Tips In Telugu
-
కొత్తిమీర తాజాగా, పకోడీలు క్రిస్పీగా, క్రంచీగా: ఈ టిప్స్ పాటించండి!
వంట చేసేటపుడు కొన్ని చిట్కాలు పాటించడమో, లేదా కొన్ని ఇంగ్రీడియంట్స్ అదనంగా కలపడమో తప్పని సరి. లేదంటే ఎంత కష్టపడి చేసిన వంట అయినా రుచిని కోల్పోతుంది. అలాగే ముఖ్యమైన పోషకాలను కోల్పోతాం. లేదా ఒక్కోసారి అసలు టేస్టే లేకుండా పోతుంది. అందుకే ఈ టిప్స్ ఒకసారి చూడండి. ♦ పకోడీలు మెత్తబడకుండా ఎక్కువ సేపు కరకరలాడుతూ ఉండాలంటే పావు కేజీ శనగపిండిలో గుప్పెడు మొక్కజొన్న పిండి కలపాలి. ♦ పూరీలు నూనె తక్కువ పీల్చుకుని, పొంగి కరకరలాడాలంటే పూరీలు వత్తేటప్పుడు బియ్యప్పిండి చల్లుకోవాలి. ♦ కూరగాయలను తొక్క తీసి, తరిగిన తర్వాత నీటిలో శుభ్రం చేస్తే అందులోని పోషకాలు నీటిలో కరిగిపోతాయి. ముఖ్యంగా నీటిలో కరిగే విటమిన్లను నష్టపోతాం. కాబట్టి తొక్క తీయడమైనా, తరగడమైనా నీటితో శుభ్రం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. అలాగే తరిగిన వెంటనే వండాలి. పై నియమాన్ని వంకాయలకు పాటించడం కష్టం. ఎందుకంటే తరిగిన వెంటనే నీటిలో వేయకపోతే వంకాయ ముక్కలు నల్లబడడంతోపాటు చేదుగా మారతాయి. కాబట్టి ముందుగా వంకాయలను ఉప్పు నీటిలో కడిగి ఆ తర్వాత తరిగి మళ్లీ నీటిలో వేయాలి. ♦ యాపిల్ను కట్ చేసి, ఆ ముక్కలను ప్లేట్లో అమర్చి సర్వ్ చేసే లోపే ముక్కలు రంగు మారుతుంటాయి. కాబట్టి కట్ చేసిన వెంటనే ఆ ముక్కల మీద నిమ్మరసం చల్లితే ముక్కలు తాజాగా ఉంటాయి. చాకును నిమ్మరసంలో ముంచి కట్ చేయడం కూడా మంచి ఫలితాన్నిస్తుంది. ♦ కొత్తిమీరను పలుచని క్లాత్ బ్యాగ్లో పెట్టి ఫ్రిజ్లో నిల్వ ఉంచితే ఆకులు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. -
జుట్టు బాగా రాలుతుందా.. అయితే ఇలా చేయండి!
'ఈ రోజుల్లో జుట్టు రాలడం చాలా సాధారణం అయిపోయింది. సరైన ఆహారం తీసుకోకపోవడం, కాలుష్యం, ఒత్తిడి.. ఇలా రకరకాల కారణాలతో జట్టు ఊడిపోతుంటుంది. హెయిర్ ఫాల్ను నివారించేందుకు చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, షాంపులు, కండీషనర్లు వాడుతుంటారు. ఇవేవీ పనిచేయకపోతే ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్ల వైపు పరుగులు పెడుతుంటారు. కానీ మన వంటింట్లో దొరికే పదార్థాలతోనే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టొచ్చు.' ఇలా చేయండి.. జుట్టు కుదుళ్లు బలంగా ఉండాలంటే... ఒక పాత్రలో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక టీ స్పూన్ నిమ్మరసం, కోడిగుడ్డు సొన ఒకదాని తరువాత ఒకటి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల దగ్గర నుండి చివరి వరకూ పట్టించి ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి. వారంలో ఒక్కసారయినా టీ డికాషన్ తో జుట్టును కడిగితే సిల్కీగా అవుతుంది. తలంటుకునే ముందు షాంపూలో కొద్దిగా వెనిగర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని కురులంతటికీ పట్టించి పది నిమిషాల తరువాత తలస్నానం చేస్తే జుట్టు మెరుస్తుంది. ఇవి చదవండి: ప్రపంచంలోనే అత్యంత వరస్ట్ కర్రీగా చోటు దక్కించుకున్న భారతీయ వంటకం ఏంటంటే..? -
వింటర్లో మేకప్ వేసుకుంటున్నారా? ఈ విషయాలు తెలిస్తే..
చలికాలంలో చర్మం ఎక్కువగా పొడిబారుతుంది. ఈ సమస్యను పోగొట్టుకునేందుకు చాలామంది మాయిశ్చరైజింగ్ క్రీములు, మేకప్ ఉత్పత్తులను వాడుతుంటారు. అయితే బయట దొరికే ఉత్పత్తుల్లో చాలా వరకు ఆల్కహాల్ శాతం ఎక్కువ ఉంటుంది. అందుకే చలికాలం సౌందర్య ఉత్పత్తులను ఎక్కువగా వాడకపోవడమే మంచిది. ఇంట్లోనే దొరికే వస్తువులతో వింటర్ స్కిన్ కేర్ను ఫాలో అవ్వొచ్చు. అదెలా అంటే.. ►తేనె, రోజ్ వాటర్ సమపాళ్లలో కలిపి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత శుభ్రపరుచుకోవాలి. పొడి చర్మానికి మేలైన ప్యాక్. చర్మం చక్కగా శుభ్రపడుతుంది. మృదువుగా అవుతుంది.సహజసిద్ధమైన వెన్న, నూనె, గ్లిజరిన్లను చలికాలంలో మాయిశ్చరైజర్లుగా ఉపయోగించడం మంచిది. ► శనగపప్పు 1 కప్పు, బియ్యం 1 కప్పు, మినప్పప్పు 1 కప్పు సమపాళ్లలో తీసుకుని, ఛాయపసుపు కొమ్ములు గుప్పెడు, గంధ కచూరాలు గుప్పెడు, ఎండబెట్టిన గులాబీ రెక్కలు కొన్ని కలిపి గ్రైండ్ చేసి పొడి చెయ్యాలి. ఈ పొడిని కొద్దికొద్దిగా తీసుకుని పెరుగులో కాని, మజ్జిగలోకాని, పాలలో గాని కలిపి, సబ్బుకి మారుగా ఈ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి స్నానం చేస్తే ఒళ్లు పేలిపోకుండా ఉండడమే కాకుండా చర్మం నునుపు తేలి సువాసన వెదజల్లుతుంది. ► గుడ్డు పచ్చ సొనలో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ పాల పొడి కలిపి ముఖానికి చేతులకు పట్టించాలి. మృదువుగా మర్దనా చేసి, 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ► కలబంద (అలొవెరా) రసం శరీరానికి పట్టించి, అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం మృదుత్వం కోల్పోదు. ► ఒక చెంచా తేనెను పెరుగుతో కలిపి ముఖానికి అప్లై చేసి, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మం కోల్పోయిన తేమను తిరిగి తెస్తుంది. చర్మం ఆరోగ్యకరమైన నిగారింపును సంతరించుకుంటుంది. -
బాణలిలో ఫ్రై చేస్తున్నారా? ఇలా చేస్తే అడుగు అంటుకోదు
వంటింటి చిట్కాలు ►గ్లాసు నీళ్లల్లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్కను ముక్కలు చేసి వేయాలి. దీనిలో బోరిక్ యాసిడ్ రెండు టీస్పూన్లు వేసి మూడు గంటలపాటు నానబెట్టాలి. తరువాత ఈ నీటిని సింక్లో పోస్తే బొద్దింకలు రావు. ► నిమ్మకాయ ముక్కలు, పుదీనా ఆకులు వెనిగర్ను సమపాళ్లల్లో తీసుకుని ఐస్క్యూబ్ ట్రేలో పోసి రాత్రంతా రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. ఉదయం ఈ ఐస్క్యూబ్ను తీసి దుర్వాసన వస్తోన్న సింక్లో వేస్తే దుర్వాసన పోతుంది. ► పాలు పొయ్యి మీద పెట్టి మర్చిపోతుంటాం. చాలాసార్లు అవి పొంగి స్టవ్ మొత్తం అవుతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే పాల గిన్నె మీద ఓ చెక్క చెంచాను ఉంచండి. ► పప్పు త్వరగా ఉడకాలన్నా మరింత రుచిగా ఉండాలన్నా అందులో ఒక టీస్పూన్ నువ్వులనూనె వేయాలి. ► వెల్లుల్లి, ఉల్లిపొట్టు అంత సులభంగా రాదు. దీనికోసం వేడి నీళ్లలో వీటిని కాసేపు వేసి ఆ తర్వాత పొట్టు తీయండి. ఇలా చేస్తే పొట్టు సులువుగా వస్తుంది. ► టొమాటో చుట్టూ చిన్నగా గాటు పెట్టి మరుగుతున్న నీటిలో వేయాలి. నిమిషం తరువాత తీసేసి ఐస్వాటర్లో వేయాలి. నిమిషం తరువాత టొమాటోను పట్టుకుని లాగితే తొక్క సులభంగా వచ్చేస్తుంది. ► మనం దోసెలు వేసేటప్పుడు పెనానికి అతుక్కుపోతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే.. వంకాయలతో ముందుగా పెనం పై వంకాయ ముక్కతో రుద్దండి. ► బాణలిలో కొద్దిగా నీళ్లుపోసి అవిరైపోయేవరకు వేడిచేయాలి. బాణలిలో ఒక్క నీటిచుక్క కూడా లేనప్పుడు నూనె వేసి ఫ్రైచేస్తే ఏ పదార్థమైనా బాణలికి అంటుకోదు. -
పప్పులతో ఫేస్ప్యాక్.. ముఖం బంగారంలా వెలిగిపోతుంది
బ్యూటీ టిప్స్ ►ఎర్ర పప్పు మంచి ఎక్స్ఫోలియేటర్గా కూడా పనిచేస్తుంది. ఎర్రపప్పులోని పోషకాలు,విటమిన్లు చర్మ రంగుని మెరుగ్గా చేస్తాయి. ఈ ఎర్రపప్పుతో ఫేస్ప్యాక్ వల్ల మృతకణాలను పోగొట్టి చర్మాన్ని మెరుగ్గా చేస్తుంది. ►కప్పు ఎర్రకందిపప్పు (మసూర్దాల్) తీసుకుని దానిలో ముప్పావు కప్పు పచ్చిపాలు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం ఈ పప్పుని పేస్టులా గ్రైండ్ చేయాలి. ముఖాన్ని కడిగి ఈ పేస్టుని అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తరువాత ముఖంపై వలయాకారంలో మర్దనచేసి నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్ను తగ్గించి, ముఖం కాంతిమంతంగా కనిపించేలా చేస్తుంది. ► మూడు టీస్పూన్ల పచ్చిశనగపప్పును రాత్రంతా నానబెట్టుకుని, ఉదయం నీళ్లు తీసేసి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, టీస్పూను నిమ్మరసం, తేనె వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టుని ముఖానికి అప్లై చేసి ఆరాక కడిగేయాలి. తరువాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేయడం వల్ల ముఖం మీద జిడ్డు, నల్లమచ్చలు, మొటిమలు తగ్గుముఖం పడతాయి. ► రెండుగంటలు నానిన నాలుగు టీస్పూన్ల పొట్టు పెసరపప్పుని పేస్టు చేయాలి. ఈ పేస్టులో టీస్పూను ఆరెంజ్ పీల్ పొడి, టీస్పూను గంధం పొడి వేసి కలపాలి. ఈ పేస్టుని ముఖానికి పూతలా వేసి పదినిమిషాలు ఆరనివ్వాలి. తరవాత కొద్దిగా నీటితో తడిచేసి మర్దన చేసి కడిగేయాలి. వారానికి మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతిమంతంగా, అందంగా కనిపిస్తుంది. హెయిర్ టిప్స్ ► టీస్పూను అలోవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్ల ఉల్లి రసం, మూడు టీస్పూన్ల కొబ్బరి నూనెవేసి అన్నిటినీ చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు రాసి మర్దన చేయాలి. మరుసటిరోజు తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల పలుచబడిన మాడు ఒత్తుగా, నల్లగా నిగనిగలాడుతుంది. -
జుట్టు బాగా రాలుతుందా? ఉసిరి, క్యారెట్తో ఇలా చేస్తే..
ఈ రోజుల్లో జుట్టు రాలడం చాలా సాధారణం అయిపోయింది. సరైన ఆహారం తీసుకోకపోవడం, కాలుష్యం, ఒత్తిడి.. ఇలా రకరకాల కారణాలతో జట్టు ఊడిపోతుంటుంది. హెయిర్ ఫాల్ను నివారించేందుకు చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, షాంపులు, కండీషనర్లు వాడుతుంటారు. ఇవేవీ పనిచేయకపోతే ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్ల వైపు పరుగులు పెడుతుంటారు. కానీ మన వంటింట్లో దొరికే పదార్థాలతోనే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఉసిరి ఇండియన్ గూస్బెర్రీగా పిలిచే ఉసిరిలో జుట్టుకు బలం చేకూర్చే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అధికమొత్తంలో విటమిన్ ఇ , విటమిన్ ఉ, ఎమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.ఇవి కేశాలను బలంగా దృఢంగా ఉండేందుకు తోడ్పడతాయి.ఇందుకోసం ఏం చేయాలంటే..ఉసిరికాయను ముక్కలుగా కోసి నీడలో ఆరబెట్టాలి. ముక్కలు ఆరిన తరువాత పొడిచేసుకోవాలి. ఇప్పుడు ఉసిరి పొడి 2 టేబుల్ స్పూన్స్ తీసుకుని దానిలో నిమ్మరసం వేసుకుని పేస్ట్లా చేసుకుని స్కాల్ప్పై అఫ్లై చేసుకోవాలి. ఇలా పెట్టుకుని రెండు గంటల పాటు ఉంచుకుని ఆ తరువాత షాంపు, చల్లని నీళ్లతో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్లు రాలడం తగ్గుతుంది. క్యారెట్ క్యారెట్లో బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, ఇ లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ రక్త ప్రసరణ బాగా జరిగేందుకు తోడ్పడమేగాక, వెంట్రుకల పెరుగుదలను ప్రేరేపిస్తాయి. క్యారెట్ జ్యూస్ తెల్ల వెంట్రుకలు రాకుండా చేస్తుంది. అందువల్ల 100 మిల్లీ లీటర్ల క్యారెట్ జ్యూస్ను రోజూ తీసుకుంటే వెంట్రుకలు ఆరోగ్యంగా, నల్లగా పెరుగుతాయి. స్వచ్ఛమైన కొబ్బరి నూనె కల్తీలేని స్వచ్ఛమైన కొబ్బరినూనెలో ఉండే లారిక్ యాసిడ్ కేశాలను ధృడంగా ఉంచడంలో సాయపడుతుంది. వెంట్రుకలు తెగిపోకుండా కుదుళ్ల నుంచి బలంగా ఉంచుతుంది. కొబ్బరినూనెతో తలమీద మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి కుదుళ్ల నుంచి కేశాలు పెరుగుతాయి. అంతేకాకుండా 15–20 నిమిషాలపాటు కొబ్బరినూనెతో స్కాల్ప్ మర్దన చేసి ఒక గంటపాటు లేదా ఒక రాత్రి మొత్తం అలా వదిలేయాలి. ఆతరువాత షాంపుతో వాష్ చేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. పోషకాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒత్తిడిని వల్ల జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. అందుకే సరైన డైట్ పాటించడంతో పాటు యోగా, ధ్యానం, వర్కౌట్ చేయాలి. -
పిల్లలను బాధ్యతతో పెంచుతున్నారా? అతి గారాబమా?
చాలామంది తల్లిదండ్రులు తాము పడ్డ కష్టాలను తమ పిల్లలు అనుభవించ కూడదనే ఉద్దేశ్యంతో వారిని అతి గారం చేస్తుంటారు. తమకు ఉన్నా లేకున్నా, వారికి కావలసిన అన్ని వసతులూ, సౌకర్యాలూ సమకూర్చుతూ, వారికి కష్టం అనేది తెలియకుండా పెంచుతుంటారు. అయితే అది చాలా తప్పు. వారికి బాల్యం నుంచి బాధ్యతలు తెలియజేయాలి. అలాగని వారి నెత్తిమీద బాధ్యతల బరువు వెయ్యడం కాదు... వారి బాధ్యత వారికి తెలిసేలా చేయడమే బాధ్యతతో కూడిన పెంపకం. పంచుకోవడం అన్నది పిల్లలకి తప్పనిసరిగా నేర్పాల్సిన వాటిలో ఒకటి. దానివల్ల ఇతరులతో స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. ఒకరి అవసరం మరొకరికి తెలుస్తుంది. కొంతమంది పిల్లలు స్కూలు నుండి రాగానే, పుస్తకాల సంచీ అక్కడే ఏ సోఫాలోనో పారేసి, విడిచిన బట్టలని, చెప్పులని ఒకపక్కకి వదిలేస్తారు. అటువంటప్పుడు వారికి ఆ వస్తువుల విలువ, అవసరం తెలియజేస్తూ, క్రమపద్ధతిలో భద్రపరచుకునేట్లు వారికి అలవాటు చేయాలి. అంతేకాదు, వారు అడిగినవన్నీ వెంటనే తెచ్చి ఇవ్వకుండా మంచి మాటలతో బుజ్జగించి దారికి తేవాలి. ఎదిరించి మాట్లాడుతుంటే... పెద్దవాళ్ళని ఎదిరించి మాట్లాడే పిల్లలని చూస్తుంటాం. మొదట తల్లిదండ్రులు తమ పెద్దలని గౌరవిస్తే, అదే బాటలో పిల్లలూ నడుచుకుంటారు. గురువులు, పెద్దలు, వృద్ధులను తల్లిదండ్రులు గౌరవిస్తే పిల్లలు అదే అలవాటు చేసుకుంటారు. షాపింగ్ షాపింగ్కి వెళ్ళినపుడు, పిల్లలని తమతో తీసుకెళుతుంటారు. అక్కడ వారికి సెల్ఫోన్ చేతికిచ్చి ఒకచోట కూర్చోబెట్టి తాము షాపింగ్ చేసుకుంటారు. అలా కాక తమ పిల్లలని కూడా తమతో ఉంచుకుంటే ఒక వస్తువు కొనేటప్పుడు తమ తల్లిదండ్రులు ఆ వస్తువు నాణ్యతని ఎలా పరీక్షిస్తున్నారో, ఎలా ఎంచుకుంటున్నారో అన్న విషయాలు తెలుసుకోవటంతో పాటు అక్కడ ఏమేమి రకాలు ఉన్నాయి, తమకు ఏమి కావాలి, ఏవి ఉపయోగం అన్నది గ్రహించుకోగల్గుతారు. కలిసి భోజనం చేయడం వారానికి ఒక్కరోజు అయినా అందరూ కలిసి భోజనం చేయాలి. అలా చేయటం వల్ల బయటకు వెళ్ళి, ఇతరులతో కలిసి భోజనం చేయాల్సొచ్చినప్పుడు, తల్లిదండ్రులు పిల్లలకు తినిపించాల్సిన అవసరం ఉండదు. మంచి మాటలతో సహజంగా పిల్లలు అల్లరి బాగా చేస్తుంటారు. ఆ అల్లరి మోతాదు మించి΄ోతుంటుంది. వస్తువులు పాడవటం, విరగటం, పగిలి పోవటం కూడా జరుగుతుంటుంది. ఆ సమయంలో ఎంత కోపం వచ్చినా, ఆ పాడయిన వస్తువు గురించే మాట్లాడాలి కాని పిల్లవాడి మనస్తత్వం గురించి మాట్లాడకూడదు. ఆ వస్తువు భద్రత గురించి చెప్పాలి. మరొకసారి ఆ తప్పు చేయకుండా ఉండేలా చేయాలి. పాకెట్ మనీ సాధారణంగా పిల్లలు కొంచెం ఎదిగాక, వారికి వారి ఖర్చుల నిమిత్తం కొంత సొమ్ము ఇస్తుంటారు. వారు ఎలా ఖర్చు పెట్టుకున్నా పట్టించుకోరు. ఇది సరి కాదు. వారు ఆ డబ్బును ఎందుకు... ఎలా ఖర్చు చేస్తున్నారో పద్దు రాయమనాలి. వాటిని చెక్ చేసి, అందులో అనవసర ఖర్చులుంటే వాటిని ఎత్తి చూపాలి. దీనివల్ల పిల్లలకి మనీ మేనేజ్మెంట్ అలవడుతుంది. టైమ్ మేనేజ్మెంట్ ఉదయం లేచే సమయం, భోజన సమయం, చదువుకునే సమయం, ఆటలాడే సమయం, పడుకునే సమయం.. ఇలా అన్నింటికీ ఒక టైం టేబుల్ తయారు చేయాలి. ఇది ఎంతో అవసరం. చదువు చదువు అని పోరాటం కాదు, ఎలా చదువుకోవాలో, చదువు ప్రాముఖ్యత ఏమిటో తెలియపరిస్తే వారు చదువుని కష్టపడి కాకుండా, ఇష్టపడి చదువతారు. థాంక్స్.. సారీ..! ఎదుటి వారికి ఇబ్బంది కలిగించినపుడు సారీ చెప్పటం, ఎవరి దగ్గరైనా ఏ వస్తువునైనా, లేదా సహాయాన్నైనా పొందితే,కృతజ్ఞత చెప్పటం అలవరచాలి. బాల్యం నుంచే పెద్దలను, తల్లిదండ్రులను గౌరవించడం, ఇరుగు పొరుగుతో, తోటివారితో మర్యాదగా మెలగడం, ఉన్నదానిని కలిసి పంచుకోవడం వంటి వాటిని నేర్పిస్తూ, మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. -
ఇలా చేయడం వల్ల చర్మంపై ముడతలు తగ్గుతాయి
సూర్యరశ్మిలోని అల్ట్రావయొలెట్ కిరణాలు చర్మంపై ముడతలను రావడానికి కారణమవుతాయి. కాలుష్యం కూడా చర్మంపై ముడతలకు కారణం అవుతుంది. మరి సహాజసిద్దమైన పద్దతుల్లో చర్మంపై ముడతలను ఎలా నివారించాలి అన్నది ప్రముఖ ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి మాటల్లోనే.. చర్మానికి మృదువైన, తేమను అందించే క్రీమ్ను రాసుకోండి రోజుకు కనీసం 15 నిమిషాలు మీ చర్మాన్ని మసాజ్ చేయడం. దీనివల్ల రక్త ప్రసరణ పెరిగి ముడతలు తగ్గుతాయి. చర్మం ఆరోగ్యం నిద్రపై చాలా ప్రభావం చూపుతుంది. రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి. ఒత్తిడి చర్మంపై ముడతలకు కారణం అవుతుంది. యోగా, ధ్యానం చేయడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ధూమపానం సాధారణ వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేసి, ముడతలకు దోహదం చేస్తుందట. అధిక నాణ్యత గల యాంటీ రింకిల్ క్రీమ్ను ఉపయోగించండి. ఇది ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. బొప్పాయి పైతొక్కును ముఖంపై రబ్ చేసి అరగంట తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే యవ్వనంగా మారుతుంది. అలోవెలా జెల్లో యాంటీ ఆక్సిడెంట్స్, హైడ్రేటింగ్ లక్షణాలు ఉంటాయి. ప్రతిరోజూ దీన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల ముడతలు తగ్గుతాయి. గుడ్డులోని తెల్లసొనను చర్మంపై అప్లై చేసి ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేయాలి. గుడ్డు తెల్లసొనలోని అల్బుమిన్ అనే ప్రోటీన్ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. పండిన అరటిపండును మెత్తగా చేసి 1స్పూన్ తేనే, 1స్పూన్ పెరుగు కలపి చర్మానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత నీళ్లతో వాష్ చేసుకోవాలి. అరటిపండులోని పోషకాలు కొల్లాజెన్ను పెంచుతాయి. కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వల్ల ముడతలను తగ్గిస్తుంది. -
జుట్టు రాలడం, తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా? ఈ టానిక్ ట్రై చేయండి
బ్యూటీ టిప్స్ ►బీట్రూట్ ఒకటి తీసుకుని చెక్కు తీసి ముక్కలుగా తరగాలి. రెండు ఉసిరి కాయలను గింజలు తీసేసి ముక్కలుగా కోయాలి. వీటికి పన్నెండు రెమ్మల కరివేపాకు, గ్లాసు నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని పదినిమిషాల పాటు మీడియం మంట మీద మరిగించాలి. చక్కగా మరిగాక దించేసి చల్లారిన తరువాత ఈ రసాన్ని వడగట్టి సీసాలో నిల్వచేసుకోవాలి. ఈ టానిక్ను వారానికి రెండు మూడుసార్లు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. రెండు గంటల తరువాత సాధారణ షాంపుతో కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చే స్తే కుదుళ్లకు పోషకాలు అందుతాయి. రక్తప్రసరణ చక్కగా జరిగి జుట్టు ఊడడం తగ్గుతుంది. చివర్లు చిట్లకుండా చక్కగా పెరుగుతాయి. ► మరుగుతున్న రెండు గ్లాసుల నీటిలో మూడు టేబుల్ స్పూన్ల టీ పొడి, పది గులాబీ పువ్వులు వేసి పదినిమిషాల పాటు మరిగించాలి. ఇది చల్లారిన తర్వాత వడగట్టి ఒక సీసాలో పోయాలి. తలస్నానం చేసిన జుట్టుకు ఈ డికాషన్ను పట్టించి, టవల్ చుట్టుకోవాలి. నీటితో కడగకూడదు. ఇది కండీషనర్లా పనిచేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ► చాలామంది జుట్టుకు నూనె రాసుకోవడం మానేస్తుంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు జీవం కోల్పోతుంది. అందుకే తలస్నానానికి ముందు తప్పనిసరిగా కొబ్బరినూనెను తలంతా పట్టించాలి. 2 గంటల తర్వాత స్నానం చేస్తే జుట్టు పుట్టుకుచ్చులా మెరుస్తుంది. ► కోడిగుడ్లులోని ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ జుట్టుకు మంచి పోషణ అందిస్తాయి. వారానికి ఒకసారి ఎగ్వైట్ను కుదుళ్లకు పట్టించి 20-30 నిమిషాలు పట్టించి, ఆ తర్వాత గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా, సిల్కీగా మారుతుంది. ► రెండు టేబుల్ స్పూన్ల మందారం పొడి, రెండు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ రసం కలిపి చూర్ణం చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. ► రెండు టేబుల్ స్పూన్ల ఎండిన మందారాల పొడికి కలబంద, ఉసిరి పొడి, పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తుంటే తెల్లని జుట్టు సమస్య తగ్గుతుంది. జెల్ మెరుపులు టేబుల్ స్పూను పంచదార పొడిలో స్పూను వేడినీళ్లు పోసి కలపాలి. దీన్లో రెండు టీస్పూన్ల పచ్చి పాలు, స్పూను అలోవెరా జెల్ వేసి కలపాలి. శుభ్రంగా కడిగిన ముఖానికి ఈ మిశ్రమాన్ని రాసి మర్దన చేయాలి. పదినిమిషాల పాటు ఆరనిచ్చి కడిగేయాలి. వారానికి మూడు సార్లు ఈ ప్యాక్ వేయడం వల్ల చర్మానికి తేమ అంది, మృదువుగా నిగారింపుతో కనిపిస్తుంది. -
లవంగాలు, కర్పూరంతో రూమ్ ఫ్రెష్నర్.. ఇలా చేసుకోండి
వంటింటి చిట్కాలు కొద్దిగా మెంతిపిండి, కొద్దిగా అన్నం వేసి నానిన బియ్యాన్ని గ్రైండ్ చేస్తే అప్పం మరింత మృదువుగా వస్తుంది. ఎంతో తియ్యగా ఉండే అరటిపండ్లపై ఫ్రూట్ఫ్లైస్ వాలుతూ చిరాకు పెడుతుంటాయి. అయితే మార్కెట్ నుంచి అరటిపండ్లు తెచ్చిన వెంటనే శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకుంటే ఫ్రూట్ఫ్లై ఒకటీ వాలదు. అరకప్పు వంటసోడాలో నీళ్లు పోసి పేస్టులా కలపాలి. ఈ పేస్టుని అవెన్లో లోపలి భాగంలో రాయాలి. హీటింగ్ కాయిల్స్, ఫ్యాన్ బ్లేడ్స్, లైట్స్ మీద రాయకూడదు. కింద, సైడు గోడలకు రాసి రాత్రంతా ఉంచేయాలి. ఉదయాన్నే కాటన్ వస్త్రంతో వంటసోడాని తుడిచేయాలి. సోడా పూర్తిగా పోయిన తరువాత నీటిలో కలిపిన వెనిగర్తో మరోసారి తుడవాలి. ఇలా చేస్తే అవెన్లో పేరుకుపోయిన మురికి, అవెన్ గోడలకు పడ్డ మచ్చలూ పోయి కొత్త దానిలా మెరుస్తుంది. అంగుళం దాల్చిన చెక్క, నాలుగు లవంగాలు, నాలుగు కర్పూరం బిళ్లలను మెత్తగా దంచి పొడిచేయాలి. ఈ పొడిలో కొద్దిగా నీళ్లు, కొద్దిగా నూనె వేసి ద్రవంలా మర్చాలి. ఈ ద్రవాన్ని ఖాళీ అయిన దోమల రిపెలర్స్, ఆల్ అవుట్ లాంటి డబ్బాల్లో వేసి ప్లగ్లో పెట్టి స్విచ్ ఆన్ చేస్తే రూమ్ అంతా సువాసన వస్తుంది. ఇది సహజసిద్ధమైన రూమ్ ఫ్రెష్నర్గా పనిచేస్తుంది. -
పెదాలకు ఇది రాసుకుంటే గులాబీ రంగులోకి మారతాయి
హార్మోన్ల మార్పులు, విటమిన్ల లోపం, ధూమపానం, హైపర్ పిగ్మేంటేషన్ వంటి పలు కారణాల వల్ల పెదాలు నల్లగా మారుతుంటాయి. ఆ నలుపుదనం తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు కొబ్బరి నూనె, తేనెలో పంచదార కలపండి. ఈ మిశ్రమాన్ని పెదవులపై స్క్రబ్గా ఉపయోగించండి. ఇది పెదవులపై చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. పెదాలను మృదువుగా, అందమైన రంగులోకి మారుస్తుంది. రెగ్యులర్గా లిప్స్టిక్ వాడేవాళ్ల పెదాలు నల్లగా మారుతుంటాయి. అందుకే లిప్స్టిక్ను ఎక్కువసేపు ఉంచుకోవచ్చు. బయటి నుంచి రాగానే ఆలివ్ ఆయిల్ లేదా బాదం ఆయిల్తో లిప్స్టిక్ను తొలగించుకోవాలి. విటమిన్ ఈ టాబ్లెట్స్ అనేవి గ్రేట్ రెమెడీగా పనిచేస్తాయి.విటమిన్ ఈ అప్లై చేయడం వల్ల పెదాలు మృదువుగా మారతాయి. గులాబీ నీళ్లను ప్రతిరోజూ పెదాలకు రాసుకోవడం వల్ల లేత గులాబీ రంగులోకి మారతాయి. పెదాలకు లిప్బామ్ ఎంచుకునేటప్పుడు ఎస్పీఎఫ్ 30 ఉండేలా చూసుకోవాలి. దీనిని రెగ్యులర్గా వాడటం వల్ల మీ పెదాలు అందంగా మెరుస్తాయి. పెదవులు పగిలి బాధ పెడుతుంటేనేతిని కొద్దిగా వేడి చేసి, పెదవులపై మృదువుగా పూయాలి. ఇరవై నిమిషాల పాటు అలానే ఉంచి, గోరువెచ్చని నీటితో కడగాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల సమస్య తగ్గిపోతుంది. స్ట్రాబెర్రీని పేస్ట్లా చేసి, అందులో కాస్త పాల క్రీమ్ వేసి కలపాలి. దీన్ని పడుకోబోయేముందు పెదవులకు అప్లై చేసి, ఉదయాన్నే శుభ్రంగా కడుక్కోవాలి. నల్లని పెదవులు ఉన్నవారు తరచూ ఇలా చేస్తూ ఉంటే... నలుపు పోయి, పెదవులు గులాబీ రంగులోకి మారతాయి -
క్షణాల్లో అందంగా మెరిసిపోవచ్చు.. ఈ ఫేస్ప్యాక్ వేసుకోండి
అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? దీనికోసం వేలకు వేలు ఖర్చు పెట్టి మరీ ట్రీట్మెంట్లు, ఫేస్క్రీములు కొంటుంటారు. అయితే ఇంట్లోనే దొరికే వస్తువులతో ఫేషియల్ లాంటి గ్లోను సొంతం చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం. ►మెటిమలు, నల్లమచ్చలు పోవాలంటే... ఒక స్పూను నిమ్మరసంలో అంతే మోతాదులో తేనె కలిపి ముఖానికి రాయాలి. పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. పొడి చర్మం అయితే నిమ్మరసం బదులు కీరదోస రసం కలుపుకోవచ్చు. ► ఇక లేత కొబ్బరితో ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం చాలా నిగారింపును సంతరించుకుంటుంది. లేత కొబ్బరి తో వేసుకునే ఫేస్ ప్యాక్ స్కిన్టోన్ను రెట్టింపు చేస్తుంది. ► కొంచెం నిమ్మరసాన్ని తేనెతో కలిపి ముఖానికి అప్లై చేయండి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటిలో కడగాలి. ఇది చర్మంలోని తేమను పెంచడమే కాకుండా, ఈ మాస్క్ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. ► కొద్దిగా కాఫీ పౌడర్, కొబ్బరి నూనెను సమపాళ్లలో తీసుకొని అందులో ఒక చెంచా చక్కెర వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేయండి. ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడమే కాకుండా మృదువుగా మారుస్తుంది, చర్మం తాజాగా కనిపిస్తుంది. ► ఒక చెంచా తేనెను పెరుగుతో కలిపి ముఖానికి అప్లై చేసి, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మం కోల్పోయిన తేమను తిరిగి తెస్తుంది. ►చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంటే... రాత్రి పడుకునే ముందు స్వచ్ఛమైన నెయ్యిని ముఖానికి రాయాలి. ఎగ్ ప్యాక్ కూడా ప్రయత్నించవచ్చు. -
ఎంత రుద్దినా ఉల్లి వాసన పోవడం లేదా? ఇలా చేయండి
ఇంటిప్స్: ►రెండు టేబుల్ స్పూన్ల కర్బూజా గుజ్జులో టీస్పూను నిమ్మరసం, టేబుల్ స్పూను శనగ పిండి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి మర్దన చేయాలి. ఇరవై నిమిషాలు ఆరాక చల్లటి నీటితో కడిగేయాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే.. చర్మం మీద పేరుకుపోయిన మృతకణాలు, ట్యాన్ తొలగి చర్మం మృదువుగా, కాంతిమంతంగా మారుతుంది. ► కెచప్లో కొద్దిగా అయోడిన్ వేసి కలపాలి. అయోడిన్ వేసిన తరువాత కెచప్ రంగు మారితే పాడైపోయినట్టు. అంతేగాక ఇతర రసాయనాలు కలిసిన కల్తీ కెచప్ మాత్రమే ఇలా రంగు మారుతుంది. ► చీజ్ ముక్కను మంట దగ్గర పెట్టినప్పుడు మండితే చీజ్ నకిలీది. ఇలా కాకుండా నిప్పు సెగకు చీజ్ కరిగితే స్వచ్ఛంగా ఉన్నట్టు. ► నిమ్మకాయలను ముప్పైసెకన్ల పాటు మైక్రోవేవ్లో పెట్టి, ఆ తరువాత పిండితే రసం బాగా వస్తుంది. ► కేక్ మిగిలిపోయినప్పుడు అంచులకిరువైపులా బ్రెడ్స్లైసులను పెట్టాలి. స్లైసులు పడిపోకుండా టూత్ పిక్ గుచ్చి, రిఫ్రిజిరేటర్లో పెడితే కేక్ పాడవకుండా తాజాగా ఉంటుంది. ► బ్రెడ్ లేదా బిస్కెట్స్ను పాలల్లో ముంచుకుని తినేటప్పుడు...చేతితో కాకుండా... ఫోర్క్తో పట్టుకుని ముంచితే పాలల్లో చక్కగా మునిగి మరింత రుచిగా ఉంటాయి. ► బాస్కెట్లో అడుగున కొన్ని పేపర్ ముక్కలు వేసి బంగాళదుంపలు వేయాలి. దుంపలపైన మరికొన్ని పేపర్ ముక్కలు వేసి నిల్వచేస్తే ΄ాడవకుండా తాజాగా ఉంటాయి. ► మిగిలిపోయిన నిమ్మచెక్కలకు ఉప్పు అద్ది ఉంచితే పాడవకుండా తాజాగా ఉంటాయి. ► మిగిలిపోయిన బ్రెడ్ ప్యాకెట్ను క్లాత్ బ్యాగ్లో ఉంచితే బూజు పట్టకుండా తాజాగా ఉంటుంది. ► ఉల్లిపాయను ముక్కలు తరిగిన తరువాత చేతులు ఉల్లి వాసన వస్తుంటే... కొద్దిగా టూత్ పేస్టుని తీసుకుని దానితో చేతులను రుద్ది కడగాలి. ఇలాచేస్తే ఉల్లిఘాటు వదిలిపోతుంది. ► పేపర్ బ్యాగ్కు రంధ్రాలు చేసి లోపల వెల్లుల్లిని పెడితే నెలల పాటు నిల్వ ఉంటుంది. -
కేక్ మిగిలిపోయిందా? ఇలా చేస్తే పాడవకుండా ఉంటుంది
సెలెరీని సిల్వర్ ఫాయిల్లో చుట్టి రిఫ్రిజిరేటర్లో పెడితే రెండు మూడు వారాల పాటు తాజాగా ఉంటుంది. చీమలు ఎక్కువగా ఉన్న చోట దాల్చిన చెక్క పొడిని నీటితో కలిపి స్ప్రే చేయడంతో చీమలు పారిపోతాయి. కాఫీ పౌడర్ లేదా మిరియాల పొడి నీళ్లలో కలిపి ఆ ప్రాంతంలో చల్లినా చీమలు రాకుండా ఉంటాయి. వేపుళ్ళు చేస్తున్నప్పుడు చెంచా వెనిగర్ చేర్చితే కూరగాయలు నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటాయి. వెల్లుల్లి రెబ్బలను నీటిలో నానబెట్టి తీస్తే త్వరగా పొట్టు వదిలిపోతుంది. మిగిలిపోయిన పాలను ఐస్ట్రేలో పోసి ఫ్రీజర్లో పెట్టాలి. గడ్డకట్టిన పాల బిళ్లలను టీ కాఫీలలో వాడుకోవచ్చు. ఒక్కోసారి క్యారట్పైన ఎక్కువగా మట్టిపేరుకుపోతుంటుంది. అటువంటప్పుడు .. స్టీల్ స్క్రబర్తో రుద్ది కడిగితే, సులభంగా మట్టి వదులుతుంది. టొమాటోలను పసుపు నీళ్లల్లో వేసి పదినిమిషాలు ఉంచాలి. తరువాత కడిగి తుడిచిపెట్టుకుంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. కేక్ మిగిలిపోయినప్పుడు అంచులకిరువైపులా బ్రెడ్స్లైసులను పెట్టాలి. స్లైసులు పడిపోకుండా టూత్ పిక్ గుచ్చి, రిఫ్రిజిరేటర్లో పెడితే కేక్ పాడవకుండా తాజాగా ఉంటుంది. -
కొబ్బరి నూనెలో ఇవి కలిపి ముఖానికి రాసుకుంటే.. ముఖం వెలిగిపోతుంది
సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్ ►కొబ్బరినూనె మంచి సౌందర్య సాధనంగా పనిచేస్తుంది. సెలబ్రెటీలు చాలామంది తమ చర్మాన్ని అందంగా... ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కొబ్బరినూనెను విరివిగా వాడుతుంటారు. కొబ్బరినూనెలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పొడి చర్మానికి ఔషధంలా పనిచేస్తాయి. కొబ్బరినూనె చర్మానికి సహజసిద్ధమెన మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. ► టీ స్పూను కొబ్బరినూనెలో అర టీస్పూను పెరుగు, టీస్పూను ఓట్స్ పొడి వేసి మెత్తని పేస్టులా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి పదిహేను నిమిషాలపాటు ఆరనివ్వాలి. పూర్తిగా ఆరాక గుండ్రంగా మర్దన చేస్తూ గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖచర్మానికి తేమ అంది ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ► రెండు టీస్పూన్ల కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం, టీ స్పూను వంటసోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముక్కు, గడ్డం, నుదురు వంటి బ్లాక్హెడ్స్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో పట్టించి పది నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ బ్లాక్హెడ్స్ను తొలగించడమేగాక, చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది. ఫలితంగా చర్మరంధ్రాల్లో పేరుకున్న అధిక జిడ్డు, దుమ్మూ ధూళీ పోయి చర్మం చక్కని నిగారింపుని సంతరించుకుంటుంది. ► ముఖం మీద నల్లమచ్చలు, కంటిచుట్టూ ఏర్పడిన నల్లని వలయాలపై కొబ్బరినూనెతో క్రమం తప్పకుండా మర్దన చేస్తుంటే .. మచ్చలు తగ్గుముఖం పడతాయి. -
ఇంట్లోనే దొరికే వస్తువులతో ఫేస్ప్యాక్.. ఇన్స్టంట్ గ్లో ఖాయం
బ్యూటీ టిప్స్ ఎండకు తిరిగి రావడం వల్ల కొందరి ముఖం కమిలిపోయినట్లు కనిపిస్తూ నల్లగా మారుతుంది. వెంటనే వారి ముఖం కాంతిమంతంగా మారాలంటే ఒక టీస్పూన్ శనగపిండిలో కొద్దిగా టమాటో రసం, పెరుగు, చిటికెడు పసుపు కలిపి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత ముఖాన్ని చన్నీళ్లతో కడుక్కుంటే ఇన్స్టంట్ గ్లో వస్తుంది. జిడ్డు చర్మం, మొటిమలతో బాధ పడేవారు ఓ పాత్రలో 10-12 వేప ఆకులు తీసుకొని, వాటికి కొద్దిగా పసుపు కలిపి పేస్ట్లా చేసుకోవాలి. దాన్ని రెండు రోజులకోసారి ప్యాక్లా వేసుకుంటే సరి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం మెరిసిపోతుంది. పాలల్లో కొద్దిగా ఓట్స్ వేసి ఉడికించాలి. దీన్ని మెత్తగా పేస్ట్లా చేసుకొని తర్వాత ఇందులో కాస్త పెరుగు, తేనే కలిపి ప్యాక్లా వేసుకోండి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల జిడ్డు వదిలిపోయి చర్మం తాజాగా మెరుస్తుంది. అరకప్పు కీరదోస గుజ్జు తీసుకుని అందులో కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేయండి. కీరాదోస పిగ్మెంటేషన్ సమస్యను దూరం చేస్తుంది. సీజనల్ ఫ్రూట్స్తో కూడా చక్కగా పేస్ప్యాక్ ట్రై చేయొచ్చు. బొప్పాయి ఇందుకు బెస్ట్ ఆప్షన్. కాస్తంత బొప్పాయి గుజ్జులో రోజ్వాటర్ కలిపి రాసుకుంటే చర్మం కొత్త నిగారింపును సంతరించుకుంటుంది. -
జుట్టు సౌందర్యానికి మామిడి ఆకులు.. ఈ విషయాలు మీకు తెలుసా?
నోరూరించే మామిడి పళ్లు తినాలంటే వేసవి వచ్చేవరకు ఎదురు చూడక తప్పదు. అయితే మామిడి ఆకులు కోసుకోవడానికి ఎప్పుడూ ఇబ్బంది ఉండదు. అందుకే వివాహాది శుభకార్యాలు, పండుగలు, పర్వదినాలలో గుమ్మాలకు మామిడాకు తోరణాలు కట్టుకుంటూనే ఉన్నాం. ఇంతేనా? జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి, ఆరోగ్య సంరక్షణకు కూడా మామిడి ఆకులు ఉపయోగపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. మామిడి ఆకులలో జుట్టు కుదుళ్లు బలంగా ఉండటానికి అవసరం అయ్యే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే ఎ, ఇ, సి విటమిన్లు ఉండటం వల్ల ఇది సాధ్యం అవుతుందని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. మామిడాకులలో పైన చెప్పుకున్న విటమిన్లతో పాటు యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉండటం వల్ల వీటిని ఉపయోగించిన వారికి జుట్టు బాగా పెరుగుతుంది. అంతేకాదు... తలపై మామిడి ఆకులను ఉంచి, వాటిని కప్పుతూ ఏదైనా పలుచని క్లాత్ను కట్టుకోవడం ద్వారా తలనొప్పి తగ్గుతుంది. తలలో రక్తనాళాలు దెబ్బతినకుండా ఉంటాయి. రక్త ప్రసరణ పెరుగుతుంది. మామిడి ఆకుల్లో ఉండే సహజ తైలాలు జుట్టు సంరక్షణకు ఉపకరిస్తాయి. మామిడి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు నెరవకుండా, బలహీనంగా మారకుండా ఉంచుతాయి. మామిడి ఆకులను ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్ఫలితాలూ లేకుండా జుట్టు నల్లగా, ఒత్తుగా తయారవుతుంది. మామిడి ఆకులలో ఉండే ఫ్లేవనాయిడ్లు జుట్టును సహజంగా నల్లగా మార్చడంలో , నిగారింపు వచ్చేలా చేయడంలో సహాయపడతాయి. ఎలా ఉపయోగించాలి? ►తాజా మామిడి ఆకులు కొన్ని తీసుకుని కాసిని నీళ్లు చేర్చి మిక్సీలో వేసుకుని లేదా రుబ్బుకుని పేస్ట్లా చేసుకోవాలి. దానికి పెరుగు లేదా ఆలివ్ నూనెను చేర్చాలి. ఈ పేస్ట్ను చివళ్ల నుంచి కుదుళ్ల వరకు పట్టించాలి. ఆరేదాకా ఉంచి, ఆ తరవాత మైల్డ్ షాంపూతో స్నానం చేయాలి. ►మామిడి ఆకులను ఎండలో ఎండబెట్టి మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. తరువాత పేస్ట్ లా చేసుకుని బ్లాక్ టీని కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. ఇలా చేస్తే జుట్టుకు మంచి పోషణ అందటంతో పాటు నల్లగా మారుతుంది. ►మధుమేహంతో బాధపడేవారు కొన్ని మామిడి ఆకులను శుభ్రంగా కడిగి నీళ్లలో ఉడకబెట్టి కషాయంలా కాచుకోవాలి. గోరువెచ్చగా అయ్యాక వడపోసి తాగాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు చేయడం వల్ల మధుమేహం అదుపులోకి వస్తుంది. -
రోజూ చప్పట్లు కొట్టడం వల్ల మెమొరి పవర్ పెరుగుతుందా?
ఎవరైనా ఏదైనా మంచి పని చేసినప్పుడు, వారు చేసిన పని హర్షణీయంగా... ప్రశంసార్హంగా అనిపించినప్పుడు వారిని మెచ్చుకుంటూ చప్పట్లు కొడతాం.. అయితే అలా చప్పట్లు కొట్టడం వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటికే ‘క్లాపింగ్ థెరపీ’ అని పేరు. చప్పట్లు కొట్టడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో చూద్దాం... ►సాధారణంగా ఎవరినైనా అభినందిస్తున్నప్పుడు చప్పట్లు కొడతాం. అది ప్రశంసలో ఒక భాగం. కానీ చప్పట్లు కొట్టడం వెనుక చాలామందికి తెలియని ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయి. ‘లాఫింగ్ థెరపీ’ మాదిరిగానే ‘క్లాపింగ్ థెరపీ’ కూడా ఇప్పుడు ఫేమస్ అయ్యింది. క్లాపింగ్ థెరపీ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటే.. ►మనిషి శరీరంలో ప్రతి అవయవం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. అరచేతులు రక్తనాళాలు, నరాల చివరలకు కేంద్రం. మీరు వాటిని ఉత్తేజపరిస్తే మీ ఆరోగ్య సమస్యలు నయం అవుతాయి. ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. అయితే చప్పట్లు కొట్టడం వల్లే ఆరోగ్యం విషయంలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ►చప్పట్లు కొట్టడం ఆందోళనను నియంత్రించడానికి సులభమైన మార్గం. చప్పట్లు కొట్టడం ప్రారంభించగానే మెదడుకి సానుకూల సంకేతాలు వెళ్తాయి. ఇది నిరాశను పోగొడుతుంది. సంతోషకరమైన హార్మోన్లను పెంచడానికి రోజువారి వ్యాయామంలో చప్పట్లు కొట్టడాన్ని కూడా భాగంగా చేసుకోవాలి. ►కరతాళ ధ్వనులు చేయడం వల్ల రక్తపోటు స్ధాయులు నియంత్రణలో ఉంటాయి. తద్వారా గుండె ఆరోగ్యం బాగుంటుంది. చప్పట్లు కొట్టినపుడు శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది అనేక గుండె సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు, చప్పట్లు కొట్టడంతో శ్వాస సమస్యలు కూడా తగ్గుతాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ►చప్పట్లు కొట్టడం వల్ల తెల్ల కణాల ఉత్పత్తి పెరిగి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని రుజువైంది. ఫలితంగా కాలానుగుణంగా వచ్చే అనేక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. పిల్లలు క్రమం తప్పకుండా చప్పట్లు కొట్టడం వల్ల వారిలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగవడంతో పాటు వారి చేతి రాతలో తప్పులు దొర్లకుండా ఉంటాయి. ► చప్పట్లు కొట్టడం వల్ల జుట్టు రాలే సమస్య అదుపులోకి వస్తుంది. అయితే కొన్ని ప్రత్యేకమైన ఫలితాలను ఆశిస్తూ చప్పట్లు కొట్టే ముందు అరచేతులకు కొద్దిగా ఆవ నూనె లేదా కొబ్బరి నూనె రాసుకోవడం మెరుగైన ఫలితాన్ని ఇస్తుంది. అరచేతుల్ని నిటారుగా ఉంచి.. చేతివేళ్లు ఒకదానికొకటి తాకేలా ఉంచి చప్పట్లు కొట్టాలి. మంచి ఫలితాల కోసం ఉదయం పూట కొట్టడం మంచిదట. లేదంటే ఎవరి వీలును బట్టి వారు ఈ క్లాపింగ్ థెరపీ ని అనుసరించవచ్చు. -
టిప్స్: ఇలా చేస్తే ఎక్కిళ్లు వెంటనే తగ్గిపోతాయి
►కొంతమందికి నిద్రలేవడంతోనే విపరీతంగా తుమ్ములు వస్తుంటాయి. అలాంటి వారు తులసి, పుదీనా, రెండు మిరియపు గింజలు నిమ్మరసం కలిపి కషాయం లాగా చేసుకొని రోజూ ఒక కప్పు కషాయం తీసుకుంటుంటే నెలరోజుల్లో సమస్య తీరిపోతుంది. ఇవి అందుబాటులో లేనపుడు తుమ్ములు వస్తుంటే కొత్తిమీర వాసన చూస్తూ ఉండండి . తుమ్ములు ఆగుతాయి. ఇది తాత్కాలికంగా పనిచేస్తుంది. పైన చెప్పిన కషాయం పూర్తి ఉపశమనం ఇస్తుంది. ►వామును దోరగా వేయించి మెత్తని పొడిగా నూరి ఉదయ, సాయంకాలాలు భోజనానికి అరచెంచాడు పుచ్చుకోవాలి.ఇంగువను దోరగా వేయించి, పొడి చేసుకొని పావుచెంచాడు మోతాదుగా వేడి అన్నంతో, మొదటి ముద్దతో కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు బాధించదు. ►ఎక్కిళ్ళు ఎక్కువగా వచ్చే వాళ్ళు పావుచెంచా శొంఠిపొడి, పావు చెంచా కరక్కాయ పొడి రెండింటిని ఒక కప్పు వేడినీటిలో కలిపి రెండుపూటలా సేవిస్తూ ఉంటే దగ్గు, దమ్ము, ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. -
చలికాలంలో ఇలా చేస్తే చర్మం మృదువుగా, నిగనిగలాడుతుంది
ప్రస్తుతం వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. దీని ప్రభావం మన చర్మంపై కూడా కనిపిస్తోంది. మార్పు, వాతావరణం కారణంగా, చర్మం పగుళ్లు మొదలవుతుంది. సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే కొన్ని రోజుల తర్వాత అది మరింత తీవ్రమవుతుంది. ఈ సమస్యను నివారించడానికి మన పెద్దలు కొన్ని గృహ చిట్కాలను పాటించేవారు. అవేమిటో తెలుసుకుందాం. పూర్వం చలికాలం రాగానే పెద్దవాళ్లు వంటికి వెన్నపూస లేదా నువ్వులనూనెను రాసుకుని ఎండలో కాసేపు నిలబడేవారు. దాంతో చర్మానికి తగిన పోషకాలు అంది తేమను కోల్పోకుండా మృదువుగా ఉండేది. ఇప్పుడు కూడా మనం అలా చేయవచ్చు. వాటితో పాటు మరికొన్ని చిట్కాలు చూద్దాం. చర్మానికి కలబంద: అలోవెరా జెల్ అంటే కలబంద గుజ్జు చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది ఎల్లప్పుడూ చర్మానికి మంచి నేస్తం వంటిది. అలోవెరాలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వల్ల ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలోనూ, గాయాలను నయం చేయడానికీ సహాయపడుతుంది. దీనికోసం చేయవలసిందల్లా రాత్రిపూట కాసింత కలబంద గుజ్జు... అదేనండీ... అలోవెరా జెల్తో ముఖానికి, శరీరానికి సున్నితంగా మసాజ్ చేస్తే సరి. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరినూనె: తలకే కాదు. ఒంటికి కూడా... కొబ్బరినూనెను కేవలం తలకు మాత్రమే రాసుకునే తైలంగా చూస్తారు చాలామంది. అయితే కొబ్బరి నూనె చర్మానికి కూడా చాలా ప్రయోజనకరమైనది. స్వచ్ఛమైన కొబ్బరినూనెను తీసుకుని ఒంటికి, ముఖానికి సున్నితంగా మసాజ్ చేయాలి. పడుకునే ముందు లేదా స్నానానికి అరగంట ముందు ఇలా చేస్తే చికాకు, అసౌకర్యం లేకుండా ఉంటుంది. అదేవిధంగా రోజూ పడుకునే ముందు స్వచ్ఛమైన నేతిని చర్మానికి రాసుకుంటూ ఉంటే కొద్దిరోజుల్లోనే చర్మం కోమలంగా... మృదువుగా నిగారింపును సంతరించుకుంటుంది. ఆవనూనె: పొడి బారిన చర్మాన్ని తిరిగి కాంతిమంతంగా మార్చుకోవడానికి ఆవనూనెను చర్మంపై అప్లై చేయడం సర్వసాధారణం. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉండడంతో పాటు చర్మ సమస్యలు ఏవీ రావు. పిల్లలకు రోజూ బేబీ ఆయిల్ లేదా వెన్న, నెయ్యి లేదా నువ్వులనూనెను ఒంటికి రాసి ఎండలో ఆరిన తర్వాత స్నానం చేయిస్తే చర్మం మృదువుగా ఉండడంతో పాటు ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. చలికాలంలో ఇలా చేయడం మంచిది. -
ఈ నూనె రాస్తే జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది
సమస్యలు తగ్గించే ఆమ్లా ఆయిల్ మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను వేడిచేయాలి. నూనె చక్కగా వేడెక్కిన తరువాత రెండు టేబుల్ స్పూన్ల ఉసిరిపొడి వేసి కలపాలి. సన్నని మంటమీద మరో ఐదు నిమిషాలు మరగనిచ్చి దించేయాలి. నూనె చల్లారాక గాజుసీసాలో వేసి నిల్వచేసుకోవాలి. రాత్రి పడుకునేముందు ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి మర్దన చేసుకోవాలి. వారంలో కనీసం నాలుగుసార్లు ఈ నూనెతో మర్దన చేయడం వల్ల జుట్టు సమస్యలు తగ్గుముఖం పట్టి ఒత్తుగా పెరుగుతుంది. మృదువుగా మార్చే క్రీమ్ టేబుల్ స్పూను పెట్రోలియం జెల్లీలో టేబుల్ స్పూను కొబ్బరి నూనె వేసి, టేబుల్ స్పూను గ్లిజరిన్, ఐదారు చుక్కల నిమ్మరసం వేసి క్రీమ్లా మారేంతవరకు బాగా కలపాలి. తరువాత ఈ క్రీమ్ను పగిలిన పాదాలకు రాసి మర్దన చేయాలి. రోజుకు రెండుసార్లు ఈ క్రీమ్ను అరికాళ్లకు రాస్తే పగుళ్లు తగ్గి పాదాలు కోమలంగా, మృదువుగా మారతాయి. -
భోజనం తర్వాత సోంపు తింటే ఏమవుతుందో తెలుసా?
►రాత్రి పడుకునేముందు గ్లాసు నీళ్లలో టీస్పూను మెంతులు వేసి నానపెట్టాలి. ఉదయం పరగడుపున ఈ నీళ్లను తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కీళ్లనొప్పులనుంచి ఉపశమనం కలగడంతో΄ాటు, శరీర బరువు అదుపులో ఉంటుంది. రోజూ మెంతుల నీళ్లు తాగడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. ►రాత్రి పూట నిద్రకు ముందు ఒక గ్లాస్ చల్లని పాలను తాగాలి. పాలను బాగా మరిగించి అనంతరం వాటిని చల్లార్చి కాసేపు ఫ్రిజ్లో ఉంచాలి. అనంతరం వాటిని నిద్రకు ముందు తాగాలి. ఇలా 3 రోజుల పాటు వరుసగా చేస్తే ఎసిడిటీ తగ్గిపోతుంది. ►రోజూ మధ్యాహ్నం, రాత్రి భోజనం అనంతరం కాసిని సోంపు గింజలను నోట్లో వేసుకుని బాగా నమిలి మింగాలి. ఇలా చేస్తుంటే జీర్ణ సమస్యలు అన్నీ తగ్గిపోతాయి. ముఖ్యంగా కడుపులో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. -
డైట్లో అవి పాటిస్తే త్వరగా బరువు తగ్గొచ్చు
అధిక బరువు నుంచి విముక్తి పొందేందుకు చాలామంది చాలారకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ విఫలమౌతుంటారు. వాకింగ్, డైటింగ్, వ్యాయామం ... ఇలా చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే రోజూ నిర్ణీత సమయంలో వ్యాయామంతో పాటు డైట్లో కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉండేట్టు చూసుకుంటే బరువు అదుపులో ఉంటుంది. బరువు తగ్గేందుకు కూరగాయలు చక్కగా సాయం చేస్తాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. స్థూలకాయాన్ని నియంత్రణలో ఉంచకపోతే గుండె వ్యాధులు, మధుమేహం, రక్తపోటు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు వెంటాడుతాయి. శరీరాన్ని డొల్లగా మార్చేస్తాయి. రోజూ తగినంత నిద్ర, నీళ్లు, సరైన డైట్ వల్ల స్థూలకాయం రాకుండా ఉంటుంది. -
ఇంటి గోడలపై మచ్చలు పోవడం లేదా? ఇలా క్లీన్ చేయండి
ఇంటి గోడలపై మరకలు పడితే వదిలించడం కాస్త కష్టమే. కొన్నిసార్లు అయితే వీటిని లగించడానికి ఎంతో కష్టపడాలి, అయిన సరిగ్గా వదలవు, కొన్ని సార్లు గోడు రంగు కూడా ఊడిపోతూ ఉంటుంది.కొన్నిసార్లు ఈ మరకలు పోవాలంటే మళ్లీ పెయింటింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ మరకలు పడ్డప్పుడల్లా పేయింటింగ్ వేయలేం కదా.ఇది ఖర్చుతో కూడుకున్న పని. అలాంటప్పుడు ఖర్చులేకుండా సింపుల్ చిట్కాతో మరకల్ని పోగొట్టి కొత్త ఇంటిలా మెరిసేలా చేయొచ్చు. అదేలాగో ఇప్పుడు చూద్దాం. హైడ్రోజన్ పెరాక్సైడ్తో ఎలాంటి మొండి మరకల్ని కూడా ఈజీగా పోగొట్టొచ్చు. దీనికోసం ఏం చేయాలంటే.. ►హైడ్రోజన్ పెరాక్సైడ్ను బేకింగ్ సోడాతో 1:1 నిష్పత్తిలో కలపండి. ఈ మిశ్రమాన్ని స్పాంజ్ లేదా మైక్రోఫైబర్ క్లాత్ని ఉపయోగించి గోడలపై అప్లై చేసి కాసేపు అలాగే వదిలేయండి. కాసేపటి తర్వాత తడి గుడ్డతో తుడిస్తే గోడలపై ఎలాంటి మరకల్ని వదిలిస్తుంది. ► బేకింగ్ సోడా స్క్రబ్బింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది.పెరాక్సైడ్ బ్లీచింగ్లా పనిచేసి మరకల్ని సులభంగా పోగొడుతుంది. ఒకవేళ గోడలపై మరకలు లేకపోయినా ఈ కెమికల్ను స్ప్రే చేస్తే దుమ్ము, దూళి కూడా క్షణాల్లో వదలగొడుతుంది. -
మిగిలిపోయిన అన్నం, కూరల్ని మొక్కలకు పడేయండి
అన్నం, కూరలు మిగిలిపోతే పడేస్తుంటారు. అయితే ఆ పడేసేదేదో మొక్కల దగ్గర పడేస్తే వాటికి కావాల్సిన పోషకాలు అంది, అవి ఏపుగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ►మిగిలిపోయిన పప్పులో నీళ్లు కలిపి పలుచగా చేయాలి. ఈ పప్పు నీళ్లను మొక్కలకు పోయాలి. మజ్జిగ మరీ పుల్లగా అయితే తాగలేము. ఈ పుల్లటి మజ్జిగను బకెట్ నీళ్లల్లో పోసి కలపాలి. ఈ నీటిని మొక్కలకు పోయాలి. ► మిగిలిపోయిన అన్నాన్ని మెత్తగా గ్రైండ్ చేసి నీటిలో కలపాలి. ఈ నీటిని మొక్కలకు పోయాలి. బియ్యం, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు కడిగిన నీటిని సింక్లో పోయకుండా మొక్కలకు పోస్తే మంచిది. ► ఉల్లిపాయ తొక్కలు, అరటి తొక్కలను పడేయకుండా నీటిలో నానబెట్టాలి. పదిగంటల తరువాత ఈ నీటిని మొక్కలకు పోయాలి. ఈ నీటి నుంచి నైట్రోజన్, పొటాషియం, ఫాస్పరస్లు మొక్కలకు పుష్కలంగా అందుతాయి. చూశారుగా... మిగిలిపోయినవి మొక్కలకు ఎంత మేలు చేస్తున్నాయో. ఇంకెందుకు ఆలస్యం మీ గార్డెన్ మరింత పచ్చగా కళకళలాడించేందుకు ప్రయత్నించండి. -
టీనేజర్స్ని ఇబ్బంది పెట్టే మొటిమల సమస్యకు ఇలా చెక్ పెట్టొచ్చు
మొటిమలు.. చాలామంది టీనేజర్స్ని ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఇది మొదటి స్థానంలో ఉంటుంది.కాలుష్యం, హార్మోన్లలో మార్పులు,పోషకాహార లోపాలు వంటి కారణాల వల్ల ముఖంపై మొటిమలు వస్తుంటాయి. అయితే సమస్యకు నివారించేందుకు ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు అవి మరింత ఎక్కువై ఇబ్బంది పెడుతుంటాయి. వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టే కంటే మన ఇంట్లోనే దొరికే నేచురల్ ఫేస్ప్యాక్తో మొటిమలకు చెక్ పెట్టొచ్చు. అదెలాగో చూద్దామా. ►బీట్రూట్ గుజ్జులో రెండు చెంచాల ముల్తానీ మట్టీ, చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్లా అప్లై చేయాలి. అరంగటపాటు ఆరనిచ్చి.. చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలూ, నల్లమచ్చలు తొలగిపోయి చర్మం నిగనిగలాడుతుంది. ► జాజికాయ, మిరియాలు, మంచి గంధం..ఈ మూడింటిని తీసుకుని ఒక్కొక్కటి విడివిడిగా ఒక రాయి మీద కొంచెం కొంచెం నీళ్లు జల్లుకుంటూ అరగదీయాలి. అలా అరగదీయగా వచ్చిన మూడు రకాల పేస్టులను ఒక చిన్న కప్పులోకి తీసుకుని ఒకదానితో ఒకటి బాగా కలపాలి. ► ఆ మిశ్రమాన్ని పడుకునే ముందు మొటిమలు, మచ్చలు ఉన్న చోట రాసుకుని నిద్రపోవాలి. మరునాడు పొద్దున్నే లేచి ముఖాన్ని గోరు వెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా మూడు నుండి ఏడు రోజుల వరకు చేసినట్లయితే ఎలాంటి మొటిమలు అయినా, మొండి మచ్చలయినా సులభంగా తొలగిపోతాయి. ► రెండు స్పూన్ల పెరుగులో రెండు టీస్పూన్ల బీట్రూట్ రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. అరగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటే.. పింపుల్స్, వాటి తాలూకూ మచ్చలు తొలగుతాయి -
బిర్యానీ వండేటప్పుడు ఈ చిట్కా పాటించండి.. టేస్ట్ బావుంటుంది
వంటింటి చిట్కాలు ► అరకప్పు వంటసోడాలో నీళ్లు పోసి పేస్టులా కలపా. ఈ పేస్టుని అవెన్లో లోపలి భాగంలో రాయాలి. హీటింగ్ కాయిల్స్, ఫ్యాన్ బ్లేడ్స్, లైట్స్ మీద రాయకూడదు. కింద, సైడు గోడలకు రాసి రాత్రంతా ఉంచేయాలి. ఉదయాన్నే కాటన్ వస్త్రంతో వంటసోడాని తుడిచేయాలి. సోడా పూర్తిగా పోయిన తరువాత నీటిలో కలిపిన వెనిగర్తో మరోసారి తుడవాలి. ఇలా చేస్తే అవెన్లో పేరుకుపోయిన మురికి, అవెన్ గోడలకు పడ్డ మచ్చలూ పోయి కొత్త దానిలా మెరుస్తుంది. ► పచ్చిమిరపకాయల్ని కాసింత పసుపుతో చేర్చి సీసాలో నిలువ చేస్తే ఎరుపు రంగుకు మారకుండా ఉంటాయి. ► మైదా పిండితో చిప్స్ చేసేటప్పుడు బంగాళాదుంపలు ఉడికించి పిండిలో కలిపితే చిప్స్ కరకరలాడతాయి. ► అన్నం మెత్తగా ఉడికినప్పుడు క్యారెట్ను అత్యంత సన్నగా తరిగి అన్నంలో కలుపుకోవాలి.అప్పుడు అన్నం మరీ మెత్తగా అనిపించదు. ► పకోడి చేసేప్పుడు చేసేప్పుడు పిండిలో కాస్త నూనే మరియు చిటికెడు వంట సోడ కలిపితే పకోడిలు క్రిస్పీగా వస్తాయి. ► బిర్యానీ వండేటప్పుడు ఒక నిమ్మకాయరసం పిండితే అన్నం పొడిపొడిగా ఉండటమే కాకుండా రుచిగానూ ఉంటుంది. ► వడియాలు నిల్వ ఉంచే డబ్బాలో కాస్త ఇంగువ ఒక గుడ్డలో కట్టి వేస్తే వాటిని వేయించే సమయంలో మంచి వాసన రుచి ఉంటాయి. ► రసం తీసేసిన నిమ్మకాయలను, సన్నని ముక్కలుగా తరిగి, ఆవిరి మీద ఉడికించి, దానికి కొంచం ఉప్పు కారం, బెల్లం వేసి పోపు వెయ్యండి. నోరూరించే ఇన్స్టంట్ నిమ్మకాయ పచ్చడి రెడీ. -
పార్టీకి వెళుతున్నారా? ఈ ఫేస్ప్యాక్తో ఇన్స్టంట్ గ్లో
ఇన్స్టంట్ గ్లో ప్యాక్ ఎంత మంచి డ్రెస్, దానికి తగ్గ యాక్సెసరీస్ ధరించినా, ముఖం ప్రకాశవంతంగా ఉంటేనే ఆకర్షణీయంగా ఉంటుంది. క్షణాల్లో మెరుపులీనేలా కనిపించే ఇన్స్టంట్ గ్లో ప్యాక్ను ప్రయత్నించి చక్కగా మెరిసిపోండి. ►రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిలో టీస్పూను తేనె, రెండు టేబుల్ స్పూన్ల చల్లటి పాలు పోసి పేస్టులా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకుని రెండు నిమిషాలు మర్దన చేయాలి. ఆరిన తరువాత నీటితో కడిగేయాలి. తడిలేకుండా తుడుచుకుని మాయిశ్చరైజర్ రాసుకుంటే ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. -
బట్టలపై మరకలు పడ్డాయా? సింపుల్గా ఇలా వదిలించుకోండి
బట్టలపై మరకలు పడ్డప్పుడు డ్రై క్లీనింగ్కి ఇద్దామంటే ఆ ధరకు కొత్తదే వస్తుందమే అనిపిస్తుంది. అయితే మరకలను తొలగించుకునేందుకు కొన్ని చిట్కాలున్నాయి. అవేమిటో చూద్దాం. ►మీ దుస్తులు మెరిసేలా చేయాలంటే ఆస్పిరిన్ మాత్రలు బాగా ఉపయోగపడతాయి. ఆస్పిరిన్లో ఉండే ఎసిటైల్సాలిసిలిక్ ఆమ్లం బట్టలపై పడిన మరకలను తొలగించేందుకు సాయం చేస్తుంది. ►తెల్లని దుస్తులను నాలుగైదు ఆస్పిరిన్ టాబ్లెట్లు వేసిన నీళ్ల బకెట్లో బాగా నానబెట్టండి. తరవాత బట్టల సబ్బుతో ఉతకడమో లేదా వాషింగ్ మెషీన్లో వేసి మామూలుగా ఉతికి జాడించి ఆరేస్తే సరి! ► రక్తపు మరకలను తొలగించడానికి.. ఆస్పిరిన్ను చల్లటి నీటిలో కరిగించి బట్టలను నానబెట్టండి. వేడినీటితో రక్తపు మరకలను తొలగించడానికి ప్రయత్నించవద్దు. ఇది ప్రోటీన్లు గడ్డకట్టడానికి కారణమవుతుంది. ఆ తరువాత మరకను తొలగించడం కష్టం అవుతుంది. చేస్తుంది. ► నూనె, గ్రీజు మరకలకు.. ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా కోయాలి. ఒక ముక్క మీద ఉప్పు వేసి మరకపై రుద్దాలి. ఇది నిమిషాల్లో బట్టలపై ఉన్న మరకలను తొలగిస్తుంది. ► వక్కపొడి, పాన్ మసాలా మరకలు పెరుగు లేదా మజ్జిగను మరక పడ్డ చోట ఉంచి పది నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత శుభ్రమైన నీటితో వస్త్రాన్ని కడగాలి. ఇది బట్టలపై ఉన్న మరకలను తొలగిస్తుంది. ► టీ–కాఫీ మరకలు టీ–కాఫీ మరకలు పడ్డప్పుడు ముందుగా గోరువెచ్చటి నీటిలో ఆ వస్త్రాన్ని పదిహేను నిమిషాలు ఉంచిన తర్వాత లిక్విడ్ డిటర్జెంట్లో నానబెట్టాలి. తర్వాత మరక పడ్డ చోట చేతితో రుద్దితే మరకలు తొలగుతాయి. ► టర్కీ టవళ్లు, దుప్పట్ల వంటి వాటిని బట్టలుతికే సోడా కలిపిన నీటిలో నానబెట్టి ఉతికితే త్వరగా శుభ్ర పడతాయి. -
బీట్రూట్ ఫేస్ప్యాక్.. ముఖం కాంతిమంతంగా మెరుస్తుంది
బ్యూటీ టిప్స్ ►బీట్ రూట్ తొక్కలు, కమలా తొక్కలను నీడలో ఆరబెట్టాలి. పెళపెళ విరిగేలా తొక్కలు ఎండిన తరువాత మెత్తగా పొడిచేయాలి. రెండు టేబుల్ స్పూన్ల ఈ పొడిలో రోజ్వాటర్ వేసి పేస్టులా కలపాలి. ఈ పేస్టుని ముఖానికి రాసి ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. తరువాత పదిహేను నిమిషాలు ఆరనిచ్చి చల్లటి నీటితో కడిగేయాలి. వారానికి రెండు మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖం కాంతిమంతంగా మెరుస్తుంది. ఈ ప్యాక్తో వచ్చే గ్లో ఎక్కువ రోజులు ముఖాన్ని అందంగా ఉంచుతుంది. ► చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో బీట్రూట్ ముందుంటుంది. మొటిమలని తగ్గిస్తుంది. మురికిని దూరం చేసి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది. ఇందులో పాలు కలిపి చేస్తాం. కాబట్టి, చర్మం మృదువుగా, మెరుస్తుంటుంది. ► పాలు, తేనె రెండింటి కలయిక ముఖ సహజ కాంతిని పెంచుతుంది. పాలలో ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ ఉంటుంది. ఇది చాలా ఎఫెక్టివ్ ఎక్స్ఫోలియేటింగ్ లక్షణాలని కలిగి చర్మంలోని మృతకణాలు, మలినాలను తొలగిస్తుంది. పాలలోని ఎమోలియెంట్, హైడ్రేటింగ్ గుణాలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు, మచ్చల్ని దూరం చేస్తుంది. ► పండిన బొప్పాయి, పుచ్చకాయ, బంగాళాదుంప, టొమాటో, కీర దోసకాయలు ఇలా వేటినైనా పేస్ట్గా చేసి.. దానిని 15 నిమిషాలు ఫ్రిజ్లో ఉంచండి. అనంతరం పేస్ట్ను అప్లై చేసి.. పేస్ట్ చర్మంలో కలిసిపోయే వరకు స్క్రబ్ చేయండి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. టాన్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. -
ఇలా చేస్తే మీ పాత సోఫాలు కొత్త వాటిలా మెరుస్తాయి
క్లీనింగ్ టిప్స్ ►ఫ్యాబ్రిక్ సోఫాను శుభ్రం చేయడానికి, ఆరు టీస్పూన్ల బాత్ సోప్ పౌడర్ తీసుకోండి. దీనిలో తగినన్ని వేడి నీళ్లు పోస్తూ బాగా కలపండి. దానికి రెండు టీస్పూన్ల అమ్మోనియా లేదా తేనె జోడించండి. ఆ తరువాత, ఈ ద్రావణాన్ని చల్లబరచండి. ► చల్లబడిన తర్వాత దానిని బాగా కలిపితే నురగ వస్తుంది. ఇప్పుడు సోఫాపై భాగంలో గుడ్డ లేదా స్పాంజ్ సహాయంతో ఈ నురుగుతో శుభ్రం చేయండి. దీని తరువాత సోఫాను ఫ్యాన్ కింద ఆరనివ్వండి. దీంతో ఫ్యాబ్రిక్ సోఫా కొత్తదానిలా మెరిసిపోతుంది. ► వెనిగర్లో లిన్సీడ్ ఆయిల్ మిక్స్ చేసి ఓ క్లాత్తో తుడిస్తే మీ పాత సోఫాలు కొత్తవాటిలా మెరుస్తాయి. ► వెల్వెట్ సోఫాలపై చాలా దుమ్ము పేరుకుపోతుంది. వాటిని శుభ్రం చేయడానికి వాక్యూమ్ క్లీనర్ వాడొచ్చు. లేదా సాఫ్ట్ డిటర్జెంట్ ఉపయోగించి కూడా శుభ్రం చేయొచ్చు. -
బొద్దింకల బెడద తగ్గించే సింపుల్ వంటింటి చిట్కాలు
కిచెన్ టిప్స్ ►మిరియాలు, ముద్దకర్పూరాలను సమపాళల్లో తీసుకుని పొడిచేయాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా టూత్పేస్టు, కొద్దిగా ఫేస్ పౌడర్ వేసి కలపాలి. చివరిగా నాలుగు వెల్లుల్లి గర్భాలను మెత్తగా నూరి అందులో కలపాలి. ఈ మిశ్రమాన్ని బొద్దింకలు తిరిగే ప్రాంతాల్లో రాస్తే బొద్దింకలు లోపలికి రావు. చూద్దామన్నా ఇంట్లో ఎక్కడా కనిపించవు. ► వంటింట్లో వాడే టవల్స్, మసిబట్టలు జిడ్డుపట్టి ఒక పట్టాన వదలవు. వీటిని ఉతకడానికి పెద్దగా శ్రమపడనక్కర్లేదు. వేడినీటిలో కాస్తంత షాంపు కలపాలి. ఈ నీటిలో జిడ్డుపట్టిన టవల్ను నానబెట్టాలి. 20 నిమిషాల తరువాత బ్రష్తో రుద్దుతూ ఉతికితే జిడ్డు, దుర్వాసన పోయి టవల్ శుభ్రంగా మారుతుంది. వారానికి ఒకసారి కిచెన్ టవల్స్ను ఇలా ఉతికితే జిడ్డుగా అనిపించవు. -
సింక్ వద్ద దోమలు, బొద్దింకలు వస్తున్నాయా? ఇలా చేయండి
ఇంటిప్స్ ►గ్లాసు నీళ్లల్లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్కను ముక్కలుగా తుంచి వేయాలి. దీనిలో బోరిక్ యాసిడ్ రెండు టీ స్పూన్లు వేసి మూడు గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ నీటిని సింక్లో పోస్తే బొద్దింకలు రావు. ► నిమ్మకాయలను శుభ్రంగా కడిగి తుడవాలి. వీటికి కొద్దిగా నూనె రాసి టిష్యూపేపర్ వేసిన బాక్స్లో పెట్టి రిఫ్రిజిరేటర్లో పెడితే ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి. ► గ్లాసు నీళ్లలో కొద్దిగా వెనిగర్ వేసి టూత్బ్రష్లను నానబెట్టాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే టూత్ బ్రష్లు శుభ్రపడతాయి. ► నిమ్మకాయ ముక్కలు, పుదీనా ఆకులు, వెనిగర్ను సమపాళ్లల్లో తీసుకుని ఐస్క్యూబ్ ట్రేలో పోసి రాత్రంతా రిఫ్రిజిరేటర్ లో పెట్టాలి. ఉదయం ఈ ఐస్క్యూబ్ను తీసి దుర్వాసన వస్తోన్న సింక్లో వేస్తే దుర్వాసన తొలగిపోతుంది. ► టొమాటో చుట్టూ గాటు పెట్టి మరుగుతున్న నీటిలో వేయాలి. నిమిషం తరువాత తీసేసి ఐస్వాటర్లో వేయాలి. తరువాత టొమాటోను పట్టుకుని లాగితే తొక్క సులభంగా వచ్చేస్తుంది. -
ఇలా చేస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి
బ్యూటీ టిప్స్ ► పండిన బొప్పాయి, పుచ్చకాయ, బంగాళాదుంప, టొమాటో, కీర దోసకాయలు ఇలా వేటినైనా పేస్ట్గా చేసి.. దానిని 15 నిమిషాలు ఫ్రిజ్లో ఉంచండి. అనంతరం పేస్ట్ను అప్లై చేసి.. పేస్ట్ చర్మంలో కలిసిపోయే వరకు స్క్రబ్ చేయండి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. టాన్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ► కొబ్బరి పాలలో దూదిని ఉంచి 15 నిమిషాల పాటు ముఖానికి మర్దనా చేయాలి. ఇది ట్యాన్ని రిమూవ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద గుజ్జును ముఖంపై అప్లై చేశాకా 15 నిమిషాల తర్వాత సాధారణ నీళ్లతో కడిగేయాలి. ఇది స్కిన్టోన్ని సాఫ్ట్గా చేస్తుంది. ►రెండు కర్పూరం బిళ్లలు, మూడు కప్పల వేపాకుల్లో కొద్దిగా కొబ్బరి నూనె వేసి పేస్టుచేయాలి. ఈ మిశ్రమాన్ని చుండ్రు ఉన్న ప్రాంతంలో రాసి మర్దన చేయాలి. చుండ్రు బాధ క్రమంగా తగ్గిపోతుంది. కర్పూరం పొడిని ఆలివ్ నూనెలో వేసి కలిపి జుట్టుకు పట్టించినా చుండ్రు తగ్గుతుంది. ఈ రెండింటిలో ఏదైనా ఒకటి వారానికి మూడుసార్లు చేస్తే ఉపశమనం త్వరగా వస్తుంది. ► కాలివేళ్ల సందుల్లో గాలి తగలక పాచిపడుతుంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే...కాళ్లను శుభ్రంగా కడిగి, తడిలేకుండా తుడవాలి. ఇప్పుడు టూత్పేస్టుని వేళ్ల సందులో రాయాలి. రోజూ పడుకునేముందు ఇలా చేస్తే కాళ్లు పాయవు. ► ఒక బౌల్లో హాఫ్ కప్ అవకాడో గుజ్జు తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్.. 2 చుక్కల తేనె వేసి బాగా కలపండి. ఆ మిక్సర్ని మొహానికి అప్లయ్ చేసి.. 15 మినట్స్ వరకు అలాగే ఉంచేయండి. తర్వాత కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి. -
ఎలాంటి చర్మ సమస్యలు ఉన్నా వేపాకులతో చెక్ పెట్టొచ్చు
వేప చెట్టు ఇంటి దగ్గర్లో ఉంటే వేరే సౌందర్యసాధనాలతో పనే ఉండదు. వేపాకులు, బెరడు, వేపనూనె ఔషధాలుగానే కాదు, సౌందర్య సాధనాలుగానూ ఉపయోగపడతాయి. ఎలాంటి చర్మ సమస్యలకైనా వేపతో ఇట్టే చెక్ పెట్టేయవచ్చు. ► ముఖంపై మొటిమలు, నల్లమచ్చలు ఏర్పడుతుంటే వేపాకులతో చక్కని విరుగుడు ఉంది. గుప్పెడు వేపాకులను అరలీటరు నీటిలో వేయాలి. వేపాకులు పూర్తిగా మెత్తగా మారిపోయేంత వరకు ఆ నీటిని మరిగించాలి. కాసేపటికి నీరు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. అప్పుడు వడగట్టి ఆ కషాయాన్ని సీసాలో భద్రపరచుకోవాలి. ►ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఆ నీటితో కాస్త దూదిని తడిపి ముఖాన్ని రుద్దుకుంటే చాలు. మొటిమలు, మచ్చలు మటుమాయం అవుతాయి. ∙చర్మం పొడిబారి, తరచు దురదలు పెడుతున్నట్లయితే, పైన చెప్పుకున్నట్లే వేపాకులతో కషాయం చేసి, బకెట్ నీటిలో ఒకకప్పు కషాయాన్ని పోసి ఆ నీటిని స్నానానికి ఉపయోగిస్తే చాలు, కొద్దిరోజుల్లోనే చర్మం ఆరోగ్యకరంగా మారుతుంది. ► ముఖం తరచు జిడ్డుగా మారుతుంటే, వేపాకుల పొడి, గంధం పొడి, గులాబి రేకుల పొడి సమభాగాలుగా తీసుకుని కలుపుకోవాలి. చెంచాడు పొడిలో మూడు నాలుగు చుక్కల వేపనూనె, కొద్దిగా తేనె, నిమ్మరసం పిండుకుని ముద్దలా కలుపుకోవాలి. దానిని ముఖానికి పట్టించి, అరగంటసేపు ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం తాజాగా మారుతుంది. -
పెడిక్యూర్ కోసం పార్లర్కు వెళ్లాల్సిన పనిలేదు, సింపుల్గా ఇంట్లోనే..
పెడిక్యూర్ ఇప్పుడు ఇంట్లోనే.. ►పాదాలను మెరిపించడంలో అరటితొక్కలు చక్కగా పనిచేస్తాయి. ►అరటితొక్కలను పాదాలపైన రుద్దితే మృతకణాలు, దుమ్మూ ధూళీ తొలగిపోతాయి. ► అరటి తొక్కలను ముక్కలుగా తరిగి కొద్దిగా తేనె వేసి పేస్టు చేయాలి. ఈ పేస్టుని పాదాలకు రాయాలి. అరగంట తరువాత సాధారణ నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల పాదాలు మృదువుగా మారడంతో పాటు, చక్కగా మెరుస్తాయి. ► అరటితొక్కల పేస్టులో కొద్దిగా అలోవెరా జెల్ కలపాలి. ఈ పేస్టుని పాదాలకు అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి. ఈ పేస్టు పాదాలకు తేమనందించి కోమలంగా ఉంచుతుంది. ► అరటితొక్కల పేస్టులో కాఫీ పొడి, తేనె వేసి కలిపి స్క్రబర్లా పదిహేను నిమిషాలు రుద్దాలి. పాదాలపైన మురికి, మలినాలు పోయి చక్కగా మెరుస్తాయి. -
గుండెపోటు వస్తుందో లేదో ముందే తెలుసుకోండి..ఆ ట్యాబ్లెట్ దగ్గర ఉంచుకోండి
గుండెలో కొవ్వు పేరుకుపోవడం, ఫ్యాట్స్ అధికంగా ఉన్న ఆహారం తినడం, అధిక బరువు, డయాబెటిస్ రోగుల్లో ఇన్సులిన్ రెసిస్టన్స్ కారణాల వల్ల సంభవించవచ్చు. పైన పేర్కొన్న కొన్ని కారణాల వల్ల గుండె కండరాల్లో కొవ్వు అధికంగా పేరుకునేటట్లు చేస్తుంది. ఇలా పేరుకుపోయిన కొవ్వు గుండెను బలహీనపరిచి హార్క్ రిస్క్ను పెంచుతుంది. ముందే లక్షణాలను గుర్తించడం వల్ల జాగ్రత్తపడొచ్చు. హార్ట్ ఎటాక్ వచ్చేముందే శరీరం కొన్ని హెచ్చరికలను మనకు పరోక్షంగా పంపుతుంది. కానీ వాటిని మనం సాధారణంగా భావించి పెద్దగా నోటిస్ చేయము. పల్ప్ టేషన్ కొద్ది మెట్లు ఎక్కినా ఆయసం వస్తుంది. కుడి చేతిని పైకి ఎత్తడంలో ఇబ్బంది,నొప్పి, చెమట పడుతుంది. ఒక వయసు దాటిన వాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే ఇంట్లో "సార్బిట్రేట్ " మాత్రలు( లైఫ్ సేవింగ్ మాత్రలు చాలా తక్కువ ఖరీదు) అందుబాటులో ఉంచుకోవాలి. ఏ మాత్రం ఇబ్బంది అనిపించినా ఆ మాత్ర ఒకటి నాలుక కింది భాగంలో ఉంచుకోవాలి, మింగకూడదు. డాక్టర్ను వెంటనే సంప్రదించాలి. స్టంట్ వేయించుకున్నాక ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ? ►స్టంట్ ప్రక్రియ ముగిశాక, మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి, భవిష్యత్తులో అడ్డంకులు ఏర్పడకుండా జాగ్రత్తలు పాటించాలి. అవేంటో చూద్దాం. ► ఆస్పిరిన్,క్లోపిడోగ్రెల్ వంటి యాంటీ ప్లేట్లెట్ మందులతో సహా డాక్టర్ సూచించిన మందులను వాడండి. ► ధూమపానం..అనేక జబ్బులకు కారకం. కాబట్టి మందు, సిగరెట్ వంటివి మానేయడం మంచిది. ► కొలెస్ట్రాల్ తక్కువ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్, తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు తీసుకోవచ్చు. ► ఊబకాయం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి గుండె ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన బరువు ఉంచుకోవడం ముఖ్యం. ► క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ► దీర్ఘకాలిక ఒత్తిడి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ధ్యానం, యోగా వంటివి ఒత్తిడిని తగ్గిస్తుంది. -నవీన్ రోయ్ ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
కొరియన్ గ్లాసీ స్కిన్ టోన్ కావాలా? సింపుల్గా ఈ ప్యాక్ వేసుకోండి
ఫర్ గ్లాస్ స్కిన్.. ఈ చిట్కాలు పాటించండి. ►ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్, హాఫ్ కప్ బ్రౌన్ షుగర్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఆ పేస్ట్ని స్క్రబ్లా మొహానికి రుద్దుకోవాలి .. ఓ 10 మినట్స్ వరకు. తర్వాత కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుని టవెల్తో ఆ తడిని అద్ది.. మాయిశ్చరైజర్ అప్లయ్ చేయాలి. ► శెనగపిండి చర్మాన్ని కాంతివంతం చేయడంలో సహాయం చేస్తుంది. శెనగపిండి, పసుపు, పెరుగు వేసి బాగా కలపండి. దీన్ని ముఖంపై అప్లై చేసి 15 నిమిషాల తర్వాత ఆరాక కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ► పండిన బొప్పాయి, పుచ్చకాయ, బంగాళాదుంప, టొమాటో, కీర దోసకాయలు ఇలా వేటినైనా పేస్ట్గా చేసి.. దానిని 15 నిమిషాలు ఫ్రిజ్లో ఉంచండి. అనంతరం పేస్ట్ను అప్లై చేసి.. పేస్ట్ చర్మంలో కలిసిపోయే వరకు స్క్రబ్ చేయండి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. టాన్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ► కొబ్బరి పాలలో దూదిని ఉంచి 15 నిమిషాల పాటు ముఖానికి మర్దనా చేయాలి. ఇది ట్యాన్ని రిమూవ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద గుజ్జును ముఖంపై అప్లై చేశాకా 15 నిమిషాల తర్వాత సాధారణ నీళ్లతో కడిగేయాలి. ఇది స్కిన్టోన్ని సాఫ్ట్గా చేస్తుంది. ► అవిసె గింజలు స్కిన్ టోన్ని గ్లాసీగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవిసె గింజలను ఓ పాత్రలో వేడి చేసి అందులో నీళ్లు కలపాలి. జెల్ ఫార్మట్లో వచ్చాక స్టవ్ ఆపేసి వడగట్టాలి. మిగిలిన జెల్ను ముఖంపై అప్లై చేస్తే రిజల్ట్ వెంటనే కనిపిస్తుంది. -
చేతిలో తాళాల గుత్తి పెడితే ఫిట్స్ తగ్గుతాయా? వాస్తవమిదే
మెదడుకు రక్తం లేదా ఆక్సిజన్ సరఫరాలో లోపం ఏర్పడినప్పుడు తాత్కాలికంగా స్పృహ కోల్పోతారు. దీన్నే మూర్ఛపోవడం అంటారు. వైద్యభాషలో దీన్ని సాధారణంగా "పాసింగ్ అవుట్" అని సూచిస్తారు.మూర్ఛలో మూడు రకాలు ఉన్నాయి (వాసోవగల్ సింకోప్, కరోటిడ్ సైనస్ సింకోప్, సిట్యుయేషనల్ సింకోప్).వీటిలో కొన్ని ప్రాణాపాయమైనవి. మరి మన చుట్టూ ఎవరైనా మూర్ఛపోయినప్పుడు ఏం చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. మూర్ఛ/ఫిట్స్ తరచూ వచ్చేవాళ్లలో కొన్ని లక్షణాలు ఉంటాయి. శరీరం వీక్ అయిపోవడం, మైకం కమ్మేయడం, "బ్లాకింగ్ అవుట్/వైటింగ్ అవుట్" కూడా అనుభవిస్తారు. అసలు మూర్ఛ రావడానికి గల సాధారణ కారణాలు ఏంటంటే.. భయం లేదా భావోద్వేగ గాయం,ఒత్తిడి. తీవ్రమైన నొప్పి,విశ్రాంతి లేకపోవడం. లోబీపీ, డీహైడ్రేషన్ మధుమేహం గుండె జబ్బు దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి (ఎంఫిసెమా) హైపర్వెంటిలేషన్ ఎక్కువ సేపు ఒకే భంగిమలో నిలబడటం. ప్రేగు కదలిక సమయంలో తీవ్రమైన ఒత్తిడి కొన్ని మందులు లేదా ఆల్కహాల్ తీసుకోవడం తాళాల గుత్తి పెడితే ఫిట్స్ తగ్గుతాయా? అప్పటివరకు ఉల్లాసంగా గడిపిన వాళ్లు ఫిట్స్తో అల్లాడిపోతుంటారు. దీంతో ఏం చేయాలో తెలియక చుట్టూ ఉన్నవాళ్లు కూడా గందరగోళానికి గురవుతుంటారు. ఆ సమయంలో ఫిట్స్తో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి చేతిలో తాళాల గుత్తి ఉంచడం, ఇనుముతో తయారుచేసిన వస్తువులను ఉంచడం, ఉల్లిపాయ వాసన చూపించడం వంటివి చేస్తుంటారు.ఇలా చేయడం వల్ల ఫిట్స్ ఆగిపోతాయనుకుంటారు. ఐరన్ మెదడులోని అలజడిని కంట్రోల్ చేసి ఫిట్స్ను తగ్గిస్తుందని నమ్ముతారు. కానీ వాస్తవానికి ఇది అపోహ మాత్రమే అంటున్నారు వైద్యులు. సాధారణంగానే ఫిట్స్ లేదా మూర్ఛ అనేది ఎపిసోడ్ల రూపంలో వస్తాయి. ఇవి 1-2 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండవు. ఈ సమయంలో మీరు ఏం చేసినా, చేయక పోయినా దానంతటవే ఆగిపోతాయి. దీన్ని స్టేటస్ ఎపిలెప్టికస్ అని పిలుస్తారు. ఒకవేళ ఇది ఐదు నిమిషాల కంటే ఎక్కవు సేపు ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. మూర్ఛపోయినప్పుడు ఏం చేయాలి? ►ముందుగా చేయవలసినది భయాందోళనలకు గురికాకూడదు. పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే పాదాలను రబ్ చేస్తుండాలి. దీనివల్ల చర్మం చల్లబడకుండా ఉంటుంది. ► మూర్ఛపోయిన వ్యక్తిని వెనుకవైపు పడుకోబెట్టడం లేదా అతని/ఆమె మోకాళ్ల మధ్య తాళం వేసి కూర్చోబెట్టడం లాంటివి చేయాలి. ► ఎవరైనా కిందపడిపోతే అది ఫిట్స్ అని అనుకోకుండా ముందుగా గాయలు ఏమైనా ఉంటే చూసుకోవాలి. అప్పటికి ఆ వ్యక్తిలో కదలిక లేకపోతే వారి కాళ్లను గుండె నుంచి సుమారు 12 అంగుళాలు (30CM) పైకి లేపడం వల్ల రక్తప్రవాహం ఆగకుండా ఉంటుంది. వ్యక్తి శ్వాస తీసుకోవడం ఆపివేసినట్లయితే, వెంటనే CPR చేయండి. ► షేక్ చేయడం, అరవడం: కొన్నిసార్లు గాయం కారణంగా వ్యక్తులు సడెన్ షాక్కి గురయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఆ వ్యక్తుల పేరు తెలిస్తే గట్టిగా వాళ్ల పేరు పిలుస్తూ తట్టండి. శరీరాన్ని షేక్ చేయడం వల్ల స్పృహను తిరిగి పొందడానికి సహాయపడుతుంది. మూర్ఛ వ్యాధిపై అవగాహన కలిగి ఉండటం ద్వారా మీరు అలాంటి వ్యక్తులను రక్షించిన వారు అవుతారు. - నవీన్ నడిమింటి ఆయుర్వేద నిపుణులు ఫోన్ -9703706660 -
మిగిలిపోయిన అన్నాన్ని మళ్లీమళ్లీ వేడి చేసి తింటున్నారా? క్యాన్సర్ వస్తుంది
ఫ్రిజ్లో ఉంచిన ఆహారాన్ని పదే పదే వేడి చేయడం వల్ల అందులో ఉండే పోషకాలు మొత్తం నశిస్తాయి. ఇది క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లు పాటించాలి. ఎలాంటి ఆహారాలు వేడి చేసి తినడం వల్ల నష్టం ఏమిటో తెలుసుకుందాం. ►చాలామంది నాన్ వెజ్ ఫుడ్ని ఫ్రిజ్లో స్టోర్ చేసి తర్వాత వేడి చేసి తింటూ ఉంటారు. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ► చాలామంది రాత్రి మిగిలిన అన్నాన్ని ఫ్రిజ్లో పెట్టి ఉదయం వేడి చేసి తింటారు. అలాగని ఉదయం మిగిలిన దానిని రాత్రికి వేడి చేసి తినడం మంచిదనుకోకండి. అది కూడా మంచి పద్ధతి కాదు. కొన్ని నివేదికల ప్రకారం అన్నాన్ని మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే ఫుడ్ పాయిజన్ జరుగుతుందని తేలింది. ► గుడ్లని ఆమ్లెట్ వేసుకొని, ఉడకబెట్టుకొని తింటారు. కొన్నిసార్లు వీటితో కూరలు కూడా వండుతారు. గుడ్లలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే గుడ్లు వండిన వెంటనే తినడం మంచిది. ఫ్రిజ్లో పెట్టి వేడి చేసిన తర్వాత తినకూడదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ► మైక్రోవేవ్ ఓవెన్లో కాఫీని మళ్లీ వేడి చేయడం దాదాపుగా అందరూ చేస్తుంటారు. ఈ విషయం తెలిస్తే ఆ పని అస్సలు చేయరు. ఎందుకంటే కాఫీ చల్లబడినప్పుడు ఆమ్లంగా మారుతుంది. ఇది గ్యాస్ సమస్యలకు దారి తీస్తుంది. దానికంటే కాఫీని థర్మో-ఫ్లాస్క్లో నిల్వ చేయండి. నచ్చినప్పుడు సిప్ చేయండి. ► చికెన్ని రోండోసారి ఉడికిస్తే అందులో మాంసకృత్తులు నశిస్తాయి. ► పుట్టగొడుగులను వండిన వెంటనే తినాలి. ఎక్కువసేపు నిల్వ ఉంచడం, రీహీట్ చేయడం అస్సలు మంచిది కాదు. దీనివల్ల ప్రొటీన్లు విచ్ఛిన్నమై జీర్ణసంబంధిత సమస్యలు, ఇతరత్రా అనారోగ్యాలకు దారితీయొచ్చు. ► చేపలను మళ్లీమళ్లీ వేడి చేయడం వల్ల దాని మృదుత్వం మొత్తం పోయి పొడిగా మారుతుంది. ► ఆకుపచ్చ కూరగాయలు ఆకుపచ్చ కూరగాయలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో నైట్రేట్ కూడా ఉంటుంది. ఇలాంటి కూరగాయలతో వండిన వంటకాలని వేడి చేసినప్పుడు అవి క్యాన్సర్ కారకాలను విడుదల చేస్తాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే ఈ తప్పు అస్సలు చేయకూడదు. -
మందులు వేసుకున్నా దగ్గు తగ్గడం లేదా? అయితే ఈ చిట్కాలు పాటించండి
హెల్త్ టిప్స్ ►నీళ్ళలో తులసి ఆకులు వేసి మరిగించి, ఆ తర్వాత మరిగిన తులసి నీటిని కాస్త చల్లార్చి తీసుకుంటే దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. ► కొంచెం గోరువెచ్చని నీళ్లలో కరక్కాయ పొడిని కలుపుకుని తాగినా, కరక్కాయ ముక్క బుగ్గన పెట్టుకుని ఆ రసాన్ని మింగుతూ ఉన్నాపొడి దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. ► అర టీ స్పూన్ సొంఠి పొడి లో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకున్నా దగ్గు నుంచి రిలీఫ్ లభిస్తుంది. ► టీ స్పూన్ తేనెలో 1 టీ స్పూన్ అల్లం రసం, 1 టీ స్పూన్ దానిమ్మరసం మూడింటిని బాగా కలిపి తీసుకోవాలి. ఇలా రోజుకి 2 లేదా మూడు సార్లు చేస్తే రిజల్ట్ మీకే తెలుస్తుంది. ► రెండు, మూడు రోజుల పాటు రెండు మిరియాల గింజలు, మెలమెల్లగా నములుతూ, ఆ రసం మింగితే దగ్గు తగ్గుతుంది. ► సీతాఫలం విత్తనాలు, ఆకులు మెత్తగా నూరి పట్టిస్తే, పేలు పోతాయి. ► అరటిపండు, తేనెతో కలిపి తీసుకంటే క్షయవ్యాధిగ్రస్తులకు మంచిది. ► నేరేడు ఆకులు నీటిలో మరిగించి, వడగట్టి, ఆ నీటిని పుక్కిలిస్తే నోటిపూతలు తగ్గుతాయి. ► వేప చెట్టు బెరడును పెనంపై బాగా కాల్చి, మెత్తగా పొడి చేయాలి. ఆ పొడికి కొద్దిగా కొబ్బరి నూనె చేర్చి, కురుపులపై రాస్తే ఉపశమనం వుంటుంది. ∙వేపాకు రసం, దానికి సమాన భాగంలో పెరుగు జోడించి, కాస్త నిమ్మరసం కలిపి తలకు పట్టిస్తే చుండ్రు తగ్గుతుంది. మీకు తెలుసా? ►వంట పూర్తయిన తర్వాత అంట్లను కొందరు వంటింటి షింకులోనే అలా ఉంచేస్తుంటారు. అలా చేయకండి. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేసుకోవడమో లేకపోతే బయట వేసుకోవడమో చేయండి. సింకులో గిన్నెలు పడి ఉండటం వల్ల వాటిలో బ్యాక్టీరియా చేరి దుర్వాసన రావడం ప్రారంభం అవుతుంది. వాటిని వాడటం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ►సాధారణంగా చాలా మంది వంటింట్లోనే చెత్త డబ్బాను పెట్టుకుంటుంటారు. ఒకటి రెండు రోజులు గనుక అది అలాగే ఉండిపోతే సూక్ష్మ జీవులు చేరి కంపు రావడం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఏ రోజుకారోజు చెత్తను తీసివేయండి. వెసులుబాటు ఉంటే గనుక అసలు దీన్ని వంటింటి బయట వైపు ఏర్పాటు చేసుకోవడం మంచిది. -
జీలకర్రలో కల్తీని నిమిషాల్లో ఇలా గుర్తించండి..
కల్తీని గుర్తిద్దామిలా... ►ఇప్పుడు ఏది చూసినా కల్తీ అవుతోంది. కల్తీ కలిసిన జీలకర్ర తింటే ఆరోగ్యం పాడవుతుంది. అందువల్ల జీలకర్రను నాణ్యమైనదో కాదో ఇలా తెలుసుకోండి... ► కొద్దిగా జీలకర్రను తీసుకుని నలిపి చూడాలి. నలిపినప్పటికీ జీలకర్ర అలానే ఉంటే జీలకర్రలో ఏదీ కలవలేదని అర్థం. ► జీలకర్రను నీటిలో వేసి ఐదు నిమిషాలు నానబెట్టాలి. నీరు రంగు మారితే జీలకర్రలో ఏదో కల్తీ జరిగినట్టే. ► జీలకర్ర వాసన లేకపోతే అది స్వచ్ఛమైన జీలకర్ర కాదు. ఇలా చేస్తే దంతాలు ఆరోగ్యంగా.. వేడి నీళ్లలో బేకింగ్ సోడా, కొద్దిగా నిమ్మరసం వేసి కలపాలి. ఈ నీటిలో టూత్ బ్రష్ను మునిగేలా వేసి ఇరవై నిమిషాలు నానబెట్టాలి. తరువాత సాధారణ నీటితో కడిగితే బ్రష్లో ఉన్న మురికి, బ్యాక్టీరియా పోతుంది. పదిరోజులకొకసారి బ్రష్లను ఇలా శుభ్రం చేసుకుంటే, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిని కలపాలి. ఈ మిశ్రమంలో ముంచిన టిక్కాను, తరువాత గుడ్లసొనలో ముంచి డీప్ఫ్రై చేస్తే టిక్కా క్రిస్పీగా మరింత రుచిగా వస్తుంది. -
ఎక్కువగా చెమటలు పడుతున్నాయా? గుండెపోటు రావొచ్చు!
చెమటలు పట్టడం అనేది చాలా సాధారణ విషయం.. ఎందుకంటే శరీర శ్రమ అతిగా చేయడం వల్ల అందరిలో చెమట పడుతూ ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో మరింత సహజం. అయితే కొందరిలో చెమట విచ్చలవిడిగా పడుతూ ఉంటుంది. దీంతోపాటు కొందరిలో అకస్మాత్తుగా చెమటలు వస్తాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు చాలామంది దీనిని సాధారణ సమస్యగా భావించి తేలిగ్గా తీసుకుంటున్నారు. దీని వల్ల భవిష్యత్లో ఆరోగ్య సమస్యలని కొని తెచ్చుకున్నట్లేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలా మీకు జరుగుతుంటే మాత్రం మీ ఒంటి మీద మీరు కాస్తంత శ్రద్ధ తీసుకోవాల్సిందే మరి! అకస్మాత్తుగా చెమటలు పట్టడం అనేకరకాల అనారోగ్య సమస్యలకు ముందస్తు సూచనలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని గుండెజబ్బుల లక్షణాలలో ఒకటిగా వైద్యులు భావిస్తారు. తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ముందు తరచు ఆకస్మాత్తుగా చెమటలు పడతాయని నిపుణులు చెబుతున్నారు. మీలో ఇలాంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించడం, వారి సలహా మేరకు హెల్త్చెకప్ చేయించుకోవడం మంచిదని అనుభవజ్ఞుల సలహా. అధిక చెమట ఈ వ్యాధుల లక్షణాలలో ఒకటి... అకస్మాత్తుగా చెమటలు పట్టడం గుండెపోటు మొదటి లక్షణమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మహిళలకు రాత్రిపూట ఎక్కువగా చెమట పడడం వల్ల భవిష్యత్లో రానున్న తీవ్రసమస్యలకు సంకేతాలు. తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా కూడా ఎక్కువగా చెమట పడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొంతమందిలో మధుమేహం పెరగడం కారణంగా కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. అకస్మాత్తుగా వచ్చే చెమటలు రాకుండా ఉండాలంటే... ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించడం. మద్యపానం అలవాటుంటే వెంటనే మానేయడం. ఆకు కూరలు, పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం. గ్రీన్ టీ తీసుకోవడం ∙రోజుకు కనీసం మూడు లీటర్ల నీటిని తాగడం. డీప్ ఫ్రైలు, ఇతర నూనె పదార్థాలను తగ్గించడం. ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామాలు చేయడం ∙పద్ధతి ప్రకారం డైట్ తీసుకోవడం అవసరం. -
డిప్రెషన్, ఒత్తిడితో చిత్తవకండి.. ఈ పనులు చేయండి
ఉదయం లేచినప్పటి నుంచి ఉరుకులు పరుగులు మొదలు. చేయాల్సిన పనుల చిట్టా చాంతాడంత. దీంతో హడావుడి, ఆందోళన. ఫలితం ఒత్తిడి. అందుకనే ఈ రోజుల్లో ఎక్కువ శాతం మంది ప్రజలు ఒత్తిడికి గురవుతున్నారు. ఆందోళనతో చిత్తవుతున్నారు. వీటి వల్ల వచ్చే శారీరక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ ఒత్తిడిని తగ్గించుకుంటే చాలా అనారోగ్య సమస్యల నుంచి బయట పడొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకు ఇంట్లో మనంతట మనం పాటించగల చిన్న చిట్కాలను చెబుతున్నారు. అవేంటో చూద్దామా..? గోరు వెచ్చని లేదా చల్లని నీటితో స్నానం చేయడం చాలా మంచిది. శరీరంలో ఎక్కడైనా నొప్పులుగా అనిపిస్తే చిన్నగా మసాజ్ చేసుకోవడం, కండరాలన్నీ సాగేలా ఒళ్లు విరుచుకోవడం లాంటి పనుల వల్ల ఒత్తిడి తగ్గుతుంది. బాత్ రూమ్లో కూనిరాగాలు తీయడం లేదా ఏదైనా లైట్ మ్యూజిక్ని పెట్టుకుని, గోరువెచ్చని నీటితో శరీరం, మనస్సు తేలిక పడేంతవరకు టబ్ బాత్ చేయాలి. అందుకు మంచి సువాసన ఉన్నసహజమైన సబ్బును ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. డ్యాన్స్ నృత్యం చేయడం అనేది ఒత్తిడి నివారిణిలా పని చేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మంచి సంగీతాన్ని పెట్టుకుని దానికి తగినట్లుగా డ్యాన్స్ చేయవచ్చు. ఎవరైనా ఉన్నప్పుడు చేయడం మొహమాటం అయితే ఎవరూ లేనప్పుడు ఆ పని చేయండి. దీనివల్ల మనసుకు ఆనందం కలుగుతుంది. ఒత్తిడి హార్మోన్ల స్థాయి తగ్గుతుంది. ఇష్టమైన వారితో ప్రేమగా... ఎక్కువ ఒత్తిడిలో ఉన్నప్పుడుఇష్టమైన వారితో ప్రేమగా...సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి. అందువల్ల శరీరంలో డోపమైన్ లాంటి హ్యాపీ హార్మోన్ లు విడుదలవుతాయి. దీంతో మీరు ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. బబుల్ ర్యాప్లను పగలగొట్టడం... బబుల్ ర్యాప్ కవర్లను చూడగానే అంతా వాటిని పగలగొట్టాలని ఉవ్విళ్లూరతారు. అందుకు కారణాలు లేక΄ోలేదు. అలా వాటిని పేల్చడం వల్ల మనలో ఓ రకమైన ఆనందం కలుగుతుంది. ఒత్తిడి దూరమవుతుంది. అందువల్లనే మనం వాటిని పేల్చేందుకు ఇష్టపడుతుంటాం. మంచి పుస్తకాలు చదవడం... మంచి పుస్తకాలు, పేపర్లు చదవడం ద్వారా కూడా ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. ఒత్తిడిగా అనిపించినప్పుడు మీకు నచ్చిన పుస్తకం తీసి చదవండి. వెంటనే తగ్గుముఖం పడుతుంది ఆ ఒత్తిడి. అలాగే రోజూ దినపత్రికలను చదవడం కూడా ఒత్తిడి నివారణలో ఒక భాగం. దినపత్రికలు చదవడమనగానే నేరవార్తలు, హత్యావార్తలు కాదు. మనసుకు కాస్తంత ఆహ్లాదం కలిగించే వార్తలు చదవడం మేలు. ఆలయ సందర్శనం... మీ మతాన్ని అనుసరించి మీరు ప్రార్థనామందిరాలను సందర్శించడం మంచిది. రోజూ కాసేపు పూజామందిరంలో గడపడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. అలాగని దేనినీ అతిగా చేయరాదు. గంటలు గంటలు పూజలు చేస్తూ గడపడం కూడా మంచిది కాదు. క్రమం తప్పకుండా ఆలయానికి లేదా మసీద్కు లేదా చర్చికి వెళ్లడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది. మీరు ఒత్తిడిలో ఉన్నారు అనుకున్నప్పుడువీటిలో మీకు వీలైనవాటిని పాటించి చూడండి. అన్నింటికన్నా ముఖ్యం ఒత్తిడి వచ్చాక బాధ పడేకంటే ఒత్తిడికి గురికాకుండా చూసుకోవడం చాలా ఉత్తమం. అదేవిధంగా ఒత్తిడి ఎందువల్ల వస్తుందో తెలుసుకుంటే నివారించుకోవడం సులభం కాబట్టి. ముందుగా మీ పనులను ప్రశాంతగా పూర్తి చేయడం ఆరంభించండి. ధ్యానం... ఒత్తిడి నుంచి బయట పడటానికి ధ్యానం అద్భుతమైన మార్గం అని చాలా అధ్యయనాల్లో తేలింది. శ్వాస మీద ధ్యాస పెట్టి కేవలం రెండు నిమిషాలు కళ్లు మూసుకున్నా సరే అది మీ శరీరంలో స్ట్రెస్ హార్మోన్ స్థాయుల్ని తగ్గిస్తుంది. -
నిమ్మచెక్కలను ఫ్రిజ్లో పెడుతున్నారా?ఏం అవుతుందంటే..
కిచెన్ టిప్స్ : ►నిమ్మచెక్కతో మరకలు ఈజీగా పోతాయి కాయగూరలు తరిగే చెక్కని నిమ్మచెక్కతో రుద్ది కాసేపయ్యాక కడిగేయండి. మరకలు పోతాయి. ఎప్పుడైనా దానిపై మాంసం కోసినా.. నిమ్మచెక్కతో రుద్దాలి. క్రిములు వృద్ధి చెందకుండా ఉంటాయి. ► నిమ్మచెక్కలని సన్నగా తరిగి కాసిని నీళ్లలో వేసి ఆ పాత్రని మైక్రో ఓవెన్ లో కొన్ని నిమిషాలు ఉంచి తీసేయండి. అలా చేస్తే దుర్వాసనలు తొలగిపోవడంతో పాటూ లోపల పడి ఉన్న పదార్థాలని శుభ్రం చేయడం కూడా తేలికవుతుంది. ► ఫ్రిజ్లో ఓ మూలగా నిమ్మచెక్కని పెట్టి చూడండి. అందులోంచి వచ్చే దుర్వాసనలు పోతాయి. ► స్టీలు కుళాయిలపై నీటిమరకలు పడుతుంటాయి. అవి తెల్లగా మారాలంటే వాటిని నిమ్మచెక్కతో రుద్ది కడిగితే చాలు. -
పరగడుపున ఉసిరి తీసుకుంటున్నారా? ఈ విషయం తెలుసా?
Health Tips: ►ఉసిరి పచ్చడి తీసుకోవడం, తేనెలో నానపెట్టిన ఉసిరిని నిత్యం పద్ధతి ప్రకారం సేవించడం ద్వారా దృష్టిలోపం తగ్గుతుంది. ఉసిరి పొడిని నిత్యం పరకడుపున తేనెతో కలిపి సేవించడం వల్ల వత్తిడి, అలసట తగ్గుతుంది. ►ఎండు ద్రాక్షలు లేదా కిస్మిస్లు వాడడం మంచిది. వీటికి చలువ చేసే గుణం వుంది. గ్లాసుడు నీళ్లలో ఎండు ద్రాక్షలు వేసి, నానపెట్టి, ఆ నీటిని తీసుకుంటే వేడి చేయకుండా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు చాలా మంచిది. ► గోధుమలు, బియ్యం, పెసలు, రాగులు, సోయాగింజ లు, జొన్నలు అరకిలో వంతున కలిపి, 50 గ్రాముల నువ్వులు, 20 గ్రాముల జీలకర్ర జోడించి, దోరగా విడివిడిగా వేయించాలి. ఆపై మరపట్టించి రొట్టెలు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పిండితో జావ కూడా చేసుకోవచ్చు. ► నెలసరి నొప్పితో బాధపడేవారు పుదీనా ఆకులను నీళ్లలో వేసి మరిగించి, వడకట్టి, ఆ నీటిని సేవించడం వల్ల మంచి ఫలితం వుంటుంది. పుదీనా ఆకులు, ఉప్పు కలిపి నీటిలో మరిగించి, ఆ ఆవిరి పడితే గొంతు మృదువుగా మారుతుంది. -
ఇంటి చిట్కాలతోనే కాంతివంతంగా మెరిసిపోవచ్చు.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి
అందంగా కనిపించాలనే కోరికి ఎవరికి మాత్రం ఉండదు? కానీ అందుకు తగ్గట్లు తగిన శ్రద్ద తీసుకోవాలి. స్కిన్ కేర్ కోసం ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలన్న అవగాహన చాలామందికి ఉండదు. చర్మంపై ఏవేవో ప్రయోగాలు చేస్తూ వేలకు వేలు ఖర్చుపెడుతుంటారు. కానీ సింపుల్గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే అందంగా మెరిసిపోవచ్చు. అదెలాగో చూద్దాం. కాంతిమంతమైన ముఖం కోసం.... ►టమాటాను గుండ్రంగా కట్ చేసి ఒక ముక్కను తీసుకుని దానికి పంచదార అద్దాలి. తరువాత ఈ ముక్కను ముఖంపై సున్నితంగా రుద్దాలి. పది నిమిషాల తరువాత సాధారణ నీళ్లతో కడుక్కోవాలి. తరువాత స్పూను శనగ పిండి, అరస్పూను అలోవెర జెల్, రెండు స్పూన్ల టమాటా రసం, అర స్పూను తేనె వేసి పేస్టులా కలుపుకోవాలి. ఈ పేస్టుని ముఖానికి ఫేస్ప్యాక్లా వేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై ఉన్న మృత కణాలు, ట్యాన్ పోయి ముఖం కాంతిమంతమవుతుంది. ► రెండు స్పూన్ల పాలలో, అర స్పూన్ తేనె కలిపి కళ్ల చుట్టు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత కాసేపు వేళ్లతో మెల్లగా మసాజ్ చేసుకోవాలి. ఇలా పడుకునేముందు ప్యాక్ వేసుకొని చల్లటి నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. ► కొద్దిగా కాఫీ పౌడర్, కొబ్బరి నూనెను సమపాళ్లలో తీసుకొని అందులో ఒక చెంచా చక్కెర వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేయండి. ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడమే కాకుండా మృదువుగా మారుస్తుంది, చర్మం తాజాగా కనిపిస్తుంది. ► ఒక కప్పు గ్రీన్ టీని బ్రూ చేసి చల్లారనివ్వండి. దీన్ని స్కిన్ టోనర్గా ఉపయోగించండి. ఇది స్కిట్టోన్ని పెంచుతుంది. -
ఇడ్లీ, దోశల పిండి పాడవకుండా ఉండాలంటే.. ఇలా చేయండి
వంటింటి చిట్కాలు: ►ఇడ్లీ, దోశ పిండి త్వరగా పాడు కాకుండా ఉండాలంటే... ఇడ్లీ, దోశ పిండికోసం నానబెట్టే పప్పు, బియ్యం, రవ్వలను కడిగేటప్పుడు కొద్దిగా ఉప్పువేసి కడగాలి. ఇలా కడిగి రుబ్బిన పిండి నాలుగైదు రోజుల పాటు పులవకుండా ఉంటుంది. ► కోడిగుడ్లు ఉడికించే నీళ్ళలో కాస్త ఉప్పు వేసినా, ఉడికించిన వెంటనే గుడ్లను చన్నీళ్లలో వేసినా పెంకు సులభంగా వస్తుంది. ► కిచెన్ షెల్ఫులు,తలుపులు రోజూ శుభ్రం చేస్తున్నా కూడా జిడ్డు పడుతుంటాయి. నెలకొకసారి లీటరు వేడి నీటిలో ఒక టేబుల్ స్పూన్ అమోనియా, రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ కలిపి స్ప్రే బాటిల్లో పోసుకుని జిడ్డుగా ఉన్న ప్రదేశాలలో స్ప్రే చేసి తడి పీల్చుకునే పొడి వస్త్రంతో తుడవాలి. ► మామూలుగా దోసెలు పెనానికి అతుక్కుపోతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే, అందుబాటులో వంకాయలు ఉంటే, ముందుగా పెనంపై వంకాయ ముక్కతో రుద్దండి. ► బొంబాయి రవ్వ హల్వా మరింత రుచిగా ఉండాలంటే ఒక టేబుల్ స్పూన్ శెనగ పిండిని కలుపుకుకోవాలి. ► కూరల్లో కారం కాస్త ఎక్కువైతే అందులో కొంచెం నిమ్మరసం లేదా రెండు టీస్పూన్ల నెయ్యి కలిపితే కారం తగ్గుతుంది. ► కలిపిన చపాతీ పిండి మిగిలిపోతే ఆ ముద్దపైన కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి రిఫ్రిజిరేటర్ లో ఉంచాలి. అప్పుడు సాఫ్ట్గా ఉంటాయి. ► పెరుగు పుల్లగా అవ్వకుండా ఉండాలంటే.. పెరుగులో కొబ్బరి ముక్కను వేసి చూడండి. -
మోకాళ్ల నొప్పులకు పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా? ఇవి తెలుసుకోండి
మన పెద్దవాళ్లు వృద్ధాప్యంలో కూడా ఎంతో బలంగా ఉండేవారు.. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా వారిలో కూడా శరీర సమస్యలు వస్తున్నాయి. చాలా మంది వృద్ధుల్లో మోకాళ్ల నొప్పులు వస్తున్నాయి. దీంతో పాటు ఆధునిక జీవనశైలికి అలవాటు పడ్డ యువతలో కూడా ఇవే సమస్యలు వస్తున్నాయి. మోకాళ్లనొప్పుల కారణంగా నడవడానికి చాలామంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలకు కూడా దారి తీయొచ్చు. మోకాళ్ల నొప్పులను తట్టుకోలేక చాలామంది పెయిన్ కిల్లర్స్ అంటే నొప్పి నివారణిలను ఆశ్రయిస్తుంటారు. వీటివల్ల ఎన్నో దుష్ప్రభావాలు కలుగుతాయి. అందువల్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని సహజ చిట్కాలను తెలుసుకుందాం. ఆర్థరయిటీస్, ఆస్టో ఆర్థరయిటీస్, రుమటాయిడ్ ఆర్థరయిటీస్ వంటి కొన్ని రకాల అనారోగ్య కారణాలతో పాటు సరైన దినచర్యను పాటించకపోవడం, తీసుకునే ఆహారాల్లో తగినన్ని పోషకాలు లేకపోవడం, ఇతర అనారోగ్య సమస్యల కారణంగా కూడా మోకాళ్ల నొప్పులు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ నొప్పులు ఎందుకు వస్తున్నాయో తెలుసుకుని ఆ తర్వాత ఈ సమస్యల నుంచి శాశ్వతంగా ఉపశమనం పొందడానికి కొన్ని మార్గాలను అన్వేషిద్దాం. కలబంద ఆయుర్వేద నిపుణులు కలబందను ఔషధంగా భావిస్తారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలారకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి తీవ్ర మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు నొప్పి ప్రభావిత ప్రాంతంలో ప్రతిరోజు అలోవెరా జెల్ను అప్లై చేసి సున్నితంగా మర్ధన చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సులభంగా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మోకాళ్ల వాపులు కూడా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. పసుపు పసుపు యాంటీ బాక్టీరియల్గా పని చేస్తుంది. ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి దీనిని అన్నిరకాల వ్యాధులకు వినియోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతిరోజు పసుపును వినియోగించడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అయితే దీనిని వినియోగించే ముందు ఒక బౌల్ తీసుకుని అందులో ఆవాల నూనెను వేసి.. ఒక టీ స్పూన్ పసుపును వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది. అల్లం అల్లం మోకాళ్ల నొప్పుల నివారణకు ఉపయోగించే మందులలో అల్లాన్ని బాగా ఉపయోగిస్తారు. కొన్ని అల్ల ముక్కలను తీసుకుని వాటిని గ్లాసు నీళ్లలో వేసి బాగా మరగబెట్టాలి. మనం తీసుకున్న నీటి పరిమాణం సగానికి తగ్గిందని నిర్ధారించుకున్న తర్వాత స్టవ్ మీదినుంచి దింపి గోరువెచ్చగా అయిన తర్వాత వడకట్టి తాగాలి. రుచికి తేనె, నిమ్మరసం వంటివి కలుపుకోవచ్చు. కర్పూర తైలం తీవ్ర మోకాళ్ల నొప్పుల కారణంగా బాధపడేవారు కర్పూరం నూనెను కూడా వినియోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అన్నిరకాల నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. దీనిని వినియోగించాలనుకునేవారు ముందుగా కర్పూరం నూనె తీసుకుని బౌల్లో పోసుకుని గోరువెచ్చగా చేయాలి. ఆ తర్వాత ఈ నూనెను ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి 15 నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల సులభంగా తీవ్ర మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. చింతగింజల పొడి మోకాళ్లలో గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే నొప్పులు తగ్గాలంటే కాస్తంత చింతగింజల పొడిని వేడినీళ్లలో వేసి బాగా మరగబెట్టి వడకట్టి తాగుతుండాలి. అలాగే దీనిలో పాలు కలపకుండా బెల్లం పొడి వేసి పాయసంలా చేసుకుని కూడా తాగచ్చు. నల్లేరు కాడలతో తయారు చేసిన పచ్చడిని, బెండకాయలను, గోరుచిక్కుడు కాయలను ఆహారంలో విరివిగా ఉపయోగించడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి సహజ ఉపశమనం లభిస్తుంది. ఏదైనా గాయం వలన కానీ మెడికల్ కండిషన్ వలన కానీ మీరు రోజూ చేసే పనులన్నీ బట్టి కానీ మోకాళ్ళ నొప్పులు సహజంగా వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా మోకాళ్ల నొప్పులు ఉంటే కచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాలి. మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే అల్లం, పసుపు బాగా పనిచేస్తాయి. ఒక గ్లాసు నీళ్లు తీసుకుని అందులో అల్లం, పసుపు వేసి 15 నిమిషాల పాటు ఆ నీటిని మరిగించండి. తర్వాత ఈ జ్యూస్ తీసుకున్నట్లయితే మోకాళ్ళ నొప్పులు తగ్గే అవకాశం ఉంది. మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటే కనక హీట్, కోల్డ్ కంప్రెస్ అంటే కాపడం పెట్టవచ్చు. హీట్ కంప్రెస్ని నొప్పి ఎక్కువ ఉంటే మాత్రం వాడకూడదు. ఎందుకంటే ఇంకా నొప్పి కలుగుతుంది. ఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళకి వేడినీటి కాపడం బాగా పనిచేస్తుంది. ఆటలు సమయంలో గాయాలైనప్పుడు కోల్డ్ కంప్రెసర్ బాగా తోడ్పడుతుంది. ఎప్సం సాల్ట్ని స్నానం చేసే నీళ్లలో వేసుకుని స్నానం చేస్తే ఉపశమనం లభిస్తుంది.అరకప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ని ఒక గ్లాసు నీళ్లలో వేసుకుని తాగితే మోకాళ్ళ నొప్పులు బాగా తగ్గుతాయి. రాత్రి నిద్రపోయేటప్పుడు తాగితే చాలా చక్కగా ఈ చిట్కా పనిచేస్తుంది. బరువు నియంత్రణ సాధ్యమైనంత వరకు మన వెయిట్ మానేజ్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ బరువు పెరగడం వల్ల మోకాళ్ల పైన భారం పడి, మోకాళ్ళ నొప్పులు పెరిగే అవకాశం ఉంది. అందుకని బరువుని మేనేజ్ చేసుకుంటూ మోకాళ్లపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. బరువు తగ్గడం కోసం వ్యాయామాలు కూడా చేసుకోవచ్చు. -
జుట్టును కాపాడుకోవడానికి ఈ ప్రొఫెషనల్ డ్రైయర్ ఉండాల్సిందే
నిగారింపుతో ముఖం ఎంతగా మెరిసిపోయినా తల మీద తగినంత జుట్టు లేకపోతే ఆ అందం కళాహీనమే. అందుకే చాలామంది మహిళలు కేశసంరక్షణలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. వారానికో హెయిర్ మాస్క్, రోజు విడిచి రోజు హెయిర్ మసాజ్లు.. ఇలా తమకు తెలిసిన పద్ధతిలో జుట్టును కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే వారానికి రెండుమూడుసార్లు తలస్నానం చెయ్యడం మంచిదంటారు నిపుణులు. నిజానికి తల స్నానం చేయడంతో పాటు జుట్టును ఆరబెట్టుకోవడమూ కష్టమైన పనే.. బిజీ లైఫ్లో! అందుకే ఈ ప్రొఫెషనల్ ఎయిర్ డ్రైయర్ ఇంట్లో ఉండాల్సిందే! చిత్రంలోని ఈ డివైస్.. గిరిజాల జుట్టు.. మందపాటి జుట్టు.. ఇలా అన్ని రకాల జుట్టుకూ ప్రయోజనం కలిగిస్తుంది. ఆన్, ఆఫ్, హై, లో అనే ఆప్షన్స్తో దీన్ని వినియోగించడమూ తేలికే! నెగెటివ్ అయానిక్ టెక్నాలజీతో కూడిన ఈ హెయిర్ డ్రైయర్.. భారీ ప్రతికూల అయాన్లను విడుదల చేయడంతో జుట్టులోని తేమను పోగొట్టి.. మృదువుగా మారుస్తుంది. జుట్టును కాపాడుతుంది. ఈ సాధనం చాలా తేలికగా చిన్నగా ఉండటంతో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఇది స్టెయిలింగ్ ఫ్లెక్సిబిలిటీతో పాటు.. కంట్రోల్ కోసం 2 విభిన్న స్పీడ్ మోడ్లను అందిస్తుంది. అలాగే ఇందులోని రెండు ప్రత్యేకమైన హెడ్స్ని అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఆటోలీకేజ్ సంరక్షణ కోసం సేఫ్టీ ప్లగ్తో.. ఈ డ్రైయర్ అప్గ్రేడ్ అయ్యింది. దాంతో దీన్ని ఉపయోగించినప్పుడు షార్ట్ సర్క్యూట్ లేదా విద్యుత్ లీకేజీ జరిగితే.. ఓవర్–హీట్ ప్రొటెక్షన్లు ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాయి. ధర 35 డాలర్లు. అంటే 2,894 రూపాయలు. -
అలాంటి సమస్యలు ఉన్నవాళ్లు ఆవాలను తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?
వంటలు మరింత రుచిగా రావడం కోసం పోపు పెట్టడం తెలుగువారికి అలవాటు. ఈ పోపులో ఎక్కువగా వినియోగించే వాటిల్లో ఆవాలు ఒకటి. ఆవాలు ఆహార పదార్థాలకు రుచిని ఇవ్వడమే శరీరానికి చాలా రకాలుగా సహాయపడతాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ప్రస్తుతం చాలామందికి వీటిని తినడమే తప్ప వీటివల్ల కలిగే లాభాలు ఏంటో తెలియదు. ఆవాలను తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పోపులో వేసే దినుసులలో ఎవరైనా సరే ముందుగా చెప్పేది ఆవాలనే. ఈ ఆవాల వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం ఉంది. వాటిలో గాయాలు తొందరగా మానడం ముందుగా చెప్పుకోవచ్చు. ఈ గాయాలు తగిలిన చోట ప్రతిరోజు ఆవాల పొడిని అప్లై చేయడం వల్ల తొందర్లోనే మంచి ఫలితాలు పొందుతారు. ఆధునిక జీవనశైలి కారణంగా చాలామందిలో దంతాల సమస్యలు వస్తున్నాయి. తరచు దంతాల నొప్పితో బాధపడేవారు ఆవాలను నీటిలో మరిగించి ఆ నీటిని పుక్కిలించి ఉమ్మెయ్యడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా దంతాల నొప్పి నుంచి సులభంగా లభిస్తుంది. ఆవాలు శ్వాస కోసం సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగించేందుకు సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడే వారు ఒక టీ స్పూన్ ఆవాల పొడిలో, ఒక టీ స్పూన్ ఆవాలను కలుపుకొని తీసుకోవడం వల్ల సులభంగా శ్వాస కోసం వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆవాలు కీళ్ల నొప్పుల నుంచి కూడా ప్రభావంతంగా ఉపశమనం కలిగిస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. కీళ్ల నొప్పుల కారణంగా నడవలేకపోతున్నవారు ఒక టీ స్పూన్ ఆవాలు నూనె ఓ చిన్న గిన్నెలో తీసుకొని అందులోనే ఒక టీ స్పూన్ ఆవాల పొడి, కర్పూరం వేసి పేస్టులా తయారు చేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఆవపిండితో తయారు చేసిన ఆహారాన్ని రోజూ తినడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా.. జీర్ణ క్రియ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. -
వేడి నీళ్లు Vs చన్నీళ్లు.. ఏ నీళ్లతో స్నానం చేస్తే మంచిది?
స్నానం వేడినీళ్లతో చేస్తే మంచిదా? లేక చన్నీళ్లతోనా? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. కొందరు కాలంతో సంబంధం లేకుండా వేడినీళ్ల స్నానానికి అలవాటు పడితే, మరికొందరేమో చన్నీళ్లకు అలవాటు పడతారు. వేడి నీళ్లతో స్నానం చేస్తే ఒళ్లు నొప్పులు తగ్గడంతో పాటు కండరాలు ఉత్తేజంగా ఉంటాయని కొందరు అనుకుంటారు. చల్లటి నీళ్లలతో స్నానం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. ఇంతకీ ఏ నీళ్లతో స్నానం చేస్తే మంచిది? మనం ప్రతిరోజు స్నానం చేసే సమయంలో మనకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటాం. దీని కారణంగా పలు సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కొందరు చన్నీళ్ల స్నానమే మంచిదంటారు. మరికొందరు వేడివేడి నీళ్ల వల్ల హానికారక క్రిములన్నీ తొలగిపోయి ఆరోగ్యం సమకూరుతుందనుకుంటారు. ఈ రెండూ అపోహలే. స్నానానికి నీళ్లు మరీ చల్లగా ఉండకూడదు. మరీ వెచ్చగా ఉండకూడదు. గోరువెచ్చని నీళ్లతో స్నానమే ఆరోగ్యం. ఇక బలహీనంగా ఉన్నవాళ్లు, వయసుపైబడిన వృద్ధులు మరీ ఎక్కువ చన్నీళ్ల స్నానం కాని, మరీ ఎక్కువ వేణ్ణీళ్లతో కానీ స్నానం చేయద్దు. ఒకవేళ మీరు మీ వృత్తిరీత్యా వేరే ఊళ్లలో ఉండటం వల్ల వేణ్ణీళ్లు పెట్టుకోవడం సాధ్యం కావడం లేదా? ఇలా మరీ చన్నీళ్ల స్నానమే చేయడం తప్పకపోతే... స్నానం చేసే వ్యవధిని వీలైనంత కుదించండి. అవి వేణ్ణీళ్లయినా, చన్నీళ్లయినా... వీలయినంత వరకు పొద్దున్నే ఏమీ తినకముందే స్నానం చేయడం మంచిది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల స్నానానికి ముందే తినాల్సివచ్చినా... కడుపు నిండా తిన్న వెంటనే స్నానం చేయవద్దు.ఇలా చేయడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాకపోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి స్నానం చేసిన తర్వాత కనీసం అర్ధగంట అయినా వ్యవధి ఉండేలా చూసుకోవడం మంచిది. నీళ్లు ఎంత చల్లగా ఉంటే... స్నానం వ్యవధి అంతగా తగ్గాలి. చన్నీళ్లతో స్నానం చేసే అలవాటు ఉన్నవారు... స్నానానికి ముందర చల్లటి నీళ్లు తాగకండి. చన్నీళ్లు గానీ లేదా వేణ్ణీళ్లు గానీ... వాటితో స్నానం చేశాక ఒకవేళ తలనొప్పి లేదా జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తే... అవి (చన్నీళ్లు / వేణ్ణీళ్లు) మీకు అంతగా సరిపడవని గుర్తించి, ఆ మేరకు గోరువెచ్చని నీటికి షిఫ్ట్ అవడం మంచిది. -
ఉల్లిపాయలు ఫ్రిడ్జ్లో పెడుతున్నారా? అలా అస్సలు చేయకండి
కిచెన్ టిప్స్: వర్షాకాలంలో ఉల్లిపాయలు త్వరగా పాడవకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి. ఉల్లి ఎక్కువ రోజుల పాటు పాడవకుండా ఉంటుంది. ► ఇతర కూరగాయలు ఉన్న బుట్టలో ఉల్లిపాయలను ఉంచకూడదు. దుంపలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వంటి వాటితో కలిపి ఉల్లిపాయలు ఉంచడం వల్ల త్వరగా మొలకలు వస్తాయి. కూరగాయల్లో ఇథలిన్ ఉల్లిపాయలు త్వరగా మొలకెత్తడానికి దోహదపడుతుంది. ►ఉల్లిపాయలను నిల్వచేసేందుకు పేపర్ బ్యాగ్లనే వాడాలి. పేపర్ బ్యాగ్స్లో ఉల్లిపాయలు ఉంచడం వల్ల ఉల్లిపాయల్లో ఉత్పన్నమయ్యే తేమను పేపర్ పీల్చుకుంటుంది. తేమ లేకపోతే ఉల్లిపాయలు త్వరగా మొలకెత్తవు. ►రిఫ్రిజిరేటర్లో ఉల్లిపాయలను నిల్వచేయకూడదు. రిఫ్రిజిరేటర్లోని ఇతర కూరగాయల వల్ల, లోపలి తేమ వాతావరణం ఉల్లి త్వరగా మొలకెత్తేలా చేస్తాయి. ►ప్లాస్టిక్ సంచుల్లో ఉల్లిపాయలను ఎప్పుడూ నిల్వ చేయకూడదు. మార్కెట్ నుంచి తెచ్చిన ప్లాస్టిక్ సంచిలో నుంచి ఉల్లిపాయలు తీయడం మర్చిపోతుంటాము. ప్లాస్టిక్ బ్యాగ్లో వేడికి ఉల్లిపాయలు పాడవుతాయి. -
కొరియన్ స్కిన్ టోన్ మీ సొంతం అవ్వాలంటే బియ్యం నీళ్లు..
కే– బ్యూటీ మానియా ►కొరియన్ గ్లాస్ స్కిన్ సొంత మవ్వాలంటే.. బియ్యం గంజిని ఫేస్కి అప్లయ్ చేసుకుని అది కంప్లీట్గా డ్రై అయిపోయాక వాష్ చేసుకోవాలి. ఈ రెమిడీని రెగ్యులర్గా ఫాలో అయితే యూవీ రేస్తో డామేజ్ అయిన స్కిన్కి మళ్లీ లైఫ్ వస్తుంది. స్మూత్గా.. రికింల్ ఫ్రీగా మారుతుంది! ► స్కిన్ కేర్లో క్లెన్సింగ్ చాలా ముఖ్యమైంది. చర్మాన్ని క్లీన్ చేయడం వల్ల మురికి, మలినాలను దూరం చేసి క్లీన్గా ఉంచుకోవచ్చు. అందుకోసం ముందుగా కొరియన్ స్త్రీలు డబుల్ క్లెన్సింగ్ని ఫాలో అవుతుంటారు. పాలను సహజ క్లెన్సింగ్లా వాడుకోవచ్చు. ► కొరియన్ స్త్రీలు క్రీమ్స్ కంటే షీట్ మాస్క్లు ఎక్కువగా వాడతారు. దీనివల్ల చర్మం కాంతివంతంగా, హైడ్రేటెడ్గా మారుతుంది. ► టోనర్లు చర్మం పీహెచ్ స్థాయిలని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. యాపిల్ సైడర్ వెనిగర్, రోజ్ వాటర్ అన్ని చర్మ రకాలకు బెస్ట్ టోనర్గా పనిచేస్తుంది. ► ఇక ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ప్రతిరోజూ సన్ స్క్రీన్ ధరించడం చాలా ముఖ్యం. అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకోవడం కోసం SPF-20, అంతకన్నా ఎక్కువ ఉన్న సన్స్క్రీన్ను ధరించడం చాలా ముఖ్యం. ► అయితే ఎంత స్కిన్ కేర్ పాటించినా నిద్ర కూడా అంతకంటే ఎక్కువే ముఖ్యం. రోజుకి కనీసం 8 గంటల పాటు నిద్రపోవడం వల్ల చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. వానకాలంలో జలుబు, దగ్గు నుంచి ఉపశమనం మిరియాలు మంచి ఘాటు వాసనను కలిగి ఉంటాయి. ఈ కారణంగానే వీటిని మసాజ్ ఆయిల్ తయారీలో ఒక వనరుగా ఉపయోగిస్తారు. ఈ ఆయిల్తో మర్దనా చేసుకోవడం లేదా కొన్ని చుక్కలు నీటిలో కలుపుకొని స్నానం చేస్తే కండరాల నొప్పులు, ఒళ్లు నొప్పులు, గాయాలు తగ్గుతాయి. గ్లాసు మంచినీరు, ఐదు లేక ఆరు మిరియాలు, ఒక ముక్క తెల్ల ఉల్లిపాయ, చితక్కొట్టిన అల్లం ముక్క ఒకటి, చిన్న బెల్లం.. ఇవన్నీ వేసి నీరు సగం అయ్యేంత వరకు కాచండి. వేడిగా ఉండగానే తాగండి. దీనిని సేవించడం వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. భరించరానంత తలనొప్పి తగ్గాలంటే పది తులసి ఆకులు, పది నల్ల మిరియాలను నూరి అందులో టీ స్పూను తేనె కలిపి రోజుకు మూడు సార్లు తినాలి. -
రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగిందా? వీరిలో ముప్పెక్కువ
ఈరోజుల్లో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం ఎక్కువగా చూస్తున్నాం. మనం తీసుకునే ఆహార పదార్థాల్లోని ‘ప్యూరిన్’ అనే రసాయనం విచ్ఛిన్నం అయినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది.శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే అనేక ఆనోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే కొన్ని ఆరోగ్య నియమాలు పాటిస్తే యూరిక్ యాసిడ్ స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. అవేంటో చూద్దాం. శరీరంలో యూరిక్ యాసిడ్ మోతాదులు పెరిగితే... అది సాధారణంగా కాలి బొటనవేలి ఎముకల మధ్యనో లేదా ఏ మోకాలు ప్రాంతంలోనో ఓ స్ఫటికంగా రూపొందుతుంది. అక్కడి ఎముకలతో ఒరుసుకుపోతూ... తీవ్రమైన నొప్పిని కలిగిస్తుందన్నది చాలామందికి తెలిసిన విషయమే. ఇలా వచ్చే కీళ్లనొప్పుల్ని ‘గౌట్’ అని అంటారు. ఇటీవలి కాలంలో యూరిక్ యాసిడ్ సమస్య చాలామందిని వేధిస్తుంది. తిన్న ఆహారం జీర్ణం అయిన తర్వాత విడుదల చేసే పోషకాలలో ఇది కూడా ఒకటి. యూరిక్ యాసిడ్ ఎప్పటికప్పుడు యూరిన్ ద్వారా బయటకు వెళ్లిపోతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినా, విసర్జన సరిగా జరగకపోయినా ఇది రక్తంలో ఉండిపోతుంది. క్రమంగా ఇవి స్ఫటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతాయి. ముప్పు ఎవరెవరిలో ఎక్కువ...? యూరిక్ యాసిడ్ మోతాదులు పెరిగే అవకాశాలు కొందరిలో మరీ ఎక్కువ. వారెవరంటే... మద్యం తీసుకునేవారు మధుమేహం (డయాబెటిస్)తో బాధపడేవారు ∙అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవారు ∙రక్తాన్ని పలుచబార్చే మందులు వాడేవారిలో... ముప్పు ఎక్కువ. శరీరంలో మోతాదుకు మించి యూరిక్ యాసిడ్ ఉంటే కడుపులో మంట,కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సమస్యలు, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, చేతుల వేళ్ళు వాపులు వంటి ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. యూరిక్ యాసిడ్ ఇలా చేస్తే కంట్రోల్లో.. లేత సొరకాయ చెక్కు తీసి, చిన్న ముక్కలు చేసి, ఎటువంటి నీళ్లు పొయ్యకుండా మిక్సీలో వేసి, ఆ గుజ్జును (ఫిల్టర్ చెయ్యకుండా) పరగడుపున తినాలి. రోజూ ఒక చిన్న గ్లాసుడు(100ml) తిని చూడండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది. కొన్ని వారాల పాటు అన్ని రకాల నాన్ వెజ్ ఆహారాలు (చికెన్, మటన్, లివర్, చేప, రొయ్యలు మొదలైనవి) పూర్తిగా ఆపేయండి రోజుకు 1 లేదా 2 గుడ్లు వరకు తినొచ్చు రోజుకు కనీసం 4-5 లీటర్ల నీటిని కచ్చితంగా త్రాగండి. తరచుగా నిమ్మకాయలు తీసుకోండి. పీచు పదార్థం అధికంగా ఉండే బీరకాయ, సొరకాయ, బెండ, బ్రోకలీ, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. కాలీఫ్లవర్, పాలకూర, పన్నీర్ మరియు పుట్టగొడుగులు వంటి కూరగాయలను కొన్నాళ్లు నివారించండి. -డా.నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
నల్ల ద్రాక్షతో ఫేస్ప్యాక్ వేసుకుంటే ఏమవుతుందో తెలుసా?
జిడ్డుతత్వం ఉన్న చర్మానికి గ్రేప్స్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. ఈ ప్యాక్ వేసుకుంటే అధికంగా ఉన్న జిడ్డు పోతుంది. పది నల్ల ద్రాక్షపండ్లను పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టులో టేబుల్ స్పూను ముల్తాని మట్టి, టీస్పూను రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట పాటు ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. కొన్ని నల్ల ద్రాక్షపళ్లను బాగా స్మాష్ చేసిగుజ్జు తీయాలి. దానికి చెంచా పంచదార, చిటికెడు పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి సున్నితంగా మర్దన చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఇలా చేస్తే ముఖంపై మృత కణాలన్నీ తొలగిపోతాయి. 5 వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తే ముఖం కాంతిమంతంగా.. యంగ్లుక్తో కనిపిస్తుంది. ఒక కప్పు ద్రాక్ష పళ్లు తీసుకుని చేతులతో పిసికి గుజ్జులా చేయాలి. వాటిలో రెండు చెంచాల పాలు, చెంచా తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తుంటే ముఖంపై ఉండే మొటిమలు తాలూకు మచ్చలు పోయి చర్మం మృదువుగా మెరుపులీనుతుంటుంది. చిన్న టొమాటో తీసుకుని ముక్కలుగా తరగాలి. ఈ ముక్కలకు ఆరు ద్రాక్షపండ్లను జోడించి మెత్తని పేస్టులా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదవులు, కళ్లకు అంటకుండా ముఖానికి, మెడకు అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి. -
పిల్లలు మాట వినకుండా బెట్టు చేస్తున్నారా?ఇలా దారికి తెచ్చుకోండి
ఈకాలం పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం కష్టమే. ఇది చేయకు, అది చేయకు, అలా, ఇలా ఉండకూడదు అని చెబితే అస్సలు వినరు. పెద్దవాళ్లు చెప్పేది తమ మంచికే అన్న స్పృహ ఉండదు వారికి. అయినా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తపన పడుతుంటారు తల్లిదండ్రులు. మాట వినకుండా పెంకిగా ప్రవర్తించే పిల్లలను ఇలా మీ దారిలోకి తెచ్చుకోండి. అప్పుడు ఇక పిల్లలతో పాటు మీరూ సంతోషంగా ఉంటారు. ►మాట వినడం లేదని పిల్లలను తిట్టకూడదు. నువ్వు చెడ్డదానివి లేదా చెడ్డవాడివి అని వారిని నిందించకూడదు. నువ్వు పెద్దదానివి లేదా పెద్దవాడివు అవుతున్నావు కదా... అందుకే ఇలా చేస్తే బాగుంటుంది... అని లాలనగా చెప్పాలి. ► కోపంలో మనం అనే కొన్ని రకాల మాటలు పిల్లల మనసుకు గాయం చేసి, వారి మనసును విరిచేస్తాయి. కొన్నిసార్లు వారి ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతిస్తాయి. అందుకే వీలైనంత వరకు వారికి ఓపికగా అర్థమయ్యేలా వివరించి చెప్పాలి. ►పిల్లలు ఎంత విసిగించినప్పటికీ పెద్దగా అరవకూడదు. పైన చెప్పుకున్నట్టు సున్నితంగా పదేపదే చెబుతూ బుజ్జగించాలి. ఎంత చెప్పినా వినకుండా ఉంటే ముందు వాళ్ల కోపం తగ్గించాలి. తరువాత పిల్లలు విసుక్కోకుండా జాగ్రత్తగా చెప్పాలి. ► చెప్పేది ఏదైనా ప్రేమగా చెబితే ఎంత మొండి చేసేవారైనా తప్పకుండా వింటారు. నచ్చిన డ్రెస్ వేసుకోనివ్వడం, హోం వర్క్ అయిన తరువాత టీవీ చూడనివ్వడం, డాడీతో కలిసి బయటకు వెళ్లడానికి అనుమతించడం వంటివి. ఇలా పిల్లలకు తల్లిదండ్రుల మీద నమ్మకం కలిగించి, తరువాత వారికి మంచి చెడులు వివరించాలి. ►ప్లీజ్, థ్యాంక్యూ, యూ ఆర్ వెల్కమ్ వంటి మర్యాదలు నేర్పించాలి. తల్లిదండ్రులు ఏం మాట్లాడతారో పిల్లలు అదే నేర్చుకుంటారు. అందుకే మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి. ► పిల్లలు వారికి హాని జరిగే పనులు కొన్నిసార్లు చేస్తుంటారు. వెంటనే కేకలేసి, లెక్చర్ ఇవ్వకూడదు. కాస్త దెబ్బలు తగిలినప్పటికీ... వాళ్లు తేరుకున్నాక, మీ మాటలు వినే మూడ్లో ఉన్నప్పుడు మాత్రమే దాని గురించి వివరించాలి. అప్పుడు వారు మరోసారి అటువంటి పనులు చేయరు. -
నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి
కిచెన్ టిప్స్ ►ఒక్కో నిమ్మకాయను అల్యూమినియం ఫాయిల్ల్లో చుట్టి రిఫ్రిజిరేటర్లో పెడితే ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి. ► శాండ్ విచ్ మరీ మెత్తగా కాకుండా చక్కగా రావాలంటే... శాండ్ విచ్లో పెట్టే కూరగాయలు, బ్రెడ్ మయనేజ్, చీజ్ గది ఉష్ణోగ్రతలో ఉండేలా చూసుకోవాలి. ఇంతకు మించి వేడిగా ఉండే తేమ చేరి శాండ్విచ్ మెత్తగా మారిపోతుంది. ► కొన్నిసార్లు పన్నీర్ ముక్కలు ఫ్రై చేసిన తరువాత గట్టిగా మారుతుంటాయి. ఇలాంటప్పుడు పన్నీర్ ముక్కలు ఫ్రై చేసిన తరువాత చల్లని నీటిలో ఐదు నుంచి పదినిమిషాలు ఉంచాలి. తరువాత కూరలో వేస్తే పన్నీర్ ముక్క మృదువుగా, మెత్తగా ఉంటుంది. ► ఉప్పు ఉన్న జాడీలో రెండు పచ్చిమిరపకాయలు వేసి ఉంచితే, వర్షాకాలంలో ఉప్పు చెమ్మచేరి నీరు కారిపోకుండా ఉంటుంది. ► కేక్ చేసేటప్పుడు పిండిలో ఒక చెంచా గ్లిసరిన్ కలిపితే కేకు ఎక్కువకాలం తాజాగా ఉంటుంది. ► బిర్యానీ వండేటప్పుడు ఒక నిమ్మకాయరసం పిండితే అన్నం గడ్డలుగా కాకుండా పొడిపొడిగా ఉంటుంది. ► పులిహోరలో వేరుశనగగుళ్ళు కరకరలాడుతూ ఉండాలంటే విడిగా నూనెలో వేయించండి. అన్నంలో తాలింపు వేశాక, వేడితగ్గాక, అప్పుడు వేరుశనగగుళ్ళు కలపండి. పులిహోర రుచిగా ఉంటుంది. -
వీకెండ్లో మెరిసిపోండి.. ఇలా చేస్తే జుట్టు తెల్లబడదు
ట్యాన్ తగ్గాలంటే... ► స్పూను కాఫీ పొడిలో స్పూను తేనె, స్పూను బంగాళ దుంప రసం, స్పూను గంధం పొడివేసి చక్కగా కలిపితే డీ ట్యాన్ ప్యాక్ రెడీ. ఈ ప్యాక్ను ముఖం, చేతులు, మెడపైన పూతలా వేసి పదిహేను నిమిషాలు ఆరనివ్వాలి. తరువాత తడి బట్టతో తుడిచేసి, నీటితో కడిగేయాలి. ► వారానికి రెండు–మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటే నలుపు పోయి, చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ప్యాక్ వేసుకునే సమయం లేనప్పుడు..టొమాటో రసాన్ని ముఖానికి రాసుకుంటే ట్యాన్ తగ్గుతుంది. ► నిమ్మరసంలో బంగాళదుంప రసం కలిపి ముఖానికి పెట్టుకున్నా ట్యాన్ పోతుంది ► ఈ ప్యాక్లు వేసుకున్నప్పటికీ రాత్రి పడుకునేముందు చేతులు, కాళ్లకు నైట్క్రీమ్ రాసుకుంటే ట్యాన్ తొలగి చర్మం కాంతిమంతంగా మెరుస్తుంది. హెయిర్ కేర్ యాపిల్ సైడర్ వెనిగర్లో కొద్దిగా నీళ్లు కలిపి, తలస్నానం చేసిన జుట్టుకు కుదళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల తల స్నానం చేసిన తరువాత కూడా జుట్టుకు పట్టి ఉండే జిడ్డు వదులుతుంది. వారానికి ఒకసారి ఇలా చేయాలి. ఉసిరి పొడిలో నిమ్మరసం వేసి పేస్టులా కలపాలి. ఈ పేస్టుని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి క్యాప్ పెట్టుకోవాలి. గంట తరువాత మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి. ఈ ప్యాక్లో విటమిన్ సి పుష్కలంగా ఉండి కురులను దృఢంగా మారుస్తుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. త్వరగా తెల్లబడదు. -
ఫస్ట్ టైమ్ ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోకుంటే..
సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. కావున ఉద్యోగస్థులైనా, వ్యాపారస్తులైనా తప్పకుండా ఇల్లు కొనుగోలు లేదా నిర్మించుకోవడం చేస్తారు. అయితే ఇల్లు కొనుగోలు చేసే వారు మాత్రం తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 👉ఇల్లు కొనటం అనేది కేవలం భావోద్వేగానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఆర్థిక పరమైన అంశం కూడా. కావున ఇల్లు కొనేటప్పుడు ఎక్కడ కొనుగోలు చేస్తున్నాము, ధర ఎంత ఉంది అనే మరిన్ని విషయాలు ముందుగానే తెలుసుకోవాలి. సొంత ఇల్లు భద్రతాభావం అందిస్తుంది. 👉కొత్త ఇల్లు కొనుగోలు చేయడంలో సరైన నిర్ణయం తీసుకోకుంటే అది విపరీత పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది. అభివృద్ధి చెందని ప్రాంతంలో ఇల్లు కొనుగోలు చేస్తే, అవసరమైన సౌకర్యాలు లభించకపోగా.. రవాణా & ఇతర ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. 👉సాధారణంగా ఇంటికయ్యే ఖర్చులో 10 నుంచి 20 శాతం డౌన్ పేమెంట్ అవసరం. అయితే మిగిలిన మొత్తం బ్యాంకుల నుంచి హోమ్ లోన్ రూపంలో తీసుకునే వెసులుబాటు ఉంటుంది. మీ దగ్గర ఉన్న బడ్జెట్లో ఇల్లు కొనుగోలు చేయడానికి అన్వేషించాలి. 👉ఇల్లు కొనుగోలు చేస్తే మాత్రం సరిపోదు.. దానికి కట్టుదిట్టమైన రిజిస్ట్రేషన్ వంటివి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఖర్చులు మీరు ఇల్లు కొనుగోలు చేసే డబ్బుతో పాటు అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. ఇది కొంత ఆర్థిక ఒత్తిడికి దారితీయవచ్చు. 👉బిల్డర్లు లేదా ప్రాపర్టీ డీలర్లతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇల్లు కొనటానికి ముందే లాయర్ను సంప్రదించడం మంచిది. ఎందుకంటే మీరు తీసుకోబోయే ప్రాపర్టీకి కో-ఓనర్ ఎవరైనా ఉన్నారా? లేదా? అనేది ముందుగానే తెలుసుకోవాలి. అంతే కాకుండా తీసుకోబోయే ప్రాపర్టీ లిటిగేషన్స్ ఏవైనా ఉన్నాయా చెక్ చేసుకోవాలి. అన్ని సరిగ్గా ఉన్నాయన్న తరువాతే రిజిస్టర్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు నిశ్చింతగా కొత్తింట్లో అడుగుపెట్టవచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కావలసిన వివరాలు తెలుసుకోకుండా.. ఇల్లు కొంటే భవిష్యత్తులో ఏదైనా సమస్యలు తలెత్తవచ్చు. దీనిని వినియోగదారుడు గుర్తుంచుకోవాలి. -
కిచెన్ టిప్స్: ఇలా చేస్తే వంకాయలు రంగు మారకుండా ఉంటాయి
కిచెన్ టిప్స్ ►వంకాయ ముక్కలను కోసిన వెంటనే ఉప్పు నీటిలో వేయాలి.టేబుల్ స్పూను నిమ్మరసం వేసిన నీటిలో కోసిన వంకాయ ముక్కలపై వేస్తే రంగుమారవు. ►రెండు స్పూన్ల నీటిలో స్పూను పాలు పోసి చక్కగా కలపాలి. ఈ పాల మిశ్రమాన్ని వంకాయ ముక్కలపై చల్లాలి. ముక్కలు చేదుగా మారవు. వంకాయ ముక్కలు లేదా కూరగాయ ముక్కలు వేసే నీటిలో టేబుల్ స్పూను వెనిగర్ వేసి కలపాలి. అప్పుడు కూరగాయ ముక్కలు రంగు మారకుండా ఉంటాయి. ►పండిన అరటిపండు గుజ్జు, కొద్దిగా పెరుగు వేసి చపాతీపిండిని ముద్దగా కలిపితే చపాతీలు మరింత మృదువుగా మెత్తగా, రుచికరంగా ఉంటాయి. ►సమోసా పిండిలో కొద్దిగా నిమ్మరసం వేసి కలిపితే సమోసాలు మరింత క్రిస్పీగా కరకరలాడతాయి. వర్షంలోనూ క్లియర్ వ్యూ మిర్రర్ వర్షాకాలంలో కారు అద్దాలు తడిసి ఎదురుగా వస్తోన్న వాహనాలు సరిగా కనపడవు. వైప్స్, గుడ్డతో తుడిచినప్పటికీ ఇంకా మసకమసకగానే కనిపిస్తుంది. ఇలా కాకుండా అద్దం క్లియర్గా కనిపించాలంటే.. బంగాళ దుంపను రెండు చెక్కలు చేయాలి. ఒక చెక్కను తడిసిన అద్దంపై రుద్దాలి. అద్దం మీద ఉన్న తడిపోయి క్లియర్గా ఉంటుంది. మరోసారి వర్షం నీళ్లు పడినా సులభంగా జారిపోయి అద్దం స్పష్టంగా కనిపిస్తుంది. -
రోజూ ఇలా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి
కొంతమందికి కనుబొమలు బాగా పలుచగా, ఉండీ లేనట్టుగా కనిపిస్తాయి. కనుబొమలు తీరైన ఆకృతితో, దట్టంగా ఉంటేనే ముఖారవిందం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పలుచని కనుబొమ్మలను ఒత్తుగా... నల్లగా మార్చుకోవడానికి ఇలా ప్రయత్నించి చూడండి... ఆముదం: జట్టు పెరుగుదలకు దోహదపడే వాటిలో ఆముదం ముందు వరుసలో ఉంటుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, విటమిన్ ఇ, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. దూదిని ఆముదంలో ముంచి పలుచని ఐబ్రోస్ మీద అద్దుకుని ఐదు నిమిషాలు మర్దన చేయాలి. రోజూ ఇలా చేయడం వల్ల వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. ఉల్లిపాయ రసం: ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఉల్లిపాయ రసాన్ని రోజూ కనుబొమలకు రాసుకోవాలి. రెండు మూడు వారాల్లోనే చక్కని ఫలితం కనిపిస్తుంది. ఆలివ్ ఆయిల్ : ఫీనాలిక్ కాంపౌండ్స్ ఉండే ఆలివ్ నూనెను కనుబొమ్మలకు రాస్తే .. వెంట్రుకలు నల్లగా పెరుగుతాయి. -
ఇంటి చిట్కాలతో బ్లాక్ సర్కిల్స్కు చెక్ పెట్టండి
సాధారణంగా మనలో చాలామందికి కొన్నిసార్లు మోకాళ్లు, మోచేతుల వద్ద నల్లగా మారుతుంటుంది.దీంతో నలుగురిలోకి వెళ్లినప్పుడు ఆయా భాగాలు కనబడకుండా కవర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొంత మందికి ఎన్ని జాగ్రత్తలు పాటించినా నల్లటి వలయాలు బాధిస్తుంటాయి. ఈ సమస్యకు సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టవచ్చు. అదెలా చూసేద్దాం. ►టీ స్పూన్ నిమ్మరసంలో స్పూన్ నీళ్లు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో దూది ఉండను ముంచి చర్మం మీద రాయాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. రోజూ ఈ విధంగా చేయడం వల్ల నలుపు తగ్గుతుంది. ►రోజ్వాటర్లో దూది ఉండను ముంచి, నలుపు ఉన్న చోట రాయాలి. అలాగే శనగపిండిలో కొన్ని చుక్కల రోజ్వాటర్ పోసి, పేస్ట్ చేసి రాయాలి. ఈ విధంగా రోజూ చేయాలి. ►అవకాడో పండును గుజ్జు చేయాలి. ఈ గుజ్జును కళ్లకింద ముఖమంతా రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవచ్చు. అవకాడోలో ఉన్న సహజ ఔషధ గుణం చర్మం పిగ్మెంటేషన్ను తగ్గిస్తుంది. ► ఒక ఆలుగడ్డను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వాటిని నేరుగా మోచేతులు, మోకాళ్లపై రుద్దవచ్చు. లేదా వాటి రసం తీసి ఆయా భాగాలపై రాయాలి. తరువాత 30 నిమిషాలు ఆగి గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారం రోజుల పాటు చేస్తు తప్పక ఫలితం కనిపిస్తుంది. ► ఒక టీస్పూన్ బొప్పాయిరసం, అంతే మొత్తంలో తేనె తీసుకుని బాగా కలిపి మిశ్రమంలా చేయాలి. దీన్ని రాస్తుంటే మోచేతులు, మోకాళ్లపై ఉండే నలుపుదనం పోతుంది. -
ఇలా చేస్తే ఏడాదికి 60 లక్షల ఆదాయం! 10 ఏళ్ల వరకు గ్యారెంటీ!
Blueberry Farming: రోజులు మారుతున్నాయి. డబ్బు సంపాదించాలంటే ఉద్యోగమే చేయాలనే విధానానికి నేటి యువత చెక్ పెడుతున్నారు. వ్యవసాయం మీద ఆసక్తితో విదేశాల్లో ఉద్యోగాలు వదిలి మళ్ళీ మన దేశానికే వస్తున్నారు. ఆధునిక పద్దతులతో, శాస్త్రీయమైన విధానంతో పంటలు పండించి లాభాలను పొందుతున్నారు. ఈ కథనంలో మనం 'బ్లూబెర్రీ' (Blueberry) సాగుతో మంచి ఆదాయం ఎలా పొందాలనే వివరాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఒకప్పటి నుంచి పండిస్తున్న వరి, రాగి వంటివి మాత్రమే కాకుండా కూరగాయలు, పండ్లు వంటివి కూడా టెక్నాలజీ ఉపయోగించి పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే డ్రాగెన్ వంటి విదేశీ పంటల విషయంలో కూడా నేర్పు ప్రదర్శిస్తున్నారు. ఇక చాలామంది అనేక ప్రాంతాల్లో ఇప్పటికే అమెరికన్ బ్లూబెర్రీ సాగుచేస్తున్నారు. అనేక పోషక విలువలు కలిగిన బ్లూబెర్రీని ఎక్కువమంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో కేజీ రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. అమెరికన్ సూపర్ ఫుడ్గా భావించే ఈ బెర్రీస్ ప్రపంచ వ్యాప్తంగా అధిక డిమాండ్ పొందుతున్నాయి. మన దేశంలో వీటి ఉత్పత్తి చాలా తక్కువ, కావున అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతోంది. 10 సంవత్సరాల పాటు పండ్లు.. ప్రస్తుతం మన దేశంలో పండుతున్న విదేశీ పంటల్లో అమెరికన్ బ్లూబెర్రీ ఒకటి. దీని సాగుతో అధిక లాభాలను పొందవచ్చు. బెర్రీస్ సాగులో ఉన్న ఒక బెనిఫిట్ ఏమిటంటే.. దీనిని ఒకసారి నాటితే సుమారు 10 సంవత్సరాల పాటు పండ్లు వస్తూనే ఉంటాయి. బెర్రీస్లో అనేక రకాలు ఉన్నాయి. ఇదీ చదవండి: ఫుడ్ ఆర్డర్ బిల్ చూసి ఖంగుతిన్న మహిళ - జొమాటో రిప్లై ఇలా.. అనేక విటమిన్లు, పోషకాలతో నిండిన ఈ పండ్లకు గిరాకీ ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంది. కావున తగిన జాగ్రత్తలు తీసుకుని పండిస్తే తప్పకుండా ఆశించిన లాభాలను పొందవచ్చు. ఈ పంటకు అనువైన కాలం ఏప్రిల్, మే నెలలు అని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కలు 10 నెలలకే ఉత్పత్తి ఇవ్వడం మొదలు పెడతాయి. కావున ఫిబ్రవరి & మార్చి సమయంలో కోతకు వస్తాయి. జూన్ నెల వరకు దిగుబడి వస్తుంది. ఇదీ చదవండి: భయపడుతున్న ఫోన్పే & గూగుల్ పే! యూజర్లకు ఇది శుభవార్తే.. సంవత్సరానికి రూ. 60 లక్షల వరకు.. దిగుబడి అయిన తరువాత మొక్కలను కొంత కత్తిరించినట్లయితే.. మళ్ళీ చిగురిస్తాయి. ఈ విధంగా చేయడం వల్ల ఉత్పత్తి మరింత ఎక్కువవుతుంది. ఎకరం భూమిలో సుమారు 3000 మొక్కలు నాటవచ్చు. ఒక చెట్టు సుమారు 2 కేజీల వరకు పండ్లు అందిస్తుంది. కేజీ రూ. 1000 విక్రయిస్తే సంవత్సరానికి రూ. 60 లక్షల వరకు సంపాదించవచ్చు. ఈ పంట పండించాలనుకునే వారు అవగాహన ఉన్న వ్యక్తులను లేదా ఇప్పటికే పంట పండిస్తున్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది. -
వర్షాకాలంలో చర్మం ఆరోగ్యం కోసం ఇలా చేయండి
ఈ కాలం జిడ్డు చర్మం గలవారి సమస్య మరింత పెరుగుతుంటుంది. అలాగే, ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా పెరిగే అవకాశం ఉంది. డీ హైడ్రేట్ అయ్యి చర్మం నిస్తేజంగా మారే అవకాశం ఉంది. ఈ సమస్యలకు విరుగుడుగా.. ► జిడ్డు, మలినాలను తొలగించడానికి క్లెన్సర్ను ఉపయోగించాలి. దీనివల్ల మృతకణాలు సులువుగా తొలగిపోతాయి. ► సహజసిద్ధమైన క్లెన్సర్ కావాలనుకుంటే ఇందుకు ఓట్ మీల్, చక్కెర లేదా పండ్ల గుజ్జును వాడుకోవచ్చు. ► చర్మం పొడిగా మారితే బాదం నూనె లేదా మాయిశ్చరైజర్ని ఉపయోగించాలి. రోజూ పది గ్లాసుల నీళ్లు తాగాలి. ► ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి వ్యక్తిగత పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలి. తేమ ఉండే చోట ఫంగల్ పౌడర్లు, క్రీములను ఉపయోగించాలి. ► చర్మం తాజాగా ఉండాలంటే మీ ఆహారంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్లను చేర్చాలి. ► ఒత్తిడిని ఎదుర్కోవడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇవి దోహదపడతాయి. ► వేప, తులసి, పసుపు, కలబంద వంటి వాటిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ► వీటిని చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి పై పూతలుగా వాడితే ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడతాయి. -
డ్రైఫ్రూట్స్.. ఇలా చేస్తే వర్షాకాలంలో ఫ్రెష్గా ఉంటాయి
బ్రెడ్ ప్యాకెట్లో కొన్ని స్లైసులను మాత్రం వాడి మిగిలిన వాటిని ప్యాకెట్లో అలానే ఉంచేస్తుంటాం. అయితే అవి కొన్నిసార్లు రాయిలా గట్టిగా మారతాయి. ఇటువంటప్పుడు బ్రష్ను నీటిలో ముంచి స్లైసులపైన రాయాలి. తరువాత కొద్దిగా నీటిని చల్లి, స్లైసులను పదిహేను సెకన్ల పాటు అవెన్లో ఉంచితే మెత్తగా తాజాగా మారిపోతాయి. డ్రైఫ్రూట్స్ని మార్కెట్ నుంచి తెచ్చిన తరువాత కొద్దిగా ఉప్పువేసి దోరగా వేయించి, గాలిచొరబడని డబ్బాలో నిల్వచేస్తే వర్షాకాలంలోనూ మెత్తబడకుండా, పాడవకుండా కరకరలాడతాయి. ఒక గుడ్డు తెల్ల సొనలో స్పూను తేనె వేసి చక్కగా కలపౠలి. ఈ మిశ్రమాన్ని ముక్కుమీద, చుట్టూ పూతలా వేసి ఇరవై నిమిషాలు ఆరనివ్వాలి. పూర్తిగా ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల బ్లాక్ హెడ్స్ సమస్య తగ్గుముఖం పడుతుంది. -
పెసరపప్పుతో ముఖం కాంతిమంతంగా.. ఈ ప్యాక్ ట్రై చేయండి
పొట్టు ఉన్న పెసర పప్పుని నాలుగు టీస్పూన్లు తీసుకుని రెండు గంటలు నానబెట్టి పేస్టు చేయాలి. ఈ పేస్టులో టీస్పూను ఆరెంజ్ పీల్ పొడి, టీస్పూను గంధం పొడి వేసి చక్కగా కలపాలి. ఈ పేస్టుని ముఖానికి పూతలా వేసి పదినిమిషాలు ఆరనివ్వాలి. తరువాత కొద్దిగా నీటితో తడిచేసి మర్దన చేసి కడిగేయాలి. వారానికి మూడు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతిమంతంగా, అందంగా కనిపిస్తుంది. -
వంటింటి చిట్కాలు: కిచెన్లో నూనె ఒలికిపోతే ఇలా చేయండి
కిచెన్ టిప్స్ కూర అడుగంటినప్పుడు రెండు మూడు ఐస్ క్యూబ్స్ను వేసి కరిగేంత వరకు తిప్పాలి. ఇలా చేస్తే పాత్రకు అంటుకున్నది విడిపోయి కూర అడుగంటకుండా ఉంటుంది. కిచెన్లో నూనె వొలికిపోతే వెంటనే వొలికిన నూనె మీద గోధుమ పిండి చల్లాలి. ఐదు నిమిషాల తరువాత పేపర్తో తుడిస్తే నూనె పడిన ప్రాంతం జిడ్డులేకుండా శుభ్రం పడుతుంది. వర్షాకాలంలో వాతావరణంలోని తేమను పీల్చుకుని... డోర్లు వేసినప్పుడు, తీసినప్పుడు కిర్రుమని శబ్దాలు చేస్తుంటాయి. డోర్లను పట్టి ఉంచే బోల్టుల వద్ద కొద్దిగా టాల్కం పౌడర్ చల్లడం వల్ల లేదా కొవ్వొత్తిని రుద్దడం వల్ల ఆ శబ్దాలు రాకుండా ఉంటాయి. ఈ వర్షాకాలంలో ఇలా కడగడం వల్ల పండ్లు, కూరగాయలు త్వరగా పాడవకుండా ఉండాలంటే.. వేడినీళ్లలో రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసి కలపాలి. ఈ నీటిలో పండ్లు, కూరగాయలను పదిహేను నిమిషాలు ఉంచి, తరువాత సాధారణ నీటితో కడిగేయాలి. -
వర్షాకాలంలో ఇలా చేస్తే బిస్కెట్లు క్రిస్పీగా ఉంటాయి..
వర్షాకాలంలో కూడా బిస్కెట్లు మెత్తగా అవకుండా కరకరలాడాలంటే ఇలా చేసి చూడండి... ప్లాస్టిక్, అల్యమినియం డబ్బాలు, గాజు పాత్రల్లో బిస్కెట్లు, కుకీలను నిల్వచేయాలి. గాలిచొరబడకుండా పెడితే ఎక్కువ రోజులపాటు క్రిస్పీగా ఉంటాయి. డబ్బాల్లో నిల్వచేసేటప్పుడు అడుగు భాగంలో రెండుమూడు వరుసల్లో టిష్యపేపర్లు వేసి తరువాత బిస్కట్లు పెట్టాలి. బిస్కట్లపైన మరో రెండు వరుసల్లో టిష్యపేపర్లు వేసి పైన బిస్కెట్లు పెట్టాలి. ఇలా నిండుగా పెట్టి గాలిచొరబడకుండా మూత పెట్టాలి. జిప్లాక్ పౌచ్లలో నిల్వచేస్తే కూడా కుకీలు తాజాగా ఉంటాయి. గాలిచొరబడని డబ్బాలు, జిప్లాక్ పౌచ్లను రిఫ్రిజిరేటర్లో పెడితే మరిన్ని రోజులు బిస్కెట్లు తాజాగా ఉంటాయి. అనుకోకుండా సరిగా నిల్వచేయనప్పుడు మెత్తబడిన కుకీలను అవెన్ లేదా ఎయిర్ఫ్రైయర్లో పదినిమిషాలు వేడిచేస్తే మళ్లీ క్రిస్పీగా మారతాయి. వీటిని కూడా నిల్వ చేసుకోవచ్చు. -
ధనవంతుడవ్వాలనే తపన సరిపోదు.. ఈ టిప్స్ తప్పనిసరి!
ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్నతమైన స్థానానికి ఎదగాలని, ధనవంతుడు కావాలని.. బ్రాండెడ్ దుస్తులు, ఖరీదైన కార్లు, బంగ్లాలు కొనాలని కలలు కంటూ ఉంటారు. అయితే కొన్ని రోజుల తరువాత ఇవన్నీ మనవల్ల అయ్యేపని కాదని మధ్యలోనే ఊరుకునే అవకాశం ఉంటుంది. అయితే ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా మీరు అనుకున్న సక్సెస్ సాధిస్తారు.. తప్పకుండా ధనవంతులవుతారు. దీనికి సంబంధించిన కొన్ని టిప్స్ ఈ కథనంలో తెలుసుకుందాం. స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం.. ధనవంతుడు కావాలని కలలు కనే ప్రతి ఒక్కరికి ఒక మంచి సులభమైన మార్గం స్టాక్ మార్కెట్ అనే చెప్పాలి. జీవితంలో డబ్బు పొదుపుచేయడం ఎంత ముఖ్యమో.. వాటిని ఇన్వెస్ట్ చేయడం కూడా అంతే ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఇన్వెస్ట్మెంట్లో నష్టాలు వస్తాయని భావించవచ్చు, కానీ సరైన అవగాహన ఉంటే అలాంటి సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. డైవర్సిఫికేషన్ చాలా అవసరం.. సంపాదించి కూడబెట్టిన డబ్బు ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయకుండా.. వివిధ రంగాల్లో పెట్టుబడులుగా పెట్టాలి. అంటే మీదగ్గరున్న డబ్బు కేవలం స్టాక్ మార్కెట్ మీద మాత్రమే కాకుండా.. గోల్డ్ లేదా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడం వంటివాటిలో పెట్టుబడిగా పెట్టాలి. అప్పుడు ఒక రంగంలో నష్టం వచ్చినా.. మరో రంగంలో తప్పకుండా లాభం వస్తుంది. దీనిని ఎప్పుడూ మరచిపోకూడదు. అప్పులు చేయడం మానుకోవాలి.. సంపాదనకు తగిన ఖర్చులను మాత్రమే పెట్టుకోవాలి. విచ్చలవిడి ఖర్చులు చేస్తూ.. డబ్బు కోసం ఎక్కడపడితే అక్కడ అప్పులు చేస్తే తరువాత చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. దీనిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అప్పు మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతుందనే విషయం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఇదీ చదవండి: నకిలీ మందులకు చెక్.. ఒక్క క్యూఆర్ కోడ్తో మెడిసిన్ డీటెయిల్స్! గోల్ చాలా ముఖ్యం.. నువ్వు ధనవంతుడు కావాలంటే ముందుగా తప్పకుండా కొన్ని రూల్స్ పాటించాలి. ఫైనాన్సియల్ గోల్స్ పెట్టుకోవాలి. మీ ప్రయాణాన్ని గోల్ వైపు సాగిస్తే తప్పకుండా అనుకున్నది సాదిస్తావు. ఇల్లు, కారు ఇతరత్రా ఏమి కొనాలనుకున్న ముందుగా ఒక ప్రణాలికను సిద్ధం చేసుకోవాలి. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు.. లక్షల కోట్ల సంపద, వేల ఎకరాల భూమి స్మార్ట్ ఇన్వెస్ట్ అవసరం.. ఇన్వెస్ట్ అంటే ఎదో ఒక రంగంలో గుడ్డిగా వెళ్లిపోవడం కాదు.. అలోచించి చాలా స్మార్ట్గా పెట్టుబడి పెట్టాలి. ట్యాక్స్ సేవింగ్స్, ఫండ్స్ వంటి వాటిని ఎంచుకోవాలి. తక్కువ సమయంలో అధిక వడ్డీ వచ్చే రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం మరచిపోకూడదు. యువకుడుగా ఉన్నప్పుడే రిస్క్ తీసుకోవాలి.. అప్పుడే సక్సెస్ పరుగెత్తుకుంటూ వస్తుంది. ధనవంతుడు కావాలనే కోరిక ఉంటే సరిపోదు.. దాని కోసం అహర్నిశలు ఆలోచించాలి, ఆ మార్గంలోనే ప్రయాణం కొనసాగించాలి. తెలియని రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందు దాని గురించి తప్పకుండా తెలుసుకోవాలి, వీలైతే నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఎక్కడ, ఎలా పెట్టుబడులు పెడుతున్నావో తెలియకపోతే భవిష్యత్తులో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
ఇది ఆడవాళ్లకు మాత్రమే.. బొట్టు తీయకుండా నిద్రపోతున్నారా?
బొట్టుబిళ్ల పెట్టుకునే ప్రదేశంలో కొన్నిసార్లు దురద, దద్దుర్లు, వాపు, మచ్చలు ఏర్పడుతుంటాయి. బొట్టుపెట్టుకునే ప్రదేశంలో చర్మం పొడిబారడం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. వీటిని అధిగమించేందుకు ఇలా చేయండి చాలు... మాయిశ్చరైజర్ : బొట్టుబిళ్ల తీయకుండా అదేపనిగా ఉంచడం వల్ల చర్మం పొడిబారి దురద వస్తుంటుంది. ఇలాంటప్పుడు రాత్రి పడుకునే ముందు బొట్టుబిళ్లను తీసి మాయిశ్చరైజర్ రాసి మర్దన చేయాలి. ఇది పొడిబారిన చర్మానికి తేమనందించి దురదను తగ్గిస్తుంది. నూనె: రోజూ రెండు నిమిషాల పాటు కొబ్బరి లేదా నువ్వుల నూనె రాసి మర్దన చేయాలి. దీనివల్ల చర్మానికి తేమ అంది మచ్చపడకుండా ఉంటుంది. జెల్ : అలోవెరా జెల్ను రాసి మర్ధన చేయడం వల్ల అక్కడ ఏర్పడే దద్దుర్లు, మొటిమలు పోతాయి. అలోవెరా జెల్లోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు చర్మాన్ని దురద, దద్దుర్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. గ్లూ తక్కువగా : బొట్టు బిళ్లలను ఎంపిక చేసేటప్పుడు గ్లూ, గమ్ తక్కువగా ఉండే వాటినే ఎంచుకోవాలి. రాత్రి పడుకునే ముందు బొట్టుబిళ్లను తీసేసి మాయిశ్చర్ రాసుకుని పడుకోవాలి. ఉదయం బొట్టు బిళ్ల పెట్టుకుంటే ఏ సమస్యా ఉండదు. -
వాటికి దూరంగా ఉంటాను.. అదే నా బ్యూటీ సీక్రెట్: సాయిపల్లవి
హీరోయిన్ సాయిపల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేచురల్ బ్యూటీగా, లేడీ పవర్ స్టార్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ స్టేటస్ని సొంతం చేసుకుంది. ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సాయిపల్లవి తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచేసింది. గ్లామర్కు దూరంగా, నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ తనకంటూ సెపరేట్ స్టైల్ని క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. అయితే ఇప్పటిదాకా తెలుగులో వరుసగా చిత్రాలు చేస్తూ వచ్చిన సాయిపల్లవి అనూహ్యంగా గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు ఈమె చేతిలో కమలహాసన్ నిర్మించనున్న ఓ సినిమా మాత్రమే ఉంది. సినిమాల సంగతి పక్కన పెడితే సాయిపల్లవి మేకప్ లేకపోయినా ఎంతో అందంగా ఉంటుంది. దాని వెనుకున్న బ్యూటీ సీక్రెట్ను ఆమె బయటపెట్టింది. ''తాజా ఆకుకూరలు, కూరగాయలు, పళ్లు తీసుకుంటాను. కెమికల్ బ్యూటీ ప్రొడక్ట్స్కి నేను దూరం. వారంలో కనీసం మూడు రోజులు ఎక్సర్సైజ్ చేస్తాను. తగినన్ని మంచినీళ్లు తాగుతాను'' అంటూ తన అందం వెనకున్నరహస్యాన్ని బయటపెట్టింది. -
బ్రేక్ఫాస్ట్లో రోజూ అరటిపండు తింటున్నారా? అస్సలు అలా చేయకండి
రోజూ ఉదయం అల్పాహారం తప్పనిసరి అని న్యూట్రిషనిస్టులు చెబుతున్నా కొందరు ఏమాత్రం దీన్ని ఫాలో అవ్వరు. ఖాళీ కడుపుతోనే బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసేస్తుంటారు. ఇలా దీర్ఘకాలం చేయడం వల్ల గ్యాస్ట్రిక్తో పాటు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోక తప్పదు. కొందరు బరువు తగ్గాలనే ఉద్దేశంతో ఉదయం పూట టిఫిన్ చేయరు. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ తప్పనిసరిగా బ్రేక్ఫాస్ట్ చేయాలని, మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. మరి ఎలాంటి ఆహారాన్ని బ్రేక్ఫాస్ట్లో భాగం చేసుకోవాలి? దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అన్నది ఇప్పుడు చూద్దాం. ► బ్రేక్ఫాస్ట్ తినకపోతే సన్నబడ్డం మాట పక్కన ఉంచితే లావు అయ్యే ప్రమాదం ఎక్కువ ఉందని పలు పరిశోధనల్లో తేలింది. ► కొందరు ఓ గ్లాసు పాలతోనే, ఓ చిన్న పండుతోనే బ్రేక్ఫాస్ట్ని ముగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల కాసేపటికే ఆకలి మొదలై కనిపించినవన్నీ తినేస్తుంటాం. దీని వల్ల అమాంతం బరువు పెరిగే ఆస్కారం ఉంటుంది. ► ఉదయాన్ని ప్రోటీన్లు, మంచి కొవ్వులు కలగలిపిన ఆహారాన్ని తీసుకోవాలి. సోయా, పప్పు గింజలు, పాలు, పనీర్, గుడ్డు వంటివి బ్రేక్ఫాస్ట్కి బెస్ట్ ఛాయిస్. ► తృణధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అన్ని పోషకాలు అందుతాయి. రాగుల్లో అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది. అందుకే ఉదయాన్ని రాగిజావ తీసుకోవడం మంచిది. ► ఓట్స్ పాలు, డ్రైఫ్రూట్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ► పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.. అందుకే రోజూ ఊదయన్నే పాలకూర దోశ తినటం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. ► చాలామంది అల్పాహారంలో ఇడ్లీ తీసుకుంటుంటారు. దీంతో పాటు ఒక గ్లాసు పాలు కూడా జత చేసుకుంటే అలసట ఉండదు. ► ఎక్కువ టైం లేదనుకుంటే మొలకెత్తిన పెసలతో చేసిన ఫ్రూట్ సలాడ్ను తీసుకోవాలి. ► మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం వేరుశనగలు, అవిసెలు వంటివి జతచేర్చుకుంటే శరీరానికి మంచి కొవ్వులు అందుతాయి. ► ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్తో కూడిన ఓట్స్, అటుకులు, ఉప్మాను అల్పాహారంలో తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్లో అరటిపండు తినకూడదా? అరటిపండ్లలో పోషక విలువలు ఎంత ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇందులో దాదాపు 25 శాతం చక్కెర ఉంటుంది. చాలామంది బ్రేక్ఫాస్ట్గా అరటిపండ్లను తీసుకుంటుంటారు. వీటిని తినడం వల్ల తాత్కాలికంగా బలంగా అనిపించినా కాసేపటికే అలసటగా, ఆకలిగా అనిపించేలా చేస్తుంది. అరటిపండులోని చక్కెర బూస్ట్ కోరికలను ప్రేరేపిస్తుంది.అందుకే అల్పాహారంలో అరటిపండ్లు తినకూడదని వైద్యులు చెబుతున్నారు.అందుకే ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండ్లను తీసుకోకుండా సాయంత్రం స్నాక్స్గా వీటిని తింటే ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయిని చెబుతున్నారు. -
అరటిపండుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నారా? దానిలోని బి12 చర్మానికి..
ఈరోజుల్లో ఆడవాళ్లు, మగవాళ్లు అనే తేడా లేకుండా అందానికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఒకప్పుడు బ్యూటీ పార్లర్లు అంటే ఆడవాళ్ల కోసమే ప్రత్యేకంగా ఉండేవి. కానీ ఇప్పుడు అబ్బాయిలు కూడా మేం ఎందుకు తగ్గాలి అని సెలూన్ షాప్లకు క్యూ కడుతున్నారు. వేలకు వేలు తగలేసి మరీ కాస్ట్లీ ప్రోడక్ట్లను కొంటున్నారు. అయితే ఖర్చు లేకుండానే మన ఇంట్లో దొరికే వస్తువులతో క్షణాల్లో అందంగా మెరిసిపోవచ్చు. అదెలాగో చూసేద్దాం. బ్యూటీ టిప్స్: అరటి తొక్కతో సహా పండుని ముక్కలుగా తరిగి పేస్టు చేయాలి. ఈ పేస్టుకు రెండు టీస్పూన్ల పచ్చిపాలు పోసి మరోసారి గ్రైండ్ చేసి పదిహేను నిమిషాలు రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పూతలా వేసుకుని, ఇరవై నిమిషాలు ఆరాక కడిగేయాలి. అరటి పండులో ఉన్న విటమిన్ బి 6, బి12, ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం చర్మానికి పోషణ అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ ప్యాక్ను వారానికి రెండుసార్లు వేసుకోవడం వల్ల ముఖ చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. -
స్కూల్కి వెళ్లనని పిల్లలు మారాం చేస్తున్నారా? ఇలా చేసి చూడండి
ఉదయాన్నే పిల్లల్ని తయారు చేసి స్కూలుకు పంపించడం పేరెంట్స్కు పెద్దపని. ఇంతకంటే వాళ్లను నిద్రలేపడం అతిపెద్ద టాస్క్. ఎంత లేపినా నిద్ర లేవరు. కింద స్కూల్ ఆటోనో, బస్సో వచ్చి హారన్ కొడుతుంటుంది. కానీ వీళ్లు లేవరు. వీళ్లను తొందరగా నిద్ర లేపాలంటే ఇలా ప్రయత్నించి చూడండి.... సమస్యను అర్థం చేసుకోవాలి.. ముందుగా నిద్ర లేవడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నారేమో గమనించాలి. రాత్రి సరిగా పడుకున్నారా లేదా... అసలు నిద్రపట్టలేదా... ఇంకేదైనా సమస్య ఉంటే అనునయంగా అడిగి తెలుసుకోవాలి. సరిపోయిందా లేదా? స్కూలుకు వెళ్లే పిల్లలు కనీసం పది గంటలు నిద్రపోవాలి. గేమ్స్, ఫోన్లు చూస్తూ సరిగా పడుకోరు. రోజూ ఒక నిర్దేశిత సమయాన్ని కేటాయించి వాళ్లు కచ్చితంగా పడుకునేలా చేయాలి. ప్రేమతో లేపాలి ఉదయం ఎంత ఉత్సాహంగా లేస్తే రోజంతా అలానే గడుస్తుంది. అందుకే పిల్లలు త్వరగా లేవకపోయినా ప్రేమగా నిద్రలేపాలి. పిల్లలకు అర్థమయ్యే ప్రేమ భాషలోనే నిద్రలేపాలి. ఇందుకోసం వాళ్లకు నచ్చే మంచి విషయాలు, స్కూలుకు వెళ్లడం ఎంతముఖ్యమో ప్రేమతో చెప్పాలి. ఇష్టమైన ఫుడ్ పిల్లలు ఇష్టంగా తినే ఆహారాన్ని బ్రేక్ఫాస్ట్లో ఇవ్వాలి. అది తినడం కోసం అయినా త్వరగా నిద్ర లేస్తారు. ఈ నాలుగు చిట్కాలు ప్రయత్నిస్తే మీ సమస్య తీరినట్టే. -
దిండు లేకుండా పడుకోలేరా? ఈ సమస్యలు తప్పవు
రాత్రిపూట నిద్రించేటప్పుడు చాలామంది తలకింద దిండు పెట్టుకొని పడుకుంటారు. అయితే తక్కువ ఎత్తు ఉన్న దిండు ఫరవాలేదు కానీ, పెద్ద దిండు పెట్టుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. ఇది మొదట్లో తెలియదు కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ముందుగా మెడ నొప్పి ఎదురవుతుంది. ఈ నొప్పి దీర్ఘకాలికంగా వేధిస్తుంది. కొంతమందికి ఉదయం నిద్రలేవగానే వెన్నులో నొప్పితో బాధపడతారు. మీకు ఇలాంటి సమస్య ఎదురైతే పడుకునేటప్పుడు మీరు ఎత్తయిన దిండు ఉపయోగిస్తున్నట్లు లెక్క. దీనివల్ల వెన్నెముక వంగిపోతుంది. డిస్క్లలో దరం పెరిగి వెన్నునొప్పి వస్తుంది. అందువల్ల దిండు లేకుండా నిద్రించడం అలవాటు చేసుకోవాలి. తలలో రక్త ప్రసరణ జరగదు: ఎత్తయిన దిండు పెట్టుకొని నిద్రపోతే తలకి రక్త సరఫరా సరిగ్గా జరగదు. రాత్రిపూట చాలా గంటలు ఇలాగే ఉండటం వల్ల రక్త సరఫరా లేక జుట్టుకు సరైన పోషణ లభించదు. దీనివల్ల జుట్టు రాలే సమస్య మొదలవుతుంది. అంతేకాదు, తరచు తలనొప్పి వస్తుంది. లావుపాటి దిండు పెట్టుకొని నిద్రించడం వల్ల శరీరంలోని కొన్ని భాగాలకి రక్త సరఫరా సరిగ్గా అందక తిమ్మిర్ల సమస్యలు ఏర్పడుతాయి. అందువల్ల మెడనొప్పి ఉండకూడదంటే తక్కువ ఎత్తు ఉండే చిన్న దిండుని ఉపయోగించాలి లేదంటే మెత్తటి టవల్ లేదా పలుచటి దుప్పటిని మడత పెట్టి తలకింద పెట్టుకోవడం ఉత్తమం. -
ఎండుకొబ్బరి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి
ఎండుకొబ్బరిని నిల్వ ఉంచిన కొద్దిరోజులకే కొబ్బరిచిప్ప లోపల బూజులాగా రావడం, కొన్నిసార్లు లోపల తెల్లగా ఉన్నప్పటికీ చేదుగా మారడం చూస్తుంటాం. ఇవేవీ రాకుండా, కొబ్బరిచిప్పలను చింతలేకుండా ఇలా నిల్వచేసుకోండి... మార్కెట్ నుంచి తెచ్చిన ఎండు కొబ్బరి చిప్పలను శుభ్రంగా తుడిచి, ఎండలో ఆరబెట్టాలి. ఆరిన చిప్పలను ఉప్పునీటిలో ముంచిన గుడ్డతో తుడవాలి. ఇప్పుడు కొద్దిగా కొబ్బరినూనెను వేళ్లతో తీసుకుని చిప్పకు రాసి నిమిషం పాటు రుద్దాలి. ఈ చిప్పలను రెండురోజుల పాటు ఎండలో పెట్టి , కవర్లో మూటకట్టాలి. ఈ మూటను గాలిచొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఇలా పెట్టిన కొబ్బరి నెలల పాటు పాడవకుండా ఉంటుంది. టేబుల్ స్పూను పటిక పొడిని కప్పు నీటిలో కలపాలి. పటిక మొత్తం కరిగిన తరువాత ఈ నీటిలో చిన్న గుడ్డను ముంచి కొబ్బరి చిప్పల లోపల, బయటా తుడవాలి. ఇలా తుడిచిన చిప్పలను ఎండలో రెండు రోజుల పాటు ఆరబెట్టి, కవర్లో మూటకట్టాలి. ఈ మూటను గాలిచొరబడని డబ్బాలో నిల్వచేయాలి. ఇలా కూడా ఎక్కువ రోజుల పాటు చిప్పలు తాజాగా ఉంటాయి. -
వర్షాకాలం: పకోడీలు, బజ్జీలు ఇలా చేస్తే క్రిస్పీగా..
పకోడీలు, బజ్జీలు క్రిస్పీగా రావాలంటే... పిండిని కలిపేటప్పుడు ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి.∙ అరగంట ముందే పిండిని చల్లని నీటితో కలిపి పక్కన పెట్టుకోవాలి. పకోడీలు, బజ్జీలను నూనెలో వేసి డీప్ఫ్రై చేసేటప్పుడు పదేపదే తిప్పకూడదు. ఎక్కువగా తిప్పితే మెత్తగా మారతాయి. అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు మాత్రమే తిప్పుతూ ఫ్రైచేయాలి. పచ్చిమిర్చి, పాలకూర, వంకాయ, అరటికాయ, బంగాళ దుంప వంటివాటితో బజ్జీలు వేసేముందు శుభ్రంగా కడిగి, కాటన్ గుడ్డతో తడిలేకుండా తుడిచి ఫ్యాన్ గాలికింద ఆరబెట్టాలి. తరువాత పిండిలో ముంచితే ముక్కలకు పిండి చక్కగా అంటుకుని బజ్జీలు క్రిస్పీగా, క్రంచీగా వస్తాయి. కిచెన్ టిప్స్ ఊరగాయలను నిల్వచేసుకునే చిన్న జాడీలను పొడిగా ఆరబెట్టిన తరువాత, వేడివేడి నూనెను జాడీలోపల రాయాలి. తరువాత ఊరగాయ పెడితే బూజు పట్టదు. రోజూ మూతతీసి వాడుతున్నప్పటికి పచ్చడి ఎక్కువరోజుల పాటు నిల్వ ఉంటుంది. -
ఎలాంటి సమస్యలు ఉన్నా ఆయుర్వేదంతో చెక్
అనేక అనారోగ్య సమస్యలకు ఆయుర్వేదం చక్కటి పరిష్కారం. చిన్న చిట్కాలతోనే కొన్ని వ్యాధులను నయం చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ఇంగువను నిమ్మరసంతో కలిపి నూరి కొద్దిగా వెచ్చచేసి దూదిని దానిలో ముంచి తడిపి పంటి నొప్పి వున్నచోట పెడితే పంటి నొప్పి తగ్గిపోతుంది. బిళ్లగనేరు ఆకుల్ని, జామ ఆకుల్ని సమతూకంలో తీసుకుని ముద్దచేసి ఈ ముద్దని ఐదు చెంచాల వంతున ఉదయం సాయంత్రం 3 రోజులు తీసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది. వంద గ్రాముల వాము శుభ్రంచేసి ఎర్రగా వేయించి, మెత్తగా పొడిచేసి డబ్బాలో నిల్వ ఉంచుకొని గ్యాస్ట్రబుల్ ఉన్నప్పుడు ఒక చెంచా పొడిని నీళ్ళల్లోగాని, విడిగా గాని తీసుకుంటే ఎక్కువ త్రేన్పులు రాకుండా ఉంటుంది. అల్లంముక్కలు తేనెతో గానీ, పంచదారతో గానీ కలుపుకుని తింటే యూనినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. పచ్చి మెంతులు ఒక అరచెంచా ఉదయం, సాయంత్రం మింగాలి. పచ్చివి తినలేకపోతే పెరుగులో నానబెట్టుకుని తింటే మూత్ర పిండాల నొప్పి తగ్గుతుంది. నేరేడు విత్తులు, గింజలు తీసేసిన కాకర కాయలు, నేలతంగేడు పూజ, పొడపత్రి, తిప్పతీగె, ఉసిరికాయ చూర్ణం చేసి రెండు పూటలా నోట్లో వేసుకొని, నీరు తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. మందార పువ్వుల్ని కొబ్బరి నూనెలో వేసి మరగబెట్టి చల్లార్చి తలకు పెట్టుకుంటే జుట్టు ఊడకుండా ఉంటుంది. గుంటగలగరాకు దంచి, రసం తీసి ఒక వంతు కొబ్బరి నూనెలో కలిపి నీరు మరిగే వరకు ఉడకబెట్టాలి. చిటపట శబ్దం పోయి నూనె పైకి తేలేవరకు పొయ్యిమీద ఉంచాలి. సువాసనకి గంధకచ్చూరాలు కలుపుకుని వాడడంవల్ల జుట్టు రాలదు. నల్లబడుతుంది, పెరుగుతుంది. అశ్వగంధ వేర్లు తీసుకుని మెత్తగా నూరి ఒక చెంచా పొడిని అర కప్పు నీళ్ళల్లోగాని, పాలల్లోగాని కలుపుకుని తాగితే నడుం నొప్పి తగ్గుతుంది. అశ్వగంధ ఆకుల్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక పచ్చి ఆకుని నమిలి మింగాలి. ఇది బరువును తగ్గిస్తుంది ఎర్రమందారంపూలను రెండు గ్లాసుల నీళ్ళలో వేసి ఉడికించి ఒక గ్లాసు నీరు వచ్చేవరకు మరిగించి, వడకట్టి, కషాయం తీసి సీసాలోకి తీసుకుని, రోజూ తలకి పెట్టుకొని రెండు గంటల తర్వాత తల స్నానం చేస్తే పేనుకొరుకుడు తగ్గుతుంది. ఆవుపాలు తీసుకుని అందులో ఒక చెక్క నిమ్మరసం కలిపి వెంటనే తీసుకుంటే అర్షమొలలు తగ్గుతాయి. జిల్లేడు పువ్వు, పసుపు సమానంగా తీసుకుని నూరి అందులో కొంచెం ఆముదాన్ని వేసి మడమకి రాత్రిపూట కట్టి ఉదయం తీసేస్తే మడమ నొప్పి తగ్గుతుంది. శొంఠి మిరియాలు సమానంగా తీసుకుని, రెండింటిని దోరగా వేయించి చూర్ణంచేసి పూటకి ఐదు గ్రాములు తేనెతో కలిపి రోజూ మూడు పూటలా 10 రోజుల్లో కీళ్ళ నొప్పులు తగ్గుతాయి సింహనాద గుగ్గిళ్ళు అనే టాబ్లెట్లను రోజుకు మూడు చొప్పున మూడునెలలు వాడితే మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది. -నవీన్ నడిమింటి -
ఈ డివైస్తో శాశ్వతంగా మొటిమలను పోగొట్టుకోవచ్చు..
సాధారణంగా తీసుకుంటున్న ఆహారంతోనో, వయసులో వచ్చే మార్పులతోనో, నెలసరి సమయాల్లోనో.. మొటిమలు రావడం.. అవి పూర్తిగా తగ్గకుండా నల్లటి మచ్చలుగా మిగిలిపోవడం, ఎర్రటి దద్దుర్లు ఏర్పడటం వంటివి చాలామందిలో కనిపించే సమస్యలే. వాటికి చెక్ పెడుతుంది చిత్రంలోని మినీ మెషిన్.ఈ ఎల్ఈడీ మెడికల్ డివైస్ (యాక్నే లైట్ షాట్).. వాడుతున్న తొలి రోజు నుంచే మెరుగైన ఫలితాలనివ్వడం మొదలుపెడుతుంది. అంటే ట్రీట్మెంట్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందన్న మాట. ఇది చర్మం మీద ఏర్పడే మొటిమల్ని, మచ్చల్ని, గాయాలను శాశ్వతంగా దూరం చేస్తుంది. చర్మాన్ని మృదువుగా మార్చేస్తుంది. దీన్ని వినియోగించే సమయంలో చేతులతో అవసరం ఉండదు. పైగా ఈ డివైస్ని సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. టార్గెటెడ్ డెలివరీ సిస్టమ్తో రూపొందిన ఈ మినీ మెషిన్.. మొటిమలు లేదా మచ్చలున్న చోట లైట్ థెరపీతో చర్మాన్ని మెరిపిస్తుంది. ఇది చాలా సురక్షితమైనది. ప్రభావవంతమైనది. వేగవంతమైనది కూడా. ఈ చికిత్సతో 90 శాతం మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. ఈ డివైస్ని వినియోగించి.. ముఖం మీదున్న రంధ్రాలను 80 శాతం వరకూ తగ్గించుకోవచ్చు. గాయాలను వాటి తాలుకు మచ్చలను 75 శాతం వరకూ నయం చేసుకోవచ్చు. దీన్ని మగవారు కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే కంటి పరిసరాల్లో వినియోగిస్తున్నప్పుడు.. చిత్రంలోని ప్రత్యేకమైన కళ్లజోడును పెట్టుకోవాలి. బాగుంది కదూ!