Assembly meetings
-
అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు బుధవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు నందినగర్లోని నివాసం నుంచి కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరారు. ఆయన వెంట పార్టీ నేతలు జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి రాగా, ఇంటి వద్ద కార్యకర్తలు కొబ్బరికాయలు కొట్టి వాహనంపై గులా బీ పూలు చల్లారు. సభ ప్రారంభానికి అరగంట ముందే అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మండలిలో ప్రతిపక్ష నేత ఎస్.మధుసూదనాచారి, హరీశ్రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగ తం పలికారు. గంగుల కమలాకర్, కేపీ వివేకానంద్, తాతా మధు, నవీన్కుమార్రెడ్డి కేసీఆర్కు పుష్పగుచ్ఛాలు అందజేశారు. శాసనసభ లాబీలో తన కు కేటాయించిన చాంబర్లో అరగంట పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్లో చేరిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తన తమ్ముడి కుమారుడి వివాహానికి రావాల్సిందిగా కేసీఆర్ను ఆహ్వానిస్తూ శుభలేఖ అందజేశారు. అశ్వారావుపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కూడా కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీ సమావేశాలు ఉదయం 11కి ప్రారంభం కాగా, 5 నిమిషాల ముందే పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కేసీఆర్ సభలోకి వెళ్లారు. గవర్నర్ ప్రసంగం ముగిశాక సభ వాయిదా పడగానే అసెంబ్లీ నుంచి కేసీఆర్ తిరిగి నందినగర్ నివాసానికి వెళ్లిపోయారు. కేసీఆర్ను కలిసిన మంత్రి తుమ్మల శాసనసభకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిశారు. ఆయన యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. కేసీఆర్ కూడా మంత్రి తుమ్మల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
ఏపీ అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ తో అబద్ధాలు చెప్పించిన చంద్రబాబు
-
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సర్వే ఇది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియ పూర్తయిందని మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఈ నెల 4న ఈ సర్వే నివేదికను రాష్ట్ర కేబినెట్కు అందిస్తామని, ఆ రోజున ఉదయం 10 గంటలకు కేబినెట్ భేటీ అయి నివేదికపై చర్చిస్తుందని వెల్లడించారు. అదే రోజున అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీలో నివేదికపై చర్చిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ‘సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే’పై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్తోపాటు కో–చైర్మన్ దామోదర రాజనర్సింహ, సభ్యులు పొన్నం ప్రభాకర్, సీతక్క తదితరులు ఆదివారం సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.దేశంలో ఎక్కడా లేనంత కచ్చితంగా..రాష్ట్ర ప్రభుత్వం యాభై రోజుల్లోనే 96.9 శాతం కచ్చితత్వంతో సమగ్ర సర్వే నిర్వహించి రికార్డు సృష్టించిందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. దేశంలో ఎక్కడా ఇంతటి కచ్చితత్వంతో సర్వే జరగలేదన్నారు. 2023 అసెంబ్లీ ఎన్ని కల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చి న హామీ మేరకు ఈ సర్వే చేపట్టామని తెలిపారు. ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సర్వేకు సంబంధించి ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, నోడల్ అధికారి అనుదీప్ దురిశెట్టి తదితరులు ఆదివారం మంత్రివర్గ ఉపసంఘానికి సర్వే నివేదిక సమర్పించారని వెల్లడించారు.సంక్షేమ కార్యక్రమాల కోసంరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తోందని ఉత్తమ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ఈ సర్వే వివరాలను వినియోగించుకుంటామని తెలిపారు. ఇది కేవలం డేటా సేకరణ ప్రక్రియ మాత్రమే కాదని, సామాజిక న్యాయ విప్లవమని వ్యాఖ్యానించారు. సర్వేపై తప్పుడు ప్రచారాలు, హైకోర్టులో పిల్లు వేయడం వంటి సమస్యలు ఎదురయ్యాయని చెప్పారు. కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునివ్వడంతో సర్వే సమగ్రంగా కొనసాగిందని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించేలా అధికార యంత్రాంగం వివిధ కార్యక్రమాలు నిర్వహించి.. సర్వేను విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పారు. సర్వేలో పాల్గొన్న ప్రతి అధికారి, సిబ్బందికి మంత్రివర్గ ఉపసంఘం అభినందనలు తెలుపుతోందన్నారు. రాష్ట్ర చరిత్రలో మైలురాయిసమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే రాష్ట్ర చరిత్రలో మైలురాయి అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వంపై నమ్మకాన్ని ప్రదర్శిస్తూ సర్వేలో పాలు పంచుకున్నారని తెలిపారు. కొందరు ఉద్దేశపూర్వకంగా సర్వేను అడ్డుకునేందుకు తప్పుడు ప్రచారం చేశారని, వాటిని ప్రజలు తిప్పికొట్టారని పేర్కొన్నారు. ఈ సర్వే సామాజిక న్యాయాన్ని నిర్ధారించడంలో నిబద్ధతతో కూడిన ప్రయత్నమని మంత్రి దామోదర రాజనర్సింహ అభివర్ణించారు. ఇలాంటి సర్వేలు దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రణాళిక శాఖ ము ఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, ఇతర అధికారులు పాల్గొన్నారు.రేపు అసెంబ్లీ సమావేశంసాక్షి, హైదరాబాద్: ఈ నెల 4వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర అసెంబ్లీ సమావేశం కానుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ఆదేశాల మేరకు ఈ భేటీ జరుగుతోందని పేర్కొంటూ.. శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు ఆదివారం బులెటిన్ విడుదల చేశారు. -
అసెంబ్లీలో రేవంత్ సర్కార్ను నిలదీస్తాం: కేటీఆర్
సాక్షి, సిద్ధిపేట: రైతుల తరపున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదిస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గురుకులాల్లో ఉన్న దుర్భర పరిస్థితులపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఓ రిపోర్ట్ ఇచ్చామన్నారు. రైతులపై దాడి చేస్తూ భూములు లాక్కుంటూ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే అడ్డుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు.‘‘మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. అత్యంత మూర్ఖంగా, అనాలోచితంగా చరిత్ర గురించి తెలియకుండా ఏర్పాటు చేస్తున్న విగ్రహం గురించి పోట్లాడతాం. మోసాలు, అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోపై నిలదీస్తాం. రాష్ట్ర ప్రజల గొంతుకై తెలంగాణ సమస్యలపై అసెంబ్లీలో పోరాడతాం. అరకొరగా రుణమాఫీ చేశారు. కొనుగోలు కేంద్రాలు సరిగా నడపలేని పరిస్థితి. విజయోత్సవాల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మరోసారి మోసం చేస్తోంది ’’ అని కేటీఆర్ దుయ్యబట్టారు.రేపటి నుంచి (సోమవారం) నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో నేడు బీఆర్ఎస్ శాసనసభా పక్ష భేటీ జరిగింది. ఎర్రవల్లి నివాసంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కొందరు ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. సుమారు వారం రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు, ఏడాదిలో రేవంత్ ప్రభుత్వ పాలన వైఫల్యాలతో పాటు ప్రజా సమస్యలను ప్రస్తావించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు సోమవారం బీఏసీ సమావేశంలో ప్రతిపాదించే ఎజెండా ఆధారంగా తమ వ్యూహానికి పదును పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. -
డ్రైవర్ లేని కారులా ‘జీరో అవర్’
సాక్షి, అమరావతి: ‘జీరో అవర్.. డ్రైవర్లేని కారులా ఉంది.. సభ్యులు ప్రస్తావించే సమస్యలు ఎవరు రాసుకుంటున్నారో... ఎవరు చర్యలు తీసుకుంటున్నారో తెలియడం లేదు..’ అని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్ను ఉద్దేశించి రవికుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చను వేడెక్కించాయి. దీనిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందిస్తూ నిండు సభలో అసత్యాలు మాట్లాడొద్దని రవికుమార్కు హితవు పలికారు. కొండవీటి వాగుపై బ్రిడ్జి కట్టాలి అమరావతికి కొండవీటి వాగు పెద్ద సమస్యగా మారింది. 2014–19 మధ్య దీనిపై బ్రిడ్జి మంజూరు చేశారు. కానీ కట్టలేదు. ఈ వాగు పొంగితే రాకపోకలు నిలిచిపోతున్నాయి. తక్షణమే బ్రిడ్జి కట్టాలి. అలాగే కోటేరు వాగుపై కూడా బ్రిడ్జి నిరి్మంచేలా చర్యలు చేపట్టాలి. – తెనాలి శ్రావణ్కుమార్, తాడికొండ ఎమ్మెల్యే ఏపీఎస్పీ పోలీసులకు పదోన్నతుల్లేవ్ ఏపీఎస్పీ పోలీసులు ఏళ్ల తరబడి పదోన్నతులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. సివిల్ పోలీసులుగా కన్వర్షన్ చేయాలని దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి కన్వర్షన్ అయినా ఇవ్వండి... లేకుంటే పదోన్నతులు, ఇంక్రిమెంట్లయినా ఇప్పించండి. – పెన్మెత్స విష్ణుకుమార్రాజు, ఎమ్మెల్యే, విశాఖ ఉత్తరం తుంగభద్ర 33 గేట్లు మార్చాలి 75 ఏళ్ల చరిత్రగల తుంగభద్ర ఈ ఏడాది నీటితో కళకళలాడుతోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తుంగభద్ర డ్యాం 33 గేట్లు మార్చాలని సిఫారసు చేసింది. ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చవుతుంది. ఈ ఖర్చును ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు భరించాలి. – కాలవ శ్రీనివాసులు, రాయదుర్గం ఎమ్మెల్యే లో వోల్టేజీ సమస్య పరిష్కరించండి విద్యుత్ లో వోల్టేజీ సమస్య తీవ్రంగా ఉంది. ఈ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తగిన చర్యలు తీసుకుని లోవోల్టేజీ సమస్య పరిష్కరించాలి. – పూసపాటి అదితి, ఎమ్మెల్యే, విజయనగరం -
AP: 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11నుంచి జరగనున్నాయి. 11న ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశమవుతాయని శాసన వ్యవహారాల కార్యదర్శి సోమవారం రెండు నోటిఫికేషన్లు జారీ చేశారు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు దాటినా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. 2024–25 సంవత్సరానికి సంబంధించి గత ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టింది.జూన్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నా.. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను పొడిగిస్తూ ఆర్డినెన్స్ ఇచ్చింది. దాని గడువు నవంబర్తో ముగుస్తుండటంతో అనివార్యంగా ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి. ఇందుకోసం ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనుంది. ఈ ఆర్థిక ఏడాదిలో మిగతా నాలుగు నెలలే మిగిలి ఉండటంతో ఆ కాలానికే పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. 10 రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. -
రేపు ఉభయసభల్లో వార్షిక బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీ వరకు జరగనున్నాయి. 25న శాసనసభ, శాసనమండలిలో 2024.25 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అధ్యక్షతన మంగళవారం జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన శాసనసభ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపం ప్రకటించిన అనంతరం వాయిదా పడింది. ఆ తర్వాత స్పీకర్ చాంబర్లో జరిగిన బీఏసీ సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్తోపాటు ప్రభుత్వ విప్లు లక్ష్మణ్కుమార్, రామచంద్రునాయక్ హాజరయ్యారు. విపక్షం నుంచి బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రులు టి.హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్రెడ్డి, సీపీఐ నుంచి కూనమనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ అసెంబ్లీలో తాము చర్చించదలిచిన అంశాల జాబితాను అందజేశాయి. పక్షంరోజులు సభ నిర్వహించాలని బీఆర్ఎస్, కనీసం 18 రోజులు సమావేశాలు జరగాలని బీజేపీ కోరాయి. అయితే గతంలో బడ్జెట్ జరిగిన సమావేశాల తీరుతెన్నులను వివరిస్తూ ఈ నెల 31 వరకు సభ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై బీఆర్ఎస్, బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసినా, ఈ నెల 31 వరకు సభ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే రోజూవారీ ఎజెండాపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్, బీజేపీ కోరాయి. అయితే ఎజెండాపై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని ప్రభుత్వ పక్షం ప్రకటించింది. మొదట తెలంగాణకు కేటాయింపులు లేకపోవడంపై తీర్మానం బీఏసీలో నిర్ణయించిన మేరకు బుధవారం ఉద యం 10 గంటలకు ప్రారంభమయ్యే శాసనసభలో ప్రశ్నోత్తరాల అనంతరం కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు లేకపోవడంపై తీర్మానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై చర్చించి కేంద్రానికి తీర్మానం పంపుతారు. అనంతరం రుణమాపీ అంశంపైనా స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశముంది. ప్రశ్నోత్తరాల్లో భాగంగా పాఠశాల బస్సుల ఫిట్నెస్, గ్రామపంచాయతీలుగా తండాలు, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ సిబ్బంది, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వంటి అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. ఈ నెల 25న ఉదయం 11 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి డి.శ్రీధర్బాబు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ నెల 26న అసెంబ్లీకి విరామం ప్రకటించి.. తిరిగి 27న బడ్జెట్పై చర్చ ప్రారంభమవుతుంది. 28న సమావేశాలకు విరామం ప్రకటించి తిరిగి 29 నుంచి 31వ తేదీ వరకు మూడు రోజుల పాటు బడ్జెట్పై చర్చ కొనసాగుతుంది. చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించిన తర్వాత అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడుతుంది. కాగా శాసనమండలిలోనూ మంగళవారం చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అధ్యక్షతన మండలి బీఏసీ సమావేశం జరిగింది. -
ఈ తీర్మానం ప్రవేశపెడుతున్నందుకు చింతిస్తున్నా..
సాక్షి, హైదరాబాద్: ‘అత్యంత చిన్న వయసులోనే జీహెచ్ఎంసీ కార్పొరేటర్గా ఎన్నికవ్వడం... ఆ తర్వాత కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం తీవ్రంగా కలిచివేసింది. ఆమె మరణం నేపథ్యంలో అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెడుతున్నందుకు చింతిస్తున్నాను’అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. 2024–25 వార్షిక బడ్జెట్కు సంబంధించి ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టగా, ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్న క్రమంలో మంగళవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సమావేశంలో భాగంగా సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టాలని స్పీకర్ జి.ప్రసాద్కుమార్ సూచించగా...సీఎం రేవంత్రెడ్డి లాస్య నందిత సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కంటోన్మెంట్ నుంచి ఐదుసార్లు గెలుపొందిన సాయన్న తనకు అత్యంత సన్నిహితుడన్నారు. అనారోగ్య కారణాలతో గతేడాది ఆయన మరణించగా... ఆయన వారసురాలిగా లాస్య కంటోన్మెంట్ నుంచి గెలుపొందారని, గత ఫిబ్రవరి 23న జరిగిన ప్రమాదంలో ఆమె మరణించడం బాధాకరమని చెప్పారు. సాయన్న, లాస్య నందిత ఇద్దరూ గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి, కంటోన్మెంట్ ప్రజల కోసం ఎంతో కృషి చేశారన్నారు. లాస్య కుటుంబానికి అండగా ఉంటాం: కేటీఆర్ లాస్య నందిత ఎమ్మెల్యేగా గెలిచిన మూడు నెలలకే రోడ్డు ప్రమాదంలో మరణించడం పార్టీకి తీరని లోటు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జి.సాయన్న అజాతశత్రువన్నారు. ఎమ్మెల్యే ముఠాగోపాల్, సాయన్న మంచి మిత్రులని, వారిద్దరూ కలిసి వచ్చి లాస్య నందితకు కార్పొరేటర్గా అవకాశం కల్పించాలని కేసీఆర్ను కోరగా, వెంటనే ఆమెకు టికెట్ ఇచ్చారన్నారు. ఎన్నికల్లో విజయపథంలో ముందుగా సాగిన లాస్య నందితను విధి వెంటాడిందన్నారు. నల్లగొండలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశ అనంతరం ఒక ప్రమాదం ముంచుకొచి్చందని, అక్కడ్నుంచి స్వల్ప గాయాలతో బయటపడిన ఆమె... కొన్నాళ్లకు ఇంట్లో లిఫ్ట్ ప్రమాదం బారిన పడ్డారని, రెండింటి నుంచి బయటపడినా, ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదం నుంచి తప్పించుకోలేక పోయిందని చెప్పారు. » రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు మాట్లాడుతూ లాస్య నందిత కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు. » రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ లాస్య నందిత రోడ్డు ప్రమాదానికి గురైనట్టు తెలియగానే సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో వెంటనే వారి ఇంటిని చేరుకున్నానని, అక్కడి పరిస్థితిని సమీక్షించి అధికారిక లాంఛనాలతో కార్యక్రమాలు చేపట్టామన్నారు. » బీజేపీ పక్షనేత మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ లాస్య ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పారు»ఎమ్మెల్యేలు బలాల, కూనంనేని సాంబశివరావు, తలసాని శ్రీనివాస్యాదవ్, సునీతాలక్ష్మారెడ్డి, రాజ్ ఠాకూర్, ముఠా గోపాల్, శ్రీగణేశ్, పాయల్ శంకర్, కేపీ.వివేకానంద, రాజశేఖర్రెడ్డి తదితరులు లాస్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. » లాస్య మృతికి సంతాప సూచకంగా సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. -
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ మూడో విడత సమావేశాలు ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. శాసనమండలి సమావేశాలు ఈ నెల 24న ఉదయం 10 గంటలకు మొదలవుతాయి. అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 3వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది. తొలిరోజు మంగళవారం ఉదయం స్పీకర్ ప్రసాద్కుమార్ అధ్యక్షతన సభ ప్రారంభమైన వెంటనే ఈ ఏడాది ఫిబ్రవరి 23న రోడ్డు ప్రమాదంలో మరణించిన దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పట్ల సభ సంతాపం ప్రకటించనుంది. ఈ సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రవేశపెడతారు.అలాగే ఇటీవలి కాలంలో మరణించిన పలువురు మాజీ ఎమ్మెల్యేలకు కూడా నివాళులరి్పంచనుంది. అనంతరం సభను 24వ తేదీ ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తారు. తర్వాత స్పీకర్ ప్రసాద్కుమార్ అధ్యక్షతన ఆయన ఛాంబర్లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో సభ ఎజెండా, సమావేశాలు ఎన్ని రోజులు జరిగేదీ ఖరారు చేయనున్నారు. 24న రైతు రుణమాఫీ అంశంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశముందని సమాచారం.ఇక 25న శాసనసభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు 2024–25 వార్షిక బడ్జెట్ను ప్రవేశ పెడతారు. 26న సమావేశాలకు విరామం ప్రకటిస్తారు. 27న బడ్జెట్ ప్రసంగంపై చర్చ ప్రారంభం అవుతుంది. బోనాల పండుగ నేపథ్యంలో 28, 29 తేదీల్లో మళ్లీ విరామం అనంతరం, ఈ నెల 30 నుంచి సమావేశాలు తిరిగి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో స్కిల్స్ యూనివర్సిటీతో పాటు పలు ప్రభుత్వ బిల్లులు సభ ముందుకు రానున్నాయి. 25న మంత్రివర్గ భేటీ: అసెంబ్లీలో ఈ నెల 25న రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడుతున్న నేపథ్యంలో అదే రోజు ఉదయం 9 గంటలకు మీటింగ్ హాల్లో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో బడ్జెట్ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఇప్పటివరకు రెండు విడతలుగత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. తొలి విడత సమావేశాలు డిసెంబర్ 9 నుంచి 21వ తేదీ వరకు 6 రోజుల పాటు, రెండో విడత ఫిబ్రవరి 9 నుంచి 17 తేదీల నడుమ 8 రోజుల పాటు జరిగాయి. తొలి విడత సమావేశాల్లో నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక జరిగింది. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించింది. ఇక ఫిబ్రవరిలో జరిగిన రెండో విడత సమావేశాల్లో 2024– 25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు సాగునీటి వనరులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. -
23 నుంచి అసెంబ్లీ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ మూడో విడత సమావేశాలు ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. శాసనమండలి సమావేశాలు మరుసటి రోజు 24న ఉదయం 10 గంటలకు మొదలవుతాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 23న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు మొదటి వారం వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. తొలిరోజు సభ.. దివంగత ఎమ్మెల్యే లాస్య నందితతో పాటు ఇటీవలి కాలంలో మరణించిన పలువురు మాజీ ఎమ్మెల్యేల మరణంపై సంతాపం ప్రకటించిన తర్వాత వాయిదా పడుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించిన విషయం తెలిసిందే. ఈ నెల 24న శాసనసభ, శాసన మండలి వేర్వేరుగా సమావేశమై సాధారణ బిజినెస్ను చేపట్టే అవకాశం ఉంది. అలాగే 25న ఉభయ సభల్లో రాష్ట్ర వార్షిక (2024–25) బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. 26న అసెంబ్లీ సమావేశాలకు విరామం ప్రకటించి 27న బడ్జెట్ ప్రసంగంపై చర్చ చేపడతారు. బోనాల పండుగ నేపథ్యంలో 28, 29 తేదీల్లో సభకు మరోసారి విరామం ప్రకటించి తిరిగి ఈ నెల 30 నుంచి సమావేశాలు కొనసాగించే అవకాశముంది. అయితే సభ ఎజెండా, ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై ఈ నెల 23న స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో నిర్ణయిస్తారు. గత ఏడాది డిసెంబర్లో తొలిసారిరాష్ట్రంలో గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో రేవంత్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. కాగా తొలి విడత అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9 నుంచి 21వ తేదీ వరకు 6 రోజుల పాటు జరిగాయి. ఇక రెండో విడత ఫిబ్రవరి 9 నుంచి 17వ తేదీ నడుమ 8 రోజుల పాటు జరిగాయి. తొలి విడత సమావేశాల్లో నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం తదితర అంశాలు చోటుచేసున్నాయి. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించింది. ఫిబ్రవరిలో జరిగిన రెండో విడత సమావేశాల్లో 2024– 25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు సాగునీటి వనరులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. అనర్హత కోసం బీఆర్ఎస్ పట్టు!పార్టీ మారిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ అసెంబ్లీ వేదికగా పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ మూడో శాసనసభ ఇప్పటివరకు రెండు విడతల్లో సమావేశం కాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ భేటీకి దూరంగా ఉన్నారు. అయితే వచ్చే బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ త్వరలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యే అవకాశముంది. బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన 10 మంది ఎమ్మెల్యేలు ఈసారి సమావేశాల సందర్భంగా అధికార పార్టీతో జట్టు కట్టడం ఆసక్తికరంగా మారనుంది. -
22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, విజయవాడ: ఈ నెల 22 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. శ్వేత ప్రతాలపైనా చర్చించనున్నారు. ఐదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. -
జాబ్ కేలండర్కు చట్టబద్ధత: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల జాబ్ కేలండర్కు చట్టబద్ధత కల్పించి, అసెంబ్లీలో జాబ్ కేలండర్ను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ప్రకటించారు. ఏటా మార్చి 31వ తేదీనాటికి ఖాళీ పోస్టుల వివరాలు తెప్పించుకుంటామని.. జూన్లో నోటిఫికేషన్లు ఇచ్చి, డిసెంబర్ 9వ తేదీ నాటికి ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. పదేళ్లుగా నోటిఫికేషన్లు లేక, ఉద్యోగాలు రాక నిరుద్యోగులు అన్యాయానికి గురయ్యారని.. ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తుంటే వాయిదా వేయా లంటూ కోచింగ్ సెంటర్ల యజమానులు, రాజకీయ నేతలు అభ్యర్థులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. శనివారం జేఎన్టీయూలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యజమానులతో ‘ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత’ అన్న అంశంపై సీఎం రేవంత్ ముఖాముఖి చర్చించారు. వివరాలు రేవంత్ మాటల్లోనే.. ‘‘రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయా లని కొందరు అంటున్నారు. పరీక్షలతో ఏమాత్రం సంబంధం లేనివారు దీక్షలు చేయడం వింత. ఇటీవల దీక్ష చేసిన ముగ్గురూ ఏ పరీక్ష కూడా రాయడం లేదు. ఒకరేమో కోచింగ్ సెంటర్ యజమాని. మరొ కరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పదవీ ఇవ్వలేదని ప్రభుత్వాన్ని గిల్లడమే పనిగా పెట్టుకున్నారు. గాందీలో దీక్ష చేసిన వ్యక్తి నాయకుడిగా ఎదగడానికి ఓ రాజకీయ నేత అండతో ఆందోళన చేశారు. గ్రూప్–1లో 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్కు ఎంపిక చేస్తే ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ ఎవరైనా కోర్టుకు వెళ్తే పరీక్షలు ఆగిపోతాయి. అందుకే నోటిఫికేషన్లో ఉన్న మేరకే పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీ ఉంటుంది. నిరుద్యోగుల కర్మాగారాలు కావొద్దు నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా ఇంజనీరింగ్ కాలేజీలు మారకూడదు. ప్రపంచంతోనే పోటీపడేలా ఇంజనీరింగ్ విద్యను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. నైపుణ్యం లేకుండా, కేవలం ఇంజనీరింగ్ పట్టాలిస్తే వారికి ఉద్యోగాలు రావు. తాత్కాలిక ఉద్యోగ, ఉపాధి మార్గాల కోసం కంప్యూటర్ కోర్సులను కాలేజీలు కావాలనుకోవడం సరికాదు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ వంటి కోర్సులను కనుమరుగు చేస్తే దేశానికే ప్రమాదం. ‘ఫీజు’ ఎప్పటికప్పుడు ఇస్తాం ఫీజు రీయింబర్స్మెంట్పై కాలేజీలు ఏమాత్రం దిగులు పడొద్దు. బకాయిలన్నీ వన్ టైం సెటిల్మెంట్గా ఇచ్చే యోచన చేస్తున్నాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచి్చన ఈ పథకాన్ని మరింత విజయవంతంగా నడిపిస్తాం. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ఏ ఏడాదికా ఏడాదిలో ఇచ్చేందుకు ప్రయత్నించాలని నిర్ణయించాం. సంక్షేమంపైనే దృష్టి పెట్టడం వల్ల కొన్నేళ్లుగా రాష్ట్రం ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటోంది. లోపాలను గుర్తించాలి పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా సాంకేతిక విద్య ఉండటం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసే నైపుణ్య యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. నైపుణ్యాభివృద్ధికి అవసరమైన కార్యాచరణ చేసే స్వేచ్ఛనిస్తున్నాం. విద్యలో ఉన్న లోపాలను గుర్తించి, మార్పు దిశగా అడుగులు వేసేలా చేస్తాం. ఈ దిశగా ముందుకొచ్చే సంస్థలకు చేయూతనిస్తాం. ఫార్మా రంగంలో పరిశోధనను ఎన్నో ఏళ్లుగా ప్రోత్సహించబట్టే కోవిడ్ వ్యాక్సిన్ తయారీకి హైదరాబాద్ కేంద్రమైంది. సాఫ్ట్వేర్ రంగంలోనూ ప్రతి పది మందిలో ఒకరు తెలుగు వాళ్లే ఉన్నారు. వచ్చే 20 ఏళ్లలో ఎంతో మంది సీఈవోలు ఉండబోతున్నారు. ఐటీఐల సిలబస్లో మార్పు దశాబ్దాల నాటి సిలబస్తో నడుస్తున్న ఐటీఐలకు ఉజ్వల భవిష్యత్ తెచ్చేందుకు ప్రణాళిక రూపొందించాం. రాష్ట్రంలోని 65 ఐటీఐలను టాటా సంస్థ తోడ్పాటుతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాలుగా మారుస్తున్నాం. ఈ పైలట్ ప్రాజెక్టు ఊహించని విధంగా అత్యాధునిక టెక్నాలజీని సొంతం చేసుకుంది. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలున్నా.. తగిన స్కిల్స్ లేకపోవడం వల్ల నిరుద్యోగం కనిపిస్తోంది. ఆఖరికి నిర్మాణ రంగంలోనూ ఇతర రాష్ట్రాల వాళ్లే ఉంటున్నారు. ఈ పరిస్థితి మారాలి. స్కిల్ పెంపుతోనే ఇది సాధ్యం.ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్లో లీడ్ పార్టనర్గా తెలంగాణ ఉండాలన్నది మా లక్ష్యం’’ అని రేవంత్రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. కాలేజీలకు సామాజిక కోణం అవసరం: శ్రీధర్బాబు ప్రైవేటు కాలేజీలు సామాజిక కోణంలో విద్యా వ్యవస్థ మార్పు కోసం కృషి చేయాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు కోరారు. పరిశ్రమల అవసరాలు, పరిశోధన, అభివృద్ధి దిశగా కొత్త కోర్సులను రూపొందించేందుకు ప్రయత్నాలు జరగాలన్నారు. ఏఐ గ్లోబల్ సమ్మిట్ను సెప్టెంబర్లో నిర్వహిస్తున్నామని.. తర్వాత 200 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తామని ప్రకటించారు. 2030 నాటికి ఐటీలో బెంగళూరును అధిగమించడమే తమ లక్ష్యమని చెప్పారు. -
మాకు ఆ గౌరవం ఏదీ? ప్రొటోకాల్పై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: తాము అత్యున్నత రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నా అధికారులు కనీసంప్రొటోకాల్ పాటించడం లేదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాల పర్యటనకు వెళ్తున్న సందర్భాల్లో ప్రొటోకాల్ నిబంధనల మేరకు తమను గౌరవించడం లేదన్నారు. శాసనసభ ప్రాంగణంలో మండలి చైర్మన్ గుత్తా, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నతాధికారులతో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రొటోకాల్ అంశంలో తాము ఎదుర్కొంటున్న సమస్యల జాబితాను వివరించారు. అనంతరం డీజీపీ జితేందర్, ఇతర పోలీసు ఉన్నతాధికారులతోనూ చైర్మన్, స్పీకర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ భేటీలో ప్రొటోకాల్ అంశంపై వీరిద్దరు ఉన్నతాధికారులను హెచ్చరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో జరిగిన భేటీలో పలు అంశాలను ప్రస్తావించారు. తమను గౌరవించాల్సిన తీరుపై కిందిస్థాయి అధికారులకు అర్థమయ్యే రీతిలో సందేశాలు, సంకేతాలివ్వాలని గుత్తా, గడ్డం ప్రసాద్ చెప్పారు. చైర్మన్, స్పీకర్ అభ్యంతరాలు ఇవే.. తాము జిల్లా పర్యటనకు వెళ్లిన సమయంలో కనీసం ఆర్డీఓ లేదా తహసీల్దార్ స్థాయి అధికారులు స్వయంగా వచ్చి స్వాగతం చెప్పాల్సిన ఉన్నా ఎవరూ రావడం లేదు. తమ పర్యటనలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని ప్రొటోకాల్ విభాగం జిల్లా అధికారులకు పంపించడం లేదు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ పరంగా జరిగే అభివృద్ధి కార్యక్రమాలకూ ఆహ్వానించడం లేదు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలకు మాత్రమే సమాచారం ఇస్తున్నారు. సాధారణంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో బదిలీలపై వచ్చే అధికారులు మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ను మర్యాదపూర్వకంగా కలవాలనే ఆనవాయితీని పాటించడం లేదు. దీంతో ఏ అధికారి ఏ స్థానంలో పనిచేస్తున్నారో కనీస సమాచారం కూడా ఉండట్లేదు. జాతీయ పండుగలైన పంద్రాగస్టు, గణతంత్ర దినోత్సవం, రాష్ట్ర అవతరణ వేడుకలు తదితర సందర్భాల్లో తాము జాతీయ పతాకాన్ని ఏ జిల్లాలో ఎగురవేయాలో చివరి నిమిషం వరకు చెప్పడం లేదు. ⇒ పర్యటనలకు వెళ్లిన సందర్భంలో కనీసం ఎస్ఐ స్థాయి అధికారి బందోబస్తు ఇవ్వాల్సి ఉన్నా ఎక్కడా కనిపించడం లేదు. దీనికి వాహనాల కొరత, మంత్రుల వెంట వెళ్లడం తదితర కారణాలను సాకుగా చూపుతున్నారు. ఎయిర్పోర్టు వీఐపీ లాంజ్లో సినిమా తారలు, ఇతరులను కూర్చోబెడుతూ మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ వెళ్లిన సందర్భంలో అధికారిక ఏర్పాట్లేవీ చేయడం లేదు. అటవీ ప్రాంతాలు, మారుమూల గ్రామాలకు వెళ్లినపుడు భద్రతా ఏర్పాట్లు ఉండటం లేదు. 25 లేదా 26న రాష్ట్ర బడ్జెట్? రాష్ట్ర అసెంబ్లీ వార్షిక బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్ర బడ్జెట్ ఈనెల 23న ప్రవేశపెడుతున్న నేపథ్యంలో, రాష్ట్ర బడ్జెట్ ఈనెల 25 లేదా 26న ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం ఉన్నతాధికారులతో జరిగిన భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ సమీక్ష నిర్వహించారు. సమావేశాలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. డీఎస్సీ, గ్రూప్స్ పరీక్షలపై విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాసనసభ, మండలి లెజిస్లేచర్ సెక్రటేరియట్లో పెండింగులో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాల్లో ప్రొటోకాల్ వివాదాలు తలెత్తకుండా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పారు. ఈ సమీక్షలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, లెజిస్లేచర్ సెక్రెటరీ నరసింహాచార్యులు, విప్ రామచంద్రు నాయక్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు . -
21 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఈ నెల 21వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. తొలుత 19వ తేదీ అనుకున్నా, ఆ తర్వాత 24 నుంచి నిర్వహించాలని యోచించింది. ఎక్కువ మంది మంత్రులు ఇంకా బాధ్యతలు తీసుకోకపోవడం, పలు ఇతర కారణాలతో 21 నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. 2 రోజులపాటు సమావేశాలు నిర్వహిస్తారని సమాచారం. మొదటిరోజు ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణం, రెండవ రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారని చెబుతున్నారు. -
24 నుంచి అసెంబ్లీ సమావేశాలు!
సాక్షి, అమరావతి: ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 22వ తేదీ తొలి మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. తొలుత ఈ నెల 19వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వ పెద్దలు అనుకున్నట్టు సమాచారం. అయితే మంత్రులందరూ పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించకపోవడంతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణను వాయిదా వేసినట్టు ప్రచారం నడుస్తోంది. 24వ తేదీ నుంచి ఐదురోజులు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ లీగల్ సెల్కు సీఎం చంద్రబాబు అభినందనలు గత ఐదేళ్లలో టీడీపీ లీగల్ విభాగం అనేక పోరాటాలు చేసిందని, లాయర్లు చేసిన కృషి ప్రశంసనీయమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన సోమవారం ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ లీగల్ సెల్ సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పగలు, రాత్రి తేడా లేకుండా అన్నివేళలా లీగల్ సెల్ కార్యకర్తలకు అండగా నిలిచిందని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా పార్టీతో ఉండేది కార్యకర్తలే తప్ప అధికారులు కాదని, ఈ క్రమంలో కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
Delhi Excise Policy Scam Case: 12 తర్వాత వర్చువల్గా హాజరవుతా: కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వరుసగా ఎనిమిదోసారి పంపిన సమన్లకు కూడా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించలేదు. మార్చి 4వ తేదీన తమ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నందున సోమవారం విచారణకు హాజరు కాలేకపోయినట్లు తెలిపారు. ఈడీ తనకు సమన్లు ఇవ్వడం చట్టవిరుద్ధమే అయినా ఈనెల 12వ తేదీ తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వర్చువల్గా హాజరయ్యేందుకు చట్టం హక్కు కలి్పంచింది. అందుకు ఈడీ అధికారులు అనుమతిస్తారని భావిస్తున్నా. ఈడీ విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నేను డిమాండ్ చేయలేదు. ఒకవేళ ప్రత్యక్ష ప్రసారం చేసినా అభ్యంతరం లేదు’అని కేజ్రీవాల్ అన్నారు. అయితే, కేజ్రీవాల్ పంపిన సమాధానాన్ని పరిశీలిస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. అయితే, కేజ్రీవాల్ను వర్చువల్గా విచారించేందుకు సిద్ధంగా లేని ఈడీ..తొమ్మిదో విడత సమన్లు పంపే అవకాశాలున్నాయంటున్నారు. ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడంతో ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించడం.. కేజ్రీవాల్ వినతి మేరకు మార్చి 16న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు ప్రకటించడం తెలిసిందే. బీజేపీ ‘మోదీ కా పరివార్’ ప్రచారాన్ని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. కేవలం కేంద్ర మంత్రులే మోదీ కుటుంబమన్నారు. -
‘కుప్టి’కి నిధులు కేటాయించేలా చూస్తా..
ఆదిలాబాద్: బోథ్ నియోజకవర్గంలో ప్రాజెక్టులు, మారుమూల గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణాల కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు బోథ్ ఎమ్మెల్యే అనిల్జాదవ్ తెలిపారు. నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న కుప్టి ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం బడ్జెట్ కేటాయించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని తెలిపారు. అటవీశాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో నియోజకవర్గంలో పలు రోడ్ల పనులు మధ్యంతరంగా నిలిచి పనులు ముందుకు సాగడంలేదని పేర్కొన్నారు. దీంతోని యోజకవర్గంలోని మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నియోజకవర్గలో నూతనంగా మరో 20 చెరువుల మంజూరు కోసం అసెంబ్లీలో ప్రస్తావిస్తానని తెలిపారు. సాగునీరు, రోడ్ల సౌకర్యాల ఏర్పాటు కోసం అసెంబ్లీలో ప్రస్తావించనున్నట్లు పేర్కొన్నారు. ఇవి చదవండి: తెలంగాణ అసెంబ్లీ: గవర్నర్ తమిళిసై ప్రసంగం ఇదే.. -
చర్చకు తేవాల్సిన అంశాలెన్నో..
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి జిల్లాకు సంబంధించి చాలా అంశాలు అసెంబ్లీలో చర్చకు రావాలని జిల్లావాసులు కోరుతున్నారు. గ్రేటర్ వరంగల్ చుట్టుపక్కల ఔటర్ రింగు రోడ్డు పనులకు 2017 అక్టోబర్లో అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రూరల్ జిల్లాలోని టెక్స్టైల్ పార్కు స్థలంలోనే శిలాఫలకం వేశారు. నగరం చుట్టూ 69 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్డును ప్రతిపాదించారు. 29 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ రాంపూర్ నుంచి దామెర వరకు నిర్మించింది. మరో 40 కిలోమీటర్ల మేర పెండింగ్ పడింది. వరంగల్ మహా నగరాన్ని అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. ముంపు బెడద 15 ఏళ్లుగా ఉంది. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మంత్రిగా ఉండగా.. ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి చెందినవారే. వరంగల్ నగరాభివృద్ధితో పాటు వరంగల్, వరంగల్ పశ్చిమతో పాటు వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల శివారు గ్రామాల్లో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. మడికొండలో మూడు నక్షత్రాల హోటల్తో స హా, హైదరాబాద్లోని హైటెక్స్ తరహాలో అంతర్జాతీయ సమావేశ, వాణిజ్య ప్రదర్శనల కేంద్రం (వైటెక్స్) నిర్మించేందుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. దీన్ని పీపీపీ మోడ్లో నిర్మించి నిర్వహించేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర పారి శ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ భూసేకరణ చేసి ఇవ్వాల్సి ఉంది. నిధులిస్తేనే ఇవన్నీ జరిగేది. జయశంకర్ భూపాలపల్లి నుంచి ములుగు కొత్త జిల్లాగా ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా పాలనపరంగా ఇంకా కుదుటపడేందుకు వసతులు కల్పించాలి. ఉమ్మడి వరంగల్లో పలు ప్రాజెక్టులు, పథకాలపై స్పష్టత ఇచ్చేలా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు. వరంగల్లోని మామునూరులో విమానాశ్రయం రావాలన్న ఎన్నో ఏళ్ల కల నెరవేరడం లేదు. ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు 700 ఎకరాలకుపైగా స్థలం అందుబాటులో ఉంది. మరో 200 నుంచి 400 ఎకరాల భూసేకరణ అవసరమని, గత ప్ర భుత్వం సేకరించి ఇస్తామన్నా సాధ్యం కాలేదు. ఇదివరకే మట్టి నమూనా పరీక్షలు కూడా నిర్వహించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్లు రెండేళ్లుగా భూకేటాయింపుల కోసం ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్లో ఉన్నట్లు వరంగల్లోనూ మెట్రో రైలును తీసుకొచ్చేందుకు చేసిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. మెట్రో నియో రైలు ప్రాజెక్టుకు కాకతీయ పట్ట ణాభివృద్ధి సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించి మూడేళ్ల కిందట ప్రభుత్వానికి సమర్పించింది. రూ.1100 కోట్ల అంచనా వ్యయంతో కాజీపేట నుంచి వరంగల్ వరకు 15 కిలోమీటర్ల మేర నిర్మించే ఇందులో సగం నేలపై సగం ఆకాశ మార్గంలో నడిచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈసారైన నిధులు కేటాయిస్తే ఈ ప్రాజెక్టు ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉంది. కాకతీయ మెగా జౌళి పార్కులో పరిశ్రమల ఏర్పాటు, సౌకర్యాల కల్పనకు గత ప్రభుత్వం రూ.574 కోట్లను మంజూరు చేసి రూ.174 కోట్లు విడుదల చేసింది. ఆమేరకు పలు మౌలిక వసతులు కల్పించగా.. మరో రూ.400 కోట్లు రావాల్సి ఉంది. పార్కులో కొన్ని ప్రాంతాల్లో రహదారులను నిర్మించి, విద్యుత్ సరఫరా కోసం ఉపకేంద్రాన్ని నిర్మించారు. మిషన్ భగీరథ ద్వారా 12 ఎంఎల్డీ సామర్థ్యం గల వ్యవస్థను ఇంకా నిర్మించుకోవాల్సి ఉంది. మొత్తం 1200 ఎకరాల్లో పరిశ్రమల స్థాపనకు కావాల్సిన నిధులు, అన్ని రకాల వసతులు తీర్చుదిద్దుకుంటే మరికొన్ని వస్త్ర పరిశ్రమలు వచ్చే వీలుంది. భూపాలపల్లికి ఎస్సారెస్పీ, దేవాదుల నుంచి సాగునీటి పంపిణీని మెరుగుపర్చాలి. చిన్నకాళేశ్వరం పూర్తి చేయాలి. ములుగు జిల్లాలో ములు గు, ఏటూరునాగారంలో బస్సు డిపోల ఏర్పా టు, గోదావరి తీర ప్రాంతాల్లో ముంపు నివారణ చర్యల కోసం కరకట్టల నిర్మాణం చేపట్టాలంటే పెద్దమొత్తంలో బడ్జెట్లో నిధులు రాబట్టాలి. ఇవి చదవండి: ‘కుప్టి’కి నిధులు కేటాయించేలా చూస్తా.. -
అసెంబ్లీ వద్ద టీడీపీ హైడ్రామా
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలను టీడీపీ ఎమ్మెల్యేలు తమ పబ్లిసిటీకి ఉపయోగించుకునే క్రమంలో హైడ్రామా సృష్టించారు. సోమవారం సమావేశాలు ప్రారంభానికి ముందు అసెంబ్లీ ఆవరణలో టీడీపీ సభ్యులు నిరసన పేరుతో హడావుడి మొదలెట్టారు. అసెంబ్లీ పరిసరాల్లో నిరసనలు, ప్రదర్శనలకు అనుమతి లేదని తెలిసి కూడా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రదర్శనగా వచ్చారు. ఒక్కసారిగా అసెంబ్లీ గేట్లు తోసుకుంటూ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి వారిని ఆపేందుకు ప్రయత్నించారు. టీడీపీ సభ్యులు బారికేడ్లను నెట్టివేసి అసెంబ్లీ లోపలికి వెళ్లారు. పోలీసులను తిడుతూ కావాలనే రాద్ధాంతం సృష్టించి అక్కడే అనుకూల మీడియాతో మాట్లాడారు. అవసరం లేకున్నా ఫొటోలు, వీడియోల కోసం పోలీసులతో వాగ్వాదానికి దిగి, నెట్టుకుంటూ గందరగోళం సృష్టించారు. రాజ్యాంగ వ్యవస్థకు అవమానం ఇకపోతే ఉభయ సభల సంయుక్త సమావేశం వేదికగా రాజ్యాంగ వ్యవస్థను టీడీపీ అవమానించింది. సభా సంప్రదాయాలను అపహాస్యం చేసింది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ఉపక్రమించారు. తొలుత కొద్ది నిముషాల పాటు గవర్నర్ ప్రసంగం సాఫీగా సాగింది. అనంతరం ప్రతిపక్ష సభ్యులు గవర్నర్ ప్రసంగానికి సమాంతరంగా పదే పదే రన్నింగ్ కామెంట్రీతో ఆటంకం కలిగించారు. టీడీపీ సభ్యుల్లో ముఖ్యంగా బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు తదితరులు తమ స్థానాల్లో కూర్చునే ప్రసంగ అంశాలపై కామెంట్లు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలో సభలో ప్రతిపక్ష సభ్యుల తీరును అధికార పక్షం సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పేదలందరికీ ఇళ్లు, మహిళా సాధికారత రంగాల్లో ప్రభుత్వం చేపట్టి సంస్కరణలు, ఆయా వర్గాలకు జరిగిన మేలుపై గణాంకాలతో సహా గవర్నర్ తన ప్రసంగంలో వివరిస్తుండగా టీడీపీ సభ్యులు అంతరాయం కలిగించే యత్నం ఎక్కువగా చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన సామాజిక భద్రత–సున్నితత్వం నుంచి సుస్థిరత దిశగా పరివర్తన.. అనే అంశంపై గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ వెంట తెచ్చుకున్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభలో నినాదాలు చేశారు. తమ స్థానాల్లో నిలబడి.. గవర్నర్ ప్రసంగంలో వాస్తవాలు లేవంటూ ఆరోపించారు. అసత్యాల ప్రసంగాన్ని వినలేమంటూ వాకౌట్ చేశారు. ఈ క్రమంలో ఓ వైపు ప్రసంగం కొనసాగుతుండగానే అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. టీడీపీ సభ్యులను పూర్తిగా ఇళ్లకు పరిమితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు. ఆ తర్వాత టీడీపీ సభ్యులు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం అంతా అంకెల గారడీ, అభూత కల్పనలు, అసత్యాలు, అర్థసత్యాలమయమని.. ఈ సందర్భంగా టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బుచ్చయ్యచౌదరి తదితరులు విమర్శించారు. ఎన్నికల ముందు గవర్నర్ ద్వారా ప్రజల్ని మోసగించడానికి సీఎం జగన్ మరోసారి ప్రయత్నించారని విమర్శించారు. 36 పేజీల గవర్నర్ ప్రసంగంలో వాస్తవ పరిస్థితులు ప్రజల ముందు ఉంచలేదన్నారు. 98 శాతం హామీలు నెరవేర్చాను, 175 స్థానాల్లో గెలిపించండి.. అనే అర్హత ముఖ్యమంత్రికి లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని సీఎం నెరవేర్చ లేదని చెప్పారు. గవర్నర్ కూడా నీళ్లు నములుతూ, చెప్పలేక చెప్పలేక దగ్గుతూ అబద్ధాలు చెప్పారన్నారు. -
రేవంత్ X అక్బర్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగ శ్వేతపత్రంపై గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరువురి మధ్య మాటల తూటాలు పేలాయి. అక్బరుద్దీన్ మాట్లాడుతుండగా మొదలైన ఈ రగడ గంటకుపైగా కొనసాగింది. దీంతో సభలోని కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ సభ్యులు వాదోపవాదాలకు దిగారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఒకానొక సందర్భంలో స్పీకర్ పోడియం వద్దకు అక్బరుద్దీన్ సహా ఎంఐఎం సభ్యులు దూసుకెళ్లారు. ఎంఐఎం సభ్యులతోపాటు బీఆర్ఎస్ సభ్యులు హరీశ్రావు, పల్లా రాజేశ్వర్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి తదితరులు పోడియం వద్దకు వెళ్లి సభాపతితో వాదనకు దిగారు. దీంతో సభ అదుపుతప్పింది. బీఆర్ఎస్ పాలనపై ప్రశంసలతో వాదన మొదలు.. : విద్యుత్ రంగ శ్వేతపత్రంపై చర్చలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ ‘గత ప్రభుత్వ హయాంలో పాతబస్తీలో రూ. 25 వేల కోట్ల అభివృద్ధి జరిగింది. 2014తో పోలిస్తే విద్యుదుత్పత్తి భారీగా పెరిగింది. బీఆర్ఎస్ హయాంలో జెన్కో ఆస్తులు రూ. 12,783 కోట్ల నుంచి రూ. 40,454 కోట్లకు పెరిగాయి. పాతబస్తీలో ఇంకా 5 వేల స్తంభాలు, కొత్త కండక్టర్ (తీగ), ట్రాన్స్పార్మర్ల ఏర్పాటుకు కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’అని కోరారు. దీనిపై మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జోక్యం చేసుకుంటూ అక్బరుద్దీన్ గత పదేళ్ల కాలంలో ఆ పనులేవీ చేయించుకోలేకపోగా ఇప్పుడు ప్రశ్నించడం ఏమిటంటూ నిలదీశారు. దీనిపై అక్బరుద్దీన్ ఘాటుగా ప్రతిస్పందించారు. సీనియర్ను అయిన తనను మొదటిసారి సభకు వచ్చిన సత్యనారాయణ ప్రశ్నిస్తున్నారని... పెద్దలు మాట్లాడుకుంటుండగా చిన్న పిల్లాడిలా మాట్లాడొద్దని వ్యాఖ్యానించారు. రేవంత్రెడ్డి జోక్యం... అక్బరుద్దీన్ మాట్లాడుతుండగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జోక్యం చేసుకున్నారు. ‘అక్బరుద్దీన్ సహచర ఎమ్మెల్యేలను గౌరవించాలి. సభలో ప్రస్తుతం 57 మంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారు. కవ్వంపల్లి సత్యనారాయణ దళితుడు. ఆయన మాట్లాడితే ఆగ్రహం వ్యక్తం చేయాలా? అధికారంలోకి రాగానే అక్బరుద్దీన్ను ప్రొటెం స్పీకర్ను చేశాం. ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. అక్బరుద్దీన్ కేవలం ఎంఐఎం నేత మాత్రమే. ఆయన్ను మేం ముస్లిం ప్రతినిధిగా చూడట్లేదు. చాంద్రాయణగుట్టలో హిందువులు కూడా ఆయనకు ఓటు వేశారు. మాకు ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అనే తేడాలేదు. బీఆర్ఎస్ దుర్మార్గాలు మిత్రపక్షమైన ఎంఐఎంకు కనిపించలేదా? గత ప్రభుత్వాన్ని అదే పనిగా ఎంఐఎం పొగుడుతుంటే వినేందుకు మేం సిద్ధంగా లేము. తెలంగాణ ప్రజలు మీ మిత్రపక్షం బీఆర్ఎస్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. బీఆర్ఎస్ తరఫున ఎంఐఎం ఎందుకు వకాల్తా పుచ్చుకుంటోంది? మైనారిటీల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు‘అని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. మా ముస్లిం నేతలను ఓడించారు.. ‘అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, మజ్లిస్ కలసి పనిచేశాయి. నిజామాబాద్ అర్బన్లో షబ్బీర్ అలీని, జూబ్లీహిల్స్లో అజాహరుద్దీన్ను ఓడించేందుకు కేసీఆర్తో కలసి మజ్లిస్ పనిచేసింది. అదే మజ్లిస్ పార్టీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలలో ఎందుకు పోటీ చేయలేదు? కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను ముఖ్యమంత్రులుగా, రాష్ట్రపతులుగా చేసింది. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అక్బరుద్దీన్.. కేసీఆర్కు మిత్రుడు కావొచ్చు. మోదీకి మద్దతివ్వవచ్చు.. అది వాళ్లిష్టం. మజ్లిస్, బీఆర్ఎస్ మిత్రపక్షాలు అని కేసీఆర్ పలుమార్లు చెప్పారు. మజ్లిస్ పార్టీ కేసీఆర్ను రక్షించేందుకు ప్రయత్నిస్తోంది. అక్బరుద్దీన్ ముస్లింలందరికీ నాయకుడు కాదు. మజ్లిస్ పార్టీకి మాత్రమే నాయకుడు’అని రేవంత్ వ్యాఖ్యానించారు. విద్యుత్ బకాయిలు రాబడతారా? ‘విద్యుత్ మొండి బకాయిల్లో సిద్దిపేట 61.37 శాతం, గజ్వేల్ 50.29 శాతం, హైదరాబాద్ సౌత్ 43 శాతంతో టాప్లో ఉన్నాయి. కేసీఆర్, హరీశ్రావు, అక్బరుద్దీన్ బాధ్యత తీసుకొని విద్యుత్ బకాయిలను క్లియర్ చేస్తారా?’అని రేవంత్ ప్రశ్నించారు. ఈ బిల్లులు వసూలు చేస్తే బకాయిల నుంచి బయటపడతామన్నారు. పాతబస్తీలో విద్యుత్ బకాయిల చెల్లింపులు జరిపే బాధ్యత తనదని అక్బరుద్దీన్ చెప్పడం లేదని రేవంత్ విమర్శలు గుప్పించారు. రేవంత్ మాట్లాడుతుండగా మజ్లిస్ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. వైఎస్సాఆర్ వల్లే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు... రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై అక్బరుద్దీన్ తీవ్రంగా స్పందించారు. ‘మేము ఎవరికీ భయపడం. కిరణ్కుమార్రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదు. కాంగ్రెస్ మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేస్తోంది. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కాంగ్రెస్, ఎంఐఎం కలసి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చాయి. వైఎస్సార్ నిజమైన జెంటిల్మాన్... గొప్ప నాయకుడు. కాంగ్రెస్కు చెందిన అప్పటి ఢిల్లీ నేతలు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన మా నాన్నను కలిశారు. ఆ తర్వాతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో రిజర్వేషన్ల అంశాన్ని చేర్చారు. కాంగ్రెస్, ఎంఐఎం కలసే అప్పడు ఎన్నికలను ఎదుర్కొన్నాయి’అని పేర్కొన్నారు. సీఎంకు చాలెంజ్.. షబ్బీర్ అలీని ఓడించేందుకు ప్రయత్నించామని రేవంత్ ఆరోపించారు. మేము నిజామాబాద్ అర్బన్లో పోటీ చేయలేదు. షబ్బీర్ అలీ ఓటమితో మాకేం సంబంధం? జూబ్లీహిల్స్లో మాకు కార్పొరేటర్ ఉన్నారు. బలమైన అభ్యర్థిని నిలిపాం. అంబేడ్కర్ వంటి మహానేతను కూడా ఓడించిన ఘనత కాంగ్రెస్దే. మమ్మల్ని బీజేపీ బీ–టీం అంటున్నారు. మేము బతికి ఉన్నంత వరకు బీజేపీతో కలసి పనిచేయం. సీఎం రేవంత్కు చాలెంజ్’అంటూ కామెంట్స్ చేశారు. ఏబీవీపీ, బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్లో రేవంత్రెడ్డి ఉన్నారని... అన్నిచోట్లా సీఎంకు అనుభవం ఉందని వ్యాఖ్యానించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ సభానాయకుడిని కించపర్చేలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. స్పీకర్ కూడా జోక్యం చేసుకొని సభానాయకుడు మాట్లాడుతున్నప్పుడు ఎవరూ మధ్యలో మాట్లాడవద్దన్నారు. ఈ దశలో మరోసారి జోక్యం చేసుకున్న సీఎం రేవంత్రెడ్డి ‘నాదెండ్ల భాస్కర్రావు, ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్కుమార్రెడ్డి, కేసీఆర్ హయాం వరకు ఎంఐఎం ఎవరెవరితో దోస్తీ చేసిందో అందరికీ తెలుసు. ఆ అంశంపై చర్చించాలంటే మరోసారి చర్చిద్దాం’అని పేర్కొన్నారు. దీనికి అక్బరుద్దీన్ బదులిస్తూ ‘మేము ఎవరితో కలసి పనిచేసినా రాష్ట్ర అభివృద్ధి కోసమే. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరిపక్వతగా మాట్లాడటం లేదు’అని అన్నారు. -
రెండ్రోజుల్లో రూ.2 లక్షల రుణమాఫీ ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఇచ్చిన హామీ ఏమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వం మొట్టమొదటి మంత్రివర్గం సమావేశంలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న హామీ ఏమైందని ఆయన నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టిందని, అసలు ఆట ఇప్పుడుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలోని బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి అప్పగించారనే పాత చింతకాయ పచ్చడినే శుక్రవారం జరిగే అసెంబ్లీ ఉభయ సభల సమావేశాల్లో గవర్నర్ నోటితో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిస్తుందని ఎద్దేవా చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల పద్దులపై గతంలో కాంగ్రెస్ హయాంలో ఏనాడూ చర్చ జరగలేదని, తాము మాత్రం పద్దులపై ప్రతీ ఏటా శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, కాగ్ నివేదికలను ఇచ్చామన్నారు. ప్రతీ ఏడాది తమ ప్రభుత్వం ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ శ్వేతపత్రం లాంటిదేనని, ప్రతీ అసెంబ్లీ సమావేశంలో అప్పుల వివరాలు సమర్పించామన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీకి ఇచ్చిన నివేదికను కాంగ్రెస్ నేతలు చదవకపోతే ఏం చేస్తామన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని పరోక్షంగా ఉద్దేశిస్తూ ‘ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 45వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. ఇలాంటి హామీలు అనేకం ఉన్నాయి. పాలకుర్తిలోనూ నిరుద్యోగం ఉండటమేంటి, ఉద్యోగాల మేళా పెడతాం అని అక్కడి ఎమ్మెల్యే అంటున్నారు.. వేచి చూద్దాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై మంత్రి బుగ్గన సమీక్ష
అమరావతి: అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమీక్ష నిర్వహించారు. సమావేశాల నిర్వహణకు సంబంధించిన అంశాలు, భద్రత, వసతుల ఏర్పాట్లపై 'విప్'లతో చర్చించారు. ఈ నెల 21వ తేదీ నుంచి శాసనసభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏఏ అంశాలపై చర్చ జరగాలనే అంశాలపై చర్చించారు. చీఫ్ విప్లు ముదునూరి నాగరాజ వర ప్రసాద రాజు, జంగా కృష్ణమూర్తి, కాపు రామచంద్రారెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు. సమావేశాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి బుగ్గన తెలిపారు. సమావేశాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలను ఫలవంతం చేయాలని, అభివృద్ధిపై చర్చించాలని చెప్పారు. వ్యక్తిగత విమర్శలకు స్థానం కాదని విపక్ష నేతలకు సూచించారు. ఇదీ చదవండి: నేడు ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం.. లైవ్ అప్డేట్స్ -
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ, శాసనమండలి సమావేశాలు గురువారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమవుతాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యే సమావేశంలో ముందుగా కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్నతో పాటు ఇటీవలి కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం పాటిస్తారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో శాసనసభ సమావేశాల నిర్వహణ తేదీలు, ఎజెండా ఖరారు చేస్తారు. సుమారు నాలుగురోజుల పాటు శాసనసభ సమావేశాలు జరిగే అవకాశముంది. బీఏసీ భేటీలో విపక్షాల నుంచి వచ్చే సూచనలు, ప్రతిపాదనల ఆధారంగా అవసరమైతే సమావేశాల తేదీలను పొడిగించొచ్చు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అధ్యక్షతన జరిగే మండలి సమావేశాల్లో తొలిరోజు రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదలపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. అనంతరం జరిగే బీఏసీ సమావేశంలో మండలి నిర్వహణ తేదీలు, ఎజెండా ఖరారు చేస్తారు. చివరి సమావేశాలని... తెలంగాణ రెండో శాసనసభకు ఇవి చివరి సమావేశాలుగా భావిస్తున్న నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు అసెంబ్లీ వేదికగా తమ ఎజెండా వినిపించేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఉచితవిద్యుత్, ధరణి వంటి అంశాలపై స్వల్పకాలిక చర్చ ద్వారా విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని అధికార బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రశ్నోత్తరాలతో పాటు ఇతర చర్చల సందర్భంగా ప్రస్తావించేలా అధికార పక్షం కసరత్తు చేస్తోంది. మరోవైపు విపక్ష పార్టీలు కూడా డబుల్ బెడ్రూమ్లు, ధరణి లోపాలు, ఇటీవల వరదల మూలంగా సంభవించిన నష్టం తదితరాలపై చర్చకు పట్టుపట్టే అవకాశాలు ఉన్నాయి. కాగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు ఇచి్చన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరవుతారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. 4 కీలక బిల్లులు ప్రస్తుత సమావేశంలో 4 కీలక బిల్లులు ఉభయ సభల ముందుకు రానున్నాయి. ఇందులో గతంలో అసెంబ్లీ ఆమోదించినా, గవర్నర్ తిరస్కరించిన మూడు బిల్లులు కూడా ఉన్నాయి. వీటిని ఉభయసభలు మరోమారు చర్చించి ఆమోదిస్తాయి. 1. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఇటీవల కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని బిల్లు రూపంలో సభలో చర్చించి ఆమోదిస్తారు. 2. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (రెగ్యు లేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్అన్యూయేషన్) చట్టసవరణ బిల్లు–2022 3. తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టసవరణ బిల్లు–2022 4. తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు–2022 -
ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడమే కాంగ్రెస్ ఎజెండా
సాక్షి, హైదరాబాద్: తొమ్మిదేళ్ల రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడమే ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతోంది. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రంలో ఉద్యమసాధన ఆకాంక్షలు నెరవేరని తీరును ఎండగట్టాలని అనుకుంటోంది. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని సభ దృష్టికి తేవడం ద్వారా వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ప్రజలకు వివరించేలా అసెంబ్లీలో గళమెత్తాలని నిర్ణయించింది. దీంతో పాటు సీఎల్పినేత మల్లు భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నిర్వహించిన పీపుల్స్మార్చ్ పాదయాత్ర అనుభవాలు, ప్రజలు ఏకరువు పెట్టిన సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం ద్వారా వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం అశాస్త్రీయంగా జరుగుతోందని, ముఖ్యంగా మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల నిర్వహణలో ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం కారణంగానే తాజా వరదనష్టం జరిగిందని, ప్రాణ, ఆస్తి, పంట నష్టాలకు ప్రభుత్వ ఎత్తుగడల లోపమే కారణమనే అంశాలను ఫోకస్ చేయాలని నిర్ణయించింది. కాగా, ఈ అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజుల పాటు నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది. ఈ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించేందుకుగాను గురువారం కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం కానుంది. ఇక, ఈ అసెంబ్లీ గడువు తీరేలోపు ఇవే చివరి సమావేశాలనే చర్చ జరుగుతోంది. 2018 జరిగిన ఎన్నికల్లో గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోకి అడుగుపెట్టిన కాంగ్రెస్పార్టీ చివరి సమావేశాల నాటికి తన ప్రాతినిధ్యాన్ని కోల్పోయి ఐదుగురికి మాత్రమే పరిమితం కావడం గమనార్హం. -
ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం.. ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా
Updates: ద్రవ్య వినిమయ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ఏపీ శాసనమండలి కూడా నిరవధికంగా వాయిదా పడింది. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రవేశపెట్టారు. ద్రవ్య వినిమయ బిల్లుపై సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అక్క చెల్లెమ్మల పక్షపాత బడ్జెట్ గా ఏపీ సీఎం జగన్ చెప్పారు. రైతన్నల పక్షపాత బడ్జెట్, గ్రామ స్వరాజ్ బడ్జెట్గా ఉందన్నారు. గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ క్యాలండర్ ను విడుదల చేసి దాని ప్రకారంగా నిధులను విడుదల చేస్తుందని సీఎం జగన్ వివరించారు. సీఎం వైఎస్ జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు మావి అక్కా చెల్లెమ్మల, రైతన్నల పక్షపాత బడ్జెట్లు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రతి బడ్జెట్లో నిధులు రైతన్నల పక్షపాత బడ్జెట్ గ్రామ స్వరాజ్య బడ్జెట్ ఏ నెలలో ఏ సంక్షేమ కార్యక్రమం చేస్తామో క్యాలెండర్ ద్వారా తెలియజేస్తున్నాం సంక్షేమ క్యాలెండర్ ద్వారా అన్ని పథకాలు అమలు చేస్తున్నాం: సీఎం జగన్ ఏప్రిల్లో జగనన్న వసతి దీవెన అందిస్తాం వైఎస్సార్ ఆసరా రేపట్నుంచి మొదలవుతుంది ఏప్రిల్ 5 వరకూ వైఎస్సార్ ఆసరా కార్యక్రమం మేలో వైఎస్సార్ భరోసా, రైతు కిసాన్ కార్యక్రమం మేలో జగనన్న విద్యా దీవెన, కల్యాణమస్తు మొదటి ఇన్స్టాల్మెంట్లు, వైఎస్సార్ మత్యకార భరోసా జూన్లో జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యాకానుక, వైఎస్సార్ లా నేస్తం తొలి విడత కార్యక్రమాలు జూలైలో జగనన్న విదేశీ విద్యా దీవెన తొలి విడత జూలైలో వైఎస్సార్ నేతన్న నేస్తం, ఎంఎస్ఎంఈ ప్రోత్సహకాలు, జగనన్న తోడు తొలి విడత కార్యక్రమం, వైఎస్సార్ సున్నా వడ్డీ(ఎస్హెచ్జీ) కార్యక్రమం జూలైలో వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా రెండో విడత ఆగస్టులో జగనన్న విద్యా దీవెన రెండో విడత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ వాహన మిత్ర సెప్టెంబర్లో వైఎస్సార్ చేయూత అక్టోబర్లో వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ అక్టోబర్లో జగనన్న వసతి దీవెన నవంబర్లో వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా మూడో విడత నవంబర్లో జగనన్న విద్యా దీవెన మూడో విడత డిసెంబర్లో జగనన్న విదేశీ విద్యా దీవెన రెండో విడత డిసెంబర్లో జగనన్న చేదోడు జనవరిలో వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ జనవరిలో వైఎస్సార్ ఆసరా జనవరిలో జగనన్న తోడు రెండో విడత జనవరిలో వైఎస్సార్ లా నేస్తం రెండో విడత జనవరిలో పెన్షన్ పెంపు(రూ. 3,000) ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన నాల్గో విడత ఫిబ్రవరిలో కల్యాణ మస్తు, షాదీ తోఫా నాల్గో విడత ఫిబ్రవరిలో ఈబీసీ నేస్తం మార్చిలో జగనన్న వసతి దీవెన రెండో విడత మార్చిలో ఎంఎస్ఎంఈ ప్రోత్సహకాలు సీఎం జగన్ ప్రసంగం మొదటిసారిగా షాపూర్ జీ పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్పై ఐటీ సోదాలు జరిగాయి నవంబర్, 2019లో మనోజ్పై ఐటీ సోదాలు జరిగాయి ఆ తర్వాత చంద్రబాబు పీఏ శ్రీనివాస్పై ఐటీ దాడులు చేసింది చంద్రబాబు పీఏ శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్తో కలిసి డీల్ చర్చించారు బోగస్ కంపెనీలతో నిధులు మళ్లించారు ఎల్ అండ్ టీ నుంచి కూడా డబ్బులు ఇప్పించేందుకు మనోజ్ ప్రయత్నించారు అమరావతిలో జరిగిన నిర్మాణాల్లో భారీ అవినీతి: సీఎం జగన్ మనోజ్ దుబాయిలో సీబీఎన్కు రూ. 1514 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది రామోజీరావు కొడుకు వియ్యంకుడు రఘు కూడా దీంట్లో భాగస్వామి మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రసంగం ►చంద్రబాబు పీఏ అవినీతిపై ఐటీ శాఖ నివేదిక ఇచ్చింది ►కోట్లలో అవినీతి జరిగింది ►దాదాపు రూ. 2 వేల కోట్ల అవినీతి జరిగింది ►కొన్ని ఆధారాలు కూడా సేకరించినట్లు ఐటీ శాఖ చెప్పింది ►ప్రజా ధనాన్ని చంద్రబాబు దోచుకున్నారు ►సంక్షోభాన్ని చంద్రబాబు తన అవినీతికి అవకాశంగా మార్చుకున్నారు ►ఏపీ సచివాలయ నిర్మాణంలో భారీ అవినీతి జరిగింది ►చంద్రబాబు అవినీతిపై పత్రికల్లో కథనాలు వచ్చాయి ►మనోజ్ వాసుదేవ్ 2019లో చంద్రబాబుని కలిశారు ►మనోజ్ వాసుదేవ్ షాపూర్ జీ పల్లోంజి సంస్థ ప్రతినిధి ►పీఏ శ్రీనివాస్ ఇచ్చే ఆదేశాలను పాటించమని ఆయనకు బాబు చెప్పారు ►బోగస్ ఇన్వాయిస్లతో నిధులు మళ్లించారు ►ఆర్వీఆర్ రఘు, కృష్ణ, నారాయణ్ సంస్థలకు నిధులు మళ్లింపు ►పీఏ శ్రీనివాస్ ఇచ్చే ఆదేశాలను పాటించమని ఆయనకు బాబు చెప్పారు ►బోగస్ ఇన్వాయిస్లతో నిధులు మళ్లించారు ►ఆర్వీఆర్ రఘు, కృష్ణ, నారాయణ్ సంస్థలకు నిధులు మళ్లింపు ►అసెంబ్లీ సచివాలయం, హైకోర్టు నిర్మాణాల షాపూర్ జీ పల్లోంజి చేపట్టింది ►ఈ సంస్థకు రూ. 8 వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చారు ►బోగస్ కంపెనీలు, వోచర్లతో నిధులు మళ్లించారు ►చివరిగా ఈ డబ్బులన్నీ చంద్రబాబుకు చేరాయి ►మొత్తం చంద్రబాబు, టీడీపీ రూ. 143 కోట్లు అందాయి ►స్కిల్ స్కామ్లో రూ. 372 కోట్లు చంద్రబాబు కొట్టేశారు ►కేబినెట్ ఆమోదానికి, ఎంవోయూకు సంబంధం ఉండదు ►అమరావతిలో చంద్రబాబు కట్టింది గోరంత.. కొట్టేసింది కొండంత 03:17PM అసెంబ్లీలో సీఎం జగన్ ప్రసంగం ►బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చాలని తీర్మానం ►దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలని తీర్మానం ►అసెంబ్లీలో ఆమోదించిన ఆ రెండు తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నాం ►పాదయాత్రలో ఎస్టీల్లో చేర్చాలని బోయ, వాల్మీకి కులస్థులు కోరారు ►ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బోయ, వాల్మీకి కులస్థుల స్థితిగతుల కోసం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశాం ►రాయలసీమ జిల్లాల్లో ఆ కులాలు ఆర్థిక, సామాజిక స్థితిగతులను ఏకసభ్య కమిషన్ తెలుసుకుంది.. ప్రభుత్వానికి నివేదిక అందించింది ►కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ తీర్మానం ►ఉమ్మడి ఏపీలో దివంగత నేత వైఎస్సార్ హయాంలో తీర్మానం జరిగింది ►మళ్లీ ఇప్పుడు మన హయాంలో తీర్మానం చేస్తున్నాం ►ఏజెన్సీలో ఉన్న ఎస్టీ కులాలపై దీని ప్రభావం ఉండదు ►గిట్టనివారు ఓట్ల కోసం దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారు ►ఎస్టీలు నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు ►నా ప్రభుత్వంలో వాళ్లకు అన్యాయం జరగదు ►గిరిజనులు, ఆదివాసీలకు ఈ తీర్మానాలతో ఇబ్బంది ఉండదు Time: 03:10 PM ►దళిత క్రిస్టియన్లను ఎస్సీల జాబితాలోకి చేర్చాలని ఏకగ్రీవ తీర్మానం ► బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చాలని తీర్మానం ►తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి మేరుగు నాగార్జున ►అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు: మేరుగు నాగార్జున ►లబ్ధిదారుల ఇంటి వద్దకే సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వం ►మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా సంక్షేమ ఫలాలు ►గత టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలతో దోచుకున్నారు. ►బోయ, వాల్మీకి కులాలను ఎస్టీలో చేర్చాలన్న తీర్మానానికి సభ ఆమోదం Time: 02:00 PM ►విద్యా దీవెన పథకం పేదలు చదువు కోవడానికి ఏర్పాటు చేశాం: మంత్రి నాగార్జున ►పేదల కుటుంబాల స్థితిగతుల ఆధారంగా ఫీజు రీయింబర్స్మెంట్ ►ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు కులాలకు చెందిన పేద విద్యార్థులకు ఈ పథకం ►వసతి దీవెన ద్వారా కూడా విద్యార్థుల ఖర్చులకు హాస్టల్ ఫీజు చెల్లింపు ►మత్స్యకార భరోసా కింద రూ.10వేలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ: మంత్రి అప్పలరాజు ►వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు సాయం ►హిందూ ధర్మ ప్రచారం, పరిరక్షణకు చర్యలు: మంత్రి కొట్టు సత్యనారాయణ ►ఈ ఏడాది 2900 దేవాలయాలను నిర్మిస్తాం ►ఈ ఏడాది దూపదీప నైవేద్యాల కోసం నిధులు కేటాయించాం Time: 10:31 AM ►ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం: మంత్రి ధర్మాన ప్రసాదరావు ►పేదల ఇళ్ల కోసం భూముల్ని కొనుగోలు చేశాం Time: 9:50 AM ►సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల: ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ►31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం గొప్ప విషయం. ►జగనన్న కాలనీల్లో అత్యాధునిక సౌకర్యాలు కూడా గొప్ప విషయం ►31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఒక చరిత్ర: మంత్రి జోగి రమేష్. ►జగనన్న కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాలు. ►త్వరలోనే జగనన్న కాలనీలు పూర్తవుతాయి. Time: 9:30 AM ►అసెంబ్లీ సభా కార్యకలాపాలకు టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. నిబంధనలు ఉల్లంఘించి రెడ్లైన్ను టీడీపీ సభ్యులు క్రాస్ చేశారు. స్పీకర్ పదేపదే హెచ్చరించినా పోడియం వద్ద టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ ఛైర్ దగ్గరకు టీడీపీ సభ్యులు దూసుకెళ్లారు. దీంతో అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. ►టీడీపీ హయాంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీలో 3,138 ప్రొసీజర్లు పెంచిన ఘనత సీఎం జగన్దన్నారు. ►తొమ్మిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. ►బోయ, వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ బీసీ సంక్షేమశాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ తీర్మానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీల జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ మంత్రి మేరుగ నాగార్జున తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. -
ఆరు పద్దులకు ఆమోదం
సాక్షి, అమరావతి: శాసనసభ సమావేశాల సందర్భంగా ఆరు బడ్జెట్ పద్దులకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. గురువారం సభలో వ్యవసాయ–సహకార, పశు సంవర్థక–మత్స్య, పౌర సరఫరాలు, ప్రణాళిక–శాసన వ్యవహారాలు, గవర్నర్, కేబినెట్, జీఏడీ నిర్వహణ, సమాచార, ప్రజా సంబంధాలకు చెందిన పద్దులను ప్రవేశపెట్టారు. వీటిపై చర్చించిన అనంతరం మంత్రులు సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయం రైతులకు అండగా నిలిచిందని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి తెలిపారు. ఎన్నడూ లేనివిధంగా ఖరీఫ్కు ముందస్తుగా సాగునీరు, వైఎస్సార్ రైతు భరోసాతో పెట్టుబడి సాయం అందించడం మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమాను అందిస్తున్నామన్నారు. మార్కెట్లో గిట్టుబాటు ధర లభించని పంటలను ఎమ్మెస్పీకి కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. టీడీపీ హయాంలో ఆక్వా జోన్ పరిధిలో 2.56 లక్షల ఎకరాలు, నాన్ ఆక్వా జోన్లో 1.90 లక్షల ఎకరాలు భూమి ఉందని పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక ఆక్వా జోన్లోకి 4.20 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయన్నారు. ఆక్వా రైతులకు సబ్సిడీ విద్యుత్కు సంబంధించి టీడీపీ సర్కారు రూ.309 కోట్ల రీయింబర్స్ పెండింగ్లో పెట్టగా, తమ ప్రభుత్వం వచ్చాక యూనిట్ రూ.1.50 చొప్పున సబ్సిడీ విద్యుత్ ఇస్తూనే పాత బకాయిలతో కలిపి రూ.2,687 కోట్లు ఖర్చు చేశామన్నారు. పాడి రైతులకు గతంలో ఎన్నడూ లేని విధంగా లీటరు గేదె పాలపై రూ.20 లబ్ధి చేకూరుస్తున్నట్టు చెప్పారు. అమూల్ రేట్లు పెంచడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ డెయిరీలు రేట్లు పెంచాల్సి వచి్చందని, ఆ మేరకు రైతులకు రూ.2,300 కోట్ల మేర ప్రయోజనం కలిగిందని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల బిల్లుకు సభ ఆమోదం సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు చట్టబద్ధత కల్పిస్తూ రూపొందించిన ఏపీ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల బిల్లు–2023కు గురువారం శాసనసభ ఆమోదం తెలిపింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ సభలో బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో సచివాలయాల వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చిందని మంత్రి సురేశ్ తెలిపారు. సచివాలయాల ద్వారా 500కు పైగా సేవలు ప్రజలకు గ్రామ, వార్డు స్థాయిల్లోనే అందుతున్నాయన్నారు. ఇక సచివాలయాల బిల్లుతో పాటు మరో ఆరు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. సభ ఆమోదం పొందిన ఆరు బిల్లులు ♦ ఏపీ ఎస్సీ సబ్ ప్లాన్, ట్రైబల్ సబ్ ప్లాన్ (సవరణ) బిల్లు–2023 ♦ ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ ఎస్టీ (సవరణ) బిల్లు–2023 ♦ ఏపీ పబ్లిక్ సర్విసెస్ డెలివరీ గ్యారంటీ (సవరణ) బిల్లు–2023 ♦ ఏపీ మున్సిపల్ లాస్ (సవరణ) బిల్లు–2023 ♦ ఏపీ మున్సిపల్ లాస్ (రెండో సవరణ) బిల్లు–2023 ♦ ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ (సవరణ) బిల్లు–2023 -
నేను రాను.. మీరు వెళ్లండి
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో టీడీపీ పునరాలోచనలో పడింది. సమావేశాలకు హాజరైతేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. తన కుటుంబం గురించి అసభ్యంగా మాట్లాడారనే కారణాన్ని చూపించి చంద్రబాబు గత అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. సీఎం అయితేనే మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశారు. మీడియా సమావేశం పెట్టి బోరున విలపించి అందరిలోనూ నవ్వుల పాలయ్యారు. అప్పట్లో ఆయనతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సమావేశాలను బహిష్కరించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి మొదటి వారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత సమావేశాల్లో చంద్రబాబు చేసిన శపథం, హడావుడి నేపథ్యంలో ఈ సమావేశాలకు వెళ్లాలా వద్దా అనే విషయంపై టీడీపీలో చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో అడుగు పెట్టేది లేదని తెగేసి చెప్పి నానా హడావుడి చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు అన్ని వైపుల నుంచి వచ్చిన విమర్శలతో వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. చంద్రబాబు, టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీని ఎదుర్కోలేక చేతులెత్తేయడం, ఏడవడం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ విశ్లేషకులు చంద్రబాబు తీరును తప్పు పట్టారు. దీంతో తాను అసెంబ్లీకి రానని, ఎమ్మెల్యేలు వెళ్లాలని చంద్రబాబు చెబుతున్నట్లు సమాచారం. కొందరు ఎమ్మెల్యేలు మాత్రం గతంలో శపథం చేసిన కారణంగా వెళ్లకపోతేనే బాగుంటుందని చెబుతున్నారు. ఏ మొఖం పెట్టుకుని వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. కొందరు మాత్రం అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి నిరసనలు తెలపాలని సూచిస్తున్నారు. కనీసం గవర్నర్ ప్రసంగం వరకైనా ఉండాలని, లేకపోతే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఉండి తర్వాత నిరసన తెలిపి వచ్చినా బాగుంటుందని చెబుతున్నారు. చంద్రబాబు ఈ అంశంపై పలువురు నేతలతో మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. తాను వెళ్లకుండా పార్టీ ఎమ్మెల్యేలను పంపించాలని బాబు భావిస్తున్నట్లు తెలిసింది. విద్యార్థులతో జూమ్లో మాట్లాడిన చంద్రబాబు ఉక్రెయిన్లో చిక్కుకున్న రాష్ట్ర విద్యార్థులకు ఆర్థిక సాయమందిస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. విద్యార్థులతో రెండో రోజూ శనివారం ఆయన జూమ్ కాల్లో మాట్లాడారు. విద్యార్థులకు సహాయం చేసేందుకు ఉక్రెయిన్, పోలండ్, హంగేరీలలో స్థిరపడిన తెలుగువారు (ఎన్నారైలు)ని చంద్రబాబు సంప్రదించారు. విద్యార్థులకు అవసరమైన డబ్బు, ఆహారం, హోటల్ ఖర్చులు అందించాలని వారిని కోరారు. ఆ ఖర్చును టీడీపీ నుంచి తిరిగి చెల్లిస్తామని తెలిపారు. పరిస్థితి క్లిష్టంగానే ఉందని, ఎవరూ వారి ప్రాంతాల నుంచి బయటకు రావద్దన్న ఇండియన్ ఎంబసీ సూచనలను పాటించాలని చెప్పారు. -
స్పీకర్దే తుది నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశానికి ముగ్గురు సభ్యులున్న బీజేపీని పిలవాలా వద్దా అనేది స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బీఏసీ సమావేశానికి హాజరు కావాలనుకుంటే బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్కు విజ్ఞప్తి చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. సోమవారానికి అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ కమిటీహాల్లో శుక్రవారం మీడియాతో ప్రశాంత్రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు అసెంబ్లీ వేదికగా చెప్పుకుంటామని సీఎం కేసీఆర్ బీఏసీ భేటీలో వెల్లడించారన్నారు. ప్రతిపక్షాలు కోరినన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుత సమావేశాల్లో హరితహారం, దళితబంధు, ఐటీ, పరిశ్రమలు వంటి పది అంశాలను చర్చించాలని కోరుతూ స్పీకర్కు ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. 12 అంశాలపై చర్చకు కాంగ్రెస్ ప్రతిపాదనలు ఈ సమావేశాల్లోనే నాలుగైదు బిల్లులతో పాటు రెండు ఆర్డినెన్స్లు కూడా సభ ముందుకు వస్తా యని ప్రశాంత్రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 12 అంశాలపై చర్చించాలని ప్రతిపాదనలు ఇచ్చిందని, హైదరాబాద్ ఓల్డ్సిటీ అభివృద్ధిపై చర్చించాలని ఎంఐఎం పార్టీ కోరిందని పేర్కొన్నారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కోసం కానిస్టిట్యూషన్ క్లబ్ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. టీఆర్ఎస్పై ఈటల రాజేందర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీయే తమకు ప్రధాన ప్రత్యర్థి అని, ఈ నెల 21,22,23 తేదీల్లో నిర్వహించిన సర్వేలో బీజేపీ కంటే టీఆర్ఎస్ పార్టీ 15% ఎక్కువ ఓట్లు సాధిస్తుందని వెల్లడైనట్లు మంత్రి తెలిపారు. -
అసెంబ్లీ సమావేశాలు షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎనిమిదో విడత సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తొలుత జాతీయ గీతాలాపన చేసి సమావేశాలను మొదలుపెట్టారు. సుమారు పావుగంట పాటు జరిగిన తొలిరోజు కార్యక్రమాల్లో.. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పత్రాలు, నివేదికలను సమర్పించారు. తర్వాత ఇటీవలికాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు నివాళి అర్పించారు. అనంతరం సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. రెండు ఆర్డినెన్సులు.. తెలంగాణ హౌజింగ్ బోర్డు ఆర్డినెన్స్ (2021)ను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ ఆర్డినెన్స్ 2021ని సింగిరెడ్డి నిరంజన్రెడ్డి శాసనసభకు సమర్పించారు. ఇక రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ మూడో వార్షిక నివేదికను తలసాని శ్రీనివాస్ యాదవ్, ట్రాన్స్కో, డిస్కమ్లకు సంబంధించిన వార్షిక నివేదికలను మంత్రి జగదీశ్రెడ్డి; టూరిజం అభివృద్ధి సంస్థ తొలి వార్షిక నివేదికను మంత్రి వి.శ్రీనివాస్గౌడ్; తెలంగాణ సమగ్ర శిక్షణా కార్యక్రమం వార్షిక నివేదికను మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభకు అందజేశారు. తొమ్మిది మందికి నివాళి ఇటీవల మరణించిన తొమ్మిది మంది మాజీ ఎమ్మెల్యేలకు నివాళి అర్పిస్తూ శాసనసభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. మాజీ ఎమ్మెల్యేలు కుంజా బుజ్జి (భద్రాచలం), అజ్మీరా చందూలాల్ (ములుగు), కేతిరి సాయిరెడ్డి (హుజూరాబాద్), కుంజా భిక్షం (బూర్గంపాడు), మేనేని సత్యనారాయణరావు (కరీంనగర్), మాచర్ల జగన్నాథం (వర్ధన్నపేట), బుగ్గారపు సీతారామయ్య (బూర్గంపాడు), చేకూరి కాశయ్య (కొత్తగూడెం/పాల్వంచ) మృతిపట్ల సంతాపం ప్రకటించింది. శాసనసభ్యులుగా వారి రాజకీయ ప్రస్థానం, సేవలను స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రస్తుతించారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. నివాళి అనంతరం సభను సోమవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఇద్దరు కొత్త సభ్యులతో మండలి శుక్రవారం ఉదయం 11 గంటలకు మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్రెడ్డిని ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి సభకు పరిచయం చేశారు. మండలి ప్యానెల్ వైస్ చైర్మన్లుగా నారదాసు లక్ష్మణరావు, సయ్యద్ అమీనుల్ జాఫ్రీలను నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవల మరణించిన ఉమ్మడి ఏపీ మాజీ ఎమ్మెల్సీలు పి.లింబారెడ్డి, టి.లక్ష్మారెడ్డి, హెచ్ఏ రెహ్మాన్, ఆర్.ముత్యంరెడ్డిలకు నివాళిగా మండలి రెండు నిమిషాలు మౌనం పాటించింది. తర్వాత రెండు ఆర్డినెన్సులు, పలు నివేదికలను మండలి ముందు ఉంచినట్టు చైర్మన్ ప్రకటించారు. సోమవారం ఉదయానికి సభను వాయిదా వేశారు. -
‘అందుకు భయపడే చంద్రబాబు కొత్త డ్రామా’
సాక్షి, విజయవాడ: అసెంబ్లీ సమావేశాలు బహిష్కరిస్తున్నామని చంద్రబాబు కొత్త డ్రామా మొదలు పెట్టారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనాకు భయపడి హైదరాబాద్ నుంచి రావటం ఇష్టంలేక డ్రామా ఆడుతున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఒక్కపూట జరిగినా ప్రతిపక్ష నేతగా ఉపయోగించుకోవాలని ఆయన హితవు పలికారు. ‘‘రఘరామను అరెస్ట్ చేస్తే చంద్రబాబు గగ్గోలు పెట్టారు. రఘురామను తాబేదారుగా మార్చుకుని ప్రభుత్వంపై కుట్ర పన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు చేస్తున్నారని’’ ఎమ్మెల్యే జోగి రమేష్ నిప్పులు చెరిగారు. చదవండి: రఘురామకృష్ణరాజు వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం: సజ్జల ఏపీ అసెంబ్లీ సమావేశాలు: మొహం చాటేసిన చంద్రబాబు -
ఎజెండాకే పరిమితం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ, శాసనమండలి సమావేశా లను ఒక్కోరోజు చొప్పున మాత్రమే నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించిన నేపథ్యంలో మంగళవారం శాసనసభ, బుధ వారం శాసనమండలి భేటీ జరగనుంది. భేటీ ఒకరోజు మాత్రమే కాబట్టి ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ లాంటి అంశాల జోలికి వెళ్లకుండా ఎజెండాను మాత్రమే చేపట్టే అవకాశం ఉంది. సమావేశాల ఏర్పాట్లపై శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్ నేపథ్యంలో శాసనసభ, మండలి సమావేశ మందిరాల్లో సీటింగ్ ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత నెల 6 నుంచి 16వ తేదీ వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల తరహాలోనే సభ్యుల మధ్య భౌతికదూరం ఉండేలా సీటింగ్ విధానం కొనసాగించాలని, శాసనసభ ప్రాంగణంతో పాటు, సభ లోపల కూడా పూర్తిస్థాయిలో శానిటైజేషన్ చేయించా లని అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహా చార్యులను ఆదేశించారు. ఏర్పాటు చేయా ల్సిన బందోబస్తుపై రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీసు కమిషనర్లతో ఫోన్ ద్వారా సమీక్షించారు. అవసరమైన సమాచా రంతో సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్ కుమార్కు ఫోన్లో సూచించారు. ఎజెండా అంశాలే... మంగళవారం ఉదయం 11.30 గంటలకు శాసనసభ సమావేశం ప్రారంభమై నేరుగా ఎజెండాపై చర్చిస్తుంది. శనివారం జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో నాలా, రిజిస్ట్రేషన్, జీహెచ్ఎంసీ 1955 చట్టాలను సవరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ఈ మూడు చట్టాలకు సవరణ బిల్లులను సభలో ప్రవేశపెడతారు. వీటిపై చర్చించి ఆమోదించిన తర్వాత శాసనసభను స్పీకర్ వాయిదా వేస్తారు. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే మండలి... శాసనసభ ఆమోదించిన బిల్లులను చర్చించి ఆమోదించిన తర్వాత వాయిదా పడనుంది. అనుమానితులకు కరోనా పరీక్షలు ఉభయ సభల ప్రాంగణాల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమ య్యాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు, అసెంబ్లీ సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులు కరోనా లక్షణాలు న్నట్లు అనుమానం ఉంటే పరీక్షలు చేయిం చుకోవాలని మండలి చైర్మన్ గుత్తా, శాసన సభ స్పీకర్ పోచారం సూచించారు. సభలో ప్రవేశపెట్టే బిల్లులివే... ►వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చే క్రమంలో సంబంధిత అధికారి విచక్షణాధికారం దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఇటీవలి నూతన రెవెన్యూ చట్టంలో సవరణలు చేస్తారు. ధరణి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో నాలా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును పౌరులకు కల్పిస్తూ, భూమార్పిడి సులభతరం చేయాలనే సవరణ కూడా చేస్తారు. ►రెవెన్యూ చట్టంలోని సవరణలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చట్టానికి కూడా స్వల్ప సవరణ చేస్తారు. ►జీహెచ్ఎంసీ చట్టం – 1955కు సవరణ చేయడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ పాల కమండలిలో మహిళలకు 50 శాతం ప్రాతి నిధ్యానికి చట్టబద్ధత కల్పిస్తారు. వార్డు కమిటీల పనివిధానం, వార్డుల రిజర్వేషన్ రొటేషన్ను రెండు పర్యాయాలకు మారుస్తూ చట్ట సవరణ చేస్తారు. -
జాతీయ స్థాయిలో పార్టీపై కేసీఆర్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్ : జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీ పెడుతున్న వస్తున్న వార్తలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పందించారు. కొత్త రాజకీయ పార్టీపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదని కొట్టిపారేశారు. జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటుపై భవిష్యత్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశాన్ని సర్వనాశనం చేశాయని, ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రగతి భవన్లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్సీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీ ముగిసిన అనంతరం సీఎం మాట్లాడారు. (10న రెవెన్యూ చట్టంపై ప్రకటన) దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ లక్ష మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలను ఏ ఒక్కరూ ఆశామాషీగా తీసుకోవద్దని, ఎవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని సభ్యులకు హితబోధ చేశారు. అన్ని అంశాలపై సభలో చర్చిద్దామన్నారు. పూర్తి సమాచారంతో అందరూ మాట్లాడాలని సూచించారు. రెవిన్యూ చట్టంతో రాష్ట్ర రూపురేఖలు మారతాయని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ఎల్పీ సమావేశం సందర్భంగా దుబ్బాక దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి సీఎం నివాళి అర్పించారు. ఆయన మృతితో దుబ్బాకలో ఉప ఎన్నికల అనివార్యమైన విషయం తెలిసిందే. పార్టీ అభ్యర్థి ఎంపికపై కొంత ఉత్కంఠ ఉన్నా.. సోలిపేట కుటుంబంలోనే ఒకరికి టికెట్ కేటాయించే అవకాశం ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ భేటీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కీలకమైన అంశాలపై చర్చించేందుకు తెలంగాణ మంత్రిమండలి సమావేశమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత సమావేశమైన కేబినెట్ కొత్త రెవెన్యూ చట్టం, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించనుంది. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా సీఎం సభ్యులతో చర్చించనున్నారు. -
విద్యుత్ ఒప్పందాలపై ఏపీ ప్రభుత్వం స్పష్టత
సాక్షి, అమరావతి: విద్యుత్ ఒప్పందాలపై ప్రభుత్వం స్పష్టత నిచ్చింది. విద్యుత్పై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చే పరిస్థితిలో ఉందని, పీపీఏలపై అత్యున్నతమైన కమిటీ సమీక్ష చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. శాసనసభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం నిజనిజాలపై పరిశీలన చేస్తోందని పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలుపై గత ప్రభుత్వం హడావుడిగా నిర్ణయం తీసుకుందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్పై ఒక కమిటీ వేసిందని.. ఆ నివేదిక రాగానే అన్ని విషయాలు వెల్లడిస్తామని చెప్పారు. పద్ధతి ప్రకారం జరగాలంటే సమయం పడుతుందని వివరించారు. పవన్ విద్యుత్, సౌర విద్యుత్ వాడకం మంచిదేనని.. పెట్రోలు,డీజీల్ నిల్వలు వాడకం మంచిది కాదన్నారు. పీపీఏల్లో జరిగిన అవినీతిపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందన్నారు. కేబినెట్ సబ్కమిటీ పర్యవేక్షిస్తుంటే.. టీడీపీకి ఆతృత ఎందుకని బుగ్గన ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం ఏ దోపిడీ చేసినా మేం ఊరుకుంటే వాళ్లకు సంతోషమని, వాస్తవాలు చెబితే టీడీపీ పట్టించుకోదని విమర్శించారు. 2014-15లో డిస్కమ్ల నష్టాలు రూ.9వేల కోట్లు అని, 2018-19లో ఆ నష్టాలు రూ.29 వేల కోట్లకు చేరాయన్నారు. గత ఐదేళ్లలో డిస్కమ్లను రూ.20 వేల కోట్ల నష్టాల్లో పడేశారన్నారు. ఎక్కువ రేట్లకు ఇచ్చిన వాటిపై మరోసారి ఆలోచించాలని కోరితే గొడవ చేస్తున్నారన్నారు. అవినీతి జరిగితే చర్యలు తీసుకోమని కేంద్రం కూడా చెప్పిందని వివరించారు. విద్యుత్ కోసం రైతులు ఇబ్బందులు పడకూడదనే సీఎం జగన్ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని బుగ్గన పేర్కొన్నారు. -
‘వాటిపై టీడీపీకి మాట్లాడే హక్కు లేదు’
సాక్షి, అమరావతి: ప్రత్యేకహోదా, విభజన హామీల గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదని మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. పార్టీలు ఇచ్చిపుచ్చుకోవడం గురించి టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నారని.. ఈ రాష్ట్రంలో పార్టీలు ఇచ్చి పుచ్చుకోవడం టీడీపీకి తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలియదన్నారు. పార్టీలే కాదు, బీ ఫారాలు కూడా ఇచ్చిపుచ్చుకున్నారన్నారు. 2014 నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన వ్యక్తి వైఎస్ జగన్ ఒక్కరేనని తెలిపారు. ఢిల్లీ, గుంటూరులో దీక్షలు చేశారని, ధర్నాలు, యువభేరీ కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. పార్టీ ఎంపీల చేత కూడా వైఎస్ జగన్ రాజీనామాలు కూడా చేయించారన్నారు. వైఎస్సార్సీసీ ఎంపీలు కన్నా.. టీడీపీ ఎంపీలు అప్పట్లో ఎక్కువ మంది ఉన్నారని, కాని చీమ కుట్టినట్టుకూడా వారికి అప్పుడు లేదన్నారు. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీయే బెటరని అప్పట్లో బల్ల గుద్దినట్టు చంద్రబాబు చెప్పారన్నారు. అప్పట్లో ఆర్థిక మంత్రికి శాలువాలు కప్పి, స్వీట్లు పంచుకున్న చరిత్ర వారిదని.. ఇప్పుడు అదే వ్యక్తులు నీతులు చెప్తున్నారని మండిపడ్డారు. అలా చేయకపోతే కేంద్రం ఆలోచించేంది.. ఆరోజు నుంచి నేటి వరకూ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా కావాలంటూ మడమ తిప్పకుండా మాట్లాడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని అన్నారు. ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పిన చంద్రబాబు.. ఆ తర్వాత రాత్రికి రాత్రి యూటర్న్ తీసుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీసి, ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా సరిపెట్టుకుంటారన్న ఒక మైండ్సెట్ని క్రియేట్ చేసింది చంద్రబాబేనన్నారు. అలా చేయకపోతే ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఉండేదన్నారు. ‘షీలా బీడే కమిటీ ఈ జనవరితో అయిపోయింది. వాళ్లు 89 రికమెండేషన్లు ఇస్తే.. ఈ ప్రభుత్వం వచ్చాక 68 రికమెండేషన్లకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. మేం అవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం ఏ అభ్యంతరాలు పెట్టకుండా 68 సిఫార్సులకు సానుకూలత తెలిపింది. కాని ఆ రోజు టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది. రాజకీయం చేసింది. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన తర్వాత పారిపోయి ఈ రాష్ట్రానికి వచ్చేశారు. హైదరాబాద్ 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని అయితే... కట్టుబట్టలతో పారిపోయి వచ్చారని’ కన్నబాబు దుయ్యబట్టారు. హైదరాబాద్లో ఉన్న ఏపీ ప్రజలు బాధపడే పరిస్థితి ఏర్పడిందని.. చేసిందంతా చేసి ఇవాళ నీతి కథలు, పిట్ట కథలు చెబుతున్నారని ధ్వజమెత్తారు నాడు అలా..నేడు ఇలా... టీడీపీకి ప్రత్యేక హోదాపైన, విభజన హామీలపైన మాట్లాడే హక్కులేదని.. ఐదేళ్ల పాటు ఏమీ చేయకపోగా, ఆరునెలల్లో ఏదో జరిగిపోయిందన్నట్టుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు రాజీనామాలు చేసినప్పుడే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి ఉంటే ఫలితం ఉండేదని, కాని అలా చేయకుండా మోదీ అన్యాయం చేశారని ఎన్నికల ముందు మాట్లాడి, ఇప్పుడు మళ్లీ మోదీతో జతకట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నలుగురు ఎంపీలను బీజేపీలోకి పంపించి మళ్లీ ఇక్కడ మరోలా మాట్లాడుతున్నారన్నారు. ఎన్నిసార్లు నాలుకలు మడతపెట్టారో వారికే తెలియాలి.. ఉద్యోగులకు సంబంధించిన అంశాలను పరిష్కరించడానికి, ఆస్తుల పంపిణీ గురించి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. తెలంగాణ ఇచ్చిన భవనాల్లో ఏదీ కూడా విభజన చట్టంలోని పరిధిలోనిది కాదని.. విభజన చట్టంలో భవనాల్లోని ఒక్క గదిని కూడా అప్పగించలేదని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలో ఉండగా... విభజన చట్టంలోని భవనాలను ఆక్రమిస్తే ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు. అక్కడ సచివాలయంలో భవనాలు ఎందుకు వృథాగా పడి ఉన్నాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కార్యాలయం కోసం అభివృద్ది చేసిన దాన్ని కూడా విడిచిపెట్టారని.. ఇప్పుడు అక్కడ ఉండకపోయినా, బూజు పట్టినా.. కరెంటు బిల్లుల రూపేణా కట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఐదేళ్లపాటు వాళ్లు చేసిన నిర్వాకానికి మరో ఐదేళ్ల పాటు కష్టపడితే తప్ప తీరని విధంగా సమస్యలు సృష్టించారన్నారు. మనకు కేటాయించిన భవనాలను తెలంగాణ ప్రభుత్వం ఆక్యుపై చేసినా.. అడగలేకపోయారని.. కారణం ఓటుకు నోటు కేసులో అప్పటి ముఖ్యమంత్రికి ఉన్న బలహీనత అని తెలిపారు. ఢిల్లీతో సంబంధాల విషయంలో ఎన్నిసార్లు నాలుకలు మడతపెట్టారో టీడీపీ వాళ్లకే తెలియాలని ఎద్దేవా చేశారు. -
పకడ్బందీ వ్యూహంతో అధికారపక్షం
సాక్షి, అమరావతి : నేటి నుంచి ప్రారంభం కానున్న శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాలను ఎదుర్కోవడానికి అధికార వైఎస్సార్సీపీ పకడ్బందీ వ్యూహంతో సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఆరు నెలల పాలనను పూర్తి చేసిన నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశాలు కీలకంగా మారనున్నాయి. ఎన్నికలకు ముందు జగన్ చేసిన ప్రజా సంకల్ప పాదయాత్రలో, ఆ తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే యత్నంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సఫలీకృతం అయింది. ఆరు నెలల్లో ప్రజలకు ఎంతో చేశామన్న ధీమా, సంపూర్ణ ఆత్మ విశ్వాసంతో అధికార పక్షం ముందుకు కదులుతోంది. శీతాకాల సమావేశాలు మొదలు కావడానికి కొద్ది రోజుల ముందు నుంచే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కసరత్తు మొదలు పెట్టారు. ఉభయ సభల్లో చర్చకు రానున్న, తాము ప్రస్తావించనున్న అంశాలపై వారు కూలంకషంగా చర్చించారు. టీడీపీ లేవనెత్తే అనవసర వివాదాలు, సభను పక్క దోవ పట్టించే విధంగా సభలో ప్రస్తావించే అంశాలను తిప్పి కొట్టడానికి సిద్ధమయ్యారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఇవ్వాలనే చట్టాన్ని చాలా వరకు ఆచరణలో అమలు చేసి చూపించారు. ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వ సొమ్మును ఆదా చేయడం అనేది ముమ్మాటికీ ఘనతే. ఈ అంశం చర్చకు వచ్చినపుడు ప్రతిపక్షం ఏవైనా అవాంతరాలు సృష్టిస్తే సరైన సమాధానాలతో వాటిని ఎదుర్కొనేందుకు అధికారపక్షం సిద్ధమవుతోంది. ప్రకృతి వల్ల ఉత్పన్నమైన ఇసుక కొరతను విజయవంతంగా నివారించడం, మద్యం వినియోగాన్ని రాష్ట్రంలో గణనీయంగా తగ్గించడం, చరిత్రాత్మకమైన రీతిలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాలు, అమరావతి రాజధాని రైతుల సమస్యలు, కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలు, తదితర అంశాలన్నింటిపై చర్చకు అధికార పక్షం సిద్ధంగా ఉంది. ప్రజల కోసమే అసెంబ్లీ గడికోట శ్రీకాంత్రెడ్డి ప్రజల కోసం అసెంబ్లీ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలన్న కృత నిశ్చయంతో అధికార పక్షం ఉందని, ప్రతిపక్షం బాధ్యతగా సభలో చర్చకు తెచ్చే ఏ అంశానికైనా సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి తెలిపారు. అలా కాకుండా వ్యక్తిగత అజెండాతో సభను తప్పు దోవ పట్టించే విధంగా వ్యవహరిస్తే అధికారపక్షం చూస్తూ ఊరుకోబోదన్నారు. అసెంబ్లీ ఉన్నది ప్రజల సమస్యలను చర్చించి పరిష్కరించడం కోసమేనన్నది అందరూ గుర్తించాలన్నారు. -
మైక్ కట్ చేస్తే రోడ్ల మీదకే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలని కాంగ్రెస్ శాసనసభా పక్షం నిర్ణయించింది. ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్లు, తాగు, సాగు నీరు, నిరుద్యోగం, యూరియా కొరత, రైతుబంధు, విష జ్వరాలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించింది. బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహం తదితరాలపై చర్చించేందుకు కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో ఇక్కడి గోల్కొండ హోటల్లో సమావేశం జరిగింది. ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, జగ్గారెడ్డి, వీరయ్య, సీతక్కలతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, ఎంపీ రేవంత్రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, జెట్టి కుసుమకుమార్ తదితరులు హాజరయ్యారు. రైతుబంధు సైతం అందలేదని, రుణమాఫీ అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న అంశంపై చర్చించిన నేతలు దీనిపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించారు. అసెంబ్లీలో మాట్లాడటానికి కోరినంత సమయం ఇవ్వకున్నా, మైక్ కట్ చేసి తమగొంతు నొక్కాలని ప్రయత్నించినా రోడ్లెక్కి ఆందోళన కొనసాగించాలనే అభిప్రాయానికి వచ్చారు. ముఖ్యంగా రైతులు యూరియా కొరతను ఎదుర్కొంటున్నా.. ప్రభుత్వం స్పందించిన తీరు బాగాలేదని, రైతుల మరణాన్ని కించపరిచేలా ప్రభుత్వం వ్యవహరించిందనే అభిప్రాయాలు ఈ సమావేశంలో వ్యక్తమయ్యాయి. భేటీ అనంతరం శ్రీధర్బాబు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. సంగారెడ్డి తాగునీటి సమస్యను పరిష్కరించకుంటే ఈ నెల 15న చలో అసెంబ్లీ నిర్వహిస్తామని జగ్గారెడ్డి హెచ్చరించారు. -
అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రజా దర్బార్
సాక్షి, అమరావతి: త్వరలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండడంతోపాటు ముఖ్యమంత్రిని కలుసుకునేందుకు వచ్చే ప్రజల కోసం ఇంకా కొన్ని సదుపాయాలు కల్పించాల్సి ఉండడంతో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశాయి. ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని, వారి సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాదర్బార్ను నిర్వహించ తలపెట్టిన సంగతి తెలిసిందే. శాసనసభ సమావేశాల తర్వాత ప్రజా దర్బార్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. జూలై 1వ తేదీ నుంచి ప్రజాదర్బార్ జరుగుతుందని మీడియాలో ప్రచారం సాగుతోందని, అది సరికాదని మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు మొదలైతే ముఖ్యమంత్రి ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకే అసెంబ్లీకి వెళ్లాల్సి ఉంటుందని, ఈలోగా ప్రజలను కలుసుకుని, విజ్ఞప్తులు స్వీకరించడం కష్టం అవుతుందని అన్నారు. ముఖ్యమంత్రిని కలుసుకోవడానికి వచ్చే ప్రజల కోసం మౌలిక వసతులు కల్పించాల్సి ఉందని, ఇతర ఏర్పాట్లు చేయాల్సి ఉందని, అవన్నీ పూర్తయ్యాక ప్రజా దర్బార్ ప్రారంభిస్తారని తెలిపారు. -
మొదట వైఎస్ జగన్ ప్రమాణం.. తరువాత చంద్రబాబు
సాక్షి, అమరావతి: తొలి క్యాబినెట్ సమావేశంతోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాశమంత ఎత్తుకి ఎదిగారని ప్రభుత్వ చీఫ్విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మేనిఫెస్టోను అమలు చేసే విధంగా తొలి క్యాబినెట్ సమావేశంలోనే చర్యలు తీసుకోవడం గర్వకారణన్నారు. మంగళవారం అమరావతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ అసెంబ్లీ తొలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభవుమతాయని వెల్లడించారు. తొలుత సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని, అనంతరం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేస్తారని తెలిపారు. గురువారం స్పీకర్ ఎన్నిక ఉంటుందని, 14న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారని చెప్పారు. సభను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహిస్తామని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత స్పీకర్, ప్రభుత్వంలా కాకుండా హుందాగా నిర్వహిస్తామన్నారు. ప్రతిపక్షాన్ని కూడా గౌరవించి సభలో అవకాశం ఇస్తామన్నారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష సభ్యులకు ఛాంబర్ కూడా ఇవ్వకుండా హేళన చేశారని, తమ ప్రభుత్వంలో అందరికీ సరైన ప్రాధాన్యం కల్పిస్తామని పేర్కొన్నారు. -
12 నుంచి అసెంబ్లీ
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించిన నేపథ్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి నూతన శాసనసభ తొలి సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో నూతనంగా ఎన్నికైన 175 మంది, అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. స్పీకర్ ఎన్నిక కూడా జరుగుతుంది. కాగా సమావేశాలు ప్రారంభానికి ముందే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారు. ఇప్పటికే ఆయన ఈ నెల 8వ తేదీ ఉదయం తొలుత సచివాలయంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అదే రోజున మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సచివాలయంలో జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణకు ఒక రోజు ముందుగా 7వ తేదీన వైఎస్సార్ ఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రివర్గ కూర్పు ఎలా ఉండబోతోందో వివరిస్తూ ఆ మరుసటి రోజున జరిగే విస్తరణపై ఎమ్మెల్యేలను మానసికంగా జగన్ సిద్ధం చేస్తారని పార్టీ వర్గాల సమాచారంగా ఉంది. 10న తొలి మంత్రివర్గ సమావేశం కొత్త మంత్రులతో ఏర్పడబోయే మంత్రివర్గ సమావేశం ఈ నెల 10వ తేదీన జరుగనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో 12 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ తొలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రభుత్వ పరంగా ప్రజలకు చేయాల్సిన దిశానిర్దేశం వంటి అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. తమ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలపడంతో పాటుగా వారికి ఇచ్చిన హామీల అమలుకు జగన్ ప్రభుత్వం ఎలా కట్టుబడి ఉందనే విషయంపై ఒక స్పష్టతను ఇస్తారని తెలుస్తోంది. -
వాళ్లపై వేటు వేసి మాట్లాడండి మిస్టర్ స్పీకర్!
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా చంద్రబాబు.. గవర్నర్ నరసింహన్తో పచ్చి అబద్దాలు చెప్పించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఈ ఐదేళ్లలో చేసినవి ఏమైనా ఉంటే అవి అవినీతి, మోసం, దగా, అన్యాయం మాత్రమేనని ధ్వజమెత్తారు. జపాన్, సింగపూర్ కంటే ఎక్కువ అభివృద్ధి సాధిస్తే రాష్ట్రంలో ఇంకా మూడొంతుల మంది ఎందుకు పేదరికంలో మగ్గిపోతున్నారని ప్రశ్నించారు. అసత్యాలతో కరపత్రాన్ని రాయించి గవర్నర్తో చదివించడం ప్రజల దురదృష్టమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య మూలసూత్రాలపై ఏమాత్రం నమ్మకం లేని చంద్రబాబు.. గవర్నర్తో ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పిన ‘సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు’ అనే మాటను చెప్పించడం సిగ్గుచేటన్నారు. రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కి 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా కొనుగోలు చేసి వారిలో నలుగుర్ని మంత్రులుగా చేసి కొనసాగిస్తున్న అసెంబ్లీని దయ్యాల కొంప అనుకోవాల్సిందేనా? అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. స్పీకర్ చక్కగా డ్రామా నడిపిస్తున్నారని, పదే పదే ఫోన్లు చేసి ప్రతిపక్షాన్ని ఆహ్వానిస్తున్నానని డ్రామాలాడుతున్నారని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ విరుద్ధంగా కొనుగోలు చేసిన 23 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే అదే గంటలో అసెంబ్లీకి వస్తామని స్పష్టం చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాలకు బుధవారం ఆమోదం తెలిపిన స్పీకర్కు ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు లేఖలు ఇస్తే పట్టించుకోలేదన్నారు. స్పీకర్ తన పోస్టుకు విలువ ఇవ్వకుండా పార్టీ కండువా వేసుకుని పార్టీ మీటింగ్స్లో మాట్లాడుతూ.. సీఎంను పొగడ్తలతో ముంచెత్తుతున్నారన్నారు. నాలుగేళ్లు ఎన్డీఏలో కొనసాగిన చంద్రబాబుకు రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు గుర్తుకు రాలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్తో జత కడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు చెప్పుకుంటున్న అభివృద్ధి రేటు పచ్చి అబద్దమన్నారు. ఉత్పత్తి రంగంలో దేశవ్యాప్తంగా 16.7 శాతం అభివృద్ధి ఉంటే ఏపీలో 9.66 శాతం ఉందని చెప్పారని, అంత వెనుకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ సర్వీస్ సెక్టార్లో 44 శాతం అభివృద్ధి ఎలా సాధించిందో చంద్రబాబుకే తెలియాలని ఎద్దేవా చేశారు. వ్యవసాయ రంగంలో కూడా ఆహార ఉత్పత్తులు గతంలో కంటే కూడా బాగా తగ్గాయన్నారు. వ్యవసాయాన్ని సర్వ నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. తన చుట్టూ ఉన్న ప్రజల అభివృద్ధి కోరుకోవాలని కానీ, ఎక్కడో నక్షత్రాల్లో అభివృద్ధి అంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. ఐదేళ్లలో విఫలమై.. ఇప్పుడు 2050 విజన్ అంటున్నారని ఎద్దేవా చేశారు. అవినీతిరహితంగా ఏపీ పాలన ఉందని చెప్పించడం సిగ్గుచేటు అన్నారు. ఈ ఐదేళ్లలో బడ్జెట్ కేటాయింపుల కంటే ఎక్కువగా దోపిడీ చేశారన్నారు. -
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా....?
సాక్షి, అమరావతి : ఈ నెల చివరన జరగాల్సి ఉన్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడినట్టు తెలుస్తోంది. సాధారణ ఎన్నికలకు ముందు చివరి అసెంబ్లీ సమావేశాలు జనవరి 30వ తేదీ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయని నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే పెన్షన్ల పంపిణీ, కొత్త పథకాల ప్రకటించిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణకు మరో నోటిఫికేషన్ విడుదల చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఫిబ్రవరి 4నుంచి 11వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. -
30 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: సాధారణ ఎన్నికలకు ముందు చివరి అసెంబ్లీ సమావేశాలు 30వ తేదీ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయని రాష్ట్ర గవర్నర్ నర్సింహన్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సమావేశాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 5వ తేదీన పూర్తి స్థాయి ఓటాన్ బడ్జెట్ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాలు వారం రోజుల పాటు నిర్వహించనున్నారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టే ఎత్తుగడలో భాగంగా పూర్తి స్థాయి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను రూ.రెండు లక్షల కోట్లకు పైగా అంచనాలతో రూపొందించనున్నారు. పలు రంగాలకు రూ.వేల కోట్లు కేటాయించినట్లు ప్రచారం చేసుకోవడమే ధ్యేయంగా బడ్జెట్ రూపకల్పన చేస్తున్నారు. అయితే పూర్తిస్థాయి బడ్జెట్లోనే ఏప్రిల్, మే నెలలకు ఓటాన్ బడ్జెట్కూ అసెంబ్లీ ఆమోదం తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల ముందు ఆయా రంగాలకు భారీ మొత్తంలో కేటాయించామనే ప్రచారం చేసుకునేలా బడ్జెట్ రూపకల్పన చేయాలని నిర్ణయించింది. -
అసెంబ్లీ భేటీ, భద్రతపై మండలి చైర్మన్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 17 నుంచి నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాలు, భద్రతా ఏర్పాట్లపై మండలి చైర్మన్ స్వామిగౌడ్ నేతృత్వంలోని బృందం సోమవారం సమీక్షించింది. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు, డీజీపీ మహేందర్రెడ్డి, నగర కమిషనర్ అంజనీకుమార్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉన్నతాధికారులు, ట్రాఫిక్, ఫైర్ విభాగాల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు అసెంబ్లీ, మండలి ప్రాంగణాలను పరిశీలించి సీఎం, వీఐపీల అలైంటింగ్ పాయింట్లు, వాటి భద్రత, అసెంబ్లీ లోపల, బయట ఎంత మంది సిబ్బందిని భద్రతలో నిమగ్నం చేయాలన్న దానిపై చర్చించారు. అదే విధంగా ట్రాఫిక్సమస్య తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ముందు జాగ్రత్తగా అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. -
సీఎల్పీ నేతగా ఎన్నికయ్యేదెవరో?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం ఈ నెల 16 లేదా 17న జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు 17 నుంచి జరగనున్న నేపథ్యంలో సమావేశాల ప్రారంభానికి ముందే సీఎల్పీ సమావేశం నిర్వహిస్తారని చెబుతున్నా.. 17న అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులుగా ప్రమాణం చేసిన అనంతరమే సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నట్లు గాంధీభవన్ వర్గాలంటున్నాయి. ఈ సమావేశానికి అధిష్టానం దూతగా కేరళకు చెందిన లోక్సభ సభ్యు డు, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ 15న రాత్రి హైదరాబాద్ రానున్నారు. ఈయన సమక్షంలో పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్నిక జరగనుంది. దీంతో సీఎల్పీ నేతగా ఎవరిని ఎన్నుకుంటారన్నది పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పార్టీ తరఫున గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డి, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్గా పనిచేసిన మల్లు భట్టి విక్రమార్క, మాజీ మం త్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, సబి తా ఇంద్రారెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, లోక్సభ సభ్యుడిగా, ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవమున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నా యి. వీరిలో ఉత్తమ్, భట్టిలను సీఎల్పీ నేతగా నియమించే విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. సీఎల్పీ రేసులో రాజగోపాల్రెడ్డి, శ్రీధర్బాబుల పేర్లూ వినిపిస్తున్నాయి. రాజగోపాల్రెడ్డి పేరును అధిష్టానం తీవ్రంగానే పరి శీలిస్తోందని, ఇందుకు తగినట్టు గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది మద్దతు కూడగట్టుకునే పనిలో రాజగోపాల్రెడ్డి కొంత చురుకుగానే ఉన్నారని ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ విప్ గా, శాసనసభా వ్యవహారాల మంత్రిగా పనిచేసిన అనుభవమున్న శ్రీధర్బాబు కూడా రేసు లో ముందున్నట్టు తెలుస్తోంది. సీఎల్పీ నేతగా మహిళకు అవకాశం ఇవ్వాలనుకుంటే సబితా ఇంద్రారెడ్డిని నియమించే అవకాశాలున్నాయి. మొత్తంగా సీఎల్పీ నేతగా ఎవరిని ఎన్నుకుంటా రనేది కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
సీఎం దుబాయ్ టూర్పై కొనసాగుతున్న అస్పష్టత
-
టూర్ ఉన్నట్టా? లేనట్టా..?
సాక్షి, హైదరాబాద్:రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దుబాయ్ పర్యటన విషయంలో అస్పష్టత కొనసాగుతోంది. ఈనెల 6 నుంచి 13వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో జరిగే అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సుకు ఆయన హాజరు కావాల్సి ఉంది. అయితే, ఈనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆయన దుబాయ్ పర్యటన లేనట్టేనని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేయాల్సి ఉండటంతో సమయాభావం ఏర్పడుతుందని, దీంతో ఆయన దుబాయ్కి వెళ్లకపోవచ్చని అంటున్నారు. దీనిపై సీఎం కార్యాలయ వర్గాలు మాత్రం ఇంతవరకు అధికారికంగా ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. మరోవైపు అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు కావడంతో కనీసం ఒక్కరోజయినా వెళ్లి ఆ సదస్సులో పాల్గొనే ఆలోచన కూడా ఉందనే చర్చ కూడా జరుగుతోంది. అన్ని అనుమతులు, ఉత్తర్వులు వచ్చాయి వాస్తవానికి, ఈనెలలో జరిగే పెట్టుబడిదారుల సదస్సుకు రావాలని కేసీఆర్కు గత ఏడాదిలోనే ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆ సదస్సుకు హాజరుకావాలని నిర్ణయించుకున్న కేసీఆర్ తన పర్యటనకు అవసరమైన దౌత్యపరమైన అనుమతులు కూడా తీసుకున్నారు. దుబాయ్, అబుదాబిల్లోని పారిశ్రామికవేత్తలతో భేటీతో పాటు దుబాయ్లోని తెలంగాణ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలపై భారత రాయబార కార్యాలయ అధికారులతో చర్చించాలని నిర్ణయించుకున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆయనతో పాటు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్లకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కానీ, అసెంబ్లీ సమావేశాల సమయంలోనే మంత్రివర్గ విస్తరణకు కూడా అవకాశం ఉండటంతో మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవా లన్న దానిపై తగిన కసరత్తు చేయాల్సి ఉన్నందున కేసీఆర్ దుబాయ్ వెళ్లకపోవచ్చని ప్రగతిభవన్ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ ఆఖరి నిమిషంలో వెళ్లాలని నిర్ణయించుకుంటే గనుక షెడ్యూల్ ప్రకారం కాకుండా కనీసం ఒక్కరోజు వెళ్లిరావచ్చని తెలుస్తోంది. మొత్తంమీద కేసీఆర్ దుబాయ్ పర్యటనపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
రెండో రోజు వర్షాకాల సమావేశాలు ప్రారంభం
అమరావతి: ఏపీ అసెంబ్లీలో రెండో రోజు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన హరికృష్ణతో పాటు మరో 8 మంది మాజీ శాసనసభ సభ్యులకు ఉభయసభలు సంతాపం తెలపనున్నాయి. డ్వాక్రా రుణాల మాఫీ, రాష్ట్రంలో భూముల పునఃపరిష్కార సర్వే, భాషా పండితుల పదవులస్థాయి పెంపు, చెరుకు రైతులకు విత్తనంపై సబ్బిడీ, పేదలకు ఇళ్లపట్టాలు, అంగన్వాడీ ఆయాల అర్హతలు, ఖాళీగా ఉన్న పదవుల భర్తీ, బనగానపల్లె నియోజకవర్గంలో రాళ్ల పేల్చివేత కార్యకలాపాలు, గ్రామీణ, పట్టణ గృహ నిర్మాణ పథకం, రాష్ట్రంలో పడిపోతున్న విద్య నాణ్యత, నీటిపారుదల రంగం వంటి అంశాలు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు రానున్నాయి. అలాగే విశాఖపట్నం జిల్లాలో దివీస్ ఫార్మా వల్ల కాలుష్యం, ఎన్టీఆర్ విద్యోన్నతి, నిరుద్యోగ భృతి, న్యాయవాదుల సంక్షేమం, ఉపాధి కల్పనా కేంద్రాలు, మహిళలపై దురాగతాలు, ఎంజీఎన్ఆర్ఈజీ నిధులు, అనంతపురం జిల్లాలో ఎంజీఎన్ఆర్ఈజీ అవినీతి, కాకినాడలో హార్వర్డ్ పార్క్, పెండెకల్లులో పీహెచ్సీ, రాజధాని నగర అభివృద్ధి వంటి అంశాలు శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు రానున్నాయి. -
ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేకుండానే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి. తమ పార్టీ నుంచి అధికార టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయనందుకు నిరసనగా గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి వెఎస్సార్సీపీ సభ్యులు సభకు హాజరుకాని విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అన్హరత వేటు వేస్తే.. ఆ వెంటనే అసెంబ్లీకి హాజరవుతామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బుధవారం ప్రకటించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోనందున గురువారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రెండోసారి ప్రధాన ప్రతిపక్షం లేకండానే ప్రభుత్వం ఏకపక్షంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనుంది. ఉదయం 8.30 గంటలకు బీఏసీ భేటీ గురువారం ఉదయం 9.15 గంటలకు శాసన సభ సమావేశాలు, 9.45 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అంతకు ముందు ఉదయం 8.30 గంటలకు శాసనసభా వ్యవహారాల కమిటీ(బీఏసీ) సమావేశమై ఎప్పటి వరకు సమావేశాలు నిర్వహించాలో నిర్ణయించనుంది. మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి మృతికి గురువారం ఉభయ సభల్లో నివాళులు అర్పించనున్నారు. మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ మృతి పట్ల శుక్రవారం నివాళులు అర్పిస్తారు. పటిష్ట బందోబస్తు అసెంబ్లీకి వచ్చే ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు, భద్రతా సిబ్బంది మర్యాదపూర్వకంగా నడుచుకోవాని స్పీకర్ కోడెల స్పష్టం చేశారు. అసెంబ్లీ చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, గట్టి నిఘా పెట్టాలని సూచించారు. విజిటర్స్ గ్యాలరీపైనా కన్నేసి ఉంచాలన్నారు. విజిటర్లకు ఇచ్చే పాస్లను క్షుణ్నంగా పరిశీలించాకే లోపలికి అనుమతించాలని స్పీకర్ ఆదేశించారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానాలేవీ? అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మండలి చైర్మన్ ఎన్ఎండీ ఫరూక్ కలిసి బుధవారం బందోబస్తు ఏర్పాట్లు, సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోడెల మాట్లాడుతూ.. ఇవే చివరి పూర్తిస్థాయి అసెంబ్లీ సమావేశాలు కావొచ్చని చెప్పారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా మంత్రులు ఇచ్చిన సమాధానాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదనే ఆరోపణలున్నాయన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఆరోపణలకు తావివ్వరాదని అధికారులకు సూచించారు. అత్యధికంగా రెవెన్యూ, విద్య, వైద్యం, ఆరోగ్యం, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, పురపాలక శాఖల్లో ప్రశ్నలకు సమాధానాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. మండలి చైర్మన్ ఫరూక్ మాట్లాడుతూ.. ఇంతవరకూ జరిగిన 11 సెషన్లకుగాను 792 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉందన్నారు. -
వారిపై వేటేయండి.. నేటి నుంచే సభకు వస్తాం
సాక్షి, అమరావతి: తమ పార్టీ నుంచి అధికార అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలను శాసనసభా సభ్యత్వాల నుంచి తక్షణం అనర్హులుగా ప్రకటిస్తే తాము గురువారం నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలకు హాజరవుతామని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. ఈ మేరకు వారు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక బహిరంగ లేఖ రాశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్య దేవాలయంలో ఉంటున్న దొంగ సొత్తు లాంటి వారని, వారిని ఈరోజే బయట పడేయాలని కోరారు. ఫిరాయింపుదారుల అనర్హత మాట ఎత్తని స్పీకర్ తమను మాత్రం శాసనసభా సమావేశాలకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్పీకర్ అధికార పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తూ, ప్రతిపక్ష అణచివేయడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని దుయ్యబట్టారు. స్పీకర్ను మీ(చంద్రబాబు) చెప్పు చేతల్లో ఉంచుకుని, సొంత పార్టీ కార్యకర్తగా వాడుకుంటున్నందున ఈ లేఖను మీకు రాయాల్సి వస్తోందని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాసిన లేఖ పూర్తి పాఠం... ‘‘అసెంబ్లీ సమావేశాలకు మా పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కావాలని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన విజ్ఞాపన నేపథ్యంలో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాం. పార్టీ ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలను అధికార పక్షం సీట్లలో కూర్చోబెట్టి సభను నడుపుతున్న స్పీకరు గారు, వారిని ఏళ్ల తరబడి పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి కాపాడుతున్న స్పీకరు గారు ప్రజాస్వామ్య ధర్మపన్నాలు వల్లించడం చూసిన తరవాత ఈ బహిరంగ లేఖ రాస్తున్నాం. గురువారం నుంచి మీరు నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాలకు మేం హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజే ఫిరాయింపు మంత్రులు నలుగురిని, ఫిరాయింపు ఎమ్మెల్యేలు 22 మందిని తక్షణం పదవుల నుంచి తొలగించండి. ప్రజాస్వామ్య దేవాలయంలో ఉన్న మీ దొంగసొత్తును ఈరోజే బయటపడేయండి. ఇదే విషయాన్ని 2017 అక్టోబరులో శాసనసభ సమావేశాల సందర్భంగా చెప్పాం. మరోసారీ చెపుతున్నాం. ఈరోజే వారిని తొలగించండి. రేపటి నుంచి సమావేశాలకు తప్పక హాజరవుతాం. భారత ప్రజాస్వామ్యానికి మన పార్లమెంట్ ప్రతీక అయితే... రాష్ట్రంలో ప్రజలెన్నుకున్న ప్రతినిధులతో ఉన్న అసెంబ్లీ రాష్ట్రస్థాయిలో ప్రజాస్వామ్యానికి దేవాలయం. అటువంటి ప్రజాస్వామ్య దేవాలయాన్ని దయ్యాల కొంపగా మార్చి, మా శాసనసభ్యుల్లో 22 మందిని విడతలవారీగా కొనుగోలు చేసి, పార్టీ మార్చి మీ అధికార పక్షం సీట్లలో కూర్చోబెట్టుకుని, వారిలో నలుగురితో మంత్రులుగా ప్రమాణం చేయించి, వారితో మమ్మల్ని తిట్టించడానికి సిద్ధమైన మీరు నడుపుతున్న సభను ఏ ప్రమాణాల్లో అయినా ఎవరైనా శాసనసభ అంటారా? మీరు సభలో చేస్తున్నది ప్రజాస్వామ్య దేవత మీద అఘాయిత్యం కాదా? అలవాటుపడిన హంతకుడికి రానురానూ తాను చేసే హత్యలు మామూలు విషయంగా మారిపోతాయన్నట్టు ఏకంగా మీ మామ నుంచే ముఖ్యమంత్రి పదవి, పార్టీ, పార్టీ అధ్యక్ష పదవి, పార్టీ గుర్తు, ఎన్నికల గుర్తు, ట్రస్టు వంటివన్నీ లాక్కుని, ఆయన కుటంబాన్ని ముక్కలు చేసి ముఖ్యమంత్రి అయిన మీ ముందు... పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన చట్టాలూ, ప్రజాస్వామ్య సూత్రాలూ, రాజ్యాంగ నియమాలూ మాట్లాడటం దయ్యాల ముందు వేదాలు వల్లించడం లాంటిదే. ఒక పార్టీ నుంచి ఎన్నికైన శాసనసభ్యుడు ఆ తరవాత తన పార్టీకి కాకుండా వేరే పార్టీకి విధేయత చూపినట్టు ఆధారాలున్న మరుక్షణం అటువంటి శాసనసభ్యుడిని అనర్హుడిగా చేయాలని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం(రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్) స్పష్టం చేస్తోంది. ఈ అధికారాన్ని రాజ్యాంగం శాసన సభాపతి చేతిలో పెట్టింది. ఫిరాయించిన వారి శాసన సభ్యత్వాన్ని తక్షణం రద్దు చేయడానికి తన చేతిలోకి వచ్చిన ఈ అధికారాన్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే వ్యవహరిస్తున్న కోడెల శివప్రసాదరావు గారు, ఫిరాయింపుదార్ల సభ్యత్వాలు రద్దు చేయకుండా మీ తరఫున అడ్డుపడేందుకు తనకున్న అధికారాన్ని మార్చుకుని శాసన సభ గౌరవాన్ని, రాజ్యాంగాన్ని పాతిపెడుతుంటే... మేం అలాంటి సభకు రాలేమని స్పష్టం చేశాం. 2016 ఫిబ్రవరి నుంచి 2017 మార్చి వరకు విడతలవారీగా 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల్ని తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయింపజేశారు. ఒక్కొక్కరికీ రూ.30 కోట్ల వరకు లంచంగా ఇచ్చి మరీ ఈ కొనుగోళ్లకు పాల్పడ్డారు. ఆ శాసన సభ్యుల డిస్క్వాలిఫికేషన్కు ఎప్పటికప్పుడు మా పార్టీ తరఫున స్పీకరుకు నివేదించాం. 2017 మార్చి 27న ఒకసారి, 2017 నవంబరు 8న మరోసారీ స్పీకరుకు డిస్క్వాలిఫికేషన్ వేటు వేయండని విజ్ఞప్తి చేశాం. మీరు ఆడమన్నట్టు ఆడటానికి, మీ కనుసైగల్ని ఆదేశాలుగా తీసుకునేందుకు అలవాటుపడిన స్పీకరు గారు చట్టం, రాజ్యాంగం కంటే మీ పట్ల విధేయతను గొప్పదిగా భావించటం వల్లే ఈ రోజుకీ ఆ 22 మందిమీదా అనర్హత వేటు పడలేదు. అంతేకాకుండా, శాసనసభ జాబితాలో వారిని మా పార్టీ సభ్యులుగా చూపుతూ మరోవంక అధికార పక్షం బెంచీల్లో కూర్చోబెట్టే దుర్మార్గాన్ని కొనసాగిస్తున్నారు. శాసనసభ పవిత్రతను మంటగలపడంలో మీ కౌరవ పటాలంలో ఎవరు తక్కువ తిన్నారు గనక? రాజ్యాంగబద్ధంగా ఉన్నత పదవిలో ఉంటూ కూడా మీ ఫొటోలకు పాలాభిషేకాలు– మీకు పాదాభిషేకాలూ చేస్తే తప్ప వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కూడా దక్కదనుకునే అర్భకులు, ఎన్టీఆర్ వెన్నుపోటులో మీ పార్ట్నర్ అయిన పన్నుపోటు శాఖ మంత్రిగారు, నిలువు మార్గంలో లోపలికి ప్రవేశించలేడని నిర్ణయించుకుని అడ్డదారిలో మీరు సభలోకి నెట్టిన మీ పుత్రరత్నం గారు, వీరికి తోడు మా పార్టీలో గెలిచి మీ మంత్రి మండలిలో చేరిన దుష్ట చతుష్టయం, వీరందరూ చాలరన్నట్టు– వారివారి శాఖల్లో కాక, కేకల్లో బూతుల్లో మీరు శిక్షణ ఇచ్చి పంపిన పటాలం... వీరందరికీ తమరి అమోఘమైన నాయకత్వం! శాసనసభను ఇంతగా గబ్బు పట్టించిన వారు ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో మరొకరున్నారా చంద్రబాబు గారూ? గుంటూరులో మీరు ఇటీవల పెట్టిన ‘నారా హమారా’ సభలో నిండా ముప్పయ్యేళ్ళు లేని 10 మంది ముస్లిం యువకులు లేచి, అయ్యా... 2014 ఎన్నికల్లో మీ వాగ్దానాల సంగతేమిటని ప్రశ్నిస్తే సమాధానం నోటితో చెప్పటం చేతగాని మీరు, శాసనసభలో నిజాయతీగా ప్రజల తరఫున సంధిస్తున్న మా ప్రశ్నలకు సమాధానం చెప్పగలరని ఎవరు అనుకుంటారు? గత నాలుగేళ్ళలో శాసన సభలో మీరు ఏనాడు ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగారు? మేం నిరంతరం ప్రజల్లోనే ఉన్నాం... ఉంటాం. మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి నవంబరు నుంచి నేటి వరకు 2,900 కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా ప్రజల్లోనే ఉంటూ, ప్రజలకు భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. మరి మీరేం చేస్తున్నారు? కమీషన్ పద్ధతిలో భూ కేటాయింపుల కోసం కేబినెట్ మీటింగులు, లంచాల కోసం సెక్రెటేరియట్లో సిట్టింగులు, మనీలాండరింగ్ కోసం విదేశీ పర్యటనలు... ఇదే కదా మీ పరిపాలన? ఇవన్నీ అందరికీ తెలిసినా మీ మాజీ పార్ట్నర్లు, కాబోయే పార్ట్నర్లతో మేం శాసనసభనుంచి పారిపోయాం అని మమ్మల్ని విమర్శిస్తూ మీ స్క్రిప్టును వారితో పలికిస్తున్నారు. ఆ నలుగురు మంత్రులను, 22 మంది ఎమ్మెల్యేలను వెంటనే తొలగించండి. చట్టసభలోనే చట్టానికి విలువలేనప్పుడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎలా వెళ్తారు? స్పీకరే రాజ్యాంగ భక్షకుడిగా పార్టీ ఫిరాయింపులకు కొమ్ముగాస్తుంటే ఇంకెక్కడి శాసన సభ? కళ్లెదురుగా కనిపిస్తున్నా, స్పీకర్ ఏళ్ల తరబడి ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోకపోవడం ఏమిటి? ఇది పరమ దుర్మార్గం, ఇది అప్రజాస్వామికం అని ఉద్యమించాల్సిన పక్షాల్ని, ఎల్లో మీడియాని మీ బిస్కెట్లకు అలవాటు చేసి వారిని మా మీదకు ఉసిగొల్పుతున్నారు. ప్రజల సమస్యల మీద చర్చించే ధైర్యం గానీ, సత్తా గానీ ఉంటే వెంటనే ఆ నలుగురు మంత్రుల్ని, 22 మంది ఎమ్మెల్యేల్ని డిస్క్వాలిఫై చేయండి. చేసిన దుర్మార్గానికి లెంపలు వేసుకుని ప్రజలను క్షమాపణ అడగండి. ఇవేవీ చేతగావనుకుంటే, మీ ఎల్లో మీడియా, మీ మాజీ–తాజా పార్ట్నర్ల అండదండలతో, మీ పుత్రరత్నం ఆకాంక్షలకు అనుగుణంగా మీ దుశ్శాసన సభను మీకు నచ్చినట్టుగా నడుపుకోండి. రాష్ట్రంలో ఉన్న మేధావులు, ఆలోచనపరులు, బాధ్యతగల ప్రతి ఒక్కరూ మేం రాసిన ఈ ఉత్తరంలోని అంశాలమీద ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం. ఇట్లు... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు -
వచ్చే నెల 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు!
సాక్షి, అమరావతి: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను వచ్చే నెల ఆరో తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. వారం నుంచి పదిరోజులపాటు సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. తాత్కాలిక సచివాలయంలో మంగళవారం జరిగిన శాఖాధికారులు, విభాగాధిపతుల సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని సూచనప్రాయంగా తెలిపారు. వాస్తవానికి ఈ నెలలోనే సమావేశాలు నిర్వహించాలని భావించినా పలు కారణాల వల్ల సాధ్యం కాలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నిబంధనల ప్రకారం కనీసం ఆరు నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకూ సమావేశాలు జరిగాయి. ఆరు నెలలు కావస్తుండడంతో మళ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఇన్నాళ్లూ బీజేపీ నేతలు నిద్రపోయారా?
బెంగళూరు: ‘ఐదేళ్లుగా బీజేపీ నిద్రపోయిందా? గత 15 అసెంబ్లీ సమావేశాల్లో ఈ నిధులపై లెక్కలు చూపిన సమయంలో వారు నిద్రపోయారా? ప్రజలను మోసం చేయడం మానండి. పదేపదే అబద్ధం చెబితే నిజం కాబోదు..’అంటూ బీజేపీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మండిపడ్డారు. కేంద్రం నుంచి అందిన దాదాపు రూ.2,19,506 కోట్ల నిధులకు లెక్కలు చెప్పాలని ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్షా డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. గత ఐదేళ్లలో కేంద్రం నుంచి అందిన నిధుల్లో ప్రతి రూపాయికీ అసెంబ్లీలో లెక్క చూపామని సిద్దరామయ్య స్పష్టం చేశారు. ఈ విషయం బీజేపీకి చెందిన ప్రతిపక్ష నేత జగదీష్ షెట్టర్కు కూడా తెలుసునని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు అమలు కోసం రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కేంద్రం కోత విధించిందని ఆరోపించారు. -
మనం దేశానికే ఆదర్శం
సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోందని, కొత్త రాష్ట్రమైనా దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతోందని, ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభు త్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు శాతంగా ఉన్న తెలంగాణ ప్రాంత స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి 2016–17 నాటికి 8.6 శాతానికి పెరిగిందని.. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువని తెలిపారు. సోమవారం రాష్ట్ర శాసనమండలి, శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలిరోజున గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. శాసనసభ సమావేశాలు నిర్మాణాత్మకంగా జరుగుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఇరవై నిమిషాల పాటు ఇంగ్లిష్లో మాట్లాడిన ఆయన.. చివరిలో కొద్దిసేపు తెలుగులో మాట్లాడి, ‘ఓం సర్వే భవంతు సుఖినాః.. సర్వే సంతు నిరామయః’అనే శ్లోకంతో ప్రసంగాన్ని ముగించారు. గవర్నర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. బంగారు తెలంగాణ దిశగా.. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రైతులకు గోదావరి, కృష్ణా జలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. కోటి ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి చర్యలు చేపట్టాం. ముఖ్యంగా కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. మిషన్ భగీరథ ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాం. ఉత్తమ పారిశ్రామిక విధానంతో.. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం. టీఎస్ ఐపాస్తో కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నాం. ఈ విధానంతో రాష్ట్రానికి 1.18 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఐటీ పరిశ్రమలకు హైదరాబాద్ కేం ద్రంగా మారింది. టీ–హబ్తో స్టార్టప్లను ప్రో త్సహిస్తున్నాం. టీహబ్–2ను ప్రారంభిస్తాం. ప్రభుత్వ వైద్యానికి చేయూత కేసీఆర్ కిట్ పథకానికి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇది అమల్లోకి వచ్చాక ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు 33 శాతం నుంచి 49 శాతానికి పెరిగాయి. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు ‘తెలంగాణకు హరితహారం’కార్యక్రమా న్ని ప్రారంభించాం. నాణ్యమైన విద్య అందించేందుకు 517 గురుకులాలు ప్రారంభించాం. ఎస్టీల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నాం. రహదారుల అభివృద్ధికి చర్యలు ప్రభుత్వం రవాణా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. జాతీయ రహదారులను జిల్లా, మండల రహదారులతో అనుసంధానం చేస్తు న్నాం. గతేడాది హైదరాబాద్ మెట్రోరైల్ కూడా ప్రారంభమైంది. పీపీపీ పద్ధతిలో చేపట్టిన ఈ ప్రాజెక్టు తొలిదశలో 30 కిలోమీటర్ల మార్గం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. తెలుగు భాషను, సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తెలుగు ప్రపంచ మహాసభలను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం తెలుగు భాష, సాహిత్యాన్ని చాటింది. 8 వేల మంది ప్రతినిధులు సభలకు హాజరయ్యారు. ప్రభుత్వం బంగారు తెలంగాణ లక్ష్యాన్ని సాధించే దిశగా చిత్తశుద్ధితో ముందుకు సాగుతోంది. ఉభయ సభల్లో చర్చలు మన ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయని ఆశిస్తున్నా..’’ రైతుల సంక్షేమానికి చర్యలు రాష్ట్రంలో అధిక జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. అందువల్లే ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తోంది. 23 లక్షల పంపుసెట్లకు నిరంతర విద్యుత్ ఇస్తున్నాం. త్వరలో కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తాం. భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం విజయవంతమైంది. ఈ రికార్డుల సమాచారంతో త్వరలోనే ధరణి వెబ్సైట్ను ప్రారంభించనున్నాం. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకం విజయవంతంగా సాగుతోంది. రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తున్నాం. గొల్ల, కురుమలకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలు పంపిణీ చేస్తున్నాం. విద్యుత్ రంగంలో ప్రగతి సాధించాం. పరిశ్రమలకు పవర్ హాలిడేలను ఎత్తివేశాం. సౌర విద్యుదుత్పత్తిలో దేశంలోనే ముందున్నాం. -
మరో 3 రోజులు అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు మరో మూడు రోజుల పాటు నిర్వహించ నున్నట్లు మంత్రి కాల్వ∙శ్రీనివాసులు వెల్లడించారు. శాసనసభాపతి కోడెల శివ ప్రసాదరావు అధ్యక్షతన శాసనసభలోను, మండలి చైర్మన్ ఎన్ఎండీ ఫరూక్ అధ్యక్ష తన శాసన మండలిలోను మంగళవారం జరిగిన బీఏసీ సమావేశం నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ నెల 29, 30 తేదీల్లోను, వచ్చే నెల 2న సభలో చర్చించాల్సిన అంశాలను నిర్ణయించినట్టు వివరించారు. -
సొంత డబ్బాతో తొలిరోజు సరి!
-
సొంత డబ్బాతో తొలిరోజు సరి!
సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఆప్రజాస్వామిక తీరును నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హాజరుకాని నేపథ్యంలో.. శుక్రవారం నుంచి ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తొలిరోజు కీలకమైన ప్రజాసమస్యల ప్రస్తావనేదీ లేకుండానే ముగిసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. రైతులు, డ్వాక్రా రుణాల మాఫీ చేయాలని.. యువతకు ఉద్యోగ–ఉపాధి అవకాశాలు కల్పించాలని, పార్టీ ఫిరాయించిన వారిని తక్షణమే అనర్హులుగా ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నెరవేర్చడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఆ పార్టీ అసెంబ్లీని బహిష్కరించి పాదయాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్లింది. సమస్యలను పరిష్కరించి ప్రజలకు మేలు చేయాల్సిన ప్రభుత్వం వాటిని విస్మరించి ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించింది. సమావేశాల తొలి రోజున ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలుకొని చివరి వరకు ప్రభుత్వానికి వత్తాసుగానే తప్ప ప్రజలకు మేలు చేసే ఏ విధమైన చర్చ లేకుండాపోయింది. అనేక అక్రమాలకు ఆలవాలంగా మారి దాదాపు రూ.353 కోట్ల మేర అవినీతి జరిగిందని సాక్షాత్తూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తప్పుబట్టిన పట్టిసీమ ప్రాజెక్టుపై వచ్చిన ప్రశ్నను స్వల్పకాలిక చర్చగా మార్చి ప్రభుత్వానికి కితాబులిచ్చే దిశగా ప్రసంగాలు కొనసాగాయి. ప్రధాన ప్రతిపక్షం లేక సభ వెలవెల రాష్ట్రంలో తొలిసారిగా ప్రధాన ప్రతిపక్షం లేకుండా ప్రారంభమైన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు తొలిరోజునే వెలవెలబోయాయి. అధికారపక్ష సభ్యుల్లోనూ ఈ తేడా కొట్టొచ్చినట్లు కనిపించింది. ప్రధాన ప్రతిపక్షం లేకుండా ఇవేం సమావేశాలంటూ పలువురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు పెదవి విరిచారు. ‘‘ప్రధాన ప్రతిపక్షం హాజరై ప్రజాసమస్యలు ప్రస్తావించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దానిపై చర్చ జరిగి సభలో ఒక హుందాతనం ఏర్పడేది. ఈసారి అలాంటి పరిస్థితి లేనందున సమావేశాలు చప్పచప్పగా అనిపిస్తున్నాయి. ఏదో మా డప్పు మేము కొట్టుకోవడానికే తప్ప ఇవేవీ ప్రజాసమస్యల పరిష్కారానికి పనికి వచ్చేవిగా కనిపించడం లేదు’’ అని సీనియర్ శాసనసభ్యులు కొందరు వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం లేకుండా సాగిన సభ కళ లేకుండాపోయిందని పలువురు అభిప్రాయపడ్డారు. విపక్షం లేకపోయినా సీఎం దిశానిర్దేశం ఇదిలా ఉంటే.. వైఎస్సార్సీపీ అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ ప్రకటన చేసినప్పటికీ.. వ్యూహ కమిటీ సమావేశమంటూ సభ ప్రారంభానికి ముందే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హడావుడి చేశారు. ప్రతిపక్షం హాజరయ్యేలా ప్రయత్నించి సభను సజావుగా నిర్వహించాల్సిన ఆయన ఆ బాధ్యతను పట్టించుకోకుండా ప్రతిపక్షంగా మనమే వ్యవహరిద్దామంటూ సమావేశంలో టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేయడం విశేషం. ఆ తరువాత మంత్రులను నిలదీయండంటూ తన ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారని బయటకు లీకులిప్పించారు. అయితే.. సభలో మాత్రం అలాంటి సన్నివేశాలు ఏ దశలోనూ కనిపించలేదు. సభ ప్రారంభానికి ముందు సభా వ్యవహారాల కమిటీ సమావేశం మొక్కుబడిగా ముగిసింది. ఇందులో వైఎస్సార్సీపీపై విమర్శలకే అధికారపక్ష నేతలు ఎక్కువ సమయం కేటాయించారని సమాచారం. ప్రజా సమస్యల ప్రస్తావన ఏదీ? ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో శుక్రవారం ప్రారంభమైన సభ.. ప్రభుత్వానికి, అధినేత చంద్రబాబునాయుడికి జేజేలు పలకడమే తప్ప ఏ సమయంలోనూ ప్రజాసమస్యల ప్రస్తావన కనిపించలేదు. మొదటి ప్రశ్నగా పట్టిసీమ ప్రాజెక్టుపై దాదాపు అరగంటసేపు చర్చ సాగించారు. ఈ పథకంలో జరిగిన అవినీతి అక్రమాల సంగతిని ప్రస్తావనకు లేకుండా కేవలం నదుల అనుసంధానం చేసిన అపర భగీరధుడిగా చంద్రబాబును కీర్తించే చర్చగా మార్చేశారు. దీనిపై మరింత లోతుగా మాట్లాడాల్సి ఉందని బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్రాజు ప్రతిపాదించగా మంత్రి యనమల రామకృష్ణుడు స్వల్పకాలిక చర్చను చేపట్టాలని సూచించారు. దీంతో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ తరువాత పట్టిసీమపై స్వల్పకాలిక చర్చను దాదాపు రెండు గంటలపాటు కొనసాగించారు. పట్టిసీమను చేపట్టిన చంద్రబాబును అభినందిస్తూ ప్రత్యేక తీర్మానం చేయాలని బీజేపీ ప్రతిపాదించడం విశేషం. అంబేద్కర్ స్మృతివనం, అమృత్ పథకం అమలు, ఎన్టీఆర్ పట్టణ గృహనిర్మాణ పథకం, చంద్రన్న బీమా, గిరిజన గ్రామాలకు రవాణా సదుపాయాలు, గ్రామ పంచాయతీలకు భవనాలు అనే అంశాలపై ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. -
సభ ఎన్నాళ్లు?: ఎమ్మెల్యే అక్బరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: ‘‘ఈ సభ ఎన్ని రోజులు జరుగుతుందో ఎవరికీ తెలియదు. 15రోజులా.. 20 రోజులా లేక 25 రోజులా? ఎన్నిరోజులో తెలియకుండానే సభ నిర్వహ ణేంటి? బిల్లులు ఎప్పుడు ప్రవేశపెడతారు?’’అని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ నిలదీశారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. ఒక చిన్న ప్రశ్నకు అధికార పక్షం సుదీర్ఘంగా మాట్లాడుతూపోతే ప్రశ్నలు ఇచ్చిన తాము ఏం కావాలని ప్రశ్నించారు. సభలో ప్రతిపక్షాలకు ఒక రూలు, అధికార పక్షానికి మరో రూలా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది ప్రభుత్వ వ్యూహమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సభ నిర్వహణపై బీఏసీని పిలవాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకు సమ్మతించిన సభాపతి బీఏసీని పిలుస్తానని హామీ ఇచ్చారు. ఎన్ని రోజులైనా చర్చకు సిద్ధం: ఈటల ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ సభలో ఎన్ని రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమైన ప్రశ్నలుండగా సమయం మించిపోతే ‘డీమ్డ్ టు బీ ఆన్సర్డ్’అంటూ వదిలేయడం తగదని, వాటిని వాయిదా వేసి తర్వాత అవకాశం కల్పించాలన్నారు. మేడారం జాతరను కుంభమేళ తరహాలో కేంద్రం జాతీయ పండుగగా గుర్తించేలా సిఫార్సు చేయాలంటూ పలువురు సభ్యులు చేసిన సూచనపై ఈటల స్పందిస్తూ మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని సభ ద్వారా తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామన్నారు. గిరిజన దేవాలయాలకు పూజారులుగా పనిచేసే వారికి వేతనాలు ఇవ్వాలని బీజేఎల్పీ నేత కిషన్రెడ్డి కోరగా ఈ అంశం సీఎం దృష్టిలో ఉందన్నారు. -
సభ ఎన్నిరోజులో ఎవరికీ తెలియదు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాలు ఎన్నిరోజులు జరుగుతాయో ఎవరికీ తెలియదని బీజేపీ ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామిక సంప్రదాయాలు, శాసనసభ వ్యవహారాల సలహా సంఘం అంటే ప్రభుత్వానికి లెక్కలేకుండా పోయిందని విమర్శించారు. ఒక్కసభా నాయకునికి మాత్రమే సభను ఎన్నిరోజులు నడుపుతారో తెలిసినట్టుందన్నారు. ముఖ్యమైన అంశాలను చర్చించకుండా అధికారపార్టీ సభ్యులు సభను ఏకపక్షంగా నడిపించుకుంటున్నారని అన్నారు. వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఫసల్ బీమా యోజనను అమలు చేయడంలేదని, నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలేదని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. -
27 నుంచి తెలంగాణ అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ, మండలి శీతాకాల సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఈ నెల 27 నుంచి సమావేశాలు నిర్వహించాలని అసెంబ్లీ కార్యదర్శికి ప్రతిపాదనలు పంపింది. 26న బీఏసీ సమావేశం నిర్వహించి, ఎన్ని రోజులు సభ జరపాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై మంగళవారం ప్రగతిభవన్లో సీఎం కె.చంద్రశేఖర్రావుతో వ్యూహ కమిటీ భేటీ అయింది. నెలరోజుల పాటు సమావేశాలు నిర్వహించేలా ప్రతిపాదించాలని.. 15 నుంచి 20 రోజుల పాటు పనిదినాలు ఉండేలా షెడ్యూల్ ఖరారు చేసేలా కోరాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రభుత్వం తరఫున ఈ ప్రతిపాదనను అసెంబ్లీ కార్యదర్శికి పంపించాలని సూచించారు. శాసనసభ ఎన్ని రోజులు జరిగితే.. అన్ని రోజులు మండలి కూడా జరపాలని అన్నారు. శాసనసభలో చర్చ జరిగిన ప్రతి అంశంపైనా మండలిలోనూ చర్చ జరగాలన్నారు. అన్ని అంశాలపై చర్చ ప్రజలకు సంబంధించిన అన్ని విషయాలపై కూలంకషంగా చర్చ జరగాలని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘అసెంబ్లీ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చ జరగాలి. సభ్యులు లేవనెత్తే ప్రతి అంశంపై జవాబు చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధం. ప్రజలకు అన్ని విషయాలను అసెంబ్లీ ద్వారా వివరించాలి. దీనికోసం మంత్రులు సిద్ధం కావాలి. ప్రతిపక్ష సభ్యులు ఏ అంశంపై ఏ ప్రశ్నలు వేసినా ప్రభుత్వం నుంచి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల సంక్షేమం కోసం దేశంలో మరెక్కడా అమలు చేయని ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. వాటి గురించి వివరించాలి. సభ్యుల సందేహాలను నివృత్తి చేయాలి. విలువైన సూచనలు స్వీకరించాలి. అంతిమంగా అసెంబ్లీ నుంచి ప్రజలకు కావాల్సిన సమాచారం పోవాలి. ఎన్ని రోజులు సభ నిర్వహించడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నెల రోజుల పాటు సభ నిర్వహించాలని అధికార పక్షం నుంచి కోరదాం. ప్రతిపక్ష సభ్యులు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సభ నిర్వహించడానికి అభ్యంతరం లేదు. సభ హుందాగా నడవాలి. ప్రతీ అంశంపై చర్చ జరగాలి..’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక మాతృభాష పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైనా అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగాలని ఆకాంక్షించారు. ఇంటర్ వరకు కచ్చితంగా తెలుగు ఒక సబ్జెక్టుగా ఉండాలన్న నిబంధనతో మాతృభాష పరిరక్షణ జరగడంతో పాటు అనేక మంది తెలుగు పండిట్లకు ఉద్యోగావకాశం కూడా లభిస్తుందన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో కూడా తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించనున్నట్లు వెల్లడించారు. స్పష్టమైన తీర్మానాలు చేయాలి ప్రస్తుత సమావేశాలు చాలా ముఖ్యమై నవిగా భావించాలని, ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై మంత్రులు స్పష్టమైన ప్రకటనలు చేయాలని కేసీఆర్ సూచించారు. వివిధ అంశాలపై సభ్యులందరూ మాట్లాడేలా కూలంకషంగా చర్చ జరగాలని, కొన్ని బిల్లు లను ఆమోదించుకోవాలని చెప్పారు. ఇక అసెంబ్లీలో గతంలో అనేక అంశాలపై తీర్మా నాలు చేసి కేంద్రానికి పంపినా.. అక్కడి నుంచి స్పందన రాలేదన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్, హైకోర్టు విభజన, ఎస్టీ, మైనారిటీలకు రిజర్వేషన్ల పెంపు, సింగరేణి ఉద్యోగులకు ఆదాయపన్ను మినహాయింపు, ఉపాధి హామీ పనులను వ్యవసాయంతో అనుసంధానం చేయడం, తెలంగాణలో ఎయిమ్స్ స్థాపన తదితర అంశాలపై కేంద్రాన్ని కోరుతూ మరోసారి అసెంబ్లీ గట్టిగా కోరాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. ఈ మేరకు మరోసారి తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాలని, ఒత్తిడి పెంచాలని పేర్కొన్నారు. కాగా సమావేశాలకు సంబం ధించి ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. -
వచ్చే నెల ప్రథమార్ధంలో అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ప్రారంభించిన తరువాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సాధారణంగా అయితే బడ్జెట్ సమావేశాల అనంతరం వర్షాకాల సమావేశాలు, ఆ తరువాత శీతాకాల సమావేశాలు ఉంటాయి. అయితే జీఎస్టీ కోసం ఈ ఏడాది మే 16న ఒక రోజు అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం నిర్వహించింది. దీంతో నవంబర్ 16కు ఆరునెలల గడువు ముగిసిపోతుందనే సాంకేతిక అంశాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది. ఆలోగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నందున నవంబర్ తొలి వారం లేదా రెండో వారంలో చట్టసభను సమావేశపరచాలనే అభిప్రాయానికి ప్రభుత్వ పెద్దలు వచ్చారు. నవంబర్ తొలివారంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేపట్టే అవకాశం ఉన్నందున అసెంబ్లీ సమావేశాలకు వచ్చే చాన్స్ లేదని సర్కార్ భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏ సమస్యనైనా ఆధారాలతో సహా ప్రతిపక్ష నేత అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తుండటం ప్రభుత్వ పెద్దలకు మింగుడు పడటం లేదని, ఆయన లేని సమయంలో సమావేశాలు నిర్వహిస్తే తమ పని మరింత సులువు అవుతుందని అధికారపక్షం భావిస్తోందని, ఈ విధానం మంచిదికాదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వాధినేత అవినీతిని ప్రతిపక్ష నేత ఎండగడతారనే భయం ప్రభుత్వ పెద్దల్లో ఉందని, అవకాశం ఉన్నంత వరకు అటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చేయడమే ‘ముఖ్య’నేతకు అలవాటని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కాగా, ఈ నెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయ్, లండన్, అమెరికా పర్యటనలకు వెళ్తున్నారు. అనంతరం స్పీకర్తో కలసి ఇన్చార్జి అసెంబ్లీ కార్యదర్శి కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సమావేశాల కోసం విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. -
గతంకంటే భిన్నంగా సమావేశాలు
అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ మధుసూదనాచారి సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు గతం కంటే ఎంతో భిన్నంగా జరుగుతున్నాయని శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి అన్నారు. కొత్త రాష్ట్రమైనా కేవలం మూడేళ్లలో ఎన్నో రంగాల్లో అభివృద్ధిలో పురోగమిస్తోందని, మూడేళ్లుగా సాగుతున్న అసెంబ్లీ సమావేశాల తీరు సంతృప్తికరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ మీడియా సలహా కమిటీ (ఎంఏసీ) తొలి సమావేశం సోమవారం అసెంబ్లీ సమావేశ మందిరంలో జరిగింది.శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎంఏసీ చైర్మన్ వి.సూరజ్కుమార్, కమిటీ సభ్యులు, శాసనసభ కార్యదర్శి రాజసదారాం ఇందులో పాల్గొన్నారు. మీడియా లాంజ్లో ఏర్పాట్లు, అసెంబ్లీ గ్యాలరీ పాసులు, సీట్ల కేటాయింపు, పార్కింగ్, శాసనసభ వార్తలను కవర్ చేసే మీడియా ప్రతినిధులకు ఓరియంటేషన్ తదితర అంశాలపై చర్చ జరిగింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలను ప్రజలంతా చూస్తున్నారని, ఈ నేపథ్యంలోనే సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చించి మీడియా కమిటీ సహకారంతో ముందుకు సాగుదామని స్పీకర్ అన్నారు. తరచూ ఇలాంటి సమావేశాల ద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవచ్చని స్వామిగౌడ్ అభిప్రాయపడ్డారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. -
సస్పెన్షన్ రద్దు!
♦ ఏడుగురు డీఎంకే ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేత ♦ ధన్యవాదాలు తెలిపిన స్టాలిన్ ♦ అధికార, ప్రతిపక్షాలు చెట్టాపట్టాల్ ♦ వాకౌట్ లేకుండానే ముగిసిన సమావేశం సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రతిపక్షం ఆగ్రహం, అధికార పక్షం నిగ్రహం లేదా వాగ్యుద్ధాలు వాకౌట్లో సాగుతున్న అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నాడు మాత్రం ప్రశాంతంగా ముగిశాయి. డీఎంకే ఎమ్మెల్యేల సస్పెన్షన్ రద్దు, ప్ర«ధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం, వివిధ అంశాలపై చర్చలతో శుక్రవారం నాటి అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగి ముచ్చట గొలిపాయి. శుక్రవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తరువాత స్పీకర్ ధనపాల్ మాట్లాడుతూ అసెంబ్లీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు తన ప్రకటనను వెలిబుచ్చుతారని అన్నారు. ఆ తరువాత సంఘం అధ్యక్షుడు, ఉప సభాపతి పొల్లాచ్చి జయరామన్ మాట్లాడుతూ, డీఎంకే సభ్యులు ఎస్ అంబేద్కుమార్ (వందవాశి), కేఎస్. మస్తాన్(సెంజి),కేఎస్.రవిచంద్రన్(ఎగ్మూరు), సురేష్ రాజన్ (నాగర్కోవిల్), కె.కార్తికేయన్ (రిషివందయం), పి. మురగన్ (వేప్పనగల్లి) కేకే. సెల్వం (ఆయిరమ్ విళక్కు)ల క్రమశిక్షణ ఉల్లంఘన నివేదికను కమిటి తరఫున అసెంబ్లీకి సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నివేదికను ఈ రోజే చర్చకు పెట్టాలని అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత, మంత్రి సెంగోట్టయ్యన్ తీర్మానాన్ని ప్రతిపాదించగానే అసెంబ్లీ అభీష్టానికి వదిలేయగా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమయంలో స్పీకర్ ధనపాల్ మాట్లాడుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన సదరు ఏడుగురు డీఎంకే ఎమ్మెల్యేలు సభా హక్కులను ఉల్లంఘించారని, అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగకుండా అడ్డుకున్నారని తెలిపారు. వీరిపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యే వెట్రివేల్ తనకు సమర్పించిన ఉత్తరం ఆధారంగా ఆరునెలలపాటు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. సస్పెండ్ కారణంగా ఈ ఆరునెలల కాలంలో ఎమ్మెల్యేల వేతనం, ఇతర ఆదాయాలు పొందలేరని క్రమశిక్షణ సంఘం ఆరోజు ప్రకటించిందని అన్నారు. అయితే సదరు ఏడుగురు ఎమ్మెల్యేలు తనవద్దకు వచ్చి పశ్చాత్తాపపడ్డారని, ఇకపై అలా నడుచుకోమని విన్నవించుకున్నారని స్పీకర్ తెలిపారు. వారిని శిక్షించాలని అసెంబ్లీ కోరినా మన్నించి సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేస్తున్నానని ప్రకటించారు. ఆసియా ఖండంలోనే తమిళనాడు ఆరోగ్యకరమైన రాష్ట్రంగా విరజిల్లాలని ఆశిస్తున్నట్లు స్పీకర్ పేర్కొనారు. ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ స్పీకర్కు ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడు ఎయిమ్స్ వైద్యశాల ఏ జిల్లాలో స్థాపిస్తారని స్టాలిన్ అడిగిన ప్రశ్నకు వైద్యశాఖా మంత్రి విజయభాస్కర్ బదులిస్తూ, అన్ని జిల్లా ఎమ్మెల్యేలు తమ ప్రాంతంలో నెలకొల్పాలని కోరుతున్నారు, అయితే ఈ విషయమై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున గతనెల 24వ తేదీన ఉత్తరం రాశామని చెప్పారు. ఏదేమైనా రాష్ట్రానికి ఎయిమ్స్ వైద్యశాలను సాధించి తీరుతామని హామీ ఇచ్చారు. స్టాలిన్తో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల భేటీ: రాజీవ్గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న పేరరివాళన్ను పెరోల్పై విడుదల చేసే అంశంలో మద్దతు కోరుతూ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు స్టాలిన్తో భేటీ అయ్యారు. ప్రజాప్రతినిధులను కలిసేందుకు పేరరివాళన్ తల్లి అర్బుతామ్మాళ్ శుకవారం సచివాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పెరోల్పై కలిసి చర్చించుకోవడం మరో విశేషం. -
సమీక్షలకు శ్రీకారం
► సీఎం బిజీ ►మంత్రులతో చర్చ ► అసెంబ్లీకి సన్నద్ధం అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని శాఖల వారీగా సమీక్షలకు సీఎం పళనిస్వామి సిద్ధం అయ్యా రు. సోమవారం పర్యాటక, దేవాదాయ, ప్రజా పనుల శాఖ మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు. సీనియర్ మంత్రులతో భేటీ అయ్యారు. సాక్షి, చెన్నై: అసెంబ్లీ సమావేశాలు జూన్ ఏడు లేదా ఎనిమిదో తేదీ నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు సాగుతున్న విషయం తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షం డీఎంకేను ఎదుర్కొనేందుకు తగ్గ అస్త్రాలను సిద్ధం చేసుకునే పనిలో పాలకులు నిమగ్నం అయ్యారు. శాఖల వారీగా కేటాయింపులు, పథకాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరించి పనిలో పడ్డారు. ఉదయం సచివాలయంకు దాదాపుగా అందరూ మంత్రులు హాజరయ్యారు. వారి వారి శాఖల్లో సమీక్షలతో బిజీ అయ్యారు. ఆయా శాఖల్లోని వ్యవహారాల మీద సీఎం పళనిస్వామి సైతం దృష్టి సారించారు. ఇందులో భాగంగా రోజుకు రెండు మూడు శాఖలు చొప్పున సమీక్షించేందుకు నిర్ణయించారు. ఆ దిశగా దేవాదాయ, పర్యాటక, ప్రజా పనుల శాఖల్లో సాగుతున్న పనులు, నిధులు, వ్యయాలు, పథకాలు, పెండింగ్ ప్రాజెక్టులు, కొత్త కార్యక్రమాలు తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. ఆయా శాఖల మంత్రుల సమక్షంలో కార్యదర్శులు పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. ఆయా శాఖల మీద చర్చ సాగే సమయంలో ప్రతిపక్షాల్ని ఎదుర్కొనే విధంగా అన్ని సమాధానాలు, అన్ని వివరాలు లెక్కలతో సహా ముందు ఉంచుకుని తిప్పికొట్టే ప్రసంగాలు సాగించాలని ఈ సందర్భంగా సీఎం ఆయా శాఖల మంత్రులకు సూచించే పనిలో పడ్డారు. ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సీఎం పళని స్వామిని కలిసి వినతి పత్రం సమర్పించడం గమనార్హం. సీఎంతో భేటీ: పళని స్వామి సర్కారుకు వ్యతిరేకంగా పన్నెండు మంది ఎమ్మెల్యే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో మాజీ మంత్రులు పళనియప్పన్, సెంథిల్ బాలాజీ, తోపు వెంకటాచలం కూడా ఉన్నారు. వీరితో పాటుగా మరో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉదయం సచివాలయం వచ్చారు. సమీక్షలో బిజీగా ఉన్న సీఎంను కలిసేందుకు యత్నించారు. సమీక్ష ముగిసినానంతరం వీరికి అనుమతి లభించిందని చెప్పవచ్చు. సీఎంతో ఈ ఎనిమిది మంది గంట పాటుగా సమావేశం అయ్యారు. నియోజకవర్గాల్లోని సమస్యలు, కూవత్తూరు క్యాంపులో తమకు ఇచ్చిన హామీల అమలు నినాదంతో ఓ చిట్టాను సీఎంకు అందజేసి వెళ్లినట్టు సమాచారం. దీంతో సీనియర్ మంత్రులు సెంగోట్టయన్, తంగమణి, జయకుమార్, ఎస్పీ వేలుమణిలను తన ఛాంబర్కు సీఎం పిలిపించుకుని ప్రత్యేకంగా భేటీ కావడం గమనార్హం. అసెంబ్లీ సమావేశాలకు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలు తమకు ఇచ్చిన జాబితాను పరిశీలించి, వాటి అమలు మీద తగు నిర్ణయం తీసుకునే పనిలో సీఎం నిమగ్నమైనట్టు తెలిసింది. అమ్మ ప్రభుత్వానికి నేటితో ఏడాది : పాలన మీద పట్టు బిగించే విధంగా , ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే రీతిలో పళని సర్కారు సిద్ధం అవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారంతో అమ్మ ప్రభుత్వం మళ్లీ అధికార పగ్గాలు చేపట్టి ఏడాది కానున్నడం గమనార్హం. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అమ్మ జయలలితకు మళ్లీ పట్టం కట్టారు. మే 23వ తేది వరుసగా రెండో సారి సీఎం పగ్గాలు జయలలిత చేపట్టారు. ఈ ఏడాది కాలంలో ఎన్నో విషాదాలు, ఎన్నో ఘటనలు సాగినా, ప్రజలకు ఒరిగిందేమీ లేదు. అమ్మ జయలలిత మరణంతో పన్నీరు సీఎం కావడం, ఆయన్ను పదవి నుంచి దించి చిన్నమ్మ శశికళ సీఎం అయ్యేందుకు ప్రయత్నాలు చేపట్టి, చివరకు అక్రమాస్తుల కేసు రూపంలో కటకటాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి. ఇక, పళని తన నేతృత్వంలో అమ్మ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నా, ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు అంతంత మాత్రమే. ఢిల్లీకి సీఎం : ముఖ్యమంత్రి పళణిస్వామి మంగళవారం ఢిల్లీ బయలుదేరనున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో బుధవారం భేటి కానున్నారు. మాజీ సీఎం పన్నీర్ సెల్వం ప్రధానితో రెండు రోజుల క్రితం భేటి అయిన నేపథ్యంలో హఠాత్తుగా సీఎం ఢిల్లీ పర్యటన సాగునుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
రేవంత్రెడ్డి పిటిషన్పై స్పందించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల నుంచి స్పీకర్ తనను సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను పది రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తన సస్పెన్షన్ శాసనసభ వ్యవహారాలకు, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని, సహజ న్యాయసూత్రాలను కాలరాస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ఏకపక్షంగా ప్రకటించాలని కోరుతూ రేవంత్రెడ్డి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
అసెంబ్లీ సమయంలోనూ మంత్రివర్గ విస్తరణ!
విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనూ మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చునని విద్యుత్శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఇష్టాగోష్టిగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చుననే వార్తలు వస్తున్నాయి కదా అని విలే కరులు ప్రస్తావించగా ‘మంత్రివర్గ విస్తరణ, మార్పు చేర్పులు అనేవి పూర్తిగా ముఖ్యమంత్రి పరిధిలోనివి. దానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడా, అయిపోయిన తర్వాతనా అనేది ఎందుకు? ముఖ్యమంత్రి అనుకుంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఉండొచ్చు’ అని వ్యాఖ్యానించారు. -
ప్రజా సమస్యలే ప్రధానాస్త్రం
►అసెంబ్లీలో జిల్లా ఎమ్మెల్యేల పోరాటం ►బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలన్న పెద్దిరెడ్డి ►ప్రభుత్వ భూముల ఆక్రమణపై చెవిరెడ్డి ధ్వజం ►డ్వాక్రా రుణాల మాఫీపై నినదించిన రోజా తిరుపతి: అసెంబ్లీ సమావేశాల్లో జిల్లా శాసనసభ్యుల వాణి ఊపందుకుంది. ప్రజా సమస్యలే ప్రధానాస్త్రంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారు. ఎన్నికల హామీలను గాలికొదిలి రాష్ట్ర ప్రజలను అధికార పార్టీ మభ్యపెడుతోందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. జిల్లాకు చెందిన పుంగనూరు, చంద్రగిరి, నగరి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఆర్కే రోజా తమదైన శైలిలో ప్రజా సమస్యలను, సంక్షేమ పథకాల అమల్లో సర్కారు వైఫల్యాలపై వ్యూహాత్మకంగా ధ్వజమెత్తు తున్నారు. తిరుపతి రూరల్ మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణపై బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ధ్వజమెత్తిన చెవిరెడ్డి భాస్కర్రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను ఎత్తిచూపారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుడగ జంగాల సమస్యలను లేవనెత్తారు. ప్రభుత్వంపై రోజా ఫైర్ గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో నగరి ఎమ్మెల్యే రోజా ప్రభుత్వం తీరుపై భగ్గుమన్నారు. డ్వాక్రా మహిళల రుణ మాఫీ, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు లోపించిన రక్షణ, గోరుముద్దల పథకం అమల్లో లోపాలను ప్రస్తావించారు. 80 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.14,200 కోట్ల రుణ మాఫీ చేయాల్సి ఉంటే, బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించడం ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశారు. జిల్లాకు చెందిన జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్కుమార్, పీలేరు, మదనపల్లి ఎమ్మెల్యేలు రామచంద్రారెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డిలు సమయం దొరికినప్పుడు, సందర్భం వచ్చినపుడు ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ, ప్రజల అవసరాలను గుర్తు చేస్తున్నారు. -
ఎండలో నిలబడి రేవంత్ నిరసన
అన్యాయంగా సభనుంచి సస్పెండ్ చేశారని ఆరోపణ సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాల నుంచి బహిష్కరణకు గురైన టీటీడీపీ ఎమ్మెల్యేలు ఎ.రేవంత్రెడ్డి, సండ్రవెంకటవీరయ్య సోమవారం అసెంబ్లీ ప్రధానద్వారం ఎదురుగా, మండు టెండలో నిలబడి నిరసన తెలియజేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంతో పాటు, అసెంబ్లీ జరిగిన సమయం అంతా వారు ఎండలోనే నిలబడ్డారు. మరో టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కూడా అసెంబ్లీ లోపలికి వెళ్లలేదు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో సభ పూర్తిగా ఆయన ఆధీనం లోనే ఉంటుందని, ఆ సమయంలో ఏం జరిగినా స్పీకర్కు సస్పెండ్ చేసే అధికారం లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. స్పీకర్కు అధికారంలేకున్నా, గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారనే సాకుతో తమను సస్పెండ్ చేయడం ద్వారా అప్రజాస్వామిక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. -
2019నాటికి లక్ష ప్రభుత్వ ఉద్యోగాలిస్తాం
-
విపక్షాలను ఎలా ఎదుర్కొందాం?
‘అసెంబ్లీ’ వ్యూహంపై నేడు సీఎం అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ భేటీ హైదరాబాద్: ప్రతిపక్షాల విమర్శలను సమర్థంగా తిప్పికొట్టేందుకు అధికార పార్టీ సన్నద్ధమవుతోంది. శుక్ర వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గురువారం టీఆర్ఎస్ శాసనసభా పక్షం భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సి వ్యూహంపై ఇం దులో చర్చించనున్నారు. ఇటీవల ప్రతిపక్షం కాంగ్రెస్తో పాటు టీడీపీ, బీజేపీ సైతం ప్రభుత్వ విధానాలపై ఒంటి కాలిపై లేస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ జనావేదన పేరున సదస్సులు నిర్వహిస్తోంది. మరోవైపు టీడీపీ సైతం పాదయాత్రలతో జనంలోకి వెళ్లింది. బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. అసెంబ్లీ వేదికగా కూడా విపక్షాలు విమర్శలకు దిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే తమ సభ్యులు ఎలా వ్యవహరించాలనే దానిపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ సూచనలు చేస్తారని చెబుతున్నారు. నామినేటెడ్, సంస్థాగత అంశాలపైనా.. నామినేటెడ్ పదవులు, పార్టీ సంస్థాగత అంశాలపైనా భేటీలో చర్చించే అవకాశం ఉందంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే.. ఏప్రిల్లో జరగాల్సిన పార్టీ 16వ ప్లీనరీపై సీఎం దృష్టి పెడతారని సమాచారం. అలాగే ఏడుగురు ఎమ్మెల్యేలకు మొదట పార్లమెంటరీ కార్యదర్శులుగా అవకాశం ఇచ్చినా.. కోర్టు తీర్పుతో వారు మాజీలయ్యారు. ఇలాంటి వారినీ, పదవులపై ఆశలు పెట్టుకున్న వారందరినీ పరిగణలోకి తీసుకుని ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. -
కొత్త..కొత్తగా...!
⇒ నవ్యాంధ్రలో తొలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ⇒ తరలివచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ⇒ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం ⇒ దారి పొడవునా హారతులు పట్టి తిలకం దిద్దిన మహిళలు ⇒ అసెంబ్లీ గేటు వద్ద టీడీపీ శ్రేణుల ఓవర్యాక్షన్ ⇒ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల బస్సుకు అడ్డుగా నిలిచి నినాదాలు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తొలి అసెంబ్లీ సమావేశాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవనంలో సోమవారం మొట్టమొదటగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నోచుకున్నాయి. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వీరిలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. సాక్షి, అమరావతి బ్యూరో : రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు విచ్చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్థానికులు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయన ప్రత్యేక బస్సులో ఎమ్మెల్యేలతో కలిసి వెలగపూడిలోని అసెంబ్లీ భవనానికి చేరుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్నారని తెలుసుకున్న స్థానికులు ప్రకాశం బ్యారేజి, ఉండవల్లి సెంటర్, పెనుమాక, యర్రబాలెం, కృష్ణాయపాలెం, వెంకటపాలెం శివారు ప్రాంతానికి చేరుకున్నారు. పెనుమాకలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు జగన్మోహన్రెడ్డికి హారతులు పట్టి తిలకం దిద్ది స్వాగతం పలికారు. యర్రబాలెం, కృష్ణాయపాలెంలోనూ స్థానికులు స్వాగతం పలికారు. మందడం శివారు ప్రాంతం నుంచి సచివాలయానికి నూతనంగా ఏర్పాటు చేసిన రహదారి మీదుగా వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళుతున్నారని తెలుసుకున్న వెంకటపాలెం గ్రామస్తులు రహదారి వద్దకు చేరుకున్నారు. తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి కత్తెర హెనీ క్రిస్టినా ఆధ్వర్యంలో తుళ్లూరు మండల పార్టీ అధ్యక్షులు బత్తుల కిషోర్ స్వాగతం పలికారు. వారందరికీ వైఎస్ జగన్ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఇదిలావుండగా, వెంకటపాలెం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పూలమాలవేసి నివాళులర్పించారు. అసెంబ్లీ గేటు వద్ద టీడీపీ నేతల ఓవర్ యాక్షన్.. రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాలు కావటంతో ప్రభుత్వ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. దారిపొడవునా పోలీసులను మోహరింపజేసింది. ముందుగానే అసెంబ్లీ గేట్ వద్దకు చేరుకున్న అధికారపార్టీ నేతలు హడావుడి చేయటం కనిపించింది. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యేలు కలిసి ప్రత్యేక బస్సులో అసెంబ్లీ గేటు వద్దకు చేరుకోగా, వాహనానికి అడ్డుగా నిలిచిన టీడీపీ శ్రేణులు లోకేష్బాబుకు అనుకూల నినాదాలు చేశారు. బస్సుకు దారి వదలాలని పోలీసులు, అక్కడున్న నేతలు చెప్పినా పట్టించుకోకుండా నినాదాలు చేస్తూ కనిపించారు. టీడీపీ శ్రేణుల ఓవర్యాక్షన్ను గమనించిన ఇరుపార్టీ నాయకులు ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. కొంత సమయంపాటు ఇరు వర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం నడిచింది. ఆ తరువాత వైఎస్సార్సీపీ నేతలు, పోలీసులు జోక్యం చేసుకోవటంతో వివాదం సద్దుమణిగింది. ఇదిలా ఉంటే విజయవాడ నుంచి జెండాలు చేతపట్టుకుని వస్తున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పోలీసులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ నాయకుడు వస్తున్నారని తెలుసుకుని చూడటానికి వచ్చామని ఎంతచెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. ఆసక్తిగా మారిన అసెంబ్లీ సమావేశాలు... ఏపీ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మొట్టమొదటిసారిగా వెలగపూడిలో ప్రారంభం కావటంపై కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు ఆసక్తి చూపారు. అసెంబ్లీని, సమావేశాలను తిలకించటానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో విజయవాడ, గుంటూరు ప్రధాన మార్గాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఉండవల్లి, వెంకటపాలెం, మందడం, మల్కాపురం గ్రామాల మీదుగా వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీ నేతలు భారీ ఎత్తున వాహనాల్లో తరలిరావడం కనిపించింది. కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలు తరలిరావటంతో వెలగపూడి, మందడం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోని హోటళ్లు కిటకిటలాడాయి. ఇదిలాఉంటే భారీగా తరలివచ్చిన వారికి ప్రభుత్వ యంత్రాంగం భోజన ఏర్పాట్లలో విఫలమైంది. ఎర్రటి ఎండలో సందర్శకులు తాగు నీరు కూడా లభించక ఇబ్బందులు పడ్డారు. కొందరు సృహతప్పి పడిపోవటం కనిపించింది. -
అసెంబ్లీ సమావేశాల పొడిగింపు కుదరదు
చీఫ్విప్ కాల్వ శ్రీనివాసులు సాక్షి, అమరావతి: మార్చి నెలాఖరులోగా బడ్జెట్ ఆమోదం పొందాల్సి ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీ సమావేశాలను పొడిగించలేమని ప్రభుత్వ చీఫ్విప్ కాల్వ శ్రీనివాసులు చెప్పారు. గుంటూరు జిల్లా వెలగపూడిలోని తాత్కాలిక అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన మాట్లాడారు. బీఏసీ సమావేశం నిర్ణయానికి విరుద్దంగా వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు మాట్లాడటం సరికాదన్నారు. గవర్నర్ ప్రసంగం బాగుందని చెప్పారు. ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఆంధ్రప్రదేశ్కు వచ్చే ప్రయోజనాలను గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం మరోసారి చాటిచెప్పిందన్నారు. మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు ప్రభాకర్చౌదరి, ఎ.నాగేశ్వర్రెడ్డి, బొండా ఉమామహేశ్వరరావు, కేఏ నాయుడు, కాగిత వెంకట్రావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా మాట్లాడారు. -
మరో కార్యాచరణకు జేఏసీ సిద్ధం
27న యువజన సంఘాలతో సమావేశం సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత నిరుద్యోగుల సమస్య పరిష్కారం కోసం మరోసారి కార్యాచరణ ప్రకటించాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అధ్యక్షతన ముఖ్యనేతలు రాష్ట్ర కార్యాలయంలో శనివారం సమావేశమయ్యారు. నిరుద్యోగ నిరసన ర్యాలీని ప్రభుత్వం అడ్డుకున్న నేపథ్యంలో మరోసారి భారీ కార్యాచరణకు సిద్ధం కావాలని నిర్ణయించారు. దీనికోసం ఈ నెల 27న విద్యార్థి, యువజన సంఘాల నేతలతో సమావేశం కానున్నారు. సుధీర్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాల్లో సదస్సులను నిర్వహించనున్నారు. మార్చి 1న మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జేఏసీ సమావేశం కానుంది. 4న నిర్మల్ జిల్లా కేంద్రంలో, 5న కరీంనగర్లో, 11న హన్మకొండలో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో జేఏసీ కన్వీనర్ కె.రఘు, నేతలు ఎన్.ప్రహ్లాద్, ఇటిక్యాల పురుషోత్తం, వెంకటరెడ్డి, భైరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఏకపక్షంగా అసెంబ్లీ సమావేశాలు: భట్టి
సాక్షి, హైదరాబాద్: ప్రజాసమస్యలపై చర్చించకుండా అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం ఏకపక్షంగా నడిపిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మండిప డ్డారు. శనివారం గాంధీభవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘ఆపరేషన్ సక్సెస్... పేషెంట్ డెడ్’ అన్నట్టుగా సమావేశాలు జరిగాయన్నారు. టీఆర్ఎస్ గొప్పలను చెప్పుకోవ డానికి తప్ప ప్రజా సమస్యలను చర్చించలేదన్నారు. 94 గంటలపాటు సమావేశాలు జరిగితే 50 గంటలపాటు టీఆర్ఎస్ వాళ్లే మాట్లాడారన్నారు. రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, మిషన్ భగీరథ వంటి పథకాలపై తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ప్రభుత్వం పారిపోయిం దని అన్నారు. జీహెచ్ఎంసీలో అవినీతిపై ప్రశ్నిస్తే సమాధానమే ఇవ్వలేదన్నారు. -
'దేశంలోనే కేసీఆర్ వంటి సీఎం లేరు'
హైదరాబాద్: రాష్ట్ర శాసన సభ, మండళ్ల శీతాకాల సమావేశాలు జరిగిన తీరు చారిత్రాత్మకమని, అన్ని వర్గాలకు ఊరటనిచ్చేలా సభలు జరిగాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అభిప్రాయపడ్డారు. ఒంటరి మహిళలకు జీవన భృతి కోసం పథకం ప్రకటించడం అభినందనీయమని, బీసీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉభయ సభల వేదికగా ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్సీలు వి.గంగాధర్ గౌడ్, ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి, సలీంలు విలేకరులతో మాట్లాడారు. కుల వృత్తులను కాపాడేందుకు సీఎం ఉభయ సభల్లో చేసిన ప్రకటనలు వెనుకబడిన వర్గాల్లో కొత్త ఉత్సాహాన్నిచ్చాయని చెప్పారు. మైనారిటీలకు పెద్ద మొత్తంలో పథకాలు ప్రకటించిన కేసీఆర్ వంటి సీఎం దేశంలో మరొకరు లేరన్నారు. కొద్దిగా ఆలస్యమైనా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే పట్టుదలతో సీఎం ఉన్నారని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అసెంబ్లీ జరిగిన తీరుపై చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామని, కేసీఆర్ కుటుంబం కనుసన్నల్లో అసెంబ్లీ నడిచిందన్న రేవంత్ ఆరోపణలు అర్థరహితమన్నారు. -
సాగు ప్రాజెక్టులపై సమీక్ష
కేబినెట్ భేటీలో చర్చించనున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై పూర్తిస్థాయి సమీక్షకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక నిర్వహించనున్న కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న, చేపడుతున్న ప్రాజెక్టులపై క్షుణ్ణంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు ప్రాజెక్టులవారీగా జరిగిన పనులు, చేసిన ఖర్చు, అవసరమైన నిధులు, అందించిన ఆయకట్టు, మిగిలిన లక్ష్యాలపై నివేదికలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ అంశంపై నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషీ మంగళవారం ఈఎన్సీ మురళీధర్, విజయ్ప్రకాశ్లతోపాటు ఇతర అధికారులతో మూడు గంటలపాటు సమీక్షించారు. ఈ ఏడాది పెద్ద, మధ్యతరహా, చిన్న నీటి ప్రాజెక్టుల కింద కలిపి మొత్తంగా 30 లక్షల ఆయకట్టుకు నీరందేలా ప్రణాళికలు సాగుతున్నా ఇంకా కొన్ని ప్రాజెక్టుల పనులు పట్టాలెక్కిల్సి ఉంది. ఇందులో తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతల, దేవాదుల రెండో దశ, ఇందిరమ్మ వరద కాల్వ, ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు వంటివి ఉన్నాయి. వీటికితోడు నిర్మాణంలో ఉన్న 25 భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల్లో ధరల పెరుగుదలకు అనుగుణంగా అదనపు చెల్లింపులు (ఎస్కలేషన్) చేసేందుకు ప్రభుత్వం జీవో–146 తెచ్చినా పనులు ఆశించినట్లుగా జరగట్లేదు. ఏడాది కాలంలో 78 ప్యాకేజీల్లో కేవలం 13 శాతం పనులే జరిగాయి. గతేడాది బడ్జెట్లో రూ. 25 వేల కోట్లు కేటాయించినా వివిధ కారణాలతో రూ. 9,500 కోట్ల ఖర్చు మాత్రమే జరిగింది. ఈ అంశాలన్నింటిపై సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. -
రెండువారాల్లో డీసీసీలకు అధ్యక్షులు!
అసెంబ్లీ సమావేశాల తర్వాత జిల్లాల్లో అభిప్రాయ సేకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జిల్లాలకు పార్టీ కొత్త సారథుల ఎంపిక ప్రక్రియను రెండు వారాల్లోగా పూర్తిచేయాలని పీసీసీ భావిస్తోంది. దీనికనుగుణంగా ఇప్పటికే స్థూలంగా అభిప్రాయ సేకరణను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, పార్టీ ముఖ్యనేతలు పూర్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మరో సారి జిల్లాల వారీగా అభిప్రాయ సేకరణను పూర్తిచేయనున్నారు. పాత జిల్లాలకు కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసినవారు ఆసక్తి చూపిస్తే ముందు వారికే అవకాశం ఇవ్వాలని పీసీసీ నిర్ణయించింది. కాగా, రంగారెడ్డి డీసీసీ పదవి కి క్యామ మల్లేశ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షు నిగా ఉన్న దానం నాగేందర్ జిల్లాల పునర్వి భజనకు ముందుగానే తమ పదవులకు రాజీనామా చేశారు. మొత్తం 31 జిల్లాలు ఏర్పా టైన నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై టీపీసీసీ కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత పార్టీ కార్యక్ర మాల విషయంలోనూ కొంత అయోమయం ఏర్పడింది. పాత జిల్లాల పరిధిలో ఉన్న కొన్ని మండలాలు, గ్రామాలు మరో జిల్లా పరిధి లోకి కూడా చేరాయి. మారిన మండలాల్లో పార్టీ కార్యక్రమాలను ఎవరిద్వారా పర్యవేక్షిం చాలో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా డీసీసీలకు అధ్యక్షుడి ఎంపిక పూర్తిచేయాలని పార్టీ భావిస్తోంది. సామాజిక సమీకరణాలు, సమర్థత, పార్టీకి కేటాయించే సమయం, ఆ జిల్లాలోని పార్టీ ముఖ్యనేతలకు ఆమోదయోగ్యం వంటి వాటి పై అభిప్రాయ సేకరణ జరుపుతోంది. రెండు వారాల్లోగా కసరత్తు పూర్తిచేసి, అధిష్టానవర్గం నుంచి ఆమోదం పొందాలని యోచిస్తోంది. పలువురి అనాసక్తి: పార్టీకోసం పూర్తి కాలం పనిచేయగలిగే నాయకులనే డీసీసీ అధ్యక్షులు గా పరిశీలించాలన్నది ఏఐసీసీ మార్గదర్శనం. పార్టీ అధికారంలోకి వస్తే డీసీసీ అధ్యక్షు లుగా పనిచేసిన వారికి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని భావిస్తోంది. అయితే డీసీసీ అధ్యక్షులకు పార్టీ టికెట్లు లేవనడంతో ప్రజాక్షేత్రంలో పోటీచేయాలనుకున్న నేతలు డీసీసీ అధ్యక్షుడిగా చేయడానికి నిరాసక్తత చూపుతున్నారు. -
ఫిబ్రవరిలో శాసనసభ శీతాకాల సమావేశాలు!
స్పీకర్ కోడెల శివప్రసాదరావు సాక్షి, అమరావతి: జనవరి నెలాఖరు లోపు అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తయితే వచ్చేనెల మొదటి వారంలో శీతాకాల సమావేశాలు, మూడోవారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. వెలగపూడిలోని అసెంబ్లీ భవన నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఒకవేళ ఈ నెలాఖరులోపు భవన నిర్మాణ పనులు పూర్తి కాకపోతే శీతాకాల, బడ్జెట్ సమావేశాలను వచ్చేనెలాఖరులో ఒకేసారి జరుపుతామని చెప్పారు. -
18 దాకా అసెంబ్లీ సమావేశాలు!
11న బీఏసీ భేటీలో అధికారిక ప్రకటన? సాక్షి, హైదరాబాద్: శాసన సభ, శాసన మండలి సమావేశాలను మరికొద్ది రోజులు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. గతనెల 16న మొదలైన ఉభయ సభల సమావేశాలు ఈ నెల 11వ తేదీ దాకా జరగనున్నాయి. మరోసారి సమావేశాలను పొడిగించేందుకు 11వ తేదీన బీఏసీ సమావేశం నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. అధికార పార్టీ సభ్యుల నుంచి తెలిసిన సమాచారం మేరకు ఈ నెల 18వ తేదీ వరకు సమావేశాలను పొడిగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు 11న జరగనున్న బీఏసీ భేటీలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దీనిపై అనధికారికంగా చెప్పారని సమాచారం. ఈ నెల 12న కూడా సభ జరిపి, 13, 14, 15 తేదీల్లో సంక్రాంతి సెలవులు తీసుకుని తిరిగి 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సభ నిర్వహించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే శీతాకాల సమావేశాలను మొత్తంగా 23 రోజుల పాటు జరిపినట్లు అవుతుంది. పొడిగింపు వెనుక వ్యూహం!: రాష్ట్రంలో చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాల అమలుపై సమగ్ర చర్చ జరగాలని, వాస్తవాలు ప్రజలకు వివరించాలని అధికార పక్షం భావిస్తోంది. ఈ కారణంగానే దాదాపు అన్ని ప్రభుత్వ పథకాలపై లఘు చర్చలను చేపడుతోందని అంటున్నారు. ఓ వైపు విపక్షాలు కోరిన అంశాలపై చర్చ జరుపుతూనే అధికార పక్షంగా తమ పాలన తీరును అసెంబ్లీ వేదికగా ప్రజల్లోకి తీసుకువెళ్లే వ్యూహాన్ని అధికారపక్షం అనుసరిస్తోందని చెబుతున్నారు. సమావేశాలు మొదలు కావడానికి ముందు, ఆ తర్వాత జరిగిన టీఆర్ఎస్ శాసన సభాపక్ష సమావేశంలో ఇదే అంశంపై చర్చ జరిగింది. ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసుకుందామన్న వ్యూహంతోనే సమావేశాల తేదీలను పొడిగిస్తున్నారని విపక్ష సభ్యులు అభిప్రాయపడుతున్నారు. సమావేశాల తేదీల పొడిగింపుపై ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకంగా మాట్లాడితే.. రాష్ట్రాభివృద్ధిపై వారికి చిత్తశుద్ధి లేదని, అందుకే సమావేశాలు వద్దంటున్నారని ఎదురుదాడి చేసే ప్లాన్లో కూడా అధికార పార్టీ ఉందని విశ్లేషిస్తున్నారు. -
జనవరి చివర్లో లేదా ఫిబ్రవరిలో ‘అసెంబ్లీ’
స్పీకర్ కోడెల శివప్రసాదరావు కారంపూడి: జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరిలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. గుంటూరు జిల్లా కారంపూడి మండలం పేటసన్నెగండ్లలో కొంతకాలంగా అస్వస్థతతో ఉన్న మాజీ ఎమ్మెల్యే కొర్రపాటి వెంకట సుబ్బారావును బుధవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు అమరావతిలోని తాత్కాలిక సచివాలయంలో జరుగుతాయని తెలిపారు. తాత్కాలిక సచివాలయంలో 10–15 సంవత్సరాలు సమావేశాలు జరిగే అవకాశం ఉందన్నారు. -
విపక్షాలు పూర్తిగా విఫలం -మంత్రి హరీశ్రావు
విపక్షాలు ఎలాంటి వ్యూహం లేకుండా వ్యవహరిస్తున్నాయి హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయని శాసన సభావ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. విపక్షాలు ఒక వ్యూహమంటూ లేకుండానే వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో మంత్రి కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సమావేశాల్లో తమదే పూర్తిగా పైచేయి అయిందన్నారు. అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి సమర్థంగా చెప్పుకుంటున్నామని ఆయన వివరించారు. గతంలో తాము కూడా ప్రతిపక్షంలో ఉన్నామని, ప్రస్తుత ప్రతిపక్షాలకు భిన్నంగా ఒక వ్యూహంతో వ్యవహరించేవారమని గుర్తు చేశారు. అన్ని అంశాలపై మాట్లాడాలనుకుని ప్రతిపక్షాలు తప్పు చేస్తున్నాయని ఆయన విశ్లేషించారు. ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేందుకు వారి దగ్గర ఏ అంశమూ లేదని అన్నారు. సహజంగా ప్రతిపక్ష పార్టీలు ఏదో ఒకటీ రెండు అంశాలను తీసుకుని పూర్తి స్థాయిలో వాటివెంటే పడుతూ ప్రభుత్వానికి చికాకు కలిగిస్తాయని, కానీ ఇప్పుడు విపక్షాలు ఎలాంటి వ్యూహం లేకుండా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. సిద్దిపేట నగదు రహితానికి ‘ఆధార్ పే’ సిద్దిపేటను నగదు రహిత లావాదేవీలకు మార్చేందుకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న నేపథ్యంలో బ్యాంకు ప్రతినిధులు కొందరు మంత్రి హరీశ్రావును అసెంబ్లీలోని ఆయన చాంబర్లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు తీసుకువచ్చిన కొత్త ‘ఆధార్ పే మర్చంట్ డివైజ్’ను మంత్రి హరీశ్రావు పరిశీలించారు. సిద్దిపేటలో అన్ని రకాల లావాదేవీలకు ‘ఆధార్ పే’యంత్రాలను అమర్చేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. తగినన్ని మెషిన్లను కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. బ్యాంకు అధికారులు గతంలో రూ.10వేలు వెచ్చించి కొనుగోలు చేసిన మైక్రో ఏటీఎంల స్థానే రూ. 1800 విలువ చేసే ఆధార్ ఆధారిత మర్చంట్ ఫింగర్ ప్రింట్ మిషన్ పనితీరునూ మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ మర్చంట్ మిషన్ను రూ.వెయ్యికే ఇవ్వాలని మంత్రి బ్యాంకర్లను కోరారు. 5 వేల మర్చంట్ మిషన్లలకు మంత్రి వెంటనే ఆర్డర్ ఇచ్చారు. ఈ సందర్భంగా హరీశ్రావు తన ఆధార్ నంబర్ను బ్యాంకు అకౌంట్తో స్వయంగా లింక్ చేసుకున్నారు. -
టీడీపీకి మాట్లాడే హక్కు లేదు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గువ్వల బాలరాజు సాక్షి, హైదరాబాద్: బషీర్బాగ్ లో రైతులను పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపిన టీడీపీకి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గువ్వల బాలరాజు మండి పడ్డారు. ఆ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో వారిద్దరూ మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరును దేశమంతా ప్రశంసిస్తోందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై కన్నా చంద్రబాబు యావే రేవంత్ రెడ్డిలో ఎక్కువగా కనిపిస్తోందని విమర్శించారు. రేవంత్ తెలంగాణ అసెంబ్లీలో బాబు భజన చేస్తామంటే ఎలా ఒçప్పుకుంటామని ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణకు రేవంత్ ద్రోహం చేస్తున్నాడని వారు దుయ్యబట్టారు. -
ప్రతిపక్షాలు రెచ్చగొట్టినా నోరు జారొద్దు: కేసీఆర్
-
మనమే మాట్లాడాలి!
టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్ • ప్రతిపక్షాలకు ఎజెండాయే లేదు • సభా సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం • మంత్రులు సహా అంతా సభలో హుందాగా ఉండాలి • ప్రతిపక్షాలు రెచ్చగొట్టినా నోరు జారొద్దు • అధికారపక్ష సభ్యుల హాజరు నూరుశాతం ఉండాల్సిందే సాక్షి, హైదరాబాద్: రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి చేపట్టిన కార్య క్రమాలను అసెంబ్లీ సమావేశాలు వేదికగా ప్రజలకు వివరిద్దామని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. సమావేశాల్లో చర్చించడానికి ప్రతిపక్షాలకు ఎజెండానే లేదని, అందువల్ల మనమే మాట్లా డాలని, సమయాన్ని సద్వినియోగం చేసు కోవాలని స్పష్టం చేశారు. గురువారం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. శాసనసభ, శాసన మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు.. ‘‘సమావేశాల్లో చర్చించడానికి ప్రతిపక్షాలకు ఎజెండానే లేదు. ఏం మాట్లాడినా మనమే మాట్లాడాలి. బీఏసీ సమావేశానికే విపక్షాలు నాలుగైదు అంశాల పాయింట్లు రాసుకుని వచ్చాయి. అత్యధిక సభ్యులం మనమే ఉన్నాం. మన సమయం మనం వినియోగించుకుందాం. ఈ రెండున్నరేళ్ల కాలంలో ఏం చేశామో ప్రజలకు వివరిద్దాం..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్ విషయంలో నిక్కచ్చిగా ఉందామని, నిర్ణీత గడువులోగా సమాధానాలు చెప్పాలని మంత్రులకు సూచించారు. ముఖ్యంగా సభ్యులు అడిగిన ప్రశ్నల పరిధిలోనే సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. అదనపు సమాచారం ఇస్తూ, విషయం నుంచి ఎందుకు పక్కకు పోతున్నారని కూడా ప్రశ్నించారని తెలిసింది. మంత్రులు, ఇతర సభ్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ నోటి దురుసుకు పోవద్దని, సభలో హుందాగా వ్యవహరించాలని సూచించారు. అందరూ రావాల్సిందే.. ఈ సమావేశాలు కీలకమైనవని, పార్టీ సభ్యుల హాజరు నూటికి నూరుశాతం ఉండాల్సిందే నని కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. సమావేశం ముగిసే వరకూ ఉండాలని, తప్పని పరిస్థితి అయితే, ఆయా జిల్లాల మంత్రులకు సమాచారం ఇవ్వాలని సూచిం చారు. ‘‘మంత్రులు కంట్రోల్లో ఉండాలి. ప్రశ్నలకు గణాంకాలు సహా సంతృప్తికర సమాధానాలివ్వాలి. ప్రతిపక్షాలకు దీటైన సమాధానం ఇద్దాం. ఎక్కువ రోజులు సభ జరపాలని విపక్షాలు కోరుతున్నాయి. అవసరమైతే సమావేశాలను పొడిగిద్దాం..’’ అని కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. నోట్ల రద్దుపై నేనే మాట్లాడతా.. నోట్ల రద్దు రాష్ట్ర పరిధిలో తీసుకున్న నిర్ణయం కాదని, అది మన అంశమే కాదని.. విపక్షాలు కోరినందున చర్చకు పెడుతున్నామని సమావేశంలో కేసీఆర్ పేర్కొన్నారు. అయితే ఆ అంశంపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ మాట్లాడొద్దని, తానే మాట్లాడుతానని స్పష్టం చేశారు. ఇక తొలిరోజు మండలిలో విద్యుత్ పరిస్థితిపై మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడతారని, రెండో రోజు మండలిలో నోట్లరద్దు అంశంపై తాను మాట్లాడతానని చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతించామని, అయితే అదే సమయంలో ప్రజల కష్టాలను ఎప్పటికప్పుడు ప్రధాని దృష్టికి తీసుకువెళుతున్నామని తెలిపారు. నోట్ల రద్దుతో మనకూ నష్టం జరిగిందని, ఆదాయం పడిపోయిందని చెప్పారు. ఎక్సైజ్ ఆదాయం మాత్రం పెరిగిందన్నారు. ‘నాగం’ బండారం బయటపెట్టండి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల్లే వంటూ చెన్నైలోని ‘నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ’ నుంచి బీజేపీ నేత నాగం జనార్దన్రెడ్డి స్టే తీసుకువచ్చిన అంశంపై భేటీలో చర్చ జరిగింది. దీనిపై ఎవరూ భయపడొద్దని, ప్రాజెక్టు ఎక్కడికి పోదని కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే మహబూబ్నగర్ ప్రజలకు వాస్తవాలు వివరించాలని, నాగం బండారం బయట పెట్టాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్కడికక్కడ ప్రెస్మీట్లు పెట్టి నాగం ఆ జిల్లాకు అన్యాయం చేయాలని చూస్తున్న విషయాన్ని బయటపెట్టాలని చెప్పారు. -
అన్నదాతకు ఊరట
అసెంబ్లీ నేపథ్యంలో రూ.300 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ పంపిణీ సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ముంచుకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. దాదాపు ఎనిమిది నెలలుగా పెండింగ్లో పెట్టిన ఇన్ పుట్ సబ్సిడీ నిధుల విడుదలకు ఫైళ్లు కదిపింది. 2015 ఖరీఫ్లో కరువు తీవ్రతతో నష్టపోయిన రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.820 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీ మంజూరు చేసింది. ఆరు నెలల కిందటే కరువు సాయంగా రాష్ట్రానికి నిధులు విడుదల చేసింది. 20.91 లక్షల మంది నష్టపోయిన రైతులకు పంపిణీ చేయాల్సిన ఈ సొమ్మును ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అత్యవసరమైన చెల్లింపులకు సర్కారు కరువు నిధులను మళ్లించిందన్న విమర్శలున్నాయి. కేంద్రం పదే పదే యుటిలైజేషన్ సర్టిఫికెట్లు పంపాలని కోరడంతో పీడీ ఖాతాలో నిధులున్నట్లుగా పెండింగ్లో పెట్టింది. కానీ నిరుడు కరువుతో నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి పంపిణీ చేయలేదంటూ విపక్ష పార్టీలు అవకాశం దొరికినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో ఇన్ పుట్ సబ్సిడీ అంశం చర్చకు వచ్చే అవకాశముందని ప్రభుత్వం అప్రమత్తమైంది. పీడీ ఖాతాలో ఉన్నట్లుగా చెబుతున్న నిధుల్లో రూ.300 కోట్లు వెంటనే విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. -
అస్త్రశస్త్రాలతో సిద్ధం
21 నుంచి బెల్గాంలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సమస్యలపై ప్రశ్నలు సంధించనున్న విపక్షాలు దీటుగా ఎదుర్కోవడానికి సహచరులకు సీఎం దిశానిర్దేశం బెంగళూరు : రెండో రాజధాని బెల్గాంలో ఈసారి శీతాకాల శాసనసభ సమావేశాలు వాడీ వేడిగా జరుగనున్నారుు. అధికార పార్టీని ఇరుకున పెట్టడానికి విపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారుు. అరుుతే వీటిని దీటుగా ఎదుర్కొడానికి సిద్ధంగా ఉండాలని సీఎం సిద్ధరామయ్య తన సహరులకు ఇప్పటికే దిశ నిర్దేశం చేశారు. ఈనెల 21 నుంచి డిసెంబర్ 2 వరకూ బెళగావిలోని సువర్ణ సౌధలో శీతాకాల సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరుసగా కరువు కాటకాల్లో మునిగిపోరుున రైతులను ఆదుకోవడంలో సిద్ధరామయ్య ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ రైతు సంఘం నాయకులు సమావేశాల మొదటి రోజు సువర్ణసౌధ ముట్టడికి ఇప్పటికే పిలుపునిచ్చారు. చెరకు బకారుుల సత్వరం చెల్లించడంతో పాటు ఎకరాకు రూ. 15 వేలు నష్టపరిహారం, ఇక సహకార రుణాలు మాఫీ చేయాలని రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు బీజేపీ, జేడీఎస్ నాయకులు కూడా మద్దతు ప్రకటించారు. సమావేశాల మొదటి రోజును సభను స్తంభింప చేయాలని విపక్షాలు ఏకతాటిపైకి వచ్చారుు. అరుుతే కరువు తాలూకాలుగా ప్రకటించిన ప్రాంతాల్లో రుణాలు రద్దు చేసి కొంత వరకు రైతు సంఘం నాయకులు శాంతింప చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇక కావేరి వివాదంపై చర్చించడానికి రెండుసార్లు ప్రత్యేక శాసనసభ సమావేశాలను జరిపిన సిద్ధరామయ్య ప్రభుత్వం మహదారుు వివాదం పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, హైదరాబాద్-కర్ణాటక ప్రాంతానికి చెందిన నాయకులు విమర్శిస్తున్నారు. ఈ విషయమై ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆ ప్రాంతానికి చెందిన విపక్ష నేతలు భావిస్తున్నారు. ఇక వేసవి మొదలు కాకుండానే తాగునీటి సమస్యలు, విద్యుత్ కోతలు ఉత్పన్న మవుతున్న విషయానికి సంబంధిం విపక్షాలు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడానికి అవసరమైన గణాంకాలను సేకరిస్తున్నారుు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యలపై... ఇక రాష్ట్రంలో శాంతిభద్రత విషయంపై కూడా విపక్షాలు నిలదీసే అవకాశం ఉంది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యలతో బీజేపీ శ్రేణులు మండిపోతున్నారు. ఈ విషయంపై బహిరంగంగానే సిద్ధు సర్కార్పై బీజేపీ ఎంపీ శోభాకరంద్లాజే వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. ఇక మంత్రి తన్వీర్ వ్యవహారం, ఎంఈఎస్ ప్రాబల్యం ఉన్న బెల్గాంలో ఈ సారి శీతాకాల సమావేశాలు అధికార పార్టీకి చెమటలు పట్టిస్తాయనడంలో సందేహం లేదు. -
జీఎస్టీ బిల్లుకు ఏపీ కేబినేట్ ఆమోదం
-
జీఎస్టీ బిల్లుకు ఏపీ కేబినేట్ ఆమోదం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెట్టాల్సిన నాలుగు బిల్లులను మంత్రివర్గం ఆమోదించింది. విజయవాడలో మంగళవారం ఉదయం ఏపీ కేబినేట్ సమావేశం మూడు గంటల పాటు జరిగింది. ఈ సమావేశంలో కేబినేట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో వస్తు సేవా పన్నుల(జీఎస్టీ) బిల్లును ప్రవేశపెట్టానున్నారు. కర్నూలులో ఇండ్రస్టీయల్ హబ్ కోసం ఏపీఐఐసీకి 7 వేల ఎకరాలు, విశాఖ జిల్లాలో పర్యాటక శాఖ, ట్రాన్స్కో, ఏపీఐఐసీకి కలిపి సుమారు 64 ఎకరాల భూమి ఇచ్చేందుకు ఏపీ కేబినేట్ ఆమోదం తెలిపింది. విజయవాడ, విశాఖ, తిరుపతి, అనంతపురంలలో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ టవర్లు నిర్మించాలని కేబినేట్ నిర్ణయించింది. ఎలక్ట్రానిక్ పాలసీ సవరణ, కార్మిక సంస్కరణలు, కాకినాడలో గెయిల్ గ్యాస్ స్టోరేజ్ ఫెసిలిటీని పెంచే ప్రతిపాదనలకు కేబినేట్ అంగీకరించింది. ఇక ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీపై కేంద్రం అధికారికంగా ప్రకటన చేసే వరకు స్పందించకూడదని ఏపీ కేబినేట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్లో గురువారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న విషయం తెలిసిందే. కేబినేట్ ఆమోదించిన బిల్లుల వివరాలు ► జీఎస్టీ బిల్లు ► ఎన్జీ రంగా వర్శిటీ ఆధ్వర్యంలో ప్రైవేట్ కళాశాలల బిల్లు ► రిజిస్ట్రేషన్ శాఖలో డబుల్ రిజిస్ట్రేషన్లను నియంత్రించే బిల్లు ► కమర్షియల్ ట్యాక్స్ పరిధిలోని వ్యాట్ సవరణ బిల్లు. -
మొక్కుబడిగానే అసెంబ్లీ
- రెండు, మూడు రోజులకు కుదించే అవకాశం - వెలగపూడిలో వచ్చే బడ్జెట్ సమావేశాలు సాక్షి, అమరావతి: ఓటుకు కోట్లు కేసు సీఎం చంద్రబాబును వెంటాడుతున్న నేపథ్యంలో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా చేసేందుకు అసెంబ్లీ సమావేశాలను కుదించడానికి టీడీపీ ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. జీఎస్టీ బిల్లుతో పాటు రెండు ఆర్డినెన్స్లకు ఆమోదం తెలిపేందుకే ఈ వర్షాకాల సమావేశాలను పరిమితం చేయాలని భావిస్తోంది. ఈ నెల 8 నుంచి ప్రారంభమయ్యే సమావేశాలను రెండు లేదా మూడు రోజులకు కుదించే ప్రయత్నం చేస్తున్నారు. ఈనెల 8, 9 అసెంబ్లీ సమావేశాలు జరగడానికి అవకాశం ఉంది. 10వ తేదీ రెండో శనివారం కావడంతో ఆరో జు సమావేశాలు నిర్వహిస్తారా? లేదా అన్నది అనుమానమే. 11 ఆదివారం, 12 బక్రీద్ పర్వదినం కావడంతో సెలవు రోజుల్లో సమావేశాలు జరిగే అవకాశంలేదని టీడీపీ సీనియ ర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించా రు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరిపామన్నది ముఖ్యం కాదని, ఒకసారి నిర్వహిస్తే 6 నెలల వరకు మళ్లీ నిర్వహించాల్సిన అవసరంలేదని ఆ నాయకుడు అన్నారు. ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేకే.. ఓటుకు కోట్లు వ్యవహారంలో పునర్విచారణకు కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు అసెంబ్లీలో సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వస్తుందని భయపడుతున్నారు. దీనికితోడు రాజధాని నిర్మాణంలో స్విస్ చాలెంజ్ పేరుతో అడ్డగోలు విధానం, రాష్ట్రంలో కరువు తీవ్రత, పుష్కరాల్లో నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై ప్రభుత్వం బదులివ్వలేని స్థితిలో ఉంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న టీడీపీ ప్రభుత్వం.. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్కుపెట్టే విమర్శలు, ప్రశ్నల పరంపర నుంచి తప్పించుకునేందుకే సమావేశాలు కుదించినట్టు సమాచారం. వర్షాకాల సమావేశాలు కనీసం ఐదు రోజుల పాటు నిర్వహించే ఆనవాయితీ ఉంది. ప్రతిపక్షానికి, ప్రజలకు సమాధానం చెప్పలేక ఆ ఆనవాయితీకి ఇప్పుడు తిలోదకాలిచ్చేస్తున్నారు. వెలగపూడిలో బడ్జెట్ సమావేశాలు.. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న అసెంబ్లీ భవనంలోనే వచ్చే బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం నిర్మాణ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సమావేశమై నిర్మాణ తీరుతెన్నులు సమీక్షించారు. డిసెంబర్ నాటికే ఆ భవనం నిర్మాణం పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థల ప్రతినిధులు తెలిపారు. జనవరికి ఆ భవనాన్ని నిర్మించి అప్పగించాలని, అక్కడే బడ్జెట్ సమావేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని యనమల చెప్పినట్టు సమాచారం. -
పజా సమస్యలను ప్రస్తావిస్తాం: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించి వాటికి పరిష్కారమార్గాలను సూచించాలని బీజేపీ శాసనసభాపక్షం నిర్ణయించింది. ఈ సందర్భంగా మొత్తం 20సమస్యలను ప్రస్తావించాలని నిర్ణయించినట్లు బీజేఎల్పీ నేత జి.కిషన్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా సెప్టెంబర్ 17ను రాష్ట్ర విమోచన దినంగా అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్తో పాటు, జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలు, వాటితో ముడిపడిన సమస్యలు, మహారాష్ట్రతో ఒప్పందంపై తమ వాదనను వినిపిస్తామని చెప్పారు. -
అధికారికంగా నిర్వహించాలి
విమోచన దినంపై బీజేపీ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాష్ట్రం విలీనమైన సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని అసెంబ్లీ సమావేశాల తొలిరోజున బీజేఎల్పీ డిమాండ్ చేయనుంది. టీఆర్ఎస్ గతంలో ప్రజలకిచ్చిన హామీ మేరకు ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించింది. ఉత్సవాలను అధికారికంగా నిర్వహించే వరకు పార్టీపరంగా ఉద్యమాన్ని కొనసాగించాలని తీర్మానించినట్లు బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది. మంగళవారం ఉదయం 10 గంటలకు అసెం బ్లీ ఎదుటనున్న మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్పటేల్ విగ్రహానికి పార్టీ ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. -
వచ్చే నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ 14వ శాసనసభ ఎనిమిదో సమావేశాలు సెప్టెంబర్ ఎనిమిదో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కానున్నాయి, హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లోని అసెంబ్లీ సమావేశ మందిరంలో సమావేశాలు జరుగుతాయి. ప్రారంభానికి సంబంధించి శుక్రవారం శాసనసభ ఇన్చార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇటీవల పార్లమెంటు జీఎస్టీ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లును మెజారిటీ రాష్ట్రాలు ఆమోదిస్తేనే అమలుచేసేందుకు వీలవుతుంది. ఈ నేపథ్యంలో సమావేశాలను నిర్వహిస్తున్నారు. పనిలో పనిగా వర్షాకాల సమావేశాలను కూడా పూర్తిచేస్తారు. మూడు రోజుల పాటు మాత్రమే సమావేశాలు జరపాలని ప్రభుత్వం భావిస్తున్నా తొలి రోజున జరిగే శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశాల్లో సభ ఎన్నిరోజులు నిర్వహించేది నిర్ణయిస్తారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సమగ్రంగా చర్చించేందుకు అసెంబ్లీని కనీసం నాలుగు వారాల పాటు నిర్వహించాలని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఇప్పటికే డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు కూడా అసెంబ్లీ సమావే శాలను కనీసం మూడు నుంచి నాలుగు వారాలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం, కృష్ణా పుష్కరాలు, రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, దళితులపై దాడులు, ఏపీకి ప్రత్యేక హోదా తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మండలి సమావేశాలు ఎనిమిదో తేదీ ఉదయం పది గంటలకు పబ్లిక్గార్డెన్స్లోని సమావేశ మందిరంలో ప్రారంభమవుతాయి. తొలుత సమావేశాలను ఏపీ నూతన రాజధాని ప్రాంతం అమరావ తిలో నిర్వహించాలని భావించారు. అక్కడ ఏర్పాట్లు పూర్తి కాకపోవటంతో హైదరాబాద్లోనే నిర్వహించనున్నారు. -
నెలాఖరు నుంచి అసెంబ్లీ
* లేదా సెప్టెంబర్ 17 నుంచి సమావేశాలు * గణేశ్ నవరాత్రుల దృష్ట్యా సర్కారు మల్లగుల్లాలు సాక్షి, హైదరాబాద్: గణేశ్ నవరాత్రుల దృష్ట్యా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ నెల 30 నుంచి లేదా సెప్టెంబర్ 17వ తేదీ నుంచి సమావేశాలు నిర్వహించే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. జీఎస్టీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించేందుకు వీలైనంత త్వరగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఇప్పటికే నిర్ణయించారు. ఈ మేరకు సన్నాహాలు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 8 నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో ఏపీ కంటే ముందే జీఎస్టీ బిల్లును ఆమోదించి పంపేందుకు వీలుగా ఈ నెలాఖరునే సమావేశాలు ప్రారంభించాలనే ప్రతిపాదన వచ్చింది. కేవలం మూడు రోజుల పాటు సమావేశాలు జరిపి, తొలి రోజునే జీఎస్టీ బిల్లును ఆమోదించాలని యోచిస్తోంది. మరోవైపు గణేశ్ నవరాత్రుల దృష్యా భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు ఇబ్బందులు తలెత్తకుండా... నిమజ్జనోత్సవం ముగిశాక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసే ప్రత్యామ్నాయాన్ని కూడా సర్కారు పరిశీలిస్తోంది. దీనికి సంబంధించి పోలీసు విభాగం నుంచి అందిన సూచనలను అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. మొత్తంగా ఈ నెల 30వ తేదీ నుంచిగానీ లేదా సెప్టెంబర్ 17వ తేదీ నుంచిగానీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి తీసుకునే తుది నిర్ణయం మేరకు తేదీ ఖరారవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అస్సాం, బిహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు జీఎస్టీ బిల్లును ఆమోదించాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సెప్టెంబర్ తొలివారంలో బిల్లును ఆమోదించి పంపిస్తామని ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖకు సమాచారమిచ్చాయి. జీఎస్టీ బిల్లుకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా వీలైనంత తొందరగా సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ శాసనసభ సమావేశాల్లోనే దేవాదాయ శాఖ చట్ట సవరణ బిల్లు, ఎస్టీ, మైనారిటీల స్థితిగతులపై సుధీర్ కమిషన్, చెల్లప్ప కమిషన్ ఇచ్చిన నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. -
నెలాఖరు నుంచి అసెంబ్లీ
-
8 నుంచి అసెంబ్లీ సమావేశాలు
ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల అమలాపురం : శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 8న ప్రారంభమవుతాయని ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. సమావేశాలు నాలుగైదు రోజులపాటు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో బుధవారం ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తొలుత అసెంబ్లీ సమావేశాలను అమరావతిలో నిర్వహించాలనుకున్నామని, కేంద్రం జీఎస్టీ బిల్లును వచ్చే నెల 8 నాటికి ఆమోదించి పంపాల్సిందిగా కోరడంతో హైదరాబాద్లో నిర్వహిస్తున్నామన్నారు. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏఏ అంశాలు చర్చించాలనేది తొలి రోజున బీఏసీ సమావేశం నిర్వహించి ప్రకటిస్తామని చెప్పారు. కేంద్ర ఆర్థికమంత్రి చైర్మన్గా ఉన్న హైపర్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఈ నెల 30న న్యూఢిల్లీలో సమావేశమై జీఎస్టీ పరిహారం కేటాయింపులపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. -
వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఏపీలోనే
నిర్మాణాలు పూర్తికాకపోయినా సీఎం ఆదేశాల మేరకు ఏర్పాట్లు: స్పీకర్ కోడెల సాక్షి, హైదరాబాద్: శాసనసభా సమావేశాలను సెప్టెంబర్ చివరి వారంలో ఆంధ్రప్రదేశ్లోనే నిర్వహించనున్నట్టు స్పీకర్ కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. గత సమావేశాలనే ఏపీలో నిర్వహించాల్సి ఉందని, కానీ సాధ్యపడలేదన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం శాసనసభా ప్రాంగణంలోని అంబేడ్కర్, గాంధీజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శాసనసభా, మండలి సమావేశాలు ఏపీలో నిర్వహించేందుకు అవసరమైన పనులు వేగంగా జరగడం లేదన్నారు. అయినా సరే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అక్కడే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో అనుకున్న దానికన్నా జీడీపీ సాధించామని, ఇంకా సాధించాల్సి ఉందని తెలిపారు. పేదల జీవన ప్రమాణాలు పెరగాలని, కులమతాలకతీతంగా అందరూ కలిసికట్టుగా అభివృద్ధి సాధించాలని కోరారు. -
ప్రత్యక్ష ప్రసారంలో ఇబ్బందేమిటో..?
సాక్షి, చెన్నై: అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసా రం ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో ఇబ్బం దులు ఏమిటో అని ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. ఇందుకుగాను నిర్ణయం తీసుకునే విషుంగా మరిం త సమయాన్ని న్యాయమూర్తులు కే టాయించారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను టీవీల ద్వారా ప్రత్యక్ష ప్ర సారం చేయాలన్న డిమాండ్ ఎప్ప టి నుంచో వస్తున్న విషయం తెలిసిందే. అయితే, పాలకుల్లో స్పందన మాత్రం లేదు. ఈ వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరింది. ఈ ప్రజా వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి మహాదేవన్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం విచారించింది. ఇప్పటికే ఈ విషయంగా నిర్ణయాలు తీసుకునేందుకుగాను ప్రభుత్వానికి పలుసార్లు సమయాన్ని కోర్టు కేటాయించిందని చెప్పవచ్చు. తాజా విచారణ సమయంలో ప్రభుత్వాన్ని బెంచ్ ప్రశ్నిస్తూ కొన్ని వ్యాఖ్యల్ని సంధించిందని చెప్పవచ్చు. పార్లమెంట్, రాజ్య సభల్లోని వ్యవహారాల్నే ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నప్పుడు, ఇక్కడి అసెంబ్లీ సమావేశాలను ప్రసారం చేయడంలో ఇబ్బందులు ఏమిటో అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఇంతలో అడ్వకేట్ జనరల్ సోమయాజులు జోక్యంచేసుకుని సమయం కేటాయించాలని విన్నవించారు. అదే సమయంలో పిటిషనర్ తరఫున న్యాయవాది శేషాద్రి అందుకుని కేరళ తరహాలో ఇక్కడ ప్రసారాలు చేయవచ్చుగా అని సూచించారు. ఈ ప్రసారాలకు నిధులు ఖర్చు అవుతాయన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుందని, కేరళలో అనుసరిస్తున్న విధానం అనుసరిస్తూ నిధులతో పనిలేదని వివరించారు. దీంతో తదుపరి విచారణ అక్టోబర్కు వాయిదా పడింది. నష్టపరిహారం కోసం: ఎన్నికల వాయిదా పడడంతో తమకు ఏర్పడ్డ న ష్టాన్ని ఎన్నికల కమిషన్ ద్వారా ఇప్పించాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. మే 16న రాష్ట్రంలోని 232 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, నగదు బట్వాడా ఆరోపణలతో తంజావూరు, అరవకురిచ్చిల్లో ఎన్నికలు ఆ గాయి. ఈ ఎన్నికల నిర్వహణ ఎప్పుడో అన్నది తేలాల్సి ఉంది. కాగా, డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులు నగదు బట్వాడా కారణంగా ఈ ఎన్నికలు వాయిదా పడ్డాయని, ఈ దృష్ట్యా తమకు నష్టం ఏర్పడి ఉన్నదంటూ బీజేపీ, పీఎంకే తదితర అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఆ ఎన్నికల నిమిత్తం తాము నియమ నిబంధనలకు లోబడి ఖర్చులు పె ట్టి ఉన్నామని, ఆ ఖర్చులను తమకు ఎవరు ఇస్తారని పిటిషన్ ద్వారా ఎన్నికల యంత్రాంగాన్ని ప్రశ్నించారు. తమకు నష్ట పరిహారం అం దించే విధంగా ఎన్నికల యంత్రాంగాన్ని ఆదేశించాలని విన్నవించారు. ఈ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి మహాదేవన్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. ఎన్నికల యంత్రాంగం తరఫున న్యాయవాది నిరంజన్ హాజరై, నష్ట పరిహారం చెల్లించేందుకు తగ్గ ఆస్కారాలు లేవు అని బెంచ్ దృష్టికి తెచ్చారు. దీంతో తదుపరి విచారణ సెప్టెంబరు 20కు వాయిదా పడింది. -
‘పవర్పాయింట్’కు అవకాశం ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటిపై చర్చించి పరిష్కరించడానికి వెంటనే అసెంబ్లీని సమావేశపర్చాలని కాంగ్రెస్పార్టీ విప్, ఎమ్మెల్యే ఎస్.సంపత్కుమార్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలను తక్షణమే ఏర్పాటుచేయాలని కోరుతూ స్పీకర్ ఎస్.మధుసూదనాచారికి గురువారం సీఎల్పీ రాసిన లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత చట్టసభలపై ఉందని అన్నారు. భూసేకరణ చట్టం-2013కు విరుద్ధంగా, రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేస్తోందన్నారు. దీంతో సాగునీటి ప్రాజెక్టులకోసం భూములు కోల్పోయే రైతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారని వివరించారు. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్పై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అనేక అబద్ధాలు చెబుతూ, ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్లోని లోపాలు, వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ విషయంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనానికి సంబంధించిన ప్రాజెక్టుల టెండర్లు, కాంట్రాక్టులపై సమగ్రంగా చర్చించడానికి, అసెంబ్లీలో కాంగ్రెస్ పక్షాన పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెంటనే వర్షాకాల సమావేశాలను ఏర్పాటుచేయాలని సంపత్కుమార్ డిమాండ్ చేశారు. సీఎల్పీ కార్యదర్శి రామ్మోహన్రెడ్డి, సంపత్కుమార్లు మొదట స్పీకర్ను కలిసేందుకు అసెంబ్లీకి వచ్చారు. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శి రాజ సదారాంను కలసి సీఎల్పీ పక్షాన లేఖ ఇచ్చారు. -
నేటి నుంచి అసెంబ్లీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు 15 చట్టసభకు గత నెల ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఓటర్లను నగదు పంచారనే ఆరోపణలతో కరూరు జిల్లా అరవకురిచ్చి, తంజావూరు అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ వాయిదాపడగా, మొత్తం 234 స్థానాలకుగానూ 232 స్థానాలకు మాత్రమే పోలింగ్ నిర్వహించారు. తిరుప్పరగున్రం అన్నాడీఎంకే ఎమ్మెల్యే శీనివేల్ అనారోగ్య కారణాలతో మృతి చెందారు. దీంతో 231 ఎమ్మెల్యేలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. వీరిలో అన్నాడీఎంకే నుంచి 133 సభ్యులు, డీఎంకే నుంచి 98 సభ్యులు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. సీఎంగా జయలలిత బాధ్యతలు చేపట్టిన తరువాత గత నెల 25వ తేదీన ఒకసారి, ఈనెల 3వ తేదీన మరోసారి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అయితే తొలి సమావేశంలో సభ్యులచే ప్రమాణ స్వీకారం, రెండో సమావేశంలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికతోనే సరిపెట్టి జూన్ 16వ తేదీన అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ ప్రకటించారు. ప్రజల సమస్యలు, కొత్త ప్రభుత్వం నుంచి ప్రకటన చోటుచేసుకోలేదు. ఈ కోణంలో చూస్తే ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇవే తొలి సమావేశాలుగా పరిగణనలోకి తీసుకోవచ్చు. అందుకే గవర్నర్ కే రోశయ్య కొత్త ప్రభుత్వాన్ని ఉద్దేశించి తొలిసారిగా ప్రసంగించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా, గవర్నర్ ప్రసంగం అనంతరం సమావేశాలను వాయిదావేస్తున్నట్లు ప్రకటిస్తారు. శుక్రవారం మళ్లీ సమావేశాలు కొనసాగుతాయి. సుమారు ఐదురోజుల పాటూ అసెంబ్లీ సమావేశాలు సాగుతాయని అంచనావేస్తున్నారు. ఈ ఐదు రోజుల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి సభ్యులు ప్రసంగిస్తారు. ఎన్నికల మేనిఫెస్టోలో అన్నాడీఎంకే ఇచ్చిన హామీలను గ వర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే సీఎం జయలలిత చేసిన తొలి సంతకం ప్రకారం 500 టాస్మాక్ దుకాణాల మూతపై స్పష్టమైన ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. అనేక ప్రత్యేకతల అసెంబ్లీ: ఇదిలా ఉండగా, కొత్త అసెంబ్లీ అనేక ప్రత్యేకతలను, చారిత్రాత్మక ప్రాధాన్యతలను సంతరించుకుంది. గత అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్ ఈసారి ఓటమి పాలు కావడమేగాక, ఆ పార్టీ నుంచి ఒక్క అభ్యర్థి కూడా సభలో ప్రాతినిథ్యం వహించడం లేదు. రాష్ట్ర చరిత్రలో 89 మంది సభ్యులతో డీఎంకే బలమైన ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ప్రతిపక్ష నేతగా స్టాలిన్ బాధ్యతలు చేపట్టారు. అలాగే డీఎంకే మిత్రపక్ష కాంగ్రెస్ 8 స్థానాలు, ఇండియన్ ముస్లింలీగ్ ఒక్క స్థానంతో కొత్త అసెంబ్లీలోకి అడుగిడుతున్నారు. తమిళనాడు అసెంబ్లీ చరిత్రలో వామపక్షాలు లేని తొలి అసెంబ్లీగా మరో రికార్డును సొంతం చేసుకుంది. -
కీలక నిర్ణయాలు
వచ్చేనెల 4నుంచి శాసనసభ సమావేశాలు కర్ణాటక ఆఫర్డబుల్ హౌసింగ్ పాలసీ అమలుకు ఆమోదం నగరోత్తన పథకం కింద రూ.7,300 కోట్లు వ్యయం మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం వివరాలు వెల్లడించిన మంత్రి జయచంద్ర బెంగళూరు: వచ్చే నెల 4 నుంచి 29 వరకూ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఈమేరకు బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రీటైల్ ట్రేడ్ పాలసీ-2015 అమలుకు కూడా మంత్రి మండలి పచ్చజండా ఊపింది. మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను న్యాయశాఖమంత్రి టీ.బీ జయచంద్ర మీడియాకు వెల్లడించారు. ⇒నూతనంగా అమల్లోకి వచ్చే రీటైల్ ట్రేడ్ పాలసీ వల్ల ఆ రంగంలో స్కిల్డ్, అన్స్కిల్డ్ విభాగాల్లో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా రీటైల్ సంస్థల పనివేళలతో పాటు , కార్మిక చట్టాల్లో కూడా మార్పులు రానున్నాయి. ⇒రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సొంతింటి కలను నిజం చేసే చర్యల్లో భాగంగా కేంద్ర నుంచి ఆర్థిక సహకారం అందుకోవడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కర్ణాటక ఆఫర్డబుల్ హౌసింగ్ పాలసీ అమలుకు మంత్రి మండలి పచ్చజండా ఊపింది. ⇒ నగరోత్తన పథకం కింద 2016-17,2017-18 ఏళ్లల్లో బెంగళూరులో వివిధ అభివృద్ధి పథకాల కోసం రూ.7,300 కోట్లు ఖర్చు చేయడానికి అంగీకారం. ⇒బళ్లారి, రాయచూర్, కొప్పళ జిల్లాల్లో తాగునీటి సరఫరాకు రూ.432.55 కోట్లు విడుదల. ⇒తుమకూరు నుంచి శిర మీదుగా దావణగెరె వరకూ రైల్వే లైన్ల పనుల కోసం అవసరమై 235 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడం కోసం రూ.1,801 కోట్ల నిధులు విడుదలకు మంత్రి మండలి అంగీకారం. ⇒{పస్తుత ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి అరవింద్ జాదవ్ ఈనెల 30న రిటైర్డ్ అవుతున్న నేపథ్యంలో నూతన ముఖ్యకార్యదర్శి ఎంపిక విషయాన్ని ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కట్టబెడుతూ మంత్రి మండలి ఏకగ్రీవ నిర్ణయం. కాగా, ముఖ్యకారదర్శి రేసులో సీనియారిటీను అనుసరించి వరుసగా ఉపేంద్ర త్రిపాఠి, సుభాష్చంద్ర, రత్నప్రభ, ఎస్.కే పట్నాయక్లు ఉన్నారు. వీరందిరిలో ఏడాది తొమ్మిది నెలల సర్వీసు కలిగిన రత్నప్రభను ముఖ్యకార్యదర్శిగా ఎంపికచేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ⇒పౌరసరఫరాల శాఖ రేషన్ షాపుల ద్వారా సరఫరా చేసే బియ్యం, రాగులు తదితర ఆహార పదార్థాలను చట్టవిరుద్ధంగా పొందడం కాని, నిల్వ చేయడం కాని చేసిన వారి వివరాలు చెప్పిన వారికి రూ.200 బహుమతి ఇవ్వడానికి అంగీకారం. -
నేటి నుంచి అసెంబ్లీ
తమిళనాడు 15వ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి జయలలిత సహా మొత్తం 232 మంది సభ్యుల చేత ప్రొటెం స్పీకర్ సెమ్మలై పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. వచ్చేనెల 3వ తేదీన స్పీకర్ను ఎన్నుకుంటారు. * 232 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం * నేడు నలుగురు మంత్రులతోనూ... సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు 15వ చట్టసభకు సభ్యులను ఎన్నుకునేందుకు ఈనెల 16వ తేదీన మొత్తం 234 స్థానాలకుగానూ 232 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఓటర్లను నగదు పంచారనే ఆరోపణలు రావడంతో కరూరు జిల్లా అరవకురిచ్చి, తంజావూరు అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ వాయిదా పడింది. ఈనెల 19వ తేదీన జరిగిన ఓట్ల లెక్కింపులో అన్నాడీఎంకే 134 స్థానాలు గెలుచుకుని మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. డీఎంకే కూటమి 98 స్థానాల్లో గెలుపొందింది. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఈనెల 23వ తేదీన ముఖ్యమంత్రిగా జయలలిత పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. 28 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం జయలలిత ఐదు అంశాలపై తొలి సంతకం చేశారు. గత అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండిన విజయకాంత్ ఈసారి ఓటమి పాలుకాగా, ఆ స్థానాన్ని డీఎంకే నేత స్టాలిన్ అలంకరించారు. అయితే ఆనాడు విజయకాంత్ తొలుత అధికార అన్నాడీఎంకేకు మిత్రపక్షంగా ఎన్నికల్లో పోటీచేసి ఆ తరువాత ప్రతిపక్షంగా మారిపోయారు. ఈసారి ప్రతిపక్ష నేత స్టాలిన్ నిజంగానే అధికార అన్నాడీఎంకేకు ప్రత్యర్థిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 15వ అసెంబ్లీ బుధవారం సమావేశం అవుతుందని అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బుధవారం ఉదయం తాత్కాలిక స్పీకర్ సెమ్మలై కొత్త సభ్యుల చేత పదవీ ప్రమాణం చేయిస్తారని, వచ్చేనెల 3వ తేదీన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సాగుతుందని అన్నారు. 89 మంది సభ్యులతో డీఎంకే ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిందని తెలిపారు. అలాగే కాంగ్రెస్ 8 స్థానాలు, ఇండియన్ ముస్లింలీగ్ ఒక్క స్థానంతో కొత్త అసెంబ్లీలోకి అడుగిడుతున్నారని చెప్పారు. తమిళనాడు చరిత్రలో వామపక్షాలు లేని తొలి అసెంబ్లీగా రికార్డు కెక్కినట్లు తెలిపారు. నేడు నలుగురు మంత్రుల ప్రమాణం: అమ్మ కేబినెట్లో కొత్తగా చేరిన న లుగురు ఈనెల 25వ తేదీన రాజ్భవన్లో పదవీ ప్రమాణం చేయనున్నారు. జి. భాస్కరన్, సెవ్వూరు ఎస్ రామచంద్రన్, నిలోఫర్ కబిల్, బాలకృష్ణారెడ్డి చేత గవర్నర్ కే రోశయ్య మంతులుగా ప్రమాణం చేయిస్తారు. -
కరువుపై చర్చకు అసెంబ్లీని సమావేశపర్చాలి
సీఎంకు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ప్రభుత్వపరంగా చేపట్టే సహాయ చర్యలపై చర్చిం చేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్కు టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. కరువుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని, నీటి ఎద్దడి, పశుగ్రాసం కొర త నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. కేంద్రం నుంచి కరువు సహాయం కింద రూ.10వేల గ్రాంట్ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలన్నారు. పంట నష్టపోయి న రైతులకు తక్షణ సహాయగా ఎకరాకు రూ.10వేల కోట్ల చొప్పున పరిహారం చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లయ్ కార్పొరేషన్ ద్వారా ఉల్లి క్వింటాల్ రూ.1500 చొప్పున, మార్క్ఫెడ్ ద్వారా పసుపు క్వింటాల్కు రూ.12వేలు చొప్పున, చెరకు టన్నుకు రూ.1,000 చొప్పున ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలని కోరారు. -
కాంగ్రెస్.. సెల్ఫ్ గోల్ చేసుకుంది
♦ అసెంబ్లీ సమావేశాలు గొప్పగా జరిగాయి ♦ సభా సమయం వృథా కాలేదు ♦ పన్నెండేళ్లలో అతి తక్కువ వాయిదాలు ♦ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్ సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ఈసారి అద్భుతంగా జరిగాయని, పదిహేడు రోజుల పాటు మంచి చర్చ జరిగిందని శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి టి.హరీశ్రావు చెప్పారు. సభా సమయం వృథా కాలేదన్నారు. అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత గురువారం ఆయన అసెంబ్లీ కమిటీ హాలులో విలేకరులతో మాట్లాడారు. ‘గడిచిన 12 ఏళ్లలో అతి తక్కువ సార్లు సభ వాయిదా పడడం ఇదే తొలిసారి. పోడియంలోకి ఎవరూ రాలే దు. ఏ ఒక్క రోజూ సభా సమయం వృథా కాలేదు. ప్రతిపక్షాలను కలుపుకుని పోయాం. ప్రభుత్వం ఒక మెట్టు దిగివచ్చి సభ జరిపింది. గతంలో అన్ని పద్దులపై ఎప్పుడూ చర్చ జరగలేదు. గత ఏడాది, ఈసారి కలిపి రెండు సార్లూ అన్ని పద్దులపై చర్చించాం. మంచి సంప్రదాయాన్ని నెలకొల్పాం. మంత్రుల కంటే ప్రతిపక్ష సభ్యులకే ఎక్కువ సమయం ఇచ్చాం’ అని మంత్రి హరీశ్ వెల్లడించారు. ప్రతిపక్షాల గైర్హాజరు దురదృష్టకరం చివరి రోజు ప్రతిపక్షాలు సభను బాయ్కాట్ చేయడం దురదృష్టకరమని హరీశ్ అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు సభకు ఎందుకు హాజరు కాలేదో తమకు తెలియదని, టీవీలు చూసి బయట ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడడం ఎందుకని ప్రశ్నించారు. ‘క్రికెట్ ఇంట్లో ఆడితే ఎలా? గ్రౌండ్లో కదా ఆడాల్సింది. మీ వాదనలో పసలేదు. నిజాయితీ ఉంటే సభకు వచ్చి మాట్లాడేవారు. ప్రతిపక్ష సభ్యులకూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అవకాశం ఇస్తామన్నాం. టెక్నాలజీ వాడొద్దని రూల్స్ ఉన్నాయా? ఆన్లైన్లో సమాచారం, మెయిల్స్ ద్వారా ప్రశ్నలు పంపాలని, సభలో ల్యాప్టాప్లు వాడాలని రూల్స్ కమిటీలో నిర్ణయం తీసుకున్నాం’ అని ఆయన అన్నారు. సభకు రాకుండా, ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చలో పాల్గొనకుండా కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ చేసుకుందన్నారు. సీఎం కేసీఆర్ వాస్తవ పరిస్థితులను క ళ్లకు కట్టారని, ఒక విధంగా ఆయన తన ఆత్మను సభలో ఆవిష్కరించారని చెప్పారు. కాంగ్రెస్ది కేవలం గోబెల్స్ ప్రచారమన్నారు. వారు మాట్లాడింది బోగసని తేలిపోయిందన్నారు. కాంగ్రెస్ కూడా సభలో ఉండిఉంటే బావుండే దని, సీఎం ప్రతీ సభ్యుని ప్రశ్నకు జవాబిచ్చారని హరీశ్ చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ సభ్యులు ఇప్పటికైనా, కనీసం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలో పాల్గొని పనులు చేసుకోవాలని, ప్రజలకన్నా మేలు చేయాలని, మంచి పనులకు మద్దతుగా నిలవాలని హితవు పలికారు. సమావేశంలో చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కోటి ఎకరాల మాగాణమే లక్ష్యం మండలిలో మంత్రి హరీశ్రావు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కోటి ఎకరాలను మాగాణంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రాజెక్టులను చేపట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. గురువారం శాసన మండలిలో సాగునీటిపై లఘుచర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను, తెలంగాణ అవసరాలను ఎలా తీ ర్చబోతున్నామన్న అంశాలను అందరికీ తెలిపేం దుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శాసనసభ లో ఇచ్చిన ప్రజెంటేషన్ దేశంలోని ఇతర సీఎంలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై ప్రతిపక్షాలకు అనుమానాలుంటే నివృత్తి చేసుకోవాల్సిందిపోయి, తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనని పారిపోయాయన్నారు. వట్టిపోయిన ప్రాజెక్టులకు నీటిని ఎలా తెస్తామో సీఎం వివరించారని, పెండింగ్ ప్రాజెక్టులను కూడా ఎలా పూర్తిచేస్తామో తెలిపారని ఆయన పేర్కొన్నా రు. ప్రాణహిత ద్వారా ఆదిలాబాద్కు, భీమ, కోయిల్సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టుల ద్వారా మహబూబ్నగర్కు ఏడాదిన్నరలో సాగునీరందిస్తామన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రతిపక్షాలు ఎటువంటి సూచనలిచ్చినా స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అంతకు ముందు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ.. ప్రాజెక్టులపై రాజకీయ పార్టీలకు ఉన్న అభ్యంతరాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణరావు, బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధర్ గౌడ్, నరేందర్రెడ్డి, శంబీపూర్రాజు, బోడకుంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. హరిత విప్లవం, క్షీర విప్లవం మాదిరిగా జలవిప్లవానికి కేసీఆర్ నాంది పలికారని, త్వరలోనే కోటి ఎకరాల బీడుభూములు మాగాణంగా మారబోతున్నాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
పులి కాస్తా పిల్లి కావడమంటే ఇదే...!
గత అసెంబ్లీ సమావేశాలతో పోల్చితే ప్రస్తుత సమావేశాల్లో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో టీడీపీ సభ్యులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదని, ప్రధానప్రతిపక్షం కాంగ్రెస్ను కూడా వెనక్కు తోసి తామే అసలైన విపక్షంగా ప్రవర్తించిన తీరును పలువురు ఎమ్మెల్యేలు గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పుడు టీడీపీ నుంచి మెజారిటీ ఎమ్మెల్యేలు విడిపోయి టీఆర్ఎస్లో విలీనమయ్యాక కూడా కొందరు ఎమ్మెల్యేలు ఏమాత్రం వెనక్కుతగ్గడం లేదంటున్నారు. తామే అసలైన అధికారపక్షంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలనే పక్కకు తోసే విధంగా వారు చూపుతున్న వేగం చూసి ఇతర ఎమ్మెల్యేలు ముక్కున వేలేసుకుంటున్నారు. గతంలో ఆయా సందర్భాల్లో బయట బహిరంగంగానే రేవంత్రెడ్డి మీసం మేలేసి తొడగొట్టి సవాళ్లు విసిరిన విషయాన్ని కూడా పలువురు ప్రస్తావిస్తున్నారట. ఓటుకు కోట్లు కేసులో జైలు నుంచి రేవంత్ బెయిల్పై బయటకొచ్చాక టైగర్ ఈజ్ బ్యాక్ అంటూ గతంలో ఫ్లెక్సీలు, పోస్టర్లు వెలిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేల్లో రేవంత్రెడ్డి, మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కలసి కనిపిస్తున్నారు. అధిక సందర్భాల్లో రేవంత్రెడ్డి ఒక్కడే ఏక్నిరంజన్ అన్న చందంగా లాబీల్లో అటు ఇటు తిరుగుతూ కనిపిస్తున్నారు. ఎవరు వెంట లేకపోవడంతో మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటి, గత అనుభవాలు, సంఘటనలను గుర్తుచేసుకుంటూ రే వంత్రెడ్డి గడిపేస్తున్నారట. ఒకప్పుడు పులి ఇప్పుడు పిల్లి అనే సామెతకు ఇది అతికినట్లుగా సరిపోతుందని పలువురు ముక్తాయింపునిచ్చేస్తున్నారు... -
సర్కారు కొత్త సంప్రదాయం
ఆదివారాల్లోనూ అసెంబ్లీ సమావేశాలు సాక్షి, హైదరాబాద్: ఆదివారం అంటే అందరికీ ఆటవిడుపు.. సెలవు దినం. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివారం అచ్చొచ్చినట్లుంది. ఇటీవల వరుసగా మంత్రివర్గ భేటీలను ఆదివారం నిర్వహిస్తున్న ప్రభుత్వం ఏకంగా అసెంబ్లీ సమావేశాలను కూడా ఆదివారం కొనసాగించే కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించింది. శుక్రవారం జరిగిన బీఏసీ సమావేశంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షాలతో చర్చించి ఆమోద ముద్ర కూడా వేయించింది. ఈనెలాఖరు వరకు జరిగే బడ్జెట్ సమావేశాల వ్యవధిలో వచ్చే మూడు ఆదివారాలను పనిదినాలుగా గుర్తించడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదివారం కేబినెట్ మీటింగ్లతో పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ప్రతిపాదన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో అసెంబ్లీకి శని, ఆదివారాలు సెలవులుండేవి. ఈ రెండ్రోజులు ఉద్యోగులకు సెలవు దినాలు కాగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాలకు వెళ్లే వీలుండేది. కానీ తాజా నిర్ణయంతో ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు వీరందరూ పని చేయాల్సిందే. సహజంగానే అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు సాధారణ పరిపాలనా విభాగంతో పాటు సచివాలయ సిబ్బందికి సెలవులు రద్దు చేస్తారు. అవసరమైన సమాచారంతో నిత్యం అందుబాటులో ఉండాలని ఇప్పటికే సంబంధిత విభాగాల అధికారులు ఉద్యోగులందరికీ సర్క్యులర్ జారీ చేశారు. రాజ్యాంగం ప్రకారం ఏప్రిల్ ఒకటికి ముందే బడ్జెట్కు సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లు శాసనసభ ఆమోదం పొందటం తప్పనిసరి. లేదంటే రాష్ట్ర ఖజానా నుంచి ప్రభుత్వం నిధులు డ్రా చేయడానికి వీలుండదు. అందుకే సెలవు రోజులతో సంబంధం లేకుండా పదహారు పనిదినాల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాల్సి ఉందని ప్రభుత్వం లెక్కలేసుకుంది. ఈ నేపథ్యంలోనే శని, ఆదివారాలు పనిదినాలుగా మార్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ను ఆమోదించేందుకు ఏర్పాటు చేసిన రాష్ట్ర మంత్రివర్గ భేటీ సైతం రేపు (ఆదివారం) సాయంత్రమే జరగనుండటం కొసమెరుపు. -
ప్రజా సమస్యలపైనే అసెంబ్లీ నడపాలి
సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య సాక్షి, హైదరాబాద్: ప్రజల సమస్యలకు పరిష్కారం లభించేలా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఒక ప్రకటనలో కోరారు. బడ్జెట్ సమావేశాలు 45 రోజులు జరిపే సంప్రదాయం గతంలో ఉండేదని, ఇప్పుడు శాసనసభా నిబంధనలను ఉల్లంఘిస్తూ, ప్రజా సమస్యలపై చర్చించకుండా, మొత్తం ప్రతిపక్షాన్నే విస్మరించే చెడు సంప్రదాయం రాష్ట్రంలో కనిపిస్తోందన్నారు. గత ఏడాది శీతాకాల సమావేశాలనే ఎత్తేశారని, అసెంబ్లీ ఎజెండాలో 344, ఎస్ఎన్క్యూ, కాల్ అటెన్షెన్ (74) తీర్మానాలు ప్రచురించడాన్ని మానేశారని, చర్చకు కూడా అవకాశం ఇవ్వడం లేదన్నారు. విపక్షాలన్నీ ఒకే సమస్యపై వాయిదా తీర్మానం పెట్టినా తిరస్కరిస్తున్నారన్నారు. రూల్స్ కమిటీ మీటింగ్ పెట్టి.. అసెంబ్లీ జరగాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని, అరెస్ట్లు, కేసులు, అవసరమైతే జైల్లో పెడతామని ప్రతిపక్షాలకు హెచ్చరికలు చేయడం సరైంది కాదన్నారు. సభలో సంఖ్యాబలంతో సంబంధం లేకుండా ప్రతిపక్షానికి ప్రాధాన్యతనిచ్చి సభను సజావుగా నడిపించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. -
కేంద్రం సహకరిస్తేనే అభివృద్ధి
♦ నేను ఎవ్వరికీ భయపడటంలేదు ♦ జూన్ తర్వాత అసెంబ్లీ విజయవాడలోనే: సీఎం సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సహకరిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, ఈ దిశగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు చెప్పారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్లే కేంద్రంపై తాను మాట్లాడలేకపోతున్నానని, అంతే తప్ప తాను ఎవరికీ భయపడటం లేదని స్పష్టం చేశారు. వచ్చే జూన్ తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు విజయవాడలోనే జరుగుతాయని ప్రకటించారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలతో పోటీపడుతున్నామని వెల్లడించారు. రాష్ట్ర విభజనలో హేతుబద్ధత లోపించిన కారణంగా సమస్యలు వస్తున్నాయన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే చర్చకు ముఖ్యమంత్రి బుధవారం శాసనసభకు సమాధానం ఇచ్చారు. రాజధాని అమరావతి కోసం భూములు కొనుగోలు చేయాలంటే రూ. 40 వేల కోట్లు కావాలని, ఇంత మొత్తం భరించే శక్తి లేని కారణంగానే భూసమీకరణ చేపట్టామని తెలిపారు. రైతులందరి ఆమోదంతో ఈ ప్రక్రియను పూర్తిచేసినా... విపక్షం దీన్ని రాద్ధంతం చేస్తోందని విమర్శించారు. ప్రతికూల పరిస్థితులున్నా రాష్ట్రాభివృద్ధి వేగంగా ముందుకెళ్తోందని వివరించారు. రాష్ట్రంలో వ్యవసాయమే ప్రధాన ఆదాయమని, దీన్ని దృష్టిలో ఉంచుకుని పారిశ్రామిక, సేవా, ఐటీ రంగాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మించేందుకు నిధులు ఎలా సమకూర్చాలనే విషయమై ఆలోచిస్తున్నామని, దీనికోసం అప్పులు తేవడమా, ఎన్ఆర్ఐ బాండ్స్ వెళ్ళడమా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు, మరికొన్ని రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని, ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక గ్రాంట్లు ఇస్తుందన్న విశ్వాసం తమకు ఉందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం ముందుకొస్తే పోలవరం అప్పగిస్తాం పోలవరం నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తి చేస్తామంటే, అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాంట్రాక్టుల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ప్రాజెక్టులను తాము చేపడుతున్నామని, ఇవి పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని చెప్పారు. పట్టిసీమను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో, నిర్ణీత కాలవ్యవధిలోనే పూర్తిచేశామని, రాయలసీమకు తాగునీరు అందించే విషయంలో చిత్తశుద్ధితో ఉన్నామని తెలిపారు. -
కేసీఆర్తో టీడీపీ ఎమ్మెల్యే మాగంటి భేటీ
♦ టీఆర్ఎస్లో చేరికకు రంగం సిద్ధం! ♦ మరో ఎమ్మెల్యే గాంధీ కూడా చేరతారని ప్రచారం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోమవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. కొద్దిరోజులుగా గోపీనాథ్ సైతం అధికార టీఆర్ఎస్లో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన సీఎంను కలవడంతో ఈ ప్రచారానికి బలం చేకూరినట్లయింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే గోపీనాథ్, ఆయనతో పాటు మరో టీడీపీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా టీఆర్ఎస్ గూటికి చేరుకుంటారని విశ్వసనీయ సమాచారం. మిగిలేది ముగ్గురేనా! పదిహేను మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగుపెట్టిన టీటీడీపీలో ప్రస్తుతం మిగిలింది కేవలం అయిదుగురు ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. ప్రస్తుతం రేవంత్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ, ఆర్.కృష్ణయ్య టీడీపీ శిబిరంలో ఉన్నారు. తాజాగా గోపీనాథ్ సీఎంతో భేటీ కావడంతో టీఆర్ఎస్లో ఆయన చేరిక కూడా దాదాపు ఖాయమైనట్టేనని అంటున్నారు. మరో ఎమ్మెల్యే గాంధీ సైతం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ పార్టీ మారితే ఇక, మిగిలేది ముగ్గురే. సోమవారం ఎన్టీఆర్భవన్లో జరిగిన మాజీ మంత్రి మాధవరెడ్డి వర్ధంతి కార్యక్రమానికి పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. అయితే గోపీనాథ్, గాంధీ ఇద్దరూ ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. దీంతో వీరిద్దరూ టీఆర్ఎస్ గూటికి చేరడం ఖాయమైనట్లేనని, అందుకే చంద్రబాబు పాల్గొనే కార్యక్రమానికి కూడా హాజరు కాలేదని చెబుతున్నారు. -
అధ్యక్షా..!
అసెంబ్లీ సమావేశాలకు విపక్షం సిద్ధమవుతోంది. శనివారం నుంచి ప్రారంభమయ్యే రాష్ట్ర శాసన సభ సమావేశాల్లో ప్రధానంగా ‘రాజధాని దురాక్రమణ’పై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అస్త్రశస్త్రాలను సమకూర్చుకుంది. పేద రైతుల పొట్టకొట్టి సంపాదించిన డబ్బుతోనే అధికార తెలుగుదేశం విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టటమే తన ప్రధాన ఎజెండా అని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి స్పష్టం చేశారు. తాగునీటి సమస్యపై ప్రస్తావిస్తానని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా చెబుతున్నారు. రాజధాని భూములను గద్దల్లా తన్నుకుపోయిన ప్రభుత్వ పెద్దల అవినీతిపై నిలదీయనున్నట్టు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఉద్ఘాటించారు. పల్నాడులో కరువుపై సభలో ప్రస్తావించనున్నట్టు మాచర్ల ఎమ్మెల్యే పీఆర్కే తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన ఎజెండా కోన రఘుపతి, ఎమ్మెల్యే, బాపట్ల బాపట్ల : ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టటమే ప్రధాన ఎజెండా. కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగింది. రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు కూడా సక్రమంగా లేవు. ఖరీఫ్, రబీలో రైతులు తీవ్రంగా నష్టపోగా, కరువు మండలాల జాబితాకు సంబంధించి బాపట్ల నియోజకవర్గంలోని కేవలం ఒక మండలానికే చోటు కల్పించి, మరో రెండు మండలాలను వదిలి వేయడంపై ప్రధానంగా చర్చిస్తా. టీడీపీ అధికారంలోకి వచ్చేటప్పుడు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. పాలన చేపట్టిన రెండేళ్ళు కావస్తున్నప్పటికి స్పందించకపోవటం విచారకరం. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తా. నియోజకవర్గ సమస్యలపై చర్చిస్తా షేక్ మొహమ్మద్ ముస్తఫా, ఎమ్మెల్యే, గుంటూరు తూర్పు పట్నంబజారు (గుంటూరు) : నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా. ముఖ్యంగా వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరతా. కృష్ణా నీటి నిల్వలు తగ్గిపోతున్న క్రమంలో నియోజకవర్గంలో నీటి సమస్య జఠిలం కానుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నీటి ఇబ్బందులు ఉన్నాయి. వీటిని అధిగమించి ప్రజలకు తాగునీటిని అందజేయాల్సిన బాధ్యతను ప్రభుత్వానికి గుర్తు చేస్తా. డ్రైనేజీ, కాల్వలు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై చర్చిస్తాం. నియోజకవ ర్గంలోని పలు ప్రాంతాల్లో కాలనీలు ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్నా సరైన రోడ్లు లేవు, వీటిని నిర్మించడానికి ప్రభుత్వం చొరవ చూపాలని తెలియజేస్తా. గుంటూరు నగరంలో నానాటికీ తీవ్ర సమస్యగా మారుతున్న ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారిస్తా. వీటితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముస్లిం మైనారిటీలపై పెడుతున్న అక్రమ కేసులపై మాట్లాడతా. ప్రభుత్వ తీరును ఎండగడతా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల : ప్రజలు కరువు, మంచినీటి సమస్యతో అల్లాడుతుంటే ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఫిరాయింపులను ప్రోత్సాహిస్తూ రాజధాని భూములను కొనుగోలు చేసిన అధికార పార్టీ దుర్నీతిపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తా. పల్నాడులో కరువు, నీటి సమస్యతో ఇబ్బందిపడుతున్న విషయాన్ని అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్తా. పంటలు పండక, నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే ఇంత వరకు కరువు సాయం, పశుగ్రాసం, నీటి సరఫరాకు చర్యలు తీసు కోక పోవటం దారుణం. ఇటువంటి వాటిని పట్టించుకోకుండా ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులను అధికార పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నిస్తూ దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్న టీడీపీ సర్కారును నిలదీస్తా. రాజధాని భూ కుంభకోణం అవినీతి చర్యలపై ప్రభుత్వ తీరును ఎండగడతా. పల్నాడులో చేపట్టాల్సిన మంచినీటి పథకాలు, వరికపూడిశెల, దుర్గి మిర్చి యార్డు, ఆయా సమస్యలను ప్రస్తావిస్తా. రాజధాని దురాక్రమణపై నిలదీస్తా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) మంగళగిరి : రాజధాని పేరుతో మంత్రులు, అధికార పార్టీ నేతలు చేసిన భూ దురాక్రమణపై ప్రభు త్వాన్ని నిలదీస్తా. పేద రైతుల కడుపులు కొట్టి అధికార పార్టీ నేతలు భూములతో వ్యాపారం చేసి కోట్లాది రూపాయలు ఆర్జించి అవినీతికి పాల్పడ్డారు. రైతులకు న్యాయం చేసేందుకు అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తుతా. నదీ తీరాన ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై ప్రశ్నిస్తా. ముఖ్యంగా నియోజకవర్గంలోని గ్రామాలతో పాటు మంగళగిరి, తాడేపల్లి మున్సిపాల్టీలలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తా. చేనేత సహకార సంఘాలతో పాటు చేనేత కార్మికుల సమస్యలు, రుణమాఫీ తదితర అంశాలను ప్రస్తావిస్తా. రాజధాని గ్రామాలలో భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వం ఇస్తున్న ఫించన్లు అర్హులైన పేదలకు అందడం లేదు, తెలుగు తమ్ముళ్ల కారణంగా అసలైన లబ్ధిదారులు నష్టపోతున్నారనే అంశాన్నీ అసెంబ్లీలో లేవనెత్తి అర్హులైన పేదలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తా. బకింగ్హామ్ కాలువపై వంతెనలు, తాడేపల్లి, రేవేంద్రపాడు వంతెనల స్థానంలో నూతన వంతెనలు, తెనాలి రోడ్ విస్తరణ అంశాలను సభ దృష్టికి తీసుకువస్తా. రాజధాని భూ సమీకరణ గ్రామాలలో సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్లు అధికారుల అవినీతి కారణంగా ప్రభుత్వ, అన్నోన్భూములను కొల్లగొట్టిన విషయాన్ని సభ దృష్టికి తీసుకువచ్చి అసలైన రైతులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరతా. రాజధానిలో సంపూర్ణ రుణమాఫీ, ఉపాధి, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, రుణమాఫీ అంశాలను ప్రస్తావిస్తా. రైతు రుణమాఫీ పై నిలదీస్తాం డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే, నరసరావుపేట నరసరావుపేటవెస్ట్ : తెలుగుదేశం వాగ్దానాల్లో భాగమైన రైతు రుణమాఫీలో రెండో ఫేజ్ ఎప్పుడు అమలు చేస్తారనే విషయమై ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రాష్ట్ర బడ్జెట్లో రైతు రుణమాఫీ రెండో విడతకు ఎంత కేటాయిస్తున్నారనే విషయాన్ని లేవనెత్తుతా. అలాగే మెడికల్ అండ్ హెల్త్ విభాగంలో తెలు గుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు నియామకాలు చేపట్టలేదు.ఇప్పుడు కాంట్రాక్ట్ పద్ధతిపై తీసుకుంటామనే వార్తలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇక రాజధాని భూముల విషయంలో ముఖ్యమంత్రి, అతని బినామీలు, మంత్రులు వారి బినామీలు చేసిన దురాక్రమణపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తాం. లోకేష్, నారాయణ ఇద్దరూ కలిసి 3వేల ఎకరాలకు పైగా భూములను కొనుగోలు చేశారనే విషయం తేటతెల్లమైంది. దీంతో ప్రభుత్వ వెబ్సైట్ను నిలిపివేయించటం పెద్ద నేరం. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. రాజధాని భూములతో వచ్చిన డబ్బుతోనే రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను రూ. 20 కోట్ల నుంచి రూ.30 కోట్లకు కొని ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేసింది. -
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు
♦ అందుకే రోజా సస్పెన్షన్ వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయలేదు ♦ విచారణను 9కి వాయిదా వేయడం వల్ల పిటిషనర్కు నష్టం ♦ హైకోర్టులో రోజా తరఫు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ వ్యవహారంలో శాసన వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శి వ్యూ హాత్మకంగా వ్యవహరిస్తున్నారని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. అందులో భాగంగానే కౌంటర్లు దాఖలు చేయాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోకుండా మరింత గడు వు కోరారని తెలిపారు. దీంతో సింగిల్ జడ్జి తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేశారని వివరించారు. ఈ నెల 5 నుంచి అసెం బ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయని, 9వ తేదీన విచారణ జరపడం వల్ల పిటిషనర్కు శాసనసభ చర్చల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోతుందన్నారు. ఏపీ శాసనసభ నిబంధనల్లోని రూల్ 340 సబ్ రూల్ 2 ప్రకారం ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు వేసే అధికారం స్పీకర్కు ఉందని, అయితే, ఆ సస్పెన్షన్ ఆ సెషన్కు మాత్రమే పరిమితమని ఆమె కోర్టుకు నివేదించారు. ఏడాదిపాటు సస్పెన్షన్ వల్ల ఎమ్మెల్యేగా రోజా తన నియోజకవర్గ ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం కోల్పోతారని చెప్పారు. ఇప్పటివరకు ఆమెకు సస్పెన్షన్ తాలూకు ఉత్తర్వుల కాపీని కూడా అందచేయలేదని ఇందిరా జైసింగ్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం, తదుపరి విచారణను 9వ తేదీన కాకుండా ఇంకా ముందుగానే చేపట్టాలని సింగిల్ జడ్జిని కోరుతామని పేర్కొంది. తదుపరి వాదనల నిమిత్తం విచారణను ఈ నెల 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ తనను శాసనసభ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ రోజా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సింగిల్ జడ్జి జస్టిస్ సంజయ్కుమార్ సోమవారం విచారించారు. ఈ వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేసేందుకు అసెంబ్లీ కార్యదర్శి, శాసన వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి మరింత గడువు కోరడంతో తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేశారు. దీన్ని సవాలు చేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు రోజా అప్పీల్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రోజా తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు. ఈ అప్పీల్పై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. వాయిదా వేయడంపై అప్పీల్ దాఖలు చేయడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది. న్యాయసమీక్ష చేయొచ్చని సుప్రీం చెప్పింది ప్రత్యేక పరిస్థితుల్లో అప్పీల్ దాఖలు చేయవచ్చని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని జైసింగ్ సమాధానమిచ్చారు. సింగిల్ జడ్జి వద్ద గతనెల 15, 16, 17 తేదీల్లో విచారణ జరిగిందని, రోజా పిటిషన్ విచారణార్హతతోపాటు కేసు పూర్వాపరాలపై అదనపు అడ్వొకేట్ జనరల్ లోతుగా వాదనలు వినిపించారని చెప్పారు. స్పీకర్ నిర్ణయంపై న్యాయ సమీక్షకు వీల్లేదని చెప్పారని అన్నారు. అయితే, న్యాయ సమీక్ష చేయవచ్చని రాజారాంపాల్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. 17న నోటీసులు జారీ చేసిన సింగిల్ జడ్జి తదుపరి విచారణను 29కి వాయిదా వేశారని, 29న తిరిగి విచారణకు రాగా అదనపు ఏజీ తాను అసెంబ్లీ కార్యదర్శి తరపున కూడా హాజరవుతున్నానని, కౌంటర్కు గడువు కావాలని కోరారని ఆమె ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాక 4వ తేదీన సభా హక్కుల కమిటీ సమావేశం ఉందని, ఆ వివరాలను కౌంటర్లో పొందుపరుస్తానని చెప్పారని తెలిపారు. ఇదంతా వ్యూహాత్మకంగానే చేశారన్నారు. పిటిషనర్కు ఆ హక్కుంది రోజా సస్పెన్షన్ నిర్ణయం స్పీకర్ది మాత్రమే కాదని, మొత్తం శాసనసభది అని అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వివరించారు. రూల్ 340 సబ్ రూల్ 2 ప్రకారం ఎమ్మెల్యేను ఆ సెషన్ వరకే సస్పెండ్ చేసే అవకాశం ఉంది కదా! అని ధర్మాసనం ప్రశ్నిం చింది. ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే హక్కు పిటిషనర్కు ఉందని స్పష్టం చేసింది. దమ్మాలపాటి శ్రీని వాస్ స్పందిస్తూ... స్పీకర్కు అధికరణ 194(3) కింద విస్తృత అధికారాలున్నాయని చెప్పారు. 5వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున 9వ తేదీ కంటే ముందుగానే కేసు విచారణ చేపట్టాలని సింగిల్ జడ్జిని కోరుతామని ధర్మాసనం పేర్కొంది. న్యాయస్థానంలో వాదనలు వినేందుకు ఎమ్మెల్యే రోజా మంగళవారం స్వయంగా హైకోర్టుకు వచ్చారు. -
గవర్నర్ ప్రసంగం అడ్డుకుంటే ఏడాది సస్పెన్షన్
♦ రెండు పూటలా బడ్జెట్ సమావేశాలు ♦ ప్రశ్నోత్తరాల సమయంలో నిరసనలకు నో ♦ సభలోకి ప్లకార్డులను అనుమతించేది లేదు ♦ అసెంబ్లీ రూల్స్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరించాలని, సభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేయాలని శాసనసభ రూల్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి అధ్యక్షతన స్పీకర్ చాంబర్లో సోమవారం రూల్స్ కమిటీ సమావేశం జరిగింది. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్రావు, మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, బీజేపీ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్, టీడీపీ నుంచి ఇటీవల టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే వివేకానంద భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బడ్జెట్ సమావేశాలను రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 దాకా, సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల దాకా రెండు సెషన్లుగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య రగడ జరుగుతోంది. ఎమ్మెల్యేల విషయంలో అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేద ని రూల్స్ కమిటీకి ఫిర్యాదులు అందాయి. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి నేతృత్వంలో వారం రోజుల్లో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. బడ్జెట్ సమావేశాలను అర్థవంతంగా నిర్వహించేందుకు ప్రశ్నోత్తరాల సమయంలో నిరసనలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వకూడదని, ప్రశ్నోత్తరాలను సాగదీయ వద్దని అభిప్రాయం వ్యక్తమైంది. ప్రధానంగా సభలోకి ప్లకార్డులను తీసుకురావడాన్ని నిషేధించారు. ఈసారి బడ్జెట్ సమావేశాలను పూర్తిగా డిజిటలైజ్డ్ (పేపర్లెస్) సెషన్గా జరపాలని... ఈ విధానం ఇప్పటికే అమలవుతున్న గోవా, హర్యానా అసెంబ్లీలను సందర్శించి ఆ పద్ధతులను అధ్యయనం చేయాలని, అసెంబ్లీ గ్రంథాలయాన్ని కంప్యూటరీకరించాలని నిర్ణయించారు. ఇక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల వేతనాల పెంపుపైనా సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
16న అసెంబ్లీ!
* మధ్యంతర బడ్జెట్ దాఖలు కోసమే * నాలుగు రోజలకే అవకాశం చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడు ప్రభుత్వం చిట్టచివరి అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ను దాఖలు చేసేందుకు ఈనెల 16వ తేదీన సమావేశం అవుతోంది. ఈ ఏడాది ఆరంభంలో అంటే గత నెల 20వ తేదీన అసెంబ్లీ సమావేశాలు సాగాయి. గవర్నర్ ప్రసంగం, ఆ తరువాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో పలువురు సభ్యులు ప్రసంగించారు. సభ్యుల ప్రసంగంలో లేవనెత్తిన ప్రశ్నలకు, విమర్శలకు ముఖ్యమంత్రి జయలలిత సభలో బదులిచ్చారు. కేవలం నాలుగురోజులు మాత్రమే సాగిన అసెంబ్లీ సమావేశాలు ఆ తరువాత వాయిదా పడ్డాయి. ప్రస్తుత ప్రభుత్వ కాలపరిమితి ఈ ఏడాది మేలో తీరిపోనుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు యథావిధిగా బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సి ఉంది. ఈ కారణాల చేత ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సి ఉంది. ఇందుకోసం ఈనెల 16వ తేదీన బడ్జెట్ సమావేశం ఆరంభం కానుంది. బడ్జెట్పై చర్చ ముగిసిన తరువాత ఆర్థిక మంత్రి ఓ పన్నీర్సెల్వం బదులిస్తారు. ఈ బడ్జెట్ సమావేశాలు కేవలం నాలుగురోజులు మాత్రమే జరుగుతాయని తెలుస్తోంది. ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ మాట్లాడుతూ, ఈనెల 16వ తేదీ ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఈ సందర్బంగా 2016-17 సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడతారని చెప్పారు. డీఎండీకే సభ్యులకు నో ఎంట్రీ: అసెంబ్లీ సమావేశాల నుంచి బహిష్కరణకు గురైన 6 మంది డీఎండీకే ఎమ్మెల్యేలు ఈ సమావేశాలకు సైతం హాజరయ్యే అవకాశం లేదు. ఈ ఏడాది అసెంబ్లీ సమావేశాల్లో వరుసగా పదిరోజులు ముగిసిన తరువాత వారు హాజరుకావచ్చు. అయితే జనవరిలో జరిగిన సమావేశాలు నాలుగురోజులతో ముగిశాయి. అలాగే ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు నాలుగురోజులేనని తెలుస్తోంది. ఈపరిణామం వల్ల బహిష్కృత డీఎండీకే ఎమ్మెల్యేలు చివరి అసెంబ్లీ సమావేశాలను సైతం కోల్పోనున్నారు. -
ఏప్రిల్లో ‘పుర’ సమరం
♦ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్, అచ్చంపేట మున్సిపాలిటీకి ఎన్నికలు ♦ వార్డు రిజర్వేషన్లు సిద్ధం.. నేడు ప్రభుత్వానికి ప్రతిపాదనలు ♦ ఆమోదిస్తే వెంటనే ఎన్నికల ప్రకటన ♦ అసెంబ్లీ సమావేశాల తర్వాతే ఎన్నికలకు వెళ్లే యోచనలో సర్కారు ♦ దుబ్బాక, సిద్దిపేట, కొల్లాపూర్, మేడ్చల్ ఎన్నికలకు తొలగని న్యాయ చిక్కులు సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన అధికార పార్టీ.. త్వరలో మరో ‘పుర’ సమరానికి సిద్ధమవుతోంది. గ్రేటర్ జోష్లో ఉన్న సర్కారు.. త్వరలో గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... వచ్చే ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు పురపాలికలకు ఎన్నికల ప్రక్రియ కసరత్తు పూర్తయింది. డివిజన్లు/వార్డుల రిజర్వేషన్లను సిద్ధం చేసిన పురపాలక శాఖ సోమవారం ప్రభుత్వ ఆమోదం కోసం పంపించనుంది. ఈ రిజర్వేషన్లను ప్రభుత్వం ఆమోదించిన వెంటనే ఈ మూడు చోట్లలో ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెలలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆ తర్వాతే ఈ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. మార్చి 20 వరకు బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. ఆ తర్వాతే డివిజన్లు/వార్డు రిజర్వేషన్లను ప్రభుత్వం ఆమోదించే అవకాశాలున్నాయి. దీంతో పోలింగ్ ఏప్రిల్లో జరిగే అవకాశముంది. ఇంకా తొలగని కోర్టు చిక్కులు.. రాష్ట్రంలోని 3 మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు 53 మున్సిపాలిటీలకు 2014 మార్చి 31న ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఎన్నికలు వాయిదా పడిన సిద్దిపేట, కొల్లాపూర్, మేడ్చల్, దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికలను ఇంకా న్యాయపరమైన చిక్కులు వెంటాడుతున్నాయి. సిద్దిపేట, కొల్లాపూర్ పురపాలికల వార్డు రిజర్వేషన్లను పురపాలక శాఖ సిద్ధం చేసింది. సిద్దిపేట మున్సిపాలిటీలో ఆరు శివారు గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు కేసు వేయడంతో అప్పట్లో హైకోర్టు విధించిన స్టే ఇంకా కొనసాగుతోంది. అలాగే కొల్లాపూర్, మేడ్చల్, దుబ్బాకకు గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీలుగా హోదా కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు వేసిన కేసుపై ఇంకా స్టే ఉంది. సిద్దిపేట, కొల్లాపూర్ పురపాలికల వార్డు రిజర్వేషన్లు ఇప్పటికే సిద్ధం కావడంతో కోర్టు స్టే తొలగిన వెంటనే ఎన్నికల నిర్వహణ సాధ్యం కానుంది. మార్చి చివరిలోగా న్యాయపరమైన చిక్కులు తొలగిపోతే సిద్దిపేట, కొల్లాపూర్ మున్సిపాలిటీలకు సైతం గ్రేటర్ వరంగల్, ఖమ్మం, అచ్చంపేటతో కలిపే ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. హైకోర్టు స్టే తొలగిన తర్వాతే మేడ్చల్, దుబ్బాక పురపాలికల వార్డు రిజర్వేషన్లను ఖరారు చేయాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఇటీవల కొత్తగా ఏర్పడిన బాదెపల్లి(మహబూబ్నగర్ జిల్లా) నగర పంచాయతీకి ఎన్నికలు నిర్వహించేందుకు రెండేళ్ల గడువు ఉందని అధికారులు తెలిపారు. -
బయట ఉమ్మేస్తే రూ.1000 జరిమానా!
బిల్లు ప్రవేశపెట్టనున్న మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై: క్షయ తదితర అంటువ్యాధుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడాన్ని నిషేధించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే నెల మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో తేనుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం, పొగాకు నమలడాన్ని నిషేధించాలని రాష్ట్ర ఆరోగ్యమంత్రి దీపక్ సావంత్ గత ఏడాది ప్రతిపాదించారు. నిషేధాన్ని ఉల్లంఘించేవారికి భారీ జరిమానాతోపాటు బహిరంగ ప్రదేశాలను శుభ్రం చే యడం వంటివి చేయించాలని యోచిస్తున్నామని ఆయన తెలిపారు. బిల్లు ప్రకారం.. బహిరంగ ప్రదేశాల్లో తొలిసారి ఉమ్మితే రూ.1000 జరిమానా చె ల్లించి, ఒక రోజు సామాజికసేవ చేయాల్సి ఉంటుంది. రెండోసారి ఆ నేరానికి పాల్పడితే రూ. 3 వేల జరిమానా చెల్లించి, 3 రోజుల సామాజిక సేవ చేయాలి. పలుమార్లు ఈ నేరానికి పాల్పడితే రూ. 5వేల జరిమానా చెల్లించి, 5 రోజుల సామాజిక సేవ చేయాలి. -
బడ్జెట్ సమావేశాలు 23 నుంచి!
ఫిబ్రవరి 4న షెడ్యూలు ఖరారు న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 23 నుంచి మొదలయ్యే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సమావేశాల షెడ్యూలును ఖరారు చేసేందుకు పార్లమెంటరీ వ్యవహారా కేబినెట్ కమిటీ వచ్చే నెల 4న భేటీ కానుంది. రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్లను ప్రవేశపెట్టటం ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశం అయినప్పటికీ.. జీఎస్టీ, రియల్ ఎస్టేట్ వంటి కీలక బిల్లులకు కూడా ఈ భేటీల్లోనే పార్లమెంటు ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. సాధారణంగా బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి మూడో వారంలో మొదలై.. మే ఆరంభంలో ముగుస్తాయి. మధ్యలో.. బడ్జెటరీ డిమాండ్లు, గ్రాంట్లను కమిటీలు చర్చించేటపుడు పార్లమెంటు సమావేశాలకు విరామం ఉంటుంది. కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి నెల చివరి రోజైన 29వ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టటం ఆనవాయితి. ఈ ఏడాది 23 నుంచి సమావేశాలు మొదలయ్యే అవకాశముంది. అయితే ఇవి కొనసాగుతుండగానే పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. (ఈ రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాల కాలపరిమితి మే-జూన్ నెలల్లో ముగియనుంది.) దీంతో పార్లమెంటు సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగుతాయనే దానిపై సందిగ్ధత తలెత్తే అవకాశముంది. ఆయా పార్టీల నేతలు ప్రచారంలో పాల్గొనేందుకు వీలుగా పార్లమెంటు సమావేశాల నిడివిని తగ్గించే అవకాశముందని చెప్తున్నారు. -
కాల్మనీని పక్కదారి పట్టించేందుకే రోజా సస్పెన్షన్
నరసరావుపేట రూరల్ : అసెంబ్లీ సమావేశాల్లో కాల్మనీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికే కుట్రపూరితంగా ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ కొండపల్లి వెంకటేశ్వరరావు విమర్శించారు. పీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ కాసు వెంకట కృష్ణారెడ్డి స్వగృహాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విజయవాడలో వెలుగుచూసిన కాల్మనీ వ్యవహారంలో నింధితులందరూ టీడీపీ వాళ్లేనని, వారిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోలేదన్నారు. శాసనసభలో జరుగుతున్న పరిణామాలు బాధాకరమన్నారు. ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం సరికాదన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాసం పెట్టడం నరసరావుపేటకు మచ్చగా మిగులుతుందన్నారు. ముఖ్యమైన బిల్లులు, ప్రజాసమస్యలపై చర్చ జరగాల్సి ఉండగా వాటి గురించి పట్టించుకోకుండా పరస్పరం ఆరోపణలు చేసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. పార్టీ నాయకులు పడాల చక్రారెడ్డి, కపలవాయి రమేష్, మంజూర్, దుర్గాబాబు, బాషా పాల్గొన్నారు. -
జీరో అవర్లో అందరికీ అవకాశం
♦ శాసనసభ సమావేశాల చివరి రోజున పలు అంశాలను ప్రస్తావించిన సభ్యులు ♦ టీ బ్రేక్ కూడా లేకుండా ఏకధాటిగా జరిగిన సభ సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాల చివరిరోజున సభలో ఉన్న సభ్యులందరికీ జీరో అవర్లో మాట్లాడే అవకాశం దక్కింది. ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత స్పీకర్ మధుసూధనాచారి గంట సమయం జీరో అవర్ కోసం కేటాయించారు. టీ బ్రేక్ సైతం ఇవ్వకుండా ఉదయం 10గంటల నుంచి ఒకటిన్నర వరకు సభను నిరాటంకంగా నడిపించారు. 50 మంది సభ్యులు తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు, ఇతరత్రా అంశాలను ప్రస్తావించారు. ఎవరెవరూ ఏం మాట్లాడారంటే.. ‘చార్మినార్ ప్రాంతంలో మద్యం దుకాణాలు మందిరాలకు, పాఠశాలలకు దగ్గరగా ఏర్పాటు చేశారు. ఇది నిబంధనల ఉల్లంఘనే. దుకాణాలకు అనుమతులు ఇచ్చినప్పుడే ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకునేలా రెవెన్యూ శాఖకు ఆదేశాలివ్వాలి.. వాటిని దూరంగా పెట్టించాలి’ - అక్బరుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యే ‘హైదరాబాద్ చుట్టుపక్కల అనధికార లేఅవుట్లు చాలా ఉన్నాయి. వాటిల్లో ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. లేఅవుట్ల పేరిట ఆక్రమించిన భూ వివరాలను ప్రభుత్వం సేకరించాలి’ -శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే ‘హైదరాబాద్లో పారిశుధ్యం లోపించింది. డ్రైనేజీలన్నీ నిండిపోయి మురుగు రోడ్లపైకి వస్తోంది. పారిశుధ్య వాహనాలన్నీ పాతవైపోయాయి. వాటి స్థానంలో కొత్తవాటిని తెచ్చి పారిశుధ్య నిర్వహణ పక్కాగా చేయండి’ - ముంతాజ్ అహ్మద్, ఎంఐఎం ఎమ్మెల్యే ‘బెల్లంపల్లి నియోజకవర్గంలో మామిడి రైతులు ఎక్కువగా ఉన్నారు. అక్కడ మామిడి మార్కెట్ను ఏర్పాటు చేయండి’ - చిన్నయ్య, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ‘రాష్ట్రంలో ఆందోళన చేస్తున్న ఆశ వర్కర్లకి అండగా నిలవండి. కేంద్రం నుంచి వర్కర్లకు కనీస వేతనాలు వచ్చేలా చూడండి’ -తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ‘మహబూబాబాద్ను జిల్లా కేంద్రం చేయాలి. జిల్లా కేంద్రంగా చేయాల్సిన అన్ని రకాల అర్హతలు దీనికి ఉన్నాయి’ -శంకర్నాయక్, రెడ్యానాయక్, ఎమ్మెల్యేలు ‘జూరాల నుంచి కింద కోయిల్సాగర్కు నీరివ్వడంలో జాప్యం జరిగింది. రెండో మోటార్ను ఆరంభించి కోయిల్సాగర్ను నింపండి’ - ఆళ్ల వెంకటేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే -
ముగిసిన సభాపర్వం
♦ విపక్షాలు లేకుండానే మూడు రోజులు సాగిన అసెంబ్లీ, మండలి ♦ శాసనసభలో 30.06 గంటలు.. మండలిలో 26.23 గంటల చర్చ ♦ విపక్ష సభ్యుల మూకుమ్మడి సస్పెన్షన్ ♦ ప్రతిపక్షాలు లేకుండానే సభ నిర్వహణ! సాక్షి, హైదరాబాద్: మునుపెన్నడూ లేని రీతిలో సంచలనం సృష్టించిన శాసనసభ, మండలి సమావేశాలు బుధవారం నుంచి నిరవధికంగా వాయిదాపడ్డాయి. గత నెల 23న మొదలై ఏడు రోజులపాటు జరిగిన ఈ సమావేశాల్లో చివరి మూడురోజులు విపక్షం లేకుండానే కొనసాగాయి. రైతుల ఆత్మహత్యలపై రెండు రోజుల పాటు చర్చ జరిగినా ప్రభుత్వాన్ని నిర్మాణాత్మకంగా నిలదీయడంలో విఫలమైన ప్రతిపక్షం... ఆ తరువాత మేల్కొన్నా ప్రయోజనం లేకుండా పోయింది. రుణమాఫీని ఏకమొత్తంగా చెల్లిం చాలంటూ సభను స్తంభింపజేసినా ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. అంతేగాకుండా సభలో ఆందోళన చేపట్టిన విపక్ష సభ్యులందరినీ (ఎంఐఎం మినహా) సమావేశాల కాలంపాటు సస్పెండ్ చేసింది. మూకుమ్మడి సస్పెన్షన్తో అప్రతిష్ట ఎంఐఎం మినహా దాదాపు విపక్ష సభ్యులందరినీ బయటకు పంపించి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం సంచలనం సృష్టించింది. చివరకు అధికారపక్ష ఎమ్మెల్యేలు సైతం విపక్షం లేకుండా సభ జర గడంపై విస్మయం వ్యక్తం చేశారు. ‘మాకు మేమే మాట్లాడుకుంటే వచ్చేదేముంది. ప్రతిపక్షం నుంచి ప్రశ్నలు వస్తేనే కదా.. ప్రభుత్వం ఏం చేసిందో వివరంగా చెప్పుకొనే అవకాశం వచ్చేది. పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నలు వేయడం, పార్టీకి చెందిన మంత్రులే సమాధానం చెప్పడం.. ఇందులో మజా ఏముంది..’’ అని ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం గమనార్హం. రైతుల సమస్యలపై కావాల్సినంత చర్చ జరిగినా... విపక్ష సభ్యులు కావాలనే మొండిపట్టు పట్టారని, ఇదంతా రాజకీయం కోసం చేశారని అధికార పక్షం తమ నిర్ణయాన్ని సమర్థించుకోజూసింది. అయితే అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరుగుతోందన్న వ్యాఖ్యలు వినిపించాయి. వాస్తవానికి బీఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈనెల 9వ తేదీ వరకు, చర్చ సరిపోలేదనుకుంటే 10వ తేదీన కూడా సభ జరపాలని నిర్ణయించారు. కానీ విపక్షాలు లేకుండా ఇన్ని రో జులపాటు సభ నిర్వహించడం సబబు కాదన్న అంతర్మథనం అధికార పక్షంలో జరిగినట్లు చెబుతున్నారు. అందువల్లే మూడు రోజుల ముందే ఇరు సభలను నిరవధికంగా వాయిదా వేశారని అంటున్నారు. ముప్పై గంటల పాటు సమావేశాలు తొలుత వర్షాకాల సమావేశాలను ఐదారు రోజులకు పరిమితం చేయాలని సర్కారు భావించినా... విపక్షాల కోరిక మేరకు పది పనిదినాలకు అంగీకరించింది. కానీ ఏడు రోజులకే నిరవధికంగా వాయిదా వేసింది. మొత్తంగా శాసనసభలో 30.06 గంటల పాటు చర్చ జరిగింది. ఇందులో టీఆర్ఎస్ 18.19 గంటలు, కాంగ్రెస్ 3.56 గంటలు, టీడీపీ 2.07 గంటలు, ఎంఐఎం 2.30 గంటలు, బీజేపీ 1.38 గంటలు, వైఎస్సార్సీపీ 42 నిమిషాలు, సీపీఐ 33 నిమిషాలు, సీపీఎం 21 నిమిషాల పాటు చర్చలో పాల్గొన్నాయి. 19 ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. అనుబంధంగా వచ్చిన 70 ప్రశ్నలకు జవాబిచ్చారు. మరో 14 ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. ఈసారి మొత్తం 26 మంది సభ్యులకే ప్రసంగించే అవకాశం దక్కింది. రెండు బిల్లులను ప్రవేశపెట్టగా ఐదు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఇక శాసన మండలిలో 26.23 గంటల పాటు చర్చ జరిగింది. -
రైతుల మనోధైర్యాన్ని దెబ్బకొడుతున్నారు
- విపక్షాలపై మంత్రి కేటీఆర్ మండిపాటు - రైతు సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది - విపక్షాల వాదనలో పసలేదు - బిహార్కు కేంద్రం రూ.1.25 లక్షల కోట్ల ప్యాకేజీ ఏ లెక్కన ఇచ్చిందో బీజేపీ నేతలు చెప్పాలి - ప్రధానికి ఒక్కసారైనా తెలంగాణకు వచ్చే తీరిక లేకుండా పోయింది సాక్షి, హైదరాబాద్: రైతు సమస్యల పరిష్కారం విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, అందుకే ఈ అసెంబ్లీ సమావేశాల్లో 12 గంటల పాటు రైతు సమస్యలు, ఆత్మహత్యలపై చర్చకు వీలుకల్పించిందని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఈ విషయంలో తమ సిద్ధాంతాలు పక్కనపెట్టి రాద్ధాంతం చేస్తున్న ప్రతిపక్షాల వాదనలో పసలేదని, విపక్షనేతలంతా కలసి రాష్ట్ర రైతుల మనోధైర్యాన్ని దెబ్బకొడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. గురువారం ఆయన టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంత్రి మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలసి విలేకరులతో మాట్లాడారు. రైతు సమస్యలపై శాసన సభలో విస్తృతంగా చర్చించామని చెప్పారు. రెండు రోజుల్లో పన్నెండు గంటలు చర్చిస్తే అందులో విపక్షాలే ఏకంగా 6.23 గంటల పాటు చర్చలో పాల్గొన్నాయని వివరించారు. కాంగ్రెస్ 2.43 గంటలు, టీడీపీ 1.10 గంటలు, బీజేపీ 1.15 గంటలు, ఎంఐఎం 42 నిమిషాలు, వైఎస్సార్ కాంగ్రెస్ 30 నిమిషాలు, సీపీఐ 26 నిమిషాలు, సీపీఎం 15 నిమిషాల పాటు ఇదే అంశంపై మాట్లాడాయన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎంత రెచ్చగొట్టాలని చూసినా తాము ఓపిగ్గా ఉన్నామని, ముఖ్యమంత్రి స్పష్టంగా గంటా 45 నిమిషాల పాటు అన్ని విషయాలూ వివరించారని చెప్పారు. 60ఏళ్ల దరిద్రం 15నెలల్లో పోతుందా..? రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వ ఆలోచనలు సభలో చెప్పామని, వారసత్వంగా సంక్రమించిన విద్యుత్ సమస్యను నివారించి ఆరుగంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చామని చెప్పారు. అయినా, అరవై ఏళ్లుగా వచ్చిన దరిద్రం కేవలం పదిహేను నెలల్లో పోతుందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.6లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించేందుకు నిర్ణయించామని, ప్రతిపక్షాలు అడగకముందే గత ఏడాది జూన్ 2 నుంచి చెల్లించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందని గుర్తు చేశారు. సభలో తాము విపక్షాలు చెప్పిందంతా విన్నామని, కానీ, ప్రతిపక్షాలకు చర్చ అవసరం లేదని.. వారికి రచ్చ మాత్రమే కావాలని, శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని రోజులైనా శాసన సభను నిర్వహిస్తామని, అయితే విపక్షాల వాదనలో పసలేదని, వారిది డొల్ల వాదనని పేర్కొన్నారు. ‘కేంద్రంలోని ప్రభుత్వం బిహార్కు రూ.1.25 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఏ నీతి ఆయోగ్ ప్రతిపాదించిందని ఇచ్చారు..? ఏ మేనిఫెస్టోలో పెట్టారని ఇచ్చారు..? దీనికి బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి’ అని అన్నారు. ఏపీ పునర్విభజన చట్టం మేరకు ఏపీకి ఏమిచ్చినా, తెలంగాణకు కూడా ఇవ్వాల్సిందేనని, పదిహేను నెలల్లో ప్రధానికి ఒక్కసారన్నా తెలంగాణకు వచ్చే ఓపిక, తీరిక లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. ‘కేంద్రం ఎందుకు నిధులు ఇవ్వడం లేదు? కాల్లల్లో కట్టెలు ఎందుకు పెడుతున్నారు’ అని ప్రశ్నించారు. అధికారమే పరమావధిగా అన్ని పక్షాలు ఒక్కటవుతున్నాయని, ప్రభుత్వాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్రెడ్డి, ఎ.జీవన్రెడ్డి, గువ్వల బాలరాజు, శ్రీనివాస్గౌడ్, పుట్టా మధు, రెడ్యానాయక్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
వ్యూహాత్మకంగా చెక్!
- విపక్షాల ప్లాన్ను ముందే గ్రహించిన అధికారపక్షం - వాయిదాలు, సస్పెన్షన్లతో వారికి ప్రచారం వస్తుందనే సభ వాయిదా సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల ఎత్తులను ముందే గ్రహించిన అధికార పక్షం.. వాటికి వ్యూహాత్మకంగా చెక్ పెట్టిం ది. రుణమాఫీని (మిగిలిన యాభై శాతం) ఒకే విడతలో బ్యాంకులకు చెల్లించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం నుంచే అసెంబ్లీలో అనుసరించాల్సిన ప్రణాళికను సిద్ధం చేసుకున్న విపక్షాలు.. వ్యవసాయ మంత్రి ప్రకటన తరువాత దాన్ని ఆచరణలో పెట్టాలని భావించాయి. కానీ వివరణలు ముగియగానే స్పీకర్ సభను వాయిదా వేశారు. దీంతో గురువారం ఉదయం సభ ప్రారంభం కావడంతోనే విపక్షాలు ఇదే అంశాన్ని లేవనెత్తి.. గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిం చాయి. దీనిని పసిగట్టిన అధికారపక్షం వారికి అవకాశం ఇవ్వకుండా కొద్దిసేపట్లోనే సభను సోమవారానికి వాయిదా వేసింది. మధ్యలో మూడురోజుల పాటు సమావేశాలు లేనందున ఈ సమస్య సమసిపోతుందని భావించింది. అనూహ్యంగా సభ వాయిదాతో బిత్తరపోయిన విపక్ష సభ్యులు.. అసెంబ్లీ బయట కొద్దిసేపు ధర్నా చేయడం తప్పితే మొత్తం అంశంలో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడంలో విఫలమయ్యారు. ఏదో ఒక సంచలనం సృష్టించడానికి ప్రతిపక్షాలన్నీ ప్రయత్నిస్తాయని టీఆర్ఎస్ అంచనా వేసిందని.. అందుకే వారికి ఏమాత్రం అవకాశమివ్వకుండా కొద్దిసేపు గొడవ జరగ్గానే సోమవారానికి సభ వాయిదా పడేలా పావులు కదిపిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు రైతుల ఆత్మహత్యలపై రెండు రోజుల పాటు జరిగిన చర్చ సందర్భంగా విపక్షాలన్నీ సంయమనంతో వ్యవహరించాయి. ప్రభుత్వం చెప్పేదంతా విన్నాయి. కానీ,చివరికి ప్రభుత్వం వలలో విపక్షాలు చిక్కాయనే అభిప్రాయం వస్తోంది. కాంగ్రెస్, టీడీపీ సహా ఇతర విపక్షాల సభ్యులు కూడా ప్రతిపక్షాలు ఫెయిలయ్యాన్న అభిప్రాయాన్ని అంగీకరిస్తున్నారు. వారికి ప్రచారం ఎందుకని..? విపక్షాలను నియంత్రించడానికి కొద్దిసేపు సభను వాయిదా వేసినా ప్రయోజనం ఉండదని అధికారపక్షం భావించింది. తిరిగి సభ మొదలుకాగానే అదే గందరగోళం సృష్టించే అవకాశం ఉందని.. ఇది వారికి మీడియాలో ప్రచారం క ల్పించడం మినహా మరొకటి కాదనే భావన వ్యక్తమైంది. రైతుల సమస్యలపై రెండు రోజుల్లో ఏకంగా 12గంటల పాటు చర్చ జరిగాక కూడా ఆ అంశాన్ని పట్టుకుని ప్రతిపక్షాలు భీష్మించి, సభను రాజకీయంగా వాడుకునే యత్నం చేస్తున్నందునే వాయిదా నిర్ణయం తీసుకుని ఉంటారని చెబుతున్నారు. విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలుపుతున్న సమయంలో.. మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ ఒకే దగ్గర కూర్చుని ముచ్చటించారు. తర్వాత కొద్దిసేపటికే సభను స్పీకర్ వాయిదా వేశారు. -
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
-
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
తొలిరోజు సంతాప తీర్మానం.. వాయిదా * తర్వాత 5 రోజులు సెలవు.. తిరిగి 29న ప్రారంభం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇటీవల ఆకస్మికంగా మృతిచెందిన మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డికి తొలిరోజున సంతాపం ప్రకటిస్తారు. సంతాప తీర్మానంపై ఆయా పక్షాల నేతలు మాట్లాడిన అనంతరం సభ వాయిదా పడుతుంది. ఈ మేరకు టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ వివరించినట్లు సమాచారం. అనంతరం బీఏసీ సమావేశం జరిగే వీలుంది. అయితే 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సెలవుగా ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిసింది. తిరిగి అసెంబ్లీ 29న మొదలుకానుంది. ఎన్ని రోజులు సమావేశాలు జరుగుతాయన్నది బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. -
ఆ పాపం గత పాలకులదే
సాక్షి, హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలు, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. సోమవారం రాజ్భవన్కు వెళ్లిన సీఎం దాదాపు రెండు గంటలకుపైగా గవర్నర్తో చర్చలు జరిపారు. ప్రధానంగా రైతుల ఆత్మహత్యలపైనే చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో వరుస రైతు ఆత్మహత్యలపై మంత్రివర్గ సమావేశంలో విచారం వ్యక్తం చేసిన సీఎం.. గవర్నర్కు అదే విషయాన్ని నివేదించారు. హైదరాబాద్ కేంద్రంగా ఇద్దరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడటానికి దారి తీసిన కారణాలు తెలుసుకునేందుకు గవర్నర్ ఆసక్తి ప్రదర్శించినట్టు తెలిసింది. వర్షాభావ పరిస్థితులతోపాటు గతంలో పాలకు లు అనుసరించిన విధానాలు రైతుల పాలిట శాపంగా మారాయన్నారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు ఎక్స్గ్రేషియాను రూ.6 లక్షలకు పెంచిన విషయాన్ని సీఎం.. గవర్నర్కు వివరించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచీఈ నెల 18 వరకు రాష్ట్రంలో 242 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా ముగ్గురు సభ్యుల కమిటీ నిర్ధారించింది. వీరిలో 176 మందికి పరిహారం చెల్లింపులు పూర్తయ్యాయి. ఈ వివరాలతో కూడిన నివేదికను గవర్నర్కు సీఎం అందజేసినట్లు తెలిసింది. ఈనెల 20 నుంచి చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.6 లక్షల పరిహారం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. గతంతో పోలిస్తే ఈ మొత్తం నాలుగు రెట్లు పెంచినట్లు తెలిపారు. దీంతోపాటు ఇటీవల చైనా పర్యటన వివరాలను గవర్నర్తో సీఎం పంచుకున్నట్లు తెలిసింది. తెలంగాణలో పెట్టుబడులకు అక్కడి పారిశ్రామికవేత్తలు ఎంతో ఆసక్తి ప్రదర్శించారని, హైదరాబాద్లో కొత్త పరిశ్రమల స్థాపనకు కొన్ని కంపెనీలు ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. బుధవారం ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు, గణేష్ ఉత్సవాలు, బక్రీద్ల నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన బందోబస్తు చర్యలు, పొరుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక బలగాలను రప్పించిన విషయాలను చర్చించారు. ఇటీవల వరంగల్ జిల్లాలో ఎన్కౌంటర్, పలు నామినేటేడ్ పోస్టుల నియామకం అంశాలు చర్చకు వచ్చాయి. ఎస్సీ, బీసీ, మైనారిటీ కమిషన్ల పదవుల నియామకంతోపాటు ఆర్టీఐ, మానవ హక్కుల కమిషన్ల పదవుల నియామకంపై చర్చించినట్లు తెలిసింది. -
త్వరలో రైతు భరోసా దీక్ష: పొంగులేటి
- కలెక్టరేట్ల ముట్టడి, దీక్షపై సమీక్ష సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగానే రైతులకు అన్ని విధాలా భరోసా కల్పించేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు త్వరలో రైతు భరోసా దీక్ష చేపట్టనున్నట్లు వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్ లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ రాష్ట్ర నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు సమస్యలపై శుక్రవారం పార్టీ నిర్వహించిన కలెక్టరేట్ల ముట్టడి, త్వరలో జరపతలపెట్టిన రైతు భరోసా దీక్ష ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. రైతులు పిట్టల్లా రాలిపోతుంటే ప్రభుత్వం ఇప్పటివరకు పైసా సహాయం కూడా చేయలేదన్నారు. రైతులను ఆదుకోవాలని నాలుగు నెలల క్రితం నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో రైతు దీక్ష చేపట్టామని, ఎవరు ఎన్ని ఆందోళనలు చేసినా టీఆర్ఎస్ ప్రభుత్వం తన పంథాను మార్చుకోవడంలేదని విమర్శించారు. వివిధ రాజకీయ పార్టీలు రకరకాల ఉద్యమాలు చేపట్టినా పట్టించుకోవడంలేదన్నారు. ప్రభుత్వం మొద్దునిద్ర వీడే విధంగా త్వరలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రైతు భరోసాదీక్ష చేపట్టనున్నట్లు చెప్పారు. రైతు సమస్యలపై అసెంబ్లీ సమావేశాలను స్తంభింపచేస్తామన్నారు. సమావేశంలో పార్టీ నేతలు ఎడ్మా కిష్టారెడ్డి, జి.సురేష్ రెడ్డి, ముజ్తబ అహ్మద్, గట్టు శ్రీకాంత్ రెడ్డి, కె.శివకుమార్, కొండా రాఘవరెడ్డి, బొడ్డు సాయినాథ్రెడ్డి, ఐల వెంకన్నగౌడ్, నర్రా బిక్షపతి, జి. శ్రీధర్ రెడ్డి, భీష్వ రవీందర్, ఎం శ్యాంసుందర్ రెడ్డి, మెరుగు శ్రీనివాసరెడ్డి, గాదె నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్న టీఆర్ఎస్
-
టార్గెట్ ‘కరుణ’!
- సభా హక్కుల ఉల్లంఘన - ఫిర్యాదుపై సమీక్ష - క్రమశిక్షణా సంఘం సమాలోచన సాక్షి, చెన్నై : అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న డీఎంకే అధినేత ఎం.కరుణానిధిని అధికార పక్షం టార్గెట్ చేసింది. సభకు రాకుండానే, అసెంబ్లీ వ్యవహారాల్లో తలదూర్చే విధంగా వ్యవహరిస్తున్నారని వచ్చిన ఫిర్యాదును స్పీకర్ ధనపాల్ పరిగణనలోకి తీసుకున్నారు. దీన్ని క్రమ శిక్షణా సంఘానికి పంపించారు. ఆ సంఘం ఆయన ప్రకటనల తీరుపై సమీక్షించి నివేదిక సిద్ధం చేస్తోంది. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక, అసెంబ్లీలో ప్రతి పక్షాల గళాన్ని నొక్కేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ధిక్కరిస్తే చర్యలు తప్పదన్నట్టుగా సస్పెన్షన్ వేటులు పడుతున్నాయి. ఇందుకు ప్రధాన ప్రతిపక్ష నేత విజయకాంత్, ఆ పార్టీ సభ్యులపై విధిస్తూ వస్తున్న సస్పెన్షన్లు ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక, సభ జరిగినప్పుడల్లా ప్రతి రోజూ డీఎంకే వాకౌట్ల పర్వాన్ని కొనసాగిస్తూనే వస్తున్నది. తమకు మాట్లాడే అవకాశమివ్వడం లేదని, తమ తీర్మానాలపై చర్చ సాగించడం లేదని ఆరోపిస్తూ ఈ పర్వాన్ని ఆ పార్టీ సభ్యులు కొనసాగిస్తూ వస్తున్నారు. సింగిల్ డిజిట్ సభ్యుల్ని కల్గిన ప్రతిపక్ష పార్టీలే సభ వ్యవహారాల్లో కలుసుకుంటున్నాయి. కాగా, మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కరుణానిధి అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అసెంబ్లీ మందిరంలోకి అడుగు పెట్టలేదు. తిరువారూర్ నుంచి ఆయన అసెంబ్లీకి ఎన్నికైన విషయం తెలిసిందే. వీల్ చైర్లో ఉన్న తనకు కూర్చునేందుకు వీలుగా సభలో ప్రత్యేక స్థలం కేటాయించాలన్న ఆయన అభ్యర్థను అధికార పక్షం పట్టించుకోలేదు. దీంతో సభ జరిగినప్పుడు ఏదో ఒక రోజున లాబిలో ఉన్న పుస్తకంలో సంతకం చేసి అటే బయటకు వెళ్తుండం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీకి రాకుండానే, ఆయన సభా వ్యవహారాల్లో తలదూర్చుతూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణను అన్నాడీఎంకే వర్గాలు తెరమీదకు తెచ్చాయి. ఇటీవల సభలో మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కరుణానిధిపై సభ హక్కుల ఉల్లంఘన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్తో స్పీకర్కు ఫిర్యాదు చేరింది. సభా హక్కుల ఉల్లంఘన అసెంబ్లీలో గృహ నిర్మాణ శాఖ మంత్రి వైద్యలింగం చేసిన ప్రసంగాన్ని ఖండిస్తూ, అందులోని తప్పుల తడక, అనుచిత వ్యాఖ్యల్ని ఎత్తి చూపుతూ డీఎంకే అధినేత ఎం.కరుణానిధి గత నెల ముఫ్పైన ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిని పరిగణలోకి తీసుకున్న మంత్రి వైద్యలింగం డీఎంకే అధినేత ఎం.కరుణానిధిని టార్గెట్ చేశారు. అసెంబ్లీలో తాను చేసిన ప్రసంగాన్ని ఖండించే విధంగా, అసెంబ్లీ వ్యవహారాల్ని ధిక్కరించే రీతిలో కరుణానిధి ప్రకటన ఉందంటూ స్పీకర్ ధనపాల్కు మంత్రి వైద్యలింగం ఫిర్యాదు చేశారు. సభలో సందించాల్సిన ప్రశ్నల్ని, సభలోనే లేల్చుకోవాల్సిన అంశాల్ని బజారుకీడ్చే రీతిలో కరుణానిధి విమర్శలు ఆరోపణలు ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిని పరిగణించి స్పీకర్ ధనపాల్ విచారణకు ఆదేశించారు. సమాలోచన అసెంబ్లీ క్రమ శిక్షణా సంఘానికి అధ్యక్షులుగా డెప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి వి.జయరామన్ వ్యవహరిస్తున్నారు. సభ్యులుగా ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం, ప్రధాన ప్రతిపక్ష నేత విజయకాంత్, పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే విజయ ధరణి, డీఎండీకే తరపున ఎమ్మెల్యే బాబు మురుగవేల్, డీఎంకే తరపున కంబం రామకృష్ణన్లతో పాటుగా సీపీఐ, సీపీఎం సభ్యులు కూడా వ్యవహరిస్తున్నారు. స్పీకర్ ధనపాల్ నుంచి వచ్చిన ఫిర్యాదుపై సమాలోచించింది చర్యకు ఆ సంఘం సిద్ధమయింది. సోమవారం సాయంత్రం అసెంబ్లీ ఆవరణలో డెప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి వి.జయరామన్ అధ్యక్షతన కమిటీ సమావేశమయింది. ప్రధాన ప్రతి పక్ష నేత సభకు రావడం లేదు కాబట్టి, ఆ పార్టీ ఎమ్మెల్యే బాబు మురుగవేల్ సస్పెన్షన్ వేటు కారణంగా సమావేశానికి దూరం కాక తప్పలేదు. మెజారిటీ శాతం మంది అన్నాడీఎంకే సభ్యులే ఈ సంఘంలో ఉండడంతో కరుణానిధి ప్రకటనపై తీవ్రంగానే స్పందించి ఉంటారన్నది గమనార్హం. కరుణానిధి వ్యాఖ్యల్ని నిశితంగా పరిశీలించి, నివేదికసిద్ధం చేస్తున్నారు. ఈ నివేదికను స్పీకర్ ధనపాల్కు సమర్పించి, తదనంతరం కరుణానిధిపై చర్యకు రంగం సిద్ధ చేస్తున్నారు. అయితే, ఏ ప్రాతిపదికన కరుణానిధిపై చర్య తీసుకుంటారోనన్నది వేచి చూడాల్సిందే. -
బాబు డైరెక్షన్..తమ్ముళ్ల యాక్షన్
అసెంబ్లీలో విపక్షం గొంతు నొక్కిన పాలకపక్షం హైదరాబాద్: విపక్షం గొంతు నొక్కడమే లక్ష్యంగా రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సాగాయి. ప్రజా సమస్యలను ప్రస్తావించిన ప్రతిసారీ ఏదో విధంగా సభను పక్కదారి పట్టించడమే పనిగా పెట్టుకున్న పాలకపక్షం ప్రజాసమస్యల పరంగా ఐదు రోజుల పాటు సభను తూతూ మంత్రంగా నడిపి మమ అనిపించింది. మంత్రులు, అధికారపక్ష సభ్యుల అనుచిత వ్యాఖ్యలు, కవ్వింపు చర్యలతో ఏ ప్రయోజనమూ నెరవేరకుండానే సమావేశాలు ముగిశాయి. ఆగస్టు 31 ఉదయం ప్రారంభమైన సమావేశాలు శుక్రవారం మధ్యాహ్నానికే ముగిశాయి. విపక్షం గట్టిగా పట్టుబట్టడంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించడం, అరకొరగా దుర్భిక్షంపై చర్చ మినహా ఈ సమావేశాల తో సాధించిందేమీ లేదు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అర్థంపర్థంలేని ఆరోపణలతో సభను పక్కదోవ పట్టిస్తూ అధికార పక్షం కాలం వెళ్లబుచ్చింది. నిమిషానికోసారి జగన్ మైక్ కట్ చేయించి విపక్షనేత చెప్పాలనుకున్న విషయాలను ప్రస్తావనకే రాకుండా చేశారు. పట్టిసీమ, పోలవరం తదితర అంశాలపై జగన్ మాట్లాడటానికి యత్నించినపుడు స్పీకర్ అడ్డుకున్నారు. హడావిడిగా బిల్లులు ప్రవేశపెట్టడంపై నిరసన తెలుపుతూ గురువారం విపక్షం వాకౌట్ చేయగా.. విపక్షం లేనప్పుడే తొమ్మిది బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. విపక్షంపై విషం :తొలిరోజు వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదాపై వాయిదా తీర్మానం నోటీసు ఇస్తే పాలకపక్షం దొంగాట ఆడి, ప్రభుత్వమే తీర్మానం పెట్టనుందని ప్రకటించి సరిపెట్టింది. విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డికి మాట్లాడే అవకాశమే లేకుండా చేసింది. చంద్రబాబు నాయుడు దర్శకత్వంలో చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, మంత్రి అచ్చన్నాయుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తదితరులు ఎప్పటికప్పుడు విపక్షం గొంతు నొక్కడంలో కీలకపాత్ర పోషించారు. విపక్షనేత సభలో ఉండరని రూఢీగా తెలిసిన మూడో రోజున గోదావరి నదీ జలాలను వినియోగించుకోవడం, పట్టిసీమ ప్రాజెక్టుపై స్వల్ప కాలిక చర్చంటూ మొదలు పెట్టి విపక్షంపై విషం చిమ్మారు. మంత్రుల పని తీరుకు సీఎం తనయుడు మార్కులేస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో అచ్చన్నాయుడు రెచ్చిపోయారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ సభను పక్కదోవ పట్టించారు. చివరిరోజు శుక్రవారం.. ‘ఓటుకు కోట్లు’ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమేయంపై చర్చించాలని విపక్షం వాయిదా తీర్మానం ఇస్తే.. విపక్ష నేత జగన్కు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్ చేసి ఈ తీర్మానం ఇప్పించారని అచ్చన్నాయుడు ఆరోపించి సభ జరక్కుండా చేశారు. 9 బిల్లులు.. 2 తీర్మానాలు : ఐదు రోజుల అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో 20 గంటల 29 నిమిషాల పాటు సభ నడిచింది. 50 లిఖిత పూర్వక ప్రశ్నలకు జవాబులు వచ్చాయి. ఆరు స్వల్ప కాలిక ప్రశ్నలకు, 344 నిబంధన కింద ఒక ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. సభలో ప్రవేశపెట్టిన 9 బిల్లులు పాస్ అయ్యాయి. రెండు తీర్మానాలను సభ ఆమోదించింది. రెండింటిపై స్వల్ప వ్యవధి చర్చ జరిగింది. మంత్రి ఒక ప్రకటన చేశారు. -
‘ఓటుకు కోట్లు’పై... బాబు మొహం చాటేశారు
సమాధానం చెప్పే ధైర్యం లేకే సభను వాయిదా వేసుకున్నారు బాబు రాజీనామా చేయాల్సినంత తీవ్రమైన అంశం అది సభలో చర్చకు అనుమతించకపోవడం అన్యాయం నిబంధనల ప్రకారం అడిగినా ప్రయోజనం లేకపోయింది రూ.వెయ్యి కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏమైంది? 15 నెలలైనా ఒక్క ఉద్యోగమూ లేదు, ఒక్కరికీ నిరుద్యోగభృతి ఇవ్వలేదు హోదాతో ఉద్యోగాలొస్తాయన్న కనీస ధ్యాస లేదు పోలవరంపై రాష్ట్రానికి చిత్తశుద్ధి లేదని కేంద్రమే చెప్పింది పట్టిసీమకు వ్యతిరేకమని గతంలోనే చెప్పాం {పభుత్వ తీరుపై ధ్వజమెత్తిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హైదరాబాద్: తాను అడ్డంగా దొరికిపోయిన ఓటుకుకోట్లు కుంభకోణంలో సమాధానం చెప్పుకునే దమ్మూ, ధైర్యం లేకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శాసనసభను వాయిదా వేసుకుని వెళ్లిపోయారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఓటుకుకోట్లు కుంభకోణంపై అసెంబ్లీలో చర్చ కోసం తాము నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చినా అనుమతించలేదని ఆయన అన్నారు. శాసనసభ వర్షాకాల సమావేశాలు అర్ధాంతరంగా వాయిదాపడిన తరువాత శుక్రవారం మధ్యాహ్నం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసనసభ సమావేశాలు జరిగిన తీరును ఆయన వివరిస్తూ... అధికారపక్షం వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి పేరును ఏసీబీ చార్జిషీటులో పొందుపరిస్తే ఆ వ్యవహారాన్ని అసెంబ్లీలో చర్చించవద్దంటే ఎలా? అని జగన్ విస్మయం వ్యక్తం చేశారు. ‘‘ఒక ఎమ్మెల్యేను ప్రలోభపెడుతూ ఒక ముఖ్యమంత్రి రెడ్హ్యాండెడ్గా దొరకడం బహుశా దేశంలో ఇదే ప్రథమం. నామినేటెడ్ ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడింది చంద్రబాబేనని ఫోరెన్సిక్ నివేదికలో ధ్రువీకరించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు ఆదేశాల మేరకు ఒక టీడీపీ ఎమ్మెల్యే లంచం డబ్బు తీసుకుని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు సిద్ధపడి పట్టుపడ్డారు. ఇంత గట్టి సాక్షాధారాలతో పట్టుపడితే, ముఖ్యమంత్రిపైనా నేరుగా ఆరోపణలు వస్తే అసెంబ్లీలో చర్చకు అనుమతించరా! ఇంత తీవ్రమైన అంశాన్ని అసెంబ్లీలో చర్చించకపోవడం కూడా బహుశా దేశ చరిత్రలో ఇదే మొదటిసారేమో! దొంగను పట్టుకోవడం తప్పు అన్నట్లుగా ఉంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించకూడదనే దుర్బుద్ధితోనే శాసనసభ సమావేశాలను ఐదురోజులకు పరిమితం చేశారు. కనీసం పదిహేను రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని మేము కోరినా ప్రయోజనం లేకపోయింది. అధికారం ఉంది కదా అని, స్పీకర్ స్థానం కూడా వాళ్లదే కనుక చర్చకు అవకాశం ఇవ్వకుండా వ్యవస్థలను మేనేజ్ చేయడం నిజంగా ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. ఈ వ్యవహారం నిజంగా ఎలా ఉందంటే... దొంగతనం చేస్తూ పట్టుబడ్డ ఒక దొంగ ఆ దొంగతనం చేయడం తప్పు కాదు, తనను పట్టుకోవడమే తప్పు అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఏపీలో అక్రమంగా సంపాదించిన నల్లధనాన్ని వెదజల్లుతూ పట్టుబడిన పరిస్థితి ఇది. ఎమ్మెల్యేలను కొనడానికి సన్నద్ధమై ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఐదు నుంచి ఇరవై కోట్ల రూపాయల వరకూ ఆశ చూపిన ఉదంతం ఇది, మొత్తం మీద రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల కుంభకోణం ఇది. పట్టిసీమ నుంచి ఇసుక మాఫియా వరకూ సాక్షాత్తూ ముఖ్యమంత్రే పర్సెంటేజీలు తీసుకుని సంపాదించిన డబ్బు ఇది. మట్టి దగ్గరి నుంచి బొగ్గు దాకా ప్రతి అం శంలోనూ కమీషన్లు తీసుకుంటున్న పరిస్థితి. జీవో నెంబర్ 22 నుంచి, డిస్టిల్లరీలను విస్తరింప జేసుకోవడానికి అనుమతులు ఇవ్వడం నుంచి లంచాలు తీసుకున్నారు. ఎంపిక చేసిన పారిశ్రామికవేత్తలకే ప్రోత్సాహకాలు ఇచ్చి కమీషన్లు తీసుకున్నారు. కృష్ణపట్నం విద్యుత్ ఉత్పాదనా కేంద్రంలో ఒక మెగావాట్ విద్యుత్కు ఉత్పాదనా వ్యయం రూ.8 కోట్లకు పెరి గింది, పైగా అది సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించింది కూడా కాదు. సూప ర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించే విద్యుత్ కేంద్రంలో కూడా ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పాదనా వ్యయం రూ.5.5 కోట్లకు మించదు కానీ కృష్ణపట్నంలో మాత్రం రూ.8 కోట్లకు పెరిగింది. రాయలసీమ థర్మల్ విద్యు త్ కేంద్రంలో కూడా అంతే. అక్కడ రూ.4 కోట్లతో జరగాల్సిన ఒక మెగావాట్ ఉత్పత్తి వ్యయం రూ.6 కోట్లకు పెరిగింది. దీన్ని బట్టి ఎక్కడ చూసినా లంచాలే అనేది స్పష్టం అవుతుంది. ఇలా సంపాదించిన డబ్బును విచ్చలవి డిగా వెదజల్లుతూ దొరికిపోతే, చంద్రబాబు పేరును ఏసీబీ చార్జిషీట్లో 22 సార్లు పొందుపరిస్తే, ఫోరెన్సిక్ నివేదికలో కూడా ఆ టేపుల్లో ఉన్నది చంద్రబాబు గొంతేనని నిర్ధారిస్తే అసెంబ్లీలో చర్చకు అనుమతించక పోవడం ఏమిటి? సభలో మేం ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు చంద్రబాబు అసెంబ్లీలోని తన చాంబర్లో ఉండి కూడా బయటకు రాకుండా కూర్చున్నారు. చంద్రబాబు అసెంబ్లీకి వచ్చి చొరవ తీసుకుని చర్చించి, ఆ చర్చలో తన వాదన ఏమిటో చెప్పి ఉండాల్సింది, కానీ ఆయన ఆ బాధ్యత నుంచి తప్పించుకున్నారు. చంద్రబాబు రాజీనామా చేసి ఉండాలి... వాస్తవానికి ఈ వ్యవహారంలో చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఉండాలి. వాయిదా తీర్మానం రూపంలో, 344 నిబంధన కింద మేము నోటీసులు ఇచ్చినా కూడా ముఖ్యమంత్రి సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు. మేము పద్ధతి ప్రకారం చర్చకు రాలేదని తెలుగుదేశం వారు ఆరోపించగలరు. కానీ మేము నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చామనడానికి ఈ ప్రతులే(స్పీకర్కు ఇచ్చిన నోటీసులు చూపిస్తూ) సాక్ష్యం. తనను ఫలానా ఉద్యోగి లంచం అడుగుతున్నారని ఒక రైతు గానీ, సాధారణ వ్యక్తిగానీ ఏసీబీ అధికారుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తే, ఆ రైతుకు ఏసీ బీ అధికారులు కొంత డబ్బును ఇచ్చి ఆ నోట్ల పై ఫింగర్ప్రింట్ అసెస్మెంట్ పౌడర్ను చల్లి లంచం అడిగిన ఉద్యోగికి ఇవ్వజూపాల్సిందిగా చెప్పి వల పన్నుతారు. ఆ రైతు ఆ డబ్బును లంచం అడిగిన ఉద్యోగికి ఇస్తూ ఉండగా పట్టుకుం టారు. నోట్ల మీద ఉన్న ఫింగర్ ప్రింట్ పౌడర్ ఆ ఉద్యోగి చే తికి అంటుకున్నపుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్టు చేస్తారు. కేసు పెట్టి ఉద్యోగం నుంచి తొలగిస్తారు. మరి ఇక్కడేమైంది? నేరుగా ఆడియో, వీడియో టేపులతో సహా నల్లధనం ఇస్తూ దొరికిపోయినా అసెం బ్లీలో చర్చ కూడా జరగలేదు. చంద్రబాబు అసెంబ్లీకి వచ్చి ఆడియో రికార్డుల్లో ఉన్న గొంతు తనది కాదని చెప్పుకునే ధైర్యం చేయలేదు. ఫోరెన్సిక్ నివేదిక కూడా ఆ గొంతు ఆయనదేనని ధ్రువీకరించిన నేపథ్యంలో సీఎం అసెంబ్లీకి రాకుండా దాక్కున్నారంటే నిజంగా ఏ నైతిక హక్కుతో ఇవాళ ఆ స్థానంలో కూర్చున్నారో తన మనస్సాక్షినే అడగాలి. హెరిటేజ్ ఫ్రెష్కు నష్టాలొస్తాయనే ధరల స్థిరీకరణ చేయడం లేదు.. నిత్యావసరాల ధరలు మండిపోతున్నా తమ సొంత సంస్థ హెరిటేజ్ ఫ్రెష్కు నష్టాలొస్తాయనే ముఖ్యమంత్రి చంద్రబాబు ధరల స్థిరీకరణ చేయడం లేదని వైఎస్ జగన్ ఆరోపించారు. నిత్యావసర ధరల పెరుగుదలపై వాయి దా తీర్మానం ఇచ్చినా చర్చకు పిలవలేదని జగన్ మండిపడ్డారు. ‘‘కందిపప్పు జనవరిలో రూ.80 ఉంటే ఇవాళ రూ.150, చింతపండు రూ.80 నుంచి రూ.130, ఉల్లి రూ.20 నుంచి రూ.70, ఎండుమిర్చి రూ.80 నుంచి రూ.125లకు ధరలు పెరిగాయి. ఈ ధరలన్నిటినీ హెరిటేజ్ ఫ్రెష్లో తీసుకొచ్చాం. ధరల స్థిరీకరణకు రూ.వెయ్యి కోట్లతో నిధి ఏర్పాటు చేస్తానన్నారు. కానీ, హెరిటేజ్ ఫ్రెష్కు నష్టాలొస్తాయనే ధరల స్థిరీకకరణ చేయడంలేదు. నిత్యావసరాల పెరుగుదలపై చర్చకు వాయిదా తీర్మానం గురువారం ఇచ్చాం. శుక్రవారం 344కింద ఓటుకు కోట్లుపై నోటీసిచ్చాం. నిత్యావసరాల ధరల పెరుగుదలపై చర్చకు గురువారం పిలిచి ఉండొచ్చు. కానీ పిలవలేదు. చంద్రబాబు ఓటుకు కోట్లు చర్చలో ఎక్కడ ఇరుక్కుంటాడోనని 344 కింద నిత్యావసరాల ధరల పెరుగుదలపై చర్చకు పెడతామంటారు. ఓటుకు కోట్లు చర్చ అడగొద్దంటారు. నిత్యావసరాల ధరల పెరుగుదలపైనా చర్చించరు’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. కనీసం ఒక్క ప్యూన్ ఉద్యోగమైనా ఇచ్చారా? ‘‘రాష్ట్రం విడిపోయేటప్పుడు.. రాష్ట్రంలో 1,42,828 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పారు. ఇప్పటికి 15 నెలలవుతోంది. ఒక్క ప్యూన్ ఉద్యోగం ఇవ్వలేదు. డీఎస్సీ పరీక్షలు పెట్టారు. ఇంకా ఫలితాలు ప్రకటించరు. ఉద్యోగాలూ ఇవ్వరు. ఏపీపీఎస్సీ పరీక్షలైతే నిర్వహించనే లేదు. ఫీల్ట్ అసిస్టెంట్లను తొలగిస్తున్నారు. సంఘమిత్రలు ఇంతకు ముందు ప్రభుత్వం నుంచి రూ.2 వేలు, గ్రూపుల నుంచి మరో రూ.2 వేలు తీసుకునే వాళ్లు. ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వడం మానేసింది. అంగన్వాడీల జీతాలపై అసెంబ్లీ జరిగినప్పుడల్లా గట్టిగా నిలదీస్తున్నాం. అదిగో ఇదిగో పెంచుతామంటున్నారు. ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. నిరుద్యోగులకు వయోపరిమితి పెంచి, రిక్రూట్మెంట్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఇంతవరకు ఆ ఊసేలేదు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్లో పనిచేస్తున్న వాళ్ల పరిస్థితి అంతే. నిర్ణీత సమయాల్లో ఉద్యోగ నియామకాలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆ తర్వాత పట్టించుకోరు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఇప్పుడు మాట మార్చారు. పరిశీలిస్తామన్నామే తప్ప పర్మినెంట్ చేస్తామని చెప్పలేదని ఇప్పుడు అంటున్నారు. ఇంటింటికీ ఉద్యోగం, ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికీ నిరుద్యోగ భృతి రూ.2 వేలు ఇస్తామని ఎన్నికలప్పుడు టీవీల్లో ఊదరగొట్టారు. వీటి కోసం రాష్ట్రంలో 1.75 కోట్ల ఇళ్లు ఎదురు చూస్తున్నాయి.. ఉద్యోగమన్నా ఇవ్వు.. రూ.2 వేలు నిరుద్యోగ భృతినైనా ఇవ్వమని. కానీ, ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు’’ అని జగన్పేర్కొన్నారు. చాలా అగచాట్లు పడి ప్రత్యేక హోదాపై చర్చను జరిపించాం ‘‘ప్రభుత్వం సహకరించకపోయినా ప్రత్యేక హోదాపై చర్చ జరగడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని సభలో గట్టిగా పోరాడాం. శాసనసభ్యులకు, మంత్రులకు ప్రత్యేక హోదా అంటే ఏంటో తెలియదు. దాని వల్ల కలిగే ప్రయోజనాలూ తెలియవు. వారికి అర్థం కావాలని, వాళ్ల మనసు మారాలని చర్చ జరిపించాం. చంద్రబాబు ప్రత్యేక హోదాను అడ్డుకుంటారు. కన్ఫ్యూజింగ్(గందరగోళం)గా మాట్లాడతారు. అదేమన్నా సంజీవినా అంటారు. ప్రత్యేక హోదా వస్తేనే పారిశ్రామిక రాయితీలు, ఎక్సైజ్ డ్యూటీ, ఇన్కమ్ ట్యాక్స్లో వంద శాతం మినహాయింపు లాంటివి వస్తాయి. అప్పుడే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారు. అప్పుడే ఉద్యోగాల వస్తాయన్న కనీస ధ్యాస లేదు. తటస్థంగా ఉండి అసెంబ్లీ నడపాల్సిన స్పీకర్, న్యూట్రాలిటీ(తటస్థం) తప్పడం ఆయన చేసిన తప్పు. అసెంబ్లీని భ్రష్టు పట్టించడం చంద్రబాబు చేసిన తప్పు. ప్రతి రోజూ ఓ ముఖ్యమైన, ప్రాధాన్యం ఉన్న అంశాన్ని చర్చకు తీసుకువస్తున్నాం’’ అని వైఎస్ జగన్ అన్నారు. 19 లేదా 20 నుంచి జగన్ దీక్ష! హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం తాను చేయబోయే నిరవధిక నిరాహారదీక్షను ఈ నెల 19 లేదా 20వ తేదీ నుంచే ప్రారంభించే అవకాశం ఉందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. ఈ తేదీని తమ పార్టీ నేతలు త్వరలో ధ్రువీకరిస్తారని తెలిపారు. 17న వినాయకచవితి ఉన్నందువల్ల పార్టీ నేతల సూచన మేరకు తొలుత ప్రకటించిన తేదీ వాయిదా వేసుకున్నట్లు విలేకరులడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన శుక్రవారం చెప్పారు. -
అశోకుడు-షాజహాను
అక్షర తూణీరం ఇది గత పాలకుల కుట్ర. నగరం చుట్టూతా రింగ్ రోడ్డు వేశారు. మేం తరిమికొడుతుంటే, అవినీతి రింగ్ రోడ్డులో తిరిగి వస్తోందని చెబుతున్నారు. వానాకాలం సమా వేశాలన్నప్పుడల్లా నాకు వానాకాలం చదువులు గుర్తుకొ స్తాయి. ఏ మాత్రం సాగని చదువుని వా నాకాలం చదువం టారు. ఏమాత్రం సాగని సమావేశాలు కాబట్టి వానాకాలం విశేష ణం సరిపోయింది. చెట్లకింద బడులు నడిచే రోజుల్లో ఈ సామెత పుట్టింది. పొరుగూరు పోయి చదువుకోవాలి కదా! వాగులు వంకలు అడ్డం వచ్చేవి. అయ్యవారు డొంకదారిలో రాలేకపోయేవారు. ఇలాంటి అనేకానేక అడ్డం కుల వల్ల బడి నడిచేది కాదు. ఏమాత్రం చదు వు అబ్బేది కాదు. ఇప్పుడు కూడా అంతే. వానాకాలం అసెంబ్లీ సెషన్లో ఊకదంపు, చెరిగిపోసుకోవడం, మాటల కంపు తప్ప ప్రజకి ఒక్క మంచి కూడా జరగలేదు. ప్రత్యక్ష ప్రసారాలు పుణ్యమా అని వినోదాన్ని మాత్రం ఉచితంగా పంచారు. అది మాత్రం ప్రజాసేవ కాదా అంటే, సరే అంటాం. ధన్య వాదాలు. సీజన్ కదిలిపోతున్నా వానచినుకు లేదు. ఎందుకో కృత్రిమ వర్షాలకు, మబ్బు లు విత్తేందుకు ప్రయత్నం చేయడం లేదు. మామూలు గా అయితే చేస్తారు. ఈ ప్రక్రియ వల్ల వాన కురవక పోయినా, కొన్నిచోట్ల కనక వర్షం కురుస్తుందని చెప్పు కోగా విన్నాను. ‘‘చూడండి! వర్షాలు లేకపోతే ఎంత అనర్థమో...’’ అన్నా డొక పెద్ద ప్రభుత్వాధికారి. నేను అయోమ యంగా చూశా. ‘‘వానలు లేకపోబట్టి కదా, పంటపొల్లాల్లో ఉండాల్సిన ఎలుకలు ప్రభుత్వ ఆస్పత్రులకు చేరింది...’’ అంటూ నిట్టూర్చా డు. వినాయక నిమజ్జనానికి కూడా ఆంధ్రాలో నీళ్లు లేవండీ అని ఒక పెద్దాయన వాపోయా డు. ‘‘మీకేం ఫర్వాలేదు. మనకు బంగాళాఖా తం ఉంది. అవసరమైతే విగ్రహాల తరలింపు బాధ్యత మేం తీసుకుంటాం. రాష్ట్రంలోని అన్ని విగ్రహాల నిమజ్జనం అయ్యేదాకా నేను నిద్ర పోనివ్వను’’ అంటూ నాయకుడు హామీ ఇచ్చే స్తాడని శ్రోత సముదాయించాడు. ఆంధ్రా నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డ ఒక పెద్దాయన తెగ బాధపడిపోతూ బాధకు కారణాలు చెప్పాడు. ఇంతకు ముం దు రాష్ట్రంలో ఏం జరిగినా ఒక్కటిగా సంతో షించడమో బాధపడడమో చేసేవాణ్ణి. రాష్ట్రం ముక్కలైంది గాని నా బుర్ర ముక్కలు కాలేదు. ఒకరు అశోక చక్రవర్తిలా చెరువులు తవ్విం చుట, చెట్లు నాటించుట చేసేస్తున్నారు. ప్రజల శ్రేయస్సుకై చీప్లిక్కర్ ప్రవేశపెడతానన్నారు. ప్రజలు ససేమిరా వద్దన్నారు. సరే, మీ శ్రేయ స్సు కోసం ప్రవేశ పెట్టను గాక పెట్టనన్నారు. ‘‘అవినీతిని తరిమికొట్టాం’’ అన్నారు. మరి ఎక్కడ చూసినా అదే కనిపిస్తోందేమని ప్రశ్ని స్తే-ఇది గతపాలకుల కుట్ర. నగరం చుట్టూతా రింగ్రోడ్డు వేశారు. మేం తరిమికొడుతుంటే, అవినీతి రింగ్రోడ్డులో తిరిగి వస్తోందని చెబు తున్నారు. ఇంకొకరు షాజహాన్ చక్రవర్తి తాజ్ మహల్ని నిర్మించినట్టు అమరావతిని నిర్మిస్తా నని తెరపై బొమ్మలు చూపిస్తున్నారు. తాజ్మ హల్ ప్రజల కడుపులు నింపలేదు. అమరా వతి కూడా సేమ్ టు సేమ్. ఇవన్నీ తలుచు కుంటూ ఆ పెద్దాయన రెండు బరువులు మో స్తున్న ఫీలింగ్తో తల పగిలిపోతోందంటాడు. కావచ్చు. మద్రాసు నుంచి విడిపోయినప్పుడు ఈ గొడవలేదు. అది తమిళం, మనం తెలుగు. ఇప్పుడేమో రెండూ తెలుగు రాష్ట్రాలైనాయి. చాలామంది విజయనగర్ కాలనీలో కూచుని విజయనగరం గురించి, విజయవాడ, విశాఖ గురించి ఆలోచిస్తుంటారు. ప్రస్తుతం ఒక ప్రభుత్వానికి మూడు నాలుగు అపోజిషన్లు తగులుతున్నాయి. ఇవిగాక బీజేపీకి రాష్ట్రంలో ఎలాంటి పాత్ర పోషించాలో తెలియడం లేదు. చెప్పులోని రాయిలా, చెవిలోని జోరీగలా, ఇంటిలోని పోరులా.. కొన్నిసార్లు తయారవు తోంది. తెలుగు పెద్దాయనకు తలభారం తగ్గా లంటే అన్ని విధాల వార్తలకూ దూరంగా ఉం డడమే మందు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్రం అంధకారం
- ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసేందుకే అసెంబ్లీ సమావేశాలు - వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్రెడ్డి శెట్టూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్రం అంధకారం అవుతుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్.ఎం.మోహాన్రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం తాలుకా కార్యదర్శి కిరణ్ చౌదరి సేవాదళ్ జిల్లా కార్యదర్శి సత్తిరెడ్డి, కళ్యాణదుర్గం మండల కార్యదర్శి గుప్తా,ట్రేడ్ యూనియన్ నాయకులు టైలర్శీను, విద్యార్థివిభాగం జిల్లా కార్యదర్శి షేక్షావలీతో కలసి గురువారం ఆయన మండల పరిధిలోని కైరేవు, మాకొడికి, యాటకల్లు గ్రామలో ్లపర్యటించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్.జగన్ను టార్గెట్ చేసేందుకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పే సమయానికి మైకులు కట్ చేసే నీచ సాంస్కృతికి టీడీపీ ప్రభుత్వం దిగజారిందన్నారు. పర్యటనలో భాగంగా ఆయన మాకొడికి గ్రామంలో ఉపాధిహామీ పనికి వెళ్లి మృతి చెందిన వన్నూరుస్వామి కుటుంబాన్ని పరామర్శించారు. వెఎస్సార్సీపీలో చురుకైన కార్యకర్తగా వన్నూరుస్వామి పని చేశాడన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. వన్నూరుస్వామి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఉపాధి పనులకు వెళ్లి మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ యువజన విభాగం తాలుకా కార్యదర్శి కిరణ్ చౌదరి, జిల్లా సేవాదళ్ కార్యదర్శి సత్తినారాయణరెడ్డి, కళ్యాణదుర్గం సేవాదళ్ కార్యదర్శి గుప్తా, ట్రేడ్ యూనియన్ నాయకులు టైలర్ శీను, విద్యార్థివిభాగం జిల్లా కార్యదర్శి షేక్షావలీ, అన్వర్ , మల్లేష్, గరీబ్సాబ్, బోయ రామాంజినేయులు, నజీర్సాబ్ ఉన్నారు. -
అసెంబ్లీయే అఖిలపక్షం!
సాగునీటి ప్రాజెక్టులపై రాజకీయ పార్టీలు, పలు ప్రజా సంఘాలు చేస్తున్న దాడిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు శాసనసభ సమావేశాలను వేదికగా మార్చుకోవాలని అధికార పక్షం భావిస్తోంది. ఈనెల 23 నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈసారి సమావేశాలు ఆరు రోజుల పాటు జరిపే అవకాశం ఉంద ంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల రీఇంజనీరింగ్ (రీ డిజైనింగ్)కు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు వస్తున్నాయి. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు, కాళేశ్వరం వద్ద ఎత్తిపోతల పథకం, దేవాదుల రీడిజైనింగ్ వంటి అంశాలపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దాంతోపాటు పెండింగ్ ప్రాజెక్టులకు బడ్జెట్ విడుదల చేయడం లేదని ఆరోపిస్తున్నాయి. అందువల్ల ఈ అంశాలపై అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి వివరించడం కంటే... అసెంబ్లీ సమావేశాలు వేదికగా ఆయా ప్రాజెక్టులు, ప్రభుత్వ కార్యక్రమాల గురించి వివరించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. గోదావరి, కృష్ణా నదులపై జరిగిన జల దోపిడీ మొదలు ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ ఆవశ్యకత వరకు నేరుగా అసెంబ్లీలో వివరించడానికి కసరత్తు మొదలుపెట్టారు. -
కర్నూలు నుంచి అమరావతికి డైరెక్ట్ రోడ్డు
హైదరాబాద్ : కర్నూలు నుంచి రాజధాని అమరావతికి నేరుగా రోడ్డు మార్గం వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రత్యేక హోదాపై ఆయన గురువారం శాసనమండలిలో ప్రకటన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ...'ఏ ప్రాంతం వారి ఆదాయం వారిదే అని ఇరురాష్ట్రాలకు కేంద్రం పెద్దలు చెబుతున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ ఆదాయం తక్కువ.. జనాభా ఎక్కువని.. ఈ విషయంలో తెలంగాణ ఆదాయం ఎక్కువని, జనాభా తక్కువని అన్నారు. రాష్ట్ర విభజనతో ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఎలా సరిదిద్దుతారో కేంద్రం చెప్పలేదని పేర్కొన్నారు. రెండు ప్రాంతాలకు న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరానని, కానీ నేడు ఆ పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణను తాను అభివృద్ధి చేశానని ప్రస్తుతం ఏపీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని చెప్పారు. రైతుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ బిల్లు తెచ్చినప్పటికీ రైతులు, ప్రజల నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండటంతో కాస్త తగ్గినట్లు చెప్పారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం నేపథ్యంలో రాజభవన్, అసెంబ్లీ, సచివాలయం వంటి వాటి నిర్మాణాల కోసం రూ.1500 కోట్లను కేంద్రం ప్రకటించగా, అందులో రూ.500 కోట్లు కేవలం రాజధాని విజయవాడ ప్రాంత అభివృద్దికే ఖర్చుచేయాల్సి వస్తోందన్నారు. ఏపీకి న్యాయం జరగాలంటూ అన్ని రాజకీయ పార్టీల నేతలను కలిశానని' తెలిపారు. -
అచ్చెన్నాయుడుపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
హైదరాబాద్ : ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసును వైఎస్ఆర్ సీపీ ఇచ్చింది. వైఎస్ఆర్ సీపీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు స్పీకర్ కోడెల శివప్రసాద్రావుకు అచ్చెన్నాయుడుపై ఉల్లంఘన నోటీసులు సమర్పించారు. గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉండి కూడా.. వైఎస్ఆర్ సీపీని సైకో పార్టీ అంటూ సభలో అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మంత్రి తీరుపై సభలో ఉన్న వైఎస్ఆర్ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా సభా కార్యక్రమాలను ఆ పార్టీ అడ్డుకోంది. -
మూడోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే కరువు, తాగునీటి సమస్య, ఆత్మహత్యలపై వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. -
'అసెంబ్లీ అయ్యేదాకా సిటీ వీడద్దు'
⇒ వెళ్లాలంటే మంత్రులు, సీఎస్ అనుమతి తీసుకోవాలి ⇒ అన్ని శాఖల అధికారులకు సీఎస్ ఆదేశాలు హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో సమావేశాలు ముగిసే వరకు అధికారులు ఎవరూ హైదరాబాద్ వదిలి వెళ్లరాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆదేశించారు. సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎవరైనా హైదరాబాద్ వీడి వెళ్లాలంటే సంబంధిత మంతులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి తీసుకోవాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు అడిగే అంశాలపై సంబంధిత మంత్రులకు ఎప్పటికప్పుడు వివరాలు అందజేయాలని ఆయా శాఖల అధికారులకు సీఎస్ సూచించారు. ఇప్పటికే సభ్యులు అడిగిన పెండింగ్ ప్రశ్నలన్నింటికీ తక్షణం సమాధానాలను అసెంబ్లీకి సమర్పించాలని ఆదేశించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు ప్రస్తావించిన అన్ని అంశాల పైనా తగిన సమాధానాలను అసెంబ్లీకి పంపించేందుకు ప్రతి శాఖలో జవాబుదారీ గల అధికారిని నియమించాలని సూచించారు. అలాగే గత అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు ఇచ్చిన హామీలకు సంబంధించి లిఖిత పూర్వక సమాధానాలను అసెంబ్లీకి పంపించాలని సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సూచించారు. -
అసెంబ్లీకి సిద్ధం
► అసెంబ్లీ సమావేశాలకు కసరత్తులు పూర్తయ్యాయి. ► ఈనెల 24 నుంచి సెప్టెంబర్ 29 వరకు సభ నిర్వహించేందుకు ► స్పీకర్ ధనపాల్ నిర్ణయించారు. తొలిరోజు సంతాప తీర్మానంతో ► సరి పెట్టి తదుపరి 18 రోజుల పాటు శాఖల వారీగా నిధుల ► కేటాయింపుల చర్చ సాగనుంది. సాక్షి, చెన్నై : ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొక్కుబడిగా జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సీఎంగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత లేని దృష్ట్యా, ఆమె స్థానంలో భారంగా బాధ్యతను చేపట్టిన పన్నీరు సెల్వం నమా అనిపించేశారు. శాఖల వారీగా నిధుల కేటాయింపుల చర్చ కూడా సాగలేదు. ఎట్టకేలకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నుంచి నిర్దోషిగా బయట పడ్డ సీఎం జయలలిత, ఆర్కే నగర్ నుంచి మళ్లీ అసెంబ్లీ మెట్లు ఎక్కి సీఎం పగ్గాలు చేపట్టారు. ఆమె సీఎంగా బాధ్యతలు చేపట్టినానంతరం అసెంబ్లీ సమావేశాల నిర్వహణ మీద దృష్టి పెట్టలేదు. పాలన మీద పట్టు సాధించే పనిలో పడ్డారని చెప్పవచ్చు. ప్రతి పక్షాల అసెంబ్లీని సమావేశ పరచాలని పదే పదే డిమాండ్ చేయడంతో పాటుగాప్రభుత్వంపై విమర్శలు గుప్పించే పనిలో పడ్డాయి. దీంతో అసెంబ్లీ తేదీని గవర్నర్ రోశయ్య ద్వారా గత వారం ప్రకటించారు. 18 రోజుల చర్చ : సభ తేదీ ఖరారు కావడంతో నిర్వహణా కసరత్తుల మీద స్పీకర్ ధనపాల్ దృష్టి సారించారు. శుక్రవారం అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. స్పీకర్ ధనపాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ నిర్వహణ, చర్చించాల్సిన అంశాలు, శాఖల వారీగా నిధుల కేటాయింపుల సమీక్ష తేదీలను నిర్ణయించారు. ఆ మేరకు సభను ఈనెల 24 నుంచి సెప్టెంబర్ 29 వరకు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. సెలవు దినాలు పోగా సభ 19 రోజుల పాటుగా సాగనున్నది. 24వ తేదీ తొలిరోజున ఇటీవల మరణించి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, మాజీ మంత్రి, కడయనల్లూరు ఎమ్మెల్యే చెందూర్ పాండియన్, సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్లకు సంతాపం తెలియజేస్తూ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. వీరికి సంతాపం తెలియజేసినానంతరం సభ వాయిదా పడనున్నది. తదుపరి 25వ తేదీ నుంచి 18 రోజుల పాటుగా ఆయా శాఖలకు నిధుల కేటాయింపులపై చర్చ సాగనున్నట్టు స్పీకర్ ధనపాల్ వివరించారు. ఆ మేరకు సెప్టెంబర్ 22వ తేదీ రాష్ట్ర హోం శాఖకు నిధుల కేటాయింపుపై చర్చ జరగనున్నదని తెలిపారు. అయితే, సభను 18 రోజులకు పరిమితం చేయడానికి ప్రతి పక్షాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో యాబై వరకు విభాగాలు, ముప్పై మంది వరకు శాఖలు ఉన్నప్పడు సమయాన్ని మాత్రం తక్కువగా కేటాయించి ఉండడాన్ని ఖండిస్తున్నారు. ఏదో మొక్కుబడిగా చర్చ సాగించేందుకే ప్రభుత్వం నిర్ణయించినట్టుందని మండి పడుతున్నారు. అయితే, ఈ సమయంలో ప్రతి పక్షాల్ని ధీటుగా ఎదుర్కొనడంతో పాటుగా, రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజాకర్షణ నిర్ణయాలు నిధుల కేటాయింపుల్లో ఉండే అవకాశాలు ఉన్నట్టు సచివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. -
వచ్చే నెలలో తెలంగాణ అసెంబ్లీ
-
వచ్చే నెలలో అసెంబ్లీ
మొదటి లేదా మూడో వారంలో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం హైదరాబాద్: వచ్చేనెల మొదటి వారం లేదా మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి తుది నిర్ణయం మేరకు ఈ తేదీలు ఖరారవుతాయని అధికార వర్గాలు వెల్లడించాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే సదస్సులో పాల్గొనేందుకు సెప్టెంబర్ 9న సీఎం కేసీఆర్ చైనా పర్యటనకు బయల్దేరనున్నారు. 14న ఆయన తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు. పారిశ్రామిక ప్రతినిధులు, పలువురు ఉన్నతాధికారులను వెంట బెట్టుకొని ప్రత్యేక విమానంలో సీఎం చైనా వెళ్లనున్నారు. ఈ మేరకు సీఎంవో కార్యాలయం ఏర్పాట్లు కూడా ప్రారంభించింది. సీఎం చైనా పర్యటన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. సెప్టెంబర్ మొదటి వారంలో అయిదు రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని సీఎం ఇటీవల తన మంత్రివర్గ సహచరులతో ప్రస్తావించారు. అయితే చైనా పర్యటన నుంచి వచ్చాక ఈ సమావేశాలు నిర్వహించాలని ఆలోచన ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రశ్నలకు సమాధానాలపై సీఎస్ సమీక్ష గత అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు.. వాటికి అందించాల్సిన రాతపూర్వక సమాధానాలపై మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ సమీక్ష నిర్వహించారు. వివిధ విభాగాల కార్యదర్శులతో వాటి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వచ్చే సమావేశాల దృష్ట్యా పెండింగ్లో ఉన్న వాటికి సమాచారం అందించాలని సూచించారు. సమావేశాల సమయంలో అధికారులు, సిబ్బంది సెలవులు పెట్టవద్దని, మంత్రులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. -
అసెంబ్లీ ఐదు రోజులే
31వ తేదీనుంచి వచ్చే నెల 4 వరకే సమావేశాలు ముఖ్యమంత్రి ఆమోదానికి ఫైలు హైదరాబాద్: రాష్ట్రంలో ఒక పక్క కరువు, రైతుల ఆత్మహత్యల వంటి ప్రధాన సమస్యలు, మరోపక్క ప్రభుత్వ నిర్వాకంతో గోదావరి పుష్కరాల్లో 30 మంది మృతి చెందడం, పట్టిసీమలో మోసాలు లాంటి పలు కీలకాంశాలు అసెంబ్లీలో చర్చకు రాకుండా ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను కేవలం ఐదు రోజులతో ముగించేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31వ తేదీ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాలు వచ్చే నెల 4వ తేదీతో ముగియనున్నాయి. ఇందుకు సంబంధించిన ఫైలుకు ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం ఆమోదం తెలిపి ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల శాసనసభ స్పీకర్కు, ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖలో తాము అసెంబ్లీలో ప్రస్తావించనున్న సమస్యలను పేర్కొన్న విషయం తెలిసిందే. -
ఆర్థిక స్థితి బాగా లేదంటూ విహారయాత్రలేంటి?
⇒ ఎమ్మెల్యేల్ని పర్యటనకు తీసుకెళతామనడంపై జ్యోతుల అభ్యంతరం ⇒ ఈ పర్యటనలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పాల్గొనరని స్పష్టీకరణ ⇒ ఆ డబ్బుతో అసెంబ్లీ సమావేశాల్ని మరిన్ని రోజులు జరుపుకుందాం ⇒ ప్రత్యేక హోదా, రాజధానికి తరలింపు వంటి సమస్యలెన్నో ఉన్నాయి ⇒ వాటిపై చర్చకు 20 రోజులైనా సమావేశాలు జరగాల్సిన అవసరముంది సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలందరినీ మూడు రోజులపాటు శ్రీహరికోట, కృష్ణపట్నం, తిరుపతికి తీసుకెళ్తామన్న శాసనసభ స్పీకర్ ఆహ్వానాన్ని తమ పార్టీ తిరస్కరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా ఉన్నప్పుడు బాధ్యతగల ఎమ్మెల్యే స్థాయిలో ఇలాంటి విహారయాత్రలో పాల్గొనడం మంచిది కాదన్నది తమ పార్టీ అభిప్రాయమని, అందుకే ఆ పర్యటనకు పార్టీ ఎమ్మెల్యేలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఆయన ప్రకటించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జ్యోతుల విలేకరులతో మాట్లాడారు. విహారయాత్రల పేరుతో వృథాచేసే ఇలాంటి డబ్బులతో శాసనసభ సమావేశాల్ని మరిన్ని రోజులు పొడిగించుకుని.. ప్రజాసమస్యలపై చర్చించుకుందామని సూచించారు. వర్షాకాల సమావేశాల్ని ఐదురోజులకు కుదించాలని ఆలోచన జరుగుతున్నట్టు తెలుస్తోందని, కనీసం 20 రోజులైనా సమావేశాలు జరిపేలా చర్యలు తీసుకోవాలని స్పీకర్ను ఆయన కోరారు. చర్చించాల్సిన అంశాలెన్నో ఉన్నాయి.. రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం అనేక సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారంటూ.. కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, నీటివసతి ఉన్నచోటా పంటలు వేసుకునేందుకు రైతులకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని నెహ్రూ గుర్తుచేశారు. అసెంబ్లీ సమావేశాల్లో పుష్కరాలపై చర్చ ఉంటుందని శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రకటించారని.. దీనికితోడు విభజన తరువాత రాష్ట్రానికి కేంద్రప్రభుత్వ సహకారం వంటి అంశాలపై అసెంబ్లీ వేదికగా చర్చ జరగాల్సి ఉందని చెప్పారు. ప్రత్యేక హోదా అంశం ఇపుడు రాష్ట్రాన్ని కుదిపేస్తోందని.. గతంలోనే తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఈ అంశంపై శాసనసభ ద్వారా తీర్మానం చేసి కేంద్రానికి పంపుదామని సూచించారని గుర్తుచేశారు. రాష్ట్ర రాజధానికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు సంబంధించిన అంశంపైనా చర్చించాల్సి ఉందన్నారు. హైదరాబాద్ నుంచి వెంటనే కార్యాలయాల తరలింపు వల్ల ప్రయోజనమా? లేదంటే పదేళ్లపాటు హక్కున్న నేపథ్యంలో ఏ మేరకు తరలింపు ఉండాలన్న దానిపై సమగ్రంగా చర్చ జరగాలన్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసుతో రాష్ట్ర పరువు తీవ్రంగా దెబ్బతిందంటూ.. దీనిపై చర్చ జరగాలన్నారు. ఇలాంటి కీలక అంశాలపై అసెంబ్లీ వేదికగా చర్చ జరగాల్సిన నేపథ్యంలో సమావేశాల్ని నామమాత్రంగా నిర్వహించి, ఎమ్మెల్యేల విహారయాత్రలకు డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల ప్రజలకు ప్రయోజనం ఉండదన్నారు. సమావేశాల్ని 20 రోజులపాటైనా నిర్వహించాలన్నారు. ప్రజాసమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలపై శాసనసభ వేదికపై సమగ్ర చర్చ జరగాలని తమ పార్టీ కోరుకుంటుందని జ్యోతుల నెహ్రూ పేర్కొంటూ.. సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరిస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించని పరిస్థితుల్లో స్పీకర్ విజ్ఞతతో ఆలోచించి ఈ పర్యటనను రద్దు చేయాలని కోరారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలు సైతం ఈ యాత్రను బహిష్కరించితే మంచిదన్నారు. -
సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాలు
-
వర్సిటీలకు కొత్త చట్టం
15 రోజుల్లో రూపకల్పన.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు గవర్నర్తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు కొత్త చట్టం తీసుకువచ్చే అంశంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో చర్చించారు. వర్సిటీలకు చాన్సలర్ల నియామకానికి తోడు రాష్ట్రానికి అనుగుణమైన మార్పులు, చేర్పులతో ఈ కొత్త చట్టానికి రూపకల్పన చేస్తున్నామని ఆయనకు తెలిపారు. దీంతోపాటు ఉస్మానియా ఆస్పత్రి భవనం కూల్చివేత, పదో షెడ్యూల్లోని సంస్థల అంశంలో ఏపీ ఫిర్యాదులపైనా వివరణ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం రాజ్భవన్లో గవర్నర్తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని యూనివర్సిటీలన్నింటికీ గవర్నర్ గౌరవ హోదాలో చాన్సలర్గా కొనసాగుతున్నారు. అయితే రాష్ట్రం ఏర్పడ్డాక వర్సిటీలకు వైస్ చాన్సలర్ల (వీసీల) నియామకాలను ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. ఈ క్రమంలో ఒక్కో యూనివర్సిటీకి ఒక నిపుణుడిని చాన్సలర్గా నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం ప్రస్తుతమున్న యూనివర్సిటీల చట్టాన్ని మార్చాల్సి ఉంది. దీంతోపాటు పాలన, అకడమిక్ వ్యవహారాల్లో ఒక్కో వర్సిటీ ఒక్కో విధంగా వ్యవహరిస్తుండడం, ప్రభుత్వానికి వర్సిటీలపై ఆజమాయిషీ లేకుండా పోయిన పరిస్థితులను చక్కదిద్దాలన్న భావనకు వచ్చారు. వీటన్నింటి నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా కొత ్త చట్టానికి రూపకల్పన చేయనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య, ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, న్యాయశాఖ అధికారులు చర్చించారు. 15 రోజుల్లో చట్టాన్ని రూపొందించాలని... వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయానికి వచ్చారు. ఈ పరిణామాలన్నింటినీ భేటీ సందర్భంగా గవర్నర్కు సీఎం కేసీఆర్ వివరించారు. దీంతోపాటు పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఫైన్ ఆర్ట్స్ కాలేజీల్లో అడ్మిషన్లు, తదితర వివాదాలపై తెలంగాణ ప్రభుత్వం వివాదాస్పదంగా వ్యవహరిస్తోందంటూ ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం మధ్యాహ్నమే గవర్నర్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో... వీటిపై గవర్నర్కు సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. ఈ సంస్థలన్నీ విభజన చట్టం ప్రకారం పదో షెడ్యూల్లో ఉన్నాయని, వాటి సేవలు కావాలంటే ఏపీ ప్రభుత్వం రాత పూర్వకంగా కోరాల్సి ఉందని, అందుకు అవసరమైన చార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఇక ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేత అంశంపైనా గవర్నర్, సీఎం మధ్య చర్చ జరిగింది. చారిత్రక కట్టడమైనప్పటికీ ఉస్మానియా ఆసుపత్రి భవనం కూలిపోయే స్థితిలో ఉందని, అందుకే కూల్చివేయాలనే నిర్ణయించామని.. అదే స్థలంలో అధునాతన ఆసుపత్రి నిర్మిస్తామని గవర్నర్కు కేసీఆర్ వివరించారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని కూడా ఆయనకు తెలియబరిచారు. 7న ఢిల్లీకి గవర్నర్.. ఈనెల 7న గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో విభజనకు సంబంధించి పెం డింగ్లో ఉన్న పలు అంశాలను సైతం గవర్నర్కు కేసీఆర్ నివేదించారు. ప్రధానంగా హైకోర్టు విభజనను వేగంగా పూర్తి చేయాలని కోరారు. -
సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాలు?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబర్ మొదటి వారంలో 5 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. సచివాలయంలో సోమవారం సీఎం కేసీఆర్ను కలసిన ఉన్నతాధికారులు, మంత్రులతో ఈ మేరకు పేర్కొన్నట్లు తెలిసింది. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడవగానే ప్రతీ అంశాన్ని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, ఆ పార్టీల నేతలకు ఏ మాత్రం ఓపిక లేకుండా అయిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రాణహిత-చేవెళ్లపై ప్రభుత్వం ఏం చెప్పినా వినిపించుకోకుండా అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నట్లు సమాచారం. విపక్షాలకు ఘాటైన సమాధానం ఇవ్వడంతో పాటు రాష్ట్ర ప్రజలకూ దీనిపై స్పష్టత ఇచ్చేందుకు తానే అసెంబ్లీ సమావేశాల్లో స్వయంగా వివరణ ఇస్తానని కేసీఆర్ పేర్కొన్నారని తెలిసింది. -
ఆయన కూడా అన్నారు
- రైతుల ఆత్మహత్యలకు ప్రేమ వ్యవహారం కారణమన్న శరద్ పవార్ మాటలను ఉటంకించిన ఖడ్సే - 2013లో పార్లమెంటులో మూడు సార్లు చెప్పారని వెల్లడి - ఖడ్సే వ్యాఖ్యలపై సభలో గందరగోళం సృష్టించిన ఎన్సీపీ - రికార్డు నుంచి తొలగించాలని డిమాండ్.. సభ 20 నిమిషాలు వాయిదా ముంబై: అసెంబ్లీ సమావేశాలు గురువారం వాడివేడిగా సాగాయి. రైతుల ఆత్మహత్యలకు ప్రేమ వ్యవహారాలే కారణమని 2013లోనే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చెప్పారని బీజేపీ నేత, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే అన్నారు. లోక్ సభలో ఫిబ్రవరి 26, ఆగస్టు 6న, రాజ్యసభలో ఆగస్టు 16న పవార్ మూడు సార్లు ఈ వ్యాఖ్యలు చేశారని ఖడ్సే అసెంబ్లీలో చెప్పారు. దీంతో సభలో గందరగోళం ఎన్సీపీ సృష్టించింది. ఖడ్సే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఎన్సీపీ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లడంతో స్పీకర్ హరిభావ్ బాడ్గే సభను ఇరవై నిమిషాలు వాయిదా వేశారు. రైతుల ఆత్మహత్యలకు గల కారణాలపై జాతీయ నేర పరిశోధన సంస్థ అందించిన వివరాల మేరకు అనారోగ్యం, మాదక ద్రవ్యాలకు బానిస అవడం, కుటుంబ సమస్యలు, నిరుద్యోగం, ఆస్తి తగాదాలు, ప్రేమ వ్యవహారాలు, పేదరికం, వృత్తి సమస్యలు, నపుంసకత్వం, వరకట్న సమస్యలు తదితర ఇతర అంశాలు కారణమని పవార్ చెప్పారని ఖడ్సే పేర్కొన్నారు. ఇటీవల పార్లమెంట్లో వ్యాఖ్యలు చేసే సమయంలో సింగ్ గణాంకాలకు సంబంధించిన ఎన్సీఆర్బీ పత్రాలు చూపించారు. కాగా, స్పీకర్ అనుమతి లేకుండానే పవార్ పార ్లమెంటు వ్యాఖ్యలకు సంబంధించిన పత్రాన్ని పంచారంటూ ఎన్సీపీ నేత జైదత్ శిర్సాగర్ అన్నారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జైదత్ వ్యాఖ్యలను పృథ్విరాజ్ చవాన్ సమర్థించారు. అయితే దీనిపై ఖడ్సే స్పందిస్తూ.. తాను స్పీకర్ అనుమతి తీసుకున్నానని అయితే సంబంధిత పత్రం ఎలా పంపిణీ అయిందో విచారించాలన్నారు. ఖడ్సే స్పీకర్ అనుమతి తీసుకోలేదని, ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఎన్సీపీ నేతలు ఛగన్ భుజబల్, శశికాంత్ షిండే డిమాండ్ చేశారు. కరువుతో రైతులు తల్లడిల్లుతున్న సమయంలో పవార్ రూ. 76,000 కోట్ల మేర రుణాన్ని మాఫీ చేశారని భుజబల్ గుర్తు చేశారు. సింగ్ రూ. 76 కూడా మాఫీ చేయలేదని ఎద్దేవా చేశారు. పరిశ్రమలకు గమ్యస్థానం మహారాష్ట్ర ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్ర పరిశ్రమల విధానంపై ఆ శాఖ మంత్రి సుభాశ్ దేశాయ్ మాట్లాడుతూ.. పరిశ్రమలకు మహారాష్ట్ర గమ్యస్థానమన్నారు. ఆటోమోబైల్ సంస్థ జనరల్ మోటార్స్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడం, పొరుగు రాష్ట్రం గుజరాత్లో కంపెనీ మూసేస్తున్నట్లు తెలపడం దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో పెట్టుబడి విధానాన్ని జనరల్ మోటార్స్ ప్రకటించిందని చెప్పారు. పుణేలోని తాలేగావ్లో ఉన్న కంపెనీని విస్తరించాలని నిర్ణయించిందని వెల్లడించారు. ‘మేక్ ఇన్ మహారాష్ట్ర’ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని వెల్లడించారు. పాక్తో ద్వైపాక్షి చర్చలు వద్దు: అజిత్ పవార్ పాకిస్తాన్తో భారత్ ద్వైపాక్షిక చర్చలు జరపకూడదని, క్రికెట్కు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోకూడదని ఎన్సీపీ నేత అజిత్ పవార్ అన్నారు. పంజాబ్లోని గురుదాస్పూర్లో టైస్టుల దాడిని ఖండిస్తూ అసెంబ్లీలో గురువారం అజిత్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు శాసనసభ్యులపై వాట్సాప్లో పోస్ట్ చేస్తున్న ద్వేశపూరిత వార్తలను, తన సెల్ఫోన్లోని పోస్టులను కూడా అసెంబ్లీలో ఇతర సభ్యులకు పవార్ చూపించారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని స్పీకర్ హరిభావ్ బాగ్డేను కోరారు. పేదల కడుపుకొట్టే సంస్కృతి కాదు నాది: పంకజ ‘చిక్కి’ల కుంభకోణం అంశంపై అసెంబ్లీ రభస జరిగింది. ప్రతిపక్ష నాయకుడు ధనంజయ్ ముండే చిక్కి కుంభకోణం విషయంపై తీవ్ర ఆరోపణలు చేశారు. నాణ్యత లేని చిక్కీలను పంపిణీ చేశారని, పంకజ ముండే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పంకజ ముండే ఆరోపణలు తిప్పకొట్టారు. పేదల కడుపుకొట్టే సంస్కృతి తనది కాదన్నారు. చిక్కిని కొనుగోలు నిర్ణయాన్ని కళ్లు మూసుకుని తీసుకోలేదని, అన్ని విభాగాలతోపాటు అనేక మందితో చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రత్యర్థులు ఆరోపణలతో గందరగోళం సృష్టించిన అనంతరం సీఎం కూడా తనదైన శైలిలో ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఆరోపణలు చేసేవారికి వాటికి సమాధానాలు వినేంత ఓర్పు ఉండాలని చురకలంటించారు. రాష్ట్రంలో జనరల్ మోటార్స్ రూ. 6,400 కోట్ల పెట్టుబడి ఆటోమోబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ (జీఎం) పుణేలో ఉన్న కంపెనీని విస్తరించేందుకు నిర్ణయించిందని, ఇందుకుగాను రూ. 6,400 కోట్లు పెట్టుబడి పెట్టనుందని రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. రెండేళ్లలో కంపెనీలో ఉత్పత్తి మొదలవుతుందని చెప్పారు. గురువారం మధ్యాహ్నం జనరల్ మోటార్స్ అధికారులతో సీఎం ఫడ్నవీస్ సమావేశమయ్యారు. యూఎస్కు చెందిన మరో ఆటోమోబైల్ సంస్థ క్రిస్లర్ కూడా రాష్ట్రంలో రూ. 2,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని సీఎం చెప్పారు. రాష్ట్రంలో జీఎం కంపెనీ 10 కొత్త చెర్వొలెట్ మోడళ్లను ఉత్పత్తి చేయనుందని వెల్లడించారు. గుజరాత్లోని కంపెనీని మూసెస్తున్నట్లు ప్రకటించిందని జీఎం తెలిపింది. -
ఆగస్టు 31 లేదా సెప్టెంబర్ 3 నుంచి అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 31వ తేదీ నుంచి లేదా సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సెప్టెంబర్ 20వ తేదీలోపు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉందని ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. సచివాలయంలో బుధవారం తనను కలిసిన విలేకరులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సెప్టెంబర్ రెండో వారంలో విదేశీ పర్యటనకు వెళ్తున్నందున సెప్టెంబర్ తొలి వారంలోనే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఉండవచ్చునని యనమల పేర్కొన్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో రైతుల రుణ మాఫీ, రైతుల ఆత్మహత్యలతో పాటు ఇటీవల పుష్కరాల ప్రారంభం రోజున తొక్కిసలాటలో 29 మంది మృతి చెందిన ఘటన చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. డీజిల్ లీటర్పై రూ.2 తగ్గింపు: డీజిల్ ధ రను లీటర్పై 2 రూపాయలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు యనమల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ లీటర్పై నాలుగు రూపాయల వ్యాట్ను పెంచిన విషయం తెలిసిందే. -
తప్పని విస్తరణ
చర్చకు రాని ప్రముఖ ముసాయిదా బిల్లులు ఈ నెల 24కు ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు సమావేశాల గడువును విస్తరించే దిశగా ప్రభుత్వ సన్నాహాలు బెంగళూరు: ప్రభుత్వం రూపొందించిన కొన్ని ముఖ్యమైన ముసాయిదా బిల్లులను ఇప్పటికీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టకపోవడంతో వర్షాకాల సమావేశాలను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 24తో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ముగియాల్సి ఉన్నప్పటికీ ఈ బిల్లులను సభలో ప్రవేశపెట్టి సభ అనుమతి పొందేందుకు గాను ఐదు రోజుల పాటు సమావేశాల నిర్వహణను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి గురువారం సాయంత్రం బెళగావిలోని సువర్ణసౌధలో జరిగిన సభా సలహా సమితి సమావేశంలో సైతం తీర్మానం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఈనెల 24న ముగియాల్సి ఉన్న అసెంబ్లీ సమావేశాలు 29 వరకు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక బెళగావిలో సువర్ణసౌధలో 10రోజుల పాటు సాగిన అసెంబ్లీ సమావేశాల్లో మొదటి మూడు రోజులు చెరకు రైతుల ఆత్మహత్యలే ప్రతిధ్వనించాయి. చెరుకు రైతులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిల పట్ల చక్కెర కర్మాగారాల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్న నేపథ్యంలో కన్నడనాడులో చెరుకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెరుకు రైతులకు రావాల్సిన బకాయిలను తక్షణమే ఇప్పించడంతో పాటు రైతుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ప్రతిపక్షాలు మూడు రోజుల పాటు సభా కార్యకలాపాలను సజావుగా సాగనివ్వలేదు. అనంతరం లోకాయుక్తపై వచ్చిన అవినీతి ఆరోపణలతో ఉభయ సభలు అట్టుడికాయి. లోకాయుక్త వై.భాస్కర్రావును పదవీచ్యుతిడిని చేయాలనే డిమాండ్తో బీజేపీ, జేడీఎస్లు సంయుక్తంగా ఎమ్మెల్యేల సంతకాల సేకరణను సైతం ప్రారంభించాయి. ఇక ఇంకోరోజు రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖలో వెలుగుచూసిన పరుపులు, దిండ్ల కుంభకోణంతో ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని నిలదీశాయి. ఇలా బెళగావిలోని సువర్ణసౌధలో 10రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షం, విపక్షాల మధ్య వాగ్యుద్ధానికే ఎక్కువ సమయం కేటాయించారు. దీంతో ప్రభుత్వం రూపొందించిన కొన్ని ముఖ్యమైన ముసాయిదా బిల్లులను సభల్లో ప్రవేశపెట్టలేకపోయారు. ఇక సువర్ణసౌధలో ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. తిరిగి సోమవారం నుంచి బెంగళూరులోని విధానసౌధలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈనెల 24నాటికి ఈ సమావేశాలు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ, ముఖ్యమైన బిల్లులను సభలో ప్రవేశపెట్టి సభ ఆమోదాన్ని పొందేందుకు గాను ఐదు రోజుల పాటు సభా కార్యకలాపాలను పొడిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
జెడ్పీ సర్వసభ్య సమావేశం మళ్లీ వాయిదా
నల్లగొండ : ఈనెల 12, 13 తేదీల్లో జరగాల్సిన జిల్లా పరి షత్ సర్వసభ్య సమావేశం మరోమారు వాయిదా పడింది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న కారణంగా ఈ సమావేశాలను వాయిదా వేస్తున్నామని, త్వరలోనే తేదీలను వెల్లడిస్తామని జెడ్పీ సీఈఓ మహేందర్రెడ్డి ఆదివారం తెలిపారు. వాస్తవానికి పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో జిల్లా పరిషత్ లాంటి స్థానిక సంస్థల సర్వసభ్య సమావేశాలు జరగడానికి వీల్లేదు. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కావాల్సి ఉన్నందున చట్టసభలకు సంబంధించిన కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుందన్న ఆలోచనతో స్థానిక సంస్థల సర్వసభ్య సమావేశాలు నిర్వహించే ఆనవాయితీ లేదు. ఈ కారణంగానే సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని అధికార వర్గాలు చెపుతున్నా..అంతర్గతంగా రాజకీయ విభేదాల కారణంగానే మరోమారు వాయిదా పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలేవీ లేనందున, పార్లమెంటు సమావేశాలకు వెళ్లాల్సిన ఎంపీలు (లోక్సభ, రాజ్యసభ సభ్యులు) అనుమతిస్తే సమావేశాలు నిర్వహించుకునే వీలుంది. ఈ మేరకు ఎంపీల అనుమతి కోసం జెడ్పీ చైర్మన్ బాలునాయక్ మంతనాలు జరిపినా పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం నడుచుకోవాలని, నిబంధనలు ఎలా ఉంటే అలా వెళ్లాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి తేల్చిచెప్పడంతో సమావేశాన్ని వాయిదా వేశారని జెడ్పీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మిగిలిన ఇద్దరు ఎంపీలైన పాల్వాయి గోవర్ధనరెడ్డి, బూర నర్సయ్య గౌడ్లు సమావేశాలు జరుపుకునేందుకు అంగీకరించారని, గుత్తా పెట్టిన మెలిక నేపథ్యంలోనే సమావేశాలు వాయిదా వేశారని సమాచారం. కాగా, జెడ్పీ చైర్మన్ నేరుగా గుత్తా సుఖేందర్రెడ్డితో మాట్లాడని నేపథ్యంలో జెడ్పీ సీఈవో మహేందర్రెడ్డి ఆయనను సంప్రదించారని తెలుస్తోంది. రూల్ ప్రకారం నడుచుకోవాలని సీఈఓకు గుత్తా తేల్చిచెప్పడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. అయితే, త్వరలోనే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న పరిస్థితుల్లో మరో మూడు నెలలు ఈ సమావేశాలు జరిగే అవకాశం లేదని జెడ్పీ వర్గాలంటున్నాయి. -
ఆప్ సర్కారు ఓట్ ఆన్ అకౌంట్
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అసెం బ్లీలో రానున్న మూడు నెలల కోసం ఓట్ ఆన్ అకౌంట్ను ప్రవేశపెట్టింది. ఇందుకోసం రెండు రోజుల అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నుంచి మొదలయ్యాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 37,750 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సర్కారు ప్రకటించింది. ఆర్థిక మంత్రిత్వశాఖను కూడా నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా.. ఓట్ ఆన్ అకౌంట్తో పాటు వ్యాట్ చట్టంలో సవరణను కూడా సభలో ఉంచారు. వ్యాపారులు తమ క్రెడిట్ను తరువాతి ఆర్థిక సంవత్సరాల లోకి కూడా తీసుకెళ్లే వెసులుబాటును కల్పిస్తూ సవరించిన వ్యాట్ చట్టాన్ని సభ భారీ మెజారిటీతో ఆమోదించింది. వివిధ రంగాలలో ప్రాధాన్యతలను గుర్తించడం కోసం ప్రజలతో సంప్రదింపులు జరపనున్నట్లు ఆయన చెప్పారు. బడ్జెట్ రూపకల్పనకు సమయం పట్టనున్నందున రానున్న మూడు నెలల కోసం ఓట్ ఆన్ అకౌంట్ను ప్రవేశపెడుతున్నట్లు ఆయన చెప్పారు. ఆప్ సర్కారు రాజీనామా చేసినప్పటి నుంచి 2014-15 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ. 4,500 కోట్ల లోటుకు గురైందని ఆయన వివరించారు. అంతవరకు విద్యుత్, నీటి సబ్సీడీతో పాటు ఇతర ఖర్చుల కోసం ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ను ప్రవేశపెట్టింది. 2015-16లో ఆర్థికాభివృద్ధి రేటు 8.2% 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఢిల్లీ ఆర్థికాభివృద్ధి రేటు 8.2 శాతం ఉంటుందని మనీష్ సిసోడియా చెప్పారు. ప్రభుత్వం ప్రణాళిక వ్యయం కోసం రూ. 16,250 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కోసం రూ. 21,500 కోట్ల్లు కేటాయించాలనుకుంటోందని మంత్రి తెలిపారు. ప్రతిపాదిత ప్రణాళికేతర వ్యయం గతేడాది కేటాయింపు కన్నా రూ. 3,000 కోట్లు ఎక్కువ కాగా, ప్రణాళికా వ్యయం మాత్రం నిరుటి కన్నా రూ. 100 కోట్లు తక్కువగా ఉండనుంది. కేంద్ర సహాయం రూ. 325 కోట్లేనా.. కేంద్ర సహాయం కింద ఢిల్లీకి రూ. 325 కోట్లు మాత్రమే కేటాయించడంపై సిసోడియా ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా ఏళ్లుగా ఈ మొత్తం లో మార్పు రాలేదని ఆయన చెప్పారు. ఢిల్లీకి కేంద్ర నిధుల కేటాయింపును పెంచాలని 14వ ఆర్థిక సంఘం సిఫారసుచేసిందని సిసోడియా పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి కేంద్రానికి లభించే మొత్తం సర్వీస్ టాక్స్లో 0.65 శాతం ఢిల్లీకి ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తున్నామని ఇదొక్కటే తమ డిమాండ్ అని ఆయన చెప్పారు. ఈ డిమాండ్ నెరవేర్చినట్లయితే ఢిల్లీకి రూ. 4,000 కోట్లు లభిస్తాయని సిసోడియా తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ విధానాలు: సిసోడియా వార్షిక బడ్జెట్తో పాటు ఇతర ప్రభుత్వ విధానాలను ప్రజలు ఇచ్చే ఐడియాలతో రూపొందించాలని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు యోచిస్తోందని ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మంగళవారం చెప్పారు. అసెంబ్లీలో రానున్న మూడు నెలల కోసం ఓట్ ఆన్ అకౌంట్ను ప్రవేశపెడుతూ ఈ విషయం చెప్పారు. ఢిల్లీ సమస్యలను పరిష్కరించడానికి తాము రూపొందించే విధానాలలో ప్రజలు కూడా కూడా పాల్గొనాలని తమ ప్రభుత్వం కోరుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రజలిచ్చే ఐడియాలతో బడ్జెట్ రూపొందుతుందని ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ప్రమాణోత్సవ సభలోనే ప్రకటించారు. క్రౌడ్ సోర్సింగ్ ద్వారా వార్షిక బడ్జెట్ రూపొందించాలని నిర్ణయించడంతో ఆప్ సర్కారు జూన్లో వార్షిక బడ్జెట్ ప్రవేళపెడ్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
సభ జరుగుతున్నప్పుడు ప్రత్యక్ష ప్రసారాలొద్దు
ఏపీ స్పీకర్ కోడెల ఆదేశాలు హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో సభ వెలుపల (అసెంబ్లీ ప్రాంగణంలో) ప్రత్యక్ష ప్రసారాలు ఇవ్వొద్దని ఏపీ శాసన సభాపతి (స్పీకర్) డాక్టర్ కోడెల శివప్రసాదరావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసెంబ్లీ మీడియా పాయింట్తో పాటు వివిధ పార్టీల శాసన సభాపక్ష కార్యాలయాల నుంచి ప్రత్యక్ష ప్రసారాలు చేయవద్దని ఆదేశించారు. -
లాబీ ముచ్చట్లు
పనిలేక ధర్నా చేస్తున్నారా: కేటీఆర్ ‘టీడీపీ ఎమ్మెల్యేలు పనిలేక ధర్నా చేస్తున్నారా, లేదా ధర్నా చేయడమే పనిగా పెట్టుకున్నారా? ఇంతకూ స్పీకర్ చాంబర్లో కిందనే కూర్చున్నారా, సోఫాల్లో కూర్చున్నారా? అయినా అసలు వాళ్లెందుకు ధర్నా చేస్తున్నారు?’’ అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలు మంగళవారం స్పీకర్ చాంబర్లో ధర్నా చేయడంపై లాబీలో ఆయన విలేకరులతో ఇలా స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యేలు తమ సస్పెన్షన్పై రాష్ర్టపతికి ఫిర్యాదు చేశారని గుర్తు చేయగా, ‘ఆడ, ఈడ తిరిగే బదులు మా దగ్గరికొచ్చి అడిగితే సరిపోయేది కదా’ అన్నారు. సీఎల్పీ నేతను చూస్తే జాలేస్తోంది: కడియం అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత జానారెడ్డిని చూస్తే జాలేస్తోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ‘జానా ఒకసారి నిరసన తెలుపుతున్నట్లు చెప్పాక కూడా మరో ఎమ్మెల్యే (భట్టి) లేచి మాట్లాడే ప్రయత్నం చేయడమేమిటి? నాయకుని కంట్రోల్లో ఎమ్మెల్యేలు లేరు. జానా మాట ఎవరూ వింటున్నట్లు లేదు’’ అన్నారు. కాకతీయ ఉత్సవాలు ఇప్పట్లో లేనట్టే : అజ్మీరా కాకతీయ ఉత్సవాలు ఇప్పట్లో ఉండవని పర్యాటక మంత్రి అజ్మీరా చందూలాల్ పేర్కొన్నారు. వాటిని అత్యంత ఘనంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉత్సవాలకు రాష్ట్రపతిని ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. కాకతీయుల వారసులను ఛత్తీస్గడ్లోని బస్తర్ నుంచి ఆహ్వానించాలనుకుంటున్నాం. హైదరాబాద్లోని కాకతీయ వంశస్తులందరినీ గుర్తించి వారి ఫోన్ నంబర్లను కూడా సేకరించాం’’ అని చెప్పారు. భట్టి ఎగిరి పడుతుండెందుకు: నాయిని ‘భట్టి ఎందుకు ఎగిరిపడుతుండు? ఎస్సీ సబ్ ప్లాన్ గురించి ఆయనకు జానారెడ్డి కంటే ఎక్కువ తెలుసా?’ అని లాబీల్లో తనకు ఎదురు పడిన కాంగ్రెస్ నేత డీకే అరుణను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రశ్నించారు. ఆమె బదులి వ్వకపోవడంతో ఇంకేదో మాట్లాడబోయారు. పక్కనే ఉన్న మరో మంత్రి కేటీఆర్ ఆయనను పక్కకు తీసుకెళ్లారు. -
వృద్ధాప్య పింఛన్ల అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతాం: బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ: ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం కోసం మంగళవారం నుంచి రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో వృద్ధాప్య పింఛన్ల అంశాన్ని లేవనెత్తనున్నట్లు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తెలిపింది. పింఛన్లు రాకపోవడంతో నగరంలో వేల మంది వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ అంటోంది. పింఛన్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కూడా వారి సమస్యను పరిష్కరించే నాథుడు కనిపించడం లేదని ఆరోపించింది. వృద్ధాప్య పింఛన్ల కోసం కొత్త దరఖాస్తులను స్వీకరించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2012లో వృద్ధాప్య పింఛన్ల కోసం కొత్త దరఖాస్తులను స్వీకరించడం నిలిపివేసిందని బీజేపీ శాసనసభ నేత విజేందర్ గుప్తా చెప్పారు. రాష్ట్రపతి పాలన కాలంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీ కోసం సమర్పించిన బడ్జెట్లో కొత్తగా 40 వేల వృద్ధ్యాప్య పింఛన్ల కోసం నిధులు కేటాయించారని ఆయన గుర్తుచేశారు. దీంతో 40 వేల మంది వృద్ధులు ప్రయోజనం పొందారని పేర్కొన్నారు. ఆప్ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ కొత్త దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. రానున్న ఓట్ ఆన్ అకౌంట్లో ప్రభుత్వం కొత్త పింఛన్ల కోసం కేటాయింపులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం 60 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారికి నెలకు రూ. వెయ్యి, 70 ఏళ్లకు పైబడినవారికి రూ. 1,500 ఢిల్లీ సర్కారు పింఛనుగా ఇస్తోంది. -
స్పీకర్ పదవికి వన్నె తేవడమే లక్ష్యం
అసెంబ్లీ సమావేశాల పొడిగింపు నిర్ణయం ప్రభుత్వానిదే: కోడెల గుంటూరు : నిష్పక్షపాతంగా వ్యవహరించడం ద్వారా పదవికి వన్నె తేవడమే లక్ష్యమని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. గుంటూరులో ఆదివారం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ మీట్ ద ప్రెస్’ కార్యక్రమానికి ఆయన హాజరై విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో శాసనసభ సమావేశాల పొడిగింపుపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లేటప్పుడు నిరసన తెలుపుతున్నామనిగానీ, వాకౌట్ చేస్తామని గానీ అనకపోవడం ఆవేదనకు గురిచేసిందన్నారు. అయినప్పటికీ ప్రతిపక్షం సభకు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. పోలవరం పూర్తికి నాలుగైదేళ్లు పడుతుందని, అందువల్ల ఎత్తిపోతల ద్వారా నీటిని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టిందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సత్తెనపల్లిలో ఇప్పటికే 22 వేల మరుగుదొడ్లు నిర్మించి రికార్డు సృష్టించామన్నారు. ఈ సమావేశంలో ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణాంజనేయులు, ట్రెజరర్ శ్రీనివాస్, సభ్యులు పాల్గొన్నారు.