Asia Cup 2023
-
Jay Shah: 32 ఏళ్ల వయసులో తొలిసారి.. ముచ్చటగా మూడోసారి
బీసీసీఐ కార్యదర్శి జై షా మరోసారి ఆసియా క్రికెట్ మండలి(ఏసీసీ) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇండోనేషియాలోని బాలిలో ఏసీసీ బుధవారం వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఇందులో భాగంగా జై షాను తమ చీఫ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 32 ఏళ్ల వయసులో తొలిసారి.. కాగా జై షా ఏసీసీ బాస్గా ఎన్నికకావడం ఇది వరుసగా మూడోసారి. నజ్ముల్ హుసేన్ స్థానంలో 2021లో తొలిసారిగా అధ్యక్ష పదవిని చేపట్టిన ఆయన.. ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా నిలిచారు. అప్పటికి జై షాకు 32 ఏళ్లు. ఇక తాజా సమావేశంలో సభ్యుల నిర్ణయానికి అనుగుణంగా జై షా పదవీ కాలం కొనసాగనుంది. కాగా బీసీసీఐలో కీలక వ్యక్తిగా ఉన్న ఆయన.. ఏసీసీలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. కోవిడ్ సమయంలో బాస్గా బాధ్యతలు స్వీకరించి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ప్రతీ విషయంలోనూ తనదైన ముద్ర ఇక గతేడాది ఆసియా కప్-2023 హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడంలో జై షా కీలక పాత్ర పోషించారు. ఈవెంట్ నిర్వహణ హక్కులు దక్కించుకున్న పాకిస్తాన్కు టీమిండియాను పంపే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. పాక్ పంతం వీడకపోతే.. ప్రత్యామ్నాయాలు వెదుక్కోవాల్సి ఉంటుందని హెచ్చరించి శ్రీలంక- పాక్ వేదికగా టోర్నీని నిర్వహించేలా జై షా ఏర్పాట్లు చేశారు. టీమిండియా ఆడే మ్యాచ్లన్నింటికీ లంక ఆతిథ్యం ఇచ్చింది. ఇక ఈ దఫా వన్డే ఫార్మాట్లో నిర్వహించిన ఆసియా కప్ ఈవెంట్ ఫైనల్లో టీమిండియా శ్రీలంకను ఓడించి విజేతగా అవతరించింది. కాగా భారత హోం మంత్రి అమిత్ షా కుమారుడే జై షా అన్న విషయం తెలిసిందే. చదవండి: Ind vs Eng 2nd Test: ఇంగ్లండ్కు షాక్.. కీలక స్పిన్నర్ దూరం -
సెమీస్లో భారత్ను ఓడించి.. కట్చేస్తే ఇప్పుడు ఏకంగా ఛాంపియన్స్గా
అండర్-19 ఆసియాకప్ 2023 ఛాంపియన్స్గా బంగ్లాదేశ్ నిలిచింది. దుబాయి వేదికగా జరిగిన ఫైనల్లో యూఏఈను 195 పరుగుల తేడాతో చిత్తు చేసిన బంగ్లాదేశ్.. తొలిసారి అండర్-19 ఆసియాకప్ టైటిల్ను ముద్దాడింది. తుది పోరులో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్ అషికర్ రెహ్మాన్ షిబ్లీ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 149 బంతులు ఎదుర్కొన్న అషికర్ రెహ్మాన్.. 12 ఫోర్లు, 1 సిక్సర్తో 129 పరుగులు చేశాడు. అతడితోపాటు రిజ్వాన్(60), అరిఫుల్ ఇస్లాం(50) పరుగులతో రాణించారు. యూఏఈ బౌలర్లలో ఆయామన్ ఆహ్మద్ 4 వికెట్లతో చెలరేగగా.. ఒమిడ్ రెహ్మద్ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం 283 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ.. బంగ్లా బౌలర్ల దాటికి కేవలం 87 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బౌలర్లలో రోహనత్, మరూఫ్ మిర్దా తలా మూడు వికెట్లు పడగొట్టగా... ఇక్భాల్, షేక్ ఫవీజ్ చెరో రెండు వికెట్లు సాధించారు. కాగా సెమీఫైనల్లో భారత్ను బంగ్లాదేశ్ ఓడించిన సంగతి తెలిసిందే. చదవండి: IND VS SA 1st ODI: ఏ భారత కెప్టెన్కు సాధ్యం కాని ఘనతను సాధించిన కేఎల్ రాహుల్ -
ఒకే రోజు రెండు సంచలనాలు.. పసికూనల చేతిలో భారత్, పాక్లకు పరాభవం
అండర్-19 ఆసియా కప్లో ఒకే రోజు రెండు సంచలనాలు నమోదయ్యాయి. పసికూనలైన బంగ్లాదేశ్, యూఏఈల చేతుల్లో మాజీ ఛాంపియన్లు భారత్, పాకిస్తాన్ ఓటమిపాలయ్యాయి. ఇవాళ (డిసెంబర్ 15) జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ల్లో తొలుత యూఏఈ పాకిస్తాన్ను మట్టికరిపించగా.. ఆతర్వాతి మ్యాచ్లో బంగ్లాదేశ్ టీమిండియాకు షాకిచ్చింది. ఫలితంగా యూఏఈ, బంగ్లాదేశ్ జట్లు ఫైనల్కు చేరాయి. దుబాయ్ వేదికగా డిసెంబర్ 17న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ల విషయానికొస్తే.. పాకిస్తాన్తో జరిగిన తొలి సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. 47.5 ఓవర్లలో 193 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. పాక్ పేసర్ ఉబెయిద్ షా (4/43) యూఏఈ పతనాన్ని శాశించాడు. యూఏఈ ఇన్నింగ్స్లో కెప్టెన్ అయాన్ ఖాన్ (55) అర్దసెంచరీతో రాణించగా.. ఓపెనర్ ఆర్యాన్ష్ శర్మ (46), డిసౌజా (37) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. యూఏఈ బౌలర్లు మూకుమ్మడిగా అటాకింగ్ చేయడంతో 49.3 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్లో కెప్టెన్ సాద్ బేగ్ (50), అజాన్ అవైస్ (41) మాత్రమే రాణించారు. యూఏఈ బౌలర్లలో అయ్మాన్ అహ్మద్, హార్దిక్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. రెహ్మాన్, ధృవ్, బదామీ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక బంగ్లాదేశ్తో జరిగిన రెండో సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన యువ భారత్.. 42.4 ఓవర్లలో 188 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో ముషీర్ ఖాన్ (50), మురుగన్ అభిషేక్ (62) అర్ధసెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్ మరూఫ్ 4 వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాశించాడు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్.. అరీఫుల్ ఇస్లాం (94) చెలరేగడంతో 42.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అరీఫుల్కు అహ్రార్ అమీన్ (44) సహకరించాడు. నమన్ తివారీ (3/35), రాజ్ లింబానీ (2/47) చివరి వరకు ప్రయత్నించినప్పటికీ టీమిండియాను గెలిపించలేకపోయారు. -
ఏడు వికెట్లతో చెలరేగిన భారత పేసర్.. 52 పరుగులకే ప్రత్యర్థి ఆలౌట్
ACC U19 Asia Cup, 2023- India U19 vs Nepal U19: అండర్-19 ఆసియా కప్-2023 టోర్నీలో భారత యువ జట్టు ఘన విజయం సాధించింది. నేపాల్ను పది వికెట్ల తేడాతో చిత్తు చేసి సెమీస్ రేసులో ముందుకు దూసుకెళ్లింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో గ్రూప్-‘ఏ’లో ఉన్న భారత్ తొలుత అఫ్గనిస్తాన్తో తలపడింది. ఈ మ్యాచ్లో అఫ్గన్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన ఉదయ్ సహారన్ సేన.. రెండో మ్యాచ్లో మాత్రం ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో సెమీస్ చేరాలంటే.. లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్లో తప్పక గెలవాల్సిన స్థితిలో నిలిచింది. ఏడు వికెట్లతో చెలరేగిన రాజ్ లింబాని ఈ నేపథ్యంలో మంగళవారం నేపాల్తో తలపడ్డ భారత జట్టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పేసర్ రాజ్ లింబాని ఏడు వికెట్లతో చెలరేగి నేపాల్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. 9.1 ఓవర్లలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి బ్యాటర్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. లింబానికి తోడుగా.. ఆరాధ్య శుక్లా రెండు, అర్షిన్ కులకర్ణి ఒక వికెట్తో రాణించారు. ఈ ముగ్గురు అద్భుత ప్రదర్శన కారణంగా.. నేపాల్ 22.1 ఓవర్లలోనే చాపచుట్టేసింది. ఓపెనర్లే పూర్తి చేశారు భారత బౌలర్ల విజృంభణ కారణంగా 52 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టును ఓపెనర్లు ఆదర్శ్, అర్షిన్ కులకర్ణి విజయతీరాలకు చేర్చారు. ఆదర్శ్ 13 బంతుల్లో 13 పరుగులతో అజేయంగా నిలవగా.. అర్షిన్ 30 బంతుల్లోనే 43 పరుగులు రాబట్టి భారత్ విజయాన్ని ఖరారు చేశాడు. ఇక ఈ గెలుపుతో భారత జట్టు సెమీస్ బెర్తును అనధికారికంగా ఖాయం చేసుకుంది. మరోవైపు.. గ్రూప్-‘ఏ’లో భాగమైన పాకిస్తాన్ మంగళవారం అఫ్గనిస్తాన్తో పోటీపడుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 48 ఓవర్లలో 303 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ గెలిస్తే సెమీస్ చేరడం లాంఛనమే! దీంతో మరోసారి దాయాదులు భారత్- పాక్ మ్యాచ్ చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది. చదవండి: Virat Kohli: రాజు ఎక్కడైనా రాజే! టాప్లో కింగ్ కోహ్లి ACC Men's U19 Asia Cup | India-U19 vs Nepal-U19 | Highlights. https://t.co/6wE0HM9pDH#ACCMensU19AsiaCup #ACC — AsianCricketCouncil (@ACCMedia1) December 12, 2023 -
Ind vs Pak: మెగా క్రికెట్ టోర్నీ షెడ్యూల్ విడుదల.. భారత్- పాక్ మ్యాచ్ ఆరోజే
దాయాదులు భారత్- పాకిస్తాన్ మరోసారి మెగా క్రికెట్ టోర్నీలో పోటీ పడనున్నాయి. ఆసియా మెన్స్ అండర్-19 వన్డే కప్లో భాగంగా డిసెంబరు 10న ముఖాముఖి తలపడనున్నాయి. దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ ఇందుకు వేదిక కానుంది. కాగా అండర్-19 మెన్స్ ఆసియా కప్-2023కి సంబంధించిన షెడ్యూల్ను ఆసియా క్రికెట్ మండలి శనివారం విడుదల చేసింది. దుబాయ్లో వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్న ఈ టోర్నీకి శుక్రవారం(డిసెంబరు 8) తెరలేవనుంది. గ్రూప్-ఏలో భాగమైన భారత్- అఫ్గనిస్తాన్తో మ్యాచ్తో ఈ ఈవెంట్ ఆరంభం కానుంది. అదే రోజు మరో మ్యాచ్లో పాకిస్తాన్- నేపాల్తో తలపడనుంది. గ్రూప్ దశలో మ్యాచ్లన్నీ ఐసీసీ అకాడమీ గ్రౌండ్, ఐసీసీ అకాడమీ గ్రౌండ్-2లో జరుగనున్నాయి. అయితే, డిసెంబరు 17నాటి ఫైనల్కు మాత్రం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది. ఇక మ్యాచ్లన్నీ భారత కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ఆరంభం కానున్నాయి. కాగా ఆసియా అండర్-19 కప్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. గ్రూప్-ఏలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ సహా పాకిస్తాన్, నేపాల్, అఫ్గనిస్తాన్ పోటీ పడనుండగా.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, జపాన్, యూఏఈ తలపడనున్నాయి. భారత జట్టు కెప్టెన్గా ఉదయ్ సహారన్ ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమి కుమార్ పాండే (వైస్ కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాన్షు మొలియా, ముషీర్ ఖాన్, ధనుష్ గౌడ, అవినాష్ రావు (వికెట్ కీపర్), ఎం అభిషేక్, ఇన్నేష్ మహాజన్ (వికెట్ కీపర్), ఆర్ధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారీ. ట్రావెలింగ్ రిజర్వ్స్: ప్రేమ్ దేవ్కర్, అన్ష్ గోసాయి, మహ్మద్ అమన్. నాన్ ట్రావెలింగ్ రిజర్వులు: దిగ్విజయ్ పాటిల్, జయంత్ గోయత్, పి.విఘ్నేష్, కిరణ్ చోర్మాలే. -
సచిన్, కోహ్లి కాదు! అతడికి బౌలింగ్ చేయడం చాలా కష్టం: డేల్ స్టెయిన్
Rohit Sharma- Dale Steyn: ‘‘నా కెరీర్లో నాకు సవాల్ విసిరిన బౌలర్ ఎవరైనా ఉన్నారా అంటే డేల్ స్టెయిన్ మాత్రమే. తన బౌలింగ్లో పరుగులు సాధించడం చాలెంజింగ్గా ఉంటుంది. అయినప్పటికీ తన ఆట తీరును నేను ఎంతగానో ఆస్వాదిస్తాను. క్లాస్ ప్లేయర్ తను. అతడి నైపుణ్యాలు అమోఘం. బంతి స్వింగ్ చేయడంలో తనకు తానే సాటి. గంటకు 140+ కి.మీ. వేగంతో బంతిని స్వింగ్ చేయగలిగిన స్పీడ్స్టర్లు కొంతమందే ఉంటారు. అందులో స్టెయిన్ ముందు వరసలో ఉంటాడు’’.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల చేసిన వ్యాఖ్యలివి. రోహిత్ ఇలా.. అతడేమో అలా అంతర్జాతీయ క్రికెట్లో ప్రొటిస్ మాజీ పేసర్ డేల్ స్టెయిన్ బౌలింగ్లో రోహిత్ శర్మ ఒకే ఒక్కసారి అవుటయ్యాడు. ఇక, మూడు ఫార్మాట్లలోనూ స్టెయిన్ బౌలింగ్లో హిట్మ్యాన్ సగటు 30 కంటే తక్కువ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో స్టెయిన్ బౌలింగ్ ఎలా ఉంటుందో.. అతడిని ఎదుర్కోవడంలో తాను ఇబ్బంది పడిన విషయాన్ని రోహిత్ శర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తాజాగా రోహిత్ను ఉద్దేశించి డేల్ స్టెయిన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. రోహిత్ శర్మ అతడికి బౌలింగ్ చేయడం కష్టం ‘అద్భుతమైన బ్యాటర్.. జట్టును ముందుండి నడిపించే నాయకుడు.. రోహిత్కు బౌలింగ్ చేయడం నాకెల్లప్పుడూ కష్టతరంగానే ఉండేది’’ అంటూ అంతర్జాతీయ స్థాయిలో తనకు సవాల్ విసిరిన మేటి బ్యాటర్గా రోహిత్ శర్మ పేరును చెప్పాడు స్టెయిన్. ఈ క్రమంలో ఇద్దరు దిగ్గజాలు.. పరస్పర గౌరవం అంటూ హిట్మ్యాన్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కాగా సౌతాఫ్రికా తరఫున 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడిన డేల్ స్టెయిన్ ఆయా ఫార్మాట్లలో వరుసగా 439, 196, 64 వికెట్లు పడగొట్టాడు. సూపర్ ఫామ్లో హిట్మ్యాన్ పరిమిత ఓవర్ల క్రికెట్పై దృష్టి సారించే క్రమంలో 2019లో టెస్టులకు గుడ్బై చెప్పిన స్టెయిన్ గన్.. 2021లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇదిలా ఉంటే.. అక్టోబరు 5 నుంచి ఆరంభం కానున్న వన్డే వరల్డ్కప్-2023 నేపథ్యంలో సారథి రోహిత్ శర్మ మంచి ఫామ్లో ఉండటం టీమిండియాకు శుభసూచకంగా పరిణమించింది. గత ఆరు వన్డే ఇన్నింగ్స్లో రోహిత్ నాలుగు అర్ధ శతకాలు చేశాడు. అందులో వరుసగా మూడు ఫిఫ్టీలు సాధించడం విశేషం. ఆసియా కప్-2023లో నేపాల్, పాకిస్తాన్, శ్రీలంకపై హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇక రోహిత్ శర్మ సారథ్యంలో వన్డే ఫార్మాట్లో వరుసగా రెండోసారి టీమిండియా ఆసియా చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: WC 2023: బహుశా నాకు ఇదే చివరి వరల్డ్కప్ కావొచ్చు: టీమిండియా స్టార్ క్రికెటర్ Rohit Sharma - Dale Steyn is the most challenging bowler I've faced. Dale Steyn - I've struggled bowling to Rohit Sharma, he's just amazing. - The mutual respect between two legends of the game! pic.twitter.com/D4tFlqAN6l — Mufaddal Vohra (@mufaddal_vohra) September 30, 2023 -
ఆసియా క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం..
-
ఆసియా కప్ ఫైనల్లో అశూ ఆడాల్సింది.. అతడికి వీలు కాలేదనే సుందర్కు ఛాన్స్
India vs Australia, 1st ODI: ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో వాషింగ్టన్ సుందర్ను కాదని.. రవిచంద్రన్ అశ్విన్కు చోటు ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆసియా కప్-2023 ఫైనల్లో మైదానంలో దిగిన వాషీకి ఆసీస్తో తుదిజట్టులో చోటు దక్కుతుందని అంతా అనుకున్నారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత జట్టులోకి అశూ రీఎంట్రీ ఇస్తున్న తరుణంలో సుందర్ వైపే మొగ్గుచూపుతారని హర్భజన్ సింగ్ వంటి మాజీలు కూడా అభిప్రాయపడ్డారు. ఆసియా కప్ ఫైనల్లో ఆడించారు కాబట్టి తొలి వన్డేలో అతడికి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. అక్షర్ పటేల్ గాయం కారణంగా ఆశల పల్లకిలో కాగా అక్షర్ పటేల్ గాయం కారణంగా చెన్నై ఆఫ్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ వరల్డ్కప్-2023 ఆశలు సజీవంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసీస్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో రాణిస్తే ఐసీసీ ఈవెంట్లో అడుగుపెట్టే అవకాశం ముంగిట నిలిచారు. ఈ నేపథ్యంలో మొహాలీ వేదికగా శుక్రవారం మొదలైన తొలి మ్యాచ్లో అశూకు చోటు దక్కగా.. వాషీకి మొండిచేయి ఎదురైంది. దీంతో మేనేజ్మెంట్ తీరుపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. వాషీని పరిగణనలోకి తీసుకోనపుడు ఎందుకు శ్రీలంకకు పంపించారని ప్రశ్నిస్తున్నారు. ఆసియా కప్ ఫైనల్కు ఫస్ట్ ఛాయిస్ అశూనే ఈ క్రమంలో.. దినేశ్ కార్తిక్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అక్షర్ పటేల్ స్థానంలో ఆసియా కప్-2023 శ్రీలంకతో ఫైనల్కు తొలి ఛాయిస్ అశ్వినే అని పేర్కొన్నాడు. అశూ కుదరదన్నాడు కాబట్టే వాషీని ఫ్లైట్ ఎక్కించారని తనకు తెలిసిందన్నాడు. ఈ మేరకు క్రిక్బజ్ షోలో డీకే మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసిన అంతర్గత సమాచారం ప్రకారం.. ఈ విషయంలో రోహిత్, అజిత్, రాహుల్ ద్రవిడ్లను నేను సమర్థిస్తాను. ఆసియా కప్ ఫైనల్కు ముందుగా వాళ్లు అశ్విన్కే పిలుపునిచ్చారు. ఆ తర్వాతే అశూను ఎంపిక చేశారు అయితే, తాను మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా లేనని అశ్విన్ చెప్పాడు. అంతేకాదు.. తనకు బదులు లోకల్ మ్యాచ్లు ఆడి రిథమ్లో ఉన్న వాషింగ్టన్ సుందర్ను పంపిస్తే బాగుంటుందని సూచించాడు. దీంతో ఎన్సీఏలోనే ఉన్న సుందర్ను శ్రీలంకకు పంపించారు. ఆ తర్వాత అశ్విన్ రెండు క్లబ్ మ్యాచ్లు ఆడాడు. ఆ తర్వాతే ఆసీస్తో సిరీస్కు అతడిని ఎంపిక చేశారు. అసలు విషయం ఇదే. వాళ్ల మొదటి ప్రాధాన్యం అశ్విన్కే. వాషింగ్టన్ ఈ విషయంలో కాస్త నిరాశకు గురికావొచ్చు. అయితే, వాళ్లు మాత్రం అశ్విన్ వైపే మొగ్గుచూపారు’’ అని చెప్పుకొచ్చాడు. వరల్డ్కప్ జట్టులోనూ.. కాగా గత ఆరేళ్ల వ్యవధిలో అశ్విన్ రెండే రెండు వన్డేలు ఆడిన విషయం తెలిసిందే. ఇక అక్షర్ గనుక కోలుకోకపోతే అక్టోబరు 5 నుంచి మొదలయ్యే వన్డే వరల్డ్కప్ టోర్నీలో ఈ 2011 ప్రపంచకప్ విజేతకు చోటు ఖాయమే అనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఆసీస్తో తొలి వన్డేలో అశూ ఒక వికెట్ తీశాడు. మార్నస్ లబుషేన్ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: అవును.. నాకు ధోనితో విభేదాలున్నాయి.. కానీ! గంభీర్కు స్ట్రాంగ్ కౌంటర్? WC: అలాంటి వాళ్లకు నో ఛాన్స్! అందుకే అతడిని ఎంపిక చేయలేదు: చీఫ్ సెలక్టర్ -
మహ్మద్ సిరాజ్ తీవ్ర భావోద్వేగం.. ‘మిస్ యు పప్పా’ అంటూ!
దుబాయ్: ఆసియా కప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన భారత పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో 694 పాయింట్లతో నంబర్వన్గా నిలిచాడు. ఇప్పటి వరకు 9వ స్థానంలో ఉన్న ఈ హైదరాబాదీ ఏకంగా ఎనిమిది స్థానాలు మెరుగుపర్చుకొని అగ్రస్థానానికి చేరుకోవడం విశేషం. వన్డే ర్యాంకింగ్స్లో సిరాజ్ టాప్గా నిలవడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో నంబర్వన్గా నిలిచిన అతను రెండు నెలల తర్వాత ఆసీస్ పేసర్ జోష్ హాజల్వుడ్కు ఆ స్థానాన్ని కోల్పోయాడు. ఆసియా కప్ ఫైనల్లో 21 పరుగులకే 6 వికెట్లు తీసిన ప్రదర్శనతో ఇప్పుడు మళ్లీ శిఖరానికి చేరాడు. సిరాజ్ తీవ్ర భావోద్వేగం కెరీర్లో అత్యుత్తమ దశను చూస్తున్న సిరాజ్ తన ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగ పోస్ట్ చేశాడు. కొంత కాలం క్రితం చనిపోయిన తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ‘మిస్ యు పాపా’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. తనను తల్లిదండ్రులు ఆశీర్వదిస్తున్న ఫోటోను వారిద్దరు చూస్తున్న చిత్రానికి తాను గ్రౌండ్లో ఆడుతున్న ఫోటోను అతను జత చేశాడు. చదవండి: ‘నా అకౌంట్లో 80 వేలే ఉన్నాయి’.. భారత టెన్నిస్ స్టార్ ఆవేదన -
వేటు తప్పదా? ‘అతడే జట్టును ముందుండి నడిపిస్తాడు! సెలక్టర్ల నిర్ణయం ఇదే’
Asia Cup 2023- ICC ODI WC 2023: ఆసియా కప్-2023 ఫైనల్లో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడి ఘోర పరాభవం మూటగట్టుకుంది శ్రీలంక. గతేడాది టీ20 ఫార్మాట్లో చాంపియన్గా నిలిచిన దసున్ షనక బృందం.. ఈసారి కనీస పోటీ ఇవ్వలేకపోయింది. భారత పేసర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ధాటికి 50 పరుగులకే ఆలౌటై చెత్త గణాంకాలు నమోదు చేసింది. వన్డే ఈవెంట్ ఆసాంతం.. ముఖ్యంగా ఫైనల్లో కెప్టెన్ దసున్ షనక బ్యాటింగ్ వైఫల్యం తీవ్ర ప్రభావం చూపింది. వేటు తప్పదంటూ వార్తలు ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచకప్-2023కి ముందు అతడిపై వేటు వేయడం ఖాయమని.. షనక స్థానంలో వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ను శ్రీలంక సారథిగా నియమించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్కు చెందిన సీనియర్ అధికారి మాట్లాడుతూ... సెలక్టర్ల నిర్ణయం ఇదే ‘‘వరల్డ్కప్-2023 ముగిసేంత వరకు కెప్టెన్గా దసున్ షనకకే కొనసాగించాలని సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు’’ అని తెలిపినట్లు న్యూస్వైర్ పేర్కొంది. దీంతో శ్రీలంక కెప్టెన్ మార్పు ఇప్పట్లో లేదని స్పష్టమైంది. కాగా ప్రపంచకప్లో అక్టోబరు 7న శ్రీలంక తమ ఆరంభ మ్యాచ్లో సౌతాఫ్రికాతో తలపడనుంది. అంతకంటే ముందు సెప్టెంబరు 27న అఫ్గనిస్తాన్తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఇక వరల్డ్కప్ జట్టును ప్రకటించేందుకు సెప్టెంబరు 28 వరకు సమయం ఉన్న నేపథ్యంలో శ్రీలంక ఇంకా తమ జట్టును ప్రకటించలేదు. మొన్ననే సెలక్టర్లకు థాంక్స్ చెప్పిన షనక.. మెరుగ్గానే టీమిండియాతో ఫైనల్కు ముందు దసున్ షనక మాట్లాడుతూ.. బ్యాటర్గా విఫలమైనా కెప్టెన్గా తనను నమ్మినందుకు సెలక్టర్లకు ధన్యవాదాలు చెప్పాడు. ప్రస్తుతం సారథ్య బాధ్యతలపైనే తన దృష్టి కేంద్రీకృతం అయి ఉందని పేర్కొన్నాడు. కాగా కెప్టెన్గా వన్డేల్లో షనక రికార్డు బాగుంది. 37 వన్డేల్లో 23 గెలిపించాడు. వన్డే సారథిగా దసున్ షనక విజయాల శాతం 60.5. ఈ నేపథ్యంలో అతడిపై ఇప్పట్లో వేటుపడే అవకాశం లేదని అభిమానులు చర్చించుకుంటున్నారు. చదవండి: Ind vs Aus: కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా? కెప్టెన్ కావాల్సినోడు.. -
Ind vs Aus: కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా? కెప్టెన్ కావాల్సినోడు..
Asian Games 2023: చైనాలో జరుగనున్న ఆసియా క్రీడలు-2023కి ఈసారి భారత క్రికెట్ నియంత్రణ మండలి మహిళా, పురుష జట్లను పంపుతున్న విషయం విదితమే. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో వుమెన్స్ టీమ్.. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో ద్వితీయ శ్రేణి జట్టు హోంగ్జూకు వెళ్లనున్నాయి. అయితే, అంతకంటే ముందు స్వదేశంలో సెప్టెంబరు 22న ఆరంభం కానున్న ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో రుతురాజ్ ఆడేందుకు రంగం సిద్ధమైంది. ఆసీస్తో తొలి మ్యాచ్లో అతడు తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. రెంటికీ చెడ్డ రేవడి ఇదిలా ఉంటే.. ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టులో తిలక్ వర్మ, రింకూ సింగ్ సహా పలువురు యువ స్టార్లు చోటు దక్కించుకున్నారు. మరోవైపు.. కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. సంజూ శాంసన్ ఆసియా కప్లో అలా.. వరల్డ్కప్జట్టులో ఇలా కేఎల్ రాహుల్ ఆగమనంతో ఆసియా కప్-2023లో వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్తో పోటీలో ఓడిన సంజూ.. రిజర్వ్ ప్లేయర్గా ఎంపికయ్యాడు. ఇక బ్యాటర్గా సూర్యకుమార్ యాదవ్ కంటే మెరుగైన స్థితిలోనే ఉన్నా ఈ వన్డే ఈవెంట్లో అతడిని దురదృష్టం వెక్కిరించింది. కెప్టెన్ కావాల్సినోడు.. మరీ ఇంత అన్యాయమా? ప్రపంచకప్-2023 జట్టులోనూ సూర్య వైపే మొగ్గు చూపిన సెలక్టర్లు సంజూను పక్కనపెట్టేశారు. ఆస్ట్రేలియాతో సిరీస్లోనూ అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీరును తప్పుబట్టాడు. ‘‘ఆసియా క్రీడల జట్టులో సంజూ శాంసన్ పేరు లేకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఆసియా కప్లో రిజర్వ్గా ఉన్నాడు.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో చోటు దక్కలేదు. ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసే అవకాశం లేదు. రుతురాజ్ గైక్వాడ్తో కలిసి శుబ్మన్ గిల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. ఇషాన్కు వరుస అవకాశాలు ఇషాన్ మిడిలార్డర్లో నిలదొక్కుకునేందుకు ఇప్పటికే మేనేజ్మెంట్ కావాల్సినన్ని అవకాశాలు ఇచ్చింది. సంజూ శాంసన్ ఆసియా క్రీడల జట్టులో ఉంటేనైనా బాగుండేది. వరల్డ్కప్ టీమ్లో ఎలాగూ చోటివ్వలేదు.. కనీసం ఆసియా క్రీడల్లో ఆడేందుకు కూడా పనికిరాడా? ఇది సరైన పద్ధతి కాదు.. ప్రపంచకప్ జట్టులో ఆఖరి నిమిషం వరకు పోటీ పడ్డ వ్యక్తి కచ్చితంగా ఈ టీమ్లోనైనా ఉండాల్సింది కదా. కేవలం సభ్యుడిగా కాదు.. నిజానికి కెప్టెన్ అవ్వాల్సింది’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. చదవండి: అంబానీ ఇంట పూజకు భార్య అతియాతో రాహుల్.. వీడియో వైరల్ -
సిరాజ్ మియా.. మరోసారి వరల్డ్ నంబర్ 1 బౌలర్గా.. ఏకంగా..
ICC Men's ODI Bowling Rankings: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్లో అదరగొట్టాడు. మరోసారి ప్రపంచ నెంబర్ 1 బౌలర్గా అవతరించాడు. ఆసియా కప్-2023 ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో సంచలన రికార్డులు నమోదు చేయడంతో పాటు బౌలింగ్ ర్యాంకింగ్స్లో ఏకంగా 8 స్థానాలు ఎగబాకాడు. తద్వారా మరోసారి అగ్రపీఠం కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్వుడ్ని వెనక్కినెట్టి 694 రేటింగ్ పాయింట్లతో టాప్-1లోకి దూసుకువచ్చాడు. కాగా శ్రీలంకతో ఆసియా వన్డే కప్ ఫైనల్లో సిరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన ఈ హైదరాబాదీ స్టార్.. మరో రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. సిరాజ్ దెబ్బకు శ్రీలంక కకావికలం సిరాజ్ దెబ్బకు లంక బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. లంకను 50 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన మియా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కొలంబో మ్యాచ్లో మొత్తంగా ఏడు ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ ఫాస్ట్బౌలర్.. 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 10 ఓవర్ల కోటా పూర్తి చేసేందుకు సిద్ధం అవుతుండగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అతడిని వారించాడు. ఫిట్నెస్ కూడా ముఖ్యమంటూ ట్రైనర్ సూచనలు ఇవ్వడంతో.. అలా సిరాజ్ పేస్ అటాక్కు తెరపడింది. లేదంటే.. మరిన్ని వికెట్లు కూల్చేవాడేమో! మొత్తం ఎన్ని వికెట్లంటే? ప్రస్తుతం సిరాజ్ వన్డే వరల్డ్కప్-2023కి సిద్ధమయ్యే పనిలో ఉన్నాడు. అంతకంటే ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో భాగం కానున్నాడు. కాగా ఈ ఏడాది ఆరంభంలో సిరాజ్ మొట్టమొదటి సారి వరల్డ్ నంబర్ 1 ర్యాంకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆసియా టోర్నీ తాజా ఎడిషన్లో సిరాజ్ 12.2 సగటుతో మొత్తంగా 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ తాజా వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే 1. మహ్మద్ సిరాజ్- ఇండియా- 694 పాయింట్లు 2. జోష్ హాజిల్వుడ్- ఆస్ట్రేలియా- 678 పాయింట్లు 3. ట్రెంట్ బౌల్ట్- న్యూజిలాండ్- 677 పాయింట్లు 4. ముజీబ్ ఉర్ రెహమాన్- అఫ్గనిస్తాన్- 657 పాయింట్లు 5. రషీద్ ఖాన్- అఫ్గనిస్తాన్- 655 పాయింట్లు. చదవండి: ఆసియా కప్ ఫైనల్లో ఘోర ఓటమి.. శ్రీలంక కెప్టెన్పై వేటు! కొత్త కెప్టెన్ ఎవరంటే? Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023 -
ఆసియా కప్ ఫైనల్లో ఘోర ఓటమి.. శ్రీలంక కెప్టెన్పై వేటు! కొత్త కెప్టెన్ ఎవరంటే?
ఆసియాకప్-2023 ఫైనల్లో భారత్ చేతిలో 10 వికెట్ల తేడాతో శ్రీలంక ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి కేవలం 50 పరుగులకే కుప్పకూలింది. ఈ ఘోర పరాభావం నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దసున్ షనకను జట్టు కెప్టెన్సీ నుంచి తొలిగించాలని శ్రీలంక క్రికెట్ భావిస్తున్నట్లు సమాచారం. భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్కు ముందే లంక బోర్డు తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడి స్ధానంలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండీస్కు జట్టు పగ్గాలు అప్పజెప్పాలని శ్రీలంక క్రికెట్ ప్రణాళికలలు సిద్దం చేస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. త్వరలో జరగనున్న బోర్డు మీటింగ్లో ఈ విషయంపై చర్చించనున్నట్లు వినికిడి. కెప్టెన్గా ఎన్నో రికార్డులు శ్రీలంక జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన షనక జట్టును విజయ పథంలోనే నడిపించాడని చేప్పుకోవాలి. ఇప్పటివరకు దసున్ షనక కెప్టెన్సీలో 37 మ్యాచ్లు ఆడిన శ్రీలంక.. 23 విజయాలు సాధించింది. కేవలం 14 మ్యాచ్ల్లోనే ఓటమి పాలైంది. కెప్టెన్గా అతడి విజయం శాతం 60.5గా ఉంది. అదే విధంగా షనక సారథ్యంలోనే 8 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్, 12 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై శ్రీలంక విజయం సాధించింది. గతేడాది ఆసియాకప్ను కూడా షనక నాయకత్వంలోని శ్రీలంకనే సొంతం చేసుకుంది. చదవండి: IND vs AUS: అశ్విన్.. ఆసీస్తో ఆడినంత మాత్రాన సరిపోతుందా?: ఇర్ఫాన్ పఠాన్ -
పాక్ క్రికెట్లో ముసలం.. బాబర్తో విభేదాలు! వైస్ కెప్టెన్పై వేటు
పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ముసలం మొదలైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంతో జట్టులోని మిగితా ఆటగాళ్లకు విభేధాలు తలెత్తున్నట్లు సమాచారం. ఆసియాకప్-2023 లీగ్ దశలో అదరగొట్టిన పాకిస్తాన్.. సూపర్-4లో ఓటమి పాలై టోర్నీ అనుహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ టోర్నీ అంతటా కెప్టెన్గా బాబర్ ఆజం తీసుకున్న నిర్ణయాలపై కొంతమంది ఆటగాళ్ళు ఆసంతృప్తి వ్యక్తం చేసినట్లు వినికిడి. అదేవిధంగా పాకిస్తాన్ డ్రెసింగ్ రూమ్లో రెండు వర్గాలు ఉన్నాయని, కొంతమంది ఆటగాళ్ళు బాబర్ ఆజం నాయకత్వాన్ని బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. శ్రీలంక చేతిలో ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో బాబర్ ఆజం, స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ కూడా బాబర్కు వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం. అదే విధంగా బాబర్ ఆజంపై పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ కూడా కీలక వాఖ్యలు చేశాడు. "ఫీల్డ్లో బాబర్ ఆజంతో అంత ఆనందంగా ఉండలేకపోతున్నాం. ఎందుకంటే అతడు మైదానంలో పూర్తి భిన్నంగా ఉంటాడు. కానీ ఆఫ్ది ఫీల్డ్ మాత్రం అతడితో మేము మంచిగా ఎంజాయ్ చేస్తామని షాదాబ్ పేర్కొన్నాడు. షాదాబ్ ఖాన్పై వేటు.. కాగా బాబర్పై షాదాబ్ బహిరంగంగా చేసిన వాఖ్యలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సీరియస్గా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైస్ కెప్టెన్సీ పదవి నుంచి షాదాబ్ను తప్పించాలని పీసీబీ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న పీసీబీ బోర్డు మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జియోన్యూస్ తమ రిపోర్టులో వెల్లడించింది. చదవండి: Asia Cup 2023: 'అతడు ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్.. చాలా గర్వంగా ఉంది' -
'అతడు ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్.. చాలా గర్వంగా ఉంది'
ఆసియాకప్-2023ను రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో శ్రీలంకను 10వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. 8వ సారి ఆసియా విజేతగా నిలిచింది. కాగా ఈ టోర్నీలో టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా ఈవెంట్లో 6 మ్యాచ్లు ఆడిన గిల్.. 302 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లలో రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. పాకిస్తాన్తో తొలి మ్యాచ్లో విఫలమైన గిల్.. ఆ తర్వాత అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చాడు. కాగా గిల్ ఒక్క టోర్నీలో మాత్రమే కాకుండా అంతకుముందు విండీస్ సిరీస్లో కూడా అద్భుతంగా రాణించాడు. ఓవరాల్గా ఈ ఏడాది ఇప్పటివరకు 17 ఇన్నింగ్స్లు ఆడిన గిల్ 68.33 సగటుతో 1025 పరగులు చేశాడు. ఈ నేపథ్యంలో శుభ్మన్ గిల్పై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. గిల్ను ఫ్యూచర్ ఆఫ్ భారత్ క్రికెట్ అని కపిల్ దేవ్ అభివర్ణించాడు. "శుబ్మన్ గిల్ ఒక అద్భుతం. అతడు భారత్ క్రికెట్ భవిష్యతు. ఈ యువ క్రికెటర్ కచ్చితంగా భారత క్రికెట్ను అత్యున్నత స్ధాయికి తీసుకువెళ్తాడు. ఇండియాలో ఇటువంటి అద్భుతమైన ఆటగాడు ఉన్నందుకు చాలా గర్వంగా ఉందంటూ" పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్దేవ్ పేర్కొన్నాడు. చదవండి: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా కేఎల్ రాహుల్.. అశ్విన్ రీఎంట్రీ -
ఆసియా కప్ 2023 టాప్ పెర్ఫార్మర్స్ వీరే..!
ఆసియా కప్ 2023 విజేతగా టీమిండియా అవతరించిన విషయం తెలిసిందే. శ్రీలంకతో నిన్న (సెప్టెంబర్ 17) జరిగిన ఫైనల్లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఎనిమిదో సారి ఆసియా ఛాంపియన్గా నిలిచింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా ఆడుతూ పాడుతూ 6.1 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్ (23), శుభ్మన్ గిల్ (27) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు మహ్మద్ సిరాజ్ (7-1-21-6), బుమ్రా (5-1-23-1), హార్దిక్ పాండ్యా (2.2-0-3-3) చెలరేగడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. కేవలం కుశాల్ మెండిస్ (17), దుషన్ హేమంత (13 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆసియా కప్ 2023 టాప్ పెర్ఫార్మర్స్ వీరే..! 2023 ఆసియా కప్లో టాప్ పెర్ఫార్మెన్స్లపై ఓ లుక్కేస్తే, ఈ జాబితాలో అంతా టీమిండియా ఆటగాళ్లే కనిపిస్తారు. అత్యధిక పరుగులు, అత్యధిక బౌండరీలు, అత్యధిక సిక్సర్లు, అత్యుత్తమ బౌలింగ్ సగటు, అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు.. ఇలా దాదాపు ప్రతి విభాగంలో భారత ఆటగాళ్లు టాప్లో ఉన్నారు. అత్యధిక పరుగులు: శుభ్మన్ గిల్ (6 ఇన్నింగ్స్ల్లో 302 పరుగులు) అత్యధిక అర్ధసెంచరీలు: రోహిత్ శర్మ, కుశాల్ మెండిస్ (3) అత్యధిక సిక్సర్లు: రోహిత్ శర్మ (11) అత్యధిక బౌండరీలు: శుభ్మన్ గిల్ (35) అత్యధిక స్కోర్: బాబర్ ఆజమ్ (151) అత్యధిక సగటు: మహ్మద్ రిజ్వాన్ (4 ఇన్నింగ్స్ల్లో 97.5) అత్యుత్తమ స్ట్రయిక్రేట్: మహ్మద్ నబీ (178.95) అత్యధిక వికెట్లు: మతీష పతిరణ (11) అత్యుత్తమ బౌలింగ్ సగటు: హార్ధిక్ పాండ్యా (11.33) అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు: మహ్మద్ సిరాజ్ (6/21) టోర్నీ మొత్తంలో 7 సెంచరీలు నమోదు కాగా.. ఇందులో మూడు సెంచరీలు (కోహ్లి, రాహుల్, గిల్) భారత ఆటగాళ్లు చేసినవే కావడం విశేషం. -
'అతడు గాయం నుంచి తిరిగొచ్చినట్లు లేదు .. చుక్కలు చూపిస్తున్నాడు'
దాదాపు ఏడాది తర్వాత వన్డేక్రికెట్లో అడుగుపెట్టిన టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా తన ప్రదర్శనతో అకట్టుకున్నాడు. ఈ ఏడాది ఆసియాకప్ వన్డే టోర్నీతో రీ ఎంట్రీ ఇచ్చిన బుమ్ బుమ్ బుమ్రా తన పేస్ బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ టోర్నీలో బుమ్రా నాలుగు వికెట్లు మాత్రమే సాధించినప్పటికీ.. పవర్ప్లేలో మాత్రం భారత్కు అద్బుతమైన ఆరంభాన్ని అందించాడు. కొత్త బంతితో బుమ్రా అద్బుతాలు సృష్టించాడు. ఈ క్రమంలో బుమ్రాపై టీమిండియా మాజీ ఓపెనర్ అకాష్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రా గాయం నుంచి తిరిగి వచ్చినట్లు కనిపించడం లేదని చోప్రా అభిప్రాయపడ్డాడు. "జస్ప్రీత్ బుమ్రా 10 ఓవర్లు వేయగలడా అని మనం ఆలోచిస్తున్నాము. ఆసియాకప్లో అతడు ఏ మ్యాచ్లో కూడా తన ఫుల్ ఓవర్ల కోటాను పూర్తి చేయలేదు. కానీ ఈ ఈవెంట్లో అతడు వేసిన ప్రతీ ఓవర్ కూడా ఒక అద్భుతం. అది జట్టుకు చాలు . అతడు ప్రతీ సారి 10 ఓవర్లు బౌలింగ్ చేయాల్సిన అవసరం లేదు. నా వరకు అయితే బుమ్రా గాయం నుంచి తిరిగి వచ్చినట్లు కనిపించడం లేదు. బుమ్రా పూర్తి ఫిట్నెస్గా ఉన్నాడు. అదే విధంగా మంచి రిథమ్లో కూడా ఉన్నాడు. అతడు ఫీల్డ్లో కొంచెం కూడా ఇబ్బంది పడడడం లేదు. అతడు బంతిని రెండు వైపులా అద్భుతంగా స్వింగ్ చేస్తున్నాడు. అతడు పేస్లో వైవిధ్యం చూపిస్తున్నాడు. బుమ్రా తిరిగి రావడం జట్టుకు ఎంతో బలాన్ని ఇచ్చిందని "చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: AUS vs IND: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్గా రాహుల్! మరి రోహిత్? -
క్రికెటర్ కాదు.. కోచ్? ఫిజియో? కానే కాదు.. ట్రోఫీ ఎత్తాడుగా! సచిన్, ద్రవిడ్ వల్ల
Who's The Man Who Lifted Asia Cup Trophy?: మ్యాచ్కు వర్ష సూచన.. ఒకవేళ ఫలితం తేలకుంటే రిజర్వ్ డే వరకు ఆగాలా? ఏమో.. ఏదేమైనా ఈసారి టీమిండియా గెలవాల్సిందే..! కప్పు కొట్టాల్సిందే.. ఆసియా కప్-2023 ఫైనల్లో టీమిండియా- శ్రీలంక ఫైనల్కు ముందు సగటు అభిమాని మదిలో మెదిలిన భావాలు.. కానీ వరణుడు ‘కరుణించాడు’... కాస్త ఆలస్యమైనా మ్యాచ్ జరిగేందుకు వీలుగా తానే వెనక్కి వెళ్లిపోయాడు.. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్కు రాగా.. టీమిండియా ఆటగాళ్లంతా మైదానంలో దిగారు.. ఆ తర్వాత ఏం జరిగిందో క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలి వికెట్ తీసి శుభారంభం అందించగా.. మరో ఫాస్ట్బౌలర్ మహ్మద్ సిరాజ్ లంక బ్యాటింగ్ ఆర్డర్ను కకావికలం చేశాడు. ఏకంగా ఆరు వికెట్లతో అదరగొట్టాడు. ఈ హైదారాబాదీ దెబ్బకు శ్రీలంక బ్యాటర్లు క్యూ కట్టగా.. హార్దిక్ పాండ్యా వచ్చి మిగిలిన మూడు వికెట్లు తీసి లాంఛనం పూర్తి చేశాడు. 51 పరుగుల లక్ష్యంతో బరిలోగి దిగిన టీమిండియా 6.1 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించింది. ఎనిమిదోసారి ఆసియా కప్ భారత్ కైవసమైంది. ఆటగాళ్లతో పాటు అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. ఇక ట్రోఫీ ప్రదానోత్సవం.. గత కొంతకాలంగా ఏదైనా సిరీస్ గెలిస్తే.. సెలబ్రేషన్స్ సమయంలో జట్టులోకి కొత్తగా అడుగుపెట్టిన వాళ్లు.. లేదంటే అందరికంటే వయసులో చిన్నవాళ్లకు ట్రోఫీని అందజేయడం ఆనవాయితీగా వస్తోందన్న విషయం తెలిసిందే. తిలక్ వర్మకే ఆ అదృష్టం ఈసారి హైదరాబాదీ బ్యాటర్ 20 ఏళ్ల తిలక్ వర్మకు ఏకంగా ఆసియా కప్ రూపంలో ఆ అదృష్టం దక్కింది. ఆ తర్వాత వెంటనే మరో వ్యక్తి ట్రోఫీని ఎత్తాడు. ఫొటోలు క్లిక్మన్నాయి.. అతడు ఎవరు? టీమిండియా ప్లేయర్ కాదు.. అలా అని కోచ్ లేదంటే ఫిజియో.. వీళ్లెవరూ కాదు.. మరెవరు.. జట్టుకు సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న వ్యక్తుల్లో అతి ముఖ్యమైనవాడు. హి ఈజ్ రఘు రాఘవేంద్ర అతడి పేరు రఘు రాఘవేంద్ర.. త్రో డౌన్ స్పెషలిస్టు. బ్యాటర్లు నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నపుడు వాళ్లకు స్లింగర్ నుంచి బంతులు రిలీజ్ చేసేది ఇతడే. నిజానికి బౌలర్ల కంటే మన బ్యాటర్లు ఇతడినే ఎక్కువసార్లు నెట్స్లో ఎదుర్కొంటారు. బ్యాటర్ల స్టైల్ను బట్టి.. మైదానంలో వాళ్లు ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొనేందుకు సంసిద్ధం కావడంలో త్రో డౌన్ స్పెషలిస్టు కీలకంగా వ్యవహరిస్తాడు. కేవలం బ్యాటింగ్ మాత్రమే కాదు.. ఫీల్డింగ్ ప్రాక్టీస్లోనూ రఘుదే కీలక పాత్ర. అతడికి తోడుగా మరో ఇద్దరు త్రో డౌన్ స్పెషలిస్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లిద్దరి సిఫారసుతోనే! అయితే, టీమిండియా మొట్టమొదటి త్రో డౌన్ స్పెషలిస్టు మాత్రం రఘు రాఘవేంద్రనే! టీమిండియా దిగ్గజాలు సచిన్ టెండుల్కర్, ప్రస్తుత హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ సిఫారసుతో భారత జట్టుతో చేరాలన్న అతడి కోరిక నెరవేరింది. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన రఘు 2011లో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ సిబ్బందిలో ఒకరిగా అడుగుపెట్టాడు. సచిన్, ధోని వంటి బ్యాటర్లకు త్రో డౌన్స్ ఇవ్వటమే కాదు.. జట్టుకు అవసరమైనపుడు అన్నీ తానై వ్యవహరించడంలో రఘు ముందుంటాడు. అన్నింట్లో ముందే ఉంటాడు ఈ విషయాన్ని గతంలో టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన ట్వీట్ ద్వారా వెల్లడించాడు. ‘‘టీమిండియాలో అత్యంత కఠిన శ్రమకోచ్చే రఘు. కేవలం త్రో డౌన్స్ ఇవ్వడమే కాదు.. మ్యాచ్ టిక్కెట్ల దగ్గర నుంచి హోటల్స్, లాజిస్టిక్స్, భోజనం.. ఇలా ఏ విషయాల్లోనైనా సాయానికి తానున్నాంటూ ముందుకు వస్తాడు’’ అని ప్రశంసలు కురిపించాడు. ఇక టీమిండియాకు అతిపెద్ద చీర్ లీడర్ అయిన రఘు.. గతేడాది టీ20 వరల్డ్కప్ సందర్భంగా.. ఆటగాళ్లతో పాటు అభిమానుల మనసు గెలుచుకున్నాడు. టీమిండియా- బంగ్లాదేశ్ మ్యాచ్ చూసిన వారికి ఈ సంగతి గుర్తుండే ఉంటుంది. షూస్ తుడుస్తూ.. మనసులు గెలిచాడు లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. వర్షం పడింది. కాసేపటి తర్వాత వాన తగ్గుముఖం పట్టడంతో మళ్లీ ఆట మొదలుపెట్టగా.. అవుట్ ఫీల్డ్ కాస్త తడిగా ఉండటంతో టీమిండియా ప్లేయర్లు ఎక్కడ ఇబ్బంది పడతారోనని బ్రష్ పట్టుకుని రంగంలోకి దిగాడు రఘు. ఫీల్డర్లు పట్టుజారి పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో.. బౌండరీ లైన్ దగ్గరికి వచ్చి.. వారి షూస్కు అంటిన మట్టిని బ్రష్తో క్లీన్చేస్తూ ఏ ఇబ్బంది కలగకుండా చూసుకున్నాడు. అప్పుడు అతడి ఫొటో నెట్టింట వైరల్ కాగా.. ప్రశంసల జల్లు కురిసింది. తాజాగా ఆసియా కప్ విజయం నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లు అతడికి ట్రోఫీ అందించి కృతజ్ఞతాభావం చాటుకోవడంతో పాటు సముచిత గౌరవం కల్పించడంతో మరోసారి ఇలా వార్తల్లోకెక్కాడు. చదవండి: అంతా బాగానే ఉంది కానీ.. అప్పట్లో కోహ్లి, ద్రవిడ్: రోహిత్కు వార్నింగ్ Team india @BCCI s most hard working guy RAGHU in th team management from giving throw downs in the nets to match tickets,hotel,logistics,food or anything..always ready to help the team.keep up the good work and by the way how can u sit like this man?On one leg👌can anyone copy👇 pic.twitter.com/Ot1wjjRprf — Harbhajan Turbanator (@harbhajan_singh) December 7, 2018 Introducing the Super11 Asia Cup 2023 Champions! 💙🇮🇳#AsiaCup2023 pic.twitter.com/t0kf09xsCJ — AsianCricketCouncil (@ACCMedia1) September 17, 2023 Introducing the Super11 Asia Cup 2023 Champions! 💙🇮🇳#AsiaCup2023 pic.twitter.com/t0kf09xsCJ — AsianCricketCouncil (@ACCMedia1) September 17, 2023 Off field hero of Indian team.👏 He is India's sidearm thrower Raghu who is running around the ground with a brush in hand to clean the shoes of Indian players to avoid the possibility of them sleeping.#T20Iworldcup2022 #INDvsBAN #ViratKohli𓃵 #Rain #KLRahul𓃵 #T20WorldCup pic.twitter.com/d3BdJkHn5M — Rajan Rai (@RajanRa05092776) November 2, 2022 -
అంతా బాగానే ఉంది కానీ.. అప్పట్లో కోహ్లి, ద్రవిడ్: రోహిత్కు వార్నింగ్
Asia Cup 2023 Winning Captain- Rohit Sharma: ‘‘రోహిత్ శర్మ కెప్టెన్సీపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. ఐపీఎల్లో కొంతమందైతే ఒక్కసారి జట్టును గెలిపించలేకపోయారు. కానీ.. రోహిత్ ఏకంగా ఐదు టైటిళ్లు గెలిచాడు. అయితే, అసలు పరీక్ష ముందుంది. రాబోయే 15 రోజులలో ఏం జరుగుతుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జట్టులో ప్రస్తుతం 15- 18 అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న ఆటగాళ్లు ఉన్నారు. అయితే, వారిలో ఒక్కరైనా సరే సరైన సమయంలో రాణించకపోతే అప్పుడు అన్ని వేళ్లు రోహిత్ వైపే చూపిస్తాయి. వరల్డ్కప్ ముగిసిన తర్వాత ప్రతి కెప్టెన్ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో కోహ్లి, ద్రవిడ్ ఫేస్ చేశారు విరాట్ కోహ్లి గతంలో ఇదంతా ఫేస్ చేశాడు. 2007లో రాహుల్ ద్రవిడ్కు సైతం ఇలాంటి పరిస్థితే ఎదురైంది’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ భారత సారథి రోహిత్ శర్మను హెచ్చరించాడు. ఆసియా విజయంతో నూతనోత్సాహం కాగా సొంతగడ్డపై పుష్కరకాలం తర్వాత టీమిండియా వన్డే ప్రపంచకప్ ఆడనున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, పాకిస్తాన్, శ్రీలంక, నెదర్లాండ్స్ ఈ ఐసీసీ టోర్నీలో పాల్గొననున్నాయి. అయితే, అంతకంటే ముందే భారత జట్టు ఆసియా కప్-2023లో భాగంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకతో మ్యాచ్లు ఆడింది. ఈసారి వన్డే ఫార్మాట్లో నిర్వహించిన టోర్నీ ఫైనల్లో శ్రీలంకను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసి చాంపియన్గా అవతరించింది. లోపాలు బయటపడ్డాయి ప్రపంచకప్నకు ముందు ఈ గెలుపు టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందనడంలో సందేహం లేదు. అయితే.. చెత్త ఫీల్డింగ్తో పరుగులు ఇవ్వడం, క్యాచ్లు డ్రాప్ చేయడం.. చెత్త షాట్ల ఎంపిక వంటి కొన్ని పొరపాట్లు సరిచేసుకోవాల్సి ఉంది. ఆసీస్తో సన్నాహక సిరీస్ ఇదిలా ఉంటే.. ఆసియా విజయంతో పాటు మెగా టోర్నీ కంటే ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడటం కూడా భారత్కు మంచి సన్నాహకంగా ఉపయోగపడనుంది. ఈ నేపథ్యంలో.. గౌతం గంభీర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. అంతా బాగానే ఉంది కానీ.. రోహిత్ కెప్టెన్సీకి అసలు పరీక్ష వరల్డ్కప్ రూపంలో ముందు ఉందని అభిప్రాయపడ్డాడు. జాగ్రత్త రోహిత్.. గంభీర్ వార్నింగ్ ఆసియా కప్ రెండుసార్లు గెలిచిన రోహిత్ను ప్రశంసిస్తూనే.. వరల్డ్కప్- 2023లో గనుక ఏమాత్రం తేడా జరిగినా విమర్శల పాలుకాక తప్పదని వార్నింగ్ ఇచ్చాడు. గతంలో కోహ్లి, ద్రవిడ్ విషయంలో ఇలాగే జరిగిందని గుర్తు చేశాడు. అయితే, ఈసారి జట్టు పటిష్టంగా ఉన్న కారణంగా రోహిత్ పని సులువు కానుందని.. కచ్చితంగా ఫైనల్ చేరతారని గంభీర్ అంచనా వేశాడు. ఒకవేళ టీమిండియా రాణించకపోతే రోహిత్ కెప్టెన్సీపై ప్రశ్నలు, చర్చలు మొదలవుతాయని పేర్కొన్నాడు. చదవండి: అతడే మా కొంపముంచాడు.. మమ్మల్ని క్షమించండి ప్లీజ్: శ్రీలంక కెప్టెన్ సిరాజ్ కాదు!; వరల్డ్కప్లో టీమిండియా ప్రధాన అస్త్రం అతడే: పాక్ లెజెండ్ Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023 Super11 Asia Cup 2023 | Final | India vs Sri Lanka | Highlights https://t.co/74ghboYcrR#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 17, 2023 -
రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ధోనికి అలా సాధ్యం కాలేదు!
Asia Cup, 2023 India vs Sri Lanka, Final- Rohit Sharma Record: ఐదేళ్ల క్రితం ఆసియా కప్ టోర్నీలో టీమిండియాను చాంపియన్గా నిలిపిన రోహిత్ శర్మ.. కెప్టెన్గా మరోసారి అదే ఫీట్ను పునరావృతం చేశాడు. హిట్మ్యాన్ సారథ్యంలో భారత జట్టు ఆసియా కప్-2023 ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో మట్టికరిపించి విజయకేతనం ఎగురవేసింది. మిస్టర్కూల్తో పాటు లంక లెజెండ్ మాదిరిగానే వన్డే మ్యాచ్లో 50 పరుగులకే ఆలౌట్ అయిన శ్రీలంక విధించిన స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 6.1 ఓవర్లలోనే ఛేదించి రికార్డు స్థాయిలో అతి పెద్ద విజయం నమోదు చేసింది. కాగా ఆటగాడిగా రోహిత్ శర్మ కెరీర్లో ఇది 250వ అంతర్జాతీయ వన్డే కావడం విశేషం. అదే విధంగా ఆసియా కప్ వన్డే చరిత్రలో 28వది. ఇక ఈ మ్యాచ్లోనే కెప్టెన్గానూ రోహిత్ అరుదైన ఘనతలు సాధించాడు. శ్రీలంకపై విజయంతో ఆసియా వన్డే కప్లో సారథిగా తొమ్మిది మ్యాచ్లు గెలిచి.. టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, శ్రీలంక లెజెండ్ అర్జున రణతుంగతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ధోనికి అలా సాధ్యం కాలేదు అయితే, ధోని(14 మ్యాచ్లలో), రణతుంగ(13 మ్యాచ్లలో)ల కంటే అత్యంత వేగంగా ఈ ఫీట్ నమోదు చేశాడు. 11 మ్యాచ్లలో 9 విజయాలు సాధించి చరిత్రకెక్కాడు. ఇదిలా ఉంటే.. కొలంబోలో శ్రీలంకతో ఆదివారం నాటి ఫైనల్లో గెలుపుతో రోహిత్ శర్మ కెప్టెన్గా రెండోసారి ఆసియా కప్ అందుకున్నాడు. అజారుద్దీన్తో పాటు.. ధోని, రోహిత్ ఈ క్రమంలో ఒకటి కంటే ఎక్కువసార్లు ఈ ఘనత సాధించిన కెప్టెన్గా మహ్మద్ అజారుద్దీన్, మహేంద్ర సింగ్ ధోని తర్వాతి స్థానంలో నిలిచాడు. 1990-91లో అజారుద్దీన్, 2010, 2016(టీ20 ఫార్మాట్లో తొలిసారి)లో ధోని టీమిండియాకు టైటిల్ అందించారు. కాగా ఫైనల్లో ఆరు వికెట్లతో చెలరేగి హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. చదవండి: Asia Cup 2023: కాస్త ఓవర్ అయిందేమో భయ్యా! అందుకే ఆ బంతి వెంట పరిగెత్తాను: సిరాజ్ అతడే మా కొంపముంచాడు.. మమ్మల్ని క్షమించండి ప్లీజ్: శ్రీలంక కెప్టెన్ Super11 Asia Cup 2023 | Final | India vs Sri Lanka | Highlights https://t.co/74ghboYcrR#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 17, 2023 -
శ్రీలంకకు గిఫ్ట్గా 4 పరుగులు.. ముఖం దాచుకున్న కోహ్లి! వీడియో వైరల్
సెప్టెంబర్ 17(ఆదివారం).. శ్రీలంక క్రికెట్కు మరచిపోలేని రోజుగా మిగిలిపోతుంది. ఆసియాకప్-2023 భాగంగా టీమిండియాతో జరిగిన ఫైనల్లో 10 వికెట్ల తేడాతో శ్రీలంక ఘోర ఓటమి చవిచూసింది. భారత ఫాస్ట్బౌలర్ల ధాటికి కేవలం 50 పరుగులకే శ్రీలంక కుప్పకూలింది. తమ వన్డే క్రికెట్ చరిత్రలో లంకకు ఇది రెండో అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. టీమిండియా ఫాస్ట్బౌలర్ మహ్మద్ సిరాజ్ పేస్ ముందు.. లంక బ్యాటర్లు పట్టుమని పది నిమిషాల కూడా నిలవలేకపోయారు. సిరాజ్ 6 వికెట్లతో లంకను చావు దెబ్బతీశాడు. అసియాకప్ చరిత్రలో భారత్ తర్వాత అత్యుత్తమ రికార్డు కలిగి ఉన్న శ్రీలంక.. ఇటువంటి ప్రదర్శన కనబరిచడం అందరని ఆశ్చర్యపరిచింది. విరాట్ కోహ్లి ఓవర్ త్రో గిఫ్ట్ కాగా శ్రీలంక 50 పరుగుల మార్క్ను అయినా అందుకుందంటే అది టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పుణ్యమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే విరాట్ ఓవర్ త్రో రూపంలో 4 పరుగులు శ్రీలంకకు గిఫ్ట్గా ఇచ్చాడు. లంక ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్లో దుషాన్ హేమంత ఫైన్ లెగ్ దిశగా షాట్ ఆడాడు. ఈ క్రమంలో హేమంత రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. దీంతో ఫీల్డర్ వికెట్ కీపర్ దిశగా త్రో వేశాడు. అయితే త్రోలో పవర్ లేకపోవడంతో బంతి స్లిప్లో ఉన్న కోహ్లి చేతికి వెళ్లింది. కోహ్లి వెంటనే నాన్స్ట్రైకర్ ఎండ్కు విసిరాడు. అయితే బంతి స్టంప్స్కు తాకకుండా బౌండరీ లైన్కు వెళ్లింది. దీంతో లంకకు ఆదనంగా నాలుగు పరుగులు వచ్చాయి. బంతి బౌండరీకి వెళ్లడంతో కోహ్లి నిరాశ చెందాడు. తన క్యాప్తో ముఖాన్ని అడ్డుపెట్టుకున్నాడు. కానీ భారత్ అప్పటికే లంకపై చేయి సాధించడంతో విరాట్ కాసేపటికే చిరునవ్వు నవ్వాడు. కోహ్లి రియాక్షన్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: అతడే మా కొంపముంచాడు.. మమ్మల్ని క్షమించండి ప్లీజ్: శ్రీలంక కెప్టెన్ pic.twitter.com/9NJLcluBOW — Rahul Chauhan (@ImRahulCSK11) September 17, 2023 Super11 Asia Cup 2023 | Final | India vs Sri Lanka | Highlights https://t.co/74ghboYcrR#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 17, 2023 -
అతడే మా కొంపముంచాడు.. మమ్మల్ని క్షమించండి ప్లీజ్: శ్రీలంక కెప్టెన్
ఆసియాకప్-2023 ఫైనల్లో టీమిండియా చేతిలో 10 వికెట్ల తేడాతో శ్రీలంక ఘోర ఓటమిని చవిచూసింది. లీగ్,సూపర్-4 దశలో అదరగొట్టిన లంకేయులు.. ఫైనల్లో మాత్రం దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్ల ధాటికి లంక బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది.భారత పేసర్ మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో లంక పతనాన్ని శాసించంగా.. హార్దిక్ పాండ్యా 3 వికెట్లతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన ఫలితంగా ప్రత్యర్థి లంక కేవలం 50 పరుగులకే కుప్పకూలింది. అంతర్జాతీయ వన్డేల్లో లంకకు ఇది రెండో అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. లంక బ్యాటర్లలో 8 మంది సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. ఇక వరల్డ్కప్కు ముందు ఈ దారుణ ఓటమి లంక ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మరోవైపు గాయాలు కూడా శ్రీలంక క్రికెట్ను వెంటాడుతున్నాయి. హసరంగా, చమీరా, అవిష్క ఫెర్నాండో, థీక్షణ వంటి స్టార్ ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. వీరు వరల్డ్కప్ సమయానికి కోలుకుంటారన్నది అనుమానమే. ఇక భారత చేతిలో ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం లంక కెప్టెన్ దసున్ షనక స్పందించాడు. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ తమ ఓటమిని శాసించాడని షనక తెలిపాడు. అతడే మా కొంపముంచాడు.. మహ్మద్ సిరాజ్ అద్బుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. ఈ పిచ్ బ్యాటర్లకు బాగా అనుకూలిస్తుందని నేను భావించాను. అందుకే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాను. కానీ ఈ నిర్ణయం మిస్ఫైర్ అయింది. వాతవారణ పరిస్ధితులు కూడా కీలక పాత్ర పోషించాయి. మేము ఇది మర్చిపోలేని రోజు. మేము మా బ్యాటింగ్ టెక్నిక్ను మెరుగుపరుచుకుని క్రీజులో నిలదొక్కుకుని ఉండి ఉంటే బాగుండేది. కానీ అది మేము చేయలేకపోయాం. ఫైనల్లో మేము ఓడిపోయినప్పటికీ మాకు చాలా సానుకూలాంశాలు ఉన్నాయి. ఈ టోర్నీలో సదీర, కుసల్ మెండీస్ స్పిన్నర్లను ఆడిన విధానం గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. అదేవిధంగా ఆసలంక కూడా తన మార్క్ను చూపించాడు. ఈ ముగ్గురూ భారత పిచ్లపై కూడా అద్భుతంగా ఆడగలరు. అయితే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల నుంచి ఎలా పుంజుకోవాలో మాకు తెలుసు. మేము పాకిస్తాన్ వంటి మేటి జట్లను ఓడించి ఫైనల్కు వచ్చాం. మా బాయ్స్ గత కొంతకాలంగా బాగా రాణిస్తున్నారు. మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన అభిమానులందరికీ ధన్యవాదాలు. అయితే మా ఆటతీరుతో మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమించండి. అదే విధంగా విజేత భారత్కు నా అభినందనలు అంటూ పోస్ట్మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో షనక చెప్పుకొచ్చాడు. చదవండి: నాకు ఒక మెసేజ్ వచ్చింది.. అందుకే సిరాజ్కు మళ్లీ బౌలింగ్ ఇవ్వలేదు: రోహిత్ శర్మ -
సిరాజ్ కాదు!; వరల్డ్కప్లో టీమిండియా ప్రధాన అస్త్రం అతడే: పాక్ లెజెండ్
Asia Cup, 2023 India vs Sri Lanka, Final- Mohammed Siraj: ఆసియా కప్-2023లో ఎనిమిదోసారి చాంపియన్గా నిలిచి టోర్నమెంట్లో అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా మరో మెట్టు ఎక్కింది టీమిండియా. శ్రీలంకను తమ సొంతగడ్డపై మట్టికరిపించి జయభేరి మోగించింది. కొలంబో వేదికగా ఆదివారం నాటి మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత ఫాస్ట్బౌలర్లు రోహిత్ సేనకు చిరస్మరణీయ విజయం అందించారు. బుమ్రా మొదలెడితే.. సిరాజ్ చుక్కలు చూపించాడు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలి వికెట్ తీసి శుభారంభం అందించగా.. హైదరాబాదీ స్టార్ మహ్మద్ సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు. ఆ తర్వాత అతడికి ‘రెస్ట్’ ఇవ్వడంతో బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా మిగిలిన మూడు వికెట్లు తీసి పనిపూర్తి చేశాడు. ఈ క్రమంలో 50 పరుగులకే శ్రీలంక ఆలౌట్ కాగా.. 6.1 ఓవర్లలోనే టీమిండియా టార్గెట్ ఛేదించి ఆసియా కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. స్వదేశంలో వన్డే వరల్డ్కప్-2023కు ముందే అంతర్జాతీయ టైటిల్ సాధించి నయా జోష్లో ఉంది. వరల్డ్కప్లో టీమిండియా ప్రధాన అస్త్రం అతడే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లెజండరీ పేసర్ వసీం అక్రం కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ టోర్నీలో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా టీమిండియాకు ప్రధాన ఆయుధం కానున్నాడని పేర్కొన్నాడు. అదే విధంగా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సైతం కీలక పాత్ర పోషిస్తాడని చెప్పుకొచ్చాడు. ఆసియా కప్ ఫైనల్లో భారత బౌలర్ల విజృంభణ నేపథ్యంలో ఈ మాజీ లెఫ్టార్మ్ ఫాస్ట్బౌలర్ మాట్లాడుతూ.. ‘‘వరల్డ్కప్ టోర్నీలో టీమిండియా ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. వారి అమ్ములపొదిలో ఉన్న ప్రధాన అస్త్రం హార్దిక్ పాండ్యా అనడంలో సందేహం లేదు. కుల్దీప్ యాదవ్ సైతం అద్భుతరీతిలో ఇక కుల్దీప్ యాదవ్.. ఆసియా కప్ ఈవెంట్లో పటిష్ట జట్ల బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. నిజానికి భారత జట్టు ఇప్పుడు పూర్తి సమతూకంగా కనిపిస్తోంది. టీమిండియా మేనేజ్మెంట్ తమ ఆటగాళ్లకు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తూ ఇక్కడిదాకా తీసుకువచ్చింది. ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందే వాళ్లు సరైన జట్టుతో అన్ని రకాలుగా సంసిద్ధమయ్యారు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్తాన్ శ్రీలంక చేతిలో ఓడి సూపర్-4లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. బ్యాట్తోనే కాదు.. బాల్తోనూ ఇక ఆసియా కప్-2023లో కుల్దీప్ యాదవ్ 9 వికెట్లు కూల్చి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. మరోవైపు హార్దిక్ పాండ్యా బంతితోనూ రాణించడం టీమిండియాకు సానుకూలాంశంగా మారింది. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ప్రపంచకప్ ఆరంభం కానున్న విషయం విదితమే. అంతకంటే ముందు రోహిత్ సేన ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. చదవండి: నాకు మెసేజ్ వచ్చింది.. అందుకే సిరాజ్ చేతికి మళ్లీ బంతిని ఇవ్వలేదు: రోహిత్ Asia Cup 2023: కాస్త ఓవర్ అయిందేమో భయ్యా! అందుకే ఆ బంతి వెంట పరిగెత్తాను: సిరాజ్ Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023 -
నువ్వు క్లాస్..బాసూ! ఆనంద్ మహీంద్ర లేటెస్ట్ ట్వీట్ వైరల్
ఆసియా కప్2023లో భారత ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన మహమ్మద్ సిరాజ్ హీరోగా మారిపోయాడు. హైదరాబాదీ ఎక్స్ప్రెస్ మొహమ్మద్ సిరాజ్ వీరవిహారంతో శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ను కుప్పకూల్చి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. భారత జట్టు సభ్యుడిగా టైటిల్ సాధించడంలో మియాన్ మ్యాజిక్ చేయడం మాత్రమే కాదు తన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ 5000డాలర్ల ప్రైజ్ మనీని కొలంబో గ్రౌండ్ స్టాఫ్కి విరాళంగా ప్రకటించి మరింత ఎత్తుకు ఎదిగాడు. దీంతో సిరాజ్పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామిక వేత్త, ఎం అండ్ అధినేత ఆనంద్ మహీంద్ర స్పందించారు. నువ్వు క్లాస్ బాసూ అన్న రీతిలో స్పందించారు. ‘‘ఒకటే మాట.. క్లాస్.. అంతే .. ఈ క్లాస్ అనేది ఇది మీ సంపద లేదా మీరు ఎక్కడి నుంచి వచ్చారు. మీ బ్యాక్ గ్రౌండ్ అనే దాన్నుంచి రాదు.. అది మీలోనే ఉంటుంది’’ అంటూ ట్విట్ చేశారు. 2021లో మహీంద్ర థార్ గిఫ్ట్ ఇదే మ్యాచ్లో సిరాజ్ వన్ మ్యాన్ షోపై కూడా ఆనంద్ మహీంద్ర స్పందించారు. అయితే ఈ రైజింగ్ స్టార్కు దయచేసి ఎస్యూవీ ఇచ్చేయండి సార్ అంటూ ఒక యూజర్ కోరగా, 2021లో మహీంద్రా థార్ ఇచ్చిన సంగతిని గుర్తుచేస్తూ బదులిచ్చారు. కాగా ఆసియా కప్ ఫైనల్లో టీమ్ ఇండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఆసియా కప్ విజేతగా నిలిచాన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో సిరాజ్ ఒకే ఓవర్లో 4 వికెట్లు, 10 బంతుల వ్యవధిలో 5 వికెట్లు సాధించడం అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. Just one word: CLASS. It doesn’t come from your wealth or your background. It comes from within…. https://t.co/hi8X9u4z1O — anand mahindra (@anandmahindra) September 17, 2023 -
నాకు మెసేజ్ వచ్చింది.. అందుకే సిరాజ్ చేతికి మళ్లీ బంతిని ఇవ్వలేదు: రోహిత్
Asia Cup, 2023 India vs Sri Lanka, Final- Mohammed Siraj: టీమిండియా పేసర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ తన అంతర్జాతీయ కెరీర్లో అత్యత్తుమ గణాంకాలు నమోదు చేశాడు. ఆసియాకప్-2023లో భాగంగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో సిరాజ్ విశ్వరూపం చూపించాడు. ఒకే ఓవర్లో 4 వికెట్లు పడగొట్టి శ్రీలంకను తమ సొంతగడ్డపై చావు దెబ్బతీశాడు. ఓవరాల్గా 7 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్.. 6 వికెట్లు పడగొట్టి కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సిరాజ్ మియా మ్యాజిక్ దాటికి ఆతిథ్య జట్టు కేవలం 50 పరుగులకే కుప్పకూలింది. అయితే సిరాజ్ 7 వికెట్ల ఘనత సాధించే అవకాశం ఉన్నప్పటికీ.. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అతడికి బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు. సిరాజ్ చేత 7 ఓవర్లు బౌలింగ్ చేయించి హిట్మ్యాన్ ఆపేశాడు. రోహిత్ నిర్ణయంపై భిన్నభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. సిరాజ్తో మరో ఓవర్ అదనంగా వేయించి వుంటే 7 వికెట్ల హాల్ సాధించి చరిత్రపుటలకెక్కేవాడని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇక ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడాడు. సపోర్ట్ స్టాప్ సూచన మేరకు సిరాజ్తో మరో ఓవర్ వేయించలేదని రోహిత్ తెలిపాడు. "స్లిప్స్లో అంతమంది ఫీల్డర్లను చూడటం చాలా ఆనందంగా అన్పించింది. మా ముగ్గురు పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా సిరాజ్ మిగిలిన వారికంటే చాలా కష్టపడ్డాడు. అయితే అందరూ ప్రతీరోజు రాణించాలంటే సాధ్యం కాదు. ఒక్కో రోజు ఒక్కొక్కరు హీరో అవుతారు. ఈ రోజు సిరాజ్ది. అప్పటికే సిరాజ్ తొలి స్పెల్తో కలుపుకుని వరుసుగా 7 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 7 ఓవర్లు అంటే చాలా ఎక్కువ. అయితే అతడితో మరో ఒకట్రెండు ఓవర్లు వేయించాలని నేను అనుకున్నాను. కానీ అతడికి ఓవర్లను ఆపాలని మా మా ట్రైనర్ నుంచి నాకు సందేశం వచ్చింది. సిరాజ్ మాత్రం బౌలింగ్ కొనసాగించడానికి ఉత్సాహంగా ఉన్నాడు. ఒక రిథమ్లో ఉన్నప్పుడు అది ఒక బ్యాటర్కు అయినా, బౌలర్కైనా సహజం. కానీ ఫిట్నెస్ కూడా ముఖ్యం. ఎందుకంటే అతడి దూకుడు ఇక్కడితో ఆగకూడదు కదా" అని పోస్ట్మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో రోహిత్ పేర్కొన్నాడు. Super11 Asia Cup 2023 | Final | India vs Sri Lanka | Highlights https://t.co/74ghboYcrR#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 17, 2023 చదవండి: Afghan Mystery Girl: వారెవ్వా టీమ్ భారత్.. మోదీ జీకి బర్త్డే గిఫ్ట్! ఎవరీ అందాల సుందరి? వ్యాపారవేత్త మాత్రమే కాదు.. Asia Cup 2023: ఆసియా ఛాంపియన్స్గా టీమిండియా.. ప్రైజ్ మనీ ఎంతంటే? -
వారెవ్వా టీమ్ భారత్.. మోదీ జీకి బర్త్డే గిఫ్ట్! ఎవరీ అందాల సుందరి?
Afghan Mystery Girl- Who Is Wazhma Ayoubi: వజ్మా అయూబీ.. సోషల్ మీడియాను ఫాలో అయ్యే వాళ్లకు అఫ్గనిస్తాన్ ‘మిస్టరీ గర్ల్’ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆసియా కప్-2023 టోర్నీలో టీమిండియాకు మద్దతుగా పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తోందీమె. కోహ్లికి వీరాభిమాని విరాట్ కోహ్లికి వీరాభిమాని అయిన వజ్మా.. ఇప్పటికే కింగ్ సంతకంతో కూడిన జెర్సీని కూడా దక్కించుకుంది. ఆసియా కప్లో పాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా కోహ్లి 13 వేల పరుగుల మైలురాయిని చేరుకోగానే ఆ జెర్సీ ధరించి కింగ్ రికార్డును సెలబ్రేట్ చేసుకుంది. అంతేకాదు.. పాకిస్తాన్ సహా ఇతర జట్లపై టీమిండియా గెలిచినపుడు శుభాకాంక్షలు తెలుపుతూ వజ్మా అభిమానం చాటుకుంది. ఇక ఆదివారం నాటి ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు శ్రీలంకను చిత్తు చేసి చాంపియన్గా నిలవడంతో ఆమె పట్టరాని సంతోషంలో మునిగిపోయింది. సిరాజ్ బౌలింగ్కు ఫిదా అంతేకాదు టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్కు ఫిదా అయిపోయింది. మ్యాచ్ చూస్తున్నపుడు.. ‘‘11.2 ఓవర్లలో స్కోరు 33-7. కనీవిని ఎరుగని రీతిలో ఇలా ఏడు వికెట్లు పడటం చూశాం. అందులో 6 వికెట్లు మహ్మద్ సిరాజ్వే! ఈరోజు ఈ మ్యాచ్ చరిత్ర సృష్టిస్తుందనడంలో సందేహం లేదు’’ అని వజ్మా అయూబ్ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది. మోదీ జీకి అదిరిపోయే బర్త్డే గిఫ్ట్ ఇక రోహిత్ సేన ఎనిమిదోసారి ఆసియా కప్ ట్రోఫీని ముద్దాడటంతో అద్భుతమైన పోస్ట్తో టీమిండియా సహా భారత ప్రధాని నరేంద్ర మోదీ అభిమానులను ఆకట్టుకుంది. ‘‘టీమ్ భారత్కు శుభాభినందనలు. శ్రీ మోదీ జీకి అదిరిపోయే బర్త్డే(సెప్టెంబరు 17) గిఫ్ట్ ఇచ్చారు. ప్రపంచంలో ఉన్న టీమిండియా ఫ్యాన్స్ అందరికీ కంగ్రాట్స్’’ అని వజ్మా విష్ చేసింది. ఆమె పోస్టుకు వేలల్లో లైకులు వస్తున్నాయి. థాంక్యూ.. ‘నిజంగా మా లక్కీ ఫ్యాన్’ అంటూ ఆమెకు కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరీ వజ్మా ఆయుబ్? అఫ్గనిస్తాన్లో జన్మించిన వజ్మా ఆయుబి వృత్తిరిత్యా మోడల్. దుబాయ్లో నివాసం ఉంటున్న ఆమె వ్యాపారవేత్తగా రాణిస్తోంది. అంతేకాదు సాయం కోసం ఎదురుచూసే వారికి తన వంతు విరాళం అందిస్తూ ఫిలాంత్రపిస్ట్గానూ పేరొందింది. వజ్మాకు ‘LAMAN’ అనే ఫ్యాషన్ బ్రాండ్ కూడా ఉంది. బాలీవుడ్లో అడుగుపెట్టి నటిగా గుర్తింపు పొందాలనేది ఆమె చిరకాల కోరిక. అయితే, ఆసియా కప్-2023 నుంచి అఫ్గనిస్తాన్ నిష్క్రమించిన తర్వాతే వజ్మా తన సెకండ్ హోం టీమ్ అదేనండి రోహిత్ సేనకు ఈ అందాల సుందరి మద్దతు ఇవ్వడం విశేషం. చదవండి: కాస్త ఓవర్ అయిందేమో భయ్యా! అందుకే ఆ బంతి వెంట పరిగెత్తాను: సిరాజ్ Congratulations team Bharat, what a birthday gift for Sri Modi Ji @PMOIndia Congratulations to all Fans all around the world 🇮🇳👏🏻👏🏻👏🏻 #SLvsIND #AsiaCup2023final #AsiaCup pic.twitter.com/A6sIgXlifv — Wazhma Ayoubi 🇦🇫 (@WazhmaAyoubi) September 17, 2023 Super11 Asia Cup 2023 | Final | India vs Sri Lanka | Highlights https://t.co/74ghboYcrR#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 17, 2023 -
ఆసియా ఛాంపియన్స్గా టీమిండియా.. ప్రైజ్ మనీ ఎంతంటే?
ఆసియాకప్-2023 విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంకను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత జట్టు.. 8వ సారి ఆసియాకప్ను ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక.. భారత బౌలర్ల ధాటికి కేవలం 50 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో లంకను దెబ్బతీయగా, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 3 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం 51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఇక ఆసియా ఛాంపియన్స్గా నిలిచిన భారత జట్టుకు ఫ్రైజ్మనీ ఎంత? మ్యాన్ ఆఫ్ది సిరీస్ అవార్డు ఎవరికి లభించిందో వంటి ఆసక్తికర విషయాలపై ఓ లూక్కేద్దం. విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే ? ఈ ఏడాది ఆసియాకప్ విజేతగా నిలిచిన టీమిండియాకు ప్రైజ్ మనీ లక్ష యాభై వేల డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ1.24 కోట్లు) లభించింది. అదే విధంగా రన్నరప్గా నిలిచిన లంకకు 75,000 డాలర్లు( భారత కరెన్సీలో రూ.62 లక్షలు) నగదు బహుమతి దక్కింది. ఇక టోర్నీ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు ప్లేయర్ ఆఫ్ది సిరీస్ అవార్డు వరించింది. ఇందుకు గాను కుల్దీప్ 15,000 డాలర్లు( భారత కరెన్సీలో రూ. 12 లక్షలు) ప్రైజ్ మనీ అందుకున్నాడు. ఈ మెగా ఈవెంట్లో కుల్దీప్ 4 మ్యాచ్ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. ఇక ఫైనల్లో 6 వికెట్లతో అదరగొట్టిన మహ్మద్ సిరాజ్కు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్కు అవార్డు దక్కింది. ఈ అవార్డు రూపంలో అతడికి రూ. 4లక్షల ప్రైజ్మనీ లభించింది. అయితే సిరాజ్ తన మంచి మనసును చాటుకున్నాడు. తనకు వచ్చిన ప్రైజ్మనీని ప్రేమదాస స్టేడియం గ్రౌండ్స్మెన్కు కానుకగా ఇచ్చాడు. ఇక ఈ ఏడాది ఆసియాకప్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్(302) ఉండగా.. వికెట్ల లిస్ట్లో శ్రీలంక పేసర్ మతీషా పతిరానా(11) నిలిచాడు. చదవండి: Asia Cup 2023: కాస్త ఓవర్ అయిందేమో భయ్యా! అందుకే ఆ బంతి వెంట పరిగెత్తాను: సిరాజ్ -
కాస్త ఓవర్ అయిందేమో భయ్యా! అందుకే ఆ బంతి వెంట పరిగెత్తాను: సిరాజ్
Asia Cup, 2023 India vs Sri Lanka, Final- Mohammed Siraj: ఆ ఆరు వికెట్లు... సిరాజ్ రెండో ఓవర్... తొలి బంతి: పాయింట్ దిశగా నిసాంక డ్రైవ్... జడేజా అద్భుత క్యాచ్. మూడో బంతి: అవుట్ స్వింగర్కు సమరవిక్రమ ఎల్బీడబ్ల్యూ. నాలుగో బంతి: కవర్ పాయింట్ దిశగా ఆడిన అసలంక... కిషన్ క్యాచ్. ఆరో బంతి: అవుట్ స్వింగర్ను ఆడలేక కీపర్ రాహుల్కు ధనంజయ క్యాచ్. సిరాజ్ మూడో ఓవర్... నాలుగో బంతి: అవుట్ స్వింగర్...షనక క్లీన్బౌల్డ్. సిరాజ్ ఆరో ఓవర్... రెండో బంతి: అవుట్ స్వింగర్... డ్రైవ్ చేయబోయి మెండిస్ క్లీన్బౌల్డ్. Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023 నాకు రాసిపెట్టి ఉందన్న సిరాజ్ అంతా ఒక కలలా అనిపిస్తోంది. గత కొంతకాలంగా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాను. కానీ వికెట్లు మాత్రం దక్కడంలేదు. లైన్ అండ్ లెంగ్త్కు కట్టుబడి బౌలింగ్ చేశా. చివరకు ఇవాళ నేను అనుకున్న ఫలితం వచ్చింది. వన్డేల్లో బంతిని స్వింగ్ చేసేందుకు సాధారణంగా ప్రయత్నిస్తుంటా. టోర్నీ గత మ్యాచ్లలో అలాంటిది సాధ్యం కాలేదు. కానీ ఇవాళ మంచి స్వింగ్ లభించింది. అవుట్ స్వింగర్ను సమర్థంగా వాడుకోవడం ఆనందంగా అనిపించింది. బ్యాటర్లు డ్రైవ్ చేసేందుకు ప్రయత్నిస్తే అవుటయ్యేలా బంతులు వేశా. గతంలో శ్రీలంకతో మ్యాచ్లో ఐదు వికెట్ల ప్రదర్శనకు చేరువగా వచ్చినా చివరకు దక్కలేదు. సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది మనకు ఎంత రాసి పెట్టి ఉంటే అంతే దక్కుతుందని నమ్ముతా. ఇవాళ అదృష్టం నా వైపు ఉంది. భారత్కు ప్రాతినిధ్యం వహించడంకంటే గర్వించే విషయం మరొకటి ఉండదు. ఇలాంటి ప్రదర్శనలు మరింత ప్రేరణను అందిస్తాయి. కఠోర శ్రమ, సాధన ఫలితమిస్తున్నాయి. నేను ఇంకా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది అని టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు. బౌండరీ ఆపేందుకు సిరాజ్ పరుగులు ఆసియా కప్-2023 ఫైనల్లో శ్రీలంకతో మ్యాచ్లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టుకు సిరాజ్ విజయం అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కఠిన శ్రమ వల్లే ఇదంతా సాధ్యమైందంటూ సిరాజ్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక శ్రీలంక ఇన్నింగ్స్లో నాలుగో ఓవర్లో అప్పటికే మూడు వికెట్లు తీసిన తర్వాత సిరాజ్ హ్యాట్రిక్ కోసం యత్నించగా.. బంతి బౌండరీ దిశగా వెళ్లింది. బాల్ను ఆపేందుకు సిరాజ్ కూడా దాని వెంట పరుగులు తీశాడు. ఇది చూసి విరాట్ కోహ్లి, శుబ్మన్ గిల్ సహా హార్దిక్పాండ్యా నవ్వులు చిందించారు. మ్యాచ్ చూస్తున్న వాళ్లకు ఇదంతా కాస్త అసాధారణంగా అనిపించింది. కాస్త ఓవర్ అయిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అత్యుత్సాహం కాదు.. అంకితభావం నిజానికి అది అత్యుత్సాహం అనడం కంటే ఆట పట్ల సిరాజ్ నిబద్ధత, అంకితభావానికి నిదర్శనం అని చెప్పొచ్చు. ఈ విషయం గురించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంటున్న సమయంలో రవిశాస్త్రి సిరాజ్ను ప్రశ్నించగా.. ‘‘బంతి బౌండరీకి వెళ్లకుండా ఆపితే గొప్పగా ఉంటుందని భావించాను అంతే’’ అని సిరాజ్ సమాధానం ఇచ్చాడు. గ్రౌండ్స్మెన్కు సిరాజ్ గిఫ్ట్ ఫైనల్లో అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో చెలరేగిన సిరాజ్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. టోర్నీలో ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎంతో శ్రమకోర్చి పిచ్లు సిద్ధం చేసిన ప్రేమదాస స్టేడియం గ్రౌండ్స్మెన్ను తన తరఫున కానుకను ప్రకటించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా తనకు వచ్చిన 5 వేల డాలర్ల చెక్ను వారికి అందించాడు. మరోవైపు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కూడా కాండీ, కొలంబో గ్రౌండ్స్మెన్కు ప్రత్యేక బహుమతిని ప్రకటించింది. 50 వేల డాలర్లు వారికి ఇస్తున్నట్లు ఏసీసీ అధ్యక్షుడు జై షా వెల్లడించారు. చదవండి: నా శరీరం 40 ఏళ్లు అంటోంది.. ఐడీ 31 చూపిస్తోంది.. కానీ: డికాక్ భావోద్వేగం W . W W 4 W! 🥵 Is there any stopping @mdsirajofficial?! 🤯 The #TeamIndia bowlers are breathing 🔥 4️⃣ wickets in the over! A comeback on the cards for #SriLanka? Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/Lr7jWYzUnR — Star Sports (@StarSportsIndia) September 17, 2023 Reality ! They are Laughing on Siraj As he only Bowl and he only Running to safe Boundary#INDvsSL https://t.co/3EvGgSu4Rp pic.twitter.com/qbdY3NcuTK — Jaisi Jiski Soch (@Jaisi_JiskiSoch) September 17, 2023 Introducing the Super11 Asia Cup 2023 Champions! 💙🇮🇳#AsiaCup2023 pic.twitter.com/t0kf09xsCJ — AsianCricketCouncil (@ACCMedia1) September 17, 2023 Super11 Asia Cup 2023 | Final | India vs Sri Lanka | Highlights https://t.co/74ghboYcrR#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 17, 2023 -
Asia Cup 2023: ఫైర్ సిరాజ్... ఆసియా కప్ విజేత భారత్
భారత్, శ్రీలంక మధ్య ఆసియా కప్ ఫైనల్... గత రెండు మ్యాచ్లలో లంక జట్టు ప్రదర్శన కారణంగా స్థానిక అభిమానులతో స్టేడియం దాదాపుగా నిండిపోయింది... పాక్పై గెలుపు, భారత్తో పోరాడిన తీరు తుది పోరుపై కూడా అంచనాలు పెంచాయి... మ్యాచ్ హోరాహోరీగా సాగవచ్చని అనిపించింది... వర్షంతో ఆట 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది... స్టేడియంలో కాస్త ఆలస్యంగా వచ్చినవారు సీట్లలో కుదురుకునే ప్రయత్నంలో ఉండగా... ఆదివారం వినోదం కోసం మరికొందరు ఇళ్లలో సిద్ధపడుతున్నారు... కానీ మరో గంట ముగిసేసరికి ఖేల్ ఖతం... లంక ఇన్నింగ్స్ ముగిసేందుకు 15.2 ఓవర్లు సరిపోయాయి... ఆపై భారత్ మరో 6.1 ఓవర్లలో ఫటాఫట్ ఛేదన... ఆసియా కప్ ఎనిమిదోసారి భారత్ సొంతం! ముందుగా మ్యాచ్ మూడో బంతికి వికెట్తో బుమ్రా మొదలు పెట్టాడు... ఆ తర్వాత వచ్చిన సిరాజ్ తన మొదటి ఓవర్ను మెయిడిన్గా వేసి ప్రమాద సూచిక ప్రదర్శించాడు... ఆ తర్వాత అతని రెండో ఓవర్లో అసలు విధ్వంసం జరిగింది. ఒకటి, రెండు కాదు... ఏకంగా నాలుగు వికెట్లు అతని ఖాతాలో... తన మరుసటి ఓవర్లోనూ ఇదే కొనసాగిస్తూ మరో వికెట్... శ్రీలంక స్కోరు 12/6. అయితే అందులో ఐదు వికెట్లు సిరాజ్వే... కొంత విరామం తర్వాత మరో వికెట్ కూడా అతని ఖాతాలోనే ... 7 ఓవర్లు వేశాక అదే జోరుతో మళ్లీ బంతిని అందుకునేందుకు సిద్ధమైనా కెపె్టన్ ఇక చాలని వారించాడు... తర్వాతి మూడు వికెట్లతో హార్దిక్ (3/3) ప్రత్యర్థి ఆట ముగించాడు. 50 ఓవర్ల లంక ఇన్నింగ్స్ కాస్తా 50 పరుగుల ఇన్నింగ్స్గా మారిపోయింది! కొలంబో: హైదరాబాదీ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ తన వన్డే కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనతో చెలరేగాడు. టెస్టు క్రికెట్ను గుర్తుకు తెచ్చేలా పదునైన స్వింగ్ బౌలింగ్తో సత్తా చాటిన అతని ధాటిని తట్టుకోలేక శ్రీలంక బ్యాటింగ్ కుప్పకూలింది. సిరాజ్ అసాధారణ ప్రదర్శనతో అలవోకగా టీమిండియా ఆసియా చాంపియన్గా నిలిచింది. సొంతగడ్డపై కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయిన లంక పలు చెత్త రికార్డులు తమ ఖాతాలో వేసుకుంది. ఆదివారం ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ 10 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన లంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌటైంది. కుశాల్ మెండిస్ (34 బంతుల్లో 17; 3 ఫోర్లు), దుషాన్ హేమంత (15 బంతుల్లో 13 నాటౌట్; 1 ఫోర్) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సిరాజ్ (6/21) ఆరు వికెట్లతో లంకను దెబ్బకొట్టాడు. అనంతరం భారత్ 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసి గెలిచింది. శుబ్మన్ గిల్ (19 బంతుల్లో 27 నాటౌట్; 6 ఫోర్లు), ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు) మ్యాచ్ ముగించారు. ఒకదశలో 12/6తో లంక వన్డేల్లో అత్యల్ప స్కోరు (35; జింబాబ్వే) నమోదు చేస్తుందేమో అనిపించినా చివరకు ఆ గండం దాటింది. టోచ్చిలో 9 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) జడేజా (బి) సిరాజ్ 2; కుశాల్ పెరీరా (సి) రాహుల్ (బి) బుమ్రా 0; కుశాల్ మెండిస్ (బి) సిరాజ్ 17; సమరవిక్రమ (ఎల్బీ) (బి) సిరాజ్ 0; అసలంక (సి) ఇషాన్ కిషన్ (బి) సిరాజ్ 0; ధనంజయ డిసిల్వా (సి) రాహుల్ (బి) సిరాజ్ 4; షనక (బి) సిరాజ్ 0; వెలలాగె (సి) రాహుల్ (బి) హార్దిక్ పాండ్యా 8; దుషాన్ హేమంత (నాటౌట్) 13; మదుషన్ (సి) కోహ్లి (బి) హార్దిక్ పాండ్యా 1; పతిరణ (సి) ఇషాన్ కిషన్ (బి) హార్దిక్ పాండ్యా 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (15.2 ఓవర్లలో ఆలౌట్) 50. వికెట్ల పతనం: 1–1, 2–8, 3–8, 4–8, 5–12, 6–12, 7–33, 8–40, 9–50, 10–50. బౌలింగ్: బుమ్రా 5–1–23–1, సిరాజ్ 7–1–21–6, హార్దిక్ పాండ్యా 2.2–0–3–3, కుల్దీప్ యాదవ్ 1–0–1–0. భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (నాటౌట్) 23; గిల్ (నాటౌట్) 27; ఎక్స్ట్రాలు 1; మొత్తం (6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 51. బౌలింగ్: మదుషన్ 2–0–21–0, పతిరణ 2–0–21–0, వెలలాగె 2–0–7–0, అసలంక 0.1–0–1–0. Super11 Asia Cup 2023 | Final | India vs Sri Lanka | Highlights https://t.co/74ghboYcrR#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 17, 2023 -
ఇంతింతై... వటుడింతై! బుమ్రా తర్వాత ఇప్పుడు అతడే.. అమ్ముల పొదిలో అరుదైన ‘వాబుల్ సీమ్’!
Asia Cup 2023 Winner Team India- Mohammed Siraj: శ్రీలంక ఇన్నింగ్స్ నాలుగో ఓవర్.... సిరాజ్ వేసిన ఐదో బంతిని ధనంజయ మిడాన్ వైపు ఆడాడు. జోరు మీదున్న సిరాజ్ బంతిని ఆపేందుకు తానే స్వయంగా బౌండరీ వరకు పరుగెత్తాడు. అప్పటికే ఆ ఓవర్లో మూడు వికెట్లు తీసిన సిరాజ్కు అంత అవసరం లేదు. కోహ్లికి కూడా అలాగే అనిపించి గిల్తో పాటు అతనూ చిరునవ్వులు చిందించాడు. కానీ సిరాజ్ అంకితభావం ఎలాంటిదో అది చూపించింది. ఒక్కసారిగా మైదానంలోకి దిగితే చాలు వంద శాతం అతను జోష్లో కనిపిస్తాడు. ఒక్క క్షణం కూడా ఉదాసీనత కనిపించదు. సిరాజ్ వన్డేల్లో ఇప్పుడు కీలక బౌలర్గా ఎదగడమే అనూహ్యం. టెస్టుల్లో తనను తాను నిరూపించుకొని రెగ్యులర్గా మారినా ఎంతో మంది పేసర్లు అందుబాటులో ఉన్న వన్డేల్లో అతనికి సులువుగా చోటు దక్కలేదు. 2019లో తొలి వన్డే ఆడి అతను జట్టులో స్థానం కోల్పోయాడు. టెస్టు ప్రదర్శనలు, ఐపీఎల్లో చక్కటి బౌలింగ్ కూడా అతనికి వన్డేల్లో చోటు కల్పించలేకపోయాయి. అయిదే దాదాపు ఏడాదిన్నర క్రితం సిరాజ్ కెరీర్లో కీలక మలుపు. వేర్వేరు సిరీస్లకు బుమ్రా, షమీలాంటి సీనియర్లు తరచుగా విశ్రాంతి తీసుకుంటుండటంతో అతనికి మళ్లీ అవకాశం దక్కింది. దీనిని అతను అన్ని విధాలా అందిపుచ్చుకున్నాడు. మూడేళ్ల విరామం తర్వాత సిరాజ్ మళ్లీ వన్డే ఆడాడు. అంతే... అప్పటి నుంచి అతని ప్రదర్శన ప్రతీ మ్యాచ్కు మెరుగవుతూ వచ్చింది. ఏదో ద్వితీయ శ్రేణి జట్టులోకి ఎంపిక చేశాం... సీనియర్లు వస్తే మళ్లీ వెనక్కే అన్నట్లుగా కాకుండా తనను మరోసారి పక్కన పెట్టలేని విధంగా రాణించాడు. ఫిబ్రవరి 2022 నుంచి ఆడిన 28 వన్డేల్లో 4 మ్యాచ్లు మినహా ప్రతీసారి వికెట్లు పడగొట్టాడు. అలాగనీ పరుగులు ధారాళంగా ఇవ్వలేదు. ఎకానమీ 5 పరుగులు కూడా దాటలేదు. వికెట్లు దక్కకపోయినా ఎన్నోసార్లు బ్యాటర్ను ఇబ్బంది పెట్టి, మెయిడిన్లతో ఒత్తిడి పెంచి మ్యాచ్పై సిరాజ్ చూపించిన ప్రభావం అమూల్యం. ఇప్పుడు షమీని దాటి బుమ్రా తర్వాత రెండో ప్రధాన పేసర్గా మారాడు. ‘సిరాజ్ అరుదైన ప్రతిభావంతుడు’ అంటూ పదే పదే రోహిత్ ప్రశంసించడం టీమ్లో అతనేమిటో చూపించింది. సిరాజ్ పునరాగమనానికి ముందు ఏడాది కాలంలో కొత్త బంతితో భారత బౌలర్లు పేలవంగా బౌలింగ్ చేశారు. తొలి పది ఓవర్లలో అత్యంత చెత్త ప్రదర్శన (23 వన్డేల్లో 132.10 సగటు) నమోదు చేసిన టీమ్గా ఇండియా నిలిచింది. సిరాజ్ వచ్చాక అంతా మారిపోయింది. ఆరంభ ఓవర్లలోనే వికెట్లు తీసి అతను ఇస్తున్న శుభారంభాలు జట్టు విజయానికి బాటలు వేశాయి. కెరీర్ ఆరంభంలో సహజమైన ఇన్స్వింగ్ బౌలర్గా అడుగు పెట్టిన అతను ఆ తర్వాత అవుట్స్వింగర్లు వేయడంలో రాటుదేలాడు. ఇప్పుడు అతని అమ్ముల పొదిలో అరుదైన ‘వాబుల్ సీమ్’ అనే ఆయుధం కూడా ఉంది. జనవరి 25న తొలిసారి ఐసీసీ వరల్డ్ నంబర్వన్గా నిలిచిన సిరాజ్ అప్పటి నుంచి చెలరేగుతూనే ఉన్నాడు. 29 వన్డేలు పెద్ద సంఖ్య కాకపోవచ్చు గానీ ఎలా చూసినా వన్డేల్లో 19.11 సగటు అసాధారణం. సరిగ్గా వరల్డ్ కప్కు ముందు సిరాజ్ సూపర్ ఫామ్ జట్టుకు ఆనందాన్నిచ్చే విషయం. ఇదే జోరు కొనసాగిస్తే ఈ హైదరాబాదీ పేసర్ మెగా టోర్నీలోనూ స్టార్గా నిలవడం ఖాయం. –సాక్షి క్రీడా విభాగం 4 వన్డేల్లో ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన నాలుగో బౌలర్ సిరాజ్. గతంలో చమిందా వాస్ (శ్రీలంక; 2003లో బంగ్లాదేశ్పై), మొహమ్మద్ సమీ (పాకిస్తాన్; 2003లో న్యూజిలాండ్పై), ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్; 2019లో వెస్టిండీస్పై) ఈ ఫీట్ నమోదు చేశారు. 6/21 వన్డేల్లో భారత్ తరఫున ఇది నాలుగో అత్యుత్తమ ప్రదర్శన. స్టువర్ట్ బిన్నీ (6/4), కుంబ్లే (6/12), బుమ్రా (6/19) సిరాజ్కంటే ముందున్నారు. 263 మిగిలి ఉన్న బంతులపరంగా (43.5 ఓవర్లు) భారత్కు ఇదే అతి పెద్ద విజయం. 16 మ్యాచ్లో తొలి 5 వికెట్లు తీసేందుకు సిరాజ్కు పట్టిన బంతులు. గతంలో చమిందా వాస్, అలీఖాన్ (అమెరికా) కూడా ఇదే తరహాలో 16 బంతులు తీసుకున్నారు. 129 రెండు ఇన్నింగ్స్లు కలిపి ఈ మ్యాచ్ 129 బంతుల్లోనే (21.3 ఓవర్లు) ముగిసింది. తక్కువ బంతుల్లో ముగిసిన మ్యాచ్ల జాబితాలో ఇది మూడో స్థానంలో నిలిచింది. చదవండి: Ind Vs SL: అతడు అద్భుతం.. బ్యాటింగ్ సూపర్! కానీ.. క్రెడిట్ మొత్తం తనకే: రోహిత్ Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023 -
ఆసియా కప్-2023 విజేతలు గ్రౌండ్స్మెన్, పిచ్ క్యూరేటర్స్
2023 ఆసియా కప్ టైటిల్ను టీమిండియా ఎగరేసుకుపోయింది. ఇవాళ (సెప్టెంబర్ 17) జరిగిన ఫైనల్లో భారత్.. శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో రికార్డు విజయం సాధించి, ఎనిమిదో సారి ఆసియా కప్ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా ఆడుతూ పాడుతూ 6.1 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్ (23), శుభ్మన్ గిల్ (27) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు మహ్మద్ సిరాజ్ (7-1-21-6), బుమ్రా (5-1-23-1), హార్దిక్ పాండ్యా (2.2-0-3-3) చెలరేగడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. కేవలం కుశాల్ మెండిస్ (17), దుషన్ హేమంత (13 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 🏏🏟️ Big Shoutout to the Unsung Heroes of Cricket! 🙌 The Asian Cricket Council (ACC) and Sri Lanka Cricket (SLC) are proud to announce a well-deserved prize money of USD 50,000 for the dedicated curators and groundsmen at Colombo and Kandy. 🏆 Their unwavering commitment and… — Jay Shah (@JayShah) September 17, 2023 తెర వెనుక హీరోలకు గుర్తింపు.. 2023 ఆసియా కప్ విజయవంతం కావడంలో కొలొంబో, క్యాండీ మైదానాల సహాయ సిబ్బంది, పిచ్ క్యూరేటర్ల పాత్ర చాలా కీలకమైంది. వీరి కమిట్మెంట్ లేనిది ఆసియా కప్ అస్సలు సాధ్యపడేది కాదు. కీలక మ్యాచ్లు జరిగిన సందర్భాల్లో వర్షాలు తీవ్ర ఆటంకాలు కలిగించగా.. క్యూరేటర్లు, గ్రౌండ్స్మెన్ ఎంతో అంకితభావంతో పని చేసి మ్యాచ్లు సాధ్యపడేలా చేశారు. ముఖ్యంగా ఈ టోర్నీలో గ్రౌండ్స్మెన్ సేవలు వెలకట్టలేనివి. Join us in appreciating the Sri Lanka groundsmen 👏👏 pic.twitter.com/0S7jpERgxj — CricTracker (@Cricketracker) September 17, 2023 వారు ఎంతో అప్రమత్తంగా ఉండి, వర్షం పడిన ప్రతిసారి కవర్స్తో మైదానం మొత్తాన్ని కప్పేశారు. స్థానికమైన ఎన్నో టెక్నిక్స్ను ఉపయోగించి, వీరు మైదానాన్ని ఆర బెట్టిన తీరు అమోఘమని చెప్పాలి. వీరి పనితనానికి దేశాలకతీతంగా క్రికెట్ అభిమానులు ముగ్దులైపోయారు. ఆసియా కప్-2023 నిజమైన విజేతలు గ్రౌండ్స్మెన్, పిచ్ క్యూరేటర్స్ అని సోషల్మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అంతిమంగా వీరి కష్టానికి తగిన గుర్తింపు దక్కింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ), శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ).. కొలొంబో, క్యాండీ మైదానాల గ్రౌండ్స్మెన్, క్యూరేటర్లకు 50,000 యూఎస్ డాలర్ల ప్రైజ్మనీని ప్రకటించారు. వారి కమిట్మెంట్, హార్డ్వర్క్లకు ఇది గుర్తింపు అని ఏసీసీ చైర్మన్ జై షా అన్నారు. వీరు లేనిది ఆసియా కప్-2023 సాధ్యపడేది కాదని షా ప్రశంసించారు. కాగా, ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మహ్మద్ సిరాజ్ తనకు లభించిన ప్రైజ్మనీ మొత్తాన్ని గ్రౌండ్స్మెన్కు ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు. -
Ind Vs SL: అతడు అద్భుతం.. బ్యాటింగ్ సూపర్! కానీ.. క్రెడిట్ మొత్తం తనకే: రోహిత్
Asia Cup 2023 Final- Rohit Sharma Comments: ‘‘అవును.. అత్యద్భుత ప్రదర్శన.. ఫైనల్లో ఇలా ఆడటం మానసికంగా మనం ఎంత సంసిద్ధంగా ఉన్నామో తెలియజేస్తుంది. గెలవాలన్న పట్టుదల.. బంతితో శుభారంభం.. బ్యాట్తో అద్భుతమైన ముగింపు.. స్లిప్స్లో ఫీల్డింగ్ చేస్తున్నపుడు.. మన సీమర్లను చూసి నాకు గర్వంగా అనిపించింది. గొప్పగా అనిపించింది ఎంతో కఠిన శ్రమకోర్చి ప్రణాళికలను పక్కాగా అమలు చేసిన తీరు అమోఘం. ఇలాంటి ప్రదర్శనలు చూసినపుడు ఎంతో గొప్పగా అనిపిస్తుంది. ఇలా జరగుతుందని నేను కూడా ఊహించలేదు. ప్రతి ఒక్క ఆటగాడు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. అయితే, క్రెడిట్ మాత్రం సిరాజ్కే దక్కుతుంది. ఇలాంటి పిచ్ మీద సీమర్లు ఇంత గొప్పగా రాణించడం అత్యంత అరుదు. నిజంగా సిరాజ్ అద్భుతం చేశాడు’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. పేసర్ మహ్మద్ సిరాజ్పై ప్రశంసలు కురిపించాడు. ఆసియా కప్-2023 ఫైనల్లో భారత జట్టు శ్రీలంకను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఆది నుంచే చుక్కలు కొలంబోలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకకు ఆది నుంచే చుక్కలు చూపించారు భారత పేసర్లు. ముందుగా జస్ప్రీత్ బుమ్రా వికెట్ పడగొట్టి శుభారంభం అందించగా.. సిరాజ్ సంచలన స్పెల్(6/21)తో మెరిశాడు. హార్దిక్ పాండ్యా మూడు వికెట్లతో రాణించాడు. ఈ క్రమంలో 50 పరుగులకే ఆలౌట్ అయింది ఆతిథ్య జట్టు. ఇక స్వల్ప టార్గెట్ను ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 6.1 ఓవర్లలోనే ఖేల్ ఖతం చేసింది. ఇషాన్ కిషన్ 23, శుబ్మన్ గిల్ 27 పరుగులు రాబట్టగా 10 వికెట్ల తేడాతో రోహిత్ సేన విజయం సాధించింది. రోహిత్ ఖాతాలో రెండో ఆసియా కప్ తద్వారా చాంపియన్గా నిలిచి ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్ సొంతం చేసుకుంది. కెప్టెన్గా రోహిత్ శర్మ ఖాతాలోనూ రెండో ఆసియా కప్ ట్రోఫీ చేరింది. అదే విధంగా.. అంతర్జాతీయ టైటిల్ కోసం ఐదేళ్లుగా నిరీక్షిస్తున్న అభిమానుల కల నెరవేరింది. ఈ నేపథ్యంలో హర్షం వ్యక్తం చేసిన రోహిత్.. సిరాజ్తో పాటు భారత ఆటగాళ్లను కొనియాడాడు. కాగా సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందగా.. కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ సిరీస్గా నిలిచాడు. ఇక సిరాజ్ మియా సంచలన ప్రదర్శన నేపథ్యంలో అతడిపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: ఏంటా బౌలింగ్ సామి! సిరాజ్ దెబ్బకు లంక విలవిల.. ఆసియా కప్ మనదే అస్సలు ఊహించలేదు.. కలలా ఉంది! పెద్ద మనసు చాటుకున్న సిరాజ్ Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023 W . W W 4 W! 🥵 Is there any stopping @mdsirajofficial?! 🤯 The #TeamIndia bowlers are breathing 🔥 4️⃣ wickets in the over! A comeback on the cards for #SriLanka? Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/Lr7jWYzUnR — Star Sports (@StarSportsIndia) September 17, 2023 A sensational bowling performance, a comprehensive win and the #AsiaCup2023 title triumph 🏆 Recap #TeamIndia's memorable Sunday in Colombo 📽️🔽#INDvSL pic.twitter.com/Eym1a66jiX — BCCI (@BCCI) September 17, 2023 -
అస్సలు ఊహించలేదు.. కలలా ఉంది! పెద్ద మనసు చాటుకున్న సిరాజ్
Asia Cup Final 2023- Ind vs SL #Mohammed Siraj- #W 0 W W 4 W: ‘‘అంతా ఓ కలలా అనిపిస్తోంది. గతంలో త్రివేండ్రంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లోనూ ఇలాగే జరిగింది. ఆరంభంలోనే నాలుగు వికెట్లు పడగొట్టాను. ఐదు వికెట్ల హాల్ నమోదు చేయలేకపోయాను. అయినా.. మన విధిరాతలో ఇలా జరగాలని రాసి ఉన్నపుడు కచ్చితంగా జరిగే తీరుతుందని నాకిప్పుడు అర్థమైంది. నమ్మలేకపోయాను నిజానికి ఈరోజు ఆరంభంలోనే వికెట్లు తీయడానికి నేను పెద్దగా ప్రయత్నించలేదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో నేను ఎల్లప్పుడూ స్వింగ్ కోసమే చూస్తూ ఉంటా. గత మ్యాచ్లలో అస్సలు ఇలా లేదు. ఈరోజు మాత్రం బాల్ ఫుల్గా స్వింగ్ అయింది. అసలు నేనే నమ్మలేకపోయాను. అవుట్ స్వింగర్లు సంధించి ఎక్కువ వికెట్లు పడగొట్టగలిగాను. బ్యాటర్లు ముందుకు వచ్చి ఆడేలా ట్రాప్ చేసి విజయవంతమయ్యాను. చాలా సంతోషంగా ఉంది’’ అని టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ హర్షం వ్యక్తం చేశాడు. ఆసియా కప్-2023 ఫైనల్లో శ్రీలంకతో మ్యాచ్లో ఈ హైదరాబాదీ బౌలర్ అదరగొట్టిన విషయం తెలిసిందే. W . W W 4 W! 🥵 Is there any stopping @mdsirajofficial?! 🤯 The #TeamIndia bowlers are breathing 🔥 4️⃣ wickets in the over! A comeback on the cards for #SriLanka? Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/Lr7jWYzUnR — Star Sports (@StarSportsIndia) September 17, 2023 సిరాజ్ దెబ్బకు పెవిలియన్కు క్యూ కొలంబో వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో విశ్వరూపం ప్రదర్శించాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లతో విజృంభించిన సిరాజ్ మియా.. మొత్తంగా 7 ఓవర్ల బౌలింగ్లో 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు. సిరాజ్ దెబ్బకు శ్రీలంక టాపార్డర్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఓపెనర్ పాతుమ్ నిసాంక(2) సహా కుశాల్ మెండిస్(17), సమరవిక్రమ(0), చరిత్ అసలంక(0), ధనుంజయ డి సిల్వ(4), దసున్ షనక(0) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023 ఇక జస్ప్రీత్ బుమ్రా ఓపెనర్ కుశాల్ పెరీరాను డకౌట్ చేయగా.. హార్దిక్ పాండ్యా దునిత్ వెల్లలగే(8), ప్రమోద్ మదుషాన్(1), మతీశ పతిరణ(0)లను పెవిలియన్కు పంపాడు. దీంతో 15.2 ఓవర్లలో 50 పరుగులకే లంక ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో టీమిండియా ఓపెనర్లు ఇషాన్ కిషన్ 23, శుబ్మన్ గిల్ 27 పరుగులతో అదరగొట్టి 6.1 ఓవర్లలోనే విజయ లాంఛనం పూర్తి చేశారు. దీంతో టీమిండియా ఎనిమిదో సారి ఆసియా కప్ విజేతగా అవతరించింది. పెద్ద మనసు చాటుకున్న సిరాజ్ ఇక విజయానంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మహ్మద్ సిరాజ్ మాట్లాడుతూ.. తన ప్రణాళికలను పక్కాగా అమలు చేశానన్నాడు. బుమ్రా, పాండ్యాల నుంచి సహకారం అందిందని.. సమిష్టిగా రాణించి జట్టుకు విజయం అందించామని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా.. తనకు లభించిన ప్రైజ్మనీని గ్రౌండ్స్మెన్కు ఇచ్చి పెద్ద చాటుకున్నాడు సిరాజ్. కాగా కొలంబోలో వర్షాల నేపథ్యంలోనూ సిబ్బంది ఎప్పటికప్పుడు మ్యాచ్ సజావుగా సాగేలా శ్రమించిన విషయం తెలిసిందే. దీంతో వారి పట్ల ఈ విధంగా కృతజ్ఞతా భావం చాటుకున్నాడు సిరాజ్. చదవండి: ఏంటా బౌలింగ్ సామి! సిరాజ్ దెబ్బకు లంక విలవిల.. ఆసియా కప్ మనదే -
Asia Cup 2023 Final: వన్డే క్రికెట్లో అతి భారీ విజయం
ఓ వన్డే క్రికెట్ టోర్నీ ఫైనల్లో టీమిండియా బంతుల పరంగా అతి భారీ విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకతో జరిగిన 2023 ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు ఈ ఘనతను సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ 263 పరుగులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి, వన్డే క్రికెట్ టోర్నీ ఫైనల్స్ చరిత్రలో అతి భారీ విజయాన్ని నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 2003 వీబీ సిరీస్ ఫైనల్లో ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్ నిర్ధేశించిన 118 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా మరో 226 బంతులు మిగిలుండగానే ఛేదించింది. టీమిండియాకు అతి భారీ విజయం.. వన్డే క్రికెట్లో టీమిండియా బంతుల పరంగా అతి భారీ విజయాన్ని సాధించింది. శ్రీలంకతో జరిగిన ఇవాల్టి మ్యాచ్లో భారత్ 263 బంతులు మిగిలుండగానే, వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్కు ముందు బంతుల పరంగా టీమిండియాకు అతి భారీ విజయం 2001లో కెన్యాపై దక్కింది. నాటి మ్యాచ్లో భారత్ 231 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. వన్డే టోర్నీ ఫైనల్స్లో మూడవది.. ఈ మ్యాచ్లో శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. ఓ వన్డే టోర్నీ ఫైనల్స్లో ఈ ఘనత (10 వికెట్ల తేడాతో విజయం) మూడో జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఓ వన్డే టోర్నీ (కోకో కోలా కప్) ఫైనల్స్లో 1998లో భారత్ తొలిసారి 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నాటి ఫైనల్స్ భారత్.. జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 2003 వీబీ సిరీస్ ఫైనల్లో ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా నిలిచింది. కేవలం 129 బంతుల్లో మ్యాచ్ ముగిసింది.. భారత్-శ్రీలంక మధ్య జరిగిన ఆసియాకప్ 2023 ఫైనల్స్ బంతుల పరంగా మూడో అతి చిన్న మ్యాచ్గా రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్ కేవలం 129 బంతుల్లో (రెండు ఇన్నింగ్స్) ముగిసింది. శ్రీలంక 15.2 ఓవర్లు.. భారత్ 6.1 ఓవర్లు బ్యాటింగ్ చేశాయి. బంతుల పరంగా అతి చిన్న మ్యాచ్ 2020లో నేపాల్-యూఎస్ఏ మధ్య జరిగింది. ఆ మ్యాచ్ కేవలం 104 బంతుల్లో ముగిసింది. ఇదిలా ఉంటే, 2023 ఆసియా కప్ టైటిల్ను భారత్ ఎనిమిదో సారి ఎగరేసుకుపోయింది. ఇవాళ జరిగిన ఫైనల్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఆతిథ్య శ్రీలంకను మట్టికరిపించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా ఆడుతూ పాడుతూ 6.1 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్ (23), శుభ్మన్ గిల్ (27) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు మహ్మద్ సిరాజ్ (7-1-21-6), బుమ్రా (5-1-23-1), హార్దిక్ పాండ్యా (2.2-0-3-3) చెలరేగడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. కేవలం కుశాల్ మెండిస్ (17), దుషన్ హేమంత (13 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
ఏంటా బౌలింగ్ సామి! సిరాజ్ దెబ్బకు లంక విలవిల.. ఆసియా కప్ మనదే
Asia Cup 2023 Winner Team India: ఆసియా వన్డే కప్-2023 ఫైనల్.. టీమిండియా వర్సెస్ శ్రీలంక.. ఆదివారం.. అంతర్జాతీయ టైటిల్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానుల ఐదేళ్ల నిరీక్షణకు తెరదించాలని భారత జట్టు.. సమిష్టితత్వాన్ని నమ్ముకుని రోహిత్ సేనను ఢీకొట్టేందుకు దసున్ షనక బృందం సిద్ధమయ్యాయి.. కొలంబోలో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్ సాగే కొద్దీ బంతి టర్న్ అయ్యే సూచనలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు లంక కెప్టెన్ దసున్ టాస్ సందర్భంగా తెలిపాడు. రోహిత్ శర్మ కూడా తాము కూడా బ్యాటింగ్ వైపే మొగ్గు చూపేవాళ్లమని పేర్కొన్నాడు. పైగా ఈ ఎడిషన్లో ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన మ్యాచ్లలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే ఐదుసార్లు గెలుపొందింది. దీంతో.. అభిమానుల్లో ఆందోళన.. రోహిత్ టాస్ గెలిస్తే బాగుండు.. ప్చ్.. ఇంతలో వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం.. కాసేపటికి కవర్లు తీయగానే కాస్త ఉత్సాహం.. ఏం జరుగబోతుందో చూద్దాం అనుకుంటుండగా.. టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అటాకింగ్ మొదలుపెట్టాడు.. మూడో బంతికే ఓపెనర్ కుశాల్ పెరీరా అవుట్. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. బుమ్రా ఇలా శుభారంభం అందించగా.. హైదరాబాదీ స్టార్ మహ్మద్ సిరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నాలుగో ఓవర్ మొదటి బంతికి పాతుమ్ నిసాంకను.. మూడో బంతికి సదీర సమరవిక్రమను ఎల్బీడబ్ల్యూగా.. ఆ మరుసటి బాల్కే చరిత్ అసలంకను అవుట్ చేశాడు. అంతటితో సిరాజ్ వికెట్ల దాహం తీరలేదు.. ఆఖరి బంతికి ధనుంజయ డిసిల్వను కూడా పెవిలియన్కు పంపాడు. ఒకే ఓవర్లో ఏకంగా.. నాలుగు వికెట్లు.. వన్డే ఫార్మాట్లో అరుదుగా కనిపించే దృశ్యం.. Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023 ఇక్కడితో మన స్పీడ్స్టర్ సిరాజ్ జోరు ఆగిపోలేదు.. ఆ తర్వాత ఆరో ఓవర్ నాలుగో బంతికి లంక కెప్టెన్ దసున్ షనకను అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. తద్వారా 16 బంతుల్లోనే ఐదు వికెట్లు కూల్చిన బౌలర్గా ఘనత సాధించాడు. ఆ తర్వాత మళ్లీ పన్నెండో ఓవర్లో రోహిత్ శర్మ మరోసారి సిరాజ్కు బంతినివ్వగా.. రెండో బాల్కే శ్రీలంక స్టార్ బ్యాటర్ కుశాల్ మెండిస్ను బౌల్డ్ చేశాడు. ఫాస్ట్ ఇన్స్వింగర్తో అతడిని బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత భారత పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా రంగంలోకి దిగాడు. 13 ఓవర్ మూడో బంతికి లంక యువ ఆల్రౌండర్ దునిత్ వెల్లలగేను అవుట్ చేశాడు. అనంతరం.. పదహారో ఓవర్లో పాండ్యా బౌలింగ్లో ప్రమోద్ ఇచ్చిన క్యాచ్ విరాట్ కోహ్లి ఒడిసిపట్టడంతో లంక తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాతి బంతికే పతిరణ కూడా అవుట్! ఇంకేముంది 50 పరుగులకే శ్రీలంక ఆలౌట్.. There was absolutely no respite for Sri Lanka as @hardikpandya7 joined the action to complete a 3-wicket haul with back-to-back wickets 🔥 P.S. This is the lowest score in Asia Cup history 🤯 Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/15vGk0qTmZ — Star Sports (@StarSportsIndia) September 17, 2023 అసలు ఇది వన్డే మ్యాచా లేదంటే.. టీ20నా.. ఓసారి గిల్లి చూసుకోవాల్సిందే అనేంతలా టీమిండియా ఫాస్ట్బౌలర్ల విజృంభణతో పాపం దసున్ షనక బృందం ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. 15.2 ఓవర్లలోనే చాపచుట్టేసింది. సొంతగడ్డపై అవమానకర రీతిలో భారీ పరాభవం మూటగట్టుకుంది. టీమిండియా చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. సిరాజ్ సహా బుమ్రా, పాండ్యా అద్భుతంగా రాణించి ప్రత్యర్థిని కట్టడి చేయగా.. ఇషాన్ కిషన్ను ఓపెనర్గా ప్రమోట్ చేశాడు భారత సారథి రోహిత్ శర్మ. తన స్థానంలో శుబ్మన్ గిల్కు జోడీగా ఈ వికెట్ కీపర్ను పంపాడు. కెప్టెన్ పెట్టుకున్న నమ్మకాన్ని ఈ ఇద్దరు కుర్రబ్యాటర్లు ఏమాత్రం వమ్ము చేయలేదు. ఇషాన్ 18 బంతుల్లో 23, గిల్ 19 బంతుల్లో 27 పరుగులతో అదరగొట్టి.. 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించేలా చేశారు. ఇంకేముంది ఎనిమిదోసారి భారత్ ఆసియా కప్ ట్రోఫీని ముద్దాడింది. Sublime 4️⃣ Timed to perfection by @ShubmanGill, bisecting the field & sending the ball to the fence.#TeamIndia's chase to the 🏆 is underway! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/vepXPaLvmZ — Star Sports (@StarSportsIndia) September 17, 2023 Kishan on a roll! Back-to-back 4️⃣s for @ishankishan51 opening the batting, getting #TeamIndia racing towards victory! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/NchlAeTbpU — Star Sports (@StarSportsIndia) September 17, 2023 చదవండి: నా శరీరం 40 ఏళ్లు అంటోంది.. ఐడీ 31 చూపిస్తోంది.. కానీ: డికాక్ భావోద్వేగం W . W W 4 W! 🥵 Is there any stopping @mdsirajofficial?! 🤯 The #TeamIndia bowlers are breathing 🔥 4️⃣ wickets in the over! A comeback on the cards for #SriLanka? Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/Lr7jWYzUnR — Star Sports (@StarSportsIndia) September 17, 2023 -
భారత బౌలర్ల విజృంభణ.. శ్రీలంక చెత్త రికార్డు
కొలొంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న ఆసియా కప్-2023 ఫైనల్లో టీమిండియా పేసర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా హైదరాబాదీ ఎక్స్ప్రెస్ మహ్మద్ సిరాజ్ (7-1-21-6) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బుమ్రా (5-1-23-1), హార్దిక్ పాండ్యా (2.2-0-3-3) తమవంతుగా రాణించడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. ఓ వన్డే టోర్నీ ఫైనల్లో ఇదే అత్యల్ప స్కోర్. ఈ చెత్త రికార్డును శ్రీలంక మూటగట్టుకుంది. గతంలో (2000లో ఇండియా వర్సెస్ శ్రీలంక) వన్డే టోర్నీ ఫైనల్లో అత్యల్ప స్కోర్ 54 పరుగులుగా ఉండింది. ఈ మ్యాచ్లో శ్రీలంక ఆ రికార్డును బద్దలు కొట్టింది. వన్డేల్లో భారత్పై అత్యల్ప స్కోర్ కూడా ఇదే కావడం విశేషం. 2014లో టీమిండియాపై బంగ్లాదేశ్ చేసిన 58 పరుగులు అత్యల్ప స్కోర్గా ఉండింది. ఈ మ్యాచ్లో శ్రీలంక ఈ చెత్త రికార్డును కూడా తమ ఖాతాలో వేసుకుంది. అలాగే ఈ ఇన్నింగ్స్లో మొత్తం 10 వికెట్లు పేసర్ల ఖాతాలోకే వెళ్లాయి. ఇదే టోర్నీలో పాక్తో జరిగిన గ్రూప్ మ్యాచ్లో కూడా మొత్తం 10 వికెట్లు పేసర్లకే దక్కాయి. ఆ మ్యాచ్లో పాక్ పేసర్లు మొత్తం భారత వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్లో శ్రీలంక మరో చెత్త రికార్డు కూడా మూటగట్టుకుంది. వన్డేల్లో రెండో అత్యల్ప స్కోర్ను నమోదు చేసింది. వన్డేల్లో శ్రీలంక అత్యల్ప స్కోర్ 43 పరుగులుగా ఉంది. 2012లో సౌతాఫ్రికాపై శ్రీలంక ఈ స్కోర్ చేసింది. కాగా, ఈ మ్యాచ్లో భారత పేసర్ల విజృంభణతో శ్రీలంక 50 పరుగులకు ఆలౌట్ కాగా.. లంక ఇన్నింగ్స్లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కావడం మరో విశేషం. లంక ఇన్నింగ్స్లో కేవలం కుశాల్ మెండిస్ (17), దుషన్ హేమంత (13 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
సిరాజ్ సంచలనం.. తమ వరల్డ్ రికార్డును తామే బ్రేక్ చేసిన శ్రీలంక! చెత్తగా..
Asia Cup Final 2023- Ind vs SL #Mohammed Siraj- #W 0 W W 4 W: ఆసియా కప్-2023 ఫైనల్లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ధాటికి శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ హైదరాబాదీ ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ పాతుమ్ నిసాంకతో మొదలుపెట్టిన సిరాజ్ వరుసగా వన్డౌన్ బ్యాటర్ సదీర సమరవిక్రమ, ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన చరిత్ అసలంక, ధనుంజయ డి సిల్వ, కెప్టెన్ దసున్ షనకలను పెవిలియన్కు పంపాడు. సిరాజ్ విశ్వరూపం.. బెంబేలెత్తిన లంక బ్యాటర్లు 12వ ఓవర్ ముగిసే సరికి ఏకంగా ఆరు వికెట్లు తీసి సంచలన ప్రదర్శనతో మెరిశాడు. జస్ప్రీత్ బుమ్రా తొలి వికెట్ తీసి లంకను దెబ్బకొట్టగా.. సిరాజ్ దెబ్బకు శ్రీలంక బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఈ క్రమంలో సింహళీయుల జట్టు వన్డే చరిత్రలో తన పేరిట ఉన్న చెత్త రికార్డును తానే బద్దలు కొట్టింది. అంతర్జాతీయ వన్డేల్లో అత్యల్ప స్కోరుకు ఆరు వికెట్లు కోల్పోయిన జట్టుగా తన రికార్డును తానే అధిగమించింది. 2012లో పర్ల్లో సౌతాఫ్రికాతో మ్యాచ్లో శ్రీలంక 13 పరుగులకు ఆరో వికెట్ కోల్పోయింది. తాజాగా టీమిండియాతో ఆసియా కప్ ఫైనల్లో 12 పరుగుల వద్దే ఆరో వికెట్ పారేసుకుంది. అసోసియేట్ దేశాలు మినహా టెస్టు ఆడే జట్లలో శ్రీలంక రెండుసార్లు ఈ మేరకు ఘోర పరాభవం మూటగట్టుకోవడం గమనార్హం. కెనడా లంక చేతిలో.. లంక ఇలా కాగా 2003లో శ్రీలంకతో పర్ల్లో 12 పరుగులకు.. అదే విధంగా 2013లో నెట్ కింగ్ సిటీతో మ్యాచ్లో 10 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడం సహా ప్రత్యర్థి చేతిలో ఇలా భంగపడటం రెండూ శ్రీలంక జట్టుకే చెల్లిందని క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. కొలంబో వేదికగా ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత పేసర్ల ధాటికి 50 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా ఒకటి, సిరాజ్ ఆరు, హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు పడగొట్టారు. చదవండి: నా శరీరం 40 ఏళ్లు అంటోంది.. ఐడీ 31 చూపిస్తోంది.. కానీ: డికాక్ భావోద్వేగం W . W W 4 W! 🥵 Is there any stopping @mdsirajofficial?! 🤯 The #TeamIndia bowlers are breathing 🔥 4️⃣ wickets in the over! A comeback on the cards for #SriLanka? Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/Lr7jWYzUnR — Star Sports (@StarSportsIndia) September 17, 2023 Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023 -
సిరాజ్ పెర్ఫార్మెన్స్కు ఆనంద్ మహీంద్రా ఫిదా.. కార్ ఇచ్చేయండి సార్..
భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆసియా కప్-2023 (Asia Cup) ఫైనల్ మ్యాచ్ కొలొంబో వేదికగా ఈరోజు (సెప్టెంబర్ 17) జరుగుతోంది. ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 15.2 ఓవర్లలో కేవలం 50 పరుగులకే ఆల్అవుట్ అయింది. తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 51 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో ఆసియా కప్ భారత్ వశమైంది. కాగా మొదటి ఇన్నింగ్స్లో బౌలింగ్కు దిగిన భారత్ బౌలర్లు విజృంభించారు. శ్రీలంక టాప్ బ్యాంటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. ముఖ్యంగా నాలుగో ఓవర్లో భారత బౌలర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) కేవలం నాలుగు పరుగులిచ్చి ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో సిరాజ్ 6 వికెట్లు సాధించాడు. మహమ్మద్ సిరాజ్ అద్భుత బౌలింగ్కు ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఫిదా అయ్యారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్ట్ పెట్టారు. సిరాజ్ ప్రదర్శనకు సంబంధించి ఐసీసీ చేసిన ట్వీట్ను ట్యాగ్ చేస్తూ మీరు ఒక మార్వెల్ అవెంజర్ అంటూ మహమ్మద్ సిరాజ్ను అభినందించారు. ఈ పోస్ట్ యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. పలువురు తమకు తోచిన విధంగా కామెంట్లు పెడుతున్నారు. ‘సార్ సిరాజ్కు ఎస్యూవీ గిఫ్ట్ ఇచ్చేయండి’ అంటూ కోరగా దానికి ఆనంద్ మహీంద్ర స్పందిస్తూ కచ్చితంగా ఇస్తానంటూ పేర్కొన్నారు. I don’t think I have EVER before felt my heart weep for our opponents….It’s as if we have unleashed a supernatural force upon them… @mdsirajofficial you are a Marvel Avenger… https://t.co/DqlWbnXbxq — anand mahindra (@anandmahindra) September 17, 2023 -
Asia Cup 2023 Final IND VS SL: చరిత్ర సృష్టించిన సిరాజ్
భారత్-శ్రీలంక జట్ల మధ్య కొలొంబో వేదికగా జరుగుతున్న ఆసియా కప్-2023 ఫైనల్లో టీమిండియా ఏస్ పేసర్ మహ్మద్ సిరాజ్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో ఒకే ఓవర్లో 4 వికెట్లతో పాటు 10 బంతుల వ్యవధిలో 5 వికెట్లు పడగొట్టిన సిరాజ్.. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున సింగిల్ స్పెల్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) ఐదు వికెట్ల ఘనత సాధించిన బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. The historical over of Mohammad Siraj.....!!! 4 wickets in a single over. pic.twitter.com/aMd3cihLso — Mufaddal Vohra (@mufaddal_vohra) September 17, 2023 చమిందా వాస్ రికార్డు సమం.. ఓవరాల్గా చూస్తే.. సిరాజ్ లంక పేస్ దిగ్గజం చమిందా వాస్ రికార్డును సమం చేశాడు. వాస్ కూడా సిరాజ్ లాగే ఓ స్పెల్లో 16 బంతుల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ తన స్పెల్లో తొలి 16 బంతుల్లో (2.4 ఓవర్లలో) ఓ మెయిడిన్ ఓవర్ వేసి కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. Mohammad Siraj registers the fastest ever 5 wicket haul in a spell for India in international cricket - 16 balls. pic.twitter.com/ilfFa1pZ4u — Mufaddal Vohra (@mufaddal_vohra) September 17, 2023 సిరాజ్ ఆన్ ఫైర్.. 6 వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో శ్రీలంక ఈ మ్యాచ్లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరుగుతున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకేయులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ మ్యాచ్లో ఇప్పటివరకు 6 ఓవర్లు వేసిన సిరాజ్.. ఓ మెయిడిన్ ఓవర్ వేసి 13 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. Mohammad Siraj - the hero! A superb delivery to get his 6th wicket. pic.twitter.com/U3mDt9u9WG — Mufaddal Vohra (@mufaddal_vohra) September 17, 2023 నిస్సంక (2, జడేజా క్యాచ్), కుశాల్ మెండిస్ (17, బౌల్డ్), సమరవిక్రమ (0, బౌల్డ్), అసలంక (0, ఇషాన్ కిషన్ క్యాచ్), ధనంజయ డిసిల్వ (4, రాహుల్ క్యాచ్), షనక (0, బౌల్డ్) వికెట్లు సిరాజ్ ఖాతాలో పడ్డాయి. కుశాల్ పెరీరాను (0) బుమ్రా.. వెల్లలగేను (8) హార్దిక్ ఔట్ చేశారు. 13 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 40/8గా ఉంది. ప్రమోద్ మధుషన్ (0), దుషన్ హేమంత (6) క్రీజ్లో ఉన్నారు. Record-breaking Siraj! 🤯@mdsirajofficial rewrites history, now recording the best figures in the Asia Cup! 6️⃣ for the pacer! Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/2S70USxWUI — Star Sports (@StarSportsIndia) September 17, 2023 -
Asia Cup Final: శ్రీలంకను మట్టికరిపించిన భారత్.. 10 వికెట్ల తేడాతో ఘన విజయం
శ్రీలంకను మట్టికరిపించిన భారత్.. 10 వికెట్ల తేడాతో ఘన విజయం 2023 ఆసియా కప్ టైటిల్ను భారత్ ఎగరేసుకుపోయింది. ఇవాళ జరిగిన ఫైనల్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఆతిథ్య శ్రీలంకను మట్టికరిపించింది. తద్వారా ఎనిమిదో ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా ఆడుతూ పాడుతూ 6.1 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్ (23), శుభ్మన్ గిల్ (27) టీమిండియాను విజయతీరాలక చేర్చారు. అంతకుముందు మహ్మద్ సిరాజ్ (7-1-21-6), బుమ్రా (5-1-23-1), హార్దిక్ పాండ్యా (2.2-0-3-3) చెలరేగడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. కేవలం కుశాల్ మెండిస్ (17), దుషన్ హేమంత (13 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. టార్గెట్ 51.. 3 ఓవర్లలో భారత్ స్కోర్ 32/0 51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ వేగంగా లక్ష్యం దిశగా సాగుతుంది. 3 ఓవర్లలో భారత్ వికెట్లు నష్టపోకుండా 32 పరుగులు చేసింది. గిల్ (18), ఇషాన్ (13) క్రీజ్లో ఉన్నారు. నిప్పులు చెరిగిన సిరాజ్.. 50 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక శ్రీలంకతో జరుగుతున్న ఆసియా కప్-2023 ఫైనల్లో టీమిండియా పేసర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా హైదరాబాదీ ఎక్స్ప్రెస్ మహ్మద్ సిరాజ్ (7-1-21-6) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (2.2-0-3-3) తనవంతుగా రాణించడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా (5-1-23-1) కూడా ఓ వికెట్ పడగొట్టాడు. లంక ఇన్నింగ్స్లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. కేవలం కుశాల్ మెండిస్ (17), దుషన్ హేమంత (13 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన శ్రీలంక 40 పరుగుల వద్ద శ్రీలంక ఎనిమిదో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టడంతో వెల్లలగే (8) ఔటయ్యాడు. సిరాజ్ ఆన్ ఫైర్.. 6 వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో శ్రీలంక టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరుగుతున్నాడు. కుశాల్ మెండిస్ను (17) క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా ఈ ఇన్నింగ్స్లో తన ఆరో వికెట్ను పడగొట్టాడు. సిరాజ్ 5.2 ఓవర్లలో ఓ మెయిడిన్ వేసి కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన శ్రీలంక.. సిరాజ్కు ఐదు వికెట్లు శ్రీలంక జట్టు 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. మహ్మద్ సిరాజ్ కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టి శ్రీలంక నడ్డి విరిచాడు. ఐదో ఓవర్ నాలుగో బంతికి సిరాజ్.. షనక (0)ను క్లీన్బౌల్డ్ చేశాడు. నిప్పులు చెరిగిన సిరాజ్.. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ తొలి బంతికి నిస్సంకను (2) ఔట్ చేసిన సిరాజ్.. మూడు, నాలుగు, ఆరు బంతులకు సమరవిక్రమ (0), అసలంక (0), ధనంజయ డిసిల్వ (4)లను పెవిలియన్కు పంపాడు. దీంతో శ్రీలంక 12 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన సిరాజ్ సిరాజ్ ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి శ్రీలంకను భారీ దెబ్బకొట్టాడు. తొలి బంతికి నిస్సంకను ఔట్ చేసిన సిరాజ్.. మూడు, నాలుగు బంతులకు సమరవిక్రమ (0), అసలంక (0)లను పెవిలియన్కు పంపాడు. దీంతో శ్రీలంక 8 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన సిరాజ్ సిరాజ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి శ్రీలంకను భారీ దెబ్బకొట్టాడు. తొలి బంతికి నిస్సంకను ఔట్ చేసిన సిరాజ్.. మూడో బంతికి సమరవిక్రమను (0) ఎల్బీడబ్ల్యూ చేశాడు. దీంతో శ్రీలంక 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక 8 పరుగుల వద్ద శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో జడేజా క్యాచ్ అందుకోవడంతో నిస్సంక (2) ఔటయ్యాడు. కుశాల్ మెండిస్ (5), సమరవిక్రమ క్రీజ్లో ఉన్నారు. మొదలైన మ్యాచ్.. తొలి ఓవర్లోనే వికెట్ వర్షం కారణంగా భారత్-శ్రీలంక ఫైనల్ మ్యాచ్ 40 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. బుమ్రా వేసిన తొలి ఓవర్లోనే శ్రీలంక వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ మూడో బంతికే కేఎల్ రాహుల్ వికెట్ల వెనుక అద్భుతమైన క్యాచ్ పట్టి కుశాల్ పెరీరాను (0) పెవిలియన్కు సాగనంపాడు. భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆసియా కప్-2023 ఫైనల్ మ్యాచ్ కొలొంబో వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 17) జరుగనుంది. ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక, భారత్ జట్లు చెరో మార్పు చేశాయి. శ్రీలంకకు సంబంధించి తీక్షణ స్థానంలో దుషన్ హేమంత జట్టులోకి రాగా.. భారత జట్టులో అక్షర్ పటేల్ స్థానాన్ని వాషింగ్టన్ సుందర్ భర్తీ చేశాడు. కాగా, మ్యాచ్ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు వర్షం ప్రారంభంకావడంతో మ్యాచ్ ఆలస్యమైంది. తుది జట్లు.. టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ శ్రీలంక: కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరన W . W W 4 W! 🥵 Is there any stopping @mdsirajofficial?! 🤯 The #TeamIndia bowlers are breathing 🔥 4️⃣ wickets in the over! A comeback on the cards for #SriLanka? Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/Lr7jWYzUnR — Star Sports (@StarSportsIndia) September 17, 2023 -
#lndVsSL: టాస్ గెలిచిన శ్రీలంక.. అక్షర్ అవుట్.. వాషీ ఇన్! తుదిజట్లు ఇవే
Asia Cup Final 2023- ndia vs Sri Lanka Playing XI: ఆసియా కప్-2023 ఫైనల్కు రంగం సిద్ధమైంది. కొలంబో వేదికగా ఆర్. ప్రేమదాస స్టేడియంలో టీమిండియా- శ్రీలంక టైటిల్ పోరులో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అక్షర్ పటేల్ అవుట్.. వాషీ ఇన్ ఇక ఆదివారం నాటి మ్యాచ్లో టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ ఎంట్రీ ఇచ్చారు. బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా అక్షర్ పటేల్ గాయం కారణంగా దూరంకాగా యువ స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు తుదిజట్టులో చోటు దక్కింది. తీక్షణ స్థానంలో అతడే మరోవైపు.. స్టార్ స్పిన్నర్ మహీశ్ తీక్షణ గాయంతో వైదొలగడంతో దుషాన్ హేమంతను జట్టులోకి తీసుకున్నట్లు లంక సారథి దసున్ షనక వెల్లడించాడు. ఆరంభంలో పిచ్ బ్యాటింగ్కు అనుకూలించే విధంగా ఉన్న నేపథ్యంలో తొలుత బ్యాటింగ్ చేయాలనుకున్నట్లువెల్లడించాడు. కాగా రోహిత్ శర్మ సైతం.. తాము టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకునే వాళ్లమని పేర్కొన్నాడు. కాగా ఆసియా వన్డే కప్-2023లో కొలంబో వేదికగా ఇప్పటి వరకు జరిగిన ఆరు మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్కు దిగిన జట్టు ఐదుసార్లు గెలవడం విశేషం. తుదిజట్లు ఇవే టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్. శ్రీలంక: కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరానా. చదవండి: బంగ్లా చేతిలో ఓడిపోయారు.. శ్రీలంకపై గెలవాలంటే: పాక్ మాజీ క్రికెటర్ The stage is set! It's the FINAL battle for Asian supremacy! 💥 Who'll come out on top - #India or #SriLanka? Tune-in to the final, #INDvSL in #AsiaCupOnStar Today | 2 PM | Star Sports Network #Cricket pic.twitter.com/k2FJk5egJz — Star Sports (@StarSportsIndia) September 17, 2023 -
బంగ్లా చేతిలో ఓడిపోయారు.. శ్రీలంకపై గెలవాలంటే: పాక్ మాజీ క్రికెటర్
Asia Cup, 2023- India vs Sri Lanka, Final: ఆసియా కప్-2023 ఫైనల్కు ముందు పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ టీమిండియాను హెచ్చరించాడు. శ్రీలంకను తక్కువగా అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నాడు. సొంతగడ్డపై పటిష్టంగా కనిపిస్తున్న దసున్ షనక బృందాన్ని ఓడించడం అంత తేలికేమీ కాదని వార్నింగ్ ఇచ్చాడు. బంగ్లాదేశ్ చేతిలో ఓటమి ఊహించారా? కొలంబో వేదికగా ఆదివారం టీమిండియా- శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా ఓడిపోతుందని ఊహించామా? కానీ అదే జరిగింది. అలాగే పాకిస్తాన్ శ్రీలంక చేతిలో ఓడిపోయింది. టోర్నీ నుంచి నిష్క్రమించింది. బంగ్లా చేతిలో టీమిండియా ఓటమి కంటే పాక్ నిష్క్రమణ మరీ ఘోరం. ఏదేమైనా.. ఇప్పటికీ భారత జట్టుకు అవకాశం ఉంది. వాళ్లు ఫైనల్ ఆడబోతున్నారు. టీమిండియా సత్తాకు పరీక్ష కానీ అంతకంటే ముందే బంగ్లాదేశ్తో మ్యాచ్లో పరాజయం వారికి కనువిప్పు కలిగించిందనే అనుకుంటున్నా. కఠినంగా శ్రమించి.. వ్యూహాలు పక్కాగా అమలు చేస్తేనే ఫైనల్లో అనుకున్న ఫలితం రాబట్టగలరు. శ్రీలంకను ఓడించడం అనుకున్నంత సులువు కాదు. టీమిండియా సత్తాకు పరీక్ష ఇది. శ్రీలంకను తక్కువ అంచనా వేయకండి రోహిత్ సేనను ఎలాగైనా ఓడించి ట్రోఫీ గెలవాలని శ్రీలంక కాచుకుని కూర్చుంది. ప్రపంచకప్ టోర్నీకి ముందు ఏ జట్టుకైనా ఇలాంటి విజయాలు అవసరం. ఐసీసీ ఈవెంట్కు ముందు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి. ఇప్పటికైనా టీమిండియా కళ్లు తెరవాలి. బంగ్లాదేశ్ చేతిలో ఓటమిని మర్చిపోవద్దు’’ అని చెప్పుకొచ్చాడు. సమిష్టిగా రాణిస్తూ విజయపరంపర కాగా స్టార్లు ప్లేయర్లు లేకుండా.. అండర్డాగ్స్గా బరిలోకి దిగిన శ్రీలంక ఒక్కో అవరోధం దాటుకుంటూ ఫైనల్ వరకూ చేరుకుంది. ఇక గతేడాది టీ20 ఫార్మాట్లో ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి టైటిల్ విజేతగా దసున్ షనక జట్టు నిలిచిన విషయం తెలిసిందే. సమిష్టిగా రాణించడం శ్రీలంకకు బలం. ఈ నేపథ్యంలోనే రోహిత్ సేనను ఉద్దేశించి అక్తర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: ఆర్సీబీ పేసర్కు లక్కీ ఛాన్స్! టీమిండియాలో చోటు.. బీసీసీఐ ప్రకటన WC 2023: పాకిస్తాన్కు దెబ్బ మీద దెబ్బ! ఆసియా కప్ పోయింది.. ఇక.. -
WC 2023: పాకిస్తాన్కు దెబ్బ మీద దెబ్బ! ఆసియా కప్ పోయింది.. ఇక..
WC 2023- Major Blows To Pakistan Team: ఘన విజయంతో ఆసియా కప్-2023 టోర్నీని ఆరంభించిన పాకిస్తాన్ ఆఖరి వరకు అదే జోరును కొనసాగించలేకపోయింది. నేపాల్ను చిత్తు చేసి సూపర్-4లో తొలుత అడుగుపెట్టిన బాబర్ ఆజం బృందానికి రోహిత్ సేన చెక్ పెట్టిన విషయం తెలిసిందే. కీలక మ్యాచ్లలో చేతులెత్తేసి చిరకాల ప్రత్యర్థిని ఏకంగా 228 పరుగులతో చిత్తు చేసిన టీమిండియా శ్రీలంకతో మ్యాచ్లోనూ గెలుపొంది ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. దాయాది చేతిలో ఘోర పరాభవం పాలైన నేపథ్యంలో.. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్కు గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు దూరం కావడం పాక్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. బాబర్ వర్సెస్ ఆఫ్రిది అయినప్పటికీ, ఆఖరి వరకు పోరాడగలిగినా శ్రీలంక చేతిలో ఓటమి తప్పలేదు. దీంతో పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో లంకతో మ్యాచ్ అనంతరం.. కెప్టెన్ బాబర్ ఆజం, స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది డ్రెస్సింగ్రూంలో గొడవపడినట్లు పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాబర్ ఆజం- షాహిన్ ఆఫ్రిది సీనియర్లు కూడా ఇలాగేనా ఆడేది.. వీరిద్దరి వాగ్యుద్ధం తారస్థాయికి చేరగా.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ సర్దిచెప్పినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కాగా సీనియర్ ఆటగాళ్లు కూడా ఆశించిన మేర రాణించకపోవడం లేదని, బాధ్యతాయుతంగా ఆడని కారణంగానే ఓటమి ఎదురైందంటూ బాబర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎవరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు మధ్యలో కలుగజేసుకున్న ఆఫ్రిది.. అంత అసహనం పనికిరాదని.. కనీసం మెరుగ్గా ఆడిన బౌలర్లు, బ్యాటర్లను ప్రశంసించవచ్చు కదా అని బాబర్కు కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సమాధానంగా.. జట్టులో ఎవరు బాగా ఆడుతున్నారు.. ఎవరు ఏం చేస్తున్నారో తనకు తెలుసునని గట్టిగానే బదులిచ్చినట్లు సదరు మీడియా తెలిపింది. ఈ క్రమంలో రిజ్వాన్ సహా కోచ్ గ్రాంట్ బ్రాడ్బర్న్ చొరవతీసుకుని బాబర్- ఆఫ్రిదిలను కూల్ చేసినట్లు పేర్కొంది. అయితే, ఆఫ్రిది మాటలకు నొచ్చుకున్న బాబర్.. ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ఎవరితోనూ మాట్లాడకుండా టీమ్ బస్సులోకెక్కి కూర్చున్నాడని సమాచారం. వరల్డ్కప్నకు ముందు పాక్కు దెబ్బ మీద దెబ్బ కాగా వన్డే వరల్డ్కప్-2023కి సమయం సమీపిస్తున్న తరుణంలో ఆసియా కప్లో ఓటమితో నంబర్ 1 స్థానాన్ని పోగొట్టుకున్న పాకిస్తాన్ జట్టు సమస్యలతో సతమతమవుతోంది. ఓవైపు స్టార్ పేసర్లు నసీం షా, హ్యారిస్ రవూఫ్ గాయాల బారిన పడ్డారు. వాళ్లు సెలక్షన్కు ఎప్పుడు అందుబాటులోకి వస్తారో తెలియదు. ఇలాంటి తరుణంలో.. ఆసియా కప్ పరాభవంతో ఆగ్రహంతో ఉన్న బాబర్తో ఆఫ్రిది గొడవ విభేదాలకు దారి తీయడం.. ఇలా ఏది చూసినా పాకిస్తాన్కు ప్రస్తుతం టైమ్ బాగా లేదనే అనిపిస్తోందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. చదవండి: WC 2023: ఫిట్గా ఉన్నా శ్రేయస్ అయ్యర్కు నో ఛాన్స్! ఇక మర్చిపోవాల్సిందేనా? -
WC 2023: ఫిట్గా ఉన్నా శ్రేయస్ అయ్యర్కు నో ఛాన్స్! ఇక మర్చిపోవాల్సిందేనా?
WC 2023- Shreyas Iyer Fitness Big Concern For Team India: సుదీర్ఘ విరామం తర్వాత ఆసియా కప్-2023 సందర్భంగా రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను గాయం వేధిస్తోంది. వెన్నునొప్పికి సర్జరీ చేయించుకుని తిరిగొచ్చిన అయ్యర్ పాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. రీఎంట్రీలో విఫలం ఈ లీగ్ మ్యాచ్లో అతడు కేవలం పద్నాలుగు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత నేపాల్తో మ్యాచ్ ఆడినప్పటికీ ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్లే లక్ష్యాన్ని ఛేదించడంతో అయ్యర్కు బ్యాటింగ్ చేసే అవసరమే రాలేదు. అయితే, సూపర్-4లో పాక్తో మ్యాచ్ సందర్భంగా అనూహ్యంగా ఆఖరి నిమిషంలో అతడు జట్టుకు దూరమయ్యాడు. వెన్నునొప్పి తిరగబెట్టడంతో శ్రేయస్ అయ్యర్ను పక్కన పెట్టినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ సందర్భంగా తెలిపాడు. పునరాగమనంలో రాహుల్ సెంచరీ మ్యాచ్కు ఐదు నిమిషాల ముందు వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్కు ఆడాల్సి ఉంటుందని చెప్పగా.. అతడు అందుకు సంసిద్ధమైనట్లు పేర్కొన్నాడు. అయితే, అయ్యర్ అభిమానులు మాత్రం కావాలనే అయ్యర్ను తప్పించి రాహుల్ను జట్టులోకి తీసుకువచ్చారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక పాక్తో మ్యాచ్లో అదరగొట్టిన కేఎల్ రాహుల్ అజేయ సెంచరీ(111)తో రీఎంట్రీని ఘనంగా చాటాడు. మరోవైపు.. అయ్యర్ రెగ్యులర్గా బ్యాటింగ్కు వచ్చే నాలుగో స్థానంలో రాహుల్ రాగా.. ఇషాన్ కిషన్కు ఐదో నంబర్ బ్యాటర్గా స్థానం దక్కింది. అయ్యర్ ఫిట్గా ఉన్నా నో ఛాన్స్ వెస్టిండీస్ సహా ఆసియా కప్ ఆరంభ మ్యాచ్లలో అదరగొట్టిన ఈ ఓపెనర్ మిడిలార్డర్లో స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా దూసుకుపోతున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్ కావడం అతడికి మరో ప్లస్ పాయింట్. ఇదిలా ఉంటే.. సూపర్-4లో ఆఖరిదైన బంగ్లాదేశ్తో మ్యాచ్కు ముందు శ్రేయస్ అయ్యర్ ఫిట్గా ఉన్నాడని.. అతడు బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఫొటోలు బయటకు వచ్చాయి. కానీ.. బంగ్లాదేశ్తో నామమాత్రపు మ్యాచ్లోనూ అయ్యర్కు చోటు దక్కలేదు. టీ20 నయా స్టార్ తిలక్ వర్మ వన్డే ఈ మ్యాచ్ సందర్భంగా వన్డే అరంగేట్రం చేయగా.. సూర్యకుమార్ యాదవ్ ఆరోస్థానంలో బ్యాటింగ్ చేశాడు. యధావిధిగా రాహుల్ నంబర్ 4, ఇషాన్ నంబర్ 5లో బరిలోకి దిగారు. అయ్యర్ విషయంలో రిస్క్ తీసుకోరు.. కాబట్టి ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీలంకతో ఫైనల్లోనూ శ్రేయస్ అయ్యర్ను ఆడించే పరిస్థితి కనబడటం లేదు. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ స్పందిస్తూ.. అయ్యర్ విషయంలో రిస్క్ తీసుకునే బదులు మేనేజ్మెంట్ ఇషాన్ కిషన్ వైపే మొగ్గు చూపుతుందని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు.. శ్రేయస్ కోసం.. మంచి ఫామ్లో ఉన్నా ఇషాన్పై వేటు వేయకపోవచ్చని పేర్కొన్నాడు. రాహుల్ నాలుగో స్థానంలో ఆడనుండగా... ఐదో నంబర్ బ్యాటర్గా ఇషాన్కు శ్రీలంకతో ఫైనల్ జట్టులో చోటు ఖాయమేనని చెప్పుకొచ్చాడు. అయ్యో అయ్యర్.. అసలేమైంది? ఈ నేపథ్యంలో ఇంతకీ శ్రేయస్ అయ్యర్కు ఏమైంది? నిజంగానే ఫిట్నెస్ సమస్యలు ఉన్నాయా? లేదంటే ఇషాన్ కోసం అతడిని పక్కనపెడుతున్నారా? ఆసియా కప్ టోర్నీకి ముందు ఫిట్గా లేడని చెప్పిన కేఎల్ కమ్బ్యాక్ ఇవ్వగా.. అయ్యర్కు మాత్రం ఈ దుస్థితి ఏమిటో? ఇలా అయితే.. వన్డే వరల్డ్కప్లో కూడా అతడు ఆడే పరిస్థితులు లేవని నిట్టూరుస్తున్నారు. అయితే, ప్రపంచకప్ కంటే ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సందర్భంగా ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ తిరిగి సత్తా చాటుతాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైతే ఆసియా కప్-2023 ఫైనల్లో చోటు గురించి అయ్యర్ మర్చిపోవాల్సిందేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆసీస్తో సిరీస్తో సన్నాహకాలు కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుండగా.. అక్టోబరు 8న టీమిండియా తమ తొలి మ్యాచ్లో ఆసీస్ను ఢీకొట్టనుంది. అంతకంటే ముందు సొంతగడ్డపై సెప్టెంబరు 22- 27 వరకు ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. చదవండి: ఆర్సీబీ పేసర్కు లక్కీ ఛాన్స్! టీమిండియాలో చోటు.. బీసీసీఐ ప్రకటన 𝙏𝙝𝙚 𝙁𝙞𝙣𝙖𝙡 𝙁𝙧𝙤𝙣𝙩𝙞𝙚𝙧 👌 Relive #TeamIndia's journey to the #AsiaCup2023 Final ahead of today's summit clash against Sri Lanka in Colombo 🏟️#INDvSL pic.twitter.com/FSEOvqLv2M — BCCI (@BCCI) September 17, 2023 One final time before the final! 👌#TeamIndia are geared up for #INDvBAN 🙌#AsiaCup2023 pic.twitter.com/5ydNqDaoW2 — BCCI (@BCCI) September 15, 2023 -
Ind vs SL: అభిమానులకు చేదువార్త! లంకను తక్కువ అంచనా వేస్తే అంతే ఇక!
Asia Cup, 2023- India vs Sri Lanka, Final Predicted Playing XI: గతేడాది ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో సూపర్-4 దశలోనే ఇంటిబాట పట్టిన టీమిండియా వన్డే ఫార్మాట్లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ప్రపంచకప్-2023 ఆరంభానికి ముందే అంతర్జాతీయ టైటిల్ గెలిచి అభిమానులను ఖుషీ చేయాలని రోహిత్ సేన భావిస్తోంది. ఈ క్రమంలో కొలంబో వేదికగా శ్రీలంకతో ఆసియా కప్-2023 ఫైనల్కు అన్ని రకాలుగా సిద్ధమైంది. సూపర్-4లో ఆఖరిదైన బంగ్లాదేశ్తో మ్యాచ్లో ఐదు మార్పులతో బరిలోకి దిగిన భారత జట్టుకు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్తో మ్యాచ్లో చేదు అనుభవం విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్లకు విశ్రాంతినిచ్చిన మేనేజ్మెంట్.. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ కృష్ణను ఆడించారు. అయితే, వెస్టిండీస్తో టీ20లలో అదరగొట్టినప్పటికీ.. వన్డే అరంగేట్రంలో తడబడ్డాడు హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ. సూర్య కూడా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇక బుమ్రా ఉన్నాడు కాబట్టి తుదిజట్టు నుంచి మరోసారి షమీకి ఉద్వాసన తప్పదు. వాషింగ్టన్ సుందర్కు ఛాన్స్! సిరాజ్ రాకతో ప్రసిద్ తప్పుకోవాల్సిందే. కానీ బంగ్లాతో మ్యాచ్ సందర్భంగా స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ దూరం కావడంతో ఇప్పటికే వాషింగ్టన్ సుందర్ శ్రీలంకకు చేరుకున్నాడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి పేస్ ఆల్రౌండర్ శార్దూల్ను తప్పించి ఈ చెన్నై కుర్రాడిని ఆడించవచ్చు. లంక స్పిన్నర్ దూరం.. తక్కువ అంచనా వేస్తే అంతే ఇక టీమిండియా పరిస్థితి ఇలా ఉంటే.. కీలక స్పిన్నర్ మహీశ్ తీక్షణ దూరం కావడం శ్రీలంక అవకాశాలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. అయితే, యువ స్పిన్ సంచలనం దునిత్ వెల్లలగే సూపర్ఫామ్లో ఉండటం.. అతడికి తోడుగా ఆల్రౌండర్లు అసలంక, ధనంజయ డి సిల్వా రాణించడం దసున్ షనక బృందానికి సానుకూలాంశాలు. కుశాల్ మెండిస్, నిసాంక, సమరవిక్రమ బ్యాట్ ఝలిపిస్తే తిరుగే ఉండదు. ఇక స్టార్లు లేకపోయిన్పటికీ ఫైనల్ దాకా చేరుకున్న.. డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకను టీమిండియా లైట్ తీసుకునే పరిస్థితి లేదు. సూపర్-4 మ్యాచ్లోనే రోహిత్ సేనకు ఈ విషయం బాగా అర్థమైంది. టాస్ గెలిచిన జట్టు తొలుత.. ఇక కొలంబో వాతావరణం మరోసారి టీమిండియా- శ్రీలంక ఫైనల్ మ్యాచ్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుత ఆసియా కప్లో కొలంబో వేదికగా జరిగిన ఆరు మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్కు దిగిన జట్టు ఐదుసార్లు గెలవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఆసియా కప్ ఇప్పటి వరకు 15 సార్లు జరిగింది. 13 సార్లు వన్డే ఫార్మాట్లో, రెండుసార్లు టి20 ఫార్మాట్లో నిర్వహించారు. భారత్, శ్రీలంక జట్లు ఆసియా కప్ ఫైనల్స్లో ఏడుసార్లు తలపడ్డాయి. నాలుగుసార్లు భారత్, మూడుసార్లు శ్రీలంక గెలుపొందాయి. ఓవరాల్గా ఆసియా కప్ టైటిల్ను అత్యధికంగా భారత్ ఏడుసార్లు గెలవగా.. ఆరుసార్లు ట్రోఫీని సొంతం చేసుకుంది శ్రీలంక. మరి ఈసారి ఎవరిది పైచేయి కానుందో! పిచ్, వాతావరణం గత తొమ్మిది రోజుల్లో ప్రేమదాస స్టేడియంలో ఆరు మ్యాచ్లు జరిగాయి. దాంతో పిచ్ మందకొడిగా మారింది. స్పిన్నర్లకు ఎక్కువ అనుకూలంగా ఉండే అవకాశముంది. ఈ మ్యాచ్కు వర్ష సూచన ఉంది. ఆదివారం సాయంత్రం, రాత్రి వేళల్లో ఒకట్రెండుసార్లు ఉరుములతో కూడిన వర్షం పడవచ్చు. ఒకవేళ వర్షంవల్ల ఆట సాధ్యపడకపోతే రిజర్వ్ డే సోమవారం ఫైనల్ను కొనసాగిస్తారు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్/వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్. శ్రీలంక: షనక (కెప్టెన్), కుశాల్ పెరీరా, నిసాంక, కుశాల్ మెండిస్, సమరవిక్రమ, అసలంక, ధనంజయ డిసిల్వా, దునిత్ వెల్లలగే, దుషాన్ హేమంత, పతిరణ, కసున్ రజిత. చదవండి: న్యూజిలాండ్పై గెలుపు.. ఇంగ్లండ్దే సిరీస్ The big day has arrived! #India locks horns with #SriLanka in the #AsiaCup2023 final. Get ready for a cricketing spectacle! 🇮🇳🆚🇱🇰 Tune-in to #INDvSL in #AsiaCupOnStar Tomorrow | 2 PM | Star Sports Network#Cricket pic.twitter.com/R4PfMv29XR — Star Sports (@StarSportsIndia) September 16, 2023 -
Asia Cup: నిరీక్షణ ముగించాలని టీమిండియా! సమష్టిగా రాణిస్తూ శ్రీలంక
Asia Cup 2023 Final Ind VS SL: ద్వైపాక్షిక సిరీస్లు కాకుండా మూడు అంతకంటే ఎక్కువ దేశాలు పాల్గొన్న అంతర్జాతీయ టోర్నీలలో భారత జట్టు విజేతగా నిలిచి ఐదేళ్లయింది. 2018లో ఆసియా కప్ టైటిల్ సాధించాక భారత జట్టు మరో టోర్నీలో చాంపియన్గా నిలువలేదు. 2019 వన్డే ప్రపంచకప్లో, 2022 టి20 ప్రపంచకప్లో సెమీఫైనల్స్లో ఓడిన టీమిండియా... 2019, 2023 ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల చేతుల్లో ఓడిపోయి రన్నరప్గా నిలిచింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ టోర్నీ టైటిల్ నిరీక్షణ ముగించేందుకు భారత జట్టుకు ఆసియా కప్ రూపంలో మరో అవకాశం దక్కింది. స్ఫూర్తిదాయక ఆటతీరుతో ఆకట్టుకుంటున్న శ్రీలంకతో నేడు జరిగే ఫైనల్లో టీమిండియా ‘ఢీ’కొంటుంది. తుది పోరులో గెలిచి భారత జట్టు టైటిల్ నిరీక్షణకు తెరదించుతుందా లేదా మరికొన్ని నెలలు పొడిగిస్తుందా మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. కొలంబో: వర్షంతో దోబూచులాడిన ఆసియా కప్ వన్డే క్రికెట్ టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. ఆదివారం భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగే ఫైనల్తో ఈ టోర్నీకి తెరపడనుంది. వచ్చే నెలలో మొదలయ్యే వన్డే ప్రపంచకప్నకు సన్నాహకంగా భారత్, శ్రీలంక జట్లకు ఈ టోర్నీ ఉపయోగపడుతోంది. బంగ్లాదేశ్తో చివరి ‘సూపర్–4’ మ్యాచ్లో అనూహ్యంగా ఓడిపోయిన భారత జట్టు ఫైనల్ను మాత్రం తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. వాళ్లంతా వచ్చేస్తున్నారు బంగ్లాదేశ్తో మ్యాచ్లో విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, సిరాజ్, బుమ్రా ఫైనల్లో బరిలోకి దిగుతారు. అక్షర్ పటేల్ చేతి వేళ్లకు గాయం కావడంతో అతను ఫైనల్కు దూరమయ్యాడు. అక్షర్ పటేల్కు ప్రత్యామ్నాయంగా టీమ్ మేనేజ్మెంట్ స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను శనివారం కొలంబోకు రప్పించింది. బ్యాటింగ్ పరంగా భారత్ పటిష్టంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, కోహ్లి, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా మెరిస్తే భారత్ భారీ స్కోరు చేయడం ఖాయం. ఈ టోర్నీలో గిల్, కోహ్లి, రాహుల్ ఒక్కో సెంచరీ కూడా చేశారు. బౌలింగ్లోనూ భారత్ సమతూకంగా ఉంది. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, పాండ్యా పేస్తో ఆకట్టుకుంటే.. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా స్పిన్తో ప్రత్యర్థిని కట్టడి చేయగలరు. సమష్టిగా రాణిస్తూ... ఆసియా కప్లో ఆరుసార్లు చాంపియన్గా నిలిచిన శ్రీలంక ఏడో టైటిల్పై గురి పెట్టింది. భారత్ అత్యధికంగా ఏడుసార్లు ఆసియా కప్ టైటిల్ను సాధించింది. పలువురు స్టార్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోయినా ఈ టోర్నీలో శ్రీలంక స్ఫూర్తిదాయక ఆటతో ఫైనల్కు దూసుకొచ్చింది. దాసున్ షనక నాయకత్వంలో తుది పోరులోనూ అదే జోరు కొనసాగించాలని శ్రీలంక పట్టుదలతో ఉంది. బ్యాటింగ్లో కుశాల్ మెండిస్, నిసాంక, అసలంక, సమర విక్రమపై లంక ఆశలు పెట్టుకుంది. షనక, ధనంజయ డిసిల్వా, వెలలాగె ఆల్రౌండ్ పాత్రలను పోషిస్తారు. గాయం కారణంగా స్పిన్నర్ తీక్షణ ఫైనల్కు దూరమయ్యాడు. పతిరణ, కసున్ రజిత తమ పేస్తో భారత బ్యాటర్లను ఏమేరకు కట్టడి చేస్తారో చూడాలి. -
భారత్తో ఫైనల్కు లంక స్పిన్నర్ దూరం.. జట్టులోకి ఆల్రౌండర్
Asia Cup 2023- India vs Sri Lanka In Final: ఊహించినట్లుగానే టీమిండియాతో ఫైనల్కు ముందు శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. లంక స్టార్ స్పిన్నర్ మహీశ్ తీక్షణ జట్టుకు దూరమయ్యాడు. ఆసియా కప్-2023 సూపర్-4లో పాకిస్తాన్తో తాడో పేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్ సందర్భంగా తీక్షణ గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో తొడ కండరాలు పట్టేసినా బౌలింగ్ కొనసాగించి తన స్పెల్ పూర్తి చేశాడు. మెరుగైన ఎకానమీతో ఒక వికెట్ కూడా తీశాడు. అయితే, స్కానింగ్ అనంతరం గాయం తీవ్రమైనదిగా తేలినట్లు తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఆసియా కప్-2023 ఫైనల్కు అతడు దూరమైనట్లు తెలిపింది. మహీశ్ తీక్షణ స్థానంలో సహన్ అరాచిగేను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. తీక్షణను హై పర్ఫామెన్స్ సెంటర్కు పంపిస్తున్నట్లు లంక క్రికెట్ బోర్డు తెలిపింది. ఎవరీ సహన్ అరాచిగే? 27 ఏళ్ల సహన్ అరాచిగే.. బ్యాటింగ్ ఆల్రౌండర్. లెఫ్టాండ్ బ్యాటర్ అయిన అతడు.. రైట్ ఆర్మ్ ఆఫ్బ్రేక్ బౌలర్. జింబాబ్వేలో వన్డే వరల్డ్కప్-2023 క్వాలిఫయర్స్ సందర్భంగా వెస్టిండీస్తో మ్యాచ్లో లంక తరఫున అరంగేట్రం చేశాడు. ఫైనల్లో టాప్ స్కోరర్ తొలి అంతర్జాతీయ మ్యాచ్లో 5 ఓవర్లు బౌలింగ్ చేసి 18 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అయితే, అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక క్వాలిఫయర్స్ ఫైనల్లో నెదర్లాండ్స్తో మ్యాచ్లో మాత్రం అదరగొట్టాడు సహన్. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగి 57 పరుగులతో రాణించి టాప్ స్కోరర్గా నిలిచాడు. అప్పటికే వరల్డ్కప్నకు అర్హత సాధించిన శ్రీలంక టాప్-1లో నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు. చదవండి: టీమిండియాకు షాక్.. ఫైనల్కు ఆల్రౌండర్ దూరం! లంకకు యువ క్రికెటర్.. -
3 సింగిల్ డిజిట్ స్కోర్లు! అయినా నన్ను నమ్మిన సెలక్టర్లకు థాంక్స్: కెప్టెన్
Asia Cup 2023- India Vs Sri Lanka In Final: ‘‘నాయకుడిగా జట్టును ముందుకు నడిపించే సమయంలో నా బ్యాటింగ్తో కెప్టెన్సీని పోల్చుకోను. మిడిలార్డర్లో బ్యాటర్గా ఎలా ఆడాలన్న విషయం కంటే.. సారథిగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న అంశం మీదే నా దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉంటుంది. బ్యాటింగ్ ముఖ్యం కాదని నేను చెప్పను గానీ.. ఫామ్ గురించి మర్చిపోయి కెప్టెన్గా ముందుకు సాగిపోతాను. ఎందుకంటే.. డెసిషన్ మేకింగ్ సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. నాపై నమ్మకం ఉంచిన సెలక్టర్లకు థాంక్స్ నిజానికి ఫామ్లేమితో సతమతమవుతున్నా.. నాపై నమ్మకం ఉంచిన సెలక్టర్లకు ధన్యవాదాలు. అదే విధంగా నాలో ఆత్మవిశ్వాసం సడలకుండా ఎప్పుటికప్పుడు సహాయసహకారాలు అందిస్తు కోచింగ్ సిబ్బందికి కూడా థాంక్స్ చెప్పుకోవాలి. ఆటగాడిగా విఫలమవుతున్నా.. నాయకుడిగా రాణించడానికి వీరే కారణం. అందుకే వాళ్లందరికీ ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను’’ అని శ్రీలంక కెప్టెన్ దసున్ షనక అన్నాడు. బ్యాటర్గా విఫలమవుతున్నా.. తనపై విశ్వాసం ఉంచి, అండగా నిలుస్తున్న సెలక్టర్ల పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. మూడు సింగిల్ డిజిట్ స్కోర్లు కాగా ఆసియా కప్-2023లో అసాధారణ పోరాటంతో ఫైనల్కు చేరింది శ్రీలంక. సమిష్టిగా రాణిస్తూ.. సెప్టెంబరు 17న టీమిండియాతో కొలంబో వేదికగా తలపడేందుకు సిద్ధమైంది. అయితే, ఈ వన్డే టోర్నీలో ఇప్పటి వరకు కెప్టెన్ దసున్ షనక బ్యాట్ ఝులిపించకపోవడం కాస్త జట్టును కలవరపెడుతోంది. ఇప్పటి వరకు ఈ ఆల్రౌండర్ ఆరు మ్యాచ్లలో కలిపి చేసిన పరుగులు కేవలం 54. అందులో మూడు సింగిల్ డిజిట్ స్కోర్లే ఉండటం గమనార్హం. బంగ్లాదేశ్తో మ్యాచ్లో 14 నాటౌట్, అఫ్గనిస్తాన్పై 5, బంగ్లాదేశ్ మీద 24, టీమిండియాపై 9, పాకిస్తాన్పై 2 పరుగులు మాత్రమే సాధించాడు. నాయకుడిగా సూపర్ హిట్ అయితే, బ్యాటర్గా విఫలమైనా.. యువ ఆటగాళ్లతో కూడిన జట్టును విజయవంతంగా ముందుకు నడిపించడంలో మాత్రం సఫలమయ్యాడు. వన్డే వరల్డ్కప్ క్వాలిఫయర్స్ ఆడి అండర్డాగ్స్గా ఆసియా కప్ బరిలోకి దిగిన లంకను ఫైనల్కు తీసుకువచ్చాడు. ఈ నేపథ్యంలో టీమిండియాతో తుదిపోరుకు ముందు మీడియాతో మాట్లాడిన దసున్ షనక.. తన బ్యాటింగ్ వైఫల్యాల గురించి ప్రస్తావించాడు. ప్రస్తుతం ఆటగాడిగా కంటే నాయకుడిగా రాణించడం మీదే ఎక్కువగా దృష్టి సారించానని పేర్కొన్నాడు. చదవండి: అతడు అద్భుతం.. క్రెడిట్ వాళ్లకు ఇవ్వాల్సిందే.. మేం ఓడినా: రోహిత్ శర్మ WATCH: Dasun Shanaka previews Asia Cup 2023 Finals against Indiahttps://t.co/vdpKwgkdrm #AsiaCup2023 #SLvIND — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 16, 2023 -
టీమిండియాకు షాక్.. ఫైనల్కు ఆల్రౌండర్ దూరం! లంకకు యువ క్రికెటర్..
Asia Cup 2023 Final: ఆసియా కప్-2023 ఫైనల్కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గాయం కారణంగా జట్టుకు దూరమైనట్లు తెలుస్తోంది. యువ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్తో ఈ స్పిన్ ఆల్రౌండర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయించినట్లు సమాచారం. లంకకు బయల్దేరిన యువ క్రికెటర్ ఈ క్రమంలో చెన్నై ఆటగాడు సుందర్ ఇప్పటికే శ్రీలంకు బయల్దేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘అక్షర్ను గాయాలు వేధిస్తున్నాయి. చిటికిన వేలికి గాయమైంది. ముంజేయికి కూడా దెబ్బతగిలింది. వాషీని ఎయిర్పోర్టులో చూశానన్న డీకే అంతేకాదు.. తొడ కండరాలు పట్టేశాయి కూడా. అందుకే వాషింగ్టన్ను శ్రీలంకకు పిలిపిస్తున్నారు’’ అని పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే.. టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ సైతం సుందర్ ప్రయాణం గురించి హింట్ ఇచ్చాడు. ‘‘ఎయిర్పోర్టులో అనుకోకుండా.. నాకు వాషింగ్టన్ సుందర్ తారసపడ్డాడు. అతడికి ఎక్కడికి వెళ్తున్నాడో గెస్ చేయండి’’ అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్తో మ్యాచ్ తర్వాత విలేకరులతో మాట్లాడిన టీమిండియా ఓపెనర్ శుబ్మన్ గిల్.. అక్షర్ గాయాలు అంత తీవ్రమైనవి కావని పేర్కొనడం గమనార్హం. బంగ్లాదేశ్తో మ్యాచ్లో అక్షర్ పోరాటం కాగా ఆసియా కప్-2023 సూపర్-4లో ఆఖరి మ్యాచ్లో భారత జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్తో మ్యాచ్లో చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన శుక్రవారం నాటి మ్యాచ్లో అక్షర్ పటేల్ 34 బంతుల్లో 42 పరుగులతో రాణించాడు. అంతకుముందు బంగ్లా ఇన్నింగ్స్లో 9 ఓవర్ల బౌలింగ్లో 47 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇదిలా ఉంటే.. గాయాల తీవ్రత ఎక్కువైతే మాత్రం వన్డే వరల్డ్కప్-2023కి కూడా అక్షర్ పటేల్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. వన్డేల్లో సుందర్ గణాంకాలు ఇక యువ స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 16 వన్డేలు ఆడాడు. 16 వికెట్లు తీయడంతో పాటు 233 పరుగులు సాధించాడు. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్తో చివరిగా వన్డే ఆడాడు. కాగా ఆదివారం (సెప్టెంబరు 17) టీమిండియా- శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. చదవండి: అతడిని కాదని నీకు ఛాన్స్.. ‘రాక రాక’ వచ్చిన అవకాశం! ఇకనైనా మారు.. -
అతడిని కాదని నీకు ఛాన్స్.. ‘రాక రాక’ వచ్చిన అవకాశం! ఇకనైనా మారు..
Suryakumar fails again in Asia Cup match vs Bangladesh: ఆసియా కప్-2023 టోర్నీలో రాక రాక వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకోయాడు టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. బంగ్లాదేశ్తో మ్యాచ్లో 34 బంతులు ఎదుర్కొన్న ఈ ముంబై ఆటగాడు.. 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు మాత్రమే సాధించాడు. బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ బౌలింగ్లో బౌల్డ్ అయి వెనుదిరిగాడు. షాట్ సెలక్షన్లో తప్పిదంతో భారీ మూల్యం చెల్లించాడు. ఈ నేపథ్యంలో.. వన్డేల్లో సూర్య కంటే మెరుగైన రికార్డు ఉన్న సంజూ శాంసన్ను కాదని.. అతడికి అవకాశం ఇచ్చిన బీసీసీఐపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. అతడిని కాదని నీకు ఛాన్స్ సంజూను కావాలనే పక్కనపెట్టి.. ఈ టీ20 నంబర్ 1 బ్యాటర్కు ఇంకెన్ని ఛాన్స్లు ఇస్తారని.. ఇకనైనా సెలక్టర్లు కళ్లు తెరవాలని చురకలు అంటిస్తున్నారు. వన్డే వరల్డ్కప్-2023 జట్టులో సూర్యకుమార్ను ఆడిస్తే ఫలితం అనుభవించక తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. ఏడేళ్లు బెంచ్ మీదే ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ‘‘ప్రస్తుతం సూర్య మైండ్సెట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను కూడా ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్నపుడు ఏడేళ్లు బెంచ్ మీదే కూర్చున్నా. ఐపీఎల్, ఫస్ట్క్లాస్ క్రికెట్లో సూర్య స్ట్రైక్రేటు 170కి పైగా ఉంది. అయితే, వన్డేల్లో మాత్రం అతడు ఇంతవరకు తనను తాను నిరూపించుకోలేకపోయాడు. అలాంటి మైండ్సెట్ మార్చుకో సూర్య అందుకే ఎలాగైనా 50 ఓవర్ ఫార్మాట్లో రాణించి అభిమానుల నుంచి గౌరవం పొందాలనే ఒత్తిడిలో ఉన్నాడు. ఇలాంటి మైండ్సెట్ నుంచి సూర్య బయటపడాలి. విమర్శల గురించి మనం ఎంత ఎక్కువగా ఆలోచిస్తే.. మనపై ప్రతికూల ప్రభావం అంత ఎక్కువగా పడుతుంది. అభద్రతాభావం మనల్ని వెంటాడుతుంది’’ అని సూర్యకుమార్ యాదవ్కు సలహాలు ఇచ్చాడు. ప్రపంచకప్లో సూర్య తప్పక రాణిస్తాడని తాను భావిస్తున్నానని.. అయితే ఈసారి తనను పూర్తిగా నిరాశపరిచాడని పేర్కొన్నాడు. వన్డేల్లో సంజూ గణాంకాలు ఇలా కాగా ఇప్పటి వరకు టీమిండియా తరఫున 27 వన్డేల్లో సూర్య.. 24.41 సగటుతో 537 పరుగులు సాధించాడు. ఇక మిడిలార్డర్లో స్థానం కోసం ఎదురుచూస్తున్న సంజూ శాంసన్.. 13 వన్డేలాడి 55.71 సగటుతో 390 పరుగులు చేశాడు. చదవండి: SA Vs Aus: క్లాసెన్ సునామీ ఇన్నింగ్స్.. టీమిండియా ప్రపంచ రికార్డు బద్దలు -
Ind vs Ban: అరంగేట్ర బౌలర్ చేతిలో అవుట్.. రోహిత్ శర్మ చెత్త రికార్డు
Asia Cup 2023- India Vs Bangladesh: ఆసియా కప్-2023 సూపర్-4 ఆఖరి మ్యాచ్లో టీమిండియాకు అనూహ్య రీతిలో ఓటమి ఎదురైంది. పాకిస్తాన్ను ఏకంగా 228 పరుగులతో చిత్తు చేసి.. శ్రీలంకపై 41 పరుగులతో గెలుపొందిన రోహిత్ సేన బంగ్లాదేశ్ చేతిలో భంగపడింది. ఫైనల్కు ప్రాక్టీస్ అనుకున్న మ్యాచ్లో ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది. అదరగొట్టిన బంగ్లా కెప్టెన్ కొలంబోలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. షకీబ్ అల్ హసన్ బృందాన్ని బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో కెప్టెన్ షకీబ్ 80, తౌహిద్ హృదయ్ 54, నసైమ అహ్మద్ 44 పరుగులతో రాణించారు. దీంతో బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు స్కోరు చేసింది. రోహిత్ డకౌట్ అయితే, లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే ఊహించని షాకిచ్చాడు బంగ్లా అరంగేట్ర బౌలర్ తంజీమ్ హసన్ సకీబ్. రెండు బంతులు ఎదుర్కొన్న కెప్టెన్ రోహిత్ శర్మను డకౌట్గా వెనక్కి పంపాడు. ఈ రైట్ఆర్మ్ పేసర్ బౌలింగ్లో అనాముల్కు క్యాచ్ ఇచ్చి రోహిత్ పెవిలియన్ చేరాడు. గిల్ సెంచరీ, అక్షర్ ఇన్నింగ్స్ వృథా మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ 121, ఆల్రౌండర్ అక్షర్ పటేల్ 42 పరుగులతో రాణించినా.. భారత్ గెలుపునకు ఆరు పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా.. రోహిత్ శర్మ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. రోహిత్ శర్మ చెత్త రికార్డు ఆసియా వన్డే కప్ చరిత్రలో అత్యధిక సార్లు(3) డకౌట్ అయిన తొలి భారత బ్యాటర్, కెప్టెన్గా రోహిత్ నిలిచాడు. ఈ టోర్నీలో పరుగుల ఖాతా తెరవకుండానే మూడుసార్లు పెవిలియన్ చేరిన ఐదో క్రికెటర్గా చెత్త రికార్డు జాబితాలోకెక్కాడు.ఇదిలా ఉంటే.. వన్డే ఫార్మాట్లో రోహిత్ డకౌట్ కావడం ఇది ఏకంగా పదిహేనోసారి కావడం గమనార్హం. ఆసియా వన్డే కప్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన క్రికెటర్లు ►రూబెల్ హసన్(బంగ్లాదేశ్)-3 ►సల్మాన్ భట్(పాకిస్తాన్)-3 ►అమీనుల్ ఇస్లాం(బంగ్లాదేశ్)-3 ►మహేళ జయవర్ధనే(శ్రీలంక)-3 ►రోహిత్ శర్మ(ఇండియా)-3. చదవండి: అతడు అద్భుతం.. క్రెడిట్ వాళ్లకు ఇవ్వాల్సిందే.. మేం ఓడినా: రోహిత్ శర్మ Super11 Asia Cup 2023 | Super 4 | India vs Bangladesh | Highlightshttps://t.co/hEYw3GY8qd#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 15, 2023 -
అతడు అద్భుతం.. క్రెడిట్ వాళ్లకు ఇవ్వాల్సిందే.. మేం ఓడినా: రోహిత్ శర్మ
Asia Cup 2023- Ind Vs Ban: Rohit Sharma Comments On Loss: ‘‘భవిష్యత్తు మ్యాచ్లు.. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అందరు ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని భావించాం. అందుకే బంగ్లాదేశ్తో మ్యాచ్లో మార్పుల విషయంలో కాంప్రమైజ్ కాలేదు. వరల్డ్కప్ ఆడాల్సిన కొంతమంది ఆటగాళ్లను పరీక్షించేందుకు జట్టులోకి తీసుకున్నాం. అక్షర్ పటేల్ అద్భుతం ఈరోజు అక్షర్ పటేల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కానీ దురదృష్టవశాత్తూ లక్ష్యం పూర్తి చేయలేకపోయాడు. అయితే, ఆఖరి వరకు అతడు పట్టుదలగా పోరాడిన తీరు అద్భుతం’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆల్రౌండర్ అక్షర్ పటేల్(34 బంతుల్లో 42 పరుగులు)ను ప్రశంసించాడు. బంగ్లాదేశ్ చేతిలో భంగపాటు అదే విధంగా.. బంగ్లాదేశ్ విజయంలో ఆ జట్టు బౌలర్లదే కీలక పాత్ర అన్న రోహిత్... వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందేనని పేర్కొన్నాడు. కాగా ఆసియా కప్-2023 ఫైనల్లో బెర్తు ఖరారు చేసుకున్న తర్వాత సూపర్-4లో బంగ్లాదేశ్తో జరిగిన నామమాత్రపు మ్యాచ్లో భారత జట్టు ఓటమిపాలైన విషయం తెలిసిందే. స్టార్లు లేకుండా బరిలోకి దిగి ప్రాధాన్యం లేని మ్యాచ్ కావడంతో ఏకంగా ఐదు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా అనూహ్య రీతిలో బంగ్లా చేతిలో ఓడి పరాభవం మూటగట్టుకుంది. విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్లతో పాటు మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ లాంటి కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చి.. షకీబ్ బృందం చేతిలో భంగపాటుకు గురైంది. అందుకే వాళ్లకు అవకాశాలు కాగా బంగ్లాతో మ్యాచ్లో హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ(5) వన్డే అరంగేట్రం చేయగా.. సూర్యకుమార్ యాదవ్(26) కూడా చోటు దక్కించుకున్నాడు. అదే విధంగా.. మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ కృష్ణ జట్టులోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన కెప్టెన్ రోహిత్ శర్మ.. వన్డే వరల్డ్కప్-2023కు ముందు ఆటగాళ్ల సన్నద్ధతను పరీక్షించేందుకే ఈ మ్యాచ్లో వీరికి అవకాశం ఇచ్చినట్లు తెలిపాడు. రాజీపడేది లేదు ఆటలో గెలుపోటములు సహజమని.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం పట్ల పశ్చాత్తాపం లేదని పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్లో శతకం(121)తో ఆకట్టుకున్న శుబ్మన్ గిల్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘గిల్ అద్బుతం సెంచరీతో ఆకట్టుకున్నాడు. గిల్ ఫామ్లో ఉన్నాడు.. సెంచరీతో అతడి నుంచి మేము ఏం కోరుకుంటున్నామో అదే చేసి చూపించాడు. జట్టు కోసం ఏమేం చేయాలో అంతా చేశాడు. గతేడాది కాలంగా గిల్ మంచి ఫామ్లో ఉన్నాడు. కొత్త బంతితో బౌలర్లు అటాక్ చేసినపుడు కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. హార్డ్వర్క్తో ఎప్పటికప్పుడు తనని తాను నిరూపించుకుంటున్నాడు’’ అని రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. కాగా ఈ మ్యాచ్లో రోహిత్ డకౌట్ అయ్యాడు. భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ స్కోర్లు: టాస్: టీమిండియా.. బౌలింగ్ బంగ్లా స్కోరు: 265/8 (50) టీమిండియా స్కోరు: 259 (49.5) విజేత: 6 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షకీబ్ అల్ హసన్(80 పరుగులు సహా.. 10 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి ఒక వికెట్). చదవండి: క్లాసెన్ మహోగ్రరూపం.. క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని విధ్వంసం Super11 Asia Cup 2023 | Super 4 | India vs Bangladesh | Highlightshttps://t.co/hEYw3GY8qd#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 15, 2023 -
Ind Vs Ban: భారత్కు బంగ్లా షాక్.. టీమిండియాకు తప్పని ఓటమి
కొలంబో: ఆసియా కప్లో అనూహ్య ఫలితం... ‘సూపర్–4’ దశలో రెండు ఘన విజయాలతో ముందే ఫైనల్ స్థానం ఖాయం చేసుకున్న భారత్కు చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి ఎదురైంది. ప్రాధాన్యత లేని మ్యాచ్లో ముగ్గురు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి బరిలోకి దిగిన టీమిండియా చివరకు ఓటమి పక్షాన నిలిచింది. అయితే ఈ గెలుపు బంగ్లాదేశ్ ప్రదర్శనను తక్కువ చేసేది కాదు. ముందే ఫైనల్ రేసు నుంచి నిష్కమించినా చివరి వరకు స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చిన ఆ జట్టు చెప్పుకోదగ్గ విజయంతో స్వదేశానికి వెళ్లనుంది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ 6 పరుగుల తేడాతో భారత్పై గెలిచింది. ఆసియా కప్లో గతంలో ఒకే ఒకసారి భారత్ను (2012)ఓడించిన బంగ్లాకు ఇది రెండో విజయం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (85 బంతుల్లో 80; 6 ఫోర్లు, 3 సిక్స్లు), తౌహీద్ హృదయ్ (81 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్స్లు), నసుమ్ అహ్మద్ (45 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. 49 పరుగులకే జట్టు 4 వికెట్లు కోల్పోగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షకీబ్, తౌహీద్ ఐదో వికెట్కు 101 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లలో శార్దుల్ 3, షమీ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 49.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది. శుబ్మన్ గిల్ (133 బంతుల్లో 121; 8 ఫోర్లు, 5 సిక్స్లు) కెరీర్లో ఐదో సెంచరీతో చెలరేగాడు. ప్రతికూల పరిస్థితుల్లో స్పిన్కు బాగా అనుకూలిస్తున్న పిచ్పై అతను పట్టుదల కనబర్చి నిలబడ్డాడు. అయితే ఇతర బ్యాటర్ల వైఫల్యంతో జట్టుకు ఓటమి తప్పలేదు. చివర్లో అక్షర్ పటేల్ (34 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్స్లు) పోరాడినా లాభం లేకపోయింది. ముస్తఫిజుర్ 3 వికెట్లు తీయగా... అరంగేట్ర బౌలర్ తన్జీమ్, మెహదీ హసన్ చెరో 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ఆదివారం జరిగే ఫైనల్లో శ్రీలంకతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్తో హైదరాబాదీ ఎడంచేతి వాటం బ్యాటర్ తిలక్ వర్మ వన్డేల్లోకి అడుగు పెట్టాడు. భారత్ తరఫున వన్డేలు ఆడిన 252వ ఆటగాడిగా తిలక్ నిలిచాడు. ఈ మ్యాచ్కు ముందే తిలక్ 7 టి20ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తన్జీద్ (బి) శార్దుల్ 13; లిటన్ దాస్ (బి) షమీ 0; అనాముల్ (సి) రాహుల్ (బి) శార్దుల్ 4; షకీబ్ (బి) శార్దుల్ 80; మిరాజ్ (సి) రోహిత్ (బి) అక్షర్ 13; తౌహీద్ (సి) తిలక్ (బి) షమీ 54; షమీమ్ (ఎల్బీ) (బి) జడేజా 1; నసుమ్ (బి) ప్రసిధ్ 44; మెహదీ హసన్ (నాటౌట్) 29; తన్జీమ్ (నాటౌట్) 14; ఎక్స్ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 265. వికెట్ల పతనం: 1–13, 2–15, 3–28, 4–59, 5–160, 6–161, 7–193, 8–238. బౌలింగ్: షమీ 8–1–32–2, శార్దుల్ 10–0–65–3, ప్రసిధ్ 9–0–43–1, అక్షర్ పటేల్ 9–0–47–1, తిలక్ 4–0–21–0, జడేజా 10–1–53–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) అనాముల్ (బి) తన్జీమ్ 0; గిల్ (సి) తౌహీద్ (బి) మెహదీ 121; తిలక్ (బి) తన్జీమ్ 5; కేఎల్ రాహుల్ (సి) షమీమ్ (బి) మెహదీ 19; ఇషాన్ కిషన్ (ఎల్బీ) (బి) మిరాజ్ 5; సూర్యకుమార్ (బి) షకీబ్ 26; జడేజా (బి) ముస్తఫిజుర్ 7; అక్షర్ (సి) తన్జీద్ (బి) ముస్తఫిజుర్ 42; శార్దుల్ (సి) మిరాజ్ (బి) ముస్తఫిజుర్ 11; షమీ (రనౌట్) 6; ప్రసిధ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 17; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 259. వికెట్ల పతనం: 1–2, 2–17, 3–74, 4–94, 5–139, 6–170, 7–209, 8–249, 9–254, 10–259. బౌలింగ్: తన్జీమ్ 7.5–1–32–2, ముస్తఫిజుర్ 8–0–50–3, నసుమ్ 10–0–50–0, షకీబ్ 10–2–43–1, మెహదీ హసన్ 9–1–50–2, మిరాజ్ 5–0–29–1. -
Asia Cup 2023: భారత బౌలర్ల వైఫల్యం.. బంగ్లాదేశ్ భారీ స్కోర్
ఆసియా కప్-2023లో భాగంగా కొలొంబో వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్ 15) జరుగుతున్న చివరి సూపర్-4 మ్యాచ్లో బంగ్లాదేశ్ ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి బంగ్లాదేశ్ను బ్యాటింగ్కు ఆహ్వానించిన భారత్.. తొలుత బంగ్లా బ్యాటర్లను గడగడలాడించింది. భారత బౌలర్ల ధాటికి ఓ దశలో బంగ్లాదేశ్ 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బంగ్లా బ్యాటర్లు నిర్ణీత 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేశారు. కష్టాల్లో ఉన్న బంగ్లాదేశ్ను తొలుత ఆ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (80) ఆదుకోగా.. ఆతర్వాత తౌహిద్ హ్రిదోయ్ (54) తనవంతు సహకారాన్ని అందించాడు. అయితే షకీబ్, తౌహిద్ స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో బంగ్లాదేశ్ మళ్లీ కష్టాల్లో పడింది. ఈ దశలో నసుమ్ అహ్మద్ (44), మెహిది హసన్ (29 నాటౌట్) మెరుపులు మెరిపించి, బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేసేందుకు తోడ్పడ్డారు. 34.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులుగా ఉన్న బంగ్లా స్కోర్.. ఆ తర్వాత 15.5 ఓవర్లలో ఏకంగా 104 పరుగులు జోడించి, 265 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆఖర్లో బంగ్లా బ్యాటర్లు చెలరేగి ఆడగా.. భారత బౌలర్లు తేలిపోయారు. ఆఖర్లో భారత బౌలింగ్లో లోపాలు స్పష్టంగా కనిపించాయి. శార్దూల్ వికెట్లు తీసినా (3/65) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఆఖర్లో ప్రసిద్ధ్ కృష్ణ (9-0-47-1) కూడా విచ్చలవిడిగా పరుగులు ఇచ్చాడు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా (1/53), అక్షర్ పటేల్ (1/47) చెరో వికెట్ పడగొట్టినా పరుగులు సమర్పించకున్నారు. మొత్తంగా పసికూనలను కంట్రోల్ చేయడంతో భారత బౌలర్లు విఫలమయ్యారు. ఇక్కడ ఏమాత్రం అటుఇటు అయినా ఫలితంగా తారుమారయ్యే ప్రమాదం కూడా ఉంది. -
IND VS BAN: అరుదైన ఘనత సాధించిన రవీంద్ర జడేజా
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో 200 వికెట్లతో పాటు 2000 పరుగులు సాధించిన 14వ ప్లేయర్గా, వన్డేల్లో భారత్ తరఫున కపిల్ (3783 పరుగులు, 253 వికెట్లు) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా, భారత్ తరఫున వన్డేల్లో 200 వికెట్ల మార్కును అందుకున్న ఏడో బౌలర్గా (337 వన్డే వికెట్లతో కుంబ్లే అగ్రస్థానంలో ఉన్నాడు) రికార్డుల్లోకెక్కాడు. The moment when Jadeja completed 200 wickets in ODIs.- A historic moment....!!!!!!!pic.twitter.com/uv4ulOrYpk— Johns. (@CricCrazyJohns) September 15, 2023 ఆసియా కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్తో ఇవాళ (సెప్టెంబర్ 15) జరుగుతున్న మ్యాచ్లో షమీమ్ హొస్సేన్ వికెట్ పడగొట్టడం ద్వారా జడ్డూ వన్డేల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. కెరీర్లో 182వ వన్డే ఆడుతున్న జడ్డూ.. 200 వికెట్లతో పాటు 2578 పరుగులు చేశాడు. కాగా, కొలొంబో వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా పట్టుబిగించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి భారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్.. 45 ఓవర్ల తర్వాత 7 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. షకీబ్ (80), తౌహిద్ హ్రిదోయ్ (54) అర్ధసెంచరీలతో రాణించగా.. తంజిద్ హసన్ (13), లిటన్ దాస్ (0), అనాముల్ హాక్ (4), మెహిది హసన్ (13), షమీమ్ హొస్సేన్ (1) విఫలమయ్యారు. నసుమ్ అహ్మద్ (35), మెహిది హసన్ (13) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టగా.. షమీ 2, అక్షర్, జడేజా తలో వికెట్ దక్కించుకున్నారు. -
Asia Cup 2023: బంగ్లాదేశ్తో మ్యాచ్.. హిట్మ్యాన్ డబుల్ సెంచరీ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు సాధించాడు. ఆసియా కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్తో ఇవాళ (సెప్టెంబర్ 15) జరుగుతున్న మ్యాచ్లో మెహిది హసన్ మీరజ్ క్యాచ్ (వన్డేల్లో 91వ క్యాచ్) పట్టడం ద్వారా, హిట్మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లు) 200 క్యాచ్ల మార్కును అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్కు ముందు 34 మంది ఈ ఘనత సాధించారు. 449 మ్యాచ్ల్లో హిట్మ్యాన్ 200 క్యాచ్లు ఆందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక క్యాచ్లు (వికెట్కీపర్ కాకుండా) అందుకున్న రికార్డు లంక దిగ్గజం మహేళ జయవర్ధనే పేరిట ఉంది. జయవర్ధనే 652 మ్యాచ్ల్లో మొత్తం 440 క్యాచ్లు అందుకున్నాడు. ఈ జాబితాలో రోహిత్కు ముందు రాహుల్ ద్రవిడ్ (334), విరాట్ కోహ్లి (303), అజహారుద్దీన్ (261), టెండూల్కర్ (256) లాంటి భారత ఆటగాళ్లు ఉన్నారు. ఇదిలా ఉంటే, కొలొంబో వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా పట్టుబిగించింది.ఈ మ్యాచ్లో టాస్ ఓడి భారత్ ఆహ్వనం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్.. 34 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. షకీబ్ 80 పరుగులు చేసి బంగ్లాదేశ్ను ఆదుకున్నాడు. షకీబ్, తంజిద్ హసన్ (13), లిటన్ దాస్ (0), అనాముల్ హాక్ (4), మెహిది హసన్ (13) ఔట్ కాగా.. తౌహిద్ హ్రిదోయ్ (40), షమీమ్ హొస్సేన్ క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టగా.. షమీ, అక్షర్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
Rohit: అందుకే కోహ్లితో పాటు వాళ్లంతా అవుట్! అయ్యర్కు నో ఛాన్స్
Asia Cup, 2023 - India vs Bangladesh- India Playing XI: ఆసియా కప్-2023 సూపర్-4లో బంగ్లాదేశ్తో మ్యాచ్లో టీమిండియా ఏకంగా ఐదు మార్పులతో బరిలోకి దిగింది. ఊహించినట్లుగానే నామమాత్రపు మ్యాచ్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి విశ్రాంతినిచ్చింది మేనేజ్మెంట్. అదే విధంగా పనిభారం తగ్గించే క్రమంలో.. గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను బెంచ్కే పరిమితం చేసింది. శ్రీలంకతో ఫైనల్కు ముందు ఈ ఇద్దరు కీలక ఆటగాళ్లతో పాటు వైస్ కెప్టెన్, పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సహా పేసర్ మహ్మద్ సిరాజ్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్లకు కూడా రెస్ట్ ఇచ్చారు. అయ్యర్కు నో ఛాన్స్ ఈ నేపథ్యంలో హైదరాబాదీ యువ సంచలనం తిలక్ వర్మ వన్డే అరంగేట్రం చేయగా.. ఈ వన్డే టోర్నీ ఆరంభం నుంచి బెంచ్కే పరిమితమైన సూర్యకుమార్ యాదవ్ తొలిసారి తుదిజట్టులోకి వచ్చాడు. అదే విధంగా శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ప్రసిద్ కృష్ణ కూడా బంగ్లాదేశ్తో మ్యాచ్లో ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఫిట్నెస్ సాధించి ప్రాక్టీస్ చేసిన శ్రేయస్ అయ్యర్కు మాత్రం జట్టులో చోటు దక్కలేదు. దీంతో అతడికి మళ్లీ వెన్నునొప్పి తిరగబెట్టిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే కోహ్లితో పాటు వాళ్లంతా అవుట్: రోహిత్ శర్మ ఇక కొలంబోని ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు ఈ టోర్నీలో పూర్తిస్థాయిలో ఫీల్డింగ్ చేయలేదు. కాబట్టి ఈసారి తొలుత బౌలింగ్ చేస్తాం. లైట్ల వెలుతురులో బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. ఈ పిచ్ను చక్కగా వినియోగించుకున్న వాళ్లందరికీ సహకరిస్తోంది. పేసర్లు, స్పిన్నర్లూ రాణించగలుగుతున్నారు. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్లో ఆడని యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. అందుకే ఐదు మార్పులు చేశాం. విరాట్, హార్దిక్, సిరాజ్, బుమ్రా, కుల్దీప్లను తప్పించాం. తిలక్ అరంగేట్రం చేస్తున్నాడు. షమీ, ప్రసిద్ జట్టులోకి వచ్చారు. సూర్యకుమార్ను కూడా ఆడిస్తున్నాం’’ అని పేర్కొన్నాడు. ఫైనల్లో శ్రీలంకతో పోటీపడనున్న టీమిండియా కాగా సూపర్-4లో పాకిస్తాన్, శ్రీలంకపై విజయాలు సాధించిన భారత జట్టు ఇప్పటికే ఫైనల్కు చేరుకున్న విషయం తెలిసిందే. ఇక పాకిస్తాన్తో గురువారం నాటి మ్యాచ్లో గెలుపొందిన శ్రీలంక కూడా తుదిపోరుకు అర్హత సాధించింది. టీమిండియా- శ్రీలంక మధ్య సెప్టెంబరు 17న కొలంబో వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్తో నామమాత్రపు మ్యాచ్లో బీసీసీఐ ఈ మేరకు మార్పులు చేయడం గమనార్హం. బంగ్లాదేశ్తో మ్యాచ్కు టీమిండియా రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ప్రసిద్ కృష్ణ. చదవండి: చివరి బంతి వరకు పోరాడినా ఫలితం లేదు.. ఏడ్చేసిన బాబర్!? వైరల్ -
Ind vs Ban: పసికూనపై భారత్ ఘోర పరాజయం..గిల్ సెంచరీ వృధా..
Asia Cup, 2023- India Vs Bangladesh Updates: ఆసియా కప్లో భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన సూపర్ ఫొర్ దశలోని చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు భారత్ పై 6 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో తడబడిన భారత జట్టు 259 పరుగులకే ఆలౌటై 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తడబడిన టెయిలెండర్లు.. అక్షర్ పటేల్ శార్దూల్ ఠాకూర్ ఎనిమిదో వికెట్కు 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి గెలుపుపై ఆశలు రేకెత్తించారు. అంతలోనే ఒకరి తర్వాత ఒకరు బంగ్లా బౌలర్లకు దాసోహం అంటూ కేవలం 10 పరుగుల వ్యవధిలో మిగిలిన మూడు వికెట్లనూ కోల్పోయారు. తొమ్మిదో వికెట్ కూడా కోల్పోయిన భారత్.. అక్షర్ పటేల్ 34 బంతుల్లో 42 పరుగులు చేసి అవుటయ్యాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత జట్టు లక్ష్యానికి చేరువైన దశలో శార్ధూల్ ఠాకూర్(11) ముస్తఫిజుర్ రహ్మాన్ బౌలింగ్లో మెహదీ హసన్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. శుభ్మన్ గిల్ ఔట్.. ఏడో వికెట్ కోల్పోయిన భారత్.. సెంచరీ సాధించి మంచి ఊపు మీదున్న గిల్ భారత జట్టును సురక్షితంగా గమ్యానికి చేరుస్తాడని భావిస్తున్నంతలో మహెడీ భారత జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. మహెడీ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడిన గిల్ లాంగాఫ్ వైపుగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి హ్రిదోయ్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గిల్ మొత్తం 133 బంతులను ఎదుర్కొని 90.98 స్ట్రైక్ రేటుతో 121 పరుగులు చేశాడు. జడేజా క్లీన్బౌల్డ్.. గిల్ సెంచరీ ముస్తాఫిజుర్ బౌలింగ్లో రవీంద్ర జడేజా (7) క్లీన్బౌల్డయ్యాడు. మరోవైపు గిల్ 117 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. 38.3 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 174/6గా ఉంది. గిల్కు జతగా అక్షర్ క్రీజ్లో ఉన్నాడు. సూర్యకుమార్ ఔట్.. ఐదో వికెట్ కోల్పోయిన భారత్ షకీబ్ అల్ హసన్ బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్ (26) క్లీన్బౌల్డ్ అయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్ 94 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. మెహిది హసన్ బౌలింగ్లో ఇషాన్కిషన్ (5) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. గిల్ (57), సూర్యకుమార్ యాదవ్ క్రీజ్లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన భారత్.. కేఎల్ రాహుల్ ఔట్ 74 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. మెహిది హసన్ బౌలింగ్లో షమీమ్కు క్యాచ్ ఇచ్చి కేఎల్ రాహుల్ (19) ఔటయ్యాడు. 42 పరుగులతో గిల్ క్రీజ్లో ఉన్నాడు. టార్గెట్ 266.. 13 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 64/2 ఆదిలోనే 2 వికెట్లు కోల్పోయిన భారత్.. ఆతర్వాత ఆచితూచి ఆడుతుంది. గిల్ (36), కేఎల్ రాహుల్ (15) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. 13 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 64/2. టార్గెట్ 266.. రెండో వికెట్ కోల్పోయిన భారత్ 266 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ రెండో బంతికే రోహిత్ శర్మను (0) ఔట్ చేసిన తంజిమ్.. మూడో ఓవర్లో అరంగేట్రం ఆటగాడు తిలక్ వర్మను (5) క్లీన్ బౌల్డ్ చేశాడు. టార్గెట్ 266.. రోహిత్ శర్మ డకౌట్ 266 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ ఇన్నింగ్స్ రెండో బంతికే రోహిత్ శర్మ (0) వికెట్ కోల్పోయింది. తంజిమ్ బౌలింగ్లో అనాముల్కు క్యాచ్ ఇచ్చి రోహిత్ డకౌటయ్యాడు. 50 ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోర్ 265/8 టాస్ ఓడి భారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. కెప్టెన్ షకీబ్ (80), తౌహిద్ హ్రిదోయ్ (54) అర్ధ సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో నసుమ్ అహ్మద్ (44), మెహిది హసన్ (29 నాటౌట్) బంగ్లాదేశ్ ఓ మోస్తరు స్కోర్ చేసేందుకు తోడ్పడ్డారు. బంగ్లా ఇన్నింగ్స్లో తంజిద్ హసన్ (13), లిటన్ దాస్ (0), అనాముల్ హాక్ (4), మెహిది హసన్ (13), షమీమ్ హొస్సేన్ (1) విఫలమయ్యారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టగా.. షమీ 2, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ దక్కించుకున్నారు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ 238 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో నసుమ్ అహ్మద్ (44) క్లీన్ బౌల్డయ్యాడు. ఏడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ 193 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఏడో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్లో తిలక్వర్మకు క్యాచ్ ఇచ్చి తౌహిద్ హ్రిదోయ్ (54) ఔటయ్యాడు. నసుమ్ అహ్మద్ (18), మెహిది హసన్ (0) క్రీజ్లో ఉన్నారు. ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ 161 పరుగుల వద్ద (34.1 ఓవర్) బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. జడేజా.. షమీమ్ హొస్సేన్ను (1) ఎల్బీడబ్ల్యూ చేశాడు. జడేజాకు ఇది వన్డేల్లో 200వ వికెట్. ఐదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్. షకీబ్ (80) ఔట్ 160 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఐదో వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో షకీబ్ అల్ హసన్ (80) క్లీన్ బౌల్డయ్యాడు. 33.1 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 160/5. తౌహిద్ హ్రిదోయ్ (40), షమీమ్ హొస్సేన్ క్రీజ్లో ఉన్నారు. 26 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 124/4 26 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 124/4గా ఉంది. షకీబ్ అల్ హసన్ (60), తౌహిద్ హ్రిదోయ్ (25) క్రీజ్లో ఉన్నారు. 5.4: మూడో వికెట్ కోల్పోయిన బంగ్లా టీమిండియా పేసర్ శార్దూల్ ఠాకూర్ మరోసారి మెరిశాడు. ఓపెనర్ తాంజిద్ హసన్తో పాటు వన్డౌన్ బ్యాటర్ అనాముల్ హక్(4) వికెట్ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. 3.1: రెండో వికెట్ డౌన్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో తాంజిద్ హసన్(13) అవుట్. అనాముల్ హక్, షకీబల్ హసన్ క్రీజులో ఉన్నారు. మూడో ఓవర్ ముగిసే సరికి బంగ్లా స్కోరు: 20/2 2.1: తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ షమీ బౌలింగ్లో బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ బౌల్డ్. డకౌట్గా వెనుదిరిగిన లిటన్ దాస్. తిలక్ వర్మ అరంగేట్రం ఇప్పటికే ఆసియా కప్-2023 ఫైనల్లో అడుగుపెట్టిన టీమిండియా.. బంగ్లాదేశ్తో నామమాత్రపు మ్యాచ్కు సిద్ధమైంది. శ్రీలంకతో తుది పోరుకు ముందు సన్నాహకంగా సాగనున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. వాళ్లందరికీ విశ్రాంతి ఇక బంగ్లాతో మ్యాచ్ సందర్భంగా హైదరాబాదీ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ అంతర్జాతీయ వన్డేల్లో అడుగుపెట్టాడు. కాగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సహా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్లకు విశ్రాంతినిచ్చినట్లు రోహిత్ వెల్లడించాడు. వీరి స్థానాల్లో తిలక్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ప్రసిద్ కృష్ణ, సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ తరఫున తంజీమ్ హసన్ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. తుది జట్లు ఇవే టీమిండియా రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ప్రసిద్ కృష్ణ. బంగ్లాదేశ్ లిటన్ దాస్(వికెట్ కీపర్), తాంజిద్ హసన్, అనముల్ హక్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), తౌహిద్ హ్రిదోయ్, షమీమ్ హుస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, మెహది హసన్, నసూమ్ అహ్మద్, తన్జిమ్ హసన్ సకీబ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్. చదవండి: Ind vs SL: టీమిండియాతో ఫైనల్కు ముందు శ్రీలంకకు ఎదురుదెబ్బ -
చివరి బంతి వరకు పోరాడినా ఫలితం లేదు.. ఏడ్చేసిన బాబర్!? వైరల్
Asia Cup 2023- Sri Lanka Eliminate Pakistan: వరుసగా రెండోసారి ఆసియా కప్ ఫైనల్ చేరాలన్న పాకిస్తాన్ ఆశలపై శ్రీలంక నీళ్లు చల్లింది. గతేడాది టీ20 ఫార్మాట్లో నిర్వహించిన టోర్నీలో పాక్ను ఓడించి చాంపియన్గా నిలిచిన దసున్ షనక సేన.. ఈసారి ఆ జట్టును కనీసం ఫైనల్ కూడా చేరవనివ్వలేదు. సొంతగడ్డపై ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగి.. కొలంబోలో బాబర్ ఆజం బృందంపై పైచేయి సాధించింది. టీమిండియాతో పాటు తుదిపోరుకు అర్హత సాధించింది. అఫ్గన్ను క్లీన్స్వీప్ చేసిన జోష్లో మొత్తంగా 12 సార్లు(11 వన్డే, ఒక టీ20) ఫైనల్ చేరి చరిత్ర సృష్టించింది. కాగా ఈ వన్డే టోర్నీ ఆరంభానికి ముందు శ్రీలంక వేదికగా పాకిస్తాన్ అఫ్గనిస్తాన్తో మూడు మ్యాచ్ల సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. ఆసియా కప్ సన్నాహకాల్లో భాగంగా జరిగిన ఈ సిరీస్లో అఫ్గన్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది పాకిస్తాన్. నేపాల్పై ఘన విజయం.. భారత్ చేతిలో ఘోర పరాభవం ఇక ముల్తాన్ వేదికగా ఈవెంట్ ఆరంభ మ్యాచ్లో నేపాల్పై ఏకంగా 238 పరుగులతో గెలుపొంది అన్ని శుభసూచకాలే అని మురిసిపోయింది. అయితే, లీగ్ దశలో టీమిండియాతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం.. సూపర్-4లో బంగ్లాదేశ్పై గెలిచినా.. భారత జట్టులో చేతిలో భారీ ఓటమి పాక్ అవకాశాలను సంక్లిష్టం చేసింది. కీలక ఆటగాళ్లు దూరమైనా ఆఖరి వరకు ఈ క్రమంలో ఫైనల్ చేరాలంటే శ్రీలంకతో తాడోపేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో శక్తిమేర ప్రయత్నించింది. కీలక పేసర్లు హ్యారిస్ రవూఫ్, నసీం షా జట్టుకు దూరమైనా.. ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్ను తీసుకురాగలిగింది. ప్చ్.. ఎంతగా పోరాడినా ఫలితం లేదు అయితే, వరణుడి కారణంగా 42 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో.. 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. లంక ఆల్రౌండర్ చరిత్ అసలంక ఏమాత్రం తడ‘బ్యా’టుకు లోనుకాలేదు. గెలవాలంటే ఆఖరి బంతికి రెండు పరుగులు రాబట్టాల్సిన తరుణంలో సరిగ్గా 2 రన్స్ తీసి లంకను ఫైనల్కు తీసుకెళ్లాడు. దీంతో పాకిస్తాన్ ఆటగాళ్ల హృదయాలు ముక్కలయ్యాయి. ఐసీసీ వన్డే నంబర్ 1 బ్యాటర్, పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోవడంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ నేపథ్యంలో అతడు కన్నీటి పర్యంతమైనట్లుగా ఉన్న ఫొటో, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. బాబర్కు ఇది అలవాటే! బాబర్ ఆజం సారథ్యంలో పాకిస్తాన్ టీ20 వరల్డ్కప్-2021లో సెమీస్లోనే ఇంటిబాట పట్టింది. గతేడాది ఆసియా కప్లో రన్నరప్గా నిలిచింది. అదే విధంగా టీ20 ప్రపంచకప్లో ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. ఈసారి సూపర్-4 దశలోనే ఆసియా కప్ ప్రయాణాన్ని ముగించింది. దీంతో కీలక టోర్నీల్లో బాబర్ జట్టును గెలిపించలేడనే అపవాదు మూటగట్టుకుంటున్నాడు. చదవండి: మరీ చెత్తగా.. అందుకే ఓడిపోయాం.. వాళ్లిద్దరు అద్భుతం: బాబర్ ఆజం I have seen Babar Azam cry for the first time.💔😢 Don't be sad, @babarazam258. You're the No 1 team and No 1 Batsman in the world...... Always #BehindYouSkipper#PAKvsSL #captaincy #PakistanCricket pic.twitter.com/a91w5oQgj9 — King 👑Babar Azam 56❤️ (@fizza258) September 14, 2023 Look at the reaction of babar azam after last ball 😭💔#AsiaCup2023 pic.twitter.com/cate2stPgp — Shehzad Ahmad (@CEShehzad123) September 14, 2023 Babar Azam in Asia cup 2023 without Nepal inning. Matches: 3 Runs : 56 Average : 18.6 Strike rate : 35 And believe me guys he is no.1 ranked ICC ODI batter. Even Akash Chopra is better than him.#PakistanCricket #BabarAzam pic.twitter.com/Y9ge2bb6D2 — Kohlified. (@123perthclassic) September 14, 2023 You can see how hard Babar Azam is trying to hold back his tears 💔#PAKvSL | #PAKvsSL #SLvsPak #SLvPAK #PakvsSri #AsiaCup2023 #AsiaCup23 #AsiaCup #PakistanCricket #colomboweather #Cricket #CricketTwitter #Pakistan #PakistanCricket #PakistanZindabad pic.twitter.com/Vkvpvx5jnh — Babar Adeel Hussain (@AdeelHuss1) September 14, 2023 -
Ind vs SL: టీమిండియాతో ఫైనల్కు ముందు శ్రీలంకకు ఎదురుదెబ్బ
Asia Cup 2023- Sri Lanka To Face India In Final: ఆసియా కప్-2023 ఫైనల్లో అడుగుపెట్టిన శ్రీలంకకు పెద్ద ఎదురుదెబ్బ. ఆ జట్టు కీలక స్పిన్నర్ మహీశ్ తీక్షణ గాయం తీవ్రతరమైనట్లు సమాచారం. తొడ కండరాలు పట్టేయడంతో అతడు నొప్పితో బాధపడుతున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు గురువారం రాత్రి వెల్లడించింది. స్కానింగ్ కోసం శుక్రవారం అతడిని ఆస్పత్రికి తరలించనున్నట్లు తెలిపింది. కాగా తుదిపోరుకు అర్హత సాధించాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో శ్రీలంక అద్భుత విజయం సాధించింది. కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో సూపర్-4 మ్యాచ్లో గురువారం పాకిస్తాన్తో తలపడింది శ్రీలంక. పట్టుదలతో ఫైనల్లోకి శ్రీలంక వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన వన్డే మ్యాచ్లో అసాధారణ పోరాటంతో 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన హొరాహోరీ పోరులో పట్టుదలగా పోరాడి ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ సందర్భంగానే లంక యువ స్పిన్నర్ మహీశ్ తీక్షణకు గాయమైంది. నొప్పి ఉన్న బౌలింగ్ చేసి ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కుడి తొడ కండరాలు పట్టేశాయి. అయినప్పటికీ తన స్పెల్ పూర్తి చేశాడీ రైట్ఆర్మ్ బౌలర్. పాక్ ఇన్నింగ్స్లో తొమ్మిది ఓవర్ల బౌలింగ్లో 42 పరుగులు ఇచ్చి 4.70 ఎకానమీతో ఒక వికెట్ తీశాడు. టీమిండియాతో ఫైనల్కు అనుమానమే! మహ్మద్ నవాజ్ను బౌల్డ్ చేసిన తీక్షణ బౌలింగ్లో.. ఒకవేళ శ్రీలంక గనుక 35వ ఓవర్లో డీఆర్ఎస్ తీసుకుంటే ఇఫ్తికర్ అహ్మద్(47) వికెట్ కూడా అతడి ఖాతాలో చేరేదే! ఇదిలా ఉంటే.. స్పిన్కు అనుకూలిస్తున్న కొలంబో పిచ్ మీదే సెప్టెంబరు 17 నాటి ఫైనల్లో శ్రీలంక టీమిండియాను ఢీకొట్టనుంది. ఇలాంటి సమయంలో కీలక స్పిన్నర్ మహీశ్ తీక్షణ గాయపడటం ఆ జట్టులో ఆందోళన రేకెత్తిస్తోంది. కాగా 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ రైట్ ఆర్మ్ ఆఫ్బ్రేక్ స్పిన్నర్ ఇప్పటి వరకు లంక తరఫున 27 వన్డేల్లో 44 వికెట్లు తీశాడు. ఆసియా కప్-2023లో ఇప్పటి వరకు ఎనిమిది వికెట్లు కూల్చాడు. చదవండి: మరీ చెత్తగా.. అందుకే ఓడిపోయాం.. వాళ్లిద్దరు అద్భుతం: బాబర్ ఆజం 🚨 Maheesh Theekshana has strained his right hamstring. The player will undergo a scan tomorrow to fully assess his condition. Theekshana sustained the injury while he was fielding during the ongoing game between Sri Lanka and Pakistan.#AsiaCup2023 #SLvPAK pic.twitter.com/6RTSRxhKNQ — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 14, 2023 -
మేము పాకిస్తాన్కు ఛాన్స్ ఇచ్చాం.. కానీ మా వాడు అదరగొట్టాడు: షనక
Asia Cup 2023- Pakistan vs Sri Lanka: ‘‘ముందు నుంచి మ్యాచ్ మా చేతిలోనే ఉంది. అయితే, వికెట్లు పడుతూ ఉండటం వల్ల చివరి ఓవర్ వరకు మ్యాచ్ కొనసాగింది. తిరిగి పుంజుకునేందుకు మేము పాకిస్తాన్కు అవకాశం ఇచ్చాము. కానీ.. చరిత్ అసలంక మమ్మల్ని గెలిపిస్తాడని మాకు ముందే తెలుసు. టీమిండియాతో మ్యాచ్లో తప్పిదాలు బ్యాటింగ్కు వెళ్లే ముందు.. టీమిండియాతో మ్యాచ్లో మేము చేసిన తప్పిదాల గురించి చర్చించుకున్నాం. మొదటి 10 ఓవర్లలో వికెట్లు పారేసుకున్నాం. ఏదేమైనా కుశాల్, సదీర అద్భుతమైన ఇన్నింగ్స్తో మ్యాచ్ను మలుపు తిప్పారు. వారిద్దరు శ్రీలంక జట్టులో ఉన్న అత్యుత్తమ ప్లేయర్లు. అయితే, ఆఖరి వరకు చరిత్ పట్టుదలగా పోరాడిన తీరు ప్రశంసనీయం’’ అని శ్రీలంక కెప్టెన్ దసున్ షనక హర్షం వ్యక్తం చేశాడు. వరుసగా రెండోసారి ఆసియా కప్ ఫైనల్కు చేరుకోవడం సంతోషంగా ఉందన్నాడు. అదరగొట్టిన కుశాల్, సదీర ఆసియా కప్-2023 సూపర్-4 దశలో చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో పాకిస్తాన్పై శ్రీలంక గెలుపొందిన విషయం తెలిసిందే. కొలంబోలో గురువారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ 42 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం లంక టార్గెట్ 252గా నిర్దేశించారు అంపైర్లు. ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్(91), నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన సదీర సమరవిక్రమ(48) అద్భుత ఇన్నింగ్స్తో లంక గెలుపునకు బాటలు వేశారు. అసలంక ఆదుకున్నాడు అయితే, ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన వాళ్లలో మిగతా వాళ్లంతా విఫలం కాగా ఐదో నంబర్ బ్యాటర్ చరిత్ అసలంక 49 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. గెలవాలంటే ఒక బంతికి రెండు పరుగులు రాబట్టాల్సిన తరుణంలో ఒత్తిడిని జయించి.. జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఆసియా కప్లో శ్రీలంక ఏకంగా 11వ సారి(వన్డే ఫార్మాట్) ఫైనల్కు చేరింది. గతేడాది చాంపియన్ శ్రీలంక.. ఈసారీ ఫైనల్లో ఇక ఈ మ్యాచ్లో లంక కెప్టెన్ దసున్ షనక కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. కాగా గతేడాది టీ20 ఫార్మాట్లో నిర్వహించిన ఈ టోర్నీలో శ్రీలంక చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి టైటిల్ గెలిచింది. ఈసారి ఫిఫ్టీ ఓవర్ల ఫార్మాట్లో సెప్టెంబరు 17న టీమిండియాతో ఫైనల్లో దసున్ షనక బృందం తలపడనుంది. చదవండి: అతడు ఆడాలంటే కోహ్లి ఉండొద్దు.. రోహిత్ మాత్రం: భారత మాజీ బ్యాటర్ మరీ చెత్తగా.. అందుకే ఓడిపోయాం.. వాళ్లిద్దరు అద్భుతం: బాబర్ ఆజం Super11 Asia Cup 2023 | Super 4 | Pakistan vs Sri Lanka | Highlightshttps://t.co/QTLYm5AOMO#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 14, 2023 -
అతడు ఆడాలంటే కోహ్లి ఉండొద్దు.. రోహిత్ మాత్రం: భారత మాజీ బ్యాటర్
Asia Cup, 2023- India vs Bangladesh: బంగ్లాదేశ్తో టీమిండియా మ్యాచ్ నేపథ్యంలో తుది జట్టు కూర్పు గురించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శ్రేయస్ అయ్యర్ తిరిగి వస్తే అతడి కోసం యువ ఆటగాళ్లపై వేటు వేయొద్దని.. సీనియర్లకే సర్దుకోవాలని చెప్పాలని సూచించాడు. అయ్యర్ కోసం విరాట్ కోహ్లి తన స్థానం త్యాగం చేయాలని విజ్ఞప్తి చేశాడు. రీఎంట్రీలో విఫలం కాగా గాయం నుంచి కోలుకుని సుదీర్ఘ కాలం తర్వాత ఆసియా కప్-2023 సందర్భంగా రీఎంట్రీ ఇచ్చిన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పాకిస్తాన్తో మ్యాచ్లో విఫలమయ్యాడు. నేపాల్తో ఆడినా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కేఎల్ రాహుల్ పాతుకుపోయాడు ఈ క్రమంలో సూపర్-4లో మరోసారి టీమిండియా పాక్తో తలపడే సమయంలో వెన్నునొప్పి తిరగబెట్టడంతో జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన కేఎల్ రాహుల్ అజేయ సెంచరీతో పునరాగమనాన్ని ఘనంగా చాటి జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. వికెట్ కీపర్గానూ రాణించాడు. నామమాత్రపు వన్డేకు శ్రేయస్ అయ్యర్ ఇక సూపర్-4 దశలో పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత జట్టు ఇప్పటికే ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లాదేశ్తో శుక్రవారం నామమాత్రపు వన్డే ఆడనుంది. విశ్రాంతి తర్వాత నెట్స్లో ప్రాక్టీస్కు దిగిన అయ్యర్ మ్యాచ్ ఆడేందుకు ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బంగ్లాతో మ్యాచ్లో అతడి సన్నద్ధతను పరీక్షించేందుకు మేనేజ్మెంట్ సిద్ధమైనట్లు సమాచారం. అయితే, సీనియర్లకు విశ్రాంతినిస్తే అతడికి రూట్ క్లియర్ అవుతుంది. కానీ వాళ్లు కూడా తుదిజట్టులో ఉంటే.. ఇషాన్ కిషన్పై వేటు తప్పకపోవచ్చు. అయ్యర్ వస్తే కోహ్లి రెస్ట్ తీసుకోవాలి ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్గా ఉంటే.. కావాల్సినంత ప్రాక్టీస్ చేసి ఉంటే అతడిని తప్పక ఆడించాలి. వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకున్నాడనే అనుకుంటున్నా. అయ్యర్ వస్తే ఎవరిని తప్పిస్తారనేది మన ముందున్న పెద్ద ప్రశ్న. ఇందుకు నా సమాధానం కొందరికి ఆగ్రహం తెప్పించవచ్చు. అయితే, ఇబ్బందికర పరిస్థితులు వచ్చినపుడు ఇంట్లోని చిన్న పిల్లలకు చెప్పకూడదు. పెద్దవాళ్లే బాధ్యత తీసుకుని అడ్జస్ట్ అయిపోవాలి. ఆగష్టు నెల మొత్తం ఆటకు దూరమైనా ముఖ్యంగా ఇప్పటికే ఫామ్ నిరూపించుకున్న సీనియర్లు రెస్ట్ తీసుకోవాలి. నేను మాట్లాడేది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి గురించే! నేనైతే ఈసారి కోహ్లిని విశ్రాంతి తీసుకోమని అడుగుతాను. ఆగష్టు నెల మొత్తం క్రికెట్కు దూరమైనా నేను అతడికే విశ్రాంతినివ్వాలని అంటాను. రోహిత్ కెప్టెన్ కాబట్టి జట్టులో ఉండాల్సిందే’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా కొలంబో వేదికగా శుక్రవారం టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్కు రంగం సిద్ధమైంది. చదవండి: మరీ చెత్తగా.. అందుకే ఓడిపోయాం.. వాళ్లిద్దరు అద్భుతం: బాబర్ ఆజం One final time before the final! 👌#TeamIndia are geared up for #INDvBAN 🙌#AsiaCup2023 pic.twitter.com/5ydNqDaoW2 — BCCI (@BCCI) September 15, 2023 -
వరల్డ్కప్నకు ముందు పాకిస్తాన్కు మరో భారీ షాక్! అతడు లేకుండానే..
Asia Cup 2023- Pakistan vs Sri Lanka: వన్డే ప్రపంచకప్-2023కి ముందు పాకిస్తాన్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక పేసర్ నసీం షా ఐసీసీ టోర్నీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయం కారణంగా శ్రీలంకతో డూ ఆర్ డై మ్యాచ్ ఆడలేకపోయిన ఈ యువ ఫాస్ట్బౌలర్.. మెగా ఈవెంట్ నాటికి కూడా అందుబాటులోకి రావడం కష్టమేనని పాక్ సారథి బాబర్ ఆజం సంకేతాలు ఇచ్చాడు. ఘనంగా ఆరంభించి.. కీలక సమయంలో చేతులెత్తేసిన పాక్ కాగా నేపాల్పై భారీ విజయంతో ఘనంగా ఆసియా కప్-2023 టోర్నీని ఆరంభించిన పాకిస్తాన్.. సూపర్-4లో టీమిండియా చేతిలో అంతే చిత్తుగా ఓడిపోయింది. ఈ క్రమంలో శ్రీలంకతో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లోనూ పరాజయం పాలై ఇంటిబాట పట్టింది. పేసర్లకు గాయాలు కొలంబోలో లంకతో మ్యాచ్కు ముందే పాకిస్తాన్ పేస్ త్రయంలో ముఖ్యమైన ఇద్దరు బౌలర్లు హ్యారిస్ రవూఫ్, నసీం షా గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఈ క్రమంలో గురువారం నాటి మ్యాచ్లో జమాన్ ఖాన్ వన్డేల్లో అరంగేట్రం చేయగా.. మహ్మద్ వసీం జూనియర్ కూడా తుదిజట్టులో చోటు సంపాదించాడు. అయితే, ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో శ్రీలంకదే పైచేయి అయింది. రెండు వికెట్ల తేడాతో పాక్ మీద గెలిచి టీమిండియాతో తుదిపోరుకు లంక అర్హత సాధించింది. చెత్త బౌలింగ్, ఫీల్డింగ్ కారణంగా బాబర్ ఆజం బృందం భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. నసీం షా ఆసియా కప్ గోవిందా.. ఇక ప్రపంచకప్నకు ముందు మరో షాక్ ఈ నేపథ్యంలో హ్యారిస్ రవూఫ్, నసీం షా గాయాల గురించి బాబర్ ఆజం ఇచ్చిన అప్డేట్ పాక్ అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది. ఇప్పటికే ఆసియా కప్ టోర్నీ నుంచి రిక్తహస్తాలతో నిష్క్రమించిన మెన్ ఇన్ గ్రీన్.. వన్డే ప్రపంచకప్లో కూడా చేదు అనుభవం ఎదుర్కొంటుందా అనే భయాలు వారిని వెంటాడుతున్నాయి. ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘హ్యారిస్ రవూఫ్ పరిస్థితి బాగానే ఉంది. పక్కటెముకల నొప్పితో కాస్త ఇబ్బంది పడుతున్నాడు. అయితే, వరల్డ్కప్ నాటికి అతడు పూర్తిగా కోలుకుంటాడనే నమ్మకం ఉంది. నసీం షా కూడా అంతే. అయితే, అతడి రికవరీకి ఎంత సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేను’’ అని బాబర్ ఆజం పేర్కొన్నాడు. అయితే.. ఐసీసీ ఈవెంట్కు నాటికి అతడు అందుబాటులోకి వస్తాడనే అనుకుంటున్నానంటూ మాట దాటవేశాడు. గతంలో 14 నెలల పాటు ఆటకు దూరం కాగా నసీం షా గాయం గురించి ఇంతవరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పూర్తి వివరాలు బయటకు వెల్లడించలేదు. కుడి భుజం నొప్పితో విలవిల్లాడుతున్న అతడు ప్రస్తుతం దుబాయ్లో ఉన్నట్లు సమాచారం. ఇక 20 ఏళ్ల నసీం షాకు గాయాల బెడద కొత్తే కాదు. గతంలో వెన్నునొప్పి కారణంగా ఈ రైట్ ఆర్మ్ పేసర్ ఏకంగా 14 నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్కు వన్డేల్లో కీలక బౌలర్గా మారిన నసీం ఇప్పటి వరకు ఆ ఫార్మాట్లో అంతర్జాతీయ స్థాయిలో 14 మ్యాచ్లు ఆడి 32 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్-2023కి ముందు నసీం ఇలా గాయపడటం పాకిస్తాన్కు పెద్ద ఎదురుదెబ్బ. చదవండి: మరీ చెత్తగా.. అందుకే ఓడిపోయాం.. వాళ్లిద్దరు అద్భుతం: బాబర్ ఆజం Super11 Asia Cup 2023 | Super 4 | Pakistan vs Sri Lanka | Highlightshttps://t.co/QTLYm5AOMO#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 14, 2023 -
మరీ చెత్తగా.. అందుకే ఓడిపోయాం.. వాళ్లిద్దరు అద్భుతం: బాబర్ ఆజం
Asia Cup, 2023- Pakistan vs Sri Lanka- Babar Azam Comments On Loss: ఆసియా కప్-2023 టోర్నీలో పాకిస్తాన్ ప్రయాణం ముగిసింది. చివరి ఓవర్ వరకు నువ్వా- నేనా అన్నట్లు సాగిన గురువారం నాటి మ్యాచ్లో శ్రీలంక చేతిలో బాబర్ ఆజం బృందం ఓడిపోయింది. కొలంబోలో లంక చేతిలో 2 వికెట్ల తేడాతో పరాజయం పాలై ఈ వన్డే ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం.. శ్రీలంక జట్టు తమ కంటే మెరుగ్గా ఆడిందని.. అందుకే గెలుపు వారినే వరించిందని పేర్కొన్నాడు. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో తమ బౌలింగ్, ఫీల్డింగ్ పేలవంగా సాగిందని అందుకే ఓడిపోయామని తెలిపాడు. వాళ్లిద్దరు అద్భుతంగా ఆడి లంక బ్యాటర్లు కుశాల్ మెండిస్, సమరవిక్రమ అద్భుతమైన భాగస్వామ్యం నమోదు చేసి మ్యాచ్ను తమ నుంచి లాగేసుకున్నారని బాబర్ ఆజం చెప్పుకొచ్చాడు. ‘‘మేము ఆరంభంలో.. మ్యాచ్ చివర్లో మెరుగ్గా రాణించగలుగుతున్నాం. కానీ మిడిల్ ఓవర్లలో సరిగ్గా ఆడలేకపోతున్నాం. ఈ రెండే కొంప ముంచాయి ఈరోజు కూడా అదే జరిగింది. మిడిల్ ఓవర్లలో మా బౌలింగ్ అస్సలు బాలేదు. ఫీల్డింగ్ కూడా స్థాయికి తగ్గట్లు లేదు. ఈ రెండు కారణాల వల్ల మేము భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది’’ అని బాబర్ ఆజం లంక చేతిలో తాము ఓడిపోవడానికి గల కారణాలు విశ్లేషించాడు. అందుకే బంతిని అతడి చేతికి ఇచ్చాను ఇక ఆఖరి ఓవర్లో బాల్ను వన్డే అరంగేట్ర బౌలర్కు ఇవ్వడంపై స్పందిస్తూ.. ‘‘ చివరి ఓవర్ వరకు పోరాటం కొనసాగించే క్రమంలో.. ఆఖర్లో అత్యుత్తమ బౌలర్లనే బరిలోకి దించాలని భావించాను. అందుకే సెకండ్ లాస్ట్ ఓవర్లో బంతిని షాహిన్ ఆఫ్రిది చేతికి ఇచ్చాను. ఫైనల్ ఓవర్లో జమాన్ ఖాన్పై నమ్మకం ఉంచాను. అయితే, శ్రీలంక మా కంటే మెరుగ్గా ఆడి విజయం సాధించింది’’ అని బాబర్ ఆజం ఓటమిని అంగీకరించాడు. శ్రీలంక అసాధారణ పోరాటం.. ఫైనల్లో టీమిండియాతో కాగా ఆసియా కప్-2023 సూపర్-4 దశలో తమ ఆఖరి మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో 7 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 86 పరుగులు(నాటౌట్) పాక్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక ఆదిలోనే వికెట్లు కోల్పోయినా.. వన్డౌన్ బ్యాటర్, వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ 91 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సమరవిక్రమ 48, ఆఖరి వరకు క్రీజులో ఉన్న చరిత్ అసలంక 49 పరుగులతో రాణించారు. 42వ ఓవర్ చివరి బంతికి జమాన్ ఖాన్ వేసిన బాల్కు రెండు పరుగులు తీసిన లంక ఆటగాళ్లు జట్టు ఫైనల్ బెర్తును ఖరారు చేశారు. సెప్టెంబరు 17న టీమిండియా- శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. చదవండి: Ind Vs Ban: జోరు కొనసాగించేందుకు... అయ్యర్ బరిలోకి... Super11 Asia Cup 2023 | Super 4 | Pakistan vs Sri Lanka | Highlightshttps://t.co/QTLYm5AOMO#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 14, 2023 Some effort this from @iamharis63! 🔥#PAKvSL | #AsiaCup2023 pic.twitter.com/rHE9xkV2il — Pakistan Cricket (@TheRealPCB) September 14, 2023 -
Ind Vs Ban: జోరు కొనసాగించేందుకు... అయ్యర్ బరిలోకి...
కొలంబో: ఆసియా కప్లో ఫలితం దృష్ట్యా ప్రాధాన్యత లేని చివరి లీగ్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ‘సూపర్–4’ దశలో భాగంగా నేడు జరిగే పోరులో భారత్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. భారత్ ఇప్పటికే టోర్నీలో ఫైనల్కు చేరగా... బంగ్లాదేశ్ ఫైనల్ రేసు నుంచి ముందే నిష్క్రమించింది. ఇరు జట్లకు సంబంధించి అందుబాటులో ఉన్న ఆటగాళ్లను పరీక్షించడం లేదా విశ్రాంతి మాత్రమే ఈ మ్యాచ్కు సంబంధించి ప్రధానంగా మారాయి. ద్వైపాక్షిక సిరీస్లు కాకుండా మూడు అంతకుమించి దేశాలు పాల్గొన్న టోర్నీల్లో బంగ్లాదేశ్ చేతిలో ఏనాడూ ఓడని టీమిండియా ఆడిన ఐదు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. పిచ్ నెమ్మదిగా ఉండే అవకాశం కనిపిస్తుండగా మ్యాచ్ రోజు వర్షసూచన లేకపోవడం విశేషం. అయ్యర్ బరిలోకి... మ్యాచ్కు ప్రాధాన్యత లేకపోయినా భారత్ అనవసరపు మార్పులు చేయకపోవచ్చు. రాబోయే వరల్డ్కప్ సన్నాహాలను దృష్టిలో ఉంచుకొని చూస్తే పూర్తి స్థాయి రెగ్యులర్ జట్టుతోనే బరిలోకి దిగవచ్చు. టాప్–3 రోహిత్, గిల్, కోహ్లి ఇప్పటికే సిరీస్లో తమ సత్తా ప్రదర్శించగా, ఇషాన్ కిషన్ కూడా ఆకట్టుకున్నాడు. కేఎల్ రాహుల్ తన విలువేంటో పాక్తో మ్యాచ్లో చూపించడం మేనేజ్మెంట్కు బెంగ తగ్గింది. అయితే మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ పరిస్థితి మాత్రమే కాస్త ఇబ్బందికరంగా ఉంది. గాయంతో అతను రెండు మ్యాచ్లు ఆడలేదు. అతడి బ్యాటింగ్ను పరీక్షించడం ఇప్పుడు కీలకం. గురువారం నెట్స్లో అందరికంటే ఎక్కువగా సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్ చేసిన అతను మ్యాచ్కు సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. అయ్యర్ను ఆడించాలనుకుంటే కిషన్ను పక్కన పెట్టవచ్చు. టోర్నీలో బుమ్రా మరీ ఎక్కువగా ఏమీ బౌలింగ్ చేయలేదు కాబట్టి విశ్రాంతి అనవసరం. అయితే మ్యాచ్ ప్రాక్టీస్ కోసం సిరాజ్ స్థానంలో షమీని ఎంచుకునే అవకాశం ఉంది. ఆపై పిచ్ను దృష్టిలో ఉంచుకొని శార్దుల్, అక్షర్లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. టోర్నీలో మొత్తంలో అఫ్గానిస్తాన్పై ఒక మ్యాచ్ గెలవడం మినహా బంగ్లాదేశ్ ఏ రకంగానూ ఆకట్టుకోలేకపోయింది. గత కొన్నాళ్లుగా వన్డేల్లో ఆ జట్టు ప్రదర్శన చూస్తే టోర్నీలో మంచి పోటీ ఇవ్వగలదని భావించినా అంతా తలకిందులైంది. కెప్టెన్ షకీబ్ సహా ఏ ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయారు. తొలి రెండు మ్యాచ్లలో చెలరేగిన నజు్మల్ గాయంతో స్వదేశం తిరిగి వెళ్లగా, వికెట్ కీపర్ ముషి్ఫకర్ కూడా ఈ మ్యాచ్కు అందుబాటులో లేడు. ఈ నేపథ్యంలో కొత్త ఆటగాళ్లను ఆ జట్టు పరీక్షించే అవకాశం ఉంది. అయితే ఎవరు ఎలా ఆడినా షకీబ్ ప్రదర్శనపైనే ఆ జట్టు విజయావకాశాలు ప్రధానంగా ఆధారపడి ఉన్నాయనేది వాస్తవం. -
Asia cup : 11వ సారి ఫైనల్లోకి.. టైటిల్ కోసం టీమిండియాతో పోరు
కొలంబో: ఆసియా కప్ ఫైనల్ మరోసారి భారత్, శ్రీలంక మధ్య జరగనుంది. గురువారం హోరాహోరీగా సాగిన ‘సూపర్–4’ మ్యాచ్లో లంక 2 వికెట్ల తేడాతో పాక్ను ఓడించి ఈ టోర్నీలో 11వ సారి(వన్డే ఫార్మాట్) ఫైనల్లోకి దూసుకెళ్లింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన సమరంలో చివరకు లంకదే పైచేయింది. వర్షం కారణంగా మ్యాచ్ను ముందుగా 45 ఓవర్లకు, ఆ తర్వాత 42 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 42 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. మొహమ్మద్ రిజ్వాన్ (73 బంతుల్లో 86 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్లు), అబ్దుల్లా షఫీక్ (69 బంతుల్లో 52; 3 ఫోర్లు, 2 సిక్స్లు), ఇఫ్తికార్ అహ్మద్ (40 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఒకదశలో జట్టు స్కోరు 130/5 కాగా... రిజ్వాన్, ఇఫ్తికార్ ఆరో వికెట్కు 108 పరుగులు జోడించి ఆదుకున్నారు. అనంతరం లంక లక్ష్యాన్ని డక్వర్త్ లూయిస్ ద్వారా 42 ఓవర్లలో 252 పరుగులుగా నిర్దేశించారు. లంక సరిగ్గా 42 ఓవర్లలో 8 వికెట్లకు 252 పరుగులు సాధించి గెలిచింది. కుశాల్ మెండిస్ (87 బంతుల్లో 91; 8 ఫోర్లు, 1 సిక్స్), సదీరా సమరవిక్రమ (51 బంతుల్లో 48; 4 ఫోర్లు), అసలంక (47 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ గెలుపుతో శ్రీలంక నాలుగు పాయింట్లతో ‘సూపర్–4’ దశలో రెండో స్థానంలో నిలిచి ఫైనల్ చేరింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నిష్క్రమించాయి. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: షఫీక్ (సి) మదుషన్ (బి) పతిరణ 52; ఫఖర్ (బి) మదుషన్ 4; బాబర్ (స్టంప్డ్) మెండిస్ (బి) వెలలాగె 29; రిజ్వాన్ (నాటౌట్) 86; హారిస్ (సి అండ్ బి) పతిరణ 3; నవాజ్ (బి) తీక్షణ 12; ఇఫ్తికార్ (సి) షనక (బి) పతిరణ 47; షాదాబ్ (సి) మెండిస్ (బి) మదుషన్ 3; షాహిన్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 15; మొత్తం (42 ఓవర్లలో 7 వికెట్లకు) 252. వికెట్ల పతనం: 1–9, 2–73, 3–100, 4–108, 5–130, 6–238, 7–243. బౌలింగ్: మదుషన్ 7–1–58–2, తీక్షణ 9–0–42–1, షనక 3–0–18–0, వెలలాగె 9–0–40–1, పతిరణ 8–0–65–3, ధనంజయ 6–0–28–0. శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి అండ్ బి) షాదాబ్ 29; పెరీరా (రనౌట్) 17; మెండిస్ (సి) హారిస్ (బి) ఇఫ్తికార్ 91; సమరవిక్రమ (స్టంప్డ్) రిజ్వాన్ (బి) ఇఫ్తికార్ 48; అసలంక (నాటౌట్) 49 ; షనక (సి) నవాజ్ (బి) ఇఫ్తికార్ 2; ధనంజయ (సి) వసీమ్ (బి) షాహిన్ 5; వెలలాగె (సి) రిజ్వాన్ (బి) షాహిన్ 0; మదుషన్ (రనౌట్) 1; పతిరణ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 10; మొత్తం (42 ఓవర్లలో 8 వికెట్లకు) 252. వికెట్ల పతనం: 1–20, 2–77, 3–177, 4–210, 5–222, 6–243, 7–243, 8–246. బౌలింగ్: షాహిన్ 9–0–52–2, జమాన్ 6–1–39–0, వసీమ్ 3–0–25–0, నవాజ్ 7–0–26–0, షాబాద్ 9–0–55–1, ఇఫ్తికార్ 8–0–50–3. -
SL VS PAK: శ్రీలంక యువ సంచలనం అరుదైన ఘనత
శ్రీలంక యువ సంచలన స్పిన్నర్ దునిత్ వెల్లలగే అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియాకప్లో టాప్-10 ర్యాంకింగ్స్లో ఉన్న నాలుగురు బ్యాటర్లను ఔట్ చేశాడు. వరల్డ్ నంబర్ వన్ వన్డే బ్యాటర్, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్తో పాటు వరల్డ్ నంబర్ 2 బ్యాటర్, టీమిండియా యంగ్ గన్ శుభ్మన్ గిల్.. వరల్డ్ నంబర్ 8, 9 బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను పెవిలియన్కు పంపాడు. Young sensation Dunith Wellalage dismantled ODI ranking No. 1, 2, 8 & 9 at the Asia Cup 2023 🌟 Incredible - Dunith Wellalage 🙌 pic.twitter.com/eWFBqFne0k — CricTracker (@Cricketracker) September 14, 2023 సెప్టెంబర్ 12న భారత్తో జరిగిన మ్యాచ్లో రోహిత్, గిల్, కోహ్లిలతో పాటు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాల వికెట్లు కూడా తీసిన వెల్లలగే.. ఇవాళ (సెప్టెంబర్ 14) పాకిస్తాన్తో జరుగుతున్న కీలక పోరులో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ భరతం పట్టాడు. వెల్లలగే సంధించిన బంతికి బోల్తా కొట్టిన బాబర్ స్టంపౌటయ్యాడు. వెల్లలగే కేవలం 3 రోజుల వ్యవధిలో వరల్డ్ టాప్ బ్యాటర్లనంతా ఔట్ చేయడంతో అతనిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. భారత్, పాక్ మ్యాచ్లలో 6 వికెట్లు పడగొట్టిన వెల్లలగే, గ్రూప్ దశలో బంగ్లాదేశ్పై ఓ వికెట్.. ఆతర్వాత ఆఫ్ఘనిస్తాన్పై మరో 2 వికెట్లు.. దీని తర్వాత సూపర్-4లో బంగ్లాదేశ్పై మరో వికెట్.. ఇలా మొత్తంగా ఈ టోర్నీలో ఇప్పటివరకు 10 వికెట్లు తీసి, లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. వెల్లలగే బంతితో మ్యాజిక్ చేయడమే కాకుండా, బ్యాట్తోనూ మెరుపులు మెరిపించగలడు. టీమిండియాతో జరిగిన సూపర్-4 మ్యాచ్లో ఓ పక్క అతని సహచరులు, స్పెషలిస్ట్ బ్యాటర్లంతా పెవిలియన్కు క్యూ కడుతున్నా అతను మాత్రం చివరివరకు ఒంటరిపోరాటం (42 నాటౌట్) చేసి అజేయంగా నిలిచాడు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక పట్టుబిగించింది. లంక బౌలర్లు 130 పరుగులకే (27.4 ఓవర్లలో) సగం మంది పాక్ ఆటగాళ్లను పెవిలియన్కు పంపారు. ఈ దశలో వర్షం ప్రారంభమైంది. మ్యాచ్కు ముందు కూడా వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్ను 45 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్లో గెలిస్తేనే పాక్ ఫైనల్కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా, మెరుగైన రన్రేట్ ఆధారంగా శ్రీలంక ఫైనల్కు చేరుకుంటుంది. సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్లో టీమిండియాతో తలపడుతుంది. -
Asia Cup 2023: టీమిండియాకు గుడ్ న్యూస్
ఆసియా కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్తో రేపు (సెప్టెంబర్ 15) జరగాల్సిన చివరి సూపర్-4 మ్యాచ్కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. వెన్నునొప్పితో బాధపడుతున్న మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తుంది. బంగ్లాతో మ్యాచ్కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్లో అయ్యర్ చురుగ్గా పాల్గొన్నాడు. దీంతో అతను బంగ్లాతో మ్యాచ్కు అందుబాటులో ఉండటం ఖాయమని సమాచారం. టీమిండియా ఇదివరకే ఫైనల్స్కు చేరిన నేపథ్యంలో బంగ్లాదేశ్తో మ్యాచ్లో పలువురు సీనియర్లకు రెస్ట్ ఇవ్వాలని భారత యాజమాన్యం భావిస్తుంది కాబట్టి, తుది జట్టులో అయ్యర్ స్థానానికి ఎలాంటి ఢోకా ఉండదు. అయితే, బంగ్లాదేశ్పై అయ్యర్ రాణిస్తేనే టీమిండియాకు అసలు సమస్య మొదలవుతుంది. ఇప్పటికే అయ్యర్ స్థానంలో జట్టులోకి వచ్చిన రాహుల్ పాక్పై సూపర్-4 మ్యాచ్లో సెంచరీతో కదం తొక్కడం, అంతకుముందు గ్రూప్ దశలో పాక్తో జరిగిన మ్యాచ్లో ఇషాన్ కిషన్ రాణించడంతో నాలుగో నంబర్ స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొంది. బంగ్లాపై అయ్యర్ కూడా రాణిస్తే ఫైనల్లో ఎవరిని ఆడించాలో, ఎవరిని పక్కకు పెట్టాలో అర్ధం కాదు. దీంతో అయ్యార్ ఎంట్రీ ఇప్పటినుంచే టీమిండియా మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది. రాహుల్, అయ్యర్, ఇషాన్ ముగ్గురు రాణించడం శభపరిణామమే అయినప్పటికీ జట్టు కూర్పు ప్రధాన సమస్యగా మారుతుంది. మున్ముందు భారత మిడిలార్డర్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలియాలంటే వేచి చూడాలి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్లో మరో సూపర్-4 మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ ఫైనల్కు చేరుకున్న విషయం తెలిసిందే. సూపర్-4 దశలో టీమిండియా వరుసగా పాకిస్తాన్, శ్రీలంకలను మట్టికరిపించి, తుది పోరుకు అర్హత సాధించింది. ఫైనల్కు ముందు భారత్ రేపు బంగ్లాదేశ్తో తలపడుతుంది. శ్రీలంక-పాకిస్తాన్ మధ్య ఇవాళ (సెప్టెంబర్ 14) జరిగే మ్యాచ్తో మరో ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. ఇవాల్టి మ్యాచ్ పాక్ గెలిస్తే, భారత్తో ఫైనల్లో తలపడుతుంది. ఇలా కాకుండా ఇవాల్టి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా, గెలుపు మినహా పాక్కు ఎలాంటి ఫలితం వచ్చినా శ్రీలంక ఫైనల్కు వెళ్తుంది. -
PAK VS SL: ఉత్కంఠ పోరులో పాక్ అవుట్.. ఫైనల్లో భారత్ vs శ్రీలంక
అనుకున్నదే జరిగింది. చరిత్ర పునరావృతమైంది. భారత్ పాకిస్తాన్ ఆసియా కప్ ఫైనల్లో తలపడితే చూడాలని ఆశపడ్డ అభిమానులకు మరోసారి భంగపాటు ఎదురయింది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో పాకిస్తాన్.. శ్రీలంక చేతిలో రెండు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో దసున్ షనక బృందం ఆసియా కప్ 2023 ఫైనల్ కు దూసుకెళ్లింది. సెప్టెంబర్ 17న టీమిండియాతో ట్రోఫీ కోసం తలపడనుంది. కొలంబో వేదికగా గురువారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్లో 42 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి బాబర్ ఆజం బృందం 252 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక డి.ఎల్.ఎస్ పద్ధతిలో విధించిన 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో గెలుపొంది టైటిల్ కు అడుగు దూరంలో నిలిచింది. ఉత్కంఠ పోరులో పాక్పై శ్రీలంక విజయం ఆసియా కప్-2023లో భాగంగా కొలొంబో వేదికగా శ్రీలంక-పాకిస్తాన్ జరిగిన మద్య జరిగిన మాచ్లో శ్రీలంక విజయం సాధించింది. చివరి వరకు సాగిన ఉత్కంఠ పోరులో పాక్పై శ్రీలంక రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి బంతికి శ్రీలంకను గెలిపించిన అసలంక. దీంతో శ్రీలంక ఫైనల్కు చేరింది. ఈ నెల 17న జరగనున్న ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక, భారత్తో తలపడనుంది. స్కోర్లు: పాక్ 252/7, శ్రీలంక 253/8 ఎనిమిదో వికెట్ కోల్పోయిన శ్రీలంక 246/8 వద్ద శ్రీలంక ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ప్రమోద్ మదుశన్ ఔటయ్యాడు. ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక 243/7 వద్ద శ్రీలంక ఏడో వికెట్ కోల్పోయింది. దునిత్ వెల్లలేజ్ ఔటయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంక 243/6 వద్ద శ్రీలంక ఆరో వికెట్ కోల్పోయింది. ధనుంజయ సిల్వ ఔటయ్యాడు. ఐదో వికెట్ కోల్పోయిన శ్రీలంక 222/5 (37) వద్ద శ్రీలంక ఐదో వికెట్ కోల్పోయింది. దసున్ శనక (2) పరుగులకు ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక 210/4 (35) వద్ద శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. కుసాల్ మండీస్ (91) పరుగులకు ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక 177/3 (29) వద్ద శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. సమర విక్రమ (48) పరుగులకు ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక 77 పరుగుల వద్ద శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. నిస్సంక ఔటయ్యాడు. పాక్ 252/7.. తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక 20 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. కుశాల్ పెరీరా (17) రనౌటయ్యాడు. చెలరేగిన రిజ్వాన్.. శ్రీలంక ముందు భారీ టార్గెట్ ఇన్నింగ్స్ ఆరంభంలో ఆచితూచి ఆడిన పాక్ చివర్లో చెలరేగి ఆడింది. ముఖ్యంగా మహ్మద్ రిజ్వాన్ (73 బంతుల్లో 86 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) విజృంభించాడు. అతనికి ఇఫ్తికార్ అహ్మద్ (47) సహకరించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో అబ్దుల్లా షఫీక్ (52) అర్ధ సెంచరీతో రాణించాడు. వర్షం కారణంగా మ్యాచ్ను తొలుత 45 ఓవర్లకు, మధ్యలో 42 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే. నిర్ణీత 42 ఓవర్లలో పాక్ స్కోర్ 252/7గా ఉంది. లంక బౌలర్లలో పతిరణ 3, మధుషన్ 2, తీక్షణ, వెల్లలగే చెరో వికెట్ పడగొట్టారు. 36 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 192/5 36 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 192/5గా ఉంది. మహ్మద్ రిజ్వాన్ (57), ఇఫ్తికార్ అహ్మద్ (23) క్రీజ్లో ఉన్నారు. వర్షం అంతరాయం.. 27.4 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 130/5 వర్షం మరోసారి మ్యాచ్కు ఆటంకం కలిగించింది. ఐదో వికెట్ పడ్డవెంటనే మొదలైంది. 27.4 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 130/5గా ఉంది. రిజ్వాన్ (22) క్రీజ్లో ఉన్నాడు. 27 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 128/4 27 ఓవర్ల తర్వాత పాకిస్తాన్ స్కోర్ 128/4గా ఉంది. మొహమ్మద్ నవాజ్ (10), మొహమ్మద్ రిజ్వాన్ (22) క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ 73 పరుగుల వద్ద పాకిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. యువ స్పిన్నర్ వెల్లలగే బౌలింగ్లో బాబర్ ఆజమ్ (29) స్టంపౌటయ్యాడు. నత్త నడకలా సాగుతున్న పాక్ బ్యాటింగ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాక్ 6 ఓవర్లలో వికెట్ కోల్పోయి 19 పరుగులు మాత్రమే చేసింది. పాక్ ఇన్నింగ్స్ నత్త నడకలా సాగుతుంది. ప్రమోద్ మధుషన్ ఫఖర్ జమాన్ను (4) క్లీన్ బౌల్డ్ చేయగా.. అబ్దుల్లా షఫీక్ (6), బాబర్ ఆజమ్ (9) క్రీజ్లో ఉన్నారు. తుది జట్లు.. పాకిస్తాన్: ఫకర్ జమాన్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మొహమ్మద్ రిజ్వాన్ (వికెట్కీపర్), మొహమ్మద్ హరీస్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), మొహమ్మద్ నవాజ్, జమాన్ ఖాన్, షాహీన్ అఫ్రిది, మొహమ్మద్ వసీం జూనియర్ శ్రీలంక: పథుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వ, దసున్ షనక, దునిత్ వెల్లలగే, మహీష్ తీక్షణ, ప్రమోద్ మధుషన్, మతీష పతిరణ ఆసియా కప్-2023లో భాగంగా కొలొంబో వేదికగా శ్రీలంక-పాకిస్తాన్ జట్ల మధ్య ఇవాళ (సెప్టెంబర్ 14) జరగాల్సిన కీలక మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమవుతుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో కనీసం టాస్ కూడా పడలేదు. పరిస్థితులను చూస్తుంటే ఈ మ్యాచ్ రద్దయ్యేలా కనిపిస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే శ్రీలంక ఫైనల్కు చేరుకుంటుంది. పాక్తో పోలిస్తే మెరుగైన రన్రేట్ ఉన్న కారణంగా లంక ఈ ఛాన్స్ కొట్టేస్తుంది. సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్లో శ్రీలంక.. టీమిండియాను ఢీకొంటుంది. మరోవైపు పాక్ ఫైనల్కు చేరాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. అది ఇవాల్టి మ్యాచ్ జరిగి, అందులో పాక్ విజయం సాధించాలి. పాక్కు గెలుపు కాకుండా ఎలాంటి ఫలితం వచ్చినా ప్రయోజనం లేదు. కాగా, మరో సూపర్-4 మ్యాచ్ జరగాల్సి ఉండగానే భారత్ ఫైనల్కు చేరుకున్న విషయం తెలిసిందే. సూపర్-4 దశలో టీమిండియా వరుసగా పాకిస్తాన్, శ్రీలంకలను మట్టికరిపించి, తుది పోరుకు అర్హత సాధించింది. ఫైనల్కు ముందు భారత్ రేపు (సెప్టెంబర్ 15) బంగ్లాదేశ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో టీమిండియా ప్రయోగాల బాటపట్టే అవకాశం ఉంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు అవకాశం రాని ఆటగాళ్లకు మేనేజ్మెంట్ అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ సహా పలువురు స్టార్ ప్లేయర్లు రెస్ట్ తీసుకోవచ్చు. -
Ind vs Ban: రోహిత్, కోహ్లితో పాటు అతడికి రెస్ట్.. ఆ ముగ్గురి ఎంట్రీ! కెప్టెన్?
Asia Cup, 2023 India vs Bangladesh, Super Fours: ఆసియా కప్-2023 సూపర్-4లో అద్బుత ప్రదర్శనలతో అదరగొట్టింది టీమిండియా. తద్వారా.. ఈ సారి వన్డే ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఇక లీగ్ దశలో తదుపరి బంగ్లాదేశ్తో తలపడనున్న భారత తుది జట్టులో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. బంగ్లాతో నామమాత్రపు మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాలకు మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చేందుకు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇలా అయితే బాగుంటుంది కీలక ఆటగాళ్లపై పనిభారాన్ని తగ్గించడం సహా వన్డే ప్రపంచకప్-2023కి ముందు ఇతర ప్లేయర్ల సన్నద్ధతను పరీక్షించేందుకు ఈ మేరకు యోచన చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశ్లేషకుల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజులు తగినంత విశ్రాంతి లేకుండా కొలంబోలో జరుగుతున్న సూపర్-4 దశలో ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్కు వర్షం అడ్డంకి కారణంగా రిజర్వ్ డే కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం మొదలైన మ్యాచ్.. సోమవారం ముగిసింది. ఇందులో గెలుపొందిన రోహిత్ సేన.. మళ్లీ 15 గంటల్లోపే శ్రీలంకతో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. ఇక్కడా విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. అంతా బాగానే ఉంది కానీ.. వరుసగా మూడు రోజుల పాటు(ఆది, సోమ, మంగళ) తగినంత విశ్రాంతి లేకుండా ఆడటం క్రికెటర్లపై ఒత్తిడి పెంచడం సహజం. ముఖ్యంగా ఓపెనర్ రోహిత్ శర్మకు కెప్టెన్గా అదనపు భారం. నా వయసు 35 ఇక లంకతో మ్యాచ్కు ముందు కోహ్లి మాట్లాడుతూ.. తన పదిహేనేళ్ల కెరీర్లో ఇలా వెనువెంటనే వన్డే ఆడటం ఇదే తొలిసారి అని వ్యాఖ్యానించాడు. అంతేకాదు.. తనకు నవంబరు నెలలో 35 ఏళ్లు అంటూ వయసును గుర్తు చేసుకుంటూ.. శరీరానికి కావాల్సినంత విశ్రాంతి అవసరమని పేర్కొన్నాడు. టీ20లకు దూరంగానే కాగా ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీ20 ద్వైపాక్షిక సిరీస్లలో ఆడటం లేదు. ఈ వెటరన్ స్టార్ల ప్రాధాన్యం దృష్ట్యా వన్డే వరల్డ్కప్-2023కి ముందు మేనేజ్మెంట్ ఇలా విశ్రాంతినిస్తూ వస్తోంది. ఇక ఇప్పుడు ఆసియా కప్లో ఇప్పటికే ఫైనల్ చేరి భారత జట్టు టైటిల్కు అడుగుదూరంలో ఉంది. బుమ్రాను కాపాడుకోవాలి ఇలాంటి సమయంలో నామమాత్రపు మ్యాచ్లో రోహిత్, కోహ్లిలకు రెస్ట్ ఇస్తే ఫైనల్లో ఫ్రెష్గా రీఎంట్రీ ఇస్తారు. వీరిద్దరితో పాటు జస్ప్రీత్ బుమ్రా.. గాయం నుంచి కోలుకుని సుదీర్ఘకాలం తర్వాత పునరాగమనం చేసిన ఈ ఫాస్ట్బౌలర్కు సైతం బంగ్లాతో మ్యాచ్లో విశ్రాంతి ఇస్తే బాగుంటుంది. హార్దిక్ కెప్టెన్గా కాగా ఒకవేళ రోహిత్ శర్మ దూరమైతే గైర్హాజరీ హార్దిక్ పాండ్యా పగ్గాలు చేపడతాడు. ఫిట్నెస్ నిరూపించుకుంటే శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ ఇవ్వడం లాంఛనమే. అదే సమయంలో సూర్యకుమార్ యాదవ్ను ఆడించే అవకాశం కూడా ఉంటుంది. బుమ్రా లేనట్లయితే మహ్మద్ షమీ మళ్లీ తుదిజట్టులోకి రావొచ్చు. ఈ నేపథ్యంలో.. శుబ్మన్ గిల్కు జోడీగా.. ఇషాన్ కిషన్ ఓపెనర్గా ప్రమోట్ అయితే, మూడో స్థానంలో సూర్య.. నాలుగో స్థానంలో అయ్యర్.. ఆ తర్వాతి స్థానాల్లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ టాప్-8లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. చదవండి: Asia Cup: ఫైనల్లో భారత్ వర్సెస్ పాక్ లేనట్లే! మూటాముల్లె సర్దుకోండి.. -
ఆసియా కప్ లో కీలక మ్యాచ్..పాకిస్థాన్ కు షాక్..!
-
పాక్ ఓటమి ఖాయమే! రిజర్వ్ డే అయినా.. ఇంకేదైనా! టోర్నీ రాతే అంత..
Asia Cup 2023- India vs Pakistan: టీమిండియా- పాకిస్తాన్ ఫైనల్లో తలపడటం ఆసియా కప్ చరిత్రలోనే లేదని.. ఈసారి కూడా అలాగే జరుగుతుందని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఎవరు ఎంతగా ప్రయత్నించినా చిరకాల ప్రత్యర్థులను ఈ మెగా ఈవెంట్ ఫైనల్లో చూసే అవకాశం ఉండకపోవచ్చని పేర్కొన్నాడు. పాక్ను చిత్తు చేసి.. లంకను జయించి ఆసియా కప్-2023లో గ్రూప్-ఏ నుంచి టీమిండియా- పాకిస్తాన్, గ్రూప్- బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ సూపర్ 4 దశకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలుత పాక్ను చిత్తుచిత్తుగా ఓడించిన రోహిత్ సేన.. ఆపై శ్రీలంక మీద జయభేరి మోగించింది. తద్వారా ఈ వన్డే టోర్నీలో తుదిపోరుకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఇదిలా ఉంటే.. టీమిండియా చేతిలో దారుణ ఓటమి చవిచూసిన బాబర్ ఆజం బృందం.. నెట్ రన్రేటు పరంగా లంక కంటే వెనుకబడి ఉంది. గాయాలు, వర్షం.. పాక్ను వెంటాడుతున్న దురదృష్టం ఈ క్రమంలో చావో రేవో తేల్చుకోవాల్సిన సందర్భంలో గురువారం కొలంబో వేదికగా లంకతో పోటీపడనుంది. ఇప్పటికే కీలక ఆటగాళ్లు గాయపడటంతో డీలా పడిన పాక్ జట్టు.. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే! రిజర్వ్ డే అయినా.. ఇంకేదైనా ఇది జరగదంతే అప్పుడు.. టీమిండియాతో పాటు.. శ్రీలంక ఫైనల్కు చేరుకుంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘శ్రీలంక- పాక్ మ్యాచ్ పరిస్థితులను గమనిస్తే.. విషయం పూర్తిగా అర్థమైపోతోంది కదా! ఇండియా- పాకిస్తాన్ను ఫైనల్కు పంపించాలని ఎంతగా ప్రయత్నాలు చేసినా.. ఆ రెండు తుదిపోరులో పరస్పరం ఢీకొట్టడం టోర్నీ చరిత్రలోనే లేదు. అందుకు పరిస్థితులు కూడా అనుకూలించవు! అదంతే!’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. భారత్- పాక్ను ఫైనల్ చేర్చేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ఈ కామెంటేటర్.. ‘‘ఈ గ్రూప్లో నేపాల్ను ఎవరు చేర్చమన్నారు. మొత్తంగా ఆరు జట్లున్న రెండు గ్రూప్ల నుంచి నాలుగు సూపర్ 4కి చేరతాయి కదా.. ఆపై రెండు జట్లు ఫైనల్కు! కానీ.. మిగతా మ్యాచ్లకు కాదని కేవలం ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్కే రిజర్వ్ డే కేటాయించడం చూస్తుంటే.. కచ్చితంగా ఇది కేవలం ఈ రెండు జట్ల కోసం మాత్రమే నిర్వహిస్తున్న టోర్నమెంట్లా అనిపించడంలో తప్పులేదు’’ అని ఆసియా క్రికెట్ కౌన్సిల్ వివక్షపూరిత వైఖరిని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. చరిత్రలోనే లేదు.. పాక్ ఓటమి ఖాయమే! ఇక హ్యారిస్ రవూఫ్, నసీం షా వంటి స్టార్ పేసర్ల గైర్హాజరీ.. దాంతో పాటు వర్ష సూచనలు పాక్ ఫైనల్ ఆశలపై నీళ్లు చల్లడం ఖాయమని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా 1984లో మొదలైన ఆసియా కప్ చరిత్రలో దాయాదులు భారత్- పాక్ ఫైనల్లో తలపడ్డ దాఖలాలు లేవు. ఇక రెండేళ్లకోసారి నిర్వహిస్తున్న ఈ ఈవెంట్లో టీమిండియా అత్యధికంగా ఏడుసార్లు చాంపియన్గా నిలవగా.. శ్రీలంక ఆరు, పాకిస్తాన్ రెండుసార్లు టైటిల్ గెలిచాయి. గతేడాది టీ20 ఫార్మాట్లో నిర్వహించిన ఆసియా కప్ చాంపియన్గా శ్రీలంక తన పేరును చరిత్రలో లిఖించుకుంది. చదవండి: Asia Cup: ఫైనల్లో భారత్ వర్సెస్ పాక్ లేనట్లే! మూటాముల్లె సర్దుకోండి.. -
Asia Cup: ఫైనల్లో భారత్ వర్సెస్ పాక్ లేనట్లే! మూటాముల్లె సర్దుకోండి..
Asia Cup 2023- Pakistan Vs Sri Lanka: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరుపై ఆ జట్టు అభిమానులు మండిపడుతున్నారు. కీలక ఆటగాడిపై వేటు వేసినందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టైటిల్ గెలవడం మాట అటుంచితే.. ఫైనల్ చేరడమే కష్టమని.. ఇక ఇంటికి వచ్చేందుకు సిద్ధం కావాలంటూ పాక్ జట్టును ఉద్దేశించి ఘాటు విమర్శలు చేస్తున్నారు. టీమిండియా చేతిలో చిత్తుగా ఓడి ఈ దుస్థితిలో కాగా ఆసియా కప్-2023 సూపర్-4లో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్.. శ్రీలంకతో చావోరేవో తేల్చుకోనుంది. కొలంబో వేదికగా గురువారం నాటి ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు భారత్తో పాటు ఫైనల్కు చేరుకుంటుంది. గాయాల కారణంగా కీలక పేసర్లు అవుట్ ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే మాత్రం రన్రేటు పరంగా మెరుగ్గా ఉన్న శ్రీలంక తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పాకిస్తాన్ను ఓ వైపు గాయాల బెడద వెంటాడుతుంటే.. మరోవైపు.. ఓపెనర్ ఫఖర్ జమాన్ను తప్పిస్తూ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. లంకతో మ్యాచ్కు ముందు పాక్ బుధవారమే తమ తుది జట్టును ప్రకటించింది. లంకతో మ్యాచ్లో ఏకంగా ఐదు మార్పులు స్టార్ పేసర్లు నసీం షా, హ్యారిస్ రవూఫ్, ఆఘా సల్మాన్ గాయాల కారణంగా జట్టుకు దూరం కాగా.. వారి స్థానాల్లో జమాన్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్, సౌద్ షకీల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక టీమిండియాతో మ్యాచ్లో దారుణ ప్రదర్శన కనబరిచిన ఫహీం ఆష్రఫ్పై వేటు పడగా.. మహ్మద్ నవాజ్ జట్టులోకి వచ్చాడు. అయితే, వెటరన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ స్థానంలో మహ్మద్ హ్యారిస్ను తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వరుస వైఫల్యాల నేపథ్యంలో వేటు! ఇప్పటి వరకు ఈ వన్డే టోర్నీలో మొత్తంగా ఆడిన మూడు ఇన్నింగ్స్లో ఫఖర్ జమాన్ కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియాతో మ్యాచ్లో 50 బంతులు ఆడి కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, పాక్ ఇన్నింగ్స్లో అతడే టాప్ స్కోరర్ కావడం గమనార్హం. ఈ క్రమంలో వరుస వైఫల్యాల నేపథ్యంలో కీలక మ్యాచ్లో ఫఖర్ జమాన్పై వేటు పడింది. అయితే, డూ ఆర్ డై మ్యాచ్లో అతడిని తప్పించడం జట్టుకు మైనస్గా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుస సెంచరీలు.. ద్విశతక వీరుడు తనదైన రోజు ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పగల సత్తా ఉన్న అనుభవం ఉన్న ఆటగాడిని కాదని హ్యారిస్ను ఆడించడం సరికాదని విశ్లేషకులు అంటున్నారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్లో సొంతగడ్డపై న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో ఫఖర్ జమాన్ వరుస సెంచరీలు సాధించాడు. రెస్ట్ పేరిట వేటు? జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. అయితే, గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్తో సతమతమవుతున్న ఫఖర్ జమాన్కు ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చిన మేనేజ్మెంట్ ఓపిక నశించి ఈసారి రెస్ట్ పేరిట వేటు వేసినట్లు తెలుస్తోంది. హ్యారిస్ రికార్డు గణాంకాలేమో ఇలా ఇక ఇప్పటి వరకు పాక్ తరఫున 76 వన్డేలు ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 3268 పరుగులు సాధించాడు. ఫఖర్ జమాన్ ఖాతాలో 10 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉంది. పాక్ తరఫున వన్డేల్లో ద్విశతకం సాధించిన తొలి బ్యాటర్ అతడే! ఇదిలా ఉంటే.. ఫఖర్ జమాన్ స్థానంలో తుదిజట్టులో వచ్చిన మహ్మద్ హ్యారిస్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఆడిన 5 వన్డేల్లో కలిపి 27 పరుగులు సాధించాడీ వికెట్ కీపర్ బ్యాటర్. ఇదిలా ఉంటే.. గందరగోళ పరిస్థితుల్లో లంక చేతిలో పాకిస్తాన్ చిత్తు కావడం ఖాయమంటూ టీమిండియా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: టీమిండియాకు షాక్.. ఉమ్రాన్కు లక్కీ ఛాన్స్! రేసులో అతడు కూడా! -
Asia Cup: మ్యాచ్ రద్దయితే ఫైనల్కు లంక! పాక్ సంగతి అంతే ఇక..
కొలంబో: ఆసియా కప్లో ‘సెమీఫైనల్’లాంటి మ్యాచ్కు రంగం సిద్ధమైంది. సూపర్–4 దశలో భాగంగా నేడు జరిగే పోరులో శ్రీలంకతో పాకిస్తాన్ తలపడుతుంది. రెండు వరుస విజయాలతో భారత జట్టు ఇప్పటికే ఫైనల్కు అర్హత సాధించగా... భారత్తో తుది పోరులో తలపడే ప్రత్యర్థిని ఈ మ్యాచ్ నిర్ణయించనుంది. నాలుగో జట్టయిన బంగ్లాదేశ్ ఇప్పటికే రెండు మ్యాచ్లలో ఓడి ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేటి మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్లోకి అడుగు పెడుతుంది. భారత్ చేతిలో చిత్తుగా ఓడి ఆత్మవిశ్వాసం దెబ్బతినడంతో పాటు రన్రేట్లో పాక్ భారీగా వెనుకబడగా... టీమిండియా చేతిలో ఓడినా చివరి వరకు పోరాడిన లంక మెరుగైన స్థితిలో ఉంది. వర్షం కారణంగా నేటి మ్యాచ్ రద్దయితే లంక లాభపడుతుంది. మెరుగైన రన్రేట్తో ఆ జట్టు ఫైనల్కు చేరుతుంది. బలాబలాల దృష్ట్యా చూస్తే పాకిస్తాన్, శ్రీలంక సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. అయితే సొంతగడ్డపై లంకకు అదనపు ప్రయోజనం ఉంది. భారత్తో పోరులో పాక్ పేలవ బ్యాటింగ్ బయటపడింది. ఓపెనర్లు ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హఖ్ అంతంత మాత్రమే ఆడుతుండగా, వరల్డ్ నంబర్వన్ బ్యాటర్గా బరిలోకి దిగిన బాబర్ ఆజమ్ దానికి తగినట్లుగా కనీస ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. మిడిలార్డర్లో రిజ్వాన్, ఆగా సల్మాన్, ఇఫ్తికార్ కూడా జట్టు ఆశించిన రీతిలో స్కోర్లు చేయలేకపోతున్నారు. అయితే అన్నింటికంటే మించి ప్రధాన బౌలర్లు హారిస్ రవూఫ్, నసీమ్ షా ఈ మ్యాచ్కు దూరం కావడం పాక్కు పెద్ద దెబ్బ. నసీమ్ అధికారికంగా తప్పుకోగా అతని స్థానంలో జమాన్ను ఎంపిక చేశారు. రవూఫ్ కూడా ఆడే తక్కువగా ఉండటంతో దమాని బరిలోకి దిగవచ్చు. పాక్ స్పిన్ కూడా బలహీనంగా ఉంది. మరోవైపు లంక స్పిన్ బలమేంటో గత మ్యాచ్లో కనిపించింది. ఇదే జోరు కొనసాగిస్తే పాక్ను ఆ జట్టు సునాయాసంగా అడ్డుకోగలదు. వెలలాగె, అసలంక, తీక్షణలను పాక్ ఎలా ఆడుతున్నది చూడాలి. ప్రధానంగా కుశాల్ మెండిస్, నిసాంక, సమరవిక్రమ, ధనంజయలపై ఆ జట్టు బ్యాటింగ్ ఆధారపడి ఉంది. ఆల్రౌండర్గా కెపె్టన్ షనక కీలక ప్రదర్శన చేయాల్సి ఉంది. 155 ఇప్పటి వరకు శ్రీలంక, పాకిస్తాన్ జట్లు 155 వన్డే మ్యాచ్ల్లో తలపడ్డాయి. 92 మ్యాచ్ల్లో పాకిస్తాన్, 58 మ్యాచ్ల్లో శ్రీలంక గెలిచాయి. ఒక మ్యాచ్ ‘టై’ అయింది. నాలుగు మ్యాచ్లు రద్దయ్యాయి. -
శ్రీలంకతో మ్యాచ్.. తుది జట్టును ప్రకటించిన పాక్.. ఏకంగా ఐదు మార్పులు
ఆసియా కప్-2023లో భాగంగా కొలొంబో వేదికగా రేపు (సెప్టెంబర్ 14) శ్రీలంకతో జరుగబోయే మ్యాచ్కు ముందు పాకిస్తాన్ తమ తుది జట్టును ప్రకటించింది. భారత్తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన హరీస్ రౌఫ్, నసీం షాలు ఈ మ్యాచ్కు అందుబాటులో లేరు. వీరిలో నసీం షా టోర్నీ మొత్తానికే దూరం కాగా.. రౌఫ్ గాయంపై స్పష్టత రావాల్సి ఉంది. నసీం షా స్థానంలో జమాన్ ఖాన్ తుది జట్టులోకి రాగా.. హరీస్ రౌఫ్ ప్లేస్లో మొహమ్మద్ వసీం జూనియర్ జట్టులో చేరాడు. ఈ రెండు మార్పులతో పాటు పాక్ మరో మూడు మార్పులు కూడా చేసింది. భారత్తో మ్యాచ్ సందర్భంగానే గాయపడిన అఘా సల్మాన్ స్థానంలో సౌద్ షకీల్ జట్టులోకి రాగా.. ఓపెనర్ ఫకర్ జమాన్ స్థానంలో (రెస్ట్) మొహమ్మద్ హరీస్ ప్లేయింగ్ ఎలెవెన్లోకి వచ్చాడు. భారత్తో మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఫహీమ్ అష్రాఫ్పై (10-0-74-0) వేటు పడింది. అతడి స్థానంలో మొహహ్మద్ నవాజ్ తుది జట్టులోకి వచ్చాడు. మొత్తంగా రేపటి మ్యాచ్ కోసం పాకిస్తాన్ ఏకంగా ఐదు మార్పులు చేసింది. ఇదిలా ఉంటే, ఆసియా కప్-2023లో పాక్ భవితవ్యం రేపు శ్రీలంకతో జరిగే మ్యాచ్తో తేలిపోతుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో పాక్ ఓడినా లేక ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా ఆ జట్టు ఫైనల్కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ మ్యాచ్లో పాక్ గెలిస్తే మాత్రం సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్లో భారత్తో తలపడుతుంది. శ్రీలంకతో మ్యాచ్కు పాకిస్తాన్ తుది జట్టు: ఇమామ్ ఉల్ హాక్, మొహమ్మద్ హరీస్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మొహమ్మద్ రిజ్వాన్ (వికెట్కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), మొహమ్మద్ నవాజ్, జమాన్ ఖాన్, షాహీన్ అఫ్రిది, మొహమ్మద్ వసీం జూనియర్ -
Asia Cup 2023: పాకిస్తాన్కు బ్యాడ్ న్యూస్
ఆసియా కప్-2023లో భాగంగా శ్రీలంకతో రేపు (సెప్టెంబర్ 14) జరుగబోయే కీలక మ్యాచ్కు ముందు పాకిస్తాన్కు భారీ షాక్ తగిలింది. టీమిండియాతో సూపర్-4 మ్యాచ్ సందర్భంగా గాయపడిన ఆ దేశ స్టార్ పేసర్ నసీం షా ఆసియా కప్ మొత్తానికే దూరమయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇవాళ (సెప్టెంబర్ 13) అధికారికంగా ప్రకటించింది. నసీం షా గాయం (భుజం) తీవ్రత అధికంగా ఉండటంతో, త్వరలో జరుగనున్న వరల్డ్కప్ను దృష్టిలో పెట్టుకుని అతనికి పూర్తి విశ్రాంతినిచ్చినట్లు పీసీబీ పేర్కొంది. నసీం షా స్థానాన్ని జమాన్ ఖాన్తో రీప్లేస్ చేస్తున్నట్లు వెల్లడించింది. జమాన్ ఇప్పటికే జట్టులో చేరిపోయాడని, ట్రైనింగ్లో కూడా పాల్గొంటున్నాడని తెలిపింది. నసీం షా జట్టును వీడినప్పటికీ, అతను నిరంతరం పీసీబీ వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడని, ప్రపంచకప్ సమయానికంతా అతను పూర్తి ఫిట్నెస్ట్ సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేసింది. మరోవైపు భారత్తో సూపర్-4 మ్యాచ్ సందర్భంగానే గాయపడిన మరో పేసర్ హరీస్ రౌఫ్పై పీసీబీ ఎలాంటి ప్రకటన చేయలేదు. పీసీబీ డాక్టర్లు నసీం, రౌఫ్లు ఇద్దరు తమ పర్యవేక్షణలో ఉంటారని చెప్పారు కాని, రౌఫ్ గురించి ప్రత్యేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దీంతో రౌఫ్ గాయం నుంచి కోలుకున్నాడని తెలుస్తుంది. నసీంతో పోలిస్తే రౌఫ్ గాయం తేలికపాటిదని, అతను పూర్తిగా రికవర్ అయ్యాడని సమాచారం. తొలుత పీసీబీ రౌఫ్కు కూడా రీప్లేస్మెంట్ను ప్రకటించాలని భావించినప్పటికీ, అతను వేగంగా కోలుకోవడంతో ఆ అవసరం లేదని భావించినట్లు తెలుస్తుంది. రౌఫ్ రేపు శ్రీలంకతో జరిగే మ్యాచ్కు అందుబాటులో ఉంటాడో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి నసీం షా ఒక్కడే గాయం కారణంగా పాక్ జట్టును వీడాడు. కాగా, భారత్తో మ్యాచ్ తర్వాత గాయపడిన రౌఫ్కు రీప్లేస్మెంట్గా షానవాజ్ దహానిని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఆసియా కప్-2023లో పాక్ భవితవ్యం రేపు (సెప్టెంబర్ 14) శ్రీలంకతో జరిగే మ్యాచ్తో తేలిపోతుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో పాక్ ఓడినా లేక ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా ఆ జట్టు ఫైనల్కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ మ్యాచ్లో పాక్ గెలిస్తే మాత్రం సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్లో భారత్తో తలపడుతుంది. -
ఆసియా కప్-2023 ఫైనల్లో భారత్, పాక్..?
ఆసియా కప్-2023లో భారత్-పాక్లు ముచ్చటగా మూడోసారి తలపడే అవకాశం ఉంది. తొలుత ఈ రెండు జట్లు గ్రూప్ దశలో తలపడగా.. ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఆతర్వాత ఇరు జట్లు మరోసారి సూపర్-4 స్టేజీలో ఎదురెదురుపడ్డాయి. అప్పుడు టీమిండియా.. పాక్ను 228 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. ప్రస్తుత సమీకరణల ప్రకారం భారత్, పాక్లు మరోసారి తలపడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 17న కొలొంబోలో జరిగే ఫైనల్లో మరోమారు దాయాదుల పోరు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే, ఇది జరగాలంటే రేపు (సెప్టెంబర్ 14) శ్రీలంకతో జరుగబోయే గ్రూప్-4 మ్యాచ్లో పాకిస్తాన్ తప్పక గెలవాల్సి ఉంటుంది. గెలుపు తప్ప వేరే ఏ ఇతర ఫలితం వచ్చినా, పాక్ ఫైనల్కు చేరదు. ఎందుకంటే ప్రస్తుతం పాక్ (-1.892) కంటే శ్రీలంకకు (-0.200) మెరుగైన రన్రేట్ ఉంది. ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైతే మెరుగైన రన్రేట్ ఆధారంగా శ్రీలంక ఫైనల్కు చేరుకుంటుంది. మరోవైపు భారత్ ఇంకో మ్యాచ్ (బంగ్లాదేశ్తో) ఆడాల్సి ఉండగానే ఫైనల్కు చేరుకుంది. పాక్, శ్రీలంకలపై వరుస విజయాలతో భారత్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. భారత్తో మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ, రెండు మ్యాచ్ల్లో ఓడిన కారణంగా బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాబట్టి కొలొంబో వేదికగా రేపు జరుగబోయే మ్యాచ్లో పాకిస్తాన్ తప్పక గెలిస్తేనే, ఫైనల్లో దాయాదుల పోరు జరిగే అవకాశం ఉంటుంది. దీంతో రేపటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాకుండా ఉండాలని, అలాగే లంకపై పాక్ గెలవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. -
క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘనత సాధించిన విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ప్రపంచ క్రికెట్లో అత్యంత అరుదైన ఘనతను సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లు) 300 విజయాల్లో భాగమైన ఆరో క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. ఆసియా కప్-2023లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 12) జరిగిన సూపర్-4 మ్యాచ్లో శ్రీలంకపై విజయం సాధించడం ద్వారా కోహ్లి ఈ ఘనతను సాధించాడు. ప్రపంచ క్రికెట్లో కోహ్లికి ముందు కేవలం ఐదుగురు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఈ జాబితాలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అత్యధికంగా 377 విజయాలు సాధించాడు. ఆతర్వాత లంక లెజెండ్ మహేళ జయవర్ధనే (336), క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (307), సౌతాఫ్రికన్ ఆల్టైమ్ గ్రేట్ జాక్ కల్లిస్ (305), లంక లెజెండ్ కుమార సంగక్కర (305) ఉన్నారు. ఇదిలా ఉంటే, లంకతో జరిగిన మ్యాచ్లో 41 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా ఆసియా కప్-2023 ఫైనల్కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిన తక్కువ స్కోర్ను డిఫెండ్ చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కెప్టెన్ రోహిత్ శర్మ (53), కేఎల్ రాహుల్ (39), ఇషాన్ కిషన్ (33), అక్షర్ పటేల్ (26) ఓ మోస్తరు స్కోర్లతో రాణించడంతో 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. లంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలగే (5/40), చరిత్ అసలంక (4/18) టీమిండియా పతనాన్ని శాశించారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్ (4/43), బుమ్రా (2/30), జడేజా (2/33), సిరాజ్ (1/17), హార్ధిక్ పాండ్యా (1/14) కకావికలం చేశారు. వీరి ధాటికి లంకేయులు 41.3 ఓవర్లలో 172 పరుగులకు చాపచుట్టేశారు. లంక ఇన్నింగ్స్లో దునిత్ వెల్లలగే (42 నాటౌట్) ఒక్కడే పోరాడాడు. -
‘టీమిండియా మ్యాచ్ ఫిక్స్ చేశారు’.. మండిపడ్డ అక్తర్! మనోళ్లకు చేతకాదు..
Asia Cup 2023- India vs Sri Lanka: ‘‘అసలు మీరేం చేస్తున్నారో.. ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇండియా మ్యాచ్ ఫిక్స్ చేసిందంటూ నాకు మీమ్స్తో కూడిన మెసేజ్లు వచ్చిపడుతున్నాయి. పాకిస్తాన్ను రేసు నుంచి తప్పించేందుకు టీమిండియా ఉద్దేశపూర్వకంగానే ఓడిపోతుందనేది వాటి సారాంశం. మీరంతా బాగానే ఉన్నారు కదా? అసలు ఇలా మాట్లాడటంలో ఏమైనా అర్థం ఉందా? శ్రీలంక బౌలర్లు శక్తిని కూడదీసుకుని ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. వెల్లలలగే, అసలంక కఠినంగా శ్రమించారు. 20 ఏళ్ల పిల్లాడి పట్టుదల చూశారా? ఆ 20 ఏళ్ల పిల్లాడి తాపత్రయాన్ని మీరు చూశారా? 43 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఇదంతా చూస్తూ ఉన్నా.. ఇండియా నుంచి, ఇతర దేశాల అభిమానుల నుంచి నాకు ఒకటే ఫోన్ కాల్స్. ఈరోజు ఇండియా కావాలనే ఓడిపోతుందని ఒకటే వాగడం’’ అంటూ పాకిస్తాన్ మాజీ ఫాస్ట్బౌలర్ షోయబ్ అక్తర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలగే పోరాటం చూసిన తర్వాత కూడా ఇలా ఎలా మాట్లాడగలిగారో అర్థం కావడం లేదంటూ సోకాల్డ్ ఫ్యాన్స్ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. కాగా ఆసియా కప్-2023 సూపర్-4లో పాకిస్తాన్ను 228 పరుగులతో చిత్తు చేసిన భారత జట్టు.. మంగళవారం శ్రీలంకతో తలపడింది. తిప్పేసిన స్పిన్నర్లు ఈ మ్యాచ్లో గెలిస్తే నేరుగా ఫైనల్ చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో కొలంబోలో రోహిత్ సేన ఎలాంటి పొరపాటు చేయలేదు. పాక్తో మ్యాచ్ ముగిసిన 15 గంటల్లోపే మళ్లీ మైదానంలో దిగిన టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో లంక స్పిన్నర్లు వెల్లలగే, చరిత్ అసలంక ధాటికి 213 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. స్పిన్కు అనుకూలిస్తున్న పిచ్పై వెల్లలగే బంతిని తిప్పేసి ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. టీమిండియా- లంక ఫలితంపై అయితే, లక్ష్య ఛేదనలో లంక 172 పరుగులకే ఆలౌట్ కావడంతో అతడి పోరాటం వృథాగా పోయింది. 41 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా నేరుగా ఫైనల్లో ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. గ్రూప్-ఏలో భారత జట్టుతో పాటు ఉన్న పాకిస్తాన్కు ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే.. లంకను రోహిత్ సేన ఓడించాల్సిందే! ఈ నేపథ్యంలోనే కొంతమంది టీమిండియా టాపార్డర్ విఫలం కావడం చూసి.. లంకను గెలిపించి పాక్ను రేసు నుంచి తప్పించేందుకు ఇలా ఆడుతున్నారంటూ ఆరోపించారు. ఇదే విషయమై తనకు కాల్స్ వచ్చాయని రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా తెలిపాడు. వాళ్లంతా కష్టపడ్డారు.. మనోళ్లకు చేతకాదు ‘‘వాళ్లు ఎందుకు అలా అంటున్నారో అర్థం కాలేదు. అసలు టీమిండియా ఎందుకు ఓడిపోవాలని అనుకుంటుంది? గెలిస్తే ఎంచక్కా ఫైనల్ చేరే అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకుంటుంది? ఎలాంటి కారణాలు లేకుండా ఇలాంటి పిచ్చిపని ఎందుకు చేయాలనుకుంటుంది? లో స్కోరింగ్ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు పట్టుదలగా పోరాడారు. కుల్దీప్ అద్భుతం చేశాడు. జట్టును గెలిపించేందుకు జస్ప్రీత్ బుమ్రా శక్తిమేర కష్టపడ్డాడు. ఇక లంక కుర్రాడు వెల్లలగే బౌలింగ్, బ్యాటింగ్ రెండూ చేయగలడు. కానీ మన వాళ్ల సంగతి వేరు. వాళ్ల నుంచి ఇలాంటి పోరాటం ఎప్పుడూ చూడలేదు. మన ఫాస్ట్బౌలర్లు షాహిన్ ఆఫ్రిది, హ్యారిస్ రవూఫ్, నసీం షా 10 ఓవర్లు బౌలింగ్ చేసినా గాయపడకుండా ఉంటే చూడాలని ఉంది. మన వాళ్లు కూడా పోరాటపటిమ కనబరచాలి’’ అని అక్తర్ వ్యాఖ్యానించాడు. కాగా పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్లో శ్రీలంకపై గెలిస్తేనే ఫైనల్ బెర్తు ఖరారవుతుంది. చదవండి: టీమిండియాకు షాక్.. ఉమ్రాన్కు లక్కీ ఛాన్స్! రేసులో అతడు కూడా! 5 వికెట్లు మాత్రమే కాదు.. సిక్సర్లు, సెంచరీ హీరో కూడా! ఎవరీ దునిత్ వెల్లలగే? Super11 Asia Cup 2023 | Super 4 | India vs Sri Lanka | Highlightshttps://t.co/EI2KjpFup6#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 12, 2023 -
Ind vs SL: అస్సలు ఊహించలేదు.. కోహ్లి వికెట్ తీశాడు.. కానీ!
Asia Cup 2023- India vs Sri Lanka: ఆసియా కప్-2023 సూపర్-4లో భాగంగా టీమిండియాతో మ్యాచ్లో ఓటమిపై శ్రీలంక కెప్టెన్ దసున్ షనక స్పందించాడు. కొలంబో వికెట్ బ్యాటర్లకు అనుకూలిస్తుందని భావించామని.. కానీ అనూహ్యరీతిలో బంతి టర్న్ అయిందని పేర్కొన్నాడు. ఇక దునిత్ వెల్లలగే అద్భుతం చేయగలడని తాను ముందే ఊహించానన్న షనక.. అందుకు తగ్గట్లే అతడి ఆట తీరు కొనసాగిందని హర్షంవ వ్యక్తం చేశాడు. అదే విధంగా చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వ అద్భుతంగా బ్యాటింగ్ చేశారని కొనియాడాడు. టాపార్డర్ను కుదేలు చేసిన వెల్లలగే కాగా మంగళవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుని.. లంకను ఫీల్డింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో శ్రీలంక స్పిన్నర్లు దునిత్ వెల్లలగే, చరిత్ అసలంక ధాటికి భారత బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. వెల్లలగే ఐదు, అసలంక నాలుగు వికెట్లు పడగొట్టగా.. మహీశ్ తీక్షణకు ఒక వికెట్ దక్కింది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ శతకం(53)తో టాప్ స్కోరర్గా నిలవగా.. 49.1 ఓవర్లలో టీమిండియా 213 పరుగులు చేయగలిగింది. అసలంక, ధనంజయ పోరాడినా లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకను స్పిన్ ఆల్రౌండర్లు చరిత్ అసలంక(22), ధనంజయ డి సిల్వ(41) ఆదుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. భారత బౌలర్ల ధాటికి లంక జట్టు 172 పరుగులకే చాపచుట్టేయగా.. 41 పరుగులతో గెలిచి రోహిత్ సేన ఫైనల్కు చేరింది. కాగా ఈ ఓటమితో వరుసగా 13 వన్డే విజయాలు సాధించిన షనక బృందం జోరుకు బ్రేక్ పడింది. బౌలింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఈ నేపథ్యంలో దసున్ షనక మాట్లాడుతూ.. ‘‘వికెట్ ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదు. బ్యాటింగ్ పిచ్ అనుకున్నాం.. కానీ అలా జరుగలేదు. వెల్లలగే అద్భుతంగా రాణించాడు. ధనంజయ, అసలంక కూడా గొప్పగా బౌలింగ్ చేశారు. ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్లు నెట్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. అందుకే టీమిండియాతో మ్యాచ్లోనాకు వారిద్దరి రూపంలో రెండు మంచి స్పిన్ ఆప్షన్లు కనిపించాయి’’ అని పేర్కొన్నాడు. ఇక వెల్లలగే అద్భుతంగా ఆడగలడని అంచనా వేశానన్న షనక.. అతడు విరాట్ కోహ్లి వికెట్ తీయడం ప్రత్యేకమని హర్షం వ్యక్తం చేశాడు. ఈరోజు వెల్లలగేదే అంటూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్పై ప్రశంసలు కురిపించాడు. కాగా ఈ మ్యాచ్లో వెల్లలగే శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి(3), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా వికెట్లు తీశాడు.ఘ తదుపరి పాకిస్తాన్తో చావోరేవో ఇదిలా ఉంటే.. శ్రీలంక తమ తదుపరి మ్యాచ్లో పాకిస్తాన్తో చావోరేవో తేల్చుకోనుంది. గురువారం నాటి ఈ మ్యాచ్లో గెలిస్తేనే లంక ఫైనల్కు చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఇదిలా ఉంటే.. గతేడాది టీ20 ఫార్మాట్లో నిర్వహించిన ఆసియా కప్ టోర్నీలో శ్రీలంక ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: టీమిండియాకు షాక్.. ఉమ్రాన్కు లక్కీ ఛాన్స్! రేసులో అతడు కూడా! 5 వికెట్లు మాత్రమే కాదు.. సిక్సర్లు, సెంచరీ హీరో కూడా! ఎవరీ దునిత్ వెల్లలగే? Sri Lanka's young sensation finishes with a maiden five-for🤩#INDvSL📝: https://t.co/PCYHPHAr6B pic.twitter.com/dLKo0UrIJc — ICC (@ICC) September 12, 2023