్లు.. ♦ సమాధానం చెప్పి కదలాలంటూ నిర్బంధం ♦ వేల్పూరులో తీవ్ర ఉద్రిక్తత.. ♦ భారీగా మోహరించిన పోలీసులు సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే రెచ్చిపోయారు. వారం రోజుల క్రితం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏఎస్సైని కాలితో తన్నిన విషయం మర్చిపోకముందే.. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఏకంగా ఒక ఎస్సైని, రైటర్ను తన కార్యాలయానికి పిలిపించి నిర్భంధించారు. పార్టీ కార్యాలయంలో కటిక నేలపై కూర్చోబెట్టి అవమానించారు. ‘నా మాట వినకుండా మా పార్టీ వారిపై కేసులు పెడతావా. నాకు సమాధానం చెప్పే వరకూ నిన్ను ఇక్కడి నుంచి వదిలేది లేదు’ అంటూ భీష్మించారు. పార్టీ కార్యకర్తలు పోలీసులను బండబూతులు తిట్టినట్టు సమాచారం. ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. అధికారపార్టీవారిపై కేసు పెట్టవద్దంటూ ఒత్తిడి తణుకు నియోజకవర్గ పరిధిలోని ఇరగవరం మండలం రేలంగి శివారు అంతెనవారి పేటలో ఈస్టర్ రోజున దళితుల మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాల మధ్య చర్చి విషయంలో కొంతకాలంలో వివాదం నెలకొంది. సమాధుల్ని అలికే రోజున స్మశానంలోనే ఇరువర్గాలు గొడవ పడ్డాయి. తర్వాత ఎవరింటికి వారు వచ్చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు వైఎస్సార్ సీపీ వర్గానికి చెందిన వారి ఇళ్లపై దాడి చేశారు. ఒకరికి తల పగిలింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఇరువర్గాలకు చెందిన చెరో ఆరుగురిపై సెక్షన్ 307 కింద కేసులు నమోదు చేశారు. తెలుగుదేశం వారిపై కేసు పెట్టవద్దంటూ ఇరగవరం ఎస్సై శ్రీనివాస్పై ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అయితే దాడి జరిగిన విషయం నిర్థారణ కావడంతో ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. మీకు ఎంత దమ్ముందిరా.. అంటూ దుర్భాషలు ఈ నెల 15న తెలుగుదేశం పార్టీకి చెందిన ఆరుగురిని, వైఎస్సార్ కాంగ్రెస్కు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. గురువారం నాడు వైఎస్సార్ సీపీకి చెందిన మరొకరిని అరెస్ట్ చేశారు. ఇంకా ఇద్దరు దొరకాల్సి ఉంది. అయితే తన మాట వినకుండా తమ వారిపై కేసులు పెట్టడమే కాకుండా వారిని అరెస్ట్ చేయడంపై ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆగ్రహించారు. ఇరగవరం ఎస్సై, రైటర్ను వేల్పూరులోని తన కార్యాలయానికి రమ్మని తణుకు సీఐ ఆదేశించారు. సీఐ వేరేచోట ఉండటంతో రాలేకపోయారు. ఎస్సై శ్రీనివాస్, రైటర్ ప్రదీప్కుమార్ సాయంత్రం 6 గంటల సమయంలో వేల్పూరులోని ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయ గదిలోకి రమ్మన్న ఎమ్మెల్యే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా మాట వినకుండా కేసులు నమోదు చేస్తారా.. మీకు ఎంత దమ్ముందిరా’ అంటూ బూతులు తిట్టారు. వారిని కార్యాలయంలో నేలపై నేలపై కూర్చోబెట్టి తాను కూడా వారి ఎదురుగా కూర్చున్నారు. తనకు సమాధానం చెప్పేవరకూ బయటకు వెళ్లనీయనంటూ నిర్బంధించారు. ఈ వ్యవహారాన్ని ఫొటోలు తీసిన పోలీసుల నుంచి సెల్ఫోన్లు లాక్కుని ఆ ఫోటోలను డిలిట్ చేయించారు. ఎస్సైని నిర్బంధించిన విషయం ఎస్పీకి తెలియడంతో ఆయన స్వయంగా ఎమ్మెల్యేకి ఫోన్చేసి నిర్బంధించడం సరికాదని చెప్పడంతో వారిని వదిలిపెట్టినట్టు సమాచారం. అప్పటికే అక్కడికి చేరుకున్న రేలంగి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు ఎస్ఐని, రైటర్ను బయటకు వెళ్లనివ్వకుండా మరోమారు అడ్డగించారు. దీంతో పోలీసులు భారీగా ఎమ్మెల్యే కార్యాలయం వద్ద మోహరించారు. కొవ్వూరు డీఎస్పీ మురళీకృష్ణ, తణుకు సీఐ అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేతో చర్చలు జరిపారు. తఢమ వారికి అన్యాయం జరిగిందని ప్రశ్నించడానికి మాత్రమే పిలిచానని, తాను ఎవరిని నిర్బంధించలేదని ఎమ్మెల్యే మీడియాకి తెలిపారు. -
వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై ఎమ్మెల్యే అనుచరుడి దాడి
– ఫిర్యాదు చేసిన బాధితుడు, పట్టించుకోని పోలీసులు – నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్న ఎమ్మెల్యే మణిగాంధీ కర్నూలు సీక్యాంప్: వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై అధికార పార్టీ నేతల దాడులకు అడ్డుకట్ట పడడంలేదు. బుధవారం గీతాముఖర్జీనగర్లో నివాసముంటున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త చాకలి నరేష్(28)ను అదే కాలనీకి చెందిన కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ ప్రధాన అనుచరుడు అధికార పార్టీ నాయకుడు ఇ.సురేంద్ర గౌడ్ కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. చాకలి నరేష్ స్థానికంగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని, అధికార పార్టీ ఇచ్చిన తప్పుడు వాగ్ధానాల గురించి స్థానికులకు వివరించేవాడు. దీన్ని మనసులో పెట్టుకుని సురేంద్ర గౌడ్ దాడి చేశాడని నరేష్ బంధువులు వాపోయారు. ప్రమాద స్థలంలో స్పృహ తప్పి పడిపోయిన చాకలి నరేష్ను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిపించారు. అతని తలకి, చేతికి దెబ్బతగలి 12కుట్లు పడ్డాయి. క్షతగాత్రుడి తల్లిదండ్రులు భార్య నాలుగో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే దాడి చేసిన సురేంద్రగౌడ్ మణిగాంధీ అనుచరుడు కావడంతో పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నాడని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. -
ఎస్ఐపై గల్లా అనుచరుల దాడి
►నలుగురు యువకుల బరితెగింపు ►రాజీ కోసం తీవ్రంగా కృషిచేసిన సీఐ ►ఇన్స్పెక్టర్ తీరుపై రగిలిపోతున్న పోలీసులు తిరుచానూరు: తిరుచానూరు ఎస్ఐపై బుధవారం రాత్రి గల్లా అరుణకుమారి అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఎస్ఐ రామాంజనేయులు రాత్రి సింధూ జంక్షన్ వైపు వెళుతుండగా నలుగురు యువకులు ఓ ఆటో డ్రైవర్తో గొడవ పడుతుండ డాన్ని గమనించి వారిని వారించే యత్నం చేశారు. ఆ యువకులకు, ఎస్ఐకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఎస్ఐ ఓ యువకుడిపై చేయి చేసుకోవడంతో ఆ నలుగురు కలసి ఎస్ఐపై దాడిచేసి పారిపోయారు. వారు టీడీపీకి చెందిన సునీల్, అతని అనుచరులని అక్కడున్నవారు తెలిపారు. ఎస్ఐ స్టేషన్కు వచ్చి సీఐకి ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డ వారు అధికార పార్టీకి చెందినవారు కావడంతో ‘‘ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా చూడాలి. నువ్వు కొత్తగా వచ్చావు. అధికార పార్టీ నాయకులను చూసీ చూడనట్టు వ్యవహరించాలి’’ అని సీఐ సలహా ఇచ్చారు. దీంతో ఎస్ఐ మనస్తాపానికి గురైనట్టు తెలిసింది. సాక్షాత్తూ ఎస్ఐపై దాడిచేస్తే కేసు నమోదు చేయకుండా రాజీ యత్నం చేయడంతో సీఐపై పోలీసులు రగిలిపోతున్నారు. ఎస్పీ అయినా స్పందించాలని కోరుతున్నారు. -
అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు?
జరిమానాతో లారీలను వదిలిపెట్టిన విజిలెన్స్ అధికారులు ప్యాపిలి: అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నేతలు అడ్డదారిలో అక్రమార్జనకు తెరతీశారు. అయితే అధికారులు తరచూ దాడులు నిర్వహించి అక్రమాలను అడ్డుకట్ట వేసేందుకు యత్నించినా చివరకు అధికారపార్టీ నేతలదే పైచేయి అవుతోంది. మండల కేంద్రం ప్యాపిలి వద్ద ఇటీవల విజిలెన్స్ అధికారులు అక్రమంగా గ్రానైట్ను తరలిస్తున్న రెండు లారీలను స్వాధీనం చేసుకుని చివరకు జరిమానాతో వాటిని వదిలేయడం చర్చనీయాంశమైంది. కర్నూలు వైపు నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రికి అక్రమంగా గ్రానైట్ ఖనిజాన్ని తరలిస్తున్న ఏపీ 02ఎక్స్ 6277, ఏపీ 02 టీఏ 6255 నంబర్లు గల లారీలను ఈ నెల 14న కర్నూలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్యాపిలి వద్ద అదుపులోకి తీసుకున్నారు. లారీలను ప్యాపిలి పోలీస్స్టేషన్ అప్పగించిన అధికారులపై తాడిపత్రికి చెందిన అధికారపార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మంగళవారం ప్యాపిలికి చేరుకున్న విజిలెన్స్ అధికారులు పోలీస్స్టేషన్లో ఉన్న లారీలపై ఫెనాల్టీ వేసి వదిలేశారు. అయితే ఈ లారీలు ఎవరి పేరుతో ఉన్నాయన్న విషయం, ఫెనాల్టి ఎంత వేశారన్న వివరాలు తెలియరాలేదు. -
అధికార పార్టీ నేతల దౌర్జన్యం
-
అధికార పార్టీ నేతల దౌర్జన్యం
► నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ నేతల ఇల్లు కూల్చివేత ►ఎర్రచందనం స్మగ్లర్ మహేష్నాయుడు తదితరులపై కేసు నమోదు ►సంఘటన స్థలాన్ని పరిశీలించిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి సుండుపల్లి: సుండుపల్లిలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆనందరెడ్డి, ఎంపీపీ అజంతమ్మలకు చెందిన నిర్మాణంలో ఉన్న భవనాన్ని అధికారపార్టీకి చెందిన ఎర్రచందనం స్మగ్లర్ మహేష్ నాయుడు, శివారెడ్డిలు సోమవారం అర్ధరాత్రి సమయంలో కూల్చి వేశారు. సంఘటన స్థలాన్ని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల ఇంటికి సమీపంలో వేరెవరూ ఇల్లు నిర్మించుకోకూడదా అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు ఇలాగే వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు. సొంత భూమిలో వైఎస్సార్సీపీ నాయకులు ఇల్లు కట్టుకుంటుంటే టీడీపీ నాయకులు అర్ధరాత్రి సమయంలో మనుషులు, మారణాయుధాలతో వచ్చి జేసీబీతో ఇంటిని కూల్చి వేసి భయోత్పాతం సృష్టించడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఆరంరెడ్డి మాట్లాడుతూ ఎంపీపీ, మండల వైఎస్సార్సీపీ నాయకుడు 20 ఏళ్లుగా అనుభవంలో ఉన్న వారి పూర్వీకుల స్థిరాస్తిలో ఇల్లు కట్టుకుంటుంటే దౌర్జన్యానికి పాల్పడటం తగదన్నారు. ఎంపీపీ అజంతమ్మ మాట్లాడుతూ తాము బెంగళూరులో ఉంటున్నామని, తమ సొంత భూమిలో ఇంటి నిర్మాణం జరుగుతుండగా సోమవారం అర్ధరాత్రి జేసీబీతో కూల్చివేశారన్నారు. తాము ప్రతి దాడికి దిగితే పరిస్థితి ఏమవుతుందన్నారు. ఏదైనా సమస్య ఉంటే మండల మేజిస్ట్రేట్ రావాలి. పోలీసులు రావాలి కానీ ఇలా టీడీపీ నాయకుడు మహేష్నాయుడు వచ్చి అతని ఇంటికి వెళ్లేందుకు దారి లేదంటూ తమ స్థలంలో నిర్మిస్తున్న ఇంటిని కూల్చి వేయడం ఏమిటన్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నిర్మాణంలో ఉన్న ఇంటిని అధికార పార్టీ నాయకులు కూల్చివేయడంపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, ఎంపీపీ అజంతమ్మ, వైఎస్సార్సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఆరంరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వెళ్లి సుండుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు రాయచోటి సీఐ నరసింహరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సిరాజుదీ్దన్, సర్పంచ్ బ్రహ్మానందం, ఎంపీటీసీ బాబు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు జయరామిరెడ్డి, రంగారెడ్డి, రాజారెడ్డి, బెల్లం సంజీవరెడ్డి, గౌరవసలహాదారుడు కృష్ణంరాజు, ఎస్సీసెల్ మండల కన్వీనర్ చిన్నప్ప, మండల కోఆప్షన్ మెంబర్ పండూస్, బీసీ నాయకులు సూరి ఆచారి, జిల్లా ఎస్టీ నాయకుడు చంద్రానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ రికార్డులెక్కడ?
⇒ముదపాక భూముల్లో మరో కోణం ⇒రెవెన్యూ అధికారుల పనేనని అనుమానం ⇒మలుపులు తిరుగుతున్న కుంభకోణం ⇒భూములను పరిశీలించిన కలెక్టర్, జేసీ విశాఖపట్నం/పెందుర్తి : పెను సంచలనం రేపిన పెందుర్తి మండలం ముదపాక భూముల వ్యవహారంలో కొత్త కోణం తెరపైకి వచ్చింది. దళితులకు చెందిన వందల ఎకరాల అసైన్డ్ భూములను కారుచౌకగా కొట్టేయడానికి కొంతమంది అధికార పార్టీ పెద్దలు వేసిన ఎత్తుగడ బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగడం, సాక్షిలో పలు కథనాలు రావడం, అసెంబ్లీలో చర్చ జరగడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం కలెక్టర్ ప్రవీణ్కుమార్, జాయింట్ కలెక్టర్ సృజన, ఆర్డీవో వెంకటేశ్వరరావు, వుడా అధికారులు ముదపాక వెళ్లి వివాదాస్పద అసైన్డ్ భూములను సందర్శించారు. రెవెన్యూ, వుడా అధికారుల వద్ద ఉన్న రికార్డులను పరిశీలించారు. అధికారిక రికార్డులెక్కడ ఈ అసైన్డ్ భూములకు చెందిన అధికారిక రికార్డులు లేవని సాక్షాత్తూ కలెక్టర్ ప్రవీణ్కుమార్ వెల్లడించారు. దీంతో వందల కోట్ల రూపాయల విలువైన భూముల రికార్డులు ఏమయ్యాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి ఈ భూములను రైతుల నుంచి కొట్టేయడానికి వేసిన స్కెచ్లో రెవెన్యూ అధికారులు, సిబ్బంది కీలకపాత్ర పోషిం చారన్న ఆరోపణలు ఆది నుంచీ ఉన్నాయి. రెవెన్యూ సిబ్బంది, అధికారులతో కుమ్మక్కైన కొంతమంది పెద్దలు ఎకరం రూ.10 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఆ భూములను విక్రయించకపోతే ప్రభుత్వమే స్వాధీనం చేసేసుకుంటుందని, అప్పుడు ఈ సొమ్ము కూడా దక్కకుండా పోతుందని భయపెట్టారు. బెదిరించి అక్రమంగా కొందరు భూముల్లోంచి రోడ్డు కూడా వేసేశారు. అది నిజమేనేమోనని నమ్మిన రైతులు తమ భూములు అమ్మకానికి ముందుకొచ్చారు. ఇలా 236 మంది రైతుల నుంచి 280 ఎకరాల భూమిని కొనుగోలుకు ‘పెద్దలు’ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎకరానికి రూ.లక్ష చొప్పున అడ్వాన్సుగా చెల్లించి వారి నుంచి ముందస్తుగా తెల్లకాగితాలు, ప్రాంసరీనోట్లపై సంతకాలు చేయించుకున్నారు. వుడా ఎంట్రీతో ఉలిక్కపడ్డ రైతులు చివరకు తమ నుంచి కొనుగోలు చేస్తున్న భూములను వుడా భూసేకరణ (ల్యాండ్ పూలింగ్) కు ఎకరం కోటి రూపాయలకు ఇస్తున్నారన్న సంగతి తెలుసుకుని సదరు రైతులు షాక్ తిన్నారు. ఈ మోసాన్ని గుర్తించిన ఆ గ్రామానికి చెందిన కొంతమంది యువకులు, రైతులు ఏకమై పత్రికలు, బీజేపీ శాసనసభా పక్షనేత, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజును ఆశ్రయించారు. దీనిపై సాక్షిలో ప్రముఖంగా కథనాలు ప్రచురితమయ్యాయి. మరోవైపు విష్ణుకుమార్రాజు అసెంబ్లీ ఈ కుంభకోణాన్ని ప్రస్తావించారు. ఈ బాగోతంలో అధికార పార్టీ పెద్దలు, రెవిన్యూ అధికారులు కూడా ఉన్నారని, సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనిపై బుధవారం కలెక్టర్ ప్రవీణ్కుమార్ జేసీ, ఆర్డీవో, తహసీల్దార్లను వెంటబెట్టుకుని ముదపాక భూములను పరిశీలించారు. అనంతరం ఈ అసైన్డ్ భూములకు సంబంధించిన అధికారిక రికార్డులు లేవని, ఎంజా య్మెంట్ సర్వేకు ఆదేశించామని కుండబద్దలు కొట్టారు. అంటే ఈ రికార్డులు మాయం వెనక రెవెన్యూ అధికారులున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
బజారున పడిన పచ్చపార్టీ పరువు!
రాజంపేట : రాజంపేట రెవెన్యూ డివిజన్లో ఇటీవల పోలీసు, రెవెన్యూశాఖ పరంగా అధికారపార్టీకి చెందిన కొందరు తమకు అనుకూలంగా లేకుంటే అవినీతి..అమ్ముడుపోయారనే లాంటి అపవాదును అంటగడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వివిధశాఖలకు చెందిన అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటూ బహిరంగగానే ఆరోపణలు గుప్పించడంపై అధికారపార్టీ వర్గాల్లో కలకలంరేపుతోంది. అధికారపార్టీలో కొనసాగుతున్నవారే అధికారుల పనితీరుపై పచ్చనేతలు ధ్వజమెత్తుతుంటే అది నేరుగా చంద్రబాబు సర్కారుకు మచ్చ తెచ్చేలా ఉందనే భావనతో కొందరు పార్టీనేతలు ఆవేదన చెందుతున్నారు. మా విధులు మమ్మల్ని చేయనివ్వండి. లేదంటే పనిచేయలేం..బదిలీ చేసేయ్యండి బాబు అంటూ పలువురు అధికారులు అధికార పార్టీ నేతల తీరుతో అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. పోలీసువైఖరిపై మహిళనేత కస్సుబుస్సు.. నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో రెండురోజు క్రింద జరిగిన ఓ ఘర్షణ కేసుకు సంబంధించి పోలీసులు హత్యయత్నం కేసును నమోదు చేశారు. ఈవిషయంలో అధికారపార్టీ చెందిన జిల్లా మహిళనాయకురాలు రంగప్రవేశం చేశారు.. ఈ కేసు పెట్టడం అన్యాయమంటూ, తమ వర్గానికి చెందిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయలేదంటూ ఏకంగా ఉన్నతస్థాయి అధికారి నుంచి కింద వరకు ఉన్న పోలీసులు ఏకపక్షంగా వ్యవహారించారని, అమ్ముడుపోయారని మీడియా ఎదుట ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె ఆరోపణలు పై పోలీసులు అంసతృప్తితో రగిలిపోతున్నారు. ఆ మహిళనేత రాత్రి వరకు పోలీసుస్టేషన్లోనే భీష్మించుకొని ఉండటం అధికారపార్టీలో హాట్టాపిక్గా మారింది. ఈ నాయకురాలు అనుసరిస్తున్న తీరు బెదిరింపు«ధోరణిలా ఉందనే భావనకు పోలీసులు వచ్చేసినట్లు తెలిసింది. ప్రభుత్వనేతలే మాపై నిందలేస్తుంటే ఏలా? ప్రభుత్వం ఆదేశాలు, నిబంధనల మేరకు పనిచేస్తుంటే ..అధికారపార్టీకి చెందిన నేతలే అనవసరమైన నిందలేస్తుంటే ఏలా అనే భావన అధికారుల్లో నెలకొనింది. ప్రధానంగా పోలీసు, రెవిన్యూశాఖలకు అధికారపార్టీకి చెందిన నేతల నుంచి వత్తిడి రోజురోజుకు అధికంకావడం రాజంపేట డివిజన్లో అధికమవుతోంది. అనుకూలం..ప్రతికూలం అంశాలను పరిగణనలోకి తీసుకొని తమ పట్ల అధికారపార్టీ నేతలు ఇష్టానుసారగంగా వ్యవహారిస్తుంటే ఇక ప్రభుత్వం నడిచే బాటలో ఏ విధంగా నడుచుకోగలమని అధికారవర్గాలు వాపోతున్నారు. విడమంటే పాముకు కోపం, కరచమంటే కప్పకు కోపం అన్నట్లు చందనా రాజంపేట పోలీసు, రెవిన్యూ అధికారుల తలలుపట్టుకుంటున్నారు. కొందరైతే ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి బదిలీకోసం వేయికన్నులతో ఎదురుచూస్తున్నారు. -
అధికార పార్టీ బ్యాలెట్ గేమ్
-
ఎమ్మెల్యేల పనితీరుకు మార్కులు
► టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చేయించిన సర్వే ఫలితాలు ► 6 నెలల కాలంలో భారీగా పడిపోయిన ఎమ్మెల్యేల పనితీరు ► ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలని సూచించిన అధినేత ► జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలుచుకోనున్నట్లు వెల్లడి సాక్షి, మహబూబ్నగర్ : ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్వహించిన సర్వే ఒక్కసారిగా రాజకీయ వేడి రగిల్చింది. జిల్లాలోని ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా మార్కులు వేశారు. తాజాగా వెలువడిన సర్వే ఫలితాలు ఎమ్మెల్యేలలో ఒక్కసారిగా గుబులు పుట్టించాయి. 6నెలల వ్యవధిలోనే ఎమ్మెల్యేల పనితీరు భారీగా పడిపోయినట్లు సర్వేలో వెల్లడైంది. ఎమ్మెల్యేల పనితీరును కాస్త మార్చుకోవాలని సుతిమెత్తగా హెచ్చరించారు. జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై వచ్చిన మార్కులతో సీఎం కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కేవలం 6నెలల కాలంలోనే దాదాపు 20శాతం పైగా పడిపోయారని వివరించారు. అయితే ఎమ్మెల్యేలు తమ పనితీరును మార్చుకుంటే సునాయాసంగా గెలుపొందవచ్చని, వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొత్తం 119స్థానాలకుగానూ దాదాపు 106 వరకు గెలుపొందుతామని పేర్కొన్నారు. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా మెజార్టీ స్థానాలు గెలుపొందుతామని స్పష్టం చేశారు. ఎన్నికల వేడి రగిల్చిన సర్వే.. రానున్న రెండేళ్లలో జరగనున్న సాధారణ ఎన్నికలకు రాజకీయ పార్టీలు అప్పుడే సన్నద్ధమవుతున్నాయి. 2014 సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14నియోజకవర్గాలకుగాను 7 స్థానాలు టీఆర్ఎస్ గెలుపొందగా.. 5 కాంగ్రెస్, 2టీడీపీ గెలుపొందాయి. రాష్ట్ర స్థాయిలో మారిన పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీల నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బలం 9కి చేరింది. ఈ నేపథ్యంలో వచ్చే సాధారణ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ఒక సవాలుగా తీసుకున్నాయి. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ గెలుపు గుర్రాలను చూసుకుంటున్నారు. నెల రోజుల క్రితం పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి సర్వే నిర్వహించగా... తాజాగా సీఎం కేసీఆర్ సర్వేలను బయటపెట్టడంతో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఫస్ట్క్లాస్ మార్కులే రాలే... ఉమ్మడి మహబూబ్నగర్ జి ల్లాలో కేవలం ముగ్గురు మాత్ర మే ఫస్ట్ క్లాస్ మార్కులు సాధిం చినట్లు సీఎం సర్వే ద్వారా వెలుగుచూసింది. వీరిలో టీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మాత్ర మే 67.40శాతం సాధించారు. మిగతా ఇద్దరు అలంపూర్ ఎమ్మెల్యే సంపత్కుమార్ 71.10శాతం, గద్వాల ఎమ్మెల్యే 65శాతం లభించింది. 6నెలల్లో నే ఎమ్మెల్యేల పనితీరు బాగా పడిపోయింది. సరాసరిగా ప్రతీఒక్క ఎమ్మెల్యే 20శాతం మేర పడిపోయారు. ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి డా.సి.లక్ష్మారెడ్డి 6నెలల క్రితం 73.20శాతంలో ఉంటే జనవరిలో నిర్వహించిన సర్వేలో 51.40 శాతానికి పడిపోయారు. అదే విధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు 6నెలల క్రితం 62.50శాతం ఉండగా... తాజా సర్వేలో 55.20కు తగ్గింది. కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి 6నెలల క్రితం 56.80శాతం ప్రజల మద్దతు లభించగా... ప్రస్తుతం 49.80శాతం ఉన్నట్లు వెల్లడైంది. సుతిమెత్తగా హెచ్చరింపు... జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పనితీరు మార్చుకోకపోతే వేటు తప్పదని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. పనితీ రు ఆధారంగా.. సర్వేల ఆధారంగానే పార్టీ తరఫున టిక్కెట్లు ఇవ్వనున్నట్లు సంకేతాలు జారీ చేశారు. సాధారణ ఎన్నికలకు మరో రెండేళ్లు ఉ న్న నేపథ్యంలో ఎమ్మెల్యేలందరూ పద్ధతి మార్చుకోవాలని సూచించినట్లు సమాచారం. ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నారో సర్వే ద్వారా తెలియజేశారు. ఇక నుంచి జనం మధ్యలో తిరుగుతూ.. వారి సమస్యలను పరిష్కరించాలని సుతిమెత్తగా హెచ్చరించారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
ఈటల టాప్
► మంత్రి కేటీఆర్కు తొలి, రెండో సర్వేకు10.20 శాతం తేడా ► ముగ్గురు ఎమ్మెల్యేలకు అత్తెసరు మార్కులు ► పలువురు ఎమ్మెల్యేలకు ఏటా తగ్గిన గ్రాఫ్ ► జగిత్యాలలో పుంజుకున్న ఎమ్మెల్యే జీవన్రెడ్డి ► ఎమ్మెల్యేలపై అధికార పార్టీ సర్వే విడుదల ► ప్రజల మనోభావాలను కళ్లకు కట్టిన సీఎం కేసీఆర్ ► జనంతో మమేకం కావాలని ఉద్బోధ ► ఏటా పెరుగుతూ వచ్చిన రాజేందర్ పనితీరు ► ఉమ్మడి జిల్లాలో 89.90 శాతం జనం మెచ్చిన నేత సాక్షి, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల పనితీరును గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ వారి కళ్లకు కట్టారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారి పనితీరు, రెండు విడతలు నిర్వహించిన సర్వే ఫలితా లను వెల్లడించారు. గురువారం హైదరాబాద్లో జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి జిల్లాల వారీగా సర్వే నివేదికల ఆధారంగా సమీక్ష జరిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతల జాతకాన్ని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు వెల్లడించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 12 కాగా.. శాసనసభ్యులు, శాసనసభ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరు, టీఆర్ఎస్ పార్టీ, ఇతర పార్టీల బలాబలాలను కేసీఆర్ వివరించారు. ప్రజాక్షేత్రంలో ఉండే వారికి ప్రజల వేసిన మార్కులను వివరించడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి ఈటల రాజేందర్కు ఫస్ట్ ర్యాంకు.. తొలి సర్వే, రెండో సర్వేకు భారీ తేడా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై టీఆర్ఎస్ నిర్వహించిన సర్వేలో హుజూరాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్కు ప్రజలు ఫస్ట్ ర్యాంకు ఇచ్చారు. ఏటా ఆయన ప్రజలకు చేరువవుతున్నట్లు సర్వే నివేదికలు చెబుతున్నాయి. కాగా.. టీఆర్ఎస్ శాసనసభ్యులుగా ఎన్నికైన తరువాత 2015–16 సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో మధ్య ఆ పార్టీ మొదట సర్వే జరిపించింది. తొలి సర్వేలో మంచి మార్కులు సాధించిన వారు కూడా రెండో సర్వేలో దారుణంగా వెనుకబడడం గమనార్హం. మంత్రి ఈటల రాజేందర్ తొలి సర్వేలో 73.50 శాతంగా ఉంటే.. రెండో సర్వే నాటికి ఆయన పనితీరు 89.90 శాతానికి పెరిగింది. ఆ తర్వాత ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ తొలి సర్వేలో 42.60 శాతం మార్కులు రాగా, రెండో సర్వేలో 47.30 శాతానికి పెరిగింది. సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ 70.60 నుంచి 60.40 శాతంగా మారింది. తొలి, రెండో సర్వేలతో పోలిస్తే జిల్లా ఎమ్మెల్యేల్లో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కు మార్కులు తగ్గాయి. అదే వరుసలో మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, ఆ తర్వాత కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఉన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నాలుగు శాతం తేడాతో ఉండగా, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ 88.10 శాతం నుంచి 56 శాతానికి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్కుమార్ 67.60 నుంచి 53.90కి, చొప్పదండి ఎమ్మెల్యే 79.40 నుంచి 62.50, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి 75.50 నుంచి 54.20కి తగ్గారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్రెడ్డి తొలి, రెండో సర్వేకు గ్రేడ్ పెరిగింది. తొలి సర్వేలో 50.90 శాతం ఉండగా.. రెండో సర్వే నాటికి 68.90 శాతానికి పెరిగింది. అభివృద్ధి, సంక్షేమం ఎజెండాగా మారాలి... ప్రజలతో మమేకం కావాలి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మనస్సులో నిలవడంతోపాటు చిరస్థాయి పేరు ప్రఖ్యాతలు పొందాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు సూచించారు. బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయన జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 13 మంది ఎమ్మెల్యేల పనితీరుపై తాను నిర్వహించిన సర్వే వివరాలను వెల్లడించిన సీఎం 60 శాతానికి పైగా ప్రజల మద్దతు పొందిన ఎమ్మెల్యేలను అభినందించారు. మిగతా వారు కూడా పనితీరు మెరుగుపరుచుకొని ప్రజల్లో చెరగని ముద్ర వేసుకోవాలన్నారు. ప్రజల మద్దతే పనితీరుకు కొలమానమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రాజెక్టుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మమేకం అవుతూ పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాలని సూచించినట్లు తెలిసింది. – ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు -
ఇదీ.. మీ పనితీరు
ఎమ్మెల్యేల పని విధానంపై సర్వేల నివేదిక ∙స్వయంగా వెల్లడించిన సీఎం కేసీఆర్ మీరు మారాలని శాసనసభ్యులకు క్లాస్ లోపాలను సరిదిద్దుకోవాలని ఆదేశం బహిరంగ సభలు నిర్వహించాలని సూచన సర్వేలో ఎర్రబెల్లి ఫస్ట్, వినయ్భాస్కర్ సెకండ్ ఆఖరులో ఎమ్మెల్యే రాజయ్య, మంత్రి చందూలాల్ వరంగల్ : అధికార పార్టీలో సర్వే అలజడి నెలకొంది. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కేసీఆర్ నిర్వహించిన సర్వే వివరాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ కార్యక్రమాలు, ఎమ్మెల్యేల వ్యక్తిగత పనితీరు, ప్రజలకు అందుబాటులో ఉండడం, టీఆర్ఎస్పై ప్రజల స్పందన వంటి అంశాలతో ఈ సర్వే చేయించారు. రెండు దశల్లో చేసిన సర్వే వివరాలను సీఎం కేసీఆర్ స్వయంగా వెల్లడించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్లో గురువారం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం పాత జిల్లాల వారీగా మంత్రులు, శాసనసభ్యులతో సీఎం ప్రత్యేకంగా సమావేశయమ్యారు. ఎమ్మెల్యేల పనితీరుపై నిర్వహించిన సర్వే వివరాలను వారికి స్వయంగా అందజేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో అనుకూలత ఉన్నా... స్థానికంగా ఎమ్మెల్యేలపై ప్రతికూలత ఉందని పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా లోపాలను వెంటనే సరిచేసుకోవాలని ఆదేశించారు. టీఆర్ఎస్పై, ఎమ్మెల్యేలపై ప్రతికూలత ఎక్కువగా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. బాగా ప్రతికూలత ఉన్న నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని, స్వయంగా తానే ఈ సభలకు హాజరవుతానని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో సమన్వయం చేసుకుని బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాగా, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు, డోర్నకల్ ఎమ్మెల్యే డి.ఎస్.రెడ్యానాయక్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. -
అధికార పార్టీకి మహిళలపై గౌరవం లేదు
ఒంగోలు అర్బన్: అధికార పార్టీ నేతలకు మహిళలపై గౌరవం లేదని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గంగాడ సుజాత అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ నెల 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో మహిళలకు ఆటలపోటీలు, సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని మహిళలు కార్యక్రమానికి తరలిరావాలని కోరారు. గతంలో కృష్ణా జిల్లాలో మహిళా తహశీల్దారుపై అధికార పార్టీ ఎమ్మెల్యే చేయిచేసుకోవడం, ఇటీవల మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకి హాజరయ్యేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజాపై ప్రవర్తించిన తీరుతో పాటు రాష్ట్రంలో మహిళలపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఎన్నో ఉన్నాయన్నారు. ఈ మహిళా దినోత్సవం నుంచి అయినా అధికార పార్టీ నేతల్లో మహిళల పట్ల మార్పు రావాలన్నారు. డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ అని చెప్పి మోసం చేశారన్నారు. మహిళా విభాగం జిల్లా అ«ధికార ప్రతినిధి బడుగు ఇందిర మాట్లాడుతూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు కనీస భద్రత కల్పించాలన్నారు. నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నా మహిళలకు సముచిత స్థానం ఇచ్చి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల కోసం ప్రత్యేక చట్టాలను కల్పించి అమలు చేయాలని కోరారు. సమావేశంలో మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కావూరి సుశీల, అనంతలక్ష్మీ తదితరులు ఉన్నారు. -
కార్యకర్తలను వదిలే వరకు కదిలేది లేదు
– టీడీపీ వర్గీయుల మధ్య ఫ్లెక్సీల గొడవ – అనుమానంతో అమాయకులపై గల్లా అనుచరుల దాడి – ఫిర్యాదు చేసిన బాధితులను అరెస్టుచేసిన పోలీసులు – ముత్యాలరెడ్డి పల్లె పోలీస్స్టేషన్లో బైఠాయించిన చెవిరెడ్డి – పెద్దసంఖ్యలో తరలి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు – దళితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయరా ? : నారాయణ స్వామి ‘‘నన్ను నమ్మిన వాళ్లు అన్యాయంగా జైల్లో ఉంటే.. నాకు పండుగ లేదు.. అధికార పార్టీ నాయకుల అరాచకాలకు అమాయకులు బలైతుంటే ఊరుకునేది లేదు. తప్పు చేసినవారితో పాటు దాన్ని సమర్థించిన వారు కూడా భవిష్యత్తులో పశ్చాత్తాపపడుతారు. అధికారాన్ని అడ్డగోలుగా వాడుతూ.. ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని విచారించకుండానే అమాయక దళితులను అరెస్టు చేయడం పోలీసులకు తగదు’’ అని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వగ్రామం నారావారిపల్లె సమీపంలోని పుదిపట్లలో గురువారం టీడీపీకి చెందిన రెండు వర్గాలు గొడవపడ్డాయి. గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలసి వస్తున్న మణి అనే దళితుడిపై అనుమానంతో పుదిపట్ల సమీపంలో మాజీ మంత్రి గల్లా అనుచరులు దాడికి తెగబడ్డారు. బాధితులు గల్లా అనుచరులపై ముత్యాలరెడ్డిపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుపై కేసు నమోదు చేయని పోలీసులు శుక్రవారం ఉదయం మణిని, వారి కుటుంబ సభ్యులను అరెస్టు చేశారు. బాధితులకు అండగా చెవిరెడ్డి సింగపూర్, చెన్నై నుంచి ఎమ్మెల్యే చెవిరెడ్డి కుమారులు సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చారు. అయినప్పటికీ తన నియోజకవర్గ పరిధిలో ఓ దళితుడిని అన్యాయంగా స్టేషన్లో ఉంచారని తెలుసుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శుక్రవారం ఉదయం ముత్యాలరెడ్డి పల్లె పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. బాధితులను వదలాలని కోరారు. వారిని వదిలే వరకు ఎన్ని గంటలయినా.. రోజులయినా సరే ఇక్కడి నుంచి కదిలేది లేదని అక్కడే బైఠాయించారు. అధికార పార్టీ ఒత్తిడితో పోలీసులు అరాచకాలకు పాల్పడితే బాధితులకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఉత్కంఠ నెలకొంది. పోలీసులపై నారాయణస్వామి ఫైర్ గురువారం అర్ధరాత్రి దళితులు ఫిర్యాదుచేస్తే ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ స్వామి మండిపడ్డారు. కేసు నమోదు చేయకుంటే జిల్లావ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మునీశ్వర్ రెడ్డి, మునస్వామి యాదవ్, వెంకటరమణ, బడి వెంకటేష్ యాదవ్, చంద్రమౌళి రెడ్డి, దళిత సంఘ నాయకులు ప్రదీప్, నారాయణ, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. అర్ధరాత్రి కేసు నమోదు ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, నారాయణస్వామి స్టేషన్ వద్దే బైఠాయించడంతో బాధితుడు మణి బంధువు సిద్దముని ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం అర్ధరాత్రి తర్వాత నిందితులు బడి సుధా యాదవ్, రవీంద్ర, వెంకటముని, గుండ్లూరు శివ, ఈశ్వరయ్యపై కేసు నమోదు చేశారు. -
రచ్చ రచ్చ.. రసాభాస
ఎండాడలో గంట ముందే ముగిసిన జన్మభూమి సమస్యలు చెబుదామని వచ్చిన వారిపై టీడీపీ కార్యకర్తల దాడి రుషికొండలో తమ్ముళ్ల బాహాబాహీ అధికార పార్టీలో ఆధిపత్య పోరు, అంతర్గత కుమ్ములాటలు జన్మభూమి సాక్షిగా బహిర్గతమయ్యాయి. అధికారుల ఎదుటే బాహాబాహీకి దిగడం, రక్తాలు వచ్చేలా కొట్టుకోవడంతో బిత్తరపోయారు ప్రజలు. టీడీపీ మహిళా నాయకురాలిపై అదే పార్టీకి చెందిన నాయకుడు అసభ్యంగా ప్రవర్తించడం.. ఆమె భర్త తిరగబడడం.. ఇలా ఒకటేమిటి.. అడ్డూ అదుపూ లేని టీడీపీ నాయకుల ఆగడాలకు వేదికైంది ఆరో వార్డు పరిధి రుషికొండలోని జన్మభూమి సభ. ఇక అదే వార్డులోని ఎండాడ సభ ఇందుకు భిన్నంగా ఏమీ జరగలేదు. ఇక్కడ విశేషమేమంటే సమస్యలు చెప్పడానికి వచ్చిన ప్రజలపైనే దాడి చేశారు టీడీపీ కార్యకర్తలు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఉన్నతాధికారి కూడా అధికార పార్టీ నాయకులకే వత్తాసు పలకడం శోచనీయం. ప్రజలపై దాడిని ఖండించిన వైఎస్సార్ సీపీ నాయకులతో గొడవకు దిగి అక్కడి సభనూ రచ్చరచ్చ చేశారు. మొత్తానికి ఎందుకు నిర్వహించారో తెలియకుండానే ముగించేశారు అధికారులు. – సాగర్నగర్ (విశాఖ తూర్పు) జీవీఎంసీ ఆరోవార్డు పరిధిలో మంగళవారం జరిగిన జన్మభూమి–మా ఊరు సభలు రసాభాసగా ముగిశాయి. ఎండాడలో గంటన్నర ఆలస్యంగా మొదలైన సభను గంట ముందుగానే ముగించేశారు. మధురవాడ జోనల్ కమిషనర్ పి.ఎం. సత్యవేణి ఫిర్యాదులిచ్చిన స్థానికులతో అతిగా వ్యహరించడంతో స్థానికులు వారిపై తిరగబడ్డారు. అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కటై సమస్యలు చెప్పే అవకాశం ఇవ్వకుండా రచ్చరచ్చ చేశారు. నిర్మాణం పూర్తయినా ప్రారంభించని ఎన్టీఆర్ సుజలం వాటర్ ప్లాంట్ విషయమై వైఎస్సార్ సీపీ నాయకులు లొడగల రామ్మోహన్, లొడగల అప్పారావు, ఉప్పులూరి గోపి, నల్ల రవి, సుంకర హరిబాబు, చిర్రా రామ్మోహన్ సభలో జోనల్ కమిషనర్ సత్యవేణిని ప్రశ్నించారు. దీంతో జెడ్సీ వ్యంగ్యంగా మాట్లాడటంతో లొడగల అప్పారావు, ఇతర నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారిపై దాడి రాజీవ్నగర్కు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి రాజీవ్నగర్ రోడ్డు దుస్థితి, సాగర్నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో రోగుల పరిస్థితి, రోడ్లు, అంతర్గత డ్రైనేజీల దుస్థితిపై అధికారులను నిలదీశారు. దీంతో శ్రీనివాసరావుపై టీడీపీకి చెందిన వెంకటరమణ అనే చోటా కార్యకర్త, వార్డు కమిటీ అధ్యక్షుడు చెట్టుపల్లి గోపి దాడికి ప్రయత్నించగా వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డు తగిలారు. దీంతో ఇరువర్గాల మధ్య పది నిమిషాలు తోపులాట, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ఈ గొడవలు భరించలేక జన్మభూమి ప్రత్యేక అధికారి మోహన్రావు గంటన్నర ముందుగానే వేదిక దిగిపోయారు. అనంతరం ఒకరు తర్వాత ఒకరుగా వివిధ శాఖల అధికారులంతా వెళ్లిపోవడంతో వేదిక ఖాళీ అయిపోయింది. ఉదయం 10.30కు ప్రారంభమైన సభ మధ్యాహ్నం 12 గంటలకే ముగిసిపోయింది. దీంతో సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన స్థానికులు బిత్తరపోయి, సభ నిర్వహణను విమర్శిస్తూ వెళ్లిపోయారు. -
అధికార పార్టీ నేతలే బాధ్యత వహించాలి
చండూరు : గట్టుప్పల మండలం రద్దుపై అధికార పార్టీ నేతలే బాధ్యత వహించాలని రైతుసేవా సహకార సంఘం చైర్మన్ బొబ్బల శ్రీనివాస్రెడ్డి అన్నారు. గట్టుప్పలలో జరిగిన ఒక్క రోజు దీక్షకు ఆయన ఆదివారం సంఘీభావం తెల్పిన అనంతరం మాట్లాడారు. చండూరుకు 22 కిలో మీటర్ల దూరంలో ఉన్న గట్టుప్పల గ్రామానికి మండలానికి కావల్సిన అర్హత ఉందన్నారు. ఆ ఇద్దరి గలాటలో మండలాన్ని కోల్పోయామని ఆరోపించారు. వారు గ్రామస్తులకు తమ సమాధానం చెప్పుకోవల్సిన అవసరం ఉందన్నారు. తప్పించుకొని ఎన్నాళ్లు తిరుగుతారని, ఎన్నికల ముందైన తమ దగ్గరకు వస్తారని, ఆ సమయంలో తగిన బుద్ది చెప్తామని ఆయన హెచ్చరించారు. గట్టుప్పల మండలం కోసం చేస్తున్న దీక్షలకు తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందన్నారు. మండలం ఏర్పాటయ్యే వరకు నిరసనలు కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో మండల సాధన కమిటీ కన్వీనర్ ఇడెం కైలాసం, క్రిష్ణయ్య, రాపోలు సత్తయ్య, పోరెడ్డి ముత్తారెడ్డి, లడే సత్తయ్య, గుండుకాడి జంగయ్య, కుమ్మరి సత్తయ్య, మాదగోని గోపాల్, భీమగొని మల్లేశం తదితరులు ఉన్నారు. ఆందోళనలు ఆగవు : ఇడెం కైలాసం చండూరు : గట్టుప్పలను మండలంగా ప్రకటించే వరకు ఆందోళనలు ఆగవని మండల సాధన కమిటీ కన్వీనర్ ఇడెం కైలాసం అన్నారు. 82వ రోజు మండల సాధన కమిటీ ఒక్క రోజు దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. 82 రోజులుగా దీక్షలు చేపడుతున్న అధికార పార్టీ నేతలు స్పందించక పోవడం బాధకరమన్నారు. అసెంబ్లీలో మండలం పై ఎమ్మెల్యే చర్చించపోవడంపై పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. ఎన్ని నెలలైన, సంవత్సరాలైన నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో రాపోలు సత్తయ్య, లడే సత్తయ్య, మాదగోని గోపాల్, భీమగోని మల్లేశం తదితరులు ఉన్నారు. -
అధికారుల తీరుపై సభ్యుల ఆగ్రహం
9 నెలలైనా బిల్లులు ఇవ్వరా? అధికార పార్టీ ప్రజాప్రతినిధులకే బిల్లులు ఇస్తారా? దివంగత సీఎం జయలలితకు నివాళి మునిపల్లి : మండలంలోని ఆయా శాఖల అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఎంపీపీ ఈశ్వరమ్మ ఆధ్వర్యంలో మునిపల్లి మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సభ ప్రారంభం కాగానే తమిళనాడు దివంగత సీఎం జయలలితకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. గ్రామాల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణంలో నాసిరకం ఇసుక వాడుతున్నారని ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేసినా పట్టించుకోరా? అని ఎంపీపీ ఉపాధ్యక్షుడు ఖమ్మంపల్లి మల్లేశంగౌడ్, మక్తక్యాసారం ఎంపీటీసీ సభ్యుడు శివచంద్రకుమార పాటిల్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అంగద్పై మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు పోన్ చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. గ్రామాల్లో వాటర్ ట్యాంకర్లతో నీటి సరఫరా చేసిన బిల్లులు మంజూరు చేయమంటే 9 నెలలైనా ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వడం లేదని అన్నారు. ఎమ్మెల్మే ఫోన్ చేయగానే ఓ ప్రజాప్రతినిధికి మొత్తం బిల్లులు ఇచ్చారని, మిగతా ప్రజాప్రతినిధులకు బిల్లులు ఇవ్వొద్దని ఎవ్వరైనా చెప్పారా? అని ప్రశ్నించారు. వాటర్ ట్యాంకర్ యజమానులకు ప్రజాప్రతినిధులు బయట అప్పులు తెచ్చి ఇచ్చారని చెప్పారు. ప్రైవేటు పాఠశాలలు ఎన్నింటికి అనుమతి ఉంది..? ఎన్నింటికి అనుమతి లేదనే వివరాలను పూర్తి స్థారుులో ఇవ్వాలని జూలేలో కోరితే ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ఇన్చార్జి ఎంఈఓ దశరథ్ను ఎంపీపీ మల్లేశంగౌడ్, మక్తక్యసారం ఎంపీటీసీ సభ్యుడు శివచంద్రకుమార్ పాటిల్ నిలదీశారు. పాఠశాలలకు సక్రమంగా ఉపాధ్యాయులు రావడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులంటే అధికారులకు లెక్కలేకుండా పోరుుందని, ఏది చెప్పినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఇంటిపన్నును ముక్కుపిండి వసూలు చేసే పంచాయతీ కార్యదర్శులు మేళసంగంలో శివారులో పత్తి కంపెనీ నిర్మాణం కోసం పన్ను (ట్యాక్స్) కడతానని అనుమతి తీసుకున్నారని, పన్ను కట్టకుండా పనులు నిర్వహించి ఏకంగా పత్తి కొనుగోలు చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని ఇన్చార్జి ఈఓపీఆర్డీ నాగలక్ష్మిని నిలదీశారు. ‘మాకు సంబంధం లేదు. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్కే తెలుసు’ అని ఆమె దాటవేశారు. శ్రీనివాస్ వివరణ ఇస్తూ పన్ను కట్టాలని డిమాండ్ నోటీసు ఇచ్చామన్నారు. రూ.1,502 పన్ను కట్టినట్లు రశీదు ఇచ్చారని సభదృష్టికి తెచ్చారు. ఇంటి యజమానుల నుంచి వేలలో పన్ను వసూలు చేస్తున్న అధికారులు పత్తి కంపెనీ నుంచి ఇంత తక్కువ పన్ను ఏ లెక్కన తీసుకుంటున్నారని పంచాయతీ కార్యర్శి శ్రీనివాస్ను నిలదీశారు. 65వ నంబర్ జాతీయ రహదారి సమీపంలో గల గుట్టలను ఎల్అండ్టీ సంస్థ జేసీబీలతో తవ్వి అక్రమంగా మొరం తరలిస్తున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని తహసీల్దార్ పద్మావతిపై మండిపడ్డారు. కంకోల్, పెద్దగోపులారం, బుదేరా శివారులోని గుట్టల నుంచి అక్రమంగా మొరం తవ్వి తీసుకెళ్తున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి ఇప్పటి వరకు ఎల్అండ్టీ సంస్థ ఎలాంటి అనుమతి తీసుకోలేదని తహసీల్దార్ పద్మావతి సభదృష్టికి తెచ్చారు. ప్రతి నెలా అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి సమీక్ష సమావేశంలో పాల్గొని రిజిష్టర్లో సంతకాలు చేయాలని సీడీపీఓ రేణుక ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులను కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అసద్పటేల్, ఎంపీటీసీ సభ్యలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అవినీతి సొమ్ము మార్చేదెలా?
అధికార పార్టీ నేతల్లో గుబులు విశాఖపట్నం: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా కోట్లు కూడబెట్టిన అధికార పార్టీ నాయకులకు ఇప్పుడు కంటిపై కునుకు కరువైంది. ఇసుక నుంచి రేషన్షాపు డీలర్షిప్ల వరకు, సీసీ రోడ్ల నుంచి ఇళ్ల క్రమబద్ధీకరణ వరకు ప్రతి పనిలో కిక్బ్యాగ్లు, పర్సంటేజ్లు తీసుకుంటూ సంపాదించిన సొమ్ము ఎక్కడ దాచుకోవాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. కొందరు హవాలా మార్గంలో మార్చుకునేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు సాగిస్తున్నారు. సిండికేట్లో చక్రం తిప్పే ఓ ప్రజాప్రతినిధితో పాటు పోర్టు వ్యాపారాల లావాదేవీల్లో కింగ్మేకర్గా ఉన్న మరో ప్రజాప్రతినిధి ఈ తరహాలో బ్లాక్ను వైట్ చేసుకుంటున్నట్టు గుసగుసలు విన్పిస్తున్నారుు. గ్రామీణ జిల్లా పరిధిలోనూ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు హవాలా బ్రోకర్ల ద్వారా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. గడిచిన వారం రోజుల్లో ఇలా వందల కోట్ల బ్లాక్మనీ వైట్గా మారినట్టు తెలిసింది. తొలుత ఎక్స్చేంజ్కు 20 శాతం కమిషన్ తీసుకున్న ఈ బ్రోకర్లు ప్రస్తుతం 30 నుంచి 35 శాతం వరకు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. పన్ను పరిధిలోకి రాకుండా ఉండేందుకు.. చోటామోటా నాయకులు తమకు పరిచయం ఉన్న బ్యాంకు మేనేజర్ల ద్వారా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా మార్చిన సొమ్ము పన్నుల పరిధిలోకి రాకుండా ఉండేందుకు వివిధరూపాల్లో బ్యాంకులో జమైనట్టుగా చూపించి సర్దుబాటు చేస్తున్నారు. మరోవైపు ఏడాది వరకు ఎలాంటి వడ్డీ లేకుండా వ్యాపారస్తులకు అప్పులిస్తున్నారు. తొలి రెండురోజులు జన్ధన్ ఖాతాల్లో జమ చేరుుంచినా ఆ డిపాజిట్లపై ఇన్కంటాక్స్ నిఘా పెట్టిందన్న వార్తల నేపథ్యంలో కాస్త వెనుకడుగు వేస్తున్నారు. డిసెంబర్ 30 వరకు మార్చుకునే అవకాశం ఉండడంతో ఏదో విధంగా వైట్ చేసుకోవాలన్న తపనతో పరుగులు పెడుతున్నారు. -
ఏ క్షణమైనా మెరుపుదాడి!
- ఏజెన్సీలో ఉండొద్దు.. మైదాన ప్రాంతాలకు వచ్చేయండి - అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలకు పోలీసుల హెచ్చరిక విశాఖపట్నం: భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతల్లో వణుకు మొదలైంది. ముఖ్యంగా ఏజెన్సీ సహా పరిసర మండలాల్లోని టీడీపీ నేతలు కంటిమీద కనుకు లేకుండా ఉన్నారు. కీలక నేతలు సహా ఒకేసారి 30 మంది సహచరులను కోల్పోరుున మావోరుుస్టులు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ఏ క్షణమైనా మెరుపుదాడి చేసే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖ ఉన్నతాధికారుల నుంచి వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ఆందోళన చెందుతున్నారు. విశాఖ ఏజెన్సీ, ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లోని ప్రజాప్రతినిధులు మైదానప్రాంతాలకు వెళ్లాలని కేంద్ర ఇంటిలిజెన్స శాఖ నుంచి ఇప్పటికే ఆదేశాలొచ్చారుు. ఈ నేపథ్యంలో విశాఖ ఏజెన్సీలో ఉంటున్న టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజాప్రతినిధులు కొంత కాలంపాటు స్వగ్రామాలకు దూరంగా ఉండాలని జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఏజెన్సీలో పర్యటించాల్సి వచ్చినప్పటికీ జిల్లా పోలీస్ శాఖతోపాటు స్థానిక పోలీస్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. మీ ఆనుపానులు ఎప్పటికప్పుడు మాకు తెలియజేయాలని, ప్రతి ఒక్కరికి భద్రత కల్పించడం సాధ్యమయ్యే పనికాదని హెచ్చరించినట్టు చెబుతున్నారు. దీంతో ఏ క్షణాన్న ఏ రూపంలో మావోలు విరుచుకుపడతారోననే ఆందోళన అధికార పార్టీ నేతల్లో నెలకొంది. మావోల నుంచి ముప్పు ఉన్న జిల్లామంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడితోపాటు ఏజెన్సీకి చెందిన పలువురు టీడీపీ నేతలకు భద్రత పెంచారు. ఇటీవలే టీడీపీలో చేరిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తనకు భద్రత పెంచాల్సిందిగా కోరినట్టు సమాచారం. బాక్సైట్ ఉద్యమ నేపథ్యంలో మావోల నుంచి ముప్పు ఉందనే ఆందోళనతో మంత్రి అయ్యన్నపాత్రుడితో సహా ఏజెన్సీ ప్రాంత ప్రజాప్రతినిధులు పలువురు పూర్తిగా విశాఖకే పరిమితయ్యారు. ముఖ్యంగా అయ్యన్న పాత్రుడైతే ఆయన టూర్ షెడ్యూల్ కూడా ఒక దశలో మీడియాకు విడుదల చేయడం కూడా ఆపేశారు. ఇటీవలే మళ్లీ టూర్ షెడ్యూల్ ఇస్తున్నప్పటికీ పోలీస్ హెచ్చరికల నేపథ్యంలో టూర్ షెడ్యూల్ విషయంలో పోలీసుల అనుమతితోనే విడుదల చేసే పరిస్థితి నెలకొంది. పోలీస్ హెచ్చరికల నేపథ్యంలో ఈయనొక్కరే కాదు.. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన టీడీపీ నేతల్లో కూడా ఆందోళన కనిపిస్తోంది. -
అధికార పార్టీ అండతో గ్యాంబ్లింగ్ క్లబ్స్
-
అధికార‘పంచాయితీ’
–టీడీపీ వ్యవహారాలను చక్కదిద్దుతున్న జిల్లా కీలక ఉన్నతాధికారి –పార్టీ పంచాయతీలకు వేదికైన కార్యాలయం –అసమ్మతి నేతలకు బుజ్జగింపూ అక్కడే –సర్వత్రా విమర్శల పాలవుతున్న తీరు ప్రజా సేవ చేయాల్సిన ఉన్నతాధికారి అధికారపార్టీ వ్యవహారాలు చక్కదిద్దుతున్నారు. రాజకీయపరంగా పాలకపక్షానికి తమ వంతు సాయమందిస్తున్నారు. ఆఖరుకు పార్టీలో విభేదాలను పరిష్కరించడానికి కూడా వెనుకాడని పరిస్థితి ఏర్పడిందని జిల్లాలో చర్చించుకుంటున్నారు. అధికార టీడీపీ చేతుల్లో పావులుగా మారిన తీరు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రజాసేవకు అంకితమవుతామని ప్రమాణం చేసి వచ్చి అధికారపక్ష సేవలో తరించడంపై ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, చిత్తూరు: రాజకీయాలకు అతీతంగా పని చేస్తూ..ప్రజల మన్ననలు పొందాల్సిన అధికారులు అధికారంలో ఉండేపార్టీలకు కొమ్ము కాస్తున్నారు. తుదకు అధికార పార్టీ నాయకుల్లో విభేదాలు తలెత్తినా ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లోనే అధికారులు చక్కబెడుతున్నారు. అధికార పెద్దలకు నివేదికలు పంపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బుజ్జగింపుల పర్వం కేవలం మండలస్థాయిలో అనుకుంటే పొరబడినట్లే. జిల్లా పాలనలో కీలక భూమిక వహించే ఉన్నత స్థాయి అధికారి నేతృత్వాన జరగడం విశేషం. ఇవికో మచ్చుకు కొన్ని – కుప్పం పంచాయితీలో ఇటీవల టీడీపీలో కొందరు వార్డు సభ్యులు రాజీనామా చేసి సంక్షోభం సృష్టించారు. అధికార పార్టీ వెన్నులో వణుకు పుట్టించారు. వీరిని బుజ్జగించి దారికి తెచ్చే బాధ్యతను జిల్లా కీలక ఉన్నతాధికారి భుజాన వేసుకున్నారు. ఈ పంచాయతీని సమర్ధంగా నిర్వహించి వారిలో అసమ్మతిని చల్లార్చారు. పంచాయతీ అభివృద్ధి నామమాత్రంగా ఉందంటూ గోడు చెప్పుకొందామని కార్యాలయానికి వచ్చిన వార్డు సభ్యులకు సదరు అధికారి క్లాసు పీకారు. పార్టీ పరువు బజారుకు ఈడ్చొద్దంటూ సలహా ఇచ్చారు. – జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణ,అటవీ శాఖ మంత్రి బోజ్జల, హౌసింగ్ చైర్మన్ వర్ల రామయ్యలు ఏకంగా టీడీపీ నాయకులు కార్యకర్తలను నేరుగా జిల్లా కీలక ఉన్నతాధికారి కార్యాలయానికి తీసుకొచ్చారు. మంతనాలు జరిపారు. టీడీపీ నాయకులకు అధికారులు అనుగుణంగా నడచుకోవాలని హుకుం జారీ చేశారు. ఏ సంక్షేమ పథకం అమలు చేయాలన్నా టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే జరగాలని అనధికార ఆదేశాలు జారీ చేశారు. ఈ తతంగం ఆ పాలనాధికారి సమక్షంలోనే జరగడం గమనార్హం. – మాజీ మంత్రి ముద్దుకృష్ణమ నాయుడు ఎమ్మెల్సీ అయిన వెంటనే మంత్రి బొజ్జల, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌనివారి శ్రీనివాసులు, ఎంపీ శివప్రసాద్ తదితరులు రాజకీయ సమావేశం సదరు కీలక ఉన్నత అధికారి చాంబరులోనే నిర్వహించారు. ఇది ప్రజా సంక్షేమం కోసం ఏర్పాటైన సమావేశం అనుకుంటే పొరపాటు. నీరు–చెట్టు, ఇతర నామినేషన్ పనులను టీడీపీ కార్యకర్తలకే ఇవ్వాలని అ ఉన్నతాధికారికి చెప్పారు. వారి ఆదేశాల ప్రకారం చాలా వరకు పనులు అధికార పార్టీ కార్యకర్తలకే పనులు కేటాయిస్తున్నారు. – కొన్ని రోజుల క్రితం చిత్తూరు మేయర్ కుర్చీపై టీడీపీ నాయకులతో అర్ధరాత్రివరకు సమావేశం నిర్వహించారు. టీడీపీలో ఉన్న రెండు వర్గాలను పిలిపించుకొని అసంతృప్తిని చల్లార్చేందుకు ప్రయత్నించారు. కుమ్ములాడుకుంటుంటే పార్టీ పరువు పోతుందని సదరు ఉన్నతాధికారి స్వయంగా వ్యాఖ్యానించారని సమాచారం. -
‘ప్లాన్’ మారింది!
– అడ్డదిడ్డంగా రోడ్డు విస్తరణ పనులు – మాస్టర్ప్లాన్కు విరుద్ధం – అధికారపార్టీ అనుయాయుడికి లబ్ధి – ఓ వాణిజ్య భవనం జోలికి వెళ్లని కర్నూలు కార్పొరేషన్ అధికారులు మాస్టర్ప్లాన్.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తారు. కానీ.. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో కార్పొరేషన్ అధికారులు మాస్టర్ప్లాన్ పనులు అడ్డగోలుగా చేపట్టారు. అలైన్మెంట్ను అడ్డదిడ్డంగా మార్పులు చేశారు. ఓ రహదారిలో రెండు చోట్ల వాణిజ్య భవనాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుని స్వామిభక్తిని ప్రదర్శించారు. ఇదెక్కడి న్యాయమని అడిగితే..‘షార్ట్ టర్మ్’ పనులు శరవేగంగా చేయాల్సి ఉన్నందున అంతవరకే చేశామని సమాధానమిస్తున్నారు. సాక్షి, కర్నూలు కార్పొరేషన్లో ఆరేళ్లుగా పాలకవర్గం లేకపోవడంతో అభివృద్ధి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకపోయింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నగరంలో అప్పటి కమిషనర్ మూర్తి కొన్ని అభివృద్ధి పనులు చేయించారు. ఆ తర్వాత ఎలాంటి పనులు జరగలేదనే చెప్పాలి. ఇక నిధుల లేమి కారణంగా కర్నూలు కార్పొరేషన్ పరిధిలో అభివద్ధి కుంటుపడింది. కృష్ణా పుష్కరాల పుణ్యమా అని నగరానికి ప్రభుత్వం రూ. 15 కోట్ల నిధులు కేటాయించింది. ఈ నిధులతో నగరంలో రహదారుల విస్తరణ పనులతోపాటు.. సుందరీకరణ తదితర అభివద్ధి పనులను కార్పొరేషన్ అధికారులు శరవేగంగా చేపట్టారు. పనులు ఇలా.. కర్నూలు నగర జనాభా ఏటేటా పెరుగుతోంది. అయితే అందుకు తగ్గట్టు రహదారుల విస్తరణ లేకపోవడంతో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పుష్కరాల నిధులతో విశ్వేశ్వరయ్య సర్కిల్ నుంచి బిర్లాగేటు వరకు.. ఆర్ఎస్ రోడ్డు సర్కిల్ నుంచి రైల్వేస్టేషన్ రోడ్దు వరకు.. మదర్థెరిస్సా విగ్రహం నుంచి సుంకేసుల రహదారి వరకు.. సి–క్యాంపు నుంచి నంద్యాల చెక్పోస్టు వరకు రహదారి విస్తరణ పనులు చేపట్టారు. మార్పులు ఇలా.. ఆర్ఎస్ రోడ్డు సర్కిల్ నుంచి రైల్వేస్టేషన్ రోడ్డు వరకు 100 నుంచి 60 అడుగుల వరకు రహదారిని విస్తరించాలని నగర పాలక సంస్థ అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు పనులు కూడా చేపట్టారు. ఇందులో భాగంగా జలమండలి.. కేవీఆర్ కళాశాలకు సంబంధించిన ప్రభుత్వ స్థలాల్ని స్వాధీనం చేసుకుని రహదారిని విస్తరిస్తున్నారు. అదేవిధంగా మరోవైపున రైల్వే స్టేషన్కు ఎదురుగా ఉన్న భవనాలు, ఓ వాణిజ్య సముదాయం.. ట్రాన్స్కో భవనం.. జలవనరుల అధికారి నివాసం, అదనపు ఎస్పీ నివాసం వరకు రహదారిని విస్తరిస్తున్నట్లు మార్కింగ్ చేశారు. అయితే ఇక్కడే అధికారులు తెలివితేటలు ప్రదర్శించారు. జలమండలి ఎదురుగా ఉన్న రహదారిని 100 నుంచి 90 అడుగులకు.. అదేవిధంగా రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న రహదారిని 60 అడుగుల నుంచి 45 అడుగులకు కుదించి అధికారపార్టీ నేతల అనుయాయులకు అనుకూలంగా అలైన్మెంట్లో మార్పులు చేశారు. గతంలో వేసిన మార్కింగ్ భిన్నంగా విస్తరణ పనులు చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయాన్ని నగరపాలక సంస్థ అధికారుల దష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లగా.. ఆయా ప్రాంతాల్లో ప్రై వేటు వ్యక్తులకు సంబంధించిన భవనాలు ఉన్నాయి.. కాబట్టి ప్రస్తుతం వాటి జోలికెళ్లలేదని అడిషనల్ సిటీప్లానర్ శాస్త్రి తెలిపారు. -
పోలీసుల స్వామిభక్తి...
ఎన్సీపీ దాడి కేసులో వైఎస్సార్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా అరెస్టుల పర్వం అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో కొనసాగుతున్న వేధింపులు కార్యాలయాన్ని ధ్వంసం చేసి, నాయకులపై దాడి చేసిన నిందితులను గుర్తించని వైనం నరసరావుపేటటౌన్: అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పోలీసు అధికారులు నడుస్తూ స్వామి భక్తిని చాటుకొంటున్నారు. నల్లపాటి కేబుల్ విజన్(ఎన్సీవీ) కార్యాలయం ధ్వంసం అనంతరం జరిగిన పరిణామాల్లో కేవలం వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకుని పోలీసులు అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. మరికొందరిని విచారణపేరుతో వేధిస్తున్నారు. దీంతో పాటు వైఎస్సార్కాంగ్రెస్పార్టీ నాయకులకు బెయిల్ రాకుండా ఉండేందుకు కుట్రపన్నుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. నరసరావుపేటలో ఇటీవల ఎన్ సీవీ కార్యాలయం ధ్వంసం చేయడంతోపాటు జీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ నల్లపాటి చంద్రశేఖర్రావును తీవ్రంగా గాయపరచిన నిందితులను ఇప్పటివరకు గుర్తించని పోలీసులు, బాధితులైన ఎన్సీవీ యాజమాన్యంపై నాన్బెయిల్బుల్ కేసులు నమోదు చేసిన విషయం విదితమే. కేసులో అరెస్టయి సబ్జైల్లో ఉన్న ఎన్సీవీ అధినేత నల్లపాటి రామచంద్రప్రసాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లాం కోటేశ్వరరావులకు బెయిల్ రాకుండా ఉండేందుకు దేశం నాయకుల వత్తిడితో పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేసులో ఫిర్యాదుదారుడైన షేక్ జానిమౌలాలి ప్రభుత్వ వైద్యశాల నుంచి నాలుగు రోజుల క్రితమే డిశ్చార్జ్ అయినా ఇంకా వైద్యశాలలోనే ఉన్నాడని పోలీసులు కోర్టుకు సమర్పించడం విమర్శలకు బలాన్ని చేకూరుస్తోంది. జాని మౌలాలి విషయంపై వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ టి.మోహన్ శేషుప్రసాద్ను వివరణ కోరగా మూడురోజుల క్రితం వైద్యశాల నుంచి డిశ్చార్జ్ అయి వెళ్ళినట్టు ధ్రువీకరించారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక వేళ బెయిల్పై విడుదలైతే మరోకేసులో అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కౌన్సిలర్ కేసులో అత్యుత్సాహం .. కౌన్సిలర్ శీలు బాబురావు పెట్టిన కేసులో పోలీసులు అత్యుత్సాహంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అనుమానితుల పేరుతో శనివారం రాత్రి జొన్నలగడ్డ, పమిడిపాడు, సాతులూరు గ్రామాలకుచెందిన సుమారు పదిమందిని రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. వారిని కలుసుకొనేందుకు బంధువులు, గ్రామస్తులు స్టేషన్కు వెళ్ళగా వారిపట్ల దురుసుగా వ్యవహరించినట్లు బంధువులు చేప్పారు. స్టేషన్లో ఉన్న వారిపై విచారణ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
అధికార పార్టీలో అంతర్మథనం
► ఎమ్మెల్యేలకే అధికారమంటూ ప్రచారం ► ఆందోళనలో పాత నేతలు ► కరణంకు కార్పొరేషన్ పదవి, గొట్టిపాటికి నియోజకవర్గ బాధ్యతలు..? ► అన్నా, దివి శివరాంల పరిస్థితి అయోమయం ► అమీతుమీకి సిద్ధమవుతున్న పాత నేతలు ► పజా క్షేత్రంలోనే తేల్చుకోవాలని నిర్ణయం సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఒక పక్క టీడీపీ పాత నేతలు.. కొత్తగా పార్టీలో చేరిన శాసనసభ్యుల పట్ల ఆ పార్టీ అధిష్టానం పూటకో తీరున వ్యవహరిస్తుండటంతో పాత నేతల్లో అంతర్మథనం మొదలైంది. తాజాగా ఎమ్మెల్యేలకే నియోజకవర్గ బాధ్యతలు అంటూ అధిష్టానం నిర్ణయించినట్లు ప్రచారం జరగడం పాత నేతలకు పుండు మీద కారం చల్లినట్లయింది. అధిష్టానం వైఖరిపై పాత నేతలు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే అమీతుమీకి సిద్ధపడాలని, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని వారు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే చంద్రబాబు మాత్రం పాత నేతలను బుజ్జగించేందుకు నామినేటెడ్ పదవులు ఎర వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అద్దంకి నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత కరణం బలరాంకు ఆర్టీసీ లేదా మరో ఇతర కార్పొరేషన్ పదవులు అప్పగించనున్నట్లు సమాచారం. కార్పొరేషన్ పదవి ఇస్తానంటూ గతంలోనే చంద్రబాబు తనకు చెప్పారని ఇటీవల కరణం సైతం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. కరణంకు కార్పొరేషన్ పదవి అప్పగించి అద్దంకి నియోజకవర్గ బాధ్యతలను కొత్తగా పార్టీలో చేరిన గొట్టిపాటికి అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ప్రస్తుతం అద్దంకి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న కరణం వెంకటేష్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. వెంకటేష్ దీనికి అంగీకరిస్తాడా... అన్నది అనుమానమే. చిన్న వయస్సులోనే వెంకటేష్ రాజకీయ భవిష్యత్తుకు గండి పడుతుంటే కరణం బలరాం చూస్తూ ఊరుకుంటారా..? అదే జరిగితే తండ్రి, కొడుకులు టీడీపీ అధిష్టానంతో అమీతుమీకి సిద్ధపడే పరిస్థితి ఉంటుందన్న ప్రచారం ఉంది. ఇక గిద్దలూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబును పక్కనపెట్టి ఎమ్మెల్యే అశోక్రెడ్డికే పూర్తి బాధ్యతలు అప్పగించేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లు సమాచారం. పార్టీలో చేర్చుకునే సమయంలోనే అశోక్రెడ్డికి చంద్రబాబు, చినబాబు లోకేష్లు ఈ మేరకు హామీ ఇచ్చినట్లు ప్రచారం ఉంది. అందులో భాగంగానే అన్నా రాంబాబును మెల్లగా గిద్దలూరు రాజకీయాల నుంచి తప్పించే ప్రయత్నానికి దిగినట్లు తెలుస్తోంది. అయితే రాంబాబును బుజ్జగించేందుకు ఏదైనా నామినేటెడ్ పోస్టు ఇస్తారా... లేదా... అన్నది వేచి చూడాల్సిందే...? ప్రాధాన్యతనివ్వకపోతే రాంబాబు తన వర్గీయులతో కలిసి అధిష్టానంతో తేల్చుకునేందుకు వెనుకాడే పరిస్థితి లేదు. ఇక కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోతుల రామారావును పార్టీలో చేర్చుకొని ఇప్పటికే పాత నేత దివి శివరాంకు అధిష్టానం ప్రాధాన్యత తగ్గించింది. పోతుల రామారావు, దివి శివరాంల మధ్య విభేదాలు పూర్తిగా సమసిపోలేదు. శివరాం వర్గీయులను తన వైపు తిప్పుకునేందుకు పోతుల అన్ని విధాలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే కొందరు నేతలు పోతుల వైపు మళ్లారు. పోతులను బలోపేతం చేసి శివరాంను బలహీనుడ్ని చేసి ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నంలో అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో శివరాంకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తారా... లేదా... అన్నది ప్రశ్నార్థకమే. ఒక వేళ నామినేటెడ్ పదవి కట్టబెట్టకపోతే శివరాం పార్టీలో కొనసాగుతారా అన్నదీ సందేహమే. జిల్లా స్థాయిలో ముగ్గురు నేతలకు ప్రాధాన్యత ఉన్న నామినేటెడ్ పదవులు అధిష్టానం కట్టబెడుతుందా... అన్నది అనుమానమే. నాయకుల సంగతి పక్కన పెడితే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు ఏ మాత్రం ఇష్టం లేదు. దశాబ్దాల పాటు పార్టీ జెండాలు మోసిన తమకు ఇప్పుడు కొత్తగా పార్టీలో చేరిన వారు అడ్డు తగులుతుంటే కార్యకర్తలు సహించే పరిస్థితి ఉండదు. అయితే ఎమ్మెల్యేలు పార్టీలో చేరడంతో క్షేత్రస్థాయిలో పాత నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే వర్గీయులు అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. సంక్షేమ అభివృద్ధి పథకాల్లో తమకే ప్రాధాన్యతనివ్వాలంటూ పోటీ పడి గొడవలకు దిగుతున్నారు. దీంతో జిల్లాలోని గిద్దలూరు, అద్దంకి, కందుకూరు నియోజకవర్గాల్లో ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ పరిస్థితుల్లో పాత నేతలకు పార్టీ అధిష్టానం ప్రాధాన్యత తగ్గిస్తే అది క్షేత్ర స్థాయిలోనూ తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇదే జరిగితే కార్యకర్తల పక్షాన నిలిచి అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునేందుకు పాత నేతలు సిద్ధపడనున్నట్లు సమాచారం. -
తమ్ముళ్లకు ‘ప్రత్యేక’ పందేరం
♦ రూ.5లక్షల చొప్పున నామినేషన్పై ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం ♦ పాత మున్సిపాలిటీలో ప్రతిపాదించకపోవడంపై ఓ నేత అభ్యంతరం పార్టీ నేతలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఏకైక లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోంది. అధికారులను ఏమార్చి.. నిబంధనల రూటుమార్చి దోచుకోండంటూ ‘ప్రత్యేక’నిధులను కేటాయిస్తోంది. ఇంకేముంది అధికారం అండతో టీడీపీ నేతలు బరి తెగిస్తున్నారు. అభివృద్ధికి వినియోగించాల్సిన నిధులను ‘మీకింత మాకింత’ అంటూ అందినకాడికి దోచుకుతింటున్నారు. కడప కార్పొరేషన్ : స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) నిధులు అధికార పార్టీ నాయకులకు వరంగా మారాయి. రూ.5లక్షల చొప్పున నామినేషన్పై పనులు తీసుకొని పంచుకుతినేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమయ్యారు. వివరాల్లోకి వెలితే.. నగరపాలక సంస్థ అధికారులు 20 డివిజన్లలో 48 పనులకు రూ.2కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఈ నిధులను కేటాయిస్తుంది. కానీ గత ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి దీనికి కొత్త భాష్యం నేర్పారు. ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన నియోజకవర్గ కీలక నేతలకు ఎస్డీఎఫ్ నిధులను కేటాయించి, అధికార పార్టీ నేతలకు పందేరం నిర్వహించే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుత తెలుగు దేశం ప్రభుత్వంలో కూడా అదే అనవాయితీ కొనసాగుతోంది. ఎస్డీఎఫ్ నిధులను స్థానిక ఎమ్మెల్యేను కాదని అధికారపార్టీ జిల్లా అధ్యక్షుడికి ఈ నిధులను కేటాయించినట్లు తెలిసింది. దీంతో నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్లంతా ఆ నిధులను విని యోగించుకునేందుకు తహతహలాడుతున్నారు. ప్రతిపాదనలు మళ్లీ తయారుచేయండి... పాత మున్సిపాలిటీలో ఒక్క పనిని కూడా ప్రతిపాదించకపోవడంపై ఇటీవల పార్టీ మారిన నగరపాలక సంస్థలోని కీలక నేత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. అన్ని ప్రాంతాలకు న్యాయం చేసేలా మళ్లీ ప్రతిపాదనలు తయారు చేయాలని కమిషనర్ను కోరినట్లు తెలిసింది. అలాగే అధికారులు ఒకరికి కేటాయించిన పనులను పైరవీలతో మరొకరు ఎగరేసుకు పోతుండటంపై ఒకరదిద్దరు తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. అలాగే ఈ పనులను ఏ శాఖ ద్వారా చేయిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ నగరపాలక సంస్థ ద్వారానే చేయిస్తే మాత్రం మిగతావారు కూడా అదే విధానంలో పనులు ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారంతో నగరపాలక అధికారులు ఇరుకున పడుతున్నట్లు సమాచారం. కేంద్రప్రభుత్వ నిధులతో జల్సా.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక ం నిధులను దారి మళ్లించి ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) పేరిట పట్టణాల్లో ఖర్చుపెడుతున్నట్లు తెలుస్తోంది. తద్వారా టీడీపీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధమవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చివరికి ఉపాధి కూలీల నోట్లో మట్టి కొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న విమర్శలూ చెలరేగుతున్నాయి. నిధుల పంపకం ఇలా... 44వ డివిజన్లోని సత్తార్ కాలనీలో డోర్ నంబర్ 46/87 నుంచి 106-1వరకూ సిమెంటు రోడ్డు, డ్రైనేజీ కాలువ నిర్మాణానికి రూ.10లక్షలు ప్రతిపాదించారు. ఈ పనిని ఆ డివిజన్ కార్పొరేటర్ భర్తకు కేటాయించినట్లు సమాచారం. అలాగే 45వ డివిజన్ బాలాజీనగర్ ఎస్సీకాలనీలో సిమెంటు రోడ్డు నిర్మాణానికి రూ.4.97లక్షలు అంచనాలు రూపొందించి ఆ డివిజన్ కార్పొరేటర్ తనయునికి అప్పగించినట్లు తెలుస్తోంది. 37వ డివిజన్లో రూ.4.95లక్షలతో సిమెంటు రోడ్డు, రూ.4.90లక్షలతో సీసీడ్రైన్ నిర్మాణానికి అంచనాలు తయారుచేసి స్థానిక టీడీపీ కార్పొరేటర్కు అప్పగించినట్లు తెలిసింది. 41వ డివిజన్లో సీసీరోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులను స్థానిక టీడీపీ నాయకుడికి అప్పగించారు. ఎస్డీఎఫ్ పనుల అంచనా విలువలన్నీ ఖచ్చితంగా రూ.5లక్షలుగానీ, లేకపోతే రూ.4.95లక్షలు, రూ.4.90లక్షలు ఇలా నాలుగైదు వేల తేడాతో అంచనాలు రూపొందించడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్కు విన్నవించి.. అంచనాలు రూపొందించి.. ఈ మేరకు నగరంలో ఫలానా చోట సమస్యలున్నాయని కలెక్టర్ కు వినతిపత్రాలు ఇచ్చారు. పనుల వారీగా వాటికి అంచనాలు రూపొందించాలని కలెక్టర్ కమిషనర్ను ఆదేశించారు. ఏ ప్రభుత్వ నిధులనైనా టెండర్ విధానంలో ఖర్చుచేస్తే సంబంధిత శాఖకు ఆదాయం కూడా సమకూరుతుంది. పనుల నాణ్యత కూడా బాగుంటుంది. అలా కాకుండా ఈ నిధులను నామినేషన్పై అప్పగించడమంటే నాణ్యతకు తిలోదకాలిచ్చినట్లే. ప్రభుత్వం తెలుగు దేశం పార్టీ నాయకులను ఆర్థికంగా బలోపేతం చే చేయడానికే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఇదేం విభజన!
♦ కొత్త జిల్లాలపై టీఆర్ఎస్లో భిన్నస్వరాలు ♦ ఏకగ్రీవ తీర్మానాన్ని పట్టించుకోకపోవడంపై కినుక ♦ విడిపోయిన హైదరాబాద్లో మళ్లీ చేర్చడమేమిటని రుసరుస ♦ ఉద్యమానికి సిద్ధమవుతున్న విపక్షాలు జిల్లా యూనిట్గా విభజన ప్రక్రియ చేపట్టాలని ఏకగ్రీవ తీర్మానం చేసినా పరిగణనలోకి తీసుకోకపోవడం, ఏకపక్షంగా జిల్లాను విడగొడుతూ అధికారులు ప్రతిపాదించడం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు మింగుడు పడడంలేదు. హైదరాబాద్ జిల్లా పరిధిలోకి తూర్పు ప్రాంతాలను చేర్చడం సహేతుకం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విలీన ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ విపక్షాలు ఉద్యమానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లాల పునర్విభజన అధికారపార్టీలో అసంతృప్తిని రాజేసింది. కొత్త జిల్లాల ఏర్పాటులో తమ ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఆపార్టీ నేతల అసంతృప్తికి కారణమైంది. ఇదే విషయాన్ని రాష్ట్రస్థాయి పునర్విభజన కమిటీ సభ్యుడు, ఎంపీ కేశవరావు ముందు కుండబద్దలు కొట్టారు. వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా కొనసాగింపుపై ఎలాంటి భేదాభిప్రాయం లేకున్నా.. మిగతా నియోజకవర్గాలను హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లాల్లో కలుపుతూ ముసాయిదా రూపొందించడాన్ని తప్పుబడుతు న్నారు. ఈ పరిణామాలను ముందుగానే పసిగట్టిన అధికారపార్టీ ఎమ్మెల్యే ఒకరు ఈ అంశంపై.. నేడో, రేపో విలేకర్ల సమావేశం పెట్టి మరీ తన అభిప్రాయాన్ని స్పష్టం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. జిల్లాల పునర్విభజనను రాజకీయ కోణంలో చూడకుండా.. సొంత నియోజకవర్గ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. 1978లో హైదరాబాద్ జిల్లా నుంచి విడిపోయి రంగారెడ్డి జిల్లా ఏర్పడిందని, మరోసారి తమను హైదరాబాద్లో విలీనం చేయాలనే ప్రతిపాదన ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన విలేకర్ల సమావేశంలో తేల్చిచెప్పే అవకాశముంది. -
నమ్మించి...వంచించి..!
► మాచర్ల మునిసిపాలిటీలో టీడీపీ కొత్త డ్రామా .. ► పదవి నుంచి దిగిపోవాలని చైర్పర్సన్పై ఒత్తిడి ► ససేమిరా అంటున్న చైర్పర్సన్ వర్గీయులు ► గ్రూపులుగా విడిపోయిన అధికార కౌన్సిలర్లు ► మాచర్ల మున్సిపల్ చైర్పర్సన్ గోపవరపు శ్రీదేవి ► వైస్ చైర్పర్సన్ నెల్లూరు మంగమ్మ ఏరుదాటాక తెప్ప తగలేయడం అధికార పార్టీకి అలవాటే అంటున్నారు. నమ్మించి వంచించడంలోనూ అంతేనంటున్నారు. ఓట్ల కోసం దేనికైనా ఒడిగడతారని, అవసరమైతే మాటలు చెప్పి మభ్యపెడతారంటున్నారు. ఈ కోవలోనే మాచర్ల మున్సిపల్ చైర్పర్సన్ను ఇబ్బంది పెడుతున్నారంటూ వాపోతూ, అధికారపార్టీ అంటేనే అసహ్యించుకునే రీతిలో చైర్పర్సన్ సామాజిక వర్గీయులు రగిలిపోతున్నారు. - సాక్షి, గుంటూరు సాక్షి, గుంటూరు : తమ రాజకీయ లక్ష్యాలను నెరవేర్చేందుకు వర్గాలను వాడుకొని ఆ తర్వాత కూరలో కరివేపాకులా ఏరిపారేయడం అధికార పార్టీ నేతలకు అలవాటు. జిల్లాలోని మాచర్ల మున్సిపల్ చైర్పర్సన్ వ్యవహారంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. మున్సిపాల్టీలో ఎక్కువ ఓటర్లు ఉన్న ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చైర్పర్సన్ పదవిని ఎరచూపారు. ఆ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థితో భారీగా ఖర్చు పెట్టించారు. తీరా గెలుపొందిన తర్వాత అధికార పార్టీ అసలు రూపం చూపించారు. చైర్పర్సన్కు ఏ పనిలోనూ సహకరించకుండా అడుగడుగునా అవస్థలకు గురిజేశారు. ఒప్పందంలో భాగమంటూ ఇప్పుడు పదవి నుంచి దిగిపోవాలంటూ ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు. కౌన్సిలర్లు గ్రూపులుగా విడిపోయినట్లు డ్రామాలాడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్నారు. అభివృద్ధికి అడుగడుగునా అడ్డంకి.... టీడీపీకి చెందిన 20 మంది కౌన్సిలర్లు గెలుపొందడంతో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన గోపవరపు శ్రీదేవిని చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. పదవి చేపట్టినప్పటి నుంచి అధికార పార్టీ సామాజిక వర్గ నేతలు, కౌన్సిలర్లు ఆమెకు చుక్కలు చూపిస్తున్నారు. అభివృద్ధి పనులకు కౌన్సిల్లో ఆమోదించాల్సి వచ్చినప్పుడల్లా గైర్హాజరవుతూ కోరం లేకుండా చేస్తూ అడుగడుగునా అడ్డుపడ్డారు. అనేక సందర్భాల్లో తీవ్రస్థాయిలో దూషణలకు దిగడమే కాకుండా చైర్పర్సన్, ఆమె భర్తపై భౌతిక దాడులకు సైతం తెగబడ్డారు. సుమారు ఆరు కోట్ల నిధులు ఉన్నా ఒక్క పైసా కూడా ఖర్చు చేసే అవకాశం లేకుండా చేశారు. పలు సార్లు కౌన్సిల్ సమావేశాల సాక్షిగా చైర్పర్సన్, ఆమెకు అనుకూలంగా ఉన్న కౌన్సిలర్లను అవమానించారు. పదవి నుంచి దిగేందుకు ససేమీరా అంటున్న చైర్పర్సన్ వర్గం... ఒప్పందం ప్రకారం జూలై 2వ తేదీన నూతన చైర్పర్సన్గా ప్రస్తుత వైస్ చైర్మన్ పగ్గాలు చేపట్టాల్సి ఉంది. తమకాలంలో ఒక్క పనికి కూడా సహకరించనందుకు తాము పదవి నుంచి దిగే సమస్యే లేదని చైర్పర్సన్ వర్గం భీష్మించి కూర్చుంది. వైస్ చైర్మన్ నెల్లూరు మంగమ్మను చైర్పర్సన్ కుర్చీలో కూర్చోబెట్టేందుకు ఆ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ, మంత్రి సైతం శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అవసరమైతే చైర్పర్సన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసే ఆలోచనలో టీడీపీ నేతలున్నారు. పదవి కోసం డ్రామా.... ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినా వారు పట్టీ పట్టనట్లు వ్యవహరించిన తీరుపై చైర్పర్సన్ వర్గీయులు ఆవేదన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా ఖండించని నియోజకవర్గ ఇన్చార్జితోపాటు, జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పుడు వారి సామాజిక వర్గం నేతను చైర్మన్గా కూర్చొబెట్టేందుకు రాజకీయ డ్రామాకు తెరలేపారు. గ్రూపులుగా విడిపోయినట్లు నటిస్తూ చైర్పర్సన్ సామాజిక వర్గానికి దూరం కాకుండా వ్యవహారం నడుపుతున్నారు. చైర్పర్సన్ ఇబ్బందులకు గురిచేసినప్పుడు మీరంతా ఎక్కడ ఉన్నారంటూ ఆర్యవైశ్య నాయకులు జిల్లా నేతలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. -
ఆయనొద్దు.. ఈయనొద్దు!
► బదిలీలపై టీడీపీ నేతల పోస్టుమార్టం ► ఒత్తిళ్లతో జిల్లా అధికారుల బేజారు ► కొత్త స్థానాల్లో చేరని పలువురు ఉద్యోగులు ► యథాస్థానాల కోసం నేతల పట్టు ► మరోసారి బదిలీలు తప్పవనే చర్చ సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో మరోసారి బదిలీలు చేపట్టాల్సి రానుందా? బదిలీలు చేయాల్సిందేనంటూ అధికార పార్టీ నేతల నుంచి మళ్లీ ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయా? ఈ నేపథ్యంలోనే బదిలీ అయిన పలువురు ఉద్యోగులు ఆయా స్థానాల్లో బాధ్యతలు చేపట్టలేదా? అధికార పార్టీ నేతల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో మరోసారి బదిలీల ఫైళ్లను దులపనున్నారా? అనే వరుస ప్రశ్నలకు నిజమేననే సమాధానం వస్తోంది. ఒకవైపు రెవెన్యూలో కీలక సంస్కరణలు అమలవుతున్న సందర్భంలో పలువురు తహశీల్దార్లు విధుల్లో చేరేందుకు విముఖత చూపుతుండటంతో పాలన అస్తవ్యస్తంగా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం చందంగా అధికార పార్టీలోని నేతల నుంచే వద్దని ఒకరు.. చేయాల్సిందేనని మరొకరు ఒత్తిళ్లు తెస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు మరోసారి బదిలీలకు సిద్ధమవుతున్నట్లు చర్చ జరుగుతోంది. చేరమంటే చేరం.. ► జిల్లాలో మొత్తం 16 మంది తహసీల్దార్లను బదిలీ చేశారు. అయితే, ఇందులో పలువురు ఇంకా బదిలీ జరిగిన ప్రాంతంలో బాధ్యతలు తీసుకోలేదు. ప్రధానంగా ఆళ్లగడ్డ తహసీల్దార్ను రుద్రవరానికి బదిలీ చేశారు. అయితే, ఈయన ఇప్పటివరకు విధుల్లో చేరలేదు. అహోబిలం ఆలయం విషయంలో స్థానికంగా ఉన్న ఇద్దరు అధికార పార్టీ నేతల మధ్య ఉన్న ఆధిప్యత పోరులో భాగంగా బదిలీ జరిగింది. ఈ నేపథ్యంలో మరో అధికార పార్టీ నేత బదిలీ చేసిన చోట బాధ్యతలు తీసుకోవద్దని, మళ్లీ ఇక్కడికే పోస్టింగ్ ఇప్పిస్తానని చెబుతున్నట్టు సమాచారం. ► కల్లూరు తహసీల్దారును బీ-సెక్షన్ సూపరిండెంటుగా బదిలీ చేశారు. ఈయన కూడా విధుల్లో చేరలేదు. ఏదో ఒక మండలానికి తహసీల్దారుగా వేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఇందుకు కొద్ది మంది అధికార పార్టీ నేతలు పైరవీ చేస్తున్నారని తెలిసింది. ► సి.బెళగల్ తహశీల్దారును బనగానపల్లెకు మార్చారు. ఈయన కూడా విధుల్లో చేరలేదు. కోడుమూరు నియోజకవర్గంలో కొద్దిరోజుల క్రితం పార్టీ మారిన నేత ఈ బదిలీ వెనుక ఉన్నారని సమాచారం. దీంతో మరో అధికార పార్టీ నేత ఈయనను ఇక్కడే ఉంచేందుకు పావులు కదపడం ప్రారంభించారు. ఈ విధంగా పలువురు తహసీల్దార్లు బదిలీ జరిగిన చోటకు వెళ్లకుండా నచ్చిన చోటనే ఉండేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అవకాశం లేకున్నా... ప్రభుత్వం విడుదల చేసిన బదిలీ ఉత్తర్వుల మేరకు జిల్లాలో ఏ ఒక్క తహసీల్దారునూ బదిలీ చేసే అవకాశం లేదు. అయితే, పరిపాలన సౌలభ్యం పేరుతో అధికార పార్టీ నేతల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు కొద్ది మందిని బదిలీ చేశారు. ఇప్పుడు అధికార పార్టీ నేతల్లోనే ఎక్కడికక్కడ మరో వర్గం బదిలీ జరగకుండా ఆపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఎవరి మాట వినాలనే విషయంలో జిల్లా ఉన్నతాధికారులకూ అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా కొంత మంది వివిధ ఆరోపణలతో పోస్టింగులు కూడా దక్కించుకోలేదు. వీరు కూడా ఇప్పుడు పోస్టింగుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. మొత్తం మీద మరోసారి జిల్లాలో బదిలీల ప్రక్రియకు తెరలేవనుందన్నమాట. -
ఉత్తమ అవార్డు ఖరీదు రూ.20 వేలు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్లుగా తయారైంది అధికార పార్టీలోని కొంద రు నాయకుల పరిస్థితి. పైరవీకారులంతా ప్ర జాప్రతినిధుల వద్దకు వెళుతుంటే తమ పరిస్థితి ఏమిటని భావించారో లేక కాసుల కక్కుర్తికి అలవాటుపడ్డారో కానీ పార్టీ మైనారిటీ నేత ఒకరు ఏకంగా ఉత్తమ అవార్డులు ఇప్పిస్తామం టూ డబ్బులు వసూలు చేయడం ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఇలా పది మంది దగ్గర డబ్బులు చేసిన సదరు నేత అందులో ఇద్దరికి అవార్డులు కూడా ఇప్పించగలిగారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పొక్కి చివరకు మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్కుమార్ చెవినపడటంతో వారు సదరు నేతపై మండిపడ్డారట. దీంతో చేసిదేమీ లేక తీసుకున్న డబ్బులు గుట్టుచప్పుడు కాకుండా వెనక్కు ఇచ్చేశాడని సమాచారం. పది మందికి హామీ... రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందించిన వారిని ప్రభుత్వం ఉత్తమ అవార్డులతో సత్కరించిన సంగతి తెలిసిందే. ఈనెల 2న రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ చేతుల మీదుగా అవార్డులు అందించిన సంగతి విదితమే. ఈ అవార్డు కింద సన్మానపత్రంతోపాటు రూ.50 వేల చెక్కు కూడా ఇస్తుండటం తో పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. ఒక్కో అవార్డుకు వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఫలానా కేటగిరిలో ఫలానా వారికే అవార్డు ఇవ్వాలంటూ మంత్రిపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయి. ఈ ఒత్తిళ్లను తట్టుకోలేక అధికార యంత్రాంగం చేతులెత్తేసింది. తెల్లవారితే అవార్డుల ప్రదానోత్సం ఉంటుంద ని తెలిసినప్పటికీ అర్ధరాత్రి వరకు అవార్డు గ్రహీతల పేర్లను అధికారికంగా ప్రకటించలేకపోయింది. దీనిని ఆసరాగా చేసుకున్న అధికార పార్టీ జిల్లా విభాగానికి చెందిన నాయకుడొకరు అవార్డు కోసం దరఖాస్తు చేసుకున్న పలువురిని కలిసి ‘మీకు అవార్డు ఇప్పిస్తాను. అవార్డు కింద మీకు రూ.50 వేలు వస్తాయి. అందులో నాకు రూ.20 వేలు ఇవ్వండి’ అని ప్రతిపాదించారు. కొందరు సదరు నేత ప్రతి పాదనను తిరస్కరించగా... ఓ పది మంది మాత్రం డబ్బులిచ్చేందుకు సిద్ధపడి కొంత అడ్వాన్సు కూడా ఇచ్చేశారు. అయితే అందులో ఇద్దరికి మాత్రమే అవార్డులొచ్చాయి. నిజానికి ఆ ఇద్దరు ఏ రంగంలోనూ పెద్దగా సేవలందిం చిన వాళ్లు కాదు. అయినప్పటికీ వాళ్ల పేర్లు అవార్డు గ్రహీతల జాబితాలో ఉండటం... మంత్రి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడంతో అధికార పార్టీ నేతలు ఆరా తీయడం మొదలు పెట్టారు. మూడో వ్యక్తితో ముప్పు.. సొంత పార్టీ నేతలు ఒకవైపు ఆరా తీస్తున్న సమయంలోనే కాసుల కక్కుర్తికి అలవాటుపడ్డ సదరు మైనారిటీ నేత ఉత్తమ అవార్డు పొందిన వ్యక్తి వద్దకు వెళ్లారు. నిజానికి సదరు వ్యక్తికి మంచి పేరుంది. ఏ రాజకీయ నాయకుడితో నూ పెద్దగా సంబంధాల్లేవు. సేవాభావాలున్న మనిషి. దీంతో ఎలాంటి పైరవీ లేకుండానే అతని పేరును ఉత్తమ అవార్డు గ్రహీతల జాబి తాలో చేర్చారు. అయితే సదరు నేత ఆయనను కూడా వదల్లేదు ‘మీకు అవార్డు మీకు ఇవ్వాలని మంత్రికి, అధికారులకు చెప్పింది నేనే. నావల్లే నీకు అవార్డు వచ్చింది. మరి నాకేం లేదా?’ అని అడిగారు. దీంతో నోరెళ్లబెట్టిన సదరు అవార్డు గ్రహీత నిజమే కాబోలు అనుకుంటూ రూ.15 వేలు ఇచ్చాడని తెలిసింది. ఈ విషయం ఆ నోటా ఈనోటా చేరి పార్టీ కార్యకర్తల్లో చర్చనీయాంశమైంది. చివరకు మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్కుమార్ దృష్టికి వెళ్లడంతో వారు సదరు నాయకుడిపై మండిపడ్డట్లు సమాచారం. దీంతో భయపడిన సదరు నేత కిక్కురమనకుండా రూ.15వేలు తి రిగి ఇచ్చినట్లు తెలిసింది. మిగిలిన ఇద్దరు మా త్రం అవార్డులు వచ్చిన సంతోషంలో ఉన్నారు. -
పోరంబోకు ప్రణాళిక
► రూ.5 కోట్ల శ్మశాన స్థలం కబ్జాకు యత్నం ► పాత్రధారులు అధికార పార్టీనేతలు ► సూత్రధారులు రెవెన్యూ అధికారులు ► హైకోర్టు స్టే ఉన్నా బేఖాతరు కాసుల వేటలో కొందరు అధికార పార్టీ నేతలు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై శ్మశాన పోరంబోకు స్థలాన్ని కబ్జా చేసేందుకు రంగంలోకి దిగారు. హైకోర్టులో స్టే ఉన్నా వెనుకాడటం లేదు. ఈ తంతు వెనుక లక్షలాది రూపాయల మతలబు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఉదయగిరి: ఉదయగిరి పట్టణంలోని స్థలాలకు ఐదారేళ్ల నుంచి గిరాకీ పెరుగుతోంది. ఒకప్పుడు పెద్దగా విలువ లేని ఇళ్ల స్థలాల ధరలు నేడు ఆకాశాన్నంటుతున్నాయి. సందర్భాన్ని సొమ్ము చేసుకున్న కొంతమంది నాయకులు, రెవెన్యూ అధికారులు ఇప్పటికే కోట్ల రూపాయల విలువైన స్థలాలను అమ్మేసుకున్నారు. పట్టణంలోని సర్వే నంబరు 1167, 1179, 1180లోని 11.34 ఎకరాల ప్రభుత్వ శ్మశాన పోరంబోకు భూమిపై అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతల కన్ను పడింది. స్థానిక రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రూ.5 కోట్లుపైగా విలువచేసే ఈ భూమికి టెండరు పెట్టారు. త్వరలో పదవీ విరమణ చేయబోతున్న ఓ అధికారి సహకారంతో ఈ భూమిని చేజిక్కించుకునేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. రికార్డులు తారుమారు సర్వే నంబరు 1167లో 4.86 ఎకరాలు, సర్వే నంబరు 1179లో 4.89, సర్వే నంబరు 1180లో 1.59 ఎకరాలను వందేళ్ల నుంచి శ్మశాన స్థలంగా వాడుతున్నారు. 1954 ఆర్ఎస్సార్లోనూ ఈ భూమి శ్మశాన పోరంబోకుగా నమోదైవుంది. 2016 మార్చి వరకు కూడా అడంగల్లో శ్మశాన పోరంబోకుగానే నమోదై ఉంది. కానీ 2016 జూన్లో ఈ శ్మశాన పోరంబోకు కాస్త రికార్డుల్లో పోరంబోకుగా మార్చేశారు. శ్మశాన స్థలాలను కాపాడాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీచేయడంతో ఆ స్థలాన్ని పోరంబోకుగా మార్చేశారు. కొన్నేళ్ల నుంచి వివాదం విలువైన ఈ స్థలాన్ని కాజేసేందుకు 20 ఏళ్ల నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ ప్రయత్నాలను స్థానికులు అడ్డుకుంటూనే ఉన్నారు. గతంలో ఈ భూమికి పెద్దగా విలువ లేకపోవడంతో నేతల కన్ను పడలేదు. కానీ ప్రస్తుతం ఈ భూముల విలువ రూ.కోట్లకు చేరడంతో దీన్ని ఎలాగైనా కాజేయాలని అధికార పార్టీ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మాదాల జానకిరాం ఉదయగిరి ఎమ్మెల్యేగా రాష్ట్ర భూగర్భ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో దీన్ని కాజేసేందుకు కొంతమంది ప్రయత్నించగా స్థానికులు ప్రతిఘటించారు. దీంతో ఎమ్మెల్యే రెవెన్యూ అధికారులను, స్థానికులను ఒకచోటకు చేర్చి రెవెన్యూ రికార్డులు పరిశీలించి శ్మశాన స్థలంగా ఉండటంతో అందులో ఎవరికీ ఇళ్లస్థలాల పట్టాలు ఇవ్వవద్దని రెవెన్యూ అధికారులను ఆదేశించడంతో ఆ సమస్య అంతటితో సద్దుమణిగింది. టీడీపీ అధికారంలోకొచ్చిన వెంటనే తహసీల్దారు కుర్రా వెంకటేశ్వర్లు సహకారంతో పట్టణానికి చెందిన కొంతమంది అధికారపార్టీ నేతలు దీన్ని కాజేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నేతలు ఆ శ్మశాన స్థలం పక్కనే ఉన్న సెటిల్మెంట్లో ఇళ్లస్థలాల లే అవుట్లు వేసి దాని పక్కనే ఉన్న శ్మశాన స్థలంలో 70 సెంట్లు ఆక్రమించి అందులోనూ ప్లాట్లు వేసి విక్రయించారు. ఇందులో సుమారుగా రూ.30 లక్షలకు పైగా ప్రభుత్వ భూమిని అమ్మున్నారనే విమర్శలున్నాయి. ఇంతటితో ఆగక పక్కనే ఉన్న మిగతా మొత్తం స్థలాన్ని కాజేసేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారులకు విషయం తెలియజేసినా పట్టించుకోలేదు. అంతే కాకుండా ఈ స్థలాన్ని ఇళ్ల ప్లాట్లుగా మార్చేందుకు అభ్యంతరాలుంటే తెలియజేయాలని రెవెన్యూ అధికారులు పంచాయతీకి ఏ-1 నోటీసు పంపించారు. దీంతో పరిస్థితి మరింత రచ్చకెక్కడంతో పంచాయతీ పాలకవర్గం ఇది శ్మశాన స్థలమైనందున ఇళ్ల పాట్లుగా మార్చేందుకు తీర్మానం ఇవ్వలేమని పంపించారు. కొంతమంది స్థానికులు ఈ విషయమై 2016 జనవరిలో హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చారు. ఆగని ప్రయత్నాలు ఇంత రచ్చకెక్కినా గుట్టుచప్పుడు కాకుండా ఈ శ్మశాన భూమికి సంబంధించి 300కుపైగా ఇళ్ల ప్లాట్లుగా విభజించి లేఅవుట్లు తయారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పాత తేదీలతో ఈ పట్టాలను అధికార పార్టీ నేతల చేతుల్లో పెట్టేందుకు రెవెన్యూ కార్యాలయంలో పత్రాలు సిద్ధమైనట్లు తెలిసింది. నెలలోపు ఈ పట్టాలన్నీ అధికార పార్టీ నేతలకు అందించేందుకు రంగం సిద్ధమైనట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే వెంకటరామారావు దృష్టికి కొంతమంది నేతలు తీసుకెళ్లినట్లుగా సమాచారం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ విషయంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టి శ్మశాన స్థలాన్ని కాపాడాలని ఉదయగిరి పట్టణవాసులు కోరుతున్నారు. ఇళ్ల స్థలాలు ఎవరికీ ఇవ్వడం లేదు పై సర్వే నంబర్లకు సంబంధించిన భూమి హైకోర్టులో స్టేలో ఉంది. ఆ స్థలంలో ఎవరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడం లేదు. గతంలో ఈ స్థలం ప్రభుత్వ అనాదీనంగా ఉంది. అడంగల్లో శ్మశానంగా ఎలా మారిందో నాకు తెలియదు. ఈ స్థలానికి సంబంధించి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం లేదు. - కుర్రా వెంకటేశ్వర్లు, తహసీల్దారు -
కలిసిన నేతలు.. కలవని మనసులు
కర్నూలులో నువ్వానేనా! ► ఆధిపత్యం కోసం పార్టీ మారిన నేత ఆరాటం ► తన వర్గంలో చేరితే మేయర్ను చేస్తానని ఆఫర్ ► నగరంలో నందికొట్కూరు తరహా రాజకీయాలు? ► కార్పొరేషన్ ఎన్నికలకు ముందే రాజుకుంటున్న చిచ్చు ► కలిసి పనిచేస్తామంటూనే కత్తులు దూస్తున్న వైనం సాక్షి ప్రతినిధి, కర్నూలు: సొంత పార్టీలో మరో వర్గంలోని నేతలను తన వర్గంలో చేర్చుకుని పార్టీ మారిన తరహాలో కండువాలు కప్పుకునే నందికొట్కూరు తరహా అధికార పార్టీ రాజకీయం కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికీ పాకిందా? అధికార పార్టీలో ఉన్న ఇరువురు నేతల మధ్య క్రమంగా దూరం పెరుగుతోందా? కలిసి పనిచేస్తామంటూనే ఆధిప్యత రాజకీయాలకు తెరలేసిందా? అనే వరుస ప్రశ్నలకు నిజమేనని ఆ పార్టీలోని కొందరు నేతలే ఘంటాపథంగా చెబుతున్నారు. కర్నూలు కార్పొరేషన్ ఎన్నికలు కేంద్రంగా చేసుకుని కొత్తగా అధికార పార్టీలో చేరిన నేత ఒకరు అవతలి వైపున్న నేతలకు గాలం వేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. తన వెంట నడిస్తే కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తానని ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. కలిసి పనిచేస్తామని ప్రకటనలు ఇస్తూనే కత్తులు దూసుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని అధికార పార్టీలో చర్చ మొదలయింది. ఇక్కడ నాదే పైచేయి రానున్న కర్నూలు కార్పొరేషన్ ఎన్నికలు కేంద్రంగా అధికార పార్టీలో రాజకీయం జరుగుతోంది. వాస్తవానికి ఇప్పటికీ కార్పొరేషన్ మేయర్ పీఠం ఏ వర్గానికి కేటాయిస్తారనే విషయంలో స్పష్టత రాలేదు. గతంలో ఉన్న రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకారం బీసీ మహిళకు అవకాశం ఉంది. అయితే.. మారిన జనాభా, వార్డుల నేపథ్యంలో ఎవరికి పీఠం దక్కుతుందనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. మొత్తంగా బీసీ జనరల్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరికొద్ది మంది అధికార పార్టీ నేతలు ఓసీ జనరల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దీనిపై ఇప్పటికే బీసీ సంఘాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో బీసీలకే కేటాయించే అవకాశం కనిపిస్తోంది. దీని ఆధారంగా ఎన్నికల ముందు నుంచి అధికార పార్టీలో ఉండి.. తాజాగా పెద్దల సీటు సంపాదించిన నేత వెనుక నడుస్తున్న బీసీ నేతకు తాజాగా పార్టీలో చేరిన నేత గాలం వేసినట్టు సమాచారం. కార్పొరేషన్లో పైచేయి తనదేనని.. సీట్ల కేటాయింపులోనూ తన మాటే చెల్లుబాటు అవుతుందనే ప్రచారం ఆయన చేసుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. తన వర్గంలో ఉంటే మేయర్ అభ్యర్థిగా ప్రకటించడంతో పాటు గెలిపించుకుంటానని కూడా భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఆయన కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో తనదే పైచేయి అనే సంకేతాలను పంపే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అయితే, రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎక్కడకు దారితీస్తాయోననే చర్చ అధికార పార్టీలో మొదలయింది. -
నిబంధనలు తూచ్
రాజకీయ సిఫార్సుల మేరకే ఉద్యోగుల బదిలీలు ఎమ్మెల్యేల మాటే నెగ్గింది వంత పాడిన ముఖ్యమంత్రి సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘వెబ్ కౌన్సెలింగ్.. నిబంధనల మేరకు ఉద్యోగుల బదిలీలు’ అంటూ సర్కారు పలికిన పలుకులు మాటల వరకే అని తేలిపోయింది. నిబంధనల్ని తోసిరాజనడం.. అధికార పార్టీ ఎమ్మెల్యేల మాట చెల్లుబాటు కావడంతో ఉద్యోగుల బదిలీలన్నీ పక్క పక్క మండలాలకు, పక్క గ్రామాలకే పరిమితం అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ నిబంధనల ప్రకారమే బదిలీలు చేయాలని ఆదేశించారు. సాయంత్రానికి కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేల మాట వినండని పరోక్షంగా హితబోధ చేయడంతో ఉద్యోగుల బదిలీలు ప్రహసనంగా జరిగిపోయాయి. ఆన్లైన్ ద్వారానే బదిలీలు ఉంటాయని ప్రకటించినా కొందరు ఉద్యోగులు కీలక ప్రాంతాల్లో పోస్టింగ్ల కోసం నేతల చెంతకు పరుగులు తీశారు. ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి తమకు అనుకూలంగా ఉండే వారి కోసం పైరవీలు చేశారు. ఇప్పటివరకు ఉపాధ్యాయులను మాత్రమే కౌన్సెలింగ్ ద్వారా బదిలీ చేస్తుండగా.. అన్ని శాఖల్లోని ఉద్యోగులకు ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కౌన్సెలింగ్ విధానం వల్ల ఎటువంటి అక్రమాలకు తావు ఉండదని అందరూ భావించారు. ఈ నిబంధనలతో ఉద్యోగుల్లో కొందరు తమకు ఎక్కడ పోస్టింగ్ వస్తుందో అని హడలిపోయారు. వెంటనే ఎమ్మెల్యేలను ఆశ్రయించారు. దీంతో కథ మారిపోయింది. దీంతో వారు తమకు అనుకూలమైన వారిని తమ నియోజకవర్గంలోనే ఉండేలా చక్రం తిప్పారు. నిబంధనలు గాలికి.. వాస్తవంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇప్పటివరకూ ఏజెన్సీలో పనిచేయని ఉద్యోగుల్ని గుర్తించి వారిని అక్కడకు పంపించాలి. ఏజెన్సీ ఏరియాలో పనిచేసిన వారిని అర్బన్ ప్రాంతాలకు తీసుకురావాల్సి ఉంది. జిల్లాలో ఈ నిబంధనలను కాదని బదిలీలు జరిగాయి. ఉద్యోగ సంఘాల్లో సభ్యులుగా ఉన్న కొందరు.. సంఘ కార్యవర్గ పదవిలో ఉన్నట్టు చెప్పుకుని వారు ప్రస్తుతం ఉంటున్న స్థానాల నుంచి కదల లేదు. దివ్యాంగులకు మొండిచేయి దివ్యాంగులకు బదిలీల నుంచి మినహాయించాలనే నిబంధన ఉన్నా దానిని కూడా పక్కనపెట్టి ఇష్టం వచ్చిన రీతిలో బదిలీ ప్రక్రియ నిర్వహించారు. ఖజానా శాఖలో ఒక అంధ ఉద్యోగిని నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేయడంపై తీవ్ర దుమారం రేగింది. సర్వే శాఖలోనూ ఒక అంధ ఉద్యోగిని బదిలీ చేయడంపై సాక్షాత్తు ఏలూరు ఎమ్మెల్యే కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయితే పెద్దగా పలుకుబడి, ఆదాయం రాని విభాగాల్లో మాత్రం బదిలీలు యథాతథంగా జరిగిపోయాయి. రెవెన్యూ విభాగంలో ఆదాయం వచ్చే ప్రాంతాల్లో పోస్టింగ్ల కోసం భారీగా చెల్లింపులకు కూడా సిద్ధమైనట్టు ఆరోపణలు వచ్చాయి. వీఆర్వోలు, ఆర్ఐలు చక్రం తిప్పడంతో వారిని దూర ప్రాంతాలకు బదిలీ చేయకుండా అక్కడికక్కడే ఉద్యోగాలు కట్టబెట్టారు. దుగ్గిరాల వీఆర్వోను కిలోమీటరు దూరం కూడా లేని శనివారపుపేటలో నియమించారు. వట్లూరు వీఆర్వోను సైతం కిలోమీటరు దూరంలో ఉన్న సత్రంపాడులో నియమించారు. సాఫ్ట్వేర్ పనిచేయలేదు రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన బదిలీల సాఫ్ట్వేర్ పనిచేయలేదు. దీంతో వెబ్ కౌన్సెలింగ్ బదిలీలు కాస్తా సాధారణ బదిలీలుగా మారాయి. జిల్లాస్థాయిలో ప్రారంభించిన వెబ్ బదిలీల ప్రక్రియ కొంత ఫలితాన్నిచ్చినా చివరకు రాజకీయ బదిలీలుగా మారడంతో ఆ ప్రక్రియ వల్ల ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. -
ఉద్యాన శాఖలో భారీ అవినీతి
► అవినీతి ‘పందిరి’ ► ‘పందిరి పంటల’ నిధులు పక్కదారి ► గుట్టు చప్పుడు కాకుండా కాజేస్తున్న ► అధికార పార్టీ నేతలు.. సహకరిస్తున్న అధికారులు ఉద్యాన శాఖఆధ్వర్యంలో అమలవుతున్న ‘పందిరి పంటలు’ పథకం అవినీతికి కేరాఫ్గా మారింది. పంటలేదు.. పందిరి లేదు.. భూమి అసలే లేదు. అయినా బినామీల ఖాతాల్లో ప్రతినెలా రూ.లక్షలు జమఅవుతోంది. ఇలా జమ అయిన మొత్తాన్ని అధికార పార్టీ నాయకులు, అధికారులు కలిసి పంచుకుంటున్నారు. అంతిమంగా అర్హులైన రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న బీడు భూమిధర్మవరం మండలం దర్శినమల గ్రామానికిచెందిన చంద్ర మోహన్ అనే రైతుది. ఇందులో పందిళ్లు వేసి, తీగజాతి పంటలైన బీర, కాకర సాగు చేస్తున్నట్లు ఉద్యానశాఖకు దరఖాస్తు చేశాడు. అధికారులు ఏమాత్రమూ పరిశీలన చేయకుండానే ఉద్యాన శాఖ ఖాతా (నం :0098561007907) నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ ఏడాది మార్చి తొమ్మిదిన సదరు రైతు ఎస్బీఐ ఖాతా(నం:20316867772)కు రూ. 2,25,778 జమ చేశారు. ఇక్కడున్నది ద్రాక్ష తోట. కానీ ఉద్యానశాఖ అధికారుల లెక్కల ప్రకారం కుళ్లాయప్ప అనే రైతు ఇక్కడ కాకర పంట సాగు చేస్తున్నాడు. ఇందుకు గాను ఆయన ఎస్బీఐ ఖాతా (నంబర్ 20250313712)కు గతేడాది నవంబర్ ఏడున రూ. 3,38,667, నవంబర్ 19వ తేదీన రూ. 1,00,000 జమ చేశారు. వాస్తవానికి ఈ భూమి దర్శినమలకు చెందిన హరి అనే రైతు పేరిట ఉంది. కుళ్లాయప్ప అనే రైతు పేరిట నకిలీ ఖాతాను సృష్టించి, ప్రభుత్వ నిధులను కాజేశారు. ఇలా ఒక్క దర్శినమల గ్రామంలోనే దాదాపు 20 మంది పేరిట రూ.40 లక్షల దాకా స్వాహా చేశారు. ధర్మవరం : రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) కింద ఉద్యాన శాఖ అమలు చేస్తున్న ‘పందిరి పంటలు’ పథకం అధికార పార్టీ నేతలు, అధికారులకు కాసుల పంట పండిస్తోంది. ఈ పథకం కింద పందిళ్లు వేసి, తీగజాతి పంటలు (కాకర, బీర లాంటివి) సాగు చేస్తే ఎకరానికి రూ. 1,10,000 చొప్పున గరిష్టంగా రెండెకరాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. పొలంలో రాతి బండలు పూడ్చి, వాటిపైన ఇనుప తీగలు అల్లాలి. పంటలు సాగు చేసేందుకు బోరు, మోటార్, డ్రిప్ అన్నీ అమర్చి ఉండాలి. ఇందుకోసం మంజూరైన మొత్తాన్ని వెనక్కి చెల్లించాల్సిన అవసరం (100 శాతం సబ్సిడీ) ఉండదు. ఈ క్రమంలో ఈ పథకంపై అధికార పార్టీ నాయకులు కన్నేశారు. వారికి ఏళ్ల తరబడి ఇక్కడే పాతుకుపోయిన అధికారులు సహకరించారు. బినామీ రైతుల పేర్లతో ఖాతాలు తెరిచి..స్వాహా పర్వానికి తెరలేపారు. కీలక భూమిక పోషించిన ఓ ఉన్నతాధికారి ఈ స్వాహా పర్వంలో ఉద్యానశాఖ డివిజన్ స్థాయి అధికారి కీలక భూమిక పోషించినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. తాడిమర్రి, బత్తలపల్లి, ముదిగుబ్బ, ధర్మవరం రూరల్ మండలాల్లో కొందరు బ్రోకర్లను ఏర్పాటు చేసుకుని, ఈ స్వాహా పర్వానికి తెరలేపినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న అధికార పార్టీ నాయకులు కొందరు సదరు అధికారిని నిలదీయడంతో వారికి రూ. 5 లక్షల మేర ముట్టజెప్పినట్లు సమాచారం. ఆ తరువాత కూడా సదరు నాయకులు, అధికారి కలిసి భారీ స్థాయిలో బోగస్ రైతులను సృష్టించి.. నిధులు స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ ముఖ్య నాయకుడు సదరు అధికారిని తీవ్ర స్థాయిలో మందలించారు. దీంతో ఇక్కడి నుంచి బదిలీ చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సదరు అధికారి వ్యవహారంపై ఇప్పటికే ఉద్యాన శాఖలోని ఉన్నతాధికారులకు కూడా బాధిత రైతులు ఫిర్యాదు చేశారు. అన్ని అర్హతలు ఉన్నా తమను మాత్రం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని, స్వాహారాయుళ్లకు మాత్రం వెంటనే పనులు చేసిపెడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. -
కవ్వింపు... తమ్ముళ్ల బరితె గింపు!
వైఎస్సార్ సీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేక కవ్వింపు చర్యలు అమరావతి మండలం నరుకుళ్లపాడులో ఇరు వర్గాల ఘర్షణ మొత్తం 12 మందికి గాయాలు..ఆస్పత్రుల్లో చికిత్స వైఎస్సార్సీపీ కార్యకర్తలను పరామర్శించిన కావటి గుంటూరు : అధికార పార్టీ కార్యకర్తలు అడ్డగోలు రాజకీయాలకు తెరతీశారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. అమరావతి సదావర్తి సత్రం భూముల కుంభకోణంపై వైఎస్సార్ సీపీ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ ఆదివారం జరిపిన పర్యటన విజయవంతమైంది. దీన్ని జీర్ణించుకోలేని తెలుగు తమ్ముళ్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో సోమవారం అమరావతి మండలం నరుకుళ్లపాడులో వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. మొత్తం 12 మంది గాయపడగా, వారిలో ఆరుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ఆరుగురు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. అమరావతిలోని సదావర్తి సత్రం భూముల కుంభకోణంపై ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీ అమరావతిలో పర్యటించింది. ఈ క్రమంలో పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ శ్రేణులు ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని తెలుగు తమ్ముళ్లు అమరావతిలో నిజనిర్ధారణ కమిటీని అడ్డుకుని ఉద్రిక్త వాతావరణం సృష్టించే ప్రయత్నం చేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పూర్తి సంయమనం పాటించిన క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని టీడీపీ కార్యకర్తలను చెల్లాచెదురు చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కమిటీకి ఘనస్వాగతం పలకడంతో పాటు పర్యటనను విజయవంతం చేశారు. దీంతో టీడీపీ గ్రామస్థాయి నేతల్లో ఆక్రోశం మొదలైంది. ఈ క్రమంలో అమరావతి మండలం నరుకుళ్లపాడు ఎస్సీ కాలనీలో టీడీపీ, వైఎస్సార్ సీపీ వర్గాల మధ్య జరిగిన పరస్పర దాడిలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. టీడీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడి రెచ్చగొట్టి తొలుత వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. దీంతో కార్యకర్తలు మేకల విజయ్, మేకల బుల్లెబ్బాయి, మేకల సురేష్, మేకల భారతి, మేకల రాంబాబు, రాణిలపై దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. వీరు కూడా వారిని ప్రతిఘటించిన క్రమంలో ఎదురు దాడి చేయటంతో ఆ వర్గంలో కూడా కొందరికి గాయాలయ్యాయి. అమరావతి సీఐ మురళీకృష్ణ ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కఠినంగా శిక్షించాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడి గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని భంగపరుస్తున్నారని పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్నాయుడు మండి పడ్డారు. సోమవారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పార్టీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన విజయవంతమైందనే అక్కసుతో గ్రామంలో కవ్వింపు చర్యలకు పాల్పడి తమ పార్టీ కార్యకర్తలపై దాడిచేశారని, టీడీపీ ప్రభుత్వం గ్రామాల్లో చిచ్చుపెడుతూ పబ్బం గడుపుతోందని మండి పడ్డారు. దీనిపై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. -
మీడియా స్వేచ్ఛను హరిస్తున్న ప్రభుత్వం
సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై జర్నలిస్టు సంఘాల ఆగ్రహం కర్నూలు (సిటీ): మీడియా స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వం హరిస్తోందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.అంబన్న, ఎం.రామ్మోహన్, ఏపీయూడబ్ల్యూఎఫ్ జిల్లా అధ్యక్షుడు కేబీ శ్రీనివాసులు ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు మీడియా పనిచేస్తుందన్నారు. తమకు అనుకూలంగా పనిచేయడం లేదనే కారణంతో మీడియాపై అధికార పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం తగదన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతున్న మీడియాను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకే ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు అధికారపార్టీ పాల్పడుతోందన్నారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. సాక్షిటీవీ ప్రసారాలను పునరుద్ధరించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా జరల్నిస్టు సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. -
అంతర్యుద్ధం
► అధికార పార్టీలో ఆ నలుగురు ఎమ్మెల్యేలదే హవా ► అన్ని నియోజకవర్గాల్లో సమాంతర వ్యవస్థ ► క్లబ్బులు, అక్రమ మైనింగ్, భూ ఆక్రమణలు ► పోలీస్ శాఖపై ఓ సీనియర్ ఎమ్మెల్యే పెత్తనం ► చిన‘బాబు’ అండతో దందాలు, దౌర్జన్యాలు ► గుర్రుమంటున్న మిగిలిన ఎమ్మెల్యేలు, మంత్రులు అంతటా ఆ నలుగురే... ఎక్కడ విన్నా వారి పేరే... ఏ పంచాయితీ అయినా వారే...జిల్లాలో మంత్రులు, ముఖ్యనేతల కంటే వారి హవానే ఎక్కువ... దందాలు...దౌర్జన్యాలు..పేకాటక్లబ్బులు... కోడిపందేలు..అక్రమ మైనింగ్...ఇసుక తవ్వకాలు.. ఉన్నతాధికారుల బదిలీలు... ఏవైనా సరే...వారి కనుసన్నలలోనే సాగాలి... జిల్లాలోని పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే, డెల్టాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, రాజధాని ప్రాంతానికి చెందిన మరో ఎమ్మెల్యే ఆగడాలపై అధికార పార్టీ నేతల్లో సీరియస్గా చర్చ సాగుతోంది. చిన‘బాబు’ అండతోనే ఆగడాలకు అంతులేకుండా పోతోందని పలువురు టీడీపీ నేతలు అంటున్నారు. - సాక్షి, గుంటూరు సాక్షి, గుంటూరు : జిల్లాలో మొదటి నుంచీ చిన‘బాబు’ వర్గంగా పేరొందిన ఆ నలుగురు ఎమ్మెల్యేల హవా తట్టుకోలేక మంత్రులు, ముఖ్యనేతలు, మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు తీవ్రంగా మదనపడుతున్నారు. తమకు తెలియకుండానే అనేక పనులు నేరుగా వారే చేసుకుంటున్నారని వాపోతున్నారు. అధికారుల అండదండలతోనే ఆ ఎమ్మెల్యేలు తమ పనులు చక్కబెట్టుకుంటున్నారని అంటున్నారు. ఇలాయితే ఇక తామెం దుకని ప్రశ్నిస్తున్నారు. వారికి ఏ విధం గా సహకరిస్తున్నారంటూ జిల్లా స్థాయి అధికారులపై కొందరు మంత్రులు, ఎంపీలు, నేతలు విరుచుకుపడిన సం దర్భాలు అనేకం ఉన్నాయి. జిల్లాలో అనేక ముఖ్య నామినేటెడ్ పదవులు సైతం భర్తీ చేయకపోవడానికి నేతల మధ్య అంతర్గత విభేదాలే ప్రధాన కా రణంగా చెబుతున్నారు. వాటిని సైతం చిన‘బాబు’ ద్వారా భర్తీ చేయించేం దుకు ఆ వర్గం ఎమ్మెల్యేలు ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం. నియోజకవర్గాలపై ఆధిపత్యం.... ఆ నలుగురు అన్ని నియోజకవర్గాలపై ఆధిపత్యం చెలాయిస్తూ సమాంతర వ్యవస్థ నడుపుతున్నారు. పేకాట క్లబ్బులు, కోడి పందేలు, అక్రమ మైనింగ్, ఇసుక దందాలు, భూ ఆక్రమణలు ఇలా అన్ని వ్యవహారాల్లోనూ తలదూరుస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగంసైతం వీరు చెప్పినట్లుగా చేసేస్తారు.. జిల్లా స్థాయి అధికారులను బదిలీ చేయించాలన్నా, వారికి నచ్చినవారికి పోస్టింగ్లు ఇప్పించాలన్నా చిటికెలో పని. మంత్రులను సైతం లెక్కచేయకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని సొంత పార్టీనేతలే గుసగుసలాడుతున్నారు. పోలీసుశాఖపై పెత్తనం..... ఆ నలుగురిలో ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రి పదవి ఆశించి భంగపడిన వారే. చివరకు తమకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ చిన‘బాబు’ను కోరడంతో ఆయన తన ఆశీస్సులు అందజేశారని అంటున్నారు. దీంతో జిల్లా పోలీసు శాఖలో ఓ సీనియర్ ఎమ్మెల్యే పెత్తనం బాగా కొనసాగుతోంది. ఇందుకు కారణం పోలీసు ఉన్నతాధికారులకు చిన‘బాబు’తో చెప్పించుకోవడమేనని తెలుస్తోంది. జిల్లాలోని ఏ నియోజకవర్గంలో సీఐ పోస్టింగ్ పడాలన్నా ఆయన్ను కలిస్తే పనవుతుందనే విషయం బహిరంగమైంది. దీంతో అధికార పార్టీకి చెందిన మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యనేతల వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. రాజధాని పరిధిలో ఉన్న ఓ ఎమ్మెల్యే జిల్లాలో ఉన్న అసైన్డ్ భూములు, లిటిగేషన్ భూముల జాబితాను సేకరించి భారీ స్థాయిలో వాటిని కాజేసిన వైనంపైనా అధికార పక్ష సభ్యులు పెదవి విరుస్తున్నారు. డెల్టా ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే కృష్ణానది పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వుతూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. -
నీదా..నాదా!
జెడ్పీ పీఠం ► టీడీపీలో మరో వివాదం ► తెరపైకి జెడ్పీ చైర్మన్ పదవి ఒప్పందం ► నేతలను కలుస్తున్న వైస్ చైర్పర్సన్ పుష్పావతి ► అటువంటి ఒప్పందం లేదంటున్న జెడ్పీ చైర్మన్ ► తాను ఖర్చు చేసిన మొత్తం వాపస్ ఇస్తే ఇస్తానని కొత్త మెలిక సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలో మరో లొల్లి తెరమీదకు వచ్చింది. రాజ్యసభ సీటు విషయంలో రేగిన రగడ కాస్తా చల్లారకముందే... జెడ్పీ చైర్మన్ పీఠంపై చర్చ మొదలయ్యింది. మొదట్లో చేసుకున్న ఒప్పందం మేరకు తనకు రెండేళ్ల తర్వాత జెడ్పీ చైర్మన్ పీఠాన్ని అప్పగించాలని నందవరం జెడ్పీటీసీ సభ్యురాలు, జెడ్పీ వైస్ చైర్మన్ పుష్పావతి కోరుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆమె టీడీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డిని కలిసి విన్నవించినట్టు తెలిసింది. త్వరలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో పాటు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్లను కూడా కలవనున్నట్లు సమాచారం. మరోవైపు అటువంటి ఒప్పందమేదీ లేదని ప్రస్తుత జెడ్పీ చైర్మన్ రాజశేఖర్ తన అనుచరుల వద్ద వాదిస్తున్నట్టు తెలిసింది. అయితే... తాను ఖర్చు పెట్టిన డబ్బులను ఇస్తే పదవిని ఇప్పుడే వదులుకుంటానని రాజశేఖర్ అంటున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మొదట్లో కుదిరిన ఒప్పందం మేరకు ఖర్చు పెట్టిన మొత్తం ఇవ్వాలన్న నిబంధనేదీ లేదని వైస్ చైర్మన్ వర్గీయులు వాదిస్తున్నారు. మొత్తం మీద అధికార పార్టీలో మరో పదవి లొల్లి షురూ అయ్యిందన్నమాట. జూలై 7 డెడ్లైన్ జిల్లాలో అధికార పార్టీకి జిల్లా పరిషత్ ఎన్నికల్లో మెజార్టీ రాలేదు. అయినప్పటికీ పదవులు, డబ్బు ఆశచూపి చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. అందులో భాగంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ పార్టీ మారి ఏకంగా చైర్మన్ పీఠాన్ని రాజశేఖర్ దక్కించుకున్నారు. దీనిపై అప్పట్లోనే అధికార పార్టీలో అసంతృప్తి రాజుకుంది. నేరుగా పార్టీ టికెట్లపై గెలిచిన తమను కాదని... వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి పదవి ఎలా ఇస్తారని వాదించారు. అయితే, ప్రస్తుతం కేవలం రెండేళ్ల కాలపరిమితికి మాత్రమే ఆయన జెడ్పీ చైర్మన్గా ఉంటారని పార్టీ నేతలు బుజ్జగించారు. రెండేళ్ల తర్వాత మిగిలిన మూడేళ్ల కాలానికి చైర్మన్ పీఠాన్ని అప్పగిస్తామని వైస్ చైర్మన్గా ఉన్న పుష్పావతికి పార్టీ నేతలు అప్పట్లో హామీనిచ్చారని ఈమె వర్గీయులు పేర్కొంటున్నారు. ఈ ఒప్పందం మేరకు జూలై 7తో రెండేళ్ల కాలపరిమితి ముగియనున్నందున... జూలై 8 నుంచి తనకు పీఠం అప్పగించాలని ఆమె కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నేతలందరినీ కలుస్తున్నట్టు తెలిసింది. -
చచ్చాక ఇస్తారా?
► కొత్త పింఛన్ల మంజూరులో జాప్యం ► ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినవి 10,725 ► ఎదురు చూస్తున్న 52 వేల మంది దరఖాస్తుదారులు ఇతని పేరు గంగయ్య. లేపాక్షి మండలం కుర్లపల్లి. వయసు 70 ఏళ్లకు పైబడి ఉంది. పింఛను కోసం గత ఏడాది జనవరి 12న మొదటి సారిగా అధికారులకు అర్జీ (నంబర్ 129878) ఇచ్చాడు. అప్పటి నుంచి ఇస్తూనే ఉన్నాడు. ముసలి వయసులో ఏ పనీ చేయలేని తనకు కనీసం పింఛ నైనా వస్తే ఆసరాగా ఉంటుందని గంగయ్య చెబుతున్నాడు. ఈమె పేరు పెద్దక్క. పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు. ఒక క న్ను పూర్తిగా కనిపించదు. వికలాంగ సర్టిఫికెట్ ఉంటే పింఛన్ ఇస్తామని అధికారులు చెప్పారు. పెద్దాస్పత్రికి వెళ్లి సదరం క్యాంపులో 40 శాతం వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ తెచ్చుకుంది. ఏడాదిన్నర గడిచింది. పింఛన్ గురించి అడిగితే నీ పేరు జాబితాలో ఉందని చెబుతున్నారే తప్ప ఇవ్వడం లేదు. అనంతపురం అర్బన్ :పేదల సంక్షేమమే ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు రాష్ట్ర మంత్రులు, అధికారపార్టీ ప్రజాప్రతినిధులు వేదికలెక్కి ఊదరగొడుతున్నారు. వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా సామాజిక భద్రత పథకం కింద అందించే పింఛన్లు పేదల దరికి చేరడం లేదు. వీటి కోసంవృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. గతంలో అర్హులైన వారందరికీ పింఛన్లు అందేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. జన్మభూమి కమిటీ సిఫారసు చేసినవారికే దక్కుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన పింఛన్లు జిల్లాలో 10,725 ఉన్నాయి. ఇక దరఖాస్తు చేసుకుని ఆన్లైన్లో అప్లోడ్ జరిగినవి 52 వేల వరకు ఉన్నాయి. వీరంతా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఉన్నవి తొలగించారు.. : ీడీపీ అధికారం చేపట్టిన తరువాత పింఛన్ మొత్తాన్ని రూ.వెయ్యి చేసింది. అప్పటి వరకు జిల్లాలో 4.12 లక్షల మంది పింఛన్ అందుకునే వారు. మొత్తాన్ని పెంచిన తర్వాత ప్రభుత్వం విచారణ చేయించి 1.30 లక్షల పింఛన్లను తొలగించింది. దీంతో లబ్ధిదారుల సంఖ్య 2.82 లక్షలకు తగ్గిపోయింది. ఆ తరువాత విడతలవారీగా 1.05 లక్షల పింఛన్లు మంజూరు చేసింది. ప్రస్తుతం జిల్లాలో మొత్తమ్మీద 3,87,654 మంది పింఛన్ అందుకుంటున్నారు. జన్మభూమి కమిటీల నిర్వాకం జిల్లాలో జన్మభూమి కమిటీల నిర్వాకంతో వేలాది మంది పేదలు పింఛన్కు దూరమయ్యారు. బత్తలపల్లి మండల కేంద్రంలోనే దాదాపు 200 మంది వృద్ధులు, వికలాంగుల పింఛన్లు రద్దయ్యాయి. వీరంతా మూడు నెలల క్రితం కలెక్టరేట్కు తరలివచ్చి జాయింట్ కలెక్టర్-2 సయ్యద్ ఖాజా మొిహ ద్దీన్ వద్ద గోడు వెల్లబోసుకున్నారు. కొత్త పింఛన్ల ఊసేలేదు గత ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా కొత్తగా పింఛన్లు మంజూరయ్యేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎవరైనా మరణి ంచినా, వరుసగా కొన్ని నెలలు తీసుకోకున్నా.. అలాంటి వారి పేర్లను తొలగిస్తామని, వారి స్థానంలో కొత్తవాటికి మంజూరు చేస్తామని ఒక అధికారి చెప్పారు. -
దాటవేతకు వెతుకులాట
► సదావర్తి సత్రం భూముల అమ్మకంపై తలోమాట ► రూ.వెయ్యి కోట్ల లూటీపై నేతల్లో ఆందోళన ► ఆత్మరక్షణలో అధికార పార్టీ సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: అమరలింగేశ్వరునికీ శఠగోపం పెట్టిన తీరుపై అధికార పార్టీలో అంతర్మధనం మొదలైంది. గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి చెందిన చెన్నై నగర సమీపంలోని 83.11 ఎకరాల విక్రయంలోని లోపభూయిష్ట విధానాలను, దేవాదాయ శాఖలో సంబంధిత ఫైలు కదిలిని వైనాన్ని ‘సాక్షి’ సాక్ష్యాలతో సహా వెలుగులోకి తేవడంతో టీడీపీ ముఖ్య నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ పార్టీ ఎదురుదాడికి ప్రయత్నిస్తోంది. చివరకు ముఖ్యమంత్రి ఆ ఫైళ్లలోని సమాచారం ఎలా బయటకు పొక్కిందని దేవాదాయ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఎవరికి వారు తమ తప్పులను కప్పిపుచ్చుకునే క్రమంలో భాగంగా పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్పై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ టీడీపీ అమరావతి మండల అధ్యక్షుడు కె.కోటేశ్వరరావు పోలీసుస్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ కుమారుడు నిరంజన్ కూడా విజయవాడ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి సదావర్తి భూముల కొనుగోలులో తమ పెద్దల ప్రమేయం లేదని వివరణ ఇచ్చుకున్నారు. చలమలశెట్టి రామానుజయ మరో అడుగు ముందుకేసి ‘ఏం, కాపులు వ్యాపారం చేసుకోకూడదా’? అని ప్రశ్నించడం విడ్డూరం. భూముల వేలంలో అక్రమాలను ‘సాక్షి’ వెలుగులోకి తెస్తే వర్గం వ్యాపారం గురించి చలమలశెట్టి వింత, వితండ వాదాన్ని తీసుకు రావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదావర్తి సత్రం కోసం తమ పూర్వీకులు దానంగా ఇచ్చిన భూమిని అత్యంత తక్కువ ధరకు విక్రయించడం ఏ మాత్రం సరికాదని ఆ సత్రం చైర్మన్, రాజా వంశీయుడైన రాజా వాసిరెడ్డి సుధాస్వరూప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్కూ లేఖ రాయనున్నట్లు ‘సాక్షి’కి తెలిపారు. గత సీఎంలను కోరినా.... సదావర్తి సత్రం భూములను విక్రయించాలని గతంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన కె.రోశయ్య, ఎన్.కిరణ్కుమార్రెడ్డిలను కోరినట్లు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ గతంలోనే ప్రకటించారు. అప్పటి సీఎంలు స్పందించ లేదని, తమ ముఖ్యమంత్రి సహకరించారని తెలిపారు. ఇందుకు అభినందిచాల్సింది పోయి తప్పు పట్టడమేమిటని ప్రశ్నించారు. అప్పటి ముఖ్యమంత్రులకు ఆ భూములపై బహుశా కన్ను పడలేదేమో అన్న వ్యాఖ్యకు ఎమ్మెల్యే కొమ్మాలపాటి నుంచి జవాబు రాలేదు. అమరలింగేశ్వరునికి మోసం చేయడానికి తన వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధపడనని మరోమాటగా కూడా కొమ్మాలపాటి చెప్పారు. చలమలశెట్టి రామానుజయ మాట్లాడుతూ సదావర్తి సత్రం భూముల వ్యవహారంలో ఇంత లోతు అంశాలు దాగి ఉన్నాయనేది తనకు తెలియదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు రుజువైతే కాపు కార్పొరేషన్ పదవికి రాజీనామా చేయడానికి వెనుకాడబోనని రామానుజయ ఇది వరకే స్పష్టం చేశారు. భూముల వేలం ప్రక్రియ లోపభూయిష్టమని అంతటా కోడై కూస్తున్నా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండటం గమనార్హం. ఎలా తప్పించుకోవాలి ? సదావర్తి సత్రం భూములను విక్రయించాలని పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ప్రతిపాదించడం, దీనిపై ముఖ్యమంత్రి పేషీ ఆఘమేఘాలపై అనుకూలత వ్యక్తం చేసి దేవాదాయ, దర్మాదాయ శాఖకు సూచనలు చేయడం, ఆ శాఖ ఉన్నతాధికారులు వేలం నిర్వహించడం అన్నీ పక్కా ప్రణాళికతో జరిగినట్లు సుస్పష్టమవుతోంది. ఈ అంశంపై ఇటీవల తిరుపతిలో జరిగిన మహానాడులో అన్ని ప్రాంతాల ముఖ్య నాయకుల మధ్య తీవ్ర చర్చ జరగడం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వచ్చింది. రాజధాని ప్రాంతంలో ‘భూదందా’కు పెదబాబు, చినబాబుతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య అనుయాయులు కారకులుగా సాక్ష్యాలతో సహా ‘సాక్షి’ ఇది వరకే వెలుగులోకి తెచ్చిన నేపథ్యంలో సదావర్తి సత్రం భూముల విక్రయంలోనూ అధిష్టానం ఇంతకు తెగపడుతుందా అనేది పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఆ దృష్ట్యానే మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘సాక్షి’పై, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై లెక్కకుమిక్కిలి అక్కసు వెళ్లగక్కడం గమనార్హం. ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ‘అభినందన’ పేరిట భారీ వ్యాపారాన్ని పలు ప్రాంతాల్లో విస్తరించారు. ఆ వ్యాపార రహస్యాలన్నీ తెలిసినందునే చెన్నై నగర సమీపంలోని విలువైన సదావర్తి సత్రం భూముల విక్రయంపై దృష్టి సారించి తమ అధినేత చెవిన వేశారని టీడీపీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. రాజధాని అమరావతి ప్రాంతంలో ఎమ్మెల్యేకి చెందిన పలు వెంచర్లకు సంబంధించి లేఅవుట్ అప్రూవల్స్ ఉన్నాయి. తమ వెంచర్లను భూసమీకరణ నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి, ఆయన తనయుడు లోకేష్, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరుల వద్ద పలుసార్లు ప్రాధేయపడినట్లు సమాచారం. తమ వర్గానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల ‘ఆవేదన’ను సీఎం, మంత్రుల దృష్టికి ఎమ్మెల్యేతో సహా పలువురు తీసుకెళ్లారు. పలు వెంచర్లకు పరిష్కారాలు లభించాయి. వీటన్నింటి నేపథ్యంలోనే సదావర్తి సత్రం భూములు కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ కుటుంబ సభ్యులు ముగ్గురికి, వీరితో పాటు మరో ఐదుగురికి తక్కువ ధరకు వేలంలో దక్కాయని తెలుస్తోంది. -
మాట వినని వారిపై వేటు
18 మంది తహసీల్దార్లకు స్థానచలనం అర్ధరాత్రి ఆగమేఘాల మీద బదిలీలు మంత్రి ‘గంటా’ బృందం ఒత్తిళ్లు అనుకూలమైన వారికి పోస్టింగ్లు అధికార పార్టీ నేతలు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతోంది. తమకు అనుకూలంగా లేకపోతే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎవరినైనా మార్చేయడం పరిపాటిగా మారింది. తమ అడుగులకు మడుగులొత్తే అధికారుల కోసం నిస్సిగ్గుగా పైరవీలు సాగిస్తున్నారు. కొన్ని బదిలీల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా జోక్యం చేసుకుంటుండగా.. వారి అనుచరగణం తామేమి తీసిపోమన్నట్టుగా పైరవీలు సాగిస్తున్నారు. ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చి మరీ తమకు అనుకూలంగా ఉండే తహ సీల్దార్లకు కోరుకున్న చోట పోస్టింగ్లు ఇప్పించగలిగారు. విశాఖపట్నం: ఉలుకూ పలుకులేదు, చడీ చప్పుడు లేదు.. ఒక్కసారిగా రికార్డు స్థాయిలో 18 మంది తహసీల్దార్లకు స్థానచలనం జరిగింది. ఇందుకోసం గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి వరకు పైరవీలు సాగాయి. సాధారణంగా ఏటా విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో రెవెన్యూతో సహా వివిధ శాఖల్లో అంతర్గత బదిలీలు జరుగుతుంటాయి. గతేడాది విశాఖ ఆర్డీవోతో సహా జిల్లా స్థాయి అధికారుల బదిలీల్లో మంత్రుల మధ్య జరిగిన ఆధిపత్య పోరు తీవ్ర దుమారాన్నే రేపింది. మళ్లీ ఈ ఏడాది రాజకీయ బదిలీల పర్వం మొదలైంది. తాజాగా జిల్లాలో 18మంది తహసీల్దార్లను బదిలీ చేశారు. వీరిలో ఎక్కువగా మంత్రులతో పాటు స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేల మాట వినడం లేదనే సాకుతోనే బదిలీ వేటుపడినట్టు తెలిసింది. ముఖ్యంగా మంత్రి గంటా శ్రీనివాసరావు సొంత నియోజకవర్గమైన భీమిలి టీడీపీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న పరుచూరి భాస్కరరావు ఒత్తిడి మేరకు విశాఖ రూరల్ (చినగదిలి) తహసీల్దార్ ఎల్.సుధాకర్నాయుడుపై వేటు వేసినట్టు చెబుతున్నారు. ఇటీవల కాలంలో సుధాకర్నాయుడు తమ మాట వినడం లేదనే అక్కసుతో ఆయనను ఎలాగైనా బదిలీ చేయించేందుకు పావులు కదిపారు. అదే సమయంలో అచ్యుతా పురం తహసీల్దార్గా పనిచేస్తున్న ఎం.శంకరరావును రూరల్ మండలానికి తెచ్చు కోవాలన్న పట్టుదలతోనే మంత్రి గంటా ద్వారా జిల్లా ఉన్నతాధికారిపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ అనుకున్నది సాధించుకున్నార ని వినికిడి. భాస్కరరావు ఒత్తిడి మేరకే నాయుడ్ని కదపాల్సి వచ్చిందంటున్నారు. నగరంలో దీర్ఘకాలం పాటు పనిచేస్తున్న అర్బన్ తహసీల్దార్ కేవిఎస్ రవితో పాటు, ఇటీవల ఆవ భూముల ఆక్రమణల విషయంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో అనకాపల్లి తహసీల్దార్ ఎస్.భాస్కరరెడ్డిపై బదిలీ వేటు వేశారు. రవి స్థానంలో రూరల్ తహశీల్దార్ సుధాకర నాయుడ్ని వేయగా.. భాస్కరరెడ్డి స్థానంలో వి.మాడుగుల తహశీల్దార్ పి.కృష్ణమూర్తిని నియమించారు. మంత్రి అయ్యన్న పాత్రుడు ఒత్తిడి మేరకు నర్సీపట్నం తహసీల్దార్గా పనిచేస్తున్న వి.వి.రమణపై వేటు వేశారు. కానీ ఈ స్థానంలో ఎవరినీ నియమించలేదు. అదే విధంగా మిగిలిన తహసీల్దార్ల బదిలీలు కూడా స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకే జరిగినట్టు సమాచారం. నాలుగైదు రోజుల నుంచి ఈ కసరత్తు జరుగుతున్నప్పటికీ ఒత్తిళ్ల నేపథ్యంలో బయటకు పొక్కనీయకుండా రెవెన్యూ వర్గాలు జాగ్రత్త పడ్డారు. మంగళవారం ఉదయమే తుది జాబితా సిద్ధమైన ప్పటికీ అర్ధరాత్రి వరకు రాజకీయ ఒత్తిళ్లు సాగడం వల్లే రాత్రి 11.30 గంటల సమయంలో కలెక్టర్ సంతకం చేసినట్టు చెబుతున్నారు. మళ్లీ ఉదయానికి ఎలాంటి ఒత్తిళ్లు వస్తాయోననే ఆందోళనతో అర్ధరాత్రి ఆఘమేఘాల మీద బదిలీ ఉత్తర్వులు పంపడం.. తెల్లారగానే రిలీవ్ చేయడం అంతా చకచకా సాగిపోయింది. ఇక రెండో విడత బదిలీలు ఈ నెల 9 నుంచి 15 మధ్యలో జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నుంచే చేయాల్సి ఉన్నప్పటికీ 2 నుంచి 8 వరకు నవనిర్మాణ దీక్షా సదస్సులు జరుగనుండడంతో 9 నుంచి బదిలీలు చేపట్టాలని నిర్ణయించారు. శాఖల వారీగా రెండేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారితోపాటు పరిపాలనా సౌలభ్యం పేరిట ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకు బదిలీలు చేపట్టేందుకు రంగం చేస్తున్నారు. -
ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత అధికార పార్టీదే
సీఎల్పీ నేత జానారెడ్డి సాక్షి, హైదరాబాద్: త్యాగా లు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజ ల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న పార్టీదేనని సీఎల్పీ నేత కె. జానారెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నా రు. రాష్ట్ర ప్రజల ఆందోళన, ఆకాంక్షలను గమనించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. చారిత్రాకమైన సోనియా నిర్ణయాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని జానా పేర్కొన్నారు. విద్య, ఉద్యోగాల్లో అవకాశాల పెంపు, సాగు నీరు, వెనకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధి మొదలైనవి సాధించడం ద్వారా సమతౌల్యతతో కూడిన రాష్ట్రాభివృద్ధి జరగాలని జానా ఆకాం క్షించారు. తెలంగాణ సాధన కోసం పోరాడిన వారికి అభినందనలు తెలిపిన జానా... అమరవీరులకు శ్రద్ధాంజలి తెలిపారు. -
పరాకాష్టకు స్మగ్లర్ల వివాదాలు
► పరస్పరం ఫిర్యాదులు ► కొందరికి అధికార పార్టీ నేతల అండ ► వారిని పట్టించుకోని అధికారులు బీవీపాళెం(తడ) : చెన్నై కేంద్రంగా కొందరు ట్రాన్స్పోర్టర్లు సరుకుల ఎగుమతులు, దిగుమతులు చేస్తుంటారు. వారంతా సరుకు పరిస్థితిని బట్టి రవాణా చార్జీలు వసూలు చేస్తారు. ఈ క్రమంలో కొన్ని సరుకులను బిల్లులు లేకుండా రవాణా చేస్తుంటారు. చెన్నైలో కొనుగోలు చేసిన సరుకును ఎలాంటి పన్నులు చెల్లించకుండానే మన రాష్ట్రానికి చేరుస్తున్నారు. ఇదే క్రమంలో ఆంధ్రా వైపు నుంచి కూడా కొన్ని వస్తువులను సరిహద్దులను దాటిస్తున్నారు. ఇందుకు గానూ వ్యాపారుల నుంచి భారీగా వసూలు చేస్తారు. మధ్యలో వాహనాలను అధికారులు పట్టుకోకుండా ఎప్పటికప్పుడు ముడుపులు అందజేస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ట్రాన్స్పోర్టర్ల ముసుగులో కొందరు స్మగ్లర్లు రంగ ప్రవేశం చేశారు. వీరి ద్వారా సరుకుల రవాణా చేస్తే పెట్టుబడి తక్కువగా ఉంటుందని ఎక్కువమంది వ్యాపారులు వారి వైపే మొగ్గుచూపుతున్నారు. ఎక్కువగా నిత్యావసర సరుకులు, సుగంధ ద్రవ్యాలతో పాటు వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు, నిషేదిత గుట్కాలు, పాన్మసాలాలను ట్రాన్స్పోర్టర్ల ముసుగులోని స్మగ్లర్లు యథేచ్ఛగా సరిహద్దులు దాటించేస్తున్నారు. వివాదాలతో రచ్చకెక్కిన వ్యవహారం గతంలో కొద్దిమంది మాత్రమే ఇలా వ్యాపారం సాగించేవారు. ప్రస్తుతం ఇలాంటి వ్యాపారాలు సాగించే వారు బాగా పెరిగిపోయారు. దీంతో పోటీ పెరిగి వ్యాపారులను తమ ట్రాన్స్పోర్ట్ వైపు ఆకర్షించేందుకు స్మగ్లర్లు ఎత్తుగడలు మొదలుపెట్టారు. సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, నెల్లూరు ప్రాంతాలు చెన్నైకి దగ్గరలో ఉండటంతో ఆయా ప్రాంతాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని ఒకరిపై ఒకరు అధికారులకు ఫిర్యాదులు చేస్తూ అవతలి వారి వాహనాలను పట్టించే పనులను మొదలుపెట్టారు. ఇందులోనూ అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉండే రవాణాదారులకు వత్తాసు పలుకుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీ నాయకుల అండతో జీరో దందా వ్యాపారం సాగిస్తున్న రవాణాదారులను ఏ అధికారీ ఎదుర్కొనే పరిస్థితి లేదు. గుట్టుగా సాగిపోతున్న జీరోదందా స్మగ్లర్ల మధ్య వివాదాల నేపథ్యంలో మరోమారు రచ్చకెక్కింది. ఇటీవల ఓ వర్గానికి చెందిన పార్శిల్ లారీని అధికారులు పట్టుకోవడంతో, సంబంధిత వ్యక్తులు చెక్పోస్ట్కు వచ్చి చేసిన హడావుడి చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అధికారులు కూడా స్మగ్లర్లలో ఓ వర్గానికి కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
నేరాలకు కేరాఫ్ తాడేపల్లి.
► వరుస కిడ్నాప్లతో కలకలం ► శ్రీమంతులే టార్గెట్ ► చేసేది..చేయించేది.. సెటిల్ చేసేది.. ► అంతా వారే! తాడేపల్లి రూరల్ : శ్రీమంతులు... విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న పిల్లల తల్లిదండ్రులే టార్గెట్గా తాడేపల్లి ప్రాంతంలో కిడ్నాప్లు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో నేరస్తులు రూటు మార్చి సినీ ఫక్కీలో పక్కాగా ప్లాన్ చేసి, గుట్టు చప్పుడు కాకుండా ‘టార్గెట్’లను కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెట్టి వారి నుంచి లక్షలాది రూపాయలు గుంజుకుంటున్నారు. గత వారంలో వరుసగా తాడేపల్లిలో రెండు కిడ్నాప్లు, ఒక దోపిడీ జరిగాయి. ఇందులో దోపిడీ ఘటన మాత్రమే వెలుగు చూసింది. కిడ్నాప్ విషయాలు మాత్రం బయటకు రాలేదు. కిడ్నాప్ విషయాలు ఆ నోటా ఈ నోటా పోలీసుల చెవినబడ్డాయి. ఈ మేరకు తాడేపల్లి పోలీసులు ఆదివారం సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తాడేపల్లి మునిసిపల్ ప్రాంతంలో నివాసం ఉండే ఓ బిల్డర్ ఇంటికి వెళుతుండగా అతడిని కారులో ఎక్కించుకుని, కిడ్నాప్ చేసి ఏటీఎం కార్డు, కొంత నగదు దోచుకెళ్లారు. మరుసటి రోజు కుంచనపల్లికి చెందిన ఓ శ్రీమంతుడిని కిడ్నాప్ చేశారు. అనంతరం అతడిని తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలలో కారులో తిప్పుతూ చిత్రహింసకు గురి చేశారు. అదే సమయంలో కిడ్నాప్ అయిన వ్యక్తికి కిడ్నాప్ చేయించిన వ్యక్తి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని సమాచారం అడుగుతాడు. కిడ్నాప్ అయిన వ్యక్తి నుంచి విషయాలు తెలుసుకున్నట్టు నటించి, కిడ్నాపర్స్తో ఫోన్లో మాట్లాడి, వారు అడిగిన డబ్బులు ఇస్తానంటూ అతనే ఆ డబ్బు తెస్తాడు. ఆ డబ్బును కిడ్నాపర్లకు అందజేసి, అనంతరం కిడ్నాప్ అయిన వ్యక్తి నుంచి వసూలు చేసుకుంటాడు. నగదు వసూలు ఇలా.. ఇలా జరిగిన కిడ్నాప్లో కుంచనపల్లికి చెందిన ఓ శ్రీమంతుడి వద్ద ఎనిమిది లక్షలు వసూలు చేశారు. సదరు కిడ్నాప్ అయిన వ్యక్తి దగ్గర ఈ నెల 21న రూ. లక్ష, 23న రూ. 3 లక్షలు, 25న రూ. 4.5 లక్షలు వసూలు చేశారు. దీనిలో కూడా కిడ్నాపర్స్తో మాట్లాడినందుకు రూ. 50 వేలు అంటూ అదనంగా నగదు వసూలు చేశాడు. ఈ కిడ్నాప్లు చేస్తున్నది తాడేపల్లికి చెందిన మాజీ నేరస్తుడిగా పోలీసులు గుర్తించినట్టు విశ్వసనీయ సమాచారం. గతంలో ఆ పాత నేరస్తుడు తాడేపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పేకాట, కోడిపందేలు నిర్వహించడంతో ఎవరి ఆర్థిక పరిస్థితి ఏంటనేది తెలిసిన వ్యక్తి. వారిని కిడ్నాప్ చేస్తే ఎంత డబ్బు వసూలు చేయవచ్చు, ప్రాణభయం ఉన్నవారిని మాత్రమే ఎంచుకుని ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పోలీసుల అదుపులో మహానాడు ప్రాంతానికి చెందిన ముగ్గురు కిడ్నాపర్లు ఉన్నట్టు సమాచారం. అసలు సూత్రధారి పరారీ ఉండి, అధికార పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. -
కబ్జాలపాటి
శాతవాహన కళాశాల స్థలం కబ్జాకు వ్యూహం సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి ఎగ్జిబిషన్కు అనుమతి ఫిర్యాదు చేసినా స్పందించని అధికార యంత్రాంగం అధికార పార్టీ పెద్దల ప్రమేయం అమరావతి : విజయవాడ నగరంలో అధికార పార్టీ నేతల కబ్జాలు మితిమీరుతున్నాయి. కంటికి కనిపించిన ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్న అధికార పార్టీ పెద్దలు... ఇప్పుడు ప్రైవేటు స్థలాల పైనా కన్నేశారు. సర్వోత్తమ న్యాయస్థానం ఆదేశాలనూ బేఖాతరు చేస్తూ అధికార పార్టీ నేతలు సాగిస్తున్న కబ్జాల పర్వానికి ‘శాతవాహన కళాశాల’ స్థల వివాదం ప్రత్యక్ష ఉదాహరణ. ప్రభుత్వ పెద్దల అండదండలు పుష్కలంగా ఉండటం, వారికీ కబ్జాలో వాటా ఇస్తుండటంతో.. అధికార పార్టీ నేతల కబ్జాలను చూస్తూ ఊరుకోవాల్సిందేనంటూ అధికార యంత్రాంగానికి హుకుం జారీ చేస్తుండటం గమనార్హం. వివాదం తేలే వరకు శాతవాహన కళాశాల స్థలం విషయంలో యథాతథ స్థితిని (స్టేటస్ కో) కొనసాగించమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం ఆదేశాలను ధిక్కరించి అధికార పార్టీ నాయకులు స్థలాన్ని కబ్జా చేయడానికి ఒక్కో అడుగూ వేస్తూ పోతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. వివాదం తేలే వరకు ఎలాంటి కార్యకలాపాలూ ఆ స్థలంలో నిర్వహించడానికి వీల్లేకపోయినా.. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి శాతవాహన కళాశాల కమిటీ కార్యదర్శి హోదాలో టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ అనుమతి ఇవ్వడం గమనార్హం. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి ఏకపక్షంగా ఎగ్జిబిషన్కు ఎలా అనుమతి ఇస్తారంటూ స్థలం అసలు యజమాని అభ్యంతరం చెప్పినా.. అధికార పార్టీ నేతలు లక్ష్యపెట్టలేదు. దిక్కున్నచోట చెప్పుకోమంటూ బెదిరించారని బెజవాడలో ప్రచారం జరుగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసి న్యాయం చేయండి మహాప్రభో.. అంటూ జిల్లా కలెక్టర్ మొదలు అధికార యంత్రాంగాన్ని వేడుకున్నా... ప్రభుత్వ పెద్దలకు భయపడి అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. ‘ఇప్పుడు ఎగ్జిబిషన్ పెట్టారు.. తర్వాత స్థలాన్ని కబ్జాచేసి పారేస్తారు. సుప్రీంకోర్టు ఆదేశాలకే దిక్కులేకపోతే ఎలా? అధికార యంత్రాంగం ఏమీ చేయలేకపోతే.. ఎవరికి చెప్పుకోవాలి’ అంటూ బాధితులు అధికారుల వద్ద వాపోయినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. వివాదం ఇదీ.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వార్డు-11లో ఉన్న 5.10 ఎకరాల భూమిని దుర్గామల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీకి 1974లో విక్రయించడానికి స్థలం యజమాని బోయపాటి శ్రీనివాస అప్పారావు ‘షరతులతో కూడిన ఒప్పందం’ చేసుకున్నారు. పట్టణ గరిష్ట భూ పరిమితి చట్టం నుంచి తప్పించుకోవడానికి వీలుగా సొసైటీతో ఒప్పందం చేశారు. ఒప్పందం జరిగింది కానీ.. భూమిని సొసైటీకి అప్పజెప్పడం కానీ, విక్రయ రిజిస్ట్రేషన్ కానీ చేయలేదు. భూమిని తమకు అప్పగించేలా ఉత్తర్వులు ఇవ్వమని కోరుతూ 1991లో సొసైటీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. భూమిపై సొసైటీకి హక్కులేదని సివిల్ కోర్టు తీర్పు చెప్పింది. జిల్లా కోర్టు కూడా ఈ తీర్పునే సమర్థించింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన న్యాయపోరాటంలో అప్పారావు గెలిచారు. తాము చెల్లించిన సొమ్ము వడ్డీ సహా చెల్లించమని సొసైటీ చేసిన డిమాండ్కు అప్పారావు సానుకూలంగా స్పందించడంతో.. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరింది. ఈ మేరకు లోక్ అదాలత్ అవార్డు కూడా ఇచ్చింది. సొసైటీకి అప్పారావు రూ.9 లక్షలు చెల్లించారు. ఆలపాటి రాజా ఎంట్రీ... వివాదాస్పద స్థలంపై 2011లో టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ కన్నుపడింది. దీంతో సొసైటీ కార్యదర్శిగా ఉన్న కామేశ్వరరావు రాజీనామా చేయడం, తర్వాత రోజే సొసైటీ కార్యవర్గ సభ్యుడిగా, కార్యదర్శిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎన్నికవడం చకచకా జరిగిపోయాయి. సొసైటీ కార్యదర్శి మార్పు చెల్లదంటూ మాజీ కార్యదర్శి జగపతిరావు హైకోర్టును ఆశ్రయించడంతో.. ఆయన వాదనతో కోర్టు ఏకీభవించింది. సొసైటీ కార్యదర్శిగా ఆలపాటి రాజా నియామకం/నామినేషన్ చెల్లదని తీర్పు చెప్పింది. సొసైటీ కార్యదర్శిగా కొనసాగడానికి అవకాశం లేకపోవడంతో.. అదే సొసైటీ నడుపుతున్న శాతవాహన కళాశాల కార్యదర్శి/కరెస్పాండెంట్గా ఆయన తెరపైకి వచ్చారు. ఏదో రకంగా సొసైటీని గుప్పెట్లో పెట్టుకొని స్థలాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం. భూమి యజమాని, సొసైటీ మధ్య రాజీ కుదరలేదని, ఫోర్జరీ సంతకాలు చేశారంటూ సొసైటీ కార్యదర్శి కామేశ్వరరావు మళ్లీ కేసు దాఖలు చేశారు. ఈ కేసు వేయడం వెనక ఆలపాటి రాజా ఉన్నారని సమాచారం. ఈ కేసును హైకోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ భూమి యజమాని అప్పారావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భూమి విషయంలో తుది తీర్పు వచ్చే వరకు స్టేటస్ కో కొనసాగించాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవో రద్దయిపోయింది దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వహిస్తున్న శాతవాహన కళాశాలను కార్యదర్శి, కరస్పాండెంట్గా టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను ఎంపిక చేయడం నిబంధనలకు విరుద్ధమని, సొసైటీ సభ్యుల్లోనూ తీవ్ర విభేదాలున్నాయని, సొసైటీ కార్యవర్గాన్ని రద్దు చేసి స్పెషల్ ఆఫీసర్ను నియమించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా వివాదాలు ముగిసే వరకు ప్రత్యేక అధికారికి సొసైటీ బాధ్యతలను స్పెషల్ ఆఫీసర్కు అప్పగించాలని అడ్వకేట్ జనరల్తో పాటు ఉన్నత విద్యా శాఖ న్యాయవాది కూడా ప్రభుత్వానికి సూచించారు. ఈ నేపథ్యంలో శాతవాహన కళాశాల యాజమాన్యాన్ని రద్దు చేసి, బాధ్యతను కలెక్టర్కు అప్పగిస్తూ ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి సునీత దావ్రా 2015 మార్చి 17న ఉత్తర్వులు (జీవో-84) జారీ చేశారు. ఏం జరిగిందో.. ఏమో.. సరిగ్గా 10 రోజులకు జీవో-84ను పక్కన (అబేయన్స్లో) పెడుతూ మరో ఉత్తర్వును (జీవో-97) జారీ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ తన పలుకుబడితో ఉత్తర్వులను రద్దు చేయించారని ఉన్నత విద్యాశాఖలో ప్రచారం జరుగుతోంది. ఎగ్జిబిషన్కు అనుమతి సుప్రీంకోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ సొసైటీ, కళాశాల యాజమాన్యం వివాదాస్పద స్థలాన్ని ఎగ్జిబిషన్ నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చింది. స్థలం తమ చేతుల్లో ఉందని ఆలపాటి రాజేంద్రప్రసాద్ చెప్పుకోవడానికి, ఆ మేరకు ఆధారాలు సంపాదించుకోవడానికి వీలుగా అధికార బలంలో ఎగ్జిబిషన్ నిర్వహణకు స్థలాన్ని ఇచ్చారని, సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడాన్ని ప్రశ్నిస్తూ అప్పారావు ప్రభుత్వ యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేసినా.. ప్రభుత్వ పెద్దలకు భయపడి అధికారులు స్పందించడం లేదు. -
స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఓపెన్ బ్యాలెట్
► వైఎస్సార్ సీపీ గెలుస్తుందేమోననే భయంతో ► అధికార దుర్వినియోగానికి పాల్పడిన మేయర్ ► అధికార పార్టీ ఒత్తిడితో సీరియల్ నంబర్లతో ► బ్యాలెట్లు తయారు చేయించిన కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ నేతలతో పాటు అధికారులు సైతం అడ్డదారులు తొక్కారు. సీక్రెట్గా జరగాల్సిన ఎన్నికలను ఓపెన్గా జరిపించారు. ఈ అక్రమాలను ప్రశ్నించడంతో కమిషనర్ సైతం వైఎస్సార్సీపీ కార్పొటర్లతో దురుసుగా మాట్లాడారు. కమిషనర్ వైఖరిపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల బలప్రయోగంతో బయటకు పంపారు. రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన ఈ ఎన్నికలను ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు బహిష్కరించారు. సాక్షి ప్రతినిధి - నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అధికార పార్టీ, అధికారులు అడుగడుగునా అధికార దుర్వినియో గానికి పాల్పడ్డారు. పాలకవర్గంలో కీలకమైన స్టాండింగ్ కమిటీకి శని వారం ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. మొత్తం ఐదు స్థానాలకు గాను మేయర్ అజీజ్, ఆనం వివేకానందరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఆదాల ప్రభాకర్రెడ్డి వర్గాల నుంచి 13 మంది పోటీ నామినేషన్లు దాఖలు చేశారు. మేయర్ అజీజ్ మీద తీవ్రస్థాయిలో వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో ఊహించని విధంగా వైఎస్సార్ సీపీ నుంచి ఇద్దరు కొర్పొరేటర్లు పోటీకి దిగారు. ఎన్నిక లాంఛనమే అనుకున్న మేయర్, టీడీపీ పెద్దలకు ఈ పరిణామం షాక్ ఇచ్చింది. తన మీద కార్పొరేటర్లలోను, టీడీపీ పెద్దల్లోను నెలకొన్న ఆగ్రహం ఈ ఎన్నికలు కొంప ముంచుతుతాయని మేయర్ భయపడ్డారు. వైఎస్సార్సీపీ ఒక్క స్థానం గెలిచినా కార్పొరేషన్లో తాను ముఖం చూపుకోలేననే భయంతో మేయర్ అజీజ్ తన అసంతృప్తి వర్గాన్ని శాంతింప చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నించారు. తన శక్తి చాలకపోవడంతో జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిని రంగంలోకి దించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో నాలుగు రోజుల క్రితం రవిచంద్ర, సోమిరెడ్డి పార్టీ కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన 8 మందితో నామినేషన్లు ఉపసంహరింప చేశారు. కార్పొరేటర్లు ఎవరైనా పార్టీని ధిక్కరించి వైఎస్సార్సీపీకి ఓటు వేస్తే పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. అయినా కార్పొరేటర్లు టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారని, తమకు 36 మంది ఉన్నా రెండు స్థానాలు ఓడిపోతామని మేయర్కు కంటి మీద కునుకు లేకుండా పోయింది. వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ రూప్కుమార్యాదవ్ తమ సభ్యులు ఇద్దరూ గెలుస్తారని ధీమాగా చెప్పారు. వైఎస్సార్సీపీ నుంచి ఒక్క ఓటు చీలితే కార్పొరేషన్లో అడుగు కూడా పెట్టనని, మా అభ్యర్థి గెలిస్తే మేయర్ రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. దీంతో అధికార పార్టీలో మరింత ఉలికిపాటు మొదలైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఓ హోటల్లో పార్టీ కార్పొరేటర్లకు అజీజ్ విందు ఏర్పాటు చేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు ఓట్లు వేయొద్దని ప్రాధేయపడ్డారు. అయినా అనుమానమే కార్పొరేటర్ల మీద సామ, దాన, బేధ, దండోపాయాలు ప్రయోగించినా కొందరు తనకు వ్యతిరేకంగానే ఓటు వేస్తారని మేయర్ అజీజ్ ఆందోళన. ఎవరు ఎవరికి ఓటు వేశారో తెలుసుకునేలా పోలింగ్ నిర్వహించాలని అధికారుల మీద తీవ్ర ఒత్తిడి తెచ్చారు. కార్పొరేషన్ అధికారులు చట్టంలోని లొసుగులను అధికార పార్టీకి అనుకూలంగా మార్చే వ్యూహం అమలు చేశారు. బ్యాలెట్ మీద దాని కౌంటర్ ఫాయిల్ మీద సీరియల్ నంబర్లు ముద్రించారు. క్రాస్ఓటింగ్ చేస్తే తెలిసిపోతుంద ని మేయర్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. మేయర్ మీద ఆగ్రహం ఉన్నా కార్పొరేటర్లు అయిష్టంగానే ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓపెన్ బ్యాలెట్ పై వైఎస్సార్సీసీ కార్పొరేటర్ల ఆందోళనతో ఉద్రిక్తత శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన స్టాండిగ్ కమిటీ ఎన్నిక కోసం కమిషనర్ ఏర్పాటు చేయించిన బ్యాలెట్ పేపర్లు ఓపెన్ బ్యాలెట్ తీరును వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ రూప్కుమార్తో పాటు పార్టీ కార్పొరేటర్లంతా తీవ్రంగా వ్యతిరేకించి కమిషనర్ను నిలదీశారు. ఎన్నికలను నిలిపి వేయాలంటూ ఆందోళన చేపట్టారు. ఎన్నికల కేంద్రంలో కింద బైఠాయించి నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లను పోలీసుల బలప్రయోగంతో బయటకు పంపించేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఎన్నిక నిర్వహించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు బహిష్కరించారు. -
స్వేచ్ఛకు సంకెళ్లు
వైఎస్సార్సీపీ ఫ్లోర్లీడర్ పోలుబోయిన రూప్కుమార్యాదవ్ నెల్లూరు సిటీ : ఓటమి భయంతోనే అధికార పార్టీ స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తూ బ్యాలెట్పై సీరియల్ నంబర్లు ముద్రించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వైఎస్సార్సీపీ ఫ్లోర్లీడర్ పోలుబోయిన రూప్కుమార్యాదవ్ విమర్శించారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీకి 36 మంది సభ్యులు ఉండగా, వైఎస్సార్సీపీకి 17 మంది ఉన్నారన్నారు. టీడీపీ గెలుపొందేందుకు అవసరమైన ఓట్లు ఉన్నా.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలను ప్రోత్సహిస్తే అధికారులు త్వరలో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇంత చిన్న ఎన్నికకు సీసీ కెమెరాలు, 144 సెక్షన్ విధించడం ఏమిటని ప్రశ్నించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, పార్టీ విప్ బొబ్బల శ్రీనివాసులుయాదవ్, కార్పొరేటర్ ఊటుకూరు మాధవయ్య తదితర కార్పొరేటర్లు పాల్గొన్నారు. 35 ఓట్లు పోలింగ్.. ఒక కార్పొరేటర్కు 34 ఓట్లే! స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన సభ్యులు కిన్నెర ప్రసాద్, రాజానాయుడు, దాసరి రాజేష్, షేక్ వహిద, అంచూరు జానకి గెలుపొందారు. మొత్తం ఓట్లు 54 ఉండగా, వైఎస్సార్సీపీ నుంచి 17 మంది కార్పొరేటర్లు ఓటింగ్ను బహిష్కరించారు. టీడీపీకి చెందిన బొల్లినేని శ్రీవిద్య అందుబాటులో లేరు. సీపీఎం కార్పొరేటర్ పద్మజ గైర్హాజరయ్యారు. అయితే టీడీపీ నుంచి పోటీ చేసిన ఐదుగురులో నలుగురికి 35 ఓట్లు పోలవగా, దొడ్డపనేని రాజానాయుడుకు మాత్రం 34 ఓట్లు పోలయ్యాయి. అయితే రాజానాయుడికి ఓటు వేయని కార్పొరేటర్ ఎవరనే దానిపై అధికార పార్టీలో చర్చనీయాంశమైంది. నగర మేయర్ అజీజ్, టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిలు ఎన్నికల్లో విజయం సాధించిన వారికి అభినందనలు తెలిపారు. -
సుందరయ్య స్ఫూర్తిగా సమస్యలపై పోరాటం
► సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుల పిలుపు ► పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి పూలమాలలు కర్నూలు సిటీ : పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తిగా సమస్యలపై ఉద్యమాలు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.షడ్రక్, జిల్లా కార్యదర్శి ప్రభాకర్రెడ్డి పిలుపునిచ్చారు. పుచ్చలపల్లి సుందరయ్య 31వ వర్ధంతి సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యం లో గురువారం ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్లు ఆర్పిం చారు. పార్టీ కార్యకర్తలందరూ సుందరయ్య చరిత్రను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాల్జేస్తున్నాయన్నారు. ఒక పార్టీ తరుఫున గెలిచిన వారు సొంత ప్రయోజనాల కోసం అధికార పార్టీలోకి మారుతుండడం ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయడమేనన్నారు. పార్టీ కార్యకర్తలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నా రు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, రాజశేఖర్, నగర కార్యదర్శి గౌస్ దేశాయ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ,ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.నిర్మల, అలివేలమ్మ, అరుణ, సుజా త, సీఐటీయూ నగర నాయకులు రాముడు, అంజిబాబు పాల్గొన్నారు. -
రూ. వందల కోట్లు పెట్టి 17 మంది ఎమ్మెల్యేలను కొన్నారు
♦ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అనైతిక చర్య ఇది ♦ నైతిక బాధ్యత ఉంటే ఫిరాయింపుదారులు రాజీనామా చేయాలి ♦ లేదంటే స్పీకర్ అనర్హత వేటు వేయాలి ♦ వాజ్పేయ్ ఒక్క ఎంపీని తీసుకుంటే అధికారం ఉండేది ♦ లోక్సభలో మేకపాటి ఆవేదనపూరిత ప్రసంగం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ రూ.వందల కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని, ఈ వ్యవహారంపై ఫిర్యాదుచేసినా అధికార పార్టీకే చెందిన స్పీకర్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని వైఎస్సార్సీపీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. సోమవారం లోక్సభలో కేంద్ర పాలనలో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో జరిగిన చర్చలో ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి మాట్లాడారు. ‘‘మేం ఈ బడ్జెట్కు సిన్సియర్గా మద్దతు పలుకుతున్నాం. కానీ ఒక పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు మరో పార్టీకి ఫిరాయించడాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది చాలా అనైతికమైన పని, దురదృష్టకరమైన చర్య. దీనిని మనం సరిచేయాల్సి ఉంది. లేదంటే ఇదొక పరిహాసంగా మారుతుంది. ఇదే పార్లమెంటులో మనం చేసుకున్న చట్టాలను మనమే నాశనం చేసుకుంటే ఎలా? ఆంధ్రప్రదేశ్లో 175 మంది సభ్యులు ఉండే సభలో 108 మంది సభ్యులతో ప్రభుత్వం స్థిరంగా ఉంది. మా ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వ సుస్థిరత పట్ల భయపడాల్సిన పనేమీ లేదు. కానీ మా పార్టీ నుంచి ఎమ్మెల్యేలను ఒకరొకరిగా ప్రతిరోజు, దినం తప్పించి దినం లాక్కుంటున్నారు. వందల కోట్లు చెల్లించి ఇప్పటివరకు 17 మంది ఎమ్మెల్యేలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొనుగోలు జరిపారు’’ అని ఆవేదన పూరితంగా ప్రసంగించారు. టీడీపీ ఎంపీల ఆందోళన.. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలు ఇది సరికాదంటూ ఆందోళనకు దిగగా స్పీకర్ ఈ ఆందోళన విషయాన్ని, మేకపాటి రాజమోహన్రెడ్డి అభియోగం మోపిన నేత పేరు రికార్డులకు వెళ్లవని ప్రకటించారు. టీడీపీ నేతల ఆందోళనకు ప్రతిస్పందించిన మేకపాటి... ‘‘నేను చెప్పింది పూర్తి వాస్తవం. నేనెన్నడూ అబద్ధం చెప్పలేదు. వాళ్లు భారీగా సొమ్ములు చెల్లించి మా ఎమ్మెల్యేలు 17 మందిని కొనుగోలు చేశారు. ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇది చాలా అనైతికం. వాళ్లకు నైతిక బాధ్యత ఉంటే రాజీనామా చేయాలి. లేదంటే గౌరవ స్పీకర్ వారిపై అనర్హత వేటు వేయాలి..’’ అని డిమాండ్ చేశారు. వాజ్పేయిని ఆదర్శంగా తీసుకోవాలి.. ఉత్తరాఖండ్లో స్పీకర్ అధికార పార్టీకి చెందిన వారైనప్పటికీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారని మేకపాటి చెప్పారు. ‘‘కానీ ఆంధ్రప్రదేశ్లో ఫిరాయింపుదారులపై మేం ఫిర్యాదులు చేసినప్పటికీ స్పీకర్ చర్య తీసుకోవడం లేదు. ఈ విషయంలో మనకు వాజ్పేయి గొప్ప ఉదాహరణగా నిలుస్తారు. ఆయన అధికారంలో ఉండాలనుకుంటే, తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని తలిస్తే, ఇతర పార్టీలకు చెందిన సభ్యులను తీసుకుని ఉండేవారు.మధ్యంతర ఎన్నికలు రాకుండా ఉండేవి. కానీ ఆయన అలా చేయలేదు. ఈ గొప్ప ఉదాహరణను మనం అనుసరించాలి’’ అని చెప్పారు. ‘‘అందుకే ఆయన భారతరత్న అయ్యారు’’ అని స్పీకర్ వ్యాఖ్యానించారు. అనంతరం మేకపాటి మాట్లాడుతూ... ‘‘అవును మేడమ్. ఆయన గొప్ప వ్యక్తి. ఆయనను ఆరాధించాల్సిన అవసరం ఉంది. మనం చేసుకున్న ఫిరాయింపు నిరోధక చట్టాన్ని సరిచేసుకోని పక్షంలో దానివల్ల ఉపయోగం లేకుండా పోతుంది. ఒక పార్టీ టికెట్పై ఎన్నికై మరో పార్టీకి మారిన 3 నెలల్లో ఆ ఫిరాయింపుదారుడిపై అనర్హత వేటు పడాలి. మనం ఫిరాయింపు నిరోధక బిల్లును సరిచేసుకోవాలి..’’ అని విజ్ఞప్తి చేశారు. -
గిరిజనులను అవమానించడమే
► కిడారి టీడీపీలో చేరికపై ఎమ్మెల్యే బూడి వ్యాఖ్య ► ఎన్ని ప్రలోభాలు పెట్టినా పార్టీని వీడేదిలేదని పునరుద్ఘాటన ► ప్రతికార్యకర్తా సైనికుడిలా పనిచేయాలని పిలుపు ► 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీదే విజయం మాడుగుల రూరల్: వైఎస్సార్ సీపీ పార్టీ గుర్తుపై గెలిచిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు టీడీపీలో చేరడం గిరిజనుల మనోభావాలు దెబ్బతీయడమేనని మాడుగుల శాసనసభ్యుడు బూడి ముత్యాలనాయుడు అన్నారు. రాజీనామా చేసి తిరిగి గెలవాలని సవాల్ చేశారు. స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం జరిగిన మండల పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారపార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా తాను పార్టీని వీడబోనని ఆయన పునరుద్ఘాటించారు. పార్టీ నేత జగన్మెహన్రెడ్డి ఎంతో నమ్మకంతో పార్టీ బీ ఫారం ఇచ్చారని, నియోజకవర్గ ప్రజలు విశ్వాసంతో గెలిపించారని ఆయన అన్నారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయబోనని స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికల్లో మనదే అధికారం ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తివంచనలేకుండా కృషి చేస్తానని బూడి తెలిపారు. రాష్ర్టంలో పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీ కార్యకర్తలు అధైర్యపడవద్దన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతికార్యకర్తా సైనికుడిలా పనిచేయాలని పిలుపిచ్చారు. 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఓడిపోయిన వ్యక్తితో శంకుస్థాపనలా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్యెల్యేను కాదని ఓడిపోయిన అధికార పార్టీ నాయకుడు రామానాయుడు నియోజకర్గంలో ప్రొటోకాల్ నిబంధనలు ఉల్లంఘించి శంకుస్థాపనలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలు తెలుసుకొని తనకు నేరుగా తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు. త్వరలో మాడుగులలో కార్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పారు. సమావేశానికి పార్టీ మండల అధ్యక్షుడు తాళ్లపురెడ్డి రాజారాం అధ్యక్షత వహించారు. పార్టీ నాయకులు పెదబాబు, కన్నారావు, అప్పలనాయుడు, కృష్ణమూర్తి, పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యం అపహాస్యం
► వైఎస్ఆర్ కాంగ్రెస్ ఐటీ విభాగం ఆగ్రహం ► వైఎస్.విజయమ్మ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు బెంగళూరు(బనశంకరి): ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్న అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఐటీ విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం బెంగళూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఐటీ విభాగం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ పుట్టిన రోజు కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రానిక్సిటీలోని దొడ్డతోగూరులో శేషారూడ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ విభాగం జనరల్ సెక్రటరీలు, శ్యామ్ సుందర్రెడ్డి కలకడ, వీరభద్రరావు మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అవినీతి డబ్బుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ పార్టీని నిర్వీర్యం చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు వీడినంత మాత్రాన పార్టీ బలహీనపడుతుందని అనుకోవడం పొరపాటని, పార్టీకి కార్యక ర్తలు, ప్రజలు అండగా ఉన్నారని తెలిపారు. అధికార పార్టీలోకి వెళ్తున్న ఎమ్మెల్యేలచే తక్షణం రాజీనామా చేయించి దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా నగర ఐటీ విభాగం సభ్యులు వెంకటసుబ్బయ్య, హరిబాబు పేనం, కైరా శ్రీనివాసులు, కిరణ్కుమార్రెడ్డి, ప్రకాష్రెడ్డి, బయప్పరెడ్డి, కుమార స్వామిరెడ్డి, అక్షయ్ టీ.కరణం, సురేంద్రరెడ్డి, ఓబుళరెడ్డి, నానిరెడ్డి, మునాఫ్, సబారీబేగం, దిల్షాద్ బేగం, రాజశేఖర్రెడ్డి, చంద్ర నారాయణ్రెడ్డి, జాన్సన్రాజు, నరేశ్, ప్రవీణ్, జనార్దన్రెడ్డి, రాహుల్రెడ్డి, సాయి దొడ్డతోగూరు తాలూకా పంచాయతీ అధ్యక్షుడు జీ.శంకర్రెడ్డి, ఆలయ కార్యదర్శి పురుషోత్తమరెడ్డి, రాజప్ప తదితరులు పాల్గొన్నారు. సేవ్డెమెక్రసీ పేరుతో ఈ నెల 30న శనివారం సాయంత్రం 6 గంటలకు మారతహళ్లిలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. మరిన్ని వివరాల కోసం వెంకట్... 9945207998 , సురేంద్ర-9880549875, హరి-8722803924, కుమార్ -8892469526 నెంబర్లు సంప్రదించగలరు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు హాజరుకావాలని వారు కోరారు. -
బడాబాబు భూదాహం.. బడుగులపై దాష్టీకం
► మార్కెట్ స్థలం స్వాధీనానికి బలప్రయోగం ► రూ.15 కోట్ల ఆ స్థలంపై ప్రజాప్రతినిధి కన్ను ► అడ్డుకున్నవారి ఈడ్చివేత.. లాఠీల ప్రయోగం ► ముగ్గురి ఆత్మహత్యాయత్నం.. అయినా కరుణించని అధికారులు ► రోడ్డున పడ్డ 400 మంది రైతులు, చిరువ్యాపారులు ► విశాఖ నగరంలో ప్రభుత్వ దౌర్జన్యకాండ ► బలవంతంగా ఖాళీ చేయించిన వైనం ► 400మంది రైతుల జీవనోపాధికి విఘాతం ముందస్తు నోటీసులు లేవు.. సూచనప్రాయ సమాచారమూ లేదు..శనివారం ఉదయం..వ్యాపారాలు జరుగుతున్న వేళ..ఉరుము లేని పిడుగులా ఒక్కసారిగా పోలీసు బలగాలు.. వారి వెంట జీవీఎంసీ అధికారులుఅక్కడ వాలారు..వచ్చీ రావడంతోనే బడుగులపైదాష్టీకానికి దిగారు..షాపులు ఖాళీ చేయమనిహుకుం జారీ చేశారు..షాపుల్లో ఉన్న కూరగాయలను రోడ్డుపైకి విసిరేశారు.. అడ్డుకున్న వారిని ఈడ్చిపారేశారు.. లాఠీలు ప్రయోగించారు..ముగ్గురు ఆత్మహత్యాయత్నానికిపాల్పడినా ఏమాత్రం వెనుకంజ వేయలేదు..వారిని కూడా ఎత్తుకెళ్లి పోలీసు వ్యాన్లలో పడేశారు.. అరెస్టు చేసి.. స్టేషన్లకు తరలించారు..ఆనక.. పొక్లెయిన్లతో షాపులను పడగొట్టారు.. మార్కెట్ను నేలమట్టం చేశారు. బడుగు రైతులు.. చిరువ్యాపారుల జీవ న చిత్రాన్ని ఛిద్రం చేశారు.. ఎందుకింత దాష్టీకం?.. ఎవరి కోసం ఈ దౌర్జన్యకాండ??..అని ప్రశ్నిస్తే.. దీని వెనుక పెద్దల భూదాహం కనిపిస్తుంది.. రూ.15 కోట్ల మార్కెట్స్థలంకాజేయాలన్న కుట్ర కనిపిస్తుంది.. అదేలాగో మీరే చదవండి.. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నగరంలోని 29వ వార్డు పరిధి కొబ్బరితోట ప్రాంతంలోని రామకృష్ణా జంక్షన్లో దాదాపు అర ఎకరా విస్తీర్ణంలో ఎన్నో ఏళ్లుగా కూరగాయల మార్కెట్ నిర్వహిస్తున్నారు. సుమారు 400 మంది కూరగాయల రైతులు, చిరు వ్యాపారులకు ఈ మార్కెట్టే జీవనాధారం. కానీ శనివారం హఠాత్తుగా జీవీఎంసీ, పోలీసులు ఆ మార్కెట్ స్థలంపై పడ్డారు. రైతులు, చిరువ్యాపారులను ఇష్టం వచ్చినట్లు ఈడ్చివేశారు. ముగ్గురు ఆత్మహత్యకు యత్నించినా పట్టించుకోకపోగా బలవంతంగా పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం దుకాణాలను నేలమట్టంచేశారు. శనివారం సాయంత్రానికి మార్కెట్ను చదును చేసేశారు. తెరముందు జీవీఎంసీ అధికారులు, పోలీసులు ఈ దమనకాండకు పాల్పడినా.. తెరవెనుక టీడీపీ పెద్దల కబ్జాకాండ వ్యూహం ఉంది. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ స్వయంగా ఈ క్రైం కథ నడిపించారు. జీవీఎంసీ కార్యాలయంలో కూర్చొని మార్కెట్ను ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయించాల్సిందేనని కమిషనర్ ప్రవీణ్కుమార్పై ఒత్తిడి పెంచారు. బడుగులపై ఉక్కుపాదం మోపి పని జరిపించుకున్నారు. ప్రజాప్రతినిధికి కట్టబెట్టే కుట్ర కొబ్బరితోట ప్రాంతంలోని రామకృష్ణా జంక్షన్లో సర్వే నంబర్ 129తో ఉన్న దాదాపు అర ఎకరా స్థలాన్ని జీవీఎంసీ కొన్నేళ్ల క్రితమే కూరగాయల రైతులకు కేటాయించింది. జీవీఎంసీ అక్కడ రోడ్లు, మౌలిక సౌకర్యాలు కూడా కల్పించింది. కానీ 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ పెద్దల కన్ను ఆ స్థలంపై పడింది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం దాని విలువ దాదాపు రూ.15 కోట్లు. ప్రధానంగా స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఆ స్థలాన్ని తమపరం చేసుకోవాలని ఎత్తుగడ వేశారు. కానీ రైతులు, చిరువ్యాపారులు తమకు జీవనోపాధి కల్పిస్తున్న ఆ స్థలాన్ని వదులుకునేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇష్టపడరని ఆయనకు తెలుసు. దాంతో కోర్టు తీర్పులు ఉటంకిస్తూ ఖాళీ చేయించాలనుకున్నారు. అది కూడా సాధ్యపడదని తెలుసుకున్నారు. ఇక దండోపాయంతోనే రైతులను ఖాళీ చేయించడమొక్కటే మార్గమన్న నిర్ణయానికి వచ్చారు. అందుకు జీవీఎంసీ అధికారులు, పోలీసుల సహకారం తీసుకున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా శనివారం హఠాత్తుగా జీవీఎంసీ, పోలీసు అధికారులను వెంటబెట్టుకు వచ్చి షాపులపై పడ్డారు. రైతులు, చిరువ్యాపారులను విచక్షణారహితంగా ఈడ్చివేసి.. లాఠీలు ప్రయోగించి మరీ మార్కెట్స్థలాన్ని ఖాళీ చేయించారు. ఎమ్మెల్యే వాసుపల్లి హల్చల్ మార్కెట్ స్థలాన్ని బలవంతంగా ఖాళీ చేయించేందుకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ స్వయంగా రంగంలోకి దిగడం గమనార్హం. ప్రజాప్రతినిధిగా బాధితుల పక్షాన నిలవాల్సిన ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. రైతులు, చిరువ్యాపారుల ఆందోళనతో మార్కెట్లో ఓ వైపు పరిస్థితి ఉద్రిక్తంగా ఉండగా ఎమ్మెల్యే వాసుపల్లి జీవీఎంసీ కార్యాలయానికి వెళ్లి కమిషనర్ ప్రవీణ్కుమార్ను కలిశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శనివారమే మార్కెట్ స్థలాన్ని ఖాళీ చేయించాలని స్పష్టంగా చెప్పారు. లేకపోతే రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకుంటారని కూడా సందేహం వ్యక్తం చేశారు. అధికారులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దగ్గరుండి మరీ ఒత్తిడి తెచ్చారు. మార్కెట్ స్థలాన్ని ఖాళీ చేయించారు. దాదాపు 400 మంది రైతులు, చిరువ్యాపారులకు జీవనోపాధి కల్పించిన మార్కెట్ను నేలమట్టం చేయించారు. ఖాళీ చేయించడం అయిపోయింది.. ఆ స్థలాన్ని కొల్లగొట్టడమే మిగిలింది.. అధికార పార్టీ పెద్దలు తలచుకుంటే బడుగుల బతుకులు ఏపాటి చెప్పండి... ప్రభుత్వ పెద్దల భూదాహానికి ప్రభుత్వ భూములు కరగాల్సిందే మరి!. -
ప్రజల మెప్పు కోసం రైతుతో అబద్ధాలు
► జిల్లాపై కపట ప్రేమ చూపుతున్న సీఎం ► వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ► శంకరనారాయణ, తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ధ్వజం అనంతపురం : జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి సభలో చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండి రైతు రామకృష్ణారెడ్డితో అబద్ధాలు చెప్పించారు. ఆయన పొలాన్ని తాము పరిశీలించాం.. ఏడాదికి పై నుంచే బీడు పెట్టాడని వెఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ధ్వజమెత్తారు.శుక్రవారం ప్రకాష్రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించారని వారు విమర్శించారు. కష్ట కాలంలో ఉన్న రైతులను పట్టించుకోకుండా ప్రజాధనం లూటీకి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పోటీ పడుతున్నారని ఆరోపించారు. మంత్రి పరిటాల సునీత కుటుంబం రెణ్నెళ్లుగా తమ వ్యక్తిగత కార్యక్రమాలు, ఆర్భాటాల కోసమే ప్రచారం చేసుకున్నారన్నారు తప్ప, ప్రజల గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. తీవ్ర కరువుతో ఉపాధి లేక బెంగళూరు, హైదరాబాద్, మద్రాసు నగరాలకు లక్షలాది మంది వలసలు వెళ్తున్నారన్నారు. తాగునీటికి ప్రజలు అల్లాడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం, కోట్లాది రూపాయలు వెచ్చించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వాటాకు సంబంధించిన హంద్రీ-నీవా నీటిని కుప్పం బ్రాంచ్ కాలువ సృష్టించి తీసుకెళ్తుంటే జిల్లాలోని ప్రజాప్రతినిధులు నోరు మెదకపోవడం అన్యాయమన్నారు. దీనిపై వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం, ఇతర రైతు, ప్రజా సంఘాలు నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా కనీసం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. జిల్లాలోని ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిస్తామని జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చెప్పకపోవడం దగాకోరుతనానికి నిదర్శనమన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి హంద్రీ-నీవా జలాలను జీడిపల్లి వరకు తీసుకొచ్చారన్నారు. హంద్రీ-నీవా ఆయకట్టు సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మూడేళ్లూ ఇలాగే కొనసాగితే టీడీపీ భూస్థాపితం కాక తప్పదన్నారు. సమావేశంలో కనగానపల్లి జెడ్పీటీసీ బిల్లే ఈశ్వరయ్య, మరూరు సింగిల్ విండో ఉపాధ్యక్షుడు దండు రామాంజనేయులు, డెరైక్టర్ తలారి శేఖర్, పార్టీ రాప్తాడు మండల కన్వీనర్ బోయ రామాంజనేయులు, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు. -
ప్రతిపక్షాలు లేకుండానే ‘పుర’ బడ్జెట్
► రూ. 2404.13లక్షల బడ్జెట్కు ఆమోదం ► బడ్జెట్ను తిరస్కరించిన ప్రతిపక్షాలు ► ఎస్సీ, ఎస్టీ నిధులు ఖర్చు చేయడం లేదని అధికార పార్టీ సభ్యుడి వాకౌట్ వనపర్తిటౌన్ : పుర ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు తలొగ్గి ఏర్పాటు చేసిన వనపర్తి పుర బడ్జెట్ ప్రతిపక్షాల వాకౌట్కు వేదికయింది. శుక్రవారం పుర చైర్మన్ పలుస రమేష్గౌడ్ అధ్యక్షతన మునిసిపల్ కౌన్సిల్హాల్లో బడ్జెట్ సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభంలోనే బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎన్. జ్యోతి మాట్లాడుతూ బడ్జెట్ తప్పులతడకగా రూపొందించారని, బడ్టెట్ను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఎన్. భువనేశ్వరి మాట్లాడుతూ బడ్జెట్ సమావేశం ఎప్పుడో జరగాల్సి ఉన్న ఇప్పుడు ఏర్పాటు చేయడం సిగ్గుచేటని బడ్జెట్ను ఆమోదించామన్నారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ ఉంగ్లం తిరుమల్ మాట్లాడుతూ అవినీతికి పెద్దపీట వేసేలా బడ్జెట్ ఉందని, వార్షిక బడ్జెట్ను కేవలం ఆరు నెలలకు కుదించి రూపొందించారని ఆరోపించారు. బడ్జెట్లో సమగ్రత లోపించినందున ప్రతిపక్ష సభ్యులమంతా వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. చైర్మన్ రమేష్గౌడ్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా సభ్యులు వాకౌట్ చేశారు. ప్రతిపక్షాల వాకౌట్ను టీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ గట్టుయాదవ్ తీవ్రంగా వ్యతిరేకించారు. అంకెల తప్పును ప్రతిపక్షాలు బడ్జెట్ను తప్పు అనడం సరికాదని హితవు పలికారు. అధికార సభ్యుడి వాకౌట్పై విస్మయం ఎస్సీ, ఎస్టీ సభ్యులకు కేటాయిస్తున్న సబ్ప్లాన్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని అధికార పార్టీకి చెందిన సభ్యుడు వెంకటేష్ సభ నుంచి దళిత ప్రజాప్రతినిధులం వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనను అనుసరించాలనుకున్న సభ్యులు కమలమ్మ. ప్రమీలను మిగతా సభ్యులు వారించారు. వైస్ చైర్మన్ వాకౌట్ వైస్ చైర్మన్ బి.కృష్ణ మాట్లాడుతూ అధికారుల లావాదేవీలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని ఆరోపిస్తున్న తరుణంలో కలుగజేసుకున్న టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గట్టుయాదవ్ మీ పార్టీ వాళ్లు(బీజేపీ) వ్యతిరేకించారు. మీరు వ్యతిరేకిస్తున్నారా.. సమర్థిస్తున్నారా.. అని అడగడంతో ఇద్దరి మధ్య కొద్దిసేపు మాటల రగడ జరిగినా చివరకు వైస్ చైర్మన్ సభ నుంచి వాకౌట్ చేశారు. బడ్జెట్ చదవకుండానే అమోదం అధికార పార్టీ సభ్యుడు వాకిటి శ్రీధర్ బడ్జెట్ ప్రతిని చదవాల్సిన అవసరం లేదని చెప్పడంతో 1/3పైగా మెజార్టీ గల అధికార పార్టీ సభ్యులు బడ్జెట్కు ఏకగ్రీవకంగా అమోదం తెలపడంతో రూ. 2404.13 లక్షల బడ్జెట్ను ఆమోదిస్తున్నట్లు చైర్మన్ రమేష్గౌడ్ ప్రకటించారు. సభ ముగిసిన తర్వాత మినిట్స్లో వ్యతిరేకించిన సభ్యుల పేర్లు రాయాలని ప్రతిపక్షాలు అడగడంతో కమిషనర్ రాత పూర్వకంగా ఇవ్వాలని కోరారు. ఈ సమయంలో సభ్యులకు, కమిషనర్కు మధ్య నిబంధనలపై చిన్నపాటిగా మాటమాట పెరిగినప్పటికీ చివరకు ప్రతిపక్ష సభ్యులు దగ్గరుండి మినిట్స్లో పేర్లు నమోదు చేయించారు. -
ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
► అంతా వీఐపీలే ► పత్తి గోదాంలో అడ్డా.. ► కేసు కాకుండా నేతల విఫలయత్నం ► కోర్టుకు వెళ్లొచ్చిన కొద్దిగంటలకే అరెస్టు వేములవాడ రూరల్ : మండలంలోని తిప్పాపురం గ్రామంలోని ఒక పత్తి గోదాంలో పేకాట ఆడుతున్న ఆరుగురుని సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. శ్రీలక్ష్మీబాలాజీ ట్రేడింగ్ కంపెనీకి చెందిన పత్తి గోదాంలో మంగళవారం కొందరు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో అక్కడకు చేరుకున్నారు. పేకాట ఆడుతున్న వేములవాడ పట్టణానికి చెందిన కట్కం శ్రీనివాస్, తాటికొండ రాంబాబు, కట్కం శంకరయ్య, బుస్స కైలాసం, మోటూరి శ్రీనివాస్లతోపాటు ఫాజుల్నగర్ గ్రామానికి చెందిన బిక్కుమల్ల రమేశ్ను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.39,600 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. వీరంతా వివిధ వ్యాపారాలు నిర్వహిస్తూ, ప్రముఖులుగా చలామణి అవుతున్నవారే. విషయం తెలుసుకున్న పట్టణంలోని ప్రముఖ వ్యాపారులు పోలీస్స్టేషన్కు వచ్చారు. కేసు కాకుండా విడిపించాలని తీవ్రప్రయత్నాలు చేశారు. సీఐ శ్రీనివాస్ పైరవీలకు అవకాశం ఇవ్వకుండా కేసు నమోదు చేశారు. నాయకుల వత్తాసు పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిన వారికి పట్టణానికి చెం దిన ప్రముఖ నాయకుడు, మాజీ ప్రజాప్రతినిధి వత్తాసు పలికాడు. అధికార పార్టీలో ఉన్న ఆ నాయకుడు పేకాటరాయుళ్లకు సమీప బంధువు కావడం, వారితో పలు వ్యాపార లావాదేవీలు ఉండడంతో కేసు నుంచి తప్పించాలని ప్రయత్నించాడు. పోలీస్స్టేషన్కు వచ్చిన ఆయన పోలీసులతో చేసిన సంధి ప్రయత్నం విఫలం కావడంతో ‘కేసు నమోదు చేశారు కనుక రాత్రికి ఇంటికి పంపించాలని’ ఒత్తిడి తీసుకువచ్చాడు. పత్తి మిల్లే అడ్డాగా.. రోజంతా పత్తి వ్యాపారం నిర్వహిస్తున్న ఈ మిల్లు ప్రముఖ నాయకులకు పేకాట అడ్డాగా కూడా మారినట్లు ఆరోపణ లు వస్తున్నాయి. వేములవాడ, సిరిసిల్ల ప్రధాన రోడ్డు పక్కన గల శ్రీలక్ష్మీబాలాజీ ట్రేడింగ్ కంపెనీకి చెందిన పత్తిగోదాం పేకాట రాయుళ్లకు అడ్డాగా మారింది. ఉదయం వ్యాపారం పత్తి వ్యాపారం... సాయంత్రం వేళ ఇందులో పేకాట క్లబ్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పేకాటలో పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోరుున ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం. కోర్టుకు వెళ్లొచ్చిన కొన్ని గంటలకే...? పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిన వారిలో కొందరు మంగళవారం పేకాట కేసులోనే కోర్టుకు వెళ్లొచ్చారు. కొద్ది గంటలకే మళ్లీ పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కడం విశే షం. కోర్టుకు వెళ్లి, అక్కడి నుంచి నేరుగా మళ్లీ పత్తి గోదాం కు చేరుకుని పేకాట ప్రారంభించినట్లు సమాచారం. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసి అరెస్టు చేయడం పట్టణంలో చర్చనీయాంశమైంది. ఈ పేకాటరాయుళ్లలో తండ్రీకొడుకులు సైతం ఉండటం కొసమెరుపు. -
అ(ఉ)పకారంపై కొనసాగుతున్న విచారణ
పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఉపకార వేతనాలు మంజూరు చేస్తే.. లేని పేర్లు సృష్టించి అధికారులు కాజేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న వీరిని హాస్టల్ విద్యార్థులుగా చూపించి లక్షల రూపాలు మింగేశారు. ఆలస్యంగానైనా ఇది కాస్త వెలుగులోకి రావడంతో అవినీతి నిరోధక శాఖాధికారులు నిజాలు వెలికి తీసేందుకు రంగంలోకి దిగారు. రెండు రోజులుగా దీని సంగతి, వెనుకనున్న పెద్దల సంగతి తేల్చేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇంతలోనే తప్పులు చేసిన అధికారులు తప్పించుకునేందుకు అధికార పార్టీ నేతలను ఆశ్రరుుంచారని సమాచారం. మరి ఏసీబీ ఎంత వరకు నిజాలను వెలికితీసి అధికారుల భరతం పడుతుందో వేచి చూడాల్సిందే! శ్రీకాకుళం టౌన్/పాతబస్టాండ్ : ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను హాస్టల్ విద్యార్థులుగా చూపిస్తూ ఏటా రూ.లక్షలు కాజేస్తున్న వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖాధికారులు రోజంతా విచారణ కొనసాగించారు. ఏసీబీ డీఎస్పీ రంగరాజు నేతృత్వంలో ఓ బృందం విచారణలో రెండో రోజూ కలెక్టరేట్ చుట్టూ తిరిగింది. కలెక్టర్ పి.లక్ష్మీనృసింహంను మంగళవారం నేరుగా కలసిన ఏసీబీ డీఎస్పీ రంగరాజు సుదీర్ఘంగా చర్చించారు. జాయింట్ కలెక్టర్ -2 పి.రజనీకాంతరావు చాంబరులో ఇన్చార్జి బీసీ సంక్షేమ శాఖాధికారిగా ఉన్న ధనుంజరావును విచారించారు. ఆయన వద్ద రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. స్కాలర్షిప్పుల విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న బాలరాజును ఉదయం 10నుంచి రాత్రివరకు ఏసీబీ కార్యాలయంలో ఉంచి విచారించారు. 305 మంది విద్యార్థుల సొమ్ము మళ్లింపు... జిల్లాలో 2013-14 విద్యా సంవత్సరంలో బీసీ విద్యార్థులు గిరిజన సంక్షేమ శాఖ వసతిగృహంలో ఉంటూ చదువుకుంటున్నారని చూపిస్తూ ప్రభుత్వం నుంచి రూ.లక్షలాధిగా నిధులు దారి మళ్లించేశారు. అందులో గిరిజన సంక్షే మ అధికారులతో పాటు బీసీసంక్షేమ శాఖ ఉద్యోగులు భాగస్వాములు కావడంతో ఇటీవల సస్పెండైన గిరిజన సంక్షేమశాఖ అధికారి ఖాతాకు నిధులు మళ్లించారు. ఈ వ్యవహారంలో రెండు శాఖల అధికారులతో పాటు భ్యాంకు అధికారుల పాత్రపైనా అనుమానాలను వ్యక్తం చేసిన కలెక్టర్ లీడ్ బ్యాంకు మేనేజరు రామిరెడ్డిని పిలిపించి ఖాతాలను పరిశీలించాలని ఆదేశించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న బిల్లులు ఆన్లైన్లో అందజేస్తే టీబీఆర్ నంబరు జనరేట్ అయ్యింది. దీంతో ట్రెజరీ నుంచి నేరుగా ప్రస్తుత ఎస్టీ హాస్టల్ వార్డెన్గా ఉన్న ఝూన్సీ ఖాతాలోకి 305మంది విద్యార్థులకు సంబంధించిన నిధులు జమయ్యాయి. ఒక్కొక్కరికి రూ.10,500 వంతున రూ.32.02 లక్షలు జమైంది. అంతకు ముందే గిరిజన సంక్షేమ శాఖకు చెందిన అధికారి సస్పెండ్ కావడంతో ఆ నిధులు డ్రా చేసేందుకు అకౌంటు హోల్డర్గా ఉన్న ఝూన్సీ ముందుకు రాలేదు. అధికారికే రూ.5 లక్షలు ఇవ్వజూపారు... గత ఏడాది ఇదే వ్యవహారానికి సంబంధించి గిరిజన సంక్షేమ శాఖలో పర్యవేక్షణాధికారిగా ఉన్న అధికారికి రూ.లక్ష ముడుపుగా అందజేసి ఖాతాలో చేరిన రూ.లక్షలు కాజేశారు. ఈ ఏడాది ప్రభుత్వం ఫిబ్రవరిలో వార్డెన్ ఖాతాకు జమైన రూ.32.02 లక్షలు విత్డ్రా చేయడానికి ముందు సదరు అధికారికి రూ.5లక్షలు ముడుపుగా అందించేందుకు సిద్ధమయ్యారు. దీనికి తోడు గిరిజన బాలికల వసతిగృహంలో బాలురు ఉన్నట్టు చూపించి నిధులు దారి మళ్లించడం మరో ఆసక్తి గొలిపే అంశం. 305 మంది విద్యార్థుల్లో కొందరు పురుషుల పేర్లు ఉండడంతో సదరు అధికారి ఉలిక్కిపడ్డారు. చేసేదిలేక ఆ అధికారి కలెక్టర్కు సమాచారం అందించారు. రాజకీయ పైరవీలు ఉపకార వేతనాలను హాస్టల్ మెస్చార్జీలుగా చూపించి కాజేసేందుకు ప్రయత్నించిన గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగులు రాజకీయ పైరవీలకు సిద్ధమయ్యారు. అధికార పార్టీ పెద్దలకు బంధువులమంటూ ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు కసరత్తు మొదలు పెట్టారు. ఖాతాలు సృష్టించి నిధులు దారి మళ్లించడమే కాకుండా గిరిజన సంక్షేమ శాఖలో ఓ అధికారికి రూ.5లక్షలు ఇవ్వజూపిన గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగులపై విచారణ ఎప్పటికి మొదలవుతుందో వేచిచూడాలి. అజయ్కుమార్కు ఓప్రైవేటు కాలేజీలో వాటా? ఈ వ్యవహారంలో ప్రభుత్వ సొమ్మును సొంత ఖాతాలకు మళ్లించి తిరిగి ఆ సొమ్మునే చెక్కుగా మార్చుకునే ప్రయత్నంలో రోడ్డు ప్రమాదానికి గురైన అజయ్కుమార్ పాలకొండ మండలం బుక్కూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆయనతో పాటు కారులో రూ.24లక్షల విలువైన చెక్కును పోలీసులు కనుగొన్నారు. ఇంత మొత్తంలో చెక్కు ఈయన చేతికి ఎలా చిక్కిందన్నది ప్రశ్న. అజయ్కుమార్ పాలకొండ ప్రాంతంలోని ఓ ప్రైవేటు కాలేజీలో వాటాదారునిగా ఉన్నట్టు చెబుతున్నారు. చెక్కు ఇచ్చిన అధికారి సస్పెన్షన్లో ఉండడంతో ఆ దిశగా పోలీసు విచారణ మొదలైంది. అజయ్కుమార్ నోరు విప్పితే అసలు నిందితులు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఏసీబీ తనిఖీలు శ్రీకాకుళం టౌన్ : పట్టణంలోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల వసతిగృహంలో మంగళవారం అవినీతి నిరోదక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్కడున్న రికార్డులను స్వాధీన పరచుకుని పరిశీలించారు. ఏసీబీ డీఎస్పీ రంగరాజు నేతృత్వాన తనిఖీలు చేపట్టారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికిగాను వెల్ఫేర్ అధికారికి ప్రభుత్వం కేటాయించిన బ్యాంకు ఖాతాను పరిశీలించారు. ఆ ఖాతాలో గిరిజన సంక్షేమ శాఖ విడుదల చేసిన డైట్ బిల్లులను మార్చి నెలలో ప్రభుత్వం చెల్లించింది. జూన్ నుంచి మార్చి నెల వరకు ఆ ఖాతాకు ఇతర నిధులేవీ చేరే అవకాశం ఉండదు. కాని ఈ ఖాతాలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. స్టేట్ బ్యాంకు నుంచి లావాదేవీలను సేకరించిన డీఎస్పీ రంగరాజు వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించినట్టు తెలుస్తోంది. -
ప్రొటోకాల్ ఉల్లంఘనులపై ఫిర్యాదు
మదనపల్లె: అధికార పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ ప్రచార ఆర్భాటం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రొటోకాల్ను విస్మరించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి సబ్కలెక్టర్ కృతికాబాత్రాకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం ఆయన నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో కలిసి స్థానిక సబ్కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఇవ్వాల్సినప్రాధాన్యం ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రారంభంలో ఇవ్వకపోవడం బాధాకరమైన విషయమన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన‘ హౌస్ఫర్ ఆల్’ పథకానికి సంబంధించి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పైలాన్ ప్రారంభోత్సవ శిలాఫలకంలో ఎమ్మెల్యేకు ప్రొటోకాల్ నిబంధనల మేరకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. వీలైనంత త్వర గా శిలాఫలకాన్ని మార్చి ప్రొటోకాల్ నిబంధన ప్రకారం ముఖ్య అతిథి స్థానంలో తన పేరును ముద్రించి ఏర్పాటు చేయాలని కోరారు. లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. స్పందించిన సబ్కలెక్టర్ ప్రొటోకాల్ ఉల్లంఘనపై సంబంధిత అధికారులతో విచారణ జరిపించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కౌన్సిలర్లు జింకా వెంకటాచలపతి, బిఏ ఖాజా, మస్తాన్రెడ్డి, ఎంపీపీ సుజనా బాలకృష్ణారెడ్డి, జరీనా హైదర్, జెడ్పీటీసీ సభ్యులు భాస్కర్, సుజాత, సర్పంచ్ శరత్రెడ్డి పాల్గొన్నారు. -
తెలుగుదేశం పార్టీని వీడుతున్నాం
పార్టీకి వెలమల కళ్లాల వాసులు గుడ్బై అధికార పార్టీ నేతల తీరుపై నిప్పులు చెరిగిన గ్రామస్తులు శృంగవరపుకోట: ముప్పై సంవత్సరాలు జెండా మోశాం. తెలుగుదేశం పార్టీకి తప్ప మరో పార్టీకి ఏనాడూ ఏ ఒక్క ఓటు వేసిన పాపాన పోలేదు. గ్రామమంతా ఒక్కటే మాటగా గంపగుత్తగా ఓట్లు వేశాం. ఏనాడూ మాకు ఇది కావాలని నాయకుల్ని అడగలేదు. వాళ్లు మాకు చేసింది లేదు సరికదా..ఇప్పుడు మమ్మల్ని ఇరుకున పెట్టి ఇబ్బందుల పాలు చేశారు. పోలీసులు ఈడ్చుకెళ్లి అక్రమంగా అరెస్టు చేస్తే కనీసం మమ్మల్ని పరామర్శించేందుకు పార్టీ నాయకుడు ఒక్కరూ రాలేదు. ఇదీ మాకు పార్టీలో దక్కిన గౌరవం’’’ అంటూ ఎస్.కోటలోని వెలమల కళ్లాల వాసులు మూకుమ్మడిగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం వెలమల కళ్లాల వద్ద డంపింగ్యార్డు ప్రారంభం సందర్భంగా జరిగిన ఘటనలో పోలీసులు ఏడుగురు వ్యక్తుల్ని అరెస్టు చేయడం, ఈ ఘటనలో పలువురు మహిళల్ని ఈడ్చేయడం చేశారు. ఈ ఘటనలతో కలత చెందిన వెలమలకళ్లాల వాసులు బుధవారం మీడియాను తమ కళ్లాలకు పిలిచి సమావేశం నిర్వహించారు. మాకు అన్యాయం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. పార్టీకి సేవ చేశాం. అభ్యర్థి ఎవరైనా, ఎలక్షన్ ఏదైనా వెలమల కళ్లాలు అంటే తెలుగుదేశం అనేలా పనిచేశామన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యే, ఎంపీపీ, సర్పంచ్లు ఉన్నా ఏనాడూ డంపింగ్యార్డు ఇక్కడ పెడతామన్న మాట చెప్పలేదన్నారు. మా బతుకులు పాడవుతాయని అడిగితే పోలీసులతో తన్నించి, కేసులు పెట్టించారని, ఓట్లేసినందుకు మంచి న్యాయం చేశారని వాపోయారు. పోలీసులు అరెస్టులు చేస్తే కనీసం వారికి నచ్చచెప్పేందుకు ఒక్క నేత మా వెంట రాలేదు. పార్టీవల్ల మాకు న్యాయం జరగలేదు సరికదా..ఎమ్మెల్యే, ఎంపీపీ, సర్పంచ్ల తీరు వల్ల అన్యాయం జరిగింది. అందుకే మూకుమ్మడిగా 40కుటుంబాల వారం తెలుగుదేశం పార్టీని వీడుతున్నాం అంటూ గ్రామానికి చెందిన పురుషులు, యువకులు ఎడ్ల రామారావు, ఎడ్ల సంతోష్కుమార్, నాగిరెడ్డి గణేష్, వేచలపు సత్తిబాబు, ఎడ్ల గోవింద, రామారావు, బోజంకి ఎర్నాయుడు, అప్పలనాయుడు, రాపేటి నాగేశ్వరరావు, వంటాకు గౌరినాయుడులతో పలువురు మహిళలు మూకుమ్మడిగా ప్రకటించారు. అనంతరం వారంతా ఎమ్మెల్యే, ఎంపీపీ, సర్పంచ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ఎంపీడీఓల బదిలీలకు
► కొందరు అధికారపార్టీ నేతల్లో అసంతృప్తి ► యూనియన్ నేతకు ప్రాధాన్యంపై ఆగ్రహం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: జిల్లాలో ఎంపీడీఓల బదిలీలకు బ్రేక్పడింది.. సుదీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్నవారితో పాటు పలు ఆరోపణలు, ఫిర్యాదులు.. తదితర కారణాలతో 25 మంది ఎంపీడీఓలను బదిలీచే స్తూ మంగళవారం జిల్లా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎంపీడీఓల బదిలీలు అధికారపార్టీకి చెందిన కొందరు నేతల్లో అసంతృప్తిని రాజేసింది. తమకు కావాల్సినవారిని ఇతర ప్రాంతాలకు పంపించడం, తమ కన్నా ఓ యూనియన్ మాటే చెల్లుబాటు అయిందన్న కారణాలతో ఎంపీడీఓల బదిలీలను తాత్కాలికంగా నిలిపేయాలని అధికారపార్టీ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే ఈ బదిలీల వ్యవహారం రాజకీయంగా దుమారం రేపడంతో అధికారులు బదిలీ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం అధికారపార్టీకి చెందిన కొందరు నేతలతో పాటు ఎంపీడీఓల్లో అసంతృప్తిని కలిగించింది. ప్రస్తుతం కీలకస్థానాల్లో ఉన్న అధికారులకే మళ్లీ కీలకస్థానాలు లభించడం వెనక ఏ మంత్రాంగం జరిగిందోన్న అంశం ఎంపీడీఓల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై ప్రజాప్రతినిధుల అసంతృప్తిని తగ్గించేందుకు జిల్లాకు చెందిన మంత్రి ఒకరు బదిలీలను తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించినట్లు తెలిసింది. దీంతో అధికారులు బదిలీ ఉత్తర్వులు జారీచేయకుండా ప్రభుత్వానికి ర్యాపికేషన్ రూపంలో పంపించడానికి సిద్ధమవుతున్నారు. ఎంపీడీఓల బదిలీలకు సంబంధించి అధికారపార్టీ నేతలు, కొందరు ప్రజాప్రతినిధుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందరినీ సాధ్యమైనంత వరకు సంతృప్తిపరిచేలా బదిలీల్లో కూర్పుచేసినా చివరికి నిలిపివేయాలని పార్టీ నేతల నుంచే ఒత్తిడి రావడంపై ఒక ప్రజాప్రతినిధి కొందరు ఎంపీడీఓల ముందే ఆవేదన వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఎంపీడీఓల బదిలీల వ్యవహారం జిల్లాలో రాజకీయ వేడిని కలిగించింది. ఎంపీడీఓల బదిలీల్లో యూనియన్ నేత ఒకరు కీలకంగా వ్యవహరించడం సైతం అధికార పార్టీలోని కొందరు ప్రజాప్రతినిధుల్లో అసంతృపి రగిలించేందుకు కారణమైందని ప్రచారం జరుగుతోంది. సదరు యూనియన్ నేతకు బదిలీకి అర్హత లేకపోయినా పరిపాలన కారణాల పేరుతో తన నివాస ప్రాంతానికి సమీపంలోనే పోస్టింగ్ ఇవ్వడం ఇటు అధికార పార్టీలోనూ అటు ఎంపీడీఓల్లోనూ పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం బదిలీల్లో కొందరి పోస్టింగ్ సహేతుకంగా లేదని వాటిని మార్చాల్సిందేనని పట్టుబట్టడం విశేషం. దీంతో ఆఘమేఘాల మీద ఎంపీడీఓల బదిలీలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. -
కారెక్కిన చిట్టెం
► గులాబీ తీర్థం పుచ్చుకున్న మక్తల్ ► ఎమ్మెల్యే రాంమోహన్రెడ్డి ► మంత్రి లక్ష్మారెడ్డి వెంట సీఎం కేసీఆర్ వద్దకు.. ► నియోజకవర్గ అభివృద్ధి కోసమే ► టీఆర్ఎస్లో చేరుతున్నానని ప్రకటన ► కాంగ్రెస్ నుంచి ఒక వికెట్ ఔట్! సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: జిల్లాలో అధికార పార్టీలోకి రాజకీయ వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.. కొన్నినెలల క్రితం నారాయణపేట టీడీపీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకోగా, కాంగ్రెస్లో కీలకనేతగా ఉన్న మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్రెడ్డి బుధవారం టీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ను కలిసి పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. జిల్లా కాంగ్రెస్లో కీలకనేతగా ఉన్న మాజీమంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణకు సోదరుడైన రాంమోహన్రెడ్డి టీఆర్ఎస్లో చేరడం రాజకీయవర్గాల్లో సంచలనం రేకెత్తించింది. కొంతకాలంగా టీఆర్ఎస్లో చేరడానికి ప్రయత్నిస్తున్నారని జరుగుతున్న ప్రచారానికి ఆయన తెరదించారు. చిట్టెం రాంమోహన్రెడ్డి తండ్రి చిట్టెం నర్సిరెడ్డి మరణానంతరం 2005లో రాజకీయాల్లోకి వచ్చారు. 2005లో జరిగిన శాసనసభ ఉపఎన్నికలో ఆయన మక్తల్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. 2009లో అదే నియోజకవర్గం నుంచి ఓటమి చవిచూసిన చిట్టెం 2014లో కాంగ్రెస్ నుంచి తిరిగి మక్తల్ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే! టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జిల్లాలో ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరి, అభివృద్ధి కార్యక్రమాల్లో చూపుతున్న వివక్షపై చిట్టెం జిల్లా పరిషత్ సమావేశాలు, ఇతర వేదికలపై బహిరంగంగానే పోరాటం చేశారు. గతేడాది సెప్టెంబర్లో జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశం సాక్షిగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్తో వాదోపవాదం జరిగి చిట్టెంపై దాడికి దారితీయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఇందుకు నిరసనగా కాంగ్రెస్ జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. మక్తల్ శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నామని, కనీసం నియోజకవర్గంలో ప్రజల గొంతు తడపలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన చిట్టెం ఇటువంటి కారణాలతోనే అధికార పార్టీ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. చిట్టెం రాంమోహన్రెడ్డి టీఆర్ఎస్లో చేరికపై కాంగ్రెస్ నుంచి ఇంకా కారు ఎక్కేవారిలో ఎవరున్నారనేది రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అనేక మంది పేర్లు ప్రచారంలో ఉండడం విశేషం. ‘మక్తల్’ అభివృద్ధి కోసమే.. మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నా.. భీమా ప్రాజెక్టు పూర్తయితే వేలాది ఎకరాల బీడుభూములు సాగులోకి వస్తాయి. ప్రాజెక్టును పూర్తిచేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు సీఎం కేసీఆర్ హామీఇచ్చారు. త్వరలోనే ఆత్మకూర్, నర్వ, మాగనూరు, ఊట్కూర్, మక్తల్ మండలాల నుంచి పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అనుచరులతో కలిసి టీఆర్ఎస్లో చేరుతున్నా.. - ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్రెడ్డి -
అడుగంటిన కృష్ణమ్మ!
► శ్రీశైలం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరినా సాగర్కు కొనసాగుతున్న నీటి విడదల ► వన్యప్రాణులకు పొంచి ఉన్న ముప్పు ► ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్న నిపుణులు ► అధికారపార్టీకి పట్టని సీమ కన్నీటి గోడు కర్నూలు సిటీ: బిరబిర పరుగులిడాల్సిన కృష్ణానది నీరులేక వెలవెలబోతోంది. గత దశాబ్దాన్నర కాలంలో ఏ నాడు కూడాఈ పరిస్థితిని ఎదుర్కోలేదు. ఈ ఏడాది తక్కువ స్థాయిలో వర్షాపాతం నమోదు కావడంతో గతేడాది జూలై నుంచి నవంబరు వరకు 58 టీఎంసీలు మాత్రమే శ్రీశైలం జలాశయానికి చేరాయి. ఈ అరకొర నీటిని నిల్వ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తాగు నీటి అవసరాల పేరుతో తెలంగాణకు, కోస్తా ప్రాంతాలకు తరలించారు. రాయల సీమకు మాత్రం చుక్క నీటిని వదలలేదు. దీనిపై అప్పట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు రైతు సంఘాలు, ఇతర పార్టీలు ఆందోళనలు చేసినా ఈ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేతలు పట్టించుకోలేదు. వాస్తవానికి ఈ రోజుకు కూడా కృష్ణాడెల్టాలో తాగు నీటి ఇబ్బందులు రాయల సీమ కంటే తక్కువగానే ఉన్నాయి. తెలుగు దేశం పార్టీకి ఆ ప్రాంత ప్రజలు ఓట్లు వేశారనే ప్రేమతోనో లేక రాయల సీమ వాసులు తమ పార్టీని ఆదరించలేదనే కోపంతోనో ఇప్పటికీ కూడా డెడ్స్టోరేజ్కి చేరిన శ్రీశైలం జలాశయం నుంచి తాగు నీటి కోసమని దిగువకు నీటిని తీసుకెళ్తున్నారు. గత దశాబ్దాన్నర కాలంలో ఇంత దిగువ వరకు నీటిని వాడుకోలేదని అధికార గణాంకాలే చెబుతున్నాయి. డెడ్ స్టోరేజీ నీటిని వాడితే వన్యప్రాణులకు పొంచిన ముప్పు.. శ్రీశైలం జలాశయం పూర్థి స్థాయి నీటి మట్టం 885 అడుగులు, 215 టీఎంసీలు సామర్థ్యం. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో జలాశయంలోకి నీటి చేరికలు తక్కువ స్థాయిలో ఉన్నాయి. సాధారణంగా మే చివరికి జలాశయం డెడ్ స్టోరేజీకి చేరుకునేది. అయితే తక్కువ వర్షపాతంతో మార్చి మొదటి వారానికే డెడ్ స్టోరేజీకి చేరుకుంది. అయినా, నీటిని తాగు నీటి పేరుతో నాగర్జున సాగర్కు తీసుకుపోతున్నారు. ఇలా తీసుకెళ్లడంతో ప్రాజెక్టులో నీరు పూర్తిగా అడుగంటిపోయి నల్లమల అడవుల్లోని వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతుంది. ఇదే అభిప్రాయంతో కొందరు పర్యావరణవేత్తలు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. తప్పని పరిస్థితి: ప్రస్తుతం తప్పని పరిస్థతుల్లో శ్రీశైలం నుంచి నీటిని వదులుతున్నాం. తాగు నీటికి ఇబ్బందులు ఉన్న సమయంలో 705 అడుగుల వరకు నీటిని వాడుకునేందుకు అవకాశం ఉంది. వన్యప్రాణులకు కొంత ఇబ్బంది ఉండవచ్చు. కానీ ప్రస్తుతం తాగు నీటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నందు వల్లే కృష్ణా బోర్డు తెలంగాణ, కోస్తాకు వాటాలుగా పంచింది. శ్రీశైలంలో ప్రస్తుతం ఉన్న నీటి మట్టంతో రాయల సీమకు నీరు ఇవ్వడం సాధ్యం కాదు. - చిట్టిబాబు, చీఫ్ ఇంజనీర్ జల వనరుల శాఖ, కర్నూలు ప్రాజెక్ట్స్ -
కౌన్సెలింగ్తోనే..
ఎంపీడీఓల బదిలీలకు ఇదేమార్గం ► అధికార వర్గాల్లో కలకలం రేపిన ‘సాక్షి’ కథనం ► సుదీర్ఘకాలంగా ఒకేచోట ఉన్నవారికి ► స్థానచలనం.. 11న ముహూర్తం ► రంగం సిద్ధం చేసిన అధికారులు ► ఫలించని యూనియన్ నేతల పన్నాగాలు ► ఫిర్యాదులు ఎదుర్కొంటున్న ఆరుగురు ఎంపీడీఓలపై బదిలీ వేటు? సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: జిల్లాలో ఎంపీడీఓల బదిలీకి రంగం సిద్ధమైంది. కౌన్సెలింగ్ ద్వారానే ఈ ప్రక్రియను చేపట్టాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈనెల 11న ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు ఆయా మండలాల అధికారులకు జెడ్పీ అధికారులు సమాచారం తెలియజేశారు. ఎంపీడీఓల బదిలీల్లో భారీగా పైరవీలు చోటుచేసుకుంటున్నాయని, లాబీయింగ్ చేసిన వారికే కీలకస్థానాలు లభించే అవకాశం ఉందని, ఈ వ్యవహారానికి ఓ యూనియన్కు చెందిన కీలకనేత చక్రం తిప్పుతున్నారని శుక్రవారం ‘సాక్షి’లో వచ్చిన కథనం అధికారవర్గాల్లో కలకలం రేపింది. ఐదేళ్ల ఉద్యోగకాలం పూర్తయినా ఎంపీడీఓలను ఇతరప్రాంతాలకు నేరుగా బదిలీచేయాలని తొలుత జిల్లా అధికారులు భావించినా ఈ కథనంలో పునరాలోచనలో పడ్డారు. బదిలీలపై పారదర్శకత లోపిస్తే న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరగడంతో కౌన్సెలింగ్ ద్వారానే నిర్వహించడం మంచిదని ఓ నిర్ణయానికి వచ్చారు. 13 మంది ఎంపీడీఓలకు స్థానచలనం జిల్లాలో 13మంది ఎంపీడీఓలు ఐదేళ్లపాటు ఒకేచోట పనిచేస్తున్నట్లు తేలింది. అయితే వారిస్థానాల్లో ఎవరిని నియమిస్తారో.. ఏయే మండలాల అధికారులను భర్తీచేస్తారోనన్న అంశం ప్రస్తుతం పంచాయతీరాజ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తమకు అనుకూలమైన స్థానాలను పొందేందుకు ప్రయత్నాలు ఏ మేరకు ఫలించనున్నాయో ఈనెల 11న తేలనుంది. కౌన్సెలింగ్ ద్వారా బదిలీ జరుగుతుండడంతో ఒక్కో అధికారికి రెండు లేదా మూడు ఆప్షన్లు ఎంచుకునే అవకాశం లభించినట్లయింది. ఇక తన రాజకీయ పలుకుబడితో మహబూబ్నగర్ ఎంపీడీఓ పోస్టును పొందేందుకు ప్రయత్నించిన ఓ యూనియన్ నేతకు కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు జరుగుతుండడంతో ఆయనకు అవకాశం లేకుండాపోయింది. అయినా ఏదోమార్గం ద్వారా కీలక స్థానాలను పొం దేందుకు సదరునేత ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని ఉద్యోగవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బదిలీకి అవకాశం లేని పక్షంలో తానిప్పుడు నిర్వహిస్తున్న డిప్యూటేషన్ పోస్టునే పదిలపర్చుకోవడంపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇక ఆయనను నమ్ముకుని కీలకస్థానాలకు భారీ పైరవీలు చేసిన కొందరు ఎంపీడీఓలు రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు పోస్టింగ్లపై ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. ఒకే మండలంలో ఐదేళ్లు పూర్తవడంతో పాటు పనితీరు బాగాలేని, ప్రజల నుంచి ఫిర్యాదులు రావడం వంటి కారణాలతో జిల్లాలో మరో ఆరుగురు ఎంపీడీఓలపై బదిలీ వేటువేసేందుకు అధికారులు రంగం సిద్ధంచేసినట్లు తెలిసింది. అయితే చాలాకాలంగా ఎంపీడీఓలకు బదిలీలు లేకపోవడంతో అనేకమంది అధికారపార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిదులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా కీలకస్థానాలు పొందేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నిస్తుండడం విశేషం. -
అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చా?
గూడూరు : అధికారం ఉంటే ఎక్కడైనా, ఏదైనా ఏర్పాటు చేయెచ్చేమో మరి...అదెలా అనుకుంటున్నారా.. ఈ ఫ్లెక్సీలను చూస్తేనే ఆ అధికార దర్పమేమిటో తెలుస్తోంది. అవి రెండూ ప్రభుత్వ కార్యాలయాలు.. ఒకటి చిల్లకూరు పోలీస్స్టేషన్ కాగా, మరొకటి రెవెన్యూ కార్యాలయం. ఆ ప్రాంతంలో ఓ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా సామాన్య మానవుడు ఆయా కార్యాలయాల ముందు ఏదైనా అడ్డుగా పెడితే వారికి నరకం చూపిస్తారు. అలాంటి ఆ కార్యాలయాల ముందే అడ్డంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై పలువురు ఔరా .. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ ఫ్లెక్సీల్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపినవారే ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారా.. లేక ఆయా శాఖలకు చెందిన అధికారులులే వాటిని ఏర్పాటు చేశారా.. అనే సందేహాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఆ నాయకుడి జన్మదిన కార్యక్రమానికి కూడా ప్రజాప్రతినిధులకన్నా, అన్ని శాఖల అధికారులే ఎక్కువగా హాజరయ్యారు. దీన్ని బట్టే అధికార పార్టీకి ఏ స్థాయిలో అధికార యంత్రాంగం కొమ్ము కాస్తోందో తెలియకనే తెలుస్తుంది మరి. -
వాళ్లే.. మా వాళ్లు!
► టీడీపీలో ఇన్చార్జీలదే హవా ► నియోజకవర్గ నిధులూ వారికే.. ► తేల్చి చెబుతున్న ప్రభుత్వ పెద్దలు ► నివ్వెరపోతున్న వలస నేతలు ► నియోజకవర్గ అభివృద్ధి కోసమే ► పార్టీ మారుతున్నట్లు ప్రకటనలు ► తాజా నిధుల మంజూరులో దక్కని స్థానం ► ప్రజల్లోకి వెళ్లేదెలాగనే ఆందోళన నియోజకవర్గాల అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్లు చెబుతున్న నేతలకు అధికార పార్టీ షాక్ ఇస్తోంది. ఇదివరకు ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులకే పెద్దపీట వేస్తుండటం పట్ల వలస నేతల్లో అసహనం వ్యక్తమవుతోంది. ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు వచ్చిన అవకాశాన్ని కాస్తా చేజార్చుకుని.. ‘పచ్చ’నోట్లకు తలొగ్గిన నేతల్లో అంతర్మథనం మొదలయింది. పార్టీ మారితే చక్రం తిప్పవచ్చని భావించిన నేతలకు మొదటికే మోసం రావడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలో చేరిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అవమానాలు తప్పట్లేదు. పార్టీలో చేరిన నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన తమనే నియోజకవర్గ ఇన్చార్జీలుగా ప్రకటిస్తారని ఆశించారు. అయితే, ఇందుకు భిన్నంగా మొదటి నుంచి పార్టీలో ఉండి.. గెలవకపోయినప్పటికీ ఇన్చార్జీలుగా ఉన్నవాళ్లే రానున్న రోజుల్లోనూ అదే పదవిలో కొనసాగుతారని అధికార పార్టీ అధినేత తేల్చిచెప్పినట్టు తెలిసింది. అంతేకాకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా విడుదల చేసే నిధులూ ఈ ఇన్చార్జీల ఆధ్వర్యంలోనే ఖర్చు చేస్తారని కూడా ఖరాఖండిగా స్పష్టం చేసినట్టు సమాచారం. ఫలితంగా నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్టు చెప్పిన నేతలకూ ఈ పరిణామాలు కాస్తా మింగుడుపడటం లేదు. కోడుమూరులో విష్ణుదే హవా కోడుమూరు ఎమ్మెల్యేగా గెలిచిన మణిగాంధీ అధికార పార్టీలో చేరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారినట్టు ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం విడుదల చేసే నిధులు కాస్తా తన పేరు మీదనే విడుదల అవుతాయని ఆశించారు. అయితే, తాజాగా కోడుమూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు మార్చి 31న ఉత్తర్వులు కూడా జారీచేసింది. పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జీ విష్ణువర్దన్ రెడ్డి చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఈ నిధులు మంజూరు చేస్తున్నామని.. మరో రూ.2 కోట్లను ఉపాధి హామీ కింద సమకూర్చుకుని మొత్తం రూ.4 కోట్లను ఖర్చు చేయాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తద్వారా నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ తమ నియోజకవర్గ ఇన్చార్జీలకే అప్పగించనున్నట్టు అధికార పార్టీ తేటతెల్లం చేసింది. ఈ నేపథ్యంలో తాము పార్టీ మారినప్పటికీ ఏం ఉపయోగమంటూ నాయకులు పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఆళ్లగడ్డ నిధులు గంగులవే.. గతంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల ప్రభాకర్ రెడ్డి అని.. ఆయనకు ఏకంగా రూ.5 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అప్పట్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఉన్న భూమా అఖిలప్రియ కాస్తా ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని, హైకోర్టులో కేసు వేస్తానని కూడా ప్రకటించారు. కొన్ని నెలల తర్వాత భూమా అఖిలప్రియ కాస్తా అధికార పార్టీలో చేరారు. అయినప్పటికీ గంగుల ఆధ్వర్యంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతాయని అధికారపార్టీ స్పష్టం చేసింది. నంద్యాలలోనూ ఇదే తరహాలో తానే నియోజకవర్గ ఇన్చార్జినని శిల్పా మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని పార్టీ కూడా వ్యతిరేకించలేకపోయింది. ఈ నేపథ్యంలో పార్టీ మారినప్పటికీ తమకు ప్రొటోకాల్ తప్ప.. అభివృద్ధి నిధులు ఒక్కపైసా వచ్చే అవకాశం లేదని పార్టీ మారిన నేతలు వాపోతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు చెబుతున్నా ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఇది తమ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందులు తెచ్చిపెట్టే పరిణామమని వాపోతున్నారు. -
జంప్ జిలాని
► సొంత పార్టీలోనే పొసగని నేతలు ► ఒక గ్రూపు నుంచి మరో గ్రూపులోకి జంప్ ► జిల్లాలో అధికార పార్టీలో కొత్త తరహా రాజకీయాలు ► నష్టం తప్పదంటున్న విశ్లేషకులు ► అయోమయంలో కార్యకర్తలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాలలోనూ నందికొట్కూరు తరహా రాజకీయం మొదలయింది. అధికార పార్టీలోని నాయకులే.. గ్రూపులు మారుస్తూ పత్రికలకు ఎక్కడం నంద్యాలలోనూ షురూ అయింది. పార్టీలోని అవతలి గ్రూపు వ్యక్తులను బలహీనం చేసేందుకు వీలుగా మరో గ్రూపు ఆడుతున్న ఈ నాటకంలో అధికారపార్టీ పరువు బజారుకెక్కుతోంది. పార్టీలో తమ గ్రూపు బలమే ఎక్కువని చాటుకునేందుకు సాగుతున్న ఈ జంప్జిలానీల వ్యవహారం అంతిమంగా ఆ పార్టీనే నష్టపర్చక తప్పదనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతోంది. నిన్న నందికొట్కూరు.. నేడు నంద్యాల.. రేపు కోడుమూరు నియోజకవర్గంలోనూఇదే తరహా రాజకీయం మొదలవుతుందేమోననే ఆందోళన ఆ పార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది. కొత్త నేత వచ్చారా.. గ్రూపులు మార్చేద్దాం వాస్తవానికి గతంలో రాజకీయాలు అంటే పార్టీ మారిన నేతతో పాటే కార్యకర్తల పయనం ఉండేది. అంతేతప్ప.. ఒకే పార్టీలోనే గ్రూపులు మారడం జరిగేది కాదు. ఒకవేళ జరిగినా.. తాము గ్రూపు మారామంటూ పత్రికలకు ఎక్కడం ఎన్నడూ చూడలేదు. అయితే, ఇందుకు భిన్నంగా జిల్లాలో ఈ తరహా రాజకీయాలు అధికమయ్యాయి. మొదట్లో నందికొట్కూరు నియోజకవర్గంలో మాండ్ర శివానందరెడ్డి అధికార పార్టీలో చేరిన వెంటనే.. కొద్ది మంది తెలుగుదేశానికి చెందిన నేతలే వచ్చి శివానందరెడ్డి గ్రూపులో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ తరహా ప్రకటనలు నందికొట్కూరులో మొన్నటివరకు సర్వసాధారణం. ఇప్పుడు తాజాగా నంద్యాలలోనూ ఈ తరహా గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. కొత్త నేత పార్టీలోకి వస్తే తన బలాన్ని పెంచుకునేందుకు అవతలి పార్టీలోని వారిని కాకుండా సొంత పార్టీలోని మరో గ్రూపునకు చెందిన నేతలను చేర్చుకుంటూ బల నిరూపనకు దిగుతుండటం గమనార్హం. -
ప్రజలే దేవుళ్లు !
► నమ్మేది సామాజిక న్యాయాన్నే ► ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సాక్షి, బెంగళూరు: ‘నేను నాస్తికుడిని కాదు, నా దృష్టిలో దేవుళ్లంటే ప్రజలే. నేను నమ్మేది సామాజిక న్యాయాన్నే’ అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేర్కొన్నారు. సిద్ధరామయ్య స్వగ్రామం మైసూరు జిల్లా సిద్దరామనహుండిలో శుక్రవారం జరిగిన జాతర మహోత్సవంలో సిద్ధరామయ్య పాల్గొని, గ్రామస్తులతో అనేక విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో సిద్ధరామయ్య ముచ్చటించారు. సిద్ధరామనహుండిలో మూడేళ్లకోసారి సిద్ధరామేశ్వర, చిక్కతాయమ్మల జాతర మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. 2011లో జాతర జరిగిన సందర్భంలో తాను కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. అయితే ఆలయ జీర్ణోద్ధరణ పనుల నేపథ్యంలో ఐదేళ్లుగా జాతర మహోత్సవాన్న నిర్వహించలేక పోయారని పేర్కొన్నారు. తాను దేవుడిని నమ్ముతానని, అయితే మూఢ నమ్మకాలను, ఆచారాలను ఒప్పుకోనని స్పష్టం చేశారు. ప్రజలకు అందాల్సిన సామాజిక న్యాయానికే తాను ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తానని అన్నారు. బసవణ్ణ తత్వాలు, సిద్ధాంతాలను తను నమ్ముతానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. లోకాయుక్తకు ఎలాంటి నష్టం ఉండబోదు..... అవినీతి నిరోధక దళం(ఏసీబీ) ఏర్పాటు కారణంగా లోకాయుక్తకు ఎలాంటి నష్టం ఉండబోదని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. లోకాయుక్తకు ఉన్న ఎలాంటి అధికారాలనూ మార్చలేదని, కేవలం అవినీతిని మరింత పటిష్టంగా ఎదుర్కొనేందుకు మాత్రమే ఏసీబీని ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ విషయంపై అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు విపక్షాలకు సైతం ఎలాంటి అనుమానాలున్నా వాటిని నివృత్తి చేస్తానని వెల్లడించారు. -
జన్మభూమి కమిటీల పెత్తనమేంటి?
► చిన్నచూపు చూస్తున్న అధికారులు ► స్టాండింగ్ కమిటీ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుల ధ్వజం నెల్లూరు(అర్బన్) : చిన్న, చిన్న సమస్యల పరిష్కారానికి కూడా అధికార పార్టీకి చెందిన జన్మభూమి కమిటీ సభ్యులు అడ్డుపడుతున్నారు. పింఛన్ పొందాలన్న జన్మభూమి కమిటీల ఆమోదం తెలపాలి. కమిటీల పెత్తనం ఏంటంటూ అధికార పక్షాని చెందిన జెడ్పీటీసీ సభ్యులతో పాటు వైఎస్సార్సీపీ సభ్యులు ప్రభుత్వంపై మండిపడ్డారు. స్థానిక దర్గామిట్టలోని జెడ్పీ కార్యాలయంలో చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అధ్యక్షతన బుధవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బొమ్మిరెడ్డి మాట్లాడుతూ అజెండా ప్రకారం గృహనిర్మాణం, విద్య, వైద్యం, స్త్రీశిశు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం తదితర అంశాలపై చ ర్చించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. గృహనిర్మాణ శాఖ పీడీ రామచంద్రారెడ్డి ఎన్టీఆర్ హౌసింగ్, అందరికీ ఇళ్లు పథకాలకు వచ్చిన అర్జీలు, తదితర అంశాలను వివరిస్తుండగా దుత్తలూరు జెడ్పీటీసీ చీదెళ్ల మల్లికార్జున అడ్డుకున్నారు. ఇళ్ల మంజూరుపై జెడ్పీటీసీ సభ్యులతో ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. గతంలో నిర్మించిన ఇళ్లకు నేటికీ బిల్లులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయని ప్రశ్నించారు. ఈఈల అవినీతి వల్లనే బిల్లులు అందడం లేదని, కొత్తగా మంజూరయ్యే వాటికైనా బిల్లులు వస్తాయా..రావా చెప్పాలని డిమాండ్ చేశారు. పీడీ మాట్లాడుతూ లోపాలపై సమీక్షించి తగుచర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొడవలూరు జెడ్పీటీసీ సభ్యుడు ఐ శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ జెడ్పీ పాఠశాలల్లో జరిగే కార్యక్రమాల సమాచారాన్ని జెడ్పీటీసీలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పాఠశాలల్లో స్వీపర్ల భర్తీ, మరుగుదొడ్ల నిర్మాణం తదితర విషయాలను జెడ్పీటీసీలకు చెప్పకపోవడానికి గల కారణాలను వెల్లడించాలని సర్వశిక్ష అభియాన్ అధికారులను డిమాండ్ చేశారు. తమకు తెలియకుండా పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈయనకు మద్దతుగా పలువురు జెడ్పీటీసీ సభ్యులు మాట్లాడారు. ఈ దశలో చైర్మన్ బొమ్మిరెడ్డి కలుగజేసుకుని ఇక మీదట ఏ పనులు జరిగినా జెడ్పీటీసీల ఆధ్వర్యంలో జరిగేలా తీర్మానం చేయించారు. డీఆర్డీఏ పీడీ చంద్రమౌళి మాట్లాడుతూ పింఛన్ల కోసం కొత్తగా 30వేల మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. దీంతో పలువురు జెడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతూ జన్మభూమి కమిటీ సభ్యులు సూచించిన వారికే పింఛన్ అందుతుందని విమర్శించారు. ప్రజాప్రతినిధులను కాదని అర్హతలేని జన్మభూమి కమిటీల సభ్యులకు పెత్తనం ఇవ్వడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. జన్మభూమి కమిటీలతో అర్హత ఉన్న పలువురికి పింఛన్ అందడం లేదని ధ్వజమెత్తారు. వైద్యశాలల్లో తగిన మందులు అందుబాటులో ఉంచాలని కోరారు. అనంతరం అంగన్వాడీ సెంటర్లు, వ్యవసాయం, సబ్సిడీపై పచ్చిరొట్ట ఎరువులు , సంక్షేమం, తదితర అంశాలను చర్చించారు. జెడ్పీ వైస్చైర్పర్సన్ పొట్టేళ్ల శిరీష, డ్వామా పీడీ హరిత, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీఎంహెచ్ఓవరసుందరం, సర్వశిక్ష అభియాన్ పీఓ కనకనర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
వలస నేత.. మారేనా రాత!
► కేసులున్న వ్యక్తికి మంత్రి పదవా? ► ఎలా ఇస్తారని ఒక వర్గం వాదన ► పార్టీకి చెడ్డపేరు వస్తుందనే అభిప్రాయం ► అధినేత దృష్టికి తీసుకెళ్లే యోచన ఒక్కటవుతున్న జిల్లా టీడీపీ నేతలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలోకి తాజాగా చేరిన నేతకు మంత్రి పదవి దక్కేందుకు రోజుకో కొత్త అడ్డంకి ఎదురవుతోంది. ఇన్ని రోజులుగా మంత్రి పదవి హామీ ఆయనకు ఇవ్వలేదంటున్న ఆ పార్టీ నేతలు.. తాజాగా ఆయనపై ఉన్న కేసులు అడ్డువచ్చే అవకాశం ఉందనే ప్రచారం మొదలుపెట్టారు. గతంలో ఆయనపై రౌడీషీట్ ఉందని ఆరోపణలు చేసి, ఎమ్మెల్యే పదవికి కూడా అర్హుడు కాదని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఇప్పుడు పిలిచి మంత్రి పదవి ఇస్తే పార్టీ పరువు బజారునపడుతుందనే కొత్త వాదనను తెరమీదకు తెస్తున్నారు. అంతేకాకుండా మంత్రి పదవి ఇస్తే అధికార పార్టీలో చేరితే చాలు అన్ని ఆరోపణలు మాఫీ అవుతాయనే సందేశాన్ని ప్రజల్లోకి పంపినట్టు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది అంతిమంగా పార్టీకి జిల్లాలో చెడ్డపేరు తెచ్చిపెడుతందనే చర్చకు తావిస్తోంది. ఇదే విషయాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. విమర్శించి.. అందలమెక్కించవచ్చా? వాస్తవానికి సదరు నేతను విమర్శిస్తూ అధికార పార్టీ నేతలు గతంలో అనేక ఆరోపణలు చేశారు. రౌడీషీటర్ అని.. ఏకంగా ఎర్రచందనం స్మగ్లర్ అని కూడా వ్యాఖ్యానించారు. ఇన్ని కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎమ్మెల్యే పదవికి కూడా అనర్హుడని ఘాటు విమర్శలు చేశారు. ఇప్పుడు అదే నేతలకు ఏకంగా మంత్రి పదవి ఇస్తే ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకుని వెళ్లగలమనే అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. ప్రతిపక్షంలో ఉంటే చెడ్డవాడు.. అధికారపార్టీలో చేరితే మంచివాడు అని మనమే సర్టిఫికెట్ ఇచ్చినట్టు అవుతుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేవలం ఎమ్మెల్యేగానే ఉంచాలని కోరుతున్నారు. ఒక్కటవుతున్న నేతలు.. ఒకవైపు కేసుల వ్యవహారంతో పార్టీకి చెడ్డపేరు వస్తుందని చెబుతున్న నేతలు.. మరోవైపు ఎన్నికల ముందు నుంచీ పార్టీలో ఉన్న నేతలు ఏకమవుతున్నారు. తమను కాదని కొత్తగా పార్టీలో చేరిన వారికి మంత్రి పదవి ఇవ్వద్దని ఏకంగా అధినేతను స్వయంగా కలిసి విన్నవించాలని భావిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే.. అదే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారని, వారిలో ఏ ఒక్కరికి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని వాదించనున్నట్టు తెలిసింది. మొత్తం మీద మంత్రి పదవి వ్యవహారం కాస్తా జిల్లా రాజకీయాలను రోజుకో మలుపు తిప్పుతోంది. -
సభ సాక్షిగా తప్పుచేసి..
♦ సరిదిద్దుకునేందుకు ప్రివిలేజ్ కమిటీని వాడుకున్న ప్రభుత్వం ♦ ఆ కమిటీలో మెజారిటీ సభ్యులు అధికారపక్షం వారే ♦ అధికారపక్షం దూషణలు పట్టించుకోని కమిటీ ♦ ప్రతిపక్ష సభ్యుల అసమ్మతి నోట్ను పట్టించుకోని వైనం ♦ గతంలో ఎన్నడూ ప్రివిలేజ్ కమిటీ నివేదికపై చర్చించని సభ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించిన ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు ప్రివిలే జ్ కమిటీని ఒక సాధనంగా ఉపయోగించుకుంటోంది. ప్రతిపక్ష నేతతో పాటు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై శాసనసభలో ఇష్టం వచ్చినట్లు పలు సందర్భాల్లో నోరు పారేసుకున్న చరిత్ర కలిగిన ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ ఇచ్చిన నివేదికకు ఉన్న చట్టబద్ధతపై సర్వత్రా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను శాసనసభ నుంచి గత డిసెంబర్ 18న ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్ను సుప్రీంకోర్టు ఆక్షేపించగా, నిబంధనలు విరుద్ధంగా ఈ సస్పెన్షన్ ఉందంటూ హైకోర్టు నిలుపుదల చేసింది. ఈ నేపథ్యంలో తాము చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. డిసెంబర్లో జరిగిన సమావేశాల్లో రోజా అనుచితంగా ప్రవర్తించారని, సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సస్పెన్షన్ సమయంలో ప్రకటించారు. రోజా అసెంబ్లీలో కామ చంద్రబాబు అని వ్యాఖ్యలు చేశారని, అందుకే సస్పెండ్ చేశామని అధికారపక్షం ప్రచారం చేసింది. ఆమె, ఇతర ప్రతిపక్ష సభ్యులు చేశారని చెప్తున్న వ్యాఖ్యలను ఎంపిక చేసి మీడియాకు లీక్ చేసింది. తమ సభ్యులు చేసిన వ్యాఖ్యల జోలికి మాత్రం అధికార పక్షం వెళ్లలేదు. వాస్తవానికి రోజా కాల్మనీ వ్యవహారాన్ని దృష్టిలో ఉంచుకుని కామ చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. ‘ఈనాడు’ లాంటి దినపత్రికలు కూడా కాల్మనీని ‘కామ’ అని రాసిన సందర్భాలున్నాయి. శీర్షికల్లో కూడా ‘కామాంతకులు’ అని పొందుపరిచారు. అనితను అస్త్రంగా చేసుకుని.. సభ నుంచి రోజా సస్పెన్షన్పై అప్పట్లోనే నిరసన వ్యక్తమైంది. దీంతో ఆమె డిసెంబర్ 18న చేశారని చెప్తున్న వ్యాఖ్యలపై అదే నెల 22న ప్రతిపక్షం సభలో లేకుండా చూసి అయిదు, పది నిమిషాల్లో పూర్తయ్యే జీరో అవర్ను గంటల తరబడి కొనసాగించి అధికార పార్టీ సభ్యులు వంగలపూడి అనితతో ఫిర్యాదు చేయించారు. ఆమెను ఒక అస్త్రంగా వాడుకున్నారు. దీంతో స్పీకర్ శాసనసభ శీతాకాల సమావేశాల్లో జరిగిన పరిణామాలపై ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మెజారిటీ సభ్యులు అధికారపక్షం నుంచే ఉండటం గమనార్హం. ఆ కమిటీ ప్రతిపక్షం నుంచి సభ్యుడిగా ఉన్న గడికోట శ్రీకాంత్రెడ్డి చేసిన ప్రతిపాదనలు ఏ ఒక్కటీ ఆమోదించకపోగా, అసమ్మతి నోట్ను కూడా పట్టించుకోకుండా తాము ఇవ్వాలనుకున్న నివేదికను ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా ప్రివిలేజ్ కమిటీ.. అనిత జీరో అవర్లో ప్రస్తావించిన అంశం, ప్రివిలేజ్ నోటీస్ ఆధారంగా రోజాపై విచారణ చేపట్టింది. అయితే తన సస్పెన్షన్కు సంబంధించి కోర్టు కేసుల విషయంలో తీరిక లేకుండా ఉండటం, ఆనారోగ్యం వల్ల కమిటీకి హాజరు కాలేనని రోజా కమిటీకి రాతపూర్వకంగా తెలిపారు. అయినా కమిటీ వాటిని పట్టించుకోలేదు. ఈ ప్రివిలేజ్ కమిటీలో ఏడుగురు సభ్యులుంటే ఐదుగురు అధికారపక్షం నుంచే ఉన్నారు. కమిటీ చైర్మన్గా వ్యవహరించిన గొల్లపల్లి సూర్యారావు.. 14వ శాసనసభ ఆరంభం నుంచి తనకు ఏమాత్రం ప్రసంగించే అవకాశం వచ్చినా వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు ఆయన తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని పదే పదే విమర్శించటమే అలవాటుగా పెట్టుకున్నారు. ఆయనే చైర్మన్గా ఉన్న కమిటీ సహజంగానే వాస్తవాలు పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఇచ్చింది. ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న వైఎస్సార్సీపీ సభ్యులు కూడా నివేదికపై తమ అసమ్మతిని వ్యక్తం చేశారు. అయినా కమిటీ పట్టించుకోలేదు. మరో అవకాశం ఎందుకివ్వలేదు? ప్రివిలేజ్ కమిటీకి అధికారపక్షంతో పాటు ప్రతిపక్ష సభ్యులు పలు పిటిషన్లు అందచేశారు. అధికారపక్షం అందచేసిన పిటిషన్లు బుల్లెట్ స్పీడ్తో కమిటీ ముందు విచారణకు వస్తుంటే ప్రతిపక్ష సభ్యులు అందజేసిన పిటిషన్లు కనీసం నత్తనడకతో సమానంగానైనా కమిటీ ముందు విచారణకు రాలేదు. ఇదే విషయాన్ని కమిటీలోని విపక్ష సభ్యులు చైర్మన్ను గట్టిగా ప్రశ్నించినా ఫలితం శూన్యం. రోజాపై చర్యను తప్పుపడుతూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ను ఆశ్రయించిన ప్రభుత్వం తాము నిబంధనలకు విరుద్ధంగా ఆమెను సస్పెండ్ చే శామని ఒక నిర్ధారణకు వచ్చి, సస్పెన్షన్కు చట్టబద్ధత కల్పించేందుకు ప్రివిలేజ్ కమిటీని ఉపయోగించుకుంది. డిసెంబర్ 18వ తేదీన రోజాను సస్పెండ్ చేశారు. అప్పట్లో రోజా విషయంలో అంతగా పట్టించుకోని టీడీపీ ఎమ్మెల్యే అనిత అధికారపక్ష ప్రేరేపణతో 22న ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ప్రివిలేజ్ కమిటీయే ఆమెకు మరో అవకాశం ఇస్తే సరిపోయేది. కానీ కమిటీ వాస్తవాలు పట్టించుకోకుండా కమిటీలోని విపక్ష సభ్యుల అసమ్మతిని ఖాతరు చేయకుండా ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై అధికార పక్షం నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించింది. వాస్తవానికి గతంలో ఎన్నడూ ప్రివిలేజ్ కమిటీ నివేదికపై సభలో చర్చించలేదు. రోజా విషయంలో మాత్రం వెంటనే సభలో చర్చకు చేపట్టి ఎప్పటిలాగే విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై, ఆయన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిపై అధికారపక్షం ఆరోపణలు, విమర్శల దాడి కొనసాగించింది. చివరకు ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యేందుకు రోజాకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఆ అవకాశం ప్రివిలేజ్ కమిటీయే ఇస్తే సరిపోయేదని, అలా కాకుండా సుదీర్ఘంగా చర్చించి, పనిలో పనిగా విపక్షంపై ఆరోపణలు గుప్పించిన తర్వాత రోజాకు మరో అవకాశం అనడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. సుప్రీంకోర్టు ఆక్షేపించినా, హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా రోజాను అసెంబ్లీ లోనికి ఎందుకు అనుమతించలేదని అంటున్నారు. సభ సాక్షిగా తప్పుచేసి మసిపూసి మారేడుకాయ చేసేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
లైన్మెన్పై చెప్పుతో దాడి
రాప్తాడు పీఎస్లో కేసు నమోదు నిందితుడికి అధికార పార్టీ అండ అనంతపురం : అధికార పార్టీ అండదండలతో నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులను బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, చివరికి దాడులు చేయడం పరిపాటిగా మారుతోంది. తాజాగా రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లిలో మాట వినని ట్రాన్స్కో లైన్మెన్ను చెప్పుతో దాడి చేశాడు ఓ నాయకుడు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలిలా ఉన్నాయి. గొందిరెడ్డిపల్లి, పుల్లలరేవు గ్రామాలకు బోయ నాగరాజు అనే వ్యక్తి లైన్మెన్గా పని చేస్తున్నాడు. గొందిరెడ్డిపల్లికి చెందిన నాగభూషణం, నారాయణస్వామి, లక్ష్మీనారాయణకు ట్రాన్స్ఫార్మర్ మంజూరైంది. ఈ నెల 17న లైన్మెన్ నాగరాజు దగ్గరుండి ట్రాన్స్ఫార్మర్ బిగించారు. ఈ పనిలో తక్కిన 11 కేవీ కండక్టర్ వైరును ట్రాన్స్కో కార్యాలయానికి తరలించారు. అయితే లక్ష్మీనారాయణ అనే వ్యక్తి మిగులు వైరును తనకివ్వాలని లైన్మెన్ను కోరాడు. నిబంధనల ప్రకారం మిగులు వైరును కార్యాలయానికి తరలిస్తామని, ఇవ్వడానికి వీలుకాదని లైన్మెన్ స్పష్టం చేశాడు. ఇది మనుసులో పెట్టుకున్న లక్ష్మీనారాయణ మరుసటి రోజు 18న ఉదయం 9 గంటల సమయంలో గొందిరెడ్డిపల్లిలో ఎదురైన లైన్మన్ను దుర్భాషలాడుతూ దాడికి దిగాడు. కిందపడేసి చెప్పుతో దాడి చేశాడు. స్థానికులు కల్పించుకుని విడిపించారు. రాప్తాడు పీఎస్లో కేసు నమోదు : ఈ ఘటనపై తీవ్ర మనస్థాపానికి గురైన లైన్మెన్ నాగరాజు నేరుగా రాప్తాడు పోలీస్స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. నిందితుడికి అధికార పార్టీ నాయకులు అండ ఉండటంతో పోలీసులూ చూసీ చూడనట్లు వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. కేసు కూడా వెనక్కు తీసుకోవాలని బాధితుడిపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. ఒకానొక సందర్భంలో బెదిరింపులకు గురి చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా బోయ నాగరాజు తనకు జరిగిన అవమానంపై కుల నాయకుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. -
సభలో ద్వంద్వ ప్రమాణాలు
ప్రజాస్వామ్యానికి పాతరేస్తున్న అధికారపక్షం (కె. సుధాకర్ రెడ్డి) ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఏకైక ప్రతిపక్షం పట్ల అధికార తెలుగుదేశం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా అనుసరిస్తున్న వైఖరిపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. శాసనసభలో తమను ప్రశ్నించే వారే ఉండకూడదన్న ధోరణితో వెళుతున్నట్టు ఆయా సందర్భాలు స్పష్టం చేస్తున్నాయని చెబుతున్నారు. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యురాలు ఆర్.కె.రోజాను శాసనసభ నుంచి ఏడాది పాటు సస్పెండు చేసిన వ్యవహారం, తదనంతరం ఉత్పన్నమైన పరిణామాలపై పౌర సమాజంలో తీవ్ర చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన 14వ శాసనసభ ఇప్పటివరకు ఏడుసార్లు సమావేశం కాగా, ప్రతి సమావేశంలోనూ ప్రతిపక్షం పట్ల విషం చిమ్ముతూ నిందాపూర్వక ధోరణి, ఎదురుదాడి కొనసాగించడం తప్ప ఏనాడూ ప్రజాస్వామిక స్పూర్తిని ప్రదర్శించలేదని జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కొత్తగా సభకు వచ్చారు మీకు నిబంధనలు, సంప్రదాయాలు తెలియవు నేర్చుకోండి... అంటూ ప్రతిపక్షాన్ని గేలి చేస్తూనే మరోవైపు అధికార పార్టీయే వాటికి తిలోదకాలివ్వడాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రతిపక్ష సభ్యులు తమను తిట్టారంటూనే తీవ్రస్థాయిలో అభ్యంతరకర పదజాలం ఉపయోగిస్తూ ఎదురుదాడి చేయడం, ప్రతిపక్షనేతపై మూకుమ్మడిగా వ్యక్తిగతదాడి చేయడం అధికారపార్టీ ద్వంద్వప్రమాణాలకు నిదర్శనమంటున్నారు. న్యాయ మూర్తులను, న్యాయ వ్యవస్థలను గౌరవించాలంటూ శాసనసభ వేదికగా గంటకుపైగా చ ర్చ చేసిన అధికార పక్షం నేతలే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పాటించకపోవడం గమనార్హం. ప్రతిపక్షం గొంతెత్తకూడదన్న లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక ధోరణికి రోజా సస్పెన్షన్ వ్యవహారాన్ని ఉదహరిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ నీతికి ఉదాహరణగా అనేక సందేహాలు, సమాధానాలు లేని ప్రశ్నలెన్నో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్రజాస్వామిక ధోరణికి ఉదాహరణలెన్నో... శాసనసభ 340 (2) నిబంధన కింద సస్పెండు చేసే అధికారం లేదని, దానిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని రోజా ప్రకటించిన తర్వాత డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు. అప్పటికే సస్పెన్షన్ వేటుకు గురైన రోజా విషయాన్ని ఆ కమిటీ పరిశీలించి దానిని హక్కుల కమిటీకి నివేదించింది. రోజాను అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో (డిసెంబర్ 18న) ఏడాది పాటు సస్పెండు చేయగా, రెండు నెలల తర్వాత ఫిబ్రవరి 21న సభా హక్కుల కమిటీ (ప్రివిలేజెస్ కమిటీ)ని నియమించారు. సస్పెండు చేసిన రెండు నెలల తర్వాత ఏర్పడిన ఆ కమిటీ అదే అంశంపై రోజాకు నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. సస్పెన్షన్ తీర్మానం పెట్టినప్పుడు సభలో వివరణ ఇచ్చుకోవడానికి ఒక్క క్షణం అవకాశం ఇవ్వలేదు గానీ, కమిటీ ముందు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఇకపోతే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రస్తుత శాసనసభ ఇప్పటివరకు (ప్రస్తుతం జరుగుతున్నవి 7వ సమావేశాలు) మొత్తం ఏడు సార్లు సమావేశం కాగా అనేక సమావేశాల్లో ప్రతిపక్ష నాయకుడిని, ఆయనతో పాటు సభలో లేని, తిరిగొచ్చి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉన్నప్పటికీ ఆయన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై వ్యక్తిగత దూషణలు చేసిన ఎమ్మెల్యేను సభా హక్కుల కమిటీలో నియమించారు. (సభలో లేని వ్యక్తిపై దూషణలు కాదు కదా అసందర్భంగా ఆరోపణలు చేయడానికి కూడా నిబంధనలు అంగీకరించవు) ద్వంద్వప్రమాణాలకు రుజువులివిగో.. శాసనసభ్యురాలు ఆర్ కె రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ విధిస్తూ చేసిన తీర్మానం చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిన అవసరం లేదన్నారు. అలా చెప్పిన వారే ఆ తీర్పును పై కోర్టులో సవాలు చేస్తారు. శాసన వ్యవస్థలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలే వని ఒకవైపు చెబుతారు. మరోవైపు హైకోర్టు మధ్యంతర తీర్పుపై స్టే కోరుతూ అప్పీలు చేస్తారు. రోజాను ఏడాది పాటు సస్పెండు చేయమన్నది శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించినట్టు చెబుతారు. కానీ ఆరోజు ప్రతిపక్షం తీవ్రంగా వ్యతిరేకించిన అంశాన్ని ప్రస్తావించరు. రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ విధిస్తూ తీర్మానం చేసిన తర్వాత దానిపై ప్రతిపక్షం అభ్యంతరం చెబితే తీర్మానం చేయడం పూర్తయింది కాబట్టి దానిపై చర్చకు అనుమతించబోమన్నారు. అది అయిపోయింది. ఆ అంశంపై మాట్లాడొద్దని అడ్డుకున్నారు. ఆ వ్యవహారంపై మళ్లీ చర్చించడానికి వీలులేదన్న వారే... ఆ తీర్మానం చెల్లదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు దానిపై మళ్లీ చర్చించాలని చెబుతారు. శాసనసభ కార్యదర్శి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను స్వీకరిస్తారు. కానీ రోజాను కనీసం అసెంబ్లీ పరిధిలోకి కూడా రానీయకుండా మార్షల్స్ పెట్టి అడ్డుకుంటారు. రోజాపై విధించిన సస్పెన్షన్ తీర్మానం చెల్లదని శాసనసభ కార్యదర్శిని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు ప్రతిని ఆయన స్వీకరిస్తారు. కానీ దానిపై శాసనసభ కార్యదర్శి మాత్రం అప్పీలుకు వెళ్లరు. న్యాయ శాఖ ముఖ్య కార్యదర్శికి శాసనసభా వ్యవహారాలు, నిర్ణయాలతో ఎలాంటి సంబంధం ఉండదు. కానీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆయనతో ధర్మాసనం ముందు అప్పీలు చేయిస్తారు. శాసనసభ నిబంధన 340 (2) కింద రోజాను ఏకంగా ఏడాది పాటు సస్పెండు చేసే అధికారం లేదని ప్రతిపక్షం అన్నప్పుడు మాకు రూల్స్ తెలుసు అంటారు. కానీ హైకోర్టులో వాదనలు వినిపించే ముందు పొరపాటున 340 (2) నిబంధన కింద అని వచ్చిందనీ, నిజానికి రాజ్యాంగంలోని 194 నిబంధన కింద సస్పెండు చేశామని చెప్పారు. శాసనసభలో నియమ నిబంధనలను ప్రతిపక్ష నేత విడమరిచి సోదాహరణకు చెబుతున్నప్పుడు... ఏకంగా రూల్స్ను సస్పెండు చేస్తున్నారు. (స్పీకర్పై ప్రతిపక్షం ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ప్రతిపక్ష నేత రూల్ 71 (2), రూల్ 72 (3) కింద పద్ధతి ప్రకారం చేపట్టాలన్నప్పుడు ఆ రూల్స్ను ఎత్తివేస్తూ అధికార పార్టీ తీర్మానం చేసింది) ఆయా అంశాలపై ప్రతిపక్షం నిరసనలను టెలికాస్ట్ చేయకుండా నియంత్రిస్తారు. కానీ ప్రతిపక్ష సభ్యుల నిరసనల సందర్భంగా శాసనసభ ప్రతిష్టకు భంగకలిగించే విధంగా ప్రవర్తించారంటూ వారిపై వేటు వేస్తారు. సభలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడటానికి మైక్ ఇవ్వరు. కానీ సభలో వాడకూడని (అన్-పార్లమెంటరీ) భాష మాట్లాడారని నిందిస్తారు. ప్రతిపక్ష సభ్యులు హుందాగా వ్యవహరించాలని అంటారు.. కానీ వారిని రాయడానికి వీల్లేనంత తీవ్రమైన పరుషపదజాలంతో తిట్టిపోస్తారు. నన్ను నువ్వు అని ఏకవచనంతో సంబోధిస్తున్నారంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి రగడచేస్తారు.. అదే సమయంలో తమ మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రతిపక్షనాయకుడిపై వ్యక్తిగత దాడి చే యిస్తారు. నిరాధార ఆరోపణలు గుప్పిస్తారు. సభాపతి మైక్ ఇవ్వనంత వరకు ఏ సభ్యుడు మాట్లాడినా అవి రికార్డుల్లోకి వెళ్లవు. రికార్డుల్లోకి వెళ్లని మాటలకు సంబంధించిన (అది కూడా ప్రతిపక్ష సభ్యులకు సంబంధించి మాత్రమే) ఆడియో సీడీలు బయటకు లీక్ చేసి మీరు ఇలా అడ్డగోలుగా మాట్లాడారంటూ వాటిపై రాద్ధాంతం చేస్తారు. స్పీకర్ అనుమతితోనే ఆ సీడీలను విడుదల చేశామని ఒకరోజు చెబుతారు. ఆ ఆడియో సీడీల బయటకు పొక్కడంపై తాను ఎవరికీ అనుమతి ఇవ్వలేదంటూ స్పీకర్ ఆ మాటలను ఖండించినా, దానిపైన అధికార పక్షం మళ్లీ మాట్లాడదు. -
అధికారులు కావలెను
♦ 20 శాఖలకు సారథులు లేరు ♦ అధికార పార్టీ పెద్దలంటే భయం ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే పాలన సక్రమంగా జరగాలి. పాలన సక్రమంగా జరగాలంటే నడిపించే సారథులుండాలి. ఇదేం చోద్యమో గాని జిల్లాలో ఉన్నతాధికారి పోస్టులు ఖాళీగా ఉండిపోతున్నాయి. ఉన్న కొద్దిమందీ అధికార పార్టీ పెద్దలు, వారిదగ్గర పనిచేస్తున్న వారిపెత్తనం భరించలేక..తప్పులు చేయలేక వెళ్లిపోతున్నారు. మరికొందరు ఇటీవల కలెక్టరు ఆగ్రహానికి గురై నిష్ర్కమించారు. ఈ విధంగా జిల్లాలో 20 శాఖలకు ఉన్నతాధికారులు లేరు. ప్రస్తుతం ఇన్చార్జిలతోనే కొనసాగిస్తున్నారు. ద్వితీయశ్రేణి అధికారుల పోస్టుల్లో ఖాళీలు ఉండనే ఉన్నాయి. దీనివల్ల పనుల్లో పురోగతి ఉండటంలేదు. శ్రీకాకుళం టౌన్: జిల్లావ్యాప్తంగా రెవెన్యూ, పంచాయితీరాజ్,ఇంజినీరింగ్, గృహ నిర్మాణం, సంక్షేమ,ఐటీడీఏ ఇలా 69 శాఖలున్నాయి. వాటికి అనుబంధ శాఖలు కొనసాగుతున్నాయి. ఈశాఖల్లో కలెక్టరేటు కీలకమైనది. కలెక్టరు, జాయింట్ కలెక్టరు,జేసీ-2 తర్వాత కీలక స్థానం డీఆర్ఓదే. ఇక్కడి డీఆర్ ఓ వెంకటరావు ఇటీవల ఆర్థిక వ్యవహరాల్లో విమర్శలకు గురవడంతో సెలవుపై వెళ్లాలంటూ కలెక్టరు ఆదేశించారు. దీంతో రెవెన్యూశాఖలో అతికీలకమై న పోస్టు ఖాళీ అయ్యింది. ఇటీవల కలెక్టరు మాట ను ధిక్కరించిన కారణంగా బీసీ సంక్షేమ అధికారి రవిచంద్రను ప్రభుత్వానికి సరెండరు చేశారు. ఆయన స్థానంలో వచ్చేందుకు ఎవరూ సుముఖం గా లేరు. సామాజిక అటవీశాఖ డిఎఫ్ఓ వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన్ను కూడా ప్రభుత్వానికి సరెండరు చేశారు. డిఎస్ఓ ఆనంద్కుమార్నూ కలెక్టరు సరెండర్ చేశారు. ఐటీడీఏ పరిధిలోని డెప్యూటీ డెరైక్టరును దీర్ఘకాలిక సెలవుపై పంపించా రు. ఆర్థిక లావాదేవీల వివాదంలో చిక్కుకున్న ఆర్వీఎం పీఓ రామచంద్రారెడ్డిని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులివి డీఆర్ఓ: దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు డీబీసీడబ్య్లు: ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు ఆర్వీఎం పీఓ: ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు. జిల్లా పౌరసరఫరాల అధికారి: ఆనంద్కుమార్ను బదిలీపై పంపారు. ఆయన స్థానంలో ఎఎస్ఓ స్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమించారు. బిసికార్పోరేషన్ ఈడీ: బదిలీతో ఖాళీ ఏర్పడింది. ఎస్డీసీ ఆమదాలవలస: అనారోగ్యకారణంతో సెలవుపై వెళ్లారు నెడ్ క్యాప్ జిల్లా మేనేజరు: బదిలీపై వెళ్లారు.. డిడి ట్రెజరీస్: బదిలీపై వెళ్లారు( ఇన్చార్జిగా విజయనగరం డిడి) డీపీఓ: వివాదాలవల్ల బదిలీపై వెళ్లారు. డిఎఫ్ఓ సోషల్ ఫారెస్టు: రేంజ్ అధికార్లను వేధించారంటూ సరెండరయ్యారు. ఐసిడిఎస్ పిడి: చక్రధరరావు సస్పెండయ్యారు పరిశ్రమల శాఖ: జిల్లా జనరల్ మేనేజరు డ్వామా ఏపీడీ: మాతృశాఖకు వెళ్లిపోయారు. వాటర్షెడ్ ఏపీఎం:కొంతకాలంగా పోస్టు ఖాళీ అరసవల్లి ఈఓ: రథసప్తమి వేడుకల ముందు బదిలీ అయ్యారు. జిల్లా రిజిస్ట్రార్: కొన్నేళ్లుగా పోస్టు ఖాళీ. జిల్లాపరిషత్: డిప్యూటీ సీఈఓ బదిలీపెవైళ్లారు. జిల్లా పరిషత్: అకౌంట్స్ ఆఫీసరు పోస్టుఖాళీ. జలవనరులశాఖ ఈఈ: ఇక్కడున్న ఇఇ పదోన్నతిపై వెళ్లిపోవడంతో వంశధార ప్రాజక్టులో డిఈఈ రవీంధ్రబాబుకు పూర్తిబాద్యతలు అప్పగించారు. ఐటీడీఏ డీడీ: అవినీతి ఆరోపణల నేపథ్యంలో బదిలీ. వీరికితోడు ద్వితీయశ్రేణి అధికారులు ఇలా జిల్లా వదిలి వెళ్లిన సందర్భాలు లేక పోలేదు. నచ్చని వారికి ఏదో కారణం చూపి బయటకు పంపిస్తున్న జిల్లాకు చెందిన నాయకులు, ఉన్నతాధికారులు తిరి గి ఆస్థానంలో మరొకరిని తీసుకురావడంలో అంత గా శ్రద్ధ తీసుకోక పోవడం వల్ల ప్రభుత్వశాఖల్లో దిగువస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా తయారైంది. అసలే మార్చినెల, ఆపై ఆర్థిక లావాదేవీలు జోరందుకున్న కాలం. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా ఉన్నతాధికారులు లేక దిగువస్థాయి ఉద్యోగులే చక్కబెడుతున్నారన్న విమర్శులున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చెపుతున్న రెండెంకల అభివృద్ధి ఎలాసాధ్యమవుతుందో.. -
సుజలం విఫలం
►మినరల్ వాటర్కు నోచుకోని గ్రామాలు ►ఎన్నికల హామీని గాలికొదిలేసిన ప్రభుత్వం ►డిప్యూటీ సీఎం ప్రారంభించిన మూడు ప్లాంట్లూ మూత ►కరెంటు బిల్లులు చెల్లించక సరఫరా నిలిపివేత ►జిల్లాలో ఏర్పాటు చేసిన ప్లాంట్లు 25 ►ప్రస్తుతం మిగిలినవి 2 మాత్రమే సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రతి గ్రామానికీ మినరల్ వాటర్ అందిస్తామని ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన అధికార పార్టీ.. ఎన్నికల తర్వాత ఆ హామీని అటకెక్కించింది. ఎన్టీఆర్ సుజల పథకం కింద ఇప్పటివరకు జిల్లాలో 25 ఆర్ఓ ప్లాంట్లను మాత్రమే ఏర్పాటు చేసింది. అయితే, ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్లలో ఏకంగా 23 మూతపడగా.. కేవలం 2 ప్లాంట్లు మాత్రమే నడుస్తున్నాయి. డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గం పత్తికొండలో ఆయన చేతుల మీదుగా ప్రారంభించిన మూడు ప్లాంట్లు మూతపడటం గమనార్హం. వాస్తవానికి జిల్లాలోని అన్ని గ్రామాలకు మినరల్ వాటర్ అందించాలంటే 889 ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ.44.45 కోట్లు అవసరమని అంచనా. అయితే, కేవలం 25 ప్రారంభించి.. ఇందులోనూ ప్రైవేటు సంస్థల నిధులు, దాతల ద్వారా ప్రారంభించినవే అధికం. వీటికి కరెంటు బిల్లులు ఇవ్వలేక.. ఏకంగా ప్లాంట్లనే మూతపడేశారు. మొత్తంగా జిల్లాలో ఎన్టీఆర్ సుజల పథకం కాస్తా పడకేసింది. ఒత్తిడితెచ్చి మరీ ఏర్పాటు చేసి... వాస్తవానికి ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు కోసం అధికారులు మొదట్లో నానా హైరానా పడ్డారు. కచ్చితంగా ఏర్పాటు చేయాల్సిందేనన్న ఆదేశాల నేపథ్యంలో ప్రైవేటు సంస్థల మీద ఒత్తిడి తెచ్చి మరీ ఏర్పాటు చేశారు. అయితే, వీటి నిర్వహణ మాత్రం ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు కోసం దాతలు కేవలం గది ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని... మినరల్ వాటర్ యంత్ర పరికరాలను ప్రభుత్వమే సమకూరుస్తుందని అధికారులు హామీనిచ్చారు. దీంతో ప్రైవేటు సంస్థలు తమ స్థలాల్లో ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చారు. తీరా ప్లాంటు ఏర్పాటైన తర్వాత.. దీనిని స్థానిక పంచాయతీకి అప్పగించాలని చెప్పడంతో మా స్థలాన్ని కూడా పంచాయతీకి ఎలా అప్పగిస్తామంటూ వాపోయారు. ప్రభుత్వం ఇచ్చిన యంత్ర పరికరాలు తీసుకెళ్లాలని ప్రైవేటు సంస్థలు కాస్తా తేల్చిచెప్పడంతో జిల్లాలో పలు చోట్ల ప్లాంట్లు మూతపడిన పరిస్థితి ఏర్పడింది. డిప్యూటీ సీఎం ప్రారంభించినా.. పత్తికొండ నియోకవర్గంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్వయంగా మూడు ఆర్ఓ పాంట్లను ప్రారంభించారు. ఇందులో ఏ ఒక్కటీ పనిచేయడం లేదు. మూడు ప్లాంట్లు కూడా మూతపడ్డాయి. బిల్లులు కట్టకపోవడంతో కరెంటు సరఫరా నిలిపేశారు. ఫలితంగా గ్రామాలకు మంచినీరు అందించే ప్రక్రియ కాస్తా మూలకుచేరింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్లాంట్లదీ ఇదే పరిస్థితి. ప్రచారానికే పరిమితం: ఎన్టీఆర్ సుజల రక్షిత మంచినీటి పథకం ప్రచారానికే పరిమితమైంది. రూ.2లకే 20 లీటర్ల మంచినీటిని అందిస్తామని ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని అమలు చేయలేకపోయారు. గ్రామంలో 2 వేలకు పైగా జనాభా కలుషితమైన నీటిని తాగి రోగాలబారిన పడుతోంది. రామలింగ, హుళేబీడ -
కాన్పు కోసం వెళ్లి వివాహిత మృతి
► ఆసుపత్రిని ధ్వంసం చేసిన బంధువులు ► రాజీచేసిన అధికార పార్టీ నేతలు ఉదయగిరి : కాన్పు కోసం వివాహిత ఆసుపత్రికి వెళ్లి మృతిచెందిన సంఘటన ఉదయగిరిలో చోటుచేసుకుంది. దీంతో వివాహిత బంధువులు వైద్యశాలను ధ్వంసం చేశారు. బాధితుల కథనం మేరకు.. స్థానిక షబ్బీర్ కాలనీకి చెందిన పుట్టా ఆదిలక్ష్మి (20) గర్భిణి. గురువారం రాత్రి ఆమెకు నొప్పులు రావడంతో 7.30 గంటల ప్రాంతంలో కుటుంబసభ్యులతో కోట్నీస్ వైద్యశాలకు వచ్చింది. అక్కడ డాక్టర్ శ్యాంప్రసాద్ ఆమెను అడ్మిట్ చేసుకున్నారు. సిబ్బంది కాన్పయ్యేందుకు కొన్ని రకాల ఇంజెక్షన్లు, మాత్రలు ఇచ్చారు. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో అక్కడ పనిచేస్తున్న ఓ మంత్రసాని సాయంతో ఆదిలక్ష్మి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో వైద్యుడు శ్యాంప్రసాద్ అక్కడ లేకుండా నిద్రపోతున్నారు. ఆదిలక్ష్మికి బ్లీడింగ్ ఎక్కువ కావడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో ఆందోళనపడ్డ సిబ్బంది నిద్రపోతున్న వైద్యుడిని లేపడానికి ప్రయత్నించారు. అయితే ఆయనవైపు నుంచి స్పందన రాలేదు. దీంతో ఆందోళన చెందిన బంధువులు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు తరలించేందుకు నిర్ణయించుకొని వాహనాన్ని తెచ్చుకున్నారు. ఇంతలో వైద్యుడు పేషంట్ వద్దకు వచ్చి ఖంగారు పడాల్సిన అవసరం లేదని, తానే చూస్తానని బంధువులకు చెప్పడంతో వారు అక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలో 4.30 గంటల ప్రాంతంలో ఆదిలక్ష్మి ప్రాణాలు వదిలింది. దీంతో లబోదిబోమంటూ బంధువులు తమ దగ్గరి వారికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో మృతురాలి బంధువులు పెద్ద ఎత్తున వైద్యశాలకు చేరుకొని డాక్టర్ నిర్లక్ష్యంపై విరుచుకుపడ్డారు. కొంతమేర ఫర్నీచర్, కిటికీలు పగలగొట్టారు. దాడి జరగవచ్చని భావించిన వైద్యుడు ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఐదు గంటలకే ఎస్సై వెంకటరెడ్డి, విజయకుమార్ తమ సిబ్బందితో ఆసుపత్రి వద్దకు చేరుకున్నాడు. డాక్టర్, సిబ్బందిపై దాడి జరగకుండా అడ్డుకున్నారు. అధికార పార్టీ నేతల రంగప్రవేశం : అధికార పార్టీకి చెందిన కొద్దిమంది నేతలు వైద్యుడి తరపున రంగప్రవేశం చేసి మృతురాలి బంధువులతో బేరసారాలకు దిగారు. ఇరువురుకి రాజీ కుదిర్చారు. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో నగదు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఈ విషయమై డాక్టర్ శ్యాంప్రసాద్ను సాక్షి ఫోన్ ద్వారా వివరణ అడిగేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. డిప్యూటీ డీఎంహెచ్ఓ రాంప్రసాద్ను వివరణ అడగ్గా ఆయన ఈ ఘటనపై విచారణ చేసేందుకు గండిపాలెం పీహెచ్సీ వైద్యుడు ఫైరోజ్ను నియమించామన్నారు. పూర్తిస్థాయి నివేదిక తీసుకొని జిల్లా వైద్యాధికారికి నివేదిస్తామని, ఆయనకు ఫోన్ ద్వారా విషయం చెప్పామన్నారు. -
కొత్త సమస్య!
► అధికార పార్టీలో సీట్ల లొల్లి ► మేం ఎప్పుడు వచ్చినా ముందే.. ► టీడీపీ నేతలతో అధికార పార్టీ తాజా నేత వ్యాఖ్య ► మండిపడుతున్న ఓ వర్గం నేతలు ► కార్యకర్తల్లో గందరగోళం సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలో కొత్త నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంపై పాత నేతలు మండిపడుతున్నారు. పార్టీ గెలిచిన తర్వాత వచ్చి చేరితే ప్రాధాన్యతనిస్తూ.. ముందు నుంచి ఉన్న తమకు వెనుక కుర్చీ ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా పుండు మీద కారం చల్లినట్టు.. మేం ఎప్పుడు వచ్చినా ముందు సీటే అని కొత్తగా పార్టీలో చేరిన నేత వ్యాఖ్యానించడం పట్ల అధికార పార్టీలోని ఒక వర్గం నేతలు అగ్గిమీద గుగ్గిలంఅవుతున్నారు. ఈ పరిస్థితితో తమ వెనుకనున్న కార్యకర్తలకు ఏం సందేశం పంపుతున్నారనే చర్చ జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా సీఎంతో పాటు హెలికాప్టర్లోనే సదరు నేత దిగారు. అంతేకాకుండా సమావేశంలోనూ ముందు వరుస కుర్చీలో కూర్చున్నారు. ఇది చూసి.. మూడో వరుసలో కూర్చున్న అధికార పార్టీ నేతలు తమ పరిస్థితి ఇలా తయారయిందేమిటనే ఆలోచనలో పడిపోయారు. ఎప్పుడు వచ్చామన్నది కాదు.. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా? లేదా... ఇది ఓ సినిమాలోని పాపులర్ డైలాగ్. ఇప్పుడు ఇదే డైలాగ్ను కొత్తగా పార్టీలో చేరిన నేత వ్యాఖ్యానించడం పాత నేతలకు మింగుడు పడటం లేదు. పార్టీలోకి ఎప్పుడు వచ్చామన్నది కాదు.. ఎప్పుడు వచ్చినా ముందు వరుస మాదేనని తన వ్యతిరేక వర్గం నేతలకు వినపడేలా మార్చి 8న కర్నూలులో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో ఆయన వ్యాఖ్యానించారు. దీంతో మూడో వరుసలో కూర్చున్న ఆ పార్టీ నేతలకు ఈ వ్యాఖ్యలు కాస్తా మింగుడు పడలేదు. దీంతో అధికార పార్టీలో తమ స్థానం ఏమిటని ఈ నేతలు చర్చించుకోవడం గమనార్హం. మా స్థానం ఇదేనా? ఎన్నికల ముందు పార్టీలో చేరి.. పార్టీ కోసం కష్టపడితే తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా కొత్త నేతలకు అగ్రస్థానం ఇవ్వడంపై అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్న చందంగా తమ పరిస్థితి మారిపోయిందని వాపోతున్నారు. ఇది కాస్తా అంతిమంగా పార్టీకే ఇబ్బంది కలిగిస్తుందనే విషయాన్ని అధినేత గుర్తించాలని విన్నవిస్తున్నారు. మొత్తం మీద అధికార పార్టీలో చేరికల వ్యవహరం రోజురోజుకీ కొత్త మలుపులకు దారితీస్తోంది. -
ఆరోపణలు ఉన్నా...
► రెగ్యులర్ రిజిస్ట్రార్ గా శివశంకర్ ► వీసీ కనుసన్నల్లోనే నియామకం ► ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాలు నెల్లూరు (టౌన్): వడ్డించేవాడు మనోడైతే బంతి చివర కూర్చొన్న అన్ని సమకూరతాయన్న చందంగా తయారైంది విక్రమ సింహపురి యూనివర్సిటీలో పరిస్థితి. ఇన్చార్జి రిజిస్ట్రార్ శివశంకర్పై అనేక అవినీతి ఆరోపణలు వెలువెత్తుతున్నా ఆయననే శాశ్వత రిజిస్ట్రారుగా నియమిస్తూ పాలకమండలి పచ్చజెండా ఊపింది. అధికార పార్టీ అండ కూడా తోడవ్వడంతో ఆయనకు ఎదురే లేకుండాపోయింది. రిజిస్ట్రార్ అంటే వర్సిటీలో గుమస్తా నుంచి ప్రొఫెసర్ల వరకు పొసగడం లేదు. పా లకమండలి నియామకంతోనైనా వర్సిటీ ప్రక్షాళన జరగుతుందని ఆశపడ్డ వారికి భంగపాటు తప్పడం లేదు. ఆక్కడ జరిగే పైరవీలకు వారు తలొగ్గారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈనెల 14న వీఎస్యూ రిజిస్ట్రార్గా శివశంకర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో అవినీతి ఆరోపణలు ఉన్న వారిని రిజిస్ట్రార్గా నియమించి విద్యావ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఏది ఏమైనా రిజిస్ట్రార్ అవినీతిపై తమ ఉద్యమం ఆపేదిలేదని విద్యార్థి సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఆరోపణలు ఎన్నో... వర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్గా శివశంకర్ హ యాం లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో డిగ్రీ పరీక్షల మూల్యాంకనం విషయంలో వర్సిటీ ఉద్యోగులు, రిజిస్ట్రార్ల మధ్య వివాదం నెలకొంది. వారంరోజులుగా పైగా విధులు బహిష్కరించి ఆందోళనలు నిర్వహించారు. ఇరువర్గాలతో ఎమ్మెల్సీ సోమిరెడ్డి, ఎమ్మెల్యే శ్రీధరరెడ్డిలు సంప్రదింపులు జరిపారు. రిజిస్ట్రార్ అవినీతిపై విచారణ జరిపించాలని లేఖ రాస్తానని వీసీ ఒప్పుకోవడంతో ఉద్యోగుల చేత ఆందోళన విరమింప చేశారు. నేటికీ లేఖ రాయలేదు. డిగ్రీ పరీక్షల నిర్వహణలో అవకతవకలతో పాటు కార్పొరేట్ కళాశాలల దగ్గర భారీగా వసూళ్లకు పాల్పడి ర్యాంకులు ఇచ్చారని విద్యార్థి సం ఘాలు ఆరోపిస్తున్నాయి. అప్పట్లో హడావుడిగా విచారణ సంఘాన్ని ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక ఇచ్చిన ప్రకారం రమణారెడ్డి, మురళీమోహన్, డిప్యూటీ రిజిస్ట్రార్లకు మెమోలు జారీచేశారు. రిజిస్ట్రార్ ఆదేశాలు ప్రకారం మాత్రమే చేశామని వారు చెప్పడంతో వెనక్కుతగ్గారు. డిగ్రీ మూల్యాంకనం విషయంలో రెండు కళాశాలలు అక్రమాలకు పాల్పడిట్లు ధ్రువీకరించారు. నేటికి వాటిపై చర్యలు లేవు. హాస్టల్ భోజ నం, క్రీడల నిధుల్లో రూ.40 లక్షల మేర రిజి స్ట్రార్ అవినీతికి పాల్పడ్డారంటూ విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. రిజిస్ట్రార్కు అనుకూలంగా పాలకమండలి రిజిస్ట్రార్ సొంతవారిని పాలకమండలిలో నియమించుకున్నారని విద్యార్థి నాయకులు ఆరోపిస్తున్నారు. పాలకమండలి సభ్యుడిగా నియమించా ల్సి వస్తుందని ప్రిన్సిపాల్ మురగయ్యను బదిలీ చేసి అనుకూలంగా ఉండే వెంకటరావును నియమించారన్న ఆరోపణలున్నాయి. రానున్నరోజు ల్లో పాలకమండలి అవినీతికి అండగా నిలుస్తుం దా లేక ప్రక్షాళన చేస్తుందాఅనేది వేచిచూడాల్సిందే. -
వెల్దుర్తిలో అధికార పార్టీ వర్గీయుల హల్చల్
మారణాయుధాలతో పట్టుబడిని ఐదుగురు వ్యక్తులు వెల్దుర్తి రూరల్: అత్యంత సమస్యాత్మక గ్రామమైన చెరుకులపాడుకు చెందిన అధికార పార్టీ వర్గీయులు మరోసారి రెచ్చిపోయారు. ప్రతిపక్ష పార్టీ చోటా నాయకుడు లక్ష్యంగా సోమవారం హల్చల్ సృష్టించారు. వెల్దుర్తి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన పాతకక్షలకు ఆజ్యం పోస్తోంది. వివరాల్లోకి వెళితే.. వెల్దుర్తి పట్టణంలో సోమవారం సాయంత్రం ఐదుగురు పైగా అధికార పార్టీ వర్గీయులు ఓ వాహనంతో చెరుకులపాడుకే చెందిన ప్రతిపక్ష పార్టీ నేత ముఖ్య అనుచరుడు మోహన్ను ఢీకొట్టే ప్రయత్నం చేశారు. తాగిన మైకంలో ఉన్న వారు ఈ ఘాతుకానికి పాల్పడగా.. ఆయన తృటిలో తప్పించుకున్నారు. వెంటనే పోలీసుస్టేషన్కు చేరుకుని జరిగిన విషయాన్ని వివరించారు. అప్రమత్తమైన పోలీసులు వాహనంతో పాటు అందులోని వ్యక్తులను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత వాహనాన్ని తనిఖీ చేయగా మరణాయుధాలు బయటపడినట్లు తెలిసింది. అయితే వ్యవహారం అధికార పార్టీకి చెందినది కావడంతో పోలీసులు చర్యలు తీసుకునేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై వెల్దుర్తి ఎస్ఐ తులసీనాగప్రసాద్ను ‘సాక్షి’ వివరణ కోరగా ఆకతాయిలు కొందరు తప్పతాగి హల్చల్ చేస్తున్నారే సమాచారం అందడంతో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అయితే వారి వద్ద ఎలాంటి మారణాయుధాలు లభ్యం కాలేదన్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడవుతాయన్నారు. -
ఊరిస్తున్న ‘నామినేటెడ్’
► పోస్టులపై సీఎం ప్రకటనతో అధికార పార్టీ నేతల్లో చిగురిస్తున్న ఆశలు ► కార్పొరేషన్ స్థాయి పదవుల కోసం పలువురి పోటాపోటీ ► మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులకు పెరుగుతున్న ఆశావహులు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : సుదీర్ఘ కాలంగా వాయిదా పడుతూ వస్తున్న నామినేటెడ్ పదవుల పందేరంపై అధికార పార్టీ నేతల్లో తాజాగా ఆశలు చిగురిస్తున్నాయి. అనేకసార్లు వాయిదా పడుతూ వస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ వ్యవహారంపై పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఇటీవల స్పష్టమైన ప్రకటన చేయడంతో పార్టీ శ్రేణుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ ఉద్యమ కాలంలో పార్టీ జెండాను భుజాన వేసుకొని తిరిగిన అనేకమంది నేతలతోపాటు వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన వారు ఈసారి నామినేటెడ్ పదవులపై భారీ ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రస్థాయి నేతలను ప్రసన్నం చేసుకోవడానికి ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలను వేగవంతం చేశారు. జిల్లా నుంచి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులను ఆశిస్తున్న వారు సైతం ఈసారి ఎక్కువగా ఉండడం.. వివిధ సందర్భాల్లో ఆయా నేతలకు పార్టీ అధిష్టానం నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇస్తామని హామీఇవ్వడం వంటి కారణాలతో జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ముఖ్యనేతలు అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. అప్పటి హామీలతో.. డిసెంబర్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ ఆశించినా దక్కకపోవడం, ఆ సమయంలో మున్ముందు ప్రభుత్వం పరంగా భర్తీచేసే నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇస్తామని పార్టీ ముఖ్యులు భరోసా ఇవ్వడంతో ఆయా నేతలు నామినేటెడ్ పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసి ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్రెడ్డికి రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవి లభించే అవకాశం ఉందని ఆయన అనుచరులు పూర్తి నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన జగదీశ్వర్రెడ్డికి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రంగంలో దింపింది. అయితే ఆయన ఓటమి చెందడం, అదే పార్టీ నుంచి పోటీచేసిన మరో అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి విజయం సాధించారు. దీంతో జగదీశ్వర్రెడ్డి రాష్ట్రస్థాయి పదవీ ఇవ్వాలని పార్టీలోని ఆయన అనుచరులు అధిష్టానాన్ని కోరుతున్నారు. పెరుగుతున్న ఆశావహులు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓటమి చెందిన జైపాల్ యాదవ్, నారాయణపేట నుంచి పోటీచేసిన శివకుమార్రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాథం, గద్వాలకు చెందిన కృష్ణమోహన్రెడ్డి, మహబూబ్నగర్కు చెందిన ఇంతియాజ్ తదితరులు రాష్ట్రస్థాయి పదవులు ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నట్లు సమాచారం. తాజాగా నారాయణపేట నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రాజేందర్రెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో అక్కడ ఇప్పటి వరకు టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న శివకుమార్రెడ్డికి సైతం సమాన ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే రీతిలో అనేక మంది జిల్లా నియోజకవర్గ స్థాయి నేతలు మార్కెట్ కమిటీ, దేవాలయ కమిటీ, గ్రంథాలయ కమిటీ వంటి నామినేటెడ్ పదవులపై దృష్టి సారించి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని 19 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్న ప్రచారం..నియోజకవర్గస్థాయి నేతల్లో జోరు పెంచింది. ఆ పదవి తమకు లభించేలా జిల్లాకు చెందిన మంత్రిని, ఎమ్మెల్యేల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. -
స్వతంత్రులపై అధికార దాడులు
► ప్రచారం చేయకుండా నిర్బంధం ► ప్రేక్షకపాత్ర పోషించిన పోలీసులు ► జల్లో పెరిగిన సానుభూతి ► ఫలితాలపై ప్రభావం చూపనున్న ఓవరాక్షన్ ? వరంగల్ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నిక పోలింగ్ సందర్భంగా తూర్పు నియోజకవర్గ పరిధిలో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థులపై అధికార పార్టీ నేతలు పలు చోట్ల దా డులు చేశారు. టీఆర్ఎస్ నుంచి టిక్కెట్లు రాకపోవడంతో పలువురు స్వతంత్రులుగా బరిలోకి దిగడంతో పాటు.. గెలిస్తే టీఆర్ఎస్లోకి వస్తామంటూ ప్రచారం చేసుకున్నా రు. అయితే, అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్న ధ్యేయంతో ఆ పార్టీ నేతలు పోలీసులు సహాయంతో స్వతంత్ర అభ్యర్థులను గత నాలుగు రోజులుగా ఇక్కట్లకు గురిచేశారు. పోలింగ్ సమయంలోనూ స్వతంత్ర అభ్యర్థులకు ఓటర్లు మొగ్గు చూపడంతో భరించలేని అధికార పార్టీ అభ్యర్థులు స్వతంత్రులపై విరుచుకుపడ్డారు. వా రి తరపున ప్రచారం చేస్తున్న వారిని పోలీ సులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదంతా గమనిస్తున్న ఓట ర్లలో స్వతంత్రుల పట్ల సానుభూతి పెరిగిం ది. ఈ సానుభూతి ఎవరిని ముంచిందో ఫలితాలు వస్తే కానీ తెలియదు. 15వ డివిజన్లో.... వరంగల్ ఎల్బీ నగర్ మాసూం ప్రభుత్వ పాఠశాల పోలింగ్ బూత్ వద్ద అధికార పార్టీ అభ్యర్థి భర్త సాదిక్.. టీఆర్ఎస్ రెబల్ స్వ తంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శారద జోషి భర్త సురేష్ జోషిపై దాడికి పాల్పడ్డాడు. విష యం తెలిసిన స్థానిక ఓటర్లు ఇదే అన్యా య మంటూ సురేష్జోషికి అండగా నిలిచారు. బందోబస్తులో ఉన్న పోలీసులు ఇంతేజార్గంజ్ స్టేషన్కు సమాచారం అందించడంతో సీఐ భీంశర్మ పోలింగ్ బూత్కు వచ్చి సురేష్జోషిని అక్కడే నిర్భందించారు. తనపై దాడి చేసిన వారిని వదిలి దెబ్బలు తగిలినా తన ను నిర్భంధించిడం న్యాయమా అని ప్రశ్నిం చినా సమాధానం ఇవ్వలేదని బాధితుడు వాపోయాడు. చివరకు దాడి చేసిన అభ్యర్థి భర్తను పోలింగ్ బూత్ వద్దకు ర ప్పించగా.. ప్రచారం కోసం తనను వదలాలని సురేష్ జోషి ప్రాధేయపడినా పట్టించుకోలేదు. విషయం తెలుసుకున్న ఏసీపీ సురేంద్రనాథ్ వచ్చి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి వెళ్లా రు. చివరకు సురేష్ జోషి భార్య, అభ్యర్థి శారదజోషి, సోదరితో పాటు పలువురు ధర్నాకు దిగడం, ప్రచారం చేయకుండా ఇం ట్లో ఉంటామని హామీ ఇవ్వడంతో రెండు గంటల అనంతరం పోలీసులు జోషిని వది లిపెట్టారు. అయితే, సురేష్పై దాడి విష యం డివిజన్లో ప్రచారం కావడంతో ఓట ర్లలో ఆయనపై సానుభూతి పెరిగి గెలిచే అవకాశాలు మెరుగైనట్లు సమాచారం. డివి జన్లో మొత్తం 12,539ఓట్లు ఉండగా 4,550(36.29 శాతం) ఓట్లు పోలయ్యా యి. ఇంత తక్కువ పోల్ కావడంతో గె లు పుపై ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 13, 15వ డివిజన్లలో.. వరంగల్ 13వ డివిజన్లోని స్వతంత్ర అ భ్యర్థిగా మాజీ కార్పొరేటర్ ఓని భాస్కర్ సతీమణి పోటీకి దిగారు. స్థానికుడు కావ డంతో పాటు సామాజిక వర్గ ఓట్లు భాస్కర్కు గెలిచే అవకాశమున్నట్లు ప్రచారం సా గింది. దీంతో అధికార పార్టీనేతలు పోలీ సుల సహకారంతో భాస్కర్ ప్రచారం చేసుకోకుండా అడ్డంకులు సృష్టించారు. డివిజన్లో భాస్కర్ పట్ల సానుభూతి పెరగడం వల్ల పోలింగ్లో ఓట్లు ఎక్కువ పడు తున్నట్లు ఫ్రచారం సాగింది. దీంతో పో లింగ్ కేంద్రాల వద్ద ప్రచారం నిర్వహిస్తు న్న స్వతంత్ర అభ్యర్థి అనుచరులను పోలీ సులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన సైతం అధికార పార్టీ అభ్యర్థికి ప్రతి కూలంగా మారినట్లు చెబుతోంది. ఇక పో లింగ్ ముగిసిన అనంతరం 20వ డివిజన్ లో రె బల్ అభ్యర్థి అనుచరులపై అధికార పార్టీ అభ్యర్థి అనుచరులు దాడి చేయగా, ఇరువర్గాలకు గాయాలైనట్లు సమాచారం. అంతకుముందు ఇదే డివిజన్లోని శాంతి నగర్ సన్రైస్ స్కూల్లోని పోలింగ్ కేం ద్రం వద్ద టీఆర్ఎస్, స్వతంత్య్ర అభ్యర్థి మ ద్దతుదారుల నడుమ ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు ఇరువర్గాల ను చెదరగొట్టి పంపించారు. కాగా, తూ ర్పు పరిధి అధికార పార్టీ అభ్యర్థుల పట్ల పోలీసుల ఓవరాక్షన్ ఏ పరిణా మానికి దారి తీసిందో ఓట్ల లెక్కింపుతో తెలుస్తుం ది. అయితే, పోలింగ్ ప్రశాంతంగా జరిగిన ట్లు పోలీసులు ప్రకటించడం విశేషం. -
2019లో జగన్ సీఎం కావడం తథ్యం
జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి డక్కిలి: 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం ఖావడం తథ్యమని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అన్నారు. డక్కిలిలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సీఎం చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమం చేపట్టి అధికారం పోయి ఇంటికెళ్లారన్నారు. అదేవిధంగా 2019లో జరగనున్న ఎన్నికల్లో జన్మభూమి కమిటీలతోనే ఇంటికి పోవడం ఖాయమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరూ భయపడాల్చిన పని లేదన్నారు. న్యాయం కోసం ఎంత దూరమైన పోరాటం సాగిస్తామన్నారు. తాను జెడ్పీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించనప్పటి నుంచి జిల్లాల్లోని అన్ని మండలాల్లో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడా లేనివిధంగా వెంకటగిరి నియోజకవర్గంలో అరాచకపాలన సాగుతోం దన్నారు. అధికారపార్టీ ఇష్టానుసారంగా పని చేస్తోందన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారను. అధికారపార్టీ చేతుల్లో పోలీసు వ్యవస్థ కీలు బొమ్మగా మారిందన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేసినా పోలీసులు పట్టించకోకపోవడంపై మండిపడ్డారు. అధికారపార్టీ ఏది చెబితే అధికారులు అది చేయడం దారుణమన్నారు. గతేడాది వరదలు వచ్చిన సమయంలో రాపూరు మండలం సిద్ధవరంలో ఓ వ్యక్తి మృతి చెందాడన్నారు. అతడి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా మంజూరు చేసిందన్నారు. దీనికి సంబంధించిన చెక్కును కూడా పార్టీల పేరు పెట్టి ఇవ్వకుండా అడ్డుకున్నారన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే లోకాయుక్త ద్వారా కోర్టును ఆశ్రయిస్తామని చెబితే వెంటనే చెక్కును పంపిణీ చేశారన్నారు. అధికారం ఉందని సైదాపురం మండలం పరిషత్ వైస్ ప్రెసిడెంట్ వసంతలక్ష్మిపై సర్పంచ్ సుబ్రహ్మణ్యం నాయుడు దాడిచేశారని, దానిపై ఫిర్యాదు ఇచ్చినా కూడా పోలీసులు పట్టించుకోలేదన్నారు. -
భూమాకు ఎదురుగాలి
► వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేసిన నగర పంచాయతీ వైస్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి ► అదే బాటలో మరికొందరు మండల, గ్రామస్థాయి నాయకులు ఆళ్లగడ్డటౌన్: ఫ్యాన్ గుర్తుపై గెలిచి ఇటీవలే అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి అనుకోని పరిస్థితి ఎదురవుతోంది. పార్టీలతో సంబంధం లేకుండా నాయకులు, కార్యకర్తలు తన వెంటే ఉంటారని భావిస్తూ వచ్చిన ఆయనకు సొంత ఇలాకాలో ఎదురుగాలి వీస్తోంది. నగర పంచాయతీ వైఎస్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేయడం, మరికొందరు గ్రామ, మండలస్థాయి నాయకులు ఆయన బాటలో వెళ్తుండడం ఇందుకు నిదర్శనం. శుక్రవారం ఆళ్లగడ్డలోని తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో డాక్టర్ రామలింగారెడ్డి ఈ మేరకు బహిరంగంగానే ప్రకటించారు. ‘ఎవరో పార్టీని వీడినంత మాత్రాన నేను కూడా మారాలా? నాకు ఆ అవసరం లేదు’ అని పేర్కొన్నారు. డాక్టర్ రామలింగారెడ్డి, ఆయన భార్య డాక్టర్ సరోజిని దాదాపు నాలుగు దశాబ్దాలుగా వైద్య వృత్తిలో ఉంటూ, విద్యా సంస్థలు స్థాపించి, అంకాళ్రెడ్డి మెమోరియల్ సేవా ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తు నియోజవర్గ ప్రజలకు సుపరిచితులుగా ఉన్నారు. గత నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. 20 వార్డులకు 18 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు కేటాయిండంతో వైఎస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. మున్సిపాల్టీకి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన గళం వినిపిస్తూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో భూమా, ఆయన కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ పార్టీ మారడంతో డాక్టర్ రామలింగారెడ్డి ఆయన వెంట వెళ్లారా? వారితో విభే దిస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచాను. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిరభ్యంతరంగా స్వీకరిస్తానని ఆయన ప్రకటించారు. అదేబాటలో పలువురు భూమానాగిరెడ్డి..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడ టం జీర్ణించుకోలేని అనేకమంది లోలోన మదనపడుతున్నారు. ఎవరో ఒకరు ముందుకు వస్తే వారి నాయకత్వంలో పార్టీలోనే ఉంటామని చెబుతున్నారు. భూమా కుటుంబం పీఆర్పీ నుంచి వైఎస్సార్సీపీలోకి వచ్చిన సమయంలో ఆ కుటుంబానికి చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న అనేక కుటుం బాలు వైఎస్సార్పై ఉన్న అభిమానంతో కలిసి నడిచారు. ముఖ్యంగా ఉయ్యలవాడ, చాగలమర్రి, శిరివెళ్ల మండలాల్లో ప్రధాన వర్గాలుగా ఉన్న ముస్లిం మైనార్టీ, క్రైస్తవులు, మరో సామాజిక వర్గం పూర్తిగా మద్దతు తెలిపింది. ఫలితంగానే పీఆర్పీ అభ్యర్థిగా కేవలం 2 వేల మెజార్టీతో గెలిచిన దివంగత ఎమ్మెల్యే శోభా నాగిరెడి ఆ త ర్వాతి ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అభ్యర్థి గంగుల ప్రతాపరెడ్డిపై పోటీ చేసి 36వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు. ఇందులో చాలా వరకు వైఎస్సార్ అభిమానులే ఉన్నారన్న విషయం సుస్పష్టం. అలాంటి వీరంతా ప్రస్తుతం వైఎస్సార్సీపీ నాయకుని కోసం ఎదురుచూస్తున్నారు. -
పచ్చ మార్కు పాలన!
► జిల్లాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గెలిచిన చోట ప్రొటోకాల్ ఉల్లంఘన ► ప్రొటోకాల్పై ప్రశ్నిస్తేఅక్రమ కేసులు బనాయింపు ► నిన్న డాక్టర్ గోపిరెడ్డి, నేడు షేక్ మహ్మద్ ముస్తఫాపై తప్పుడు కేసులు రాష్ర్టంలో అరాచకం రాజ్యమేలుతోంది. ప్రజాస్వామ్యంలో పాలకులు తప్పు చేస్తే ఎత్తిచూపేందుకు ప్రతిపక్షం ఉంటుంది. అయితే పచ్చ పాలకులు తప్పు అని ఎవ్వరు ప్రశ్నించినా అధికార బలంతో అణగదొక్కుతున్నారు. పాలనలో పెడధోరణులు చొప్పిస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. సామాన్యులనే కాదు చివరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై సైతం అక్రమ కేసులు పెడుతూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. సాక్షి, గుంటూరు : జిల్లాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గెలుపొందిన నియోజకవర్గాల్లో ఓటమిపాలైన అధికార పార్టీ నేతలు ఇన్చార్జి పదవి అడ్డుపెట్టుకుని హల్చల్ చేస్తున్నారు. ప్రొటోకాల్ పాటించకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ప్రొటోకాల్పై ప్రశ్ని స్తే తప్పుడు కేసులు పెట్టిస్తూ ఎమ్మెల్యేలను సైతం అరెస్ట్ చేయిస్తున్నారు. నియోజకవర్గాల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. నిన్న నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.. నేడు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మహ్మద్ ముస్తఫాపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడుతున్నారు. తప్పు ఒకరిది శిక్ష మరొకరిది అన్నట్లు పోలీసుల వ్యవహార శైలి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు పట్టని ఉన్నతాధికారులు.. జిల్లాలో నరసరావుపేట, మాచర్ల, గుంటూరు తూర్పు, బాపట్ల, మంగళగిరి నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ నిధులతో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా.. జన్మభూమి లాంటి అధికారిక కార్యక్రమం జరిగినా ఎమ్మెల్యేల కంటే ముందుగా అక్కడి టీడీపీ ఇన్చార్జిలకు అధికారుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. శిలాఫలకాలపై సైతం ఇన్చార్జిల పేరు ఉంటోంది. వారి పేరు ఏ అధికారంతో పెడుతున్నారో అర్థం కాని పరిస్థితి. దీనిపై జిల్లా ఉన్నతాధికారులను ఎన్నిసార్లు కలిసి ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతూపొంతూలేని ప్రొటోకాల్ ఉల్లంఘనలు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో సైతం కార్పొరేషన్ అధికారులు టీడీపీ ఇన్చార్జి మద్దాళ గిరిధర్ను వేదికపై కూర్చోబెట్టి అధికారికంగా ఆయనతో పింఛన్లు ఇప్పించడం వంటివి చేశారు. స్థానిక ఎమ్మెల్యేను అవమానిస్తూ అధికారులు చేస్తున్న ప్రొటోకాల్ ఉల్లంఘనలకు అంతూపొంతూ లేకుండాపోతోంది. తాజాగా ఆదివారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని చంద్రబాబు నాయుడు కాలనీ, మద్దిరాల కాలనీల్లో కార్పొరేషన్ నిధులతో నిర్మించిన సైడ్ డ్రైన్లు, రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం పంపకపోవడంతో పాటు, టీడీపీ ఇన్చార్జి మద్దాళ గిరిధర్ పేరును శిలాఫలకంపై ఉండ టాన్ని జీర్ణించుకోలేని కొందరు వీటిని ధ్వంసం చేశారు. అయితే ఇదేదో ఎమ్మెల్యేనే చేసినట్లు ఆయనతో పాటు 56 మందిపై పెదకాకాని, గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఇప్పటికే పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేశారు కూడా. అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఎమ్మెల్యే ముస్తఫాను సైతం అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. దీనిపై వైఎస్సార్సీపీ జిల్లా నేతలు మర్రి రాజశేఖర్, లేళ్ళ అప్పిరెడ్డి, రావి వెంకటరమణ, కావటి మనోహర్ నాయుడు, కొత్తా చిన్నపురెడ్డి, ఆళ్ళ వీరరాఘవమ్మ ఎస్పీని కలిసేందుకు రాగా ఆయన అందుబాటులో లేకపోవడంతో వెనుతిరిగారు. గత నెలలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కూడా తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇలా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. -
పోలీసులపై తిరగబడిన ఎంపీ వర్గీయులు!
బుట్టాయగూడెం : అటవీప్రాంతంలో ఉన్న గుబ్బల మంగమ్మ గుడి వద్ద అధికారపార్టీకి చెందిన ఓ ఎంపీ వర్గీయులు ఆదివారం మద్యం తాగి హడావుడి సృష్టించారు. పోలీసులపై తిరగబడ్డారు. అదేమని అడిగిన ఆలయ కమిటీ సభ్యులతోనూ వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనపై స్థానికులు, భక్తులు చెప్పిన వివరాల ప్రకారం.. గుబ్బల మంగమ్మ గుడికి కైకలూరు నుంచి వచ్చిన ఎంపీ వర్గీయులు 50 మంది ఆలయ ప్రాంగణంలో మద్యం సేవించి గొడవ చేస్తుండగా, ఇద్దరు పోలీసులు వెళ్లి ఇలా చేయడం తప్పని చెప్పారు. దీంతో మద్యం మత్తులో ఉన్న ఎంపీ వర్గీయులు పోలీసులపై తిరగబడ్డారు. వారితో వాదనకు దిగారు. దీంతో పోలీసులు ఆలయ కమిటీ సభ్యులకు, సర్పంచ్ కోర్స కన్నప్పరాజుకు విషయం చెప్పారు. వారు వెళ్లి ఎంపీ వర్గీయులతో మాట్లాడారు. ఈ సమయంలో ఎంపీ వర్గీయులు వారిపైనా వాదనకు దిగారు. ఇది ఇరువర్గాల మధ్య తోపులాటకు దారితీసింది. ఈ ఘటనలో ఎంపీ వర్గీయులతోపాటు ఆలయ కమిటీ సభ్యులకు గాయాలైనట్టు సమాచారం. దీంతో విషయం తెలుసుకున్న బుట్టాయగూడెం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఎంపీ వర్గీయుల్లో కొందరిని బుట్టాయగూడెం పోలీసుస్టేషన్కి తీసుకువచ్చారు. కేసు నమోదు చేయకుండా ఆలయ కమిటీ సభ్యులకు, ఎంపీ వర్గీయులకు మధ్య పోలీసులు రాజీ చేసి వివాదాన్ని సద్దుమణిగేటట్టు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులను వివరణ అడిగితే గుడివద్ద ఎటువంటి గొడవ జరగలేదని, యాత్రికులకు, ఆలయ కమిటీ సభ్యులకు మధ్య స్వల్ప వాదన చోటుచేసుకుందని చెబుతున్నారు. -
వేధింపుల వల్లే సర్పంచ్ వెంకట్రావు మృతి
ఉప్పలగుప్తం : అధికార పార్టీ నాయకుల వేధింపుల వల్లే ఎస్ యానాం గ్రామ సర్పంచ్ పెట్టా వెంకట్రావు ఆకస్మిక మృతి చెందారని, ఇది ముమ్మాటికీ అధికార పార్టీ హత్యేనని వైఎస్సార్సీపీ జిల్లా ప్రధానకార్యదర్శి శెట్టిబత్తుల రాజబాబు అన్నారు. మంగళవారం రాత్రి సర్పంచ్ వెంకట్రావు మృతి చెందారు. బుధవారం ఎస్.యానాంలో ఆయన కుటుంబసభ్యులను రాజబాబు పరామర్శించారు. వెంకట్రావు భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ఎంతో రాజకీయ అనుభవం కలిగిన వెంకట్రావు ైవె ఎస్సార్సీపీకి అనుకూల సర్పంచ్ కావడంతో అధికార పార్టీ నాయకుల వేధింపులు ప్రారంభమయ్యాయన్నారు. అతడిపై కక్ష సాధింపుతో అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి పదవి నుంచి తప్పించారన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ వెంకట్రావు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి సర్పంచ్ పదవి దక్కించుకున్నారన్నారు. అయినా అధికార పార్టీ నాయకులు ఆయనపై లేనిపోని ఆరోపణలు చేసి రెండోసారి సర్పంచ్ పదవి నుంచి తప్పించారన్నారు. మళ్లీ కోర్టు ఉత్తర్వుల ద్వారా గత నెల 10న సర్పంచ్గా తిరిగి బాధ్యతలు స్వీకరించారన్నారు. దీనిని జీర్ణించుకోలేని అధికార పార్టీ నాయకులు మాన సిక ఒత్తిడికి గురి చేశారని, ఆ క్రమంలోనే ఆయన మృతి చెందారన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు బద్రి బాబ్జి, ఎంపీపీ శిరంగు సత్తిరాజు, పార్టీ నాయకులు దంగేటి రాంబాబు, మోటూరి సాయి, పినిపే జయరాజ్, జోగి రాజా, పుగాకు శ్రీను, జోగి అర్జునరావు, బడుగు శ్రీను, తాడి గోపాలకృష్ణ, యాళ్ళ లక్ష్మీనారాయణ తదితరులు ఆయన వెంట ఉన్నారు. విజయసాయిరెడ్డి పరామర్శ వెంకట్రావు కుటుంబాన్ని బుధవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఫోన్లో పరామర్శించారు. పార్టీ అధ్యక్షుడు జగన్మెహనరెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నందున ఆయన తరఫున కూడా వెంకట్రావుకు సంతాపం తెలిపారు. మాజీ మంత్రి, సీజీసీ సభ్యులు పినిపే విశ్వరూప్ వెంకట్రావు కుటుంబసభ్యులను ఫోన్లో పరామర్శించారు. -
ఆనకట్టల ఆధునికీకరణ జరిగేనా..?
జపాన్ నిధులపైనే ప్రాజెక్టుల భవితవ్యం నిధులు దోచుకుంటున్న అధికార పార్టీ నేతలు బుచ్చిరెడ్డిపాళెం : జిల్లాలో ఆనకట్టల ఆధునీకరణపై నీలినీడలు కమ్ముకున్నా యి.ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వం సొమ్మొకరిది..సోకు మరొకరిది అన్న చందంగా వ్యవహరిస్తోంది. అభివృద్ధి పనులకు నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ అవి తమ ప్రభుత్వం చేస్తున్న పనులుగా అధికార పార్టీ చూపుతోంది. తాజాగా జపాన్ బృం దం రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా జిల్లాలోనూ పర్యటించింది. జపాన్ నిధులతో ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులు చేపట్టి, ఆ క్రెడిట్ తమ ఖాతా ల్లో వేసుకునే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వివరాల్లోకి వెళితే..జపాన్ బృందం ఈ నెల 6న జిల్లాలోని కండలేరు, సంగం ఆనకట్టలను పరిశీలించింది. అయితే వాటి పరిధిలో జరుగుతున్న పనులు, అధికారుల నిర్లక్ష్యాన్ని చూసి జపాన్ బృందం నవ్వుకుంది. వాస్తవానికి జిల్లాలోని కండలేరు, సోమశిల, కనిగిరి రిజర్వాయర్ల అభివృద్ధి పనులు జరగాల్సి ఉంది. గేట్ల మరమ్మతుల మొదలు సామర్థ్యాన్ని పెంచేందుకు పలు పనులు చేపట్టాల్సి ఉంది. అయితే అధికారులు మాత్రం జపాన్ బృందానికి నామమాత్రంగా సంగం ఆనకట్టను, కండలేరు జలాశయాన్ని చూపి మమ అనిపించారు. ఆయా ఆన కట్టల పరిధిలో ఎన్నో కాలువలు నేటికీ అభివృద్ధికి నోచుకోలేదు.ఆనక ట్టల అభివృద్ధికే రూ. 800 కోట్లు అవసరమవుతాయని జపాన్ బృందం అంచనా వేసిన ట్లు సమాచారం. అయితే అంతటితో సరిపెడితే పనిపూర్తి కాదని చివరి పంటకు నీరందేలా కాలువల అభివృద్ధి పనులు కూడా చేయాల్సి వస్తోందని బృందం భావించినట్లు తెలిసింది. ప్రభుత్వం నియమించిన కమిటీ జాడేది..? జిల్లాలోని రిజర్వాయర్లు, కాలువలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఏడాది క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటిం చారు. కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నామన్నారు. రిజర్వాయర్లను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కమిటీ పరిశీలన జరిపి ఏడాది దాటుతున్నా ఆ దిశగా పనులు చేసిన దాఖలాలు లేవు. కేవలం కాలువల పనులు అధికార పార్టీ నేతల దోపిడీకే పరిమితమయ్యాయి. కాలువల అభివృద్ధి ఏదీ? జిల్లాలో కాలువల అభివృద్ధి పనులు నామమాత్రంగా జరుగుతున్నాయి. ఇరిగేషన్ అధికారుల కాసుల కక్కుర్తితో పనులు తూతూమంత్రంగా జరుగుతున్నాయి. రూ.50 లక్షల నిధులతో చేపట్టిన మలిదేవి డ్రెయిన్ పనులు అస్తవ్యస్తంగా జరిగిన విషయం తెలిసిందే. అధికార పార్టీ నేతలకు ఇరిగేషన్ ఏఈ మొదలు ఎస్ఈ వరకు దాసోహమయ్యారు. కాలువ పనుల్లో అవినీతి జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. జపాన్ నిధులతోనే ప్రాజెక్టు భవితవ్యం కాలువల పనుల పేరుతో అధికార పార్టీ నేతలకు ప్రభుత్వం కోట్లు దోచి పెడుతున్న విషయం చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆశలు వదులుకున్న రైతులు జపాన్ నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే జపాన్ బృందం మాత్రం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపింది. పూర్తిగా వివరాలు తీసుకున్న తరువాతే తదుపరి చర్యలు ఉంటాయని ప్రకటించింది. ఈ మేరకు జపాన్ నిధులతో ప్రాజెక్టుల భవితవ్యం తేలనుందని విశ్లేషకులు చెబుతున్నారు. జిల్లాలో ఆనకట్టల ఆధునికీక రణ అటకెక్కింది. జపాన్ నిధులపైనే ప్రాజెక్టుల భవితవ్యం ఆధారపడి ఉంది. ప్రభుత్వం కేటాయించిన నిధులు అధికారపార్టీ నేతల దోపిడీకి గురయ్యాయి. ఫలితంగా సాగునీరు రైతులకు సక్రమంగా అందడంలేదు. -
పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్సార్సీపీ ధర్నా
దాడి చేసినవారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ తాడిపత్రిరూరల్: ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ తాడిపత్రి నియోజకవర్గం సమన్వయకర్త వీఆర్ రామిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సోమవారం పట్టణ పోలీస్స్టేషన్ ఎదుట ధర్నాచేశారు. కార్యకర్త శంకర్పై ముగ్గురు వ్యక్తులు ఆదివారం రాత్రి దాడిచేసి గాయపరచారు. దీనిపై బాధితుడు శంకర్ మిత్రులు సుధాకర్రెడ్డి, రంగస్వామితో కలిసి ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. న్యాయం చేయాల్సిన ఎస్ఐ ఫిర్యాదిదారులపైనే దాడి చేయడం అమానుషమని వీఆర్ రామిరెడ్డి అన్నారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి, వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గంటపాటు పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసేంతవరకు ఇక్కడి నుంచి కదిలేదిలేరని భీష్మించారు. దీంతో సీఐ రామక్రిష్ణారెడ్డి వారికి సర్దిచెప్పారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేస్తామన్నారు. అలాగే కౌన్సిలింగ్ కూడా ఇస్తామని హామీ ఇవ్వడంతో వీఆర్ రామిరెడ్డి, పార్టీ యువజన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భాస్కర్రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బా లరాజు, పట్టణ కన్వీనర్ కంచెంరామ్మోహన్రెడ్డి, నియోజవర్గం యువజన అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి, పెద్దపప్పూరు మండల కన్వీనర్ రఘునాథరెడ్డి, సేవదళ్ అధ్యక్షుడు సంపత్, పట్టణ యుత్ కన్వీనర్ ప్రదీప్రెడ్డి, తదితర నాయకులు,. కార్యకర్తలు ఆందోళన విరమించారు. -
అభివృద్ధి ముసుగులో ఫిరాయింపులా?
స్పీకర్లు పాలకపార్టీల తొత్తులుగా మారితే ఎలా?: వామపక్షాల ధ్వజం సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా పాలకపక్షాలే పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం విస్మయం కలిగిస్తోందని వామపక్ష పార్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లొసుగుల్ని ఉపయోగించుకుని పాలక పార్టీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వ్యాపారంగా మారిపోతున్నాయనే దానికి ఇటీవలి పరిణామాలే సాక్ష్యమని ఆవేదన వ్యక్తం చేశాయి. అధికార సుస్థిరతకే తంటాలు:సీపీఐ తెలంగాణలో తమ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వైపు ఫిరాయించినప్పుడు అనైతికమని గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే పని చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. స్పీకర్లా, పాలకపక్ష మద్దతుదార్లా?: సీపీఎం ఎవరైనా ప్రజాప్రతినిధి తాను గెలిచిన పార్టీ నుంచి తప్పుకుని వేరే పార్టీలో చేరినప్పుడు ఆ వ్యక్తి సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిన స్పీకర్లు సైతం చట్టబద్ధంగా వ్యవహరించడం లేదని, అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.స్వతంత్రంగా వ్యవహరించాల్సిన స్పీకర్లు పాలకపార్టీ లకు తొత్తులుగా మారడం, వాటి ప్రయోజనాలు కాపాడడం దురదృష్టకరమన్నారు. -
అధికారమే పరమావధి
ప్రస్తుతానికి విజయనగరం పురమే కార్పొరేషన్ హోదాను అడ్డుకున్న టీడీపీ నేతలు అధికార పార్టీ నేతలకు పదవులు పోతాయన్న భయం నగరపాలక సంస్థ ఉత్తర్వులు తాత్కాలికంగా నిలుపుదల న్యాయపరమైన అభిప్రాయం వచ్చాక తదుపరి చర్యలు భలే చాన్సులే..లక్కీ చాన్సులే..అధికారంలో ఉన్న మజా అనుభవించితే తెలియనులే.. పవర్లో ఉంటేనే హోదా.. డబ్బు..పలుకుబడి లెక్కలేనంత ఉంటాయి. ఒక్కసారిగా అధికారం పోతే దారిన పోయే దానయ్య కూడా ముఖం తిప్పుకుని పక్కనుంచి వెళ్లిపోతాడని అధికార పార్టీ నేతలు గ్రహించినట్లున్నారు. మున్సిపల్ పాలకవర్గం ఇచ్చిన తీర్మానం ప్రకారం గత ఏడాది డిసెంబర్ 10వ తేదీన విజయనగరం మున్సిపాల్టీని కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాలకవర్గం కూడా తమ హోదా పెరుగుతుందని భావించింది. అయితే పురపాలక సంఘం కార్పొరేషన్గా మారాక కొత్తగా పాలకవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని గ్రహించకుండా.. పాలకవర్గం ఏకపక్ష తీర్మానం చేసి కార్పొరేషన్ హోదా కోసం ప్రభుత్వానికి పంపించేసింది. ఎప్పుడైతే కార్పొరేషన్ ఉత్తర్వులొచ్చి, సాంకేతిక కారణాలు తెలిశాయో పాలకవర్గం కంగుతింది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: కార్పొరేషన్గా మారితే విజయనగరం దశ తిరగనుందని, పెద్ద ఎత్తున అభివృద్ధికి నోచుకుంటుందని పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ హోదా వస్తే ముఖ్యంగా కేంద్రప్రభుత్వం నుంచి వివిధ గ్రాంట్లు మంజూరవుతాయి. ఆర్థిక సంఘం నిధులు పెద్ద ఎత్తున వస్తాయి. నగర పాలక సంస్థ కమిషనర్ హోదాలో కౌన్సిల్ ఆమోదం లేకుండా రూ. 10లక్షల వరకు అభివృద్ధి పనుల కోసం నేరుగా ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది. స్టాండింగ్ కమిటీల ద్వారా రూ. 50లక్షల వరకు అభివృద్ధి పనులకు ఖర్చు చేయడానికి వెసులుబాటు ఉంటుంది. నగరపాలక సంస్థలో పోస్టులు కూడా పెరుగుతాయి. అధికార వికేంద్రీకరణ జరుగుతుంది. ప్రతి విభాగానికి సూపరింటెండెంట్ స్థాయి పోస్టులొస్తాయి. త్వరితగతిన నిర్ణయా లు తీసుకుని, ప్రజలకు సేవలు అందించేందుకు అవకాశం వస్తుంది. ఎన్నికల భయంతో యూటర్న్ కార్పొరేషన్ హోదా ఇచ్చాక అందుకు తగ్గ పాలకవర్గాన్ని ఎన్నుకోవాలనే సరికి ప్రస్తుత పాలకులకు భయం పట్టుకుంది. పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, అసంతృప్తి నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తే గెలవలేమన్న అభద్రతాభావానికి లోనయ్యారు. పదవులు అప్గ్రేడ్ అయితేనే కార్పొరేషన్ గా కొనసాగించాలని, లేదంటే మున్సిపాల్టీగానే ఉంచేయాలని పైరవీలు ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, వైస్చైర్మన్ కనకల మురళి, తదితరులు కొందరు ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని మరీ ప్రభుత్వంపై ఒత్తిడికి దిగారు. ఆ మంత్రిత్వ శాఖలో పైరవీలు కూడా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అలాగే సీఎంను సైతం కలిసి తమ పరిస్థితిని ఏకరువు పెట్టారు. కార్పొరేషన్ ఉత్తర్వుల్ని నిలుపుదల పాలకవర్గం ఒత్తిళ్ల నేపథ్యంతో పాటు ఎన్నికలు నిర్వహిస్తే పరువు పోతుందన్న భయంతో ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది. సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత కార్పొరేషన్ ఉత్తర్వులను నిలుపుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.న్యాయపరమైన అభిప్రాయం వచ్చే వరకు హోదాను అబేయన్స్లో పెడుతున్నట్టుగా ప్రభుత్వం సమర్థించుకుంటోంది. మొత్తానికి పట్టణ ప్రగతికి దోహదపడే కార్పొరేషన్ హోదాకు అధికార పార్టీ నేతలే తూట్లు పొడిచారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అబేయన్స్లో కార్పొరేషన్ ఉత్తర్వులు సాంకేతిక కారణాల దృష్ట్యా విజయనగరం పురపాలక సంఘానికి ఇచ్చిన కార్పొరేషన్ హోదాను అబేయన్స్లో పెట్టాం. న్యాయప రమైన అభిప్రాయం వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటాం. అంతవరకు పురపాలక సంఘంగానే కొనసాగనుంది. - కె.కన్నబాబు, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖ డెరైక్టర్ -
పైసలిస్తే పోస్టునీదే
విజయనగరం ఫోర్ట్: మెంటాడ మండలానికి చెందిన ఓ అభ్యర్థి తనకు అంగన్వాడీ కార్యకర్త పోస్టు ఇప్పించాలని కోరుతూ అధికార పార్టీ నేతను ఆశ్రయించింది. ఈ విషయమై ఆ నేత బదులిస్తూ ‘పోస్టు తప్పనిసరిగా నీకే ఇప్పిస్తాను.. మరి మాకు ఖర్చులు ఉంటాయి. వాటిని భరించగలిగితే పోస్టు ఖాయం. ఇక వెళ్లిపోవచ్చు..’ అంటూ తేల్చిచెప్పారు. గజపతినగరం నియోజకవర్గంలోని గంట్యాడ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని కార్యకర్త పోస్టు కోసం ఓ అభ్యర్థి అధికార పార్టీ నేతను ఆశ్రయించగా సదరు నాయకుడు రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ మొత్తం ఇచ్చేందుకు అభ్యర్థి కూడా అంగీకరించినట్లు సమాచారం. ఇదీ జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీ విషయంలో చాలాచోట్ల జరుగుతున్న వ్యవహారం. కొద్ది నెలల కిందట జరిగిన అంగన్వాడీ నియామకాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే సిఫారుసు చేసిన వారిలో దాదాపు 90 శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలియడంతో డబ్బులు ఇస్తే పని అయిపోతుందనే భావన చాలా మంది అభ్యర్థుల్లో నెలకొంది. వాస్తవ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. తాజాగా అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడటంతో అధికార పార్టీ నేతలు పండగ చేసుకుంటున్నారు. గతంలో మాదిరిగానే అధిక మొత్తంలో దండుకోవచ్చుననే భావనలో చాలామంది తెలుగు తమ్ముళ్లలో ఉన్నట్టు సమాచారం. పోస్టుల వివరాలు.. : మైదాన ప్రాంతంలో 275 పోస్టులు, ఐటీడీఏ పరిధిలో 409 అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మైదాన ప్రాంతంలో 28 కార్యకర్త, 115 ఆయా, 34 మినీ అంగన్వాడీ కార్యకర్త, 98 లింక్ వర్కర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఐటీడీఏ పరిధిలో 16 అంగన్వాడీ కార్యకర్త, 55 ఆయా, 19 మిని అంగన్వాడీ కార్యకర్త, 57 క్రైసీ వర్కర్, 262 లింక్ వర్కర్ పోస్టుల నియామకాలు జరగనున్నాయి. 15 నుంచి ఇంటర్వ్యూలు... : ప్రాజెక్టు వారీగా ఖాళీగా ఉన్న పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఎంపిక కమిటీ చైర్మన్గా జిల్లా కలెక్టర్, మెంబర్ కన్వీనర్గా ఐసీడీఎస్ పీడీ, సభ్యులుగా డీఎంహెచ్ఓ, ఆర్డీఓ, సీడీపీఓలు వ్యవహరిస్తారు. ఈ నెల 15 నుంచి 17 వరకు మైదాన ప్రాంతంలోని అంగన్వాడీ పోస్టులకు , 18 నుంచి 20వతేది వరకు గిరిజన ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. సిఫారుసులుంటేనే...! : అధికార పార్టీ నేత ఎవరికి చెబితే వారికే పోస్టు దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అధికార పార్టీ నేతలు లెటర్హెడ్పై ఇచ్చిన పేర్లకే ఉద్యోగాలు రావడంతో ఈ ఆరోపణలకు ఊతమిస్తున్నాయి. మరోవైపు అధికారులు కూడా టీడీపీ నేత సిఫారుసులకే ప్రాధాన్యమిస్తున్నట్లు బాధిత అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారమే నియామకాలు చేపడతామని అధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతా పారదర్శకం.. ఈసారి అంగన్వాడీ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తాం. దీనికోసం సిబ్బందిని కూడా నియమించనున్నాం. సిఫారుసులను ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టించుకోం. -ఎ.ఇ.రాబర్ట్స్, ఐసీడీఎస్ పీడీ, విజయనగరం -
నేడు మంత్రివర్గంతో జయ భేటీ
చెన్నై, సాక్షి ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికార అన్నాడీఎంకే వేగం పెంచింది. ఈ నెల 2వ వారంలో మరోసారి అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైంది. ఎన్నికల వ్యూహరచనలో భాగంగా పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత నేడు మంత్రివర్గంతో సమావేశం అవుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లేదా మేలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈలోగా చివరి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ పథకాలు, వర్షాలు, వరదల్లో ప్రభుత్వం చేపట్టిన సహాయ కార్యక్రమాలు తదితర అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో వివరంగా చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఈ నెల 2వ వారంలో చట్టసభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్నందున మధ్యంతర బడ్జెట్ను మాత్రమే ప్రవేశపెడతారని అంచనా వేస్తున్నారు. బడ్జెట్లో కొత్తగా ప్రవేశ పెట్టదలుచుకున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం మంత్రుల అభిప్రాయాలను తీసుకుంటారని అంచనా వేస్తున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో అనేక ఆకర్షణీయమైన పథకాలకు సీఎం శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఈ పథకాలన్నింటినీ అసెంబ్లీ సమావేశాల్లో అధికారికంగా ప్రకటించాలని భావిస్తున్నారు. ప్రకటించిన పథకాలను ఎన్నికల ప్రచారంలో ప్రధానాస్త్రాలుగా వినియోగించుకోవాలని పార్టీ భావిస్తోంది. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం కొంతమేర అప్రతిష్టపాలైంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ప్రతిపక్షాలు మరింత రగడ చేసి ప్రభుత్వాన్ని రచ్చకీడ్చాయి. ప్రతిపక్షాల వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు అసెంబ్లీ సమావేశాలను వేదికగా మరల్చుకోవాలని ప్రభుత్వం ఆశిస్తోంది. విపక్షల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పేలా మంత్రివర్గాన్ని సిద్ధం చేయడమే జయ నిర్వహిస్తున్న సమావేశం అంతరార్థమని అంచనా. అలాగే జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని తొలగించేందుకు వీలుగా చట్టాన్ని సవరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు ప్రకటించిన పథకాలకు నిధుల కేటాయింపు, ఏయే పథకాలు పూర్తయ్యాయి అనే వివరాలను బడ్జెట్ నోట్లో ప్రస్తావించనున్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్త పన్నులు లేని బడ్జెట్లను మాత్రమే ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఎన్నికల సమీపిస్తున్న వేళ తాజా బడ్జెట్లో సైతం కొత్త పన్నుల విధింపు జోలికి సీఎం వెళ్లరని అంచనా వేస్తున్నారు. తాజా బడ్జెట్పై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన ప్రభుత్వం కేవలం తుది మెరుగులు దిద్దేందుకే అదివారం మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
రెబల్స్ విపక్షలకు అధికార పార్టీ బంపర్ ఆఫర్
-
జన్మభూమిలో తమ్ముళ్ల బరితెగింపు
► జన్మభూమిలో పచ్చదండు దాష్టీకం ► నిలదీసిన వారిపై దాడులు, ముష్టి ఘాతాలు ► ప్రశ్నించినవారి గెంటివేత అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా గ్రామ సభ వద్ద వ్యక్తి ఆత్మహత్యా యత్నం ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదంటూ జిల్లా వ్యాప్తంగా నిరసనలు, నిలదీతలు జన్మభూమి సభలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. అధికార పార్టీ నేతల నియంతృత్వపోకడలు రాజరిక పాలనను మరోసారి గుర్తు చేస్తున్నాయి. అధికార పార్టీనాయకుల బరితెగింపుతో గ్రామాల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. సమస్యలు పరిష్కరించేందుకు చేపట్టిన సభలు కాస్తా ఆధిపత్యాన్ని చాటుకునే వేదికలుగా మారాయి. సమస్య చెబితే హెచ్చరికలు... ప్రశ్నిస్తే దౌర్జన్యాలు.. ఇదేమని నిలదీస్తే పిడిగుద్దులు... ఇంకా మొండికేస్తే గెంటివేతలు... ఇదీ జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాల తీరు తెన్నూ... సాక్షి ప్రతినిధి, విజయనగరం: జన్మభూమి గ్రామ సభల్లో టీడీపీ నాయకుల దౌర్జన్యం పెచ్చుమీరుతోంది. సమస్యలపై ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగుతున్నారు. జన్మభూమి గ్రామ సభ సందర్భంగా పెద్ద శబ్దంతో బాకాల్లో పాటలు వేయడాన్ని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ నాయకులు, స్థానికులను టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి చావబాదారు. మరోసారి ప్రశ్నించకుండా ముష్టి ఘాతాలు కురిపించారు. విజయనగరం ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ కౌన్సిలర్గా ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులో హైస్కూల్ విద్యార్ధులు పరీక్ష రాస్తుండగా బాకాలు పెట్టి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్న వైనాన్ని ప్రశ్నించినందుకు భౌతిక దాడులకు పాల్పడ్డారు. పార్వతీపురంలోని ఏడో వార్డులోని కేపీఎం హై స్కూల్లో విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. వరండాలో రాస్తున్న విద్యార్థులకు ఈ శబ్దాలు అసౌకర్యంగా మారాయి. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు దేవుపల్లి నాగరాజు, మజ్జి వెంకటేష్లతో పాటు స్థానికులు కూడా టీడీపీ నాయకులను ప్రశ్నించారు. అదే అవకాశంగా భావించిన టీడీపీ కార్యకర్తలు ఉన్న పళంగా వీరిపై దాడులు చేశారు. దొరికిన వారిని దొరికినట్టు చితక్కొట్టారు. టీడీపీ నాయకుల నిర్లక్ష్యాన్ని, పట్టించుకోని వైనాన్ని ప్రశ్నించిన వారంతా ఒక్క సారిగా అవాక్కయ్యారు. తేరుకోకముందే వారిపై టీడీపీ నాయకులు పిడిగుద్దులు కురిపించారు. దీంతో స్థానికులు, వైఎస్సార్సీపీ నాయకులు తలోదిక్కుకు పారిపోయారు. కొత్తవలస మండలం తాడివానిపాలెం గ్రామానికి చెందిన బోని సత్యం తన వద్ద ఎస్సీలకు ఇళ్ల పట్టాలిచ్చేందుకు భూమిని తీసుకుని ఇప్పటి వరకూ ప్రత్యామ్నాయంగా వేరేచోట భూమి ఇవ్వలేదనీ, ఎన్నిమార్లు అధికారులను ప్రశ్నించినా సమాధానం ఇవ్వడం లేదనీ మంచినీటి పథకం ఓవర్ హెడ్ ట్యాంకుపైకి ఎక్కి ఆత్మహత్యా యత్నం చేసాడు. ఎంత మంది చెప్పినా వినలేదు. చాలా సేపు అక్కడే ఉండిపోవడంతో అధికారులు, స్థానికులు బతిమిలాడి మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో అతను కిందికి దిగాడు. మెరకముడిదాం మండలం ఊటపల్లి, మక్కువ మండలం తూరు మామిడి, జామి మండలం భీమసింగి తదితర గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయనీ, కేంద్రాల్లో ఎక్కడా ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో పందికొక్కులు, దొంగల పాలవుతున్నాయనీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఇబ్బందులు కలుగుతున్నాయనీ నిలదీశారు. అలాగే రేషన్ కార్డులు, పింఛన్లను కేవలం అధికార పార్టీ వర్గాల వారికే ఇస్తున్నారని గ్రామసభల్లో నిలదీశారు. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు ఇందిరానగర్లో నిర్వహించిన గ్రామసభలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు ఆశపువేణు, జి.వి.రంగారావు, దానబాబుల ఆధ్వర్యంలో పలువురు నాయకులు అపరిష్కృత సమస్యలు పరిష్కరించమన్నందుకు తెలుగు తమ్ముళ్లు దుర్భాషలకు దిగారు. రేషన్ కార్డులు కొంత మందికే ఇచ్చి రాజకీయం చేస్తున్నారని అధికారులను నిలదీశారు. పూసపాటిరేగ మండలం వెంపడాంలో పిన్నింటి వెంకటరమణ తదితరులు పింఛన్ల మంజూరులో పక్షపాత వైఖరిని ఎండగడుతూ నిలదీశారు. గజపతినగరం మండంల కెంగువలో అనధికారిక కుళాయిలపై మజ్జి రామకృష్ణ తదితరులు ప్రశ్నించగా ఆర్డబ్ల్యుఎస్ ఏఈ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వాదులాట జరిగింది. ఏఎస్ఐ త్రినాధ సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. మెరకముడిదాం మండలం జి.మర్రివలసలో గత సమస్యల్లో ఎన్ని పరిష్కరించారో చెప్పి అప్పుడు గ్రామ సభ నిర్వహించాలని సర్పంచ్ గొర్లె రామారావు నిలదీయగా సంబంధిత ఫైలు తేలేదని అధికారులు చెప్పడం కొసమెరుపు. -
కొడితే దిక్కెవరు?
► {పభుత్వ అధికారులకు అధికార పార్టీ నాయకుల హెచ్చరిక ► దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి యత్నం ► చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్న అధికారులు చంద్రగిరి: ఏరా..పోలీసువయితే మాకేంటి.. అధికారం మాది.. నిన్ను ఇక్కడే తంతా.. ఎవడికైనా చెప్పుకో.. ఇదీ ఓ కానిస్టేబుల్పై టీడీపీ కార్యకర్త తిట్ల పురాణం. మా కార్యకర్తకే అడ్డుచెబుతావా.. అసలు మండలంలో ఉద్యోగం చేయాలని ఉందా? లేదా? కొడితే నీకు దిక్కెవడురా ఇదీ ఓ అధికారిపై టీడీపీ మండలాధ్యక్షుడి గాండ్రింపు. ఏరా.. సర్వే చేయాలని ఎన్నిసార్లు అడగాలి. లెక్కలేదా? ఇది సర్వేయర్పై మరో టీడీపీ కార్యకర్త తిట్ల దండకం. అసలేం జరిగిందంటే.. చంద్రగిరి మండలంలో శనివారం మూడో విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమం ప్రారంభమైంది. కొండ్రెడ్డికండ్రిగ పంచాయతీలో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి విధుల నిమిత్తం కానిస్టేబుల్ జగదీష్ హాజరయ్యాడు. చంద్రన్న కానుక సంచిలో ఏమి ఉంటుందని ఓ మహిళ అడిగింది. అందులో బెల్లం, గోధుమ, నెయ్యి, పప్పు తదితర వస్తువులుంటాయని ఆయన సమాధానం చెప్పారు. ఇంతలో అనంత గుర్రప్పగారిపల్లికి చెందిన ఓ కార్యకర్త చంద్రన్న కానుకలను ఎగతాళి చేస్తావా అంటూ కానిస్టేబుల్ జగదీష్పై దాడికి యత్నించాడు. మరోసారి మాట్లాడితే ఇక్కడే తంతా అంటూ విరుచుకుపడ్డాడు. తర్వాత టీడీపీ మండల అధ్యక్షుడు కానిస్టేబుల్ జగదీష్పైకి దూసుకెళ్తూ దాడికి యత్నించాడు. మండలంలో ఉద్యోగం చేయాలని ఉందా లేదా? అంటూ హెచ్చరించాడు. తిట్ల పురాణం భీమవరం పంచాయతీలో జరిగిన జన్మభూమి కార్యక్ర మంలో అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మండల సర్వేయర్ హేమకుమార్పై తిట్లదండకం అందుకున్నాడు. తన పొలంలో సర్వే చేయాడానికి పిలిస్తే ఎందుకు రాలేదంటూ దుర్భాషలాడాడు. సీరియస్...వెంటనే రాజీ.. ప్రభుత్వ విధుల్లో ఉన్న సర్వేయర్పై దుర్భాషలాడిన మునిరత్నంను వెంటనే అరెస్ట్ చేయాలంటూ తహశీల్దార్ కిరణ్కుమార్ ఆదేశించారు. ప్రభుత్వ అధికారులంటే చులకనైందా అంటూ ఆయన మునిరత్నంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కానీ స్థానిక టీడీపీ చోటానాయకుల ఒత్తిడితో తహశీల్దార్ వెనక్కితగ్గారు. డీఎస్పీ రాజీకి యత్నం విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడికి యత్నించడం, అసభ్యంగా దూషించడం చట్ట ప్రకారం నేరం కావడంతో వారిపై చర్యలు తీసుకోవాల్సిన తిరుపతి వెస్ట్ డీఎస్పీ శ్రీనివాసులు రాజీకి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. స్వయంగా ఆయనే భీమవరానికి వచ్చి సర్పంచ్ నివాసంలో టీడీపీ నాయకులతో పంచాయితీ నిర్వహించారు. -
పచ్చచొక్కాలు వేసుకుని డ్యూటీ చేస్తున్నారు
-
'పోలీసులు పచ్చచొక్కాలు వేసుకుని డ్యూటీ చేస్తున్నారు'
ఆంధ్రప్రదేశ్లో పోలీసులు పచ్చచొక్కాలు వేసుకుని డ్యూటీలు చేస్తున్నారని, ప్రతిపక్షం చేస్తున్న ఉద్యమాలను అణిచేసి సీఎం దగ్గర మంచి మార్కులు కొట్టాలని చూస్తున్నారని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రజాసమస్యలపై పోరాడితే అన్ని సెక్షన్లు అమలులోకి వస్తాయని, ఇదంతా చూస్తే అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని అన్నారు. అనూష కేసులో స్వయంగా టీడీపీ ఎమ్మెల్యే హస్తం ఉందని ఆడియో రికార్డింగు ద్వారా నిర్ధారణ అయినా పోలీసు కమిషనర్ పట్టించుకోలేదని, అలాగే సీఐ భార్య అనుమానాస్పద స్థితిలో మరణించిన కేసులో కూడా పురోగతి లేదని ఆయన విమర్శించారు. కమిషనరేట్లో పైరవీలు చేసేవారికే పోస్టింగులు వస్తున్నాయని ఆరోపించారు. పోలీసుల బెదిరింపులకు తాము ఎట్టి పరిస్థితిలోనూ భయపడేది లేదని, ప్రజాసమస్యలపై వైఎస్ఆర్సీపీ తరఫున పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని గుడివాడ అమర్నాథ్ చెప్పారు. -
అధికార పార్టీతో పొత్తా?
-
అధికార పార్టీతో పొత్తా?
* ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్తో అవగాహనపై కాంగ్రెస్లో మంటలు * దేశంలో ఎక్కడైనా ఇలా ఉందా? * దీనికన్నా పార్టీని గంపగుత్తగా విలీనం చేయడమే మేలు: టీపీసీసీ నేతలు * పొత్తు ప్రస్తావనే ఆత్మహత్యాసదృశం: భట్టి సాక్షి, హైదరాబాద్: స్థానిక ప్రజాప్రతినిధుల కోటా నుంచి శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్తో అవగాహన, పొత్తు కుదుర్చుకునే దిశగా జరుగుతున్న చర్చలపై కాంగ్రెస్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ పొత్తుల చర్చలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అంటూ నిరసన ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘టీఆర్ఎస్తో పొత్తు చర్చ కాంగ్రెస్కు మంచిది కాదు. అధికారంలో ఉన్న పార్టీతో చర్చించడం కంటే గంపగుత్తగా విలీనం చేయడమే మేలు. ఒక ట్రెండు సీట్ల కోసం అధికార పార్టీ దగ్గర మోకరిల్లడం అంటే కాంగ్రెస్ను, ప్రజా ప్రతినిధులను, కేడర్ను అమ్ముకోవడమే. దీన్ని పార్టీ నేతలు, శ్రేణులు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించరు’’ టీపీసీసీ ముఖ్య నేతలు పలువురు స్పష్టం చేస్తున్నారు. చర్చలు జరిపేవారి హోదా ఏమిటో? వరంగల్ ఉప ఎన్నికల్లో ఓటమికి చాలా కారణాలున్నాయని, వాటిపై సమీక్షించుకుని భవి ష్యత్ పోరాటానికి సిద్ధం కావాలని టీపీసీసీలో కొందరు నేతలు సూచనలు చేస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో గెలుపోటములు అత్యంత సహజమని, ఒక్కసారి ఓడిపోతే అధికార పార్టీ దగ్గర దేబిరించడం ఎలా సమంజసమని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ‘‘ప్రతిపక్ష పార్టీ అంటే ప్రజల పక్షాన అధికార పార్టీపై పోరాడటం. ఒక్కసారి ఓడిపోతే ఏమైతది? ప్రతిపక్ష పార్టీ సహజ లక్షణమే అధికార పార్టీపై పోరాడటం. దాన్ని వదిలిపెట్టి ఎవరి ప్రయోజనాల కోసం పొత్తులు, అవగాహనలు అం టూ చర్చలు జరుపుతున్నారో అర్థం కావడం లేదు. అసలు అధికార టీఆర్ఎస్తో చర్చలు ఎవరు జరుపుతున్నారో, పార్టీలో వారి హోదా ఏమిటో తెలుసుకోవడం మంచిది. కొందరు నేతల వ్యక్తిగత, రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నట్టున్నారు. కాంగ్రెస్ ఉనికిని లేకుండా చేసేందుకు కొందరు సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీనిపై అధిష్టానం దగ్గర తేల్చుకుంటాం’’ టీపీసీసీ ముఖ్య నేతలు కొందరు పేర్కొన్నారు. పొత్తు ప్రస్తావనే ఉత్పన్నం కాదు: భట్టి అధికార పార్టీతో ఎన్నికల పొత్తులు, అవగాహన అనే చర్చ రావడమే కాంగ్రెస్కు ఆత్మహత్యాసదృశమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క ‘సాక్షి’ ప్రతినిధితో అన్నారు. ‘‘అధికార పార్టీతో ప్రతిపక్ష పార్టీ ఎక్కడైన చర్చలు జరుపుతుందా? ప్రతిపక్ష పార్టీతో పొత్తులు పెట్టుకోవాలనే ప్రస్తావన రావడమే తప్పు. టీఆర్ఎస్తో పొత్తు లేదా అవగాహన అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. టీఆర్ఎస్ను ఓడించడానికి అవసరమైతే కలిసి వచ్చే మిగిలిన అన్ని ప్రతిపక్ష పార్టీలతో కలిసి పనిచేస్తాం. పొత్తుల చర్చల సంగతి నాకు, టీపీసీసీ అధ్యక్షుడికి తెలియదు. పొత్తు అంటూ ఎవరూ నన్ను, టీపీసీసీ అధ్యక్షుడిని అడగలేదు. టీఆర్ఎస్తో పొత్తుల ప్రస్తావనే కాంగ్రెస్కు ఆత్మహత్యా సదృశం’’ అని ఆయన స్పష్టం చేశారు. అధికార పార్టీ వైఫల్యాలపై పోరాటానికి తమ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు. అధికార పార్టీపై పోరాటంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. -
ఆ డీల్ ఖరీదు వందకోట్లు...
విజయవాడలోని తెలుగు తమ్ముళ్లలో ప్రస్తుతం ఇదో పెద్ద చర్చ. విజయవాడకు చెందిన ఒకరు హఠాత్తుగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆ వెంటనే ఎంపీగా పోటీచేసి రెండుసార్లు వరుసగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర ఛాంపియన్ అంటూ గొంతెత్తారు. ఆ తరువాత రాజకీయాలకు దూరం అని ప్రకటించారు. రాజకీయాల్లో ఉన్న మజా ఏమిటో రుచి చూసిన ఆయన గతంలో తాను ప్రాతినిధ్యం విహ ంచిన పార్టీలో కొనసాగితే రాజకీయంగా భవిష్యత్ లేదని నిర్ధారించుకున్నారు. ఏదో ఒక పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన ఆయన ప్రతిదీ లాభానష్టాలతో బేరీజు వేస్తుంటారు. రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ నుంచి మరో పార్టీలో చేరితే లాభం, నష్టం ఎంతో ఒక అంచనాకు ఆయన వచ్చారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలో చేరితే రానున్న మూడున్నర సంవత్సరాలు ఇష్టం వచ్చినట్లు లబ్ధి పొందవచ్చని భావించిన ఆయన పెద్ద మొత్తంలో సమర్పించుకోవాలని నిర్ణయించారట. త్వరలో అధికార పార్టీలో చేరేందుకు అనువుగా ఇప్పటికే అధినేతతో సంప్రదింపులు జరిపిన ఆయన సుమారు రూ. వందకోట్లు సమర్పించేందుకు సిద్ధపడ్డారట. అంత పెద్ద మొత్తం సమర్పించినందుకు వచ్చే ఎన్నికల వరకూ పార్టీలో చేరిన నేత అడిగిన పనల్లా చేసి పెట్టడంతో పాటు విజయవాడ లోక్సభ నియోజకవర్గ సీటు కూడా ఇస్తానని అధినేత హామీ ఇచ్చారట. ఈ విషయం తెలిసిన తెలుగు తమ్ముళ్లు ఆ డీల్ చాలా పెద్దదట అని చెవులు కొరుక్కుంటున్నారు. -
ఇంటి స్థలం కోసం ప్రాణాలు పణం
♦ మనస్తాపంతో తండ్రి, నలుగురు కొడుకుల ఆత్మహత్యాయత్నం ♦ చికిత్సపొందుతూ ఇద్దరు కొడుకుల మృతి ♦ మరో ఇద్దరి పరిస్థితి విషమం ♦ టీఆర్ఎస్ నాయకుడి ఇంటి వద్ద ఘటన ♦ మహబూబ్నగర్ జిల్లాలో కలకలం జడ్చర్ల: ఇంటిస్థలాన్ని దక్కించుకునేందుకు ఏకంగా తమ ప్రాణాలనే పణంగా పెట్టిందో కుటుంబం. దాయాదులు, మధ్యవర్తి కలసి స్థలాన్ని తమకు కాకుండా చేశారని కలతచెంది ఓ తండ్రి, నలుగురు కొడుకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. వారిలో ఇద్దరు కొడుకులు మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన ఆదివారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లిలో చోటుచేసుకుంది. కురుమయాదవ సంఘం అధ్యక్షుడు గడ్డమీది వెంకటయ్య పదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన దొరసాని సులోచనమ్మ వద్ద 400 గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. అప్పట్లో ఇరువురు బాండ్పేపర్పై ఒప్పందం రాసుకున్నారు. అయితే ఆ స్థలం వారి పేర రిజిస్ట్రేషన్ కాలేదు. ఇటీవల ఆ స్థలంలో కురుమ యాదవ సంఘానికి సంబంధించిన భవనాన్ని నిర్మించాలని.. తమకు సులోచనమ్మ ఆ స్థలాన్ని ఇచ్చిందని దాయాదులు, కులస్తులు నిర్మాణపనులు మొదలుపెట్టడంతో వివాదం రాజుకుంది. తాను కొనుగోలు చేసిన స్థలంలో సంఘ భవనాన్ని ఎలా కడతారని ప్రశ్నించిన వెంకటయ్యను అధికార పార్టీకి చెందిన సర్పంచ్ శ్రీనివాసులు, మండల టీఆర్ఎస్ నాయకుడు ఇర్ఫాన్ తదితరులు బెదిరించారు. దీనిపై జడ్చర్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో వెంకటయ్య తన నలుగురు కుమారులు శ్రీశైలం, మహేశ్, చంద్రశేఖర్, కుమార్లను వెంటబెట్టుకొని ఆదివారం ఉదయం జడ్చర్లలోని ఇర్ఫాన్ ఇంటికి వచ్చాడు. తన స్థల సమస్యను పరిష్కరించాలని కోరాడు. ఆ స్థలం సంఘానికే చెందుతుందని, ఆశలు విడిచి పెట్టుకోవాలని ఇర్ఫాన్ చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వారు తమ వెంటే తెచ్చుకున్న పురుగుల మందును తాగారు. దీంతో బాధితులను వెంటనే బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అందరినీ మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీశైలం(30), మహేశ్(28) మృతిచెంచారు. చంద్రశేఖర్, కుమార్ల పరిస్థితి విషమంగా ఉంది. తమ దాయాదులు, కొందరు కులస్తులు తన కొడుకుల ప్రాణాలను బలిగొన్నారని వెంకటయ్య భార్య మణెమ్మ విలపించింది. పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోకపోవడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని కన్నీరుమున్నీరైంది. రెక్కలకష్టమే జీవనాధారం వెంకటయ్య కుటుంబానికి రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. తనకున్న ఐదెకరాల్లో పత్తి, వరి ఇతర పంటలు సాగుచేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మృతిచెందిన పెద్దకొడుకు శ్రీశైలంకు భార్య సుమిత్రమ్మ, ముగ్గురు కొడుకులు ఉన్నారు. శ్రీశైలం ఆటో నడిపేవాడు. మరణించిన రెండో కుమారుడు మహేశ్కు భార్య యాదమ్మ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మహేశ్ గ్రామంలోనే డోజర్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మరో ఇద్దరు సోదరులు హైదరాబాద్లో ఉంటున్నారు. వివాదానికి కారణమైన స్థలం విలువ రూ.లక్షలోపే ఉంటుందని, ఇందుకోసం ప్రాణాలను పణంగా పెట్టడమంటే వారు ఎంతగా మనస్తాపానికి గురయ్యారోనని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమ వెనుక ఓ రాష్ట్ర మంత్రి ఉన్నారంటూ అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుల బంధువులు ఆరోపించారు. -
టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి వీరంగం
సచివాలయంలో ముఖ్య కార్యదర్శిపై చిందులు సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ ఎమ్మెల్యే వీరంగం సృష్టించారు. ఉన్నతాధికారిపై చిందులు వేశారు. నాకే అపాయింట్మెంట్ ఇవ్వరా అంటూ ఆవేశంతో ఊగిపోయారు. అధికారి చాంబర్ వద్ద గ్లాసు పగులగొట్టారు. ఫైళ్లను విసిరికొట్టారు. సచివాలయంలోని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి పేషీలో జరిగిన ఈ ఘటన ఆ పేషీ అధికారులనే కాదు ఇతర ఉద్యోగులు, సిబ్బందినీ, సచివాలయానికి పనిపై వచ్చినవారినీ విస్మయపరిచింది. వివరాల్లోకి వెళితే... తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు సోమవారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్ను కలిసేందుకు సచివాలయానికి వచ్చారు. అయితే వలవన్ అప్పుడు అధికారులతో సమావేశంలో ఉన్నారు. ఇళ్ల నిర్మాణానికి గాను 10 ఎకరాల స్థలం కేటాయింపు విషయమై చర్చించడానికి పేషీకి వచ్చిన వెలగపూడి సుమారు గంటసేపు అక్కడ వేచిచూశారు. ఎంతకీ అధికారి నుంచి పిలుపురాకపోవడంతో ఎమ్మెల్యే ఆవేశం కట్టలు తెంచుకుంది. ఎమ్మెల్యే ఆవేశం చూసి పేషీ సిబ్బంది భయకంపితులయ్యారు. తర్వాత ఎమ్మెల్యే తలుపులు తోసుకుని ఉన్నతాధికారి సమావేశం గదిలోకి వెళ్లి ఆయన్నుద్దేశించి ఆవేశంగా మాట్లాడారు. సంయమనంతో వ్యవహరించిన వలవన్.. ఎమ్మెల్యే వెలగపూడికి నచ్చజెప్పి, ఫైలుకు సంబంధించిన సమాధానం చెప్పి పంపించినట్టు తెలిసింది. -
వ్యూహాత్మకంగా చెక్!
- విపక్షాల ప్లాన్ను ముందే గ్రహించిన అధికారపక్షం - వాయిదాలు, సస్పెన్షన్లతో వారికి ప్రచారం వస్తుందనే సభ వాయిదా సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల ఎత్తులను ముందే గ్రహించిన అధికార పక్షం.. వాటికి వ్యూహాత్మకంగా చెక్ పెట్టిం ది. రుణమాఫీని (మిగిలిన యాభై శాతం) ఒకే విడతలో బ్యాంకులకు చెల్లించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం నుంచే అసెంబ్లీలో అనుసరించాల్సిన ప్రణాళికను సిద్ధం చేసుకున్న విపక్షాలు.. వ్యవసాయ మంత్రి ప్రకటన తరువాత దాన్ని ఆచరణలో పెట్టాలని భావించాయి. కానీ వివరణలు ముగియగానే స్పీకర్ సభను వాయిదా వేశారు. దీంతో గురువారం ఉదయం సభ ప్రారంభం కావడంతోనే విపక్షాలు ఇదే అంశాన్ని లేవనెత్తి.. గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిం చాయి. దీనిని పసిగట్టిన అధికారపక్షం వారికి అవకాశం ఇవ్వకుండా కొద్దిసేపట్లోనే సభను సోమవారానికి వాయిదా వేసింది. మధ్యలో మూడురోజుల పాటు సమావేశాలు లేనందున ఈ సమస్య సమసిపోతుందని భావించింది. అనూహ్యంగా సభ వాయిదాతో బిత్తరపోయిన విపక్ష సభ్యులు.. అసెంబ్లీ బయట కొద్దిసేపు ధర్నా చేయడం తప్పితే మొత్తం అంశంలో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడంలో విఫలమయ్యారు. ఏదో ఒక సంచలనం సృష్టించడానికి ప్రతిపక్షాలన్నీ ప్రయత్నిస్తాయని టీఆర్ఎస్ అంచనా వేసిందని.. అందుకే వారికి ఏమాత్రం అవకాశమివ్వకుండా కొద్దిసేపు గొడవ జరగ్గానే సోమవారానికి సభ వాయిదా పడేలా పావులు కదిపిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు రైతుల ఆత్మహత్యలపై రెండు రోజుల పాటు జరిగిన చర్చ సందర్భంగా విపక్షాలన్నీ సంయమనంతో వ్యవహరించాయి. ప్రభుత్వం చెప్పేదంతా విన్నాయి. కానీ,చివరికి ప్రభుత్వం వలలో విపక్షాలు చిక్కాయనే అభిప్రాయం వస్తోంది. కాంగ్రెస్, టీడీపీ సహా ఇతర విపక్షాల సభ్యులు కూడా ప్రతిపక్షాలు ఫెయిలయ్యాన్న అభిప్రాయాన్ని అంగీకరిస్తున్నారు. వారికి ప్రచారం ఎందుకని..? విపక్షాలను నియంత్రించడానికి కొద్దిసేపు సభను వాయిదా వేసినా ప్రయోజనం ఉండదని అధికారపక్షం భావించింది. తిరిగి సభ మొదలుకాగానే అదే గందరగోళం సృష్టించే అవకాశం ఉందని.. ఇది వారికి మీడియాలో ప్రచారం క ల్పించడం మినహా మరొకటి కాదనే భావన వ్యక్తమైంది. రైతుల సమస్యలపై రెండు రోజుల్లో ఏకంగా 12గంటల పాటు చర్చ జరిగాక కూడా ఆ అంశాన్ని పట్టుకుని ప్రతిపక్షాలు భీష్మించి, సభను రాజకీయంగా వాడుకునే యత్నం చేస్తున్నందునే వాయిదా నిర్ణయం తీసుకుని ఉంటారని చెబుతున్నారు. విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలుపుతున్న సమయంలో.. మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ ఒకే దగ్గర కూర్చుని ముచ్చటించారు. తర్వాత కొద్దిసేపటికే సభను స్పీకర్ వాయిదా వేశారు.