Faf du Plessis
-
కొత్త వ్యూహంతో.. అక్షర్పై ఆశలతో ఢిల్లీ క్యాపిటల్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయిన అతి కొద్ది జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఒకటి. గత సీజన్లో వరుసగా పరాజయ పరంపరతో ప్రారంభించి మొదటి అయిదు మ్యాచ్ లలో నాలుగింటిలో ఓటమి చవిచూసి.. చివరికి ఆరో స్థానంతో ముగించింది ఢిల్లీ. అయితే, ఈసారి జట్టు స్వరూపాన్నే మార్చేసింది. గత సీజన్ కెప్టెన్ భారత్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ (Rishabh Pant)ను రికార్డు స్థాయిలో రూ 27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కనుగోలు చేసిన తర్వాత కొత్త వ్యూహానికి తెరతీసింది.అనుభవజ్ఞుడైన భారత్ వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ (KL Rahul), దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్ వంటి సీనియర్లను కొనుగోలు చేసింది. కానీ గతంలో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్కి కెప్టెన్ గా వ్యవహరించిన కెఎల్ రాహుల్ ఢిల్లీ పగ్గాలు చేపట్టేందుకు అంత ఆసక్తి చూపించకపోవడంతో ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ లో రాణించిన మరో యువ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కి నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్లోనూ మార్పులుఢిల్లీ బ్యాక్రూమ్ సిబ్బందిలో కూడా మార్పులు చేశారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్థానంలో భారత్ మాజీ ఆల్ రౌండర్ హేమాంగ్ బదానీని ప్రధాన కోచ్గా నియమించారు. భారత మాజీ బ్యాటర్ విశాఖపట్నంకి చెందిన వై వేణుగోపాలరావు కొత్త క్రికెట్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టాడు. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ను మెంటార్గా, మాథ్యూ మోట్ను అసిస్టెంట్ కోచ్గా, మునాఫ్ పటేల్ను బౌలింగ్ కోచ్గా నియమించారు.సీనియర్లకు మళ్ళీ జట్టులో చోటుఅయితే ఢిల్లీ జట్టులో చాలా మంది గత సీజన్ ఆటగాళ్లు మళ్లీ జట్టు లో కొనసాగుతున్నారు. గత సీజన్ లో ప్రాతినిధ్యం వహించిన అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్లను రెటైన్ చేసారు. వేలంలో ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్ను తిరిగి కొనుగోలు చేశారు. పేసర్ ముఖేష్ కుమార్ కూడా గత సీజన్ లో ఢిల్లీ తరపున ఆడాడు. దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణించిన కరుణ్ నాయర్ కూడా గతంలో ఈ ఫ్రాంచైజీ తరపున ఆడారు.గత సీజన్లో తమ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్తో ఢిల్లీ సమస్యలను ఎదుర్కొంది. ఈ కారణంగా బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేశారు. ఆస్ట్రేలియా కి చెందిన సీనియర్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ (రూ 11.75 కోట్లు), టి నటరాజన్ (రూ 10.75 కోట్లు), ముఖేష్ కుమార్ (రూ 8 కోట్లు) , మోహిత్ శర్మ (రూ 2.20 కోట్లు)లను తీసుకువచ్చారు. ఇక స్పిన్ విభాగం లో కుల్దీప్ మరియు అక్షర్ పటేల్ ఉన్నారు.ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ జట్టు నుంచి తప్పుకోవడం ఢిల్లీ క్యాపిటల్స్ ని కొంత దెబ్బతీసింది. అయితే ఢిల్లీ కొత్త జట్టు కొత్త కెప్టెన్, కొత్త వ్యూహం తో ఈసారి రంగ ప్రవేశం చేస్తోంది. అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ మార్చి 24 (సోమవారం)న విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-విడిసిఏ క్రికెట్ స్టేడియంలో రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్తో జరిగే మ్యాచ్ తో తమ ఐపీఎల్ 2025 సీజన్ని ప్రారంభిస్తుంది. విశాఖపట్నం ని తన రెండో హోమ్ గ్రౌండ్ గా ఎంచుకున్న ఢిల్లీ తన మొదటి రెండు హోమ్ మ్యాచ్లను ఇక్కడే ఆడుతుంది.ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు లో ప్రధాన ఆటగాళ్ళుజేక్ ఫ్రేజర్-మెక్గుర్క్ఆస్ట్రేలియా కి చెందిన జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్ 2023 నుండి టీ20లలో పవర్ప్లేలో అత్యధిక స్ట్రైక్ రేట్ (168.04) ఉన్న బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (184.8), అభిషేక్ శర్మ (181.47) ల తర్వాత మూడో స్థానం లో ఉన్నాడు. 21 ఏళ్ల ఈ యువ బ్యాటర్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 234.04 స్ట్రైక్ రేట్తో 330 పరుగులు సాధించాడు. ఈ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి అతడిని కొనుగోలు చేసింది.కెఎల్ రాహుల్మాజీ లక్నౌ కెప్టెన్ కెఎల్ రాహుల్ ఇటీవల ఛాంపియన్ ట్రోఫీ లో తన అసాధారణ ప్రతిభతో భారత్ జట్టుకి విజయాలు చేకూర్చి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సీజన్లో రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఓపెనింగ్ చేయనున్నాడు. ఐపీఎల్ లో బాగా నిలకడ రాణిస్తున్న బ్యాటర్లలో ఒకడిగా పేరు పొందిన రాహుల్ 132 మ్యాచ్లు ఆడి 135 స్ట్రైక్ రేట్తో 37 అర్ధ సెంచరీలు, నాలుగు సెంచరీలతో 4,683 పరుగులు సాధించాడు.ఫాఫ్ డు ప్లెసిస్అపార అనుభవం ఉన్న ఈ దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు ఈ సీజన్ లో ఓపెనర్ గాను, ఢిల్లీ క్యాపిటల్స్కు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ఫాఫ్ 145 ఐపీఎల్ మ్యాచ్లలో ఆడాడు. 140 స్ట్రైక్ రేట్తో 37 అర్ధ సెంచరీ లతో 4571 పరుగులు చేశాడు.కరుణ్ నాయర్దేశవాళీ క్రికెట్ లో సెంచరీలతో రికార్డుల మోత మోగించిన కరుణ్ నాయర్ మళ్ళీ ఐపీఎల్ లో ఢిల్లీ తరపున రంగ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. విదర్భ రంజీ ట్రోఫీ విజయంలో కరుణ్ నాయర్ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్స్లో 120 , 80 పరుగులు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ నాయర్ ఎనిమిది మ్యాచ్ల్లో 700 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. 76 ఐపీఎల్ మ్యాచ్లతో, దాదాపు 130 స్ట్రైక్ రేట్తో 10 అర్ధ సెంచరీలతో 1,496 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్లో అతని స్థిరత్వం ఢిల్లీ కి కీలకం.అక్షర్ పటేల్కొత్త కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన అక్షర్ పటేల్ తన జట్టును ఫైనల్స్కు తీసుకెళ్లాలని పట్టుదలతో ఉన్నాడు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్ తరపున బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ రాణించిన అక్షర్ పటేల్ కి కెప్టెన్ గా పెద్ద అనుభవం లేదు. అయితే తన నైపుణ్యంతో రాణించగల సామర్థ్యముంది. అక్షర్ ఇంతవరకు 150 ఐపీఎల్ మ్యాచ్లలో, 130 స్ట్రైక్ రేట్తో మూడు అర్ధ సెంచరీలతో 1,653 పరుగులు చేశాడు. 8 కంటే తక్కువ ఎకానమీతో 123 వికెట్లతో సాధించిన అక్షర్ జట్టుకు సరైన సమతుల్యతను ఇస్తాడనడంలో సందేహం లేదు.ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకెఎల్ రాహుల్, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్, ట్రిస్టియన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, మిచెల్ స్టార్క్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, మోహిత్ శర్మ, ఫాఫ్ డుప్లెసిస్, ముఖేష్ కుమార్, దర్శన్ నల్కాండే, విప్ రాజ్ నిగమ్, దుష్మంత చమీరా, డోనోవన్ ఫెరీరా, అజయ్ మండల్, మన్వంత్ కుమార్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారీ. -
షాక్లో క్రికెట్ ఫ్యాన్స్.. నమీబియా కెప్టెన్గా ఫాఫ్ డుప్లెసిస్
అండర్-19 వరల్డ్ కప్ 2026 క్వాలిఫయర్స్కు నమీబియా క్రికెట్ బోర్డు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా ఫాఫ్ డుప్లెసిస్ ఎంపికయ్యాడు. అవును మీరు విన్నది నిజమే. దక్షిణాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ నమీబియా అండర్-19 కెప్టెన్గా ఎలా ఎంపికయ్యాడని ఆలోచిస్తున్నారా? అయితే మీరు అనుకుంటున్నట్లు ఆ డుప్లెసిస్ .. ఈ డుప్లెసిస్ ఒకరు కాదు. ఒకే పేరుతో ఉన్నప్పటికి ఈ ఇద్దరు క్రికెటర్లు వేర్వేరు.17 ఏళ్ల డుప్లెసిస్ దేశవాళీ టోర్నీల్లో మెరుగ్గా రాణించి నమీబియా కెప్టెన్గా నియమితుడయ్యాడు. అయితే సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ మాదిరిగానే ఈ ఫాఫ్ డుప్లెసిస్ కూడా రైట్ హ్యాండ్ బ్యాటరే కావడం గమనార్హం. ఈ డుప్లెసిస్ లెగ్ బ్రేక్ బౌలింగ్ కూడా చేయగలడు. ఇక సీనియర్ డుప్లెసిస్ విషయానికి వస్తే.. ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించేందుకు సిద్దమవుతున్నాడు. ఇప్పటికే ఢిల్లీ జట్టుతో కలిసిన డుప్లెసిస్.. నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ మొదటి మ్యాచ్లో మార్చి 24న వైజాగ్ వేదికగా లక్నో సూపర్జెయింట్స్తో తలపడనుంది.వరల్డ్కప్లో ఆడడమే లక్ష్యంగా.. కాగా జింబాబ్వే వేదికగా జరగనున్న అండర్-19 వరల్డ్ కప్ 2026లో ఆడేందుకు నమీబియాకు ఇదొక సువర్ణ అవకాశం. నైజీరియాలోని లాగోస్లో జరగనున్న ప్రపంచ కప్ క్వాలిఫైయర్లో సత్తాచాటి ఈ మెగా టోర్నీకి ఆర్హత సాధించాలని ఈ ఆఫ్రికా జట్టు పట్టుదలతో ఉంది. డివిజన్ 1 క్వాలిఫైయర్లలో సియెర్రా లియోన్, టాంజానియా, కెన్యా, నైజీరియా, ఉగాండా వంటి జట్లతో నమీబియా తలపడనుంది. మార్చి 28 నుంచి డివిజన్ 1 క్వాలిఫైయర్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. ఈ రౌండ్లో గెలిచిన జట్టు నేరుగా 2026 అండర్-19 ఆఫ్రికా ఉపఖండం తరపున ప్రపంచకప్కు ఆర్హత సాధిస్తారు.నమీబియా జట్టు: ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), అడ్రియన్ కోయెట్జీ, బెన్ బ్రాసెల్, డాన్ బ్రాసెల్, ఎరిక్ లింట్వెల్ట్, హెన్రీ గ్రాంట్, జాంకో ఎంగెల్బ్రెచ్ట్, జునియన్ తనయాండా, లియామ్ బెసన్, లుకా మైకెలో, మాక్స్ హెంగో, రోవాన్ వాన్ వురెన్, టియాన్ వాన్ డెర్ మెర్వే, వాల్డో స్మిత్.చదవండి: IPL 2025: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా రియాన్ పరాగ్.. అఫీషియల్ అప్డేట్ -
IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ వైస్ కెప్టెన్గా డుప్లెసిస్
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. తమ జట్టు వైస్ కెప్టెన్గా ఫాఫ్ డుప్లెసిస్ను నియమిస్తున్నట్లు ఇవాళ (మార్చి 17) వెల్లడించింది. గత రెండు సీజన్లలో ఆర్సీబీ కెప్టెన్గా వ్యవహరించిన ఫాఫ్ను ఢిల్లీ ఈ సీజన్ మెగా వేలంలో సొంతం చేసుకుంది. ఢిల్లీ ఫాఫ్ను బేస్ ధర రూ. 2 కోట్లకు దక్కించుకుంది. కొద్ది రోజుల కిందటే ఢిల్లీ యాజమాన్యం తమ నూతన కెప్టెన్గా అక్షర్ పటేల్ను ఎంపిక చేసింది. ఈ సీజన్లో ఫాఫ్ అక్షర్కు డిప్యూటీగా పని చేస్తాడు. ఆర్సీబీ కెప్టెన్గా, సౌతాఫ్రికా కెప్టెన్గా ఫాఫ్కు మంచి అనుభవం ఉంది. ఫాఫ్ కెప్టెన్సీ అనుభవం ఈ సీజన్లో అక్షర్ పటేల్కు చాలా ఉపయోగపడుతుందని ఢిల్లీ మేనేజ్మెంట్ భావిస్తుంది. ఫాఫ్ ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్, ఆర్సీబీ ఫ్రాంచైజీల తరఫున ఆడాడు. ఫాఫ్ తన ఐపీఎల్ కెరీర్లో 145 మ్యాచ్లు ఆడి 136.37 స్ట్రయిక్రేట్తో 4571 పరుగులు చేశాడు. ఇందులో 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫాఫ్ ఈ సీజన్లో ఢిల్లీ ఓపెనర్గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆసీస్ యువ ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్తో ఫాఫ్ జోడీ కట్టవచ్చు. కాగా, ఢిల్లీ మేనేజ్మెంట్ అక్షర్ పటేల్ను కెప్టెన్గా నియమించకముందు ఈ సీజన్లోనే తమతో చేరిన కేఎల్ రాహుల్ను కెప్టెన్సీ కోసం సంప్రదించినట్లు తెలుస్తుంది. అయితే ఢిల్లీ మేనేజ్మెంట్ ఆఫర్ను రాహుల్ తిరస్కరించాడని సమాచారం. రాహుల్ కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ సీజన్లో రాహుల్, డుప్లెసిస్తో పాటు ఆసీస్ స్పీడ్స్టర్ మిచెల్ స్టార్క్ కూడా ఢిల్లీతో జతకట్టాడు. ఈ సీజన్ మెగా వేలంలో ఢిల్లీ మేనేజ్మెంట్ స్టార్క్కు మంచి ధర చెల్లించి సొంతం చేసుకుంది. గత సీజన్ వరకు ఢిల్లీ కెప్టెన్గా ఉన్న రిషబ్ పంత్ను ఈ సీజన్లో లక్నో రికార్డు ధరకు (రూ.27 కోట్లు) సొంతం చేసుకుంది. పంత్ లక్నో కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయాణం.. మే 24న లక్నో సూపర్ జెయింట్స్తో జరిగే మ్యాచ్తో మొదలవుతుంది. ఈ మ్యాచ్ వైజాగ్లో జరుగనుంది. ఈ సీజన్ మార్చి 22న కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్తో మొదలవుతుంది.ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఢిల్లీ జట్టు..అభిషేక్ పోరెల్, ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, డోనోవన్ ఫెరీరా, అజయ్ మండల్, మన్వంత్ కుమార్, అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ, దుష్మంత చమీర, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, టి. నటరాజన్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, త్రిపురణ విజయ్ -
అక్షర్, రాహుల్ కాదు..? ఢిల్లీ కెప్టెన్గా ఎవరూ ఊహించని ప్లేయర్!?
ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే మరో క్రికెట్ పండగ అభిమానులను అలరించేందుకు సిద్దమైంది. ఐపీఎల్-2025 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ కోలకతా నైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ ఏడాది క్యాష్రిచ్ లీగ్ సీజన్లో పాల్గోనే మొత్తం పది జట్లు తమ ప్రాక్టీస్ను మొదలు పెట్టేశాయి.ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగమైన భారత ఆటగాళ్లు సైతం ఒక్కొక్కరుగా తాము ప్రాతినిథ్యం వహిస్తున్న జట్లతో చేరుతున్నారు. అయితే ఈ టోర్నీలో భాగమయ్యే పది జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఇంకా తమ కెప్టెన్ వివరాలను వెల్లడించలేదు. గతసీజన్ వరకు తమ జట్టు కెప్టెన్గా వ్యవహరించిన రిషబ్ పంత్ను ఐపీఎల్ మెగా వేలంలోకి ఢిల్లీ విడిచిపెట్టింది. దీంతో ఢిల్లీ కెప్టెన్ ఎంపిక ఇప్పుడు అనివార్యమైంది.నో చెప్పిన రాహుల్..ఈ క్రమంలో ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ.14 కోట్లకు కొనుగోలు చేసిన కేఎల్ రాహుల్కు ఢిల్లీ తమ జట్టు పగ్గాలను అప్పగిస్తుందని అంతాభావించారు. అంతా అనుకున్నట్లే అతడిని కెప్టెన్గా ఎంపికచేసేందుకు ఢిల్లీ యాజమాన్యం ముందుకు వచ్చింది. కానీ రాహుల్ మాత్రం కెప్టెన్సీపై తనకు ఆసక్తి లేదని, కేవలం బ్యాటర్గా మాత్రమే కొనసాగుతానని సున్నితంగా తిరష్కరించినట్లు తెలుస్తోంది. దీంతో భారత స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ బాధ్యతలు చెపడాతడని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.రేసులో డుప్లెసిస్..అయితే ఢిల్లీ కెప్టెన్సీ రేసులో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిట్సల్ మెనెజ్మెంట్ డుప్లెసిస్ను పేరును పరిశీలిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా డుప్లెసిస్కు కెప్టెన్గా చాలా అనుభవం ఉంది. గత మూడు సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్గా డుప్లెసిస్ వ్యవహరించాడు. అతడు కెప్టెన్సీలో ఐపీఎల్-2022,24 సీజన్లలో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ ఆర్హత సాధించింది. డుప్లెసిస్ కెప్టెన్గా కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా ఆకట్టుకున్నాడు. డుప్లెసిస్ పలు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో కూడా వ్యవహరిస్తున్నాడు. దీంతో అతడిని అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తమ జట్టు పగ్గాలను అప్పగించాలని ఢిల్లీ భావిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఢిల్లీ కొత్త కెప్టెన్ ఎవరన్నదానిపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.2025 ఐపీఎల్ సీజన్ కోసం ఢిల్లీ జట్టు..ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, అషుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, దర్శన్ నల్కండే, అజయ్ జాదవ్ మండల్, త్రిపురణ విజయ్, అక్షర్ పటేల్, మన్వంత్ కుమార్, మాధవ్ తివారి, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, డొనొవన్ ఫెరియెరా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, టి నటరాజన్, ముకేశ్ కుమార్చదవండి: Hardik Pandya: ఈ విజయం ఆయనకే అంకితం.. హార్దిక్ పాండ్యా భావోద్వేగం -
వారెవ్వా ఫాఫ్.. 40 ఏళ్ల వయస్సులో అద్భుత విన్యాసం! వీడియో వైరల్
దక్షిణాఫ్రికా టీ20 లీగ్-2025లో జోబర్గ్ సూపర్ కింగ్స్ కథ ముగిసింది. సెంచూరియన్ వేదికగా సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్తో జరిగిన ఎలిమినేటర్లో 32 పరుగుల తేడాతో సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. దీంతో టోర్నీ నుంచి సూపర్ కింగ్స్ ఇంటిముఖం పట్టింది. 185 పరుగుల లక్ష్య చేధనలో జోబర్గ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 152 పరుగులకే పరిమితమైంది. జోబర్గ్ బ్యాటర్లలో జానీ బెయిర్ స్టో(37), డెవాన్ కాన్వే(30) మినహా మిగితా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. సన్రైజర్స్ బౌలర్లలో డాసెన్, ఓవర్టన్, బార్ట్మన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జాన్సెన్ ఓ వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. సన్రైజర్స్ బ్యాటర్లలో కెప్టెన్ మార్క్రమ్(40 బంతుల్లో 62, 5 ఫోర్లు, 2 సిక్స్లు), బెడింగ్హామ్(27), స్టబ్స్(26), జాన్సెన్(23) రాణించారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో తహిర్, విల్జోయెన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.డుప్లెసిస్ స్టన్నింగ్ క్యాచ్..ఇక ఈ మ్యాచ్లో సూపర్ కింగ్స్ ఓటమి పాలైనప్పటికి.. ఆ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(Faf du Plessis) సంచలన క్యాచ్తో అందరిని ఆశ్చర్యపరిచాడు. సన్రైజర్స్ ఇన్నింగ్స్ ఐదవ ఓవర్ వేసిన తహిర్.. తొలి బతిని డేవిడ్ బెడింగ్హామ్కు ఫ్లైట్ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో బెడింగ్హామ్ ఆ బంతిని మిడ్-ఆఫ్ దశగా లాఫ్టెడ్ డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించాడు.షాట్ సరిగ్గా కనక్ట్ అయినప్పటికి మిడ్-ఆఫ్లో ఉన్న 40 ఏళ్ల డుప్లెసిస్ అద్బుత విన్యాసం కనబరిచాడు. ఫాప్ తన ఎడమవైపునకు గాల్లోకి జంప్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్నారు. ఈ క్యాచ్ చూసిన ప్రతీ ఒక్కరూ షాక్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.రాయల్స్తో సన్రైజర్స్ ఢీ..ఇక గురువారం జరగనున్న క్వాలిఫయర్-2లో పార్ల్ రాయల్స్తో సన్రైజర్స్ ఈస్ట్రన్ కేప్ తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి వరుసగా మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టాలని సన్రైజర్స్ భావిస్తోంది. మరోవైపు పార్ల్ రాయల్స్ సైతం ఈ మ్యాచ్లో గెలిచి తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టాలని పట్టుదలతో ఉంది.చదవండి: CT 2025: 'బుమ్రా దూరమైతే అతడికి ఛాన్స్ ఇవ్వండి.. అద్భుతాలు సృష్టిస్తాడు' Absolutely FAF-tastic 🤯 Faf du Plessis continues to defy the laws of physics #BetwaySA20 #SECvJSK #WelcomeToIncredible pic.twitter.com/WAnGnTex5P— Betway SA20 (@SA20_League) February 5, 2025 -
సన్రైజర్స్ ఘన విజయం.. సూపర్ కింగ్స్ ఎలిమినేట్
సౌతాఫ్రికా టీ20 లీగ్లో డిఫెండింగ్ చాంపియన్ సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్(Sunrisers Eastern Cape) మరోసారి టైటిల్ రేసులో నిలిచింది. ఎలిమినేటర్ మ్యాచ్లో జొబర్గ్ సూపర్ కింగ్స్(Joburg Super Kings)ను చిత్తు చేసి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. కాగా 2023లో మొదలైన సౌతాఫ్రికా టీ20 లీగ్(SA20)లో ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్రైజర్స్ హైదరాబాద్కు చెందిన ఈస్టర్న్ కేప్ జట్టు అరంగేట్ర చాంపియన్గా నిలిచింది.గతేడాది కూడా మార్క్రమ్ సారథ్యంలోని ఈ జట్టు విజేతగా అవతరించి వరుసగా రెండోసారి టైటిల్ గెలిచింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా టైటిల్కు గురిపెట్టిన సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఎస్ఏ20- 2025 ఆరంభంలో మాత్రం చేదు అనుభవాలు ఎదుర్కొంది.హ్యాట్రిక్ పరాజయాలుజనవరి 9న లీగ్ తొలి మ్యాచ్లో భాగంగా ముంబై ఇండియన్స్ కేప్టౌన్ చేతిలో 97 పరుగుల తేడాతో సన్రైజర్స్ చిత్తుగా ఓడింది. అనంతరం రాయల్ పర్ల్స్ చేతిలోనూ తొమ్మిది వికెట్ల తేడాతో పరాభవం పాలైంది. ఆ తర్వాత ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయి.. హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసింది.ఆపై విజయాల బాట పట్టిఅయితే, నాలుగో మ్యాచ్లో డర్బన్ సూపర్ జెయింట్స్పై గెలుపొంది విజయాల బాట పట్టిన సన్రైజర్స్.. ఆపై వరుసగా మూడు మ్యాచ్లలో జయభేరి మోగించి ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది. లీగ్ దశలో మొత్తంగా పది మ్యాచ్లో ఐదింట గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన సన్రైజర్స్ ఎలిమినేటర్ మ్యాచ్కు అర్హత సాధించింది.ఇందులో భాగంగా బుధవారం రాత్రి జొబర్గ్ సూపర్ కింగ్స్తో తలపడింది సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు. సెంచూరియన్ వేదికగా సాగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సూపర్ కింగ్స్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 184 పరుగులు చేసింది.మార్క్రమ్ కెప్టెన్ ఇన్నింగ్స్ఓపెనర్లు బెడింగ్హాం(14 బంతుల్లో 27), టోనీ డి జోర్జి(9 బంతుల్లో 14) ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించగా.. జోర్డాన్ హెర్మాన్(16 బంతుల్లో 12), అబెల్(10 బంతుల్లో 10) నిరాశపరిచారు. ఈ క్రమంలో ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. నలభై బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.మిగతా వాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ 21 బంతుల్లో 26 పరుగులు చేయగా.. ఆఖర్లో మార్కో జాన్సెన్ మెరుపు ఇన్నింగ్స్(12 బంతుల్లో 23) ఆడాడు. ఫలితంగా సన్రైజర్స్ మంచి స్కోరు(184-6) నమోదు చేయగలిగింది. జొబర్గ్ సూపర్ కింగ్స్ బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్, విల్జోయెన్ రెండేసి వికెట్లు దక్కించుకోగా.. మహీశ్ తీక్షణ, మొయిన్ అలీ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.సూపర్ కింగ్స్ ఎలిమినేట్ఇక లక్ష్య ఛేదనలో జొబర్గ్ శుభారంభమే అందుకున్నా దానిని కొనసాగించలేకపోయింది. ఓపెనర్లలో డెవాన్ కాన్వే(20 బంతుల్లో 30) రాణించగా.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(18 బంతుల్లో 19) మాత్రం విఫలమయ్యాడు. మిగిలిన ఆటగాళ్లలో జేపీ కింగ్(9), విహాన్ ల్యూబే(13), మొయిన్ అలీ(0), హార్డస్ విల్జోయెన్(14) పూర్తిగా నిరాశపరచగా.. వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్స్టో ధనాధన్ దంచికొట్టాడు.కేవలం 17 బంతుల్లోనే 37 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా ఇవాన్ జోన్స్(17 బంతుల్లో 22నాటౌట్) రాణించాడు. కానీ అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. ఇరవై ఓవర్లు పూర్తయ్యేసరికి ఏడు వికెట్లు నష్టపోయిన జొబర్గ్ సూపర్ కింగ్స్ 152 పరుగులకే పరిమితమైంది. దీంతో 32 పరుగుల తేడాతో గెలుపొందిన సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్.. జొబర్గ్ను ఎలిమినేట్ చేసి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.క్వాలిఫయర్-2లో పర్ల్ రాయల్స్తో ఢీసన్రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక తదుపరి గురువారం నాటి క్వాలిఫయర్-2 మ్యాచ్లో సన్రైజర్స్ పర్ల్ రాయల్స్ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు శనివారం జరిగే ఫైనల్లో ముంబై ఇండియన్స్ కేప్టౌన్తో టైటిల్ కోసం తలపడుతుంది.చదవండి: ఇదేం పద్ధతి?: రోహిత్ శర్మ ఆగ్రహం -
కాన్వే మెరుపు ఇన్నింగ్స్.. సన్రైజర్స్కు ‘బోనస్’ షాక్!
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025(SA20- 2025) ఎడిషన్ తుది అంకానికి చేరుకుంటోంది. ఇప్పటికే పర్ల్ రాయల్స్(Parl Royals) ప్లే ఆఫ్స్నకు అర్హత సాధించగా.. మిగిలిన మూడు స్థానాల కోసం నాలుగు జట్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇలాంటి తరుణంలో సన్రైజర్స్ ఈస్టర్న్కేప్(Sunrisers Eastern Cape) జట్టుకు జొబర్గ్ సూపర్ కింగ్స్ భారీ షాకిచ్చింది.సన్రైజర్స్ వరుస విజయాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు.. ‘బోనస్’ పాయింట్(Win With Bonus Point)తో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ప్లే ఆఫ్స్ రేసులోనూ రైజర్స్తో పోటీకి సై అంటోంది. కాగా గ్వెబెర్హా వేదికగా జనవరి 9న సౌతాఫ్రికా టీ20 లీగ్ మూడో సీజన్ ఆరంభమైంది. తొలి మ్యాచ్లో పర్ల్ రాయల్స్తో తలపడ్డ.. డిఫెండింగ్ చాంపియన్ సన్రైజర్స్ ఓటమితో ప్రయాణాన్ని ఆరంభించింది.వరుసగా నాలుగు విజయాలుఅనంతరం.. ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలోనూ ఓడిన మార్క్రమ్ బృందం.. తర్వాత వరుసగా నాలుగు విజయాలు సాధించింది. డర్బన్ సూపర్ జెయింట్స్ను వరుసగా రెండు మ్యాచ్లలో చిత్తు చేయడంతో పాటు.. ప్రిటోరియా క్యాపిటల్స, జొబర్గ్ సూపర్ కింగ్స్పై గెలుపొందింది.ఈసారి మాత్రం ఘోర పరాజయంఇక ఆదివారం నాటి మ్యాచ్లో జొబర్గ్ జట్టుతోనే తలపడిన సన్రైజర్స్ ఈసారి మాత్రం ఘోర పరాజయం పాలైంది. జొహన్నస్బర్గ్ వేదికగా టాస్ గెలిచిన సన్రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, జొబర్గ్ బౌలర్ల ధాటికి 118 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ బెడింగ్హాం(40 బంతుల్లో 48), వికెట్ కీపర్ ట్రిస్టన్ స్టబ్స్(37), మార్కో జాన్సెన్(22) మాత్రమే రాణించారు.మిగతా వాళ్లలో ఓపెనర్ జాక్ క్రాలే, అబెల్, జోర్డాన్ హెర్మాన్, కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్, బేయర్స్ స్వానెపోయెల్ డకౌట్ కాగా.. లియామ్ డాసన్, ఒట్నీల్ బార్ట్మన్, రిచర్డ్ గ్లెసాన్(1*) ఒక్కో పరుగు మాత్రమే చేశారు. ఇక జొబర్గ్ బౌలర్లలో విల్జోన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. సిపామ్ల మూడు వికెట్లు, ఇమ్రాన్ తాహిర్, మతీశ పతిరణ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.What a start for the Joburg Super Kings 🏎️#BetwaySA20 #JSKvSEC #WelcomeToIncredible pic.twitter.com/jQhU4dIW85— Betway SA20 (@SA20_League) January 26, 2025 డెవాన్ కాన్వే మెరుపు ఇన్నింగ్స్ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జొబర్గ్ సూపర్ కింగ్స్ ఆదిలోనే కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(15) వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ డెవాన్ కాన్వే ధనాధన్ దంచికొట్టాడు. 56 బంతుల్లో పదకొండు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా వన్డౌన్ బ్యాటర్ విహాన్ లూబే(17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ , 25 రన్స్) మెరుపు ఇన్నింగ్స్తో రాణించాడు.ఫలితంగా మరో 36 బంతులు మిగిలి ఉండగానే జొబర్గ్ సూపర్ కింగ్స్ లక్ష్యాన్ని ఛేదించింది. తొమ్మిది వికెట్ల తేడాతో సన్రైజర్స్పై గెలుపొంది.. అదనపు పాయింట్ను కూడా ఖాతాలో వేసుకుంది. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఆరు జట్లు లీగ్ దశలో పదేసి మ్యాచ్లు ఆడతాయి. పాయింట్ల కేటాయింపు ఇలామ్యాచ్ గెలిస్తే నాలుగు పాయింట్లు, ఫలితం తేలకపోతే రెండు పాయింట్లు వస్తాయి. ఓడితే పాయింట్లేమీ రావు. ఇక గెలిచిన- ఓడిన జట్టు మధ్య రన్రేటు పరంగా 1.25 రెట్ల తేడా ఉంటే.. నాలుగు పాయింట్లకు అదనంగా మరో బోనస్ పాయింట్ కూడా వస్తుంది.జొబర్గ్ సూపర్ కింగ్స్ ఈ నిబంధన ప్రకారమే తాజాగా బోనస్ పాయింట్ సాధించి.. ఓవరాల్గా 15 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానానికి దూసుకువచ్చింది. కాగా పర్ల్ రాయల్స్ ఇప్పటికి ఏడు మ్యాచ్లు పూర్తి చేసుకుని ఆరు విజయాలతో 24 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది.మరోవైపు.. ఎంఐ కేప్టౌన్ ఏడింట నాలుగు(21 పాయింట్లు), సన్రైజర్స్ ఎనిమిదింట నాలుగు(19 పాయింట్ల) విజయాలతో పట్టికలో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. జొబర్గ్ ఏడింట మూడు గెలిచి నాలుగో స్థానంలో.. ప్రిటోరియా క్యాపిటల్స్ ఏడింట కేవలం ఒక్కటి గెలిచి ఐదు, డర్బన్ సూపర్ జెయింట్స్ ఎనిమిదింట ఒక్క విజయంతో అట్టడుగున ఆరో స్థానంలో ఉన్నాయి. చదవండి: చరిత్ర సృష్టించిన హసరంగ.. ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ -
చరిత్ర సృష్టించిన డేవిడ్ మిల్లర్
సౌతాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో 11000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి సౌతాఫ్రికా ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో భాగంగా ప్రిటోరియా క్యాపిటల్స్తో నిన్న (జనవరి 18) జరిగిన మ్యాచ్లో మిల్లర్ ఈ మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్లో మిల్లర్ రికార్డు లక్ష్య ఛేదనలో 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 48 పరుగులు చేశాడు. మిల్లర్ తన ఓవరాల్ టీ20 కెరీర్లో 468 ఇన్నింగ్స్లు ఆడి 11,046 పరుగులు చేశాడు.మిల్లర్ 11000 టీ20 రన్స్ క్లబ్లో చేరిన గంటల వ్యవధిలోనే మరో సౌతాఫ్రికన్ ఈ క్లబ్లో చేరాడు. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా సౌతాఫ్రికా టీ20 లీగ్లోనే 11000 పరుగుల మార్కును తాకాడు. ఈ లీగ్లో భాగంగా ఎంఐ కేప్టౌన్తో జరిగిన మ్యాచ్లో డుప్లెసిస్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. డుప్లెసిస్ 376 ఇన్నింగ్స్ల తన టీ20 కెరీర్లో 11,042 పరుగులు చేశాడు.టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన సౌతాఫ్రికా ఆటగాళ్లు..డేవిడ్ మిల్లర్-11046డుప్లెసిస్-11042డికాక్-10620ఏబీ డివిలియర్స్-9424రిలీ రొస్సో-9067నిన్న జరిగిన మ్యాచ్ల విషయానికొస్తే.. ప్రిటోరియా క్యాపిటల్స్పై పార్ల్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. విల్ స్మీడ్ (34 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటగా.. రహ్మానుల్లా గుర్భాజ్ (29 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కైల్ వెర్రిన్ (23 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఓ మోస్తరు ఇన్నింగ్స్లతో రాణించారు. ఆఖర్లో జేమ్స్ నీషమ్ (13 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. క్యాపిటల్స్ ఆటగాళ్లలో విల్ జాక్స్ 2, రిలీ రొస్సో 14 పరుగులు చేసి ఔటయ్యారు.213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ 19.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఇన్నింగ్స్ తొలి బంతికే ఇన్ఫామ్ బ్యాటర్ డ్రి ప్రిటోరియన్ డకౌట్ కాగా.. జో రూట్ (60 బంతుల్లో 92 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), రూబిన్ హెర్మన్ (33 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (24 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్లతో తమ జట్టును గెలిపించారు. సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఇదే రికార్డు లక్ష్య ఛేదన.మరో మ్యాచ్లో జోబర్గ్ సూపర్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ కేప్టౌన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే (31 బంతుల్లో 35; 4 ఫోర్లు), ఫాఫ్ డుప్లెసిస్ (38 బంతుల్లో 61; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), వికెట్ కీపర్ జానీ బెయిర్స్టో (27 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు.ఛేదనలో ర్యాన్ రికెల్టన్ (39 బంతుల్లో 89; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో ఎంఐ కేప్టౌన్ 15.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. రస్సీ వాన్ డర్ డస్సెన్ (24 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్), రీజా హెండ్రిక్స్ (28 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. -
నవశకం.. కొత్త కెప్టెన్ అతడే!.. ఆర్సీబీ హెడ్కోచ్ వ్యాఖ్యలు వైరల్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ).. మూడుసార్లు ఫైనల్ చేరినా ఒక్కసారి కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టైటిల్ గెలవలేకపోయింది. ప్రత్యర్థి జట్ల ఎత్తులకు చిత్తై.. ఆఖరి మెట్టుపై బోల్తా పడి ట్రోఫీని చేజార్చుకుంది. దీంతో.. ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచే టీమిండియా సూపర్స్టార్ విరాట్ కోహ్లి(Virat Kohli) కెరీర్లో ఐపీఎల్ టైటిల్ లేని లోటు ఇప్పటికీ అలాగే ఉండిపోయింది.ఆర్సీబీ ముఖచిత్రంగా కోహ్లిఅయితే, ఈసారి మాత్రం ఆర్సీబీ తలరాత మారుతుందంటున్నాడు ఆ జట్టు హెడ్కోచ్ ఆండీ ఫ్లవర్(Andy Flower). అదే విధంగా కొత్త కెప్టెన్ గురంచి కూడా సంకేతాలు ఇచ్చాడు. కాగా ఆర్సీబీకి భారీ ఫాలోయింగ్ రావడానికి ప్రధాన కారణం కోహ్లినే అనడంలో సందేహం లేదు. తన ఇమేజీ ద్వారా ఆర్సీబీ ముఖచిత్రంగా మారిపోయిన ఈ రన్మెషీన్.. 2011లో తొలిసారి కెప్టెన్గా పగ్గాలు చేపట్టాడు.ఆ తర్వాత రెండేళ్లకు పూర్తిస్థాయి కెప్టెన్గా నియమితుడైన కోహ్లి.. 2016లో జట్టును ఫైనల్స్కు చేర్చాడు. కానీ తుదిపోరులో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఆర్సీబీ ఓడిపోయి.. రిక్తహస్తాలతో వెనుదిరిగింది. ఆ తర్వాత కూడా చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ భారాన్ని, పని ఒత్తిడిని తగ్గించుకునే క్రమంలో 2021లో సారథ్య బాధ్యతల నుంచి కోహ్లి వైదొలిగాడు.డుప్లెసిస్ సారథ్యంలోఈ క్రమంలో సౌతాఫ్రికా వెటరన్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్(Faf Du Plesis) ఆర్సీబీ కెప్టెన్గా నియమితుడయ్యాడు. 2024 వరకు నాయకుడిగా జట్టును ముందుండి నడిపించాడు. అయితే, మెగా వేలానికి ముందు ఆర్సీబీ డుప్లెసిస్ను వదిలేసింది. ఆక్షన్ సమయంలోనే అతడిని కొనేందుకు ఆసక్తి చూపలేదు.ఈ నేపథ్యంలో ఆర్సీబీకి ఐపీఎల్-2025లో కొత్త కెప్టెన్ రావడం ఖాయమైంది. అతడు మరెవరో కాదు.. కోహ్లినే అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై స్పోర్ట్స్తక్తో మాట్లాడిన ఆండీ ఫ్లవర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.నవశకం ఆరంభం‘‘నవశకం ఆరంభం కాబోతోంది. మూడేళ్ల సైకిల్లో ఊహించిన ఫలితాన్ని రాబట్టబోతున్నాం. అందరూ అనుకున్నదే నిజమయ్యే అవకాశం ఉంది. అయితే, ఇప్పటి వరకు అందుకు సంబంధించిన చర్చ జరుగలేదని మాత్రం చెప్పగలను’’ అని ఆండీ ఫ్లవర్ పేర్కొన్నాడు. అదే సమయంలో.. కోహ్లికే మరోసారి పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని ఆండీ ఫ్లవర్ సంకేతాలు ఇచ్చాడు. మరోవైపు.. ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మొ బొబాట్ సైతం కెప్టెన్సీ అంశం గురించి ఇంకా చర్చించలేదని చెప్పినా.. పరోక్షంగా కోహ్లి వైపే తాము మొగ్గుచూపే ఛాన్స్ ఉందని తెలియజేశాడు.తిరుగులేని కింగ్కాగా ఐపీఎల్ కెరీర్లో ఇప్పటి వరకు 252 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లి 8004 పరుగులు సాధించాడు. ఇందులో ఎనిమిది శతకాలతో పాటు.. 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా 705 ఫోర్లు, 272 సిక్సర్లు ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఖాతాలో ఉన్నాయి. రైటార్మ్ మీడియం పేసర్ అయిన కోహ్లి ఐపీఎల్లో నాలుగు వికెట్లు కూడా తీయడం విశేషం. మూడేళ్ల షెడ్యూల్ ఇదేఇదిలా ఉంటే.. గతేడాది ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీ.. ఫైనల్లో మాత్రం అడుగుపెట్టలేకపోయింది. ఎలిమినేటర్ మ్యాచ్లోనే ఇంటిబాట పట్టింది. ఇక బీసీసీఐ ఇప్పటికే మూడేళ్ల ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్-2025.. మార్చి 14- మే 25 వరకు.. ఐపీఎల్-2026.. మార్చి 15- మే 31 వరకు.. ఐపీఎల్- 2027.. మార్చి 14- మే 30 వరకు నిర్వహించనున్నారు. చదవండి: 'డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి'.. భజ్జీ పోస్ట్ వైరల్ -
కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్న డుప్లెసిస్.. వీడియో
అబుదాబీ టీ10 లీగ్లో భాగంగా ఢిల్లీ బుల్స్తో జరుగుతున్న క్వాలిఫయర్-2 మ్యాచ్లో మోరిస్విల్లే సాంప్ ఆర్మీ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. అమీర్ హంజా బౌలింగ్లో షాదాబ్ ఖాన్ కొట్టిన బంతిని డుప్లెసిస్ ఒంటిచేత్తో అద్భుతమైన క్యాచ్గా మలిచాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఇది జరిగింది. ఈ ఓవర్లో డుప్లెసిస్ రెండు క్యాచ్లు పట్టాడు. షాదాబ్ ఖాన్ క్యాచ్కు ముందు డుప్లెసిస్ టామ్ బాంటన్ క్యాచ్ కూడా పట్టుకున్నాడు.WHAT A STUNNER FROM 40-YEAR-OLD FAF DU PLESSIS IN T10 LEAGUE 🤯 pic.twitter.com/LV9KLNHuPt— Johns. (@CricCrazyJohns) December 2, 2024ఈ మ్యాచ్లో డుప్లెసిస్ మొత్తంగా మూడు క్యాచ్లు పట్టాడు. ఇన్నింగ్స్లో ఏడో ఓవర్లో మరో సూపర్ క్యాచ్తో డుప్లెసిస్ రోవ్మన్ పావెల్ను పెవిలియన్కు పంపాడు. 40 ఏళ్ల వయసులోనూ డుప్లెసిస్ మైదానంలో పాదరసంలా కదలడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బుల్స్ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 89 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇసురు ఉడాన 3, అమీర్ హంజా 2, కరీం జనత్, ఇమాద్ వసీం తలో వికెట్ పడగొట్టి ఢిల్లీ బుల్స్ను కట్టడి చేశారు. ఢిల్లీ బుల్స్ ఇన్నింగ్స్లో టిమ్ డేవిడ్ (24) టాప్ స్కోరర్గా నిలువగా.. నిఖిల్ చౌదరీ (16), రోవ్మన్ పావెల్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్కు చేరుతుంది. -
మెగా వేలానికి ముందు విధ్వంసం సృష్టించిన డుప్లెసిస్
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఆర్సీబీ మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ విధ్వంసం సృష్టించాడు. అబుదాబీ టీ10 లీగ్లో భాగంగా చెన్నై బ్రేవ్ జాగ్వర్స్తో జరిగిన మ్యాచ్లో ఫాఫ్ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో ఫాఫ్ 26 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 76 పరుగులు చేశాడు. ఫలితంగా ఫాఫ్ ప్రాతినిథ్యం వహిస్తున్న మోరిస్విల్లే సాంప్ ఆర్మీ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై బ్రేవ్ నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. డాన్ లారెన్స్ 25 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేశాడు. చెన్నై బ్రేవ్ ఇన్నింగ్స్లో వాన్ డర్ డస్సెన్ 3, జోష్ బ్రౌన్ 13, భానుక రాజపక్ష 18, తిసార పెరీరా 8, క్రిస్ లిన్ 3, కోబ్ హెర్ఫ్ట్ 1 పరుగు చేశారు. సాంప్ ఆర్మీ బౌలర్లలో ఇమాద్ వసీం, ఆమిర్ హమ్జా, ఉడాన, కరీమ్ జనత్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 105 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సాంప్ ఆర్మీ.. ఫాఫ్ చెలరేగిపోవడంతో మరో 18 బంతులు మిగిలుండగానే (వికెట్ కోల్పోయి) విజయతీరాలకు చేరింది. సాంప్ ఆర్మీ ఇన్నింగ్స్లో షర్జీల్ ఖాన్ 8, చరిత్ అసలంక 17 పరుగులు చేశారు. చెన్నై బ్రేవ్ బౌలర్లలో ఒషేన్ థామస్కు ఓ వికెట్ దక్కింది. కాగా, ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఫాఫ్ డుప్లెసిస్ ఇవాళ (నవంబర్ 25) ఆక్షన్కు రానున్నాడు. ఫాఫ్ 2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. తాజా ఇన్నింగ్స్ నేపథ్యంలో ఫాఫ్ వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది. ఫాఫ్ కోసం ఆర్సీబీ, చెన్నై పోటీ పడవచ్చు. -
రాణించిన డుప్లెసిస్, ఛార్లెస్.. సీపీఎల్ ఫైనల్లో లూసియా కింగ్స్
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ చివరి అంకానికి చేరుకుంది. సెయింట్ లూసియా కింగ్స్ ఫైనల్స్కు చేరింది. ఇవాళ (అక్టోబర్ 3) జరిగిన క్వాలిఫయర్-1లో లూసియా కింగ్స్ గయానా అమెజాన్ వారియర్స్పై 15 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతిన) గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లూసియా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అమెజాన్ వారియర్స్కు వరుణుడు ఆడ్డు తగిలాడు. వారియర్స్ ఇన్నింగ్స్ 13 ఓవర్ల వరకు సజావుగా సాగింది. ఈ దశలో వర్షం మొదలై మ్యాచ్కు అంతరాయం కలిగించింది. వర్షం ఎంతకీ ఆగకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిన లూసియా కింగ్స్ను విజేతగా ప్రకటించారు. వర్షం ప్రారంభమయ్యే సమయానికి అమెజాన్ వారియర్స్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 106 పరుగులుగా ఉంది. ఈ మ్యాచ్లో గెలుపుతో లూసియా కింగ్స్ నేరుగా ఫైనల్కు చేరుకుంది. అమెజాన్ వారియర్స్ బార్బడోస్ రాయల్స్తో క్వాలిఫయర్-2 ఆడనుంది. అక్టోబర్ 5న జరిగే క్వాలిఫయర్-2లో గెలిచే జట్టు అక్టోబర్ 7న జరిగే ఫైనల్లో లూసియా కింగ్స్తో తలపడుతుంది.రాణించిన డుప్లెసిస్, జాన్సన్ ఛార్లెస్అమెజాన్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో ఫాఫ్ డుప్లెసిస్ (57), జాన్సన్ ఛార్లెస్ (79) అర్ద సెంచరీలతో రాణించారు. వీరిద్దరు మినహా లూసియా ఇన్నింగ్స్లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. రోస్టన్ ఛేజ్, టిమ్ సీఫర్ట్ తలో 18 పరుగులు, డేవిడ్ వీస్ 13, మాథ్యూ ఫోర్డ్ 0, జెర్మియా 1 పరుగు చేశారు. వారియర్స్ బౌలర్లలో మొయిన్ అలీ, ప్రిటోరియస్ తలో రెండు, షమార్ జోసఫ్ ఓ వికెట్ తీశారు.లక్ష్య ఛేదనలో అమెజాన్ వారియర్స్ కూడా ధాటిగానే ఇన్నింగ్స్ ప్రారంభించింది. రహ్మానుల్లా గుర్బాజ్ 24, కీమో పాల్ 14, షాయ్ హోప్ 27, ప్రిటోరియస్ 2 పరుగులు చేసి ఔట్ కాగా.. హెట్మైర్ 37, మొయిన్ అలీ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచారు. లూసియా కింగ్స్ బౌలర్లలో అల్జరీ జోసఫ్, డేవిడ్ వీస్, ఛేజ్, నూర్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.చదవండి: Irani Cup 2024: సెంచరీతో కదంతొక్కిన అభిమన్యు ఈశ్వరన్ -
రాణించిన హోప్, హెట్మైర్.. సరిపోని డుప్లెసిస్ మెరుపులు
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ చివరి దశకు చేరుకుంది. లీగ్ దశలో మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ మ్యాచ్ తర్వాత ప్లే ఆఫ్స్ మొదలవుతాయి. ప్లే ఆఫ్స్ నాలుగు బెర్త్లు ఇదివరకే ఖరారైపోయినప్పటికీ.. ఏ జట్టు ఏ స్థానంలో ఉంటున్నది రేపటి మ్యాచ్తో తేలనుంది.లీగ్లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 28) గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ లూసియా కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో అమెజాన్ వారియర్స్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది.రాణించిన హోప్, హోట్మైర్ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్.. షాయ్ హోప్ (31 బంతుల్లో 56; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), షిమ్రోన్ హెట్మైర్ (30 బంతుల్లో 58; 9 ఫోర్లు, సిక్స్) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్ (26), ఆజమ్ ఖాన్ (26), రొమారియో షెపర్డ్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లూసియా కింగ్స్ బౌలర్లలో డేవిడ్ వీస్ 3 వికెట్లు పడగొట్టగా.. నూర్ అహ్మద్, అల్జరీ జోసఫ్ తలో 2 వికెట్లు దక్కించుకున్నారు.సరిపోని డుప్లెసిస్ మెరుపులుఅనంతరం 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లూసియా కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమతమైంది. డుప్లెసిస్ (59 బంతుల్లో 92 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) లూసియా కింగ్స్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. అతనికి అల్జరీ జోసఫ్ (21 బంతుల్లో 25 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) తోడుగా నిలిచాడు. లక్ష్యం పెద్దది కావడంతో లూసియా కింగ్స్ గమ్యాన్ని చేరుకోలేకపోయింది. డుప్లెసిస్ మెరుపులు సరిపోలేదు. వారియర్స్ బౌలర్లలో మోటీ, మొయిన్, తాహిర్ తలో రెండు వికెట్లు తీసి లూసియా కింగ్స్ను దెబ్బకొట్టారు.చదవండి: NZ Vs SL 2nd Test: న్యూజిలాండ్ను చిత్తు చేసిన శ్రీలంక.. -
డుప్లెసిస్ 74వ హాఫ్ సెంచరీ
టీ20 క్రికెట్లో దక్షిణాఫ్రికా ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ 74వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా ట్రిన్బాగో అండ్ నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఫాఫ్ ఈ ఫీట్ను సాధించాడు. సెంచరీలతో (6) కలుపుకుని ఫాఫ్ తన కెరీర్లో మొత్తం 80 సార్లు 50 పరుగుల మార్కును దాటాడు.పొట్టి క్రికెట్ చరిత్రలో కేవలం పది మంది (ఫాఫ్తో సహా) మాత్రమే ఈ ఘనత సాధించారు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ టాప్లో (112) ఉండగా.. క్రిస్ గేల్ (110), విరాట్ కోహ్లి (106), బాబర్ ఆజమ్ (101), జోస్ బట్లర్ (90), అలెక్స్ హేల్స్ (88), రోహిత్ శర్మ (86), ఆరోన్ ఫించ్ (85), షోయబ్ మాలిక్ (83), ఫాఫ్ డెప్లెసిస్ (80) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు.ట్రిన్బాగో అండ్ నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్ (43 బంతుల్లో 59), జాన్సన్ ఛార్లెస్ (40 బంతుల్లో 89) అర్ద సెంచరీలతో రాణించారు. కీరన్ పోలార్డ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నైట్రైడర్స్ 17.5 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు మాత్రమే చేసింది. డ్వేన్ బ్రావో (0) రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. నూర్ అహ్మద్ (3/39), డేవిడ్ వీస్ (2/27) నైట్రైడర్స్ పతనాన్ని శాశించగా.. పియెర్రి, అల్జరీ జోసఫ్, రోస్టన్ ఛేజ్, సడ్రక్ డెస్కార్టే తలో వికెట్ పడగొట్టారు. నైట్రైడర్స్ ఇన్నింగ్స్లో హేమాహేమీ హిట్టర్లు ఉన్నా జేసన్ రాయ్ ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ (41) చేశాడు. చదవండి: న్యూజిలాండ్తో రెండో టెస్ట్.. శ్రీలంక తుది జట్టు ప్రకటన -
డుప్లెసిస్ ఊచకోత.. కేవలం 31 బంతుల్లోనే! వీడియో
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024లో సెయింట్ లూసియా కింగ్స్ తమ మూడో విజయాన్ని నమోదు చేసింది. గ్రాస్ ఐలెట్ వేదికగా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. సెయింట్ కిట్స్ బ్యాటర్లలో ఆండ్రీ ఫ్లెచర్(62), రూసో హాఫ్ సెంచరీలతో మెరిశారు. సెయింట్ లూసియా బౌలర్లలో ఆల్జారీ జోషఫ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఛేజ్, వీస్, సద్రక్ తలా వికెట్ సాధించారు.డుప్లెసిస్ ఊచకోత..అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని సెయింట్ లూసియా కింగ్స్ 16.3 ఓవర్లలో కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది. లక్ష్య చేధనలో ఓపెనర్లు ఫాప్ డుప్లెసిస్, జాన్సెన్ చార్లెస్ విధ్వంసం సృష్టించారు. ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశారు. చార్లెస్ 42 బంతుల్లో 4ఫోర్లు, 7 సిక్స్లతో 74 పరుగులు చేయగా.. డుప్లెసిస్ 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 62 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రత్యర్ధి జట్టు బౌలర్లలో హసరంగా,క్లార్క్సన్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా డుప్లెసిస్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక పాయింట్ల పట్టిక విషయానికి వస్తే.. గయానా ఆమెజాన్ వారియర్స్ తొలి స్ధానంలో ఉండగా.. సెయింట్ లూసియా మూడో స్ధానంలో కొనసాగుతోంది. చదవండి: అంతా అనుకున్నట్టే జరిగింది.. న్యూజిలాండ్- అఫ్గాన్ టెస్టు రద్దు pic.twitter.com/ex0bSYNHN4— Cricket Cricket (@cricket543210) September 13, 2024 -
డుప్లెసిస్పై వేటు..? ఆర్సీబీ కెప్టెన్గా ఊహించని ఆటగాడు!
ఐపీఎల్-2024 సీజన్కు ముందు అన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రిటైన్ జాబితాను సిద్దం చేసే పనిలో పడ్డాయి. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నుంచి ఇంకా రిటెన్షన్ పక్రియకు సంబంధించి ఎటువంటి గైడ్లైన్స్ రానిప్పటకి.. ఆయా జట్లు మాత్రం ఇప్పటినుంచే తమ ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాయి. మెగా వేలంకు ముందు ఎవరనీ విడిచిపెట్టాలి, ఎవరిని రిటైన్ చేసుకోవాలి అన్న ఆంశాలపై ఫ్రాంచైజీలు ఓ నిర్ణయంకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పలు సంచలన నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్పై వేటు వేయాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.డుప్లెసిస్తో పాటు ఆసీస్ విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ను సైతం వేలంలోకి విడిచిపెట్టాలని ఆర్సీబీ నిర్ణయించుకున్నట్లు వినికిడి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పాటు రజత్ పటిదార్, ఇంగ్లండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ను రిటైన్ చేసుకోవాలని యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆర్సీబీ కెప్టెన్గా రజత్ పాటిదార్ను నియమించే ఆలోచనలో ఆర్సీబీ యాజమాన్యం ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చనడుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో పాటిదార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఫస్ట్ హాఫ్లో నిరాశపరిచిన పాటిదార్.. సెకెండ్ హాఫ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 15 మ్యాచ్లు ఆడి 398 పరుగులు చేశాడు.గ్రీన్కు గుడ్ బై.. ?అదే విధంగా 2024 మినీ వేలం లో రూ.11 కోట్ల రూపాయలకు దక్కించుకున్న అల్జారీ జోసెఫ్ తో పాటు ట్రేడింగ్ ద్వారా రూ. 17 కోట్లకు దక్కించుకున్న ఆసీస్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ సైతం వేలంలోకి వచ్చే అవకాశముంది.ఐపీఎల్-2024లో పర్వాలేదన్పించిన ఆర్సీబీ.. లిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. 2024 ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆఫ్ కు అర్హత సాధించిన ఆర్సీబీ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. -
IPL 2025: ఈ ముగ్గురు కెప్టెన్లను రిలీజ్ చేయనున్న ఫ్రాంఛైజీలు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం-2025 నేపథ్యంలో ఆటగాళ్ల రిటెన్షన్ అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. పది జట్ల ఫ్రాంఛైజీలు- భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారుల మధ్య జూలై 31 నాటి సమావేశంలో ఈ విషయమై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఫ్రాంఛైజీ యజమానుల్లో అధికులు ఆరుగురు క్రికెటర్లను రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరగా.. బీసీసీఐ ఇందుకు సానుకూలంగా స్పందించిందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడు ఫ్రాంఛైజీలు మాత్రం తమ కెప్టెన్లను విడిచిపెట్టి.. వారి స్థానంలో కొత్త వారిని నియమించుకోవాలనే యోచనలో ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది.ఆర్సీబీఐపీఎల్-2025 నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తమ సారథిని మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం. వేలానికి ముందు ఫాఫ్ డుప్లెసిస్ను విడిచిపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 36 ఏళ్ల డుప్లెసిస్ ఐపీఎల్-2024లో 438 పరుగులు చేయడంతో పాటు.. జట్టును ప్లే ఆఫ్స్ వరకు చేర్చగలిగాడు.అయితే, డుప్లెసిస్ వయసు రీత్యా కెప్టెన్గా అతడిని కొనసాగించేందుకు విముఖంగా ఉన్నట్లు సమాచారం. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని.. యువ టీమిండియా ఆటగాడిని సారథిగా నియమించుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.పంజాబ్ కింగ్స్ఐపీఎల్ టాప్ రన్ స్కోర్లలో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఒకడు. అయితే, పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా ఉన్న అతడు గత కొంతకాలంగా ఫామ్లేమితో సతమతమవుతున్నాడు. అంతేకాదు.. ఐపీఎల్-2024లో ఆరంభ మ్యాచ్ల తర్వాత గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యాడు.ధావన్ స్థానంలో ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కర్రన్ పంజాబ్ కింగ్స్ను ముందుకు నడిపించాడు. అయితే, ప్లే ఆఫ్స్మాత్రం చేర్చలేకపోయాడు. ఇక ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ సాధించని జట్లలో పంజాబ్ కూడా ఉందన్న విషయం తెలిసిందే.ఇందుకు ప్రధాన కారణం సరైన నాయకుడు లేకపోవడమే. ఇక ధావన్ ఇప్పటికే జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. అంతేకాదు దేశవాళీ క్రికెట్లోనూ ఆడటం లేదు. అలాంటి ఆటగాడిని సారథిగా కొనసాగించడంలో అర్థం లేదని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 38 ఏళ్ల ధావన్ను కెప్టెన్గా తప్పించి.. అతడి స్థానంలో యువ నాయకుడిని ఎంపిక చేసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.లక్నో సూపర్ జెయింట్స్ఐపీఎల్లో 2022లో అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్కు మూడేళ్లుగా టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. 2022, 2023 సీజన్లలో లక్నోను టాప్-4లో నిలబెట్టిన రాహుల్.. 2024లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆటగాడినూ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. పద్నాలుగు మ్యాచ్లలో కలిపి 520 పరుగులు చేసినప్పటికీ.. స్ట్రైక్రేటు(136.12) పరంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ సందర్భంగా ఓనర్ సంజీవ్ గోయెంకా రాహుల్పై బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అంతా బాగానే ఉందని సంజీవ్ గోయెంకా సంకేతాలు ఇచ్చినా.. రాహుల్ మాత్రం బాగా హర్టయినట్లు సమాచారం. జట్టును వీడాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఫ్రాంఛైజీ సైతం రాహుల్ను రిలీజ్ చేసేందుకు సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: IPL 2025: గుజరాత్ టైటాన్స్ కీలక నిర్ణయం.. ఆశిష్ నెహ్రాపై వేటు! -
రాణించిన కాన్వే.. సూపర్ కింగ్స్ను గెలిపించిన డుప్లెసిస్
మేజర్ లీగ్ క్రికెట్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ భీకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్తో ఇవాళ (జులై 25) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఫాఫ్ మరో అర్ద సెంచరీ బాదాడు. ఫలితంగా సూపర్ కింగ్స్ 9 వికెట్ల తేడాతో ఎంఐ న్యూయార్క్పై ఘన విజయం సాధించింది.FAF DU PLESSIS - THE LEGEND OF THE SUPER KINGS FAMILY. ⭐- 72 (47) with 6 fours and 3 sixes in the Eliminator against MI New York in the MLC. The captain at the age of 40 keeps getting better. 👌pic.twitter.com/GrURm0QS7U— Mufaddal Vohra (@mufaddal_vohra) July 25, 2024రషీద్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ.. రషీద్ ఖాన్ (30 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఎంఐ ఇన్నింగ్స్లో రషీద్తో పాటు మెనాంక్ పటేల్ (48), షయాన్ జహంగీర్ (26) మాత్రమే రాణించారు. సూపర్కింగ్స్ బౌలర్లలో స్టోయినిస్, ఆరోన్ హార్డీ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. జియా ఉల్ హక్, నూర్ అహ్మద్, బ్రావో తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్ కింగ్స్.. ఓపెనర్లు డుప్లెసిస్ (72), డెవాన్ కాన్వే (43 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), సత్తా చాటడంతో అలవోకగా (18.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) విజయం సాధించింది. బంతితో రాణించిన ఆరోన్ హార్డీ బ్యాట్తోనూ (22 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటాడు. ఈ మ్యాచ్లో గెలుపుతో సూపర్ కింగ్స్ ఛాలెంజర్ మ్యాచ్కు అర్హత సాధించగా.. ముంబై ఇండియన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. రేపు జరుగబోయే క్వాలిఫయర్ మ్యాచ్లో వాషింగ్టన్ ఫ్రీడం, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ పోటీపడతాయి. ఈ మ్యాచ్లో ఓడిన జట్టుతో సూపర్ కింగ్స్ ఛాలెంజర్ మ్యాచ్ ఆడతుంది. క్వాలిఫయర్ విజేత, ఛాలెంజర్ గేమ్ విజేత జులై 28న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.ఎంఎల్సీ 2024లో డుప్లెసిస్ స్కోర్లు..14(14), 100(58), 34(17), 61(38), 55(32), 39(17), 72(47)7 ఇన్నింగ్స్ల్లో 168.16 స్ట్రయిక్రేట్తో 53.57 సగటున సెంచరీ, 3 అర్ద సెంచరీల సాయంతో 375 పరుగులు. -
IPL 2025: డుప్లెసిస్కు షాక్.. ఆర్సీబీ కెప్టెన్గా కేఎల్ రాహుల్!?
ఐపీఎల్-2025 సీజన్కు పలు ఫ్రాంచైజీలు భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి లక్నో సూపర్ జెయింట్స్. వచ్చే ఏడాది సీజన్కు ముందు తమ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ను విడిచిపెట్టాలని లక్నో ఫ్రాంచైజీ యాజమాన్యం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దైనిక్ జాగరణ్ రిపోర్ట్ ప్రకారం.. కేఎల్ రాహుల్, లక్నో మేనేజ్మెంట్ మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అతడిని లక్నో విడిచిపెట్టాలని భావిస్తున్నట్లు సదరు పత్రిక పేర్కొంది. రాహుల్ కూడా లక్నో మేనేజ్మెంట్ పైన ఆంసతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ ఏడాది సీజన్లో ఎల్ఎస్జి యజమాని సంజీవ్ గోయెంకా, రాహుల్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు పలు ఊహాగానాలు వినిపించాయి.ఆ తర్వాత రాహుల్, గోయెంకా ఇద్దరూ ఈ ఊహాగానాలను ఖండించినప్పటికి.. క్రికెట్ వర్గాల్లో మాత్రం ఇంకా ఈ చర్చనడుస్తోంది. రాహుల్ సారథ్యంలోని ఎల్ఎస్జి రెండు సార్లు ఫ్లే ఆఫ్స్కు చేరింది. కానీ ఈ ఏడాది సీజన్లో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది.ఆర్సీబీ కెప్టెన్గా రాహుల్?ఇక కేఎల్ రాహుల్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కన్నేసినట్లు తెలుస్తోంది. మెగా వేలానికి ముందు ఎల్ఎస్జి నుంచి రాహుల్ను ట్రేడ్ చేసుకోవాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడతున్నాయి. ప్రస్తుత ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ వయస్సు 40కి చేరుకోవడంతో.. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా కొత్త కెప్టెన్ను ఫ్రాంచైజీ వెతుకుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కేఎల్ రాహల్ను సొంతం చేసుకుని తమ జట్టు పగ్గాలను అప్పగించాలని ఆర్సీబీ యాజమాన్యం యోచిస్తున్నట్లు వినికిడి. కాగా కేఎల్ రాహుల్ తన ఐపీఎల్ కెరీర్ను ఆర్సీబీ ఫ్రాంచైజీతో ప్రారంభించాడు. -
డుప్లెసిస్ మెరుపు అర్ద సెంచరీ.. రషీద్ ఖాన్ వీరోచిత పోరాటం
మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) 2024 ఎడిషన్లో భాగంగా ముంబై ఇండియన్స్ న్యూయార్క్తో ఇవాళ (భారతకాలమానం ప్రకారం) జరిగిన మ్యాచ్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది.డుప్లెసిస్ మెరుపు అర్ద సెంచరీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టెక్సాస్ సూపర్ కింగ్స్.. ఓపెనర్లు డుప్లెసిస్ (38 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), డెవాన్ కాన్వే (28 బంతుల్లో 40; 3 ఫోర్లు, సిక్సర్) చెలరేగి ఆడటంతో ఓ మోస్తరు స్కోర్ చేసింది. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్లో ఆరోన్ హార్డీ 22, జాషువ ట్రంప్ 3, మిలింద్ కుమార్ 2, సావేజ్ 10 పరుగులు చేసి ఔట్ కాగా.. స్టోయినిస్ 24, డ్వేన్ బ్రావో 7 పరుగులతో అజేయంగా నిలిచారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ (4-0-17-1) పొదుపుగా బౌలింగ్ చేయగా.. ట్రెంట్ బౌల్ట్ 2, నోష్తుష్ కెంజిగే, ఎహసాన్ ఆదిల్ తలో వికెట్ పడగొట్టారు.రషీద్ ఖాన్ వీరోచిత పోరాటం వృధా177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. 52 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. మెనాంక్ పటేల్ (45 బంతుల్లో 61; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), రషీద్ ఖాన్ (23 బంతుల్లో 50; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆదుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రషీద్ పోరాడితే పోయేదేమీ లేదన్నట్లు బ్యాటింగ్ చేశాడు. రషీద్ వీరోచితంగా పోరాడినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్లో కీరన్ పోలార్డ్ (17 బంతుల్లో 5), టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 6) చాలా బంతులు వృధా చేశారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో స్టోయినిస్ 4, జియా ఉల్ హక్ 2, మొహమ్మద్ మోహిసిన్ ఓ వికెట్ పడగొట్టారు.ఇదిలా ఉంటే, మేజర్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్ జులై 5న మొదలైన విషయం తెలిసిందే. ఈ ఎడిషన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో వాషింగ్టన్ ఫ్రీడం (4 మ్యాచ్ల్లో 3 విజయాలు) టాప్లో ఉండగా.. టెక్సాస్ సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్, సీయాటిల్ ఓర్కాస్ వరుస స్థానాల్లో ఉన్నాయి. లీగ్లో భాగంగా రేపు (రాత్రి ఒంటి గంటకు) జరుగబోయే మ్యాచ్లో సీయాటిల్ ఓర్కాస్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్ తలపడనున్నాయి. -
డుప్లెసిస్ విధ్వంసకర సెంచరీ.. 12 ఫోర్లు, 5 సిక్స్లతో
మేజర్ లీగ్ క్రికెట్-2024లో టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. ఈ లీగ్లో భాగంగా సోమవారం చర్చ్ స్ట్రీట్ పార్క్ వేదికగా వాష్టింగ్టన్ ఫ్రీడమ్తో జరిగిన మ్యాచ్లో డుప్లెసిస్ విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్ధి బౌలర్లను డుప్లెసిస్ ఊచకోత కోశాడు. కేవలం 58 బంతుల్లోనే ఫాప్ తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, 5 సిక్స్లు ఉన్నాయి. మేజర్ లీగ్ క్రికెట్లో డుప్లెసిస్కు ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. ఇక అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా టెక్సాస్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ చేసింది. అతడితో పాటు మరో ఓపెనర్ డెవాన్ కాన్వే(39) పరుగులతో రాణించాడు. వాష్టింగ్టన్ బౌలర్లలో నేత్రవల్కర్ రెండు వికెట్లు పడగొట్టగా.. మార్కో జానెసన్, డిల్, హోస్సేన్ తలా వికెట్ సాధించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన వాష్టింగ్టన్కు ఓపెనర్ స్మిత్(26), హెడ్(36) మంచి ఆరంభాన్ని ఆంచారు. వీరిద్దరూ ధాటికి వాషింగ్టన్ 4 ఓవర్లలో 62 పరుగులు చేసింది. అయితే ఈ సమయంలో వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. వర్షం ఎప్పటికి తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చింది. -
అదే మా ఓటమిని శాసించింది.. లేదంటే విజయం మాదే: డుప్లెసిస్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. అహ్మదాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన ఎలిమేనిటర్లో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. దీంతో టోర్నీ నుంచి ఆర్సీబీ ఇంటిముఖం పట్టింది. వరుస మ్యాచ్ల్లో గెలిచి ఫ్లే ఆఫ్స్కు చేరిన బెంగళూరు.. ఎలిమినేటర్ రౌండ్ను దాటలేకపోయింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(34) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. విరాట్ కోహ్లి(33), మహిపాల్(32) పరుగులతో రాణించారు.అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్(45) పరుగులతో అదరగొట్టగా.. రియాన్ పరాగ్(36), హెట్మైర్(26), పావెల్(16)పరుగులతో రాణించారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ స్పందించాడు. బ్యాటింగ్లో మరింత మెరుగ్గా రాణించింటే ఫలితం మరో విధంగా ఉండేదని డుప్లెసిస్ తెలిపాడు."మేము తొలుత బ్యాటింగ్లో మెరుగ్గా రాణించలేకపోయాం. సెకెండ్ ఇన్నింగ్స్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. అదనంగా 20 పరుగులు చేసి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. సాధరణంగా ఈ వికెట్పై 180 పరుగులు సాధిస్తే టార్గెట్ను డిఫెండ్ చేసుకోవచ్చు.ఎందుకంటే అహ్మదాబాద్ పిచ్ కాస్త స్లోగా ఉంది. మా బౌలర్లు అద్బుతంగా పోరాడారు. ఈ సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ మాకు పెద్దగా ఉపయోగపడలేదు. ఇక ఈ సీజన్లో మా జట్టు ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. పాయింట్ల పట్టకలో అట్టడుగు స్ధానం నుంచి ప్లే ఆఫ్స్కు రావడం నిజంగా గర్వించదగ్గ విషయం. వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాం. కానీ దురదృష్టవశాత్తూ ఎలిమినేటర్ రౌండ్ను దాటలేకపోయామని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో డుప్లెసిస్ పేర్కొన్నాడు. A comeback to winning ways when it mattered the most & how 👌👌Upwards & Onwards for Rajasthan Royals in #TATAIPL 2024 😄⏫Scorecard ▶️ https://t.co/b5YGTn7pOL #RRvRCB | #Eliminator | #TheFinalCall pic.twitter.com/NsxjVGmjZ9— IndianPremierLeague (@IPL) May 22, 2024 -
RR vs RCB: వార్ వన్సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం
ఐపీఎల్-2024 ఆఖరి అంకానికి చేరుకుంటోంది. ఇప్పటికే ఒక ఫైనలిస్టు ఖరారు కాగా.. తుది పోరుకు అర్హత సాధించేందుకు మిగిలిన మూడు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.ఈ సీజన్లో ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టిన కోల్కతా నైట్ రైడర్స్ క్వాలిఫయర్-1లో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్లో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో రైజర్స్ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్కు దూసుకువెళ్లింది కేకేఆర్.ఇక ఫైనల్ రేసులో మిగిలినవి రెండే మ్యాచ్లు. ఎలిమినేటర్, క్వాలిఫయర్-2. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది.సన్రైజర్స్తో ఎలిమినేటర్ విజేత పోటీఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. క్వాలిఫయర్-1లో కేకేఆర్ చేతిలో ఓడిన సన్రైజర్స్తో అమీతుమీ తేల్చుకుంటుంది. ఆ మ్యాచ్లో గనుక గెలిస్తే ఫైనల్కు చేరుకుంటుంది.ఈ క్రమంలో బెంగళూరు- రాజస్తాన్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్ సునిల్ గావస్కర్ ఎలిమినేటర్ విజేత ఎవరన్న అంశంపై తన అంచనా తెలియజేశాడు.‘‘ఆర్సీబీ ఈసారి ఎంతటి అద్భుతం చేసిందో చూశాం. ముఖ్యంగా వరుస పరాజయాల తర్వాత వాళ్లు తిరిగి పుంజుకున్న తీరు అమోఘం. మామూలు జట్లకు ఇలాంటివి సాధ్యం కావు.అయ్యో.. మనం ఓడిపోతూనే ఉన్నాంఆర్సీబీ ప్రధాన ఆటగాళ్లలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లితో పాటు మిగతా సీనియర్ ప్లేయర్లు తమ ఆట తీరుతో.. జట్టులో ఉత్సాహం నింపారు. ఆర్సీబీ స్థానంలో మరే ఇతర జట్టు ఏదైనా ఉంటే.. ‘అయ్యో.. మనం ఓడిపోతూనే ఉన్నాం. అంతా ముగిసిపోయింది’ అని బెంబేలెత్తిపోయేవాళ్లు.కానీ డుప్లెసిస్, కోహ్లి ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వలేదు. ఇక రాజస్తాన్.. గత నాలుగు- ఐదు మ్యాచ్లలో ఓడిపోతూనే ఉంది. ఆఖరిగా ఆడిన మ్యాచ్లోనూ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.వాళ్లను చూస్తే పూర్తిగా ఫామ్ కోల్పోయినట్లు కనిపిస్తున్నారు. పదకొండు రోజుల పాటు ఆటకు దూరంగా ఉన్న కేకేఆర్ మాదిరి ఏదైనా ప్రత్యేకంగా చేస్తే తప్ప రాజస్తాన్కు గెలిచే అవకాశాలు ఉండవు.లేదంటే మ్యాచ్ ఏకపక్షంగా సాగిపోయే ఛాన్స్ ఉంది. ఆర్సీబీ రాజస్తాన్ను చిత్తు చేసినా చేస్తుంది. ఒకవేళ అలా జరగకపోతేనే ఆశ్చర్యం’’ అని సునిల్ గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు. ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశాడు.గావస్కర్ వర్సెస్ కోహ్లికాగా ఇటీవల గావస్కర్- కోహ్లి మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. కోహ్లి స్ట్రైక్రేటు గురించి గావస్కర్ విమర్శించగా.. రన్మెషీన్ అందుకు కాస్త ఘాటుగానే బదులిచ్చాడు. ఎలా ఆడాలో తనకు తెలుసునని.. జట్టు ప్రయోజనాల కోసం ఏం చేయాలో కూడా తెలుసంటూ కౌంటర్ వేశాడు. -
RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
ఆర్సీబీ.. ఆర్సీబీ.. ఆర్సీబీ.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే పేరు.. ఆర్సీబీ నామస్మరణతో హోరెత్తుతూ ఆగని జోరు... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఏకంగా ఐపీఎల్-2024 టైటిల్ సాధించిందా? అన్నంతగా సంబరాలు..ఖండాంతరాలు దాటిన సంబురం.. అమెరికాలోనూ పేలుతున్న విన్నింగ్ క్రాకర్స్.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరిన క్రమంలో ‘నమ్మ బెంగళూరు’ అంటూ కనీవినీ ఎరుగని రీతిలో సెలబ్రేషన్స్.. అంత ప్రత్యేకమాఈ విజయం అంత ప్రత్యేకమా అంటే అవుననే చెప్పాలి. ఇంత వరకు ఒక్కసారి కూడా ఆర్సీబీ టైటిల్ గెలవనే లేదు. అయితే, అనూహ్య రీతిలో ఈసారి మహిళా ప్రీమియర్ లీగ్ రూపంలో తొలిసారి బెంగళూరు ఫ్రాంఛైజీకి ట్రోఫీ దక్కింది.స్మృతి మంధాన కెప్టెన్సీలో ఆర్సీబీ వుమెన్ టీమ్ కప్ కొట్టింది. ఇదే జోరులో పురుషుల జట్టు కూడా ఈసారి ట్రోఫీ సాధిస్తుందని.. టైటిల్ లేదన్న వెలితిని పూరిస్తుందని అభిమానులు ఆశపడ్డారు. అయితే, ఆరంభ మ్యాచ్లోనే ఆర్సీబీ ఓటమిపాలైంది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పరాజయంతో సీజన్ను మొదలుపెట్టింది.ఆ తర్వాత సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్పై విజయం సాధించిన బెంగళూరు జట్టు.. అదే జోరును కొనసాగించలేకపోయింది. వరుస వైఫల్యాలతో చతికిల పడి ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించే తొలి జట్టు అవుతుందేమోనన్న భావన కలిగించింది. KGF త్రయంలో విరాట్ కోహ్లి రాణించినా గ్లెన్ మాక్స్వెల్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అంచనాలు అందుకోలేకపోయారు.మాక్సీ కొన్నాళ్లు జట్టుకు దూరంగాఫలితంగా విమర్శల పాలయ్యారు. దీంతో మాక్సీ కొన్నాళ్లు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ చేరాలంటే ప్రతి మ్యాచ్లోనూ చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. నిజానికి ఇలాంటి ఒత్తిడిలో ఏ జట్టైనా చిత్తవుతుంది. కానీ ఆర్సీబీ అందుకు విరుద్ధం.ఎంత ఒత్తిడి పెరిగితే అంతగా చెలరేగిపోతాం అన్నట్లుగా వరుసగా ఆరు విజయాలు సాధించి.. ఇప్పుడిలా ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది. చెన్నై సూపర్ కింగ్స్పై తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఊహించని విజయం సాధించింది. రిపీట్ అవుతుందా?సీఎస్కేపై గెలిచినా నెట్ రన్రేటు పరంగా కూడా ఆ జట్టు కంటే మెరుగైన స్థితిలో ఉంటేనే టాప్-4కు అర్హత సాధిస్తుందన్న తరుణంలో అద్భుతం చేసి.. టాప్-4కు అర్హత సాధించింది. కాగా 2016లోనూ ఆరంభంలో ఆకట్టుకోలేకపోయిన ఆర్సీబీ.. ఆ తర్వాత వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ చేరి.. అటుపై ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతమవుతుందని అభిమానులు భావిస్తున్నారు. కాగా 2016 ఫైనల్లో ఆర్సీబీ సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే.ఆర్సీబీ వర్సెస్ చెన్నై స్కోర్లు👉వేదిక: చిన్నస్వామి స్టేడియం.. బెంగళూరు👉టాస్: చెన్నై.. బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 218/5 (20)👉చెన్నై స్కోరు: 191/7 (20)👉ఫలితం: చెన్నైపై 27 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం.. ప్లే ఆఫ్స్లో ఎంట్రీ👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఫాప్ డుప్లెసిస్(39 బంతుల్లో 54, కీలక సమయంలో రెండు క్యాచ్లు).చదవండి: Virat Kohli: కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క.. వీడియో వైరల్ Winning celebration of RCB in North America right now🔥🔥.Bigger than any franchise.RCB , RCB , RCB . pic.twitter.com/2M2FipXGYX— Kohlified. (@123perthclassic) May 19, 2024Winning celebration of RCB near Trump building Chicago. right now🔥🔥.Bigger than any franchise.RCB , RCB , RCB . pic.twitter.com/dy1Oko6QS7— #RCBNation (@9Sxventy3) May 19, 2024Bengaluru won't sleep tonight 😎RCB RCB all over the city @RCBTweets ❤️🔥pic.twitter.com/6jvvAAVERT— M. (@RCB_Hiv3) May 18, 2024Hear the Roar, Hear "Kohli, Kohli & RCB, RCB" Chants when they qualify for playoffs.- King Kohli & RCB are emotions..!!!! pic.twitter.com/Afqck4jNSH— Tanuj Singh (@ImTanujSingh) May 18, 2024📽️ RAW Reactions post a surreal win ❤️When emotions spoke louder than words at Chinnaswamy 🏟️A special lap of honour for the @RCBTweets fans that continue to believe in their side 👏👏#TATAIPL | #RCBvCSK pic.twitter.com/CrBQUBRKEI— IndianPremierLeague (@IPL) May 19, 2024 -
RCB Vs CSK: అతడి వల్లే గెలిచాం.. డుప్లిసెస్ ఎమోషనల్
#RCB Vs CSK ఐపీఎల్ అంటేనే క్రికెట్ అభిమానులకు ఒక పండుగ. అలాంటి ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంటర్స్(#RCB) అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అదరగొట్టింది. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరగని రీతిలో ఐపీఎల్-17లో ప్లే ఆఫ్ల్స్కు చేరుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో చైన్నె సూపర్ కింగ్స్కు షాకిస్తూ మెరుగైన రన్రేట్తో విజయం సాధించి ముందంజలో నిలిచింది. ప్లే ఆఫ్స్కు చేరాల్సిన నాకౌట్ మ్యాచ్లో సీఎక్కేపై 27 పరుగుల తేడాలో ఆర్సీబీ విజయం సాధించింది. ఇక, ఈ మ్యాచ్లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లిసిస్కు మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ సందర్భంగా డూప్లిసిస్ మాట్లాడుతూ.. బెంగళూరులో ఈ సీజన్ను ముగించడం చాలా ఆనందనిచ్చింది. విజయంతో ప్లే ఆఫ్స్కు ఎంతో సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్లో మా బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. నాకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును బౌలర్ యశ్ దయాల్కు అంకితమిస్తున్నాను. యశ్ బౌలింగ్ చేసిన విధానం చాలా బాగుంది. అతడి వల్లే మ్యాచ్ గెలిచాం. అందుకే తనకు అవార్డ్ను అంకితమిస్తున్నా. THE WINNING CELEBRATION FROM RCB. 🫡❤️- RCB into the Playoffs after having 1 win out of first 8 matches. 🤯🔥pic.twitter.com/LPFjay2A7C— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2024 ఇలాంటి పిచ్పై పరుగులు చేయడం ఎంతో కష్టం. మా బ్యాటర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించారు. మా బౌలర్లు కూడా కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి ప్రత్యర్థిని పరుగులు చేయకుండా ఆపగలిగారు. ఈ క్రెడిట్ అంతా మా బౌలర్లదే. ఇక, మా జట్టు ఓడినా.. గెలిచినా ఆర్సీబీ అభిమానులు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నాను. ప్లే ఆఫ్ మ్యాచ్ల్లో కూడా జట్టుగా రాణించి విజయాలను సాధిస్తామనే నమ్మకం ఉంది అంటూ కామెంట్స్ చేశాడు. THE GREATEST COMEBACK IN IPL HISTORY. 🏆- RCB qualified for Playoffs after losing 6 consecutive matches. 🤯pic.twitter.com/eIe6J7Iqhh— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2024 అదరగొట్టిన ఆర్సీబీ బ్యాటర్స్..ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్స్ అందరూ రాణించారు. వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టు చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. బౌండరీలే లక్ష్యంగా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. డుప్లెసిస్ (54), కోహ్లి (47), రజత్ పటీదార్ (41), గ్రీన్ (38) చెలరేగడంతో మొదట ఆర్సీబీ 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో ఇన్నింగ్ ప్రారంభించిన చెన్నైకి మొదటి బంతికే ఫామ్లో ఉన్న సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ ఔటయ్యాడు. ఇక, మూడో ఓవర్లో మిచెల్ (4) కూడా నిష్క్రమించాడు. దీంతో, 19/2తో సీఎస్కే ఒత్తిడిలో పడిపోయింది. కానీ రచిన్, రహానె (33) నిలబడడంతో కాసేపు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 8 ఓవర్లలో 85/2 స్కోర్తో మళ్లీ రేసులో నిలిచింది. ఈ దశలో ఆర్సీబీ బౌలర్ ఫెర్గూసన్.. రహానెను ఔట్ చేయడంతో మ్యాచ్ మళ్లీ ఆర్సీబీ చేతిలోకి వచ్చింది. 14 పరుగుల వ్యవధిలో రచిన్తో పాటు దూబె, శాంట్నర్ ఔట్ కావడంతో ఆ జట్టు పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. సీఎస్కే 15 ఓవర్లలో 129/6తో నిలిచింది. గెలవాలంటే ఐదు ఓవర్లలో 90 పరుగులు పరిస్థితి. ఓడినా ప్లేఆఫ్స్కు చేరాలన్నా 72 పరుగులు చేయాల్సిన స్థితి. అలాంటి దశలో ధోని, జడేజా పోరాడారు. చివరి రెండు ఓవర్లలో ప్లేఆఫ్స్లో స్థానం కోసం 35 (విజయం కోసం కావాల్సింది 53) పరుగులు చేయాలి. ఫెర్గూసన్ వేసిన ఇన్నింగ్స్లో 19వ ఓవర్లో జడేజా, ధోని కలిసి.. 18 పరుగులు రాబట్టడంతో ఉత్కంఠ పెరిగింది. ఆఖరి ఓవర్ (యశ్ దయాళ్) తొలి బంతికే ధోని సిక్స్ బాదడంతో చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగయ్యాయి. కానీ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి రెండో బంతికి ధోనీని ఔట్ చేశాడు. ఆ తర్వాతి నాలుగు బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చి ఆర్సీబీకి మరిచిపోలేని విజయాన్ని అందించాడు. -
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్! వీడియో
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ ఔటైన విధానం వివాదస్పదమైంది. ఈ మ్యాచ్లో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం తీవ్ర చర్చానీయాంశమైంది.ఏమి జరిగిందంటే?ఆర్సీబీ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో సీఎస్కే స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ ఐదో బంతి స్టంప్స్ దిశగా వేశాడు. దీంతో రజిత్ పాటిదార్ ఆ డెలివరీని స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. ఈ క్రమంలో శాంట్నర్ బంతిని ఆపేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.అయితే బంతి మాత్రం శాంట్నర్ చేతి వేలికి దగ్గరగా వెళ్తూ నాన్స్ట్రైక్ ఎండ్లో స్టంప్స్ను తాకింది. వెంటనే సీఎస్కే ఆటగాళ్లు రనౌట్ అప్పీల్ చేశారు. దీంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్కు రిఫర్ చేశాడు. తొలుత బంతి చేతి వేలికి తాకిందా లేదా అని నిర్ధారించుకోవడానికి థర్డ్ అంపైర్ మైఖేల్ గోఫ్ అల్ట్రా ఎడ్జ్ సాయంతో చెక్చేశాడు.అయితే అల్ట్రా ఎడ్జ్లో చిన్నగా స్పైక్ రావడంతో బంతి చేతికి వేలికి తాకినట్లు అంపైర్ నిర్ధారించుకున్నాడు. అనంతరం బంతి స్టంప్స్కు తాకే సమయానికి బ్యాటర్ క్రీజులోకి వచ్చాడా లేదాన్నది పలు కోణాల్లో అంపైర్ పరిశీలించాడు.ఓ యాంగిల్లో బంతి వికెట్లను తాకే సమయానికే డుప్లిసిస్ తన బ్యాటను గీతను దాటించినట్లు కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం బ్యాట్ గాల్లో ఉందంటూ తన నిర్ణయాన్ని ఔట్గా ప్రకటించాడు.దీంతో ఫాప్ డుప్లెసిస్తో పాటు స్టేడియంలో ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. కానీ చేసేదేమి లేక డుప్లెసిస్ (29 బంతుల్లో 54 రన్స్) నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్ డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్, చెత్త అంపైరింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. pic.twitter.com/4hijPiCz9A— Reeze-bubbly fan club (@ClubReeze21946) May 18, 2024 -
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న కీలక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు చెలరేగారు. సీఎస్కే బౌలర్లకు చుక్కలు చూపించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో ఫాప్ డుప్లెసిస్(54) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లి(47), రజిత్ పాటిదార్(41), కామెరాన్ గ్రీన్(38 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్లు ఆడారు.సీఎస్కే బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ రెండు వికెట్లు, తుషార్ దేశ్పాండే, శాంట్నర్ తలా వికెట్ సాధించారు. ఇక ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు ఆర్హత సాధించాలంటే 18 పరుగుల తేడాతో సీఎస్కేను ఓడించాలి.చదవండి: టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..! -
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. 2008 నుంచి ఇప్పటి దాకా.. ఇంత వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. అయినప్పటికీ ఆ జట్టుకు ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్సీబీకి ఉన్నంత విశ్వసనీయమైన ఫ్యాన్ బేస్ మరే జట్టుకు లేదంటారు.నాయకుడి స్థానం నుంచి వైదొలిగిఇంతటి క్రేజ్కు కారణం టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి అన్న విషయం తెలిసిందే. ఇక్కడే తన ఫ్రాంఛైజీ క్రికెట్ మొదలుపెట్టిన ఈ రన్మెషీన్.. ఇప్పటికీ ఆ జట్టుతోనే కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనూ కెప్టెన్గానూ బాధ్యతలు చేపట్టిన కోహ్లి పనిఒత్తిడిని తగ్గించుకుని.. కేవలం బ్యాటింగ్పై ఫోకస్ చేసే క్రమంలో నాయకుడి స్థానం నుంచి 2021 తర్వాత తప్పుకొన్నాడు.గత రెండు సీజన్లుగా సౌతాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్గా కొనసాగుతుండగా.. కోహ్లి ఓపెనింగ్ బ్యాటర్గా సేవలు అందిస్తున్నాడు. అయితే, అతడి సారథ్యంలో గతేడాది ఆరో స్థానంతో ముగించిన ఆర్సీబీ.. ఐపీఎల్-2024 ఆరంభంలో వరుస ఓటములు చవిచూసింది.వరుసగా ఐదు విజయాలు సాధించితర్వాత తిరిగి పుంజుకుని వరుసగా ఐదు విజయాలు సాధించి.. ప్రస్తుతానికి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేసుకుంది. అయితే, కేజీఎఫ్గా ప్రసిద్ధి పొందిన ఆర్సీబీ బ్యాటింగ్ త్రయం కోహ్లి, గ్లెన్ మాక్స్వెల్, ఫాఫ్లలో కేవలం కోహ్లి ఒక్కడే రాణిస్తున్నాడు.ఇప్పటి వరకు ఈ ఎడిషన్లో ఆడిన 13 మ్యాచ్లలో కలిపి 661 పరుగులు చేసిన కోహ్లి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్నాడు. అయితే, జట్టును ప్లే ఆఫ్స్ చేర్చడం మాత్రం కష్టంగా మారింది.ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే సీజన్లో విరాట్ కోహ్లిని మళ్లీ కెప్టెన్గా ప్రకటించాలని ఆర్సీబీ మేనేజ్మెంట్కు సూచించాడు.ఆర్సీబీకి కోహ్లి కూడా అలాగేఈ మేరకు.. "ఈసారి వాళ్లు(ఆర్సీబీ గనుక ) ప్లే ఆఫ్స్నకు అర్హత సాధించకపోతే.. భారత క్రికెటర్ను కెప్టెన్గా తీసుకురావాలి. అయినా ఎవరో ఎందుకు? మళ్లీ కోహ్లినే కెప్టెన్ను చేస్తే సరిపోతుంది కదా! చెన్నై జట్టు మీద ధోని ప్రభావం ఎంత ఉంటుందో.. ఆర్సీబీకి కోహ్లి కూడా అలాగే!బలమైన నాయకుడు. జట్టును ఎలా ముందుకు నడిపించాలో అతడికి తెలుసు. ప్రస్తుతం వాళ్లు దూకుడుగానే ఆడుతున్నారు. కోహ్లి సారథిగా వస్తే మరింత బాగుంటుంది. విరాట్ కోహ్లి తిరిగి ఆర్సీబీ పగ్గాలు చేపడితే చూడాలని ఉంది" అని భజ్జీ స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు.చదవండి: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు: ధోని ఫ్యాన్స్పై సంచలన వ్యాఖ్యలు -
IPL 2024 GT VS RCB: అత్యంత అరుదైన క్లబ్లో చేరిన ఫాఫ్ డుప్లెసిస్
ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ టీ20ల్లో అత్యంత అరుదైన క్లబ్లో చేరాడు. నిన్న (మే 4) గుజరాత్తో జరిగిన మ్యాచ్లో మెరుపు అర్దసెంచరీతో ఇరగదీసిన ఇతను.. పొట్టి ఫార్మాట్లో 10000 పరుగులు పూర్తి చేసుకున్న 14వ బ్యాటర్గా, తొలి సౌతాఫ్రికన్ క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. టీ20 కెరీర్లో 369 మ్యాచ్లు ఆడిన డుప్లెసిస్.. 134.30 స్ట్రయిక్రేట్తో 32.17 సగటున 10039 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో ఓవరాల్గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. గేల్ 463 మ్యాచ్ల్లో 22 సెంచరీలు, 88 హాఫ్ సెంచరీల సాయంతో 14562 పరుగులు చేశాడు. ఈ జాబితాలో గేల్ తర్వాతి స్థానాల్లో షోయబ్ మాలిక్ (13360), పోలార్డ్ (12900), విరాట్ కోహ్లి (12536), అలెక్స్ హేల్స్ (12319), వార్నర్ (12232), రోహిత్ శర్మ (11482), జోస్ బట్లర్ (11465), ఆరోన్ ఫించ్ (11458), కొలిన్ మున్రో (10961), బాబర్ ఆజమ్ (10620), జేమ్స్ విన్స్ (10451), డేవిడ్ మిల్లర్ (10230), డుప్లెసిస్ ఉన్నారు.ఈ మ్యాచ్లో చేసిన పరుగులతో కలుపుకుని డుప్లెసిస్ మరో ఘనత సాధించాడు. డుప్లెసిస్ ఆర్సీబీ తరఫున నాలుగో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు. ఆర్సీబీకి ముందు సీఎస్కేకు ఆడిన డుప్లెసిస్ ఆ ఫ్రాంచైజీ తరఫున మూడో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు.మ్యాచ్ విషయానికొస్తే.. డుప్లెసిస్ మెరుపు అర్ద సెంచరీతో చెలరేగడంతో గుజరాత్పై ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఆర్సీబీ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్ ఇన్నింగ్స్లో షారుక్ ఖాన్ (37), డేవిడ్ మిల్లర్ (30), రాహుల్ తెవాతియా (35) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మిగతా ప్లేయర్లంతా పెవిలియన్కు క్యూకట్టారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, యశ్ దయాల్, విజయ్కుమార్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కర్ణ్ శర్మ, గ్రీన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. పవర్ ప్లేలో పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోయింది. తొలి ఆరు ఓవర్లలో 92 పరుగులు చేసిన ఆర్సీబీ.. ఆతర్వాత ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయి ఆలౌటయ్యేలా కనిపించింది. అయితే దినేశ్ కార్తీక్ (21 నాటౌట్).. సప్నిల్ సింగ్ (15 నాటౌట్) సాయంతో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. గుజరాత్ బౌలర్లలో జాషువ లిటిల్ 4 వికెట్లతో విజృంభించగా.. నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో భారీ జంప్ కొట్టి చివరి స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. ఈ ఓటమితో గుజరాత్ తొమ్మిదో స్థానానికి పడిపోయింది. -
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపున్కుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఏడో స్ధానానికి చేరుకుంది. ఈమ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది.19.3 ఓవర్లలో 147 పరుగులకు గుజరాత్ ఆలౌటైంది. గుజరాత్ బ్యాటర్లలో షారూఖ్ ఖాన్ (37), డేవిడ్ మిల్లర్(30), రాహుల్ తెవాటియా(35) పర్వాలేదన్పించారు. ఇక ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, విజయ్ కుమార్, యశ్ దయాల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. గ్రీన్, కరణ్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.ఆర్సీబీ బ్యాటర్లలో ఓపెనర్లు ఫాప్ డుప్లెసిస్(23 బంతుల్లో 64), విరాట్ కోహ్లి(27 బంతుల్లో 42) పరుగులతో తుపాన్ ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత దినేష్ కార్తీక్(21 నాటౌట్), స్వప్నిల్ సింగ్(15) పరుగులతో మ్యాచ్ను ఫినిష్ చేశారు. గుజరాత్ బౌలర్లలో లిటిల్ 4 వికెట్లు పడగొట్టగా.. నూర్ ఆహ్మద్ రెండు వికెట్లు సాధించాడు.No RCB RCB fans will pass without liking this. ❤️🔥💫⭐Vintage RCB | Just RCB is RCBing | Can RCB vs GT | Faf du Plessis | Only RCB #RCBvsGT #GTvsRCB #ViratKohli pic.twitter.com/Ou5XvqxCv1— crazy (@cricrazyNandu) May 4, 2024 -
RCB కెప్టెన్గా అతడు ఉంటే ఏం మాట్లాడగలరు: సెహ్వాగ్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆట తీరుపై విమర్శలు వెల్లుతుతున్నాయి. సొంతమైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో సొంత జట్టు అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే ఐపీఎల్-2024లో కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరే అవకాశం ఉండదని మండిపడుతున్నారు. ఇక ఇప్పటికే భారత టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతి సైతం ఆర్సీబీని కొత్త వాళ్లకు అమ్మేయాలంటూ యాజమాన్యం తీరును విమర్శించాడు. జట్టు నిండా స్టార్లు ఉన్నా ఇలాంటి చెత్త ప్రదర్శన ఏమిటని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అదే ఇక్కడ ప్రధాన సమస్య ‘‘జట్టులో 12- 15 మంది భారత ఆటగాళ్లు ఉన్నారు. కేవలం 10 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. కానీ ఆర్సీబీ కోచింగ్ సిబ్బందిలో దాదాపుగా అందరూ విదేశీయులే ఉన్నారు. అదే ఇక్కడ ప్రధాన సమస్య. ఇక ఆటగాళ్లలో కొంతమంది మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నారు. వీరిలో సగం మందికి ఇంగ్లిష్ పూర్తిగా అర్థమే కాదు. అలాంటపుడు ఆ విదేశీ కోచ్లు వీరిని ఎలా మోటివేట్ చేయగలరు? వారితో ఎక్కువ సమయం ఎలా గడపగలరు? భాష పూర్తిగా రాని ఆటగాళ్లు తమ సమస్యలను కోచ్లకు ఎలా వివరించగలరు? నాకైతే ఆర్సీబీలో ఒక్క ఇండియన్ కోచ్ కూడా కనిపించడం లేదు. కనీసం ఒక్కరైనా అనుభవజ్ఞుడైన కోచ్ ఉంటే బాగుంటుంది కదా! ఆటగాళ్లు ఏది చర్చించాలన్నా అందుకు తగిన వాతావరణం ఉండాలి. కెప్టెన్గా అతడు ఉంటే ఏం మాట్లాడతారు? నాకు తెలిసి చాలా మంది ఆటగాళ్లు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ దగ్గరికి వెళ్లడానికే సంశయిస్తారు. ఎందుకంటే అతడు ఏదైనా అడిగితే వీరు సమాధానం చెప్పలేరు కదా! ఒకవేళ కెప్టెన్ గనుక భారతీయుడైతే.. సదరు ఆటగాళ్లు తాము అనుకుంటున్న విషయాన్ని స్పష్టంగా అతడికి తెలియజేయగలరు. కానీ విదేశీ ఆటగాడితో సరిగా కమ్యూనికేట్ చేయలేక.. ఒకదానికి బదులు ఇంకొకటి మాట్లాడితే తదుపరి మ్యాచ్లో తుదిజట్టులో చోటు దక్కే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఆర్సీబీ సహాయక సిబ్బందిలో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురైనా భారతీయులు ఉండాలి’’ అని క్రిక్బజ్ షోలో సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్-2024లో ఆర్సీబీ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్లలో కేవలం ఒక్కటి గెలిచి ఆరు ఓడిపోయింది. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ఇక ఈ సీజన్లో ఆర్సీబీ హెడ్కోచ్గా ఆండీ ఫ్లవర్ బాధ్యతలు చేపట్టగా.. బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్ కోచ్గా టీమిండియా మాజీ ఆల్రౌండర్ శ్రీధరన్ శ్రీరామ్, బౌలింగ్ కోచ్గా ఆడం గ్రిఫిత్(టాస్మేనియా మాజీ క్రికెటర్), ఫీల్డింగ్ కోచ్గా మలోలన్ రంగరాజన్ వ్యవహరిస్తున్నారు. చదవండి: SRH: ‘బాధితులు’ కూడా అసూయ పడేలా.. కమిన్స్ ఏమన్నాడో తెలుసా? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మా కుర్రాళ్లు బాగా పోరాడారు.. అదే మా కొంపముంచింది: ఆర్సీబీ కెప్టెన్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ఏ మాత్రం మారలేదు. ఈ మెగా ఈవెంట్లో ఆర్సీబీ వరుసగా ఐదో ఓటమి చవచూసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో 25 పరుగుల తేడాతో బెంగళూరు ఓటమి పాలైంది. మరోసారి బెంగళూరు బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. తొలుత బౌలింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 287 పరుగుల రికార్డు స్కోర్ను సమర్పించుకుంది. ట్రావిస్ హెడ్(102) ,హెన్రిచ్ క్లాసెన్(67), మార్క్రమ్(35), సమద్(37) ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశారు. అనంతరం లక్ష్య చేధనలో ఆర్సీబీ బ్యాటర్లు ఆఖరి వరకు పోరాడారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో దినేష్ కార్తీక్ అద్బుతమైన పోరాటం చేశాడు. కేవలం 35 బంతుల్లోనే 7 సిక్సర్లు, 5 ఫోర్లతో కార్తీక్ 83 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ డుప్లెసిస్(62), విరాట్ కోహ్లి(42) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. ఈ ఓటమితో ఆర్సీబీ ప్లే ఆఫ్ ఛాన్స్లను సంక్లిష్టం చేసుకుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ స్పందించాడు. బౌలింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి పాలైమని ఫాప్ చెప్పుకొచ్చాడు. "ఈ మ్యాచ్లో మేము ఆఖరి వరకు పోరాడినందుకు సంతోషంగా ఉంది. ఈ సీజన్లో మా నుంచి వచ్చిన మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన ఇదే. చిన్నస్వామి వికెట్ సరిగ్గా టీ20 క్రికెట్కు సరిపోతుంది. 280 పైగా టార్గెట్ను ఛేజ్ చేయడం అంత సులభం కాదు. కానీ మేము దగ్గరికి వచ్చి ఓడిపోయాం. ఈ మ్యాచ్లో కొన్ని మార్పులు చేశాము. కొత్తగా కొన్ని విషయాలను ప్రయత్నించాం. ఫాస్ట్ బౌలర్లు ఈ పిచ్పై పూర్తిగా తేలిపోయారు. బ్యాటింగ్ పరంగా మేము బలంగానే ఉన్నాము. మేము ఇంకా కొన్ని విభాగాల్లో ఇంకా మెరుగవ్వాలి. ముఖ్యంగా బౌలింగ్పై ఎక్కువ దృష్టిపెట్టాలి. అదే విధంగా బ్యాటింగ్లో కూడా పవర్ప్లే తర్వాత రన్ రేట్ తగ్గకుండా చూసుకోవాలి. ఈ హైస్కోరింగ్ రన్ ఛేజ్లో మా బాయ్స్ ఆఖరి వరకు మ్యాచ్ను విడిచిపెట్టలేదు. తొలుత బౌలింగ్లో 30-40 పరుగులు ఎక్కువగా ఇచ్చాం. అదే మా కొంపముంచింది. కానీ ఆటలో గెలుపుటములు సహజం. ఓడిపోయినందుకు కచ్చితంగా బాధ ఉంటుంది. కానీ మా మైండ్ను ఫ్రెష్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మా తర్వాతి మ్యాచ్ల్లో ఆడేందుకు సిద్దంగా ఉండాలి కదా" అంటూ పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో డుప్లెసిస్ పేర్కొన్నాడు. -
IPL2024 RCB vs SRH: హై స్కోరింగ్ మ్యాచ్లో ఆర్సీబీ ఓటమి..
IPL2024 RCB vs SRH Live Updates: హై స్కోరింగ్ మ్యాచ్లో ఆర్సీబీ ఓటమి.. ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమి చవిచూసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 25 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. 288 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఆర్సీబీ ఆఖరివరకు పోరాడింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో దినేష్ కార్తీక్ అద్బుతమైన పోరాటం చేశాడు. కేవలం 35 బంతుల్లోనే 7 సిక్సర్లు, 5 ఫోర్లతో కార్తీక్ 83 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ డుప్లెసిస్(62), విరాట్ కోహ్లి(42) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. మార్కండే రెండు, నటరాజన్ ఒక్క వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఎస్ఆర్హెచ్ ఏకంగా 287 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(102) సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్(67), మార్క్రమ్(35), సమద్(37) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఆర్సీబీ ఆరో వికెట్ డౌన్ 181 పరుగులు వద్ద ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన మహిపాల్ లామ్రోర్.. కమ్మిన్స్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో దినేష్ కార్తీక్(36), రావత్(5) పరుగులతో ఉన్నారు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 122/5 13 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఆర్సీబీ విజయానికి 42 బంతుల్లో 128 పరుగులు కావాలి. క్రీజులో దినేష్ కార్తీక్(16), లామ్రోర్(18) పరుగులతో ఉన్నారు. 10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 122/5 ఆర్సీబీ వరుస క్రమంలో మూడు వికెట్లు కోల్పోయింది. 9 ఓవర్ వేసిన మార్కండే బౌలింగ్లో పాటిదార్ ఔట్ కాగా.. అనంతరం కమ్మిన్స్ బౌలింగ్లో డుప్లెసిస్(62), సౌరవ్ చౌహన్ పెవిలియన్కు చేరారు. 10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 122/5 ఆర్సీబీ రెండో వికెట్ డౌన్.. జాక్స్ ఔట్ 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. ఉనద్కట్ బౌలింగ్లో విల్ జాక్స్ రనౌటయ్యాడు. 8 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో ఆర్సీబీ ఫాప్ డుప్లెసిస్(51), పాటిదార్ ఉన్నారు. ఆర్సీబీ తొలి వికెట్ డౌన్.. కోహ్లి ఔట్ 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 42 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. మార్కండే బౌలింగ్లో ఔటయ్యాడు. చెలరేగి ఆడుతున్న ఆర్సీబీ ఓపెనర్లు.. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ దూకుడుగా ఆడుతోంది. 4 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. క్రీజులో ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లి(25), ఫాప్ డుప్లెసిస్(31) పరుగులతో ఉన్నారు. సన్రైజర్స్ విధ్వంసం.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ను ఎస్ఆర్హెచ్ సాధించింది. ఈ మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఎస్ఆర్హెచ్ ఏకంగా 287 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(102) సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్(67), మార్క్రమ్(35), సమద్(37) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుమందు ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 277 పరుగులు చేసింది. ఈ మ్యాచ్తో తన రికార్డును తానే తిరగరాసింది. అదేవిధంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సిక్స్లు కొట్టిన జట్టుగా సన్రైజర్స్ నిలిచింది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఏకంగా 22 సిక్స్లు బాదారు. ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ డౌన్.. క్లాసెన్ ఔట్ 233 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. హెన్రిచ్ క్లాసెన్(31 బంతుల్లో 67, 7 సిక్స్లు, 4 ఫోర్లు).. ఫెర్గూసన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 18 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ మూడు వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. 16 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 217/2 16 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హెన్రిచ్ క్లాసెన్(27 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్లు), మార్క్రమ్(9) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ డౌన్.. హెడ్ ఔట్ ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. విధ్వంసకర సెంచరీతో చెలరేగిన హెడ్.. ఫెర్గూసన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 41 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 9 ఫోర్లు, 8 సిక్స్లతో 102 పరుగులు చేశాడు. 14 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. క్రీజులో హెన్రిస్ క్లాసెన్(39), మార్క్రమ్(2) పరుగులతో ఉన్నారు. ట్రావిస్ హెడ్ విధ్వంసకర సెంచరీ.. ట్రావిస్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో బెంగళూరు బౌలర్లకు హెడ్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై హెడ్ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 38 బంతుల్లో హెడ్ తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 9 ఫోర్లు, 8 సిక్స్లు ఉన్నాయి. 102 పరుగులతో హెడ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 12 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి1 57 పరుగులు చేసింది. తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్.. 108 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన ఆభిషేక్ శర్మ.. టాప్లీ బౌలింగ్లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్(79), క్లాసెన్(1) పరుగులతో ఉన్నారు. దంచి కొడుతున్న ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు.. ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ దంచికొడుతున్నారు. 8 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(33), ట్రావిస్ హెడ్(71) పరుగులతో ఉన్నారు. ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ ట్రావిస్ హెడ్ తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. కేవలం 20 బంతుల్లో 5 ఫోర్లు, 3సిక్స్లతో హెడ్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(23), ట్రావిస్ హెడ్(52) పరుగులతో ఉన్నారు. దంచి కొడుతున్న ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(14), ట్రావిస్ హెడ్(13) పరుగులతో ఉన్నారు. ఐపీఎల్-2024లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ రెండు మార్పులతో బరిలోకి దిగింది. గ్లెన్ మాక్స్వెల్, సిరాజ్ ఈ మ్యాచ్కు దూరమయ్యారు. ఆర్సీబీ తుది జట్టులోకి కివీస్ ఫాస్ట్ బౌలర్ లూకీ ఫెర్గూసన్ వచ్చాడు. సన్రైజర్స్ మాత్రం తమ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. తుది జట్లు సన్రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, సౌరవ్ చౌహాన్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, విజయ్కుమార్ వైషాక్, రీస్ టోప్లీ, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్ -
చాలా బాధగా ఉంది.. అతడే మా కొంపముంచాడు: ఆర్సీబీ కెప్టెన్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీరు ఏ మాత్రం మారలేదు. ఈ మెగా ఈవెంట్లో ఆర్సీబీ మరో ఘోర ఓటమిని చవిచూసింది. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో బెంగళూరు పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లు అదరగొట్టినప్పటికి.. బౌలర్లు మాత్రం దారుణంగా తేలిపోయారు. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ముంబై సునాయాసంగా కేవలం 15.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో 9వ స్ధానంలో కొనసాగుతోంది. ఇక ఈ ముంబై చేతిలో ఓటమిపై మ్యాచ్ అనంతరం ఫాప్ డుప్లెసిస్ స్పందించాడు. మంచు ప్రభావం తమ కొంపముంచిందని డుప్లెసిస్ తెలిపాడు. "మేము ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం. చాలా బాధగా ఉంది. ఒక మ్యాచ్లో విజయం సాధించాలంటే బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ రాణించాలి. టాస్ గెలిచింటే పరిస్థితి మరో విధంగా ఉండేదేమో. ఎందుకంటే మేము కూడా తొలుత బౌలింగ్ చేయాలనుకున్నాం. రెండో ఇన్నింగ్స్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. మా బౌలర్లు చాలా ఇబ్బంది పడ్డారు.అయితే దీనిని నేను సాకుగా చెప్పాలనుకోవడం లేదు. వారు బాగా ఆడారు. మాపై ఒత్తిడి తెచ్చారు. బౌలింగ్లో కూడా అద్బుతంగా రాణించారు. ఈ మ్యాచ్లో మేము కూడా చాలా తప్పులు చేశాము. ఇటువంటి వికెట్పై 190 పైగా స్కోర్ను డిఫెండ్ చేసుకోవడం అంత ఈజీ కాదు. పవర్ప్లేలో మేము మరి కొన్ని పరుగులు సాధించింటే బాగుండేంది. సెకెండ్ ఇన్నింగ్స్లో మంచు ప్రభావం ఉంటుందని మాకు ముందే తెలుసు కాబట్టి 250 పైగా పరుగులు చేయాల్సింది. ఆరంభంలో వికెట్లు కోల్పోడం కూడా మమ్మల్ని దెబ్బతీసింది. అయితే పాటిదార్, నేను క్రీజులో ఉన్నప్పుడు పెద్ద స్కోర్ వస్తుందని భావించాను. కానీ ముంబై బౌలర్లు తిరిగి కమ్బ్యాక్ ఇచ్చారు. ముఖ్యంగా బుమ్రా అద్బుతంగా బౌలింగ్ చేశాడు. అతడు డెత్ ఓవర్లలో సూపర్ బౌలింగ్ చేశాడు. అతడికి అద్బుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. బుమ్రాని ఎటాక్ చేసి ఒత్తిడిలోకి నెట్టడం అంత సలభం కాదు. లసిత్ మలింగ గైడన్స్లో జస్ప్రీత్ మరింత మెరుగయ్యాడని నేను భావిస్తున్నాను. అటువంటి క్లాస్ బౌలర్ మా జట్టులో ఉంటే బాగుండేది. మా బౌలింగ్ విభాగం అంత పటిష్టంగా లేదని మాకు తెలుసు. కాబట్టి రాబోయో మ్యాచ్ల్లో బ్యాటింగ్ పరంగా మెరుగ్గా రాణించి భారీ స్కోర్లు సాధించాలని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో ఫాప్ పేర్కొన్నాడు. -
RCB Vs MI: ఫాప్ డుప్లెసిస్ 'నో లూక్' సిక్స్.. వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ అద్భుతమైన షాట్తో మెరిశాడు. డుప్లెసిస్ న్యూ లూక్ షాట్తో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 2వ ఓవర్ వేసిన గెరాల్డ్ కోయిట్జీ ఆఖరి బంతిని డుప్లెసిస్కు 142.3 కి.మీ వేగంతో గుడ్ లెంగ్త్ డెలివరీ సంధించాడు. అయితే ముందుగానే పొజిషన్లో వచ్చిన డుప్లెసిస్.. బంతిని చూడకుండానే ర్యాంప్ షాట్ ఆడాడు. అయితే డెలివరీగా ఎక్కువగా పేస్ ఉండడంతో దెబ్బకు బంతి స్టాండ్స్లో పడింది. దీంతో డుప్లెసిస్ న్యూ లూక్ సిక్స్ చూసిన బౌలర్ కొయిట్జీ ఒక్కసారిగా తెల్లముఖం వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. #MIvsRCB,#RCBvsMI,#FafDuPlessis Fabulous pic.twitter.com/24eiZQQtga — Be Positive 🙂↕️🌝💯 (@Tauqeer__azam) April 11, 2024 -
అతడి వల్లే ఓడిపోయాం.. అలా చేయకుంటే బాగుండేది!
‘‘తొలి ఇన్నింగ్స్లో వికెట్ పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలించలేదు. ఏదేమైనా ఇక్కడ 190 స్కోరు చేస్తే బాగుంటుందని భావించాం. కనీసం ఇంకో 10- 15 పరుగులు చేస్తే ఫలితం బాగుండేది. మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. టాస్ గెలిసి తొలుత బౌలింగ్ ఎంచుకోవడం కూడా వారికి సానుకూల ఫలితాలను ఇచ్చింది. మ్యాచ్ సాగుతున్నీ కొద్దీ పిచ్ మీద తేమ కారణంగా బ్యాటింగ్ సులువైంది. విరాట్ ఆఖరి వరకు బాగానే ఆడాడు. ఆఖరి ఓవర్లలో కామెరాన్ గ్రీన్ బ్యాట్ ఝలిపిస్తే బాగుండేది. స్పిన్నర్ల బౌలింగ్లో పరుగులు రాబట్టాలని శాయ శక్తులా కృషి చేసినా సాధ్యం కాలేదు. అదే సీమర్ల బౌలింగ్లో హిట్టింగ్ ఆడగలిగాం. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ప్రత్యర్థిని తొలి నాలుగు ఓవర్లలో బాగానే కట్టడి చేయగలిగాం. అప్పుడే మ్యాచ్ మలుపు తిరిగింది కానీ ఆరో ఓవర్లో మేము 20కి పైగా పరుగులు సమర్పించుకోవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ తర్వాత మాపై క్రమంగా ఒత్తిడి పెరిగింది. ఎక్కువగా కుడిచేతి వాటం బ్యాటర్లే ఉన్నారు కాబట్టి మాక్స్వెల్తో బౌలింగ్ చేయించలేదు. ఇద్దరు రైట్ హ్యాండర్లు క్రీజులో ఉన్నపుడు మా లెఫ్టార్మ్ స్పిన్నర్ హిమాన్షు శర్మను బరిలోకి దించాం. వికెట్లు తీసేందుకు మా ప్రయత్నం చేశాం. జైస్వాల్(లెఫ్టాండర్) అవుటైన తర్వాత కూడా మాక్సీతో బౌలింగ్ చేయించాలని అనుకోలేదు. ఇక ఈ మ్యాచ్లో మా ఫీల్డింగ్ అత్యంత సాధారణంగా ఉంది. తదుపరి మ్యాచ్లో తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నిస్తాం’’ అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. ఐపీఎల్-2024లో భాగంగా రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమి అనంతరం ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.ఘ ఆ ఓవర్లోనే ఆర్సీబీ కొంప మునిగింది లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ను తొలి నాలుగు ఓవర్లలో కట్టడి చేసినా.. మయాంక్ దాగర్ వేసిన ఆరో ఓవర్ నుంచి మ్యాచ్ స్వరూపం మారిపోయిందని డుప్లెసిస్ పేర్కొన్నాడు. ఆ తర్వాత ఏ దశలోనూ రాజస్తాన్ను ఆపలేకపోయామని.. ఫీల్డింగ్ వైఫల్యాల వల్ల కూడా మూల్యం చెల్లించామని తెలిపాడు. కాగా జైపూర్లో శనివారం నాటి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 183 పరుగులు చేసింది. అయితే, లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ ఆరంభంలోనే యశస్వి జైస్వాల్(0) వికెట్ కోల్పోయినా.. జోస్ బట్లర్(100- నాటౌట్), సంజూ శాంసన్(69) ఇన్నింగ్స్ కారణంగా విజయఢంకా మోగించింది. కేవలం 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్ను పూర్తి చేసి ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఆర్సీబీ బౌలర్లలో రీస్ టోప్లీ రెండు వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన మయాంక్ దాగర్ ఏకంగా 34 పరుగులు ఇచ్చుకున్నాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్లో ఆరో ఓవర్ బౌల్ చేసిన ఈ లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ ఏకంగా 20 పరుగులు ఇవ్వడం ఆర్సీబీ కొంపముంచింది. ఇక ఈ మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అజేయ శతకం(113) వృథాగా పోయింది. చదవండి: Virat Kohli: ఇంత స్వార్థమా?.. ఐపీఎల్ చరిత్రలో కోహ్లి చెత్త రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024: ఆర్సీబీ లాంటి జట్లు ఎప్పటికీ ట్రోఫీ గెలవలేవు!
"This is why they have not won the IPL for so many years": రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘స్టార్ల’ వైఫల్యం కారణంగానే ఆర్సీబీ ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదని వ్యాఖ్యానించాడు. కోట్లకు కోట్లు తీసుకునే అగ్ర శ్రేణి అంతర్జాతీయ క్రికెటర్లు మైదానంలో కంటే డ్రెసింగ్ రూంలోనే ఎక్కువగా ఉండటం వల్లే ఆర్సీబీ రాత మారడం లేదని రాయుడు అభిప్రాయపడ్డాడు. కాగా 2008 నుంచి బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదన్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్వెల్, ఫాఫ్ డుపెస్లిస్, మహ్మద్ సిరాజ్ వంటి టాప్ క్లాస్ ఆటగాళ్లు ఉన్నా ఆర్సీబీ ట్రోఫీని ముద్దాడలేకపోయింది. తాజాగా ఐపీఎల్-2024లోనూ పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచింది. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 28 రన్స్తో ఓడి మూడో ఓటమిని చవిచూసింది. బ్యాటర్లు, బౌలర్ల సమిష్టి వైఫల్యం కారణంగా సొంత మైదానంలో పరాభవం మూటగట్టుకుంది. A win at home followed by a win away from home for the Lucknow Super Giants! 👏👏 They move to number 4⃣ on the Points Table! Scorecard ▶️ https://t.co/ZZ42YW8tPz#TATAIPL | #RCBvLSG pic.twitter.com/uc8rWveRim — IndianPremierLeague (@IPL) April 2, 2024 స్టార్లు ఒక్కసారైనా రాణించారా? ఈ నేపథ్యంలో అంబటి రాయుడు మాట్లాడుతూ.. ‘‘ వాళ్ల బౌలర్లు ఎల్లప్పుడూ అత్యధికంగా పరుగులు సమర్పించుకుంటూనే ఉంటారు. ఇక బ్యాటర్లేమో స్థాయికి తగ్గట్లు ఆడరు. ఆర్సీబీ కష్టాల్లో ఉన్న సమయంలో.. మేటి బ్యాటర్గా పేరున్న ఒక్క ఆటగాడు కూడా రాణించడం ఇంత వరకు చూడలేదు. అలాంటి జట్లు ఎప్పటికీ టైటిల్ గెలవలేవు. అందుకే ఇన్నేళ్లుగా ఆర్సీబీ ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ సాధించలేకపోయింది. బిగ్ ప్లేయర్లంతా టాపార్డర్లో ఉంటారు. కేక్ తినగా మిగిలిన క్రీమ్ను వదిలేసినట్లు డౌన్ ఆర్డర్లో ఉన్న యువ ఆటగాళ్లపై భారం వేస్తారు. ఒత్తిడిలో యువ ఆటగాళ్లతో పాటు దినేశ్ కార్తిక్ మాత్రమే ఆడటం చూస్తున్నాం. పదహారేళ్లుగా ఆర్సీబీ కథ ఇదే ఒత్తిడిలో మరింత మెరుగ్గా రాణించాల్సిన ఆర్సీబీలోని అగ్ర శ్రేణి అంతర్జాతీయ ప్లేయర్లు ఎప్పుడు బాధ్యత తీసుకున్నారు? వాళ్లంతా ఎక్కువగా డ్రెసింగ్ రూంలోనే ఉంటారు. ఈ ఒక్కరోజు మాత్రమే ఇలా జరగలేదు. పదహారేళ్లు ఆర్సీబీ కథ ఇదే’’ అని అంబటి రాయుడు స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన నెటిజన్లు.. కోహ్లి, మాక్స్ వెల్, డుప్లెసిస్, కామెరాన్ గ్రీన్ వంటి ఆటగాళ్లను ఉద్దేశించే రాయుడు ఇలా అని ఉంటాడని భావిస్తున్నారు. ఆ అదృష్టం అందరికీ ఉండదు బ్రో! అయితే, ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం రాయుడు అభిప్రాయంతో విభేదిస్తున్నారు. ఒక్కోసారి అదృష్టం కలిసి వస్తే కూడా ఆరుసార్లు టైటిల్ గెలిచిన జట్లలో భాగమయ్యే ఛాన్స్ ఉందని రాయుడును ఉద్దేశించి సెటైర్లు వేస్తున్నారు. కాగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన అంబటి రాయుడు ఆ జట్లు ట్రోఫీలు గెలిచిన సందర్భాల్లో(మూడేసి సార్లు) జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. గతేడాది సీజన్ తర్వాత ఐపీఎల్కు అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. చదవండి: రూ.11 కోట్లు టైమ్కి తీసుకుంటాడు.. అతడికేమో 17 కోట్లు! మరి ఆట? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024: ఆర్సీబీ కెప్టెన్కు ఏమైంది..? చెత్త షాట్ ఆడి మరి? వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. వరుసగా మూడో మ్యాచ్లో డుప్లెసిస్ నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో డుప్లెసిస్ విఫలమయ్యాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో ఓ చెత్త షాట్ ఆడి డుప్లెసిస్ తన వికెట్ను కోల్పోయాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన హర్షిత్ రాణా మూడో బంతి హాఫ్ కట్టర్గా సంధించాడు. కానీ డుప్లెసిస్ మాత్రం హాఫ్ సైడ్ వెళ్లి స్కూప్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో షార్ట్ ఫైన్ లెగ్ దిశగా బంతి గాల్లోకి లేచింది. షార్ట్ ఫైన్ లెగ్ ఫీల్డింగ్ చేస్తున్న మిచెల్ స్టార్క్.. ఈజీ క్యాచ్ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. pic.twitter.com/A1wRUMpZLP — Sitaraman (@Sitaraman112971) March 29, 2024 -
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. ఇందులోనైనా ఆర్సీబీ గెలుస్తుందా..?
ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (మార్చి 25) పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని ఆర్సీబీ భావిస్తుండగా.. పంజాబ్ సీజన్లో వరుసగా రెండో విజయంపై కన్నేసింది. ఆర్సీబీ సీజన్ తొలి మ్యాచ్లో సీఎస్కే చేతిలో ఓటమిపాలు కాగా.. పంజాబ్ తమ తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. తొలి మ్యాచ్లో ఆయా జట్ల ప్రదర్శనలపై ఓ లుక్కేద్దాం.. ఆర్సీబీ కంటే పంజాబ్ అన్ని విభాగాల్లో మెరుగ్గా కనిపించింది. ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ పేపర్పై బలంగా కనిపించినప్పటికీ తొలి మ్యాచ్లో స్టార్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. 8 ఫోర్లు బాది డుప్లెసిస్ (35) ప్రమాదకరంగా కనిపించినప్పటికీ.. ఆ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ముస్తాఫిజుర్ అతన్ని పెవిలియన్కు పంపాడు. విరాట్ విషయానికొస్తే.. ఆ మ్యాచ్లో అతని బ్యాటింగ్ నత్త నడకను తలపించింది. అతను 20 బంతులను ఎదుర్కొని కేవలం 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రజత్ పాటిదార్, మ్యాక్స్వెల్ డకౌటై దారుణంగా నిరాశపర్చగా.. కోట్లు పెట్టి అరువు తెచ్చుకున్న కెమారూన్ గ్రీన్ తుస్సుమనిపించాడు. వికెట్కీపర్లు అనూజ్ రావత్ (48), దినేశ్ కార్తీక్ (38 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లు ఆడకపోయుంటే ఆర్సీబీ 100 పరుగులు చేయడం కూడా కష్టంగా ఉండేది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు కూడా తేలిపోయారు. స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. అల్జరీ జోసఫ్, కర్ణ్ శర్మ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మయాంక్ డాగర్ కాస్త పర్వాలేదనిపించగా.. గ్రీన్ 2 వికెట్లు తీసి నాట్ బ్యాడ్ అనిపించాడు. పంజాబ్తో ఇవాల్టి మ్యాచ్లో ఆర్సీబీ అదనపు పేసర్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. కర్ణ శర్మ స్థానంలో ఆకాశదీప్ తుది జట్టులోకి రావచ్చు. పంజాబ్ విషయానికొస్తే.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చి విజయం సొంతం చేసుకుంది. అర్ష్దీప్ సింగ్, రబాడ, రాహుల్ చాహర్ తమ కోటా ఓవర్లు పూర్తి చేసి పర్వాలేదనిపించగా.. హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీసినప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. హర్ప్రీత్ బ్రార్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్ పడగొట్టాడు. బ్యాటింగ్లో సత్తా చాటిన సామ్ కర్రన్ ఒకే ఓవర్ బౌల్ చేశాడు. ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు పర్వాలేదనిపించారు. కర్రన్ (63) అర్దసెంచరీతో రాణించగా.. లివింగ్స్టోన్ (38 నాటౌట్), శిఖర్ ధవన్ (22), ప్రభ్సిమ్రన్ సింగ్ నాట్ బ్యాడ్ అనిపించారు. ఆర్సీబీతో ఇవాల్టి మ్యాచ్ పంజాబ్ ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఢిల్లీతో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించవచ్చు. ఆర్సీబీ తుది జట్టు (అంచనా): ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (వికెట్కీపర్), అల్జరీ జోసెఫ్, ఆకాశ్దీప్, మయాంక్ డాగర్, మహ్మద్ సిరాజ్ పంజాబ్ తుది జట్టు (అంచనా): శిఖర్ ధవన్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో, సామ్ కర్రన్, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ (వికెట్కీపర్), శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్ -
రచిన్ రవీంద్ర సూపర్ క్యాచ్.. బిత్తరపోయిన ఆర్సీబీ కెప్టెన్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో సీఎస్కే ఆటగాడు రచిన్ రవీంద్ర సంచలన క్యాచ్తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్తో దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ను రవీంద్ర పెవిలియన్కు పంపాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్గా వచ్చిన డుప్లెసిస్ ఆది నుంచే సీఎస్కే బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. తొలి నాలుగు ఓవర్లలో ఫాప్ బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ ఎటాక్లోకి తీసుకువచ్చాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 5 ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ రెహ్మన్ నాలుగో బంతిని డుప్లెసిస్కు ఫుల్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. డుప్లెసిస్ లాఫ్టెడ్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో డీప్లో ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్ను అందుకున్నాడు. ఇది చూసిన డుప్లెసిస్ బిత్తర పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ మ్యాచ్లో డుప్లెసిస్(35) పరుగులు చేశాడు. All Happening Here! Faf du Plessis ✅ Rajat Patidar ✅ Glenn Maxwell ✅@ChennaiIPL bounced back & in some style 👏 👏#RCB are 3 down for 42 in 6 overs! Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE Follow the match ▶️ https://t.co/4j6FaLF15Y#TATAIPL |… pic.twitter.com/tyBRQJDtWY — IndianPremierLeague (@IPL) March 22, 2024 -
IPL 2024: చెన్నై, ఆర్సీబీ మ్యాచ్కు ముందు వాతావరణం, పిచ్ వివరాలు
ఐపీఎల్ 2024 సీజన్ తొలి మ్యాచ్ ఇవాళ (మార్చి 22) జరుగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే), ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. అక్షయ్ కుమార్, ఏఆర్ రెహ్మాన్లచే ప్రత్యేక కార్యక్రమం.. మ్యాచ్కు ముందు సీజన్ ఆరంభ వేడుకలు జరుగనున్నాయి. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఈవెంట్లో బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సంగీత మాంత్రికుడు ఎఆర్ రెహ్మాన్, సింగర్ సోనూ నిగమ్ పెర్ఫార్మ్ చేయనున్నారు. సీఎస్కే నూతన కెప్టెన్గా రుతురాజ్.. లీగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. నూతన కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది. మాజీ కెప్టెన్ ధోని స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకుని రుతురాజ్కు బాధ్యతలు అప్పజెప్పాడు. వాతావరణం ఎలా ఉందంటే.. సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్కు వేదిక అయిన చెన్నైలో వాతావరణం ఆటకు ఆనువుగా ఉంది. వాతావరణం నుంచి మ్యాచ్కు ఎలాంటి అవాంతరాలు సంభవించవు. చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం రాత్రి తేలికపాటి వర్షం పడినప్పటికీ.. ఇవాళ మ్యాచ్ జరిగే సమయంలో (7-11 గంటల మధ్యలో) వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మ్యాచ్ వేలల్లో ఉష్ణోగ్రతలు 30, 31 డిగ్రీల మధ్యలో ఉండే అవకాశం ఉంది. వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు. పిచ్ ఎవరికి అనుకూలం.. చెపాక్ పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండిటికీ అనుకూలిస్తుందని చెప్పాలి. తొలుత బ్యాటర్లకు స్వర్గధామంగా కనిపించే ఈ పిచ్ క్రమంగా స్నిన్కు అనుకూలిస్తూ బౌలర్ ఫ్రెండ్లీగా మారుతుంది. ఈ పిచ్పై ఛేదన కాస్త కష్టంగానే ఉంటుంది. తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకే విజయావకాశాలు అధికంగా ఉంటాయి. రాత్రి వేళలో తేమ శాతం అధికమైతే స్పిన్నర్లు చెలరేగే అవకాశం ఉంటుంది. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సూపర్ కింగ్స్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనమైన రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు. చెపాక్ విషయానికొస్తే.. ఆర్సీబీపై సీఎస్కే సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. ఇక్కడ ఇరు జట్లు 8 మ్యాచ్ల్లో తలపడగా.. సీఎస్కే ఏకంగా ఏడు మ్యాచ్ల్లో జయకేతనం ఎగురవేసింది. కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఆర్సీబీ విజయం సాధించింది. అది కూడా లీగ్ ప్రారంభ ఎడిషన్ అయిన 2008లో. నాటి నుంచి ఇప్పటివరకు ఆర్సీబీ సీఎస్కేపై చెపాక్లో ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేదు. తుది జట్లు (అంచనా).. సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్దీప్ -
IPL 2024: ఆర్సీబీపై సీఎస్కేదే ఆధిపత్యం.. పదహారేళ్లలో..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా మార్చి 22న జరుగనుంది. సీజన్ ఓపెనర్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. హెడ్ టు హెడ్ రికార్డులను ఓసారి పరిశీలిస్తే.. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సూపర్ కింగ్స్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనమైన రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు. సొంత అడ్డా చెపాక్లో ఏ జట్టుపై అయినా పట్టపగ్గాల్లేని సీఎస్కే.. ఆర్సీబీపై సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. చెపాక్ ఈ ఇరు జట్లు ఇప్పటివరకు 8 మ్యాచ్ల్లో తలపడగా.. సీఎస్కే ఏకంగా ఏడు మ్యాచ్ల్లో జయకేతనం ఎగురవేసింది. కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఆర్సీబీ విజయం సాధించింది. అది కూడా లీగ్ ప్రారంభ ఎడిషన్ అయిన 2008లో. నాటి నుంచి ఇప్పటివరకు ఆర్సీబీ సీఎస్కేపై చెపాక్లో ఒక్క మ్యాచ్లో కూడా గెలిచింది లేదు. చెపాక్ పిచ్ విషయానికొస్తే.. ఈ మైదానం బ్యాటింగ్, బౌలింగ్ రెండిటికీ అనుకూలిస్తుందని చెప్పాలి. తొలుత బ్యాటర్లకు స్వర్గధామంగా కనిపించే ఈ పిచ్ క్రమంగా స్నిన్కు అనుకూలిస్తూ బౌలర్ ఫ్రెండ్లీగా మారుతుంది. ఈ పిచ్పై ఛేదన కాస్త కష్టంగానే ఉంటుంది. ఇందుకు అక్కడి వాతావరణం కూడా ఓ కారణం. వేసవికాలం రాత్రి వేళల్లో తేమ శాతం అధికంగా ఉండటంతో స్పిన్నర్లు చెలరేగే అవకాశం ఉంటుంది. తుది జట్లు (అంచనా): సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్/వికెట్కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, మతీశ పతిరణ ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్దీప్ -
IPL 2024- RCB: విరాట్ కోహ్లి లేకుండానే..
IPL 2024- RCB- బెంగళూరు: ఐపీఎల్ తాజా ఎడిషన్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ గురువారం ప్రీ సీజన్ క్యాంప్(శిక్షణా శిబిరం)నకు శ్రీకారం చుట్టింది. అయితే జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కాస్త ఆలస్యంగా శిబిరంలో చేరనున్నాడు. ఫ్రాంచైజీల వ్యవహారాల్ని పరిశీలిస్తున్న బీసీసీఐ ఇందుకు గల కారణాన్ని వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతో ఆటకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న కోహ్లి త్వరలోనే జట్టుతో కలుస్తాడని తెలిపింది. కాగా.. తన భార్య అనుష్క శర్మ ప్రసవం నేపథ్యంలో కోహ్లి లండన్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు దూరమైన అతడు.. ‘ఆర్సీబీ అన్బాక్స్’ ఈవెంట్ సందర్భంగా తిరిగి అభిమానుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. కెప్టెన్ వచ్చేశాడు.. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్తో పాటు వెస్టిండీస్ స్టార్ అల్జారీ జోసెఫ్ ప్రీ సీజన్ క్యాంపులో చేరారు. ఇక ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు ఆర్సీబీ పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. కొత్త హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్, క్రికెట్ డైరెక్టర్ మో బొబట్లు జట్టుతో చేరి శిబిరాన్ని పర్యవేక్షిస్తున్నారు. సంతోషంగా ఉంది ఈ నేపథ్యంలో కెప్టెన్ డుప్లెసిస్ మాట్లాడుతూ.. ‘‘ఆండీ ఫ్లవర్ అద్భుతమైన వ్యక్తి. ఇలాంటి కోచ్ మార్గదర్శనంలో ముందుకు సాగడం మా జట్టు చేసుకున్న అదృష్టం. గొప్ప మనసున్న వ్యక్తి’’ అంటూ హర్షం వ్యక్తం చేశాడు. మరోవైపు ఆండీ ఫ్లవర్ సైతం ఆర్సీబీ చరిత్రలోని ఓ నూతన అధ్యాయంలో తాము కూడా భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. కాగా చెపాక్ వేదికగా మార్చి 22న ఐపీఎల్ పదిహేడో సీజన్ మొదలుకానుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీ మధ్య తాజా ఎడిషన్ తొలి మ్యాచ్ జరుగనుంది. చదవండి: IPL 2024: షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్ ఆ రెండు జట్ల మధ్య! వైజాగ్లోనూ -
డుప్లెసిస్ ఊచకోత.. సూపర్ కింగ్స్ సంచలన విజయం
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో జోబర్గ్ సూపర్ కింగ్స్ క్వాలిఫియర్-2కు అర్హత సాధించింది. ఈ లీగ్లో భాగంగా బుధవారం పార్ల్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సూపర్ కింగ్స్.. క్వాలిఫియర్-2 బెర్త్ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పార్ల్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌటైంది. జో బర్గ్ బౌలర్లలో సామ్ కుక్ నాలుగు వికెట్లతో రాయల్స్ పతనాన్ని శాసించగా.. నంద్రే బర్గర్ 3, తహీర్ రెండు వికెట్లతో సత్తాచాటారు. రాయల్స్ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్(47) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం 139 పరుగుల లక్ష్యాన్ని సూపర్ కింగ్స్ ఒక్క వికెట్ నష్టపోయి కేవలం 13.2 ఓవర్లలో ఛేదించింది. సూపర్ కింగ్స్ ఓపెనర్లు లీస్ డుప్లే, ఫాప్ డుప్లెసిస్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. డుప్లై 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 68 పరుగులు చేయగా.. డుప్లెసిస్ 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 55 పరుగులు చేశాడు. ఫిబ్రవరి 8న జోబర్గ్ సూపర్ కింగ్స్ క్వాలిఫియర్-2లో డర్బన్ సూపర్ జెయింట్స్తో తలపడనుంది. -
టీ20 మ్యాచ్లో బ్యాటర్ల ఊచకోత.. ఏకంగా 412 పరుగులు!
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో జో బర్గ్ సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. జోహన్నెస్బర్గ్ వేదికగా డర్బన్ సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సూపర్ కింగ్స్.. ప్లే ఆఫ్ బెర్త్ను ఖారారు చేసుకుంది. కాగా ఈ మ్యాచ్లో పరుగుల వరద పారింది.ఈ మ్యాచ్లో రెండు జట్లు కలిపి ఏకంగా 412 పరుగులు చేశాయి. ఇరు జట్ల బ్యాటర్లు ఏకంగా 20 సిక్స్లు బాదారు. తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. సూపర్ జెయింట్స్ బ్యాటర్లలో జేజే స్మట్స్(55), ముల్దర్(59) హాఫ్ సెంచరీలతో సత్తచాటగా.. ఆఖరిలో క్లాసెన్(16 బంతుల్లో 40, 3 సిక్స్లు, 3 ఫోర్లు) మెరుపులు మెరిపించాడు. అనంతరం 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ కింగ్స్ 19.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే నష్టపోయి ఛేదించింది. సూపర్ కింగ్స్ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్(29 బంతుల్లో 57), లూస్ డిప్లై(57) హాఫ్ సెంచరీతో సత్తాచాటారు. వీరిద్దరితో పాటు మడ్సన్(44 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సూపర్ జెయింట్స్ బౌలర్లలో నూర్ ఆహ్మద్ రెండు, ప్రిటోరియస్ ఒక్క వికెట్ పడగొట్టాడు. -
SA20, 2024: డుప్లెసిస్ ఊచకోత.. 34 బంతుల్లోనే..!
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో జోబర్గ్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ విశ్వరూపం ప్రదర్శించాడు. ముంబై ఇండియన్స్ కేప్టౌన్తో జరిగిన మ్యాచ్లో 20 బంతుల్లోనే అజేయ అర్ధశతకం (4 ఫోర్లు, 3 సిక్సర్లు) బాది తన జట్టును గెలిపించాడు. ఫలితంగా సూపర్ కింగ్స్ 34 బంతుల్లోనే ఎంఐ కేప్టౌన్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించి, 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. WHAT A RUN CHASE JOBURG SUPER KINGS 🤯 🔥 JSK chases down 98 runs from just 5.4 overs - Faf Du Plessis 50*(20) & Du Plooy 41*(14) are the heroes in chase against MI Capetown in SA20 - A classic game. pic.twitter.com/XqKwrSU5Xs — Johns. (@CricCrazyJohns) January 29, 2024 వర్షం కారణంగా 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేప్టౌన్.. కెప్టెన్ కీరన్ పోలార్డ్ (10 బంతుల్లో 33 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగడంతో 3 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. వాన్ డర్ డస్సెన్ (16), రికెల్టన్ (16 బంతుల్లో 23) రెండంకెల స్కోర్లు చేయగా.. లివింగ్స్టోన్ 3 పరుగులకే ఔటయ్యాడు. సూపర్ కింగ్స్ బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ 2, లిజాడ్ విలియమ్స్ ఓ వికెట్ పడగొట్టారు. JOBURG SUPER KINGS 98 RUNS FROM JUST 5.4 OVERS. 🤯 - Madness from Faf Du Plessis & Du Plooy...!!!!pic.twitter.com/M1t9aqaG0x — Johns. (@CricCrazyJohns) January 30, 2024 అనంతరం లక్ష్య ఛేదన సమయంలో వర్షం మరోసారి ఆటంకం కలిగించడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిన సూపర్ కింగ్స్ లక్ష్యాన్ని 98 పరుగులకు మార్చారు. లక్ష్యం పెద్దది కావడంతో ఓపెనర్లు డుప్లెసిస్, డు ప్లూయ్ (14 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) తొలి బంతి నుంచే దూకుడుగా ఆడారు. వీరిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సూపర్ కింగ్స్ 5.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. వరుస ఓటములతో సతమతమవుతున్న సూపర్ కింగ్స్కు ఇది ఊరట కలిగించే విజయం. -
సౌతాఫ్రికా టీ20 లీగ్.. తొలి మ్యాచ్ వర్షార్పణం
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024 ఎడిషన్కు వరుణుడు ఘన స్వాగతం పలికాడు. సన్రైజర్స్ ఈస్ట్రన్ కేప్, జోబర్గ్ సూపర్ కింగ్స్ మధ్య నిన్న (జనవరి 10) జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. గతేడాది ఛాంపియన్ అయిన సన్రైజర్స్ ఈ మ్యాచ్లో ఫేవరెట్గా ఉండింది. సన్రైజర్స్కు ఎయిడెన్ మార్క్రమ్ నాయకత్వం వహిస్తుండగా.. జోబర్గ్ సూపర్ కింగ్స్ డుప్లెసిస్ కెప్టెన్గా ఉన్నాడు. సూపర్ కింగ్స్ గతేడాది సెమీఫైనల్ వరకు చేరింది. ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా టీ20 లీగ్ గత ఎడిషన్లోనే పురుడు పోసుకుంది. తొలి ఎడిషన్ ఫైనల్లో సన్రైజర్స్.. ప్రిటోరియా క్యాపిటల్స్ను ఓడించి ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌట్ కాగా.. సన్రైజర్స్ 16.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సన్రైజర్స్ ఈస్ట్రన్ కేప్ స్క్వాడ్: ఆడమ్ రోసింగ్టన్ (వికెట్కీపర్), ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), టెంబా బవుమా, డేవిడ్ మలాన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జన్సెన్, సైమన్ హార్మర్, టామ్ ఎబెల్, ఒట్నీల్ బార్ట్మన్, లియామ్ డాసన్, అయాబులెలా గ్కమనే, సరెల్ ఎర్వీ, ప్యాట్రిక్ క్రూగర్స్, బెయర్స్ స్వానోపోల్, ఆండీల్ సైమ్లేన్, కాలెబ్ సలేకా, జోర్డన్ హెర్మన్ జోబర్గ్ సూపర్ కింగ్స్ స్క్వాడ్: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), డోనోవన్ ఫెరీరా (వికెట్కీపర్), రీజా హెండ్రిక్స్, లీస్ డు ప్లూయ్, మొయిన్ అలీ, రొమారియో షెపర్డ్, కైల్ సిమండ్స్, గెరాల్డ్ కొయెట్జీ, లిజాడ్ విలియమ్స్, నండ్రే బర్గర్, ఇమ్రాన్ తాహిర్, వేన్ మాడ్సెన్, ఆరోన్ ఫంగిసో, డేవిడ్ వీస్, డయ్యన్ గేలియం, సిబోనెలో మఖాన్యా, జహీర్ ఖాన్, సామ్ కుక్, రోనన్ హెర్మాన్ -
అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ.. సంకేతాలు ఇచ్చిన దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్, ఆ జట్టు మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వడంపై సంకేతాలు ఇచ్చాడు. వచ్చే ఏడాది (2024) జరగనున్న టీ20 ప్రపంచకప్లో పునరాగమనాన్ని పరిశీలిస్తున్నట్లు ఫాఫ్ స్వయంగా వెల్లడించాడు. ఈ విషయమై దక్షిణాఫ్రికా వైట్ బాల్ కోచ్ రాబ్ వాల్టర్తో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నాడు. తాను అంతర్జాతీయ క్రికెట్కు తిరిగి రాగలనని నమ్ముతున్నానని తెలిపాడు. తన పునరాగమనంపై గత రెండేళ్లుగా చర్చలు జరుగుతున్నాయని.. టీ20 ప్రపంచకప్ సమయానికి జట్టు సమతూకం విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని అన్నాడు. ప్రస్తుతం అబుదాబి టీ10 లీగ్లో ఆడుతున్న ఫాఫ్ అంతర్జాతీయ క్రికెట్లోకి రీంట్రీ ఇచ్చే అంశాన్ని తనే ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. 39 ఏళ్ల ఫాఫ్ ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్లో భీకర ఫామ్లో ఉండిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో అతను శుభ్మన్ గిల్ తర్వాత లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ సీజన్లో అతను 14 ఇన్నింగ్స్ల్లో 730 పరుగులు చేశాడు. ఫాఫ్ తన చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ను 2020 చివర్లో ఆడాడు. అప్పటినుంచి అతను లీగ్ క్రికెట్కు మాత్రమే పరిమితమయ్యాడు. ఫాఫ్ను టీ20 జట్టులో చేర్చుకోవాలని కొత్తగా ఎంపికైన పరిమత ఓవర్ల కోచ్ రాబ్ వాల్టర్ క్రికెట్ సౌతాఫ్రికాపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తుంది. ఫాఫ్ ఫిట్నెస్ పరంగానూ, టెక్నికల్గానూ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాడని వాల్డర్ నమ్ముతున్నాడు. రీఎంట్రీ విషయమై వాల్టర్ మరో దిగ్గజ బ్యాటర్తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. రీఎంట్రీ ఇచ్చేందుకు డుప్లెసిస్కు ఆసక్తి ఉన్నా క్రికెట్ సౌతాఫ్రికా అతన్ని అనుమతిస్తుందో లేదో వేచి చూడాలి. ఇదిలా ఉంటే, మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ల కోసం భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లు డిసెంబర్ 10 నుంచి మొదలవుతాయి. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్ల కోసం ఇరు జట్లను ఇదివరకే ప్రకటించారు. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ తొలుత టీ20 సిరీస్ ఆడుతుంది. తొలి మ్యాచ్ డర్బన్ వేదికగా డిసెంబర్ 10న జరుగుతుంది. -
IPL 2024: ఆర్సీబీలో భారీ ప్రక్షాళన.. స్టార్ ఆటగాళ్లకు షాక్.. లక్కీ డీకే
ఐపీఎల్ 2024 సీజన్కు ముందు ఆర్సీబీ ఫ్రాంచైజీ భారీ ప్రక్షాళనకు దిగింది. ఆ జట్టు హాజిల్వుడ్, హసరంగ, హర్షల్ పటేల్, బ్రేస్వెల్, పార్నెల్ లాంటి స్టార్లను సైతం వేలానికి వదిలేసింది. అయితే ఆ జట్టు ఎవరూ ఊహించని విధంగా దినేశ్ కార్తీక్ను కొనసాగించింది. కెప్టెన్గా డుప్లెసిస్ను కొనసాగించిన ఆర్సీబీ.. కెమారూన్ గ్రీన్ను ముంబై ఇండియన్స్ను నుంచి ట్రేడింగ్ చేసుకుంది. విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్వెల్ లాంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉండనే ఉన్నారు. ఆర్సీబీ రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే.. వనిందు హసరంగ హర్షల్ పటేల్ జోష్ హాజిల్వుడ్ ఫిన్ అలెన్ మైఖేల్ బ్రేస్వెల్ డేవిడ్ విల్లే వేన్ పార్నెల్ సోనూ యాదవ్ అవినాశ్ సింగ్ సిద్దార్థ్ కౌల్ కేదార్ జాదవ్ ఆర్సీబీ కొనసాగించనున్న ఆటగాళ్లు వీరే.. ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్) గ్లెన్ మ్యాక్స్వెల్ విరాట్ కోహ్లి రజత్ పాటిదార్ అనూజ్ రావత్ దినేశ్ కార్తీక్ సుయాశ్ ప్రభుదేశాయ్ విల్ జాక్స్ మహిపాల్ లోమ్రార్ కర్ణ్ శర్మ మనోజ్ భండగే కెమరూన్ గ్రీన్ (ముంబై నుంచి ట్రేడింగ్) మయాంక్ డాగర్ (ఎస్ఆర్హెచ్ నుంచి ట్రేడింగ్) వైశాఖ్ విజయ్ కుమార్ ఆకాశ్ దీప్ మొహమ్మద్ సిరాజ్ రీస్ టాప్లే హిమాన్షు శర్మ రజన్ కుమార్ -
అప్పుడలా! ఈసారి మాత్రం వరల్డ్కప్ ట్రోఫీ మాదే: సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్
అప్పటి దాకా అదరగొట్టడం... అభిమానుల్లో అంచనాలు పెంచేయడం... మేజర్ ఈవెంట్లలో కీలక సమయంలో చేతులెత్తేయడం.. కనీసం ఫైనల్ కూడా చేరలేక చతికిలపడటం.. మీరు ఊహించిన పేరు నిజమే! ఈ ప్రస్తావన సౌతాఫ్రికా గురించే! 1992 నుంచి వరల్డ్కప్ టోర్నీలో పోటీపడుతున్న దక్షిణాఫ్రికా ఇంత వరకు ఒక్క వన్డే ట్రోఫీ కూడా గెలవలేదు. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లలో విజయం అంచులదాకా వెళ్లి బోల్తా పడటం.. ‘చోకర్స్’ అనే ‘నామధేయం’ తమకు సరిగ్గా సరిపోతుందని మళ్లీ మళ్లీ నిరూపించుకోవడం ప్రొటిస్కు బాగా అలవాటు. ఈసారి ట్రోఫీ గెలుస్తాం అయితే, ఈసారి ఆ అపఖ్యాతిని కచ్చితంగా చెరిపేసుకుంటాం అంటున్నాడు సౌతాఫ్రికా స్పీడ్స్టర్ కగిసో రబడ. ప్రపంచకప్ ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా భారత్లో బరిలోకి దిగుతామని పేర్కొన్నాడు. ఇప్పటి వరకు జరగనిది.. ఇప్పుడు చేసి చూపిస్తామంటూ ధీమా వ్యక్తం చేశాడు. ప్రొటిస్ పేస్ దళానికి నాయకత్వం వహిస్తున్న 28 ఏళ్ల రబడ ఈ మేరకు మాట్లాడుతూ.. ‘‘సౌతాఫ్రికా క్రికెట్ గురించి బయట నడుస్తున్న డ్రామా, చర్చల గురించి మేము అస్సలు పట్టించుకోము. నిజమే ప్రపంచకప్ టోర్నీల్లో ఆడుతూ.. ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోతే ఎలా ఉంటుందో తెలుసు. ప్రతి క్రికెటర్ కల అదే! తీవ్రమైన నిరాశ కలుగుతుంది కదా! ఈ విషయంలో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఈసారి దానిని సాధ్యం చేసి చూపించాలని నేను... మేమంతా బలంగా కోరుకుంటున్నాం. వరల్డ్కప్ ట్రోఫీ గెలవడం ఎవరికైనా ఇష్టమే కదా! ప్రతి ఒక్క క్రికెటర్ కల అదే! ఒక్కసారి జట్టును ప్రకటిస్తే.. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే చూస్తారు’’ అంటూ ఆత్మవిశ్వాసం ప్రదర్శించాడు. కాగా ఇప్పటి వరకు నాలుగుసార్లు వరల్డ్కప్ సెమీస్ వరకు చేరుకున్న సౌతాఫ్రికా ఒక్కసారి కూడా ముందడుగు వేయలేకపోయింది. అప్పుడలా.. ఆఖరిగా.. 2019 వరల్డ్కప్లో మాంచెస్టర్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై 10 పరుగుల తేడాతో గెలిచి.. విజయంతో టోర్నీని ముగించింది. అయితే, ఈసారైనా కప్ గెలుస్తారంటూ.. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు మాత్రం ఫాఫ్ డుప్లెసిస్ బృందం నిరాశనే మిగిల్చింది. ఇదిలా ఉంటే.. భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి వన్డే వరల్డ్కప్ ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే! చదవండి: టీమిండియా క్యాప్ అందుకోవడం ఈజీ అయిపోయింది.. అదే జరిగితే బుమ్రా అవుట్! -
ఐపీఎల్లో ఓ వెలుగు వెలిగిన స్టార్ క్రికెటర్
-
ఐపీఎల్లో ఓ వెలుగు వెలిగిన స్టార్ క్రికెటర్, అక్కడ మాత్రం దయనీయ స్థితిలో..!
ఈ ఏడాది (2023) ఐపీఎల్లో, అంతకుముందు జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్లో మెరుపులు మెరిపించిన సౌతాఫ్రికన్ లెజెండ్ ఫాఫ్ డుప్లెసిస్ ప్రస్తుతం అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) ఇనాగురల్ ఎడిషన్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఎంఎల్సీ-2023లో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన డుప్లెసిస్.. తన క్రికెటింగ్ కెరీర్లోకెళ్లా అత్యంత దారుణమైన గణాంకాలు నమోదు చేశాడు. 7 ఇన్నింగ్స్ల్లో 6.57 సగటున 85.18 స్ట్రయిక్రేట్తో కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. లీగ్ క్రికెట్లో ఘన చరిత్ర కలిగిన డప్లెసిస్.. తన 13 ఏళ్ల కెరీర్లో ఇప్పటివరకు ఏ లీగ్లోనూ ఇంత పేలవ ప్రదర్శన కనబర్చలేదు. డుప్లెసిస్ వరుస వైఫల్యాల నేపథ్యంలో అతని ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీ ఆందోళన చెందుతుంది. ఆ జట్టు అభిమానుల బాధ వర్ణణాతీతంగా ఉంది. డుప్లెసిస్ వచ్చే సీజన్లో ఎలాగైనా తమకు ఐపీఎల్ టైటిల్ సాధించిపెడతాడని గంపెడాశలు పెట్టుకున్న ఆర్సీబీ అభిమానులు.. ఫాఫ్ దయనీయ పరిస్థితి చూసి కుమిలిపోతున్నారు. ఇలాగైతే 2024లో కూడా తాము టైటిల్ గెలిచినట్లే అని తలలుపట్టుకుంటున్నారు. ఎంఎల్సీలో చెన్నై సూపర్ కింగ్స్ అనుబంధ ఫ్రాంచైజీ అయిన టెక్సాస్ సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన డుప్లెసిస్.. ముంబై ఇండియన్స్ న్యూయార్క్తో జరిగిన ఆఖరి మ్యాచ్లో 9 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. ఆ మ్యాచ్లో సూపర్ కింగ్స్.. ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి లీగ్ నుంచి నిష్క్రమించింది. భారతకాలమానం రేపు (జులై 31) జరుగబోయే ఫైనల్లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్.. సియాటిల్ ఆర్కాస్ను ఢీకొంటుంది. కాగా, టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి, పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కొనసాగుతున్న డుప్లెసిస్.. ఎంఎల్సీ మినహాయించి ఈ ఏడాది టీ20 లీగ్ల్లో మెరుపులు మెరిపించిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో 14 మ్యాచ్లు ఆడిన అతను.. 56.15 సగటున, 153.68 స్ట్రయిక్ రేట్తో 730 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా టీ20 లీగ్లో 11 మ్యాచ్ల్లో 41 సగటున, 147.60 స్ట్రయిక్రేట్తో 369 పరుగులు చేశాడు. -
నిప్పులు చెరిగిన పార్నెల్.. కుప్పకూలిన సూపర్ కింగ్స్
అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ ఆరంభ ఎడిషన్లో సీయాటిల్ ఆర్కాస్ ఫ్రాంచైజీ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆ జట్టు సీజన్లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. టెక్సాస్ సూపర్ కింగ్స్తో ఇవాళ (జులై 22) జరిగిన మ్యాచ్లో ఆర్కాస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టు కెప్టెన్ వేన్ పార్నెల్ నిప్పులు చెరగడంతో (5/20) తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 127 పరుగులకే కుప్పకూలింది. పార్నెల్.. సూపర్ కింగ్స్ పతనాన్ని శాసించగా, ఆండ్రూ టై (2/15), ఇమాద్ వసీం (1/25), గానన్ (1/30) మిగతా పనిని పూర్తి చేశారు. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్లో డ్వేన్ బ్రేవో (39) టాప్ స్కోరర్గా నిలువగా..డేనియల్ సామ్స్ (26), కోడీ చెట్టి (22), డుప్లెసిస్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఔటై డెవాన్ కాన్వే (0) నిరాశపర్చగా.. డేవిడ్ మిల్లర్ (8), మిచెల్ సాంట్నర్ (2) దారుణంగా విఫలమయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్కాస్.. 16 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (53) అర్ధసెంచరీతో రాణించగా.. హెన్రిచ్ క్లాసెన్ (21 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్తో మెరిశాడు. ఆర్కాస్ కోల్పోయిన రెండు వికెట్లలో ఒకటి సాంట్నర్, మరొకటి మొహమ్మద్ మొహిసిన్ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో ఆర్కాస్ టేబుల్ టాపర్గా (3 మ్యాచ్ల్లో 3 విజయాలు) నిలువగా.. 4 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించిన సూపర్ కింగ్స్ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వాషింగ్టన్ ఫ్రీడం (3 మ్యాచ్ల్లో 2 విజయాలు), శాన్ఫ్రాన్సిస్కో యునికార్న్స్ (3 మ్యాచ్ల్లో 2 విజయాలు), ముంబై ఇండియన్స్ న్యూయార్క్ (3 మ్యాచ్ల్లో ఓ విజయం), లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్ (4 మ్యాచ్ల్లో 4 పరాజయాలు) వరుసగా 3 నుంచి 6 స్థానాల్లో ఉన్నాయి. -
మరోసారి ‘యెల్లో’ జెర్సీ ధరించనున్న డుప్లెసిస్.. చెన్నై ప్రాంఛైజీ కెప్టెన్గా
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ మరో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీతో మరోసారి జతకట్టాడు. అగ్ర రాజ్యం అమెరికా తొలిసారి నిర్వహిస్తున్న మేజర్ లీగ్ క్రికెట్ టీ20 టోర్నీలో డుప్లెసిస్ భాగం కానున్నాడు. ఈ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్ (టీఎస్కే) తరఫున ఆడనున్నాడు. అంతేకాకుండా జట్టుకు అతడే అతడే సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా టెక్సాస్ సూపర్ కింగ్స్ వెల్లడించింది. ఇక ఇప్పటికే దక్షిణాఫ్రికా టీ20 లీగ్లో సీఎస్కే కొనుగొలు చేసిన జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్టుకు డుప్లెసిస్ కెప్టెన్గా ఉన్నాడు. అదే విధంగా ఐపీఎల్లో కూడా చాలా సీజన్ల పాటు సీఎస్కేకు డుప్లెసిస్ ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్యాష్రిచ్ లీగ్లో దాదాపు సీఎస్కే తరపున 100పైగా మ్యాచ్లు ఆడిన ఫాప్.. 2,935 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఫాప్ ప్రస్తుతం ఆర్సీబీ కెప్టెన్గా ఉన్నాడు. ఐపీఎల్-2023లో 14 మ్యాచ్లు ఆడిన డుప్లెసిస్.. 730 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో రెండో స్ధానంలో నిలిచాడు. ఇక మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో డు ప్లెసిస్తో పాటు అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో, మిచెల్ సాంట్నర్, డెవాన్ కాన్వే, డేవిడ్ మిల్లర్ వంటి స్టార్ క్రికెటర్లు టెక్సాస్ సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నారు. కాగా ఎంఎల్సీ ఫస్ట్ సీజన్ జులై 13 నుంచి జూలై 30 వరకు జరగనుంది. -
IPL 2023: ఆర్సీబీ వైఫల్యాలకు కారణం ఎవరంటారు..?
మే 21న జరిగిన మ్యాచ్లో గుజరాత్ చేతిలో ఓటమితో ఐపీఎల్ 2023లో ఆర్సీబీ ప్రస్థానం ముగిసింది. దీంతో వరుసగా ఆ జట్టు 16వ ఎడిషన్లోనూ రిక్త హస్తాలతోనే లీగ్ నుంచి నిష్క్రమించింది. ప్రతి ఏడాది ఈ సారి కప్ మాదే అంటూ ఊదరగొట్టే ఆర్సీబీ.. ఈ ఏడాది కనీసం ప్లే ఆఫ్స్కు కూడా చేరకుండానే నిరాశగా లీగ్ నుంచి వైదొలిగింది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్లో ఆర్సీబీ పరిస్థితి మరింత దారుణంగా ఉన్నప్పటికీ.. డుప్లెసిస్ (14 మ్యాచ్ల్లో 730 పరుగులు), కోహ్లి (14 మ్యాచ్ల్లో 639 పరుగులు)లు జాకీలు వేసి పైకి లేపడంతో గ్రూప్ స్టేజ్ ఆఖరి మ్యాచ్ వరకు నెట్టుకొచ్చింది. డుప్లెసిస్, కోహ్లిల తర్వాత అడపాదడపా మ్యాక్స్వెల్ (14 మ్యాచ్ల్లో 400 పరుగులు), సిరాజ్ (14 మ్యాచ్ల్లో 19 వికెట్లు) రాణించడంతో ఆర్సీబీ 14 మ్యాచ్ల్లో కనీసం 7 మ్యాచ్ల్లోనైనా గెలవగలిగింది. వాస్తవానికి పైన పేర్కొన్న నలుగురి ప్రదర్శనలతో పాటు మిగతా జట్టు సభ్యులు నామమాత్రంగా రాణించినా ఆర్సీబీ 14 మ్యాచ్ల్లో కనీసం 9 మ్యాచ్ల్లోనైనా గెలవగలిగేదే. అయితే ఆ నలుగురు మినహాయించి ఒక్కరు కూడా కనీస ప్రదర్శన చేయకపోవడంతో ఆ జట్టుకు ఈ దుస్థితి దాపురించింది. బౌలింగ్లో కర్ణ్ శర్మ (9 వికెట్లు), హసరంగ (9 వికెట్లు), వేన్ పార్నెల్ (9 వికెట్లు), విజయ్కుమార్ వైశాఖ్ (9 వికెట్లు) కాస్త పర్వాలేదనిపించినప్పటికీ, వారి నుంచి ఈ ప్రదర్శనలు సరిపోలేదు. వీరు ఏదో టెయిలెండర్ల వికెట్లు సాధించారే తప్పించి, పరుగులను నియంత్రించలేకపోయారు. పలు మ్యాచ్ల్లో ఆర్సీబీ 200కు పైగా పరుగులు సాధించినప్పటికీ, ఆ స్కోర్లను డిఫెండ్ చేసుకోలేక చతికిలపడింది. ఆర్సీబీ బౌలింగ్ విభాగంలో దారుణంగా విఫలమైన వారిలో ఆల్రౌండర్ అని చెప్పుకునే షాబాజ్ అహ్మద్ (10 మ్యాచ్ల్లో ఒక్క వికెట్, 42 పరుగులు), హర్షల్ పటేల్ (8 వికెట్లు) ముఖ్యులు. వీరిలో మరి ముఖ్యంగా హర్షల్ పటేల్ తన స్థాయికి తగ్గట్టుగా రాణించకపోగా, ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ ఏడాది ఆర్సీబీ వైఫల్యాలకు ముఖ్య కారకులుగా చెప్పుకునే బ్యాటింగ్ హీరోల గురించి మాట్లాడుకోవాలి. గతేడాది ప్రదర్శనతో గ్రేట్ ఫినిషర్గా కీర్తించబడిన దినేశ్ కార్తీక్ (13 మ్యాచ్ల్లో 140 పరుగులు, 4 డకౌట్లు).. ఈ ఏడాది అత్యంత దారుణంగా విఫలమై, ఆర్సీబీ ఓటములకు ప్రత్యక్ష కారణమయ్యాడు. డీకే తన స్థాయికి తగ్గట్టుగా ఆడి ఉంటే ఆర్సీబీ సునాయాసంగా మరో 2 మ్యాచ్లు గెలిచేది. బ్యాటింగ్ విభాగంలో ఘోరంగా విఫలమైన మరో 4 ఆటగాళ్లు.. మహిపాల్ లోమ్రార్ (12 మ్యాచ్ల్లో 135 పరుగులు), షాబాజ్ అహ్మద్ (10 మ్యాచ్ల్లో 42 పరుగులు), అనూజ్ రావత్ (9 మ్యాచ్ల్లో 91), సుయాశ్ ప్రభుదేశాయ్ (5 మ్యాచ్ల్లో 35). వీరు గల్లీ క్రికెటర్ల కంటే హీనంగా బ్యాటింగ్ చేసి జట్టు ఓటముల్లో కీలకపాత్ర పోషించారు. డుప్లెసిస్-కోహ్లి జోడీ తొలి వికెట్కు రికార్డు స్థాయి భాగస్వామ్యాలు నమోదు చేసినప్పటికీ.. వీరు కనీస స్థాయి ఆట కూడా ఆడకుండా విఫలమయ్యారు. మొత్తంగా చూస్తే ఆ నలుగురు (డెప్లెసిస్, కోహ్లి, మ్యాక్స్వెల్, సిరాజ్) మినహాయించి జట్టు మొత్తం విఫలం కావడంతో ఈ ఏడాది ప్లే ఆఫ్స్కు చేరకుండానే ఆర్సీబీ ఖేల్ ఖతమైంది. ఈ ఏడాది ఆర్సీబీ వైఫల్యాల్లో ముఖ్య కారకులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చదవండి: సెమీ ఫైనల్కు వెళ్లే అర్హత ఆర్సీబీకి లేదు: డుప్లెసిస్ వ్యాఖ్యలు వైరల్ -
సెమీ ఫైనల్కు వెళ్లే అర్హత ఆర్సీబీకి లేదు: డుప్లెసిస్ వ్యాఖ్యలు వైరల్
IPL 2023- RCB Knocked Out: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఈసారి కూడా నిరాశే మిగిలింది. పదిహేనేళ్లుగా కళ్లు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానులను నిరాశపరుస్తూ ఐపీఎల్-2023లో ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే ఇంటిబాట పట్టింది. గుజరాత్ టైటాన్స్తో తప్పక గెలవాల్సి ఆదివారం నాటి మ్యాచ్లో మెరుగైన స్కోరు సాధించినా.. శుబ్మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. దీంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, పేసర్ మహ్మద్ సిరాజ్ కన్నీటి పర్యంతమయ్యారు. వీరిని చూసి అభిమానుల హృదయాలు ముక్కలయ్యాయి. చాంపియన్గా నిలుస్తారని ఆశపడితే టాప్-4కి కూడా చేరకపోవడంతో ఆర్సీబీపై విమర్శలు కూడా వచ్చాయి. మాది అత్యుత్తమ జట్టు కాదు ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమణ అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఈ సీజన్ను ఇక్కడితోనే ముగించడం పట్ల బాధగా ఉంది. తీవ్ర నిరాశకు లోనయ్యాను. ఆ అర్హత మాకు లేదు నిజాయితీగా చెప్పాలంటే.. మా ప్రదర్శనను పరిశీలిస్తే మేము అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలవడానికి అర్హులం కాదు. కాకపోతే మాకంటూ కొన్ని గొప్ప విజయాలు ఉండటం నిజంగా మా అదృష్టం. కానీ జట్టుగా మా ప్రదర్శన చూస్తే సెమీ ఫైనల్లో అడుగుపెట్టే అర్హత మాత్రం మాకు లేదు’’ అని ఫాఫ్ డుప్లెసిస్ పేర్కొన్నాడు. తమ వైఫల్యాల గురించి అసంతృప్తి వ్యక్తం చేస్తూ డుప్లెపిస్ మాట్లాడిన వీడియోను ఆర్సీబీ షేర్ చేయగా ట్రెండ్ అవుతోంది. ఆటగాడిగా, కెప్టెన్గా రాణించినా కాగా గతేడాది విరాట్ కోహ్లి నుంచి ఆర్సీబీ పగ్గాలు చేపట్టిన డుప్లెసిస్.. బ్యాటర్గా, సారథిగా అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్-2022లో 468 పరుగులు సాధించాడు. అదే విధంగా జట్టును ప్లే ఆఫ్స్నకు చేర్చాడు. ఇక ఈసారి ఆటగాడిగా అత్యుత్తమంగా రాణించి 730 పరుగులతో ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు. మరోవైపు.. కోహ్లి సైతం బ్యాట్ ఝులిపించి 639 పరుగులు చేశాడు. వీటిలో రెండు శతకాలు ఉండటం విశేషం. కానీ.. ఆర్సీబీ లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టడంతో డుప్లెసిస్కు, అతడి బృందానికి నిరాశ తప్పలేదు. చదవండి: నిజంగా సిగ్గుచేటు.. కఠిన చర్యలు తీసుకుంటాం! శుబ్మన్ సోదరికి అండగా.. IPL 2023: మళ్లీ అవే తప్పులు! ఏం నేర్చుకున్నాడో: టీమిండియా మాజీ ఓపెనర్ RCB v GT Game Day Review Captain Faf, players and the coaches reflect on the #IPL2023 season and send in their gratitude and regards to the 12th Man Army, after match that brought an end to our campaign this year.#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/8Vst2kRZLV — Royal Challengers Bangalore (@RCBTweets) May 22, 2023 -
IPL 2023: ఆర్సీబీ టైటిల్ గెలవదని డుప్లెసిస్ ముందే చెప్పాడు..!
ఐపీఎల్ 2023లో ఆర్సీబీ ప్రస్తానం నిన్నటితో (మే 21) ముగిసింది. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమితో ఆ జట్టు కుంగుబాటుతో లీగ్ నుంచి నిష్క్రమించింది. విరాట్ కోహ్లి సెంచరీ చేయడంతో తప్పక గెలుస్తామనుకున్న మ్యాచ్లో ఆర్సీబీ ఓడింది. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలపై శుభ్మన్ గిల్ నీళ్లు చల్లాడు. ఫలితంగా ఆర్సీబీ ఇంటికి, ముంబై ప్లే ఆఫ్స్కు చేరాయి. ఆర్సీబీ.. ఈ ఏడాది కూడా టైటిల్ గెలవకుండా నిరాశగా వెనుదిరిగిన నేపథ్యంలో ఆ జట్టుకు సంబంధించిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం ట్రెండింగ్లో నిలిచింది. సీజన్ ప్రారంభానికి ముందు ఓ ప్రత్యేక కార్యక్రమం సందర్భంగా ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ "ఈ ఏడాది కప్ లేదు" అని అన్నాడు. ఆర్సీబీ స్లోగన్ "ఈ సాల కప్ నమ్దే"ను డుప్లెసిస్ పొరపాటున "ఈ సాల కప్ నహీ" అని ఉచ్ఛరించాడు. దీంతో పక్కనే ఉన్న కోహ్లి.. డుప్లెసిస్ చేసిన తప్పును నవ్వుతూ సరిచేశాడు. దీనికి సంబంధించిన వీడియోను కొందరు ఆర్సీబీకి, ఆ జట్టు అభిమానులకు ట్యాగ్ చేస్తూ సోషల్మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆర్సీబీ ఈ ఏడాది కూడా టైటిల్ గెలవదని డుప్లెసిస్కు ముందే తెలుసని కామెంట్లు చేస్తున్నారు. కొందరు సరదాగా ఈ వీడియోను షేర్ చేస్తుంటే, కొందరేమో ఆర్సీబీ ఓటమిని తమాషా చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. Even Faf Knows Ee Sala Cup Nahi 😂😂😂😂🙊😂😂😂😂#RCB pic.twitter.com/ZRu3moy66X — Dr Khushboo 🇮🇳 (@khushbookadri) April 1, 2023 తమ జట్టుపై అనవసర ట్రోలింగ్కు దిగుతున్న వారికి ఆర్సీబీ అభిమానులు సైతం ధీటైన సమాధానాలతో బదులిస్తున్నారు. ఆర్సీబీ ఎప్పటికీ టైటిల్ గెలవలేకపోయిన మేము వారితోనే ఉంటామని, కింగ్ కోహ్లి ఎప్పటికీ కింగేనని, డుప్లెసిస్ లాంటి టాలెంటెడ్ ఆటగాడిని హేళన చేస్తే క్రికెట్ అభిమానులు క్షమించరని కౌంటర్లిస్తున్నారు. కాగా, గుజరాత్ టైటాన్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లి వీరోచిత శతకం వృధా అయ్యింది. శుభ్మన్ గిల్ సూపర్ సెంచరీతో గుజరాత్ను గెలిపించాడు. ఆర్సీబీ ఓటమిపాలవ్వడంతో ప్లే ఆఫ్స్కు చేరిన నాలుగో జట్టుగా ముంబై నిలిచింది. రేపు (మే 23) జరుగబోయే క్వాలిఫయర్ 1 మ్యాచ్లో గుజరాత్-సీఎస్కే.. మే 24న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో-ముంబై.. మే 26న జరిగే క్వాలిఫయర్ 2లో క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు-ఎలిమినేటర్లో గెలిచిన జట్టు.. మే 28న జరిగే ఫైనల్లో క్వాలిఫయర్ 1 విన్నర్-క్వాలిఫయర్ 2 విన్నర్లు తలపడతాయి. చదవండి: ఇంగ్లండ్కు బయల్దేరనున్న విరాట్ కోహ్లి -
అతడే మా కొంపముంచాడు : ఆర్సీబీ కెప్టెన్
-
అతడే మా కొంపముంచాడు.. చాలా బాధగా ఉంది! కోహ్లి మాత్రం అద్బుతం: ఆర్సీబీ కెప్టెన్
ఐపీఎల్-2023 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంటిముఖం పట్టింది. గుజరాత్ టైటాన్స్తో జరిగిన డూ ఆర్డై మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమిపాలైంది. తద్వారా ప్లేఆప్స్ రేసు నుంచి బెంగళూరు నిష్క్రమించింది. 198 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఆర్సీబీ బౌలర్లు విఫలమయ్యారు. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కేవలం 19.1 ఓవర్లలోనే ఛేదించింది. గుజరాత్ ఓపెనర్ శుబ్మన్ గిల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. గిల్ 52 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 104 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అంతకుముందు ఆర్సీబీ ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లి(101) కూడా సెంచరీతో మెరిశాడు. ఇక కీలక మ్యాచ్లో ఓటమిపై ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ స్పందించాడు. శుబ్మన్ గిల్ తన అద్భుత సెంచరీతో మ్యాచ్ను తమనుంచి దూరం చేశాడు అని డుప్లెసిస్ తెలిపాడు. "ఈ మ్యాచ్లో ఓటమి పాలవ్వడం మమ్నల్ని తీవ్రంగా నిరాశపరిచింది. మేము అత్యుత్తమ జట్టుతో ఈ మ్యాచ్లో బరిలోకి దిగాం. సెకెండ్ ఇన్నింగ్స్లో మంచు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. బంతి ఈజీగా బ్యాట్పైకి వచ్చింది. అయితే తొలి ఇన్నింగ్స్లో కూడా మంచు ప్రభావం ఉంది కానీ.. సెకెండ్ హాఫ్లో మాత్రం ఇంకా ఎక్కువగా ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్లో మేము రెండు సార్లు బంతిని మార్చాం. బౌలర్లకు అంత గ్రిప్ దొరకలేదు. విరాట్ తన అద్భుత ఇన్నింగ్స్తో మాకు మంచి స్కోర్ను అందించాడు. కానీ శుబ్మాన్ మాత్రం తన విరోచిత సెంచరీతో మ్యాచ్ను మా నుంచి దూరం చేశాడు. మేము ఈ ఏడాది సీజన్ మొత్తం టాపార్డ్లో రాణించనప్పటకీ.. మిడిలార్డర్లో మాత్రం దారుణంగా విఫలమయ్యాం. గతేడాది కార్తీక్ ఫినిషర్ పాత్ర పోషించాడు. కానీ ఈ సారి మాత్రం భిన్నంగా ఆడాడు. అదే విధంగా పవర్ప్లేతో పాటు డెత్ ఓవర్లలో కూడా వికెట్లు సాధించలేకపోయాం. కొన్ని విభాగాల్లో మేము కాస్త మెరుగవ్వాలి" అని పోస్ట్మ్యాచ్ ప్రేంజేటేషన్లో డుప్లెసిస్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: ప్లే ఆఫ్స్ నుంచి ఆర్సీబీ ఔట్.. కోహ్లిని మరోసారి టార్గెట్ చేసిన నవీన్! ఛీ అసలు నీవు Shubman Gill seals off the chase with a MAXIMUM 👏🏻👏🏻@gujarat_titans finish the league stage on a high 😎#TATAIPL | #RCBvGT pic.twitter.com/bZQJ0GmZC6 — IndianPremierLeague (@IPL) May 21, 2023 -
RCB VS GT: ఆర్సీబీ ఫ్యాన్స్కు బ్యాడ్న్యూస్.. వర్షం ముప్పు..?
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ (రాత్రి 7:30) అత్యంత కీలక సమరం జరుగనుంది. ఈ మ్యాచ్లో లోకల్ టీమ్ ఆర్సీబీ.. టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు చేరాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సి ఉంది. ఇలాంటి కీలక మ్యాచ్కు ముందు ఆర్సీబీని ఓ అంశం తీవ్రంగా కలవరపెడుతుంది. ఈ మ్యాచ్కు వర్షం ముంపు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మ్యాచ్ సమయానికి ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని యాక్యూ వెదర్ చూపిస్తుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యపడకపోయినా లేక ఆటంకం కలిగినా ఆర్సీబీ తీవ్ర నష్టంగా పరిగణించబడుతుంది. మ్యాచ్ రద్దైతే ఆర్సీబీ, గుజరాత్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. అప్పుడు ఆర్సీబీ ఖాతాలో 15 పాయింట్లు ఉంటాయి. ఇది జరిగి, సన్రైజర్స్పై ముంబై గెలిస్తే.. ఆ జట్టు 16 పాయింట్లతో నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. ఈ సమీకరణల నేపథ్యంలో నేటి మ్యాచ్ వరుణుడు ఆటంకం లేకుండా సాగాలని ఆర్సీబీ అభిమానులు దేవుళ్లను వేడుకుంటున్నారు. కాగా, గుజరాత్ (18),సీఎస్కే (17), లక్నో (17) ఇదివరకే ప్లే ఆఫ్స్కు చేరుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2023 కీలక దశకు చేరిన తరుణంలో ఆర్సీబీ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. బ్యాటర్లు విరాట్ కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్స్వెల్ ఓ రేంజ్లో ఇరగదీస్తున్నారు. గత మ్యాచ్లో విరాట్ సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. డుప్లెసిస్, మ్యాక్స్వెల్, బ్రేస్వెల్ రాణిస్తున్నారు. బౌలింగ్లో సిరాజ్, పార్నెల్, హసరంగ, హాజిల్వుడ్ పర్వాలేదనిపిస్తున్నారు. వర్షం నుంచి ఎలాంటి ఆటంకం కలగకపోతే ఈ మ్యాచ్లో ఆర్సీబీ తప్పక గెలుస్తుందని ఆ జట్టు అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఆర్సీబీ.. గెలిచి నిలుస్తుందా లేక ఓడి నిష్క్రమిస్తుందా అన్నది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాలి. చదవండి: MI Vs SRH: ముంబైకి చావోరేవో.. యువ బ్యాటర్ రీఎంట్రీ! ఉమ్రాన్కు ‘లాస్ట్’ ఛాన్స్! -
కోహ్లి భారీ సిక్సర్.. పాపం నితీశ్రెడ్డి! డుప్లెసిస్ రియాక్షన్ వైరల్
IPL 2023 SRH Vs RCB- Virat Kohli: సింహంతో ఆట.. పులి వేట ఎప్పుడూ ప్రమాదకరమే! అలాగే విరాట్ విశ్వరూపం ప్రదర్శిస్తే ప్రత్యర్థి జట్టు వణికిపోవాల్సిందే. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే ఎలాంటి బాల్ వేయాలో తెలియక బౌలర్లు తలలు పట్టుకోవాల్సిందే! ఐపీఎల్-2023లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లకు ఈ విషయం అనుభవంలోకి వచ్చింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లి ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి సెంచరీతో మెరిశాడు. 63 బంతులు ఎదుర్కొని 100 పరుగులు చేసిన కోహ్లి ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. సన్రైజర్స్ విధించిన 187 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్తో కలిసి ఈ ఓపెనర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపిస్తూ.. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం పంచాడు. ముఖ్యంగా సన్రైజర్స్ పేసర్ నితీశ్కుమార్ రెడ్డి బౌలింగ్లో కోహ్లి బాదిన భారీ సిక్సర్(103 మీటర్లు) హైలైట్గా నిలిచింది. అరంగేట్రం చేసిన నితీశ్రెడ్డి ఆర్సీబీతో గురువారం నాటి మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్లో అరంగేట్రం చేసిన 19 ఏళ్ల ఆంధ్ర ప్లేయర్ బౌలింగ్లో కోహ్లి తొమ్మిదో ఓవర్ తొలి బంతిని సిక్సర్గా మలిచాడు. కోహ్లి అద్భుతమైన షాట్కు ప్రేక్షకులే కాదు కోహ్లి ఓపెనింగ్ పార్ట్నర్ డుప్లెసిస్ కూడా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. కోహ్లి భారీ సిక్సర్.. డుప్లెసిస్ రియాక్షన్ అదుర్స్ కోహ్లి ఈ మేరకు భారీ షాట్ బాదగానే.. ‘‘వావ్.. నమ్మలేకపోతున్నా’’ అన్నట్లు డుప్లెసిస్ ఇచ్చిన రియాక్షన్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో డుప్లెసిస్ 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 71 పరుగులు చేశాడు. కోహ్లి, డుప్లెసిస్ అద్భుత ప్రదర్శన కారణంగా 19.2 ఓవర్లలోనే టార్గెట్ను ఛేజ్ చేసింది. సన్రైజర్స్పై 8 వికెట్ల తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్స్నకు చేరువైంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలిచిన ఆర్సీబీ ఇక ఆర్సీబీతో మ్యాచ్తో అరంగేట్రం చేసిన నితీశ్కుమార్ రెడ్డికి ఈ మ్యాచ్లో రెండు ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్లో మొత్తంగా 19 పరుగులు ఇచ్చాడు ఈ యువ పేసర్. ఉప్పల్ మ్యాచ్లో విజయంతో బెంగళూరు జట్టు 14 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకోగా.. ఓటమిపాలైన సన్రైజర్స్ అట్టడుగున పదో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: అవన్నీ చెత్త మాటలు.. నేను అస్సలు పట్టించుకోను! గర్వంగా ఉంది: కోహ్లి వాళ్లిద్దరే మా ఓటమిని శాసించారు.. లేదంటేనా! చాలా బాధగా ఉంది: మార్కరమ్ The Beauty (& the Beast) of #TATAIPL 😎#SRHvRCB #IPLonJioCinema #Kohli https://t.co/qfCZLvS2f6 pic.twitter.com/Ju0rBsfEIA — JioCinema (@JioCinema) May 18, 2023 ICYMI! A treat for the #RCB fans right here in Hyderabad.@imVkohli goes big with a maximum.#TATAIPL #SRHvRCB pic.twitter.com/KbojxpdFvG — IndianPremierLeague (@IPL) May 18, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2023: కోహ్లి సెంచరీ.. ఆర్సీబీ ఘన విజయం
IPL 2023: SRH Vs RCB Match Live Updates: ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 19.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ను అందుకుంది. కోహ్లి 61 బంతుల్లో శతకంతో వీరవిహారం చేయగా.. డుప్లెసిస్ 47 బంతుల్లో 71 పరుగులతో రాణించాడు. ఈ మ్యాచ్లో విజయంతో ఆర్సీబీ రన్రేట్ను మరింత మెరుగుపరుచుకుంది. 13 ఓవర్లలో ఆర్సీబీ 117/0 ఆర్సీబీ 13 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 117 పరుగులు చేసింది. కోహ్లి 64, డుప్లెసిస్ 54 పరుగులతో ఆడుతున్నారు. కోహ్లి, డుప్లెసిస్ అర్థశతకాలు.. ఆర్సీబీ 108/0 ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో ఆర్సీబీ టార్గెట్ దిశగా సాగుతుంది. కోహ్లి, డుప్లెసిస్లు అర్థశతకాలతో చెలరేగడంతో ఆర్సీబీ 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 108 పరుగులు చేసింది. దంచుతున్న కోహ్లి, డుప్లెసిస్.. ఆర్సీబీ 90/1 187 పరుగుల పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఇన్నింగ్స్ దూకుడుగా ఆరంభించింది. కోహ్లి 46, డుప్లెసిస్ 42 పరుగులతో చెలరేగి ఆడుతున్నారు. ప్రస్తుతం ఆర్సీబీ 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. ఆర్సీబీ టార్గెట్ 187.. ఆర్సీబీతో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 51 బంతుల్లో 104 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. హ్యారీ బ్రూక్ 27 పరుగులు చేశాడు. ఆర్సీబీ బౌలర్లలో మైకెల్ బ్రాస్వెల్ రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, హర్షల్పటేల్, షాబాజ్ అహ్మద్లు తలా ఒక వికెట్ తీశారు. క్లాసెన్ సెంచరీ.. ఎస్ఆర్హెచ్ 19 ఓవర్లలో 182/4 19 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ నాలుగు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 49 బంతుల్లో శతకం సాధించాడు. 51 బంతుల్లో 104 పరుగులు చేసిన క్లాసెన్ హర్షల్పటేల్ బౌలింగ్లో వెనుదిరిగాడు. క్లాసెన్ ఫిఫ్టీ.. 11 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 95/2 11 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 24 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకోగా.. మార్క్రమ్ 16 పరుగులతో ఆడుతున్నాడు. 33 పరుగులకే రెండు వికెట్లు డౌన్ ఆర్సీబీతో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. మైకెల్ బ్రాస్వెల్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడం విశేషం. తొలుత 11 పరుగులు చేసిన అభిషేక్ శర్మను క్లీన్బౌల్డ్ చేసిన బ్రాస్వెల్.. ఆ తర్వాత 15 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠిని క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. 4 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 27/0 4 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 11, రాహుల్ త్రిపాఠి 15 పరుగులతో ఆడుతున్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గురువారం 65వ మ్యాచ్లో హైదరాబాద్ వేదికగా ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ కన్నా ఆర్సీబీకి చాలా కీలకం. ప్లేఆఫ్ చేరాలంటే మ్యాచ్లో ఆర్సీబీ గెలవడం తప్పనిసరి. సన్రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, కార్తీక్ త్యాగి, మయాంక్ డాగర్, భువనేశ్వర్ కుమార్, నితీష్ రెడ్డి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, మైకేల్ బ్రేస్వెల్, వేన్ పార్నెల్, హర్షల్ పటేల్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్ #RCB won the toss and opted to field first in Hyderabad 🏏 Catch all the action from #SRHvRCB - LIVE & FREE on #JioCinema, available on all sim cards.#EveryGameMatters #TATAIPL #IPLonJioCinema #IPL2023pic.twitter.com/1NmcJyczIb — JioCinema (@JioCinema) May 18, 2023 -
సన్రైజర్స్తో కీలక మ్యాచ్..! బౌలింగ్ చేసిన కోహ్లి.. ‘కేజీఎఫ్’ వీడియో వైరల్
IPL 2023- SRH Vs RCH- Virat Kohli: ఐపీఎల్-2023 ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో గెలిచేందుకు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ భారమంతా కే.జీ.ఎఫ్. (కోహ్లి, గ్లెన్, ఫాఫ్)పై ఉన్న నేపథ్యంలో వీరు ప్రాక్టీసు చేస్తున్న వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. హోరాహోరీ పోరులో కాగా ఈ సీజన్లో ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ ఆరింట గెలిచి 12 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇక డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్నకు అర్హత సాధించగా.. చెన్నై, లక్నో, ముంబై, ఆర్సీబీ మధ్య మిగతా మూడు బెర్తుల కోసం హోరాహోరీ పోటీ ఉంది. రన్రేటు పరంగా మెరుగ్గా ఉన్న రాజస్తాన్ సైతం ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్-ఆర్సీబీ మధ్య మ్యాచ్ ఫలితం కీలకంగా మారింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి అధికారికంగా నిష్క్రమించిన సన్రైజర్స్ ఈ మ్యాచ్లో ఓడిస్తేనే ఆర్సీబీ రేసులో ఉంటుంది. లేదంటే ఆశలు వదులుకోవాల్సిందే! ‘కే.జీ.ఎఫ్.’ ఏం చేస్తుందో మరి! ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్ ప్లేయర్లపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఈ మ్యాచ్లో ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో కోహ్లి.. మాక్సీ, ఫాఫ్నకు బౌలింగ్ చేయడం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ సీజన్లో డుప్లెసిస్ ఇప్పటి వరకు 631 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు. కోహ్లి 438, మాక్సీ 384 పరుగులు చేశారు. సన్రైజర్స్తో మ్యాచ్- ఆర్సీబీ తుది జట్టు (అంచనా) విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్వెల్, అనుజ్ రావత్, వేన్ పార్నెల్, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్. చదవండి: చాలా కష్టంగా ఉంది.. ఒక్కరూ సాయం చేయడం లేదు.. కనీసం: చేతన్ శర్మ -
గతం సన్రైజర్స్కు అనుకూలం, మరి ఆర్సీబీ గెలుస్తుందా..?
ఐపీఎల్ 2023లో భాగంగా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఇవాళ (మే 18) జరుగబోయే కీలక సమరంలో సన్రైజర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలుపుతో సన్రైజర్స్కు ఒరిగేదేమీ లేనప్పటికీ, ఆర్సీబీకి మాత్రం అత్యంత కీలకం. ఈ మ్యాచ్లో గెలిస్తేనే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. లేదంటే పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా మారతాయి. ఆర్సీబీకి మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉన్నా, అది టేబుల్ టాపర్ గుజరాత్తో (మే 21న) కావడం, అదీ భారీ తేడాతో గెలవాల్సి ఉండటం ఆ జట్టుకు పెద్ద సమస్యగా మారుతుంది. ఇక, నేటి మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందో, ఏ జట్టు ఓడుతుందో అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఆర్సీబీపై సన్రైజర్స్ గెలుపోటముల రికార్డు ఘనంగా ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 22 మ్యాచ్లు జరగ్గా.. సన్రైజర్స్ 12, ఆర్సీబీ 9 మ్యాచ్ల్లో గెలుపొందాయి. ఓ మ్యాచ్ రద్దైంది. గతం సన్రైజర్స్కు అనుకూలంగా ఉండటంతో ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలుస్తుందా..లేదా..? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రస్తుత ఫామ్ ప్రకారం సన్రైజర్స్తో పోలిస్తే ఆర్సీబీకే విజయావకాశాలు అధికంగా ఉన్నప్పటికీ.. ఆ జట్టు పూర్తిగా KGF (కోహ్లి, గ్లెన్ మ్యాక్స్వెల్, ఫాఫ్ డుప్లెసిస్)పైనే అధారపడి ఉండటం వారి ఫ్యాన్స్ను కలవరపెడుతుంది. మరోవైపు సన్రైజర్స్ పరిస్థితి సైతం ఏమంత ఆశాజనకంగా లేదు. ఆటగాళ్ల నిలకడలేమి ఆ జట్టు ఓటములకు ప్రధాన కారణంగా మారింది. ఏ ఆటగాడు ఎప్పుడు ఎలా ఆడతాడో వారితో పాటు ఎవరికీ తెలియని పరిస్థితి. KGFతో పాటు సిరాజ్, హాజిల్వుడ్, కర్ణ్ శర్మ తమ ఫామ్ను కొనసాగిస్తే, నేటి మ్యాచ్లో ఆర్సీబీ గెలవడం పెద్ద సమస్య ఏమీ కాకపోవచ్చు. సన్రైజర్స్ ఫ్యాన్స్ సైతం నేటి మ్యాచ్లో ఆర్సీబీనే గెలవాలనుకోవడం విశేషం. తమ జట్టు ఎలాగూ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది కాబట్టి, వారు ఆర్సీబీ గెలిచి ప్లే ఆఫ్స్కు చేరుకోవాలని కోరుకుంటున్నారు. విరాట్ కోహ్లి ఇంతవరకు ఐపీఎల్ టైటిల్ గెలవలేదన్న సానుభూతి అభిమానుల్లో ఉంది. దీంతో ఈ యేడు సన్రైజర్స్ ఫ్యాన్స్ కూడా ఆర్సీబీ మద్దతుదారులుగా మారిపోయారు. ఏది ఎలా ఉన్నా, నేటి మ్యాచ్లో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి. చదవండి: IPL 2023: సన్రైజర్స్తో ఆర్సీబీ మ్యాచ్.. గెలిచిందా నిలుస్తుంది..! -
59 పరుగులకే ఆలౌట్.. రాజస్తాన్ చెత్త రికార్డు! ఐపీఎల్ చరిత్రలో..
IPL 2023 RR vs RCB- Wayne Parnell: ఐపీఎల్-2023లో రాజస్తాన్ రాయల్స్పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సంచలన విజయం సాధించింది. సంజూ శాంసన్ సేనను 59 పరుగులకే కట్టడి చేసి 112 పరుగుల తేడాతో గెలుపొందింది. సొంతమైదానంలో రాజస్తాన్ను చిత్తుచిత్తుగా ఓడించి మరోసారి ఆ జట్టుపై ఆధిపత్యాన్ని చాటుకుంది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకున్న ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కోహ్లి విఫలమైనా జైపూర్ వేదికగా ఆదివారం (మే 14) జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ విరాట్ కోహ్లి 18 పరుగులకు పరిమితం కావడంతో ఫ్యాన్స్ నిరాశచెందారు. అర్ధ శతకాలతో రాణించి అయితే, ఫాఫ్ డుప్లెసిస్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్(55 పరుగులు)తో జట్టును ఆదుకోగా... వన్డౌన్ బ్యాటర్ గ్లెన్ మాక్స్వెల్ అతడికి సహకారం అందించాడు. 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 54 పరుగులు సాధించాడు. మహిపాల్ లామ్రోర్(1), దినేశ్ కార్తిక్ (0) పూర్తిగా విఫలం కాగా.. ఆఖర్లో అనూజ్ రావత్ మెరుపులు మెరిపించాడు. 11 బంతుల్లోనే 29 పరుగులు సాధించి చివరి వరకు అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు స్కోరు చేసింది. ఆరంభంలోనే కోలుకోలేని షాకులు 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ను ఆరంభంలోనే షాకిచ్చాడు ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్. గత మ్యాచ్ హీరో యశస్వి జైశ్వాల్ను డకౌట్ చేశాడు. సిరాజ్ ఆర్సీబీ వికెట్ల ఖాతా తెరవగా.. మరో ఫాస్ట్బౌలర్ వేన్ పార్నెల్ జోష్ను కొనసాగించాడు. జోస్ బట్లర్ను డకౌట్ చేసిన అతడు.. సంజూ శాంసన్ను కూడా పెవిలియన్కు పంపాడు. ఈ క్రమంలో రెండు ఓవర్లు కూడా ముగియక ముందే రాజస్తాన్ 3 వికెట్లు కోల్పోయింది. ఇక బ్రేస్వెల్, కర్ణ్ శర్మ కూడా విజృంభించడంతో వరుసగా వికెట్లు కోల్పోయిన రాజస్తాన్ 10.3 ఓవర్లలో 59 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. చెత్త రికార్డు.. మూడోసారి తద్వారా ఐపీఎల్ చరిత్రలో మూడోసారి అత్యల్ప స్కోరుకే ఆలౌట్ అయిన జట్టుగా చెత్త రికార్డు నమోదు చేసింది. కాగా 2017లో కేకేఆర్తో మ్యాచ్లో 49(కోల్కతాలో), 2009లో ఆర్సీబీ చేతిలో 58 పరుగుల తేడా(కేప్టౌన్)తో రాజస్తాన్ చిత్తైంది. తాజాగా జైపూర్ మ్యాచ్లో 59 పరుగులకే కథ ముగించింది. ఆర్సీబీ బౌలర్లు అదుర్స్ ఇక రాజస్తాన్ తర్వాత అత్యల్ప స్కోరుకు అవుటైన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ కొనసాగుతోంది. 2017లో ఢిల్లీలో ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఢిల్లీ 66 పరుగులకు ఆలౌట్ అయింది. కాగా రాజస్తాన్తో తాజా మ్యాచ్లో 3 ఓవర్ల బౌలింగ్ కోటాలో కేవలం 10 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీసిన వేన్ పార్నెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆర్సీబీ మిగతా బౌలర్లలో సిరాజ్, మాక్సీ ఒక్కో వికెట్ తీయగా.. బ్రేస్వెల్, కర్ణ్ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టారు. చదవండి: సీఎస్కేను ఓడించే సత్తా ఆ ఒక్క జట్టుకే ఉంది: ఆకాష్ చోప్రా సెంచరీ చేసినా.. స్కోరు జీరో అయినా భయ్యా అంతే! ఆరోజు బాగా ఏడ్చేశాను.. 𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦! The Anuj Rawat direct-hit that left everyone in disbelief 🔥🔥 Check out the dismissal here 🔽 #TATAIPL | #RRvRCB pic.twitter.com/2GWC5P0nYP — IndianPremierLeague (@IPL) May 14, 2023 -
డుప్లెసిస్ అరుదైన ఘనత.. నాలుగో విదేశీ ప్లేయర్గా
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో 4వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో విదేశీ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఆదివారం రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో అశ్విన్ బౌలింగ్లో ఫోర్ కొట్టడం ద్వారా డుప్లెసిస్ ఐపీఎల్లో 4వేల పరుగుల మార్క్ను అందుకున్నాడు. ఇక డుప్లెసిస్ కంటే ముందు ముగ్గురు బ్యాటర్లు ఈ ఫీట్ సాధించారు. మొదటిస్థానంలో డేవిడ్ వార్నర్ 174 మ్యాచ్ల్లో 6265 పరుగులతో ఉండగా.. 184 మ్యాచ్ల్లో 5162 పరుగులుతో ఏబీ డివిలియర్స్ రెండో స్థానంలో, క్రిస్గేల్ 142 మ్యాచ్ల్లో 4965 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక డుప్లెసిస్ మాత్రం 128 మ్యాచ్ల్లో 4వేల పరుగుల మార్క్ను అందుకున్నాడు. ఈ సీజన్లో డుప్లెసిస్ సూపర్ఫామ్ కనబరుస్తున్నాడు. తాజాగా రాజస్తాన్తో మ్యాచ్లో అర్థశతకం సాధించిన డుప్లెసిస్కు ఇది ఏడోది. 12 మ్యాచ్ల్లో 608 పరుగులతో లీడింగ్ టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. చదవండి: #DC:ప్లేఆఫ్ రేసు నుంచి ఔట్.. ఆరంభం నుంచి అన్ని మైనస్లే హెచ్సీఏను ఏకిపారేసిన సునీల్ గావస్కర్ -
ఒక్కసారి కుదురుకుంటే అతడిని ఆపడం ఎవరి తరం కాదు.. మేము కనీసం!
IPL 2023 MI vs RCB: ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ప్రశంసలు కురిపించాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే అతడి ఆపడం ఎవరితరం కాదని పేర్కొన్నాడు. స్కై ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడని.. బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు. ఐపీఎల్-2023లో భాగంగా ముంబైతో ఆర్సీబీ మంగళవారం తలపడిన విషయం తెలిసిందే. ఉఫ్మని ఊదేసిన ముంబై ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు స్కోరు చేసింది. ఈ క్రమంలో ముంబై 16.3 ఓవర్లలోనే కేవలం 4 వికెట్లు నష్టపోయి.. ఆర్సీబీ విధించిన లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. కేవలం 35 బంతుల్లోనే 83 పరుగులు రాబట్టాడు. అతడి ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ఇలా విధ్వంసకర ఇన్నింగ్స్తో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డ సూర్య ముంబైకి మర్చిపోలేని విజయం అందించాడు. కనీసం 20 పరుగులు చేసి ఉంటే ఇక మెరుగైన స్కోరు నమోదు చేసిప్పటికీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయిన ఆర్సీబీ.. 6 వికెట్ల తేడాతో ఓటమి పాలై పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి దిగజారింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఆర్సీబీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ.. తాము మరో 20 పరుగులు స్కోర్ చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. ‘‘వికెట్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. ముంబై పటిష్ట జట్టు. అందులోనూ వారి సొంతమైదానం. మేము 20 పరుగులు చేస్తే పరిస్థితి వేరేలా ఉండేది. ముంబైలాంటి జట్టు ముందు భారీ లక్ష్యం ఉంచితేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలం. నిజానికి ఆఖరి ఐదు ఓవర్లలో మేము సరిగా ఆడలేకపోయాం. 200 అనేది మెరుగైన స్కోరు అని చెప్పగలం. డుప్లెసిస్, సూర్య (PC: IPL) అతడు అద్భుతం మనకు మనం సర్దిచెప్పుకోవడానికి మాత్రమే అలా అనుకోవాల్సి ఉంటుంది! నిజానికి వాళ్లు మొదటి ఆరు ఓవర్ల(62/2)ను చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ముఖ్యంగా స్కై(సూర్య) బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. సూపర్ ఫామ్లో ఉన్న అతడిని ఆపడం ఎవరితరం కాలేదు. ఇక సిరాజ్ ఐపీఎల్ ఆరంభం నుంచి బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదుర్కోకతప్పదు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. బ్యాటర్లు కూడా ఇంకాస్త మెరుగుపడాల్సి ఉంది. పవర్ప్లేలో కనీసం 60 పరుగులు రాబడితేనే పోటీలో నిలవగలం’’ అని ఫాఫ్ డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్లో ఆర్సీబీ పేసర్లు సిరాజ్, హర్షల్ పటేల్ పూర్తిగా తేలిపోయి విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ఆర్సీబీ తరఫున 1000 పరుగులు ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో 41 బంతులు ఎదుర్కొన్న ఆరెంజ్ క్యాప్ హోల్డర్ ఫాఫ్.. 5 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 65 పరుగులు సాధించాడు. ఆర్సీబీ తరఫు 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కాగా గతేడాది బెంగళూరు సారథిగా పగ్గాలు చేపట్టిన ఫాఫ్ బ్యాటర్గానూ, కెప్టెన్గానూ తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లి కేవలం ఒకే పరుగుకు పరిమితం కావడం కూడా ప్రభావం చూపింది. చదవండి: Virat Kohli: చిల్లర వేషాలు మానుకో! లేదంటే ఐపీఎల్లోనే లేకుండా పోతావ్! MI Vs RCB: కాలం మారుతుంది! సూర్య అవుట్ కాగానే దగ్గరికి వచ్చిన కోహ్లి.. వీడియో వైరల్ ఆర్సీబీకి పట్టిన దరిద్రం.. ఇకనైనా అతడిని వదిలేయండి! లేదంటే మీ కర్మ! Faf Du Plessis in IPL 2023: - 73(43) vs MI - 23(12) vs KKR - 79*(46) vs LSG - 22(16) vs DC - 62(33) vs CSK - 84(56) vs PBKS - 62(39) vs RR - 17(7) vs KKR - 44(40) vs LSG - 45(32) vs DC - 65(41) vs MI Captain, Leader, Legend, Faf. pic.twitter.com/KXXoHlc6pA — Johns. (@CricCrazyJohns) May 9, 2023 Up Above The World So High Like A Diamond His Name Is SKY 🤩#TATAIPL | #MIvRCB | @surya_14kumar | @mipaltan pic.twitter.com/EgUDqe7aao — IndianPremierLeague (@IPL) May 9, 2023 -
క్యాచ్ డ్రాప్.. రోహిత్ కోపానికి అర్థముంది!
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే డుప్లెసిస్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. డుప్లెసిస్ ఇచ్చిన క్యాచ్ను నెహాల్ వదేరా జారవిడిచాడు. ఓవర్ నాలుగో బంతిని మిడ్వికెట్ దిశగా ఆడగా.. అక్కడే ఉన్న వదేరా చేతిలోకి వచ్చిన క్యాచ్ను వదిలేశాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ వదేరాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోహిత్ ఆగ్రహానికి ఒక కారణం ఉంది. ఈ సీజన్లో డుప్లెసిస్ టాప్ స్కోరర్గా ఉన్నాడు. 10 మ్యాచ్లాడి 511 పరుగులు సాధించిన డుప్లెసిస్ ఆరెంజ్ క్యాప్తో కొనసాగుతున్నాడు. అతని ఖాతాలో ఐదు అర్థసెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోరు 84గా ఉంది. సున్నా వద్ద ఉన్నప్పుడే డుప్లెసిస్ ఔట్ అయితే ముంబైకి ప్రమాదం తప్పేదని రోహిత్ భావించాడు. అందుకే వదేరా క్యాచ్ వదిలేయగానే తన కోపాన్ని బయటపెట్టాడు. Nehal Wadhera dropped an easy catch of Faf (the orange cap holder) at mid-wicket & Rohit Sharma was annoyed with that 😑#TATAIPL | #IPL2023 | #MIvsRCB pic.twitter.com/8zYFIyfrVE — CricWatcher (@CricWatcher11) May 9, 2023 చదవండి: రిటైర్మెంట్పై తొందరేం లేదు.. ఐపీఎల్-2023 గెలిచి ఇంకో ఏడాది ఆడతా..! ధోనిలా ఉన్నాడు.. 2040లో ఇదే జరగొచ్చు! -
సూర్య 'ప్రతాపం'.. ముంబై ఇండియన్స్ ఘన విజయం
ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 200 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 16.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. సూర్యకుమార్ 35 బంతుల్లో 85, ఏడు ఫోర్లు. ఆరు సిక్సర్లు తన ఐపీఎల్ కెరీర్లో బెస్ట్ ఇన్నింగ్స్ ఆడగా.. నెహాల్ వదేరా 34 బంతుల్లో 52 నాటౌట్ యాంకర్ రోల్ పాత్ర పోషించాడు. అంతకముందు ఇషాన్ కిషన్ 41 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆర్సీబీ బౌలర్లలో హసరంగా, విజయ్కుమార్ వైశాక్లు చెరో రెండు వికెట్లు తీశారు. సూర్యకుమార్ అర్థశతకం.. ముంబై 174/2 సూర్యకుమార్ తన సూపర్ ఫామ్ను కంటిన్యూ చేస్తున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్లో సూర్య అర్థశతకంతో మెరిశాడు. 26 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న సూర్యకుమార్ ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 15 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేసింది. నెహాల్ వదేరా 44 పరుగులతో ఆడుతున్నాడు. 10 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 99/2 10 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. సూర్యకుమార్ 18, వదేరా 25 పరుగులుతో ఆడుతున్నారు. టార్గెట్ 200.. ముంబై ఇండియన్స్ 62/2 200 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. నెహాల్ వదేరా 6, సూర్యకుమార్ రెండు పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు రోహిత్(7 పరుగులు), ఇషాన్ కిషన్(41 పరుగులు)హసరంగా బౌలింగ్లోనే వెనుదిరిగారు. Photo Credit : IPL Website ముంబై ఇండియన్స్ టార్గెట్ 200 ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. మ్యాక్స్వెల్ 68, డుప్లెసిస్ 65 పరుగులతో రాణించగా.. ఆఖర్లో కార్తిక్ 18 బంతుల్లో 30 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఆర్సీబీ 199 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ బౌలర్లో జాసన్ బెహండార్ఫ్ మూడు వికెట్లు తీయగా.. కుమార్ కార్తికేయ, జోర్డాన్, గ్రీన్ తలా ఒక వికెట్ పడగొట్టారు. 18 ఓవర్లలో ఆర్సీబీ 185/5 18 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ ఐదు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. దినేశ్ కార్తిక్ 17 బంతుల్లో 30, కేదార్ జాదవ్ 10 పరుగులతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website 14 ఓవర్లలో ఆర్సీబీ 146/4 ఒక్క పరుగు మాత్రమే చేసిన లామ్రోర్ కుమార్ కార్తికేయ బౌలింగ్లో వెనుదిరగడంతో ఆర్సీబీ నాలుగో వికెట్ నష్టపోయింది.ప్రస్తుతం ఆర్సీబీ 14 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. డుప్లెసిస్ 65 పరుగులు, దినేశ్ కార్తిక్ ఒక్క పరుగుతో ఆడుతున్నారు. అంతకముందు 33 బంతుల్లో 68 పరుగులతో విధ్వంసం సృష్టించిన గ్లెన్ మ్యాక్స్వెల్ ఔట్ కావడంతో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. బెహండార్ఫ్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన మ్యాక్సీ.. నెహాల్ వదేరాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. Photo Credit : IPL Website మ్యాక్స్వెల్ ఫిఫ్టీ.. ఆర్సీబీ 104/2 ఆర్సీబీ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో అర్థసెంచరీతో మెరిశాడు. 25 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న మ్యాక్స్వెల్ ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. అతని ధాటికి ఆర్సీబీ 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. డుప్లెసిస్ 44 పరుగులతో ఆడుతున్నాడు. Photo Credit : IPL Website 6 ఓవర్లలో ఆర్సీబీ 56/2 ఆరు ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. డుప్లెసిస్ 26, మ్యాక్స్వెల్ 23 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఆరు పరుగులు చేసిన అనూజ్ రావత్ బెహండార్ఫ్ బౌలింగ్లో వెనుదిరిగాడు. Photo Credit : IPL Website తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఆర్సీబీకి ఆదిలోనే షాక్ తగిలింది. ఒక్క పరుగు మాత్రమే చేసిన కోహ్లి బెహండార్ఫ్ బౌలింగ్లో కీపర్ ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది. Photo Credit : IPL Website టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా మంగళవారం ముంబై వేదికగా 54వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్, ఆర్సీబీ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. Hitman wins the toss at Wankhede & asks the King to bat first 😎 Stream #MIvRCB LIVE & FREE with #IPLonJioCinema for any sim card!#TATAIPL #IPL2023 #RohitSharma #ViratKohli | @mipaltan @RCBTweets @imVkohli @ImRo45 pic.twitter.com/1A2wP5mf00 — JioCinema (@JioCinema) May 9, 2023 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, విజయ్కుమార్ వైషాక్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్వుడ్ ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, జాసన్ బెహ్రెండోర్ఫ్ ఈ సీజన్లో ఇరుజట్లు 10 మ్యాచ్ల్లో చెరో ఐదు విజయాలతో ఆరు, ఎనిమిది స్థానాల్లో ఉన్పాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు టాప్-5లో నిలిచే అవకాశం ఉంది. గత మ్యాచ్కు దూరంగా ఉన్న తిలక్ వర్మ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. -
IPL 2023: ఫిల్ సాల్ట్ దెబ్బ.. ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు వికెట్ల తేడాతో విజయాన్నిఅందుకుంది. 182 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ఢిల్లీ 16.4 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ను అందుకుంది. ఫిల్ సాల్ట్ 45 బంతుల్లో 87 పరుగులు, 8 ఫోర్లు, ఆరు సిక్సర్లు విధ్వంసం సృష్టించగా.. రిలీ రొసౌ 22 బంతుల్లో 35 నాటౌట్, మిచెల్ మార్ష్ 17 బంతుల్లో 26 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్, హాజిల్వుడ్, కర్ణ్శర్మలు తలా ఒక వికెట్ తీశారు. విజయం దిశగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీతో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం దిశగా పయనిస్తోంది. 182 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఢిల్లీ 15 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ 83, రిలీ రొసౌ 26 పరుగులతో ఆడుతున్నారు. ఢిల్లీ విజయానికి 30 బంతుల్లో 16 పరుగులు కావాలి 13 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 151/2 13 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ 75, రిలీ రొసౌ 21 పరుగులతో ఆడుతున్నారు. మిచెల్ మార్ష్(26)ఔట్.. రెండో వికెట్ డౌన్ 26 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ హర్షల్ పటేల్ బౌలింగ్లో లామ్రోర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ రెండో వికెట్ నష్టపోయింది. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ 64, రొసౌ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఫిల్ సాల్ట్ మెరుపు అర్థశతకం.. ఢిల్లీ 115/1 ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ 28 బంతుల్లో మెరుపు అర్థశతకం సాధించాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది. మార్ష్ 22 పరుగులతో సహకరిస్తున్నాడు టార్గెట్ 182.. దంచుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ 182 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఆడుతుంది. 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ 44, మిచెల్ మార్ష్ 17 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 22 పరుగులు చేసి వార్నర్ తొలి వికెట్గా వెనుదిరిగాడు. Photo Credit : IPL Website లామ్రోర్ మెరుపులు.. ఆర్సీబీ 20 ఓవర్లలో 181/4 ఆర్సీబీ బ్యాటర్ మహిపాల్ లామ్రోర్ ఐపీఎల్లో తొలి హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కోహ్లి 55 పరుగులు చేయగా.. మహిపాల్ లామ్రోర్(29 బంతుల్లో 54 నాటౌట్, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు) రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ రెండు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్ చెరొక వికెట్ తీశారు. Photo Credit : IPL Website కోహ్లి (55)ఔట్.. ఆర్సీబీ 137/3 ఆర్సీబీ ఓపెనర్ విరాట్ కోహ్లి సీజన్లో ఆరో అర్థసెంచరీతో మెరిశాడు. 42 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న కోహ్లి ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు ఉన్నాయి. 55 పరుగులు చేసిన కోహ్లి ముకేశ్ కుమార్ బౌలింగ్లో ఖలీల్ అహ్మద్కు క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆర్సీబీ 16 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. మహిపాల్ లామ్రోర్ 34 పరుగులతో క్రీజులో ఉన్నాడు. Photo Credit : IPL Website మ్యాక్స్వెల్ గోల్డెన్ డక్.. వరుస బంతుల్లో రెండు వికెట్లు ఆర్సీబీతో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ మిచెల్ మార్ష్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. తొలుత 45 పరుగులు చేసిన డుప్లెసిస్ మిచెల్ మార్ష్ బౌలింగ్లో అక్షర్ పటేల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఆర్సీబీ 82 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. తర్వాతి బంతికే మ్యాక్స్వెల్ను గోల్డెన్ డక్గా వెనుదిరిగడంతో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. Photo Credit : IPL Website 7 ఓవర్లలో ఆర్సీబీ 57/0 ఏడు ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. కోహ్లి 25, డుప్లెసిస్ 32 పరుగులతో క్రీజులో ఉన్నారు. కోహ్లి 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఐపీఎల్లో ఏడువేల పరుగులు మైలురాయిని అందుకున్నాడు. Photo Credit : IPL Website 4 ఓవర్లలో ఆర్సీబీ 23/0 4 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. కోహ్లి 20, డుప్లెసిస్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. కోహ్లి 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఐపీఎల్లో ఏడువేల పరుగులు మైలురాయిని అందుకున్నాడు. Photo Credit : IPL Website టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ ఐపీఎల్ 16వ సీజన్లో శనివారం డబుల్ హెడర్లో భాగంగా ఢిల్లీ వేదికగా 50వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్(కెప్టెన్), ఫిలిప్ సాల్ట్(వికెట్కీపర్), మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, మనీష్ పాండే, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్కీపర్), కేదార్ జాదవ్, వనిందు హసరంగా, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్వుడ్ వరుస విజయాలతో దుమ్మురేపుతున్న ఆర్సీబీ టాప్-4లో అడుగుపెట్టేందుకు యత్నిస్తోంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం తమ పరాజయాల పరంపరను కొనసాగిస్తూనే ఉంది. ఇక గత రికార్డులు పరిశీలిస్తే.. ఇరుజట్లు 29 సార్లు తలపడగా.. 18 మ్యాచ్ల్లో ఆర్సీబీ.. 10 మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ నెగ్గాయి. ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు. ఇక కోట్లా మైదానంలో ఆర్సీబీకి మంచి రికార్డు ఉంది. ఇక్కడ ఢిల్లీతో ఆడిన 9 మ్యాచ్ల్లో ఆరింటిని నెగ్గడం విశేషం. -
IPL 2023: ఈ సాలా కప్ నమదే, రాసి పెట్టుకోండి.. లక్కీ మ్యాన్ మాతోనే ఉన్నాడు..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైన నాటి నుండి 'ఈ సాలా కప్ నమదే'.. ఈ సాలా కప్ నమదే అంటూ ఆర్సీబీ అభిమానులు హడావుడి చేయడం చూస్తూనే ఉన్నాం. 15 సీజన్లు అయిపోయినా ఆ జట్టు ఇంతవరకు ఒక్క టైటిల్ కూడా సాధించింది లేదు కానీ, ఆ జపం మాత్రం వదలడం లేదు. 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్కు చేరినా ఆర్సీబీకి అదృష్టం కలిసి రాలేదు. ప్రస్తుత సీజన్లోనూ ఆర్సీబీ అభిమానులు అదే స్లోగన్ చెప్తూ ఊదరగొడుతున్నారు. ప్రస్తుత సీజన్లో వారికి అశించిన ఫలితాలు రాకపోయినా, చెత్త జట్టుతో (KGFS (కోహ్లి,మ్యాక్సీ, డుప్లెసిస్,సిరాజ్) మినహా) అతి కష్టం మీద నెట్టుకొస్తున్నా ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం ఈ సాలా కప్ నమదే అని ధీమాగా చెబుతున్నారు. పైగా నిన్న (మే 1) లక్నోపై విజయానంతరం వారి వాయిస్లో బేస్ పెరిగింది. ఈ సాలా కప్ నమదే అంటూ ఇంకా గట్టిగా వాదిస్తున్నారు. వారి కాన్ఫిడెన్స్కు కారణం ఏంటని ఆరా తీస్తే.. చాలామంది ఓ ఆటగాడి పేరు చెబుతున్నారు. అతడే ఆర్సీబీ వెటరన్ స్పిన్నర్ కర్ణ్ శర్మ. కర్ణ్ శర్మ ఎక్కడ ఉంటే ఆ జట్టు టైటిల్ గెలవడం మనం చూశాం. ఇతగాడు 2016 (సన్రైజర్స్ హైదరాబాద్), 2017 (ముంబై ఇండియన్స్), 2018 (సీఎస్కే), 2021 (సీఎస్కే) సీజన్లలో వివిధ విన్నింగ్ టీమ్లలో భాగంగా ఉన్నాడు. ఐపీఎల్లో కర్ణ్ శర్మను మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్గా పేరుంది. ఆర్సీబీ అభిమానులు ప్రస్తుతం కర్ణ్ శర్మ సెంటిమెంట్ పైనే గంపెడాశలు పెట్టుకున్నారు. పైగా ప్రత్యర్ధులు ఈ ఏడాది తమను తక్కువ అంచనా వేయడం కూడా కలిసొస్తుందని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో (9 మ్యాచ్ల్లో 5 విజయాలు) ఉన్న ఆర్సీబీ.. తదుపరి మ్యాచ్ల్లో వరుస విజయాలు సాధించి, ఆ తర్వాత టైటిల్ కూడా సాధించి తీరుతుందని ఆర్సీబీ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఈ సాలా కప్ నమదే.. రాసి పెట్టుకోండి అంటూ సోషల్మీడియాను హోరెత్తిస్తున్నారు. మరోవైపు ఆర్సీబీ వ్యతిరేకులు మాత్రం ఆర్సీబీకి అంత సీన్ లేదని, కర్ణ్ శర్మ గతేడాది కూడా వారితోనే ఉన్నాడు, అప్పుడు కానిది ఇప్పుడెలా కుదురుతుందని పంచ్లు వేస్తున్నారు. మరికొందరైతే దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్ లాంటి దిగ్గజాలను జట్టులో ఉంచుకుని టైటిల్ సాధించాలనుకోవడం అత్యాశే అవుతుందని సెటైర్లు వేస్తున్నారు. మరి ఫ్యాన్స్ నమ్మకాన్ని ఆర్సీబీ నీలబెడుతుందో, నీరుగారుస్తుందో వేచి చూడాలి. -
అదే మాకు కలిసొచ్చింది.. నాకు ముందే తెలుసు ఇలా జరుగుతుందని: డుప్లెసిస్
ఐపీఎల్-2023లో భాగంగా వాజ్పేయి ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించిన విషయం తెలిసిందే. కేవలం 127 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా కాపాడుకోగలిగారు. 127 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో కేవలం 108 పరుగులకే కుప్పకూలింది. ఇక సంచలన విజయంపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ స్పందించాడు. లక్నో వంటి వికెట్పై తొలుత బ్యాటింగ్ చేయడం తమకు కలిసొచ్చిందని డుప్లెసిస్ తెలిపాడు. "మా హోం గ్రౌండ్ చిన్నస్వామి వికెట్కు ఇక్కడి వికెట్ పూర్తి వ్యతిరేకం. మేము ఈ మ్యాచ్లో తొలత 6 ఓవర్లు బాగా ఆడాం. విరాట్తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పడం సంతోషంగా ఉంది. అదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అనుకుంటా. ఎందుకంటే మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్కు చాలా కష్టంగా ఉంది. ఇటువంటి పిచ్లపై తొలుత బ్యాటింగ్ చేయడం చాలా ముఖ్యం. 135 పరుగులు చేస్తే చాలు ఈ వికెట్పై మంచిస్కోర్ అవుతుందని భావించాను. ఇదే విషయం నేను కార్తీక్ మాట్లాడుకున్నాం. కానీ దురదృష్టవశాత్తూ మేము అనుకున్న మార్క్ను అందుకోలేకపోయాము. అయినప్పటికీ ఫీల్డ్లో అడుగుపెట్టేటప్పుడు మా బాయ్స్తో ఒకే విషయం చెప్పాను. ఈ స్కోర్నే మ్యాచ్ విన్నింగ్ స్కోర్గా భావించండి అని చెప్పా. ఆ మాత్రం స్కోర్ సాధిస్తే విజయం మాదే అని ముందే ఊహించా. ఇక మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. జోష్, కరుణ్ చాలా బౌలింగ్ చేశారు. ఇక ఇదే రిథమ్ను మా తర్వాతి మ్యాచ్ల్లో కొనసాగించేందుకు ప్రయత్నిస్తాం" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో డుప్లెసిస్ పేర్కొన్నాడు. చదవండి: #Virat Kohli: షాకిచ్చిన బీసీసీఐ! పైకి కనబడేదంతా నిజం కాదు.. కోహ్లి పోస్ట్ వైరల్! ఫ్యాన్స్ ఫైర్ Shootout at 𝚆̶𝚊̶𝚍̶𝚊̶𝚕̶𝚊̶ Ekana: 1️⃣9️⃣ wickets, 1️⃣ hamstring injury, unlimited drama & #RCB breaking 💔 in Lucknow#LSGvRCB #TATAIPL #IPLonJioCinema #IPL2023 | @RCBTweets pic.twitter.com/7S2NEdsV9b — JioCinema (@JioCinema) May 1, 2023 -
కనీసం ఒక్క మ్యాచ్లోనైనా నిరూపించుకున్నాడా? మరీ దారుణంగా.. ఇప్పటికైనా
IPL 2023- Dinesh Karthik: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఆట తీరును టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శించాడు. ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లలో కనీసం ఒక్కదాంట్లో కూడా స్థాయికి తగ్గట్లు రాణించలేదని పెదవి విరిచాడు. జట్టు తనపై ఆధారపడొచ్చనే భరోసా ఇవ్వలేకపోయాడంటూ విమర్శలు గుప్పించాడు. అప్పుడు అదుర్స్. .. గత సీజన్లో ఆర్సీబీ ఫినిషర్గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించి.. ఐపీఎల్ ప్రదర్శన ద్వారా భారత జట్టులో పునరాగమనం చేశాడు వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్. కానీ పదహారో ఎడిషన్లో సీన్ రివర్స్ అయింది. గతేడాది ఐపీఎల్లో 16 ఇన్నింగ్స్లలో 330 పరుగులు చేసిన డీకే.. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్లలో సాధించినవి కేవలం 83 పరుగులు. ఇప్పుడేమో తుస్ ఈ గణాంకాలను బట్టి దినేశ్ కార్తిక్ ప్రదర్శన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతేడాది ఆర్సీబీకి బలంగా ఉన్న డీకే ఈసారి మాత్రం అంచనాలు అందుకోలేకపోతున్నాడు. ఒక్క మ్యాచ్లో కూడా తనదైన ముద్ర వేయలేకపోయాడు. మరోవైపు ఆర్సీబీ భారమంతా విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్వెల్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మీదే పడుతోంది. కేజీఎఫ్పైనే భారం ప్రతిసారీ ఈ ముగ్గురిపైనే ఆధారపడటంతో వీరిలో ఒక్కరు విఫలమైనా ఆర్సీబీ విజయాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘కేజీఎఫ్ (కోహ్లి, గ్లెన్, ఫాఫ్) గనుక ఒకవేళ స్థాయికి తగ్గట్లు రాణించలేని పరిస్థితుల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో ఆర్సీబీ యాజమాన్యం ప్రణాళికలు రచించుకోవాలి. వాళ్లు గనుక విఫలమై జట్టు కష్టాల్లో కూరుకుపోతే బాధ్యతను నెత్తినవేసుకోగల ఆటగాళ్లను తయారుచేసుకోవాలి. ఆ ప్లేయర్ దినేశ్ కార్తికా లేదంటే మహిపాల్ లామ్రోరా అన్న విషయాన్ని పక్కనపెడితే.. ఆర్సీబీ మిడిలార్డర్ మాత్రం పూర్తి బలహీనంగా ఉంది. ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే ముఖ్యంగా కార్తిక్ గత ఎనిమిది మ్యాచ్లలో కనీసం ఒక్క మ్యాచ్లో కూడా జట్టు తనపై ఆధారపడొచ్చు అనే భరోసాను ఇవ్వలేకపోయాడు. మేనేజ్మెంట్ కచ్చితంగా ఈ బ్యాటింగ్ లోపాలను సరిచేసుకోవాలి’’ అని సూచించాడు. లేనిపక్షంలో భారీ మూల్యం తప్పదంటూ ఇర్ఫాన్ హెచ్చరికలు జారీ చేశాడు. కాగా గత మ్యాచ్లో సొంతమైదానంలో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిపాలైన ఆర్సీబీ.. మే 1న లక్నోలో సూపర్ జెయింట్స్తో పోటీకి సిద్ధమైంది. ఈ క్రమంలో గాయపడిన డేవిడ్ విల్లే స్థానంలో కేదార్ జాదవ్ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. చదవండి: Viral: మిస్టర్ కూల్కు ఆగ్రహం! నీకసలు బుద్ధుందా? జట్టులో నుంచి తీసిపారేయండి! MI Vs RR: గ్రహణం వీడింది..! అతడు భవిష్యత్ సూపర్స్టార్.. నో డౌట్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అవమాన భారంతో తలెత్తుకోలేకపోతున్న ఆర్సీబీ ఫ్యాన్స్.. డీకే, షాబాజ్పై ఫైర్
సొంత మైదానంలో పరాజయాల (లక్నో, సీఎస్కే, కేకేఆర్ చేతుల్లో) నేపథ్యంలో ఆర్సీబీ అభిమానులు తెగ ఫీలైపోతున్నారు. తమ ఆటగాళ్ల చెత్త ప్రదర్శన కారణంగా వారు తలెత్తుకోలుకపోతున్నారు. సొంత ఇలాకాలో ఇదేం కర్మ రా బాబు అనుకుంటూ అవమాన భారంతో కుంగిపోతున్నారు. సొంత జట్టుకే వ్యతిరేకంగా సోషల్మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. KGFను (కోహ్లి, గ్లెన్ మ్యాక్స్వెల్, ఫాప్ డుప్లెసిస్) మినహాయించి మిగతా ఆటగాళ్లందరిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ముఖ్యంగా దినేశ్ కార్తీక్, షాబజ్ అహ్మద్లపై తారా స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. వీరి వల్లే ఆర్సీబీ విజయాలకు దూరమవుతుందని మండిపడుతున్నారు. వీరు సరిగ్గా ఆడకపోగా.. ఇతరులను కూడా భ్రష్ఠుపట్టిస్తున్నారని (రనౌట్లు, మిస్ ఫీల్డింగ్లు, క్యాచ్లు జారవిడచడం వంటివి) తూర్పారబెడుతున్నారు. నిన్న కేకేఆర్తో జరిగిన మ్యాచ్ గురించి ప్రస్తావిస్తూ.. దినేశ్ కార్తీక్ను (18 బంతుల్లో 22, సుయాశ్ రనౌట్కు కారకుడు), షాబాజ్ అహ్మద్ను (5 బంతుల్లో 2, ఒకే ఓవర్లో 25 పరుగులు సమర్పించుకున్నాడు) పరుష పదజాలంతో దూషిస్తున్నారు. చదవండి: #JasonRoy: 4 బంతుల్లో నాలుగు సిక్సర్లు.. షాబాజ్ అహ్మద్ను ఉతికారేశాడు వీరి వల్లే తాము సొంత మైదానంలో తలెత్తుకోలేకపోతున్నామని వాపోతున్నారు. ఇక చాలు.. మీరు వెళ్లండ్రా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు. హర్షల్ పటేల్, సుయాశ్ ప్రభుదేశాయ్, విజయ్ కుమార్ వైశాఖ్లు కూడా తమ ఆటతీరును మెరుగుపర్చుకోవాలని, లేకపోతే స్వచ్ఛందంగా జట్టును తప్పుకోవాలని సూచిస్తున్నారు. పనిలో పనిగా సరైన జట్టును (దేశీయ ఆటగాళ్లను) ఎంపిక చేసుకోలేదని ఫ్రాంచైజీ యాజమాన్యంపై మండిపడుతున్నారు. ఆ నలుగురిని (KGF, సిరాజ్) తప్పిస్తే, ఐపీఎల్ చరిత్రలో ఇంత బలహీనమైన జట్టే ఉండదని అంటున్నారు. కాగా, చిన్న స్వామి స్టేడియంలో (బెంగళూరు) కేకేఆర్తో నిన్న (ఏప్రిల్ 26) జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. సిరాజ్ (4-0-33-1), హసరంగ (4-0-24-2), విరాట్ కోహ్లి (37 బంతుల్లో 54) మినహాయించి ఆ జట్టు మూకుమ్మడిగా విఫలమై ఓటమిపాలైంది. చదవండి: #ViratKohli: అరుదైన ఘనత.. టి20 చరిత్రలో తొలి ఆటగాడిగా తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. జేసన్ రాయ్ (29 బంతుల్లో 56; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), నితీశ్ రాణా (21 బంతుల్లో 48), వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 31) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసి, 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో డుప్లెసిస్ (17), మ్యాక్స్వెల్ (5) సహా అందరూ విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, సుయాశ్ శర్మ, ఆండ్రీ రసెల్ తలో 2 వికెట్లు పడగొట్టారు. చదవండి: 'ఓటమికి అర్హులం.. ఫీల్డింగ్ వైఫల్యం కొంపముంచింది' -
అనుష్కతో కలిసి డ్యాన్స్ చేసిన కోహ్లి.. అంతలోనే విరాట్ కాలికి! ఏం జరిగిందంటే?
టీమిండియా మాజీ కెప్టెన్, ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఐపీఎల్-2023లో బీజీబీజీగా ఉన్నాడు. ఈ మెగా ఈవెంట్లో ఆర్సీబీ స్టాండింగ్ కెప్టెన్గా విరాట్ వ్యవహరిస్తున్నాడు. రెగ్యూలర్ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ గాయంతో బాధపడుతుండంతో మరి కొన్ని మ్యాచ్లకు కోహ్లినే నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఈ సీజన్లో పంజాబ్, రాజస్తాన్తో మ్యాచ్ల్లో ఆర్సీబీ సారధిగా వ్యవహరించిన విరాట్.. ఈ రెండు మ్యాచ్ల్లోనూ తమ జట్టుకు విజయాలను అందించాడు. ఇక వ్యక్తిగత ప్రదర్శనలో కూడా విరాట్ దుమ్మురేపుతున్నాడు. ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన కోహ్లి.. 279 పరుగులు సాధించాడు. విరాట్ ఆరెంజ్ క్యాప్ రేసులో నాలుగో స్థానంలో ఉన్నాడు. అనుష్కతో కలిసి డ్యాన్స్ చేసిన విరాట్.. ఇక ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్తో ఆర్సీబీ తలపడిన సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్కు ముందు జిమ్లో విరాట్ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఓ పంజాబీ పాటకు వీరిద్దరూ స్టేప్పులు వేశారు. అయితే కొన్ని సెకన్లకే కాలు పట్టేయడంతో కోహ్లి పక్కకు వెళ్లిపోయాడు. దీంతో అనుష్క ఒక్క సారిగా గట్టిగా నవ్వింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: #David Warner: ఉప్పల్లో కింగ్.. టైటిల్ వీరుడు! అప్పుడు మా వార్నర్ అన్న.. ఇప్పుడు.. Virat Kohli and Anushka Sharma dancing on a Punjabi song. Video of the day! pic.twitter.com/dzPIeMs8G0 — Mufaddal Vohra (@mufaddal_vohra) April 24, 2023 -
తమ రికార్డును తామే బద్దలు కొట్టిన మ్యాక్స్వెల్-డుప్లెసిస్
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ మరో విజయాన్నినమోదు చేసింది. ఆదివారం రాజస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఏడు పరుగుల తేడాతో నెగ్గింది. కాగా ఈ మ్యాచ్లో ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. ఐపీఎల్ హిస్టరీలో థర్డ్ వికెట్కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జోడీగా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా తము క్రియేట్ చేసిన రికార్డును 6 రోజుల్లోనే బ్రేక్ చేయడం గమనార్హం. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో డుప్లెసిస్, మ్యాక్స్వెల్ ఇద్దరూ మూడో వికెట్కు 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతకు 6 రోజుల ముందు ఏప్రిల్ 17న చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 126 పరుగులతో పాట్నర్షిప్తో అదరగొట్టారు. 2017లో గుజరాత్ లయన్స్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ-కేఎల్ రాహుల్ ఇద్దరూ మూడో వికెట్కు అత్యధిక పరుగులు జోడించగా.. చెన్నైతో మ్యాచ్లో డుప్లెసిస్(62), మ్యాక్సీ(77) ఆ రికార్డును బ్రేక్ చేశారు. తాజాగా తమ రికార్డును మళ్లీ తామే బద్దలు కొట్టారు. డుప్లెసిస్, మ్యాక్స్వెల్ క్రియేట్ చేసిన ఈ 127 పరుగుల భాగస్వామ్యం ఐపీఎల్ హిస్టరీలో 15వ అత్యుత్తమ భాగస్వామ్యంగా నిలిచింది. మూడో వికెట్కు మాత్రం ఇదే అత్యుత్తమం. ఈ మ్యాచ్లో డుప్లెసిస్ మరో అరుదైన ఘనతను కూడా సాధించాడు. టి20 క్రికెట్లో 9 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2023లో ఇప్పటికే నాలుగు అర్ధ సెంచరీలు సాధించిన డుప్లీ.. తాజాగా ఐదో అర్ధశతకాన్ని అందుకున్నాడు. పలితంగా పొట్టి ఫార్మాట్లో 9వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. -
Du Plessis: వయసు మీద పడుతున్నా పాతబడ్డ వైన్లా మత్తెక్కిస్తున్నాడు..!
ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ వయసు మీద పడుతున్నా ఆట విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. 38 వయసులోనూ కుర్రాడిలా రెచ్చిపోతూ పరుగుల వరద పారిస్తున్నాడు. గత కొంతకాలంగా పక్కటెముకుల నొప్పితో బాధపడుతున్నప్పటికీ వీరలెవెల్లో విజృంభిస్తున్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్లోనూ విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడుతూ కుర్రాళ్లకు సైతం అసూయ పడేలా చేస్తున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పట్టపగ్గాలు లేకుండా విజృంభిస్తున్న డుప్లెసిస్.. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 5 హాఫ్ సెంచరీలు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో అతను 7 మ్యాచ్ల్లో 67.50 సగటున 165.71 స్ట్రయిక్రేట్తో 405 పరుగులు సాధించాడు. ఇందులో 33 ఫోర్లు, 25 సిక్సర్లు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ రేసులో ఇతని దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. డుప్లెసిస్ భీకర ఫామ్ను చూసి సహచర స్టార్ ఆటగాళ్లు సైతం ముక్కున వేళ్లేసుకుంటున్నారు. నాలుగు పదుల వయసుకు దగ్గరపడుతున్నా పాతబడ్డ వైన్లా ఆటతో మత్తెక్కిస్తున్నాడంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ప్రస్తుత సీజన్లో డుప్లెసిస్ చేసిన స్కోర్ల వివరాలు.. ముంబై ఇండియన్స్పై 73(43) కేకేఆర్పై 23(12) లక్నో సూపర్ జెయింట్స్పై 79*(46) ఢిల్లీ క్యాపిటల్స్పై 22(16) చెన్నై సూపర్ కింగ్స్పై 62(33) పంజాబ్ కింగ్స్పై 84(56) రాజస్థాన్ రాయల్స్పై 62(39) -
వారి కంటే గల్లీ క్రికెటర్లే నయం.. దినేశ్ కార్తీక్ గురించి చెప్పనక్కర్లేదు..!
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో ఇవాళ (ఏప్రిల్ 23, మధ్యాహ్నం 3:30 గంటలకు) జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ గతంలో మాదిరే మరోసారి భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. డుప్లెసిస్ (39 బంతుల్లో 62; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), మ్యాక్స్వెల్ (44 బంతుల్లో 77; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లతో చెలరేగినా ఆ జట్టు భారీ స్కోర్ చేయలేక చతికిలపడింది. మ్యాక్సీ, డుప్లెసిస్ విజృంభించడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసి పటిష్టమైన స్థితిలో ఉండిన ఆ జట్టు ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయింది. 45 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి ఉసూరుమనిపించింది. కోహ్లి (0), షాబాజ్ అహ్మద్ (2), లోమ్రార్ (8), దినేశ్ కార్తీక్ (16), ప్రభుదేశాయ్ (0), హసరంగ (6) విజయ్కుమార్ వైశాఖ్ (0) గల్లీ క్రికెటర్ల కంటే హీనంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా దినేశ్ కార్తీక్ అత్యంత దారుణంగా ఆడటమే కాకుండా ఇద్దరు రనౌట్ కావడంతో కీలకపాత్ర పోషించాడు. బంతిని టచ్ చేసేందుకు కూడా ఇబ్బంది పడిన దినేశ్ కార్తీక్పై ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వీడెక్కడ దొరికాడు రా బాబు అంటూ తలలు బాదుకుంటున్నారు. కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్స్వెల్ లేకపోతే తమ పరిస్థితి ఏంటని బాధపడుతున్నారు. ప్రతి మ్యాచ్లో KGF (కోహ్లి, గ్లెన్ మ్యాక్స్వెల్, ఫాఫ్ డుప్లెసిస్) పైనే ఆధారపడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వీరు మినహాయించి ఒక్కరంటే ఒక్కరు కూడా బ్యాటింగ్లో రాణించలేకపోవడాన్ని సహించలేకపోతున్నారు. మిగతా జట్లలో దేశీయ ఆటగాళ్లు పోటీపడి రాణిస్తుంటే, తమ జట్టులోని ఆటగాళ్లు పెవిలియన్కు క్యూకట్టడంతో పోటీపడుతున్నారని వాపోతున్నారు. షాబాజ్ అహ్మద్, మహిపాల్ లోమ్రార్, దినేశ్ కార్తీక్, సుయాశ్ ప్రభుదేశాయ్లను తూర్పారబెడుతున్నారు. వీరి కంటే గల్లీ క్రికెటర్లు వెయ్యి రెట్లు నయమని అంటున్నారు. వెంటనే వీరిని జట్టు నుంచి తప్పించి, టాలెంటెడ్ యంగ్ ప్లేయర్లను తీసుకోవాలని ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. -
డుప్లెసిస్ రిబ్స్ పై టాటూ దాని అర్ధం ఇదా...
-
డుప్లెసిస్ రిబ్స్ పై టాటూ దానికి అర్ధం ఇదా..
-
సిరాజ్ సూపర్ షో...
సిరాజ్ గెలిపించిన మ్యాచ్ ఇది! నిప్పులు చెరిగే బౌలింగ్, కళ్లు చెదిరే ఫీల్డింగ్తో పంజాబ్ కింగ్స్పై స్పీడ్స్టర్ పంజా విసిరాడు. పంజాబ్ కుదురుకోకుండా దెబ్బ మీద దెబ్బ వేయడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఈ సీజన్లో మూడో విజయాన్ని సాధించింది. మొహాలీ: మెరుపులతో డుప్లెసిస్, కోహ్లి బెంగళూరును నడిపిస్తే... బౌలింగ్తో గెలిపించిన ఘనత మాత్రం సిరాజ్దే! దీంతో ఐపీఎల్లో గురువారం జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 24 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్పై విజయం సాధించింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా దిగిన రెగ్యులర్ కెప్టెన్ డుప్లెసిస్ (56 బంతుల్లో 84; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), ఈ మ్యాచ్లో సారథ్యం వహించిన విరాట్ కోహ్లి (47 బంతుల్లో 59; 5 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. హర్ప్రీత్ బ్రార్కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత పంజాబ్ 18.2 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. ప్రభ్సిమ్రన్ (30 బంతుల్లో 46; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), జితేశ్ శర్మ (27 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సిరాజ్ (4/21) కీలకమైన వికెట్లు తీశాడు. డుప్లెసిస్ ధనాధన్ ‘ఇంపాక్ట్’ కోహ్లి, డుప్లెసిస్ల ఓపెనింగ్ మైదానంలోని ప్రేక్షకుల్ని మెరుపులతో మురిపించింది. దూసుకొచ్చే బంతిని కాచుకొని, గతి తప్పిన బంతిని బౌండరీలవైపు శిక్షిస్తూ బెంగళూరు ఇన్నింగ్స్ను ఏకంగా 16 ఓవర్ల పాటు నడిపించారు. 137 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని జోడించారు. ఈ క్రమంలో ముందుగా డుప్లెసిస్ 31 బంతుల్లో, తర్వాత కోహ్లి 40 బంతుల్లో ఫిఫ్టీలను పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి పరుగుల పంజా ‘కింగ్స్’ను ఉక్కిరిబిక్కిరి చేయగా, స్వల్ప వ్యవధిలో వీళ్లిద్దరితో పాటు హిట్టర్ మ్యాక్స్వెల్ (0) అవుటవడంతో 200 మార్క్ను దాటకుండా పంజాబ్ అడ్డుకుంది. అనంతరం కష్టపడితే ఛేదించే లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ను సిరాజ్ తన తొలి ఓవర్ నుంచే కష్టాలపాలు చేశాడు. అథర్వ (4)ను ఎల్బీగా అవుట్ చేశాడు. సిక్స్, ఫోర్ కొట్టి జోరు మీదున్న హర్ప్రీత్ సింగ్ (13)ను డైరెక్ట్ హిట్తో రనౌట్ చేశాడు. ప్రభ్సిమ్రన్ రాణింపు తర్వాత జితేశ్ శర్మ మెరుపులతో లక్ష్యం దిశగా సాగుతుంటే మళ్లీ సిరాజ్ నిప్పులు చెరిగాడు. హర్ప్రీత్ బ్రార్ (13), ఎలిస్ (1)లను క్లీన్బౌల్డ్ చేసి పరాజయాన్ని ఖాయం చేశాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) జితేశ్ శర్మ (బి) హర్ప్రీత్ 59; డుప్లెసిస్ (సి) స్యామ్ కరన్ (బి) ఎలిస్ 84; మ్యాక్స్వెల్ (సి) అథర్వ (బి) హర్ప్రీత్ 0; దినేశ్ కార్తీక్ (సి) అథర్వ (బి) అర్షదీప్ 7; మహిపాల్ (నాటౌట్) 7; షహబాజ్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–137, 2–137, 3–151, 4–163. బౌలింగ్: అర్షదీప్ సింగ్ 4–0–34–1, హర్ప్రీత్ 3–0–31–2, ఎలిస్ 4–0–41–1, స్యామ్ కరన్ 4–0–27–0, రాహుల్ చహర్ 4–0–24–0, లివింగ్స్టోన్ 1–0–9–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: అథర్వ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 4; ప్రభ్సిమ్రన్ (బి) పార్నెల్ 46; షార్ట్ (బి) హసరంగ 8; లివింగ్స్టోన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 2; హర్ప్రీత్ సింగ్ (రనౌట్) 13; స్యామ్ కరన్ (రనౌట్) 10; జితేశ్ శర్మ (సి) షహబాజ్ (బి) హర్షల్ పటేల్ 41; షారుఖ్ (స్టంప్డ్) దినేశ్ కార్తీక్ (బి) హసరంగ 7; హర్ప్రీత్ బ్రార్ (బి) సిరాజ్ 13; ఎలిస్ (బి) సిరాజ్ 0; అర్షదీప్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 150. వికెట్ల పతనం: 1–4, 2–20, 3–27, 4–43, 5–76, 6–97, 7–106, 8–147, 9–149, 10–150. బౌలింగ్: సిరాజ్ 4–0–21–4, పార్నెల్ 3–0–32–1, హసరంగ 4–0–39–2, వైశాక్ 3–0–29–0, మ్యాక్స్వెల్ 1–0–5–0, హర్షల్ పటేల్ 3.2–0–22–1. -
PBKS VS RCB: ఆర్సీబీ కెప్టెన్గా కోహ్లి.. 15 నెలల తర్వాత, డుప్లెసిస్ ఉన్నా..!
ఐపీఎల్-2023లో భాగంగా పంజాబ్ కింగ్స్తో ఇవాళ (ఏప్రిల్ 20) జరుగుతున్న మ్యాచ్లో విరాట్ కోహ్లి ఆర్సీబీ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు వదిలేశాక, దాదాపు 15 నెలల అనంతరం కోహ్లి ఇలా ఓ జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు. 2022 జనవరి 11న కోహ్లి చివరిసారిగా భారత టెస్ట్ జట్టు కెప్టెన్గా వ్యవహరించాడు. నాడు సౌతాఫ్రికాతో జరిగిన ఆ మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైంది. టెస్ట్ల్లో విజయవంతమైన కెప్టెన్ అయిన కోహ్లి ఊహించని పరిణామాల నడుమ ఓటమితో కెప్టెన్సీ కెరీర్ ముగించాడు. డుప్లెసిస్ ఉన్నా కోహ్లి ఎందుకు..? పక్కటెముకల నొప్పితో బాధపడుతున్న ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్.. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగాడు. నొప్పి కారణంగా అతను ఫీల్డింగ్ చేయలేకపోవడంతో అతని స్థానంలో కోహ్లి తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఆర్సీబీ బౌలింగ్ సమయంలో డుప్లెసిస్కు రీప్లేస్మెంట్గా విజయ్కుమార్ వైశాఖ్ బరిలోకి దిగనున్నాడు. కాగా, ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకుంది. వరుస బంతుల్లో కోహ్లి (59), మ్యాక్స్వెల్ (0) ఔట్ కావడం.. స్కోర్ వేగం పెంచే క్రమంలో డుప్లెసిస్ (84) కూడా పెవిలియన్కు చేరడం.. ఆ తర్వాత వచ్చిన దినేశ్ కార్తీక్ (7), మహిపాల్ (7 నాటౌట్), షాబాజ్ అహ్మద్ (5 నాటౌట్) చెత్తగా బ్యాటింగ్ చేయడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 174 పరుగుల స్కోర్కే పరిమితమైంది. పంజాబ్ బౌలరల్లో హర్ప్రీత్ బ్రార్ 2, అర్షదీప్, ఇల్లిస్ తలో వికెట్ పడగొట్టారు. -
150 పరుగులకే పంజాబ్ ఆలౌట్.. ఆర్సీబీ ఘన విజయం
150 పరుగులకే పంజాబ్ ఆలౌట్.. ఆర్సీబీ ఘన విజయం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 24 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 18.2 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. ప్రబ్సిమ్రన్ సింగ్ 46, జితేశ్ శర్మ 41 మినహా మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. హసరంగా రెండు వికెట్లు, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్లు చెరొక వికెట్ తీశారు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన పంజాబ్ 147 పరుగుల వద్ద పంజాబ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్లో హర్ప్రీత్ బ్రార్ క్లీన్ బౌల్డయ్యాడు. ఓటమి దిశగా పయనిస్తున్న పంజాబ్.. ఏడో వికెట్ డౌన్ 106 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పంజాబ్ ఓటమి దిశగా పయనిస్తుంది. హసరంగ బౌలింగ్లో షారుఖ్ ఖాన్ (7) స్టంపౌటయ్యాడు. 76 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన పంజాబ్ పంజాబ్ రనౌట్ రూపంలో మరో వికెట్ కోల్పోయింది. హసరంగ అద్భుతమైన డైరెక్ట్ త్రోతో సామ్ కర్రన్ (10) ఔటయ్యాడు. దీంతో పంజాబ్ 76 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. సిరాజ్ సూపర్ త్రో.. నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్ వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసి జోరుమీదున్న సిరాజ్, మరో అద్భుతమైన డైరెక్ట్ త్రోతో హర్ప్రీత్ సింగ్ (13) పెవిలియన్కు పంపాడు. 6 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 49/4. సామ్ కర్రన్, ప్రభ్సిమ్రన్ (21) క్రీజ్లో ఉన్నారు. నిప్పులు చెరుగుతున్న సిరాజ్.. మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడుతున్నాడు. తన స్పెల్లో వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీశాడు. తొలుత రివ్యూవి వెళ్లే అథర్వ వికెట్ (ఎల్బీ)ను దక్కించుకున్న సిరాజ్.. ఆతర్వాత 4వ ఓవర్లో కూడా రివ్యూకి వెళ్లి లివింగ్స్టోన్ను ఔట్ (ఎల్బీ) చేశాడు. రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్ 175 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ మూడో ఓవర్ తొలి బంతికి రెండో వికెట్ కోల్పోయింది. హసరంగ బౌలింగ్లో మాథ్యూ షార్ట్ (8) క్లీన్ బౌల్డయ్యాడు. టార్గెట్ 175.. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ 175 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ రెండో బంతికే వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్లో అథర్వ టైడే (4) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రాణించిన డుప్లెసిస్, కోహ్లి.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే..? టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకుంది. వరుస బంతుల్లో కోహ్లి (59), మ్యాక్స్వెల్ (0) ఔట్ కావడం.. స్కోర్ వేగం పెంచే క్రమంలో డుప్లెసిస్ (84) కూడా పెవిలియన్కు చేరడం.. ఆ తర్వాత వచ్చిన దినేశ్ కార్తీక్ (7), మహిపాల్ (7 నాటౌట్), షాబాజ్ అహ్మద్ (5 నాటౌట్) చెత్తగా బ్యాటింగ్ చేయడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 174 పరుగుల స్కోర్కే పరిమితమైంది. హర్ప్రీత్ బ్రార్ 2, అర్షదీప్, ఇల్లిస్ తలో వికెట్ పడగొట్టారు. డుప్లెసిస్ (84) ఔట్ ఇల్లిస్ బౌలింగ్లో సిక్స్ బాదిన మరుసటి బంతికే డుప్లెసిస్ (84) ఔటయ్యాడు. 18 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 154/3. లోమ్రార్, కార్తీక్ (3) క్రీజ్లో ఉన్నారు. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ.. కోహ్లి, మ్యాక్స్వెల్ ఔట్ ఆర్సీబీకి వరుస షాక్లు తగిలాయి. హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో వరుస బంతుల్లో విరాట్ కోహ్లి (59), మ్యాక్స్వెల్ (0) ఔటయ్యారు. 17 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 145/2. డుప్లెసిస్ (78), దినేశ్ కార్తీక్ (1) క్రీజ్లో ఉన్నారు. కోహ్లి హాఫ్ సెంచరీ.. 14 ఓవర్ల తర్వాత స్కోర్ ఎంతంటే..? 40 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో కోహ్లి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 14 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 118/0. కోహ్లికు జతగా డుప్లెసిస్ (65) క్రీజ్లో ఉన్నాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన డుప్లెసిస్ ఆర్సీబీ ఓపెనర్ డుప్లెసిస్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ సీజన్లో డుప్లెసిస్కు ఇది నాలుగో హాఫ్ సెంచరీ. ఓవరాల్గా 29వ ఐపీఎల్ ఫిఫ్టి. 11 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 98/0. డుప్లెసిస్కు జతగా కోహ్లి (39) క్రీజ్లో ఉన్నాడు. ధాటిగా ఆడుతున్న డుప్లెసిస్, కోహ్లి ఆర్సీబీ ఓపెనర్లు డుప్లెసిస్ (27), విరాట్ కోహ్లి (29) ధాటిగా ఆడుతున్నారు. వీరి ధాటికి ఆర్సీబీ 5.1 ఓవర్లలోనే 50 పరుగుల మార్కు దాటింది. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 59/0గా ఉంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ ఐపీఎల్-2023లో భాగంగా మొహాలీ వేదికగా ఇవాళ (ఏప్రిల్ 20) మధ్యాహ్నం 3:30 గంటలకు పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు.. పంజాబ్ కింగ్స్: అథర్వ టైడే, మాథ్యూ షార్ట్, లివింగ్స్టోన్, హర్ప్రీత్ సింగ్, సికందర్ రజా, సామ్ కర్రన్ (కెప్టెన్), జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, హర్ప్రీత్ బ్రార్, నాథన్ ఇల్లీస్, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్ ఆర్సీబీ: డుప్లెసిస్, విరాట్ కోహ్లి (కెప్టెన్), మహిపాల్ లోమ్రార్, మ్యాక్స్వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్, హసరంగ, పార్నెల్, సుయాష్ ప్రభుదేశాయ్, సిరాజ్ -
CSK VS RCB: డుప్లెసిస్ పక్కటెముకలపై ఉన్న ఆ టాటూ అర్ధం తెలుసా..?
చెన్నై సూపర్ కింగ్స్తో నిన్న (ఏప్రిల్ 17) జరిగిన రసవత్తర పోరులో లోకల్ జట్టు ఆర్సీబీ 8 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. చెన్నై నిర్ధేశించిన 227 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఫాఫ్ డుప్లెసిస్ (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్వెల్ (36 బంతుల్లో 76; 3 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడినప్పటికీ, స్వల్ప వ్యవధిలో ఇద్దరూ ఔట్ కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఓటమిపాలైనప్పటికీ.. డుప్లెసిస్-మ్యాక్సీ విధ్వంకర ఇన్నింగ్స్లపై మాత్రం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ డాషింగ్ బ్యాటర్ల విన్యాసాలను ఆ జట్టు ఈ జట్టు అన్న తేడా లేకుండా అన్ని జట్ల అభిమానులు కొనియాడుతున్నారు. గెలిచింది సీఎస్కేనే అయినా డుప్లెసిస్-మ్యాక్సీల నామస్మరణతో సోషల్మీడియా మార్మోగిపోతుంది. Played such an iconic knock at 38 even when he wasn't fully fit. Appreciation tweet for Captain FAF. ❤️ You just can't scroll down without liking this! #RCBvsCSK pic.twitter.com/JztllvBuYA — Sexy Cricket Shots (@sexycricketshot) April 17, 2023 ఇదే మ్యాచ్ సందర్భంగా కనిపించిన ఓ దృశ్యం కూడా నెటిజన్లను విపరీతంగా ఆకర్శించింది. ఆర్సీబీ బ్యాటింగ్ సమయంలో 13వ ఓవర్ పూర్తైన తర్వాత డుప్లెసిస్ కొద్దిగా ఇబ్బంది పడినట్లు కనిపించాడు. అప్పటికే అతని పక్కటెముకలు చుట్టూ బ్యాండ్ కట్టి ఉంది. సిబ్బంది సాయంతో అతను ఆ బ్యాండ్ను సరిచేసుకున్నాడు. ఈ క్రమంలో అభిమానులు డుప్లెసిస్ రిబ్స్పై ఉన్న ఓ టాటూను నొటిస్ చేశారు. దీంతో ఆ టాటూ ఏంటీ, అది ఏ భాష, దాని అర్ధం ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు. డుప్లెసిస్ శరీరంపై చాలా టాటూస్ ఉన్నా ఈ టాటూ మాత్రం నెటిజన్ల ప్రత్యేకంగా ఆకర్శించింది. సోషల్మీడియా జరిపిన చర్చ అనంతరం అభిమానులకు సదరు టాటూ అర్ధం తెలిసింది. ఆ టాటూ అరబ్బీ భాషలోని ఓ పదమని, దాని అర్ధం Fazl (దేవుడి దయ) అని, దేవుడి దయ వల్ల తన జీవితంలో ఊహించని సానుకూల మార్పులు జరగడం వల్ల డుప్లెసిస్ ఈ టాటూను తన రిబ్స్ పైభాగంలో వేయించుకున్నాడని ఫ్యాన్స్ తెలుసుకున్నారు. డుప్లెసిస్ అరబ్బీలో టాటూ వేయించుకోవడంపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. మరోవైపు డుప్లెసిస్ తన పక్కటెముకలపై కట్టిన బ్యాండ్ గురించి కూడా మ్యాచ్ అనంతరం వివరణ ఇచ్చాడు. రిబ్స్లో సమస్య ఉన్న కారణంగా తాను బ్యాండ్ కట్టుకునే బరిలోకి దిగాల్సి వచ్చిందని తెలిపాడు. -
CSK VS RCB: వారిద్దరిలో ఎవరు ఉన్నా, సీఎస్కేకు సీన్ సితార అయ్యేది..!
ఐపీఎల్-2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిన్న (ఏప్రిల్ 17) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన హైఓల్టేజీ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 8 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం విధితమే. ఈ మ్యాచ్లో ఇరు జట్ల బ్యాటర్లు పోటాపోటీగా విధ్వంసం సృష్టించి పరుగుల వరద పారించారు. సీఎస్కే తరఫున డెవాన్ కాన్వే (45 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), శివమ్ దూబే (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) రెచ్చిపోగా.. ఆర్సీబీ ఆటగాళ్లు డుప్లెసిస్ (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), మ్యాక్స్వెల్ (36 బంతుల్లో 76; 3 ఫోర్లు, 8 సిక్సర్లు) ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. అయితే అంతిమంగా సీఎస్కేనే విజయం వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేయగా.. ఆర్సీబీ 20 ఓవర్లు ఆడి 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులకే పరిమితమైంది. కాగా, భారీ లక్ష్య ఛేదనలో 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినప్పటికీ, ఏమాత్రం తగ్గకుండా అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి, సీఎస్కేకు ముచ్చెమటలు పట్టించిన ఆర్సీబీపై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆరంభంలోనే కోహ్లి వికెట్ కోల్పోయినా డెప్లెసిస్, మ్యాక్సీ చూపించిన తెగువకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆ ఫ్రాంచైజీ ఈ ఫ్రాంచైజీ అన్న తేడా లేకుండా అన్ని జట్ల అభిమానులు డుప్లెసిస్, మ్యాక్సీ బ్యాటింగ్ విన్యాసాలను కొనియాడుతున్నారు. మరో ఓవర్ పాటు వీరిద్దరిలో ఎవరో ఒకరు ఉండి వుంటే సీఎస్కేకు సీన్ సితార అయ్యేదని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం ధోని సైతం అంగీకరించాడు. వాస్తవానికి మ్యాక్స్వెల్, డుప్లెసిస్ ఔటయ్యే సమయానికి ఆర్సీబీ పటిష్టమైన స్థితిలో ఉండింది.14 ఓవర్లలో ఆ జట్టు 159 పరుగులు చేసింది. ఆర్సీబీ గెలవాలంటే 36 బంతుల్లో 68 పరుగులు చేయాల్సి ఉండింది. మ్యాక్సీ, డుప్లెసిస్ ఔటయ్యాక వచ్చిన షాబాజ్ అహ్మద్ (12), దినేశ్ కార్తీక్ (28), సుయాశ్ ప్రభుదేశాయ్ (19) కూడా తమ శక్తి మేరకు పోరాడినప్పటికీ, ఆఖర్లో వేన్ పార్నెల్ (5 బంతుల్లో 2), హసరంగ (2 బంతుల్లో 2 నాటౌట్) దారుణంగా నిరాశపరిచారు. ఆఖరి ఓవర్లో గెలుపుకు 19 పరుగులు అవసరం కాగా.. ఆర్సీబీ కేవలం 10 పరుగులు మాత్రమే సాధించడంతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఓటమిపాలైనప్పటికీ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చినందుకు గాను అభిమానుల మన్ననలు అందుకుంది. ముఖ్యంగా డుప్లెసిస్, మ్యాక్సీ చూపించిన తెగువను ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. కొండంత లక్ష్యంగా ఎదురుగా ఉన్న ఏమాత్రం వెరవకుండా వారిద్దరు ప్రదర్శించిన తెగువకు ఫ్యాన్స్ సలాం కొడుతున్నారు. -
హ్యాట్సాఫ్.. ఆర్సీబీకి దొరికిన ఆణిముత్యం! 38 ఏళ్ల వయసులో.. నొప్పిని భరిస్తూనే..
IPL 2023 RCB Vs CSK- Faf du Plessis: చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయినప్పటికీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాత్రం అభిమానుల మనసు గెలిచాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా 33 బంతులు ఎదుర్కొన్న అతడు 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 62 పరుగులు సాధించాడు. టాప్లో డుప్లెసిస్ తద్వారా ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్లలో కలిపి 259 పరుగులు పూర్తి చేసుకుని అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానానికి ఎగబాకాడు. ఆరెంజ్ క్యాప్ అందుకుని టాప్లో కొనసాగుతున్నాడు. కాగా డుప్లెసిస్ కెప్టెన్ ఇన్నింగ్స్కు తోడు ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ 36 బంతుల్లో 76 పరుగులతో రాణించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పంటిబిగువన నొప్పిని భరిస్తూనే డెత్ ఓవర్లలో సీఎస్కే బౌలర్లు రాణించడంతో సొంతమైదానంలో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. ఇదిలా ఉంటే.. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డుప్లెసిస్ ఫిజియోలు వచ్చి అతడి పొట్ట చుట్టూ కట్టుకట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నొప్పిని పంటిబిగువన భరిస్తూనే కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టును గెలిపించేందుకు కృషి చేశాడంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ డుప్లెసిస్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరేం పర్లేదు ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఈ ఘటనపై స్పందించిన ఫాఫ్ డుప్లెసిస్.. ‘‘మ్యాచ్ ఆరంభంలో డైవింగ్ చేస్తున్న సమయంలో పక్కటెముకలకు దెబ్బ తలిగింది. నొప్పి కాస్త ఇబ్బంది పెట్టింది. బ్యాటింగ్ చేయగలనా లేదోనన్న భయం వేసింది. కానీ అంత బాగానే జరిగింది’’ అని పేర్కొన్నాడు. డీకే ఫినిష్ చేస్తాడనుకున్నా సీఎస్కే బ్యాటర్లను కట్టడి చేసి ఉంటే ఫలితం తమకు అనుకూలంగా ఉండేదని.. ఏదేమైనా దురదృష్టవశాత్తూ ఓటమి తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దినేశ్ కార్తిక్(14 బంతుల్లో 28 పరుగులు) మ్యాచ్ ఫినిష్ చేస్తాడని పెట్టుకున్న ఆశలు అడియాసలై పోయానని విచారం వ్యక్తం చేశాడు. ఆర్సీబీకి దొరికిన ఆణిముత్యం కాగా 38 ఏళ్ల సౌతాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ గతేడాది ఆర్సీబీ పగ్గాలు చేపట్టాడు. కోహ్లి నుంచి సారథ్య బాధ్యతలు స్వీకరించిన అతడు.. జట్టును ప్లే ఆఫ్స్ చేర్చి కెప్టెన్గా తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు. ఐపీఎల్-2022లో 16 ఇన్నింగ్స్లో కలిపి 468 పరుగులు చేసి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఆర్సీబీ తరఫున టాప్ బ్యాటర్గా నిలిచాడు. నాలుగు పదుల వయసుకు చేరువవుతున్నా ఇటు ఆటగాడిగా.. అటు కెప్టెన్గా అద్భుతంగా రాణిస్తున్న డుప్లెసిస్ ఆర్సీబీకి దొరికిన ఆణిముత్యం అని అభిమానులు మురిసిపోతున్నారు. చదవండి: వాళ్లిద్దరు ఇంకాసేపు క్రీజులో ఉంటే మేము ఓడిపోయేవాళ్లం.. కానీ: ధోని తిలక్ ఇంట్లో సచిన్, రోహిత్, సూర్య సందడి.. ఫొటోలు వైరల్! ఎన్నటికీ మరువం! .@ChennaiIPL come out on top in the mid-table clash as they beat #RCB by 8 runs in highly entertaining and run-filled #TATAIPL match. 👏 👏 Scorecard ▶️ https://t.co/QZwZlNk1Tt#RCBvCSK pic.twitter.com/jlEz6KmM0V — IndianPremierLeague (@IPL) April 17, 2023 #DuPlessis Only respect 🥺🙌 He has played in pain.#RCBvsCSK pic.twitter.com/ezLtgiycl9 — ✨️ ❤ Kohli Fan Girl ❤ ✨️ (@kohlifangirl178) April 17, 2023 -
RCB Vs CSK: ఇదేమి మ్యాచ్ రా బాబు.. బ్యాటర్ల విధ్వంసం! 444 పరుగులు, 33 సిక్స్లు
చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 8 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఫలితం విషయం పక్కన పెడితే.. ఈ మ్యాచ్ మాత్రం అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజా అందించింది. ఈ మ్యాచ్లో పరుగులు వరద పారింది. రెండు జట్లు కలిపి ఏకంగా 444 పరుగులు నమోదు చేశాయి. అదే విధంగా ఇరు జట్ల బ్యాటర్లు ఏకంగా 33 సిక్స్లు బాదడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది. చెన్నై బ్యాటర్లలో కాన్వే(45 బంతుల్లో 83 పరుగులు), దుబే(27 బంతుల్లో 52) అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. 227 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన బెంగళూరు తొలి ఓవర్లోనే కోహ్లి వికెట్ను కోల్పోయింది. అనంతరం డుప్లెసిస్, మాక్స్వెల్ షో మొదలైంది. వీరిద్దరూ సీఎస్కే బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపించారు. మాక్స్వెల్ 36 బాల్స్లో 8 సిక్సర్లు, 3 ఫోర్లతో 76 పరుగులు చేయగా.. డుప్లెసిస్ 33 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఇక వీరిద్దరూ వరుస క్రమంలో ఔట్ కావడంతో ఆర్సీబీ 8 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేయగల్గింది. చదవండి: Trolls On Vijaykumar Vyshak: చివరి మ్యాచ్లో హీరో.. ఇప్పుడు జీరో! అత్యంత చెత్త రికార్డు.. #Virat Kohli: దూకుడు ఎక్కువైంది.. కోహ్లికి ఊహించని షాక్! ఫైన్ పడింది.. ఎందుకంటే.. 2019: #TATAIPL debut for @RCBTweets 🏏 Now: Chief destructor against them for @ChennaiIPL 💛 Shivam Dube's attack mode was 🔛 with the bat🔥#RCBvCSK #IPLonJioCinema #IPL2023 | @IamShivamDube pic.twitter.com/jTnfAAccOL — JioCinema (@JioCinema) April 17, 2023 -
వాళ్లిద్దరు ఇంకాసేపు క్రీజులో ఉంటే మేము ఓడిపోయేవాళ్లం.. కానీ: ధోని
IPL 2023 RCB Vs CSK- Dhoni Comments: ‘‘బెంగళూరు వికెట్పై ఆడటం ఎంతో బాగుంటుంది. ఆరంభంలో డ్యూ ఎక్కువగా ఉంటుంది. ప్రణాళికలు పక్కాగా అమలు చేస్తే తిరుగుండదు. సరైన సమయం కోసం వేచి చూశాం. ఇన్నింగ్స్ ద్వితీయార్థంలో వేగం పెంచాం. దూబే హిట్టింగ్ ఆడటంలో దిట్ట. అయితే, తను ఫాస్ట్బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడతాడు. స్పిన్నర్లను మాత్రం సమర్థవంతంగా ఎదుర్కొంటూ హిట్టింగ్ ఆడగలడు. నిజానికి తన విషయంలో మేము ముందు నుంచే కొన్ని ప్రణాళికలు రచించాం. కానీ.. గాయం బారిన పడిన కారణంగా పూర్తిస్థాయిలో వాటిని అమలు చేయలేకపోయాం. ఆత్మవిశ్వాసం ముఖ్యం అయితే, తనపై మాకు పూర్తి నమ్మకం ఉంది. మిడిల్ ఓవర్స్లో పరుగులు సాధించగలడు. ఈ విషయంలో మాకంటే కూడా తనపై తనకు ఎక్కువ నమ్మకం ఉండాలి. అతడి ప్రతిభ, నైపుణ్యాలపై మాకెలాంటి సందేహం లేదు. కానీ ఒక్కసారి మైదానంలో దిగిన తర్వాత వ్యక్తిగత ప్రదర్శన బాగుండాలంటే ఆత్మవిశ్వాసం ఉండాలి’’ అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో మెరుపు అర్ధ శతకంతో మెరిసిన శివం దూబే ఆట తీరును ప్రశంసిస్తూనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించాడు. కాన్వే, దుబే దంచికొట్టారు కాగా ఐపీఎల్-2023లో భాగంగా సోమవారం ఆర్సీబీ- సీఎస్కే చిన్నస్వామి స్టేడియంలో తలపడ్డాయి. సొంతమైదానంలో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ధోని సేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 226 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే 83(45 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లు) పరుగులతో అదరగొట్టగా.. నాలుగో స్థానంలో వచ్చిన శివం దూబే 27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు సాధించాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ ఆరంభంలోనే ఓపెనర్ విరాట్ కోహ్లి వికెట్ కోల్పోయింది. ఫాఫ్, మాక్సీ సూపర్ ఇన్నింగ్స్ మరో ఓపెనర్, కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ 33 బంతుల్లో 62 పరుగులతో ఆకట్టుకోగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ 36 బంతుల్లో 76 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ మిగతా వాళ్ల నుంచి కావాల్సిన మేర సహకారం అందకపోవడంతో ఆర్సీబీ విజయానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ధోని సేన చేతిలో ఓటమి పాలైంది. వాళ్లిద్దరు ఇంకాసేపు ఉంటే మేము ఓడిపోయేవాళ్లం ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ.. ఫాఫ్, మాక్సీ ఆట తీరును కొనియాడాడు. వాళ్లిద్దరూ ఇంకాసేపు క్రీజులో ఉంటే గనుక 18వ ఓవర్లోనే ఆర్సీబీ విజయం సాధించేదని పేర్కొన్నాడు. అయితే, తమ యువ బౌలర్లు డెత్ ఓవర్లలో అద్భుతంగా రాణించారంటూ ప్రశంసలు కురిపించాడు. డ్వేన్ బ్రావో మార్గదర్శనంలో సాధన చేస్తూ ఆత్మవిశ్వాసంతో ఒత్తిడిని అధిగమిస్తున్నారని పేర్కొన్నాడు. పతిరణ సూపర్ హిట్ డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం కష్టమని.. అయితే యువ బౌలర్లు మాత్రం ఎంతో సులువుగా పని పూర్తి చేస్తున్నారంటూ ధోని ప్రశంసించాడు. కాగా ఆర్సీబీ గెలవాలంటే విజయ సమీకరణం 18 బంతుల్లో 35 పరుగులు ఉన్న వేళ ధోని బంతిని పతిరణ, తుషార్ దేశ్పాండేలకు ఇచ్చాడు. 18వ ఓవర్లో పతిరణ కేవలం 4 పరుగులు మాత్రమే ఇవ్వగా.. తుషార్ 19 ఓవరల్లో 12 పరుగులు ఇచ్చాడు. ఇక ఆఖరి రెండు బంతుల్లో ఆర్సీబీకి 11 పరుగులు అవసరమైన వేళ పతిరణ.. తొలుత రెండు పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాతి బంతికి ప్రభుదేశాయ్ను అవుట్ చేసి చెన్నై గెలుపును ఖరారు చేశాడు. చదవండి: దురదృష్టం అంటే కోహ్లిదే.. అయ్యో విరాట్! బౌలర్కు మాత్రం!వీడియో వైరల్ .@ChennaiIPL come out on top in the mid-table clash as they beat #RCB by 8 runs in highly entertaining and run-filled #TATAIPL match. 👏 👏 Scorecard ▶️ https://t.co/QZwZlNk1Tt#RCBvCSK pic.twitter.com/jlEz6KmM0V — IndianPremierLeague (@IPL) April 17, 2023 -
RCB Vs DC: ఢిల్లీ క్యాపిటల్స్పై ఆర్సీబీ గెలుపు
Royal Challengers Bangalore vs Delhi Capitals Updates: ఢిల్లీ క్యాపిటల్స్పై ఆర్సీబీ గెలుపు సొంతమైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గర్జించింది. సమిష్టి ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసింది. ప్రత్యర్థి జట్టును 23 పరుగుల తేడాతో ఓడించి జయకేతనం ఎగురవేసింది. తద్వారా ఐపీఎల్-2023లో రెండో విజయం నమోదు చేసింది. కోహ్లి అర్ధ శతకం ఐపీఎల్-2023లో భాగంగా సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్ శుభారంభం అందించారు. కోహ్లి అర్ధ శతకంతో మెరువగా.. డుప్లెసిస్ 22 పరుగులు సాధించాడు. మిగిలిన వాళ్లలో వన్డౌన్ బ్యాటర్ మహిపాల్ లామ్రోర్ 26, గ్లెన్ మాక్స్వెల్ 24 పరుగులు చేశారు. హర్షల్ పటేల్ 6 పరుగులకే పెవిలియన్ చేరగా.. షాబాజ్ అహ్మద్ (12 బంతుల్లో 20 పరుగులు నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. ఇక దినేశ్ కార్తిక్ డకౌట్గా వెనుదిరగగా.. అనూజ్రావత్ 22 బంతుల్లో 15 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్షల్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ ఒకటి, లలిత్ యాదవ్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఆదుకున్న మనీశ్ పాండే.. కానీ ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేయగలిగింది. ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఢిల్లీని మనీశ్ పాండే అర్ధ శతకంతో ఆదుకున్నాడు. మిగతా వాళ్లలో అక్షర్ పటేల్(21), అన్రిచ్ నోర్జే(23 నాటౌట్) మాత్రమే 20 పరుగుల మార్కు అందుకున్నారు. దీంతో ఢిల్లీకి మరో ఓటమి తప్పలేదు. విజయ్కుమార్ వైషాక్ అరంగేట్రంలోనే అదుర్స్ ఇదిలా ఉంటే.. ఆర్సీబీ అరంగేట్ర బౌలర్ విజయ్కుమార్ వైషాక్ 3 వికెట్లతో చెలరేగడం విశేషం. ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ రూపంలో కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మిగిలిన వాళ్లలో సిరాజ్కు రెండు, పార్నెల్, హసరంగ, హర్షల్ పటేల్లకు ఒక్కో వికెట్ దక్కాయి. 17.3: తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ సిరాజ్ బౌలింగ్లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన అమన్ హకీం ఖాన్(18). 15.5: ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ విజయ్కుమార్ వైషాక్ బౌలింగ్లో లలిత్ యాదవ్(4) అవుట్. స్కోరు: 110/8 (15.5) అర్ధ శతక హీరో అవుట్ 13.6: హసరంగ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన మనీష్ పాండే(50). ఫలితంగా ఏడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ. స్కోరు: 98/7 (14) ఆరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ 12.2: విజయ్కుమార్ వైషాక్ బౌలింగ్లో సిరాజ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన అక్షర్ పటేల్(21). స్కోరు: 81/6 (12.3) 12 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు: 76/5 9 ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 53-5 8.5: హర్షల్ పటేల్ బౌలింగ్లో అభిషేక్ పోరెల్(5) అవుట్. పవర్ ప్లేలో ఢిల్లీ స్కోరు: 32-4 5.4: విజయ్కుమార్ వైషాక్ బౌలింగ్లో డేవిడ్ వార్నర్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆదిలోనే ఢిల్లీకి ఊహించని షాక్.. మూడో వికెట్ డౌన్(2/3 (2.2)) 2.2: సిరాజ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన యశ్ ధుల్(1). మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్. వార్నర్, మనీశ్ పాండే క్రీజులో ఉన్నారు. ఢిల్లీ స్కోరు: 2/2 (2) వార్నర్, యశ్ ధుల్ ఒక్కో పరుగుతో క్రీజులో ఉన్నారు. 1.4: రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ పార్నెల్ బౌలింగ్లో మిచెల్ మార్షెల్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. పరుగుల ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. ఆదిలోనే ఢిల్లీ క్యాపిటల్స్కు భారీ షాక్ 0.4: రనౌట్గా వెనుదిరిగిన ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా. సిరాజ్ బౌలింగ్లో ఓపెనర్లు వార్నర్, షా పరుగుకు యత్నించగా అనూజ్ రావత్ పాదరసంలా కదిలి.. బంతిని వికెట్లకు గిరాటేశాడు. దీంతో షా రనౌట్ కాగా.. అతడి రూపంలో ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. స్కోరు: 1-1. ఆర్సీబీ స్కోరు: 174/6 (20) 18 ఓవర్లలో ఆర్సీబీ స్కోరు: 154-6 అనూజ్ రావత్, షాబాజ్ అహ్మద్ క్రీజులో ఉన్నారు. 14.2: కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో దినేశ్ కార్తిక్ డకౌట్. ఆరో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ 14.1: కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో మాక్స్వెల్ అవుట్. ఆర్సీబీ స్కోరు: 132/5 (14.1) నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ 13.6: అక్షర్ పటేల్ బౌలింగ్లో హర్షల్ పటేల్ అవుట్. మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ 12.3: మిచెల్ మార్ష్ బౌలింగ్లో వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్కు క్యాచ్ ఇచ్చి మహిపాల్ లామ్రోర్(26(18) [6s-2])అవుట్. మాక్స్వెల్, హర్షల్ పటేల్ క్రీజులో ఉన్నారు. 12 ఓవర్లలో ఆర్సీబీ స్కోరు: 110/2 మహిపాల్ (20), గ్లెన్ మాక్స్వెల్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ డౌన్ 10.1: అర్ధ శతకం పూర్తి చేసుకున్న కోహ్లి అవుట్ లలిత్ యాదవ్ బౌలింగ్లో యశ్ ధుల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన విరాట్ కోహ్లి (50(34) [4s-6 6s-1]) 9 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ స్కోరు: 70/1 50 పరుగుల మార్కు అందుకున్న ఆర్సీబీ 7 ఓవర్లలో స్కోరు: 54-1 పవర్ప్లేలో ఆర్సీబీ ఇలా: 47/1 (6) ఐదు ఓవర్లలో ఆర్సీబీ స్కోరు: 43/1 (5) కోహ్లి (19) ,మహిపాల్ (1) క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ 4.4: మిచెల్ మార్ష్ బౌలింగ్లో డుప్లెసిస్(22(16)) అవుట్. అమన్ హకీం ఖాన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన బెంగళూరు కెప్టెన్. మూడో ఓవర్లో ఇలా: 26-0 2.3: ముస్తాఫిజుర్ బౌలింగ్లో మరో ఫోర్ కొట్టిన డుప్లెసిస్ 2.2: ముస్తాఫిజుర్ బౌలింగ్లో బౌండరీ బాదిన డుప్లెసిస్ రెండో ఓవర్లో ఆర్సీబీ స్కోరు: 16/0 (2) కోహ్లి 12, డుప్లెసిస్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొత్తంగా ఐదు పరుగులు మాత్రమే ఇచ్చిన అక్షర్ పటేల్. ►తొలి ఓవర్లో ఆర్సీబీ స్కోరు: 11-0 0.3: మరోసారి బౌండరీతో మెరిసిన కోహ్లి 0.2: నోర్జే బౌలింగ్లో ఫోర్ బాదిన కోహ్లి ఐపీఎల్-2023లో మరో ఆసక్తికరపోరుకు రంగం సిద్దమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరులో జరుగుతున్న శనివారం నాటి మ్యాచ్లో ఇరు జట్లు ఒకే మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. ఢిల్లీ జట్టులోకి మిచెల్ మార్ష్ రాగా.. స్పిన్నర్ వనిందు హాసరంగా ఆర్సీబీ జట్టులోకి చేరాడు. ఇక ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో ఆడిన మూడు మ్యాచ్ల్లో ఆర్సీబీ కేవలం ఒక్క మ్యాచ్లో విజయం సాధించగా.. ఢిల్లీ ఇంకా ఖాతా తెరవలేదు. తుదిజట్లు(Playing XI) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, విజయ్కుమార్ వైషాక్. ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, యశ్ ధుల్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ముస్తాఫిజుర్ రెహమాన్. -
అట్లుంటది ఆర్సీబీ గ్రహచారం.. ఎంత చేసినా అంతే, చెత్త రికార్డు
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యంత దురదృష్టమై జట్టు ఏదైనా ఉందా అంటే అది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరేనని చెప్పాలి. ఆరంభ సీజన్ నుంచి జట్టు నిండా దిగ్గజాలు ఉన్నా ఆ జట్టు ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క టైటిల్ కూడా సాధించలేదు. ప్రతి ఏడాది 'ఈ సాలా కప్ నమదే' (ఈ ఏడాది కప్ మనదే) అని ఫ్యాన్స్ను ఊరించే ఈ జట్టు.. ప్రతి యేడు భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి ఉసూరుమనిపిస్తుంది. ఈ టీమ్ ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికీ అర్ధం కాదు. కొన్ని సందర్భాల్లో అతి భారీ లక్ష్యాలను తృణప్రాయంగా ఛేదిస్తుంది. కొన్ని సందర్భాల్లో అత్యంత పేలవమైన ఆటతీరుతో దారుణంగా నిరాశపరుస్తుంది. ఇంకొన్ని సందర్భాల్లో తొలుత బ్యాటింగ్ చేసి అత్యంత భారీ స్కోర్లు చేసే ఈ జట్టు, వాటిని డిఫెండ్ చేసుకోలేక చతికిలపడుతుంది. ఇలాంటి ఘటనే ఐపీఎల్-2023లో నిన్న జరిగింది. తమకు అచ్చొచ్చిన చిన్నస్వామి స్టేడియంలో లక్నోతో జరిగిన మ్యాచ్లో 212 పరుగుల భారీ లక్ష్యాన్ని డుప్లెసిస్ సేన డిఫెండ్ చేసుకోలేక ఓటమిపాలైంది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్లో లక్నో చివరి బంతికి విజయం సాధించి, ఆర్సీబీ దృరదృష్టాన్ని మరోసారి గుర్తు చేసింది. థ్రిల్లర్ సినిమాను తలపించిన ఈ మ్యాచ్లో ఓటమితో ఆర్సీబీ తమ దురదృష్టాన్ని మరింత మెరుగుపర్చుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 200 అంతకంటే ఎక్కువ స్కోర్ చేసి దాన్ని డిఫెండ్ చేసుకోలే చతికిలపడిన దురదృష్ట జట్టుగా రికార్డుల్లో నిలిచింది. ఆర్సీబీ ఇప్పటివరకు 5 సందర్భాల్లో 200 ప్లస్ స్కోర్ చేసి దాన్ని డిఫెండ్ చేసుకోలేక ఓటమిపాలైంది. ఐపీఎల్లో మరే జట్టు ఇన్ని సార్లు ఇలా ఓటమిపాలవలేదు. ఆర్సీబీ తర్వాత సీఎస్కే 3 సార్లు, పంజాబ్, కేకేఆర్ తలో 2 సార్లు 200 ప్లస్ స్కోర్ను నిలువరించుకోలేపోయాయి. ఇదిలా ఉంటే, నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో లక్నో వికెట్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య సాగిన ఈ మ్యాచ్లో లక్నో చివరి బంతికి విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. విరాట్ కోహ్లి (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), డుప్లెసిస్ (46 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాక్స్వెల్ (29 బంతుల్లో 59; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో వికెట్ నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 213 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన లక్నో 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండగా.. తొలుత స్టోయినిస్ (30 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆతర్వాత పూరన్ (18 బంతుల్లో 62; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) చారిత్రక ఇన్నింగ్స్లు ఆ జట్టు గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు. ఆఖర్లో హైడ్రామా నెలకొన్నప్పటికీ ఇన్నింగ్స్ చివరి బంతికి బై రావడంతో లక్నో వికెట్ తేడాతో విజయం సాధించింది. -
మా ఓటమికి ప్రధాన కారణం అదే.. వాళ్ల వల్లే ఇదంతా: డుప్లెసిస్
ఐపీఎల్-2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో ఓటమి చవిచూసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఒక్క వికెట్ తేడాతో పరజాయం పాలైంది. 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ కాపాడుకోలేకపోయింది. ఆఖరి ఓవర్లో విజయానికి ఐదు పరుగులు కావల్సిన నేపథ్యంలో.. చివరి బంతికి బై రూపంలో పరుగు రావడంతో లక్నో గెలిపొందింది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ స్పందించాడు. మిడిల్ ఓవర్లలో పట్టు కోల్పోవడంతో మ్యాచ్ ఓడిపోయామని డుప్లెసిస్ తెలిపాడు. పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో డుప్లెసిస్ మాట్లాడుతూ.. "ఈ మ్యాచ్లో ఓటమి పాలవ్వడం నిరాశ కలిగించింది. లక్నో బ్యాటర్లు మిడిల్ ఓవర్లలో అద్భుతంగా ఆడారు. అయితే ఒక బంతికి ఒక పరుగు కావల్సినప్పుడు.. కచ్చితంగా రనౌట్ వస్తుందని భావించాను. కానీ దురదృష్టవశాత్తూ అది జరగలేదు. బెంగళూరు వికెట్ కూడా 7 -14 ఓవర్ల వరకు నెమ్మదిగా ఉంది. అందుకే వారు మిడిల్ ఓవర్లలో మా బౌలర్లను టార్గెట్ చేశారు. ఆఖరి 5 ఓవర్లలో వికెట్ బౌలర్లకు కాస్త అనుకూలించింది. స్టోయినిష్, పూరన్ అద్భుతమైన షాట్లు ఆడారు. వారిద్దూ మ్యాచ్ను మా నుంచి లాగేసుకున్నారు. హర్షల్ పటేల్ తన తొలి ఓవర్లో భారీగా పరుగులు ఇచ్చాడు. కానీ ఆఖరి ఓవర్లో అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చాడు. అయితే డెత్ ఓవర్లలో ఎదో మ్యాజిక్ చేసి గెలవడం చాలా కష్టం. ఎందుకంటే ఎటువంటి బౌలర్కైనా డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం కష్టం. ఇక మా ఇన్నింగ్స్లో నేను సగం వరకు బౌలర్లను ఎదుర్కొవడానికి కాస్త ఇబ్బంది పడ్డాను. అందుకే కోహ్లికి సింగిల్ తీసి స్ట్రైక్ ఇచ్చేశాను. మిడిల్ ఓవర్లలో ఎప్పడైతే రెండు మూడు షాట్లు ఆడానో నా రిథమ్ను తిరిగి పొందాను. తర్వాతి మ్యాచ్ల్లో ఇటువంటి తప్పిదాలు రిపీట్ కాకుండా ఆడుతామని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నాడు. చదవండి: Avesh Khan: ఓవరాక్షన్కు తప్పదు భారీ మూల్యం! ‘ఆవేశ్’ ఖాన్కు ఊహించని షాక్! 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗚𝗔𝗠𝗘 🤯🤯🤯@LucknowIPL pull off a last-ball win! A roller-coaster of emotions in Bengaluru 🔥🔥 Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/96XwaYaOqT — IndianPremierLeague (@IPL) April 10, 2023 -
RCB Vs LSG: ఓటమి బాధలో ఉన్న ఆర్సీబీకి మరో షాక్.. భారీ జరిమానా
Royal Challengers Bangalore vs Lucknow Super Giants: ఓటమి బాధలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మరో షాక్ తగిలింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్కు 12 లక్షల జరిమానా పడింది. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా ఈ మేరకు అతడికి నిర్వాహకులు ఫైన్ విధించారు. కాగా ఐపీఎల్-2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సోమవారం ఆర్సీబీ- లక్నో మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 212 పరుగులు చేసింది. పూరన్ దెబ్బ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి పూరన్ రూపంలో కష్టాలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఆఖరి బాల్కు బై రూపంలో పరుగు రావడంతో లక్నో సూపర్ జెయింట్స్ జయకేతనం ఎగురవేసింది. ఇదిలా ఉంటే.. బెంగళూరు జట్టుకు ఇప్పటికే ఆన్ఫీల్డ్ పెనాల్టీ పడిన విషయం తెలిసిందే. అప్పటికే పెనాల్టీ స్లో ఓవర్ రేటు కారణంగా ఆఖరి ఓవర్లో ఎక్స్ట్రా ఫీల్డర్ను ఇన్సైడ్ సర్కిల్లో ఉంచడం వల్ల డీప్ బౌండరీలో కేవలం నలుగురినే ప్లేస్ చేయాల్సి వచ్చింది. తాజాగా ఆర్సీబీ కెప్టెన్కు జరిమానా విధిస్తూ ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటన విడుదల చేశారు. ‘చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా జరిమానా విధించాం. ఈ సీజన్లో ఆర్సీబీది తొలి తప్పిదం అయిన కారణంగా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్కు 12 లక్షల రూపాయలు జరిమానా విధించాం’’ అని ఐపీఎల్ అధికారిక ప్రకటనలో తెలిపింది. చదవండి: RCB Vs LSG: కనీసం బంతిని టచ్ చేయలేదు.. మరీ అంత ఓవరాక్షన్ పనికిరాదు! అయ్యో హర్షల్.. ఆ పని ముందే చేయాల్సింది! అలా జరిగి ఉంటేనా! వీడియో వైరల్ 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗚𝗔𝗠𝗘 🤯🤯🤯@LucknowIPL pull off a last-ball win! A roller-coaster of emotions in Bengaluru 🔥🔥 Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/96XwaYaOqT — IndianPremierLeague (@IPL) April 10, 2023 -
2023 ఐపీఎల్లో అత్యంత భారీ సిక్సర్.. కొడితే స్టేడియం బయట పడింది..!
IPL 2023: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 115 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. ఈ సిక్స్ ఏకంగా మైదానం బయటకు వెళ్లి పడింది. ఇది చూసి స్టేడియంలో ఉన్న జనాలంతా అవాక్కయ్యారు. బిష్ణోయ్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్ నాలుగో బంతికి డుప్లెసిస్ ఈ మాన్స్టర్ సిక్సర్ను కొట్టాడు. 𝗖𝗼𝗺𝗺𝗮𝗻𝗱𝗲𝗿-𝗶𝗻-𝗖𝗵𝗶𝗲𝗳 becomes 𝗪𝗿𝗲𝗰𝗸𝗲𝗿-𝗶𝗻-𝗖𝗵𝗶𝗲𝗳 🔥#RCBvLSG #TATAIPL #IPL2023 pic.twitter.com/KK5ZqpUmNl — JioCinema (@JioCinema) April 10, 2023 ఐపీఎల్-2023లో ఇదే అత్యంత భారీ సిక్సర్ కాగా.. ఓవరాల్ ఐపీఎల్ హిస్టరీలో ఇది 10వ భారీ సిక్సర్గా నమోదైంది. ఐపీఎల్ అరంగేట్రం సీజన్ (2008)లో సీఎస్కే ఆటగాడు ఆల్బీ మోర్కెల్ బాదిన 125 మీటర్ల భారీ సిక్సర్ ఇప్పటివరకు లాంగెస్ట్ సిక్సర్గా చలామణి అవుతుంది. దీని తర్వాత 2013లో పంజాబ్ ఆటగాడు ప్రవీణ్ కుమార్ 124 మీటర్ల సిక్సర్ కొట్టగా.. 2011లో గిల్క్రిస్ట్ 122 మీటర్లు, 2010లో ఉతప్ప 120 మీటర్లు, 2013 గేల్ 119, 2009లో యువరాజ్ 119, 2008లో రాస్ టేలర్ 119, 2016లో బెన్ కట్టింగ్ 117, 2013లో గంభీర్ 117 మీటర్ల సిక్సర్ కొట్టాడు. 115M SIX FROM @faf1307 🤯 📸: Jio Cinema pic.twitter.com/VOREXEPgJt — CricTracker (@Cricketracker) April 10, 2023 కాగా, లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో డుప్లెసిస్ ఈ ఒక్క సిక్సర్తోనే సరిపెట్టుకోలేదు. ఈ ఇన్నింగ్స్లో అతను 5 భారీ సిక్సర్లు బాదాడు. అతనితో పోటాపోటీగా మ్యాక్స్వెల్ 6, కోహ్లి 4 సిక్సర్లు కొట్టారు. ఫలితంగా ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో వికెట్ నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లి (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), డుప్లెసిస్ (46 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాక్స్వెల్ (29 బంతుల్లో 59; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) స్కోర్ చేయగా.. అమిత్ మిశ్రా, మార్క్ వుడ్కు తలో వికెట్ దక్కింది. -
RCB Vs LSG: రెండుసార్లు ఆర్సీబీదే పైచేయి.. ఈసారి చిన్నస్వామి స్టేడియంలో
IPL 2023 RCB Vs LSG: ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సిద్ధమైంది. సొంతమైదానంలో రెండో మ్యాచ్లోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. కాగా క్యాష్ రిచ్ లీగ్ పదహారో ఎడిషన్లో తమ ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీ ముంబై ఇండియన్స్తో తలపడింది. చిన్నస్వామి స్టేడియంలో ముంబైపై 8 వికెట్ల తేడాతో గెలుపొంది గెలుపుతో సీజన్ను ఆరంభించింది. అయితే, కోల్కతా నైట్రైడర్స్తో ఆడిన మ్యాచ్లో ఆర్సీబీ 81 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. తొలి మ్యాచ్లో రాణించిన ఓపెనర్లు విరాట్ కోహ్లి(ముంబైపై 49 బంతుల్లో 82 పరుగులు), ఫాఫ్ డుప్లెసిస్ (ముంబైపై 43 బంతుల్లో 73 పరుగులు) కోల్కతాలో విఫలమయ్యారు. వీరితో పాటు డేవిడ్ విల్లే (20 పరుగులు) మాత్రమే ఇరవై పరుగుల మార్కును అందుకున్నాడు. దీంతో ఆర్సీబీకి పరాజయం తప్పలేదు. మరోవైపు.. తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించిన లక్నో సూపర్ జెయింట్స్.. రెండో మ్యాచ్లో చెన్నై చేతిలో ఓటమి పాలైంది. ఆర్సీబీతో లక్నో ఢీ అయితే, సొంతమైదానంలో సన్రైజర్స్తో మ్యాచ్లో విజయం సాధించి తిరిగి గెలుపు బాటపట్టింది. ఈ నేపథ్యంలో రెండేసి విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న లక్నో, రెండింట ఒక విజయంతో ఏడో స్థానంలో ఉన్న ఆర్సీబీ సోమవారం బెంగళూరు వేదికగా తలపడనున్నాయి. రెండుసార్లు ఆర్సీబీదే పైచేయి కాగా బెంగళూరు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి వర్ష సూచనైతే లేదు. అదే విధంగా బ్యాటర్లకు అనుకూలించే చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్లో కూడా మెరుగైన స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకు ఆర్సీబీ- లక్నో రెండుసార్లు ముఖాముఖి తలపడగా.. రెండుసార్లు బెంగళూరు జట్టే విజయం సాధించింది. ఈ మ్యాచ్తో ఆర్సీబీకి ప్రొటిస్ ఆల్రౌండర్ వేన్ పార్నెల్ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. ఆర్సీబీ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు.. ఫిట్నెస్ సమస్యలతో గత మ్యాచ్కు దూరమైన లక్నో బౌలర్ మార్క్ వుడ్ ఆర్సీబీతో ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఆవేశ్ ఖాన్ సైతం అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్సీబీ వర్సెస్ లక్నో తుది జట్ల అంచనా: ఆర్సీబీ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లి, అనూజ్ రావత్, గ్లెన్ మాక్స్వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తిక్, మైకేల్ బ్రేస్వెల్, డేవిడ్ విల్లే, హర్షల్ పటేల్, కరణ్ శర్మ, మహ్మద్ సిరాజ్. లక్నో కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టొయినిస్/క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, గౌతమ్/అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్, ఆవేశ్ ఖాన్/జయదేవ్ ఉనాద్కట్, మార్క్ వుడ్, రవి బిష్ణోయి. ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్. చదవండి: 4 ఓవర్లలో 69 పరుగులు; తలెత్తుకో చాంపియన్.. కేకేఆర్ ట్వీట్ వైరల్! ఎవరీ యశ్ దయాల్? IPL 2023: హర్షా బోగ్లేకు ధావన్ అదిరిపోయే కౌంటర్! నవ్వుతూనే చురకలు! -
ప్రతిసారీ వాళ్లమీదే ఆధారపడితే ఎలా? బెటర్ ఆప్షన్ ఉంటే అతడి స్థానంలో..
IPL 2023 KKR Vs RCB: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ల ఆట తీరుపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. ప్రతిసారీ విరాట్ కోహ్లి, డుప్లెసిస్పై ఆధారపడటం సరికాదంటూ చురకలు అంటించాడు. మిగతా వాళ్లు కూడా కాస్త బ్యాట్ ఝులిపించాలంటూ హితబోధ చేశాడు. ముఖ్యంగా గ్లెన్ మాక్స్వెల్, దినేశ్ కార్తిక్ తమ వంతు పాత్ర పోషించాలని వీరూ భాయ్ సూచించాడు. ఐపీఎల్-2023లో కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో ఆర్సీబీ 81 పరుగుల భారీ తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన కేకేఆర్ శార్దూల్ ఠాకూర్, రింకూ సింగ్ మెరుపు ఇన్నింగ్స్తో సొంత మైదానంలో 204 పరుగులు స్కోరు చేసింది. అంతా చేతులెత్తేశారు లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీకి శుభారంభం అందించిన ఓపెనర్లు విరాట్ కోహ్లి (21), ఫాఫ్ డుప్లెసిస్ (23) త్వరగానే పెవిలియన్ చేరడంతో కష్టాలు మొదలయ్యాయి. వన్డౌన్లో వచ్చిన మైకేల్ బ్రేస్వెల్ 19 పరుగులు చేయగా.. గ్లెన్ మాక్స్వెల్(5) పూర్తిగా నిరాశపరిచాడు. సింగిల్ డిజిట్ స్కోర్లు ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన హర్షల్ పటేల్(0), షాబాజ్ అహ్మద్ (1), దినేశ్ కార్తిక్ (9), అనూజ్ రావత్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారు. తొమ్మిదో స్థానంలో వచ్చిన పేస్ ఆల్రౌండర్ 20 పరుగులతో అజేయంగా నిలవగా.. ఆకాశ్ దీప్ 17 పరుగులు చేయగలిగాడు. ఈ క్రమంలో 123 పరుగులకే ఆలౌట్ అయిన ఆర్సీబీ పదహారో ఎడిషన్లో తొలి పరాజయం నమోదు చేసింది. డీకే, మాక్సీ ఏం చేస్తున్నారు? ఈ నేపథ్యంలో క్రిక్బజ్ షోలో మాట్లాడిన వీరేంద్ర సెహ్వాగ్.. ‘‘ప్రతిసారి ఇద్దరు ఆటగాళ్ల మీద ఆధారపడటం సరికాదు. విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ రాణిస్తే మాత్రమే ఆర్సీబీ గెలుస్తుందనిపిస్తోంది. ఇలా జరుగకూడదు కదా! గ్లెన్ మాక్స్వెల్, దినేశ్ కార్తిక్ కూడా పరుగులు సాధించాలి. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అనూజ్ రావత్ కూడా బాధ్యతగా వ్యవహరించాలి. ఆర్సీబీ ఇప్పటికైనా అతడి కంటే బెటర్ ఆప్షన్ ఉంటే చూసుకోవాలి’’ అని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా మంచే జరిగింది ‘‘ఏదేమైనా టాపార్డర్ విఫలమైతే, బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైతే ఆ జట్టు పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికే జట్లన్నింటికీ అవగతమే. గతంలో ఎన్నోసార్లు ఆయా జట్లు ఇలాంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్నాయి. ఈసారి ఆర్సీబీకి రెండో మ్యాచ్లోనే ఇలా జరగడం మంచిదైంది. ఒకవేళ 8-9 మ్యాచ్ల తర్వాత ఇలా జరిగి ఉంటే కష్టమైపోయేది. ఆదిలోనే లోపాలు సరిదిద్దుకుంటే మిగతా మ్యాచ్లలో మరింత మెరుగ్గా రాణించే అవకాశాలు ఉంటాయి’’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. చదవండి: కోహ్లి వచ్చాడు.. కోపంగా బ్యాట్ విసిరేశాడు.. పక్కనే కూర్చున్న నాతో.. నీరజ్చోప్రా తమ్ముడిలా ఉన్నాడు.. 'ఇంపాక్ట్'ను భలే వాడింది పో! ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్! ప్రతీసారి ఇంతే A memorable first victory of #TATAIPL 2023 at home.@KKRiders secure a clinical 81-run win over #RCB ⚡️⚡️ Scorecard - https://t.co/J6wVwbsfV2#TATAIPL | #KKRvRCB pic.twitter.com/0u57nKO57G — IndianPremierLeague (@IPL) April 6, 2023 -
అర్థం కాని ఆర్సీబీ.. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియదు!
ఐపీఎల్ మొదలైన తొలి సీజన్ నుంచి ఆర్సీబీ ప్రతీసారి ఫెవరెట్గానే కనిపిస్తుంది. మూడుసార్లు ఫైనల్ గడప తొక్కినప్పటికి రన్నరప్తోనే సరిపెట్టుకుంది. అయితే యాదృశ్చికంగా ఆర్సీబీ ప్రతీ సీజన్లో ఒక మ్యాచ్లో దారుణ ఆటతీరును కనబరచడం అలవాటుగా చేసుకుంది. అదేంటో తెలియదు కానీ ముందు మ్యాచ్లో విజృంభించి ఆ తర్వాతి మ్యాచ్కే బొక్కబోర్లా పడడం ఆర్సీబీ నైజం. తాజా సీజన్లోనూ ఆర్సీబీకి ఆ పరిస్థితి ఎదురైంది. కేకేఆర్తో మ్యాచ్లో 205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 123 పరుగులకే ఆలౌటై 81 పరుగుల తేడాతో భారీ ఓటమి చవిచూసింది. అయితే ఒక దశలో 95 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఈ దశలో ఆకాశ్ దీప్, డేవిడ్ విల్లేలు మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఆర్సీబీ పరువు నిలబడింది. లేకుంటే వంద పరుగులలోపే ఆలౌటై ఘోర పరాజయాన్నే మూటగట్టుకునేదే. అయితే కేకేఆర్తో మ్యాచ్కు ముందు ముంబైతో జరిగిన మ్యాచ్లో ఇదే ఆర్సీబీ దూకుడైన ఆటతీరును ప్రదర్శించింది. 172 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. విరాట్ కోహ్లి 82 నాటౌట్, డుప్లెసిస్ 73 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ముంబైపై చెలరేగిన వీరిద్దరు కేకేఆర్తో మ్యాచ్లో తక్కువ స్కోరుకే వెనుదిరగడం జట్టును దెబ్బతీసింది. ఇవాళ ఆర్సీబీ ఆటతీరు చూసిన ఫ్యాన్స్.. ''ఎవరికి అర్థం కాని ఆర్సీబీ.. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియదు''అంటూ పేర్కొన్నారు. -
డుప్లెసిస్ అర్థం కాని యాసతో కేకేఆర్కు మేలు
ఐపీఎల్ 2023లో 9వ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య జరిగింది. ఈ మ్యాచ్ కు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమిచ్చింది. అయితే ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా కాస్త గందరగోళం నెలకొంది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ యాస అర్థం కాక కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా అయోమయానికి గురయ్యాడు. అయితే దీనిపై తర్వాత డుప్లెసిస్ క్లారిటీ ఇచ్చాడు. విషయంలోకి వెళితే.. టాస్ సందర్భంగా కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా కాయిన్ గాల్లోకి ఎగరేశాడు. ఆ సమయంలో డుప్లెసిస్ హెడ్స్ అన్నాడు. కాయిన్ కూడా హెడ్స్ పడింది. అయితే మ్యాచ్ రిఫరీతోపాటు నితీష్ రానా కూడా డుప్లెసిస్ టెయిల్స్ అన్నాడనుకొని టాస్ కేకేఆర్ గెలిచినట్లు భావించారు. కానీ తాను హెడ్స్ అన్నట్లు డుప్లెసిస్ చెప్పాడు. ఆ సమయంలో టాస్ నిర్వహిస్తున్న సంజయ్ మంజ్రేకర్ కూడా ఫాఫ్.. హెడ్స్ అన్నాడని స్పష్టం చేశాడు. దీనిపై నితీష్ అసహనం వ్యక్తం చేస్తూ పక్కకెళ్లిపోయాడు. ఇది నీకు ఓకే కదా అని మంజ్రేకర్ అడిగినా అతడు పట్టించుకోలేదు. దీనిపై డుప్లెసిస్ వివరణ ఇచ్చాడు. "మొదట బౌలింగ్ చేస్తాం. నా యాస అర్థం కాక నితీష్ రాణా కాస్త తప్పుగా అర్థం చేసుకున్నట్లున్నాడు" అని డుప్లెసిస్ చెప్పాడు. ఈ నిర్ణయంపై నితీష్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశాడు. టాస్ గెలిచి ఉంటే తాను కూడా ఫీల్డింగ్ ఎంచుకునేవాడినని నితీష్ రాణా పేర్కొన్నాడు. అయితే డుప్లెపసిస్ అర్థం కాని యాస కేకేఆర్కు ఒక రకంగా మేలు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కేకేఆర్ మొదట్లో తడబడినా ఆఖర్లో శార్దూల్, రింకూ సింగ్లు మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో 204 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ దారుణ ఆటతీరును కనబరిచింది. 84 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఇక ఈ సీజన్లో రాత్రి పూట మంచు కారణంగా టాస్ గెలిచిన జట్లు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంటున్నాయి. .@RCBTweets win the toss at Eden Gardens and elect to bowl first 💪 Catch #KKRvRCB - LIVE & FREE on #JioCinema across all telecom operators 👈#IPL2023 #IPLonJioCinema #TATAIPL | @KKRiders pic.twitter.com/Z7jnwlEIsI — JioCinema (@JioCinema) April 6, 2023 -
స్నిన్నర్ల విజృంభణ.. ఆర్సీబీపై కేకేఆర్ ఘన విజయం
కేకేఆర్తో మ్యాచ్లో ఆర్సీబీ ఓటమి పాలైంది. 205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 123 పరుగులకే ఆలౌటై 81 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. అయితే ఒక దశలో 95 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఈ దశలో ఆకాశ్ దీప్(8 బంతుల్లో 17), డేవిడ్ విల్లే(20 బంతుల్లో 20 నాటౌట్)లు మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఆర్సీబీ పరువు నిలబడింది. లేకుంటే వంద పరుగులలోపే ఆలౌటై ఘోర పరాజయాన్నే మూటగట్టుకునేదే. డుప్లెసిస్ 23 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి నాలుగు వికెట్లు తీయగా.. సుయాశ్శర్మ మూడు, సునీల్ నరైన్ రెండు వికెట్లు, శార్దూల్ ఒక వికెట్ పడగొట్టాడు. ఓటమి దిశగా ఆర్సీబీ.. 86 పరుగులకే 8 వికెట్లు డౌన్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 86 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. టార్గెట్ 205.. 54కే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ 205 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీ కష్టాల్లో పడింది. 8 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. బ్రాస్వెల్ ఆరు, షాదాబ్ అహ్మద్ క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website శార్దూల్, రింకూ సింగ్ మెరుపులు.. ఆర్సీబీ టార్గెట్ 205 శార్దూల్ ఠాకూర్(29 బంతుల్లో 69,9 ఫోర్లు, 3 సిక్సర్లు), రింకూ సింగ్(33 బంతుల్లో 46 పరుగులు) విధ్వంసం సృష్టించడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోరు చేసింది. అంతకముందు రహమనుల్లా గుర్బాజ్ 57 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆర్సీబీ బౌలర్లలో డేవిడ్ విల్లే, కర్ణ్ శర్మలు చెరో రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, హర్షల్ పటేల్, ఆకాశ్దీప్లు తలా ఒక వికెట్ తీశారు. Photo Credit : IPL Website శార్దూల్ దూకుడు.. 16 ఓవర్లలో కేకేఆర్ 147/5 ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ మెరుపు ఇన్నింగ్స్తో దూకుడు ప్రదర్శిస్తుండడంతో కేకేఆర్ 16 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. శార్దూల్ 19 బంతుల్లో 47, రింకూ సింగ్ 21 పరుగులతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website 94 పరుగులకే ఐదు వికెట్లు ఆర్సీబీతో మ్యాచ్లో కేకేఆర్ కష్టాల్లో పడింది. 94 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. కర్ణ్ శర్మ వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టాడు. Photo Credit : IPL Website 9 ఓవర్లలో కేకేఆర్ 71/3 9 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్ 47 పరుగులతో ఆడుతున్నాడు. Photo Credit : IPL Website వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ ఆర్సీబీతో మ్యాచ్లో కేకేఆర్ వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. డేవిడ్ విల్లే ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో వరుస బంతుల్లో వెంకటేశ్ అయ్యర్(3), మణిదీప్(0) పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం కేకేఆర్ 4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. Photo Credit : IPL Website టాస్ గెలిచి ఫీల్డింగ్ ఏంచుకున్న ఆర్సీబీ ఐపీఎల్ 16వ సీజన్ 9వ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్తలపడుతున్నాయి. ఈడెన్స్ గార్డెన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో కేకేఆర్ విజయంపై కన్నేసింది. టాస్ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఏంచుకుంది. .@RCBTweets win the toss at Eden Gardens and elect to bowl first 💪 Catch #KKRvRCB - LIVE & FREE on #JioCinema across all telecom operators 👈#IPL2023 #IPLonJioCinema #TATAIPL | @KKRiders pic.twitter.com/Z7jnwlEIsI — JioCinema (@JioCinema) April 6, 2023 కోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): మన్దీప్ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), నితీష్ రాణా(కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చకరవర్తి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, మైకేల్ బ్రేస్వెల్, షాబాజ్ అహ్మద్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్ తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను చిత్తు చేసిన ఆర్సీబీ జోరు కొనసాగించాలని భావిస్తోంది. సొంత గడ్డపై గెలిచి, టోర్నమెంట్లో బోణీ కొట్టాలని నితీశ్ రానా సేన పట్టుదలతో ఉంది. ముంబైపై హాఫ్ సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ, కెప్టెన్ డూప్లెసిస్ ఈ మ్యాచ్లోనూ రాణిస్తే ఆర్సీబీకి తిరుగుండదు. సమిష్టిగా సత్తా చాటడంపై కేకేఆర్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. -
కోహ్లి, డుప్లెసిస్ విధ్వంసం.. ముంబైపై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ 16వ సీజన్ను ఆర్సీబీ ఘనంగా ఆరంభించింది. ఆదివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలోనే చేధించింది. కోహ్లి(49 బంతుల్లో 82 నాటౌట్), డుప్లెసిస్( 43 బంతుల్లో 73) తొలి వికెట్కు 148 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఆఖర్లో డుప్లెసిస్ ఔటైనప్పటికి కోహ్లి మిగతాపనిని పూర్తి చేశాడు. కోహ్లి, డుప్లెసిస్ అర్థ శతకాలు.. విజయం దిశగా ఆర్సీబీ ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఆర్సీబీ విజయం దిశగా పయనిస్తోంది. కోహ్లి, డుప్లెసిస్లు అర్థశతకాలతో విరుచుకుపడడంతో ఆర్సీబీ ప్రస్తుతం 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 113 పరుగులు చేసింది. ఆర్సీబీ విజయానికి 48 బంతుల్లో 59 పరుగులు కావాలి. 9 ఓవర్లు ముగిసరికి ఆర్సీబీ వికెట్ నష్టోకుండా 80 పరుగులు చేసింది. డుప్లెసిస్ 44, కోహ్లి 32 పరుగులతో క్రీజులో ఉన్నారు. టార్గెట్ 172.. ధాటిగా ఆడుతున్న ఆర్సీబీ 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ దూకుడు కనబరుస్తోంది. 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. డుప్లెసిస్ 26, కోహ్లి 22 పరుగులతో ఆడుతున్నారు. ఆర్సీబీ టార్గెట్ 172 ఆర్సీబీతో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. తిలక్ వర్మ 46 బంతుల్లో 84 పరుగులు నాటౌట్ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. 17 ఓవర్లలో ముంబై 123/7 కష్టాల్లో పడిన ముంబై ఇండియన్స్ను తెలుగుతేజం తిలక్ వర్మ తన హాఫ్ సెంచరీతో నిలబెట్టాడు. ప్రస్తుతం ముంబై 17 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. తిలక్ వర్మ 59, అర్షద్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. 14 ఓవర్లలో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసిసంది. తిలక్ వర్మ 44 పరుగులతో ఆడుతున్నాడు. సూర్యకుమార్ ఔట్.. 48కే నాలుగు వికెట్లు సూర్యకుమార్(16) రూపంలో ముంబై ఇండియన్స్ 48 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్ ఔట్.. మూడో వికెట్ డౌన్ ఆర్సీబీతో మ్యాచ్లో ముంబై ఇండియన్స్కు షాకుల మీద షాక్లు తగులుతున్నాయి. రోహిత్ శర్మ రూపంలో ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. అంతకముందు 10 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ను సిరాజ్ ఔట్ చేస్తే.. 5 పరుగులు చేసిన గ్రీన్ను టోప్లే పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం ముంబై ఐదు మూడు వికెట్ల నష్టానికి 19 పరుగులతో ఉంది. టాస్ గెలిచిన ఆర్సీబీ ఐపీఎల్ ఐదో మ్యాచ్లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ బౌలింగ్ తీసుకున్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. సొంత గడ్డపై విజయం సాధించాలని డూప్లెసిస్ సేన పట్టుదలతో ఉంది. విక్టరీతో టోర్నీ ప్రారంభించాలని రోహిత్ సేన భావిస్తోంది. ముంబై ఇండియన్స్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నేహాల్ వదేరా, హృతీక్ షోకీన్, పియూష్ చావ్లా, జోఫ్రా ఆర్చర్, అర్షద్ ఖాన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు : విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లిసెస్ (కెప్టెన్), మైకేల్ బ్రాస్వెల్, షాబజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, ఆకాశ్ దీప్, రేస్ తోప్లే, మహ్మద్ సిరాజ్ -
'#Ee sala Cup Nahi'.. జట్టు కెప్టెన్ అయ్యుండి ఆ మాట అనొచ్చా!
ఐపీఎల్లో మోస్ట్ అన్లక్కీ జట్టు ఏదైనా ఉందంటే అది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టే. ప్రతీ సీజన్లో పేపర్పై బలంగా కనిపించే ఆర్సీబీ అసలు ఆటలో మాత్రం తేలిపోతుంది. ఒత్తిడిలో ఆడదన్న పేరును మూటగట్టుకున్న ఆర్సీబీ మరో సౌతాఫ్రికా జట్టులా తయారైంది. ఈ సాలా కప్ నమ్ దే(ఈసారి కప్ మనదే) అంటూ ప్రతీసారి ఊదరగొట్టే ఆర్సీబీ ఆ కలను మాత్రం నెరవేర్చుకోలేకపోతుంది. తాజాగా ప్రారంభమైన ఐపీఎల్ 16వ సీజన్కు ఆర్సీబీ నూతనోత్సాహంతో సిద్ధమైంది. ఏప్రిల్ 2న ముంబై ఇండియన్స్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో జట్టు కెప్టెన్ పాఫ్ డుప్లెసిస్ జట్టు కూర్పు గురించి.. ఈ సీజన్లో తాము ఆడబోయే గేమ్ స్ట్రాటజీ గురించి ప్రమోషన్ ఈవెంట్లో మాట్లాడాడు. ఈ మీటింగ్కు కోహ్లి కూడా హాజరయ్యాడు. అయితే కెప్టెన్ డుప్లెసిస్ చర్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆర్సీబీ స్లోగన్ ఈ సాలా కప్ నమ్దేను డుప్లెసిస్ తప్పుగా చెప్పాడు. కోహ్లి అతని చెవిలో ఈ సాలా కప్ నమ్దే అని చెప్పాడు. కానీ డుప్లెసిస్కు ఈ సాలా కప్ వరకు అర్థమైంది కానీ చివరి పదం అర్థం కాలేదు. దీంతో ఈ సాలా కప్ నహీ(ఈసారి కప్పు రాదు) అని తప్పుగా చెప్పేశాడు. దీంతో షాక్ తిన్న కోహ్లి డుప్లెసిస్ మాటలకు పగలబడి నవ్వుకున్నాడు. ఆ తర్వాత కోహ్లి మరోసారి చెప్పడంతో డుప్లెసిస్ ఈసారి మాత్రం ఈ సాలా కప్ నమ్దే అంటూ కరెక్ట్గా చెప్పాడు. ఈ చర్య ఆర్సీబీ అభిమానులను కాస్త భయానికి గురి చేసింది. కానీ ఐపీఎల్లో ఉన్న మిగిలిన జట్ల అభిమానులు మాత్రం #Ee Sala Cup Nahi.. హ్యాష్ట్యాగ్ క్రియేట్ చేసి డుప్లెసిస్ను ట్రోల్ చేశారు. ''కెప్టెన్ అయ్యుండి అంత మాట అంటావా''..'' నిజమేలే.. ఈసారి కూడా మీకు కప్పు ఎలాగో రాదు.. అందుకే నీ నోటి నుంచి ఆ మాట వచ్చింది''..'' ముందే ఫిక్స్ అయినట్టున్నారు కప్ రాదని'' అంటూ కామెంట్ చేశారు. ఐపీఎల్లో ఆర్సీబీ ఇప్పటి వరకు మూడుసార్లు రన్నరప్గా నిలిచింది. అయితే 2016 తర్వాత ఆర్సీబీ మూడేళ్ల పాటు ఆఖరి స్థానాల్లో నిలుస్తూ వచ్చింది. అయితే 2020 నుంచి మాత్రం ఆర్సీబీ ఆటలో దూకుడు పెరిగింది. గతేడాది ఐపీఎల్లో ఎలిమినేటర్లో లక్నోను ఇంటికి పంపించి రెండో క్వాలిఫయర్ ఆడిన ఆర్సీబీ రాజస్తాన్ చేతిలో ఖంగుతిని ఇంటిబాట పట్టింది. Faf Du Plessis mistakenly says "Ee Sala Cup Nahi". instead of "ee sala cup namde" Virat Kohli Could Not Stop Laughing 😂#IPL2023 #RCB #RCBvMI #FafDuPlessis #ViratKohlipic.twitter.com/ym3hhdV40e — CRICKETNMORE (@cricketnmore) April 1, 2023 చదవండి: అరుదైన రికార్డు.. కోహ్లిని సమం చేసిన గబ్బర్ -
ఆర్సీబీ రాత ఇంతేనా.. మహిళల ఐపీఎల్లోనూ నిరాశ తప్పదా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్ (2008) నుంచి ఏ యేటికి ఆ యేడు ఎన్నో అంచనాల నడుమ బరిలోకి దిగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు, ప్రతి సీజన్లోనూ ఉసూరుమనిపిస్తూ ఫ్రాంచైజీ అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తున్న విషయం విధితమే. పేరులో రాయల్, జట్టు నిండా స్టార్లు ఉన్నారనే మాట తప్పించి, ఆర్సీబీ 15 ఎడిషన్లలో సాధించింది ఏమీ లేదు. 2009, 2011, 2016 ఎడిషన్లలో రన్నరప్గా నిలిచిన ఆ జట్టు.. ప్రతి యేడు 'ఈ సాలా కప్ నమ్మదే' అనడం తప్ప ఒక్కసారి కూడా టైటిల్ సాధించింది లేదు. 2009 ఎడిషన్లో రాస్ టేలర్, 2011లో క్రిస్ గేల్, 2016లో విరాట్ కోహ్లి ఒంటిరిగా విజృంభించడంతో ఈ మూడు ఎడిషన్లలో ఫైనల్కు చేరింది తప్పిస్తే.. ఈ జట్టు మూకుమ్మడిగా ఆడి, గెలిచింది ఎప్పుడూ లేదు. కనీసం మహిళల ఐపీఎల్ (WPL)లో అయినా ఫేట్ మారుతుందని ఆశించిన ఆర్సీబీ అభిమానులకు ఇక్కడ కూడా నిరాశ తప్పడం లేదు. మెన్స్ టీమ్కు తాము ఏమాత్రం తక్కువ కాదన్నట్లు, మహిళల టీమ్ పోటీపడి మరీ వరుస పరాజయాలు మూటగట్టుకుంటుంది. డబ్ల్యూపీఎల్-2023లో ఆర్సీబీ వుమెన్స్ టీమ్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలై, మెన్స్ ఆర్సీబీని గుర్తు చేస్తుంది. మెన్స్ ఆర్సీబీ లాగే వుమెన్స్ ఆర్సీబీ కూడా స్టార్లతో కళకళలాడుతున్నప్పటికీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడుతుంది.కోట్లు కుమ్మరించి ఏరికోరి ఎంచుకున్న కెప్టెన్ మంధన వ్యూహాలు రచించడంలో దారుణంగా విఫలమవుతుండగా.. ఢిల్లీ, ముంబైలతో జరిగిన మ్యాచ్ల్లో అంతర్జాతీయ స్టార్లు సోఫీ డివైన్, రిచా ఘోష్, రేణుకా సింగ్ పూర్తిగా చేతులెత్తేశారు. ఢిల్లీతో మ్యాచ్లో ఎల్లీస్ పెర్రీ, హీథర్ నైట్, మెగాన్ షట్ పర్వాలేదనిపించగా.. కెప్టెన్ మంధన రెండు మ్యాచ్ల్లో బ్యాట్తో ఓకే అనిపించింది. లీగ్లో తదుపరి మ్యాచ్ల్లో కూడా ఆర్సీబీ ప్రదర్శన ఇలాగే కొనసాగితే, మెన్స్ ఆర్సీబీలాగే ఈ జట్టు పరిస్థితి కూడా పేపర్పై పులిలా తయారవుతుంది. కాగా, డబ్ల్యూపీఎల్ అరంగ్రేటం సీజన్లో భారీ అంచనాల నడుమ బరిలో నిలిచిన ఆర్సీబీ.. తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో, రెండో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ రెండు మ్యాచ్ల్లో ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించినా, ఆతర్వాత వచ్చే ప్లేయర్లు దారుణంగా విఫలమయ్యారు. బ్యాటింగ్ విషయంలో వరుస ఇదైతే, బౌలింగ్లో ఆర్సీబీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఢిల్లీతో మ్యాచ్లో షఫాలీ, లాన్నింగ్లకు కనీసం డాట్ బాల్ వేయలేక ఆర్సీబీ బౌలర్లు అష్టకష్టాలు పడ్డారు. ఆ మ్యాచ్లో తొలి ఓవర్ మినహాయించి, 19 ఓవర్లలో ఆర్సీబీ బౌలర్లు బౌండరీలు, సిక్సర్లు సమర్పించుకున్నారు. ముంబైతో మ్యాచ్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి కొనసాగింది. దాదాపుగా అందరూ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. రెండు మ్యాచ్ల్లో కలిపి ఆర్సీబీ బౌలర్లు కేవలం 3 వికెట్లు మాత్రమే పడగొట్టారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతుంది. -
దక్షిణాఫ్రికాకు గుడ్ న్యూస్.. మూడేళ్ల తర్వాత స్టార్ క్రికెటర్ రీ ఎంట్రీ!
అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్.. మళ్లీ జాతీయ జట్టు తరుపున ఆడేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. 2021లో అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన డుప్లెసిస్.. ప్రోటీస్ వైట్ బాల్ జట్టు తరుపున ఆడేందుకు ఉత్సుకత చూపిస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ నుంచి డుప్లెసిస్ తప్పుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వివిధ ఫ్రాంచైజీ లీగ్ల్లో ఆడుతున్నాడు. డుప్లెసిస్ చివరిసారిగా 2020లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో ప్రోటీస్ తరపున ఆడాడు. ప్రోటీస్ వార్తాపత్రిక ర్యాప్పోర్ట్ నివేదిక ప్రకారం.. డుప్లెసిస్ ఇప్పటికే దక్షిణాఫ్రికా కొత్త వైట్ బాల్ కోచ్ రాబ్ వాల్టర్ కలిసినట్లు సమాచారం. స్వదేశంలో విండీస్తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్లలో డుప్లెసిస్కు చోటు దక్కే అవకాశం ఉంది. కాగా డుప్లెసిస్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా టీ20లీగ్లో ఫాప్ అదరగొట్టాడు. జోబర్గ్ సూపర్ కింగ్స్కు సారథ్యం వహించిన డుప్లెసిస్ 369 పరుగులు సాధించాడు. ఇక విండీస్తో వైట్బాల్ సిరీస్లకు తమ జట్టును దక్షిణాఫ్రికా క్రికెట్ సోమవారం ప్రకటించనుంది. మార్చి16న ఈస్ట్ లండన్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ప్రోటీస్-విండీస్ వైట్ బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. చదవండి: WPL 2023: లేడీ సెహ్వాగ్ విధ్వంసం.. 10 ఫోర్లు, 4 సిక్స్లతో! వీడియో వైరల్ -
Virat Kohli: మన స్థానంలోకి వచ్చిన వాళ్లు సలహాలు తీసుకోకున్నా పర్లేదు! అలా అని..
Virat Kohli- RCB Captaincy: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవకపోయినా క్రేజ్ మాత్రం తగ్గని జట్టు ఏదైనా ఉందంటే టక్కున గుర్తుకువచ్చే పేరు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఇందుకు ప్రధాన కారణం టీమిండియా స్టార్, రన్మెషీన్ విరాట్ కోహ్లి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. గత పదిహేను ఎడిషన్లలో ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గకపోయినా కోహ్లి చరిష్మాతో నేటికీ ఆర్సీబీ ఫేవరెట్ జట్టుగానే కొనసాగుతోంది. అయితే, గత సీజన్లో విరాట్ ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో సౌతాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. తనదైన శైలిలో జట్టును ముందు నడిపి మంచి ఫలితాలే రాబట్టాడు. జట్టును ప్లే ఆఫ్స్ వరకు చేర్చగలిగాడు. అయితే, ఈసారి ఆర్సీబీ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. ఇందుకు కూడా కోహ్లినే కారణం. పూర్వ వైభవం పొట్టి ఫార్మాల్లో కోహ్లి అవసరం పెద్దగా ఉండబోదన్న అభిప్రాయాల నేపథ్యంలో ఆసియా కప్ టీ20 టోర్నీ సందర్భంగా సెంచరీ(అంతర్జాతీయ కెరీర్లో 71వది)తో పూర్వవైభవం పొందాడు కోహ్లి. అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో 61 బంతులు ఎదుర్కొని 122 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లో మరో రెండు శతకాలు బాదాడు. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2022 తర్వాత కోహ్లిపై ఏ స్థాయిలో విమర్శలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పొట్టి ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్సీకి గుడ్బై చెప్పడం, ఆర్సీబీ కెప్టెన్సీ వదులుకోవడం.. ఆ తర్వాత వరుస ఫార్మాట్ల నుంచి భారత కెప్టెన్ బాధ్యతల నుంచి ఉద్వాసన వంటి కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. నిలకడలేమి ఫామ్తో సతమతమయ్యాడు. ఈ నేపథ్యంలో కోహ్లి తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆర్సీబీ కెప్టెన్సీ వదులుకోవాలని నిర్ణయించుకున్న సమయంలో కొత్త సారథి ఎవరైనా అతడి నేతృత్వంలో ఆడేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నానని మేనేజ్మెంట్కు చెప్పాడట కోహ్లి. ఈ విషయం తెలిసిన డుప్లెసిస్ ఎగ్జైట్ అయ్యాడట. ఆటే ముఖ్యం ఆర్సీబీ పాడ్కాస్ట్ సీజన్ 2లో ఈ మేరకు మాట్లాడుతూ.. ‘‘ఆర్సీబీ కెప్టెన్సీ ప్రణాళికల గురించి నాకు తెలిసిన తర్వాత వెంటనే అతడికి మెసేజ్ చేశాను. నాకు తెలిసి నేనే మొదట అతడికి ఈ విషయం చెప్పానుకుంటా. తను చాలా సంతోషపడ్డాడు. అదే సమయంలో తన కెప్టెన్సీ నేను ఆడబోతున్నానని తెలిసి ఎగ్జైట్ అయ్యాడు. సలహాలు ఇవ్వకపోవడమే మంచిది గత సీజన్లో జరిగిన పరిణామాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. నిజానికి వ్యక్తుల కన్నా ఆటే అత్యుత్తమమైనది. ఆట కంటే ఎవరూ ఎక్కువ కాదు. కాబట్టి ఒక్కోసారి మనకు అప్పజెప్పిన బాధ్యతల నుంచి తప్పుకొన్న తర్వాత.. బాధపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. మన స్థానంలోకి వచ్చిన వ్యక్తి మన సలహాలు, సూచనలు తీసుకోనని చెప్పినా చింతించాల్సిన పని లేదు. ఎవరూ అలా ఆలోచించొద్దు కూడా! అని కోహ్లి చెప్పుకొచ్చాడు. కెప్టెన్గా వైదొలిగిన నిజాన్ని జీర్ణించుకునేందుకు సమయం పట్టిందని, అయితే, కొత్త సారథికి సూచనలు ఇవ్వాలన్న ప్రతిపాదన మాత్రం తనకు అంతగా నచ్చలేదని, ఎవరికైనా స్వేచ్ఛనిస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డాడు. కాగా మార్చి 31 నుంచి ఐపీఎల్-2023 ఆరంభం కానుంది. -
ఆ ఇద్దరి నుంచే కెప్టెన్సీ స్కిల్స్ నేర్చుకున్నా: సన్రైజర్స్ కొత్త కెప్టెన్
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్గా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఐడెన్ మార్క్రమ్ ఎంపికైన సంగతి తెలిసిందే. గత సీజన్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా వ్యవహరించిన కేన్ విలియమ్సన్ నుంచి మార్క్రమ్ బాధ్యతలు నుంచి స్వీకరించనున్నాడు. కాగా ఈ ఏడాది సీజన్ మినీ వేలంకు ముందు విలియమ్సన్ను ఎస్ఆర్ హెచ్ విడిచిపెట్టింది. అయితే మినీవేలంలో విలియమ్సన్ను గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. అదే విధంగా సౌతాఫ్రికా టీ20 లీగ్లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ సారథ్యం వహించిన మార్క్రమ్.. తమ జట్టు తొలి టైటిల్ను అందించాడు. ఇక ఈ లీగ్లో మార్క్రమ్ సారధిగానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనతో కూడా ఆకట్టుకున్నాడు. 12 మ్యాచ్లు ఆడిన అతడు 366 పరుగులతో పాటు 11 వికెట్లు కూడా సాధించాడు. ఇక ఐపీఎల్లో సన్రైజర్స్ సారథిగా బాధ్యతలు చేపట్టిన మార్క్రామ్ తొలి సారి స్పందించాడు. ఇండియాటూడేతో మార్క్రమ్ మాట్లాడుతూ.. "సన్రైజర్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. కెప్టెన్గా జట్టును విజయ పథంలో నడిపించడానికి 100 శాతం ఎఫక్ట్ పెడతాను. అదే విధంగా మా జట్టుకు అభిమానులు మద్దతు కూడా చాలా ఉంటుంది. కాబట్టి వారిని సంతృప్తి పరచేందుకు మేము గట్టిగా ప్రయత్నిస్తాం. ఇక నా కెరీర్లో ఆదర్శప్రాయులైన వ్యక్తుల గురించి మాట్లాడాలంటే.. జాతీయ జట్టుకు ఆడేటప్పుడు ఫాఫ్ డు ప్లెసిస్ నుంచి చాలా విషయాలు నేర్చకున్నాను. ముఖ్యంగా ఒక సారథిగా ఎలా ఉండాలో తెలుసుకున్నాను. ఇక గతేడాది సన్రైజర్స్లో ఆడినప్పుడు కేన్ విలియమ్సన్ నుంచి కూడా కెప్టెన్సీ స్కిల్స్ను నేర్చుకున్నాను. ఫాప్ లాగే కేన్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఆటగాళ్లకు మద్దతుగా నిలవడం, వారిలో ఆత్మవిశ్వాసం నింపండం వంటవి విలియమ్సన్ ప్రత్యేకం. అందుకే ఈ ఇద్దరి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అదే విధంగా హెడ్ కోచ్ బ్రియాన్ లారాతో కలిసి పనిచేయడానికి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: T20 WC 2023: సెమీస్కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ ఆల్రౌండర్ దూరం -
SA20 2023: ముగిసిన ‘ముంబై’ కథ.. టోర్నీ నుంచి అవుట్.. మనకేంటీ దుస్థితి?
SA20, 2023 - Joburg Super Kings vs MI Cape Town: సౌతాఫ్రికా టీ20- 2023 లీగ్లో ఎంఐ కేప్టౌన్ కథ ముగిసింది. ఆరంభ సీజన్లోనే ముంబై ఇండియన్స్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. జోబర్గ్ సూపర్ కింగ్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో ఎంఐ కేప్టౌన్ 76 పరుగుల భారీ తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. దీంతో ఏడో పరాజయం నమోదు చేసిన ఎంఐ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ విజయంతో చెన్నై ఫ్రాంఛైజీకి చెందిన జోబర్గ్ ప్లే ఆఫ్స్నకు చేరుకుంది. కాగా జోహన్నస్బర్గ్ వేదికగా ది వాండరర్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన ఎంఐ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆరంభంలోనే షాక్ ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన జోబర్గ్కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్లు కెప్టెన్ డుప్లెసిస్, హెండ్రిక్స్ డకౌట్గా వెనుదిరిగారు. దీంతో ఎంఐ జట్టు సంబరాలు చేసుకుంది. అయితే, వన్డౌన్లో వచ్చిన అన్క్యాప్డ్ ఇంగ్లిష్ బ్యాటర్ లూయీస్ డు ప్లూయీ వారి ఆనందాన్ని ఎక్కువ సేపు నిలవనీయలేదు. ఆదుకున్న అన్క్యాప్ట్ బ్యాటర్ జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ 48 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 81 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిలిగిన వాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్ 40 పరుగులతో రాణించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో జోబర్గ్ 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. రషీద్ విఫలం ఎంఐ బౌలర్లలో లిండే ఒకటి, సామ్ కరన్ రెండు, జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు తీయగా.. డెవాల్డ్ బ్రెవిస్కు ఒక వికెట్ దక్కింది. ఇక కెప్టెన్ రషీద్ ఖాన్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. మిగతా ఎంఐ బౌలర్లతో పోలిస్తే.. 4 ఓవర్ల కోటాలో 42 పరుగులు ఇచ్చి మ్యాచ్లో చెత్త గణాంకాలు నమోదు చేశాడు. చేతులెత్తేశారు ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఎంఐ కేప్టౌన్ను జోబర్గ్ బౌలర్లు ఆది నుంచే దెబ్బకొట్టారు. ఓపెనర్ రాసీ వాన్ డసెన్ 20, వన్డౌన్లో వచ్చిన గ్రాంట్ రోల్ఫోసన్ 21 పరుగులు చేయగా.. నాలుగో స్థానంలో వచ్చిన బేబీ ఏబీడీ 27 పరగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో 17.5 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ అయిన ఎంఐ భారీ ఓటమిని మూటగట్టుకుంది. హృదయం ముక్కలైంది ఈ పరాజయంతో టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఎంఐ కేప్టౌన్ .. ‘‘మేము ఆరంభ సీజన్ను ఇలా ముగించాలనుకోలేదు. అయినా మేమంతా ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటాం’’ అంటూ హృదయం ముక్కలైందంటూ హార్ట్ ఎమోజీని జత చేసింది. మనకేంటీ దుస్థితి? మరోవైపు.. జోబర్గ్ ప్లే ఆఫ్స్నకు దూసుకెళ్లి టైటిల్ సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇక ఐపీఎల్-2022 సీజన్లో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ముంబై ఫ్యాన్స్ ఉసూరుమంటున్నారు. ‘‘గత కొన్నాళ్లుగా నిరాశే ఎదురవుతోంది. ఏ లీగ్లో కూడా ప్లే ఆఫ్స్ చేరుకోలేమా? మనకేంటీ దుస్థితి’’ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన రషీద్ ఖాన్.. కెప్టెన్గానూ విఫలమయ్యాడు. పదింట ఎంఐ కేవలం మూడు విజయాలే నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ Not the way we’d have wanted to end our inaugural #SA20 campaign 💔 But a family sticks together and so will we. 🤗💙#OneFamily — MI Cape Town (@MICapeTown) February 6, 2023 .@JSKSA20 solidify the 2️⃣nd spot in the #SA20 points table 💛 Watch the #JSKvMICT match highlights and stay tuned to #JioCinema, #Sports18 & @ColorsTvTamil 📺📲 for #SA20League action 🏏#SA20onJioCinema #SA20onSports18 pic.twitter.com/hmmpfGLSy2 — JioCinema (@JioCinema) February 6, 2023 Leus du Plooy's innings brought @JSKSA20 fans a lot of joy 🫶 Keep watching #SA20 action on #JioCinema, #Sports18 & @ColorsTvTamil 📺📲#JSKvMICT #SA20onJioCinema #SA20onSports18 | @SA20_League pic.twitter.com/BsBbqr1QvX — JioCinema (@JioCinema) February 6, 2023 -
SA20 2023: ఆర్సీబీ కెప్టెన్ విధ్వంసం.. టోర్నీలో తొలి సెంచరీ నమోదు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ సౌతాఫ్రికా 20 లీగ్(SA20 2023) టోర్నీలో తొలి శతకంతో మెరిశాడు. లీగ్లో జోబర్గ్ సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న డుప్లెసిస్ కెప్టెన్గా జట్టును నడిపిస్తున్నాడు. (58 బంతుల్లోనే 113 పరుగులు నాటౌట్) చేసిన డుప్లెసిస్ ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు ఉండడం విశేషం. ముందు కెప్టెన్గా తన బాధ్యతను నిర్వహించిన డుప్లెసిస్ ఆ తర్వాత బ్యాటింగ్లోనూ విధ్వంసం సృష్టించాడు.కాగా తొలిసారి జరుగుతున్న సౌతాఫ్రికా 20 లీగ్ 2023లో డుప్లెసిస్దే తొలి శతకం కావడం విశేషం. ఇక డుప్లెసిస్ ఈ సీజన్లో ఏడు మ్యాచ్లు కలిపి 277 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో జాస్ బట్లర్ 285 పరుగులు(పార్ల్ రాయల్స్ జట్టు) ఉన్నాడు. మంగళవారం వాండరర్స్ వేదికగా డర్బన్ సూపర్ జెయింట్స్తో మ్యాచ్ జరిగింది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్(48 బంతుల్లో 65 పరుగులు) టాప్ స్కోరర్గా నిలవగా.. హోల్డర్ 28, కైల్ మేయర్స్ 28 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన జోబర్గ్ సూపర్ కింగ్స్ డుప్లెసిస్ ధాటికి 19.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ 45 పరుగులతో రాణించాడు. ఇక గతేడాది ఐపీఎల్లో డుప్లెసిస్ ఆర్సీబీకి కెప్టెన్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అతని సారధ్యంలో ఆర్సీబీ ప్లేఆఫ్స్కు వెళ్లింది. ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్కు షాకిచ్చిన ఆర్సీబీ క్వాలిఫయర్-2లో మాత్రం రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఖంగుతింది. అలా గతేడాది ఐపీఎల్లో ఆర్సీబీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. The maiden #Betway #SA20 CENTURY has been an absolute delight to witness! Faf du Plessis is a man for the big moments 🔥#JSKvDSG | @Betway_India pic.twitter.com/QcZAAYOLU6 — Betway SA20 (@SA20_League) January 24, 2023 చదవండి: SA20 2023: చెలరేగిన బట్లర్, మిల్లర్.. సన్రైజర్స్కు భంగపాటు '22 ఏళ్ల పరిచయం.. కచ్చితంగా తప్పు చేసి ఉండడు' -
సౌతాఫ్రికా ఆల్రౌండర్ సంచలన నిర్ణయం.. ఆటకు గుడ్ బై! ఇకపై..
South Africa All Rounder Dwaine Pretorius: సౌతాఫ్రికా ఆల్రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అతడు.. తక్షణమే తన నిర్ణయం అమల్లోకి వస్తుందని సోమవారం ప్రకటించాడు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు సైతం ధ్రువీకరించింది. ఈ మేరకు.. ‘‘క్రికెట్ కెరీర్కు సంబంధించి గత కొన్ని రోజుల క్రితమే నేను అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నాను. అంతర్జాతీయ స్థాయిలో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగాలని నిశ్చయించుకున్నా. ప్రొటిస్కు ఆడాలనే ఆశయంతో వచ్చిన వాడిని. ఇక్కడిదాకా ఎలా రాగలిగానో నాకే తెలియదు. అయితే, దేవుడిచ్చిన ప్రతిభాపాటవాలు, ఆట పట్ల నిబద్ధత చూపగల లక్షణం నేను విజయవంతమయ్యేలా చేశాయి. ఇక ముందు కూడా నా భవిష్యత్తు ఆయనే నిర్ణయిస్తాడు’’ అంటూ తన రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా ప్రిటోరియస్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. టీ20ల కోసమే.. ‘‘మున్ముందు టీ20, ఇతర పొట్టి ఫార్మాట్లపై దృష్టి సారిస్తాను. ఎలాంటి బంధనాలు లేని ఆటగాడిగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే నాకు నచ్చినట్లుగా నేను ఆడగలిగే స్వేచ్ఛ లభించింది. ఈ నిర్ణయం ద్వారా ఇటు ఆటతో పాటు కుటుంబానికి కూడా తగినంత సమయం కేటాయించగలుగుతాను. నా ప్రయాణంలో ఇంతవరకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఫాఫ్ డు ప్లెసిస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. నన్ను మళ్లీ జట్టులోకి రప్పించి.. నన్ను నేను మరింత మెరుగైన ఆటగాడిగా మలచుకోవడంలో నాకు సహాయపడినందుకు ఫాఫ్నకు థాంక్యూ’’ అని ప్రిటోరియస్ తన నిర్ణయం వెనుక గల కారణాలు వెల్లడించాడు. కాగా 33 ఏళ్ల డ్వేన్ ప్రిటోరియస్ ఐపీఎల్-2023లో చెన్నై సూపర్కింగ్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఆరేళ్ల కాలంలోనే.. 2016లో ఐర్లాండ్తో వన్డే మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ప్రిటోరియస్.. ప్రొటిస్ తరఫున 30 టీ20, 27 వన్డేలు, మూడు టెస్టు మ్యాచ్లు ఆడాడు. రెండు వరల్డ్కప్ టోర్నీల్లో సౌతాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించాడు. గతేడాది ఇంగ్లండ్తో ఆడిన వన్డే అతడి కెరీర్లో చివరిది. చదవండి: Suryakumar Yadav: సూర్య కెరీర్పై గంభీర్ ట్వీట్! నీకు అతడు మాత్రమే కనిపిస్తున్నాడా? ఫ్యాన్స్ ఫైర్ Virat Kohli: అదొక జబ్బు! దాని నుంచి బయటపడాలని కోరుకుంటున్నా.. కోహ్లి పోస్ట్ వైరల్ -
IPL 2023: ఆర్సీబీ ఒక్కసారి ట్రోఫీ గెలిస్తే... వరుసగా 3- 4 టైటిళ్లు గెలుస్తుంది!
IPL 2023- Royal Challengers Bangalore: జట్టులో ఎంతో మంది స్టార్ ప్లేయర్లు.. విరాట్ కోహ్లి వంటి రికార్డుల ధీరులు.. ఒంటి చేత్తో మ్యాచ్ను మలుపు తిప్పగల సమర్థులు.. అయినా ఇంత వరకు ఒక్క టైటిల్ కూడా గెలవని జట్టుగా అపవాదు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి ఇది. కోట్లాది మంది అభిమాన గణం.. ‘‘ఈ సాలా కప్ నామ్దే(ఈసారి కప్ మాదే)’’ అంటూ గత పదిహేనేళ్లుగా ఎదురుచూస్తున్నా వారి కలలు నెరవేర్చలేకపోతోంది. గత మూడు సీజన్లుగా అద్భుతంగా రాణిస్తున్నా కీలక సమయాల్లో చతికిలపడి టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ మాజీ ఆటగాడు, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక్కసారి ఆర్సీబీ ట్రోఫీ గెలిచిందంటే వరుసగా టైటిళ్లు సొంతం చేసుకుంటుందని జోస్యం చెప్పాడు. ఇప్పటికి 15 సీజన్లు పూర్తయ్యాయనుకుంటా స్టార్ స్పోర్ట్స్ షోలో డివిలియర్స్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికి 15 సీజన్లు పూర్తయ్యాయనుకుంటా.. వాళ్లు సవాళ్లను అధిగమించాలని పట్టుదలటా ఉన్నారు. ఆర్సీబీ ఒక్కసారి గెలిచిందంటే.. వాళ్లు రెండు, మూడు, నాలుగు గెలుస్తూనే ఉంటుంది. టీ20 క్రికెట్ అంటేనే అంచనాలు తలకిందులు చేసే ఫార్మాట్. పొట్టి క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్ల ఫలితాలు అంచనా వేయలేం. అయితే ఈసారి ఆర్సీబీ మారుతుందనే ఆశిస్తున్నా’’ అంటూ ఆర్సీబీ ఈసారి టైటిల్ గెలవాలని ఆకాంక్షించాడు. రీ ఎంట్రీ కాగా 2011లో బెంగళూరుకు ఆడటం మొదలుపెట్టిన మిస్టర్ 360 డివిలియర్స్.. 11 సీజన్ల పాటు ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇక క్యాష్ రిచ్ లీగ్కు గుడ్ బై చెప్పిన ఈ ప్రొటిస్ దిగ్గజం ఈసారి ‘రీ ఎంట్రీ’ అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, ఆటగాడినా లేదంటే మరే ఇతర పాత్రలోనైనా కనిపిస్తాడా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఐపీఎల్-2023 మినీ వేలం డిసెంబరులో కొచ్చి వేదికగా జరుగనుంది. కాగా గత సీజనల్లో ఫాఫ్ డుప్లెసిస్ ఆర్సీబీకి కెప్టెన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. చదవండి: భారత్-న్యూజిలాండ్ తొలి టీ20 ఆలస్యం.. కారణమిదే It is no secret who @ABdeVilliers17 will be cheering for this year!#RCB fans, are you ready to chant Ee Sala Cup Namde with him?🤩 pic.twitter.com/sf5fCYJmju — Star Sports (@StarSportsIndia) November 17, 2022 -
'మరో మూడు వారాల్లో పూర్తిగా తెలుసుకుంటారు'
సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్.. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఆటబయోగ్రఫీ త్వరలోనే విడుదల కానుంది. ''ఫాఫ్: థ్రూ ఫైర్(Faf: Through Fire)'' పేరిట ఆటోబయోగ్రఫీ అక్టోబర్ 28న బుక్ రిలీజ్ జరగనుంది. ఈ సందర్భంగా డుప్లెసిస్ తన జీవితచరిత్ర గురించి ట్విటర్ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''ఒక క్రికెటర్గా మాత్రమే మీకు తెలుసు. నేనొక మూసిన పుస్తకాన్ని. ఇన్నాళ్లుగా క్రికెట్ ఆడుతున్నప్పటికి ఒక్కసారి కూడా నా జీవితం, క్రికెట్ లైఫ్ గురించి నాకు తెలిసినవాళ్లకు తప్ప ఎక్కడా బయటపెట్టలేదు. మరో మూడు వారాల్లో నా జీవితం గురించి మీకు పూర్తిగా తెలుస్తుంది. 'Faf: Through Fire'.. నా స్వీయ చరిత్ర మిమ్మల్ని ఆకట్టుకుంటుంది'' అంటూ ముగించాడు. ఇక డుప్లెసిస్ సౌతాఫ్రికా తరపున విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా పేరు పొందాడు. కెప్టెన్గా డుప్లెసిస్ విన్నింగ్ పర్సంటేజ్ 73.68 శాతం ఉండడం విశేషం. సౌతాఫ్రికా తరపున అన్ని ఫార్మాట్లలో ఆల్టైమ్ బ్యాటర్గా గుర్తింపు పొందిన డుప్లెసిస్ 2011లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. సౌతాఫ్రికా తరపున డుప్లెసిస్ 69 టెస్టుల్లో 4,163 పరుగులు, 143 వన్డేల్లో 5,507 పరుగులు, 50 టి20ల్లో 1528 పరుగులు సాధించాడు. డుప్లెసిస్ ఖాతాలో టెస్టుల్లో 10 సెంచరీలు, వన్డేల్లో 12 సెంచరీలు, టి20ల్లో సెంచరీ ఉన్నాయి. సౌతాఫ్రికా తరపున మూడు ఫార్మాట్లలో(టెస్టు, వన్డే, టి20) సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా డుప్లెసిస్ రికార్డులకెక్కాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్పై దృష్టి పెట్టేందుకు డుప్లెసిస్ 2021లో టెస్టు క్రికెట్కు గుడ్బై చెప్పాడు. అయితే సరైన ఫామ్లో లేక ఇబ్బంది పడుతున్న డుప్లెసిస్ అక్టోబర్లో జరగనున్న టి20 ప్రపంచకప్కు జట్టులో చోటు దక్కలేదు. ఇక టెంబా బవుమా కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా టి20 ప్రపంచకప్లో గ్రూఫ్-2లో పాకిస్తాన్, టీమిండియా, బంగ్లాదేశ్తో పాటు క్వాలిఫయింగ్ జట్లతో మ్యాచ్లు ఆడనుంది. I’ve always been a closed book. I haven’t really shared my journey through life and cricket with the people outside of my circle. In three weeks, you will get to be a part of my circle. Pre-order here 👇https://t.co/J9cpr3Gi2Nhttps://t.co/FujCqdIuJy#ThroughFire #ComingSoon pic.twitter.com/rUggbyc0bj — Faf Du Plessis (@faf1307) October 7, 2022 చదవండి: 'ఇంజనీర్లు చాలా మంది ఉన్నారు.. ఫాస్ట్ బౌలర్ అవ్వు' -
CPL 2022: డుప్లెసిస్ అద్భుత సెంచరీ.. టీ20 ఫార్మాట్లో నాలుగోది! కానీ పాపం..
Caribbean Premier League 2022 - Faf Du Plessis 4th T20 Century: కరేబియన్ ప్రీమియర్ లీగ్-2022లో భాగంగా గయానా అమెజాన్ వారియర్స్తో మ్యాచ్లో సెయింట్ లూసియా కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అద్భుత సెంచరీతో మెరిశాడు. 59 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్ల సాయంతో 103 పరుగులు చేశాడు. తద్వారా టీ20 ఫార్మాట్లో తన నాలుగో శతకాన్ని నమోదు చేశాడు ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు. అయితే, గయానా అమెజాన్ వారియర్స్ బ్యాటర్లు రాణించడంతో.. భారీ స్కోరు చేసినా సెయింట్ లూసియా కింగ్స్కు ఓటమి తప్పలేదు. దీంతో ఫాఫ్ డుప్లెసిస్ సెంచరీ ఇన్నింగ్స్ వృథాగా పోయింది. Century for Faf!! Faf’s superb 103 runs from 59 balls earns him the @Dream11 MVP for match 27!! #CPL22 #GAWvSLK #CricketPlayedLouder #Dream11 #BiggestPartyInSport pic.twitter.com/R5Rkal9UCW — CPL T20 (@CPL) September 23, 2022 టాస్ గెలిచి.. భారీ స్కోరు చేసి Guyana Amazon Warriors vs Saint Lucia Kings: గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో సెయింట్ లూసియా కింగ్స్, గయానా అమెజాన్ వారియర్స్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కింగ్స్ కెప్టెన్ డుప్లెసిస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్గా బరిలోకి దిగి సెంచరీ సాధించాడు. అయితే, మిగతా ఆటగాళ్లలో వన్డౌన్ బ్యాటర్ డిక్విల్లా(36 పరుగులు) మినహా ఎవరూ రాణించలేకపోయారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కింగ్స్ జట్టు 194 పరుగులు చేసింది. అర్ధ శతకాలతో మెరిసి.. సమిష్టి కృషితో.. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వారియర్స్ జట్టుకు ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్(26 బంతుల్లో 52 పరగులు), చంద్రపాల్ హేమ్రాజ్ (29 పరుగులు) శుభారంభం అందించారు. ఇక వన్డౌన్ బ్యాటర్ షాయీ హోప్ 30 బంతుల్లో 59 పరుగులతో రాణించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చినా షకీబ్ అల్ హసన్ మాత్రం డకౌట్గా వెనుదిరిగి నిరాశపరిచాడు. అయితే, ఆఖర్లో వారియర్స్ కెప్టెన్ షిమ్రన్ హెట్మెయిర్ 36 పరుగులు చేసి జట్టును విజయం దిశగా నడిపాడు. ఆఖరి ఓవర్ రెండో బంతికి ఒక పరుగు తీసి రొమారియో షెఫర్డ్ లాంఛనం పూర్తి చేశాడు. ఇలా 19.2 ఓవర్లలో నాలుగు వికెట్లు పోయి వారియర్స్ లక్ష్యాన్ని ఛేదించింది. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక విలువైన ఇన్నింగ్స్ ఆడిన షాయీ హోప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2022లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్గా వ్యవహరించిన ఫాఫ్ డుప్లెసిస్.. 16 ఇన్నింగ్స్లో 468 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో అతడి అత్యధిక స్కోరు 96. What an innings!!! Faf brings up his 4th T20 century in emphatic style as this evenings @fun88eng Magic Moment. #CPL22 #GAWvSLK #CricketPlayedLouder #Fun88 #BiggestPartyInSport pic.twitter.com/eBZpOUusyM — CPL T20 (@CPL) September 23, 2022 -
జొహన్నెస్బర్గ్ కెప్టెన్గా డుప్లెసిస్
కేప్టౌన్: చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే) పాత మిత్రులు స్టీఫెన్ ఫ్లెమింగ్, డుప్లెసిస్ మళ్లీ జట్టు కట్ట నున్నారు. సీఎస్కే యాజమాన్యం దక్షిణాఫ్రికా టి20 లీగ్లో కొనుగోలు చేసిన జొహన్నెస్బర్గ్ సూపర్ కింగ్స్ కోసం ఇద్దరు కలిసి పని చేయనున్నారు. ఈ జట్టుకు ఫ్లెమింగ్ కోచ్ కాగా, డుప్లెసిస్ సారథ్యం వహించనున్నాడు. ఐపీఎల్ మెగా వేలానికి ముందు చెన్నై డుప్లెసిస్ను విడుదల చేశాక ఈ ఏడాది బెంగళూరుకు సారథ్యం వహించి జట్టును ప్లేఆఫ్స్కు చేర్చాడు. క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) టి20 లీగ్లో ఓ మినీ సీఎస్కే జట్టే బరిలోకి దిగబోతోంది. ఎందుకంటే మొయిన్ అలీ (ఇంగ్లండ్), మహీశ్ తీక్షణ (శ్రీలంక), రొమారియో షెఫర్డ్ (విండీస్)లు కూడా జొహన్నెస్బర్గ్ జట్టులో ఉన్నారు. ఆటగాళ్లే కాదు కోచింగ్ సిబ్బంది కూడా సీఎస్కేతోనే నిండిపోతోంది. ఫ్లెమింగ్ హెడ్కోచ్గా, ఎరిక్ సిమన్స్ సహాయ కోచ్గా వ్యవహరిస్తారు. ఒకప్పుడు సీఎస్కేకు ఆడిన దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ ఆల్బీ మోర్కెల్ను కూడా జొహన్నెస్బర్గ్ జట్టు కోచింగ్ సిబ్బందిలో నియమించనున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది ఆరంభంలో సీఎస్ఏ టి20 లీగ్ జరిగే అవకాశముంది. -
మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్తో జతకట్టనున్న డుప్లెసిస్
సౌతాఫ్రికా మాజీ కెప్టెన్, ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు సారధి ఫాఫ్ డుప్లెసిస్.. తన మాజీ ఐపీఎల్ జట్టైన చెన్నై సూపర్ కింగ్స్తో (సీఎస్కే) తిరిగి జతకట్టనున్నాడు. వచ్చే ఏడాది ప్రారంభంలో క్రికెట్ సౌతాఫ్రికా నిర్వహించే టీ20 లీగ్ కోసం సీఎస్కే యాజమాన్యం ఫాఫ్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. సఫారీ లీగ్ కోసం ఆటగాళ్ల (ఐదుగురు.. ఇందులో ఒకరు సౌతాఫ్రికన్ అయి ఉండాలి, ముగ్గురు విదేశీ ప్లేయర్లు ఉండాలి, ఇద్దరికి మించి ఒకే దేశానికి చెందిన ఆటగాళ్లు ఉండకూడదు, ఒక అన్ క్యాపడ్ ప్లేయర్ ఉండాలి) డైరెక్ట్ అక్విజిషన్కు (నేరుగా ఎంపిక చేసుకునే సౌలభ్యం) ఆగస్ట్ 10 డెడ్లైన్ కావడంతో సీఎస్కే యాజమాన్యం స్థానిక కోటాలో ఫాఫ్ను ఎంచుకుంది. సఫారీ లీగ్లో పాల్గొనే ఆరు ఫ్రాంచైజీల్లో ఒకటైన జోహన్నెస్బర్గ్ను సొంతం చేసుకున్న సీఎస్కే యాజమాన్యం.. తాము ఎంపిక చేసుకున్న మిగతా నలుగురు ఆటగాళ్ల వివరాలను వెల్లడించలేదు. ఈ లీగ్లో పాల్గొనే మిగతా ఐదు జట్లు కూడా తమ స్టార్ సైనింగ్స్ను ప్రకటించడానికి ఇష్టపడలేదు. ఫాఫ్ 2011 నుంచి 2021 వరకు సీఎస్కేకు ప్రాతినిధ్యం వహించాడు. 2022 మెగా వేలంలో అతని ఆర్సీబీ సొంతం చేసుకుని కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది. కాగా, సఫారీ లీగ్లో పాల్గొనే మొత్తం ఆరు జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కేప్టౌన్ను ముంబై ఇండియన్స్, జొహన్నెస్బర్గ్ను సీఎస్కే, సెంచూరియన్, పార్ల్, డర్బన్, పోర్ట్ ఎలిజబెత్ ఫ్రాంచైజీలను ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యాలు దక్కించుకున్నాయి. చదవండి: విదేశీ లీగ్స్లోనూ తనదైన ముద్ర.. కొత్త జట్ల పేర్లను ప్రకటించిన ముంబై యాజమాన్యం -
'37 ఏళ్ల వయస్సులో అదరగొడుతున్నాడు.. అతడిని జట్టులోకి తీసుకోండి'
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్కు ఫాప్ డు ప్లెసిస్ను దక్షిణాఫ్రికా జట్టులోకి తీసుకోవాలని ఆ దేశ మాజీ పేసర్ మోర్నే మోర్కెల్ అభిప్రాయపడ్డాడు. కాగా డుప్లెసిస్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెట్కు సంబంధించిన ప్రణాళికలలో భాగంగా లేడు. అదే విధంగా అతడు తన దక్షిణాఫ్రికా క్రికెట్ సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయాడు. కాగా డుప్లెసిస్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2020లో ఆడాడు. ఇక ఐపీఎల్-2022లో ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన డుప్లెసిస్ పర్వాలేదనిపించాడు. ఈ ఏడాది సీజన్లో 468 పరుగులు చేసిన డుప్లెసిస్.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. "డు ప్లెసిస్ 37 ఏళ్ల వయస్సులో కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. అతడు ఫీల్డింగ్లో కూడా అదరగొడుతున్నాడు. డుప్లెసిస్ ఐపీఎల్లో ఆర్సీబీ తరుపున అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. కాబట్టి అటువంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు దక్షిణాఫ్రికా జట్టులో ఉండాలి. క్రికెట్ సౌతాఫ్రికా పునరాలోచన చేసి అతడిని ప్రపంచకప్కు జట్టులోకి తీసుకురావాలి" అని మోర్కెల్ పేర్కొన్నాడు. చదవండి: Sourav Ganguly 50th Birthday: లండన్లో బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్న దాదా -
బిగ్బాష్ లీగ్లో ఆడనున్న ఆర్సీబీ కెప్టెన్..!
దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ ఈ బిగ్ బాష్ లీగ్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. బిగ్ బాష్ లీగ్ 12వ సీజన్ ఓవర్సీస్ డ్రాఫ్ట్ నామినీల జాబితాలో తన పేరును డుప్లెసిస్ నమోదు చేసుకున్నాడు. ఇక బిగ్ బాష్ లీగ్లో ఇప్పటి వరకు డుప్లెసిస్ కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. 2012 సీజన్లో మెల్బోర్న్ రెనెగేడ్స్ తరపున ఫాప్ ప్రాతినిధ్యం వహించాడు. ఈ మ్యాచ్లో 17 బంతులు ఆడిన డుప్లెసిస్ కేవలం 14 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇక ఈ ఏడాది టోర్నమెంట్ హాఫ్ సీజన్కు డుప్లెసిస్ అందు బాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా అత్యధిక జీతం కలిగిన ప్లాటినం విభాగంలో డుప్లెసిస్ చోటు దక్కించుకోవచ్చు అని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ కేటగిరీలో ఒక ఆటగాడు అత్యధికంగా 340,000 ఆస్ట్రేలియా డాలర్ల జీతం పొందుతాడు. ఇక అతడితో పాటు ఆ దేశ ఆటగాళ్లు రిలీ రోసోవ్, మార్చంట్ డి లాంగే కూడా తమ పేర్లును నమోదు చేసుకున్నారు. చదవండి: Ind Vs Eng: వాళ్లకు ఐపీఎల్ ముఖ్యం.. ఇది చాలా డేంజర్: బీసీసీఐపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఘాటు వ్యాఖ్యలు -
'విరాట్ కోహ్లి కంటే డుప్లెసిస్ అత్యుత్తమ కెప్టెన్'
ఐపీఎల్-2022లో భాగంగా శుక్రవారం జరిగిన క్వాలిఫైయర్-2లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమి చెందిన ఆర్సీబీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా ఈ సీజన్లోనైనా కప్ సాధిస్తుందని భావించిన ఆర్సీబీ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇది ఇలా ఉండగా.. గతేడాది సీజన్ కంటే ఈ ఏడాది సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన ప్రదర్శన కనబరిచిందని భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా కెప్టెన్గా విరాట్ కోహ్లి కంటే ఫాఫ్ డుప్లెసిస్ అత్యుత్తమంగా రాణించాడని మంజ్రేకర్ తెలిపాడు. "ఆర్సీబీ గత సీజన్ కంటే ప్రస్తుత సీజన్లో మెరుగ్గా రాణించింది. విరాట్ కోహ్లి కంటే డుప్లెసిస్ అత్యత్తుమ సారథిగా కన్పిస్తున్నాడు. కాగా వారిద్దరి నుంచి మరింత మంచి ఇన్నింగ్స్లు ఆశించాం. అయితే ప్లే ఆఫ్స్కు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా టైటిల్ సాధిస్తారని భావించాను. అయితే క్వాలిఫైయర్-2లో ఓటమి గల కారణాలు వాళ్లకు బాగా తెలుసు. ఇక ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ బౌలర్లు అద్బుతంగా రాణించారు. అయితే బౌలర్లను సరైన సమయాల్లో డుప్లెసిస్ ఉపయోగించాడు. ఇక అతడు బ్యాటింగ్ పరంగా టోర్నీ ఆరంభంలో అద్భుతంగా రాణించనప్పటికీ.. అందరూ బ్యాటర్ల మాదిరిగానే సెకెండ్ హాఫ్లో కాస్త తడబడ్డాడు. అయినప్పటికీ కెప్టెన్గా మాత్రం డుప్లెసిస్ సరైన ఎంపిక" అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: 'ఓవైపు తల్లికి సీరియస్.. అయినా మ్యాచ్లో అదరగొట్టాడు' -
మరో సౌతాఫ్రికాలా తయారైంది.. ఇంకా ఎన్నేళ్లు నిరీక్షించాలో!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. షార్ట్కట్లో ఆర్సీబీ. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫ్యాన్ ఫాలోవర్స్ కలిగిన జట్టుగా ఆర్సీబీ ఎప్పుడు ముందు స్థానంలో ఉంటుంది. సీఎస్కే, ముంబై జట్లు టైటిళ్లు కొల్లగొట్టడంతో ఫ్యాన్బేస్ను పెంచుకోగా.. ఆర్సీబీ మాత్రం మొదటి సీజన్ నుంచి తాజా సీజన్ వరకు ఒక్కసారి టైటిల్ గెలవకపోయినా అభిమాన గణం మాత్రం పెంచుకుంటూనే వచ్చింది. అయితే ఆ జట్టు మాత్రం అభిమానుల ఆశలను నిలుపుకోలేక దురదృష్టవంతమైన టీమ్గా తయారైంది. PC: IPL Twitter మొదటి సీజన్ నుంచి చూసుకుంటే కెప్టెన్లు మారినా.. ఆటగాళ్లు మారినా ఆర్సీబీ తలరాత మాత్రం మారడం లేదు. ప్రతీసారి అంచనాలకు మించి పేపర్ బలంగా కనిపించే జట్టు ఆర్సీబీ. ''ఈసాలా కప్ నమ్దే'' అంటూ ట్యాగ్లైన్ ఏర్పాటు చేసుకొని ఆర్సీబీ బరిలోకి దిగుతుంటే.. అరె ఈసారి ఎలాగైనా కప్ కొడుతుంది అని అభిమానులు మురిసిపోవడం.. మొదట్లో మెరిసి ఆఖర్లో ఊసురుమనిపించడం అలవాటుగా చేసుకుంది. ఆర్సీబీకి అంత పేరు రావడానికి టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఉండడమే. ఆరంభం నుంచి కోహ్లి ఆర్సీబీలోనే ఉండడం.. 2014లో ఆర్సీబీ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన కోహ్లి.. 2021 ఐపీఎల్ సీజన్ వరకు కెప్టెన్గా ఉన్నాడు. తన ఏడేళ్ల కెప్టెన్సీలో ఆర్సీబీని కోహ్లి ఒకసారి రన్నరప్(2016), మూడుసార్లు ప్లేఆఫ్ వరకు తీసుకెళ్లగలిగాడు. ఇక 2022 ఐపీఎల్లో డుప్లెసిస్ కెప్టెన్సీలోని ఆర్సీబీ ఆరు సీజన్ల తర్వాత ఎలిమినేటర్ గండాన్ని దాటింది. అయితే క్వాలిఫైయర్ సరిహద్దును మాత్రం దాటలేకపోయింది. 8వ సారి ప్లేఆఫ్స్కి చేరిన ఆర్సీబీ.. ఎనిమిదో సారి కూడా రిక్త హస్తాలతోనే ఇంటిబాట పట్టింది. దీంతో ఆర్సీబీని మరో దక్షిణాఫ్రికా జట్టుతో పోలుస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఇది ఎంతవరకు నిజం అని చెప్పలేం గాని.. కొన్ని విషయాల్లో మాత్రం ఆర్సీబీ ప్రొటిస్ జట్టును గుర్తుకుతెస్తుంది. PC: IPL Twitter క్రికెట్లో అత్యంత దురదృష్టవంతమైన జట్టుగా దక్షిణాఫ్రికాకు పేరుంది. ఇంతవరకు ఒక్క మేజర్ టోర్నీని(ఐసీసీ ట్రోఫీలు) గెలవని ప్రొటీస్ జట్టు పరంగా చూస్తూ మాత్రం ఎప్పుడు ఉన్నతస్థానంలోనే ఉంటుంది. 1990వ దశకం నుంచి 2017 వరకు దక్షిణాఫ్రికా జట్టు పేపర్పై చాలా బలంగా కనిపించేది. ద్వైపాక్షిక సిరీస్ల్లో చెలరేగిపోయే దక్షిణాఫ్రికా.. ఐసీసీ మేజర్ టోర్నీలంటే మాత్రం ఎక్కడలేని ఒత్తిడిని కొనితెచ్చుకునేది. ఆ ఒత్తిడితోనే గెలవాల్సిన మేజర్ ట్రోఫీలను కూడా చేజేతులా పోగొట్టుకునేది. ప్రొటీస్ జట్టలో ఆటగాళ్ల ప్రతిభకు కొదువలేదు. జట్టుకు ఆడిన దిగ్గజ ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా 1999 వన్డే ప్రపంచకప్లో సెమీఫైనల్ మ్యాచ్లో 1 బంతికి 22 పరుగులు చేయాల్సి రావడం.. బహుశా దక్షిణాఫ్రికా జట్టుకు మాత్రమే చెల్లింది. అదృష్టానికి దూరంగా.. దురదృష్టానికి దగ్గరగా ఉన్న ప్రొటిస్ జట్టుకు, ఆర్సీబీకి కొన్ని విషయాల్లో మాత్రం చాలా పోలికలు ఉన్నాయి. ఆర్సీబీ కూడా ప్రతీసారి భారీ అంచనాలతో బరిలోకి దిగడం.. జట్టులో స్టార్ ఆటగాళ్లకు కొదువ లేకపోవడం.. కీలక మ్యాచ్ల్లో ఒత్తిడిని కొనితెచ్చుకోవడం.. ఫలితంగా టైటిల్కు దూరంగా నిలవడం జరుగుతూనే ఉంది. ఆర్సీబీ కప్ కొట్టేది ఎప్పుడు.. తమ ఒత్తిడిని జయించేది ఎన్నడూ.. ఐపీఎల్ టైటిల్ కొట్టాలన్న నిరీక్షణ ఫలించేది ఎన్నడనేది వేచి చూడాల్సిందే. చదవండి: Trolls On RCB Fan Girl: 'ఆర్సీబీ కప్ కొట్టదు.. నువ్వు పెళ్లి చేసుకోవు' కోహ్లి కెరీర్ మొత్తం కంటే ఈ సీజన్లోనే ఎక్కువ తప్పులు చేశాడు.. మరీ ఇలా -
IPL 2022: మాకిది గొప్ప సీజన్.. గర్వంగా ఉంది: డుప్లెసిస్
‘‘ఆర్సీబీకి ఇది గ్రేట్ సీజన్. నాకు చాలా గర్వంగా ఉంది. మొదటి సీజన్లోనే ఇక్కడిదాకా తీసుకువచ్చినందుకు! ఎక్కడికెళ్లినా మా అభిమానులు మా వెంటే ఉన్నారు. మాకు మద్దతు తెలపడానికి ఇక్కడిదాకా వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ సీజన్లో మాకంటూ కొన్ని గుర్తుండిపోయే ప్రదర్శనలు ఉన్నాయి. ముఖ్యంగా హర్షల్ అద్భుతం. ఇక డీకే గురించి చెప్పాల్సిన పనిలేదు. జాతీయ జట్టులో మళ్లీ చోటు దక్కించుకున్నాడు. రజత పాటిదార్ కూడా ఆకట్టుకున్నాడు. ఇక ఈరోజు మ్యాచ్ మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. రాజస్తాన్ రాయల్స్ బలమైన జట్టు. నిజానికి మాకంటే ఎక్కువ వారే విజయానికి అర్హులు. మా మొదటి ఆరు ఓవర్లు టెస్టు క్రికెట్లా సాగాయి. ఈ వికెట్ పాతబడ్డ కొద్దీ బ్యాటర్లకు అనుకూలించింది’’ అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. కాగా ఐపీఎల్-2022తో వరుసగా మూడోసారి ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీ.. లక్నోను ఓడించి క్వాలిఫైయర్-2కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలైంది. రాజస్తాన్ బ్యాటర్ జోస్ బట్లర్ చెలరేగడంతో ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇక సంజూ సేన సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఆర్సీబీ సారథి డుప్లెసిస్ మాట్లాడుతూ.. కీలక పోరులో ఓటమి నిరాశపరిచిందని.. ఏదేమైనా తమకు ఈ సీజన్ గొప్పగా సాగిందని పేర్కొన్నాడు. అదే విధంగా భారత సంస్కృతి గొప్పదని, ఇక్కడి ప్రజలు ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తారన్నాడు. ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, వారు ఎక్కడున్నా ఆర్సీబీ నామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగాల్సిందేనని.. వ్యక్తిగతంగా, జట్టుగా ఇంతమంది అభిమానం పొందడం గర్వకారణమని భావోద్వేగానికి లోనయ్యాడు. ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు చెప్పాడు. ఐపీఎల్ క్వాలిఫైయర్-2: రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ టాస్: రాజస్తాన్ రాయల్స్ బెంగళూరు స్కోరు: 157/8 (20) రాజస్తాన్ స్కోరు: 161/3 (18.1) విజేత: ఏడు వికెట్ల తేడాతో రాజస్తాన్ విజయం.. ఫైనల్లో అడుగు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జోస్ బట్లర్(60 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 పరుగులు- నాటౌట్) చదవండి: IPL 2022: ఐపీఎల్లో మహ్మద్ సిరాజ్ చెత్త రికార్డు.. తొలి బౌలర్గా..! WHAT. A. WIN for @rajasthanroyals! 👏 👏 Clinical performance by @IamSanjuSamson & Co. as they beat #RCB by 7⃣ wickets & march into the #TATAIPL 2022 Final. 👍 👍 #RRvRCB Scorecard ▶️ https://t.co/orwLrIaXo3 pic.twitter.com/Sca47pbmPX — IndianPremierLeague (@IPL) May 27, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: సమఉజ్జీలు.. అహ్మదాబాద్లో టాస్ గెలిస్తే...
IPL 2022 Qualifier 2 RR Vs RCB: మరోసారి విజేతగా నిలవాలనే కసితో రాజస్తాన్ రాయల్స్... కనీసం ఈసారైనా టైటిల్ గెలవాలనే పట్టుదలతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఫైనల్లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నాయి. తుది పోరుకు అర్హత సాధించి ఐపీఎల్-2022 ట్రోఫీ గెలవాలని తహతహలాడుతున్నాయి. ఇందుకోసం ఫైనల్లో గుజరాత్ టైటాన్స్తో పోటీపడే క్రమంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మరి తుదిజట్లు ఎలా ఉండబోతున్నాయి? పిచ్ వాతావరణం, ముఖాముఖి రికార్డులు తదితర అంశాలు పరిశీలిద్దాం. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ? శుక్రవారం (మే 27), రాత్రి ఏడున్నర గంటలకు ఆరంభం వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్ ముఖాముఖి పోరులో.. ఐపీఎల్లో ఇప్పటి వరకు రాజస్తాన్, ఆర్సీబీ 26 సార్లు తలపడ్డాయి. ఇందులో 11 సార్లు రాజస్తాన్ గెలుపొందగా.. ఆర్సీబీ 13 సార్లు విజయం సాధించింది. ఇక ఐపీఎల్-2022 ఎడిషన్లో లీగ్ దశలో రెండు మ్యాచ్లలో పోటీ పడగా...ఇరు జట్లు చెరో మ్యాచ్లో నెగ్గి సమ ఉజ్జీలుగా ఉన్నాయి. పిచ్ వాతావరణం అహ్మదాబాద్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి. రాత్రుళ్లు కూడా ఇక్కడ 29 డిగ్రీలు నమోదు అవుతున్నాయి. ఇక అహ్మదాబాద్ గ్రౌండ్లో ఆరు ఎర్రమట్టి, 5 నల్లమట్టి పిచ్లు ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాచ్కు ఉపయోగించిన మట్టిపైనే పిచ్ స్వభావం ఆధారపడి ఉంటుంది. ఎర్రమట్టి పిచ్లు అయితే త్వరగా ఎండి.. స్పిన్నర్లకు అనుకూలంగా మారతాయి. గతంలో కూడా ఇక్కడి మ్యాచ్లలో స్పిన్నర్లకే ప్రయోజనం చేకూరింది. ఇక అహ్మదాబాద్ వికెట్పై నమోదైన సగటు తొలి ఇన్నింగ్స్- 160 పరుగులు. ఇక్కడ లక్ష్య ఛేదనకు దిగిన జట్లే 55 శాతం గెలుపొందాయి. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. తుది జట్ల అంచనా రాజస్తాన్ రాయల్స్: యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్(కెప్టెన్- వికెట్ కీపర్), దేవ్దత్ పడిక్కల్, షిమ్రన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ కృష్ణ, యజువేంద్ర చహల్, ఒబెడ్ మెకాయ్. బ్యాటర్ జోస్ బట్లర్, బౌలర్లు చహల్, ప్రసిద్ కృష్ణ రాజస్తాన్ జట్టుకు ప్రధాన బలం. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, దినేశ్ కార్తిక్(వికెట్ కీపర్), మహిపాల్ లామ్రోర్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హాజిల్వుడ్. కోహ్లి, డుప్లెసిస్తో పాటు ఎలిమినేటర్ హీరో రజత్ పాటిదార్, దినేశ్ కార్తిక్ మరోసారి బ్యాట్ ఝులిపించడంతో పాటు రాజస్తాన్ స్టార్ బ్యాటర్లు బట్లర్, శాంసన్లను ఆర్సీబీ బౌలర్లు కట్టడి చేసి సమిష్టి కృషితో రాణిస్తే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి 👇 Shikhar Dhawan: పాపం ధావన్... తన తప్పు లేకున్నా తన్నులు తిన్నాడు! వైరల్ వీడియో IPL 2022: చాన్స్ ఇస్తే... చెలరేగిపోయారు... ఈ నలుగురు వారికి వారే సాటి! అద్భుతంగా.. When in Amdavad, we got to vlog. 😌 PS: @ninety9sl has a special message for you at the end. 💗#RoyalsFamily | #HallaBol | #TATAIPL2022 pic.twitter.com/5elFbzZofu — Rajasthan Royals (@rajasthanroyals) May 26, 2022 The action shifts to Ahmedabad as we take on RR & the winner books a ticket to the final against GT. Here is everything you need to know about #Qualifier2 #RRvRCB on @KreditBee presents 12th Man TV.#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #PlayOffs pic.twitter.com/BrmSLaiClv — Royal Challengers Bangalore (@RCBTweets) May 26, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: ఎలిమినేటర్ మ్యాచ్లో విజయం వాళ్లదే.. కారణం ఏమిటంటే!
IPL 2022 Eliminator LSG Vs RCB Winner Prediction: ఐపీఎల్-2022లో మరో ఆసక్తికరపోరుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్తో క్యాష్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం(25) నాటి పోరుకు ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఇక ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్-1లో ఓడిన రాజస్తాన్ రాయల్స్తో తలపడుతుంది. క్వాలిఫైయర్-2లో గనుక గెలుపొందితే గుజరాత్ టైటాన్స్తో పాటు ఫైనల్లో అడుగుపెట్టి టైటిల్ రేసులో నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మూడుసార్లు వరుసగా ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీ, అరంగేట్రంలోనే అదరగొట్టిన లక్నో విజయంపై కన్నేశాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, వివాదాస్పద వ్యాఖ్యాతగా పేరొందిన సంజయ్ మంజ్రేకర్ ఎలిమినేటర్ మ్యాచ్ విజేతను అంచనా వేశాడు. లక్నో మీద ఆర్సీబీ గెలుస్తుందని జోస్యం చెప్పాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో అతడు మాట్లాడుతూ.. ‘‘బెంగళూరుకు విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాళ్లకు స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఫాఫ్ డుప్లెసిస్ ఐపీఎల్ రికార్డు ఓసారి చూడండి. ప్లే ఆఫ్స్లో అతడు మరింతగా రెచ్చిపోతాడు. ఇక విరాట్ కోహ్లి కూడా గేరు మార్చాడు. అనుభవం కలిగిన ఆర్సీబీ జట్టు ఇలాంటి కీలక మ్యాచ్లలో ఒత్తిడిని అధిగమించి మంచి ప్రదర్శన నమోదు చేయగలదు. కాబట్టి వాళ్లు గెలుస్తారు’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా గత సీజన్లో చెన్నై సూపర్కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన ఫాఫ్.. ఫైనల్లో కేకేఆర్పై 59 బంతుల్లో 86 పరుగులు చేసి తమ జట్టును చాంపియన్గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక గుజరాత్తో మ్యాచ్లో కోహ్లి ఫామ్లోకి వచ్చాడు. 54 బంతుల్లో 73 పరుగులు సాధించాడు. చదవండి👉🏾IPL 2022 Eliminator LSG Vs RCB: లక్నో 5 ఓటములు ఆ 3 జట్ల చేతిలోనే.. కీలక మ్యాచ్ తుదిజట్ల అంచనా చదవండి👉🏾Hardik Pandya: దీనంతటికీ కారణం వాళ్లే.. ఉప్పొంగిపోను! అతడిని చూసి గర్వపడుతున్నా! Josh ke saath, aa rahe hain humaare #SuperGiants kal ke eliminator mein bhaukaal machane! ❤️🔥 Tune in at 7:30 pm tomorrow to watch our #SuperGiants in action 🍿📺#IPL2022 🏆 #bhaukaalmachadenge #lsg #LucknowSuperGiants #T20 #TataIPL #Lucknow #UttarPradesh #LSG2022 pic.twitter.com/OjGFSIMd0g — Lucknow Super Giants (@LucknowIPL) May 24, 2022 Pumped up and ready to take on LSG in the #IPL2022 playoffs, RCB had two intense practice sessions in the lead up to the game. Hear about our preparations form our players and coaches on @kreditbee presents Game Day.#PlayBold #Mission2022 #RCB #ನಮ್ಮRCB #PlayOffs #LSGvRCB pic.twitter.com/8UW60sDnW3 — Royal Challengers Bangalore (@RCBTweets) May 25, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: చిత్రంగా లక్నో 5 ఓటములు ఆ 3 జట్ల చేతిలోనే.. మరి ఆర్సీబీని ఓడిస్తుందా?
IPL 2022 Eliminator LSG Vs RCB: ఐపీఎల్-2022 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. క్వాలిఫైయర్-1లో రాజస్తాన్ రాయల్స్పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. మరోవైపు.. టైటిల్ రేసులో నిలిచేందుకు ఎలిమినేటర్ మ్యాచ్లో బుధవారం(మే 25) లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య పోటీ జరుగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్-2లో రాజస్తాన్తో తలపడనుంది. మరి ఈ కీలక పోరుకు సిద్ధమవుతున్న లక్నో, ఆర్సీబీ మధ్య మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగనుంది? పిచ్ వాతావరణం, తుది జట్ల అంచనా, ముఖాముఖి పోరులో పైచేయి ఎవరిది అన్న విషయాలు గమనిద్దాం. ఐపీఎల్ 2022 ఎలిమినేటర్ మ్యాచ్: లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్కతా మే 25(బుధవారం) రాత్రి ఏడున్నర గంటలకు ఆరంభం పిచ్ వాతావరణం: బంతి ఎక్కువగా బౌన్స్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక బెంగాల్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే సూచనలు ఉన్నాయి. మధ్యాహ్నం లేదంటే సాయంత్ర వేళ వర్షం కురిసే అవకాశం ఉంది. ఆర్ద్రత ఎక్కువగా ఉన్నందున మంచు కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉంది. తుదిజట్ల అంచనా: లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్(కెప్టెన్), ఎవిన్ లూయీస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టొయినిస్, జేసన్ హోల్డర్, క్రిష్ణప్ప గౌతమ్, మోహ్సిన్ ఖాన్, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయి గత మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్పై విజయంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ క్వింటన్ డికాక్(140 నాటౌట్)తో పాటు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫామ్లో ఉండటం లక్నోకు కలిసి వచ్చే అంశం. ఇక బౌలింగ్ విభాగంలో కృనాల్, రవి బిష్ణోయి, గౌతమ్, స్టొయినిస్ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆసక్తికర అంశం: ఐపీఎల్-2022లో పవర్ప్లేలో మొత్తంగా లక్నో 23 వికెట్లు కోల్పోయింది. ఇక లీగ్ దశలో ఓడిన ఐదు మ్యాచ్లలో గుజరాత్ టైటాన్స్ చేతిలో రెండు, రాజస్తాన్ రాయల్స్ చేతిలో రెండు, ఆర్సీబీ చేతిలో ఒకటి ఉండటం విశేషం. రాయల్ చాలెంజర్స్ తుది జట్టు అంచనా: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, దినేశ్ కార్తిక్, మహిపాల్ లామ్రోర్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్/ఆకాశ్ దీప్, సిద్దార్థ్ కౌల్/మహ్మద్ సిరాజ్, జోష్ హాజిల్వుడ్. ముఖాముఖి పోరులో: ఐపీఎల్-2022లో భాగంగా 31వ మ్యాచ్ ఆర్సీబీ, లక్నో మధ్య జరిగింది. ఇందులో డుప్లెసిస్ బృందం 18 పరుగుల తేడాతో గెలుపొంది లక్నోపై పైచేయి సాధించింది. చదవండి👉🏾Hardik Pandya: దీనంతటికీ కారణం వాళ్లే.. ఉప్పొంగిపోను! అతడిని చూసి గర్వపడుతున్నా! చదవండి👉🏾IPL 2022: ఐపీఎల్లో సంజు శాంసన్ చెత్త రికార్డు.. తొలి కెప్టెన్గా..! Josh ke saath, aa rahe hain humaare #SuperGiants kal ke eliminator mein bhaukaal machane! ❤️🔥 Tune in at 7:30 pm tomorrow to watch our #SuperGiants in action 🍿📺#IPL2022 🏆 #bhaukaalmachadenge #lsg #LucknowSuperGiants #T20 #TataIPL #Lucknow #UttarPradesh #LSG2022 pic.twitter.com/OjGFSIMd0g — Lucknow Super Giants (@LucknowIPL) May 24, 2022 Pumped up and ready to take on LSG in the #IPL2022 playoffs, RCB had two intense practice sessions in the lead up to the game. Hear about our preparations form our players and coaches on @kreditbee presents Game Day.#PlayBold #Mission2022 #RCB #ನಮ್ಮRCB #PlayOffs #LSGvRCB pic.twitter.com/8UW60sDnW3 — Royal Challengers Bangalore (@RCBTweets) May 25, 2022 -
IPL 2022: సంజూ తప్ప వాళ్లంతా అదరగొట్టారు.. టాప్-10లో ఉన్నది వీళ్లే
IPL 2022: ఐపీఎల్-2022 ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే లీగ్ దశ ముగియగా.. మే 24న తొలి క్వాలిఫైయర్-1 జరుగనుంది. ఆ తర్వాతి రోజు ఎలిమినేటర్ మ్యాచ్, మరుసటి రోజు క్వాలిఫైయర్ 2 మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇక ఫైనల్ మే 29న జరుగననున్న విషయం తెలిసిందే. తుది పోరుకు అర్హత సాధించేందుకు గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ సీజన్ లీగ్ దశలో తమ జట్ల తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాను ఓసారి పరిశీలిద్దాం. ఐపీఎల్-2022 లీగ్ దశలో 10 జట్ల తరఫున అత్యధిక పరుగుల వీరులు 1. జోస్ బట్లర్- రాజస్తాన్ రాయల్స్- 629 పరుగులు- అత్యధిక స్కోరు 116 2. కేఎల్ రాహుల్(కెప్టెన్)- లక్నో సూపర్జెయింట్స్- 537 పరుగులు- అత్యధిక స్కోరు 103 నాటౌట్ 3. శిఖర్ ధావన్- పంజాబ్ కింగ్స్- 460 పరుగులు- అత్యధిక స్కోరు 88 నాటౌట్ 4. ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్)- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- 443 పరుగులు- అత్యధిక స్కోరు- 96 5. డేవిడ్ వార్నర్- ఢిల్లీ క్యాపిటల్స్- 432 పరుగులు- అత్యధిక స్కోరు 92 నాటౌట్ 6. అభిషేక్ శర్మ- సన్రైజర్స్ హైదరాబాద్- 426 పరుగులు- అత్యధిక స్కోరు 75 7. ఇషాన్ కిషన్- ముంబై ఇండియన్స్- 418 పరుగులు- అత్యధిక స్కోరు 81 నాటౌట్ 8. హార్దిక్ పాండ్యా(కెప్టెన్)- గుజరాత్ టైటాన్స్- 413 పరుగులు- అత్యధిక స్కోరు 87 నాటౌట్ 9. శ్రేయస్ అయ్యర్(కెప్టెన్)- కోల్కతా నైట్రైడర్స్- 401 పరుగులు- అత్యధిక స్కోరు- 85 10. రుతురాజ్ గైక్వాడ్- చెన్నై సూపర్కింగ్స్- 368 పరుగులు- అత్యధిక స్కోరు 99 ఐపీఎల్-2022 లీగ్ దశలో టాప్-5లో ఉన్న బ్యాటర్లు 1. జోస్ బట్లర్- రాజస్తాన్ రాయల్స్- 629 పరుగులు- అత్యధిక స్కోరు 116 2. కేఎల్ రాహుల్(కెప్టెన్)- లక్నో సూపర్జెయింట్స్- 537 పరుగులు- అత్యధిక స్కోరు 103 నాటౌట్ 3. క్వింటన్ డికాక్- లక్నో సూపర్జెయింట్స్- 502 పరుగులు- అత్యధిక స్కోరు 140 నాటౌట్ 4.3. శిఖర్ ధావన్- పంజాబ్ కింగ్స్- 460 పరుగులు- అత్యధిక స్కోరు 88 నాటౌట్ 5. ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్)- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- 443 పరుగులు- అత్యధిక స్కోరు- 96 చదవండి👉🏾Kusal Mendis: మ్యాచ్ జరుగుతుండగానే ఛాతి నొప్పి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు చదవండి👉🏾Ind Vs SA: వాళ్లందరికీ అవకాశం.. మీరు పశ్చాత్తాపపడక తప్పదు: టీమిండియా మాజీ బ్యాటర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
టిమ్ డేవిడ్కు గిఫ్ట్ పంపిన ఆర్సీబీ కెప్టెన్..!
IPL 2022: ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లి, ఆర్సీబీ ఫైనల్ ఫోర్కు చేరేలా చేసిన ముంబై ఇండియన్స్ హార్డ్ హిట్టర్ టిమ్ డేవిడ్కు ఆర్సీబీ సారధి ఫాఫ్ డుప్లెసిస్ ఓ అపురూప కానుక పంపాడు. తనతో పాటు విరాట్, మ్యాక్స్వెల్లు ముంబై కిట్లో ఉన్న ఫోటోను డుప్లెసిస్ టిమ్కు మెసేజ్ చేశాడు. ఈ విషయాన్ని టిమ్ స్వయంగా వెల్లడించాడు. సదరు ఫోటోను త్వరలోనే తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేస్తానని టిమ్ చెప్పుకొచ్చాడు. కాగా, నిన్న (మే 21) ఢిల్లీతో జరిగిన కీలక మ్యాచ్లో టిమ్ మెరుపు ఇన్నింగ్స్ (11 బంతుల్లో 34; 4 సిక్సర్లు, 2 ఫోర్లు) ఆడి ముంబైని గెలిపించి, ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్తును కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ నిర్ధేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టిమ్ కళ్లు చెదిరే ఇన్నింగ్స్తో ముంబైని 5 వికెట్ల తేడాతో గెలిపించాడు. మ్యాచ్ చేజారుతున్న సమయంలో క్రీజ్లోకి వచ్చిన టిమ్.. ఆకాశమే హద్దుగా చెలరేగి ఢిల్లీ పాలిట విలనయ్యాడు. ఫలితంగా ముంబై గెలుపుతో సీజన్ను ముగించగా, ఢిల్లీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో బ్యాటర్ల వైఫల్యంతో ఢిల్లీ ఓటమిపాలవగా, ఆర్సీబీ దర్జాగా ప్లేఆఫ్స్ చేరుకుంది. కాగా, సింగపూర్కు చెందిన టిమ్ డేవిడ్ను ముంబై ఇండియన్స్ ఈ సీజన్ మెగా వేలంలో 8.25 కోట్లకు కొనుగులు చేసింది. చదవండి: IPL 2022: ఢిల్లీని చిత్తు చేసిన ముంబై.. ఎగిరి గంతేసిన కోహ్లి.. వీడియో వైరల్ -
గుజరాత్ టైటాన్స్పై ఆర్సీబీ ఘన విజయం
-
ఆర్సీబీకి ప్లేఆఫ్ అవకాశం ఎంత?.. కోహ్లిపై డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఐపీఎల్ 2022 సీజన్లో ఆర్సీబీ మరొక పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్లేఆఫ్కు దగ్గరైన వేళ పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో 54 పరుగుల తేడాతో ఓటమిపాలై అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. పంజాబ్ భారీ స్కోరు చేసినప్పటికి ఆర్సీబీ అసలు పోరాడే ప్రయత్నమే చేయలేదు. మరి ఆర్సీబీకి ప్లే ఆఫ్ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి. ఆర్సీబీ ప్లే ఆఫ్ చేరాలంటే తమ చివరి లీగ్ మ్యాచ్లో తప్పక గెలవాల్సిందే. గుజరాత్ టైటాన్స్తో ఆఖరి మ్యాచ్ ఆడనున్న ఆర్సీబీ ఒకవేళ ఓడితే మాత్రం ఇంటిదారి పట్టాల్సిందే. ప్రస్తుతం ఆర్సీబీ 13 మ్యాచ్ల్లో ఏడు విజయాలు, ఆరు పరాజయాలతో 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. దీనికి తోడు ఆర్సీబీ నెట్రన్రేట్ కూడా మైనస్లో ఉంది. గుజరాత్తో మ్యాచ్ గెలిస్తే.. 16 పాయింట్లతో ప్లేఆఫ్ అవకాశాలు ఉంటాయి. ఒక రకంగా ఆర్సీబీకి గుజరాత్తో మ్యాచ్ డూ ఆర్ డై అనొచ్చు. ఆర్సీబీ ఓడినా కూడా ఒక అవకాశం ఉంది. ప్లే ఆఫ్లో తొలి రెండు స్థానాలు గుజరాత్, లక్నోలు దాదాపు ఖరారు చేసుకున్నట్లే. ఇక మూడో జట్టుగా రాజస్తాన్ రాయల్స్కు అవకావం ఉన్నప్పటికి.. మూడు, నాలుగు స్థానాలకు ఎక్కువ జట్లు పోటీ పడుతున్నాయి. వాటిలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ప్లస్ నెట్ రన్రేట్తో ముందంజలో ఉన్నాయి. ఒకవేళ పంజాబ్ లేదా ఢిల్లీ క్యాపిటల్స్లో ఏ జట్టైనా తమ చివరి రెండు మ్యాచ్లు గెలిస్తే ఆర్సీబీ కథ ముగిసినట్లే. మరి ఆర్సీబీ తమ చివరి మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలు నిలుపుకుంటుందా లేక మరోసారి లీగ్ దశలోనే ఇంటిబాట పడుతుందా అనేది రానున్న రోజుల్లో తెలియనుంది. ఇదిలా ఉంటే.. మ్యాచ్ ఓటమి అనంతరం ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ కోహ్లి బ్యాడ్ ఫామ్పై స్పందించాడు. ''కోహ్లికి నా మద్దతు ఉంటుంది. అతను బ్యాడ్ఫేజ్ చూస్తున్న మాట నిజమే.. కానీ అతని కోసం ఒక మంచి ఇన్నింగ్స్ ఎదురుచూస్తుంది.. దానిని అందుకుంటానని కోహ్లి గట్టిగా నమ్ముతున్నాడు. కోహ్లి తేలికైన ఆటను ఆడేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తున్నాడు.. కానీ అన్ని మార్గాలు అతని ఔట్ కోసం వచ్చేస్తున్నాయి. ఒక గేమ్లో ఇలా జరగడం సహజం. ఏదైనా సరే.. పాజిటివ్గా ఉంటూ కష్టపడితే ఫలితం కనిపిస్తుంది. వాస్తవానికి ఈరోజు మ్యాచ్లో కోహ్లి కొన్ని మంచి షాట్లు ఆడాడు. ఇలాంటి ఆటను మున్ముందు కూడా ఆడుతూ భారీ స్కోర్లు చేయాలని కోరుకుంటున్నా..'' అంటూ తెలిపాడు. చదవండి: Virat Kohli: అలవాటే కదా.. ఎవరిని తిట్టి ఏం లాభం! IPL 2022: దీని దుంపతెగ.. పాడు పిల్లి ఎంత పనిచేసింది A clinical win for @PunjabKingsIPL! 👏 👏 6⃣th victory of the season for @mayankcricket & Co. as they beat #RCB by 54 runs. 👍 👍 Scorecard ▶️ https://t.co/jJzEACTIT1#TATAIPL | #RCBvPBKS pic.twitter.com/Zo7TJvRTFa — IndianPremierLeague (@IPL) May 13, 2022 -
IPL 2022: దీని దుంపతెగ.. పాడు పిల్లి ఎంత పనిచేసింది
ఐపీఎల్ 2022 సీజన్లో శుక్రవారం ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్కు ఒక పిల్లి అనుకోని అతిథిలా వచ్చింది. దీంతో మ్యాచ్కు కాసేపు అంతరాయం కలిగింది. అయితే సదరు పిల్లిగారు మైదానంలోకి వచ్చి ఆటగాళ్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. మరి ఆటకు ఎందుకు విరామం అనుకుంటున్నారా.. ఆ పిల్లి సైట్స్క్రీన్ మీద దర్జాగా కూర్చొని మ్యా్చ్ వీక్షించింది. పిల్లి జాలీగా ఎంజాయ్ చేసినప్పటికి.. స్ట్రైక్లో ఉన్న బ్యాట్స్మన్కు సైట్స్క్రీన్ ఎదురుగా ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సైట్స్ర్కీన్ నుంచి ఏ చిన్న ఇబ్బంది కలిగిన బ్యాట్స్మన్ తన ఫోకస్ కోల్పోతుంటాడు. సరిగ్గా డుప్లెసిస్ను కూడా ఇదే విషయం ఇబ్బంది పెట్టింది. విషయాన్ని అంపైర్కు చేరవేయగా.. మ్యాచ్ నిలిపివేసి సిబ్బందికి చెప్పి పిల్లిగారిని అక్కడి నుంచి పంపించేశారు. ఈ ఘటన ఆర్సీబీ తొలి ఓవర్ తర్వాత చోటు చేసుకుంది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు.. మైదానంలోకి రాకుండానే ఎంత ఇబ్బంది పెట్టింది... దీని దుంపతెగ.. పాడుపిల్లి ఎంత పని చేసింది అంటూ కామెంట్స్ చేశారు. మ్యాచ్ విషయానికి వస్తే ప్లేఆఫ్ అవకాశాలు నిలవాలవంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ గర్జించింది. ఓపెనర్గా బెయిర్ స్టో(29 బంతుల్లో 66, 4 ఫోర్లు, 7 సిక్సర్లు) సీజన్లో తొలిసారి అదరగొట్టడం.. లివింగ్స్టోన్(42 బంతుల్లో 70, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ పంజాబ్ బౌలర్ల ధాటికి 155 పరుగులకే చాప చుట్టేసింది. మ్యాక్స్వెల్ 35 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. చదవండి: Virat Kohli: అలవాటే కదా.. ఎవరిని తిట్టి ఏం లాభం! Kagiso Rabada: టి20 క్రికెట్లో పంజాబ్ కింగ్స్ బౌలర్ కొత్త చరిత్ర Nothing unusual, just a cat stopping the play#RCBvsPBKS pic.twitter.com/lOljTMgF4i — Jemi_forlife (@jemi_forlife) May 13, 2022 IPL-2022 No.2 యువ ఆటగాళ్లు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆర్సీబీ ఫైనల్స్కు చేరడం పక్కా.. ఆధారాలివిగో అంటున్న ఫ్యాన్స్..!
పర్యావరణ పరిరక్షణ, పచ్చదనంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రతి యేటా ‘గో గ్రీన్’ నినాదంతో ఓ మ్యాచ్కు గ్రీన్ కలర్ జెర్సీలతో బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రంగు జెర్సీలు తమ ఆటగాళ్లకు అచ్చి రావట్లేదన్న సెంటిమెంట్ను ఆ జట్టు అభిమానులు బలంగా నమ్ముతారు. ఈ సీజన్కు ముందు వరకు ఆర్సీబీ గ్రీన్ జెర్సీల్లో ఆడిన 10 మ్యాచ్ల్లో ఏడింటిలో (2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020) ఓటమిపాలవ్వగా.. రెండు మ్యాచ్ల్లో (2011, 2016) విజయాలు, మరో మ్యాచ్ (2015) వర్షం కారణంగా రద్దైంది. తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో గ్రీన్ కలర్ జెర్సీల్లో బరిలో దిగిన ఆర్సీబీ.. ఆరెంజ్ ఆర్మీని 67 పరుగుల తేడాతో చిత్తు చేసి సీజన్లో ఏడో విజయంతో ప్లే ఆఫ్స్ దిశగా దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలపై ఆ జట్టు అభిమానులు ఓ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. గతంలో తమ జట్టు గ్రీన్ కలర్ జెర్సీల్లో గెలిచిన సీజన్లలో ఫైనల్స్కు చేరిందని, దీంతో ఈ సీజన్లోనూ డుప్లెసిస్ సేన పక్కాగా ఫైనల్స్కు చేరుతుందని బల్ల గుద్ది చెబుతున్నారు. అంతే కాకుండా ఈ ఏడాది తమ జట్టు పాత ఆనవాయితీకి కూడా చరమగీతం పాడి టైటిల్ను ఎగురేసుకుపోతుందని ధీమాగా ఉన్నారు. కాగా, ఆర్సీబీ తొలిసారి గ్రీన్ కలర్ జెర్సీల్లో బరిలోకి దిగిన 2011 సీజన్లో డేనియల్ వెటోరీ కెప్టెన్సీలో తొలిసారి ఫైనల్స్కు చేరింది. అయితే ఫైనల్స్లో సీఎస్కే చేతుల్లో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఆ తర్వాత 2016 సీజన్లోనూ విరాట్ కోహ్లి నేతృత్వంలో ఫైనల్స్కు చేరినప్పటికీ తుది సమరంలో సన్రైజర్స్ హైదరాబాద్ చేతుల్లో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్ల్లో 7 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాలంటే మిగిలిన 2 మ్యాచ్ల్లో కనీసం ఓ మ్యాచ్లోనైనా గెలవాల్సి ఉంటుంది. ఇతర జట్లతో పోలిస్తే ఆర్సీబీ నెట్ రన్రేట్ తక్కువగా ఉండడంతో మిగిలిన రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధిస్తే ఇతర జట్లతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్కి అర్హత సాధిస్తుంది. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్ల్లో మే 13న పంజాబ్ కింగ్స్తో, మే 19న గుజరాత్ టైటాన్స్తో తలపడాల్సి ఉంది. చదవండి: T20 WC 2021: రిజ్వాన్కు ఆ నిషేధిత మెడిసిన్ ఇచ్చాం: పీసీబీ డాక్టర్ సంచలన వ్యాఖ్యలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: వారి స్థానంలో తుది జట్టులోకి ఆ ఇద్దరు: విలియమ్సన్
IPL 2022 SRH Vs RCB- Playing XI: ఐపీఎల్-2022లో భాగంగా రాయల్ చాలెంజర్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. సీన్ అబాట్, శ్రేయస్ గోపాల్ స్థానంలో ఫజల్హక్ ఫారూకీ, జగదీశ సుచిత్ తుది జట్టులోకి వచ్చారు. కాగా ముంబైలోని వాంఖడే మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ విషయంపై స్పందించిన సన్రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. ‘‘టాస్ ఓడిపోయాం కాబట్టి మాకు నచ్చిన అంశం ఎంచుకునే వీల్లేదు. అయితే మేము ఛేజింగ్ బాగా చేస్తాం. ముఖ్యంగా బంతితో రాణించాల్సి ఉంది’’ అని పేర్కొన్నాడు. ఇక అబాట్, గోపాల్ స్థానంలో ఫారూకీ, సుచిత్ జట్టులోకి వచ్చినట్లు కేన్ మామ తెలిపాడు. ఇక ఎప్పుడూ టాస్ గెలిచే కేన్ను తాను ఓడించడం సంతోషంగా ఉందని ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ పేర్కొనడం విశేషం. ఐపీఎల్ మ్యాచ్ 54: సన్రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ తుదిజట్లు: సన్రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్కరమ్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), శశాంక్ సింగ్, జగదీశ సుచిత్, కార్తిక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, ఫజల్హక్ ఫారూకీ, ఉమ్రాన్ మాలిక్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ): విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, మహిపాల్ లామ్రోర్, దినేశ్ కార్తిక్(వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హాజిల్వుడ్. #RCB have won the toss and they will bat first against #SRH. Live - https://t.co/tEzGa6a3Fo #SRHvRCB #TATAIPL pic.twitter.com/RKKros4phJ — IndianPremierLeague (@IPL) May 8, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: మళ్లీ ఓడిన ‘రైజర్స్’.. 67 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం
-
సీఎస్కేపై ఆర్సీబీ ఘన విజయం
-
సీఎస్కేను ఢీ కొట్టనున్న ఆర్సీబీ.. టాస్ గెలిస్తే!
IPL 2022 CSK Vs RCB: ఐపీఎల్-2022లో మరో ఉత్కంఠభరిత పోరకు రంగం సిద్దమైంది. పుణేలోని ఎంసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా బుధవారం(మే 4) చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఇక వరుస మూడు ఓటములతో డీలా పడ్డ ఆర్సీబీ.. సీఎస్కేపై విజయం సాధించి తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. విరాట్ కోహ్లి తిరిగి ఆర్సీబీ కలిసిచ్చే ఆంశం. బ్యాటింగ్లో కెప్టెన్ డుప్లెసిస్, మాక్స్వెల్, కార్తీక్ వంటి స్టార్ ఆటగాళ్లు బ్యాట్ ఝుళిపిస్తే.. సీఎస్కే గట్టి పోటీ ఎదుర్కోక తప్పదు. ఇక బౌలింగ్ పరంగా ఆర్సీబీ పటిష్టంగా కన్పిస్తోంది. బౌలింగ్ విభాగంలో జోష్ హాజిల్వుడ్, సిరాజ్, హాసరంగా వంటి స్టార్ బౌలర్లు ఉన్నారు. ఇక సీఎస్కే విషయానికి వస్తే.. ధోని తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక తొలి మ్యాచ్లోనే సీఎస్కే విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే గెలిపొందింది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా సీఎస్కే పటిష్టంగా కన్పిస్తోంది. ఇక ఎస్ఆర్హెచ్తో జరిగిన గత మ్యాచ్లో సీఎస్కే ఓపెనర్లు రుత్రాజ్ గైక్వాడ్, కాన్వే అధ్బుతమైన ఇన్నింగ్స్ ఆడారు. అదే విధంగా మిడిలార్డర్లో రాయుడు కూడా రాణిస్తోన్నాడు. ఇక గత మ్యాచ్కు దూరమైన బ్రావో ఈ మ్యాచ్కు అందుబాటులోఉండే అవకాశం ఉంది. ఇక ఇరు జట్లలో హిట్టర్లు ఉన్నారు కాబట్టి భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకు ఇరు జట్లు 30 సార్లు ముఖాముఖి తలపడగా.. సీఎస్కే 20 మ్యాచ్ల్లో విజయం సాధించగా.. ఆర్సీబీ కేవలం 9 మ్యాచ్ల్లో మాత్రమే గెలుపొందింది. పిచ్ రిపోర్ట్ ఎంసీఏ స్టేడియం పిచ్ గత మ్యాచ్ల్లో బ్యాటింగ్కు, బౌలర్లకు అనుకూలించింది. గత మ్యాచ్ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. అయితే న్యూ బాల్తో బౌలర్లు కూడా వికెట్లు పడగొట్టారు. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. తుది జట్లు అంచనా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, మహిపాల్ లోమ్రోర్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్వుడ్ చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, MS ధోని (కెప్టెన్), డ్వేన్ బ్రావో, డ్వైన్ ప్రిటోరియస్, సిమర్జీత్ సింగ్, ముఖేష్ చౌదరి, మహేశ్ తీక్షణ చదవండి: IPL 2022 Playoff Venues: ఐపీఎల్ అభిమానులకు గుడ్న్యూస్ చెప్పిన బీసీసీఐ..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); In sync and 💪Here is the peek into the game tonight with Mr. Cricket @mhussey393!#RCBvCSK #Yellove #WhistlePodu 🦁💛 @amazonIN #AmazonPay pic.twitter.com/zeERmr6CNT — Chennai Super Kings (@ChennaiIPL) May 4, 2022 Captain Faf, Mike Hesson and Josh Hazlewood give us some insights into the team’s preparations and priorities heading into the big game against CSK, on @kreditbee presents Game Day.#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #RCBvCSK pic.twitter.com/3nxwFbGOjB — Royal Challengers Bangalore (@RCBTweets) May 4, 2022 -
IPL 2022: సీఎస్కే తరఫున మా అద్బుత రికార్డు.. ఫాఫ్ కుళ్లుకొని ఉంటాడు!
Ruturaj Gaikwad-Devon Conway Break CSK Record: ఐపీఎల్-2022లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో చెన్నై సూపర్కింగ్స్(సీఎస్కే) ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే అదరగొట్టారు. గతేడాది ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అయిన రుతు ఈ మ్యాచ్లో 57 బంతుల్లో(6 ఫోర్లు, 6 సిక్సర్లు) 99 పరుగులు చేయగా.. కాన్వే 55 బంతుల్లో(8 ఫోర్లు, 4 సిక్సర్లు) 85 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి 107 బంతుల్లో 182 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. తద్వారా చెన్నై సూపర్కింగ్స్ తరఫున షేన్ వాట్సన్- ఫాఫ్ డుప్లెసిస్ తరఫున ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. కాగా ఐపీఎల్-2020 సీజన్లో వాట్సన్- డుప్లెసిస్ 181 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయగా సీఎస్కే తరఫున అదే అత్యుత్తమ పార్ట్నర్షిప్. ఇప్పుడు రుతు- కాన్వే ఓపెనింగ్ జోడీ దీనిని అధిగమించింది. అదే విధంగా.. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన నాలుగో జోడీగా నిలిచింది. డేవిడ్ వార్నర్- జానీ బెయిర్స్టో(ఎస్ఆర్హెచ్- 185), గౌతమ్ గంభీర్- క్రిస్ లిన్(కేకేఆర్ 184 నాటౌట్), కేఎల్ రాహుల్- మయాంక్ అగర్వాల్(కింగ్స్ ఎలెవన్ పంజాబ్) ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. ఇక ఈ అరుదైన రికార్డుపై సంతోషం వ్యక్తం చేసిన రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఫాఫ్ డుప్లెసిస్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ రికార్డు భాగస్వామ్యం చూసి ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కుళ్లుకొని ఉంటాడని సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ మేరకు.. ‘‘కాన్వేతో రికార్డు భాగస్వామ్యం ఇది. సీఎస్కే తరఫున ఈ భాగస్వామ్యం అత్యధికం. ఈ విషయంలో ఫాప్ కాస్త అసూయ పడుతున్నాడనుకుంటా(నవ్వులు). అసలు ఇది సాధ్యమవుతుందని మేము ఊహించలేదు. శుభారంభం ఇవ్వాలని భావించాం. వికెట్లు పడకుండా జాగ్రత్త పడాలని ముందే నిర్ణయించుకున్నాం’’ అని రుతు చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2021లో డుప్లెసిస్ సీఎస్కేకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. రుతురాజ్తో కలిసి ఓపెనింగ్ చేసిన ఈ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ రుతు(635) కంటే కేవలం రెండు పరుగులు వెనుకబడి(633) ఆరెంజ్ క్యాప్ చేజార్చుకున్నాడు. ఇక ఐపీఎల్ మెగా వేల-2022 నేపథ్యంలో సీఎస్కే అతడిని రిటైన్ చేసుకోకపోవడంతో ఆక్షన్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో 7 కోట్ల రూపాయలు వెచ్చించి డుప్లెసిస్ను కొనుగోలు చేసిన ఆర్సీబీ అతడిని కెప్టెన్గా నియమించింది. ఐపీఎల్ మ్యాచ్-46: సీఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ స్కోర్లు చెన్నై-202/2 (20) హైదరాబాద్-189/6 (20) చదవండి👉🏾 MS Dhoni: జడేజాకు ముందే తెలుసు.. అయినా ప్రతీదీ విడమరిచి చెప్పలేం కదా! ధోని ఘాటు వ్యాఖ్యలు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆర్సీబీ పేరిట ఎవరికి సాధ్యం కాని చెత్త రికార్డు!
ఐపీఎల్ 2022లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ డకౌట్ అయ్యాడు. ప్రదీప్ సంగ్వాన్ బౌలింగ్లో డుప్లెసిస్ కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్లో ఆర్సీబీ ఓపెనింగ్ జోడి అనవసర రికార్డు నమోదు చేసింది. సీజన్లో 10వ మ్యాచ్ ఆడుతున్న ఆర్సీబీ తొలి నాలుగు మ్యాచ్ల్లో ఓపెనింగ్ జోడి వరుసగా 50,1,5,50 పరుగులు జోడించింది. అయితే చివరి ఆరు మ్యాచ్ల్లో మాత్రం వరుసగా 14,5,7,10,11 పరుగులు జోడించారు. మరో విషయమేంటేంటే.. ఈ సీజన్లో ఆర్సీబీ తరపున టాప్-3 బ్యాట్స్మెన్లు ఆరుసార్లు డకౌట్ అయ్యారు. ఇందులో అనూజ్ రావత్ మూడుసార్లు, కోహ్లి రెండుసార్లు, డుప్లెసిస్ ఒకసారి డకౌట్ లిస్ట్లో ఉన్నారు. ఐపీఎల్ 2022 సీజన్లో ఒక జట్టు తరపున టాప్-3 బ్యాట్స్మెన్ ఎక్కువసార్లు డకౌట్ అయిన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. చదవండి: Rohit-Kohli: 'ఇద్దరు చెత్తగా ఆడుతున్నారు.. ఈరోజైనా కనికరిస్తారా! -
RCB: మొన్న 68 పరుగులకే ఆలౌట్.. అక్కడేమో అత్యల్ప స్కోరు 73..!
IPL 2022 RCB Vs RR: సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఘోర ఓటమి తర్వాత రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్కు సిద్ధమవుతోంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా సంజూ శాంసన్ సేనతో తలపడబోతోంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించి తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. కాగా హైదరాబాద్తో మ్యాచ్లో ఆర్సీబీ 68 పరుగులకే ఆలౌట్ అయి పరాజయం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. మరోవైపు.. జోస్ బట్లర్ వరుస సెంచరీలతో అద్భుత ఫామ్లో ఉండటం రాజస్తాన్కు కలిసి వచ్చే అంశంగా పరిణమించింది. కెప్టెన్ సంజూ శాంసన్ సైతం అద్భుత ఆట తీరు కనబరుస్తున్నాడు. వీరిద్దరి సూపర్ ఇన్నింగ్స్కు తోడు బౌలర్ల విజృంభణతో ఐపీఎల్-2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్పై రాజస్తాన్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఏప్రిల్ 22 నాటి ఈ మ్యాచ్లో సంజూ బృందం 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ, ఆర్ఆర్ జట్ల పోరు ఆసక్తికరంగా మారింది. మరి ఇరు జట్ల ముఖాముఖి రికార్డులు, తుది జట్టు అంచనా, పిచ్ వాతావరణం తదితర అంశాలను పరిశీలిద్దాం. హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఐపీఎల్లో బెంగళూరు, రాజస్తాన్ ఇప్పటి వరకు 26 సందర్భాల్లో తలపడ్డాయి. బెంగళూరు 13 మ్యాచ్లు గెలవగా.. రాజస్తాన్ 10 విజయాలు తన ఖాతాలో వేసుకుంది. ఇక రాజస్తాన్తో ఆడిన గత ఐదు మ్యాచ్లలో ఆర్సీబీదే పైచేయి. వరుసగా 4 వికెట్లు, 7 వికెట్లు, 10 వికెట్లు, 7 వికెట్లు, 8 వికెట్ల తేడాతో రాజస్తాన్పై బెంగళూరు విజయం సాధించింది. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ? ఐపీఎల్ మ్యాచ్- 39: బెంగళూరు వర్సెస్ రాజస్తాన్- ఏప్రిల్ 26(మంగళవారం) మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం(ఎంసీఏ)- పుణె పిచ్ ►పుణెలోని ఎంసీఏ స్టేడియం బ్యాటింగ్కు అనుకూలమైన వికెట్. బంతి పాతబడే కొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపగలరు. ►ఈ వేదికపై జరిగిన మొత్తం టీ20 మ్యాచ్లు: 44 ►తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు సాధించిన విజయాలు: 21 ►లక్ష్య ఛేదనకు దిగిన జట్లు గెలిచిన సందర్భాలు: 23 ►ఇక్కడ నమోదైన అత్యధిక స్కోరు: 211/4 (రాజస్తాన్ రాయల్స్-2018) ►అత్యల్ప స్కోరు: 73/10 (కింగ్స్ ఎలెవన్ పంజాబ్-2017) తుది జట్ల అంచనా: ఆర్సీబీ- ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), అనూజ్ రావత్/మహిపాల్ లామ్రోర్, విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్వెల్, దినేశ్ కార్తిక్, సూయశ్ ప్రభుదేశాయ్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, వనిందు హసరంగ, జోష్ హాజిల్వుడ్, మహ్మద్ సిరాజ్ రాజస్తాన్- జోస్ బట్లర్, దేవ్దత్ పడిక్కల్, సంజూ శాంసన్(కెప్టెన్), షిమ్రన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, కరుణ్ నాయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ కృష్ణ, ఒబెడ్ మెకాయ్, యజువేంద్ర చహల్. Faf du Plessis, Mike Hesson and Sridharan Sriram talk about our preparedness, the opposition, the mood in the camp and much more ahead of the #RCBvRR match in Pune at 7:30 PM IST today.#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/KrzjqUUyFL — Royal Challengers Bangalore (@RCBTweets) April 26, 2022 Elegant shots, a sturdy mind, an infectious smile - our Starboy has it all. 💗#RoyalsFamily | #दिलसेरॉयल | #RCBvRR | @devdpd07 pic.twitter.com/LDoOx5pQK1 — Rajasthan Royals (@rajasthanroyals) April 26, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి👉🏾Sakshi Dhoni: జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఎండగట్టిన ధోని భార్య -
కోహ్లి కాదు.. ఇప్పుడు డుప్లెసిస్ స్టార్ అయ్యాడు! అతడు మాత్రం ఇంకా!
IPL 2022- Virat Kohli- RCB: టీమిండియా మాజీ కెప్టెన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లి ఐపీఎల్-2022లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. గత సీజన్తో ఆర్సీబీ కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన కోహ్లి.. ఇకపై బ్యాటర్గా జట్టుకు సేవలు అందిస్తానని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సారథ్య బాధ్యతల భారం తొలగిపోతే కోహ్లి బ్యాట్ ఝులిపించడం ఖాయమని, మునుపటి రన్మెషీన్ను చూడవచ్చని అభిమానులు ఆశపడ్డారు. కానీ అలా జరగడం లేదు. ఐపీఎల్ తాజా సీజన్లో ఒకటీ రెండు మినహా మిగతా మ్యాచ్లలో కోహ్లి చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయాడు. లక్నో సూపర్జెయింట్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో డకౌట్గా వెనుదిరిగి మరోసారి నిరాశపరిచాడు. ఇక ఈ ఎడిషన్లో ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్లలో కోహ్లి చేసిన పరుగులు 119. అత్యధిక స్కోరు 48. ఈ గణాంకాలను బట్టి కోహ్లి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కెవిన్ పీటర్సన్ ఈ పరిణామాల నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కోహ్లి గురించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తాను ఇప్పుడు కెప్టెన్ కాదని, సాధారణ ఆటగాడిననే విషయాన్ని కోహ్లి త్వరగా గ్రహించాలని సూచించాడు. ఈ మేరకు.. ‘‘షో ఏదైనా తానే స్టార్గా ఉండాలని విరాట్ కోహ్లి కోరుకుంటాడు. అయితే, ఇప్పుడు ఫాఫ్ డుప్లెసిస్ స్టార్ అయ్యాడు. నావను సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. ఫాఫ్నకు హోటల్లో విలాసవంతమైన గది కేటాయించారో లేదో తెలియదు కానీ.. కోహ్లికి మాత్రం ఫాఫ్ కంటే పెద్ద గదినే ఇస్తారు. నిజానికి ఓ కెప్టెన్ మళ్లీ సాధారణ ఆటగాడిగా మారాలంటే కాస్త కష్టమే. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో నీ పాత్ర ఉండకపోవచ్చు. మునుపటిలా ఆధిపత్యం ప్రదర్శించే వీలు ఉండకపోవచ్చు. కెప్టెన్గా ఉన్నపుడు అభిమానులు, సహచర ఆటగాళ్లు నిన్ను చూసే విధానం వేరుగా ఉంటుంది. అయితే, ఓ సోల్జర్(ఆటగాడి)గా నువ్వు మళ్లీ జట్టులో ఇమిడిపోతావా లేదా అన్నది పెద్ద ప్రశ్న. నిజానికి అలా ఉండటం మనసుకు కష్టం’’ అని పీటర్సన్ పేర్కొన్నాడు. కోహ్లి ఇంకా పూర్తిగా ఫామ్లోకి రాలేదని, అందుకు ఇంకాస్త సమయం పడుతుందని అభిప్రాయపడ్డాడు. ఇక నెట్స్లో కోహ్లి వార్మప్ చేయడం చూశానన్న పీటర్సన్.. ‘‘తన పనేదో తాను చేసుకుంటున్నాడు. ఒక నవ్వు లేదు. హెలో చెప్పడాలు లేవు. ఎవరితోనూ పెద్దగా కలిసేది లేదు.. ప్రతిసారి.. ‘‘నేను ఆటపై దృష్టి పెట్టాను. సాధించి తీరాల్సిందే’’ అన్నట్లుగా సీరియస్గా ఉంటున్నాడు’’ అని వ్యాఖ్యానించాడు. కోహ్లి ఒత్తిడిలో కూరుకుపోయాడని, దానిని అధిగమిస్తేనే మునుపటిలా బ్యాట్ ఝులిపించగలడన్నాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో పీటర్సన్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఇక ఆర్సీబీ పగ్గాలు చేపట్టిన డుప్లెసిస్ ఇటు బ్యాటర్గా.. అటు కెప్టెన్గా రాణిస్తూ అభిమానులు ప్రశంసలు అందుకుంటున్నాడు. లక్నోతో మ్యాచ్లో కెప్టెన్ ఇన్నింగ్స్(96 పరుగులు) ఆడి అతడు ఆర్సీబీని గెలిపించిన సంగతి తెలిసిందే. తాజా గెలుపుతో పాయింట్ల పట్టికలో బెంగళూరు రెండో స్థానాని(10 పాయింట్లు)కి చేరుకుంది. చదవండి: IPL 2022: సెంచరీ మిస్.. అయితేనేం జట్టును గెలిపించాడు! జోష్లో బెంగళూరు! That's that from Match 31.@RCBTweets win by 18 runs against #LSG. Scorecard - https://t.co/9Dwu1D2Lxc #LSGvRCB #TATAIPL pic.twitter.com/oSxJ4fAukI — IndianPremierLeague (@IPL) April 19, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: సెంచరీ మిస్.. అయితేనేం జట్టును గెలిపించాడు!
IPL 2022 RCB Vs LSG- ముంబై: కొత్త కెప్టెన్ నేతృత్వంలో ఐపీఎల్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ (ఆర్సీబీ) ఆట ప్రతీ మ్యాచ్కూ పదునెక్కుతోంది. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆర్సీబీ ఐదో విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. మంగళవారం జరిగిన పోరులో బెంగళూరు 18 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ను ఓడించింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ డు ప్లెసిస్ (64 బంతుల్లో 96; 11 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్తో జట్టుకు చెప్పుకోదగ్గ స్కోరు అందించాడు. అనంతరం లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కృనాల్ పాండ్యా (28 బంతుల్లో 42; 5 ఫోర్లు, 2 సిక్స్లు), కేఎల్ రాహుల్ (24 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. జోష్ హాజల్వుడ్ (4/25) లక్నోను దెబ్బ తీశాడు. సెంచరీ మిస్... బెంగళూరు ఇన్నింగ్స్ పేలవంగా ప్రారంభమైంది. చమీరా వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి అనూజ్ రావత్ (4) అవుట్ కాగా, తర్వాతి బంతికే విరాట్ కోహ్లి (0) వెనుదిరిగాడు. ఆ తర్వాత మ్యాక్స్వెల్ (11 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడి ఇన్నింగ్స్ను చక్కబెట్టే ప్రయత్నం చేశాడు. చమీరా ఓవర్లో అతను వరుస బంతుల్లో 4, 4, 6 బాదగా ఆ ఓవర్లో మొత్తం 19 పరుగులు వచ్చాయి. అయితే హోల్డర్ అద్భుత క్యాచ్తో మ్యాక్సీ ఇన్నింగ్స్ ముగియగా, సుయాశ్ (10) విఫలమయ్యాడు. ఈ దశలో డుప్లెసిస్ జట్టును ఆదుకున్నాడు. అతడికి షహబాజ్ అహ్మద్ (22 బంతుల్లో 26; 1 ఫోర్) నుంచి తగిన సహకారం లభించింది. వీరిద్దరు ఐదో వికెట్కు 48 బంతుల్లో 70 పరుగులు జోడించారు. షహబాజ్ రనౌటైన తర్వాత మరింత జోరుగా ఆడిన డుప్లెసిస్ ... బిష్ణోయ్ ఓవర్లో 14 పరుగులు రాబట్టి 90ల్లోకి చేరుకున్నాడు. అయితే 20వ ఓవర్ ఐదో బంతికి భారీ షాట్ ఆడే క్రమంలో అవుట్ కావడంతో అతని సెంచరీ చేజారింది. సమష్టి వైఫల్యం... ఛేదనలో లక్నో తడబడింది. డికాక్ (3), మనీశ్ పాండే (6) విఫలం కాగా, రాహుల్ను హర్షల్ అవుట్ చేశాడు. కీపర్ క్యాచ్ను అంపైర్ నాటౌట్గా ప్రకటించగా... రివ్యూలో ఫలితం ఆర్సీబీకి అనుకూలంగా వచ్చింది. ఆ తర్వాత కృనాల్ ధాటిగా ఆడటంతో లక్నో పోటీలో నిలిచింది. అయితే ఎనిమిది పరుగుల వ్యవధిలో హుడా (13), కృనాల్ వెనుదిరిగారు. చివర్లో స్టొయినిస్ (15 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్), హోల్డర్ (16) కొన్ని పరుగులు సాధించినా... అప్పటికే బాగా ఆలస్యమైపోయింది. 38 బంతుల్లో 74 పరుగులు చేయాల్సిన స్థితిలో వచ్చిన స్టొయినిస్కు జట్టును గెలిపించడం శక్తికి మించి భారంగా మారింది. చదవండి: Faf Du Plesis: ఆర్సీబీ కెప్టెన్కు సెంచరీ యోగ్యం లేదా! That's that from Match 31.@RCBTweets win by 18 runs against #LSG. Scorecard - https://t.co/9Dwu1D2Lxc #LSGvRCB #TATAIPL pic.twitter.com/oSxJ4fAukI — IndianPremierLeague (@IPL) April 19, 2022 -
ఆర్సీబీ కెప్టెన్కు సెంచరీ యోగ్యం లేదా!
ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. ఐపీఎల్ 2022లో లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో డుప్లెసిస్ 96 పరుగుల అసాధారణ ఇన్నింగ్స్తో మెరిశాడు. 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో జాగ్రత్తగా ఆడిన డుప్లెసిస్ 64 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 96 పరుగులు సాధించాడు. ఐపీఎల్లో ఇంతవరకు సెంచరీ లేని డుప్లెసిస్ ఈసారి ఎలాగైనా ఆ ఫీట్ సాధిస్తాడని అనుకునేలోపే సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో హోల్డర్ బౌలింగ్లో స్టోయినిస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా డుప్లెసిస్ ఐపీఎల్లో 96 పరుగుల వద్ద ఔట్ కావడం ఇది రెండోసారి. ఇంతకముందు సీఎస్కే తరపున 2019లో పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లోనూ 96 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇక 2021 సీజన్లో కేకేఆర్తో మ్యాచ్లో సీఎస్కే తరపున ఆడిన డుప్లెసిస్ 95 పరుగులు నాటౌట్ గా నిలిచి సెంచరీ మార్క్ను అందుకోలేకపోయాడు. ఇదే సీజన్లో పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో 88 పరుగులు చేసి ఔటయ్యాడు. మొత్తానికి చాలా ఏళ్ల నుంచి ఐపీఎల్ ఆడుతున్నప్పటికి డుప్లెసిస్కు సెంచరీ కల అలాగే మిగిలిపోయింది. నాలుగుసార్లు సెంచరీ అవకాశం వచ్చినప్పటికి.. మూడుసార్లు ఔట్.. ఒకసారి నాటౌట్గా మిగిలి సెంచరీని అందుకోలేకపోయాడు. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్..''డుప్లెసిస్కు సెంచరీ చేసే యోగ్యం ఇప్పట్లో లేనట్లేనా'' అంటూ కామెంట్ చేశారు. డుప్లెసిస్ మెరుపు ఇన్నింగ్స్ కోసం క్లిక్ చేయండి చదవండి: Virat Kohli: అదే నిర్లక్ష్యం.. కోహ్లి ఖాతాలో అనవసర రికార్డు CLASS KNOCK! 🙌🏻 Well played, @faf1307! 👏🏻👏🏻#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #LSGvRCB pic.twitter.com/29kwOnhPb9 — Royal Challengers Bangalore (@RCBTweets) April 19, 2022 -
IPL 2022: లక్నో సూపర్ జెయింట్స్పై ఆర్సీబీ ఘన విజయం
-
చెల్లెలి మరణం.. జట్టుకు దూరం.. అతడి సేవలను మిస్సవుతున్నాం!
IPL 2022 CSK vs RCB: చెన్నై సూపర్కింగ్స్తో మ్యాచ్లో తమ స్టార్ బౌలర్ హర్షల్ పటేల్ లేని లోటు స్పష్టంగా కనిపించిందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. తానుంటే జట్టుకు బలమని, మ్యాచ్ స్వరూపాన్ని ఒంటిచేత్తో మార్చేయగల సత్తా అతడిని సొంతమని పేర్కొన్నాడు. త్వరలోనే అతడు జట్టులోకి తిరిగి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2022లో భాగంగా చెన్నైతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 23 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించిన శివమ్ దూబే, రాబిన్ ఊతప్ప తమ అద్భుత ప్రదర్శనతో సీఎస్కేకు ఈ సీజన్లో మొదటి విజయం దక్కడంలో కీలక పాత్ర పోషించారు. కాగా గత సీజన్లో పర్పుల్ క్యాప్ గెలుచుకున్న ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ ఈసారి కూడా తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. PC: IPL అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా అతడు ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. తన చెల్లెలు మరణం నేపథ్యంలో హర్షల్ పటేల్ బయోబబుల్ను వీడి ఇంటికి వెళ్లాడు. కాగా గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న హర్షల్ సోదరి ఏప్రిల్ 9న తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఆమె చనిపోయినట్లు జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా.. తమ సహచర ఆటగాడికి కష్టకాలంలోనూ అండగా ఉంటామన్న సందేశం ఇచ్చే క్రమంలో.. ఆర్సీబీ క్రికెటర్లు సీఎస్కేతో మ్యాచ్ సమయంలో నల్లటి బ్యాండ్లు ధరించి సోదరభావాన్ని చాటుకున్నారు. హర్షల్ పటేల్ సోదరి మరణం నేపథ్యంలో చేతులకు బ్యాండ్లు ధరించి మైదానంలో దిగారు. సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ స్కోర్లు: చెన్నై: 216/4 (20) బెంగళూరు: 193/9 (20) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శివమ్ దూబే చదవండి: IPL 2022 CSK Vs RCB: కెప్టెన్గా తొలి గెలుపు.. ఈ విజయం నా భార్యకు అంకితం: జడేజా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: ఆర్సీబీపై సీఎస్కే ఘన విజయం
-
సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ.. విజయం ఎవరిది..?
ఐపీఎల్-2022లో మరో ఉత్కంఠభరిత పోరుకు రంగం సిద్దమైంది. మంగళవారం(ఏప్రిల్ 12) డివై పాటెల్ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. కాగా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు సీఎస్కే బోణీ కొట్టలేదు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యా్చ్ల్లోనూ ఓటమి చెంది పాయింట్ల పట్టికలో అఖరి స్థానంలో సీఎస్కే నిలిచింది. కాగా ఆర్సీబీపై విజయం సాధించి క్యాష్ రీచ్ లీగ్లో సీఎస్కే తొలి విజయం సాధించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఇరు జట్లు బలాబలాలు ఓ సారి పరిశీలిద్దాం. కాగా గత మ్యాచ్లో స్పిన్నర్ మహేశ్ తీక్షణనను సీఎస్కే తుది జట్టులోకి తీసుకుంది. అయితే అతడు భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో అండర్-19 సంచలనం రాజవర్ధన్ హంగర్గేకర్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. బ్యాటింగ్ పరంగా సీఎస్కే పటిష్టంగా కన్పిస్తోంది. రాబిన్ ఊతప్ప, మోయిన్ అలీ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఇక రుత్రాజ్ గైక్వాడ్ ఫామ్లోకి వస్తే ఆ జట్టుకు మరింత కలిసిస్తోంది. మరో వైపు బౌలింగ్ పరంగా చెన్నై బలహీనంగా ఉంది. ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే.. ఈ ఏడాది సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడు విజయాలు ఆర్సీబీ సాధించింది. బౌలింగ్ బ్యాటింగ్ పరంగా ఆర్సీబీ పటిష్టంగా కన్పిస్తోంది. కాగా ఈ మ్యాచ్లో ఆర్సీబీ తుది జట్టలోకి జోష్ హాజల్వుడ్ వచ్చే అవకాశం ఉంది. తుది జట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(అంచనా) ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), జోష్ హేజిల్వుడ్, వనిందు హసరంగా, సిద్ధార్థ్ కౌల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్ చెన్నై సూపర్ కింగ్స్ (అంచనా) రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా (కెప్టెన్), శివమ్ దూబే, ఎంస్ ధోని (వికెట్ కీపర్), డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, మహేశ్ తీక్షణ, రాజవర్ధన్ హంగర్గేకర్ -
IPL 2022: అతడు భవిష్యత్ ఆశా కిరణం: డుప్లెసిస్
అర్ధ శతకంతో రాణించి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించిన యువ బ్యాటర్ అనూజ్ రావత్పై ప్రశంసలు కురుస్తున్నాయి. అతడి ఆట తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, కోచ్ సంజయ్ సైతం అనూజ్ అద్భుత ఇన్నింగ్స్ను కొనియాడుతున్నారు. కాగా ముంబై ఇండియన్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు.. ముంబైని బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో రోహిత్ సేన 6 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేధనకు దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 24 బంతులు ఎదుర్కొని కేవలం 16 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. ఈ క్రమంలో వన్డౌన్లో వచ్చిన మాజీ సారథి విరాట్ కోహ్లితో కలిసి మరో ఓపెనర్ అనూజ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 47 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 66 పరుగులు సాధించాడు. కోహ్లి(48), అనూజ్ రాణించడంతో 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఆర్సీబీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ మాట్లాడుతూ.. ‘‘ముంబై వంటి పటిష్టమైన జట్టుపై గెలుపొందడం సంతోషంగా ఉంది. మా బౌలర్లు అత్యుత్తమంగా రాణించారు. 18వ ఓవర్ల పాటు మా బ్యాటింగ్ అద్భుతంగా సాగింది. అనూజ్ రావత్కు మ్యాచ్ను గెలిపించగల సత్తా ఉంది. భవిష్యత్ ఆశాకిరణం అతడు. మ్యాచ్కు ముందు అనూజ్తో ఎన్నో విషయాలు చర్చించాను. ఇక ఆకాశ్ దీప్ బౌలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అద్భుతంగా బౌలింగ్ చేశాడు’’ అని అనూజ్, ఆకాశ్లను కొనియాడాడు. ఇక కోచ్ సంజయ్ అనూజ్గురించి చెబుతూ.. ‘‘ఆరంభ మ్యాచ్లలో తడబడ్డా ప్రస్తుతం బాగా రాణిస్తున్నాడు. ముంబైతో మ్యాచ్లో అద్భుతమైన షాట్లు ఆడాడు. ఫాఫ్తో కలిసి మెరుగైన భాగస్వామ్యాలు నమోదు చేస్తున్నాడు. తనది చాలా కష్టపడే తత్వం. అనూజ్ ఇన్నింగ్స్ పట్ల మేము సంతోషంగా ఉన్నాం’’ అని పేర్కొన్నాడు. ఆర్సీబీ వర్సెస్ ముంబై స్కోర్లు ముంబై-151/6 (20) ఆర్సీబీ-152/3 (18.3) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అనూజ్ రావత్ చదవండి: IPL 2022: ఒక్క మ్యాచ్ అయినా గెలవండిరా బాబూ! సిగ్గుతో చచ్చిపోతున్నాం! Captain Faf and Coach Sanjay heap praises on Anuj Rawat and Akash Deep, after our commanding win against MI last night. Watch what Anuj, Akash and S Sriram had to say about this win.#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #RCBvMI pic.twitter.com/zBT6sAVlT4 — Royal Challengers Bangalore (@RCBTweets) April 10, 2022 -
IPL 2022: ముంబై ఇండియన్స్పై ఆర్సీబీ విజయం
-
IPL 2022: శతక్కొట్టిన ఆర్సీబీ.. అంబరాన్నంటిన సంబురాలు
100 Wins For RCB In IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అరుదైన ఘనత సాధించింది. ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా నిన్న (ఏప్రిల్ 5) రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆ జట్టు.. క్యాష్ రిచ్ లీగ్లో వందో విజయాన్ని నమోదు చేసింది. తద్వారా ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన నాలుగో జట్టుగా రికార్డుల్లోకెక్కింది. A century of wins. Countless unforgettable memories. 💯🥳#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/jvWNOW8mIq— Royal Challengers Bangalore (@RCBTweets) April 6, 2022 లీగ్ ప్రారంభమైన నాటి (2008) నుంచి ఆర్ఆర్తో మ్యాచ్ వరకు మొత్తం 214 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ.. 100 మ్యాచ్ల్లో విజయాలు సాధించగా, 107 మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. మిగిలిన 7 మ్యాచ్ల్లో 4 మ్యాచ్ల్లో ఎలాంటి ఫలితం రాకపోగా, 2 మ్యాచ్ల్లో టై బ్రేకర్లో గెలుపు, మరో మ్యాచ్లో టై బ్రేకర్లో ఓటమి చవిచూసింది. ఐపీఎల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో ముంబై ఇండియన్స్ (219 మ్యాచ్ల్లో 125 విజయాలు) అగ్రస్థానంలో ఉండగా, రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ (198 మ్యాచ్ల్లో 117 విజయాలు), మూడో ప్లేస్లో కోల్కతా నైట్రైడర్స్ (212 మ్యాచ్ల్లో 109 విజయాలు) జట్లు ఉన్నాయి. ఆర్సీబీ సెంచరీ సెలబ్రేషన్స్ అదుర్స్.. ఐపీఎల్లో తమ జట్టు వందో విజయాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. డ్రెస్సింగ్ రూమ్లో జరిగిన ఈ సెలబ్రేషన్స్లో ఆటగాళ్లతో పాటు ఆర్సీబీ బృంద సభ్యులంతా పాల్గొని రచ్చరచ్చ చేశారు. ఆర్సీబీ యాజమాన్యం వెరైటీ వంటకాలతో కూడిన ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది. ఆర్సీబీ నినాదాలతో డ్రెస్సింగ్ రూమ్ మార్మోగిపోయింది. ఐ యామ్ ప్రౌడ్ టు బి ఆర్సీబియన్ అంటూ ఆటగాళ్లు అంబరాన్నంటేలా నినదించారు. సెంచరీ సెలబ్రేషన్స్లో కొత్త పెళ్లికొడుకు మ్యాక్స్వెల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచాడు. Celebrations of RCB in the Dressing room after the yesterday's match win against Rajasthan Royals. pic.twitter.com/OIa8x1O3av— CricketMAN2 (@ImTanujSingh) April 6, 2022 ఇక ఆర్ఆర్తో మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ, గత మ్యాచ్లతో పోలిస్తే కాస్త మెరుగ్గానే బౌలింగ్ చేసి ప్రత్యర్ధిని 169 పరుగులకు కట్టడి చేయగలిగింది. బట్లర్ (70 నాటౌట్), హెట్మేయర్ (42 నాటౌట్) ఆఖర్లో బ్యాట్ ఝులిపించడంతో ఆర్ఆర్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. ఛేదనలో ఆర్సీబీ కాస్త తడబడినప్పటికీ దినేశ్ కార్తీక్ (44 నాటౌట్), షాబాజ్ అహ్మద్ (45) అద్భుతమైన ఆటతీరుతో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా ఆర్సీబీ ఐపీఎల్ 2022 సీజన్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. చదవండి: ‘అత్యుత్తమ ఫినిషర్’.. నా కెరీర్ ముగిసిపోలేదు.. అందుకే ఇప్పుడిలా! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
RR Vs RCB: అక్కడ టాస్ గెలిస్తేనే విజయం!
IPL 2022 RR Vs RCB Prediction: ఐపీఎల్-2022 సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలోనూ ఘన విజయం సాధించింది ఆర్ఆర్. తమ ఆరంభ మ్యాచ్లో భాగంగా సన్రైజర్స్తో తలపడ్డ రాజస్తాన్ 61 పరుగుల తేడాతో గెలుపొందింది. అదే విధంగా రెండో మ్యాచ్లో ముంబైని 23 పరుగుల తేడాతో ఓడించి సత్తా చాటింది. ఈ క్రమంలో సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్తాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అద్భుత రన్రేటు(2.100)తో ముందుకు దూసుకెళ్లింది. ఇదే జోష్లో మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్కు సిద్ధమవుతోంది. హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. మరి ఈ రెండు జట్ల ముఖాముఖి పోరులో ఇప్పటి వరకు ఎవరిది పైచేయి, పిచ్ వాతావరణం, తుది జట్ల అంచనా, మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగనుంది అన్న విషయాలు గమనిద్దాం. రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తేది, సమయం: ఏప్రిల్ 5, రాత్రి 7: 30 గంటలకు మ్యాచ్ ఆరంభం వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై పిచ్ వాతావరణం: వాంఖడేలో జరిగిన గత మూడు మ్యాచ్లను గమనిస్తే.. చేజింగ్ జట్లే విజయం సాధించాయి. సాయంత్రం ఇక్కడ జరిగే మ్యాచ్లలో మంచు ప్రభావం ఎక్కువ. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా పేసర్లకు ఈ పిచ్ అనుకూలమని గత మ్యాచ్లను బట్టి అర్థమవుతోంది. కేకేఆర్ తరఫున ఉమేశ్ యాదవ్, గుజరాత్ టైటాన్స్ తరఫున మహ్మద్ షమీ ఇక్కడ అద్బుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం గమనార్హం. ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ ముఖాముఖి రికార్డులు ఐపీఎల్లో ఇప్పటి వరకు 24 మ్యాచ్లలో రాజస్తాన్, బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఇందులో పన్నెండింటిలో ఆర్సీబీ విజయం సాధించగా.. రాజస్తాన్ 10 మ్యాచ్లలో గెలుపొందింది. రెండు మ్యాచ్లలో ఫలితం తేలలేదు. ఇక వాంఖడేలో ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్లలో రాజస్తాన్ కేవలం ఏడింట ఓడిపోగా.. ఆర్సీబీ 12 మ్యాచ్లకు గానూ ఎనిమిదింట పరాజయం మూటగట్టుకుంది.కాగా ఈ సీజన్లో రాజస్తాన్ రెండింట గెలుపొందగా.. ఆర్సీబీ ఒక మ్యాచ్లో ఓడి, మరో మ్యాచ్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మంళవారం నాటి పోరు మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. తుది జట్ల అంచనా: ఆర్సీబీ: ఫాప్ డుప్లెసిసస్(కెప్టెన్), అనూజ్ రావత్, విరాట్ కోహ్లి, దినేశ్ కార్తిక్, రూథర్ఫర్డ్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, డేవిడ్ విల్లే, హర్షల్ పటేల్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్ రాజస్తాన్: జోస్ బట్లర్, యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), దేవ్దత్ పడిక్కల్, షిమ్రన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, యుజువేంద్ర చహల్, ప్రసిద్ కృష్ణ. చదవండి: IPL 2022: రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్.. ఆర్సీబీకి బ్యాడ్ న్యూస్! Faf’s pep talk to the team, Mike’s assessment, Willey’s team song assignment, Harshal on facing old friend Yuzi, Maxi’s availability and much more, as we preview the #RRVRCB game on @kreditbee presents Game Day.#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/rRFAu5PGGn — Royal Challengers Bangalore (@RCBTweets) April 5, 2022 We carry Rajasthan in our hearts. We are #DilSeRoyal. 💗#RoyalsFamily | #RRvRCB pic.twitter.com/ibZp6X4Nk9 — Rajasthan Royals (@rajasthanroyals) April 5, 2022 -
ఆర్సీబీకి భారీ షాక్.. యువ ఆటగాడు దూరం!
ఐపీఎల్-2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు యువ ఆటగాడు లవ్నీత్ సిసోడియా గాయం కారణంగా ఈ ఏడాది సీజన్కు దూరమయ్యాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్లో కూడా సిసోడియా అవకాశం రాలేదు. కర్ణాటకకు చెందిన ఈ యువ ఆటగాడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2022 మెగా వేలంలో రూ. 20 లక్షలకు సిసోడియాను ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఇక అతడి స్థానంలో మధ్యప్రదేశ్ యువ ఆటగాడు రజత్ పాటిదార్ను భర్తీ చేసింది. గతేడాది సీజన్లో ఆర్సీబీకు ప్రాతినిద్యం వహించిన పాటిదార్ పర్వాలేదనిపించాడు. అయితే ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు ఆర్పీబీ అతడిని రీటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలో వేలంలోకి వెళ్లిన పాటిదార్ను ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. అయితే మళ్లీ అతడిని ఆర్సీబీ కొనుగోలు చేయడం విశేషం. దేశీయ స్థాయిలో 31 టీ20 మ్యాచ్లు ఆడిన పాటిదార్ 861 పరుగులు సాధించాడు. ఇక ఆర్సీబీ తన తదుపరి మ్యాచ్లో ఏప్రిల్5న రాజస్తాన్ రాయల్స్తో తలపడనుంది. చదవండి: IPL 2022 CSK Vs PBKS: ఆహా ఏమా షాట్.. ! 108 మీటర్ల భారీ సిక్సర్ బాదిన లివింగ్స్టోన్ -
'మేము సీఎస్కే అభిమానులం.. కానీ డుప్లెసిస్ అంటే పిచ్చి'
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ చెన్నైసూపర్ కింగ్స్తో తన అనుబంధాన్ని ముగించినప్పటికీ సీఎస్కే ఫ్యాన్స్ ఇంకా అతడిని అభిమానిస్తూనే ఉన్నారు. కాగా బుధవారం(మార్చి30) ఆర్సీబీ, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్లో సీఎస్కే అభిమానులు ప్రత్యేక బ్యానర్తో సందడి చేశారు. ఆ బ్యానర్లో "మేము చెన్నైసూపర్ కింగ్స్ అభిమానులం, కానీ డుప్లెసిస్ కోసం మేము ఇక్కడకు వచ్చాం" అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఐపీఎల్-2022లో మెగా వేలంలో డుప్లెసిస్ను రూ. 7 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. అంతేకాకుండా ఆర్సీబీ యాజమాన్యం తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు డుప్లెసిస్కు అప్పగించింది. ఇక ఐపీఎల్-2022లో భాగంగా తొలి మ్యాచ్లో పంజాబ్ చేతిలో అనూహ్యంగా ఓటమి చెందిన ఆర్సీబీ రెండో మ్యాచ్లో విజయం సాధించింది. కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 128 పరుగులకే ఆలౌట్ అయింది. కేకేఆర్ బ్యాటర్లలో ఆండ్రీ రసెల్ (25), ఉమేశ్ యాదవ్(18) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో వనిందు హసరంగా 4, ఆకాశ్ దీప్ 3, హర్షల్ పటేల్ 2, సిరాజ్ ఒక వికెట్ సాదించారు. అనంతరం 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 7 వికెట్లు కోల్పోయి చేధించింది.. ఆర్సీబీ బ్యాటర్లలో రూథర్పోర్డ్ 28, షాబాజ్ అహ్మద్ 27 పరుగులతో కీలక ఇన్నింగ్స్లు ఆడారు. కేకేఆర్ బౌలర్లలో టిమ్ సౌథీ 3, ఉమేవ్ యాదవ్ 2, నరైన్, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ తీశారు. చదవండి: IPL 2022: పంజాబ్ కింగ్స్కు గుడ్న్యూస్.. సిక్సర్ల వీరుడు వచ్చేశాడు! Fans poster during #RCBvsKKR : "We are CSK fans, but we are here for Faf Du Plessis @faf1307 💛🦁." #WhistlePodu | #IPL2022 pic.twitter.com/K6wg4oF1Be — CSK Fans Army™ 🦁 (@CSKFansArmy) March 30, 2022 -
క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూగా మిగిలిపోనుంది
ఐపీఎల్ 2022లో భాగంగా కేకేఆర్,ఆర్సీబీ మధ్య మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. కేకేఆర్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ హర్షల్ పటేల్ వేశాడు. అప్పటికే హర్షల్ పటేల్ 2 ఓవర్లు వేసి 2 మెయిడెన్లు సహా 2 వికెట్లు తీసి ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో క్రీజులో ఉన్న వరుణ్ చక్రవర్తికి హర్షల్ 16వ ఓవర్లో ఆఖరి బంతిని ఫుల్టాస్గా వేశాడు. ఆ బంతి బ్యాట్కు తగిలి వన్ స్టప్ అయి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అది క్లియర్గా ఔట్ కాదని తెలిసినప్పటికి.. బంతి వరుణ్ చక్రవర్తి బూట్లకు తగిలి బ్యాట్కు తగిలిందేమోనని హర్షల్ పటేల్ అంపైర్కు అప్పీల్ చేశాడు. అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. ఇంతటితో ఊరుకుంటే అయిపోయేది.. కానీ హర్షల్ పటేల్ కెప్టెన్ డుప్లెసిస్వైపు చూడడం.. అతను రివ్యూ తీసుకోవడం జరిగిపోయింది. ఇక రిప్లేలో బంతి ఎక్కడా కనీసం బ్యాట్స్మన్ బూట్లకు తగిలినట్లుగా కూడా కనిపించలేదు. అంతేకాదు బంతి బ్యాట్ మిడిల్లో తగిలినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ''డుప్లెసిస్ తీసుకున్న రివ్యూ.. క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రివ్యూగా మిగిలిపోనుంది.. బౌలర్ కంటే తెలియకపోవచ్చు.. కెప్టెన్గా అనుభవం ఉన్న నీకు ఆ రివ్యూ ఎలా తీసుకోవాలనిపించింది డుప్లీ..'' అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. చదవండి: Ravi Shastri: ఉమ్రాన్ మాలిక్పై టీమిండియా మాజీ కోచ్ ప్రశంసల వర్షం IPL 2022: కేకేఆర్కు ఆ జట్టు మాజీ ప్లేయర్ వార్నింగ్.. తేడా వస్తే -
IPL 2022: ఉత్కంఠ పోరులో కేకేఆర్పై ఆర్సీబీ విజయం
-
IPL 2022: జోరుమీదున్న కేకేఆర్ను ఆర్సీబీ నిలువరించేనా..?
RCB VS KKR Head To Head Records: ఐపీఎల్ 2022 సీజన్లో ఇవాళ (మార్చి 30) మరో రసవత్తర పోరు జరుగనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో పరుగుల వరద పారడం ఖాయమని తెలుస్తుంది. తొలి మ్యాచ్లో సీఎస్కేపై గ్రాండ్ విక్టరీతో కేకేఆర్ జోరుమీదుండగా.. భారీ స్కోర్ను కాపాడుకోలేక, పంజాబ్ చేతిలో చావుదెబ్బ తిన్న ఆర్సీబీ.. బోణీ విజయం కోసం ఆరాటపడుతుంది. హెడ్ టు హెడ్ రికార్డ్స్ విషయానికొస్తే.. క్యాష్ రిచ్ లీగ్లో ఇరు జట్లు 29 మ్యాచ్ల్లో తలపడగా కేకేఆర్ 16, ఆర్సీబీ 13 మ్యాచ్ల్లో విజయాలు నమోదు చేశాయి. ఇక గతేడాది జరిగిన 2 మ్యాచ్ల్లోనూ కేకేఆర్ ఘన విజయాలు సాధించి ఆర్సీబీపై ఆధిక్యం ప్రదర్శించింది. ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే.. ఆర్సీబీతో పోలిస్తే కేకేఆర్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉందనే చెప్పాలి. చెన్నైతో జరిగిన గత మ్యాచ్లో చిన్నచిన్న పోరపాట్లు మినహా కేకేఆర్ అన్ని విభాగాల్లో ప్రత్యర్ధిపై పైచేయి సాధించింది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తనకున్న వనరులను అద్భుతంగా వినియోగించుకోగా, సీనియర్ బ్యాటర్ రహానే తిరిగి ఫామ్లోకి రావడం కేకేఆర్కు శుభపరిణామమని చెప్పాలి. బ్యాటింగ్లో వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్.. బౌలింగ్లో సునీల్ నరైన్, శివమ్ మావి, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు మంచి టచ్లో ఉండటంతో ఆర్సీబీతో మ్యాచ్లోనూ కేకేఆర్కు తిరుగుండదని అంచనా. ఇక ఆర్సీబీ విషయానికొస్తే.. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 205 పరుగుల భారీ స్కోర్ సాధించినప్పటికీ, దాన్ని కాపాడుకోలేక చేతులెత్తేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కెప్టెన్ డుప్లెసిస్, విరాట్ కోహ్లి, దినేష్ కార్తీక్లు అద్భుతమైన టచ్లో ఉండటం కేకేఆర్తో మ్యాచ్కు ముందు ఆర్సీబీకి కలిసొచ్చే అంశం. తొలి మ్యాచ్లో కీలక బౌలర్లు హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, హసరంగ దారాళంగా పరుగులు సమర్పించుకోవడం ఆర్సీబీని కలవరపెడుతుంది. మొత్తంగా చూస్తే.. ఆర్సీబీతో మ్యాచ్లో కేకేఆర్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. ఆర్సీబీ (అంచనా): డుప్లెసిస్(కెప్టెన్), అనూజ్ రావత్, విరాట్ కోహ్లి, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, వనిందు హసరంగ, డేవిడ్ విల్లీ, హర్షల్ పటేల్, షాబాజ్ అహ్మద్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్ కేకేఆర్ (అంచనా): వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానే, నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సామ్ బిల్లింగ్స్, ఆండ్రీ రస్సెల్, షెల్డన్ జాక్సన్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, శివమ్ మావి, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి చదవండి: IPL: క్రిస్ గేల్ వచ్చేస్తున్నాడు..! -
IPL 2022: రెండు పాయింట్లు మాకు చాలా ముఖ్యం.. క్రెడిట్ వాళ్లదే: మయాంక్
IPL 2022- నవీ ముంబై: ఆదివారం ఐపీఎల్ పసందైన విందు ఇచ్చింది. 27 సిక్సర్లతో (బెంగళూరు 13, పంజాబ్ 14)... 413 పరుగులతో ( 205 + 208) రెట్టింపు వినోదాన్ని పంచింది. ఒక సిక్సర్ ఎక్కువ కొట్టిన పంజాబ్ ఐదు వికెట్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించి బోణీ కొట్టింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 205 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ డుప్లెసిస్ (57 బంతుల్లో 88; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), కోహ్లి (29 బంతుల్లో 41; 1 ఫోర్, 2 సిక్స్లు), దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) మెరిశారు. కొండంత లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 19 ఓవర్లలోనే 208 పరుగులు చేసి ముగించింది. ఓపెనర్లు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (24 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్లు), ధావన్ (29 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్) , రాజపక్స (22 బంతుల్లో 43; 2 ఫోర్లు, 4 సిక్స్లు) ధాటికి పంజాబ్ లక్ష్యంవైపు సాఫీగా సాగిపోయింది. షారుఖ్ ఖాన్ (20 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఒడెన్ స్మిత్ (8 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్లు) ఆరో వికెట్కు 4.1 ఓవర్లలో 52 పరుగులు జోడించి పంజాబ్ను గెలిపించారు. రెండు పాయింట్లు మాకు చాలా ముఖ్యం: మయాంక్ అగర్వాల్ పంజాబ్ కెప్టెన్గా తొలిసారి పూర్తి స్థాయి కెప్టెన్గా వ్యవహరిస్తున్న మయాంక్ అగర్వాల్ గెలుపుతో సీజన్ ఆరంభించడం విశేషం. ఈ నేపథ్యంలో విజయానంతరం మయాంక్ మాట్లాడుతూ.. ‘‘రెండు పాయింట్లు అనేవి మాకు చాలా చాలా ముఖ్యం. వికెట్ బాగుంది. ఇరు జట్లు 200కు పైగా పరుగులు సాధించడం చూస్తుంటూనే అర్థమవుతోంది. జట్టు ఎంపికలో సరైన నిర్ణయం తీసుకున్నాం. నాకు తెలిసి మేము 15- 20 పరుగులు ఎక్కువగా ఇచ్చి ఉంటాం. విరాట్, ఫాఫ్ కలిసి మ్యాచ్ను తమ వైపు లాగేసుకునే ప్రయత్నం చేశారు. కానీ మా బ్యాటర్లు అద్భుతంగా రాణించారు’’ అని హర్షం వ్యక్తం చేశాడు. చదవండి: World Cup 2022: అంతా నువ్వే చేశావు హర్మన్.. కానీ ఎందుకిలా? మా హృదయం ముక్కలైంది! A spectacular run-chase by @PunjabKingsIPL in a high-scoring thriller sums up a Super Sunday 😍#TATAIPL #PBKSvRCB pic.twitter.com/7x90qu4YjI — IndianPremierLeague (@IPL) March 27, 2022 A skipper Mayank special 😎 Check out @mayankcricket's authoritative six👌👌 WATCH▶️https://t.co/t0on2mlWMo #TATAIPL #PBKSvRCB pic.twitter.com/Sp14KIi9d4 — IndianPremierLeague (@IPL) March 27, 2022