Top Stories
ప్రధాన వార్తలు
తిరుపతి లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది. సిట్లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజుతోపాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు ఉండనున్నారు. ఈ సిట్ బృందం శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ జరపనుంది. కాగా ఏపీ ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ నేతలపై దాడులను ప్రోత్సహించినట్లు సర్వశ్రేష్ట త్రిపాఠిపై ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో త్రిపాఠిపై వైఎస్సార్సీపీ గవర్నర్కు ఫిర్యాదు కూడా చేసింది.పల్నాడులో అల్లర్లు సమయంలో త్రిపాఠి గుంటూరు ఐజీగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో పల్నాడులో ఎన్నికల నిర్వహణ జరిగింది. ఎన్నికల సమయంలో దేశంలో ఎక్కడా లేని అల్లర్లు త్రిపాఠి హయాంలో జరిగాయని ఈసీ ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. అయితే అలాంటి వివాదాస్పద అధికారితో సిట్ ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: టీటీడీ లడ్డూపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందే: అంబటి
అక్కడుంది చంద్రబాబు.. SIT ఏర్పాటుపై వీహెచ్పీ సురేంద్ర జైన్ ఆగ్రహం
సాక్షి,న్యూఢిల్లీ : చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం తిరుపతి లడ్డు వివాదాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని, లడ్డూ వివాదంలో నిజానిజాలు బయటకు రావాలంటే సిట్ సరిపోదని విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ అన్నారు. సిట్ ఏర్పాటుపై సాక్షి టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు.‘చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ నాయకుడు. తన రాజకీయ స్వార్థం కోసం లడ్డు వివాదం అంశాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. లడ్డుపై వివాదంపై నిజా నిజాలు బయటికి రావాలంటే ఆయన నియమించిన సిట్ సరిపోదు. న్యాయ విచారణ జరగాలి’ అని డిమాండ్ చేశారు.రాజకీయ ఆరోపణల నేపథ్యంలో నిజానిజాలు బయటికి రావాలంటే న్యాయ విచారణే శరణ్యం’ అని సురేంద్ర జైన్ తెలిపారు. ఈ సందర్భంగా లడ్డూ వివాదంపై తిరుమల శ్రీవారి భక్తులు ఆందోళన చెందవద్దని, ఈ అంశంపై త్వరలోనే మేం న్యాయపరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దేశంలో అన్ని దేవాలయాలు నిర్వాహణ నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలి. దేవాలయాల పరిరక్షణపై వీహెచ్పీ త్వరలో ఉద్యమం చేపడుతుంది’ అని సురేంద్ర జైన్ హెచ్చరించారు. సిట్లో చంద్రబాబు మనిషితిరుమల లడ్డు వివాదంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన కూలంగా వ్యవహరించిన గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్ చీఫ్గా నియమించారు. సిట్లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజుతో పాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు ఉండనున్నారు.
ఉత్తర్ప్రదేశ్లో సీఎం యోగి సర్కార్ కొత్త రూల్స్
లక్నో: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ రాష్ట్రంలో కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చారు. యూపీ సర్కార్ కొత్త నిబంధనల మేరకు.. విధి నిర్వహణలో చెఫ్లు, వెయిటర్లు మాస్క్లు, గ్లౌజులు ధరించాలి. హోటళ్లు, రెస్టారెంట్లలో సీసీ టీవీ కెమెరాలు తప్పని సరిగా ఇన్ స్టాల్ చేయాలి. నిర్వాహకులు, మెనూ బోర్డ్లపై నిర్వాహకుల పేర్లు, అడ్రస్ వివరాలు తప్పని సరిగా ఉండాలని సీఎం యోగి ఆధిత్యనాథ్ స్పష్టం చేశారు. ఫ్రూట్జ్యూస్లో మూత్రంకొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లో ఖుషీ జ్యూస్ కార్నర్ షాపు యజమాని పండ్ల రసాల్లో మూత్రం కలిపి అమ్ముతూ పట్టుబడ్డాడు. జ్యూస్లో మూత్రం కలుపుతుండగా..అక్కడే ఉన్న వినియోగదారుడు నిలదీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.Uttar Pradesh : In Loni of Ghaziabad, locals caught Mohd. Aamir and Md Kaif mixing Human URINE in juice at their juice shop and selling it to people. Police even recovered a plastic can filled with Urine at the shop named Khushi Juice Corner. Case has been registered and both… pic.twitter.com/jkC8poGuVn— Amitabh Chaudhary (@MithilaWaala) September 14, 2024 రాష్ట్రంలో కొత్త నిబంధనలుఈ నేపథ్యంలో సీఎం యోగి ఆధిత్యనాథ్ ఆద్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోటల్స్లో కొత్త నిబంధనల్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు.సమావేశం అనంతరం ఆధిత్యనాథ్ మాట్లాడుతూ.. తినే ఆహార పదార్థాలు కల్తీ అవుతున్న ఘటనల నేపథ్యంలో ఆహార పదార్థాలలో మానవ వ్యర్థాలను కలపడం అసహ్యకరమైంది. ఆమోదయోగ్యం కాదు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతంగా కాకుండా ఉండేందుకు కొత్త నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కొత్త నిబంధనల్ని అమలు చేస్తున్నారా? లేదా అని పరిశీలించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, పోలీసులు, స్థానిక అధికారులు తనిఖీ చేస్తారని అన్నారు.ప్రజారోగ్యం విషయంలో రాజీ పడేది లేదని తెలిపారు. ఆహారం కలుషితం లేదా అపరిశుభ్రమైన పద్ధతుల్ని అవలంభించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.
యూట్యూబర్ హర్ష సాయిపై కేసు పెట్టిన యువతి
యూట్యూబర్ హర్షసాయిపై పోలీసు కేసు నమోదైంది. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని తనని మోసం చేసి రూ.2 కోట్లు తీసుకున్నాడని ఫిర్యాదు చేసింది. హర్షసాయితో పాటు అతడి తండ్రి రాధాకృష్ణపైన కూడా కంప్లైంట్ ఇచ్చింది. దీంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.పేదలకు డబ్బు సాయం చేస్తూ వాటిని వీడియోలుగా తీసి యూట్యూబ్లో పోస్ట్ చేసే చాలా పాపులర్ అయ్యాడు. అయితే బెట్టింగ్ యాప్స్ని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాడని కొన్నాళ్ల క్రితం ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మోసం చేశాడని యువతి ఫిర్యాదు చేయడంతో హర్షసాయి బండారం కాస్త బట్టబయలైంది.
ఇజ్రాయెల్ దాడిలో హిజ్బుల్లా కమాండర్ ఇబ్రహీం ఖుబైసీ హతం
బీరూట్ : హిజ్బుల్లాను ఇజ్రాయెల్ ఆర్మీ చావుదెబ్బ తీసింది. ఇప్పటికే సోమవారం హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ హత మార్చగా.. మంగళవారం హిజ్బుల్లా కమాండర్ ఇబ్రహీం ఖుబైసీ ప్రాణాలు తీసినట్లు పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) లెబనాన్ రాజధాని బీరూట్లో దక్షిణ శివారు ప్రాంతమైన దహియే జిల్లాలో హిజ్బుల్లా కమాండర్ ఇబ్రహీం ఖుబైసీ లక్ష్యంగా వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇబ్రహీం ఖుబైసీ మరణించారని తెలుస్తోంది. ఆయన మరణంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.హిజ్బుల్లా రాకెట్,క్షిపణి విభాగానికి కమాండర్ ఇబ్రహీం ఖుబైసీపై దాడి జరిగిన సమయంలో ఆయనతో పాటు మరో ఐదుమంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. కాగా,లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో సోమవారం మరణించిన వారి సంఖ్య 558కి పెరిగింది. అదే సమయంలో, 1835 మంది తీవ్రంగా గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియాడ్ తెలిపారు.🔴LEBANON 🇱🇧-ISRAEL 🇮🇱| Several sources claim that one of the Hezbollah Commander, Ibrahim #Qubaisi, was killed during an Israeli airstrike on Tuesday 09/24 in Dahiya, #Beirut. Ibrahim Qubaisi was until then the commander of #Hezbollah's rocket division. #MiddleEastTensions pic.twitter.com/iKJpGaNZ6c— Nanana365 (@nanana365media) September 24, 2024
జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్గా రుతురాజ్! సంజూకు నో ఛాన్స్
ఇరానీ ట్రోఫీ-2024లో భాగంగా లక్నో వేదికగా ముంబై, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఆక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. తాజాగా ఈ మ్యాచ్ కోసం 15 మంది సభ్యులతో కూడిన రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది.ఈ జట్టుకు టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా బెంగాల్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్ వంటి స్టార్ ఆటగాళ్లకు చోటు దక్కింది. అయితే దులీప్ ట్రోఫీలో సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్కు మాత్రం బీసీసీఐ సెలక్టర్లు మొండి చేయిచూపించింది. అతడికి ఇరానీ ట్రోఫీ జట్టులో చోటు ఇవ్వలేదు. అదే విధంగా బంగ్లాతో టెస్టు సిరీస్కు ఎంపికైన భారత క్రికెటర్లు ధ్రువ్ జురెల్, యష్ దయాల్ను ఈ జట్టులో సెలెక్టర్లు చేర్చారు. దీంతో వీరిద్దరూ రెండు టెస్టుకు బెంచ్కే పరిమితమయ్యే అవకాశముంది. మరోవైపు ఈ ఇరానీ కప్లో ముంబై జట్టుకు సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే సారథ్యం వహించనున్నాడు.ఇరానీ ట్రోఫీకి రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్)*, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, సరాంశ్ జైన్, ప్రసిద్ధ్ కృష్ణ, ముఖేష్ కుమార్, యష్ దయాల్*, రికీ భుయ్, శాశ్వత్ రావత్, ఖలీల్ అహ్మద్, రాహుల్ చాహర్చదవండి: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాం.. ట్రోఫీ మాదే: హర్మన్
రోజుకు రూ.45 లక్షల జీతం.. అగ్రరాజ్యంలో తెలుగు తేజం
ప్రపంచంలో అత్యధిక జీతం తీసుకుంటున్న అతి కొద్దిమంది సీఈఓలలో ఒకరు ఐబీఎమ్ సీఈఓ 'అరవింద్ కృష్ణ'. ఇంతకీ ఈయన ఎవరు? ఈయన వేతనం ఎంత? అనే మరిన్ని ఆసక్తికర విషయాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం..ప్రపంచంలో ఎక్కువ జీతం తీసుకునే సీఈఓలలో ఒకరుగా మాత్రమే తెలిసిన అరవింద్ కృష్ణ.. మన భారతీయుడు అని బహుశా కొంతమందికి తెలియకపోవచ్చు. ఈయన 1962 నవంబర్ 23 పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించిన తెలుగు బిడ్డ. తండ్రి భారత సైన్యంలో పనిచేసిన ఆర్మీ అధికారి.అరవింద్ కృష్ణ తమిళనాడులోని కూనూర్లోని స్టాన్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో, డెహ్రాడూన్లోని సెయింట్ జోసెఫ్స్ అకాడమీలో చదువుకున్నారు. ఆ తరువాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీని.. 1991లో యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా - ఛాంపెయిన్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పిహెచ్డీ పట్టా పొందారు.అరవింద్ కృష్ణ 1990లోనే ఐబీఎంకు సంబంధించిన థామస్ జే. వాట్సాన్ రీసెర్చ్ సెంటర్లో చేరారు. 2009 వరకు అక్కడే కొనసాగారు. ఆ తరువాత ఐబీఎం ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్లో జనరల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించారు. 2015లో ఐబీఎం రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పదోన్నతి పొందారు. ఆ తరువాత ఐబీఎం క్లౌడ్ అండ్ కాగ్నిటివ్ సాఫ్ట్వేర్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. 2020లో ఐబీఎం సీఈఓ అయ్యారు. కంపెనీలో ఈయన దాదాపు 34 ఏళ్ళు పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవిస్తాయి: శామ్ ఆల్ట్మన్ఐబీఎం సీఈఓ అయిన తరువాత అరవింద్ కృష్ణ.. కంపెనీ ఉన్నతికి ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈయన వార్షిక వేతనం ఇప్పుడు రూ.165 కోట్లు. అంటే రోజుకు రూ.45 లక్షల జీతం అన్న మాట. 2023లో ఈయన జీతం పెరగడంతో వార్షిక వేతనం భారీగా పెరిగింది.
‘లడ్డూ’ వెనుక బాబు మతలబు ఇదేనా?.. ఏదో తేడా కొడుతోంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్ది రోజులుగా రెచ్చిపోతూ ఉన్నవి లేనివి అన్నీ కలిపి విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్పై ఆరోపణలు గుప్పించారు. అదే సమయంలో తన గురించి తాను పొగుడుకుంటూ ఏకంగా తాను దేవుడి ప్రతినిధిని అన్నట్టుగా మాట్లాడుతుండడం సంచలనంగా ఉంది. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ కల్తీ నెయ్యితో తయారవుతోందని దారుణంగా వ్యాఖ్యానించారు. విశేషమేమిటంటే తాను అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ కల్తీ వ్యవహారం జరిగినప్పటికీ ఆయన వ్యూహాత్మకంగా వైఎస్సార్సీపీపైనా, మాజీ సీఎం వైఎస్ జగన్పైనా ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేశారు.ఈ సందర్భంగా వెంకటేశ్వరస్వామే తనతో నిజాలు చెప్పించారని ఆయన వెల్లడించడం పరాకాష్టగా భావించాలి. మామూలుగా కొంతమంది అతితో ఉండే భక్తులు, పూనకం వచ్చినవారు, భవిష్యత్తు వాణి చెబుతామనేవారు.. అటువంటివాళ్లే తాము దేవునికి ప్రతినిధులుగా, దేవుడే మాట్లాడిస్తున్నామని చెబుతుంటారు. చంద్రబాబును ఆ మాట అనలేముగానీ, ఆయన మాట్లాడిన తీరు చూస్తే అలా అనిపించే అవకాశముంది.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు, వైఎస్సార్సీపీకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలన్న తాపత్రయంలో తానేమి మాట్లాడుతన్నారో ఆయన తెలుసుకోలేకపోతున్నారు. అత్యంత సీనియర్ నాయకుడిగా ఉన్న ఈయన, తిరుమలకు అపచారం కలిగించేలా తిరుమలేశుడిపై అపనమ్మకం పెరిగేలా దుష్ప్రచారం చేశారు. పైగా ప్రపంచవ్యాప్తంగా హిందువుల గుండె మండిపోతున్నదని ఇంత పెద్ద అపచారం జరిగిన నేపథ్యంలో సంప్రోక్షణ గురించి మఠాధిపతులతో మాట్లాడతానని చెబుతున్నారు. హిందువులను రెచ్చగొట్టడంతో పాటు, తిరుమల ప్రసాదం లడ్డూ వివాదాన్ని మరి కొంతకాలం కొనసాగించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేది ఆయన దురుద్దేశంగా కనిపిస్తోంది.జూన్ 4న ఆయన అధికారంలోకి వచ్చారు. జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ మొత్తం అధికార యంత్రాంగమంతా 4వ తేదీ నుంచే ఆయన అధీనంలోకి వెళ్లింది. జులై నెలలో నాణ్యతలేని ట్యాంకర్లను వెనక్కి పంపించడం ఆ తర్వాత నివేదిక తెప్పించడంవంటివి జరిగాయి. నాణ్యత లేని టాంకర్లను వెనక్కి పంపించామని, ఈఓ చెబితే, అబ్బేబ్బే.. లేదు.. ఆ నెయ్యిని లడ్డూలలో వాడారని చంద్రబాబు అంటున్నారు. అది నిజమే అయితే ఇలాంటి చర్యకు పాల్పడ్డ ఈఓని, ఇతర సంబంధిత అధికారులను చంద్రబాబు సస్పెండ్ చేయాలి కదా?. కేసులు పెట్టాలి కదా? ఏదో మతలబు లేనిదే చెన్నైలో ల్యాబ్లు అందుబాటులో వుంటే గుజరాత్కు పనిగట్టుకొని ఎందుకు పంపించారు? ఎన్డీడీబీ ఎండీ తిరుమల ఈవోను, మరికొంత మంది ప్రముఖులను ఎందుకు కలిశారు? ఆ తర్వాతనే ఈ టెస్టుల తతంగం జరగడంలోని ఆంతర్యం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.విశేషమేమిటంటే చంద్రబాబు నిజాలు చెబుతారా లేదా అన్నదానిపై గత మూడున్నరదశాబ్దాలుగా ప్రజల్లోగానీ, రాజకీయవర్గాల్లో గానీ చర్చజరుగుతోంది. చంద్రబాబుతో స్వామివారు సైతం నిజం చెప్పించలేరని కొంతమంది చమత్కరిస్తుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, విభజిత ఏపీ అసెంబ్లీలోగానీ పలువురు ఈ అంశం గురించి మాట్లాడుతూ చంద్రబాబు అలవోకగా అబద్ధాలు ఆడుతుంటారని వ్యాఖ్యానిస్తుంటారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పట్లో శాసనసభలో మాట్లాడుతూ చంద్రబాబు కన్నార్పకుండా అబద్ధాలు చెప్పగలరని, నిజం మాట్లాడితే తల వక్కలవుతుందనే మునిశాపం ఆయనకు వుందని ఎద్దేవా చేసేవారు. అప్పటినుంచీ ఈ డైలాగు బాగా ప్రసిద్ధిగాంచింది. దానికి తగ్గట్టుగానే చంద్రబాబు రాజకీయంగా గానీ, ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల విషయంలోగాన మాట మార్చడం, అబద్ధాలు చెప్పడం సర్వసాధారణం అన్న అభిప్రాయం నెలకొంది.ఉదాహరణకు ఉమ్మడి అసెంబ్లీలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ టెండర్కు సంబంధించి వైఎస్సార్ హయాంలో ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. చర్చకు నోటీసు ఇచ్చారు. ఆ నోటీసులో మొదట వేయికోట్లని రాసి, పదమూడు వందల కోట్లుగా మార్చారు. ఆ విషయాన్ని చీఫ్ విప్గా వున్న కిరణ్ కుమార్రెడ్డి లేవనెత్తారు. దానికి చంద్రబాబు ఇచ్చిన సమాధానం ఇచ్చిన ఏంటంటే తాము కావాలనే సంఖ్యను మార్చామని చెప్పారు. దాంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా చంద్రబాబుపై విరుచుకుపడి ఆయన గుణమే అంత అని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో బాగా రభస అయింది. చంద్రబాబు చేసిన తప్పునకు టీడీపీతో పాటు సీపీఐ, సీపీఎం పక్షాల సభ్యులు తల పట్టుకున్నారు.డెయిరీ రంగంలో సొంతంగా హెరిటేజ్ పరిశ్రమను కలిగిన చంద్రబాబు 320కే నాణ్యమైన నెయ్యి ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. పాల నుంచి కేవలం నెయ్యే కాకుండా పాలను ఇతర ఉత్పత్తుల అమ్మకం ద్వారా లోటును కవర్ చేసుకుంటారన్న సంగతి ఈయనకు తెలియదా? పోనీ ఇది తక్కువ ధర అనుకున్నా ఆయన పాలించిన 2014-19 మధ్య కిలో నెయ్యి 276కే మహారాష్ట్రలోని గోవిందా పాల ఉత్పత్తుల కంపెనీకి ఎలా టెండర్ ఖరారు చేశారు? అంటే అప్పుడు కూడా కల్తీ జరిగిందని చంద్రబాబు ఒప్పుకున్నట్టే కదా!ఆనాడు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కు ( నందిని) ఎందుకు టెండర్ను ఇవ్వలేదు. ఇలాంటివాటికి ఏమీ సమాధానం ఇవ్వకుండా తనతో వెంకటేశ్వరస్వామి నిజాలు చెప్పించారని బుకాయిస్తే సరిపోతుందా?. తీరా చూస్తే ఆయన చెప్పినవి అసత్యాలేనని తేలుతోంది. ఆయన కుమారుడు లోకేషే కల్తీ నెయ్యితో ఉన్న టాంకర్లలోని సరుకు వాడలేదని ట్వీట్ చేశారు. దీంతో చంద్రబాబు నిజం చెప్పలేదా అన్న ప్రశ్న వస్తుంది. ఆనాడు టిటిడి ఏర్పాటు చేసిన ధరల కమిటీలో ప్రస్తుతం చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా వున్న పార్థసారథి, టీడీపీ శాసన సభ్యురాలు ప్రశాంతి రెడ్డి వున్నారు. వీరిద్దరూ ఆ రోజుల్లో వైఎస్సార్సీపీకి చెందినవారు. తదుపరి అంటే 2024లో టీడీపీలోకి వచ్చారు. మరి వీరిని ఇప్పుడు టీటీడీలో అవకతవకలకు బాధ్యులని చెప్పి తప్పించగలరా?అలాగే బీజేపీకి చెందని నేత వైద్యనాధన్ కూడా కమిటీలో వున్నారు. టీటీడీలో బీజేపీ సభ్యులుకూడా వున్నారని వైఎస్సార్సీపీ ప్రస్తావిస్తే దాన్ని బ్లాక్ మెయిల్ అని ఎల్లో మీడియా భాష్యం చెప్పడం విచిత్రంగా వుంది. అసలు విశేషం ఏమిటంటే నెయ్యి కన్నా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెబుతున్న పిష్ ఆయిల్, పిగ్ ఫాట్ వంటివాటి ఖరీదు చాలా ఎక్కువట. ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి ఆ వివరాలు చెబుతూ జంతు కొవ్వు వెయ్యి నుంచి 1400 రూపాయలు ఉంటే 320 రూపాయల ఖరీదుఉన్న నేతిలో ఎవరైనా కలుపుతారా? అని ప్రశ్నించారు. రాగిలో బంగారం కలుపుతారా?. బంగారంలో రాగి కలుపుతారా? పాలలో నీళ్లు కలుపుతారా . నీళ్లలో పాలు కలుపుతారా? అన్న అర్ధవంతమైన ప్రశ్న వేశారు. దీనికి చంద్రబాబు అండ్ కో ఏమి చెబుతారో చూడాలి.ఆ విషయానికి వస్తే 1995లో ఈయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఎన్ని రకాలుగా మాటలు మార్చారో అందరికీ తెలిసిందే. 1996 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని మసీదులు కూల్చేపార్టీగా అభివర్ణించారు. 2004లో ఓటమి తర్వాత జీవితంలో బిజెపితో పొత్తుపెట్టుకోనని అన్నారు. నరేంద్ర మోదీని నర హంతకునిగా ఆరోపించారు. తాను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు మోదీని హైదరాబాద్ రానీయనని హెచ్చరించేవారు. అయినా మళ్లీ 2014లో మోదీ ఎక్కడుంటే అక్కడకు వెళ్లి బతిమలాడుకొని మరీ బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు. 2018లో బీజేపీ నుంచి విడిపోయి మోదీని టెర్రరిస్టు, ముస్లింలను బతకనీయడు, పెళ్లాన్ని ఏలుకోలేనివాడు దేశాన్ని ఎలా ఏలుతాడు అని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. తిరిగి 2024 నాటికి మోదీ అంతటి గొప్పవాడు లేడని ప్రకటించాడు. మరి వీటిలో ఏది నిజం, ఏది అబద్ధం అంటే ఏం చెప్పగలం.సోనియా గాంధీని దెయ్యం , భూతం అని తిట్టారు. కానీ ఆ తర్వాత ఆమెతో కలిసి రాజకీయ సభల్లో పాల్గొని పొగిడారు. లక్ష కోట్ల రుణాలు మాఫీ చేస్తామని వాగ్ధానం చేసి ఆ తర్వాత దాన్ని నెరవేర్చకపోగా మొత్తం రుణమాఫీ చేశామని దబాయించేవారు. తమ రాజకీయ అవసరాల కోసం మాట్లాడే చంద్రబాబు మాటలు నిజాలా అబద్ధాలా అనేది పక్కన పెడితే, ఎలాగైనా మాట మార్చడంలో ఆయనకు ఆయనే సాటి. ఇప్పుడు వైఎస్ జగన్ పై ఎదురు దాడి చేస్తూ ప్రధానికి లేఖ రాయడానికి ఎంత ధైర్యమని ప్రశ్నించడం చిత్రంగా వుంది. వైవీ సుబ్బారెడ్డి భార్య పక్కా హిందువు అయితే ఆమెకు క్రైస్తవ మతం అంటగట్టి స్టేట్మెంట్ ఇచ్చారు.మరో వైపు తన క్యాబినెట్లోనే హోంమంత్రిగా వున్న వ్యక్తి ఒకసారి తను క్రిస్టియన్ అని, మరొకసారి హిందూమతం అని చెప్పుకున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి తన కుమార్తె పెళ్లిని క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం చేశారని చంద్రబాబు ఆరోపిస్తారు. మరో వైపు ఒక క్రిస్టియన్ను వివాహమాడి, పిల్లలకు సైతం క్రిస్టియన్ పేర్లనే పెట్టిన పవన్ కల్యాణ్ చాలా గొప్ప హిందువు అని సర్టిఫికెట్ ఇస్తుంటారు. చంద్రబాబు స్వయంగా క్రైస్తవ సమావేశానికి వెళ్లి ఏసుక్రీస్తును నమ్మినవారికి అపజయం లేదని సూక్తులు చెప్పారు. కానీ ఇప్పుడేమో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. నిజానికి మతమన్నది వ్యక్తిగతం. కానీ చంద్రబాబు లాంటివారు తమ స్వార్ధ రాజకీయాల కోసం కులం, మతం, నిజాలతో సంబంధం లేకుండా వాడేసుకోగలరని అనిపిస్తుంది.-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
పవన్కు ప్రకాష్ రాజ్ కౌంటర్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. తిరుమల లడ్డు వివాదంపై ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో పవన్.. ప్రకాష్ రాజ్పై విమర్శలు చేశారు. ఆ విమర్శలకు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. పవన్కు కౌంటర్ ఇచ్చారు. ‘పవన్ .. నేను చేసిన ట్వీట్ ఏంటి? నా ట్వీట్పై మీరు మాట్లాడుతుందంటేంటి. మరోసారి నా ట్వీట్ను చదవి అర్థం చేసుకోండి. నేను షూటింగ్ నిమిత్తం విదేశాల్లో వున్నాను 30 తేదీ తరువాత వస్తాను. మీ ప్రతి మాటకు సమాధానం చెపుతాను. మీకు వీలైతే నా ట్వీట్ని మళ్లీ చదివి అర్థం చేసుకోండి’ అంటూ వీడియోని విడుదల చేశారు. Dear @PawanKalyan garu..i saw your press meet.. what i have said and what you have misinterpreted is surprising.. im shooting abroad. Will come back to reply your questions.. meanwhile i would appreciate if you can go through my tweet earlier and understand #justasking pic.twitter.com/zP3Z5EfqDa— Prakash Raj (@prakashraaj) September 24, 2024 ట్వీట్లో ప్రకాష్ రాజ్ ఏమన్నారంటేపవన్ కల్యాణ్... మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారణ జరిపి నేరస్తులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, జాతీయ స్థాయిలో దీనిపై చర్చించుకునేలా చేస్తున్నారు? ఇప్పటికే మన దేశంలో ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు’ అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. Dear @PawanKalyan …It has happened in a state where you are a DCM .. Please Investigate ..Find out the Culprits and take stringent action. Why are you spreading apprehensions and blowing up the issue Nationally … We have enough Communal tensions in the Country. (Thanks to your… https://t.co/SasAjeQV4l— Prakash Raj (@prakashraaj) September 20, 2024 ప్రకాష్ రాజ్ ట్వీట్పై పవన్ ఇలా మాట్లాడారుసున్నితాంశాలపై నటుడు ప్రకాశ్రాజ్ విషయం తెలుసుకుని మాట్లాడాలి. ఆయనతో పాటు అందరికీ చెబుతున్నా.. విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండి. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు’ అని పవన్ వ్యాఖ్యానించారు.చదవండి: పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండే
తిరుపతికి లడ్డూ ఎలా వచ్చింది?
తిరుపతి లడ్డూపై వివాదం నెలకొన్న ప్రస్తుత తరుణంలో అసలు లడ్డూ ఎలా ఆవిర్భవించిందో తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మందిలో కలుగుతోంది. అసలు తిరుమల శ్రీ వేంకటేశుని ప్రసాదంగా లడ్డూ ఎప్పటి నుంచి ఉంది..అసలు లడ్డూయే ప్రసాదంగా ఎందుకు ఉంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు అనిరుధ్ కనిశెట్టి అనే చరిత్రకారుడు ‘ది ప్రింట్’లో రాసిన సమగ్ర కథనంలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తొమ్మిదో శతాబ్దం నుంచి ఇప్పటివరకు తిరుపతి చరిత్రను వివరిస్తూ కాలగమనంతో పాటు శ్రీ వేంకటేశుని ప్రసాదం ఎలా మారుతూ వచ్చిందన్నది అనిరుధ్ తన కథనంలో రాసుకొచ్చారు.వేల ఏళ్ల క్రితం తిరుపతి ప్రసాదం ఏంటి..?నిజానికి తిరుమల-తిరుపతి అనగానే లడ్డూ టక్కున గుర్తొచ్చేస్తుంది. ఎందుకంటే తిరుపతి వెళ్లినపుడు ఏడుకొండలవాడిని దర్శించుకోవడం ఎంత ముఖ్యమైన ఘట్టమో లడ్డూ ప్రసాదం తినడమూ భక్తులకు అంతే ముఖ్యం. ఏడుకొండలకు వెళ్లి లడ్డూ ప్రసాదం ఆరగించడమే కాదు..క్యూలో నిల్చొని కష్టపడి తీసుకున్న లడ్డూను ఇతరులకు పంచి పెట్టడం కూడా భక్తిలో భాగమైపోయాయి. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన లడ్డూ నిజానికి తొలి ఉంచి ఏడు కొండలవాడి ప్రసాదం కాదని అనిరుధ్ చెబుతున్నారు. తొమ్మిదో శతాబ్దం నుంచి 1900 సంవత్సరం వరకు శ్రీవారి ప్రసాదం అన్నం,నెయ్యితో తయారు చేసిన పొంగల్ అని తెలిపారు. లడ్డూ ప్రసాదంగా ఎలా మారింది..?తొమ్మిదో శతాబ్దంలో తిరుపతి పుణ్యక్షేత్రం బ్రాహ్మణుల ఆధీనంలో చిన్న పల్లెటూరుగా ఉండేది.ఆ తర్వాతి కాలంలో చోళులు, విజయనగర రాజులు, బహమనీ సుల్తానులు, బ్రిటీషర్ల పాలనలో తిరుపతి క్షేత్రంలో చాలా మార్పులు జరిగాయి. శ్రీ వేంకటేశుడి మహిమతో తిరుపతి ప్రభ రోజురోజు పెరుగుతూ వచ్చింది.తొలుత అక్కడ పొంగల్గా ఉన్న ప్రసాదం ఉత్తర భారతీయుల కారణంగా లడ్డూగా మారిందని అనిరుధ్ తన కథనంలో రాశారు. ‘బాలాజీ’ అనే పిలుపు కూడా వారిదే..బ్రిటీషర్ల పాలనలో ఉత్తర భారతీయులు ఎక్కువగా తిరుపతి సందర్శనకు వచ్చేవారని, వీరు వెంకటేశుడిని బాలాజీగా పిలుచుకునే వారని తెలిపారు. వీరే పొంగల్గా ఉన్న తిరుపతి ప్రసాదాన్ని తీయనైన లడ్డూగా మార్చారని అనిరుథ్ రాసుకొచ్చారు.తొలుత బ్రాహ్మణుల ఆధీనంలో తిరుపతి ఉన్నపుడు వెంకటేశునికి స్వచ్చమైన మంచి నీటితో అభిషేకాలు అక్కడ నెయ్యితో వెలిగించిన దీపాలు తప్ప ఎలాంటి నైవేద్యాలు ఉండేవి కాదని కథనంలో అనిరుధ్ పేర్కొనడం విశేషం. ఇదీచదవండి: లడ్డూ వెనుక ‘బాబు’ మతలబు ఇదేనా..
వైఎస్సార్ జిల్లాపై సీఎం చంద్రబాబు మరోమారు కక్ష సాధింపు
ఇజ్రాయెల్ దాడిలో హిజ్బుల్లా కమాండర్ ఇబ్రహీం ఖుబైసీ హతం
1974 మందికి మాత్రమే ఈ కారు: దీని రేటెంతో తెలుసా?
తగ్గిన 'దేవర' రన్ టైమ్.. ఇప్పుడు ఎంతంటే?
పాక్కు భారీ షాక్.. షాహీన్ అఫ్రిదికి గాయం! ఆ సిరీస్కు దూరం?
మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు.. ఉత్తర్వులు జారీ
మెగా కోడలి డ్యాన్స్.. పాయల్ రాజ్పుత్ గ్లామర్
ముగ్గురు ఎంపీలను బాబు కొన్నాడు: విజయసాయిరెడ్డి
అంతర్జాతీయ క్రికెట్కు ఇవాన్స్ గుడ్బై
న్యూస్ చదువుతుండగా లెబనాన్ జర్నలిస్ట్పై ఇజ్రాయెల్ మిస్సైల్ దాడి
అక్కడుంది చంద్రబాబు.. SIT ఏర్పాటుపై వీహెచ్పీ సురేంద్ర జైన్ ఆగ్రహం
చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు బతకదు: సుబ్రహ్మణ్యస్వామి
టెట్ అభ్యర్థులకు అగ్ని పరీక్ష..
జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్గా రుతురాజ్! సంజూకు నో ఛాన్స్
తిరుపతి లడ్డూ వివాదం.. పవన్కు చురకలు
ఆలియా కూతురి విషయంలో నెరవేరిన ఎన్టీఆర్ కోరిక!
సాక్షి కార్టూన్ 24-09-2024
అగార్కర్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్?
ముగ్గురు ఎంపీలను బాబు కొన్నాడు: విజయసాయిరెడ్డి
రైతుబంధు దరఖాస్తులు తీసుకోండి
వైఎస్సార్ జిల్లాపై సీఎం చంద్రబాబు మరోమారు కక్ష సాధింపు
ఇజ్రాయెల్ దాడిలో హిజ్బుల్లా కమాండర్ ఇబ్రహీం ఖుబైసీ హతం
1974 మందికి మాత్రమే ఈ కారు: దీని రేటెంతో తెలుసా?
తగ్గిన 'దేవర' రన్ టైమ్.. ఇప్పుడు ఎంతంటే?
పాక్కు భారీ షాక్.. షాహీన్ అఫ్రిదికి గాయం! ఆ సిరీస్కు దూరం?
మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు.. ఉత్తర్వులు జారీ
మెగా కోడలి డ్యాన్స్.. పాయల్ రాజ్పుత్ గ్లామర్
ముగ్గురు ఎంపీలను బాబు కొన్నాడు: విజయసాయిరెడ్డి
అంతర్జాతీయ క్రికెట్కు ఇవాన్స్ గుడ్బై
న్యూస్ చదువుతుండగా లెబనాన్ జర్నలిస్ట్పై ఇజ్రాయెల్ మిస్సైల్ దాడి
అక్కడుంది చంద్రబాబు.. SIT ఏర్పాటుపై వీహెచ్పీ సురేంద్ర జైన్ ఆగ్రహం
చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు బతకదు: సుబ్రహ్మణ్యస్వామి
టెట్ అభ్యర్థులకు అగ్ని పరీక్ష..
జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్గా రుతురాజ్! సంజూకు నో ఛాన్స్
తిరుపతి లడ్డూ వివాదం.. పవన్కు చురకలు
ఆలియా కూతురి విషయంలో నెరవేరిన ఎన్టీఆర్ కోరిక!
సాక్షి కార్టూన్ 24-09-2024
అగార్కర్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్?
ముగ్గురు ఎంపీలను బాబు కొన్నాడు: విజయసాయిరెడ్డి
రైతుబంధు దరఖాస్తులు తీసుకోండి
సినిమా
'వాళా' సినిమా రివ్యూ (ఓటీటీ)
ఓటీటీలో ప్రతివారం పదులకొద్దీ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అలా తాజాగా స్ట్రీమింగ్లోకి వచ్చిన మలయాళ సినిమా 'వాళా'. కేవలం రూ.4 కోట్లు పెట్టి తీస్తే రూ.40 కోట్లు వసూలు చేసిందీ చిన్న సినిమా. మలయాళంలో సూపర్ హిట్ కాగా.. ఇప్పుడు ఓటీటీలో తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేశారు. బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్ ట్యాగ్ లైన్తో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?విష్ణు, అజు థామస్, మూస అనే ముగ్గురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఎప్పుడు అల్లరి చేస్తూ తల్లిదండ్రులకు తలనొప్పులు తీసుకొస్తుంటారు. వీళ్లకు కలామ్, వివేక్ ఆనంద్ అనే మరో ఇద్దరు ఫ్రెండ్స్ తోడవుతారు. వీళ్లంతా ఓ ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతారు. మొదటిరోజే పెద్ద గొడవ పెట్టుకుంటారు. ఏకంగా లెక్చరర్ని కూడా కొట్టేస్తారు. అలా ఆడుతూ పాడుతూ సాగిపోతున్న వీళ్లు.. ఊహించని విధంగా డ్రగ్స్ కేసులో పట్టుబడతారు. మరి వీళ్లు బయటపడ్డారా? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎందుకంటే ఆ వయసులో చేసే అల్లరి, హంగామా అలా ఉంటుంది మరి. చదువు బిడ్డల సంగతి పక్కనబెడితే ఆవారాగా తిరిగే బ్యాచ్లు కూడా ఉంటాయి. అలాంటి ఓ బ్యాచ్ కథే 'వాళా'. చూస్తే సింపుల్ కథనే గానీ చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. 90ల జ్ఞాపకాలు, టీనేజీ అల్లర్లు, గొడవలు, తల్లిదండ్రులు మాట వినకపోవడం లాంటి సీన్స్ ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. కానీ ఇందులో మాత్రం ఇంచుమించు అలానే ఉన్నప్పటికీ హాయిగా నవ్వుకునేలా చేస్తాయి.కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీ అనగానే దాదాపు ప్రతి దర్శకుడు కుర్రాళ్ల వైపు నుంచే కథ చెబుతారు. కానీ ఇందులో మాత్రం ఇటు కుర్రాళ్ల వైపు నుంచి నవ్విస్తూనే తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూపించారు. పిల్లల వల్ల వాళ్లు ఎంతలా స్ట్రగుల్ అవుతారనే విషయాన్ని చాలా చక్కగా చూపించారు. ఇంటర్వెల్ ముందు వరకు 90స్ జ్ఞాపకాల్ని నెమరవేసుకునేలా ఉంటాయి. ఆ తర్వాత మాత్రం పిల్లలు-తల్లిదండ్రుల మధ్య బంధాన్ని చూపించారు. చివర అరగంట అయితే చూస్తున్న మనం కన్నీళ్లు పెట్టుకునేంతలా ఎమోషనల్ అయిపోతాం.'వాళా' అంటే మలయాళంలో అరటి మొక్క అని అర్థం. పనిపాటా లేకుండా తిరిగే సోమరులని కూడా అదే పేరుతో పిలుస్తుంటారు. అరటి మొక్కని చూపించడంతో మొదలయ్యే ఈ సినిమా.. అరటి తోటని చూపించే సన్నివేశంతో ముగుస్తుంది. అలానే ప్రస్తుత సమాజంలోని ఎంతోమంది కుర్రాళ్లు ఈ సినిమాలో తమని తాము చూసుకోవడం గ్యారంటీ. ఎందుకంటే చాలా సీన్లు అలా కనెక్ట్ అయిపోతాయ్.ఎవరెలా చేశారు?యాక్టర్స్ ఎవరూ మనకు తెలియదు. కానీ సినిమా చూస్తున్నప్పుడు ఆ ఆలోచన మనకు రాదు. ఎందుకంటే అంత బాగా చేశారు. సినిమాటోగ్రాఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా కథకి తగ్గట్లు ఉంది. స్నేహం అంటే ఒకరి కోసం ఒకరు ఆవేశపడటం కాదు. అందరూ కలిసి ఓ బలమైన ఆశయం కోసం పట్టుదలతో ముందుకెళ్లడం, కన్నవాళ్ల కళ్లలో సంతోషం చూడటం అనే సందేశాన్ని అంతర్లీనంగా ఈ కథలో ఇచ్చారు. నిడివి కూడా 2 గంటలే. కుటుంబంతో కలిసి చూసే సినిమా ఇది.-చందు డొంకాన
అత్యాచార కేసులో ప్రముఖ నటుడికి అరెస్ట్ వారెంట్
మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ రిపోర్ట్ సంచలనం సృష్టించిందనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ సినిమా పరిశ్రమలో మహిళలపై ఎలాంటి లైంగిక వేధింపులు జరుగుతున్నాయో ఈ కమిటీ బయటపెట్టింది. ఇందులో ప్రముఖ హీరోలు, నటులు, దర్శకులు ఇరుక్కున్నారు. ప్రముఖ నటుడు సిద్ధిఖీపైన కూడా ఓ మహిళ అత్యాచార ఆరోపణలతో ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఈ కేసులోనే సదరు నటుడికి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అప్పటికే ముందస్తు బెయిల్ కోసం సిద్ధిఖీ ప్రయత్నించగా.. దాన్ని కోర్టు తిరస్కరించింది.(ఇదీ చదవండి: కాపీ కొట్టారంటూ డైరెక్టర్ శంకర్ కామెంట్.. 'దేవర' గురించేనా..?)కేసు ఏంటి?మాజీ నటి ఫిర్యాదులో పేర్కొన్న దాని ప్రకారం.. ఓ తమిళ సినిమాలో అవకాశమిస్తానని సిద్ధిఖీ చెప్పాడు. అందుకోసం లైంగిక అవసరాలు తీర్చమన్నాడు. కుదరదనే సరికి బలవంతంగా ఓ హోటల్లో అత్యాచారం చేశాడు. 2016లో తిరువనంతపురంలో ఈ సంఘటన జరిగింది. అయితే ఈ ఘటన గురించి గతంలో ఇదే నటి మాట్లాడుతూ.. తనతో సిద్ధిఖీ అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది.ఇప్పుడే ఎందుకు?తాజాగా హేమ కమిటీ రిపోర్ట్ రిలీజ్ చేయడంతో పలువురు నటీమణులు తమపై జరిగిన అఘాయిత్యాలని బయటపెడుతున్నారు. అలా సదరు నటి.. నటుడు సిద్ధిఖీపై పోలీస్ కేసు పెట్టింది. ఈ క్రమంలోనే విచారించిన కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కానీ సిద్ధిఖీ ప్రస్తుతం తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో పోలీసులు అతడిని పట్టుకునే పనిలో ఉన్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్)
‘ఆంధ్రావాలా’తో దేవర పోలిక.. కొరటాల ఏం అన్నారంటే..
ఈ మధ్యకాలంలో సినీ ప్రేక్షకులు మారిపోయారు. కథలో కొత్తదనం ఉంటేకానీ థియేటర్స్కి రావడం లేదు. పెద్ద హీరో సినిమా అయినా సరే.. కథ నచ్చలేదంటే ఫ్యాన్స్ సైతం టికెట్ పెట్టి సినిమా చూడడానికి ముందుకు రావడం లేదు. అందుకే మన దర్శకనిర్మాతలు డిఫరెంట్ స్టోరీస్తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అయినా కూడా ఓ చిన్న కామన్ పాయింట్ కనిపించినా.. చాలు మరొక సినిమాతో పోల్చేస్తున్నారు. ఒకప్పుడు సినిమా రిలీజ్ తర్వాత ఈ కథ పలానా సినిమాను గుర్తు చేస్తుందని చెప్పేవారు. (చదవండి: ఆ హిట్ డైరెక్టర్తో రజనీకాంత్ సినిమా..!)కానీ ఇప్పుడు అయితే ఫస్ట్ లుక్ మొదలు టీజర్, ట్రైలర్ని చూసి వేరే సినిమాలతో పోలిక పెడుతున్నారు. అసలు కథ ఏంటి అనేది తెలియకుండానే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాపై కూడా నెట్టింట అలాంటి ట్రోల్స్ వచ్చాయి. తాజాగా డైరెక్టర్ కొరటాల ఆ ట్రోల్స్పై స్పందించారు.‘ఆంధ్రావాలా’ తో పోలికకొరటాల శివ దర్శకత్వం మహించిన ‘దేవర’ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశాడు. అయితే ఈ విషయాన్ని ట్రైలర్ రిలీజ్ వరకు బయటకు చెప్పలేదు. ఇటీవల విడుదలైన ట్రైలర్లో ఎన్టీఆర్ని తండ్రి, కొడుకుల పాత్రల్లో చూపించారు. అప్పటి నుంచి ఈ సినిమాపై ట్రోలింగ్ మొదలైంది. ఈ సినిమా కథను ఎన్టీఆర్ నటించిన ‘ఆంధ్రావాలా’తో పోల్చుతూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ‘ఆంధ్రావాలా’లో ఎన్టీఆర్ తండ్రి, కొడుకు పాత్రల్లో నటించాడు. దేవరలో అలాంటి పాత్రల్లోనే కనిపించాడు. ఈ సినిమా కథతో దేవరకు సంబంధం ఉందంటూ ట్వీట్స్ చేస్తున్నారు.అలా ఎలా పోలుస్తారు: కొరటాలతాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆంధ్రావాలా’ట్రోలింగ్పై కొరటాల స్పందించారు. ఈ సినిమాలో హీరో తండ్రికొడుకులు నటించినంత మాత్రనా అదే కథ అంటె ఎలా? అసలు ఆ కథతో దీనికి సంబంధమే లేదు. ఒక హీరో తండ్రికొడుకులుగా నటించిన సినిమాలు భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి(నవ్వుతూ..). అసలు అదేం పోలిక? ఇది కంప్లీట్ ఫిక్షనల్ స్టోరీ’ అని కొరటాల అన్నారు. ఇక మరో ప్రశ్నకు సమాధానం చెబుతూ.. సోషల్ మీడియాను చెడును ప్రచారం చేయడానికే ఎక్కువగా వాడుతున్నారని, అలా కాకుండా మంచికి ఉయోగించాలని కోరారు. నెగెటివల్ కామెంట్ చేయడం వేరే..ద్వేషించడం వేరు. కామెంట్ చేయడంలో తప్పలేదు..ద్వేషించకూడదు అని కొరటాల అన్నారు.
స్టైలిష్ లుక్లో మహేశ్.. సీతక్కకు ఫ్యాన్ అంటున్న నమ్రత (ఫోటోలు)
న్యూస్ పాడ్కాస్ట్
యుద్ధక్షేత్రం పరిష్కారం కాదు. ఐరాస సదస్సులో మోదీ వ్యాఖ్యలు
జరగని తప్పుపై రాద్ధాంతమెందుకు?... నిరాధార ఆరోపణలు చేస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పండి... ప్రధాని మోదీకి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అతిశి... మరో ఐదుగురు కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం.. ఇంకా ఇతర అప్డేట్స్
హైడ్రాకు ఇక పూర్తి స్వేచ్ఛ... సంస్థకు చట్టబద్ధత కల్పించాలని తెలంగాణ కేబినెట్ సమావేశంలో నిర్ణయం.. ఇంకా ఇతర అప్డేట్స్
జమ్మూకశ్మీర్ యువతలో సాధికారత మొదలైంది... శ్రీనగర్, కాత్రాలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ హర్షం.. ఇంకా ఇతర అప్డేట్స్
‘ఒక దేశం-ఒకే ఎన్నిక’కు కేంద్ర కేబినెట్ పచ్చజెండా... రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులకు ఆమోదం.. ఇంకా ఇతర అప్డేట్స్
మహిళా వైద్యులు నైట్ డ్యూటీలు చేయొద్దన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఏపీలో గవర్నమెంటు స్కూలు పిల్లలపై వివక్ష ఎందుకు?. సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మానుకోండి, లేకపోతే ప్రజాగ్రహం తప్పదు... ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో సీబీఎస్ఈ బోధన రద్దు... ప్రస్తుత విద్యా సంవత్సరంలో స్టేట్ బోర్డు పరీక్షలే.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రీడలు
ఖరీదైన అపార్ట్మెంట్ కొన్న అయ్యర్.. ఎన్ని కోట్లంటే..?
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు అతడిని భారత సెలక్టర్లు పక్కన పెట్టారు. ఈ క్రమంలో దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో ఇండియా-డి జట్టుకు అయ్యర్ సారథ్యం వహించాడు. కానీ అక్కడ కూడా తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో శ్రేయస్ విఫలమయ్యాడు.ఈ టోర్నీలో మొత్తం ఆరు ఇన్నింగ్స్లలో కేవలం రెండు సార్లు మాత్రమే 50 పరుగుల మార్క్ను అతడు అందుకున్నాడు. అదే విధంగా రెండు ఇన్నింగ్స్లలో డకౌట్గా వెనుదిరిగాడు. అయితే దులీప్ ట్రోఫీలో విఫలమైన అయ్యర్.. ఇప్పుడు ఇరానీ ట్రోఫీపై దృష్టి సారించాడు. రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరగనున్న మ్యాచ్లో సత్తాచాటి తిరిగి భారత టెస్టు జట్టులో పునరాగమనం చేయాలని ఈ ముంబైకర్ భావిస్తున్నాడు.అపార్ట్మెంట్ కొన్న అయ్యర్..ఇక ఇది ఇలా ఉండగా.. శ్రేయస్ అయ్యర్ మరో ఖరీదైన అపార్ట్మెంట్ కొనుగోలు చేశాడు. ముంబైలోని వర్లీ ప్రాంతంలో రూ. 2.90 కోట్లతో ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అమ్మ రోహిణీ అయ్యర్తో కలిసి అతడు ఈ ఇంటిని కొన్నట్టు స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయం అధికారులు చెబుతున్నారు. వర్లీలోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలోని త్రివేణి ఇండస్ట్రియల్ సీహెచ్ఎస్ఎల్లోని 2వ అంతస్తులో అపార్ట్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. జాప్కీ రిపోర్ట్ ప్రకారం.. 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయ్యర్ ఖరీదు చేసిన అపార్ట్మెంట్ ఉందంట.రిజిస్ట్రేషన్ కోసం రూ.17.40 లక్షల స్టాంప్ డ్యూటీ అయ్యర్ కట్టినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ముంబైలో అయ్యర్ పేరిట ఓ అపార్ట్మెంట్ ఉంది. 2020లో ముంబైలోనే అత్యంత ఎత్తైన లోధా వరల్డ్ టవర్స్ ని 48వ అంతస్థులో ప్లాట్ను శ్రేయస్ కొనుగోలు చేశాడు.చదవండి: IND vs BAN: అగార్కర్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్?
ఈసారి టీ20 వరల్డ్కప్ టీమిండియాదే: కెప్టెన్
ఈసారి టీ20 ప్రపంచకప్ గెలిచితీరతామని టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ధీమా వ్యక్తం చేసింది. జట్టులోని ప్రతి ఒక్కరు ఈ మెగా టోర్నీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని.. గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతామని పేర్కొంది. ఈవెంట్ ఎక్కడైనా ప్రేక్షకుల మద్దతు మాత్రం తమకే లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసింది.న్యూజిలాండ్తో తొలి మ్యాచ్కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా అక్టోబరు 3 నుంచి మహిళల టీ20 వరల్డ్కప్-2024 మొదలుకానుంది. బంగ్లాదేశ్- స్కాట్లాండ్ మధ్య మ్యాచ్తో ఈ ఐసీసీ ఈవెంట్కు తెరలేవనుంది. ఇక టీమిండియా అక్టోబరు 4న న్యూజిలాండ్తో పోరుతో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.ట్రోఫీ గెలవాలన్న నిరీక్షణకు ఈసారి తెరదించుతాంఈ నేపథ్యంలో ఐసీసీతో మాట్లాడిన హర్మన్ప్రీత్ కౌర్.. ‘‘మా జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉన్నాము. చాలా కాలంగా మేము ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాం. అదే మా బలం. ఎక్కడున్నా అభిమానుల మద్దతు మాకే ఉంటుంది. జట్టులోని ప్రతి ఒక్కరు అత్యుత్తమంగా రాణించేందుకు సిద్ధంగా ఉన్నారు. ట్రోఫీ గెలవాలన్న నిరీక్షణకు ఈసారి తెరదించుతాం’’ అని పేర్కొంది. కాగా ఐసీసీ టోర్నీలో భారత మహిళల జట్టు కొన్నేళ్లుగా ఆఖరి మెట్టుపై బోల్తా పడుతున్న విషయం తెలిసిందే. గత టీ20 వరల్డ్కప్ ఆసాంతం నిలకడగా రాణించిన హర్మన్ సేన.. ఫైనల్లో మాత్రం అనుకన్న ఫలితం రాబట్టలేకపోయింది. గత పొరపాట్లు పునరావృతం చేయకుండాటైటిల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇటీవల మహిళల ఆసియా కప్ టోర్నీలోనూ ఫైనల్లో శ్రీలంక చేతిలో అనూహ్యంగా పరాజయం పాలైంది. అయితే, ప్రపంచకప్ ఈవెంట్లో మాత్రం గత పొరపాట్లు పునరావృతం చేయకూడదని.. ఒత్తిడిని జయించి టైటిల్ గెలవాలని భావిస్తోంది. చదవండి: IND vs BAN: అగార్కర్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్?
జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్గా రుతురాజ్! సంజూకు నో ఛాన్స్
ఇరానీ ట్రోఫీ-2024లో భాగంగా లక్నో వేదికగా ముంబై, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఆక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. తాజాగా ఈ మ్యాచ్ కోసం 15 మంది సభ్యులతో కూడిన రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది.ఈ జట్టుకు టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా బెంగాల్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్ వంటి స్టార్ ఆటగాళ్లకు చోటు దక్కింది. అయితే దులీప్ ట్రోఫీలో సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్కు మాత్రం బీసీసీఐ సెలక్టర్లు మొండి చేయిచూపించింది. అతడికి ఇరానీ ట్రోఫీ జట్టులో చోటు ఇవ్వలేదు. అదే విధంగా బంగ్లాతో టెస్టు సిరీస్కు ఎంపికైన భారత క్రికెటర్లు ధ్రువ్ జురెల్, యష్ దయాల్ను ఈ జట్టులో సెలెక్టర్లు చేర్చారు. దీంతో వీరిద్దరూ రెండు టెస్టుకు బెంచ్కే పరిమితమయ్యే అవకాశముంది. మరోవైపు ఈ ఇరానీ కప్లో ముంబై జట్టుకు సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే సారథ్యం వహించనున్నాడు.ఇరానీ ట్రోఫీకి రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్)*, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, సరాంశ్ జైన్, ప్రసిద్ధ్ కృష్ణ, ముఖేష్ కుమార్, యష్ దయాల్*, రికీ భుయ్, శాశ్వత్ రావత్, ఖలీల్ అహ్మద్, రాహుల్ చాహర్చదవండి: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాం.. ట్రోఫీ మాదే: హర్మన్
టీమిండియాతో రెండో టెస్టు.. బంగ్లాకు ఊహించని ఎదురు దెబ్బ!
భారత్ చేతిలో తొలి టెస్టులో ఘోర ఓటమి చవిచూసిన బంగ్లాదేశ్కు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 27న కాన్పూర్ వేదికగా భారత్తో జరగనున్న రెండో టెస్టుకు బంగ్లా స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ గాయం కారణంగా దూరం కానున్నట్లు సమాచారం.చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో షకీబ్ చేతి వేలికి గాయమైంది. బ్యాటింగ్ చేస్తుండగా బుమ్రా బౌలింగ్లో బంతి బలంగా షకీబ్ కూడి చేతికి వేలికి తాకింది. దీంతో అతడు నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే అతడికి ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. ఆ తర్వాత షకీబ్ తన ఇన్నింగ్స్ను కొనసాగించినప్పటికి నొప్పితో బాధపడుతున్నట్లు మైదానంలో కన్పించాడు. మ్యాచ్ అనంతరం అతడిని స్కానింగ్కు తరలించగా ఎటువంటి పగులు లేనిట్లు తేలినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కానీ వారం రోజుల పాటు వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కాన్పూర్ టెస్టుకు షకీబ్ దూరమైతే బంగ్లాకు నిజంగా గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. అయితే షకీబ్ తొలి టెస్టులో తన మార్క్ను చూపించలేకపోయాడు. అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ సత్తాచాటలేకపోయాడు.చదవండి: IND vs BAN: అగార్కర్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్?
బిజినెస్
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి స్వల్ప లాభాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 20.97 పాయింట్ల లాభంతో 84,949.58 వద్ద, నిఫ్టీ 11.80 పాయింట్ల లాభంతో 25,950.85 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్, హిందాల్కో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్ప్రైజెస్ వంటి కంపెనీలు చేరాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్, హిందుస్తాన్ యూనిలీవర్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి కంపెనీలో నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవిస్తాయి: శామ్ ఆల్ట్మన్
మారుతున్న కాలంతో పాటు మనిషి కూడా మారుతూ ఉండాలి. లేకుంటే మనుగడ కష్టమవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వచ్చిన తరువాత చాలామంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. దీనిపై తాజాగా ఓపెన్ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్మన్' స్పందించారు.ఏఐ వల్ల ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవిస్తాయనే మాట నిజమే.. కానీ ఉద్యోగుల్లో కూడా మార్పు వస్తుందని ఆల్ట్మన్ అన్నారు. ఏఐ ఉద్యోగులకు పని లేకుండా చేస్తుందేమో అని భయం ఎవరికీ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనిషి సృజనాత్మకతతో మరిన్ని మార్గాలను అన్వేషించగలడు. ఇదే వారి సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.ఈ రోజు చేస్తున్న ఉద్యోగాలు కొన్ని సంవత్సరాల క్రితం లేదు, అదే విధంగా ఇప్పుడు మనం చేస్తున్న ఉద్యోగాలు రాబోయే తరాలకు చాలా చిన్నవిగా లేదా అనవసరమైనవిగా కూడా అనిపించవచ్చు. కొత్తగా వచ్చిన మార్పులను మనిషి ఎలా స్వీకరించారో.. ఏఐ వల్ల వచ్చే మార్పులను కూడా స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉండాలని ఆల్ట్మన్ అన్నారు. ఏఐ ఉద్యోగుల మీద మాత్రమే కాకుండా.. సమాజం మీద కూడా ప్రభావం చూపుతుందని అన్నారు.ఇదీ చదవండి: ఎక్స్లో బ్లాక్ బటన్ తొలగింపు: మస్క్ ట్వీట్ వైరల్ఈ రోజు ఏఐ ఎంతలా విస్తరించింది అంటే.. విద్య, వైద్యం వంటి చాలా రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకురావడంలో ఏఐ పెద్ద పాత్ర పోషిస్తోంది. కాబట్టి ఏఐ రాక జీవితాలను ఇప్పుడున్నదానికంటే ఉన్నతంగా మార్చుకోవడానికి సహాయపడుతుందని అన్నారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. టెక్నాలజీని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఆల్ట్మన్ హెచ్చరించారు. ఏఐ వల్ల అనుకూల ప్రయోజనాలు మాత్రమే కాకుండా.. ప్రతికూలతలు ఉన్నాయని అన్నారు.
దిగ్గజ ఆటో కంపెనీల మధ్య ఒప్పందం?
మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా ఆటో ఫోక్స్వ్యాగన్ ఇండియా (ఎస్ఏవీడబ్ల్యూఐపీఎల్) త్వరలో కీలక ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు. త్వరలో ముంబయిలో ఈ రెండు సంస్థలకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్లు సమావేశం కాబోతున్నట్లు చెప్పారు.ఈ సమావేశంలో ఇరు సంస్థల మధ్య భాగస్వామ్యం కుదిరే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కంపెనీల ఉత్పత్తులు, తయారీ యూనిట్ల వినియోగం, టెక్నాలజీ, వంటి అంశాలపై ఇరుపక్షాలు దృష్టి సారించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎస్ఏవీడబ్ల్యూఐపీఎల్ భారత్లో పుణె, ఔరంగబాద్లోని తయారీ యూనిట్లను కలిగి ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా మహారాష్ట్రలోని చకన్లో తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని స్థల సేకరణలో నిమగ్నమైనట్టు సమాచారం. మొత్తంగా ఆటోమోటివ్ పరిశ్రమకు సమీపంలో ఉండాలన్నది కంపెనీ భావన. మల్టీ ఎనర్జీ ప్లాట్ఫామ్ అయిన న్యూ ఫ్లెక్సిబుల్ ఆర్కిటెక్చర్ (ఎన్ఎఫ్ఏ) ఆధారిత వాహనాలను ఇక్కడ తయారు చేయబోతున్నట్లు తెలిసింది.ఇదీ చదవండి: చాట్జీపీటీ ఎక్స్ ఖాతా హ్యాక్..?
చాట్జీపీటీ ఎక్స్ ఖాతా హ్యాక్..?
ఓపెన్ఏఐకు చెందిన ఒక ఎక్స్ ఖాతా హ్యాక్ అయినట్లు కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. క్రిప్టోకరెన్సీ స్కామర్లు సంస్థకు చెందిన చాట్జీపీటీ ఆధ్వర్యంలోని ‘న్యూస్మేకర్’ ఎక్స్ పేజీను హ్యాక్ చేసినట్లు తెలిపాయి. ఈ పేజీలో ఓపెన్ఏఐకు సంబంధించిన క్రిప్టో టోకెన్లు దర్శనమిచ్చాయని, వాటిని క్లిక్ చేసిన వెంటనే నకిలీ వెబ్సైట్కి వెళ్తుందనేలా వార్తలు వచ్చాయి.మీడియా సంస్థల కథనాల ప్రకారం..‘ఓపెన్ఏఐ వినియోగదారులందరికి ఏఐ, బ్లాక్చెయిన్ టెక్నాలజీ మధ్య అంతరాన్ని తగ్గించేలా $OPENAI టోకెన్ పరిచయం చేస్తున్నందుకు సంస్థ సంతోషం వ్యక్తం చేస్తోంది. $OPENAIను వినియోగించుకుని భవిష్యత్ బీటా ప్రోగ్రామ్లన్నింటికీ యాక్సెస్ చేసుకోవచ్చు’ అనేలా పోస్ట్లు వెలిశాయి. అది చూసిన యూజర్లు దానిపై క్లిక్ చేసిన వెంటనే క్రిప్టో పేజీకి వెళ్లేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై ఓపెన్ఏఐ, ఎక్స్ ప్రతినిధులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ఇదీ చదవండి: ముందుగానే యాపిల్ ఇంటెలిజన్స్ సూట్..?ఇదిలాఉండగా, క్రిప్టోకరెన్సీని ప్రమోట్ చేస్తున్న రిప్పల్ ల్యాబ్స్ ద్వారా సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానెల్ను హ్యాక్ చేసినట్లు వార్తలు వచ్చిన గంటల్లోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. మోసపూరిత క్రిప్టోకరెన్సీ స్కీమ్ను ప్రోత్సహించడానికి ఓపెన్ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఎక్స్ ఖాతాను గతంలో హ్యాక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అధిక ప్రజాధరణ ఉన్న ఎక్స్ ఖాతాలపై హ్యాకర్ల దాడులు పెరుగుతున్నాయి. ఇలాంటి హ్యాకర్ల వల్ల అమెరికన్లు 2023లో 5.6 బిలియన్ డాలర్ల(రూ.46 వేలకోట్లు) మేర నష్టపోయినట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. 2022తో పోలిస్తే హ్యాకర్ల వల్ల నష్టపోయిన సొమ్ము 2023లో 45 శాతం పెరిగిందని పలు నివేదికల ద్వారా తెలిసింది.
ఫ్యామిలీ
EY మహిళా ఉద్యోగి మృతి : నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల దుమారం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన వ్యాఖ్యలతో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పని ఒత్తిడి కారణంగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ (EY)సంస్థలో 26 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ మృతిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.ఒత్తిడిని ఎదుర్కొనేందుకు అంతర్గత బలం అవసరమని, ఇది దైవత్వం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. దీనిపై అనుచిత వ్యాఖ్యలు అంటూ ప్రతిపక్ష నాయకులతో సహా పలువురు సోషల్ మీడియా వినియోగదారులు మండిపడుతున్నారు.చెన్నై మెడికల్ కాలేజీలో జరిగిన ఒక కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ ప్రసంగించారు.ఈ సందర్భంగా అన్నా సెబాస్టియన్ కేంద్ర మంత్రి స్పందిస్తూ ఇంటి నుండి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో పిల్లలకు నేర్పించాలని, దేవునిపై ఆధారపడటం ద్వారా మాత్రమే ఒత్తిడిని ఎదుర్కోవచ్చని అన్నారు. ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి అంతర్గత శక్తి ఉండాలని పేర్కొన్నారు. “భగవంతుని నమ్మండి, మనకు భగవంతుని అనుగ్రహం ఉండాలి. దేవుణ్ణి వెతకండి, మంచి క్రమశిక్షణ నేర్చుకోండి. మీ ఆత్మ శక్తి దీని నుండి మాత్రమే పెరుగుతుంది. పెరుగుతున్న ఆత్మశక్తితోనే అంతర్గత బలం వస్తుంది...విద్యా సంస్థలు దైవత్వం మరియు ఆధ్యాత్మికతను తీసుకురావాలి. అప్పుడే మన పిల్లలకు అంతర్గత బలం వస్తుంది. అది వారి ప్రగతికి, దేశాభివృద్ధికి దోహదపడుతుంది. అదే నా దృఢమైన నమ్మకం,” అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకు అంబానీ, అదానీ దిగ్గజాల బాధ తప్ప సామాన్యుల బాధ కనిపించదు, ఎన్నో ఆశలతో వస్తున్న అన్నా లాంటి యువకులు కార్పొరేట్ కంపెనీల దోపిడీకి బలైపోతున్నారంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (సంస్థ), కెసి వేణుగోపాల్ ట్వీట్ చేశారు. Dear Nirmala Sitaraman ji,Anna had inner strength to handle the stress that came with pursuing a gruelling Chartered Accountancy degree. It was the toxic work culture, long work hours that took away her life which needs to be addressed. Stop victim shaming and atleast try to be… pic.twitter.com/HP9vMrX3qR— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) September 23, 2024 చార్టర్డ్ అకౌంటెన్సీ డిగ్రీని చదవడంలోనే అన్నా అంతర్గత బలం ఎంతోఉంది. కానీ విషపూరితమైన పని సంస్కృతి, సుదీర్ఘ పని గంటలు ఆమె జీవితాన్ని నాశనం చేశాయి. దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. బాధితురాలిని అవమానించడం ఆపండి, కనీసం కొంచెం సున్నితంగా ఉండటానికి ప్రయత్నించండి, మీరు కోరుకుంటే దేవుడు మార్గనిర్దేశం చేస్తాడు అంటూ ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు. అటు అన్నా సెబాస్టియన్ మృతిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) విచారణ చేపట్టింది. పని భారం వల్లే అన్నా మృతి చెందిందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కమిషన్, ఈ వ్యవహారంలో స్వయంచాలకంగా విచారణ ప్రారంభించింది. నాలుగు వారాల్లోగా సమగ్ర దర్యాప్తు నివేదికను అందజేయాలని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖను కూడా కమిషన్ ఆదేశించింది. దీనిపై కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ విచారణ జరుపుతోంది.కాగా ఎర్నాకులం కున్నప్పిల్లికి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ ఉద్యోగంలో చేరిలో నాలుగు నెలలకే, తీవ్ర ఒత్తిడి, గుండెపోటుతో మరణించింది. దీంతో ఆమె తల్లి కంపెనీ చైర్మన్కు ఈమెయిల్ రావడంతోఈ విషయంలో సోషల్మీడియాలో వైరల్గా మారింది.
రాత్రిపూట కూడా సన్లైట్ని ఉపయోగించుకోవచ్చు! ఎలాగో తెలుసా..?
మనకు నచ్చిన ఫుడ్ని ఏం టైంలో అయినా ఆర్డర్ చేసుకుని హాయిగా తినేస్తాం. అలానే సౌరశక్తిని కూడా మనకు నచ్చిన ప్రదేశంలో ఆర్డర్ చేసుకుని ఉపయోగించుకోవచ్చట. ఆఖరికి రాత్రిపూట కూడా సన్లైట్ని ఆర్డర్ చేసుకొవచ్చట. ఈ సాంకేతికతను కాలిఫోర్నియాకు చెందిన రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అనే స్టార్టప్ కంపెనీ అందుబాటులోకి తీసుకురానుంది. అందరూ ప్రతి చోట సోలార్ ఫ్యానెల్స్ని ఇన్స్టాల్ చేసి సౌరశక్తిని ఉపయోగించుకుంటున్నారు. అయితే రాత్రి వేళ ఈ సూర్యకాంతి ఆఫ్ అవుతుంది కాబట్టి వినియోగించుకునే అవకాశమే ఉండదు. ఆ సమస్యకు చెక్పెట్టేలా సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది ఈ కంపెనీ. ఎలా అంటే.. ఈ ప్రాజెక్ట్ వ్యవస్థాపకుడు సీఈవో బెన్ నోవాక్. రాత్రిపూట కూడా సౌరశక్తిని వినియోగించుకునేలా చేయడమే తమ కంపెనీ లక్ష్యం అని అన్నారు. తమ కంపెనీ రాత్రిపూట కూడా నచ్చిన ప్రదేశంలో సౌరశక్తిని ఉపయోగించుకునేలా సన్లైట్ని విక్రయిస్తుందని అన్నారు. జస్ట్ ఆ కంపెనీ వెబ్సైట్లో లాగిన్ అయ్యిఆర్డర్ పెట్టుకుంటే చాలు మీరున్న ప్రదేశానికే సూర్యకాంతి వచ్చేస్తుంది. అందుకోసం 57 చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఆ ఉపగ్రహాలకి 33-చదరపు అడుగుల అల్ట్రా రిఫ్లెక్టివ్ మైలార్ అద్దాలు అమర్చుతారు. ఈ అద్దాలు భూమిపై ఉన్న సౌర క్షేత్రాలపై ప్రతిబింబించేలా రూపొందించారు. అంతేగాదు ఈ ఉపగ్రహాలు భూమి ఉపరితలం నుంచి 370 మైళ్ల ఎత్తులో కక్ష్యలో తిరుగుతాయని వివరించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. అంతేగాదు ఈ ప్రాజెక్టును లండన్లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ స్పేస్ ఫ్రమ్ స్పేస్లో సమర్పించినట్లు వెల్లడించారు సీఈవో బెన్. ఇదెలా సాధ్యమో ప్రయోగాత్మకంగా ఓ వీడియో తీసి మరీ వివరించారు. అందుకోసం రిఫ్లెక్ట్ ఆర్బిటల్ కంపెనీ ఏడుగురు వ్యక్తులతో కూడిన బృందం, హాట్ ఎయిర్ బెలూన్లో వెళ్తోంది. ఆ బెలూన్కే ఎనిమిది అడుగుల కొలత గల మైలార్ మిర్రర్లను అమర్చారు. వాటిపై గాజు కాకుండా అల్యూమినియం ఫ్రేమ్పై విస్తరించిన పాలిస్టర్ ఫిల్మ్లు ఉంటాయి. అవి భూమిపై ఉన్న సౌరఫలకాలపై పరావర్తనం చెందేలా చేస్తాయి. అంటే ఇక్కడ బృందం సుమారు 242 మీటర్ల (దాదాపు 800 అడుగులు) దూరం నుంచి సోలార్ ప్యానెల్స్పై హాట్ ఎయిర్ బెలూన్పై ఉన్న అద్దం నుంచి కాంతిని విజయవంతంగా పరావర్తనం అయ్యేలా చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అలా నచ్చిన ప్రదేశంలోకి సూర్యరశ్మిని ఉపయోగించుకునేలా ఉపగ్రహాలు ఉయోగించనుంది ఈ స్టార్టప్ కంపెనీ. అయితే ఇదేమంత ఖరీదైనది కాదని తమ వెంచర్ లాభదాయకమైనదని ఆ ప్రాజెక్ట్ నిపుణులు నమ్మకంగా చెబుతుండటం విశేషం. ఈ ప్రాజెక్ట్ని 2025 కల్లా పూర్తి స్థాయిలో ప్రారంభించనుంది. అతేకాదండోయ్ ఈ కంపెనీకి అప్పుడే సూర్యకాంతి కోసం సుమారు 30 వేల దరఖాస్తులు వచ్చేశాయట. Sharing a bit more about Reflect Orbital today. @4TristanS and I are developing a constellation of revolutionary satellites to sell sunlight to thousands of solar farms after dark. We think sunlight is the new oil and space is ready to support energy infrastructure. This… pic.twitter.com/5WRb8etAv0— Ben Nowack (@bennbuilds) March 13, 2024 (చదవండి: ఆరేళ్ల ప్రాయంలో కిడ్నాప్కి గురయ్యాడు..కట్చేస్తే 70 ఏళ్ల తర్వాత..!)
Dussehra 2024 : కజ్జికాయలు.. ఈజీగా, హెల్దీగా!
దసరా సంబరాలకు ముహూర్తం సమీపిస్తోంది. ఈ వేడుకలకు అందరూ సిద్ధమైపోతున్నారు కూడా ముఖ్యంగా రకారకాల పిండివంటలు, తీపి వంటకాల తయారీలో బిజీగా ఉంటారు. ప్రతీదీ కల్తీ అవుతున్న ప్రస్తుత తరుణంలో రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలను ఇంట్లోనే తయారు చేసుకోవడం ఉత్తమం. అందులోనూ ఈజీగా తయారు చేసుకొనేవైతే ఇంకా మంచిది. మరి ఎంతో ఇష్టమైన కజ్జికాయలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి! దసరా,దీపావళి, సంక్రాంతి పండగులకు తయారు చేసుకునే వంటకాల్లో కజ్జికాయలు ఒకటి. అనుభవం లేని వారు కూడా చాలా సులభంగా కజ్జికాయలను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది అటు హాట్ లాగా ఉంటుంది, ఇటు స్వీట్లాగా కూడా ఉంటుంది. కజ్జికాయలకి కావాల్సిన పదార్థాలు:మైదాపిండి, ఒక టేబుల్ స్పూన్ రవ్వ, ఉప్పు, నెయ్యి, పుట్నాలు, ఎండు కొబ్బరి , ఆరు యాలకులు, నూనెకజ్జికాయల తయారీమైదాపిండి శుభ్రంగా జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి రవ్వ, ఉప్పు, నెయ్యి కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు మెత్తని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. తరువాత ఈ ముద్దపైన నూనెరాసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టఫింగ్ తయారీ కొబ్బరి ముక్కలు, యాలకులు, పుట్నాల పప్పు నెయ్యితో దోరగా వేయించుకోవాలి. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో బెల్లం ఆర్గానిక్ బెల్లం పౌడర్ లేదంటే మెత్తగా చేసుకున్న చక్కెర పొడి ,యాలకుల పొడి వేసి బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. కావాలంటే దీంట్లో రుచి కోసం జీడిపప్పు, బాదం పలుకులను కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కొబ్బరి, బెల్లం, యాలకులు, జీడిపప్పుతో తయారు చేసినకొబ్బరి లౌజును కూడా వాడుకోవచ్చు. (బరువు తగ్గాలనుకుంటున్నారా? బనానా స్టెమ్ జ్యూస్ ట్రై చేశారా?)ఇపుడుముందుగానే కలిపి ఉంచుకన్న చపాతీ పిండిని చపాతీలాగా ఒత్తుకుని, కజ్జికాయలు ఒత్తుకునే (మౌల్డ్) చెక్కపై ఉండి, మధ్యలో రెడీ చేసిపెట్టుకున్న స్టఫింగ్ వేసి ప్రెస్ చేసుకోవాలి. లేదంటే చపాతీ మధ్యలో స్టఫింగ్ పెట్టి, మడిచి అంచుల్లో ఫోర్క్తో డిజైన్ వత్తుకుంటే సరిపోతుంది.ఇపుడు స్టవ్మీద బాండ్లీ పెట్టుకుని, నూనె పోసి బాగా వేడెక్కిన తరువాత ఒత్తి పెట్టుకున్న కజ్జికాయలను, మంచి రంగు వచ్చేదాకా తక్కువమంటపై వేయించుకోవాలి. అంతే కజ్జికాయలు రెడీ. చల్లారిన తరువాత వీటిని ప్లాస్టిక్ లేదా స్టీల్ డబ్బాల్లో ఉంచుకోవాలి. ఇదీ చదవండి: World Tourism Day 2024: ప్రకృతిని కాపాడుకుందాం, ఈ పనులు అస్సలు చేయకండి!
బరువు తగ్గాలనుకుంటున్నారా? బనానా స్టెమ్ జ్యూస్ ట్రై చేశారా?
మనిషి ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలకు మూలం ప్రకృతి. కానీ చాలావరకు ప్రకృతి సహజంగా లభించే మూలికల గురించి మొక్కల గురించి నేటి తరానికి అవగాహన కరువుతోంది. ఈ నేపథ్యంలో అలాంటి వాటి గురించి తెలుసు కోవడం, అవగాహన పెంచుకోవడం, ఆచరించడం చాలా ముఖ్యం.అలాంటి వాటిల్లో ఒకటి అరటి పండు. అరటిపండులో అద్భుత గుణాలు ఉన్నాయి. ఇందులోని పోషక గుణాలు పిల్లలకీ, పెద్దలకీ చాలా మేలు చేస్తాయి. ఒకవిధంగా అరటి చెట్టులో ప్రతీ భాగమూ విలువైనదే. అరటి ఆకులను భోజనం చేసేందుకు వాడతారు. దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. కార్తీక మాసంలో కార్తీక దీపాలను పెట్టేందుకు అరటి దొప్ప ఆధ్యాత్మికంగా చాలా విలువైంది. ఇక అరటి పువ్వుతో పలు రకాల వంటకాలు తయారు చేస్తారు. కానీ అరటి కాండంలోని ఔషధ గుణాల గురించి చాలామంది తెలియదు. వాటి గురించి తెలుసుకుందాం.అరటిపండులో పొటాషియం, విటమిన్ బి6, మెగ్నీషియం, విటమిన్ సి, కాపర్, ఐరన్, మాంగనీస్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్, ఇతర ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.అధిక స్థాయి చెడు కొలెస్ట్రాల్కు చెక్ చెప్పవచ్చు.ఇందులో కేలరీలు తక్కువ. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని వాడటం వల్ల దీర్ఘకాలంలో మలబద్ధకం , కపుడు అల్సర్లను నివారించడంలో ఉపయోపడుతుంది.ఈ జ్యూస్లో విటమిన్ బి6 పుష్కలంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది. ఇందులో పొటాషియం కూడా లభిస్తుంది.కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నవారికి ఇది సంజీవని లాంటిదని చెప్పవచ్చు. ఇందులోని పొటాషియం , మెగ్నీషియం రాళ్లను నివారిస్తుంది.కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది.కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుకు కూడా మంచిది. గుండె జబ్బులను కూడా అడ్డుకుంటుంది. శరీరంలోని మలినాలు బయటికి పంపింస్తుంది. అధిక బరువు సమస్యకు కూడా చెక్పెడుతుంది.బరువు తగ్గడానికి ప్రతిరోజూ 25 గ్రా నుండి 40 గ్రా అరటి కాండం జ్యూస్ను తీసుకోవచ్చు.అరటి కాండం రసం శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో పనిచేస్తుంది కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. జీర్ణ వ్యవస్థ నుంచి అసిడిటీ వరకూ చాలా సమస్యలు దూరమవుతాయి..యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కు కూడా పనిచేస్తుంది. శరీరంలోని ట్యాక్సిన్ని బయటికి పంపి మూత్ర నాళాన్ని శుభ్రపరచడానికి సాయపడుతుంది.అరటి కాండం ఆకుపచ్చ పొరను తీసివేసి, లోపల కనిపించే తెల్లటి కాండాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి, 15 నిమిషాలు ఉడకబెట్టి, రోజుకు రెండుసార్లు సేవించ వచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని చోట్ల తొట్టెల్లో అరటి కాండాన్ని ఊరబెట్టి, ఆ నీటిని వడపోసి ఔషధంగా వాడతారు. శుభ్రం చేసి కట్ చేస్తే మజ్జిగలో నానబెట్టి ఫ్రిజ్ లో నిల్వ ఉంచుకోవచ్చు.దక్షిణ థాయ్లాండ్లో, తీపి , పుల్లని కూరగాయల సూప్ లేదా కూరలో సన్నగా తరిగిన అరటి కాడను కలుపుతారు. సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా దుష్ప్రభావాలను కలిగి లేనప్పటికీ, అలెర్జీ, కడుపు నొప్పి, వాంతులు, అలర్జీ రావొచ్చు. ఒక్కోసారి లే కాలేయం, మూత్రపిండాలకు హాని కలిగించే అవకాశంఉంది. అయితే, వ్యక్తి వైద్య చరిత్ర , అరటి కాండం పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా రూపంలో తినేటప్పుడు లేదా త్రాగేటప్పుడు మితంగా ఉండాలి. నోట్: అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే .వైద్య నిపుణుడు, పోషకాహార నిపుణుడు లేదా డైటీషియన్ను సంప్రదించడం చాలా ముఖ్యం.
ఫొటోలు
International View all
ఇజ్రాయెల్ దాడిలో హిజ్బుల్లా కమాండర్ ఇబ్రహీం ఖుబైసీ హతం
బీరూట్ : హిజ్బుల్లాను ఇ
న్యూస్ చదువుతుండగా లెబనాన్ జర్నలిస్ట్పై ఇజ్రాయెల్ మిస్సైల్ దాడి
బీరూట్ : లెబనాన్ దేశంలో హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భీక
శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య
కొలంబో: శ్రీలకం నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య అధికారికంగా ని
సునీత విలియమ్స్ కోసం 26న క్రూ–9 ప్రయోగం.. అయినా 5 నెలలు పడుతుందా!
కేప్ కెనవెరల్ (అమెరికా): హమ్మయ్యా... సునీతా విలియమ్స్ త్వరలోనే భూమిని చేరుకోనున్నారు.
భారత్, చైనాల మధ్య నలిగిపోము: శ్రీలంక అధ్యక్షుడు
కొలంబో: భారత్, చైనా దేశాలతో విదేశాంగ విధానంలో శ్రీలంక సమానమ
National View all
ఆటోను ఢీకొట్టిన ట్రక్కు.. ఏడుగురు మృతి
భోపాల్: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..ఇద్దరు మావోయిస్టులు మృతి
రాయ్పూర్:ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు,పోలీసులకు మధ్య మరోసా
ఉత్తర్ప్రదేశ్లో సీఎం యోగి సర్కార్ కొత్త రూల్స్
లక్నో: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ రాష్ట్రంలో కఠిన
వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలన్న కంగనా.. కాంగ్రెస్ కౌంటర్
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన దురుస
అక్కడుంది చంద్రబాబు.. SIT ఏర్పాటుపై వీహెచ్పీ సురేంద్ర జైన్ ఆగ్రహం
సాక్షి,న్యూఢిల్లీ : చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం తిరు
NRI View all
అమెరికాలో గుండెపోటుతో తెలుగు విద్యార్థి హఠాన్మరణం
ఆంధ్రప్రదేశ్కు చెందిన యువకుడు డల్లాస్లో గుండెపోటుతో మరణించాడు.
న్యూజెర్సీలో విజయవంతంగా నాట్స్ పికిల్బాల్ టోర్నీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తెలుగు వారిలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు న్యూజెర్సీలో తాజాగా పికిల్ బాల్ టోర్న
ఎన్ఆర్ఐలే భారత్ అంబాసిడర్లు: ప్రధాని మోదీ
న్యూయార్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్న
అమెరికాలో ఇండియన్ ఎంబసీ అధికారి అనుమానాస్పద మృతి
వాషింగ్టన్: అమెరికాలోని ఇండియన్ ఎంబసీ (దౌత్య కార్యాలయం)లో వ
లెబనాన్ పేజర్ల పేలుళ్లలో కేరళ టెక్కీ ప్రమేయం?
హెజ్బొల్లా లక్ష్యంగా జరిగిన పేజర్ల పేలుళ్ల కేసులో..
క్రైమ్
మారేడుమిల్లిలో వైద్య విద్యార్థుల విహారయాత్ర.. విషాదాంతం
అల్లూరి, సాక్షి: మారేడుమిల్లి విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. నిన్న గల్లంతైన ముగ్గురు వైద్య విద్యార్థుల్లో ఇద్దరు మృతిచెందగా.. సోమవారం ఉదయం వాళ్ల మృతదేహాల్ని వెలికి తీశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.మారేడుమిల్లి పర్యాటక ప్రాంతానికి ఏలూరులోని ఆశ్రం కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 14 మంది వైద్యవిద్యార్థులు ఆదివారం ట్రావెలర్ వాహనంలో వెళ్లారు. మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిలోని ‘జలతరంగిణి’ జలపాతం వద్దకు చేరుకుని అందులో దిగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీవర్షం కురిసింది. జలపాతం ఉద్ధృతి పెరగడంతో ఐదుగురు కొట్టుకుపోయారు.హరిణిప్రియ, గాయత్రి పుష్పను ఒడిశా నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరు యువకులు కాపాడి, రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. హరిణిప్రియ పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమహేంద్రవరం తరలించారు. గల్లంతైనవారిలో సౌమ్య, హరదీప్, అమృత, హరిణిప్రియ, గాయత్రి పుష్ప ఉన్నారు. వీరిలో విజయనగరానికి చెందిన గల్లంతైన వారికోసం పోలీసులు, సీబీఈటీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సౌమ్య, అమృత మృతదేహాలు లభ్యమయ్యాయి. హరదీప్ కోసం గాలింపు కొనసాగుతోంది.కొసిరెడ్డి సౌమ్య (21) ది పార్వతీపురం జిల్లా బొబ్బిలి స్వస్థలంకాగా, బి.అమృత (21) బాపట్లగా పోలీసులు తెలిపారు. సీహెచ్ హరదీప్(20) ప్రకాశం జిల్లా మార్కాపురంగా తెలుస్తోంది. సౌమ్య, అమృత మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
బీటెక్ రవి దాష్టీకం
సాక్షి టాస్క్ఫోర్స్: వైఎస్సార్ జిల్లా పులివెందుల పట్టణంలోని మారుతీ హలు సమీపంలో ఉన్న రాజగోపాల్రెడ్డి శ్రావణి దంపతులపై టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి దాష్టీకాన్ని ప్రదర్శించారు. ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదనే కారణంతో ఏకంగా తెలుగు తమ్ముళ్లను ఇంటికి పంపి మరీ కొట్టుకుంటూ తీసుకెళ్లిన ఘటన ఆదివారం జరిగింది. బాధితుల కథనం మేరకు వివరాలు.. పులివెందుల పట్టణం మారుతీ హాల్ సమీపంలో రాజగోపాల్రెడ్డి దంపతులు దుస్తుల షాపు నడుపుతున్నారు. పట్టణంలోని ప్రయివేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యుడు మధు భార్య లావణ్య దుస్తుల షాపునకు వస్తూ వీరికి పరిచయమైంది. హైదరాబాద్లో బ్యూటీషియన్ కోర్సు చేస్తున్నానని కొంత, రియల్ ఎస్టేట్ కోసమని మరికొంత డబ్బును తీసుకుంది. ఏడాదిలో సుమారు రూ.32 లక్షలు తీసుకుంది. తర్వాత లావణ్యను డబ్బులు అడగడంతో నాలుగు నెలల కిందట రూ.10 లక్షల బ్యాంకు చెక్కులు ఇచ్చింది. కాగా, చెక్ బౌన్స్ అయిందని కోర్టులో రాజగోపాల్రెడ్డి, శ్రావణిలు కేసు వేశారు. దీంతో ఈ వ్యవహారం టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి చెంతకు చేరింది. వారు ఫోన్ చేయడంతో రాజగోపాల్రెడ్డి లిఫ్ట్ చేయలేదని తెలుగు తమ్ముళ్లు వాహనాలు వేసుకుని రాజగోపాల్రెడ్డి ఇంటికి వెళ్లి.. మా వాళ్లపైనే కేసు వేస్తావా అంటూ వారిపై దాడి చేశారు. ఆరుగురు టీడీపీ కార్యకర్తలు రాజగోపాల్రెడ్డిని కారులోనే కొట్టుకుంటూ టీడీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడే ఉన్న బీటెక్ రవి నేతృత్వంలో మరింతగా రెచ్చిపోయారు.రాజగోపాల్రెడ్డి సతీమణి శ్రావణి పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో పోలీసులు టీడీపీ నేతలకు ఫోన్ చేశారు. దీంతోటీడీపీ నేతలు రాజగోపాల్రెడ్డిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. అనంతరం లావణ్య తండ్రి సుధాకరరెడ్డి, చిన్నాన్న చంద్రమౌలేశ్వరెడ్డిలతో పాటు మరో నలుగురిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
యువతిని 30 ముక్కలుగా నరికి..
దొడ్డబళ్లాపురం: ఓ యువతిని చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచిన భయానక ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. వయ్యాలికావల్ పోలీస్స్టేషన్ పరిధి మల్లేశ్వరంలోని ఓ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో శనివారం స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి సోదా చేయగా ఫ్రిజ్లో కుక్కిన మహిళ శరీర భాగాలు 30కి పైగా బయటపడ్డాయి. వారం క్రితం ఈ దారుణం చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మహాలక్ష్మి (29)అనే బాధితురాలు కర్ణాటకలో కొంతకాలంగా ఉంటున్నారని ఏసీపీ సతీశ్ కుమార్ చెప్పారు. సింగిల్ బెడ్ రూం ఇంట్లో ఆమె ఒక్కతే ఉంటున్నారని తెలిపారు. ఆమె వివరాలను సేకరించామని, అయితే ఇప్పుడే వాటిని బయటపెట్టలేమని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. పరిచయమున్న వారే దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానాలున్నాయి. ఇలా ఉండగా, మహాలక్ష్మి హత్యకు గురైన విషయం తెలిసిన ఆమె భర్త కూడా అక్కడికి చేరుకున్నాడు. మహాలక్ష్మి మాల్లో పని చేస్తుండగా, అతడు బెంగళూరుకు సమీపంలోని ఆశ్రమంలో ఉద్యోగి అని సమాచారం.
కలిసి బతకలేమని.. ప్రేమ ప్రయాణం విషాదాంతం
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం స్థానికులను ఆవేదనకు గురిచేసింది. తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోకపోవడంతోనే ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. దోమకొండ మండలం అంబర్పేట్ గ్రామానికి చెందిన వీణ(23), కోనాపూర్ గ్రామానికి చెందిన సాయి(24) కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ గురించి చెప్పి.. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ భావించారు. కానీ, వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో, మనస్థాపానికి గురయ్యారు.ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం కోనాపూర్లో చెట్టుకు ఉరివేసుకుని సాయికుమార్, అంబర్పేట్లోని తన ఇంట్లో దూలానికి ఉరేసుకుని వీణా ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో, ఇరు కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఆత్మహత్యల సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం మృతదేహాలను స్థానిక కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్ని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: జానీ భార్య అయేషా అరెస్ట్కు రంగం సిద్ధం!
వీడియోలు
టీడీపీ శ్రేణుల బరితెగింపు.. కర్రలు, కారంతో అటాక్
ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై అంబటి రియాక్షన్
కారుపైకి ఎక్కి టీడీపీ దాడులు
మేము తప్పుచేసాం అని నిరూపించు నేను నీ బూట్లు తుడుస్తా...!
రఘురామరాజు అరెస్ట్ ? బాబుకు దళిత నేతలు వార్నింగ్
రేవంత్ రెడ్డికి కోర్టు నోటీసులు
కామారెడ్డిలో దారుణం.. విద్యార్థినిని వేధించిన పీఈటీ
కేటీఆర్ సంచలన కామెంట్స్..
గవర్నర్ తో సీతక్క భేటీ
సీబీఐతో విచారణ జరిపించాలని దేశమంతా కోరుకుంటుంది