Department of Revenue
-
దేవుడి భూముల్లో ‘సౌర’ వెలుగులు
సాక్షి, హైదరాబాద్ : దేవాదాయ శాఖ భూముల్లో సౌర విద్యుత్తు ఉత్పత్తి కానుంది. వ్యవసాయ యోగ్యం కాని భూములు దశాబ్దాలుగా వృథాగా ఉంటున్నాయి. ఈ భూముల్లో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. కొన్నిచోట్ల భూములు అన్యాక్రాంతమయ్యాయి. అలాంటి భూములను తిరిగి స్వాధీనం చేసుకుని, వ్యవసాయానికి ఉపయోగపడని భూములను గుర్తించి వాటిల్లో కూడా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. అయితే నేరుగా దేవాదాయ శాఖ కాకుండా.. స్వయం సహాయక బృందాల (ఎస్హెచ్జీలు) ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. భూములు ఇవ్వటం ద్వారా లీజు రూపంలో దేవాదాయ శాఖకు ఆదాయం రానుండగా, సౌర విద్యుత్తు ప్లాంట్ల నిర్వహణ రూపంలో ఎస్హెచ్జీలకు రాబడి సమకూరుతుంది. తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని దేవాలయాల భూములను గుర్తించి ఆయా జిల్లాల రెవెన్యూ యంత్రాంగం ఆధ్వర్యంలో రెడ్కో, ఎస్హెచ్జీలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. ప్రస్తుతానికి 250 ఎకరాల భూములను గుర్తించారు. 62 మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేసే వీలుంది. వీటి ద్వారా నిత్యం సగటున 2.48 లక్షల యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశం ఉందని అంచనా. రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖకు 40 వేల ఎకరాలకు పైగా భూములున్నాయి. వీటి ఆలనాపాలనా అంత పక్కాగా లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు వేల ఎకరాల భూములు కబ్జా చేశారు. వీటిల్లో విడిపించుకోదగ్గ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని, వాటికి సంబంధిత దేవుడి పేరుతో పాస్ పుస్తకాలు పొందే కసరత్తు దేవాదాయ శాఖ ప్రారంభించింది.ఇప్పటికే 57 శాతం భూముల వివరాలను ధరణిలో నమోదు చేయించారు. ఇప్పటికి స్వాధీనం అయిన భూములు, కబ్జా కాకుండా ఉన్న భూములను దేవాలయాలకు ఆదాయాన్ని తెచ్చిపెట్టేలా వినియోగించుకునే ప్రయత్నం ప్రారంభమైంది. అయితే వ్యవసాయ యోగ్యంగా లేని భూములపై ఇప్పటివరకు పెద్దగా దృష్టి లేకుండా పోయింది. ఇప్పుడు వాటిల్లో సౌర విద్యుత్తు ఫలకాలు ఏర్పాటు చేయటం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసి విక్రయించాలని నిర్ణయించారు. అయితే దీన్ని సొంతంగా నిర్వహించగలిగే స్థాయిలో దేవాదాయ శాఖ వద్ద మానవవనరులు లేవు. దీంతో ఎస్హెచ్జీలను తెరపైకి తెచ్చారు.దేవాదాయ శాఖకు 40 వేల ఎకరాల భూములుఈ ప్రాజెక్టును ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా రెండుదశల్లో నిర్వహించాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. తొలి దశలో ఐదు దేవాలయాలకు చెందిన 231 ఎకరాలను గుర్తించింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయానికి చెందిన 20 ఎకరాలు, మెదక్ జిల్లా నర్సాపూర్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి మందిరానికి చెందిన 100 ఎకరాలు, నిర్మల్ జిల్లా భైంసాలోని శ్రీ గోశాలకు చెందిన 96 ఎకరాలు, నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి చెందిన 9 ఎకరాలు, నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం బుజలాపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి చెందిన 6 ఎకరాలను మొదటి దశ కోసం గుర్తించారు. రెండో దశలో మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మండలం మాటేడు గ్రామ శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్, మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామంలోని శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవాలయం, మహబూబాబాద్లోని శ్రీ శివాలయం, హనుమకొండ రాగన్న దర్వాజా ప్రాంతంలోని శ్రీసీతారామచంద్రస్వామిదేవాలయాలకు చెందిన 21 ఎకరాలను ఇందుకోసం గుర్తించారు.వీటిల్లో త్వరలో సోలార్ విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం ఆయా భూముల్లో రెడ్ కో, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సర్వే జరుగుతోంది. ఎకరాకు రూ.15 వేల మేర లీజును ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. -
భూమి లేదు.. ఉన్నా హక్కుల్లేవు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భూముల సమస్యలు పేరుకుపోతున్నాయని, వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ స్పష్టం చేసింది. ఇందుకోసం కొత్త చట్టాలను, విధానాలను రూపొందించుకోవడంతోపాటు కొన్నిరకాల సంస్కరణలు, మరికొన్ని కొత్త పద్ధతులను అవలంబించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి 54 అంశాలతో కూడిన నివేదికను అందజేసింది. అందులో పలు ఆసక్తికర అంశాలను కూడా వెల్లడించింది.రాష్ట్రంలోని 56శాతం గ్రామీణ కుటుంబాలకు భూమి లేదని కమిటీ తమ నివేదికలో తెలిపింది. భూములున్న రైతాంగం కూడా హక్కుల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొంది. రాష్ట్రంలోని 50శాతం మంది పట్టాదారులకు భూముల విషయంలో పలు సమస్యలు ఉన్నాయని.. వారికి సమగ్ర హక్కుల కల్పన ఇంకా పూర్తికాలేదని వెల్లడించింది. ఎప్పుడో నిజాం కాలంలో చేసిన భూముల సర్వే తర్వాత తెలంగాణలో సర్వేనే జరగలేదని, వెంటనే భూముల డిజిటల్ సర్వేకు పూనుకోవాలని సిఫార్సు చేసింది. కోర్టు కేసుల్లో భూములు నలిగిపోతున్నాయని, దశాబ్దాల తరబడి కోర్టుల చుట్టూ హక్కుల కోసం తిరగాల్సి వస్తోందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలోని కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల్లో 66శాతం సివిల్ కేసులే ఉన్నాయని.. ఇందులో భూవివాదాలే ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఇక రెవెన్యూ కోర్టులను రద్దు చేసే నాటికి వాటిలో 25వేల కేసులు పెండింగ్లో ఉన్నాయని, అవి ఇంతవరకు పరిష్కారానికి నోచుకోలేదని తెలిపింది. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య 4 లక్షల ఎకరాల భూముల విషయంలో వివాదాలు ఉన్నాయని.. అటవీ శాఖ చెప్తున్న దానికి, ధరణిలో నమోదు చేసిన భూములకు 23.72 లక్షల ఎకరాల తేడా ఉందని వెల్లడించింది. వక్ఫ్, దేవాదాయ భూముల వివరాల్లో కూడా పొంతన లేదని తెలిపింది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి రాష్ట్రంలో టైటిల్ గ్యారంటీ చట్టాన్ని అమల్లోకి తేవాలని సిఫార్సు చేసింది. క్షేత్రస్థాయిలో గ్రీవెన్స్ వ్యవస్థ ఉండాలని.. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రెవెన్యూ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలని సూచించింది. పహాణీలను డిజిటలైజ్ చేయాలని, గ్రామానికో రెవెన్యూ నిర్వాహకుడిని ఏర్పాటు చేయాలని కోరింది. అయితే, తమ సిఫారసులన్నీ ఏకకాలంలో అమలు చేయడం సాధ్యం కాదని.. అందుకే మూడు విభాగాల్లో ప్రతిపాదిస్తున్నామని తెలిపింది. అందులో కొన్ని తక్షణమే చేపట్టాల్సి ఉండగా, మరికొన్ని స్వల్పకాలిక, ఇంకొన్ని దీర్ఘకాలిక వ్యూహాలు, ప్రణాళికలతో పరిష్కరించుకోవాల్సి ఉంటుందని నివేదికలో ధరణి కమిటీ స్పష్టం చేసింది. ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ ఇచ్చిన నివేదికలోని ముఖ్య సిఫారసులివీ.. గ్రామస్థాయిలోనే ల్యాండ్ గ్రీవెన్స్ వ్యవస్థ ఉండాలి. కమ్యూనిటీ పారాలీగల్ కార్యక్రమాన్ని పునరుద్ధరించాలి. రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలి. కలెక్టరేట్లు, ఐటీడీఏలు, సీసీఎల్ఏలో లీగల్ సెల్స్ ఏర్పాటు చేయాలి. ఆర్వోఆర్ కొత్త చట్టం తీసుకురావాలి. సాదాబైనామాల సమస్యను పరిష్కరించాలి. గ్రామీణ నివాస ప్రాంతాల (ఆబాదీ)ను సర్వే చేయాలి. – రాష్ట్రంలోని అన్ని భూములను రీసర్వే చేసి శాశ్వత భూఆధార్ ఇవ్వాలి. టైటిల్ గ్యారంటీ చట్టాన్ని అమల్లోకి తేవాలి. – అసైన్డ్ భూములన్నింటికీ పట్టాదారు పాసుపుస్తకాలు, టైటిల్ డీడ్స్ మంజూరు చేసి యాజమాన్య హక్కులు కల్పించాలి. సీలింగ్ భూములకు కూడా హక్కులివ్వాలి. – ఇనాం భూములకు ఆక్యుపేషన్ రైట్స్ సర్టిఫికెట్ (ఓఆర్సీ) ఇవ్వాలి. ఆ ఓఆర్ఎసీ వివరాలను ధరణి పోర్టల్లో నమోదు చేయాలి. – అటవీ, రెవెన్యూ శాఖల మధ్య ఉన్న భూముల సమస్యల పరిష్కారానికి జాయింట్ సర్వే చేపట్టాలి. అటవీ భూముల వివరాలను ధరణి పోర్టల్లో మరోమారు నమోదు చేయాలి. – భూదాన బోర్డును ఏర్పాటు చేయాలి. భూదాన భూముల వివరాలను ధరణి పోర్టల్లో నమోదు చేయాలి. దేవాదాయ, వక్ఫ్ భూములను కూడా ధరణిలో పొందుపర్చాలి. – నిషేధిత భూముల జాబితా (22ఏ)ను సవరించాలి. అప్డేట్ చేయాలి. భూసేకరణ జరిగిన భూములను పట్టాదారు ఖాతాల నుంచి తొలగించాలి. – రాష్ట్రంలోని అన్ని భూచట్టాల స్థానంలో రెవెన్యూ కోడ్ (ఒకే చట్టం) అమల్లోకి తేవాలి. నల్సార్ న్యాయ వర్సిటీలోని ల్యాండ్ రైట్స్ సెంటర్ను అభివృద్ధి చేయాలి. – భూసంస్కరణల విషయంలో ప్రభుత్వానికి సహాయకారిగా ఉండేందుకు ‘ఇన్నోవేషన్స్ అండ్ లీగల్ సపోర్ట్ సెల్’ను ఏర్పాటు చేయాలి. – తహసీల్దార్ స్థాయిలో ల్యాండ్ సపోర్ట్ సెల్స్ ఏర్పాటు చేయాలి. గ్రామానికో భూమి నిర్వహణ అధికారిని నియమించాలి. – రెవెన్యూ సిబ్బంది సామర్థ్యాలు, పనితీరును మెరుగుపర్చేలా ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వడం కోసం ల్యాండ్ అకాడమీని ఏర్పాటు చేయాలి. కొత్త ల్యాండ్ పాలసీ రూపొందించాలి. – కోనేరు రంగారావు, గిర్గ్లానీ కమిటీలతోపాటు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కేంద్ర ప్రభుత్వ’ సలహాలను పరిగణనలోకి తీసుకోవాలి. ల్యాండ్ గవర్నెన్స్ అసెస్మెంట్ రిపోర్టు తయారు చేయాలి. – ధరణి పోర్టల్ను ప్రభుత్వ ఏజెన్సీకి అప్పగించాలి. గతంలో జరిగిన ధరణి లావాదేవీలపై థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలి. – ధరణి పోర్టల్లో ఉన్న అన్ని మాడ్యూళ్ల స్థానంలో ఒక్కటే మాడ్యూల్ ఉంచాలి. పార్ట్–బీ భూముల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. సేత్వార్, ఖాస్రా, సెస్లా, పాత పహాణీలను డిజిటలైజ్ చేయాలి. -
‘రెవెన్యూ’ సేవల్లో తేడా కనపడాలి: పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే. మీరు బాగా పనిచేస్తే ప్రజలకు మేలు జరగడమే కాదు.. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. సామాన్యులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి. గతానికి, ప్రస్తుతానికి తేడా కనపడాలి’అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రెవెన్యూ ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 272 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లతో మంత్రి పొంగులేటి ఆదివారం హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో ముఖా ముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లుగా రాష్ట్ర ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యల నుంచి విముక్తి కలిగించేలా దేశానికే రోల్మోడల్గా ఉండే కొత్త రెవెన్యూ చట్టాన్ని త్వరలో తీసుకొస్తామని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకొనేలా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామన్నారు. వ్యవస్థలో ఒకరిద్దరి తప్పుల కారణంగా అందరికీ చెడ్డపేరు వస్తోందని, అలాంటి పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తగా పనిచేయాలని, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు వేసే ప్రతి అడుగు రెవెన్యూ వ్యవస్థకు వన్నె తెచ్చేలా ఉండాలన్నారు. రెవెన్యూ సేవల్లో అంతరాయాన్ని నివారించేలా నల్లగొండ జిల్లా తిరుమలగిరి, రంగారెడ్డి జిల్లా యాచారం మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టామని.. ఈ క్రమంలో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకొని కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని రూపొందించే ప్రక్రియ తుదిదశకు చేరుకుందని వివరించారు. కొత్త చట్టం వచ్చేలోగానే ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామన్నారు. 3 నెలలకోసారి లీగల్ సమావేశాలు.. ప్రభుత్వ భూముల పరిరక్షణలో రెవెన్యూ యంత్రాంగం రాజీపడవద్దని మంత్రి పొంగులేటి సూచించారు. భూముల పరిరక్షణ కోసం మూడు నెలలకోసారి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో లీగల్ టీంలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. రెవెన్యూ మంత్రిగా ఎవరున్నా భూముల రికార్డులను టాంపరింగ్ చేసేందుకు వీల్లేకుండా రెవెన్యూ రికార్డుల డిజిటైజేషన్ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపడతామని తెలిపారు. రెవెన్యూ కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోయినా పట్టించుకోని గత ప్రభుత్వం.. అప్పు చేసి మరీ ఉన్న సచివాలయాన్ని కూలగొట్టి కొత్తది కట్టిందని విమర్శించారు. కొన్ని జిల్లాల్లో కలెక్టరేట్లు ఉన్నా కొత్తవి నిర్మించిందని.. తానైతే అలాంటి పనులు చేయబోనని పొంగులేటి స్పష్టం చేశారు. అందరికీ శిక్షణ తప్పనిసరి.. రెవెన్యూ శాఖలో ఉద్యోగంలో చేరిన వారితోపాటు సర్వీసులో ఉన్న వారికి కూడా శిక్షణ తప్పనిసరి చేస్తామని.. ఇందుకోసం రెవెన్యూ అకాడమీని ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల జాబ్ చార్ట్ నిర్ధారణకు కమిటీని ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల్లోని ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి జాబ్ చార్ట్ రూపొందిస్తామన్నారు. ఆర్థికేతర అంశాలకు తక్షణమే పరిష్కారం రెవెన్యూ ఉద్యోగుల సమస్యల్లో ఆర్థికేతర అంశాలను తక్షణమే పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. 33 జిల్లాల్లో సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను ఏర్పాటు చేస్తామని, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల కేడర్ స్ట్రెంగ్త్ పెంచుతామని, 17 మంది రెవెన్యూ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లను పూర్వ జిల్లాలకు పంపడంపై దసరాలోపే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కె. చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి డి. శ్రీనివాస్రెడ్డి, కోశాధికారి భాస్కరరావు, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు వి. లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ, ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వరద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవలి వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం అందించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. వరదలతో ప్రభావితమైన ప్రతి కుటుంబానికి రూ. 16,500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాలు ఇటీవలి వర్షాలకు ప్రభావితం అయ్యాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలకు సాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల ప్రభావంపై సోమవారం సచివాలయంలో మంత్రి పొంగులేటి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎస్ శాంతికుమారి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్లతోపాటు మున్సిపల్, వ్యవసాయం, పంచాయతీరాజ్, విద్యుత్, విద్య, రహదారులు, భవనాలు, హౌసింగ్, ఇరిగేషన్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. సమీక్షలో వరద నష్టాన్ని అంచనా వేయడంతోపాటు దాన్ని పూడ్చుకునేందుకు ఎన్ని నిధులు కావాలన్న దానిపై చర్చించారు. వరదలు, నష్టంపై కేంద్రానికి పంపాల్సిన నివేదికలో పొందుపర్చాల్సిన అంశాలపై మంత్రి పొంగులేటి అధికారులకు పలు సూచనలు చేశారు. వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సాయం అందించాలని ఆదేశించారు. బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మానవతా దృక్పథంతో సాయం పెంపు సమీక్షలో అధికారులు మాట్లాడుతూ.. వరదల కారణంగా ఖమ్మం జిల్లాలో ఆరుగురు, కొత్తగూడెంలో ఐదుగురు, ములుగులో నలుగురు, కామారెడ్డి, వనపర్తిలలో ముగ్గురి చొప్పున చనిపోయారని మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి పొంగులేటి.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయంతోపాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో పూర్తిగా, పాక్షికంగా కూలిపోయిన ఇళ్లను గుర్తించి.. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సూచించారు. వరదలతో ప్రభావితమైన ప్రతి కుటుంబానికి రూ.16,500 చొప్పున సాయం అందించాలని.. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నేరుగా బాధితుల ఖాతాల్లోనే జమ చేయాలని ఆదేశించారు. తొలుత రూ.10 వేల ఆర్థిక సాయం అనుకున్నప్పటికీ.. మానవతా దృక్పథంతో దాన్ని రూ.16,500కు పెంచామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వరద ముంపునకు గురైన పంట భూములకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. ఇక మైనింగ్ వ్యర్థాలను ప్రభుత్వ భూముల్లో వేయడం వల్ల వరద వెళ్లక సూర్యాపేట, పాలేరులకు భారీగా నష్టం జరిగిందని అధికారులు సమీక్షలో మంత్రికి వివరించారు. దీంతో ఆ నష్టాన్ని మైనింగ్ ఏజెన్సీల నుంచే వసూలు చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సూచించారు. శాశ్వత మరమ్మతులు చేపట్టండి సమీక్షలో భాగంగా అధికారులు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 358 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయని, దాదాపు 2 లక్షల మంది ప్రభావితమయ్యారని వివరించారు. 158 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, 13,494 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. వర్షాలు, వరదలతో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లు వేల కిలోమీటర్ల పొడవునా దెబ్బతిన్నాయని అధికారులు వివరించగా.. వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రోడ్లను పునరుద్ధరించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. శాశ్వత మరమ్మతులకు అవసరమైన కార్యాచరణను రెండు రోజుల్లో తయారు చేయాలని సూచించారు. పెద్ద, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులను కూడా వేగంగా చేపట్టాలన్నారు. అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలలు, పీహెచ్సీలు ఏ మేరకు దెబ్బతిన్నాయనే వివరాలను సేకరించాలని సూచించారు. ఇక వర్షాలు, వరదల కారణంగా ఇండ్లలోకి నీరు చేరి.. ఇంటి పత్రాలు, ఆస్తి పత్రాలు, కుటుంబ సభ్యుల ఆధార్, రేషన్కార్డులు, విద్యార్థుల సర్టిఫికెట్లు తడిచిపోయాయని, కొన్నిచోట్ల కొట్టుకుపోయాయని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి... డాక్యుమెంట్లు పోయిన బాధితులు స్థానిక పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని, వీలైనంత త్వరగా వారికి డూప్లికేట్ పత్రాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
సినిమా వృక్షం పునరుజ్జీవానికి చర్యలు
కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో నేలకూలిన 150 ఏళ్ల చరిత్ర కలిగిన సినిమా (నిద్ర గన్నేరు) వృక్షాన్ని తిరిగి అదే ప్రదేశంలో బతికించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పి.ప్రశాంతి ప్రకటించారు. అటవీ, రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి బుధవారం కూలిన చెట్టును ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. కెమికల్ ట్రీట్మెంటు ద్వారా ఈ చెట్టును మళ్లీ చిగురింప జేసేందుకు రోటరీ క్లబ్ రాజమహేంద్రవరం ముందుకొచి్చందన్నారు. -
‘ధరణి’ అధికారాల బదలాయింపు!
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు కలెక్టర్లకు మాత్రమే ‘ధరణి’దరఖాస్తుల పరిష్కార అధికారాలుండగా, వికేంద్రీకరణ ద్వారా తహసీల్దార్లు, ఆర్డీఓలు, అదనపు కలెక్టర్లు (రెవెన్యూ)కు కొన్ని అధికారాలు కట్టబెట్టనున్నారు. ధరణి పోర్టల్ పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సూచన మేరకు రైతు సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారాల బదలాయింపు కసరత్తు చురుగ్గా సాగుతోంది. ఏ అధికారికి ఏ దరఖాస్తు పరిష్కరించే అధికారం ఇవ్వాలన్న దానిపై రెవెన్యూశాఖ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ♦ ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం 35 మాడ్యూళ్లు అందుబాటులో ఉన్నాయి. ♦ తాజా లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో రెండు మాడ్యూళ్లలో మాత్రమే 1.5 లక్షల దరఖాస్తులున్నాయని ధరణి కమిటీ గుర్తించింది. ♦ టీఎం 14 (గ్రీవెన్సెస్ ఆన్ స్పెసిఫిక్ ల్యాండ్ మ్యాటర్స్) మాడ్యూల్లో 40,435 దరఖాస్తులు, టీఎం 33 (మాడిఫికేషన్ రిక్వెస్ట్ అప్లికేషన్) మాడ్యూల్లో 1.05 లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ♦ మిగిలిన 33 మాడ్యూళ్లలో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారాల బదలాయింపునకు కసరత్తు జరుగుతుండగా, ముఖ్యమైన టీఎం 14, 33 మాడ్యూళ్లలో ఏ దరఖాస్తులు ఎవరు పరిష్కరించాలన్న దానిపై ధరణి కమిటీతో పాటు రెవెన్యూశాఖ ఓ అభిప్రాయానికి వచ్చింది. అవసరమైతేనే సీసీఎల్ఏకు ♦ ధరణి మాడ్యూళ్ల (టీఎం14, టీఎం33)లోని దరఖాస్తులను తహసీల్దార్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్, కలెక్టర్తో పాటు సీసీఎల్ఏలకు అధికారాలు కల్పిస్తూ వికేంద్రీకరణ కసరత్తు జరుగుతోంది. ♦ టీఎం14లో ఆధార్ తప్పులు, ఆధార్ అందుబాటులో లేకపోవడం, తండ్రి, భర్త పేరులో తప్పులు, ఫొటో మిస్ కావడం, జెండర్, కులం తప్పుగా నమోదు కావడం, సర్వే నంబర్ మిస్సింగ్, తహసీల్దార్ల డిజిటల్ సంతకాలు లేకపోవడంలాంటి సమస్యలున్నాయి. వీటిలో సర్వేనంబరు మిస్సింగ్ మినహా ఇతర సమస్యల పరిష్కార అధికారాలు తహసీల్దార్లకు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ♦ సర్వేనంబరు మిస్సింగ్ దరఖాస్తుల పరి ష్కారం ఆర్డీఓలకు అప్పగించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇక, టీఎం 33లో భాగమైన పాసుపుస్తకాల్లోని తప్పుల సవరణ, నోషనల్ ఖాతా (ప్రభుత్వ భూమి ఉండే ఖాతా) నుంచి పట్టాభూమిగా మార్పు, పాసు పుస్తకంలోని పేరుమార్పు, మిస్సింగ్ సర్వేనంబరు, భూమి వర్గీకరణ, భూమి స్వభావం, భూమి రకం, భూమి అనుభవదారుని పేరు లాంటి సమస్యలను పరిష్కరించే అధికారాన్ని తహసీల్దార్లు, ఆర్డీఓల సి ఫారసులతో కలెక్టర్లకు అప్పగించనున్నారు. ♦ నోషనల్ ఖాతామార్పు అధికారం విషయంలో అవసరమైతే సీసీఎల్ఏ అనుమతి తీసు కునేలా మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. మిగిలిన మాడ్యూళ్లలో కొన్నింటిని అద నపు కలెక్టర్లు (రెవెన్యూ)కు అప్పగించనున్నారు. ఈ మేరకు ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల సమస్యలను పరిష్కరించే అధికారాలను వికేంద్రీకరించే ప్రక్రియ త్వరలోనే ఓ కొలిక్కి వస్తుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. -
10 లక్షలు దాటిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం వేగంగా జరుగుతోంది. రోజుల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయి. శుక్రవారం సాయంత్రానికి 10.31 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 79,953 రిజిస్ట్రేషన్లు జరిగాయి. కాకినాడ జిల్లాలో 79,892 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. పల్నాడు, వైఎస్సార్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో 50 వేలకుపైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. మిగిలిన రిజిస్ట్రేషన్లను వారం రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్లు పూర్తయిన లబ్ధిదారులకు కన్వేయన్స్ డీడ్ల పంపిణీని త్వరలో చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఒంగోలులో ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తర్వాత అన్ని జిల్లాల్లోనూ ప్రజాప్రతినిధులు పంపిణీ చేయనున్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు పేదలకు స్థలాలు ఇచ్చినా వాటిపై పూర్తి హక్కులు ఇవ్వకుండా డి–పట్టాలు మాత్రమే జారీ చేశారు. తొలిసారిగా వైఎస్ జగన్ అన్ని హక్కులతో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సంకల్పించి ఆ దిశగా అడుగులు వేశారు. ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడే వాటికి వెంటనే రిజిస్ట్రేషన్లు చేయాలని చూసినా చట్టపరమైన ఇబ్బందుల వల్ల ఆ పని ఆలస్యమైంది. అన్ని సమస్యలను అధిగమించి, అసైన్డ్ భూముల చట్టానికి సవరణ చేసి ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్ల తర్వాత జారీ చేసే కన్వేయన్స్ డీడ్లు పదేళ్ల తర్వాత సేల్ డీడ్లుగా మారనున్నాయి. అప్పుడు రెవెన్యూ శాఖ ఎన్ఓసీ అవసరం లేకుండానే పేదలు వాటిని నిరభ్యంతరంగా అమ్ముకునే అవకాశం ఏర్పడుతుంది. అలాగే రిజిస్ట్రేషన్ అయిన నాటి నుంచి వాటిపై ప్రైవేటు భూముల మాదిరిగానే రుణాలు, ఇతర సౌకర్యాలు పొందే అవకాశం ఉంటుంది. -
రాష్ట్రంలో భూ సంస్కరణలు ఓ విప్లవం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన భూసంస్కరణలు ఓ విప్లవమని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పేద, బడుగు, బలహీన వర్గాల కోసం అన్నింటినీ ఎదుర్కొని కేవలం నాలుగేళ్లలోనే ఈ సంస్కరణలు తెచ్చారని తెలిపారు. ఈ సంస్కరణలు రాష్ట్రంలోని లక్షలాది పేద కుటుంబాల జీవన స్థితిగతులను మారుస్తాయని, వారి గౌరవాన్ని పెంచుతాయని వివరించారు. సీఎం జగన్ చాలా దూరదృష్టితో ఆలోచించి ఈ సంస్కరణలు తెచ్చారని తెలిపారు. భూమి యాజమాన్యం, వినియోగదారులకు సంబంధించి ఈ నాలుగేళ్లు ఎంతో ప్రత్యేకమని చెప్పారు. ‘అసైన్డ్ భూముల క్రమబద్దీకరణ – రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వే – పేదల కోసం చుక్కల భూముల సంస్కరణలు’ అనే అంశంపై సోమవారం అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా 15 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పారు. 28 లక్షల ఎకరాల భూమిపై ఒకేసారి యాజమాన్య హక్కులు రాబోతున్నాయని తెలిపారు. భూమి టైటిల్ ఫ్రీగా ఉంటే పెట్టుబడులు తెస్తుందని, దానివల్ల ఉద్యోగాలు వస్తాయని, తద్వారా జీడీపీ పెరిగి రాష్ట్రం వృద్ధిలోకి వస్తుందని తెలిపారు. భూమిని సరిగా వినియోగంలో తీసుకురాలేకపోతే అది సరైన పాలన కాదని అన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలూ భూమిని లిటిగేషన్ ఫ్రీ చేస్తున్నాయని చెప్పారు. భూమి వినియోగంలో లేకుండా చేస్తే చెడు ప్రభావాలు పెరుగుతాయన్నారు. అసైన్డ్ భూముల చట్ట సవరణ భూమిని అమ్మడానికి చేసినది కాదని, వాటిపై సర్వ హక్కులు కల్పించడం కోసమని చెప్పారు. ఎప్పుడైనా దాన్ని ఉపయోగించుకునేలా ప్రైవేటు భూమితో సరిసమానమైన హక్కులు కల్పించామన్నారు. సీఎం వైఎస్ జగన్ తెచ్చిన ఈ సంస్కరణలను ప్రజలు బాగా స్వీకరించారని, ఇంత పెద్ద సమస్యకు ఆర్డినెన్స్ ఇస్తే ఒక్క విమర్శ కూడా రాలేదన్నారు. అసైన్మెంట్ జరిగి 20 సంవత్సరాలు దాటితే యాజమాన్య హక్కులు లభిస్తాయన్నారు. ఈ భూముల యజమానులు ఎన్ఓసీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదని, ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేదని చెప్పారు. అధికారులు వీటి జాబితాను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపుతారని, ప్రజలకు ఇబ్బంది లేకుండా అక్కడ ప్రక్రియ అంతా జరుగుతుందని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచిన వాడే నాయకుడు ప్రజల కష్టాలను తగ్గించి, జీవన ప్రమాణాలు పెంచి, వారి గుండుల్లో చిరకాలం ఉండే వాడు, పెద్ద ఎత్తున జరిగే దాడిని తట్టుకుని సంస్కరణలు చేయగలిగిన వాడే నాయకుడని అన్నారు. అలాంటి నాయకుడే వైఎస్ జగన్ అని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చే సమయానికి పేదలకు భూమి ఇస్తే, అది మళ్లీ ధనవంతుల దగ్గరకు చేరిపోయే పరిస్థితి ఉందని, అందుకే పేదలకిచ్చిన భూముల్ని అమ్మకూడదని, వ్యవసాయం మాత్రమే చేయాలని నిబంధన పెట్టారని తెలిపారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేనందున, ఇంకా భూమిని ప్రభుత్వం చేతుల్లోనే పెట్టుకోవడం సరికాదని, ఆ భూములపై వారికి సర్వ హక్కులు ఇవ్వాల్సిందేనని సీఎం జగన్ భావించారని తెలిపారు. పేద రైతుల గౌరవాన్ని పెంచడానికి అసైన్డ్ భూముల చట్టానికి సీఎం సవరణ సవరణ చేశారని తెలిపారు. దీనివల్ల 15 లక్షల కుటుంబాల సామాజిక స్థితి మారి, వారికి గౌరవం ఏర్పడుతుందన్నారు. 28 లక్షల ఎకరాల భూమిపై ఒకేసారి యాజమాన్య హక్కులు రాబోతున్నాయని తెలిపారు. ఎవరూ కోరకుండానే సీఎం జగన్ ఈ సంస్కరణలు తెచ్చారని తెలిపారు. దీనిపై బాగా అధ్యయనం చేశామని, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు వెళ్లి చూశామని, అన్నింటిపైనా చర్చింన తర్వాత అక్కడికంటే సరళంగా సీఎం చట్టాన్ని మార్చారని చెప్పారు. వైఎస్సార్ తర్వాత మళ్లీ ఇప్పుడే భూ పంపిణీ అనాధీన భూములను క్రమబద్దీకరించి, వందేళ్లుగా ఉన్న చుక్కల భూముల సమస్యనూ సీఎం జగన్ పరిష్కరించారని చెప్పారు. దీనిద్వారా 2.50 లక్షల ఎకరాలు విముక్తి పొందాయని, ఆ రైతులకు హక్కులు వచ్చాయని తెలిపారు. దళితవాడల్లో భూమి కొని అయినా శ్వశానవాటికలు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించినట్లు తెలిపారు. భూ పంపిణీ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హయాంలో జరిగిందని, అప్పట్లో 7 లక్షల ఎకరాలు ఇచ్చామని తెలిపారు. మళ్లీ ఇప్పుడు భూ పంపిణీ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారని తెలిపారు. సాగుకు యోగ్యమైన భూమిని గుర్తించారని, త్వరలో సభ పెట్టి పంపిణీ ప్రారంభిస్తారని చెప్పారు. అసైన్డ్ భూముల చట్టంలో ఇళ్ల స్థలాలపై ఉన్న ఆటంకాన్ని కూడా ముఖ్యమంత్రి ఎత్తివేశారని, 10 సంవత్సరాల తర్వాత ఆ స్థలాలను అమ్ముకోవచ్చని తెలిపారు. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలివ్వడం గొప్ప విషయం 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం గొప్ప విషయమని మంత్రి చెప్పారు. ఇందుకోసం భూమని కొనడానికి రూ. 12 వేల కోట్లు ఖర్చయినా సీఎం జగన్ వెనకడుగు వేయలేదని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల్లో పేదల కోసం భూమి కొనడానికి రూ.12 వేల కోట్లు బడ్జెట్లో పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్ జగన్ ప్రభుత్వమేనని చెప్పారు. ఆ కాలనీల్లో సౌకర్యాలు కల్పించడానికి ఇంకా చాలా ఖర్చు పెడుతున్నామని తెలిపారు. ఈ స్థలాల లేఅవుట్లు, అక్కడ కల్పిస్తున్న వసతులు చూసి అక్కడికి వెళ్లాలని చాలామంది అనుకుంటున్నారని తెలిపారు. ఇదంతా కేవలం రెండేళ్లలోనే వచ్చిందన్నారు. ఈర‡్ష్యతో ఉన్న వాళ్లు తప్ప ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రశంసించకుండా ఎవరుంటారని ప్రశ్నించారు. సర్వే జరక్కపోవడం వల్లే గ్రామాల్లో వివాదాలు బ్రిటిషర్ల కాలంలో భూముల సర్వే జరిగిందని, అప్పటి నుంచి మళ్లీ సర్వే జరక్కపోవడం వల్ల గ్రామాల్లో ఎన్నో వివాదాలు నెలకొన్నాయని చెప్పారు. వీటన్నింటినీ పరిష్కరించడానికి సీఎం వైఎస్ జగన్ రీ సర్వే ప్రారంభించారని తెలిపారు. 17 వేల గ్రామాలకుగానూ 4 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తయిందని, రెండు నెలలకు 2 వేల గ్రామాల్లో సర్వే పూర్తవుతుందని తెలిపారు. 15 శాతం మందికి ఖాతా నంబర్లు కూడా లేవని, 1.20 లక్షల మందికి ఎఫ్ఎంబీలు కూడా కనిపించడంలేదన్నారు. ఒక్క సర్వే జరిగితే ఇలాంటివన్నీ పరిష్కారమవుతాయన్నారు. 5 సెంటీమీటర్ల కచ్చితత్వంతో సర్వే చేస్తున్నామన్నారు. ఇందుకోసం 10 వేల మంది సర్వేయర్లను నియమించామని, పరికరాల కోసం ఇప్పటికే రూ.500 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. దేశంలో సమగ్రమైన సర్వే చేసిన రాష్ట్రంగా ఏపీ ఆదర్శంగా నిలవబోతోందన్నారు. దీనివల్ల ప్రయోజనం పొందుతున్న ఏ ఒక్క రైతు పైసా పెట్టక్కర్లేదన్నారు. ఇవన్నీ భవిష్యత్ తరాల కోసం చేసే పనులని, రాజనీతిజు్ఞలే ఈ పనులు చేస్తారని చెప్పారు. ఇవన్నీ ఓట్ల కోసం చేసేది కాదు ఒక స్కూల్ పిల్లాడికి అవసరమైన అన్నింటినీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్నారని మంత్రి చెప్పారు. పుస్తకాలు, బ్యాగ్, యూనిఫాం, బూట్లు, సాక్సులు ఇవ్వడం.. మంచి టీచర్ను పెట్టడం, వారికి భోజనం పెట్టడం.. ఒకవేళ వాళ్లమ్మ పనికి పంపేస్తుందనే భయంతో ఆమెకు డబ్బులివ్వడం.. ఇవన్నీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం సీఎం జగన్ చేస్తున్న కార్యక్రమాలని తెలిపారు. ఓట్ల కోసం కాదని చెప్పారు. తల్లితండ్రులు, పిల్లల కోసం దేశంలో ఎక్కడా లేని మంచి విద్యా వ్యవస్థను సీఎం జగన్ ఇక్కడ తెచ్చారన్నారు. టీచర్లంటే తనకు చాలా అభిమానం ఉందని, వారిపై వ్యతిరేకత లేదని చెప్పారు. వారు కోరకుండానే విద్యా వ్యవస్థలో మార్పు వచ్చిందని, దీన్ని అభినందిస్తూ ఒక తీర్మానం చేయాలని అన్నానని, దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. అవసరమైతే తన మాటలను ఉపసంహరించుకుంటానని చెప్పారు. ప్రతి సెక్రటేరియట్ ఓ రిజిస్ట్రేషన్ కార్యాలయం సామాన్యలు మరింత త్వరతగతిన రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి సీఎం జగన్ కొత్తగా టైటిలింగ్ యాక్ట్ తెస్తున్నారని చెప్పారు. దీని ద్వారా రిజిస్ట్రేషన్తోపాటే మ్యుటేషన్ కూడా జరిగిపోతుందన్నారు. ప్రతి గ్రామ సెక్రటేరియేట్ ఒక రిజిస్ట్రేషన్ కార్యాలయం కాబోతోందన్నారు. కొత్త చట్టం వచ్చాక ఆర్ఓఆర్ చట్టం ఉండదన్నారు. ఒకే ఆస్తిని రెండుసార్లు రిజిస్ట్రేషన్ చేయడం వంటివి ఉండవన్నారు. క్లియర్ టైటిల్తో ఉండే రాష్ట్రంగా ఏపీ నిలవబోతోందన్నారు. వంద సంవత్సరాలుగా కృశించినపోయిన రెవెన్యూ శాఖను సీఎం జగన్ కోట్లాది మంది ఆకాంక్షలకు అనుగుణంగా మార్చారని తెలిపారు. వెబ్ల్యాండ్లో తప్పులు సరి చేయడానికి తహశీల్దార్కి అధికారాలు ఇచ్చారన్నారు. ఎస్సీ కోఆపరేటివ్ భూములకు పట్టాలివ్వడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దేవాలయాల సర్వీస్ ఈనాం భూములపైనా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రెవెన్యూలో విప్లవాత్మక మార్పులు: శాసన వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్రెడ్డి రెవెన్యూ వ్యవస్థలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. అసైన్డ్, చుక్కల భూముల సమస్యలు పరిష్కరించడం వల్ల కొన్ని లక్షల మంది దళితులు, బీసీలు, పేదలకు లబ్ధి కలిగింది. అసైన్డ్ భూములపై హక్కులు నిరుపేదలకు వరం. గత ప్రభుత్వంలో రెవెన్యూ విషయంలో చాలా తప్పలు జరిగాయి. ఒకరి భూములను మరొకరు ఆన్లైన్ చేయించుకున్న దాఖలాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని కోరుతున్నా. వైఎస్ జగన్ ప్రభుత్వం రెవెన్యూ లోపాలపై గట్టిగా దృష్టి సారించి, వాటిని సవరిస్తోంది. హక్కుదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తోంది. ఇది పేదల ప్రభుత్వమని మరోసారి నిరూపించింది. అసైన్డ్ హక్కులు చారిత్రాత్మకం : సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసైన్డ్ భూములపై హక్కులు కల్పించడం చరిత్రాత్మకం. అనేక జటిలమైన సమస్యలకు సీఎం జగన్ ఈరోజు పరిష్కారాలు చూపిస్తున్నారు. చంద్రబాబు ఫిలాసఫీ హైటెక్. సీఎం జగన్ ఫిలాసఫీ లోకల్టెక్. చంద్రబాబు కార్పొరేట్ శక్తుల్ని ప్రేమిస్తే.. జగన్ కార్మికుల్ని ప్రేమిస్తారు. భూమాతను కొందరికే సొంతం చేసిన చరిత్ర బాబుది. అదే భూమిని పేదలకు ఇచ్చి వారికి హక్కులు కల్పించిన సీఎం జగన్. చంద్రబాబు రాజమండ్రిలో ప్రజలను చంపిన చోటే దేవుడు ఆయన్ని జైల్లో పెట్టాడు. 31 లక్షల మందికి ఇళ్ల పట్లాలు లేవనే విషయం చద్రబాబుకు తెలుసా? ఒక సినిమా హీరో విలన్కి సపోర్ట్ చేస్తున్నాడు. నైపుణ్యమైన దొంగను కాపాడ్డానికి హీరో వెళ్లాడు. ఆయన హీరో కాదు విలన్. అణగారిన వర్గాలకు, బలిసిన వాళ్లకి మధ్య యుద్ధం జరుగుతోంది. బాబు అసైన్డ్ భూముల్ని దోచుకున్నారు.. జగన్ వాటిపై హక్కులిచ్చారు: నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ ఎం జగన్మోహనరావు చంద్రబాబు అసైన్డ్ భూములను దోచుకుంటే, సీఎం వైఎస్ జగన్ వాటిపై పేదలకు హక్కులు కల్పించారు. బాబు హయాంలో క్యాపిటల్ రీజియన్లో 1,400 ఎకరాల అసైన్డ్ భూములను దోచుకున్నారు. సీఆర్డీఏ పరిధిలో అసైన్డ్ రైతులను భయపెట్టి వారి భూముల్ని లాక్కున్నారు. చుక్కల భూములు, షరతుల గల భూములు వంటి లక్షల ఎకరాలపై హక్కులివ్వడం ఎప్పుడూ జరగలేదు. సమగ్ర భూ సర్వేను స్వాతంత్య్రం వచ్చాక ఏ ప్రభుత్వం చేపట్టలేదు. అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా ఈ సర్వే జరుగుతోంది. అభినవ కొమరం భీం జగన్ : పాడేరు ఎమ్మెల్యే కె. భాగ్యలక్ష్మి అసైన్డ్ భూములకు సీఎం వైఎస్ జగన్ సంపూర్ణమైన యాజమాన్య హక్కులు కల్పించడం చరిత్రాత్మకం. ఈ నిర్ణయం లక్షలాది రైతుల జీవితాల్లో గొప్ప మార్పు తెస్తుంది. గిరిజన ప్రాంతాల్లో ఆర్ఓఎఫ్ఆర్ భూములకు ఇప్పుడు రుణాలు ఇస్తున్నారు. గిరిజనులకు భూములపై సర్వ హక్కులు కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినవ అంబేద్కర్.. అభినవ కొమరం భీం. -
‘రికార్డు’ సంస్కరణలు ప్రజలకు చెబుదాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపట్టిన భూ సంస్కరణల వల్ల ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. రెవిన్యూ శాఖలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, సమగ్ర భూసర్వేతో భూ రికార్డుల ప్రక్షాళన, భూముల రిజిస్ట్రేటేషన్ల విషయంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి వల్ల చేకూరుతున్న ప్రయోజనాలను క్షుణ్నంగా వివరిస్తూ ప్రజల్లోకి విస్తృత సమాచారాన్ని పంపాలన్నారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం అమలు తీరుపై గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. ప్రజలకు మేలు జరుగుతున్న నిర్ణయాలపై కూడా ఎల్లో మీడియా వక్రీకరిస్తూ ద్రుష్పచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రజల్లో ఆందోళన రేకెత్తించేలా తప్పుడు రాతలు రాస్తోందని, వీటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మంచిని మంచిగా చూపించడం ఇష్టం లేకనే వక్రీకరణలకు పాల్పడుతున్నారని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో ఆయా మండలాలు, తాలూకాల్లో ఒకరిద్దరు మాత్రమే సర్వేయర్లు ఉండగా మన రాష్ట్రంలో ప్రతి గ్రామ సచివాలయానికీ ఒక సర్వేయరు ఉన్నారని సీఎం జగన్ గుర్తు చేశారు. భూ యజమానుల హక్కుల పరిరక్షణ, రికార్డుల్లో స్వచ్ఛత, కచ్చితత్వానికి ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతోందన్నారు. కీలక సంస్కరణలు చేపట్టి రిజిస్ట్రేటేషన్ల వ్యవస్థను నేరుగా గ్రామ సచివాలయాల వద్దకే తెస్తున్నామని చెప్పారు. ఇప్పటికే కొన్ని గ్రామ సచివాలయాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఇప్పుడు రిజిస్ట్రేటేషన్ చేయించుకునేవారు ఇంటి నుంచే ఆ పనిని చేయించుకునేలా సాంకేతికతను తెస్తున్నామన్నారు. ఇన్ని సౌలభ్యాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తుంటే కొందరు తప్పుడు రాతలు, వక్రీకరణలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని తిప్పికొడుతూ మన ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, వాటి వల్ల చేకూరిన ప్రయోజనాలను ప్రజలకు సమగ్రంగా వివరించాలని దిశా నిర్దేశం చేశారు. మనం చేస్తున్న మంచి అంతా ప్రజల్లోకి వెళ్లాలని స్పష్టం చేశారు. 95 శాతం డ్రోన్ ఫ్లయింగ్ పూర్తి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం కింద జరుగుతున్న సమగ్ర సర్వే ప్రగతిని సమీక్షలో అధికారులు వివరించారు. 13,460 గ్రామాలకు గానూ 12,836 గ్రామాల్లో అంటే 95 శాతం గ్రామాల్లో డ్రోన్ల ఫ్లయింగ్ పూర్తయిందని తెలిపారు. మిగతా పనిని అక్టోబరు 15లోగా పూర్తి చేస్తామన్నారు. 81 శాతం గ్రామాలకు సంబంధించి సర్వే ఇమేజ్ల ప్రక్రియ పూర్తైనట్లు చెప్పారు.60 శాతం గ్రామాలకు సంబంధించి ఓఆర్ఐలను (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్) జిల్లాలకు పంపే పని పూర్తి చేయాల్సి ఉందన్నారు. సర్వేలో 3,240 రోవర్లను వినియోగించామని, గతం కంటే 1,620 అదనంగా పెరిగినట్లు చెప్పారు. తొలి విడతగా చేపట్టిన 2 వేల గ్రామాల్లో అన్ని రకాలుగా సర్వే పూర్తయిందని వివరించారు. మ్యుటేషన్లు, కొత్త సర్వే సబ్ డివిజన్లు, 19 వేల సరిహద్దుల సమస్యల పరిష్కారం,సర్వే రాళ్లు పాతడం సహా 7.8 లక్షల మందికి భూహక్కు పత్రాల పంపిణీ పూర్తైనట్లు వెల్లడించారు. ఫేజ్ 2లో మరో 2 వేల గ్రామాల్లో భూహక్కు పత్రాల పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. రెండో దఫా సర్వే గ్రామాల్లో అక్టోబరు 15 నాటికి రిజిస్ట్రేటేషన్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మున్సిపాలిటీల్లో.. మున్సిపల్ శాఖ పరిధిలో సర్వే ప్రగతిని కూడా అధికారులు నివేదించారు. ఇప్పటికే 91.93 శాతం ఆస్తుల వెరిఫికేషన్ పూర్తైందని, 66 మున్సిపాలిటీల్లో ఓఆర్ఐ ప్రక్రియ ముగిసిందని తెలిపారు. ప్రత్యేక బృందాల ఏర్పాటు ద్వారా సర్వే ప్రక్రియను ముమ్మరం చేయాలని సీఎం సూచించారు. ఫేజ్ 2 సర్వే పూర్తైన చోట రిజిస్ట్రేటేషన్ సేవలకు సిద్ధం కావాలి మొదటి దశ సర్వే పూర్తైన 2 వేల గ్రామాల్లో అమల్లోకి తెచ్చిన రిజిస్ట్రేషన్ సేవలపై పూర్తి స్థాయిలో సమీక్ష చేయడంతోపాటు ఫేజ్ 2 సమగ్ర సర్వే పూర్తైన గ్రామాల్లో కూడా రిజిస్ట్రేటేషన్ సేవలను అందించేందుకు అన్ని రకాలుగా సిద్ధం కావాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆయా గ్రామాల్లో రిజిస్టేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రిజిస్ట్రేటేషన్ల కోసం ప్రజలు వేరేచోటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ వ్యవస్థను గ్రామాల్లోకే తెచ్చామన్నారు. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేటేషన్ ప్రక్రియ సక్రమంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. భూ వివాదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి మండల స్థాయిలో మొబైల్ కోర్టులు సేవలందించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. -
వీఆర్వోలు ‘వెనక్కి’?
సాక్షి, హైదరాబాద్: జీతం లేదు.. సీనియారిటీ లేదు.. పదోన్నతులు రావు... పనిచేసేందుకు వెళ్లిన శాఖలో వివక్ష... ఉన్నచోట ఒక్కరికే పది పనులు.. లేనిచోట ఎలాంటి పనీ లేదు.. పేరుకే జూనియర్ అసిస్టెంట్... చేయాల్సింది మాత్రం తోటమాలి, వాచ్మన్, అటెండర్ పనులు.. ఇవీ ఇతర శాఖల్లోకి వెళ్లిన ‘గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వోల)’పరిస్థితి. సర్దుబాటులో భాగంగా ఇతర శాఖల్లోకి వెళ్లినవారు ఆయా చోట్ల కష్టాలు, సమస్యలను తట్టుకోలేక.. తిరిగి రెవెన్యూశాఖలోకి తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై కొన్నినెలలుగా చర్చ సాగుతున్నా.. వీఆర్ఏల సర్దుబాటు నేపథ్యంలో బలంగా తెరపైకి వస్తోంది. వీఆర్ఏలను సర్దుబాటు చేసిన తరహాలోనే తమకు కూడా సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించి రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలనే డిమాండ్ వస్తోంది. దీనికి ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కూడా మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో వీఆర్వోలకు పేరు మార్చి, రెవెన్యూశాఖలోనే భూసంబంధిత పనులు కాకుండా ఇతర విధులు అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏదో ఒక ఇబ్బందితో.. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో వీఆర్వోల వ్యవస్థను రద్దు చేయడంతో.. సుమారు 5,400 మంది వివిధ ప్రభుత్వ శాఖలకు వెళ్లాల్సి వచ్చింది. విద్య, మున్సిపల్, వైద్యం, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ ఇలా పలు ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో వారిని సర్దుబాటు చేశారు. రెవెన్యూ శాఖ నుంచి ఇతర శాఖల్లోకి రావడంతో వారి సీనియారిటీని కోల్పోయారు. ఆరేళ్ల నుంచి గరిష్టంగా 20ఏళ్లవరకు సీనియారిటీని కోల్పోవాల్సి వచ్చిందని వారు వాపోతున్నారు. పేరుకు జూనియర్ అసిస్టెంట్ హోదాలో ఇతర శాఖల్లో చేరినా.. ఆయాచోట్ల రికార్డు అసిస్టెంట్గా, తోటమాలిగా, అటెండర్గా పనిచేయాల్సి వస్తోందని అంటున్నారు. మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లుగా వెళ్లిన వారికి కనీసం కూర్చునేందుకు కూడా కుర్చీలు లేవని చెప్తున్నారు. హైదరాబాద్ శివార్లలోని ఓ మున్సిపాలిటీలో వార్డు అధికారిగా చేరిన ఓ వీఆర్వోకు శక్తికి మించిన బాధ్యతలు ఇచ్చారని.. లీగల్ సెల్, ఇళ్లు కూలగొట్టడం, ప్రకృతి వైపరీత్యాల పర్యవేక్షణ, చెట్ల పెంపకం, పార్కుల పరిరక్షణ, చెరువుల పరిరక్షణ, ఆసరా పింఛన్లలో వేలిముద్రల గుర్తింపు పనులు అప్పగించారని వీఆర్వో వర్గాలు చెప్తున్నాయి. అన్ని పనులు చేయలేక మానసిక వేదనతో సదరు వీఆర్వో బ్రెయిన్స్ట్రోక్కు గురయ్యారని అంటున్నాయి. పని లేక.. జీతాలు రాక.. ఇక సొసైటీలు, కార్పొరేషన్లు, కొన్ని స్థానిక సంస్థల పరిధిలోకి వెళ్లిన వీఆర్వోలకు స్థానిక నిధుల నుంచే వేతనం ఇస్తుండటంతో.. కొందరికి నాలుగైదు నెలలుగా జీతాల్లేవని అంటున్నారు. కొన్నిజిల్లాల్లో అవసరమైన ఉద్యోగుల సంఖ్య (కేడర్ స్ట్రెంత్)కు మించి పోస్టింగులు ఇచ్చారని, ఐదుగురు సిబ్బంది అవసరమైన చోటకు 10 మందిని పంపారని, అక్కడ ఎలాంటి విధులు నిర్వహించాలో కూడా తెలియక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఆయా శాఖల్లో పనిచేస్తున్న రెగ్యులర్ సిబ్బంది నుంచి వివక్ష ఎదుర్కోవాల్సి వస్తోందని, తమకు పదోన్నతులు రాకుండా చేయడానికి వచ్చారా? అంటూ మండిపడుతున్నారని చెప్తున్నారు. సొంత శాఖలో సమస్యలు కూడా పరిష్కారం కాక మాజీ వీఆర్వో లు రెవెన్యూ శాఖ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ప్రొబేషన్ డిక్లరేషన్, సర్వీసు వ్యవహారాల ఫైళ్లు సీసీఎల్ఏ, రెవెన్యూ కార్యదర్శి పేషీల్లో పెండింగ్లో ఉన్నాయని.. ప్రత్యేక, సాధారణ ఇంక్రిమెంట్లు, పీఆర్సీ వర్తింపు అంశాల్లో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం తమకు సమస్యగా మారిందని వీఆర్వోలు వాపోతున్నారు. సంఘాలకు అతీతంగా సమావేశమై.. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు రాష్ట్రంలోని 33 జిల్లా లకు చెందిన మాజీ వీఆర్వోలు బుధవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమయ్యారు. సంఘాలకు అతీతంగా ‘సమస్యలపై చర్చ–ప్రభుత్వానికి నివేదన’అనే నినాదంతో తమ ఉద్యోగ హక్కులకు భద్రత కల్పించాలని.. లేదంటే మాతృశాఖకు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీఆర్వోలను ఇతర శాఖల్లో కలపడం వల్ల సీనియారిటీ దెబ్బతింటుందని, వేల మంది ఇబ్బందిపడుతున్నారని టీఆర్ఈఎస్ఏ అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీసుకు భద్రత లేక వారంతా ఆందోళనలో కూరుకుపోయారన్నారు. అయితే.. వీఆర్వోల సమావేశం నిర్వహణ వెనుక ప్రభుత్వంలో కీల క హోదాలో ఉన్న కొందరు నాయకులు ఉన్నారని, వారి సలహా మేరకే ఈ సమావేశం నిర్వహించారని సమాచారం. భూసంబంధిత అంశాలు మినహా మిగతా రెవెన్యూ వ్యవహారాల ను చూసుకునేందుకు వీఆర్వోల పేరు మార్చి మళ్లీ రెవెన్యూశాఖలోకి తీసుకునేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. వీఆర్ఏలతోనే తంటా! రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన వీఆర్ఏ సర్దుబాటు ప్రక్రియ వీఆర్వోలలో అలజడికి కారణమైంది. తమకంటే కింది కేడర్లో పనిచేసిన వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేయడంతోపాటు సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి మరీ.. రెవెన్యూ శాఖల్లోనే కొనసాగిస్తున్నారని, అదే పద్ధతిని తమ విషయంలో ఎందుకు పాటించలేదని వీఆర్వోలు ప్రశ్నిస్తున్నారు. సర్వీసు వ్యవహారాలు పెండింగ్లో ఉండటంతో చాలా జిల్లాల్లో వేతనాలు రావడం లేదని, ప్రతి విషయానికి ఏదో ఒక అడ్డంకి వస్తోందని అంటున్నారు. రెవెన్యూలో మరిన్ని సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి, తమను వెనక్కి తీసుకోవడమే ఏకైక పరిష్కారమని పేర్కొంటున్నారు. -
నోటరీ ఆస్తుల క్రమబద్ధీకరణ.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లో నోటరీల ద్వారా క్రయవిక్రయాలు జరిగిన వ్యవసాయేతర ఆస్తుల క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్మిత్తల్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. వీటి ప్రకారం.. నోటరైజ్డ్ డాక్యుమెంట్లు ఉన్న ఆస్తుల క్రమబద్ధీకరణ కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుతో పాటు నోటరీ డాక్యుమెంటు, సదరు ఆస్తికి సంబంధించిన లింకు డాక్యుమెంట్లు, ఆస్తిపన్ను రశీదు, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, లేదంటే ఆ ఆస్తి స్వాదీనంలో ఉన్నట్టు నిరూపించే ఇతర ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఈ దరఖాస్తుల్లో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన ఆస్తులు ఉంటే వాటికి జీవోలు 58, 59 (ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల క్రమబద్ధీకరణ) ద్వారా పరిష్కారం చూపిస్తారు. లేదంటే నేరుగా పరిష్కరిస్తారు. ఈ విధంగా రిజిస్టర్ చేసేందుకు 125 గజాల లోపు ఉన్న ఆస్తులపై ఎలాంటి స్టాంపు డ్యూటీ వసూలు చేయరు. అంతకు మించితే మాత్రం మార్కెట్ రేటు ప్రకారం స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు రూ.5 జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో వివరించారు. ఇందుకు సంబంధించి ఎలాంటి గడువును పేర్కొనలేదు. -
నీటిపారుదల శాఖకు 5,950 మంది వీఆర్ఏలు!
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖలోని 24 వేల మంది గ్రామ రెవెన్యూ సహా యకు(వీఆర్ఏ)ల్లో 5,950 మందిని నీటి పారుదల శాఖలో లష్కర్లుగా నియమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. ప్రస్తుతం వీరంతా రెవెన్యూ శాఖలో రూ.10,500 గౌరవ వేతనంపై తాత్కాలిక ఉద్యోగు లుగా కొనసాగుతున్నారు. వారి సేవలను అదే శాఖలో క్రమబద్ధీకరించడంతోపాటు కొత్త పేస్కేల్ను వర్తింపజే యాలని ప్రభు త్వం నిర్ణయించినట్లు తెలిసింది. అనంతరం అవసరాన్ని బట్టి వేర్వేరు శాఖల్లో వారిని విలీనం చేయాలని భావిస్తోంది. రూ.19 వేల మూల వేతనంతో కలిపి మొత్తం రూ.23 వేల స్థూల వేతనం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. 5,950 మంది వీఆర్ఏలతోపాటు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద నిర్వాసితులుగా మారిన కుటుంబాల నుంచి మరో 200 మందిని లస్కర్లుగా నియమించుకోవడానికి నీటిపారుదల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రాజెక్టుల కింద నిర్వాసితులుగా మారిన కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించడానికి ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీవో 98 కింద 200 మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తయింది. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపి లస్కర్ల నియామకంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీఆర్ఏలను లస్కర్లుగా నియమిస్తామని ఆయన చాలా ఏళ్ల కిందే ప్రకటించిన విషయం తెలిసిందే. సాగునీటి ప్రాజెక్టులు, కాల్వలు, తూములకు కాపలా కాస్తూ పంట పొలాలకు నీళ్లు అందేలా లస్కర్లు పనిచేయాల్సి ఉంటుంది. కాల్వల్లో పిచ్చి మొక్కలు తొలగించడం, గండ్లు పడితే ఉన్నతాధికారులకు తక్షణమే సమాచారం ఇవ్వడం వంటి విధులు నిర్వహిస్తారు. తెలంగాణ వచ్చాక కొత్త ప్రాజెక్టులను పెద్ద ఎత్తున నిర్మించినా, నిర్వహణకు అవసరమైన క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించలేదు. లస్కర్ల నియామకంతో కొత్త ప్రాజెక్టుల నిర్వహణ మెరుగుపడే అవకాశాలున్నాయి. -
చరిత్రాత్మక నిర్ణయం.. ‘అసైన్డ్’ రైతుల జీవితాల్లో వెలుగు
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కేటాయించిన 20 సంవత్సరాల తర్వాత అసైన్డ్ భూముల యజమానులకు సర్వ హక్కులు ఇవ్వడం భూముల వ్యవహారాల్లోనే మేలి మలుపు. దీనివల్ల 15 లక్షల మందికిపైగా రైతులకు ప్రయోజనం చేకూరడంతోపాటు రాష్ట్రంలో అసైన్డ్ భూముల వివాదాలకు తెరపడనుంది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో లక్షలాది మంది రైతుల బతుకు చిత్రాన్ని మార్చే అత్యంత కీలకమైన ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేశారు. భూమి లేని నిరుపేదలు, ఆర్మీలో పని చేసిన వారు, స్వాతంత్య్ర సమర యోధులకు వ్యవసాయ భూములు ఇస్తారు (అసైన్ చేస్తారు). తమకు ఇచ్చిన భూములను స్వాతంత్య్ర సమర యోధులు, ఆర్మీలో పని చేసిన వారు (ఎక్స్ సర్వీస్మెన్).. పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. కానీ నిరుపేదలు మాత్రం అమ్ముకునే అవకాశం లేదు. 1954కు ముందు భూములు ఇచ్చిన వారికి పట్టాల్లో ఎక్కడా వాటిని అమ్మకూడదనే షరతు లేదు. 1954 తర్వాత ఇచ్చిన అసైన్డ్ చట్టాల్లో మాత్రం భూములు అమ్మకూడదనే నిబంధన ఉంది. దీంతో ఈ భూములన్నింటినీ నిషేధిత జాబితా 22 (ఎ)లో పెట్టారు. దీనివల్ల వాటి క్రయవిక్రయాలకు అవకాశం లేకుండా పోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1954కు ముందు అసైన్డ్ అయిన భూములను నిషేధిత జాబితా నుంచి తీసివేసే ప్రక్రియ ప్రారంభించింది. 1954 తర్వాత అసైన్డ్ అయిన భూములు మాత్రం నిషేధిత జాబితాలో ఉన్నాయి. 1977లో ఏపీ అగ్రికల్చరల్ ల్యాండ్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్–పీఓటీ) చట్టం వచ్చింది. దీని ప్రకారం భూమి లేని నిరుపేదలకు వ్యవసాయం కోసం ఇచ్చిన భూములు అమ్ముకోకూడదు. ఎలాంటి కష్టం వచ్చినా, అవసరం వచ్చినా, చదువుల కోసమైనా, ఆరోగ్యం కోసమైనా అమ్ముకునే అవకాశం లేదు. ఈ చట్టం రూపొందించడానికి ముందు ఉన్న అసైన్డ్ భూములు కూడా ఈ చట్టం వల్ల నిషేధిత జాబితాలోకి వచ్చేశాయి. హక్కు లేక.. అమ్ముకోలేక.. తమకు ఇచ్చిన భూమిలో ఏదైనా అవసరం వచ్చి అరెకరం, ఇంకొంత గానీ అమ్ముకోవాలనుకుంటే చట్ట ప్రకారం అమ్ముకోలేని పరిస్థితి ఉండడంతో అసైన్డ్ రైతులు తమ భూములు రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేక కాగితాల మీద రాసి అమ్మకాలు జరిపారు. ఫలితంగా వారికి రావాల్సిన రేటులో కనీసం 25 శాతం కూడా దక్కేది కాదు. తక్కువ రేటుకే తమ భూములను సాదాబైనామాల పద్ధతిలో అమ్ముకునేవారు. ఆ భూమిపై హక్కు లేకపోవడం వల్ల రెవెన్యూ శాఖ ఎప్పుడైనా వారికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉండేది. ఆ భూమి ప్రభుత్వం తీసేసుకుంటుందని, వేరే అవసరాలకు రిజర్వు చేస్తోందనే భయాందోళనలు రైతుల్లో ఉండేవి. మరో వైపు రెవిన్యూ రికార్డులు క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితిని తెలిపేలా లేవు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 19,21,855 మందికి 33,29,908 ఎకరాలు అసైన్డ్ చేస్తే ఆ రికార్డులు క్షేత్ర స్థాయికి తగ్గట్టుగా లేవు. 1954 నుంచి అసైన్మెంట్లు (కేటాయింపులు) జరుగుతూనే ఉన్నాయి. అంటే 70 సంవత్సరాల తర్వాత కూడా అసైన్డ్ భూములపై రైతులకు హక్కులు లేవు. ప్రజాప్రతినిధుల కమిటీతో విస్తృత అధ్యయనం ఈ భూములపై అనేక విజ్ఞప్తులు అందడంతో వీటిపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో 13 మంది ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలతో 2022 ఆగస్టు 30న సీఎం జగన్ ప్రజాప్రతినిధుల కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కర్ణాటక, తమిళనాడులో పర్యటించి అక్కడి విధానాలపై అధ్యయనం చేసింది. అసైన్డ్ భూములకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న చట్టాలు, నియమ నిబంధనలను సైతం క్షుణ్ణంగా పరిశీలించింది. కేరళ రాష్ట్రంలో అసైన్ చేసిన మూడేళ్ల తర్వాత, కర్ణాటకలో 25 ఏళ్ల తర్వాత, తమిళనాడులో పదేళ్ల తర్వాత కొన్ని నిబంధనలతో అమ్ముకునే అవకాశం ఉందన్న విషయాన్ని కమిటీ పరిగణనలోకి తీసుకుంది. కర్ణాటకలో ఐదేళ్ల తర్వాత కలెక్టర్ అనుమతితో అసైన్డ్ భూములను అమ్ముకోవచ్చు. తమిళనాడులో మిగులు భూముల్లో ఇచ్చిన అసైన్మెంట్ అయితే 25 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత మన రాష్ట్రంలో అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత లబ్ధిదారులు, వారు లేకపోతే వారి వారసులు (హక్కుదారులు) వారికి అవసరమైనప్పుడు అమ్ముకునే అవకాశం కల్పించాలని కమిటీ భావించింది. ఇందుకోసం ఏపీ అసైన్మెంట్ (పీఓటీ)–1977కు సవరణలు చేయాలని కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ నివేదిక ఇచ్చింది. అంటే అసైన్మెంట్ జరిగి 20 ఏళ్లు పూర్తయితే అసైన్దారులు, వారి వారసులకు పూర్తి యాజమాన్య హక్కులు ఇవ్వాలని సిఫారసు చేసింది. దీనికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 15.21 లక్షల మంది రైతుల జీవితాల్లో వెలుగు ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రైతులకు మేలు జరుగుతుంది. సుమారు 15,21,160 మంది భూమి లేని నిరుపేదలకు వారికి సంబంధించిన 27,41,698 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తాయి. 20 ఏళ్లకు ముందు ఇచ్చిన భూములన్నింటికీ ఇది వర్తిస్తుంది. ఈ భూములన్నీ 1954 తర్వాత అసైన్మెంట్ చేసినవే. ఈ 20 ఏళ్లలో 4,00,695 మందికి 5,88,211 ఎకరాల భూమిని అసైన్ చేశారు. ప్రతి సంవత్సరం రెవిన్యూ విభాగం 20 ఏళ్లు పూర్తయిన భూముల జాబితాను తయారు చేసి, వాటిని 22(ఎ) నుంచి తొలగిస్తుంది. గతంలో మాదిరిగా ఒక భూమిని 22(ఎ) నుంచి తొలగించాలంటే అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. రెవెన్యూ శాఖ తనకు తానే 20 ఏళ్లు దాటిన భూములను జాబితా నుంచి తీసివేస్తుంది. అసైన్డ్ రైతులు ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ ఉండదు. అవినీతి ఉండదు. పారదర్శకంగా ఈ ప్రక్రియ నడుస్తుంది. అదే సమయంలో ఎవరైనా 20 ఏళ్లకు ముందే పేద రైతుల నుంచి భూములు కొనుక్కుని ఉంటే వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. వారికి ఎటువంటి హక్కులు రావు. అలాంటి వారి విషయంలో 1977 పీఓటీ చట్టం అమల్లో ఉంటుంది. పదేళ్ల తర్వాత ఇళ్ల పట్టాలు అమ్ముకోవచ్చు వ్యవసాయ భూములే కాకుండా ప్రభుత్వం ఇళ్ల పట్టాలు నిరుపేదలకు అసైన్ చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 31 లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది. ఇలా ఇచ్చిన ఇళ్లపై 20 సంవత్సరాల తర్వాత గత చట్టాల ప్రకారం సర్వ హక్కులు లభించేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక దాన్ని 10 ఏళ్లకు తగ్గిస్తూ పీఓటీ చట్టంలో సవరణ చేసింది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాలు పొందిన వారితోపాటు, మిగిలిన వారికీ ఇది వర్తిస్తుంది. -
బ్యాంకుల ఎస్ఎఫ్టీ నివేదికల్లో వైరుధ్యాలు
న్యూఢిల్లీ: అధిక విలువ కలిగిన లావాదేవీలకు సంబంధించి కొన్ని బ్యాంకులు సమరి్పంచిన ‘స్టేట్మెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ (ఎస్ఎఫ్టీ)’ విషయంలో వైరుధ్యాలు ఉన్నట్టు ఆదాయన్ను శాఖ గుర్తించింది. ఆదాయపన్ను శాఖ నిర్ధేశించిన లావాదేవీల వివరాలను ఎస్ఎఫ్టీ కింద ఏటా బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్, వివిధ సంస్థలు ఆదాయపన్ను శాఖకు నివేదించాల్సి ఉంటుంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్ఎఫ్టీని మే 31 నాటికి దాఖలు చేయాలి. ఫారెక్స్ డీలర్లు, బ్యాంక్లు, సబ్ రిజి్రస్టార్, ఎన్బీఎఫ్సీ, పోస్టాఫీసులు, బాండ్లు/డిబెంచర్లు జారీ చేసిన సంస్థలు, మ్యూచువల్ ఫండ్ ట్రస్టీలు, షేర్ల బైబ్యాక్ చేసిన కంపెనీలు, డివిడెండ్ చెల్లించిన కంపెనీలు ఎస్ఎఫ్టీ పరిధిలోకి వస్తాయి. తమిళనాడుకు చెందిన ప్రముఖ బ్యాంక్ నివేదించిన ఎఫ్ఎఫ్టీలో వ్యత్యాసాలను గుర్తించినట్టు ఆదాయపన్ను శాఖ అత్యున్నత విభాగం సీబీడీటీ ప్రకటించింది. కొన్ని లావాదేవీలను అసలుకే వెల్లడించకపోగా, కొన్ని లావాదేవీల సమాచారం కచి్చతంగా పేర్కొనలేదని వెల్లడించింది. ఉత్తరాఖండ్లో రెండు కోపరేటివ్ బ్యాంకుల్లో తనిఖీలు నిర్వహించగా, వేలాది కోట్ల రూపాయల లావాదేవీలను రిపోర్ట్ చేయాలేదని బయటపడినట్టు తెలిపింది. వివిధ సంస్థలు ఎస్ఎఫ్టీ ద్వారా ఆదాయపన్ను శాఖకు వివరాలు తెలియజేస్తే.. ఆయా సమాచారాన్ని పన్ను చెల్లింపుదారుల వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లో చేరుస్తారు. దీంతో పన్ను చెల్లింపుదారులు తమ ఏఐఎస్ను పరిశీలించుకుని రిటర్నులు దాఖలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎస్ఎఫ్టీల్లో వ్యత్యాసాలు గుర్తించినట్టు ప్రకటించిన సీబీడీటీ, తీసుకున్న చర్యలపై సమాచారం తెలియజేయలేదు. -
రెవె‘న్యూ’ ప్రాబ్లమ్!
సాక్షి, హైదరాబాద్: వీఆర్ఏ.. గ్రామ రెవెన్యూ సహాయకుడు.. పేరుకే రెవెన్యూ ఉద్యోగి. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అన్ని శాఖల కార్యకలాపాల్లోనూ భాగస్వామ్యం ఉంటుంది. వీఆర్ఏలు అంటే గ్రామస్థాయిలో ప్రభుత్వ ప్రతినిధి లాంటి వారనే అభిప్రాయమూ ఉందంటే వారిదెంతటి కీలక పాత్రో అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారి వ్యవస్థను రద్దు చేశాక.. వీఆర్ఏలే గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థకు ఏకైక దిక్కుగా మిగిలారు. అలాంటి వీఆర్ఏల సేవలు గ్రామాల్లో అవసరం లేదని, వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదన గందరగోళానికి దారితీస్తోంది. వీఆర్ఏల ఉద్యోగాలను క్రమబద్ధీకరించి, పేస్కేల్ అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడంపై హర్షం వ్యక్తమవుతున్నా.. వారిని ఇతర శాఖలకు పంపితే క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులకు పరిష్కారం ఏమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీఆర్ఏల విధులెన్నో.. వీఆర్ఏలు రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ వీరి జాబ్చార్ట్ మాత్రం మిగతా ఉద్యోగులకు భిన్నంగా ఉంటుంది. గ్రామాల్లోని చెరువులు, కుంటల సంరక్షణతో పాటు ఏ చెరువు కట్ట తెగినా, వాగులు పొంగినా, అలుగులు పోసినా నీటిపారుదల శాఖ ఏఈ, డీఈలకు వీఆర్ఏలే ప్రాథమిక సమాచారం ఇస్తుంటారు. గతంలో అయితే నీటి పంపకం (తైబందీ) కూడా వీరి పర్యవేక్షణలోనే జరిగేది. ఇక, గ్రామపంచాయతీ సమావేశాల ఏర్పాట్లు చేసేది, గ్రామంలోకి ఏ శాఖకు చెందిన అధికారి వచ్చినా దగ్గరుండి గ్రామానికి సంబంధించిన సమాచారం ఇచ్చేది వీఆర్ఏలే. ఆరోగ్య శిబిరాల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో జరిగే కార్యక్రమాలకు సంబంధించిన వసతుల కల్పన బాధ్యత కూడా వీరిదే. పదో తరగతి నుంచి అన్ని స్థాయిల్లోని పరీక్షలకు సంబంధించి పాఠశాలలు, కళాశాలల్లో ఏర్పాట్లు చేస్తుంటారు. ప్రకృతి విపత్తులు, పంట నష్టం, శాంతిభద్రతలు, అగ్నిప్రమాదాలు తదితర అంశాలకు సంబంధించిన సమాచారం కోసం వీఆర్ఏలపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఎన్నికల (పోలింగ్) ప్రక్రియలో సైతం తెరవెనుక పనిచేస్తుంటారు. పోలింగ్ స్టేషన్ల గుర్తింపు నుంచి ఆయా స్టేషన్లలో వసతుల కల్పన, పోల్ స్లిప్పుల పంపిణీ, పోలింగ్ బాక్సుల పర్యవేక్షణ (స్ట్రాంగ్ రూంలకు తరలించేంతవరకు) చేసేది వీఆర్ఏలే. గ్రామాల్లో ‘ప్రభుత్వ ప్రతినిధి‘! ఇక గ్రామాల్లో హత్యలు జరిగినప్పుడు, గుర్తుతెలియని మృతదేహాలు కనిపించినప్పుడు, దోపిడీలు, ఆత్మహత్యల్లాంటి ఘటనలు జరిగినప్పుడు వీఆర్ఏలే పోలీసులకు ప్రాథమిక సమాచారం అందిస్తారు. గంజాయి రవాణా, స్మగ్లింగ్ లాంటి ఘటనలు జరిగినప్పుడు సాక్ష్యాలు బలంగా ఉండేలా పోలీసులు నిర్వహించే పంచనామాలో సాక్షులుగా (పంచ్) వ్యవహరిస్తుంటారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమల్లోనూ కీలక పాత్ర పోషిస్తారు. వీటితో పాటు 56 రకాల రెవెన్యూ విధులను వీరు నిర్వహిస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం తరఫున గ్రామాల్లో ఉండే వ్యక్తి వీఆర్ఏ. అలాంటి వీఆర్ఏలను ఇతర శాఖల్లోకి పంపిస్తే రెవెన్యూ శాఖ పునాదులు కదలడం ఖాయమని, ఆ వ్యవస్థ మనుగడే కష్టసాధ్యమవుతుందనే అభిప్రాయం రెవెన్యూ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇతర శాఖలపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. వీరి నిష్క్రమణ కారణంగా ఎదురయ్యే సమస్యలకు గ్రామస్థాయిలో పరిష్కారమే ఉండదని అంటున్నారు. ఇంతటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న వీరిని.. ఇతర శాఖల్లో సర్దుబాటు చేసే విషయంలో ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే రెవెన్యూ ఉన్నతాధికారులు మాత్రం దీనిపై మౌనం పాటిస్తున్నారు. వారు వెళితే కష్టమే.. వీఆర్ఏల జీవితాల్లో వెలుగులు నింపేలా వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. అయితే వారికి పేస్కేల్ ఇచ్చి రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని కోరుతున్నాం. అలా కాకుండా వారిని ఇతర శాఖల్లోకి బదలాయిస్తే.. క్షేత్రస్థాయిలో పనిచేసే వారుండరు. రెవెన్యూ పాలనే కాదు.. ఇతర శాఖల పరిధిలోని సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలు కూడా కష్టతరమవుతుంది. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. – కె.గౌతమ్కుమార్, ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఆర్ఏలకు సంబంధించిన గణాంకాలివీ.. రాష్ట్రంలోని మొత్తం రెవెన్యూ గ్రామాలు: 10,416 మొత్తం వీఆర్ఏ పోస్టుల సంఖ్య: 23,046 విధుల్లో ఉన్న వీఆర్ఏలు: 21,434 డిగ్రీ, ఆపైన చదువుకున్నవారు: 2,909 ఇంటర్ విద్యార్హతలున్నవారు: 2,343 పదో తరగతి చదివినవారు: 3,756 పదో తరగతిలోపు చదువుకున్నవారు: 7,200 నిరక్షరాస్యులు: 5,226 విద్యార్హతలపై కిరికిరి? ► ఇతర శాఖలకు పంపే మాట అటుంచితే కేబినెట్ ఆమోదించిన విధంగా వీఆర్ఏల క్రమబద్ధీకరణ ప్రక్రియ సజావుగా సాగుతుందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వీరిని క్రమబద్ధీకరించే విషయంలో రెవెన్యూ ఉన్నతాధికారులు పెట్టిన నిబంధనలు చాలామందిని పేస్కేల్ నుంచి దూరం చేస్తాయనే వాదన వినిపిస్తోంది. రెవెన్యూ శాఖ సేకరించిన వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న వీఆర్ఏలలో కేవలం 9,008 మందికి మాత్రమే 10వ తరగతి, అంతకన్నా ఎక్కువ విద్యార్హతలున్నాయి. మిగిలిన 12,426 మంది వీఆర్ఏలు పదో తరగతి కన్నా తక్కువ చదువుకోగా, వీరిలో 5వేల మందికి పైగా నిరక్షరాస్యులు ఉన్నారు. ఒకవేళ విద్యార్హతలే క్రమబద్ధీకరణకు ప్రామాణికమైతే తగిన విద్యార్హతలు లేని వీఆర్ఏల కుటుంబాల్లో అర్హతలు ఉన్న వారికి ఉద్యోగాలివ్వాలని వీఆర్ఏల జేఏసీ, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) డిమాండ్ చేస్తున్నాయి. కానీ రెవెన్యూ వర్గాలు మాత్రం.. 10వ తరగతి కంటే తక్కువ విద్యార్హతలు ఉన్న మెజారిటీ వీఆర్ఏల విషయంలో ఏం నిర్ణయం తీసుకునేదీ స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. -
బీఆర్ఎస్కు కోకాపేటలో 11 ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని కోకాపేట గ్రామంలో 11 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం జరిగిన కేబినెట్ భేటీలో భూపరిపాలన శాఖ చేసిన ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించినట్టు తెలిసింది. ఈ భూమిలో ప్రజా నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలకు శిక్షణ ఇచ్చేందుకు ‘ఇన్స్టిట్యూట్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్’ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పేరిట చేసిన ప్రతిపాదన సముచితమేనని భూపరిపాలన శాఖ (రెవెన్యూ) పెట్టిన నోట్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ భూమిని హెచ్ఎండీఏ నుంచి స్వాధీనం చేసుకుని బీఆర్ఎస్కు కేటాయిస్తామని ఆ శాఖ పేర్కొంది. దీంతో సుమారు రూ.500 కోట్ల విలువైన భూమిని బీఆర్ఎస్ పేరిట బదలాయించడం లాంఛనమే కానుంది. అయితే, కేబినెట్ నిర్ణయాల ను వెల్లడించేందుకు ఆర్థిక మంత్రి హరీశ్రావు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ అంశాన్ని గోప్యంగా ఉంచడం, తమకు భూమిని కేటాయించాలని బీఆర్ఎస్ ప్రతిపాదించిన వారంరోజుల్లోనే రెవెన్యూశాఖ అంగీకారం తెలిపి మంత్రివర్గ సమావేశం ముందు నోట్ పెట్టడం, కేబినెట్ ఇందుకు ఆమోదం తెలిపిన విషయాన్ని రహస్యంగా ఉంచడం చర్చనీయాంశమవుతోంది. బీఆర్ఎస్ చేసిన ప్రతిపాదన ఇదే కేబినెట్ ముందు భూపరిపాలన శాఖ పెట్టిన నోట్ ప్రకారం ఈనెల 12న బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పేరిట భూకేటాయింపు కోసం ప్రతిపాదన వచ్చింది. ఈ భూమిలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ను ఏర్పాటు చేసి నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలకు వ్యక్తిత్వ వికాస శిక్షణ ఇస్తామని అందులో పేర్కొన్నారు. ఈ కేంద్రంలో కాన్ఫరెన్స్ హాళ్లు, లైబ్రరీ, శిక్షణ తీసుకునే వారికి వసతి, సెమినార్ రూమ్లు, విద్యావేత్తలకు పని ప్రదేశాలను ఏర్పాటు చేస్తామన్నారు. సామాజిక కార్యకర్తలు, ప్రజా నాయకుల అవసరాలను తీర్చేందుకు ఇదో ప్రతిష్టాత్మక కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. ఇందుకు కోకాపేటలోని 239, 240 సర్వే నంబర్లలో గల 11 ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్టుగానే.. బీఆర్ఎస్ ప్రతిపాదనను పరిశీలించిన భూపరిపాలన శాఖ కేబినెట్ ముందు సవివరంగా నోట్ పెట్టింది. హైదరాబాద్ జిల్లా తిరుమలగిరి మండలంలోని బోయిన్పల్లి గ్రామంలో ఉన్న 502, 503, 502/పీ2 సర్వే నంబర్లలోని 10 ఎకరాల 15 గుంటల భూమిని ఎకరం రూ.2 లక్షల చొప్పున అప్పట్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ)కి కేటాయించినట్టు ఈ నోట్లో పేర్కొంది. జాతీయస్థాయిలో మానవ వనరుల అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసేందుకు ఈ భూమిని కేటాయించినట్టు తెలిపింది. దీనిపై హైకోర్టు ఉత్తర్వుల మేరకు గత ఏప్రిల్ 28న ఆ భూమిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)కి పునర్కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పింది. ఈ పరిస్థితుల్లో ఏపీసీసీకి బోయిన్పల్లిలో భూమి ఇచ్చినట్టుగానే కోకాపేటలో బీఆర్ఎస్కు భూమి ఇవ్వడం సముచితమేనని భూపరిపాలన శాఖ ఆ నోట్లో స్పష్టం చేసింది. రూ.40 కోట్లకు...? ఈ భూమిని కేబినెట్ నిర్ణయించిన ధరకు బీఆర్ఎస్కు కేటాయిస్తామని భూపరిపాలన శాఖ నోట్లో పేర్కొంది. దీనిప్రకారం ఈ భూమి తమ పేరిట బదలాయించేందుకు బీఆర్ఎస్ పార్టీ మొత్తం రూ.40 కోట్లు చెల్లించేలా కేబినెట్ ఆమోదించినట్టు సమాచారం. దాదాపు రూ.500 కోట్ల విలువైన ఈ భూమిని రూ.40 కోట్లకు బీఆర్ఎస్కు బదలాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్న విషయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే జిల్లాల్లో పార్టీ కార్యాలయాల కోసం గజానికి రూ.100 చొప్పున మాత్రమే తీసుకుని విలువైన భూములను బీఆర్ఎస్ పేరిట బదలాయించుకున్నారని, హైదరాబాద్ జిల్లా కార్యాలయం కోసం బంజారాహిల్స్లో 4,935 చదరపు గజాల భూమిని నామమాత్రపు ధరకు సొంతం చేసుకున్నారని, ఇది బీఆర్ఎస్ భూదాహానికి నిదర్శనమనే విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి. -
ఓవైపు ధరణి.. మరోవైపు బట్వాడా సమస్యలు.. అధికారుల తీరు గిట్లుండాలే!
రాష్ట్రంలో భూముల లావాదేవీలు జరిగి నెలలు గడుస్తున్నా రైతులకు పట్టాదారు పాస్బుక్లు అందడం లేదు. ఇదేమిటని రెవెన్యూ కార్యాలయాలకు వెళితే తపాలా శాఖ ఆపేసిందని.. అక్కడికి వెళితే రెవెన్యూశాఖ నుంచి తమకు రానేలేదని చెప్తుండటంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అసలు వాస్తవం ఏమిటంటే.. లక్షల కొద్దీ పాస్బుక్కులు రెవెన్యూ కార్యాలయాల్లోనే గుట్టలుగా పడి ఉన్నాయి. వాటిని తపాలాశాఖ ద్వారా రైతులకు బట్వాడా చేసేందుకు సంబంధించిన చార్జీలను రెవెన్యూ శాఖ చెల్లించకపోవడమే దీనికి కారణం. పాస్బుక్ల ముద్రణ, బట్వాడా కోసం రైతుల నుంచే రూ.300 వసూలు చేస్తున్న రెవెన్యూ శాఖ.. తపాలా శాఖకు చార్జీలు చెల్లించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: భూముల రిజిస్ట్రేషన్లు అయ్యాయి.. పాస్బుక్ల ముద్రణ, తపాలా ద్వారా ఇంటికి చేర్చేందుకు బట్వాడా ఖర్చును రైతులు అప్పుడే రెవెన్యూ శాఖకు చెల్లించారు. కానీ నెలలు గడుస్తున్నా పాస్బుక్ మాత్రం చేతికి అందడం లేదు. ఒకరిద్దరు కాదు.. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది రైతులకు పాస్బుక్లు అందాల్సి ఉంది. ఎప్పుడో రైతుల ఇళ్లకు చేరాల్సి ఉన్న ఈ పాస్బుక్లు రెవెన్యూ శాఖ కార్యాలయాల్లోని బీరువాల్లో మూలుగుతున్నాయి. ఏప్రిల్ నుంచి ఇదే పరిస్థితి. ఇప్పటికే ధరణి సమస్యలు గందరగోళంతో రైతులు ఇబ్బంది పడుతుండగా.. ఇప్పుడు పాస్బుక్లు రాకపోతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. చెల్లింపులు లేక బకాయిలు.. వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన రైతుల నుంచి రిజిస్ట్రేషన్ సమయంలోనే రూ.300 చొప్పున రెవెన్యూ శాఖ వసూలు చేస్తోంది. ఆ మొత్తంతో పాస్బుక్ను ముద్రించి, తపాలా శాఖ ద్వారా రైతుల ఇళ్లకు పంపాల్సి ఉంటుంది. ఇందుకోసం రైతుల నుంచి వసూలు చేసిన సొమ్ములో ఒక్కో పాస్బుక్కు రూ.40 చొప్పున తపాలాశాఖకు చార్జీగా చెల్లించాలి. కానీ ఏడాది నుంచి ఈ చెల్లింపుల్లో రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం చూపుతోంది. తపాలా శాఖ పాస్బుక్లను ఠంచనుగా బట్వాడా చేస్తున్నా.. అందుకు సంబంధించిన చార్జీలను ఎప్పటికప్పుడు చెల్లించడం లేదు. అప్పుడప్పుడు ఎంతో కొంత మొత్తం ఇస్తూ వస్తోంది. దీనితో బకాయిలు రూ.3 కోట్ల వరకు చేరుకున్నాయి. చార్జీల సొమ్ము చెల్లించాలని తపాలా శాఖ ఎన్నిసార్లు కోరినా రెవెన్యూ శాఖ నుంచి స్పందన లేదు. అయినా ఇప్పుడు కాకున్నా తర్వాత అయినా డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో తపాలా అధికారులు బట్వాడాను కొనసాగిస్తూ వచ్చారు. ఆడిట్ అభ్యంతరాలతో.. ఇంతగా బకాయిలు పేరుకుపోతున్నా.. ఇంకా సేవలు ఎలా అందిస్తున్నారంటూ తపాలా శాఖను అంతర్గత ఆడిట్ అధికారులు ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తపాలా శాఖ బకాయిల వసూలుపై దృష్టిపెట్టింది. బకాయిలు చెల్లించకుంటే ఏప్రిల్ ఒకటి నుంచి బట్వాడా నిలిపేస్తామని రెవెన్యూ శాఖకు తేల్చి చెప్పింది. అయినా రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించలేదు. దీంతో తపాలాశాఖ ఏప్రిల్ ఒకటి నుంచి పాస్బుక్ల బట్వాడాను నిలిపేసింది. ఇకపై పాస్బుక్లను పంపవద్దని స్పష్టం చేసింది. అప్పటి నుంచి రెవెన్యూ కార్యాలయాల్లోనే లక్షల సంఖ్యలో పాస్బుక్లు పేరుకుపోయాయి. తప్పుడు సమాచారంతో అటూ ఇటూ.. పాస్బుక్కులు అందకపోవడంలో తప్పు తమది కాదని.. తపాలా శాఖనే దగ్గరపెట్టుకుని పంపటం లేదంటూ కొందరు అధికారులు తప్పుడు సమాచారం ఇస్తుండటంతో రైతులు పోస్టాఫీసులకు వెళ్తున్నారు. అసలు పాస్ పుస్తకాలు తమ వద్దకు రానేలేదని, రెవెన్యూ అధికారుల వద్దనే ఉంటాయని తపాలా సిబ్బంది స్పష్టం చేస్తుండటంతో మళ్లీ రెవెన్యూ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. ఇదంతా గందరగోళంగా మారిపోయింది. చార్జీల బకాయిలు, పాస్బుక్ల బట్వాడా నిలిపివేత అంశాలపై రెవెన్యూ, పోస్టల్ అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా.. స్పందించేందుకు నిరాకరించారు. ఇంతకు ముందు రవాణాశాఖలోనూ.. గతంలో డ్రైవింగ్ లైసెన్సుల విషయంలోనూ ఇదే తరహాలో ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. డ్రైవింగ్ లైసెన్స్ బట్వాడా కోసం వాహనదారుల నుంచి ఫీజులు వసూలు చేసిన రవాణాశాఖ.. తపాలా శాఖకు ఆ చార్జీలను చెల్లించలేదు. ఎన్నిసార్లు అడిగినా రవాణాశాఖ స్పందించకపోవటంతో.. గతేడాది తపాలా శాఖ డ్రైవింగ్ లైసెన్సుల బట్వాడాను నిలిపేసింది. అప్పట్లో ఆ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో.. రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పందించారు. ట్రాన్స్పోర్టు అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు బకాయిల్లోంచి దాదాపు రూ.కోటి వరకు చెల్లించేలా చర్యలు చేపట్టారు. దానితో తపాలా శాఖ బట్వాడాను పునరుద్ధరించింది. ఇప్పుడు రెవెన్యూ శాఖ వంతు వచ్చింది. -
‘చుక్కల’ చిక్కుల్లేవ్!
సాక్షి, అమరావతి: భూముల చరిత్రలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరో విప్లవాత్మక ముందడుగు వేసింది. రాష్ట్రంలో దశాబ్దాలుగా స్తంభించిపోయిన చుక్కల భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరించింది. ఒకేసారి 15 జిల్లాల్లో 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించి రైతన్నలకు ఊరట కల్పించింది. రెవెన్యూ శాఖ నిర్వహించిన సుమోటో వెరిఫికేషన్ ద్వారా రికార్డులన్నింటినీ పూర్తిగా పరిశీలించి చుక్కల నుంచి విముక్తి కల్పించింది. ‘‘22 ఏ (1) ఇ’’ నుంచి తొలగిస్తూ ఇప్పటికే 10 జిల్లాలకు సంబంధించిన జీవోలు జారీ కాగా మిగతావి త్వరలో వెలువడనున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 43 వేల ఎకరాల చుక్కల భూములకు విముక్తి లభించింది. ఈ భూములను రైతులు ఇక స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు. వాటిపై రుణాలు పొందేందుకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. లక్షల మంది రైతు కుటుంబాల్లో మానసిక వేదనను తొలగిస్తూ చుక్కల భూములకు విముక్తి కల్పించిన నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ సారథ్యంలో ఈ నెలలో భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భూముల సమస్యలపై స్పెషల్ ఫోకస్ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీర్ఘకాలంగా పేరుకుపోయిన భూముల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా అన్ని భూములను రీ సర్వే చేస్తోంది. షరతుల గల పట్టా భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించడంతో కృష్ణా జిల్లా అవనిగడ్డలో 18 వేల ఎకరాలకు సంబంధించి రైతులకు మేలు జరిగింది. అనాధీనం, ఖాళీ కాలమ్ భూముల సమస్యను పరిష్కరించేందుకు చట్టాన్ని మార్చింది. కృష్ణా, గోదావరి డెల్టాలోని లంక భూములకు డి పట్టాలిచ్చేందుకు నిబంధనలను సవరించింది. అదే క్రమంలో చుక్కల భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తోంది. నిషేధిత ఆస్తుల జాబితాలోని 22 ఏ (1) ఇ నుంచి చుక్కల భూములను తొలగించింది. నిబంధనలకు అనుగుణంగా ఆ భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాలని తొలుత జిల్లా కలెక్టర్లను ఆదేశించినా వివాదాలు, దళారుల కారణంగా అడుగు ముందుకు పడకపోవడంతో ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగింది. 1.81 లక్షల సర్వే నెంబర్ల రీ–వెరిఫికేషన్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్రంలో చుక్కల భూములన్నింటినీ సుమోటోగా రీ వెరిఫికేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు 2022 ఆగస్టు 22, 25వ తేదీల్లో జిల్లా కలెక్టర్లకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సాయిప్రసాద్ రెండు సర్క్యులర్లు జారీ చేశారు. చుక్కల భూములు కాకపోయినప్పటికీ 1908 రిజిస్ట్రేషన్ల చట్టం సెక్షన్ 22–ఏ (1)ఇ కింద నమోదు చేసిన భూములతోపాటు అసలు నిషేధిత జాబితాలో చేర్చకూడని వాటిని 22 ఏలో పొందుపరచిన కేసులపై ఒక నిర్ణయానికి రావాలని ఆదేశించారు. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా చుక్కల భూముల పేరుతో ఉన్న 4.06 లక్షల ఎకరాలను రెవెన్యూ యంత్రాంగం సుమోటోగా రీ వెరిఫికేషన్ చేసింది. ఆర్డీవోలు, తహశీల్దార్లు 1.81 లక్షల సర్వే నెంబర్లలోని 4.06 లక్షలపైగా ఎకరాలకు సంబంధించిన భూములను రీ వెరిఫికేషన్ చేశారు. రైతుల వద్ద ఉన్న డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ల శాఖ రికార్డులు, రెవెన్యూ శాఖ నిర్వహించే 10 (1) అకౌంట్, రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)లను క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఆ భూములకు సంబంధించి ఏవైనా కోర్టు ఉత్తర్వులుంటే వాటిని కూడా పరిగణలోకి తీసుకున్నారు. 2017లో చుక్కల భూముల చట్టం వచ్చే నాటికి ఆ భూమి 11 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కాలం సంబంధిత రైతు ఆధీనంలో ఉందో లేదో పరిశీలించారు. ఆర్ఎస్ఆర్ (రీ–సెటిల్మెంట్ రిజిష్టర్)లోని 16వ కాలమ్లో చుక్కల భూమిగా నిర్దేశించే కాలమ్ను పరిశీలించారు. వీటి ప్రకారం రికార్డుల్లో పేరు ఉన్నట్లు ధృవీకరించుకోవడంతోపాటు 11 ఏళ్లుగా సంబంధిత రైతు ఆధీనంలో భూమి ఉంటే 22 (ఏ)1 ఇ నుంచి తొలగించారు. అలాగే చుక్కల భూముల కేటగిరీ కిందకు రావని గుర్తించిన భూములను నిబంధనల ప్రకారం ఏ కేటగిరీలో చేర్చాలో అందులో (22ఏ (1) చేర్చారు. రైతులకు సర్వ హక్కులు నిషేధిత జాబితాలో ఉండడంతో ఈ భూముల రిజిస్ట్రేషన్లను ఇన్నాళ్లూ నిలిపివేశారు. పంట రుణాలు కూడా రావడంలేదు. తమ సమస్యను పరిష్కరించాలని రైతులు అధికారుల చుట్టూ తిరగడమే కానీ ఇన్నాళ్లూ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సమస్యలన్నింటికీ తెర దించుతూ చుక్కల భూముల సమస్యకు సీఎం వైఎస్ జగన్ ముగింపు పలికారు. రాష్ట్ర చరిత్రలో లక్షల ఎకరాల భూములకు విముక్తి కల్పించడం ఇదే తొలిసారి. ప్రణాళిక ప్రకారం చుక్కల భూముల సమస్యను పరిష్కరించి వాటికి విముక్తి కలిగించి లక్షల మంది రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపారు. దీనిద్వారా సంబంధిత రైతులకు తమ భూములపై సర్వ హక్కులు లభిస్తాయి. 15 ఏళ్ల అవస్థలు తీరాయి.. గ్రామంలో పూర్వీకులు నుంచి వచ్చిన 2.50 ఎకరాలు భూమిని 15 ఏళ్ల క్రితం రెడ్ మార్క్లో పెట్టారు. తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి అడిగితే చుక్కల భూమిగా నమోదైందని చెప్పారు. అప్పటి నుంచి పొలం అమ్ముకోవాలంటే రిజిస్టర్ కాకపోవడంతో ఎంతో ఇబ్బంది పడుతున్నా. సమస్య పరిష్కరించాలని చాలాసార్లు అధికారులకు అర్జీలిచ్చినా స్పందన లేదు. సీఎం జగన్ ప్రభుత్వం మా సమస్యను ఇంత సులభంగా పరిష్కరిస్తుందని అనుకోలేదు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. – జానపాటి అవులయ్య, వేములకోట, మార్కాపురం మండలం, ప్రకాశం జిల్లా ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.. 18 ఏళ్ల క్రితం సర్వే నెంబర్ 432–3, 4లో 2.30 ఎకరాల భూమి కొన్నాం. అప్పటి నుంచి అందులో సాగు చేసుకుంటున్నాం. 2015లో ఆ భూమికి సంబంధించిన పట్టాదార్ పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకుంటే చుక్కల భూమిగా నమోదైందని చెప్పారు. దీంతో విక్రయించేందుకు, బ్యాంకు రుణం పొందేందుకు వీలు లేకుండా పోయింది. ఎన్నోసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. ఇన్నాళ్లకు మా భూమిని చుక్కల నుంచి తప్పించినట్లు చెప్పారు. మేం కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించారు. ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం – నల్లగొర్ల మస్తానయ్య, మహిమలూరు, ఆత్మకూరు మండలం, నెల్లూరు జిల్లా చుక్కల భూములంటే? ఆంగ్లేయుల హయాంలో నిర్వహించిన రీ సర్వేలో కొందరు భూ యజమానులు సర్వేకు ముందుకు రాకపోవడం, భూమి ఎవరిదో నిర్థారించలేకపోవడంతో ఆర్ఎస్ఆర్–1లోని పట్టాదార్ కాలమ్, రిమార్క్స్ కాలమ్లో మూడు చుక్కలు పెట్టి వదిలేశారు. శిస్తు కట్ట లేని రైతులు సర్వేకు విముఖత చూపడంతో ఆ భూములు ఎవరివో రికార్డుల్లో నమోదు కాలేదు. ఇక ఆ తర్వాత మళ్లీ సర్వే జరగలేదు. రికార్డులు అలా చుక్కలతోనే ఉండడంతో వాటిని చుక్కల భూములుగా వ్యవహరిస్తున్నారు. -
రెవెన్యూ సమస్యలు పరిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) కోరింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్కుమార్ను కలిసి ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. సీఎస్ను కలిసిన వారిలో ట్రెసా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నిరంజన్రావు తదితరులు ఉన్నారు. -
ఆదాయం లేని ఆలయాలకు ఊరట
సాక్షి, అమరావతి: ఆదాయం తక్కువ ఉండే ఆలయాలపై అదనపు భారాలు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రూ.ఐదులక్షల లోపు ఆదాయం ఉండే గుళ్లు, ఇతర హిందూ ధార్మికసంస్థలు చట్టబద్ధంగా దేవదాయ శాఖకు చెల్లించాల్సిన వివిధ రకాల ఫీజుల నుంచి మినహాయింపునిచ్చింది. ఇందుకు సంబంధించి దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్లాల్ సోమవారం జిల్లాల దేవదాయ శాఖ అధికారులకు, డిప్యూటీ కమిషనర్లు, రీజనల్ జాయింట్ కమిషనర్లకు సూచనలు జారీచేశారు. అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నప్పటికీ.. కమిషనర్ ముందుగానే ఆయా ఆలయాల నుంచి ఆ తరహా ఫీజులను వసూలు చేయవద్దని సూచిస్తూ మెసేజ్ ఆదేశాలు జారీచేశారు. దేవదాయ శాఖ చట్టం ప్రకారం.. ఎన్నో ఏళ్ల నుంచి రాష్ట్రంలో రూ.రెండులక్షలకు పైగా ఆదాయం ఉన్న ఆలయాలు ఏటా కొంత మొత్తం దేవదాయ శాఖకు చెల్లించాలి. ఆదాయం తక్కువ ఉండే పురాతన ఆలయాల పునర్నిర్మాణంతో పాటు హిందూ ధార్మిక కార్యక్రమాలకు ఉద్దేశించిన కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్)కు ప్రతి ఆలయం తమ నికర ఆదాయంలో తొమ్మిది శాతం చొప్పున చెల్లించాలి. దేవదాయ శాఖ నిర్వహణ నిధికి మరో ఎనిమిది శాతం, ఆడిట్ ఫీజుగా 1.5 శాతం చొప్పున చెల్లించాలి. ఇటీవల రూ.ఐదులక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలను ఈ తరహా ఫీజులు వసూలు నుంచి మినహాయించే విషయం పరిశీలించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. హైకోర్టు సూచనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఫీజు మినహాయింపునకు ఆదాయ పరిమితిని ఏటా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచింది. 95 శాతం ఆలయాల ఆదాయం రూ.ఐదులక్షల లోపే.. రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలో మొత్తం 24,699 గుళ్లు, ఇతర హిందూ ధార్మికసంస్థలు ఉన్నాయి. వీటిలో ఏటా రూ.ఐదులక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలు 23,465 ఉన్నాయి. అంటే దేవదాయ శాఖ పరిధిలోని మొత్తం గుళ్లలో ఏటా రూ.ఐదులక్షల లోపు నికర ఆదాయం ఉండే ఆలయాలే 95 శాతం. రూ.ఐదులక్షల లోపు ఆదాయం ఉన్న వాటిలో 4,131 ఆలయాలు మాత్రమే దేవదాయ శాఖ కార్యనిర్వహణాధికారుల (ఈవోల) పర్యవేక్షణలో ఉన్నాయి. ఫీజు మినహాయింపునకు ఆదాయ పరిమితి పెంపుతో కొత్తగా 1,254 ఆలయాలకు లబ్ధికలుగుతుందని అధికారులు తెలిపారు. ఈ ఆలయాలు ఏటా రూ.7.31 కోట్ల వరకు ప్రయోజనం పొందే అవకాశం ఉందని వెల్లడించారు. అర్చకుల జీతభత్యాలకు వెసులుబాటు.. రూ.ఐదులక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలను దేవదాయ శాఖ చట్టబద్ధంగా చెల్లించాల్సిన ఫీజుల నుంచి మినహాయింపు ఇస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల ఆయా ఆలయాల్లో పనిచేసే అర్చకుల జీతాలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నిర్ణయం అమలుకు కృషిచేస్తున్న అందరికీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయబాబు కృతజ్ఞతలు తెలిపారు. -
రెవెన్యూలో క్రమశిక్షణ కొరడా
సాక్షి, అమరావతి: రెవెన్యూ శాఖలో అక్రమార్కులపై గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉన్నతాధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. విచారణలో తప్పు చేసినట్లు తేలితే భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది తహసీల్దార్లపై ఈ తరహా చర్యలు తీసుకోవడం సంచలనం సృష్టించింది. ఇద్దరు తహసీల్దార్లను ఏకంగా సర్వీసు నుంచి తొలగించారు. ఐదుగురు తహసీల్దార్లకు డిప్యూటీ తహసీల్దార్లుగా రివర్షన్ ఇచ్చారు. మరొకరికి కంపల్సరీ రిటైర్మెంట్ ఇవ్వగా ఇంకో ముగ్గురికి ఇక్రిమెంట్లలో కోత విధించారు. భూముల వ్యవహారాల్లో అక్రమాలు చేస్తే.. తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండల తహసీల్దార్ సీహెచ్ శ్రీదేవికి నాలుగు రోజుల క్రితం డిప్యూటీ తహసీల్దార్గా రివర్షన్ ఇచ్చారు. 2017లో ఆమె పెద్దపంజాణి మండల తహసీల్దార్గా ఉన్నప్పుడు ముత్తుకూరు గ్రామంలో 350 ఎకరాల అటవీ శాఖ భూమిలో ప్రైవేటు వ్యక్తులకు పట్టాలిచ్చారు. అక్కడి నుంచి బదిలీ అయ్యి రిలీవైన తర్వాత రోజు వెబ్ ల్యాండ్లో ఈ మార్పులు చేయించినట్లు తేలింది. ఆమెకు సహకరించిన పెద్దపంజాణి వీఆర్వో డి.శ్రీనివాసులను సైతం పూర్తిగా విధుల నుంచి తొలగించారు. వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె తహసీల్దార్ ఈశ్వరయ్య అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో సర్వీసు నుంచి తొలగించారు. 2017లో ఆయన అట్లూరు మండల తహసీల్దార్గా ఉన్నప్పుడు వందల ఎకరాల భూముల రికార్డులను తారుమారు చేసినట్లు రుజువైంది. ఒక వీఆర్వో భార్య పేరు మీద కోట్ల రూపాయల విలువైన భూముల్ని మార్చినట్లు విచారణలో తేలడంతో విదుల నుంచి శాశ్వతంగా తొలగించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ తహసీల్దార్ డి.చంద్రశేఖర్ను శాశ్వతంగా డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకి రివర్షన్ చేశారు. అనంతపురం జిల్లా పుట్లూరు తహసీల్దార్ పి.విజయకుమారి, అదే జిల్లాకు చెందిన మరో తహసీల్దార్ పీవీ రమణకు రివర్షన్ ఇచ్చారు. ప్రకాశం జిల్లాకు చెందిన తహసీల్దార్ డీవీబీ వరకుమార్కు సీనియర్ అసిస్టెంట్గా రివర్షన్ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తహసీల్దార్లు టి.రామకృష్ణ, కె.శ్రీని వాసరావు, ఏలూరు జిల్లాకు చెందిన తహసీల్దార్ పి రాకడమణికి ఇంక్రిమెంట్లలో కోత పెట్టారు. చితూ ్తరు జిల్లాకు చెందిన మరో తహసీల్దార్ నరసింహులకు కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చారు. ఇలాంటి వ్యవహారాల్లో ఒక డిప్యూటీ సర్వేయర్, మరో టైపిస్ట్పైనా చర్యలు తీసుకున్నారు. గతంలోలాగా కాకుండా.. గతంలో అక్రమాలు బయట పడితే సస్పెండ్ చేసి వదిలేసేవారు. దీంతో మళ్లీ పోస్టింగ్ తెచ్చుకుని ఏమీ జరగనట్లు పనిచేసేవారు. ఆ అక్రమాలపై తదుపరి విచారణ ఏళ్ల తరబడి కొనసాగేది. చివరికి వాటి నుంచి ఎలాగోలా బయటపడి క్లీన్చిట్ తెచ్చుకునేవాళ్లు. కానీ ఇప్పుడు అక్రమాలు నిజమని తేలితే ఊహించని విధంగా చర్య తీసుకుంటుండటంతో రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు వణికిపోతున్నారు. రివర్షన్ అనే పదం ఇప్పుడు రెవెన్యూ వర్గాల్లో గుబులు రేపుతోంది. పెండింగ్లో ఉన్న వి చారణలు త్వరితగతిన పూర్తి చేసేలా తమ శాఖ వి జిలెన్స్ విభాగాన్ని సీసీఎల్ఏ సాయిప్రసాద్ పరుగులు పెట్టిస్తున్నారు. తాము ఏం చేసినా చెల్లుతుందనే రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు తాజా ఘటనలతో అక్రమాలు అంటేనే ఉలిక్కిపడుతున్నారు. -
సర్వే సెటిల్మెంట్ శాఖ పునర్వ్యవస్థీకరణ
సాక్షి, అమరావతి: 50 ఏళ్ల తర్వాత రాష్ట్రంలోని సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డుల శాఖను ప్రభుత్వం పునర్వ్యస్థీకరించింది. కింది నుంచి పైస్థాయి వరకు కేడర్ పోస్టుల్ని అప్గ్రేడ్ చేయడంతోపాటు పలు విభాగాలకు సంబంధించి కీలకమైన మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 1971లో సర్వే శాఖ పునర్వ్యవస్థీకరణ జరిగింది. అప్పటి నుంచి పదోన్నతుల ఛానల్ లేకపోవడంతో నియమితులైన వారంతా ఒకే కేడర్లో ఏళ్ల తరబడి పనిచేసి రిటైర్ అవుతున్నారు. తాజాగా.. వైఎస్ జగన్ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా భూముల రీసర్వేను చేపట్టడంతో సర్వే శాఖ ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగి పని విధానం పూర్తిగా మారిపోయింది. మరోవైపు.. గ్రామ సచివాలయ వ్యవస్థలో 11,158 మంది గ్రామ సర్వేయర్లను నియమించడంతో సర్వే శాఖ మరింత క్రియాశీలకంగా మారింది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పేరుతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న భూముల రీ సర్వే, వాటి సేవల స్వరూపం పూర్తిగా మారిపోవడం, సర్వే అవసరాలు పెరగడం, భూసేకరణ, భూముల సబ్ డివిజన్ వంటి పనులు గతం కంటే పూర్తిగా మారిపోయిన నేపథ్యంలో సర్వే శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. పూర్తిస్థాయిలో పర్యవేక్షణ, తనిఖీ వ్యవస్థ ఉండేలా పునర్వ్యవస్థీకరించింది. పర్యవేక్షణాధికారులుగా మండల సర్వేయర్లు మండల స్థాయి నుంచి డివిజన్, డివిజన్ నుంచి జిల్లా, జిల్లా నుంచి రీజినల్ స్థాయి వరకు 410 పోస్టుల్ని అప్గ్రేడ్ చేశారు. ప్రస్తుతం జిల్లా స్థాయిలో అసిస్టెంట్ డైరెక్టర్ కేడర్ పోస్టు ఉండేది. దాన్ని డిప్యూటీ డైరెక్టర్ హోదాకు పెంచారు. రీజినల్ స్థాయిలో ఉన్న డిప్యూటీ డైరెక్టర్ పోస్టులను జాయింట్ డైరెక్టర్ హోదాకు పెంచారు. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు అన్ని పోస్టుల్ని అప్గ్రేడ్ చేశారు. మండల స్థాయిలో కొద్దికాలం క్రితం వరకు మండల సర్వేయర్లే ప్రారంభ ఉద్యోగులు. గ్రామ సర్వేయర్లు రావడంతో ఇప్పుడు వారు ప్రారంభ ఉద్యోగులయ్యారు. దీంతో మండల సర్వేయర్ పోస్టు పర్యవేక్షణాధికారి పోస్టుగా మారింది. గతంలో మండల సర్వేయర్లను పర్యవేక్షించేందుకు డివిజన్ స్థాయిలో ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఉండేవారు. ఇప్పుడు గ్రామ సర్వేయర్లందరికీ మండల సర్వేయర్ పర్యవేక్షణాధికారిగా మారారు. దీనికి అనుగుణంగా మండల సర్వేయర్ పోస్టును మండల ల్యాండ్ సర్వే అధికారిగా మార్చారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సర్వేయర్లు, అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా ఏపీ సర్వే శిక్షణ అకాడమీని ఏపీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియో డెశీ అండ్ జియో ఇన్ఫర్మ్యాటిక్స్గా మార్చారు. సెంట్రల్ సర్వే కార్యాలయాన్ని సెంట్రల్ సర్వే ఆఫీస్ అండ్ జియో స్పేషియల్ వింగ్గా మారుస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. -
Telangana VRAs Pay Scale Issue: పది పాసైతేనే పేస్కేల్!
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) పేస్కేల్ అంశాన్ని పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. వీఆర్ఏల విద్యార్హతలను పరిగణనలోకి తీసుకోవాలని.. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన వీఆర్ఏలకు పేస్కేల్ ఇవ్వాలని, మిగతా వారందరికీ గౌరవ వేతనంతోనే సరిపెట్టాలనే ప్రతిపాదన సిద్ధమైందని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఫైల్పై సీఎం సంతకం పెట్టడమే తరువాయి అని పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో దాదాపు 25 వేల మంది వీఆర్ఏలు పనిచేస్తుండగా.. అందులో 3–6 తరగతుల మధ్య, 7–9 తరగతుల మధ్య, పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారి వివరాలను రెవెన్యూ శాఖ సేకరించింది. ఇదే సమయంలో 1 నుంచి 9వ తరగతి వరకు.. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారి వివరాలనూ తీసుకుంది. ఈ కేటగిరీల మేరకు పదో తరగతి, ఆపై చదివినవారు 5 వేల మంది వరకు ఉంటారని, వారికి పేస్కేల్ ఇచ్చే అవకాశం ఉందని అంచనా. రెవెన్యూ సంఘాలు ఈ ప్రతిపాదనల విషయంగా ఉన్నతాధికారులను సంప్రదించినా.. విద్యార్హతల ఆధారంగా ప్రతిపాదనలు పంపుతున్నామని, తుది నిర్ణయం ముఖ్యమంత్రిదేనని పేర్కొన్నట్టు తెలిసింది. పోస్టింగ్ ఎక్కడెక్కడ? రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలలో ఎంత మందిని ఏయే శాఖలకు పంపుతారనే దానిపై రెవెన్యూ వర్గాల్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. అందరినీ రెవెన్యూ శాఖలోనే కొనసాగిస్తారని.. అయితే డిప్యూటేషన్పై ఇతర శాఖలకు పంపుతారనే వాదన ప్రధానంగా వినిపిస్తోంది. అలాకాకుండా పేస్కేల్ వర్తించేవారు, డైరెక్ట్ రిక్రూటీలను మాత్రమే రెవెన్యూలో కొనసాగించి.. మిగతా వారిని వివిధ శాఖలకు పంపుతారనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు డైరెక్ట్ రిక్రూటీలలో కొందరిని వ్యవసాయశాఖకు కూడా పంపే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని అధికారులు అంటున్నారు. గౌరవ వేతనం కేటగిరీలోకి వచ్చే వీఆర్ఏలను ప్రభుత్వం తన అవసరాలను బట్టి వివిధ శాఖల్లో ఉపయోగించుకుంటుందని, ఈ మేరకు నీటిపారుదల శాఖలోకి లష్కర్లుగా వెళ్లేవారికి గౌరవ వేతనమే ఉంటుందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. అంతా గప్చుప్గా..! వీఆర్ఏలు, వీఆర్వోల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై నోరు మెదిపేందుకు ఉన్నతాధికారులెవరూ ముందుకు రావడం లేదు. సీసీఎల్ఏ అధికారులను ఎప్పుడు అడిగినా.. తమకేం తెలియదంటూ దాటవేస్తున్నారని, కనీసం ఏం జరుగుతుందో కూడా చెప్పడం లేదని వీఆర్ఏల సంఘాలు వాపోతున్నాయి. మరోవైపు కొన్ని వీఆర్ఏ సంఘాలు ఈనెల 23న పేస్కేల్ కోసం సీసీఎల్ఏ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఇప్పుడే వీఆర్ఏ పేస్కేల్ అంశం పరిష్కారం కావాలని.. లేకుంటే ఎన్నికల సమయం వరకు ఆగాల్సిన పరిస్థితి నెలకొంటుందనే ఆందోళన వీఆర్ఏలలో కనిపిస్తోంది. ఐదేళ్లుగా నాన్చుడే.. అర్హతల మేరకు సర్వీసు క్రమబద్ధీకరణ, డ్యూటీ చార్ట్, పేస్కేల్ ఇస్తామని సీఎం స్పష్టంగా మూడుసార్లు ప్రకటించారు. దేవుడు వరమిచ్చినా పూజారి అనుగ్రహించ నట్టు.. అధికారులు మా సమస్యను ఐదేళ్లుగా నాన్చుతున్నారు. డైరెక్ట్ రిక్రూటీలకు వీలైనంత త్వరగా న్యాయం చేస్తారన్న నమ్మకం ఉంది. – రమేశ్ బహదూర్, వీఆర్ఏ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆందోళన బాట వీడం న్యాయమైన మా సమస్యను పరిష్కరించాలని అధికారులను వేడుకుంటున్నాం. వేల మంది వీఆర్ఏలకు సంబంధించిన అంశాన్ని వీలైనంత త్వరగా సానుకూలంగా పరిశీలించాలి. ఈనెల 23న సీసీఎల్ఏ వద్ద నిరసన చేపడతాం. అవసరమైతే సమ్మెలోకి వెళ్తాం. – వెంకటేశ్ యాదవ్, వీఆర్ఏ అసోసియేషన్ కార్యదర్శి -
అన్ని శాఖలకు తల్లి.. రెవెన్యూ శాఖ
సాక్షి, అమరావతి: అన్ని శాఖలకూ రెవెన్యూ శాఖ తల్లి వంటిదని, దీనిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కొత్త కార్యాలయాన్ని మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో బుధవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సీసీఎల్ఏ కార్యదర్శి ఎ.బాబు, సంయుక్త కార్యదర్శులు గణేష్కుమార్, తేజ్ భరత్, సీఎంఆర్వో (కంప్యూటరైజేషన్ ఆఫ్ ఎంఆర్వో ఆఫీసెస్) ప్రాజెక్ట్ డైరెక్టర్ పనబాక రచన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి తదితరులు మంత్రి ధర్మాన ప్రసాదరావును సన్మానించారు. -
లక్ష్య సాధనకు అనుగుణంగా పనిచేస్తా
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యసాధనకు అనుగుణంగా పనిచేస్తానని రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. సచివాలయంలోని ఐదో బ్లాకులోని తన చాంబర్లో బుధవారం ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బ్రిటీషర్లు సర్వే చేశాక 75 సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం భూముల సమగ్ర సర్వే నిర్వహించలేకపోయిందన్నారు. తమ ప్రభుత్వం అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తూ పెద్దఎత్తున భూ సర్వే నిర్వహించడం ద్వారా టైటిల్ ఫ్రీ చేయడం ద్వారా భూ యాజమాన్య హక్కులను అందరికీ బదిలీ చేయడం జరుగుతోందన్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ–స్టాంపులకు అనుమతిచ్చే ఫైలుపై తొలి సంతకం చేశారు. కాగా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ్, సీసీఎల్ఏ జి.సాయిప్రసాద్, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి,రామకృష్ణ తదితరులు మంత్రికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. -
వీఆర్వోలకు గ్రేడింగ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)ను గ్రేడింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండలాల వారీగా వారి వివరాలను పంపాలని కోరుతూ సీఎస్ సోమేశ్కుమార్ శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు సమాచారం పంపారు. ప్రత్యేక ఫార్మాట్లో ఆదివారం మధ్యాహ్నంకల్లా వివరాలు పంపాలని.. ఆయా మండలాల తహసీల్దార్లు తమ పరిధిలోని వీఆర్వోలకు గ్రేడింగ్ ఇవ్వాలని సూచించారు. వీఆర్వో పనిచేస్తున్న మండలం, క్లస్టర్, ఉద్యోగి ఐడీ నంబర్, స్వగ్రామం, పాత జిల్లా, ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారు, ఎప్పటినుంచి పనిచేస్తున్నారు, చివరగా పనిచేసిన మూడు ప్రాంతాలు, పుట్టినతేదీ, వీఆర్వోగా రిక్రూటైన తేదీ, రిటైర్మెంట్ తేదీ, వీఆర్వోగా నియామకమైన పద్ధతి, కులం, రిజర్వేషన్, మొబైల్ నంబర్తోపాటు సదరు వీఆర్వోకు ఏ/బీ/సీ/డీ గ్రేడింగ్ ఇస్తూ వివరాలు పంపాలని ఆదేశించారు. సస్పెన్షన్లో ఉన్న, దీర్ఘకాలికంగా సమాచారం లేకుండా సెలవులో ఉన్న వారి వివరాలనూ పంపాలన్నారు. 15 ఇతర శాఖల్లో సర్దుబాటు! రెవెన్యూ శాఖ పరిధిలోని వీఆర్వోలను 15 శాఖల్లో సర్దు బాటు చేసేందుకే వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోందని అధికారవర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో 5,384 మంది వీఆర్వోలు పనిచేస్తుండగా.. అందులో 1,300 మంది వరకు నేరుగా రిక్రూటైనవారు ఉన్నారు. వారిని రెవెన్యూశాఖలో కొనసాగించి మిగతావారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తారా? అందరినీ ఇతర శాఖలకే పంపుతారా అన్న దానిపై చర్చ జరుగుతోంది. ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు గాను వీఆర్వోలను ఆప్షన్లు అడుగుతారనే ప్రచారమున్నా.. అది సాధ్యం కాకపోవచ్చని, ప్రభుత్వమే అవసరాలకు అనుగుణంగా ఇతర శాఖలకు పంపేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. కాగా.. వీఆర్వోల విషయంగా ప్రభుత్వం ఒక అడుగు వేయడంతో.. తమ పేస్కేల్, పదోన్నతుల సమస్యకు కూడా త్వరలో పరిష్కారం లభించవచ్చని గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) ఆశిస్తున్నారు. -
కొత్త జిల్లాల రెవెన్యూ డివిజన్లలో స్వల్ప మార్పులు
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. ప్రకాశం, పల్నాడు, సత్యసాయి జిల్లాలకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్లను సవరిస్తూ తాజాగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ బుధవారం సవరణ నోటిఫికేషన్లు ఇచ్చారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. ► ప్రకాశం జిల్లా ఒంగోలు రెవెన్యూ డివిజన్లోని మర్రిపూడి, పొన్నలూరు మండలాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్న కనిగిరి డివిజన్లో కలిపారు. కనిగిరి డివిజన్లో ఉన్న ముండ్లమూరు, తల్లూరు మండలాలను ఒంగోలు డివిజన్లో చేర్చారు. ► నర్సరావుపేట కేంద్రంగా ప్రతిపాదించిన పల్నాడు జిల్లాలోని గురజాల డివిజన్లో 14 మండలాలను 10 మండలాలకు తగ్గించారు. గురజాల డివిజన్లో ప్రతిపాదించిన పెదకూరపాడు, అచ్చంపేట, క్రోసూరు, అమరావతి మండలాలను నర్సరావుపేట డివిజన్కు మార్చారు. ప్రస్తుతం ఇవి గుంటూరు డివిజన్లో (పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనకు ముందు) ఉన్నాయి. దీంతో నర్సరావుపేట డివిజన్లో మండలాల సంఖ్య 18కి చేరింది. ► కొత్తగా ఏర్పాటు చేస్తున్న సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి డివిజన్లో ప్రతిపాదించిన 12 మండలాలను 8 మండలాలకు తగ్గించారు. కదిరి, తలుపుల, నంబులపూలకుంట్ల, గాండ్లపెంట మండలాలను కదిరి డివిజన్లోకి మార్చారు. ఈ నాలుగు మండలాలు పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనకు ముందు కదిరి డివిజన్లో ఉన్నాయి. ► చిత్తూరు జిల్లాలో కొత్తగా ప్రతిపాదించిన పలమనేరు డివిజన్లోని రొంపిచర్ల మండలాన్ని చిత్తూరు రెవెన్యూ డివిజన్లో కలిపారు. -
AP: సెలవైనా.. శరవేగంగా
సాక్షి, అమరావతి: కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులకు జీతాలు చెల్లించేలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ట్రెజరీ కార్యాలయాలు సెలవు రోజైన ఆదివారం సైతం శరవేగంగా బిల్లుల ప్రాసెస్ నిర్వహించాయి. ఆర్థికశాఖ ఆదేశాలతో ప్రత్యక్షంగా కలెక్టర్లే రంగంలోకి దిగి ఉద్యోగులు, పెన్షనర్ల బిల్లుల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. సోమవారం నెలాఖరు కావడంతో సాయంత్రం కల్లా పూర్తి చేసేలా అన్ని జిల్లాల్లో ప్రాసెస్ జరుగుతోంది. శని, ఆదివారం అర్ధరాత్రి వరకు ట్రెజరీ ఉద్యోగులు బిల్లులను అప్లోడ్ చేశారు. ట్రెజరీల్లో సుమారు 2 లక్షల బిల్లులు కొత్త పీఆర్సీ ప్రకారం సిద్ధమైనట్లు తెలుస్తోంది. పే అండ్ అకౌంట్స్లో 50 వేల బిల్లులను అధికారులు ప్రాసెస్ చేశారు. ఆర్థికశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో బిల్లులు సిద్ధం చేస్తున్నారు. నేటి నుంచి పెన్షనర్ల బిల్లులను ఉద్యోగులు సిద్ధం చేయనున్నారు. కాగా, 1వ తేదీ వరకు ఉద్యోగులకు కొత్త జీతాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖ సన్నద్ధమవుతుంది. కొత్త జీతాలతో వాస్తవాలు వెల్లడి.. కొత్త పీఆర్సీ ప్రకారం పెరిగిన జీతాలను అందుకోవడం ద్వారా ఉద్యోగులు వాస్తవాలను అర్థం చేసుకుంటారని ప్రభుత్వం భావిస్తోంది. అందరి జీతాలు పెరిగాయని స్పష్టం చేయాలన్నదే ప్రభుత్వ తాపత్రయం. అందుకనే శరవేగంగా జీతాల బిల్లుల ప్రాసెస్ చేపట్టింది. కొన్ని రాజకీయ శక్తులు పన్నిన కుట్రలకు ఉద్యోగులు బలి కాకుండా కాపాడుకుంటూ నిజం ఏమిటో తెలియజేసేలా చర్యలు చేపట్టింది. జీతాలు తగ్గుతాయన్న ఆరోపణల్లో నిజం లేదని నిరూపించనుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగులు, పెన్షనర్లకు చెందిన మొత్తాలను ఫిబ్రవరి 1 నాటికి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీనికి అడ్డుపడే వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని గట్టి సంకేతాలనిచ్చింది. విజయనగరంలో ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించిన డీడీవోలకు మెమోలిచ్చారు. తమ ఎత్తుగడలు పారవనే కొన్ని సంఘాలు ఉద్దేశపూర్వకంగా జీతాల బిల్లుల ప్రాసెస్ పనులకు అడ్డుపడుతున్నట్లు తెలిసింది. విజయనగరంలో మెమోలు విజయనగరం జిల్లాలో జనవరి వేతనాల ప్రక్రియ పనులను చేపట్టకుండా కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు అడ్డుకున్నారు. ఆర్థిక శాఖ ఆదేశాలను అమలు చేయని 175 మంది డీడీవోలకు జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి మెమోలు జారీ చేశారు. జిల్లా కేంద్రంలో ట్రెజరీ ప్రధాన కార్యాలయానికి అనుసంధానమైన 177 కార్యాలయాల సిబ్బందికి సంబంధించిన డీడీవోల వివరాలను సేకరించారు. 2 విభాగాల నుంచి మాత్రమే వేతనాల పనులను పూర్తి చేయగా మిగిలిన 175 శాఖల డీడీఓలు ప్రారంభించలేదని గుర్తించి వారందరికీ మెమోలను జారీ చేశారు. సోమవారం కూడా సమయం ఉన్నందున బిల్లుల ప్రాసెస్ జరిగేలా చర్యలు చేపట్టారు. చిత్తూరులో సజావుగా.. చిత్తూరు జిల్లాలో కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్లకు బిల్లుల చెల్లింపు జరిగేలా కలెక్టర్ హరినారాయణన్ పర్యవేక్షించారు. జిల్లా ట్రెజరీ కార్యాలయం, 17 సబ్ ట్రెజరీ కార్యాలయాలు ఆదివారం పనిచేసినట్లు చెప్పారు. అలసత్వం వహిస్తే చర్యలుంటాయని హెచ్చరించామన్నారు. ఉత్తర్వులు పాటించాల్సిందే.. ప్రకాశం జిల్లాలో అన్ని శాఖల డీడీవోలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పని చేయాలని ఆదేశించినట్లు కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. అన్ని శాఖల హెచ్ఓడీలు, జిల్లా అధికారులకు డీడీవోలతో పని చేయించాలని, లేనిపక్షంలో మెమోలు జారీ చేయాలని ఆదేశించామన్నారు. పనిచేయని డీడీవోలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఉత్తరాంధ్రలో వేగంగా.. విశాఖపట్నం జిల్లాలో బిల్లుల ప్రక్రియను సోమవారం నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, డీఆర్వో శ్రీనివాసమూర్తి తెలిపారు. మొత్తం 1,299 మంది డీడీవోలుండగా ఇప్పటి వరకు 227 మంది వేతన బిల్లుల ప్రక్రియను ప్రారంభించారన్నారు. 39 మంది డీడీవోలు తమ పనిని పూర్తి చేశారు. మిగిలిన ప్రక్రియ సోమవారం పూర్తి కానుంది. పనిచేయని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి డీడీఓలు 1,068 మంది ఉండగా ఇప్పటివరకు 180 మంది బిల్లుల పని ప్రారంభించారు. వీరిలో 31 మంది పూర్తి చేశారు. ఉభయ గోదావరిలో రెండు రోజులుగా.. పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా 15 సబ్ ట్రెజరీల్లో 145 మంది ట్రెజరీ ఉద్యోగులు విధుల్లో పాల్గొని పోలీసు, అగ్నిమాపక, ట్రెజరీ, విజలెన్స్, ఏసీబీ తదితర విభాగాల్లో 1,200 మంది ఉద్యోగుల బిల్లులను ప్రాసెస్ చేశారు. 26,800 మంది పింఛనుదారుల బిల్లులను సైతం ప్రాసెస్ చేసినట్టు అధికారులు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ట్రెజరీతో పాటు సబ్ ట్రెజరీల్లో రెండు రోజులుగా పోలీసు, ఏపీఎస్పీ, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, న్యాయశాఖ ఉద్యోగుల జీతాల బిల్లులు 8 వేల వరకు పూర్తి చేశారు. పెన్షన్లకు సీఎఫ్ఎంఎస్ ద్వారా ఆన్లైన్ వెరిఫికేషన్ పూర్తి చేశారు. ఆదేశాలను కచ్చితంగా పాటిస్తాం గుంటూరు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలను ఖాతాల్లో జమ చేసే పనిలో ఖజానా శాఖ ఉద్యోగులు నిమగ్నమయ్యారు. జిల్లాలోని 17 సబ్ ట్రెజరీ కార్యాలయాలతోపాటు కలెక్టరేట్లోని ఖజానా కార్యాలయంలోనూ విధులు నిర్వహిస్తున్నట్లు ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి.రాజగోపాలరావు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1కల్లా జిల్లాలోని 39 వేల మంది పెన్షనర్ల ఖాతాల్లోకి నగదు మొత్తం జమ అవుతుందన్నారు. జిల్లాలో 35,706 మంది ఉద్యోగులకు సంబంధించిన ప్రాసెస్ జరుగుతున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలో డీడీవోలు 50 బిల్లులను ప్రాసెస్ చేశారని కలెక్టర్ నివాస్ తెలిపారు. జిల్లాలో మొత్తం 1,283 డీడీవోల పరిధిలో 34,346 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు 16,392 మంది ఉద్యోగులకు సంబంధించి ప్రాసెస్ చేసినట్లు చెప్పారు. అనంత, కర్నూలు, నెల్లూరుల్లోను.. అనంతపురం జిల్లాలో ట్రెజరీ ఉద్యోగులు ఆదివారం కూడా విధులకు హాజరయ్యారు. ప్రభుత్వ ఆదేశాలతో డీడీఓలు, ఎస్టీఓలు విధుల్లోకి వచ్చారు. కర్నూలు జిల్లాలో జనవరి నెల వేతనాలను కొత్త పీఆర్సీ ప్రకారం బిల్లులు పంపాలని అన్ని శాఖల డీడీవోలను ఆదేశించినట్టు కలెక్టర్ పి.కోటేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు పోలీసు శాఖ నుంచి బిల్లులు రాగా ట్రెజరీ అధికారులు ప్రాసెస్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పలు శాఖలకు చెందిన 200 మంది డీడీవోలు జనవరి జీతాల బిల్లులను సిద్ధం చేసి ట్రెజరీకి పంపినట్టు కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు చెప్పారు. మిగతావి కూడా సిద్ధమవుతున్నాయని, సోమవారం వరకు అవకాశం ఉన్నందున మోమోలు ఇవ్వలేదని చెప్పారు. -
యాదాద్రికి రూ.50 లక్షల విరాళం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం కోసం సుంకిశాల దేవస్థానం వ్యవస్థాపకుడు పైళ్ల మల్లారెడ్డి రూ.50 లక్షల విరాళం ఇచ్చారు. శుక్రవారం ఆయన దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిని హైదరాబాద్లో కలసి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ఇటీవల యాదాద్రి ఆలయాన్ని సందర్శించినట్లు తెలిపారు. యాదాద్రి దేశంలోనే గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటోందన్నారు. -
మద్యంపై పన్ను తగ్గింపు
సాక్షి, అమరావతి: తెలంగాణ సహా పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యాన్ని అరికట్టడానికి, నాటు సారా తయారీని నిరోధించడానికి ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో మద్యంపై పన్ను రేట్లను తగ్గించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వ్యాట్, ఏక్సైజ్ డ్యూటీ, స్పెషల్ మార్జిన్లను తగ్గించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మద్య నియంత్రణలో భాగంగా మద్యం వినియోగం తగ్గించడానికి ధరలను ప్రభుత్వం గతంలో పెంచిన విషయం తెలిసిందే. దీంతో కొందరు ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని తెచ్చి విక్రయిస్తున్నారు. నాటు సారా తయారు చేస్తున్నారు. ఈ రెండింటినీ కట్టడి చేయడానికి మద్యం మీద పన్ను రేట్లను తగ్గించారు. దీనివల్ల అన్ని రకాల మద్యం బ్రాండ్లపై 15 నుంచి 20 శాతం మేర ధరలు తగ్గుతాయి. ప్రస్తుతం రూ.200 ఉన్న మద్యం బాటిల్.. సవరించిన రేట్ల ప్రకారం రూ.150కు లభించే అవకాశం ఉంది. అదే విధంగా అన్ని రకాల బీర్లపై రూ.20 మేర ధరలు తగ్గనున్నాయి. అయినప్పటికీ, తెలంగాణ రాష్ట్రంకన్నా 10 శాతం అదనంగా మద్యం ధరలు ఉంటాయి. -
AP: క్లియర్ టైటిల్తో రిజిస్ట్రేషన్
సాక్షి, అమరావతి: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులకు క్లియర్ టైటిల్తో రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. పథకం పురోగతిపై సీఎం జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. జాప్యం లేకుండా ఆమోదం.. లబ్ధిదారుల దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి జాప్యం లేకుండా ఆమోదించాలని సీఎం జగన్ సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన కూడా నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలన్నారు. ఆస్తులపై పూర్తి హక్కులు.. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద లబ్ధిదారులకు ఆస్తులపై పూర్తి హక్కులు దక్కుతాయనే అంశంపై అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. పథకం అమలుపై దిగువస్థాయి అధికారులకు, లబ్ధిదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. 20 నుంచి డిసెంబర్ 15 వరకు రిజిస్ట్రేషన్ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 20వతేదీ నుంచి ప్రారంభిస్తామని, డిసెంబర్ 15 వరకు ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. 52 లక్షల మంది నమోదు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ఇప్పటి వరకు 52 లక్షల మంది నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో 45.63 లక్షల మంది లబ్ధిదారుల డేటాను ఇప్పటికే సచివాలయాలకు ట్యాగ్ చేసినట్లు వివరించారు. వీటిపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి ఎప్పటికప్పుడు దరఖాస్తులను ఆమోదిస్తున్నట్లు చెప్పారు. మరో 10 రోజుల్లో పూర్తిస్థాయిలో ఆమోదించనున్నట్లు తెలిపారు. సమీక్షలో మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్జైన్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ దవులూరి దొరబాబు పాల్గొన్నారు. పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తగినన్ని స్టాంపు పేపర్లను సిద్ధం చేసి 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. -
‘భూముల’ సమస్య పరిష్కారానికి చర్యలు
సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్ల శాఖలో నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూములపై అనేక వినతులు వస్తున్నాయి. వీటిపైనే ఎక్కువగా వివాదాలు కూడా ఏర్పడుతున్నాయి. అనేక రకాల ఇబ్బందులు సైతం ఉండటంతో ఈ భూములకు సంబంధించిన ఫైళ్లను క్లియర్ చేసేందుకు జిల్లా కలెక్టర్లు వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా జిల్లా స్థాయిలో పరిష్కారం కావాల్సిన అనేక ఫైళ్లు భూ పరిపాలన శాఖ (సీసీఎల్ఏ)కు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టంలో సెక్షన్–22ఏ కింద నమోదైన భూములను రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉండదు. 22–ఏ(1)ఏ నుంచి 22ఏ (1)ఈ వరకు ఉన్న 5 రకాల భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వం అనుమతిస్తే తప్ప ఈ భూములను రిజిస్ట్రేషన్ చేయరు. దీంతో పలు కారణాలతో ఇలాంటి భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్కు అవకాశం ఇవ్వాలని వినతులు వస్తున్నాయి. వివాదాల భయం, స్పష్టత లేకపోవడం, సిబ్బంది కొరత వంటి కారణాల వల్ల వాటిని క్లియర్ చేసేందుకు చాలాకాలం నుంచి ప్రయత్నం జరగలేదు. దీంతో ఇలా వచ్చే ఫైళ్లు పేరుకుపోయాయి. కలెక్టరేట్లు, సీసీఎల్ఏ కార్యాలయంలో 18 లక్షలకు పైగా ఫైళ్లు ఇలా పెండింగ్లో ఉన్నట్టు ఇటీవల గుర్తించారు. అవి ఏ దశలో ఉన్నాయి, పరిష్కరించేందుకు గల అవకాశాలు, ఇబ్బందులను తెలుసుకునేందుకు సీసీఎల్ఏ నీరబ్కుమార్ ప్రసాద్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇద్దరు ఉన్నతాధికారులు, సెక్షన్ ఆఫీసర్లు, సీనియర్ ఉద్యోగులతో ఏర్పాటైన ఈ కమిటీ ఆ ఫైళ్ల పూర్తి వివరాలను సేకరిస్తోంది. వాటన్నింటినీ క్రోడీకరించి సీసీఎల్ఏకు నివేదిక ఇవ్వనుంది. దాన్ని పరిశీలించి ఫైళ్లను క్లియర్ చేసేందుకు ఉన్న అవకాశాలపై ప్రభుత్వానికి సీసీఎల్ఏ ప్రతిపాదనలు పంపే అవకాశం ఉన్నట్టు తెలిసింది. -
మాజీ సైనికుడికి గౌరవం ఇదేనా?
సాక్షి, హైదరాబాద్: మాజీ సైనికుడికి నిబంధనల మేరకు భూమి కేటాయించినా రెవెన్యూ అధికారులు అప్పగించకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రెండు యుద్ధాల్లో పాల్గొన్న సైనికుడికి మీరిచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించింది. రెండు వారాల్లోగా భూమి కేటాయించి సైట్ ప్లాన్తోపాటు అప్పగించాలని గత జూన్ 15న ఆదేశించినా ఇప్పటికీ అమలు చేయకపోవడంపై మండిపడింది. రెండు వారాల్లో భూమి అప్పగించకపోతే రూ.25 వేలు జరిమానాగా పిటిషనర్కు చెల్లించాల్సి వస్తుందని తమ ఆదేశాల్లో స్పష్టం చేసిన నేపథ్యంలో, రూ.25 వేలు పిటిషనర్కు చెల్లించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. మరో రెండు వారాల్లో కూడా భూమి అప్పగించకపోతే రూ.50 వేలు పిటిషనర్కు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిల ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తమకు 4 ఎకరాల భూమిని రెండు వారాల్లో అప్పగించాలన్న ధర్మాసనం ఆదేశాలను అమలు చేయలేదంటూ వికారాబాద్ జిల్లాకు చెందిన మాజీ సైనికుడు పి.లక్ష్మీనారాయణరెడ్డి దాఖలు చేసిన కోర్టుధిక్కరణ పిటిషన్ను ధర్మాసనం విచారించింది. భూ కేటాయింపు ప్రక్రియ తుది దశలో ఉందని, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరీందర్ నివేదించారు. మరో రెండు వారాల సమయం ఇస్తే భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేయడంతోపాటు భూమిని అప్పగిస్తామని పేర్కొన్నారు. విచారణను సెప్టెంబర్ 15కు వాయిదా వేసింది. -
ఆరుగురు అధికారులకు 6 నెలల జైలు
సాక్షి, హైదరాబాద్: కోర్టు ఆదేశాల అమల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అటవీ, రెవెన్యూ శాఖ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్లకు చెందిన భూమి సేకరణ విషయంలో ఆరు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని 2009లో అటవీ శాఖ, రెవెన్యూ అధికారులను ఆదేశించినా ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడింది. ఉద్దేశపూర్వకంగానే ఆదేశాలను ఉల్లంఘించారంటూ అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆర్.శోభ, రంగారెడ్డి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ సునీత ఎం.భగవత్, డీఎఫ్వో జానకీరామ్, అడిషనల్ కలెక్టర్ ఎస్.తిరుపతిరావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎ.శాంతకుమారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ డి.అమోయ్కుమార్కు ఆరు నెలల సాధారణ జైలుశిక్ష విధించింది. రూ.2 వేల చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్ ఇటీవల తీర్పునిచ్చారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సర్వే నంబర్ 222/1 నుంచి 222/20లో మహ్మద్ సిరాజుద్దీన్ తదితరులకు 383 ఎకరాల భూమి ఉంది. అటవీ అధికారులు ఈ భూమిని రిజర్వు ఫారెస్టుగా మార్చాలని నిర్ణయించి సేకరించాలని భావించారు. అయితే ఈ భూమిని రిజర్వు ఫారెస్టుగా మార్చడం సాధ్యం కాదంటూ అటవీశాఖ సెటిల్మెంట్ ఆఫీసర్ 2008లో కలెక్టర్కు లేఖ రాశారు. అటవీ శాఖ అధికారుల నిర్ణయాన్ని సవాల్చేస్తూ సిరాజుద్దీన్ తదితరులు హైకోర్టును ఆశ్రయించగా, ఈ భూమిసేకరణ ప్రక్రియపై ఆరు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని 2009లో అటవీ, రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఆరేళ్లయినా అటవీ అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోగా ఆ భూమిని తమకు అప్పగించకపోవడాన్ని సవాల్చేస్తూ సిరాజుద్దీన్ తదితరులు 2015లో కోర్టుధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. -
‘సచివాలయ’ ఖాళీల భర్తీ బాధ్యత ఏపీపీఎస్సీకి..
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)కి ప్రభుత్వం అప్పగించింది. గతంలో రెండు విడతలుగా సచివాలయ ఉద్యోగాలను పంచాయతీరాజ్శాఖ భర్తీచేసింది. ఇంకా వివిధ విభాగాల్లో మిగిలిన దాదాపు 8,500 ఉద్యోగాలను భర్తీచేసే బాధ్యతను ఇప్పుడు ప్రభుత్వం ఏపీపీఎస్సీకి అప్పగించింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని పంచాయతీరాజ్శాఖ నెలరోజుల కిందటే వివిధ శాఖాధిపతులకు తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో రెవెన్యూ శాఖ పరిధిలో పనిచేసే వీఆర్వో, విలేజి సర్వేయర్ గ్రేడ్–3 పోస్టుల ఖాళీల వివరాలను వెంటనే ఏపీపీఎస్సీకి పంపాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి మంగళవారం రాత్రి శాఖాధిపతులకు మెమో ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు సీసీఎల్ఏ, సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా 15 వేలకుపైగా గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి, వాటిలో పనిచేసేందుకు మొత్తం 19 విభాగాల్లో 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను మంజూరు చేసిన విషయం తెలిసిందే. పంచాయతీరాజ్శాఖ 2019 జూలైలోను, 2020 జనవరిలోను నోటిఫికేషన్లు ఇచ్చి రాతపరీక్షలు నిర్వహించి ఉద్యోగాలను భర్తీచేసింది. ఇంకా మిగిలిన దాదాపు 8,500 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఉద్యోగాల ఖాళీలు, నోటిఫికేషన్లు, రాతపరీక్షల వివరాలతో మే నెల 30న ఏపీపీఎస్సీ కేలండర్ విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ వివరాలు సేకరిస్తున్నారు. -
ఎక్కడి వినతులు అక్కడే
సాక్షి, అమరావతి: నిషేధిత ఆస్తుల జాబితాలోని ఆస్తులు యజమానులకు తలనొప్పిగా మారాయి. ప్రభుత్వం అసైన్మెంట్ కింద పేదలకిచ్చిన భూములన్నీ ఈ జాబితాలోనే ఉంటాయి. వాటిని పట్టాదారులు లేదా వారి వారసులు అనుభవించడానికి తప్ప ఇతరులకు బదలాయించడానికి, విక్రయించడానికి ఎలాంటి హక్కులు ఉండవు. అయితే, దురదృష్టవశాత్తూ కొన్ని ప్రైవేటు భూములు కూడా పీఓబీ జాబితాలో ఉన్నాయి. ఒక సర్వే నంబరులో పదెకరాలు ఉండి అందులోని ఐదెకరాలు ప్రభుత్వ భూమి ఉందనుకుంటే.. అది మాత్రమే నిషేధిత ఆస్తుల జాబితాలో ఉండాలి. కానీ, మిగిలిన ఐదెకరాల ప్రైవేటు భూమి కూడా పీఓబీలో ఉంటోంది. దీంతో అత్యవసర సమయాల్లో యజమానులు వాటిని విక్రయించాలన్నా, ఎవరికైనా బహుమతి కింద రిజిస్టర్ చేయాలన్నా వీలుకావడంలేదు. అందువల్ల ప్రొహిబిషన్ ఆర్డర్ బుక్ (పీఓబీ) జాబితాలో ఉన్న భూములను అందులో నుంచి తొలగించాలంటూ భూ యజమానుల నుంచి దరఖాస్తులు వస్తున్నాయి. పెండింగ్లోనే దరఖాస్తులు ► నిజంగా అవి ప్రైవేటు భూములైతే వాటిని పీఓబీ జాబితా నుంచి తొలగించాలంటూ జిల్లా కలెక్టర్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు పంపించాలి. కలెక్టర్ల నుంచి వచ్చిన జాబితా ప్రకారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన జిల్లా రిజిస్ట్రార్లు పీఓబీలోని జాబితాను సవరిస్తారు. ► గత ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి జనవరి నెలాఖరు వరకూ ఎనిమిది నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా పీఓబీ నుంచి తొలగించాలంటూ రెవెన్యూ శాఖకు 3,255 దరఖాస్తులు మీసేవ కేంద్రాల ద్వారా అందాయి. అయితే, అధికారులు వీటిలో తొమ్మిదింటిని మాత్రమే ఆమోదించి 42 తిరస్కరించారు. ► మిగిలిన 3,204 అర్జీలు పెండింగులో ఉండటం గమనార్హం. మీసేవ నుంచి వచ్చిన ఈ దరఖాస్తులు కాకుండా తమ భూములను పీఓబీ నుంచి తొలగించాలంటూ నేరుగా అధికారులకు సమర్పించిన వినతులకు లెక్కేలేదు. ► మొత్తం దరఖాస్తుల్లో 72 శాతానికి పైగా గడువు దాటినా పరిష్కారానికి నోచుకోలేదు. ► ఒక్కటంటే ఒక్క దరఖాస్తును కూడా పరిష్కరించని జిల్లాలు అధికంగా ఉన్నాయి. ఈ వినతుల పరిష్కారం విషయంపై అధికారులు ఏమాత్రం శ్రద్ధ చూపడంలేదనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. -
విశాఖ సిట్ నివేదిక సిద్ధం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లాలో జరిగిన భూ కుంభకోణంపై ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ పూర్తిచేసింది. ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేసేందుకు రంగం సిద్ధంచేస్తున్నట్లు సిట్ చైర్మన్ డాక్టర్ విజయకుమార్ తెలిపారు. ఏలేరు గెస్టు హౌస్లోని సిట్ కార్యాలయంలో సిట్ సభ్యులతో మంగళవారం సమావేశమైన ఆయన.. వారి సిఫార్సులు, అభిప్రాయాలతో పాటు గతంలోని మధ్యంతర నివేదికపై సమీక్షించారు. సభ్యులతో పాటు తన అభిప్రాయాలను కూడా నివేదికలో పొందుపరిచిన చైర్మన్.. తన తుది నివేదికను సిద్ధంచేశారు. అనంతరం డాక్టర్ విజయకుమార్ తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 309 పేజీలతో సమగ్ర నివేదిక సిద్ధమైందన్నారు. తమకు వచ్చిన 1400 ఫిర్యాదులతో పాటు.. గతంలో సిట్ అందించిన నివేదికలో కొన్ని అంశాలపైనా విచారణ చేపట్టి పలు సిఫార్సులు చేశామన్నారు. మొత్తం 350–400 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైనట్లు తమ విచారణలో తేలిందన్నారు. తమకు వచ్చిన ఫిర్యాదులన్నింటిపైనా క్షుణ్ణంగా విచారణ చేపట్టామని.. అనేక ఫిర్యాదుల మీద అధికారుల అభిప్రాయం కూడా పరిగణనలోకి తీసుకున్నామని విజయ్కుమార్ చెప్పారు. విచారణలో వెలుగులోకి వచ్చిన అన్ని అంశాల్నీ నివేదికలో పొందుపరిచామని చైర్మన్ వివరించారు. వెలుగుచూసిన అక్రమాల పుట్ట అంతకుముందు.. టీడీపీ ప్రభుత్వ హయాంలో అనేక భూ ఆక్రమణలు, అక్రమాలు చోటుచేసుకున్నాయి. నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు (ఎన్ఓసీ), భూస్థితి మార్పు, రికార్డుల ట్యాంపరింగ్, ప్రభుత్వ స్థలాల్ని అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు కట్టబెట్టడం, 22ఎ తదితర అంశాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై సిట్ జరిపిన దర్యాప్తులో అనేక అంశాలు వెలుగుచూశాయి. ఈ అక్రమాల్లో ఇద్దరు తహసీల్దార్ల ప్రమేయంతో పాటు కొందరు ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్లు సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. జిల్లాలోని 13 మండలాల్లో భూ అక్రమాలు భారీగానే జరిగినట్లుగా కూడా గుర్తించింది. 1996 నుంచి జారీచేసిన 66 ఎన్ఓసీలను లోతుగా పరిశీలించి అక్రమాలు జరిగాయని సభ్యులు గుర్తించారు. అదేవిధంగా అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వాధికారులు, ప్రైవేటు వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిట్ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. సొంత కార్యాలయాలకు సిట్ సిబ్బంది మరోవైపు.. విచారణ పూర్తికావడంతో సిట్ కార్యాలయంలో డెప్యూటేషన్పై విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని తిరిగి రెవెన్యూ శాఖకు అప్పగించారు. సిట్ పరిధిలో పనిచేసేందుకు జిల్లాలోని వివిధ రెవిన్యూ కార్యాలయాల నుంచి 19 మందిని డెప్యుటేషన్పై నియమించారు. వీరిని తిరిగి వారి వారి కార్యాలయాలకు పంపించినట్లు సిట్ ఛైర్మన్ విజయ్కుమార్ తెలిపారు. ఇప్పటికే 20 బాక్సులతో కూడిన విచారణ పత్రాలను జిల్లా ట్రెజరీ కార్యాలయంలో భద్రపరిచినట్లు వెల్లడించారు. -
రీసర్వేకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన అత్యంత ప్రతిష్టాత్మక భూమి రీసర్వే ప్రాజెక్టు అమలుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం కింద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీసర్వే చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రణాళికా బద్ధంగా చేస్తోంది. గత వందేళ్ల చరిత్రలో దేశంలో ఎక్కడా తలపెట్టని అతి పెద్ద సర్వేని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నందున అవసరమైనవన్నీ సమకూర్చుకుంటూ ముందుకెళుతోంది. హైబ్రిడ్ మెథడ్లో కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ (కార్స్), డ్రోన్స్ లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్ధిష్ట సమయంలో సర్వే క్రతువు పూర్తి చేసేందుకు టైమ్లైన్ రూపొందించింది. రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్, సర్వే ఆఫ్ ఇండియా సమన్వయంతో రీసర్వేకు నిబంధనావళి రూపొందించాయి. 17,460 రెవెన్యూ గ్రామాల్లో.. – రాష్ట్ర వ్యాప్తంగా 17,461 రెవెన్యూ గ్రామాలు, 47,861 ఆవాసాలు, 110 పట్టణ, నగరాభివృద్ధి సంస్థల పరిధిలోని భూములు, స్థలాలు, ఇళ్లు సర్వే చేసి హద్దులు నిర్ణయించి యజమానులకు హక్కు పత్రాలు ఇవ్వాలన్న దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతోంది. – మొత్తం 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో భూములు, స్థలాలు, ఇతర స్థిరాస్తులను మూడు దశల్లో సర్వే చేయనున్నారు. మొదటి దశలో 5,122 గ్రామాల్లో, రెండో దశలో 6000 గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తారు. తదుపరి మూడో దశలో మిగిలిన గ్రామాల్లో సర్వే ప్రారంభించి 2023 ఆగస్టు నాటికి పూర్తి చేస్తారు. – డ్రోన్ సర్వే కోసం సర్వే ఆఫ్ ఇండియానే డ్రోన్లను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆ సంస్థ సర్వేయర్ల బృందం రాష్ట్రానికి చేరుకుంది. శరవేగంగా రికార్డుల స్వచ్చికరణ – రెవెన్యూ రికార్డుల స్వచ్చికరణ కార్యక్రమం చకచకా సాగుతోంది. ఎంపిక చేసిన గ్రామాల సరిహద్దు రాళ్లను అక్కడి సర్వేయర్లు గుర్తించారు. రికార్డులను సర్వే టీమ్కు అందజేశారు. సర్వే సమయంలో వచ్చే వివాదాలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రతి మండలానికి ఒకటి చొప్పున 670 మొబైల్ ట్రైబ్యునల్స్ను కూడా ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనుంది. – ఈ సర్వేలో జిల్లాలకు సంబంధించి జాయింట్ కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర స్థాయిలో రీసర్వేకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. గ్రామాల వారీగా సర్వే ప్రారంభమయ్యే తేదీలను ఆయా జిల్లా కలెక్టర్ల పేరుతో సర్వే అసిస్టెంట్ డైరెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేస్తారు. రీ సర్వే సమయంలో అందుబాటులో ఉండాలని గ్రామ సచివాలయ సిబ్బంది ఆయా గ్రామాలు, పట్టణాల వారికి సూచిస్తారు. మొదటి విడతలో 30 బేస్ స్టేషన్లు – రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే కోసం 70 బేస్ స్టేషన్లు (సెల్ఫోన్ పని చేయడానికి సెల్ టవర్లలాగే రోవర్లకు బేస్ స్టేషన్లు అవసరం) ఏర్పాటు చేయాల్సి ఉంది. మొదటి దశలో 5,122 గ్రామాల్లో రీసర్వేకు ఇబ్బంది లేకుండా తొలుత 30 బేస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటికే 5 పూర్తయ్యాయి. మిగిలిన 25 బేస్ స్టేషన్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. – జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళంలో 5, విజయనగరంలో 3, విశాఖపట్నంలో 4, తూర్పుగోదావరిలో 7, పశ్చిమ గోదావరిలో 4, కృష్ణాలో 5, గుంటూరులో 3, ప్రకాశంలో 7, నెల్లూరులో 5, చిత్తూరులో 7, వైఎస్సార్ కడపలో 5, కర్నూలులో 5, అనంతపురంలో పది కలిపి మొత్తం 70 బేస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. రేపు సీఎం జగన్ చేతుల మీదుగా పట్టాలు ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద రీసర్వే పూర్తి చేసిన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో ఈ నెల 21వ తేదీ (సోమవారం) పట్టాలు ఇవ్వడం ద్వారా రీసర్వే మహాక్రతువుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పచ్చజెండా ఊపుతారు. భూ యజమానులకు ఫీల్డ్ మ్యాపు, భూ యాజమాన్య హక్కు పత్రం (1బి), గ్రామంలోని స్థలాలు, ఇళ్లు లాంటి స్థిరాస్తుల యజమానులకు ప్రాపర్టీ కార్డు (ఆస్తి పత్రం) అందజేస్తారు. అనంతరం ఈనెల 22వ తేదీన ప్రతి జిల్లాల్లో ఒక్కో గ్రామంలో రీసర్వే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందుకోసం 13 గ్రామాలను ఇప్పటికే ఎంపిక చేశారు. తదుపరి వారం రోజుల్లో ఒక్కో రెవెన్యూ డివిజన్లో ఒక్కో గ్రామం చొప్పున మొత్తం 51 గ్రామాల్లో, తర్వాత నాలుగైదు రోజుల్లో ఒక్కో మండలంలో ఒక్కొక్కటి చొప్పున 670 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే ప్రారంభిస్తారు. పక్షం లేదా 20 రోజుల నాటికి 5,122 గ్రామాల్లో ఈ ప్రక్రియ ప్రారంభించేలా ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించిన 14,000 మంది సర్వేయర్లలో 9,423 మందికి సర్వే సెటిల్మెంట్ విభాగం ఇప్పటికే సంప్రదాయ సర్వే విధానాలపై శిక్షణ ఇచ్చింది. 6,740 మందికి ఆటోక్యాడ్, ఎల్రక్టానిక్ టోటల్ స్టేషన్స్ (ఈటీఎస్), డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (డీజీపీఎస్) సర్వేపై శిక్షణ పూర్తి చేసింది. ఎలాంటి రికార్డులు అడగరు రీ సర్వే సందర్భంగా యజమానులు ఎలాంటి రికార్డులు చూపించాల్సిన పని ఉండదు. రెవెన్యూ శాఖ దగ్గర ఉన్న రికార్డుల ప్రకారమే సర్వే పూర్తి చేస్తారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నిబంధనల ప్రకారం అన్నీ పరిశీలించి ఎలాంటి వివాదాలు లేని వారికి నిర్దిష్ట కాల పరిమితిలో శాశ్వత భూ హక్కులు కల్పిస్తారు. ప్రతి భూమి బిట్ (పార్సల్)కు విశిష్ట గుర్తింపు సంఖ్య ఇస్తారు. రెవెన్యూ, సర్వే రికార్డులన్నీ గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. రీ సర్వే తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజి్రస్టేషన్ సేవలు కూడా అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లు చేస్తోంది. – నీరబ్ కుమార్ ప్రసాద్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ -
ప్రతి ఇంచూ కొలుస్తారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వందేళ్ల తర్వాత చేపడుతున్న అతి పెద్ద రీ సర్వేలో కచ్చితమైన కొలతలు, భూ యజమానుల సంతృప్తి ప్రధాన లక్ష్యాలుగా రెవెన్యూ శాఖ నాలుగు ఐచ్ఛికాలను సిద్ధం చేసింది. కొలతల్లో ఎక్కడైనా చిన్నపాటి తేడా వచ్చిందని రైతులు అభ్యంతరం చెబితే మరో విధానంలో ఆ భూమి హద్దులు నిర్ణయిస్తారు. ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష’ కింద రాష్ట్రంలోని వ్యవసాయ భూములు, గ్రామీణ, పట్టణ ఆస్తులను రీ సర్వే చేసేందుకు రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్, సర్వే ఆఫ్ ఇండియా ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాయి. దీనిపై ప్రజలను చైతన్యపరచడం, రీ సర్వే ప్రయోజనాలను తెలియజేయడం కోసం ఈ నెల 14నుంచి 19వ తేదీ వరకు గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల వద్ద గ్రామ సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రీ సర్వే ఉద్దేశం, లక్ష్యాలను అధికారులు ఈ సభల్లో వివరిస్తారు. రీ సర్వే ఎలా ఉంటుంది? దీని ప్రయోజనాలు ఎలా ఉంటాయనే అంశాలపై షార్ట్ ఫిల్మ్ కూడా ప్రదర్శిస్తారు. మూడు దశల్లో పూర్తి అటవీ భూములు తప్పించి ప్రభుత్వ భూములు సహా స్థిరాస్తులన్నింటినీ మూడు దశల్లో సర్వే చేసేలా టైమ్లైన్ సిద్ధమైంది. రాష్ట్రంలో 17,460 రెవెన్యూ గ్రామాల పరిధిలో 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల మేర గల భూముల సర్వేకు సర్వే ఆఫ్ ఇండియా, రాష్ట్ర సర్వే సెటిల్మెంట్ శాఖ సంయుక్తంగా బ్లూప్రింట్ తయారు చేశాయి. మొదటి విడత కింద 5 వేల గ్రామాల్లో సర్వే ప్రారంభించి వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తారు. ఇందులో భాగంగానే ఈ నెల 21న రీ సర్వేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారు. పైలట్ ప్రాజెక్టు కింద రీ సర్వే పూర్తయిన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో సీఎం జగన్ రైతులకు పట్టాలను అందజేసి రీ సర్వేకి పచ్చ జెండా ఊపుతారు. అదే రోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒక్కొక్క గ్రామంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. తర్వాత ప్రతి డివిజన్లో ఒక గ్రామంలోను, తదుపరి ప్రతి మండలంలో ఒక రెవెన్యూ గ్రామంలో రీ సర్వే ప్రారంభిస్తారు. ఇలా వారం రోజుల్లో 670 గ్రామాల్లో ఈ ప్రక్రియ ఆరంభమవుతుంది. రెండో విడత రీ సర్వేను 2021 ఆగస్టులో 6,500 గ్రామాల్లో ప్రారంభించి 2022 జూన్ నాటికి పూర్తి చేస్తారు. మిగిలిన గ్రామాల్లో మూడో విడత సర్వేను 2022 జూలైలో ప్రారంభించి 2023 జూన్ నాటికి పూర్తి చేస్తారు. కార్స్, డ్రోన్లు, రోవర్ల వినియోగం – రీ సర్వేలో కంటిన్యూయస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ (కార్స్), డ్రోన్లు, రోవర్లు వంటి అత్యాధునిక పరికరాలను వినియోగిస్తారు. ఇందుకోసం ఇప్పటికే 9,500 సర్వేయర్లకు శిక్షణ ఇచ్చారు. సర్వేకు 70 బేస్ స్టేషన్లు అవసరం కాగా, ఇప్పటికే 5 ఏర్పాటు చేశారు. మరో 65 బేస్ స్టేషన్లను దశలవారీగా నెలకొల్పుతారు. మొదటి విడత సర్వే కోసం వచ్చే నెలాఖరు నాటికి 30 బేస్ స్టేషన్లను సిద్ధం చేస్తారు. ఎక్కడైనా భూముల్లో పండ్ల తోటలు, ఎత్తయిన చెట్లు ఎక్కువగా ఉంటే డ్రోన్లను పంపడం వీలు కాదు. అందువల్ల ఇలాంటి చోట్ల బేస్ స్టేషన్ల నుంచి శాటిలైట్ ఆధారంగా అక్షాంశాలు, రేఖాంశాల ప్రకారం సబ్ డివిజన్ల (కమతాల) వారీగా రోవర్లను వినియోగించి హద్దులు నిర్ణయిస్తారు. రీసర్వే సమయంలో కొలతల్లో సూక్ష్మ తేడాల వల్ల వివాదాలు వస్తే నాలుగు పద్ధతులను అనుసరిస్తారు. 1 డ్రోన్ల సాయంతో భూముల కచ్చితమైన కొలతల్ని నిర్ధారించడం మొదటి పద్ధతి. 2 డ్రోన్లతో నిర్ధారించిన కొలతలపై భూ యజమానులు అభ్యంతరం చెబితే రోవర్స్ను వినియోగించి కొలతలు వేసి హద్దుల్ని నిర్ణయించడం రెండో పద్ధతి. 3 రోవర్స్ కొలతలపైనా యజమాని సంతృప్తి చెందకపోతే మూడో విధానంగా మాన్యువల్ (పాత) విధానంలో చైన్ లింకులతో కొలతలు వేస్తారు. 4 చైన్ లింకులతో కొలతలపైనా అసంతృప్తి వ్యక్తమైతే సివిల్ ఇంజనీ రింగ్ పద్ధతిలో కొలిచి హద్దులు నిర్ణయిస్తారు. -
శరవేగంగా సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు– భూరక్ష పథకం’ కింద రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ రీసర్వేకి రెవెన్యూ శాఖ శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రికార్డుల స్వచ్ఛీకరణ కార్యక్రమం సాగుతోంది. కంటిన్యుయస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ (కార్స్) టెక్నాలజీ, డ్రోన్ కెమెరాలతో రీసర్వే చేసేందుకు వీలుగా సర్వే సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 21.21 కోట్లు విడుదల చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వందేళ్ల తర్వాత భూముల సమగ్ర రీసర్వే చేపడుతున్నందున దీనిపై గ్రామ సచివాలయాల ద్వారా ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికి తగ్గట్లు అధికారులు కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. రీసర్వే సందర్భంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం మొబైల్ కోర్టులను కూడా ప్రభుత్వంఏర్పాటు చేయనుంది. ఎన్నో ఉపయోగాలు – ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూరక్ష పథకం’తో భూ యజమానులకు తమ భూములపై వేరొకరు సవాల్ చేయడానికి వీలులేని శాశ్వత హక్కులు లభిస్తాయి. దీనివల్ల భూ వివాదాలు తగ్గిపోతాయి. – అస్తవ్యస్తంగా ఉన్న రికార్డులను స్వచ్ఛీకరిస్తున్నారు. దీంతో చనిపోయిన వారి పేర్లతో ఉన్న భూములు వారి వారసుల పేర్లతో రికార్డుల్లో నమోదు అవుతాయి. – వాస్తవంగా ఉన్న భూముల విస్తీర్ణం ప్రకారం రికార్డులు సవరిస్తారు. – భూములు తమ పేర్లతో రికార్డుల్లోకి ఎక్కడంవల్ల వడ్డీలేని పంట రుణాలకు అవకాశం కలుగుతుంది. – రాష్ట్రంలో ప్రస్తుతం సర్వే నంబర్ల వారీగా హద్దు రాళ్లు లేవు. దీంతో సరిహద్దుల తగాదాలు ఎక్కువగా ఉన్నాయి. రీసర్వేతో ప్రతి సర్వే నంబరుకు హద్దులు నిర్ధారణ అవుతాయి. – గత పాలకుల హయాంలో రైతులు భూమిని కొలత వేయించుకోవాలంటే నిర్దిష్ట రుసుం చెల్లించడంతోపాటు ముడుపులివ్వాల్సి వచ్చేది. ప్రస్తుతం ప్రభుత్వమే ఉచితంగా భూమిని కొలత వేసి సరిహద్దు రాళ్లు నాటిస్తుంది. – ప్రజలకు ఆధార్ ఉన్నట్లే ప్రతి భూభాగానికి భూధార్ అనే విశిష్ట గుర్తింపు సంఖ్యను ప్రభుత్వం కేటాయిస్తుంది. – ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రకారమే క్రయవిక్రయ రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రికార్డుల్లో అప్డేట్ (మార్పులు) చేస్తారు. దీంతో మోసపూరిత రిజిస్ట్రేషన్లకు, రికార్డుల ట్యాంపరింగ్కు అవకాశం ఉండదు. ఒకరి భూమిని మరొకరు రిజిస్ట్రేషన్ చేయడానికి ఏమాత్రం ఆస్కారం ఉండదు. – ప్రతి సర్వే నంబర్ను డ్రోన్ కెమెరాతో ఫొటో తీసి సర్వే రికార్డులతో మ్యాచ్ చేస్తారు. వీటిని డిజిటలైజ్ చేస్తారు. దీంతో రికార్డులు భద్రంగా ఉంటాయి. – కొన్ని చోట్ల కొందరికి సంబంధించి రికార్డుల్లో భూమి ఒకచోట ఉంటే అనుభవిస్తున్న భూమి మరోచోట ఉంది. ఇలాంటివి కూడా బయటకు వస్తాయి. – ఆక్రమణల్లోని ప్రభుత్వ భూములు బయటపడతాయి. ఇదో సాహసోపేత నిర్ణయం – ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ భూవివాదాల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమగ్ర భూసర్వే చేయాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దేశంలో వందేళ్ల తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వమే ఈ యజ్ఞం లాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. దీనిని పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లు చేస్తున్నాం. దీని కోసం రికార్డుల స్వచ్ఛీకరణ కార్యక్రమం సాగుతోంది. రెవెన్యూ కోర్టుల్లో ఉన్న 52,866 కేసులు, వెబ్ల్యాండ్లో సవరణలో కోసం వచ్చిన 79,405 అర్జీలను స్పెషల్ డ్రైవ్ ద్వారా పరిష్కరిస్తాం. మూడు దశల్లో.. ► ఈనెల 21వ తేదీన భూముల సమగ్ర రీసర్వే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. ► దేశంలోనే మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో కార్స్ టెక్నాలజీని వినియోగించనున్నారు. ► రాష్ట్రంలో 90 లక్షల మంది పట్టాదారులు ఉన్నారు. వారికి చెందిన 1.96 కోట్ల సర్వే నంబర్ల పరిధిలో 2.26 కోట్ల ఎకరాల భూమిని రీసర్వే చేయాల్సి ఉంది. మూడు దశల్లో దీనిని పూర్తి చేస్తారు. ► మొదటి దశలో 5 వేల గ్రామాల్లోనూ, రెండో దశలో 6,500, మూడో దశలో 5,500 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ చేపడతారు. ► 2023 ఆగస్టు నాటికి మొత్తం సర్వే ప్రక్రియ పూర్తి చేస్తారు. రీసర్వే కోసం రాష్ట్ర వ్యాప్తంగా 4,500 బృందాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. -
భూముల రీసర్వేకు రూ.987.46 కోట్లు
సాక్షి, అమరావతి: అత్యాధునిక టెక్నాలజీతో రాష్ట్రవ్యాప్తంగా భూములను సమగ్రంగా రీసర్వే చేసేందుకు ప్రభుత్వం రూ.987.46 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు పరిపాలన ఆమోదం తెలుపుతూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం’ అని వ్యవహరించనున్నారు. ఈనెల 5వతేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ పేరు ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వ్యవసాయ భూములు, గ్రామ పంచాయతీలు, పట్టణాల్లోని స్థలాలు రీసర్వే ప్రాజెక్టు పరిధిలోకి వస్తాయి. డ్రోన్లు, కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ (కార్స్) నెట్వర్క్తో చేపట్టనున్న రీసర్వే ప్రాజెక్టుకు రూ.987.46 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం ప్రారంభమవుతుంది. మూడు దశల్లో రీ సర్వే పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. సుపరిపాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అత్యంత ప్రాధాన్య కార్యక్రమాల్లో భూముల సమగ్ర రీసర్వే ప్రాజెక్టు ప్రధానమైనది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వంద శాతం కచ్చితమైన కొలతలలో రాష్ట్రవ్యాప్తంగా భూములను రీ సర్వే చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. భూ రికార్డులను స్వచ్ఛీకరించడంతోపాటు ట్యాంపర్డ్ ఫ్రూఫ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్స్ టెక్నాలజీ ద్వారా వీలైనంత తక్కువ ధరకు పరికరాలు కొనుగోలు చేయనున్నారు. ఇందుకోసం బడ్జెట్లో ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది. -
వైద్య కళాశాలలకు భూముల కేటాయింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వైద్య విద్య సంచాలకుల పేరిట పలు జిల్లాల్లో భూములను కేటాయిస్తూ రెవెన్యూ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రి నిర్మాణం కోసం 50 ఎకరాలను, కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం చిలకలపూడిలో ప్రభుత్వ వైద్య కళాశాల కోసం 29.60 ఎకరాల భూమిని కేటాయించింది. అదేవిధంగా గుంటూరు జిల్లా జమ్ములపాలెంలో 51.07 ఎకరాలు, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 12.58 ఎకరాలను కేటాయించింది. కాకినాడ అర్బన్ మండలం రమణయ్య పేటలో 15.76 ఎకరాలను రంగరాయ వైద్య కళాశాల స్థాయి పెంపు కోసం కేటాయించింది. అనంతపురం జిల్లా పెనుకొండలో ప్రభుత్వ వైద్య కళాశాల కోసం పశు సంవర్థక శాఖకు చెందిన 48.49 ఎకరాలను బదలాయించింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల కోసం ఉచితంగా భూములను కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. -
వరద బాధితులకు ఉచితంగా నిత్యావసరాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో వరద బాధితులకు నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేసి, ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇళ్లు వరద నీటిలో మునిగిపోయిన ప్రాంతాల్లోని బాధిత కుటుంబాలకు.. ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, ఒక కేజీ కందిపప్పు, ఒక లీటర్ పామాయిల్, కిలో ఉల్లిగడ్డలు, కిలో బంగాళదుంపలు పంపిణీ చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ సోమవారం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు. -
రికార్డుల స్వచ్ఛీకరణ సవాలే!
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూముల సమగ్ర రీసర్వేకు ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో తప్పుల తడకగా ఉన్న భూ రికార్డుల స్వచ్ఛీకరణ ప్రక్రియ రెవెన్యూ శాఖకు అతి పెద్ద యజ్ఞంలా మారింది. ప్రస్తుత ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమం కేవలం స్వచ్ఛీకరణ కాదని, ఇది రికార్డుల ప్రక్షాళన ప్రక్రియ అని రెవెన్యూ శాఖ మాజీ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ధర్మాన ప్రసాదరావు పలుమార్లు పేర్కొన్నారు. దీనిని పకడ్బందీగా చేస్తే చాలా వరకు భూ వివాదాలు పరిష్కారమవుతాని రెవెన్యూ, న్యాయ రంగాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. పక్కాగా, లోప రహితంగా రికార్డులను అప్డేట్ చేయాలంటే రెవెన్యూ ఉద్యోగులు జవాబుదారీతనంతో పని చేయాల్సి ఉంటుంది. కష్టమైన ప్రక్రియే.. ► రాష్ట్రంలో 4 కోట్ల ఎకరాలకు (1.63 లక్షల చదరపు కిలోమీటర్ల) పైగా ప్రభుత్వ, ప్రయివేటు భూములున్నాయి. 17,460 గ్రామాల పరిధిలో 1.96 కోట్ల సర్వే నంబర్ల పరిధిలో 2.26 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి 90 లక్షల మంది రైతుల చేతుల్లో ఉంది. ► మొత్తం 3 కోట్ల ల్యాండ్ హోల్డింగ్స్ ఉండగా, వీటిలో ప్రభుత్వానికి చెందినవి 43 లక్షలు. ఇందులో లక్షలాది ఎకరాలు ఆక్రమణదారుల గుప్పెట్లో ఉన్నాయి. ► చాలా చోట్ల భూ అనుభవ రికార్డులు (అడంగల్), భూ యాజమాన్య రికార్డులు (1బి)లను మార్చి వేశారు. అసైన్మెంట్ రిజిష్టర్లను మాయం చేశారు. ప్రభుత్వం వివిధ అవసరాల కోసం సేకరించిన భూమి చాలా చోట్ల ఇప్పటికీ ప్రయివేటు వ్యక్తుల పేర్లతోనే ఉంది. అక్రమాల పుట్టలు.. ► రెవెన్యూ రికార్డులు అక్రమాల పుట్టలుగా మారాయి. ఏటా జరపాల్సిన రెవెన్యూ జమా బందీ దశాబ్దాలుగా నిర్వహించకపోవడం ఇందుకు ప్రధాన కారణం. ► ఒకే భూమికి ఇద్దరు ముగ్గురికి దరఖాస్తు (డీకేటీ) పట్టాలు ఇచ్చిన సంఘనటలు కోకొల్లలుగా ఉన్నాయి. కొందరు రిటైర్డు రెవెన్యూ ఉద్యోగులు కూడా ఇలా నకిలీ పత్రాలు సృష్టించి మోసాలకు పాల్పడ్డారు. ► ఒక సర్వే నంబరులో 10 ఎకరాల భూమి ఉంటే 20 ఎకరాలకు డీకేటీ పట్టాలు/ అడంగల్స్ ఉన్నవి కూడా చాలా చోట్ల ఉన్నాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు లెక్కే లేదు. దశాబ్దాలుగా మార్పులే లేవు ► ఎప్పటికప్పుడు రికార్డుల్లో మార్పులు చేర్పులు (అప్డేట్) చేయడాన్నే స్వచ్ఛీకరణ (మ్యుటేషన్) అంటారు. దురదృష్టవశాత్తు దశాబ్దాలుగా భూ రికార్డులు అప్డేట్ చేయకుండా వదిలేశారు. దశాబ్దాల కిందట చనిపోయిన వారి పేర్లతో లక్షలాది ఎకరాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వాస్తవ భూమి విస్తీర్ణానికీ, రికార్డుల్లో ఉన్న దానికి మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ► ఇలా రికార్డుల్లో తేడా ఉన్న సర్వే నంబర్లలోని భూమి యజమానులతో మాట్లాడి ఒప్పించి ఆయా వ్యక్తుల పేర్లతో ఉన్న భూమి విస్తీర్ణాన్ని ఆర్ఎస్ఆర్ ప్రామాణికంగా తగ్గించడం చాలా క్లిష్టమైన సమస్య. ► తల్లిదండ్రులు చనిపోయినా వారి పిల్లలు భాగపరిష్కారాలు చేసుకోకుండా తలా కొంత దున్నుకుంటున్నారు. రికార్డుల్లో చనిపోయిన తల్లిదండ్రుల పేరుతోనే భూమి ఉంది. ► చాలా చోట్ల భూమి కొన్న వారి బదులు అమ్మిన వారి పేర్లతోనే అడంగల్, 1బీలో భూమి ఉంది. వీటిని సరిచేయాల్సి ఉంది. ► భూమిలేని పేదల పేరుతో ప్రభుత్వం అసైన్మెంట్ పట్టాలు ఇస్తోంది. భూముల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో అసైన్మెంట్ రిజిస్టర్లను మాయం చేసి చాలా మంది ప్రభుత్వ భూములను అసైన్మెంట్ పట్టాలంటూ దున్నుకున్నారు. మరికొందరు నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందాల ద్వారా అమ్ముకున్నారు. పకడ్బందీగా ఏర్పాట్లు సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి భూ రికార్డులను పకడ్బందీగా, పారదర్శకంగా స్వచ్ఛీకరించాల్సి ఉంది. జనవరి ఒకటో తేదీ నుంచి తొలి విడత రీసర్వే చేపట్టనున్న 6,500 గ్రామాల్లో రికార్డులు ముందు పెట్టుకుని టేబుల్ వెరిఫికేషన్ చేయాలని ఇప్పటికే రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఆర్ఎస్ఆర్, అడంగల్ మధ్య విస్తీర్ణంలో తేడాలు ఇక్కడ చాలా వరకు తేలే అవకాశం ఉంది. భూ రికార్డుల స్వచ్ఛీకరణకు ఒకపక్క, భూముల సమగ్ర రీసర్వేకు మరో పక్క చకచకా ఏర్పాట్లు చేస్తున్నాం. – వి.ఉషారాణి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్ఎస్ఆర్ అడంగల్ మధ్య 33.54 లక్షల ఎకరాల తేడా రెవెన్యూ శాఖలో అత్యంత ప్రామాణికమైనది రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్). బ్రిటిష్ కాలంలో దేశవ్యాప్తంగా మొత్తం భూమిని సర్వే చేసినప్పుడు సర్వే నంబర్ల వారీగా ఎంతెంత భూమి ఉందో ఆర్ఎస్ఆర్లో నమోదు చేశారు. అయితే ఆర్ఎస్ఆర్, అడంగల్ మధ్య 33.54 లక్షల ఎకరాలకుపైగా వ్యత్యాసం ఉండటం రెవెన్యూరికార్డులు తప్పుల తడకలుగా ఉన్నాయనడానికి నిదర్శనం. అడంగల్, భూమి కొలతల పుస్తకం (ఎఫ్ఎంబీ) మధ్య కూడా ఇలాగే భారీ తేడా ఉంది. భూమి ఎవరిదో రెవెన్యూకే తెలియదు! రాష్ట్రంలో చాలా కుటుంబాలకు వంశ పారంపర్యంగా భూమి సంక్రమించి ఉంటుంది. ఇలాంటి వారిలో కొందరి వద్ద భూమి తమదేననడానికి రాత పూర్వకమైన ఆధారాలు ఉండకపోవచ్చు. రెవెన్యూ శాఖ వద్ద కూడా చాలా వరకు రికార్డులు లేవు. అందుకే వెబ్ల్యాండ్, అడంగల్లో చాలా భూమి అన్సెటిల్డ్ అని, తెలియదు అని ఉంది. ఇలాంటి భూమి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా ఉంది. -
భూ సమగ్ర రీ–సర్వేకు.. ప్రతి గ్రామానికీ ఒక బృందం
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా భూముల సమగ్ర రీ–సర్వేకి రెవెన్యూ శాఖ పకడ్బందీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీన ప్రారంభించి మూడు దశల్లో అనగా 2023 ఆగస్ట్ నాటికి రీ–సర్వే పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి? సుమారు 120 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి చేపట్టదలచిన ఈ భారీ కార్యక్రమాన్ని ఎలా చేయాలనే అంశాలతో రెవెన్యూ శాఖ నివేదిక తయారు చేసింది. ► ప్రతి గ్రామానికీ ఇద్దరు గ్రామ సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ సహాయకుడు (వీఆర్ఏ)తో సర్వే బృందాన్ని తయారు చేయనుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 4,500 బృందాలు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ► రికార్డుల స్వచ్ఛీకరించనిదే రీ–సర్వే సాధ్యం కాదు. అందువల్ల భూ రికార్డుల పరిశీలనకు ప్రతి గ్రామానికి ఇద్దరు గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్ఓ)తో బృందాన్ని ఏర్పాటు చేయనుంది. ► వీఆర్ఓల బృందం పరిశీలించి ఆమోదించిన ల్యాండ్ రిజిస్టర్ను తహసీల్దార్ పరిశీలించి ఆమోదించే వ్యవస్థ ఉంటుంది. ► రాష్ట్రంలో 17,460 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలో 90 లక్షల మంది పట్టాదారులు (భూ యజమానులు) ఉన్నారు. ► 1.96 కోట్ల సర్వే నెంబర్ల పరిధిలో పట్టాదారులకు చెందిన 2.26 కోట్ల ఎకరాల భూమిని రీ–సర్వే చేయాల్సి ఉంది. ► మొదటి దశలో రాష్ట్రంలోని అన్ని మండలాలకు చెందిన 5 వేల గ్రామాల్లోనూ, రెండో దశలో 6,500, మూడో దశలో 5,500 గ్రామాల్లో భూముల సమగ్ర రీ–సర్వే ప్రక్రియ పూర్తి చేసేలా రెవెన్యూ శాఖ కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది. -
భూ వివాదాల పరిష్కారానికి కాలపరిమితి!
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. వివాద, అవినీతి రహిత పాలన అందించేలా ఈ వ్యవస్థను మలచాలని భావిస్తున్న సర్కారు.. భూ వివాదాలను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది. అక్రమాలు, అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్న రెవెన్యూ శాఖను సంస్కరించాలని సీఎం కేసీఆర్ పట్టు్టదలగా ఉన్నారు. కేశంపేట, కీసర, షేక్పేట తదితర తహసీల్దార్ల అవినీతి లీలలు, కొన్నాళ్ల కిందట అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ సజీవ దహనం çఘటన తో అవాక్కయిన ప్రభుత్వం.. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో నూతన రెవెన్యూ చట్టం ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. 20 కీలక నియమాలతో.. ప్రస్తుతం మనుగడలో ఉన్న 144 చట్టాలు/నియమాల్లో కాలం చెల్లినవాటికి మంగళం పాడి.. కేవలం 20 చట్టాలను క్రోడీకరిస్తూ కొత్త చట్టం రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు శివశంకర్, బలరామయ్య, రంగారెడ్డి జిల్లా మాజీ జేసీ సుందర్ అబ్నార్ తదితర రెవెన్యూ, న్యాయ నిపుణులతో కూడిన కమిటీ వారం రోజులుగా కొత్త చట్టం తయారీపై సంప్రదింపులు జరుపుతోంది. ఉద్యోగుల సర్దుబాటు, హోదాల మార్పులు, చేర్పులు తదితర అంశాలపై చర్చిస్తున్న ప్రభుత్వ పెద్దలు.. రెవెన్యూ వివాదాల పరిష్కారానికి నిర్దిష్ట కాలపరిమితిని నయా చట్టంలో చేర్చనున్నారు. తహసీల్దార్ స్థాయిలో 45 రోజుల్లో పరిష్కారం కాని అర్జీని నేరుగా కలెక్టర్కు పంపాలని, అక్కడా పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ట్రిబ్యునల్కు నివేదించాలని, అది ఇచ్చే తీర్పు సంతృప్తికరంగా లేదని భావిస్తే.. రెవెన్యూ కోర్టుకు అప్పీల్ చేసుకునేలా కొత్త విధానం ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. దరఖాస్తు పురోగతి వివరాలు భూ వివాదాలు సకాలంలో పరిష్కరించేందుకు కొత్త విధానం దోహదపడుతుందని భావిస్తోంది. ఈ క్రమంలోనే సమస్యల పరిష్కారంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకోవాలని నిర్ణయించింది. దరఖాస్తుదారు అర్జీ దాఖలు చేసింది మొదలు... దాని పురోగతి (స్టేటస్) ఎలా ఉంది? ఏ అధికారి వద్ద పెండింగ్లో ఉందనే సమాచారాన్ని కూడా ఆన్లైన్లోనే చూసుకునేలా ఏర్పాట్లు చేయనుంది. -
ఏపీలో జనవరి1 నుంచి సమగ్ర భూ సర్వే
-
జనవరి 1న సమగ్ర భూ సర్వేకు శ్రీకారం
సమగ్ర భూ సర్వేపై గ్రామ సచివాలయాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలి. ప్రతి గ్రామ సచివాలయంలో భూ సర్వే ప్రయోజనాలపై పోస్టర్లు అతికించాలి. 1930 తర్వాత చేపడుతున్న తొలి భూముల రీసర్వే అయినందున గ్రామ సభల ద్వారా ప్రజలు, రైతుల్లో అవగాహన కల్పించాలి. ప్రజలకు సమగ్ర సమాచారం అందించడంతో పాటు, రీసర్వే వల్ల భూ యజమానులకు కలిగే మేలు గురించి అవగాహన కల్పించాలి. సమగ్ర భూ సర్వే చేసిన తర్వాత నాటే నంబరు రాళ్లన్నీ వెంటనే గుర్తించడానికి వీలుగా ఒకే డిజైన్లో ఉండాలి. అర్బన్ ప్రాంతాల్లో కూడా సర్వే చేయాలి. అందువల్ల ప్రస్తుతమున్న 4,500 సర్వే బృందాలను పెంచుకోవాలి. సర్వే చేస్తున్న సమయంలో వచ్చే వివాదాలను వెంటనే పరిష్కరించేలా యంత్రాంగాన్ని క్రియాశీలకంగా రూపొందించుకోవాలి. సర్వే ప్రారంభం అయ్యే నాటికే మొబైల్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన పరికరాలు, డ్రోన్లు, రోవర్లు, బేస్ స్టేషన్లు, సర్వే బృందాలకు అవసరమైన వాహనాలు సమకూర్చుకోవాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై సర్వేయర్లకు, అవసరమైన అంశాలపై గ్రామ సచివాలయాల సిబ్బందికి పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వాలి. సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా భూముల సమగ్ర రీసర్వే ప్రాజెక్టును వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీన ప్రారంభించి 2023 ఆగస్టు నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సోమవారం తన అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో జరిగిన రెవెన్యూ శాఖ ఉన్నత స్థాయి సమీక్షలో భూముల సమగ్ర రీసర్వేపై సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించాలని, పట్టణ ప్రాంతాలకు కూడా సమగ్ర రీసర్వేను అమలు చేసేందుకు వీలుగా సర్వే బృందాలను పెంచాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించడం వల్ల రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయని, ఎక్కడా పొరపాట్లకు తావు ఉండదని సీఎం వివరించారు. భూ సర్వే కోసం కొనుగోలు చేసిన పరికరాలన్నీ గ్రామ సచివాలయాల్లో ఉంచాలని ఆదేశించారు. దీనివల్ల ఎప్పుడు ఎలాంటి అవసరమున్నా వినియోగించుకోవడానికి వీలవుతుందన్నారు. సమగ్ర రీసర్వేకు అత్యుత్తమ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. సమీక్షలో అధికారులు సీఎంకు వివరించిన అంశాలు ఇలా ఉన్నాయి. సమగ్ర భూ సర్వేపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్. చిత్రంలో మంత్రి ధర్మాన తదితరులు ఎక్కడికక్కడ వివాదాలు పరిష్కరించేలా చర్యలు ► సర్వే సందర్భంగా వచ్చే వివాదాలను ఎక్కడికక్కడే పరిష్కరించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో ప్రయోగాత్మకంగా భూ సర్వే పూర్తి చేశాం. ఈ గ్రామంలో గతంలో 182 కమతాలు ఉండగా, నేడు వీటి సంఖ్య 631కి చేరింది. ఇప్పుడు కూడా కమతాల కంటే సర్వే నంబర్లు ఎక్కువగా ఉన్నాయి. 631 కమతాలు ఉండగా 829 సర్వే నంబర్లు ఉన్నాయి. ► రికార్డుల స్వచ్ఛీకరణ వల్ల రైతులకు మేలు జరుగుతుంది. దశాబ్దాలుగా ఉన్న సమస్యలు తొలగిపోవడంతోపాటు భూ యజమానులు/ రైతులకు ప్రస్తుతమున్న ఊహాజనిత హక్కుల స్థానే శాశ్వత హక్కులు లభిస్తాయి. ► సర్వే సందర్భంగా తలెత్తే సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించేందుకు మొబైల్ ట్రిబ్యునల్స్ ఉంటాయి. వివాదాలకు తావు లేకుండా భూ సమస్యలను పరిష్కరించడానికి ఇవి సహాయ పడతాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమగ్ర భూ సర్వే చేస్తున్న తొలి రాష్ట్రం మనదే. ► భూ సర్వే చేయగానే రోవర్ నుంచి నేరుగా ఆన్లైన్ పద్ధతుల్లో కంప్యూటర్లో పూర్తి వివరాలు నమోదవుతాయి. మధ్యలో ఏ వ్యక్తీ వాటిలో మార్పులు చేర్పులు చేయలేరు. ► ఇప్పటికే పెండింగ్లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. రెవెన్యూ కోర్టుల్లో 52,866 వివాదాలు ఉన్నాయి. వెబ్ ల్యాండ్ పొరపాట్లకు సంబంధించిన 79,405 రికార్డుల స్వచ్ఛీకరణకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. ► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నీరబ్ కుమార్ ప్రసాద్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ సిద్ధార్థ జైన్, పలువురు అధికారులు పాల్గొన్నారు. (ఇతర రాష్ట్రాల్లో ఆస్తి పన్ను విధానాలపై అధ్యయనం) -
ఆధారాల్లేకుండా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు
సాక్షి, అమరావతి: ఆరోపణలకు నిర్ధిష్టమైన ఆధారాలేవీ చూపకుండానే ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. వీధుల్లో మాట్లాడుకునే మాటల ఆధారంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడం ఇటీవల కాలంలో ఎక్కువైపోయిందని వివరించారు. ప్రజాప్రయోజనాలను ఓ జోక్గా భావిస్తున్నారన్నారు. దేవదాయ నిధులను అమ్మఒడి పథకానికి మళ్లిస్తున్నారని ఆరోపిస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన వ్యక్తి, అందుకు ఒక్క ఆధారాన్ని కూడా కోర్టుకు సమర్పించలేదని తెలిపారు. దేవదాయ శాఖలో బ్రాహ్మణ కార్పొరేషన్ భాగం కాదని, నిధులను అమ్మఒడి కోసం మళ్లిస్తున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఎక్కడా లేదన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు, పిల్ను కొట్టేసేందుకు సిద్ధమైంది. ఈ దశలో విజయవాడకు చెందిన పిటిషనర్ చింతా ఉమామహేశ్వరరెడ్డి తరఫు న్యాయవాది ఎన్ రవిప్రసాద్, తగిన డాక్యుమెంట్లను కోర్టు ముందుంచుతానని అభ్యర్ధించడంతో న్యాయస్థానం అందుకు అంగీకరిస్తూ విచారణను సెప్టెంబర్ 11కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలితతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
బీపీఎల్ కుటుంబాలకే ఇళ్ల స్థలాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇళ్ల స్థలాల పంపిణీకి దారిద్య్రరేఖకు దిగువనున్న (బీపీఎల్) కుటుంబాలనే అర్హులుగా ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో రాష్ట్రంలో ఇళ్లు లేనివారందరికీ సంతృప్త స్థాయిలో 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి దశలవారీగా ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. అయితే.. దీన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు లబ్ధిదారుల ఎంపికతోపాటు కొన్ని నిబంధనలను మార్చాలని ఆదేశించింది. దీనిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ఈ ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియ ఆగకుండా కొనసాగించడంలో భాగంగా హైకోర్టు ఆదేశాల ప్రకారం నిబంధనలను ప్రభుత్వం స్వల్పంగా సవరించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్రరేఖకు దిగువనున్న వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేసినందున కొత్త నిబంధనల ప్రాతిపదికగా వారి జాబితాను పునఃపరిశీలించి.. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలనే ఎంపిక చేసి జాబితాను సవరించనున్నారు. అనంతరం సవరించిన జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉంటుంది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మార్చిన నిబంధనలతో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఉషారాణి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నివాస స్థలం పట్టా ధర రూపాయే.. ► పేదలకు ఇచ్చే స్థలం పట్టా ధరను రూపాయిగా నిర్ణయించారు. కన్వేయన్స్ డీడ్ రూపంలో ఇవ్వదలిచినందున స్టాంప్ పేపర్కు రూ.10, లామినేషన్కు రూ.10 కలిపి రూ.21గా ఖరారు చేశారు. ► కొత్త నిబంధనల ప్రకారం ఇళ్ల స్థలాలను విక్రయించడానికి వీలుకాదు. ఆ స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఐదేళ్లు నివాసం ఉన్న తర్వాత అత్యవసరమైతేనే వేరే వారికి విక్రయించవచ్చు. ► పేదల పట్టాలను కన్వేయన్స్ డీడ్ రూపంలో ఇవ్వనుంది. డూప్లికేషన్ లేకుండా చేయడం, ట్యాంపరింగ్కు అవకాశం లేకుండా చేయడం కోసమే ప్రభుత్వం ఈ విధానాన్ని రూపొందించింది. -
ఆర్థిక సంవత్సరం పొడిగింపు... నిజంకాదు!
న్యూఢిల్లీ: ఏప్రిల్ 2019 నుంచీ ప్రారంభమై మార్చి 2020తో ముగిసే 2019–2020 ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలలు అంటే జూన్ నెలాంతం వరకూ పొడిగించినట్లు సోమవారం వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలింది. ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ మేరకు ఒక వివరణాత్మక ప్రకటన చేసింది. ఆర్థిక సంవత్సరం పొడిగింపు జరిగినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. దీని ప్రకారం ఆర్థికశాఖ కింద పనిచేస్తున్న రెవెన్యూ శాఖ 30వ తేదీన ఇండియన్ స్టాంప్స్ యాక్ట్లో కొన్ని సవరణలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ను జారీ చేసింది. దీనిని కొన్ని మీడియా వర్గాలు తప్పుగా అర్థం చేసుకున్నాయి. ‘‘స్టాక్ ఎక్సే్చంజీలు లేదా క్లీనింగ్ కార్పొరేషన్ల ద్వారా జరిగే సెక్యూరిటీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ల లావాదేవీలపై స్టాంప్ డ్యూటీ వసూళ్లకు 2020 ఏప్రిల్ 1 నుంచీ పటిష్ట యంత్రాంగం అమల్లో ఉంటుందని గత నోటిఫికేషన్ ఒకటి తెలిపింది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ యంత్రాగం అమలును 2020 జూలై 1వ తేదీ వరకూ వాయిదా వేయడం జరిగిందని రెవెన్యూ శాఖ మార్చి 30వ తేదీన ఒక ప్రకటన ఇచ్చింది. దీనిని కొన్ని మీడియా వర్గాలు తప్పుగా అర్థం చేసుకున్నాయి’’ అని ఆర్థికశాఖ ప్రకటన మంగళవారం వివరణ ఇచ్చింది. -
ఉగాది రోజు ఇళ్ల పట్టాలు
సాక్షి, అమరావతి: ఉగాది పర్వదినం సందర్భంగా ఈ నెల 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు వేగవంతం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేసిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆంక్షలు తొలగిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇళ్ల పట్టాల పంపిణీతోపాటు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు అవరోధం తొలగిపోయింది. ఈ నేపథ్యంలో ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల్లో 26 లక్షల మందికి నివాస స్థల పట్టాలను కన్వేయన్స్ డీడ్స్ (విక్రయ దస్తావేజుల) రూపంలో ఇచ్చేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. సంక్షేమం ఇక చకచకా.. నిధులు విడుదల - ఇళ్ల స్థలాల కోసం భూమి ఇచ్చిన వారికి పరిహారం చెల్లింపు, ప్లాట్ల అభివృద్ధి కోసం రెవెన్యూ శాఖ తాజాగా బుధవారం రూ.1,400 కోట్లు విడుదల చేసింది. - రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ పేరుతో రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి ఉషారాణి జీఓ జారీ చేశారు. - ఈ నిధుల్లో కృష్ణాకు రూ.450 కోట్లు, గుంటూరుకు రూ.450 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాకు రూ.200 కోట్లు, పశ్చిమ గోదావరికి రూ.300 కోట్లు చొప్పున కేటాయించారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటి దాకా ప్రభుత్వం రూ.5000 కోట్లు విడుదల చేసింది. - త్వరితగతిన ఫ్లాటింగ్, పట్టాలను సిద్ధం చేయాలని రెవెన్యూ అధికారులు జిల్లాల అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. -
రూ.10 స్టాంప్ పేపర్పై మూడు పేజీల్లో ఇళ్ల పట్టా
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ రోజు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. 25 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్పై అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. భూములను సేకరించి చదును చేయడం, ప్లాటింగ్, మార్కింగ్ జరుగుతోంది. లబ్ధిదారుల పేరిట ప్రభుత్వం రూ.పది స్టాంప్ పేపర్పై ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి అందించనుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రెవెన్యూ శాఖ జిల్లా అధికార యంత్రాంగానికి పంపింది. రిజిస్ట్రార్ కార్యాలయానికి డాక్యుమెంట్ రూ.పది స్టాంపు పేపర్ తొలి పేజీలో లబ్ధిదారుడి సమాచారంతో పాటు తహసీల్దారు సంతకం ఉంటుంది. రెండో పేజీలో ఇంటి స్థలం, సరిహద్దు వివరాలు, తహసీల్దారు సంతకం ఉంటుంది. మూడో పేజీ (ఫారం 32–ఏ)లో తొలుత తహసీల్దారు / ప్రతినిధి ఎడమ చేతి బొటన వేలి ముద్ర వేసి పాస్పోర్టు ఫోటో అతికించి సంతకం చేసి చిరునామా పూరిస్తారు. తరువాత లబ్ధిదారులు / ఆమె ప్రతినిధి ఎడమ చేతి బొటన వేలు ముద్ర వేసి పాస్ పోర్టు ఫొటో అతికించి సంతకం చేసి చిరునామా పూరిస్తారు. స్టాంప్ పేపర్పై సాక్షి, తహసీల్దారు సంతకాలు చేస్తారు. డాక్యుమెంట్ మూడు పేజీలను స్కానింగ్ చేసి రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపిస్తారు. లబ్ధిదారుల పేరిట తహసీల్దారులే రిజిస్ట్రేషన్ చేయిస్తారు. ఈ ప్రక్రియపై చర్చించేందుకు రెవెన్యూ శాఖ మంగళవారం తహసీల్దార్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. - రూ.పది స్టాంపు పేపర్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రెవెన్యూ శాఖ ఇంటి స్థలం పట్టా అని ఉంటుంది. - లబ్ధిదారులు ఇంటి స్థలాన్ని వంశపారంపర్యంగా అనుభవించవచ్చు. అవసరాల నిమిత్తం ఇంటి స్థలాన్ని బ్యాంకులో ఎప్పుడైనా తనఖా పెట్టుకోవచ్చని పట్టాలో పేర్కొన్నారు. - అవసరమైతే ఐదేళ్ల తరువాత ఇంటి స్థలాన్ని విక్రయించుకోవచ్చు, కొనుగోలు చేయవచ్చు. మంజూరు చేసిన స్థలంలో అమలులో ఉన్న చట్టాలకు లోబడి నివాస కట్టడాలు చేపట్టవచ్చు. - నవరత్నాల పథకాల వివరాలతోపాటు వైఎస్సార్, ముఖ్యమంత్రి జగన్ ఫొటోతో కూడిన లోగోను ఇంటి స్థలం పట్టాపై ముద్రించారు. -
భూ మాయకు అడ్డుకట్ట!
కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తికి ఐదు ఎకరాలుండగా రాత్రికి రాత్రే అతడి పేరుతో 30 ఎకరాలను వెబ్ల్యాండ్లోకి ఎక్కించారు. సదరు భూమిపై బ్యాంకులో రుణం తీసుకున్న రెండు రోజులకే ఆ భూమిని వెబ్ ల్యాండ్లో ఆయన పేరుతో లేకుండా ప్రభుత్వ ఖాతాలోకి మార్చేశారు. సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వెబ్ల్యాండ్ పేరుతో గతంలో జరిగిన భూ మోసాలను వెలికి తీయడంపై రెవెన్యూ శాఖ దృష్టి సారించింది. ప్రభుత్వ భూములను పరిరక్షించే దిశగా రికార్డుల స్వచ్ఛీకరణ, ఆటోమేటిక్ మ్యుటేషన్లకు నిబంధనలు రూపొందించింది. సర్వే నంబర్లవారీగా వెబ్ల్యాండ్ రికార్డులు తనిఖీ చేసి ఆర్ఎస్ఆర్ (రీ సెటిల్మెంట్ రిజిస్టర్) ఆధారంగా లావాదేవీలను తనిఖీ చేయనున్నారు. కొంతమంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది ప్రభుత్వ భూములను రాత్రికి రాత్రే వెబ్ల్యాండ్లో ప్రైవేట్ వ్యక్తుల పేర్లతో నమోదు చేశారనే విమర్శలున్నాయి. కొంతమంది బడా నాయకులు రెవెన్యూ సిబ్బందిని ముడుపులతో సంతృప్తిపరిచి ప్రభుత్వ భూములను పెద్ద ఎత్తున తమ పేర్లతో, బినామీల పేర్లతో వెబ్ల్యాండ్లో నమోదు చేయించుకున్నారు. ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల పేరుతో ఉండాలంటే తప్పకుండా దరఖాస్తు పట్టా (డీకేటీ) ఇచ్చి ఉండాలి. లేదంటే భూమి కేటాయించి ఉండాలి. ఇందుకు భిన్నంగా లక్షల సంఖ్యలో లావాదేవీలు జరిగాయి. రిటైర్డ్ అధికారుల కీలక పాత్ర కొందరు రిటైర్డు తహసీల్దార్లు, గ్రామ రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు. పదవీ విరమణ/బదిలీకి ముందు భారీగా వసూళ్లు చేసి వెబ్ల్యాండ్లో ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తుల పేర్లతో నమోదు చేశారు. కొందరైతే విచారణ జరిపినా బయటకు రాకుండా ఏకంగా రికార్డులు మాయం చేశారు. చాలా జిల్లాల్లో డీకేటీ రిజిస్టర్లు, భూ అనుభవ రికార్డు (అడంగల్), భూ యాజమాన్య హక్కుల పుస్తకం (1బి) పాతవి మాయం కావడం ఇందుకు నిదర్శనమని ఉన్నతాధికారులు అంగీకరిస్తున్నారు. విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో ఇలాంటివి ఎక్కువగా చోటు చేసుకున్నాయి. ఇక్కడ ఎక్కువగా బంజరు భూములు ఉండటమే ఇందుకు కారణం. ఆర్ఎస్సార్తో సరిపోల్చాలి.. రెవెన్యూ శాఖ అత్యంత ప్రామాణికంగా పరిగణించే బ్రిటిష్ కాలం నాటి ఆర్ఎస్ఆర్తో సరిపోల్చి సర్వే నంబర్లవారీగా డీకేటీ రిజిస్టర్, అడంగల్, 1 బి రికార్డులు, వెబ్ల్యాండ్ను పరిశీలిస్తే మోసాలు కచ్చితంగా వెలుగులోకి వస్తాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ‘ఉదాహరణకు ఓ గ్రామంలోని 102 సర్వే నంబరులో 30 ఎకరాలు ఆర్ఎస్ఆర్లో ప్రభుత్వ భూమి అని ఉందనుకుందాం. తర్వాత ప్రభుత్వం అది ఎవరికైనా అసైన్మెంట్ (డీకేటీ) పట్టా కింద ఇచ్చి ఉంటే డీకేటీ రిజిస్టర్లో ఉంటుంది. ఒకవేళ డీకేటీ ఇచ్చినట్లు నమోదు కాకుండా ఈ భూమి వెబ్ల్యాండ్లో ఇతరుల పేరుతో ఉంటే అక్రమ మ్యుటేషన్ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది’ అని రాష్ట్ర భూ పరిపాలన సంయుక్త కమిషనర్ శ్రీధర్ తెలిపారు. ‘డీకేటీ పట్టాలు ఎప్పుడు ఎవరికి ఇచ్చారనే వివరాలు కలెక్టరేట్లలో ఉంటాయి. వీటి ఆధారంగా తనిఖీలు చేస్తే అక్రమాలు బయటకు వస్తాయి. అయితే అక్కడ కూడా రికార్డులు గల్లంతైతే మోసాలను వెలికి తీయడం కష్టం’ అని భూ వ్యవహారాలపై అనుభవజ్ఞుడైన ఓ రిటైర్డు ఐఏఎస్ అధికారి పేర్కొన్నారు. ఆటోమేటిక్ మ్యుటేషన్ అంటే...? ఏదైనా ఓ భూమిని కొనుగోలుదారుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే ఆ సమాచారం సబ్ రిజిస్ట్రార్ నుంచి సంబంధిత తహసీల్దార్ కార్యాలయానికి అందుతుంది. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు 15 రోజులు గడువు ఇచ్చి ఆమేరకు భూముల రికార్డులను రెవెన్యూ అధికారులు సవరిస్తారు. కొనుగోలుదారుడు తన పేరుతో భూ రికార్డులను మార్చుకునేందుకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. -
లే అవుట్లను తలదన్నేలా!
సాక్షి, అమరావతి: అందమైన లే–అవుట్లు.. విశాలమైన అంతర్గత రోడ్లు... ప్లాట్ల దగ్గరి నుంచి సమీప గ్రామానికి లింకు రోడ్డు...! ఇదేదో రియల్ ఎస్టేట్ సంస్థ వ్యాపార ప్రకటన కాదు... రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాల కోసం ఎంపిక చేసిన స్థలాలివి. ఉగాది సందర్భంగా గూడులేని పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను రియల్ ఎస్టేట్ వెంచర్లను తలదన్నేలా అధికారులు తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 9,100 ఎకరాల్లో ఈ పనులు జోరుగా సాగుతున్నాయి. దాదాపు 25 లక్షల మంది పేదలకు ఉగాదికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. గతానికి భిన్నంగా ఇంటి పట్టా పొందిన లబ్ధిదారుడు వెంటనే గృహ నిర్మాణం ప్రారంభించేలా భూమిని పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో లే అవుట్ పనులు ఊపందుకున్నాయి. గ్రామాల్లో ఇళ్ల పట్టాల కోసం కేటాయించిన భూముల వివరాలను రెవిన్యూ శాఖ సర్వే నంబర్ల వారీగా గ్రామీణాభివృద్ధి శాఖకు తెలియజేసిన వెంటనే ఉపాధి హామీ నిధులతో చదును చేయడం, అంతర్గత రోడ్ల నిర్మాణ పనులను చేపడుతున్నారు. ఆయా చోట్ల పరిస్థితిని బట్టి ఎకరానికి రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఈ పనుల కోసం ఖర్చు చేస్తున్నారు. నెలాఖరుకు భూమి చదును, రోడ్లు పూర్తి - గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల కోసం రెవిన్యూ శాఖ ఇప్పటి వరకు 12,843 ప్రాంతాల్లో గుర్తించిన భూమి వివరాలను గ్రామీణాభివృద్ది శాఖకు అందజేయగా ఎలాంటి అభ్యంతరాలు లేని 9,633 గ్రామాల్లో చదును చేయడం మొదలైంది. - ముళ్ల పొదలు లాంటివి తొలగింపు పనులు ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయి. - భూమి చదును చేయడం, మెరక తోలడం, లే అవుట్ ప్రకారం రోడ్ల నిర్మాణానికి డ్రోన్లను వినియోగించారు. - ప్రతి ఎకరాకు గరిష్టంగా 4,000 క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించి భూమి చదును చేస్తున్నారు. - ప్రతి ఎకరానికి గరిష్టంగా 800 మీటర్ల పొడవున అంతర్గత రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. - ఇళ్ల పట్టాల కోసం గుర్తించిన భూమి నుంచి సమీపంలోని రోడ్డు లేదా గ్రామం వరకు గరిష్టంగా 5 కి.మీ పొడవున లింకు రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. - భూమి చదును, అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఆ భూమిని తిరిగి రెవిన్యూ శాఖకు అప్పగిస్తే లే అవుట్ ప్రకారం ప్లాట్ల వారీగా రాళ్లు పాతుతారు. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది. - రాష్ట్రవ్యాప్తంగా 8,662 గ్రామాల్లో పనులు వేగంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. -
నివాస స్థలం ఎవరి అధీనంలో ఉంటే వారికే పట్టా
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రభుత్వం దరఖాస్తు (డీకేటీ) పట్టా రూపంలో ఇచ్చిన నివాస స్థలాలు ఎవరి అధీనంలో ఉంటే వాటిపై వారికే హక్కులు కల్పించాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది. 2019 జనవరి 21వ తేదీకి ముందు చేతులు మారిన నివాస స్థల డీకేటీ పట్టాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్యదర్శి వి.ఉషారాణి జిల్లా కలెక్టర్లకు అంతర్గత ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి డీకేటీ పట్టాల రూపంలో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు చాలావరకు అనధికార లావాదేవీల ద్వారా చేతులు మారాయి. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్(పీఓటీ) చట్టం ప్రకారం వీటి క్రయవిక్రయాలకు ఆస్కారం లేదు. అందువల్ల విక్రయ రిజిస్ట్రేషన్లు జరగవు. ఈ నేపథ్యంలో అనధికారికంగా కొనుగోలు చేసిన స్థలం ఎవరి అధీనంలో ఉంటే వారికే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే డీకేటీ పట్టాల రూపంలో ఇళ్ల స్థలాలు తీసుకున్న వారు ఆర్థిక సమస్యలుంటే 20 ఏళ్ల తర్వాత విక్రయించుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు పీఓటీ చట్టానికి సవరణ చేస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించింది. దీంతో గతేడాది జనవరి 21వ తేదీకి ముందు నివాస స్థలం ఎవరి అధీనంలో ఉంటే వారికే పట్టా ఇవ్వాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు మెమో జారీ చేసింది. గతంలోనే ఈ మెమో ఇచ్చినప్పటికీ కొందరు కలెక్టర్లు/ రెవెన్యూ అధికారులు సందేహాలు వ్యక్తం చేశారు. వాటిని నివృత్తి చేస్తూ తాజాగా ప్రభుత్వం మరో మెమో పంపింది. వేరే వారికి ఇచ్చిన నివాస స్థలాలను ఎవరు పడితే వారు కొనుగోలు చేసినా, స్వాధీనం చేసుకున్నా పట్టా ఇవ్వడం కుదరదు. ఇల్లు గానీ, నివాస స్థలం గానీ లేనివారికి మాత్రమే ఇలా పట్టా ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. పీఓటీ చట్ట సవరణ నేపథ్యంలో ఇప్పటివరకూ ఇళ్ల స్థలాలు పొందినవారు వాటిని 20 ఏళ్ల తర్వాత విక్రయించుకోవచ్చు. -
ఇళ్ల స్థలాలకు భూసేకరణ వేగవంతం
సాక్షి, అమరావతి: ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు 25 లక్షల మందికి నివాస స్థల పట్టాలు ఇవ్వాలన్న లక్ష్యంతో రెవెన్యూ శాఖ చకచకా కసరత్తు చేస్తోంది. గ్రామ, వార్డు వలంటీర్లు అందించిన సమాచారాన్ని విశ్లేషించి ఇప్పటికే 22.78 లక్షల మంది లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసింది. నవరత్నాల అమల్లో భాగంగా వచ్చే ఉగాది రోజు 25 లక్షల మందికి నివాస స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలను సాకారం చేసే దిశగా రెవెన్యూ యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. భూముల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో నివాస స్థల పట్టాలు ఇవ్వడానికి భూమిని సమకూర్చుడం మహా యజ్ఞంలా మారింది. అందువల్ల ఈ అంశపైనే రెవెన్యూ శాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 22,850 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివాస స్థలాలు ఇవ్వడానికి గుర్తించిన భూమి పోనూ ఇంకా 19 వేల ఎకరాలు అవసరమని రెవెన్యూ యంత్రాంగం అంచనా వేసింది. ఈ భూసేకరణ నిమిత్తం రూ.10 వేల కోట్లు అవసరమని రెవెన్యూ శాఖ ప్రాథమిక నివేదిక రూపొందించింది. చకచకా కసరత్తు నిధుల విడుదలకు సీఎం సమ్మతి తెలపడంతో నివాస స్థలాల కోసం భూసేకరణ కసరత్తును రెవెన్యూ శాఖ వేగవంతం చేసింది. పట్టణ, నగర ప్రాంతాల్లో భూమి విలువ అధికంగా ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని జీ ప్లస్ త్రీ తరహాలో ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి తర్వాత గృహ నిర్మాణ పథకాల కింద ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది. ఉభయ గోదావరి జిల్లాల్లో భూముల కొరత, అధిక ధరలను పరిగణనలోకి తీసుకుని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో సైతం జీ ప్లస్ త్రీకి అనుమతించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు కోరగా ప్రభుత్వం ఆమోదించింది. మూడు దశల్లో నిధుల విడుదలకు సీఎం ఆదేశం భూసేకరణకు రూ.10 వేల కోట్ల నిధులు అవసరమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మౌఖికంగా నివేదించామని రెవెన్యూశాఖ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ‘సాక్షి’కి తెలిపారు. ‘రూ.3 వేల కోట్ల చొప్పన మూడు విడతల్లో రూ. 10 వేల కోట్లు ఇవ్వాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు. ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్న భూమి పోనూ గ్రామీణ ప్రాంతాల్లో 8000 ఎకరాలు, పట్టణ ప్రాంతాల్లో 11000 ఎకరాలు కలిపి మొత్తం 19000 ఎకరాలు సేకరించాల్సి ఉంది. వ్యయ నియంత్రణలో భాగంగా సాధ్యమైనంతవరకూ భూసేకరణను తగ్గించి ప్రభుత్వ భూములను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళుతున్నాం. ఇదే లక్ష్యంతో ఇంకా ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఆక్రమణల్లో ఉంటే గుర్తించి స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించాం’ అని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వెల్లడించారు. -
త్వరలో పట్టాదారు కార్డులు
సాక్షి, అమరావతి: నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలకు చెక్ పెట్టేందుకు ప్రతి రైతు/భూ యజమానికి ఏటీఎం కార్డు తరహాలో పట్టాదారు కార్డులు అందజేయాలని రెవెన్యూ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ ప్రతిపాదిత కార్డు పాన్కార్డు పరిమాణంలో ఉండి.. దానిపై భూ యజమాని పేరు, చిరునామా ఉంటుంది. చిన్న డిజిటల్ చిప్ అమర్చడం వల్ల కార్డును స్వైప్/స్కాన్ చేస్తే సదరు రైతుకు ఏ గ్రామం/పట్టణంలోని ఏయే సర్వే నంబర్లలో ఎంత భూముందో కనిపిస్తుంది. భద్రత ప్రమాణాలతో కూడిన పట్టాదారు కార్డు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇది ఎలా ఉండాలి? ఒక్కో దానికి ఎంత ఖర్చవుతుంది? అనే అంశాలపై రెండు సంస్థలతో సంప్రదింపులు జరిపారు. పారదర్శకంగా టెండర్లు నిర్వహించి తక్కువ ధరకు పొందేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. నకిలీలకు అడ్డుకట్ట వేసేలా రెవెన్యూ శాఖలో భూ రికార్డులు తప్పుల తడకలుగా ఉన్నందున ప్రక్షాళన చేయాలని రెవెన్యూ శాఖ ఇప్పటికే మార్గదర్శకాలిచ్చింది. వచ్చే ఏడాది మే నెలాఖరుకి రికార్డుల్ని పూర్తిగా స్వచ్ఛీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పూర్తైన వెంటనే పట్టాదారు పాసు పుస్తకం స్థానంలో కార్డులు ఇస్తారు. నకిలీలకు, ట్యాంపరింగ్కు అవకాశం లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్డులు ఇవ్వాలని నిర్ణయించామని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ‘సాక్షి’కి తెలిపారు. -
ఉగాది రోజున 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు
సాక్షి, అమరావతి: ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు సమకూర్చే లక్ష్యంలో భాగంగా వచ్చే ఉగాది రోజున 25 లక్షల మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ దస్తావేజులతో కూడిన పట్టాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని సీసీఎల్ఏ, ప్రభుత్వ ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ వెల్లడించారు. ఈ అంశంపై శుక్రవారం సచివాలయం నుంచి జిల్లా సంయుక్త కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమం కోసం గ్రామాల వారీగా ప్రభుత్వ భూములు, లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాల నుంచి అందిన సమాచారం మేరకు ఇప్పటివరకూ 22 లక్షల వరకూ లబ్ధిదారుల గుర్తింపు పూర్తయ్యిందని, మిగిలిన లబ్ధిదారుల గుర్తింపును త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మొదటగా ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇళ్ల స్థలాలుగా ఇచ్చేందుకు అనువుగా ఉన్న భూములేమిటనేది గుర్తించాలన్నారు. లిటిగేషన్లో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి కోర్టుకు అఫిడవిట్ సమర్పించి ఆ భూములను కూడా ఇళ్ల పట్టాలుగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే గుర్తించిన భూములన్నీ గ్రామాల వారీ మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాలను క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో టిడ్కో నిర్మిస్తున్న ఇళ్ల లబ్ధిదారుల వివరాలను, వివిధ పట్టణాభివృద్ధి సంస్థల వద్ద ఇళ్ల స్థలాలకు ఉద్దేశించిన భూముల వివరాలను కూడా సేకరించాలని కోరారు. రెవెన్యూ శాఖ కార్యదర్శి ఉషారాణి మాట్లాడుతూ ఇళ్ళ స్థలాలకై ప్రభుత్వ భూముల గుర్తింపులో భాగంగా గతంలో సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా కేటాయించిన భూములను, భూదాన భూముల స్థితిగతులను కూడా తెలుసుకోవాలన్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక కమిషనర్ హరినారాయణ మాట్లాడుతూ ఇళ్ల స్థలాల కోసం ఇప్పటివరకూ 23,180 ఎకరాల భూమిని గుర్తించామని, ఇంకా అవసరమైన భూమిని త్వరగా గుర్తించాలన్నారు. -
బార్ల సంఖ్య సగానికి తగ్గించండి
సాక్షి, అమరావతి: ప్రజలకిచ్చిన మాట మేరకు దశల వారీ మద్య నియంత్రణలో భాగంగా బార్ల సంఖ్యను సగానికి సగం తగ్గించేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న బార్లలో ఇక 50 శాతమే ఉండాలని, 50 శాతం కనిపించకూడదని స్పష్టం చేశారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఆదాయ వనరుల శాఖలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మద్యం ఆదాయం తగ్గుతున్నప్పటికీ ప్రజలకిచ్చిన మాట నెరవేర్చడమే ముఖ్యమని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 839 బార్లు ఉండగా ఇందులో 420 బార్లు కనుమరుగు కావాలని సూచించారు. లైసెన్స్ ఫీజును భారీగా పెంచాలని కూడా సీఎం ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతాల్లోనే బార్లు ఉండాలని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బార్లు తెరిచి ఉంచే సమయాన్ని కూడా తగ్గించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు బార్లు తెరిచి ఉంచుతున్నారని, నూతన బార్ల విధానంలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే బార్లు తెరిచి ఉండాలని సూచించారు. ఇందుకు సంబంధించిన నూతన బార్ల విధానాన్ని వీలైనంత త్వరగా రూపొందించాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. మహిళా సంక్షేమమే సీఎం ధ్యేయం ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ తన పాదయాత్రలో ఎంతో మంది మహిళల కష్టాలు విన్నారు. తమ భర్తలు తాగుడుకు బానిస కావడంతో ఎన్నో కష్టాలు పడుతున్నామని ఆయనకు చెప్పుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ కష్టం నుంచి తమను గట్టెక్కించాలని వేడుకున్నారు. వారి కష్టాలను స్వయంగా చూసిన జగన్.. తాము అధికారంలోకి రాగానే దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచి్చన మాట మేరకు తొలుత 43 వేల బెల్ట్షాపులను తొలగించారు. ఆ తర్వాత 4,380 మద్యం దుకాణాలలో 20 శాతం దుకాణాలు (880) తొలగించారు. మిగిలిన 3,500 దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. మద్యంను ఆదాయ వనరుగా చూడకుండా ప్రజల ఆరోగ్యమే ప్రధానంగా సీఎం ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే తాజాగా బార్ల సంఖ్యను సగానికి తగ్గించేయాలని ఆదేశించారు. ‘రాష్ట్రంలో ప్రస్తుతం గత చంద్రబాబు సర్కారు తెచ్చిన 2017 – 2022 బార్ల విధానం అమల్లో ఉంది. గతంలో వారి మద్దతుదారులకు లబ్ధి కలిగేలా ముందు చూపుతో వ్యవరించారు. ఇప్పుడు ఆ విధానం స్థానంలో సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు ప్రజలకు మేలు జరిగేలా నూతన బార్ల విధానాన్ని రూపొందిస్తాం’ అని ఎక్సైజ్ కమిషనర్ ఎం.ఎం. నాయక్ ‘సాక్షి’కి తెలిపారు. -
ఉగాదికి ఇళ్ల పట్టాలు
-
పేదలకు ఏపీ సర్కారు బంపర్ ఆఫర్
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల్లో అభ్యంతరాల్లేని అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. రెండు సెంట్లలోపు వరకు మొత్తం రూపాయికే రిజిస్ట్రేషన్ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అంతకు మించితే క్రమబద్ధీకరణ ఫీజు ఎంత ఉండాలన్న దానిపై ప్రతిపాదనలు రూపొందించాలని ఆయన సూచించారు. అలాగే, వీటి క్రమబద్ధీకరణకు విధివిధానాలు తయారు చేయాలన్నారు. ఉగాది నాటికి పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చే విషయమై గురువారం ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) పిల్లి సుభాష్ చంద్రబోస్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. కాల్వగట్ల వాసులకు ప్రాధాన్యం నదీతీరాల వెంబడి, కాల్వగట్ల వెంబడి ఉన్న ఇళ్ల కారణంగా ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పు పొంచి ఉన్నందున.. స్థలాలు, ఇళ్ల కేటాయింపులో ఇక్కడి వారికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. గతంలో స్థలం ఇచ్చినా రిజిస్ట్రేషన్ చేసే వారు కాదని.. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నామన్నారు. చంద్రబాబు పేదలకు ఇచ్చిన స్థలాలను లాక్కున్నారని.. ఒకసారిఇచ్చిన తర్వాత ఎలా లాక్కుంటారని జగన్ ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణానికి వీలైనంత మేర ప్రభుత్వ స్థలాలనే వాడుకోవాలని ఆయన స్పష్టం చేశారు. విడివిడిగా ఇళ్లే ఇవ్వండి పట్టణ ప్రాంతాల్లో అవకాశం ఉన్నచోట పేదలకు అపార్ట్మెంట్ ఫ్లాట్లు కన్నా.. ఇళ్ల స్థలాలు కేటాయించి వాటిలో విడివిడిగా ఇళ్లు కట్టించాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం పేదలు ఉంటున్న బహుళ అంతస్తుల సముదాయాల్లో నిర్వహణ సరిగ్గాలేదని.. ఫలితంగా ఫ్లాట్లు దెబ్బతింటున్నాయని ముఖ్యమంత్రి వివరించారు. దీనికి పరిష్కారంగా లబ్ధిదారులకు విడివిడిగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. అలాగే, ప్రస్తుతం సమస్యలు ఎదుర్కొంటున్న ఫ్లాట్లను బాగుచేసుకునేలా ఏదైనా ఆలోచన చేయాలన్నారు. లబ్ధిదారుల జాబితా విధిగా ప్రదర్శించాలి ఇళ్ల స్థలాలు పొందే లబ్ధిదారుల జాబితాలను విధిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని కూడా సీఎం ఆదేశించారు. ఇళ్ల స్థలాల కోసం ఎవరికైనా అర్హత లేకపోతే అందుకు కారణాలను కూడా వారికి తెలియజేయాల్సిందేనని స్పష్టంచేశారు. ఈ సమయంలో మంత్రి బుగ్గన జోక్యం చేసుకుని.. గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు, ఇళ్లు విషయంలో.. వైఎస్సార్సీపీకి ఓట్లేశారని, ఆ పార్టీ సానుభూతిపరులంటూ వారికి నిరాకరించారని తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కాగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించే లబ్ధిదారుల జాబితా కింద దరఖాస్తులు ఎవరికి చేయాలి.. ఎలా చేయాలి.. ఎవరిని సంప్రదించాలి వంటి సూచనలు కూడా ఇవ్వాలని సీఎం చెప్పారు. జనవరి వరకూ దరఖాస్తులు స్వీకరించాలి ఇళ్ల స్థలాల లబ్ధిదారుల నుంచి జనవరి వరకూ దరఖాస్తులు స్వీకరించాలని, లక్ష్యం కన్నా మరో 10 శాతం అదనంగా ఇళ్ల స్థలాలను బఫర్గా పెట్టుకుంటే దరఖాస్తుదారులు అనుకున్న దానికంటే ఎక్కువ ఉన్నా ఇబ్బందిలేకుండా ఉంటుందని సీఎం అన్నారు. 20,47,325 మంది లబ్ధిదారులు ఇప్పటివరకూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల సంఖ్య 20,47,325గా తేలిందని, ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకూ 19,389 ఎకరాల భూమిని గుర్తించామని, ఇక్కడ మరో 8వేల ఎకరాలు అవసరమయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే, పట్టణ ప్రాంతాల్లో 2,559 ఎకరాలను గుర్తించామని, ఇక్కడ ఇంకా 11వేల ఎకరాలు అవసరమవుతాయని అంచనా వేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. మొత్తం మీద పేదల ఇళ్ల స్థలాల కోసం సుమారు రూ.10 వేల నుంచి రూ.12 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందన్నారు. (చదవండి: సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం) -
భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ సిబ్బందిపై ఉందని ఏపీ ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. కబ్జాదారులు ఎంతటి వారైనా ఉపేక్షించొద్దన్నారు. తిరుపతిలోని ఎస్వీయూ సెనేట్ హాల్లో బుధవారం నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణంపై రెవెన్యూ, గృహనిర్మాణ శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. బోస్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ పాడి పరిశ్రమ మీద ఆధారపడ్డ వారికి 3 సెంట్ల భూమి ఇచ్చే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. మంత్రి కె.నారాయణస్వామి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు ప్లాస్టరింగ్ చేయించుకోలేని స్థితిలో పలువురు పేదలున్నారని, ఈ విషయాన్ని పరిశీలించాలని కోరారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ నవరత్నాల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్రెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, నవాజ్ బాషా, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఆదిమూలం, చింతల రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, కలెక్టర్ నారాయణ భరత్గుప్తా, తిరుపతి ఆర్డీవో కనక నరసారెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్సార్ రైతు భరోసా అర్హులకే అందాలి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 15వ తేదీ నుంచి అమలు చేయనున్న ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథకాన్ని నిజమైన రైతులందరికీ అందేలా చూడాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోని వెబ్లాండ్ జాబితాను గ్రామ పంచాయితీల వారీగా పరిశీలించి అందులో ఉన్న వారు నిజమైన రైతులో కాదో గుర్తించి ఈ పథకం కింద పెట్టుబడి సాయాన్ని అందించాలన్నారు. ఈ పథకం అమలుకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై బుధవారం ఆయన వ్యవసాయ మంత్రి కన్నబాబు, జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ, అనుబంధ రంగాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో మాదిరిగా వ్యవసాయం చేయని వారికి, విదేశాల్లో ఉంటూ సాగు చేయని భూ యజమానులకు, వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్, చేపల చెరువులుగా మార్పిడి చేసిన వారికి రైతు భరోసా కింద లబ్ధి కలగకూడదన్నారు. సర్వే తర్వాతే గ్రామ సచివాలయాలలో జాబితా : వైఎస్సార్ రైతు భరోసాపై పక్కా ప్రణాళిక రూపకల్పన కోసం సీఎంతో సమీక్ష అనంతరం అధికారులు చర్చలు జరిపారు. తండ్రి చనిపోయాక వ్యవసాయం చేస్తున్న పిల్లల పేర్లు, కొత్తగా భూమి కొనుగోలు చేసిన వారి పేర్లు, ఈనాం సాగుదార్లను రికార్డుల్లోకి ఎక్కించాలని నిర్ణయించారు. రైతు భరోసా పథకానికి అర్హులు ఎవరో తేల్చేలా ఈనెల 18 నుంచి 25 వరకు సర్వే చేయించాలని నిర్ణయించారు. అనంతరం అర్హుల జాబితాను గ్రామ సచివాలయాలలో ప్రదర్శిస్తారు. కాగా, పీఎం కిసాన్ డేటా, అన్నదాత సుఖీభవలో చాలా లోపాలు జరిగాయని, వాటిని సవరించి అర్హులను గుర్తించనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. రైతుల సందేహాల నివృత్తికి హెల్ప్లైన్ ఏర్పాటు చేస్తామన్నారు. -
రెండు నెలల్లో రికార్డుల ప్రక్షాళన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తప్పుల తడకలుగా ఉన్న భూ రికార్డులను రెండు నెలల్లో పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆదేశించారు. సచివాలయంలోని తన చాంబర్ నుంచి బుధవారం జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్హులందరికీ ఉగాది రోజున నివాస స్థల పట్టాల పంపిణీ, భూముల సమగ్ర రీసర్వే అనేవి సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యమైన పథకాలని ఉప ముఖ్యమంత్రి వివరించారు. భూముల రీసర్వే చేయడానికి ముందే భూ రికార్డులను పూర్తిగా అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నారు. రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్), వెబ్ల్యాండ్ మధ్య భూముల విస్తీర్ణంలో భారీ తేడా ఉందని, చాలా చోట్ల చనిపోయిన వారి పేర్లతోనే భూములు ఉన్నాయని వివరించారు. కొన్నిచోట్ల వాస్తవ విస్తీర్ణానికి, రికార్డుల్లో ఉన్న గణాంకాలకు పోలిక లేదన్నారు. రీసర్వే చేయాలంటే వీటన్నింటినీ ముందుగా సరిదిద్దాల్సి ఉంటుందని తెలిపారు. రికార్డుల స్వచ్చికరణకు మార్గదర్శకాలతో (ఫార్మట్తో సహా) రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి నెల రోజుల్లో ప్రక్రియను పూర్తిచేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 మండలాలకు ఒకటి చొప్పున ఆధునిక స్టోరేజీ గదుల నిర్మాణాన్ని సెప్టెంబర్ 15 కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. రికార్డులు స్వచ్ఛీకరించేప్పుడు తప్పులు, పొరపాట్లకు ఆస్కారం లేకుండా క్షేత్రస్థాయిలో ఒకటికి రెండుసార్లు చెక్ చేసి కచ్చితంగా నిర్ధారించుకున్న తర్వాతే మార్పులు చేయాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్సింగ్, సీసీఎల్ఏ కార్యదర్శి చక్రవర్తి ఆదేశించారు. -
పక్కాగా భూ హక్కులు
సాక్షి, అమరావతి: యజమానులకే కాకుండా కొనుగోలుదారులకు సైతం భూమి హక్కులపై పూర్తి భరోసా కల్పించే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్టు–2019ను రాష్ట్ర శాసనసభ సోమవారం ఆమోదించింది. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి చట్టంలేదని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక, సాహసోపేత నిర్ణయం తీసుకుని ఈ బిల్లు తెచ్చారని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ ప్రశంసించారు. ల్యాండ్ మాఫియాకు, అక్రమ రిజిస్ట్రేషన్లకు, నకిలీ రికార్డులకు చెక్ పెట్టడమే ధ్యేయంగా పకడ్బందీగా శాశ్వత భూ హక్కుల కల్పన బిల్లును రూపొందించామని ఆయనన్నారు. ఈ సందర్భంగా మంత్రి బోస్ ప్రవేశపెట్టిన బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీని ఆవశ్యకత, విశేషాలు, ఉపయోగాలను ఆయన వివరించారు. పట్టణీకరణ పెరిగిన నేపథ్యంలో భూముల విలువ పెరగడం, భూ రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం, ల్యాండ్ మాఫియా విచ్చలవిడిగా విజృంభించడం, నకిలీ రికార్డులు సృష్టించి వాస్తవ రికార్డులు తారుమారు చేస్తుండటంవల్ల భూ యజమానులు దారుణంగా నష్టపోతున్నారన్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ రికార్డుల బూజు దులిపి ప్రక్షాళన చేసేందుకు ఈ చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. చట్టం తీరుతెన్నులు ఇలా.. ‘ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్టు–2019 చాలా పటిష్టమైన చట్టం. దీని ప్రకారం స్థిరాస్తి హక్కుల రిజిస్టర్ను రూపొందిస్తాం. దీనిలోని స్థిరాస్తిని యజమాని తప్ప మరెవ్వరూ విక్రయించడానికి వీలులేకుండా ఈ చట్టం ఉపకరిస్తుంది. రాష్ట్రంలోని మొత్తం స్థిరాస్తులను శాశ్వత రిజిస్టర్, వివాద రిజిస్టర్, కొనుగోలు రిజిస్టర్లలో నమోదు చేస్తాం. దీని ప్రకారమే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. రిజిస్ట్రేషన్ల ప్రకారం ఆటో మ్యుటేషన్ వ్యవస్థ తెస్తాం. భూమి హక్కులకు భవిష్యత్తులో ఇన్సూరెన్సు కూడా కల్పించాలనే ఆలోచన ఉంది. అలాగే, ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులను సవరిస్తారు. ఇందుకోసం సర్వే నంబర్ల వారీగా భూములకు సంబంధించి భూ యాజమాన్య రికార్డు (1బి రిజిస్టర్), రీసర్వే రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్), భూ అనుభవ రిజిస్టర్ (అడంగల్) వివరాలను బహిరంగంగా ప్రకటిస్తారు. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలియజేయడానికి నెల రోజుల గడువు ఇస్తారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాకు తగ్గని అధికారి నేతృత్వంలో రాష్ట్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అథారిటీ ఏర్పాటుచేస్తారు. ఈ అధికారి కింద ల్యాండ్ టైట్లింగ్ అధికారులను నియమిస్తారు. భూమి హక్కులను రిజిస్టర్ చేసే బాధ్యత ల్యాండ్ టైట్లింగ్ అధికారిదే. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నెలరోజుల్లో ఫిర్యాదులు రాని భూముల వివరాలను జిల్లా, మండలం, గ్రామం, సర్వే నంబర్ల వారీగా రిజిస్టర్ చేస్తారు. ఇది తాత్కాలిక టైట్లింగ్ రిజిస్టర్గా ఉంటుంది. ఈ జాబితాతో తుది నోటిఫికేషన్ జారీచేసి అభ్యంతరాలు కోరతారు. రెండేళ్లలో అభ్యంతరాలు లేకపోతే ఆయా భూముల యజమానులను శాశ్వత హక్కుదారులుగా గుర్తించి రిజిస్టర్లో నమోదు చేస్తారు. వీటిని ఆన్లైన్లో పెడతారు. ఈ ఆస్తుల యజమానులకు ప్రశ్నించ వీలులేని హక్కులు లభిస్తాయి. వీటిపై ఎవరూ కోర్టుకు వెళ్లడానికి కూడా వీలుండదు’.. అని ఉప ముఖ్యమంత్రి వివరించారు. ‘అలాగే, ఫైనల్ నోటిఫికేషన్ జారీచేశాక రెండేళ్లలో అభ్యంతరాలు వచ్చిన భూములన్నింటినీ సర్వే నంబర్ల వారీగా అనుభవదారుల పేర్లు రాసి వివాద రిజిస్టర్లో నమోదుచేస్తారు. ఇందులోని భూమిపై హక్కులు తమవేనని భావించే వారు జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని ట్రిబ్యునల్లో కేసు వేయాలి. ట్రిబ్యునల్ తీర్పుపై ఎవరూ సవాల్ చేయకపోతే ఆ భూములన్నీ శాశ్వత టైట్లింగ్ రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఒకవేళ ట్రిబ్యునల్ తీర్పుపై ఎవరైనా సవాల్ చేయాలంటే నెల రోజుల్లోగా న్యాయమూర్తి నేతృత్వంలోని స్టేట్ లెవల్ అప్పిలేట్ ట్రిబ్యునల్లో అప్పీల్కు వెళ్లవచ్చు. భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలున్నా ఈ రెండు ట్రిబ్యునళ్లకే వెళ్లాలి. కోర్టుకు వెళ్లడానికి వీల్లేదు. ఎవరైనా కోర్టుకు వెళ్లినా ఆ కేసులను కోర్టులు ట్రిబ్యునళ్లకే పంపుతాయి. కోర్టులకు అధికారాలు ఉండవు. రాష్ట్రస్థాయి ట్రిబ్యునల్ తీర్పుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే హైకోర్టులో సవాల్ చేయవచ్చు. హైకోర్టులో భూ వివాదాలను విచారించడానికి ప్రత్యేకంగా ఒక బెంచి ఉంటుంది. జిల్లా, రాష్ట్రస్థాయి ట్రిబ్యునళ్లకు జ్యుడీషియల్ హోదా ఉంటుంది’.. అని బోస్ చెప్పారు. ఇది సాహసోపేత బిల్లు : ధర్మశ్రీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఈ బిల్లుపై మాట్లాడుతూ.. ఇది సాహసోపేతమైనదని, ప్రస్తుత పరిస్థితుల్లో దీని అవసరం ఎంతో ఉందన్నారు. రెవెన్యూ బూజు దులిపే బిల్లు తెచ్చినందుకు సీఎంను అభినందిస్తున్నామని చెప్పారు. స్థిరాస్తి యజమానులతోపాటు, కొనేవారికి కూడా రక్షణ కల్పించే ఈ బిల్లు చాలా గొప్పదని గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా ఈ బిల్లును తేవడం సాహసోపేతమైన చర్య అని కొనియాడారు. అదే సమయంలో సరిగా చేయకపోతే దుస్సాహసమవుతుందన్నారు. గత 70ఏళ్లలో ఇది జరగనందున జాగ్రత్తగా చేయాలని సూచించారు. కాగా, మార్కెట్ కమిటీలకు గౌరవ చైర్మన్లు, సభ్యులుగా నియమితులయ్యే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దవకుండా చూసే చట్ట సవరణ బిల్లును కూడా ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రవేశపెట్టగా శాసనసభ ఆమోదించింది. పాదయాత్రలో వచ్చిన వినతులే ప్రేరణ ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన వినతుల్లో 60 శాతానికిపైగా భూ వివాదాలకు సంబంధించినవే ఉన్నాయి. జిల్లా కలెక్టరు ఆఫీసును కూడా అమ్మి రిజిస్ట్రేషన్ చేసిన సంఘటనలున్నాయి. ఇలా రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదనే అధికారం రిజిస్ట్రేషన్ అధికారికి లేదు. నిషేధిత ఆస్తుల జాబితా (పీఓబీ) పెట్టడంవల్ల ప్రస్తుతం ప్రభుత్వ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయడంలేదు. ప్రైవేటు ఆస్తులను మాత్రం యజమానికి తెలియకుండా వేరే వారు అమ్మేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇలా యజమానులే కాక కొనుగోలుదారులు సైతం నష్టపోతున్నారు. రెవెన్యూ రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడంవల్లే ఇవి జరుగుతున్నాయని సీఎం వైఎస్ జగన్ గుర్తించారు. దీంతో అధికారంలోకి రాగానే నిపుణులతో చర్చించి ఈ బిల్లుకు రూపకల్పన చేశారు’ అని బోస్ వివరించారు. -
యజ్ఞంలా ‘నివాస స్థలాల’ భూసేకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మందికి నివాస స్థల పట్టాల పంపిణీకి ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తోంది. ఇల్లు గానీ, ఇంటి స్థలం గానీ లేని వారందరికీ వచ్చే తెలుగు సంవత్సరాది(ఉగాది) పర్వదినం సందర్భంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఒకేరోజు 25 లక్షల మందికి నివాస స్థల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఇందుకు అవసరమైన భూమిని సమకూర్చడానికి అధికార యంత్రాంగం కార్యాచరణ ప్రారంభించింది. 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీకి 62,500 ఎకరాల భూమి అవసరమని లెక్క తేల్చింది. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రస్తుతం ఇళ్ల స్థలాల పంపిణీకి పనికొచ్చే భూమి ఎంత ఉంది? ఇంకా ఎక్కడెక్కడ ఎంత భూమి సేకరించాలనే దానిపై అధికారులు ప్రాథమిక కసరత్తు చేపట్టారు. అక్టోబరు 2వ తేదీన గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు ఏర్పాటైన తర్వాత ఏయే గ్రామాలు, పట్టణాల్లో ఇళ్లు లేని వారు ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఎంతమందికి నివాస స్థల పట్టాలు ఇవ్వాలో పక్కాగా తేలుతుంది. దీని ప్రకారం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని మినహాయించి, అవసరమైన ప్రైవేట్ భూమిని సేకరించి, పట్టాల పంపిణీకి వీలుగా ప్లాట్లు వేయాల్సి ఉంటుంది. 62,500 ఎకరాలు అవసరం ఒక ఎకరా భూమి 40 మందికి మాత్రమే పట్టాల పంపిణీకి సరిపోతుంది. ఎకరాకు వంద సెంట్లు కాగా, నిబంధనల ప్రకారం ఇందులో 40 సెంట్లు రహదారులు, మురుగు కాలువలు, పార్కులు తదితరాలకు వదిలిపెట్టాల్సి ఉంటుంది. మిగిలిన 60 సెంట్లను ఒక్కొక్కరికి 1.5 సెంట్ల చొప్పున 40 మందికి పంచవచ్చు. ఈ లెక్కన 25 లక్షల మందికి నివాస స్థలాలు ఇవ్వడానికి 62,500 ఎకరాలకుపైగా భూమి అవసరం. ఆక్రమణల్లో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. పరిశ్రమలు స్థాపిస్తామంటూ భూములు తీసుకుని, ఆ తర్వాత ముఖం చాటేసిన సంస్థలకు నోటీసులు జారీచేసి, సదరు భూములను వెనక్కి తీసుకునేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. మొత్తమ్మీద ఇప్పటిదాకా ఉన్న లెక్కల ప్రకారం 8,500 ఎకరాల భూమి ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ప్రభుత్వం వద్ద ఉంది. మిగిలిన 54,000 ఎకరాలను వివిధ మార్గాల్లో సమకూర్చాల్సి ఉంటుంది. ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. భారీస్థాయిలో భూసేకరణ చేయాల్సి ఉన్నందున ప్రభుత్వం ఇందుకోసం ఐఏఎస్ అధికారిని రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనరేట్లో స్పెషల్ కమిషనర్గా నియమించింది. ఆయన ఏయే జిల్లాల్లో ఎంతెంత భూమి కావాలో నివేదిక రూపొందించి, ఆ మేరకు భూసేకరణ కోసం కలెక్టర్లతో నిత్యం సమన్వయం చేసుకుంటారు. పట్టణాల్లో అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీకి భూసేకరణను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సమీక్షించాలి. ఇళ్లు లేని వారి కోసం వచ్చే ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని గృహ నిర్మాణ శాఖకు ముఖ్యమంత్రి భారీ లక్ష్యం నిర్దేశించారు. భూసేకరణ ప్రక్రియ రెవెన్యూ, గృహ నిర్మాణం, సాంఘిక సంక్షేమం, ఆర్థిక తదితర శాఖలతో ముడిపడి ఉంది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ భూ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో రూ.5,000 కోట్లు కేటాయించింది. వివిధ శాఖల సమన్వయంతో భూసేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించడానికి ఓ కమిటీని నియమించింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్సింగ్ అధ్యక్షతన గల ఈ కమిటీలో గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలో భూసేకరణ కోసం ప్రత్యేకంగా నియమితులైన స్పెషల్ కమిషనర్ సభ్యులుగా ఉన్నారు. లక్ష్యం మేరకు భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యేలా చూడడమే ఈ కమిటీ బాధ్యత. ‘‘25 లక్షల మందికి ఇళ్ల పట్టాల జారీకి కసరత్తు చేస్తున్నాం. పేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న ముఖ్యమంత్రి లక్ష్యం ఎంతో ఉన్నతమైనది. దీనిని నెరవేర్చే దిశగా అధికార యంత్రాంగం అన్ని చర్యలూ తీసుకుంటోంది’’ అని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్సింగ్ చెప్పారు. -
స్టాంపులు, రిజస్ట్రేషన్ల శాఖలో అవినీతికి చెక్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పదేపదే నొక్కి చెబుతున్న అవినీతి రహిత, పారదర్శక పాలనకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి మాటలను స్ఫూర్తిగా తీసుకున్న ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ చర్చించుకుని, రిజిస్ట్రార్ల పోస్టింగ్లు, బదిలీలకు కొత్త విధానాన్ని రూపొందించి తక్షణమే అమలు చేశారు. అవినీతి కట్టడే లక్ష్యంగా రాష్ట్రంలో అత్యధిక రాబడి ఉన్న 12 రిజిస్ట్రేషన్ కార్యాలయాల సబ్ రిజిస్ట్రార్లుగా కొత్త వారికి పోస్టింగ్లు ఇచ్చారు. కొత్తగా ఉద్యోగంలో అడుగుపెట్టేవారు ఉత్సాహంగా, నిజాయతీగా పనిచేస్తారని, అవినీతికి పాల్పడరనే ఉద్దేశంతో ఈ నియామకాలు జరిపారు. ఇందుకోసం రాష్ట్రంలో అత్యధిక రాబడి ఉన్న 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పరిపాలనా సౌలభ్యం పేరుతో కౌన్సెలింగ్ నుంచి మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి దాఖలాల్లేవ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ద్వారా గ్రూప్–2కు ఎంపికై, ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకుని పోస్టింగ్ల కోసం ఎదురు చూస్తున్న 12 మందిని మెరిట్ (గ్రూప్ –2లో వచ్చిన మార్కులు) ఆధారంగా 12 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్లుగా బుధవారం ప్రభుత్వం నియమించింది. గ్రూప్–2 ద్వారా సబ్ రిజిస్ట్రార్లుగా ఎంపికైన వారు మారుమూల చివరి గ్రేడ్లో ఉన్న ప్రాంతాల్లో సబ్ రిజిస్ట్రార్లుగా నియమితులు కావడం మొదటి నుంచి రివాజుగా వస్తోంది. అయితే ఈ పర్యాయం దీనికి పూర్తి భిన్నంగా రిజిస్ట్రేషన్ శాఖ వారికి కీలక స్థానాలను అప్పగించింది. జోన్–1లో విశాఖపట్నం, మధురవాడ, భీమిలి, జోన్–2లో గాంధీనగర్, విజయవాడ పటమట, గుణదల, రాజమండ్రి, జోన్–3లో మంగళగిరి, నెల్లూరు, నల్లపాడు, జోన్–4లో అనంతపురం, కర్నూలు ఆదాయపరంగా ముందున్నాయి. అందువల్ల వీటిని అత్యంత ఫోకల్ కేంద్రాలుగా ఎంపిక చేసిన రిజిస్ట్రేషన్ శాఖ పరిపాలనా సౌలభ్యం పేరుతో (అవినీతి కట్టడి లక్ష్యంగా) ఇక్కడ సబ్ రిజిస్ట్రార్లుగా కొత్తవారిని నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 12 మంది కొత్తవారిని ఆయా ప్రాంతాల్లో నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకూ ఇలా పోస్టింగ్లు ఇచ్చిన దాఖలాలు లేవని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ‘‘సాధారణంగా అధిక ఆదాయం ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ పోస్టు ఖాళీ అవుతుందని తెలియగానే పలుకుబడి గల అధికారులు సిఫార్సులు చేయించుకుని, అక్కడికి బదిలీ అయ్యేవారు. కీలకమైన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఖాళీలు ఉండేవి కావు. కొత్తగా సబ్ రిజిస్ట్రార్లుగా ఎంపికైన వారు అప్రధానమైన ప్రాంతాల్లోనే నియమితులయ్యేవారు. మొదటినుంచీ ఇదే విధానం అమలవుతోంది. ఈసారి అవినీతికి చరమగీతం పాడాలన్న లక్ష్యంతో కొత్త ఉద్యోగులను కీలకమైన స్థానాల్లో నియమించాం’’ అని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు, ఇన్స్పెక్టర్ జనరల్ వెంకట్రామిరెడ్డి చెప్పారు. పకడ్బందీగా నిబంధనల అమలు కొత్తవారికి పోస్టింగ్లు ఇచ్చిన 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మినహా మిగిలిన చోట్ల పోస్టింగులకు ప్రభుత్వం కౌన్సెలింగ్ విధానం పాటించింది. అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) కేసుల్లో ఉన్న వారికి ప్రధానమైన చోట్ల (ఫోకల్) పోస్టింగులు ఇవ్వరాదని, ప్రధానమైన ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి అప్రధాన ప్రాంతాల్లో, అప్రధాన ప్రాంతాల్లో ఉన్న వారికి ప్రధాన ప్రాంతాల్లో పోస్టింగులు ఇవ్వాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పేర్కొంది. ఈ మేరకు పకడ్బందీ నిబంధనలు రూపొందించింది. ఎక్కడ ఎలాంటి అతిక్రమణలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇన్స్పెక్టర్ జనరల్ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో నోడల్ అధికారులుగా ఉన్న డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్స్/ జిల్లా రిజిస్ట్రార్లు పక్కాగా నిబంధనల ప్రకారమే బదిలీల కౌన్సెలింగ్ను బుధవారం నిర్వహించారు. కొత్త రక్తానికి ప్రాధాన్యం ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్–1కు ఎంపికై జిల్లా రిజిస్ట్రార్లుగా నియామకం కోసం ఎదురుచూస్తున్న వారిని ఆరు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్లుగా నియమించాలని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ రెండు రోజుల క్రితమే ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే జిల్లా రిజిస్ట్రార్ కేడర్లోని వారిని సబ్ రిజిస్ట్రార్లుగా నియమించడం సాంకేతికంగా తప్పవుతుంది. అందువల్ల స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు, ఐజీ వెంకట్రామిరెడ్డి వెళ్లి ఉప ముఖ్యమంత్రిని కలిసి ఈ విషయాన్ని వివరించారు. కొత్తగా ఎంపికైన 12 మంది సబ్ రిజిస్ట్రార్లను అధిక రాబడి ఉన్న 12 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్లుగా నియమిస్తే బాగుంటుందని వారు విన్నవించారు. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్–1కు ఎంపికైన ఆరుగురిని కూడా ఇదే తరహాలో అతి ముఖ్యమైన రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జిల్లాల రిజిస్ట్రార్లుగా నియమిద్దామని తెలిపారు. దీనికి సమ్మతించిన ఉప ముఖ్యమంత్రి ఇందుకు అనుగుణంగా అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గ్రూప్–2లో మెరిట్ ఆధారంగా 12 మంది కొత్త వారిని కీలక ప్రాంతాల్లో సబ్ రిజిస్ట్రార్లుగా నియమించారు. ఆరు ముఖ్యమైన జిల్లాల్లో జిల్లా రిజిస్ట్రార్లుగా త్వరలో కొత్త వారికి పోస్టింగులు ఇవ్వనున్నారు. -
నవరత్నాల అమలే ప్రధాన అజెండా
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీల అమలు, ప్రధాన సమస్యల పరిష్కారం, అవినీతి రహిత పారదర్శక సుపరిపాలన ముఖ్యమైన అజెండాలుగా నేడు (సోమవారం) కలెక్టర్ల సదస్సు జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో తొలి కలెక్టర్ల సమావేశం ఉండవల్లిలోని ప్రజావేదికలో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలా పవిత్రంగా భావిస్తామని, ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసి తీరుతామని వైఎస్ జగన్ గత నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ప్రకటించిన విషయం తెలిసిందే. అదే రోజు వృద్ధులు, వితంతువులు, తదితరులకు పింఛన్ను రూ.2,000 నుంచి రూ.2,250కి పెంచుతూ సంతకం చేశారు. ఇలా ఆరంభమైన హామీల అమలు ప్రక్రియ తొలి కేబినెట్ సమావేశంతో వేగం పుంజుకుంది. ఆశా కార్యకర్తల గౌరవ వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ.10 వేలకు, పారిశుధ్య కార్మికులకు వేతనాన్ని రూ.18 వేలకు పెంచడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతిని జూలై నుంచి 27 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి సాగు ఖర్చులకు రూ.12,500 వచ్చే ఏడాది మే నుంచి ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొనగా ఈ ఏడాది రబీ నుంచే ఇవ్వాలని నిర్ణయించారు. ఇలా ప్రతి అంశంపై స్పష్టతతో ముందుకెళుతున్న సీఎం వైఎస్ జగన్ తన ప్రభుత్వ ప్రాధామ్యాలు వివరించడంతోపాటు పాలన ఎలా ఉండాలో నేడు జరిగే కలెక్టర్ల సమావేశంలో వారికి మార్గనిర్దేశం చేయనున్నారు. సుస్పష్టమైన అజెండా.. గతానికి పూర్తి భిన్నంగా కలెక్టర్ల సదస్సును సత్ఫలితాలనిచ్చే చర్చా కేంద్రంగా వినియోగించుకోవాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారు. కలెక్టర్ల సదస్సుకు ఖరారు చేసిన అజెండానే దీనికి నిదర్శనమని సీనియర్ ఐఏఎస్ అధికారులు చెబుతున్నారు. ‘గత ఐదేళ్లలో ఐదు మిషన్లు, ఎనిమిది గ్రిడ్లు, కన్వర్జెన్స్, సంతులిత వృద్ధి, సంతృప్త స్థాయి అంటూ కేవలం గణాంకాలు, టేబుళ్లు, గ్రాఫిక్స్తో ఎవరికీ ఏమీ అర్థం కాని విధంగా, నిర్దేశిత లక్ష్యం లేకుండా కలెక్టర్ల సదస్సులు జరుగుతూ వచ్చాయి. క్షేత్ర స్థాయిలో సమస్యలను ప్రస్తావించడానికి అధికారులు, ఒకరిద్దరు మంత్రులు ప్రయత్నించినా మీరు అర్థం చేసుకోవడం లేదు. మనం లక్షలాది మందికి ఫోన్ చేస్తే వారు ఇలా చెప్పారంటూ బుకాయిస్తూ, నోరు మూయిస్తూ వచ్చారు. దీంతో సమస్యలను చెప్పడమే మానేసిన మంత్రులు, కొందరు అధికారులు సీఎం చంద్రబాబును పొగడటం, ఆయన తాను హైదరాబాద్ను అభివృద్ధి చేశానని, హైటెక్ సిటీని కట్టానంటూ స్వోత్కర్షగా సాగుతూ వచ్చాయి. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం తొలి కలెక్టర్ల సదస్సుకే స్పష్టమైన అజెండా ఖరారు చేసింది. ప్రజలకు ఇచ్చిన నవరత్నాల అమలు సీఎం తన తొలి ప్రాధాన్యమని చెబుతున్నారు. వీటి అమలే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. సదస్సు అజెండాలో కూడా నవరత్నాల అమలుకు తీసుకోవాల్సిన చర్యలను చేర్చారు. అత్యంత ముఖ్యమైన వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో తేవాల్సిన మార్పులు, తీసుకోవాల్సిన చర్యలకు ప్రాధాన్యం ఇచ్చారు. వచ్చే ఉగాది నాటికి 25 లక్షల మంది మహిళలకు ఇంటి స్థల పట్టాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న సీఎం ఇందుకు ఏమి చేయాలో దిశానిర్దేశం చేయాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. ఇందులో భాగంగానే రెవెన్యూ శాఖ అధికారులు ఇళ్ల స్థల పట్టాల జారీకి అర్హుల ఎంపిక, విధివిధానాలను ప్రధాన అజెండాగా చేర్చారు. భూ యజమానులకు నష్టం జరగకుండా కౌలు రైతులకు న్యాయం చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమల్లో భాగంగా వారికి రుణ అర్హత కార్డుల జారీ, ఇతర చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. దీంతో ఈ దిశగా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని రెవెన్యూ, వ్యవసాయ శాఖలు ఈ అంశాన్ని ప్రాధాన్య అంశంగా చేర్చాయి. 108, 104 అంబులెన్సుల సేవలను మెరుగుపరుస్తామని ఇచ్చిన హామీ అమలు దిశగా ఇప్పటికే వైద్య రంగంలో సంస్కరణల కోసం నిపుణుల కమిటీని వేసిన సీఎం.. కలెక్టర్లకు దిశానిర్దేశం కోసం అజెండాలో ప్రాధాన్యం కల్పించారు. తొలి కలెక్టర్ల సదస్సు అజెండా చాలా సుస్పష్టంగా, ప్రాధామ్యాల ప్రకారం ఉంది. ఇది కొత్త సీఎంకు ఉన్న విజన్కు నిదర్శనం’ అని పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు పేర్కొన్నారు. తొలి చర్చ గ్రామ సచివాలయాలపైనే.. గ్రామ సచివాలయాల ఏర్పాటు ద్వారా గ్రామ పంచాయతీల్లో పారదర్శక పాలన అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశంతోనే కలెక్టర్ల సదస్సులో తొలి చర్చకు శ్రీకారం చుడుతుండటం గమనార్హం. తెల్ల రేషన్కార్డు ఉండి, వైద్య ఖర్చులు రూ.1,000 దాటితే వారిని ఆరోగ్యశ్రీలోకి తీసుకురావడంతోపాటు 104, 108 అంబులెన్సు సేవలను మెరుగుపర్చాలని సీఎం కీలక నిర్ణయం తీసుకున్నందున కలెక్టర్ల సదస్సులో దీన్ని రెండో అంశంగా చేర్చారు. కరవు నేపథ్యంలో వ్యవసాయ, పశుసంవర్థక శాఖల్లో తీసుకోవాల్సిన చర్యలు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి పరిస్థితి, తదితర అన్ని అంశాలను ఆయా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు/ ముఖ్య కార్యదర్శులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సదస్సులో వివరించనున్నారు. వర్షాలు ఆరంభమైన నేపథ్యంలో పంటల సాగుకు ప్రభుత్వం అందించాల్సిన సహకారం, సబ్సిడీ విత్తనాలు, ఎరువుల సరఫరా చర్యలను తెలియజేస్తారు. సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ స్వాగతోపన్యాసంతో కలెక్టర్ల సదస్సు ప్రారంభమవుతుంది. తర్వాత సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కొత్త ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలు, అధికారులు అనుసరించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేస్తారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రారంభోపన్యాసం, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రసంగం ఉంటాయి. అనంతరం సీఎం వైఎస్ జగన్ కీలకోపన్యాసం ద్వారా ప్రభుత్వ ప్రాధాన్యాలు, అధికారులు ఎలా వ్యవహరించాలనే అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. తర్వాత పరిపాలనలో గ్రామ సచివాయాలు, గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఎలా ఉండాలన్న అంశంపై పంచాయతీరాజ్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శులు గోపాలకృష్ణ ద్వివేది, శ్యామలరావు పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇస్తారు. వైద్య రంగంపై వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి, నిత్యావసర సరుకుల డోర్ డెలివరీపై ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్యపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, కరవు నేపథ్యంలో తీసుకుంటున్న, తీసుకోవాల్సిన చర్యలపై లైన్ డిపార్టుమెంట్ల అధికారులు పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తారు. వీటిపై చర్చ ముగిసిన తర్వాత శాంతిభద్రతలపై కలెక్టర్లు, ఎస్పీల సంయుక్త సమావేశం ఉంటుంది. -
హెలిప్యాడ్ కోసం మా భూమి తీసుకున్నారు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కోసం హెలిప్యాడ్ నిర్మించేందుకు కరీంనగర్ జిల్లా, తీగలగుట్ట గ్రామం సర్వే నంబర్ 232లో ఉన్న తమకు చెందిన భూమిని తీసుకునేందుకు ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మూడు పక్కల ముఖ్యమంత్రి, అతని బంధువుల భూములు ఉండగా, వాటిని వదిలేసి తమ భూమిని హెలిప్యాడ్ కోసం తీసుకుంటున్నారంటూ సిరిసిల్లకు చెందిన పి.ప్రతిమ, మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, కరీంనగర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఆర్డీవోలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వి.రఘునాథ్ వాదనలు వినిపిస్తూ.. 2013లో వచ్చిన భూ సేకరణ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం పిటిషనర్ల భూములను తీసుకుందని తెలిపారు. ప్రజా ప్రయోజనం కోసం అధికారులు తమ భూమిని తీసుకోలేదని, కేవలం ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రయోజనం కోసం భూమిని తీసుకున్నారని తెలిపారు. అంతేకాక పిటిషనర్ల భూమి పక్కనే ఉన్న ముఖ్యమంత్రి, ఆయన బంధువుల భూముల జోలికి వెళ్లకుండా పిటిషనర్ల భూములను తీసుకోవడం అన్యాయమన్నారు. ముఖ్యమంత్రి ఇష్టాయిష్టాల మేర తమ భూమిని తీసుకున్నారే తప్ప, చట్ట నిబంధనలకు లోబడి కాదని వివరించారు. కరీంనగర్ కలెక్టర్ 20 ఎకరాల్లో విస్తరించి ఉందని, అందులో ఇప్పటికే రెండు హెలికాప్టర్లు ఉన్నాయని తెలిపారు. 2013 కొత్త భూ సేకరణ చట్టం కింద ప్రైవేటు ప్రయోజనాల కోసం భూ సేకరణ చేయడం సరికాదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ ప్రతివాదులను ఆదేశించారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. -
మీదెంత.. మాదెంత?
♦ భూముల స్పష్టతపై వుడా, రెవెన్యూ తర్జనభర్జన ♦ 8 మండలాల్లో తేలని లెక్క ♦ అభివృద్ధికి పనికిరాని స్థలాల్ని త్యజించాలని వుడా నిర్ణయం విశాఖ నగర అభివృద్ధి సంస్థకు రెవెన్యూ భూముల బదలాయింపు వ్యవహారం తలకు మించిన భారంగా మారింది. రెవెన్యూ అప్పగించిన భూముల్లో వేల ఎకరాలు అభివృద్ధికిపనికిరానివే ఉండటంతో వాటిని త్యజించాలని భావిస్తోంది. మరోవైపు అప్పగించిన భూములు ఎక్కడ ఉన్నాయనే అంశంపై ఇంకా ఎనిమిది మండలాలపై రెవెన్యూ శాఖ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. విశాఖసిటీ: వుడా పరిధి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల వరకూ విస్తరించి ఉంది. వుడాకు గతంలో 11,610.24 ఎకరాల భూములను రెవెన్యూ శాఖ అప్పగించాలని నిర్ణయించింది. వీటిని వివిధ రకాలుగా అభివృద్ధి చేసి వాటి ద్వారా కొత్త ప్రాజెక్టులకు నిధులు సమకూర్చుకోవాలని సూచించింది. స్టేట్ ఎలినేషన్ కమిటీ మాత్రం కేవలం 1,431 ఎకరాలకు మాత్రమే ఆమోదముద్ర వేసింది. మిగిలిన భూములన్నీ రెవెన్యూ పరిధిలోనే ఉండిపోయాయి. దీంతో వివిధ అభివృద్ధి పనులకు, ఇతర అవసరాలకు వుడాకు తెలియకుండానే రెవెన్యూ శాఖ 4,214.12 ఎకరాలను ఇతర సంస్థలకు కట్టబెట్టింది. మిగిలిన భూముల్లో వుడా 2,132.72 ఎకరాల్ని వినియోగించుకుంది. 8 మండలాల్లో తేలని లెక్క చిక్కు ఇదిలా ఉండగా.. విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు సంబంధించి 8 మండలాల్లో రెవెన్యూ శాఖ అప్పగించిన భూములు ఎక్కడెక్కడున్నాయన్న అంశంపై స్పష్టత రావడం లేదు. అటు రెవెన్యూ రికార్డుల్లోనూ, ఇటు వుడా రికార్డుల్లోనూ సర్వే పరంగా ఇబ్బందులు ఉన్నాయి. విశాఖ జిల్లా పరిధిలో అర్బన్, పెందుర్తి, గాజువాక మండలాల్లోనూ, విజయనగరం జిల్లాలోని డెంకాడ, భోగాపురం, విజయనగరం, కొత్తవలస, పూసపాటిరేగ మండలాల్లోనూ మొత్తం 519 ఎకరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించే అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. వీటిని గుర్తించడంతో పాటు సంయుక్తంగా నిర్వహించాల్సిన 1383.80 ఎకరాల్లో వుడా సిబ్బందితో కలిసి సర్వే చేయాలని జాయింట్ కలెక్టర్ జి.సృజన ఇటీవల రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇవన్నీ పూర్తయితే.. వుడా భూములపై స్పష్టత వచ్చే అవకాశముంది. రెండు వేల ఎకరాలకు నో భూముల రికార్డులు ట్యాంపరింగ్ వ్యవహారం జరిగిన నేపథ్యంలో తమ పరిధిలో ఉన్న వుడా భూముల్ని తీసుకోవాలంటూ ఇటీవల కలెక్టర్ ప్రవీణ్కుమార్ వుడా వీసీ బసంత్కుమార్కు సూచించారు. ఈ భూబదలాయింపు ప్రక్రియ అధికారికంగా సాగాలి. అంటే.. నిబంధనల ప్రకారం ఈ భూములన్నింటికీ నిర్ణీత రుసుం చెల్లించి రెవెన్యూ రికార్డుల నుంచి వుడా రికార్డులకు బదలాయింపు చేసుకోవాలి. ప్రస్తుత ధరల ప్రకారం.. తమకు చెందాల్సిన భూములకు దాదాపు రూ.1400 కోట్ల వరకూ చెల్లించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మరోవైపు తమ ఆధీనంలో ఉన్న భూములు స్థితిగతులు, ఆక్రమణకు గురైన వాటి వివరాలు, ఏయే ప్రాంతాల్లో ఎంత భూమి ఉంది., కొండ ప్రాంతంలో ఎంత భూములున్నాయనే వివరాలపై వుడా ఎస్టేట్ విభాగం ఇప్పటి వరకూ 10,226.44 ఎకరాల్లో సర్వే నిర్వహించింది. మొత్తం భూమిలో 3314.84 ఎకరాలను ఖాళీ స్థలాలుగా గుర్తించారు. ఇందులో 2313.31 ఎకరాల్లో కొండ ప్రాంతాలు, గుట్టలు, వాగులు, గెడ్డలు, పచ్చికబయళ్లు, రహదారులు, లోయలున్నాయి. ఇవి అభివృద్ధికి ఏమాత్రం పనికిరావు. బదలాయింపు ప్రక్రియలో ఈ 2,313.31 ఎకరాలకూ రెవెన్యూకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు రెవెన్యూ శాఖ 4,214.12 ఎకరాల్ని ఇతర సంస్థలకు ఇప్పటికే కట్టబెట్టేసింది. అంటే మొత్తం దాదాపు 6,527.43 ఎకరాలు వుడాకి కానివే ఉన్నాయి. వీటిని బదలాయింపు ప్రక్రియ నుంచి మినహాయించాలని రెవెన్యూ శాఖను వుడా కోరింది. త్వరలోనే స్పష్టత వస్తుంది ఆరు బృందాలతో నిర్వహించిన సర్వే దాదాపు పూర్తయింది. రెవెన్యూతో కలిసి చేయాల్సింది త్వరలోనే పూర్తవుతుంది. అప్పుడే వుడా భూములపై స్పష్టత వస్తుంది. వుడాకు కేటాయించిన భూముల్లో కొంత మేర పలు ప్రభుత్వ శాఖలకు రెవెన్యూ శాఖ అప్పగించింది. వాటి బదులుగా కొన్ని భూముల్ని అప్పగించాలని వీసీ బసంత్కుమార్ సూచనల మేరకు రెవెన్యూ అధికారుల్ని కోరాం. అభివృద్ధికి పనికిరాని భూముల్ని బదలాయింపు నుంచి మినహాయించాలని సూచించాం. దీనిపై రెవెన్యూ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. – వసంతరాయుడు, వుడా ఎస్టేట్ అధికారి -
మార్కెట్ విలువలను సవరించబోం
భూములపై హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించబోమని ఉమ్మడి హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించకపోవడాన్ని సవాలు చేస్తూ రైతు నాయకుడు కోదండరెడ్డి దాఖలు చేసిన పిల్పై ఏసీజే ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ‘‘నోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్రం లో ఆస్తుల రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో మార్కెట్ విలువను సవరిం చడం సరికాదు’’ అని తెలిపిం ది. ‘‘రాష్ట్రం లో రియల్ ఎస్టేట్ వృద్ధి గణనీయంగా పెరిగింది. కాబట్టి మార్కెట్ విలువను సవరించాల్సిన కారణమేదీ కని పించడం లేదు’’ అని వివరించింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.ఆర్.మీనా ఈ మేరకు జారీ చేసిన మెమోను ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి సోమవారం కోర్టు ముందుంచారు. దీన్ని పరిశీలించిన హైకోర్టు, మా ర్కెట్ విలువలను సవరించ కూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక తామేం చేయగ లమని పిటిషనర్ను ప్రశ్నించింది. అభ్యంతరాలేమైనా ఉంటే తెలియ జేయాలంటూ విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూ ర్తి జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. -
పోస్టింగ్ల కోసం పోటాపోటీ
హైదరాబాద్ ఆర్డీవో స్థానంపై కన్ను.. నాలుగు మండలాలకు భలే గిరాకీ సిటీ బ్యూరో: జిల్లా రెవెన్యూ శాఖలో పోస్టింగ్ల కోసం జోరుగా పైరవీలు సాగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఎనిమిది మంది తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా, పన్నెండు మంది డిప్యూటీ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా పదోన్నతులు లభించాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ అధికారి (ఆర్డీవో) పోస్టుతో సహా, పదోన్నతులతో ఖాళీ అవుతున్న నాలుగు మండల తహశీల్దార్ల పోస్టుల కోసం తీవ్ర స్థాయిలో లాబీయింగ్ జరుగుతున్నట్లు సమాచారం. మూడు యూఎల్ఎసీ తహశీల్దార్ల స్థానాలు కూడా ఖాళీ అవుతున్నా పెద్దగా డిమాండ్ లేకుండా పోయింది. కీలకమైన స్థానాల్లో పోస్టింగ్ కోసం పెద్ద మొత్తంలో ముడుపులు సమర్పించేందుకు సైతం అధికారులు సిద్దమవుత్నున్నారు. జిల్లాలో సుమారు 12 మంది డిప్యూటీ తహశీల్దార్లకు పదోన్నతి లభించగా అందులో నలుగురు వివిధ ఆరోపణలతో డిఫర్ అయ్యారు. ఒకరికి మాత్రం రూల్ 16( హెచ్) ప్రకారం రిలాక్సేషన్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో మిగిలిన వారికి కొత్త పోస్టింగ్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ సంఘాల నాయకులు పైరవీల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఆర్డీవో పోస్టుకు పోటా పోటీ హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ అధికారి పోస్టు కోసం తాజాగా పదోన్నతి పొందిన ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లు తీవ్రంగా పోటీ పడుతున్నట్లు సమాచారం. అందులో సంఘం బాధ్యుడితో పాటు మరొకరు ఉన్నత స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు కలెక్టరేట్లో ఖాళీగా ఉన్న యూఎల్సీ విభాగం డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు సైతం మరో ముగ్గురు పోటీ పడుతున్నారు. మొత్తం మీద తాజాగా పదోన్నతి పొందినవారిలో ఇద్దరికి మాత్రమే జిల్లాలో పోస్టింగ్ లభించే అవకాశాలు ఉండటంతో మిగిలిన ఆరుగురు బయటకు వెళ్లాల్సిందే లాబీయింగ్.. జిల్లా రెవెన్యూ యంత్రాంగంలో కీల మండలమైన షేక్పేట్పై అందరి దృష్టి పడింది. ప్రభుత్వ, అసైన్డ్, మిగులు, శిఖం భూములు అధికంగా ఉన్నందున షేక్పేట తహశీల్దార్ పోస్టుకు అధిక డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం అక్కడి తహశీల్దారు చంద్రకళకు డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి లభించడంతో ఆ స్థానం ఖాళీ అవుతోంది. ఆ పోస్టు దక్కించుకునేందుకు ఇటీవల పదోన్నతులు పొందిన కొత్తవారితో పాటు పాత యూఎల్సీ, కలెక్టరేట్లో పనిచేస్తున్న తహశీల్దార్లు సైతం తీవ్ర ప్రయత్నాలు చేస్తునట్లు తెలుస్తోంది. మరోవైపు సైదాబాద్, నాంపల్లి, హిమాయత్ నగర్ మండల తహాశీల్దార్ల పోస్టులకు సైతం తీవ్ర పోటీ నెలకొన్నట్లు సమాచారం. -
డ్యాష్ బోర్డు పై నీలినీడలు
రెండు నెలలుగా కసరత్తు ఇండికేటర్లకు రెవెన్యూ శాఖ దూరం సిటీబ్యూరో: జిల్లా అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డ్యాష్ బోర్డు’ రూపకల్పనపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. గత మూడు నెలలుగా ఇందుకు సంబందించి కసరత్తు సాగుతూనే ఉంది. పరిపాలన యంత్రాంగంలో కీలకమైన రెవెన్యూ శాఖ నుంచి ఇప్పటి వరకు ఇండికేటర్ల సమాచారం అందక పోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఏపీ తరహాలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల గణాంకాల డాటా బేస్ తో జిల్లా స్థాయి ’డ్యాష్ బోర్డు’ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా తొలివిడత ప్రయోగాత్మకంగా రంగారెడ్డి, మహాబూబ్నగర్, వరంగల్ అర్బన్, వనపర్తి జిల్లాలను ఎంపిక చేసింది. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. తొలివిడతలో హైదరాబాద్ జిల్లా లేనప్పటికి కలెక్టర్ రాహుల్ బొజ్జా ప్రత్యేక శ్రద్దతో డ్యాష్ బోర్డు ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందస్తుగా రూపకల్పనకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి తమ శాఖలకు సంబంధించిన నాలుగు లేదా ఐదు ముఖ్యమైన ఇండికేటర్లను గుర్తించి పంపాలని సూచించారు. ఇందుకుగాను సీజీజీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఇండికేటర్ల ప్రొఫార్మాను సైతం జిల్లా ప్రణాళిక విభాగం ద్వారా వివిధ శాఖలకు పంపారు. జిల్లాల్లో మొత్తం 48 శాఖలు ఉండగా 31 శాఖల నుంచి సమాచారం అందింది. అధికార యంత్రాంగం ముఖ్యమైన నాలుగైదు ఇండికేటర్లను పంపాలని సూచించగా, పలు శాఖలు ఏకంగా నివేదికలు సమర్పించడం గమనార్హం. మరికొన్ని శాఖలు గణాంకాల వివరాలను అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. డాటా బేస్తో డ్యాష్ బోర్డు జిల్లా సమాచారం సమస్తం అప్ డేట్ గా అందుబాటులో ఉండే విధంగా డ్యాష్ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. రెవెన్యూ, విద్యా, ఆరోగ్య, సంక్షేమ, ఇతరాత్ర శాఖల ద్వారా అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల సమగ్ర వివరాలు గణాంకాల రూపంలో గల డాటా బేస్ను ఒక పోర్టర్ లో పొందుపర్చాలన్నది డ్యాష్ బోర్డు లక్ష్యం. కలెక్టర్ రాహుల్ బొజ్జ, జాయింట్ కలెక్టర్ ప్రశాంతి ప్రతి సమావేశంలో డ్యాష్ బోర్డు కోసం ముఖ్యమైన ఇండికేటర్ల సమాచారాన్ని పంపించాలని అధికారులను సూచిస్తున్న ఎవరూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. డే టూ డే అప్డేట్.. డ్యాష్ బోర్డులో వివిధ శాఖల సమాచారాన్నంతా ప్రతిరోజు అప్డేట్ చేస్తారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్డేట్ చేసేందుకు ప్రతి శాఖ కార్యాలయం నుంచి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అప్డేట్ సమాచారం ఉండే విధంగా చర్యలు చేపడుతున్నారు. కలెక్టర్ మొత్తం డ్యాష్ బోర్డుపై, జిల్లా స్థాయి అధికారులు తమ శాఖల పనితీరు ఎప్పటి కప్పుడు పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. శాఖల పనితీరు, వెనుకబాటును గుర్తించి ప్రోత్సహించేందుకు అవకాశం ఏర్పడుతుంది. అయితే సాక్షాత్తు రెవెన్యూ శాఖ సమాచారం అందించక పోవడంతో డ్యాష్ బోర్డు రూప కల్పనకు అడ్డంకులు తప్పడం లేదు. -
రెవెన్యూలో గాడి తప్పిన పాలన
⇒ భూపరిపాలన ప్రధాన కమిషనర్ పోస్టు ఆర్నెల్లుగా ఖాళీ ⇒ ప్రభుత్వ పథకాల అమలుపై సిబ్బందికి దిశానిర్దేశం కరువు ⇒ ఏళ్లు గడుస్తున్నా ముగియని క్రమబద్ధీకరణ ప్రక్రియ సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖలో పాలన గాడి తప్పింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు యంత్రాంగానికి దిశానిర్దేశం చేయాల్సిన పెద్దదిక్కు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రెవెన్యూ విభాగంలోనే ఎంతో కీలకమైన భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) పోస్టు గత ఆరు నెలలుగా ఖాళీగానే దర్శనమిస్తోంది. ప్రభుత్వం.. గత రెండున్నరేళ్లుగా ఈ పోస్టు భర్తీ పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. దీంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనన్న చందంగా తయారైంది. దీంతో రెండేళ్ల కిత్రం ప్రభుత్వం ప్రారంభించిన భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ (జీవో 59) కథ నేటికీ కంచికి చేరలేదు. మరోవైపు లక్షల సంఖ్యలో వచ్చిన సాదా బైనామాల క్రమబద్ధీకరణ దరఖాస్తులకు మోక్షం కలగడం లేదు.కంచికి చేరని క్రమబద్ధీకరణ కథ అన్యాక్రాంతమైన ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న వారికి ఆయా భూములను క్రమబద్ధీకరిచేందుకు 2014 డిసెంబరులో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అల్పాదాయ వర్గాలకు 125 గజాలలోపు స్థలాలను ఉచిత కేటగిరీలో, ఉన్నత వర్గాలకు చెల్లింపు కేటగిరీలో ఆయా స్థలాలను క్రమబద్ధీకరించాలని ఉత్తర్వులలో పేర్కొంది. ఈ ప్రక్రియ అంతటినీ మూడు నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉండగా, రెండేళ్లు దాటినా చెల్లింపు కేటగిరీ దరఖాస్తులకు పూర్తిగా మోక్షం కలగలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పలుమార్లు గడువును పొడిగించినా, క్రమబద్ధీకరణ ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన ఆన్లైన్ వ్యవస్థ సరిగా పనిచేయక క్షేత్రస్థాయి సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 వేల దరఖాస్తులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని, పెద్దనోట్ల రద్దు ప్రభావంతో దరఖాస్తు దారులు సకాలంలో సొమ్ము చెల్లించలేకపోయారని పలు జిల్లాల కలెక్టర్లు చెబుతున్నారు. మరో ఆరు నెలల పాటు గడువు పెంచాలని కొందరు జిల్లా కలెక్టర్లు నెలరోజుల క్రితమే ప్రభుత్వానికి లేఖ రాసినా ఉన్నతాధికారుల నుంచి స్పందన లేదు. మరోవైపు తాము పూర్తిస్థాయిలో సొమ్ము చెల్లించినప్పటికీ, తమ స్థలాలను క్రమబద్ధీకరణ చేయకపోవడం పట్ల దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. సాదాబైనామాలకూ కలగని మోక్షం గ్రామీణ ప్రాంతాల్లో పేద రైతులు తెల్లకాగితాలపై రాసుకున్న భూముల క్రయ విక్రయాలను (సాదా బైనామా) కూడా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం 2016 జూన్లో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 11.16 లక్షల దరఖాస్తులు అందగా.. ఇప్పటివరకు క్రమబద్ధీకరణకు ఆదేశాలిచ్చింది మాత్రం 34 వేల మంది రైతులకే కావడం గమనార్హం. మొత్తం దరఖాస్తుల్లో 2.93 లక్షల దరఖాస్తులను వివిధ కారణాలతో అధికారులు తిరస్కరించినప్పటికీ, ఇంకా ఆరున్నర లక్షలమంది దరఖాస్తు దారులకు సాదా బైనామాలను ప్రభుత్వం ఎప్పుడు క్రమబద్ధీకరిస్తుందో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. మరోవైపు హైదరాబాద్, వరంగల్ నగరాల పరిధిలోని కొన్ని మండలాలలో సాదా బైనామాల క్రమబద్ధీకరణను తొలుత నిషేధించిన ప్రభుత్వం, ఆపై నిషేధాన్ని సడలిస్తూ గత డిసెంబరులో జీవో నెంబరు 294 జారీచేసింది. అయితే కొన్ని మండలాల్లో సాదా బైనామాల క్రమబద్ధీకరణపై నిషేధాన్ని ప్రభుత్వం సడలించినా, ఆయా మండలాలలో క్రమబద్ధీకరణకు కొత్తగా దరఖాస్తులను స్వీకరించేందుకు సీసీఎల్ఏ ఆదేశాలు జారీ చేయలేదు. దీంతో దరఖాస్తు చేసుకుందామనుకున్న రైతులు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. కొత్త జిల్లాల్లో భర్తీ కాని పోస్టులు మరోవైపు కొత్త జిల్లాలతో కొత్తగా 125 మండలాలు, 25 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆయా పోస్టులలో పూర్తిస్థాయి తహసీల్దార్లను, ఆర్డీవోలను నియమించలేదు. మరోవైపు భూమి రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే నిమిత్తం క్షేత్రస్థాయిలో రెవెన్యూ యంత్రాంగం కోసం సీసీఎల్ఏ అధికారులు రూ. 5 కోట్లతో కొనుగోలు చేసిన టాబ్లెట్ పీసీలు, గత రెండు నెలలుగా మూలనపడి పాడవుతున్నాయి. -
వర్తకం కోసమే భూములు కొనాలి
- ప్రజావసరాల కోసం భూములు కొనరాదు - జీవో 123పై హైకోర్టులో వాదనలు - విచారణ నేటికి వారుుదా సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగంలోని అధికరణ 298 కింద ప్రభుత్వం వర్తక, వాణిజ్యావసరాల కోసమే భూములు కొనుగోలు చేయాలి తప్ప ప్రజాప్రయోజనాల నిమిత్తం సేకరించాల్సిన భూములను కొనుగోలు చేయడానికి వీల్లేదని సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ తెలిపారు. పార్లమెంటు చట్టం అమల్లో ఉండగా కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా చట్టాన్ని మీరి వ్యవహరించడానికి వీల్లేదన్నారు. మల్లన్నసాగర్తో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టుల కోసం అవసరమైన భూములను 2013 భూ సేకరణ చట్టం కింద కాకుండా జీవో 123 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుండటాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలవడం తెలిసిందే. వీటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, సత్యప్రసాద్ వాదనలు వినిపించారు. ‘‘కేంద్ర చట్టాన్ని అమలు చేస్తే బాధితులకు ఎక్కువ పరిహారం చెల్లించాల్సి ఉంటుందనే ప్రభుత్వం జీవో 123ను తెరపైకి తెచ్చింది. పైగా భూములను ఇష్టానుసారం తీసుకుంటోంది. నిబంధనలను ఎక్కడా పాటించడం లేదు’’ అన్నారు. 2013 భూ సేకరణ చట్టంలోని షెడ్యూల్ 3 కేవలం సాగునీటి ప్రాజెక్టులకు మాత్రమే వర్తిస్తుందా అని ధర్మాసనం ప్రశ్నించింది. కాదని, నిర్వాసితులున్న ప్రతి ప్రాజెక్టుకూ వర్తిస్తుందని అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి చెప్పారు. పునరావాసం కింద నిర్మాణాలు చేపట్టి ఇచ్చినా వాటిని వాడుకోవడానికి బాధితులు ఇష్టపడడం లేదన్నారు. పునరావాసానికి డబ్బులిచ్చేందుకు సైతం సిద్ధంగా ఉన్నామని ఏజీ చెప్పారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇప్పటికీ పునరావాసం కల్పించలేదని సత్యప్రసాద్ అన్నారు. వాదనలు బుధవారమూ కొనసాగుతారుు. జీవో 190, 191 ప్రకారం ప్రయోజనాలు... భూమి లేని వ్యవసాయ కూలీలు, ఇతరులకు జీవో 190, 191 ప్రకారం ప్రయోజనాలు కల్పిస్తామని ఉమ్మడి హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. జీవో 123 ద్వారా చేపట్టే భూ సేకరణ వల్ల ప్రభావితమయ్యే కూలీలు తదితరుల కోసం 190, 191 జీవోల ద్వారా సంక్షేమ చర్యలు తీసుకుంటామంటూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. భూములమ్మేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారి నుంచి కొనుగోలు చేసేందుకే జీవో 123 జారీ చేశామని వివరించారు. నిర్వాసితుల కుటుంబానికి ఎకరాకు రూ.5.04 లక్షలు చెల్లిస్తామన్నారు. ఈ జీవోల కింద ఇచ్చే ప్రయోజనాలకు అంగీకరించని బాధితులకు 2013 భూ సేకరణ చట్టం కింద ప్రయోజనాలను వర్తింపజేస్తామన్నారు. -
అధికార భూదందా
టీడీపీ చేతిలో రూ.5 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి ‘అధికార’ నాయకులకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ శాఖ మండిపడుతున్న పుత్తూరు పట్టణ ప్రజలు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులు విచ్చలవిడిగా భూ దందాలకు పాల్పడుతున్నారు. పదేళ్లుగా అధికారంలో లేకపోవడంతో చోటా నాయకులంతా ఎక్కడ ప్రభుత్వ భూమి కనపడితే అక్కడ ఆక్రమణలకు సిద్ధపడుతున్నారు. తాజాగా పుత్తూరు పట్టణంలో తెలుగుదేశం తమ్ముళ్లు విలువైన ప్రభుత్వ భూమిపై కన్నేశారు. ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రే భూమిలో ఉన్న ముళ్ల కంపలు తొలగించి చదును చేశారు. స్థానిక తహశీల్దార్ సంఘటనా స్థలాన్ని సందర్శించినా ఫలితం లేకపోరుుంది. విజయపురం: పట్టణంలోని పుత్తూరు-చిత్తూరు రహదారిని ఆనుకుని చెర్లోపల్లి రోడ్డు సమీపంలో సర్వే నెంబర్ 19లో సుమారు 3.84 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమి ఉంది. ఈ భూమిలో గతంలో నెత్తం గ్రామానికి చెందిన వారు శ్మశాన స్థలంగా వాడుకునేవారు. కాలక్రమేణా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకోవడంతో ఆ భూమిపై టీడీపీ నాయకుల కన్ను పడింది. గత కొన్నేళ్లుగా ఈ భూమి ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం స్థలంలో ఉన్న ముళ్ల చెట్లను తొలగించి స్థలాన్ని చదును చేశారు. ఈ స్థలాన్ని పరిశీలించిన రెవెన్యూ శాఖాధికారులు కనీసం ప్రభుత్వ భూమి అని హెచ్చరిక బోర్డు కూడా పెట్టకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. ఈ ఆక్రమణ వెనుక టీడీపీ నేతల మద్దతు ఉండడంతో రెవెన్యూ శాఖాధికారుల ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉండిపోయారు. మార్కెట్ రేట్ ప్రకారం ఈ స్థలం ఖరీదు సుమారు 5 కోట్ల రూపాయలు ధర పలుకుతోంది. పుత్తూరు పట్టణవాసులు తెలిపారు. పేదల పేరు చెప్పి టీడీపీ నాయకులు ఖరీదైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నారుు. ఈ భూమిలో కొంత కాల్వ పోరంబోకు భూమి కూడా ఉన్నట్లు తెలిసింది. ఆక్రమణదారులు కాల్వను సైతం మట్టితో కప్పేశారు. ఇందులో ప్లాట్లు వేసి అమ్మేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో నెత్తం గ్రామస్తులు కొందరు ఈ భూమిలో పాకలు వేసుకున్నారు. అరుుతే రెవెన్యూ శాఖాధికారులు శ్మశాన స్థలంతో పాటు చట్ట ప్రకారం కాల్వ పోరంబోకు స్థలంలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పి పేదలు వేసిన పాకలను పీకి పారేశారు. దీనిపై పేదలు పలుమార్లు ధర్నాలు కూడా చేసినా అధికారులు ససేమిరా అన్నారు. కాని ప్రస్తుతం మాత్రం టీడీపీ నాయకుల ఒత్తిడితో పచ్చ తమ్ముళ్ల ఆక్రమణను రెవె న్యూ శాఖాధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నారుు. అంతే కాకుండా రెవెన్యూ అధికారులను ఓ పేరు మోసిన అధికార పార్టీ నాయకుడు ఆ స్థలం వైపు కన్నెత్తి చూడకూడదని హెచ్చరికలు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ దీనిపై చర్యలు తీసుకుని కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని పుత్తూరు, చెర్లోపల్లి, నెత్తం గ్రామస్తులు, ప్రజలు కోరుతున్నారు. మా ఆధీనంలోనే ఉంది రెండు రోజులకు ముందు నెత్తం గ్రామస్తులు ఇంటి స్థలం కోసం సర్వే నెంబర్ 19లో ప్రభుత్వ భూమిని చదును చేశారు. అది తెలుసుకొని మేం నిలిపి వేశాం. ఆ భూమి ఇప్పటికీ మా ఆధీనంలోనే ఉంది. ఎవ్వరూ ఆక్రమించలేదు. - రంగస్వామి, పుత్తూరు తహశీల్దార్ -
త్వరలో జిల్లా రిజిస్ట్రార్ పోస్టుల భర్తీ!
- స్పెషల్ సీఎస్ నుంచి డిప్యూటీ సీఎంకు ఫైలు - నేడు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖలో ఖాళీగా ఉన్న జిల్లా రిజిస్ట్రార్(డీఆర్) పోస్టుల భర్తీకి ఉన్నతాధికారులు ఎట్టకేలకు శ్రీకారం చుట్టారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలును ఉన్నతాధికారులు శుక్రవారం ఎట్టకేలకు కదిలించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంతకం చేయడంతో ఫైలు అక్కడ్నుంచి ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. ఉప ముఖ్యమంత్రి పరిశీలన అనంతరం శనివారం ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, పోస్టింగ్ల కోసం వేచిచూస్తున్న జిల్లా రిజిస్ట్రార్లలో కొందరు తమకు నచ్చిన చోట పోస్టింగ్ల కోసం పైరవీలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఇప్పటివరకు సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన కార్యాలయం పరిధిలోనే ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్గా పోస్టింగ్లు దక్కించుకోవాలని ఒకరిద్దరు తీవ్రంగా యత్నిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 23 డీఆర్ పోస్టులుండగా అందులో 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్, హైదరాబాద్ సౌత్, రంగారెడ్డి, రంగారెడ్డి ఈస్ట్, మహబూబ్నగర్, నల్లగొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్ పోస్టులు ఖాళీగా ఉండగా, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాలకు రెగ్యులర్ డీఆర్ల స్థానంలోనూ ఇన్చార్జిలే కొనసాగుతున్నారు. మరోవైపు హైదరాబాద్లోని రిజిస్ట్రేషన్ల శాఖ ప్రధాన కార్యాలయంలోనూ జిల్లా రిజిస్ట్రార్ హోదా కలిగిన అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ పోస్టులను ప్రభుత్వం రెండేళ్లుగా భర్తీ చేయలేదు. -
పైసలిస్తేనే పని (‘పైసా’చికం)
రెవెన్యూ శాఖలో జోరుగా అవినీతి నర్సాపూర్లో వెళ్లూనుకున్న దందా పాస్ పుస్తకాలు సైతం అమ్ముకుంటున్న వైనం పెండింగ్లో వేలాదిగా దరఖాస్తులు కళ్లప్పగించి చూస్తున్న ఉన్నతాధికారులు ఏసీబీ దాడి చేసినా మారని దుస్థితి నర్సాపూర్:రెవెన్యూ శాఖలో అవినీతిదే రాజ్యం.. పైసలు ఇస్తేనే ఫైలు కదులుతోంది. ఇటీవల తహసీల్దారు, వీఆర్ఓ, వీఆర్ఏలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటనే ఇందుకు నిదర్శనం. డబ్బులు లేనిదే ఏ పని కావడంలేదు. రైతు మల్లేశం.. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తిని తనతో పాటు తన అక్క వీరమణి పేర్లమీద మార్చాలని నాలుగు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు కనికరించకపోగా.. రూ.20వేలు ఇస్తేనే పని పూర్తవుతుందని చెప్పడంతో ఆ రైతు ఏసీబీనీ ఆశ్రయించిన సంగతి తెలిసిందే.. ఇలాంటివి వెలుగుచూడని ఘటనలు ఎన్నో.. అమలుకాని నిబంధనలు నియోజకవర్గంలోని రెవెన్యూ కార్యాలయాల్లో నిబంధనలు అమలు కావడం లేదు. వంశపారంపర్యంగా వచ్చే భూములను తమ పేర్లపై మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకుంటే.. విచారణ చేపట్టి ఎలాంటి ఆక్షేపణలు రాని పక్షంలో 15 రోజుల్లోనే మార్పు చేయాల్సి ఉంటుంది. రెవెన్యూ శాఖలో అవినీతిని అరికట్టేందుకు ఆన్లైన్ వ్యవస్థను అమలు చేస్తున్నప్పటకీ పలువురు అధికారులు, కింది స్థాయి ఉద్యోగులు సాంకేతికపరమైన సమస్యలు ఉన్నాయంటూ పనులన్నీ పెండింగ్లో పెట్టి డబ్బును గుంజుతున్నారు. పెండింగ్లో దరఖాస్తులు పేర్లు మార్పు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసినా, రిజిష్ట్రేషన్ డాక్యుమెంటును నేరుగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి వచ్చినా వాటిని పట్టించుకోవడంలేదు. నిర్ణీత గడువు దాటినా వాటిని పట్టించుకునే నాథుడు లేకుండా పోయారు. భూములను తమ పేర్ల మీద మార్చుకునేందుకు వచిచ్న దరఖాస్తులు.. నర్సాపూర్ మండలంలో సుమారు 50, కౌడిపల్లిలో 56, హత్నూరలో 38, వెల్దుర్తిలో వందలాదిగా పెండింగ్లో ఉన్నట్టు తెలిసింది. ఒక్కో చోట ఒక్కో తీరు వసూళ్లు.. భూముల పేర్లు మార్పు చేసేందుకువచ్చే దరఖాస్తుదారుల నుంచి ఒక్కో చోట ఒక్కోవిధంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నట్టు సమాచారం. నర్సాపూర్లో ఇటీవల రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. కొంత మంది వ్యాపారులు గుంట నుంచి ఐదు గుంటల వరకు వ్యవసాయ భూములు కొనుగోలు చేసి వాటిని వ్యవసాయేతర భూములుగా (నాలా) మార్పు చేసేందుకు దరఖాస్తులు చేశారు. వీటిని మార్చేందుకు రూ. వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా నాలా దరఖాస్తుదారుల నుంచి ఐదు నెలల వ్యవధిలోనే లక్షల రూపాయలు వసూలు చేసినట్టు సమాచారం. ఇదిలాఉండగా గతంలో ఇక్కడ పని చేసిన అధికారి బదిలీ కావడంతో దరఖాస్తుదారు నుంచి 40 వేల రూపాయలు తీసుకుని ఆగమేఘాల మీద విచారణ చేపట్టి నాలా దరఖాస్తును పై అధికారులకు పంపినట్టు వినికిడి. కొల్చారం మండలంలోని పైతర, రంగంపేట, తుక్కాపూర్ గ్రామాలకు చెందిన రైతులు భూములను తమ పేర్ల మీద మార్చుకునేందుకు నెలలతరబడి తహసిల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పనులు కావడంలేదు. ఓ అధికారి పెద్ద ఎత్తున భూముల కొనుగోలు ఇటీవల నర్సాపూర్లో ఇద్దరు అధికారులు, ఒక గ్రామ రెవెన్యూ సహాయకుడు ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. కాగా అందులో ఒక అధికారి కొన్ని నెలల క్రితం మండలంలోని మూసాపేట గ్రామంలో సుమారు 13ఎకరాల వ్యవసాయ భూములను సుమారు 80లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి తన బందువుల పేర రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలిసింది. పాస్ పుస్తకాలను సైతం అమ్ముకుంటుండ్రు పాస్ పుస్తకాలను అడ్డగోలు ధరలకు అమ్ముకుంటున్నారు. రైతులకు ప్రభుత్వం పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్ పుస్తకాలను నామమాత్రంగా 30 రూపాయల ధరకు సరఫరా చేస్తుంది. కాగా పాస్పుస్తకాలు, టైటిల్ డీడ్స్ లేవంటూ విఆర్ఓలు అడ్డగోలుగా అమ్ముతున్నారు. వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు వాటిని అమ్ముతున్నా ఏ అధికారి చర్యలు తీసుకోకోవడం గమనార్హం. పదుల నుంచి వేల రూపయాలుగా ధర నిర్ణయించి అమ్ముతున్నారరంటె అవినీతీ ఏ మేరకు ఉందో తెలుస్తుంది. ఆన్లైన్ విధానం పకడ్బందీగా అమలు ఆన్లైన్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అవినీతికి ఎవరు పాల్పడినా చర్యలు తీసుకుంటాం. భూముల పేర్లు మార్పిడికి ఆన్లైన్లోనే దరఖాస్తు చేయాలని సూచించాం. సమస్యలు పరిష్కారం కానిపక్షంలో తన దృష్టికి తేవాలి. - మెంచు నగేష్, మెదక్ ఆర్డీఓ -
రెవెన్యూ వర్సెస్ విద్యుత్ శాఖ
వరంగల్ తహసీల్దార్ఆఫీస్కు కరెంట్ కట్ ఎన్పీడీసీఎల్పై రెవెన్యూ శాఖ ప్రతిచర్య దేశాయిపేట సబ్స్టేషన్ నిర్మాణంపై నోటీస్ సీజ్ చేసేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులు హన్మకొండ : రెవెన్యూ, విద్యుత్(ఎన్పీడీసీఎల్) శాఖల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. కొన్ని నెలలుగా రెండు శాఖల మధ్య పోరు జరుగుతోంది. వరంగల్ మండల తహసీల్దార్ కార్యాలయం కరెంటు బిల్లు రూ.8 లక్షలకుపైగా బకాయి ఉంది. దీంతో ఎన్పీడీసీఎల్ అధికారులు తహసీల్ కార్యాలయానికి కరెంటు సరఫరా నిలిపివేశారు. ఈ చర్యతో రెవెన్యూ శాఖ అధికారులు అదే తీరుగా స్పందిస్తూ దేశాయిపేట సబ్స్టేషన్ను సీజ్ చేసేందుకు సన్నద్ధమయ్యారు. దేశాయిపేట 308 సర్వే నంబర్లోని 1.20 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎన్పీడీసీఎల్ 2009లో సబ్స్టేషన్ నిర్మించింది. సబ్స్టేషన్ భూమి విషయంలో ఎలాంటి కేటాయిం పులు జరపలేదని, చెల్లింపులు జరగలేదని 2016 ఫిబ్రవరిలో రెవెన్యూ శాఖ, ఎన్పీడీసీఎల్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు ఎన్పీడీసీఎల్ అధికారులు స్పందించలేదు. తహసీల్దార్ కార్యాలయానికి కరెంటు సరఫరా నిలిపివేయడంతో గతంలో జారీ చేసిన నోటీసు విషయాన్ని పైకి తెచ్చారు. నోటీసులకు ఎన్పీడీసీఎల్ నుంచి స్పందన లేకపోవడంతో సబ్స్టేషన్ను సీజ్ చేసేందుకు రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లారు. సబ్స్టేషన్ సిబ్బంది ఈ విషయాన్ని ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులకు తెలిపారు. ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులు వెంటనే రెవెన్యూ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపారు. వరంగల్ తహసీల్దార్ కార్యాలయానికి కరెంటు సరఫరా పునరుద్ధరించారు. దీంతో రెవెన్యూ అధికారులు సబ్స్టేçÙన్ నుంచి వెనక్కి వచ్చారు. వీడియోల చిత్రీకరణ సబ్స్టేషన్ సీజ్ విషయం... ఎన్పీడీసీఎల్, రెవెన్యూ అధికారుల మధ్య స్వల్ప వాగ్వాదానికి దారితీసింది. ‘మీ కార్యాలయానికి కరెంటు సరఫరా నిలిపివేసిన విషయం మాకు తెలియదు. రెండు ప్రభుత్వ విభాగాలే కదా... ఒక రోజు ముందు వెనుక బిల్లులు చెల్లిస్తాం. ఆగవచ్చు కదా’ అని రెవెన్యూ అధికారులు అన్నారు. ‘ప్రభుత్వ భూమి కేటాయింపులకు సంబంధించిన డబ్బులను ఎన్పీడీసీఎల్ చెల్లించలేదు. అయి నా మా శాఖ అడగడం లేదు’ అని రెవెన్యూ అధికారులు సమాధానమిచ్చారు. రెండు శాఖల అధికారులు మాట్లాడుతుండగా ఇరు శాఖల సిబ్బంది పోటీపడి వీడియో చిత్రీకరించారు. కరెంటు సరఫరా పునరుద్ధరించారని తహసీల్దార్ కార్యాలయం నుంచి ఫోన్ రాగానే వరంగల్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శర్మ, వీఆర్వో స్రవంతి, ఇతర సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
చిన్న జిల్లాగా సిద్దిపేట!
సాక్షి, హైదరాబాద్: ‘కొత్త జిల్లాలను ప్రజల ఇష్టాయిష్టాల మేరకు ఏర్పాటు చేయాలి. సుపరిపాలన దిశగా ముందడుగు వేసేలా కొత్త జిల్లాల ప్రతిపాదనలుండాలి’’ అని కొత్త జిల్లాల ముసాయిదా తయారీకి ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఎదుట ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు ఈటల, తుమ్మలతో కూడిన ఉపసంఘం శుక్రవారం మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశమైంది. ప్రతిపాదిత జిల్లాల మ్యాపులతో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, సీసీఎల్ఏ రేమండ్ పీటర్ పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మెదక్ జిల్లా సమీక్షలో మంత్రి హరీశ్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్ పాల్గొన్నారు. జనగామను జిల్లా చేయాలనే అభ్యర్థనలున్నాయని కడియం గుర్తు చేశారు. కాబట్టి వరంగల్ జిల్లాలోని జనగామ, చేర్యాల ప్రాంతాలను ప్రతిపాదిత సిద్దిపేట జిల్లాలో కలిపే విషయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. జనగామ ప్రజలకు ఇష్టం లేకుంటే సిద్దిపేటలో కలపొద్దని హరీశ్ అన్నారు. ‘‘సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాలతోనే సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేసినా అభ్యంతరం లేదు. అన్ని రంగాల్లో ముందంజలో ఉన్న సిద్దిపేట చిన్న జిల్లాగా ఏర్పడితే రాష్ట్రంలో నంబర్వన్గా ఎదుగుతుంది’’ అని ఆశాభావం వెలిబుచ్చారు. మెదక్ జిల్లా పటాన్చెరు, రామచంద్రాపురం మండలాలను ప్రతిపాదిత సికింద్రాబాద్ జిల్లాలో కలుపవద్దని, సంగారెడ్డి జిల్లాలో ఉంచాలని ప్రజాప్రతినిధులు కోరారు. అనంతరం నిజామాబాద్ జిల్లా సమీక్షకు మంత్రి పోచారం, ఎంపీ కవిత, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్ హాజరయ్యారు. ‘‘ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలాన్ని మెదక్ జిల్లాలో కలపొద్దు. కామారెడ్డి జిల్లాలో ఉంచాలి. బాన్సువాడ సెగ్మెంట్లోని వర్లి, కోటగిరి మండలాలను నిజామాబాద్లో కాకుండా కామారెడ్డిలో చేర్చాల’’ని కోరారు. అందరికీ ఆమోదయోగ్యంగా జిల్లాలు ఏర్పాటవుతాయని అనంతరం కవిత మీడియాతో చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా సమీక్షలో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్ పాల్గొన్నారు. జిల్లాలో కొత్తగా మంచిర్యాల (కొమురం భీమ్), నిర్మల్ జిల్లాల ప్రతిపాదనలపై చర్చ జరిగింది. ఉపసంఘం శనివారం హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం; ఆదివారం మహబూబ్నగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల ప్రతినిధులతో భేటీ కానుంది. 16న అఖిలపక్ష సమావేశం జరిగే అవకాశముంది. సీఎం నిర్ణయం మేరకు తేదీ ఖరారవుతుందని మహమూద్ అలీ తెలిపారు. -
రెవెన్యూ శాఖలో భర్తీ కాని ఖాళీలు
► అదనపు పనిభారంతో ఉద్యోగులు, సిబ్బంది అందోళన ► నేటి వీడియో కాన్ఫరెన్స్లో ప్రస్తావనకు సన్నద్ధం సాక్షి, సిటీబ్యూరో: ఒక వైపు పనిభారం.. మరోవైపు సిబ్బంది కొరత రెవెన్యూ యంత్రాంగాన్ని భయపెడుతున్నది. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, హరితహారం వంటి అదనపు కార్యకలాపాలు రెవెన్యూ ఉద్యోగులను మరింత ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో గురువారం కలెక్టరేట్ నుంచి ‘20 ఎజెండా’ అంశాలపై జిల్లా అధికారయంత్రాంగం నిర్వహించతలపెట్టిన వీడియో కాన్ఫరెన్స్లో పని భారంపై తమ అభిప్రాయాలను వ్యక్తపరిచేందుకు తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు సన్నద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా... ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా ఫైలును పక్కనపెట్టిన సర్కారు... రోజుకో కొత్త నిర్ణయంతో ఒత్తిడికి గురిచేస్తోంది. మరోవైపు జిల్లాల పునర్విభజన ముహూర్తం కూడా సమీపిస్తుండడంతో తహసీల్దార్ల నియామకంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు తహసీల్దార్లకు జూలైలో డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు లభించాయి. తహసీల్దార్ స్థాయి అధికారులకు ప్రమోషన్లు ఇచ్చిన సర్కారు.. డిప్యూటీ తహసీల్దార్లకు పదోన్నతులు కల్పించలేదు. దీంతో ఈ పోస్టులను ఇప్పటికిప్పుడు భర్తీ చేసే పరిస్థితి కనిపించడంలేదు. అదే సమయంలో అటూ పదోన్నతులు లభించిన తహసీల్దార్ల ఫైలుకు మోక్షం కలగలేదు. వీరికి పోస్టింగ్లకు ఇంకా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. అదనపు పనులతో ఇబ్బందులు... వెబ్ల్యాండ్ అప్డేషన్, అసైన్డ్ భూముల సర్వే, యూఎల్సీ భూముల క్రమబద్ధీకరణ, జీఓ 58,59 అమలు, భూముల వేలం తదితర పనులతో రెవెన్యూ అధికారులు సతమతమవుతున్నారు. జిల్లాలో ఒకటి, రెండు మండలాలు మినహాయించి మిగతా మండలాల్లో జనాభా 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉండటంతో ఇక్కడి సిబ్బందిపై పని భారం రెండింతలు పడుతున్నది. ఇక్కడ ధృవీకరణ పత్రాల జారీ శక్తికి మించిన భారమవుతున్నది. దీనికితోడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు తదితర ప్రాజెక్టులకు ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ కూడా తహసీల్దార్లకు కత్తిమీద సాములా మారింది. ఏ మాత్రం ఆలసత్వం ప్రదర్శించినా ఉద్యోగానికే ఎసరొచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో భూసేకరణ అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే కొంతమంది తహసీల్దార్లకు పదోన్నతులు కల్పించిన సర్కారు.. అదేసమయంలో కిందిస్థాయి అధికారులకు కూడా ప్రమోషన్లు ఇవ్వకపోవడం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణంగా చెప్పవచ్చు. కేవలం రెవెన్యూ విధులేగాకుండా... కల్యాణలక్ష్మి, షాదీముబారక్, హరితహారం తదితర పథకాల అమలులోనూ తహసీల్దార్లదే కీలకపాత్ర. దీనికితోడు వారానికి నాలుగురోజులు సీసీఎల్ఏ, సీఎస్, కలెక్టర్, జేసీలు, ఇతర శాఖాధిపతులు నిర్వహిస్తున్న సమావేశాలు కూడా పనులను ప్రభావితం చేస్తున్నాయి. కొంతమంది తహసీల్దార్లు మాత్రం వీడియో కాన్ఫరెన్స్లు, సమీక్షలను సాకుగా చూపి కార్యాలయాలకు ఎగనామం పెడుతుండడంతో అర్జీదారుల బాధలు వర్ణణాతీతంగా మారాయి. -
సాఫ్ట్వేర్.. సమస్యలతో బేజార్
సాంకేతిక లోపాలతో సతమతమవుతున్న రెవెన్యూ శాఖ * పరిష్కారం కనుగొనని ఉన్నతాధికారులు * ఇలాగైతే కష్టమంటున్న తహసీల్దార్లు * ‘క్రమబద్ధీకరణ’ అమలులో వైఫల్యం సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖలో వివిధ పథకాల అమలు నిమిత్తం భూపరిపాలన కార్యాలయం ప్రవేశపెట్టిన సాఫ్ట్వేర్ ఎందుకూ కొరగాకుండా పోతోంది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి ఉన్నతాధికారులు సమకూర్చిన ఆన్లైన్ విధానాలతో పారదర్శకత సంగతేమో గానీ, గత రెండేళ్లుగా ఏ పథకం కూడా సంపూర్ణంగా అమలుకు నోచుకోలేదు. 2014 డిసెంబర్లో ప్రభుత్వం ప్రారంభించిన భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ నుంచి నిన్నమొన్నటి సాదా బైనామాల క్రమబద్ధీకరణ వరకు సాంకేతిక సమస్యలతో రెవెన్యూ యంత్రాంగమంతా సతమతమవుతోంది. సమస్యలు పరిష్కరించకపోగా పథకాల అమలు విషయంలో వైఫల్యాలకు తహసీల్దార్లనే బాధ్యులను చేస్తూ చార్జిమెమోలు, ఇంక్రిమెంట్లలో కోతలు విధిస్తామంటున్నారు. ఇది ఎంతవరకు సబబని తెలంగాణ తహ సీల్దార్ల సంఘం ప్రశ్నిస్తోంది. టీజీటీఏ ఆధ్వర్యంలో తహసీల్దార్లంతా మూకుమ్మడిగా ఆందోళనకు దిగడంతో మేల్కొన్న సర్కారు త్వరలోనే ఇబ్బందులను తొలగిస్తామని హామీ ఇచ్చింది. కొలిక్కిరాని క్రమబద్ధీకరణ ప్రక్రియ రాష్ట్రంలో భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ మొదలై రెండేళ్లు కావస్తున్నా, ఇంతవరకు ఓ కొలిక్కి రాలేదు. సాంకేతిక సమస్యల కార ణంగా పక్కన బెట్టిన దరఖాస్తులను అధికారులు ఇంతవరకు పరిష్కరించలేదు. జీవో 58 ప్రకారం పేదలు నివాసముంటున్న స్థలాలను ఉచితంగా వారికి క్రమబద్ధీకరించాలి. ఈ విషయంలో ఎంతోమందికి ఆధార్ కార్డు లేదని, కార్డు ఉన్నా ఇన్వాలిడ్ అని రావడంతో నేటి వరకు ఆ దరఖాస్తులను ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. అలాగే జీవో 59 కింద చెల్లింపు కేటగిరీలో క్రమబద్ధీకరణ నిమిత్తం ఏడాది క్రితమే సొమ్ము చెల్లించినా ఆ భూములనూ అధికారులు రిజిస్ట్రేషన్ చేయడం లేదు. మొత్తం 49,211 దరఖాస్తులు ప్రభుత్వం వద్ద ఉంటే.. ఇప్పటివరకు ఆయా దరఖాస్తుల్లో అధికారులు క్లియర్ చేసింది 7,451 దరఖాస్తులే (15శాతం) కావడం గమనార్హం. ఈ ప్రక్రియ నిమిత్తం భూపరిపాలన అధికారులు రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన సాఫ్ట్వేర్లో రోజుకో రకమైన సమస్యలు తలెత్తుతుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇతర పథకాల అమలు తీరూ ఇందుకు భిన్నంగా ఏమీ లేదని తెలుస్తోంది. -
సీఎం లెక్క.. 42 శాతం అవినీతి
ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సాక్షి, విజయవాడ బ్యూరో/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లెక్కల ప్రకారం రెవెన్యూశాఖలో 42 శాతం అవినీతి ఉందని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వెల్లడించారు. అయితే శాఖ మొత్తం అవినీతిమయం అని కాకుండా ఇంకా 58 శాతం నిజాయితీగా పనిచేస్తున్న కోణంలో చూడాలని వ్యాఖ్యానించారు. రెవెన్యూ శాఖలో అందరూ ‘మహాత్మా గాంధీ’లే ఉండరని, ఇంత పెద్ద వ్యవస్థలో అక్కడక్కడ లోపాలు ఉంటాయని స్పష్టం చేశారు. రెవెన్యూ మొత్తం అవినీతిమయమనే ప్రచారం చేయడం సరికాదన్నారు. విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్లో గురువారం సర్వే సెటిల్మెంట్శాఖ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కేఈ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు బుధవారం నిర్వహించిన రెవెన్యూ సమీక్షా సమావేశాన్ని కూడా కొన్ని పత్రికలు వక్రీకరించాయని పేర్కొన్నారు. రెవెన్యూ అవినీతిపై కథనాలు రాసినందుకే సీఎం ఆ సమావేశాన్ని నిర్వహించారంటూ కొందరు కాలర్ ఎగరేస్తున్నారని వ్యాఖ్యానించారు. -
వీళ్లిట్టా.. వాళ్లట్టా!
నీటి తీరువా వసూలులో ఇరుశాఖల మధ్య సమన్వయలోపం రెవెన్యూ శాఖ ఖాతాలో రూ. 2 కోట్ల పన్నులు నాలుగేళ్లుగా జల వనరుల శాఖ వాటా ఇవ్వని వైనం భూములకు నీరిచ్చేది జల వనరుల శాఖ అధికారులు, పన్ను వసూలు చేయాల్సింది రెవెన్యూ శాఖ అధికారులు కావడంతో ఆ రెండు శాఖల మధ్య సమన్వయం కొరవడింది. దీంతో కాల్వలు, చెరువులకు చిన్నపాటి గండ్లు పడినా తాత్కాలిక మరమ్మతులు చేయాలన్నా నిధుల కొరత వేధిస్తోంది. కర్నూలు సిటీ: కాల్వల కింద ఆయకట్టు భూముల నుంచి నీటి తీరువా వసూలులో రెవెన్యూ, జలవనరులశాఖాధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ విషయంలో ఈ రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో కొన్నేళ్లుగా పన్నులు వసూలు కావడం లేదు. వసూలైన సొమ్ము రెవెన్యూ శాఖ ఖాతాల్లో మూలుగుతున్నా జల వనరుల శాఖకు వాటా రావడం లేదు. ఈ పరిస్థితి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పన్ను వసూలు బాధ్యత నుంచి రెవెన్యూ శాఖను తప్పించే యోచనలో ఉంది. ఇందుకు సంబంధించి గత నెల 30వ తేదీన ఆయకట్టు అభివృద్ధి సంస్థ, అపెక్స్ సభ్యులు అభిప్రాయం కోరగా జల వనరుల శాఖకు చెందిన మెజారీ ఇంజినీర్లు పన్ను వసూలు బాధ్యతను తీసుకునేందుకు సమ్మతించారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో ప్రధానంగా కేసీ, తుంగభద్ర దిగువ కాలువ, గాజులదిన్నె ప్రాజెక్టు, శివభాష్యం, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగా, చిన్న నీటిపారుదల శాఖ, ఆంధ్రప్రదేశ్ ఆయకట్టు అభివృద్ధి సంస్థ పరిధిలోని ఎత్తిపోతల పథకాల కింద మొత్తం 6.29 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. ఈ భూముల నుంచి పన్ను వసూలు బాధ్యతను ప్రభుత్వం రెవెన్యూ శాఖకు అప్పగించింది. అయితే ఈ విషయంలో ఆ శాఖాధికారుల నిర్లక్ష్యం కారణంగా పన్నులు భారీగా పెండింగ్లో పడిపోయాయి. ఈ క్రమంలో నిధుల వేట మొదలెట్టిన ప్రభుత్వం నీటి తీరువాపై రెవెన్యూ శాఖ నిర్లక్ష్యాన్ని గుర్తించి ఆ బాధ్యతను జల వనరుల శాఖ ఇంజనీర్లకు అప్పగించాలని సంకల్పించి వారి అభిప్రాయాలు తీసుకుంది. రూ. 21.25 కోట్ల బకాయిలు కర్నూలు, కడప జిల్లాల్లోను, తుంగభద్ర దిగువ కాల్వ, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగా, గాజులదిన్నె ప్రాజెక్టు, శివభాష్యం, చెరువులు, ఎత్తిపోతల పథకాల కింద సాగయ్యే ఆయకట్టుకు సంబంధించి గతేడాది మే నెలవరకు తీసుకుంటే రూ. 21.25 కోట్ల బకాయిలున్నాయి. సాధారణంగా కాల్వల కింద సాగయ్యే పంటలకు వేరువేరుగా పన్నులు వసూలు చేస్తారు. ఎకరాకు వరి పంటకు రూ. 200, ఇరిగేటేడ్ డ్రై పంటకు రూ. 100 ప్రకారంవసూలు చేస్తారు. అభిప్రాయం తీసుకున్నారు.. ఆయకట్టుకు సంబంధించి నీటి తీరువా వసూళ్ల బాధ్యతను ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు నిర్వహించారు. ప్రస్తుతం జలవనరుల శాఖకు అప్పగించేందుకు అపెక్స్ సభ్యులు, ఉన్నతాధికారులు అభిప్రాయాన్ని సేకరించారు. అయితే చాలా మంది మన కాల్వలకు సంబంధించి పన్నులు మనమే వసూలు చేసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. - ఎస్.చంద్రశేఖర్ రావు -
బదిలీలైనా చేరని ఉద్యోగులు!
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మేర రెవెన్యూ శాఖలో బదిలీలు జరిగాయి. ఉద్యోగుల్లో సగం మంది బదిలీ స్థానాల్లో చేర లేదు. వీరిలో చాలా మంది బదిలీల మార్పులకు, యథాస్థానంలో కొనసాగేందుకు రాజకీయ నేతల చుట్టూ తిరుగుతున్నారు. ముడుపులు చెల్లించేందుకు సైతం కొందరు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అధిక సంఖ్యలో బదిలీ జరిగిన వీఆర్వోలు మాత్రమే విధుల్లో చేరారు. బదిలీల ప్రక్రియ జూన్ 20తో ముగిసింది. 24వ తేదీవరకు సర్దుబాటు ప్రక్రియ నిర్వహించారు. బదిలీ స్థానాల్లో చేరాలని ఉత్తర్వులు జారీచేసి వారం రోజులు కావాస్తున్నా పలు కేడర్లులో ఉద్యోగుల చేరలేదు. ప్రతిరోజు అధికార పార్టీకి చెందిన నాయకుల ప్రతినిధులు కలెక్టరేట్కు రావడం, దగ్గరుండి మార్పులు చేయించుకుంటుండం విమర్శలకు తావిస్తోంది. కొందరు ఉద్యోగులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. వీఆర్వోలు 108 మంది బదిలీలు కోరుకుంటే 90 మందికి పైగా కొత్త స్థానాలకు బదిలీ అయ్యారు. వీరిలో ఇంచుమించుగా అందరూ విధుల్లో చేరారు. డిప్యూటీ తహశీల్దారు కేడరులో 34 మందికి బదిలీలు చేసినా, సగం మంది కూడా కొత్త స్థానాల్లో చేరలేదు. నరసన్నపేట ఎంఎల్ఎస్ పాయింట్, పాలకొండ, రణస్టలం సూపరెంటెండెంట్లు, కోటబోమ్మాళి డీటీ... ఇలా చాలా మంది బాధ్యతల స్వీకరణకు వెనుకంజ వేస్తున్నారు. ఈ కోవలోనే సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు. బదిలీల్లో భాగంగా రెవెన్యూ పర్యవేక్షకుల పోస్టులను కూడా నియమించాలని ఉన్నతాధికారులు జాబితాలు సిద్ధంచేశారు. శాఖాపరమైన సమస్యలు ఉత్పన్నం కావడంతో మరో మూడు నెలల వరకు సమయం పట్టవచ్చని కార్యాలయం భోగట్టా. కలెక్టరేట్ కు వచ్చేందుకు వెనుకడుగు... కలెక్టరేట్కు వచ్చేందుకు ఉద్యోగులు వెనుకాడుతున్నారు. కలెక్టరేట్లో పనిభారం ఎక్కువగా ఉండడం, ప్రతి క్షణం ఉన్నతాధికారులు దగ్గరలో ఉండడంతో ఇబ్బందులు వస్తాయని భయపడుతున్నారు. కలెక్టరేట్లో కొన్ని సీట్లలో పనిచేసిన వారు రాత్రి ఎనిమిది గంటల వరకు ఉండాల్సి రావడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. ఇటీవల జేసీ ప్రత్యేక శ్రద్ధతో వివిధ మండలాల నుంచి మూడు కేడర్ల ఉద్యోగులు 18 మందిని కలెక్టరేట్కు బదిలీలపై తీసుకువచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు వీరిలో సగం మంది మాత్రమే విధుల్లో చేరారు. ఏఓ స్థానం ఖాళీ... కలెక్టరేట్లో ఎ-సెక్షన్ సూపరింటెండెంట్ పరిపాలనాధికారిగా వ్యవహరిస్తారు. ఇక్కడ పనిచేస్తున్న కాళీప్రసాద్ని బదిలీ చేశారు. ఈ స్థానంలో ఎవరినీ నియమించలేదు. ఈ పోస్టులో పనిఒత్తిడి ఉండడంతో కొంతమంది రావాడానికి ఇష్టపడటం లేదు. కొత్తవారు, ఇటీవల రిక్రూట్మెంట్లో ఎంపికైన వారు ఈ సీటులో ఉంటే న్యాయం జరుగుతుందని రెవెన్యూ ఉద్యోగులు భావిస్తున్నారు. -
మార్గదర్శకాల ప్రకారమే ప్రకటన
కరువు మండలాలపై హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం హైదరాబాద్: కరువు మండలాల ప్రకటన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన మార్గదర్శకాల ప్రకారమే వ్యవహరిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కరీంనగర్ జిల్లాలోనూ ఆ మార్గదర్శకాలను అనుసరించే కరువు మండలాలను ప్రకటించినట్లు వివరించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ (విపత్తుల నిర్వహణ) ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా.. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. కరీంనగర్ జిల్లాలో కలెక్టర్ సిఫారసులకు విరుద్ధంగా 40 మండలాలకుగాను కేవలం 19నే కరువు మండలాలుగా ప్రకటించడాన్ని సవా లు చేస్తూ జగిత్యాల ఎమ్మెల్యే జీవన్రెడ్డి పిల్ వేసిన విషయం తెలిసిందే. గతేడాది నైరుతి రుతుపవనాల సమయంలో రాష్ట్రంలో సగ టు వర్షపాతం 713.6 మి.మి. ఉండగా, 610 మి.మి. మాత్రమే నమోదయిందని, ఈ నేపథ్యంలో కరువు మండలాల ప్రకటనకు ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసి సిఫారసులు కోరిందని కౌంటర్లో మీనా పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో కలెక్టర్ 40 మండలాలను కరువు ప్రాంతాలుగా సిఫారసు చేయగా, కమిటీ 19 మండలాలనే ఓకే చేసిందన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం పిటిషనర్ వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకున్నామని, ఆ ప్రకారం కేశవపట్నానికి మాత్రమే కరువు మండలంగా గుర్తించే అర్హత ఉందన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని వ్యాజ్యాన్ని కొట్టేయాలని మీనా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. -
పాలనలో ఇక మలేసియా పెత్తనం!
అధికారులకు ‘పెమాండో’ శిక్షణ సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణంలో సింగపూర్ చేతిలో కీలుబొమ్మగా మారిన ప్రభుత్వం తాజాగా పరిపాలనలో మలేసియా పెత్తనానికి తెర లేపింది. వివిధ శాఖల్లో సంస్కరణల అమలుకు మలేసియాకు చెందిన ‘ఫెర్ఫార్మెన్స్ మేనేజిమెంట్ అండ్ డెలివరీ యూనిట్ (పెమాండో) సహాయ సహకారాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పెమాండో సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ సంస్థ కోరిన సమాచారం ఎప్పటికప్పుడు ఇవ్వాలని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఆదాయ ఆర్జన శాఖల (రెవెన్యూ ఎర్నింగ్) పరిస్థితిపై అధ్యయనం చేసి చేపట్టాల్సిన సంస్కరణలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు పెమాండో సన్నాహాలు చేపట్టింది. ఎంపిక చేసిన జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లతోపాటు రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో మలేిసియా సంస్థ ప్రతినిధులు సమావేశమై మలేసియాలో అమలవుతున్న సంస్కరణలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. సీసీఎల్ఏ అనిల్ చంద్ర పునేఠా, సీసీఎల్ఏ కార్యదర్శి రామారావు ఇటీవల ఇదే అంశంపై ఆ దేశానికి వెళ్లి ఆ సంస్థ ప్రతినిధులతో సమావేశమై వచ్చారు. కాగా ఏయే శాఖల్లో ఎలాంటి లోపాలు ఉన్నాయో, ప్రభుత్వ కార్యక్రమాలు ఎందుకు సక్రమంగా అమలు కావడంలేదో ప్రత్యేకంగా విదేశీ సంస్థ చెప్పాల్సిన అవసరం లేదని ఇప్పటికే వివిధ కమిటీలు ఇచ్చిన నివేదికలను సర్కారు చిత్తశుద్ధితో అమలు చేస్తే సరిపోతుందని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. నేడు వర్క్షాప్.. పెమాండో, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయమే లక్ష్యంగా హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీహెచ్ఆర్డీ)లో సోమవారం వర్క్షాప్ను నిర్వహించనున్నారు. దీన్ని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రారంభిస్తారు. -
‘క్రమబద్ధీకరణ’ గడువు పెంపుపై తర్జన భర్జన
సాక్షి, హైదరాబాద్: చెల్లింపు కేటగిరిలో భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియకు మరోమారు గడువు పెంచే విషయమై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఏడాదిన్నరగా ఈ ప్రక్రియ కొనసాగుతుండటం, పలుమార్లు గడువు పెంచినా వివిధ స్థాయిల్లో దరఖాస్తులు పెండింగ్లో ఉండిపోవడంతో అంతా గందరగోళంగా తయారైంది. భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి 2014 డిసెంబర్లో జీవో 59 విడుదల చేసిన సర్కారు.. 90 రోజుల్లోనే ఈ ప్రక్రియను ముగించాలని స్పష్టం చేసింది. అయితే ఆ బాధ్యతలను నెత్తికెత్తుకున్న భూపరిపాలన విభాగంలో కమిషనర్లు తరచుగా మారుతుండటంతో సిబ్బందికి మార్గనిర్దేశం చేసేవారు కరువయ్యారు. ఎట్టకేలకు గత నెల మొదటి వారం నుంచి పూర్తి సొమ్ము చెల్లించిన కొన్ని దరఖాస్తులను క్లియర్ చేసిన తహసీల్దార్లు ఆయా భూములను లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్లు చేశారు. మరోవైపు వాయిదాల పద్ధతిలో సొమ్ము చెల్లిస్తున్న వారు మరికొన్ని వాయిదాలు చెల్లించాల్సి రావడం, కొన్ని దరఖాస్తుల్లో పేర్కొన్న భూమి పాక్షిక కమర్షియల్/పాక్షిక రెసిడెన్షియల్ కేటగిరీలో ఉండటం క్షేత్రస్థాయి అధికారులకు తలనొప్పిగా మారింది. గడువు పొడిగించలేం..: భూముల క్రమబద్ధీకరణ ఏడాదిన్నరగా సాగుతున్నందున మరోమారు గడువు పొడిగించడం సమంజసం కాదని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందికి సూచనలు చేసినట్లు తెలిసింది. ఇంకోవైపు గడువు ముగిసినందున తాము చెల్లించిన సొమ్మును తిరిగి ఇమ్మని కొందరు దరఖాస్తుదారులు తహసీల్దార్లను డిమాండ్ చేస్తున్నారు. క్రమబద్ధీకరణను త్వరితగతిన ముగించేందుకు గడువు పెంచాలని ఆయా జిల్లాల కలెక్టర్లు సీసీఎల్ఏకు లేఖ రాశారు. సాదా బైనామాల రిజిస్ట్రేషన్లు, యూఎల్సీ ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటు వంటి వాటితో సీసీఎల్ఏ బిజీగా ఉండటంతో గడువు పెంపుపై ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం లేదని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. -
విముక్తి
► వెట్టి నుంచి బయటపడిన 55మంది చెంచుకూలీలు ► నల్లమల టు బీజాపూర్ వలసపనులకు అడవిబిడ్డల ► అక్రమ తరలింపు దాడులుచేసి పట్టుకున్న ► సీఐడీ అధికారులు జిల్లాకేంద్రంలో వలస ► కూలీలకు పునరావాసం గుంపుమేస్త్రీ, డీసీఎం డ్రైవర్ అరెస్ట్ ► నిందితుడి ఇంట్లో సోదాలు, కీలకపత్రాలు స్వాధీనం మహబూబ్నగర్ న్యూటౌన్/లింగాల వారి అమాయకత్వం వీరికి అవసరం.. వారి ఆకలిమంట వీరికి సిరులపంట.. నల్లమల అడవిబిడ్డలతో కొన్నిరోజులుగా వెట్టిచాకిరీ చేయిస్తున్న ఓ గుంపుమేస్త్రీని సీఐడీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. 55మంది చెంచులను కర్ణాటకలో రోడ్డు విస్తరణ పనులు చేయించేందుకు తీసుకెళ్తుండగా బుధవారం బీజాపూర్ వద్ద సీఐడీ డీఎస్పీ వసంత్కుమార్ నేతృత్వంలో అధికారుల బృందం దాడులు నిర్వహించి వారికి విముక్తి కల్పించింది. వారిలో 25మంది పురుషులు, 18మంది మహిళలు, 12మంది చిన్నారులు ఉన్నారు. లింగాల మండలంలోని చెన్నంపల్లికి చెందిన ఆంజనేయులు గుంపుమేస్త్రీ. కొన్నేళ్లుగా వివిధ గ్రామాలకు చెందిన చెంచులు, ఇతరులతోపాటు బాలకార్మికులను ఇతర రాష్ట్రాల్లో వివిధ పనులు చేయించేందుకు వారికి కొంత అడ్వాన్స్ కింద ఇచ్చి తీసుకెళ్తుంటాడు. అందులో భాగంగానే లింగాల మండలంలోని చెన్నంపల్లి, అప్పాయిపల్లి, పద్మన్నపల్లి, రాయవరం, కొల్లాపూర్ మండలంలోని పలు గ్రామాల నుంచి 55మంది కూలీలను కర్ణాటకలోని బీజాపూర్కు తీసుకెళ్తుండగా అధికారులు దాడులుచేసి పట్టుకున్నారు. గుంపుమేస్త్రీ ఆంజనేయులుతో పాటు వాహనడ్రైవర్ను అరెస్ట్చేసి బుధవారం మహబూబ్నగర్ కోర్టులో హాజరుపరిచారు. కూలీలకు కలెక్టర్ టీకే శ్రీదేవి జిల్లాకేంద్రంలోని రాయల్ ఫంక్షన్ హాలులో తాత్కాలిక పునరావాసం కల్పించారు. ఆమె బుధవారం సాయంత్రం వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చెంచులకు వారి స్వగ్రామాల్లోనే అవసరమైన పనులు కల్పిస్తామన్నారు. వారికి మూడు రోజులపాటు భోజన వసతి ఏర్పాటుచేస్తామన్నారు. అనారోగ్యం బారినపడిన వారికి తక్షణ వైద్యం అందించి తగిన జాగ్రత్తలు తీసుకుంటామని భరోసాఇచ్చారు. వెట్టిచాకిరి చేయిస్తే కఠినచర్యలు: కలెక్టర్ వెట్టిచాకిరి ప్రోత్సహించినా, పనులు చేయించినా వారిపై కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్ టీకే శ్రీదేవి హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదష్టకరమన్నారు. వెట్టి చాకిరి చేయించేందుకు కూలీలను తీసుకెళ్తున్న కాంట్రాక్టర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. చెంచులకు విముక్తి కలిగించిన అధికారులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. బడిఈడు పిల్లలను బాలకార్మికులుగా పనిచేయిస్తే టోల్ఫ్రీ నెం.1098కు ఫోన్చేసి సమాచారం ఇవ్వాలని కలెక్టర్ కోరారు. కలెక్టర్ వెంట నాగర్కర్నూల్ ఆర్డీఓ దేవెందర్రెడ్డి, డీఎస్పీ కష్ణమూర్తి, సీఐడీ డీఎస్పీ వసంత్కుమార్, తహసీల్దార్ అమరేందర్, సెట్మాసీఈఓ హన్మంత్రావు, లయన్ నటరాజ్ ఉన్నారు. గుంపుమేస్త్రీ ఇంట్లో సీఐడీ సోదాలు లింగాల మండలం చెన్నంపల్లికి చెందిన గుంపుమేస్త్రీ ఆంజనేయులు ఇంట్లో సీఐడీ అధికారులు మంగళవారం రాత్రి సోదాలు నిర్వహించి కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇలాంటి వారు ఎందరో చట్టాలను అతిక్రమించి ఎలాంటి అనుమతులు లేకుండా వలస కూలీలను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్తుంటారు. వాస్తవానికి కూలీల వివరాలను తహసీల్దార్ కార్యాలయంలో కచ్చితంగా తెలియపర్చాలి. కానీ అవేవీ పట్టించుకోకుండా నామమాత్రపు కూలి చెల్లిస్తూ సుదూర ప్రాంతాలకు పనులు చేయించేందుకు తీసుకెళ్తున్నారు. కార్మిక, రెవెన్యూ శాఖల అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇకనైనా ప్రత్యేకదృష్టి సారించి వలసల నుంచి విముక్తి కల్పించాలని పలువురు కోరుతున్నారు. -
అమరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు
ఉత్తర్వులు జారీచేసిన సర్కారు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఉద్యోగానికి ఎంపిక చేసే వ్యక్తికి ఉండాల్సిన వయోపరిమితి, విద్య వంటి కనీస అర్హతలను ప్రభుత్వం సడలించింది. ఇప్పటికే ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేసిన ప్రభుత్వం, ఇల్లు, ఉచిత విద్య, ఆరోగ్య సదుపాయం, వ్యవసాయం చేసుకునే కుటుంబమైతే భూమి ఇవ్వాలని నిర్ణయిం చింది. అమరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు జిల్లాల కలెక్టర్లను అపాయింటింగ్ అథారిటీగా నియమించిం ది. ఈ మేరకు పాటించాల్సిన మార్గదర్శకాలను ఉత్తర్వుల్లో సూచించింది. మార్గదర్శకాలివే.. కుటుంబంలో ఉద్యోగానికి ఎంపిక చేసే వ్యక్తికి ఎలాంటి వయోపరిమితి అక్కర్లేదు. చివరి గ్రేడ్ ఉద్యోగానికి అవసరమైన విద్యార్హతను సదరు వ్యక్తి ఐదేళ్లలోగా పొందేందుకు అవకాశం కల్పించారు. అర్హత ఉన్నవారు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని కోరుకుంటే, అవసరమైతే రోస్టర్ పాయింట్లలోనూ రిలాక్సేషన్ ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. కుటుంబసభ్యుల అనుమతితో రక్త సంబంధీకులు ఎవరికైనా ఉద్యోగం ఇవ్వవచ్చు. భార్య లేదా భర్త ఆ తర్వాత పిల ్లలకు ప్రాధాన్యతను ఇవ్వాలి. జిల్లా కలెక్టర్లకు.. అవసరమైతే నిబంధనలను సడలించుకునే అధికారాన్ని ప్రభుత్వం కల్పించింది. ప్రస్తుతం ఉన్న ఖాళీల్లో నియామకాలు జరపాలని, అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించుకోవచ్చని పేర్కొంది. మార్గదర్శకాలను అనుసరించి ఉద్యోగ నియామకపత్రాలను జారీచేయాలని ఆదేశించింది. -
రెవెన్యూ పరిధిలోకి రిజిస్ట్రేషన్ల శాఖ
బీఆర్ మీనాకు బాధ్యతలు అప్పగింత సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికే రిజిస్ట్రేషన్ల శాఖ బాధ్యతలూ అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ రాజీవ్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై రిజిస్ట్రేషన్ల శాఖకు కూడా ముఖ్య కార్యదర్శిగా రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్.మీనా వ్యవహరించనున్నారు. 2010 వరకు రెండు శాఖలు ఒకే ముఖ్య కార్యదర్శి పరిధిలో ఉండగా, దాదాపు ఐదేళ్ల తర్వాత తిరిగి ఒకే ముఖ్య కార్యదర్శి పరిధిలోకి తేవడం గమనార్హం. ముఖ్య కార్యదర్శి, కమిషనర్ వంటి కీలక పోస్టుల్లో రెగ్యులర్ అధికారులు ఉండకపోవడంతో గందరగోళంగా తయారైన రిజిస్ట్రేషన్ల శాఖను, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి పరిధిలోకి తేవడం పట్ల రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
పని భారం!
♦ రెవెన్యూ ఖాళీల భర్తీపై శ్రద్ధ చూపని సర్కారు ♦ రోజురోజుకూ పెరుగుతున్న పనిఒత్తిడి ♦ సతమతమవుతున్న ఉద్యోగులుz ♦ కొత్త జిల్లాలు ఏర్పాటుచేస్తే మరింత గందరగోళం రెవెన్యూ శాఖ తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. పహాణీల కంప్యూటరీకరణ, భూముల క్రమబద్ధీకరణ, ఫార్మాసిటీ భూసేకరణ, ఓటర్ల ముసాయిదా రూపకల్పన ఇలా ఒకేసారి పనులను మోపడంతో యంత్రాంగం ఉక్కిరిబిక్కిరవుతోంది. అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్న రెవెన్యూ విభాగాన్ని ప్రభుత్వం పటిష్టం చేయకుండా ఏకకాలంలో అద నపు విధులు అప్పగిస్తుండడం ఉద్యోగులను ఊపిరిపీల్చుకోకుండా చేస్తోంది. రాష్ట్ర బడ్జెట్లో సింహాభాగం నిధులు సమకూర్చిపెడుతున్న ఈ శాఖను బలోపేతం చేయకుండా చేతులెత్తేసింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లాలో రెవెన్యూ విభాగంలో సగం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సర్వేయర్లు, జూనియర్/ సీనియర్ అసిస్టెంట్లు, వీఆర్ఓలు ఇలా ప్రతి కేటగిరీలోనూ ఉద్యోగుల సంఖ్య అరకొరగానే ఉంది. ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా.. ఉన్నవారితో సర్దుబాటు చేసుకోవాలని సూచించింది. ఇది ఉద్యోగులపై పనిభారాన్ని మోపుతోంది. ఈ ప్రభావం ప్రభుత్వం నిర్దేశించే పనుల మీద కనిపిస్తోంది. నగరీకరణ నేపథ్యంలో జిల్లాలో భూముల విలువలు ఆకాశన్నంటుతుండడంతో భూ వివాదాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దీంతో కోర్టు కేసులు, లోకాయుక్తలో పిటిషన్లు నమోదు కావడం.. వీటికి కౌంటర్లు దాఖలు చేయడంతో పుణ్యకాలం పూర్తవుతోంది. సుప్రీంకోర్టు, హైకోర్టు మొదలు దిగువశ్రేణి న్యాయస్థానాల వరకు సుమారు వేయి కేసులు పెండి ంగ్లో ఉన్నాయి. వీటిని కొలిక్కి తెచ్చేందుకు రెవెన్యూ యంత్రాంగం తలమునకలవుతున్నా.. కిందిస్థాయిలో జరుగుతున్న పొరపాట్లతో కోర్టు ధిక్కారం, జైలు శిక్షలు తప్పడంలేదు. ఇక సాధారణ అర్జీల సంగతి సరేసరి. సమ్మెట పోటు! ప్రతి మండలంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు ఆర్ఐలు, సర్వేయరు, స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులుండాలి. అయితే, వీటిలో తహసీల్దార్, డీటీ పోస్టులు మినహా మిగతా వాటిలో చాలావరకు ఖాళీగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 43 మంది సర్వేయర్లు ఉండాల్సివుండగా.. కేవలం 20 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ (జీఓ 58,59), ఔషధనగరి, భూదాన్, మెట్రో, ఎంఎంటీఎస్ రైల్వే లైన్ల సర్వే, ఆక్రమణకు గురయ్యే భూములకు హద్దులను నిర్దేశించే ఈ విభాగాన్ని ఉద్యోగుల కొరత పట్టిపీడిస్తోంది. మరోవైపు 22ఏ భూముల పరిశీలన కూడా భారంగా మారింది. గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డులకు కీలకంగా వ్యవహరించే వీఆర్ఓల సంఖ్య కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 557 పోస్టులు ఉండగా.. దీంట్లో 428 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మండలానికి ఇద్దరు ఆర్ఐలను నిర్దేశించినా.. కేవలం పట్టణ మండలాల్లోనే ఇది అమలవుతోంది. దీంతో వెబ్ల్యాండ్ అప్డేషన్ నత్తనడకన సాగుతోంది. ఇక సీనియర్ అసిస్టెంట్లను నియమించక పోవడం కూడా మండల కార్యాలయాల్లో పనులకు తీవ్ర విఘాతం కలుగుతోంది. 144 పోస్టులు మంజూరు కాగా.. దీంట్లో సగం కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి. ఇక జూనియర్ అసిస్టెంట్ల పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని భావించవచ్చు. బ్యాక్లాగ్, పదోన్నతులతో ఈ పోస్టులను నింపుతుండడంతో కేవలం ఆరు మాత్రమే ఖాళీగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. నిరంతరం ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా కొనసాగుతుండడంతో రెవెన్యూ పనులపై ప్రభావం చూపుతోంది. ఓటర్ల నమోదు వ్యవహారంలో రాజకీయ పక్షాలు కోర్టుకెక్కిన నేపథ్యంలో.. పని ఒత్తిడితో ఈ విధులు ఎక్కడ తమ మెడకు పడతాయోననే బెంగ ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రెవెన్యూ శాఖలో ఖాళీలను భర్తీ చేయకుండా.. కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే ఉద్యోగుల నడ్డివిరగడం ఖాయంగా కనిపిస్తోంది. నిర్దేశించిన పోస్టుల్లో ఉద్యోగులను నియమించిన తర్వాతే.. నయా జిల్లాల గురించి ఆలోచించాలని ఉద్యోగసంఘాలు సూచిస్తున్నాయి. అప్పుడే ఏయే జిల్లాకు ఎంత మంది అవసరమవుతారో తేలుతుందని అంటున్నాయి. -
ఆడిట్ అభ్యంతరాలను పరిష్కరించాలి
పీఏసీ సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న ఆడిట్ అభ్యంతరాలన్నింటినీ ఈ ఏడాది డిసెంబరు ఆఖరు నాటికి పరిష్కరించాలని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సమావేశం నిర్ణయించింది. పీఏసీ చైర్మన్ గీతారెడ్డి అధ్యక్షతన సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో ఈ సమావేశం జరి గింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో పాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు హాజరైన సమావేశం వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ఆడిట్ అభ్యంతరాలన్నింటినీ పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు కమిటీకి సమాచారం అందివ్వాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు ప్రతి నెలా కనీసం రెండుసార్లు సమావేశాలు జరిపాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఆడిట్నూ పీఏసీ పరిధిలోకి తేవాలని ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకు వెళ్లాలని కూడా నిర్ణయించారు. ఈ నెల 20వ తేదీన మరోమారు సమావేశం కావాలని పీఏసీ నిర్ణయించింది. రెవెన్యూ శాఖలోనూ ఎక్కువగా ఆడిట్ అభ్యంతరాలు పెండింగులో ఉన్నట్లు గుర్తించి వాటిపైనా చర్చించారు. వచ్చే సమావేశంలో పర్యాటకం, యువజన సంఘాల విభాగాలతోపాటు మున్సిపల్ శాఖలపై చర్చించనున్నారు. కమిటీ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, గువ్వల బాలరాజు, మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఫారుఖ్ హుస్సేన్, పాటూరి సుధాకర్రెడ్డి, భానుప్రసాద్, రాములు నాయక్, శాసన సభా కార్యద ర్శి రాజసదారాం, జాయింట్ సెక్రటరీ నర్సింహా చారి తదితరులు పీఏసీ సమావేశంలో పాల్గొన్నారు. -
భూ క్రమబద్ధీకరణలో ఆన్లైన్కు మంగళం!
♦ మాన్యువల్గానే కన్వేయన్స్ డీడ్ల జారీ ♦ జాప్యాన్ని నివారించేందుకు రెవెన్యూ శాఖ నిర్ణయం ♦ సాఫ్ట్వేర్ కోసం ఖర్చు చేసిన కోటి వృథా సాక్షి, హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియలో నెలకొన్న గందరగోళానికి తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెల్లింపు కేటగిరీలో జీవో 59 కింద కన్వేయన్స్ డీడ్ల జారీని ఆన్లైన్లో కాకుండా మాన్యువల్గానే చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ భూము ల్లో నివాసమేర్పరచుకున్న వారికి ఆయా స్థలాలను నిర్దేశిత ధర చెల్లిస్తే క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం 2014 డిసెంబర్లో జీవో 59ని జారీ చేసిన సంగతి తెలిసిందే. ఉత్తర్వులు జారీ అయిన మూడు నెలల్లో ఈ ప్రక్రియను ముగించాల్సి ఉండగా, ఏడాదిన్నర అవుతున్నా ఇంతవరకు ఒక్క దరఖాస్తును కూడా అధికారులు క్లియర్ చేయలేదు. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన సొమ్మును ఒకేసారి చెల్లించిన దరఖాస్తుదారులు లబోదిబోమంటున్నారు. చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియలో ఎడతెగని జాప్యం నెలకొనడాన్ని సర్కారు సీరియస్గా తీసుకుంది. సాక్షాత్తూ సీఎం కేసీఆర్ కలుగజేసుకుని తక్షణం ఆన్లైన్ ప్రక్రియను నిలిపివేసి మాన్యువల్గా కన్వీయన్స్ డీడ్లు జారీ చేసే అధికారాన్ని తహసీల్దార్లకు అప్పగించాలని ఆదేశించినట్లు సమాచారం. సీఎం ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ అధికారులు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారని తెలుస్తోంది. ఆన్లైన్తో అవస్థలెన్నో.. క్రమబద్ధీకరణ ప్రక్రియలో అవకతవకలను నియంత్రిం చేందుకని భూపరిపాలన విభాగం ఆన్లైన్ ప్రక్రియను చేపట్టింది. దీనికోసం రూ.కోటి వ్యయం చేసి సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసింది. క్షేత్రస్థాయిలో సిబ్బందికి కంప్యూటర్ పరిజ్ఞానం లేక చేసిన తప్పులను ఎడిట్ చేసేందుకు ఆప్షన్ ఇవ్వాలని తహసీల్దార్లు పలుమార్లు కోరినా సీసీఎల్ఏ కార్యాలయ అధికారులు ససేమిరా అనడం, దరఖాస్తులో పేర్కొన్న విస్తీర్ణానికి, పరిశీలనలో తేలిన వివరాలకు వ్యత్యాసం ఉండటం, దరఖాస్తుదారులు రెండు మూడు దఫాలుగా సొమ్ము చెల్లించిన నేపథ్యంలో కొంత మొత్తం ఎక్కువగా ఉన్నా సాఫ్ట్వేర్ అనుమతించకపోవడం, ఆపై ఎడిట్ ఆప్షన్ను ఉన్నతాధికారులు ఇవ్వకపోవడం.. తదితర అంశాలతో క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు ఇబ్బం దులు పడాల్సి వచ్చింది. తీరా రెండ్రోజుల క్రితం ఎడిట్ ఆప్షన్ ఇచ్చాక కూడా అనుమతి కోసం తహసీల్దారు పంపిన వివరాలు ఆన్లైన్లో ఆర్డీవోకు చేరకపోవడం, కమర్షియల్ స్థలాలకు సాఫ్ట్వేర్ ద్వారా డిమాండ్ నోటీసులు జారీ చేయకపోవడం.. తదితర సమస్యలు ఉత్పన్నమయ్యాయి. వాస్తవానికి నివాస స్థలాలకు పరిశీలన ప్రక్రియ మొత్తం గత డిసెంబర్లోనే పూర్తయినా కేవలం ఎడిట్ ఆప్షన్ కోసం 4 నెలలు ఆగాల్సి వచ్చిందని తహసీల్దార్లు వాపోతున్నారు. రూ. కోటి వృథా: భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ కోసం సుమారు రూ.కోటి వ్యయం చేసి తీసుకున్న సాఫ్ట్వేర్, తాజా నిర్ణయంతో వృథా అయిపోయింది. ఆన్లైన్ ప్రక్రియలో ఇబ్బందులున్నాయని, గతంలోనే తహసీల్దార్లు, ఆర్డీవోలు చెప్పినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. సీఎం కలుగజేసుకుంటే తప్ప, క్రమబద్ధీకరణ ప్రక్రియ కొలి క్కి రాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మేల్కొన్నందుకు సంతోషంగా ఉందని పలువురు తహసీల్దార్లు, ఆర్డీవోలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
అవినీతి రెవెన్యూ
► రికార్డుల తారుమారులో నంబర్ 1 ► ప్రభుత్వ, పట్టా భూములు మాయం ► అధికారపార్టీ నేతల ఒత్తిళ్లు.. ధనదాహం ► ఇప్పటికి ముగ్గురు తహసీల్దార్ల సస్పెన్షన్ ► ఆర్ఐలు, వీఆర్వోలు కూడా.. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రెవెన్యూ శాఖకు రోజుకొక అవినీతి మరక అంటుకుంటోంది. మొన్న సూళ్లూరుపేట తహసీల్దార్ మునిలక్ష్మి, నిన్న కలిగిరి తహసీల్దార్ లావణ్య.. నేడు నెల్లూరు రూరల్ తహసీల్దార్గా పనిచేసిన జనార్దన్. మరికొందరు ఆర్ఐలు, వీఆర్వోలు. వీరంతా అవినీతికి పాల్పడ్డారనే కారణాలతో కలెక్టర్ సస్పెండ్ చేశారు. అదేవిధంగా దుత్తలూరు, సంగం, దగదర్తి తహసీల్దార్లు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములకు సంబంధించి పాసుపుస్తకాలు తారుమారు చేయటం, మరికొందరు పాసుపుస్తకాలు ఇచ్చే విషయంలో మామూళ్లు పుచ్చుకోవటం షరామామూలైపోయింది. జిల్లాలో 46 మండలాలు ఉన్నాయి. వేలాది ఎకరాల ప్రభుత్వ, డాటెడ్, ప్రైవేటు భూములు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో భూములు, స్థలాలకు మంచి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ను కొందరు తహసీల్దార్లు, ఆర్ఐ, వీఆర్వోలు సద్వినియోగం చేసుకుంటున్నారు. మూడో కంటికి తెలియకుండా ఒకరి పేరుతో ఉన్న భూములను వేరొకరికి మార్చి సొమ్ముచేసుకుంటున్నారు. పేద, మధ్యతరగతి కుటుం బాల రైతులు భూ సమస్యలపై కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోరు. అదే అధికారపార్టీ నాయకులు, లంచం ఇచ్చేవారికే ఎదురెళ్లి స్వాగతం పలికి మరి పనులు చేసిపెడుతున్నారు. కంచే చేను మేస్తోంది పల్లెలు, పట్టణాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, ప్రజలకు ఎదురయ్యే సమస్యలను రెవెన్యూ అధికారులు పరిష్కరించాలి. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదే. అయితే ప్రస్తుతం రెవెన్యూశాఖ అందుకు విరుద్ధంగా తయారైంది. కొందరు అధికారులు ప్రభుత్వ, ప్రైవేటు భూములను వేరొకరికి కట్టబెట్టి సొమ్ము చేసుకోవటం ఆనవాయితీగా మార్చేసుకున్నారు. గతంలో సూళ్లూరుపేట తహసీల్దార్గా పనిచేసిన మునిలక్ష్మి వాకాటి రామనాథమ్మ కు చెందిన భూములను వాకాటి రమేష్రెడ్డివిగా రికార్డులు తారుమారు చేశారు. అధికారపార్టీకి చెందిన మాజీ సర్పంచ్ ఒత్తిడి, డబ్బులపై ఆశతో ఆమెచేత ఈ పనిచేయించింది. దీంతో మునిలక్ష్మి, ఆర్ఐ కిరణ్ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. అదేవిధంగా కలిగిరి తహసీల్దార్గా పనిచేసిన లావణ్య కొండాపురం మండలం గానుగపెంట, పొట్టిపల్లిలోని 120 ఎకరాల అటవీ, మంత్రి ఘంటా శ్రీనివాసరావు భూములకు నకిలీ పాసుపుస్తకాలు సృష్టించారనే ఆరోపణలతో ఆమెను విధుల నుంచి తొలగించారు. తాజాగా నెల్లూరు రూర ల్ మండల తహసీల్దార్గా పనిచేసిన జనార్దన్ శ్రీవేదగిరి నరసింహస్వామి ఆలయ భూముల్లోని టేకుచెట్ల నరికివేతకు సహకరించారు. నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి రూ.కోట్లు విలువచేసే టేకుచెట్ల కొట్టివేతకు కారణమయ్యారు. దీంతో జనార్దన్పై వేటు వేయటంతోపాటు క్రిమినల్ కేసు నమోదు చేయనున్నట్లు కలెక్టర్ జానకి ప్రకటించారు. అదేవిధంగా దుత్తలూరు, సంగం, దగదర్తి తహసీల్దార్లు పాసుపుస్తకాల కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డా రు. భూ సమస్యలను పరిష్కరించాల్సిన రెవెన్యూ అధికారులే భక్షకులుగా అవతారం ఎత్తుతుంటే ప్రజల సమస్యలను పరిష్కరించే వారు ఎవరనే ప్రశ్న సామాన్యుల్లో తలెత్తుతోంది. భూసమస్యల పరిష్కారం కో సం తహసీల్దార్ కార్యాలయం తొక్కాలంటే ప్రజలు వణికిపోతున్నారు. రికార్డులను తారుమారు చేసి వేరొకరికి కట్టబెడుతారేమోనని భయపడుతున్నారు. ఇకనైనా అధికారులు ప్రజాసమస్యల పట్ల స్పందించి పరి ష్కరించే దిశగా కృషిచేయాలని కోరుకుంటున్నారు. -
రెవెన్యూ పనులకూ కాలపరిమితి!
♦ 12 అంశాలతో రెవెన్యూ పాలసీకి కసరత్తు ♦ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వెల్లడి సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక విధానం, ఐటీ విధానం మాదిరిగానే రెవెన్యూశాఖకు సంబంధించి కూడా కొత్త విధానాన్ని (పాలసీ) తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) మహమూద్ అలీ తెలిపారు. మొత్తం 12 అంశాలతో పాలసీకి త్వరలో రూపకల్పన చేయనున్నట్లు చెప్పారు. పారిశ్రామిక, ఐటీశాఖల తరహాలోనే రెవెన్యూశాఖలోనూ ప్రతి పనికీ నిర్దేశిత కాలపరిమితిని విధించాలని యోచిస్తున్నామని...గడువులోగా పనులు చేయకుంటే బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకునే అంశాన్ని ఇందులో పొందుపరచాలనుకుంటున్నామన్నారు. రెవెన్యూ పాలసీ రూపకల్పన, విధానాల అమలుపై చర్చించేందుకు నెలాఖరులోగా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశ మవుతున్నట్లు మహమూద్ అలీ వివరించారు. నూతన పాలసీ ద్వారా రెవెన్యూ వ్యవస్థలో తీసుకురానున్న సంస్కరణల గురించి ఆదివారం ఆయన విలేకరులకు వివరించారు. ఇతర ప్రభుత్వ విభాగాలతో పోల్చితే రెవెన్యూ వ్యవస్థ పనితీరు మెరుగ్గానే ఉందన్నారు. ముఖ్యంగా సమగ్ర కుటుంబ సర్వే, ఆసరా పెన్షన్లు, భూముల క్రమబద్ధీకరణ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్.. తదితర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో రెవెన్యూ సిబ్బంది కీలకపాత్ర పోషించారని కితాబిచ్చారు. గత రెండేళ్లుగా తమ ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా ఈ శాఖలో ఉన్నత(అధికారుల) స్థాయిలో అవినీతిని పూర్తిగా అరికట్టగలిగామని...కానీ క్షేత్రస్థాయిలో అవినీతి పెరిగిందని ఫిర్యాదులు వస్తున్నాయని మహమూద్ అలీ పేర్కొన్నారు. కొత్త రాష్ట్రంలో ఉద్యోగులు పనితీరును మార్చుకునేందుకు కొంత గడువు ఇచ్చామని, ఇకపై ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. కాగా, భూ వివాదాలు, కుటుంబాల్లో ఆస్తుల విభజన సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి జిల్లాకు ఒక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని మహమూద్ అలీ చెప్పారు. అలాగే తహ సీల్దార్లు, రెవెన్యూ డివిజన్ అధికారులకు సొంత వాహనాలు సమకూర్చే అంశం పరిశీలనలో ఉందని... వీఆర్ఏలకు కనీస వేతనం, ఇతర సదుపాయాలు కల్పించాలనుకుంటున్నామన్నారు. -
బుక్ చేసి బుక్కయ్యారు
రెవెన్యూ పెత్తనంపై హోటళ్ల హాహాకారాలు తాజాగా 18 నుంచి 20 వరకు రిజర్వ్ చేయాలని ఆదేశం సర్క్యులర్ జారీ చేసిన సబ్ కలెక్టర్ 19న జాతీయ పంచాయతీ దినోత్సవం దేశ వ్యాప్తంగా 1200 మంది వీవీఐపీల రాక 49 హోటళ్లలో 795 గదులు మూడు రోజుల పాటు బ్లాక్ పాత బకాయిలపై స్పందించని అధికారులు విజయవాడ : నగరంలోని హోటళ్లపై రెవెన్యూ శాఖ కర్రపెత్తనం పెరిగింది. విజయవాడ రాజధాని నగరం అయినప్పటి నుంచి స్టార్ హోటళ్లు మొదలుకొని సాధారణ హోటళ్ల వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నెలలో వివిధ రకాల సదస్సులు, సెమినార్ల పేరుతో వీవీఐపీలు వస్తున్నారని హోటళ్ల గదులన్నీ రిజర్వు చేసి వినియోగించుకోవటం, చివర్లో డబ్బు చెల్లించకుండా బకాయిలు పడటం నగరంలో షరామాములుగా మారింది. తాజాగా ఈ నెల 19న జాతీయ పంచాయతీ దినోత్సవాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగరంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడి హోటళ్లలో 80 శాతం గదులను రెవెన్యూ అధికారులు బ్లాక్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల కోసం వీటిని వినియోగిస్తున్నా నిధులు మాత్రం సక్రమంగా కేటాయించకపోవటంతో అటు అధికారులు ఇబ్బంది పడుతుండగా, ఇటు వ్యాపారులు నష్టపోతున్నారు. బుక్ చేస్తారు.. డబ్బు చెల్లించరు... విజయవాడ నగరంలో స్టార్ హోటళ్లతో కలుపుకొని 49 ప్రధాన హోటళ్లు ఉన్నాయి. వాటిలో మొత్తం 900 గదులు ఉన్నాయి. అందులో 795 గదులను ప్రభుత్వం రిజర్వు చేసింది. అసలే పెళ్లిళ్ల సీజన్ కావటం, ఆన్లైన్లో ఎక్కువ బుకింగ్లు జరగటంతో హోటళ్ల నిర్వాహకులు సతమతమవుతున్నారు. పోనీ వినియోగించుకున్న గదులకు భారీ డిస్కౌంట్తో అయినా డబ్బు చెల్లిస్తారా అంటే అదీ లేదు. సీఎం ప్రమాణ స్వీకారం మొదలుకొని ఇప్పటివరకు జరిగిన అనేక కార్యక్రమాలకు గాను హోటళ్లకు ప్రభుత్వం లక్షల్లో బకాయి పడింది. సర్పంచ్ల సదస్సుకు 1200 మంది... ఈ నెల 19న జాతీయ పంచాయతీ దినోత్సవాన్ని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా విజయవాడలో నిర్వహించనున్నాయి. దీనిని పురస్కరించుకొని జాతీయ స్థాయిలో గిరిజన మహిళా సర్పంచ్ల సదస్సును నిర్వహిస్తున్నారు. సదస్సుకు 1200 మంది వీవీఐపీలు హాజరవుతున్నారు. 10 రాష్ట్రాల నుంచి 1050 మంది గిరిజన మహిళా సర్పంచ్లు, 100 మంది అధికారులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి వివిధ క్యాడర్ల అధికారులతో కలిపి 1200 మంది వీవీఐపీలు, వీఐపీలు హాజరుకానున్నారు. ఈ క్రమంలో వచ్చిన వారందరికీ వసతి సౌకర్యాలు చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జిల్లా కలెక్టర్కు ఆదేశాలు అందాయి. దీంతో కలెక్టర్ బాబు.ఏ ఈ బాధ్యతను సబ్ కలెక్టర్ సుజనకు అప్పగించారు. ఈ క్రమంలో ఆమె హోటళ్ల నిర్వాహకులతో సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి హోటళ్లలో ఉన్న 80 శాతం గదులు రిజర్వు చేయాలని ఆదేశించారు. ఈ నెల 18 నుంచి 20 వరకు 49 హోటళ్లలో ఉన్న 900 గదుల్లో 795 గదులు బ్లాక్ చేయాలని, ఎవరికీ కేటాయించకుండా అన్ని చర్యలు చేపట్టాలని చెప్పారు. రిజర్వ్ చేసిన గదుల్లో వినియోగించిన గదులకు మాత్రమే నామమాత్రపు అద్దె చెల్లిస్తామని, మిగిలినవాటికి చెల్లించబోమని స్పష్టం చేశారు. వాస్తవానికి ప్రభుత్వ కార్యక్రమాలకు జీఏడీ విభాగం బిల్లు చెల్లిస్తుంది. లేదంటే జిల్లా స్థాయి కార్యక్రమం అయితే కలెక్టర్ నిధులు సమకూరుస్తారు. కానీ జాతీయ స్థాయి కార్యక్రమం అయినప్పటికీ నిధులు లేకపోవటం సమస్యగా మారింది. పాత బకాయిలు ఇవ్వండి సబ్ కలెక్టర్ సుజన నిర్వహించిన సమావేశానికి నగరంలో 20 మంది వరకు హోటళ్ల ప్రతినిధులు హాజరయ్యారు. ఇప్పటికే రూ.30 లక్షల వరకు ఉన్నాయని, వాటిని చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సబ్కలెక్టర్ను కోరారు. పెళ్లిళ్ల సీజన్ కావటంతో 50 శాతానికి పైగా గదులు ఆన్లైన్లో బుక్కయ్యాయని, కొన్ని హోటళ్లలో ఫంక్షన్ హాళ్లు కూడా పెళ్లిళ్లకు ఇచ్చామని చెప్పారు. అయినా వాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని ప్రభుత్వానికి గదులు కేటాయించాలని అధికారులు ఆదేశించినట్లు సమాచారం. ఈ క్రమంలో కేటాయించిన డబ్బు చెల్లించేలా చూడాలని కోరగా, సబ్కలెక్టర్ సానుకూలంగా స్పందించి అద్దె చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో హోటళ్ల వారీగా రెవెన్యూ అధికారులే గదులు నిర్ణయించారు. గేట్వేలో 98 రూమ్లు ఉంటే 49, మురళీ ఫార్చ్యూన్లో 84 గదులకు గాను 36, డీవీ మానర్లో 109కి గాను 50, మార్గ్ కృష్ణాయలో 49కి గాను 30, ఐలాపురంలో 65కు గాను 40 గదులు రిజర్వ్ చేశారు. -
అవినీతికి అంతేది..?
► రెవెన్యూ శాఖలో కనిపించని ప్రక్షాళన ► అధికంగా మహిళా తహసీల్దార్లే ► ఏసీబీకి చిక్కుతున్న వైనం ► ముడుపులు ఇవ్వందే కదలని ఫైళ్లు ► బాధ్యతలు స్వీకరించని తహసీల్దార్లపై చర్యలు నెల్లూరు(పొగతోట): రెవెన్యూ శాఖలో అవినీతికి అంతులేకుండాపోతోంది. ముడుపులు ఇవ్వందే ఫైళ్లు కదిలే పరిస్థితి లేదు. కలెక్టర్ ఫోన్ చేసి ఆదేశించినా రెవెన్యూలో లంచాలివ్వందే పనులు జరగడం లేదు. జిల్లాలో మహిళా తహసీల్దార్లు అధికంగా ఏసీబీ వలలో చిక్కుకుంటున్నారు. జిల్లాలో ఏడాదిన్నర కాలంలో ముగ్గురు మహిళా తహసీల్దార్లు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కగా, మరో ఇద్దరు సస్పెండయ్యారు. పరిపాటిగా మారుతున్న లంచాల డిమాండ్ అడంగళ్, 1బీ, పాస్పుస్తకాలు, భూ సర్వే.. ఇలా ప్రతి దానికీ లంచాలను డిమాండ్ చేయడం రెవెన్యూలో అలవాటుగా మారిపోయింది. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు మామూళ్లకు అలవాటుపడటంతో రెవెన్యూ శాఖలో ముడుపులు ఇవ్వందే చిన్న పని కుడా జరగడంలేదు. వందలెకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నా, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదు. పైస్థాయి అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుంటే తామేమి తక్కువ తిన్నలేదన్నట్లు కింది స్థాయి ఉద్యోగులూ అదేబాటలో పయనిస్తున్నారు. అధికార పార్టీ నేతలూ భాగస్వాములే.. తహసీల్దార్ల బదిలీలు అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లో జరుగుతుండటంతో అవినీతి, అక్రమాలు అధికంగా జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. భూముల విలువలు అధికంగా పెరిగిపోవడంతో అక్రమాలు అధికమయ్యాయి. పాస్పుస్తకాలు, అడంగళ్, 1బీ, పేర్ల మార్పు, భూముల వివరాలు, తదితర పనులకు ధరలు నిర్ణయించి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూమి సరిహద్దులు.. డివిజన్ చేసేందుకు.. భూసర్వే.. ఇలా ప్రతి అంశానికీ లంచం డిమాండ్ చేస్తున్నారు. మండల స్థాయిలో లంచాలను అధికంగా డిమాండ్ చేయడంతో ప్రజలు కలెక్టర్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ప్రజల వినతులను స్వీకరించి వెంటనే పరిష్కరించాల్సిందిగా కలెక్టర్ ఆదేశిస్తున్నా, న్యాయం జరగడంలేదు. లంచాలు ఇచ్చిన వారికి మాత్రం సకాలంలో పనులు పూర్తవుతున్నాయి. మరోవైపు రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీతిపై ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టనుంది. బదిలీ చేసినా బాధ్యతలు స్వీకరించకుండా సెలవుపై వెళ్లిన తహశీల్దార్లు వెంటనే బాధ్యతలు స్వీకరించేలా చర్యలు చేపట్టింది. చెప్పినా ఇంకా బాధ్యతలను స్వీకరించకపోతే చర్యలు తీసుకోనుంది. అధికార పార్టీ నాయకుల ప్రమేయం లేకుండా బదిలీలు చేసేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా మూడేళ్లు పూర్తయిన ఆర్ఐలను బదిలీ చేయనున్నారు. ఒకరిద్దరి వల్లే శాఖకు చెడ్డపేరు: రెవెన్యూలో ఒకరిద్దరు అక్రమాలకు పాల్పడటం వల్ల శాఖకు చెడ్డపేరొస్తోంది. 90 శాతం మంది నిజాయతీగా పని చేస్తున్నారు. సిబ్బంది కొరత ఉన్నా సకాలంలో జిల్లా అధికారులు చెప్పిన పనులను పూర్తి చేస్తున్నాం. సిబ్బంది కొరత ఉన్నా భూ రికార్డుల కంప్యూటరీకరణ, తదితర పనులను వంద శాతం పూర్తి చేస్తున్నాం. - షఫీమాలిక్, ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు -
ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం
► రెండెకరాలు సాగు చేస్తున్నట్టు రికార్డుల్లో నమోదు ► తాడోపేడో తేల్చుకునేందుకు ► రాజుపేట గ్రామస్తుల నిర్ణయం వడ్డించేవాడు మనోడైతో బంతిలో అఖరిన కూర్చొన్న అన్నీ అందుతాయన్న సామెత అక్షరాల నిజం అనిపిస్తుంది. అధికారం ఉంది కదా అని అధికారులను ప్రసన్నం చేసుకొని ఏకంగా విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాజేస్తున్న సంఘటన మండలంలోని రాజుపేటలో చోటు చేసుకుంది. గ్రామంతో సంబంధం లేని వ్యక్తి పేరిట రెండెకరాల స్థలం ఉండటం మరింత బలం చేకూర్చుతోంది. మునగపాక: మండలంలోని రాజుపేట గ్రామంలో సర్వే నంబరు 310లో 5.16 ఎకరాల మేర ప్రభుత్వ స్థలాన్ని గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్పోర్స్ట్ కాంప్లెక్స్కు కేటాయించారు. అయితే మండల కేంద్రానికి దూరంగా ఉన్నందున ఖాళీగా ఉండిపోయింది. అయితే ఈస్థలాన్ని కాజేసేందుకు అధికార పార్టీ నేతలు తమదైన శైలిలో ప్రయత్నాలు చేశారు. ఇదే అదనుగా భావించిన తిమ్మరాజుపేట గ్రామానికి చెందిన భీమిశెట్టి వెంకటరమణ తాను గత కొంతకాలంగా సర్వేనంబర్ 310 -1లో 2 ఎకరాల స్థలాన్ని సాగు చేస్తున్నట్లు రికార్డులు సృష్టించి పట్టాదారు పాసు పుస్తకం పొందినట్టు సమాచారం. రెవెన్యూశాఖ, భూమి రికార్డుల కంప్యూటరీకరణలో పట్టాదారుని అడంగల్, సహానీ కాఫీలో రైతు పేరు భీమిశెట్టి వెంకటరమణ , సన్ఆఫ్ లేటు జగ్గారావు, ఖాతా నంబర్ 283, సర్వేనెంబర్ 310-1లో 2 ఎకరాల సాగు చేస్తున్నట్లు ఉండటంతో గ్రామస్తులు కంగుతిన్నారు. ప్రభుత్వ భూమిని తాము సాగులో ఉన్నామంటూ పొందుపరచడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా చోటుచేసుకుందని వారు ధ్వజమెత్తుతున్నారు. దీనిపై తాడోపేడో తేల్చుకునేందుకు రాజుపేట గ్రామస్తులు సిద్ధపడుతున్నారు. రాజుపేట పంచాయతీలో ప్రభుత్వ భూమికి సంబంధించి తిమ్మరాజుపేట గ్రామస్తుల పేరిట రికార్డులో నమోదు కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధి అండదండలతోనే ఇదంతా జరిగిందని ప్రచారం జరుగుతోంది. దీనిపై తహశీల్దార్ రాంబాబును వివరణ కోరగా ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అడంగల్లో తిమ్మరాజుపేట వాసిపేరిట ఎలా నమోదైందన్న దానిపై విచారణ చేస్తామని చెప్పారు. -
నిషేధిత భూముల్లో రిజిస్ట్రేషన్ కుదరదిక!
సెక్షన్ 22‘ఎ’ లోకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భూములు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల మధ్య కుదిరిన అవగాహన హైదరాబాద్: ప్రభుత్వ భూముల పరిరక్షణపై రెవెన్యూ శాఖ దృష్టి సారించింది. ఇతరుల పేరుమీద రిజిస్ట్రేషన్ కాకుండా నిషేధం విధించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రకాల సర్కారీ భూములు అన్యాక్రాంతమవుతుండడం, వాటిని రిజిస్ట్రేషన్ల శాఖ యథేచ్ఛగా రిజిస్టర్ చేస్తుండడంపై ఇటీవల హైకోర్టు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ నిబంధనల్లోని సెక్షన్ 22ఎ ను తప్పనిసరిగా అమలు చేయాలని రెవెన్యూశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలు తాజాగా ఒక అవగాహనకు వచ్చాయి. తాజాగా భూపరిపాలన కార్యాలయంలో జరిగిన సమావేశంలో హైకోర్టు సూచించిన విధంగా సెక్షన్ 22ఎను ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించాయి. సెక్షన్ 22ఎ/1లో ఎ నుంచి ఇ కేటగిరీ వరకు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన భూముల వివరాలను పొందుపరిచేందుకు రెవెన్యూ శాఖ అంగీకరించింది. ఆయా కేటగిరీల్లోని భూములకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఏ సబ్ రిజి స్ట్రార్ కార్యాలయంలోనూ రిజిస్ట్రేషన్ కాకుండా నియంత్రించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. నిషేధిత భూముల వివరాలు ఇవీ... సీసీఎల్ఏ ఏర్పాటు చేసిన ఆన్లైన్ వ్యవస్థ ద్వారా నిషేధిత భూముల గురించి ఎప్పటికప్పుడు తాజాపర్చిన వివరాలను రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు కంప్యూటర్లో వీక్షించేందుకు అవకాశం కల్పించారు. విక్రయించేందుకుగానీ, రిజిస్ట్రేషన్ చేసేందుకుకానీ వీల్లేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భూములు, అసైన్డ్, పోరంబోకు, రిజిస్టర్ అయిన దేవాదాయశాఖ, వక్ఫ్ భూములు, పట్టణ భూగరిష్ట పరిమితి(యూఎల్సీ) చట్టం ప్రకారం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం స్వాధీనం చేసుకున్న భూములు, అవినీతి నిరోధక శాఖ అటాచ్ చేసిన భూములు, పన్నులు చెల్లించని ఆస్తుల వివరాలు, గ్రీన్పార్కుల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇచ్చిన ఖాళీస్థలాలు నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయి. రిజిస్ట్రేషన్ల శాఖ సెక్షన్ 22ఎలో రెవెన్యూ శాఖ పొందుపరిచిన నిషేధిత భూముల్లో కొన్నింటిని తొలగించాల్సి వస్తే, వాటిని పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసింది. టిస్లిమ్గా వెబ్ల్యాండ్: రాష్ట్రంలో భూములకు సంబంధించి రెవెన్యూ శాఖ నిర్వహిస్తున్న వెబ్ల్యాండ్(వెబ్సైట్) పేరు మార్చాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ నిర్ణయించారు. తొలుత తెలంగాణ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్(టీఎల్ఆర్ఎంఎస్) పేరును ప్రతిపాదించారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి అనుగుణంగా ఉండేలా తెలంగాణ స్టేట్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్(టిస్లిమ్) సిస్టమ్గా మార్పు చేయాలని నిర్ణయించారు. -
‘రెవెన్యూ’కు నిరాశ
బడ్జెట్ కేటాయింపుల్లో గతేడాది కన్నా రూ.300 కోట్ల గండి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కీలకమైన రెవెన్యూ శాఖకు తాజా బడ్జెట్లో నిరాశే మిగిలింది. పైగా గత సంవత్సరం కంటే తక్కువ నిధులను ప్రభుత్వం కేటాయించింది. సిబ్బంది వేతనాలు, కార్యాలయాల ఖర్చులు, అద్దె వాహన చార్జీలకు మాత్రమే నిధులను కేటాయించింది. శాఖాపరంగా తీసుకురాదలిచిన సంస్కరణలకు ఊతమిచ్చే ప్రయత్నం చేయలేదు. గత ఏడాది బడ్జెట్లో రూ.1,687 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ ఏడాది కేటాయింపుల్లో రూ.300 కోట్లకుపైగా కోత పెట్టింది. ఈసారి 1,384.13 కోట్లను మాత్రమే కేటాయించింది. ఇందులో ప్రణాళికా వ్యయం కింద రూ.46.76 కోట్లు, ప్రణాళికేతర పద్దులో రూ.1337.37 కోట్లు ఉన్నాయి. అన్ని గ్రామాల్లోనూ వీఆర్వో కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్లలో ఆర్డీవో ఆఫీసులు, కలెక్టరేట్లకు కొత్త భవనాల నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. తాజా రెవెన్యూ చట్టాలపై సిబ్బందికి శిక్షణ, రెవెన్యూ వ్యవస్థ సంపూర్ణ కంప్యూటరీకరణకు కేవలం రూ.కోటితో సరిపెట్టింది. రెవెన్యూ శాఖకు సంబంధించి సచివాలయ విభాగానికి రూ.10.71 కోట్లు, జిల్లాల్లో భూపరిపాలన విభాగానికి రూ.859 కోట్లు కేటాయించింది. -
‘డబుల్’ ఎంపిక ట్రబుల్
► వివాదాస్పదమవుతున్న లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ ► కలెక్టర్కు నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఫిర్యాదు ► అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నుంచే విమర్శలు ► ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం తీరిదీ.. సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రభుత్వ ప్రతిష్టాత్మక డబుల్బెడ్రూం ఇళ్ల పథకం వివాదాస్పదమవుతోంది. ఈ గృహాల నిర్మాణానికి టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోగా, తాజాగా చేపట్టిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా విమర్శలకు దారితీస్తోంది. నిర్మల్లో గృహాలు మంజూరు చేయిస్తామని చెప్పి కొందరు దళారులు దరఖాస్తుదారుల నుంచి రూ.లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నారని ఏకంగా అధికార పార్టీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో కొత్త వివాదానికి తెరలేచింది. లబ్ధిదారుల ఎంపికను రహస్యంగా కాకుండా, పారదర్శకంగా నిర్వహించాలని చైర్మన్ కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గృహ నిర్మాణ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సొంత నియోజకవర్గంలోనే ఈ తీరు నెలకొనడం చర్చనీయాంశంగా మారింది. డబుల్బెడ్రూం ఇళ్ల కోసం నెల రోజుల క్రితం నిర్మల్లో దరఖాస్తులు తీసుకున్నారు. కొందరు నేరుగా మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా, కొన్ని వార్డుల్లో కౌన్సిలర్లే దరఖాస్తులు తీసుకుని మున్సిపల్ కార్యాలయంలో ఇచ్చారు. ఒక్క నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలోనే సుమారు రెండు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిని అధికారులు రెవెన్యూ శాఖకు పంపారు. తాజాగా ఈ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ చేపట్టారు. పట్టణంలో వార్డుల వారీగా ఈ పరిశీలన చేస్తున్నారు. ఈ తంతును అధికారులు మొక్కుబడిగా ముగుస్తుండడంతో పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లబ్ధిదారుల జాబితా ఎప్పుడో సిద్ధం చేశారనే ఆరోపణలు వస్తున్నారుు. ఈ నేపథ్యంలో చైర్మన్ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆదిలాబాద్లోనూ.. జిల్లా కేంద్రంలోనూ ఈ పథకం అమలు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులుండగా, టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల వార్డులనే ఈ పథకానికి ఎంపిక చేశారని ఇటీవల ఆమ్ఆద్మీ పార్టీ విమర్శించింది. ఈ పథకం కేటాయింపుల్లో అధికారులు మార్గదర్శకాలను పాటించడం లేదని, వికలాంగులు, వితంతువులకు ప్రాధాన్యత కల్పించాల్సి ఉండగా, అధికారులు ఇవేవీ పట్టించుకోవడం లేదన్నారు. గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక జరగాలి. కానీ అలాంటేవేవీ లేకుండానే ఇష్టానుసారంగా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 400 చొప్పున జిల్లాకు 4,000 గృహాలు మంజూరయ్యాయి. అదనంగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి 500, నిర్మల్ నియోజకవర్గానికి 250 ఇండ్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణ బాధ్యతలను పట్టణాల్లో ఆర్అండ్బీకి, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖకు అప్పగించారు. వీటి నిర్మాణానికి పంచాయతీరాజ్ అధికారులు ఇప్పటికే రెండు పర్యాయాలు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రతిష్టంబన నెలకొన్న విషయం విదితమే. తాజాగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా వివాదానికి దారితీస్తుండడం గమనార్హం. -
‘రెవెన్యూ’కు ట్యాబ్స్
♦ వీఆర్ఓల నుంచి తహసీల్దార్ల వరకు పంపిణీ ♦ సమాచారం పంపాలని సీసీఎల్ఏ ఉత్తర్వులు ♦ ‘వెబ్ల్యాండ్’ నిర్వహణ సులభతరం సాక్షి,రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రెవెన్యూ శాఖను సంస్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అవినీతి ఆరోపణలు మూటగట్టుకుంటున్న ఈ శాఖను సుపరిపాలన దిశగా నడిపించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. రెవెన్యూ రికార్డులను చిటికెలోనే తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి రెవెన్యూ ఉద్యోగులకు కూడా టాబ్లెట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి సర్వే నంబర్ పుట్టు పూర్వోత్తరాలు, క్షేత్రస్థాయిలో స్థితిగతులతో కూడిన సమగ్ర సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు ‘వెబ్ల్యాండ్’ పేర కొత్త సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసిన ప్రభుత్వం.. తాజాగా క్రోడీకరించిన ఈ సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకునేలా గ్రామ రెవెన్యూ అధికారి మొదలు మండల తహసీల్దార్ వరకు టాబ్లెట్లను అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, డిప్యూటీ తహసీల్దార్లు, తహసీల్దార్లకు సంబంధించిన సమాచారాన్ని తక్షణమే పంపాలని రాష్ట్ర భూపరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) రేమాండ్పీటర్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అధికారి, పోస్టింగ్, ఖాళీలను తెలిపేలా రూపొందించిన ఫార్మెట్కు అనుగుణంగా సమాచారాన్ని నివేదించమని సూచించారు. ఇదిలావుండగా, ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లాలో పనిచేస్తున్న 434 మంది వీఆర్ఓలు, 65 మంది ఆర్ఐలు, 59 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 37 మంది తహసీల్దార్లకు టాబ్లెట్లు రానున్నాయి. -
దూపకుంటకు ‘డబుల్’ హారం!
రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి రెవెన్యూ శాఖ కసరత్తు జీ ప్లస్ 4 పద్ధతిలో నిర్మాణం గతంలో పట్టాలు పొందినవారికి తొలి ప్రాధాన్యం హన్మకొండ : డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి నగర శివారులో ఉన్న దూపకుంట గ్రామం పరిధిలోని భూములను ఎం పిక చేసే దిశగా రెవెన్యూ శాఖ కసరత్తు చే స్తోంది. మురికివాడలు లేని నగరంగా వరంగల్ను తీర్చిదిద్దుతానంటూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీకి త్వరితగతిన ఆచరణాత్మక రూపు కల్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేశారు. వరంగల్ పరిధిలోని దాదాపు 30వేల కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం భారీగా స్థలం అవసరం ఉంది. నగర పరిధిలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను రెవెన్యూ శాఖ అధికారులు గుర్తిస్తున్నారు. రెవెన్యూ రికార్డులు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మాస్ట ర్ ప్లాన్, కాకతీయ అర్బ న్ డెవలప్మెంట్ లే ఔట్లను క్షుణ్ణంగా పరిశీలి స్తున్నారు. వేలాది ఇళ్లు నిర్మించాల్సి ఉన్నందు న ఎక్కువ విస్తీర్ణంలో ఒకేచోట ప్రభుత్వ స్థలం లభ్యత ఉన్న ప్రదేశాలపై అధికారులు దృష్టిసారించారు. గ్రేటర్లో ఇటీవల విలీనమైన గీసుకొండ మండలం దూపకుంట పరిధిలో ఒకేచోట 22 ఎకరాల స్థలం ఉన్నట్లుగా గుర్తించారు. గత ఏడాది 9 మురికివాడల్లో ఇళ్ల నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అయితే స్థలం అందించే విషయం లో స్థానికుల నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో అనేకచోట్ల అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈసారి అలా కాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అభ్యంతరాలు రాకుండా.. దూపకుంటలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని గతంలో పేదలకు 50 గజాల వంతున ప్రభుత్వం పంపిణీ చేసింది. విద్యుత్, రోడ్డు సౌకర్యం కల్పించారు. ఐదేళ్లు గడిచినా ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు జరుగలేదు. దీంతో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు ఈ స్థలం అనువైనదని అధికారులు భావిస్తున్నారు. గతంలో భూములు పొంది, ఇళ్లు కట్టుకోలేకపోయిన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయిం పులో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. తద్వారా ఇళ్ల నిర్మాణానికి, స్థల సేకరణకు పెద్దగా అభ్యంతరాలు రాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. లిఫ్టు వసతితో.. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం వరంగల్ నగరంలో 30వేల ఇళ్లను నిర్మించా ల్సి ఉంది. స్థల లభ్యత, సేకరణ ప్రక్రియ, స్థానికుల నుంచి మద్దతు విషయంలో అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్లు, వీధి దీపాలు, పార్కులు తది తర సౌకర్యాలు ఉండే లేఔట్తో స్థలమున్న చోటే పెద్దఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణరుుంచారు. దీంతో దూపకుంటలో నిర్మించనున్న డబుల్ బెడ్రూం అపార్ట్మెంట్లను కనీసం జీ ప్లస్ 4 పద్ధతిలో నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ విధానంలో నిర్మించే ఇళ్లకు వివిధ అంతస్తుల్లో ఉండే ప్రజలు రాకపోకలు సాగించేం దుకు లిఫ్ట్ వసతిని ఏర్పాటు చేయాల్సి ఉం టుంది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. -
అహం వీడి పనిచేస్తే అందరికీ మేలు
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్: అధికారులు అహం వీడి పనిచేస్తేనే అందరికీ మేలు జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్రజలకు సత్వర సేవలందించడం ద్వారా బంగారు తెలంగాణ నిర్మాణంలో రెవెన్యూ శాఖ కీలకం కావాలన్నారు. ఆదివారం తన నివాసంలో తెలంగాణ తహసీల్దార్ల సంఘం నూతన డైరీ-2016ని మహమూద్ అలీ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ... ‘గ్రామాల్లో చిన్నచిన్న సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదని జనం మా వద్దకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు అందుబాటులో ఉండకపోవడమే ఇందుకు కారణం. పోలీసు శాఖ మాదిరిగానే రెవెన్యూ శాఖలోనూ అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తున్నాం.. తెలంగాణ వ్యాప్తంగా భూముల రీసర్వే ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తాం. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచే వెబ్ల్యాండ్ ద్వారా క్రాప్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ అన్నారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వుడాకు భూ బాధ్యతలు!
అర్బన్ భూముల రికార్డులు, అడంగల్ నిర్వహణ ఇక అప్పగింత రెవెన్యూ శాఖకు తగ్గనున్న భారం విశాఖపట్నం సిటీ: అనేక దశాబ్దాలుగా భూ వివరాలకు సంబంధించిన రికార్డులను నిర్వహిస్తున్న రెవెన్యూ శాఖ అర్బన్లో ఇక ఆ బాధ్యతల నుంచి తప్పుకోనుంది. అర్బన్ భూముల రికార్డుల నిర్వహణను ఇకపై వుడాకు అప్పగించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులకు-వుడా అధికారులకు మధ్య కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. శనివారం కూడా కలెక్టర్ యువరాజ్, వుడా వైస్ చైర్మన్ బాబూరావు నాయుడుల మధ్య ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భూములకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. వుడాలో ప్రస్తుతం 23 అర్బన్ మండలాలున్నాయి. ఇవన్నీ నాలుగు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఇప్పుడా 23 మండలాల అడంగల్ రికార్డులను వుడా నిర్వహించడంతో పాటు పర్యవేక్షించే అధికారం కూడా రెవెన్యూ వర్గాలు కల్పిస్తున్నాయి. త్వరలో విశాఖ మెట్రో డెవలప్మెంట్ అధారిటీ (వీఎండీఏ)గా మారబోతున్న తరుణంలో ఈ కొత్త అధికారాలను వుడాకు అప్పగించాలని చూస్తున్నారు. వుడాకు అప్పగించి భూ రికార్డులను నిర్వహించేందుకు అనుమతిచ్చినా ప్రస్తుతం చట్టం అనుమతించదనే వాదనలున్నాయి. వుడా సర్వేయర్లు చేసే రికార్డులను ప్రభుత్వం పట్టించుకోదు. ఆ సర్వేను మళ్లీ రెవెన్యూ అధికారుల అధీనంలో చేయిస్తారు. అయితే తాజాగా కొత్త చట్టం రూపొందించి కొన్ని అధికారాలను వుడాకు కల్పించేందుకు సైతం వెనకాడడం లేదని తెలిసింది. 1920 నుంచీ అడంగళ్ (పహాణీ) రికార్డులను రెవెన్యూ అధికారులే నిర్వహిస్తున్నారు. ఈ రికార్డుల్లో ముఖ్యంగా భూమి హక్కుదారు, పట్టాదారు, అనుభవదారు ఎవరనే వివరాలుంటాయి.భూమి స్వభావం తెలుసుకోవాలంటే అడంగళ్ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఆ భూమి మెట్ట, మాగాణి, పోరంబోకు, గెడ్డ, చెరువు, కొండ, స్మశానం, కొండ పోరంబోకు, గెడ్డ పోరంబోకు, కాలువ, ఇసుక నేల, ఎర్ర నేల, రాళ్ల నేల ఇలాంటి వివరాలన్నీ లభిస్తాయి. ఆ భూమిలో ఏమేం పండుతాయి. ఎలా పండుతాయి. వర్షాధారమేనా లేక నీరు కాల్వల ద్వారా నీరు వస్తుందా. ఏ ఆయకట్టు కింద సాగవుతోంది. ఇలాంటి వివరాలన్నీ ఉంటాయి.ఆ భూమి పన్నులు ఎలా ఉన్నాయి. ఎవరు చెల్లిస్తున్నారు. ఎవరు అనుభవిస్తున్నారనే వివరాలన్నీ అందులో పొందుపరచబడి ఉంటాయి. ఆ భూమి తమదంటూ ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించినా, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా దాని పూర్వాపరాలు తెలుసుకునేందుకు అడంగళ్ ఒక్కటే మార్గం. ఇంతటి ప్రాముఖ్యం గల ఈ ల్యాండ్ రికార్డులను వుడాకు ఎందుకు అప్పగించనుంది. ల్యాండ్ రికార్డులను సంబంధించి నిర్వహించేందుకు ఎకరాకు రూ. 10 చొప్పున వసూలు చే సుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. ఈ నేపధ్యంలో తదుపరి వివరాలపై చర్చలు జరుగుతున్నాయి. -
ఒకేసారి రెండు పండుగలు..!
నేటి నుంచి దసరా ఉత్సవాలు విజయదశమి రోజున రాజధానికి శంకుస్థాపన రాష్ర్ట పండుగగా దసరా ఏర్పాట్లపై అధికారుల నిరంతర పర్యవేక్షణ విజయవాడ (ఇంద్రకీలాద్రి) : ఈ ఏడాది దసరాకు ఒకేసారి రెండు పండుగలు జరుగనున్నాయి. దసరా ఉత్సవాలు ఒకటైతే, రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన రెండోది. దసరాను రాష్ర్ట పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంద్రకీలాద్రి విద్యుత్ దీపాల వెలుగులతో ధగధగమెరుస్తోంది. ఉత్సవాలను ఘనంగా నిర్వహణకు దేవాదాయ, రెవెన్యూ శాఖలు, ఇతర ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ బాబు.ఏ ఉత్సవాల ఏర్పాట్లపై పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించి పర్యవేక్షిస్తున్నారు. అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉత్సవాలకు రోజుకు సుమారు 60వేల నుంచి 80 వేల మంది భక్తులు విచ్చేస్తారని ఆలయ అధికారులు అంచనావేశారు. మరో వైపున అమరావతి శంకుస్థాపన పనులు విజయదశమి రోజునే కావడంతో ఈ ఏడాది వీఐపీల తాకిడి అధికంగా ఉండవచ్చని భావిస్తున్నారు. ఉత్సవాలకు సర్వం సిద్ధం శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు స్వాగతం పలుకుతూ నగర నాలుగు దిక్కులా భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. వినాయకుడి గుడి నుంచి క్యూలైన్ల పనులు పూర్తయ్యాయి. అమ్మవారి దర్శనం పూర్తయిన భక్తులు కొండ దిగువకు చేరుకుందుకు రెండు మార్గాల ద్వారా 5 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. మహా మండపం వద్ద సాంస్కృతిక కళావేదిక ఏర్పాటు చేసిన అధికారులు భక్తులకు ఆహ్లాదాన్ని కల్పించేలా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ఇక అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు నిత్యాన్నదాన పథకంలో భాగంగా ఉచిత అన్నప్రసాద విరతణ చేసేందుకు గాను అర్జున వీధిలోని శృంగేరి పీఠంతో పాటు బ్రాహ్మణ వీధిలోని మాజేటి ప్రహ్లాదరావు కల్యాణమండపంలోను ఏర్పాట్లు చేశారు. మరో వైపున ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో క్యూలైన్లలో భక్తులు ఇబ్బందులు పడుకుండా మంచినీటి సదుపాయం, షామియానాల ఏర్పాటుతో పాటు అశోకస్థూపం, ఘాట్రోడ్డు, ఓం టర్నింగ్, ఆలయ ప్రాంగణాలలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వీఐపీల కోసం మూడుంచెల విధానం దసరా ఉత్సవాలు, అమరావతి శంకుస్థాపన నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి భారీగా వీఐపీలు, రాజకీయ ప్రముఖులు విచ్చేసే అవకాశం ఉండడంతో కొండపై భాగంలో మూడు అంచెల సెక్యూరిటీగా ఏర్పాటు చేశారు. తొలుత మోడల్ గెస్ట్ హౌస్ నుంచి వీఐపీ వాహనం ద్వారా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న వారికి అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అవుట్ పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తారు. ఇక అక్కడి నుంచి అమ్మవారి ఆలయం వద్ద ప్రోటోకాల్ ఆఫీసర్ సదరు వీఐపీని అమ్మవారి దర్శనానికి తీసుకువెళ్లతారు. ఈ దఫా అనధికార వీఐపీలను అడ్డుకునేందుకు పోలీసు, రెవెన్యూ అధికారులు పక్కా ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నారు. సోమవారం జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్ కలెక్టర్ నాగలక్ష్మి, దుర్గగుడి ఈవో నర్సింగరావు, ఇతర రెవెన్యూ అధికారులు స్నానఘాట్లు, క్యూలైన్లు, ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఉదయం 9 గంటలకు దర్శనం దసరా ఉత్సవాలలో తొలి రోజైన మంగళవారం తెల్లవారు జామున అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, పూజల అనంతరం ఉదయం 9 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 9.30 గంటలకు అమ్మవారి ఉత్సవమూర్తిని పల్లకిపై ఊరేగింపుగా భవానీదీక్ష మండపానికి తీసుకువెళ్లి ప్రతిష్టిస్తారు. ఉదయం 10 గంటలకు భవానీదీక్ష మండపంలో లక్ష కుంకుమార్చన ప్రారంభమవుతుంది. మంగళవారం ఒక బ్యాచ్ మాత్రమే కుంకుమార్చన నిర్వహిస్తారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీపీ దసరా ఉత్సవాలను పురస్కరించుకుని నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ సోమవారం దుర్గమ్మకు పట్టుచీరను సమర్పించారు. తొలుత వన్టౌన్ పీఎస్కు చేరుకున్న సీపీ స్టేషన్లో అమ్మవారిని ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడ నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, తీన్మాన్ డప్పులతో గుర్రపు బగ్గీపై పట్టుచీరను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అమ్మవారికి పట్టుచీరను సమర్పించేందుకు విచ్చేసిన సీపీకి ఆలయ ఈవో నర్సింగరావు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారికి పట్టుచీరను సమర్పించి ఉత్సవాలు విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో డీసీపీ అశోక్కుమార్, కాళీదాసు, వెస్ట్ ఏసీపీ శివరామ్, వన్టౌన్ సీఐ వెంకటేశ్వర్లు, పలువురు ఉన్నతాధికారులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. -
రైతుల అవసరాలను తీర్చండి
జిల్లా కలెక్టర్ల టెలీకాన్ఫరెన్స్లో చంద్రబాబు కాలిఫోర్నియా వెళ్లి రోడ్లను పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు సాక్షి, విజయవాడ బ్యూరో : ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ సీజన్లలో రైతుల అవసరాలకు తగ్గట్టుగా ఎరువులు, విత్తనాలను సమకూర్చాలని రుణ పరపతి అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి శనివారం ఆయన వారితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలస్యంగానైనా ఇటీవల కురిసిన భారీ వర్షాలు కొంతమేర మేలు చేశాయని, వ్యవసాయ, రెవెన్యూ శాఖలను సమన్వయపరిచి రైతాంగానికి అండగా ఉండాలన్నారు. తన క్యాంపు కార్యాలయంలో పలువురు సందర్శకుల నుంచి వినతులు స్వీకరించారు. ఆర్ అండ్ బీ శాఖపై సమీక్ష... రోడ్డు భద్రత కోసం అన్ని ప్రధాన రోడ్లపైనా సీసీ కెమెరాలు అమర్చి నిరంతరం పర్యవేక్షించాలని సీఎం ఆర్ అండ్ బీ శాఖాధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో జరిపిన సమీక్షలో మాట్లాడుతూ అన్ని జిల్లా కేంద్రాలనూ రాజధాని ఔటర్ రింగ్రోడ్డుతో అనుసంధానం చేయాలన్నారు. భీమునిపట్నం నుంచి ఒంగోలు మధ్య 216 కోస్తా (బీచ్) జాతీయ రహదారి ఒక మోడల్గా అభివృద్ధి చేయాలని సూచించారు. కాలిఫోర్నియాలోని పసిఫిక్ కోస్ట్ హైవే తరహాలో ఈ బీచ్ రోడ్డు ఉండాలని అవసరమైతే అధికారులు కాలిఫోర్నియా వెళ్లి అధ్యయనం చేయాలని సూచించారు. హిందూపురం బైపాస్రోడ్డుతో పాటు బెంగళూరును కలుపుతూ నాలుగులైన్ల రహదారిని నిర్మించాలన్నారు. హైదరాబాద్-కల్వకుర్తి-తిరుపతిని అనుసంధానిస్తే చెన్నైకు దగ్గర దారి అవుతుందని, కడప-రాజంపేట-కోడూరు-తిరుపతిని కలుపుతూ రహదారిని అభివృద్ధి చేయాలన్నారు. రాష్ట్రంలోనూ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ నేషనల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ తరహాలో రాష్ర్టంలోనూ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఆదేశించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో కార్పొరేషన్ సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ స్థాయిలో గుర్తించిన 42 రంగాల్లోని స్థానిక పారిశ్రామికవేత్తల నేతృత్వంలో దీన్ని ఏర్పాటుచేయాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న నైపుణ్యాభివృద్ధి కేంద్రాలతోపాటు హబ్ అం డ్ స్పోక్ విధానంలో ఆరు క్లస్టర్లలో 36 ఎక్సలెన్స్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు కార్పొరేషన్ అధికారులు సీఎంకు వివరించారు. చంద్రబాబును కలిసిన సండ్ర ఓటుకు నోటు కేసులో అరెస్టయి బెయిల్పై విడుదలైన తెలంగాణకు చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే శనివారం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిశారు. రెండుగంటల పాటు బాబుతో సమావేశమైనట్లు తెలిసింది. తెలంగాణ అసెంబ్లీలో ఓటుకు నోటు కేసును ఎలా ఎదుర్కోవాలి, తాను ఏం చెప్పాలనే దానిపై సండ్ర సీఎంతో చర్చించినట్లు సమాచారం. -
రెవెన్యూ రికార్డుల గోల్మాల్!
వాకాడు : రెవెన్యూ శాఖలో అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. రికార్డుల్లో పేర్లను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు. వాకాడు మండలంలోని తీరప్రాంతం కోస్టల్ కారిడార్లో ఉండటంతో పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఇప్పటికే తూపిలిపాళెంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ( ఎన్ఐఓటీ)కి శంకుస్థాపన జరిగింది. దీనికి సంబంధించి భూసేకరణ కూడా పూర్తయింది. దుగరాజపట్నం ఓడరేవు నిర్మాణం కూడా ప్రతిపాదనలో ఉంది. ఇంకా పలు ప్రాజెక్టులు, పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భూముల విలువకు రెక్కలు వచ్చాయి. ఇదే సమయంలో కొందరి కన్ను ప్రభుత్వ, అసైన్డ్ భూముల మీద పడింది. వారికి కొందరు అవినీతి అధికారులు అండగా నిలవడంతో రికార్డుల్లో పేర్లు తారుమారవుతున్నాయి. విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేటు పరం అవుతున్నాయి. ఈ వ్యవహారంలో భారీగా నగదు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని ఉదాహరణలు.. దుగరాజపట్నం రెవెన్యూ పరిధిలోని 805, 806,808,809,810 సర్వే నంబర్ల భూమిని సంబంధించి గతంలో నిరుపేదలకు పట్టాలు మంజూరు చేశారు. అయితే ప్రస్తుతం ఆ సర్వే నంబర్లకు సంబంధించిన అడంగల్, డి రిజిస్టర్లో పేర్లను దిద్దేసినట్లు అసలైన లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. వల్లమేడు పరిధిలోని 15, 27 సర్వే నంబర్లకు సంబంధించి 4.16 ఎకరాల భూముల అనుభవదారుల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో మారిపోయినట్లు సమాచారం. ఇలా సుమారు 300 ఎకరాలకు సంబంధించి రికార్డులు మారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆన్లైన్లో పేర్లు మార్పు చేయడంతో పాటు కొన్ని ప్రభుత్వ భూములకు అయితే పట్టాదారు పాసుపుస్తకాలు కూడా పొందినట్లు తెలిసింది. పొంతన కుదరని వివరాలు సాధారణంగా ప్రభుత్వ భూముల వివరాలు ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్స్ అసిస్టెంట్ డెరైక్టర్ ఆధీనంలో ఉంటాయి. ప్రతి మండల సర్వేయర్, తహశీల్దార్ కార్యాలయంలోనూ ఒక్కో కాపీ ఉంచుతారు. అయితే ప్రస్తుతం సర్వే అండ్ రికార్డ్స్ కార్యాలయంలో ఉన్న కాపీకి తహశీల్దార్ కార్యాలయంలోని పెయిర్ అడంగల్కు పొంతన కుదరనట్లు సమాచారం. సర్వేయర్ వద్ద ఉన్న వాస్తవ కాపీతో సరిపోల్చితే తహశీల్దార్ అడంగల్ కాపీలో దిద్దుబాటులు కనిపిస్తున్నాయి. గతంలో ఈ ప్రాంతంలో పనిచేసిన కొందరు తహశీల్దార్లు, వీఆర్వోల సహకారంతోనే ఈ అక్రమాల పర్వం జరిగిందని తెలుస్తోంది. మరోవైపు గతంలో ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన సుమారు వెయ్యి ఎకరాలకు పైగా భూమి కూడా ఆక్రమణల ఉచ్చులో చిక్కుకుని ఉన్నాయి. భూములను ఆక్రమించిన కొందరు ఇప్పటికే వాటిని విక్రయించి సొమ్ము చేసేసుకున్నారు. ప్రధానంగా దుగరాజపట్నం, కాకివాకం, కొండూరు, కొండూరుపాళెం తదితర గ్రామాల్లో ఎక్కువగా ఈ అక్రమణల పర్వం సాగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆరేళ్లుగా తిరుగుతున్నాం: వాకాడులోని సర్వే నంబర్ 528లో ప్రభుత్వం నాకు అర ఎకరా భూమిని మంజూరు చేసింది. అయితే కొందరు అధికారుల కారణంగా భూమి నాకు దక్కలేదు. మరొకరు సాగు చేసుకుంటున్నారు. ఆరే ళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కరువైంది. - కార్యం భువనేశ్వరి, బీసీ కాలనీ వాకాడు. నా పొలం రికార్డులను మార్చేశారు: దుగరాజపట్నం రెవెన్యూ పరిధిలోని 805, 806, 808, 809, 810 సర్వే నంబర్లలో ప్రభుత్వం నాకిచ్చిన సీలింగ్ పట్టా భూమికి సంబంధించి రికార్డుల్లో నా పేరు మార్చేశారు. దుగరాజపట్నం రెవెన్యూ డీ రిజస్టర్లో లబ్ధిదారుల పేర్లను తొలగించి ఇతరులను చేర్చారు. అడంగల్లో కూడా మార్చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం అడంగళ్లు తహశీల్దార్ కార్యాలయంలో లేవంటున్నారు. - పాశం ఏడుకొండలు, దుగరాజపట్నం విచారించి చర్యలు తీసుకుంటాం.. రికార్డులు తారుమారు అయిన విషయం నా దృష్టికి రాలేదు. ఒకవేళ అలా జరిగి ఉంటే విచారించి శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. దుగరాజపట్నం పోర్టు రానున్న దృష్ట్యా ఆ పంచాయతీ పరిధిలోని రెవెన్యూ భూములకు సంబంధించి అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సంబంధిత రికార్డులను సబ్కలెక్టర్ వారు తీసుకెళ్లారు. - తహశీల్దార్ ఈశ్వరమ్మ -
అడిగింది ఇవ్వాల్సిందే
లంచంలో పైసా తగ్గించని వీఆర్వో రూ.50 వేలు తీసుకుంటూ పట్టుబడిన వైనం ఏసీబీ చట్రంలో చిక్కిన రెవెన్యూ ఉద్యోగి రావికమతం: అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ)అధికారుల వలకు వీఆర్వో చిక్కాడు. వంద!, వెయ్యి! కాదు ఏకంగా రూ.50 వేలు లంచం తీసుకుంటూ గురువారం పట్టుబడ్డాడు. మండల రెవెన్యూశాఖలో ఘటికుడుగా గుర్తింపుపొందిన గుడివాడ వీఆర్వో వాలిమరక ముత్యాలు దొరికిపోవడం స్థానికంగా సంచలనమైంది. వివరాలిలా ఉన్నాయి. మునగపాకకు చెందిన సూరిశెట్టి కన్నారావు, పెంటకోట గోవిందరావులు గుడివాడ రెవెన్యూ పరిధిలో గతంలో 4.11ఎకరాల భూమి కొనుగోలు చేశారు. అప్పట్లో వీఆర్వోకు రూ.1.25లక్షలు ముట్టజెప్పి పట్టాదారు పాసుపుస్తకం పొందారు. ఆ భూమిని వారు వేరొకరికి విక్రయించారు. పాసుపుస్తకంలో ప్రస్తుతం కొనుగోలు చేసినవారి పేరు మార్పునకు, ఆన్లైన్ చేసేందుకు వీఆర్వోను కలిశారు. అతను రూ.50వేలు డిమాండ్ చేశాడు. గతంలో పెద్ద మొత్తం ఇచ్చామని, ఇప్పుడు ఫ్రీగా చేయాలని కోరారు. కనీసం కొంతయినా తగ్గించాలన్నారు. అయినా వీఆర్వో అంగీకరించకపోవడంతో రూ.50వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందుగా నగదు ముట్టజెబితేనే పని అంటూ నెలల తరబడి తిప్పడంతో విసిగిపోయిన గోవిందరావు, కన్నారావులు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్ను కలిశారు. ఆయన సూచనమేరకు గురువారం ఉదయం రైతులిద్దరూ పాసుపుస్తకాలు పూర్తయ్యాయా.. డబ్బుతెచ్చామంటూ వీఆర్వోను కలిశారు. పోలీసు స్టేషన్కు ఎదురుగా ఉన్న తన ప్రైవేటు కార్యాలయానికి డబ్బు తేవాలని చెప్పాడు. అక్కడ వారిద్దరూ రూ.50వేలు ఇచ్చారు. దానిని లెక్కచూసుకుని సొరుగులో పెడుతుండగా డీఎస్పీ రామకృష్ణప్రసాద్, సీఐలు రామకృష్ణ, గణేష్, రమణమూర్తిలు రెడ్హ్యాండెడ్గాా వీఆర్వోను పట్టుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏసీబీ అధికారుల పక్కా ప్లాన్లో వీఆర్వో ఇరుక్కుపోయాడు. ఏసీబీ డీఎస్పీకి రైతుల మొర.. వీఆర్వో ముత్యాలు ఏసీబీకి చిక్కాడని తెలిసి ఆ గ్రామం నుంచి చాలా మంది రైతులు రావికమతం వచ్చి డీఎస్పీ రామకృష్ణను కలిశారు. పాసుపుస్తకాల కోసం, ఆన్లైన్ చేయించడానికి, తప్పొప్పులు సరిచేయడానికి తమ నుంచి చాలా నగదు తీసుకున్నారని, ప్రస్తుతం ఆయన స్సపెండ్ అయితే తమ డబ్బు పోతుందని వాపోయారు. పనులు కావంటూ రైతులు అక్కిరెడ్డి రామారావు, జెర్రిపోతుల రాంబాబు,నక్కా అప్పారావు, కరణం అమ్మాజి,గేదెల పరదేశినాయుడు తదితరులు మొరపెట్టుకున్నారు. తమకు డబ్బులిప్పించాలని కోరారు. ఆ విషయంలో తానేమీ చేయలేనని,డబ్బులు డిమాండ్ చేసినపుడే తమను ఆశ్రయించాల్సిందని డీఎస్పీ బదులిచ్చారు. -
సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం
-
సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం
రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిందని సీఎం వ్యాఖ్యలు * డిప్యూటీ కలెక్టర్ల బదిలీలను రద్దుచేస్తూ జీవో * రెవెన్యూశాఖకు సంబంధం లేకుండా భూసేకరణ * ముఖ్యమంత్రి వైఖరిపై కేఈ అనుమానాలు * యువనేత ఒత్తిడితోనే పక్కనపెట్టారన్న అభిప్రాయం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మధ్య నెలకొన్న రాజకీయ వాతావరణం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్గా మారింది.ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలి కాలంలో వ్యవహరిస్తున్న తీరుపై రెవెన్యూ శాఖ నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి శిబిరం అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. డిప్యూటీ కలెక్టర్లను బదిలీలు చేస్తూ నిన్న ఇచ్చిన జీవోను రద్దు చేసిన ముఖ్యమంత్రి తాజాగా శుక్రవారం విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో రెవెన్యూ శాఖలో అవినీతి డబుల్ డిజిట్ గ్రోత్ సాధించిందని ఒకటికి రెండుసార్లు చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా ముఖ్యమంత్రి అనుసరిస్తున్న వైఖరిపై కేఈ కృష్ణమూర్తి శిబిరం తర్జనభర్జన పడుతోంది. చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి, పరిణామాలు దేనికి సంకేతమని సన్నిహితుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. గతంలో మంత్రివర్గ సమావేశంలో ఒకసారి, అంతకుముందు కలెక్టర్ల సమావేశంలోనూ రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిపోయిందని ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని విశ్లేషిస్తున్న కేఈ శిబిరం మొత్తంగా ఆ మాటల్లోని ఆంతర్యం వేరై ఉంటుందన్న నిర్ణయానికి వచ్చారు. కావాలనే తనపట్ల తప్పుడు సంకేతాలు వెళ్లడానికి ఈ ప్రయత్నం జరుగుతుందా? అన్న అనుమానాలు కేఈ సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. డిప్యూటీ కలెక్టర్ల బదిలీలను నిలుపుదల చేయ డం ఇది మూడోసారి కావడం గమనార్హం. భూసేకరణకు రెవెన్యూశాఖ దూరం రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం అనేక ప్రాజెక్టుల కోసం భూ సేకరణ జరుగుతుండగా, అన్నీ రెవెన్యూ శాఖకు సంబంధం లేకుండా చేస్తున్నారు. అమరావతి రాజధాని భూ సమీకరణ, భోగాపురం ఎయిర్పోర్టు భూ సేకరణతోపాటు బందరు పోర్టు వంటి విషయాల్లోనూ కేఈని దూరం పెట్టారు. ఆ ప్రాజెక్టుల భూ సేకరణను మంత్రులు పి.నారాయణ, గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు తదితరులకు అప్పగించారు. జరుగుతున్న పరిణామాలపై కేఈ ఇటీవల సన్నిహితులతో నిర్వహించిన సమావేశంలో ప్రస్తావించినట్టు సన్నిహితవర్గాలు చెప్పాయి. కొత్తగా పార్టీలో చేరిన శిల్పా చక్రపాణిరెడ్డిని కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించడంతోపాటు ఎమ్మెల్సీ కూడా ఇచ్చారని, ఆ విషయంలో కనీసం తనను సంప్రదించలేదని కేఈ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. పార్టీలో సీనియర్గా ఉన్న తాను ఇలాంటి విషయాల్లో అడిగిన వారికి సమాధానం చెప్పలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు తన పట్ల అనుసరిస్తున్న విధానాలను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ... ఇవన్నీ దేనికి సంకేతమని, వీటన్నింటిపైనా ఆలోచించాల్సి ఉందని అన్నట్టు తెలిసింది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనకు ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవి ఇవ్వాలని కోరినా నానా ఇబ్బందుల పాలు చేశారని, ఎన్నికల తర్వాత మంత్రివర్గంలోకి తీసుకున్నప్పటికీ యువనేత ఒత్తిడితోనే పక్కనపెట్టారన్న అభిప్రాయం సన్నిహితుల సమావేశంలో వ్యక్తమైంది. -
రెవెన్యూలో టెన్షన్... టెన్షన్
సాక్షి, విశాఖపట్నం : రెవెన్యూలో బదిలీ లకు రంగం సిద్ధమవడంతో యంత్రాం గంలో గుబులు మొద లైంది. జీవో నెం-68 ప్రకారం బదిలీలుచేయాలని చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ పరిపాలనా సౌలభ్యం పేరిట ఎవరినైనా కదిపే అవకాశముండడంతో ప్రతీఒక్కరిలో టెన్షన్ మొదలైంది. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారికి బదిలీ చేయాలంటూ గతంలో జీవో-57 జారీ చేశారు. ఈ జీవో ప్రకారం జిల్లాలో 659 మందికి బదిలీలకు అర్హులని లెక్కతేల్చారు. వీరిలో 470 మంది వీఆర్వోలకు కౌన్సెలింగ్ కూడా పూర్తి చేశారు. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారిని మాత్రమే స్థానచలనం కల్పించాలని జారీ చేసిన మార్గ దర్శకాలు మేరకు రెవెన్యూయేతర శాఖల్లో బదిలీలు జరిగాయి. ఆ తర్వాత జీవో నెం. 68ప్రకారం ప్రస్తుత రెవెన్యూ శాఖలో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలివ్వడం గందరగోళానికి దారితీసింది. ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారిని బదిలీచేయాలా? మూడేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారిరి కదపాలా లేక జీవో నెం.68 ప్రకారం 20 శాతానికి మించి బదిలీలు చేయకూడదో తెలియని మీమాంసలో రెవెన్యూ అధికారులు కొట్టుమిట్టాడు తున్నారు. 15వ తేదీకల్లా బదిలీ ప్రక్రియను పూర్తిచేయాలంటూ మూడో తేదీన జీవో జారీ చేసిన సర్కార్ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను మాత్రం ఇవ్వలేదు. దీంతో రెవెన్యూ యంత్రాంగంలో ఒకింత సందిగ్ధత కొనసాగుతోంది. పైరవీలు ప్రారంభం: మరోపక్క బదిలీలయ్యే వారే కాకుండా, కోరుకున్న పోస్టింగ్ కోసం కూడా రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ల నుంచి తహశీల్దార్ల వరకు పైరవీలు సాగిస్తున్నారు. ఇప్పటికే పరిపాలనా సౌలభ్యం పేరిట పన్నెండు మంది తహశీల్దార్లకు స్థాన చలనం కల్పించారు. తాజాగా బదిలీల ఉత్తర్వుల నేపథ్యంలో మరికొంత మంది తహశీల్దార్లతో పాటు డిప్యూటీ తహశీల్దార్లకు కూడా స్థానచలనం తప్పదని తెలుస్తోంది. తహశీల్దార్ స్థాయి అధికారులే కాదు ఇతర మినిస్టీరియల్ సిబ్బంది కూడా సొంత ప్రాంతాలు, కోరుకున్న పోస్టింగ్ల కోసం పైరవీలు సాగిస్తున్నారు. విశాఖ నగర పరిసర మండలాల్లో తహశీల్దార్లతో పాటు ఇతర కీలక పోస్టుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే వీరంతా మంత్రు లు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణ లు చేస్తున్నారు. దీంతో వీరు ఇచ్చే సిఫార్సు లేఖలకు యమ గిరాకీ ఏర్పడింది. ఒకటి రెండ్రోజుల్లో మార్గదర్శకాలు విడుదలైతే బదిలీలపై క్లారిటీ వస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. -
ఎవరి (మీ) కోసం
సాక్షి, విశాఖపట్నం : పేరు మారింది.. కానీ తీరు మాత్రం మారలేదు. ప్రతీ నెలా మండల కార్యాలయాల నుంచి జిల్లా కార్యాలయాల వరకు చెప్పులరిగేలా తిరగడమే తప్ప సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. గ్రీవెన్స్.. ప్రజాదర్భార్.. ప్రజావాణి.. తాజాగా మీకోసం ఇలా పేర్లు మారుతున్నాయే తప్ప ప్రజల వెతలు మాత్రం తీరడం లేదు. ఎక్కేగుమ్మం.. దిగే గుమ్మం అన్నట్టుగా తయారైంది అర్జీదారుల పరిస్థితి. రాష్ర్ట వ్యాప్తంగా గతేడాది డిసెంబర్ నుంచి ప్రజావాణి స్థానంలో ‘మీకోసం’ ప్రవేశపెట్టారు. ఈ పథకానికి మన జిల్లాలో శ్రీకారం చుట్టి మూడు నెలలు కావస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమస్యల పరిష్కారంలో సాంకేతిక విప్లవం తీసుకొస్తున్నట్టుగా గొప్పలు చెప్పుకున్నారు. ఇందుకోసం మండల స్థాయి నుంచి రాష్ర్ట స్థాయి వరకు ఎవరైనా ఎప్పుడైనా ఏ ఆర్జీ ఏ స్థితిలో ఉందో తెలుసుకునేందుకు వీలుగా ప్రత్యేక వెబ్సైట్ను కూడా రూపొందించారు. జిల్లాలో 32 డిపార్టుమెంట్ల పరిధిలో అందే అర్జీలను ఈ వెబ్సైట్లో పొందుపరుస్తూ వాటిలో ఎన్ని పరిష్కారమయ్యాయి. ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వాటి స్థితిగతులను కూడా తెలియజేస్తున్నారు. నమోదు తీరు ఇలా... అర్జీదారుడు ఇచ్చిన అర్జీని కంప్యూటర్లో నమోదు చేస్తారు. దాన్ని సంబంధిత అధికారికి పంపిస్తారు. అర్జీదారునికి రసీదు ఇస్తారు. ఎప్పటికప్పుడు ఆ అర్జీ పురోగతిపై అర్జీదారుని ఫోన్కు ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం ఇస్తారు. టోల్ఫ్రీ నెం.1100/1800-425-4440 కు ఎవరైనా ఎప్పుడైనా కాల్ చేసి తమ అర్జీ పరిస్థితి తెలుసుకోవచ్చు. అయితే ఈ టోల్ ఫ్రీ నంబర్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లైన్ కలవడం లేదని అర్జీదారులు చెబుతున్నారు. ఒక వేళ కలిసినా మీ సమస్య ఫలానా అధికారి వద్ద పెండింగ్లో ఉందనే సమాధానం తప్ప పరిష్కారమైందనే సమాధానం రావడం లేదని వాపోతున్నారు. సెల్ఫోన్కు ఎస్ఎంఎస్ రావడం తప్ప పరిష్కా రానికి నోచుకోవడం లేదని అంటున్నారు. కేవలం 31 అర్జీలకే పరిష్కారం జూన్ నుంచి ఆగస్టు నెలాఖరు వరకు మీ కోసం ద్వారా 1,266 అర్జీలందాయి. వాటిలో ఇప్పటి వరకు కేవలం 31 అర్జీలు మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. ఇంకా 1,235 అర్జీలు పెండింగ్లో ఉన్నాయి. కలెక్టరేట్లో అందే అర్జీల్లో అత్యధికం రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖలకు చెందినవే. ఆ తర్వాత పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, విద్య శాఖల పరిధిలో ఉంటున్నాయి. పరిష్కారానికి నోచుకోని మీకోసం అర్జీలపై జిల్లా అధికారులను వివరణ కోరితే మెజార్టీ అర్జీలు పరిష్కార దశలో ఉన్నాయన్నారు. ఏ నెలలో అందిన అర్జీలపై ఆ నెలలో కలెక్టర్ సమీక్షిస్తున్నారని, ఎక్కువగా క్షేత్రస్థాయిలో పెండింగ్లో ఉండిపోతున్నాయని పేర్కొన్నారు. -
‘రెవెన్యూ’లో కుదుపు
సాక్షి, విశాఖపట్నం : రెవెన్యూలో కుదుపు మొదలైంది. ఇన్నాళ్లు వాయిదాలమీద వాయిదాలు పడుతూ వస్తున్న వీరి బదిలీలకు ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి లోగా వీరి బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ శర్మ గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. జీవోఎంఎస్-98 పేరి ట జారీ చేసిన ఈ ఉత్తర్వు ప్ర కారం బదిలీ ప్రక్రియ పూర్తిగా జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో చేయాల్సి ఉంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉద్యోగుల సాధారణ బదిలీలు నా లుగు నెలలుగా సాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ హయాం లో పనిచేసిన రాష్ర్ట స్థాయి అధికారుల నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు ప్రతీ ఒక్కరికి స్థానచలనం కల్పించాలన్న ఏకైక లక్ష్యంతో జారీ చేసిన జీవో-57 వివాదస్పదం కావడం.. ఇన్చార్జి మంత్రుల పర్యవేక్షణలో చేయాలన్న ఈ బదిలీల ప్రక్రియపై హైకోర్టు స్టే ఇవ్వడంతో బదిలీలకు ఆదిలోనే బ్రేకు లు పడ్డాయి. దీంతో ఇన్చార్జి మంత్రితో సంబంధం లేకుండా శాఖాధిపతుల పర్యవేక్షణలోనే బదిలీలు చేయొచ్చంటూ మలి ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్ ఆగస్టు-1 నుంచి 15వ తేదీ బదిలీలకు గ్రీన్సిగ్నెల్ ఇచ్చింది. శాఖల వారీగా ైగైడ్లైన్స్ కూడా జారీ చేసింది. కానీ రెవెన్యూ శాఖను మాత్రం ఈ బదిలీల నుంచి మినహాయించింది. మీ ఇంటికి మీ భూమి కార్యక్రమం, క్షేత్ర స్థాయిలో సర్వే, గ్రామస్థాయిలో గ్రామసభల నిర్వహణ వంటి బాధ్యతలు రెవెన్యూ అధికారులపై ఉండడంతో వీరిని గత నెల బదిలీల నుంచి మినహాయింపునిచ్చారు. ఆగస్టు 31తో మీ ఇంటికి మీ భూమికి గ్రామసభలు పూర్తి కావడంతో ఇక ఈ శాఖలో కూడా బదిలీలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్-15వ తేదీ అర్ధరాత్రిలోగా ఈ బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. తొలుత జారీచేసిన జీవో-57 ప్రకారం మూడేళ్ల సర్వీసు పూర్తయిన అధికారులు, సిబ్బంది వారీగా అర్హుల జాబితాలను జూన్ లోనే సిద్ధంచేశారు. ఈ విధంగా జిల్లా రెవెన్యూ శాఖలో 1445 మంది సిబ్బంది ఉండగా, వీరిలో 659 మంది బదిలీలకు అర్హులని లెక్కతేల్చారు. ముఖ్యంగా ఏళ్ల తరబడి పాతుకు పోయిన వీఆర్వోలకు స్థానచలనం కల్పించేందుకు జూలైలోనే ప్రత్యేకంగా కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు. సుమారు 470 మంది ఈ కౌన్సెలింగ్కు హాజరయ్యారు. వీరికి పోస్టింగ్లు ఇవ్వడమే తరువాయి.. ఈసమయంలో హైకోర్టు స్టే ఇవ్వడంతో ఉత్తర్వులు ఇవ్వకుండా నిలుపుదల చేశారు. ప్రస్తుతం వీరందరికి పోస్టింగ్లు ఇచ్చే అవకాశం ఉంది. మరో పక్క పరిపాలనా సౌలభ్యం పేరిట ఇటీవలే పదిమంది తహశీల్దార్లకు కలెక్టర్ స్థానచలనం కల్పించారు. తాజా బదిలీల్లో సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, సెక్షన్ సూపరింటెండెంట్లు, డిప్యూటీ తహశీల్దార్లతో సహా 189 మందికి స్థానచలనం కల్పించే అవకాశాలున్నాయి. రాష్ర్ట స్థాయి గురుపూజోత్సవం, నేషనల్ అథ్లెటిక్స్ మీట్ పూర్తయిన తర్వాత ఈ బదిలీలపై జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
వారితోనే బద్నామవుతున్నాం
* ‘రెవెన్యూ’పై మహమూద్ అలీ సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘రెవెన్యూ శాఖ చాలా కీలకమైంది. పుట్టుకు మొదలు చనిపోయే వరకు ఇచ్చే ధ్రువపత్రాలన్నీ ఈ శాఖ నుంచే జారీ చేయాలి. ఇంతటి ముఖ్యమైన శాఖకు కొందరు అవినీతి అధికారులతో చెడ్డపేరు వస్తోంది. ఇకపై ఇలాంటివి సహించేది లేదు. శాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తాం. ప్రతి సేవనూ ఆన్లైన్ చేసి అక్రమాలను అరికడతాం.’ అని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ను తనిఖీ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో పలు అంశాలపై సమీక్షించిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వస్థలాల ఆక్రమణ జరగకుండా రిజిస్ట్రేషన్ విభాగాన్ని రెవెన్యూ శాఖ వెబ్సైట్తో అనుసంధా నం చేస్తామని మహమూద్ అలీ తెలిపారు. ఇలా సమన్వయం చేయడంతో ప్రభుత్వస్థలాల వివాదాలు తగ్గడం తోపాటు పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ స్థలాలపై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే నిర్వహించి మ్యాపింగ్ చేస్తున్నామని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో సర్వే దాదాపు పూర్తి అయిందన్నారు. -
ఐదు వేల ఎకరాల ‘దిల్’ భూములు వెనక్కి
సాక్షి, హైదరాబాద్: డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్టింగ్స్ లిమిటెడ్(దిల్) సంస్థకు భూమి కేటాయింపులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ సంస్థకు మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల పరిధిలో గత ప్రభుత్వం కేటాయించిన 4,999.14 ఎకరాల భూములు ఇప్పటికీ నిరుపయోగంగా ఉన్నందున ఆ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి బి.ఆర్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హౌసింగ్ బోర్డుకు అనుబంధంగా ఏర్పడిన దిల్కు పారిశ్రామికాభివృద్ధి అవసరాల కోసం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2007లో ఈ మేరకు భూములను కేటాయించింది. పరిశ్రమల ఏర్పాటు కోసం ఈ భూములను దిల్ పలు ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది. అయితే భూములు పొందిన సంస్థలు ఏళ్లు గడిచినా నేటికీ పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోయాయి. దీంతో ఈ భూములను వెనక్కి తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో భూ కేటాయింపులను రద్దు చేస్తూ తాజాగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. -
‘పుష్కర’ సేవకు గుర్తింపేది..
ఆదిలాబాద్ : పుష్కరాలు ముగిసి దాదాపు నెల రోజులు కావస్తోంది. అయినా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి ఇప్పటి వరకు నయాపైసా టీఏ, డీఏ చెల్లించలేదు. ఇక వస్తాయని ఎదురుచూస్తున్నా రోజులు గడుస్తున్నాయో గానీ డబ్బులు ఏ ఒక్కరికి చేతికి అందలేదు. దీంతో అసలు టీఏ, డీఏ సొమ్ము వస్తుందా.. లేదా.. అని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు, రెవెన్యూ శాఖలతో సమానంగా తాము విధులు నిర్వర్తించామని, వారికి ఇప్పటికే డబ్బులు అందగా తమకు మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ డబ్బులను కాజేశారా..? లేకపోతే ఎందుకు విడుదల చేయడం లేదని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు చాలకపోవడంతోనే సిబ్బందికి టీఏ, డీఏ ఇవ్వలేకపోతున్నామని వైద్య, ఆరోగ్య శాఖాధికారులు చెబుతున్నారు. ఇది అధికారుల వైఫల్యంగా కన్పిస్తోంది. ఇదా.. గుర్తింపు..! పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలను గత జూలై నెలలో పన్నెండు రోజులపాటు నిర్వహించారు. రాష్ట్రంలో తొలిసారి ఘనంగా నిర్వహించామని ప్రభుత్వం గొప్పలకు పోతున్నప్పటికీ సేవలందించిన వారిని విస్మరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంద్రాగష్టు రోజు పుష్కరాల పనుల్లో సేవలందించిన వారికి ప్రశంస పత్రాలు కూడా అందించారు. వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి టీఏ, డీఏలు కూడా ఇవ్వకపోవడం విమర్శలకు దారితీస్తోంది. జూలై 14 నుంచి 25 వరకు జిల్లాలోని 33 పుష్కర ఘాట్లలో 696 మంది సిబ్బంది వైద్య సేవలు అందించారు. ఇందులో వైద్యులు, పారామెడికల్, 104 సిబ్బంది, గజిటెడ్, నాన్ గజిటెడ్, నాలుగో తరగతి ఉద్యోగులు ఉన్నారు. సేవలందించినందుకుగాను వారి హోదాకు తగ్గట్టుగా డీఏలు ఉండగా, దూర వ్యత్యాసాలను బట్టి రవాణ చార్జీలు అందజేయాలి. పోలీసు శాఖలో పుష్కర డ్యూటీకి చేరే ముందు రోజే వారిలో ఉత్సాహం నింపేందుకు టీఏ, డీఏలను ముందుగానే చెల్లించారు. మరి పుష్కరాలు ముగిసి నెల రోజులు కావస్తున్నప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి ఇప్పటికీ టీఏ, డీఏలు ఇవ్వకపోవడంతో వారిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదేనా మాకిచ్చే గుర్తింపు అని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం కలెక్టర్ జగన్మోహన్ జిల్లాలోని వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందితో నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్లో డివిజన్, మండల స్థాయి వైద్యాధికారులు పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకేళ్లాలని అనుకున్నప్పటికీ వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తమను ఎక్కడ టార్గెట్ చేస్తారోనని మిన్నకుండిపోయినట్లు తెలుస్తోంది. వైఫల్యమెవరిది.? నిధులు చాలినంత రాకపోవడంతోనే టీఏ, డీఏ డబ్బులు చెల్లించలేకపోతున్నామని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. టీఏ, డీఏలు అన్ని కలిపి పుష్కరాల కోసం రూ.36 లక్షలు అవసరమని డెరైక్టర్ ఆఫ్ హెల్త్కు పుష్కరాలు ప్రారంభానికి ముందే నివేదించినట్లు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి రూ. 24 లక్షలు మంజూరైనట్లు వివరించారు. పుష్కరాల్లో సేవలందించిన వైద్య ఉద్యోగులందరి టీఏ, డీఏ లెక్కలు వేస్తే రూ.19 లక్షలు పైబడుతుందని చెబుతున్నారు. అలాంటప్పుడు మంజూరైన రూ.24 లక్షల నుంచి రూ.19 లక్షలు మంజూరు చేయవచ్చు కదా అనే ప్రశ్న తలెత్తుతోంది. దీనికి వైద్యారోగ్య శాఖ అధికారి చెబుతున్నా సమాధానం గందరగోళానికి దారి తీస్తోంది. పుష్కరాల్లో మొదట తక్కువ ఘాట్లు ఉన్నాయని ప్రభుత్వం చెప్పిందని, అనంతరం ఘాట్ల సంఖ్యను పెంచిందని చెబుతున్నారు. ఘాట్ల సంఖ్య పెరిగిపోవడంతో మొదట అనుకున్న 696 మంది సిబ్బందికి అదనంగా రిమ్స్, తదితర ఆస్పత్రుల నుంచి వైద్యులు, ఇతర సిబ్బందిని ఘాట్ల వద్ద వినియోగించుకోవాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు. దీంతో ఈ వ్యయం పెరిగిపోయిందని అంటున్నారు. మంచిర్యాల, చెన్నూర్, ఖానాపూర్, లక్సెట్టిపేట, నిర్మల్, బాసరలలో సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ల(ఎస్పీహెచ్వో)ల అకౌంట్లకు మొదట వచ్చిన రూ.24 లక్షల నుంచి రూ.20 లక్షలు విడుదల చేశామని డీఎంహెచ్వో అధికారులు చెబుతున్నారు. ముందుగా రెవెన్యూ అధికారులే వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తారని భావించినట్లు పేర్కొంటున్నారు. తీరా పుష్కర ఘాట్ల వద్ద సరైన వసతులు కల్పించకపోవడంతో లాడ్జీల్లో సిబ్బంది ఉండాల్సి వచ్చిందని, హోటళ్లలో తినాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎస్పీహెచ్వోలు ఆ నిధులను నేరుగా ఖర్చు చేయడం జరిగిందని వివరిస్తున్నారు. బాసరలో ఈ పరిస్థితి తీవ్రంగా రావడంతోనే సమస్య ఉత్పన్నమైందని చెబుతున్నారు. బాసరలో సాధారణ పరిస్థితులో ఉన్న రేట్ల కంటే పుష్కరాలు కొనసాగిన రోజుల్లో ధరలు అధిక శాతం ఉండడంతో పరిస్థితులు తారుమారయ్యాయని చెబుతున్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధులు నేరుగా ఖర్చుకావడంతో ఇప్పుడు టీఏ, డీఏలు ఇవ్వలేని పరిస్థితి ఉందని పేర్కొంటున్నారు. ఈ దృష్ట్యా ప్రభుత్వం మళ్లీ నిధులు మంజూరు చేస్తేనే వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి టీఏ, డీఏలు ఇచ్చే పరిస్థితి కనబడుతోంది. సమన్వయలోపమేనా..? పుష్కరాల సమయంలో సేవందించిన ఉద్యోగులకు వసతి, భోజనాల విషయంలో వివిధ శాఖల అధికారుల మద్య సమన్వయలోపమే ఈ పరిస్థితికి కారణమన్నా వాదనలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ శాఖ అధికారులే అన్ని శాఖల సిబ్బందికీ వసతి, భోజనాలు ఏర్పాటు చేస్తారని భావించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ముందుగా ఎంత ఖర్చవుతుందనే విషయంలో సరైనా అంచనా వేయలేకపోయామని అంగీకరిస్తున్నారు. తీరా పుష్కరాల సమయంలో రెవెన్యూ సిబ్బంది వసతులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేట్ లాడ్జీలు, హోటళ్లలో సిబ్బందికి వసతి, భోజనాలు ఏర్పాటు చేశామని, బయట రేట్లు అధికంగా భారం అధికమైందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీనిపై డీఎంహెచ్వో రుక్మిణమ్మను వివరణ కోరగా, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఖర్చు కావడంతో సిబ్బందికి టీఏ, డీఏ ఇవ్వలేకపోయామని అంగీకరించారు. రూ.17 లక్షలు నిధులు అవసరమని డెరైక్టర్ ఆఫ్ హెల్త్కు రాయడం జరిగిందని, ఆ డబ్బులు రాగానే ఉద్యోగుల ఖాతాల్లో నేరుగా జమచేస్తామని చెప్పారు. -
రెవెన్యూ ఉద్యోగుల పోరుబాట
కలెక్టర్ తీరుపై రెవెన్యూ అధికారులు తిరుగుబావుటా ఎగురవేశారు. ఆయన తీరుకు నిరసనగా సోమవారం జిల్లా వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళనకు శ్రీకారం చుట్టారు. మంగళవారం అన్ని మండల కేంద్రాల నుంచి భారీ సంఖ్యలో రెవెన్యూ అధికారులు తరలివెళ్లి కలెక్టరేట్ ముట్టడికి సన్నద్ధమయ్యారు. వీరిని నయానో భయానో ఆందోళన విరమించేలా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సాక్షి ప్రతినిధి, తిరుపతి: కలెక్టర్తీరుపై రెవెన్యూ అధికారులు భగ్గుమన్నారు. ఆయన తీరుకు నిరసనగా సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. మంగళవారం కలెక్టరేట్ ముట్టడికి సన్నద్ధమయ్యారు. అవమాన పరిచారు.. ప్రతిఏటా ప్రతిభచూపిన ఉద్యోగులకు మంత్రి చేతు ల మీదుగా సత్కరించి అవార్డులు ఇవ్వడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది రెవెన్యూ ఉద్యోగులకు కలెక్టర్ మొండిచేయి చూపారు. అవార్డులు ఇస్తామని జిల్లా కేంద్రానికి పిలిపించి అవమానపరిచారు. ఇది రెవెన్యూ ఉద్యోగులను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. రెవెన్యూ శాఖకు సంబంధించిన ఉద్యోగ సం ఘాలు చిత్తూరులో సమావేశమై ఆయన తీరును నిరసిస్తూ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ఉద్యమ కార్యాచరణ ఇలా.. జిల్లా వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ ఉద్యోగులు మంగళవారం సామూహిక సెలవు పెట్టి చలో చిత్తూరు, కలెక్టరేట్ ముట్టడికి సన్నద్ధమయ్యారు. 3వేల మంది ఉద్యోగులతో ముట్టడి చేపట్టాలని తీర్మానించారు. గ్రామసభలు వాయిదా వేయాలని నిర్ణయించారు. గ్రామస్థాయిలో వీఆర్ఏ నుంచి తహశీల్దార్ వరకు 65 బస్సుల్లో చిత్తూరు చేరుకునేలా ప్రణాళిక రచిం చారు. మంగళవారం జిల్లాలో సీఎం పర్యటన కార్యక్రమాలను,సైతం బహిష్కరించాలని నిర్ణయించారు. బెదిరింపులు.. బేరసారాలు రెవెన్యూ ఉన్నతస్థాయి ఉద్యోగి ఇప్పటికే 66 మంది తహశీల్దార్లతో బేరసారాలకు దిగినట్లు తెల్సింది. కలెక్టరేట్ ముట్టడిని విరమించి ఉద్యోగులు విధుల్లో పాల్గొనాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం పర్యటనకు హాజరు కావాలని తమతో చర్చించేందుకు పాలనాధికారి సిద్ధంగా ఉన్నారంటూ ఉద్యోగ సంఘాల నాయకులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు మధ్యవర్తుల ద్వారా వ్యక్తిగతంగా బెదిరింపులు ప్రారంభమయినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. మాట వినకపోతే ఏసీబీ అధికారులతో దాడులు చేయిస్తామని హెచ్చరికలు చేసినట్లు సమాచారం. ప్రభుత్వానికి చెడ్డపేరువస్తే వదిలేప్రసక్తే లేదని కొంతమంది అధికారుల ద్వారా ఉద్యోగులను దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. సంఘాలను విడగొట్టే ప్రయత్నాలూ ప్రారంభమయ్యాయి. రెవెన్యూ వేదన ‘కలెక్టర్ తీరుతో 16 నెలలుగా ఎంతో మానసిక వేదన అనుభవించాం. కష్టాలు..నష్టాలకోర్చాం. అవమానాలు భరించాం.. ఇక ఉపేక్షించేదిలేదు.. ఎన్ని ఒత్తిడిలు వచ్చినా వెనక్కి తగ్గేది లేదు.. ’ అంటూ రెవెన్యూ అధికారులు తమ ఆవేదనను వెళ్లగక్కారు. దళిత ఉద్యోగులే ఆయనకు టార్గెట్ ఓ దళిత ఉన్నత రెవెన్యూ అధికారితో పాటు మరో ఉన్నతాధికారి నిత్యం మానసిక క్షోభకు గురయ్యేలా వేధింపులు ఓ సీనియర్ అసిస్టెంట్ను జూనియర్ అసిస్టెంట్గా డీమోట్ చేసిన వైనం. పనివేళలతో సంబంధం లేకుండా వీడియో, సెట్, మొబైల్ కాన్ఫరెన్స్లు.. శని, ఆదివారాల్లో సమీక్షలు సమావేశాలు.. సాయంత్రం 5 గంటలకు సెట్కాన్ఫరెన్స్ అంటే రాత్రి 10 గంటలకు {పారంభమవుతున్న తీరు. అవమానం స్వాతంత్య్ర దినోత్సవం రోజు రెవెన్యూ ఉద్యోగులకు అవార్డులు ఇస్తామంటూ చిత్తూరుకు పిలిపించి అవమానించి వెనక్కు పంపారు. సమావేశాల్లో తరచూ ‘రెవెన్యూ ఉద్యోగులు దొంగలంటూ వ్యాఖ్యలు’ -
ఏసీబీ వలలో వీఆర్ఓ
నకిరేకల్ : రెవెన్యూశాఖలో అవినీతి పెచ్చుమీరుతోంది. మండల అధికారులతోపాటు కిందిస్థాయి ఉద్యోగులు కూడా ప్రజలనుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. లంచాలను తినడం మరిగిన వీఆర్ఓ అలవాటులో భాగంగా ఓ రైతునుంచి పట్టామార్పిడీకోసం రూ.8వేలు డబ్బులు తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన ఎక్కడోకాదు నకిరేకల్ తహశీల్దార్ కార్యాలయంలోనే పట్టపగలు జరిగింది. నల్లగొండ ఏసీబీ డీఎస్పీ కోటేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం వివరాలిలా.. నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామ శివారులోని అడవిబొల్లారం గ్రామానికి చెందిన చిక్కుల్ల లింగయ్య అనే రైతు నకిరేకల్లో నివాసముంటున్నాడు. మూడేళ్ల కిందట తండ్రి సోమయ్య చనిపోగా అతని పేర ఉన్న 7ఎకరాల 7గుంటల భూమిని తల్లి, తన పేరు మీద మార్చాలని ఏడాది కిందట రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు విచారణ చేసిన వీఆర్ఓ వెంకటేశ్వర్లు చుట్టూ మూడు నెలలుగా తిరుగుతున్నాడు. *50వేలు ఇస్తేగాని పట్టా మార్పిడీ జరగదని ఖరాకండీగా చెప్పాడు. దీంతో రైతు అంత పెద్ద మొత్తం ఇవ్వలేనని తాను కూడా అప్పులలో ఉన్నానని *8వేలు ఇస్తానని రాజీకుదిర్చాడు. తనను ఇంతలా వేదించిన వీఆర్ఓను వదిలేదిలేదని ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు వేసిన పథకం ప్రకారం గురువారం ఉదయం తహశీల్దార్ కార్యాలయంలో *8వేల నగదును తీసుకొచ్చాడు. వాటిని వీఆర్ఓ వెంకటేశ్వర్లుకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి *8వేలు, డాక్యూమెంట్స్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసి ఏసీబీ కోర్టులో సమర్పిస్తామని డీఎస్పీ బి కోటేశ్వర్రావు, ఇన్స్పెక్టర్ లింగయ్య విలేకరులకు తెలిపారు. అవినీతి అధికారులను పట్టించాలనుకునేవారు 7382625525 నంబర్కు సంప్రదించాలని కోరారు. ఇంత అన్యాయమా.. : చిక్కుల లింగయ్య (రైతు) మా తండ్రి పేరు మీద ఉన్న భూమిని తన పేరు మీద నా తల్లి పేరుమీద మార్పిడీ చేసుకునేందుకు ఏడాదికాలంగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. వీఆర్ఓ అన్యాయంగా రూ.50వేలు అడిగాడు. చివరికి తగ్గించుకుంటూ, కాళ్లవేళ్లాపడి *8వేలకు బేరం కుదిరింది. కష్టపడిన సొమ్ము అవినీతి అధికారి చేతిలో పెట్టలేక ఏసీబీకి ఫిర్యాదు చేశాను. -
పేదల ఇళ్లు క్రమబద్ధీకరణ
సాక్షి, హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాల్లో పేదలు ఏర్పాటు చేసుకున్న ఇళ్లను వందగజాల వరకూ ఉచితంగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో పేదల నివాసాలను గరిష్టంగా వందగజాల వరకూ క్రమబద్ధీకరిస్తున్నట్లు రెవెన్యూ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దారిద్య్రరేఖకు దిగువనున్న పేదలు నివాసం కోసం వేసుకున్న గుడిసెలు, ఇళ్లకే ఇది వర్తిస్తుంది. ఆక్రమించుకున్న స్థలాలకు క్రమబద్ధీకరణ జీవో వర్తించదని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ బుధవారం జారీ చేసిన జీవో 296లో స్పష్టం చేశారు. జీవోలోని ముఖ్యాంశాలు, విధి విధానాలిలా ఉన్నాయి. ⇒ గతేడాది జనవరి ఒకటో తేదీ నాటికి ఉన్న ఆక్రమిత ఇళ్లకే క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. ⇒ అభ్యంతరంలేని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమిత నివాసాల క్రమబద్ధీకరణ అని ఈ పథకాన్ని పిలుస్తారు. అమలు ఈ నెల 15 నుంచి ఆరంభమవుతుంది. ‘మీసేవ’ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ⇒ క్రమబద్ధీకరణ కోసం ఈ నెల 15 నుంచి 120 రోజుల్లోగా ‘మీసేవ’ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను సంబంధిత తహశీల్దార్లకు పంపుతారు. సబ్ కలెక్టరు/ రెవెన్యూ డివిజనల్ అధికారి అధ్యక్షతన డివిజనల్ స్థాయి రెగ్యులరైజేషన్ కమిటీ (డీఎల్ఆర్సీ)ని ఏర్పాటు చేస్తారు. ఇందులో ఆయా మున్సిపాలిటీల పట్టణ ప్రణాళిక అధికారి సభ్యునిగానూ, తహశీల్దారు సభ్య కన్వీనరుగాను ఉంటారు. తహశీల్దారు ప్రతి దరఖాస్తు వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి క్రమబద్ధీకరణకు అర్హమైనదో కాదో నిర్ధారించడం కోసం డీఎల్ఆర్సీకి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం తహశీల్దార్లకు జిల్లా కలెక్టరు/రాష్ట్ర భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) నిర్దిష్ట ప్రొఫార్మా, చెక్లిస్టు పంపుతారు. మహిళల పేరిటే పట్టాలు ⇒ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మహిళల పేరిట రూపొందిస్తారు. కుటుంబంలో మహిళలు లేని పక్షంలో కుటుంబ పెద్ద అయిన పురుషుని పేరుతో తయారు చేస్తారు. ⇒ అందిన ప్రతి దరఖాస్తును 90 రోజుల్లోగా పరిష్కరించాలి.హాడీఎల్పీసీ నిర్ణయంపై సంతృప్తి చెందని పక్షంలో దరఖాస్తుదారు 90 రోజుల్లోగా జేసీ-1కు అప్పీల్ చేసుకోవచ్చు. ఈ ప్రాంతాలకు వర్తించదు... ⇒ అభ్యంతరంలేని ఆక్రమిత ప్రభుత్వ స్థలాలను మాత్రమే పరిశీలనలోకి తీసుకుంటారు. ⇒ మాస్టర్ప్లాన్, జోనల్ డెవలప్మెంట్ ప్లాన్, రోడ్ల అభివృద్ధి ప్రణాళికకు ఇబ్బంది కలిగించే ప్రాంతాల్లోని దరఖాస్తులను, అనుమతించిన లేఅవుట్లలోని ఖాళీ స్థలాలనూ పరిశీలించరు. నీటివనరులు, శ్మశాన వాటికలు, నీటిపారుదల, తాగునీటి ట్యాంకులు ప్రాంతాల్లోని ఆక్రమణదారుల దరఖాస్తులను అనుమతించరు. ప్రజావసరాలకు పనికొచ్చే స్థలాలు, అతి విలువైన స్థలాలనూ ఈ జీవో నుంచి మినహాయిస్తారు. ⇒ పట్టా పొందిన రెండేళ్ల తర్వాత ఆ స్థలాలపై వారికి పూర్తి వారసత్వ హక్కులు లభిస్తాయి. -
దళితులు.. భూమి.. ఒక ఏడాది!
సాక్షి, హైదరాబాద్: దళితులకు భూపంపిణీ పథకం అమలు నత్తనడకన సాగుతోంది. మార్గదర్శకాల్లో అస్పష్టత కారణంగా పథకం అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. లబ్ధిదారులకు కూడా సరైన వసతులు కల్పించడంలేదు. మరోవైపు ఈ పథకం కింద ఆగస్టు 15న మరో 650 మందికి పట్టాలను పంపిణీ చేయడానికి రంగం సిద్ధమైంది. స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్లో 250 మందికి, మహబూబ్నగర్ 200, వరంగల్ 150 , నల్లగొండ 50, ఆదిలాబాద్లో 25 మందికి పట్టాలు ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ పథకాన్ని చారిత్రక గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ ప్రారంభించి ఆగస్టు 15 నాటికి ఏడాది పూర్తి కానుంది. ఈ ఏడాదిలో 1,349 మంది లబ్ధిదారులకు 3,600 ఎకరాలను పంపిణీ చేశారు. వారిలో 893 మందికి 2,400 ఎకరాల భూమి రిజిస్టర్ చేయగా, వారిలో 743 మందికి పట్టాలు పంపిణీ చేశారు. మిగిలినవారితోపాటు మరో 500 మంది లబ్ధిదారులకు ఆగస్టు 15న పట్టాలు పంపిణీ చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే భూమిని పొందిన లబ్ధిదారుల్లో అన్నిరకాల వసతులు అందినవారు తక్కువగా ఉన్నారు. భూపంపిణీ పథకం ఆచరణలో కొన్ని జిల్లాలు మరీ వెనుకబడి ఉన్నాయి. గత ఆగస్టు 15 నుంచి ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో 22 మందికి 59 ఎకరాలు, రంగారెడ్డిలో 22 మందికి 65 ఎకరాల మేర మాత్రమే పంపిణీ చేశారు. ఇక ఈ ఏడాది అంటే ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు ఖమ్మంలో ఒక్క ఎకరం కూడా పంపిణీ కాలేదు. ఇక రంగారెడ్డి జిల్లాలో ఆరుగురు లబ్ధిదారులకు 17 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారు. మెదక్లో అత్యధికంగా 356 మందికి 864 ఎకరాలు పంపిణీ చేయగా అందులో 217 మందికి భూమి రిజిస్టర్ చేసి, పట్టాలు కూడా పంపిణీ చేశారు. ఇక ఆదిలాబాద్లో 244 మందికి 706 ఎకరాలు, మహబూబ్నగర్లో 174 మందికి 512 ఎకరాలు, కరీంనగర్లో 167 మందికి 434 ఎకరాలు, వరంగల్లో 137 మందికి 392 ఎకరాలు, నల్లగొండలో 123 మందికి 290 ఎకరాలు, నిజామాబాద్లో 104 మందికి 283 ఎకరాలు పంపిణీ అయ్యాయి. ఈ పథకం అమలుపై మొత్తంగా రెవెన్యూశాఖపై ఆధారపడాల్సి రావడం, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఆర్డీవోలు సరైన శ్రద్ధ తీసుకోకపోవడం కూడా ప్రధానసమస్యగా మారింది. ఎన్ని నెలల్లో ఎంత భూమి పంపిణీ చేయాలన్న దానిపై స్పష్టత కరువైంది. భూమి కొనుగోలు నిబంధనలపై స్పష్టత కొరవడడంతో పథకం అమలు నత్తనడకన సాగుతోంది. -
రెవెన్యూ లీలలు
తిమ్మిని బమ్మిని చేయడం రెవెన్యూ అధికారులకు వెన్నతో పెట్టిన విద్య. ఉన్న భూమిని లేనట్లు, లేని భూమిని ఉన్నట్లు, అసలు భూమే లేకుండా ఆధారాలు సృష్టించడం..ఒకరి పేరుతో ఉన్న భూమిని మరొకరి పేరుతో మార్చేయడం ఇవన్నీ వారి చేతుల్లో పనులే.. భూముల ఆన్లైన్ విధానంతో నకిలీ పాస్పుస్తకాలు, రికార్డుల తారుమారు వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కందుకూరు రెవెన్యూ డివిజన్లో ఈ తరహా అక్రమాలు కోకొల్లలుగా వెలుగుచూస్తున్నాయి. - ఒక్కొక్కటిగా బయట పడుతున్న నకిలీ పాసుపుస్తకాలు, రికార్డుల తారుమారు వ్యవహారం - మీ-భూమి, ఆన్లైన్ విధానంతో వెలుగులోకి వస్తున్న సమస్యలు - డివిజన్లో 4,172 భూ సంబంధిత సమస్యలు పెండింగ్ కందుకూరు : రెవెన్యూశాఖలో పారదర్శకత కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన మీ-భూమి, ఆన్లైన్ విధానంతో రెవెన్యూ అధికారుల ఘనకార్యాలు బయటపడుతున్నాయి. సర్వేనంబర్ ఒకటే, భూమి ఒకటే కానీ ఇద్దరికి పాస్పుస్తకాలు ఇవ్వడం, రికార్డులో ఒకరు పేరు, పాస్ పుస్తకాలు మరొకరి పేరుపై ఉండడం ఇలా కోకొల్లలుగా ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలు వస్తుండడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రస్తుతం రెవెన్యూ డివిజన్లో 4 వేలకుపైగా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో రెవెన్యూ అధికారులు చేసిన కొన్ని లీలలు ఇలా ఉన్నాయి... - కందుకూరు పట్టణానికి సమీపంలో చుట్టుగుంటకు పోయే రోడ్డులో పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి 3 ఎకరాలకు పైగా పొలం ఉంది. ఈ పొలం వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని రెండేళ్ల నుంచి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అయినా స్పందించకపోవడంతో చివరికి గట్టిగా నిలదీశాడు. దీంతో అసలు విషయం బయటపడింది. మీ భూమి ఎప్పుడో అమ్మేశారు కదా ఇంకా ఆన్లైన్ ఎలా అవుతాయంటూ సమాధానం చెప్పారు. ఈసీ, ఇతర ఒరిజినల్ డ్యాక్యుమెంట్ల ఆధారంగా నిలదీయడంతో ఈ పొలానికి నకిలీ పాసు పుస్తకాలు, డాక్యుమెంట్లు తయారు చేసి పట్టణంలోని ఓ బ్యాంక్లో రూ.3 లక్షలకుపైగా రుణం తీసుకున్నారు. ఈ కుట్రకు పాల్పడింది ప్రస్తుతం తహ శీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ వీఆర్వో కావడం గమనార్హం. చివరికి అక్రమం బయపడడంతో సదరు వీఆర్వో కాళ్లావేళ్లా పడి ఎవరికీ చెప్పవద్దు, నేను రికార్డులు మార్చి ఇస్తానని చెప్పి నాలుగు రోజుల్లో రికార్డులు మార్చి పొలానికి చెందిన యజమానులకు అప్పగించారు. ఇటీవల కందుకూరు తహ శీల్దార్ కార్యాలయంలో ఓ వీఆర్వో చేసిన ఘనకార్యం ఇది. - ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో సర్వే నంబర్ 1230/ఎలో వెంకటకృష్ణారెడ్డి అనే వ్యక్తి పేరుపై 3.10 ఎకరాల భూమి ఉంది. తహశీల్దార్ ఆర్సి 165/2009 ఉత్తర్వుల ప్రకారం సదరు భూమి 15 సెంట్లు తగ్గించి దేవరపల్లి మల్లికార్జునరెడ్డి పేరుపై 7.5 సెంట్లు, మాలకొండారెడ్డి పేరుపై 7.5 సెంట్లు ఉన్నట్లు పాస్పుస్తకాలు ఇచ్చారు. కానీ ఆర్సి 165/2009 తహ శీల్దార్ ఉత్తర్వుల ప్రకారం సర్వేనంబర్ 582లో కుమ్మరిభారతి అనే మహిళపై 80సెంట్లు భూమి ఉన్నట్లు పాస్పుస్తకాలు జారీ చేశారు. ఇదీ కరేడు గ్రామంలో 2009లో జరిగిన సంఘటన ప్రస్తుతం ఆర్డీఓ దృష్టికి సమస్య వచ్చింది. - వెలిగండ్ల మండలం కొత్త కండ్రిక గ్రామానికి చెందిన ముక్కు తిరుపతయ్య తనకు సర్వేనంబర్ 282/2, 284/1 సర్వేనంబర్ 5 ఎకరాల పొలం ఉంది. కానీ తనతో పాటు మరొకరి పేరు ఈ ఐదు ఎకరాలకు అధికారులు పట్టాదారు పాస్పుస్తకాలు జారీ చేశారు. దీనిపై గతంలో గ్రామసభలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ముక్కు తిరుపతయ్య ఆర్డీవో దృష్టికి తెచ్చారు. - ఇలా ఒకటి కాదు, రెండు కాదు వేల సంఖ్యలో వెలుగులోకి వస్తున్న భూ సంబంధిత సమస్యలు ఆశాఖ ఉన్నతాధికారులను కలవరపెడుతున్నాయి. ఆర్డీఓ కార్యాలయంలో జరిగే ప్రజావాణి కార్యక్రమానికి 90శ ాతం భూసంబంధిత సమస్యలే వస్తున్నాయి. అదే సందర్భంలో ఇటీవల కనిగిరిలో రెండు నకిలీ పాస్పుస్తకాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పట్టుబడిన నకిలీ పాస్పుస్తకాల వివరాలు రికార్డుల్లో లేవు. నకిలీ స్టాంప్లు తయారు చేసి పాస్పుస్తకాలు సృష్టించినట్లు అధికారుల విచారణలో తేలింది. ఆర్డీఓ దగ్గర ఉన్న మరికొన్ని నకిలీ పాస్పుస్తకాలపై విచారణ సాగుతోంది. ఇలా ఒక పక్క నకిలీ పాస్పుస్తకాల వెలుగు చూస్తుండడంతో మరోపక్క ఒకే సర్వేనంబర్ లోని భూమికి ఇద్దరు, ముగ్గురు పాస్పుస్తకాలు, డ్యాక్యుమెంట్లు తీసుకుని ఆ భూమి నాదేనని వస్తున్నారు. తీరా వారి వద్ద ఉన్న ఆధారాలు పరిశీలిస్తే అందరి పాస్పుస్తకాలపై తహశీల్దార్ల సంతకాలు ఉంటున్నాయి. దీంతో అసలు ఒరిజనల్ పాస్పుస్తకాలు ఎవరివో తేల్చడం అధికారులకు తలకు మించిన భారంగా మారింది. ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కేవలం భూసంబంధిత సమస్యలపై 4172 ఫిర్యాదులు వచ్చాయి. ఇవి కాక సర్వే కోసం 46, ప్రభుత్వ భూములకు సంబంధించి 9, ఇతర సమస్యలు 453 దరఖాస్తులు వచ్చాయి. ఆన్లైన్ విధానంలో వెలుగులోకి అక్రమాలు: ప్రభుత్వం భూముల వివరాల కోసం మీ-భూమి వెబ్సైట్ను రూపొందించింది. ఈ వెబ్సైట్లో ప్రతి గ్రామానికి సంబంధించిన సర్వేనంబర్ల వారీగా భూముల వివరాలు నమోదు చేయాలి. వాటితో పాటు, ప్రైవేట్ భూములకు సంబంధించి యజమానుల పేర్లు ఆన్లైన్లో ఉంచాలి. ఇదే ప్రస్తుతం అధికారులకు తలనొప్పిగా మారింది. ఆర్ఎస్ఆర్ రికార్డులో ఉన్న భూముల వివరాలకి, అధికారులు జారీ చేసిన పాస్పుస్తకాల వివరాల్లో ఉన్న భూములు సరిపోలకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఉదాహరణకు ఓ గ్రామంలో ఆర్ఎస్ఆర్ రికార్డు ప్రకారం సర్వేనంబర్ 100లో రామయ్య అనే వ్యక్తి పేరుపై 3 ఎకరాల భూమి ఉంటే, లంచాలకు కక్కుర్తి పడ్డ అధికారులు రికార్డులు తారుమారు చేసి 3.50 ఎకరాలకు పాస్పుస్తకాలు ఇచ్చారు. ఇప్పుడు ఈ భూమిని ఆర్ఎస్ఆర్ రికార్డు ప్రకారం ఆన్లైన్ చేయాలంటే వీలు కాని పరిస్థితి. ఇలా మండలాల వారీగా వందల ఎకరాల భూములు వివరాలు సరిపోలక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో కొందరు తహశీల్దార్లు పూర్తిస్థాయి భూముల వివరాలు ఆన్లైన్లో ఉంచలేకపోతున్నారు. రైతులు మాత్రం తమ భూములు ఆన్లైన్ చేయడం లేదంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సమస్యలు ఉన్నమాట వాస్తవమే -ఆర్డీవో మల్లికార్జున ఈ డివిజన్లో భూములకు సంబంధించిన సమస్యలు ఉన్న మాట వాస్తవమే. అన్రిజిస్టర్డ్ డ్యాక్యుమెంట్లతో సెటిల్మెంట్ చేసుకున్న సమస్యలు అధికంగా ఉన్నాయి. ఆర్ఎస్ఆర్ రికార్డు వివరాలకి, భూముల వివరాలకు సరిపోలడం లేదు. వీటిని ఇప్పటికప్పుడు పరిష్కరించడం సాధ్యం కాాదు. విచారణ జరిగి వాస్తవ లబ్ధిదారులు గుర్తించిన తరువాతే పరిష్కారమవుతాయి. -
ఆదాయ వనరులు పెంచాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: పన్నుల ద్వారా వచ్చే ఆదాయ వనరులను పెంచేందుకు విప్లవాత్మకమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. పన్నులు ఎగవేసే అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో వాణిజ్యపన్నుల శాఖ పనితీరుపై సీఎం సమీక్షించారు. వాణిజ్యపన్నుల ద్వారా వచ్చిన ఆదాయ వివరాలను పరిశీలించారు. జీరో వ్యాపారం, పన్ను ఎగవేత, తక్కువ పన్ను చెల్లించి ఎక్కువ వ్యాపారం చేయడం వంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించినట్లు తెలిసింది. తెలంగాణకు ఉన్న నాలుగు రాష్ట్రాలతో ఉన్న సరిహద్దుల్లో 14 చెక్పోస్టులున్నాయని, వాటిని మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఏపీతో సరిహద్దుల్లోని 7 చెక్పోస్టులకు భవనాలు లేవని, రోడ్లపైనే సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని సీటీ శాఖ అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. చెక్పోస్టులకు ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోతే ప్రైవేటు వ్యక్తులతో మాట్లాడి లీజు పద్ధతిన భూమి తీసుకొని చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించినట్లు సమాచారం. రెండు చెక్పోస్టులకు భూమి అందుబాటులో ఉందని అధికారులు పేర్కొనగా, వెంటనే పనులు జరిగేలా చూసేందుకు నిధులు కేటాయిస్తామని సీఎం చెప్పారు. వాణిజ్యపన్నుల శాఖలో ఉద్యోగాల నియామకానికి ఇప్పటికే అనుమతిచ్చామని, ఇంకా ఖాళీలు ఉంటే వాటిని కూడా భర్తీ చే స్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, కమిషనర్ వి.అనిల్ కుమార్, అదనపు కమిషనర్లు చంద్రశేఖర్రెడ్డి, రేవతి రోహిణి (ఎన్ఫోర్స్మెంట్)తో పాటు సీఎంవో ముఖ్య కార్యదర్శులు నర్సింగరావు, శాంతికుమారి హాజరయ్యారు. -
అధికారం అండతో...
రూ. లక్షలాది విలువగల ఇసుక తరలింపు వనజాక్షి ఘటనతో మౌనం వహించిన రెవెన్యూశాఖ పాలకొండ : అమాంతంగా పెరిగిన ఇసుక ధరలు పచ్చచొక్కాలకు లక్షలాది రూపాయలు అర్జించే కల్పతరువుగా మారింది. పాలకొండ మండలంలో నిరాంటకంగా ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నా అధికారులు నిద్రనటిస్తున్నారు. డివిజన్ కేంద్రంలో ప్రభుత్వం ఇసుక ర్యాంపులను గతంలో తలవరం, అన్నవరం గ్రామాల వద్ద ఏర్పాటు చేసింది. ఇక్కడ ఇసుక నిల్వలు పూర్తి కావడంతో ర్యాంపులు మూసేశారు. ఐదు మండలాలతోపాటు విశాఖనగరానికి ఇక్కడి నుంచే ఇసుక వెళ్లాల్సి ఉండటంతో అమాంతంగా ఇసుక ధరలు పెరిగాయి. ఇదే అదనుగా అధికార పార్టీ నేతల అండదండలు ఉన్న వారు దోపిడీకి తెరతీశారు. మండలంలోని గోపాలపురం కేంద్రంగా దర్జాగా ఇసుక ర్యాంపును ఏర్పాటు చేసి లక్షలాది రూపాయలు విలువ చేసే ఇసుకను తరలిస్తున్నారు. మొదట్లో రాత్రి పూట అరకొర వాహనాలతో ఇసుక తరలించే వారు. ప్రస్తుతం రోజూ రాత్రి 8గంటల నుంచి వేకువ జాము 4 గంటల వరకు నిరాంటంకంగా 20 ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టరు ఇసుకను రూ.3వేలు నుంచి రూ.4వేలు వరకు విక్రయిస్తున్నారు. ఇందులో పాలకొండ పట్టణానికి చెందిన ఒక వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నారు. సొంతంగా ట్రాక్టర్లను ఏర్పాటు చేసి ఇసుకను తరలిస్తున్నారు. దీన్ని ఎవరూ ప్రశ్నించినా బెదిరింపులకు దిగుతున్నారు. రెవెన్యూ మౌనం ఇంత భారీ స్థాయిలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా రెవెన్యూ యంత్రాంగం మౌనం వహించింది. ఇటీవల కృష్ణ జిల్లా ముసునూరు మండలంలో తహశీల్దారు వనజాక్షి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవడం, ఆమెపై దాడి చేసిన సంఘటనపై సాక్షాత్తూ ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరును గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రే అక్రమ ఇసుక రవాణాను ప్రోత్సాహిస్తున్నారని తామెందకు కోరి కష్టాలు తెచ్చుకోవడమని మౌనం వహించినట్టు తెలుస్తోంది. కాగా దీనిపై ఆర్డీవో సాల్మన్రాజు మాట్లాడుతూ ఇకపై దాడులు సాగిస్తామని తెలిపారు. -
అవ్హాడ్ భద్రత ప్రభుత్వానిదే..
♦ స్పష్టం చేసిన రెవెన్యూ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే ♦ అవ్హాడ్పై దాడి సిగ్గుచేటన్న ఎన్సీపీ అధినేత శరద్పవార్ ♦ ‘చిక్కీ’ కుంభకోణం విషయంలో జాతీయ పత్రికకు నోటీసు ♦ ఘనంగా సీఎం పుట్టిన రోజు వేడుకలు ♦ శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన విద్యార్థులు ముంబై : ఎన్సీపీకి చెందిన శాసన సభ్యుడు జితేంద్ర అవ్హాడ్ భద్రత రాష్ట్ర ప్రభుత్వానిదేనని రెవెన్యూ శాఖ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే అసెంబ్లీలో స్పష్టం చేశారు. అవ్హాడ్పై జరగుతున్న దాడి గురించి బుధవారం సభలో ఎన్సీపీ సభ్యుడు దిలీప్ వల్సే పాటిల్ లేవనెత్తారు. సాంగ్లీలో అవ్హాడ్పై దాడి జరిగిందని, ఫోన్, సోషల్ మీడియా ద్వారా ఆయనకు బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. అవ్హాడ్పై దాడిపై ఆందోళన చెందుతూ సీఎం ఫడ్నవీస్కు ఎన్సీపీ అధినేత శరద్పవార్ లేఖ కూడా రాశారని తెలిపారు. ‘కార్యసాధక, ప్రగతిశీల భావాలున్న వ్యక్తులపైనే రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి. అలాంటి వారిపై దాడులు జరగడం సిగ్గుచేటు. అవ్హాడ్పై జరుగుతున్న దాడిపై సీఎం చర్యలు తీసుకోవాలి. ఆయనకు భద్రత ఏర్పాటు చేయాలి. ఒక సీఎంగా, హోంశాఖ మంత్రిగా అవ్హాడ్కు భద్రత కల్పించడం మీ కర్తవ్యం. మీరు మీ కర్తవ్యాన్ని నెరవేరుస్తారనే అనుకుంటున్నాను’ అని పవార్ లేఖలో పేర్కొన్నారు. దాడి చేస్తున్న వారిని పట్టుకోవాలని ప్రభుత్వాన్ని దిలీప్ వల్సే పాటిల్ డిమాండు చేశారు. స్పందించిన స్పీకర్ హరిబావ్ బగ్డే, మొత్తం వ్యవహారంపై ఓ ప్రకటన చేయాల్సిందిగా ప్రభుత్వానికి సూచించారు. ఎమ్మెల్యేలను మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజలకు రక్షణ ఏర్పాటు చేయడం మా బాధ్యత. అవ్హాడ్కు భ ద్రత కల్పిస్తాం. బెదిరింపుల విషయంపై విచారణకు ఆదేశిస్తాం’ అని ఖడ్సే సభలో చెప్పారు. ఆ పత్రికపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ‘చిక్కీ’ కుంభకోణానికి సంబంధించిన నివేదికను విధానసభలో చర్చించక ముందే ప్రచురించిన ఓ జాతీయ పత్రికపై బీజేపీ శాసనసభ్యుడు ప్రశాంత్ బాంబ్ సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేశారు. ‘చిక్కీ’ కొనుగోలు విషయంలో రూ.206 కోట్ల కుంభకోణం జరిగిందంటూ రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజ ముండే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ‘అసెంబ్లీలో వార్తా నివేదిక గురించి ఇంకా చర్చ జరగలేదు. సంబంధిత శాఖ నుంచి నిజానిజాలు బేరీజు వేసుకున్న తర్వాత వార్తను ప్రచురించాల్సి ఉంటుంది. కానీ ఆ పత్రిక అవేమీ చేయలేదు. మంత్రి వివరణను ప్రచురించినప్పటికీ పాత విషయాలపై మాత్రమే కేంద్రీక ృతమై ఉంది. ఇది ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చడమే’ అని ఔరంగాబాద్ జిల్లా గంగాపూర్ నియోజవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ బాంబ్ విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారం మీద ప్రశ్నోత్తరాల సమయంలో రాతపూర్వకంగా మంత్రి సమాధానమిచ్చిందని, రేట్ కాంట్రాక్ట్ బేసిస్ మీదే చిక్కీ, కిచిడీ కొనుగోళ్లు జరిపామని, అయితే ఆ పద్దతిలో రూ. కోటి ఆపైన కొనుగోళ్లపై రాష్ట్రంలో నిషేధం ఉందని ఒప్పుకున్నట్లు ఆ పత్రిక ప్రచురించింది. దీనికి వివరణ ఇచ్చిన పంకజ ముండే, ‘రేట్ కాంట్రాక్ట్ సిస్టమ్ను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం నిజమే. ఈ పద్దతి ప్రకారం వస్తువు ధర, కాంట్రాక్టర్ వంటి విషయాలను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. టెండర్ల ప్రక్రియను పరిశ్రమలు లేదా ఆర్థిక శాఖలు చూసుకుంటాయి. ఇక్కడ రేట్ కాంట్రాక్ట్ లిస్ట్ పైనే వస్తువులు అమ్మకం జరుగుతుందనే విషయం తెలుస్తోంది. మళ్లీ టెండర్లు పిలవాల్సిన పనిలేదు’ అని వివరించారు. ప్రైవేటు కోచింగ్ సెంటర్ల నియంత్రణకు చట్టం రాష్ట్రంలోని ప్రైవేటు కోచింగ్ క్లాసులపై నియంత్రణ విధించేందుకు కొత్త చట్ట తీసుకొస్తామని విద్యాశాఖ మంత్రి వినోద్ తావడే విధాన సభలో తెలిపారు. కొత్త చట్టానికి న్యాయ శాఖ ఇప్పటికే పచ్చజెండా ఊపిందని, అడ్వొకేట్ జనరల్ నుంచి కూడా ప్రభుత్వం అభిప్రాయం తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రైవేటు కోచింగ్ సెంటర్లు 100 శాతం ఫలితాలు తీసుకొస్తామని ప్రకటనలు గుప్పిస్తున్నాయని, దీనిపై ప్రభుత ్వం తీసుకుంటున్న చర్యలేంటో తెలపాలని కాలింగ్ అటెన్షన్ మోషన్ ద్వారా బీజేపీ సభ్యుడు సర్దార్ తారా సింగ్ మంత్రిని ప్రశ్నించారు. దీనికి వివరణ ఇచ్చిన తావడే, ‘ప్రైవేటు కోచింగ్ క్లాసులపై ప్రభుత్వ నియంత్రణ లేదు. ప్రైవేటు కోచింగ్ క్లాసులపై నియంత్రణ అనే ప్రతిపాదన గతంలో సభ ముందుకు వచ్చింది. అయితే ఇప్పటికే చట్టం రూపుదిద్దుకోలేదు’ అని చెప్పారు. ‘శౌర్య’కు కాల్బాదేవీ మృతుల పేర్లు కాల్బాదేవీ అగ్నిప్రమాదంలో మృతి చెందిన నలుగురు అగ్నిమాపక శాఖ అధికారుల పేర్లను శౌర్య పతకాలకు సిఫారసు చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీకి పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసన మండలిలో ఎన్సీపీ ఎమ్మెల్సీ సునీల్ తట్కరే ఇచ్చిన కాలింగ్ అటెన్షన్ మోషన్లో మాట్లాడుతూ మంత్రి రంజత్ పాటిల్ తెలిపారు. ఆ అధికారులకు అమరవీరులుగా గుర్తింపు ఇస్తారా అని ప్రశ్నించిన కపిల్ పాటిల్కు సమాధానమిస్తూ, సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించిన వారికే ఆ గుర్తింపు ఇస్తారని రంజిత్ వివరించారు. అయితే వారందరి పేర్లను శౌర్య పథకాలకు రాష్ట్రపతికి సిఫారసు చేశామని చెప్పారు. సీఎంవోకు ధన్యవాదాలు: సీఎం ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినందుకు సీఎంవోకు ధన్యవాదాలు. అంతకంటే ముందుగా జల్యుక్త్ శివార్ పథకానికి ఒక రోజు జీతాన్ని విరాళమిచ్చినందుకు నా హృదయపూర్వక అభినందనలు’ అని సీఎం ఫడ్నవీస్ పేర్కొన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా జలసంరక్షణ పథకానికి సీఎం కార్యాలయ ఉద్యోగులు విరాళం ఇవ్వడం సంతోషంగా ఉందని ట్వీట్ చేవారు. జల్ యుక్త్ శివార్కు రూ.25 వేలు చొప్పున విరాళమిచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు ఆశిశ్ శేలర్, అమిత్ సతామ్కు కృతజ్ఞతలు తెలిపారు. ‘నాపుట్టిన రోజును జరుపుకోవద్దు. ప్రకటనలు, బానర్లు కట్టొద్దు. ఆ డబ్బును జలయుక్త్ శివార్కు విరాళమివ్వండి’ అని సందేశమిచ్చారు. -
కౌలు.. ఇక మేలు
జోగిపేట : కౌలు రౌతులకు ఇక మంచి రోజులే.. పట్టాదారులకు తప్ప ఆ భూమిలో కౌలు వ్యవసాయం చేస్తున్న రైతులకు పంట రుణాలు అందడం లేదని గుర్తించిన ప్రభుత్వం భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా... వారి అనుమతి పొందిన కౌలు రైతులకు ప్రయోజనం చేకూర్చేలా రుణ అర్హత కార్డులను జారీ చేయనుంది. జిల్లాలో రెండేళ్ల క్రితం 2070 మంది కౌలు రైతులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మీ సేవ ద్వారా... కౌలు రైతులకు కార్డులను మీ సేవ కేంద్రాల ద్వారా అందించాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసింది. వీటిని పొందాలనుకునే వారు, పునరుద్ధరణ చేసుకునే వారి కోసం దరఖాస్తులను సమీపంలోని మీ సేవ, గ్రామ మండల రెవెన్యూ కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. దరఖాస్తులో కౌలుకు తీసుకున్న భూమి వివరాలతో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పాన్ కార్డు నంబర్లలో ఏదో ఒకటి తప్పనిసరిగా నమోదు చేయా ల్సి ఉంటుంది. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీ లించి గ్రామ సభ ద్వారా అధికారులు విచారణ చేస్తారు. నిర్ధారణ తర్వాత 15 రోజుల్లో కార్డులు పొందే అవకాశం ఉంటుంది. గత ఏడాది రుణ అర్హత కార్డులు పొందిన వారు కూడా రెన్యూవల్ చేసుకోవాలి. లేకుంటే అవి చెల్లుబాటు కావు. కార్డు పొందిన నాటి నుంచి మే 31 వరకు మాత్రమే చెల్లు బాటులో ఉంటుంది. ఈసారి కౌలు రైతుల సంఖ్య పెరగవచ్చని అధికారుల అంచనా. గ్రామ సభలతో అవగాహన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కౌలు రైతులకు రుణాలను అందించే విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. దీనిలో భాగంగా గ్రామ గ్రామాన రైతులతో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వం కల్పించే సౌకర్యాలపై వివరిస్తారు. గ్రామాల్లో ఆర్ఐ, వీఆర్ఓలు గ్రామ సభలు నిర్వహిస్తారు. అర్హత పొందిన ఎల్ఈసీల వివరాలు ఇంకా తెలియలేదు. - డీఆర్ఓ దయానంద్ రుణాలు అందేలా చూస్తాం 2013-14 సంవత్సరంలో జిల్లా లో 2070 మంది కౌలు రైతులకు అర్హత కార్డులను పంపిణీ చేశాం. అందులో 935 మంది బ్యాంకుల ద్వారా రూ.447 లక్షల రూపాయల రుణాలను పొందారు. 2015-16కు మీసేవ ద్వారా కార్డులు పొందిన తరువాత బ్యాంకుల ద్వారా రుణాలను అందించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం సూచించిన విధంగా కౌలు రైతులు రుణ అర్హత కార్డులను పొందాలి. - హుక్యానాయక్, వ్యవసాయశాఖ జేడీఏ రుణాలు కల్పిస్తే మంచిది ప్రభుత్వం కౌలు రైతులకు రుణాలు కల్పిస్తే మంచిది. పట్టా రైతులతో సమానంగా విత్తనాలు, ఎరువులను అందజేయాలని నిర్ణయించడం ఊరట కలిగించే అంశం. రెండు సంవత్సరాల క్రితం బ్యాంకులు రుణాలను అందజేశారు. కానీ ఇప్పుడు మాకు ఎలాంటి సౌకర్యాలూ లేవు. బ్యాంకులు కూడా అర్హులందరికీ రుణాలిచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. - మల్లయ్య, కౌలు రైతు -
పుష్కరాల్లో కనిపించని కేఈ
పక్కనపెట్టిన సీఎం దేవాదాయ మంత్రి మాణిక్యాలరావుకూ దక్కని ప్రాధాన్యత హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పుష్కరాల్లో కీలక బాధ్యత నిర్వహించాల్సిన రెవెన్యూ శాఖను పర్యవేక్షించే కేఈ కృష్ణమూర్తి ఈ మహాక్రతువుకు దూరంగా ఉన్నారు. పుష్కరాల విషయంలో ముఖ్యమంత్రి చ ంద్రబాబు ఆయనను పూర్తిగా పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ నెల 14న పుష్కరాలు ప్రారంభమైనప్పటి నుంచి కనీసం దరిదాపుల్లోకి కూడా కేఈ కృష్ణమూర్తి రాలేదు. పుష్కరాలకు ఆరు నెలల ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ప్రభుత్వం నిర్వహించిన ఏ సమీక్షా సమావేశంలోనూ ఆయన పాల్గొనలేదు. అదే సమయంలో పుణ్య స్నానాలకు ప్రధాన కేంద్రమైన రాజమండ్రి లో పర్యటించలేదు. మరో నాలుగు రోజుల్లో పుష్కరాలు ముగియనుండగా ఇప్పటివరకు ఉప ముఖ్యమంత్రి అటువైపు వెళ్లకపోవడం అధికార టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. బుధవారం రాజమండ్రిలో జరగనున్న మంత్రివర్గ సమావేశానికైనా ఆయన హాజరవుతారా? అనేది అనుమానంగానే ఉంది. ఇన్నిరోజులుగా కేఈ దూరంగా ఉన్నా చంద్రబాబు ఏనాడూ వాకబు చేయకపోగా ఆయన గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. పుష్కరాల కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంతో పాటు ఏ ఒక్క కమిటీలోనూ ఆయనను నియమించలేదు. ఏపీ రాజధాని భూ సేకరణ విషయంలోనూ కేఈని దూరం పెట్టిన విషయం తెలిసిందే. పుష్కరాల విషయంలో దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావును కూడా మొదటినుంచీ చంద్రబాబు దూరం పెడుతూ వచ్చారు. పుష్కరాల వ్యవహారాలను మంత్రి నారాయణకు అప్పగించారు. కొద్ది రోజుల కిందట మంత్రి మాణిక్యాలరావుకు చిన్నపాటి శస్త్ర చికిత్స జరిగిందని, అందువల్ల విశ్రాంతి తీసుకుంటున్నారని, పుష్కరాలు ముగిసిన తరువాత విధులకు హాజరవుతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరో మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా పుష్కరాలకు దూరంగా ఉంటున్నారు. అన్ని జిల్లాల మంత్రులు అక్కడే మకాం వేసినా గంటా అటువైపు వెళ్లడం లేదు. పుష్కరాల విషయంలో మంత్రివర్గంలోని కొందరికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్న కారణంగానే గంటా దూరంగా ఉంటున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. -
ఇదేం దోపిడీ బాబూ!
ఎకరా రూ. 25 లక్షల విలువైన భూమికి రూ. 2.25 లక్షల పరిహారం సాక్షి, హైదరాబాద్: ఎకరా రూ. 25 లక్షల మార్కెట్ విలువగల భూమిని నిరుపేదల నుంచి తీసుకున్న ప్రభుత్వం అందుకు ప్రతిగా నిర్వాసితులకు ఎకరాకు రూ. 2.25 లక్షల నామమాత్రపు పరిహారం చెల్లిస్తుందట. కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు రెవెన్యూ శాఖ జారీ చేసిన ఉత్తర్వు ఇది. విశాఖ జిల్లాలోని ఫార్మా సెజ్ కోసం భీమునిపట్నం మండలం అన్నవరం, చిప్పాడల్లో 25.74 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి ప్రభుత్వం కేటాయించింది. దీని మార్కెట్ ధరను అధికారులు ఎకరాకు రూ. 25 లక్షలుగా ప్రతిపాదించారు. దీన్ని భూ యాజమాన్య సంస్థ కూడా ఆమోదించినా, ఎకరా రూ. 12 లక్షల ధరతోనే ఏపీఐఐసీకి 25.74 ఎకరాలు కేటాయించాలని ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం తీర్మానించింది. ఇలా సగం కంటే తక్కువ ధరకే ఫార్మా సెజ్కు భూమిని కట్టబెట్టింది. కాగా ఈ భూమిలో కొంత అసైన్మెంట్ భూమి ఉంది. ఈ భూమి యజమానులకు ఎకరాకు రూ. 2.25 లక్షల పరిహారం మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తామనడం విచిత్రం. దీనిపై రెవెన్యూ అధికారులే ఆశ్చర్య పోతున్నారు. -
భూముల క్రమబద్ధీకరణ షురూ!
* చెల్లింపు కేటగిరీ మార్గదర్శకాలకు సవరణ * ఆగస్టు 15న పట్టాల పంపిణీ! సాక్షి, హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ ఇక ఊపందుకోనుంది. చెల్లింపు కేటగిరీలో ప్రభుత్వం ఇంతకుముందు ఇచ్చిన మార్గదర్శకాలను తాజాగా సవరించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ తాజాగా చెక్ మెమోను జారీ చేసింది. దీంతో చెల్లింపు కేటగిరీ దరఖాస్తులను మండలస్థాయి అధికారులు దుమ్ముదులిపే పనిలో పడ్డారు. నెలాఖరులోగా దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేసి ఆగస్టు 15న పట్టాల పంపిణీని లాంఛనంగా చేపట్టాలని సర్కారు సన్నాహాలు చేస్తోంది. సర్కారు సూచనల మేరకు జీవో 59 కింద క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని భూపరిపాలన విభాగం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలందాయి. ప్రస్తుతానికి పాత దరఖాస్తులకే.. చెల్లింపు కేటగిరీలో తొలుత 29,281 దరఖాస్తులు రాగా, ఉచితకేటగిరీలో దరఖాస్తు చేసుకున్న 16,915 మందిని పరిశీలన అనంతరం చెల్లింపు కేటగిరీలోకి చేర్చారు. దీంతో చెల్లింపు కేటగిరీలో ప్రభుత్వం వద్దనున్న దరఖాస్తుల సంఖ్య 46,196 చేరింది. ఉచిత కేటగిరీ నుంచి చెల్లింపు కేటగిరీకి మార్చిన దరఖాస్తుదారుల నుంచి సొమ్ము వసూలుపై సర్కారు ఆదేశాలివ్వకపోవడంతో ప్రస్తుతానికి పాత దరఖాస్తులను మాత్రమే పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. చెక్ మెమోలో ప్రధానంగా దరఖాస్తుదారుడు, కుటుంబ సభ్యుల వివరాలతోపాటు భూమి, నిర్మాణంపై ఎక్కువ అంశాలను పొందుపర్చారు. క్రమబద్ధీకరణ కోరుతున్న భూమి నలువైపులా ఫొటోలు, అందులోని నిర్మాణానికి సంబంధించిన ఫొటోను అధికారులు సేకరించాలి. ఏవైనా కోర్టు కేసులు ఉన్నట్లయితే పూర్తి వివరాలను సేకరించాలి. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఒకేసారి సొమ్ము చెల్లించినవారికి 5 శా తం రాయితీ ఇవ్వనున్నారు. పరిశీలన అనంతరం చెల్లించినవారికి రిజిస్ట్రేషన్ చేసి కన్వీనియన్స్ డీడ్లను అందజేస్తారు. వాయిదాల పద్ధతిన చెల్లిస్తున్నవారికి ఎండార్స్మెంట్ పత్రాలను ఇవ్వనున్నారు. -
19 మంది డిప్యూటీ తహశీల్దార్ల బదిలీలు
సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా రెవెన్యూ శాఖలో భారీగా బదిలీలయ్యాయి. ప్రభుత్వ భూముల పరిరక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న అధికారయంత్రాంగం రెవెన్యూ శాఖలో బదిలీలకు శ్రీకారం చుట్టింది. కొందరు అధికారులు ఏళ్ల తరబడి ఒకే కార్యాలయంలో తిష్టవేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో రెవెన్యూ శాఖలో పెద్దఎత్తున బదిలీలు చేపట్టినట్లు చర్చసాగుతోంది. ఈ తరుణంలో జిల్లా రెవెన్యూ శాఖ పరిధిలోని మండల తహశీల్దార్ల కార్యాలయాలతోపాటు కలెక్టరేట్లోని వివిధ విభాగాలలో పని చేస్తున్న 19 మంది డిప్యూటీ తహశీల్దార్లను బదిలీ చేస్తూ బుధవారం కలెక్టర్ కె.నిర్మల ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన డిప్యూటీ తహశీల్దార్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. -
కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు
మీ సేవ కేంద్రాల ద్వారా జారీకి రెవెన్యూశాఖ ఏర్పాట్లు ♦ కార్డున్న వారికే పథకాల లబ్ధి ♦ ఈ ఏడాది కొత్తగా 2.5 లక్షల మందికి కార్డులు ♦ పాత కార్డులున్న రైతులకు పునరుద్ధరణ ♦ ప్రతి కార్డుకు ‘ఆధార్’ అనుసంధానం సాక్షి, హైదరాబాద్: కౌలు రైతులందరికీ బ్యాంకు రుణాలను అందించే ఉద్దేశంతో.. ప్ర భుత్వం కొత్తగా రుణ అర్హత కార్డు (ఎల్ఈసీ)లను అందజేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.20 లక్షలమంది కౌలురైతులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే రుణ అర్హత కార్డులున్న 2.70 లక్షల మందికి ఈ ఏడాది వాటిని పునరుద్ధరించనున్నారు. కార్డులు లేని సుమారు 2.5 లక్షల మంది కౌలు రైతులకు వాటిని కొత్తగా అందజేయాలని సర్కారు తాజాగా నిర్ణయించింది. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు సబ్సిడీతో అందజేస్తున్న విత్తనాలు, పురుగు మందులు, వ్యవసాయ పనిముట్లను ఇకపై కౌలు రైతులకూ అందజేయనుంది. బ్యాంకుల ద్వారా పంట రుణాలతో పాటు, మార్కెట్ యార్డుల్లో పంటలను నిల్వ ఉంచుకునే సదుపాయం, కనీస మద్దతు ధరను పొందే అవకాశం.. తదితర అంశాల్లోనూ వారికి బాసటగా నిలవాలని భావిస్తోంది. బ్యాంకుల రుణాలు ఇప్పటివరకు భూముల యజమానులకే అందుతున్నాయని, వాస్తవానికి వ్యవసాయం చేస్తున్న రైతులకు అందడం లేదని ప్రభుత్వం గుర్తించింది. భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా, వారి అనుమతి పొందిన కౌలు రైతులకు ప్రయోజనం చేకూర్చేలా వీటిని జారీ చేయనుంది. ప్రయోజనాలు ఇలా.. రుణ అర్హత కార్డులను పొందనున్న కౌలురైతులకు ఇకపై బ్యాంకుల నుంచి పంట రుణాలతో పాటు ప్రభుత్వం రైతాంగానికి అందిస్తున్న వివిధ రకాల సబ్సిడీలు, మౌలిక సదుపాయాలను పొందేందుకు వీలు కలగనుంది. ప్రకృతి విపత్తులతోగానీ, వ్యవసాయ పరికరాల లోపం వల్ల గానీ పంట నష్టపోతే బీమా ద్వారా పరిహారాన్ని పొందవచ్చు. ఈ కార్డులను ఆధార్కు అనుసంధానం చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలను మరింత పటిష్టంగా అమలుచేయొచ్చని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. భూమిపై హక్కును క్లెయిం చేసుకునేందుకు గానీ, సమర్థించుకునేందుకు గానీ ఈ కార్డులను సాక్ష్యంగా వినియోగించుకునేందుకు వీలు కాదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.మీ సేవ ద్వారా ఎల్ఈసీలు జారీ కౌలు రైతులకు ఎల్ఈసీలను మీ సేవకేంద్రాల ద్వారా అందించేందుకు రెవెన్యూశాఖ ఏర్పాట్లు చేసింది. వీటిని పొందాలనుకునే/ రెన్యువల్ చేసుకోవాలనుకునే వారు దరఖాస్తులను సమీపంలోని మీ సేవకేంద్రాల్లో, గ్రామ లేదా, మండల రెవెన్యూ కేంద్రాల్లో ఉచితంగా పొందవచ్చు. దరఖాస్తులో కౌలుకు తీసుకున్న భూమి వివరాలతో పాటు తమ ఆధార్/రేషన్ కార్డు/ఓటర్ ఐడీ/పాన్ కార్డు నంబర్లలో ఏదో ఒకటి తప్పనిసరిగా నమోదు చేయాలి. కార్డు పొందేందుకు రూ.35 రుసుము చెల్లించాలి. మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి గ్రామసభ ద్వారా అధికారులు విచారణ చేస్తారు. వెరిఫికేషన్ పూర్తయిన 15 రోజుల్లో కొత్త/ రెన్యువల్ కార్డులను మీసేవ కేంద్రాల నుంచే పొందవచ్చు. ఈ కార్డు ఏడాది (జూన్ 1 నుంచి మే 31 వరకు) మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. ప్రతిఏటా రెన్యువల్ చేయించుకోవాలి. -
‘నాలా’ నిబంధనతో అసలుకే మోసం!
వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా వినియోగ మార్పిడి చేసినందుకు రెవిన్యూ శాఖకు ‘నాలా’ చార్జీలు చెల్లించాలనే నిబంధన ఇప్పుడు హెచ్ఎండీఏ ఆదాయానికి గండికొడుతోంది. కొత్తగా నిర్మాణాలు చేపట్టబోయే రియల్టర్లు హెచ్ఎండీఏ అనుమతి కోసం దరఖాస్తు చేస్తే..తప్పకుండా ‘నాలా (నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్)’ చార్జీలు చెల్లించాలని నిబంధన విధించడంతో వారు వెనక్కు తగ్గుతున్నారు. ఫలితంగా హెచ్ఎండీఏ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే దాదాపు రూ.100 కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. సిటీబ్యూరో: కొత్త లే అవుట్స్కు పర్మిషన్ పొందాలంటే తప్పనిసరిగా ‘నాలా’ (నాన్ అగ్రికల్చర్ ల్యాండ్-ఎన్ఏఎల్ఏ-కన్వర్షన్) చార్జీలు చెల్లించాలన్న నిబంధనే హెచ్ఎండీఏ కొంప ముంచింది. ఈ నిబంధన వల్లే సుమారు రూ.100 కోట్ల ఆదాయం సంస్థకు అందకుండా పోయిందని ఉద్యోగులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. కొత్త లేఅవుట్కు అనుమతివ్వాలంటే వ్యవసాయ భూమిని నివాస వినియోగ భూమిగా మార్చడానికి ఎకరానికి 10 శాతం చార్జీ చెల్లించాలని గతంలో ప్రభుత్వం నిబంధన విధించింది. అయితే... దీన్ని హెచ్ఎండీఏలో పక్కాగా అమలు చేయలేదు. ఈ కారణంగా ఇప్పటివరకు రెవిన్యూ శాఖకు రూ.1000 కోట్ల వరకు ఆదాయం అందకుండా పోయిందన్న విషయం తేలడంతో హెచ్ఎండీఏ కమిషనర్ శాలినీ మిశ్రా లోతుగా దీనిపై అధ్యయనం చేసి ఇకపై కొత్త లే అవుట్లకు అనుమతుల విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు పక్కాగా అమలు చేయాలని నిర్ణయించారు. నాలా యాక్టు- 2006 ప్రకారం రెవెన్యూ శాఖకు ఎకరానికి 10 శాతం ‘నాలా చార్జీ’ చెల్లించి ఆర్డీఓ నుంచి ఎన్ఓసీ తీసుకువచ్చాకే కొత్త లే అవుట్స్కు పర్మిషన్లు ఇవ్వాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ తాజా నిర్ణయం ఇటు ప్లానింగ్ విభాగం అధికారులకు, అటు రియల్టర్లకు మింగుడుపడడం లేదు. ఇప్పటికే 100 ఫైళ్లకు (దరఖాస్తులకు) అప్రూవల్ ఇస్తూ హెచ్ఎండీఏ డీసీ (డెవలప్మెంట్ చార్జెస్) లెటర్లు జారీ చేసింది. అయితే... దరఖాస్తుదారులు ఫీజును చెల్లించేందుకు ముందుకు రాగా నాలా చార్జి చెల్లించాల్సిందేనని మెలికపెట్టడంతో వారంతా వెనుదిరిగారు. ఇదే అదనుగా భావించి ప్రస్తుతం ప్రాసెసింగ్లో ఉన్న మరో 100 ఫైళ్లను కూడా సిబ్బంది పరిష్కరించకుండా పక్కకు పడేశారు. దీంతో దాదాపు200 ఫైళ్ల వరకు పెండింగ్లో పడిపోయాయి. ఫలితంగా గడచిన 2 నెలల వ్యవధిలో హెచ్ఎండీఏ ఖజానాకు జమ కావాల్సిన సుమారు రూ.100 కోట్లు అందకుండా పోయాయని సిబ్బంది పేర్కొంటున్నారు. సంస్థకే నష్టం ఇప్పటివరకు పట్టించుకోని నాలా చార్జీల నిబంధనను ఇప్పుడు తెరపైకి తేవడం వల్ల హెచ్ఎండీఏకే నష్టం వాటిల్లుతోంది తప్ప ప్రభుత్వానికి ఒరిగే ప్రయోజనం ఏమీ లేదని ప్లానింగ్ విభాగం అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటివరకు మొదట టెక్నికల్ అప్రూవల్ ఇస్తూ, భవన నిర్మాణ సమయంలో మాత్రం నాలా చార్జీలు స్థానిక సంస్థలకు చెల్లించి ఎన్ఓసీ తెచ్చుకోవాలని సూచించేవారు. ఇప్పుడు కొత్త కమిషనర్ ఆదేశాల వల్ల రెవిన్యూ శాఖ నుంచి ఎన్ఓసీ తీసుకురాని వారికి పర్మిషన్లు నిలిపేశామంటున్నారు. కాగా రియల్టర్లు మాత్రం కోర్టు నుంచి అనుమతి తీసుకువచ్చి పర్మిషన్లు పొందుతున్నారు. మా వల్ల కాదు: రియల్టర్లు మాస్టర్ ప్లాన్ ప్రకారం భూ వినియోగ మార్పిడి కింద తాము ఇప్పటికే చార్జీలు చెల్లించామని, మళ్లీ నాలా పేరుతో అదనపు భారం మోపడం ఎంతవరకు సమంజసమని రియల్టర్లు ప్రశ్నిస్తున్నారు. అసలే రియల్ మాంద్యం, పెరిగిన ఖర్చులతో సతమతమవుతుండగా నాలా చార్జీలు మరింత భారం అవుతున్నాయని వాపోతున్నారు. -
క్రమబద్ధీకరణ సొమ్ము చెల్లింపు గడువు పెంపు
చెల్లింపు కేటగిరీ ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు కొత్త మార్గదర్శకాలు హైదరాబాద్: చెల్లింపు కేటగిరీలో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం లబ్ధిదారులు సొమ్ము చెల్లించేందుకు సర్కారు మరింత గడువిచ్చింది. గతంలో ఇచ్చిన వాయిదాల కాలపరిమితి షెడ్యూలును తాజాగా సవరించింది. ఈ మేరకు శనివారం కలెక్టర్లకు రెవెన్యూశాఖ ఉత్తర్వులు పంపింది. తాజాగా విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్ 15 లోగా చెల్లించాల్సిన రెండవ వాయిదా గడువును ఆగస్టు 31 వరకు పెంచారు. జూన్ 30తో ముగిసిన వాయిదా గడువును సెప్టెంబర్ 30 వరకు, సెప్టెంబర్ 30తో ముగియనున్న నాలుగో ఇన్స్టాల్మెంట్ గడువును నవంబర్ 15 వరకు పొడిగించారు. చివరి ఇన్స్టాల్మెంట్ గడువును యథావిధిగా (డిసెంబర్ 31) ఉంచినట్లు షెడ్యూల్లో ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అలాగే.. చెల్లింపు కేటగిరీలో ఆయా స్థలాలను క్ర మబద్ధీకరించేందుకు అధికారులు పాటించాల్సిన నిబంధనలతో రెవెన్యూ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. సోమవారం నుంచి చెల్లింపు కేటగిరీ దరఖాస్తుల పరిశీలనను ప్రారంభించి, ఆగస్టు 15 లోగా విచారణ ప్రక్రియను పూర్తి చేయాలని మండలాల తహశీల్దార్లకు ఆదేశాలు అందాయి. కొత్త మార్గదర్శకాలు ఇలా.. చెల్లింపు కేటగిరీ (జీవో 59) కింద దరఖాస్తు చేసుకున్న కుటుంబంలోని మహిళ పేరిటే స్థలాన్ని క్రమబద్ధీకరించాలి. మహిళలు లేని పక్షంలోనే దరఖాస్తులో పేర్కొన్న వ్యక్తి పేరిట కన్వీనియన్స్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయాలి. దరఖాస్తుదారు వివరాలను నిర్ధారించుకునేందుకు ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లెసైన్స్.. తదితర గుర్తింపు కార్డులు పరిశీలించాలి. దరఖాస్తులో పేర్కొన్న స్థలం అభ్యంతర కరమైనదో, కాదో నిర్ధారించుకోవాలి. ఎఫ్టీఎల్, శిఖం, కోర్టుకేసులున్న భూముల క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులను తిరస్కరించాలి. అభ్యంతరం లేని భూములైనప్పటికీ అవి ఏ ప్రభుత్వ విభాగానికి చెందినవన్న సమాచారాన్ని సేకరించాలి. ఆయా విభాగాల నుంచి అనుమతి పొందాకే క్రమబద్ధీకరణ చేపట్టాలి. దరఖాస్తులో పేర్కొన్న స్థలాన్ని ఫొటో తీయాలి. స్థలం రిజిష్ట్రేషన్ ధర, లబ్ధిదారు చెల్లించిన సొమ్మును పరిశీలించాలి. ఈ వివరాలన్నింటితో చెక్మెమోను ఆర్డీవో ఆధ్వర్యంలోని కమిటీ అనుమతించాకే దరఖాస్తుదారు పేరిట ఆ స్థలాన్ని క్రమబద్ధీకరించాలి. ఈ ప్రక్రియలో ఏ దశలోనైనా దరఖాస్తును తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉంది. -
ఖరీఫ్ సుభిక్షమేనా!
* 45 మండలాల్లోనే దుర్భిక్షమంటూ రెవెన్యూ శాఖ లెక్కలు * అంతకుమించే ఉంటుందంటోన్న వ్యవసాయాధికారులు * మహబూబ్నగర్, మెదక్ జిల్లాల్లో కురవని వాన * రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోనూ వర్షాభావమే * తప్పుడు లెక్కలు చూపుతోన్న అధికార యంత్రాంగం సాక్షి, హైదరాబాద్ : రాష్ర్టంలో ఈ నెల 1 వ తేదీ నుంచి ఇప్పటికే అధిక వర్షపాతం నమోదైంది.. పంటల సాగూ గణనీయంగా పెరిగింది.. అని పేర్కొంటూ అధికారులు నివేదికల మీద నివేదికలు విడుదల చేశారు. కానీ, వాస్తవ పరిస్థితుల్లోకి వెళితే మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా, మరికొన్ని జిల్లాల్లో వర్షాలు అసలే కురియలేదు. రుతుపవనాలు సకాలంలో వచ్చినా కొన్ని మండలాల్లో అసలు వర్షాలే పడలేదు. అయితే ప్రభుత్వం మాత్రం అధిక వర్షపాతం మండలాలను ఎక్కువ చేసి చూపిస్తూ... వర్షాభావ మండలాల సంఖ్యను తక్కువ చూపిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ప్రకారమే జిల్లాల నుంచి రెవెన్యూ యంత్రాంగం తప్పుడు లెక్కలు చూపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. 45 మండలాలకే పరిమితం.. వ్యవసాయ సీజన్ మొదలైన జూన్ 1వ తేదీ నుంచి 308 మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షాలు కురిశాయని రెవెన్యూ యంత్రాంగం చెబుతోంది. 106 మండలాల్లో సాధారణ వర్షాలు కురిశాయని, కేవలం 40 మండలాల్లో లోటు వర్షపాతం, ఐదు మండలాల్లో తీవ్ర లోటు పరిస్థితులు నెలకొన్నాయని ఆ శాఖ తాజా నివేదికలో పేర్కొంది. మహబూబ్నగర్ జిల్లాల్లోని 64 మండలాల్లో 21, మెదక్ జిల్లాలోని 46 మండలాలకు గాను 11 మండలాల్లో లోటు, తీవ్ర లోటు మండలాలున్నాయని వెల్లడించింది. విచిత్రమేంటంటే నల్లగొండ జిల్లాల్లో 59 మండలాలుంటే కేవలం ఒక్క యాదగిరిగుట్ట మండలంలోనే లోటు వర్షపాతం నమోదైందని వెల్లడించింది. కానీ, ఆ జిల్లాలో కనీసం 15 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైందని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలోనూ 6 మండలాల్లో లోటు వర్షపాతం ఉందని పేర్కొంటే... 10 మండలాల్లో చుక్క వర్షం కురియలేదు. మరో విచిత్రమేంటంటే మహబూబ్నగర్ జిల్లాలో జూన్ ఒకటో తేదీ నుంచి ఈ నెల 24వ తేదీ వరకు జరగాల్సిన సాధారణ సాగులో ఏకంగా 85 శాతం జరిగినట్లు చెప్పారు. మెదక్ జిల్లాలో 248 శాతం, నల్లగొండ జిల్లాలో 351 శాతం, రంగారెడ్డి జిల్లాలో ఏకంగా 479 శాతం సాగు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ లెక్కల ప్రకటనపై వ్యవసాయ అధికారులు నోరెళ్లబెడుతున్నారు. తప్పుడు కొలమానాలు.. వర్షపాతం అంచనా వేయడానికి సరైన కొలమానాలు, వాతావరణ నిపుణులు లేకపోవడంతో లెక్కల్లో శాస్త్రీయత లోపిస్తోందన్న విమర్శలున్నాయి. రాష్ట్రంలో కేంద్ర వాతావరణ శాఖ (ఐఎండీ)కు చెందిన అబ్జర్వేటరీలు కేవలం నిజామాబాద్, రామగుండం, హైదరాబాద్లలో మాత్రమే ఉన్నాయి. ఈ మూడుచోట్ల మాత్రం ఐఎండీ నిపుణులు పూర్తి శాస్త్రీయ పద్ధతిలో వర్షపాతాన్ని లెక్కిస్తారు. ఇక మిగతా చోట్ల అంటే దాదాపు ప్రతి మండలంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అబ్జర్వేటరీలు ఉన్నాయి. ఇవి రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంటాయి. ఈ అబ్జర్వేటరీల నాణ్యత, వీటి నుంచి విడుదల చేసే వాతావరణ లెక్కల శాస్త్రీయత సందేహాస్పదమే. ఐఎండీ అధికారుల్లోనూ దీనిపై అనుమానాలు ఉన్నాయి. అయితే పరిస్థితి అంతా బాగుందన్న విధానంపైనే అధికారులు దృష్టి సారిస్తుండడంతో.. దీనిని పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అసలు కరువు, దుర్భర పరిస్థితులను తక్కువ చేసి చూపించాలని కొందరు అధికారులు కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. -
పట్టాల పంపిణీ మూడు జిల్లాల్లోనే!
⇒ పేదలకు లక్ష ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వ నిర్ణయం ⇒ హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకే పరిమితం ⇒ గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా సర్కారు కసరత్తు సాక్షి, హైదరాబాద్: పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ రోజును పురస్కరించుకొని జూన్ 2నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. గత డిసెంబర్లో ప్రభుత్వం ప్రకటించిన ఉచిత క్రమబద్ధీకరణ ప్రక్రియకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి మూడున్నర లక్షలమందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం పట్టాలు పొందేందుకు అర్హులైన వారిని (సుమారు లక్షన్నర మందిని) అధికారులు ఎంపిక చేశారు. అర్హుల జాబితాలో పది జిల్లాలకు చెందిన పేదలు ఉండగా, ప్రస్తుతానికి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మూడు జిల్లాలకే పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో రెండు జిల్లాలు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు కాగా, మూడవదైన మెదక్ జిల్లాలో కేవలం రెండు మండలాల (పటాన్చెరు, రామచంద్రాపురం)లో మాత్ర మే పట్టాలను పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించినట్లు సమాచారం. సమస్యాత్మకమైనవే ఎక్కువ.. ప్రభుత్వ భూముల్లోని ఆక్రమణలను క్రమబద్ధీకరించేందుకు గత డి సెంబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (58, 59)జారీచేసింది. ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ, యూఎల్సీ భూము ల్లో ఆక్రమణలకే ఈ సదుపాయం వర్తిస్తుంది. క్రమబద్ధీకరణ ప్రక్రియకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,66,150 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. వీటిలో ఉచిత కేటగిరీ కింద 3,36, 869 దరఖాస్తులు రాగా, చెల్లింపు కేటగిరీలో కేవలం 29,281 దరఖాస్తులే వచ్చాయి. ఉచిత క్రమబద్ధీకరణకు అందిన దరఖాస్తుల్లో అభ్యంతరకర భూములకు చెందినవి అధికం గా ఉన్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. వీటిలో కేంద్ర ప్రభుత్వ, రైల్వే, మిలటరీ.. తదితర సంస్థల భూములకు చెందిన దరఖాస్తులు లక్షకుపైగా ఉన్నట్లు నిర్ధారించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే.. ఇప్పటికే పట్టా ఉన్నవి, మున్సిపల్, దేవాలయ/దర్గా భూములు, మురుగు కాలవలు, రహదారుల వెంబడి, శ్మశానవాటికలు, శిఖం భూములు, కోర్టు కేసుల్లో ఉన్నవి, హౌసింగ్బోర్డు, జీపీడబ్ల్యుడీ, నిజాం నవాబువి, నాన్ ఐఎస్ఎఫ్, విద్యాశాఖ, దేవాదాయశాఖ.. తదితర 21 రకాల అభ్యంతరకరమైన భూములకు సంబం ధించి దరఖాస్తులు సుమారు లక్ష వరకు ఉన్నట్లు తెలిసింది. గ్రేటర్ పరిధిలో క్రమబద్ధీకరణ ఇలా.. అందిన దరఖాస్తులు : 2,11,798 కేంద్ర ప్రభుత్వ భూములకు చెందినవి : 84,403 పట్టాలకు ఎంపికైన అర్హులు: 99,580 సిద్ధంగా ఉన్న పట్టాలు: 65,673 రాష్ట్రవ్యాప్తంగా... అందిన దరఖాస్తులు: 3,36,869 కేంద్ర ప్రభుత్వ భూములకు చెందినవి: 1,03,331 పట్టాలకు ఎంపికైన దరఖాస్తులు: 1,43,783 సిద్ధమైన పట్టాలు: 82,024 గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే లక్ష్యం..! గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల దృష్ట్యా నగర పరిధిలో కనీసం లక్షమంది పేదలకైనా పట్టాలను పంపిణీ చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ కలెక్టర్లకు లక్ష్యా లు విధించినట్లు సమాచారం. గ్రేటర్ పరిధి లో 2.11లక్షల దరఖాస్తులు రాగా, ఇందులో పరిశీలన అనంతరం 99,580 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. ఇప్పటి వరకు 65,673 మందికి మాత్రమే ఇళ్ల పట్టాలను సిద్ధం చేశారు. అయితే.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి ఈ సంఖ్యను కనీసం లక్ష(పట్టాలను)కు చేర్చాలని కలెక ్టర్లకు సచివాలయం నుంచి ఆదేశాలందినట్లు తెలిసింది. -
క్రమబద్ధీకరణపై కసరత్తు!
- ఎక్కువ మందికి పట్టాలిచ్చేందుకు పరిశీలన - రెగ్యులరైజ్ చేసే కోణంలో రెవెన్యూ శాఖ చర్యలు - ఈ నెల 25 కల్లా తుది నిర్ణయం సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్లో జీవో 58 ప్రకారం ఉచిత క్రమబద్ధీకరణకు సంబంధించి సాధ్యమైనంత ఎక్కువ మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. ఈమేరకు గురువారం పలు శాఖల అధికారులతో సమీక్షలు, సమాలోచనలు జరిపింది. తద్వారా ఇళ్ల పట్టాలపై ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నది. వీలున్నంత మేరకు ఇళ్ల క్రమబద్ధీకరణపై ఉదారంగా వ్యవహారించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేయటంతో....చెరువులు, స్మశానవాటిక, లే అవుట్లలో ఖాళీ స్థలాలు, శిఖం భూములలోని నిర్మాణాలను కూడా రెగ్యులరైజ్ చేసే కోణంలో రెవెన్యూ శాఖ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ సంస్థలకు కేటాయించిన సర్కారీ భూముల్లో వెలిసిన నిర్మాణాల క్రమబద్ధీకరణపై సర్కారు కనికరిస్తే ఇళ్ల పట్టాలు పెంచవచ్చని యంత్రాంగం భావిస్తున్నది. పారిశ్రామిక, అటవీ, విద్య, నీటిపారుదల తదితర శాఖలకు బదలాయించిన స్థలాల్లో చాలా చోట్ల నిర్మాణాలు పుట్టుకొచ్చాయి. ఈ మేరకు క్రమబద్ధీకరణ చేయాలంటూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి 13,417 మంది దరఖాస్త్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించిన యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించగా...అక్కడి ఆదేశాలకు అనుగుణంగా వాటికి మోక్షం కలిగించే అంశంపై సీసీఎల్ఏ అధ్వర్యంలోని కమిటీ కసరత్తు చేస్తున్నది. ఈ దరఖాస్తుల్లో హైదరాబాద్ జిల్లాకు సంబంధించినవి 6,725, రంగారెడ్డి జిల్లావి 6,692 దరఖాస్తులు ఉన్నాయి. వచ్చే నెల 2 నుంచి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించటంతో.. ఆగమేఘాలపై వివిధ శాఖల నుంచి క్రమబద్ధీకరణకు సంబంధించి క్లియరెన్స్ కోసం అధికారయంత్రాంగం కుస్తీ పడుతొంది. ఈ మేరకు గురువారం ఆయా శాఖల ఉన్నతాధికారులు, సంబంధిత విభాగాలతో సమీక్షలు, చర్చలు జరిపారు. 25 వ తేదీ కల్లా కసరత్తు పూర్తి చేయాలని నిర్ణయించారు. -
రెవెన్యూ శాఖలో భూ మాఫియా
అవినీతిలో రెవెన్యూ సిబ్బంది సమాచార హక్కు చట్టాన్ని గౌరవించాల్సిందే సమాచారం ఇవ్వని అధికారులపై చర్యలు ఆర్టీఐ రాష్ట్ర కమిషనర్ విజయబాబు వెల్లడి తిరుపతి కార్పొరేషన్: ‘రెవెన్యూ శాఖలో భూ మాఫియా ఉంది, భూ రికార్డులు తారుమారు చేసి పేదల కడుపుకొడుతున్నారు, తద్వారా రెవెన్యూ సిబ్బంది కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతున్నారు’ అని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.విజయబాబు ఆరోపించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ భవనంలో మంగళవారం రాయలసీమ జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన సమాచార హక్కు చట్టం కేసుల విచారణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాచార హక్కు చట్టం కమిషన్ జారీచేసిన ఉత్తర్వులను సంబంధిత అధికారులు కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పా టైన సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనన్నారు. స్థానిక సంస్థల ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సమాచార హక్కు చట్టం 4(1),(బి) ప్రకారం సమాచారం ఇవ్వని అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీలో సమాచారం ఇవ్వకపోతే ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. రెండు రోజులుగా సమాచార హక్కు చట్టం కింద 30 కేసులు విచారించినట్టు ఆయన తెలిపారు. అందులో 3 కేసులు వాయిదా వేయగా, 9 కేసుల్లో షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. -
ఆదాయ పన్ను రేట్లు ఇంకొన్నాళ్లు యథాతథం
రెవెన్యూ శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ న్యూఢిల్లీ: రాబోయే నాలుగేళ్లలో కార్పొరేట్ ట్యాక్స్ 5% మేర తగ్గినా.. వ్యక్తిగత ఆదాయ పన్ను(ఐటీ) రేటు మాత్రం మరికొన్నాళ్లు యథాతథంగానే ఉండగలదని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం చూసినా వ్యక్తిగత ఆదాయానికి సంబంధించి 30% గరిష్ట పన్ను సరైనదేనని, దీన్ని రాబోయే 3-4 సంవత్సరాల పాటు కొనసాగించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం వార్షికంగా రూ. 10 లక్షలపైగా ఆదాయంపై 30 శాతం, రూ. 5-10 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ. 5 లక్షల కన్నా తక్కువ ఆదాయంపై 10 శాతం పన్ను ఉంటోంది. మరోవైపు, కార్పొరేట్ ట్యాక్స్ రేటులో కోతపై స్పందిస్తూ.. పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఆసియాన్ కూటమి దేశాలతో పోటీపడేందుకు ఈ చర్య ఉపయోగపడగలదని ఒక ఇంటర్వ్యూలో దాస్ పేర్కొన్నారు. చాలా మటుకు ఆగ్నేయాసియా దేశాలతో పోలిస్తే భారత్లోనే కార్పొరేట్ ట్యాక్స్ అధికంగా ఉందని, అందుకే దీన్ని తగ్గించాలని నిర్ణయించినట్లు వె ల్లడించారు. కార్పొరేట్లకు మేలు చేసేందుకే ఈ చర్య తీసుకున్నారన్న ఆరోపణలను దాస్ తోసిపుచ్చారు. ఇది కేవలం కంపెనీ స్థాయిలోనే ఉంటుందే తప్ప వ్యక్తిగతంగా ప్రమోటర్లకు గానీ షేర్హోల్డర్లకు గానీ ఎలాంటి ప్రయోజనాలూ ఉండవని గుర్తు చేశారు. కార్పొరేట్ల వద్ద మరిన్ని నిధులు ఉంటే మరిన్ని పెట్టుబడులు రాగలవని, తద్వారా మరింతగా ఉపాధి కల్పన జరగగలదన్నది ప్రభుత్వ ఉద్దేశం అని దాస్ చెప్పారు. సేవా పన్ను పెంపు సముచితమే.. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) విధానం అమలు దిశగా తాజా బడ్జెట్లో సర్వీస్ ట్యాక్స్ను 12.36 శాతం నుంచి 14 శాతానికి పెంచడం సరైన నిర్ణయమేనని మంగళవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా దాస్ తెలిపారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక సేవా పన్నును ఎకాయెకీన 12% నుంచి 22 %కి పెంచేస్తే ఎకానమీ భరించలేదన్నారు. 44 లక్షల మందిపై ఐటీ కన్ను... భారీ విలువ లావాదేవీలు జరిపినప్పటికీ ఇంకా ఐటీ రిటర్నులు దాఖలు చేయని 44,07,193 మంది కొనుగోలుదారులపై ఆదాయ పన్ను శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. వీరు ఈ నెలాఖరులోగా రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది, లేదంటే వారిపై తక్షణమే జరిమానాల విధింపు తదితర చర్యలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. -
ఏప్రిల్ నుంచి రైతు కార్డులు
మార్చి ఆఖరు నాటికి సర్వే పూర్తి ఇసుక తవ్వకాలతో స్థానికులకు లబ్ధి సీఎం హామీలపై దృష్టి ‘పది’ ఫలితాల కోసం ప్రత్యేక శిబిరాలు కలెక్టర్గా వాకాటి కరుణ తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలులో స్తబ్దతను తొల గించారు. గతంలో జిల్లాలో జేసీగా పనిచేసిన అనుభవంతో రెవెన్యూశాఖ పరంగా రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రయత్నిస్తున్నారు. వ్యక్తిగత పనులపై మార్చి 2 నుంచి 15 వరకు వెళ్తున్న కలెక్టర్ ఆదివారం ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడారు. సీఎం హామీల అమలు తీరు, ఇసుక క్వారీల కేటాయింపు, పరిపాలన పరంగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. వరంగల్పహాణీలు, పాస్పుస్తకాల కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. అన్నదాత తన భూమి వివరాల కోసం అధికారుల చుట్టూ తిరగడం.. వారిని తిప్పుకోవడం దురదృష్టకరం. అధికారుల ఆలోచన విధానంలో మార్పురావాలి. సాంకేతిక పరమైన అంశాల వల్ల సమస్యలు వస్తున్నాయి. ప్రస్తుతం అధికారులు అంతా కొత్తవారు వచ్చారు. పరిస్థితులు తప్పకుండా మారుతాయి. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేయాలి. ఈ విషయంలో ఇప్పటికే జిల్లా అధికారుల్లో కొంతమార్పు కనిపిస్తోంది. రెవెన్యూ యంత్రాంగం పని ఒత్తిడిలో ఉన్నా.. వ్యవసాయ శాఖతో కలిసి ఉమ్మడి సర్వే చేయాలని ఆదేశించాం. నెలాఖరు నాటికి పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చాం. రైతు కార్డులు జారీ.. జిల్లాలో రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా జీపీఎస్ పరికరాలతో రైతుల భూముల వివరాలు సర్వే చేస్తున్నారు. ఈ సర్వేలో పూర్తిగా వాస్తవ సమాచారం వస్తుంది. దీంతో రైతువారీగా ఎంత భూమి ఉంది? దాని స్వభావం ఏమిటి? ఎంత భూమిలో సాగు చేస్తున్నారు? రైతు పట్టాదారా? కౌలుదారా? అనే విషయాలు సేకరిస్తారు. వాటి ఆధారంగా పూర్తి వివరాలతో రైతు కార్డులు జారీ చేస్తాం. బ్యాంకు రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, ఎరువుల సరఫరా, పంట ఉత్పత్తుల అమ్మకం వంటి వాటిలో రైతు కార్డులనే పరిగణలోకి తీసకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. పాస్పుస్తకాల జారీ, మీసేవ పహాణీలు అప్డేట్ చేయడానికి కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయి. ఈ విషయంలో హైదరాబాద్ వారితో మాట్లాడాను. అయినా కొంత సమయం పడుతుంది. ఈ లోపు కార్డులు జారీ చేస్తే ఇక వాటితో రైతులకు అంతగా పని ఉండదు. పహాణీలకు ఆధార్ లింకు.. రైతుల భూమికి సంబంధించి.. మొత్తం భూమికి సర్వే నంబర్ల వారిగా రైతు ఆధార్ నంబర్ను జతచేసే ప్రక్రియ చేపడుతున్నాం. దీని వల్ల ఎవరికి వారు మార్పులు చేసే అవకాశం ఉండదు. ప్రసుత్తం భూ యజమానికి తెలియకుండానే వ్యక్తికి తెలియకుండానే పేర్లు.. చేతులు మారుతున్నాయి. ఆధార్తో ఇలాంటి వాటికి చెక్ పెట్టవచ్చు. ప్రస్తుతం ఈ పనులను జేసీ పర్యవేక్షిస్తున్నారు. ఇసుకతో ప్రతి కుటుంబం లబ్ధి పొందాలి ఇసుక తవ్వకాలు ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగానికి ఒక సవాల్ వంటిది. మన దగ్గర సుమారు మూడేళ్ల వరకు తవ్వుకునేంత ఇసుక నిల్వలు ఉన్నాయి. ఈ విషయంలో స్థానిక సొసైటీలకు ఇవ్వాలనేది ప్రభుత్వం విధానం. దాన్నే అమలు చేస్తున్నాం. ఇదే సమయంలో మధ్యవర్తులు, రాజకీయ ప్రమేయం వంటివి సహజంగానే ఉంటాయి. వాటిని పక్కన పెడితే స్థానికంగా గ్రామంలో సుమారు 550 వరకు కుటుంబాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కుటుంబాల వారి బ్యాంకు ఖాత నంబర్లు సేకరించి ప్రతి నెల వారీ వాటాగా వచ్చే డబ్బులను నేరుగా వ్యక్తిగత ఖాతాల్లో జమచేయాలని నిర్ణయించాం. ప్రతి కుటుంబానికి అన్ని ఖర్చులు పోను నెలకు కనీసం రూ.20 వేలకు తగ్గకుండా వారి ఖాతాల్లో జమ అవుతాయని అంచనా వేస్తున్నాం. ఈ విషయంలో మా ప్రణాళికలు క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు అధికారుల బృందం చర్యలు తీసుకుంటోంది. ఇలాంటి పద్ధ్దతినే గతంలో నేను జేసీగా ఉన్నప్పుడు మాసనపల్లిలో చేపట్టాం. అప్పుడు మంచి ఫలితాలు వచ్చాయి. రైతుల పొలాల్లో ఇసుక మేటలు తొలగించే విషయంలో ఏం చేయాలన్న విషయాన్ని పరిశీలిస్తున్నాం. త్వరలో దీనిపైనా నిర్ణయం తీసుకుంటాం. సీఎం హామీల విషయంలో.. సీఎం జిల్లాకు వచ్చిన సమయంలో పేదలకు పలు హామీలు ఇచ్చారు. వాటి అమలు కోసం పనులు వేగంగా సాగుతున్నాయి. ఇదే అంశంపై ఇటీవలే గృహనిర్మాణ సంస్థ ఎండీ జిల్లాకు వచ్చారు. మురికివాడల్లో ఇళ్ల నిర్మాణ డిజైన్పై చర్చించాం. త్వరలో జిల్లాకు చీఫ్ ఇంనీర్ల బృందం వస్తుం ది. వారు జిల్లాలో నాలుగైదు రోజులు ఉండి అన్ని అంశాల ను వ్యహారాలను పరిశీలిస్తారు. నాలుగు ప్రాంతాల్లో స్థలం విషయంలో అభ్యంతరాలు లేవు. ప్రభుత్వం జీవోలు విడుదల చేసింది. ఆ ప్రాంతాలకు సంబంధించి నిర్మాణాల కో సం అధికారులు సమగ్ర ప్రణాళికలు(డీపీఆర్) సిద్ధం చేస్తా రు. ఆ వెంటనే పనులు ప్రారంభమవుతాయి. సర్వేలు, ఇళ్ల నిర్మాణం, ఇతర సమస్యలపై ప్రతివారం సమీక్షిస్తున్నాం. ‘పది’ ఫలితాలపై దృష్టి.. విద్యా పరంగా పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు మంచి రి కార్డు ఉంది. ఈసారీ మంచి ఫలితాలు సాధించేందుకు ప దో తరగతి విద్యార్థులకు ముందు నుంచే ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. పదో తరగతి ఫలితాల్లో ఈసారి జిల్లా మంచి స్థానంలో ఉండాలి. అందుకోసమే ఈ ప్రయత్నం. గూగుల్లో భూముల సమాచారం ప్రభుత్వ భూముల సమగ్ర సమాచారాన్ని ఫొటోలతో గూగుల్లో అందుబాటలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూముల గుర్తింపు కోసం ప్రత్యేకంగా స్టైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశాం. సర్వేయర్లు జీపీఎస్ ద్వారా సర్వేలు చేస్తారు. ప్రభుత్వ భూముల ఫొటోలు తీయించి సమాచారం గూగుల్లో పెడతాం. దీంతో అక్రమణలు త్వరగా గుర్తించే అవకాశం ఉంది. ప్రభుత్వ భూములు గుర్తింపు పూర్తయ్యాక ప్రహరీల నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటాం. -
భవన గణన
68, 517 చదరపు గజాలలో 18 కార్యాలయాలు సర్కారుకు రెవెన్యూ శాఖ నివేదిక సిటీబ్యూరో:హైదరాబాద్ జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించిన కార్యాలయాల లెక్క... వాటి విస్తీర్ణం వివరాలతో కూడిన నివేదికను జిల్లా యంత్రాంగం గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. మారేడుపల్లి, సైదాబాద్ మండల కార్యాలయాలు అద్దె భవనాలలో కొనసాగుతుండగా... మిగిలిన 14 మండల కార్యాలయాలు, హైదరాబాద్ కలెక్టరేట్, సికింద్రాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి ఈస్ట్ ఆర్డీఓల కార్యాలయాల విస్తీర్ణం వివరాలను నివేదికలో పొందుపరిచారు. జిల్లా రెవెన్యూ శాఖ పరిధిలోని 18 కార్యాలయాల విస్తీర్ణం 68,517 చదరపు గజాలుగా తేల్చారు. వీటి వయసునూ పొందుపరిచారు. హైదరాబాద్ కలెక్టరేట్ భవనం నిర్మించి 50 ఏళ్లు గడుస్తుండగా ... ఆసిఫ్నగర్ మండల కార్యాలయ భవనం నిర్మించి 25 ఏళ్లు అవుతోంది. అంబర్పేట మండల కార్యాలయానికి 19 ఏళ్లు, ముషీరాబాద్ మండల కార్యాలయానికి 18 ఏళ్లయినట్టు గుర్తించారు. బండ్లగూడ, తిరుమలగిరి,సికింద్రాబాద్, ఖైరతాబాద్, బహుదూరపురా మండల కార్యాలయాలు, సికింద్రాబాద్ ఆర్డీఓ కార్యాలయాలు నిర్మించి 15 ఏళ్లు పూర్తయినట్టు నివేదికలో పేర్కొన్నారు. అమీర్పేట, హిమాయత్నగర్ మండల కార్యాలయాలు నిర్మించి 12 ఏళ్లు... మిగతా కార్యాలయ భవనాల వయస్సు పదేళ్ల లోపు ఉన్నట్టు అధికారులు వివరించారు. ఉన్నతాధికారులకు వేర్వేరుగా... హైదరాబాద్ జిల్లా పరిధిలోని 1352 ఎకరాల్లో 436 ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నట్టు అధికారులు తేల్చారు. ఈ భవ నాలు 255.5 ఎకరాల్లోనే ఉన్నాయని వివరించారు. దీనిపై సమగ్ర సమాచారంతో సంబంధిత శాఖల అధిపతులు నివేదికలు రూపొందించి.. వేర్వేరుగా తమ ఉన్నతాధికారులకు అందించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఇతర జిల్లాలు, రాష్ట్ర కార్యాలయ భవనాలనూ పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. భవనాలు... ఖాళీ స్థలాల విక్రయం? జిల్లాలోని విలువైన ప్రభుత్వ ఖాళీ స్థలాలు... కార్యాలయ భవనాల అమ్మకానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. ఏయే ప్రభుత్వ శాఖల పరిధిలో ఎంత భూమి ఉందోనన్న సమగ్ర సమాచారంతో వివరాలు సేకరిస్తున్న తీరు చూస్తుంటే ఇది నిజమేనన్న అనుమానాలు బలపడతున్నాయి. ప్రభుత్వ స్థలాల్లోని ఇళ్లు, భవనాల క్రమబద్ధీకరణతో భారీగా ఆదాయం సమకూర్చుకోవచ్చునన్న ఆశలు అడియాసలు కావడంతో ప్రభుత్వ కార్యాయాలపై కన్నేసినట్లు తెలుస్తోంది. భూముల అమ్మకంతో రూ. 6,500 కోట్లు సమీకరిస్తామని బడ్జెట్లో ప్రస్తావించిన ప్రభుత్వం... ఆ దిశలో నడుస్తున్నట్టు వివిధ వర్గాలు భావిస్తున్నాయి. -
ఐటీడీఏ పీవో బదిలీ
శ్రీశైలంప్రాజెక్టు: ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి నక్కల ప్రభాకరరెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. రాజధాని నిర్మాణంలో భాగంగా మాతృ సంస్థ రెవెన్యూ శాఖకు ఇతన్ని బదిలీ చేశారు. ఐటీడీఏ పీవో ఇప్పటి వరకు ఎవరినీ నియమించలేదు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించానని చెప్పారు. బ్రిటీష్ కాలం నాటి జీవోలను వెలికి తీసి తండాల అభివృద్ధికి కృషి చేశానన్నారు. చెంచు విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాల, కళాశాలలో ప్రవేశాన్ని కల్పించానన్నారు. ప్రత్యేక అనుమతితో 30 మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించి విద్యా శాతాన్ని పెంచినట్లు చెప్పారు. ఆరోగ్యదీపిక కార్యక్రమంతో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేశానన్నారు. ప్రతీ గూడెంలో ఆర్థికాభివృద్ధి సాధించడం కోసం రూ. 10లక్షలతో వడ్డీలేని రుణాలను మంజూరు చేశామని, 1386 మంది యువతకు ఈజీఎంఎం ద్వారా శిక్షణ ఇచ్చి నియామకాలు జరిపించామన్నారు. అటవీశాఖలో 37 మందికి టైగర్ ట్రాకర్లుగా, శ్రీశైలదేవస్థానంలో 16 మందికి సెక్యూరిటీగార్డులుగా ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు స్వయం ఉపాధి కింద నామమాత్రపు అద్దెతో 16 మందికి చెంచు బజార్ షాపులను కేటాయించానని వివరించారు. ట్రైకార్ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచడం, ప్రతిగూడెంలో విద్యుత్ సౌకర్యం అందించడం కోసం సోలార్ విద్యుత్ను ప్రోత్సహించడం వంటి పనులు చేశానన్నారు. సర్పంచ్లుగా 20 మందిని, వార్డుమెంబర్లుగా 73 మందిని ఎన్నికయ్యేటట్లు చేసి వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. ఐటీడీఏలో దళారి వ్యవస్థను పూర్తిగా నిర్మూలించానన్నారు. ఇదేమార్పును రానున్న అధికారులు తీసుకు రావాలన్నారు. తాను బదిలీపై 27వ తేదీన రిలీవ్ కానున్నట్లు చెప్పారు. అనంతరం చరిత్రలో ఒకరోజు ఒక చెంచుగూడెం పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
పేదలకు ఉచితమే..
- 125 గజాల దాకా క్రమబద్ధీకరణ - రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పరచుకున్న పేదలకు ఆయా స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతతో ఉందని రెవెన్యూ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా తెలిపారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆక్రమిత స్థల విస్తీర్ణం 125 గజాలకు మించినా దరఖాస్తుదారులు పేదలైతే వారికి 125 గజాల వరకు ఉచితంగానే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన స్పష్టం చేశారు. మిగిలిన స్థలం క్రమబద్ధీకరణకే నిర్దేశిత ధర మేరకు సొమ్ము చెల్లించాల్సి ఉంటుందన్నారు. కుటుంబ వార్షికాదాయం పట్టణాలు, నగరాల్లో రూ.2 లక్షల్లోపు ఉన్న వారందరినీ పేదలుగానే పరిగణిస్తామన్నారు. వీరంతా స్థానిక తహశీల్దారు నుంచి ఆదాయ ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంటుందన్నారు. అయితే భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి జీవో 59 కింద ప్రభుత్వం పేర్కొన్న రిజిస్ట్రేషన్ ధరను తగ్గించే యోచన లేదని మీనా స్పష్టం చేశారు. పేదలకు 125 గజాల వరకు స్థలాన్ని ఉచితంగా క్రమబద్ధీకరిస్తున్నందున దరఖాస్తుదారుల్లో ఎక్కువ శాతం మందిపై భారం లేదన్నారు. మధ్యతరగతి వర్గాల కోసమే 125 గజాల నుంచి 250 గజాల వరకు రిజిస్ట్రేషన్ ధరలో 50 శాతం రాయితీని ప్రభుత్వం ఇచ్చిందన్నారు. 250 నుంచి 500 గజాల్లోపు స్థలంలో ఉంటున్న వారు స్థలం క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ ధరలో 75 శాతమే చెల్లించాలని, 500 గజాలకుపైగా ఆక్రమిత స్థలంలో ఉంటున్న ప్రజలను మధ్య తరగతివారీగా పరిగణించలేమన్నారు. 2 లక్షలకు చేరువైన దరఖాస్తులు.. క్రమబద్ధీకరణకు ఇప్పటివరకూ 1.89 లక్షల దరఖాస్తులు వచ్చాయని మీనా తెలిపారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచి 1.17 లక్షల దరఖాస్తులు రాగా, అత్యల్పంగా మహబూబ్నగర్ జిల్లాలో 255 దరఖాస్తులే వచ్చాయన్నారు. క్రమబద్ధీకరణ గడువు పెంచినందున మరో 3 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. కాగా, ప్రభుత్వ భూములతో పాటు ఆక్రమణలకు గురైన శ్మశాన స్థలాలు, మున్సిపల్ స్థలాలను కూడా క్రమబద్ధీకరించాలని నిర్ణయించినట్లు మీనా చెప్పారు. శిఖం భూములను ఆక్రమించుకొన్న వారికి కూడా ఆయా స్థలాలను క్రమబద్ధీకరించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. హైదరాబాద్లో ఎంఎస్ మక్తా.. వంటి ప్రాంతాల్లో మూడు ద శాబ్దాలుగా హుస్సేన్ సాగర్ స్థలాన్ని ఆక్రమించుకొని ఎంతోమంది నివాసముంటున్నారని, వాటిని రెగ్యులరైజ్ చేయకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతుందన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో శిఖం భూములను కూడా డీనోటిఫై చేసి క్రమబద్ధీకరించేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్నాయన్నారు. క్రమబద్ధీకరణ గడువు పెంపు ఉత్తర్వులు జారీ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి దరఖాస్తుల సమర్పణకు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. 125 గజాల్లోపు స్థలాలను ఉచిత క్రమబద్ధీకరణ నిమిత్తం దరఖాస్తులు సమర్పించేందుకు ఈ నెల 31 వరకు, రిజిస్ట్రేషన్ ధర చెల్లించి వివిధ కేటగిరీల స్థలాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసేవారికి ఫిబ్రవరి 28 వరకు గడువు పొడిగిస్తూ జీవోఎంఎస్ నంబర్లు 5, 6 లతో వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇండస్ట్రియల్ పార్క్కు లైన్ క్లియర్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: జిల్లాలో పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇందుకోసం మునగపాక మండలం టి.సిరసపల్లిలో 70.98 ఎకరాలు కేటాయించింది. పార్క్ కోసం 2010 నుంచి కొనసాగుతున్న భూసేకరణ ప్రతిపాదన వివిధ దశల్లో కొనసాగుతోంది. ఎట్టకేలకు సర్వే నంబర్ 139తో ఉన్న ఈ భూమిని ఏపీఐఐసీకి కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్ శర్మ శనివారం జీవో జారీ చేశారు. పారిశ్రామిక పార్క్కు భూమి కేటాయించాలని ఏపీఐఐసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని 2010లో కోరింది. జిల్లా రెవెన్యూ యంత్రాంగం మునగపాక మండలం టి.సిరసాపల్లిలో సర్వే నంబర్ 139తో ఉన్న 70.89 ఎకరాలను గుర్తించారు. రెండు భాగాలుగా ఉన్న ఈ భూమిలో ఎవరికీ డి.పట్టాలు మంజూరు చేయలేదు. అందులో దాదాపు 66.18 ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల సాగుబడిలో ఉన్నాయి. ఈమేరకు ఆ భూమిని పారిశ్రామిక పార్క్కు కేటాయించేందుకు జిల్లా యంత్రాంగం 2010, జూన్ 10న నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై ఎవరి నుంచి అభ్యంతరాలు రాలేదని ప్రకటించింది. 2010, జూన్ 25న ఆ భూమిని ఏపీఐఐసీకి కేటాయించేందుకు గ్రామసభ తీర్మానం కూడా చేసింది. ఆ భూములను పరిశీలించిన అప్పటి జాయింట్ కలెక్టర్ వాటిలో 66.18 ఎకరాల్లో కొందరు సాగుచేస్తూ జీడిమామిడి తోటలు, ఇతర తోటలు సాగుచేస్తున్నారని నివేదిక ఇచ్చారు. అనంతరం అప్పటి కలెక్టర్ ఆ భూములను పరిశీలించి వాటిని ఏపీఐఐసీకి కేటాయించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఆ భూములను 33 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలని సూచించారు. ఎకరాకు ఏడాదికి రూ.లక్ష చొప్పున లీజుగా నిర్ణయించాలని, ప్రతి ఐదేళ్లకు ఓసారి 10శాతం లీజు మొత్తం పెంచాలని ప్రతిపాదించారు. ఆ భూముల్లో సాగు చేసుకుంటున్నవారికి జీవో నంబర్ 571 ప్రకారం పరిహారం చెల్లించాలని కూడా సూచించారు. ఎకరా రూ.10లక్షల చొప్పున కేటాయింపు ఆ ప్రతిపాదనను కొన్ని రోజులుగా పరిశీలించిన ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. లీజు బదులు ఆ భూములను ఏపీఐఐసీకి శాశ్వత ప్రాతిపాదికన కేటాయించాలని నిర్ణయించింది. ఎకరాకు రూ.10లక్షలుగా ధర నిర్ణయించింది. భూమి కేటాయించిన మూడేళ్లలో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు పూర్తికావాలని కూడా షరతు విధించింది. కేటాయించిన భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఇతర అవసరాలకు దుర్వినియోగం చేస్తే భూ కేటాయింపు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. దాంతో పారిశ్రామిక పార్క్కు భూ కేటాయింపు ప్రక్రియ దాదాపుగా పూర్తి అయ్యింది. -
చట్టబద్ధమైన పన్నులు వసూలు చేయాల్సిందే..
* అనుచిత పన్నులతో దక్కేది చెడ్డ పేరే * కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: చట్టబద్ధమైన పన్ను బకాయిలన్నింటినీ రెవెన్యూ శాఖ వసూలు చేయాల్సిందేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. అయితే, అనుచితంగా విధించిన పన్నులను రాబట్టడంపై దృష్టి పెడితే ప్రయోజనం లేదని, ఇది చెడ్డపేరు మాత్రమే తెచ్చిపెడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. శని వారం పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ వార్షిక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా జైట్లీ ఈ విషయాలు తెలిపారు. ‘సముచిత పన్ను బకాయిలను ఎలాగైనా రాబట్టుకోవాల్సిందే. కానీ, మనకి చట్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి చెల్లించనక్కర్లేని పన్నులు, అనుచితంగా విధించిన పన్నుల నుంచి అంతిమంగా ఎటువంటి రాబడి ఉండదని తె లుసుకోవాలి’ అని ఆయన చెప్పారు. గత లావాదేవీలకూ పన్నులు వర్తించేలా (రెట్రాస్పెక్టివ్) యూపీఏ ప్రభుత్వం చేసిన సవరణలను ప్రస్తావిస్తూ.. వీటి ద్వారా ఇప్పటిదాకా ఎటువంటి ఆదాయమూ కనిపించలేదని జైట్లీ వ్యాఖ్యానించారు. ఇలాంటి కేసులను కోర్టులు కొట్టివేయడమో లేదా నిలుపుదల చేయడమో జరిగిందన్నారు. కానీ చివరికి మాత్రం ఇది చెడ్డ పేరు తెచ్చిపెట్టిందని జైట్లీ పేర్కొన్నారు. ఫిన్లాండ్ సంస్థ నోకియాను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. పన్ను వివాదం కారణంగా తమిళనాడులో ఒక టెలికం ప్లాంటు మూతపడటంతో అక్టోబర్లో దేశీయంగా టెలికమ్యూనికేషన్ పరికరాల ఉత్పత్తి 78 శాతం మేర క్షీణించిందని వ్యాఖ్యానించారు. తమకు అన్ని అధికారాలు ఉన్నప్పటికీ.. రెట్రో పన్నులు విధించబోమని ఇప్పటికే స్పష్టం చేసినట్లు ఆయన చెప్పారు. మరోవైపు, గత ప్రభుత్వం నుంచి సంక్రమించిన బకాయిల కారణంగా స్థూల దేశీయోత్పత్తిలో ద్రవ్య లోటును 4.1 శాతానికి కట్టడి చేయడం పెనుసవాలుగా మారిందన్నారు. అటు వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ)పై రాష్ట్రాల్లో ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నాలు కొనసాగుతాయని జైట్లీ చెప్పారు. బీమా సంస్కరణలకు కట్టుబడి ఉన్నాం.. రాజకీయంగా ఎటువంటి అవరోధాలు వచ్చినా బీమా రంగంలో సంస్కరణలు అమలు చేస్తామని జైట్లీ స్పష్టం చేశారు. బీమా సంస్కరణల బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదం పొందేలా చూసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. బీమా బిల్లు ప్రస్తుతం రాజ్యసభ ముందు ఉంది. కానీ అక్కడ ఎన్డీఏకి మెజారిటీ లేకపోవడం, ఇతర రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండటం తెలిసిందే. -
ఏడాదిగా జీతాల్లేవ్!
పాలకొండ: అవుట్ సోర్సింగ్ సిబ్బందికి చాకిరీ తప్ప చిల్లిగవ్వ అందడంలేదు. రెవెన్యూ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్లుగా పని చేస్తున్న తాత్కాలిక సిబ్బందికి గత 12 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో వారి అవస్థలు వర్ణనాతీతం. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థతి కొనసాగుతోంది. పైగా వేతనాలు అడిగితే సాగనంపుతామని అధికారులు భయపెడుతున్నారని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ శాఖలో సిబ్బంది కొరత, పని ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని తాత్కాలిక సిబ్బందిని నియమించారు. 2008లో అవుట్ సోర్సింగ్ విధానం ప్రవేశపెట్టి కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్(సీసీఎల్ఏ) పరిధిలో వీరిని కొనసాగిస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల్లో 64మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వెబ్ ల్యాండింగ్, మీ-సేవ, భూ వివరాల నమోదు వంటి కీలక కార్యకలాపాలకు వీరినే వినియోగిస్తున్నారు. ఈ శాఖలోని రెగ్యులర్ సిబ్బందికి కంపూటర్లపై అంతగా అవగాహన లేకపోవడంతో వీరే కీలకంగా మారారు. మీ సేవ ధ్రువపత్రాల జారీలోనే వీరే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 12 నెలలుగా..... అన్ని పనులకూ అవుట్ సోర్సింగ్ సిబ్బందినే వినియోగించుకుంటున్న అధికారులు వారికి వేతనాలు చెల్లించడంలో మాత్రం చొరవ తీసుకోవడం లేదు. ప్రతి వేతనాలు అందుతాయని ఆశగా ఎదురు చూడటం, తీరా అవి అందకపోవడంతో ఉసూరుమనడం.. మళ్లీ అదే ఆశతో కాలం వెళ్లదీయడం తమకు నిత్యకృత్యంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నామని, 12 నెలలు దాటిపోవడంతో ఇప్పుడు అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదని వాపోతున్నారు. ఇప్పటికే పలుమార్లు అధికారులకు విన్నవించామని తెలిపారు. బెదిరింపులు మొదలు... వేతనాలు ఇవ్వకపోగా ప్రస్తుతం వీరికి బెదిరింపులు మొదలయ్యాయి. వేతనాలు చెల్లించనందుకు నిరసనగా ఆందోళన చేపట్టాలని ఇటీవల అవుట్ సోర్సింగ్ సిబ్బంది భావించారు. యూనియన్ ఆధ్వర్యంలో చర్చలు జరిపారు. సమావేశం నిర్వహించి విధులు భహిష్కరించాలని యోచించారు. అయితే ఉన్నతాధికారులు వీరిని హెచ్చరికలతో భయపెట్టారు. ఇప్పటికే పలు శాఖల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ సమయంలో నిరసన తెలియజేస్తే ఉన్న ఉద్యోగాలు ఊడిపోతాయని హెచ్చరించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో వీరంతా విధులు నిర్వహిస్తున్నారు. -
కొత్త కలెక్టర్కు సమస్యల స్వాగతం
⇒ రెవెన్యూ శాఖలో అధిక సమస్యలు ⇒ భూముల హద్దుల కోసం ఏళ్లతరబడి ఎదురుచుపులు ⇒ ఇసుక మాఫియాను అణచి వేస్తారా.. ⇒ బదిలీల్లో టీడీపీ నాయకుల ఒత్తిళ్లను అధిగమిస్తారా.. ⇒ నేడు బాధ్యతలు స్వీకరించనున్న కలెక్టర్ జానకి నెల్లూరు(రెవెన్యూ) : జిల్లాకు 91వ కలెక్టర్గా జానకిఅమ్మాల్ సోమవారం బా ధ్యతలు స్వీకరించనున్నారు. ఆమెకు జి ల్లాలో అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ శాఖ సమస్యలకు నిలయంగా మారింది. తహశీల్దార్ కార్యాలయాలు దళారులకు అడ్డగా మారాయి. ప్రతి చిన్న విషయంలోను టీడీపీ నాయకులు అధికారులపై ఒత్తిళ్లు చేస్తున్నారు. కొత్త కలెక్టర్ టీడీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరి స్తారా.. ఎవరినీ పట్టించుకోకుండా ప నులు చేసుకుంటూపోతారో వేచిచూడా లి. జిల్లాలో ఎం.రవిచంద్ర నుంచి పని చేసిన కలెక్టర్లు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. పేదల కోసం నూతన పథకాలకు శ్రీకారం చుట్టారు. ఎం.రవిచంద్ర పేద విద్యార్థుల కోసం పథకాన్ని అవలంబించారు. కలెక్టర్ రాంగోపాల్ పిటిషన్ మానిటరింగ్ సిస్టమ్ను ప్రారంభించి గ్రీవెన్స్డే పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థుల సమస్యలు స్వయంగా వారే అధికారులకు ఫిర్యాదు చేసేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆయన బది లీ అయిన తరువాత దానికి మంగళం పాడేశారు. తర్వాత వచ్చిన శ్రీధర్ సరస్వతినిధి, స్వీకారంను ప్రారంభించా రు. కలెక్టర్ ఎన్. శ్రీకాంత్ గ్రీవెన్స్ పరి ష్కారానికి సంబంధించి పరిష్కారం ప్రారంభించారు. పరిష్కారం సిస్టమ్ను త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. బదిలీపై వెళుతున్న కలెక్టర్ ఎప్పుడు ఫోన్లో అందుబాటులో ఉం డే వారు కాదు. కొత్తగా బాధ్యతలు స్వీ కరించినున్న కలెక్టర్ ఫోన్లో అందుబాటులో ఉండాలని ప్రజలు కోరుతున్నా రు. నూతన కలెక్టర్కు జిల్లాలో సమస్య లు స్వాగతం పలుకుతున్నాయి. వందలాది సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలా ఉన్నాయి. ముఖ్యంగా రెవె న్యూ శాఖకు సంబంధించి వందల భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. 30 ఏళ్ల కిందట ప్రజలకు పంపిణీ చేసిన భూములకు ఇప్పటి వరకు హద్దులు చుపలేదంటే రెవెన్యూ అధికారుల పని తీరు ఎమిటో అర్థమవుతుంది. కలువా యి మండలం పర్లకొండలో 28 ఏళ్ల కిందట 28 మంది పేదలకు నివాస స్థ లాలు మంజూరు చేశారు. నివాస స్థలాలకు చెందిన లభ్ధిదారులు 15 సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా వారికి పొజిషన్ చుపించలేదు. లబ్ధిదారులు వారి సమస్యను జా యింట్ కలెక్టర్ జి. రేఖారాణికి విన్నవించుకున్నారు. స్థలం సర్వే చేసి లబ్ధిదారులలో గ్రామంలో ఉన్నా వారికి పొ జిషన్ చూపించమని ఆదేశించారు. క లువాయి తహశీల్దార్ టీడీపీ నాయకు లు అడుగులకు మడుగులు ఒత్తుతూ వారి అర్హులుకాదు అని స్థలంలో ఇది ప్రభుత్వ భూమని బోర్డు పెట్టారు. పా త జాబితాలో ఉన్నా వారి పేర్లను తొల గించి టీడీపీ నాయకులు సూచించిన వారికి పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నా లు చేస్తున్నారు. జేసీ ఆదేశించినా పట్టించుకోకుండా టీడీపీ నాయకులు సలహామేరకు పనిచేసే తహశీల్దార్లు జి ల్లాలో అనేక మంది ఉన్నారు. తహశీ ల్దార్ల బదిలీలలో టీడీపీ నాయకులు పట్టుబట్టి తమకు అనుకూలంగా ఉండే వారిని ప్రాంతాలకు బదిలీలు చేయిం చుకున్నారు. గిరిజనులకు ఇచ్చిన వందలాది ఎకరాల భూమలు భూస్వామలు అక్రమించుకుని అనుభవిస్తున్నారు. భూ విలువలు అధికంగా పెరిగిపోవడంతో పట్టా భూములే కాకుండా వందలాది ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురిఅయిఉన్నాయి. కావలి తదితర ప్రాంతాల్లో చెరువులు ఆక్రమించుకుని లేఅవుట్లు వేశారు. ఈ విషయాలు స్థానిక అధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. జిల్లాలో జాక్పాట్ లారీలు, ఇసుక మా ఫియా పాతుకుపోయింది. వాటి జోలికి వెళ్లిన అధికారులు భంగపడ్డారేకాని వా టిని అరికట్టడంలో విఫలమయ్యారు. జాక్పాట్ లారీలు, ఇసుక మాఫియా జోలికి వెళితే పై స్థాయి నుంచి ఫోన్లు వస్తున్నాయి. వేలాది మంది అర్హులైన వారి పింఛన్లు తొలగించారు. వాటిని పునరుద్ధరించాలని బాధితులు కోరుకుంటున్నారు. గ్రీవెన్స్ డేకు సంబంధించి వేలాది సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ప్రజలు సమస్యల పరి ష్కా రం కోసం నెలల తరబడి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. ఇరిగేషన్కు సంబంధించి పనులు చేయకుండానే బిల్లులు కాజేస్తున్నరనే ఆరోపణలున్నా యి. జలయజ్ఞంలో భారీస్థాయిలో అవి నీతి చోటుచేసుకుందని విమర్శలున్నా యి. జలయజ్ఞం పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాలువలకు పూడిక తీయకుండా సాగునీరు విడదుల చేయడంతో చివరి భూములకు నీరు పారడంలేదు. రెవెన్యూ శాఖలో జరిగిన బది లీలు గందరగోళంగా ఉన్నాయి. ఎవరు ఎప్పుడు ఎక్కడకు బదిలీలు చేస్తారో అర్థంకాని స్థితిలో ఉద్యోగులున్నారు. కొత్త కలెక్టర్ అయినా తమకు మెరుగైన సేవలు అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. -
తుళ్లూరులో రియల్ మాయ
* రూ కోట్లు లెక్కపెట్టేందుకు దుకాణాల్లోనే నోట్ల లెక్కింపు యంత్రాలు * రోడ్ల మీదే ఖరీదైన కార్లు, సెకండ్ హ్యాండ్ వాహనాల ప్రదర్శనలు * భూ లావాదేవీల ఘర్షణల నివారణకు పోలీస్ బృందం గస్తీ సాక్షి, విజయవాడ బ్యూరో: తుళ్లూరు... గుంటూరు జిల్లాలోని ఓ మండలకేంద్రం. రెండునెలల కిందటి వరకు ఈ ఊరు ఎక్కడుందో కూడా చాలామందికి తెలియదు. రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ జరిపే ప్రాంతంగా ఈ గ్రామం ఎంపిక కావడంతో ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. వచ్చిపోతున్న వాహనాలతో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రధాన రహదారులు కిటకిటలాడుతున్నాయి. ఇటీవల వరకు రోజుకు రూ 200 వ్యాపారం జరిగితే గొప్ప అనుకున్న జిరాక్స్ సెంటర్లు మొదలుకుని కాకా హోటళ్లు, టీ అంగళ్లు, బిజీబిజీగా మారిపోయాయి. రాజధాని జోన్లో 29 గ్రామాల్లో భూ సమీకరణకు బాబు సర్కార్ కసరత్తు చేస్తుండటంతో భూ క్రయవిక్రయాలు ఊపందుకున్నా యి. ల్యాండ్ ఫూలింగ్తో తమ భూములు కో ల్పోతామని కలవరపడుతున్న అన్నదాతలు భూములు అమ్ముకునేందుకు సిద్ధమవుతున్నారు. గత పది రోజుల్లోనే ఈ 29 గ్రామాలకు చెందిన రైతులు సుమారు 3,500 ఎకరాల భూములను అమ్ముకున్నట్లు అనధికారిక సమాచారం. మూడు నుంచి నాలుగు చేతులు మారడంతో ప్రతీ రిజిస్ట్రేషన్లోనూ ధరలు పెరుగుతూపోయాయి. దీంతో పది రోజుల క్రితం రూ.90లక్షలు పలికిన ఎకరం ఇప్పుడు నుంచి కోటిన్నర నుంచి రెండు కోట్లపైమాటే. రూ.కోట్లను కమిషన్పై లెక్కించేందుకు నోట్ల లెక్కింపు యంత్రాలతో దుకాణాలు కూడా వెలిశాయి. బ్రోకర్లు కోటిు లెక్కిస్తే రూ. వెయ్యి కమిషన్ తీసుకుంటున్నారు. మరోవైపు కారు, బైక్ మేళాలు మొదలయ్యాయి. శనివారం నుంచి గుంటూరుకు చెందిన ఆటో కన్సల్టెన్సీ వాళ్లు పాత కార్లు తెచ్చి అమ్మేందుకు మేళా పెట్టారు. ఏడు రెవెన్యూ బృందాల ఏర్పాటు.. భూముల కొనుగోళ్లు అమ్మకాలకు రిజిస్ట్రేషన్ కావాలంటే పట్టాదార్ పాస్పుస్తకాలు, అడంగళ్లు తప్పనిసరి కావడంతో రెవెన్యూ శాఖకు చేతినిండా పనిదొరికింది. తుళ్ళూరు తహశీల్దార్ కార్యాలయంలో పట్టాదార్ పాస్పుస్తకాలు, అడంగళ్ దస్త్రాల కోసం శనివారం వందల సంఖ్యలో రైతులు, బ్రోకర్లుతో కిక్కిరిసిపోయింది. భూముల కొనుగోళ్లు, అమ్మకాలతో పాస్బుక్ల కోసం రైతులనుంచి వందలాది దరఖాస్తులు వస్తున్నాయని, వాటిని పరిశీలించేందుకు ఏడు బృందాలను ఏర్పాటు చేసినట్టు తహశీల్దార్ ఎ.సుధీర్బాబు ‘సాక్షి’కి చెప్పారు. ఫోర్జరీలకు, వివాదాలకు తావులేకుండా భూముల రికార్డులు, వాస్తవంగా భూములు ఎవరి పేరుతో ఉన్నాయనే విషయాలను రెవెన్యూ బృందాలు పూర్తిస్థాయి పరిశీలన చేసిన తరువాతే దరఖాస్తుదారులకు ధ్రువపత్రాలు జారీచేస్తామని తెలిపారు. తుళ్లూరులో వందలాది రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేరుకోవడంతో భూలావాదేవీల్లో ఘర్షణలు తలెత్తకుండా ప్రత్యేక పోలీస్ టీం గస్తీ తిరుగుతోంది. -
బదిలీల బాగోతం
నెల్లూరు(రెవెన్యూ): రెవెన్యూ శాఖలో బదిలీల బాగోతం నడుస్తోంది. అధికారపార్టీ నాయకులు సూచించిన ఉద్యోగులకు కోరుకున్న చోటకు బదిలీలు జరిగిపోతున్నాయి. గత నెలలో బదిలీ అయిన డిప్యూటీ తహశీల్దార్లు ఆ కుర్చీలు నచ్చక.. పదిరోజులు తిరగకుండానే కోరుకున్న చోటకు పోస్టింగ్ వేయించుకున్నారు. అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు తీసుకువచ్చి వారికి కావలసిన ప్రాంతాలను దక్కించుకున్నారు. ఈ నెల 18వ తేదీ రాత్రి టీడీపీ నాయకులు జిల్లా అధికారుల వద్ద బైటాయించి వారికి కావాల్సిన ఉద్యోగులను కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేయించారు. ఈ నెల 15వ తేదీతో బదిలీ ప్రక్రియ పూర్తికావలసి ఉంది. ప్రభుత్వం మరో పర్యాయం బదిలీ గడువును వారంరోజులు పెంచింది. ఈ నెల 22వ తేదీతో బదిలీల ప్రక్రియ పూర్తికానుంది. జిల్లాలో ఈ నెల మొదటివారంలో టీడీపీ నాయకులు సిఫార్సు మేరకు 24 మంది డీటీలను బదిలీలు చేశారు. బదిలీలు చేసి 10 రోజులు నెల్లూరు(క్రైమ్) : ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన రిమాండ్ ఖైదీ ఎ.ఏలుమలై (23) మృతదేహానికి బుధవారం ప్రభుత్వాస్పత్రిలో నెల్లూరు ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి శవ పంచనామా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ వైద్యులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. తమిళనాడు రాష్ట్రం విల్లిపురం జిల్లా చినసేలం తాలూకా మెల్లత్ఖుజీల్లీ గ్రామానికి చెందిన ఆండి, చిన్నపొన్ను దంపతుల కుమారుడు ఏలుమలై ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. బోరుమెకానిక్గా పని చేస్తున్నాడు. అతనికి నాలుగేళ్ల కిందట ధర్మపురికి చెందిన ఇంద్రాణితో వివాహమైది. వారికి మూడేళ్ల పాప ఉంది. ఎంతో సంతోషంగా సాగే ఆ కుటుంబంలో ఓ ఘటన విషాదం నింపింది. గతేడాది డిసెంబర్లో శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు ఇద్దరు అటవీ అధికారులను హతమార్చిన విషయం విధితమే. దీంతో ప్రత్యేక పోలీసులు బలగాలు శేషాచలం అడవుల్లో జల్లెడ పట్టాయి. కనిపించిన వారందరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు వారికి రిమాండ్ విధించింది. వారిలో ఏలుమలై ఒకడు. గతేడాది డిసెంబర్ 20వ తేదీ నుంచి జిల్లా కేంద్ర కారాగారంలో 238 మంది ఎర్ర కూలీలు రిమాండ్ అనుభవిస్తున్నారు. వీరంతా తమిళనాడు వాసులు. రిమాండ్కు తరలించిన కొద్ది రోజులకు ఏలుమలై నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్నాడని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. తల్లిదండ్రులు పలుమార్లు కుమారుడిని చూసేందుకు నెల్లూరుకు వచ్చి వెళ్లారు. అయితే ఏలుమలై జైలులో ఉన్నాడని తెలియగానే భార్య తన కుమార్తెతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. 10 రోజుల కిందట ఆండి, చిన్నపొన్ను జిల్లా కేంద్ర కారాగారానికి వచ్చారు. కుమారుడితో మాట్లాడి వెళ్లారు. మంగళవారం ఏలుమలై తీవ్ర అనారోగ్యంతో ప్రభుత్వాస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే మృతి చెందాడు. అనారోగ్యంతో మృతి ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీన జ్వరం రావడంతో జైలులోనే వైద్యులు చికిత్స చేశారు. మళ్లీ ఈ నెల 17వ తేదీ ఉదయం ఉన్నట్లుండి కాళ్లు, చేతులు వాపుతో పాటు విపరీతంగా నొప్పులు వచ్చాయి. అతనికి వైద్యులు పరీక్షలు చేసి చికిత్స అందించారు. 18వ తేదీ ఉదయం శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో జైలు వైద్యులు అతనికి పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం డీఎస్ఆర్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో జైలు అధికారులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. కొద్దిసేపటికే ఆయన మృతి చెందాడు. కుమారుని మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని బాధిత తల్లిదండ్రులు ఆర్డీఓకు తెలిపారు. జైలు అధికారుల నిర్లక్ష్యమే జైలు అధికారుల నిర్లక్ష్యంతోనే తన కుమారుడు మృతి చెందాడని బాధిత తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఏలుమలై మృతి చెందాడని సమాచారం అందుకున్న తల్లిదండ్రులు, అతని మామ కె. విక్టరీకొండన్, చిన్నాన్న కేతమలైలు బుధవారం ఉదయం నెల్లూరుకు చేరుకున్నారు. వారి సమక్షంలోనే ఆర్డీఓ శవపంచనామా నిర్వహించారు. తాము పది రోజుల కిందట నెల్లూరు జైలుకు వచ్చామన్నారు. భోజనం సరిగా ఉండటం లేదని, అది తినడం వల్ల తరచూ అనారోగ్యం వస్తోందని తమ కుమారుడు తెలిపాడని ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. సకాలంలోనే ఆస్పత్రికి తీసుకువచ్చి ఉంటే తన కుమారుడు బతికి ఉండేవాడని వారు వాపోయారు. మెజిస్టీరియల్ విచారణ జరపాలి : ఎల్లంకి వెంకటేశ్వర్లు, ఏపీ పౌరహక్కుల సంఘం నాణ్యమైన భోజనం అందించకపోవడం వల్ల ఖైదీలు అనారోగ్యం పాలవుతున్నారు. వారికి సరైన వైద్య సేవలందించడంలో జైలు అధికారుల నిర్లక్ష్య ధోరణి స్పష్టమవుతోంది. పరిస్థితి విషమించే అంత వరకు జైలులోనే ఉంచి ఆపై ఆస్పత్రికి పంపుతున్నారు. ఆస్పత్రికి వచ్చిన కొద్ది సేపటికే ఖైదీలు మృతి చెందుతున్నారు. ఖైదీల మృతిపై మెజిస్టీరియల్ విచారణ జరిపి అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను కోరారు. ఏలుమలై మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి నెల్లూరు (వైద్యం) : తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ ఏలుమలై మృతదేహానికి బుధవారం డీఎస్ఆర్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శశికాంత్ ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. మృతి చెందిన రిమాండ్ ఖైదీ కిడ్నీ, లివర్లను తీసి ఆసుపత్రిలో భద్రపర్చమని, వీటి పరీక్షల నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి పంపనున్నట్లు ప్రిన్సిపల్ ప్రభాకర్రావు తెలిపారు.