under-19 world cup
-
శంషాబాద్ ఎయిర్ పోర్టులో గొంగడి త్రిషకు ఘన స్వాగతం.. వీడియో
మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్లో తెలుగు అమ్మాయి గొంగడి త్రిష(gongadi trisha) అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. తన ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత్కు వరుసగా రెండోసారి వరల్డ్కప్ టైటిల్ను త్రిష అందించింది. ఏడు ఇన్నింగ్స్లలో 309 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ది టోర్నీగా త్రిష నిలిచింది.అంతేకాకుండా బౌలింగ్లోనూ తొమ్మిది వికెట్లతో త్రిష సత్తా చాటింది. ఇక భారత్ వరల్డ్కప్ను సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన త్రిష సోమవారం ఆర్ద రాత్రి హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టింది. స్వదేశానికి చేరుకున్న త్రిషకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఘన స్వాగతం పలికారు. త్రిషతో పాటు ద్రితి కేసరి,టీమ్ హెడ్ కోచ్ నూసిన్, ఫిట్నెస్ ట్రైనర్ శాలిని కూడా తమ హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో త్రిష మాట్లాడారు."అండర్ 19 వరల్డ్ కప్లో మేం పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఇక నుంచి మరింత కష్టపడి సీనియర్ టీమ్లో చోటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటాను. వరల్డ్కప్ మెగా టోర్నీలో ఆడుతున్నప్పటికి నేను ఎలాంటి ఒత్తిడిని తీసుకోలేదు. ప్రతీ మ్యాచ్లో నా పాత్రపై మాత్రమే దృష్టి పెట్టాను అని త్రిష పేర్కొంది.మరోవైపు తన సహచర ప్లేయర్ ద్రితిపై త్రిష ప్రశంసల వర్షం కురిపించింది. "ద్రితి అద్భుతమైన ప్లేయర్. కానీ జట్టు కూర్పు వల్ల ఆమెకు ఈసారి ఆడే అవకాశం లభించలేదు. కానీ కచ్చితంగా భవిష్యత్తులో ఆమె అద్భుతాలు సృష్టిస్తుందని" త్రిష కొనియాడింది.ద్రితి మాట్లాడుతూ.. "తొలుత ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కకపోవడం కాస్త బాధగా అన్పించింది. కానీ రెండు మ్యాచ్ల తర్వాత దేశం కోసమే ఆలోచించాను. భారత్కు వరల్డ్కప్ అందించిన టీమ్లో నేను భాగం కావడం చాలా గర్వంగా ఉంది. భవిష్యత్తులో అద్బుతంగా రాణిస్తాన్న నమ్మకం నాకు ఉంది. ఈ టోర్నీలో త్రిష తీవ్రంగా శ్రమించింది" అని చెప్పుకొచ్చారు.చదవండి: ఇంగ్లండ్తో తొలి వన్డే.. సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లిGongadi Trisha, the Player of the Tournament, of #U19T20WorldCup receives a grand welcome at #Hyderabad Airport.HCA President Jagan Mohan Rao extended a grand welcome to the Women's Under-19 T20 World Cup star cricketers #GongadiTrisha, Drithi Kesari, Head Coach Nooshin and… pic.twitter.com/4P4yup74L4— Surya Reddy (@jsuryareddy) February 4, 2025 -
ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ద టోర్నీ'లో త్రిష
అండర్–19 మహిళల టీ20 ప్రపంచకప్ను వరుసగా రెండోసారి సాధించిన భారత జట్టులోని పలువురు ప్లేయర్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీమ్లో చోటు దక్కింది. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో నికీ ప్రసాద్ నేతృత్వంలోని భారత అమ్మాయిల జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై జయభేరి మోగించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీ ఆసాంతం విశేషంగా రాణించిన తెలంగాణ స్టార్ ఓపెనర్ గొంగడి త్రిష సహా మొత్తం నలుగురు భారత క్రికెటర్లకు ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్’లో స్థానం లభించింది. త్రిష ఓపెనింగ్ భాగస్వామి కమలిని, లెఫ్టార్మ్ స్పిన్ ద్వయం వైష్ణవి శర్మ, ఆయుశి శుక్లాలు కూడా ఐసీసీ ఎంపిక చేసిన జట్టులో ఉన్నారు. హార్డ్ హిట్టర్ త్రిష ఈ టోర్నీ చరిత్రలోనే తొలి సెంచరీ సహా 309 పరుగులు చేసింది. లెగ్స్పిన్తో 7 వికెట్లను కూడా పడగొట్టింది. ఆమెతో జోడీగా దిగిన కమలిని 143 పరుగులు చేసింది. ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో కమలిని (50 బంతుల్లో 56 నాటౌట్) అజేయ అర్ధసెంచరీతో ఆకట్టుకుంది. భారత స్పిన్నర్లలో ఆయుశి 14 వికెట్లను చేజిక్కించుకోగా, వైష్ణవి 17 వికెట్లతో టోర్నీలోనే అగ్రస్థానంలో ఉంది. మలేసియాపై ‘హ్యాట్రిక్’తో ఆమె (5/5) అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసింది. ఐసీసీ టీమ్ ఆఫ్ ద టోర్నీ: కైలా రేనెకె (కెప్టెన్; దక్షిణాఫ్రికా), జెమ్మా బోతా (దక్షిణాఫ్రికా), త్రిష, కమలిని, ఆయుశి శుక్లా, వైష్ణవి శర్మ (భారత్), డేవినా పెరిన్, కేటీ జోన్స్ (ఇంగ్లండ్), కావొంహె బ్రే (ఆ్రస్టేలియా), చమొది ప్రబొద (శ్రీలంక), పూజ మహతో (నేపాల్), 12వ ప్లేయర్: ఎన్తబిసెంగ్ నిని (దక్షిణాఫ్రికా).చదవండి: అదరగొడుతున్న ‘అభి’ -
టీ20 వరల్డ్ కప్ విజేతలకు బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లంటే?
మహిళల అండర్ 19 టీ20 ప్రపంచకప్ 2025 ఛాంపియన్స్గా భారత జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించిన భారత్.. వరుసగా రెండోసారి అండర్–19 టి20 ప్రపంచకప్ టైటిల్ను కైవసం చేసుకుంది.ఫైనల్ మ్యాచ్లో తెలుగమ్మాయి గొంగడి త్రిష ఆల్రౌండ్ షో అదరగొట్టింది. తొలుత బౌలింగ్లో మూడు వికెట్లు పడగొట్టిన త్రిష.. అనంతరం బ్యాటింగ్లోనూ 44(నాటౌట్) సత్తాచాటింది. ఫలితంగా దక్షిణాఫ్రికా నిర్ధేశించిన 83 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్.. 11.2 ఓవర్లలోనే ఊదిపడేసింది.బీసీసీఐ భారీ నజరానా..ఇక వరుసగా రెండోసారి వరల్డ్ ఛాంపియన్స్గా నిలిచిన భారత జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నజరానా ప్రకటించింది. విజేత జట్టుకు రూ. 5 కోట్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ఆదివారం బోర్డు వెల్లడించింది. ‘విశ్వ విజేతలకు శుభాకాంక్షలు. అండర్–19 ప్రపంచకప్ టైటిల్ నిలబెట్టుకున్న జట్టు సభ్యులకు నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించాం.రెండోసారి వరల్డ్కప్ గెలిచిన జట్టు, సహాయక సిబ్బంది రూ. 5 కోట్లు అందిస్తాం’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోకుండా టైటిల్ గెలిచిన భారత జట్టుకు హైదరాబాద్కు చెందిన నౌషీన్ అల్ ఖదీర్ హెడ్ కోచ్గా వ్యవహరించింది. ఈ విజయం దేశంలో మహిళల క్రికెట్ ప్రాధాన్యత మరింత పెంచుతుందని బోర్డు అధ్యక్షుడు రోజర్ బిన్నీ అన్నారు.జట్టంతా సమష్టిగా రాణించడంతోనే ఈ ప్రదర్శన సాధ్యమైందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. 2023లో తొలిసారి జరిగిన అండర్–19 టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కూడా అప్పట్లో బోర్డు రూ. 5 కోట్ల నజరానా అందించింది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
భవిష్యత్ బాగుంది!
ఐసీసీ మహిళల అండర్–19 ప్రపంచకప్ ఆసాంతం రాణించిన భారత జట్టు... డిఫెండింగ్ చాంపియన్ హోదాకు న్యాయం చేస్తూ సంపూర్ణ ఆధిపత్యంతో వరుసగా రెండోసారి జగజ్జేతగా ఆవిర్భవించింది. ప్రత్యర్థికి పైచేయి సాధించే అవకాశం కాదు కదా... కనీసం కోలుకునే చాన్స్ కూడా ఇవ్వకుండా చెలరేగిపోయింది. వరల్డ్కప్ మొత్తం పరాజయం అన్నదే ఎరగకుండా ముందుకు సాగిన యువ భారత్... ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ చాంపియన్గా నిలిచింది.ఫైనల్కు ముందు ఆడిన ఆరు మ్యాచ్ల్లో నాలుగింట ఛేజింగ్ చేసిన టీమిండియా... అన్నీ మ్యాచ్ల్లోనూ రెండు వికెట్లు కూడా కోల్పోకుండానే లక్ష్యాన్ని అధిగమించింది. తొలుత బ్యాటింగ్ చేసే చాన్స్ వస్తే దంచి కొట్టడం... బౌలింగ్ చేయాల్సి వస్తే ప్రత్యర్థిని కట్టిపడేయడం టోర్నీ మొత్తం ఇదే ప్రణాళిక అవలంబించి విజయవంతమైంది.బ్యాటింగ్లో తెలుగమ్మాయి గొంగడి త్రిష ఆకాశమే హద్దుగా చెలరేగితే... తమిళనాడు అమ్మాయి కమలిని ఆమెకు చక్కటి సహకారం అందించింది. బౌలింగ్లో స్పిన్ త్రయం వైష్ణవి శర్మ, ఆయుషి శుక్లా, పారుణిక సిసోడియా యువ భారత విజయాల్లో కీలక పాత్ర పోషించింది. మెగా టోర్నీలో మన యంగ్ ‘స్టార్ల’ ప్రదర్శనలను ఓసారి పరిశీలిస్తే... –సాక్షి క్రీడావిభాగం కమలిని కమాల్ టోర్నీలో ఓపెనర్గా బరిలోకి దిగిన తమిళనాడుకు చెందిన కమలిని 7 మ్యాచ్లాడి 143 పరుగులు చేసింది. అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మూడో స్థానం దక్కించుకున్న కమిలిని 35.75 సగటుతో పరుగులు రాబట్టింది. అందులో 2 అర్ధశతకాలు ఉన్నాయి. లీగ్ దశలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన కమలిని ‘సూపర్ సిక్స్’లో స్కాట్లాండ్తో పోరులో 51 పరుగులు చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించింది. ఇక ఇంగ్లండ్తో సెమీఫైనల్లో దంచికొట్టిన కమలిని 56 పరుగులు చేసి అజేయంగా జట్టును ఫైనల్కు చేర్చింది. ఈ టోర్నీలో త్రిష విజృంభించడంతో ఆమె మెరుపుల ముందు కమలిని ప్రదర్శన మరుగున పడినా... జట్టుకు అవసరమైన ప్రతి సందర్భంలో ఈ తమిళనాడు వికెట్ కీపర్ రాణించింది. అండర్–19 ఆసియా కప్లోనూ ఆకట్టుకున్న కమలినిని మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ రూ. 1 కోటీ 60 లక్షలకు కొనుగోలు చేసుకుంది. ఇంట్లో సోదరులను చూసి క్రికెట్ ఆడటం నేర్చుకున్న కమలిని కొంత కాలం తర్వాత ఆటనే కెరీర్గా ఎంచుకోవాలని భావించి తీవ్ర సాధన చేసింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని నిలకడగా రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడమే తదుపరి లక్ష్యంగా కమలిని ముందుకు సాగుతోంది. ‘సూపర్’ సనిక దక్షిణాఫ్రికాతో తుదిపోరులో ఫోర్ కొట్టి భారత జట్టును విజయతీరాలకు చేర్చిన సనిక చాల్కె కూడా... ఈ టోర్నీలో తనదైన ముద్ర వేసింది. వెస్టిండీస్తో జరిగిన టోర్నీ ఆరంభ పోరులో రైజింగ్ స్టార్ త్రిష త్వరగా అవుటైన సమయంలో అజేయంగా జట్టును గెలిపించిన ముంబైకి చెందిన సనిక... ఆ తర్వాత అవకాశం వచ్చిన ప్రతిసారి మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. దక్షిణాఫ్రికాతో తుదిపోరులోనూ ఓపెనర్ కమలిని తక్కువ స్కోరుకే వెనుదిరిగినా... త్రిషతో కలిసి చక్కటి భాగస్వామ్యం నమోదు చేసింది. వరల్డ్కప్లో వైస్కెపె్టన్గానూ వ్యవహరించిన సనిక... మున్ముందు కూడా ఇదే జోరు కొనసాగించాలనుకుంటున్నట్లు వెల్లడించింది. వైష్ణవి స్పిన్ మాయ మధ్యప్రదేశ్ గ్వాలియర్కు చెందిన వైష్ణవి శర్మ... తన లెఫ్టార్మ్ స్పిన్ మాయాజాలంతో భారత అండర్–19 జట్టు వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. టోర్నీ ఆసాంతం రాణించిన వైష్ణవి 17 వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఐసీసీ అండర్–19 వరల్డ్కప్ ఒక ఎడిషన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా వైష్ణవి రికార్డుల్లోకెక్కింది. మలేసియాలోపై హ్యాట్రిక్ సహా కేవలం 5 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టిన వైష్ణవి... మరో మూడు మ్యాచ్ల్లో మూడేసి వికెట్లు పడగొట్టింది. బంగ్లాదేశ్పై 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన వైష్ణవి, స్కాట్లాండ్పై 5 పరుగులే ఇచ్చి 3 వికెట్లు ఖాతాలో వేసుకుంది. ‘సూపర్ సిక్స్’ దశలో స్కాట్లాండ్పై 23 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన ఈ మధ్యప్రదేశ్ స్పిన్నర్... ఇంగ్లండ్తో సెమీఫైనల్లో 23 పరుగులిచ్చి 2 వికెట్లు ఖాతాలో వేసుకుంది. దాదాపు ఆడిన ప్రతి మ్యాచ్లోనూ స్పిన్తో తనదైన ముద్రవేసిన వైష్ణవి శ్రీలంకపై మ్యాచ్లో 3 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టింది. పారుణిక ప్రతాపం భారత అండర్–19 జట్టు వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలవడంలో స్పిన్నర్లు కీలకపాత్ర పోషించగా... అందులో పారుణిక కూడా ఉంది. వైష్ణవి, ఆయుశికి తోడు తన లెఫ్టార్మ్ స్పిన్తో ఢిల్లీకి చెందిన పారుణిక సిసోడియా ప్రత్యరి్థని వణికించింది. 6 మ్యాచ్లాడిన పారుణిక 5.80 సగటుతో 10 వికెట్లు పడగొట్టింది. ఇంగ్లండ్తో సెమీఫైనల్లో 21 పరుగలిచ్చి 3 వికెట్లు పడగొట్టిన పారుణిక... ఫైనల్లో ప్రత్యరి్థని తన స్పిన్తో ఉక్కిరిబిక్కిరి చేసింది. 4 ఓవర్లలో కేవలం 6 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసి... దక్షిణాఫ్రికా జట్టు భారీ స్కోరు వేయకుండా అడ్డుకట్ట వేసింది. ఆయుశి అదరహో ఒకవైపు తన స్పిన్తో వైష్ణవి ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తుంటే... ఆమెకు ఆయుశీ శుక్లా తోడవడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. గింగిరాలు తిరిగే బంతులతో బ్యాటర్లను తికమిక పెట్టిన ఆయుశి వరల్డ్కప్లో 7 మ్యాచ్లాడి 5.71 సగటుతో 14 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. స్కాట్లాండ్తో పోరులో 8 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీసిన ఆయుశి భారత విజయాల్లో కీలక పాత్ర పోషించింది. వైష్ణవి బౌలింగ్లోనైనా ప్రత్యర్థులు అడపాదడపా భారీ షాట్లు ఆడగలిగారు కానీ... ఆయుశి మాత్రం బ్యాటర్లను స్వేచ్ఛగా ఆడనివ్వకుండా కట్టిపడేసింది. వైవిధ్యమైన బంతులతో ఫలితం సాధించింది. వెస్టిండీస్పై 2 వికెట్లు, మలేసియాపై 3 వికెట్లు, శ్రీలంకపై ఒక వికెట్, ఇంగ్లండ్పై 2 వికెట్లు తీసి సత్తా చాటింది. షబ్నమ్ సత్తా... భారత మహిళల జట్టు వరుసగా రెండోసారి అండర్–19 ప్రపంచకప్ గెలవడంలో... మరో తెలుగమ్మాయి పాత్ర కూడా ఉంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన 17 ఏళ్ల షబ్నమ్ షకీల్ తన మీడియం పేస్ బౌలింగ్తో ఆకట్టుకుంది. గత ప్రపంచకప్లోనూ బరిలోకి దిగిన ఈ తెలుగమ్మాయి. ఈసారి ఏడు మ్యాచ్లు ఆడి 4 వికెట్లు పడగొట్టింది. స్పిన్నర్లు ప్రధాన పాత్ర పోషించిన ఈ టోర్నీలో పేసర్గా తన బాధ్యతలు నిర్వర్తించింది. మెరుగైన ఎకానమీ నమోదు చేయడంతో పాటు... ప్రత్యరి్థపై ఒత్తిడి పెంచి సహచర బౌలర్లకు వికెట్లు దక్కడంలో కీలక పాత్ర పోషించింది. మరోవైపు కేరళకు చెందిన జోషిత 6 మ్యాచ్లాడి 6 వికెట్లు పడగొట్టింది. -
తొలి కల నెరవేరింది
క్రికెట్ బ్యాట్ పట్టుకున్నప్పటి నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనే ఏకైక లక్ష్యం పెట్టుకున్నానని... అలాంటిది అండర్–19 స్థాయిలోనే రెండుసార్లు టి20 ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టులో భాగం కావడం చాలా సంతోషంగా ఉందని రైజింగ్ స్టార్ గొంగడి త్రిష పేర్కొంది. మలేసియా వేదికగా జరిగిన మహళల అండర్–19 టి20 వరల్డ్కప్లో అద్వితీయ ప్రదర్శన కనబర్చి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన 19 ఏళ్ల త్రిష తన తొలి కల నెరవేరిందని పేర్కొంది. సీనియర్ జట్టులోనూ అవకాశం దక్కితే నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నానంటున్న తెలుగమ్మాయి త్రిషతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ...రెండు సార్లు ప్రపంచకప్ గెలవడం ఎలా అనిపిస్తోంది? ఈ ఆనందం మాటల్లో వర్ణించలేను. సాధారణంగా అండర్–19 ప్రపంచకప్లో ఒక్కసారి పాల్గొనే అవకాశం రావడమే కష్టం. అలాంటిది నాకు రెండుసార్లు ఆ చాన్స్ వచ్చింది. చిన్న వయసు నుంచే రాణిస్తుండటంతో రెండుసార్లు వరల్డ్కప్ ఆడగలిగా. జట్టు విజయాల్లో నావంతు పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉన్నాను. ‘ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్’గా నిలవడంపై స్పందన? 2023లో జరిగిన ప్రపంచకప్లో బ్యాటింగ్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు రాలేదు. ఈసారి ఓపెనర్గా బరిలోకి దిగడం కలిసొచ్చింది. నా ప్రదర్శన జట్టు విజయానికి దోహదపడితే అంతకుమించి ఇంకేం కావాలి. టోర్నీ టాప్ స్కోరర్గా నిలవడంతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డులు గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. వరల్డ్కప్నకు ముందు ఎలాంటి సాధన చేశారు? కెరీర్లో అత్యధికంగా హైదరాబాద్లోనే ప్రాక్టీస్ చేశా. మిథాలీ రాజ్ ఆట అంటే నాకు చాలా ఇష్టం. ఆమె అడుగు జాడల్లోనే సుదీర్ఘ కాలం భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని అనుకుంటున్నా. హైదరాబాద్కే చెందిన నౌషీన్ అల్ ఖదీర్ భారత అండర్–19 జట్టు హెడ్ కోచ్గా ఉండటం కూడా కలిసొచ్చింది. ఆమెకు నా ఆటతీరు బాగా తెలియడంతో మెరుగయ్యేందుకు తగిన సూచనలు ఇస్తూ ప్రోత్సహించింది. జట్టు సభ్యులతో మీ అనుబంధం? చాన్నాళ్లుగా అండర్–19 జట్టు తరఫున ఆడుతున్నాను. ప్లేయర్ల మధ్య మంచి అనుబంధం ఉంది. అండర్–19 ఆసియా కప్లోనూ దాదాపు ఇదే జట్టుతో ఆడాం. అక్కడా విజేతగా నిలవగలిగాం. ఇప్పుడు అదే టీమ్ స్పిరిట్ ఇక్కడ కూడా కొనసాగించాం. ప్లేయర్లంతా ఒక కుటుంబంలా ఉంటాం. ఈ వరల్డ్కప్లో మీకు అప్పగించిన బాధ్యతలు? ప్రపంచకప్ ప్రారంభం కావడానికి ముందే జట్టు యాజమాన్యం నా బాధ్యతలను స్పష్టంగా వివరించింది. ఓపెనర్గా బరిలోకి దిగుతుండటంతో బ్యాటింగ్ భారంమోయాల్సి ఉంటుందని ముందే తెలుసు. కేవలం వ్యక్తిగత ప్రదర్శనే కాకుండా... జట్టుగానూ అంతా కలిసి కట్టుగా కదంతొక్కడంతోనే రెండోసారి ప్రపంచకప్ గెలవగలిగాం. గత ప్రపంచకప్నకు, ఈ వరల్డ్కప్నకు మధ్య మీ ప్రదర్శనలో వచ్చిన తేడా ఏంటి? 2023లో జరిగిన ప్రపంచకప్లో మిడిలార్డర్లో బ్యాటింగ్ చేశా. ఆ సమయంలో అంతర్జాతీయ అనుభవం ఉన్న షఫాలీ వర్మ, రిచా ఘోష్లతో పాటు మరికొంత మంది సీనియర్ ప్లేయర్లు జట్టులో ఉండటంతో ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేడు. 2023 ఫైనల్లోనూ టాప్ స్కోరర్గా నిలిచినా... చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించలేక పోయా. దీంతో ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని ముందే అనుకున్నాను. నా ప్రణాళికలు ఫలించాయి. మీ ఆటతీరు వెనుక కుటుంబ సభ్యుల పాత్ర ఎంత ఉంది? కేవలం ఈ ప్రపంచకప్లో నా ప్రదర్శన అనే కాదు... నేనీస్థాయికి రావడం వెనక మా నాన్న రామిరెడ్డి కృషి ఎంతో ఉంది. ఆయన చేసిన త్యాగాలే ఈ రోజు నా బ్యాట్ నుంచి పరుగుల రూపంలో వస్తున్నాయనుకుంటా. ప్రతి దశలో మా నాన్న నాకు అండగా నిలవడంతోనే నిలకడైన ప్రదర్శన కనబర్చగలిగాను. ఎక్కడ మ్యాచ్ జరిగినా నా వెంట నాన్న ఉంటారు. వరల్డ్కప్ మొత్తం నా వెన్నంట నిలిచి... ఎప్పటికప్పుడు నాలో స్ఫూర్తినింపారు. అందుకే ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డును మా నాన్నకు అంకితమిస్తున్నాను. భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? అవకాశం వచ్చిన ప్రతిసారి రాణించాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నాను. వ్యక్తిగతంగా ఇప్పటికి నా మొదటి కల నెరవేరింది. అవకాశం వస్తే సీనియర్ జట్టు తరఫున కూడా ఇదే ప్రదర్శన కొనసాగించాలనుకుంటున్నా. టోర్నీలో త్రిష గణాంకాలు మ్యాచ్లు 7 ఇన్నింగ్స్లు 7 పరుగులు 309 అత్యధిక స్కోరు 110 సగటు 77. 25 సెంచరీలు 1 ఫోర్లు 45సిక్స్లు 5 అభినందనల వెల్లువఅండర్–19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు అభినందనలు. ఇది భారత నారీ శక్తికి నిదర్శనం. సమష్టి కృషి, సడలని సంకల్పానికి దక్కిన ఫలితం ఇది. ఈ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది. –నరేంద్ర మోదీ, ప్రధానమంత్రివరుసగా రెండోసారి అండర్–19 ప్రపంచకప్ గెలిచిన యువ భారత జట్టుకు అభినందనలు. ఈ విజయం చాలా మందికి స్ఫూర్తి. భవిష్యత్తు కోసం కొత్త ప్రమాణాలు నిర్దేశించింది. –సచిన్ టెండూల్కర్ ఐసీసీ మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన యువ భారత జట్టుకు ప్రత్యేక అభినందనలు. రెండోసారి ఈ ట్రోఫీ చేజిక్కించుకోవడంలో తెలుగు అమ్మాయిలు గొంగడి త్రిష, షబ్నమ్ కీలకపాత్ర పోషించడం ఈ ఆనందాన్ని రెట్టింపు చేసింది. –వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వరుసగా రెండోసారి మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు అభినందనలు. ట్రోఫీ చేజిక్కించుకోవడంలో తెలంగాణ ప్లేయర్ త్రిష కీలకపాత్ర పోషించింది. త్రిష లాంటి క్రీడాకారులు రాష్ట్రానికి గర్వకారణం. త్రిష భవిష్యత్తులో భారత సీనియర్ జట్టు తరఫునా రాణించాలి. –రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రిఅండర్–19 ప్రపంచకప్లో అజేయంగా నిలిచి భారత్ తమ ఆధిపత్యం చాటుకుంది. ఇది అదిరిపోయే ప్రదర్శన, దీనికి సాటి ఏది లేదు. యావత్ దేశం గరి్వస్తోంది. –మిథాలీరాజ్, భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ -
అజేయం... అద్వితీయం
త్రిష... త్రిష... త్రిష... ఈ ప్రపంచకప్ను అద్దం ముందు పెడితే తెలంగాణ ఆల్రౌండర్ ప్రదర్శనే ప్రతిబింబిస్తుందంటే అందులో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. కేవలం ఈ ఫైనల్ మ్యాచ్లో కనబరిచిన ఆల్రౌండ్ షోకే ఆమెను ఆకాశానికెత్తేయడం లేదు. టోర్నీ ఆరంభం నుంచి ప్రతి మ్యాచ్లోనూ తనదైన శైలిలో ఓపెనింగ్ దూకుడు, బౌలింగ్లో జట్టుకు అవసరమొచ్చినప్పుడు కీలకమైన వికెట్లు తీయడం త్రిషకే చెల్లింది. సఫారీ జట్టుతో టైటిల్ సమరంలో త్రిషతోపాటు స్పిన్నర్లు పారుణిక (4–0–6–2), ఆయుశి (4–2–9–2), వైష్ణవి (2/23)ల మాయాజాలంతో ‘ఫైనల్ వార్’ వన్సైడ్ అయ్యింది. కౌలాలంపూర్: ఎలాంటి సంచలనం చోటు చేసుకోలేదు. ఆధిపత్యం అటు ఇటు కూడా మారలేదు. తొలి బంతి మొదలు విజయ తీరం చేరేదాకా భారత అమ్మాయిలదే హవా. ఏ లక్ష్యంతోనైనా మలేసియాలో అడుగు పెట్టారో ఆ లక్ష్యాన్ని అజేయంగా, అద్వితీయ ఆటతీరుతో మన అమ్మాయిలు అందుకున్నారు. వరుసగా రెండోసారి టి20 అండర్–19 ప్రపంచకప్ టైటిల్ను భారత అమ్మాయిలు సాధించారు. దక్షిణాఫ్రికా వేదికగా 2023 జనవరిలో జరిగిన తొలి అండర్–19 టి20 ప్రపంచకప్లో షఫాలీ వర్మ సారథ్యంలో భారత జట్టు విజేతగా నిలిచింది. ఈసారి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ మెగా ఈవెంట్లో బరిలోకి దిగిన భారత్ తమ జైత్రయాత్రను అ‘ది్వతీయ’ంగా ముగించింది. టోర్నీ మొత్తంలో ఓటమెరుగని మన జట్టే మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో నికీ ప్రసాద్ నేతృత్వంలోని భారత జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. తొలుత స్పిన్ వలలో సఫారీ జట్టును 82 పరుగులకే పరిమితం చేసింది. మరో ముగ్గురు పది పైచిలుకు పరుగులు చేశారంతే! లెగ్ స్పిన్తో గొంగడి త్రిష 4–0–15–3తో అద్బుతమైన స్పెల్ వేయగా... మిగతా స్పిన్నర్లు పారుణిక సిసోడియా, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ తలా 2 వికెట్లు పడగొట్టారు. ఆంధ్ర సీమర్ షబ్నమ్ షకీల్కు ఒక వికెట్ దక్కింది. అనంతరం భారత జట్టు స్టార్ ఓపెనర్ త్రిష (33 బంతుల్లో 44 నాటౌట్; 8 ఫోర్లు) దూకుడైన బ్యాటింగ్తో 11.2 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి 84 పరుగులు చేసి గెలిచింది. ఆల్రౌండ్ మెరుపులతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’తో పాటు ఈ మెగా టోర్నీలోనే త్రిష (309 పరుగులు; 7 వికెట్లు) అది్వతీయ ప్రదర్శనకు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు కూడా దక్కించుకుంది. స్పిన్ వలలో విలవిల దక్షిణాఫ్రికాకు సీనియర్, జూనియర్, జెండర్ (పురుషులు, మహిళలు) ఇలా ఏ స్థాయిలోనూ ప్రపంచకప్ భాగ్యం లేదన్నది మరోసారి నిరూపితమైంది. మొదట బ్యాటింగ్కు దిగి భారీ స్కోరుతో ‘కప్’ భాగ్యం దక్కించుకుందామనుకున్న సఫారీ యువ తుల జట్టు భారత స్పిన్ వలలో చిక్కి శల్యమైంది. రెండో ఓవర్లోనే పారుణికతో భారత్ మాయాజాలం నుంచి ఆఖరి దాకా బయట పడలేకపోయింది. సిమోన్ లౌరెన్స్ (0)ను పారుణిక డకౌట్ చేయగా, జెమ్మా బొథా (14 బంతుల్లో 16; 3 ఫోర్లు) బౌండరీల దూకుడుకు ఆదిలోనే షబ్నమ్ చెక్ పెట్టింది. ఇక అక్కడితో దక్షిణాఫ్రికా పతనం మొదలైంది. ధనాధన్ ప్రపంచకప్ కోసం 83 పరుగుల లక్ష్య దూరంలో ఉన్న భారత్ను ఓపెనర్ త్రిష తన షాన్దార్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్తో మరింత సులువుగా, వేగంగా విజయతీరాలకు తీసుకెళ్లింది. బౌండరీలతో తనమార్క్ స్ట్రోక్ ప్లేతో అలరించిన ఆమె జట్టు గెలిచేదాకా క్రీజులో నిలిచింది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: జెమ్మా (సి) కమలిని (బి) షబ్నమ్ 16; లౌరెన్స్ (బి) పారుణిక 0; దియార (బి) ఆయుశి 3; కైలా రేనెకె (సి) పారుణిక (బి) త్రిష 7; కరబో మెసో (బి) ఆయుశి 10; మీక్ వాన్ (స్టంప్డ్) కమలిని (బి) త్రిష 23; కోలింగ్ (బి) వైష్ణవి 15; శేషిని నాయుడు (బి) త్రిష 0; ఆష్లే వాన్విక్ (సి) వైష్ణవి (బి) పారుణిక 0; మోనాలిసా (బి) వైష్ణవి 0, ఎన్తబిసెంగ్ నిని (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 82. వికెట్ల పతనం: 1–11, 2–20, 3–20, 4–40, 5–44, 6–74, 7–74, 8–80, 9–80, 10–82. బౌలింగ్: జోషిత 2–0– 17–0, పారుణిక 4–0–6–2, షబ్నమ్ 2–0–7– 1, ఆయుశి 4–2–9–2, వైష్ణవి 4–0–23–2, త్రిష 4–0–15–3. భారత్ ఇన్నింగ్స్: కమలిని (సి) లౌరెన్స్ (బి) రేనెకె 8; త్రిష (నాటౌట్) 44; సనిక (నాటౌట్) 26; ఎక్స్ట్రాలు 6; మొత్తం (11.2 ఓవర్లలో వికెట్ నష్టానికి) 84. వికెట్ల పతనం: 1–36. బౌలింగ్: ఎన్తబిసెంగ్ 1–0–7–0, ఫే కోలింగ్ 2–0–19–0, కైలా రేనెకె 4–1–14–1, శేషిని 1–0–12–0, వాన్విక్ 1–0–12–0, మోనాలిసా 1.2–0–10–0, జెమ్మా బొథా 1–0–9–0. -
ఫైనల్లో సౌతాఫ్రికా చిత్తు.. టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్
మహిళల అండర్ 19 టీ20 ప్రపంచ కప్-2025 విజేతగా భారత్ నిలిచింది. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత అమ్మాయిలు.. వరుసగా రెండో సారి అండర్-19 ప్రపంచకప్ టైటిల్ను ముద్దాడారు. ఈ తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా సరిగ్గా 20 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో వాన్ వూరస్ట్ (23) టాప్ స్కోరర్గా నిలవగా.. జెమా బోథా(16), ఫే కోవిలింగ్(15) పరుగులతో పర్వాలేదన్పించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.త్రిష స్పిన్ మ్యాజిక్..భారత స్టార్ ఆల్రౌండర్, తెలుగు అమ్మాయి గొండి త్రిష(Gongadi Trisha) తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను బోల్తా కొట్టించింది. త్రిష తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. ఆమెతోపాటు వైష్ణవి శర్మ, అయూష్ శుక్లా, పరునికా సిసోడియా తలా రెండు వికెట్లు సాధించారు.బ్యాటింగ్లోనూ అదుర్స్.. అనంతరం 83 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 11.2 ఓవర్లలో ఊదిపడేసింది. త్రిష బ్యాటింగ్లోనూ అదరగొట్టింది. ఓపెనర్గా వచ్చిన త్రిష.. 33 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. త్రిషతో పాటు సానికా చాల్కే(26 నాటౌట్) కూడా రాణించింది. ఈ టోర్నీలో 7 మ్యాచ్లు ఆడిన త్రిష..67.25 సగటుతో 309 పరుగులతో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచింది. -
INDW Vs SAW: ఫైనల్లో త్రిష మాయాజాలం.. 82 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్
మహిళల అండర్–19 టీ20 ప్రపంచకప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా అమ్మాయిలు భారత బౌలర్ల దాటికి నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 82 పరుగులకే ఆలౌటయ్యారు. భారత స్టార్ ఆల్రౌండర్, తెలుగు అమ్మాయి గొండి త్రిష(Gongadi Trisha) తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను బోల్తా కొట్టించింది. త్రిష తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. ఆమెతోపాటు వైష్ణవి శర్మ, అయూష్ శుక్లా, పరునికా సిసోడియా తలా రెండు వికెట్లు సాధించారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో మైకే వాన్ వూర్ట్స్(23), జెమా బోథా(16), ఫే కోవిలింగ్(15) పరుగులతో పర్వాలేదన్పించగా..మిగితా బ్యాటర్లంతా దారుణంగా నిరాశపరిచారు.అదరగొట్టిన త్రిష.. కాగా ఈ టోర్నీ అసాంతం త్రిష తన ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. భారత్ వరుసగా రెండో సారి ఫైనల్ చేరడంలో ఆమెది కీలక పాత్ర. స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో త్రిష 59 బాల్స్లో ఏకంగా 110 పరుగులతో నాటౌట్గా నిలిచింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన త్రిష..66.25 సగటుతో 265 పరుగులు చేసి టాప్ స్కోరర్గా కొనసాగుతోంది. అటు బౌలింగ్లోనూ 7 వికెట్లతో త్రిష సత్తాచాటింది.తుది జట్లుదక్షిణాఫ్రికా మహిళల U19 జట్టు: జెమ్మా బోథా, సిమోన్ లౌరెన్స్, డయారా రామ్లాకన్, ఫే కౌలింగ్, కైలా రేనెకే(కెప్టెన్), కరాబో మెసో(వికెట్ కీపర్), మైకే వాన్ వూర్స్ట్, షెష్నీ నాయుడు, ఆష్లీ వాన్ వైక్, మోనాలిసా లెగోడి, న్తాబిసెంగ్ నినితుది జట్లుదక్షిణాఫ్రికా మహిళల U19 జట్టు: జెమ్మా బోథా, సిమోన్ లౌరెన్స్, డయారా రామ్లాకన్, ఫే కౌలింగ్, కైలా రేనెకే(కెప్టెన్), కరాబో మెసో(వికెట్ కీపర్), మైకే వాన్ వూర్స్ట్, షెష్నీ నాయుడు, ఆష్లీ వాన్ వైక్, మోనాలిసా లెగోడి, న్తాబిసెంగ్ నినిచదవండి: #Virat Kohli: 'వావ్ వాట్ ఎ బాల్'.. తనను ఔట్ చేసిన బౌలర్పై కోహ్లి ప్రశంసలు -
గ్రూప్ దశలో అజేయంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా..
కౌలాలంపూర్: మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు అజేయంగా లీగ్ దశను ముగించాయి. గ్రూప్ ‘డి’లో భాగంగా బుధవారం జరిగిన తమ చివరి మ్యాచ్లో ఆ్రస్టేలియా 83 పరుగుల తేడాతో నేపాల్ జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆ్రస్టేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.బ్రయ్ (34 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్స్లు), లారోసా (31), హస్రత్ గిల్ (30) రాణించారు. అనంతరం ఛేదనలో నేపాల్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 56 పరుగులకే పరిమితమైంది. ఆడిన 3 మ్యాచ్ల్లోనూ నెగ్గిన ఆ్రస్టేలియా 6 పాయింట్లతో గ్రూప్ ‘డి’ టాపర్గా నిలిచింది. గ్రూప్ ‘సి’లో భాగంగా నైజీరియాతో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు డక్వర్త్ లూయిస్ ప్రకారం 41 పరుగుల తేడాతో గెలుపొందింది.ఆడిన అన్నీ మ్యాచ్ల్లో గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు 6 పాయింట్లతో గ్రూప్ ‘సి’ టాపర్గా నిలిచింది. బుధవారం జరిగిన ఇతర మ్యాచ్ల్లో బంగ్లాదేశ్ జట్టు 17 పరుగుల తేడాతో స్కాట్లాండ్పై... ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో అమెరికా జట్టుపై... న్యూజిలాండ్ జట్టు 67 పరుగుల తేడాతో సమోవాపై... ఐర్లాండ్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 13 పరుగుల తేడాతో పాకిస్తాన్పై గెలిచాయి. నేడు జరిగే గ్రూప్ ‘ఎ’ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్ల్లో ఆతిథ్య మలేసియాతో వెస్టిండీస్; శ్రీలంకతో భారత్ తలపడతాయి. గ్రూప్ ‘ఎ’ నుంచి భారత్, శ్రీలంక... గ్రూప్ ‘బి’ నుంచి ఇంగ్లండ్, అమెరికా, ఐర్లాండ్... గ్రూప్ ‘సి’ నుంచి దక్షిణాఫ్రికా, నైజీరియా, న్యూజిలాండ్... గ్రూప్ ‘డి’ నుంచి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు ‘సూపర్ సిక్స్’ దశకు చేరుకున్నాయి. మలేసియా, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ విజేత గ్రూప్ ‘ఎ’ నుంచి చివరిదైన సూపర్ సిక్స్ బెర్త్ను ఖరారు చేసుకుంటుంది.చదవండి: ఆరంభం అదిరింది -
పాకిస్తాన్ను చిత్తు చేసిన ఐర్లాండ్.. వరల్డ్ కప్ నుంచి ఔట్
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ జట్టు కథ ముగిసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం ఐర్లాండ్ మహిళలలతో జరిగిన మ్యాచ్లో 13 పరుగుల తేడాతో పాక్ ఓటమి చవిచూసింది. తద్వారా ఈ టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ నిష్క్రమించింది.ఈ మెగా ఈవెంట్లో మొత్తం రెండు మ్యాచ్లు ఆడిన పాక్ జట్టు.. రెండింట కూడా పరాజయం పాలైంది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఇక ఈ మ్యాచ్ను వర్షం కారణంగా 9 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది.ఐర్లాండ్ బ్యాటర్లలో వాల్ష్(31) టాప్ స్కోరర్గా నిలవగా.. అన్నాబెల్ స్క్వైర్స్(13), హర్సిన్(10) రాణించారు. పాక్ బౌలర్లలో మెమూనా ఖలీద్ 2 వికెట్లు పడగొట్టగా.. మనహర్ జెబ్, హషిన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 70 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 59 పరుగులకే పరిమితమైంది.పాక్ బ్యాటర్లలో కోమాల్ ఖాన్(12) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. ఐర్లాండ్ బౌలర్లలో ఎల్లీ మెక్గీ రెండు వికెట్లు పడగొట్టగా.. సార్జెంట్, లారా మెక్బ్రైడ్ తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అర్ష్దీప్ సింగ్.. -
అండర్–19 టి20 ప్రపంచకప్ భారత జట్టులో త్రిష, ధృతి, షబ్నమ్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో మలేసియాలో జరిగే అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో ముగ్గురు తెలుగు అమ్మాయిలు గొంగడి త్రిష, కేసరి ధృతి (తెలంగాణ), షబ్నమ్ (ఆంధ్రప్రదేశ్) చోటు దక్కించుకున్నారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది. భారత జట్టుకు నిక్కీ ప్రసాద్ కెప్టెన్ గా, సనికా చాల్కె వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు. 2023లో తొలిసారి నిర్వహించిన మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్లో షఫాలీ వర్మ సారథ్యంలో భారత జట్టు చాంపియన్గా నిలిచింది. త్రిష, షబ్నమ్ నాటి విజేత జట్టులో సభ్యులుగా ఉన్నారు. త్రిష, షబ్నమ్లకిది రెండో టి20 ప్రపంచకప్ కానుంది. గత ఆదివారం కౌలాలంపూర్లో జరిగిన ఆసియా కప్ అండర్–19 టి20 టోర్నీలో భారత జట్టుకు టైటిల్ దక్కడంలో త్రిష కీలకపాత్ర పోషించింది. త్రిష ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’తోపాటు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు గెల్చుకుంది. టి20 ప్రపంచకప్లో మొత్తం 16 జట్లు నాలుగు గ్రూప్లుగా పోటీ పడనున్నాయి. ఆతిథ్య మలేసియా, వెస్టిండీస్, శ్రీలంకతో కలిసి భారత జట్టు గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగనుంది. తమ తొలి మ్యాచ్లో భాతర అమ్మాయిల జట్టు జనవరి 19న వెస్టిండీస్తో, 21న మలేసియాతో, 23న శ్రీలంకతో తలపడుతుంది. గ్రూప్ దశ ముగిశాక పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ‘సూపర్ సిక్స్’ దశకు అర్హత సాధిస్తాయి. ‘సూపర్ సిక్స్’ను రెండు గ్రూప్లుగా విభజిస్తారు. ఇందులో మెరుగైన ప్రదర్శన కనబర్చిన నాలుగు జట్లు సెమీఫైనల్కు చేరతాయి. భారత టి20 జట్టు: నిక్కీ ప్రసాద్ (కెప్టెన్ ), సనికా చాల్కె (వైస్ కెప్టెన్ ), గొంగడి త్రిష, కమిళిని, భవిక అహిరె, ఈశ్వరి అవసారె, మిథిల, వీజే జోషిత, సోనమ్ యాదవ్, పరుణిక సిసోడియా, కేసరి ధృతి, ఆయూషి శుక్లా, అనందిత, షబ్నమ్, వైష్ణవి. -
అమెరికా అండర్–19 క్రికెట్ జట్టు కెప్టెన్ అనిక రెడ్డి
బ్రూమ్ఫీల్డ్ (కొలరాడో): వచ్చే ఏడాది జనవరిలో మలేసియా వేదికగా జరిగే మహిళల అండర్–19 ప్రపంచకప్ టి20 క్రికెట్ టోర్నీలో పాల్గొనే అమెరికా జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన అమెరికా జట్టుకు భారత సంతతికి చెందిన తెలుగమ్మాయి కొలన్ అనిక రెడ్డి కెప్టెన్గా వ్యవహరిస్తుంది. తెలుగు సంతతికి చెందిన పగిడ్యాల చేతన రెడ్డి, ఇమ్మడి శాన్వి, సషా వల్లభనేని కూడా అమెరికా జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు మలేసియాలోని నాలుగు వేదికల్లో ఈ మెగా ఈవెంట్ జరుగుతుంది. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించారు. డిఫెండింగ్ చాంపియన్ భారత్, వెస్టిండీస్, శ్రీలంక, మలేసియా జట్లకు గ్రూప్ ‘ఎ’లో చోటు కల్పించారు. గ్రూప్ ‘బి’లో అమెరికా, ఇంగ్లండ్, పాకిస్తాన్, ఐర్లాండ్... గ్రూప్ ‘సి’లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నైజీరియా, సమోవా... గ్రూప్ ‘డి’లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నేపాల్, స్కాట్లాండ్ జట్లున్నాయి. అమెరికా అండర్–19 జట్టు: కొలన్ అనిక రెడ్డి (కెప్టెన్), అదితిబా చుదసమ (వైస్ కెప్టెన్), పగిడ్యాల చేతన రెడ్డి, చేతన ప్రసాద్, దిశ ఢింగ్రా, ఇసాని మహేశ్ వాఘేలా, లేఖ హనుమంత్ శెట్టి, మాహి మాధవన్, నిఖర్ పింకూ దోషి, పూజా గణేశ్, పూజా షా, రీతూప్రియా సింగ్, ఇమ్మడి శాన్వి, సషా వల్లభనేని, సుహాని థదాని. -
అన్నను మించిపోయేలా ఉన్నాడు.. తొలి మ్యాచ్లోనే! వీడియో వైరల్
పాకిస్తాన్ క్రికెట్ నుంచి మరో పేస్ సంచలనం పుట్టుకొచ్చాడు. ఇటీవలే అండర్-19 అండర్ వరల్డ్కప్లో అదరగొట్టిన యువ పేసర్ హునైన్ షా.. ఇప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్ అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. పీఎస్ఎల్-2024లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున హునైన్ షా బరిలోకి దిగాడు. ఈ క్రమంలో గురువారం లాహోర్ వేదికగా క్వెట్టా గ్లాడియేటర్స్తో జరిగిన మ్యాచ్లో హునైన్ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన హునైన్.. 13 పరుగులిచ్చి వికెట్ పడగొట్టాడు. కట్టుదిట్టమైన బంతులు విసురుతూ ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టాడు. ఈ క్రమంలో క్వెట్టా గ్లాడియేటర్స్ ఓపెనర్ జాసెన్ రాయ్ను 20 ఏళ్ల హునైన్ అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. పీఎస్ఎల్లో హునైన్కు ఇదే తొలి వికెట్. కాగా హునైన్ షా ఎవరో కాదు.. పాకిస్తాన్ స్టార్ పేసర్ నసీం షాకు స్వయాన సోదరుడే. అన్నదమ్ములు ఇద్దరూ కూడా ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంఛైజీకే ప్రాతినిథ్యం వహిస్తుండడం గమనార్హం. అయితే తన తమ్ముడు తొలి పీఎస్ఎల్ వికెట్ సాధించగానే నసీం సంబరాల్లో మునిగితేలిపోయాడు. ఇక ఈ మ్యాచ్లో ఇస్లామాబాద్ యునైటైడ్ పై 3 వికెట్ల తేడాతో క్వెట్టా గ్లాడియేటర్స్ విజయం సాధించింది. hunain shah, remember the name pic.twitter.com/kkONIs1qXg — :) (@babardrive) February 22, 2024 -
అదే మా కొంపముంచింది.. కానీ చాలా గర్వంగా ఉంది: టీమిండియా కెప్టెన్
ఐసీసీ టోర్నీ ఫైనల్స్లో టీమిండియాను ఓటమి మరోసారి వెక్కిరించింది. 9 నెలల వ్యవధిలో వరుసగా మూడో ఐసీసీ ఈవెంట్ తుది పోరులో భారత్ ఓటమి చవిచూసింది. ఫార్మాట్లు మారిన ప్రత్యర్ధి మాత్రం మారలేదు. అదే ప్రత్యర్థి.. అదే ఆస్ట్రేలియా. తొలి రెండు సందర్భాల్లో సీనియర్ జట్టు వంతు అయితే.. ఇప్పుడు కుర్రాళ్ల వంతు. అండర్ 19 వరల్డ్కప్-2024 ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైంది. టోర్నీ మొత్తం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టు.. ఫైనల్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో 79 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. హర్జాస్ సింగ్(64) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. ప్టెన్ హ్యూ వీబ్జెన్(48), ఓలీవర్ పీక్(42) పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలింది. ఆదర్శ్ సింగ్(77 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 47), హైదరాబాద్ ప్లేయర్ మురుగణ్ అభిషేక్( 46 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 42 )టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మహిల్ బియర్డ్మన్, రాఫ్ మెక్మిలన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. కల్లమ్ విడ్లే రెండు వికెట్లు సాధించారు. కాగా అంతకముందు డబ్ల్యూటీసీ, వన్డే వరల్డ్కప్ ఫైనల్లో సీనియర్ జట్టు చేతిలో రోహిత్ సేన ఓటమి పాలవ్వగా.. ఇప్పుడు జూనియర్లు కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేశారు. ఇక ఫైనల్ పోరులో ఓటమిపై టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహారన్ స్పందించాడు. ఇక ఫైనల్ పోరులో ఓటమిపై టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహారన్ స్పందించాడు. తమ ఓటమికి కారణం బ్యాటింగ్ వైఫల్యమేనని సహారన్ అంగీకరించాడు. "ఈ టోర్నీ మొత్తం మా బాయ్స్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. వారి ఆటతీరు పట్ల నాకు చాలా గర్వంగా ఉంది. ప్రతీ ఒక్కరూ జట్టు కోసం తమ వంతు కృషి చేశారు. కానీ దురదృష్టవశాత్తూ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయాం. బ్యాటింగ్లో మేము సమిష్టిగా విఫలమయ్యాం. మేము ఈ మ్యాచ్ కోసం బాగా సన్నద్దమయ్యాం. కానీ మా ప్రణాళికలను అమలు చేయడంలో ఫెయిల్ అయ్యాం. మా బాయ్స్ కొంతమంది ర్యాంప్ షాట్లు ఆడి ఔటయ్యారు. ఆదర్శ్తో పాటు ఎవరో ఒకరు క్రీజులో ఉండి ఉండే పరిస్థితి మరోవిధంగా ఉండేది.అయితే ఈ టోర్నమెంట్ నుంచి మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ టోర్నీలో ఆడిన అనుభవం భవిష్యత్తులో మాకు ఉపయోగపడుతుందని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో సహారన్ పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీలో 397 పరుగులు చేసిన సహారన్ టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. -
ఫైనల్లో టీమిండియా ఓటమి.. మనోడే మనకు విలన్! ఎవరీ హర్జాస్ సింగ్?
140 కోట్ల మంది భారతీయులకు మరోసారి నిరాశే ఎదురైంది. మళ్లీ అదే కథ.. అదే వ్యథ. అండర్-19 వరల్డ్ కప్ మొత్తం అద్భుత ఆటతీరును ప్రదర్శించిన భారత క్రికెట్ జట్టు.. ఫైనల్లో మరోసారి ఆసీస్ చేతిలో ఓటమి పాలైంది. గతేడాది వరల్డ్కప్లో సీనియర్లకు ఎదురైన పరభావానికి కుర్రాళ్లు ప్రతీకారం తీర్చుకుంటారని అంతా భావించారు. కానీ కంగరూలు జోరు ముందు తల వంచిన జూనియర్లు.. కనీసం పోరాడకుండానే ఓటమిని అంగీకరించారు. ఏకపక్షంగా జరిగిన ఫైనల్ పోరులో 74 పరుగుల తేడాతో ఓటమిపాలైన భారత జట్టు.. బరువెక్కిన హృదయాలతో ఇంటిముఖం పట్టింది. మనోడో విలన్.. ఎవరీ హర్జాస్ సింగ్? ఇక ఆసీస్ నాలుగో సారి వరల్డ్ ఛాంపియన్స్గా నిలవడంలో ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ హర్జాస్ సింగ్ది కీలక పాత్ర. కీలక సమయంలో బ్యాటింగ్లో వచ్చిన హర్జాస్ సింగ్.. తన అద్బుతమైన ఆటతీరుతో భారత బౌలర్లకు అడ్డుగా నిలిచాడు. ఆసీస్ 99 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన దశలో జట్టును అదుకున్నాడు. అచతూచి ఆడుతూ హాఫ్ సెంచరీతో తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ను అందించాడు. ఈ టోర్నీ మొత్తం పేలవ ప్రదర్శన కనబరిచిన హర్జాస్ సింగ్ ఫైనల్లో మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 64 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లో 55 పరుగులు చేశాడు. అయితే ఈ ఆసీస్ వరల్డ్కప్ హీరో భారత భారత మూలాలు కలిగిన క్రికెటర్ కావడం గమనార్హం. హర్జాస్ సింగ్ తల్లిదండ్రులది పంజాబ్ లోని చండీగడ్. హర్జాస్ తండ్రి ఇంద్రజీత్ సింగ్ స్టేట్ లెవల్ బాక్సింగ్ ఛాంపియన్ కాగా తల్లి అవిందర్ కౌర్ రాష్ట్ర స్థాయి లాంగ్ జంపర్. అయితే వారిద్దరూ హర్జాస్ పుట్టడానికి ఐదేళ్ల ముందే సిడ్నీకి వలసవెళ్లారు. అక్కడే హర్జాస్ 2005లో జన్మించాడు. 19 ఏళ్ల హర్జాస్ చిన్నతనం నుంచే క్రికెట్పై మక్కువ ఎక్కువ. ఈ క్రమంలో హర్జాస్ సింగ్ తన ఎనిమిదేళ్ల వయస్సులో సిడ్నీలోని రెవ్స్బీ వర్కర్స్ క్రికెట్ క్లబ్లో తన క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. కాగా హర్జాస్ ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఉస్మాన్ ఖ్వాజా అంటే ఎంతో ఇష్టం. అతడిని ఆదర్శంగా తీసుకుని క్రికెట్ వైపు హర్జాస్ అడుగులు వేశాడు. అయితే హర్జాజ్ చివరగా 2015లో భారత్కు వచ్చాడు. అయితే -
కుర్రాళ్లూ వదిలేశారు.. ఫైనల్లో టీమిండియా ఓటమి! ఆసీస్దే వరల్డ్కప్
అచ్చు సీనియర్లలాగే... జూనియర్లూ సమర్పించుకున్నారు. ఆఖరి పోరు దాకా అజేయంగా నిలిచిన యువ భారత్ జట్టు ఆఖరి మెట్టుపై మాత్రం ఆ్రస్టేలియా చేతిలో ఓడింది. గతేడాది వన్డే ప్రపంచకప్లో రోహిత్ శర్మ బృందం కూడా ఎదురులేని పోరాటంతో ఫైనల్ చేరింది. చివరకు ఆస్ట్రేలియా చేతిలోనే కంగుతింది. ఇక్కడా భారత జూనియర్ జట్టు ఫైనల్ చేరే క్రమంలో అన్ని మ్యాచ్ల్లో గెలిచి కీలకమైన తుది పోరులో ఆ్రస్టేలియా జట్టు చేతిలోనే ఓటమి చవిచూసింది. వెరసి మూడు నెలల వ్యవధిలో ఆ్రస్టేలియా సీనియర్, జూనియర్ జట్లు వన్డే ప్రపంచకప్ టైటిల్స్ను హాట్ ఫేవరెట్ అయిన భారత్పైనే గెలవడం పెద్ద విశేషం. బెనోని (దక్షిణాఫ్రికా): ప్రపంచకప్ కోసం ప్రతీ మ్యాచ్లో చిందించిన చెమటంతా ఫైనల్కు వచ్చేసరికి ఆవిరైంది. యువ భారత్ జైత్రయాత్ర కప్ అందుకోవాల్సిన మ్యాచ్లో పేలవంగా ముగిసింది. అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ 79 పరుగుల తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడింది. మొదట ఆ్రస్టేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. హర్జస్ సింగ్ (55; 3 ఫోర్లు, 3 సిక్స్లు), కెపె్టన్ హ్యూగ్ వీగెన్ (48; 5 ఫోర్లు) రాణించారు. సీమర్లు రాజ్ లింబాని 3, నమన్ తివారి 2 వికెట్లు తీశారు. గతంలో ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన భారత జట్టు లక్ష్య ఛేదనలో తడబడింది. చివరకు 43.5 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (77 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్), హైదరాబాద్ కుర్రాడు మురుగన్ అభిషేక్ (46 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బియర్డ్మన్ (3/15) కోలుకోలేని దెబ్బ తీయగా, రాఫ్ మెక్మిలన్ (3/43) ఇంకెవరినీ క్రీజులో నిలువనీయలేదు. చక్కగా కట్టడి చేసినప్పటికీ... టాస్ నెగ్గి బ్యాటింగ్కు దిగిన ఆ్రస్టేలియా బ్యాటర్లెవరూ భారీ స్కోర్లు చేయకుండా భారత బౌలర్లు చక్కగానే కట్టడి చేశారు. హర్జస్ అర్ధసెంచరీ సాధించగా, వీగెన్, డిక్సన్ (56 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్), ఒలీవర్ (43 బంతుల్లో 46 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్)లను అర్ధశతకాల వరకు రానివ్వలేదు. లింబాని, నమన్ వరుస విరామాల్లో వికెట్లు తీశారు. అందువల్లే పెద్దస్కోరైతే నమోదు కాలేదు. రాణించిన ఆదర్శ్, అభిషేక్ కష్టమైన లక్ష్యం కాదు... ఈ మెగా ఈవెంట్లో మన కుర్రాళ్ల ఫామ్ ముందు ఛేదించే లక్ష్యమే! పెద్దగా కష్టపడకుండా ఏ ఇద్దరు ఫిఫ్టీలు బాదినా... ఇంకో ఇద్దరు 30 పైచిలుకు పరుగులు చేసినా చాలు గెలవాల్సిన మ్యాచ్ ఇది! కానీ టాపార్డర్లో అర్షిన్ (3), ముషీర్ ఖాన్ (22), మిడిలార్డర్లో నమ్మదగిన బ్యాటర్లు కెప్టెన్ ఉదయ్ సహారణ్ (8), సచిన్ దాస్ (8)ల వికెట్లను పారేసుకోవడంతో 68/4 స్కోరు వద్దే భారత్ పరాజయం ఖాయమైంది. ఎందుకంటే తర్వాత వచ్చిన వారెవరూ సుదీర్ఘ ఇన్నింగ్స్లు ఆడలేనివారే! ఆదర్శ్, అభిషేక్ల పోరాటం అంతరాన్ని తగ్గించేందుకు ఉపయోగపడింది. 1 అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్పై నెగ్గడం ఆస్ట్రేలియాకిదే తొలిసారి. ఈ రెండు జట్లు 2012, 2018 టోర్నీ ఫైనల్స్లోనూ తలపడగా రెండుసార్లూ భారత జట్టే గెలిచింది. 4 అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ను ఓడించిన నాలుగో జట్టు ఆ్రస్టేలియా. గతంలో పాకిస్తాన్ (2006), వెస్టిండీస్ (2016), బంగ్లాదేశ్ (2020) ఫైనల్లో ఓడించి విజేతగా నిలిచాయి. 4 అండర్–19 ప్రపంచకప్ సాధించడం ఆ్రస్టేలియాకిది నాలుగోసారి. గతంలో ఆ జట్టు 1988, 2002, 2010లలో విజేతగా నిలిచింది. 2012 భారత అండర్–19 జట్టుపై 2012 తర్వాత ఆస్ట్రేలియా యువ జట్టు మళ్లీ గెలుపొందడం విశేషం. గత 12 ఏళ్లలో ఆ్రస్టేలియా జూనియర్ జట్టుతో ఆడిన 10 మ్యాచ్ల్లోనూ యువ భారత్ విజయం సాధించింది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: డిక్సన్ (సి) అభిషేక్ (బి) తివారి 42; కొన్స్టాస్ (బి) లింబాని 0; వీగెన్ (సి) ముషీర్ (బి) తివారి 48; హర్జస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సౌమీ పాండే 55; హిక్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) లింబాని 20; ఒలీవర్ (నాటౌట్) 46; మెక్మిలన్ (సి అండ్ బి) ముషీర్ 2; అండర్సన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) లింబాని 13; స్ట్రేకర్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 19; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 253. వికెట్ల పతనం: 1–16, 2–94, 3–99, 4–165, 5–181, 6–187, 7–221. బౌలింగ్: రాజ్ లింబాని 10–0–38–3, నమన్ తివారి 9–0–63–2, సౌమీ పాండే 10–0–41–1, ముషీర్ 9–0–46–1, అభి షేక్ 10–0–37–0, ప్రియాన్షు 2–0–17–0. భారత్ ఇన్నింగ్స్: ఆదర్శ్ (సి) హిక్స్ (బి) బియర్డ్మన్ 47; అర్షిన్ (సి) హిక్స్ (బి) విడ్లెర్ 3; ముషీర్ (బి) బియర్డ్మన్ 22; ఉదయ్ (సి) వీగెన్ (బి) బియర్డ్మన్ 8; సచిన్ (సి) హిక్స్ (బి) మెక్మిలన్ 9; ప్రియాన్షు (సి) విడ్లెర్ (బి) అండర్సన్ 9; అవనీశ్ రావు (సి అండ్ బి) మెక్మిలన్ 0; అభిషేక్ (సి) వీగెన్ (బి) విడ్లెర్ 42; లింబాని (బి) మెక్మిలన్ 0; నమన్ (నాటౌట్) 14; సౌమీ (సి) హిక్స్ (బి) స్ట్రేకర్ 2; ఎక్స్ట్రాలు 18; మొత్తం (43.5 ఓవర్లలో ఆలౌట్) 174. వికెట్ల పతనం: 1–3, 2–40, 3–55, 4–68, 5–90, 6–91, 7–115, 8–122, 9–168, 10–174. బౌలింగ్: విడ్లెర్ 10–2–35–2, అండర్సన్ 9–0–42–1, స్ట్రేకర్ 7.5–1–32–1, బియర్డ్ మన్ 7–2–15–3, మెక్మిలన్ 10–0–43–3. -
వరల్డ్కప్ ఫైనల్లో బోల్తా పడ్డ భారత్.. నాలుగో సారి జగజ్జేతగా నిలిచిన ఆస్ట్రేలియా
అండర్ 19 వరల్డ్కప్ 2024 ఫైనల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. యంగ్ ఇండియాతో ఇవాళ (ఫిబ్రవరి 11) జరిగిన ఫైనల్లో యువ ఆసీస్ జట్టు 79 పరుగుల తేడాతో విజయం సాధించి, నాలుగో సారి జగజ్జేతగా నిలిచింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. భారత సంతతికి చెందిన హర్జస్ సింగ్ (55) అర్దసెంచరీతో రాణించగా.. హ్యారీ డిక్సన్ (42), హగ్ వెబ్జెన్ (48), ఒలివర్ పీక్ (46 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో రాజ్ లింబాని 3, నమన్ తివారి 2, సౌమీ పాండే, ముషీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన యువ భారత్.. 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలి వంద కోట్లకు పైగా ఉన్న భారతీయులకు నిరాశ కలిగించింది. భారత ఇన్నింగ్స్లో ఆదర్శ్ సింగ్ (47), తెలుగు ఆటగాడు మురుగన్ అభిషేక్ (42), ముషీర్ ఖాన్ (22), నమన్ తివారి (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లు బియర్డ్మ్యాన్ (3/15), రాఫ్ మెక్మిలన్ (3/43), కల్లమ్ విడ్లర్ (2/35), ఆండర్సన్ (1/42) టీమిండియా పతనాన్ని శాశించారు. తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్ 168 పరుగుల వద్ద టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. కల్లమ్ ముల్దర్ బౌలింగ్లో మురుగన్ అశ్విన్ (42) ఔటయ్యాడు. ఎనిమిదో వికెట్ డౌన్ వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి దాదాపుగా ఖరారైపోయింది. 122 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. మెక్మిలన్ బౌలింగ్లో రాజ్ లింబాని (0) క్లీన్ బౌల్డయ్యాడు. ఏడో వికెట్ కోల్పోయిన భారత్ 115 పరుగులకే భారత్ ఏడు వికెట్లు కోల్పోయింది. బియర్డ్మ్యాన్ బౌలింగ్లో ఆదర్శ్ సింగ్ (47) ఔటయ్యాడు. టీమిండియా గెలవాలంటే ఇంకా 139 పరుగులు చేయాలి. చేతిలో కేవలం మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఆరో వికెట్ డౌన్ 91 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. తెలంగాణ కుర్రాడు అవనీశ్ రాఫ్ మెక్మిలన్ బౌలింగ్లో డకౌటయ్యాడు. పీకల్లోతు కష్టాల్లో భారత్ వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 90 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. ఆండర్సన్ బౌలింగ్లో ప్రియాంశు మోలియా (9) ఔటయ్యాడు. టీమిండియా గెలవాలంటే ఇంకా 164 పరుగులు చేయాలి. చేతిలో కేవలం ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఆదర్శ్ సింగ్ (32), అవీనశ్ రావు క్రీజ్లో ఉన్నారు. 68 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ ఛేదనలో యంగ్ ఇండియా 68 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్టార్ త్రయం ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్, సచిన్ దాస్ సహా అర్శిన్ కులకర్ణి ఔట్ కాగా.. ఆదర్శ్ సింగ్ (31), ప్రియాంశు మోలియా (7) క్రీజ్లో ఉన్నారు. భారత్ గెలవాలంటే ఈ మ్యాచ్లో మరో 170 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో కేవలం ఆరు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ముషీర్ ఖాన్ క్లీన్ బౌల్డ్ 40 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. బియర్డ్మెన్ బౌలింగ్లో ముషీర్ ఖాన్ (22) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆదర్శ్ సింగ్ (12), ఉదయ్ సహారన్ క్రీజ్లో ఉన్నారు. టీమిండియా గెలవాలంటే ఇంకా 213 పరుగులు చేయాలి. చేతిలో మరో ఎనిమిది వికెట్లు ఉన్నాయి. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 254 పరుగుల లక్ష్య ఛేదనలో యువ భారత్ జట్టు 3 పరుగులకే వికెట్ కోల్పోయింది. కల్లమ్ విడ్లెర్ బౌలింగ్లో ర్యాన్ హిక్స్కు క్యాచ్ ఇచ్చి అర్షిన్ కులకర్ణి (3) ఔటయ్యాడు. ఆదర్శ్ సింగ్కు జతగా ముషీర్ ఖాన్ క్రీజ్లోకి వచ్చాడు. టీమిండియా టార్గెట్ ఎంతంటే..? అండర్ 19 వరల్డ్కప్ 2024 ఫైనల్లో ఆస్ట్రేలియా 254 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందుంచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్లో హర్జస్ సింగ్ (55) అర్దసెంచరీతో రాణించగా.. హ్యారీ డిక్సన్ (42), హగ్ వెబ్జెన్ (48), ఒలివర్ పీక్ (46 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్ 187 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. ముషీర్ ఖాన్ బౌలింగ్లో రాఫ్ మెక్మిలన్ (2) ఔట్ అయ్యాడు. 40 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 187/6గా ఉంది. ఒలివర్ పీక్ (10), చార్లీ ఆండర్సన్ (0) క్రీజ్లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్ 181 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. సౌమీ పాండే బౌలింగ్లో హర్జస్ సింగ్ (55) ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. 38 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 181/5గా ఉంది. ఒలివర్ పీక్ (6), రాఫ్ మెక్మిలన్ (0) క్రీజ్లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్ 165 పరుగుల వద్ద ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. రాజ్ లింబాని బౌలింగ్లో ర్యాన్ హెండ్రిక్స్ (20) ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. 35 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 167/గా ఉంది. ఒలివర్ పీక్ (1), హర్జస్ సింగ్ (46) క్రీజ్లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా 99 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. నమన్ తివారి బౌలింగ్లో మురుగన్ అభిషేక్కు క్యాచ్ ఇచ్చి హ్యారీ డిక్సన్ (42) ఔటయ్యాడు. 23 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా స్కోర్ 100/3గా ఉంది. ర్యాన్ హిక్స్ (1), హర్జస్ సింగ్ (1) క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా 94 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. నమర్ తివారి బౌలింగ్లో ముషీర్ ఖాన్ క్యాచ్ పట్టడంతో హగ్ వెబ్జెన్ (48) ఔటయ్యాడు. 21 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 94/2గా ఉంది. హ్యారీ డిక్సన్ (39), హర్జస్ సింగ్ (0) క్రీజ్లో ఉన్నారు. 12 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 49/1 12 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. క్రీజులో హ్యూ వీబ్జెన్(244), డిక్సాన్(21) పరుగులతో ఉన్నారు. 8 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 39/1 8 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజులో హ్యూ వీబ్జెన్(14), డిక్సాన్(21) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. భారత పేసర్ రాజ్ లింబానీ బౌలింగ్లో సామ్ కాన్స్టాస్ క్లీన్ బౌల్డయ్యాడు. 2 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 16/0 2 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 16/0 2 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. క్రీజులో డిక్సాన్(15), సామ్ కాన్స్టాస్(0) పరుగులతో ఉన్నారు. అండర్-19 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో బెనోని వేదికగా ఆస్ట్రేలియా- భారత జట్లు తలపడతున్నాయి. తుది పోరులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. ఆసీస్ మాత్రం ఒక మార్పుతో ఆడనుంది. కాగా భారత్-ఆసీస్ ఫైనల్లో తలపడడం ఇది నాలుగోసారి. ఇంతకుముందు ఫైనల్ పోరులో రెండు సార్లు భారత్ విజయం సాధించగా.. ఆసీస్ ఒక్కసారి గెలుపొందింది. తుది జట్లు: ఆస్ట్రేలియా: హ్యారీ డిక్సన్, సామ్ కొన్స్టాస్, హ్యూ వీబ్జెన్ (కెప్టెన్), హర్జాస్ సింగ్, ర్యాన్ హిక్స్ (వికెట్ కీపర్), ఆలీ పీక్, చార్లీ ఆండర్సన్, రాఫెల్ మాక్మిలన్, టామ్ స్ట్రాకర్, మహ్లీ బార్డ్మాన్, కల్లమ్ విడ్లర్ భారత్: ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ అహ్మద్ ఖాన్, ఉదయ్ సహారన్ (కెప్టెన్), ప్రియాంషు మోలియా, సచిన్ దాస్, ఆరవెల్లి అవనీష్ (వికెట్కీపర్), మురుగన్ అభిషేక్, నమన్ తివారీ, రాజ్ లింబాని, సౌమీ పాండే -
టీమిండియా కెప్టెన్ ఒక సంచలనం.. రింకూ సింగ్లానే: అశ్విన్
అండర్ 19 వరల్డ్కప్-2024 ఫైనల్ పోరుకు యువ భారత్ సిద్దమైంది. ఆదివారం బెనోని వేదికగా జరగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి ఆరోసారి ప్రపంచప్ టైటిల్ను ముద్దాడాలని భారత్ భావిస్తుంటే.. ఆసీస్ కూడా నాలుగోసారి ట్రోఫీని సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత అసాధారణ ఫామ్లో ఉంది. ప్రస్తుత ఫామ్ను చూస్తే ఆసీస్ను ఓడించడం పెద్ద కష్టమేమి కాదు. ముఖ్యంగా కెప్టెన్ ఉదయ్ సహారన్ జట్టును అద్బుతంగా నడిపిస్తున్నాడు. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్ పరంగా సత్తాచాటుతున్నాడు. ఈ నేపథ్యంలో ఉదయ్ సహారన్పై భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్లో సహారాన్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడని అశ్విన్ కొనియాడు. ప్రోటీస్ సెమీఫైనల్లో ఉదయ్ 81 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. "ఈ ఏడాది అండర్-19 వరల్డ్కప్లో ఉదయ్ సహారాన్ కెప్టెన్సీకి కొత్త అర్ధాన్ని చెప్పాడు. తన వ్యక్తిగత ప్రదర్శనతో పాటు జట్టును కూడా అద్బుతంగా ముందుండి నడిపిస్తున్నాడు. ఇప్పటికే అతడు జూనియర్ వరల్డ్కప్లో చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా నిలిచాడు. ఉదయ్ చేసిన పరుగులు చూసి నేను ఇదింతా చెప్పడం లేదు. అతడి మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యం నన్ను ఎంతగానో ఆకట్టకుంది. అతడు చాలా ప్రశాంతంగా ఉంటాడు. అదే కూల్నెస్తో మ్యాచ్ను ఫినిష్ చేస్తాడు. ఇప్పటికే నేను చాలా సార్లు చెప్పాడు అతడిని చూస్తుంటే మరో రింకూ సింగ్లా కన్పిస్తున్నాడు. రింకూ కూడా అంతే చాలా కూల్గా ఉంటాడు. ఉదయ్ బ్యాటింగ్ చూస్తే మ్యాచ్ మనదే అన్నట్లు అన్పిస్తుంది. చాలా కాన్ఫిడెన్స్తో బ్యాటింగ్ చేస్తాడని" అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. Final Ready 🙌 The two captains are all set for the #U19WorldCup Final 👌👌#TeamIndia | #BoysInBlue | #INDvAUS pic.twitter.com/9I4rsYdRGZ — BCCI (@BCCI) February 10, 2024 -
ఆరో ప్రపంచకప్ వేటలో భారత్.. ఫైనల్లో ఆసీస్తో ఢీ
బెనోని (దక్షిణాఫ్రికా): డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆరో ప్రపంచకప్ లక్ష్యంగా అంతిమ సమరానికి సన్నద్ధమైంది. ఈ టోర్నీలో పరాజయమెరుగని భారత జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో ఆ్రస్టేలియాతో తలపడనుంది. డిఫెండింగ్ చాంపియన్ ఈ టోర్నీలో అసాధారణ ఫామ్లో ఉంది. కుర్రాళ్ల మెగా ఈవెంట్ చరిత్రలో తొమ్మిదోసారి టైటిల్ వేటకు అర్హత సాధించిన భారత్కు ఫైనల్ ప్రత్యర్థిపై మంచి రికార్డు ఉంది. ఆసీస్ ఐదుసార్లు ఫైనల్ చేరింది. పాక్ (1988, 2010), దక్షిణాఫ్రికా (2002)లపై గెలిచిన ఆసీస్కు 2012, 2018లలో జరిగిన ఫైనల్స్లో మాత్రం రెండు సార్లు భారత్ చేతిలో పరాభవం ఎదురైంది. ఇప్పుడు ఇదే రికార్డును ఈ టోర్నీలోనూ అజేయ భారత్ కొనసాగించాలని ఆశిస్తోంది. ప్రస్తుత టోర్నీలో జట్ల బలాబలాల విషయానికి వస్తే యువభారత్ ఆల్రౌండ్ షోతో జైత్రయాత్ర చేస్తోంది. బ్యాటింగ్లో కెప్టెన్ ఉదయ్ సహరణ్ (389 పరుగులు), ముషీర్ ఖాన్ (338), సచిన్ దాస్ (294) సూపర్ ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లో సౌమీ పాండే (17 వికెట్లు) స్పిన్ మాయాజాలం ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేస్తోంది. మరోవైపు ఆసీస్ తరఫున ఓపెనర్ హ్యారీ డిక్సన్ (267 పరుగులు), కెప్టెన్ హ్యూగ్ వేగన్ (256) రాణించారు. బౌలింగ్లో కలమ్ విడ్లెర్ (12 వికెట్లు), టాస్ స్ట్రేకర్ (12 వికెట్లు) ప్రత్యర్థి బ్యాటర్లపై ప్రభావం కనబరిచారు. విజయాల పరంగా కూడా ఆసీస్... భారత్ లాగే దీటైన ప్రదర్శన చేసింది. సూపర్ సిక్స్లో విండీస్తో మ్యాచ్ వర్షంతో రద్దవగా మిగతా ఐదు మ్యాచ్ల్లోనూ గెలిచి అజేయంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ఫైనల్ హోరాహోరీగా జరిగే అవకాశముంది. -
'ప్లీజ్.. నా కొడుకును జడేజాతో పోల్చవద్దు'
అండర్ 19 వరల్డ్కప్-2024లో టీమిండియా ఫైనల్ చేరడంలో స్పిన్నర్ సౌమీ పాండేది కీలక పాత్ర. ఈ టోర్నీ ఆసాంతం 19 ఏళ్ల సౌమీ పాండే అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన పాండే 17 వికెట్లు పడగొట్టి.. మూడో లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న ఫైనల్లో సౌమీ మరో మూడు వికెట్లు పడగొడితే ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలుస్తాడు. అయితే ప్రతీమ్యాచ్లోనూ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్న సౌమీ పాండేను కొంతమంది టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో పోలుస్తున్నారు. భారత క్రికెట్కు మరో జడేజా దొరికేశాడని, జూనియర్ జడ్డూ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై స్పందించిన సౌమీ పాండే తండ్రి కృష్ణ కుమార్ పాండే స్పందించాడు. దయ చేసి తన కొడుకును జడేజాతో పోల్చవద్దని కృష్ణ కుమార్ విజ్ఞప్తి చేశాడు. జడేజాతో పోల్చవద్దు.. "కొంతమంది అభిమానులు సౌమీ పాండేను రవీంద్ర జడేతో పోలుస్తున్నారు. అయితే నా కొడుకును జడేజాతో పోల్చడం సరికాదు. సౌమీ ఇంకా నేర్చుకునే స్ధాయిలో ఉన్నాడు. జడేజా ఇప్పటికే తన పదిహేనేళ్ల క్రికెట్ కెరీర్ను పూర్తి చేసుకున్నాడు. అతడు తన కెరీర్లో అత్యుత్తమ స్ధాయిలో ఉన్నాడు. అతడు ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశాడు. జడ్డూ ఈ స్ధాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాడు. భారత్కు అతడు ఎన్నో అద్బుత విజయాలను అందిచాడు. సౌమీ ఇంకా మొదటి మెట్టు వద్దే ఉన్నాడు. దయచేసి ఇకనైనా సౌమీని జడేజాతో పోల్చవద్దు" అని ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణ కుమార్ పేర్కొన్నాడు. చదవండి: ILT 20: నరాలు తెగ ఉత్కంఠ.. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి! వీడియో వైరల్ -
ఆస్ట్రేలియాతో ఫైనల్ పోరు.. టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా?
భారత్, ఆస్ట్రేలియా మధ్య మరో కీలకపోరుకు రంగం సిద్దమైంది. అయితే ఈసారి పోరు సీనియర్ల మధ్య కాదు జూనియర్ల మధ్య. అండర్ 19 వరల్డ్కప్-2024 ఫైనల్లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోన్నాయి. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్పై ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించిన ఆసీస్.. తమ ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది. అంతకముందు తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన యువ భారత్.. 9వ సారి ఫైనల్లో అడుగుపెట్టింది. అండర్-19 వరల్డ్కప్లో ఆస్ట్రేలియా ఫైనల్కు చేరడం ఇది ఆరోసారి. ఫిబ్రవరి 11న సౌతాఫ్రికా బినోని స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. జూనియర్లు ప్రతీకారం తీర్చుకుంటారా? కాగా గత ఏడాదికాలంలో ఐసీసీ ఈవెంట్ ఫైనల్లో భారత్- ఆస్ట్రేలియా తలపడడం ఇది ముచ్చటగా మూడో సారి. గత రెండు ఈవెంట్ (డబ్ల్యూటీసీ 2023, వన్డే వరల్డ్కప్ 2023)ల్లోనూ ఆసీస్ గెలుపొంది.. భారత అభిమానుల ఆశలపై నీళ్లు జల్లింది. ఈ క్రమంలో కనీసం యువ భారత జట్టు అయినా ఫైనల్లో ఆసీస్ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని 140 కోట్ల మంది అభిమానులు భావిస్తున్నారు. మరి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా మరోసారి దాసోహం అంటుందా అన్నది ఆదివారం వరకు వేచి చూడాలి. కంగారులపై మనదే పై చేయి.. ఇక అండర్-19 వరల్డ్కప్లో మాత్రం కంగారులపై టీమిండియాదే పై చేయి. ఈ మెగా ఈవెంట్ ఫైనల్ పోరులో భారత్-ఆస్ట్రేలియా తలపడడం ఇది మూడో సారి. 2003 అండర్-19 వరల్డ్కప్ ఫైనల్లో తొలిసారిగా ఆసీస్- టీమిండియా తలపడ్డాయి. ఈ టోర్నీలో ఆసీస్ జట్టు కెప్టెన్గా రికీ పాంటింగ్ వ్యవహరించగా.. భారత జట్టును సౌరవ్ గంగూలీ ముందుకు నడిపించాడు. అయితే ఫైనల్ మ్యాచ్లో 125 పరుగుల తేడాతో భారత్ను ఆసీస్ చిత్తు చేసింది. కానీ ఆ తర్వాత టోర్నీల్లో మాత్రం భారత్ జూలు విధిల్చింది. అనంతరం మళ్లీ 9 ఏళ్ల తర్వాత 2012 వరల్డ్కప్ ఫైనల్లో ఆసీస్- భారత్ అమీతుమీ తెల్చుకున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్లో ఉన్ముక్త్ చంద్ నేతృత్వంలోని భారత జట్టును ఆసీస్ను ఓడించి టైటిల్ను ముద్దాడింది. అదే విధంగా 2018 వరల్డ్కప్ తుదిపోరులోనూ యువ భారత్ మట్టికరిపించింది. ఈ సారి కూడా అదే ఫలితం పునరావృతం అవుతుందని భారత అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. అద్భుత ఫామ్లో భారత్.. కాగా ప్రస్తుతం భారత జట్టు ఫామ్ను చూస్తుంటే ఆసీస్ను ఓడించి మరోసారి టైటిల్ను ఎగరేసుకోపోయేలా కన్పిస్తోంది. ఈ టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకుండా ఫైనల్స్ చేరింది. భారత కెప్టెన్ ఉదయ్ సహారాన్, ముషీర్ ఖాన్, సచిన్ దాస్ వంటి యువ సంచలనాలు అద్భుత ఫామ్లో ఉండడం జట్టుకు కలిశిచ్చే అంశం. మరోవైపు బౌలర్లలో రాజ్ లింబానీ మరోసారి చెలరేగితే ఆసీస్ బ్యాటర్లకు కష్టాలు తప్పవు. అయితే ఆసీస్ను మాత్రం తక్కువగా అంచనా వేయలేం. ఫైనల్ అంటే ఆసీస్కు పూనకాలే. పరిస్థితులు ఎలా ఉన్న ఆఖరి వరకు పోరాడడమే ఆసీస్ ప్రధాన అస్త్రం. 17 runs for 10th Wicket Partnership! 𝗔𝘂𝘀𝘁𝗿𝗮𝗹𝗶𝗮 in to U19WC finals 💥 U19WC Finals 1988 - PAK vs AUS 1998 - NZ vs ENG 2000 - SL vs IND 2002 - SA vs AUS 2004 - PAK vs WI 2006 - PAK vs IND 2008 - IND vs SA 2010 - AUS vs PAK 2012 - AUS vs IND 2014 - PAK vs SA 2016 - WI… pic.twitter.com/gDjUfyJEnx — 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) February 8, 2024 -
ఉత్కంఠ పోరులో పాక్ ఓటమి.. ఫైనల్లో ఆసీస్
బెనోని (దక్షిణాఫ్రికా): అండర్–19 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్ కూడా తొలి సెమీస్లాగే ఉత్కంఠభరితంగా ముగిసింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఒక వికెట్ తేడా తో పాకిస్తాన్పై నెగ్గి ఈ టోర్నీ చరిత్రలో ఆరోసారి ఫైనల్కు చేరుకుంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన పాక్ 48.5 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. అరాఫత్ (52; 9 ఫోర్లు), అజాన్ (52; 3 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టామ్ స్ట్రాకర్ (6/24) పాక్ను దెబ్బ తీశాడు. అనంతరం ఆస్ట్రేలియా 49.1 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు సాధించి గెలిచింది. డిక్సన్ (50; 5 ఫోర్లు), ఒలీవర్ పీక్ (49; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. 9వ వికెట్ కోల్పోయిన తర్వాత ఆసీస్ చివరి 4 ఓవర్లలో విజయానికి 16 పరుగులు చేయాల్సి ఉంది. తొలి 3 ఓవర్లలో 13 పరుగులు వచ్చాయి. స్లో ఓవర్ రేట్ కారణంగా పెనాల్టీ విధించడంతో ఆఖరి ఓవర్ కోసం ఫైన్ లెగ్ వద్ద ఉన్న ఫీల్డర్ను పాక్ రింగ్ లోపలికి తీసుకు రావాల్సి వచ్చింది. జీషాన్ వేసిన బంతిని బ్యాటర్ మెక్మిలన్ ఆడగా బంతి బ్యాట్ అంచుకు తాకి అదే ఫైన్ లెగ్ వైపు నుంచే బౌండరీ దాటింది. దాంతో ఆసీస్ కుర్రాళ్లు సంబరాలు చేసుకోగా, పాక్ బృందం నిరాశలో మునిగింది. ఆదివారం జరిగే తుది పోరులో భారత్తో ఆ్రస్టేలియా తలపడుతుంది. -
తండ్రి కలలు కన్నాడు.. కొడుకు నేరవేర్చాడు! ఎవరీ సచిన్ దాస్?
సచిన్ దాస్.. ప్రస్తుతం భారత క్రికెట్లో మారుమోగుతున్న పేరు. అండర్ 19 వరల్డ్కప్-2024లో టీమిండియా ఫైనల్కు చేరడంలో ఈ యువ ఆటగాడిది కీలక పాత్ర. క్రికెట్ గాడ్ పేరు పెట్టుకున్న ఈ యువ సంచలనం.. అందుకు తగ్గట్టుగానే అసాధారణమైన ప్రతిభను కనబరుస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి సెమీఫైనల్లో సచిన్ తనకు కెరీర్లో చిరకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 244 పరగుల ఛేదనలో 32 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో కెప్టెన్ ఉదయ్ సహారన్తో జతకట్టిన సచిన్.. తన విరోచిత పోరాటంతో తొమ్మిదోసారి ఫైనల్కు చేర్చాడు. బౌలర్లకు అనుకూలిస్తున్న వికెట్పై సచిన్ దాస్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. కేవలం 4 పరుగుల దూరంలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయిన దాస్.. తన సంచలన ఇన్నింగ్స్తో మాత్రం అందరి ప్రశంసలను అందుకుంటున్నాడు. ఈ మ్యాచ్లో 95 బంతులు ఎదుర్కొన్న సచిన్ 11 ఫోర్లు, 1 సిక్స్తో 96 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో ఎవరీ సచిన్ దాస్ అని నెటిజన్లు అరాతీసున్నారు. ఎవరీ సచిన్ దాస్? సచిన్ దాస్.. 2005 ఫిబ్రవరి 3న మహారాష్ట్రలోని బీడ్ గ్రామంలో జన్మించాడు. సచిన్కు తన చిన్నతనం నుంచే క్రికెట్పై మక్కువ ఎక్కువ. నాలుగున్నర ఏళ్ల వయస్సు నుంచే సచిన్ క్రికెట్ ఆడడం మొదలెట్టాడు. కానీ అతడు ఉన్న చోట క్రికెట్ ఆడేందుకు అత్యుత్తమ సౌకర్యాలు లేవు. అతడు ప్రాక్టీస్ చేయడానికి పూర్తి స్ధాయి క్రికెట్ పిచ్లు కూడా అందుబాటులో ఉండేవి కాదు. దాస్ హాఫ్ టర్ఫ్లపైనే ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు. సచిన్ తన ప్రయాణంలో ఎన్ని ఇబ్బందిలు ఎదుర్కొన్నప్పటికీ తన అభిరుచిని మాత్రం వదులుకోలేదు. నిరంతరం శ్రమ, పట్టుదలతో భారత జెర్సీ ధరించే స్ధాయికి చేరుకున్నాడు. అయితే సచిన్ భారత్ అండర్-19 క్రికెటర్గా ఎదగడంలో అతడి తల్లిదండ్రుల కూడా కీలక పాత్ర. సచిన్ తండ్రి పేరు సంజయ్ దాస్. అతడు మహారాష్ట్ర ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నారు. సంజయ్ దాస్కు కూడా క్రికెట్ అంటే ఇష్టం ఎక్కువే. యూనివర్సిటీ స్థాయి వరకు అతడు క్రికెట్ ఆడాడు. కానీ అతడు అంతకంటే ముందుకు వెళ్లలేదు. అయితే తన కలను కొడుకు రూపంలో నెరవేర్చుకోవాలని అనుకున్నాడు. తనకు తనయడు జన్మించిన వెంటనే ఎలాగైనా క్రికెటర్ చేయాలని సంజయ్ నిర్ణయించుకున్నాడు. మరోవైపు సచిన్ తల్లిపేరు సురేఖ దాస్. మహారాష్ట్ర పోలీస్ విభాగంలో అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. కోచ్ కూడా.. అదే విధంగా సచిన్ ఈ స్ధాయికి చేరుకోవడంలో కోచ్ షేక్ అజార్ కూడా తన వంతు పాత్ర పోషించాడు. సచిన్కు పేస్ బౌలర్లకు ఆడటంలో కాస్త ఇబ్బంది పడుతూ వస్తుండేవాడు. ముఖ్యంగా బౌన్సర్లను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడేవాడు. ఈ క్రమంలో సచిన్.. కోచ్ షేక్ అజార్ సాయంతో తన సమస్యను అధిగమించాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడి తండ్రి సంజయ్ దాస్ తెలిపాడు. సచిన్ దాస్ పేరు ఎలా వచ్చిందంటే? సచిన్ దాస్ తండ్రి సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్కి వీరాభిమాని. అయితే తన ఆరాధ్య క్రికెటర్లలో ఒకరైన సచిన్ టెండూల్కర్ పేరును తన కొడుక్కి పెట్టుకున్నారు. అయితే 18 ఏళ్ల సచిన్ దాస్ కూడా టెండూల్కర్కు వీరాభిమాని. అందుకే మాస్టర్ బ్లాస్టర్ ధరించిన 10వ నంబర్ జెర్సీనే వరల్డ్కప్లో వేసుకుంటున్నాడు. ఓవరాల్గా ఈ టోర్నీలో 6 మ్యాచ్లు ఆడిన సచిన్ దాస్.. 73.50 సగటుతో 294 పరుగులు చేశాడు. -
శ్రమించి... ఛేదించి...
ఈ టోర్నీలో ఆడిన మ్యాచ్లన్నీ గెలిచిన యువ భారత జట్టుకు 245 లక్ష్యం సులువైందే! కానీ 32 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియాకు ఆ సులువైన లక్ష్యమే క్లిష్టంగా మారింది. ఈ దశలో కెప్టెన్ ఉదయ్ సహారణ్కు జతయిన సచిన్ దాస్ ఐదో వికెట్కు 171 పరుగులు జోడించడంతో ఓటమి కోరల్లోంచి బయటపడిన భారత్ ఈ మెగా టోర్నీ చరిత్రలో తొమ్మిదోసారి ఫైనల్ పోరుకు అర్హత పొందింది. బెనోని (దక్షిణాఫ్రికా): ఆరంభం నుంచి అండర్–19 ప్రపంచకప్లో అలవోకగా జైత్రయాత్ర చేస్తున్న డిఫెండింగ్ చాంపియన్ భారత్కు సెమీస్లో అసాధారణ పోరాటం ఎదురైనా... అద్భుతమైన విజయంతో ఫైనల్ చేరింది. తొలి సెమీఫైనల్లో యువ భారత్ 2 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. మొదట దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్లకు 244 పరుగులు చేసింది. ప్రిటోరియస్ (102 బంతుల్లో 76; 6 ఫోర్లు, 3 సిక్స్లు), రిచర్డ్ (100 బంతుల్లో 64; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. రాజ్ లింబాని 3; ముషీర్ ఖాన్ 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 48.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఉదయ్ (124 బంతుల్లో 81; 6 ఫోర్లు), సచిన్ దాస్ (95 బంతుల్లో 96; 11 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత పోరాటం చేశారు. సీన్ మార్చిన సచిన్ జట్టు ఖాతా తెరువక ముందే తొలి బంతికే ఆదర్శ్ సింగ్ (0), కాసేపటికే ముషీర్ ఖాన్ (4), అర్షిన్ (12), ప్రియాన్షు (5) పెవిలియన్ చేరారు. ఈ దశలో క్రీజులో ఉన్న కెప్టెన్ ఉదయ్కి సచిన్ దాస్ జతయ్యాడు. కెప్టెన్ నింపాదిగా ఆడుతుంటే అడపాదడపా బౌండరీలతో సచిన్ దాస్ లక్ష్యఛేదనకు అవసరమైన పరుగులు పేర్చాడు. అర్ధసెంచరీలతో ఇన్నింగ్స్ను గాడిన పెట్టారు. ఇద్దరు 30 ఓవర్లపాటు అసాధారణ పోరాటం చేశారు. 4 పరుగుల తేడాతో సచిన్ సెంచరీ అవకాశాన్ని చేజార్చుకోగా... హైదరాబాద్ ఆటగాళ్లు అరవెల్లి అవనీశ్ రావు (10), అభిషేక్ మురుగన్ (0) వికెట్లు పడటంతో ఉత్కంఠ పెరిగింది. ఈ దశలో రాజ్ లింబాని (4 బంతుల్లో 13 నాటౌట్; 1 సిక్స్, 1 ఫోర్) జట్టును విజయ తీరానికి చేర్చాడు. గురువారం ఆ్రస్టేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో నెగ్గిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో భారత్తో తలపడుతుంది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ప్రిటోరియస్ (సి) అభిõÙక్ (బి) ముషీర్ 76; స్టీవ్ స్టోల్క్ (సి) అవనీశ్ (బి) రాజ్ 14; టీగెర్ (బి) రాజ్ 0; రిచర్డ్ (సి) మొయిలా (బి) నమన్ 64; ఒలీవర్ (సి) సచిన్ (బి) ముషీర్ 22; మరయిస్ (సి) అభిషేక్ (బి) సౌమీ పాండే 3; జేమ్స్ (సి) అవనీశ్ (బి) రాజ్ 24; నార్టన్ నాటౌట్ 7; ట్రిస్టన్ నాటౌట్ 23; ఎక్స్ట్రాలు 11; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 244. వికెట్ల పతనం: 1–23, 2–46, 3–118, 4–163, 5–174, 6–214, 7–220. బౌలింగ్: రాజ్ లింబాని 9–0–60–3, నమన్ తివారి 8–0–52–1, అభిõÙక్ మురుగన్ 4–0–14–0, అర్షిన్ 2–0–10–0, సౌమీ పాండే 10–0–38–1, ముషీర్ 10–1–43–2, ప్రియాన్షు 7–1–25–0. భారత్ ఇన్నింగ్స్: ఆదర్శ్ (సి) ప్రిటోరియస్ (బి) మఫక 0; అర్షిన్ (సి) జేమ్స్ (బి) ట్రిస్టన్ 12; ముషీర్ (సి) జేమ్స్ (బి) ట్రిస్టన్ 4; ఉదయ్ (రనౌట్) 81; ప్రియాన్షు (సి) ప్రిటోరియస్ (బి) ట్రిస్టన్ 5; సచిన్ (సి) టీగెర్ (బి) మఫక 96; అవనీశ్ (సి) నార్టన్ (బి) మఫక 10; అభిషేక్ (రనౌట్) 0; రాజ్ (నాటౌట్) 13; నమన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 27; మొత్తం (48.5 ఓవర్లలో 8 వికెట్లకు) 248. వికెట్ల పతనం: 1–0, 2–8, 3–25, 4–32, 5–203, 6–226, 7–227, 8–244. బౌలింగ్: మఫక 10–0–32–3, ట్రిస్టన్ 10–1–37–3, నార్టన్ 9–0–53–0, మొకినా 7.5–0–45–0, స్టోల్క్ 2–0–18–0, జేమ్స్ 8–0–44–0, వైట్హెడ్ 2–0–17–0. -
దక్షిణాఫ్రికాతో భారత్ సెమీస్ పోరు..
అండర్–19 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆతిథ్య దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్ పోరుకు సిద్ధమైంది. 1988లో మొదలైన అండర్–19 ప్రపంచకప్ల చరిత్రలో అత్యధికంగా 8 సార్లు ఫైనల్ చేరిన భారత్... 2000, 2008, 2012, 2018, 2022లలో ఐదుసార్లు విజేతగా నిలిచింది. ఉదయ్ సహరన్ నేతృత్వంలోని యువ జట్టు ఆల్రౌండ్ నైపుణ్యంతో ఉంది. ఈ టోర్నీలో వరుసగా ఐదు విజయాలు సాధించింది. ఈ మెగా ఈవెంట్కు ముందు సన్నాహకంగా ఆడిన ముక్కోణపు సిరీస్లో సఫారీ జట్టును భారత్ రెండు వన్డేల్లో ఓడించింది. కీలకమైన సెమీస్కు ముందు యువ భారత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశమిది. ఇదే సమరోత్సాహంతో ఆతిథ్య దక్షిణాఫ్రికాను మట్టికరిపించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్లో ముషీర్ ఖాన్, కెప్టెన్ ఉదయ్, సచిన్ దాస్ సూపర్ ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లో సౌమీ కుమార్ పాండే, నమన్ తివారి, రాజ్ లింబానిలు కూడా నిలకడగా రాణిస్తుండటం జట్టును పటిష్టంగా నిలిపింది. మధ్యాహ్నం 1.30 గంటలకు మొదలయ్యే ఈ సెమీస్ పోరును స్టార్స్పోర్ట్స్ ప్రసారం చేస్తుంది. -
న్యూజిలాండ్ను చిత్తు చేసిన భారత్.. 214 పరుగుల తేడాతో ఘన విజయం
అండర్ 19 వరల్డ్ కప్-2024లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీ సూపర్ సిక్స్ దశను విజయంతో ఆరంభించింది. సూపర్ సిక్స్లో భాగంగా బ్లూమ్ఫోంటైన్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 214 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. భారత విజయంలో ముషీర్ ఖాన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్లో సెంచరీతో చెలరేగిన ముషీర్.. అనంతరం బౌలింగ్లో రెండు వికెట్లు పడగొట్టాడు. 126 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్లతో 131 ముషీర్ పరుగులు చేశాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ముషీర్తో పాటు ఓపెనర్ ఆదర్శ్ సింగ్(52), కెప్టెన్ ఉదయ్ సహారన్(34) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మాసేన్ క్లార్క్ 4 వికెట్లు పడగొట్టగా.. ఒలీవర్ తెవాటియా, కమ్మింగ్, రెయాన్ తలా వికెట్ సాధించారు. 4 వికెట్లతో చెలరేగిన సౌమ్య పాండే.. 296 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. భారత బౌలర్ల దాటికి కేవలం 81 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్పిన్నర్ సౌమ్య పాండే 4 వికెట్లతో బ్లాక్క్యాప్స్ పతనాన్ని శాసించగా.. రాజ్ లింబానీ, ముషీర్ ఖాన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో కెప్టెన్ జాక్సన్(19) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. -
వరల్డ్ కప్లో చెలరేగిన భారత బ్యాటర్లు.. 326 పరుగుల భారీ స్కోర్
అండర్-19 వరల్డ్కప్ 2024లో భాగంగా అమెరికాతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా టీమిండియా బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అర్షిన్ కులకర్ణి అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 118 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో కులకర్ణి 108 పరుగులు చేశాడు. అతడితో పాటు ముషీర్ ఖాన్(73), కెప్టెన్ ఉదయ్ సహారన్(35) పరుగులతో రాణించారు. అమెరికా బౌలర్లలో సుబ్రమణ్యన్ రెండు వికెట్లు పడగొట్టగా.. అరిన్, ఆర్యా గార్గ్, రిషి రమేష్ తలా వికెట్ సాధించారు. అనంతరం 327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఎస్ 8 ఓవర్లలో 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్లలో ఇప్పటివరకు తివారీ రెండు వికెట్లు పడగొట్టగా.. రాజ్ లింబానీ ఒక్క వికెట్ సాధించారు. -
నేడు అమెరికాతో యువ భారత్ ‘ఢీ’
అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో ఉదయ్ సహారణ్ నాయకత్వంలోని టీమిండియా నేడు గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్లో అమెరికా జట్టుతో తలపడనుంది. తొలి రెండు లీగ్ మ్యాచ్ల్లో బంగ్లాదేశ్, ఐర్లాండ్పై గెలిచి ‘సూపర్ సిక్స్’ బెర్త్ను ఖరారు చేసుకున్న భారత్ ఈ మ్యాచ్లోనూ గెలిచి లీగ్ దశను అజేయంగా ముగించాలని పట్టుదలతో ఉంది. మధ్యాహ్నం గం. 1:30 నుంచి జరిగే ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్ చానెల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
న్యూజిలాండ్కు బిగ్ షాకిచ్చిన పాకిస్తాన్.. 10 వికెట్ల తేడాతో ఘన విజయం
అండర్-19 వరల్డ్కప్-2024లో పాకిస్తాన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని పాక్ అందుకుంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం ఈస్ట్ లండన్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 25.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. పాక్ ఓపెనర్లు షాజైబ్ ఖాన్(80 నాటౌట్), షమీల్ హుస్సేన్(54నాటౌట్) మ్యాచ్ను ఫినిష్ చేశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కివీస్.. పాక్ బౌలర్ల దాటికి కేవలం 140 పరుగులకే కుప్పకూలింది. పాక్ బౌలర్లలో ఉబైద్ షా, ఆరాఫాట్ మిన్హాష్ తలా 3 వికెట్లు పడగొట్టి బ్లాక్ క్యాప్స్ పతనాన్ని శాసించారు. వీరిద్దరితో పాటు నవీద్ రెండు,అలీ, జీషన్ ఒక్కో వికెట్ సాధించారు. ఈ విజయంతో పాకిస్తాన్ గ్రూపు-డి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది. చదవండి: IND vs ENG: సెంచరీతో చెలరేగిన పోప్.. రసవత్తరంగా భారత్-ఇంగ్లండ్ తొలి టెస్టు -
వరల్డ్కప్లో సెంచరీ.. గిల్ సెలబ్రేషన్స్ కాపీ కొట్టిన కివీస్ క్రికెటర్
సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్ 19 క్రికెట్ వరల్డ్కప్-2024ను న్యూజిలాండ్ ఆటగాడు స్నేహిత్ రెడ్డి ఘనంగా ఆరంభించాడు. ఈస్ట్ లండన్ వేదికగా నేపాల్తో జరిగిన మ్యాచ్లో అద్బుత సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో స్నేహిత్ 125 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 147 పరుగులు చేశాడు. ఇక ఇది ఇలా ఉండగా.. స్నేహిత్ తెలుగు సంతతికి చెందిన క్రికెటరే కావడం విశేషం. 17 ఏళ్ల స్నేహిత్ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో పుట్టినప్పటికీ.. అతని తల్లిదండ్రులు న్యూజిలాండ్కు వలస వెళ్లడంతో ఆ దేశం తరఫున క్రికెట్ ఆడుతున్నాడు. ఇక సెంచరీతో చెలరేగిన స్నేహిత్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో స్నేహిత్ మాట్లాడుతూ.. టీమిండియా ప్రిన్స్ శుబ్మన్ గిల్పై ప్రశంసల వర్షం కురిపించాడు. శుబ్మన్ గిల్ తనను ఎంతగానే ప్రభావితం చేశాడని స్నేహిత్ తెలిపాడు. అంతేకాకుండా గిల్ బోడౌన్ సెంచరీ సెలబ్రేషన్స్ స్టైల్ను స్నేహిత్ రెడ్డి అనుకరించాడు. "తొలి మ్యాచ్లోనే సెంచరీ సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సెంచరీ నాకు చాలా స్పెషల్. ఈ మ్యాచ్లో నా ఇన్నింగ్స్ను బాగా ఎంజాయ్ చేశాను. కాగా ఈ మ్యాచ్కు ముందే మా సెంచరీ సెలబ్రేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. నేను అయితే శుబ్మన్ గిల్ 'బౌడౌన్' సెలబ్రేషన్స్ జరుపుకుంటానని చెప్పాను. ఎందుకంటే నా అభిమాన క్రికెటర్లలో శుబ్మన్ ఒకడు. అతడు బ్యాటింగ్ స్టైల్ అంటే నాకెంతో ఇష్టం. అతడి షాట్ సెలక్షన్ కూడా అద్బుతం. గిల్ బ్యాటింగ్ స్టైల్ను కాపీ చేయడానికి ప్రయత్నిస్తున్నాను అని పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో స్నేహిత్ రెడ్డి పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో నేపాల్పై 64 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. చదవండి: WI vs AUS: 29 బంతుల్లో విధ్వంసకర సెంచరీ.. ఆసీస్ జట్టులో ఛాన్స్ కొట్టేశాడు! ❤️ A moment shared with family 🫶 Enjoying the occasion ✨ Shubman Gill's influence New Zealand's Snehith Reddy reflects on his #U19WorldCup century 💯 pic.twitter.com/szYB81B0yi — ICC (@ICC) January 22, 2024 -
‘బుమ్రా గొప్పొడే కానీ...’
సొంత గడ్డపై జరుగుతున్న అండర్-19 వరల్డ్కప్-2024లో దక్షిణాఫ్రికా శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్లో 31 పరుగుల తేడాతో ప్రోటీస్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో సఫారీ స్పీడ్స్టర్ క్వేనా మఫాకా ఐదు వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో 9.1 ఓవర్లు బౌలింగ్ చేసిన మఫాకా 38 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తన అద్బుత ప్రదర్శనకు గాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు 17 ఏళ్ల మఫాకాకు వరించింది. పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో మఫాకా మాట్లాడుతూ.. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్లో మఫాకా వికెట్ పడగొట్టిన ప్రతీసారి బుమ్రా స్టైల్లోనే సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. వికెట్ తీసినప్పుడు ఏ విధంగా సెలబ్రేషన్స్ జరుపుకోవాలో ప్రపంచ కప్కు ముందు నా సోదరుడిని అడిగాను. అతడు నాకు తెలియదు అని సమాధనమిచ్చాడు. అందుకు బదులుగా వెంటనే నేను 'ఐ డోంట్ నో' సెలబ్రేషన్స్ జరుపుకుంటానని నవ్వుతూ అన్నాను. అందుకే బుమ్రా సెలబ్రేషన్స్ను అనుకరించాలని నిర్ణయించుకున్నాను. బమ్రా కూడా వికెట్ పడగొట్టిన పెద్దగా సెలబ్రేషన్స్ చేసుకోడు. వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్లలో బుమ్రా ఒకడు. అయితే బుమ్రా కంటే నేను బెటర్ అనుకుంటున్నా అని ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మఫాకా పేర్కొన్నాడు. చదవండి: WI vs AUS: 29 బంతుల్లో విధ్వంసకర సెంచరీ.. ఆసీస్ జట్టులో ఛాన్స్ కొట్టేశాడు! -
గొడవకు దిగిన టీమిండియా కెప్టెన్.. కొట్టుకునేంత పని చేశారుగా! వీడియో వైరల్
అండర్ 19 వరల్డ్కప్-2024ను భారత జట్టు విజయంతో ఆరంభించింది. బ్లూమ్ఫోంటెన్ వేదికగా మాజీ విజేత బంగ్లాదేశ్తో శనివారం జరిగిన గ్రూప్ 'ఎ' తొలి లీగ్ మ్యాచ్లో 84 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహారన్ తన సహానాన్ని కోల్పోయాడు. మైదానంలోనే బంగ్లాదేశ్ ఆటగాడు అరిఫుల్ ఇస్లాంతో మాటల యుద్ధానికి సహారాన్ దిగాడు. అంతలోనే మరో బంగ్లా ఆటగాడు మహ్ఫుజుర్ రహ్మాన్ రబ్బీ తన సహచర ఆటగాడికి మద్దతుగా నిలవడంతో వాగ్వాదం మరింత తీవ్రమైంది. ఒకరికొకరు దగ్గరకు వచ్చి కొట్టుకునేంత పనిచేశారు. అయితే అంపైర్ జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఈ సంఘటన భారత ఇన్నింగ్స్ 25 ఓవర్లో చోటు చేసుకుంది. అయితే సహారాన్ కోపానికి గల కారణమేంటో తెలియలేదు. ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. కాగా ఈ మ్యాచ్లో సహారన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టు 7.2 ఓవర్లలో కేవలం 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఓపెనర్ ఆదర్శ్ సింగ్, కెప్టెన్ ఉదయ్ సహారన్ అర్ధ సెంచరీలతో భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఈ యువ జోడీ మూడో వికెట్కు 116 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఆదర్శ్ సింగ్(76), ఉదయ్ సహారన్(64) పరుగులు చేశారు. చదవండి: #Shoaib Malik: చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్.. ఒకే ఒక్కడు pic.twitter.com/fmqCEQ5ipB — Sitaraman (@Sitaraman112971) January 20, 2024 -
వరల్డ్కప్లో బోణీ కొట్టిన టీమిండియా.. 84 పరుగులతో బంగ్లా చిత్తు
అండర్ 19 వరల్డ్కప్- 2024లో భారత్ బోణీ కొట్టింది. బ్లోమ్ఫోంటెయిన్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 84 పరుగుల తేడాతో యువ భారత జట్టు విజయం సాధించింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా.. భారత స్పిన్నర్ల దాటికి 167 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో సౌమీ పాండే 4 వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించగా.. ముషీర్ ఖాన్ 2 వికెట్లతో సత్తాచాటాడు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో మహ్మద్ షిహాబ్ జేమ్స్(54) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ ఆదర్ష్ సింగ్(76) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ ఉదయ్ సహ్రన్(64) హాఫ్ సెంచరీతో రాణించాడు. బంగ్లా బౌలర్లలో మరూప్ మిరందా 5 వికెట్లతో చెలరేగాడు. ఇక ఈ మెగా టోర్నీలో టీమిండియా తమ తదుపరి మ్యాచ్లో జనవరి 25న బ్లోమ్ఫోంటెయిన్ వేదికగా ఐర్లాండ్తో తలపడనుంది. చదవండి: #Mohammed Shami: పెళ్లి కొడుకు గెటప్లో షమీ.. మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడా? -
ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ మాత్రం చెలరేగాడు! 6 వికెట్లతో
దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న అండర్-19 ప్రపంచకప్కు టీమిండియా సన్నదమవుతోంది. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు యువ భారత జట్టు దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ టీమ్స్తో ట్రైసిరీస్లో తలపడతోంది. ఈ ట్రైసిరీస్ కూడా సఫారీ గడ్డపైనే జరగుతుంది. ఈ ట్రైసిరీస్ టీమిండియా బోణీ కొట్టింది. అఫ్గానిస్తాన్తో జరిగిన తొలి మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 198 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్పిన్నర్ సౌమీ పాండే 6 వికెట్లతో చెలరేగాడు. సౌమీ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి అఫ్గానిస్తాన్ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. తన 10 ఓవర్ల కోటాలో కేవలం 29 పరుగులు మాత్రమే 6 వికెట్లు సాధించాడు. కాగా ఈ నెల 16న జరిగిన ఐపీఎల్ వేలంలో కూడా సౌమీ భాగమయ్యాడు. రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఇక ఇది ఇలా ఉండగా.. బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్ సోహిల్ ఖాన్(71) టాప్ స్కోరర్గా నిలవగా.. హసన్ ఈసాఖిల్(54) పరుగులతో రాణించాడు. అనంతరం 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 4 వికెట్లు కోల్పోయి 36.4 ఓవర్లలో ఛేదించింది. టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్ ఆదర్శ్ సింగ్(112) సెంచరీతో చెలరేగాడు. ఇక ఈ సిరీస్లో భారత్ తమ తదుపరి మ్యాచ్లో జనవరి 2న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. చదవండి: IND vs SA 2nd Test: టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఆల్రౌండర్కు గాయం -
వారిపై ఢిల్లీ క్యాపిటల్స్కు అమితమైన ఆసక్తి.. కోహ్లి విషయంలో మాత్రం ఎందుకో అలా..
WPL Auction 2023: నిన్న (ఫిబ్రవరి 13) జరిగిన తొలి మహిళల ఐపీఎల్ వేలంలో టీమిండియా డాషింగ్ ఓపెనర్, అండర్-19 వరల్డ్ కప్ 2023 విన్నింగ్ కెప్టెన్, లేడీ సెహ్వాగ్గా పేరొందిన షెఫాలీ వర్మను ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. షెఫాలీ కోసం ఆర్సీబీ సైతం తీవ్రంగా పోటీపడినప్పటికీ పట్టు వదలని ఢిల్లీ ఎట్టకేలకు భారత సివంగిని దక్కించుకుంది. షెఫాలీని ఢిల్లీ దక్కించుకున్న తర్వాత సోషల్మీడియాలో ఓ ఆసక్తికర విషయం విపరీతంగా ట్రోల్ అయ్యింది. ఢిల్లీ క్యాపిటల్స్ గతంలోకి ఓసారి తొంగి చూస్తే.. ఈ ఫ్రాంచైజీ అండర్-19 వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ల అడ్డాగా పేరొందింది. అండర్-19 వరల్డ్కప్లో భారత్ను జగజ్జేతగా నిలిపిన ఉన్ముక్త్ చంద్ 2011-13 మధ్యలో నాటి ఢిల్లీ డేర్డెవిల్స్కు ప్రాతినిధ్యం వహించగా.. 2018 అండర్-19 వరల్డ్కప్లో టీమిండియాను విశ్వవిజేతగా నిలిపిన పృథ్వీ షా.. గత నాలుగు సీజన్లు ఢిల్లీ ఫ్రాంచైజీకే ఆడుతున్నాడు. వీరి తర్వాత భారత్ను అండర్-19 వరల్డ్కప్-2022 విజేతగా నిలిపిన యశ్ ధుల్ను 2022 ఐపీఎల్ సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కోటి రూపాయలు వెచ్చించి సొంతం చేసుకుంది. తాజాగా తొలి మహిళల అండర్-19 టీ20 వరల్డ్కప్ నెగ్గిన భారత యువ జట్టు కెప్టెన్ షెఫాలీ వర్మను ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. భారత అండర్-19 వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్లపై అమితాసక్తి కనబరుస్తూ వస్తున్న ఢిల్లీ ఫ్రాంచైజీ, 2008 అండర్-19 వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్, నేటి భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిని మాత్రం ఎందుకో ఆర్సీబీకి వదిలేసింది. పై పేర్కొన్న ఆటగాళ్లలో కొందరు ఢిల్లీకి చెందిన వారు కానప్పటికీ కొనుగోలు చేసిన డీసీ ఫ్రాంచైజీ.. కోహ్లి ఢిల్లీ వాస్తవ్యుడైనప్పటికీ అతన్ని మిస్ చేసుకుంది. -
Under-19 Womens T20 World Cup 2023: ఫైనల్ సమరానికి సిద్ధం
పొచెఫ్స్ట్రూమ్: మహిళల క్రికెట్లో ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవని భారత జట్టు ఆ ఘనతకు అడుగు దూరంలో ఉంది. సీనియర్ అమ్మాయిల జట్టు మూడు ప్రపంచకప్ (రెండు వన్డే, ఒకటి టి20) ఫైనల్లో ఆడినా... రన్నరప్గానే సరిపెట్టుకుంది. ఇప్పుడు ఈ జూనియర్ జట్టు ఫైనల్ విజయంతో వస్తే... భారత మహిళల క్రికెట్ ప్రగతి మరో దశకు చేరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. షఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు ఆదివారం ఇంగ్లండ్తో అమీతుమీకి సిద్ధమైంది. శనివారమే పుట్టినరోజు జరుపుకున్న షఫాలీకి వున్న అంతర్జాతీయ అనుభవం, జట్టు ఈ టోర్నీలో కనబరిచిన ప్రదర్శనను బట్టి చూస్తే భారతే ఫేవరెట్గా కనిపిస్తోంది. పైగా రెండు ప్రపంచకప్ ఫైనల్స్ ఆడిన షఫాలీ తన నైపుణ్యంతో జట్టును విజయతీరాలకు చేర్చితే ఆమె ఖాతాలో అరుదైన రికార్డు చేరుతుంది. సెమీఫైనల్లో షఫాలీ సేన న్యూజిలాండ్పై అలవోక విజయం సాధించింది. మొదట బౌలర్లు, తర్వాత బ్యాటర్లు కివీస్ అమ్మాయిలపై ఆధిపత్యం చలాయించారు. ఫైనల్లోనూ ఇదే పట్టుదల కనబరిస్తే ప్రపంచకప్ చేతికందుతుంది. మరో వైపు సెమీస్లో హోరాహోరీ సమరంలో చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాను ఓడించడంతో ఇంగ్లండ్ జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. భారత జట్టుకు తగిన పోటీ ఇవ్వగల సత్తా ఇంగ్లండ్కు ఉంది. నేడు హాకీ ప్రపంచకప్ ఫైనల్ ► జర్మనీ X బెల్జియం ► రా.గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం ► సా.గం.5.15 నుంచి ‘ఫ్యాన్కోడ్’ యాప్లో ప్రసారం -
మహిళల టి20 వరల్డ్కప్: కివీస్పై గెలుపు.. ఫైనల్లో భారత్
ఐసీసీ అండర్-19 మహిళల టి20 వరల్డ్కప్లో భారత జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం న్యూజిలాండ్ వుమెన్స్తో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 108 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు 14.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 110 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ(10) విఫలమైనప్పటికి మరో ఓపెనర్ స్వేతా సెహ్రావత్(45 బంతుల్లో 61 పరుగులు నాటౌట్), సౌమ్య తివారీ(22 పరుగులు) రాణించడంతో భారత్ సులువుగానే విజయాన్ని అందుకుంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ప్లిమ్మర్ 35 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. ఇసాబెల్లా గేజ్ 26 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పరశ్వీ చోప్రా మూడు వికెట్లు తీయగా.. తిటాస్ సాదు, మన్నత్ కశ్యప్, షఫాలీ వర్మ, అర్జనా దేవీలు తలా ఒక వికెట్ తీశారు. ఇంగ్లండ్ వుమెన్స్, ఆస్ట్రేలియా వుమెన్స్ మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్ విజేతతో జనవరి 29న(ఆదివారం) భారత మహిళల జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. A dominant performance sends India through to the #U19T20WorldCup final! 📝 Scorecard: https://t.co/nO40lpkR7A Watch the action live and for FREE on https://t.co/5AuGFN3l1C (in select regions) 📺 pic.twitter.com/0Ik8ET7Zbi — T20 World Cup (@T20WorldCup) January 27, 2023 -
టీ20 వరల్డ్కప్ షురూ.. దక్షిణాఫ్రికాను ఢీకొట్టనున్న భారత్
Under 19 Women T20 WC: తొట్ట తొలి అండర్–19 మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీ దక్షిణాఫ్రికా వేదికగా నేటి నుంచి ప్రారంభంకానుంది. 16 జట్లు తలపడుతున్న ఈ టోర్నీ ఈనెల 29న జరిగే ఫైనల్తో ముగుస్తుంది. గ్రూప్ ‘ఎ’లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక, అమెరికా; గ్రూప్ ‘బి’లో ఇంగ్లండ్, పాకిస్తాన్, జింబాబ్వే, రువాండా; గ్రూప్ ‘సి’లో ఇండోనేసియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్; గ్రూప్ ‘డి’లో భారత్, దక్షిణాఫ్రికా, స్కాట్లాండ్, యూఏఈ జట్లున్నాయి. నేడు జరిగే తమ తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో భారత్ ఆడుతుంది. భారత జట్టులో హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిష, వైజాగ్కు చెందిన షబ్నమ్ సభ్యులుగా ఉన్నారు. భారత జట్టు: షెఫాలి వర్మ (కెప్టెన్), శ్వేత సెహ్రావత్ (వైస్ కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్కీపర్), జి త్రిష, సౌమ్య తివారి, సోనియా మెహ్దియా, హుర్లీ గాలా, హ్రిశిత బసు (వికెట్కీపర్), సోనమ్ యాదవ్, మన్నత్ కశ్యప్, అర్చనా దేవీ, పర్శవీ చోప్రా, టిటాస్ సాధు, ఫలక్ నాజ్, షబ్నమ్ టీమిండియా ఆడబోయే మ్యాచ్ల వివరాలు.. జనవరి 14న సౌతాఫ్రికాతో (భారతకాలమానం ప్రకారం సాయంత్రం 5:15 గంటలకు ప్రారంభం) జనవరి 16న యూఏఈతో (మధ్యాహ్నం 1:30 గంటలకు) జనవరి 18న స్కాట్లాండ్తో (సాయంత్రం 5:15 గంటలకు) -
IND-19 vs NZ-19: భారత జట్టులో తెలంగాణ అమ్మాయి..
స్వదేశంలో న్యూజిలాండ్ అండర్-19 మహిళల జట్టుతో జరగబోయే టీ20 సిరీస్కు భారత జట్టును ఆల్ ఇండియా ఉమెన్స్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. హోమ్ సిరీస్లో భాగంగా భారత జట్టు కివీస్తో ఐదు టీ20లు ఆడనుంది. మొత్తం మ్యాచ్లన్నీ ముంబై వేదికగా జరగనున్నాయి. నవంబర్ 27న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక 15 మంది సభ్యుల భారత జట్టుకు శ్వేతా సెహ్రావత్ కెప్టెన్గా ఎంపికైంది. కాగా వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న తొలి మహిళల అండర్-19 ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా ఈ సిరీస్ జరుగుతోంది. భారత జట్టులో తెలంగాణ అమ్మాయి సెలక్షన్ కమిటీ ప్రకటించిన జట్టులో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిషకు చోటు దక్కింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గొంగడి త్రిష 8 ఏళ్లకే జిల్లా స్థాయిలో ఆడి ఉమెన్ ఆఫ్ ద సిరీస్గా ఎంపికైంది. అదే విధంగా బీసీసీఐ నిర్వహించిన డర్-19, సీనియర్ ఇండియా బ్లూ తరఫున త్రిష అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. అదే విధంగా జైపుర్ వేదికగా జరిగిన అండర్-19 మహిళల వన్డే ఛాలెంజర్ ట్రోఫీ-2021లోను త్రిష ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. చదవండి: IND vs NZ: సూర్యకుమార్పై కోహ్లి ప్రశంసలు.. వీడియో గేమ్ ఇన్నింగ్స్ అంటూ! -
క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు.. 8 పరుగులకే ఆలౌట్..!
ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును అండర్-19 నేపాల్ మహిళల జట్టు నమోదు చేసింది. శనివారం జరిగిన అండర్-19 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్లో నేపాల్ మహిళల జట్టు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో నేపాల్ కేవలం ఎనిమిది పరుగులకే ఆలౌటైంది. తద్వారా క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్కే ఆలౌటైన జట్టుగా నేపాల్ నిలిచింది. నేపాల్ ఇన్నింగ్స్లో ఆరుగురు బ్యాటర్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరారు. నేపాల్ తరఫున స్నేహ మహారా 3 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. ఇక యుఎఈ బౌలర్లలో నాలుగు ఓవర్లలో 2 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది. ఇక 9 పరుగుల లక్ష్యాన్ని 1.1 ఓవర్లలో యుఎఈ చేధించింది. కాగా జూన్ 3న (శుక్రవారం) తమ మునుపటి మ్యాచ్లో నేపాల్ ఖతార్పై 79 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో నేపాల్ ఖతార్ను 38 పరుగులకే ఆలౌట్ చేసింది. చదవండి: ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు.. టీ10 చరిత్రలో అరుదైన ఫీట్.. తొలి ఆటగాడిగా..! -
చరిత్ర సృష్టించిన యష్ ధుల్... 8 ఏళ్లలో ఒకే ఒక్కడు!
అండర్- 19 ప్రపంచకప్ టోర్నీలో భారత్కు ప్రపంచకప్ సాధించి పెట్టిన కెప్టెన్ యశ్ ధుల్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. అరంగేట్ర మ్యాచ్లో యష్ సెంచరీల మోత మోగించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ, తమిళనాడు జట్లు మొదటి మ్యాచ్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే తొలి ఇన్నింగ్స్లో సెంచరీ సాధించిన యశ్ ధుల్..రెండో ఇన్నింగ్స్లో కూడా సెంచరీతో మెరిశాడు. ఈ నేపథ్యంలో యశ్ ధుల్ అరుదైన ఫీట్ సాధించాడు. రంజీ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లోను సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా యష్ధుల్ నిలిచాడు. అంతకు ముందు గుజరాత్ బ్యాటర్ నారీ కాంట్రాక్టర్ ఈ ఫీట్ సాధించిన మొదటి వ్యక్తి కాగా, మహారాష్ట్ర బ్యాటర్ విరాగ్ అవతే రెండో ఆటగాడిగా ఉన్నాడు. 1952-53 రంజీట్రోఫీ సీజన్లో కాంట్రాక్టర్ ఈ ఘనత సాధించగా, 2012-13 సీజన్లో విరాగ్ అవతే ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో 113 పరుగులు చేసిన యష్.. రెండో ఇన్నింగ్స్లోనూ 113 పరగులు సాధించాడు. కాగా ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా ఢిల్లీ ఫ్రాంఛైజీ 50 లక్షల రూపాయలు వెచ్చించి యశ్ ధుల్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: Rashid Khan: గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించిన రషీద్ ఖాన్.. ఎందుకో తెలుసా? Only the 3rd player in the history of #RanjiTrophy to hit 2⃣ centuries on debut 🔥 A dream start for @YashDhull2002 💙#YehHaiNayiDilli #DELvTN pic.twitter.com/ZXY6Gt00aQ — Delhi Capitals (@DelhiCapitals) February 20, 2022 -
టోర్నీ ముగిసినా స్వదేశానికి రాలేదు.. ఆరా తీస్తే
అండర్-19 ప్రపంచకప్ టోర్నీ ముగిసిన తర్వాత అఫ్గనిస్తాన్ జట్టులోని నలుగురు స్వదేశానికి వెళ్లడానికి నిరాకరించారు. ఆ దేశంలో నెలకొన్న అనిశ్చితి కారణంగానే ఆ నలుగురు లండన్లోనే ఆశ్రయం పొందుతున్నారని తెలిసింది. అందులో ఒకరు క్రికెటర్ కాగా.. మిగతా ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ఈ విషయాన్ని అఫ్గన్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించినట్లు సమాచారం. అండర్-19 ప్రపంచకప్ ఆడడానికి వెళ్లిన మా జట్టులో ఒక ఆటగాడు సహా ముగ్గురు సిబ్బంది స్వదేశానికి తిరిగిరాలేదు. వెస్టిండీస్ నుంచి నేరుగా బ్రిటన్ వెళ్లిన ఆ నలుగురు అక్కడే ఆశ్రయం పొందుతున్నారని తెలిసింది. చదవండి: కోహ్లి ఆ తప్పు చేసి ఉండకూడదు.. ఇకనైనా జాగ్రత్తగా ఉండాలి టోర్నీ ముగిసిన తర్వాత అఫ్గన్ క్రికెటర్లు అంటిగ్వా నుంచి కాబుల్ వయా యూఏఈ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. అయితే ఆ నలుగురు మాత్రం ఆస్ట్రేలియాతో ప్లేఆఫ్స్ ముగిశాక యూఏఈ వరకు కలిసి ప్రయాణించినప్పటికి.. అక్కడి నుంచి లండన్ ఫ్లైట్ ఎక్కినట్లు తెలుస్తోంది. అయితే ఇలా జరగడం ఇది తొలిసారి మాత్రం కాదు. గతంలోనూ 2009 అండర్ -19 ప్రపంచకప్లో క్వాలిఫయర్స్ ముగిసిన తర్వాత టొరంటో, కెనడాకు చెందిన క్రికెటర్లు తమ దేశంలో భద్రతా పరమైన సమస్యలు ఉన్నాయని వేరే దేశంలో తలదాచుకున్నారు. కాగా ఈ విషయంపై అఫ్గనిస్తాన్ అండర్-19 హెడ్కోచ్ రయీస్ అహ్మద్జై స్పందించాడు. ఈ ఆరోపణలను కొట్టివేస్తూ.. విషయం తెలియగానే ఆ నలుగురికి..'' మీ అవసరం అఫ్గనిస్తాన్ క్రికెట్కు ఉంది అని'' మెసేజ్ పెట్టాను. మెసేజ్ చూసినప్పటికి వారి వద్ద నుంచి ఎలాంటి సమాధానం రాలేదని పేర్కొన్నాడు. కాగా అఫ్గనిస్తాన్ జట్టు అండర్-19 ప్రపంచకప్లో మంచి ప్రదర్శన కనబరిచింది. సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైనప్పటికి అఫ్గనిస్తాన్ ఆకట్టుకుంది. ఇక మూడో స్థానం కోసం ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో ఆఖరి వరకు పోరాడినప్పటికి ఓటమి పాలైన అఫ్గన్ టోర్నీని నాలుగో స్థానంతో ముగించింది. చదవండి: IPL 2022 Auction:షేక్ రషీద్ సహా ఏడుగురు అండర్-19 ఆటగాళ్లకు బిగ్షాక్! -
U19 WC: ద్రవిడ్, లక్ష్మణ్ మాస్టర్ ప్లాన్.. వాళ్ళ రాతలు మారిపోతాయి!
న్యూఢిల్లీ: మనోజ్ కల్రా... 2018 అండర్–19 ప్రపంచకప్ గెలిచినప్పుడు ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’. అయితే నాలుగేళ్ల తర్వాత కూడా అతని కెరీర్ ఊపందుకోలేదు. కల్రా మాత్రమే కాదు... ఎంతో మంది కుర్రాళ్లు వరల్డ్కప్ లాంటి విజయం తర్వాత కూడా ముందుకు దూసుకుపోవడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా అండర్–19 వయో విభాగానికి, రంజీ ట్రోఫీకి మధ్య ఉన్న అంతరం కారణంగా వారికి సరైన మార్గనిర్దేశనం లేకుండా పోతోంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఎక్కువగా ఆడకపోవడం వల్ల జూనియర్ నుంచి సీనియర్ స్థాయికి ఎదిగే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను వారు అధిగమించలేక వెనుకబడిపోతున్నారు. ఇలాంటి ఆటగాళ్ల కోసం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఒక ప్రత్యేక కేటగిరీని ఏర్పాటు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ‘19 ప్లస్’ పేరుతో ఉండే ఈ బృందంలో అండర్–19 వరల్డ్కప్ విజేతలతో పాటు అదే వయో విభాగంలో దేశవ్యాప్తంగా ప్రతిభ గల ఆటగాళ్లను చేరుస్తారు. పూర్తిగా క్రికెట్పైనే దృష్టి కేంద్రీకరిస్తూ సాధనతో పాటు అవకాశం ఉన్నప్పుడల్లా (అండర్–25 తదితర) ఆయా రాష్ట్ర జట్ల తరఫున ఆడే అవకాశం కల్పిస్తారు. ఇదంతా ఎన్సీఏ పర్యవేక్షణలో జరుగుతుంది. భారత కోచ్ రాహుల్ ద్రవిడ్, ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్లు జాతీయ సీనియర్, జూనియర్ సెలక్టర్లతో ఈ అంశంపై చర్చించి త్వరలోనే పూర్తి స్థాయి ప్రణాళిక రూపొందించే అవకాశం ఉంది. -
యువ క్రికెటర్లను చూసి చాలా గర్వపడుతున్నా: నరేంద్ర మోది
అండర్-19 ప్రపంచకప్-2022 ఫైనల్లో ఇంగ్లండ్పై విజయం సాధించి యువ భారత్ విశ్వ విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో భారత జట్టుపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక అండర్-19 ప్రపంచకప్ గెలిచినందుకు భారత జట్టును దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోది అభినందించారు. "యువ క్రికెటర్లను చూసి తాను చాలా గర్వపడుతున్నాను, అండర్ 19 ప్రపంచకప్ను గెలుచుకున్నందుకు వారికి అభినందనలు. ఈ టోర్నమెంట్లో యష్ ధుల్ నేతృత్వంలోని జట్టు అద్భుతంగా రాణించింది" అని ట్విటర్లో ప్రధాని రాసుకొచ్చారు. ఇక అండర్ -19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటంచింది. భారత జట్టులో ప్రతీ ఒక్క ఆటగాడికి రూ. 40 లక్షల నగదు బహుమతిని అందజేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి తెలిపారు. ఇక అండర్ -19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటంచింది. భారత జట్టులో ప్రతీ ఒక్క ఆటగాడికి రూ. 40 లక్షల నగదు బహుమతిని అందజేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి తెలిపారు. కాగా అండర్-19 ప్రపంచకప్ను భారత్ ఐదో సారి గెలుచుకుంది. భారత్ 2000, 2008, 2012, 2018 లలోనూ విజేతగా నిలిచింది. చదవండి: IND VS WI 1st ODI: లైవ్ అప్డేట్స్ -
మనోడు ఎన్నాళ్లకెన్నాళ్లకు..ఒకే ఒక్కడిగా రికార్డు!
అండర్-19 ప్రపంచకప్ 2022 ను యువ భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆంటిగ్వా వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్లో నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో రాజ్ బవా అరుదైన రికార్డును సాధించాడు. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా తరపున ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్గా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన రెండో బౌలర్గా రాజ్ బవా రికార్డులెక్కాడు. అంతకు ముందు అండర్-19 వరల్డ్కప్ 2006 ఫైనల్లో పాకిస్తాన్ బౌలర్ అన్వర్ అలీ ఐదు వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా ఐసీసీ ఈవెంట్లో 150కు పైగా పరుగులు, ఐదు వికెట్లు తీసిన భారత ఎలైట్ లిస్ట్లో కపిల్ దేవ్తో పాటు బావా కూడా చేరాడు. 1983 ప్రపంచకప్లో కపిల్ దేవ్ ఈ ఘనత సాధించాడు. ఇక బావా ఈ మెగా టోర్నమెంట్లో బ్యాట్తోను, బాల్తోను అద్భుతంగా రాణించాడు. ఉగండాతో జరిగిన లీగ్ మ్యాచ్లో 162 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో 4 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్లు.. 2022లో 5/31 రాజ్ బావా 2006లో 4/8 పీయూష్ చావ్లా 2020లో 4/30 రవి బిష్ణోయ్ 2022లో 4/34 రవి కుమార్ 2012లో 4/54 సందీప్ శర్మ ఐసిసి ఈవెంట్లో 150పైగా పరుగులుతో పాటు 5వికెట్లు పడగొట్టిన భారత ఆటగాళ్లు కపిల్ దేవ్ 1983 వన్డే వరల్డ్కప్ రాజః బావా 2022 అండర్-19 వరల్డ్కప్ -
కుర్రాళ్లకు బీసీసీఐ భారీ నజరానా, ఎంతంటే..
U19 Cricket World Cup: అండర్-19 ప్రపంచకప్ 2022 ఛాంపియన్గా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో ఇంగ్లండ్పై 4 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించి జగజ్జేతగా నిలిచింది.ఈ క్రమంలో భారత జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత యువ జట్టును బీసీసీఐ కార్యదర్శి జైషా అభినందించారు. అధ్బుతమైన ప్రదర్శనతో భారత విజయంలో భాగమైన ప్రతీ ఒక్క ఆటగాడికి రూ. 40 లక్షల నగదు బహుమతిని బీసీసీఐ ప్రకటించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అదే విధంగా సహాయక సిబ్బందిలోని ప్రతి సభ్యుడికి 25 లక్షల క్యాష్ ఫ్రైజ్ను అందజేయనున్నట్లు జైషా పేర్కొన్నారు. "ప్రపంచ కప్ను గెలుచుకున్నందుకు యువ భారత్కు అభినందనలు. అండర్-19 ప్రపంచకప్లో అత్యత్తమ ప్రదర్శన చేసిన ప్రతి ఆటగాడికి 40 లక్షలు, సహాయక సిబ్బందికి 25 లక్షల రివార్డును ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను. మీరు దేశం గర్వించేలా చేశారు" అని జైషా ట్విటర్లో పేర్కొన్నారు. కాగా అండర్-19 ప్రపంచకప్ను భారత్ గెలుచుకోవడం ఇది ఐదోసారి. చదవండి: Under 19 World Cup: చాంపియన్ యువ భారత్ -
Under 19 World Cup: చాంపియన్ యువ భారత్
నార్త్సౌండ్ (అంటిగ్వా): సమష్టి ప్రదర్శనతో యువ భారత్ ఐదోసారి అండర్–19 వన్డే క్రికెట్ ప్రపంచకప్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఇంగ్లండ్తో శనివారం జరిగిన ఫైనల్లో యశ్ ధుల్ నాయకత్వంలోని భారత జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. జేమ్స్ రూ (116 బంతుల్లో 95; 12 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 47.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 195 పరుగులు సాధించి గెలిచింది. ఎడంచేతి వాటం పేస్ బౌలర్ రవి కుమార్ (4/34) హడలెత్తించగా... రాజ్ బావా ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముందుగా బంతితో ఐదు వికెట్లు తీసిన రాజ్ బావా (5/31) ఆ తర్వాత బ్యాటింగ్లోనూ (54 బంతుల్లో 35; 2 ఫోర్లు) రాణించాడు. వైస్ కెప్టెన్, ఆంధ్ర కుర్రాడు షేక్ రషీద్ (84 బంతుల్లో 50; 6 ఫోర్లు), నిశాంత్ (54 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి అర్ధ సెంచరీలు చేశారు. దినేశ్ (5 బంతుల్లో 13 నాటౌట్; 2 సిక్స్లు) నాటౌట్గా నిలిచాడు. ఐదో వికెట్కు నిశాంత్, రాజ్ 67 పరు గులు జోడించారు. ఓపెనర్ అంగ్క్రిష్ (0) డకౌట్ కాగా... హర్నూర్ (21; 3 ఫోర్లు), కెప్టెన్ యశ్ ధుల్ (17; 1 ఫోర్) ఫర్వాలేదనిపించారు. అండర్–19 ప్రపంచకప్లో భారత్ చాంపియన్గా నిలువడం ఇది ఐదోసారి. భారత్ 2000, 2008, 2012, 2018 లలోనూ విజేతగా నిలిచింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ అండర్–19 ఇన్నింగ్స్: థామస్ (సి) ధుల్ (బి) రాజ్ బావా 27; బెథెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రవి 2; ప్రెస్ట్ (బి) రవి 0; జేమ్స్ రూ (సి) తాంబె (బి) రవి 95; లక్స్టన్ (సి) దినేశ్ (బి) రాజ్ బావా 4; బెల్ (సి) దినేశ్ (బి) రాజ్ బావా 0; రేహాన్ అహ్మద్ (సి) తాంబె (బి) రాజ్ బావా 10; హార్టన్ (సి) ధుల్ (బి) తాంబె 10; సేల్స్ (నాటౌట్) 34; అస్పిన్వాల్ (సి) దినేశ్ (బి) రవి 0; బైడెన్ (సి) దినేశ్ (బి) రాజ్ బావా 1; ఎక్స్ట్రాలు 6; మొత్తం (44.5 ఓవర్లలో ఆలౌట్) 189. వికెట్ల పతనం: 1–4, 2–18, 3–37, 4–47, 5–47, 6–61, 7–91, 8–184, 9–185, 10–189. బౌలింగ్: రాజ్వర్ధన్ 7–1–36–0, రవికుమార్ 9–1– 34–4, రాజ్ బావా 9.5– 1–31–5, నిశాంత్ 6–1–19–0, విక్కీ 6–0–31–0, కౌశల్ 5–0– 29–1, అంగ్క్రిష్ 2–0–8–0. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) భారత అండర్–19 ఇన్నింగ్స్: అంగ్క్రిష్ (సి) హార్టన్ (బి) బైడెన్ 0; హర్నూర్ (సి) హార్టన్ (బి) అస్పిన్వాల్ 21; షేక్ రషీద్ (సి) రూ (బి) సేల్స్ 50; యశ్ ధుల్ (సి) బెల్ (బి) సేల్స్ 17; నిశాంత్ (నాటౌట్) 50; రాజ్ బావా (సి) ప్రెస్ట్ (బి) బైడెన్ 35; కౌశల్ (సి) రేహాన్ (బి) అస్పిన్వాల్ 1; దినేశ్ (నాటౌట్) 13; ఎక్స్ట్రాలు 6; మొత్తం (47.4 ఓవర్లలో ఆరు వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–0, 2–49, 3–95, 4–97, 5– 164, 6–176. బౌలింగ్: బైడెన్ 7–1–24–2, సేల్స్ 7.4–0–51–2, ప్రెస్ట్ 10–1–29–0, రేహాన్ 10–2–32–0, అస్పిన్వాల్ 9–0–42–2, బెథెల్ 4–0–17–0. -
Under-19 World Cup: ఫైనల్లో ఐదు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా..
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో యంగ్ ఇండియా అదరగొట్టింది. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ 189 పరుగులకే కుప్పకూలింది. ఫాస్ట్ బౌలర్లు రాజ్ బవా, రవి కుమార్లు పోటీ పడి వికెట్లు తీశారు. ముఖ్యంగా రాజ్ బవా 31 పరుగులిచ్చి ఐదు వికెట్లతో మెరిసి ఫైనల్ మ్యాచ్ను గొప్పగా మలుచుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాట్స్మన్లలో జార్జ్ థామస్(27), విల్ లుక్స్టన్(4), జార్జి బెల్(0), రెహన్ అహ్మద్(10), చివరగా జోషువా బోయ్డెన్(1)నే ఔట్ చేసి ఈ ఫీట్ సాధించాడు. ఈ నేపథ్యంలోనే రాజ్ బవా ఒక అరుదైన రికార్డును అందుకున్నాడు. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా తరపున ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్గా చరిత్ర సృష్టించాడు. ఇక ఓవరాల్గా చూసుకుంటే అండర్-19 వరల్డ్కప్ ఫైనల్లో పాకిస్తాన్ బౌలర్ అన్వర్ అలీ(2006) తర్వాత ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్గా రాజ్ బవా నిలవడం విశేషం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కాగా ఫిబ్రవరి 12,13 తేదీల్లో ఐపీఎల్ వేలం జరగనున్న నేపథ్యంలో అండర్-19 కుర్రాళ్లకు జాక్పాట్ అనే చెప్పొచ్చు. యంగ్ ఇండియా నుంచి మొత్తం 9 మంది ఆటగాళ్లు( యశ్ ధుల్, హర్నూర్ సింగ్, కుశాల్ తాంబే, అనీశ్వర్ గౌతమ్, రాజ్ అంగద్ భవ, రాజ్వర్థన్ హంగార్గేకర్, విక్కీ ఓస్వల్, వాసు వత్స్, పుష్పేంద్ర సింగ్ రాథోడ్) వేలం బరిలో అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. వీరిలో కెప్టెన్ యశ్ ధుల్, ఓపెనర్ హర్నూర్ సింగ్, ఆల్రౌండర్లు రాజ్ అంగద్ భవ, రాజ్వర్థన్ హంగార్గేకర్, స్పిన్ బౌలర్ విక్కీ ఓస్వల్లకు వేలంలో మంచి ధర పలికే అవకాశం ఉంది. ఇక ఫైనల్లో ఐదు వికెట్లతో మెరిసిన రాజ్ బవాకు వేలంలో జాక్పాట్ తగిలే అవకాశం ఉంది. ఫైనల్మ్యాచ్లో కీలక సమయంలో రాణించిన రాజ్ బవాకు ఇది మంచి పరిణామమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. Exceptional bowling from these two 👏#ENGvIND | #U19CWC pic.twitter.com/7kSg0mhCYt — ICC (@ICC) February 5, 2022 -
'నీ ఆట అమోఘం.. ప్రత్యర్థివైనా మెచ్చుకోకుండా ఉండలేం'
అండర్-19 ప్రపంచకప్లో టీమిండియాతో ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ తడబడింది. 44.5 ఓవర్లలో 189 పరుగులు వద్ద ఆలౌటైంది. ఆరంభం నుంచే టీమిండియా కుర్రాళ్లు బౌలింగ్లో చెలరేగడంతో ఇంగ్లండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. కానీ ఒక్కడు మాత్రం భారత్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని నిలబడ్డాడు. అతనే జేమ్స్ రూ.. 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన జేమ్స్ రూ.. చివరివరకు నిలబడ్డాడు. తాను నిలబడడమే కాదు.. అసలు వంద పరుగులు చేస్తుందా అన్న అనుమానం కలిగిన దశలో ఒక్కో పరుగు జత చేస్తూ జేమ్స్ రూ ఇన్నింగ్స్ నడిపించిన విధానం అద్బుతమనే చెప్పాలి. సహచరులు వెనుదిరుగుతున్నా.. తాను మాత్రం పట్టు సడలకుండా ఆడాడు. 116 బంతులెదుర్కొన్న జేమ్స్ రూ 12 ఫోర్ల సాయంతో 95 పరుగులు చేశాడు. ఇక సెంచరీ ఖామమనుకుంటున్న దశలో 95 పరుగుల వద్ద రవికుమార్ బౌలింగ్లో కౌషల్ తంబేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగడం జేమ్స్ గుండెను ముక్కలు చేసింది. అయితే జేమ్స్ అసాధారణ పోరాటంతోనే ఇంగ్లండ్ కనీసం 189 పరుగులైనా చేయగలిగింది. ''కఠిన పరిస్థితుల్లో అద్బుత ఇన్నింగ్స్ ఆడావు జేమ్స్ రూ.. ప్రత్యర్థి ఆటగాడినైప్పటికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం..19 ఏళ్ల వయసులోనే ఇంత ఓపికతో ఆడిన జేమ్స్ రూకు ఇంగ్లండ్ క్రికెట్ మంచి భవిష్యత్తు ఉందంటూ'' టీమిండియా ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. A superb partnership of 9️⃣3️⃣ between James Rew and James Sales helps us reach 189 See if that total is enough live on @SkyCricket 📺#ENGvIND | #U19CWC pic.twitter.com/yRlRy0CvjA — England Cricket (@englandcricket) February 5, 2022 -
అదరగొట్టిన భారత సంతతి కుర్రాడు.. ఎవరీ నివేథన్ రాధాకృష్ణన్
అండర్-19 ప్రపంచకప్లో ఒక భారత సంతతి కుర్రాడు అదరగొట్టాడు. ఆస్ట్రేలియన్ టీమ్లో ఆడుతున్న ఆ కుర్రాడు యాంబిడెక్స్ట్రస్ బౌలర్గా గుర్తింపు పొందాడు. తనదైన బౌలింగ్తో అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. అతనే నివేథన్ రాధాకృష్ణన్. వెస్టిండీస్ వేదికగా సాగుతున్న అండర్-19 ప్రపంచకప్ మెగా ఈవెంట్లో మూడో స్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా యువ జట్టు అఫ్గనిస్తాన్తో తలపడింది. ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రతిభ కనబరిచిన నివేథన్ రాధాకృష్ణన్ ఆసీస్ను విజయతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. చదవండి: ఆఖరి వరకు ఉత్కంఠ.. అదరగొట్టిన భారత సంతతి కుర్రాడు.. ఆసీస్దే విజయం ముందుగా బౌలింగ్లో 31 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. అతని దెబ్బకు అఫ్గనిస్తాన్ 201 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన ఆసీస్కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్ కాంప్బెల్ కెలావే(51 పరుగులు) అర్ధ శతకంతో రాణించగా.. వన్డౌన్లో వచ్చిన నివేథన్ రాధాకృష్ణన్ 66 పరుగులు సాధించాడు. ఆ తర్వాత టపాటపా వికెట్లు పడ్డాయి. అయితే, ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో విజయం ఎట్టకేలకు ఆసీస్నే వరించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా మూడోస్థానంతో అండర్-19 ప్రపంచకప్ను ముగించింది. ఎవరీ నివేథన్ రాధాకృష్ణన్.. ►2013లో నివేథన్ రాధాకృష్ణన్ భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చి సిడ్నీలో స్థిరపడ్డాడు. ►ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్కు నెట్ బౌలర్గా వ్యవహరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ ఆధ్వర్యంలో బౌలింగ్లో రాటు దేలాడు. ►అండర్-16 లెవెల్ ఆస్ట్రేలియా తరపున ప్రాతినిధ్యం వహించి వైవిధ్యమైన బౌలింగ్తో తొలిసారి గుర్తింపు పొందాడు ►ఎన్ఎస్డబ్ల్యూ ప్రీమియర్ క్రికెట్ లీగ్లో ఆడిన నివేథన్ రాధాకృష్ణన్ ఆ సిరీస్లో 898 పరుగులు చేయడంతో పాటు 20 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత ఎన్ఎస్డబ్ల్యూ, తస్మానియా క్రికెట్ నుంచి అవార్డులతో పాటు అవకాశాలు అందుకున్నాడు. ►తస్మానియా క్రికెట్ తరపున ఈ సీజన్లో ఓపెనర్గా బరిలోకి దిగిన నివేథన్ రాధాకృష్ణన్ 622 పరుగులతో రాణించాడు. చదవండి: జట్టులో స్టార్స్ లేరు.. వందకు వంద శాతం ఎఫర్ట్ పెడతాం.. కోహ్లి మాకు ఏం చెప్పాడంటే.. సాధారణంగా స్పిన్ బౌలర్ అయిన రాధాకృష్ణన్లో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే అతను రెండు చేతులతో(ఎడమ, కుడి) బౌలింగ్ చేయడంలో దిట్ట. దీంతో అతన్ని లెఫ్టార్మ్ ? లేక రైట్ ఆర్మ్? స్పిన్నర్ అనాలా అనేది సందిగ్దంగా మారింది. క్రికెట్లో ఇలాంటి బౌలర్లు ఉండడం అరదుగా జరుగుతుంటుంది. బౌలింగ్లో వైవిధ్యత చూపించడం కోసం ఏ బౌలర్ అయినా ఒకే శైలి బౌలింగ్కు పరిమితమవుతాడు. కానీ నివేథన్ రాధాకృష్ణన్ మాత్రం అటు లెఫ్ట్.. ఇటు రైట్ ఆర్మ్తో బౌలింగ్ చేస్తూ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. యాంబిడెక్స్ట్రస్ క్రికెటర్ అంటే... సాధారణంగా ఏకకాలంలో లెఫ్టార్మ్, రైట్ ఆర్మ్ బౌలింగ్ చేయగలిగిన వారిని యాంబిడెక్స్ట్రస్ క్రికెటర్ అని పిలుస్తారు. అయితే ప్రస్తుత క్రికెట్లో ఇలాంటి శైలి అరుదుగా కనిపిస్తుంది. తాజాగా నివేథన్ రాధాకృష్ణన్ వార్తల్లో నిలవడం ద్వారా యాంబిడెక్స్ట్రస్ క్రికెటర్ పదం మరోసారి వెలుగులోకి వచ్చింది. క్రికెట్ చరిత్రలో యాంబిడెక్స్ట్రస్ క్రికెటర్లు చాలా మందే ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు ఒక ఐదుగురి పేర్లు మాత్రమే ప్రముఖంగా వినిపించాయి. హనీఫ్ మొహ్మద్(పాకిస్తాన్) పాకిస్తాన్ బ్యాటింగ్లో సూపర్ స్టార్గా వెలుగొందిన హనీఫ్ మొహ్మద్ నిజానికి రెగ్యులర్ బౌలర్ కాదు. కానీ పార్ట్టైమ్ బౌలింగ్ చేసిన హనీఫ్ రెండు చేతులతో బౌలింగ్ చేయగలడు. పాకిస్తాన్ తరపున 55 టెస్టు మ్యాచ్ల్లో 3915 పరుగులు చేశాడు. గ్రహం గూచ్(ఇంగ్లండ్) ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ్గజం గ్రహం గూచ్ కూడా యాంబిడెక్స్ట్రస్ ఆటగాడే. బ్యాటింగ్లో ఎన్నోసార్లు మెరుపులు మెరిపించిన గ్రహం గూచ్.. రైట్ ఆర్మ్.. లెఫ్ట్ఆర్మ్ మీడియం పేస్తో 23 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇంగ్లండ్ తరపున గ్రహం గూచ్ 118 టెస్టుల్లో 8900 పరుగులు.. 125 వన్డేల్లో 4290 పరుగులు సాధించాడు. హసన్ తిలకరత్నే(శ్రీలంక) స్వతహాగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మన్ అయిన హసన్ తిలకరత్నే ఒకానొక సమయంలో శ్రీలంక క్రికెట్లో రాణించాడు. లంక తరపున 83 టెస్టులు.. 200 వన్డేలు ఆడిన హసన్ తిలకరత్నే బౌలింగ్లో రైట్ ఆర్మ్ స్పిన్ ఎక్కువగా వేసేవాడు. కానీ 1996 వన్డే ప్రపంచకప్లో కెన్యాతో మ్యాచ్లో తిలకరత్నే ఆఖరి ఓవర్లో రైట్ ఆర్మ్.. లెఫ్టార్మ్ బౌలింగ్ చేసి తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక 1996 వన్డే ప్రపంచకప్ను శ్రీలంక ఎగరేసుకపోయిన సంగతి తెలిసిందే. అక్షయ్ కర్నేవార్(భారత్) విదర్భ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన అక్షయ్ కర్నేవార్ ప్రస్తుతం దేశవాలీలో లిస్ట్-ఏ, టి20 మ్యాచ్లు ఆడుతు బిజీగా గడుపుతున్నాడు. అక్షయ్ కర్నేవార్ లెఫ్ట్ ఆర్మ్.. రైట్ ఆర్మ్ బౌలింగ్ చేయడంలో సమర్థుడు. విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ తరపున అక్షయ్ తన వైవిధ్యమైన బౌలింగ్తో 16 వికెట్లు తీసి సీజన్ బెస్ట్ నమోదు చేశాడు. కమిందు మెండిస్(శ్రీలంక) 17 ఏళ్ల కమిందు మెండిస్ శ్రీలంక తరపున రైట్ ఆర్మ్ ఆఫ్బ్రేక్.. స్లో లెఫ్ట్ఆర్మ్ ఆర్థడోక్స్ బౌలింగ్ చేయడంలో దిట్ట. అండర్-19 వరల్డ్కప్లో లంక తరపున ప్రాతినిధ్యం వహించి కమిందు మెండిస్ ఆకట్టుకున్నాడు. -
అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో తొలి క్రికెటర్గా..
అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో పాకిస్తాన్ కెప్టెన్ ఖాసీమ్ అక్రమ్ అరుదైన ఫీట్ సాధించాడు. ఐదో ప్లేఆఫ్ స్థానం కోసం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఖాసీమ్ అక్రమ్.. తొలుత బ్యాటింగ్లో 135 పరుగులు.. ఆ తర్వాత బౌలింగ్లో 37 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. తద్వారా ప్రపంచకప్లో ఒక మ్యాచ్లో సెంచరీ చేయడంతో పాటు బౌలింగ్లో ఐదు వికెట్లు తీసిన తొలి క్రికెటర్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ ఖాసీమ్ అక్రమ్ ఘనతను తనదైన స్టైల్లో ట్వీట్ చేసింది. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో ఒకే మ్యాచ్లో సెంచరీతో పాటు ఐదు వికెట్ల ఘనత అందుకున్న తొలి క్రికెటర్గా ఖాసీమ్ అక్రమ్ నిలిచాడు. టోర్నమెంట్లో అక్రమ్ తన మార్క్ను స్పష్టంగా చూపించాడు.. కంగ్రాట్స్ అని ట్వీట్ చేసింది. చదవండి: Yash Dhull: యశ్ ధుల్ ఒక సంచలనం.. కోహ్లితో ఉన్న పోలికేంటి! ఇక మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్తాన్ 238 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 365 పరుగులు చేసింది. కెప్టెన్ ఖాసీమ్ అక్రమ్(80 బంతుల్లో 135 నాటౌట్, 13 ఫోర్లు, 6 సిక్సర్లు), హసీబుల్లా ఖాన్(151 బంతుల్లో 136, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), ముహ్మద్ షెహజాద్ 73 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక 34.2 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. ఖాసీమ్ అక్రమ్ 37 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ఇక శనివారం టీమిండియా, ఇంగ్లండ్ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది. చదవండి: ఆకాశ్ చోప్రా అండర్-19 వరల్డ్ బెస్ట్ ఎలెవెన్.. టీమిండియా నుంచి ఒకే ఒక్కడు View this post on Instagram A post shared by ICC (@icc) -
అండర్-19 వరల్డ్ బెస్ట్ ఎలెవెన్.. టీమిండియా నుంచి ఒకే ఒక్కడు
టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అండర్-19 వరల్డ్కప్స్ బెస్ట్ ఎలెవెన్ టీమ్ను ప్రకటించాడు. ఒకప్పుడు అండర్-19 ప్రపంచకప్ ఆడి ప్రస్తుతం సూపర్స్టార్లుగా వెలుగొందుతున్న 11 మందిని ఎంపిక చేశాడు. అతని జట్టులో టీమిండియా నుంచి ఒకరు మాత్రమే చోటు దక్కించుకున్నాడు. ఆ ఒక్కడు కూడా విరాట్ కోహ్లినే కావడం విశేషం. అండర్-19 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా జట్లలో సభ్యులుగా ఉన్న రిషబ్ పంత్, జడేజాలను ఎంపికచేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. చదవండి: IND VS WI: టీమిండియాకు 1000వ వన్డే.. కోహ్లిని ఊరిస్తున్న రికార్డు కోహ్లిని కెప్టెన్గా ఎంపిక చేసిన ఆకాశ్చోప్రా.. పాక్ కెప్టెన్ బాబర్ అజమ్.. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్లను టాపార్డర్కు ఎంపికచేశాడు. ఇక మిడిలార్డర్లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్లను ఎంచుకున్నాడు. వికెట్ కీపర్గా దినేష్ చండిమల్.. ఫినిషర్గా షిమ్రోన్ హెట్మైర్కు చోటు కల్పించాడు. స్పిన్ బౌలర్గా మెహదీ హసన్ను ఎంపిక చేసిన ఆకాశ్.. పేస్ విభాగంలో కగిసో రబాడా, క్రిస్ వోక్స్, షాహిన్ అఫ్రిదిలను ఎంచుకున్నాడు. చదవండి: Yash Dhull: యశ్ ధుల్ ఒక సంచలనం.. కోహ్లితో ఉన్న పోలికేంటి! ఆకాష్ చోప్రా అండర్-19 ప్రపంచకప్స్ వరల్డ్ ఎలెవెన్: బాబర్ అజమ్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, దినేష్ చండిమాల్, ఇయాన్ మోర్గాన్, షిమ్రాన్ హెట్మెయర్, మెహిదీ హసన్, కగిసో రబడ, క్రిస్ వోక్స్, షాహిన్ అఫ్రిది. -
యశ్ ధుల్ ఒక సంచలనం.. కోహ్లితో ఉన్న పోలికేంటి!
''అండర్-19 ప్రపంచకప్లో భారత జట్టుకు సభ్యుడిగా ఉంటేనే ఒక బంపర్ టోర్నమెంట్లో ఆడుతున్నాడు.. కెరీర్కు మేజర్ స్టార్ట్ దొరికినట్లేనని అంతా అంటారు.. మరి అలాంటిది అదే అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టుకు కెప్టెన్గా నువ్వు ఉంటే.. ఇక నీ పేరు క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది.''.. అండర్-19 పెను సంచలనం.. యశ్ ధుల్కు తన చిన్ననాటి కోచ్ చెప్పిన మాటలివి.. ఈ మాటలను నిజం చేయడానికి యశ్ ధుల్ ఒక్క అడుగుదూరంలో ఉన్నాడు. శనివారం టీమిండియా ఇంగ్లండ్తో ఫైనల్లో అమితుమీ తేల్చుకోనుంది. ఐదో టైటిల్పై కన్నేసిన టీమిండియా కళను యశ్ ధుల్ తీర్చనున్నాడా అనేది తేలిపోనుంది. మరి అలాంటి యశ్ ధుల్ ఎక్కడి నుంచి వచ్చాడు.. క్రికెట్లోకి ఎలా అడుగుపెట్టాడు అన్న విషయాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. జనవరి 19,2022.. అండర్-19 ప్రపంచకప్ ప్రారంభమై అప్పటికి ఐదు రోజులు కావొస్తుంది. టీమిండియా తన తొలి మ్యాచ్లో శుభారంభం చేసింది. ఇక రెండో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇంతలో జట్టును కరోనా కుదుపేసింది. టీమిండియా కెప్టెన్ యశ్ ధుల్ సహా కొంతమంది ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. ఇది యశ్ ధుల్ను బాగా భయపెట్టింది. టీమిండియా అండర్-19లో ఐదో ప్రపంచకప్ టైటిల్ అందివ్వాలనుకున్న కోరిక నెరవేరదేమోనని అనుకున్నాడు. ఒక్కరోజు వ్యవధిలోనే డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. అయితే ఆ సమయంలో తన చిన్ననాటి కోచ్ రాజేష్ నగర్ గుర్తొచ్చారు. వెంటనే ఆయనకు ఫోన్ చేసి మాట్లాడాడు. నగర్ ఒక్కటే విషయం చెప్పారు.. భయపడకు.. కంట్రోల్లో ఉంటే అన్ని కంట్రోల్లోనే ఉంటాయి'' అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. చదవండి: Yash Dhull: యశ్ ధుల్ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్.. క్రికెట్ పుస్తకాల్లో పేరుందా! కోచ్ నగర్ మాటలు యశ్ ధుల్కు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. ఐసోలేషన్లో ఉన్న యశ్ ధుల్ మూడో రోజు నుంచే తను ఉన్న రూమ్లోనే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. దాన్నంతా ఒక కెమెరాలో బంధించి తర్వాత రీప్లే చేసుకొని షాట్ల ఎంపికను చూసుకునేవాడు. ఆ తర్వాత కోచ్ వివిఎస్ లక్ష్మణ్కు తన వీడియోలను పంపించి బ్యాటింగ్ టెక్నిక్స్ అడిగేవాడు. ఇదంతా చూసిన లక్ష్మణ్.. యశ్ ధుల్ నీ పోరాట పటిమ అద్భుతం.. ఇండియా ఎలెవెన్లో కెప్టెన్ ఆర్మ్బాండ్ ధరించి మ్యాచ్లు ఆడతావు రెడీగా ఉండు.. అని చెప్పాడు. అన్నట్లే యశ్ ధుల్ బంగ్లాదేశ్తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ సమయానికి కోలుకొని మళ్లీ అండర్-19 ప్రపంచకప్లో అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్లో 20 పరుగులతో నాటౌట్గా నిలిచి మ్యాచ్ను గెలిపించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ ఒక చరిత్ర. కష్టాల్లో పడిన టీమిండియాను షేక్ రషీద్ సాయంతో.. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన యశ్ ధుల్ సూపర్సెంచరీతో మెరిశాడు. 96 పరుగులుతో విజయం సాధించిన భారత్ ఎనిమిదోసారి ఫైనల్లో అడగుపెట్టింది. టీమిండియాకు అండర్-19 ప్రపంచకప్ అందించడానికి ఒక్క అడుగుదూరంలో ఉన్నాడు. చదవండి: Shaik Rasheed: అవరోధాలు అధిగమించి.. మనోడి సూపర్ హిట్టు ఇన్నింగ్స్ పదేళ్ల వయసు నుంచే.. యశ్ ధుల్ చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే అమితమైన ఆసక్తి ఉండేది. తన పదేళ్ల వయసు నుంచే క్రికెట్పై దృష్టి పెట్టిన యశ్ధుల్ అండర్-19లో టీమిండియాకు కప్ అందించాలని కోరుకున్నాడు. అలా ద్వారకాలోని బాల్ భవన్ స్కూల్లో క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఆరో తరగతి వచ్చిన తర్వాత కోచ్ రాజేశ్ నగర్ యశ్కు పరిచయమయ్యాడు. అప్పటినుంచి అతని ఆట పూర్తిగా మారిపోయింది. ఒక నెల వ్యవధిలోనే 15 మ్యాచ్లు ఆడి సూపర్ ఫామ్ను కొనసాగించి మంచి రన్స్ సాధించాడు. కేవలం 15 మ్యాచ్లు మాత్రమే ఆడిన ఇతను 2వేల మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా కనిపిస్తున్నాడని కొందరు కోచ్లు మెచ్చుకున్నారు. ఆ తర్వాత అండర్-19 కేటగిరిలో శ్రీలంక, నేపాల్, మలేషియాలో కీలక టోర్నీలు ఆడాడు. 15 ఏళ్ల వయసులో నేపాల్లో జరిగిన అండర్-19 టోర్నమెంట్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకొని అందరి దృష్టిలో పడ్డాడు. అయితే యశ్ ధుల్ 16 ఏళ్లకే ఇంత పేరు తెచ్చుకోవడం వెనుక కోహ్లి కూడా ఒక కారణమని అతని కోచ్ నగర్ ఒక సందర్భంలో పేర్కొన్నారు. కోహ్లితో అనుబంధం.. అతనితో పోలిక ''ఢిల్లీలో యశ్ ధుల్ ఇంటికి.. కోహ్లి ఇంటికి ఆరు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండేది. కోహ్లి ఆటను దగ్గరుండి గమనించిన యశ్ ధుల్ అతన్నే అనుకరించడం మొదలుపెట్టాడు. అండర్-19 జట్టులో మూడోస్థానంలోనే బ్యాటింగ్కు వచ్చే యశ్ ధుల్ అచ్చం కోహ్లిని తలపిస్తున్నాడు. ఒక వన్డే మ్యాచ్లో 50 ఓవర్లు ఎలా ఆడాలో కోహ్లి నుంచే నేర్చుకున్నాడు. కోహ్లి తన ఇన్నింగ్స్ను ఎలా అయితే స్టార్ట్ చేస్తాడో.. అచ్చం అదే మాదిరి యశ్ధుల్ కూడా సింగిల్స్, డబుల్స్కు ప్రాధాన్యం ఇచ్చేవాడు. ఓపెనర్లు ఔటైతే.. ఆ తర్వాత వన్డౌన్లో వచ్చే ఆటగాడు ఎంత కీలకమో తెలుసుకున్నాడు. యశ్ ధుల్ కోహ్లి టెక్నిక్ను అందుకోలేకపోవచ్చు.. కానీ అతనిలా మాత్రం ఇన్నింగ్స్లు నిర్మించగలడు.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అండర్-19 ప్రపంచకప్లో చోటు దక్కించుకునేందుకు యశ్ ధుల్ బాగా కష్టపడ్డాడు. సెప్టెంబర్- అక్టోబర్ 2021లో జరిగిన వినూ మాన్కడ్ ట్రోఫీలో యశ్ ధుల్ సూపర్ ప్రదర్శన చేశాడు. ఆ ట్రోఫీలో ఢిల్లీ గ్రూప్ స్టేజీ దాటకపోయినప్పటికి యశ్ మాత్రం 302 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఆసియా కప్లో టీమిండియా కెప్టెన్గా జట్టును ముందుండి నడిపించాడు. ఇప్పుడు వరల్డ్కప్లోనూ టీమిండియాకు ఐదో టైటిల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతని కోరిక నెరవేరి త్వరలోనే టీమిండియాలోకి కూడా అడుగుపెట్టాలని ఆశిద్దాం. చదవండి: Under-19 World Cup: అప్పుడు కుర్రాళ్లు.. ఇప్పుడు సూపర్స్టార్లు -
గ్రౌండ్లోకి రావడానికి నానాతంటాలు.. అంత కష్టమెందుకు
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ మజిలి చివరి దశకు చేరింది. శనివారం భారత్, ఇంగ్లండ్ జట్లు ఫైనల్లో తలపడనున్నాయి. మరి భారత్ ఐదోసారి టైటిల్ గెలుస్తుందా.. లేక ఇంగ్లండ్ రెండోసారి కప్ను అందుకుంటుందా చూడాలి. ఇక ఈ టోర్నీలో ఆఫ్ ఫీల్డ్.. ఆన్ఫీల్డ్లో ఎన్నో వింతలు, విశేషాలు చోటుచేసుకున్నాయి. ఫైనల్కు ఒక్కరోజు మాత్రమే మిగిలిఉండడంతో ఐసీసీ ఫ్యాన్స్ను నవ్వించడానికి ఒక ఆసక్తికర వీడియోనూ రిలీజ్ చేసింది. ఈ సంఘటన ఏ మ్యాచ్లో జరిగిందో తెలియదు. కచ్చితంగా మనల్ని నవ్విస్తుంది. విషయంలోకి వెళితే.. మ్యాచ్ సందర్భంగా ఆటగాడు గాయపడడంతో మెడికల్ అవసరం ఏర్పడింది. దీంతో ఇద్దరితో కూడిన మెడికల్ టీం సహాయం చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో ఒక వ్యక్తి బాగా లావుగా ఉన్నాడు.. అతని పక్కన అసిస్టెంట్గా ఒక అమ్మాయి ఉంది. కాల్ రావడంతో గ్రౌండ్లోకి వేగంగా వెళ్లాలనే ఉద్దేశంతో బౌండరీలైన్ వద్ద ఉన్న అడ్వర్టైజ్మెంట్ బోర్డులను దాటే ప్రయత్నం చేశారు. వారికి సాధ్యం కాలేదు. ఏమనుకున్నాడో.. ఒక్కసారిగా అథ్లెట్గా మారిన మెడికో దానిపై నుంచి జంప్ చేసి వెళ్లాలనుకున్నాడు. కానీ బొక్కబోర్లా పడ్డాడు.. పాపం అతని దెబ్బకు పక్కనున్న అమ్మాయి కూడా బలయ్యింది. ఆ తర్వాత కిందపడిన దానికి కవర్ చేసుకుంటూ పరిగెత్తడం నవ్విస్తుంది. ఇది చూసిన కామెంటేటర్లు.. ఈ మెడికో సూపర్గా ఉన్నాడు.. హార్డిల్స్కు పంపిస్తే కచ్చితంగా మెడల్స్ తీసుకొస్తాడు అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టడం ఇది ఎనిమిదోసారి. నాలుగుసార్లు విజేతగా నిలిచిన భారత్.. ఐదో టైటిల్పై కన్నేసింది. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం 1998 తర్వాత మళ్లీ అండర్-19 ప్రపంచకప్ సాధించలేకపోవడం విశేషం. దీంతో టీమిండియానే మరోసారి ఫెవరెట్గా కనిపిస్తోంది. View this post on Instagram A post shared by ICC (@icc) -
'టీమిండియాదే ప్రపంచకప్.. యష్ ధుల్ మరోసారి చెలరేగడం ఖాయం'
Yash Dhull Father About U19 WC Finals: అండర్-19 ప్రపంచ కప్లో టీమిండియా వరుసగా నాలుగో సారి ఫైనల్కు చేరింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి యువ భారత్ ఫైనల్లో అడుగు పెట్టింది. కాగా భారత విజయంలో కెప్టెన్ యష్ ధుల్ 110 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. ఇక శనివారం జరగబోయే ఫైనల్లో ఇంగ్లండ్తో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో యష్ ధుల్ తండ్రి విజయ్ ధుల్ కీలక వాఖ్యలు చేశాడు. అండర్-19 ప్రపంచ కప్ టైటిల్ను భారత్ కచ్చితంగా కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. అదే విధంగా యష్ క్రికెట్ ఫీల్డ్లో చాలా చురుకుగా ఉంటాడు, భారత్ ప్రపంచ కప్ గెలవడంలో యష్ కీలక పాత్ర పోషిస్తాడు అని అతడు తెలిపాడు. ‘‘భారత్కు కచ్చితంగా ప్రపంచకప్ వస్తుంది. ఈ టోర్నమెంట్లో యువ భారత్ జట్టు అద్భుతంగా రాణిస్తుంది. ఇంగ్లండ్ జట్టు కూడా గట్టి పోటీస్తుంది అనడంలో సందేహం లేదు. దేశం మొత్తం టీమిండియా వెనుక ఉంది. ఫైనల్లో భారత్ గెలిచి చరిత్ర సృష్టిస్తుందని అందరూ అశిస్తున్నారు. యష్ క్రికెట్ ఫీల్డ్లో చాలా చురుకుగా ఉంటాడు. జట్టు కష్టపరిస్ధితుల్లో ఉన్నప్పడు బ్యాటర్గా, సారధిగా తాను ఎంటో నిరూపించుకుంటాడు. ఆదే విధంగా ఏ బ్యాటర్కు ఏ బౌలర్ను ఊపయోగించాలో అతడికి బాగా తెలుసు’’ అని విజయ్ ధుల్ పేర్కొన్నాడు. ఇక భారత అండర్–19 జట్టు నాలుగు సార్లు ప్రపంచ కప్ను గెలుచుకుంది. 2000లో (కెప్టెన్ మొహమ్మద్ కైఫ్), 2008లో (కెప్టెన్ విరాట్ కోహ్లి), 2012లో (కెప్టెన్ ఉన్ముక్త్ చంద్), 2018 (కెప్టెన్ పృథ్వీ షా) జట్టు చాంపియన్గా నిలిచింది. మరో మూడు సార్లు (2006, 2016, 2020) ఫైనల్లో ఓడి రన్నరప్గా నిలిచింది. చదవండి: నాపై ప్రేమ చూపించినందుకు ధన్యవాదాలు.. నేను బాగానే ఉన్నా: శిఖర్ ధావన్ -
యశ్ ధుల్ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్.. క్రికెట్ పుస్తకాల్లో పేరుందా!
అండర్-19 ప్రపంచకప్లో టీమిండియా ఫైనల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కెప్టెన్ యశ్ ధుల్ సూపర్ సెంచరీకి(110 పరుగులు) తోడు షేక్ రషీద్(94) రాణించడంతో యువ భారత్.. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను 96 పరుగులతో మట్టికరిపించింది. శనివారం జరగనున్న ఫైనల్లో ఇంగ్లండ్తో అమితుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే అండర్-19 ప్రపంచకప్లో నాలుగుసార్లు విజేతగా నిలిచిన టీమిండియా ఐదోసారి టైటిల్పై కన్నేసింది. చదవండి: U19 World Cup Semi Final: ఆసీస్పై సెంచరీతో విరాట్ కోహ్లీ సరసన చేరిన యశ్ ధుల్ ఇదిలాఉంటే.. సూపర్ సెంచరీతో మెరిసిన యశ్ ధుల్ ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. అతను కొట్టిన ఒకే ఒక్క సిక్స్ ఇప్పుడు క్లాసిక్గా మిగిలిపోనుందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఆసీసీ బౌలర్ టామ్ విట్నీ వేసిన ఇన్నింగ్స్ 45వ ఓవర్ ఐదో బంతిని యష్ ధుల్ లాంగాన్ మీదుగా భారీ సిక్స్ కొట్టాడు. బంతి షార్ట్పిచ్ అవగా.. ఫ్రంట్ఫుట్కు వచ్చిన యష్.. డ్యాన్స్ మూమెంట్ ఇస్తూ బ్యాట్ ఎడ్జ్ను తగిలించాడు. అంతే.. బంతి లాంగాన్ మీదుగా వెళ్లి స్టాండ్స్ టాప్లో పడింది. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ ట్విటర్లో షేర్ చేస్తూ.. ''ఒక్క క్లాసిక్ సిక్స్తో ఐసీసీ ప్లే ఆఫ్ ది డే అవార్డు కొల్లగొట్టాడు.. ఇంతకీ యష్ ధుల్ కొట్టిన సిక్స్కు క్రికెట్ పుస్తకాల్లో ఏ పేరుందో కాస్త చెప్పండి'' అంటూ పేర్కొంది. చదవండి: హార్దిక్ పాండ్యాపై నిప్పులు చెరిగిన కోహ్లి చిన్ననాటి కోచ్ WHAT A HIT 🔥 Yash Dhull's stunning six dancing down the track is the @Nissan #POTD winner from the #U19CWC Super League semi-final clash between India and Australia 👏 pic.twitter.com/rFiEAsv2G4 — ICC (@ICC) February 3, 2022 -
సెమీఫైనల్లో సెంచరీతో చెలరేగాడు.. భారత్ను ఫైనల్కు చేర్చాడు.. దటీజ్ యష్ ధుల్!
Yash Dhull U19 World Cup: అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో యువ భారత్ ఫైనల్కు చేరింది. ఆంటిగ్వా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 96 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో శనివారం జరగనున్న ఫైనల్లో ఇంగ్లండ్తో టీమిండియా తలపడనుంది. కాగా భారత విజయంలో కెప్టెన్ యష్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్ కీలక పాత్ర పోషించారు. యష్ ధుల్ సెంచరీ(114)తో చెలరేగగా, షేక్ రషీద్ 94 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 37 పరుగులకే రెండు వికెట్లుకోల్పోయి కష్టాల్లో పడింది. ఆనంతరం యష్ ధుల్, షేక్ రషీద్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్కు 204 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది. అనంతరం 291 పరుగుల పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 194 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో విక్టీ ఓస్టావల్ మూడు వికెట్లు సాధించగా, నిషాంత్ సింధు, రవి కుమార్లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దటీజ్ యశ్ ధుల్ న్యూఢిల్లీకి చెందిన యశ్ దుల్కి ఢిల్లీ అండర్-16, అండర్-19, ఇండియా ‘ఎ’ అండర్-19 జట్లకు నాయకత్వం వహించాడు. ఇక ఇటీవల ముగిసిన వినూ మన్కడ్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడుగా ఉన్నాడు. డీడీసీఈ(ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్) తరుపున 5 మ్యాచ్లు ఆడిన యశ్ దుల్ 302 పరుగులు చేశాడు. అదే విధంగా ఆసియా అండర్–19 క్రికెట్ టోర్నీలో భారత జట్టుకు సారథ్యం వహించిన యశ్ ధుల్.... జట్టును చాంపియన్గా నిలిపాడు. యశ్ కెప్టెన్సీలో భారత యువ జట్టు ఫైనల్లో శ్రీలంకను 9 వికెట్ల తేడాతో ఓడించి విజేతగా అవతరించింది. ఇక ఇప్పుడు ఐసీసీ మేజర్ టోర్నీ వరల్డ్కప్లోనూ జట్టును ఫైనల్కు చేర్చి కెప్టెన్గా తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ముఖ్యంగా సెమీ ఫైనల్లో 110 బంతుల్లో 110 పరుగులు సాధించి బ్యాటర్గానూ జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. చదవండి: IND vs WI: క్రికెట్ అభిమానులకు భారీ షాక్.. భారత్- విండీస్ తొలి వన్డే వాయిదా! Who Is Yash Dhull: ఎవరీ యశ్ దుల్.. భారత జట్టు కెప్టెన్గా ఎలా ఎంపిక చేశారు! -
ఆసీస్పై భారీ విజయం.. ఫైనల్లో టీమిండియా
కూలిడ్జ్ (ఆంటిగ్వా): అండర్-19 వరల్డ్కప్లో టీమిండియా ఫైనల్కు చేరింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ 96 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 290 పరుగులు చేయగా, ఆసీస్ 41. 5 ఓవర్లలో 194 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. భారత యువ బౌలర్లలో విక్టీ ఓస్టావల్ మూడు వికెట్లతో ఆసీస్ను దెబ్బ తీయగా, నిషాంత్ సింధు, రవి కుమార్లు తలో రెండు వికెట్లతో మెరిశారు. కౌశల్ తాంబే, రఘువంశీలు చెరో వికెట్ తీశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు యష్ ధుల్ (110 బంతుల్లో 110; 10 ఫోర్లు, 1 సిక్స్), షేక్ రషీద్ (108 బంతుల్లో 94; 8 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్కు 204 పరుగులు జోడించడంతో భారీ స్కోరును బోర్డుపై ఉంచారు. భారీ భాగస్వామ్యం... టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు అంగ్కృష్ రఘువంశీ (6), హర్నూర్ సింగ్ (16) తడబడుతూ మొదలు పెట్టడంతో పరుగులు బాగా నెమ్మదిగా వచ్చాయి. తక్కువ వ్యవధిలో వీరిద్దరిని అవుట్ చేసి ఆసీస్ ఆధిక్యం ప్రదర్శించింది. ఈ స్థితిలో ధుల్, రషీద్ ఇన్నింగ్స్ను నిర్మించే బాధ్యత తీసుకున్నారు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడినా, నిలదొక్కుకున్న తర్వాత చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. ధుల్ 64 బంతుల్లో, రషీద్ 78 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకోగా, ఆ తర్వాత ఒకరితో మరొకరు పోటీ పడి పరుగులు సాధించారు. ఈ జోడీని విడదీయడానికి ఆసీస్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. విట్నీ ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టిన ధుల్ 106 బంతుల్లోనే శతకం మార్క్ను అందుకున్నాడు. పార్ట్నర్షిప్ 200 పరుగులు దాటిన తర్వాత 46వ ఓవర్లో వీరిద్దరు వరుస బంతుల్లో అవుటయ్యారు. విట్నీ వేసిన చివరి ఓవర్లో భారత్ వరుసగా 4, 6, 1, 6, 4, 6తో ఏకంగా 27 పరుగులు రాబట్టింది. దినేశ్ బానా ఆడిన 4 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు కొట్టడం విశేషం. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ జట్టులో లాచ్లాన్ షా(51) మాత్రమే హాఫ్ సెంచరీ చేయగా, కోరీ మిల్లర్(38), క్యాంప్బెల్ కెల్లావే(30)లు మోస్తరుగా మెరిశారు. ఫైనల్లో భారత జట్టు.. ఇంగ్లండ్తో తలపడనుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రవి కుమార్ ‘స్వింగ్’.. సెమీస్లో యువ భారత్
కూలిడ్జ్ (అంటిగ్వా): అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో యువ భారత్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్తో శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ గెలుపుతో 2020 అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 37.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. ఎడంచేతి వాటం పేస్ బౌలర్ రవి కుమార్ (3/14) స్వింగ్ బౌలింగ్తో బంగ్లాదేశ్ను హడ లెత్తించాడు. స్పిన్నర్ విక్కీ (2/25) కూడా రాణించాడు. 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 30.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ అంగ్కృష్ (44; 7 ఫోర్లు), ఆంధ్ర క్రికెటర్ షేక్ రషీద్ (26; 3 ఫోర్లు) రెండో వికెట్కు 70 పరుగులు జోడించారు. కెప్టెన్ యశ్ ధుల్ (20 నాటౌట్; 4 ఫోర్లు), కౌశల్ (11 నాటౌట్; 1 సిక్స్) రాణించారు. రవి కుమార్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఫిబ్రవరి 1న తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్తో అఫ్గానిస్తాన్; ఫిబ్రవరి 2న రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ ఆడ తాయి. ఫైనల్ ఫిబ్రవరి 5న జరుగుతుంది. -
టీమిండియాకు భారీ షాక్.. కరోనా బారిన పడిన స్టార్ ఆటగాడు
అండర్-19 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. భారత యువ ఆల్ రౌండర్ నిశాంత్ సింధు కరోనా బారిన పడ్డాడు. శుక్రవారం ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా సింధుకు పాజిటివ్గా నిర్ధారణైంది. కాగా ఇంతకుముందు కరోనా బారిన ఆరుగురు భారత యువ ఆటగాళ్లు పూర్తిగా కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న కెప్టెన్ యష్ ధుల్, షేక్ రషీద్తో పాటు పలువురు ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ఇక శనివారం క్వార్టర్ఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. కాగా లీగ్ మ్యాచ్ల్లో రెగ్యూలర్ కెప్టెన్ యష్ ధుల్ దూరం కావడంతో నిశాంత్ సింధు యువ భారత జట్టుకు నాయకత్వం వహించాడు. అంతే కాకుండా జట్టు విజయాల్లో కూడా కీలక పాత్ర సింధు పోషించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డిఫెండింగ్ ఛాంపియస్స్ బంగ్లాదేశ్పై భారత్ బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. అండర్-19 ప్రపంచకప్ 2020 ఫైనల్లో భారత్ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. చదవండి: జింబాబ్వే క్రికెటర్ బ్రెండన్ టేలర్పై ఐసీసీ నిషేధం -
మూడు మ్యాచ్లు.. 228 పరుగులు.. అతడు వేలంలోకి వస్తే జట్లు పోటీ పడాల్సిందే!
ఐపీఎల్-2022 మెగా వేలంకు సమయం అసన్నమైంది. ఫిబ్రవరి 12, 13న బెంగళూరు వేదికగా మెగావేలం జరగనుంది. ఇక ఈసారి రెండు కొత్త జట్లు టోర్నీలో పాల్గొనబోతున్నాయి. ఈ రెండు కొత్త ఫ్రాంచైజీలు ఇప్పటికే తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల పేర్లను వెల్లడించాయి. మొత్తం ఈ ఏడాది లీగ్ కోసం 1,214 మంది క్రికెటర్లు తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. అయితే రానున్న మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే కసరత్తలు మొదలపెట్టాయి. ఈ క్రమంలో అండర్-19 ప్రపంచ కప్లో అదరగొడుతున్న భారత యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువన్షీ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన రఘువన్షీ 228 పరుగులు చేశాడు. దీంట్లో ఒక అర్ధసెంచరీతో పాటు, సెంచరీ కూడా ఉంది. అదే విధంగా అండర్-19 ఆసియా కప్లో కూడా రఘువన్షీ అధ్బుతంగా రాణించాడు. దీంతో అతడితో పాటు ఆల్రౌండర్ రాజ్ బావాను కూడా ఫ్రాంచైజీలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. రాజ్ బావా బ్యాట్తోను, బాల్తోను ఈ మెగా టోర్నమెంట్లో రాణిస్తున్నాడు. ఉగాండాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో రాజ్ బావా 162 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. చదవండి: SA vs IND 3rd ODI: 'కెప్టెన్గా అతడు ఏం చేశాడో నాకు తెలియడం లేదు' -
అచ్చం డివిలియర్స్ను తలపిస్తున్నాడు.. ఐపీఎల్ వేలానికి వస్తే!
దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ విధ్వంసానికి పెట్టింది పేరు. మిస్టర్ 360 డిగ్రీస్ పేరు కలిగిన ఏబీ గ్రౌండ్ నలుమూలలా షాట్లు కొడుతూ క్షణాల్లో ఆట స్వరూపాన్నే మార్చేయగల సత్తా ఉన్నవాడు. అంతర్జాతీయంగా ఎన్నో మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికాను గెలిపించిన డివిలియర్స్.. ఐపీఎల్లోనూ అదే జోరు చూపెట్టాడు. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఎక్కువకాలం ఆడిన ఏబీ తన విధ్వంసాన్ని భారత అభిమానులకు చూపెట్టాడు. చదవండి: పంత్ పాతుకుపోయాడుగా.. అదృష్టం అంటే ఇట్టానే ఉంటాదేమో! అంతర్జాతీయ క్రికెట్కు రెండేళ్ల ముందే గుడ్బై చెప్పిన డివిలియర్స్ ఇటీవలే అన్ని రకాల లీగ్ క్రికెట్కు గుడ్బై చెప్పడంతో ఐపీఎల్లో ఇక అతని మెరుపులు కనిపించవని అభిమానులు తెగ బాధపడిపోయారు. అలా బాధపడుతున్న ఐపీఎల్ అభిమానులకు ఒక శుభవార్త. త్వరలోనే డివిలియర్స్ మెరుపులు మళ్లీ చూసే అవకాశం వచ్చింది. అదేంటి వీడ్కోలు చెప్పాడుగా.. మళ్లీ వస్తున్నాడా అని సందేహం వద్దు. చదవండి: పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్.. సన్రైజర్స్లోకి కిషన్! డెవాల్డ్ బ్రెవిస్ అనే కుర్రాడు ప్రస్తుతం అండర్-19 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా తరపున ఇరగదీస్తున్నాడు. 360 డిగ్రీస్లో షాట్లు కొడుతూ అచ్చం డివిలియర్స్ను గుర్తుచేస్తున్నాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే విధ్వంసకర షాట్లు ఆడుతూ పరుగులు రాబడుతున్నాడు. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్ల్లో 169 పరుగులు చేసిన బ్రెవిస్ ఖాతాలో ఒక సెంచరీ ఉండడం విశేషం. ఉగాండాపై సెంచరీ చేసిన డెవాల్డ్ బ్రెవిస్.. టీమిండియాపై 65 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వెస్టిండీస్పై మరో అర్థసెంచరీతో మెరిశాడు. ప్రస్తుతం టోర్నీలో టాప్ స్కోరర్గా ఉన్న బ్రెవిస్కు ఎదురులేకుండా పోయింది. ఇక టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా 65 పరుగులతో మెరిసిన డెవాల్డ్ బ్రెవిస్.. డివిలియర్స్ను గుర్తుచేస్తూ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో తన సహచరులు డ్రెస్సింగ్ రూమ్లో ''బేబీ ఏబీ'' అంటూ ప్లకార్డులను పట్టుకొని ఎంకరేజ్ చేయడం వైరల్గా మారింది. ఇక ఫిబ్రవరి 12,13 తేదీల్లో ఐపీఎల్ మెగావేలం జరగనున్న నేపథ్యంలో డెవాల్డ్ బ్రెవిస్ వేలానికి వచ్చే అవకాశముందని పలువురు పేర్కొన్నారు. ఒకవేళ అదే నిజమై.. బ్రెవిస్ను కొనుగోలు చేస్తే మాత్రం డివిలియర్స్ను మరోసారి చూసినట్లేనని అభిప్రాయపడుతున్నారు. చదవండి: జేసన్ రాయ్ విధ్వంసం.. సిక్సర్లతో వీరవిహారం 👏 Dewald Brevis caught the attention of many in the SA U19's opening #T20KO match. 🏏 How will he and the rest of the SA U19s go throughout the competition? 📲 Catch the full match highlights here https://t.co/zz5ZdsFGsZ pic.twitter.com/DYtMB79FB8 — Cricket South Africa (@OfficialCSA) October 9, 2021 Babay de-Villiers 😍 Dewald Brevis from SA U19. pic.twitter.com/xGlDtM1ruL — . (@federalite7) January 17, 2022 -
జింబాబ్వే బౌలర్పై ఐసీసీ సస్పెన్షన్ వేటు
అండర్-19 జింబాబ్వే బౌలర్ విక్టర్ చిర్వాను బౌలింగ్ నుంచి సస్పెండ్ చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అండర్-19 ప్రపంచకప్లో భాగంగా గత శనివారం పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్లో విక్టర్ చిర్వా బౌలింగ్ యాక్షన్ అనుమానాదాస్పదంగా ఉందంటూ అండర్-19 ఐసీసీ ప్యానెల్ పేర్కొంది. చిర్వా బౌలింగ్ యాక్షన్కు సంబంధించిన వీడియో ఫుటేజీని తాము పరిశీలించామని ప్యానెల్ అధికారులు తెలిపారు. చదవండి: టీమిండియాకు మరో బిగ్ షాక్.. ఐసీసీ రూల్స్లోని ఆర్టికల్ 6.7 ప్రకారం చిర్వా బౌలింగ్ యాక్షన్ అభ్యంతరకరంగా ఉండడంతో అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ వేయకుండా అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు చిర్వా సస్పెన్షన్ వేటు తక్షణమే అమల్లోకి వస్తుందని ఐసీసీ ప్యానెల్ తెలిపింది. చదవండి: Novak Djokovic: పోతూ పోతూ నష్టం మిగిల్చాడు.. కట్టేది ఎవరు? -
ఒక వైపు కెప్టెన్, వైస్ కెప్టెన్కి పాజిటివ్.. అయినా టీమిండియా ఘన విజయం..
U-19 World Cup, IND Vs Ire: అండర్-19 ప్రపంచకప్లో భారత్ జోరు కోనసాగుతోంది. ట్రినిడాడ్ వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్లో భాగంగా ఐర్లాండ్పై 174 పరుగుల భారీ తేడాతో టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది. ఈ విజయంతో క్వార్టర్ ఫైనల్ బెర్త్ను భారత్ ఖరారు చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 307 పరుగులు చేసింది. ఓపెనర్లు హర్నూర్ సింగ్(88), రఘువంశీ(79) అద్భుతమైన ఇన్నింగ్స్తో భారత్ భారీ స్కోర్ సాధించగల్గింది. 308 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 39 ఓవర్లలో 133 పరుగులకే కూప్పకూలింది. భారత బౌలర్లలో సంగ్వాన్, అనీశ్వర్ గౌతమ్, కౌషల్ తంబే తలో రెండు వికెట్లు తీయగా... విక్కీ ఓస్వాల్, రవికుమార్, రాజవర్ధన్ తలో వికెట్ సాధించారు. భారత అండర్-19 ఆరుగురు పాజిటివ్ కాగా మ్యాచ్కు ముందు భారత శిబిరంలో కరోనా కలకలం రేపింది. భారత జట్టులో ఏకంగా ఆరుగురు ఆటగాళ్లకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. భారత కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్తో పాటు మరో నలుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. దీంతో ఈ మ్యాచ్లో నిశాంత్ సింధు భారత జట్టుకు నాయకత్వం వహించాడు. చదవండి: SA vs IND: తొలి వన్డేలో టీమిండియా ఓటమి... నిరాశపర్చిన రాహుల్ కెప్టెన్సీ.. -
అండర్–19 ప్రపంచకప్ సమరానికి సై
జార్జ్టౌన్: భవిష్యత్ క్రికెట్ స్టార్ల ప్రపంచ కప్ నేటినుంచి మొదలవుతుంది. వెస్టిండీస్ ఆతిథ్యమిచ్చే ఈ అండర్–19 వరల్డ్కప్ తొలి మ్యాచ్లో కరీబియన్ జట్టుతో ఆస్ట్రేలియా తలపడనుంది. రేపు గ్రూప్–బిలో తమ తొలి పోరులో యశ్ ధుల్ సారథ్యంలోని భారత అండర్–19 జట్టు దక్షిణాఫ్రికాతో సమరానికి సిద్ధమైంది. మొత్తం 16 జట్లు నాలుగు గ్రూపుల్లో తలపడతాయి. ట్రినిడాడ్, అంటి0గ్వా, సెయింట్ కిట్స్, గయానా నగరాల్లోని మొత్తం 9 వేదికల్లో 23 రోజుల పాటు ఈ యువ మెగా టోర్నీ జరుగనుంది. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో సెమీఫైనల్స్, 5న జరిగే ఫైనల్స్తో ఈ ప్రపంచకప్ ముగుస్తుంది. గ్రూప్–ఎ: బంగ్లాదేశ్, కెనడా, ఇంగ్లండ్, యూఏఈ గ్రూప్–బి: భారత్, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, ఉగాండ గ్రూప్–సి: జింబాబ్వే, అఫ్గానిస్తాన్, పపువా న్యూగినియా, పాకిస్తాన్ గ్రూప్–డి: స్కాట్లాండ్, శ్రీలంక, విండీస్, ఆస్ట్రేలియా. -
అతడు వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు కావాల్సిందే..
టీమిండియా అండర్-19 ఆటగాడు హర్నూర్ సింగ్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన అండర్-19 అసియా కప్లోను రాణించిన హర్నూర్.. అండర్-19 వన్డే ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ల్లోనూ చేలరేగి ఆడుతున్నాడు. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో హర్నూర్ సింగ్ సెంచరీ సాధించి ఆజేయంగా నిలిచాడు. అదే విధంగా ఆంధ్రా కుర్రాడు షేక్ రషీద్ 72 పరుగులతో రాణించడంతో ఆస్ట్రేలియాపై భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 268 పరుగులకు ఆలౌటైంది. ఇది ఇలా ఉంటే.. త్వరలో జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో హర్నూర్ సింగ్ను దక్కించుకోవడానికి ఇప్పటి నుంచే పలు ప్రాంఛైజీలు కసరత్తులు మొదలు పెట్టినట్లు తెలస్తోంది. మెగా వేలంలో అతడికి భారీ ధర దక్కినా ఆశ్చర్యపోనక్కరలేదు. అతడి కోసం వేలంలో చాలా ప్రాంఛైజీలు పోటీపడతాయని క్రికెట్ నిపుణులు అంచానా వేస్తున్నారు. ఇక బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా వేలం బీసీసీఐ నిర్వహించనుంది. చదవండి: IPL 2022: బీసీసీఐ పంట పండింది.. జాక్పాట్.. వివో నుంచి బోర్డుకు మరో రూ. 454 కోట్లు! -
టీమిండియా కెప్టెన్గా యశ్ దుల్, ఆంధ్రా కుర్రాడికి వైస్ కెప్టెన్సీ
ముంబై: వెస్టిండీస్ వేదికగా వచ్చే ఏడాది(2022) జనవరి 14 నుంచి ప్రారంభంకానున్న అండర్ 19 వన్డే ప్రపంచ కప్ టోర్నీకి టీమిండియా కెప్టెన్గా ఢిల్లీ కుర్రాడు యశ్ దుల్ ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్గా ఆంధ్రా ప్లేయర్, గుంటూరు కుర్రాడు షేక్ రషీద్కి అవకాశం దక్కింది. 17 మంది ప్లేయర్లు, ఐదుగురు స్టాండ్ బై ఆటగాళ్లతో కూడిన జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. మెగా టోర్నీలో భాగంగా జరిగే ప్రాధమిక మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికా(జనవరి 15), ఐర్లాండ్(జనవరి 19), ఉగాండా(జనవరి 22) జట్లతో యంగ్ ఇండియా తలపడనుంది. ఇదిలా ఉంటే, భారత అండర్-19 జట్టు నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచి.. అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన జట్టుగా రికార్డుల్లోకెక్కిన సంగతి తెలిసిందే. భారత యువ జట్టు చివరిసారిగా 2020లో జరిగిన టోర్నీలో ఫైనల్కు చేరి.. బంగ్లాదేశ్ చేతిలో ఓడింది. భారత జట్టు అండర్-19 జట్టు: యశ్ దుల్ (కెప్టెన్), షేక్ రషీద్ (వైస్ కెప్టెన్), హర్నూర్ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, నిశాంత్ సింధు, సిద్థార్థ్ యాదవ్, అనీశ్వర్ గౌతమ్, దినేశ్ బనా (వికెట్ కీపర్), ఆరాధ్య యాదవ్ (వికెట్ కీపర్), రాజ్ అంగద్ బవా, మానవ్ పరాక్, కుశాల్ తంబే, ఆర్ఎస్ హంగర్కేర్, వసు వాత్స్, విక్కీ ఉత్సవల్, రవి కుమార్, గర్వ్ సంగ్వాన్ స్టాండ్ బై ప్లేయర్లు: రిషిత్ రెడ్డి(హైదరాబాద్), ఉదయ్ శరవణ్, అన్ష్ ఘోసాయ్, అమిత్ రాజ్ ఉపాధ్యాయ్, పీఎం సింగ్ రాథోర్ చదవండి: BWF World Championships 2021: మహిళల సింగిల్స్ ఛాంపియన్గా యమగుచి -
హర్భజన్తో ఉన్న ఆ ఇద్దరు పాక్ క్రికెటర్లు ఎవరు..?
క్రికెట్లో అవకాశాలు సన్నగిల్లాక సోషల్మీడియాలో యాక్టివ్గా ఉంటున్న టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. తాజాగా నెటిజన్లకు ఓ పరీక్ష పెట్టాడు. 1997-98 దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్-19 ప్రపంచ కప్కు సంబంధించిన ఓ ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. అందులో తనతో ఉన్న ఇద్దరు పాక్ క్రికెటర్లు ఎవరో కనుక్కోవాలంటూ నెటిజన్లను కోరాడు. Pehchano to maaane.. U-19 World Cup days 1998/99 pic.twitter.com/2iawM1dSUK — Harbhajan Turbanator (@harbhajan_singh) December 10, 2021 ఈ ఫోటోలో భజ్జీని సులువుగా గుర్తుపడుతున్న నెటిజన్లు.. అతని పక్కన ఉన్న ఇద్దరిని మాత్రం పోల్చుకోలేకపోతున్నారు. నెటిజన్లకు సవాలుగా మారిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్మీడియా చక్కర్లు కొడుతోంది. ఇందులో భజ్జీ పక్కనున్న వాళ్లను గుర్తుపట్టాలంటూ అభిమానులు గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. ఆ ఇద్దరిని కొందరు సరిగ్గా గెస్ చేయగలుగుతున్నా.. చాలా వరకు విఫలమవుతున్నారు. ఇదిలా ఉంటే, భజ్జీ పక్కన షర్ట్ లేకుండా ఉన్నది నాటి పాక్ ఆటగాడు, ప్రస్తుతం దక్షిణాఫ్రికాకు ఆడుతున్న ఇమ్రాన్ తాహిర్ కాగా, మరొకరు పాక్ మాజీ ఆటగాడు హసన్ రాజా. వీరిద్దరు పాక్ అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. వీరిలో హసన్ రాజా పాక్ తరఫున 7 టెస్ట్లు, 16 వన్డేలు ఆడగా.. పాక్లోనే పుట్టిన ఇమ్రాన్ తాహిర్ మాత్రం తన కుటుంబం దక్షిణాఫ్రికాకు వలస వెళ్లడంతో ఆ దేశ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక 1997-98 అండర్-19 ప్రపంచకప్ విషయానికొస్తే.. ఆ టోర్నీలో భారత్, పాక్ జట్ల మధ్య డర్బన్ వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్లో టీమిండియా పాక్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్లో 7 ఓవర్లు వేసిన భజ్జీ.. కీలకమైన షోయబ్ మాలిక్ వికెట్ తీశాడు. చదవండి: ‘యే బిడ్డా.. ఇది నా అడ్డా..’ అంటున్న డేవిడ్ భాయ్, కౌంటరిచ్చిన కోహ్లి -
సెమీస్లో యువ భారత్
పోష్ స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): తమ జైత్రయాత్రను కొనసాగిస్తూ యువ భారత జట్టు అండర్–19 ప్రపంచకప్లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గత ప్రపంచ కప్ రన్నరప్ ఆ్రస్టేలియాతో మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ 74 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. మొదట భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 233 పరుగులు చేసింది. తర్వాత ఆ్రస్టేలియా 43.3 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. 2008 తర్వాత ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్ చేరకపోవడం ఇదే తొలిసారి. ముందుగా భారత్ బ్యాటింగ్లో తడబడినా... యశస్వి జైస్వాల్ (82 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్స్లు), అథర్వ అంకోలేకర్ (54 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) జట్టును ఆదుకున్నారు. టాపార్డర్లో ఓపెనర్ దివ్యాన్ష్ (14) సహా తెలుగు కుర్రాడు ఠాకూర్ తిలక్వర్మ (2), కెప్టెన్ ప్రియమ్ గార్గ్ (15) విఫలమయ్యారు. ఈ దశలో లోయర్ ఆర్డర్లో అథర్వ... సిద్ధేశ్ వీర్ (42 బంతుల్లో 25; 4 ఫోర్లు), రవి బిష్ణోయ్ (31 బంతుల్లో 30; ఫోర్, సిక్స్)లతో కలిసి ఇన్నింగ్స్ను కుదుటపరిచాడు. 234 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ్రస్టేలియాను భారత పేసర్లు కార్తీక్ త్యాగి (4/24), ఆకాశ్ సింగ్ (3/30) హడలెత్తించారు. కార్తీక్ ధాటికి ఒకదశలో ఆసీస్ 17 పరుగులకే 4 వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ సామ్ ఫానింగ్ (75; 7 ఫోర్లు, 3 సిక్స్లు), స్కాట్ (35; 2 ఫోర్లు, సిక్స్) పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. కార్తీక్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ గెలుపుతో అండర్–19 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా పది విజయాలు సాధించిన తొలిజట్టుగా భారత్ గుర్తింపు పొందింది. -
సెమీ ఫైనల్కు దూసుకెళ్లిన టీమిండియా
పోష్స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా) : అండర్ 19 ప్రపంచకప్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తూ సెమీస్కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో 74 పరుగుల తేడాతో ఆసీస్పై విజయం సాధించింది. జైశ్వాల్(62) , అన్కోలేకర్(55, నాటౌట్) అర్థ సెంచరీలతో రాణించగా...త్యాగి నాలుగు, ఆకాశ్ సింగ్ మూడు వికెట్లు తీసి అదరహో అనిపించారు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన భారత్.. నిర్ణీత ఓవర్లకు 233 పరుగు చేసింది. ఆ తర్వాత 234 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఆసీస్.. భారత బౌలర్ల దాటికి 159 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బ్యాట్స్మన్లో ఫన్నింగ్ 75 , స్కాట్ 35 పరుగులు చేయగా...ముగ్గురు డకౌట్లు, ఐదుగురు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. 74 పరుగుల భారీ తేడాలో విజయం సాధించిన భారత్.. సెమీ ఫైనల్కు దూసుకెళ్లింది. నాలుగు వికెట్లు తీసి మ్యాచ్ విజయానికి కీలకమైన త్యాగికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. -
29 బంతుల్లోనే కథ ముగించారు
బ్లోమ్ఫొంటెన్: అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ జపాన్ను చిత్తు చేసింది. జపాన్ నిర్దేశించిన అతి స్వల్ప లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జపాన్ రవి భిష్నోయ్ 4, కార్తిక్ త్యాగి 3 దెబ్బకు 22.5 ఓవర్లలో 41 పరుగులకే ఆలౌటయింది. అనంతరం బరిలోకి దిగిన యువభారత్ జట్టు 4.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (18 బంతుల్లో 29; 5 పోర్లు, 1 సిక్స్), కుమార్ కుశాగ్ర (11 బంతుల్లో 13; 2 ఫోర్లు) లాంఛనాన్ని పూర్తి చేశారు. (చదవండి : చెత్త ప్రదర్శన.. 41 పరుగులకే ఆలౌట్) భారత్కు ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం. శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో యువభారత్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రవి భిష్నోయ్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు. కాగా, భిష్నోయ్పై బీసీసీఐ ప్రశంసలు కురిపించింది. చక్కని బౌలింగ్తో నాలుగు వికెట్లు తీసి భారత్ విజయానికి బాటలు వేశాడని అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఇక న్యూజిలాండ్తో మూడో లీగ్ మ్యాచ్ శుక్రవారం జరుగనుంది. 41లో ఎక్స్ట్రాలే 19.. జపాన్ బ్యాట్స్మెన్లో ఐదుగురు డకౌట్ కాగా.. వారిలో ఇద్దరు గోల్టెన్ డక్గా వెనుదిరగడం విశేషం. మిగిలిన ఐదుగురిలో ఇద్దరు ఒక పరుగు మాత్రమే చేసి ఔట్ కాగా.. ముగ్గురు 7, 7, 5 పరుగులతో వికెట్ సమర్పించుకున్నారు. ఇక ఈ జపాన్ ఇన్నింగ్స్లో ఎనిమిదో వికెట్కు నమోదైన 13 పరుగుల భాగస్వామ్యమే అత్యధికం కావడం విశేషం. జపాన్ జట్టు సాధించిన 41 పరుగుల్లో 19 పరుగులు ఎక్స్ట్రాల రూపంలో వచ్చినవే కావడం మరో విశేషం. (చదవండి : యువ భారత్ శుభారంభం) -
ఐదుగురు డకౌట్.. 41 పరుగులకే ఆలౌట్
బ్లోమ్ఫొంటెన్: అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో తొలిసారిగా ఆడుతున్న జపాన్ జట్టు అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. మంగళవారం డిఫెండింగ్ చాంపియన్ భారత్తో జరుగుతున్న మ్యాచ్లో ఆ జట్టు 22.5 ఓవర్లలో 41 పరుగులకే ఆలౌటయింది. దీంతో అండర్–19 వరల్డ్కప్ చరిత్రలో సంయుక్తంగా రెండో అతి తక్కువ పరుగుల రికార్డును నమోదు చేసింది. 2002 అండర్–19 వరల్డ్ కప్లో కెనడా, 2008లో బంగ్లాదేశ్ 41 పరుగులకు ఆలౌట్ కాగా, 2004లో స్కాట్లాండ్ జట్టు 22 పరుగులకే ఆలౌట్ అయి మొదటి స్థానంలో నిలిచింది. ఇలా వచ్చి అలా.. అందరూ అంతే.. టాస్ గెలిచిన యువభారత్ కెప్టెన్ ప్రియం గార్గ్ జపాన్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. అసలే క్రికెట్లో కూనలైన జపాన్ ఆటగాళ్లు ఏ దశలోనూ భారత బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కోలేదు. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ క్రీజులోకి వచ్చీరాగానే పెవిలియన్కు క్యూ కట్టారు. ఐదో ఓవర్లో ఓపెనర్ (కెప్టెన్) మార్కస్ థర్గేట్ వికెట్తతో మొదలైన పతనం.. 22వ ఓవర్ వచ్చే సరికి పూర్తయింది. ఐదో ఓవర్లో రెండు వికెట్లు, ఏడో ఓవర్లో రెండు వికెట్లు, పదో ఓవర్లో రెండు వికెట్లను జపాన్ జట్టు కోల్పోయింది. మిగతా నాలుగు వికెట్లను 11, 17, 20, 22 ఓవర్లలో సమర్పించుకున్న జపాన్.. ప్రత్యర్థి ముందు మోకరిల్లింది. రవి భిష్నోయ్ 4, కార్తిక్ త్యాగి 3, ఆకాశ్ సింగ్ 2, విద్యాధర్ పాటిల్ ఒక వికెట్ సాధించారు. (చదవండి : యువ భారత్ శుభారంభం) డక్.. లేదంటే గోల్డెన్ డక్.. జపాన్ బ్యాట్స్మెన్లో ఐదుగురు డకౌట్ కాగా.. వారిలో ఇద్దరు గోల్టెన్ డక్గా వెనుదిరగడం విశేషం. మిగిలిన ఐదుగురిలో ఇద్దరు ఒక పరుగు మాత్రమే చేసి ఔట్ కాగా.. ముగ్గురు 7, 7, 5 పరుగులతో వికెట్ సమర్పించుకున్నారు. ఇక ఈ జపాన్ ఇన్నింగ్స్లో ఎనిమిదో వికెట్కు నమోదైన 13 పరుగుల భాగస్వామ్యమే అత్యధికం కావడం విశేషం. జపాన్ జట్టు సాధించిన 41 పరుగుల్లో 19 పరుగులు ఎక్స్ట్రాల రూపంలో వచ్చినవే కావడం మరో విశేషం. ఇదిలాఉండగా.. శ్రీలంక జరిగిన తొలి మ్యాచ్లో యువభారత్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
సఫారీకి అఫ్గాన్ షాక్
కింబర్లీ: ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టుకు అండర్ –19 ప్రపంచ కప్ తొలి రోజు, తొలి మ్యాచ్లోనే చుక్కెదురైంది. అఫ్గానిస్తాన్ స్పిన్నర్ షఫీక్ఉల్లా గఫారీ (6/15) మాయాజాలానికి దక్షిణాఫ్రికా ఓటమి చవిచూసింది. గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో గఫారి ధాటికి దక్షిణాఫ్రికా 29.1 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 62/2తో నిలకడగా ఆడుతున్నట్లు కనిపించిన దక్షిణాఫ్రికా జట్టును గఫారీ తన లెగ్ బ్రేక్తో తిప్పేశాడు. దాంతో దక్షిణాఫ్రికా చివరి 8 వికెట్లను 67 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. అనంతరం అఫ్గాన్ 25 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసి ఏడు వికెట్లతో గెలుపొందింది. ఇబ్రహీమ్ జద్రాన్ (52; 8 ఫోర్లు), ఇమ్రాన్ (57; 9 ఫోర్లు) జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ మ్యాచ్’ అవార్డును గఫారీ అందుకున్నాడు. -
శుబ్మన్ అజేయ సెంచరీ
న్యూఢిల్లీ: అండర్–19 వరల్డ్ కప్లో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన యువ ఆటగాడు శుబ్మన్ గిల్ (111 బంతుల్లో 106 నాటౌట్; ఫోర్లు, 3 సిక్స్లు) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ ‘సి’ జట్టు దేవధర్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ టోర్నీలో నమోదైన తొలి సెంచరీ ఇదే కావడం విశేషం. గురువారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ ‘ఎ’పై 6 వికెట్ల తేడాతో ‘సి’ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ‘ఎ’ జట్టు అభిమన్యు ఈశ్వరన్ (69; 5 ఫోర్లు), నితీశ్ రాణా (68; 6 ఫోర్లు, 1 సిక్స్), అన్మోల్ప్రీత్ సింగ్ (59; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో ఆకట్టుకోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 32; 4 ఫోర్లు), కేదార్ జాదవ్ (25 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) వేగంగా పరుగులు రాబట్టడంతో చివరి 10 ఓవర్లలో 92 పరుగులు వచ్చాయి. ప్రత్యర్థి బౌలర్లలో విజయ్ శంకర్ 3, చహర్ 2, గుర్బాని ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ ‘సి’ 47 ఓవర్లలో 4 వికెట్లకు 296 పరుగులు చేసి విజయాన్నందుకుంది. లక్ష్యఛేదనలో 85 పరుగులకే కెప్టెన్ రహానే (14), అభినవ్ ముకుంద్ (37; 6 ఫోర్లు), సురేశ్ రైనా (2) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ‘సి’ జట్టును శుబ్మన్ గిల్ ఆదుకున్నాడు. ఇషాన్ కిషన్ (60 బంతుల్లో 69; 11 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్కు 121, సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్లు)తో కలిసి అభేద్యమైన ఐదో వికెట్కు 90 పరుగులు జోడించి జట్టును గెలిపించాడు. విజయానికి 5 ఓవర్లలో 27 పరుగులు అవసరమైన దశలో శుబ్మన్, సూర్యకుమార్ యాదవ్ ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడటంతో మరో మూడు ఓవర్లు మిగిలుండగానే ‘సి’ జట్టు గెలుపొందింది. అశ్విన్, ధవల్ కులకర్ణి, ములాని తలా ఓ వికెట్ పడగొట్టారు. సిరాజ్ నిరాశ పరిచాడు. మూడు ఓవర్లు వేసి 32 పరుగులిచ్చాడు. శనివారం జరిగే ఫైనల్లో భారత్ ‘బి’తో ‘సి’ జట్టు తలపడనుంది. -
సచిన్తో పోలిక మొదలు
న్యూఢిల్లీ: యువ సంచలనం పృథ్వీ షా సత్తా గురించి రెండేళ్లుగా అనేక వ్యాఖ్యానాలు! అతడు భారత జట్టుకు ఆడటం ఖాయమంటూ విశ్లేషణలు! దేశవాళీల్లోనూ అదరగొట్టడంతో తనపై మరిన్ని అంచనాలు! ఈ ఏడాది అండర్–19 ప్రపంచ కప్ గెలిచిన జట్టు సారథిగా ఎన్నో ఆశలు! వీటన్నిటికి తోడుగా సీనియర్ స్థాయిలో పృథ్వీ ఎలా రాణిస్తాడో అనే అనుమానాలు! ఇన్ని లెక్కల మధ్య, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లుండే ఐపీఎల్లో అడుగు పెట్టిన షా... అద్భుత షాట్లతో ఆకట్టుకుంటున్నాడు. దీంతో అతడి ఆటతీరును దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్తో పోల్చడం మొదలైంది. అచ్చం అతడిలాగే... సచిన్లానే 14 ఏళ్ల వయసులో స్కూల్ క్రికెట్లో అదరగొట్టిన పృథ్వీ, ఆ దిగ్గజ క్రికెటర్ తరహాలోనే అరంగేట్ర రంజీ, దులీప్ ట్రోఫీ మ్యాచ్ల్లోనూ శతకాల మోత మోగించాడు. ఇప్పుడిక ఈ ఐపీఎల్లో మూడు మ్యాచ్లాడిన అతడు 166.67 స్ట్రైక్ రేట్తో 140 పరుగులు చేశాడు. మొత్తం ఎదుర్కొన్న 84 బం తుల్లో ఐదింటిని మాత్రమే అడ్డదిడ్డంగా ఆడాడు. కవర్ డ్రైవ్ల తో 23 పరుగులు, ఆఫ్డ్రైవ్లతో 27 పరుగులు చేశాడు. 13 కట్ షాట్లు, 9 పుల్ షాట్లు సైతం కొట్టాడు. మేటి బ్యాట్స్మన్ తరహాలో పుల్ సహా అన్ని రకాల షాట్లు ఆడుతున్నాడు. దీంతో పృథ్వీ సాంకేతికత, స్టాన్స్, షాట్లు కొట్టే విధం అచ్చం సచిన్ను తలపిస్తోందని ఆసీస్ మేటి క్రికెటర్ మార్క్ వా అంటున్నాడు. ‘షా బ్యాట్ పట్టుకునే విధానం, క్రీజులో కదిలే తీరు, వికెట్కు ఇరువైపులా షాట్లు కొట్టే సామర్థ్యం గమనించండి. అతడు బంతిని కొంత ఆలస్యంగా ఆడతాడు. కానీ ఆ స్ట్రోక్ ప్లే అద్భుతం. సచిన్లానే ఎలాంటి బౌలర్నైనా ఎదుర్కోగల సత్తా తనకుంది’ అంటూ మార్క్ కొనియాడాడు. మరికొందరు బ్యాక్ లిఫ్ట్ ఆడటంలో బ్రయాన్ లారాను, కవర్ డ్రైవ్లో విరాట్ కోహ్లిని మరిపిస్తున్నాడని పేర్కొంటున్నారు. యార్కర్ బంతులకు నిలిచి, డెత్ ఓవర్లలోనూ పరుగులు సాధించడం వంటి సవాళ్లను ఎదుర్కొంటే తిరుగుండదని చెబుతున్నారు. -
బీసీసీఐ నజరానాపై ద్రవిడ్ అసహనం
సాక్షి, ముంబై : అండర్-19 ప్రపంచకప్ గెలవడంతో భారత జట్టులోని ఆటగాళ్లతో పాటు కోచ్ ద్రవిడ్, సహాయక సిబ్బందికి బీసీసీఐ నజరానా ప్రకటించింది. ఈ నజరానాపై కోచ్ రాహుల్ ద్రవిడ్ అసహనం వ్యక్తం చేశాడు. గత శనివారం బీసీసీఐ జట్టులోని ఒక్కో ఆటగాడికి రూ.30 లక్షలు, కోచ్ ద్రవిడ్కు రూ.50లక్షలు, ఒక్కో సహాయక సిబ్బందికి రూ. 20 లక్షలు ప్రోత్సాహకంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తనకు రూ.50 లక్షలు ప్రకటించి ఇతర సహాయక సిబ్బందికి రూ.20 లక్షలు ప్రకటించడంపై ద్రవిడ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అందరూ సమిష్టిగా కృషి చేస్తేనే విజయం వరించందని, అలాంటప్పుడు నజరానా విషయంలో బీసీసీఐ వ్యత్యాసం ఎందుకు చూపించిందో అర్ధం కావడం లేదన్నాడు. తానేమి వారికంటే ఎక్కువ కష్టపడలేదని అందరికి సమాన స్థాయిలో నజరానా ప్రకటిస్తే బాగుండేదని ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. మరి ద్రవిడ్ వ్యాఖ్యలను బీసీసీఐ పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి. -
ఆ ఘనత అంతా యువరాజ్దే..!
ముంబై : అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో రాణించడానికి భారత సీనియర్ క్రికెటర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగే కారణమని యువ ఆటగాడు శుభ్మన్గిల్ అభిప్రాయపడ్డాడు. అండర్-19 ప్రపంచకప్ గెలుచుకుని స్వదేశానికి చేరుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. ‘ఈ టోర్నీలో అద్భుతంగా రాణించానంటే ఆ ఘనత మొత్తం యువరాజ్ సింగ్దే.ఈ పర్యటనకు ముందు బెంగళూరు నేషనల్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాం. సిక్సర్ల కింగ్ ఒక రోజు అక్కడికి వచ్చి మాతో ముచ్చటించారు. బ్యాటింగ్లోని మెళుకువలు, సలహాలను తెలియజేశాడు. టోర్నీలోని మ్యాచ్ పరిస్థితుల గురించి కోన్ని సూచనలు చేశాడు. యూవీ పాజీ ఇచ్చిన ప్రేరణ ఎంతగానో మాకు సహకరించింది. ఈ మెగా టోర్నీలో నేను చాలా బాగా ఆడానంటే ఆ క్రెడిట్ మొత్తం యువరాజ్కే దక్కుతుంది’ అని గిల్ చెప్పుకొచ్చాడు. సెమీస్ సెంచరీపై స్పందిస్తూ.. పాకిస్తాన్తో జరిగిన సెమీఫైనల్లో సాధించిన సెంచరీపై స్పందిస్తూ.. ‘ నిజానికి ఆ మ్యాచ్లో మేం ఒత్తిడికి గురయ్యాం. ఓపెనర్ల నుంచి మాకు మంచి శుభారంభం అందినప్పటికి అనంతరం త్వరగా వికెట్లు కోల్పోయాం. అప్పడు కోచ్ రాహుల్ ద్రవిడ్ నాలో కొంత ధైర్యాన్ని నింపాడు. మ్యాచ్ చివర వరకు క్రీజులోనే ఉండలాని సూచించాడు. ఆ సమయంలో అనుకుల్ రాయ్ నుంచి కూడా మంచి మద్దతు లభించింది. కోచ్ చెప్పినట్లు ఆడి సెంచరీ సాధించనని’ పంజాబ్ ఆటగాడు చెప్పుకొచ్చాడు. ఈ టోర్నిలో శుభ్మన్ మూడు అర్థ సెంచరీలు, ఒక సెంచరీతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో రాణించి అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నాడు. అంతేగాకుండా ఐపీఎల్-11 సీజన్ వేలంలోఈ పంజాబ్ కుర్రాడిని కోల్కతా నైట్ రైడర్స్ రూ. 1.8 కోట్లకు సొంతం చేసుంది. ఐపీఎల్లో సైతం ఈ తరహా ప్రదర్శన కనబరుస్తానని ధీమా వ్యక్తం చేశాడు. -
ప్రపంచకప్ విజేతలకు ఘన స్వాగతం
-
ప్రపంచకప్ విజేతలకు ఘన స్వాగతం
సాక్షి, ముంబై : న్యూజిలాండ్ వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో అదరగొట్టి ట్రోఫీని సొంత చేసుకున్న భారత కుర్రాళ్లు సోమవారం స్వదేశానికి చేరారు. వీరికి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పృథ్వీషా నేతృత్వంలోని యువ జట్టు భారత్కు నాలుగోటైటిల్ అందించిన విషయం తెలిసిందే. యువ క్రికెటర్లకు స్వాగతం పలికేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ముంబై అంతర్జాతీయ విమానం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతూ.. సమిష్టి కృషి వల్లే ప్రపంచకప్ సాధించామన్నారు. అందరూ బాగా రాణించడంతో మా కష్టానికి ఫలితం దక్కిందని, యువ క్రికెటర్లకు మంచి భవిష్యత్ ఉందని కితాబిచ్చారు. -
‘మ్యాన్ ఆఫ్ ది టోర్నీ’ కుర్రాళ్లంతా స్టార్ క్రికెటర్లే!
సాక్షి, స్పోర్ట్స్ : అండర్-19 ప్రపంచకప్ భవిష్యత్తు క్రికెటర్లను తీర్చిదిద్దే టోర్నీ. ఆస్ట్రేలియా వేదికగా 1998లో యూత్ వరల్డ్కప్గా ప్రారంభమైన ఈ టోర్నీలో భారత్ 4 ట్రోఫీలందుకొని ప్రథమ స్థానంలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఈ టోర్నీ ద్వారా అనేక మంది కుర్రాళ్లు అంతర్జాతీయ క్రికెట్లో గుర్తింపు సాధించారు. ప్రతిభ కనభర్చిన ప్రతి ఒక్కరికి అవకాశం రాకున్నా మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన ప్రతి కుర్రాడు స్టార్ క్రికెటర్గా ఎదిగాడు. గత 18 ఏళ్లుగా ఈ టోర్నీ రికార్డులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. 2000 సంవత్సరంలో జరిగిన అండర్-19 ప్రపంచకప్లో మహ్మద్ కైఫ్ కెప్టెన్సీలో భారత్ తొలి ప్రపంచకప్ సాధించగా యువరాజ్ మ్యాన్ఆఫ్ దిసిరీస్ అందుకున్నాడు. అనంతరం యువరాజ్ స్టార్ క్రికెటర్గా ఎదిగాడు. భారత్ అందుకున్న టీ20 వరల్డ్కప్లో కీలక పాత్ర పోషించగా 2011 ప్రపంచకప్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. 2002లో జింబాంబ్వే స్టార్ క్రికెటర్ టాటెండా టైబు మ్యాన్ ఆఫ్ దిసిరీస్ అందుకున్నాడు. 2004లో ప్రస్తుత టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. 2006లో ప్రస్తుత టీమిండియా నయావాల్, టెస్టు స్పెషలిస్టు చతేశ్వరా పుజారా ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. 2008లో న్యూజిలాండ్ ఆల్రౌండర్ టిమ్ సౌతి, 2010లో దక్షిణాఫ్రికా ఆటగాడు హెన్రిక్స్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్లందుకున్నారు. 2012లో ఆస్ట్రేలియా క్రికెటర్ విలియమ్ బోసిస్టో అందుకోగా 2014లో ప్రస్తుత దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ మార్క్రమ్ మ్యాన్ ఆఫ్ టోర్నీగా నిలిచాడు. 2016లో బంగ్లాదేశ్ క్రికెటర్ మెహిదీ హసన్ ఈ ఘనతను సోంతం చేసుకున్నాడు. ఇక 2018లో భారత యువకెరటం శుభ్మన్ గిల్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ రికార్డుల నేపథ్యంలో శుభ్మన్ సైతం త్వరలోనే భారత సీనియర్ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం ఉంది.