Faf du Plessis
-
వారెవ్వా ఫాఫ్.. 40 ఏళ్ల వయస్సులో అద్భుత విన్యాసం! వీడియో వైరల్
దక్షిణాఫ్రికా టీ20 లీగ్-2025లో జోబర్గ్ సూపర్ కింగ్స్ కథ ముగిసింది. సెంచూరియన్ వేదికగా సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్తో జరిగిన ఎలిమినేటర్లో 32 పరుగుల తేడాతో సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. దీంతో టోర్నీ నుంచి సూపర్ కింగ్స్ ఇంటిముఖం పట్టింది. 185 పరుగుల లక్ష్య చేధనలో జోబర్గ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 152 పరుగులకే పరిమితమైంది. జోబర్గ్ బ్యాటర్లలో జానీ బెయిర్ స్టో(37), డెవాన్ కాన్వే(30) మినహా మిగితా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. సన్రైజర్స్ బౌలర్లలో డాసెన్, ఓవర్టన్, బార్ట్మన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జాన్సెన్ ఓ వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. సన్రైజర్స్ బ్యాటర్లలో కెప్టెన్ మార్క్రమ్(40 బంతుల్లో 62, 5 ఫోర్లు, 2 సిక్స్లు), బెడింగ్హామ్(27), స్టబ్స్(26), జాన్సెన్(23) రాణించారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో తహిర్, విల్జోయెన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.డుప్లెసిస్ స్టన్నింగ్ క్యాచ్..ఇక ఈ మ్యాచ్లో సూపర్ కింగ్స్ ఓటమి పాలైనప్పటికి.. ఆ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(Faf du Plessis) సంచలన క్యాచ్తో అందరిని ఆశ్చర్యపరిచాడు. సన్రైజర్స్ ఇన్నింగ్స్ ఐదవ ఓవర్ వేసిన తహిర్.. తొలి బతిని డేవిడ్ బెడింగ్హామ్కు ఫ్లైట్ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో బెడింగ్హామ్ ఆ బంతిని మిడ్-ఆఫ్ దశగా లాఫ్టెడ్ డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించాడు.షాట్ సరిగ్గా కనక్ట్ అయినప్పటికి మిడ్-ఆఫ్లో ఉన్న 40 ఏళ్ల డుప్లెసిస్ అద్బుత విన్యాసం కనబరిచాడు. ఫాప్ తన ఎడమవైపునకు గాల్లోకి జంప్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్నారు. ఈ క్యాచ్ చూసిన ప్రతీ ఒక్కరూ షాక్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.రాయల్స్తో సన్రైజర్స్ ఢీ..ఇక గురువారం జరగనున్న క్వాలిఫయర్-2లో పార్ల్ రాయల్స్తో సన్రైజర్స్ ఈస్ట్రన్ కేప్ తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి వరుసగా మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టాలని సన్రైజర్స్ భావిస్తోంది. మరోవైపు పార్ల్ రాయల్స్ సైతం ఈ మ్యాచ్లో గెలిచి తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టాలని పట్టుదలతో ఉంది.చదవండి: CT 2025: 'బుమ్రా దూరమైతే అతడికి ఛాన్స్ ఇవ్వండి.. అద్భుతాలు సృష్టిస్తాడు' Absolutely FAF-tastic 🤯 Faf du Plessis continues to defy the laws of physics #BetwaySA20 #SECvJSK #WelcomeToIncredible pic.twitter.com/WAnGnTex5P— Betway SA20 (@SA20_League) February 5, 2025 -
సన్రైజర్స్ ఘన విజయం.. సూపర్ కింగ్స్ ఎలిమినేట్
సౌతాఫ్రికా టీ20 లీగ్లో డిఫెండింగ్ చాంపియన్ సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్(Sunrisers Eastern Cape) మరోసారి టైటిల్ రేసులో నిలిచింది. ఎలిమినేటర్ మ్యాచ్లో జొబర్గ్ సూపర్ కింగ్స్(Joburg Super Kings)ను చిత్తు చేసి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. కాగా 2023లో మొదలైన సౌతాఫ్రికా టీ20 లీగ్(SA20)లో ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్రైజర్స్ హైదరాబాద్కు చెందిన ఈస్టర్న్ కేప్ జట్టు అరంగేట్ర చాంపియన్గా నిలిచింది.గతేడాది కూడా మార్క్రమ్ సారథ్యంలోని ఈ జట్టు విజేతగా అవతరించి వరుసగా రెండోసారి టైటిల్ గెలిచింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా టైటిల్కు గురిపెట్టిన సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఎస్ఏ20- 2025 ఆరంభంలో మాత్రం చేదు అనుభవాలు ఎదుర్కొంది.హ్యాట్రిక్ పరాజయాలుజనవరి 9న లీగ్ తొలి మ్యాచ్లో భాగంగా ముంబై ఇండియన్స్ కేప్టౌన్ చేతిలో 97 పరుగుల తేడాతో సన్రైజర్స్ చిత్తుగా ఓడింది. అనంతరం రాయల్ పర్ల్స్ చేతిలోనూ తొమ్మిది వికెట్ల తేడాతో పరాభవం పాలైంది. ఆ తర్వాత ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయి.. హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసింది.ఆపై విజయాల బాట పట్టిఅయితే, నాలుగో మ్యాచ్లో డర్బన్ సూపర్ జెయింట్స్పై గెలుపొంది విజయాల బాట పట్టిన సన్రైజర్స్.. ఆపై వరుసగా మూడు మ్యాచ్లలో జయభేరి మోగించి ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది. లీగ్ దశలో మొత్తంగా పది మ్యాచ్లో ఐదింట గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన సన్రైజర్స్ ఎలిమినేటర్ మ్యాచ్కు అర్హత సాధించింది.ఇందులో భాగంగా బుధవారం రాత్రి జొబర్గ్ సూపర్ కింగ్స్తో తలపడింది సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు. సెంచూరియన్ వేదికగా సాగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సూపర్ కింగ్స్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 184 పరుగులు చేసింది.మార్క్రమ్ కెప్టెన్ ఇన్నింగ్స్ఓపెనర్లు బెడింగ్హాం(14 బంతుల్లో 27), టోనీ డి జోర్జి(9 బంతుల్లో 14) ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించగా.. జోర్డాన్ హెర్మాన్(16 బంతుల్లో 12), అబెల్(10 బంతుల్లో 10) నిరాశపరిచారు. ఈ క్రమంలో ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. నలభై బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.మిగతా వాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ 21 బంతుల్లో 26 పరుగులు చేయగా.. ఆఖర్లో మార్కో జాన్సెన్ మెరుపు ఇన్నింగ్స్(12 బంతుల్లో 23) ఆడాడు. ఫలితంగా సన్రైజర్స్ మంచి స్కోరు(184-6) నమోదు చేయగలిగింది. జొబర్గ్ సూపర్ కింగ్స్ బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్, విల్జోయెన్ రెండేసి వికెట్లు దక్కించుకోగా.. మహీశ్ తీక్షణ, మొయిన్ అలీ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.సూపర్ కింగ్స్ ఎలిమినేట్ఇక లక్ష్య ఛేదనలో జొబర్గ్ శుభారంభమే అందుకున్నా దానిని కొనసాగించలేకపోయింది. ఓపెనర్లలో డెవాన్ కాన్వే(20 బంతుల్లో 30) రాణించగా.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(18 బంతుల్లో 19) మాత్రం విఫలమయ్యాడు. మిగిలిన ఆటగాళ్లలో జేపీ కింగ్(9), విహాన్ ల్యూబే(13), మొయిన్ అలీ(0), హార్డస్ విల్జోయెన్(14) పూర్తిగా నిరాశపరచగా.. వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్స్టో ధనాధన్ దంచికొట్టాడు.కేవలం 17 బంతుల్లోనే 37 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా ఇవాన్ జోన్స్(17 బంతుల్లో 22నాటౌట్) రాణించాడు. కానీ అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. ఇరవై ఓవర్లు పూర్తయ్యేసరికి ఏడు వికెట్లు నష్టపోయిన జొబర్గ్ సూపర్ కింగ్స్ 152 పరుగులకే పరిమితమైంది. దీంతో 32 పరుగుల తేడాతో గెలుపొందిన సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్.. జొబర్గ్ను ఎలిమినేట్ చేసి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.క్వాలిఫయర్-2లో పర్ల్ రాయల్స్తో ఢీసన్రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక తదుపరి గురువారం నాటి క్వాలిఫయర్-2 మ్యాచ్లో సన్రైజర్స్ పర్ల్ రాయల్స్ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు శనివారం జరిగే ఫైనల్లో ముంబై ఇండియన్స్ కేప్టౌన్తో టైటిల్ కోసం తలపడుతుంది.చదవండి: ఇదేం పద్ధతి?: రోహిత్ శర్మ ఆగ్రహం -
కాన్వే మెరుపు ఇన్నింగ్స్.. సన్రైజర్స్కు ‘బోనస్’ షాక్!
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025(SA20- 2025) ఎడిషన్ తుది అంకానికి చేరుకుంటోంది. ఇప్పటికే పర్ల్ రాయల్స్(Parl Royals) ప్లే ఆఫ్స్నకు అర్హత సాధించగా.. మిగిలిన మూడు స్థానాల కోసం నాలుగు జట్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇలాంటి తరుణంలో సన్రైజర్స్ ఈస్టర్న్కేప్(Sunrisers Eastern Cape) జట్టుకు జొబర్గ్ సూపర్ కింగ్స్ భారీ షాకిచ్చింది.సన్రైజర్స్ వరుస విజయాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు.. ‘బోనస్’ పాయింట్(Win With Bonus Point)తో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ప్లే ఆఫ్స్ రేసులోనూ రైజర్స్తో పోటీకి సై అంటోంది. కాగా గ్వెబెర్హా వేదికగా జనవరి 9న సౌతాఫ్రికా టీ20 లీగ్ మూడో సీజన్ ఆరంభమైంది. తొలి మ్యాచ్లో పర్ల్ రాయల్స్తో తలపడ్డ.. డిఫెండింగ్ చాంపియన్ సన్రైజర్స్ ఓటమితో ప్రయాణాన్ని ఆరంభించింది.వరుసగా నాలుగు విజయాలుఅనంతరం.. ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలోనూ ఓడిన మార్క్రమ్ బృందం.. తర్వాత వరుసగా నాలుగు విజయాలు సాధించింది. డర్బన్ సూపర్ జెయింట్స్ను వరుసగా రెండు మ్యాచ్లలో చిత్తు చేయడంతో పాటు.. ప్రిటోరియా క్యాపిటల్స, జొబర్గ్ సూపర్ కింగ్స్పై గెలుపొందింది.ఈసారి మాత్రం ఘోర పరాజయంఇక ఆదివారం నాటి మ్యాచ్లో జొబర్గ్ జట్టుతోనే తలపడిన సన్రైజర్స్ ఈసారి మాత్రం ఘోర పరాజయం పాలైంది. జొహన్నస్బర్గ్ వేదికగా టాస్ గెలిచిన సన్రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, జొబర్గ్ బౌలర్ల ధాటికి 118 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ బెడింగ్హాం(40 బంతుల్లో 48), వికెట్ కీపర్ ట్రిస్టన్ స్టబ్స్(37), మార్కో జాన్సెన్(22) మాత్రమే రాణించారు.మిగతా వాళ్లలో ఓపెనర్ జాక్ క్రాలే, అబెల్, జోర్డాన్ హెర్మాన్, కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్, బేయర్స్ స్వానెపోయెల్ డకౌట్ కాగా.. లియామ్ డాసన్, ఒట్నీల్ బార్ట్మన్, రిచర్డ్ గ్లెసాన్(1*) ఒక్కో పరుగు మాత్రమే చేశారు. ఇక జొబర్గ్ బౌలర్లలో విల్జోన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. సిపామ్ల మూడు వికెట్లు, ఇమ్రాన్ తాహిర్, మతీశ పతిరణ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.What a start for the Joburg Super Kings 🏎️#BetwaySA20 #JSKvSEC #WelcomeToIncredible pic.twitter.com/jQhU4dIW85— Betway SA20 (@SA20_League) January 26, 2025 డెవాన్ కాన్వే మెరుపు ఇన్నింగ్స్ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జొబర్గ్ సూపర్ కింగ్స్ ఆదిలోనే కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(15) వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ డెవాన్ కాన్వే ధనాధన్ దంచికొట్టాడు. 56 బంతుల్లో పదకొండు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా వన్డౌన్ బ్యాటర్ విహాన్ లూబే(17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ , 25 రన్స్) మెరుపు ఇన్నింగ్స్తో రాణించాడు.ఫలితంగా మరో 36 బంతులు మిగిలి ఉండగానే జొబర్గ్ సూపర్ కింగ్స్ లక్ష్యాన్ని ఛేదించింది. తొమ్మిది వికెట్ల తేడాతో సన్రైజర్స్పై గెలుపొంది.. అదనపు పాయింట్ను కూడా ఖాతాలో వేసుకుంది. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఆరు జట్లు లీగ్ దశలో పదేసి మ్యాచ్లు ఆడతాయి. పాయింట్ల కేటాయింపు ఇలామ్యాచ్ గెలిస్తే నాలుగు పాయింట్లు, ఫలితం తేలకపోతే రెండు పాయింట్లు వస్తాయి. ఓడితే పాయింట్లేమీ రావు. ఇక గెలిచిన- ఓడిన జట్టు మధ్య రన్రేటు పరంగా 1.25 రెట్ల తేడా ఉంటే.. నాలుగు పాయింట్లకు అదనంగా మరో బోనస్ పాయింట్ కూడా వస్తుంది.జొబర్గ్ సూపర్ కింగ్స్ ఈ నిబంధన ప్రకారమే తాజాగా బోనస్ పాయింట్ సాధించి.. ఓవరాల్గా 15 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానానికి దూసుకువచ్చింది. కాగా పర్ల్ రాయల్స్ ఇప్పటికి ఏడు మ్యాచ్లు పూర్తి చేసుకుని ఆరు విజయాలతో 24 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది.మరోవైపు.. ఎంఐ కేప్టౌన్ ఏడింట నాలుగు(21 పాయింట్లు), సన్రైజర్స్ ఎనిమిదింట నాలుగు(19 పాయింట్ల) విజయాలతో పట్టికలో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. జొబర్గ్ ఏడింట మూడు గెలిచి నాలుగో స్థానంలో.. ప్రిటోరియా క్యాపిటల్స్ ఏడింట కేవలం ఒక్కటి గెలిచి ఐదు, డర్బన్ సూపర్ జెయింట్స్ ఎనిమిదింట ఒక్క విజయంతో అట్టడుగున ఆరో స్థానంలో ఉన్నాయి. చదవండి: చరిత్ర సృష్టించిన హసరంగ.. ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ -
చరిత్ర సృష్టించిన డేవిడ్ మిల్లర్
సౌతాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో 11000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి సౌతాఫ్రికా ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో భాగంగా ప్రిటోరియా క్యాపిటల్స్తో నిన్న (జనవరి 18) జరిగిన మ్యాచ్లో మిల్లర్ ఈ మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్లో మిల్లర్ రికార్డు లక్ష్య ఛేదనలో 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 48 పరుగులు చేశాడు. మిల్లర్ తన ఓవరాల్ టీ20 కెరీర్లో 468 ఇన్నింగ్స్లు ఆడి 11,046 పరుగులు చేశాడు.మిల్లర్ 11000 టీ20 రన్స్ క్లబ్లో చేరిన గంటల వ్యవధిలోనే మరో సౌతాఫ్రికన్ ఈ క్లబ్లో చేరాడు. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా సౌతాఫ్రికా టీ20 లీగ్లోనే 11000 పరుగుల మార్కును తాకాడు. ఈ లీగ్లో భాగంగా ఎంఐ కేప్టౌన్తో జరిగిన మ్యాచ్లో డుప్లెసిస్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. డుప్లెసిస్ 376 ఇన్నింగ్స్ల తన టీ20 కెరీర్లో 11,042 పరుగులు చేశాడు.టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన సౌతాఫ్రికా ఆటగాళ్లు..డేవిడ్ మిల్లర్-11046డుప్లెసిస్-11042డికాక్-10620ఏబీ డివిలియర్స్-9424రిలీ రొస్సో-9067నిన్న జరిగిన మ్యాచ్ల విషయానికొస్తే.. ప్రిటోరియా క్యాపిటల్స్పై పార్ల్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. విల్ స్మీడ్ (34 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటగా.. రహ్మానుల్లా గుర్భాజ్ (29 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కైల్ వెర్రిన్ (23 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఓ మోస్తరు ఇన్నింగ్స్లతో రాణించారు. ఆఖర్లో జేమ్స్ నీషమ్ (13 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. క్యాపిటల్స్ ఆటగాళ్లలో విల్ జాక్స్ 2, రిలీ రొస్సో 14 పరుగులు చేసి ఔటయ్యారు.213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ 19.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఇన్నింగ్స్ తొలి బంతికే ఇన్ఫామ్ బ్యాటర్ డ్రి ప్రిటోరియన్ డకౌట్ కాగా.. జో రూట్ (60 బంతుల్లో 92 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), రూబిన్ హెర్మన్ (33 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (24 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్లతో తమ జట్టును గెలిపించారు. సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఇదే రికార్డు లక్ష్య ఛేదన.మరో మ్యాచ్లో జోబర్గ్ సూపర్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ కేప్టౌన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే (31 బంతుల్లో 35; 4 ఫోర్లు), ఫాఫ్ డుప్లెసిస్ (38 బంతుల్లో 61; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), వికెట్ కీపర్ జానీ బెయిర్స్టో (27 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు.ఛేదనలో ర్యాన్ రికెల్టన్ (39 బంతుల్లో 89; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో ఎంఐ కేప్టౌన్ 15.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. రస్సీ వాన్ డర్ డస్సెన్ (24 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్), రీజా హెండ్రిక్స్ (28 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. -
నవశకం.. కొత్త కెప్టెన్ అతడే!.. ఆర్సీబీ హెడ్కోచ్ వ్యాఖ్యలు వైరల్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ).. మూడుసార్లు ఫైనల్ చేరినా ఒక్కసారి కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టైటిల్ గెలవలేకపోయింది. ప్రత్యర్థి జట్ల ఎత్తులకు చిత్తై.. ఆఖరి మెట్టుపై బోల్తా పడి ట్రోఫీని చేజార్చుకుంది. దీంతో.. ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచే టీమిండియా సూపర్స్టార్ విరాట్ కోహ్లి(Virat Kohli) కెరీర్లో ఐపీఎల్ టైటిల్ లేని లోటు ఇప్పటికీ అలాగే ఉండిపోయింది.ఆర్సీబీ ముఖచిత్రంగా కోహ్లిఅయితే, ఈసారి మాత్రం ఆర్సీబీ తలరాత మారుతుందంటున్నాడు ఆ జట్టు హెడ్కోచ్ ఆండీ ఫ్లవర్(Andy Flower). అదే విధంగా కొత్త కెప్టెన్ గురంచి కూడా సంకేతాలు ఇచ్చాడు. కాగా ఆర్సీబీకి భారీ ఫాలోయింగ్ రావడానికి ప్రధాన కారణం కోహ్లినే అనడంలో సందేహం లేదు. తన ఇమేజీ ద్వారా ఆర్సీబీ ముఖచిత్రంగా మారిపోయిన ఈ రన్మెషీన్.. 2011లో తొలిసారి కెప్టెన్గా పగ్గాలు చేపట్టాడు.ఆ తర్వాత రెండేళ్లకు పూర్తిస్థాయి కెప్టెన్గా నియమితుడైన కోహ్లి.. 2016లో జట్టును ఫైనల్స్కు చేర్చాడు. కానీ తుదిపోరులో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఆర్సీబీ ఓడిపోయి.. రిక్తహస్తాలతో వెనుదిరిగింది. ఆ తర్వాత కూడా చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ భారాన్ని, పని ఒత్తిడిని తగ్గించుకునే క్రమంలో 2021లో సారథ్య బాధ్యతల నుంచి కోహ్లి వైదొలిగాడు.డుప్లెసిస్ సారథ్యంలోఈ క్రమంలో సౌతాఫ్రికా వెటరన్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్(Faf Du Plesis) ఆర్సీబీ కెప్టెన్గా నియమితుడయ్యాడు. 2024 వరకు నాయకుడిగా జట్టును ముందుండి నడిపించాడు. అయితే, మెగా వేలానికి ముందు ఆర్సీబీ డుప్లెసిస్ను వదిలేసింది. ఆక్షన్ సమయంలోనే అతడిని కొనేందుకు ఆసక్తి చూపలేదు.ఈ నేపథ్యంలో ఆర్సీబీకి ఐపీఎల్-2025లో కొత్త కెప్టెన్ రావడం ఖాయమైంది. అతడు మరెవరో కాదు.. కోహ్లినే అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై స్పోర్ట్స్తక్తో మాట్లాడిన ఆండీ ఫ్లవర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.నవశకం ఆరంభం‘‘నవశకం ఆరంభం కాబోతోంది. మూడేళ్ల సైకిల్లో ఊహించిన ఫలితాన్ని రాబట్టబోతున్నాం. అందరూ అనుకున్నదే నిజమయ్యే అవకాశం ఉంది. అయితే, ఇప్పటి వరకు అందుకు సంబంధించిన చర్చ జరుగలేదని మాత్రం చెప్పగలను’’ అని ఆండీ ఫ్లవర్ పేర్కొన్నాడు. అదే సమయంలో.. కోహ్లికే మరోసారి పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని ఆండీ ఫ్లవర్ సంకేతాలు ఇచ్చాడు. మరోవైపు.. ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మొ బొబాట్ సైతం కెప్టెన్సీ అంశం గురించి ఇంకా చర్చించలేదని చెప్పినా.. పరోక్షంగా కోహ్లి వైపే తాము మొగ్గుచూపే ఛాన్స్ ఉందని తెలియజేశాడు.తిరుగులేని కింగ్కాగా ఐపీఎల్ కెరీర్లో ఇప్పటి వరకు 252 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లి 8004 పరుగులు సాధించాడు. ఇందులో ఎనిమిది శతకాలతో పాటు.. 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా 705 ఫోర్లు, 272 సిక్సర్లు ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఖాతాలో ఉన్నాయి. రైటార్మ్ మీడియం పేసర్ అయిన కోహ్లి ఐపీఎల్లో నాలుగు వికెట్లు కూడా తీయడం విశేషం. మూడేళ్ల షెడ్యూల్ ఇదేఇదిలా ఉంటే.. గతేడాది ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీ.. ఫైనల్లో మాత్రం అడుగుపెట్టలేకపోయింది. ఎలిమినేటర్ మ్యాచ్లోనే ఇంటిబాట పట్టింది. ఇక బీసీసీఐ ఇప్పటికే మూడేళ్ల ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్-2025.. మార్చి 14- మే 25 వరకు.. ఐపీఎల్-2026.. మార్చి 15- మే 31 వరకు.. ఐపీఎల్- 2027.. మార్చి 14- మే 30 వరకు నిర్వహించనున్నారు. చదవండి: 'డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి'.. భజ్జీ పోస్ట్ వైరల్ -
కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్న డుప్లెసిస్.. వీడియో
అబుదాబీ టీ10 లీగ్లో భాగంగా ఢిల్లీ బుల్స్తో జరుగుతున్న క్వాలిఫయర్-2 మ్యాచ్లో మోరిస్విల్లే సాంప్ ఆర్మీ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. అమీర్ హంజా బౌలింగ్లో షాదాబ్ ఖాన్ కొట్టిన బంతిని డుప్లెసిస్ ఒంటిచేత్తో అద్భుతమైన క్యాచ్గా మలిచాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఇది జరిగింది. ఈ ఓవర్లో డుప్లెసిస్ రెండు క్యాచ్లు పట్టాడు. షాదాబ్ ఖాన్ క్యాచ్కు ముందు డుప్లెసిస్ టామ్ బాంటన్ క్యాచ్ కూడా పట్టుకున్నాడు.WHAT A STUNNER FROM 40-YEAR-OLD FAF DU PLESSIS IN T10 LEAGUE 🤯 pic.twitter.com/LV9KLNHuPt— Johns. (@CricCrazyJohns) December 2, 2024ఈ మ్యాచ్లో డుప్లెసిస్ మొత్తంగా మూడు క్యాచ్లు పట్టాడు. ఇన్నింగ్స్లో ఏడో ఓవర్లో మరో సూపర్ క్యాచ్తో డుప్లెసిస్ రోవ్మన్ పావెల్ను పెవిలియన్కు పంపాడు. 40 ఏళ్ల వయసులోనూ డుప్లెసిస్ మైదానంలో పాదరసంలా కదలడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బుల్స్ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 89 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇసురు ఉడాన 3, అమీర్ హంజా 2, కరీం జనత్, ఇమాద్ వసీం తలో వికెట్ పడగొట్టి ఢిల్లీ బుల్స్ను కట్టడి చేశారు. ఢిల్లీ బుల్స్ ఇన్నింగ్స్లో టిమ్ డేవిడ్ (24) టాప్ స్కోరర్గా నిలువగా.. నిఖిల్ చౌదరీ (16), రోవ్మన్ పావెల్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్కు చేరుతుంది. -
మెగా వేలానికి ముందు విధ్వంసం సృష్టించిన డుప్లెసిస్
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఆర్సీబీ మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ విధ్వంసం సృష్టించాడు. అబుదాబీ టీ10 లీగ్లో భాగంగా చెన్నై బ్రేవ్ జాగ్వర్స్తో జరిగిన మ్యాచ్లో ఫాఫ్ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో ఫాఫ్ 26 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 76 పరుగులు చేశాడు. ఫలితంగా ఫాఫ్ ప్రాతినిథ్యం వహిస్తున్న మోరిస్విల్లే సాంప్ ఆర్మీ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై బ్రేవ్ నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. డాన్ లారెన్స్ 25 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేశాడు. చెన్నై బ్రేవ్ ఇన్నింగ్స్లో వాన్ డర్ డస్సెన్ 3, జోష్ బ్రౌన్ 13, భానుక రాజపక్ష 18, తిసార పెరీరా 8, క్రిస్ లిన్ 3, కోబ్ హెర్ఫ్ట్ 1 పరుగు చేశారు. సాంప్ ఆర్మీ బౌలర్లలో ఇమాద్ వసీం, ఆమిర్ హమ్జా, ఉడాన, కరీమ్ జనత్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 105 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సాంప్ ఆర్మీ.. ఫాఫ్ చెలరేగిపోవడంతో మరో 18 బంతులు మిగిలుండగానే (వికెట్ కోల్పోయి) విజయతీరాలకు చేరింది. సాంప్ ఆర్మీ ఇన్నింగ్స్లో షర్జీల్ ఖాన్ 8, చరిత్ అసలంక 17 పరుగులు చేశారు. చెన్నై బ్రేవ్ బౌలర్లలో ఒషేన్ థామస్కు ఓ వికెట్ దక్కింది. కాగా, ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఫాఫ్ డుప్లెసిస్ ఇవాళ (నవంబర్ 25) ఆక్షన్కు రానున్నాడు. ఫాఫ్ 2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. తాజా ఇన్నింగ్స్ నేపథ్యంలో ఫాఫ్ వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది. ఫాఫ్ కోసం ఆర్సీబీ, చెన్నై పోటీ పడవచ్చు. -
రాణించిన డుప్లెసిస్, ఛార్లెస్.. సీపీఎల్ ఫైనల్లో లూసియా కింగ్స్
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ చివరి అంకానికి చేరుకుంది. సెయింట్ లూసియా కింగ్స్ ఫైనల్స్కు చేరింది. ఇవాళ (అక్టోబర్ 3) జరిగిన క్వాలిఫయర్-1లో లూసియా కింగ్స్ గయానా అమెజాన్ వారియర్స్పై 15 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతిన) గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లూసియా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అమెజాన్ వారియర్స్కు వరుణుడు ఆడ్డు తగిలాడు. వారియర్స్ ఇన్నింగ్స్ 13 ఓవర్ల వరకు సజావుగా సాగింది. ఈ దశలో వర్షం మొదలై మ్యాచ్కు అంతరాయం కలిగించింది. వర్షం ఎంతకీ ఆగకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిన లూసియా కింగ్స్ను విజేతగా ప్రకటించారు. వర్షం ప్రారంభమయ్యే సమయానికి అమెజాన్ వారియర్స్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 106 పరుగులుగా ఉంది. ఈ మ్యాచ్లో గెలుపుతో లూసియా కింగ్స్ నేరుగా ఫైనల్కు చేరుకుంది. అమెజాన్ వారియర్స్ బార్బడోస్ రాయల్స్తో క్వాలిఫయర్-2 ఆడనుంది. అక్టోబర్ 5న జరిగే క్వాలిఫయర్-2లో గెలిచే జట్టు అక్టోబర్ 7న జరిగే ఫైనల్లో లూసియా కింగ్స్తో తలపడుతుంది.రాణించిన డుప్లెసిస్, జాన్సన్ ఛార్లెస్అమెజాన్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో ఫాఫ్ డుప్లెసిస్ (57), జాన్సన్ ఛార్లెస్ (79) అర్ద సెంచరీలతో రాణించారు. వీరిద్దరు మినహా లూసియా ఇన్నింగ్స్లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. రోస్టన్ ఛేజ్, టిమ్ సీఫర్ట్ తలో 18 పరుగులు, డేవిడ్ వీస్ 13, మాథ్యూ ఫోర్డ్ 0, జెర్మియా 1 పరుగు చేశారు. వారియర్స్ బౌలర్లలో మొయిన్ అలీ, ప్రిటోరియస్ తలో రెండు, షమార్ జోసఫ్ ఓ వికెట్ తీశారు.లక్ష్య ఛేదనలో అమెజాన్ వారియర్స్ కూడా ధాటిగానే ఇన్నింగ్స్ ప్రారంభించింది. రహ్మానుల్లా గుర్బాజ్ 24, కీమో పాల్ 14, షాయ్ హోప్ 27, ప్రిటోరియస్ 2 పరుగులు చేసి ఔట్ కాగా.. హెట్మైర్ 37, మొయిన్ అలీ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచారు. లూసియా కింగ్స్ బౌలర్లలో అల్జరీ జోసఫ్, డేవిడ్ వీస్, ఛేజ్, నూర్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.చదవండి: Irani Cup 2024: సెంచరీతో కదంతొక్కిన అభిమన్యు ఈశ్వరన్ -
రాణించిన హోప్, హెట్మైర్.. సరిపోని డుప్లెసిస్ మెరుపులు
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ చివరి దశకు చేరుకుంది. లీగ్ దశలో మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ మ్యాచ్ తర్వాత ప్లే ఆఫ్స్ మొదలవుతాయి. ప్లే ఆఫ్స్ నాలుగు బెర్త్లు ఇదివరకే ఖరారైపోయినప్పటికీ.. ఏ జట్టు ఏ స్థానంలో ఉంటున్నది రేపటి మ్యాచ్తో తేలనుంది.లీగ్లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 28) గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ లూసియా కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో అమెజాన్ వారియర్స్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది.రాణించిన హోప్, హోట్మైర్ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్.. షాయ్ హోప్ (31 బంతుల్లో 56; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), షిమ్రోన్ హెట్మైర్ (30 బంతుల్లో 58; 9 ఫోర్లు, సిక్స్) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్ (26), ఆజమ్ ఖాన్ (26), రొమారియో షెపర్డ్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లూసియా కింగ్స్ బౌలర్లలో డేవిడ్ వీస్ 3 వికెట్లు పడగొట్టగా.. నూర్ అహ్మద్, అల్జరీ జోసఫ్ తలో 2 వికెట్లు దక్కించుకున్నారు.సరిపోని డుప్లెసిస్ మెరుపులుఅనంతరం 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లూసియా కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమతమైంది. డుప్లెసిస్ (59 బంతుల్లో 92 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) లూసియా కింగ్స్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. అతనికి అల్జరీ జోసఫ్ (21 బంతుల్లో 25 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) తోడుగా నిలిచాడు. లక్ష్యం పెద్దది కావడంతో లూసియా కింగ్స్ గమ్యాన్ని చేరుకోలేకపోయింది. డుప్లెసిస్ మెరుపులు సరిపోలేదు. వారియర్స్ బౌలర్లలో మోటీ, మొయిన్, తాహిర్ తలో రెండు వికెట్లు తీసి లూసియా కింగ్స్ను దెబ్బకొట్టారు.చదవండి: NZ Vs SL 2nd Test: న్యూజిలాండ్ను చిత్తు చేసిన శ్రీలంక.. -
డుప్లెసిస్ 74వ హాఫ్ సెంచరీ
టీ20 క్రికెట్లో దక్షిణాఫ్రికా ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ 74వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా ట్రిన్బాగో అండ్ నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఫాఫ్ ఈ ఫీట్ను సాధించాడు. సెంచరీలతో (6) కలుపుకుని ఫాఫ్ తన కెరీర్లో మొత్తం 80 సార్లు 50 పరుగుల మార్కును దాటాడు.పొట్టి క్రికెట్ చరిత్రలో కేవలం పది మంది (ఫాఫ్తో సహా) మాత్రమే ఈ ఘనత సాధించారు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ టాప్లో (112) ఉండగా.. క్రిస్ గేల్ (110), విరాట్ కోహ్లి (106), బాబర్ ఆజమ్ (101), జోస్ బట్లర్ (90), అలెక్స్ హేల్స్ (88), రోహిత్ శర్మ (86), ఆరోన్ ఫించ్ (85), షోయబ్ మాలిక్ (83), ఫాఫ్ డెప్లెసిస్ (80) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు.ట్రిన్బాగో అండ్ నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్ (43 బంతుల్లో 59), జాన్సన్ ఛార్లెస్ (40 బంతుల్లో 89) అర్ద సెంచరీలతో రాణించారు. కీరన్ పోలార్డ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నైట్రైడర్స్ 17.5 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు మాత్రమే చేసింది. డ్వేన్ బ్రావో (0) రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. నూర్ అహ్మద్ (3/39), డేవిడ్ వీస్ (2/27) నైట్రైడర్స్ పతనాన్ని శాశించగా.. పియెర్రి, అల్జరీ జోసఫ్, రోస్టన్ ఛేజ్, సడ్రక్ డెస్కార్టే తలో వికెట్ పడగొట్టారు. నైట్రైడర్స్ ఇన్నింగ్స్లో హేమాహేమీ హిట్టర్లు ఉన్నా జేసన్ రాయ్ ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ (41) చేశాడు. చదవండి: న్యూజిలాండ్తో రెండో టెస్ట్.. శ్రీలంక తుది జట్టు ప్రకటన -
డుప్లెసిస్ ఊచకోత.. కేవలం 31 బంతుల్లోనే! వీడియో
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024లో సెయింట్ లూసియా కింగ్స్ తమ మూడో విజయాన్ని నమోదు చేసింది. గ్రాస్ ఐలెట్ వేదికగా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. సెయింట్ కిట్స్ బ్యాటర్లలో ఆండ్రీ ఫ్లెచర్(62), రూసో హాఫ్ సెంచరీలతో మెరిశారు. సెయింట్ లూసియా బౌలర్లలో ఆల్జారీ జోషఫ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఛేజ్, వీస్, సద్రక్ తలా వికెట్ సాధించారు.డుప్లెసిస్ ఊచకోత..అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని సెయింట్ లూసియా కింగ్స్ 16.3 ఓవర్లలో కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది. లక్ష్య చేధనలో ఓపెనర్లు ఫాప్ డుప్లెసిస్, జాన్సెన్ చార్లెస్ విధ్వంసం సృష్టించారు. ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశారు. చార్లెస్ 42 బంతుల్లో 4ఫోర్లు, 7 సిక్స్లతో 74 పరుగులు చేయగా.. డుప్లెసిస్ 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 62 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రత్యర్ధి జట్టు బౌలర్లలో హసరంగా,క్లార్క్సన్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా డుప్లెసిస్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక పాయింట్ల పట్టిక విషయానికి వస్తే.. గయానా ఆమెజాన్ వారియర్స్ తొలి స్ధానంలో ఉండగా.. సెయింట్ లూసియా మూడో స్ధానంలో కొనసాగుతోంది. చదవండి: అంతా అనుకున్నట్టే జరిగింది.. న్యూజిలాండ్- అఫ్గాన్ టెస్టు రద్దు pic.twitter.com/ex0bSYNHN4— Cricket Cricket (@cricket543210) September 13, 2024 -
డుప్లెసిస్పై వేటు..? ఆర్సీబీ కెప్టెన్గా ఊహించని ఆటగాడు!
ఐపీఎల్-2024 సీజన్కు ముందు అన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రిటైన్ జాబితాను సిద్దం చేసే పనిలో పడ్డాయి. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నుంచి ఇంకా రిటెన్షన్ పక్రియకు సంబంధించి ఎటువంటి గైడ్లైన్స్ రానిప్పటకి.. ఆయా జట్లు మాత్రం ఇప్పటినుంచే తమ ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాయి. మెగా వేలంకు ముందు ఎవరనీ విడిచిపెట్టాలి, ఎవరిని రిటైన్ చేసుకోవాలి అన్న ఆంశాలపై ఫ్రాంచైజీలు ఓ నిర్ణయంకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పలు సంచలన నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్పై వేటు వేయాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.డుప్లెసిస్తో పాటు ఆసీస్ విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ను సైతం వేలంలోకి విడిచిపెట్టాలని ఆర్సీబీ నిర్ణయించుకున్నట్లు వినికిడి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పాటు రజత్ పటిదార్, ఇంగ్లండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ను రిటైన్ చేసుకోవాలని యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆర్సీబీ కెప్టెన్గా రజత్ పాటిదార్ను నియమించే ఆలోచనలో ఆర్సీబీ యాజమాన్యం ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చనడుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో పాటిదార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఫస్ట్ హాఫ్లో నిరాశపరిచిన పాటిదార్.. సెకెండ్ హాఫ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 15 మ్యాచ్లు ఆడి 398 పరుగులు చేశాడు.గ్రీన్కు గుడ్ బై.. ?అదే విధంగా 2024 మినీ వేలం లో రూ.11 కోట్ల రూపాయలకు దక్కించుకున్న అల్జారీ జోసెఫ్ తో పాటు ట్రేడింగ్ ద్వారా రూ. 17 కోట్లకు దక్కించుకున్న ఆసీస్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ సైతం వేలంలోకి వచ్చే అవకాశముంది.ఐపీఎల్-2024లో పర్వాలేదన్పించిన ఆర్సీబీ.. లిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. 2024 ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆఫ్ కు అర్హత సాధించిన ఆర్సీబీ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. -
IPL 2025: ఈ ముగ్గురు కెప్టెన్లను రిలీజ్ చేయనున్న ఫ్రాంఛైజీలు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం-2025 నేపథ్యంలో ఆటగాళ్ల రిటెన్షన్ అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. పది జట్ల ఫ్రాంఛైజీలు- భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారుల మధ్య జూలై 31 నాటి సమావేశంలో ఈ విషయమై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఫ్రాంఛైజీ యజమానుల్లో అధికులు ఆరుగురు క్రికెటర్లను రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరగా.. బీసీసీఐ ఇందుకు సానుకూలంగా స్పందించిందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడు ఫ్రాంఛైజీలు మాత్రం తమ కెప్టెన్లను విడిచిపెట్టి.. వారి స్థానంలో కొత్త వారిని నియమించుకోవాలనే యోచనలో ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది.ఆర్సీబీఐపీఎల్-2025 నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తమ సారథిని మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం. వేలానికి ముందు ఫాఫ్ డుప్లెసిస్ను విడిచిపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 36 ఏళ్ల డుప్లెసిస్ ఐపీఎల్-2024లో 438 పరుగులు చేయడంతో పాటు.. జట్టును ప్లే ఆఫ్స్ వరకు చేర్చగలిగాడు.అయితే, డుప్లెసిస్ వయసు రీత్యా కెప్టెన్గా అతడిని కొనసాగించేందుకు విముఖంగా ఉన్నట్లు సమాచారం. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని.. యువ టీమిండియా ఆటగాడిని సారథిగా నియమించుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.పంజాబ్ కింగ్స్ఐపీఎల్ టాప్ రన్ స్కోర్లలో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఒకడు. అయితే, పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా ఉన్న అతడు గత కొంతకాలంగా ఫామ్లేమితో సతమతమవుతున్నాడు. అంతేకాదు.. ఐపీఎల్-2024లో ఆరంభ మ్యాచ్ల తర్వాత గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యాడు.ధావన్ స్థానంలో ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కర్రన్ పంజాబ్ కింగ్స్ను ముందుకు నడిపించాడు. అయితే, ప్లే ఆఫ్స్మాత్రం చేర్చలేకపోయాడు. ఇక ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ సాధించని జట్లలో పంజాబ్ కూడా ఉందన్న విషయం తెలిసిందే.ఇందుకు ప్రధాన కారణం సరైన నాయకుడు లేకపోవడమే. ఇక ధావన్ ఇప్పటికే జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. అంతేకాదు దేశవాళీ క్రికెట్లోనూ ఆడటం లేదు. అలాంటి ఆటగాడిని సారథిగా కొనసాగించడంలో అర్థం లేదని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 38 ఏళ్ల ధావన్ను కెప్టెన్గా తప్పించి.. అతడి స్థానంలో యువ నాయకుడిని ఎంపిక చేసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.లక్నో సూపర్ జెయింట్స్ఐపీఎల్లో 2022లో అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్కు మూడేళ్లుగా టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. 2022, 2023 సీజన్లలో లక్నోను టాప్-4లో నిలబెట్టిన రాహుల్.. 2024లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆటగాడినూ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. పద్నాలుగు మ్యాచ్లలో కలిపి 520 పరుగులు చేసినప్పటికీ.. స్ట్రైక్రేటు(136.12) పరంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ సందర్భంగా ఓనర్ సంజీవ్ గోయెంకా రాహుల్పై బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అంతా బాగానే ఉందని సంజీవ్ గోయెంకా సంకేతాలు ఇచ్చినా.. రాహుల్ మాత్రం బాగా హర్టయినట్లు సమాచారం. జట్టును వీడాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఫ్రాంఛైజీ సైతం రాహుల్ను రిలీజ్ చేసేందుకు సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: IPL 2025: గుజరాత్ టైటాన్స్ కీలక నిర్ణయం.. ఆశిష్ నెహ్రాపై వేటు! -
రాణించిన కాన్వే.. సూపర్ కింగ్స్ను గెలిపించిన డుప్లెసిస్
మేజర్ లీగ్ క్రికెట్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ భీకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్తో ఇవాళ (జులై 25) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఫాఫ్ మరో అర్ద సెంచరీ బాదాడు. ఫలితంగా సూపర్ కింగ్స్ 9 వికెట్ల తేడాతో ఎంఐ న్యూయార్క్పై ఘన విజయం సాధించింది.FAF DU PLESSIS - THE LEGEND OF THE SUPER KINGS FAMILY. ⭐- 72 (47) with 6 fours and 3 sixes in the Eliminator against MI New York in the MLC. The captain at the age of 40 keeps getting better. 👌pic.twitter.com/GrURm0QS7U— Mufaddal Vohra (@mufaddal_vohra) July 25, 2024రషీద్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ.. రషీద్ ఖాన్ (30 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఎంఐ ఇన్నింగ్స్లో రషీద్తో పాటు మెనాంక్ పటేల్ (48), షయాన్ జహంగీర్ (26) మాత్రమే రాణించారు. సూపర్కింగ్స్ బౌలర్లలో స్టోయినిస్, ఆరోన్ హార్డీ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. జియా ఉల్ హక్, నూర్ అహ్మద్, బ్రావో తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్ కింగ్స్.. ఓపెనర్లు డుప్లెసిస్ (72), డెవాన్ కాన్వే (43 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), సత్తా చాటడంతో అలవోకగా (18.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) విజయం సాధించింది. బంతితో రాణించిన ఆరోన్ హార్డీ బ్యాట్తోనూ (22 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటాడు. ఈ మ్యాచ్లో గెలుపుతో సూపర్ కింగ్స్ ఛాలెంజర్ మ్యాచ్కు అర్హత సాధించగా.. ముంబై ఇండియన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. రేపు జరుగబోయే క్వాలిఫయర్ మ్యాచ్లో వాషింగ్టన్ ఫ్రీడం, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ పోటీపడతాయి. ఈ మ్యాచ్లో ఓడిన జట్టుతో సూపర్ కింగ్స్ ఛాలెంజర్ మ్యాచ్ ఆడతుంది. క్వాలిఫయర్ విజేత, ఛాలెంజర్ గేమ్ విజేత జులై 28న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.ఎంఎల్సీ 2024లో డుప్లెసిస్ స్కోర్లు..14(14), 100(58), 34(17), 61(38), 55(32), 39(17), 72(47)7 ఇన్నింగ్స్ల్లో 168.16 స్ట్రయిక్రేట్తో 53.57 సగటున సెంచరీ, 3 అర్ద సెంచరీల సాయంతో 375 పరుగులు. -
IPL 2025: డుప్లెసిస్కు షాక్.. ఆర్సీబీ కెప్టెన్గా కేఎల్ రాహుల్!?
ఐపీఎల్-2025 సీజన్కు పలు ఫ్రాంచైజీలు భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి లక్నో సూపర్ జెయింట్స్. వచ్చే ఏడాది సీజన్కు ముందు తమ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ను విడిచిపెట్టాలని లక్నో ఫ్రాంచైజీ యాజమాన్యం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దైనిక్ జాగరణ్ రిపోర్ట్ ప్రకారం.. కేఎల్ రాహుల్, లక్నో మేనేజ్మెంట్ మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అతడిని లక్నో విడిచిపెట్టాలని భావిస్తున్నట్లు సదరు పత్రిక పేర్కొంది. రాహుల్ కూడా లక్నో మేనేజ్మెంట్ పైన ఆంసతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ ఏడాది సీజన్లో ఎల్ఎస్జి యజమాని సంజీవ్ గోయెంకా, రాహుల్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు పలు ఊహాగానాలు వినిపించాయి.ఆ తర్వాత రాహుల్, గోయెంకా ఇద్దరూ ఈ ఊహాగానాలను ఖండించినప్పటికి.. క్రికెట్ వర్గాల్లో మాత్రం ఇంకా ఈ చర్చనడుస్తోంది. రాహుల్ సారథ్యంలోని ఎల్ఎస్జి రెండు సార్లు ఫ్లే ఆఫ్స్కు చేరింది. కానీ ఈ ఏడాది సీజన్లో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది.ఆర్సీబీ కెప్టెన్గా రాహుల్?ఇక కేఎల్ రాహుల్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కన్నేసినట్లు తెలుస్తోంది. మెగా వేలానికి ముందు ఎల్ఎస్జి నుంచి రాహుల్ను ట్రేడ్ చేసుకోవాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడతున్నాయి. ప్రస్తుత ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ వయస్సు 40కి చేరుకోవడంతో.. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా కొత్త కెప్టెన్ను ఫ్రాంచైజీ వెతుకుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కేఎల్ రాహల్ను సొంతం చేసుకుని తమ జట్టు పగ్గాలను అప్పగించాలని ఆర్సీబీ యాజమాన్యం యోచిస్తున్నట్లు వినికిడి. కాగా కేఎల్ రాహుల్ తన ఐపీఎల్ కెరీర్ను ఆర్సీబీ ఫ్రాంచైజీతో ప్రారంభించాడు. -
డుప్లెసిస్ మెరుపు అర్ద సెంచరీ.. రషీద్ ఖాన్ వీరోచిత పోరాటం
మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) 2024 ఎడిషన్లో భాగంగా ముంబై ఇండియన్స్ న్యూయార్క్తో ఇవాళ (భారతకాలమానం ప్రకారం) జరిగిన మ్యాచ్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది.డుప్లెసిస్ మెరుపు అర్ద సెంచరీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టెక్సాస్ సూపర్ కింగ్స్.. ఓపెనర్లు డుప్లెసిస్ (38 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), డెవాన్ కాన్వే (28 బంతుల్లో 40; 3 ఫోర్లు, సిక్సర్) చెలరేగి ఆడటంతో ఓ మోస్తరు స్కోర్ చేసింది. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్లో ఆరోన్ హార్డీ 22, జాషువ ట్రంప్ 3, మిలింద్ కుమార్ 2, సావేజ్ 10 పరుగులు చేసి ఔట్ కాగా.. స్టోయినిస్ 24, డ్వేన్ బ్రావో 7 పరుగులతో అజేయంగా నిలిచారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ (4-0-17-1) పొదుపుగా బౌలింగ్ చేయగా.. ట్రెంట్ బౌల్ట్ 2, నోష్తుష్ కెంజిగే, ఎహసాన్ ఆదిల్ తలో వికెట్ పడగొట్టారు.రషీద్ ఖాన్ వీరోచిత పోరాటం వృధా177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. 52 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. మెనాంక్ పటేల్ (45 బంతుల్లో 61; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), రషీద్ ఖాన్ (23 బంతుల్లో 50; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆదుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రషీద్ పోరాడితే పోయేదేమీ లేదన్నట్లు బ్యాటింగ్ చేశాడు. రషీద్ వీరోచితంగా పోరాడినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్లో కీరన్ పోలార్డ్ (17 బంతుల్లో 5), టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 6) చాలా బంతులు వృధా చేశారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో స్టోయినిస్ 4, జియా ఉల్ హక్ 2, మొహమ్మద్ మోహిసిన్ ఓ వికెట్ పడగొట్టారు.ఇదిలా ఉంటే, మేజర్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్ జులై 5న మొదలైన విషయం తెలిసిందే. ఈ ఎడిషన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో వాషింగ్టన్ ఫ్రీడం (4 మ్యాచ్ల్లో 3 విజయాలు) టాప్లో ఉండగా.. టెక్సాస్ సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్, సీయాటిల్ ఓర్కాస్ వరుస స్థానాల్లో ఉన్నాయి. లీగ్లో భాగంగా రేపు (రాత్రి ఒంటి గంటకు) జరుగబోయే మ్యాచ్లో సీయాటిల్ ఓర్కాస్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్ తలపడనున్నాయి. -
డుప్లెసిస్ విధ్వంసకర సెంచరీ.. 12 ఫోర్లు, 5 సిక్స్లతో
మేజర్ లీగ్ క్రికెట్-2024లో టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. ఈ లీగ్లో భాగంగా సోమవారం చర్చ్ స్ట్రీట్ పార్క్ వేదికగా వాష్టింగ్టన్ ఫ్రీడమ్తో జరిగిన మ్యాచ్లో డుప్లెసిస్ విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్ధి బౌలర్లను డుప్లెసిస్ ఊచకోత కోశాడు. కేవలం 58 బంతుల్లోనే ఫాప్ తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, 5 సిక్స్లు ఉన్నాయి. మేజర్ లీగ్ క్రికెట్లో డుప్లెసిస్కు ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. ఇక అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా టెక్సాస్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ చేసింది. అతడితో పాటు మరో ఓపెనర్ డెవాన్ కాన్వే(39) పరుగులతో రాణించాడు. వాష్టింగ్టన్ బౌలర్లలో నేత్రవల్కర్ రెండు వికెట్లు పడగొట్టగా.. మార్కో జానెసన్, డిల్, హోస్సేన్ తలా వికెట్ సాధించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన వాష్టింగ్టన్కు ఓపెనర్ స్మిత్(26), హెడ్(36) మంచి ఆరంభాన్ని ఆంచారు. వీరిద్దరూ ధాటికి వాషింగ్టన్ 4 ఓవర్లలో 62 పరుగులు చేసింది. అయితే ఈ సమయంలో వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. వర్షం ఎప్పటికి తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చింది. -
అదే మా ఓటమిని శాసించింది.. లేదంటే విజయం మాదే: డుప్లెసిస్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. అహ్మదాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన ఎలిమేనిటర్లో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. దీంతో టోర్నీ నుంచి ఆర్సీబీ ఇంటిముఖం పట్టింది. వరుస మ్యాచ్ల్లో గెలిచి ఫ్లే ఆఫ్స్కు చేరిన బెంగళూరు.. ఎలిమినేటర్ రౌండ్ను దాటలేకపోయింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(34) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. విరాట్ కోహ్లి(33), మహిపాల్(32) పరుగులతో రాణించారు.అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్(45) పరుగులతో అదరగొట్టగా.. రియాన్ పరాగ్(36), హెట్మైర్(26), పావెల్(16)పరుగులతో రాణించారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ స్పందించాడు. బ్యాటింగ్లో మరింత మెరుగ్గా రాణించింటే ఫలితం మరో విధంగా ఉండేదని డుప్లెసిస్ తెలిపాడు."మేము తొలుత బ్యాటింగ్లో మెరుగ్గా రాణించలేకపోయాం. సెకెండ్ ఇన్నింగ్స్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. అదనంగా 20 పరుగులు చేసి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. సాధరణంగా ఈ వికెట్పై 180 పరుగులు సాధిస్తే టార్గెట్ను డిఫెండ్ చేసుకోవచ్చు.ఎందుకంటే అహ్మదాబాద్ పిచ్ కాస్త స్లోగా ఉంది. మా బౌలర్లు అద్బుతంగా పోరాడారు. ఈ సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ మాకు పెద్దగా ఉపయోగపడలేదు. ఇక ఈ సీజన్లో మా జట్టు ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. పాయింట్ల పట్టకలో అట్టడుగు స్ధానం నుంచి ప్లే ఆఫ్స్కు రావడం నిజంగా గర్వించదగ్గ విషయం. వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాం. కానీ దురదృష్టవశాత్తూ ఎలిమినేటర్ రౌండ్ను దాటలేకపోయామని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో డుప్లెసిస్ పేర్కొన్నాడు. A comeback to winning ways when it mattered the most & how 👌👌Upwards & Onwards for Rajasthan Royals in #TATAIPL 2024 😄⏫Scorecard ▶️ https://t.co/b5YGTn7pOL #RRvRCB | #Eliminator | #TheFinalCall pic.twitter.com/NsxjVGmjZ9— IndianPremierLeague (@IPL) May 22, 2024 -
RR vs RCB: వార్ వన్సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం
ఐపీఎల్-2024 ఆఖరి అంకానికి చేరుకుంటోంది. ఇప్పటికే ఒక ఫైనలిస్టు ఖరారు కాగా.. తుది పోరుకు అర్హత సాధించేందుకు మిగిలిన మూడు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.ఈ సీజన్లో ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టిన కోల్కతా నైట్ రైడర్స్ క్వాలిఫయర్-1లో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్లో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో రైజర్స్ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్కు దూసుకువెళ్లింది కేకేఆర్.ఇక ఫైనల్ రేసులో మిగిలినవి రెండే మ్యాచ్లు. ఎలిమినేటర్, క్వాలిఫయర్-2. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది.సన్రైజర్స్తో ఎలిమినేటర్ విజేత పోటీఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. క్వాలిఫయర్-1లో కేకేఆర్ చేతిలో ఓడిన సన్రైజర్స్తో అమీతుమీ తేల్చుకుంటుంది. ఆ మ్యాచ్లో గనుక గెలిస్తే ఫైనల్కు చేరుకుంటుంది.ఈ క్రమంలో బెంగళూరు- రాజస్తాన్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్ సునిల్ గావస్కర్ ఎలిమినేటర్ విజేత ఎవరన్న అంశంపై తన అంచనా తెలియజేశాడు.‘‘ఆర్సీబీ ఈసారి ఎంతటి అద్భుతం చేసిందో చూశాం. ముఖ్యంగా వరుస పరాజయాల తర్వాత వాళ్లు తిరిగి పుంజుకున్న తీరు అమోఘం. మామూలు జట్లకు ఇలాంటివి సాధ్యం కావు.అయ్యో.. మనం ఓడిపోతూనే ఉన్నాంఆర్సీబీ ప్రధాన ఆటగాళ్లలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లితో పాటు మిగతా సీనియర్ ప్లేయర్లు తమ ఆట తీరుతో.. జట్టులో ఉత్సాహం నింపారు. ఆర్సీబీ స్థానంలో మరే ఇతర జట్టు ఏదైనా ఉంటే.. ‘అయ్యో.. మనం ఓడిపోతూనే ఉన్నాం. అంతా ముగిసిపోయింది’ అని బెంబేలెత్తిపోయేవాళ్లు.కానీ డుప్లెసిస్, కోహ్లి ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వలేదు. ఇక రాజస్తాన్.. గత నాలుగు- ఐదు మ్యాచ్లలో ఓడిపోతూనే ఉంది. ఆఖరిగా ఆడిన మ్యాచ్లోనూ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.వాళ్లను చూస్తే పూర్తిగా ఫామ్ కోల్పోయినట్లు కనిపిస్తున్నారు. పదకొండు రోజుల పాటు ఆటకు దూరంగా ఉన్న కేకేఆర్ మాదిరి ఏదైనా ప్రత్యేకంగా చేస్తే తప్ప రాజస్తాన్కు గెలిచే అవకాశాలు ఉండవు.లేదంటే మ్యాచ్ ఏకపక్షంగా సాగిపోయే ఛాన్స్ ఉంది. ఆర్సీబీ రాజస్తాన్ను చిత్తు చేసినా చేస్తుంది. ఒకవేళ అలా జరగకపోతేనే ఆశ్చర్యం’’ అని సునిల్ గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు. ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశాడు.గావస్కర్ వర్సెస్ కోహ్లికాగా ఇటీవల గావస్కర్- కోహ్లి మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. కోహ్లి స్ట్రైక్రేటు గురించి గావస్కర్ విమర్శించగా.. రన్మెషీన్ అందుకు కాస్త ఘాటుగానే బదులిచ్చాడు. ఎలా ఆడాలో తనకు తెలుసునని.. జట్టు ప్రయోజనాల కోసం ఏం చేయాలో కూడా తెలుసంటూ కౌంటర్ వేశాడు. -
RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
ఆర్సీబీ.. ఆర్సీబీ.. ఆర్సీబీ.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే పేరు.. ఆర్సీబీ నామస్మరణతో హోరెత్తుతూ ఆగని జోరు... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఏకంగా ఐపీఎల్-2024 టైటిల్ సాధించిందా? అన్నంతగా సంబరాలు..ఖండాంతరాలు దాటిన సంబురం.. అమెరికాలోనూ పేలుతున్న విన్నింగ్ క్రాకర్స్.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరిన క్రమంలో ‘నమ్మ బెంగళూరు’ అంటూ కనీవినీ ఎరుగని రీతిలో సెలబ్రేషన్స్.. అంత ప్రత్యేకమాఈ విజయం అంత ప్రత్యేకమా అంటే అవుననే చెప్పాలి. ఇంత వరకు ఒక్కసారి కూడా ఆర్సీబీ టైటిల్ గెలవనే లేదు. అయితే, అనూహ్య రీతిలో ఈసారి మహిళా ప్రీమియర్ లీగ్ రూపంలో తొలిసారి బెంగళూరు ఫ్రాంఛైజీకి ట్రోఫీ దక్కింది.స్మృతి మంధాన కెప్టెన్సీలో ఆర్సీబీ వుమెన్ టీమ్ కప్ కొట్టింది. ఇదే జోరులో పురుషుల జట్టు కూడా ఈసారి ట్రోఫీ సాధిస్తుందని.. టైటిల్ లేదన్న వెలితిని పూరిస్తుందని అభిమానులు ఆశపడ్డారు. అయితే, ఆరంభ మ్యాచ్లోనే ఆర్సీబీ ఓటమిపాలైంది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పరాజయంతో సీజన్ను మొదలుపెట్టింది.ఆ తర్వాత సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్పై విజయం సాధించిన బెంగళూరు జట్టు.. అదే జోరును కొనసాగించలేకపోయింది. వరుస వైఫల్యాలతో చతికిల పడి ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించే తొలి జట్టు అవుతుందేమోనన్న భావన కలిగించింది. KGF త్రయంలో విరాట్ కోహ్లి రాణించినా గ్లెన్ మాక్స్వెల్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అంచనాలు అందుకోలేకపోయారు.మాక్సీ కొన్నాళ్లు జట్టుకు దూరంగాఫలితంగా విమర్శల పాలయ్యారు. దీంతో మాక్సీ కొన్నాళ్లు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ చేరాలంటే ప్రతి మ్యాచ్లోనూ చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. నిజానికి ఇలాంటి ఒత్తిడిలో ఏ జట్టైనా చిత్తవుతుంది. కానీ ఆర్సీబీ అందుకు విరుద్ధం.ఎంత ఒత్తిడి పెరిగితే అంతగా చెలరేగిపోతాం అన్నట్లుగా వరుసగా ఆరు విజయాలు సాధించి.. ఇప్పుడిలా ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది. చెన్నై సూపర్ కింగ్స్పై తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఊహించని విజయం సాధించింది. రిపీట్ అవుతుందా?సీఎస్కేపై గెలిచినా నెట్ రన్రేటు పరంగా కూడా ఆ జట్టు కంటే మెరుగైన స్థితిలో ఉంటేనే టాప్-4కు అర్హత సాధిస్తుందన్న తరుణంలో అద్భుతం చేసి.. టాప్-4కు అర్హత సాధించింది. కాగా 2016లోనూ ఆరంభంలో ఆకట్టుకోలేకపోయిన ఆర్సీబీ.. ఆ తర్వాత వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ చేరి.. అటుపై ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతమవుతుందని అభిమానులు భావిస్తున్నారు. కాగా 2016 ఫైనల్లో ఆర్సీబీ సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే.ఆర్సీబీ వర్సెస్ చెన్నై స్కోర్లు👉వేదిక: చిన్నస్వామి స్టేడియం.. బెంగళూరు👉టాస్: చెన్నై.. బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 218/5 (20)👉చెన్నై స్కోరు: 191/7 (20)👉ఫలితం: చెన్నైపై 27 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం.. ప్లే ఆఫ్స్లో ఎంట్రీ👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఫాప్ డుప్లెసిస్(39 బంతుల్లో 54, కీలక సమయంలో రెండు క్యాచ్లు).చదవండి: Virat Kohli: కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క.. వీడియో వైరల్ Winning celebration of RCB in North America right now🔥🔥.Bigger than any franchise.RCB , RCB , RCB . pic.twitter.com/2M2FipXGYX— Kohlified. (@123perthclassic) May 19, 2024Winning celebration of RCB near Trump building Chicago. right now🔥🔥.Bigger than any franchise.RCB , RCB , RCB . pic.twitter.com/dy1Oko6QS7— #RCBNation (@9Sxventy3) May 19, 2024Bengaluru won't sleep tonight 😎RCB RCB all over the city @RCBTweets ❤️🔥pic.twitter.com/6jvvAAVERT— M. (@RCB_Hiv3) May 18, 2024Hear the Roar, Hear "Kohli, Kohli & RCB, RCB" Chants when they qualify for playoffs.- King Kohli & RCB are emotions..!!!! pic.twitter.com/Afqck4jNSH— Tanuj Singh (@ImTanujSingh) May 18, 2024📽️ RAW Reactions post a surreal win ❤️When emotions spoke louder than words at Chinnaswamy 🏟️A special lap of honour for the @RCBTweets fans that continue to believe in their side 👏👏#TATAIPL | #RCBvCSK pic.twitter.com/CrBQUBRKEI— IndianPremierLeague (@IPL) May 19, 2024 -
RCB Vs CSK: అతడి వల్లే గెలిచాం.. డుప్లిసెస్ ఎమోషనల్
#RCB Vs CSK ఐపీఎల్ అంటేనే క్రికెట్ అభిమానులకు ఒక పండుగ. అలాంటి ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంటర్స్(#RCB) అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అదరగొట్టింది. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరగని రీతిలో ఐపీఎల్-17లో ప్లే ఆఫ్ల్స్కు చేరుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో చైన్నె సూపర్ కింగ్స్కు షాకిస్తూ మెరుగైన రన్రేట్తో విజయం సాధించి ముందంజలో నిలిచింది. ప్లే ఆఫ్స్కు చేరాల్సిన నాకౌట్ మ్యాచ్లో సీఎక్కేపై 27 పరుగుల తేడాలో ఆర్సీబీ విజయం సాధించింది. ఇక, ఈ మ్యాచ్లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లిసిస్కు మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ సందర్భంగా డూప్లిసిస్ మాట్లాడుతూ.. బెంగళూరులో ఈ సీజన్ను ముగించడం చాలా ఆనందనిచ్చింది. విజయంతో ప్లే ఆఫ్స్కు ఎంతో సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్లో మా బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. నాకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును బౌలర్ యశ్ దయాల్కు అంకితమిస్తున్నాను. యశ్ బౌలింగ్ చేసిన విధానం చాలా బాగుంది. అతడి వల్లే మ్యాచ్ గెలిచాం. అందుకే తనకు అవార్డ్ను అంకితమిస్తున్నా. THE WINNING CELEBRATION FROM RCB. 🫡❤️- RCB into the Playoffs after having 1 win out of first 8 matches. 🤯🔥pic.twitter.com/LPFjay2A7C— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2024 ఇలాంటి పిచ్పై పరుగులు చేయడం ఎంతో కష్టం. మా బ్యాటర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించారు. మా బౌలర్లు కూడా కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి ప్రత్యర్థిని పరుగులు చేయకుండా ఆపగలిగారు. ఈ క్రెడిట్ అంతా మా బౌలర్లదే. ఇక, మా జట్టు ఓడినా.. గెలిచినా ఆర్సీబీ అభిమానులు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నాను. ప్లే ఆఫ్ మ్యాచ్ల్లో కూడా జట్టుగా రాణించి విజయాలను సాధిస్తామనే నమ్మకం ఉంది అంటూ కామెంట్స్ చేశాడు. THE GREATEST COMEBACK IN IPL HISTORY. 🏆- RCB qualified for Playoffs after losing 6 consecutive matches. 🤯pic.twitter.com/eIe6J7Iqhh— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2024 అదరగొట్టిన ఆర్సీబీ బ్యాటర్స్..ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్స్ అందరూ రాణించారు. వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టు చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. బౌండరీలే లక్ష్యంగా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. డుప్లెసిస్ (54), కోహ్లి (47), రజత్ పటీదార్ (41), గ్రీన్ (38) చెలరేగడంతో మొదట ఆర్సీబీ 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో ఇన్నింగ్ ప్రారంభించిన చెన్నైకి మొదటి బంతికే ఫామ్లో ఉన్న సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ ఔటయ్యాడు. ఇక, మూడో ఓవర్లో మిచెల్ (4) కూడా నిష్క్రమించాడు. దీంతో, 19/2తో సీఎస్కే ఒత్తిడిలో పడిపోయింది. కానీ రచిన్, రహానె (33) నిలబడడంతో కాసేపు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 8 ఓవర్లలో 85/2 స్కోర్తో మళ్లీ రేసులో నిలిచింది. ఈ దశలో ఆర్సీబీ బౌలర్ ఫెర్గూసన్.. రహానెను ఔట్ చేయడంతో మ్యాచ్ మళ్లీ ఆర్సీబీ చేతిలోకి వచ్చింది. 14 పరుగుల వ్యవధిలో రచిన్తో పాటు దూబె, శాంట్నర్ ఔట్ కావడంతో ఆ జట్టు పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. సీఎస్కే 15 ఓవర్లలో 129/6తో నిలిచింది. గెలవాలంటే ఐదు ఓవర్లలో 90 పరుగులు పరిస్థితి. ఓడినా ప్లేఆఫ్స్కు చేరాలన్నా 72 పరుగులు చేయాల్సిన స్థితి. అలాంటి దశలో ధోని, జడేజా పోరాడారు. చివరి రెండు ఓవర్లలో ప్లేఆఫ్స్లో స్థానం కోసం 35 (విజయం కోసం కావాల్సింది 53) పరుగులు చేయాలి. ఫెర్గూసన్ వేసిన ఇన్నింగ్స్లో 19వ ఓవర్లో జడేజా, ధోని కలిసి.. 18 పరుగులు రాబట్టడంతో ఉత్కంఠ పెరిగింది. ఆఖరి ఓవర్ (యశ్ దయాళ్) తొలి బంతికే ధోని సిక్స్ బాదడంతో చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగయ్యాయి. కానీ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి రెండో బంతికి ధోనీని ఔట్ చేశాడు. ఆ తర్వాతి నాలుగు బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చి ఆర్సీబీకి మరిచిపోలేని విజయాన్ని అందించాడు. -
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్! వీడియో
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ ఔటైన విధానం వివాదస్పదమైంది. ఈ మ్యాచ్లో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం తీవ్ర చర్చానీయాంశమైంది.ఏమి జరిగిందంటే?ఆర్సీబీ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో సీఎస్కే స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ ఐదో బంతి స్టంప్స్ దిశగా వేశాడు. దీంతో రజిత్ పాటిదార్ ఆ డెలివరీని స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. ఈ క్రమంలో శాంట్నర్ బంతిని ఆపేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.అయితే బంతి మాత్రం శాంట్నర్ చేతి వేలికి దగ్గరగా వెళ్తూ నాన్స్ట్రైక్ ఎండ్లో స్టంప్స్ను తాకింది. వెంటనే సీఎస్కే ఆటగాళ్లు రనౌట్ అప్పీల్ చేశారు. దీంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్కు రిఫర్ చేశాడు. తొలుత బంతి చేతి వేలికి తాకిందా లేదా అని నిర్ధారించుకోవడానికి థర్డ్ అంపైర్ మైఖేల్ గోఫ్ అల్ట్రా ఎడ్జ్ సాయంతో చెక్చేశాడు.అయితే అల్ట్రా ఎడ్జ్లో చిన్నగా స్పైక్ రావడంతో బంతి చేతికి వేలికి తాకినట్లు అంపైర్ నిర్ధారించుకున్నాడు. అనంతరం బంతి స్టంప్స్కు తాకే సమయానికి బ్యాటర్ క్రీజులోకి వచ్చాడా లేదాన్నది పలు కోణాల్లో అంపైర్ పరిశీలించాడు.ఓ యాంగిల్లో బంతి వికెట్లను తాకే సమయానికే డుప్లిసిస్ తన బ్యాటను గీతను దాటించినట్లు కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం బ్యాట్ గాల్లో ఉందంటూ తన నిర్ణయాన్ని ఔట్గా ప్రకటించాడు.దీంతో ఫాప్ డుప్లెసిస్తో పాటు స్టేడియంలో ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. కానీ చేసేదేమి లేక డుప్లెసిస్ (29 బంతుల్లో 54 రన్స్) నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్ డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్, చెత్త అంపైరింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. pic.twitter.com/4hijPiCz9A— Reeze-bubbly fan club (@ClubReeze21946) May 18, 2024 -
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న కీలక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు చెలరేగారు. సీఎస్కే బౌలర్లకు చుక్కలు చూపించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో ఫాప్ డుప్లెసిస్(54) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లి(47), రజిత్ పాటిదార్(41), కామెరాన్ గ్రీన్(38 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్లు ఆడారు.సీఎస్కే బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ రెండు వికెట్లు, తుషార్ దేశ్పాండే, శాంట్నర్ తలా వికెట్ సాధించారు. ఇక ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు ఆర్హత సాధించాలంటే 18 పరుగుల తేడాతో సీఎస్కేను ఓడించాలి.చదవండి: టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..! -
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. 2008 నుంచి ఇప్పటి దాకా.. ఇంత వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. అయినప్పటికీ ఆ జట్టుకు ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్సీబీకి ఉన్నంత విశ్వసనీయమైన ఫ్యాన్ బేస్ మరే జట్టుకు లేదంటారు.నాయకుడి స్థానం నుంచి వైదొలిగిఇంతటి క్రేజ్కు కారణం టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి అన్న విషయం తెలిసిందే. ఇక్కడే తన ఫ్రాంఛైజీ క్రికెట్ మొదలుపెట్టిన ఈ రన్మెషీన్.. ఇప్పటికీ ఆ జట్టుతోనే కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనూ కెప్టెన్గానూ బాధ్యతలు చేపట్టిన కోహ్లి పనిఒత్తిడిని తగ్గించుకుని.. కేవలం బ్యాటింగ్పై ఫోకస్ చేసే క్రమంలో నాయకుడి స్థానం నుంచి 2021 తర్వాత తప్పుకొన్నాడు.గత రెండు సీజన్లుగా సౌతాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్గా కొనసాగుతుండగా.. కోహ్లి ఓపెనింగ్ బ్యాటర్గా సేవలు అందిస్తున్నాడు. అయితే, అతడి సారథ్యంలో గతేడాది ఆరో స్థానంతో ముగించిన ఆర్సీబీ.. ఐపీఎల్-2024 ఆరంభంలో వరుస ఓటములు చవిచూసింది.వరుసగా ఐదు విజయాలు సాధించితర్వాత తిరిగి పుంజుకుని వరుసగా ఐదు విజయాలు సాధించి.. ప్రస్తుతానికి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేసుకుంది. అయితే, కేజీఎఫ్గా ప్రసిద్ధి పొందిన ఆర్సీబీ బ్యాటింగ్ త్రయం కోహ్లి, గ్లెన్ మాక్స్వెల్, ఫాఫ్లలో కేవలం కోహ్లి ఒక్కడే రాణిస్తున్నాడు.ఇప్పటి వరకు ఈ ఎడిషన్లో ఆడిన 13 మ్యాచ్లలో కలిపి 661 పరుగులు చేసిన కోహ్లి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్నాడు. అయితే, జట్టును ప్లే ఆఫ్స్ చేర్చడం మాత్రం కష్టంగా మారింది.ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే సీజన్లో విరాట్ కోహ్లిని మళ్లీ కెప్టెన్గా ప్రకటించాలని ఆర్సీబీ మేనేజ్మెంట్కు సూచించాడు.ఆర్సీబీకి కోహ్లి కూడా అలాగేఈ మేరకు.. "ఈసారి వాళ్లు(ఆర్సీబీ గనుక ) ప్లే ఆఫ్స్నకు అర్హత సాధించకపోతే.. భారత క్రికెటర్ను కెప్టెన్గా తీసుకురావాలి. అయినా ఎవరో ఎందుకు? మళ్లీ కోహ్లినే కెప్టెన్ను చేస్తే సరిపోతుంది కదా! చెన్నై జట్టు మీద ధోని ప్రభావం ఎంత ఉంటుందో.. ఆర్సీబీకి కోహ్లి కూడా అలాగే!బలమైన నాయకుడు. జట్టును ఎలా ముందుకు నడిపించాలో అతడికి తెలుసు. ప్రస్తుతం వాళ్లు దూకుడుగానే ఆడుతున్నారు. కోహ్లి సారథిగా వస్తే మరింత బాగుంటుంది. విరాట్ కోహ్లి తిరిగి ఆర్సీబీ పగ్గాలు చేపడితే చూడాలని ఉంది" అని భజ్జీ స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు.చదవండి: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు: ధోని ఫ్యాన్స్పై సంచలన వ్యాఖ్యలు -
IPL 2024 GT VS RCB: అత్యంత అరుదైన క్లబ్లో చేరిన ఫాఫ్ డుప్లెసిస్
ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ టీ20ల్లో అత్యంత అరుదైన క్లబ్లో చేరాడు. నిన్న (మే 4) గుజరాత్తో జరిగిన మ్యాచ్లో మెరుపు అర్దసెంచరీతో ఇరగదీసిన ఇతను.. పొట్టి ఫార్మాట్లో 10000 పరుగులు పూర్తి చేసుకున్న 14వ బ్యాటర్గా, తొలి సౌతాఫ్రికన్ క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. టీ20 కెరీర్లో 369 మ్యాచ్లు ఆడిన డుప్లెసిస్.. 134.30 స్ట్రయిక్రేట్తో 32.17 సగటున 10039 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో ఓవరాల్గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. గేల్ 463 మ్యాచ్ల్లో 22 సెంచరీలు, 88 హాఫ్ సెంచరీల సాయంతో 14562 పరుగులు చేశాడు. ఈ జాబితాలో గేల్ తర్వాతి స్థానాల్లో షోయబ్ మాలిక్ (13360), పోలార్డ్ (12900), విరాట్ కోహ్లి (12536), అలెక్స్ హేల్స్ (12319), వార్నర్ (12232), రోహిత్ శర్మ (11482), జోస్ బట్లర్ (11465), ఆరోన్ ఫించ్ (11458), కొలిన్ మున్రో (10961), బాబర్ ఆజమ్ (10620), జేమ్స్ విన్స్ (10451), డేవిడ్ మిల్లర్ (10230), డుప్లెసిస్ ఉన్నారు.ఈ మ్యాచ్లో చేసిన పరుగులతో కలుపుకుని డుప్లెసిస్ మరో ఘనత సాధించాడు. డుప్లెసిస్ ఆర్సీబీ తరఫున నాలుగో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు. ఆర్సీబీకి ముందు సీఎస్కేకు ఆడిన డుప్లెసిస్ ఆ ఫ్రాంచైజీ తరఫున మూడో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు.మ్యాచ్ విషయానికొస్తే.. డుప్లెసిస్ మెరుపు అర్ద సెంచరీతో చెలరేగడంతో గుజరాత్పై ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఆర్సీబీ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్ ఇన్నింగ్స్లో షారుక్ ఖాన్ (37), డేవిడ్ మిల్లర్ (30), రాహుల్ తెవాతియా (35) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మిగతా ప్లేయర్లంతా పెవిలియన్కు క్యూకట్టారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, యశ్ దయాల్, విజయ్కుమార్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కర్ణ్ శర్మ, గ్రీన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. పవర్ ప్లేలో పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోయింది. తొలి ఆరు ఓవర్లలో 92 పరుగులు చేసిన ఆర్సీబీ.. ఆతర్వాత ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయి ఆలౌటయ్యేలా కనిపించింది. అయితే దినేశ్ కార్తీక్ (21 నాటౌట్).. సప్నిల్ సింగ్ (15 నాటౌట్) సాయంతో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. గుజరాత్ బౌలర్లలో జాషువ లిటిల్ 4 వికెట్లతో విజృంభించగా.. నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో భారీ జంప్ కొట్టి చివరి స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. ఈ ఓటమితో గుజరాత్ తొమ్మిదో స్థానానికి పడిపోయింది. -
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపున్కుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఏడో స్ధానానికి చేరుకుంది. ఈమ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది.19.3 ఓవర్లలో 147 పరుగులకు గుజరాత్ ఆలౌటైంది. గుజరాత్ బ్యాటర్లలో షారూఖ్ ఖాన్ (37), డేవిడ్ మిల్లర్(30), రాహుల్ తెవాటియా(35) పర్వాలేదన్పించారు. ఇక ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, విజయ్ కుమార్, యశ్ దయాల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. గ్రీన్, కరణ్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.ఆర్సీబీ బ్యాటర్లలో ఓపెనర్లు ఫాప్ డుప్లెసిస్(23 బంతుల్లో 64), విరాట్ కోహ్లి(27 బంతుల్లో 42) పరుగులతో తుపాన్ ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత దినేష్ కార్తీక్(21 నాటౌట్), స్వప్నిల్ సింగ్(15) పరుగులతో మ్యాచ్ను ఫినిష్ చేశారు. గుజరాత్ బౌలర్లలో లిటిల్ 4 వికెట్లు పడగొట్టగా.. నూర్ ఆహ్మద్ రెండు వికెట్లు సాధించాడు.No RCB RCB fans will pass without liking this. ❤️🔥💫⭐Vintage RCB | Just RCB is RCBing | Can RCB vs GT | Faf du Plessis | Only RCB #RCBvsGT #GTvsRCB #ViratKohli pic.twitter.com/Ou5XvqxCv1— crazy (@cricrazyNandu) May 4, 2024 -
RCB కెప్టెన్గా అతడు ఉంటే ఏం మాట్లాడగలరు: సెహ్వాగ్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆట తీరుపై విమర్శలు వెల్లుతుతున్నాయి. సొంతమైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో సొంత జట్టు అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే ఐపీఎల్-2024లో కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరే అవకాశం ఉండదని మండిపడుతున్నారు. ఇక ఇప్పటికే భారత టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతి సైతం ఆర్సీబీని కొత్త వాళ్లకు అమ్మేయాలంటూ యాజమాన్యం తీరును విమర్శించాడు. జట్టు నిండా స్టార్లు ఉన్నా ఇలాంటి చెత్త ప్రదర్శన ఏమిటని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అదే ఇక్కడ ప్రధాన సమస్య ‘‘జట్టులో 12- 15 మంది భారత ఆటగాళ్లు ఉన్నారు. కేవలం 10 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. కానీ ఆర్సీబీ కోచింగ్ సిబ్బందిలో దాదాపుగా అందరూ విదేశీయులే ఉన్నారు. అదే ఇక్కడ ప్రధాన సమస్య. ఇక ఆటగాళ్లలో కొంతమంది మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నారు. వీరిలో సగం మందికి ఇంగ్లిష్ పూర్తిగా అర్థమే కాదు. అలాంటపుడు ఆ విదేశీ కోచ్లు వీరిని ఎలా మోటివేట్ చేయగలరు? వారితో ఎక్కువ సమయం ఎలా గడపగలరు? భాష పూర్తిగా రాని ఆటగాళ్లు తమ సమస్యలను కోచ్లకు ఎలా వివరించగలరు? నాకైతే ఆర్సీబీలో ఒక్క ఇండియన్ కోచ్ కూడా కనిపించడం లేదు. కనీసం ఒక్కరైనా అనుభవజ్ఞుడైన కోచ్ ఉంటే బాగుంటుంది కదా! ఆటగాళ్లు ఏది చర్చించాలన్నా అందుకు తగిన వాతావరణం ఉండాలి. కెప్టెన్గా అతడు ఉంటే ఏం మాట్లాడతారు? నాకు తెలిసి చాలా మంది ఆటగాళ్లు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ దగ్గరికి వెళ్లడానికే సంశయిస్తారు. ఎందుకంటే అతడు ఏదైనా అడిగితే వీరు సమాధానం చెప్పలేరు కదా! ఒకవేళ కెప్టెన్ గనుక భారతీయుడైతే.. సదరు ఆటగాళ్లు తాము అనుకుంటున్న విషయాన్ని స్పష్టంగా అతడికి తెలియజేయగలరు. కానీ విదేశీ ఆటగాడితో సరిగా కమ్యూనికేట్ చేయలేక.. ఒకదానికి బదులు ఇంకొకటి మాట్లాడితే తదుపరి మ్యాచ్లో తుదిజట్టులో చోటు దక్కే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఆర్సీబీ సహాయక సిబ్బందిలో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురైనా భారతీయులు ఉండాలి’’ అని క్రిక్బజ్ షోలో సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్-2024లో ఆర్సీబీ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్లలో కేవలం ఒక్కటి గెలిచి ఆరు ఓడిపోయింది. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ఇక ఈ సీజన్లో ఆర్సీబీ హెడ్కోచ్గా ఆండీ ఫ్లవర్ బాధ్యతలు చేపట్టగా.. బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్ కోచ్గా టీమిండియా మాజీ ఆల్రౌండర్ శ్రీధరన్ శ్రీరామ్, బౌలింగ్ కోచ్గా ఆడం గ్రిఫిత్(టాస్మేనియా మాజీ క్రికెటర్), ఫీల్డింగ్ కోచ్గా మలోలన్ రంగరాజన్ వ్యవహరిస్తున్నారు. చదవండి: SRH: ‘బాధితులు’ కూడా అసూయ పడేలా.. కమిన్స్ ఏమన్నాడో తెలుసా? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మా కుర్రాళ్లు బాగా పోరాడారు.. అదే మా కొంపముంచింది: ఆర్సీబీ కెప్టెన్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ఏ మాత్రం మారలేదు. ఈ మెగా ఈవెంట్లో ఆర్సీబీ వరుసగా ఐదో ఓటమి చవచూసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో 25 పరుగుల తేడాతో బెంగళూరు ఓటమి పాలైంది. మరోసారి బెంగళూరు బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. తొలుత బౌలింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 287 పరుగుల రికార్డు స్కోర్ను సమర్పించుకుంది. ట్రావిస్ హెడ్(102) ,హెన్రిచ్ క్లాసెన్(67), మార్క్రమ్(35), సమద్(37) ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశారు. అనంతరం లక్ష్య చేధనలో ఆర్సీబీ బ్యాటర్లు ఆఖరి వరకు పోరాడారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో దినేష్ కార్తీక్ అద్బుతమైన పోరాటం చేశాడు. కేవలం 35 బంతుల్లోనే 7 సిక్సర్లు, 5 ఫోర్లతో కార్తీక్ 83 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ డుప్లెసిస్(62), విరాట్ కోహ్లి(42) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. ఈ ఓటమితో ఆర్సీబీ ప్లే ఆఫ్ ఛాన్స్లను సంక్లిష్టం చేసుకుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ స్పందించాడు. బౌలింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి పాలైమని ఫాప్ చెప్పుకొచ్చాడు. "ఈ మ్యాచ్లో మేము ఆఖరి వరకు పోరాడినందుకు సంతోషంగా ఉంది. ఈ సీజన్లో మా నుంచి వచ్చిన మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన ఇదే. చిన్నస్వామి వికెట్ సరిగ్గా టీ20 క్రికెట్కు సరిపోతుంది. 280 పైగా టార్గెట్ను ఛేజ్ చేయడం అంత సులభం కాదు. కానీ మేము దగ్గరికి వచ్చి ఓడిపోయాం. ఈ మ్యాచ్లో కొన్ని మార్పులు చేశాము. కొత్తగా కొన్ని విషయాలను ప్రయత్నించాం. ఫాస్ట్ బౌలర్లు ఈ పిచ్పై పూర్తిగా తేలిపోయారు. బ్యాటింగ్ పరంగా మేము బలంగానే ఉన్నాము. మేము ఇంకా కొన్ని విభాగాల్లో ఇంకా మెరుగవ్వాలి. ముఖ్యంగా బౌలింగ్పై ఎక్కువ దృష్టిపెట్టాలి. అదే విధంగా బ్యాటింగ్లో కూడా పవర్ప్లే తర్వాత రన్ రేట్ తగ్గకుండా చూసుకోవాలి. ఈ హైస్కోరింగ్ రన్ ఛేజ్లో మా బాయ్స్ ఆఖరి వరకు మ్యాచ్ను విడిచిపెట్టలేదు. తొలుత బౌలింగ్లో 30-40 పరుగులు ఎక్కువగా ఇచ్చాం. అదే మా కొంపముంచింది. కానీ ఆటలో గెలుపుటములు సహజం. ఓడిపోయినందుకు కచ్చితంగా బాధ ఉంటుంది. కానీ మా మైండ్ను ఫ్రెష్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మా తర్వాతి మ్యాచ్ల్లో ఆడేందుకు సిద్దంగా ఉండాలి కదా" అంటూ పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో డుప్లెసిస్ పేర్కొన్నాడు. -
IPL2024 RCB vs SRH: హై స్కోరింగ్ మ్యాచ్లో ఆర్సీబీ ఓటమి..
IPL2024 RCB vs SRH Live Updates: హై స్కోరింగ్ మ్యాచ్లో ఆర్సీబీ ఓటమి.. ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమి చవిచూసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 25 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. 288 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఆర్సీబీ ఆఖరివరకు పోరాడింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో దినేష్ కార్తీక్ అద్బుతమైన పోరాటం చేశాడు. కేవలం 35 బంతుల్లోనే 7 సిక్సర్లు, 5 ఫోర్లతో కార్తీక్ 83 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ డుప్లెసిస్(62), విరాట్ కోహ్లి(42) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. మార్కండే రెండు, నటరాజన్ ఒక్క వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఎస్ఆర్హెచ్ ఏకంగా 287 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(102) సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్(67), మార్క్రమ్(35), సమద్(37) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఆర్సీబీ ఆరో వికెట్ డౌన్ 181 పరుగులు వద్ద ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన మహిపాల్ లామ్రోర్.. కమ్మిన్స్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో దినేష్ కార్తీక్(36), రావత్(5) పరుగులతో ఉన్నారు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 122/5 13 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఆర్సీబీ విజయానికి 42 బంతుల్లో 128 పరుగులు కావాలి. క్రీజులో దినేష్ కార్తీక్(16), లామ్రోర్(18) పరుగులతో ఉన్నారు. 10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 122/5 ఆర్సీబీ వరుస క్రమంలో మూడు వికెట్లు కోల్పోయింది. 9 ఓవర్ వేసిన మార్కండే బౌలింగ్లో పాటిదార్ ఔట్ కాగా.. అనంతరం కమ్మిన్స్ బౌలింగ్లో డుప్లెసిస్(62), సౌరవ్ చౌహన్ పెవిలియన్కు చేరారు. 10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 122/5 ఆర్సీబీ రెండో వికెట్ డౌన్.. జాక్స్ ఔట్ 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. ఉనద్కట్ బౌలింగ్లో విల్ జాక్స్ రనౌటయ్యాడు. 8 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో ఆర్సీబీ ఫాప్ డుప్లెసిస్(51), పాటిదార్ ఉన్నారు. ఆర్సీబీ తొలి వికెట్ డౌన్.. కోహ్లి ఔట్ 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 42 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. మార్కండే బౌలింగ్లో ఔటయ్యాడు. చెలరేగి ఆడుతున్న ఆర్సీబీ ఓపెనర్లు.. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ దూకుడుగా ఆడుతోంది. 4 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. క్రీజులో ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లి(25), ఫాప్ డుప్లెసిస్(31) పరుగులతో ఉన్నారు. సన్రైజర్స్ విధ్వంసం.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ను ఎస్ఆర్హెచ్ సాధించింది. ఈ మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఎస్ఆర్హెచ్ ఏకంగా 287 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(102) సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్(67), మార్క్రమ్(35), సమద్(37) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుమందు ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 277 పరుగులు చేసింది. ఈ మ్యాచ్తో తన రికార్డును తానే తిరగరాసింది. అదేవిధంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సిక్స్లు కొట్టిన జట్టుగా సన్రైజర్స్ నిలిచింది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఏకంగా 22 సిక్స్లు బాదారు. ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ డౌన్.. క్లాసెన్ ఔట్ 233 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. హెన్రిచ్ క్లాసెన్(31 బంతుల్లో 67, 7 సిక్స్లు, 4 ఫోర్లు).. ఫెర్గూసన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 18 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ మూడు వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. 16 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 217/2 16 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హెన్రిచ్ క్లాసెన్(27 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్లు), మార్క్రమ్(9) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ డౌన్.. హెడ్ ఔట్ ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. విధ్వంసకర సెంచరీతో చెలరేగిన హెడ్.. ఫెర్గూసన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 41 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 9 ఫోర్లు, 8 సిక్స్లతో 102 పరుగులు చేశాడు. 14 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. క్రీజులో హెన్రిస్ క్లాసెన్(39), మార్క్రమ్(2) పరుగులతో ఉన్నారు. ట్రావిస్ హెడ్ విధ్వంసకర సెంచరీ.. ట్రావిస్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో బెంగళూరు బౌలర్లకు హెడ్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై హెడ్ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 38 బంతుల్లో హెడ్ తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 9 ఫోర్లు, 8 సిక్స్లు ఉన్నాయి. 102 పరుగులతో హెడ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 12 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి1 57 పరుగులు చేసింది. తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్.. 108 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన ఆభిషేక్ శర్మ.. టాప్లీ బౌలింగ్లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్(79), క్లాసెన్(1) పరుగులతో ఉన్నారు. దంచి కొడుతున్న ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు.. ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ దంచికొడుతున్నారు. 8 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(33), ట్రావిస్ హెడ్(71) పరుగులతో ఉన్నారు. ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ ట్రావిస్ హెడ్ తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. కేవలం 20 బంతుల్లో 5 ఫోర్లు, 3సిక్స్లతో హెడ్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(23), ట్రావిస్ హెడ్(52) పరుగులతో ఉన్నారు. దంచి కొడుతున్న ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(14), ట్రావిస్ హెడ్(13) పరుగులతో ఉన్నారు. ఐపీఎల్-2024లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ రెండు మార్పులతో బరిలోకి దిగింది. గ్లెన్ మాక్స్వెల్, సిరాజ్ ఈ మ్యాచ్కు దూరమయ్యారు. ఆర్సీబీ తుది జట్టులోకి కివీస్ ఫాస్ట్ బౌలర్ లూకీ ఫెర్గూసన్ వచ్చాడు. సన్రైజర్స్ మాత్రం తమ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. తుది జట్లు సన్రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, సౌరవ్ చౌహాన్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, విజయ్కుమార్ వైషాక్, రీస్ టోప్లీ, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్ -
చాలా బాధగా ఉంది.. అతడే మా కొంపముంచాడు: ఆర్సీబీ కెప్టెన్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీరు ఏ మాత్రం మారలేదు. ఈ మెగా ఈవెంట్లో ఆర్సీబీ మరో ఘోర ఓటమిని చవిచూసింది. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో బెంగళూరు పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లు అదరగొట్టినప్పటికి.. బౌలర్లు మాత్రం దారుణంగా తేలిపోయారు. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ముంబై సునాయాసంగా కేవలం 15.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో 9వ స్ధానంలో కొనసాగుతోంది. ఇక ఈ ముంబై చేతిలో ఓటమిపై మ్యాచ్ అనంతరం ఫాప్ డుప్లెసిస్ స్పందించాడు. మంచు ప్రభావం తమ కొంపముంచిందని డుప్లెసిస్ తెలిపాడు. "మేము ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం. చాలా బాధగా ఉంది. ఒక మ్యాచ్లో విజయం సాధించాలంటే బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ రాణించాలి. టాస్ గెలిచింటే పరిస్థితి మరో విధంగా ఉండేదేమో. ఎందుకంటే మేము కూడా తొలుత బౌలింగ్ చేయాలనుకున్నాం. రెండో ఇన్నింగ్స్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. మా బౌలర్లు చాలా ఇబ్బంది పడ్డారు.అయితే దీనిని నేను సాకుగా చెప్పాలనుకోవడం లేదు. వారు బాగా ఆడారు. మాపై ఒత్తిడి తెచ్చారు. బౌలింగ్లో కూడా అద్బుతంగా రాణించారు. ఈ మ్యాచ్లో మేము కూడా చాలా తప్పులు చేశాము. ఇటువంటి వికెట్పై 190 పైగా స్కోర్ను డిఫెండ్ చేసుకోవడం అంత ఈజీ కాదు. పవర్ప్లేలో మేము మరి కొన్ని పరుగులు సాధించింటే బాగుండేంది. సెకెండ్ ఇన్నింగ్స్లో మంచు ప్రభావం ఉంటుందని మాకు ముందే తెలుసు కాబట్టి 250 పైగా పరుగులు చేయాల్సింది. ఆరంభంలో వికెట్లు కోల్పోడం కూడా మమ్మల్ని దెబ్బతీసింది. అయితే పాటిదార్, నేను క్రీజులో ఉన్నప్పుడు పెద్ద స్కోర్ వస్తుందని భావించాను. కానీ ముంబై బౌలర్లు తిరిగి కమ్బ్యాక్ ఇచ్చారు. ముఖ్యంగా బుమ్రా అద్బుతంగా బౌలింగ్ చేశాడు. అతడు డెత్ ఓవర్లలో సూపర్ బౌలింగ్ చేశాడు. అతడికి అద్బుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. బుమ్రాని ఎటాక్ చేసి ఒత్తిడిలోకి నెట్టడం అంత సలభం కాదు. లసిత్ మలింగ గైడన్స్లో జస్ప్రీత్ మరింత మెరుగయ్యాడని నేను భావిస్తున్నాను. అటువంటి క్లాస్ బౌలర్ మా జట్టులో ఉంటే బాగుండేది. మా బౌలింగ్ విభాగం అంత పటిష్టంగా లేదని మాకు తెలుసు. కాబట్టి రాబోయో మ్యాచ్ల్లో బ్యాటింగ్ పరంగా మెరుగ్గా రాణించి భారీ స్కోర్లు సాధించాలని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో ఫాప్ పేర్కొన్నాడు. -
RCB Vs MI: ఫాప్ డుప్లెసిస్ 'నో లూక్' సిక్స్.. వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ అద్భుతమైన షాట్తో మెరిశాడు. డుప్లెసిస్ న్యూ లూక్ షాట్తో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 2వ ఓవర్ వేసిన గెరాల్డ్ కోయిట్జీ ఆఖరి బంతిని డుప్లెసిస్కు 142.3 కి.మీ వేగంతో గుడ్ లెంగ్త్ డెలివరీ సంధించాడు. అయితే ముందుగానే పొజిషన్లో వచ్చిన డుప్లెసిస్.. బంతిని చూడకుండానే ర్యాంప్ షాట్ ఆడాడు. అయితే డెలివరీగా ఎక్కువగా పేస్ ఉండడంతో దెబ్బకు బంతి స్టాండ్స్లో పడింది. దీంతో డుప్లెసిస్ న్యూ లూక్ సిక్స్ చూసిన బౌలర్ కొయిట్జీ ఒక్కసారిగా తెల్లముఖం వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. #MIvsRCB,#RCBvsMI,#FafDuPlessis Fabulous pic.twitter.com/24eiZQQtga — Be Positive 🙂↕️🌝💯 (@Tauqeer__azam) April 11, 2024 -
అతడి వల్లే ఓడిపోయాం.. అలా చేయకుంటే బాగుండేది!
‘‘తొలి ఇన్నింగ్స్లో వికెట్ పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలించలేదు. ఏదేమైనా ఇక్కడ 190 స్కోరు చేస్తే బాగుంటుందని భావించాం. కనీసం ఇంకో 10- 15 పరుగులు చేస్తే ఫలితం బాగుండేది. మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. టాస్ గెలిసి తొలుత బౌలింగ్ ఎంచుకోవడం కూడా వారికి సానుకూల ఫలితాలను ఇచ్చింది. మ్యాచ్ సాగుతున్నీ కొద్దీ పిచ్ మీద తేమ కారణంగా బ్యాటింగ్ సులువైంది. విరాట్ ఆఖరి వరకు బాగానే ఆడాడు. ఆఖరి ఓవర్లలో కామెరాన్ గ్రీన్ బ్యాట్ ఝలిపిస్తే బాగుండేది. స్పిన్నర్ల బౌలింగ్లో పరుగులు రాబట్టాలని శాయ శక్తులా కృషి చేసినా సాధ్యం కాలేదు. అదే సీమర్ల బౌలింగ్లో హిట్టింగ్ ఆడగలిగాం. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ప్రత్యర్థిని తొలి నాలుగు ఓవర్లలో బాగానే కట్టడి చేయగలిగాం. అప్పుడే మ్యాచ్ మలుపు తిరిగింది కానీ ఆరో ఓవర్లో మేము 20కి పైగా పరుగులు సమర్పించుకోవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ తర్వాత మాపై క్రమంగా ఒత్తిడి పెరిగింది. ఎక్కువగా కుడిచేతి వాటం బ్యాటర్లే ఉన్నారు కాబట్టి మాక్స్వెల్తో బౌలింగ్ చేయించలేదు. ఇద్దరు రైట్ హ్యాండర్లు క్రీజులో ఉన్నపుడు మా లెఫ్టార్మ్ స్పిన్నర్ హిమాన్షు శర్మను బరిలోకి దించాం. వికెట్లు తీసేందుకు మా ప్రయత్నం చేశాం. జైస్వాల్(లెఫ్టాండర్) అవుటైన తర్వాత కూడా మాక్సీతో బౌలింగ్ చేయించాలని అనుకోలేదు. ఇక ఈ మ్యాచ్లో మా ఫీల్డింగ్ అత్యంత సాధారణంగా ఉంది. తదుపరి మ్యాచ్లో తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నిస్తాం’’ అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. ఐపీఎల్-2024లో భాగంగా రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమి అనంతరం ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.ఘ ఆ ఓవర్లోనే ఆర్సీబీ కొంప మునిగింది లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ను తొలి నాలుగు ఓవర్లలో కట్టడి చేసినా.. మయాంక్ దాగర్ వేసిన ఆరో ఓవర్ నుంచి మ్యాచ్ స్వరూపం మారిపోయిందని డుప్లెసిస్ పేర్కొన్నాడు. ఆ తర్వాత ఏ దశలోనూ రాజస్తాన్ను ఆపలేకపోయామని.. ఫీల్డింగ్ వైఫల్యాల వల్ల కూడా మూల్యం చెల్లించామని తెలిపాడు. కాగా జైపూర్లో శనివారం నాటి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 183 పరుగులు చేసింది. అయితే, లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ ఆరంభంలోనే యశస్వి జైస్వాల్(0) వికెట్ కోల్పోయినా.. జోస్ బట్లర్(100- నాటౌట్), సంజూ శాంసన్(69) ఇన్నింగ్స్ కారణంగా విజయఢంకా మోగించింది. కేవలం 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్ను పూర్తి చేసి ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఆర్సీబీ బౌలర్లలో రీస్ టోప్లీ రెండు వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన మయాంక్ దాగర్ ఏకంగా 34 పరుగులు ఇచ్చుకున్నాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్లో ఆరో ఓవర్ బౌల్ చేసిన ఈ లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ ఏకంగా 20 పరుగులు ఇవ్వడం ఆర్సీబీ కొంపముంచింది. ఇక ఈ మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అజేయ శతకం(113) వృథాగా పోయింది. చదవండి: Virat Kohli: ఇంత స్వార్థమా?.. ఐపీఎల్ చరిత్రలో కోహ్లి చెత్త రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024: ఆర్సీబీ లాంటి జట్లు ఎప్పటికీ ట్రోఫీ గెలవలేవు!
"This is why they have not won the IPL for so many years": రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘స్టార్ల’ వైఫల్యం కారణంగానే ఆర్సీబీ ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదని వ్యాఖ్యానించాడు. కోట్లకు కోట్లు తీసుకునే అగ్ర శ్రేణి అంతర్జాతీయ క్రికెటర్లు మైదానంలో కంటే డ్రెసింగ్ రూంలోనే ఎక్కువగా ఉండటం వల్లే ఆర్సీబీ రాత మారడం లేదని రాయుడు అభిప్రాయపడ్డాడు. కాగా 2008 నుంచి బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదన్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్వెల్, ఫాఫ్ డుపెస్లిస్, మహ్మద్ సిరాజ్ వంటి టాప్ క్లాస్ ఆటగాళ్లు ఉన్నా ఆర్సీబీ ట్రోఫీని ముద్దాడలేకపోయింది. తాజాగా ఐపీఎల్-2024లోనూ పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచింది. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 28 రన్స్తో ఓడి మూడో ఓటమిని చవిచూసింది. బ్యాటర్లు, బౌలర్ల సమిష్టి వైఫల్యం కారణంగా సొంత మైదానంలో పరాభవం మూటగట్టుకుంది. A win at home followed by a win away from home for the Lucknow Super Giants! 👏👏 They move to number 4⃣ on the Points Table! Scorecard ▶️ https://t.co/ZZ42YW8tPz#TATAIPL | #RCBvLSG pic.twitter.com/uc8rWveRim — IndianPremierLeague (@IPL) April 2, 2024 స్టార్లు ఒక్కసారైనా రాణించారా? ఈ నేపథ్యంలో అంబటి రాయుడు మాట్లాడుతూ.. ‘‘ వాళ్ల బౌలర్లు ఎల్లప్పుడూ అత్యధికంగా పరుగులు సమర్పించుకుంటూనే ఉంటారు. ఇక బ్యాటర్లేమో స్థాయికి తగ్గట్లు ఆడరు. ఆర్సీబీ కష్టాల్లో ఉన్న సమయంలో.. మేటి బ్యాటర్గా పేరున్న ఒక్క ఆటగాడు కూడా రాణించడం ఇంత వరకు చూడలేదు. అలాంటి జట్లు ఎప్పటికీ టైటిల్ గెలవలేవు. అందుకే ఇన్నేళ్లుగా ఆర్సీబీ ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ సాధించలేకపోయింది. బిగ్ ప్లేయర్లంతా టాపార్డర్లో ఉంటారు. కేక్ తినగా మిగిలిన క్రీమ్ను వదిలేసినట్లు డౌన్ ఆర్డర్లో ఉన్న యువ ఆటగాళ్లపై భారం వేస్తారు. ఒత్తిడిలో యువ ఆటగాళ్లతో పాటు దినేశ్ కార్తిక్ మాత్రమే ఆడటం చూస్తున్నాం. పదహారేళ్లుగా ఆర్సీబీ కథ ఇదే ఒత్తిడిలో మరింత మెరుగ్గా రాణించాల్సిన ఆర్సీబీలోని అగ్ర శ్రేణి అంతర్జాతీయ ప్లేయర్లు ఎప్పుడు బాధ్యత తీసుకున్నారు? వాళ్లంతా ఎక్కువగా డ్రెసింగ్ రూంలోనే ఉంటారు. ఈ ఒక్కరోజు మాత్రమే ఇలా జరగలేదు. పదహారేళ్లు ఆర్సీబీ కథ ఇదే’’ అని అంబటి రాయుడు స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన నెటిజన్లు.. కోహ్లి, మాక్స్ వెల్, డుప్లెసిస్, కామెరాన్ గ్రీన్ వంటి ఆటగాళ్లను ఉద్దేశించే రాయుడు ఇలా అని ఉంటాడని భావిస్తున్నారు. ఆ అదృష్టం అందరికీ ఉండదు బ్రో! అయితే, ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం రాయుడు అభిప్రాయంతో విభేదిస్తున్నారు. ఒక్కోసారి అదృష్టం కలిసి వస్తే కూడా ఆరుసార్లు టైటిల్ గెలిచిన జట్లలో భాగమయ్యే ఛాన్స్ ఉందని రాయుడును ఉద్దేశించి సెటైర్లు వేస్తున్నారు. కాగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన అంబటి రాయుడు ఆ జట్లు ట్రోఫీలు గెలిచిన సందర్భాల్లో(మూడేసి సార్లు) జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. గతేడాది సీజన్ తర్వాత ఐపీఎల్కు అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. చదవండి: రూ.11 కోట్లు టైమ్కి తీసుకుంటాడు.. అతడికేమో 17 కోట్లు! మరి ఆట? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024: ఆర్సీబీ కెప్టెన్కు ఏమైంది..? చెత్త షాట్ ఆడి మరి? వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. వరుసగా మూడో మ్యాచ్లో డుప్లెసిస్ నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో డుప్లెసిస్ విఫలమయ్యాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో ఓ చెత్త షాట్ ఆడి డుప్లెసిస్ తన వికెట్ను కోల్పోయాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన హర్షిత్ రాణా మూడో బంతి హాఫ్ కట్టర్గా సంధించాడు. కానీ డుప్లెసిస్ మాత్రం హాఫ్ సైడ్ వెళ్లి స్కూప్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో షార్ట్ ఫైన్ లెగ్ దిశగా బంతి గాల్లోకి లేచింది. షార్ట్ ఫైన్ లెగ్ ఫీల్డింగ్ చేస్తున్న మిచెల్ స్టార్క్.. ఈజీ క్యాచ్ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. pic.twitter.com/A1wRUMpZLP — Sitaraman (@Sitaraman112971) March 29, 2024 -
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. ఇందులోనైనా ఆర్సీబీ గెలుస్తుందా..?
ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (మార్చి 25) పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని ఆర్సీబీ భావిస్తుండగా.. పంజాబ్ సీజన్లో వరుసగా రెండో విజయంపై కన్నేసింది. ఆర్సీబీ సీజన్ తొలి మ్యాచ్లో సీఎస్కే చేతిలో ఓటమిపాలు కాగా.. పంజాబ్ తమ తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. తొలి మ్యాచ్లో ఆయా జట్ల ప్రదర్శనలపై ఓ లుక్కేద్దాం.. ఆర్సీబీ కంటే పంజాబ్ అన్ని విభాగాల్లో మెరుగ్గా కనిపించింది. ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ పేపర్పై బలంగా కనిపించినప్పటికీ తొలి మ్యాచ్లో స్టార్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. 8 ఫోర్లు బాది డుప్లెసిస్ (35) ప్రమాదకరంగా కనిపించినప్పటికీ.. ఆ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ముస్తాఫిజుర్ అతన్ని పెవిలియన్కు పంపాడు. విరాట్ విషయానికొస్తే.. ఆ మ్యాచ్లో అతని బ్యాటింగ్ నత్త నడకను తలపించింది. అతను 20 బంతులను ఎదుర్కొని కేవలం 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రజత్ పాటిదార్, మ్యాక్స్వెల్ డకౌటై దారుణంగా నిరాశపర్చగా.. కోట్లు పెట్టి అరువు తెచ్చుకున్న కెమారూన్ గ్రీన్ తుస్సుమనిపించాడు. వికెట్కీపర్లు అనూజ్ రావత్ (48), దినేశ్ కార్తీక్ (38 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లు ఆడకపోయుంటే ఆర్సీబీ 100 పరుగులు చేయడం కూడా కష్టంగా ఉండేది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు కూడా తేలిపోయారు. స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. అల్జరీ జోసఫ్, కర్ణ్ శర్మ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మయాంక్ డాగర్ కాస్త పర్వాలేదనిపించగా.. గ్రీన్ 2 వికెట్లు తీసి నాట్ బ్యాడ్ అనిపించాడు. పంజాబ్తో ఇవాల్టి మ్యాచ్లో ఆర్సీబీ అదనపు పేసర్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. కర్ణ శర్మ స్థానంలో ఆకాశదీప్ తుది జట్టులోకి రావచ్చు. పంజాబ్ విషయానికొస్తే.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చి విజయం సొంతం చేసుకుంది. అర్ష్దీప్ సింగ్, రబాడ, రాహుల్ చాహర్ తమ కోటా ఓవర్లు పూర్తి చేసి పర్వాలేదనిపించగా.. హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీసినప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. హర్ప్రీత్ బ్రార్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్ పడగొట్టాడు. బ్యాటింగ్లో సత్తా చాటిన సామ్ కర్రన్ ఒకే ఓవర్ బౌల్ చేశాడు. ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు పర్వాలేదనిపించారు. కర్రన్ (63) అర్దసెంచరీతో రాణించగా.. లివింగ్స్టోన్ (38 నాటౌట్), శిఖర్ ధవన్ (22), ప్రభ్సిమ్రన్ సింగ్ నాట్ బ్యాడ్ అనిపించారు. ఆర్సీబీతో ఇవాల్టి మ్యాచ్ పంజాబ్ ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఢిల్లీతో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించవచ్చు. ఆర్సీబీ తుది జట్టు (అంచనా): ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (వికెట్కీపర్), అల్జరీ జోసెఫ్, ఆకాశ్దీప్, మయాంక్ డాగర్, మహ్మద్ సిరాజ్ పంజాబ్ తుది జట్టు (అంచనా): శిఖర్ ధవన్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో, సామ్ కర్రన్, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ (వికెట్కీపర్), శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్ -
రచిన్ రవీంద్ర సూపర్ క్యాచ్.. బిత్తరపోయిన ఆర్సీబీ కెప్టెన్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో సీఎస్కే ఆటగాడు రచిన్ రవీంద్ర సంచలన క్యాచ్తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్తో దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ను రవీంద్ర పెవిలియన్కు పంపాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్గా వచ్చిన డుప్లెసిస్ ఆది నుంచే సీఎస్కే బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. తొలి నాలుగు ఓవర్లలో ఫాప్ బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ ఎటాక్లోకి తీసుకువచ్చాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 5 ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ రెహ్మన్ నాలుగో బంతిని డుప్లెసిస్కు ఫుల్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. డుప్లెసిస్ లాఫ్టెడ్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో డీప్లో ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్ను అందుకున్నాడు. ఇది చూసిన డుప్లెసిస్ బిత్తర పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ మ్యాచ్లో డుప్లెసిస్(35) పరుగులు చేశాడు. All Happening Here! Faf du Plessis ✅ Rajat Patidar ✅ Glenn Maxwell ✅@ChennaiIPL bounced back & in some style 👏 👏#RCB are 3 down for 42 in 6 overs! Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE Follow the match ▶️ https://t.co/4j6FaLF15Y#TATAIPL |… pic.twitter.com/tyBRQJDtWY — IndianPremierLeague (@IPL) March 22, 2024 -
IPL 2024: చెన్నై, ఆర్సీబీ మ్యాచ్కు ముందు వాతావరణం, పిచ్ వివరాలు
ఐపీఎల్ 2024 సీజన్ తొలి మ్యాచ్ ఇవాళ (మార్చి 22) జరుగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే), ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. అక్షయ్ కుమార్, ఏఆర్ రెహ్మాన్లచే ప్రత్యేక కార్యక్రమం.. మ్యాచ్కు ముందు సీజన్ ఆరంభ వేడుకలు జరుగనున్నాయి. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఈవెంట్లో బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సంగీత మాంత్రికుడు ఎఆర్ రెహ్మాన్, సింగర్ సోనూ నిగమ్ పెర్ఫార్మ్ చేయనున్నారు. సీఎస్కే నూతన కెప్టెన్గా రుతురాజ్.. లీగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. నూతన కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది. మాజీ కెప్టెన్ ధోని స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకుని రుతురాజ్కు బాధ్యతలు అప్పజెప్పాడు. వాతావరణం ఎలా ఉందంటే.. సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్కు వేదిక అయిన చెన్నైలో వాతావరణం ఆటకు ఆనువుగా ఉంది. వాతావరణం నుంచి మ్యాచ్కు ఎలాంటి అవాంతరాలు సంభవించవు. చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం రాత్రి తేలికపాటి వర్షం పడినప్పటికీ.. ఇవాళ మ్యాచ్ జరిగే సమయంలో (7-11 గంటల మధ్యలో) వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మ్యాచ్ వేలల్లో ఉష్ణోగ్రతలు 30, 31 డిగ్రీల మధ్యలో ఉండే అవకాశం ఉంది. వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు. పిచ్ ఎవరికి అనుకూలం.. చెపాక్ పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండిటికీ అనుకూలిస్తుందని చెప్పాలి. తొలుత బ్యాటర్లకు స్వర్గధామంగా కనిపించే ఈ పిచ్ క్రమంగా స్నిన్కు అనుకూలిస్తూ బౌలర్ ఫ్రెండ్లీగా మారుతుంది. ఈ పిచ్పై ఛేదన కాస్త కష్టంగానే ఉంటుంది. తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకే విజయావకాశాలు అధికంగా ఉంటాయి. రాత్రి వేళలో తేమ శాతం అధికమైతే స్పిన్నర్లు చెలరేగే అవకాశం ఉంటుంది. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సూపర్ కింగ్స్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనమైన రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు. చెపాక్ విషయానికొస్తే.. ఆర్సీబీపై సీఎస్కే సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. ఇక్కడ ఇరు జట్లు 8 మ్యాచ్ల్లో తలపడగా.. సీఎస్కే ఏకంగా ఏడు మ్యాచ్ల్లో జయకేతనం ఎగురవేసింది. కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఆర్సీబీ విజయం సాధించింది. అది కూడా లీగ్ ప్రారంభ ఎడిషన్ అయిన 2008లో. నాటి నుంచి ఇప్పటివరకు ఆర్సీబీ సీఎస్కేపై చెపాక్లో ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేదు. తుది జట్లు (అంచనా).. సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్దీప్ -
IPL 2024: ఆర్సీబీపై సీఎస్కేదే ఆధిపత్యం.. పదహారేళ్లలో..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా మార్చి 22న జరుగనుంది. సీజన్ ఓపెనర్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. హెడ్ టు హెడ్ రికార్డులను ఓసారి పరిశీలిస్తే.. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సూపర్ కింగ్స్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనమైన రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు. సొంత అడ్డా చెపాక్లో ఏ జట్టుపై అయినా పట్టపగ్గాల్లేని సీఎస్కే.. ఆర్సీబీపై సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. చెపాక్ ఈ ఇరు జట్లు ఇప్పటివరకు 8 మ్యాచ్ల్లో తలపడగా.. సీఎస్కే ఏకంగా ఏడు మ్యాచ్ల్లో జయకేతనం ఎగురవేసింది. కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఆర్సీబీ విజయం సాధించింది. అది కూడా లీగ్ ప్రారంభ ఎడిషన్ అయిన 2008లో. నాటి నుంచి ఇప్పటివరకు ఆర్సీబీ సీఎస్కేపై చెపాక్లో ఒక్క మ్యాచ్లో కూడా గెలిచింది లేదు. చెపాక్ పిచ్ విషయానికొస్తే.. ఈ మైదానం బ్యాటింగ్, బౌలింగ్ రెండిటికీ అనుకూలిస్తుందని చెప్పాలి. తొలుత బ్యాటర్లకు స్వర్గధామంగా కనిపించే ఈ పిచ్ క్రమంగా స్నిన్కు అనుకూలిస్తూ బౌలర్ ఫ్రెండ్లీగా మారుతుంది. ఈ పిచ్పై ఛేదన కాస్త కష్టంగానే ఉంటుంది. ఇందుకు అక్కడి వాతావరణం కూడా ఓ కారణం. వేసవికాలం రాత్రి వేళల్లో తేమ శాతం అధికంగా ఉండటంతో స్పిన్నర్లు చెలరేగే అవకాశం ఉంటుంది. తుది జట్లు (అంచనా): సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్/వికెట్కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, మతీశ పతిరణ ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్దీప్ -
IPL 2024- RCB: విరాట్ కోహ్లి లేకుండానే..
IPL 2024- RCB- బెంగళూరు: ఐపీఎల్ తాజా ఎడిషన్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ గురువారం ప్రీ సీజన్ క్యాంప్(శిక్షణా శిబిరం)నకు శ్రీకారం చుట్టింది. అయితే జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కాస్త ఆలస్యంగా శిబిరంలో చేరనున్నాడు. ఫ్రాంచైజీల వ్యవహారాల్ని పరిశీలిస్తున్న బీసీసీఐ ఇందుకు గల కారణాన్ని వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతో ఆటకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న కోహ్లి త్వరలోనే జట్టుతో కలుస్తాడని తెలిపింది. కాగా.. తన భార్య అనుష్క శర్మ ప్రసవం నేపథ్యంలో కోహ్లి లండన్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు దూరమైన అతడు.. ‘ఆర్సీబీ అన్బాక్స్’ ఈవెంట్ సందర్భంగా తిరిగి అభిమానుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. కెప్టెన్ వచ్చేశాడు.. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్తో పాటు వెస్టిండీస్ స్టార్ అల్జారీ జోసెఫ్ ప్రీ సీజన్ క్యాంపులో చేరారు. ఇక ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు ఆర్సీబీ పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. కొత్త హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్, క్రికెట్ డైరెక్టర్ మో బొబట్లు జట్టుతో చేరి శిబిరాన్ని పర్యవేక్షిస్తున్నారు. సంతోషంగా ఉంది ఈ నేపథ్యంలో కెప్టెన్ డుప్లెసిస్ మాట్లాడుతూ.. ‘‘ఆండీ ఫ్లవర్ అద్భుతమైన వ్యక్తి. ఇలాంటి కోచ్ మార్గదర్శనంలో ముందుకు సాగడం మా జట్టు చేసుకున్న అదృష్టం. గొప్ప మనసున్న వ్యక్తి’’ అంటూ హర్షం వ్యక్తం చేశాడు. మరోవైపు ఆండీ ఫ్లవర్ సైతం ఆర్సీబీ చరిత్రలోని ఓ నూతన అధ్యాయంలో తాము కూడా భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. కాగా చెపాక్ వేదికగా మార్చి 22న ఐపీఎల్ పదిహేడో సీజన్ మొదలుకానుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీ మధ్య తాజా ఎడిషన్ తొలి మ్యాచ్ జరుగనుంది. చదవండి: IPL 2024: షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్ ఆ రెండు జట్ల మధ్య! వైజాగ్లోనూ -
డుప్లెసిస్ ఊచకోత.. సూపర్ కింగ్స్ సంచలన విజయం
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో జోబర్గ్ సూపర్ కింగ్స్ క్వాలిఫియర్-2కు అర్హత సాధించింది. ఈ లీగ్లో భాగంగా బుధవారం పార్ల్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సూపర్ కింగ్స్.. క్వాలిఫియర్-2 బెర్త్ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పార్ల్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌటైంది. జో బర్గ్ బౌలర్లలో సామ్ కుక్ నాలుగు వికెట్లతో రాయల్స్ పతనాన్ని శాసించగా.. నంద్రే బర్గర్ 3, తహీర్ రెండు వికెట్లతో సత్తాచాటారు. రాయల్స్ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్(47) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం 139 పరుగుల లక్ష్యాన్ని సూపర్ కింగ్స్ ఒక్క వికెట్ నష్టపోయి కేవలం 13.2 ఓవర్లలో ఛేదించింది. సూపర్ కింగ్స్ ఓపెనర్లు లీస్ డుప్లే, ఫాప్ డుప్లెసిస్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. డుప్లై 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 68 పరుగులు చేయగా.. డుప్లెసిస్ 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 55 పరుగులు చేశాడు. ఫిబ్రవరి 8న జోబర్గ్ సూపర్ కింగ్స్ క్వాలిఫియర్-2లో డర్బన్ సూపర్ జెయింట్స్తో తలపడనుంది. -
టీ20 మ్యాచ్లో బ్యాటర్ల ఊచకోత.. ఏకంగా 412 పరుగులు!
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో జో బర్గ్ సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. జోహన్నెస్బర్గ్ వేదికగా డర్బన్ సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సూపర్ కింగ్స్.. ప్లే ఆఫ్ బెర్త్ను ఖారారు చేసుకుంది. కాగా ఈ మ్యాచ్లో పరుగుల వరద పారింది.ఈ మ్యాచ్లో రెండు జట్లు కలిపి ఏకంగా 412 పరుగులు చేశాయి. ఇరు జట్ల బ్యాటర్లు ఏకంగా 20 సిక్స్లు బాదారు. తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. సూపర్ జెయింట్స్ బ్యాటర్లలో జేజే స్మట్స్(55), ముల్దర్(59) హాఫ్ సెంచరీలతో సత్తచాటగా.. ఆఖరిలో క్లాసెన్(16 బంతుల్లో 40, 3 సిక్స్లు, 3 ఫోర్లు) మెరుపులు మెరిపించాడు. అనంతరం 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ కింగ్స్ 19.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే నష్టపోయి ఛేదించింది. సూపర్ కింగ్స్ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్(29 బంతుల్లో 57), లూస్ డిప్లై(57) హాఫ్ సెంచరీతో సత్తాచాటారు. వీరిద్దరితో పాటు మడ్సన్(44 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సూపర్ జెయింట్స్ బౌలర్లలో నూర్ ఆహ్మద్ రెండు, ప్రిటోరియస్ ఒక్క వికెట్ పడగొట్టాడు. -
SA20, 2024: డుప్లెసిస్ ఊచకోత.. 34 బంతుల్లోనే..!
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో జోబర్గ్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ విశ్వరూపం ప్రదర్శించాడు. ముంబై ఇండియన్స్ కేప్టౌన్తో జరిగిన మ్యాచ్లో 20 బంతుల్లోనే అజేయ అర్ధశతకం (4 ఫోర్లు, 3 సిక్సర్లు) బాది తన జట్టును గెలిపించాడు. ఫలితంగా సూపర్ కింగ్స్ 34 బంతుల్లోనే ఎంఐ కేప్టౌన్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించి, 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. WHAT A RUN CHASE JOBURG SUPER KINGS 🤯 🔥 JSK chases down 98 runs from just 5.4 overs - Faf Du Plessis 50*(20) & Du Plooy 41*(14) are the heroes in chase against MI Capetown in SA20 - A classic game. pic.twitter.com/XqKwrSU5Xs — Johns. (@CricCrazyJohns) January 29, 2024 వర్షం కారణంగా 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేప్టౌన్.. కెప్టెన్ కీరన్ పోలార్డ్ (10 బంతుల్లో 33 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగడంతో 3 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. వాన్ డర్ డస్సెన్ (16), రికెల్టన్ (16 బంతుల్లో 23) రెండంకెల స్కోర్లు చేయగా.. లివింగ్స్టోన్ 3 పరుగులకే ఔటయ్యాడు. సూపర్ కింగ్స్ బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ 2, లిజాడ్ విలియమ్స్ ఓ వికెట్ పడగొట్టారు. JOBURG SUPER KINGS 98 RUNS FROM JUST 5.4 OVERS. 🤯 - Madness from Faf Du Plessis & Du Plooy...!!!!pic.twitter.com/M1t9aqaG0x — Johns. (@CricCrazyJohns) January 30, 2024 అనంతరం లక్ష్య ఛేదన సమయంలో వర్షం మరోసారి ఆటంకం కలిగించడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిన సూపర్ కింగ్స్ లక్ష్యాన్ని 98 పరుగులకు మార్చారు. లక్ష్యం పెద్దది కావడంతో ఓపెనర్లు డుప్లెసిస్, డు ప్లూయ్ (14 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) తొలి బంతి నుంచే దూకుడుగా ఆడారు. వీరిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సూపర్ కింగ్స్ 5.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. వరుస ఓటములతో సతమతమవుతున్న సూపర్ కింగ్స్కు ఇది ఊరట కలిగించే విజయం. -
సౌతాఫ్రికా టీ20 లీగ్.. తొలి మ్యాచ్ వర్షార్పణం
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024 ఎడిషన్కు వరుణుడు ఘన స్వాగతం పలికాడు. సన్రైజర్స్ ఈస్ట్రన్ కేప్, జోబర్గ్ సూపర్ కింగ్స్ మధ్య నిన్న (జనవరి 10) జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. గతేడాది ఛాంపియన్ అయిన సన్రైజర్స్ ఈ మ్యాచ్లో ఫేవరెట్గా ఉండింది. సన్రైజర్స్కు ఎయిడెన్ మార్క్రమ్ నాయకత్వం వహిస్తుండగా.. జోబర్గ్ సూపర్ కింగ్స్ డుప్లెసిస్ కెప్టెన్గా ఉన్నాడు. సూపర్ కింగ్స్ గతేడాది సెమీఫైనల్ వరకు చేరింది. ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా టీ20 లీగ్ గత ఎడిషన్లోనే పురుడు పోసుకుంది. తొలి ఎడిషన్ ఫైనల్లో సన్రైజర్స్.. ప్రిటోరియా క్యాపిటల్స్ను ఓడించి ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌట్ కాగా.. సన్రైజర్స్ 16.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సన్రైజర్స్ ఈస్ట్రన్ కేప్ స్క్వాడ్: ఆడమ్ రోసింగ్టన్ (వికెట్కీపర్), ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), టెంబా బవుమా, డేవిడ్ మలాన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జన్సెన్, సైమన్ హార్మర్, టామ్ ఎబెల్, ఒట్నీల్ బార్ట్మన్, లియామ్ డాసన్, అయాబులెలా గ్కమనే, సరెల్ ఎర్వీ, ప్యాట్రిక్ క్రూగర్స్, బెయర్స్ స్వానోపోల్, ఆండీల్ సైమ్లేన్, కాలెబ్ సలేకా, జోర్డన్ హెర్మన్ జోబర్గ్ సూపర్ కింగ్స్ స్క్వాడ్: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), డోనోవన్ ఫెరీరా (వికెట్కీపర్), రీజా హెండ్రిక్స్, లీస్ డు ప్లూయ్, మొయిన్ అలీ, రొమారియో షెపర్డ్, కైల్ సిమండ్స్, గెరాల్డ్ కొయెట్జీ, లిజాడ్ విలియమ్స్, నండ్రే బర్గర్, ఇమ్రాన్ తాహిర్, వేన్ మాడ్సెన్, ఆరోన్ ఫంగిసో, డేవిడ్ వీస్, డయ్యన్ గేలియం, సిబోనెలో మఖాన్యా, జహీర్ ఖాన్, సామ్ కుక్, రోనన్ హెర్మాన్ -
అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ.. సంకేతాలు ఇచ్చిన దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్, ఆ జట్టు మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వడంపై సంకేతాలు ఇచ్చాడు. వచ్చే ఏడాది (2024) జరగనున్న టీ20 ప్రపంచకప్లో పునరాగమనాన్ని పరిశీలిస్తున్నట్లు ఫాఫ్ స్వయంగా వెల్లడించాడు. ఈ విషయమై దక్షిణాఫ్రికా వైట్ బాల్ కోచ్ రాబ్ వాల్టర్తో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నాడు. తాను అంతర్జాతీయ క్రికెట్కు తిరిగి రాగలనని నమ్ముతున్నానని తెలిపాడు. తన పునరాగమనంపై గత రెండేళ్లుగా చర్చలు జరుగుతున్నాయని.. టీ20 ప్రపంచకప్ సమయానికి జట్టు సమతూకం విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని అన్నాడు. ప్రస్తుతం అబుదాబి టీ10 లీగ్లో ఆడుతున్న ఫాఫ్ అంతర్జాతీయ క్రికెట్లోకి రీంట్రీ ఇచ్చే అంశాన్ని తనే ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. 39 ఏళ్ల ఫాఫ్ ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్లో భీకర ఫామ్లో ఉండిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో అతను శుభ్మన్ గిల్ తర్వాత లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ సీజన్లో అతను 14 ఇన్నింగ్స్ల్లో 730 పరుగులు చేశాడు. ఫాఫ్ తన చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ను 2020 చివర్లో ఆడాడు. అప్పటినుంచి అతను లీగ్ క్రికెట్కు మాత్రమే పరిమితమయ్యాడు. ఫాఫ్ను టీ20 జట్టులో చేర్చుకోవాలని కొత్తగా ఎంపికైన పరిమత ఓవర్ల కోచ్ రాబ్ వాల్టర్ క్రికెట్ సౌతాఫ్రికాపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తుంది. ఫాఫ్ ఫిట్నెస్ పరంగానూ, టెక్నికల్గానూ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాడని వాల్డర్ నమ్ముతున్నాడు. రీఎంట్రీ విషయమై వాల్టర్ మరో దిగ్గజ బ్యాటర్తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. రీఎంట్రీ ఇచ్చేందుకు డుప్లెసిస్కు ఆసక్తి ఉన్నా క్రికెట్ సౌతాఫ్రికా అతన్ని అనుమతిస్తుందో లేదో వేచి చూడాలి. ఇదిలా ఉంటే, మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ల కోసం భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లు డిసెంబర్ 10 నుంచి మొదలవుతాయి. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్ల కోసం ఇరు జట్లను ఇదివరకే ప్రకటించారు. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ తొలుత టీ20 సిరీస్ ఆడుతుంది. తొలి మ్యాచ్ డర్బన్ వేదికగా డిసెంబర్ 10న జరుగుతుంది. -
IPL 2024: ఆర్సీబీలో భారీ ప్రక్షాళన.. స్టార్ ఆటగాళ్లకు షాక్.. లక్కీ డీకే
ఐపీఎల్ 2024 సీజన్కు ముందు ఆర్సీబీ ఫ్రాంచైజీ భారీ ప్రక్షాళనకు దిగింది. ఆ జట్టు హాజిల్వుడ్, హసరంగ, హర్షల్ పటేల్, బ్రేస్వెల్, పార్నెల్ లాంటి స్టార్లను సైతం వేలానికి వదిలేసింది. అయితే ఆ జట్టు ఎవరూ ఊహించని విధంగా దినేశ్ కార్తీక్ను కొనసాగించింది. కెప్టెన్గా డుప్లెసిస్ను కొనసాగించిన ఆర్సీబీ.. కెమారూన్ గ్రీన్ను ముంబై ఇండియన్స్ను నుంచి ట్రేడింగ్ చేసుకుంది. విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్వెల్ లాంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉండనే ఉన్నారు. ఆర్సీబీ రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే.. వనిందు హసరంగ హర్షల్ పటేల్ జోష్ హాజిల్వుడ్ ఫిన్ అలెన్ మైఖేల్ బ్రేస్వెల్ డేవిడ్ విల్లే వేన్ పార్నెల్ సోనూ యాదవ్ అవినాశ్ సింగ్ సిద్దార్థ్ కౌల్ కేదార్ జాదవ్ ఆర్సీబీ కొనసాగించనున్న ఆటగాళ్లు వీరే.. ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్) గ్లెన్ మ్యాక్స్వెల్ విరాట్ కోహ్లి రజత్ పాటిదార్ అనూజ్ రావత్ దినేశ్ కార్తీక్ సుయాశ్ ప్రభుదేశాయ్ విల్ జాక్స్ మహిపాల్ లోమ్రార్ కర్ణ్ శర్మ మనోజ్ భండగే కెమరూన్ గ్రీన్ (ముంబై నుంచి ట్రేడింగ్) మయాంక్ డాగర్ (ఎస్ఆర్హెచ్ నుంచి ట్రేడింగ్) వైశాఖ్ విజయ్ కుమార్ ఆకాశ్ దీప్ మొహమ్మద్ సిరాజ్ రీస్ టాప్లే హిమాన్షు శర్మ రజన్ కుమార్ -
అప్పుడలా! ఈసారి మాత్రం వరల్డ్కప్ ట్రోఫీ మాదే: సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్
అప్పటి దాకా అదరగొట్టడం... అభిమానుల్లో అంచనాలు పెంచేయడం... మేజర్ ఈవెంట్లలో కీలక సమయంలో చేతులెత్తేయడం.. కనీసం ఫైనల్ కూడా చేరలేక చతికిలపడటం.. మీరు ఊహించిన పేరు నిజమే! ఈ ప్రస్తావన సౌతాఫ్రికా గురించే! 1992 నుంచి వరల్డ్కప్ టోర్నీలో పోటీపడుతున్న దక్షిణాఫ్రికా ఇంత వరకు ఒక్క వన్డే ట్రోఫీ కూడా గెలవలేదు. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లలో విజయం అంచులదాకా వెళ్లి బోల్తా పడటం.. ‘చోకర్స్’ అనే ‘నామధేయం’ తమకు సరిగ్గా సరిపోతుందని మళ్లీ మళ్లీ నిరూపించుకోవడం ప్రొటిస్కు బాగా అలవాటు. ఈసారి ట్రోఫీ గెలుస్తాం అయితే, ఈసారి ఆ అపఖ్యాతిని కచ్చితంగా చెరిపేసుకుంటాం అంటున్నాడు సౌతాఫ్రికా స్పీడ్స్టర్ కగిసో రబడ. ప్రపంచకప్ ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా భారత్లో బరిలోకి దిగుతామని పేర్కొన్నాడు. ఇప్పటి వరకు జరగనిది.. ఇప్పుడు చేసి చూపిస్తామంటూ ధీమా వ్యక్తం చేశాడు. ప్రొటిస్ పేస్ దళానికి నాయకత్వం వహిస్తున్న 28 ఏళ్ల రబడ ఈ మేరకు మాట్లాడుతూ.. ‘‘సౌతాఫ్రికా క్రికెట్ గురించి బయట నడుస్తున్న డ్రామా, చర్చల గురించి మేము అస్సలు పట్టించుకోము. నిజమే ప్రపంచకప్ టోర్నీల్లో ఆడుతూ.. ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోతే ఎలా ఉంటుందో తెలుసు. ప్రతి క్రికెటర్ కల అదే! తీవ్రమైన నిరాశ కలుగుతుంది కదా! ఈ విషయంలో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఈసారి దానిని సాధ్యం చేసి చూపించాలని నేను... మేమంతా బలంగా కోరుకుంటున్నాం. వరల్డ్కప్ ట్రోఫీ గెలవడం ఎవరికైనా ఇష్టమే కదా! ప్రతి ఒక్క క్రికెటర్ కల అదే! ఒక్కసారి జట్టును ప్రకటిస్తే.. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే చూస్తారు’’ అంటూ ఆత్మవిశ్వాసం ప్రదర్శించాడు. కాగా ఇప్పటి వరకు నాలుగుసార్లు వరల్డ్కప్ సెమీస్ వరకు చేరుకున్న సౌతాఫ్రికా ఒక్కసారి కూడా ముందడుగు వేయలేకపోయింది. అప్పుడలా.. ఆఖరిగా.. 2019 వరల్డ్కప్లో మాంచెస్టర్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై 10 పరుగుల తేడాతో గెలిచి.. విజయంతో టోర్నీని ముగించింది. అయితే, ఈసారైనా కప్ గెలుస్తారంటూ.. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు మాత్రం ఫాఫ్ డుప్లెసిస్ బృందం నిరాశనే మిగిల్చింది. ఇదిలా ఉంటే.. భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి వన్డే వరల్డ్కప్ ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే! చదవండి: టీమిండియా క్యాప్ అందుకోవడం ఈజీ అయిపోయింది.. అదే జరిగితే బుమ్రా అవుట్! -
ఐపీఎల్లో ఓ వెలుగు వెలిగిన స్టార్ క్రికెటర్
-
ఐపీఎల్లో ఓ వెలుగు వెలిగిన స్టార్ క్రికెటర్, అక్కడ మాత్రం దయనీయ స్థితిలో..!
ఈ ఏడాది (2023) ఐపీఎల్లో, అంతకుముందు జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్లో మెరుపులు మెరిపించిన సౌతాఫ్రికన్ లెజెండ్ ఫాఫ్ డుప్లెసిస్ ప్రస్తుతం అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) ఇనాగురల్ ఎడిషన్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఎంఎల్సీ-2023లో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన డుప్లెసిస్.. తన క్రికెటింగ్ కెరీర్లోకెళ్లా అత్యంత దారుణమైన గణాంకాలు నమోదు చేశాడు. 7 ఇన్నింగ్స్ల్లో 6.57 సగటున 85.18 స్ట్రయిక్రేట్తో కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. లీగ్ క్రికెట్లో ఘన చరిత్ర కలిగిన డప్లెసిస్.. తన 13 ఏళ్ల కెరీర్లో ఇప్పటివరకు ఏ లీగ్లోనూ ఇంత పేలవ ప్రదర్శన కనబర్చలేదు. డుప్లెసిస్ వరుస వైఫల్యాల నేపథ్యంలో అతని ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీ ఆందోళన చెందుతుంది. ఆ జట్టు అభిమానుల బాధ వర్ణణాతీతంగా ఉంది. డుప్లెసిస్ వచ్చే సీజన్లో ఎలాగైనా తమకు ఐపీఎల్ టైటిల్ సాధించిపెడతాడని గంపెడాశలు పెట్టుకున్న ఆర్సీబీ అభిమానులు.. ఫాఫ్ దయనీయ పరిస్థితి చూసి కుమిలిపోతున్నారు. ఇలాగైతే 2024లో కూడా తాము టైటిల్ గెలిచినట్లే అని తలలుపట్టుకుంటున్నారు. ఎంఎల్సీలో చెన్నై సూపర్ కింగ్స్ అనుబంధ ఫ్రాంచైజీ అయిన టెక్సాస్ సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన డుప్లెసిస్.. ముంబై ఇండియన్స్ న్యూయార్క్తో జరిగిన ఆఖరి మ్యాచ్లో 9 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. ఆ మ్యాచ్లో సూపర్ కింగ్స్.. ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి లీగ్ నుంచి నిష్క్రమించింది. భారతకాలమానం రేపు (జులై 31) జరుగబోయే ఫైనల్లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్.. సియాటిల్ ఆర్కాస్ను ఢీకొంటుంది. కాగా, టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి, పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కొనసాగుతున్న డుప్లెసిస్.. ఎంఎల్సీ మినహాయించి ఈ ఏడాది టీ20 లీగ్ల్లో మెరుపులు మెరిపించిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో 14 మ్యాచ్లు ఆడిన అతను.. 56.15 సగటున, 153.68 స్ట్రయిక్ రేట్తో 730 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా టీ20 లీగ్లో 11 మ్యాచ్ల్లో 41 సగటున, 147.60 స్ట్రయిక్రేట్తో 369 పరుగులు చేశాడు. -
నిప్పులు చెరిగిన పార్నెల్.. కుప్పకూలిన సూపర్ కింగ్స్
అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ ఆరంభ ఎడిషన్లో సీయాటిల్ ఆర్కాస్ ఫ్రాంచైజీ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆ జట్టు సీజన్లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. టెక్సాస్ సూపర్ కింగ్స్తో ఇవాళ (జులై 22) జరిగిన మ్యాచ్లో ఆర్కాస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టు కెప్టెన్ వేన్ పార్నెల్ నిప్పులు చెరగడంతో (5/20) తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 127 పరుగులకే కుప్పకూలింది. పార్నెల్.. సూపర్ కింగ్స్ పతనాన్ని శాసించగా, ఆండ్రూ టై (2/15), ఇమాద్ వసీం (1/25), గానన్ (1/30) మిగతా పనిని పూర్తి చేశారు. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్లో డ్వేన్ బ్రేవో (39) టాప్ స్కోరర్గా నిలువగా..డేనియల్ సామ్స్ (26), కోడీ చెట్టి (22), డుప్లెసిస్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఔటై డెవాన్ కాన్వే (0) నిరాశపర్చగా.. డేవిడ్ మిల్లర్ (8), మిచెల్ సాంట్నర్ (2) దారుణంగా విఫలమయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్కాస్.. 16 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (53) అర్ధసెంచరీతో రాణించగా.. హెన్రిచ్ క్లాసెన్ (21 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్తో మెరిశాడు. ఆర్కాస్ కోల్పోయిన రెండు వికెట్లలో ఒకటి సాంట్నర్, మరొకటి మొహమ్మద్ మొహిసిన్ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో ఆర్కాస్ టేబుల్ టాపర్గా (3 మ్యాచ్ల్లో 3 విజయాలు) నిలువగా.. 4 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించిన సూపర్ కింగ్స్ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వాషింగ్టన్ ఫ్రీడం (3 మ్యాచ్ల్లో 2 విజయాలు), శాన్ఫ్రాన్సిస్కో యునికార్న్స్ (3 మ్యాచ్ల్లో 2 విజయాలు), ముంబై ఇండియన్స్ న్యూయార్క్ (3 మ్యాచ్ల్లో ఓ విజయం), లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్ (4 మ్యాచ్ల్లో 4 పరాజయాలు) వరుసగా 3 నుంచి 6 స్థానాల్లో ఉన్నాయి. -
మరోసారి ‘యెల్లో’ జెర్సీ ధరించనున్న డుప్లెసిస్.. చెన్నై ప్రాంఛైజీ కెప్టెన్గా
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ మరో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీతో మరోసారి జతకట్టాడు. అగ్ర రాజ్యం అమెరికా తొలిసారి నిర్వహిస్తున్న మేజర్ లీగ్ క్రికెట్ టీ20 టోర్నీలో డుప్లెసిస్ భాగం కానున్నాడు. ఈ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్ (టీఎస్కే) తరఫున ఆడనున్నాడు. అంతేకాకుండా జట్టుకు అతడే అతడే సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా టెక్సాస్ సూపర్ కింగ్స్ వెల్లడించింది. ఇక ఇప్పటికే దక్షిణాఫ్రికా టీ20 లీగ్లో సీఎస్కే కొనుగొలు చేసిన జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్టుకు డుప్లెసిస్ కెప్టెన్గా ఉన్నాడు. అదే విధంగా ఐపీఎల్లో కూడా చాలా సీజన్ల పాటు సీఎస్కేకు డుప్లెసిస్ ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్యాష్రిచ్ లీగ్లో దాదాపు సీఎస్కే తరపున 100పైగా మ్యాచ్లు ఆడిన ఫాప్.. 2,935 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఫాప్ ప్రస్తుతం ఆర్సీబీ కెప్టెన్గా ఉన్నాడు. ఐపీఎల్-2023లో 14 మ్యాచ్లు ఆడిన డుప్లెసిస్.. 730 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో రెండో స్ధానంలో నిలిచాడు. ఇక మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో డు ప్లెసిస్తో పాటు అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో, మిచెల్ సాంట్నర్, డెవాన్ కాన్వే, డేవిడ్ మిల్లర్ వంటి స్టార్ క్రికెటర్లు టెక్సాస్ సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నారు. కాగా ఎంఎల్సీ ఫస్ట్ సీజన్ జులై 13 నుంచి జూలై 30 వరకు జరగనుంది. -
IPL 2023: ఆర్సీబీ వైఫల్యాలకు కారణం ఎవరంటారు..?
మే 21న జరిగిన మ్యాచ్లో గుజరాత్ చేతిలో ఓటమితో ఐపీఎల్ 2023లో ఆర్సీబీ ప్రస్థానం ముగిసింది. దీంతో వరుసగా ఆ జట్టు 16వ ఎడిషన్లోనూ రిక్త హస్తాలతోనే లీగ్ నుంచి నిష్క్రమించింది. ప్రతి ఏడాది ఈ సారి కప్ మాదే అంటూ ఊదరగొట్టే ఆర్సీబీ.. ఈ ఏడాది కనీసం ప్లే ఆఫ్స్కు కూడా చేరకుండానే నిరాశగా లీగ్ నుంచి వైదొలిగింది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్లో ఆర్సీబీ పరిస్థితి మరింత దారుణంగా ఉన్నప్పటికీ.. డుప్లెసిస్ (14 మ్యాచ్ల్లో 730 పరుగులు), కోహ్లి (14 మ్యాచ్ల్లో 639 పరుగులు)లు జాకీలు వేసి పైకి లేపడంతో గ్రూప్ స్టేజ్ ఆఖరి మ్యాచ్ వరకు నెట్టుకొచ్చింది. డుప్లెసిస్, కోహ్లిల తర్వాత అడపాదడపా మ్యాక్స్వెల్ (14 మ్యాచ్ల్లో 400 పరుగులు), సిరాజ్ (14 మ్యాచ్ల్లో 19 వికెట్లు) రాణించడంతో ఆర్సీబీ 14 మ్యాచ్ల్లో కనీసం 7 మ్యాచ్ల్లోనైనా గెలవగలిగింది. వాస్తవానికి పైన పేర్కొన్న నలుగురి ప్రదర్శనలతో పాటు మిగతా జట్టు సభ్యులు నామమాత్రంగా రాణించినా ఆర్సీబీ 14 మ్యాచ్ల్లో కనీసం 9 మ్యాచ్ల్లోనైనా గెలవగలిగేదే. అయితే ఆ నలుగురు మినహాయించి ఒక్కరు కూడా కనీస ప్రదర్శన చేయకపోవడంతో ఆ జట్టుకు ఈ దుస్థితి దాపురించింది. బౌలింగ్లో కర్ణ్ శర్మ (9 వికెట్లు), హసరంగ (9 వికెట్లు), వేన్ పార్నెల్ (9 వికెట్లు), విజయ్కుమార్ వైశాఖ్ (9 వికెట్లు) కాస్త పర్వాలేదనిపించినప్పటికీ, వారి నుంచి ఈ ప్రదర్శనలు సరిపోలేదు. వీరు ఏదో టెయిలెండర్ల వికెట్లు సాధించారే తప్పించి, పరుగులను నియంత్రించలేకపోయారు. పలు మ్యాచ్ల్లో ఆర్సీబీ 200కు పైగా పరుగులు సాధించినప్పటికీ, ఆ స్కోర్లను డిఫెండ్ చేసుకోలేక చతికిలపడింది. ఆర్సీబీ బౌలింగ్ విభాగంలో దారుణంగా విఫలమైన వారిలో ఆల్రౌండర్ అని చెప్పుకునే షాబాజ్ అహ్మద్ (10 మ్యాచ్ల్లో ఒక్క వికెట్, 42 పరుగులు), హర్షల్ పటేల్ (8 వికెట్లు) ముఖ్యులు. వీరిలో మరి ముఖ్యంగా హర్షల్ పటేల్ తన స్థాయికి తగ్గట్టుగా రాణించకపోగా, ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ ఏడాది ఆర్సీబీ వైఫల్యాలకు ముఖ్య కారకులుగా చెప్పుకునే బ్యాటింగ్ హీరోల గురించి మాట్లాడుకోవాలి. గతేడాది ప్రదర్శనతో గ్రేట్ ఫినిషర్గా కీర్తించబడిన దినేశ్ కార్తీక్ (13 మ్యాచ్ల్లో 140 పరుగులు, 4 డకౌట్లు).. ఈ ఏడాది అత్యంత దారుణంగా విఫలమై, ఆర్సీబీ ఓటములకు ప్రత్యక్ష కారణమయ్యాడు. డీకే తన స్థాయికి తగ్గట్టుగా ఆడి ఉంటే ఆర్సీబీ సునాయాసంగా మరో 2 మ్యాచ్లు గెలిచేది. బ్యాటింగ్ విభాగంలో ఘోరంగా విఫలమైన మరో 4 ఆటగాళ్లు.. మహిపాల్ లోమ్రార్ (12 మ్యాచ్ల్లో 135 పరుగులు), షాబాజ్ అహ్మద్ (10 మ్యాచ్ల్లో 42 పరుగులు), అనూజ్ రావత్ (9 మ్యాచ్ల్లో 91), సుయాశ్ ప్రభుదేశాయ్ (5 మ్యాచ్ల్లో 35). వీరు గల్లీ క్రికెటర్ల కంటే హీనంగా బ్యాటింగ్ చేసి జట్టు ఓటముల్లో కీలకపాత్ర పోషించారు. డుప్లెసిస్-కోహ్లి జోడీ తొలి వికెట్కు రికార్డు స్థాయి భాగస్వామ్యాలు నమోదు చేసినప్పటికీ.. వీరు కనీస స్థాయి ఆట కూడా ఆడకుండా విఫలమయ్యారు. మొత్తంగా చూస్తే ఆ నలుగురు (డెప్లెసిస్, కోహ్లి, మ్యాక్స్వెల్, సిరాజ్) మినహాయించి జట్టు మొత్తం విఫలం కావడంతో ఈ ఏడాది ప్లే ఆఫ్స్కు చేరకుండానే ఆర్సీబీ ఖేల్ ఖతమైంది. ఈ ఏడాది ఆర్సీబీ వైఫల్యాల్లో ముఖ్య కారకులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చదవండి: సెమీ ఫైనల్కు వెళ్లే అర్హత ఆర్సీబీకి లేదు: డుప్లెసిస్ వ్యాఖ్యలు వైరల్ -
సెమీ ఫైనల్కు వెళ్లే అర్హత ఆర్సీబీకి లేదు: డుప్లెసిస్ వ్యాఖ్యలు వైరల్
IPL 2023- RCB Knocked Out: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఈసారి కూడా నిరాశే మిగిలింది. పదిహేనేళ్లుగా కళ్లు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానులను నిరాశపరుస్తూ ఐపీఎల్-2023లో ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే ఇంటిబాట పట్టింది. గుజరాత్ టైటాన్స్తో తప్పక గెలవాల్సి ఆదివారం నాటి మ్యాచ్లో మెరుగైన స్కోరు సాధించినా.. శుబ్మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. దీంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, పేసర్ మహ్మద్ సిరాజ్ కన్నీటి పర్యంతమయ్యారు. వీరిని చూసి అభిమానుల హృదయాలు ముక్కలయ్యాయి. చాంపియన్గా నిలుస్తారని ఆశపడితే టాప్-4కి కూడా చేరకపోవడంతో ఆర్సీబీపై విమర్శలు కూడా వచ్చాయి. మాది అత్యుత్తమ జట్టు కాదు ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమణ అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఈ సీజన్ను ఇక్కడితోనే ముగించడం పట్ల బాధగా ఉంది. తీవ్ర నిరాశకు లోనయ్యాను. ఆ అర్హత మాకు లేదు నిజాయితీగా చెప్పాలంటే.. మా ప్రదర్శనను పరిశీలిస్తే మేము అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలవడానికి అర్హులం కాదు. కాకపోతే మాకంటూ కొన్ని గొప్ప విజయాలు ఉండటం నిజంగా మా అదృష్టం. కానీ జట్టుగా మా ప్రదర్శన చూస్తే సెమీ ఫైనల్లో అడుగుపెట్టే అర్హత మాత్రం మాకు లేదు’’ అని ఫాఫ్ డుప్లెసిస్ పేర్కొన్నాడు. తమ వైఫల్యాల గురించి అసంతృప్తి వ్యక్తం చేస్తూ డుప్లెపిస్ మాట్లాడిన వీడియోను ఆర్సీబీ షేర్ చేయగా ట్రెండ్ అవుతోంది. ఆటగాడిగా, కెప్టెన్గా రాణించినా కాగా గతేడాది విరాట్ కోహ్లి నుంచి ఆర్సీబీ పగ్గాలు చేపట్టిన డుప్లెసిస్.. బ్యాటర్గా, సారథిగా అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్-2022లో 468 పరుగులు సాధించాడు. అదే విధంగా జట్టును ప్లే ఆఫ్స్నకు చేర్చాడు. ఇక ఈసారి ఆటగాడిగా అత్యుత్తమంగా రాణించి 730 పరుగులతో ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు. మరోవైపు.. కోహ్లి సైతం బ్యాట్ ఝులిపించి 639 పరుగులు చేశాడు. వీటిలో రెండు శతకాలు ఉండటం విశేషం. కానీ.. ఆర్సీబీ లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టడంతో డుప్లెసిస్కు, అతడి బృందానికి నిరాశ తప్పలేదు. చదవండి: నిజంగా సిగ్గుచేటు.. కఠిన చర్యలు తీసుకుంటాం! శుబ్మన్ సోదరికి అండగా.. IPL 2023: మళ్లీ అవే తప్పులు! ఏం నేర్చుకున్నాడో: టీమిండియా మాజీ ఓపెనర్ RCB v GT Game Day Review Captain Faf, players and the coaches reflect on the #IPL2023 season and send in their gratitude and regards to the 12th Man Army, after match that brought an end to our campaign this year.#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/8Vst2kRZLV — Royal Challengers Bangalore (@RCBTweets) May 22, 2023 -
IPL 2023: ఆర్సీబీ టైటిల్ గెలవదని డుప్లెసిస్ ముందే చెప్పాడు..!
ఐపీఎల్ 2023లో ఆర్సీబీ ప్రస్తానం నిన్నటితో (మే 21) ముగిసింది. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమితో ఆ జట్టు కుంగుబాటుతో లీగ్ నుంచి నిష్క్రమించింది. విరాట్ కోహ్లి సెంచరీ చేయడంతో తప్పక గెలుస్తామనుకున్న మ్యాచ్లో ఆర్సీబీ ఓడింది. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలపై శుభ్మన్ గిల్ నీళ్లు చల్లాడు. ఫలితంగా ఆర్సీబీ ఇంటికి, ముంబై ప్లే ఆఫ్స్కు చేరాయి. ఆర్సీబీ.. ఈ ఏడాది కూడా టైటిల్ గెలవకుండా నిరాశగా వెనుదిరిగిన నేపథ్యంలో ఆ జట్టుకు సంబంధించిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం ట్రెండింగ్లో నిలిచింది. సీజన్ ప్రారంభానికి ముందు ఓ ప్రత్యేక కార్యక్రమం సందర్భంగా ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ "ఈ ఏడాది కప్ లేదు" అని అన్నాడు. ఆర్సీబీ స్లోగన్ "ఈ సాల కప్ నమ్దే"ను డుప్లెసిస్ పొరపాటున "ఈ సాల కప్ నహీ" అని ఉచ్ఛరించాడు. దీంతో పక్కనే ఉన్న కోహ్లి.. డుప్లెసిస్ చేసిన తప్పును నవ్వుతూ సరిచేశాడు. దీనికి సంబంధించిన వీడియోను కొందరు ఆర్సీబీకి, ఆ జట్టు అభిమానులకు ట్యాగ్ చేస్తూ సోషల్మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆర్సీబీ ఈ ఏడాది కూడా టైటిల్ గెలవదని డుప్లెసిస్కు ముందే తెలుసని కామెంట్లు చేస్తున్నారు. కొందరు సరదాగా ఈ వీడియోను షేర్ చేస్తుంటే, కొందరేమో ఆర్సీబీ ఓటమిని తమాషా చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. Even Faf Knows Ee Sala Cup Nahi 😂😂😂😂🙊😂😂😂😂#RCB pic.twitter.com/ZRu3moy66X — Dr Khushboo 🇮🇳 (@khushbookadri) April 1, 2023 తమ జట్టుపై అనవసర ట్రోలింగ్కు దిగుతున్న వారికి ఆర్సీబీ అభిమానులు సైతం ధీటైన సమాధానాలతో బదులిస్తున్నారు. ఆర్సీబీ ఎప్పటికీ టైటిల్ గెలవలేకపోయిన మేము వారితోనే ఉంటామని, కింగ్ కోహ్లి ఎప్పటికీ కింగేనని, డుప్లెసిస్ లాంటి టాలెంటెడ్ ఆటగాడిని హేళన చేస్తే క్రికెట్ అభిమానులు క్షమించరని కౌంటర్లిస్తున్నారు. కాగా, గుజరాత్ టైటాన్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లి వీరోచిత శతకం వృధా అయ్యింది. శుభ్మన్ గిల్ సూపర్ సెంచరీతో గుజరాత్ను గెలిపించాడు. ఆర్సీబీ ఓటమిపాలవ్వడంతో ప్లే ఆఫ్స్కు చేరిన నాలుగో జట్టుగా ముంబై నిలిచింది. రేపు (మే 23) జరుగబోయే క్వాలిఫయర్ 1 మ్యాచ్లో గుజరాత్-సీఎస్కే.. మే 24న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో-ముంబై.. మే 26న జరిగే క్వాలిఫయర్ 2లో క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు-ఎలిమినేటర్లో గెలిచిన జట్టు.. మే 28న జరిగే ఫైనల్లో క్వాలిఫయర్ 1 విన్నర్-క్వాలిఫయర్ 2 విన్నర్లు తలపడతాయి. చదవండి: ఇంగ్లండ్కు బయల్దేరనున్న విరాట్ కోహ్లి -
అతడే మా కొంపముంచాడు : ఆర్సీబీ కెప్టెన్
-
అతడే మా కొంపముంచాడు.. చాలా బాధగా ఉంది! కోహ్లి మాత్రం అద్బుతం: ఆర్సీబీ కెప్టెన్
ఐపీఎల్-2023 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంటిముఖం పట్టింది. గుజరాత్ టైటాన్స్తో జరిగిన డూ ఆర్డై మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమిపాలైంది. తద్వారా ప్లేఆప్స్ రేసు నుంచి బెంగళూరు నిష్క్రమించింది. 198 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఆర్సీబీ బౌలర్లు విఫలమయ్యారు. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కేవలం 19.1 ఓవర్లలోనే ఛేదించింది. గుజరాత్ ఓపెనర్ శుబ్మన్ గిల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. గిల్ 52 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 104 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అంతకుముందు ఆర్సీబీ ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లి(101) కూడా సెంచరీతో మెరిశాడు. ఇక కీలక మ్యాచ్లో ఓటమిపై ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ స్పందించాడు. శుబ్మన్ గిల్ తన అద్భుత సెంచరీతో మ్యాచ్ను తమనుంచి దూరం చేశాడు అని డుప్లెసిస్ తెలిపాడు. "ఈ మ్యాచ్లో ఓటమి పాలవ్వడం మమ్నల్ని తీవ్రంగా నిరాశపరిచింది. మేము అత్యుత్తమ జట్టుతో ఈ మ్యాచ్లో బరిలోకి దిగాం. సెకెండ్ ఇన్నింగ్స్లో మంచు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. బంతి ఈజీగా బ్యాట్పైకి వచ్చింది. అయితే తొలి ఇన్నింగ్స్లో కూడా మంచు ప్రభావం ఉంది కానీ.. సెకెండ్ హాఫ్లో మాత్రం ఇంకా ఎక్కువగా ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్లో మేము రెండు సార్లు బంతిని మార్చాం. బౌలర్లకు అంత గ్రిప్ దొరకలేదు. విరాట్ తన అద్భుత ఇన్నింగ్స్తో మాకు మంచి స్కోర్ను అందించాడు. కానీ శుబ్మాన్ మాత్రం తన విరోచిత సెంచరీతో మ్యాచ్ను మా నుంచి దూరం చేశాడు. మేము ఈ ఏడాది సీజన్ మొత్తం టాపార్డ్లో రాణించనప్పటకీ.. మిడిలార్డర్లో మాత్రం దారుణంగా విఫలమయ్యాం. గతేడాది కార్తీక్ ఫినిషర్ పాత్ర పోషించాడు. కానీ ఈ సారి మాత్రం భిన్నంగా ఆడాడు. అదే విధంగా పవర్ప్లేతో పాటు డెత్ ఓవర్లలో కూడా వికెట్లు సాధించలేకపోయాం. కొన్ని విభాగాల్లో మేము కాస్త మెరుగవ్వాలి" అని పోస్ట్మ్యాచ్ ప్రేంజేటేషన్లో డుప్లెసిస్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: ప్లే ఆఫ్స్ నుంచి ఆర్సీబీ ఔట్.. కోహ్లిని మరోసారి టార్గెట్ చేసిన నవీన్! ఛీ అసలు నీవు Shubman Gill seals off the chase with a MAXIMUM 👏🏻👏🏻@gujarat_titans finish the league stage on a high 😎#TATAIPL | #RCBvGT pic.twitter.com/bZQJ0GmZC6 — IndianPremierLeague (@IPL) May 21, 2023 -
RCB VS GT: ఆర్సీబీ ఫ్యాన్స్కు బ్యాడ్న్యూస్.. వర్షం ముప్పు..?
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ (రాత్రి 7:30) అత్యంత కీలక సమరం జరుగనుంది. ఈ మ్యాచ్లో లోకల్ టీమ్ ఆర్సీబీ.. టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు చేరాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సి ఉంది. ఇలాంటి కీలక మ్యాచ్కు ముందు ఆర్సీబీని ఓ అంశం తీవ్రంగా కలవరపెడుతుంది. ఈ మ్యాచ్కు వర్షం ముంపు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మ్యాచ్ సమయానికి ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని యాక్యూ వెదర్ చూపిస్తుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యపడకపోయినా లేక ఆటంకం కలిగినా ఆర్సీబీ తీవ్ర నష్టంగా పరిగణించబడుతుంది. మ్యాచ్ రద్దైతే ఆర్సీబీ, గుజరాత్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. అప్పుడు ఆర్సీబీ ఖాతాలో 15 పాయింట్లు ఉంటాయి. ఇది జరిగి, సన్రైజర్స్పై ముంబై గెలిస్తే.. ఆ జట్టు 16 పాయింట్లతో నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. ఈ సమీకరణల నేపథ్యంలో నేటి మ్యాచ్ వరుణుడు ఆటంకం లేకుండా సాగాలని ఆర్సీబీ అభిమానులు దేవుళ్లను వేడుకుంటున్నారు. కాగా, గుజరాత్ (18),సీఎస్కే (17), లక్నో (17) ఇదివరకే ప్లే ఆఫ్స్కు చేరుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2023 కీలక దశకు చేరిన తరుణంలో ఆర్సీబీ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. బ్యాటర్లు విరాట్ కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్స్వెల్ ఓ రేంజ్లో ఇరగదీస్తున్నారు. గత మ్యాచ్లో విరాట్ సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. డుప్లెసిస్, మ్యాక్స్వెల్, బ్రేస్వెల్ రాణిస్తున్నారు. బౌలింగ్లో సిరాజ్, పార్నెల్, హసరంగ, హాజిల్వుడ్ పర్వాలేదనిపిస్తున్నారు. వర్షం నుంచి ఎలాంటి ఆటంకం కలగకపోతే ఈ మ్యాచ్లో ఆర్సీబీ తప్పక గెలుస్తుందని ఆ జట్టు అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఆర్సీబీ.. గెలిచి నిలుస్తుందా లేక ఓడి నిష్క్రమిస్తుందా అన్నది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాలి. చదవండి: MI Vs SRH: ముంబైకి చావోరేవో.. యువ బ్యాటర్ రీఎంట్రీ! ఉమ్రాన్కు ‘లాస్ట్’ ఛాన్స్! -
కోహ్లి భారీ సిక్సర్.. పాపం నితీశ్రెడ్డి! డుప్లెసిస్ రియాక్షన్ వైరల్
IPL 2023 SRH Vs RCB- Virat Kohli: సింహంతో ఆట.. పులి వేట ఎప్పుడూ ప్రమాదకరమే! అలాగే విరాట్ విశ్వరూపం ప్రదర్శిస్తే ప్రత్యర్థి జట్టు వణికిపోవాల్సిందే. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే ఎలాంటి బాల్ వేయాలో తెలియక బౌలర్లు తలలు పట్టుకోవాల్సిందే! ఐపీఎల్-2023లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లకు ఈ విషయం అనుభవంలోకి వచ్చింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లి ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి సెంచరీతో మెరిశాడు. 63 బంతులు ఎదుర్కొని 100 పరుగులు చేసిన కోహ్లి ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. సన్రైజర్స్ విధించిన 187 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్తో కలిసి ఈ ఓపెనర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపిస్తూ.. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం పంచాడు. ముఖ్యంగా సన్రైజర్స్ పేసర్ నితీశ్కుమార్ రెడ్డి బౌలింగ్లో కోహ్లి బాదిన భారీ సిక్సర్(103 మీటర్లు) హైలైట్గా నిలిచింది. అరంగేట్రం చేసిన నితీశ్రెడ్డి ఆర్సీబీతో గురువారం నాటి మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్లో అరంగేట్రం చేసిన 19 ఏళ్ల ఆంధ్ర ప్లేయర్ బౌలింగ్లో కోహ్లి తొమ్మిదో ఓవర్ తొలి బంతిని సిక్సర్గా మలిచాడు. కోహ్లి అద్భుతమైన షాట్కు ప్రేక్షకులే కాదు కోహ్లి ఓపెనింగ్ పార్ట్నర్ డుప్లెసిస్ కూడా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. కోహ్లి భారీ సిక్సర్.. డుప్లెసిస్ రియాక్షన్ అదుర్స్ కోహ్లి ఈ మేరకు భారీ షాట్ బాదగానే.. ‘‘వావ్.. నమ్మలేకపోతున్నా’’ అన్నట్లు డుప్లెసిస్ ఇచ్చిన రియాక్షన్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో డుప్లెసిస్ 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 71 పరుగులు చేశాడు. కోహ్లి, డుప్లెసిస్ అద్భుత ప్రదర్శన కారణంగా 19.2 ఓవర్లలోనే టార్గెట్ను ఛేజ్ చేసింది. సన్రైజర్స్పై 8 వికెట్ల తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్స్నకు చేరువైంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలిచిన ఆర్సీబీ ఇక ఆర్సీబీతో మ్యాచ్తో అరంగేట్రం చేసిన నితీశ్కుమార్ రెడ్డికి ఈ మ్యాచ్లో రెండు ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్లో మొత్తంగా 19 పరుగులు ఇచ్చాడు ఈ యువ పేసర్. ఉప్పల్ మ్యాచ్లో విజయంతో బెంగళూరు జట్టు 14 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకోగా.. ఓటమిపాలైన సన్రైజర్స్ అట్టడుగున పదో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: అవన్నీ చెత్త మాటలు.. నేను అస్సలు పట్టించుకోను! గర్వంగా ఉంది: కోహ్లి వాళ్లిద్దరే మా ఓటమిని శాసించారు.. లేదంటేనా! చాలా బాధగా ఉంది: మార్కరమ్ The Beauty (& the Beast) of #TATAIPL 😎#SRHvRCB #IPLonJioCinema #Kohli https://t.co/qfCZLvS2f6 pic.twitter.com/Ju0rBsfEIA — JioCinema (@JioCinema) May 18, 2023 ICYMI! A treat for the #RCB fans right here in Hyderabad.@imVkohli goes big with a maximum.#TATAIPL #SRHvRCB pic.twitter.com/KbojxpdFvG — IndianPremierLeague (@IPL) May 18, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2023: కోహ్లి సెంచరీ.. ఆర్సీబీ ఘన విజయం
IPL 2023: SRH Vs RCB Match Live Updates: ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 19.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ను అందుకుంది. కోహ్లి 61 బంతుల్లో శతకంతో వీరవిహారం చేయగా.. డుప్లెసిస్ 47 బంతుల్లో 71 పరుగులతో రాణించాడు. ఈ మ్యాచ్లో విజయంతో ఆర్సీబీ రన్రేట్ను మరింత మెరుగుపరుచుకుంది. 13 ఓవర్లలో ఆర్సీబీ 117/0 ఆర్సీబీ 13 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 117 పరుగులు చేసింది. కోహ్లి 64, డుప్లెసిస్ 54 పరుగులతో ఆడుతున్నారు. కోహ్లి, డుప్లెసిస్ అర్థశతకాలు.. ఆర్సీబీ 108/0 ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో ఆర్సీబీ టార్గెట్ దిశగా సాగుతుంది. కోహ్లి, డుప్లెసిస్లు అర్థశతకాలతో చెలరేగడంతో ఆర్సీబీ 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 108 పరుగులు చేసింది. దంచుతున్న కోహ్లి, డుప్లెసిస్.. ఆర్సీబీ 90/1 187 పరుగుల పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఇన్నింగ్స్ దూకుడుగా ఆరంభించింది. కోహ్లి 46, డుప్లెసిస్ 42 పరుగులతో చెలరేగి ఆడుతున్నారు. ప్రస్తుతం ఆర్సీబీ 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. ఆర్సీబీ టార్గెట్ 187.. ఆర్సీబీతో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 51 బంతుల్లో 104 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. హ్యారీ బ్రూక్ 27 పరుగులు చేశాడు. ఆర్సీబీ బౌలర్లలో మైకెల్ బ్రాస్వెల్ రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, హర్షల్పటేల్, షాబాజ్ అహ్మద్లు తలా ఒక వికెట్ తీశారు. క్లాసెన్ సెంచరీ.. ఎస్ఆర్హెచ్ 19 ఓవర్లలో 182/4 19 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ నాలుగు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 49 బంతుల్లో శతకం సాధించాడు. 51 బంతుల్లో 104 పరుగులు చేసిన క్లాసెన్ హర్షల్పటేల్ బౌలింగ్లో వెనుదిరిగాడు. క్లాసెన్ ఫిఫ్టీ.. 11 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 95/2 11 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 24 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకోగా.. మార్క్రమ్ 16 పరుగులతో ఆడుతున్నాడు. 33 పరుగులకే రెండు వికెట్లు డౌన్ ఆర్సీబీతో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. మైకెల్ బ్రాస్వెల్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడం విశేషం. తొలుత 11 పరుగులు చేసిన అభిషేక్ శర్మను క్లీన్బౌల్డ్ చేసిన బ్రాస్వెల్.. ఆ తర్వాత 15 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠిని క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. 4 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 27/0 4 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 11, రాహుల్ త్రిపాఠి 15 పరుగులతో ఆడుతున్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గురువారం 65వ మ్యాచ్లో హైదరాబాద్ వేదికగా ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ కన్నా ఆర్సీబీకి చాలా కీలకం. ప్లేఆఫ్ చేరాలంటే మ్యాచ్లో ఆర్సీబీ గెలవడం తప్పనిసరి. సన్రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, కార్తీక్ త్యాగి, మయాంక్ డాగర్, భువనేశ్వర్ కుమార్, నితీష్ రెడ్డి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, మైకేల్ బ్రేస్వెల్, వేన్ పార్నెల్, హర్షల్ పటేల్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్ #RCB won the toss and opted to field first in Hyderabad 🏏 Catch all the action from #SRHvRCB - LIVE & FREE on #JioCinema, available on all sim cards.#EveryGameMatters #TATAIPL #IPLonJioCinema #IPL2023pic.twitter.com/1NmcJyczIb — JioCinema (@JioCinema) May 18, 2023 -
సన్రైజర్స్తో కీలక మ్యాచ్..! బౌలింగ్ చేసిన కోహ్లి.. ‘కేజీఎఫ్’ వీడియో వైరల్
IPL 2023- SRH Vs RCH- Virat Kohli: ఐపీఎల్-2023 ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో గెలిచేందుకు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ భారమంతా కే.జీ.ఎఫ్. (కోహ్లి, గ్లెన్, ఫాఫ్)పై ఉన్న నేపథ్యంలో వీరు ప్రాక్టీసు చేస్తున్న వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. హోరాహోరీ పోరులో కాగా ఈ సీజన్లో ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ ఆరింట గెలిచి 12 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇక డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్నకు అర్హత సాధించగా.. చెన్నై, లక్నో, ముంబై, ఆర్సీబీ మధ్య మిగతా మూడు బెర్తుల కోసం హోరాహోరీ పోటీ ఉంది. రన్రేటు పరంగా మెరుగ్గా ఉన్న రాజస్తాన్ సైతం ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్-ఆర్సీబీ మధ్య మ్యాచ్ ఫలితం కీలకంగా మారింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి అధికారికంగా నిష్క్రమించిన సన్రైజర్స్ ఈ మ్యాచ్లో ఓడిస్తేనే ఆర్సీబీ రేసులో ఉంటుంది. లేదంటే ఆశలు వదులుకోవాల్సిందే! ‘కే.జీ.ఎఫ్.’ ఏం చేస్తుందో మరి! ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్ ప్లేయర్లపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఈ మ్యాచ్లో ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో కోహ్లి.. మాక్సీ, ఫాఫ్నకు బౌలింగ్ చేయడం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ సీజన్లో డుప్లెసిస్ ఇప్పటి వరకు 631 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు. కోహ్లి 438, మాక్సీ 384 పరుగులు చేశారు. సన్రైజర్స్తో మ్యాచ్- ఆర్సీబీ తుది జట్టు (అంచనా) విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్వెల్, అనుజ్ రావత్, వేన్ పార్నెల్, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్. చదవండి: చాలా కష్టంగా ఉంది.. ఒక్కరూ సాయం చేయడం లేదు.. కనీసం: చేతన్ శర్మ -
గతం సన్రైజర్స్కు అనుకూలం, మరి ఆర్సీబీ గెలుస్తుందా..?
ఐపీఎల్ 2023లో భాగంగా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఇవాళ (మే 18) జరుగబోయే కీలక సమరంలో సన్రైజర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలుపుతో సన్రైజర్స్కు ఒరిగేదేమీ లేనప్పటికీ, ఆర్సీబీకి మాత్రం అత్యంత కీలకం. ఈ మ్యాచ్లో గెలిస్తేనే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. లేదంటే పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా మారతాయి. ఆర్సీబీకి మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉన్నా, అది టేబుల్ టాపర్ గుజరాత్తో (మే 21న) కావడం, అదీ భారీ తేడాతో గెలవాల్సి ఉండటం ఆ జట్టుకు పెద్ద సమస్యగా మారుతుంది. ఇక, నేటి మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందో, ఏ జట్టు ఓడుతుందో అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఆర్సీబీపై సన్రైజర్స్ గెలుపోటముల రికార్డు ఘనంగా ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 22 మ్యాచ్లు జరగ్గా.. సన్రైజర్స్ 12, ఆర్సీబీ 9 మ్యాచ్ల్లో గెలుపొందాయి. ఓ మ్యాచ్ రద్దైంది. గతం సన్రైజర్స్కు అనుకూలంగా ఉండటంతో ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలుస్తుందా..లేదా..? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రస్తుత ఫామ్ ప్రకారం సన్రైజర్స్తో పోలిస్తే ఆర్సీబీకే విజయావకాశాలు అధికంగా ఉన్నప్పటికీ.. ఆ జట్టు పూర్తిగా KGF (కోహ్లి, గ్లెన్ మ్యాక్స్వెల్, ఫాఫ్ డుప్లెసిస్)పైనే అధారపడి ఉండటం వారి ఫ్యాన్స్ను కలవరపెడుతుంది. మరోవైపు సన్రైజర్స్ పరిస్థితి సైతం ఏమంత ఆశాజనకంగా లేదు. ఆటగాళ్ల నిలకడలేమి ఆ జట్టు ఓటములకు ప్రధాన కారణంగా మారింది. ఏ ఆటగాడు ఎప్పుడు ఎలా ఆడతాడో వారితో పాటు ఎవరికీ తెలియని పరిస్థితి. KGFతో పాటు సిరాజ్, హాజిల్వుడ్, కర్ణ్ శర్మ తమ ఫామ్ను కొనసాగిస్తే, నేటి మ్యాచ్లో ఆర్సీబీ గెలవడం పెద్ద సమస్య ఏమీ కాకపోవచ్చు. సన్రైజర్స్ ఫ్యాన్స్ సైతం నేటి మ్యాచ్లో ఆర్సీబీనే గెలవాలనుకోవడం విశేషం. తమ జట్టు ఎలాగూ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది కాబట్టి, వారు ఆర్సీబీ గెలిచి ప్లే ఆఫ్స్కు చేరుకోవాలని కోరుకుంటున్నారు. విరాట్ కోహ్లి ఇంతవరకు ఐపీఎల్ టైటిల్ గెలవలేదన్న సానుభూతి అభిమానుల్లో ఉంది. దీంతో ఈ యేడు సన్రైజర్స్ ఫ్యాన్స్ కూడా ఆర్సీబీ మద్దతుదారులుగా మారిపోయారు. ఏది ఎలా ఉన్నా, నేటి మ్యాచ్లో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి. చదవండి: IPL 2023: సన్రైజర్స్తో ఆర్సీబీ మ్యాచ్.. గెలిచిందా నిలుస్తుంది..! -
59 పరుగులకే ఆలౌట్.. రాజస్తాన్ చెత్త రికార్డు! ఐపీఎల్ చరిత్రలో..
IPL 2023 RR vs RCB- Wayne Parnell: ఐపీఎల్-2023లో రాజస్తాన్ రాయల్స్పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సంచలన విజయం సాధించింది. సంజూ శాంసన్ సేనను 59 పరుగులకే కట్టడి చేసి 112 పరుగుల తేడాతో గెలుపొందింది. సొంతమైదానంలో రాజస్తాన్ను చిత్తుచిత్తుగా ఓడించి మరోసారి ఆ జట్టుపై ఆధిపత్యాన్ని చాటుకుంది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకున్న ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కోహ్లి విఫలమైనా జైపూర్ వేదికగా ఆదివారం (మే 14) జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ విరాట్ కోహ్లి 18 పరుగులకు పరిమితం కావడంతో ఫ్యాన్స్ నిరాశచెందారు. అర్ధ శతకాలతో రాణించి అయితే, ఫాఫ్ డుప్లెసిస్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్(55 పరుగులు)తో జట్టును ఆదుకోగా... వన్డౌన్ బ్యాటర్ గ్లెన్ మాక్స్వెల్ అతడికి సహకారం అందించాడు. 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 54 పరుగులు సాధించాడు. మహిపాల్ లామ్రోర్(1), దినేశ్ కార్తిక్ (0) పూర్తిగా విఫలం కాగా.. ఆఖర్లో అనూజ్ రావత్ మెరుపులు మెరిపించాడు. 11 బంతుల్లోనే 29 పరుగులు సాధించి చివరి వరకు అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు స్కోరు చేసింది. ఆరంభంలోనే కోలుకోలేని షాకులు 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ను ఆరంభంలోనే షాకిచ్చాడు ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్. గత మ్యాచ్ హీరో యశస్వి జైశ్వాల్ను డకౌట్ చేశాడు. సిరాజ్ ఆర్సీబీ వికెట్ల ఖాతా తెరవగా.. మరో ఫాస్ట్బౌలర్ వేన్ పార్నెల్ జోష్ను కొనసాగించాడు. జోస్ బట్లర్ను డకౌట్ చేసిన అతడు.. సంజూ శాంసన్ను కూడా పెవిలియన్కు పంపాడు. ఈ క్రమంలో రెండు ఓవర్లు కూడా ముగియక ముందే రాజస్తాన్ 3 వికెట్లు కోల్పోయింది. ఇక బ్రేస్వెల్, కర్ణ్ శర్మ కూడా విజృంభించడంతో వరుసగా వికెట్లు కోల్పోయిన రాజస్తాన్ 10.3 ఓవర్లలో 59 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. చెత్త రికార్డు.. మూడోసారి తద్వారా ఐపీఎల్ చరిత్రలో మూడోసారి అత్యల్ప స్కోరుకే ఆలౌట్ అయిన జట్టుగా చెత్త రికార్డు నమోదు చేసింది. కాగా 2017లో కేకేఆర్తో మ్యాచ్లో 49(కోల్కతాలో), 2009లో ఆర్సీబీ చేతిలో 58 పరుగుల తేడా(కేప్టౌన్)తో రాజస్తాన్ చిత్తైంది. తాజాగా జైపూర్ మ్యాచ్లో 59 పరుగులకే కథ ముగించింది. ఆర్సీబీ బౌలర్లు అదుర్స్ ఇక రాజస్తాన్ తర్వాత అత్యల్ప స్కోరుకు అవుటైన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ కొనసాగుతోంది. 2017లో ఢిల్లీలో ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఢిల్లీ 66 పరుగులకు ఆలౌట్ అయింది. కాగా రాజస్తాన్తో తాజా మ్యాచ్లో 3 ఓవర్ల బౌలింగ్ కోటాలో కేవలం 10 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీసిన వేన్ పార్నెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆర్సీబీ మిగతా బౌలర్లలో సిరాజ్, మాక్సీ ఒక్కో వికెట్ తీయగా.. బ్రేస్వెల్, కర్ణ్ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టారు. చదవండి: సీఎస్కేను ఓడించే సత్తా ఆ ఒక్క జట్టుకే ఉంది: ఆకాష్ చోప్రా సెంచరీ చేసినా.. స్కోరు జీరో అయినా భయ్యా అంతే! ఆరోజు బాగా ఏడ్చేశాను.. 𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦! The Anuj Rawat direct-hit that left everyone in disbelief 🔥🔥 Check out the dismissal here 🔽 #TATAIPL | #RRvRCB pic.twitter.com/2GWC5P0nYP — IndianPremierLeague (@IPL) May 14, 2023 -
డుప్లెసిస్ అరుదైన ఘనత.. నాలుగో విదేశీ ప్లేయర్గా
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో 4వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో విదేశీ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఆదివారం రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో అశ్విన్ బౌలింగ్లో ఫోర్ కొట్టడం ద్వారా డుప్లెసిస్ ఐపీఎల్లో 4వేల పరుగుల మార్క్ను అందుకున్నాడు. ఇక డుప్లెసిస్ కంటే ముందు ముగ్గురు బ్యాటర్లు ఈ ఫీట్ సాధించారు. మొదటిస్థానంలో డేవిడ్ వార్నర్ 174 మ్యాచ్ల్లో 6265 పరుగులతో ఉండగా.. 184 మ్యాచ్ల్లో 5162 పరుగులుతో ఏబీ డివిలియర్స్ రెండో స్థానంలో, క్రిస్గేల్ 142 మ్యాచ్ల్లో 4965 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక డుప్లెసిస్ మాత్రం 128 మ్యాచ్ల్లో 4వేల పరుగుల మార్క్ను అందుకున్నాడు. ఈ సీజన్లో డుప్లెసిస్ సూపర్ఫామ్ కనబరుస్తున్నాడు. తాజాగా రాజస్తాన్తో మ్యాచ్లో అర్థశతకం సాధించిన డుప్లెసిస్కు ఇది ఏడోది. 12 మ్యాచ్ల్లో 608 పరుగులతో లీడింగ్ టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. చదవండి: #DC:ప్లేఆఫ్ రేసు నుంచి ఔట్.. ఆరంభం నుంచి అన్ని మైనస్లే హెచ్సీఏను ఏకిపారేసిన సునీల్ గావస్కర్ -
ఒక్కసారి కుదురుకుంటే అతడిని ఆపడం ఎవరి తరం కాదు.. మేము కనీసం!
IPL 2023 MI vs RCB: ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ప్రశంసలు కురిపించాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే అతడి ఆపడం ఎవరితరం కాదని పేర్కొన్నాడు. స్కై ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడని.. బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు. ఐపీఎల్-2023లో భాగంగా ముంబైతో ఆర్సీబీ మంగళవారం తలపడిన విషయం తెలిసిందే. ఉఫ్మని ఊదేసిన ముంబై ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు స్కోరు చేసింది. ఈ క్రమంలో ముంబై 16.3 ఓవర్లలోనే కేవలం 4 వికెట్లు నష్టపోయి.. ఆర్సీబీ విధించిన లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. కేవలం 35 బంతుల్లోనే 83 పరుగులు రాబట్టాడు. అతడి ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ఇలా విధ్వంసకర ఇన్నింగ్స్తో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డ సూర్య ముంబైకి మర్చిపోలేని విజయం అందించాడు. కనీసం 20 పరుగులు చేసి ఉంటే ఇక మెరుగైన స్కోరు నమోదు చేసిప్పటికీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయిన ఆర్సీబీ.. 6 వికెట్ల తేడాతో ఓటమి పాలై పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి దిగజారింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఆర్సీబీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ.. తాము మరో 20 పరుగులు స్కోర్ చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. ‘‘వికెట్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. ముంబై పటిష్ట జట్టు. అందులోనూ వారి సొంతమైదానం. మేము 20 పరుగులు చేస్తే పరిస్థితి వేరేలా ఉండేది. ముంబైలాంటి జట్టు ముందు భారీ లక్ష్యం ఉంచితేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలం. నిజానికి ఆఖరి ఐదు ఓవర్లలో మేము సరిగా ఆడలేకపోయాం. 200 అనేది మెరుగైన స్కోరు అని చెప్పగలం. డుప్లెసిస్, సూర్య (PC: IPL) అతడు అద్భుతం మనకు మనం సర్దిచెప్పుకోవడానికి మాత్రమే అలా అనుకోవాల్సి ఉంటుంది! నిజానికి వాళ్లు మొదటి ఆరు ఓవర్ల(62/2)ను చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ముఖ్యంగా స్కై(సూర్య) బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. సూపర్ ఫామ్లో ఉన్న అతడిని ఆపడం ఎవరితరం కాలేదు. ఇక సిరాజ్ ఐపీఎల్ ఆరంభం నుంచి బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదుర్కోకతప్పదు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. బ్యాటర్లు కూడా ఇంకాస్త మెరుగుపడాల్సి ఉంది. పవర్ప్లేలో కనీసం 60 పరుగులు రాబడితేనే పోటీలో నిలవగలం’’ అని ఫాఫ్ డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్లో ఆర్సీబీ పేసర్లు సిరాజ్, హర్షల్ పటేల్ పూర్తిగా తేలిపోయి విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ఆర్సీబీ తరఫున 1000 పరుగులు ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో 41 బంతులు ఎదుర్కొన్న ఆరెంజ్ క్యాప్ హోల్డర్ ఫాఫ్.. 5 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 65 పరుగులు సాధించాడు. ఆర్సీబీ తరఫు 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కాగా గతేడాది బెంగళూరు సారథిగా పగ్గాలు చేపట్టిన ఫాఫ్ బ్యాటర్గానూ, కెప్టెన్గానూ తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లి కేవలం ఒకే పరుగుకు పరిమితం కావడం కూడా ప్రభావం చూపింది. చదవండి: Virat Kohli: చిల్లర వేషాలు మానుకో! లేదంటే ఐపీఎల్లోనే లేకుండా పోతావ్! MI Vs RCB: కాలం మారుతుంది! సూర్య అవుట్ కాగానే దగ్గరికి వచ్చిన కోహ్లి.. వీడియో వైరల్ ఆర్సీబీకి పట్టిన దరిద్రం.. ఇకనైనా అతడిని వదిలేయండి! లేదంటే మీ కర్మ! Faf Du Plessis in IPL 2023: - 73(43) vs MI - 23(12) vs KKR - 79*(46) vs LSG - 22(16) vs DC - 62(33) vs CSK - 84(56) vs PBKS - 62(39) vs RR - 17(7) vs KKR - 44(40) vs LSG - 45(32) vs DC - 65(41) vs MI Captain, Leader, Legend, Faf. pic.twitter.com/KXXoHlc6pA — Johns. (@CricCrazyJohns) May 9, 2023 Up Above The World So High Like A Diamond His Name Is SKY 🤩#TATAIPL | #MIvRCB | @surya_14kumar | @mipaltan pic.twitter.com/EgUDqe7aao — IndianPremierLeague (@IPL) May 9, 2023 -
క్యాచ్ డ్రాప్.. రోహిత్ కోపానికి అర్థముంది!
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే డుప్లెసిస్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. డుప్లెసిస్ ఇచ్చిన క్యాచ్ను నెహాల్ వదేరా జారవిడిచాడు. ఓవర్ నాలుగో బంతిని మిడ్వికెట్ దిశగా ఆడగా.. అక్కడే ఉన్న వదేరా చేతిలోకి వచ్చిన క్యాచ్ను వదిలేశాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ వదేరాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోహిత్ ఆగ్రహానికి ఒక కారణం ఉంది. ఈ సీజన్లో డుప్లెసిస్ టాప్ స్కోరర్గా ఉన్నాడు. 10 మ్యాచ్లాడి 511 పరుగులు సాధించిన డుప్లెసిస్ ఆరెంజ్ క్యాప్తో కొనసాగుతున్నాడు. అతని ఖాతాలో ఐదు అర్థసెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోరు 84గా ఉంది. సున్నా వద్ద ఉన్నప్పుడే డుప్లెసిస్ ఔట్ అయితే ముంబైకి ప్రమాదం తప్పేదని రోహిత్ భావించాడు. అందుకే వదేరా క్యాచ్ వదిలేయగానే తన కోపాన్ని బయటపెట్టాడు. Nehal Wadhera dropped an easy catch of Faf (the orange cap holder) at mid-wicket & Rohit Sharma was annoyed with that 😑#TATAIPL | #IPL2023 | #MIvsRCB pic.twitter.com/8zYFIyfrVE — CricWatcher (@CricWatcher11) May 9, 2023 చదవండి: రిటైర్మెంట్పై తొందరేం లేదు.. ఐపీఎల్-2023 గెలిచి ఇంకో ఏడాది ఆడతా..! ధోనిలా ఉన్నాడు.. 2040లో ఇదే జరగొచ్చు! -
సూర్య 'ప్రతాపం'.. ముంబై ఇండియన్స్ ఘన విజయం
ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 200 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 16.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. సూర్యకుమార్ 35 బంతుల్లో 85, ఏడు ఫోర్లు. ఆరు సిక్సర్లు తన ఐపీఎల్ కెరీర్లో బెస్ట్ ఇన్నింగ్స్ ఆడగా.. నెహాల్ వదేరా 34 బంతుల్లో 52 నాటౌట్ యాంకర్ రోల్ పాత్ర పోషించాడు. అంతకముందు ఇషాన్ కిషన్ 41 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆర్సీబీ బౌలర్లలో హసరంగా, విజయ్కుమార్ వైశాక్లు చెరో రెండు వికెట్లు తీశారు. సూర్యకుమార్ అర్థశతకం.. ముంబై 174/2 సూర్యకుమార్ తన సూపర్ ఫామ్ను కంటిన్యూ చేస్తున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్లో సూర్య అర్థశతకంతో మెరిశాడు. 26 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న సూర్యకుమార్ ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 15 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేసింది. నెహాల్ వదేరా 44 పరుగులతో ఆడుతున్నాడు. 10 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 99/2 10 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. సూర్యకుమార్ 18, వదేరా 25 పరుగులుతో ఆడుతున్నారు. టార్గెట్ 200.. ముంబై ఇండియన్స్ 62/2 200 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. నెహాల్ వదేరా 6, సూర్యకుమార్ రెండు పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు రోహిత్(7 పరుగులు), ఇషాన్ కిషన్(41 పరుగులు)హసరంగా బౌలింగ్లోనే వెనుదిరిగారు. Photo Credit : IPL Website ముంబై ఇండియన్స్ టార్గెట్ 200 ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. మ్యాక్స్వెల్ 68, డుప్లెసిస్ 65 పరుగులతో రాణించగా.. ఆఖర్లో కార్తిక్ 18 బంతుల్లో 30 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఆర్సీబీ 199 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ బౌలర్లో జాసన్ బెహండార్ఫ్ మూడు వికెట్లు తీయగా.. కుమార్ కార్తికేయ, జోర్డాన్, గ్రీన్ తలా ఒక వికెట్ పడగొట్టారు. 18 ఓవర్లలో ఆర్సీబీ 185/5 18 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ ఐదు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. దినేశ్ కార్తిక్ 17 బంతుల్లో 30, కేదార్ జాదవ్ 10 పరుగులతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website 14 ఓవర్లలో ఆర్సీబీ 146/4 ఒక్క పరుగు మాత్రమే చేసిన లామ్రోర్ కుమార్ కార్తికేయ బౌలింగ్లో వెనుదిరగడంతో ఆర్సీబీ నాలుగో వికెట్ నష్టపోయింది.ప్రస్తుతం ఆర్సీబీ 14 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. డుప్లెసిస్ 65 పరుగులు, దినేశ్ కార్తిక్ ఒక్క పరుగుతో ఆడుతున్నారు. అంతకముందు 33 బంతుల్లో 68 పరుగులతో విధ్వంసం సృష్టించిన గ్లెన్ మ్యాక్స్వెల్ ఔట్ కావడంతో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. బెహండార్ఫ్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన మ్యాక్సీ.. నెహాల్ వదేరాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. Photo Credit : IPL Website మ్యాక్స్వెల్ ఫిఫ్టీ.. ఆర్సీబీ 104/2 ఆర్సీబీ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో అర్థసెంచరీతో మెరిశాడు. 25 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న మ్యాక్స్వెల్ ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. అతని ధాటికి ఆర్సీబీ 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. డుప్లెసిస్ 44 పరుగులతో ఆడుతున్నాడు. Photo Credit : IPL Website 6 ఓవర్లలో ఆర్సీబీ 56/2 ఆరు ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. డుప్లెసిస్ 26, మ్యాక్స్వెల్ 23 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఆరు పరుగులు చేసిన అనూజ్ రావత్ బెహండార్ఫ్ బౌలింగ్లో వెనుదిరిగాడు. Photo Credit : IPL Website తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఆర్సీబీకి ఆదిలోనే షాక్ తగిలింది. ఒక్క పరుగు మాత్రమే చేసిన కోహ్లి బెహండార్ఫ్ బౌలింగ్లో కీపర్ ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది. Photo Credit : IPL Website టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా మంగళవారం ముంబై వేదికగా 54వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్, ఆర్సీబీ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. Hitman wins the toss at Wankhede & asks the King to bat first 😎 Stream #MIvRCB LIVE & FREE with #IPLonJioCinema for any sim card!#TATAIPL #IPL2023 #RohitSharma #ViratKohli | @mipaltan @RCBTweets @imVkohli @ImRo45 pic.twitter.com/1A2wP5mf00 — JioCinema (@JioCinema) May 9, 2023 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, విజయ్కుమార్ వైషాక్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్వుడ్ ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, జాసన్ బెహ్రెండోర్ఫ్ ఈ సీజన్లో ఇరుజట్లు 10 మ్యాచ్ల్లో చెరో ఐదు విజయాలతో ఆరు, ఎనిమిది స్థానాల్లో ఉన్పాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు టాప్-5లో నిలిచే అవకాశం ఉంది. గత మ్యాచ్కు దూరంగా ఉన్న తిలక్ వర్మ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. -
IPL 2023: ఫిల్ సాల్ట్ దెబ్బ.. ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు వికెట్ల తేడాతో విజయాన్నిఅందుకుంది. 182 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ఢిల్లీ 16.4 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ను అందుకుంది. ఫిల్ సాల్ట్ 45 బంతుల్లో 87 పరుగులు, 8 ఫోర్లు, ఆరు సిక్సర్లు విధ్వంసం సృష్టించగా.. రిలీ రొసౌ 22 బంతుల్లో 35 నాటౌట్, మిచెల్ మార్ష్ 17 బంతుల్లో 26 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్, హాజిల్వుడ్, కర్ణ్శర్మలు తలా ఒక వికెట్ తీశారు. విజయం దిశగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీతో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం దిశగా పయనిస్తోంది. 182 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఢిల్లీ 15 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ 83, రిలీ రొసౌ 26 పరుగులతో ఆడుతున్నారు. ఢిల్లీ విజయానికి 30 బంతుల్లో 16 పరుగులు కావాలి 13 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 151/2 13 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ 75, రిలీ రొసౌ 21 పరుగులతో ఆడుతున్నారు. మిచెల్ మార్ష్(26)ఔట్.. రెండో వికెట్ డౌన్ 26 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ హర్షల్ పటేల్ బౌలింగ్లో లామ్రోర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ రెండో వికెట్ నష్టపోయింది. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ 64, రొసౌ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఫిల్ సాల్ట్ మెరుపు అర్థశతకం.. ఢిల్లీ 115/1 ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ 28 బంతుల్లో మెరుపు అర్థశతకం సాధించాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది. మార్ష్ 22 పరుగులతో సహకరిస్తున్నాడు టార్గెట్ 182.. దంచుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ 182 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఆడుతుంది. 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ 44, మిచెల్ మార్ష్ 17 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 22 పరుగులు చేసి వార్నర్ తొలి వికెట్గా వెనుదిరిగాడు. Photo Credit : IPL Website లామ్రోర్ మెరుపులు.. ఆర్సీబీ 20 ఓవర్లలో 181/4 ఆర్సీబీ బ్యాటర్ మహిపాల్ లామ్రోర్ ఐపీఎల్లో తొలి హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కోహ్లి 55 పరుగులు చేయగా.. మహిపాల్ లామ్రోర్(29 బంతుల్లో 54 నాటౌట్, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు) రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ రెండు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్ చెరొక వికెట్ తీశారు. Photo Credit : IPL Website కోహ్లి (55)ఔట్.. ఆర్సీబీ 137/3 ఆర్సీబీ ఓపెనర్ విరాట్ కోహ్లి సీజన్లో ఆరో అర్థసెంచరీతో మెరిశాడు. 42 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న కోహ్లి ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు ఉన్నాయి. 55 పరుగులు చేసిన కోహ్లి ముకేశ్ కుమార్ బౌలింగ్లో ఖలీల్ అహ్మద్కు క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆర్సీబీ 16 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. మహిపాల్ లామ్రోర్ 34 పరుగులతో క్రీజులో ఉన్నాడు. Photo Credit : IPL Website మ్యాక్స్వెల్ గోల్డెన్ డక్.. వరుస బంతుల్లో రెండు వికెట్లు ఆర్సీబీతో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ మిచెల్ మార్ష్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. తొలుత 45 పరుగులు చేసిన డుప్లెసిస్ మిచెల్ మార్ష్ బౌలింగ్లో అక్షర్ పటేల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఆర్సీబీ 82 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. తర్వాతి బంతికే మ్యాక్స్వెల్ను గోల్డెన్ డక్గా వెనుదిరిగడంతో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. Photo Credit : IPL Website 7 ఓవర్లలో ఆర్సీబీ 57/0 ఏడు ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. కోహ్లి 25, డుప్లెసిస్ 32 పరుగులతో క్రీజులో ఉన్నారు. కోహ్లి 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఐపీఎల్లో ఏడువేల పరుగులు మైలురాయిని అందుకున్నాడు. Photo Credit : IPL Website 4 ఓవర్లలో ఆర్సీబీ 23/0 4 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. కోహ్లి 20, డుప్లెసిస్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. కోహ్లి 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఐపీఎల్లో ఏడువేల పరుగులు మైలురాయిని అందుకున్నాడు. Photo Credit : IPL Website టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ ఐపీఎల్ 16వ సీజన్లో శనివారం డబుల్ హెడర్లో భాగంగా ఢిల్లీ వేదికగా 50వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్(కెప్టెన్), ఫిలిప్ సాల్ట్(వికెట్కీపర్), మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, మనీష్ పాండే, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్కీపర్), కేదార్ జాదవ్, వనిందు హసరంగా, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్వుడ్ వరుస విజయాలతో దుమ్మురేపుతున్న ఆర్సీబీ టాప్-4లో అడుగుపెట్టేందుకు యత్నిస్తోంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం తమ పరాజయాల పరంపరను కొనసాగిస్తూనే ఉంది. ఇక గత రికార్డులు పరిశీలిస్తే.. ఇరుజట్లు 29 సార్లు తలపడగా.. 18 మ్యాచ్ల్లో ఆర్సీబీ.. 10 మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ నెగ్గాయి. ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు. ఇక కోట్లా మైదానంలో ఆర్సీబీకి మంచి రికార్డు ఉంది. ఇక్కడ ఢిల్లీతో ఆడిన 9 మ్యాచ్ల్లో ఆరింటిని నెగ్గడం విశేషం. -
IPL 2023: ఈ సాలా కప్ నమదే, రాసి పెట్టుకోండి.. లక్కీ మ్యాన్ మాతోనే ఉన్నాడు..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైన నాటి నుండి 'ఈ సాలా కప్ నమదే'.. ఈ సాలా కప్ నమదే అంటూ ఆర్సీబీ అభిమానులు హడావుడి చేయడం చూస్తూనే ఉన్నాం. 15 సీజన్లు అయిపోయినా ఆ జట్టు ఇంతవరకు ఒక్క టైటిల్ కూడా సాధించింది లేదు కానీ, ఆ జపం మాత్రం వదలడం లేదు. 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్కు చేరినా ఆర్సీబీకి అదృష్టం కలిసి రాలేదు. ప్రస్తుత సీజన్లోనూ ఆర్సీబీ అభిమానులు అదే స్లోగన్ చెప్తూ ఊదరగొడుతున్నారు. ప్రస్తుత సీజన్లో వారికి అశించిన ఫలితాలు రాకపోయినా, చెత్త జట్టుతో (KGFS (కోహ్లి,మ్యాక్సీ, డుప్లెసిస్,సిరాజ్) మినహా) అతి కష్టం మీద నెట్టుకొస్తున్నా ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం ఈ సాలా కప్ నమదే అని ధీమాగా చెబుతున్నారు. పైగా నిన్న (మే 1) లక్నోపై విజయానంతరం వారి వాయిస్లో బేస్ పెరిగింది. ఈ సాలా కప్ నమదే అంటూ ఇంకా గట్టిగా వాదిస్తున్నారు. వారి కాన్ఫిడెన్స్కు కారణం ఏంటని ఆరా తీస్తే.. చాలామంది ఓ ఆటగాడి పేరు చెబుతున్నారు. అతడే ఆర్సీబీ వెటరన్ స్పిన్నర్ కర్ణ్ శర్మ. కర్ణ్ శర్మ ఎక్కడ ఉంటే ఆ జట్టు టైటిల్ గెలవడం మనం చూశాం. ఇతగాడు 2016 (సన్రైజర్స్ హైదరాబాద్), 2017 (ముంబై ఇండియన్స్), 2018 (సీఎస్కే), 2021 (సీఎస్కే) సీజన్లలో వివిధ విన్నింగ్ టీమ్లలో భాగంగా ఉన్నాడు. ఐపీఎల్లో కర్ణ్ శర్మను మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్గా పేరుంది. ఆర్సీబీ అభిమానులు ప్రస్తుతం కర్ణ్ శర్మ సెంటిమెంట్ పైనే గంపెడాశలు పెట్టుకున్నారు. పైగా ప్రత్యర్ధులు ఈ ఏడాది తమను తక్కువ అంచనా వేయడం కూడా కలిసొస్తుందని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో (9 మ్యాచ్ల్లో 5 విజయాలు) ఉన్న ఆర్సీబీ.. తదుపరి మ్యాచ్ల్లో వరుస విజయాలు సాధించి, ఆ తర్వాత టైటిల్ కూడా సాధించి తీరుతుందని ఆర్సీబీ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఈ సాలా కప్ నమదే.. రాసి పెట్టుకోండి అంటూ సోషల్మీడియాను హోరెత్తిస్తున్నారు. మరోవైపు ఆర్సీబీ వ్యతిరేకులు మాత్రం ఆర్సీబీకి అంత సీన్ లేదని, కర్ణ్ శర్మ గతేడాది కూడా వారితోనే ఉన్నాడు, అప్పుడు కానిది ఇప్పుడెలా కుదురుతుందని పంచ్లు వేస్తున్నారు. మరికొందరైతే దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్ లాంటి దిగ్గజాలను జట్టులో ఉంచుకుని టైటిల్ సాధించాలనుకోవడం అత్యాశే అవుతుందని సెటైర్లు వేస్తున్నారు. మరి ఫ్యాన్స్ నమ్మకాన్ని ఆర్సీబీ నీలబెడుతుందో, నీరుగారుస్తుందో వేచి చూడాలి. -
అదే మాకు కలిసొచ్చింది.. నాకు ముందే తెలుసు ఇలా జరుగుతుందని: డుప్లెసిస్
ఐపీఎల్-2023లో భాగంగా వాజ్పేయి ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించిన విషయం తెలిసిందే. కేవలం 127 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా కాపాడుకోగలిగారు. 127 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో కేవలం 108 పరుగులకే కుప్పకూలింది. ఇక సంచలన విజయంపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ స్పందించాడు. లక్నో వంటి వికెట్పై తొలుత బ్యాటింగ్ చేయడం తమకు కలిసొచ్చిందని డుప్లెసిస్ తెలిపాడు. "మా హోం గ్రౌండ్ చిన్నస్వామి వికెట్కు ఇక్కడి వికెట్ పూర్తి వ్యతిరేకం. మేము ఈ మ్యాచ్లో తొలత 6 ఓవర్లు బాగా ఆడాం. విరాట్తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పడం సంతోషంగా ఉంది. అదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అనుకుంటా. ఎందుకంటే మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్కు చాలా కష్టంగా ఉంది. ఇటువంటి పిచ్లపై తొలుత బ్యాటింగ్ చేయడం చాలా ముఖ్యం. 135 పరుగులు చేస్తే చాలు ఈ వికెట్పై మంచిస్కోర్ అవుతుందని భావించాను. ఇదే విషయం నేను కార్తీక్ మాట్లాడుకున్నాం. కానీ దురదృష్టవశాత్తూ మేము అనుకున్న మార్క్ను అందుకోలేకపోయాము. అయినప్పటికీ ఫీల్డ్లో అడుగుపెట్టేటప్పుడు మా బాయ్స్తో ఒకే విషయం చెప్పాను. ఈ స్కోర్నే మ్యాచ్ విన్నింగ్ స్కోర్గా భావించండి అని చెప్పా. ఆ మాత్రం స్కోర్ సాధిస్తే విజయం మాదే అని ముందే ఊహించా. ఇక మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. జోష్, కరుణ్ చాలా బౌలింగ్ చేశారు. ఇక ఇదే రిథమ్ను మా తర్వాతి మ్యాచ్ల్లో కొనసాగించేందుకు ప్రయత్నిస్తాం" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో డుప్లెసిస్ పేర్కొన్నాడు. చదవండి: #Virat Kohli: షాకిచ్చిన బీసీసీఐ! పైకి కనబడేదంతా నిజం కాదు.. కోహ్లి పోస్ట్ వైరల్! ఫ్యాన్స్ ఫైర్ Shootout at 𝚆̶𝚊̶𝚍̶𝚊̶𝚕̶𝚊̶ Ekana: 1️⃣9️⃣ wickets, 1️⃣ hamstring injury, unlimited drama & #RCB breaking 💔 in Lucknow#LSGvRCB #TATAIPL #IPLonJioCinema #IPL2023 | @RCBTweets pic.twitter.com/7S2NEdsV9b — JioCinema (@JioCinema) May 1, 2023 -
కనీసం ఒక్క మ్యాచ్లోనైనా నిరూపించుకున్నాడా? మరీ దారుణంగా.. ఇప్పటికైనా
IPL 2023- Dinesh Karthik: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఆట తీరును టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శించాడు. ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లలో కనీసం ఒక్కదాంట్లో కూడా స్థాయికి తగ్గట్లు రాణించలేదని పెదవి విరిచాడు. జట్టు తనపై ఆధారపడొచ్చనే భరోసా ఇవ్వలేకపోయాడంటూ విమర్శలు గుప్పించాడు. అప్పుడు అదుర్స్. .. గత సీజన్లో ఆర్సీబీ ఫినిషర్గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించి.. ఐపీఎల్ ప్రదర్శన ద్వారా భారత జట్టులో పునరాగమనం చేశాడు వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్. కానీ పదహారో ఎడిషన్లో సీన్ రివర్స్ అయింది. గతేడాది ఐపీఎల్లో 16 ఇన్నింగ్స్లలో 330 పరుగులు చేసిన డీకే.. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్లలో సాధించినవి కేవలం 83 పరుగులు. ఇప్పుడేమో తుస్ ఈ గణాంకాలను బట్టి దినేశ్ కార్తిక్ ప్రదర్శన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతేడాది ఆర్సీబీకి బలంగా ఉన్న డీకే ఈసారి మాత్రం అంచనాలు అందుకోలేకపోతున్నాడు. ఒక్క మ్యాచ్లో కూడా తనదైన ముద్ర వేయలేకపోయాడు. మరోవైపు ఆర్సీబీ భారమంతా విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్వెల్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మీదే పడుతోంది. కేజీఎఫ్పైనే భారం ప్రతిసారీ ఈ ముగ్గురిపైనే ఆధారపడటంతో వీరిలో ఒక్కరు విఫలమైనా ఆర్సీబీ విజయాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘కేజీఎఫ్ (కోహ్లి, గ్లెన్, ఫాఫ్) గనుక ఒకవేళ స్థాయికి తగ్గట్లు రాణించలేని పరిస్థితుల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో ఆర్సీబీ యాజమాన్యం ప్రణాళికలు రచించుకోవాలి. వాళ్లు గనుక విఫలమై జట్టు కష్టాల్లో కూరుకుపోతే బాధ్యతను నెత్తినవేసుకోగల ఆటగాళ్లను తయారుచేసుకోవాలి. ఆ ప్లేయర్ దినేశ్ కార్తికా లేదంటే మహిపాల్ లామ్రోరా అన్న విషయాన్ని పక్కనపెడితే.. ఆర్సీబీ మిడిలార్డర్ మాత్రం పూర్తి బలహీనంగా ఉంది. ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే ముఖ్యంగా కార్తిక్ గత ఎనిమిది మ్యాచ్లలో కనీసం ఒక్క మ్యాచ్లో కూడా జట్టు తనపై ఆధారపడొచ్చు అనే భరోసాను ఇవ్వలేకపోయాడు. మేనేజ్మెంట్ కచ్చితంగా ఈ బ్యాటింగ్ లోపాలను సరిచేసుకోవాలి’’ అని సూచించాడు. లేనిపక్షంలో భారీ మూల్యం తప్పదంటూ ఇర్ఫాన్ హెచ్చరికలు జారీ చేశాడు. కాగా గత మ్యాచ్లో సొంతమైదానంలో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిపాలైన ఆర్సీబీ.. మే 1న లక్నోలో సూపర్ జెయింట్స్తో పోటీకి సిద్ధమైంది. ఈ క్రమంలో గాయపడిన డేవిడ్ విల్లే స్థానంలో కేదార్ జాదవ్ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. చదవండి: Viral: మిస్టర్ కూల్కు ఆగ్రహం! నీకసలు బుద్ధుందా? జట్టులో నుంచి తీసిపారేయండి! MI Vs RR: గ్రహణం వీడింది..! అతడు భవిష్యత్ సూపర్స్టార్.. నో డౌట్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అవమాన భారంతో తలెత్తుకోలేకపోతున్న ఆర్సీబీ ఫ్యాన్స్.. డీకే, షాబాజ్పై ఫైర్
సొంత మైదానంలో పరాజయాల (లక్నో, సీఎస్కే, కేకేఆర్ చేతుల్లో) నేపథ్యంలో ఆర్సీబీ అభిమానులు తెగ ఫీలైపోతున్నారు. తమ ఆటగాళ్ల చెత్త ప్రదర్శన కారణంగా వారు తలెత్తుకోలుకపోతున్నారు. సొంత ఇలాకాలో ఇదేం కర్మ రా బాబు అనుకుంటూ అవమాన భారంతో కుంగిపోతున్నారు. సొంత జట్టుకే వ్యతిరేకంగా సోషల్మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. KGFను (కోహ్లి, గ్లెన్ మ్యాక్స్వెల్, ఫాప్ డుప్లెసిస్) మినహాయించి మిగతా ఆటగాళ్లందరిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ముఖ్యంగా దినేశ్ కార్తీక్, షాబజ్ అహ్మద్లపై తారా స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. వీరి వల్లే ఆర్సీబీ విజయాలకు దూరమవుతుందని మండిపడుతున్నారు. వీరు సరిగ్గా ఆడకపోగా.. ఇతరులను కూడా భ్రష్ఠుపట్టిస్తున్నారని (రనౌట్లు, మిస్ ఫీల్డింగ్లు, క్యాచ్లు జారవిడచడం వంటివి) తూర్పారబెడుతున్నారు. నిన్న కేకేఆర్తో జరిగిన మ్యాచ్ గురించి ప్రస్తావిస్తూ.. దినేశ్ కార్తీక్ను (18 బంతుల్లో 22, సుయాశ్ రనౌట్కు కారకుడు), షాబాజ్ అహ్మద్ను (5 బంతుల్లో 2, ఒకే ఓవర్లో 25 పరుగులు సమర్పించుకున్నాడు) పరుష పదజాలంతో దూషిస్తున్నారు. చదవండి: #JasonRoy: 4 బంతుల్లో నాలుగు సిక్సర్లు.. షాబాజ్ అహ్మద్ను ఉతికారేశాడు వీరి వల్లే తాము సొంత మైదానంలో తలెత్తుకోలేకపోతున్నామని వాపోతున్నారు. ఇక చాలు.. మీరు వెళ్లండ్రా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు. హర్షల్ పటేల్, సుయాశ్ ప్రభుదేశాయ్, విజయ్ కుమార్ వైశాఖ్లు కూడా తమ ఆటతీరును మెరుగుపర్చుకోవాలని, లేకపోతే స్వచ్ఛందంగా జట్టును తప్పుకోవాలని సూచిస్తున్నారు. పనిలో పనిగా సరైన జట్టును (దేశీయ ఆటగాళ్లను) ఎంపిక చేసుకోలేదని ఫ్రాంచైజీ యాజమాన్యంపై మండిపడుతున్నారు. ఆ నలుగురిని (KGF, సిరాజ్) తప్పిస్తే, ఐపీఎల్ చరిత్రలో ఇంత బలహీనమైన జట్టే ఉండదని అంటున్నారు. కాగా, చిన్న స్వామి స్టేడియంలో (బెంగళూరు) కేకేఆర్తో నిన్న (ఏప్రిల్ 26) జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. సిరాజ్ (4-0-33-1), హసరంగ (4-0-24-2), విరాట్ కోహ్లి (37 బంతుల్లో 54) మినహాయించి ఆ జట్టు మూకుమ్మడిగా విఫలమై ఓటమిపాలైంది. చదవండి: #ViratKohli: అరుదైన ఘనత.. టి20 చరిత్రలో తొలి ఆటగాడిగా తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. జేసన్ రాయ్ (29 బంతుల్లో 56; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), నితీశ్ రాణా (21 బంతుల్లో 48), వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 31) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసి, 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో డుప్లెసిస్ (17), మ్యాక్స్వెల్ (5) సహా అందరూ విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, సుయాశ్ శర్మ, ఆండ్రీ రసెల్ తలో 2 వికెట్లు పడగొట్టారు. చదవండి: 'ఓటమికి అర్హులం.. ఫీల్డింగ్ వైఫల్యం కొంపముంచింది' -
అనుష్కతో కలిసి డ్యాన్స్ చేసిన కోహ్లి.. అంతలోనే విరాట్ కాలికి! ఏం జరిగిందంటే?
టీమిండియా మాజీ కెప్టెన్, ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఐపీఎల్-2023లో బీజీబీజీగా ఉన్నాడు. ఈ మెగా ఈవెంట్లో ఆర్సీబీ స్టాండింగ్ కెప్టెన్గా విరాట్ వ్యవహరిస్తున్నాడు. రెగ్యూలర్ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ గాయంతో బాధపడుతుండంతో మరి కొన్ని మ్యాచ్లకు కోహ్లినే నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఈ సీజన్లో పంజాబ్, రాజస్తాన్తో మ్యాచ్ల్లో ఆర్సీబీ సారధిగా వ్యవహరించిన విరాట్.. ఈ రెండు మ్యాచ్ల్లోనూ తమ జట్టుకు విజయాలను అందించాడు. ఇక వ్యక్తిగత ప్రదర్శనలో కూడా విరాట్ దుమ్మురేపుతున్నాడు. ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన కోహ్లి.. 279 పరుగులు సాధించాడు. విరాట్ ఆరెంజ్ క్యాప్ రేసులో నాలుగో స్థానంలో ఉన్నాడు. అనుష్కతో కలిసి డ్యాన్స్ చేసిన విరాట్.. ఇక ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్తో ఆర్సీబీ తలపడిన సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్కు ముందు జిమ్లో విరాట్ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఓ పంజాబీ పాటకు వీరిద్దరూ స్టేప్పులు వేశారు. అయితే కొన్ని సెకన్లకే కాలు పట్టేయడంతో కోహ్లి పక్కకు వెళ్లిపోయాడు. దీంతో అనుష్క ఒక్క సారిగా గట్టిగా నవ్వింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: #David Warner: ఉప్పల్లో కింగ్.. టైటిల్ వీరుడు! అప్పుడు మా వార్నర్ అన్న.. ఇప్పుడు.. Virat Kohli and Anushka Sharma dancing on a Punjabi song. Video of the day! pic.twitter.com/dzPIeMs8G0 — Mufaddal Vohra (@mufaddal_vohra) April 24, 2023 -
తమ రికార్డును తామే బద్దలు కొట్టిన మ్యాక్స్వెల్-డుప్లెసిస్
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ మరో విజయాన్నినమోదు చేసింది. ఆదివారం రాజస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఏడు పరుగుల తేడాతో నెగ్గింది. కాగా ఈ మ్యాచ్లో ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. ఐపీఎల్ హిస్టరీలో థర్డ్ వికెట్కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జోడీగా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా తము క్రియేట్ చేసిన రికార్డును 6 రోజుల్లోనే బ్రేక్ చేయడం గమనార్హం. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో డుప్లెసిస్, మ్యాక్స్వెల్ ఇద్దరూ మూడో వికెట్కు 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతకు 6 రోజుల ముందు ఏప్రిల్ 17న చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 126 పరుగులతో పాట్నర్షిప్తో అదరగొట్టారు. 2017లో గుజరాత్ లయన్స్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ-కేఎల్ రాహుల్ ఇద్దరూ మూడో వికెట్కు అత్యధిక పరుగులు జోడించగా.. చెన్నైతో మ్యాచ్లో డుప్లెసిస్(62), మ్యాక్సీ(77) ఆ రికార్డును బ్రేక్ చేశారు. తాజాగా తమ రికార్డును మళ్లీ తామే బద్దలు కొట్టారు. డుప్లెసిస్, మ్యాక్స్వెల్ క్రియేట్ చేసిన ఈ 127 పరుగుల భాగస్వామ్యం ఐపీఎల్ హిస్టరీలో 15వ అత్యుత్తమ భాగస్వామ్యంగా నిలిచింది. మూడో వికెట్కు మాత్రం ఇదే అత్యుత్తమం. ఈ మ్యాచ్లో డుప్లెసిస్ మరో అరుదైన ఘనతను కూడా సాధించాడు. టి20 క్రికెట్లో 9 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2023లో ఇప్పటికే నాలుగు అర్ధ సెంచరీలు సాధించిన డుప్లీ.. తాజాగా ఐదో అర్ధశతకాన్ని అందుకున్నాడు. పలితంగా పొట్టి ఫార్మాట్లో 9వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. -
Du Plessis: వయసు మీద పడుతున్నా పాతబడ్డ వైన్లా మత్తెక్కిస్తున్నాడు..!
ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ వయసు మీద పడుతున్నా ఆట విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. 38 వయసులోనూ కుర్రాడిలా రెచ్చిపోతూ పరుగుల వరద పారిస్తున్నాడు. గత కొంతకాలంగా పక్కటెముకుల నొప్పితో బాధపడుతున్నప్పటికీ వీరలెవెల్లో విజృంభిస్తున్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్లోనూ విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడుతూ కుర్రాళ్లకు సైతం అసూయ పడేలా చేస్తున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పట్టపగ్గాలు లేకుండా విజృంభిస్తున్న డుప్లెసిస్.. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 5 హాఫ్ సెంచరీలు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో అతను 7 మ్యాచ్ల్లో 67.50 సగటున 165.71 స్ట్రయిక్రేట్తో 405 పరుగులు సాధించాడు. ఇందులో 33 ఫోర్లు, 25 సిక్సర్లు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ రేసులో ఇతని దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. డుప్లెసిస్ భీకర ఫామ్ను చూసి సహచర స్టార్ ఆటగాళ్లు సైతం ముక్కున వేళ్లేసుకుంటున్నారు. నాలుగు పదుల వయసుకు దగ్గరపడుతున్నా పాతబడ్డ వైన్లా ఆటతో మత్తెక్కిస్తున్నాడంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ప్రస్తుత సీజన్లో డుప్లెసిస్ చేసిన స్కోర్ల వివరాలు.. ముంబై ఇండియన్స్పై 73(43) కేకేఆర్పై 23(12) లక్నో సూపర్ జెయింట్స్పై 79*(46) ఢిల్లీ క్యాపిటల్స్పై 22(16) చెన్నై సూపర్ కింగ్స్పై 62(33) పంజాబ్ కింగ్స్పై 84(56) రాజస్థాన్ రాయల్స్పై 62(39) -
వారి కంటే గల్లీ క్రికెటర్లే నయం.. దినేశ్ కార్తీక్ గురించి చెప్పనక్కర్లేదు..!
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో ఇవాళ (ఏప్రిల్ 23, మధ్యాహ్నం 3:30 గంటలకు) జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ గతంలో మాదిరే మరోసారి భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. డుప్లెసిస్ (39 బంతుల్లో 62; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), మ్యాక్స్వెల్ (44 బంతుల్లో 77; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లతో చెలరేగినా ఆ జట్టు భారీ స్కోర్ చేయలేక చతికిలపడింది. మ్యాక్సీ, డుప్లెసిస్ విజృంభించడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసి పటిష్టమైన స్థితిలో ఉండిన ఆ జట్టు ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయింది. 45 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి ఉసూరుమనిపించింది. కోహ్లి (0), షాబాజ్ అహ్మద్ (2), లోమ్రార్ (8), దినేశ్ కార్తీక్ (16), ప్రభుదేశాయ్ (0), హసరంగ (6) విజయ్కుమార్ వైశాఖ్ (0) గల్లీ క్రికెటర్ల కంటే హీనంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా దినేశ్ కార్తీక్ అత్యంత దారుణంగా ఆడటమే కాకుండా ఇద్దరు రనౌట్ కావడంతో కీలకపాత్ర పోషించాడు. బంతిని టచ్ చేసేందుకు కూడా ఇబ్బంది పడిన దినేశ్ కార్తీక్పై ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వీడెక్కడ దొరికాడు రా బాబు అంటూ తలలు బాదుకుంటున్నారు. కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్స్వెల్ లేకపోతే తమ పరిస్థితి ఏంటని బాధపడుతున్నారు. ప్రతి మ్యాచ్లో KGF (కోహ్లి, గ్లెన్ మ్యాక్స్వెల్, ఫాఫ్ డుప్లెసిస్) పైనే ఆధారపడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వీరు మినహాయించి ఒక్కరంటే ఒక్కరు కూడా బ్యాటింగ్లో రాణించలేకపోవడాన్ని సహించలేకపోతున్నారు. మిగతా జట్లలో దేశీయ ఆటగాళ్లు పోటీపడి రాణిస్తుంటే, తమ జట్టులోని ఆటగాళ్లు పెవిలియన్కు క్యూకట్టడంతో పోటీపడుతున్నారని వాపోతున్నారు. షాబాజ్ అహ్మద్, మహిపాల్ లోమ్రార్, దినేశ్ కార్తీక్, సుయాశ్ ప్రభుదేశాయ్లను తూర్పారబెడుతున్నారు. వీరి కంటే గల్లీ క్రికెటర్లు వెయ్యి రెట్లు నయమని అంటున్నారు. వెంటనే వీరిని జట్టు నుంచి తప్పించి, టాలెంటెడ్ యంగ్ ప్లేయర్లను తీసుకోవాలని ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. -
డుప్లెసిస్ రిబ్స్ పై టాటూ దాని అర్ధం ఇదా...
-
డుప్లెసిస్ రిబ్స్ పై టాటూ దానికి అర్ధం ఇదా..
-
సిరాజ్ సూపర్ షో...
సిరాజ్ గెలిపించిన మ్యాచ్ ఇది! నిప్పులు చెరిగే బౌలింగ్, కళ్లు చెదిరే ఫీల్డింగ్తో పంజాబ్ కింగ్స్పై స్పీడ్స్టర్ పంజా విసిరాడు. పంజాబ్ కుదురుకోకుండా దెబ్బ మీద దెబ్బ వేయడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఈ సీజన్లో మూడో విజయాన్ని సాధించింది. మొహాలీ: మెరుపులతో డుప్లెసిస్, కోహ్లి బెంగళూరును నడిపిస్తే... బౌలింగ్తో గెలిపించిన ఘనత మాత్రం సిరాజ్దే! దీంతో ఐపీఎల్లో గురువారం జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 24 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్పై విజయం సాధించింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా దిగిన రెగ్యులర్ కెప్టెన్ డుప్లెసిస్ (56 బంతుల్లో 84; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), ఈ మ్యాచ్లో సారథ్యం వహించిన విరాట్ కోహ్లి (47 బంతుల్లో 59; 5 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. హర్ప్రీత్ బ్రార్కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత పంజాబ్ 18.2 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. ప్రభ్సిమ్రన్ (30 బంతుల్లో 46; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), జితేశ్ శర్మ (27 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సిరాజ్ (4/21) కీలకమైన వికెట్లు తీశాడు. డుప్లెసిస్ ధనాధన్ ‘ఇంపాక్ట్’ కోహ్లి, డుప్లెసిస్ల ఓపెనింగ్ మైదానంలోని ప్రేక్షకుల్ని మెరుపులతో మురిపించింది. దూసుకొచ్చే బంతిని కాచుకొని, గతి తప్పిన బంతిని బౌండరీలవైపు శిక్షిస్తూ బెంగళూరు ఇన్నింగ్స్ను ఏకంగా 16 ఓవర్ల పాటు నడిపించారు. 137 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని జోడించారు. ఈ క్రమంలో ముందుగా డుప్లెసిస్ 31 బంతుల్లో, తర్వాత కోహ్లి 40 బంతుల్లో ఫిఫ్టీలను పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి పరుగుల పంజా ‘కింగ్స్’ను ఉక్కిరిబిక్కిరి చేయగా, స్వల్ప వ్యవధిలో వీళ్లిద్దరితో పాటు హిట్టర్ మ్యాక్స్వెల్ (0) అవుటవడంతో 200 మార్క్ను దాటకుండా పంజాబ్ అడ్డుకుంది. అనంతరం కష్టపడితే ఛేదించే లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ను సిరాజ్ తన తొలి ఓవర్ నుంచే కష్టాలపాలు చేశాడు. అథర్వ (4)ను ఎల్బీగా అవుట్ చేశాడు. సిక్స్, ఫోర్ కొట్టి జోరు మీదున్న హర్ప్రీత్ సింగ్ (13)ను డైరెక్ట్ హిట్తో రనౌట్ చేశాడు. ప్రభ్సిమ్రన్ రాణింపు తర్వాత జితేశ్ శర్మ మెరుపులతో లక్ష్యం దిశగా సాగుతుంటే మళ్లీ సిరాజ్ నిప్పులు చెరిగాడు. హర్ప్రీత్ బ్రార్ (13), ఎలిస్ (1)లను క్లీన్బౌల్డ్ చేసి పరాజయాన్ని ఖాయం చేశాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) జితేశ్ శర్మ (బి) హర్ప్రీత్ 59; డుప్లెసిస్ (సి) స్యామ్ కరన్ (బి) ఎలిస్ 84; మ్యాక్స్వెల్ (సి) అథర్వ (బి) హర్ప్రీత్ 0; దినేశ్ కార్తీక్ (సి) అథర్వ (బి) అర్షదీప్ 7; మహిపాల్ (నాటౌట్) 7; షహబాజ్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–137, 2–137, 3–151, 4–163. బౌలింగ్: అర్షదీప్ సింగ్ 4–0–34–1, హర్ప్రీత్ 3–0–31–2, ఎలిస్ 4–0–41–1, స్యామ్ కరన్ 4–0–27–0, రాహుల్ చహర్ 4–0–24–0, లివింగ్స్టోన్ 1–0–9–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: అథర్వ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 4; ప్రభ్సిమ్రన్ (బి) పార్నెల్ 46; షార్ట్ (బి) హసరంగ 8; లివింగ్స్టోన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 2; హర్ప్రీత్ సింగ్ (రనౌట్) 13; స్యామ్ కరన్ (రనౌట్) 10; జితేశ్ శర్మ (సి) షహబాజ్ (బి) హర్షల్ పటేల్ 41; షారుఖ్ (స్టంప్డ్) దినేశ్ కార్తీక్ (బి) హసరంగ 7; హర్ప్రీత్ బ్రార్ (బి) సిరాజ్ 13; ఎలిస్ (బి) సిరాజ్ 0; అర్షదీప్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 150. వికెట్ల పతనం: 1–4, 2–20, 3–27, 4–43, 5–76, 6–97, 7–106, 8–147, 9–149, 10–150. బౌలింగ్: సిరాజ్ 4–0–21–4, పార్నెల్ 3–0–32–1, హసరంగ 4–0–39–2, వైశాక్ 3–0–29–0, మ్యాక్స్వెల్ 1–0–5–0, హర్షల్ పటేల్ 3.2–0–22–1. -
PBKS VS RCB: ఆర్సీబీ కెప్టెన్గా కోహ్లి.. 15 నెలల తర్వాత, డుప్లెసిస్ ఉన్నా..!
ఐపీఎల్-2023లో భాగంగా పంజాబ్ కింగ్స్తో ఇవాళ (ఏప్రిల్ 20) జరుగుతున్న మ్యాచ్లో విరాట్ కోహ్లి ఆర్సీబీ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు వదిలేశాక, దాదాపు 15 నెలల అనంతరం కోహ్లి ఇలా ఓ జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు. 2022 జనవరి 11న కోహ్లి చివరిసారిగా భారత టెస్ట్ జట్టు కెప్టెన్గా వ్యవహరించాడు. నాడు సౌతాఫ్రికాతో జరిగిన ఆ మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైంది. టెస్ట్ల్లో విజయవంతమైన కెప్టెన్ అయిన కోహ్లి ఊహించని పరిణామాల నడుమ ఓటమితో కెప్టెన్సీ కెరీర్ ముగించాడు. డుప్లెసిస్ ఉన్నా కోహ్లి ఎందుకు..? పక్కటెముకల నొప్పితో బాధపడుతున్న ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్.. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగాడు. నొప్పి కారణంగా అతను ఫీల్డింగ్ చేయలేకపోవడంతో అతని స్థానంలో కోహ్లి తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఆర్సీబీ బౌలింగ్ సమయంలో డుప్లెసిస్కు రీప్లేస్మెంట్గా విజయ్కుమార్ వైశాఖ్ బరిలోకి దిగనున్నాడు. కాగా, ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకుంది. వరుస బంతుల్లో కోహ్లి (59), మ్యాక్స్వెల్ (0) ఔట్ కావడం.. స్కోర్ వేగం పెంచే క్రమంలో డుప్లెసిస్ (84) కూడా పెవిలియన్కు చేరడం.. ఆ తర్వాత వచ్చిన దినేశ్ కార్తీక్ (7), మహిపాల్ (7 నాటౌట్), షాబాజ్ అహ్మద్ (5 నాటౌట్) చెత్తగా బ్యాటింగ్ చేయడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 174 పరుగుల స్కోర్కే పరిమితమైంది. పంజాబ్ బౌలరల్లో హర్ప్రీత్ బ్రార్ 2, అర్షదీప్, ఇల్లిస్ తలో వికెట్ పడగొట్టారు. -
150 పరుగులకే పంజాబ్ ఆలౌట్.. ఆర్సీబీ ఘన విజయం
150 పరుగులకే పంజాబ్ ఆలౌట్.. ఆర్సీబీ ఘన విజయం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 24 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 18.2 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. ప్రబ్సిమ్రన్ సింగ్ 46, జితేశ్ శర్మ 41 మినహా మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. హసరంగా రెండు వికెట్లు, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్లు చెరొక వికెట్ తీశారు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన పంజాబ్ 147 పరుగుల వద్ద పంజాబ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్లో హర్ప్రీత్ బ్రార్ క్లీన్ బౌల్డయ్యాడు. ఓటమి దిశగా పయనిస్తున్న పంజాబ్.. ఏడో వికెట్ డౌన్ 106 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పంజాబ్ ఓటమి దిశగా పయనిస్తుంది. హసరంగ బౌలింగ్లో షారుఖ్ ఖాన్ (7) స్టంపౌటయ్యాడు. 76 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన పంజాబ్ పంజాబ్ రనౌట్ రూపంలో మరో వికెట్ కోల్పోయింది. హసరంగ అద్భుతమైన డైరెక్ట్ త్రోతో సామ్ కర్రన్ (10) ఔటయ్యాడు. దీంతో పంజాబ్ 76 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. సిరాజ్ సూపర్ త్రో.. నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్ వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసి జోరుమీదున్న సిరాజ్, మరో అద్భుతమైన డైరెక్ట్ త్రోతో హర్ప్రీత్ సింగ్ (13) పెవిలియన్కు పంపాడు. 6 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 49/4. సామ్ కర్రన్, ప్రభ్సిమ్రన్ (21) క్రీజ్లో ఉన్నారు. నిప్పులు చెరుగుతున్న సిరాజ్.. మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడుతున్నాడు. తన స్పెల్లో వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీశాడు. తొలుత రివ్యూవి వెళ్లే అథర్వ వికెట్ (ఎల్బీ)ను దక్కించుకున్న సిరాజ్.. ఆతర్వాత 4వ ఓవర్లో కూడా రివ్యూకి వెళ్లి లివింగ్స్టోన్ను ఔట్ (ఎల్బీ) చేశాడు. రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్ 175 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ మూడో ఓవర్ తొలి బంతికి రెండో వికెట్ కోల్పోయింది. హసరంగ బౌలింగ్లో మాథ్యూ షార్ట్ (8) క్లీన్ బౌల్డయ్యాడు. టార్గెట్ 175.. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ 175 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ రెండో బంతికే వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్లో అథర్వ టైడే (4) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రాణించిన డుప్లెసిస్, కోహ్లి.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే..? టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకుంది. వరుస బంతుల్లో కోహ్లి (59), మ్యాక్స్వెల్ (0) ఔట్ కావడం.. స్కోర్ వేగం పెంచే క్రమంలో డుప్లెసిస్ (84) కూడా పెవిలియన్కు చేరడం.. ఆ తర్వాత వచ్చిన దినేశ్ కార్తీక్ (7), మహిపాల్ (7 నాటౌట్), షాబాజ్ అహ్మద్ (5 నాటౌట్) చెత్తగా బ్యాటింగ్ చేయడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 174 పరుగుల స్కోర్కే పరిమితమైంది. హర్ప్రీత్ బ్రార్ 2, అర్షదీప్, ఇల్లిస్ తలో వికెట్ పడగొట్టారు. డుప్లెసిస్ (84) ఔట్ ఇల్లిస్ బౌలింగ్లో సిక్స్ బాదిన మరుసటి బంతికే డుప్లెసిస్ (84) ఔటయ్యాడు. 18 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 154/3. లోమ్రార్, కార్తీక్ (3) క్రీజ్లో ఉన్నారు. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ.. కోహ్లి, మ్యాక్స్వెల్ ఔట్ ఆర్సీబీకి వరుస షాక్లు తగిలాయి. హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో వరుస బంతుల్లో విరాట్ కోహ్లి (59), మ్యాక్స్వెల్ (0) ఔటయ్యారు. 17 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 145/2. డుప్లెసిస్ (78), దినేశ్ కార్తీక్ (1) క్రీజ్లో ఉన్నారు. కోహ్లి హాఫ్ సెంచరీ.. 14 ఓవర్ల తర్వాత స్కోర్ ఎంతంటే..? 40 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో కోహ్లి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 14 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 118/0. కోహ్లికు జతగా డుప్లెసిస్ (65) క్రీజ్లో ఉన్నాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన డుప్లెసిస్ ఆర్సీబీ ఓపెనర్ డుప్లెసిస్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ సీజన్లో డుప్లెసిస్కు ఇది నాలుగో హాఫ్ సెంచరీ. ఓవరాల్గా 29వ ఐపీఎల్ ఫిఫ్టి. 11 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 98/0. డుప్లెసిస్కు జతగా కోహ్లి (39) క్రీజ్లో ఉన్నాడు. ధాటిగా ఆడుతున్న డుప్లెసిస్, కోహ్లి ఆర్సీబీ ఓపెనర్లు డుప్లెసిస్ (27), విరాట్ కోహ్లి (29) ధాటిగా ఆడుతున్నారు. వీరి ధాటికి ఆర్సీబీ 5.1 ఓవర్లలోనే 50 పరుగుల మార్కు దాటింది. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 59/0గా ఉంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ ఐపీఎల్-2023లో భాగంగా మొహాలీ వేదికగా ఇవాళ (ఏప్రిల్ 20) మధ్యాహ్నం 3:30 గంటలకు పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు.. పంజాబ్ కింగ్స్: అథర్వ టైడే, మాథ్యూ షార్ట్, లివింగ్స్టోన్, హర్ప్రీత్ సింగ్, సికందర్ రజా, సామ్ కర్రన్ (కెప్టెన్), జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, హర్ప్రీత్ బ్రార్, నాథన్ ఇల్లీస్, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్ ఆర్సీబీ: డుప్లెసిస్, విరాట్ కోహ్లి (కెప్టెన్), మహిపాల్ లోమ్రార్, మ్యాక్స్వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్, హసరంగ, పార్నెల్, సుయాష్ ప్రభుదేశాయ్, సిరాజ్ -
CSK VS RCB: డుప్లెసిస్ పక్కటెముకలపై ఉన్న ఆ టాటూ అర్ధం తెలుసా..?
చెన్నై సూపర్ కింగ్స్తో నిన్న (ఏప్రిల్ 17) జరిగిన రసవత్తర పోరులో లోకల్ జట్టు ఆర్సీబీ 8 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. చెన్నై నిర్ధేశించిన 227 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఫాఫ్ డుప్లెసిస్ (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్వెల్ (36 బంతుల్లో 76; 3 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడినప్పటికీ, స్వల్ప వ్యవధిలో ఇద్దరూ ఔట్ కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఓటమిపాలైనప్పటికీ.. డుప్లెసిస్-మ్యాక్సీ విధ్వంకర ఇన్నింగ్స్లపై మాత్రం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ డాషింగ్ బ్యాటర్ల విన్యాసాలను ఆ జట్టు ఈ జట్టు అన్న తేడా లేకుండా అన్ని జట్ల అభిమానులు కొనియాడుతున్నారు. గెలిచింది సీఎస్కేనే అయినా డుప్లెసిస్-మ్యాక్సీల నామస్మరణతో సోషల్మీడియా మార్మోగిపోతుంది. Played such an iconic knock at 38 even when he wasn't fully fit. Appreciation tweet for Captain FAF. ❤️ You just can't scroll down without liking this! #RCBvsCSK pic.twitter.com/JztllvBuYA — Sexy Cricket Shots (@sexycricketshot) April 17, 2023 ఇదే మ్యాచ్ సందర్భంగా కనిపించిన ఓ దృశ్యం కూడా నెటిజన్లను విపరీతంగా ఆకర్శించింది. ఆర్సీబీ బ్యాటింగ్ సమయంలో 13వ ఓవర్ పూర్తైన తర్వాత డుప్లెసిస్ కొద్దిగా ఇబ్బంది పడినట్లు కనిపించాడు. అప్పటికే అతని పక్కటెముకలు చుట్టూ బ్యాండ్ కట్టి ఉంది. సిబ్బంది సాయంతో అతను ఆ బ్యాండ్ను సరిచేసుకున్నాడు. ఈ క్రమంలో అభిమానులు డుప్లెసిస్ రిబ్స్పై ఉన్న ఓ టాటూను నొటిస్ చేశారు. దీంతో ఆ టాటూ ఏంటీ, అది ఏ భాష, దాని అర్ధం ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు. డుప్లెసిస్ శరీరంపై చాలా టాటూస్ ఉన్నా ఈ టాటూ మాత్రం నెటిజన్ల ప్రత్యేకంగా ఆకర్శించింది. సోషల్మీడియా జరిపిన చర్చ అనంతరం అభిమానులకు సదరు టాటూ అర్ధం తెలిసింది. ఆ టాటూ అరబ్బీ భాషలోని ఓ పదమని, దాని అర్ధం Fazl (దేవుడి దయ) అని, దేవుడి దయ వల్ల తన జీవితంలో ఊహించని సానుకూల మార్పులు జరగడం వల్ల డుప్లెసిస్ ఈ టాటూను తన రిబ్స్ పైభాగంలో వేయించుకున్నాడని ఫ్యాన్స్ తెలుసుకున్నారు. డుప్లెసిస్ అరబ్బీలో టాటూ వేయించుకోవడంపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. మరోవైపు డుప్లెసిస్ తన పక్కటెముకలపై కట్టిన బ్యాండ్ గురించి కూడా మ్యాచ్ అనంతరం వివరణ ఇచ్చాడు. రిబ్స్లో సమస్య ఉన్న కారణంగా తాను బ్యాండ్ కట్టుకునే బరిలోకి దిగాల్సి వచ్చిందని తెలిపాడు.