Top Stories
ప్రధాన వార్తలు
ఆరోగ్యశ్రీ నిర్వీర్యం, ఫ్యామిలీ డాక్టర్ ఊసేలేదు: వైఎస్ జగన్ ధ్వజం
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలోని ప్రజారోగ్యం మీద చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందని, ఇందుకు విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ ఘటనలో 11 మంది చనిపోయినా, వందల సంఖ్యలో బాధితులున్నా చంద్రబాబు ప్రభుత్వం నిద్ర వీడడంలేదని మండిపడ్డారు. సమీపంలోనే ఉన్న విజయనగరం, విశాఖపట్నంల్లో మంచి ఆస్పత్రులు ఉన్నాయని, అయినా సరే స్థానిక పాఠశాలలోని బెంచీలమీద చికిత్స అందించడం దారుణమని అన్నారు.నాణ్యమైన అత్యవసర వైద్యాన్ని అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు వైఎస్ జగన్. లిక్కర్, ఇసుక స్కామ్లో నిండా మునిగిపోయిన ప్రభుత్వ పెద్దలు ప్రజల కష్టాలను గాలికొదిలేశారని విమర్శించారు. ఇప్పటికే 104, 108 వ్యవస్థలు దెబ్బతిన్నాయని, బాబు వచ్చాక వీరికి సరిగా జీతాలు కూడా రావడం లేదన్నారు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయిందని, దాదాపు రూ.1800 కోట్ల బకాయిలు గత మార్చినుంచి పెండింగ్లో పెట్టారని దుయ్యబట్టారు.చదవండి: ప్రజలు ‘సూపర్సిక్స్’ కోసం చూస్తున్నారు: బొత్స‘ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎత్తివేశారు. జీరో వేకెన్సీ పాలసీకి మంగళం పాడారు. సీహెచ్సీల్లో స్పెషలిస్టు డాక్టర్లను తీసివేశారు. విలేజ్క్లినిక్స్, పీహెచ్సీలను నిర్వీర్యంచేశారు. ఫ్యామిలీ డాక్టర్ ఊసేలేదు. ప్రభుత్వాసుపత్రుల్లో నాడు-నేడు పనులు నిలిచిపోయాయి. కొత్త మెడికల్ కాలేజీలను అస్తవ్యస్తం చేశారు. స్కాంలు చేస్తూ అమ్మడానికి సిద్ధమవుతున్నారు. తనవారికి కట్టబెట్టేందుకు చంద్రబాబు వాటిని ప్రయివేటుపరం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణాలమీదకు వస్తున్నాయి. ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలి. డయేరియా బాధిత గ్రామాల్లో మంచి వైద్యం, తాగునీటి వనరులపై ప్రత్యేక దృష్టిపెట్టాలి’ వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందనడానికి విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ. 11 మంది చనిపోయినా, వందల సంఖ్యలో బాధితులున్నా చంద్రబాబుగారి ప్రభుత్వం నిద్ర వీడడంలేదు. సమీపంలోనే ఉన్న విజయనగరం, విశాఖపట్నంల్లో మంచి ఆస్పత్రులు ఉన్నా స్థానిక…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 19, 2024
Rohit- Kohli: అంపైర్లతో గొడవ.. రోహిత్ ఆగ్రహం.. కోహ్లి ఆన్ ఫైర్!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ విరాట్ కోహ్లి అంపైర్ల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆటను ఎలా నిలిపివేస్తారంటూ ఫీల్డ్ అంపైర్లతో వాదనకు దిగారు. న్యూజిలాండ్తో తొలి టెస్టులో శనివారం నాటి ఆట సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో భాగంగా భారత్ స్వదేశంలో కివీస్ జట్టుతో మూడు మ్యాచ్లు ఆడుతోంది. ఈ క్రమంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి టెస్టు జరుగుతోంది. వర్షం వల్ల బుధవారం నాటి తొలిరోజు ఆట రద్దు కాగా.. గురువారం మ్యాచ్ మొదలైంది.462 పరుగులకు ఆలౌట్ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 46 పరుగులకే కుప్పకూలగా.. న్యూజిలాండ్ 402 పరుగులు చేసింది. రోహిత్ సేన కంటే 356 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్లో టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది. శనివారం నాటి నాలుగో రోజు ఆటలో 462 పరుగులు చేసి ఆలౌట్ అయింది.విజయంపై ఆశలుఅయితే, భారత్కు కేవలం 106 పరుగుల లీడ్ మాత్రమే లభించింది. ఈ స్కోరును డిఫెండ్ చేసుకుని మ్యాచ్ గెలవాలంటే భారత బౌలర్లు అద్భుతం చేయాల్సిందే. కాగా శనివారం ఆట చరమాంకానికి చేరుకునే సమయంలో కొత్త బంతితో కివీస్ పేసర్లు రాణించారు. దీంతో టీమిండియాలో విజయంపై ఆశలు మొదలయ్యాయి. వీలైనంత త్వరగా వికెట్లు పడగొట్టాలనే తొందర కనిపించింది.ఈ క్రమంలో కివీస్ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టగా.. భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ అటాక్ ఆరంభించాడు. ఓపెనర్ టామ్ లాథమ్ క్రీజులో ఉండగా.. రెండో బంతికే బుమ్రా ఎల్బీడబ్ల్యూకు అప్పీలు చేశాడు. అయితే, అంపైర్లు నాటౌట్ ఇచ్చారు. దీంతో చిరాకెత్తిపోయిన రోహిత్ సేనకు అంపైర్ల మరో నిర్ణయం ఆగ్రహం తెప్పించింది.అంపైర్ల నిర్ణయం.. మండిపడ్డ రోహిత్, కోహ్లివెలుతురులేమి కారణంగా దాదాపు అరగంట ముందుగానే ఆటను నిలిపివేయాలని అంపైర్లు నిర్ణయించారు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ వారి దగ్గరకు వెళ్లి వాదనకు దిగగా.. కోహ్లి కూడా అతడికి జత కలిశాడు. ఆట నిలిపే ప్రసక్తే లేదంటూ రోహిత్ కంటే ఎక్కువగా కోహ్లినే గట్టిగా వాదించినట్లు కనిపించింది. వీరిలా అంపైర్లతో వాగ్వాదానికి దిగిన కాసేపటికే మబ్బులు కమ్ముకువచ్చాయి. అంపైర్లు తమ నిర్ణయం ఫైనల్ చేస్తూ ఆట నిలిపివేయగానే.. గ్రౌండ్స్మెన్ కవర్లతో మైదానాన్ని కప్పేశారు. ఇక శనివారం ఆట పూర్తయ్యే సరికి కివీస్ నాలుగు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయలేదు. టామ్ లాథమ్ 0, డెవాన్ కాన్వే 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆఖరి రోజు ఆట ఆదివారం ఉదయం 9.15 నిమిషాలకు ఆరంభం కానున్నట్లు బీసీసీఐ తెలిపింది.టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్టు👉టీమిండియా తొలి ఇన్నింగ్స్- 46 రన్స్ ఆలౌట్👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్- 402 రన్స్ ఆలౌట్👉టీమిండియా రెండో ఇన్నింగ్స్- 462 రన్స్ ఆలౌట్👉న్యూజిలాండ్ లక్ష్యం- 107 పరుగులు👉విజయానికి పది వికెట్ల దూరంలో టీమిండియాచదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి!Ind vs NZ: అయ్యో పంత్! .. నీకే ఎందుకిలా?The umpire is asking the players to go off due to bad light. Rohit Sharma & Virat Kohli are not happy 😭😭😭#INDvNZ #tapmad #DontStopStreaming pic.twitter.com/vkn2oq93OE— Mubashir hassan (@Mubashirha88911) October 19, 2024
ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య వివాదం
ప్రభాస్ బర్త్డే ఈవెంట్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వివాదంగా మారింది. ప్రభాస్ పుట్టిన రోజు (అక్టోబర్ 23)సందర్భంగా కొంతమంది ఫేక్ ఫ్యాన్స్తో కలిసి ప్రసన్న సాహో డబ్బులు వసూలు చేసి కమర్షియల్ ఈవెంట్స్ చేస్తున్నారని ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఉండి వాసు ఆరోపించారు. ఆ ఈవెంట్ని కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే తాను ఎలాంటి కమర్షియల్ ఈవెంట్ చేయడం లేదని ప్రసన్న సాహో వర్గం వివరణ ఇచ్చింది. (చదవండి: రేణు దేశాయ్ ఇంట చండీ హోమం)ఎవరి దగ్గర తాను డబ్బులు తీసుకోలేదని, కావాలనే తనను టార్గెట్ చేశారంటూ ప్రసన్న మండి పడ్డారు. ప్రభాస్ బర్త్డే సందర్భంగా మెగా బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తామని ప్రసన్న సాహో వర్గం వెల్లడించింది.(చదవండి: టాప్ హీరో ఫ్యామిలీ నుంచి పూరీ జగన్నాథ్కు ఆఫర్)కాగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్డేని గ్రాండ్గా సెలెబ్రేట్ చేసుకునేందుకు దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 23న ఆయన కొత్త సినిమాల అప్డేట్స్ రావడంతో పాటు ఆయన నటించిన ఆరు సినిమాలు రీరిలీజ్ అవుతుండడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. బర్త్డే రోజు మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, ఛత్రపతి, ఈశ్వర్, రెబల్, సలార్ చిత్రాలు రీరిలీజ్ చేస్తున్నారు.
గ్రూప్-1 ఆందోళనలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: గ్రూప్ వన్ అభ్యర్థుల ఆందోళనలపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. శనివారం(అక్టోబర్19) సాయంత్రం హైదరాబాద్ రాజేంద్రనగర్లోని పోలీస్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చినపుడే జీవో నెంబర్ 29 ఇచ్చామని చెప్పారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి గ్రూప్ 1 నియామకాలు జరగలేదన్నారు. కొంత మంది ఉద్యోగాలు పోవడంతో రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం పదేళ్లు గ్రూప్ వన్ ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ప్రతిపక్షాల ఉచ్చులో విద్యార్థులు పడొద్దని హితవు పలికారు. కాగా గ్రూప్ వన్ రద్దు చేయాలని శనివారం ఉదయం గ్రూప్ వన్ అభ్యర్థులు హైదరాబాద్ అశోక్నగర్తో పాటు సచివాలయం వద్ద ఆందోళనలు చేశారు. వీరి ఆందోళనలకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు మద్దతు పలికారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఇదీ చదవండి: గ్రూప్-1 రగడ..సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత
మనసు మార్చుకున్న నిఖిల్ కామత్!.. అప్పుడు అద్దె ఇల్లే బెస్ట్ అని..
సొంతిల్లు కొనడం మంచిదా? అద్దె ఇంట్లోనే ఉండటం మంచిదా? అంటే.. ఇప్పటి వరకు అద్దె ఇల్లే బెస్ట్ అని బిలియనీర్ & జెరోధా సహ వ్యవస్థాపకుడు 'నిఖిల్ కామత్' చెప్పుకుంటూ వచ్చారు. అయితే నేను సొంత ఇల్లు కొనుగోలు చేశాను అంటూ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కామత్ వెల్లడించారు.డబ్ల్యుటీఎఫ్ ఈజ్ విత్ నిఖిల్ కామత్.. లేటెస్ట్ ఎపిసోడ్లో కామత్, ప్రెస్టీజ్ గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ ఇర్ఫాన్ రజాక్, బ్రిగేడ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిరూపా శంకర్, వీవర్క్ ఇండియా సీఈఓ కరణ్ విర్వానీ అద్దె ఇల్లు vs కొనుగోలు చేసిన ఇల్లు అంశం మీద చర్చ మొదలు పెట్టారు.అద్దె ఇల్లు అన్ని విధాలుగా బాగానే ఉన్నపటికీ.. ఒక సమస్య ఉంది. అద్దె ఇంటి నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళిపోతామనేది ఖచ్చితంగా తెలియదు. ఎక్కువకాలం అద్దె ఇంట్లోనే ఉండాలనుకుంటే కుదరదు. నేను అద్దె ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఈ కారణంగానే ఇల్లు కొనుగోలు చేశానని నిఖిల్ కామత్ వెల్లడించారు.ఇదీ చదవండి: ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీనేను ఒకే ఇంట్లో చాలా కాలం ఉండటానికి ఇష్టపడతాను. అయితే రియల్ ఎస్టేట్ అనేది ఇల్లిక్విడ్ అని, అది తనకు ఇష్టం ఉండదని పేర్కొన్నారు. బంగారం మీద నాకు ఆసక్తి ఉంది. కానీ రియల్ ఎస్టేట్ విషయంలో అమ్మకాలు, కొనుగోలు కొంత కష్టమని అన్నారు. అంతే కాకుండా స్టాంప్ డ్యూటీ చెల్లించడం మీద కూడా నిఖిల్ కామత్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాలను కొనుగోలు చేయడం, అద్దెకు ఇవ్వడంలో ఎవరూ ఎక్కువ డబ్బు సంపాదించలేరని ఆయన అన్నారు. దీనికంటే స్టాక్ మార్కెట్ చాలా ఉత్తమమని పేర్కొన్నారు.
దారుణం: యువతిపై అత్యాచారం.. ఆపై పెట్రోల్ పోసి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా గోపవరం అటవీ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. అడవిలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి హత్యాయత్నం చేశారు. అయితే మంటల్లో కాలుతూ యువతి కేకలు వేయడంతో గమనించిన స్థానికులు.. ఆమెను కాపాడారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువతిని కడప రిమ్స్కు తరలించారు.యువతికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా తనకు మాయ మాటలు చెప్పి తన ఇంటి సమీపంలో ఉన్న విగ్నేష్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. మూడు నెలల క్రితమే విఘ్నేష్కు వివాహం జరిగిందని, అతని భార్య గర్భిణీగా పేర్కొంది. దీంతో పోలీసులు నిందితుడు విఘ్నేష్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
‘తెలంగాణలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. అందుకు జీవో నంబర్ 29 ఓ సంకేతమన్నారు బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మాట్లాడుతూ..‘ తెలంగాణలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతోంది. సోనియా జన్మదినం... నిరుద్యోగుల బలిదినం కాబోతోంది.ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి. గ్రూప్ 1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాల్సిందే. నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా?, నిరుద్యోగ ర్యాలీలో విధ్వంసం చేసేందుకు బీఆర్ఎస్ కుట్ర, కేటీఆర్ ఓ యూజ్ లెస్ ఫెలో. నేను పేపర్ లీకేజీ చేసినట్లు ప్యామిలీతో కలిసి ప్రమాణం చేసే దమ్ముందా?. డ్రగ్స్ తీసుకుని చీకటి దందాలు సాగించిన బతుకు నీది. నా జోలికొస్తే... నీ చీకటి బతుకులను బయటపెడతా. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు బిడ్డా. కాంగ్రెస్తో కుమ్కక్కు రాజకీయాలు చేస్తోంది మీరు కాదా?, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, కాళేశ్వరం కేసులు రాకుండా చీకటి రాజకీయాలు చేస్తోంది మీరే. కాంగ్రెస్ తో పగలు ఫైటింగ్... రాత్రిళ్లు లవ్వింగ్ బతుకు మీది. తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయింది. జేసీబీ పెట్టి లేపినా బీఆర్ఎస్ లేచే పరిస్థితి లేదు. 2028లో తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. సికింద్రాబాద్ లో భజరంగ్ దళ్ కార్యకర్తలు, ప్రజలపై పోలీసుల లాఠీఛార్జ్ ను ఖండిస్తున్నా. ప్రశాంతంగా జరుగుతున్న ప్రదర్శనను అడ్డుకుని హింసను సృష్టించడం దారుణం.. పోలీసుల తీరు దుర్మార్గం’ అని ధ్వజమెత్తారు.చదవండి: TG గ్రూప్-1 రగడ: సచివాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత
ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం కొత్త పుంతలు
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ల రెడ్ బుక్ రాజ్యాంగం కొత్తపుంతలు తొక్కుతోంది. అధికారంలోకి వచ్చింది మొదలు.. స్థానిక వైఎస్సార్సీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలపై కక్షసాధింపులతో మొదలైన ఈ రెడ్ బుక్ రాజ్యాంగం.. క్రమేపీ పార్టీ అభిమానుల ఇళ్లు, ఆస్తుల విధ్వంసం, అక్రమ కేసుల బనాయింపులకు విస్తరించింది. ఆపై రాష్ట్రంలోని ఓ మోస్తరు అధికారి నుంచి ఐఏఎస్, ఐపీఎస్లనూ వేధించడం మొదలుపెట్టారు. ఓ మోసకారి నటితో ఫిర్యాదు చేయించి.. దాని ఆధారంగా ముగ్గురు ఐపీఎస్లను సస్పెండ్ చేయడం, ఇంకో పాతిక మంది సీనియర్ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా సతాయించడం చేశారు.ఇప్పుడు.. తాజాగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీడియాకూ, వైఎస్సార్సీపీ సీనియర్ నేతలకూ అమలు చేయాలని బాబు, లోకేష్లు నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. సాక్షి మీడియాపై కేసులు పెట్టడం, ఎడిటర్ మురళిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, అలాగే టీడీపీ ఆఫీసుపై దాడి అంటూ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిని వేధించడం వంటి చర్యలకు దిగారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారంటూ ఆరోపణలు గుప్పించడం, ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లతో ఢీకొట్టారన్న ఆరోపణలను కూడా వైఎస్సార్సీపీపై నెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగించాలని చూశారు. కానీ, ఆ ప్రయత్నాలు కాస్తా బెడిసికొట్టాయి. ఇక లాభం లేదనుకున్నారేమో.. వరద ముంపులో అవినీతి కంపుపై వార్తలు ఇస్తారా అంటూ చంద్రబాబు ప్రభుత్వం కన్నెర్ర చేసింది.మీడియాను ప్రభావితం చేయడం, తనకు గిట్టకపోతే అణచివేసే యత్నం చేయడం చంద్రబాబుకు కొత్తకాదు. 1995లో తన మామ ఎన్టీఆర్ను కూలదోసి అధికారంలో వచ్చిందే మీడియా అండతో కదా. అప్పట్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి వాటికి పెద్దగా పోటీ లేకపోవడంతో వాళ్లు రాసిందే వేదం అన్నట్టుగా ఉండేది. ఆ తర్వాత రోజుల్లో ‘వార్త’ మీడియా వచ్చినా అంత ప్రభావం చూపలేదు. అయినా దాన్ని తమ వ్యతిరేకిగా భావించి చంద్రబాబు దూరంగా పెట్టారు. ఆ తర్వాత కాలంలో టీవీ ఛానెళ్లు మొదలయ్యాయి. వాటిని కూడా ఆయన చాలావరకు ప్రభావితం చేయగలిగారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి అయితే అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇష్టారీతిలో కథనాలు ఇచ్చేవి. సంపాదకీయాలు రాసేవి. వైఎస్ ఆ రెండు పత్రికలు అంటూ విమర్శలు చేస్తుండేవారు. అయినా పెద్దగా ఫలితం వుండడం లేదని భావించి సాక్షి మీడియాను తేవడానికి సహకరించారు.అప్పట్లో వ్యాపారరంగంలో ఉన్న ఆయన కుమారుడు వైఎస్ జగన్.. సాక్షి పత్రికను, ఆ తర్వాత సాక్షి ఛానెల్ను తీసుకొచ్చి ప్రజల్లో సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయ్యారు. వైఎస్ జగన్ భవిష్యత్తులో కీలక నాయకుడు అవుతారనే భావనతో చంద్రబాబు, తమ మీడియా వ్యాపారానికి గట్టి పోటీదారుడు అవుతారన్న భయంతో రామోజీరావు వంటి వారు కాంగ్రెస్తో కుమ్మకై అక్రమ కేసులు పెట్టించి వైఎస్ జగన్ను జైలుకు కూడా పంపారు. అయినా ఆయన పట్టు వీడకుండా ఇటు సాక్షి మీడియాను, అటు రాజకీయాన్ని కొనసాగించి ప్రజల్లో తనదైన ముద్రను వేసుకున్నారు.ఈనాడు, ఆంధ్రజ్యోతివంటి ఎల్లో మీడియా వైఎస్ జగన్కు వ్యతిరేకంగా ఎన్ని దారుణమైన అసత్య కథనాలు రాసినా ప్రజలు పూర్తిస్థాయిలో నమ్మలేదు. అలాగని అసలు ప్రభావం పడలేదని చెప్పలేం. అందువల్లే 2014లో ఆయన అధికారానికి కొద్దిలో దూరమయ్యారు. ఐనా ఆయన జనంలో తిరగడం మానలేదు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను 23 మందిని టీడీపీ కొనుగోలు చేసినా వెనక్కి తగ్గకుండా పాదయాత్ర చేశారు. ప్రజల్లో విశ్వసనీయత తెచ్చుకున్నారు. ఆ టైమ్లో సైతం ఎల్లో మీడియా జగన్పై ఏదో రకంగా విరుచుకుపడుతుండేది. జనం వాటిని నమ్మలేదు. 2019లో జగన్ అధికారంలోకి రాగలిగారు.రాజకీయ పార్టీగా తెలుగుదేశానికి అది సహజంగానే నచ్చదు. ఎల్లో మీడియాకు గిట్టలేదు. దాంతో మళ్లీ చంద్రబాబు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు కుమ్మకై ఉన్నవి లేనివి కలిపి సృష్టించి పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. వారికి సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోడయ్యారు. వారు ఎన్ని తప్పుడు ప్రచారం చేసినా వైఎస్ జగన్ వారిపై కేసులు పెట్టలేదు. ఒక వేళ కేసులు పెట్టాల్సి వచ్చినా అబద్దపు వార్తలపై ఖండన ఇచ్చి, ప్రచురించకపోతే లేదా ప్రసారం చేయకపోతేనే చర్య తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు చేస్తే రైతుల భూములన్నీ జగన్ లాగేసుకుంటారంటూ ఘోరమైన అబద్ధాన్ని రాసి, అసత్య ప్రచారాన్ని ఎల్లో మీడియా పతాక స్థాయికి తీసుకెళ్లింది.జగన్ ఏ పని చేసినా ఏదో రకంగా వంకలు పెట్టడం, జనంలో అపోహలు సృష్టించడం వంటివి భారీ ఎత్తున చేసేవారు. వాటికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకోవడానికి యత్నిస్తే చంద్రబాబు నానా యాగీ చేసేవారు. జగన్ పాలనలో పత్రికా స్వేచ్ఛ దెబ్బతినిపోయిందని గోల గోలగా ఆరోపించేవారు. ఆ తర్వాత ఎలాగైతేనేం ఆయన అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. అంతే తనకు నచ్చని మీడియాపై, అలాగే సోషల్ మీడియాపై తన అసలు స్వరూపం చూపించడం ప్రారంభించారు.సాక్షి టీవీతోపాటు ఎన్టీవీ, టీవీ 9 ఛానెల్ను ఏపీలో పలు చోట్ల రాకుండా కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తీసుకొచ్చారు. మంత్రి గొట్టిపాటి రవి ఆధ్వర్యంలో ఇందుకోసం ఒక ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారట. ఇక సాక్షి పత్రికకు అయితే ఎలాగూ ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వడం లేదు. తమకు బాకాలు ఊదే మీడియాతోటి మాత్రమే సఖ్యతగా ఉంటూ మిగిలిన మీడియాను తొక్కేయాలని, తద్వారా తమకు ఎదురు లేకుండా చేసుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగా సాక్షి ఎడిటర్పై కేసు పెట్టారు.విజయవాడ వరదల్లో బాధితులను ఆదుకునే క్రమంలో స్కామ్లు జరిగాయన్న కథనం ఇచ్చినందుకు, ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తి కేసు పెడితే దాన్ని విజయవాడ పోలీసులు నమోదు చేశారు. ఆ వార్తలో నిజం లేకపోతే ప్రభుత్వం ఖండన ఇవ్వొచ్చు. లేదా వివరణ చెప్పవచ్చు. వాటిని కవర్ చేయకపోతే అప్పుడు ప్రభుత్వం చర్య తీసుకోవడం సహజంగా జరగాలి. కానీ, అవేమీ లేకుండా ఒక ప్రధాన పత్రిక ఎడిటర్పైనే కేసు పెట్టడమంటే పత్రికాస్వామ్యాన్ని హరించి వేయడమనేది వేరే చెప్పనవసరం లేదు. విశేషమేమిటంటే వరద సహాయంలో 5నుంచి 10శాతం అవకతవకలు జరిగి ఉండవచ్చని చంద్రబాబే చెప్పారు. మరి దానివల్ల ప్రభుత్వ ప్రతిష్ట పోలేదా?. ఆయనపై కూడా కేసు పెట్టాలి కదా.సీపీఎం నేత బాబూరావు మొదట ఈ స్కాంను బయట పెట్టారు. అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు రూ.23 కోట్లు ఖర్చు పెట్టారని ప్రభుత్వ లెక్కల్లో రాసిన సంగతిని ఆయన బయట పెడితే ప్రజల్లో అది సంచలనం అయింది. సంబంధిత మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్ లు కూడా దీనిపై గందరగోళంగా మాట్లాడారు. దీంతో ఏం చేయాలో అర్థంకాక ప్రభుత్వ పరపతిని పునరుద్ధరించుకునేందుకుగాను సాక్షి ఎడిటర్ పై తప్పుడు కేసు పెట్టారని అర్థమవుతోంది. వచ్చే నాలుగేళ్లు ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. ఎటూ తమది రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు కాబట్టి టీడీపీ వారు దేశ రాజ్యాంగాన్ని వదిలి రెడ్ బుక్నే ఫాలో అవుతారు.ఇక వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విదేశాల నుంచి తిరిగి వస్తున్నప్పుడు లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి ఏపీ ప్రభుత్వం తన డొల్లతనాన్ని ప్రదర్శించుకుంది. అంతటితో ఆగకుండా ఆయన్ను పోలీసు విచారణకు పిలిచారు. ఇంతకు కేసు ఏంటయ్యా అంటే టీడీపీ ఆఫీసుపై కొందరు దాడి చేయడం. దాడిని ఎవరూ సమర్థించరు. జగన్ ప్రభుత్వంలోనే దీనిపై కేసు పెట్టారు. అసలు ఈ దాడికి కారణం ఆ పార్టీ అధికార ప్రతినిధి ఒకరు జగన్ను నోటికొచ్చినట్టు దూషించడం. ఆ సంగతిని మాత్రం బయటకు చెప్పరు. ఇదే కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ను అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి అలాగే సజ్జల వంటి వారిని ఇరికించి కక్ష తీర్చుకోవాలనేది వాళ్ల లక్ష్యంగా కనిపిస్తోంది. పైకి నీతులు చెబుతూ లోపల మాత్రం ఇలా పగ ప్రతీకారాలకు పాల్పడడం చంద్రబాబు నైజమే.ఇదేమీ కొత్త కాదు. 2014-19 మధ్య కూడా సాక్షి మీడియాతో పాటు మరికొన్ని మీడియా సంస్థలపై టీడీపీ ప్రభుత్వం దాడి చేసింది. కాపుల ఆందోళన వార్తలు కవర్ కాకుండా చూడాలని ప్రయత్నించింది. తమ చెప్పు చేతల్లో ఉండని జర్నలిస్టులను వేధించారు. చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివి కొత్త కాదు. వీటిని ఎదుర్కోవడం జర్నలిస్టులకు కొత్త కాదు. కాకపోతే మీడియాను అణచివేయడం ద్వారానే తాము అధికారంలోకి కొనసాగగలమని చంద్రబాబు వంటి సీనియర్ నేత ఇప్పటికీ భ్రమ పడుతుండడం ఓ చారిత్రక విషాదం. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ఎదుర్కొన్న జర్నలిస్టులు చంద్రబాబును ఎదుర్కోలేరా?. - కొమ్మినేని శ్రీనివాసరావుసీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
గడ్డం కావాలా? గర్ల్ ఫ్రెండ్ కావాలా? రోడ్డెక్కిన కాలేజీ అమ్మాయిలు
ఎలాంటి భర్త కావాలి? లేదా ఎలాంటి భార్య కావాలి? అని పెళ్లీడుకొచ్చిన పిల్లల్ని పెద్దలు అడగడం సాధారణం. అలాగే నాకు ఎర్రగా, బుర్రగా ఉన్న అమ్మాయి కావాలి అని అబ్బాయిలు, ఆరడుగులుంటాడా? ఆరెంకెల జీతం ఉందా? అని అమ్మాయిలు ఆశపడటం చాలా కామన్. కానీ ఇపుడు ట్రెండ్మారింది అంటున్నారు ఇండోర్ యువతులు. అంతేకాదు ఏకంగా ‘మాకొద్దీ గడ్డం బూచోళ్లు’,‘నో క్లీన్ షేవ్.. నో గర్ల్ఫ్రెండ్' అంటూ రోడ్డుమీద కొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడమే కాదు. ఫ్యాషన్గా గెడ్డం పెంచుకుంటున్న పెళ్లి కాని ప్రసాదుల గుండెల్లో బాంబు పేల్చింది.ఇండోర్లో కొందరు కాలేజీ యువతులు 'గడ్డం తొలిగించండి.. ప్రేమను కాపాడండి' అనే నినాదంతో యువతులు ర్యాలీ తీశారు. ముఖాలకు గడ్డం మేకప్ వేసుకొని మరీ అబ్బాయిల గడ్డం విషయమై ర్యాలీ తీయడం హాట్ టాపిక్గా నిలిచింది., ‘గడ్డం రఖో యా జిఎఫ్ రఖో’(గడ్డం కావాలా? గర్ల్ఫ్రెండ్కావాలా), 'గడ్డం హటావో ప్యార్ బచావో' నినాదాలతో వీధుల్లోకి వచ్చారు. 'నో క్లీన్ షేవ్.. నో లవ్', 'నో క్లీన్ షేవ్.. నో గర్ల్ఫ్రెండ్' అనే ప్లకార్డులతో తీసిన ర్యాలీ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను ఓ 'ఎక్స్' (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా స్పందిస్తున్నారు.వారి డిమాండ్ కరెక్టేగా కనీసం వారానికి ఒకసారైనా క్లీన్ షేవ్ కాకున్నా కనీసం ట్రీమ్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడే మనం ఎలుగుబంటిలా కాకుండా జెంటిల్మెన్లా ఉంటాం అంటూ కామెంట్ చేయడం విశేషం. మరికొందరు దీని వెనుకున్న మతలబు ఏంటి భయ్యా అంటూ దీర్ఘాలోచనలో పడిపోయారు.ఇదీ చదవండి: నిద్రపోనివ్వని కల అంటే ఇదే! శభాష్ మల్లవ్వ! కాగా పురుషులు గడ్డాలతో అందంగా కనిపిస్తారా లేదా గడ్డం లేకపోతే అందంగా కనిపిస్తారా? అనేది పెద్ద చర్చే. గడ్డాలున్న పురుషులనే మహిళలు ఇష్టపడతారని అనేక అధ్యయనాలు చెబుతున్నప్పటికీ, క్లీన్ షేవ్ మెన్ మరింత ఆకర్షణీయంగా ఉంటారని మరికొందరి వాదన.Clean shave ke liye ladkiyon ne kiya kalesh🤯 pic.twitter.com/QkmIROdDyk— Ghar Ke Kalesh (@gharkekalesh) October 17, 2024
చరిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి!
టెస్టు క్రికెట్లో టీమిండియా అరుదైన ఘనత సాధించింది. ఒకే క్యాలెండర్ ఇయర్లో టెస్ట్ ఫార్మాట్లో 100 సిక్స్లు బాదిన తొలి జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఈ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. సెకెండ్ ఇన్నింగ్స్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి బాదిన సిక్సర్తో టీమిండియా 100 సిక్స్ల మైలురాయిని అందుకుంది. తద్వారా 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యం కాని రికార్డును టీమిండియా తమ ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 17 టెస్టు ఇన్నింగ్స్లు ఆడిన రోహిత్ సేన.. 105 సిక్స్లు నమోదు చేసింది. ఈ జాబితాలో భారత్ తర్వాత ఇంగ్లండ్ (2022) 89 సిక్స్లతో రెండో స్థానంలో ఉండగా, 87 సిక్స్లతో టీమిండియానే మూడో స్ధానంలో ఉంది. 2021 ఏడాదిలో భారత్ టెస్టుల్లో 87 సిక్స్లు బాదింది. ప్రస్తుత మ్యాచ్లో భారత్ ఇప్పటివరకు 8 సిక్స్లు కొట్టింది. పంత్, సర్ఫరాజ్ తలా 3 సిక్స్లు బాదగా.. రోహిత్, విరాట్ చెరో సిక్స్ కొట్టారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నాలుగో రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. టీమిండియా ఇంకా 13 పరుగుల వెనకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో సర్ఫరాజ్ ఖాన్(125), పంత్(53) పరుగులతో ఉన్నారు.చదవండి: IND vs NZ: 'సర్ఫరాజ్ ఒక అద్బుతం.. ఆ దిగ్గజాన్ని గుర్తు చేస్తున్నాడు'
ఓ బెస్ట్ ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా.. ఇవి చూడండి
మహిళ కడుపులో కత్తెర, 12 ఏళ్ల తర్వాత ఏం జరిగిందంటే..
ఊహించని ట్విస్ట్.. నాగమణికంఠ ఎలిమినేట్!
గ్రూప్-1 ఆందోళనలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Asia Cup: పాక్తో మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్.. తుదిజట్లు ఇవే
కోమటిరెడ్డి వినోదం పంచుతున్నారు: జగదీష్రెడ్డి
డోర్లాక్ పేరుతో అడ్డగోలు బాదుడు
జియో వరల్డ్ ప్లాజాలో.. ఈఎల్ & ఎన్ లండన్
ఇంకెన్ని ఛాన్సులు?.. నీ వల్ల అతడికి అన్యాయం!
టాప్ హీరో ఫ్యామిలీ నుంచి పూరీ జగన్నాథ్కు ఆఫర్
చరిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి!
మనల్ని అలా అడగలేద్సార్! ఎదుకంటే మీకే ఇంకా పెళ్లి కాలేదు!
మునగాకును రోజూ ఇలా తింటే అద్భుతాలు : ఒక్కసారి తింటే!
ఈ రాశివారికి ప్రముఖులతో పరిచయాలు, సంఘంలో గౌరవం
అలా ‘బుర్ర’ లేకుండా ఎలా మాట్లాడవయ్యా!!
'సర్ఫరాజ్ ఒక అద్బుతం.. ఆ దిగ్గజాన్ని గుర్తు చేస్తున్నాడు'
EPFO: కార్మికశాఖ కీలక నిర్ణయం.. పీఎఫ్పై మరింత ప్రయోజనం
ఓటీటీలోకి కార్తీ ఫీల్ గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Asia Cup 2024: రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్..
ఆసీస్ టూర్కు భారత జట్టు ఇదే.. కెప్టెన్గా రుతురాజ్! తెలుగోడికి చోటు?
ఓ బెస్ట్ ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా.. ఇవి చూడండి
మహిళ కడుపులో కత్తెర, 12 ఏళ్ల తర్వాత ఏం జరిగిందంటే..
ఊహించని ట్విస్ట్.. నాగమణికంఠ ఎలిమినేట్!
గ్రూప్-1 ఆందోళనలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Asia Cup: పాక్తో మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్.. తుదిజట్లు ఇవే
కోమటిరెడ్డి వినోదం పంచుతున్నారు: జగదీష్రెడ్డి
డోర్లాక్ పేరుతో అడ్డగోలు బాదుడు
జియో వరల్డ్ ప్లాజాలో.. ఈఎల్ & ఎన్ లండన్
ఇంకెన్ని ఛాన్సులు?.. నీ వల్ల అతడికి అన్యాయం!
టాప్ హీరో ఫ్యామిలీ నుంచి పూరీ జగన్నాథ్కు ఆఫర్
చరిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి!
మనల్ని అలా అడగలేద్సార్! ఎదుకంటే మీకే ఇంకా పెళ్లి కాలేదు!
మునగాకును రోజూ ఇలా తింటే అద్భుతాలు : ఒక్కసారి తింటే!
ఈ రాశివారికి ప్రముఖులతో పరిచయాలు, సంఘంలో గౌరవం
అలా ‘బుర్ర’ లేకుండా ఎలా మాట్లాడవయ్యా!!
'సర్ఫరాజ్ ఒక అద్బుతం.. ఆ దిగ్గజాన్ని గుర్తు చేస్తున్నాడు'
EPFO: కార్మికశాఖ కీలక నిర్ణయం.. పీఎఫ్పై మరింత ప్రయోజనం
ఓటీటీలోకి కార్తీ ఫీల్ గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Asia Cup 2024: రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్..
ఆసీస్ టూర్కు భారత జట్టు ఇదే.. కెప్టెన్గా రుతురాజ్! తెలుగోడికి చోటు?
సినిమా
నటుడిని చూసి భయపడ్డ సింగర్.. దగ్గరికి రావొద్దంటూ..
నెగెటివ్ రోల్స్ చేసే నటీనటులను కొందరు నిజంగానే ద్వేషిస్తారు. వాళ్లు పోషించేవి రీల్ పాత్రలు మాత్రమే అని అర్థం చేసుకోలేక నిజ జీవితంలోనూ ఇంతే కాబోలు అన్నట్లుగా వాళ్లను చూస్తేనే భయపడిపోతారు. తన విషయంలోనూ ఇదే జరిగిందంటున్నాడు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ.నన్ను చూస్తేనే భయంతాజాగా ఓ ఈవెంట్కు వెళ్లిన విజయ్ వర్మ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. అందమైన అమ్మాయిలు.. వారి తల్లులు ఎందరో నన్ను చూస్తేనే భయపడిపోతారు. ఈ విషయంలో నేను చాలా బాధగా ఫీల్ అవుతాను. పింక్ సినిమాలో క్రూరమైన వ్యక్తిగా నటించాను. అది చిన్న పాత్రే.. అయినా సరే చాలా సీరియస్గా తీసుకున్నారు. మహిళల కోసం స్పెషల్ స్క్రీనింగ్ వేసినప్పుడు అందరూ సినిమా చూసి చలించిపోయారు. కొందరైతే ఏడ్చేశారు. నేనేం చేశా?ఈ క్రమంలో సింగర్ సునిధి చౌహాన్ దగ్గరకు వెళ్లి ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించాను. కానీ ఆమె.. నా దగ్గరకు రావొద్దు.. నిన్ను చూస్తేనే భయంగా ఉంది అనేసింది. నేను నోరెళ్లబెట్టాను.. దేవుడా, నేనేం చేశాను అనుకున్నాను. ఇంతలో డైరెక్టర్ నన్ను పిలిచి.. నీ పని సక్రమంగా నిర్వర్తించావు అని మెచ్చుకున్నాడు అని గుర్తు చేశాడు.సినిమా..విజయ్ వర్మ.. గల్లీ బాయ్ (2019) సినిమాతో పేరు సంపాదించుకున్నాడు. డార్లింగ్స్, షి, మీర్జాపూర్, దాహడ్ వంటి ప్రాజెక్టులతో అలరించాడు. ఐసీ 814: ద కాందహర్ హైజాక్ అనే వెబ్ సిరీస్లో చివరగా నటించాడు.చదవండి: ఓటీటీలోకి కార్తీ ఫీల్ గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
ఒక్క ఫోటో వైరల్.. అనసూయ భర్తను నేనే అనుకున్నారు: సాయిరాజేష్
'కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్ )' చిత్రం ఆడియో వేడుకలో అనసూయ గురించి డైరెక్టర్ సాయిరాజేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 'జబర్దస్త్' కమెడియన్ రాకింగ్ రాకేశ్ హీరోగా నటిస్తూనే 'కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్ )' చిత్రానికి నిర్మాతగాను వ్యవహరిస్తోన్నాడు. ఆపై స్క్రీన్ప్లేను కూడా అందించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బేబీ సినిమా డైరెక్టర్ సాయిరాజేష్, అనసూయ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు.విలేజ్ బ్యాక్డ్రాప్లో బావమరదళ్ల ప్రేమకథతో దర్శకుడు 'గరుడవేగ' అంజి ఈ సినిమాను తెరకెక్కించాడు. తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా రానుంది. అయితే, ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో యాంకర్ అనసుయపై దర్శకుడు సాయి రాజేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'జబర్దస్త్ షో కోసం ఇద్దరం కలిసి పనిచేశాం. ఆ సమయంలో అనసూయతో ఒక సెల్ఫీ తీసుకుని సోషల్మీడియాలో పోస్ట్ చేశాను. అయితే, చాలామంది అనసూయ భర్తను నేనే అనుకుని బండబూతులు తిట్టారు. అనసూయకు సరైన టేస్ట్ లేదు.. ఈ వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంది అంటూ కొందరు కామెంట్ చేశారు. తర్వాత నేను క్లారిటీ కూడా ఇచ్చాను.' అంటూ సాయి రాజేష్ సరదాగ చేసిన వ్యాఖ్యలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.కానీ, ఇలాంటి వార్తలను తాను చూడలేదని అనసూయ చెప్పింది. సాయిరాజేష్ అందరికీ మంచి చేసే వ్యక్తి అంటూ ఆమే తెలిపింది.. అందుకే రాకింగ్ రాకేశ్ సినిమా విజయం కోసం ఇంత దూరం వచ్చారని సాయిరాజేష్పై ఆమె ప్రశంసలు కురిపించింది. అనసూయ, సాయిరాజేష్ల మధ్య సరదాగ జరిగిన సంభాషణ ఈ ఈవెంట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
'లియో'కు ఏడాది.. మేకింగ్ వీడియో చూశారా..?
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన లియో చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అయితే, ఈ చిత్రం విడుదలై సరిగ్గా ఏడాది పూర్తి అవుతుంది. దీంతో అభిమానుల కోసం చిత్ర యూనిట్ ఒక కానుకను అందించింది. లోకేశ్- విజయ్ కాంబోలో మాస్టర్ తర్వాత ఈ చిత్రం గతేడాది అక్టోబర్ 19న విడుదలైంది. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటించగా.. సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, మిస్కిన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా లియో రూ. 620 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతటి విజయం సాధించిన సినిమా రిలీజ్ అయి ఏడాది పూర్తి కావడంతో 'లియో క్రానికల్స్' పేరుతో సుమారు 8 నిమిషాల నిడివి ఉన్న వీడియోను మేకర్స్ పంచుకున్నారు. సినిమాలో ట్రెండ్ అయిన సీన్స్ను ఎలా తెరకెక్కించారో చూపించారు. నెట్టింట వైరల్గా మారిన మేకింగ్ వీడియోను మీరూ చూసేయండి.
'స్త్రీ 3' ప్రాజెక్ట్పై శ్రద్ధా కపూర్ వ్యాఖ్యలు
శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన స్త్రీ2 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే, ఈ సినిమాకు సీక్వెల్గా పార్ట్ 3 రానుంది. ఈమేరకు శ్రద్ధా కపూర్ పలు విషయాలను పంచుకుంది. ఆగష్టు 15న విడుదలైన స్త్రీ2 కేవలం రూ.50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కితే.. సుమారు రూ. 700 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.స్త్రీ2 విజయం పట్ల శ్రద్ధా కపూర్ ఇలా చెప్పుకొచ్చారు. స్త్రీ సినిమా చూసిన ప్రతిసారి ఇలాంటి సినిమా ఇప్పటి వరకు చూడలేదనే ఫీల్ ఉంటుంది. అలాంటి సమయంలో దానికి సీక్వెల్ చేయాలని నన్ను కోరినప్పుడు చాలా సంతోషించాను. పార్ట్1 మించిన విజయాన్ని స్త్రీ2 చిత్రం ద్వారా ప్రేక్షకులు అందించారు. ఈ ప్రాజెక్ట్ను ఇంత అద్భుతంగా తెరకెక్కించిన దర్శక నిర్మాతలను అభినందించాలి. ఈ చిత్రం ప్రాంచైజీలో భాగంగా మూడో పార్ట్ కూడా రానుంది. అయితే, అందులో మొదటి రెండు భాగాలకు మించిన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇప్పటికే మేకర్స్ ఆ పనులను ప్రారంభించారు.' అని ఆమె చెప్పారు.2018లో స్త్రీ సినిమా విడుదలైంది. ఆ చిత్రం భారీ విజయం అందుకోవడంతో ఈ ఏడాది రెండో పార్ట్ తెరకెక్కించారు. ఇందులో భాగంగానే మూడో పార్ట్ను కూడా నిర్మించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. హారర్ కామెడీగా వచ్చిన ఈ రెండు సినిమాలు అభిమానులను మెప్పించాయి.
న్యూస్ పాడ్కాస్ట్
ఆంధ్రప్రదేశ్లో మాఫియా సామ్రాజ్యం... కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
మూసీ నది సుందరీకరణ కాదు.. పునరుజ్జీవం... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో మోత మోగుతున్న మద్యం ధరలు... సీఎం చంద్రబాబుపై మద్యం ప్రియుల ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
మోగిన మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నగారా... షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం
భగ్గుమన్న భారత్, కెనడా బంధం. నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ పేరు చేర్చిన కెనడా. నిరసనగా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించిన భారత్
ఆంధ్రప్రదేశ్లో ఇసుక ఎక్కడైనా ఉచితంగా లభిస్తోందా?... ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన దసరా సంబరాలు.. ఊరూరా రావణ దహనాలతో సరికొత్త వెలుగులు.. ఇంకా ఇతర అప్డేట్స్
తమిళనాడులో గూడ్స్ రైలును ఢీ కొన్న మైసూరు-దర్భంగా భాగమతి ఎక్స్ప్రెస్... రెండు బోగీల్లో మంటలు... పట్టాలు తప్పిన 13 కోచ్లు.. ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు
పండుగ ముందు ఒక్కసారిగా ఎగిసిన పసిడి, వెండి
మన ప్రభుత్వం చేసిన మేలు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తోంది.. రేపల్లె నియోజకవర్గ వైఎస్సార్సీపీ శ్రేణులతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రీడలు
‘హీరో’లు అవుట్.. కుప్పకూలిన టీమిండియా! అద్భుతం జరిగితేనే..
న్యూజిలాండ్తో తొలి టెస్టులో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. రెండో ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు విజృంభించినా.. వారి పోరాటం సరిపోయేలా కనిపించడం లేదు. భారమంతా ఇప్పుడు బౌలర్లపైనే ఉంది. ఏదైనా అద్భుతం జరిగితేనే టీమిండియా ఈ మ్యాచ్ గెలుస్తుంది. లేదంటే రోహిత్ సేన వరుస విజయాలకు బ్రేక్ పడుతుంది.బెంగళూరు వేదికగా భారత్- కివీస్ మధ్య బుధవారం మొదలుకావాల్సిన మ్యాచ్ తొలిరోజు వర్షం కారణంగా.. టాస్ పడకుండానే ముగిసిపోయింది. ఈ క్రమంలో గురువారం వాన తెరిపినివ్వగా టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి బొక్కబోర్లా పడింది. పేసర్లకు అనుకూలిస్తున్న పిచ్పై పరుగులు రాబట్టలేక 46 పరుగులకే ఆలౌట్ అయింది.అనంతరం న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 402 పరుగులు చేసి.. 356 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అయితే, రెండో ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు మెరుగ్గా రాణించారు. రోహిత్, విరాట్ ఫిఫ్టీలుఓపెనర్లలో యశస్వి జైస్వాల్(35) ఫర్వాలేదనిపించగా కెప్టెన్ రోహిత్ శర్మ(52), వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి(70) అర్ధ శతకాలు చేశారు. ఈ క్రమంలో శనివారం నాటి నాలుగో రోజు ఆటలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ విశ్వరూపం ప్రదర్శించాడు.చెలరేగిన హీరోలు.. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన అతడు చిన్నస్వామి స్టేడియంలో దుమ్ములేపాడు. రిషభ్ పంత్తో కలిసి నాలుగో వికెట్కు ఏకంగా 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సర్ఫరాజ్ 150 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత టిమ్ సౌథీ బౌలింగ్లో అవుటయ్యాడు. అయితే, పంత్ కూడా స్వల్ప వ్యవధిలోనే వెనుదిరిగాడు.మొత్తంగా 105 బంతులు ఎదుర్కొన్న పంత్.. విలియం రూర్కీ బౌలింగ్ 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్ అయ్యాడు. వీళ్లిద్దరు నిష్క్రమించిన తర్వాత టీమిండియా టపటపా వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్(12), రవీంద్ర జడేజా(5), రవిచంద్రన్ అశ్విన్(15), జస్ప్రీత్ బుమ్రా(0), మహ్మద్ సిరాజ్(0) పెవిలియన్కు క్యూ కట్టారు. కివీస్ టార్గెట్ ఎంతంటే?కుల్దీప్ యాదవ్ ఆరు పరగులతో అజేయంగా నిలవగా.. టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 462 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో కివీస్ కంటే కేవలం 106 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కివీస్కు స్వల్ప లక్ష్యం విధించింది.అంటే.. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 107 పరుగులు చేసిందంటే గెలిచేస్తుంది. అలా కాకుండా ఉండాలంటే భారత బౌలర్లదే బాధ్యత. వెలుతురు లేమి కారణంగా శనివారం త్వరగా ఆటను ముగించారు. ఆట పూర్తయ్యే సరికి కివీస్ విజయానికి 107 పరుగులు, టీమిండియా పది వికెట్ల దూరంలో నిలిచాయి.చదవండి: వెనక్కి వెళ్తావా? లేదా?: పంత్ను ‘హెచ్చరించిన’ సర్ఫరాజ్! రోహిత్ రియాక్షన్ వైరల్
Ind vs NZ: అయ్యో పంత్! .. నీకే ఎందుకిలా?
టెస్టు క్రికెట్ పునరాగమనంలో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ బ్యాట్ ఝులిపిస్తూ ఆపద్భాందవుడిలా నిలుస్తున్నాడు. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్ సిరీస్లో సెంచరీతో చెలరేగిన పంత్.. తాజాగా న్యూజిలాండ్తో తొలి టెస్టులోనూ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ సేనను గట్టెక్కించే క్రమంలో సర్ఫరాజ్ ఖాన్(150)తో కలిసి నాలుగో వికెట్కు 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.సెంచరీకి ఒక్క పరుగు దూరంలోఅయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో రిషభ్ పంత్ అవుటయ్యాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 89వ ఓవర్ను కివీస్ పేసర్ విలియం రూర్కీ వేశాడు. అయితే, అతడి బౌలింగ్లో మొదటి బంతికే పంత్ అనూహ్య రీతిలో బౌల్డ్ అయ్యాడు. 99 పరుగుల(9 ఫోర్లు, 5 సిక్స్లు) వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. దీంతో చిన్నస్వామి స్టేడియం ఒక్కసారిగా మూగబోయింది.స్టాండింగ్ ఓవియేషన్అప్పటిదాకా సర్ఫరాజ్ ఖాన్- రిషభ్ పంత్ జోడీ న్యూజిలాండ్ బౌలర్లపై అటాకింగ్ చేస్తుంటే సంతోషంతో కేరింతలు కొట్టిన అభిమానులు.. పంత్ శతకం మిస్ కాగానే షాక్కు గురయ్యారు. అయితే, గాయం తాలుకు నొప్పి వేధిస్తున్నా విలువైన ఇన్నింగ్స్ ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ను సముచిత రీతిలో గౌరవించారు. పంత్ పెవిలియన్కు వెళ్తున్న సమయంలో స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు.కాగా రిషభ్ పంత్ టెస్టుల్లో ఇలా 90లలో అవుట్ కావడం ఇది ఏడోసారి. అయితే, అతడు సాధించిన శతకాలు ఆరు కావడం విశేషం. ఇక శనివారం కొత్త బంతి రాగానే కివీస్ పేసర్లు మరోసారి విజృంభిస్తున్నారు. 150 పరుగుల వద్ద సర్ఫరాజ్, 99 పరుగుల వద్ద పంత్ అవుట్ కాగానే భారత ఇన్నింగ్స్ గాడి తప్పింది.కేఎల్ రాహుల్(12) మరోసారి నిరాశపరచగా.. రవీంద్ర జడేజా(5) సైతం విఫలమయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్(15), జస్ప్రీత్ బుమ్రా(0), మహ్మద్ సిరాజ్(0) పెవిలియన్కు క్యూ కట్టారు. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్👉మొదటి టెస్టు: అక్టోబరు 16- అక్టోబరు 20👉వేదిక: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు👉వర్షం వల్ల తొలిరోజు(బుధవారం) ఆట రద్దు కాగా.. రెండో రోజు(గురువారం) టాస్ పడింది👉టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్👉భారత్ తొలి ఇన్నింగ్స్: 46 పరుగులకే కుప్పకూలిన రోహిత్ సేన👉పిచ్ను సరిగ్గా అంచనా వేయలేకపోయానంటూ తప్పిదాన్ని అంగీకరించిన రోహిత్ 👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 402 ఆలౌట్👉భారత్ రెండో ఇన్నింగ్స్: 462 ఆలౌట్👉కివీస్ లక్ష్యం: 107 పరుగులు చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి! View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema)
వెనక్కి వెళ్తావా? లేదా?: పంత్ను ‘హెచ్చరించిన’ సర్ఫరాజ్!
టీమిండియా- న్యూజిలాండ్ తొలి టెస్టు సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమిండియా స్టార్ రిషభ్ పంత్ను ‘వెనక్కి పంపేందుకు’ సెంచరీ సర్ఫరాజ్ ఖాన్ వ్యవహరించిన తీరు వైరల్గా మారింది. అసలు సంగతి ఏమిటంటే!?బెంగళూరు వేదికగా భారత్- కివీస్ జట్ల మధ్య గురువారం(రెండో రోజు) మొదటి టెస్టు మొదలైన విషయం తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన..తమ తొలి ఇన్నింగ్స్లో దారుణంగా విఫలమైంది. కేవలం 46 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. తద్వారా స్వదేశంలో అత్యల్ప స్కోరు నమోదు చేసింది.అయితే, టీమిండియా బ్యాటర్లు విఫలమైన పిచ్పై న్యూజిలాండ్ ఆటగాళ్లు మాత్రం మెరుగ్గా ఆడారు. ఓపెనర్ డెవాన్ కాన్వే 91, రచిన్ రవీంద్ర 134, టిమ్ సౌథీ 65 పరుగులతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో కివీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 402 పరుగులు చేసి.. భారత్ కంటే 356 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.రోహిత్, విరాట్ హాఫ్ సెంచరీలు.. ఈ నేపథ్యంలో పరువు కాపాడుకోవాలంటే టీమిండియా రెండో ఇన్నింగ్స్లో తప్పక రాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మ(52), విరాట్ కోహ్లి(70) అర్ధ శతకాలతో బలమైన పునాది వేశారు. అయితే, సర్ఫరాజ్ ఖాన్ రాకతో టీమిండియా స్కోరు బోర్డు మరింత వేగంగా పరుగులు పెట్టింది. కేవలం 42 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతడు.. శనివారం నాటి ఆటలో శతకం సాధించాడు.పంత్, సర్ఫరాజ్ దూకుడుఅయితే, కోహ్లి అవుటైన తర్వాత సర్ఫరాజ్కు రిషభ్ పంత్ జతకాగా.. ఇద్దరూ దూకుడుగా ఆడుతూ కివీస్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 56వ ఓవర్ వేసిన మ్యాట్ హెన్రీ బౌలింగ్లో తొలి బంతికి సర్ఫరాజ్ ఖాన్ షాట్ ఆడి.. సింగిల్ తీసుకున్నాడు. అయితే, పంత్ రెండో పరుగు కోసం పరిగెత్తుకు రాగా.. ప్రమాదాన్ని పసిగట్టిన సర్ఫరాజ్ నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి కాస్త ముందుకు వచ్చి గట్టిగా అరిచాడు. వెనక్కి వెళ్తావా? లేదా? పంత్ను ఎలాగైనా వెనక్కి పంపించడం సహా ఫీల్డర్ల ఏకాగ్రత చెదిరేలా గెంతులు వేస్తూ పంత్కు సైగలు చేశాడు. దీంతో పంత్ క్రీజులోకి వెళ్లగా.. అప్పటికే ఫీల్డర్ త్రో చేసిన బంతిని కివీస్ వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ వికెట్ల వైపునకు విసిరాడు. అయితే, అంతకంటే ముందే పంత్ క్రీజులోకి చేరుకోవడంతో ప్రమాదం తప్పింది.రోహిత్ రియాక్షన్ వైరల్ఇదిలా ఉంటే.. పంత్ను వెనక్కి పంపేందుకు సర్ఫరాజ్ చిన్న పిల్లాడిలా జంప్ చేసిన విధానం.. భారత శిబిరంలో నవ్వులు పూయించింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లి తదితరులు పంత్ సమయానికి చేరుకుంటాడో లేదోనని ఆందోళన పడుతూనే.. నవ్వులు ఆపుకోలేకపోయారు. 🤣🤣 https://t.co/ThCCxMp1yD pic.twitter.com/ymjEvBO0b4— mon (@4sacinom) October 19, 2024 ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా సర్ఫరాజ్ 150, పంత్ 99 పరుగులు చేసి అవుటయ్యారు. టీ బ్రేక్ సమయానికి 90.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 438 పరుగులు చేసి.. 82 పరుగుల ఆధిక్యంలో ఉంది.చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి! View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema)ALL INDIA REACTION ON SARFARAZ RISHABH RUN OUT CHANCE #INDvNZ pic.twitter.com/ImFtIck1sp— Wasi (@WasiTheBoi) October 19, 2024
వారెవ్వా పంత్.. దెబ్బకు ధోని రికార్డు బద్దలు
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఫైటింగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఓ వైపు గాయం బాధపడుతూనే సెకెండ్ ఇన్నింగ్స్లో తన 12వ టెస్ట్ హాఫ్ సెంచరీని సాధించాడు. గాయం కారణంగా మూడో రోజు ఆటకు దూరమైన పంత్.. కీలకమైన నాలుగో రోజు ఆటలో తిరిగి మైదానంలో మళ్లీ అడుగుపెట్టాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్తో కలిసి భారత స్కోర్ బోర్డును పంత్ పరుగులు పెట్టిస్తున్నాడు. తొలుత కాస్త ఆచితూచి ఆడిన రిషబ్.. నెమ్మదిగా తన బ్యాటింగ్లో స్పీడ్ను పెంచాడు. 54 పరుగులతో పంత్ ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 5 ఫోర్లు, 3 సిక్స్లు ఉన్నాయి.ధోని రికార్డు బద్దలుఇక ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెరిసిన పంత్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 2,500 పరుగుల మైలు రాయిని అందుకున్న భారత వికెట్ కీపర్గా పంత్ రికార్డులకెక్కాడు. ఇంతకు ముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది. ధోని ఈ మైలు రాయిని 69 ఇన్నింగ్స్లలో అందుకోగా.. రిషబ్ కేవలం 62 ఇన్నింగ్స్లలోనే సాధించాడు. చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి!
బిజినెస్
ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీ
కొత్త ఎక్స్ప్రెస్వేలు, పర్యాటక ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు పెంచితే.. పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. తద్వారా కొత్త ఉద్యోగాలు లభిస్తాయని కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల మంత్రి 'నితిన్ గడ్కరీ' (Nitin Gadkari) పేర్కొన్నారు. గోవాలో ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (FHRAI) నిర్వహించిన సదస్సులో గడ్కరీ ఈ విషయాలను వెల్లడించారు.ఆర్థికాభివృద్ధికి ఆతిథ్య రంగం ఎంతో కీలకమని నితిన్ గడ్కరీ సూచించారు. వ్యాపార కార్యకలాపాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచాలని మంత్రి హాస్పిటాలిటీ రంగానికి తమ బలమైన మద్దతును వ్యక్తం ప్రకటించారు. ఇది విస్తారమైన ఉద్యోగ అవకాశాలను అందిస్తుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: రూ.80 లక్షల జీతం: సలహా ఇవ్వండి.. టెకీ పోస్ట్ వైరల్కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్నవాటితో పాటు మరో 18 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టులు త్వరలోనే పూర్తవుతాయి. ఇది పర్యాటకాన్ని మరింత మెరుగుపరుస్తుందని గడ్కరీ పేర్కొన్నారు. ప్రస్తుతం చాలామంది ప్రజలు పుణ్యక్షేత్రాలను సందర్శించాడని మాత్రమే.. ఆధునిక నగరాలు, ప్రత్యేకమైన పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి సుముఖత చూపిస్తున్నారని ఆయన అన్నారు.
EPFO: కార్మికశాఖ కీలక నిర్ణయం.. పీఎఫ్పై మరింత ప్రయోజనం
ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం కింద ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యులందరికీ బీమా ప్రయోజనాలను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మెరుగుపరిచిన ఈ పథకం రూ. 7 లక్షల వరకు జీవిత బీమా రక్షణను అందిస్తుంది. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 28 నుండి వర్తింపులోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది.1976లో ప్రారంభమైన ఈ పథకం ఈపీఎఫ్ఓ సభ్యులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు ఆర్థిక రక్షణగా నిలుస్తోంది. ఈ స్కీమ్ కింద కనీసంగా రూ. 1.5 లక్షలు, గరిష్టంగా రూ. 6 లక్షల బీమా కవరేజీని 2018లో ప్రవేశపెట్టారు. ఇది 2021 ఏప్రిల్ వరకు కొనసాగింది. మళ్లీ 2021 ఏప్రిల్ 28 నుంచి పొడిగిస్తూ కనీస బీమా ప్రయోజనాన్ని రూ. 2.5 లక్షలకు, గరిష్ట కవరేజీని రూ.7 లక్షలకు పెంచారు.ఇదీ చదవండి: బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త స్కీమ్..అంతేకాకుండా ఈ లబ్ధి పొందేలంటే చివరి 12 నెలలు ఒకే సంస్థలో పనిచేసి ఉండాలన్న నిబంధనను కూడా ప్రభుత్వం సడలించింది. వేర్వేరు కంపెనీల్లో పనిచేసి ఉన్నా సరిపోతుంది. ఈ పథకం చెల్లుబాటు ఈ ఏడాది ఏప్రిల్ 27తో ముగియగా ఈ ప్రయోజనాన్ని పొడిగిస్తున్నట్లు కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా ఇటీవల వెల్లడించారు. ఈ చొరవ ఇప్పుడు 6 కోట్లకు పైగా ఈపీఎఫ్ఓ సభ్యులకు రూ. 7 లక్షల వరకు జీవిత బీమాను అందిస్తుంది.
పెళ్లి చేసే కుటుంబాలకు ధీమా.. వివాహ బీమా
పెళ్లంటే రెండు కుటుంబాల కలయిక. దీన్ని తరాలు గుర్తిండిపోయేలా వైభవంగా జరపాలనుకుంటారు. పెళ్లి బట్టల షాపింగ్ నుంచి వధువు అత్తారింట్లో కాలుమోపే వరకు రూ.లక్షలు ఖర్చు చేస్తారు. మొన్నామధ్య అనంత్ అంబానీ పెళ్లికి ముఖేశ్ అంబానీ కుంటుంబం కోట్లల్లో ఖర్చు చేసినట్లు వార్తలొచ్చాయి. పెళ్లిలో ఎలాంటి అవాంతరం జరగకుండా ఉండాలని అందరం కోరుకుంటాం. కానీ ఏదైనా ప్రమాదం జరిగి ఆస్తి నష్టం కలిగి, బంధువులు గాయాలపాలైతే..పెళ్లి చేస్తున్న కుటుంబ సభ్యులకు తీరని వ్యథగా మారుతుంది. అలాంటి వారికోసం చాలా బీమా కంపెనీలు వివాహ బీమా సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినా ఈ బీమా ఆర్థికంగా ఆదుకుంటుంది.వివాహ వేడుక స్థాయి, సర్వీసులను బట్టి బీమా కంపెనీలు ప్రీమియం నిర్ణయిస్తున్నాయి. భారీ కార్యక్రమం, విస్తృతమైన సర్వీసులకు కవరేజీ కావాలంటే ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుంది. సందర్భాన్ని బట్టి వెడ్డింగ్ ఇన్సూరెన్స్ కవరేజీ వివిధ రకాలుగా ఉంటుంది.లయబిలిటీ కవరేజీ..పాలసీదార్ల వల్ల ఇతరులకు ఏదైనా హాని, ఆస్తి నష్టంలాంటిది జరిగితే ఈ కవరేజీ వర్తిస్తుంది. అలాంటి సందర్భాల్లో ఏవైనా లీగల్ ఖర్చులు, చెల్లింపులు చేయాల్సి వస్తే ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, ఉద్దేశపూర్వకంగా చేసినట్లు తేలితే మాత్రం కవరేజీ వర్తించదని గుర్తుంచుకోవాలి. ఈ తరహా కవరేజీ థర్డ్ పార్టీకి చెల్లించాల్సిన నష్టపరిహారానికి మాత్రమే పరిమితమవుతుంది. దీనితో పాలసీదార్లకు ప్రత్యేకంగా పరిహారమేమీ లభించదు.ఏదైనా కారణాల వల్ల పెళ్లి రద్దైనా లేదా వాయిదా పడినా క్యాన్స్లేషన్ కవరేజీ ఉపయోగపడుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఆర్థికంగా నష్టపోకుండా చూసుకునేందుకు ఇది తోడ్పడుతుంది. విలువైన వస్తువులు పాడైనా దాని కోసం ప్రత్యేకంగా కవరేజీ అందిస్తున్నారు. పేరొందిన బీమా కంపెనీలతో పాటు ప్రత్యేకంగా వెడ్డింగ్ ఇన్సూరెన్స్ను అందించే సంస్థలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పాలసీని తీసుకునేటప్పుడు తమ నిర్దిష్ట అవసరాలపై ముందుగా ఒక అంచనాకు రావాలి. ఎంత వరకు కవరేజీ వస్తుంది, క్లెయిమ్ల ప్రక్రియ ఎలా ఉంటుంది మొదలైన వాటి గురించి బీమా సంస్థలను కనుక్కోవాలి.ఇదీ చదవండి: స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, అమెజాన్..కంపెనీలకు నష్టం!వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో యాడ్–ఆన్లు, రైడర్లు కూడా ఉంటున్నాయి. దుస్తులు మొదలుకుని హనీమూన్ వరకు ఇవి కవరేజీనిస్తాయి. ఉదాహరణకు పెళ్లి దుస్తులు దెబ్బతిన్నా లేక తీసుకొస్తుండగా దారిలో పోయినా.. ‘అటైర్ కవరేజీ’ రైడర్లాంటిది ఆదుకుంటుంది. ఇక వ్యయాల విషయానికొస్తే.. వివాహ వేడుక స్థాయి, ప్రాంతం, తీసుకోబోయే కవరేజీ వంటి అంశాలన్నీ ప్రీమియంను ప్రభావితం చేస్తాయి. అయితే ఈ పాలసీల్లోనూ కొన్ని మినహాయింపులు ఉంటాయి. సాధారణంగా బడ్జెట్ మించిపోయినా, ఇతరత్రా మనసు మార్చుకుని వేరే ప్రణాళికలు వేసుకున్నా కవరేజీపైనా ప్రభావం ఉంటుంది. కాబట్టి పాలసీపరంగా దేనికి కవరేజీ ఉంటుంది, దేనికి మినహాయింపు ఉంటుంది వంటి అంశాలను ముందుగా క్షుణ్నంగా తెలుసుకోవాలి.
గరిష్టాలను చేరిన అమెరికా ఆర్థిక లోటు!
అమెరికా దేశ బడ్జెట్ లోటు గరిష్ఠాలను చేరుకుంది. సెప్టెంబర్ 30 నాటికి ఇది రూ.1,538 లక్షల కోట్లను చేరింది. కొవిడ్ మహమ్మారి కాలంతో పోల్చినా ఈ లోటు అధికంగా నమోదవ్వడం ఆందోళనలు కలిగిస్తుంది. రుణ వడ్డీ, విద్యార్థుల సంక్షేమానికి ఖర్చు..వంటివి ఇందుకు కారణమని యూఎస్ ట్రెజరీ విభాగం తెలిపింది. అయితే ఫెడ్ ఇటీవల వడ్డీరేట్లను తగ్గించిన నేపథ్యంతో రానున్న రోజుల్లో ఈ లోటు తగ్గే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.యూఎస్ అధికారిక ట్రెజరీ డేటా ప్రకారం..సెప్టెంబరు 30 నాటికి యూఎస్ ఆర్థిక లోటు 1.83 ట్రిలియన్ డాలర్ల(రూ.1,538 లక్షల కోట్లు)కు చేరుకుంది. ఇది అంతకుముందు 2020-21 కాలంలో గరిష్ఠంగా 1.7 ట్రిలియన్ డాలర్లు(రూ.14.2 లక్షల కోట్లు)గా ఉండేది. 2023 మధ్యలో బైడెన్ ప్రభుత్వ ప్రతిపాదనలతో యూఎస్ అత్యున్నత న్యాయస్థానం విద్యార్థుల రుణాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో ఆర్థిక లోటు మరింత పెరిగినట్లయింది. యూఎస్ ఆర్థిక లోటు స్థూల దేశీయోత్పత్తిలో 6 శాతానికి మించిపోయింది. ఆర్థిక మాంద్యం, అంతర్జాతీయ యుద్ధ భయాల కారణంగా 2023లో 6.2 శాతం, 2024 సెప్టెంబర్ 30 నాటికి 6.4 శాతానికి చేరింది. వడ్డీ చెల్లింపులు కూడా భారీగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి వడ్డీ ఖర్చులు 254 బిలియన్ డాలర్లు(రూ.21 లక్షల కోట్లు) పెరిగి 1.1 ట్రిలియన్ డాలర్లకు(రూ.92 లక్షల కోట్లు) చేరాయి. ఇది గతంలో కంటే 29 శాతం అధికం. జీడీపీలో ఈ వడ్డీ చెల్లింపులు 3.93 శాతంగా ఉన్నాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు 11 శాతం పెరిగాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ఇటీవల కీలక వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దాంతో రానున్న రోజుల్లో కొంత వడ్డీ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.ఇదీ చదవండి: స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, అమెజాన్..కంపెనీలకు నష్టం!దేశీయంగా పెరుగుతున్న అప్పు ఆందోళనకరమే. అయితే ఆ అప్పు మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చిస్తే దాని ప్రతిఫలాలు సమీప భవిష్యత్తులో ఉంటాయి. కాబట్టి దాంతో కంగారు పడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి వడ్డీతో సహా భవిష్యత్తులో అప్పు తీర్చే ప్రణాళికలు ఉంటాయి. కానీ సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వాలు ఒకవేళ అవినీతికి పాల్పడితే దానికోసం ఇతర సంస్థల నుంచి తీసుకొచ్చిన అప్పు భారంగా మారుతుంది. దానివల్ల భవిష్యత్తులో ఎలాంటి రాబడి సృష్టించకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. పలితంగా దేశం ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఫ్యామిలీ
మనం ధరించే డ్రెస్కి ఇంత పవర్ ఉంటుందా..?
‘పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు డ్రెస్సింగ్ కూడా ఉపయోగపడుతుంది’ అంటారు హైదరాబాద్ వాసి, ఫౌంటెడ్ హెడ్ గ్లోబల్ స్కూల్ అండ్ కాలేజీ నిర్వాహకురాలు, టీచర్ మేఘన ముసునూరి. గ్లోబల్ టీచర్ అవార్డు గ్రహీత అయిన మేఘన ముసునూరి వార్డ్ రోబ్ గురించి చెప్పిన విషయాలు..‘‘ప్రైమరీ స్కూల్ పిల్లలకు క్లాస్ తీసుకునేటప్పుడు కలర్ఫుల్గా డ్రెస్ చేసుకుంటాను. చిన్నపిల్లలకు బ్రైట్ కలర్స్ అంటే ఇష్టం. మనం చెప్పినవి చక్కగా వినడానికి ఈ రంగులు దోహదం చేస్తాయి. పిల్లలు డ్రెస్ ఒకటే చూడరు. చెవులకు, చేతులకు, మెడలో ఏం వేసుకున్నారు.. అని కూడా చూస్తారు. వాళ్లకి ఆసక్తి కలిగించేది ఏదైనా ఉంటే, ఇదేమిటి? నేనెప్పుడూ చూడలేదు... అని కూడా అడుగుతారు. అలా ఒకరోజు నా దగ్గర వడ్లు, మినుములు... మొదలైన గింజలతో తయారు చేసిన బ్రేస్లెట్ని వేసుకెళ్లాను. ఆ రోజు దాని గురించి వారు ఎన్నోప్రశ్నలు వేశారు. అంటే, ఆ బ్రేస్లెట్ వారిలో ఎంతో ఆసక్తిని కలిగించిందనేగా! నైటీతో కనిపించనుఎదుటివారిని చూడగానే 6 నుంచి 12 సెకన్లలో ఆæవ్యక్తిని మనం సీరియస్గా తీసుకోవచ్చా లేదా అనేది బ్రెయిన్ ఒక ఇంప్రెషన్ని క్రియేట్ చేసుకుంటుంది. నాకు ఇద్దరు అమ్మాయిలు. వాళ్లు నా మాట వినని సందర్భాలు దాదాపుగా లేవు. ఎందుకంటే, వాళ్లు నన్ను నైటీలో ఎప్పుడూ చూడరు. సౌకర్యం కోసం రాత్రి సమయంలో వేసుకునే నైటీలోనే స్కూల్లో పిల్లలను దింపడానికి వచ్చే తల్లులు ఉన్నారు. చాలా మంది తల్లులు నా దగ్గర ‘తమ పిల్లలు మాట వినడం లేదు’ అని చెబుతుంటారు. అప్పుడు వాళ్లతో ‘ఎప్పుడైనా టీచర్ని మీరు నైట్డ్రెస్లో చూశారా’ అని అడుగుతాను. అంతేకాదు ‘మన డ్రెస్ వల్ల కూడా పిల్లలు మన మాట వింటారు’ అని చెబుతాను. ఒకప్పుడు మా ఇంటికి టీచర్ వస్తున్నారంటే మా తాతగారు తప్పనిసరిగా భుజంపైన కండువా వేసుకొని, బయటకు వచ్చేవారు. గౌరవం అంటే నమస్కారం ఒక్కటే కాదు. మన డ్రెస్సింగ్ కూడా. నా సొంత డిజైన్స్బైక్ రైడ్కి వెళ్లేటప్పుడు జీన్స్ వేసుకుంటాను. మీటింగ్స్, కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు చీరలు కట్టుకుంటాను. 2–3 రోజుల మీటింగ్స్ అయితే బ్లేజర్స్, ఫ్రాక్స్ కూడా వేసుకుంటాను. చీర అయితే, బ్లౌజ్ ట్రెండీగా ఉండేలా ఎంచుకుంటాను. వెస్ట్రన్ టాప్ వేసుకొని చీర కట్టుకుంటాను. కొన్నిసార్లు టాప్ టు బాటమ్ ఒకే కలర్, కొన్నిసార్లు కాంట్రాస్ట్ వేసుకుంటాను. ఇంజినీరింగ్ స్టూడెంట్స్కి కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు ఉంటాయి. అలాంటప్పుడు డైనమిజాన్ని చూపేలా డ్రెస్ చేసుకుంటాను. జ్ఞాపకాలు బాగుండాలంటే...జ్ఞాపకాలలో మన డ్రెస్సింగ్ కూడా బాగుండాలి. ఒకప్పుడు ఆకులు పచ్చగానే ఉన్నట్టు డ్రాయింగ్లో చూపేవారు. కానీ, ప్రకృతిలో ఆకులు చాలా రంగుల్లో ఉన్నాయి. అందుకని, మనం వేసుకునే డ్రెస్, జ్యువెలరీ కూడా కలర్ఫుల్గా ఉండాలి. బంగారు ఆభరణాలే వేసుకోవాలని అనుకోను. తక్కువ ఖర్చుతో లభించే క్రియేటివ్ జ్యువెలరీ ఏదైనా ఎంపిక చేసుకుంటాను. టీచర్ అంటే సీరియస్గా ఉండాల్సిన అవసరం లేదు. పిల్లల్లో ఇంట్రెస్ట్, కాన్ఫిడెంట్ బిల్డ్ చేసేలా ఉండాలి. నేను రకరకాల బ్రోచెస్ పెట్టుకుంటాను. మా స్కూల్లో ఒక పిల్లవాడు వాళ్ల అమ్మకు ఒక బ్రోచ్ను గిఫ్ట్గా ఇచ్చాడంట. ‘ఎందుకు?’ అని అడిగితే ‘మా టీచర్ పెట్టుకుంటుంది, చాలా బాగుంటుంది’ అని చెప్పాడంట. పిల్లల నుంచి ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలు నాకున్నాయి. ఇదే ఫ్యాషన్ అని, ఎవరి లాగానో ఉండాలని కాకుండా సమాజంలో మనదైన ఒక గుర్తింపు డ్రెస్సింగ్ ద్వారా చూడాలి. పవర్ డ్రెస్సింగ్ వల్ల ఎదుటివారు మనతో ప్రవర్తించే తీరులో కూడా మార్పు వస్తుంది. (చదవండి: అలియా భట్కి ఏడీహెచ్డీ డిజార్డర్..అందువల్లే పెళ్లిలో..!)
అలియా భట్కి ఏడీహెచ్డీ డిజార్డర్..అందువల్లే పెళ్లిలో..!
బాలీవుడ్ నటి అలియా భట్ గ్లామర్కి నటనకి నూటికి నూరు మార్కులు పడతాయి. అంతలా ప్రేక్షకుల మనుసులను గెలుచుకుంది. వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి దటీజ్ అలియా అని ప్రూవ్ చేసింది. ఫిట్నెస్ పరంగా గ్లామర్ పరంగా ఎంతో కేర్ తీసుకునే ఆమె ఏడీహెచ్డీ డిజార్డర్తో బాధపడుతున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అందువల్లో తన పెళ్లిలో ఆ సమస్య దృష్ట్యా ముందుగా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించింది. ఏంటా సమస్య? ఎందువల్ల వస్తుంది?అలియా ఏడీహెచ్డీ లేదా టెన్షన్-డెఫిసిట్/హైపర్యాక్టివిటీ డిజార్డర్తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. బాల్యం నుంచే తాను ఈ సమస్యను ఫేస్ చేస్తున్నట్లు తెలిపింది. దీని కారణంగా ఏ విషయంపై గంటల కొద్ది దృష్టిపెట్టి పనిచేయలేను అని చెబుతోంది. ఈ ఇబ్బంది వల్లే స్కూల్లో కూడా ఒకదానిపై ఫోకస్ పెట్టలేకపోయేదాన్ని అని తెలిపింది. ఈ సమస్యకు భయపడే పెళ్లిలో కూడా మేకప్ అరగంటకి మించి ఎక్కువ తీసుకోవద్దని ముందుగానే మేకప్ మ్యాన్లకు చెప్పారట. ఆఖరికి షూటింగ్లలో కూడా ఇలా ముందు జాగ్రత్తలు తీసుకుంటానని అంటోంది అలియాఏడీహెచ్డీ అంటే..చాలా సాధారణమైన న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్లలో ఒకటి. ఇది సాధారణంగా పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయినప్పటికీ పెద్దలల్లో కూడా నిర్ధారణ అవుతుంది. ఈ రుగ్మత ఉన్నవారి మెదడులోని నరాల నెట్వర్క్లు, న్యూరోట్రాన్స్మిటర్లలో తేడాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.దీని కారణంగా ఆయా వ్యక్తులు ఏ పని మీద ఒక అరగంటకు మించి అటెన్షన్ ఉంచలేరు. వెంటనే చికాకు, ఒత్తడికి గురవ్వుతారు. అంతేగాదు దీని వల్ల శ్రద్ధ వహించడం, ఎక్కువ సేపు చురుకుగా ఉండటం వంటి వాటిల్లో సమస్యలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. లక్షణాలు..అజాగ్రత్తఒక దానిపై దృష్టి నిలపడంలో ఇబ్బందిఆర్గనైజ్ చేసి పనిలో ఉండలేకపోవడంఎక్కువ సేపు వింటూ కూర్చోవాలన్న ఇబ్బంది పడటం.మానసిక శ్రమతో కూడిన పనులకు రోజువారీ పనుల్లో మతిమరుపుఎందువల్ల వస్తుందంటే..ఏడీహెచ్డీతో బాధపుడుతున్న వ్యక్తుల్లో మెదడు నిర్మాణం, కార్యచరణలో తేడాలు ఉన్నట్లు మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీళ్లలో పూర్తి పరిక్వతతో మెదడు ఉండకుండా నెమ్మదిగా ఉంటుందట. వీళ్లలో నిర్దేశిత శ్రద్ధే ఉంటుందట. వీరి మెదడులో ఆటోమేటిక్ అటెన్షన్ నెట్వర్క్ అనేది డిఫాల్ట్ మోడ్లో ఉంటుందట. అందువల్ల ఇలా జరుగుతుందని అన్నారు. అయితే ఈ రుగ్మత ఎందువల్ల వస్తుందనేందుకు కచ్చితమైన కారణాలు తెలియరావాల్సి ఉంది. దీనిపై అధ్యయనాలు జరుగుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఈ డిజార్డర్ కుటుంబ వారసత్వంగా వస్తుందని అన్నారు. (చదవండి: లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్: ‘తగ్గేదెలే’ అంటున్న స్పెషల్ బ్యూటీ)
చిట్టివేగానీ. పోషకాల్లో మహాగట్టివి : ఏంటవి!
చూడ్డానికి చిట్టివే కానీ పోషకాల్లో గట్టివి! ముట్టుకుంటేనే జర్రు జారిపోయేలా ఉన్నా శరీరానికి మంచి పట్టునిస్తాయి. అవే ఆవాలు. ఆవాలు రుచికి మంచి పోషక, ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.పురాతన కాలంనుంచి వీటికి ప్రాధాన్యత ఎక్కువే. ఆవాలు లేని పోపును అస్సలు ఊహించలేం. ఇక పచ్చళ్లలో, ఆవకాయల్లో ఆవాలు పాత్ర ఇంతా అంతాకాదు. చాలా రకాల కూరలు ఆవపిండితో కలిపి వండుతారు. ఆవాలు-లాభాలుఆవాల్లో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఉబ్బరం , అజీర్ణంతో బాధపడేవారు భోజనంలో ఆవపిండిని చేర్చుకోవచ్చు. పొటాషియం, కాల్షియం ఎక్కువగా లభిస్తాయి. ఇవి ఎముకలు, కీళ్ళ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.దగ్గు, జలుబు వంటి సమస్యలుకు ఉపశమనం లభిస్తుంది.ఆవాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మంచి కొవ్వులు పెరుగుతాయి. ఆవపిండిలో సెలీనియం అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఉబ్బసం లేదా శ్వాసకోశ సమస్యలకు, శ్వాసకోశంలో మంట నివారణకు ఉపయోగపడుతుంది. ఆవాల్లోని రిచ్ న్యూట్రియెంట్స్ చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా జుట్టుని బలంగా చేస్తాయి. ఇందులోని విటమిన్ ఎ, కె, సిలు.. వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలు, ఏజింగ్ లక్షణాలను దూరం చేస్తాయి.ఆవపిండిలో యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ లక్షణాలున్నాయి. అలాగే ఇందులోని సల్ఫర్ మొటిమలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు మంచిది. సోరియాసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, రింగ్ వార్మ్ వంటి సమస్యలు రాకుండా చేస్తాయి కేన్సర్కు చెక్ చెప్పే గుణాలు కూడా ఆవాల్లో ఉన్నాయి. ఆవనూనె కూడా చాలా రకాల ఔషధ ప్రయోజనాలకోసం వాడతారు. ఆవాల నూనెను పూయడం వల్ల గాయాలు వేగంగా నయం అవుతాయి.ఆహారంలో ఎలా చేర్చుకోవాలిఆవ కూరను తినవచ్చు. ఆవపొడిరూపంలో గానీ, గింజలుగా గానీ రోజూ కూరల్లో వాడు కోవచ్చు. ఆవనూనెను కూరగాయలను వేయించడానికి, మాంసం లేదా చేపల వంటకాల్లో లేదా సలాడ్లపై చల్లుకోవచ్చు.
Diwali 2024 ఈజీగా, హెల్దీగా బొప్పాయి హల్వా, టేస్ట్ అదిరిపోవాలంతే!
దీపావళి వెలుగు దివ్వెలు, మతాబులు, చిచ్చబుడ్ల వెలుగులు మాత్రమే కాదు స్వీట్ల పండుగ కూడా. అయితే ఎప్పడూ చేసుకునే తరహాలో కాకుండా, ఆయిల్ లేకుండా ఆరోగ్య కరంగా చేసుకునే స్వీట్ల గురించి తెలుసుకుందాం. ప్రిపరేషన్కు ఎక్కువ సమయం పట్టదు కూడా. ఈజీగా, హెల్దీగా బొప్పాయి హల్వా ఎలా చేయాలో చూద్దాం రండి!బొప్పాయిహల్వాకావల్సిన పదార్ధాలునెయ్యి – రెండు టేబుల్ స్పూన్లుబొప్పాయి పండు – ఒకటి (తొక్క తీసి తురుముకోవాలి)పంచదార – పావు కప్పుబాదం పప్పు పొడి – మూడు టేబుల్ స్పూన్లుయాలకుల పొడి – టీ స్పూనుకోవా తురుము – మూడు టేబుల్ స్పూన్లుబాదం పలుకులు, ఎండు ద్రాక్షలు – రెండు టీస్పూన్లు.తయారీ విధానంముందుగా స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి బొప్పాయి తురుము వేసి 15 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించాలి.నీరంతా ఇగిరాక, పంచదార వేసి మరో పదినిమిషాలు తిప్పుతూ ఉడికించాలి.ఇప్పుడు యాలకుల పొడి, కోవా తురుము, బాదంపప్పు పొడి, బాదం పలుకులు వేసి తిప్పితే పపయా హల్వా రెడీ. సహజతీపితో ఉండే ఈ హల్వాలోని పోషకాలు బొప్పాయిలో విటమిన్ సి ,బీటా కెరోటిన్ పుష్కలంగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్, డైటరీ ఫైబర్లో కూడా ఎక్కువే. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.జీర్ణక్రియకు ,గట్ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. చర్మ ఆరోగ్యానికి మంచిది. ఇందులోని బెల్లం ఇనుము , మెగ్నీషియం వంటి ఖనిజాలతో పాటు సహజమైన తీపిని అందిస్తుంది.బాదం, ఎండుద్రాక్షలతో రుచిని పెంచడమే కాకుండా ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు విటమిన్ E, మెగ్నీషియం లభిస్తాయి.
ఫొటోలు
పెళ్లయిన నలుగురితో ఎఫైర్.. కట్ చేస్తే 49 ఏళ్లు దాటినా సింగిల్గానే స్టార్ హీరోయిన్ (ఫోటోలు)
రేణూ దేశాయ్ ఇంట గణపతి, చండీ హోమం.. పాల్గొన్న అకీరా (ఫోటోలు)
నాజూగ్గా ప్రియాంక చోప్రా, స్టైయిలిష్ లుకికి ఫ్యాన్స్ ఫిదా (ఫొటోలు)
అందమైన ఇంపాక్ట్ ప్లేయర్: భార్యకు టీమిండియా క్రికెటర్ బర్త్డే విషెస్ (ఫొటోలు)
అప్పుడే దీపావళి షాపింగ్ షురూ చేసిన నటి (ఫొటోలు)
రెడ్ కలర్ శారీలో ఎర్ర గులాబీల మెరిసిపోతున్న అనన్య నాగళ్ల (ఫొటోలు)
హైదరాబాద్లో చిత్రగుప్త ఆలయం: ఎక్కడ ఉందో తెలుసా? (ఫొటోలు)
సందెవేళ తెల్ల తెల్లని చీరలో హీరోయిన్ రుహానీ శర్మ! (ఫొటోలు)
హైదరాబాద్ : మొదలైన ప్రో కబడ్డీ పోటీలు..బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ సందడి (ఫొటోలు)
బ్యాంకాక్లో చిల్ అవుతోన్న మహేశ్ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)
National View all
జార్ఖండ్ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. అధికార ప్రతిపక్ష పార్టీలు దూకుడు పెంచాయి.
వయనాడ్ బీజేపీ అభ్యర్థి ఎవరంటే..
న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే
మహిళ కడుపులో కత్తెర, 12 ఏళ్ల తర్వాత ఏం జరిగిందంటే..
సిక్కింలో ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. గతంలో కడుపు నొప్పితో అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకుంటే.. నొప్పి తగ్గకపోగా..
Jharkhand: కుదిరిన పొత్తు.. 70 స్థానాల్లో కాంగ్రెస్, జేఎంఎం పోటీ
రాంచీ: త్వరలో జరగబోయే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా క
జమ్ముకశ్మీర్కు త్వరలో రాష్ట్రహోదా !
సాక్షి,న్యూఢిల్లీ: త్వరలో జమ్ముకశ్మీర్కు త్వరలో రాష్ట్ర హోద
International View all
ఇజ్రాయెల్ ప్రధాని ఇంటిపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రమాదం
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఘర్షణవాతావరణం నెలకొంది.
హమాస్ ఉనికి ఎప్పటికీ సజీవమే: ఇరాన్ సుప్రీం నేత
టెహ్రాన్: ఇజ్రాయెల్ దాడిలో హమాస్ నేత యాహ్యా సిన్వర్ మృతి
గరిష్టాలను చేరిన అమెరికా ఆర్థిక లోటు!
అమెరికా దేశ బడ్జెట్ లోటు గరిష్ఠాలను చేరుకుంది. సెప్టెంబర్ 30 నాటికి ఇది రూ.1,538 లక్షల కోట్లను చేరింది.
భారత దౌత్యవేత్తలపై నిఘా: కెనడా
ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి ఒట్టావాలోని భారత హైకమిషన్ర్ను కెనడా అనుమానితునిగా పేర్
హమాస్ సిన్వర్ పోస్టుమార్టం రిపోర్టు.. తలలో బుల్లెట్, చేతి వేలు కత్తిరించి..
జెరూసలేం: ఇజ్రాయెల్ సైన్యం చేతిలో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వ
NRI View all
డల్లాస్లో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్ టోర్నీ
అమెరికాలో తెలుగు వారిని ఒక్కటి చేసే విధంగా నాట్స్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
అంగరంగ వైభవంగా మహాత్మాగాంధీ మెమోరియల్ దశమ వార్షికోత్సవ వేడుకలు
అమెరికా దేశంలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ మెమోరియల్ని డాలస్లో స్థాపించి పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా మహాత్మాగాంధీ మెమ
కాలేజీ అడ్మిషన్ల సంసిద్ధతపై నాట్స్ అవగాహన సదస్సు
కెనడా, భారత్ గొడవ.. మనోళ్ల పరిస్థితి ఏంటి?
Indians in Canada: ఖలీస్తానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్, కెనడా దేశాల మధ్య దౌత్యసంబంధాలు దెబ్
లండన్లో ఘనంగా దసరా అలాయి బలాయి
హైదరాబాద్ తర్వాత ప్రపంచంలోనే తొలిసారిగా పరాయి గడ్డపై అలాయి బలాయి సాంస్కృతికి నాంది పలికారు.
క్రైమ్
గుంటూరు: రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య
సాక్షి, గుంటూరు: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెదకాకాని సమీపంలో రైలు కింద పడి ప్రేమికుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. మృతులను దానబోయిన మహేశ్, నండ్రు శైలజగా గుర్తించారు. పెదకాకానికి చెందిన మహేశ్, నందిగామ మండలం రుద్రవరానికి చెందిన శైలు గత కొంత కాలంగా లవ్లో ఉన్నారు.రెండేళ్ల క్రితం మహేశ్.. హైదరాబాద్లోని ఓ స్టోర్లో పని చేస్తుండగా.. శైలజతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇటీవలే ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది.అయితే, పెళ్లికి యువతి కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. దీంతో కొన్ని రోజుల క్రితం శైలు, మహేశ్ ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టగా, ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున పెదకాకాని సమీపంలో రైల్వే ట్రాక్పై పడి ఉన్నారు.ఇదీ చదవండి: టీడీపీ నేత రాసలీలలు.. వీడియో లీక్
మాజీ మంత్రి హరీష్రావు బంధువులపై చీటింగ్ కేసు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్రావు బంధువులపై చీటింగ్ కేసు నమోదైంది. తన ప్రాపర్టీలో అక్రమంగా ఉంటున్నారని దండు లచ్చిరాజు ఆరోపిస్తున్నారు. తన్నీరు గౌతం, బోయినిపల్లి వెంకటేశ్వర రావు, గోని రాజకుమార్ గౌడ్, గారపాటి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావుపై మియాపూర్ పీఎస్లో ఆయన ఫిర్యాదు చేశారు.బ్లాంక్ చెక్, బ్లాంక్ ప్రామిసరీ నోటు తీసుకుని హరీష్రావు బంధువులు చీటింగ్కు పాల్పడ్డారని.. తనకు తెలియకుండానే తన ఇంటిని అమ్మేశారంటూ జంపన ప్రభావతిపై లచ్చిరాజు ఆరోపిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చారని.. ఈ విషయంపై 2019 నుంచి పోరాడుతున్నానని లచ్చిరాజు అంటున్నారు.ఇదీ చదవండి: సాహితీలో తవ్వేకొద్దీ డొల్ల కంపెనీలు
Twin Brothers: కలిసే తనువు చాలించి..
జీడిమెట్ల: ఇద్దరు అన్నదమ్ములు కవలలుగా జన్మించి తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇచ్చారు. తల్లిదండ్రులు కవలలకు ముద్దుగా రాము, లక్ష్మణ్ అని పేర్లు పెట్టుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములు ఎదిగి..బతుకుదెరువు కోసం హైదరాబాద్కి వచ్చి దొరికిన పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అనుకోని ప్రమాదంలో అన్నను కాపాడేందుకు తమ్ముడు ప్రయతి్నంచి ఇద్దరూ ఒకేసారి మృత్యుఒడికి చేరారు. ఈ విషాదకర సంఘటన జీడిమెట్ల పారిశ్రామిక వాడలో జరిగింది. జీడిమెట్ల డీఐ కనకయ్య, ఎస్సై హరీష్ తెల్పన వివరాల ప్రకారం.. ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతికూరు గ్రామానికి చెందిన రాము(32), లక్ష్మణ్(32) కవలలు. వీరు ఉపాధి కోసం నగరానికి వచ్చి గుండ్లపోచంపల్లి, అన్నారం గ్రామంలో ఉంటూ వివిధ పనులు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా సాధు నారాయణరావు అనే ఫ్యాబ్రికేషన్ కాంట్రాక్టర్ వద్ద రోజువారీ పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే గత నాలుగు రోజులుగా వీరిద్దరూ జీడిమెట్ల ఏస్వీ కో ఆపరేటివ్ సొసైటీలో 3 సంవత్సరాలుగా మూతపడి ఉన్న సాబూరి ఫార్మా పరిశ్రమలో ఫ్యాబ్రికేషన్ పనులు నిర్వహిస్తున్నారు. బుధవారం రాము, లక్ష్మణ్తో పాటు పాండుబస్తీకి చెందిన సురేందర్రెడ్డి పరిశ్రమలో ఉన్న వ్యాక్యూమ్ ట్యాంక్ గోడపై నిలబడి ఫ్యాబ్రికేషన్ పనులు నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల సమయంలో వీరికి తాగేందుకు చాయ్ రావడంతో లక్ష్మణ్, సురేందర్రెడ్డి గోడపై నుండి కిందకు దిగారు. గోడ దిగే క్రమంలో రాము ప్రమాదవశాత్తు వ్యాక్యూమ్ ట్యాంకులో పడిపోయాడు. పరిశ్రమ మూడు సంవత్సరాలుగా మూసి ఉన్నకారణంగా ట్యాంకులో రసాయనాలతో కూడిన నీరు 6 ఫీట్ల మేర ఉంది. రాము ట్యాంకులో పడటాన్ని గమనించిన లక్ష్మణ్ వెంటనే ట్యాంకు గోడ ఎక్కి ఓ కర్ర సాయంతో వెతకగా రాము అసస్మారక స్థితిలో పడి ఉన్నాడు. దీంతో అన్నను బయటకు తీసేందుకు లక్ష్మణ్ సైతం ట్యాంకులోకి దిగి అతను కూడా అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. ఇద్దరూ బయటకు రాకపోవడంతో సురేందర్రెడ్డి ట్యాంకులోకి దిగి అపస్మారకస్థితిలో ఉన్న రాము, లక్ష్మణ్లను బయటకు తీశాడు. ఇద్దరిని వెంటనే షాపూర్నగర్లోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఇద్దరు మృతిచెందారని డ్యూటీ డాక్టర్ నిర్ధారించారు. సురేందర్రెడ్డి సైతం అస్వస్థతకు గురికావడంతో చికిత్స అందిస్తున్నారు. రాము, లక్ష్మణ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మావోయిస్టు పార్టీ అగ్రనేత సుజాత అరెస్టు?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత అలియాస్ మైనా అలియాస్ కల్పన అలియాస్ ఝాన్సీ అలియాస్ పద్మను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 67 ఏళ్ల సుజాత వైద్య చికిత్స నిమిత్తం బస్తర్ అడవులను వీడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీదుగా హైదరాబాద్ వెళ్తుండగా పక్కాగా అందిన సమాచారంతో జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. పోలీసు అధికారులు మాత్రం ఈ విషయం ధ్రువీకరించడం లేదు. తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, అదంతా మీడియాలో వస్తున్న ప్రచారమని చెబుతున్నారు. దీంతో సుజాత నిజంగానే అరెస్టయ్యారా? లేక లొంగిపోయారా? అనే అంశంపై స్పష్టత కరువైంది. ఈమెపై కేంద్ర ప్రభుత్వం రూ.కోటి రివార్డు ప్రకటించింది. లొంగుబాటుకు ప్రయత్నాలు? సుజాత వయోభారంతో లొంగిపోవాలని నిర్ణయించుకున్నారని, సొంత జిల్లా అయిన మహబూబ్నగర్కు చేరుకుని అక్కడ తనకున్న పరిచయాల ద్వారా లొంగిపోయేందుకు ప్రయత్నించారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మరోవైపు ఇటీవల దండకారణ్యం, అబూజ్మఢ్ అడవుల్లో పోలీసులు, భద్రతా దళాల నిర్బంధం పెరిగిపోయింది. ఇంకోవైపు వయోభారం, అనారోగ్యం సమస్యలతో సుజాత ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మెరుగైన వైద్యం కోసం తెలంగాణలోకి వస్తుండగా పోలీసులు అరెస్టు చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండురోజుల కిందటే సుజాతకు సంబంధించిన పక్కా సమాచారం పోలీసులకు అందినట్టు సమాచారం. కిషన్జీతో వివాహం? మహబూబ్నగర్కు చెందిన సుజాత డిగ్రీ చేయడానికి హైదరాబాద్కు వచ్చినప్పుడు రాడికల్ స్టూడెంట్ యూనియన్తో పరిచయం అయింది. క్రమంగా విప్లవ భావాల వైపు ఆకర్షితురాలైంది. ఆమెతో పాటు మరో ఇద్దరు కూడా విప్లవ బాట పట్టి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరు మహిళలు ఇప్పటికే వివిధ ఎన్కౌంటర్లలో చనిపోయారు. సుజాత దాదాపు 43 ఏళ్లు నక్సలైట్/మావోయిస్టు పార్టీల్లో పని చేశారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీతో సుజాతకు వివాహం జరిగినట్టు తెలుస్తోంది. కిషన్జీ పదిహేనేళ్ల కిందట అప్పటి కేంద్ర ప్రభుత్వానికి, హోంమంత్రి చిదంబరానికి నేరుగా సవాల్ విసిరిన మావోయిస్టుగా సంచలనం సృష్టించారు. పదమూడేళ్ల కిందట ఎన్కౌంటర్లో చనిపోయారు.
వీడియోలు
సికింద్రాబాద్ లో కొనసాగుతున్న బంద్
వైద్య శిబిరంలో కనీస సౌకర్యాలు లేవు: సీదిరి అప్పలరాజు
మాస్ హిట్టింగ్ తో న్యూజీలాండ్ కి చుక్కలు
సినిమా సెట్ లోనే కన్ను మూయాలని ఉంది.. షారుక్ సంచలన కామెంట్స్..
సినిమా సెట్ లోనే కన్ను మూయాలని ఉంది.. షారుక్ సంచలన కామెంట్స్..
స్పూఫ్ మత్తుకు చిత్తు అవుతున్న సోషల్ మీడియా
అకీరా విషయంలో టెన్షన్ పడుతున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
హనుమాన్ సీక్వెల్ లో కాంతారా రిషబ్ శెట్టి
టీడీపీ నేతలకే తిరుమల వెంకన్న సేవలు
ఇసుక, మద్యం విషయంలో కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడింది