Federal Reserve System
-
మార్కెట్ చూపు ఫెడ్ వైపు
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య కమిటీ విధాన నిర్ణయాలు, స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం స్టాక్ సూచీలకు దిశానిర్దేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, యూఎస్, భారత్ బాండ్లపై రాబడులను ఇన్వెస్టర్లు పరిశీలించవచ్చంటున్నారు. వీటితో పాటు క్రూడాయిల్ కదలికలు, డాలర్ మారకంలో రూపాయి విలువ అంశాలు ట్రేడింగ్ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. అలాగే వచ్చే వారంలో రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్కేడ్ డెవలపర్స్, ఫైనాన్షియల్ సరీ్వసెస్ ప్లాట్ఫామ్ నార్తెర్న్ ఆర్క్ క్యాపిటల్ ఐపీఓల సబ్స్క్రిబ్షన్తో పాటు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిస్టింగ్పైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. ‘‘ఫెడ్ పాలసీ కమిటీ ద్రవ్య విధాన నిర్ణయాల వెల్లడికి ముందు సూచీలు పరిమిత శ్రేణిలో ట్రేడవ్వొచ్చు. వివిధ రంగాల షేర్లలో లాభాల స్వీకరణకు అవకాశం ఉంది. సాంకేతికంగా నిఫ్టీకి దిగువ స్థాయిలో 25,000 వద్ద తక్షణ మద్దతు ఉంది. కొనుగోళ్లు నెలకొంటే ఎగువున 25,500 వద్ద కీలక నిరోధం ఉంది. ఈ స్థాయిని చేధిస్తే 26,000 వద్ద మరో నిరోధం ఉంది’’ అని రిలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ హెడ్ అజిత్ మిశ్రా తెలిపారు స్థూల ఆర్థిక గణాంకాలు దేశీయ ఆగస్టు టోకు ద్రవ్యోల్బణ డేటాను ఇన్వెస్టర్లు పరిశీలించనున్నారు. అమెరికా పారిశ్రామికోత్పత్తి, ఫెడ్ కమిటీ ఆర్థిక అంచనాలు, యూఎస్ నిరుద్యోగ క్లెయిమ్స్ ట్రేడింగ్ను ప్రభావితం చేయోచ్చు. బ్యాంక్ ఆఫ్ జపాన్ శుక్రవారం ద్రవ్యోల్బణం డేటా శుక్రవారం విడుదల కానుంది అదే రోజున బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య పాలసీ నిర్ణయాలు వెలువడనున్నాయి. క్రూడాయిల్ ధరలూ కీలకం ద్రవ్యోల్బణంతో పాటు ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్లపై ప్రభావాన్ని చూపే క్రూడాయిల్ ధరలూ ఈ వారం కీలకం కానున్నాయి. అంతర్జాతీయంగా ప్రస్తుతం క్రూడ్ ధరలు 14 నెలల కనిష్టం వద్ద ట్రేడవుతున్నాయి. భారత్లో అధికంగా వినియోగించే బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 71.61 డాలర్ల దిగువకు చేరుకుంది. దీంతో చమురు దిగుమతులపై ప్రధానంగా ఆధారపడే దేశమైన భారత్కు ఇది సానుకూల అంశంగా మారింది.ఫెడ్ నిర్ణయాలపై దృష్టివడ్డీరేట్లపై ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాలపైనే భారత్తో సహా అంతర్జాతీయ మార్కెట్ల చూపు కేంద్రీకృతమై ఉంది. వడ్డీరేట్లను 25 లేదా 50 బేసిస్ పాయింట్లు మేర ఫెడ్ తగ్గించవచ్చనేది ఆర్థికవేత్తల అంచనా. అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశాలు మంగళవారం(సెపె్టంబర్ 17న) మొదలవుతాయి. భారత కాలమాన ప్రకారం బుధవారం(18న) రాత్రి ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్య విధాన నిర్ణయాలు వెల్లడించనున్నారు. రెండురోజుల ఫెడ్ పాలసీ సమావేశంలో ద్రవ్య కమిటీ తీసుకొనే నిర్ణయాలు భారత్తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల గమనానికి అత్యంత కీలకం కానున్నాయి. అలాగే పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలను విదేశీ ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. ప్రథమార్థంలో రూ.27,856 కోట్లుఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో పాటు దేశీయ మార్కెట్ స్థిర్వతం కారణంగా సెప్టెంబర్ ప్రథమార్థం(1–15న) విదేశీ ఇన్వెస్టర్లు రూ.27,856 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ‘‘అగ్ర రాజ్యాలైన అమెరికా, చైనాల ఆర్థిక మందగమన భయాలతో ఎఫ్ఐఐలు తమ కేటాయింపులను పునశ్చరణ చేసుకోవచ్చు. రిస్క్ సామర్థ్యాన్ని తగ్గించుకునే వ్యూహాం అమలు చేసినట్లయితే భారత్ లాంటి వర్థమాన దేశాల్లో ఎఫ్పీఐ పెట్టుబడుల తగ్గొచ్చు’’ అని మోజోపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ సీఈవో సునీల్ దమానియా తెలిపారు. ఇదే సమీక్షా కాలం(సెపె్టంబర్ 1–13 తేదీల)లో డెట్ మార్కెట్లో రూ.7,525 కోట్ల పెట్టుడులు పెట్టారు. ఎఫ్ఐఐలు ఆగస్టులో రూ.7,320 కోట్లు, జూలైలో రూ.32,365 కోట్లు, జూలైలో రూ.26,565 కోట్లు చొప్పున విక్రయాలు జరిపారు. -
సూచీలకు ఫెడ్ జోష్
ముంబై: ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వడ్డీరేట్ల తగ్గింపు ఆశలను సజీవంగా ఉంచడంతో గురువారం స్టాక్ సూచీలు లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్ 539 పాయింట్లు పెరిగి 72,641 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 173 పాయింట్లు లాభపడి 22,012 వద్ద నిలిచింది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ ద్రవ్య పాలసీ నిర్ణయాల వెల్లడి సందర్భంగా బుధవారం రాత్రి ‘ద్రవ్యోల్బణం దీర్ఘకాలిక లక్ష్యానికి మించి ఉన్నప్పటికీ, ఈ ఏడాదిలో మూడు సార్లు వడ్డీరేట్ల కోత ఉంటుంది’ అని పావెల్ సంకేతాలిచ్చారు. దీంతో అమెరికాతో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. సెన్సెక్స్ ఉదయం 405 పాయింట్లు పెరిగి 72,507 వద్ద, నిఫ్టీ 151 పాయింట్లు బలపడి 21,990 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు రోజంతా ట్రేడయ్యాయి. ముఖ్యంగా మెటల్, విద్యుత్, ఇంధన షేర్లు సూచీల ర్యాలీకి ప్రాతినిథ్యం వహించాయి. ఒక దశలో సెన్సెక్స్ 781 పాయింట్లు ఎగసి 72,881 వద్ద, నిఫ్టీ 242 పాయింట్లు బలపడి 22,081 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. కొంతకాలంగా అమ్మ కాల ఒత్తిడికి లోనైన చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ ఇండెక్సులు వరుసగా 2.36%, 2.01% చొప్పున ర్యాలీ చే శాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు ఉండొచ్చనే ఆశలతో బుధవారం అమెరికా మార్కెట్లు జీవితకాల గరిష్టాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్ ర్యాలీతో బీఎస్ఈలో రూ.5.72 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ. 379 లక్షల కోట్లకు చేరింది. క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ లిస్టింగ్ లాభాలు మాయం క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సరీ్వసెస్ లిమిటెడ్ లిస్టింగ్ లాభాలు నిలుపుకోలేకపోయింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.715)తో పోలిస్తే 11% ప్రీమియంతో రూ.795 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో లిస్టింగ్ లాభాలన్నీ మాయమయ్యాయి. చివరికి రూ.0.38% నష్టంతో రూ.712 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.995 కోట్లుగా నమోదైంది. -
Interim Budget 2024: ప్చ్..నచ్చలే! సెన్సెక్స్ నష్టం 107 పాయింట్లు
ముంబై: సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ స్టాక్ మార్కెట్ను మెప్పించకలేకపోయింది. మౌలిక వసతుల రంగానికి అంచనాల కంటే తక్కువ కేటాయింపులు, ఆదాయం పన్ను శ్లాబులు య«థాతథంగా కొనసాగింపు నిర్ణయాలు నిరాశపరిచాయి. మరోవైపు ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య పాలసీ నిర్ణయాల వెల్లడి సందర్భంగా చైర్మన్ పావెల్ ఈ మార్చిలోనూ కీలక వడ్డీ రేట్ల తగ్గింపు ఉండకపోవచ్చనే సంకేతాలిచ్చారు. ఇన్వెస్టర్లు క్యాపిటల్ గూడ్స్, మెటల్, రియల్టీ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ఫలితంగా సెన్సెక్స్ 107 పాయింట్లు నష్టపోయి 71,645 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 28 పాయింట్లు దిగివచ్చి 21,698 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో ఒడిదుడుకులు... సార్వత్రిక ఎన్నికల ముందు ప్రజాకర్షక బడ్జెట్ ఉండొచ్చనే అంచనాలతో ఉదయం స్టాక్ మార్కెట్ లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 247 పాయింట్లు పెరిగి 71,999, నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 21,781 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. జనరంజక బడ్జెట్ సమర్పణ ఆశలతో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగ సమయం(గంటసేపు)లో సెన్సెక్స్ 400 పాయింట్లు పెరిగి 72,151 వద్ద, నిఫ్టీ 107 పాయింట్లు బలపడి 21,833 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. అయితే స్టాక్ మార్కెట్కు ఉత్సాహాన్నిచ్చే ప్రకటలేవీ వెలువడకపోవడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ పాల్పడ్డారు. ఫలితంగా ఆరంభ లాభాలు కోల్పోయిన సూచీలు చివరికి నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 576 పాయింట్ల పరిధిలో నిఫ్టీ 174 పాయింట్ల రేంజ్లో కదలాడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► బడ్జెట్ ప్రకటన రోజు గత ఆరేళ్లలో స్టాక్ మార్కెట్ నాలుగు పర్యాయాలు లాభపడగా., రెండుసార్లు నష్టాలు చవిచూసింది. 2023, 2022, 2021, 2019 ఏడాదిల్లో పెరిగింది. కాగా, 2020, 2024 ఏడాదిల్లో పతనాన్ని చవిచూసింది. ► బాండ్లపై రాబడులు తగ్గడంతో ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. పీఎస్బీ, ఐఓబీ, యూకో బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ షేర్లు 7–5%, కెనరా బ్యాంక్, పీఎన్బీ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ షేర్లు 4–3% పెరిగాయి. మహారాష్ట్ర బ్యాంక్, ఎస్బీఐలు 2–1% లాభపడ్డాయి. ఎన్ఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 3.11% లాభపడింది. ► రైల్వే సంబంధిత స్టాకులు ఆరంభ లాభాలు కోల్పోయి నష్టాలు మూటగట్టుకున్నాయి. ఇర్కాన్ 3.69%, రైల్వే వికాస్ నిగమ్ 3.49%, రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 3%, జుపిటర్ వేగన్స్ 2% పతనమమయ్యాయి. ఐఆర్సీటీసీ 1.50%, టెక్స్మాకో రైల్ ఇంజనీరింగ్, టిటాఘర్ రైల్వే సిస్టమ్స్ 1% నష్టపోయాయి. ► చరిత్రాత్మకంగా పరిశీలిస్తే మధ్యంతర బడ్జెట్ వేళ ఈక్విటీ మార్కెట్లు పెద్దగా స్పందించలేదు. ఈ ఏడాది అదే పునరావృతమైంది. మూలధన వ్యయాలకు కేటాయింపుల స్వల్ప పెంపు, ద్రవ్య లోటు 5.5% నుంచి 5.1%కి తగ్గింపు లక్ష్యం మినహా ఉత్సాహాన్నిచ్చే ఇతర ప్రకటలేవీ వెలువడలేదు. ప్రసంగం తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే వరకు వడ్డీరేట్ల తగ్గింపు యోచన సముచితంకాదని ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలతో అమెరికా పదేళ్ల బాండ్లపై రాబడులు 4% పెరగడం ప్రతికూల ప్రభావం చూపింది – యస్ సెక్యూరిటీస్ ఎండీ అమర్ అంబానీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బాధ్యతాయుత, వినూత్న, సమిళిత మధ్యంతర బడ్జెట్ను సమరి్పంచారు. ఆర్థిక ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ., ప్రైవేట్ మూల పెట్టుబడులకు అవకాశం కల్పించారు. జాతీయ ప్రాముఖ్యతలున్న రంగాల వృద్ధికి మరోసారి పటిష్ట పునాదులు వేశారు’’ – బీఎస్ఈ ఎండీ సుందరరామన్ రామమూర్తి -
Fed Meeting: వడ్డీరేట్ల పెంపు తప్పదు: ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్
ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పకడ్బందీ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు వడ్డీరేట్లు పెంచాల్సిందేనని యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావాల్సి ఉందని పావెల్ సంకేతాలిచ్చారు. ఇందుకు రానున్న రోజుల్లో వడ్డీరేట్లు పెంచక తప్పదని ప్రకటించారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా ఇంకా ఆందోళనకర స్థాయిలోనే కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం రెండు శాతానికి పడిపోయేంత వరకు వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉందన్నారు. ఫెడరల్ రిజర్వ్ గతంలోలాగా వడ్డీరేట్లను పెంచకపోవచ్చనే అభిప్రాయాలు ఉండేవి. కానీ పావెల్ తెలిపిన వివరాలతో గ్లోబల్ మార్కెట్లు, ఇండియన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. పెడరల్ రిజర్వ్ బెంచ్మార్క్ రుణ రేటు 22 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టకుండా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడమే ఇప్పుడున్న లక్ష్యంగా తెలుస్తుంది. గత సంవత్సరం జూన్లో గరిష్ట స్థాయికి చేరిన ప్రధాన ద్రవ్యోల్బణం.. ప్రస్తుతం సగానికి పైగా తగ్గినప్పటికీ, వడ్డీరేట్లు పెంపు ప్రక్రియ దీర్ఘకాలికంగా కొనసాగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గురువారం అమెరికాలో టెక్ షేర్లలో వచ్చిన అమ్మకాల వెల్లువ అక్కడి మార్కెట్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. యూఎస్లో బాండ్ల రాబడులు మరింత పెరగడం కూడా ప్రతికూలంగా మారింది. -
ఆరోసారి ఫెడ్ వడ్డీ పెంపు
న్యూయార్క్: ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్ల పెంపును చేపట్టింది. రెండు రోజులపాటు సమావేశమైన ఫెడరల్ రిజర్వ్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) ద్రవ్యోల్బణ కట్టడే ప్రధాన ఎజెండాగా వరుసగా ఆరోసారి ఫండ్స్ రేట్లను పెంచింది. తాజాగా 0.75 పెంపును ప్రకటించింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 3.75–4 శాతానికి చేరాయి. దీంతో వరుసగా నాలుగోసారి 0.75 శాతం చొప్పున రేట్లను పెంచినట్లయ్యింది. ఈ ఏడాది(2022) ఇప్పటివరకూ ఎఫ్వోఎంసీ వడ్డీ రేట్లను 3.75 శాతం హెచ్చించింది. ద్రవ్యోల్బణం గత 40 ఏళ్లలోలేని విధంగా 8 శాతాన్ని అధిగమించడంతో ఫెడ్ ధరల కట్టడికి అత్యంత కీలకమైన వడ్డీ రేట్ల పెంపు మార్గాన్ని ఎంచుకుంది. తాజాగా సెప్టెంబర్లోనూ వినియోగ ధరల ఇండెక్స్ 8.2 శాతాన్ని తాకింది. -
ఫెడ్ వడ్డీ రేటు పెంపు షాక్
న్యూయార్క్: గత మూడు దశాబ్దాలలోలేని విధంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ తాజాగా వడ్డీ రేట్లను 0.75 శాతంమేర పెంచింది. దీంతో ప్రస్తుతం ఫెడ్ ఫండ్స్ రేట్లు 1.5–1.75 శాతానికి చేరాయి. మంగళవారం ప్రారంభమైన ఫెడరల్ రిజర్వ్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) సమావేశాలు బుధవారం ముగిశాయి. ద్రవ్యోల్బణం ఇటీవల అదుపు తప్పడంతో ఫెడరల్ రిజర్వ్ కఠిన తర విధానాలవైపు మొగ్గు చూపుతోంది. గత నెల(మే)లో ద్రవ్యోల్బణం 8.6 శాతాన్ని తాకింది. ఇది 40ఏళ్లలోనే అత్యధికంకాగా.. మే నెలలో జరిగిన గత సమావేశం తదుపరి కూడా ఫెడ్ 0.5 శాతం ఫండ్స్ రేట్లను హెచ్చించిన సంగతి తెలిసిందే. 2000 సంవత్సరం తరువాత ఈ స్థాయిలో వడ్డీ రేట్లను పెంచడం గత నెలలోనే జరిగింది. కాగా.. ఆర్థిక మందగమనం, ద్రవ్యోల్బణ పరిస్థితులు(స్టాగ్ఫ్లేషన్) తలెత్తనున్నట్లు విశ్లేషకులు ఇటీవల అంచనా వేస్తున్నారు. దీంతో కొద్ది రోజులుగా యూఎస్ మార్కెట్లు పతన బాటలో సాగుతున్నాయి. -
రూపాయి.. అధరహో
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం 53 పైసలు బలపడి 73.69 స్థాయికి చేరింది. గడచిన 10 వారాల్లో రూపాయి ఇంత స్థాయిలను చూడ్డం (జూన్ 16 తర్వాత) ఇదే తొలిసారి. సరళతర ఆర్థిక విధానాలనే అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడరల్ రిజర్వ్ కొనసాగిస్తుందన్న అంచనాలు, ఈక్విటీ మార్కెట్ల బులిష్ వైఖరి వంటి అంశాలు రూపాయి భారీగా బలపడ్డానికి కారణమని నిపుణుల అంచనా. ఫారెన్ బ్యాంకుల డాలర్ అమ్మకాలు, దేశంలోకి విదేశీ నిధులు భారీగా వస్తాయన్న అంచనాలు కూడా రూపాయి బలోపేతానికి కారణం. రూపాయి గురువారం ముగింపు 74.22. దీనితో పోల్చితే శుక్రవారం ట్రేడింగ్లో లాభాలతో 74.17 వద్ద ప్రారంభమైంది. వారంలో రూపాయి 70 పైసలు బలపడింది. ఈ వార్త రాస్తున్న శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 73.78 వద్ద ట్రేడవుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ 93పైన ట్రేడవుతోంది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). చదవండి : వడ్డీ రేట్ల పెంపు దిశగా అమెరికా -
37,000 దిగువన మరింత పతనం
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ హఠాత్తుగా అరశాతం వడ్డీ రేటును తగ్గించడంతో పాటు పలు ప్రధాన కేంద్ర బ్యాంకులు ఉద్దీపనలకు సిద్ధంగా వున్నట్లు ప్రకటించినప్పటికీ, కరోనావైరస్ పలు ప్రపంచదేశాల్లో తీవ్రంగా వ్యాప్తిచెందడంతో మార్కెట్ల పతనం కొనసాగుతూ వుంది. ఈ తరహా కేంద్ర బ్యాంకుల సాయం.. ఇన్వెస్టర్లను సమీప భవిష్యత్తులో శాంతింపచేస్తుందా అన్నది అనుమానమే. వ్యాధివ్యాప్తి తగ్గుముఖం పట్టి, ఉత్పత్తి, విక్రయాలు తిరిగి సాధారణస్థాయికి చేరుకుంటున్న సంకేతాలు కన్పిస్తేనే ఈక్విటీ మార్కెట్లు స్థిరపడగలుగుతాయన్నది అత్యధిక విశ్లేషకుల భావన. ఇక మన సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... మార్చి6తో ముగిసినవారంలో గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన 39,090 పాయింట్ల గరిష్టస్థాయికి చేరాక బీఎస్ఈ సెన్సెక్స్ తీవ్ర అమ్మకాల ఒత్తిడితో 37,011 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 720 పాయింట్ల నష్టంతో 37,577 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారపు పతనక్రమంలో గతేడాది అక్టోబర్9నాటి ‘స్వింగ్ లో’ అయిన 37,415 స్థాయిని శుక్రవారం ఇంట్రాడేలో సెన్సెక్స్ కోల్పోయినందున, కరెక్షన్ మరిన్ని రోజులు కొనసాగే అవకాశాలున్నాయి. ఈ వారం సెన్సెక్స్ నెగిటివ్గా మొదలైతే 37,000 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. దీన్ని కాపాడుకోలేకపోతే వేగంగా 36,720 పాయింట్ల స్థాయికి క్షీణించవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 35,990 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు. ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగితే తొలుత 37,750 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన 38,385 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. అటుపై క్రమేపీ 38,890 పాయింట్ల వరకూ పెరగవచ్చు. నిఫ్టీ 10,830 మద్దతు కోల్పోతే మరింత కరెక్షన్... క్రితంవారం ఎన్ఎస్ఈ నిఫ్టీ, గత కాలమ్లో ప్రస్తావించినట్లే 11,390 పాయింట్ల వరకూ పెరిగాక వేగంగా 10,827కు పతనమయ్యింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 213 పాయింట్ల నష్టంతో 10,989 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ గతేడాది అక్టోబర్9నాటి ‘స్వింగ్ లో’ అయిన 11,090 పాయింట్ల దిగువనే ముగిసినందున, రానున్న వారాల్లో 10,670 వరకూ పతనం కొనసాగే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. ఇక ఈ వారం 10,830 పాయింట్ల స్థాయి తొలి మద్దతు. ఇది పోతే.. వేగంగా 10,670 పాయింట్ల దాకా తగ్గొచ్చు. ఈ లోపున 10,580 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే 11,035 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన 11,250 పాయింట్లు, ఆ తర్వాత క్రమేపీ 11,390 వరకూ పెరగవచ్చు. – పి. సత్యప్రసాద్ -
‘బేర్’ బాజా!
ఈ ఏడాది మరో రేట్ల తగ్గింపు లేదని, ప్రస్తుత రేట్ల తగ్గింపు ‘తగ్గింపు సైకిల్’కు ఆరంభంగా పరిగణించకూడదని అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలివ్వడంతో గురువారం మన స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. కీలక పరిశ్రమలు, ద్రవ్యలోటు, వాహన విక్రయాల గణాంకాలు, కంపెనీల క్యూ1 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటం ప్రతికూల ప్రభావం చూపించాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతూనే ఉండటం, డాలర్తో రూపాయి మారకం విలువ 41 పైసలు పతనం కావడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన 11,000 పాయింట్ల దిగువకు పతనమైంది. 138 పాయింట్ల నష్టంతో 10,980 వద్ద ముగిసింది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ 463 పాయింట్లు క్షీణించి 37,018 పాయింట్ల వద్దకు చేరింది. ఈ ఏడాది మార్చి తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలు ఈ స్థాయిలకు పడిపోవడం ఇదే మొదటిసారి. ఈ రెండు సూచీలకు ఇది దాదాపు ఐదు నెలల కనిష్ట స్థాయి. ముడి చమురు ధరలు చెప్పుకోదగిన స్థాయిలో పడిపోయినా, మన మార్కెట్ పతనం ఆగలేదు. అయితే చివర్లో కొన్ని బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో నష్టాలు ఒకింత రికవరీ అయ్యాయి. సెన్సెక్స్ 787 పాయింట్లు డౌన్... ఆసియా మార్కెట్ల బలహీనతతో సెన్సెక్స్ నష్టాల్లోనే ఆరంభమైంది. రోజులు గడుస్తున్న కొద్దీ నష్టాలు అంతకంతకూ పెరిగాయి. ఎన్ఎస్ఈ వీక్లీ ఆప్షన్ల ముగింపు కారణంగా మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్787 పాయింట్లు, నిఫ్టీ 204 పాయింట్ల వరకూ నష్టపోయాయి. ట్రేడింగ్ చివరి గంటలో కొంత నష్టాల రికవరీ జరిగింది. ఇంధన, వాహన షేర్లు లాభపడటంతో నష్టాలు తగ్గాయి. మారుతీ సుజుకీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ ద్వయం, హిందుస్తాన్ యూని లివర్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. ఈ రికవరీ కారణంగా సెన్సెక్స్ 37,000 పాయింట్లు, నిఫ్టీ 10,900 పాయింట్లపైన ముగియగలిగాయి. నికాయ్ మినహా ఇతర ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. మరిన్ని విశేషాలు... ► వేదాంత షేర్ 5.5% నష్టంతో రూ.145 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► దాదాపు 600కు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఐషర్ మోటార్స్, బ్లూడార్ట్, ఎౖMð్స డ్ ఇండస్ట్రీస్, వీఎస్టీ టిల్లర్స్, కేర్ రేటింగ్స్, ఎస్కార్ట్స్, ఆర్తి ఇండస్ట్రీస్, వేదాంత, టాటా మోటార్స్, హిదాల్కో, బయోకా న్, ఓకార్డ్, గెయిల్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తదతర షేర్లు జాబితాలో ఉన్నాయి. ► ఓపెన్హీమర్ కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినప్పటికీ, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ షేర్ 4 శాతం మేర నష్టపోయి రూ.347 వద్ద ముగిసింది. ► స్టాక్ మార్కెట్ భారీ పతనంలోనూ 16 షేర్లు ఏడాది గరిష్ట స్థాయికి ఎగిశాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, వైభవ్ గ్లోబల్ ఈ జాబితాలో ఉన్నాయి. 1.6 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో రూ.1.6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.6 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.1,39,87,400 కోట్లకు తగ్గింది. తాజా బడ్జెట్ నుంచి చూస్తే, రూ.13.70 లక్షల కోట్లు సంపద ఆవిరైంది. రెండు నెలల్లో 9 శాతం డౌన్ ఎన్ఎస్ఈ నిఫ్టీ ఈ ఏడాది జూన్ 3న రికార్డ్ స్థాయి, 12,103 పాయింట్లను తాకింది. అప్పటి నుంచి కేవలం రెండు నెలల్లో 11,000 పాయింట్లకు (9%) పడిపోయింది. ఈ రెండు నెలల కాలంలో వాహన, బ్యాంక్, ఇంధన, మౌలిక, లోహ షేర్లు బాగా నష్టపోయాయి. ఇక నిఫ్టీ మిడ్క్యాప్ ఇండెక్స్ 13%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 16% చొప్పున క్షీణించాయి. అంతేకాకుండా నిఫ్టీ 500 సూచీలోని 300కు పైగా షేర్లు 50–90 శాతం రేంజ్లో పతనమయ్యాయి. కాక్స్ అండ్ కింగ్స్, జెట్ ఎయిర్వేస్, సింటెక్స్ ప్లాస్టిక్స్, రిలయన్స్ క్యాపిటల్, డీహెచ్ఎఫ్ఎల్, జైన్ ఇరిగేషన్ , రిలయన్స్ ఇన్ఫ్రా, వొడాఫోన్ ఐడియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. పతనానికి కారణాలు ఇవీ.... ► ఫెడ్ కామెంట్స్: అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది. దీంతో రేట్లు 2.0–2.25 శాతం రేంజ్లో ఉన్నాయి. పదేళ్ల తర్వాత తొలిసారిగా ఫెడ్ రేట్లను తగ్గించింది. అయితే ఈ తగ్గింపు, రేట్ల తగ్గింపు సైకిల్కు ఆరంభం కాదని ఫెడ్ చైర్మన్ జెరోమి పావెల్ వ్యాఖ్యానించారు. దీంతో సమీప భవిష్యత్తులో మరో రేట్ల పెంపు ఉండకపోవచ్చని ఫెడ్ సంకేతాలిచ్చినట్లయింది. ఇది మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం అమెరికా–చైనాల మధ్య జరుగుతున్న తాజా చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే ముగియడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. ► గణాంకాల నిరుత్సాహం: ఈ ఏడాది జూన్లో ఎనిమిదికీలక పరిశ్రమల వృద్ధి 0.2 శాతం తగ్గింది. సిమెంట్ ఉత్పత్తి, చమురు సంబంధిత రంగాల్లో మందగమనం చోటు చేసుకోవడం దీనికి కారణం. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో ద్రవ్యలోటు 61.4 శాతానికి (రూ.4.32 లక్షల కోట్లు) చేరింది. ఈ గణాంకాలు ఇన్వెస్టర్లలో నిరుత్సాహాన్ని నింపాయి. ► ఉత్తేజాన్నివ్వని వాహన విక్రయాలు: ఈ ఏడాది జూన్లో వాహన విక్రయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని కంపెనీలు వెల్లడించిన గణాంకాలు పేర్కొన్నాయి. ► కొనసాగుతున్న విదేశీ నిధుల ఉపసంహరణ: సంపన్నులపై విధించిన అదనపు పన్ను భారం విదేశీ ఇన్వెస్టర్లకు కూడా వర్తిస్తుంది. ఈ పన్ను విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలుమార్లు స్పష్టం చేయడంతో విదేశీ ఇన్వెస్టర్లు తమ నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. బడ్జెట్ నుంచి ఇప్పటివరకూ ఎఫ్పీఐలు 300 కోట్ల డాలర్ల మేర తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారని అంచనా. మన స్టాక్ మార్కెట్ జోరుకు కీలకమైన విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటుండటంతో మార్కెట్లో నష్టాలు కొనసాగుతున్నాయి. గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.16,870 కోట్ల మేర తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఈ ఏడాది ఇదే ఎఫ్పీఐల అత్యధిక పెట్టుబడుల ఉపసంహరణ. సూపర్ రిచ్ పన్నుతో కినుక వహించిన విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. నిధుల ఉపసంహరణ కొనసాగుతుందని నిపుణులంటున్నారు. ► రూపాయి పతనం: డాలర్తో రూపాయి మారకం విలువ 41 పైసలు నష్టపోయింది. రూపాయి విలువ గురువారం నాటి ట్రేడింగ్లో ఒక దశలో 69.20కు పడిపోయింది. -
పసిడి భవితపై ‘ఫెడ్’ రేటు ప్రభావం
అమెరికా ఆర్థిక పరిస్థితి, కీలక వడ్డీ రేట్లపై (ప్రస్తుతం 2.25 నుంచి 2.50 శాతం శ్రేణి) బుధవారం (20వ తేదీ) ఫెడరల్ రిజర్వ్ పరపతి సమీక్షా కమిటీ తీసుకునే నిర్ణయంపై పసిడి సమీప భవిష్యత్ ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్– నైమెక్స్లో ఔన్స్ (31.1గ్రా) 1,200 డాలర్ల నుంచి ప్రారంభమైన పసిడి తాజా ర్యాలీకి 1,346 డాలర్ల వద్ద తీవ్ర నిరోధం ఎదురయిన సంగతి తెలిసిందే. అటు తర్వాత కీలకమైన 1,300 డాలర్ల లోపునకు పడిపోయినా, పటిష్టంగా కొనసాగుతోంది. 15వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో 4 డాలర్ల లాభంతో 1,302 డాలర్ల వద్ద ముగిసింది. అమెరికా ఆర్థిక వృద్ధి, డాలర్ కదలికలు (15వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో 96), అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం వంటి అంశాలపై తదుపరి పసిడి కదలికలు ఆధారపడి ఉంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే సమీపకాలంలో పసిడి ధోరణి పటిష్టంగానే ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు సైతం తమ విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భాగంగా పసిడి కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. దేశంలో 32–33 వేల మధ్య స్థిరీకరణ ... కాగా డాలర్ మారకంలో రూపాయి పటిష్టత దేశీయ పసిడి ధరపై ప్రభావం చూపుతోంది. దేశీయ ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం 24పైసలు లాభపడి 69.10కి చేరిన సంగతి తెలిసిందే. గడచిన ఐదు రోజుల్లో 104 పైసలు బలపడింది. అందువల్ల పసిడి అంతర్జాతీయ భారీగా పెరిగినా, దేశీయంగా సమీప కాలంలో అంతర్జాతీయ పెరుగుదల ధోరణి పూర్తిస్థాయిలో ప్రతిబింబించకపోవచ్చన్నది నిపుణుల అభిప్రాయం. అయితే ఆయా అంశాల నేపథ్యంలోదేశీయంగా పసిడి 10 గ్రాముల ధర రూ.32,000–33,000 మధ్య స్థిరీకరణ పొందవచ్చన్నది విశ్లేషణ. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ ఎంసీఎక్స్లో పసిడి 10 గ్రాముల ధర శుక్రవారం రూ. 31,826 వద్ద ముగిసింది. కాగా ముంబై స్పాట్ మార్కెట్లో 24, 22 క్యారెట్ల ధరలు వరుసగా రూ.32,870, రూ.31,300 వద్ద ముగిశాయి. -
కీలక అవరోధశ్రేణి 36,285–36,560
ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చే ప్రకటన గత శుక్రవారం వెలువడింది. ఆర్థిక ఉద్దీపన ఉపసంహరణ, వడ్డీ రేట్ల పెంపు అంశాల్లో మార్కెట్ల భయాందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని, తమ పాలసీ ఫైనాన్షియల్ మార్కెట్లకు ఇబ్బందిగా పరిణమిస్తున్నదని భావిస్తే పాలసీని సమీక్షిస్తామంటూ అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పొవెల్ చేసిన ప్రకటనతో అమెరికా, యూరప్ మార్కెట్లు పెద్ద ర్యాలీ జరిపాయి. ఈ బాటలోనే ఆసియా ఇండెక్స్ ఫ్యూచర్లు భారీగా పెరిగాయి. సంవత్సరాంతపు సెలవుల తర్వాత సాధారణంగా జనవరి రెండోవారం నుంచి మన మార్కెట్లో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహించే విదేశీ ఇన్వెస్టర్లు, ఫెడ్ తాజా ప్రకటనతో భారత్ మార్కెట్లో పెట్టుబడుల్ని పునర్ప్రారంభిస్తారా, అమ్మకాలకు తెరతీస్తారా అనే అంశం సమీప భవిష్యత్తులో మన మార్కెట్ ట్రెండ్ను నిర్దేశించగలదు. ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే... సెన్సెక్స్ సాంకేతికాలు... జనవరి 4తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్వారం ప్రధమార్థంలో 36,285 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్ ద్వితీయార్థంలో వేగంగా 35,382 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 382 పాయింట్ల నష్టంతో 35,695 పాయింట్ల వద్ద ముగిసింది. గత శుక్రవారం అమెరికా మార్కెట్ భారీ ర్యాలీ ఫలితంగా ఈ వారం గ్యాప్అప్తో మార్కెట్ మొదలైతే సెన్సెక్స్కు 36,235 పాయింట్ల వద్ద తక్షణఅవరోధం కలగవచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే 36,285–36,560 పాయింట్ల నిరోధశ్రేణిని అధిగమించడం సెన్సెక్స్ భవిష్యత్ ట్రెండ్కు కీలకం. ఈ స్థాయిపైన ముగిస్తే క్రమేపీ 36,800–37,050 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఈ వారం పైన ప్రస్తావించిన కీలక నిరోధశ్రేణిని దాటలేకపోయినా, సోమవారం మార్కెట్ నిస్తేజంగా ప్రారంభమైనా 35,380 పాయింట్ల వద్ద సెన్సెక్స్కు తొలి మద్దతు లభిస్తున్నది. ఈ లోపున ముగిస్తే తిరిగి 35000 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే క్రమేపీ 34,400 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు. నిఫ్టీ కీలక నిరోధశ్రేణి 10925–10,985 గతవారం 10,924 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 10,629 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 133 పాయింట్ల నష్టంతో 10,727 వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ గ్యాప్అప్తో మొదలైతే 10,895 పాయింట్ల వద్ద తక్షణ అవరోధం కలగవచ్చు. అటుపైన కీలక నిరోధ శ్రేణి 10925–10,985 పాయింట్లు. గత మూడువారాలుగా పలుదఫాలు ఈ శ్రేణి అవరోధాన్ని కల్గించినందున, ఈ శ్రేణిని దాటితేనే తదుపరి అప్ట్రెండ్ సాధ్యపడుతుంది. ఈ స్థాయిపైన స్థిరపడితే క్రమేపీ 11,035–11,150 శ్రేణి వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం పైన సూచించిన కీలక నిరోధశ్రేణిని దాటలేకపోయినా, ఈ సోమవారం నిఫ్టీ బలహీనంగా ప్రారంభమైనా 10,630 వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన ముగిస్తే 10,535 స్థాయిని తిరిగి పరీక్షించవచ్చు. అటుపై కొద్దిరోజుల్లో 10,330 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగే ప్రమాదం ఉంటుంది. -
ఫెడ్ వడ్డీ రేటు పావు శాతం పెంపు..
వాషింగ్టన్: అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) కీలక వడ్డీ రేట్లను పావు శాతం మేర పెంచింది. దీంతో వడ్డీ రేట్ల శ్రేణి 2–2.25 శాతానికి చేరింది. ఉద్యోగాల కల్పన మెరుగ్గా ఉండటం, వ్యాపారాలపై పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెండు రోజుల ద్రవ్యపరపతి సమీక్ష అనంతరం ఫెడ్ వెల్లడించింది. దీంతో 2015 నుంచి ఇప్పటిదాకా ఎనిమిది సార్లు వడ్డీ రేట్లు పెంచినట్లయింది. ఈ ఏడాది మరోమారు వడ్డీ రేట్ల పెంపు ఉండొచ్చని ఫెడ్ సూచనప్రాయంగా తెలిపింది. స్థూల దేశీయోత్పత్తి రెండో త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన 4 శాతం మేర వృద్ధి నమోదు చేయడం, నిరుద్యోగిత చరిత్రాత్మక కనిష్ట స్థాయి 4 శాతం దరిదాపుల్లో ఉండటంతో పాటు ద్రవ్యోల్బణం కూడా అంచనాలకు తగ్గట్లు రెండు శాతానికి చేరడం తదితర అంశాలు వడ్డీ రేట్ల పెంపునకు కారణమైనట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, త్వరితగతిన వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ మళ్లీ మాంద్యంలోకి జారిపోయే ప్రమాదం కూడా అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఫెడ్ పాలసీ : పడిపోతున్న మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు పతనమవడానికి రోజుకో కారణం దొరుకుతోంది. వరుసగా ఐదు రోజుల నుంచి పతనమవుతూ వచ్చిన మార్కెట్లు, ఏదో నిన్న మాత్రం షార్ట్ కవరింగ్ కలసివచ్చి కొనుగోళ్లతో కళకళలాడాయి. నేడు కూడా అదే జోష్లో ప్రారంభమయ్యాయి. కానీ ఆ జోష్ ఎంతో సేపు నిలువలేదు. మరికొన్ని గంటల్లో అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంక్ తన పాలసీ నిర్ణయాన్ని ప్రకటించనుందనే వార్తల నేపథ్యంలో మళ్లీ భారీ నష్టాల బాట పట్టాయి స్టాక్ మార్కెట్లు. మరికొన్ని గంటల్లో ప్రకటించబోయే ఫెడ్ పాలసీలో కచ్చితంగా వడ్డీరేట్లను పెంచుతుందనే మెజార్టీ విశ్లేషకులు అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. దీంతో సెన్సెక్స్ మధ్యాహ్నం ట్రేడింగ్ సమయానికి 250 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 11,050 మార్కు కిందకి దిగొచ్చింది. ముఖ్యంగా ఫైనాన్సియల్, పీఎస్యూ బ్యాంకింగ్ షేర్లు దేశీయ సూచీలను పడగొడుతున్నాయి. ఆటోమొబైల్స్, ఎఫ్ఎంసీజీ సెక్టార్లలో కూడా ఒత్తిడి నెలకొంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ కూడా 1 శాతం కిందకి పడిపోయింది. టాప్ లూజర్లుగా టాటా మోటార్స్, ఐటీసీ, హెచ్సీఎల్ టెక్లు నష్టాలు గడిస్తున్నాయి. యస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇండియాబుల్స్ హౌజింగ్ మాత్రమే లాభాల్లో నడుస్తున్నాయి. అటు ఫెడ్ వడ్డీరేట్లను పెంచనుందనే సంకేతాలతో బంగారం ధరలు స్తబ్దుగా ట్రేడవుతున్నాయి. రెండు రోజుల పాటు సమావేశమైన ఫెడ్ పాలసీ కమిటీ భేటి నేటితో ముగుస్తుంది. నేడు ఫెడ్ నిర్ణయం వెల్లడించనున్నారు. ఒకవేళ ఫెడ్ రేట్లు పెరిగితే, రూపాయి విలువ మరింత ఒడిదుడుకులకు లోనుకావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. -
ఫెడ్ నిర్ణయం, రూపాయి కదలికలే కీలకం..!
న్యూఢిల్లీ: ఈవారంలో సూచీలు మరింత కన్సాలిడేషన్కు గురికావచ్చని మార్కెట్ పండితులు భావిస్తున్నారు. ముడి చమురు ధరల పెరుగుదల, డాలరు విలువ బలపడుతుండటం, ద్రవ్యలోటు వంటి పలు ఆందోళనకర అంశాల నేపథ్యంలో మార్కెట్ కన్సాలిడేషన్కు అవకాశం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ‘అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం ఈవారంలో అత్యంత కీలక అంశంగా ఉంది. మన మార్కెట్లలో దిద్దుబాటు చోటుచేసుకుంటున్న క్రమంలో పలు రంగాలు, ఎంపిక చేసిన షేర్లలో వాల్యూ బయ్యింగ్కు అవకాశం కనిపిస్తోంది.’ అని వ్యాఖ్యానించారు. ఇక శుక్రవారం వెల్లడికానున్న ద్రవ్యలోటు, ఆగస్టు ఇన్ఫ్రా డేటాలు సైతం మార్కెట్పై ప్రభావం చూపనున్నాయని భావిస్తున్నారు. వడ్డీ రేట్లు పెరిగేందుకు అవకాశం ఫెడరల్ రిజర్వ్ బుధవారం ప్రకటించనున్న వడ్డీ రేట్ల కోసం ప్రపంచదేశాల మార్కెట్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈసారి మరో 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లు పెరిగేందుకు అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రీసెర్చ్ సంస్థ రాయిటర్స్ అంచనా ప్రకారం.. సెప్టెంబర్ 25–26 సమావేశంలో పాలసీ రేటు 2 నుంచి 2–25 శాతానికి పెరిగేందుకు అవకాశం ఉంది. ఎఫ్ఓఎమ్సీ సమావేశం నేపథ్యంలో ఈవారంలో కన్సాలిడేషన్కు అవకాశం ఉందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ విశ్లేషకులు వీ కే శర్మ అన్నారు. గడిచిన సెషన్లలో చోటుచేసుకున్న కరెక్షన్ అనంతరం మార్కెట్ ఇంటర్మీడియట్ బోటమ్ను తాకినట్లు భావిస్తున్నామని వెల్లడించారు. వెంటాడుతున్న వాణిజ్య యుద్ధ భయాలు 200 బిలియన్ డాలర్ల చైనా దిగుమతులపై అమెరికా సుంకాలను విధించగా.. చైనా సైతం 110 బిలియన్ డాలర్ల అమెరికా దిగుమతులపై సుంకాలను ప్రకటించింది. ఈ రెండు దేశాల ట్యారిఫ్లు కూడా సోమవారమే అమల్లోకిరానున్నాయి. అమెరికా–చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం ఇప్పట్లో ముగియకపోగా మరింత వేడెక్కే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు డాలరుతో రూపాయి మారకం విలువ 72.91 స్థాయికి పడిపోయిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు ముడిచమురు ధరలు, రూపాయి కదలికలపై దృష్టిసారిస్తున్నారు. 11,090 స్థాయిని కోల్పోతే మరింత దిగువకు 11,170 పాయింట్ల కీలక మద్దతు స్థాయిని కోల్పోయిన నిఫ్టీకి తక్షణ మద్దతు స్థాయి 11,090 వద్ద ఉందని, ఈ స్థాయిని కూడా కోల్పోతే మరింత కరెక్షన్ను చూడవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ విశ్లేషించింది. పుల్బ్యాక్ ర్యాలీస్ నమోదైతే 11,250 అత్యంత కీలక నిరోధమని వివరించింది. -
బేరిష్గా బంగారం..
న్యూఢిల్లీ: బలపడుతున్న డాలరు, అమెరికా ఫెడ్ రేట్ల పెంపు అంచనాలు ఈ వారం బంగారానికి ప్రతికూలంగా ఉండొచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. వీటితో పాటు అమెరికాలో హైరింగ్ సరళి మందగిస్తోందన్న అభిప్రాయాలను రూఢీ చేసుకునేందుకు జూలై ఉద్యోగిత గణాంకాలను కూడా ట్రేడర్లు నిశితంగా పరిశీలించవచ్చని అంచనాలు ఉన్నాయి. వీటితో పాటు అంతర్జాతీయంగా వాణిజ్య వివాదాలకు సంబంధించిన పరిణామాలపై సైతం మెటల్స్ ట్రేడర్లు దృష్టి పెట్టనున్నారు. ఈ నెలలో జరగబోయే సమావేశంలో ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో రేట్లను పెంచే అవకాశాలున్నాయన్న అంచనాలు.. బంగారానికి ప్రతికూలంగా ఉండొచ్చని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. వీటన్నింటి దరిమిలా గత వారాంతంలో న్యూయార్క్ మెర్కంటైల్ ఎక్సే్చంజ్ కామెక్స్ విభాగంలో ఆగస్టు డెలివరీ బంగారం ఫ్యూచర్స్ ధర 0.29 శాతం తగ్గి 1,222.20 వద్ద ముగిసింది. మొత్తం మీద అంతర్జాతీయంగా వారంలో 0.56 శాతం, ఈ ఏడాది ఇప్పటిదాకా 6.4 శాతం మేర పసిడి రేటు క్షీణించినట్లయింది. దేశీయంగా మళ్లీ 31వేల పైకి.. పండుగల సీజన్, స్థానిక జ్యూయలర్ల కొనుగోళ్ల మద్దతుతో బంగారం ధర దేశీయంగా మళ్లీ కీలకమైన రూ. 31,000 మార్కు పైకి చేరింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో పది గ్రాములకు రూ. 450 మేర పెరిగింది. మేలిమి బంగారం (99.9 శాతం స్వచ్ఛత) పది గ్రాముల ధర రూ. 31,350, ఆభరణాల బంగారం (99.5 శాతం స్వచ్ఛత) రేటు రూ. 31,200 వద్ద ముగిసింది. వెండి కిలో ధర రూ. 100 మేర పెరిగి రూ. 38,350 వద్ద క్లోజయ్యింది. -
వడ్డీరేట్లు : ఫెడ్ నో సర్ప్రైజ్
అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఎలాంటి సర్ప్రైజ్ను ఇవ్వలేదు. అందరి అంచనాలకు తగ్గట్టే ఫెడ్ వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించనున్నట్టు ఫెడరల్ రిజర్వు ప్రకటించింది. దీంతో ఫెడ్ వడ్డీ రేట్లు1.75 శాతం నుంచి 2 శాతంగా కొనసాగనున్నాయి. రెండు రోజులపాటు నిర్వహించిన సమావేశాలలో భాగంగా బుధవారం సాయంత్రం(భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి) ఫెడరల్ రిజర్వు తన పరపతి నిర్ణయాలను ప్రకటించింది. ప్రస్తుతం యథాతథంగా ఉన్నప్పటికీ, సెప్టెంబర్లో వడ్డీరేట్ల పెంపు ఉంటుందని సంకేతాలు ఇచ్చింది. ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ ఇప్పటికే ఈ ఏడాదిలో రెండు సార్లు వడ్డీరేట్లు పెంచారు. 2018 ముగింపు నాటికి మరో రెండు సార్లు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుపై గత నెలలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించిన సంగతి తెలిసిందే. రేట్ల పెంపు, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయనుందని మండిపడ్డారు. ఆర్థిక వృద్ధిని కొనసాగించడానికి వడ్డీరేట్లను తగ్గించాల్సివసరం ఉందని ట్రంప్ అన్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో, ఫెడరల్ రిజర్వు తన వడ్డీరేట్లను పెంచడం ప్రారంభించింది. ద్రవ్యోల్బణం పెరుగుతుందంటే, ఆర్థిక వ్యవస్థ బాగానే ఉందనే విషయానికి సంకేతమని తెలిపింది. సేవింగ్స్వైపు నుంచి కూడా మంచి రిటర్నులు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అంతేకాక జూలైలో ప్రైవేట్ రంగంలో అంచనాలను మించుతూ 2.19 లక్షల మందికి ఉపాధి లభించినట్లు కార్మిక శాఖ తాజాగా గణాంకాలు విడుదల చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నదని, ఉపాధి మార్కెట్ పటిష్టమైందని, ద్రవ్యోల్బణం సైతం లక్ష్యానికి దగ్గరగా ఉన్నదని ఫెడ్ కమిటీ తాజాగా అభిప్రాయపడింది. సమీప భవిష్యత్లో ధరలు టార్గెట్ను మించిపోయే అవకాశంలేదని, దీంతో ప్రస్తుతానికి యథాతథ పాలసీ అమలుకే మొగ్గుచూపినట్టు జెరోమీ పావెల్ పేర్కొన్నారు. -
3 రోజుల లాభాలకు బ్రేక్
మూడు రోజుల లాభాలకు గురువారం బ్రేక్ పడింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పెంచడం, మే నెల టోకు ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ట స్థాయి 4.43 శాతానికి పెరగడం, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో కరెంట్ అకౌంట్ లోటు భారీగా పెరగడం ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 139 పాయింట్ల నష్టంతో 35,600 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 49 పాయింట్లు పతనమై 10,808 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో 251 పాయింట్ల నష్టం అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పావు శాతం పెంచింది. ఈ ఏడాది ఫెడ్ రేట్లను పెంచడం ఇది రెండోసారి. అంచనాలకు అనుగుణంగానే రేట్ల పెంపు ఉన్నప్పటికీ, ఈ ఏడాది మరో రెండు దఫాలు రేట్ల పెంపు ఉంటుందని సూచించడంతో ప్రపంచ మార్కెట్లు ప్రధానంగా ఆసియా మార్కెట్లు కుదేలయ్యాయి. సెన్సెక్స్ స్వల్ప లాభాలతో ఆరంభమైంది. అయితే ఆసియా మార్కెట్ల పతన ప్రభావంతో నష్టాల్లోకి జారిపోయింది. ఇంట్రాడేలో 251 పాయింట్లు నష్టపోయి 35,489 పాయింట్ల వద్ద కనిష్ట స్థాయిని తాకింది. చివర్లో రిలయన్స్ లాభపడడంతో వంద పాయింట్లకు పైగా రికవరీ అయింది. వివిధ కేంద్ర బ్యాంక్ల సమావేశాల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు పతనమవుతున్నాయని, ఇది మన మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపించిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. టోకు ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ట స్థాయికి పెరగడం, కరెంట్ అకౌంట్ లోటు మరింతగా పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. అయితే ఫార్మా షేర్లు లాభపడటం, రిలయన్స్ ఇండస్ట్రీస్ పెరగడంతో నష్టాలు తగ్గాయని వివరించారు. ఫార్మా జోరు... సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నా, ఫార్మా షేర్ల లాభాలు కొనసాగాయి. పలు ఫార్మా షేర్లు తమ తమ జీవిత కాల గరిష్ట స్థాయిల నుంచి బాగా పతనమయ్యాయని, ప్రస్తుతం సమంజసమైన ధరల్లో లభిస్తున్నాయని అందుకే గత కొన్ని రోజులుగా ఫార్మా షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరుగుతున్నాయని నిపుణులంటున్నారు. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆల్టైమ్ హై 1,012ను తాకింది. చివరకు 0.5 శాతం లాభంతో రూ.1,007 వద్ద ముగిసింది. ఈ షేర్కు ఇది ఆల్ టైమ్ గరిష్ట క్లోజింగ్. గత మూడు రోజుల్లో ఈ షేర్ 10 శాతం ఎగసింది. -
మార్కెట్లకు ‘ఫెడ్’ దెబ్బ
ముంబై : ఫెడ్ వడ్డీరేటు పెంపుతో, ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో బలహీనంగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, చివరికీ నష్టాలతోనే ముగిశాయి. దీంతో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 139 పాయింట్లు పడిపోయి 35,600 వద్ద, నిఫ్టీ 49 పాయింట్లు లాభంలో 10,808 వద్ద క్లోజయ్యాయి. ఫెడ్ వడ్డీరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు పాలసీ ప్రకటన ఎలా ఉంటుందోనని ఇన్వెస్టర్లు అప్రమత్తగా వ్యవహరిస్తున్నారు. సహాయక ప్యాకేజీలకు చెల్లుచీటీ రాయనుందన్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమైనట్లు నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న కారణంగా ఈ ఏడాది మరో రెండుసార్లు వడ్డీ పెంపు ఉండవచ్చునంటూ ఫెడ్ సంకేతాలివ్వడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలహీనపడింది. దీంతో ప్రపంచ మార్కెట్లన్నీ అమ్మకాలతో కుదేలయ్యాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, టైటాన్ కంపెనీ, వేదంతా, ఎల్ అండ్ టీ షేర్లు ఒత్తిడిలో కొనసాగగా.. లుపిన్, సన్ ఫార్మా, సిప్లా, కోల్ ఇండియాలు లాభాలు పండించాయి. నిఫ్టీ మిడ్క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్గా ముగిసింది. మైండ్రి, సన్ టీవీ, ఎం అండ్ ఎం ఫైనాన్సియల్, మణప్పురం ఫైనాన్స్ షేర్లు కూడా ఒత్తిడిలో కొనసాగాయి. -
లాభాలన్నీ లాస్ట్కి ఆవిరి!
ముంబై : ప్రారంభ లాభాలన్నింటిన్నీ మార్కెట్లు కోల్పోయాయి. చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 47 పాయింట్ల లాభంలో 35,739 వద్ద, నిఫ్టీ 14 పాయింట్ల లాభంలో 10,856 వద్ద స్థిరపడ్డాయి. ఫెడ్ మీటింగ్పై మార్కెట్లు ఎక్కువగా ఫోకస్ చేసినట్టు తెలిసింది. ఈ సారి ఫెడ్ తన వడ్డీరేట్లను పెంచుతుందని మార్కెట్లలో అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు కాస్త అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు. రంగాల వారీగా ఐటీ, ఫార్మా, పీఎస్యూ బ్యాంకింగ్ స్టాక్స్ ఎక్కువగా లాభపడగా.. ఆటో, ఇన్ఫ్రా, మెటల్ రంగాలు నేటి ట్రేడింగ్లో ఎక్కువగా ఒత్తిడికి గురయ్యాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్, టెక్ మహింద్రా నేటి ట్రేడింగ్లో టాప్ గెయినర్లుగా లాభాల పంట పండించాయి. మరోవైపు రిలయన్స్ జియో మంగళవారం ప్రకటించిన డబుల్ ధమాకా ఆఫర్ ప్రత్యర్థ టెల్కోలను భారీగా దెబ్బకొట్టింది. ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ కమ్యూనికేషన్షేర్లు దాదాపు 6 శాతం వరకు పడిపోయాయి. డబుల్ ధమాకా ఆఫర్ కింద కంపెనీ ఎంపిక చేసిన ప్రీపెయిడ్ రీఛార్జ్లపై అదనంగా 1.5 జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. -
సమాఖ్యలో గవర్నర్ కీలకం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పథకాల ఫలితాలు వీలైనంత ఎక్కువమంది లబ్ధిదారులకు చేరడంలో గవర్నర్లు సహాయం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు. సమాఖ్య వ్యవస్థలో గవర్నర్ల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రెండ్రోజులపాటు జరగనున్న 49వ గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల సదస్సులో ప్రధాని సోమవారం ప్రారంభోపన్యాసం చేశారు. ఆదివాసీ జనాభా చెప్పుకోదగినంత ఉన్న రాష్ట్రాల గవర్నర్లు విద్య, క్రీడ తదితర రంగాలతోపాటు సమ్మిళిత ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం అమలుపరుస్తున్న కార్యక్రమాల ప్రయోజనాలు ఈ వర్గాలకు అందేట్లు చూడటంలో చేయూతను అందించాలని ప్రధాని కోరారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఆదివాసీల పాత్ర కీలకమని.. దీనిని గుర్తించి, భావితరాల వారికి అందించేందుకుగాను డిజిటల్ మ్యూజియమ్లు మొదలైన పద్ధతుల్లో వీటిని భద్రపరచాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ అంశాల్లో గవర్నర్లు తమ అధికారాన్ని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందేవారి సంఖ్యను పెంచాలన్నారు. ‘భారతదేశ సమాఖ్య వ్యవస్థ, రాజ్యాంగ పరిధిలో గవర్నర్ పాత్ర చాలా కీలకం’ అని మోదీ పేర్కొన్నారు. గవర్నర్లు తమ పరిధిలోని యూనివర్సిటీలకు చాన్స్లర్లన్న విషయాన్ని మోదీ గుర్తుచేస్తూ.. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం వేదిక ద్వారా యువతలో యోగాపై అవగాహన పెంచేందుకు కృషిచేయాలని కోరారు. వర్సిటీలు మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలకు కేంద్రాలు కావాలన్నారు. 65వేల పల్లెలకు గ్రామస్వరాజ్ వెనుకబడిన జిల్లాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తిచేసిన జాతీయ పౌష్టికాహార మిషన్, గ్రామాల విద్యుదీకరణ ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. ఇటీవలే విద్యుదీకరణ పూర్తయిన గ్రామాలను గవర్నర్లు సందర్శించి అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 14 నుంచి మే 5 వరకు ప్రభుత్వం చేపట్టిన గ్రామ్ స్వరాజ్ అభియాన్ ద్వారా ఏడు ముఖ్యమైన ప్రభుత్వ పథకాలను 16వేల గ్రామాల్లోని ప్రజలకు అందజేసిన విషయాన్ని ప్రధాని వెల్లడించారు. ఆగస్టు 15 వరకు గడువు నిర్దేశించుకుని ఈసారి 65వేల గ్రామాలకు చేరాలని సంకల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరిగే 50వ గవర్నర్ల సదస్సుకు ఇప్పటినుంచే ప్రణాళికలు ప్రారంభించాలని కోరారు. తద్వారా ఈ వార్షిక సదస్సు ఫలప్రదమయ్యేలా ప్రయత్నిం చాలన్నారు. మార్పుకు వారధులవ్వాలి: రాష్ట్రపతి పేదలు, అణగారిన వర్గాల విద్యాప్రమాణాలను పెంచడం, వీరి జీవితాల్లో మార్పు తీసుకురావడంలో గవర్నర్లు వారధుల్లా నిలవాలని ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సూచించారు. సమాఖ్య వ్యవస్థలో కీలకమైన గవర్నర్లు.. రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకుడిగా, సంరక్షకుడిగా ఉండాలన్నారు. రాజ్భవన్లు విలువలు, సిద్ధాంతాలకు కేంద్ర స్థానాలుగా ప్రజలు భావిస్తారన్నారు. ‘భారత్లో 10 కోట్ల మంది ఆదివాసీలున్నారు. స్వాతంత్య్రం సిద్ధించినప్పటినుంచి నేటి వరకు ఈ వర్గం, మిగిలిన వారిలాగా సంక్షేమ పథకాల లబ్ధిని పొందలేకపోయింది. వీరి జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు గవర్నర్లు చురుకైన పాత్ర పోషించాలి’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ‘గవర్నర్లు అంటే యువతకు గార్డియన్లు. మీరు యువత సరైన నైతికవిలువలతో ముందుకెళ్లేలా ప్రభావితం చేయగలరు. దేశంలోని 69 శాతం యూనివర్సిటీలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నాయి. యువతలో భారత సంస్కృతి సంప్రదాయాలతో పాటు ఆధునిక విద్యను అందుకునేలా మీరు స్ఫూర్తిని పెంచండి. ఈ వర్సిటీలు జాతీయ సమగ్రతను పెంచాలి. మహాత్ముని జయంతి సందర్భంగా ఆయన బోధనలు ఎక్కువగా ప్రసారమయ్యేలా చూడాలి’ అని కోవింద్ సూచించారు. -
గతమంతా రాజ్భవన్ గండాలే!
రెండో మాట ఫెడరల్ దృక్పథం దేశంలో సర్వత్రా వికసించకుండా చేసేందుకు భారత ‘ఫెడరేషన్’ దృక్పథాన్ని నిర్వీర్యం చేసి రాష్ట్రాల ప్రత్యేక ఉనికికి గుర్తింపు లేకుండా చేశారు పాలకులు. ఇందులో భాగమే ఉత్తర–దక్షిణ భారతాలను వేర్వేరుగా చీల్చే ప్రయత్నాలూ మొగ్గ తొడుగుతున్నాయి. ‘బొంక నేర్చినవాడు వంకలూ నేరుస్తాడన్న’ట్టు ‘ఉత్తరాదిని చేజిక్కించుకున్నాం, దక్షిణాది రాష్ట్రాలను చేజిక్కించుకోవాల’ని ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేత అమిత్ షాలు యూపీ ఎన్నికల తర్వాత కొత్త నినాదాన్ని ‘మౌర్య సామ్రాజ్య విస్తరణ’ కాంక్షతో వ్యాప్తిలోకి తెచ్చారు. మరో వైపున దళితులు, మైనారిటీలపైన దాడులు చేయడానికి వెనుకాడటం లేదు. ‘రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణలో గవర్నర్ అనే వ్యక్తి రాజ్యాంగ చట్టాన్ని అమలు చేయడంలో కీలక ఇరుసు వంటివాడు. కనుకనే అతని పాత్ర కేంద్ర–రాష్ట్ర సంబంధాలలో ఒక కీలక సమస్యగా మారింది. తరచుగా అతడిని యూనియన్ ప్రభుత్వం తన సొంత రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నందుకు, అందుకు తగినట్టుగానే గవర్నర్లో నిష్పాక్షికత, వివేకం లోపించబట్టే విమర్శలకు గురి కావలసి వస్తున్నది.’ – సర్కారియా కమిషన్ నివేదిక (1988) ‘చివరికి గవర్నర్ల నియామకాలకు, వారి ఉద్వాసనలకు రాష్ట్రపతికి ఉన్న అధికారం సహితం కేంద్ర–రాష్ట్రాలను బంధించే సమాఖ్య స్ఫూర్తి సూత్రీకరణ నుంచి కూడా దూరంగా జరిగిపోయింది. క్రమంగా గవర్నర్లు రాజకీయ పక్షపాతానికి లోనై కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారేగానీ స్వతంత్ర రాజ్యాంగ కార్యాలయ నిర్వాహకులుగా వ్యవహరిం చలేకపోతున్నారు.’ – ఎల్.పి. సింగ్ (కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, మణిపూర్ మాజీ గవర్నర్) గవర్నర్ల వ్యవస్థ 1988 నాటికే తీవ్ర విమర్శల పాలైంది. ఆ వ్యవస్థ రాజ్యాంగ నిబంధనలకూ, పరిధికీ తూట్లు పొడిచిన మాట వాస్తవమని ముప్పయ్ ఏళ్ల నాడే సర్కారియా కమిషన్ బాహాటంగా చెప్పింది. ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తిని గవర్నర్లు యథేచ్ఛగా ఉల్లంఘించారని పరిపాలనా సంస్కరణల కమిషన్ (ఎంఆర్సీ) కూడా వెల్లడించింది. అయినా రాజకీయ పార్టీలు, గవర్నర్ల పాత్రలో ఆవగింజంత మార్పు కూడా రాలేదు. ఈ విషయం ఇటీవల కర్ణాటకలో ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా ద్వారా తాజాగా నిరూపితమైంది. సర్కారియా కమిషన్ విధించిన మూడు షరతులలో ఏ ఒక్కటీ ఆ రాష్ట్ర గవర్నర్ సంతృప్తికరంగా పాటించలేదు. పైగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీస మెజారిటీని సాధించడంలో విఫలమైన బీజేపీకి పట్టం కట్టేందుకు ఆయన నడుం కట్టారు. నిజానికి బీజేపీ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సొంత పార్టీ వారినే గవర్నర్లుగా నియమిస్తున్నది. ఈ సంప్రదాయంలో బీజేపీ కూడా కాంగ్రెస్ కంటే తక్కువ తినలేదు. ఈ బాగోతం ఇప్పటిది కాదు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఆరంభమైన పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక మాట అన్నది : ‘సంప్రదాయం వేరు, చట్టం వేరు’ అని. నిజానికి ఈ వేళ కాదు. ఈ దురవస్థను సర్కారియా కమిషన్ వెల్లడించడానికి ముందే కొన్ని దుష్ట సంప్రదాయాలు ప్రవేశించాయి. అప్పటికి మరో 32 ఏళ్లు వెనక్కి వెళ్లి చూస్తే, అంటే స్వాతంత్య్రం లభించిన తొలినాళ్ల చరిత్రను గమనిస్తే కళ్లు చెదురుతాయి. మరోమాటలో చెప్పాలంటే స్వాతంత్య్రం వచ్చిన తరువాత కేవలం ఐదేళ్లకే (1952) మన రిపబ్లిక్ కొత్త రాజ్యాంగానికి తొలిసారి తూటు పడింది. అదికూడా భారీగానే పడిందని మరచిపోరాదు. అది ఫెడరల్ (రాష్ట్రాల సమాఖ్య భారతం) రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించిన సంవత్సరం. ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన ఆచరణకు నాటి పాలక పక్షం కాంగ్రెస్ తొలిసారి పాల్పడింది. అది తొలి జనరల్ ఎన్నికలలోనే అని గమనించాలి. ఉమ్మడి మద్రాసు శాసనసభకు జరిగిన ఆ ఎన్నికలలో మొత్తం 375 స్థానాలలో కాంగ్రెస్ 152 చోట్ల విజయం సాధించింది. టంగుటూరి ప్రకాశం నాయకత్వంలోని ఐక్య సంఘటన కాంగ్రెస్ పార్టీ కన్నా 14 స్థానాలు అధికంగా గెలుచుకుంది. కానీ నిన్నటి కర్ణాటక నాటకంలో మాదిరిగానే 152 స్థానాలు గెలిచిన తనకే ప్రభుత్వ ఏర్పాటు హక్కు ఉందని మొండి పట్టు పట్టింది. యునైటెడ్ ఫ్రంట్ పేరుతో ఎక్కువ స్థానాలు గెలిచిన ప్రకాశం కూటమికి అవకాశం లేకుండా చేశారు. నాటి మద్రాసు గవర్నర్ శ్రీప్రకాశ్ సాయంతో రాజాజీని దొడ్డిదారిన కౌన్సిల్ సభ్యుడిని చేసి, కాంగ్రెస్ శాసన సభాపక్షానికి నాయకుడిగా ప్రకటించారు. ఇంకా, ప్రతిపక్షంలోని పదహారు మంది విభీషణ సంతతి చేత ప్లేటు ఫిరాయించేటట్టు చేశారు. ఆ ప్రకారం ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ రాజాజీని ప్రతిష్టించింది. స్వాతంత్య్రం వచ్చిన ఏడేళ్లకు కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల సాక్షిగా చేసిన నిర్వాకమిది. రుచిమరిగిన పిల్లి ఉట్టి మీదకి ఎగ బాకినట్టు అది మొదలు ప్రతిపక్షాలు ఐక్య ఘటన ద్వారా అధికారంలోకి వచ్చినా కుట్రలు, కూహకాలతో పడగొట్టే దాకా నిద్రపోని ఒక లక్షణం కాంగ్రెస్ పట్టుకుంది. అసలే బ్రిటిష్ పాలన అవశేషంగా వచ్చిన గవర్నర్ వ్యవస్థను కాంగ్రెస్ క్రమంగా కుమ్మరి పురుగులా తొలిచేసింది. ఇదే సంప్రదాయాన్ని మతోన్మాద రాజకీయాలు తప్ప మరొక వ్యాపకం లేని బీజేపీ–ఆరెస్సెస్ కూటమి పాలక పక్షాలు కొనసాగిస్తున్నాయి. కానీ ఈ అనుభవంతో ఒకటి రుజువైంది. ఇటీవల కేంద్ర పాలక పక్షం బీజేపీ అనేక విషయాలలో నర్మగర్భంగా పెడుతున్న ఆరళ్లకూ, సన్నాయి నొక్కుళ్లకు సుప్రీంకోర్టుపై ఇబ్బందుల పాలవుతున్నా న్యాయవ్యవస్థ చైతన్యం ‘కొడిగట్టిపోలేద’ని ఒక మేరకు రుజువయింది. కానీ సుప్రీంకోర్టు భావిస్తున్నట్లు ‘సంప్రదాయం వేరు, చట్టం వేరు’ అన్న వాస్తవాన్ని చెరిపేయటంలో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య తేడా లేదని గమనించాలి. పాలక విధానాల ఫలితంగా దారి తప్పిన రాజ్యాంగ వ్యవస్థలన్నీ (ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, దళిత, మైనారిటీల హక్కుల రక్షణ, లౌకిక జనతంత్ర రిపబ్లిక్ రక్షణ హామీలు, సమాచార హక్కు చట్టం వగైరా) ‘గుంటపూలు పూసే’ స్థితికి చేరుకున్నాయి. రాజ్యాంగం మీద నిరంతర దాడి రాజ్యాంగం ప్రజలకు హామీ పడిన హక్కుల పరిరక్షణ కోర్టుల బాధ్యత. వాటిని ఆచరణలో ప్రజల అనుభవంలోకి తీసుకురావడానికి బీజేపీ పాలకుల నుంచి పౌర సమాజం ఎదుర్కొంటున్న ప్రత్యక్ష పరోక్ష దాడులను కట్టడి చేసే బాధ్యత మరొకటి. అన్నింటికీ మించి, రాజ్యాంగాన్ని మరింత మెరుగు పరిచేందుకు రావలసిన మార్పులకు శ్రీకారం చుట్టగల ప్రజాహిత సవరణ అవసరం ఎంతో ఉండగా, ఆ ప్రయత్నాన్ని వదిలి పాలక శక్తులు ప్రజాస్వామిక సెక్యులర్ రాజ్యాంగం స్థానంలో ఏకమతాభినివేశ రాజ్యాంగ వ్యవస్థ నిర్మాణానికి పునాదులు వేసే ప్రయత్నంలో ఉన్నారు. సచేతనమైన, ప్రజాహితమైన తీర్పుల ద్వారా న్యాయస్థానాల ధర్మాసన చైతన్యం దేశ ప్రజలకు ప్రస్ఫుటం కాకుండా కేంద్ర పాలకులు ‘పుల్లలు’ పెడుతున్నారు. ప్రభుత్వాల, శాసన వేదికల నిర్ణయాలను పరిశీలించి, భాష్యం చెప్పి, తన తీర్పుల ద్వారా విధానంలో మార్పులకు దోహదం చేయగల హక్కును న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం కల్పించింది. ఇప్పుడా హక్కును కూడా కాలదన్నే ప్రయత్నంలో పాలకులున్నారు. చివరికి న్యాయస్థానాలకు న్యాయమూర్తుల నియామకాల్ని కూడా శాసించజూచే ‘పిదప బుద్ధులకు’ పాలకులు అలవాటు పడుతున్నారు. తమ విచక్షణాధికారాలను చలాయించేందుకు గవర్నర్లకు ఉన్న అధికారాన్ని అదుపు చేస్తూ సుప్రీం 2016లోనే ఒక తీర్పు ఇచ్చింది. గవర్నర్ల నిర్ణయాలు నిరంకుశంగానో లేదా తమకు తోచినట్లుగానో ఉండకూడదని శాసించింది. రాజ్య వ్యవహారాల్లో, పాలనా బాధ్యతల నిర్వహణలో గవర్నర్లు ‘ఇష్టారాజ్యం’గా వ్యవహరించరాదని తొలి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ ‘కరస్పాండెన్స్’లో సంకలనకర్త వాల్మీకి చౌదరి పేర్కొన్నారు. ఈ ‘ఇష్టారాజ్య’ ప్రవర్తనకు మూల కారణం గవర్నర్లను కేంద్ర పాలకులు రాజకీయ ప్రయోజనాలకు ‘పార్టీ పావు’ లుగా వాడుకోవడం. అందుకనే కశ్మీర్, గుజరాత్ మాజీ గవర్నర్ బి.కె. నెహ్రూ గవర్నర్లను ‘పాలక పార్టీలో శక్తులుడిగిపోయి చేవ చచ్చిన వ్యక్తులకు గవర్నర్ పోస్టు లివ్వడం ఖుషీలోక బాంధవుల్నిగా చూడటమే అవుతుంద’ని అన్నాడు. అలాగే, ఒకసారి కాదు, అనేకసార్లు గవర్నర్లను కేంద్ర ప్రభుత్వ ఏజెం ట్లుగా వ్యవహరించేటట్లు చేశార’ని ‘నిపుణుల బెంగాల్ సదస్సు’ వాపోయింది (1983 సెమినార్ ప్రత్యేక సంచిక, పే.400). విస్తరణ కాంక్ష గవర్నర్ల పదవులకు పాలకపక్షం తమ సభ్యుల్నే ఎంపిక చేయడం కాదు. అలాగే గవర్నర్లు రాజ్యాంగ అవసరాలకు అనుగుణంగా నడుచుకోగలిగిన రాజ్యాంగాధినేతలుగా క్రమశిక్షణతో మెలగాలి. అప్పుడే కేంద్ర రాష్ట్రాల మధ్య పరస్పరం సహకారం స్థిరపడుతుందని ప్రసిద్ధ రాజ్యాంగ నిపుణుడు గ్రాన్ విల్లీ ఆస్టిన్ ‘భారత ప్రజాస్వామిక రాజ్యాంగం పనితీరు’ అనే గ్రంథంలో రాశాడు. ఇందుకు ఫెడరల్ సంబంధాలు అనివార్యంగా సుస్థిరం కావలసిందేనన్నాడు (‘వర్కింగ్ ఎ డెమోక్రటిక్ కాన్సిట్యూషన్: ది ఇండియన్ ఎక్స్పీరియన్స్’). కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే 1991లోనే దేశాన్ని ‘భారత సంయుక్త రాష్ట్రాలు’గా ప్రకటించాలని కోరాడు. ఫెడరల్ (సమాఖ్య) దృక్పథం దేశంలో సర్వత్రా వికసించకుండా చేసేం దుకు భారత ‘ఫెడరేషన్’ దృక్పథాన్ని నిర్వీర్యం చేసి రాష్ట్రాల ప్రత్యేక ఉనికికి గుర్తింపు లేకుండా చేశారు పాలకులు. ఇందులో భాగమే ఉత్తర–దక్షిణ భారతాలను వేర్వేరుగా చీల్చే ప్రయత్నాలూ మొగ్గ తొడుగుతున్నాయి. ‘బొంక నేర్చినవాడు వంకలూ నేరుస్తాడన్న’ట్టు ‘ఉత్తరాదిని చేజిక్కించుకున్నాం, దక్షిణాది రాష్ట్రాలను చేజిక్కించుకోవాల’ని ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేత అమిత్ షాలు యూపీ ఎన్నికల తర్వాత కొత్త నినాదాన్ని ‘మౌర్య సామ్రాజ్య విస్తరణ’ కాంక్షతో వ్యాప్తిలోకి తెచ్చారు. మరో వైపున దళితులు, మైనారిటీలపైన దాడులు చేయడానికి వెనుకాడటం లేదు. ఇంతకూ ఉత్తరాదిపై కాంగ్రెస్కుగానీ, బీజేపీకిగానీ వల్లమాలిన ప్రేమకు కారణం ఏమై ఉంటుంది? ఈ ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం– ఇతర ఏ భారత రాష్ట్రానికీ కల్పించని 80 పార్లమెంటు (లోక్సభ) సీట్లు అనే ‘స్వీటు’. ఆ ఆధిపత్యంతోనే దక్షిణాదిపై సవారీ!! -ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు(abkprasad2006@yahoo.co.in) -
ఆరో రోజూ రూపాయి డౌన్
ముంబై: వరుసగా ఆరో సెషన్లోనూ రూపాయి మారకం విలువ క్షీణించింది. డాలర్తో పోలిస్తే సోమవారం మరో 36 పైసలు తగ్గి 66.48 స్థాయికి పడిపోయింది. ఇది 13 నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. 2017 మార్చి 10 తర్వాత ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్రథమం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందన్న అంచనాలు, క్రూడ్ ధరలు ఒక్కసారిగా ఎగియడం మొదలైన అంశాలు రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపాయి. కొన్నాళ్ల క్రితం దాకా చౌక ముడిచమురు ధరలతో రూపాయి బలపడినప్పటికీ, ఇప్పుడు ఆ ర్యాలీకి అడ్డుకట్ట పడినట్లేనని ఫారెక్స్ ట్రేడర్లు అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణాన్ని ఎగదోసే రిస్కును తెచ్చిపెట్టిన క్రూడ్ ధరల పెరుగుదల మూలంగా.. విధానపర నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వం డైలమాలో పడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. వాణిజ్య యుద్ధ భయాలు, బాండ్ ఈల్డ్ల పెరుగుదల తదితర అంశాలతో అంతర్జాతీయంగా తీవ్ర ఒడిదుడుకుల నేపథ్యంలో ఏప్రిల్లో ఇప్పటిదాకా విదేశీ ఇన్వెస్టర్లు, ఫండ్లు భారత మార్కెట్ నుంచి దాదాపు రూ. 8,000 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 66.12తో పోలిస్తే సోమవారం ఒకింత బలహీనంగా 66.20 వద్ద ప్రారంభమైన రూపాయి ట్రేడింగ్ ఆ తర్వాత మరింతగా తగ్గింది. డాలర్ల కొనుగోళ్ల ఒత్తిడితో ఇంట్రా డేలో 66.49 స్థాయికి కూడా తగ్గింది. మధ్యలో ప్రభుత్వ రంగ బ్యాంకులతో డాలర్లను విక్రయించడం ద్వారా ఆర్బీఐ కొంత జోక్యం చేసుకున్నప్పటికీ.. పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. చివరికి 0.54 శాతం నష్టంతో దేశీ కరెన్సీ 66.48 వద్ద క్లోజయ్యింది. -
ఫెడ్ నిర్ణయం : రూపాయి పడిపోయింది
ముంబై : ఫెడరల్ రిజర్వు పాలసీ నిర్ణయం నేడు వెలువడనున్న నేపథ్యంలో రూపాయి విలువ క్షీణించింది. అమెరికా డాలర్కు వ్యతిరేకంగా రూపాయి నాలుగు నెలల కనిష్టంలో 65.21గా నమోదైంది. 2017 నవంబర్ 16న రూపాయి విలువ ఈ స్థాయిలో ఉంది. 65.23గా ప్రారంభమైన రూపాయి విలువ, 65.19 వద్ద గరిష్ట స్థాయిని, 65.23 వద్ద కనిష్ట స్థాయిని నమోదుచేసుకుంది. ఫెడరల్ రిజర్వు నేడు తన వడ్డీరేట్లను పెంచనున్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి. రెండు రోజుల సమావేశ నేపథ్యంలో ఫెడరల్ రిజర్వు నిన్న భేటీ అయింది. ఈ ఏడాది మరో రెండు సార్లు ఫెడరల్ రిజర్వు తన వడ్డీరేట్లను పెంచనున్నట్టు తెలుస్తోంది. కొత్త చైర్మన్ పావెల్ అధ్యక్షతన ఫెడ్ కమిటీ నేడు కనీసం పావు శాతం వడ్డీ రేటును పెంచే అవకాశముందని సమాచారం. దీంతో ఫెడ్ ఫండ్స్ రేటు 1.5-1.75 శాతానికి చేరనున్నట్లు అత్యధికులు భావిస్తున్నారు. ఇన్వెస్టర్లు ఫెడ్ నిర్ణయంపై ఎక్కువగా దృష్టి సారించారు. -
నేడే ఫెడ్ నిర్ణయం : లాభాల్లో మార్కెట్లు
ముంబై : ఫెడ్ సమావేశ ఫలితాలు, సెకండ్ హాఫ్ సెషన్లో చోటు చేసుకున్న ప్రాఫిట్ బుకింగ్తో దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి కాస్త లాభాలను తగ్గించుకున్నాయి. నేటి ఇంట్రాడేలో దాదాపు 300 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్, చివరికి 139 పాయింట్ల లాభంలో 33,136 వద్ద ముగిసింది. నిఫ్టీ 30 పాయింట్ల లాభంలో 10,155 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో మార్కెట్లు ఆద్యంతం సానుకూలంగానే ట్రేడయ్యాయి. కానీ చివరకు ఇన్వెస్టర్లు కాస్త ప్రాఫిట్ బుకింగ్కు పాల్పడ్డారు. రెండు రోజులపాటు సమావేశమైన అమెరికా ఫెడ్ పాలసీ నిర్ణయం నేటి అర్ధరాత్రి వెలువడనుంది. కొత్త చైర్మన్ పావెల్ అధ్యక్షతన ఫెడ్ కమిటీ కనీసం పావు శాతం వడ్డీ రేటును పెంచే అవకాశముందని తెలుస్తోంది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేటు 1.5-1.75 శాతానికి చేరనున్నట్లు అత్యధికులు భావిస్తున్నారు. ఇన్వెస్టర్లు ఫెడ్ నిర్ణయాలపై ఎక్కువగా దృష్టి సారించినట్టు నిపుణులు పేర్కొన్నారు. ఫార్మా, మెటల్, మీడియా షేర్లు నష్టాలు గడించగా.. రియల్టీ 0.8 శాతం పైకి ఎగసింది. బ్లూచిప్స్లో ఎయిర్టెల్ 4.3 శాతం జంప్చేయగా.. బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, ఐబీ హౌసింగ్, బీపీసీఎల్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ, అల్ట్రాటెక్, ఓఎన్జీసీ, ఇండస్ఇండ్ 2.5-1 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే టాటా స్టీల్, హీరోమోటో, ఐషర్, అదానీ పోర్ట్స్, ఇన్ఫ్రాటెల్, అరబిందో, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా 2-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. -
ఫెడ్.. లబ్డబ్..
ప్రపంచ మార్కెట్లకు దిశానిర్దేశం చేసే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది మూడు దఫాలు మాత్రమే వడ్డీ రేట్లు పెంపు ఉండొచ్చని ముందస్తుగా అనుకున్నప్పటికీ.. అమెరికాలో ఆర్థిక పరిస్థితులు మెరుగవుతున్న నేపథ్యంలో ఈ పెంపు నాలుగుసార్లయినా లేదా అయిదుసార్లయినా కావొచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ చైర్మన్గా పగ్గాలు చేపట్టిన తర్వాత జెరోమ్ పావెల్ తొలిసారిగా పరపతి విధాన సమీక్ష జరుపుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్ల పెంపు విడతలపై ఉత్కంఠ నెలకొంది. మాజీ చైర్మన్ జేనెట్ యెలెన్లాగా క్రమానుగతంగా పెంచుకుంటూ వెళ్లే విధానాలనే కొనసాగిస్తారా.. లేక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను ప్రతిబింబించేలా దూకుడు ప్రదర్శిస్తారా అన్నది మార్కెట్ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్వోఎంసీ) బుధవారం వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని ప్రకటించనుంది. అదే సమయంలో ఆర్థిక అంచనాలను కూడా వెలువరిస్తుంది. ఇందులోనే వడ్డీ రేట్ల పెంపు ఎన్ని దఫాలు ఉండొచ్చన్నదీ వెల్లడి కానుంది. ఏదైతేనేం పావెల్ మాటలు బట్టి, అమెరికా సానుకూల ఆర్థిక పరిస్థితులు బట్టి చూస్తే వడ్డీ రేట్లను పెంచే క్రమం పెరగడమే తప్ప.. తగ్గే అవకాశాల్లేవని విశ్లేషకులు అంటున్నారు. సానుకూల పరిస్థితులు.. ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత గణాంకాలు మొదలైన వాటికి సంబంధించిన సానుకూల అంశాలు మరిన్ని దఫాలు వడ్డీ రేట్ల పెంపునకు దోహదపడే అవకాశాలు ఉన్నట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో ద్రవ్యోల్బణం పెరగడంతో.. వచ్చే ఏడాదిలోగా రెండు శాతం టార్గెట్ను సులువుగా చేరొచ్చని ఫెడరల్ రిజర్వ్కు కొంత భరోసానిస్తోంది. మరోవైపు, నిరుద్యోగిత స్థిరంగా 4.1 శాతంగా కొనసాగుతోంది. మెరుగుపడుతున్న ఎకానమీకి అనుగుణంగా ఉద్యోగాల కల్పనలో వృద్ధి కూడా క్రమంగా పెరుగుతోంది. రిస్కులూ ఉన్నాయి..: ఇవన్నీ నాణేనికి ఒకవైపు కాగా.. దీనికి మరోవైపు కూడా చూడాలంటున్నారు మరికొందరు విశ్లేషకులు. ఇప్పుడున్నంత తక్కువ స్థాయిలో నిరుద్యోగిత సుదీర్ఘకాలం కొనసాగడం.. దాని ప్రభావాలు ఎలా ఉంటాయన్నది ఈ మధ్య కాలంలో ఎన్నడూ చూడలేదన్నది వారి వాదన. చాన్నాళ్ల క్రితం 1960ల ఆఖర్లో నిరుద్యోగిత 4 శాతం కన్నా తక్కువ స్థాయిలో ఉండేది. అయితే, అది 1970ల నాటికి భారీ ద్రవ్యోల్బణ పరిస్థితులకు దారి తీసింది. వడ్డీ రేట్ల పెంపునకు సంబంధించి ప్రస్తుత ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత అంశాలను ఈ కోణంలో కూడా చూడాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, ఇప్పటికే పన్ను కోతలు, వ్యయాల పెంపుతో భారీ ఊతం లభించిన ఎకానమీకి.. అంతర్జాతీయంగా పటిష్ట వృద్ధి, బలహీన డాలరు, మెరుగుపడుతున్న పెట్టుబడులు మొదలైన అంశాలు కూడా తోడైతే ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా అస్థిరతకు లోనయ్యే అవకాశాలూ ఉన్నాయన్న అభిప్రాయం కూడా నెలకొంది. ప్రస్తుతం ఫెడ్ రేట్లు 1.25 శాతం – 1.50 శాతం శ్రేణిలో ఉన్నాయి. తాజా సమీక్షలో వీటిని పావు శాతం పెంచవచ్చని అంచనా. దీంతో వడ్డీ రేట్ల శ్రేణి 1.5 శాతం – 1.75 శాతానికి చేరుతుంది. గతేడాది మూడు దఫాలుగా వడ్డీ రేట్లు పెంచిన ఫెడరల్ రిజర్వ్ .. ఈ ఏడాది మరో మూడు దఫాలు పెంచే అవకాశాలు ఉన్నాయంటూ డిసెంబర్లో సూచనప్రాయంగా వెల్లడించింది. అయితే, ఈ ఏడాది జనవరిలో సమీక్ష జరిపినప్పటికీ.. రేట్లు మాత్రం యధాతథంగానే ఉంచింది. 2007–09 మధ్య కాలంలో ఆర్థిక మాంద్యం దరిమిలా ఎకానమీకి ఊతమిచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సున్నా స్థాయికి తగ్గించేసిన సంగతి తెలిసిందే. -
క్షీణించిన బంగారం, వెండి ధరలు
సాక్షి, ముంబై: ఫెడ్ వడ్డీ రేటు పెంపు అంచనాలు, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో బంగారం, వెండిధరలు సోమవారం పతనాన్ని నమోదు చేశాయి. ఆరంభం నష్టాలనుంచి మరింత నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్లో ఏప్రిల్ నెల డెలివరీ పుత్తడి ధర 0.18 శాతం పడిపోయింది. ప్రస్తుతం10 గ్రాముల బంగారం ధర రూ.120 క్షీణించి 30,104 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా, జూన్ నెలలో డెలివరీ గోల్డ్ధర ధర 42 రూపాయలు లేదా 0.14శాతానికిపై గా పడిపోయింది. మరో విలువైన మెటల్ వెండి ధరలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. విదేశాలలో బలహీనమైన ధోరణితో పుత్తడి ధరల కిందిగి పడ్డాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డాలర్ స్థిరంగా ఉండటంతో, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందని పెట్టుబడిదారులు అంచనా వేశారు. దీంతో ఎంసీఎక్స్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువ సాగుతోంది. ఇది బంగారం ధరలను ప్రభావితం చేసిందని బులియన్ ట్రేడర్లు తెలిపారు. అటు 24 క్యారెట్ల పుత్తడి ధరలు రూ.32 వేలకు దిగువనకు చేరాయి. హైదరాబాద్లో 22 క్యారట్ల బంగారం ధర రూ. 28,950గాను, 24క్యారెట్ల ధర పది గ్రా. రూ. 30,960లు పలుకుతోంది. ఢిల్లీలో 22 క్యారట్ల బంగారం ధర రూ.29,500 గాను, 24క్యారెట్ల ధర 31,600గాను ఉంది. కిలో వెండి ధర రూ. 130లు(0.35) నష్టపోయి 38, 228 వద్ద ఉంది. ఇక అంతర్జాతీయంగా సింగపూర్లో ఔన్స్ బంగారం ధర 0.17 శాతం తగ్గి 1,311.40 డాలర్లకు చేరుకుంది. -
భారీగా తగ్గిన బంగారం ధరలు
-
భారీగా తగ్గిన బంగారం ధరలు
న్యూఢిల్లీ : వరుసగా నాలుగు రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. నేటి బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు 500 రూపాయల మేర కిందకి పడిపోయింది. 460 రూపాయలు నష్టపోయి రూ.31,390గా నమోదైంది. స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్ పడిపోవడంతో పాటు గ్లోబల్గా సంకేతాలు ప్రతికూలంగా వస్తుండటంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో కేజీ వెండి ధర రూ.250 తగ్గి, రూ.39,300గా నమోదైంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు బలంగా ఉందని.. ఫెడ్ పాలసీ రేట్లను క్రమంగా పెంచుతుందని ఫెడరల్ రిజర్వు చైర్మన్ జీరోమ్ పావెల్ ప్రకటించడంతో, డాలర్కు సెంటిమెంట్ బలపడింది. దీంతో ఎంతో విలువైన ఈ మెటల్కి డిమాండ్ పడిపోయింది. మంగళవారం అంతర్జాతీయంగా బంగారం ధరలు 1 శాతం క్షీణించాయి. ఈ ఏడాది మూడు నుంచి నాలుసార్లు రేట్లను పెంచబోతున్నట్టు కూడా జీరోమ్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.460 చొప్పున పడిపోయి రూ.31,390గా రూ.31,240గా నమోదయ్యాయి. గత నాలుగు సెషన్లలో బంగారం ధరలు రూ.500 మేర పెరిగాయి. -
రేట్ల పెంపు కొనసాగుతుంది: అమెరికా
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు బలంగానే ఉందని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జీరోమ్ పావెల్ స్పష్టం చేశారు. స్టాక్ మార్కెట్లలో ఆటుపోట్ల ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ఉండబోదన్నారు. వృద్ధి, ఉపాధికి సంబం ధించిన మెరుగైన అంచనాల బలంతో ఫెడ్ పాలసీ రేట్లను క్రమంగా పెంచుతుందని తెలియజేశారు. ఫెడ్ గతేడాది మూడు పర్యాయాలు రేట్లను పెంచడమే కాకుండా 2018లోనూ మూడు సార్లు పెంచుతామని సంకేతమిచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. జానెట్ యెలెన్ తర్వాత అమెరికా ఫెడ్ చైర్మన్గా ఈ నెల 5న బాధ్యతలు చేపట్టిన పావెల్ కూడా రేట్ల పెంపుపట్ల స్పష్టతతో ఉన్న ట్టు తాజా వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి.ఈ నెల మొదట్లో స్టాక్ మార్కెట్లలో భారీ కరెక్షన్లను ప్రస్తావిస్తూ ఈ పరిణామాలు ఆర్థిక రంగ భవిష్యత్తుపై, లేబర్ మార్కెట్, ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం చూపిస్తాయని ఫెడ్ భావించడం లేదన్నారు -
ఫెడ్ రేటు పావుశాతం పెంపు
వాషింగ్టన్: అంచనాలకు అనుగుణంగానే అమెరికా సెంట్రల్ బ్యాంక్– తన ఫెడ్ ఫండ్ రేటును పావుశాతం పెంచింది. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 12.30 నిముషాలకు ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో ఫెడ్ రేటు 1.25%–1.50% శ్రేణికి మారింది. దీనితో గృహాల నుంచి కార్ల వరకూ రుణ రేటు పావుశాతం పెరిగే అవకాశం ఉంటుంది. అమెరికా వృద్ధి తీరు, ఉపాధి అవకాశాలు బాగుండడంతో అమెరికా క్రమంగా ఆర్థిక సంక్షోభంనాటి ఉద్దీపన చర్యలను వెనక్కు తీసుకోడానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 2017లో ఫెడ్ రేటు 3 దఫాలుగా ముప్పావు శాతం పెరిగింది. వచ్చే ఏడాదీ మూడు దఫాలుగా రేటు పెరిగే అవకాశంఉందన్న అంచనాలు ఉన్నా, ఇంత దూకుడు నిర్ణయాలు ఉండకపోవచ్చని ఫెడ్ తాజాగా సూచించడం గమనార్హం. ఉపాధి మెరుగుపడుతున్నా, ద్రవ్యోల్బణం అనుకున్నంతగా పెరక్కపోవడం పట్ల విధాన నిర్ణేతల్లో ఇరువురు అనుమానాలు వ్యక్తం చేశారు. డిమాండ్ బలహీనతకు అద్దం పడుతోందని భావించి.. రేట్ల పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు చేశారు. రేటు పెంపునకు వ్యతిరేకత వ్యక్తం చేసిన వారు ఒకటికన్నా ఎక్కువ ఉండడం 2016 నవంబర్ తరువాత ఇదే తొలిసారి. కాగా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ యథాతథ రేటు విధానాన్ని అనుసరిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. -
ఫెడ్ మళ్లీ వడ్డించింది
వాషింగ్టన్: అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజా పరపతి సమీక్షలో పావు శాతం (25బేసిస్పాయింట్లు) వడ్డీ రేటును పెంచింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 1.25-1.5 శాతానికి చేరాయి. దీంతో ఈ ఏడాది మూడోసారి ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) వడ్డీ రేట్లను పెంచింది. తక్కువ పన్నులతో వినియోగదారుల వ్యయం, వ్యాపార పెట్టుబడుల పెరుగుదలతో వచ్చే ఏడాదికి 2.5 శాతం వృద్ధిని అంచనా వేసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్ట వృద్ధిబాటన సాగుతోందనీ, ఈ క్రమంలో దేశ జీడీపీ 2.5 శాతం స్థాయిలో పురోగమించనుందని ఫెడ్ అభిప్రాయపడింది. ఇక ద్రవ్యోల్బణం మాత్రం 2 శాతం దిగువనే కదలనున్నట్లు అంచనా వేసింది. ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థ మరో రేటు పెంపునకు తగినంత బలంగా ఉందన్న ఫెడ్ చైర్పర్శన్ జానెట్ యెలెన్ ఏడాది మరింత అధికంగా రేట్ల పెంపు ఫెడ్ సంకేతాలిచ్చారు. అలాగే ఫిబ్రవరి 3 న తన పదవీ విరమణ ముందు తదుపరి అధ్యక్షుడు జెరోమ్ పావెల్కు మృదువైన పరివర్తనను అందించేందుకు సాధ్యమైనంతవరకు కృషి చేశానని చెప్పారు. మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన అమెరికా పటిష్ట వృద్ధిని సాధించనుందన్న ఫెడ్ తాజా అంచనాలు ప్రపంచ స్టాక్ మార్కెట్లకు జోష్ నివ్వనుందని మార్కెట్ పండితులు విశ్లేషించారు. -
డాలర్కు ఫెడ్ ఆందోళన సెగ
న్యూయార్క్: అమెరికా కరెన్సీ డాలర్కు ఫెడ్ షాక్ తగిలింది. ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ బుధవారం పడిపోయింది. అమెరికా డేటా, ద్రవ్యోల్బణంపై విధాన నిర్ణేతలు ఆందోళన నేపథ్యంలో డాలర్ ఐదు నెలల్లో చెత్త వన్డే ప్రదర్శనను నమోదు చేసింది. దీంతో దేశీయ కరెన్సీ లాభాలతో ప్రారంభమైంది.డాలర్ మారకంలోమ రూపీ 0.06పైసల లాభంతో 64.83 వద్ద కొనసాగుతోంది. అటు యూరోకూడా డాలర్ మారకరంలో అయిదురోజుల గరిష్టానికి చేరింది. ఫెడరల్ రిజర్వు ఇటీవలి విధాన సమావేశం మినిట్స్విడుదల, బలహీనమైన అమెరికా డేటా, టెక్నికల్ ట్రేడింగ్ కారణాల రీత్యా బుధవారం ఇతర కరెన్సీలతోపోలిస్తే అక్టోబర్ నెలలో కనిష్టస్థాయికి పడిపోయింది. అలాగే గత ఐదునెలల్లో ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. అటు మిచిగాన్ యూనివర్సిటీవినియోగదారుల సెంటిమెంట్ రిపోర్ట్ కూడా దీర్ఘకాలిక ద్రవ్యోల్బణం క్షీణిస్తుందని అంచనా వేసింది. -
ఫెడ్ చైర్మన్గా జెరోమ్ పావెల్
వాషింగ్టన్: అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్గా జెరోమ్ పావెల్ (64) పేరును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాకు ఎలాంటి సవాళ్లు ఎదురైనా.. తన సమర్ధవంతమైన నాయకత్వంతో పావెల్ గట్టెక్కించగలరని ట్రంప్ దీమా వ్యక్తం చేశారు. ‘ఆయన ఎంతో నిబద్ధత గలవారు. ఫెడరల్ రిజర్వ్కి రాబోయే సంవత్సరాల్లో అవసరమైన నాయకత్వాన్ని అందించగలరు‘ అని ట్రంప్ పేర్కొన్నారు. సెనేట్ కూడా ఆమోదముద్ర వేస్తే... అమెరికా ఆర్థిక వ్యవస్థకు దిశా నిర్దేశం చేసే ఫెడరల్ రిజర్వ్ చైర్మన్గా ఆయన కీలక బాధ్యతలు చేపడతారని, తన సామర్థ్యాలు, అనుభవంతో పదవికి వన్నె తేగలరని ట్రంప్ చెప్పారు. ప్రస్తుత చైర్మన్ జానెట్ యెలెన్ని తాను గౌరవిస్తానని ట్రంప్ పేర్కొన్నారు. ఎకానమీకి, కోట్ల కొద్దీ అమెరికన్ల ఆర్థిక భవితకు దిశా నిర్దేశం చేసే ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పదవిని.. అమెరికా ప్రభుత్వంలో రెండో అత్యంత శక్తిమంతమైన హోదాగా పరిగణిస్తారు. కోటీశ్వరుడు పావెల్...: రిపబ్లికన్ పార్టీకి చెందిన పావెల్ కోటీశ్వరుడు. 2012 నుంచి ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్లో ఒకరిగా కొనసాగుతున్నారు. కీలక వడ్డీ రేట్లను క్రమంగా పెంచడం, 2008–2009 నాటి మాంద్యం సమయంలో ఫెడ్ కొనుగోలు చేసిన అసెట్స్ను విక్రయించడం తదితర అంశాల్లో ప్రస్తుత చైర్మన్ యెలెన్ విధానాలకు అనుగుణంగానే ఓటింగ్ చేస్తూ వచ్చారు. దీంతో.. తన హయాంలోనూ ఆయన ఇదే ద్రవ్యపరపతి విధానాన్ని కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుత ఫెడ్ చైర్మన్ జానెట్ యెలెన్ పదవీకాలం ఫిబ్రవరితో ముగియనుంది. ఫెడ్ చైర్మన్గా ఉన్న వారిని రెండో దఫా కొనసాగనివ్వకపోవడం గడిచిన నాలుగు దశాబ్దాల్లో ఇదే తొలిసారి కానుంది. -
పసిడికి డాలర్ ‘బులిష్’ షాక్
వారంలో పసిడి 12 డాలర్లు డౌన్! అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోందని, ఫెడ్ ఫండ్ రేటు (అమెరికా సెంట్రల్ బ్యాంక్ రేటు.. ప్రస్తుతం 1–1.25 శాతం శ్రేణి) ఈ ఏడాది ఒకసారి, వచ్చే ఏడాది మూడుసార్లు పెంపు తథ్యమని అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఇస్తున్న సంకేతాలు పసిడిపై ప్రతికూల ప్రభావాన్ని కొనసాగిస్తున్నాయి. న్యూయార్క్లోని అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 29వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో 12 డాలర్లు నష్టపోయింది. 1,286 డాలర్ల వద్ద ముగిసింది. అయితే దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక అనిశ్చితి ధోరణి, ఉత్తరకొరియాతో ఘర్షణాత్మక పరిస్థితి వంటి అంశాలు– పసిడి బులిష్ ట్రెండ్ను కొనసాగిస్తాయని భావిస్తున్నారు. దేశీయంగా పండుగల డిమాండ్ వారం వారీగా డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీనత (65.34), నైమెక్స్లో తగ్గిన బంగారం స్పీడ్ వంటి అంశాలు దేశీయంగా ప్రభావం చూపినా, వారం వారీగా ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్లో పసిడి పూర్తి నష్టాల్లోకి జారలేదు. దేశీయంగా పండుగ సీజన్ డిమాండ్ ఇందుకు ఒక కారణం. ముంబై ప్రధాన మార్కెట్లో వారం వారీగా పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర స్వల్పంగా రూ.70 పెరిగి రూ.29,845కి చేరింది. -
కుప్పకూలినా... మళ్లీ కీలక మద్దతుపైకి!
భారీగా పెరిగిన ధర నుంచి ఒకపక్క లాభాల స్వీకరణ జరుగుతున్న నేపథ్యంలో, రేటు పెంపు తథ్యమని అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ బుధవారం ఇచ్చిన సంకేతాలు, దీనితో డాలర్ ఇండెక్స్ ‘తక్షణ’ బలోపేతం వంటి అంశాలు పసిడికి గత వారం భారీ షాకిచ్చాయి. న్యూయార్క్లోని అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 22వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో 25 డాలర్లు నష్టపోయింది. చివరకు 1,301 డాలర్ల వద్ద ముగిసింది. రెండు వారాల్లో ఇక్కడ నష్టం 52 డాలర్లు. సెప్టెంబర్ 8తో ముగిసిన వారంలో న్యూయార్క్లోని అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 1,362 డాలర్లను తాకింది. అయితే అదేరోజు చివరకు 10 డాలర్లు తగ్గి 1,352 డాలర్ల వద్ద ముగిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పసిడి సమీప కాలంలో 1,300 – 1,350 డాలర్ల శ్రేణిలో కొంత కాలం కన్సాలిడేషన్ జరగవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బులిష్ ధోరణే... గురువారం ఒకదశలో 1,300 డాలర్ల కీలక మద్దతుస్థాయిని కోల్పోయి, 1,293 డాలర్లకు చేరిన పసిడి తిరిగి ఒక్కరోజులోనే కీలక మద్దతుస్థాయి 1,300 డాలర్ల స్థాయిపైన ముగియడం ఈ మెటల్ బులిష్ ధోరణికి సంకేతమన్నది నిపుణుల విశ్లేషణ. మున్ముందూ ఇదే ధోరణి కొనసాగుతుందని అంచనా. అమెరికాతో ఉత్తరకొరియా ఘర్షణాత్మక వైఖరి, తాజాగా ఇరాన్ మిసైల్ ప్రయోగం వంటివి ఇందుకు తక్షణ కారణాలు కాగా, దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక అనిశ్చితి ధోరణి పసిడి బులిష్ ట్రెండ్ను కొనసాగిస్తాయని భావిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఒకసారి, వచ్చే ఏడాది మూడుసార్లు ఫెడ్ ఫెండ్ రేటు (ప్రస్తుతం 1.00–1.25 శాతం) పెంపు సంకేతాలను ఇచ్చిన వెన్వెంటనే బుధవారం 91.40 స్థాయిల్లో ఉన్న డాలర్ ఇండెక్స్ 92.50 స్థాయికి చేరింది. అయినా ఆ స్థాయిలో నిలబడలేక క్రమంగా 92 దిగువకు వచ్చేసింది. శుక్రవారం 91.95 వద్ద ముగిసింది. క్రితం వారం ముగింపు 91.85. పసిడికి దిగువస్థాయిలో 1,300 డాలర్లు, 1,280 డాలర్లు తక్షణ నిరోధాలన్నది విశ్లేషకుల అంచనా. 1,400 డాలర్లు చేరడానికి 1,370 డాలర్లు నిరోధంగా టెక్నికల్ అనలిస్టులు పేర్కొంటున్నారు. దేశీయంగా రూ.30,000 దిగువకు... వారం వారీగా డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీనత (64.90), నైమెక్స్లో తగ్గిన బంగారం స్పీడ్ వంటి అంశాలు దేశీయ పసిడిపై కూడా ప్రభావం చూపించాయి. ముంబై స్పాట్ మార్కెట్లో దాదాపు రెండు వారాల్లో ధర రూ.700 తగ్గింది. అంతక్రితం రెండు వారాల్లో పెరిగిన మొత్తంలో (రూ.1,400) దాదాపు సగం కోల్పోయింది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే ్చంజ్లో పసిడి గడచిన వారంలో రూ.271 తగ్గి, రూ.29,585 కి చేరింది. ముంబై ప్రధాన మార్కెట్లో వారం వారీగా పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.280 తగ్గి, రూ.29,775కి చేరింది. ఇక 99.5 స్వచ్ఛత విషయంలో ధర ఇదే స్థాయిలో పడి రూ. 29,625కు దిగింది. ఇక వెండి కేజీ ధర కూడా భారీగా రూ.1,005 తగ్గి రూ.39,450కి చేరింది. -
రూపాయికి ‘ఫెడ్’ షాక్!
డాలర్ ఇండెక్స్ రయ్ రయ్... ► రూపాయికి 54 పైసలు నష్టం ► అమెరికా సెంట్రల్ బ్యాంక్ ► ‘కఠిన విధాన’ ప్రకటన నేపథ్యం ► పసిడి 24 డాలర్లు డౌన్ ముంబై: అమెరికా ఆర్థిక వ్యవస్థ పనితీరు బాగుందని, ఈ ఏడాది ఒకసారి, వచ్చే ఏడాది మూడుసార్లు ఫెడ్ ఫండ్ రేటు పెంపు ఖాయమని అమెరికా సెంట్రల్ బ్యాంక్ బుధవారం చేసిన ప్రకటన డాలర్ ఇండెక్స్ పెరుగుదలకు, రూపాయి పతనానికి దారితీశాయి. బంగారం కూడా అంతర్జాతీయ మార్కెట్లో భారీగా 20 డాలర్లు పైగా పడిపోయింది. వివరాలివీ.... డాలర్ ఇండెక్స్: ఫెడ్ రేటు (ప్రస్తుతం 1 – 1.25 శాతం) పెంపు తప్పదన్న నిర్ణయంతో పాటు అక్టోబర్ నుంచి నగదు ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు లిక్విడిటీని వెనక్కు తీసుకునే చర్యలకు శ్రీకారం చుడతామని భారత్ కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11.30కి అమెరికా సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. ఆ ప్రకటన వెలువడే సమయానికి డాలర్ ఇండెక్స్ 91.30 వద్ద ఉంది. ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాలకే ఇండెక్స్ భారీగా ఒక డాలర్ మేర లాభపడింది. అమెరికా ఆర్థిక వ్యవస్థపై తక్షణం వెలువడిన ‘బులిష్ ధోరణి’ ఫలితం ఇది. గురువారం ఈ వార్త రాసే సమయానికి డాలర్ ఇండెక్స్ గరిష్ట స్థాయి 92.46కాగా, కనిష్టస్థాయి 91.89. రూపాయిపైనా ప్రభావం... డాలర్ విలువకు జోష్ రావటం గురువారంనాడు భారత రూపాయిపై ప్రభావం చూపించింది. ఫారెక్స్ మార్కెట్లో సాయంత్రం 5 గంటలకు ట్రేడింగ్ ముగిసే సమయానికి బుధవారం ముగింపుతో పోల్చిచూస్తే, డాలర్ మారకంలో రూపాయి విలువ 54 పైసలు నష్టపోయింది. 64.81 వద్ద ముగిసింది. ఇది రెండున్నర నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. కాగా. కడపటి సమాచారం అందేసరికి, అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ మరింత బలహీనంగా 64.90 వద్ద ట్రేడవుతోంది. రూపాయి కనిష్ట–గరిష్ట స్థాయిలు 64.29 – 65.07గా నమోదయ్యాయి. జారిన బంగారం... ఉత్తరకొరియా ఉద్రిక్తత, అమెరికా ఆర్థిక అనిశ్చితులు, డాలర్ ఇండెక్స్ బలహీనత వంటి అంశాల నేపథ్యంలో, బంగారం రెండు వారాల క్రితం ఔన్స్కు (31.1 గ్రా.) 1,365 డాలర్ల ధరను తాకింది. లాభాల స్వీకరణతో అటు తర్వాత కిందకు దిగుతూ వస్తున్న బంగారానికి ‘ఫెడ్’ నిర్ణయం దెబ్బ గట్టిగానే తగిలింది. గురువారం ఒకానొకదశలో బుధవారంతో పోలిస్తే ఏకంగా 20 డాలర్లు తగ్గి, 1,296 డాలర్ల వద్దకు దిగజారింది. ఒక దశలో 1,292 డాలర్ల స్థాయిని సైతం తాకింది. గత ట్రేడింగ్లో బంగారం 1,300 డాలర్లను తాకడానికి దాదాపు రెండు వారాలు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. గురువారం ట్రేడింగ్ అంతా ఇలా బలహీనంగానే సాగితే 1,300 డాలర్ల కీలక మద్దతును కోల్పోయినట్లే. దేశీయంగా స్పాట్, ఫ్యూచర్స్ ఇలా...: ఇక దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్.. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో పసిడి 10 గ్రాముల ధర ఒకదశలో క్రితం ముగింపుకన్నా రూ.220 నష్టంతో రూ. 29,554 వద్దకు దిగజారింది. ముంబై స్పాట్లో బుధవారం 99.9 స్వచ్ఛత ధర రూ. 220 తగ్గి రూ.29,730 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛత కూడా ఇదే స్థాయిలో తగ్గి రూ.29,580కి చేరింది. వెండి కేజీ ధర రూ.600 కిందకుదిగి రూ.39,265కు పడింది. -
ఫెడ్ ప్రకటన: స్వల్ప లాభాలు
సాక్షి, ముంబై : ఫెడరల్ రిజర్వు మానిటరీ పాలసీ సమావేశనాంతరం ఈక్విటీ బెంచ్ మార్కు సూచీలు స్వల్పంగా లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 42.42 పాయింట్ల లాభంలో 32,442.93 వద్ద, నిఫ్టీ 10.95 పాయింట్ల లాభంలో 10,152.10 వద్ద ఆరంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, లుపిన్, హిందాల్కో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2 శాతం మేర లాభపడ్డాయి. టీసీఎస్, బ్యాంకు ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంకు, అంబుజా సిమెంట్స్ ఒత్తిడిలో కొనసాగాయి. నిఫ్టీ మిడ్క్యాప్ 0.12 శాతం మేర పైకి ఎగిసింది. ఫెడరల్ రిజర్వు అర్థరాత్రి ప్రకటించిన మానిటరీ పాలసీ నిర్ణయంతో ఫెడ్ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు ప్రకటించింది. అమెరికాలో వెలువడుతున్న ఆర్థిక గణాంకాల హెచ్చుతగ్గులు...కీలక వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించడానికి ఒక కారణంగా తెలిసింది. ఫెడ్ ప్రకటనాంతరం అటు ఆసియన్ మార్కెట్లు మిశ్రమంగా ప్రారంభమయ్యాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 12 పైసల నష్టంలో 64.45 వద్ద కొనసాగుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 156 రూపాయల లాభంలో రూ.29,777 వద్ద ట్రేడవుతున్నాయి. -
స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులు
►నష్టాల్లో ముగిసిన సూచీలు ►ఫెడ్ నిర్ణయం కోసం ఎదురుచూపు ముంబై: అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని వెల్లడించనున్న నేపథ్యంలో బుధవారం ప్రపంచ మార్కెట్ల బాటలోనే భారత్ సూచీలు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనై..చివరకు స్వల్పనష్టాలతో ముగిసాయి. 32,499–32,383 పాయింట్ల మధ్య కదలిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 1.86 పాయింట్ల నష్టంతో 32,400.51 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. 10,171–10,134 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు గురైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 6.40 పాయింట్ల నష్టంతో 10,141.15 పాయింట్ల వద్ద ముగిసింది.ఆసియా, యూరప్ దేశాల సూచీలు కూడా ఇదేరీతిలో బలహీనంగా ముగిసాయని విశ్లేషకులు చెప్పారు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11.30 గంటలకు ఫెడ్ నిర్ణయం వెలువడుతుంది. ఫెడ్ మీట్ నేపథ్యంలో వరుసగా రెండోరోజు భారత్ సూచీలు దాదాపు ఫ్లాట్గా ముగిసాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రేట్ల సవరణ, పెట్రోలియం ఉత్పత్తుల్ని జీఎస్టీలోకి తీసుకువచ్చే ప్రతిపాదనలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టినిలిపారని ఆయన వివరించారు. టెలికం షేర్లలో చురుగ్గా ట్రేడింగ్..: ఇంటర్ కనెక్టివిటీ ఛార్జీల్లో భారీ కోత విధించిన నేపథ్యంలో బుధవారం టెలికం షేర్లు చురుగ్గా ట్రేడయ్యాయి. సెన్సెక్స్–30 షేర్లలో అధికంగా డాక్టర్ రెడ్డీస్ లాబ్ షేరు 3.33% పెరిగింది. -
ఫెడ్ భేటీ,కొరియాపై దృష్టి!
► ఉత్తర కొరియా ఉద్రిక్తతల ప్రభావం ► ఫెడరల్ రిజర్వ్ సమావేశ ఫలితం ► మూడు కొత్త కంపెనీల లిస్టింగ్ ► ఈ నెల 20 నుంచి ఎస్బీఐ లైఫ్ ఐపీఓ కొరియా ప్రాంతంలో చెలరేగుతున్న ఉద్రిక్తతలు ఈ వారం స్టాక్మార్కెట్పై గణనీయమైన ప్రభావాన్ని చూపించనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశ ఫలితం కూడా స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తుందని వారంటున్నారు. ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్తో రూపాయి మారకం కదలికలు కూడా కీలకం కానున్నాయని విశ్లేషకులంటున్నారు. ఇక రెండో క్వార్టర్కు సంబంధించిన కరంట్ అకౌంట్ గణాంకాలను ప్రభుత్వం ఈ వారంలోనే వెలువరిస్తుంది. కొరియా పరిణామాలతో ముడిపడిన భౌగోళిక ఉద్రిక్తతలు ఈ వారం కీలకం కానున్నాయని కోటక్ మ్యూచువల్ ఫండ్ సీనియర్ వైస్–ప్రెసిడెంట్ శిబానీ కురియన్ చెప్పారు. గత వారంలో ఉత్తర కొరియా జపాన్ మీదుగా మరో క్షిపణిని ప్రయోగించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీలు ముఖ్యంగా ముడి చమురు ధరల గమనం కూడా స్టాక్ సూచీల కదలికలను ప్రభావితం చేస్తుందని కురియన్ అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ముగింపుకు వచ్చిన నేపథ్యంలో రానున్న వారాల్లో మార్కెట్ దృష్టి కంపెనీల ఆర్థిక ఫలితాల రికవరీపై ఉంటుందని వివరించారు. కొరియాతో చర్చలు జరిగితే సానుకూల ప్రభావం ఉంటుందని, మరో క్షిపణి ప్రయోగం జరిగితే అది పూర్తి స్థాయి యుద్ధానికి దారితీస్తుందని ట్రేడ్బుల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ధ్రువ్ దేశాయ్ చెప్పారు. ఫెడ్ వ్యాఖ్యల ప్రాధాన్యం.... అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు విషయమై తీసుకునే నిర్ణయం ఈ వారం మార్కెట్కు కీలకం కానున్నదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. అమెరికాలో అర్థిక పరిస్థితులు మెరుగుపడిన నేపథ్యంలో 25 బేసిస్ పాయింట్ల రేట్ల పెంపు తప్పదని, అయితే భవిష్యత్ రేట్ల పెంపుపై ఫెడ్ సమావేశం వ్యాఖ్యలు కీలకం కానున్నాయని జైఫిన్ ఆడ్వైజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ దేవేంద్ర నేవ్గి చెప్పారు. 21న ఫెడ్ సమావేశం నిర్ణయం వెలువడనుంది. ఈ వారంలోనే ఎస్బీఐ లైఫ్ ఐపీఓ ఈ వారంలో రెండు కంపెనీలు ఐపీఓలు ఉండగా, మూడు కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్ట్కానున్నాయి. నేడు (సోమవారం) డిక్సన్ టెక్నాలజీస్, భారత్ రోడ్ నెట్వర్క్ కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టవుతాయి. ఈ రెండు ఐపీఓలు ఈ నెల 8న ముగిశాయి. డిక్సన్ టెక్నాలజీస్ ఇష్యూ ధర రూ.1,766గా, భారత్ రోడనెట్వర్క్ తన ఇష్యూ ధరను రూ.205గా నిర్ణయించాయి. ఈ నెల 21న(గురువారం)మాట్రిమోనిడాట్కామ్ స్టాక్ మార్కెట్లో లిస్టవనున్నది. ఇక ఈ నెల 20న(బుధవారం) ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) మొదలవుతుంది. ఈ నెల 22న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.8,400 కోట్లు సమీకరించనున్నది. ఈ ఐపీఓ ధరల శ్రేణి రూ.685–700. అర్హులైన ఉద్యోగులకు ఒక్కో షేర్కు రూ.68 డిస్కౌంట్ లభిస్తుంది. కనీసం 21 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇక గత శుక్రవారం ప్రారంభమైన ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఐపీఓ 19న(మంగళవారం) ముగియనున్నది. రూ.3,000 కోట్ల విదేశీ స్టాక్ పెట్టుబడులు వెనక్కి విదేశీ ఇన్వెస్టర్ల స్టాక్ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. ఈ నెలలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు రూ.3,000 కోట్ల మేర పెట్టుబడులను స్టాక్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. ఉత్తర కొరియా ఉద్రిక్తతలు, అంతంత మాత్రంగానే ఉన్న కంపెనీల క్యూ1 ఫలితాలు దీనికి కారణాలని నిపుణులంటున్నారు. ఈ ఏడాది ఆగస్టులో స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.12,770 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారని, దీనికి కొనసాగింపుగా ఈ నెలలో కూడా స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయని వారంటున్నారు. డిపాజిటరీల తాజా గణాంకాల ప్రకారం.., ఈ నెల 15 వ తేదీ వరకూ విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ నుంచి రూ.3,085 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోగా, డెట్ మార్కెట్లో మాత్రం రూ.3,051 కోట్లు పెట్టుబడులు పెట్టారు. మొత్తం మీద ఈ ఏడాదిలో స్టాక్ మార్కెట్లో విదేశీ పెట్టుబడులు రూ.45,099 కోట్లుగా ఉన్నాయి. -
కీలక నిరోధం దాటిన బంగారం
► 1300 డాలర్ల పైకి... ► ఏకంగా 34 డాలర్ల లాభం ∙ ► ఈ ఏడాది పసిడికి ఇదే గరిష్టస్థాయి అమెరికా ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, డాలర్ ఒడిదుడుకులు, ఫెడ్ ఫండ్ రేటును ప్రస్తుత 1.00–1.25 శాతం శ్రేణి నుంచి పెంచే అవకాశాలు తక్షణం లేకపోవడం వంటి అంశాలు బంగారానికి బలాన్నిస్తున్నాయి. సెప్టెంబర్ 1తో ముగిసిన వారంలో న్యూయార్క్లోని అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర కీలక నిరోధ స్థాయి 1300 డాలర్లను దాటింది. ఈ స్థాయి వద్ద గడచిన రెండు వారాల నుంచీ పసిడికి గట్టి నిరోధం ఎదురవుతున్న సంగతి తెలిసిందే. వారం చివరిలో ఒకదశలో 1334 డాలర్ల స్థాయిని తాకినప్పటికీ, చివరకు 1,329 డాలర్ల వద్ద ముగిసింది. క్రితం వారంతో పోలిస్తే పసిడి ఏకంగా 34 డాలర్లు పెరిగింది. పడితే కొనచ్చు...: అమెరికా ఆర్థిక రంగానికి వెలువడిన పలు సానుకూల, ప్రతికూల గణాంకాల తరహాలోనే డాలర్, పసిడి పరస్పర వ్యతిరేక దిశల్లో వారమంతా ఒడిదుడుకులమయంగా తిరిగాయి. ఒక దశలో డాలర్ ఇండెక్స్ 93 డాలర్ల స్థాయికి పెరిగితే, పసిడి 1,280 డాలర్ల స్థాయికి పడిపోయింది. అయితే వెంటనే డాలర్ బలహీనతతో తిరిగి పసిడి భారీగా పైకెగసి, కీలక 1,300 డాలర్ల నిరోధాన్ని అధిగమించింది. వారం ముగిసేసరికి డాలర్ ఇండెక్స్ 92.82 డాలర్ల స్థాయిలో ఉంది. అంతక్రితం వారంకన్నా పెరిగినా, మున్ముందు డాలర్ బలహీనత ఖాయమని, ఇది పసిడి బులిష్కు సానుకూల అంశమని నిపుణులు చెబుతున్నారు. పసిడికి దిగువస్థాయిలో 1300 డాలర్లు, 1280 డాలర్లు తక్షణ నిరోధాలన్నది వారి అంచనా. 1400 డాలర్లు చేరడానికి 1340, 1375 డాలర్లు నిరోధంగా టెక్నికల్ అనలిస్టులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, సమీప కాలంలో పసిడి దూకుడు కొనసాగుతుందని అంచనావేస్తున్నారు. అయితే ప్రస్తుత స్థాయి నుంచి 70 డాలర్ల వరకూ లాభాల స్వీకరణ జరిగే అవకాశం ఉందనీ, అలా జరిగితే అది కొనుగోళ్లకు అవకాశమని కూడా నిపుణుల అంచనా. దేశీయంగా రూ. 845 అప్ వారం వారీగా డాలర్ మారకంలో రూపాయి విలువ దాదాపు అక్కడక్కడే (63.85) ఉండడం, నైమెక్స్లో బంగారం పరుగు పెట్టడం వంటి అంశాలు దేశీయంగా పసిడిపై కూడా భారీగా ప్రభావం చూపించాయి. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్లో పసిడి వారంలో రూ.656 పెరిగి రూ. రూ.29,823కి చేరింది. ముంబై ప్రధాన మార్కెట్లో వారం వారీగా పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.845 ఎగసి, రూ.29,905కి చేరింది. ఇక 99.5 స్వచ్ఛత విషయంలో ధర ఇదే స్థాయిలో పడి రూ. 29,755కు పెరిగింది. ఇక వెండి కేజీ ధర కూడా భారీగా రూ.1,245 ఎగసి రూ.39,995 కి చేరింది. -
పసిడి... పటిష్టమే!
♦ రెండు వారాల్లో 43 డాలర్లు అప్ ♦ ఫెడ్ రేటు ఈ ఏడాది పెరగదన్న అంచనాలు అంతర్జాతీయంగా అమెరికా – ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్తతలు కొంత సమసిపోయినప్పటికీ, పసిడిలోకి పెట్టుబడులు పటిష్టంగానే కొనసాగుతున్నాయి. న్యూయార్క్లోని అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్లో ఆగస్టు 18వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో వారం వారీగా పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 5 డాలర్లు పెరిగి 1,295 వద్ద ముగిసింది. శుక్రవారం ఒక దశలో 1,306 డాలర్లకు చేరినా... అక్కడ నిలబడలేదు. గడచిన రెండు వారాల్లో పసిడి 43 డాలర్లు ఎగసింది. అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది ఇక ఫండ్ రేటును (ప్రస్తుత శ్రేణి 1–1.25 శాతం) పెంచే అవకాశం లేదన్న అంచనాలు బంగారానికి తాజాగా బలాన్ని ఇస్తున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం అనుకున్నంతగా పెరగడం లేదని, ఇది డిమాండ్ లేకపోవడాన్ని సూచిస్తుందనీ బుధవారం వెలువడిన జూలై ఫెడ్ మినిట్స్లో వెల్లడవడం– ‘‘రేటు పెంపు ఈ ఏడాది ఉండకపోవచ్చ’’ అన్న అంచనాలకు బలాన్నిచ్చింది. అయితే తాజాగా 1,300 డాలర్ల వద్ద పసిడికి గట్టి నిరోధం ఉందనీ, దీనిని దాటి నిలబడితే 1,340 డాలర్లను చూస్తుందని టెక్నికల్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఇక దిగువదిశలో 1,272, 1,242, 1,204 స్థాయిల వద్ద మద్దతు లభిస్తుందన్నది వారి అంచనా. సోమవారం నుంచీ ప్రారంభమయ్యే వారంలో లాభాల స్వీకరణ జరిగే వీలుంటుందని, అయినా ఇది కొనుగోళ్లకు అవకాశమేనని వారు అంచనావేస్తున్నారు. ఉత్తరకొరియాతో ఉద్రిక్తతలు కొనసాగే అవకాశాలతో పాటు అమెరికాలో రాజకీయ, ఆర్థిక అనిశ్చితిని ఇందుకు కారణంగా చూపుతున్నారు. ఇక డాలర్ వారం వారీగా స్వల్పంగా పెరిగి 93.36 వద్ద ఉంది. 1,204 వరకూ పడిపోయిన పసిడి తిరిగి నెలతిరక్కుండానే 100 డాలర్లు ఎగయడం గమనార్హం. దేశీయంగా కూడా బులిష్ ధోరణే దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– ఎంసీఎక్స్లో పసిడి వారంలో రూ.40 తగ్గి రూ. రూ.29,163 కి చేరింది. అయితే దేశీయ డిమాండ్ తోడు కావడంతో ముంబై ప్రధాన మార్కెట్లో వారం వారీగా పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.75 ఎగసి రూ.29,285కి చేరింది. ఇక 99.5 స్వచ్ఛత విషయంలో ధర ఇదే స్థాయిలో పెరిగి రూ. 29,135కి చేరింది. వెండి కేజీ ధర కూడా స్వల్పంగా రూ.190 పెరిగి రూ. 39,300కి చేరింది. -
మార్కెట్లకు ‘ఫెడ్’ డైరెక్షన్
♦ 25–26 తేదీల్లో ఫెడరల్ రిజర్వ్ భేటీ ♦ 27న డెరివేటివ్స్ ముగింపు ♦ కంపెనీల ఫలితాలు,లిక్విడిటీ కీలకం ♦ స్టాక్ వారీ కదలికలు, కన్సాలిడేషన్కు అవకాశం ♦ ప్రతికూలతలు లేకుంటే ముందుకే ♦ విశ్లేషకుల అంచనాలు న్యూఢిల్లీ: ఈ వారం పలు కీలక అంశాలకు వేదిక కానుంది. వడ్డీ రేట్లకు సంబంధించి అమెరికా ఫెడ్ సమావేశం బుధవారం జరగనుండగా, జూలై నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులకు గురువారంతో గడువు తీరిపోనుంది. వీటితోపాటు బ్లూచిప్ కంపెనీల ఫలితాలు మార్కెట్ గమనాన్ని నిర్ణయించనున్నాయని నిపుణులు అంటున్నారు. అధిక వోలటాలిటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. బ్లూచిప్ కంపెనీల ఫలితాలు, వచ్చే నెల ఫ్యూచర్స్కు రోలోవర్ ఏ మేర ఉంటుందన్నవి మార్కెట్ సెంటిమెంట్ను నిర్ణయించే అంశాలుగా ట్రేడ్స్మార్ట్ ఆన్లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అభిప్రాయపడ్డారు. బుధవారం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తన నిర్ణయాన్ని ప్రకటించనుందని చెప్పారు. ఈ వారంలో ఐసీఐసీఐ బ్యాంకు, మారుతి, ఓఎన్జీసీ, హీరోమోటో కార్ప్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, యాక్సిక్ బ్యాంకు, తదితర బ్లూచిప్ కంపెనీలు జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. కీలక అంశాల నేపథ్యంలో మార్కెట్లలో అధిక అస్థిరత ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. జూన్ క్వార్టర్ ఫలితాల నేపథ్యంలో మార్కెట్ కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ స్ట్రాటజిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాలు అంత ఆశాజనకంగా ఏమీ లేవన్నారు. తేడా వస్తే రివర్స్ ‘‘అధిక లిక్విడిటీకితోడు ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాలతో మార్కెట్లు అధిక స్థాయికి చేరాయి. అధిక స్థాయిల దిశగా సెంటిమెంట్ నెలకొని ఉంది. అదే సమయంలో ఉన్నట్టుండి మార్కెట్లు తిరుగుముఖం పట్టే రిస్క్ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఏవైనా ప్రతికూల పరిణామాలు ఎదురైతే అది మన మార్కెట్లపై పడుతుంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమీద్ మోదీ చెప్పారు. 25–26 నాటి ఫెడ్ సమావేశం నుంచి ఏవైనా ఊహించని నిర్ణయాలు వెలువడతాయా అన్న ఆసక్తి నెలకొందన్నారు. ఈ నేపథ్యంలో స్టాక్ వారీగా కదలికలతోపాటు మార్కెట్లలో కన్సాలిడేషన్ ఉంటుందని అధిక శాతం విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వారం రిజల్ట్స్ సోమవారం (24న) హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్, అంబుజా సిమెంట్స్ ఫలితాలను వెల్లడించనున్నాయి. 25న భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, ఏషియన్ పెయింట్స్ కంపెనీలు... ఈ నెల 26న యస్ బ్యాంక్, 27న డాక్టర్ రెడ్డీస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, మారుతీ సుజుకీ కంపెనీలు, 28న ఎల్ అండ్ టీ కంపెనీలు జూన్ త్రైమాసికపు ఫలితాలను ప్రకటిస్తాయి. అంతర్జాతీయ అంశాల పరంగా చూస్తే సోమవారం జపాన్, అమెరికా తయారీ రంగాల పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలు వెలువడనున్నాయి. 26న అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోనుండగా, ఈ వారంలోనే చమురు ఉత్పాదక దేశాల సమాఖ్య ఓపెక్ సమావేశం కూడా జరగనున్నది. జూలైలో విదేశీ ఇన్వెస్టర్ల దూకుడు దేశీయ మార్కెట్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐ) దూకుడు కొనసాగుతోంది. క్యాపిటల్ మార్కెట్లలో జూలైలో 2.4 బిలియన్డాలర్ల (రూ.15,348 కోట్ల మేర) పెట్టుబడులు పెట్టారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు విదేశీయులు చేసిన పెట్టుబడులు 25 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1,60,000 కోట్లు) దాటేశాయి. జనవరి నెలలో రూ.3,496 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్న తర్వాత నుంచి ఎఫ్పీఐలు దేశీయ మార్కెట్ల పట్ల సానుకూలంగానే కొనసాగుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం జూలై 3–21 తేదీల మధ్య ఎఫ్పీఐలు నికరంగా రూ.2,977 కోట్ల మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, డెట్ మార్కెట్లో రూ.12,371 కోట్ల పెట్టుబడులు పెట్టారు. -
కొనసాగుతున్న బంగారం దూకుడు
న్యూఢిల్లీ/న్యూయార్క్: అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్లో వరుసగా రెండవ వారమూ పసిడి పరుగు కొనసాగించింది. డాలర్ బలోపేతం కావటం, ఫెడ్ రేటు పెంచుతుందన్న అంచనాలతో రెండు వారాల క్రితం దాదాపు 1,204 డాలర్ల స్థాయికి పడిపోయిన ఔన్స్ (31.1 గ్రా) ధర... అమెరికాలోని తాజా రాజకీయ ప్రతికూల వార్తలతో 14వ తేదీతో ముగిసిన వారంలో 1,227 డాలర్లకు ఎగసింది. అటు తర్వాత 21వ తేదీతో ముగిసిన వారంలో మరో 27 డాలర్లు ఎగసి 1,254 డాలర్లకు చేరింది. అంటే రెండు వారాల్లో దాదాపు 50 డాలర్లు పెరిగింది. ప్రస్తుతం పసిడి 1,260 డాలర్ల కీలక రెసిస్టెన్స్ వద్ద ఉంది. పడితే మొదట 1,240 డాలర్లను తాకి అదీ పోతే మళ్లీ 1,205 డాలర్ల స్థాయికి చేరుతుందనేది విశ్లేషకుల అంచనా. ఇదే సమయంలో డాలర్ ఇండెక్స్ రెండు వారల్లో భారీగా పడిపోయి, శుక్రవారం ముగిసిన వారంలో 93.78 స్థాయికి చేరింది. ఇది ఏడాది కనిష్ట స్థాయి. డాలర్ ఇండెక్స్ ఎందుకు పడింది? అమెరికా రాజకీయ అనిశ్చితులు, డాలర్పై దాని ప్రతికూల ప్రభావం దీనిక్కారణం. చౌక ఆరోగ్య భద్రతా చట్టం రద్దు, తాజా చట్టం అమెరికా సెనేట్ ఆమోదాన్ని పొందలేకపోవడం డాలర్ ఇండెక్స్పై ప్రతికూల ప్రభావం చూపించింది. పన్ను సంస్కరణలు, ద్రవ్య క్రమశిక్షణ, డీ–రెగ్యులైజేషన్కు సంబంధించి ప్రభుత్వం సామర్థ్యాల విషయంలో సందేహాలు లేవనెత్తాయి. రష్యాతో ట్రంప్ సంబంధాలపై విచారణ వార్తలు ఒక పక్క షికార్ చేస్తున్నాయి. ఈ వ్యవహారం అంతా సమీప భవిష్యత్తులో డాలర్ బలహీనతకు, పసిడి బలోపేతానికి దోహదపడే అంశాలని ఫారెక్స్ లైవ్.కామ్లో సీనియర్ కరెన్సీ వ్యూహకర్త ఆడెబ్ బూటన్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మరోదఫా ఫెడ్ రేటు పెంపు అవకాశాలపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంమీద రెండు వారాల క్రితం బేరిష్లోకి జారిపోతుందనుకున్న పసిడి, తిరిగి బులిష్ ట్రెండ్ను సంతరించుకోవడం విశేషం. దేశంలో రూ.500 అప్..: అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగానే ముంబై ప్రధాన మార్కెట్లో వారం వారీగా పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.485 ఎగసి రూ.28,495కి చేరింది. ఇక 99.5 స్వచ్ఛత విషయంలో ధర ఇదే స్థాయిలో ఎగసి రూ. 28,345కు ఎగసింది. వెండి కేజీ ధర మాత్రం భారీగా 1,315 ఎగసి రూ.37,805కు చేరింది. -
మూడువారాల కనిష్టానికి సూచీలు
ఫెడ్ రేట్ల పెంపు ఎఫెక్ట్ ముంబై: అమెరికా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను పావుశాతం పెంచడంతో ప్రపంచ ప్రధాన మార్కెట్లన్నీ క్షీణించాయి. ఈ ట్రెండ్లో భాగంగా భారత్ సూచీలు కూడా తగ్గి...మూడు వారాల కనిష్టస్థాయి వద్ద ముగిసాయి. 31,229 పాయింట్ల గరిష్టస్థాయి వద్ద ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ ఆ స్థాయి నుంచి 200 పాయింట్ల మేర పతనమై..31,026 పాయింట్ల కనిష్టస్థాయిని తాకింది. ముగింపులో కాస్త కోలుకుని..చివరకు 80 పాయింట్ల తగ్గుదలతో 31,075 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,621 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 9,560 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన తర్వాత..చివరకు 40 పాయింట్ల నష్టంతో 9,578 పాయింట్ల వద్ద ముగిసింది. మే నెల 26 తర్వాత ఇంత కనిష్టస్థాయిలో సూచీలు ముగియడం ఇదే ప్ర«థమం. ఫెడ్ పావుశాతం రేట్ల పెంపు మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే వుందని, అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనంగా వున్నప్పటికీ, ఈ ఏడాది మరోదఫా రేట్లను పెంచుతామన్న సంకేతాల్ని ఫెడ్ ఛైర్మన్ వెల్లడించడంతో మార్కెట్లు తగ్గాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. మరోవైపు జీఎస్టీ అమలులోకి కానున్న నేపథ్యంలో ఆయా రంగాల్లో షేర్లు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని ఆయన వివరించారు. ఫెడ్ ప్రకటన తర్వాత డాలరుతో రూపాయి మారకపు విలువ 24 పైసలు తగ్గడం కూడా మార్కెట్ సెంటిమెంట్పై ప్రభావం చూపిందని విశ్లేషకులు చెప్పారు. టీసీఎస్ డౌన్, రిలయన్స్ అప్... సెన్సెక్స్–30 షేర్లలో ఐటీ దిగ్గజం టీసీఎస్ అత్యధికంగా 2.42 శాతం క్షీణించి రూ. 2,415 సమీపంలో ముగిసింది. క్రితం రోజు 3 శాతంపైగా పెరిగిన రిలయన్స్ తాజాగా మరో 2 శాతం ర్యాలీ జరిపి రూ. 1,383 వద్ద ముగిసింది. జియో చందాదారులు పెరిగారన్న వార్తతో మొదలైన రిలయన్స్ ర్యాలీ, బీపీతో కలిసి రూ. 40,000 కోట్ల పెట్టుబడి ప్రణాళికను వెల్లడించిన నేపథ్యంలో మరింత ఎగిసిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఆరు రోజులపాటు వరుసగా క్షీణించిన విప్రో షేరు ట్రెండ్ మార్చుకుని 1.86 శాతం పెరిగింది. ఫార్మా షేర్లు డాక్టర్ రెడ్డీస్ లాబ్, సిప్లా, సన్ఫార్మాలు 1 శాతంపైగా పెరిగాయి. నిఫ్టీలో భాగమైన అరబిందో ఫార్మా ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ అనుమతి లభించడంతో...ఈ షేరు 6 శాతం మేర ర్యాలీ జరిపింది. ప్రపంచ మార్కెట్లు డౌన్..: ఫెడ్ రేట్ల పెంపు ప్రభావంతో ప్రపంచ ప్రధాన మార్కెట్లు తిరోగమించాయి. కడపటి సమా చారం అందే సరికి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. -
బంగారం ధరలకు ఫెడ్ షాక్
న్యూఢిల్లీ: వడ్డీరేట్లను పెంచుతూ అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయం తీసుకోవడంతో అంతర్జాతీయంగా, దేశీయంగా బంగారం ధరలు భారీ పతనాన్ని నమోదు చేస్తున్నాయి. ఎంసీఎక్స్మార్కెట్ లో పుత్తడి ధరలు గురువారం నీరసించాయి. మల్టీ కామోడిటీ ఎక్స్ఛేంజ్ ఆగస్టు డెలివరీ బంగారు ధరలు భారీగా పడిపోయాయి. పది గ్రా. పసిడి ధర రూ.234 క్షీణించి రూ.28, 796 స్థాయిని నమోదు చేసింది. ఇటీవల కొన్ని సెషన్లుగా ఓలటైల్గా ఉన్న పసిడిధరలు తాజాగా మరింత దిగజారాయి. దీంతో రెండు నెలల కనిష్టాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 1.37 శాతం క్షీణించి 1,262.26 డాలర్లుగా ఉంది.అయితే వెండి ధరలు మాత్రం స్వల్పంగాపుంజుకున్నాయి. 0.01 శాతం పెరిగి 17 డాలర్లుగా నమోదైంది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఇన్వెస్లర్ల ఆందోళన అమ్మకాలకు దారి తీస్తోందని ఎనలిస్టుల అంచనా. అటు దేశీయస్టాక్మార్కెట్లు కూడా నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా నిఫ్టీ 9600 స్థాయికి దిగువన కొనసాగుతోంది. బుధవారం న్యూయార్క్ ఔన్స్ బంగారం ధర 0.47 శాతం తగ్గి 1,260.10 డాలర్లను నమోదు చేసింది. ప్రపంచ మార్కెట్లో బలహీన ధోరణి కారణంగా , ఫండ్స్ వర్తకంలో బంగారు ధరలు తగ్గుముఖం పట్టాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు కాగా అంచనాలకు అనుగుణంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫండ్ రేటును పావుశాతం పెంచింది. అంతేకాదు ఈ ఏడాది మరో సారి రేట్ కట్ తప్పదనే సంకేతాలు అందించిన సంగతి తెలిసిందే. -
ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు
వాషింగ్టన్: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను మరోపావుశాతం పెంచింది. మూడు నెలల్లో రెండవ సారి బుధవారం వడ్డీరేట్లు పెంచింది. తాజా పెంపుతో ఫెడరల్ ఫండ్స్ రేటు 1 శాతంనుంచి 1.25 శాతానికి చేరింది. ఫెడరల్ రిజర్వ్ మూడునెలల్లో రెండవసారి బుధవారం వడ్డీ రేట్లను పెంచింది. ఈ ఏడాది బాండ్లను, ఇతర సెక్యూరిటీలను తన హోల్డింగ్స్ను తగ్గించనున్నట్లు ఫెడ్ ప్రకటించింది. దీంతో యుఎస్ ఆర్ధికవ్యవస్థ గ్రోత్పై విశ్వాసాన్ని, జాబ్ మార్కెట్ మరింత మెరుగుపడనుందన్న సంకేతాలను అందించింది. రెండు రోజుల సమావేశం తరువాత, ఫెడ్ విధాన ఏర్పాటు కమిటీ ఆర్థిక వ్యవస్థ మధ్యస్తంగా విస్తరిస్తున్నట్లు విధాన ప్రకటనలో చెప్పింది. లేబర్ మార్కెట్ బలోపేతం అయ్యిందనీ, ఇటీవలి ద్రవ్యోల్బణం నిదానంగా కనిపించిందని ఫెడ్ చైర్ జానెట్ యెల్వెన్ ఒక పత్రికా సమావేశంలో పేర్కొన్నారు. ఫెడ్ తన బెంచ్ మార్క్ లెండింగ్ రేటును 1.25 శాతానికి పెంచింది. 2007-2009 ఆర్థిక సంక్షోభం మరియు మాంద్యం నేపథ్యంలో చాలా వరకు ట్రెజరీ బాండ్ల మరియు తనఖా-ఆధారిత సెక్యూరిటీల యొక్క $ 4.2 ట్రిలియన్ల పోర్ట్ఫోలియోను తగ్గించాలన్న తన ప్రణాళికపై ఫెడ్ ఒక స్పష్టమైన స్పష్టమైన సూచనలిచ్చింది. కాగా మార్చి నెలలో 25 బీపీఎస్ పాయింట్ల పెంచి 1 శాతంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
పావు శాతం పెంచిన ఫెడ్
న్యూయార్క్: అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పావుశాతం పెంచింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేటు 1–1.25 శాతానికి చేరుతుంది. వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే రేటును ఫెడ్ ఫండ్స్ రేటుగా వ్యవహరిస్తారు. ఈ ఏడాది ఇది రెండో పెంపు. కాగా 2017లో మరో పెంపు వుంటుందన్న సంకేతాల్ని ఫెడ్ వెలువరించింది. రెండురోజులగా జరుగుతున్న ఫెడ్ కమిటీ సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకు బుధవారం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. జీరో వడ్డీరేట్ల వ్యవస్థ నుంచి 2015 డిసెంబర్లో పెంపు ప్రక్రియను ఫెడ్ మొదలుపెట్టింది. అప్పటినుంచి తాజా పెంపు నాల్గవది. -
ఫెడ్ మీటింగ్: ఫ్లాట్ గా మార్కెట్లు
ముంబై : ఫెడరల్ రిజర్వు పాలసీ ప్రకటన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు(బుధవారం) ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 37.04 పాయింట్ల లాభంలో 31,140 వద్ద, నిఫ్టీ 1.70 పాయింట్ల నష్టంలో 9,605 వద్ద ట్రేడవుతున్నాయి. రెండు రోజుల పాటు భేటీ అయిన ఫెడరల్ రిజర్వు నేడు తమ పాలసీ మీటింగ్ వివరాలను వెల్లడించనుంది. దీంతో ఫెడ్ ప్రకటన ఎలా వస్తుందోనని ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రేడింగ్ ప్రారంభంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంకు, టీసీఎస్, ఇన్ఫోసిస్, లుపిన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లాభాలు పండించగా.. ఏషియన్ పేయింట్స్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, టాటా స్టీల్ నష్టాలు గడించాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా 64.34 వద్ద ఫ్లాట్ గా ప్రారంభమైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 41 రూపాయల నష్టంలో 28,952 వద్ద ట్రేడవుతున్నాయి. -
బంగారం... కొనసాగుతున్న అప్ట్రెండ్!
రెండు వారాల్లో 38 డాలర్లు లాభం న్యూయార్క్/ముంబై: అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్లో 26వ తేదీతో ముగిసిన వారంలో బంగారం ఔన్స్ (31.1గ్రా) ధర 11 డాలర్లు పెరిగి 1,266 డాలర్లకు చేరింది. రెండు వారాల్లో ఇక్కడ ధర 38 డాలర్లు పెరిగింది. ఉత్తరకొరియా యుద్ధ వాతావరణం తీవ్రత నేపథ్యంలో అంతక్రితం నాలుగు వారాల పాటు వరుసగా 61 డాలర్లు తగ్గిన పసిడి, మళ్లీ గడచిన రెండు వారాల నుంచీ పరుగుపెడుతోంది. అంతర్జాతీయంగా కీలక పరిణామాల నేపథ్యంలో... పసిడి దూకుడు మున్ముందూ తథ్యమన్న అంచనాలున్నాయి. ఆ అంశాలు చూస్తే... ♦ తక్షణం ఫెడ్ రేటు (ప్రస్తుతం 0.75–1%) పెంచదన్న సంకేతాలు. ♦ ట్రంప్ అస్పష్ట ఆర్థిక, డాలర్ బలహీన విధానాలు. రాజకీయ ఒత్తిళ్లు. ♦ ఉత్తరకొరియా పరిణామాలు ♦ ఈ వారాంతంలో జీ–7 దేశాల సమావేశం బ్రిటన్లో జూన్ 8న జరిగే ఎన్నికలు. దేశీయంగానూ లాభాలే...: అంతర్జాతీయ ప్రభావం దేశీ ఫ్యూచర్స్ మార్కెట్పైనా పడింది. ఎంసీఎక్స్లో బంగారం ధర 10 గ్రాములకు 26వ తేదీతో ముగిసిన వారంలో రూ.253 పెరిగి రూ.28,888కు ఎగసింది. ఇక దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.200 పెరిగి రూ.28,985కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో బలపడి రూ.28,835కి చేరింది. -
ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథం
వాషింగ్టన్: అంచనాలకు అనుగుణంగానే అమెరికా సెంట్రల్ బ్యాంక్ తన ఫెడ్ ఫండ్ రేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ రేటు 0.75 - 0.1 శాతం శ్రేణిలో ఉంది. జానెట్ యెలెన్ నేతృత్వంలోని ఫెడ్, ప్రస్తుతానికి రేటు పెంపు నిర్ణయాన్ని పక్కనబెట్టాలని బుధవారం నిర్ణయం తీసుకుంది. అయితే క్రమేపీ రేట్లు పెంచే ప్రక్రియను కొనసాగిస్తామని తాజాగా ఫెడ్ ఒక ప్రకటనలో పేర్కొంది. దేశంలో ఉపాధి కల్పన పటిష్టంగా వుందని, ఆర్థికాభివృద్ధి ఓ మోస్తరుగా వుండవచ్చని ఫెడ్ పేర్కొంది. మొదటి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి మందగమనం తాత్కాలికమేనని కూడా ఫెడ్ తెలిపింది. ఈ నేపథ్యంలో జూన్లో రేట్ల పెంపు నిర్ణయం ఉండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. తాజా విధాన సమావేశం తర్వాత ఫెడ్ బుధవారం విడుదల చేసిన ఫెడ్ జనవరి-మార్చి త్రైమాసికంలో ఆర్ధికవ్యవస్థ గణనీయంగా మందగించింది కానీ నిశ్చలంగాఉండనున్నట్టు భావించింది. డిసెంబరు, మార్చ్ నెలల్లో స్వల్పకాలిక రేటును స్వల్పంగా పెంచిన అనంతరం యథాతథవైఖరి అనుసరిస్తోంది. అయితే తదుపరి జూన్ రివ్యూలో మళ్లీ స్వల్పంగా వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉందని చాలామంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. మహా మాంద్యం ముగిసిన దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత, నిరుద్యోగ రేటు తక్కువగా 4.5 శాతంగా ఉంది. అయితే ఇప్పటికీ వినియోగ వ్యయం, ఫ్యాక్టరీ ఉత్పత్తి మందగించడంతోపాటు ద్రవ్యోల్బణం ఫెడ్ టార్గెట్ రేటు కంటే తక్కువగానే ఉంది. కాగా రెండు రోజుల పాటు కొనసాగిన సమావేశాలు బుధవారం ముగిశాయి. అమెరికా, ప్రపంచ ఆర్థిక అంశాలు, పరిణామాలను చర్చించిన మార్చి నెల సమావేశంలో ఫెడ్ ఫండ్ రేటు పావుశాతం పెరిగిన సంగతి తెలిసిందే. -
అమెరికా ‘ఫెడ్’ వడ్డీరేట్లు యథాతథం
వాషింగ్టన్: అంచనాలకు అనుగుణంగానే అమెరికా సెంట్రల్ బ్యాంక్ తన ఫెడ్ ఫండ్ రేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ రేటు 0.75 – 0.1 శాతం శ్రేణిలో ఉంది. రెండు రోజుల పాటు సమావేశమైన అమెరికా, ప్రపంచ ఆర్థిక అంశాలు, పరిణామాలను చర్చించిన జానెట్ యెలెన్ నేతృత్వంలోని ఫెడ్, ప్రస్తుతానికి రేటు పెంపు నిర్ణయాన్ని పక్కనబెట్టాలని బుధవారం నిర్ణయం తీసుకుంది. మార్చి నెల సమావేశంలో ఫెడ్ ఫండ్ రేటు పావుశాతం పెరిగిన సంగతి తెలిసిందే. క్రమేపీ రేట్లు పెంచే ప్రక్రియను కొనసాగిస్తామని తాజాగా ఫెడ్ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. దేశంలో ఉపాధి కల్పన పటిష్టంగా వుందని, ఆర్థికాభివృద్ధి ఓ మోస్తరుగా వుండవచ్చని ఫెడ్ పేర్కొంది. మొదటి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి మందగమనం తాత్కాలికమేనని కూడా ఫెడ్ తెలిపింది. ఈ నేపథ్యంలో జూన్లో రేట్ల పెంపు నిర్ణయం ఉండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. -
జీఎస్టీపై ఫెడ్ ఆసక్తికర అధ్యయనం
న్యూఢిల్లీ : దేశమంతటిన్నీ ఒకే పన్ను విధానంలోకి తీసుకొస్తూ ఎంతో ప్రతిష్టాత్మకమైన జీఎస్టీ అమలుకు ప్రభుత్వం శరవేగంగా ముందుకెళ్తోంది. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లోనూ జీఎస్టీకి సంబంధించిన నాలుగు అనుబంధ బిల్లులను ప్రభుత్వం ఆమోదింపజేసింది. జూలై 1తో దేశమంతా ఏకీకృత విధానంలోకి వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ అమలు ఆర్థికవ్యవస్థకు ఏ మేర లాభాలను చేకూర్చిపెడుతుందో వెల్లడిస్తూ అమెరికా సెంట్రల్ బ్యాంకు ఓ అధ్యయన నోట్ను విడుదల చేసింది. దీనిలో జీఎస్టీ అమలు భారత్ జీడీపీకి 4.2 శాతం బూస్ట్ ఇస్తుందని లేదా ఆరున్నర లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించిపెడుతుందని తెలిసింది. ఈ మొత్తం కేంద్రప్రభుత్వం వార్షిక రుణాలకు ఎక్కువని వెల్లడైంది. అయితే జీఎస్టీ అమలుతో జీడీపీ 1-2 శాతం మాత్రమే పెరుగుతుందని కేంద్రప్రభుత్వానికి చెందిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్( ఎన్సీఏఈఆర్) అంచనావేసింది. ఈ రీసెర్చ్ సంస్థకు ప్రస్తుత అధ్యక్షుడిగా నందన్ నిలేకని వ్యవహరిస్తున్నారు. జీఎస్టీ మొత్తంగా భారత సంక్షేమాన్ని పెంచుతుందని, అన్ని రాష్ట్రాల వెల్ఫేర్ను మెరుగుపరుస్తుందని అంచనావేస్తున్నామని ఫెడ్ అధ్యయన పేపర్ పేర్కొంది. అదేవిధంగా జీఎస్టీ అంతర్గత వాణిజ్య ఆటుపోట్లను తొలగిస్తుందని, ఇంటర్నల్ ట్రేడ్ను 29 శాతం పెంచుతుందని ఫెడరల్ అనాలసిస్ పేర్కొంది. ఇది భారత కంపెనీల మధ్య అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంచి, కంపెనీ బయటి వాణిజ్య 32 శాతానికి విస్తరింపజేస్తుందని తెలిపింది. దీంతో తయారీ ఉత్పత్తి 14 శాతం పెరుగుతుందని ఫెడరల్ అనాలసిస్ అంచనావేస్తోంది. ఎవా వాన్ లీమ్పుట్, ఎల్లెన్ ఎ వైన్స్క్ రచయితలు ఈ అనాలసిస్ రిపోర్టును రూపొందించారు. -
ఆల్ టైమ్ గరిష్టంలో నిఫ్టీ
ముంబై: ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్ల పెంపు తర్వాత, జీఎస్టీ కౌన్సిల్ భేటికి ముందు గురువారం ఈక్విటీ బెంచ్ మార్కు సూచీలు ఆల్ టైమ్ గరిష్టంలో ఎంట్రీ ఇచ్చాయి. సెన్సెక్స్ 168.71 పాయింట్ల లాభంలో 29,566 వద్ద, నిఫ్టీ 54.55 పాయింట్ల లాభంలో 9,139 వద్ద ట్రేడవుతున్నాయి. అంచనాలకు అనుగుణంగానే ఫెడరల్ రిజర్వు పావు శాతం వడ్డీరేట్లను పెంచుతున్నట్టు ప్రకటించడంతో ఆసియన్ మార్కెట్లపై పెద్దగా ప్రభావం పడలేదు. దీంతో దేశీయ మార్కెట్లు పాజిటివ్ గానే ట్రేడవుతున్నాయి. అదానీ పోర్ట్స్, హెచ్యూఎల్, బీహెచ్ఈఎల్, ఎల్ అండ్ టీ, ఓఎన్జీసీ, హిందాల్కో, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 1-3 శాతం లాభపడగా.. హీరో మోటారో కార్పొ అరశాతం మేర పడిపోతుంది. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ మరింత బలపడుతోంది. నిన్నటి ముగింపుకు 29 పైసలు లాభపడి 65.40 వద్ద ఎంట్రీ ఇచ్చింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్కెట్లకు జోషిచ్చాయని విశ్లేషకులు చెప్పారు. రూపాయి సైతం పాజిటివ్ గా ట్రేడవుతుందన్నారు. అంచనాలకు అనుగుణంగా నిర్ణయం రావడంతో ఫెడరల్ రిజర్వు రేట్ల ప్రభావం ఇటు దేశీయ మార్కెట్లపైనా, అటు ఆసియన్ మార్కెట్లపైనా అంతగా ప్రభావం చూపలేదని పేర్కొన్నారు. -
ఫెడ్ రేట్లు పావు శాతం పెంపు
⇒ ఈ ఏడాది మరో రెండు విడతల్లో పెంపు ఉండొచ్చని అంచనా... ⇒ పటిష్టమైన ఉద్యోగ గణాంకాల తోడ్పాటు వాషింగ్టన్: అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ రేట్లు పావు శాతం పెంచింది. ఫెడ్ ఫండ్స్ వడ్డీ రేట్ల శ్రేణి 0.75–1 శాతం మేర ఉంటుందని వెల్లడించింది. ఈ ఏడాది మరో రెండు విడతలు, వచ్చే ఏడాది మూడు విడతల మేర వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని ఫెడ్ కమిటీ అంచనా వేసింది. మరోవైపు ద్రవ్యోల్బణం లక్ష్యించిన రెండు శాతం స్థాయికి పెరగగలదని ఫెడరల్ రిజర్వ్ పేర్కొంది. అటు జీడీపీ, ద్రవ్యోల్బణం అంచనాలు యథాతథంగా కొనసాగిస్తున్నట్లు వివరించింది. బుధవారం రాత్రి ఫెడ్ నిర్ణయం వెలువడగానే అమెరికా స్టాక్స్ అర శాతం మేర, బంగారం ఒక్క శాతం లాభాల్లో ట్రేడయ్యాయి. డాలర్ ఇండెక్స్ ఒక శాతం బలహీనపడి.. 100.70 వద్ద ట్రేడయ్యింది. 2007–09 మధ్య ఆర్థిక మాంద్యం పరిణామాల తర్వాత ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం ఇది మూడోసారి. 2015 డిసెంబర్లో తొలిసారి, ఆ తర్వాత గతేడాది డిసెంబర్లో రెండోసారి వడ్డీ రేట్లు పెంచింది. పటిష్టమైన ఉద్యోగ గణాంకాలు, ఇన్వెస్టర్లు .. వ్యాపార వర్గాల విశ్వాసం గణనీయంగా మెరుగుపడటం తదితర అంశాలు రేట్ల పెంపునకు తోడ్పడ్డాయి. -
ఐటీ షేర్లకు నష్టాలు
ఫెడ్, జీఎస్టీ మండలి సమావేశాల కారణంగా మార్కెట్లో అప్రమత్తత ఒడిదుడుకులమయంగా సాగిన బుధవారం నాటి ట్రేడింగ్లో చివరకు స్టాక్ మార్కెట్ స్వల్పంగా నష్టపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల నిర్ణయం, నేడు(గురువారం) జీఎస్టీ మండలి సమావేశం నేపథ్యంలో మార్కెట్లో అప్రమత్తత నెలకొన్నది. బీఎస్ఈ సెన్సెక్స్45 పాయింట్లు నష్టపోయి 29,398 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 2 పాయింట్లు నష్టపోయి 9,085 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ, టెక్నాలజీ, ఆయిల్, గ్యాస్ షేర్లు క్షీణించగా, రియల్టీ, వాహన, కన్సూమర్ డ్యూరబుల్స్, లోహ, బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. సెన్సెక్స్ ఒక దశలో 85 పాయింట్లు లాభపడగా, మరొక దశలో 87 పాయింట్లు నష్టపోయింది. ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 39 నెలల గరిష్ట స్థాయిలకు పెరగడంతో వచ్చే నెలలో జరిగే పరపతి సమీక్షలో ఆర్బీఐ కీలక రేట్లను తగ్గించకపోవచ్చన్న అంచనాలు, మంగళవారం సెన్సెక్స్ 496 పాయింట్లు లాభపడిన నేప«థ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం,.. ప్రతికూల ప్రభావం చూపించాయి. ముడి పదార్ధాల ధరల పతనం కొనసాగుతుండటం, భారత్కు కాకుండా అమెరికాకుకు ఎగుమతులు పెంచాలని చైనా టైర్ల కంపెనీలు నిర్ణయించడంతో, భారత్కు చైనా టైర్ల తాకిడి తగ్గుతుందన్న అంచనాలతో టైర్ల షేర్లు లాభాల బాట పట్టాయి. ఎంఆర్ఎఫ్ షేర్7.6 శాతం(రూ.4,059) లాభపడి రూ.57,040 వద్ద ముగిసింది. ఈ షేర్ ఇంట్రాడేలో ఆల్–టైమ్ హై, రూ.57,059ను తాకింది. -
ఫ్లాట్గా ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 44 పాయింట్ల నష్టంతో 29398 వద్ద, నిఫ్టీ 2 పాయింట్ల నష్టంతో 9084 వద్ద ముగిశాయి. రోజు మొత్తం కన్సాలిడేషన్ బాటలో ప్రతికూలంగా సాగిన మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షలో పావు శాతం వడ్డీ పెంపు ఉండొచ్చన్న అంచనాలు బలపడిన నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు నిపుణులు వ్యాఖ్యానించారు. ఫెడ్ రేట్లను పెంచనుందనే అంచనాలనేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో అయిదు రాష్ట్రాల్లో బీజేపీ హవాతో రికార్డ్ స్థాయిలను టచ్ చేసిన సెన్సెక్స్, నిఫ్టీ స్వల్పనష్టాలతో అప్రమత్తంగా ముగిశాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి భారీగా నెలకొంది. దీంతో ఐటీ 1.8శాతం నష్టపోగా, టీసీఎస్,ఇన్ఫోసిస్ 2 శాతం దిగజారాయి. కాగా మిడ్ క్యాప్ , స్మాల్ క్యాప్ షేర్లు మంచి ప్రదర్శన కనబర్చాయి. మిగిలిన అన్ని ఇండెక్సులూ లాభపడగా.. పీఎస్యూ బ్యాంక్, ఆటో లాభపడ్డాయి. ఐడియా 9శాతం, హీరో మోటా కార్ప్, టాటాస్టీల్, ఆర్ ఐఎల్, టాటా మెటార్స్ లాభపడగా, పీవీఆర్ 4శాతం నష్టపోయింది. అలాగే హెచ్యుఎల్, విప్రో ఐసీఐసీఐ కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఎల్అండ్టీ నష్టపోయిన వాటిల్లోఉన్నాయి. మరోవైపు డాలర్ మారకంలో రూపాయి 16న నెలల గరిష్టాన్ని తాకింది. 0.20పైసలు లాభపడి 65.64 వద్ద రూ. 65ల ఎగువకు చేరింది. అటు ఫెడ్ అంచనాలతో పుత్తడి బలహీనత కొనసాగుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా.పసిడి రూ. 101లు పతనమై రూ. 27,975వద్ద ఉంది. -
ర్యాలీకి బ్రేక్: ఫెడ్ నిర్ణయంపై ఎదురుచూపులు
ముంబై : బీజేపీ ఘన విజయంతో నిన్నటి ట్రేడింగ్ లో దుమ్మురేపిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల ఫెడరల్ రిజర్వు పాలసీ మీటింగ్ నిర్ణయం నేడు వెలువడనున్న నేపథ్యంలో మార్కెట్లు ర్యాలీకి బ్రేకిచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 10.62 పాయింట్ల లాభంలో 29,453 వద్ద, నిఫ్టీ 1.90 పాయింట్ల లాభంలో 9,088 వద్ద ట్రేడవుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, సిప్లా, సన్ ఫార్మా, టాటా మోటార్స్, విప్రో, హిందాల్కో, అరబిందో ఫార్మాలు ట్రేడింగ్ ప్రారంభంలో లాభపడగా... భారతీ ఎయిర్ టెల్, లార్సెన్ అండ్ టూబ్రో, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంకు, ఏషియన్ పేయింట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ నష్టాలు గడించాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ స్వల్పంగా లాభపడి 65.76 వద్ద ప్రారంభమైంది. మంగళవారం ట్రేడింగ్ లో రూపాయి 16 నెలల గరిష్టంలో 66.82 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ఇన్వెస్టర్లు నేటి అర్థరాత్రి విడుదల కాబోయే ఫెడ్ రిజర్వుపై ఎక్కువగా దృష్టిసారించారని విశ్లేషకులంటున్నారు. ఈ కారణంతోనే ర్యాలీకి బ్రేక్ పడ్డట్టు చెబుతున్నారు. -
డాలర్ దయపై బంగారం భవిత
♦ ఐదు వారాల కనిష్టానికి పసిడి ♦వారంలో 30 డాలర్లు పతనం ♦ఫెడ్ రేట్ల పెంపు ఖాయమన్న వార్తలే కారణం న్యూఢిల్లీ/న్యూయార్క్: అమెరికా డాలర్ కదలికలు బంగారంపై బలంగానే పడుతున్నాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ మార్చి 14–15 తేదీల్లో ఫండ్ రేటు (ప్రస్తుతం 0.50 శాతం) పెంచటం ఖాయమన్న వార్తలు బంగారాన్ని కిందకు దించుతున్నాయి. ఎందుకంటే ఫెడ్ గనుక రేటు పెంచితే నగదు బాండ్లలోకి వెళుతుందని, పసిడిపై పెట్టుబడులు తగ్గుతాయి కనుక ధర ఇంకా దిగుతుందనేది విశ్లేషకుల మాట. దీంతో భవిష్యత్ పసిడి కదలికలకు ఫెడ్ నిర్ణయం కీలకం కానుందని వారు చెబుతున్నారు. ఫెడ్ రేటు పెంచితే డాలర్ మరింత పెరగటం ఖాయమన్న అంచనాలు పసిడిని నడిపిస్తాయని, అంతర్జాతీయంగా ఇలా... 10వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో పసిడి అంతర్జాతీయ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్లో ఔన్స్ (31.1గ్రా) ధర 30 డాలర్లు తగ్గి 1,204 డాలర్ల వద్ద ముగిసింది. ఇది ఐదు వారాల కనిష్టస్థాయి. గత వారం ఒక దశలో పసిడి ఇక్కడ 1,195 డాలర్ల స్థాయికి సైతం వెళ్లింది. రెండు వారాల్లో అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 53 డాలర్లు తగ్గడం విశేషం. పసిడికి 1,200 డాలర్ల వద్ద చిన్న మద్దతు ఉందనీ, ఇది పోతే 1,170 డాలర్ల వద్ద మరో మద్దతు ఉందనీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 15 వరకూ అనిశ్చితి ద్రవ్యోల్బణం, ఉపాధి కల్పన గణాంకాలు గనుక ఫెడ్ అంచనాలకు అనుగుణంగా ఉంటే మార్చి 14–15 తేదీల్లో ఫెడ్ రేటు పెంచే అవకాశాలు ఉంటాయని 10 రోజుల క్రితం యెలెన్ ప్రకటించారు. గతవారం ఇందుకు సానుకూలంగానే గణాంకాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో మార్చి 15 వరకూ ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణి అవలంభించవచ్చని నిపుణులు చెబుతున్నారు. దేశీయంగా వారంలో రూ.700కుపైగా డౌన్... ఇక అంతర్జాతీయ ప్రభావం దేశీ ఫ్యూచర్స్ మార్కెట్పైనా పడుతోంది. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో ధర వారం వారీగా 10 గ్రాములకు రూ.654 తగ్గి, రూ.28,366కి చేరింది. రెండు వారాల్లో ఇక్కడ ధర రూ. 1,277 తగ్గడం గమనార్హం. దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.745 తగ్గి రూ.28,550కు చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి రూ.28,400కు పడింది. వెండి కేజీ ధర ముంబై మార్కెట్లో రూ. 1,785 తగ్గి రూ.41,065కి పడింది. ఇక్కడ రెండు వారాల్లో పసిడి 10 గ్రాములకు దాదాపు రూ.1000 తగ్గగా, వెండి దాదాపు రూ.2,000కుపైగా నష్టపోయింది. -
ఎన్నికల ఫలితాలే దిక్సూచి
స్టాక్ మార్కెట్ భవిష్యత్తు గమనంపై ఫలితాల ప్రభావం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయమూ కీలకమే.. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రానున్న రోజుల్లో స్టాక్ మార్కెట్ కదలికలను నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. ఈ ఫలితాలు ఈ నెల 11న(శనివారం) రానున్నాయి. వీటితో పాటు రేట్ల పెంపుపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం, ప్రపంచ స్టాక్ మార్కెట్ల గమనం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, డాలర్తో రూపాయి మారకం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి తదితర అంశాల ప్రభావం స్టాక్సూచీలపై ఉంటుందని మార్కెట్ విశ్లేషకుల అంచనా. 9న ఎగ్జిట్ పోల్ ఫలితాలు వడ్డీరేట్ల పెంపు తప్పదన్న సంకేతాలతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ జానెట్ ఎలెన్ గత శుక్రవారం చేసిన వ్యాఖ్యలకు నేడు(సోమవారం) మార్కెట్ ప్రతిస్పందిస్తుంది. ఈ నెల 13న హోలి కారణంగా స్టాక్ మార్కెట్కు సెలవు కావడంతో 11న వెలువడే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఈ నెల 14న(మంగళవారం) కనిపిస్తుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ హెడ్(ప్రైవేట్ క్లయింట్ గ్రూప్) వి.కె. శర్మ చెప్పారు. అయితే 9న(గురువారం) వెలువడే ఎగ్జిట్ పోల్ ఫలితాల నుంచి మార్కెట్ కొన్ని సంకేతాలను అందిపుచ్చుకునే వీలు ఉందని ఆయన పేర్కొన్నారు. రేట్ల నిర్ణయానికి సంబంధించి అమెరికా ఫెడరల్ రిజర్వ్సమావేశం మార్చి 14–15 మధ్య జరగనున్నందున మార్కెట్లో అనిశ్చితి నెలకొనవచ్చని వివరించారు. విదేశీ పెట్టుబడులు : రూ.15,862 నాలుగు నెలల అమ్మకాల అనంతరం గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, ఎఫ్పీఐలు ఈ ఏడాది ఫిబ్రవరిలో మన స్టాక్ మార్కెట్లో రూ.9,902 కోట్లు, డెట్మార్కెట్లో రూ.5,960 కోట్లు వెరశి మన క్యాపిటల్ మార్కెట్లో రూ.15,862 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఎఫ్పీఐ పన్నులపై స్పష్టత, పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం కంపెనీల క్యూ3 ఫలితాలపై పెద్దగా లేకపోవడం తదితర కారణాల వల్ల విదేశీ పెట్టుబడులు జోరుగా వస్తున్నాయని నిపుణులంటున్నారు. -
అంతర్జాతీయంగా పసిడి మెరుపు
అంతర్జాతీయ సెంటిమెంట్ బాగుండడంతో పరుగు న్యూఢిల్లీ/న్యూయార్క్: బంగారం శుక్రవారంతో ముగిసిన వారంలో అంతర్జాతీయంగా మళ్లీ పరుగులు పెట్టింది. ధర నాలుగు నెలల గరిష్ట స్థాయికి ఎగసింది. అమెరికా నిరుద్యోగ రేటు పెరగడం, దీనితో ఫెడరల్ రిజర్వ్ రేటు (ఫెడ్ ఫండ్ రేటు) ప్రస్తుత 0.50 శాతం స్థాయి నుంచి పెంచడంపై అనుమానాలు, డాలర్ బలహీన ధోరణి వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు స్వల్పకాలంలో పసిడిని మార్గంగా ఎంచుకుంటున్నట్లు కనబడుతోంది. న్యూయార్క్ కమోడిటీ మార్కెట్లో 24వ తేదీతో ముగిసిన వారంలో ధర ఔన్స్ (31.1గ్రా)కు 22 డాలర్లు ఎగసి, 1,257 డాలర్లకు చేరింది. వరుసగా రెండు వారాలు (3, 10వ తేదీల్లో ముగిసిన వారాలు) ఔన్స్ (31.1గ్రా)కు 45 డాలర్లు పెరిగిన పసిడి ధర, తరువాతి వారంలో (17వ తేదీతో ముగిసిన వారంలో)మాత్రం 1,235 డాలర్ల వద్దే స్థిరంగా ఉన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల అనిశ్చితే భవిష్యత్తులో పసిడికి మార్గదర్శకమని నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా రూపాయి ఎఫెక్ట్... దేశీయంగా చూస్తే... అంతర్జాతీయంగా ధర పటిష్టంగా ఉన్నా.... ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్లో పసిడి ధర శుక్రవారంతో ముగిసిన వారంలో తగ్గింది. 99.9 స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.29,455కు చేరింది. మరోవైపు వెండి కేజీ ధర స్థిరంగా రూ.43,255 వద్ద ఉంది. డాలర్ మారకంలో రూపాయి విలువ గణనీయంగా మెరుగుపడ్డం వల్ల అంతర్జాతీయంగా ధర భారీగా పెరిగినా... ఇక్కడ ఈ ప్రభావం కనిపించడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయ ప్రధాన ఫ్యూచర్స్ మర్కెట్– ఎంసీఎక్స్లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి 10 గ్రాముల ధర శుక్రవారంతో ముగిసిన వారంలో రూ.29,623 వద్ద ముగిసింది. మరోవైపు ఢిల్లీలో మాత్రం పసిడి ధర దాదాపు రూ.300 ఎగసి నాలుగు వారాల గరిష్టస్థాయి... రూ.30,000పైకి చేరింది. -
దేశాన్ని నడిపించే శక్తి
కాలానికి ఆధునికతను అద్దినది ప్రజాస్వామ్యమే. ఆ భావన ఒక ఆదర్శం స్థాయిలోనే మిగిలి పోకుండా, ఆకృతి దాల్చడానికి ఉపకరించేది రాజ్యాంగం. అందుకే ‘రాజ్యాంగం మార్గదర్శి. నేను ఏనాడూ దానిని విస్మరించను’ అంటాడు జార్జి వాషింగ్టన్. భారతదేశం అనే పురాతన భూమిని ఆధునిక రాజకీయ, ఆర్థిక, సామాజిక తాత్వికతలతో చెలిమి కట్టించడంలో మన రాజ్యాంగం నిర్వహించిన పాత్ర చరిత్రాత్మకమైనది. ఆరున్నర దశాబ్దాల ఆధునిక భారత ప్రస్థానానికి రాజ్యాంగమే మార్గదర్శిగా నిలిచింది. ఇందుకు ఎన్నో దృష్టాంతాలు కనిపిస్తాయి. మన దేశం వరకు రాజ్యాంగమంటే సమున్నత చట్టం. ‘భారత పౌరులమైన మేము...’ అంటూ భారత రాజ్యాంగం ఆరంభమవుతుంది. అంటే ఇది ప్రజల కోసం, ప్రజలు రాసుకుని, ప్రజలే అందించిన రాజ్యాంగమని ఆ మూడు ముక్కలు సూచిస్తున్నాయి. స్వేచ్ఛ, సమత్వం, సౌభ్రాతృత్వం రాజ్యాంగానికి ఆత్మ వంటివి. భారత రాజ్యాంగం అంటే మొదట గుర్తుకు రావలసిన అంశం ఫెడరల్ వ్యవస్థ గురించి ఆలోచించే సంప్రదాయం లేని భారత్ను అదే వ్యవస్థలో ఒదిగి ఉండేటట్టు చేసిన సంగతి. అలాగే సమత్వం కూడా. ఏనాడూ ఇక్కడి భావధార లో లేని సమత్వం అనే ఒక ఉదాత్త భావన ప్రయోజనం ఏమిటో రుచి చూపించింది. అంతకుమించి, వందల ఏళ్ల క్రితం మరచిపోయిన స్వేచ్ఛను దేశానికి తిరిగి ప్రసాదించినది రాజ్యాంగమే. అది మన దేశంలో యథాతథ స్థితిని కొనసాగనివ్వలేదు. అయినా దేశాన్ని ఘర్షణ స్థాయికి కూడా వెళ్లనివ్వలేదు. మన రాజ్యాంగం, అమలు, విజయాలూ, వైఫల్యాలూ వంటి అంశాల గురించి ఏదైనా మాట్లాడాలని అనుకుంటే, మొదట ఆ సమున్నత చట్టం అమలులోకి వచ్చిన జనవరి 26, 1950కి ముందు ఉన్న చారిత్రక దృశ్యాన్ని ఒక్కసారి వీక్షించాలి. సుదీర్ఘ విదేశీ పాలన, చిరకాలంగా ఇక్కడ ఉన్న అనర్థాలు, ఆ అనర్థాలకు సామాజిక వ్యవస్థ అల్లికలో వచ్చిన ఘర్షణలు తోడైన వాస్తవం, ఆర్థిక అసమానతలు, వివక్ష, అంతరాల పట్ల అవగాహన ఉండాలి. డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జవహర్లాల్లతో పాటు కేఎం మున్షీ, భోగరాజు పట్టాభిసీతారామయ్య, జేబీ కృపలానీ వంటి మహనీయులు అల్లాడి కృష్ణస్వామి వంటి ఎందరో రాజ్యాంగ నిపుణులు, స్వాతంత్య్ర పోరాట యోధులు సభ్యులుగా ఉన్న రాజ్యాంగ పరిషత్ ఊహకు కూడా అందని కొన్ని సమస్యలను ఇప్పుడు దేశం వీక్షిస్తున్నది. కొన్ని కొత్త ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సమాయత్తం కావలసిన ఉన్నది కూడా. అలాంటి సమయంలో రాజ్యాంగం విఫలమైందన్న మాటను కొందరు విసిరినా, నిజమైన వైఫల్యం రాజకీయాలది, రాజకీయ నాయకత్వానిది తప్ప, రాజ్యాంగానికి కాదని చరిత్రలో ఇప్పటికే రుజువైంది. 1960 దశకం వరకు జాతీయ పోరాట స్ఫూర్తి మన వ్యవస్థలను నడిపించింది. తరువాత నాయకత్వ స్ఫూర్తి ఆ బాధ్యతను స్వీకరించింది. 1975 తరువాత మాత్రం ఈ దేశాన్ని నడిపించినది పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తే. 1975 జూన్ 25న ప్రకటించిన అత్యవసర పరిస్థితి పౌర హక్కులు, ఆదేశిక సూత్రాలు, పౌరుల స్వేచ్ఛలో రాజ్యం జోక్యం, న్యాయస్థానాలు– ప్రభుత్వ జోక్యం వంటి అంశాల గురించి గట్టి ఆలోచనలకు అంకురార్పణ చేసింది. 1990 నుంచి కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వాల జోరు మొదలైంది. ‘కేంద్ర ప్రభుత్వం’ అన్న మాట రాజ్యాంగంలో లేకున్నా, అలాంటి సంక్షుభిత రాజకీయ నేపథ్యంలో కూడా దేశ ఫెడరల్ వ్యవస్థకు జీవం పోసిన ఘనత మన రాజ్యాంగానిది. ప్రపంచీకరణ, 21వ శతాబ్దపు తొలి ఒకటిన్నర దశాబ్దాలు భారత రాజ్యాంగానికి నిశ్చయంగా కొన్ని సవాళ్లు విసిరాయి. ఇవి రాజ్యాంగ పరిషత్ ఊహించినవి కావనే అనిపిస్తుంది. అంతర్జాతీయ పరిణామాలు, వ్యక్తి స్వేచ్ఛ, ఆత్మ గౌరవ నినాదాలకు వెల్లువెత్తిన కొత్త నిర్వచనాలు; నేషన్, నేషనలిజమ్, యాంటీ నేషనలిజమ్ వంటి వాటిపై చర్చ, చర్యలు ఇందుకు సంబంధించినవే. ఈ విషయంలో ఒకవైపు అలాంటి భావనలకు స్వేచ్ఛను ఇస్తూనే, ప్రశ్నించడానికి వీలు కల్పిస్తూనే భారత్ను ఒకే దేశంగా కొనసాగడానికి అవరోధాలు లేకుండా చేస్తున్న మహోన్నత శక్తి మన రాజ్యాంగం. రాజ్యాంగం తొలి సవరణ (జూన్ 18, 1951– 9వ షెడ్యూల్, 31ఎ, 31బి అధికరణల చేరిక; 15,19,85,87,174, 176, 341, 342, 372, 376 అధికరణలకు సవరణ) నుంచి, తాజా సవరణ (సెప్టెంబర్ 8, 2016, జీఎస్టీ బిల్లు)వరకు 101 పర్యాయాలు రాజ్యాంగం మార్పులు చేసుకుంది. ఇది బలహీనత అనిపించుకోదు. కాలానుగుణంగా మార్చుకునే అవకాశం భారత రాజ్యాంగానికి ఉంది. అయితే ఇది ఎంత సరళమో, అంత కఠినం కూడా. రెండు రకాల సవరణ విధానాలు ఇదే చెబుతాయి. కొన్ని సవరణలు పార్లమెంట్ ఒక్కటే చేయవచ్చు. కొన్ని సవరణలకు అసెంబ్లీల అనుమతి అవసరం. ఇది మొదటి నుంచి కనిపిస్తున్న క్రమమే. 1955 ఆవడి కాంగ్రెస్లో సామ్యవాద సమాజ స్థాపన లక్ష్యంగా చేసుకుంది. కానీ 1990లో ప్రపంచీకరణ నేపథ్యంలో సరళీకృత ఆర్థిక వి«ధానాలు దేశంలో ప్రవేశించడానికి రాజ్యాంగం ఆటంకం కాలేదు. ఫెడరల్ వ్యవస్థ భగ్నం కాకుండా రాజ్యాంగం నిర్వహించిన పాత్ర ఘనమైనది. ఇందుకు చక్కని ఉదాహరణలు ఉన్నాయి. రాజ్యాంగం నిజమైన విజయం ఈ అంశంలోనే ఉంది కూడా. 275వ అధికరణ ఉంది. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య వనరుల విభజనలో ఈ అధికరణే కీలకం. పదో ఫైనాన్స్ కమిషన్తో ఇది మరింత బలపడింది. అది ఎంత సుస్థిరమైందంటే, ఇప్పుడు ప్రపంచానికి ఈ వనరుల విభజనకు సంబంధించి ఈ అధికరణ ఆదర్శంగా మారిపోయింది. 356 అధికరణ మరొక పాఠం. రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన, లేదా కేంద్ర పాలన విధింపునకు అవకాశం ఇచ్చే అధికరణ ఇది. ఇది రాజ్యాంగంలో ఉన్న మాట వాస్తవం. ప్రథమ ప్రధాని నెహ్రూ కాలంలోనే కేరళలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని తొలిసారి రద్దు చేయడం దగ్గర నుంచి ఈ అధికరణ వివాదాస్పదమే. కానీ కర్ణాటకలో ఎస్ ఆర్ బొమ్మయ్ ప్రభుత్వం రద్దు తరువాత సుప్రీంకోర్టు ఈ అధికరణాన్ని విచక్షణా రహితంగా ఉపయోగించే ప్రమాదాన్ని తగ్గించింది. హిందీ వివాదం కారణంగా, అంటే భాష కారణంగా 1960లో తమిళనాడు ఈ దేశం నుంచి విడిపోతుందని భయపడ్డారు. తరువాత ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొన్నారు. అయినప్పటికీ మన రాజ్యాంగం కొన్ని అంశాల పట్ల మౌనం వహిస్తుందన్న వాదన ఉంది. అది నిజం కూడా. కానీ ఆ మౌనం గంభీరమైనదని తెలుసుకోవాలంటారు నిపుణులు. వివిధ కారణాల వల్ల మన రాజ్యాంగం ఆత్మ ఆధునికం. కానీ అది నిక్షిప్తమై ఉన్న శరీరం మాత్రం పురాతనం. 1820 నాటి పాలనే ఇప్పటికీ కొనసాగుతోందన్న కటువైన అభిప్రాయాలు అప్పుడప్పుడు వెల్లువెత్తడం అందుకే కూడా. భారత రాజ్యాంగం శిలాశాసనం కాదు. సరళమైనదే. కానీ రాజ్యాంగాన్ని సమీక్షించుకునే అవకాశం మనం కోల్పోయాం. స్వాతంత్య్రం స్వర్ణోత్సవాల సందర్భంగా ఆ అవకాశం వచ్చింది. వారం రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరిపి, ఇందుకు సంబంధించిన తీర్మానం ఆమోదించింది. పీఏ సంగ్మా స్పీకర్. ఈ ఉదాత్త భావనలకు సంబంధించిన తీర్మానాన్ని ఎలా అమలు చేయాలో అందులో ప్రస్తావించుకోలేదు. అది తప్పిదమే. తరువాత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వం తీర్మానాన్ని అమలులోకి తేవడానికి ప్రయత్నించడంతోటే రాజకీయాలు మొదలైనాయి. ఇక్కడ రాజకీయాలు అన్న మాటే వాస్తవం. ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న పార్టీ బీజేపీ కాబట్టి రాజ్యాంగ సమీక్షలో ఉదాత్త లౌకిక భావాలకు చోటు ఉండదని ప్రచారం మొదలైంది. నిజానికి ఇది అపోహ అని అప్పుడే చాలామంది నచ్చచెప్పే ప్రయత్నంచేశారు. రాజ్యాంగ సమీక్షా సంఘం ఏర్పాటయింది. దానికి అధ్యక్షులు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య. బీపీ జీవన్రెడ్డి, ఫాలి నారిమన్ వంటి న్యాయకోవిదులు, సీఆర్ ఇరానీ (అప్పుడు స్టేట్స్మన్ పత్రిక సంపాదకుడు, ప్రస్తుతం లేరు) సభ్యులు. ప్రజాస్వామ్యం అనే అంశం గురించి ఏర్పాటు చేసిన సంఘంలో జస్టిస్ హెచ్ ఆర్ ఖన్నా, తెలుగువారైన జయప్రకాశ్ నారాయణ్ సభ్యులు. అయినా అపోహలు తొలగిపోలేదు. దీనితో రాజ్యాంగాన్ని శాస్త్రీయంగా సమీక్షించుకునే అవకాశం చేజారిపోయింది. ఇదొక చారిత్రక తప్పిదం. కాబట్టి జరిగిన తప్పిదాలకు రాజ్యాంగాన్ని బాధ్యురాలిగా చూపించడం కంటే, రాజకీయాలను కారణంగా చెప్పడం వాస్తవిక దృక్పథమవుతుంది. రాజ్యాంగం ప్రకారమే జరిగిన అధికార వికేంద్రీకరణతో మొదట దెబ్బతిన్నది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. అయితే గ్రామాలు రిపబ్లిక్లుగా ఉండాలని గాంధీజీ భావించేవారు. ఈ రెండు వాస్తవాలు అంత తొందరగా జీర్ణం కావు. అలాంటి హోదా కల్పిస్తే కుల సమీకరణల దృష్ట్యా గ్రామాలలో పెడధోరణులు ప్రబలిపోతాయని అంబేడ్కర్ ఊహించారు. దీనితో కులవృత్తులు నాశనమైనాయి. రాజ్యాంగమే ప్రసాదించిన జీవించే హక్కుకు పరోక్షంగా గండి పడుతోంది. కానీ దీనిని మార్చవచ్చు. ఎందుకు మార్చుకోలేదు? అందుకు మళ్లీ రాజకీయాలనే తప్పు పట్టవలసి ఉంటుంది. అందరికీ సమానావకాశాలు, విద్య, వైద్యం అందరికీ అందుబాటులో ఉండడం వంటి అంశాల వైఫల్యం కూడా రాజకీయ నాయకత్వం చిత్తశుద్ధికి సంబంధించినవే కానీ, రాజ్యాంగ వైఫల్యం కాదు. రాజ్యాంగం రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ఇది సమన్యాయ ఉద్దేశమే. కానీ నేటికీ 60 శాతం మంది సమన్యాయానికి సుదూరంగా ఉండిపోవడం ఒక చేదు వాస్తవం. ఒక పౌరుడికి విద్యావకాశాలు కల్పించకుండా, సంపద సృష్టిలో భాగస్వామిని చేయకుండా సమన్యాయం రమ్మంటే రాదు. స్త్రీ విముక్తికి సంబంధించి ఆదేశిక సూత్రాలలో స్పష్టమైన అంశాలే కనిపిస్తాయి. కానీ వాస్తవంలో కనిపిస్తున్నది వేరు. మరి 33 శాతం రిజర్వేషన్లకు అర్థం ఎక్కడ? రాజ్యాంగ రచన పూర్తయిన తరువాత అంబేడ్కర్ వాస్తవిక దృక్పథంతో చెప్పిన పలుకులు ఇప్పటికీ గుర్తుంచుకోదగినవే. రాజ్యాంగ రచన పూర్తికావడంతోటే దేశంలో దారిద్య్రం, అసమానతలు, అంతరాలు సమసిపోవు. రాజ్యాంగ ముసాయిదానో లేదా, ప్రతినో చూసి పారిపోవు. ఆ దృశ్యం ఇవాళ్టికీ తాజాగానే ఉంది. అదొక విష్కంభం. – డా. గోపరాజు నారాయణరావు -
ఫెడ్ దెబ్బ ..రుపీ ఢమాల్!
ముంబై: ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలతో దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి కుదేలైంది. డాలరుతో పోలిస్తే వరుసగా రెండో రోజూ బలహీనపడింది. బుధవారం నాటి నష్టాలను కొనసాగిస్తూ ఈ ఉదయం 17 పైసలకు పైగా కోల్పోయి రూ.68.25 ని తాకింది. ప్రస్తుతం స్వల్పంగా కోలుకుని 12 పైసల నష్టంతో 68.20 వద్ద ట్రేడవుతోంది. బుధవారం నాటి ముగింపు 13 పైసలు నష్టంతో 68.08గా నమోదైంది. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ చైర్పర్శన్ జానెట్ యెలెన్ వడ్డీ రేట్ల పెంపునకు పరిస్థితులు అనుకూలిస్తున్నాయన్న వ్యాఖ్యలతో డాలరుకు ఉత్సాహమొచ్చింది. దీంతో ఇటీవల స్వల్పంగా బలహీన పడ్డ డాలర్ మళ్లీ పుంజుకుంది. యెన్, యూరో వంటి కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ తాజాగా 101ను అధిగమించింది. దిగుమతిదారులనుంచి డాలర్ డిమాండ్ పుంజుకోవడం రూపాయి విలువను ప్రభావితం చేసిందని నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు దేశీ ఈక్విటీ మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. ఫ్లాట్ ఆరంభమైనా, లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. అటు ఎంసీఎక్స్ మార్కెట్ లో పత్తడి ధరలు కూడా వెలవెలబోతున్నాయి. పది గ్రా. రూ.188 నష్టపోయి రూ. 28,603 వద్ద ఉంది. -
పసిడి ధరకు ‘డాలర్’ దిక్సూచి..!
న్యూఢిల్లీ/న్యూయార్క్: అమెరికా ఆర్థిక అనిశ్చితి, డాలర్ కదలికల ఆధారంగా పసిడి ధర సమీప భవిష్యత్తులో ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సానుకూల, ప్రతికూల వార్తలు డాలర్ లాభ, నష్టాలపై ప్రభావం చూపుతున్నాయి. డాలర్ కదలికలు పసిడి ధరపై కనబడుతున్నాయి. ఇలాంటి వార్తల నేపథ్యంలోనే గడచిన వారంలో గత గురువారం న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్ఛంజ్లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర ఏడు వారాల గరిష్ట స్థాయికి 1204.3 డాలర్లకు చేరింది. అయితే అటు తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగుందనీ, స్వల్పకాలంలో ఎటువంటి ఇబ్బందులూ లేవని, ఉపాధి అవకాశాల మార్కెట్ పటిష్టంగా కనబడుతోందని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జానెట్ యెలెన్ చేసిన ప్రకటన డాలర్ బలోపేతానికి– పసిడి వెనక్కు తగ్గడానికీ దారితీసింది. మొత్తంమీద పసిడి గడచిన వారం 23 డాలర్ల లాభంతో 1,196 డాలర్ల వద్ద ముగిసింది. ఈ నెల ఆరవతేదీతో ముగిసిన వారం లో పసిడి 1,173 డాలర్ల వద్ద ముగిసింది. ఇక మొత్తంగా అమెరికా ఆర్థిక అనిశ్చితి పరిస్థితు లు, అస్పష్ట ప్రకటనల నేపథ్యంలో పెట్టుబడులకు సురక్షితమైన మెటల్గా పసిడి కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బంగారానికి 1,170 డాలర్ల వద్ద మద్దతు ఉందని, 1,241 డాలర్ల వద్ద తొలి నిరోధం ఉండవచ్చని విశ్లేషణలు ఉన్నాయి. భారత్లో రూ.500కుపైగా లాభం అంతర్జాతీయ ధోరణి అనుగుణంగానే దేశీయంగా గడచిన రెండు వారాల్లో పసిడి రూ.1,000కుపైగా పెరిగింది. గడచిన వారం చూస్తే... ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్లో శుక్రవారంనాటికి వారం వారీగా పసిడి ధర 99.9 ప్యూరిటీ 10 గ్రాములు రూ.555 పెరిగి రూ.29,040 వద్ద ముగిసింది. 99.5 ప్యూరిటీ ధర కూడా అదే స్థాయిలో ఎగసి రూ.28,890 వద్ద ముగిసింది. ఇక వెండి విషయానికి వస్తే, కేజీ ధర రూ.635 పెరిగి రూ.41,255కి చేరింది. వెండి రెండు వారాల్లో దాదాపు రూ.1,300 ఎగసింది. -
వచ్చే ఐదు సెషన్లే కీలకం!!
అమెరికా ఆర్థిక అంశాలే ప్రాతిపదిక పసిడిపై విశ్లేషకుల అంచనాలు న్యూఢిల్లీ/న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచాక అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నైమెక్స్లో పసిడి ఔన్స్ ధర దాదాపు 1,300 డాలర్ల నుంచి 1,127 డాలర్లకు పడిపోయినప్పటికీ... నాలుగు వారాలుగా ఒడిదుడుకులతోనే క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం 6వ తేదీతో ముగిసిన వారంలో 1,173 డాలర్లకు చేరింది. ఒకదశలో 1,182 డాలర్ల స్థాయిని కూడా తాకింది. ఈ వారంలో దాదాపు 16 డాలర్లు ఎగసింది. ఈ నేపథ్యంలో ఇకపై పసిడి పయనం ఎటువైపన్న అంచనాలకు ప్రాధాన్యం ఏర్పడింది. అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇప్పటివరకూ పసిడి ర్యాలీకి సోమవారం నుంచీ రాబోయే ఐదు రోజులు కీలకం కానున్నాయి. ముఖ్యంగా అమెరికా ఆర్థిక రంగం గురించి ఆ దేశ సెంట్రల్ బ్యాంక్– ఫెడరల్ రిజర్వ్ ప్రకటన, శుక్రవారం విడుదల కానున్న రిటైల్ అమ్మకాల గణాంకాలు పసిడి కదలికలకు కీలకం కానున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఆర్థిక పరిణామాల ప్రాతిపదికగా పసిడి కదలికలకు తక్షణ మద్దతు 1,150 డాలర్లుకాగా, నిరోధం 1,200, 1,215 డాలర్లుగా ఉన్నట్లు డైలీ ఎఫ్ఎక్స్ కరెన్సీ వ్యూహకర్త మైఖేల్ బౌత్రోస్ పేర్కొన్నారు. దేశీయంగా... అంతర్జాతీయ ధోరణి దేశీయ బులియన్ మార్కెట్పైనా గత వారం కనబడింది. ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 ప్యూరిటీ 10 గ్రాముల ధర శుక్రవారం రూ.435 పెరిగి (1.55 శాతం) రూ.28,485 వద్ద ముగిసింది. 99.5 ప్యూరిటీ ధర కూడా అదే స్థాయిలో ఎగసి రూ.28,335 వద్ద ముగిసింది. -
2017లో ఈ మూడు ఎటు?
హెచ్చుతగ్గుల బాటలోనే బంగారం! అనిశ్చిత పరిస్థితులు ఏర్పడినపుడు సురక్షితంగా ఉంటుందని అంతా బంగారంవైపు పరుగులెడతారు. అమెరికా ఆర్థిక సంక్షోభం తర్వాత 1900 డాలర్ల వరకూ పెరిగిపోయిన పుత్తడి ధర... అమెరికా కుదుటపడిందనగానే మళ్లీ 1000 డాలర్ల స్థాయికి పడిపోయింది. 2016లో కూడా బ్రెగ్జిట్, ట్రంప్ గెలుపు, ఫెడ్ రేట్ల పెంపు వంటి సంఘటనలతో 1060–1372 డాలర్ల మధ్య తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయింది. 2017లోనూ ఇదే తరహా ఊగిసలాట ఉంటుందనే అంచనాలున్నాయి. ఇటలీలో రాజకీయ సంక్షోభం, జర్మనీ, ఫ్రాన్స్లలో ఎన్నికలు పుత్తడి ధరను ప్రభావితం చేస్తాయనేది బులియన్ విశ్లేషకుల మాట. బ్రెగ్జిట్ ఇంకా జరగలేదని, ట్రంప్ ఇంకా అమెరికా అధ్యక్ష పదవిని స్వీకరించలేదని, కాబట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు షాక్లుండవనే అంచనాలకు అప్పుడే రాలేమని, ఆయా పరిణామాలకు అనుగుణంగానే బంగారం కదలవచ్చని వారు విశ్లేషిస్తున్నారు. కానీ 2017లో ఫెడ్ వడ్డీ రేట్లను జోరుగా పెంచడం, డాలరు మరింత బలపడటం జరిగితే బంగారం మరింత తగ్గొచ్చన్నది కూడా వారి అభిప్రాయం. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుల అంచనాలు ఎలా వున్నాయంటే.... పెద్దగా పెరుగుదల ఉండదు గోల్డ్ ఈటీఎఫ్లలో అమ్మకాలు తగ్గినందున (2016 నవంబర్ 8 నుంచి ఈ అమ్మకాలు 7 శాతం తగ్గాయి), 2017లో పుత్తడి అంచనాల్ని, మా గత అంచనాలతో పోలిస్తే 1,438 డాలర్ల నుంచి 1,338 డాలర్లకు తగ్గిస్తున్నాం. కానీ మొత్తంమీద సరఫరా– డిమాండ్ మధ్య వ్యత్యాసం వల్ల ప్రస్తుత ధరతో పోలిస్తే కొత్త ఏడాదిలో కొంత పెరుగుతుంది. – క్రెడిట్ సూసీ అనలిస్టులు వృద్ధికి దోహదపడే విధానాల్ని ట్రంప్ అనుసరి స్తారు. ఈ కారణంగా 2017 సంవత్సరానికి పుత్తడి అంచనాల్ని 1,280 డాలర్ల నుంచి 1,200 డాలర్లకు కుదిస్తున్నాం. – గోల్డ్మాన్ శాక్స్ విశ్లేషకులు ముడిచమురు 51–69 డాలర్ల మధ్యే? డాలరు పెరగడంతో ఆ కరెన్సీకి అభిముఖంగా పయనించే కమోడిటీలు తగ్గుతాయన్న సహజ అంచనాలు క్రూడ్పై కూడా ఉన్నాయి. అమెరికాలో క్రూడ్, గ్యాసోలిన్ నిల్వలు పెరగడం, చమురు అన్వేషణకు మరిన్ని రిగ్గులు అందుబాటులోకి రావడంతో అక్కడ ఉత్పత్తి పెరుగుతుందన్న అంచనాలు క్రూడ్ ధర పెరుగుదలకు బ్రేక్ వేస్తాయనేది కొందరు విశ్లేషకుల అభిప్రాయం. అయితే చమురు ఉత్పాదక దేశాల మండలి ఒపెక్ క్రూడ్ ఉత్పత్తిలో కోత విధించడం, అమెరికా, ఆసియాలో పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం వంటి అంశాలతో క్రూడ్ ర్యాలీ కొనసాగుతుందని ఇంకొందరు చెబుతున్నారు. వాల్స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన సర్వేలో వివిధ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు కొత్త సంవత్సరంలో బ్రెంట్ క్రూడ్ ధర సగటున 54–56 డాలర్ల మధ్య కదలవచ్చని అంచనా వేశాయి. వివిధ అంశాలు ఇందుకు దోహ దపడేవిగా ఉన్నాయని ఈ సర్వేలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు పేర్కొన్నాయి. అంచనాలు ఇలా... 2017 జూన్కల్లా క్రూడ్ ధర 69 డాలర్లకు చేరుతుంది. చమురు, గ్యాస్ అన్వేషణ రంగంలో పెట్టుబడులు తగ్గుతున్నందున క్రూడ్ ధర పెరిగే అవకాశం ఉంది. –బ్యాంక్ ఆఫ్ అమెరికా సగటు క్రూడ్ ధర 2017 ప్రధమార్థంలో 55 డాలర్లు, ద్వితీయార్థంలో 57.5 డాలర్ల చొప్పున ఉండవచ్చు. అయితే ట్రంప్ విధానాల కారణంగా అమెరికాలో చమురు ఉత్పత్తి పెరిగితే ధరలు తగ్గొచ్చు. –గోల్డ్మాన్ శాక్స్ 2017లో నైమెక్స్ క్రూడ్ ధర సగటున 55 డాలర్ల వద్ద ట్రేడ్ కావొచ్చు. –ప్రపంచ బ్యాంక్ బ్రెంట్ ధర 51–52 డాలర్ల మధ్య స్థిరపడవచ్చు. –అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ రూపాయి.. 70 వరకూ తగ్గవచ్చు.. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై తీసుకునే నిర్ణయాలు, కొత్త అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించే విధానాల ఆధారంగా డాలరు కదులుతుందని, ఇది పెరుగుతుంటే భారత్ రూపాయితో సహా ఇతర వర్థమాన దేశాల కరెన్సీలు ఒత్తిడికి లోనవుతాయని, డాలరు ర్యాలీకి బ్రేక్ పడితే మన కరెన్సీ విలువ మెరుగుపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు డాలరు పటిష్టంగా వున్నందున, వర్థమాన మార్కెట్లలోకి విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం నెమ్మదిస్తుందని, ఈ కారణంగా 2017 ప్రధమార్థంలో రూపాయి బలహీనంగానే వుండవచ్చని, మెరుగుదల ఏదైనా వుంటే అది ద్వితీయార్థంలోనే సాధ్యపడుతుందని నిపుణులు అంటున్నారు. డాలరుతో రూపాయి మారకపు విలువ 66.50/66.05 నుంచి 69.80/70 శ్రేణిలో కదలవచ్చని అధికశాతం మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విశ్లేషకుల అంచానా.. డీమానిటైజేషన్ తర్వాత పోలిస్తే రూపాయి బలపడింది. ఆర్బీఐ డాలర్లను విక్రయించడమే ఇం దుకు కారణం. కానీ కొత్త ఏడాది తొలి త్రైమాసికంలో ఆర్బీఐ డాలరు నిల్వల్ని పెంచుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇందుకు తోడు ట్రంప్ విధానాలు, ఫెడ్ రేట్ల పెంపు కారణంగా 2017 ప్రధమార్థంలో 70 స్థాయికి రూపాయి మారకపు విలువ తగ్గవచ్చు – అనింద్య బెనర్జీ, కరెన్సీ విశ్లేషకుడు, కొటక్ సెక్యూరిటీస్ ఇతర ఆసియా కరెన్సీలతో పోలిస్తే భారత్ రూపాయి మెరుగ్గానే వుంటుందని అంచనావేస్తున్నాం. కానీ డాలరు బలం కారణంగా రూపాయి కూడా తగ్గవచ్చు. అయితే ఈ క్షీణత ఇతర ఆసియా కరెన్సీలకంటే తక్కువగానే వుంటుంది. 70 వరకూ భారత్ కరెన్సీ తగ్గవచ్చు – ఐరేన్ చూంగ్, కరెన్సీ స్ట్రాటజిస్ట్, ఏఎన్జడ్ గరిష్టంగా 66.05 స్థాయికి పెరగవచ్చు. అనూహ్య పరిస్థితుల్లో 69.80/70 స్థాయికి పతనం కావొచ్చు. – హిరేన్ శర్మ, సీనియర్ కరెన్సీ విశ్లేషకుడు -
పడదు... పరిగెత్తదు?
2017 ప్రథమార్ధం వరకూ ఇదే పరిస్థితి ఆ తరవాత పాలసీ నిర్ణయాలతో దిశానిర్దేశం పెద్ద నోట్ల రద్దు ప్రభావం కొంత ఉండొచ్చు ఫెడ్ వడ్డీ రేట్ల పెంపే అతిపెద్ద ప్రతికూలం సానుకూలాంశాలు కూడా చాలా ఉన్నాయ్ డిజిటల్తో పన్నుల వ్యవస్థ మెరుగుపడొచ్చు ఎఫ్ఎంసీజీ రంగమే అత్యంత ఆకర్షణీయం ఇన్ఫ్రా, ఆటో రంగాల్లోనూ త్వరగా రికవరీ 2017పై బ్రోకింగ్ సంస్థల అంచనాలివీ... గతేడాది స్టాక్ మార్కెట్లు తక్కువ లాభాన్నే ఇచ్చాయనుకుంటారంతా!!. నిజమే.. మార్కెట్ సూచీలైన సెన్సెక్స్ను గానీ, నిఫ్టీని గానీ చూస్తే ఇదే అనిపిస్తుంది. ఏడాది ఆరంభం నుంచి చివరిదాకా చూసినపుడు సెన్సెక్స్ దాదాపు 560 పాయింట్లు లాభపడగా... నిఫ్టీ దాదాపు 220 పాయింట్లు లాభపడింది. శాతాల్లో చూస్తే ఇది 3కు మించదు. మరి నిజంగా ఇన్వెస్టర్లకు 3 శాతం లాభాలే వచ్చాయా? నిజం చెప్పాలంటే... కాస్త తెలివిగా, నిపుణుల సూచనలు పాటించి ఇన్వెస్ట్ చేసిన వారికి లాభం బాగానే వచ్చింది. ఇది ఎంత శాతమన్నది మాత్రం వారి పోర్టుఫోలియోపైనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇదే కాలంలో కొన్ని షేర్లు దాదాపు నూరు శాతం పెరిగిపోయాయి. కొన్ని ప్రభుత్వ సంస్థల షేర్లు సైతం 70–80 శాతం లాభమిచ్చాయి. ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి దిగ్గజ షేర్లను తీసుకున్నా 10 శాతానికి తక్కువ కాకుండా లాభాలు అందించాయి. ఇక ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వంటివైతే పరుగులు తీశాయి. ఏకంగా 40 నుంచి 55 శాతం మధ్య పెరిగాయి. దీన్నిబట్టి తెలుసుకోవాల్సింది ఒక్కటే!!. మొత్తంగా మార్కెట్ ఎలా ఉన్నా సరే మనం ఎంచుకున్న రంగమో, కంపెనీయో బాగుంటే పరుగులు తీయక మానదు. మార్కెట్ నష్టాల్లో ఉన్నా కూడా మన షేర్లు మాత్రం లాభపడే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే... 2017లో మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయన్న విషయమై పలువురు నిపుణుల్ని, బ్రోకరేజీ సంస్థల్ని ‘సాక్షి’ సంప్రతించింది. మొత్తంగా ఈక్విటీ మార్కెట్లు ఎలా ఉంటాయి? ఏఏ రంగాలు బాగుంటాయి? ఏఏ షేర్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు? అనే అంశాలపై వారి అభిప్రాయాలు తెలుసుకుంది. 2017వ సంవత్సరంలోకి అడుగుపెడుతూ... మార్కెట్లు కొత్త సంవత్సర తొలి ట్రేడింగ్ను ఆరంభిస్తున్న తరుణంలో... ‘సాక్షి ప్రాఫిట్’ పాఠకుల కోసం ఈ ప్రత్యేక కథనం. –సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం త్వరగానే సాధారణ స్థితి! నిఫ్టీ 7572–9465 శ్రేణిలో కదలొచ్చు ఫైనాన్స్, డిఫెన్స్, ఆటో షేర్లు రాణిస్తాయి హెచ్చుతగ్గులు ఎలా ఉన్నా.. దీర్ఘకాలంలో పసిడి, ఫిక్స్డ్ ఇన్కమ్ వంటి సాధనాల కన్నా ఈక్విటీలే చక్కని రాబడులు అందించే అవకాశముంది. అందుకే స్వల్పకాలిక లాభాలు చూసుకోకుండా సిస్టమాటిక్ విధానంలో దీర్ఘకాలిక కోణంలో ఇన్వెస్ట్ చేయాలి. మంచి క్వాలిటీ కంపెనీల షేర్లలో పెట్టుబడులు కొనసాగించడం మంచిది. కొత్త సంవత్సరానికొస్తే... రాబోయే 12–15 నెలల్లో నిఫ్టీ 7572–9465 శ్రేణిలో తిరగొచ్చని అంచనా వేస్తున్నాం. దీర్ఘకాలిక ప్రాతిపదికన కన్సూమర్ గూడ్స్, ఫైనాన్షియల్, ఆటోమొబైల్, డిఫెన్స్, కెమికల్ రంగాల సంస్థల షేర్లు రాణించే అవకాశముంది. పెద్ద నోట్ల రద్దుతో అనిశ్చితి నెలకొన్న మాట వాస్తవం. ఈ నేపథ్యంలో వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానం ముందుగా అనుకున్నట్లు 2017 ఏప్రిల్ 1 నుంచి కాకుండా.. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకాస్త ఆలస్యమైనా కూడా ఆశ్చర్యం లేదు. డిమోనిటైజేషన్ కారణంగా స్వల్పకాలికంగా కొంత అనిశ్చితి నెలకొన్నప్పటికీ... డిజిటల్ లావాదేవీలు పెరగటం, పన్నులు కట్టేవారి సంఖ్య ఎక్కువవటం, వ్యాపార విశ్వాసం మెరుగుపడటం వంటివి జరుగుతాయి. వీటన్నిటి వల్లా 2017లో మళ్లీ సాధారణ పరిస్థితులు రాగలవని భావిస్తున్నాం. రిస్కులు లేవనటం లేదు... చాలా రిస్కులున్నాయి ►నోట్ల రద్దు ప్రభావాలు దీర్ఘకాలం కొనసాగిన పక్షంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మందగించే ప్రమాదముంది. ►ముడి చమురు ధరలు మెల్లగా పెరుగుతూ వస్తున్నాయి. ఒక్కసారిగా ఎగిసే అవకాశమూ లేకపోలేదు. ►పశ్చిమాసియా, సౌత్ చైనా సముద్రంలో భౌగోళిక, రాజకీయపరమైన సమస్యలు దేనికైనా దారితీయొచ్చు. ► జీఎస్టీ అమలు వంటి పాలసీపరమైన కీలకాంశాల్లో పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం ఇబ్బందే. ►అమెరికాలాంటి సంపన్న దేశాలు రక్షణాత్మక ధోరణిలోకి వెళుతున్నాయి. ఇది మంచిది కాదు. ద్వితీయార్థంలో బాగుండొచ్చు ఇన్ఫ్రా, ఎగుమతి ఆధారిత కంపెనీలకు అనుకూలం ∙అంతర్జాతీయంగా కరెక్షన్ వస్తే మనపైనా ప్రభావం మార్కెట్లు ఈ ఏడాది ఒక దశలో ఆల్టైమ్ గరిష్ట స్థాయిల దరిదాపులకు వెళ్లాయి. కానీ అక్కడ నిలదొక్కుకోలేకపోయాయి. తర్వాత తగ్గి.. అప్పటి నుంచి అంతంతమాత్రంగానే రాణించాయి. భారత్ సహా అంతర్జాతీయంగా వర్ధమాన మార్కెట్లలో అమ్మకాల వెల్లువ, ఇటు దేశీయంగా పెద్ద నోట్ల రద్దు వంటి పరిణామాలతో మార్కెట్లు బలహీనపడటం మొదలైనవి కరెక్షన్కి కారణమయ్యాయి. కాకపోతే, 2016లో పరిశ్రమలు, వ్యవసాయ ఉత్పత్తులు, ముడి చమురు మొదలైన వాటిలో వేగంగా రికవరీ జరిగింది. మా అంచనా ప్రకారం కొత్త సంవత్సరంలో పెద్ద ర్యాలీల్లాంటివేమీ ఉండకపోయినా... స్టాక్మార్కెట్లు సానుకూలంగానే ఉండొచ్చు. డీమోనిటైజేషన్, జీఎస్టీ తదితర అంశాలతో పాటు అంతర్జాతీయ అనిశ్చితి పరిణామాల ప్రభావం వల్ల లాభాలు ఓ మోస్తరు స్థాయిలోనే ఉంటాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా మార్కెట్లు గరిష్ట స్థాయిల్లో ఉన్నాయి. వాటిల్లో ఏదైనా కరెక్షన్ వస్తే.. అది మన మార్కెట్లపై కూడా ప్రభావం చూపిస్తుంది. ప్రథమార్ధం కాస్త బలహీనంగా ఉన్నా... పరిస్థితులన్నీ చక్కబడితే ద్వితీయార్థంలో మార్కెట్లు మెరుగ్గా ఉండవచ్చు. రూపాయి విషయానికొస్తే .. 2016 మాదిరిగానే 2017లోనూ మారకం విలువ కాస్త హెచ్చుతగ్గులకు లోనుకావచ్చు. కాకపోతే విలువ మరీ అంత ఎక్కువగా పడిపోకపోవచ్చు. జీఎస్టీ అమలు వంటి పరిణామాలతో... అటు తర్వాతి సంవత్సరంపై ఆశావహ అంచనాలతో... ఎఫ్ఐఐలు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావచ్చు. ఇది రూపాయి బలోపేతానికి కొంత దోహదపడొచ్చు. వచ్చే ఏడాది కూడా పసిడి రేట్లు పెద్దగా రికవరీ లేకుండా ఒక మోస్తరు స్థాయిలోనే కొనసాగవచ్చు. అయితే, ఇదంతా కూడా డిమాండ్, సరఫరా మీదే ఎక్కువగా ఆధారపడి మారిపోతుంటుంది. ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రా ఆకర్షణీయం... దేశీ వృద్ధిపై పెద్దగా ఆధారపడని ఎగుమతి సంస్థలు, ప్రభుత్వ వ్యయాలతో ముడిపడి ఉన్న ఇన్ఫ్రా రంగ సంస్థలు మెరుగ్గా రాణించే అవకాశముంది. వాయిదా వేసుకున్నా పర్వాలేదు అనుకునేటువంటి... విచక్షణాయుతమైన కొనుగోళ్లపై ఆధారపడిన రంగాలు మాత్రం కోలుకునేందుకు కాస్త సమయం పడుతుంది. డీమోనిటైజేషన్ ప్రభావాలు ఎలా ఉన్నా.. చాలా వేగంగా సాధారణ పరిస్థితికి వచ్చేస్తున్న వాటిల్లో ఎఫ్ఎంసీజీ ఒకటి. ఈ విభాగంలో.. ముందుగా ఎఫ్ఎంసీజీ, ఆ తర్వాత చౌక వినియోగ వస్తువులు, వాటి తర్వాత ఖరీదైన వినియోగ వస్తువుల విభాగాలు కోలుకుంటాయి. ఆటోమొబైల్ రంగం విషయానికొస్తే... గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మెరుగుపడితే టూ వీలర్ల అమ్మకాలు మెరుగుపడొచ్చు. మొత్తంగా చూస్తే.. ముందుగా తక్కువ ధర ఉండే ఫోర్ వీలర్ల విభాగం... ఆ తర్వాత టూ వీలర్లు, చిట్టచివరికి హై ఎండ్ వాహనాల విభాగాల్లో అమ్మకాల రికవరీ ఉండొచ్చు. ఫెడ్ రేట్లే ప్రధాన రిస్కు!! అమెరికాలో ఫెడ్ రేట్లు పెంచడం మన మార్కెట్లకు ప్రధాన రిస్కుగా భావించవచ్చు. అలాగే, అంతర్జాతీయంగా మందగమనం రిస్కుతో పాటు దేశీయంగా పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు ప్రభావాల ప్రతికూలత కూడా ఉండొచ్చు. డీమోనిటైజేషన్ ప్రభావం కొన్ని త్రైమాసికాల పాటు... అటుపైన జీఎస్టీ అమల్లోకి వస్తే మరికొన్ని త్రైమాసికాల పాటు ఉండే అవకాశముంది. తదనుగుణంగా వృద్ధిపైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. జీఎస్టీ ఉన్న దేశాలను చూస్తే... సాధారణంగానే అమలు చేసిన తొలినాళ్లలో వృద్ధి కొంత మందగించింది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావాలు ఎక్కువగా నగదు లావాదేవీలు జరిగే అసంఘటిత రంగంపైనే ఉంటాయి. వ్యాపార సంస్థలు ఈ కొత్త మార్పులకు అనుగుణంగా సర్దుకోవడానికి కాస్త సమయం పడుతుంది కూడా. బడ్జెట్ ప్రతిపాదనలతో దిశానిర్దేశం!! ప్రభుత్వం నుంచి కొత్తగా వెలువడే పాలసీపరమైన ప్రకటనలు, బడ్జెట్ ప్రతిపాదనలు మార్కెట్లకు దిశానిర్దేశం చేస్తాయి. వీటిలో సానుకూలాంశాలేమైనా ఉంటే రికవరీ అనేది ద్వితీయార్ధం దాకా కాకుండా కాస్త ముందే జరగొచ్చు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల సమీప భవిష్యత్లో తలెత్తే మందగమనాన్ని ఎదుర్కొనడానికి బడ్జెట్లో ప్రతిపాదనలు చేసినా, పాలసీపరంగా సానుకూల ప్రకటనలేమైనా చేసినా... మార్కెట్లపై ప్రతికూలత పెద్దగా ఉండకపోవచ్చు. బడ్జెట్లో సానుకూలాంశాలే కాకుండా మార్కెట్లను కాస్త కలవరపర్చే ప్రతిపాదనలూ ఉండొచ్చు. ఇటీవలి ప్రకటనలను బట్టి చూస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ) వ్యవధిని ప్రస్తుతమున్న ఏడాది నుంచి రెండు లేదా మూడేళ్లకు పొడిగించే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. చిన్న సంస్థల షేర్లలో బాగా అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అలాంటి వాటికే దీన్ని వర్తింపచేయొచ్చు. ఏదేమైనా క్యాపిటల్ గెయిన్స్ విషయంలో కొన్ని పరిమితులు ఉండొచ్చన్న అంచనాలున్నాయి. అలా కాకుండా అన్ని స్టాక్స్కూ వర్తింపచేస్తే మార్కెట్లు ఖచ్చితంగా నెగటివ్గానే స్పందిస్తాయి. అయితే ఆర్థిక మంత్రి జైట్లీ అలాంటివేమీ చేయబోమంటూ హామీ ఇచ్చిన దరిమిలా.. ఏవో కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం చేయొచ్చు. -
క్రూడ్, ప్రపంచ మార్కెట్లే దిక్సూచి..
పరిధికి లోబడి గమనం స్వల్ప రికవరీకి అవకాశం జీఎస్టీ, రూపాయి ప్రభావం సైతం ఈ వారం స్టాక్ మార్కెట్లపై నిపుణుల విశ్లేషణ ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఓ పరిధికి లోబడి చలిస్తాయని, స్టాక్స్ విలువలు ఆకర్షణీయ స్థాయిలో ఉన్నందున స్వల్ప రికవరీకి అవకాశం లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా క్రూడాయిల్ ధరలు, అంతర్జాతీయ మార్కెట్ల కదలికల ఆధారంగా దేశీయ మార్కెట్ల గమనం ఆధారపడి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో జీఎస్టీ అమలుపై ప్రభుత్వ చర్యలు, రూపాయి మారకం విలువల్లో హెచ్చుతగ్గులు కూడా మార్కెట్పై ప్రభావం చూపిస్తాయంటున్నారు. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్ల లావాదేవీలు చాలా వరకు తగ్గినందున మార్కెట్లలో పెద్దగా కదలికలు ఉండకపోవచ్చని, దీంతో మార్కెట్లు ఓ పరిధిలో చలిస్తాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘‘డీమోనిటైజేషన్ ప్రభావం స్వల్పకాలం పాటు మార్కెట్పై ప్రభావం చూపిస్తుంది. దీని పరిణామాలపై మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుంది’’ అని అమ్రపాలి ఆద్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ హెడ్ అబనీష్కుమార్ సుదాన్షు తెలిపారు. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం అనంతరం రూపాయి కదలికలపై కన్నేసి ఉంచాలని ఇన్వెస్టర్లకు సూచించినట్టు ఆయన చెప్పారు. ప్రభుత్వం డిజిటల్ ఇండియాపై దృష్టి పెట్టడంతోపాటు రూపాయి బలహీనత కారణంగా ఐటీ షేర్లు వెలుగులో ఉండవచ్చని తాము అంచనా వేస్తున్నట్టు అబనీష్ పేర్కొన్నారు. ఇక చమురు కంపెనీల షేర్లతోపాటు టాటా గ్రూపు కంపెనీల ఈజీఎంలు ఈ వారంలో ఉన్నందున వీటి ధరలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలి ధరల పతనం కారణంగా కొన్ని షేర్లు ఆకర్షణీయ స్థాయిలో ఉన్నాయని, ఫలితంగా వీటికి కొనుగోళ్ల మద్దతు లభించవచ్చని నిపుణులు పేర్కొన్నారు. స్వల్పకాలం ప్రతికూలంగానే ఫెడ్ దూకుడైన విధానం కారణంగా మార్కెట్ ఆటుపోట్లకు గురికావచ్చని, డాలర్ బలపడడం, పెరుగుతున్న క్రూడాయిల్ ధరల కారణంగా స్వల్పకాలం పాటు మార్కెట్ ప్రతికూలంగానే కొనసాగవచ్చని జియోజిత్ బీఎన్పీ పారిబాస్ ఫైనాన్షియల్ సేవల విభాగం రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. ఈ ఏడాదికి సంబంధించి అంతర్జాతీయంగా ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ముగిసినందున దేశీయ మార్కెట్లలో వాల్యూమ్స్, అస్థిరత తగ్గుముఖం పట్టవచ్చని, షేరు వారీ వార్తల ఆధారిత గమనం కొనసాగవచ్చని జిఫిన్ అడ్వైజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దేవేంద్ర పేర్కొన్నారు. ఈక్విటీ మార్కెట్లలోకి ఎఫ్ఐఐల నిధుల ప్రవాహం సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని ట్రేడ్బుల్స్ సీఈవో ధ్రువ్ దేశాయ్ తెలిపారు. ఇక, గత వారం దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,610 కోట్లు ఉపసంహరించుకున్నట్టు గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెల 13–16 మధ్య ఈక్విటీ, డెట్ మార్కెట్లలో రూ.2,341 కోట్ల మేర అమ్మకాలు జరిపినట్టు నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ వెల్లడించింది. అధిక శాతం విక్రయాలు డెట్ మార్కెట్లోనే ఉన్నాయని తెలిపింది. ఇక సాంకేతికంగా చూస్తే నిఫ్టీ కొంత కరెక్షన్కు గురికావచ్చనే అంచనాలు ఉన్నాయి. నిఫ్టీ తక్షణ మద్దతు స్థాయిలైన 8127–8105 వద్ద నిలదొక్కుకుంటుందా, లేదా అన్నది గమనించాలని లేదంటే వారం ప్రారంభంలో మరికొంత దిద్దుబాటుకు గురికావచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ విభాగం హెడ్ దీపక్ జసాని తెలిపారు. గత వారం సెన్సెక్స్ 257.62 పాయింట్లు, నిఫ్టీ 122.30 పాయింట్ల మేర నష్టాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నవంబర్ 18 తర్వాత ఒక వారంలో గరిష్ట నష్టాలు ఎదురుకావడం మళ్లీ ఇదే. -
స్వల్ప నష్టాలు
• తగ్గిన లావాదేవీలు • 30 పాయింట్ల నష్టంతో 26,490కు సెన్సెక్స్ • 14 పాయింట్ల నష్టంతో 8,139కు నిఫ్టీ అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాది మరిన్ని మార్లు పెంచనుందన్న భయాలతో స్టాక్ మార్కెట్ శుక్రవారం స్వల్పంగా నష్టపోయింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు వరుసగా మూడో రోజూ క్షీణించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 30పాయింట్లు నష్టపోయి 26,490 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 14 పాయింట్ల నష్టంతో 8,139 పాయింట్ల వద్ద ముగిశాయి. లోహ, మౌలిక, బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, టెలికం షేర్లు షేర్లు పతనం కాగా, ఐటీ, కన్సూమర్డ్యూరబుల్ షేర్లు లాభపడ్డాయి. ఇన్పోసిస్, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభపడడంతో నష్టాలు పరిమితమయ్యాయి. ఈ వారంలో సెన్సెక్స్ 258 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 122 పాయింట్లు నష్టపోవటంగమనార్హం. గత నెల 18 తర్వాత స్టాక్ సూచీలు ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే మొదటిసారి. లావాదేవీలు తక్కువగా... సానుకూల సంకేతాలేవీ లేకపోవడంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ట్రేడింగ్కు దూరంగా ఉన్నారని, దీంతో తక్కువ లావాదేవీలు నమోదయ్యాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. సెన్సెక్స్ 26,455 – 26,595 పాయింట్ల కనిష్ట,గరిష్ట పాయింట్ల మధ్య కదలాడింది. రేట్ల పెంపుపై ఫెడ్ ధోరణిని అర్థం చేసుకోవడానికి మార్కెట్కు కొంత సమయం పడుతుందని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. డాలర్బలపడుతుండడం, ముడి చమురు ధరలు పెరుగుతుండడం వంటి కారణాల వల్ల సమీప భవిష్యత్తులో మన మార్కెట్పై ఒత్తిడి తీవ్రంగానే ఉండగలదని ఆయన అంచనా వేశారు. మందగమన భయాలు.. పుత్తడి దిగుమతులు పెరగడంతో వాణిజ్య లోటు రెండేళ్ల గరిష్ట స్థాయి 1,300 కోట్ల డాలర్లకు పెరిగింది. ఇక పెరుగుతున్న చమురు ధరలు, పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా నగదు కొరత కంపెనీల పనితీరుపై ప్రభావంచూపుతుందని, ఆర్థిక మందగమన భయాలతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారని విశ్లేషకులు చెప్పారు. కాగా సెన్సెక్స్లో అత్యధికంగా భారతీ ఎయిర్టెల్ 2.6 శాతం నష్టపోయింది. -
భారత్పై నామమాత్రమే!
ఎస్బీఐ రిసెర్చ్: రూపాయిపై స్వల్పకాలికంగా ప్రభావం చూపినా... దీర్ఘకాలంలో ఫెడ్ రేటు పెంపు ఎఫెక్ట్ మామూలుగానే ఉంటుంది. ఇక దేశంలో పన్నుల తగ్గింపు ద్వారా వినియోగ డిమాండ్ను పెంపొందించాల్సిన అవసరం ఉంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఈ చర్యలు అవసరం. ఇక్రా: రూపాయి కోణంలో చూస్తే... భారత్కు ఉన్న పటిష్ట విదేశీ మారకద్రవ్య నిల్వలు (365 బిలియన్ డాలర్లు) దేశానికి లాభించే అంశం. డాలర్ మారకంలో రూపాయి విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 67–71 శ్రేణిలో ఉండవచ్చు. సీఐఐ: ఇదిలావుండగా, పెద్ద నోట్ల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తక్షణం అధిక ప్రభావం చూపుతుందని సీఐఐ పేర్కొంది. ప్రస్తుత, వచ్చే త్రైమాసికాల్లో ఈ ప్రభావం తీవ్రంగా కనిపిస్తుందని సీఐఐ విశ్లేషించింది. -
వర్ధమాన దేశాలపై ఫెడ్ రేటు దెబ్బ..
పెట్టుబడులు తరలిపోవచ్చని మూడీస్ హెచ్చరిక అమెరికా ఎకానమీ స్థిరపడుతుండటాన్ని ప్రతిబింబిస్తూ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడం.. వర్ధమాన దేశాలకూ ప్రయోజనకరమే అయినప్పటికీ.. ఆయా దేశాల నుంచి పెట్టుబడులు తరలిపోయే అవకాశాలుఉన్నాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకునే క్రమంలో అక్కడ దిగుమతులకు డిమాండ్ పెరగడం వల్ల వర్ధమాన దేశాల ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరగలదని తెలిపింది.అదే సమయంలో ఫెడ్ ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం వల్ల విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున తరలిపోవచ్చునని.. ఇది వాటిపై ఆధారపడిన సంస్థలకు ప్రతికూలం కాగలదని వివరించింది. అలాగే రాజకీయంగా,విధానాలపరంగా అనిశ్చితికి దారితీయొచ్చని మూడీస్ పేర్కొంది. ఫెడ్ క్రమానుగతంగా మరో రెండు మూడు సార్లు వడ్డీ రేట్లను పెంచవచ్చని అభిప్రాయపడింది. మొత్తం మీద 2017 ఆఖరు నాటికి వడ్డీ రేట్లు 1.25– 1.5శాతం స్థాయికి చేరొచ్చని తెలిపింది. ఈ ప్రభావాలు అమెరికా కన్నా మిగతా వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలపైనే ఎక్కువగా కనిపించవచ్చని వివరించింది. -
ఫెడ్ పెంపును తట్టుకుంటాం
ఆ శక్తి మన ఆర్థిక వ్యవస్థకుంది • కరెన్సీ మార్కెట్ స్థిరపడుతుంది • ముఖ్య ఆర్థిక సలహాదారు సుబ్రమణియన్ • అనిశ్చితికి తెరపడింది: శక్తికాంత దాస్ • కొంత కాలం పాటు విదేశీ నిధులు వెనక్కి: ఆర్థికశాఖ • 0.25% పెంపుతో... 0.75%కి ఫెడ్ రేటు • వచ్చే ఏడాది మరో మూడుసార్లు పెంపు ఉండొచ్చన్న ఫెడ్ చీఫ్ ఎలెన్ న్యూఢిల్లీ: అమెరికా ఫెడ్ రేటు పెంపు ప్రభావాన్ని తట్టుకునే శక్తి మనకుందని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కరెన్సీ మార్కెట్లో తక్షణం స్వల్ప ఆటు పోట్లు కనిపించినా తర్వాత స్థిరపడుతుందని అభయమిచ్చింది. ఈ ఏడాది ద్వితీయార్ధం నుంచి అమెరికా ఆర్థిక రంగం పురోగమిస్తుండడాన్ని పరిగణనలోకి తీసుకున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పావు శాతం పెంచుతూ బుధవారం రాత్రి నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటిదాకా 0.50%గా ఉన్న ఫెడ్ ఫండ్ రేటు 0.75%కి చేరింది. అంతేకాక... వచ్చే ఏడాది మరో మూడుసార్లు పెంపు నిర్ణయం ఉంటుందని కూడా ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ జానెట్ ఎలెన్ సంకేతాలిచ్చారు. దీంతో ఈ అంశంపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అనిశ్చితికి తెరపడింది..: అమెరికాలో అమల్లో ఉన్న రేట్లకు అనుగుణంగా మన వడ్డీ రేట్లను సమతుల్యం చేయాల్సి ఉందని, ఫెడ్ రేటు పెంపుతో అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చితికి తెరపడిందని ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి శక్తికాంత దాస్ అన్నారు. దేశీయ మార్కెట్లు ఇప్పటికే ఈ రేటు ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్నాయని చెప్పారు. వృద్ధి అంచనాలు స్థిరంగానే ఉన్నాయన్నారు. స్వల్ప ఆటు పోట్ల అనంతరం కరెన్సీ మార్కెట్ స్థిరపడుతుందని చెప్పారు.మన ఆర్థిక రంగానికి ఆ శక్తి ఉంది...‘‘దేశీయ ఆర్థిక రంగానికి ఫెడ్ రేటు పెంపు ప్రభావాన్ని తట్టుకునే అద్భుత శక్తి ఉంది. అయితే, అంచనాలను పునఃసమీక్షించాల్సి ఉంది. కొంత కాలం పాటు వర్ధమాన దేశాల నుంచి అమెరికాకు నిధులు తరలిపోవడం ఉంటుంది. అయితే, ఇతర దేశాలతో పోలిస్తే మనపై ప్రభావం తక్కువే’’ అని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అన్నారు. ఫెడ్ రేటు పెంపును ఆర్బీఐ ఇప్పటికే పరిగణనలోకి తీసుకుందని చెప్పారు. వడ్డీ రేట్లను తగ్గిస్తుందని అందరూ భావించగా... యథాతథంగా కొనసాగిస్తూ ఆర్బీఐ ఈ నెల సమీక్ష అనంతరం నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే. వడ్డీ రేట్లు తక్కువుంటే నిధులు తరలిపోతాయ్ అమెరికాను డిపాజిట్లకు సురక్షిత ప్రదేశంగా పరిగణిస్తారని వడ్డీ రేటు పెంపు ఎప్పుడు వెలువడినా నిధులు వెనక్కి మళ్లడం, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సమీక్షించుకోవడం సాధారణమేనని ఆర్థిక శాఖకు చెందిన మరో అధికారి పేర్కొన్నారు. ‘‘ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే తక్కువ వడ్డీ రేట్లను కలిగి ఉండాలని మన దేశం భావిస్తోంది. అయితే దీన్ని బ్యాలన్స్ చేయాల్సి ఉంది. అప్పుడే ఆ ప్రభావం రూపాయిపై పడకుండా ఉంటుంది’’ అని ఆయన వివరించారు. వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే నిధులు తరలిపోయే సమస్య ఎక్కువగా ఉంటుందన్నారు. అమెరికా, భారత వడ్డీ రేట్లలో మరింత అంతరం ఉంటే రూపాయి ప్రభావితం అవుతుందని, కనుక వడ్డీ రేట్ల విషయంలో సమతుల్యంగా వ్యవహరించాల్సి ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫెడ్ నిర్ణయంతో గురువారం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి డాలర్తో 40 పైసలు బలహీనపడి 67.85కు చేరుకున్న విషయం తెలిసిందే. -
ఫెడ్ వడ్డీరేటు పావు శాతం పెంపు
-
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
-
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంచనాలకు అనుగుణంగానుఏ అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపును చేపట్టడంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య సాగాయి. ఫెడ్ వడ్డీ రేటును పావు శాతం పెంచడంతోపాటు ఇకపై రెండేళ్లపాటు ఏడాదికి కనీసం మూడుసార్లు రేట్లను పెంచే వీలున్నట్లు సంకేతమివ్వడంతో ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు దిగారు. చివరికి సెన్సెక్స్ 84 పాయింట్ల నష్టంతో 26519 వద్ద , నిఫ్టీ 29 పాయింట్ల నష్టంతో 8,154 వద్ద స్థిరపడింది. ఐటీ, పీఎస్యూ బ్యాంక్ స్వల్ప లాభాల్లోనూ, ఫార్మా,ఎఫ్ఎంసీజీ నష్టాల్లోనూ ముగిశాయి. టీసీఎస్ టాప్ విన్నర్ గా సన్ ఫార్మా టాటా మోటార్స్ టాప్ లూజర్స్ గా నిలిచాయి. ఎన్టీపీసీ, గ్రాసిమ్, అంబుజా, బాష్, అల్ట్రాటెక్, ఐటీసీ, ఇన్ఫ్రాటెల్ బలహీనంగానూ యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఓఎన్జీసీ, ఇండస్ఇండ్, ఎంఅండ్ఎం, బీవోబీ, హెచ్సీఎల్ టెక్, స్టేట్బ్యాంక్ లాభాల్లోనూ క్లోజ్ అయ్యాయి. అటు డాలర్ మారకపు రేటులో రూపాయి 39 పైసలు నష్టపోయి రూ. 67.84 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా. 552 క్షీణించి రూ.27,035 వద్ద బలహీనంగా ఉంది. -
ఫెడ్ వడ్డీరేటు పావు శాతం పెంపు
• 0.50 శాతం – 0.75 శాతం శ్రేణికి రేటు • అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని అంచనా వాషింగ్టన్: అంచనాలకు అనుగుణంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫండ్ రేటును పావుశాతం పెంచింది. దీనితో ఈ రేటు 0.50–0.75% శ్రేణికి ఎగసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోగమన దిశలో ఉండడమే రేటు పెంపు నిర్ణయానికి కారణమని ఫెడ్ పేర్కొంది. వచ్చే మూడేళ్లూ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు పుంజుకునే అవకాశం ఉందనీ ఫెడ్ అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఏడాదికి మూడు దఫాలుగా రేట్ల పెంపు అవకాశం ఉండవచ్చని ప్రకటించింది. ఫెడ్ రేటు పెంపు వార్త వెలువడిన వెంటనే అమెరికా ఈక్విటీ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. కడపటి సమాచారం అందే సరికి డౌజోన్స్ కొత్త రికార్డు స్థాయికి చేరింది. గత ఏడాది ఇదే నెల 16న ఫెడ్ ఫండ్ రేటు పావుశాతం పెరిగింది. దీనితో ఈ రేటు 0.25–0.50% శ్రేణికి మారింది. అప్పట్లోనూ ఫెడ్ నిర్ణయం తరువాత అమెరికా స్టాక్ మార్కెట్లు ర్యాలీ చేశాయి. అయితే 2 నెలలు తిరిగే సరికి అమెరికా ఎస్అండ్పీ సూచీ 11%పైగా పడిపోయింది. కాగా రేటు పెంచితే ఔన్స్ (31.1గ్రా) వెయ్యి డాలర్ల లోపునకు పడిపోతుందన్న అంచనాలకు భిన్నంగా అప్పట్లో పసిడి ర్యాలీ జరిగింది. 2006 తరువాత రేట్ల పెంపు ఇది రెండవసారి. -
ఫిక్స్డ్ డిపాజిట్లవైపే మొగ్గు
• ఎఫ్డీల్లో 11 శాతం పెరిగిన వ్యక్తిగత సంపద • రూ. 36.8 లక్షల కోట్లకు చేరిక • అయిదేళ్లలో రూ. 558 లక్షల కోట్లకు చేరనున్న వ్యక్తిగత సంపద • కార్వీ ప్రైవేట్ వెల్త్ 2016 నివేదిక హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మదుపుదారులు తమ పెట్టుబడుల ధోరణిని మార్చుకుంటున్నారు. గత ఆర్థిక సంవత్సరం ఈక్విటీల్లో పెట్టుబడుల కన్నా.. ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్ల వైపే మొగ్గు చూపారు. దీంతో ఎఫ్డీల్లో వ్యక్తిగత సంపద 11 శాతం పెరిగి రూ.36.8 లక్షల కోట్లకు చేరింది. పెట్టుబడి సాధనాలకు సంబంధించి నేరుగా ఈక్విటీల్లో పెట్టుబడులు, బీమా మొదలైనవి రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. ఆర్థిక సేవల దిగ్గజం కార్వీ గ్రూప్లో భాగమైన కార్వీ ప్రైవేట్ వెల్త్ ఏడో విడతగా విడుదల చేసిన ‘భారత సంపద నివేదిక– 2016’లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దేశీయంగా వ్యక్తిగత ఇన్వెస్టర్ల మదుపు ధోరణులను ప్రతిబింబించే ఈ నివేదిక ప్రకారం 2015–16లో దేశీయంగా వ్యక్తిగత సంపద 8.5 శాతం వృద్ధితో రూ.304 లక్షల కోట్లకు చేరింది. రాబోయే అయిదేళ్లలో ఇది చక్రగతిన 12.80 శాతం వృద్ధితో రూ.558 లక్షల కోట్లకు చేరనుంది. అంతంత మాత్రమైన ఈక్విటీల పనితీరుతో ఆర్థిక అసెట్స్లో వ్యక్తిగత సంపద కేవలం 7.14 శాతం పెరిగి రూ. 172 లక్షల కోట్లకు చేరింది. అదే భౌతిక ఆస్తుల్లో మాత్రం 10.32 శాతం వృద్ధితో రూ. 132 లక్షల కోట్లకు పెరిగింది. ప్రత్యామ్నాయ ఆస్తులపై ఆసక్తి.. దేశీ ఇన్వెస్టర్ల సంపద ప్రత్యామ్నాయ, అంతర్జాతీయ ఆస్తుల్లోనూ గణనీయంగా పెరిగింది. ప్రత్యామ్నాయ ఆస్తుల్లో పెట్టుబడుల పరిమాణం ఏకంగా 85% పెరిగి రూ. 41,960 కోట్ల నుంచి రూ. 77,503 కోట్లకు, అంతర్జాతీయ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ రూ. 14,040 కోట్ల నుంచి 31 శాతం వృద్ధితో రూ. 18,462 కోట్లకు పెరిగాయి. డెట్, రియల్ ఎస్టేట్ వంటి సాధనాల్లో పెట్టుబడుల విషయంలో దేశీ ఇన్వెస్టర్ల తీరు అంతర్జాతీయ ధోరణులకు అనుగుణంగానే ఉన్నప్పటికీ.. ఈక్విటీలు, ప్రత్యామ్నాయ ఆస్తుల అంశంలో మాత్రం భిన్నంగా ఉంది. అంతర్జాతీయంగా ఈక్విటీల్లో వ్యక్తిగత సంపద 25 శాతంగా ఉండగా.. దేశీయంగా మాత్రం ఇది 13 శాతమే ఉంది. అటు ప్రత్యామ్నాయ ఆస్తుల్లో దేశీయంగా వ్యక్తిగత సంపద 25.7 శాతంగా ఉండగా.. అంతర్జాతీయ స్థాయి లో ఇది 16%. డీమోనిటైజేషన్, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు మొదలైన పరిణామాలు స్వల్పకాలికంగా భారత ఎకానమీలో కొంత మేర పెనుమార్పులు తెచ్చే అవకాశం ఉందని కార్వీ ప్రైవేట్ వెల్త్ సీఈవో అభిజిత్ భవే తెలిపారు. అయితే, దీర్ఘకాలికంగా మాత్ర భారత వృద్ధి గాధ పటిష్టంగానే ఉంటుందని పేర్కొన్నారు. స్వల్పకాలికంగా ఒడిదుడుకులు.. వర్ధమాన దేశాల్లో భారత్ ఇంకా ఆశాదీపంగా వెలుగొందుతున్నప్పటికీ .. పెద్ద నోట్ల రద్దు పరిణామాల నేపథ్యంలో స్వల్పకాలంలో ఎకానమీ కాస్త మందగించవచ్చు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో అటు అంతర్జాతీయ మార్కెట్లు.. వాటికి అనుగుణంగా దేశీ మార్కెట్లలోనూ కొంత ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. అయితే దీర్ఘకాలంలో చూస్తే జీఎస్టీ, రియల్ ఎస్టేట్ చట్టం తదితర సంస్కరణల ఊతంతో చైనా సహా వర్ధమాన దేశాలన్నింటిలోనూ భారత్ మెరుగ్గా రాణించగలదు. మరింత సంపద అధికారికంగా ఆర్థిక వ్యవస్థలకు రావడం ద్వారా డీమోనిటైజేషన్ కూడా దీర్ఘకాలంలో సానుకూల ప్రభావం చూపగలదు. వచ్చే ఏడాది.. ఆపైన కూడా సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, చిన్న మొత్తాల పొదుపు పథకాలు మెరుగైన పెట్టుబడి సాధనాలుగా కొనసాగుతాయి. అయితే అంతిమంగా ఈ సంపద ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి సాధనాల్లోకి మళ్లగలదు. మరోవైపు.. బంగారం, రియల్ ఎస్టేట్ వంటి స్థిరాస్తుల్లో పెట్టుబడుల పరిమాణం తగ్గొచ్చు. వచ్చే అయిదేళ్లలో నేరుగా ఈక్విటీల్లో పెట్టుబడులు చక్రగతిన 20 శాతం మేర వృద్ధితో ఫేవరెట్ పెట్టుబడి సాధనంగా మళ్లీ అగ్రస్థానం దక్కించుకోగలదని అంచనా. -
ఫెడ్ ఎఫెక్ట్: నష్టాల్లో మార్కెట్లు
ఫెడరల్ రిజర్వు నుంచి వెలువడే ప్రకటనల భయాందోళనతో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 94.98 పాయింట్ల నష్టంతో 26,602.84వద్ద, నిఫ్టీ 39.35 పాయింట్ల నష్టంతో 8182.45వద్ద ముగిసింది. రెండు రోజుల ఫెడరల్ రిజర్వు భేటీ నేడు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఫెడరల్ రిజర్వు ఎలాంటి ప్రకటన వెలువరుస్తుందో అని అంతర్జాతీయంగా, దేశీయంగా ఆందోళనలు నెలకొన్నాయని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. 25 బేసిస్ పాయింట్లను పెంచుతారని ఇప్పటికే పలు అంచనాలు వెలువడ్డాయి. అయితే అమెరికా ఎకనామిక్ అవుట్లుక్, ద్రవ్యోల్బణం, మరోసారి రేట్లపెంపుపై ఫెడరల్ రిజర్వు ఎలాంటి కామెంట్లు చేస్తుందోననే దానిపై పెట్టుబడిదారులు దృష్టిసారించినట్టు తెలుస్తోంది. ఒకవేళ వర్ధమాన దేశాలకు ప్రతికూలంగా కామెంట్లు వెలువడితే, మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు యూరోపియన్ స్టాక్స్ నష్టాల బాట పట్టాయి. దేశీయ మార్కెట్లో బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఇండెక్స్లు 0.8 శాతం చొప్పున పడిపోయాయి. -
అమెరికా ఫెడ్ నిర్ణయం కీలకం
• 25 బేసిస్ పాయింట్ల ఫెడ్ పెంపు అంచనాలు • అంతకు మించితే అమ్మకాల ఒత్తిడి • ద్రవ్యోల్బణ గణాంకాలూ కీలకమే • ఈ వారం మార్కెట్పై నిపుణుల అంచనాలు న్యూఢిల్లీ: అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ తీసుకోబోయే చర్యలు.. ఈ వారం స్టాక్ మార్కెట్కు కీలకమని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. దీంతోపాటు దేశీయంగా నవంబర్ నెల వినియోగదారుల, టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు, వివిధ ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్ల పోకడలు ఈ వారం స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపుతాయని వారంటున్నారు. అలాగే విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, డాలర్తో రూపాయి మారకం.. తదితర అంశాలు కూడా స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల పరిణామాల ప్రభావం కూడా ఉంటుందని వారంటున్నారు. పెద్ద నోట్ల కరెన్సీ రద్దు కారణంగా పార్లమెంట్లో ఏర్పడిన ప్రతిష్టంభన, జీఎస్టీ సంబంధిత అంశాలపై నెలకొన్న స్తబ్దతను తొలగించే ప్రభుత్వ చర్యలు తదతర అంశాలు కూడా ప్రభావం చూపుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. అమ్మకాల ఒత్తిడి రెండు రోజుల పాటు జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం ఈ మంగళవారం(ఈ నెల 13న)మొదలవుతుంది. ఈ సమావేశంపై ప్రపంచమంతా ఆసక్తి నెలకొన్నది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచితే, భారత్ వంటి వర్ధమాన దేశాల నుంచి భారీగా విదేశీ పెట్టుబడులు తరలిపోతాయనే అంచనాలున్నాయి. ఫెడ్ రిజర్వ్ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచుతుందని ఇప్పటికే మార్కెట్ డిస్కౌంట్ చేసుకుందని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్టర్ అబ్నిష్ కుమార్ సుధాంశు చెప్పారు. అంతకంటే ఎక్కువ కోత ఉంటే మాత్రం అమ్మకాల ఒత్తిడి ఉంటుందని పేర్కొన్నారు. భవిష్యత్ రేట్ల కోతకు సంబంధించి ఫెడ్ అందించే సంకేతాలను ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తారని కొటక్ సెక్యూరిటీస్కు చెందిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా పేర్కొన్నారు. ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు ప్రకటిస్తే, డాలర్తో రూపాయి మారకం తిరిగి 68 స్థాయికి పతనమవుతుందని కొటక్ సెక్యూరిటీస్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్(కరెన్సీ డెరివేటివ్) అనింద్య బెనర్జీ చెప్పారు. ఇక దేశీయంగా చూస్తే మంగళవారం(ఈ నెల13న) నవంబర్ నెల వినియోగదారుల ద్రవ్యోల్బ ణం, బుధవారం (ఈ నెల 14న) టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడతాయి. శుక్రవారం వెలువడిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలకు ఈ వారం ప్రారంభంలో స్టాక్ సూచీలు స్పందిస్తాయని క్యాపిటల్వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ చెప్పారు. తరలిపోతున్న విదేశీ నిధులు ఈ నెలలో విదేశీ ఇన్వెస్టర్లు డెట్ మార్కెట్ నుంచి రూ. 17,392 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. అలాగే స్టాక్ మార్కెట్లో రూ.138 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో రూ.28,881 కోట్లు పెట్టుబడులు పెట్టగా, డెట్ మార్కెట్నుంచి రూ.42,101 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు -
ఎక్కడ ఫెడ్ రేట్లు అక్కడే కానీ..
పెట్టుబడిదారులు ఎంతో నిశితంగా పరిశీలించిన ఫెడ్ రిజర్వు రేట్ల ప్రకటన వెలువడింది. వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా ఉంచుతున్నట్టు ఫెడరల్ రిజర్వు ప్రకటించింది. కానీ అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెంది, ద్రవ్యోల్బణం మరింత పెరిగితే డిసెంబర్లో వడ్డీరేట్లను పెంచుతామనే సంకేతాలను ఫెడరల్ రిజర్వు వెలువరిచింది. బుధవారంతో ముగిసిన రెండు రోజుల ఫెడ్ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం వెల్లడించింది. అమెరికా ఎన్నికలు ఇంకా వారమైనా గడువు లేనిపక్షంలో, ఈ సమయంలో వడ్డీరేట్లను ఆ దేశ రిజర్వుబ్యాంకు మార్పులు చేయదని మార్కెట్ విశ్లేషకులు ముందస్తుగానే అంచనావేశారు. వారి అంచనాలకు అనుగుణంగానే వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు ఫెడ్ రిజర్వు తెలిపింది. ఇప్పటికే అమెరికా ఎన్నికల ప్రకంపనాలతో ప్రపంచమార్కెట్లన్నీ అతలాకుతలమవుతున్నాయి. దీనికి తోడు ఫెడ్ రేట్లను పెంచితే మరింత మార్కెట్లు క్షీణించే అవకాశాలుండేవని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. అయితే అమెరికా ఆర్థికవ్యవస్థ లాభపడిందని, ఉద్యోగాల వృద్ధి మాత్రం అలా స్థిరంగా ఉండిపోయిందని అమెరికా సెంట్రల్ బ్యాంకు రేట్ సెట్టింగ్ కమిటీ తెలిపింది. వారు నిర్దేశించిన ద్రవ్యోల్బణం 2 శాతం టార్గెట్ సాధించే దిశగా అమెరికా ఆర్థిక వ్యవస్థ పయనిస్తుందనే దానికి సంకేతంగా మరింత ఆశావాదం కావాలని పాలసీమేకర్స్ వ్యక్తంచేశారు. దీనికోసం మరికొన్ని రోజులు వేచిచూస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అయితే మిడ్ డిసెంబర్లో జరిగే పాలసీ మీటింగ్లో రేట్లపెంపు ఉండొచ్చనే సంకేతాలను ఇచ్చారు. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు ఫెడరల్ రిజర్వు చేసిన ప్రకటనతో అమెరికా మార్కెట్లు కిందకి దిగజారాయి. డోజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 52.32 పాయింట్లు, ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ 11.29 పాయింట్లు, నాస్డాక్ కాంపొజిట్ 40.60 పాయింట్లు నష్టపోయింది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్నందున్న ఆ దేశ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. -
ఫెడ్ ఎఫెక్ట్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
ఫెడరల్ రిజర్వు మీటింగ్ భయాందోళనతో దేశీయ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. దీనికి తోడు అంతర్జాతీయ సంకేతాలు సైతం మార్కెట్లను కుప్పకూల్చాయి. 270 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్, మరింత పడిపోతూ 27,594వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సైతం 95.15 పాయింట్ల నష్టంతో 8,513గా ట్రేడ్ అవుతోంది. ఫెడ్ రిజర్వు బ్యాంకు రెండు రోజుల పాలసీ సమావేశం నేడు ముగియనుంది. దీంతో ఫెడ్ రిజర్వు రేట్లపెంపుపై ఎలాంటి ప్రకటన చేస్తుందోనని పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. అయితే అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఫెడరల్ సెంట్రల్ బ్యాంకు వడ్డీరేట్లను పెంచదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ డిసెంబర్లో రేట్ల పెంపు సంకేతాలను ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. అటు ఆసియన్ మార్కెట్లు సైతం బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై వాల్స్ట్రీట్ చేస్తున్న భయాందోళన ప్రకటన ఆసియన్ మార్కెట్లకు దెబ్బకొట్టింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు చేరువలో ఉన్నారని వాల్స్ట్రీట్ పేర్కొంది. యాక్సిస్ బ్యాంకు, టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ, రిలయన్స్ నష్టాలను చవిచూస్తున్నాయి. టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ, ఎన్టీపీసీ, సీఐఎల్ లాభాలను గడిస్తున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ స్వల్పంగా కోల్పోయింది. మంగళవారం 66.71గా ముగిసిన రూపాయి, నేడు 66.78గా ప్రారంభమైంది. -
ఫెడ్ సమావేశం ముందు అమ్మకాలు
సెన్సెక్స్కు 53 పాయింట్ల నష్టం ముంబై: కీలకమైన అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ పరపతి విధాన సమీక్షకు మందు ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణితో వ్యవహరించారు. ఫలితంగా ఐటీ, టెక్ కౌంటర్లలో అమ్మకాలు చోటు చేసుకోవడంతో మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 53.60 పాయింట్టు నష్టపోయి 27,876.61 పాయింట్ల వద్ధ స్థిరపడింది. నిఫ్టీ మాత్రం అర పాయింటు లాభంతో 8,626.25 వద్ద ముగిసింది. అక్టోబర్లో తయారీ రంగం మెరుగైన పనితీరుకు తోడు ట్రేడర్లు పండుగ మూడ్ నేపథ్యంలో మార్కెట్లు రోజులో ఎక్కువ సమయం పాటు స్వల్ప పరిధికిలోబడి సానుకూలంగా ట్రేడయ్యాయి. ఫెడ్ సమావేశం మంగళ, బుధవారాల్లో జరగనుండడంతో ఆఖరి గంటలో అమ్మకాలు రావడంతో సెన్సెక్స్కు నష్టాలు ఎదురయ్యాయి. వాహన విక్రయాల జోరుతో ఆయా కంపెనీల స్టాక్స్లో కొనుగోళ్లు జరిగాయి. చైనా పీపీఐ (ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్) గత కొన్నేళ్లలోనే గరిష్ట స్థాయిలో నమోదు కావడంతో మెటల్ స్టాక్స్కు కూడా కొనుగోళ్ల మద్దతు లభించింది. బలహీన అంతర్జాతీయ సంకేతాలకు తోడు రెండో త్రైమాసిక ఫలితాలు మిశ్రమంగా ఉండడం మార్కెట్పై ప్రభావం చూపిందని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. అమెరికా ఎఫ్ఓఎంసీ సమావేశం, అమెరికా ఎన్నికలు పూర్తయ్యే వరకు మార్కెట్లలో ఈ స్థిరీకరణ కొనసాగుతుందన్నారు. -
పసిడి... మరికొంత కాలం అనిశ్చితే!
న్యూయార్క్/ముంబై: దీర్ఘకాలంలో సంగతి ఎలా ఉన్నా... వచ్చే రెండు నెలల కాలంలో పసిడి ధర అనిశ్చితిలోనే కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా ఎన్నికలు, అలాగే ఆ దేశ ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0.25-0.50 శాతం శ్రేణి) పెంపు అంశాలు పసిడి ధరను బేరిష్ ట్రెండ్లోనే ఉంచుతాయని అభిప్రాయపడుతున్నారు. స్వల్ప ఒడిదుడుకులతో మరికొంతకాలం పసిడి దిగువ స్థాయిలోనే కొనసాగుతుందని, ఇప్పట్లో ఔన్స్కు 1,300 డాలర్లు దాటి బలపడ్డం కష్టమన్న అభిప్రాయం ఉంది. గడచిన వారంలో పసిడి న్యూయార్క్ కమోడిటీ స్టాక్ ఎక్స్చేంజ్లో స్వల్పంగా 15 డాలర్లు లాభపడి, 1,267 డాలర్లకు ఎగసింది. ఇక ఈ స్వల్ప ప్రభావం దేశీయ మార్కెట్పైనా కనిపించింది. ముంబై ప్రధాన స్పాట్ బులియన్ మార్కెట్లో ధర 99.9 స్వచ్ఛతకు రూ.240 ఎగసి రూ.30,140 వద్ద ముగిసింది. ఇక 99.5 స్వచ్ఛత ధర సైతం ఇదే స్థాయిలో ఎగసి రూ.29,990 వద్ద ఉంది. వెండి మాత్రం కేజీకి రూ.40 తగ్గి రూ.42,640 వద్ద ముగిసింది. ఔన్స్ 31.1గ్రాములు.. డాలర్లలో ధర ప్రస్తుతం 1,267 డాలర్లు. డాలర్ మారకంలో రూపాయి విలువ ప్రస్తుతం దాదాపు 68. -
28,068 దాటకపోతే, మరింత క్షీణత..
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల రోడ్మ్యాప్కు అవసరమైన ఆ దేశపు డేటా ప్రపంచ ఇన్వెస్టర్లను అయోమయానికి లోనుచేస్తున్న సమయంలోనే ఫెడ్ చైర్పర్సన్ జానెట్ యెలెన్ తాజాగా ఒక బాంబు పేల్చారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టత తగ్గిపోతున్నద న్న ఆందోళన ఫెడ్ కమిటీ సభ్యుల్లో నెలకొన్నదని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టాల్సివుందంటూ గత శుక్రవారం ఒక కార్యక్రమంలో ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ ఆర్థికాభివృద్ధి బావుందంటూ చెపుతూ వచ్చిన యెలెన్ హఠాత్తుగా చేసిన ఈ కామెంట్పై భిన్నమైన అంచనాలు తిరిగి మార్కెట్లో ఏర్పడ్డాయి. వడ్డీ రేట్ల పెంపుపై ఫెడ్ కఠినవైఖరి వహించదన్న కారణంతో మార్కెట్లు పెరుగుతాయన్న అంచనాలు కొన్నయితే...అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనపడిందన్న సంకేతాలు అందుతున్నందున, మార్కెట్లు క్షీణిస్తాయన్న అంచనాలు మరోవైపు విశ్లేషకుల్లో ఏర్పడుతున్నాయి. ఇదిలా వుండగా...అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల తేదీ సమీపిస్తున్నది. ఈ అంశాల నేపథ్యంలో రానున్న 3-4 వారాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చు. ఇక మన సూచీల సాంకేతికాంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాలు... అక్టోబర్ 14తో ముగిసిన మూడురోజుల ట్రేడింగ్వారంలో 27,548 పాయింట్ల కనిష్టస్థాయివరకూ తగ్గిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 387 పాయింట్ల నష్టంతో 27,674 వద్ద ముగిసింది. గతవారం మార్కెట్ పంచాంగంలో సూచించిన 27,715 కీలకస్థాయికి దిగువన వరుసగా 2 రోజులపాటు సెన్సెక్స్ ముగిసిందున, ప్రస్తుత కరెక్షన్ మరిన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. వెనువెంటనే 28,043-28,068 పాయింట్ల శ్రేణిని (అక్టోబర్ 13నాటి గ్యాప్డౌన్ శ్రేణి) దాటకపోతే సెన్సెక్స్ మరింత క్షీణించే ప్రమాదం వుంటుంది. ఈ వారం మార్కెట్ పెరిగితే పైన ప్రస్తావించిన శ్రేణి వద్ద తొలి అవరోధం కలగవచ్చు. ఆపైన పటిష్టంగా ముగిస్తే క్రమేపీ 28,480 స్థాయిని అందుకోవొచ్చు. ఈ వారం మార్కెట్ క్షీణిస్తే 27,550 సమీపంలో చిన్నపాటి మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే వేగంగా 27,350 వద్దకు పతనం కావొచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే కొద్ది వారాల్లో 26,563 పాయింట్ల వరకూ (ఫిబ్రవరి కనిష్టస్థాయి 22,495 పాయింట్ల నుంచి సెప్టెంబర్ గరిష్టస్థాయి 29,077 వరకూ జరిగిన ర్యాలీకి 38.2% రిట్రేస్మెంట్ స్థాయి) పతనమయ్యే ప్రమాదం వుంటుంది. అవరోధ శ్రేణి 8,681-8,704 ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,746 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 8,541 కనిష్టస్థాయివరకూ పడిపోయింది. చివరకు అంతక్రితంవారంకంటే 115 పాయింట్ల నష్టంతో 8,583 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ పెరిగితే 8,681-8,704 శ్రేణి (అక్టోబర్ 13నాటి గ్యాప్) వద్ద గట్టి నిరోధాన్ని చవిచూడవచ్చు. ఈ శ్రేణిపైన ముగిసే క్రమేపీ తిరిగి 8,810-8,820 (సెప్టెంబర్ 26నాటి గ్యాప్) కీలక అవరోధ శ్రేణిని చేరవచ్చు. రానున్న రోజుల్లో ఈ రెండో శ్రేణిని దాటితేనే నిఫ్టీ తిరిగి అప్ట్రెండ్లోకి అడుగుపెట్టే ఛాన్స్ వుంటుంది. ఈ వారం మార్కెట్ క్షీణిస్తే 8,540 పాయింట్ల సమీపంలో చిన్న మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును పరిరక్షించుకోగలిగితే పైన ప్రస్తావించిన తొలి అవరోధ శ్రేణి ని చేరే అవకాశాలుంటాయి. ఈ మద్దతును కోల్పోతే వేగంగా 8,475 వ ద్దకు తగ్గవచ్చు. ఆ లోపున 8,355 పాయింట్ల వరకూ క్షీణించే ప్రమాదం వుంటుంది. ఈ వారం మార్కెట్లో క్షీణత కొనసాగితే రానున్న వారాల్లో 8,150 వరకూ పతనమయ్యే అవకాశాలుంటాయి. -
మార్కెట్లది బలహీనబాటే!
చిన్న ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగేయాలి... * లిక్విడిటీ క్రమంగా తగ్గే అవకాశం * ఫెడ్ రేటు, అమెరికా ఎన్నికల ప్రభావం * భారత్-పాక్ ఉద్రిక్తతలూ సమస్యే ఆర్థిక, ద్రవ్య సమాచారాలను బట్టే మార్కెట్ కదలికలుంటాయనేది కొత్త విషయమేమీ కాదు. అయితే ఇబ్బందల్లా ఒకదాని వెంట మరొకటి చోటుచేసుకునే పలు సంఘటనలు మార్కెట్ను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కదలికలు ఎటు వెళతాయో తెలియని అయోమయాన్నీ సృష్టిస్తాయి. గత పక్షం రోజుల్లో ఒకదానివెంట మరొకటి ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా, జపాన్ కేంద్ర బ్యాంకుల సమావేశం- ఆర్థిక నిర్ణయాలు ఇందులో ప్రధానమైనవి. పెట్రోలియం ఎగుమతి దేశాల సంఘం(ఒపెక్) సమావేశం, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి మొదటి విడతగా డెమోక్రటిక్, రిపబ్లిక్ అభ్యర్థులు- హిల్లరీ, ట్రంప్ చర్చ వీటిలో కీలకమైనవి. దేశీయంగా చూస్తే... పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ సైనికుల సర్జికల్ దాడులు కీలకం. ఇవన్నీ అటు అంతర్జాతీయంగా ఇటు దేశీయంగా మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపేవే. ఈ ఏడాది ఫెడ్ ఫండ్ రేటు ప్రస్తుత 0.50 శాతం పైకి పెంచుతామని సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలివ్వటం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తక్షణం కాకున్నా క్రమంగా గ్లోబల్ లిక్విడిటీ తగ్గే వీలుంది. ఇవన్నీ సమీప కాలంలో భారత్ మార్కెట్ బలహీనంగా ఉండొచ్చనే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రత్యేకించి చిన్న పెట్టుబడిదారులు తమ కష్టార్జితంపై ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. లిక్విడిటీ తగ్గే చాన్స్... ప్రస్తుతానికైతే అమెరికా, జపాన్ ఉద్దీపనలకు వచ్చిన ఇబ్బందేమీ ఉండదని మార్కెట్కు సంకేతాలందాయి. అయితే ఇవి గతంలో ఉన్నంత దూకుడుగా ఉండవన్న విషయం మాత్రం స్పష్టమవుతోంది. గడచిన పక్షం రోజుల్లో భారత్కు ఎఫ్ఐఐ పెట్టుబడుల ప్రవాహం తగ్గుతుండటాన్ని మనం గమనిస్తున్నాం. ఆగస్టులో దేశానికి 10,000 కోట్ల ఎఫ్ఐఐ పెట్టుబడులు వచ్చాయి. సెప్టెంబర్ చివరినాటికి ఈ మొత్తం రూ.5,000 కోట్లకు పడిపోయింది. జూలై అయితే ఈ మొత్తం ఏకంగా రూ.11,000 కోట్లుంది. మరో నాలుగు అంశాలు... * అమెరికా అధ్యక్ష అభ్యర్థుల చర్చల ప్రక్రియ నవంబర్ వరకూ కొనసాగుతుంది. ఇది మార్కెట్పై నిరంతరం ప్రభావితం చూపేదే. ఎన్నికల చర్చల నేపథ్యంలో గత వారం అంతర్జాతీయంగా పలు మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. చివరకు హిల్లరీకి అనుకూలంగా వచ్చిన ఒపీనియన్ పోల్ ఫలితాలు ఒడిదుడుకులను కొద్దిగా తగ్గించాయి. అయితే మున్ముందు అమెరికా అధ్యక్ష ఎన్నికలు మార్కెట్లకు చాలా కీలకం. * చమురు ఉత్పత్తిని తగ్గించాలని గత బుధవారం జరిగిన ఒపెక్ సమావేశం నిర్ణయించింది. ఎనిమిదేళ్లలో ఈ తరహా నిర్ణయం ఇదే తొలిసారి. అంతర్జాతీయ ఆర్థిక మందగమన పరిస్థితులు, ఈ నేపథ్యంలో చమురు ధరలు పడిపోకుండా చూసే దిశగా ఒపెక్ నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉంటుందన్నది వేచి చూడాల్సి ఉంది. * జర్మనీ డాయిష్ బ్యాంక్పై ఆందోళనలు మూడవ అంశం. తాజాగా ఈ షేర్ ధర ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ ఏడాది బ్యాంక్ విలువ 55 శాతం హరించుకుపోయింది. 2008 ఆర్థిక సంక్షోభానికి సంబంధించి అమెరికా న్యాయశాఖ విధించిన 14 బిలియన్ డాలర్ల జరిమానా బ్యాంకు పరిస్థితిని మరింత విషమింపజేసింది. పరిస్థితి ఎటువైపు దారితీస్తుందన్న అంశంపై జర్మనీతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థా ఆందోళన పడుతోంది. * దేశీయంగా చూస్తే... భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుండడం మనం ఇప్పటికే గమనిస్తున్నాం. భారత్ సైనికుల చర్య నేపథ్యంలో ఒక్కసారిగా సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా పడిపోయింది. అసలే అంతర్జాతీయ పరిణామాల ప్రభావంలో ఉన్న భారత్ మార్కెట్లను తాజా పరిణామాలు ఏం చేస్తాయోనని ఆలోచనలో ఇన్వెస్టర్ ఉన్నాడు. లాభాల స్వీకరణకే మొగ్గు కనబడుతోంది. నిఫ్టీ కన్సాలిడేషన్..! మొత్తంగా ఆయా పరిణామాలు భారత్ మార్కెట్పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే... నిఫ్టీ ఇటీవలి గరిష్టానికి (8,968, సెప్టెంబర్ 7) చేరటం కష్టమన్న అంచనాలున్నాయి. మార్కెట్ విలువ బాగా పెరిగిందన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. 8,900-9,000 మధ్య నిఫ్టీ కొంత బలహీన పరిస్థితిని ఎదుర్కొనడం కొనసాగుతుందన్నది నా అభిప్రాయం. డాలర్ రూపంలో చూస్తే గడచిన పక్షం రోజులుగా ఆసియా మార్కెట్లు 3 శాతంపైగా రిటర్న్స్ అందిస్తే, భారత్ మార్కెట్ రిటర్న్ మైనస్లో ఉంది. స్వల్పకాలంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని భావిస్తున్నాం. పాక్తో ఉద్రిక్తతలు తగ్గడం, ఇండియా ఎకనమిక్ అవుట్లుక్ మరింత మెరుగుపడటం వంటి అంశాలతోనే మార్కెట్ తిరిగి పుంజుకునే వీలుంది. ఈ నెలలో విడుదల కానున్న అమెరికా జీడీపీ మూడవ త్రైమాసిక గణాంకాలు కూడా మార్కెట్పై ప్రభావాన్ని చూపిస్తాయి. -
పసిడిపై ఫెడ్ నీడ..!
న్యూయార్క్/ముంబై: అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడరల్ రిజర్వు తన ఫండ్ రేటును పెంచుతుందనే అంచనాలకు అనుగుణంగా పసిడి ధర కొనసాగుతోంది. స్టాక్ మార్కెట్ల అనిశ్చితి కన్నా, ఫెడరల్ రిజర్వ్ రేటును పెంచుతుందన్న అంచనాలే పసిడిని సమీప కాలంలో ప్రభావితం చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి బంగారం ధర ఈ ఏడాది ఇప్పటికే 24 శాతానికి పైగా ఎగసింది. దీంతో కొంత లాభాల స్వీకరణ కూడా జరిగింది. దీంతో ప్రస్తుతం కొన్నాళ్లు కన్సాలిడేషన్ దశ కొనసాగవచ్చని గోల్డ్ న్యూస్లెటర్ ఎడిటర్ బ్రయిన్ లూండిన్ అభిప్రాయపడ్డారు. డాయిష్ బ్యాంక్పై అమెరికా న్యాయశాఖ భారీ జరిమానా విధించటంతో ఆ స్టాక్ భారీగా నష్టపోయింది. దీంతో స్టాక్ మార్కెట్లూ నష్టాల పాలై అనిశ్చితిలో ఉన్నాయి. వీటివల్ల స్వల్ప ఒడిదుడుకులున్నప్పటికీ సమీప కాలంలో పసిడి అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్- నెమైక్స్లో ఔన్స్కు 1,300 - 1,345 డాలర్ల మధ్య కొనసాగే అవకాశాలు ఉన్నాయని కమోడిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. వారంలో ఇలా...: వారంలో పసిడి ధర న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో ఔన్స్కు 23 డాలర్లు తగ్గి, 1,318 వద్ద ముగిసింది. దేశీయంగానూ అంతర్జాతీయ ప్రభావం కనబడింది. ముంబై ప్రధాన మార్కెట్లో పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.220 తగ్గి రూ.31,350కి చేరింది. -
సెన్సెక్స్ రివర్స్.. 105 పాయింట్లు డౌన్
36 పాయింట్లు తగ్గిన నిఫ్టీ ముంబై: ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాల్ని తగ్గించడంతో క్రితం రోజు జరిగిన ఈక్విటీ ర్యాలీ ఒకరోజుకే పరిమితమయ్యింది. గ్లోబల్ సంకేతాలు బలహీనంగా వుండటంతో ఇటీవల బాగా పెరిగిన షేర్లలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించారు. దాంతో శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 105 పాయింట్లు క్షీణించి 28,668 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 36 పాయింట్ల తగ్గుదలతో 8,832 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అయితే వారం మొత్తంమీద సెన్సెక్స్ 69 పాయింట్లు (0.24 శాతం), నిఫ్టీ 52 పాయింట్లు (0.58 శాతం) చొప్పున లాభపడ్డాయి. సెప్టెంబర్ డెరివేటివ్ సిరీస్ వచ్చేవారం ముగియనుండటంతో ఇన్వెస్టర్లు వారి లాంగ్ పొజిషన్లు ఆఫ్లోడ్ చేసుకున్నారని, దాంతో మార్కెట్ క్షీణించినట్లు జియోజిత్ బీఎన్పీ పారిబాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు.. గురువారం భారీ కొనుగోళ్లను ఆకర్షించిన బ్యాంకింగ్ షేర్లే తాజాగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. యాక్సిస్ బ్యాంక్ 5.84 శాతం పతనమై రూ. 557 వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐలు 1.1 శాతం మేర తగ్గాయి. లుపిన్, ఇన్ఫోసిస్, పవర్గ్రిడ్, టాటా స్టీల్లు 1-2.5 శాతం మధ్య క్షీణించాయి. మరోవైపు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.4 శాతం ఎగిసి కొత్త రికార్డుస్థాయి రూ. 1,313 వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 1.4 శాతం ర్యాలీ జరిపి 52 వారాల గరిష్టస్థాయి రూ. 1,103 వద్ద క్లోజయ్యింది. డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీలు స్వల్పంగా పెరిగాయి. -
మార్కెట్లకు ‘ఫెడ్’ బూస్ట్!
భవిష్యత్తులోనూ కనిష్టస్థాయిలోనే అమెరికా వడ్డీ రేట్లు... * ఫెడ్ తాజా అంచనాలతో ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్ల పరుగు * షేర్లు, బంగారం, రూపాయి...జూమ్ ఇదిగో..అదిగో...త్వరలోనే వడ్డీ రేట్లు పెంచేస్తున్నాం అంటూ నెలల నుంచి చెపుతూ వస్తున్న అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ చేతులెత్తేయడంతో ప్రపంచంలో రిస్క్ ఆస్తులు మళ్లీ భారీగా ర్యాలీ జరుపుతున్నాయి. ఈక్విటీలు, కమోడిటీలు, వర్థమాన దేశాల కరెన్సీలు కలసికట్టుగా కదం తొక్కుతున్నాయి. ప్రస్తుతానికి వడ్డీ రేట్లు పెంచడం లేదంటూ బుధవారం రాత్రి ఫెడ్ ప్రకటన వెలువడగానే అక్కడ క్రూడ్, బంగారం, వెండి, ఈక్విటీలు ఒక్కసారిగా ఎగిసిపోయాయి. అమెరికా డాలరు నిలువునా పతనమయ్యింది. ఇక గురువారం ఉదయం ఆసియా ట్రేడింగ్లో కూడా ఇదే ట్రెండ్ నడిచింది. బంగారం ఔన్సు ధర 2%పైగా ఎగిసి 1,338 డాలర్లకు చేరగా, వెండి 3.5%పెరిగింది. బ్రెంట్ క్రూడ్ తిరిగి 47.5 డాలర్ల స్థాయికి పెరిగిపోయింది. ఇదే సమయంలో భారత్ రూపాయితో సహా కొరియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా తదితర వర్థమాన దేశాల కరెన్సీలు భారీగా పెరిగాయి. ఫెడ్ నిర్ణయం కారణం కాదు.. తొమ్మిది సంవత్సరాల తర్వాత తొలిసారిగా గతేడాది డిసెంబర్లో అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పావుశాతం పెంచినప్పుడు ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లలో ఏర్పడ్డ ప్రకంపనలు సామాన్యమైనవి కాదు. వరుసగా రెండు నెలల పాటు ఈక్విటీ మార్కెట్లు 15-20 శాతం మధ్య పతనమయ్యాయి. వర్థమాన కరెన్సీలు నిలువునా పతనమయ్యాయి. రూపాయి 4%పైగా నష్టపోయింది. ఎందుకంటే అప్పుడు భవిష్యత్తు పెంపుపై ఫెడ్ ఇచ్చిన రోడ్ మ్యాప్ అటువంటిది. 2016లో 3 దఫాలు, 2017లో నాలుగు దఫాలు, 2018లో మరో 3 సార్లు రేట్లు పెంచుతూ 3.4%కి వడ్డీ రేట్లను చేరవచ్చన్న అంచనాల్ని ఫెడ్ అధికారులు అప్పట్లో వెలిబుచ్చారు. కానీ ఆ అంచనాలు క్రమేపీ తగ్గాయి. తాజా ఫెడ్ సమీక్షలో ఫెడ్ అధికారుల అంచనా ప్రకారం ఈ ఏడాది ఒకసారే పెరుగుదల వుంటుంది. ప్రస్తుతం 0.25-0.50 శాతం వున్న ఫెడ్ ఫండ్స్ రేటు (వాణిజ్య బ్యాంకులకు ఫెడ్ ఇచ్చే నిధులకు వసూలు చేసే వడ్డీ) దీర్ఘకాలంలో 2.9%కి మాత్రమే చేరవచ్చని తాజా ఫెడ్ సమీక్షలో పాల్గొన్న అధికారుల అంచనా. ఈ అంచనా ఈ ఏడాది జూన్లో 3% వుంది. అలాగే 2017లో రెండు దఫాలు మాత్రమే రేట్లు పెరగవచ్చన్నది ఇప్పటి అంచనా. గతేడాది డిసెంబర్లో వేసిన అంచనాల ప్రకారం 2017లో నాలుగుదఫాలు, ఈ ఏడాది జూన్లో ప్రకటించిన అంచనాల ప్రకారం మూడు దఫాలు రేట్లు పెరగాల్సివుంది. గత అంచనాలన్నింటినీ క్రితంరోజు సమావేశంలో పూర్తిగా తగ్గించడం రిస్క్ ఆస్తుల ర్యాలీకి ప్రధాన కారణం. అంతేగానీ ఈ సెప్టెంబర్లో రేట్లు పెంచకపోవడం కాదు. ఈ ఏడాది డిసెంబర్లో పెంచే అవకాశాలున్నాయని స్పష్టమైన సంకేతాల్ని ఫెడ్ ఇచ్చినప్పటికీ, రేట్ల పెంపు నెమ్మదిగా వుంటుందనే భావనతో ప్రస్తుతానికి డిసెంబర్ పెంపును ఇన్వెస్టర్లు పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. సెన్సెక్స్ 266 పాయింట్లు అప్.. అంతర్జాతీయ ఈక్విటీ ర్యాలీలో భాగంగా భారత్ మార్కెట్ గురువారం రెండు వారాల గరిష్టస్థాయిలో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 266 పాయింట్లు ఎగిసి 28,773 పాయింట్ల వద్ద ముగిసింది. 8,850 పాయింట్ల స్థాయిని అధిగమించిన నిఫ్టీ 90 పాయింట్లు పెరిగి 8,867 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సెప్టెంబర్ 6 తర్వాత సూచీలకు ఇదే పెద్ద పెరుగుదల. నిఫ్టీలో భాగమైన అరబిందో ఫార్మా అన్నింటికంటే అధికంగా 6 శాతం ర్యాలీ జరిపి రూ. 855 వద్ద ముగిసింది. సెన్సెక్స్-30 షేర్లలో 23 లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లో భారత్ మెరుగ్గా ర్యాలీ (0.93%) జరిపింది. జపాన్ మార్కెట్కు గురువారం సెలవుకాగా, హాంకాంగ్, తైవాన్, చైనా, ఇండోనేషియా సూచీలు 0.67% వరకూ పెరిగాయి.ఆసియాతో పోలిస్తే యూరప్ సూచీలు పెద్ద ఎత్తున ఎగిసాయి. కడపటి సమాచారంమేరకు అమెరికా మార్కెట్ 0.7% పెరుగుదలతో ట్రేడవుతోంది. 66.66 స్థాయికి రూపాయి ప్రపంచ ప్రధాన కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలరు కేవలం రెండు రోజుల్లో 1.2 శాతంపైగా పతనమైన ప్రభావంతో భారత్ రూపాయి కూడా భారీగా బలపడింది. ముంబై ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ ఒక్కసారిగా 36 పైసలు పెరిగింది. దాంతో రూపాయి రెండు వారాల గరిష్టస్థాయి 66.66 స్థాయికి చేరింది. గురువారం రాత్రి కడపటి సమాచార మేరకు ఆఫ్షోర్ మార్కెట్లో ఇది మరింత ఎగిసి 66.52కి పెరిగింది. భారత్ కరెంటు ఖాతాలోటు జూన్ క్వార్టర్లో 0.1%కి తగ్గడమూ రూపాయి భారీ ర్యాలీకి కారణం. 2.5% పెరిగిన బంగారం ప్రపంచ మార్కెట్లో వరుసగా రెండు రోజులపాటు పుత్తడి పెరిగింది. డాలరుకు అభిముఖంగా ట్రేడయ్యే బంగారం ఫెడ్ నిర్ణయం వెలువడగానే న్యూయార్క్ మార్కెట్లో బుధవారం 1,310 డాలర్ల నుంచి 1,334 డాలర్లకు (ఔన్సు ధర) చేరగా, గురువారం మరో 14 డాలర్ల పెరుగుదలతో 1,348 డాలర్లకు చేరింది. అయితే భారత్ మార్కెట్లో ఈ పెరుగుదల పరిమితంగా వుంది. రూపాయి విలువ బలపడటమే ఇందుకు కారణం. ఇక్కడ ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం ధర రెండు రోజుల్లో కలిపి దాదాపు రూ. 450 వరకూ పెరిగి రూ. 31,315కు చేరింది. ప్రపంచ మార్కెట్లో వెండి 3.8 శాతంవరకూ పెరగడంతో ఇక్కడ కేజీకి 1,300 పెరిగి రూ. 47,500 వద్దకు చేరింది. -
అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు యధాతథం
డిసెంబర్ సమీక్షలో పెంచొచ్చని సంకేతం న్యూయార్క్: అమెరికా సెంట్రల్ బ్యాంక్.. ఫెడరల్ రిజర్వ్ ‘ఫెడ్ ఫండ్’ రేటును ప్రస్తుతానికి యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ రేటు 0.25%-0.50% శ్రేణిలో ఉంది. రెండు రోజుల సమావేశం అనంతరం ఫెడ్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రేటు పెంపునకు తగిన పరిస్థితులు దేశంలో నెలకొన్నాయని, ఈ ఏడాది చివరి నాటికి(డిసెంబర్ సమావేశంలో) రేటు పెంపు అవకాశం ఉందని ఫెడరల్ రిజర్వ్ కమిటీ ఒక ప్రకటనలో సూచనప్రాయంగా తెలిపింది. రేటు పెంపునకు తగిన పటిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశీయంగా ద్రవ్యోల్బణం, ఉపాధి కల్పన, వినియోగం వంటి అంశాలకు సంబంధించి రానున్న గణాంకాల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం వరకూ రేటు పెరక్కపోవచ్చన్న అంచనాల నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడ్డం గమనార్హం. వచ్చే ఏడాది కనీసం రెండు దఫాలుగా రేటు పెరగవచ్చని ఫెడ్ అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో ‘మూడు దఫాల పెంపు’ అంచనాకన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. ఏడేళ్ల పాటు 0-0.25% ఉన్న రేటు 2015 డిసెంబర్లో తొలిసారి పావుశాతం పెరిగి, 0.25- 0.50 శాతానికి చేరింది. -
ఫెడ్ నిర్ణయం ఆధారంగా ట్రెండ్
* ఈ వారం మార్కెట్ గమనంపై నిపుణుల అంచనా * బ్యాంక్ ఆఫ్ జపాన్ పాలసీపైనా దృష్టి ముంబై: అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్ 20,21 తేదీల్లో జరిపే పాలసీ సమీక్షలో వెలువడే నిర్ణయం ఆధారంగా ఈ వారం మార్కెట్ ట్రెండ్ ఉంటుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అలాగే అవేతేదీల్లో బ్యాంక్ ఆఫ్ జపాన్ పాలసీ మీటింగ్ కూడా జరుగుతుందని, ఈ కేంద్ర బ్యాంకు ప్రకటిస్తుందని భావిస్తున్న ఉద్దీపన ప్యాకేజీ కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తుందని అంటున్నారు. అమెరికా ఫెడ్, బ్యాంక్ జపాన్ల పాలసీ సమావేశాలు మంగళవారం మొదలవుతాయని ట్రేడ్స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా తెలిపారు. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంశం తప్ప, ప్రస్తుతానికి భారత్ మార్కెట్కు సంబంధించి ఎటువంటి ప్రతికూల అంశాలు లేవని, లిక్విడిటీతో ర్యాలీ కొనసాగవచ్చని అంచనావేస్తున్నట్లు ఆయన చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పట్ల అంచనాల్ని, వడ్డీ రేట్ల పెంపు సంకేతాల్ని ఫెడ్ వెలువరిస్తుందని, వాటి ప్రకారం మార్కెట్లో హెచ్చుతగ్గులు ఏర్పడవచ్చని క్యాపిటల్వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా వివరించారు. సమీప భవిష్యత్తులో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను అమెరికా ఫెడ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ల నిర్ణయాలు ప్రభావితం చేస్తాయని ఆయన అన్నారు. ముడి చమురు, రూపాయిల కదలికలు... అమెరికా, జపాన్ల కేంద్ర బ్యాంకుల నిర్ణయాలతో పాటు ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర, దేశీయంగా డాలరుతో రూపాయి మారకపు విలువ కదలికలు కూడా స్టాక్ మార్కెట్ ట్రెండ్కు కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. ఇటీవల వేగంగా చమురు ధర పతనమవుతోంది. గత శుక్రవారం నెమైక్స్ క్రూడ్ ధర 43 డాలర్ల స్థాయికి పడిపోయింది. వివిధ ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలరు బలపడుతున్న నేపథ్యంలో రూపాయి మారకపు విలువ కూడా 67 స్థాయికి బలహీనపడింది. ఈ రెండు అంశాలు కూడా ఇన్వెస్టర్లకు ముఖ్యమేనని క్యాపిటల్వయో గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ చెప్పారు. ఈ వారం దృష్టి అంతా అమెరికా ఫెడ్ మీటింగ్పైనే వుందని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోది చెప్పారు. ఫెడ్ నిర్ణయ ప్రభావం వచ్చే కొద్దివారాలపాటు మార్కెట్పై వుంటుందని కొటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా అంచనావేశారు. ఈక్విటీల్లోకి రూ.11వేల కోట్ల ‘ఫండ్స్’ న్యూడిల్లీ: రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల రాకతో మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్) ఈ ఏడాది ఇప్పటి వరకు ఈక్విటీ మార్కెట్లలో రూ.11,600 కోట్లు పంప్ చేశాయి. గత రెండేళ్లుగా మ్యూచువల్ ఫండ్స్ తీరులోనే ఇవి ఉన్నాయి. 2015లో ఫండ్స్ పెట్టుబడులు రూ.70వేల కోట్లు కాగా, 2014లో రూ.24వేల కోట్లుగా ఉన్నాయి. సెబీ డేటా ప్రకారం 2016లో ఇప్పటి (జనవరి-సెప్టెంబర్) వరకు ఫండ్ మేనేజర్లు ఈక్విటీల్లో నికరంగా రూ.11,608 కోట్లు, డెట్ మార్కెట్లలో రూ.2.50 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. గత కొన్నేళ్లుగా బంగారం, రియల్ ఎస్టేట్ రంగాల్లో రాబడులు తగినంత లేకపోవడంతో పెట్టుబడులు ఈక్విటీ వైపు మళ్లుతున్నట్టు బజాజ్ కేపిటల్ గ్రూపు సీఈవో అనిల్ చోప్రా అభిప్రాయపడ్డారు. మ్యూచువల్ ఫండ్స్ పరంగా ఈ ఏడాది మరో రికార్డు కూడా చోటు చేసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లోనే మ్యూచువల్ ఫండ్స్లో 11 లక్షల కొత్త ఖాతాలు ప్రారంభమయ్యాయి. మొత్తం మీద ఆగస్ట్ ముగింపునాటికి ఎంఎఫ్లలో ఇన్వెస్టర్ల ఖాతాలు 3.7 కోట్ల మార్కును అధిగమించాయి. ఎఫ్పీఐల పెట్టుబడులు రూ.5,790 కోట్లు ఈ సెప్టెంబర్ నెల తొలి పక్షం రోజుల్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) భారత్ క్యాపిటల్ మార్కెట్లో రూ. 5,790 కోట్లు నికరంగా పెట్టుబడి పెట్టారు. సెప్టెంబర్ 1-16 తేదీల మధ్య వారు ఈక్విటీల్లో రూ. 2,122 కోట్లు, రుణపత్రాల్లో(బాండ్స్) రూ. 3,668 కోట్ల నికర పెట్టుబడులు జరిపినట్లు సెబి గణాంకాలు తెలుపుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ ఎఫ్పీఐలు దేశీయ స్టాక్ మార్కెట్లో రూ. 42,972 కోట్ల విలువైన నికర కొనుగోళ్లు జరపగా, డెట్ మార్కెట్ నుంచి రూ. 3,680 కోట్లు వెనక్కు తీసుకున్నారు. -
ఫెడ్ సమావేశం వరకూ అనిశ్చితి..!
* రేటు పెంపు అంచనా * డాలర్ బలోపేతం నడుమ పసిడి బలహీనత ముంబై/న్యూయార్క్: అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ వారం 20, 21 తేదీల్లో సమీక్ష జరపనుంది. ఈ సందర్భంగా ఫెడ్ ఫండ్ రేట్లు పెంచవచ్చని కొందరు, ఒకవేళ పెంచకపోయినా తదుపరి సమీక్షలో పెంచుతామనే బలమైన సంకేతాలివ్వవచ్చని కొందరు అంచనాలు వేస్తుండటంతో పసిడి ధరలు కొంత వెనుకడుగు వేశాయి. ఫెడ్ ఫండ్ రేటు పెంపు అంచనాలతో తాజాగా డాలర్ బలపడుతుండడం పసిడి, క్రూడ్ ధరసహా కమోడిటీలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం 0.50 శాతంగా ఉన్న ఫండ్ రేటు పెంచిన పక్షంలో పసిడికి ఒక స్పష్టమైన దిశానిర్దేశం ఏర్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. నిజానికి ఫెడ్ గనక ఫండ్ రేటును పెంచితే ఆ మేరకు చాలా డబ్బు బాండ్లలోకి వెళుతుంది. ఈ మేరకు పసిడి బలహీనపడవచ్చన్న అంచనాలున్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా దిగువ స్థాయిలో ఫండమెంటల్స్ పటిష్టంగా లేకపోవటం వల్ల, ఒకవేళ ఫెడ్ రేటు పెంచినా... పసిడి ముందుకే సాగుతుందన్న వాదనా ఉంది. 0.25 శాతంగా ఉన్న ఫండ్ రేటు పెంచితే, పసిడి ఔన్స్కు 1,000 డాలర్ల దిగువనకు పడిపోతుందన్న మెజారిటీ విశ్లేషణలకు అంచనాలకు భిన్నంగా ఇప్పటి వరకూ పసిడి పరుగులు తీసిందన్న వాస్తవాన్ని వారు ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. మొత్తంమీద ఫెడ్ రేటు పెంపుపై మారుతున్న అంచనాలు, ఇందుకు సంబంధించి నిర్ణయాలు రానున్న వారం రోజుల్లో పసిడి కదలికలకు కారణమవుతాయన్నది నిపుణుల అంచనా. వారంలో ధరల తీరు ఇది... అంతర్జాతీయంగా న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి కాంట్రాక్ట్ శుక్రవారం వరుసగా ఎనిమిది ట్రేడింగ్ సెషన్ల నుంచీ క్షీణిస్తూ వస్తోంది. గడచిన శుక్రవారం నాడు ముగిసిన వారంలో ధర ఔన్స్కు 19 డాలర్లు తగ్గి 1,313 డాలర్లకు చేరింది. ఇది మూడు నెలల కనిష్ట స్థాయి. ఇక దేశీయంగానూ ‘ఇప్పటి వరకూ పెరిగిన పసిడి’కి సంబంధించి లాభాల స్వీకరణ కొనసాగుతోంది. శుక్రవారంతో ముగిసిన వారంలో పసిడి 10 గ్రాములు 99.9 స్వచ్ఛత ధర రూ.125 తగ్గి రూ.31,200కు చేరింది. -
గరిష్ట స్థాయిలో అమ్మకాలు
♦ సగానికి తగ్గిన సూచీల లాభాలు ♦ సెన్సెక్స్ 186 పాయింట్లు, ♦ నిఫ్టీ 37 పాయింట్లు అప్ ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చేవారం జరపబోయే పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లు పెంచబోదన్న భరోసాతో శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభ సమయంలో భారీగా పెరిగిన మార్కెట్లో మధ్యాహ్న సెషన్ తర్వాత అమ్మకాలు వెల్లువెత్తాయి. దాంతో స్టాక్ సూచీల లాభాలు పరిమితమయ్యాయి. తొలి దశలో 350 పాయింట్లకుపైగా పెరిగి 28,778 పాయింట్ల గరిష్టస్థాయివరకూ సెన్సెక్స్ చేరిన సమయంలో అమ్మకాల ఒత్తిడి మొదలయ్యింది. దాంతో సూచీ 28,495 పాయింట్ల వరకూ పడిపోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 186 పాయింట్ల లాభంతో 28,599 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,848 పాయింట్ల గరిష్టం వరకూ పెరిగిన తర్వాత 8,750 పాయింట్ల వద్దకు క్షీణించింది. చివరకు 37 పాయింట్ల లాభంతో 8,780 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ మార్కెట్ జోరుకు అడ్డుకట్టపడటానికి బ్యాంకింగ్ షేర్లలో పెద్ద ఎత్తున జరిగిన లాభాల స్వీకరణే కారణం. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గిన అంశాన్ని రిజర్వుబ్యాంక్ అక్టోబర్ 4నాటి పాలసీ సమీక్షలో పరిగణనలోకి తీసుకుంటుందంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించడంతో తొలుత బ్యాంకింగ్ షేర్లు పెద్ద ర్యాలీ జరిపాయి. అయితే అటుతర్వాత ఇవే షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. యూరప్ మార్కెట్లు ప్రతికూలంగా ప్రారంభంకావడంతో సెంటిమెంట్ దెబ్బతిందని విశ్లేషకులు చెప్పారు. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ గరిష్టస్థాయి నుంచి 3 శాతంవరకూ క్షీణించి, చివరకు 0.5-1.15 శాతం మధ్య నష్టాలతో ముగిసాయి. హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, టాటా స్టీల్లు 1-2 శాతం మధ్య తగ్గాయి. మరోవైపు మారుతి సుజుకి 2.25 శాతం పెరిగి రికార్డు గరిష్టస్థాయి రూ. 5,500పైన ముగిసింది. ఐటీసీ, ఇన్ఫోసిస్, హీరో మోటో, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్లు 1-2 శాతం మధ్య పెరిగాయి. -
మార్కెట్లకు ‘ఫెడ్’ ఫీవర్!
♦ సెన్సెక్స్ 444 పాయింట్లు క్రాష్ నిఫ్టీ 151 పాయింట్లు పతనం ♦ జూన్ 24 తర్వాత ఇదే పెద్ద క్షీణత ♦ మెటల్, రియల్టీ షేర్లకు భారీ నష్టాలు ♦ కుదేలైన మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు ముంబై: అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న భయాలు తిరిగి తలెత్తడంతో సోమవారం స్టాక్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దాంతో బీఎస్ఈ సెన్సెక్స్ 444 పాయింట్లు పతనమై 28,354 పాయింట్ల వద్దకు పడిపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 151 పాయింట్లు క్షీణించి 8,716 పాయింట్ల వద్ద ముగిసింది. బ్రెగ్జిట్ ఉదంతం సందర్భంగా జూన్ 24న జరిగిన పతనం తర్వాత ఇదే అతిపెద్ద క్షీణత. ఒక్క ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. లార్జ్క్యాప్ షేర్లతో పోలిస్తే మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు నిలువునా పతనమయ్యాయి. దాంతో బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 2.95%, స్మాల్క్యాప్ ఇండెక్స్ 2.35% చొప్పున పడిపోయాయి. ఐటీ ఇండెక్స్ మాత్రం 0.87% లాభంతో ముగిసింది. టాటా స్టీల్ టాప్ లూజర్... తాజా మార్కెట్ పతనంలో మెటల్, రియల్టీ షేర్లు తీవ్ర నష్టాల పాలయ్యాయి. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా టాటా స్టీల్ 5.3 శాతం క్షీణించి రూ. 373 వద్ద ముగిసింది. క్షీణించిన సెన్సెక్స్ షేర్లలో అదాని పోర్ట్స్ (4.3 శాతం), ఎస్బీఐ (4.28 శాతం), ఎల్ అండ్ టీ (3.68 శాతం), ఎన్టీపీసీ (3.56 శాతం), యాక్సిస్ బ్యాంక్ (3.42 శాతం), టాటా మోటార్స్ (3.29 శాతం), మహీంద్రా (3.06 శాతం)లు వున్నాయి. సెన్సెక్స్లో భాగంకాని మెటల్ షేర్లు వేదాంత 5 శాతం, హిందాల్కో 8% చొప్పున పడిపోయాయి. సెయిల్, జేఎస్డబ్ల్యూ స్టీల్లు 4-5 శాతం మధ్య తగ్గాయి. రియల్టీ షేర్లు డీఎల్ఎఫ్, హెచ్డీఐఎల్, ఇండియాబుల్స్ రియల్టీలు 7-10 శాతం మధ్య పతనమయ్యాయి. మరోవైపు ఐటీ షేరు ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ 1.74 శాతం ర్యాలీ జరపగా, టీసీఎస్, విప్రోలు స్వల్పంగా ఎగిసాయి. ప్రపంచ మార్కెట్లదీ అదేబాట... ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో గత శుక్రవారం అమెరికా మార్కెట్లు 2%పైగా క్షీణించిన నేపథ్యంలో సోమవారం ఆసియా మార్కెట్లు అదేబాటన పయనించాయి. జపాన్ నికాయ్ సూచి 1.5% క్షీణించగా, హాంకాంగ్, సింగపూర్, చైనా, తైవాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సూచీలు 1.5-3.5% మధ్య క్షీణించాయి. యూరప్ సూచీలు 1-1.5% నష్టాలతో ముగిసాయి. తాజాగా అమెరికా సూచీలు క్షీణతతో మొదలైనప్పటికీ, టెక్నాలజీ షేర్ల ఊతంతో వెనువెంటనే లాభాల బాట పట్టాయి. కడపటి సమాచారం అందేసరికి అమెరికా నాస్డాక్ ఇండెక్స్ 0.8% లాభంతో ట్రేడవుతుండగా, డోజోన్స్ 0.4%, ఎస్ అండ్ పీ-500 సూచి 0.5% చొప్పున పెరిగి ట్రేడవుతున్నాయి. విదేశీ నిధులు తరలిపోతాయా? సెప్టెంబర్ 20న జరగనున్న ఫెడరల్ రిజర్వ్ కమిటీ సమావేశంలో వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాల కారణంగా స్వల్పకాలికంగా విదేశీ ఇన్వెస్టర్లు కొంత మేర పెట్టుబడుల్ని వెనక్కు తీసుకోవచ్చన్న భయాలు మార్కెట్లో ఏర్పడ్డాయని విశ్లేషకులు చెప్పారు. ఈ మధ్యకాలంలో భారత్ మార్కెట్ జోరుగా ర్యాలీ జరపడానికి గ్లోబల్ లిక్విడిటీయే కారణమని, వడ్డీ రేట్లు పెంచే అవకాశాలున్నాయని ఇటీవల ఫెడ్ అధికారులు బహిరంగంగా ప్రకటించడం, ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వడానికి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ నిరాకరించడం వంటి అంశాలు ఇన్వెస్టర్లను నిరుత్సాహానికి లోనుచేశాయని జియోజిత్ బీఎన్పీ పారిబాస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. దాంతో అంతర్జాతీయంగా బాండ్ల ధరల పతనం ఆరంభమయ్యిందని, ఫలితంగా స్టాక్ మార్కెట్లు అతలాకుతలమవుతున్నాయని ఆయన వివరించారు. -
మార్కెట్లపై ఝున్ ఝున్వాలా జోస్యం
న్యూఢిల్లీ : దలాల్ స్ట్రీట్ సూచీల కదలికలు ఎప్పుడు ఎటువైపు సాగుతాయో ప్రతి ఒక్కరికీ సందేహమే. ఓ సారి టాప్లో ఎగుస్తాయి. మరోసారి ఢమాల్ మనిస్తాయి. సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా కీర్తి గడించిన రాకేశ్ జున్జున్వాలా మార్కెట్లో చూడబోతున్న ఆసక్తికరమైన అంశాలు మీడియాకు వివరించారు.. దలాల్ స్ట్రీట్లో బిగ్ బుల్ను చూడబోతున్నామని.. 2003లో చూసిన జోష్ను మార్కెట్లు ప్రతిబింబించబోతున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లో పెట్టుబడిదారుల తక్కువగా పాల్గొనడం బుల్ మార్కెట్కు ప్రారంభదశలో ఉండటాన్ని సూచిస్తుందన్నారు. ఫెడరల్ రిజర్వు రేట్లు పెంచితేనే దేశీయ మార్కెట్లు కరెక్ట్ చెందుతాయన్నారు. అమెరికా రేట్లు కూడా 1-1.5 శాతం కంటే ఎక్కువ పెరుగుతాయని అంచనావేయడం లేదని పేర్కొన్నారు. రేట్ల పెంపు లేనంత వరకు అంతర్జాతీయంగా మార్కెట్లలో ర్యాలీ ఇలానే కొనసాగుతుందని వెల్లడించారు. గ్లోబల్ ర్యాలీతో సెన్సెక్స్ ఫిబ్రవరి చివరి కల్లా 18 శాతం ఎగిసినట్టు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో పేలవమైన ప్రదర్శనను కనబరుస్తున్న ఇండియన్ ఐటీ రంగంలో వృద్ధి కొనసాగింపును చూస్తామని.. కానీ ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది మాత్రం పెట్టుబడిదారులే నిర్ణయించుకోవాలని సూచించారు. గోల్డ్ మార్కెట్లో కూడా బుల్లిష్ ట్రెండ్ చూస్తామని తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడానికి ఆర్బీఐ గవర్నర్ రాజన్ తీసుకున్న విధానాలు బాగున్నాయని వివరించారు. రాజన్ 8900 కోట్ల పోర్ట్ఫోలియో కలిగిన జున్జున్వాలా, ఇండియా వారెన్ బఫెట్గా పేరుగాంచారు. -
ముగింపులో కొనుగోళ్లు..120 పాయింట్లు అప్
తాత్కాలికంగా ఫెడ్ భయాలు వెనక్కి ముంబై: సోమవారం ట్రేడింగ్ ముగింపు సమయంలో కొనుగోళ్లు జరగడంతో స్టాక్ సూచీలు నష్టాల నుంచి కోలుకుని, స్వల్ప లాభాలతో ముగిసాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న సంకేతాల కారణంగా ఆసియా, యూరప్ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అయినా, ఆశ్చర్యకరంగా మన మార్కెట్ రికవరీ అయ్యిందని విశ్లేషకులు చెప్పారు. కనిష్టస్థాయిలో కొనుగోళ్లతో పాటు కొన్ని షేర్లలో షార్ట్ కవరింగ్ జరగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 27,698 పాయింట్ల నుంచి కోలుకుని, చివరకు 120 పాయింట్ల లాభంతో 27,903 పాయింట్ల వద్ద క్లోజయ్యిందని జియోజిత్ బీఎన్పీ పారిబాస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ వివరించారు. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలతో గత రెండు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 278 పాయింట్లు నష్టపోయింది. తాత్కాలికంగా రేట్ల పెంపు ఆందోళనలకు స్వస్తిచెప్పి, ఇన్వెస్టర్లు బ్లూచిప్ షేర్లను కొనుగోలు చేసినట్లు మార్కెట్ వర్గాలు వివరించాయి. ట్రేడింగ్ తొలిదశలో 8,544 పాయింట్ల కనిష్టస్థాయివరకూ తగ్గిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 35 పాయింట్ల లాభంతో 8,607 పాయింట్ల వద్ద ముగిసింది. టాటా మోటార్స్ జూమ్: ఆటోమొబైల్ షేర్లకు పెద్ద ఎత్తున కొనుగోలు మద్దతు లభించింది. గత శుక్రవారంనాడు వెల్లడించిన ఆర్థిక ఫలితాలు ఆశావహంగా వుండటంతో టాటా మోటార్స్ షేరు 4 శాతంపైగా ర్యాలీ జరిపి ఏడాది గరిష్టస్థాయి రూ. 525 వద్ద ముగిసింది. ఇదేబాటలో హీరో మోటోకార్ప్ షేరు 2.8 శాతం ఎగిసింది. సెప్టెంబర్ 1న ఏజీఎం జరగనున్న నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 2.85 శాతం పెరిగి రూ. 1,057 వద్ద క్లోజయ్యింది. -
మార్కెట్పై ‘ఫెడ్’ మేఘాలు..!
వడ్డీరేట్ల పెంపు దిశగా ఫెడ్ చీఫ్ యెలెన్ వ్యాఖ్యల ప్రభావం... * విశ్లేషకుల అంచనా... న్యూఢిల్లీ: వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు పెరిగాయంటూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ జానెట్ యెలెన్ చేసిన వ్యాఖ్యల ప్రభావం సోమవారం నాటి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్పై ఉంటుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. దీంతో పాటు ఈ వారంలో విడుదలయ్యే గణాంకాలు, ఐఓసీ, బీపీసీఎల్, డీఎల్ఎఫ్ వంటి కొన్ని కంపెనీలు క్యూ1 ఫలితాలు, రిలయన్స్ ఏజీఎమ్, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల కదలికలు, డాలర్తో రూపాయి మారకం గమనం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల హెచ్చుతగ్గులు తదితర అంశాలు స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు. ప్రతికూలంగా మార్కెట్... రేట్లు పెంచే అవకాశాలున్నాయంటూ ఫెడ్ చైర్పర్సన్ జానెట్ యెలెన్ చేసిన వ్యాఖ్యల ప్రభావం స్టాక్ మార్కెట్పై ఉంటుందని ఈక్విరస్ సెక్యూరిటీస్ హెడ్(ఈక్విటీస్) పంకజ్ శర్మ చెప్పారు. ఫెడ్ రేట్ల పెంపు భారత్ వంటి వర్థమాన దేశాలకు మంచిది కాదని, అందుకని యెలె న్ వ్యాఖ్యల ప్రభావం మన మార్కెట్పై ప్రతికూలంగా ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. కాగా జూలై నెల ఎనిమిది కీలక రంగాల పనితీరు గణాంకాలు ఈ నెల 31(బుధవారం)వెలువడనున్నాయి. ఇక ఆగస్టు నెల భారత తయారీ రంగ పర్ఛేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలను మార్కిట్ ఎకనామిక్స్ సంస్థ గురువారం (సెప్టెంబర్ 1న) వెల్లడించనున్నది. భారత తయారీ రంగానికి సంబంధించి ఈ నెలవారీ సర్వే ప్రభావం మార్కెట్పై ఉంటుందని ట్రేడ్స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా వెల్లడించారు. వాహన షేర్లపై దృష్టి...: ఆగస్టు నెల వాహన విక్రయ గణాంకాలను వివిధ వాహన కంపెనీలు సెప్టెంబర్ 1న(గురువారం) వెల్లడించనున్నందున వాహన షేర్లపై ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుంది. ఇంధన ధరల సవరణ కారణంగా ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు, విమానయాన రంగ షేర్లు వెలుగులోకి రావచ్చు. కంపెనీల క్యూ1 ఫలితాలు ఇక డీఎల్ఎఫ్, ఎంఓఐఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొ, భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ తదితర కంపెనీలు తమ క్యూ1 ఫలితాలను ఈ వారమే వెల్లడించనున్నాయి. నేడు (సోమవారం) డీఎల్ఎఫ్, ఎంఓఐఎల్, ఐఓసీ, ఈ నెల 31న (బుధవారం) బీపీసీఎల్ తమ క్యూ1 ఫలితాలను ప్రకటిస్తాయి. ఐఓసీ బోనస్ షేర్లజారీని సోమవారమే ప్రకటించే అవకాశముంది. సెప్టెంబర్ 1న(గురువారం) జరిగే రిలయన్స్ ఏజీఎమ్లో రిలయన్స్ జియో కార్యకలాపాల ఎప్పుడు ప్రారంభించేది వెల్లడవుతుందని, ఈ రిలయన్స్ ఏజీఎమ్ కీలకమని నిపుణులంటున్నారు. గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 295 పాయింట్లు క్షీణించి 27,782 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 94 పాయింట్లు క్షీణించి 8,573పాయింట్ల వద్ద ముగిశాయి. జోరుగా విదేశీ నిధులు .. భారత స్టాక్మార్కెట్లో విదేశీ నిధుల ప్రవాహం జోరుగా సాగుతోంది. ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) రూ.8,000 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టారు. జీఎస్టీ బిల్లు ఆమోదం పొందడం, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీరేట్లను తగ్గించడం వంటి జాతీయ, అంతర్జాతీయ సానుకూల అంశాల కారణంగా భారత్లోకి విదేశీ నిధులు జోరుగా వస్తున్నాయని నిపుణులంటున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, ఈ నెల 25వ తేదీ వరకూ విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో నికరంగా రూ.8,127 కోట్లు పెట్టుబడులు పెట్టగా, డెట్ మార్కెట్ నుంచి రూ.2,727 కోట్లు ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ ఎఫ్పీఐలు స్టాక్స్లో రూ.39,905 కోట్లు పెట్టుబడులు పెట్టగా, డెట్ మార్కెట్ నుంచి రూ.7,450 కోట్లు ఉపసంహరించుకున్నారు. వెరశి భారత క్యాపిటల్ మార్కెట్లో ఎఫ్పీఐల నికర పెట్టుబడులు రూ.32,455 కోట్లుగా ఉన్నాయి. -
మందకొడిగా ట్రేడింగ్
♦ స్వల్పంగా తగ్గిన సూచీలు ♦ ఫెడ్ ఛైర్పర్సన్ ప్రసంగం కోసం ఎదురుచూపులు ముంబై: సెప్టెంబర్ నెల డెరివేటివ్ సిరీస్లో తొలిరోజైన శుక్రవారం ట్రేడింగ్ మందకొడిగా సాగింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్పర్సన్ జానెట్ యెలెన్ శుక్రవారం రాత్రి అమెరికాలో చేయనున్న ప్రసంగంలో వడ్డీ రేట్లపై ఎటువంటి సంకేతాలు వెలువడతాయోనన్న సందిగ్దత ఇన్వెస్టర్లను వెన్నాడటంతో ట్రేడింగ్ నిస్తేజంగా సాగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. వడ్డీ రేట్లు పెంచడానికి ఫెడ్ మొగ్గుచూపితే, భారత్ వంటి వర్థమాన మార్కెట్ల నుంచి కొద్దికాలంపాటు విదేశీ నిధులు తరలివెళతాయని జియోజిత్ బీఎన్పీ పారిబాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ రాయ్ చెప్పారు. బీఎస్ఈ సెన్సెక్స్ 54 పాయింట్ల తగ్గుదలతో 27,782 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచి 20 పాయింట్ల క్షీణతతో 8,572 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 295 పాయింట్లు, నిఫ్టీ 94 పాయింట్ల చొప్పున తగ్గాయి. ఆసియాలో జపాన్, సింగపూర్ సూచీలు తగ్గగా, హాంకాంగ్ మార్కెట్ స్వల్పంగా పెరిగింది. యూరప్ సూచీలు స్వల్ప నష్టాలతో ముగిసాయి. ఐటీ షేర్లు వెలవెల... సెన్సెక్స్-30 షేర్లలో 17 షేర్లు నష్టాల్లో ముగిసాయి. ఐటీ షేరు విప్రో అన్నింటికంటే అధికంగా 3 శాతం క్షీణించగా, ఇన్ఫోసిస్, టీసీఎస్లు 1-2 శాతం మధ్య తగ్గాయి. ఎస్బీఐ, సన్ఫార్మా, ఎల్ అండ్ టీలు కూడా 1-2 శాతం మధ్య నష్టపోయాయి. ఇక తాజాగా ఆర్థిక ఫలితాలు ప్రకటించిన టాటా మోటార్స్ షేరు 2 శాతం ఎగిసింది. గెయిల్, ఆర్ఐఎల్ 1-2 శాతం మధ్య ర్యాలీ జరిపాయి. -
రేట్ల పెంపునకు సిద్ధమే కానీ.. వేచిచూస్తాం
ఫెడ్ చైర్మన్ యెలెన్ న్యూయార్క్: ఫెడ్ ఫండ్ రేటు పెంపునకు తగిన పరిస్థితులు ఏర్పడ్డాయని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జానెట్ యెలెన్ పేర్కొన్నారు. అయితే సెప్టెంబర్లో వెలువడనున్న ‘ఉపాధి’ గణాంకాల వరకూ వేచిచూస్తామని సూచించారు. ఫెడ్ వైస్ చైర్మన్ స్టాన్లీ ఫీచ్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చెప్పారు. ప్రస్తుతం ఫెడ్ ఫండ్ రేటు 0.25-0.50 శాతం శ్రేణిలో ఉన్న సంగతి తెలిసిందే. టిటాన్ కౌంటీ జాక్సన్ హోల్ వ్యాలీలో జరిగిన ఒక సదస్సులో జానెట్ ప్రసంగిస్తూ.. ఫండ్ రేటు పెంపునకు తగిన పరిస్థితులు ఇటీవలి నెలల్లో ఏర్పడినట్లు తెలిపారు. అయితే సమయం కోసం వేచిచూస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్, నవంబర్లలో ఫెడ్ సమావేశాలు ఉన్నాయి. అయితే అమెరికా ఎన్నికలకు ముందు రేటు పెరగకపోవచ్చని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు దశాబ్దకాలం తరువాత ఫెడ్ 2015 చివర్లో రేటును స్వల్పంగా పావుశాతం పెంచింది. -
ఫెడ్ రేట్ల పెంపు భయాలు.. 224 పాయింట్లు డౌన్
ముంబై : అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న భయాలు కారణంగా గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ 224 పాయింట్లు పతనమయ్యింది. గత రెండు వారాల్లో ఇదే పెద్ద క్షీణత. శుక్రవారం రాత్రి అమెరికాలో బ్యాంకర్ల సమావేశంలో అమెరికా ఫెడ్ ఛైర్పర్సన్ జానెట్ యెలెన్ కీలక ఉపన్యాసం చేయనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా డిసెంబర్లలో రేట్లు పెంచవచ్చన్న సంకేతాల్ని ఈ సందర్భంగా యెలెన్ ఇస్తారన్న అంచనాలు ఇన్వెస్టర్లలో వున్నాయి. దాంతో ప్రపంచ మార్కెట్ల ట్రెండ్ను అనుసరించి భారత్ మార్కెట్ కూడా తగ్గింది. సెన్సెక్స్ 224 పాయింట్ల క్షీణతతో 27,836 పాయింట్ల వద్ద ముగిసింది. ఆగస్టు డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు కూడా ప్రభావం చూపింది. ఇన్వెస్టర్లు వారి డెరివేటివ్ పొజిషన్లను సెప్టెంబర్ నెలకు రోలోవర్ చేయడానికి బదులు స్క్వేర్అప్ చేయడానికే మొగ్గుచూపారని మార్కెట్ వర్గాలు తెలిపాయి. దాంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,600 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఈ సూచి 58 పాయింట్ల నష్టంతో 8,592 పాయింట్ల వద్ద క్లోజ య్యింది. ఆగస్టు సిరీస్లో నిఫ్టీ 74 పాయింట్లు, సెన్సెక్స్ 373 పాయింట్ల మేర తగ్గాయని జియోజిత్ బీఎన్పీ పారిబాస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. కొద్ది వారాలు పరిమితశ్రేణిలో మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనవుతుందని, వడ్డీ రేట్ల అంశంపై ఫెడ్ అభిప్రాయాలు వెల్లడయ్యాక మార్కెట్ ఏదో ఒకదిశగా పయనిస్తుందని ఆయన వివరించారు. ఐటీ, మెటల్ షేర్లలో అమ్మకాలు... ఐటీ, మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకింగ్ షేర్లు స్వల్పంగా తగ్గాయి. సెన్సెక్స్-30 షేర్లలో 25 షేర్లు క్షీణించగా, అన్నింటికంటే ఎక్కువగా ఆదాని పోర్ట్స్ 3 శాతం తగ్గింది. విప్రో, టాటా స్టీల్, ఇన్ఫోసిస్లు 2-3 శాతం మధ్య, హెచ్డీఎఫ్సీ, భారతి ఎయిర్టెల్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, ఎం అండ్ ఎంలు 1-2 శాతం మధ్య క్షీణించాయి. అయితే గెయిల్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ లాబ్లు స్వల్ప లాభాలతో ముగిసాయి. -
ఫెడ్ భయాలు తొలగి..
• జోష్నిచ్చిన మూడీస్ వృద్ధి అంచనాలు • 118 పాయింట్ల లాభంతో 28,123కు సెన్సెక్స్ • 49 పాయింట్ల లాభంతో 8,673కు నిఫ్టీ ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు ఆందోళనలు తొలగిపోవడంతో గురువారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. భారత వృద్ధి అంచనాలను ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ కొనసాగించడం కూడా కలసివచ్చింది. దీంతో రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 118 పాయింట్లు పెరిగి 28,123 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 49 పాయింట్లు పెరిగి 8,673 పాయింట్ల వద్ద ముగిశాయి. ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు జాప్యం కావడం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సానుకూలమైన అంశమని నిపుణులంటున్నారు. ఈ ఫెడ్ రేట్ల ఆందోళనలు తొలగిపోవడంతో రిటైల్, సంస్థాగత ఇన్వెస్టర్లు తాజాగా కొనుగోళ్లు జరిపారని, స్టాక్ సూచీలు లాభాల బాట పట్టాయని వారు పేర్కొన్నారు. లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరు కొనసాగించింది. ఇంట్రాడేలో 28,214 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో చివరకు 118 పాయంట్ల లాభంతో 28,123 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్ షేర్ల జోరు... బ్యాంక్ షేర్లు ముఖ్యంగా ప్రైవేట్ రంగ బ్యాంక్ షేర్లు జోరుగా పెరిగాయి. యస్ బ్యాంక్ ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయిని తాకగా, ఇండస్ ఇండ్ బ్యాంక్ 3.3 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.6 శాతం చొప్పున పెరిగాయి. బ్యాంక్ నిఫ్టీ 312 పాయింట్లు లాభపడి 19,353 వద్ద ముగిసింది. వెలుగులో చక్కెర షేర్లు ఏడాది గరిష్ట స్థాయికి చేరిన చక్కెర షేర్లు ఇటీవల కాలంలో 20 శాతానికి పైగా కరెక్షన్కు గురయ్యాయి. పంచదార ఉత్పత్తి అంచనాలకంటే తక్కువగానే ఉంటుందన్న వార్తల కారణంగా ఈ షేర్లు గురువారం లాభపడ్డాయి. ఇక ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. -
అమెరికా ‘ఫెడ్’ రేటు యథాతథం
న్యూయార్క్ : అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడ్ ఫండ్ రేటును యథాతథంగా కొనసాగించాలని నిర్ణయిం చింది. ప్రస్తుతం ఈ రేటు 0.25- 0.50 శాతం శ్రేణిలో ఉంది. ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు తొలగిపోతున్నాయని బుధవారం రాత్రి కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఫెడ్ వ్యాఖ్యానించడం గమనార్హం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నదంటూ ఫెడ్ పేర్కొన్న నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్లోనే వడ్డీ రేట్ల పెంపు వుండవచ్చన్న అంచనాలు మొదలయ్యాయి. బ్రెగ్జిట్ కారణంగా వడ్డీ రేట్ల పెంపుపై ఆచితూచి వ్యవహరిస్తామంటూ ఫెడ్ అధికారులు ఇప్పటివరకూ చెపుతూవస్తున్నారు. దాంతో డిసెం బర్లో మాత్రమే ఫెడ్ రేటు పెరిగే అవకాశం 40 శాతం వరకూ వుందని ఆర్థికవేత్తలు అంచనావేస్తువచ్చారు. ఫెడ్ తాజా అభిప్రాయంతో సెప్టెం బర్ లేదా డిసెంబర్లో రేటు పెంపు తప్పదన్నది తాజా అంచనాలు. శుక్రవారం అమెరికా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రెండవ త్రైమాసిక ఫలితాలు (ఏప్రిల్-జూన్) వెలువడుతుండడమూ తాజా ఫెడ్ నిర్ణయానికి నేపథ్యం. క్యూ1లో ఈ రేటు 1.1 శాతం కాగా, క్యూ2లో 2 శానికి కొంచెం పైనే ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. -
సమీప భవిష్యత్తులో 1425 డాలర్లు!
పసిడిపై నిపుణుల అంచనా.. న్యూఢిల్లీ: పసిడి ధర సమీప భవిష్యత్తులో మరింత ముందుకు దూసుకుపోవడం ఖాయమన్న అంచనాలు బలంగా ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులే దీనికి ప్రధాన కారణమన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఏబీఎన్ ఆమ్రో గ్రూప్ కమోడిటీ స్ట్రేటజీ విభాగం గ్లోబల్ హెడ్ జార్జిట్ బోలే ఈ మేరకు తన అభిప్రాయాలను వెల్లడిస్తూ... వచ్చే మూడు నెలల్లో న్యూయార్క్ కమోడిటీ మార్కెట్ నెమైక్స్ కాంట్రాక్ట్ ధర 1,425 డాలర్లకు చేరుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.1,425 డాలర్లకు చేరిన తర్వాత లాభాల స్వీకరణ జరిగే వీలుందని , ఫెడ్ ఫండ్ రేటు పెరిగే పరిస్థితుల్లో ఈ లాభాల స్వీకరణ ధోరణి మరింత దూకుడుగా ఉండవచ్చని ఆయన అన్నారు. కాగా, శుక్రవారంతో ముగిసిన వారంలో పసిడి ధర అటు అంతర్జాతీయంగా, ఇటు దేశీయంగా భారీగా పెరిగింది. అంతర్జాతీయంగా ధర వారం వారీగా 24 డాలర్ల లాభంతో 1,368 డాలర్ల వద్ద ముగిసింది. దేశీయంగా ముంబై ప్రధాన మార్కెట్లో శుక్రవారంతో ముగిసిన వారంలో 99.9 స్వచ్ఛత 10 గ్రాముల పసిడి ధర రూ.460 పెరిగింది. రూ.31,355 వద్ద ముగిసింది. వెండి ధర వారంలో భారీగా కేజీకి రూ.1,435 ఎగసి రూ.46,515 వద్ద ముగిసింది. -
ఏడాది చివరకు రూ.33,500 స్థాయికి పసిడి..!
బ్రెగ్జిట్, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల ప్రభావం * ఫెడ్ వడ్డీరేటు పెంపు ఆలస్యమయ్యే ధోరణీ ‘ప్లస్’! * క్రూడ్ ధరలు వెనకడుగు మరోకారణం న్యూయార్క్/న్యూఢిల్లీ: ఇటు దేశీయంగా అటు అంతర్జాతీయంగా పసిడి వెలుగులు సమీప కాలంలో కొనసాగుతాయనడానికి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారత్లో ఈ ఏడాది చివరినాటికి 10 గ్రాముల ధర రూ.33,500 స్థాయికి చేరుతుందన్న అంచనా ఉండగా, అంతర్జాతీయ స్థాయికి సంబంధించి అంచనాలు చూస్తే న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో చురుగ్గా ట్రేడయ్యే కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రా) ధర 1,350 డాలర్లు, 1,475 డాలర్ల శ్రేణిలో తిరుగుతుంది. కమోట్రెండ్జ్ రిసెర్ట్ డెరైక్టర్ జ్ఞాన్శేఖర్ త్యాగరాజన్ అంచనాల ప్రకారం... ⇒ యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవడం.. ఫలితంగా అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొనటం పసిడిలో పెట్టుబడుల పటిష్టతకు కారణం. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ ఉత్తేజానికి బ్రిటన్, యూరోపియన్ యూనియన్లు వేర్వేరుగా ఉద్దీపనలను ప్రకటించే అవకాశం. ⇒ అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడ్ ఫండ్ రేటును ప్రస్తుత 0.50% నుంచి ఇప్పట్లో పైకి పెంచదన్న అంచనా రెండవ కారణం. అమెరికా ఎన్నికల నేపథ్యమూ గమనార్హం. ⇒ ఇక మూడవ అంశానికి వస్తే- ప్రపంచ ఆర్థిక మందగమనం నేపథ్యంలో క్రూడ్ ధరలు సైతం వెనకడుగు వేయడం. ⇒ అమెరికా డాలర్ మరింత బలహీన పడే అవకాశాలు ఉన్నాయని, ఇది పసిడికి మరింత మెరుపు తీసుకువస్తుందని ఏంజిల్ బ్రోకింగ్ కమోడిటీస్ అండ్ కరెన్సీస్ బిజినెస్ ఈక్విటీ రిసెర్చ్ విభాగం డెరైక్టర్ నవీన్ మాథూర్ అభిప్రాయపడ్డారు. దీనితో స్వల్ప కాలంలో రేటు దేశీయంగా రూ.31,500-32,500 శ్రేణిలో తిరిగే అవకాశం ఉందని అంచనావేశారు. ⇒ అఖిల భారత రత్నాలు, ఆభరణాల వాణిజ్య సమాఖ్య చైర్మన్ జీవీ శ్రీథర్ కూడా ఇదే విధమైన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఆయా ఆర్థిక మందగమన అంశాలకు తోడు దేశంలో తగిన వర్షపాతమూ పసిడి డిమాండ్ బాగుండడానికి కారణమవుతుందని ఆయన అంచనా వేశారు. వారంలో భారీ జంప్.. బ్రెగ్జిట్ వార్తల నేపథ్యంలో పసిడి నెమైక్స్లో సమీక్షా వారంలో పరుగు పెట్టింది. శుక్రవారం ఒక దశలో మార్చి 2014 గరిష్ట స్థాయికి ఔన్స్కు 1,359 డాలర్లకు ఎగసింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 18 డాలర్ల లాభంతో 1,319 డాలర్ల వద్ద ముగిసింది. ఇక దేశీయంగానూ పసిడి ఇదే దూకుడు ప్రదర్శించింది. దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా శుక్రవారం 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.845 లాభంతో (3 శాతం) రూ.30,905 వద్ద ముగిసింది. ఇక 99.5 స్వచ్ఛత ధర కూడా అంతే మొత్తం ఎగసి రూ.30.755 వద్దకు చేరింది. ఇక వెండి కూడా కేజీకి రూ.1,370 ఎగసి రూ. 42,930 వద్దకు భారీ జంప్ చేసింది. -
రూ. 31 వేల చేరువలో పసిడి
ముంబై: అమెరికా రిజర్వు, ఫెడ్ వడ్డీరేట్లను పెంచుతుందో లేదో తెలియక సతమతమైన బులియన్ మార్కెట్ కు తీపి కబురు అందించింది. ఫెడ్ రేట్లలో ఎలాంటి మార్పు లేదని ఫెడరల్ రిజర్వు ఓపెన్ మార్కెట్ కమిటీ ప్రకటనతో సానుకూలంగా స్పందించింది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పసిడి మెరుపులు మెరిపిస్తోంది. బుధవారం నష్టాల్లోకదలాడిన పుత్తడి ధరలు ఫెడ్ ప్రకటనలతో పరుగులు పెడుతూ భారీ లాభాలతో దూసుకుపోతోంది. దాదాపు 500 రూ. కు పైగా లాభపడింది. ప్రస్తుతం 526 రూపాయల లాభంతో 30,970 దగ్గర ట్రేడవుతూ 31 వేల మార్క్ కు చేరువలో ఉంది. అటు డాలర్ తో పోలిస్తూ భారత కరెన్సీ రూపాయి 2 పైసలు బలపడింది. ప్రపంచ ప్రధాన కరెన్సీల కంటే అమెరికా కరెన్సీ బలహీనపడి నేల చూపులు చూస్తూ వుండడంతో రూపాయి క్రమేపీ బలపడుతోంది. కాగా ఆర్థికవ్యవస్థ వృద్ధి కొనసాగుతున్నప్పటికీ, ఉద్యోగాల వృద్ధి తక్కువగా నమోదైందని ఫెడ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినట్టు తెలిపింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా పాలసీ నిర్ణయాన్ని ప్రభావితం చేశాయని ఫెడ్ గవర్నర్ జానెట్ యెల్లెన్ పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్లో కొనసాగడమా..వైదొలగడమా.. అనే నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు.అయితే వడ్డీ రేట్ల పెంపు ఎపుడు ఉంటుందున్నది పేర్కొనలేదు. -
ఫెడ్ ప్రకటనతో బలపడుతున్న రూపాయి
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికా రిజర్వు, ఫెడ్ వడ్డీరేట్లను పెంచుతుందో లేదో తెలియక సతమతమైన రూపాయికి ఊరట లభించింది. ఫెడ్ రేట్లలో ఎలాంటి మార్పు లేదని ఫెడరల్ రిజర్వు ఓపెన్ మార్కెట్ కమిటీ ప్రకటించటంతో రూపాయి 2 పైసలు బలపడింది. ప్రపంచ ప్రధాన కరెన్సీల కంటే అమెరికా కరెన్సీ తక్కువగా నమోదవుతోంది. ఉద్యోగాల నియామకాల వృద్ధి మందగించడంతో రేట్లను పెంచడం లేదని కమిటీ బుధవారం తెలిపింది. అయితే రేట్ల పెంపు ఎప్పుడు చేపడుతోందో కమిటీ వెల్లడించలేదు. వాషింగ్టన్ లో జరిగిన నాలుగవ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్ఓఎమ్ సీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మొత్తంగా ఆర్థికవ్యవస్థ వృద్ధి కొనసాగుతున్నప్పటికీ, ఉద్యోగాల వృద్ధి తక్కువగా నమోదైందని కమిటీ పేర్కొంది. ఈ నేపథ్యంలో వడ్డీరేట్ల పెంపు చేపట్టకపోవడమే మంచిదని ప్రకటించింది. ఈ ఏడాది వడ్డీరేట్ల పెంపు రెండు సార్లు ఉండవచ్చని కమిటీ సభ్యులు సూత్రపాయంగా అంచనావేస్తున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితుల బట్టి చూస్తే కేవలం ఒక్క సారి మాత్రమే పెంపు చేపట్టవచ్చని అభిప్రాయం పడుతున్నారు.లేబర్ మార్కెట్ మందగించడంపై పాలసీ మేకర్స్ ఆందోళన వ్యక్తంచేశారు. మరోవైపు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా పాలసీ నిర్ణయాన్ని ప్రభావితం చేశాయని ఫెడ్ గవర్నర్ జానెట్ యెల్లెన్ పేర్కొన్నారు. వడ్డీ రేట్లు పెంచకపోవడానికి ఈ నిర్ణయం కూడా ఒక ప్రధాన కారణంగా ఉందని యెల్లెన్ ప్రకటించారు. యూరోపియన్ యూనియన్లో కొనసాగడమా..వైదొలగడమా.. అనే నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగేందుకు వచ్చే వారం బ్రిటన్ చేపడుతున్న ఓటింగ్ కూడా ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఒకవేళ జూలైలో జాబ్ మార్కెట్ పునరుద్ధరించుకుంటే ఆ నెలలో ఫెడ్ రేట్లను పెంచే అవకాశాలున్నట్టు ఆర్థికనిపులంటున్నారు. అయితే వడ్డీరేట్ల పెంపుకు ఆర్థిక పరిమాణాలపై ఓ స్పష్టమైన అభిప్రాయం రావాల్సి ఉందని కమిటీ తెలిపింది. -
వెలుగులో ప్రభుత్వ బ్యాంకు షేర్లు
♦ ఫ్లాట్గా ముగిసిన సూచీలు ♦ ప్రభావం చూపిన ఫెడ్, బ్రిటన్ రిఫరెండం మే నెలలో టోకు ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు అంతర్జాతీయ అంశాల కారణంగా ఇన్వెస్టర్లు జాగురూకత వహించడంతో మంగళవారం స్టాక్ సూచీలు దాదాపు ఫ్లాట్గా ముగిసాయి. రోజంతా పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 1 పాయింటు క్షీణతతో 26,396 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 2 పాయింట్ల క్షీణతతో 8,109 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. రిటైల్ టోకు ద్రవ్యోల్బణాలు రెండూ పెరగడంతో రిజర్వుబ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు సన్నగిల్లాయన్న నిరుత్సాహం ఇన్వెస్టర్లలో ఏర్పడిందని విశ్లేషకులు చెప్పారు. ప్రపంచ మార్కెట్లలో ఆందోళన... మంగళవారం ప్రారంభమై రెండురోజులపాటు జరగనున్న అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సమీక్షా సమావేశంలో వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం కోసం ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ ఆందోళనతో వేచిచూస్తున్నాయని, దీనికి తోడు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలా, వద్దా అనే అంశమై జూన్ 23న జరిగే రిఫరెండం పట్ల మార్కెట్లో భయాలు వున్నాయని విశ్లేషకులు వివరించారు. దాంతో జపాన్, హాంకాంగ్, సింగపూర్ తదితర ఆసియా మార్కెట్లు 1 శాతంవరకూ క్షీణించగా, యూరప్ సూచీలు 2-3 శాతం మధ్య పతనమయ్యాయి. కడపటి సమాచారం అందేసరికి అమెరికా సూచీలు క్షీణతతో ట్రేడవుతున్నాయి. పీఎన్బీ 8 శాతం అప్... ఇక దేశీయంగా సూచీలు ఫ్లాట్గా క్లోజయినా, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లు జోరుగా పెరిగాయి. కంపెనీల రుణ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి బ్యాంకుల కేటాయింపులు, తదితర అంశాల్లో రిజర్వుబ్యాంక్ నిబంధనల్ని సరళీకరించడంతో పీఎస్యూ బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు జరిగినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. అన్నింటికంటే అధికంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8 శాతం ర్యాలీ జరిపి రూ. 90 వద్ద ముగిసింది. ఎస్బీఐ 2.65 శాతం పెరగ్గా, ఓరియంటల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు 4 శాతం చొప్పున, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు 2 శాతం చొప్పున ఎగిసాయి. -
ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడ్.. కీలకం
రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు నేడు విడుదల... * 14న టోకు ధరల ద్రవ్యోల్బణం... * 15న ఫెడ్ పాలసీ సమీక్ష నిర్ణయం న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణ గణాంకాలు, రుతుపవనాల విస్తరణ, అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం... అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్కు కీలకమని విశ్లేషకులంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, డాలర్తో రూపాయి మారకం గమనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, గత శుక్రవారం వెలువడిన ఐఐపీ గణాం కాలు, ఆదివారం వెలువడిన చైనా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు కూడా తగిన ప్రభావం చూపుతాయని వారంటున్నారు. గణాంకాలతో ఒడిదుడుకులు అంతర్జాతీయ అంశాలతో పాటు మార్కెట్ సెంటిమెంట్ను రుతుపవనాల విస్తరణ నిర్దేశిస్తుందని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. మే నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు సోమవారం(ఈ నెల 13న), టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు మంగళవారం(ఈ నెల14న)న వెలువడుతాయని, ఇవి తగిన ప్రభావం చూపుతాయని వివరించారు. ద్రవ్యోల్బణ గణాంకాల కారణంగా మార్కెట్ ఒడిదుడుకులకు గురయ్యే అవకాశాలున్నాయని క్యాపిటల్వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా చెప్పారు. గత శుక్రవారం వెలువడిన పారిశ్రామికోత్పత్తి గణాంకాల ప్రభావం కూడా ఈ వారం స్టాక్ మార్కెట్పై ఉంటుంది. యంత్ర పరికరాల తయారీ, తయారీ రంగ కార్యకలాపాలు మందగించడం వల్ల ఈ ఏడాది ఏప్రిల్లో పారిశ్రామికోత్పత్తి మైనస్ 0.8 శాతానికి తగ్గింది. గత మూడు నెలల్లో ఇదే తొలి క్షీణత కావడం గమనార్హం. అందరి చూపు ఫెడ్ వైపే.... ఈ నెల 15న వెలువడే అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం ఫలితం పట్ల అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని నిపుణులంటున్నారు. రేట్లలో యథాతథ స్థితిని కొనసాగించాలని ఫెడ్ నిర్ణయించవచ్చని అంచనాలున్నాయి. బ్రిక్జిట్ ఫలితం(యూరోపియన్ యూనియన్లో కొనసాగాలా వద్ద అనే విషయంలో బ్రిటన్లో ఈ నెల 23న రెఫరెండమ్ జరగబోతోంది) ఎలా ఉండబోతోందోనన్న అంచనాల కారణంగా యూరోప్ మార్కెట్ల కదలికలు మన మార్కెట్పై ఒకింత ప్రభావం చూపుతాయని మనీపామ్ సీఈఓ నిర్దోశ్ గౌర్ చెప్పారు. రెండు వారాల వరుస లాభాలకు గత వారంలో బ్రేక్ పడింది. స్టాక్ సూచీలు ఏడు నెలల గరిష్ట స్థాయికి చేరిన తర్వాత లాభాల స్వీకరణ జరిగింది. సెన్సెక్స్ గత వారంలో 207 పాయింట్లు (0.8 శాతం) తగ్గి 26,636 పాయింట్లకు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 0.6 శాతం క్షీణించి 8.170 వద్ద ముగిశాయి. బుధవారం(ఈ నెల14)న బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య విధానాన్ని ప్రకటించనున్నది. ఇక గురువారం (ఈ నెల15న) బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకోనున్నది. విదేశీ కొనుగోళ్లు జోరు.. భారత స్టాక్ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. కంపెనీల క్యూ4 ఫలితాలు సానుకూలంగా ఉండటం, వర్షాలు విస్తారంగా కురుస్తాయని, ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉంటాయనే అంచనాలతో ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) రూ.3,700 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టారు. అంతకు ముందటి మూడు నెలల్లో(మార్చి-మే) విదేశీ ఇన్వెస్టర్లు రూ.32,000 కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేశారు. అంతకు ముందటి నాలుగు నెలల్లో(గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ) విదేశీ ఇన్వెస్టర్లు రూ.41,661కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. -
ఫెడ్ ప్రకటనతో జోరు తగ్గిన పసిడి
ముంబై : అమెరికా ఫెడ్ రిజర్వు జూన్ లో మరోమారు వడ్డీరేట్లను పెంచబోతోందనే సంకేతాల నేపథ్యంలో బంగారం ధరలు తగ్గు ముఖం పట్టాయి. 30వేల స్థాయి నిలదొక్కుకునే ప్రయత్నంలో ఇటీవల విఫలమైన బంగారం ధర మరింత పతనమై 30వేల రూపాయల కిందికి దిగజారింది. ఫెడ్ ప్రకనటతో గురువారం బులియన్ మార్కెట్ లో పసిడి ధరల జోరుకు భారీ బ్రేక పడింది. సుమారు మూడువారాల దిగువకు పడిపోయాయి. 314 రూపాయల నష్టంతో పది గ్రాముల పసిడి ధర 29,741రూపాయలుగా నమోదైంది. వెండిధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. ఇటీవల స్తాయిలో నిలదొక్కుకోవడంలో విఫలమైన పసిడి ఇపుడు మరింత వెలవెలబోతోంది. అటు ఫెడ్ రిజర్వు వడ్డన తప్పదనే వార్తలతో డాలర్ దూసుకుపోతుండగా, ఆసియన్ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. ఇక ఇతర విలువైన లోహాల సంగతి కొస్తే వెండి, పల్లాడియం స్వల్పంగా పెరగ్గా, ప్లాటినం ధరల్లో స్వల్ప క్షీణత నమోదైంది. అయితే పసిడి ధరల తగ్గుదలు పెట్టుబడిదారులు కొనుగోళ్లకు వినియోగించుకుంటారని గోల్డ్ ఫండ్ మేనేజర్ రిచర్డ్ అభిప్రాయపడ్డారు. ఫెడ్ నిర్ణయం ప్రపంచ బంగారం ధరలపై భారీ ప్రభావం చూపబోదని తెలిపారు. కాగా బుధవారం జరిగిన ఫెడ్ సెంట్రల్ బ్యాంకు ఏప్రిల్ పాలసీ సమావేశం అనంతరం జూన్ లో వడ్డీరేట్ల పెంపుకు సిద్దంగా ఉన్నామని అధికారులు వ్యక్తం చేసినట్టు మినిట్స్ వెల్లడించింది. రెండో త్రైమాసికంలో అమెరికా ఆర్థికాభివృద్ధి మెరుగుపడిందని, ఉద్యోగావకాశాలు, ద్రవ్యోల్బణం పెరగిందని సంకేతాలు వచ్చాయి. దాదాపు 34శాతం ఫెడ్ జూన్ లో రేట్ల పెంపుకే అవకాశముందని ట్రేడర్స్ అభిప్రాయం వ్యక్తంచేశారు. కాగా దాదాపు పది సం.రాల తరువాత గత డిసెంబర్ లో ఫెడ్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచింది. -
జూన్ లోనే "ఫెడ్" వడ్డన...!
ఫెడ్ రిజర్వు ఆసియన్ మార్కెట్లకి షాకినిచ్చింది. జూన్ లో మరోమారు వడ్డీరేట్లను పెంచబోతున్నట్టు సంకేతాలు విడుదల చేసింది. బుధవారం జరిగిన ఫెడ్ సెంట్రల్ బ్యాంకు ఏప్రిల్ పాలసీ సమావేశం అనంతరం అమెరికా ఆర్థికవ్యవస్థ బాగుంటే జూన్ లో వడ్డీరేట్ల పెంపుకు సిద్దంగా ఉన్నామని అధికారులు వ్యక్తంచేసినట్టు మినిట్స్ వెల్లడించింది. రెండో త్రైమాసికంలో అమెరికా ఆర్థికాభివృద్ధి మెరుగుపడిందని, ఉద్యోగావకాశాలు, ద్రవ్యోల్బణం పెరగిందని సంకేతాలు వచ్చాయి. దీంతో జూన్ లో ఫెడ్ వడ్డీరేట్లను పెంచబోతున్నట్టు మినిట్స్ నివేదించింది. అయితే వాల్ స్ట్రీట్ అంచనా వేసిన దానికంటే చాలా త్వరగానే జూన్ లో ఫెడ్ వడ్డీరేట్లను పెంచుతాదనే తెలుస్తోంది. దాదాపు 34శాతం ఫెడ్ జూన్ లో రేట్ల పెంపుకే అవకాశముందని ట్రేడర్స్ అభిప్రాయం వ్యక్తంచేశారు. మినిస్ట్స్ విడుదల చేసిన ఈ రిపోర్టుతో మార్కెట్లో డాలర్ బలపడింది. ఫెడ్ 2శాతం టార్గెట్ కు ద్రవ్యోల్బణం పెరుగుతుందని పాలసీమేకర్స్ వ్యక్తంచేసినట్టు తాజా డేటాలో వెల్లడైంది. ఈ సంకేతాల ప్రభావం ఆసియన్ స్టాక్ మార్కెట్లపై చూపించింది. ఈ సంకేతాలతో ఆసియన్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతున్నాయి. 2008 లో నెలకొన్న ఆర్థికమందగమనంతో ఫెడ్ రిజర్వు రేట్లను 0శాతానికి ఉంచింది. దాదాపు దశాబ్దం అనంతరం అమెరికా ఆర్థికవ్యవస్థ కొంత మెరుగుపడిందని గణాంకాలు చూపడంతో, డిసెంబర్ లో మొదటిసారి ఫెడ్ వడ్డీరేట్లను 0.25 శాతం-0.50 శాతం పెంచింది. -
పుత్తడి ధరకు ఈ వారం కీలకం!
విశ్లేషకుల అంచనా అంతర్జాతీయంగా ఈ వారం బంగారం ధరలకు కీలకం కానున్నదని నిపుణులంటున్నారు. గత శుక్రవారం వెలువడి న అమెరికా ఉద్యోగ గణాంకాలు ఆదేశ కేంద్ర బ్యాంక్-ఫెడరల్ రిజర్వ్ ఇప్పట్లో రేట్లను పెంచే అవకాశాల్లేవని సంకేతాలిచ్చాయి. దీంతో ఈ వారంలో పుత్తడి 1,300 డాలర్ల స్థాయిని దాటుతుందా లేదా ట్రేడర్ల లాభాల స్వీకరణతో ధర పతనమవుతుందా అన్న విషయమై గందరగోళం నెలకొంది. గత వారంలో ఔన్స్ బంగారం 1,300 డాలర్లను తాకి , చివరకు అంతకు ముందటి వారం ముగింపు(1,290 డాలర్లు)తో పోల్చితే ఔన్స్ బంగారం స్వల్ప లాభంతో 1,294 డాలర్ల వద్ద ముగిసింది. కాగా సమీప భవిష్యత్తులో ఫెడ్ వడ్డీరేట్లను పెంచకపోవచ్చని, దాంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,300 డాలర్లకు ఎగియవచ్చని కొంతమంది నిపుణలు అంచనా వేస్తున్నారు. అయితే లాభాల స్వీకరణ జరిగితే ధర తగ్గుతుందని మరికొంత మంది నిపుణులంటున్నారు. ఇక దేశీయ మార్కెట్లో స్టాకిస్టులు, ట్రేడర్ల నుంచి డిమాండ్ జోరుగా ఉండటంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. పండుగ, పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో స్థానికంగా కొనుగోళ్ల జోరు బాగా ఉంది. పుత్తడి పండగ-అక్షయ తృతీయ(నేడు-సోమవారం) కారణంగా వినియోగదారుల నుంచి కొంతమేర కొనుగోళ్లు ఉంటాయనే అంచనాలున్నాయి. అయితే అధిక ధర ఉండటంతో అక్షయ తృతీయ నాడు అమ్మకాలు తగ్గే అవకాశాలున్నాయని వర్తకులు ఆందోళన చెందుతున్నారు. అంతకు ముందటి వారంలో రూ.29,970 వద్ద ముగిసిన 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం గత వారంలో రూ.30,460 గరిష్ట స్థాయిని తాకి చివరకు గత శుక్రవారం రూ.30,090 వద్ద ముగిసింది. -
పసిడి పయనం ఎటువైపు?
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బంగారం, వెండి, ప్లాటినం ధరలు పెరగనున్నాయా? విశ్లేషకులు అంచనాలను గమనిస్తే ఈ అనుమానాలు బలపడుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంకు పాలసీ సమావేశాల నేపథ్యంలో ప్యూచర్స్ మార్కెట్ లో పసిడి ధరలు పెరిగాయని న్యూయార్క్ మెర్కంటైల్ ఎక్సేంజ్ తెలిపింది. జూన్ నెల నాటి కాంట్రాక్ట్ లో బంగారం ధరలు 0.83 శాతం పెరిగాయని తెలిపింది. సోమవారం నాటికి ఔన్స్ బంగారం ధర 82 777 రూపాయల దగ్గర స్థిరంగా ఉందని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ విడుదల చేసిన నివేదికలో మార్చి నెల గృహ అమ్మకాలు అంచనాల కంటే అధ్వాన్నంగా ఉండటంతో పసిడి ధరలకు ఊతం మిచ్చిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే మంగళ, బుధ, గురు, శుక్రవారం విడుదల కానున్న వివిధ అంతర్జాతీయ నివేదికలు పసిడి ధరలను ప్రభావితం చేయనున్నాయని జిన్హువా తెలిపింది. అటు అమెరికా కరెన్సీ డాలర్ క్షీణించడం కూడా గోల్డ్ ధరలకు సానుకూలంకానుంది. గోల్డ్ , డాలర్ సాధారణంగా వ్యతిరేక దిశలో పయనించడం తెలిసిందే. మరోవైపు అంతర్జాతీయంగా పసిడి ధరలు బలపడుతోంటే.. భారత ఫ్యూచర్స్ మార్కెట్లో కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ అందించిన వివరాల ప్రకారం జూన్ నెల ఫ్యూచర్స్ లో 56 రూ (0,19) క్షీణించి 10 గ్రా. బంగారం ధర 29, 436 దగ్గర స్థిరపడింది. ఇటీవలి లాభాలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో స్వల్పంగా నష్టపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మంగళవారం నాటికి 10 గ్రాముల బంగారం ధర 70 రూపాయల నష్టంతో రూ 29, 192 దగ్గర ట్రేడ్ అవుతోంది. అటు వెండి ధరలో కూడా స్వల్ప క్షీణత నమోదైంది. అదేవిధంగా రేపు ఫెడరల్ రిజర్వు ఏప్రిల్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం జరగనుంది. దీనిలో కొత్తగా ఫెడ్ ఎలాంటి చర్యలను ప్రవేశపెట్టదని సంకేతాలు వస్తున్నాయి. కానీ మానిటరీ పాలసీపై ముందస్తు మార్గదర్శకాలు, భవిష్యత్ లో వడ్డీరేట్లు పెరుగుతాయనే సూచనలను ఫెడ్ ప్రకటిస్తుందని డీలర్లు ఆశిస్తున్నారు. ఈ అంచనాల నేపథ్యంలో పసిడి పరుగులు పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
మూడు వారాల కనిష్టానికి మార్కెట్
215 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ నిఫ్టీ 68 పాయింట్లు డౌన్ ముంబై: ఆసియా మార్కెట్ల బలహీన సంకేతాలకు తోడు, భారత్ కార్పొరేట్ల క్యూ4 ఫలితాలు అంతంతమాత్రంగానే వుండవచ్చన్న అంచనాలతో గురువారం ఇన్వెస్టర్లకు అమ్మకాలకు పాల్పడటంతో స్టాక్ మార్కెట్ సూచీలు మూడు వారాల కనిష్టస్థాయిలో ముగిసాయి. సెన్సెక్స్ ట్రేడింగ్ ప్రారంభంలో 25,013 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగిన తర్వాత క్రమేపీ క్షీణిస్తూ చివరకు 24,685 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం రోజుతో పోలిస్తే 215 పాయింట్లు నష్టపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 68 పాయింట్ల నష్టంతో 7,546 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. రెండు సూచీలకు ఇది మూడు వారాల కనిష్టస్థాయి. ఫెడ్ మినిట్స్ ఎఫెక్ట్...: బుధవారం రాత్రి వెల్లడైన అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సమావేశపు మినిట్స్లో అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థకున్న రిస్క్ల ప్రస్తావన వుండటంతో ప్రధాన ఆసియా మార్కెట్లు క్షీణతతో ముగిసాయి. బీహెచ్ఈఎల్ ర్యాలీ: గత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ ప్రకటించిన తాత్కాలిక ఫలితాల్లో నష్టాలు కనపర్చినప్పటికీ, కంపెనీకి ఆర్డర్లు పెరిగాయన్న వార్తలతో ఈ షేరు సెన్సెక్స్-30 కంపెనీల్లో అత్యధికంగా 4.6 శాతం ర్యాలీ జరిపింది. సెన్సెక్స్-30 షేర్లలో 18 నష్టపోగా, 12 లాభపడ్డాయి. -
ఆశలన్నీ ‘నాఫెడ్’ పైనే..
ధర పతనంతో కొబ్బరి రైతుల దిగాలు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు వినతి త్వరలో రానున్న ఆయిల్ఫెడ్ అధికారులు అమలాపురం : కొబ్బరి ధర రానురాను పతనమవుతుండడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో కొబ్బరి కొనుగోలుకు నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్) కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆ కేంద్రాలు ఏర్పాటు చేసి ఎండు కొబ్బరి (తయారీ కొబ్బరి) కొనుగోలు చేస్తే ధరలు నిలకడగా ఉంటాయని ఆశిస్తున్నారు. కేంద్రాల ఏర్పాటుకు కృషి చేయాలని జిల్లాకు చెందిన కొబ్బరి రైతులు ఇటీవల కలెక్టర్ హెచ్.అరుణ్కుమార్కు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆయిల్ఫెడ్ అధికారులు కోనసీమలో పర్యటించనున్నట్టు ప్రచారం జరగడంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాగలవన్న ఆశ మరింతగా చిగురిస్తోంది. అంబాజీపేట మార్కెట్లో పచ్చికొబ్బరి వెయ్యి కాయల ధర రూ.4,200 నుంచి రూ.4,500 వరకు ఉంది. తయారీ కొబ్బరి ధర రూ.ఆరు వేలకు చేరింది. దీనితో నాఫెడ్ ద్వారా ఎండుకొబ్బరి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా ఎండుకొబ్బరి క్వింటాల్ రూ.5,950కి, బాల్కోప్రా (కొబ్బరి గుడ్డు)ను రూ.6,240కి కొనుగోలు చేస్తారు. ఇప్పుడు మార్కెట్లో ఎండుకొబ్బరి ధర రూ.5,500 నుంచి రూ.6 వేల వరకు ఉంది. నాఫెడ్ కేంద్రాల కొనుగోలుతో రైతులకు నేరుగా కలిగే ప్రయోజనం పెద్దగా లేకున్నా మార్కెట్లో ధర పతనం ఆగుతుంది. అంతేకాక కొబ్బరి కొనుగోలులో పోటీ వల్ల క్రమంగా ధర పెరుగుతుంది. 120 రోజుల పాటు కొనాలి.. ఉభయ గోదావరి జిల్లాల్లో గతంలో ఆరు నాఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. ఈ కేంద్రాల ద్వారా రోజుకు దాదాపు 6,600 టన్నుల క్వింటాళ్ల ఎండుకొబ్బరి కొనుగోలు చేసేవారు. నాఫెడ్ కేంద్రాల కొనుగోలుతో బహిరంగ మార్కెట్లో ఎండు కొబ్బరికి డిమాండ్ వచ్చి ధర భారీగా పెరిగేది. ఈ కారణంగానే రైతులు నాఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్), కోనసీమకు చెందిన రైతు సంఘం ప్రతినిధులు ఇటీవల కలెక్టర్ హెచ్.అరుణ్కుమార్ను కలిసి నాఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నాఫెడ్ పెట్టిన 90 రోజుల కొనుగోలు నిబంధనను మార్పు చేసి 120 రోజుల కొనుగోలుకు అనుమతించేలా చూడాలని కోరగా, నాఫెడ్ ఉన్నతాధికారులతో మాట్లాడతానని కలెక్టర్ హామీ ఇచ్చారు. నాఫెడ్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పరిశీలించాలని కలెక్టర్ నాఫెడ్, ఆయిల్ ఫెడ్ అధికారులకు నివేదించనున్నారు. ఆయిల్ఫెడ్ నివేదికే కీలకం.. నాఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ఆయిల్ఫెడ్కు చెందిన అధికారుల బృందం కోనసీమలో త్వరలో పర్యటించనున్నట్టు సమాచారం. కొబ్బరి కొనుగోలు, రైతులకు నగదు చెల్లింపులు నాఫెడ్ ఆధ్వర్యంలో జరిగినా, కొబ్బరి నాణ్యత పరిశీలన ఆయిల్ఫెడ్దే. ఈ కారణంగా ఆయిల్ఫెడ్ అధికారుల బృందం కోనసీమలో పర్యటించి ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న కొబ్బరి నాఫెడ్ నిబంధనలకు అనువుగా ఉందోలేదో నిర్ధారించనుంది. వీరు ఇచ్చే నివేదిక ఆధారంగానే నాఫెడ్ కేంద్రాల ఏర్పాటు జరగనుంది. -
ఇండియా రికవరీనే కీలకం..
⇒ అమెరికా ఫెడ్, చైనా కాదు.. ఎఫ్ఐఐలు మళ్లీ వస్తారు ♦ 2008 పరిస్థితులు పునరావృతం కావు ♦ రూపాయి క్షీణతకే ఆర్బీఐ మొగ్గు ♦ ఆరు నెలలవరకూ ఫెడ్ రేట్లు పెంచకపోవచ్చు.. ♦ ఆటో, ప్రైవేటు బ్యాంకింగ్, ఆయిల్ షేర్లు సానుకూలం డీఎస్పీ బ్లాక్రాక్ ఏఎంసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హరీష్ జవేరీ అది జరిగితే మన మార్కెట్లోకి ఇండియా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటే అమెరికా, చైనా ప్రభావాలు మన మార్కెట్పై ఉండవని, వెనక్కి వెళ్లిన ఎఫ్ఐఐలు వెతుక్కుంటూ వెనక్కి వస్తారంటున్నారు డీఎస్పీ బ్లాక్రాక్ ఏఎంసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఫండ్ మేనేజర్ హరీష్ జవేరీ. అంతర్జాతీయ పరిణామాల కంటే దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడమే స్టాక్ మార్కెట్లకు ముఖ్యమంటున్న జవేరీతో ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రత్యేక ఇంటర్వ్యూ.. సాక్షి, బిజినెస్ బ్యూరో ♦ప్రస్తుతం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకులను చాలామంది 2008 ఆర్థిక సంక్షోభంతో పోలుస్తున్నారు. అటువంటి పరిస్థితులున్నాయా? 2008లో స్టాక్ మార్కెట్లు లిక్విడిటీ కొరత వల్ల పతనమయ్యాయి. కానీ ఇప్పుడు లిక్విడిటీ కొరత లేదు. కానీ 2008 తర్వాత అమెరికా వంటి దేశాలు లిక్విడిటీ పెంచడానికి వ్యవస్థలోకి అదనపు నిధులను విడుదల చేశాయి. ఇక ఇప్పుడు అటువంటి చౌక మనీ లభించే రోజులు పోయాయి. ప్రస్తుతం మన దేశ ఆర్థిక వ్యవస్థ 2012 నాటికి పూర్తి భిన్నంగా ఉందని చెప్పొచ్చు. 2012లో అధిక ద్రవ్యలోటుతో ఇబ్బందులు ఎదుర్కొంటే, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో ప్రస్తుతం ద్రవ్యలోటును కట్టడిలోకి వచ్చింది. కాబట్టి 2008 పరిస్థితులు పునరావృతం అయ్యే అవకాశాలు లేవు. ♦గత రెండేళ్లుగా లార్జ్క్యాప్ కంటే మిడ్క్యాప్ ఇండెక్స్ మంచి పనితీరు కనపరుస్తోంది? ఈ ఏడాదీ ఇదే విధమైన ట్రెండ్ కొనసాగే అవకాశముందా? ఈ ఏడాది షేర్ల కదలికలు గత రెండేళ్లకు భిన్నంగా ఉండే అవకాశముంది. ఇప్పటి వరకు పెరిగిన మిడ్క్యాప్ షేర్లు మరింత పెరుగుతాయని చెప్పలేం. ఇక నుంచి ఫండమెంటల్గా పటిష్టంగా ఉన్న కంపెనీలు మాత్రమే పెరుగుతాయి. ఇక లార్జ్క్యాప్లో కూడా ఆటో, ప్రైవేటు బ్యాంకులు, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల షేర్లు పెరిగే అవకాశాలున్నాయి. మొత్తం మీద స్మాల్ అండ్ మిడ్ క్యాప్ షేర్ల కంటే లార్జ్ క్యాప్ షేర్లకే ఎక్కువ మొగ్గు చూపుతాను. ♦ఎఫ్ఐఐలు వైదొలుగుతున్నా.. దేశీయ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. ఈ ఏడాది కూడా దేశీయ నిధుల ప్రవాహం ఇదే విధంగా ఉండే అవకాశం ఉందా? స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది దేశీయ మ్యూచువల్ ఫండ్స్ లక్ష కోట్ల నికర కొనుగోళ్లు జరిపాయి. ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే సంఖ్యతో పాటు, సగటు సిప్ మొత్తం కూడా భారీగా పెరిగాయి. వచ్చే రెండు నెలలు మ్యూచువల్ ఫండ్స్ డివిడెండ్లు ప్రకటిస్తాయి కాబట్టి నిధుల ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది కూడా దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు ఇదే విధంగా కొనసాగుతాయి. కానీ ఇదే సమయంలో ఎఫ్ఐఐలు అమ్మకాలు చేస్తున్నాయి. చైనా, దక్షిణాసియా కరెన్సీ విలువ, వర్థమాన దేశాల వృద్ధి వంటి అంశాలపై ఎఫ్ఐఐల నిధుల ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది. మిగిలిన దేశాలతో పోలిస్తే మన ఫండమెంటల్స్ బాగున్నా.. వారి ఆలోచనలు ఏ విధంగా ఉండొచ్చన్న సంగతి ఇప్పుడే చెప్పలేం. ♦ ఏయే రంగాలపై బుల్లిష్గా ఉన్నారు? వేటికి దూరంగా ఉంటున్నారు? ఆటో (మారుతీ, టాటా మోటార్స్, అశోక్ లేలాండ్) ఆటో యాన్సిలరీ, ప్రైవేట్ బ్యాంకులు (ఇండస్ ఇండ్, హెచ్డీఎఫ్సీ, కోటక్)లపై బుల్లిష్గా ఉన్నాం. రాస్ గ్యాస్ ఒప్పందం, గ్యాస్ రంగంలో సంస్కరణల నేపథ్యంలో ఆయిల్-గ్యాస్ షేర్లలో పెట్టుబడులు కొనసాగించొచ్చు. అలాగే గ్యాస్, బొగ్గు సరఫరా మెరుగవ్వడం, ఉదయ్ స్కీం కింద అప్పులు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవడం వంటి నిర్ణయాల కారణంగా దీర్ఘకాలానికి విద్యుత్ కంపెనీలకేసి చూడొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో కన్జూమర్ బేస్డ్ కంపెనీలు (హెచ్యూఎల్, ఐటీసీ, నెస్లే), యూఎస్ఎఫ్డీఏ నిర్ణయాల వల్ల ఫార్మా, ఐటీ రంగాలకు దూరంగా ఉంటున్నాం. ఎన్పీఏ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకుంటాయన్న దానిపై పీఎస్యూ బ్యాంకుల కదలికలు ఆధారపడి ఉంటాయి. ♦అమెరికా వడ్డీరేట్లు మరింత పెంచే అవకాశం ఉందా? పెంచితే మనపై ప్రభావమేంటి? ఇప్పటికే అమెరికా వడ్డీరేట్లను ఒకసారి పెంచింది. దానీ ప్రభావం మనపై అంతగా లేదనే చెప్పొచ్చు. ప్రస్తుతం వచ్చే ఆరు నెలల వరకు ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచకపోవచ్చు. ♦చమురు ధరలు తగ్గడం అంతర్జాతీయంగా వృద్ధిలేదనడానికి సంకేతం కదా? ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుస్తుందా? అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధిరేటు సరిగా లేనందునే చమురు ధరలు తగ్గుతున్నాయనడంలో సందేహం లేదు. కానీ ఈ ధరలు తగ్గడం ఇప్పటి వరకు బాగా లబ్ధిపొందిన దేశాల్లో ఇండియా ఒకటి. ప్రపంచ వాణిజ్యంలో మన వాటా చాలా తక్కువ కాబట్టి సంస్కరణలు అమలు చేస్తూ ముందుకెళ్తున్నంత కాలం మనపై అంతగా ప్రతికూల ప్రభావం ఉండదు. చమురు ధరలు తగ్గడం వల్ల మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే రెమిటెన్స్లు తగ్గొచ్చు. కానీ ఇదే సమయంలో రూపాయి పతనం వల్ల మిగిలిన దేశాల నుంచి వచ్చే రెమిటెన్స్లు ఆ లోటును భర్తీ చేస్తాయనుకుంటన్నాం. ♦ చైనా కరెన్సీ విలువ తగ్గించడం వల్ల మన ఆర్థిక వ్యవస్థతో పాటు, స్టాక్ మార్కెట్లపై ఏ విధంగా ప్రభావం ఉంటుంది? చైనా కరెన్సీ యువాన్ విలువ తగ్గించడం వల్ల ఎగుమతుల్లో పోటీ తట్టుకోవడానికి ఇతర దేశాలు కూడా కరెన్సీ విలువను తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే చైనా ఎగుమతులతో ఈ దేశాలు పోటీ పడలేవు. ప్రస్తుతం ఇతర దేశాల కరెన్సీతో పోలిస్తే మన రూపాయి విలువ పటిష్టంగా కనిపిస్తున్నా.. రానున్న కాలంలో రూపాయి విలువ బలహీనపడటానికే ఆర్బీఐ మొగ్గు చూపొచ్చు. వచ్చే సెప్టెంబర్ నాటికి డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 70 పడిపోవచ్చని అంచనా వేస్తున్నాం. ♦ రానున్న కాలంలో దేశీయ మార్కెట్ కదలికలను ఏ అంశాలు నిర్దేశిస్తాయని అనుకుటున్నారు? దేశీయ సూచీల కదలికలు ప్రధానంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి అంతర్జాతీయంగా ఎఫ్ఐఐల రూపంలో వచ్చే నిధుల ప్రవాహం, దేశ ఆర్థిక వృద్ధిరేటు కోలుకోవడానికి ఎంత దూరంలో ఉన్నా అంశాలు కీలకమైనవి. ప్రస్తుతం దేశీయంగా కొత్త పెట్టుబడులు, ఎగుమతుల పరిస్థితి అంత ఆశావహంగా లేదు. కానీ దేశీయ వినిమయ శక్తి బాగుండటంతో ఇతర దేశాల మార్కెట్ల కంటే మనం కొద్దిగా బాగుండటానికి కారణం. ఒకసారి మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాట పట్టిందంటే చైనా, అమెరికా ప్రభావాలు మన మార్కెట్లపై పెద్దగా ఉండవు. వెనక్కి వెళ్లిన ఎఫ్ఐఐలు కూడా తిరిగి వస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే అంతర్జాతీయ పరిణామాల కంటే మన ఆర్థిక వ్యవస్థ ఎంత తొందరగా కోలుకుంటుందన్న దానిపైనే మార్కెట్ కదలికలు ఆధారపడి ఉంటాయని చెప్పొచ్చు. ♦ మూడో త్రైమాసిక ఫలితాలు ఎలా ఉంటాయని భావిస్తున్నారు? సెన్సెక్స్లోని 30 కంపెనీలు సగటున 1% వృద్ధిని నమోదు చేయొచ్చు. ఇందులోంచి మెటల్ కంపెనీలను తీసేస్తే మిగిలిన సెన్సెక్స్ కంపెనీల్లో 8-10% వృద్ధి కనపడుతుంది. కమోడిటీ ధరలు బాగా తగ్గడం వల్ల మెటల్ కంపెనీల ఆదాయాల్లో క్షీణత కనిపిస్తోంది. ఇదే సమయంలో ఇతర కంపెనీలకు నిర్వహణ వ్యయాలు తగ్గడంతో ఆదాయం పెరక్కపోయినా లాభాలు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ. చెన్నై వరదల వల్ల మూడో త్రైమాసికం ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. నాల్గవ త్రైమాసిక ఫలితాల తర్వాత కానీ ఒక స్పష్టతకు అవకాశం లేదు. ♦ ఆర్బీఐ వడ్డీరేట్లను మరింత తగ్గించే అవకాశం ఉందా? వచ్చే మూడు నుంచి ఆరు నెలలు వడ్డీరేట్లలో ఆర్బీఐ ఎటువంటి మార్పులు చేయదని భావిస్తున్నాం. వడ్డీరేట్లు పెరిగే అవకాశం లేదు కానీ.. మరింత తగ్గుతాయా లేదా అన్నదానిపై మరో ఆరు నెలలు ఆగితే కాని స్పష్టత రాదు. -
ఫోర్బ్స్ కార్యసాధకుల జాబితాలో మనోళ్లు
న్యూయార్క్: ఫోర్బ్స్ కార్యసాధకుల జాబితాలో 45 మంది భారతీయులు, భారతీయ సంతతికి చెందిన వారు స్థానం దక్కించుకున్నారు. 30 ఏళ్లలోపు వయసు ప్రాతిపదికగా వివిధ రంగాల్లో నూతన ఆవిష్కరణలకు, వృద్ధికి కృషిచేసిన వారి ఆధారంగా ఫోర్బ్స్ ఈ వార్షిక జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో మొత్తం 600 మంది చోటు దక్కించుకున్నారు. భారత్ నుంచి కన్సూమర్ టెక్ విభాగంలో ఓవైఓ రూమ్స్ సీఈవో రితేశ్ అగర్వాల్ (వయసు 22), స్ప్రింగ్ మొబైల్ యాప్ రూపకర్తలు గగన్ బియాని, నీరజ్ బెర్రీ, ఆల్ఫాబెట్స్ గూగుల్ ఎక్స్ ఉద్యోగిని కరిష్మా షా (25) స్థానం పొందారు. ఇక హాలీవుడ్, ఎంటర్టైన్మెంట్ విభాగంలో లిల్లీ సింగ్(27) స్థానం దక్కించుకున్నారు. ఇంకా భారత్ నుంచి స్థానం పొందిన వారిలో ఫైనాన్స్ విభాగంలో సిటీగ్రూప్ వైస్ ప్రెసిడెంట్ నీలా దాస్ (27), వికింగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ ప్రముఖ ఇన్వెస్టర్ అనలిస్ట్ దివ్య నెట్టిమి(29), హెడ్జ్ ఫండ్ మిలీనియమ్ మేనేజ్మెంట్ సీనియర్ అనలిస్ట్ వికాస్ పటేల్ (29), కాక్స్టన్ అసోసియేట్స్ ఇన్వెస్ట్మెంట్ అనలిస్ట్ నీల్ రాయ్ (29) ఉన్నారు. వెంచర్ క్యాపిటల్ విభాగంలో గ్రేక్రాఫ్ట్ పార్ట్నర్స్ సీనియర్ అసోసియేట్ విశాల్ లుగాని (26), న్యూ ఎంటర్ప్రైజ్ అసోసియేట్స్ సీనియర్ అసోసియేట్ అమిత్ ముఖర్జీ (27) స్థానం దక్కించుకున్నారు. మీడియా విభాగంలో ఎంఎస్ఎన్బీసీ సోషల్ మీడియా మేనేజర్ నిశా చిట్టల్ (27), నౌదిస్ మీడియా సోషల్ మీడియా వైస్ ప్రెసిడెంట్ అశిష్ పటేల్ (29) స్థానం పొందారు. తయారీ రంగంలో ఎంఐటీ విద్యార్థి సంప్రీతి భట్టాచార్య(28), సెంట్రిక్స్ సీఈవో సాగర్ గోవిల్ (29) స్థానం దక్కించుకున్నారు. సామాజిక ఎంట్రప్రెన్యూర్లలో శానిటేషన్, హెల్త్ రైట్స్ వ్యవస్థాపక డెరైక్టర్ అనూప్ జైన్ (28) స్థానం పొందారు. లా అండ్ పాలసీ విభాగంలో ఫెడరల్ రిజర్వు బోర్డులో మానిటరీ పాలసీ నిపుణుడు అశిష్ కుంభ త్ (26), ఫేస్బుక్ పబ్లిక్ పాలసీ అడ్వైజర్ దిపయన్ ఘోష్ (27), అనిశా సింగ్ (28) తదితరులు స్థానం దక్కించుకున్నారు. సైన్స్ విభాగంలో కాలిఫోర్నియా బార్కిలీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంజమ్ జార్జ్ (29) స్థానం పొందారు. -
చైనాను మించాం.. ప్రపంచాన్ని గెలిచాం!
దశాబ్దాల నుంచి ఆర్థిక పరంగా ఉరుకులు, పరుగులు పెరుగుతున్న చైనా వృద్ధిరేటును భారత్ అధిగమించడం 2015లో చెప్పుకోదగ్గ ఘటన. ఆర్బీఐ రెపో రేటు తగ్గింపుతో ఘనంగా ప్రారంభమైన 2015 ఏడాది అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుతో నిరుత్సాహకరంగా ముగిసింది. ఏడాది మొత్తంలో భారత ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఫలితాలను అందిం చింది. ఈ ఏడాది ఆర్బీఐ ఆశ్చర్యకరంగా తన పాలసీ రేట్లను నాలుగు సార్లు తగ్గించింది. 15 రంగాల్లో ఎఫ్డీఐ నిబంధనలు సరళించడం, రియల్టీ బిల్లు ఆమోదం వంటి కీలక సంస్కరణలకు కేంద్రం తెరలేపింది. విదేశీ పెట్టుబడులకు భారత్ను గమ్యస్థానం మార్చడం కోసం ప్రధాని మోదీ వివిధ దేశాలు తిరిగి వాటితో పలు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. అలాగే ఈ ఏడాది సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, మార్క్ జుకర్బర్గ్ వంటి తదిరత ప్రముఖ సీఈవోలు భారత్లో పర్యటించారు. తద్వారా ప్రపంచమంతా మన దేశం పేరు మార్మోగింది. మార్చిలో 30,000 ఆల్టైం గరిష్ట స్థాయిని తాకి న సెన్సెక్స్.. చివరికి 26,000 స్థాయికి తగ్గింది. రూపాయి మారక విలువ రెండేళ్ల కనిష్ట స్థాయికి పడింది. క్రూడ్ ధరలు దశాబ్ద కాల కనిష్టానికి పడ్డాయి. ఇది భారత్కు బాగా కలిసొచ్చిన అంశం. ఇలా పలు జాతీయ అంతర్జాతీయ అంశాలకు సంబంధించి 2015లో జరిగిన కీలక ఘటనల సమాహారమిది... గ్లోబల్ సీఈవోలు భారత్ వచ్చారు... ఈ ఏడాదిలో పలువురు గ్లోబల్ సీఈవోలు భారత్ను సందర్శించారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా, పెప్సికో సీఈవో ఇంద్రనూయి, ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్, జనరల్ మోటార్స్ సీఈవో మేరీ బర్రా వంటి తదిత రులు ఉన్నారు. వీరందరూ భారత్లో వారి వారి కంపెనీల భవిష్యత్ విస్తరణ ప్రణాళికలను ప్రకటించారు. టెక్నాలజీ దిగ్గజం గూగుల్కి భారతీయుడైన సుందర్ పిచాయ్ (43) సీఈవోగా నియమితులు కావడం ఈ ఏడాది ప్రపంచం దృష్టిని భారత్ ఆకర్షించేలా చేసింది. ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు పరంపర.. జనవరి 17న దాదాపు ఏడాదిన్నర తర్వాత (2013, మే అనంతరం) ఆర్బీఐ రెపో రేటును 8 శాతం నుంచి 7.75 శాతానికి తగ్గించింది. అటుతర్వాత వరుసగా .....మార్చి, జూన్, సెప్టెంబర్ నెలల్లో రేట్లు తగ్గించింది. ఈ ఏడాది జరిగిన నాలుగు తగ్గింపుల్లో రేపో రేటు 6.75 శాతానికి దిగింది. రెపోకు అనుగుణంగా రివర్స్ రెపో రేటు కూడా 5.75 శాతానికి చేరుకుంది. కాగా సీఆర్ఆర్ 4 శాతంగా... ఎస్ఎల్ఆర్ 21.5 శాతంగా ఉంది. ఫెడ్ పెంచింది... ఇసీబీ తగ్గించింది తొమ్మిదేళ్ల తర్వాత తొలిసారిగా 2015 డిసెంబర్లో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచింది. దీంతో 0-0.25 శాతంగా వున్న ఫెడ్ ఫండ్స్ రేటు 0.25-0.50 శాతానికి చేరింది. మరోవైపు ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం కల్పించడానికి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) తన కీలక డిపాజిట్ రేటును ప్రస్తుత మైనస్ 0.20 శాతం నుంచి మైనస్ 0.30 శాతానికి తగ్గించింది. ఇంకోవైపు పలు దఫాలు వడ్డీ రేట్లను తగ్గించిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా తన కరెన్సీ యువాన్ విలువను తగ్గించింది. యువాన్ విలువ తగ్గింపుతో కొద్దికాలంపాటు ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ మార్కెట్లలో ప్రకంపనాలు కలిగాయి. బ్రిక్స్ బ్యాంక్ ఆవిర్భావం... చైనా రాజధాని షాంఘై కేంద్రంగా మంగళవారం నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) ఆవిర్భవించింది. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల కూటమి 100 బిలియన్ డాలర్ల మూలధనంతో ఈ బ్యాంకును ఏర్పాటు చేసింది. భారత్ మదిలో మెదిలిన ఈ ఆలోచన అటు తర్వాత మూడేళ్లకు కార్యరూపం దాల్చింది. ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వంటి పశ్చిమదేశాల ఆధిపత్య ధోరణి బహుళజాతి బ్యాంకులపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవడం ఈ బ్యాంక్ ఏర్పాటు లక్ష్యం. షాంఘై కేంద్రంగా ఏర్పాటుకానున్న బ్రిక్స్ బ్యాంకు తొలి ప్రెసిడెంట్గా కేవీ కామత్ పేరు ఖరారైంది. ఆయన ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్లకు చైర్మన్గా పనిచేశారు. డిజిటల్ ఇండియాకు 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రధాని మోదీ ప్రారంభించిన డిజిటల్ ఇండియా వీక్ కార్యక్రమంలో ముకేశ్ అంబానీ, సునీల్ మిట్టల్, సైరస్ మిస్త్రీ, కుమార మంగళం బిర్లా, అజీం ప్రేమ్జీ, అనిల్ అంబానీ, బెర్న్హార్డ్ గెర్వర్ట్ తదితర దేశ విదేశ దిగ్గజాలు దాదాపు 18 లక్షల ఉద్యోగాల కల్పన జరిగేలా డిజిటల్ రంగంపై సుమారు రూ. 4.5 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో బిర్లా 7 బిలియన్ డాలర్లు, మిట్టల్ రూ. 1 లక్ష కోట్లు, అనిల్ అంబానీ రూ. 10,000 కోట్లు, కుమార మంగళం బిర్లా 9 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతామని వెల్లడించారు. 30,000 శిఖరంపై సెన్సెక్స్.. మార్చి4న రికార్డు గరిష్టస్థాయి సెన్సెక్స్ 30,025 స్థాయిని తాకి, ఆ రోజున చివరగా 29,381 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 9,100 స్థాయిని తాకి చివరకు 8,923 వద్ద ముగిసింది. ఈ ఏడాది పలు కంపెనీలు ఐపీవోకు వచ్చాయి. అందులో రూ. 3 వేల కోట్ల ఇండిగో ఐపీవో కీలకం. తగ్గిన పుత్తడి తళుకు.. బంగారం ధరల పతనం 2013 నుంచి మొదలై 2015లో కూడా కొనసాగింది. ఈ ఏడాది 10 గ్రాముల బంగారం ధర రూ.1,000 మేర (దాదాపు 5 శాతం) క్షీణించింది. ఏడాది ప్రారంభంలో రూ.26,700గా ఉన్న 10 గ్రాముల బంగారం ధర సంవత్సరాంతానికి రూ.25,500 స్థాయికి దిగింది. అలాగే వెండి ధర కూడా రూ.37,200 నుంచి రూ.34,300కు పడింది. రూపాయి మారక విలువ విపరీతమైన ఒడిదుడుకులు, అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీ రేట్ల పెంపు విషయంలో నెలకొని ఉన్న సందిగ్ధత వల్ల ఏడాది మొత్తం బంగారం ధర ఊగిసలాటకు గురయ్యింది. చైనా ఆర్థిక మాంద్యం కూడా దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. గోల్డ్ బాండ్స్కు ఓకే...డిపాజిట్కు నో ప్రభుత్వం ప్రారంభించిన పసిడి పథకాల విషయంలో... బాండ్లకు మంచి స్పందన లభించింది. వీటికి రూ. 246 కోట్ల విలువైన దరఖాస్తులు రాగా, గోల్డ్ డిపాజిట్ స్కీమ్ కింద ఒక నెలలో 400 గ్రాముల బంగారాన్నే బ్యాంకులు సమీకరించగలిగాయి. పేమెంట్ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులకు ఓకే... రిలయన్స్ ఇండస్ట్రీస్, పోస్టల్ డిపార్ట్మెంట్ సహా 11 సంస్థలు పేమెంట్ బ్యాంకులు ఏర్పాటు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) సూత్రప్రాయంగా అనుమతులు ఇచ్చింది. మొత్తం 41 సంస్థలు పేమెంట్ బ్యాంకు పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అలాగే సూక్ష్మ పరిశ్రమలు, సన్నకారు రైతులకు ప్రాథమిక బ్యాంకింగ్ సేవల్ని అందించే లక్ష్యంతో చిన్న ఫైనాన్స్ బ్యాంకుల ఏర్పాటుకు సంబంధించి 10 సంస్థలకు ఆర్బీఐ సూత్రప్రాయంగా అనుమతులు ఇచ్చింది. ఈ జాబితాలో ఉజ్జీవన్ ఫైనాన్షియల్ వంటివి ఉన్నాయి. గ్రీసు సంక్షోభం.. ఐఎంఎఫ్ రుణం చెల్లింపులో డిఫాల్ట్ కావడంతో గ్రీసు ఆర్థిక సంక్షోభం తారస్థాయికి చేరింది. ఐఎంఎఫ్ చెల్లింపుల్లో డిఫాల్ట్ అయిన తొలి అభివృద్ధి చెందిన దేశంగా గ్రీస్ నిలిచింది. అలాగే గ్రీసులో కొద్దిరోజులపాటు బ్యాంకులు మూసివేశారు. ప్రపంచవ్యాప్తంగా గ్రీసు సంక్షోభ ప్రభావం ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రసరించి, కొద్దిరోజుల పాటు ఇవి పతనమయ్యాయి. అటుతర్వాత దాదాపు 12 బిలియన్ యూరోల బెయిలవుట్ రుణ మొత్తం విడుదలకు సంబంధించి రుణదాతలతో ఒప్పందం కుదుర్చుకోవడంతో తాత్కాలికంగా గ్రీసుకు ఊరట లభించింది. దీని కింద మరో 48 సంస్కరణలను గ్రీస్ అమలు చేయాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా పెన్షన్ల తగ్గింపు, వ్యాట్ పెంపు వంటివి ఉన్నాయి. ఫోక్స్ వ్యాగన్పై ‘కాలుష్య’ మేఘాలు... ఫోక్స్వ్యాగన్ కార్ల కాలుష్య ప్రమాణాలపై భారత్లో కూడా దర్యాప్తు మొదలైంది. ఈవిషయమై దర్యాప్తు చేయాలని ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఆర్ఏఐ)ను భారీ పరిశ్రమల శాఖ ఆదేశించింది. అమెరికాతో సహా పలు కంపెనీల్లో కాలుష్య నిబంధనల విషయంలో ఫోక్స్వ్యాగన్ మోసాలకు పాల్పడిందన్న విషయం వెలుగులోకి వచ్చి, ఆటోమొబైల్ రంగంలో సంచలనం సృష్టించింది. యాపిల్కొత్త ఐఫోన్లు వచ్చాయ్... టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఐఫోన్కి సంబంధించి 6 ఎస్, 6 ఎస్ ప్లస్ వెర్షన్లను ప్రవేశపెట్టింది. సిల్వర్, గోల్డ్, స్పేస్ గ్రే, రోజ్ గోల్డ్ రంగుల్లో వీటిని విడుదల చేసింది. 3డీ టచ్, అయాన్ ఎక్స్ గ్లాస్ డిస్ప్లే తదితర ఫీచర్లు ఇందులో ఉంటాయి. టాప్ ఇంటర్నేషనల్ డీల్స్ ప్రపంచంలోనే అతి పెద్ద కెమికల్ కంపెనీ ఏర్పాటుకు తెరతీస్తూ డో కెమికల్, డ్యుపాంట్ సంస్థలు విలీనం కానున్నాయి. దీంతో కొత్తగా ఏర్పడే కంపెనీ విలువ ఏకంగా 130 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 8.7 లక్షల కోట్లు) ఉండనుంది. ఫార్మా రంగంలో అత్యంత భారీ డీల్కు తెరతీస్తూ బొటాక్స్ తయారీ సంస్థ అలెర్గాన్, అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం ఫైజర్ విలీనం కానున్నాయి. ఈ డీల్ విలువ దాదాపు 160 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 10,40,000 కోట్లు) ఉండనుంది. ఐటీ రంగంలో అత్యంత భారీ డీల్కు తెరతీసింది టెక్నాలజీ దిగ్గజం డెల్. ఏకంగా 67 బిలియన్ డాలర్లు వెచ్చించి ఈఎంసీ కార్పొరేషన్ను కొనుగోలు చేయనుంది. -
2016 ప్రథమార్ధంలో 1,000 డాలర్ల దిగువకు..!
పసిడిపై నిపుణుల అభిప్రాయం న్యూయార్క్: పసిడిపై అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు పావు శాతం పెంపు (0.50 శాతం) ప్రభావం కనిపించింది. న్యూయార్క్ కామెక్స్ ట్రేడ్లో చురుగ్గా ట్రేడవుతున్న ఫిబ్రవరి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రా) ధర శుక్రవారం వారం వారీగా దాదాపు 11 డాలర్లు తగ్గి 1,065 వద్ద ముగిసింది. ఇదే ధోరణి ఇకముందూ కొనసాగుతుందన్న అభిప్రాయాన్ని ఈ రంగంలో నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. 2016 తొలి నెలల్లోనే వెయ్యి డాలర్ల దిగువకు పడిపోతుందన్నది వారి అంచనా. తొమ్మిది సంవత్సరాల తరువాత మొట్టమొదటిసారి బుధవారం (16వ తేదీ) ఫెడ్ వడ్డీరేటు పెంచిన వెంటనే పసిడి ఆరేళ్ల కనిష్ట స్థాయిలను చూసింది. ఒక్కసారిగా దాదాపు 15 డాలర్లు పడిపోయి 1,049 డాలర్లకు పతనమైంది. కాసేపటికి తిరిగి కోలుకుంది. టెక్నికల్ సపోర్ట్గా భావిస్తున్న 1,050 డాలర్లకు పైకి చేరి 1,055 వద్ద స్థిరపడింది. కాగా చురుగ్గా ట్రేడవుతున్న మార్చి కాంట్రాక్టుకు సంబంధించి వెండి ధర 14.09 డాలర్ల నుంచి 13.88 డాలర్లకు పడిపోయింది. పసిడిని చూస్తే... భవిష్యత్ బలహీనమైన ధోరణే కనిపిస్తోందన్నది నిపుణుల వాదన. ఆయా వర్గాల అభిప్రాయాలను ఒక్కసారి పరిశీలిస్తే... * వడ్డీరేట్ల పెరుగుదల నేపథ్యంలో పసిడి బలహీన ధోరణి అవకాశాలే ఉన్నాయని వాల్ స్ట్రీల్ జర్నల్ పేర్కొంది. విలువైన మెటల్ డిమాండ్ పడిపోతుందని ట్రేడర్లు భావిస్తుండడమే దీనికి కారణంగా పేర్కొంది. * మున్ముందు డాలర్ కదలికలు పసిడి ధర నిర్ణయంపై ప్రభావం చూపుతాయని మైనింగ్.కామ్ పేర్కొంది. మధ్యకాలికంగా చూస్తే.. పసిడి ధర మందగమనంలోనే ఉంటుందని అభిప్రాయపడింది. పసిడికి డిమాండ్ పెరగాలంటే... ద్రవ్యోల్బణం భారీగా ఉండాలనీ... ఇప్పుడు ఇలాంటి పరిస్థితి లేకపోవడం పసిడికి బలహీన అంశమేనని విశ్లేషించింది. దీనివల్ల ఫిజికల్ గోల్డ్కు డిమాండ్ పెరగడం కష్టంగా అంచనావేసింది. టెక్నికల్గా... ఇతర విలువైన మెటల్స్తో పోల్చిచూస్తే... పసిడి ధర ఇంకా అధికంగానే ఉందని కూడా పేర్కొంది. * గ్లోబల్ పోస్ట్ అభిప్రాయం కూడా పసిడి ధర పడిపోతుందనే. ఈ మేరకు తన నోట్స్లో గోల్డ్మన్ శాక్స్, జేపీ మోర్గాన్, సిటీ, ఏబీఎన్ ఆమ్రో, సొసైటీ జనరాలీ అంచనాలను కూడా ఉటంకించింది. 2016 తొలి నెలల్లోనే ఔన్స్ 1,000 డాలర్ల దిగువకు పడిపోతుందని అంచనావేసింది. * ప్రస్తుతం కన్నా... 2016 చివర్లో పసిడి బలంగా ముగుస్తుందని అంచనా వేస్తున్న హెచ్ఎస్బీసీ కూడా... రికవరీకి ముందు పసిడి సమీపకాలంలో భారీగా తగ్గుతుందని పేర్కొంటోంది. దేశీయంగా మళ్లీ నష్టాల్లోకి... ఏడు వారాల తరువాత ఎనిమిదవ వారం స్వల్పంగా లాభపడిన పసిడి... మళ్లీ ఏడు రోజులు తిరిగే సరికి... యథాపూర్వం నష్టాల్లోకి జారుకుంది. 18వ తేదీ శక్రవారంతో ముగిసిన వారంలో ముంబై స్పాట్ బులియన్ మార్కెట్లో 99.5 ప్యూరిటీ 10 గ్రాముల పసిడి విలువ రూ.25,380 నుంచి రూ. 25,085కు పడింది. అంటే రూ. 295 నష్టపోయింది. 99.9 ప్యూరిటీ 10 గ్రాముల పసిడి ధర కూడా ఇంతే పరిమాణంలో తగ్గి... రూ. 24,935 వద్ద ముగిసింది. ఇక వెండి (.999 ఫైన్) కేజీ ధర 33,520 వద్ద ముగిసింది. వారం వారీగా రూ.510 నష్టపోయింది. -
మన మార్కెట్లు కంచుకోటలు!
ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొనే సత్తా ఉంది... ► ఫెడ్ వడ్డీ రేట్ల ప్రభావం తక్కువే ఉంటుంది ► కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా... ► ప్రభావం ఉన్నా.. తక్కువేనంటున్న నిపుణులు న్యూఢిల్లీ: ఎంత భారీ ఒడిదుడుకులనైనా తట్టుకుని నిలబడేలా భారత మార్కెట్లు కంచుకోటల్లా తయారయ్యాయని, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం వాటిపై తక్కువే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు వల్ల భారత మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున విదేశీ నిధులు తరలిపోతాయనేది సరికాదని పేర్కొంది. సుదీర్ఘకాలం పాటు సున్నా స్థాయిలోనే ఉంచిన వడ్డీ రేట్లను అమెరికా ఫెడరల్ రిజర్వ్ పెంచడంతో భారత్ వంటి వర్ధమాన మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడొచ్చన్న అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే, గురువారం దేశీ మార్కెట్లు అందుకు భిన్నంగా లాభపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం సస్పెన్స్ తొలగిపోవడంతో కొత్త పరిణామాలకు మార్కెట్లు సర్దుకోవాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. రాబోయే రోజుల్లో ఫెడ్ రేట్లను మరింతగా పెంచే తీరును పరిశీలించాల్సి ఉంటుందని, అయితే దీని వల్ల ఎటువంటి సంక్షోభం ఎదురైనా తట్టుకునేందుకు భారత మార్కెట్లు సిద్ధంగా ఉన్నాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. మరోవైపు, రేట్ల పెంపు భారత్పై పెద్దగా ప్రభావం చూపకపోయినా, రూపాయి సహా వర్ధమాన మార్కెట్ల కరెన్సీలపై ఒత్తిడి పడే అవకాశం ఉందని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ సెక్రటరీ జనరల్ ఎ. దీదార్ సింగ్ చెప్పారు. రూపాయి మరింత బలహీనపడటం, ఫలితంగా దేశీ యంగా ద్రవ్యోల్బణంపై పడే ప్రభావాలను పరిశీలించాల్సి ఉంటుందని అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ తెలిపారు. అనిశ్చితి తొలగింది.. భారత్ సర్వసన్నద్ధంగా ఉండటంతో దేశీ మార్కెట్లలో ఫెడ్ రేట్ల పెంపు ప్రభావం చాలా తక్కువకే పరిమితం అయిందని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ అభిప్రాయపడ్డారు. ‘‘ఆస్తులు, అప్పుల ఖాతాలు పటిష్టంగా ఉన్నాయి. ద్రవ్య నిర్వహణ మెరుగ్గా ఉంది. స్థూల దేశీయోత్పత్తి వృద్ధి కూడా బాగుంది. వడ్డీ రేట్ల మార్పుల విషయంలో కరెన్సీ మార్కెట్లు అత్యంత వేగంగా స్పందించే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక శాఖ వాటిని నిరంతరం పరిశీలిస్తోంది’’ అని చెప్పారాయన. రాబోయే మరికొన్ని రోజుల్లో తీవ్ర ఒడిదుడుకులు ఎదురుకాకపోవచ్చని స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్ఈ సీఈవో ఆశీష్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. ఫెడ్ సరళ ద్రవ్యపరపతి విధానం.. భారత్ వంటి వర్ధమాన మార్కెట్లకు మేలు చేసేదేనని, భారత్లో విదేశీ ఫండ్స్ భారీ అమ్మకాలు జరపకపోవచ్చని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ చెప్పారు. అనిశ్చితి తొలగడంతో వ ర్ధమాన దేశాలు తగు నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు లభిస్తుందని ఆయన మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్లో పేర్కొన్నారు. కొంత నిధులు తరలిపోవచ్చు: రంగరాజన్ ఫెడ్ రేట్ల పెంపుతో దేశీ స్టాక్స్ కొంత బలహీనపడొచ్చని, అమెరికాలో మంచి రాబడులు రావొచ్చన్న అంచనాలతో భారత్ నుంచి కొంత పెట్టుబడులు తరలిపోవచ్చని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ చెప్పారు. అలాగే, పెట్టుబడుల రాక గతంలో కన్నా కొంత తగ్గొచ్చన్నారు. ఫెడ్ ప్రభావం మరీ తీవ్రంగా ఉండక పోవచ్చన్నారు. ‘‘భారత్ పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే ఉంది. గతంలో మాదిరి చెల్లింపుల సంక్షోభం వంటి సందర్భాలు రావు. ఎగుమతులు తగ్గినా దానికి తగ్గట్లు చమురు రేట్ల పతనంతో దిగుమతులు కూడా తగ్గాయి. ఫలితంగా కరెంటు ఖాతా లోటు 2% కన్నా తక్కువే ఉంది. దీనర్థం అదుపులో ఉన్నట్లే’’ అని వివరించారు. ఫెడ్ ప్రభావాలకు భారత్ అతీతం కాదు: ఫిచ్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడం వల్ల మార్కెట్లలో తలెత్తే హెచ్చుతగ్గుల ప్రభావాలకు భారత్ అతీతం కాదని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ పేర్కొంది. అయితే, సానుకూల ఆర్థిక వృద్ధి అంచనాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లకు భారత్ ఆకర్షణీయంగానే ఉండగలదని పేర్కొంది. ఎగుమతులపై తక్కువగా ఆధారపడి ఉండటం, విదేశీ మారక నిల్వలు మెరుగుపడటం తదితర అంశాల కారణంగా మిగతా పోటీ దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థితిలో ఉందని ఫిచ్ వివరించింది. సమీప భవిష్యత్లో రూపాయి మారకం విలువ మెరుగుపడగలదని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ పేర్కొంది. రేట్ల పెంపు అమెరికా ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థాయికి వస్తున్నదానికి సంకేతమని, ఇది దేశీ ఫారెక్స్.. బాండ్స్ మార్కెట్లకు సానుకూల అంశమని సంస్థ అనలిస్టు బన్సీ మధ్వానీ పేర్కొన్నారు. -
ఫెడ్ వడ్డనతో కుదేలైన చమురు రంగం
హైదరాబాద్: అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్ల పెంపు ప్రభావం చమురు రంగంపై తీవ్ర ప్రభావాన్నే చూపింది. ఫెడ్ వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచినా, చమురు ధరలను బాగానే ప్రభావితం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తీవ్రంగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ పుంజుకోవడంతో.. చమురు ధరలు ఏడేళ్ళ కనిష్టానికి క్షీణించాయి. బ్యారెల్ ముడి చమురు ధర ప్రస్తుతం 35 డాలర్లకు చేరింది. ఫెడ్ రేట్లలో ఎంతో కొంత పెంపు తప్పనిసరిగా ఉంటుందని ప్రపంచ ఆర్థిక నిపుణులు ముందే అంచనాలు వేశారు. ప్రస్తుత ఫెడ్ నిర్ణయంతో ఇప్పటికే గాడితప్పిన చమురు రంగం మాత్రం ఒక్కసారిగా కుదేలైంది. ఓపెక్ దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకునే దేశాలకు ఫెడ్ నిర్ణయం సానుకూలమైనా, ధరల తగ్గుదల ఎగుమతి దేశాల మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రపంచ మార్కెట్లపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంది. కనిష్టంగా 0 శాతం గరిష్ఠంగా 0.25 శాతంగా ఉన్న వడ్డీ రేట్లను కనిష్ఠంగా 0.25, గరిష్టంగా 0.5 శాతానికి పెంచుతూ అమెరిడా ఫెడరల్ బ్యాంకు బుధవారం రాత్రి ప్రకటించింది. 2006 జూన్ తర్వాత ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం ఇదే ప్రథమం. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్ఠ స్థితిలోనే ఉందని భావించిన ఫెడ్.. వడ్డీ రేట్లను పెంచటం ద్వారా మరింత ఆర్థిక పుష్ఠికి బాటలు వేయాలని భావిస్తోంది. రానున్న కాలంలో మరిన్ని సార్లు వడ్డీ రేట్లను పెంచనున్నట్లు కూడా ఫెడరల్ బ్యాంక్ ప్రకటించింది. -
దేశీ మార్కెట్ల గత చరిత్ర..
గత చరిత్ర చూస్తే.. అమెరికా ఫెడ్ రేట్లు పెంచిన అనంతరం ఆరు నెలల పాటు దేశీ మార్కెట్లకు సానుకూలంగానే ఉంటోంది. అమెరికా ఫెడ్ 1983 నుంచి 2006 దాకా వడ్డీ రేట్లు పెంచింది. 1994 ఫిబ్రవరి 4న ఫెడ్ రేటు పెంచడానికి ఆరు నెలల ముందు నుంచి బీఎస్ఈ సెన్సెక్స్ 69 శాతం ర్యాలీ చేసింది. 2,336 పాయింట్ల నుంచి 3,947 దాకా పెరిగింది. అయితే, ఆ తర్వాత ఆరు నెలలు మాత్రం ఈ వేగం మందగించింది. 8.3 శాతం పెరుగుదలతో 4,276 పాయింట్లకు పెరిగింది. రెండోసారి.. ఇక రెండో విడత పెంపు డాట్కామ్ బబుల్ బరస్ట్ అయ్యే తరుణంలో జరిగింది. 1999 జూన్ 30 నుంచి ఫెడ్ రేట్లను పెంచడం మొదలెట్టింది. దేశీ మార్కెట్లు అప్పుడప్పుడే అంతర్జాతీయ ర్యాలీకి అనుగుణంగా పెరగడం మొదలెట్టాయి. సెన్సెక్స్ ఆ సమయానికి 35 శాతం పెరుగుదలతో 3,060 స్థాయి నుంచి 4,144 పాయింట్లకు ఎగిసింది. ఫెడ్ రేటు పెంపుతో తర్వాత ఆరు నెలల్లో సుమారు మరో 30% పెరిగి 5,375 పాయింట్లను తాకింది. మూడోసారి .. చివరిగా 2004 జూన్ 30న ఫెడ్ రేట్లు పెంచింది. దాదాపు అదే సమయంలో ప్రభుత్వం మారడం తదితర పరిణామాలు కూడా చోటుచేసుకోవడంతో మార్కెట్లు పడ్డాయి. ఆ ఏడాది ప్రారంభంలో 5,915 పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్.. రేట్ల పెంపు నాటికి 18 శాతం తగ్గి 4,874 వద్ద ట్రేడవుతోంది. దీంతో రేట్లు పెంచిన ఆరు నెలల తర్వాత మార్కెట్లు 28 శాతం ఎగియగలిగాయి. చివరిసారిగా.. 2006 జూన్ 29న చివరిసారిగా ఫెడ్ వడ్డీ రేటును 5.25 శాతానికి పెంచింది. అప్పుడు సెన్సెక్స్ 10,609 పాయింట్ల వద్ద వుంది. ఇది తదుపరి ఆరు నెలల్లో 30 శాతం పెరిగి 13,846 పాయింట్లకు చేరింది. ఆర్థిక సంక్షోభం కారణంగా 2008 నుంచి వడ్డీ రేట్లను తగ్గిస్తూ క్రమేపీ 0-0.25 శాతం స్థాయికి దించింది. 2006 తర్వాత రేట్లను మళ్లీ పెంచడం ఇప్పుడే. -
ఫెడ్.. ‘‘వడ్డించెన్!
► వడ్డీ రేటు పావు శాతం పెంపు ► ప్రస్తుత 0.25 శాతం నుంచి 0.5 శాతానికి... ► ఆర్థిక వ్యవస్థ కోలుకుంటే భవిష్యత్తులో ► క్రమంగా పెంచుతామని ప్రకటన న్యూయార్క్: అంతా ఊహించినట్లే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత పెంచింది. ఫెడ్ ఫండ్స్ రేటును పావు శాతం మేర పెంచుతున్నట్లు బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రకటించింది. దీంతో వడ్డీ రేట్లు 0.25 - 0.50 శాతం శ్రేణికి పెరిగినట్లయింది. 2006 జూన్ తర్వాత ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం ఇదే ప్రథమం. అమెరికాలో ప్రస్తుతం 0-0.25 శాతం శ్రేణిలో వడ్డీ రేట్లు ఉన్నాయి. 2016లో మరో రెండు నుంచి నాలుగు దఫాలు రేట్ల పెంపు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఫెడ్ కూడా దీన్ని ధృవీకరిస్తూ.. భవిష్యత్లో క్రమేపీ రేట్ల పెంపు మరింత ఉండవచ్చని అధికారిక ప్రకటనలో పేర్కొంది. దీనికి తగ్గట్లే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆర్థిక పరిస్థితులు, గణాంకాలపై రేట్ల పెంపు ఆధారపడి ఉంటుందని తెలిపింది. రివర్స్ రెపో రేటును పావు శాతంగా ఉంచుతున్నట్లు ఫెడ్ తెలిపింది. మధ్యకాలికంగా ద్రవ్యోల్బణం 2 శాతానికి పెరగగలదని భావిస్తున్నట్లు తెలిపింది. ఫెడ్ సభ్యులు రేట్ల పెంపును ఏకగ్రీవంగా ఆమోదించారు. ఫెడ్ ఫండ్స్ రేటు అంటే.. మన రిజర్వ్ బ్యాంక్ రెపో, రివర్స్ రెపో రేట్లకు, ఫెడ్ ఫండ్స్ రేటుకు వ్యత్యాసం వుంది. రిజర్వ్ బ్యాంకు ఇతర వాణిజ్య బ్యాంకులకు రుణాలివ్వడానికి, బ్యాంకులతో తన వద్ద డిపాజిట్ చేయించడం కోసం రెపో సాధ నాన్ని ఆర్బీఐ వాడుతుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్, ఫెడ్ ఫండ్స్ రేటు అనే సాధనాన్ని ఉపయోగిస్తుంది. ఏడాదికి 8 దఫాలు జరిగే ఫెడ్ మార్కెట్ కమిటీ సమీక్షల్లో ఈ రేటు ఎంత వుండాలన్న నిర్ణయాన్ని ప్రకటిస్తూ వుంటారు. కానీ ఈ రేటుకు ఫెడ్ స్వయంగా అప్పులివ్వదు. అందుకే దీనిని ఫెడ్ ఫండ్స్ టార్గెట్ రేటుగా పేర్కొంటుంటారు. బ్యాంకులు, ద్రవ్య సంస్థలు వాటి నిర్దేశిత రిజర్వులకంటే మించి వున్న లేదా తగ్గిన స్వల్పకాలిక నిధుల్ని ఫెడ్ వద్ద వుంచుతాయి. వాటిని ఆయా బ్యాంకులు ఇచ్చి, పుచ్చుకునే వడ్డీ రేటును ఫెడ్ ఫండ్స్ ఎఫెక్టివ్ రేటుగా వ్యవహరిస్తారు. ఇది టార్గెట్ రేటుతో దాదాపు సమానంగా వుంటుంది. అయితే ఫెడ్ వద్ద ఇతర బ్యాంకుల నిల్వలు అవసరార్థం లేకపోతే ఫెడ్ స్వయంగా ఫెడ్ డిస్కౌంట్ రేటుపై రుణాలిస్తుంది. కానీ ఇది ఎఫెక్టివ్ రేటుకంటే అధికంగా వుంటుంది. రేట్లు పెంచడం ద్వారా అధిక వడ్డీ రేటుకు నిధుల్ని తీసుకునే బ్యాంకుల్ని నిరుత్సాహపర్చడానికి, రేటు తగ్గించడం ద్వారా కనిష్ట రేటుకు నిధుల్ని బ్యాంకులు తీసుకుని వ్యవస్థలో దారాళంగా రుణ సరఫరా చేయడానికి ఈ ఫెడ్ పండ్స్ రేటు సాధనాన్ని ఫెడరల్ రిజర్వ్ ఉపయోగిస్తుంది. మనపై ప్రభావం ఏంటి? మొత్తానికి అంతా అనుకున్నట్లే అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలకమైన వడ్డీ రేట్లను పెంచింది. మరి దీని ప్రభావం భారత్పై ఎలా ఉండబోతోంది? మార్కెట్లు ఎలా స్పందించవచ్చు? కంపెనీలపై ప్రభావం ఏమిటి? రూపాయి ఏం కావొచ్చు? ఈ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నమే ఈ కథనం. దేశీ కంపెనీలపై .. అంతర్జాతీయంగా డాలర్ లిక్విడిటీ తగ్గిపోవడం వల్ల .. విదేశీ రుణాలు తీసుకున్న కార్పొరేట్లపై చెల్లింపులపరమైన ఒత్తిళ్లు పెరగొచ్చు. దీంతో ఆయా కంపెనీలకు మార్కెట్లలో కష్టకాలం ఎదురుకావొచ్చు. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్, భారతి ఎయిర్టెల్, హిందాల్కో, వేదాంత, అదాని పవర్, రిలయన్స్ పవర్ తదితర కంపెనీలకు డాలర్ల రూపంలో తీసుకున్న రుణం భారీగా వుంది. రూపాయిపై .. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఇప్పటికే గణనీయంగా పడిపోయింది. ఎఫ్ఐఐలు నిధులు వెనక్కి తీసుకుపోయే పక్షంలో ఇది మరింత క్షీణించే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రూపాయిని ఆదుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ రంగంలోకి దిగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే కరెంటు అకౌంటు లోటుపై ఒత్తిడి పెరగొచ్చని వారి అభిప్రాయం. భారత్, అమెరికా బాండ్లపై వడ్డీ రేట్ల మధ్య గణనీయంగా వ్యత్యాసమున్నప్పటికీ.. ఇటీవల దేశీయంగా ఆర్బీఐ రేట్లను తగ్గిస్తూ వస్తున్నందున... ఈ వ్యత్యాసమూ తగ్గుతోంది. తాజాగా అమెరికాలో రేట్లు పెంచడం వల్ల అక్కడి బాండ్లు.. విదేశీ ఇన్వెస్టర్లకు మరింత ఆకర్షణీయంగా మారగలవు. దీంతో వారు అమెరికా బాండ్లలో పెట్టేందుకు.. ఇప్పటిదాకా ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన నిధులను వెనక్కి తీసుకెళ్లిపోవచ్చు. ఆర్బీఐ వడ్డీ రేట్లు.. ఇంధన అవసరాల కోసం భారత్ సుమారు 80% ముడిచమురును దిగుమతి చేసుకుంటోంది. రూపాయి క్షీణిస్తే ఇంధనం ధరలు పెరుగుతాయి. ఫలి తంగా ద్రవ్యోల్బణమూ పెరుగుతుంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం, రూపాయి మారకం విలువను స్థిరపర్చడం లక్ష్యాలతో ఆర్బీఐ కీలక పాలసీ రేట్లను తగ్గించడానికి ఇష్టపడకపోవచ్చు. పసిడి పడేనా..పెరిగేనా? వడ్డీ రేట్లపై ఫెడ్ నిర్ణయం దరిమిలా పసిడి రేటు తగ్గొచ్చని కొన్ని వర్గాలు, పెరగొచ్చని మరికొన్ని వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా డాలరు కదలికలకు వ్యతిరేక దిశలో పుత్తడి రేట్లు ఉంటాయని, డాలరు మరింత పటిష్టం కావొచ్చు గనుక పసిడి ధర ఇంకా పడొచ్చని అంచనాలు ఉన్నాయి. ఒకవేళ వడ్డీ రేట్ల పెంపును మార్కెట్లు ఇప్పటికే డిస్కౌంటు చేసుకున్న పక్షంలో ఫెడ్ తదుపరి మళ్లీ ఎప్పుడు పెంచవచ్చన్న సంకేతాల కోసం ట్రేడర్లు వెతుక్కుంటారని, ఆ రకంగా చూసినా బంగారం ధరలు తగ్గేట్లే కనిపిస్తున్నాయని ఒక వర్గం చెబుతోంది. అయితే, ఇప్పటికే రేట్ల పెంపు అంచనాలకు అనుగుణంగా మార్కెట్లు భారీగా సర్దుకున్నాయని, దీంతో డాలరు తగ్గి, పసిడి మరింత పెరగొచ్చని తెలిపింది. స్టాక్ మార్కెట్లపై.. గడచిన ఆరు నెలల్లో సెన్సెక్స్ సుమారు 11% తగ్గింది. 4 నెలల పాటు ఎఫ్ఐఐలు నికరంగా అమ్ముతూనే ఉన్నారు. వడ్డీ రేట్లు పెంపుతో గ్లోబల్ ఫండ్స్ భారత్ సహా వర్ధమాన మార్కెట్ల నుంచి నిధులు ఉపసంహరించవచ్చు. అయితే, భారత ఎకానమీ రికవరీ బాటలో ఉండటం, స్థూల దేశీయోత్పత్తి మెరుగుపడుతుండటం తదితర అంశాల కారణంగా దేశీ మార్కెట్లు మరీ భారీగా స్పందించకపోవచ్చని పరిశీలకుల అంచనా. -
మూడో రోజూ లాభాల్లోనే...
► ఫెడ్ ఎఫెక్ట్ లేదంటున్న నిపుణులు ► 174 పాయింట్ల లాభంతో 25,494కు సెన్సెక్స్ ► 50 పాయింట్ల లాభంతో 7,751కు నిఫ్టీ అంతర్జాతీయ స్టాక్మార్కెట్ల మాదిరే భారత స్టాక్ మార్కెట్ కూడా బుధవారం లాభాల్లో ముగిసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపును మార్కెట్లు ఇప్పటికే డిస్కౌంట్ చేసుకున్నాయని ఇన్వెస్టర్లు భావించారని దీంతో స్టాక్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాల బాటలోనే సాగాయని నిపుణులంటున్నారు. దీనికి తోడు ఇంధన షేర్లు పెరగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 174 పాయింట్లు లాభపడి 25,494 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 పాయింట్లు లాభపడి 7,751 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్ సూచీలు రోజం తా లాభాల్లోనే ట్రేడయ్యాయి. వడ్డీరేట్లపై నిర్ణయాన్ని అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం అర్థరాత్రి వెల్లడించనున్నది. ఆయిల్ షేర్లకు లాభాలు: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆరేళ్ల కనిష్ట స్థాయి నుంచి రికవరీ కావడంతో ఆయిల్ షేర్లు లాభపడ్డాయి. ఓఎన్జీసీ, కెయిర్న్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 4% వరకూ పెరిగాయి. 2,000 సీసీ అంతకంటే ఎక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న డీజిల్ వాహన రిజిస్ట్రేషన్లపై వచ్చే ఏడాది మార్చి 31 వరకూ సుప్రీం కోర్ట్ నిషేధం(ఢిల్లీలో) విధించడంతో మహీంద్రా అండ్ మహీంద్రా 5.4 శాతం నష్టపోయింది. కాగా ఎన్ఎస్ఈకి చెందిన ఇండియా ఇండెక్స్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్(ఐఐఎస్ఎల్) సంస్థ మూడు గ్రూప్ ఇండెక్స్లను బుధవారం ప్రారంభించింది. ఆయా గ్రూప్ కంపెనీల పనితీరును ట్రాక్ చేయడానికి నిఫ్టీ టాటా గ్రూప్ ఇండెక్స్, నిఫ్టీ ఆదిత్య బిర్లా గ్రూప్ ఇండెక్స్, నిఫ్టీ మహీంద్రా గ్రూప్ ఇండెక్స్లను పూర్తి మార్కెట్ క్యాపిటలైజేషన్ విధానం ఆధారంగా రూపొందించామని ఐఐఎస్ఎల్ పేర్కొంది. -
ఫెడ్ రేట్ల పెంపుపై సిద్ధంగా ఉన్నాం..
పావు శాతం వరకూ పెంచొచ్చని అంచనా... ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యలు కోల్కతా: అమెరికా సెంట్రల్ బ్యాంక్.. ఫెడరల్ రిజర్వ్ వచ్చే వారం జరపనున్న సమీక్షలో పావు శాతం వరకూ వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ నిర్ణయం కారణంగా తలెత్తే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. శుక్రవారమిక్కడ ఆర్బీఐ బోర్డు సమావేశంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాజన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘రేట్ల పెంపునకు సంబంధించి ఫెడ్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. 0.1-0.25 శాతం మేర పెంపు ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. మెజారిటీ మార్కెట్ వర్గాలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఫెడ్ రేట్ల పెంపు అనేది దాదాపు ఖాయమేనని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఊర్జిత్ పటేల్ కూడా పేర్కొన్నారు. ఇదే జరిగితే మార్కెట్లలో నిధుల ప్రవాహంపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు. ఫెడ్ సమీక్ష ఈ నెల 15-16 తేదీల్లో జరగనుంది. ఆర్థిక వ్యవస్థ రికవరీ పుంజుకుంటుండటం, ఉద్యోగ గణాంకాలు కూడా ఆశావహంగానే నమోదవుతున్న నేపథ్యంలో దశాబ్దం తర్వాత తొలిసారిగా ఫెడ్ వడ్డీరేట్లను పెంచుతుందన్న బలమైన అంచనాలు నెలకొన్నాయి. ఇదే జరిగితే.. భారత్ సహా వర్ధమాన దేశాల క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీగా నిధులు ఉపసంహరించుకుంటారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నాటినుంచి ఫెడ్ వడ్డీరేటును దాదాపు జీరో స్థాయిలోనే(0.25 శాతం) కొనసాగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఫెడ్ చైర్పర్సన్ జానెట్ ఎలెన్ కూడా ఈసారి రేట్ల పెంపు అనివార్యమంటూ సంకేతాలివ్వడం తెలిసిందే. రికవరీల జోరు పెంచాలి... భారీగా పేరుకుపోతున్న మొండిబకాయిలను వసూలు చేసేందుకు బ్యాంకులు తీసుకునే కఠిన చర్యలను అడ్డుకోవడంలో బడా కంపెనీల ప్రమోటర్లు ఆరితేరారని గవర్నర్ రాజన్ బ్యాంకులను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆలస్యం చేయకుండా రికవరీ ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా ఆయన సూచించారు. ‘మొండిబకాయిల సమస్యను అధిగమించేందుకు బ్యాంకులకు చాలా మార్గాలు ఉన్నాయి. అయితే, కొన్ని కేసుల్లో అవి చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నాయి. దీనికి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో కొంతమంది బడా ప్రమోటర్లు కూడా బ్యాంకుల చర్యలను అడ్డుకోవడానికి తమ శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తున్నారు’ అని రాజన్ వ్యాఖ్యానించారు. ఐడీబీఐ బ్యాంకుకు రూ.900 కోట్ల రుణాన్ని ఎగవేసిన కేసులో యూబీ గ్రూప్ చైర్మన్ విజయ్ మాల్యాను తాజాగా సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ రూ.5,800 కోట్లకుపైగా రుణ డిఫాల్ట్కు సంబంధించి మాల్యాను ఎస్బీఐ ఇప్పటికే ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా కూడా ప్రకటించింది. కాగా, వ్యవస్థలో తగినంత ద్రవ్య సరఫరా(లిక్విడిటీ) ఉండేవిధంగా ఆర్బీఐ చర్యలు తీసుకుంటుందని రాజన్ చెప్పారు. ఇందుకోసం అవసరమైతే ఓపెన్ మార్కెన్ నుంచి కూడా బాండ్లను కొనుగోలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. -
జీఎస్టీ బిల్లు, రూపాయి కీలకం
ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై ప్రపంచ మార్కెట్ల దృష్టి * విశ్లేషకుల అంచనా న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుపై పార్లమెంట్ ఏవిధంగా స్పందిస్తున్నది ఈ వారం మార్కెట్కు కీలకమైన అంశమని నిపుణులంటున్నారు. అలాగే డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు అంచనాల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయనే అంశాలు కూడా స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపుతాయని వారంటున్నారు. వచ్చే శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడే అక్టోబర్ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాల కారణంగా షేర్లు ఒడిదుడుకులకు గురి కావచ్చని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపుపై స్పష్టత వచ్చే వరకూ ఇన్వెస్టర్లలో ఆందోళన కొనసాగుతుందని రిలయన్స్ సెక్యూరిటీస్ హెడ్ (రీసెర్చ్) హితేశ్ అగర్వాల్ చెప్పారు. రూపాయి బలహీనత విదేశీ ఇన్వెస్టర్లను మరింతగా ఆందోళనకు గురి చేస్తోందని ఆయన చెప్పారు. ఒక వేళ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందితే మార్కెట్ దూసుకుపోతుందని పేర్కొన్నారు. వేచి చూసే ధోరణి.. జీఎస్టీ బిల్లుతో పాటు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, అంతర్జాతీయ మార్కెట్ల పోకడ, రూపాయి కదలికలు స్టాక్ మార్కెట్కు దిశా నిర్దేశం చేస్తాయని ట్రేడ్ స్మార్ట్ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో మార్కెట్ వేచి చూసే ధోరణిలో ఉందని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జేమ్స్ మోడీ చెప్పారు. వడ్డీరేట్లు పెంచుతామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్ పర్సన్ జానెట్ యెలెన్ సూచనప్రాయంగా గత వారంలో వెల్లడించారని, ఫలితంగా విదేశీ నిధులు తరలిపోయే అవకాశాలున్నాయనే ఆందోళన ఇన్వెస్టర్లలో నెలకొన్నదని పేర్కొన్నారు. చెన్నై వరదలు కొన్ని వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపించడం కూడా సెంటిమెంట్ను దెబ్బతీస్తుందని జియోజిత్ బీఎన్పీ పారిబా హెడ్(టెక్నికల్ రీసెర్చ్ హెడ్) ఆనంద్ జేమ్స్ పేర్కొన్నారు. గత వారం మార్కెట్.. గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 490 పాయింట్లు(1.87 శాతం), నిఫ్టీ 161 పాయింట్లు (2 శాతం) చొప్పున నష్టపోయాయి. గత శుక్రవారం డాలర్తో రూపాయి మారకం రెండేళ్ల కనిష్ట స్థాయి(67.01)కి క్షీణించింది. విక్రయాల బాటలోనే విదేశీ ఇన్వెస్టర్లు విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాల బాటలోనే ఉన్నారు. వడ్డీరేట్ల పెంపు తప్పదంటూ అమెరికా ఫెడరల్ చైర్పర్సన్ జానెట్ యెలెన్ సూచనప్రాయంగా వెల్లడించిన నేపథ్యంలో ఈ నెల 1-4 తేదీల్లో ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు రూ. 2,300 కోట్ల విక్రయాలు జరిపారు. ఇదే కాలానికి డెట్ మార్కెట్లో వీరి నికర పెట్టుబడులు రూ. 2.81 కోట్లుగా ఉన్నాయి. గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లో రూ. 7,074 కోట్ల అమ్మకాలు జరిపారు. జానెట్ యెలెన్ వ్యాఖ్యల కారణంగా సున్నా వడ్డీరేట్ల శకం ముగిసినట్లేనని ఇన్వెస్టర్లు భావిస్తున్నారని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ (ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్లో రూ. 18,260 కోట్లుగా, డెట్ మార్కెట్లో రూ. 51,347 కోట్లు నికరంగా పెట్టుబడులు పెట్టారు. -
ఫెడ్ భయాలతో.. 231 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
25,887 పాయింట్ల వద్ద ముగింపు 67 పాయింట్లు క్షీణించి 7,864కు చేరిన నిఫ్టీ అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు తప్పదన్న సంకేతాలు వెలువడడంతో గురువారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. నవంబర్లో సేవల రంగం వృద్ధి తగ్గడం కూడా సెంటిమెంట్పై ప్రభావం చూపింది. వరుసగా రెండో రోజూ స్టాక్ సూచీలు నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 26 వేల పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 7,800 పాయింట్ల దిగువన ముగిశాయి. ట్రేడింగ్ చివరలో అమ్మకాలు వెల్లువెత్తడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 231 పాయింట్లు నష్టపోయి 25,887 పాయింట్లు వద్ద, నిఫ్టీ 67 పాయింట్లు క్షీణించి 7,864 పాయింట్ల వద్ద ముగిశాయి. రెండు వారాల్లో సెన్సెక్స్కు ఇదే అతి పెద్ద పతనం. ఎఫ్ఎంసీజీ, వాహన, కొన్ని బ్యాంక్, ఆర్థిక సేవల కంపెనీల షేర్లు నష్టపోయాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ జానెట్ యెలెన్ అమెరికా ఆర్థిక వ్యవస్థ పట్ల నమ్మకం వ్యక్తం చేసారని, దీంతో సున్నా వడ్డీరేట్ల శకం ముగిసిందని ఇన్వెస్టర్లు గ్రహిస్తున్నారని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. ఐదు సెన్సెక్స్ షేర్లకే లాభాలు 30 సెన్సెక్స్ షేర్లలో 25 షేర్లు నష్టపోయాయి. యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు మాత్రమే పెరిగాయి. వర్షాలు భారీగా కురుస్తుండటంతో చెన్నైలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు ఐటీ, వాహన షేర్ల ధరల పతనం కొనసాగుతోంది. యూరో మార్కెట్లకు భారీ నష్టాలు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఈసీబీ ప్యాకేజీ ఇస్తుందన్న అంచనాలతో యూరోప్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. కానీ ఈసీబీ చర్యలు ఆశించిన స్థాయిలో లేవన్న అంచనాలతో భారీ నష్టాల్లో ముగిశాయి. వచ్చే ఏడాది చివరకు సెన్సెక్స్ 29,000 పాయింట్లకు! ప్రస్తుతం 25,887 పాయింట్లుగా ఉన్న సెన్సెక్స్ వచ్చే ఏడాది చివరికల్లా 29,000 పాయింట్లకు చేరుతుందని డాయిష్ బ్యాంక్ అంచనా వేస్తోంది. అనుకూలమైన అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ పెట్టుబడులను ఆకర్షించడం కొనసాగుతుందని వివరించింది. కంపెనీల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతుం డడం, కమోడిటీ ధరల తగ్గుముఖం, పట్టణ వినియోగం మెరుగుదత వంటివి సానుకూలాంశాలని వివరించింది. -
‘ఫెడ్’ప్రభావం తక్కువే..
అక్కడ వడ్డీరేట్లు పెంచినా మనపై అంత ప్రతికూలత ఉండదు.. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికా వడ్డీ రేట్లు పెంచినా మన ఆర్థిక వ్యవస్థపై అంతగా ప్రతికూల ప్రభావం చూపదని ఆర్బీఐ మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్లు పెంచడం వల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (క్యాడ్) కొద్దిగా పెరుగుతుందన్నారు. డాలరుతో రూపాయి విలువ ఇప్పటికే బాగా క్షీణించడం వల్ల అమెరికా వడ్డీరేట్ల ప్రభావం వల్ల మరింత తగ్గే అవకాశాలు తక్కువేనన్న అభిపాయ్రాన్ని వ్యక్తం చేశారు. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) ఫౌండర్ డెరైక్టర్ డాక్టర్ వహిదుద్దీన్ ఖాన్ స్మారకోపన్యాస కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుబ్బారావు ‘సాక్షి’తో మాట్లాడుతూ అమెరికా వడ్డీరేట్లు పెంచితే స్వల్పకాలానికి మార్కెట్లు కొద్దిగా కుదుపునకు లోనవుతాయే కానీ, దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపదన్నారు. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ బేస్ రేట్ మార్పుపై స్పందిస్తూ ఇది నిరంతర ప్రక్రియని, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ప్రైసింగ్ ప్రకారం మార్చాలని చూస్తోందన్నారు. అంతకముందు స్మారకోపన్యాసంలో ఆయన మాట్లాడుతూ తన ఐదేళ్ల పదవీ కాలమంతా సంక్షోభాలతో నడించిందన్నారు. అమెరికా సబ్ ప్రైమ్, యూరప్ రుణ సంక్షోభం తర్వాత కరెన్సీ క్షీణించడం వంటి వరస సంక్షోభాలను చవి చూడాల్సి వచ్చిందన్నారు. వీటన్నింటిల్లో 2013లో జరిగిన రూపాయి విలువ పతనాన్ని అడ్డుకోవడం పెను సవాల్గా నిలిచిందన్నారు. ఆ సమయంలో కేవలం మూడు నెలల్లో రూపాయి విలువ 17 శాతం క్షీణించిందన్నారు. మిగిలిన సంక్షోభాలను అర్థం చేసుకొని పరిష్కార మార్గం కనుక్కోవడానికి తగిన సమయం ఉండేదని, కానీ కరెన్సీ విలువ పతనాన్ని అడ్డుకోవడానికి అప్పటికప్పుడు రియల్ టైమ్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చేదన్నారు. ఇలాంటి సమయంలో తీసుకున్న నిర్ణయాలు మార్కెట్కు నమ్మకం కలిగించకపోవడంతో రూపాయి మరింత క్షీణించేదన్నారు. ప్రపంచంలో ఏ దేశ రాజకీయ నాయకులైనా, కార్పొరేట్లు అయినా.. వడ్డీరేట్లు తగ్గించడం ద్వారా జీడీపీ వృద్ధి రేటును పెంచాలని డిమాండ్ చేస్తుంటారే కానీ వడ్డీరేట్లు పెంచడం ద్వారా ధరలను తగ్గించాలని పేదవాడి కోసం ఎవరూ అడగరని దువ్వూరి వ్యాఖ్యానించారు. ఇందుకు ఇండియా కూడా మినహాయింపు కాదన్నారు. కానీ వడ్డీరేట్లు తగ్గింపునకు కొత్త ఇన్వెస్ట్మెంట్లకు సంబంధం లేదన్నారు. ధరల స్థిరీకరణ, వృద్ధిరేటు, ఆర్థికవ్యవస్థ స్థిరత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆర్బీఐ నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. గంటకు పైగా సాగిన ప్రసంగంలో అప్పటి సంక్షోభాలు వాటిని ఎదుర్కొన్న తీరును ఆ సందర్భంలో వచ్చిన విమర్శలను దువ్వూరి వివరించారు. -
ఫెడ్ మినిట్స్తో లాభాలు
వడ్డీరేట్ల పెంపు విషయంలో తొందరపడకూడదని ఫెడ్ సమావేశ వివరాలు వెల్లడించడంతో ప్రపంచ మార్కెట్లతో పాటు మన స్టాక్ మార్కెట్ కూడా శుక్రవారం లాభాల్లో ముగిసింది. డాలర్తో రూపాయి మారకం 31 పైసలు పెరగడం కూడా సానుకూల ప్రభావం చూపింది. బీఎస్ఈ సెన్సెక్స్ 234 పాయింట్ల లాభంతో 27,080 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 8,190 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ వారంలో సెన్సెక్స్ 858 పాయింట్లు (3.3 శాతం), నిఫ్టీ 3% చొప్పున లాభపడ్డాయి. దూసుకుపోయిన వేదాంత.. కమోడిటీ కంపెనీ వేదాంత 11.6 శాతం ఎగసింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా లాభపడ్డ షేర్ ఇదే. అంతర్జాతీయ లోహ దిగ్గజం గ్లెన్కోర్ జింక్ ఉత్పత్తిని 5 శాతం వరకూ తగ్గించనున్నామని ప్రకటించడంతో ధరల పతనానికి అడ్డుకట్ట పడుతుందన్న అంచనాలతో లోహ షేర్లు పెరిగాయి. మార్కెట్ పరిస్థితులు ఒడిదుడుకులుగా ఉండటంతో జూలై-సెప్టెంబర్ క్వార్టర్కు మూలధన, నిర్వహణ వ్యయాలు తగ్గించుకున్నామని వేదాంత రిసోర్సెస్ పేర్కొంది. ప్రభుత్వ రంగ సౌరశక్తి ప్రాజెక్టులకు బిడ్ చేయాలని నిర్ణయించడం కూడా ప్రభావం చూపింది. ఈ అంశాల కారణంగా వేదాంత షేర్ 11.6 శాతం వృద్ధి చెంది రూ. 104 వద్ద ముగిసింది. 30 సెన్సెక్స్ షేర్లలో 19 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో(సోమవారం ఫలితాలు వెలువడతాయి) ఇన్ఫోసిస్ షేర్ 3 శాతం పెరిగింది. టాటా స్టీల్ 4 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 3 శాతం, ఓఎన్జీసీ, గెయిల్, హిందాల్కో, సిప్లా 2 శాతం చొప్పున, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, హీరో మోటొకార్ప్, హెచ్డీఎఫ్సీలు 1 శాతం చొప్పున పెరిగాయి. ఇక నష్టపోయిన షేర్ల విషయానికొస్తే, కోల్ ఇండియా 3 శాతం, మారుతీ సుజుకీ 2 శాతం, సన్ ఫార్మా 1 శాతం, భెల్ 1 శాతం చొప్పున తగ్గాయి. ముడి చమురు ధరలు పెరగడంతో పలు కంపెనీల ఆయిల్ షేర్లు 2.7 శాతం వరకూ నష్టపోయాయి. -
ఆరు రోజుల ర్యాలీకి బ్రేక్
బలహీనంగా అంతర్జాతీయ సంకేతాలు క్యూ2 ఫలితాల నేపథ్యంలో ముందు జాగ్రత్తలో ఇన్వెస్టర్లు 190 పాయింట్ల నష్టంతో 26,846కు సెన్సెక్స్ 48 పాయింట్లు నష్టపోయి 8,129కు నిఫ్టీ ఆరు రోజుల స్టాక్ మార్కెట్ ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం వివరాలు(మినిట్స్) వెల్లడికానున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం, ప్రైవేట్ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, ఆయిల్, కొ న్ని ఫార్మా షేర్లలో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, ప్రస్తుతమున్న ర్యాలీ పరిమిత కాలమేనని ఇన్వెస్టర్లు సందేహిస్తుండడం... ప్రతికూల ప్రభావం చూపాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 190 పాయింట్లు నష్టపోయి 26,846 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 48 పాయింట్లు నష్టపోయి 8,129 పాయింట్ల వద్ద ముగిశాయి. అయితే లోహ షేర్లు జోరు కొనసాగింది. ఇన్వెస్టర్ల ముందు జాగ్రత్త: అందరి అంచనాలను మించి ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించినప్పటి(సెప్టెంబర్ 29 గత మంగళవారం) నుంచి స్టాక్ మార్కెట్ లాభాల్లోనే సాగుతోంది. దీనికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు మరింత ఆలశ్యమయ్యే అవకాశాలున్నాయన్న అంచనాలు కూడా తోడవడంతో స్టాక్ మార్కెట్ గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో జోరుగా పెరుగుతూనే ఉంది. గత ఫెడరల్ రిజర్వ్ సమావేశ మినిట్స్ ద్వారా రేట్ల కోత ఎప్పుడు ఉండొచ్చనే సంకేతాల కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నాయి. ఈ నెల 12న ఇన్ఫోసిస్ కంపెనీ జూలై-సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలను వెల్లడించనున్నది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2 ఆర్థిక ఫలితాలు ఆరంభమవుతాయి. ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు కూడా వచ్చే వారం వెలువడనున్నాయి. సెన్సెక్స్ గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో 1,419 పాయింట్లు లాభపడింది. ఈ అంశాలన్నింటి కారణంగా ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారని విశ్లేషకులంటున్నారు. రిలయన్స్ 2.7 శాతం డౌన్: ఓఎన్జీసీతో ఉన్న గ్యాస్ వివాదానికి సంబంధించిన దర్యాప్తు రిలయన్స్ ఇండస్ట్రీస్కు వ్యతిరేకంగా మారే అవకాశాలున్నాయన్న వార్తల కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.7 శాతం క్షీణించి రూ. 889 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా నష్టపోయిన షేర్ ఇదే. 30 సెన్సెక్స్ షేర్లలో 19 షేర్లు నష్టాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్తో పాటు గెయిల్ 2.5 శాతం, ఐటీసీ 2 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.5 శాతం, సన్ ఫార్మా 1.1 శాత, చొప్పున నష్టపోయాయి. ఇక లాభపడిన షేర్ల విషయానికొస్తే, వేదాంత 2.3 శాతం, టాటా స్టీల్ 1.5 శాతం, హీరో మోటొకార్ప్ 0.8 శాతం, భెల్ 0.5 శాతం, డాక్టర్ రెడ్డీస్ 0.4 శాతం చొప్పున పెరిగాయి. -
నిరోధం 26,339- మద్దతు 25,386
మార్కెట్ పంచాంగం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ అసలు ఉద్దేశ్యమేమిటో గతవారం స్పష్టమైపోయింది. ఈ సంవత్సరాంతంలో వడ్డీ రేట్ల పెంపు తప్పదంటూ ఫెడ్ ఛైర్పర్సన్ యెలెన్ వెల్లడించేసేశారు. ఈ నేపథ్యంలో మన రిజర్వుబ్యాంక్ పాలసీ నిర్ణయం వెలువడనున్నది. దేశీయంగా ద్రవ్యోల్బణం కనిష్టస్థాయికి పడిపోయినందున, పావుశాతం రేట్ల కోత వుండవచ్చన్న అంచనాలు ఇప్పటికే షేర్ల ధరల్లో ఇమిడిపోయాయి. ఈ కారణంగా అరశాతం తగ్గితేనే మార్కెట్లో మరింత ర్యాలీ జరిగే ఛాన్స్ వుంటుంది. లేదంటే ఆర్బీఐ పాలసీ మీట్ తర్వాత సూచీలు పడిపోయే ప్రమాదం వుంటుంది. ఇక భారత్ సూచీల సాంకేతికాంశాలకు వస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు సెప్టెంబర్ 24తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్ వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 26,339 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగిన తర్వాత 900 పాయింట్లకుపైగా క్షీణించి, 25,386 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. అటుతర్వాత క్రమేపీ కోలుకుని, చివరకు 1.3 శాతం స్వల్పనష్టంతో 25,863 పాయింట్ల వద్ద ముగిసింది. సెప్టెంబర్ 8నాటి 24,833 పాయింట్ల కనిష్టస్థాయి నుంచి ప్రస్తుతం జరుగుతున్న రిట్రేస్మెంట్ ర్యాలీలో గతవారపు 26,339 పాయింట్ల గరిష్టస్థాయిని ‘లోయర్ హై’గా (సెప్టెంబర్ 18నాటి 26,472 పాయింట్ల గరిష్టంతో పోలిస్తే) పరిగణించవచ్చు. ఈ కారణంగా రిట్రేస్మెంట్ ర్యాలీ కొనసాగాలంటే గతవారపు గరిష్టస్థాయి అయిన 26,339 పాయింట్ల స్థాయిని సెన్సెక్స్ ఈ వారం తప్పనిసరిగా అధిగమించాల్సివుంటుంది. ఆర్బీఐ పాలసీ ప్రకటన తర్వాత ఆ స్థాయిని దాటలేకపోయినా, గతవారపు కనిష్టస్థాయి అయిన 25,386 పాయింట్ల స్థాయిని కోల్పోయినా మళ్లీ డౌన్ట్రెండ్లోకి మళ్లీ తర్వాతి రోజుల్లో 24,833 పాయింట్ల వద్దకు పతనమయ్యే ప్రమాదం వుంటుంది. ఆగస్టు 24న సెన్సెక్స్ భారీగా నష్టపోయినపుడు రికార్డు ట్రేడింగ్ పరిమాణంతో 26,730 స్థాయి నుంచి పతనం జరిగింది. ఈ వారం 26,339 పాయింట్ల నిరోధస్థాయిని అధిగమిస్తే 26,500-26,816 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. అటుపైన పటిష్టంగా ముగిస్తే 27,130 పాయింట్ల స్థాయిని చేరే ఛాన్స్ వుంటుంది. ఈ వారం 25,386 పాయింట్ల మద్దతుస్థాయిని కోల్పోతే తిరిగి 24,830 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. నిఫ్టీ మద్దతు 7,723-నిరోధం 8,021 ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,021 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన తర్వాత 7,723 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు 114 పాయింట్ల నష్టంతో 7,868 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్లానే నిఫ్టీకి కూడా గతవారపు కనిష్ట, గరిష్టస్థాయిలు ఈ వారం కీలకమైనవి. ఈ వారం 8,021 పాయింట్ల గరిష్టస్థాయిని దాటితే 8,060-8,142 పాయింట్ల శ్రేణిని సూచీ అందుకోవొచ్చు. ఆపైన ముగిస్తే 8,225 పాయింట్ల వరకూ ర్యాలీ జరిపే అవకాశం వుంది. ఈ వారం 7,723 పాయింట్ల మద్దతుస్థాయిని కోల్పోతే మరోదఫా 7,540 పాయింట్ల స్థాయి వద్దకు తగ్గవచ్చు. ఆర్బీఐ పాలసీ ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో అక్టోబర్ డెరివేటివ్ సిరీస్లో బిల్డప్ తక్కువగా జరిగింది. ఉన్నంతలో 7,800, 7,500 స్ట్రయిక్స్ వద్ద అధిక పుట్ బిల్డప్, 8,000, 8,200 స్ట్రయిక్స్ వద్ద అధిక కాల్ బిల్డప్ వుంది. పాలసీ తర్వాత భారీ ట్రేడింగ్ పరిమాణంతో 7,800 స్థాయిని కోల్పోతే తదుపరి 7,500 మద్దతుస్థాయివరకూ నిఫ్టీ తగ్గవచ్చని, 8,000 స్థాయిని భారీ టర్నోవర్తో దాటితే 8,200 స్థాయివరకూ పెరగవచ్చని ప్రస్తుత ఆప్షన్ బిల్డప్ సూచిస్తున్నది. -
నిరోధ శ్రేణి 26,500-26,800
మార్కెట్ పంచాంగం వడ్డీ రేట్ల పెంపును ప్రస్తుతానికి వాయిదా వేయడంతో పాటు భవిష్యత్తులో రేట్ల పెరుగుదల నెమ్మదిగానే వుంటుందని గత గురువారం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ప్రకటించినా, భారత్ మినహా మిగతా ప్రపంచ మార్కెట్లన్నీ క్షీణించాయి. చైనా మందగమన ప్రభావం అమెరికాపై కూడా పడుతుందన్న ఆందోళనను ఫెడ్ వ్యక్తంచేయడంతో, ఇన్వెస్టర్లు తిరిగి అనిశ్చితిలో పడ్డారు. ఈ కారణంగానే శుక్రవారం అమెరికా మార్కెట్ బాగా నష్టపోయింది. అయితే ఇక్కడ రిజర్వుబ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలతో గతవారం మార్కెట్ పటిష్టంగా ముగిసినా, అంతర్జాతీయ ట్రెండ్కు అనుగుణంగానే ఈ వారం కదలికలు వుండవచ్చు. ఇక భారత్ సూచీల సాంకేతికాంశాలకు వస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు సెప్టెంబర్ 18తో ముగిసిన వారంలో క్రమేపీ ర్యాలీ జరిపిన బీఎస్ఈ సెన్సెక్స్ 26,472 పాయింట్ల గరిష్టస్థాయికి చేరింది. చివరకు 26,219 పాయింట్ల వద్ద ముగిసింది. ఆగస్టు 24న సెన్సెక్స్ భారీగా నష్టపోయినపుడు రికార్డు ట్రేడింగ్ పరిమాణంతో 26,730 స్థాయి నుంచి పతనం జరిగింది. అటు తర్వాత ఆగస్టు నెల చివరి రెండు రోజుల్లో 26,500-26,700 పాయింట్ల మధ్య పెద్ద ఎత్తున అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. గత శుక్రవారం కూడా దాదాపు ఇదే శ్రేణి వద్ద భారీ ట్రేడింగ్ పరిమాణం నమోదుకావడంతో పాటు ఆ స్థాయి నుంచి 1 శాతం క్షీణించి, ముగిసింది. ఈ కారణంగా 26,500-26,700 పాయింట్ల శ్రేణికి ప్రాధాన్యత ఏర్పడింది. అలాగే 30,025 పాయింట్ల రికార్డుస్థాయి నుంచి ఇటీవలి 24,833 పాయింట్ల కనిష్టస్థాయివరకూ జరిగిన పతనంలో 38.2 శాతం ఫిబోనకి రిట్రేస్మెంట్ స్థాయి 26,816 పాయింట్లు. ఈ స్థాయికి సైతం సాంకేతిక ప్రాధాన్యత వుంది. ఈ రెండు అంశాల వల్ల సమీప భవిష్యత్తులో సెన్సెక్స్కు 26,500-26,816 పాయింట్ల శ్రేణి గట్టి అవరోధం కల్పించవచ్చు. పెద్ద అనుకూల వార్త వెలువడితేనే ఈ శ్రేణిని దాటే అవకాశం వుంటుంది. ఈ శ్రేణిని అధిగమించినా, ఆగస్టు 24 నాటి క్రాష్ సందర్భంగా ఏర్పడిన గ్యాప్ (26,730-27,130) కూడా ఇదే శ్రేణి వద్ద వున్నందున, ఈ గ్యాప్ నుంచి కూడా సెన్సెక్స్ వెనుతిరిగే అవకాశాలెక్కువ. రానున్న వారాల్లో 27,130 పాయింట్లపైన స్థిరపడితేనే సూచీ తిరిగి అప్ట్రెండ్లోకి ప్రవేశించగలదని చార్టులు వెల్లడిస్తున్నాయి. ఈ వారం మార్కెట్ క్షీణిస్తే 25,800 స్థాయి వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఆ లోపున వేగంగా 25,530 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే తిరిగి 24,830 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. నిఫ్టీ నిరోధం 8,060-మద్దతు 7,850 ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,055 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన తర్వాత చివరకు 193 పాయింట్ల లాభంతో 7,982 పాయింట్ల వద్ద ముగిసింది. ఆగస్టు 24నాటి పతనం రోజున, అటు తర్వాత ఆ నెల చివరి రెండు రోజుల్లోనూ 8.060-8,090 శ్రేణి మధ్య తీవ్రస్థాయిలో అమ్మకాలు జరిగాయి. అటుతర్వాత అత్యధిక ట్రేడింగ్ టర్నోవర్ సెప్టెంబర్ 18నే నమోదయ్యింది. అలాగే 9,119 పాయింట్ల రికార్డు నుంచి ఇటీవలి 7,539 పాయింట్ల కనిష్టస్థాయివరకూ జరిగిన పతనంలో 38,2 శాతం రిట్రేస్మెంట్ స్థాయి 8,142 పాయింట్లు. పైన ప్రస్తావించిన స్థాయిలకు వున్న సాంకేతిక ప్రాధాన్యత దృష్ట్యా రానున్న రోజుల్లో 8,060-8,142 పాయింట్ల శ్రేణి నిఫ్టీని గట్టిగా నిరోధించవచ్చు. ఆగస్టు 24నాటి పతన సందర్భంలో ఏర్పడిన 8,225-8,060 పాయింట్ల గ్యాప్ కూడా ఇదే శ్రేణి వద్ద వుంది. అంటే..8,060-8,142 శ్రేణిని దాటినా, 8,225 పాయింట్ల వరకూ నిఫ్టీ పదే పదే నిరోధాన్ని చవిచూసే ప్రమాదం వుంటుంది. ఇక ఈ వారం క్షీణత సంభవిస్తే 7,850 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఆ లోపున 7,760 పాయింట్ల మద్దతు శ్రేణికి పతనం కావొచ్చు. ఈ శ్రేణిని కోల్పోతే మరోదఫా 7,540 పాయింట్ల స్థాయి వద్దకు తగ్గవచ్చు. -
వెనక్కు తగ్గిన జానెట్ ఎలెన్...ఇక రాజన్ తగ్గిస్తారా
వడ్డీ రేటు పెంచని ఫెడ్ బలహీన చైనా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కారణం వాషింగ్టన్/ ముంబై : ఉత్కంఠగా వేచిచూస్తున్న ప్రపంచ దేశాలు, మార్కెట్లకు ఊరటనిస్తూ అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ జానెట్ ఎలెన్ వెనక్కుతగ్గారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనత, ఫైనాన్షియల్ మార్కెట్లలో ఒడిదుడుకులు, అమెరికా ద్రవ్యోల్బణం కనిష్టస్థాయిలోనే కొనసాగడం వంటి అంశాలతో ప్రస్తుతానికి వడ్డీ రేట్లను జీరోస్థాయిలోనే యథాతథంగా ఫెడ్ అట్టిపెట్టింది. సెప్టెం బర్ 17నాటి ఫెడ్ మార్కెట్ కమిటీ సమావేశంలో వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందన్న భయాలు, అంచనాలు కొద్దికాలంగా వెలువడుతున్న సంగతి తెలి సిందే. చైనా మందగమన ప్రభావం అమెరికా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై పడవచ్చన్న భయాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయన్న అభిప్రాయాన్ని ఫెడ్ వ్యక్తం చేసింది. అయితే అసాధారణ జీరో రేటు ద్రవ్య విధానాన్ని సాధారణ స్థితికి తీసుకురావాల్సిన అవసరాన్ని ఫెడ్ చైర్పర్సన్ ప్రస్తావిస్తూ తదుపరి రోజుల్లో రేట్ల పెంపు నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. 2015లోనే రేట్ల పెంపు ఉండవచ్చన్న సంకేతాల్ని గురువారంనాటి సమావేశంలో ఫెడ్ కమిటీ సభ్యులు వెలువరించారు. వచ్చే అక్టోబర్ నెలలో జరిగే ఫెడ్ మీటింగ్లో కాకుండా, డిసెంబర్ నెలలో ఫెడ్ రేట్లు పెరగవచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అమెరికా ఉపాధి మార్కెట్ పటిష్టంగా వుందని, అలాగే ద్రవ్యోల్బణం 2 శాతం లక్ష్యాన్ని చేరుతుందన్న విశ్వాసం ఫెడ్ కమిటీలో వుందని యెలెన్ ప్రకటించారు. కానీ ఇంధన ధరలు తగ్గినందున, ద్రవ్యోల్బణం కొద్దికాలం కనిష్టస్థాయిలో కొనసాగవచ్చని అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్లను పెంచినా, భవిష్యత్ ద్రవ్య విధానం సరళంగానే వుంటుందని ఆమె చెప్పారు. ఇక బంతి రాజన్ కోర్టులో... ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయంపై వెనకడుగు వేయడంతో సెప్టెంబర్ 29 నాటి రిజర్వుబ్యాంక్ పరపతి విధాన సమీక్షపై దేశీయ పరిశ్రమ, మార్కెట్ల దృష్టిమళ్లింది. గురువారంనాటి యెలెన్ సరళ విధాన ప్రకటనకు అనుగుణంగా ఫెడ్ రేటు పెంపు సమయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఆర్బీఐకి లేదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇక రేట్ల కోతపై ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నిర్ణయం తీసుకోవడమే తరువాయి అని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. భారత్ ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గుముఖం పట్టిందని, కరెంటు ఖాతా లోటు దిగివచ్చిందని, ఫారెక్స్ నిల్వలు పుష్కలంగా వున్నాయని, ఈ సానుకూలాంశాలన్నీ వడ్డీ రేట్ల తగ్గింపునకు మార్గం కల్పిస్తున్నట్లు విశ్లేషకులు చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది తొలినాళ్లలో ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే, సహజంగానే కొంతమేర విదేశీ నిధులు తరలివెళతాయని, అంతమాత్రాన ఆ రేట్ల పెంపు సమయం గురించి అంచనాలు వేసుకుంటూ, భారత్ స్వంత ద్రవ్య విధానాన్ని స్తంభింపచేయాల్సిన అవసరం లేదని వారు వివరించారు. రూపాయి 79 పైసలు జంప్-ఫెడ్ నిర్ణయంతో నెల గరిష్టానికి... ముంబై: డాలర్తో రూపాయి మారకం శుక్రవారం 79 పైసలు బలపడి 65.67 వద్ద ముగిసింది. ఒక్క రోజులో ఈ స్థాయిలో రూపాయి పెరగడం ఈ ఏడాది ఇదే మొదటిసారి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచకపోవడంతో డాలర్ల అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో రూపాయి నెల గరిష్టానికి ఎగసింది. ఫెడ్ వడ్డీరేట్ల పెంపు భయాలు తొలగిపోవడంతో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక, కరెన్సీ మార్కెట్లలో రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకుంది. భారత్ స్టాక్ మార్కెట్ బలపడపడడం, ద్రవ్యోల్బణం తగ్గడంతో కరంట్ అకౌంట్ లోటు ఆందోళనలు తగ్గుముఖం పట్టటం కూడా ప్రభావం చూపాయి. సర్వీసుల రంగం ఎగుమతులు పెరగడం, వాణిజ్య లోటు తగ్గడంతో జూన్ క్వార్టర్కు కరంట్ అకౌంట్ లోటు జీడీపీలో 1.2 శాతానికి తగ్గి 620 కోట్ల డాలర్లకు చేరింది. ఫారెక్స్ మార్కెట్లో గత బుధవారం డాలర్తో రూపాయి మారకం 66.46 వద్ద ముగిసింది. కోతకు అవకాశం ఫెడ్ నిర్ణయం ఆర్బీఐ రేటు కోతకు ఒక అవకాశాన్ని కల్పించింది. ద్రవ్యోల్బణం కొంత పెరిగినా అది ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం కాదు. అయితే రేటు కోత ఎంత ఉండవచ్చన్నది మాత్రం నేను చెప్పలేను. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చీఫ్ తగిన పరిస్థితులు ఫెడ్ నిర్ణయం, బలహీన డిమాండ్, దిగువస్థాయి ద్రవ్యోల్బణం ఇవన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు కోతకు అవకాశం కల్పిస్తున్నాయి. వృద్ధి ఊపందుకోవడానికి ఆర్బీఐ రేటు కోత నిర్ణయం దోహదపడుతుంది. - అరుణ్ సింగ్, డీఅండ్బీ ఎకనమిస్ట్ రేటు కోతపై ఆశలు పెంచిన ఫెడ్ నిర్ణయం అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ రేటు యథాతథంగా కొనసాగుతుండడం- భారత్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు కోత అంచనాలను పెంచింది. ఈ ఏడాది ఆర్బీఐ మూడు సార్లు 75 బేసిస్ పాయింట్లు రెపోరేటు (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణంపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం-7.25 శాతం) తగ్గించింది. ఇందులో దాదాపు 33 బేసిస్ పాయింట్ల ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు అందించాయి. తాజా ఫెడ్ నిర్ణయం, ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ 29న ఆర్బీఐ పాలసీ సమీక్ష నేపథ్యంలో ఈ ఏడాది మరో విడత రెపో కోతపై వివిధ సంస్థల అంచనాలను చూస్తే... పావుశాతం కోత ఫెడ్ నిర్ణయం- ఆర్బీఐ భారీ రేటు కోత అవకాశానికి గండికొట్టింది. ఈ నిర్ణయం మార్కెట్లలో మధ్య కాలికంగా అనిశ్చితిలో నిలిపే అవకాశాలు ఉన్నాయి. అయితే 29న ఆర్బీఐ పావుశాతం కోతకు మాత్రం అవకాశం ఉంది. - ఇండియా రేటింగ్స్ మార్గం సుగమం అంతర్జాతీయంగా ఉన్న ఒత్తిడి ఫెడ్ నిర్ణయంతో తొలగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ నెల్లో ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్ల రేటు కోతకు అవకాశం ఏర్పడింది. దేశీయంగా ఉన్న అంశాలు కూడా ఇందుకు దోహదపడుతున్నాయి. - బీఓఎఫ్ఏ-ఎంఎల్ -
సెన్సెక్స్ తొలి మద్దతు 26,280
మార్కెట్ పంచాంగం అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వు ఉద్దీపన ప్యాకేజీని నిలిపివేయనున్నట్లు 2013 ప్రథమార్థంలో సంకేతాలు ఇచ్చినపుడు ప్రపంచ మార్కెట్ల ట్రెండ్కు అనుగుణంగా భారత్లో సూచీలు దాదాపు 15 శాతం తగ్గాయి. ఇప్పుడు కూడా అంతేశాతం సెన్సెక్స్, నిఫ్టీలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ జరిగింది సాధారణమైన పతనంగానే భావించాలి. కానీ గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు 1997 తర్వాత అత్యధికస్థాయిలో రూ. 17 వేల కోట్లు భారత్ మార్కెట్లో నికర అమ్మకాలు జరిపారు. అలాగే ఈ నెల రెండు వారాల్లో కూడా 7,000 కోట్లు విక్రయించారు. మార్కెట్ క్షీణత సాధారణంగానే వున్నా, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు అసాధారణంగా వుండటం ఆందోళనకరం. ఈ సెప్టెంబర్ 17నాటి ఫెడ్ నిర్ణయంకంటే, విదేశీ ఇన్వెస్టర్లు వ్యవహరించే తీరే మన మార్కెట్ ట్రెండ్ను నిర్దేశిస్తుందన్న అంచనాలకు రావొచ్చు. సెన్సెక్స్ సాంకేతికాంశాలు సెప్టెంబర్ 11తో ముగిసిన వారంలో 24,833 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయిన బీఎస్ఈ సెన్సెక్స్, అటుతర్వాత కోలుకొని, చివరకు 1.6 శాతం లాభపడి 25,610 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్ పంచాంగంలో దీర్ఘకాలిక మద్దతుగా ప్రస్తావిస్తున్న 25,300 పాయింట్ల స్థాయి దిగువకు పతనమైనా, తిరిగి వేగంగా ఈ స్థాయి పైకి వచ్చి స్థిరపడటం సానుకూలాంశం. ఈ వారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశం సందర్భంగా సెన్సెక్స్ హెచ్చుతగ్గులకు లోనైతే తొలుత 25,280 స్థాయికి తగ్గే అవకాశం ఉంటుంది. ఆ లోపున వేగంగా 24,745 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 24,420-24,160 పాయింట్ల శ్రేణి వద్దకు పతనం కావచ్చు. గతవారపు రికవరీ కొనసాగితే సెన్సెక్స్ తొలుత 25,880 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. ఆపైన స్థిరపడితే 26.202 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. అటుపైన 26,586-26,816 పాయింట్ల శ్రేణి వరకూ ర్యాలీ జరిపే అవకాశం ఉంటుంది. నిఫ్టీ తొలి మద్దతు 7,680-నిరోధం 7,870 క్రితం వారం ప్రధమార్థంలో 7,539 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన ఎన్ఎస్ఈ నిఫ్టీ ద్వితీయార్థంలో కోలుకొని 7,865 పాయింట్ల గరిష్టస్థాయి వరకూ పెరిగింది. చివరకు 134 పాయింట్ల లాభంతో 7,789 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారం నిఫ్టీ ఎట్టకేలకు 2014 మే 16 నాటి గరిష్ట స్థాయి అయిన 7,563 స్థాయిని పరీక్షించింది. రానున్న రోజుల్లో ఈ 7,500-7,600 మద్దతు శ్రేణి నిఫ్టీకి ప్రధానమైనది. ఈ వారం నిఫ్టీ గనుక పెరిగితే తిరిగి 7,870 పాయింట్ల వద్దకు చేరవచ్చు. అటుపైన స్థిరపడితే 7,952 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఆపైన ముగిస్తే 8,080-8,142 పాయింట్ల శ్రేణి వరకూ పెరిగే అవకాశం వుంది. ఈ వారం క్షీణిస్తే 7,680 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఆ లోపున 7,500-7,600 పాయింట్ల మద్దతు శ్రేణికి పతనం కావొచ్చు. ఈ శ్రేణిని కోల్పోతే 7,200-7,118 పాయింట్ల మద్దతు శ్రేణికి నిలువునా పడిపోయే ప్రమాదం వుంటుంది. -
ఫెడ్ రేటు పెరిగితే భారత్కు మంచిదే
ముంబై: అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటు పెంచితే భారత్కు సానుకూలమేనని ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా మిరిల్ లించ్ (బీఓఏ-ఎంఎల్) శుక్రవారం విడుదల చేసిన తాజా నివేదికలో తెలిపింది. ఫెడ్ నిర్ణయం ఆలస్యం అయిన కొద్దీ దేశంలోకి పెట్టుబడుల ప్రవాహంలో ప్రతిష్టంభన ఉంటుందని, తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడతాయని కూడా నివేదిక విశ్లేషించింది. సెప్టెంబర్ 17 సమావేశం తరువాత అమెరికా ఫెడ్ వడ్డీరేటు 25 బేసిస్ పాయింట్లు (పావు శాతం) పెంచే అవకాశం ఉందని తెలిపింది. -
సెన్సెక్స్ కీలక స్థాయి 25,300 పాయింట్లు
మార్కెట్ పంచాంగం అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వు ప్రతి నెల బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవహింపజేసే నిధుల్ని (ఉద్దీపన ప్యాకేజీ) నిలిపివేయనున్నట్లు 2013 ప్రథమార్థంలో సంకేతాలు ఇచ్చింది. అప్పట్లో ఈ సంకేతాలకు ప్రపంచ స్టాక్ మార్కెట్లన్ని కొద్ది వారాలు పాటు క్షీణించాయి. దాదాపు అదే తరహాలో ఇప్పటి డౌన్ట్రెండ్ కొనసాగుతోంది. ఈ సెప్టెంబర్ 17 నాటి ఫెడ్ సమావేశంలో వ డ్డీరేట్ల పెంపు నిర్ణయాన్ని తీసుకోవచ్చనే భయాలతో ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లు పడుతున్నాయి. ఒకరకంగా ఇది ఫెడ్కు మార్కెట్ శక్తుల బెదిరింపు అస్త్రం కావచ్చు. 2013లో డౌన్ట్రెండ్ దెబ్బకు ఉద్దీపన ప్యాకేజ్ ఉపసంహరణను కొద్ది నెలలపాటు ఫెడ్ వాయిదా వేసింది. ఈ దఫా వడ్డీరేట్ల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయించేందుకే ఇప్పటి ఈక్విటీల పతనమన్న విశ్లేషణలను అత్యధిక మార్కెట్ నిపుణులు వ్యక్తంచేస్తున్నారు. ఇక భారత్ సూచీల సాంకేతికాంశాలకు వస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు సెప్టెంబర్ 4తో ముగిసిన వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 4.5 శాతం నష్టపోయి 25,202 వద్ద ముగిసింది. ఈ క్రమంలో గత మార్కెట్ పంచాంగంలో దీర్ఘకాలిక మద్దతుగా ప్రస్తావించిన 25,300 పాయింట్ల స్థాయి దిగువున ముగిసింది. గతేడాది ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో విజయం సాధించిన రోజైన మే 16 నాటి గరిష్ట స్థాయే ఈ 25,300 పాయింట్ల స్థాయి. రానున్న రోజుల్లో సెన్సెక్స్ మరింత పతనమైన తిరిగి వేగంగా ఈ స్థాయి పైకి వచ్చి స్థిరపడగలిగితే కొద్ది వారాల్లో అప్ట్రెండ్లోకి మళ్లే వీలుంటుంది. లేకపోతే కొద్ది నెలలపాటు మార్కెట్ బేర్ కక్ష్యలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. ప్రపంచ మార్కెట్ల ట్రెండ్కు అనుగుణంగా ఈ సోమవారం సెన్సెక్స్ గ్యాప్డౌన్తో మొదలైతే 24,745 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు పొందవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 24,420-24,160 పాయింట్ల శ్రేణి వద్దకు పతనం కావచ్చు. ప్రస్తుత స్థాయి నుంచి లేదా పైన ప్రస్తావించిన తొలి మద్దతు నుంచి సెన్సెక్స్ కోలుకుంటే 25,550 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. ఆపైన స్థిరపడితే 25,840 పాయింట్ల స్థాయిని అందుకోవచ్చు. అటుపైన 26,140 పాయింట్ల వరకు ర్యాలీ జరిపే అవకాశం ఉంటుంది. నిఫ్టీ మద్దతు 7,563-నిరోధం 7,750 క్రితం వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ 347 పాయింట్ల నష్టంతో 7,655 పాయింట్ల వద్ద ముగిసింది. 2014 మే 16 నాటి గరిష్ట స్థాయిని సెన్సెక్స్ కోల్పోయినా, నిఫ్టీ ఇంకా ఆ స్థాయిని (7,563 పాయింట్లు) పరీక్షించలేదు. ఈ కారణంగా నిఫ్టీకి ఇదే తక్షణ మద్దతు స్థాయి. ఈ మద్దతును కోల్పోతే 7,380 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈలోపున 7,200-7,118 పాయింట్ల మద్దతు శ్రేణికి పతనం కావచ్చు. ఈ వారం తొలి రెండు మద్దతు స్థాయిల్లో ఏదోఒక స్థాయి నుంచి నిఫ్టీ పెరిగితే 7,750 పాయింట్ల నిరోధ స్థాయిని చేరవచ్చు. ఈ స్థాయిని అధిగమించి స్థిరపడితే 7,845 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. అటుపైన ముగిస్తే 7,930 పాయింట్ల వరకు ర్యాలీ జరపవచ్చు. -
ఫెడ్ రేట్ల పెంపు భయాలు..
- కరువు, రూపాయి పతనం ప్రభావం - నష్టాల్లో సెన్సెక్స్-30, నిఫ్టీ-50 ముంబై: అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండడం, ప్రత్యేకించి అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు పెంచుతుందన్న భయాలు జీడీపీ గణాంకాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సోమవారం ఆద్యంతమూ తీవ్రమైన ఒడిదుడుకులకు గురై నష్టాల్లో ముగిసింది. వీటికి వర్షాభావ కష్టాలు, రూపాయి పతనం, లాభాల స్వీకరణ కూడా తోడవడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 109 పాయింట్లు నష్టపోయి 26,283 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 31 పాయింట్లు నష్టపోయి 7,971 పాయింట్ల వద్ద ముగిశాయి. విద్యుత్, రియల్టీ, ఇన్ఫ్రా, క్యాపిటల్ గూడ్స్, వాహన షేర్లు నష్టపోయాయి. ఫార్మా షేర్లు లాభపడ్డాయి. అధ్వాన ఆగస్టు: నెలవారీగా చూస్తే ఆగస్టు నెలలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,831 పాయింట్లు(6.51 శాతం), ఎన్ఎస్ఈ నిఫ్టీ 562 పాయింట్లు(6.58 శాతం) చొప్పున పతనమయ్యాయి. 2011 నవంబర్ తర్వాత ఒక నెలలో ఈ స్థాయిలో సెన్సెక్స్ నష్టపోవడం ఇదే మొదటిసారి. ఇక విదేశీ ఇన్వెస్టర్ల నికర అమ్మకాల విషయంలో కూడా గత నెల రికార్డ్ సృష్టించింది. గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.17,000 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. ఒక నెలలో విదేశీ ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో నికర అమ్మకాలు జరపడం ఇది రికార్డ్ స్థాయి. మ్యాట్రిక్స్ ఐపీఓకు సెబీ ఓకే న్యూఢిల్లీ: అంతర్జాతీయ సిమ్ కార్డ్నందించే మ్యాట్రిక్స్ సెల్యులర్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్ నుంచి విదేశాలకు వెళ్లే పర్యాటకులకు మ్యాట్రిక్స్ సెల్యులర్ కంపెనీ వివిధ దేశాల సిమ్కార్డ్లను , వాయిస్, డేటా, ఎస్ఎంఎస్ సర్వీసులను మ్యాట్రిక్స్ బ్రాండ్ కింద అందజేస్తోంది. కాగా ఈ ఏడాది ఇప్పటిరవకూ సెబీ 26 కంపెనీల ఐపీఓలకు అనుమతులిచ్చింది.వీటిల్లో 13 కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. -
మార్కెట్లపై ఆ మూడింటి ప్రభావం !
- ఫెడ్ రేట్ల పెంపు, కంపెనీల ఆర్థిక ఫలితాలు, బిహార్ ఎన్నికలు - బీఓఎఫ్ఏ-ఎంఎల్ తాజా నివేదిక న్యూఢిల్లీ: ఫెడ్ రేట్ల పెంపు, కంపెనీల ఆర్థిక ఫలితాలు, బిహార్ ఎన్నికలు భారత మార్కెట్పై ప్రభావం చూపుతాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్(బీఓఎఫ్ఏ-ఎంఎల్) తాజా నివేదిక పేర్కొంది. వచ్చే నెల 17న అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచితే అది భారత్కు ప్రయోజనకరమేనని. అమెరికా ఆర్థిక వ్యవస్థ రికవరీకి సూచనగా ఫెడ్ రేట్ల పెంపును పరిగణించాలని వివరించింది. అమెరికా వృద్ధి ఎగుమతులకు ఊతం ఇస్తుందని, అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు నియంత్రణలో ఉంటాయని, రూపాయి బలపడటానికి తోడ్పడుతుందని పేర్కొంది. ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపును మార్కెట్ స్వీకరిస్తే, వచ్చే నెల 29న తన పాలసీ సమీక్షలో ఆర్బీఐ కీలక రేట్లను పావు శాతం మేర తగ్గించడానికి మార్గం సుగమమవుతుందని వివరించింది. ఒక వేళ ఫెడ్ వడ్డీరేట్లను పెంచకపోతే, ద్రవ్యోల్బణ ఒత్తిడులు కారణంగా డిసెంబర్లోపే ఆర్బీఐ పాలసీ రేట్లను తగ్గించవచ్చని పేర్కొంది. కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాలు విదేశీ నిధుల ప్రవాహం భారత్లోకి రావడానికి తోడ్పడుతాయ ని, బిహార్ ఎన్నికల ఫలితాలు సంస్కరణల వేగం పై ప్రభావం చూపుతాయని నివేదిక పేర్కొంది. సెన్సెక్స్ 517 పాయింట్లు అప్ - 2 శాతం పెరిగిన సెన్సెక్స్, నిఫ్టీలు - ప్రభావం చూపిన షార్ట్ కవరింగ్ - అమెరికా వడ్డీరేట్ల పెంపు లేదనే సంకేతాలు కూడా... - 517 పాయింట్ల లాభంతో 26,231కు సెన్సెక్స్ - 157 పాయింట్ల లాభంతో 7,949కు నిఫ్టీ అమెరికా ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబరులో వడ్డీ రేట్లు పెంచకపోవచ్చన్న వార్తలకు... ఆగస్టు డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు తోడయింది. ఆగస్టు డెరివేటివ్స్ కాంట్రాక్టులకు గురువారం చివరిరోజు కావటంతో ట్రేడర్లంతా భారీ ఎత్తున షార్ట్ పొజిషన్లను కవర్ చేసుకునే పనిలో పడ్డారు. ఫలితం... సెన్సెక్స్ రయ్యిమంది. హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, ఇన్ఫోసిస్ వంటి అధిక వెయిటేజీ ఉన్న షేర్లలో కొనుగోళ్లు జరగటంతో సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 2 శాతం పెరిగి... సెన్సెక్స్ 26,000 పాయింట్లను, నిఫ్టీ 7,900 పాయింట్లను అధిగమించాయి. చివరికి సెన్సెక్స్ 517 పాయింట్ల లాభంతో 26,231 పాయింట్ల వద్ద... నిఫ్టీ 157 పాయింట్ల లాభంతో 7,949 పాయింట్ల వద్ద ముగిశాయి. ఒక్క సెషన్లో సెన్సెక్స్ ఈ స్థాయిలో లాభపడటం గడిచిన రెండు వారాల్లో ఇదే తొలిసారి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ఈ రికవరీ ర్యాలీకి కన్సూమర్ డ్యూరబుల్స్, రియల్టీ, ఫార్మా రంగాల్లోని బ్లూ చిప్ షేర్ల మద్దతు లభించింది. రేట్ల పెంపు ఇప్పుడే కాదు... బుధవారం అమెరికా స్టాక్ సూచీలు దాదాపు 4 శాతం పెరిగాయి. ఈ స్థాయిలో సూచీలు పెరగటం గడిచిన నాలుగేళ్లలో ఇదే ప్రథమం. న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ప్రెసిడెంట్ విలియం డడ్లీ సెప్టెంబర్లో వడ్డీరేట్ల పెంపు లేదని సూచనప్రాయంగా వెల్లడించడమే దీనికి కారణం. ముడి చమురు ధరలు తగ్గుతుండడం, చైనా భయాలు కొనసాగుతుండడం వంటి అంశాల నేపథ్యంలో రేట్ల కోత ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో చైనా భయాలు వెనక్కివెళ్లిపోయాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 26,303 గరిష్ట స్థాయిని తాకింది. ‘స్మార్ట్’ కంపెనీలకు లాభాలు... స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద 98 నగరాల పేర్లను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు వెల్లడించడంతో వీటితో సంబంధం ఉన్న ఎన్బీసీసీ, డి లింక్, స్మార్ట్ లింక్ నెట్వర్క్, హెచ్సీసీ, హెచ్డీఐఎల్ షేర్లు 2-9 శాతం రేంజ్లో పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో కెయిర్న్ ఇండియా 7.6 శాతం ఎగసింది. 30 సెన్సెక్స్ షేర్లలో 21 షేర్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ షేర్లలో హెచ్డీఎఫ్సీ అత్యధికంగా లాభపడింది. నెల రోజుల్లో 19 శాతం పతనం కావడం, స్టాండర్డ్ లైఫ్ పీఎల్సీతో జీవిత బీమా జాయింట్ వెంచర్ను నిర్వహిస్తున్న కంపెనీ అనుబంధ సంస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐపీఓకు రానున్నదన్న కారణాల వల్ల హెచ్డీఎఫ్సీ 8.4 శాతం లాభంతో రూ.1,195 వద్ద ముగిసింది. వేదాంత, టాటా స్టీల్, లుపిన్, సిప్లా, ఐటీసీ, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ షేర్లు 2.6-6.6 శాతం రేంజ్లో పెరిగాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా 6 శాతం పెరిగింది. వాహన షేర్లు నష్టపోయాయి. బజాజ్ ఆటో 2.4 శాతం క్షీణించగా, టాటా మోటార్స్, హీరోమోటొకార్ప్, మారుతీ సుజుకీ కూడా నష్టపోయాయి. కొనసాగుతున్న విదేశీ విక్రయాలు... వరుసగా ఏడో ట్రేడింగ్ సెషన్లోనూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) అమ్మకాలను కొనసాగించారు. గత ఏడు ట్రేడింగ్ సెషన్లలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.16,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. కాగా టర్నోవర్ బీఎస్ఈలో రూ.3,015 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.26,117 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.5,33,805 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,347 కోట్ల నికర అమ్మకాలు, దేశీ ఇన్వెస్టర్లు రూ.2,577 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. ఐదు రోజుల చైనా షాంఘై స్టాక్ సూచీ నష్టాలకు బ్రేక్ పడింది. ఈ సూచీ 5% పెరిగింది. అన్ని ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే ముగిశాయి. ఆసియా మార్కెట్ల దన్నుతో యూరప్ మార్కెట్లు భారీ లాభాల్లోనే ముగిశాయి. అమెరికా స్టాక్ సూచీలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. అధ్వాన సిరీస్... గురువారంతో ముగిసిన ఆగస్టు సిరీస్ గత రెండేళ్లలో అత్యంత అధ్వానమైనదని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఆగస్టు సిరీస్లో నిఫ్టీ 5.3 శాతం, సెన్సెక్స్ 5.6 శాతం, బ్యాంక్ నిఫ్టీ 6.6 శాతం, సీఎన్ఎక్స్ మిడ్క్యాప్ 3.4 శాతం, బీఎస్ఈ స్మాల్క్యాప్ 6.3 శాతం చొప్పున నష్టపోయాయి. షార్ట్ కవరింగ్ కారణంగా రోల్ఓవర్లు పెరిగాయని, సెప్టెంబర్లో మరో భారీ పతనం ఉందనడానికి ఇదొక సూచిక అని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. -
ఫెడ్ మీటింగ్పై ఫోకస్...
అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు నిర్ణయంపై ఇన్వెస్టర్ల దృష్టి - దేశంలో రుతుపవనాల గమనం కూడా మార్కెట్కు కీలకం న్యూఢిల్లీ: అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మార్కెట్స్ కమిటీ సమావేశం ఈ వారం మార్కెట్ ట్రెండ్ను నిర్దేశిస్తుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడుతున్నదన్న సంకేతాల్ని ఇటీవల అక్కడ వెలువడుతున్న గణాంకాలు ధ్రువపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే మంగళ, బుధవారాల్లో జరిగే ఫెడ్ కమిటీ సమావేశంలో వడ్డీ రేట్ల పెంపునకు సంబంధించి వెలువడే క్లూలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ వారం తర్వాత మళ్లీ సెప్టెంబర్ వరకూ ఫెడ్ కమిటీ సమావేశం వుండదు. ఇక దేశీయంగా రుతుపవనాల గమనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల రీతి మార్కెట్కు కీలకమని విశ్లేషకులు చెప్పారు. ఈ ఏడాది వర్షపాతం సగటుకంటే తక్కువగా వుంటుందన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో రుతుపవనాల కదలికల్ని ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తున్నారని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేశ్ అగర్వాల్ చెప్పారు. గత శుక్రవారం మార్కెట్ ముగిశాక వెలువడిన పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణం గణాంకాలు సానుకూలంగా వున్నందున, ఈ సోమవారం తొలుత మార్కెట్ పాజిటివ్గా ట్రేడ్కావొచ్చని వారు అభిప్రాయపడ్డారు. అయితే భారత స్టాక్ మార్కెట్ ప్రస్తుతం బలహీనంగా ట్రేడ్ అవుతున్నందున, ట్రేడింగ్ తొలిదశలో ఆర్జించిన లాభాల్ని మార్కెట్ నిలబెట్టుకోవడం కష్టమని అగర్వాల్ వివరించారు. జూన్ 16-17న జరిగే ఫెడ్ సమావేశం తర్వాత వడ్డీరేట్లపై అనిశ్చితి తొలగిపోతుందని రిలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అన్నారు. గతవారం మార్కెట్.. వర్షాభావ భయాలతో ఇన్వెస్టర్లు జరిపిన విక్రయాల కారణంగా గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ గతవారం 343 పాయింట్లు క్షీణించి 26,425 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా మూడువారాల్లో సెన్సెక్స్ 1,520 పాయింట్లు నష్టపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయి 7,983 పాయింట్ల వద్ద ముగిసింది. మూడు వారాల్లో ఈ సూచి 476 పాయింట్లు తగ్గింది. ఎఫ్ఐఐల విక్రయాలు 4,700 కోట్లు న్యూఢిల్లీ: జూన్ నెల తొలి రెండు వారాల్లో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ. 4,700 కోట్లు వెనక్కు తీసుకున్నారు. దేశీయ కార్పొరేట్ లాభాలు మందగిస్తున్నాయన్న ఆందోళన, ఆసియాలో చైనా, జపాన్ తదితర దేశాల ఈక్విటీల రాబడులు మెరుగ్గా వుండటంతో ఇక్కడ విదేశీ ఇన్వెస్టర్లు విక్రయిస్తున్నారని మార్కెట్ నిపుణులు చెపుతున్నారు. జూన్ 1-12 మధ్యకాలంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) ఈక్విటీ మార్కెట్లో రూ. 1,310 కోట్లు, రుణ మార్కెట్లో రూ. 3,431 కోట్ల నికర విక్రయాలు జరిగాయి. -
అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు..
ఏడాది మధ్యలోనా.. చివర్లోనా! వాషింగ్టన్: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడం ఖాయం అయినప్పటికీ అది ఈ ఏడాది మధ్యలోనా లేక చివర్లో ఉండొచ్చునా అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇటు భారత్ వంటి వర్ధమాన దేశాలతో పాటు అటు సంపన్న దేశాలపైనే ప్రభావం చూపే విధంగా అమెరికా ఫెడ్ ఈ ఏడాది మధ్యలో వడ్డీ రేట్లను పెంచే అవకాశాలున్నట్లు సంకేతాలు ఇచ్చింది. అయితే, పరిస్థితిని బట్టి పెంపుపై నిర్ణయాన్ని ఈ ఏడాది ఆఖరు దాకా వాయిదా వేసే అవకాశాలూ ఉన్నాయంటూ పాలసీ సమీక్ష సమావేశం తర్వాత ప్రకటనలో పేర్కొంది. దీంతో పెంపు ఎప్పుడు ఉండొచ్చన్న దానిపై ఆసక్తి నెలకొంది. రేట్ల పెంపు నిర్ణయానికి నియామకాలు, ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధితో పాటు డాలర్ మారకం విలువపైనా ఫెడ్ నిశితంగా దృష్టిపెట్టనుంది. కాగా, బుధవారం నాటి పాలసీ సమీక్ష సమావేశంలో 0.25 శాతం స్థాయిలో ఉన్న వడ్డీ రేట్లను ఫెడ్ రిజర్వ్ యథాతథంగానే ఉంచినప్పటికీ విధాన ప్రకటనలో ‘ఓపిక’ పదాన్ని తొలగించింది. వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఇన్నాళ్లూ ‘ఓపిక’గా వ్యవహరిస్తున్నామంటూ ఫెడ్ చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పదం తొలగించడం వల్ల పరిస్థితిని బట్టి వడ్డీ రేట్లను ఎప్పుడైనా పెంచేందుకు వెసులుబాటు లభించగలదని ఫెడ్ చైర్పర్సన్ జేనెట్ యెలెన్ పేర్కొన్నారు. అంతే తప్ప ‘ఓపిక’ పదాన్ని తొలగించినంత మాత్రాన తాము వడ్డీ రేట్లను ఎప్పుడెపుడు పెంచుదామా అన్నంత ‘అసహనం’గా లేమని ఆమె స్పష్టం చేశారు. ఏప్రిల్లో జరిగే తదుపరి సమావేశంలో పెంచే అవకాశాలు లేవని పేర్కొన్నారు. -
రూపాయి, ద్రవ్యోల్బణంపై దృష్టి
ఈ వారం మార్కెట్ను ప్రభావితం చేసే అంశాలు ⇒ అడ్వాన్సు ట్యాక్స్ చెల్లింపులు ⇒ పార్లమెంటు సమావేశాల్లో పరిణామాలు ⇒ ఫెడరల్ రిజర్వ్ కమిటీ సమావేశం న్యూఢిల్లీ: ఫిబ్రవరి నెల టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు, అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు, పార్లమెంటు సమావేశాల్లో జరగబోయే పరిణామాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ ట్రెండ్ను నిర్దేశిస్తాయంటూ విశ్లేషకులు అంచనాల్ని వెల్లడించారు. అలాగే విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, రూపాయి మారకపు విలువ కదలికలు కూడా మార్కెట్కు కీలకమని వారు వ్యాఖ్యానించారు. గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 3.21 శాతం పడిపోయింది. ఒకవారంలో సూచీ ఇంతగా క్షీణించడం ఈ ఏడాది ఇదే ప్రధమం.రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలకంటే అధికంగా నమోదుకావడంతో రిజర్వుబ్యాంక్ వడ్డీ రేట్ల కోత ప్రక్రియకు బ్రేక్వేస్తుందన్న భయాలతో క్రితం వారం మార్కెట్ పడిపోయింది. ఇక ఈ సోమవారం వెల్లడయ్యే ఫిబ్రవరి టోకు ద్రవ్యోల్బణం డేటా కోసం ఇన్వెస్టర్లు ఆతృతగా ఎదురుచూస్తున్నారని రిలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. కార్పొరేట్ల అడ్వాన్సు ట్యాక్స్ చెల్లింపుల డేటా కూడా ఈ వారం తెలుస్తుంది. అడ్వాన్సు పన్ను చెల్లింపుల్ని బట్టి మార్చి త్రైమాసికంలో ఆయా కంపెనీలు సాధించబోయే లాభనష్టాలపట్ల ఇన్వెస్టర్లకు అంచనాలు ఏర్పడతాయి. తొలి విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మార్చి 20తో ముగియనున్నందున, ఈ సభల్లో జరిగే పరిణామాల పట్ల మార్కెట్ ఆసక్తి కనపరుస్తోందని మాంగ్లిక్ వివరించారు. అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి మార్చి 17-18 తేదీల్లో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కమిటీ జరిపే సమావేశం కీలకమైనదని ఆయన వివరించారు. ఫెడ్ వడ్డీ రేట్లను ఎప్పట్నించి పెంచవచ్చన్న సంకేతాల కోసం ఈ సమావేశంపై దేశీ, విదేశీ ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నారు. సమీప భవిష్యత్తులో దేశీ మార్కెట్లు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని మరికొంతమంది విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఈ వారం మార్కెట్ అటూఇటూ కదిలినా, బుల్లిష్గానే వుండవచ్చని బొనంజా పోర్ట్ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హిరేన్ ధకన్ చెప్పారు. రూ. 72,000 కోట్లకు విదేశీ పెట్టుబడులు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు దేశీయ క్యాపిటల్ మార్కెట్లో ఈ ఏడాది ఇప్పటివరకూ చేసిన పెట్టుబడుల మొత్తం రూ. 72,000 కోట్లకు చేరింది. ఈ మార్చి నెల తొలి రెండు వారాల్లో వారు ఈక్విటీ మార్కెట్లో రూ. 9,134 కోట్లు, రుణ మార్కెట్లో రూ. 4,567 కోట్లు పెట్టుబడి చేయడంతో ఈ పక్షంరోజుల్లో వారి పెట్టుబడుల మొత్తం రూ.13,706 కోట్లకు పెరిగినట్లు సెంట్రల్ డిపాజిటరీ డేటా వెల్లడిస్తున్నది. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకూ ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ.71,958 కోట్లకు చేరాయి. -
నెల కనిష్టానికి సెన్సెక్స్
అనుకున్న దానికన్నా ముందే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచేస్తుందన్న భయాలు మంగళవారం కూడా కొనసాగాయి. దీనికి తోడు గురువారం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ), ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనుండటంతో ట్రేడింగ్ మందకొడిగా సాగింది. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 135 పాయింట్లు, నిఫ్టీ 45 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. జూన్ కంటే ముందే ఫెడ్ వడీ ్డరేట్లను పెంచే అవకాశాలున్నాయన్న ఆందోళనలతో సోమవారం స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. ఇవే భయాలు మంగళవారమూ కొనసాగాయని, సెంటిమెంట్ బలహీనపడిందని బ్రోకర్లు చెప్పారు. 365 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ సోమవారం నాటి ముగింపు(28,845 పాయింట్లు)తో పోలిస్తే 79 పాయింట్ల లాభంతో బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభమైంది. 28,924 పాయింట్ల వద్ద ఆరంభమైన సెన్సెక్స్ 28,949-28,584 గరిష్ట, కనిష్ట పాయింట్ల మధ్య (365 పాయింట్ల రేంజ్లో)కదలాడి చివరకు 135 పాయింట్ల(0.47 శాతం) నష్టంతో 28,710 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది నెల రోజుల కనిష్టం. నిఫ్టీ 45 పాయింట్లు నష్టపోయి 8,712 పాయింట్ల వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లోనే ప్రారంభమైనా, మధ్యాహ్నం ట్రేడింగ్లో కీలకమైన షేర్లలో భారీ లాభాల స్వీకరణ కారణంగా నష్టాల్లోకి జారిపోయింది. అయితే ట్రేడింగ్ చివర్లో స్వల్పస్థాయిలో కొనుగోళ్ల కారణంగా స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాలతో గట్టెక్కాయి. క్యాపిటల్ మార్కెట్లో లావాదేవీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, ఎంసీఎక్స్-ఎస్ఎక్స్ ట్రేడింగ్ విభాగం తేదీ కొనుగోలు అమ్మకం నికర విలువ డీఐఐ : 10-03 1,873 1,583 290 09-03 1,486 1,522 - 35 ఎఫ్ఐఐ: 10-03 4,292 5,040 - 748 09-03 5,752 4,914 838 (విలువలు రూ.కోట్లలో) -
మార్కెట్లకు ‘ఫెడ్’ బూస్ట్...సెన్సెక్స్ 416 ప్లస్
మళ్లీ 27,000 దాటిన ఇండెక్స్... ⇒ అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ ఎఫెక్ట్ ⇒ చమురు, కరెన్సీ, ఈక్విటీల జోష్ ⇒ మిడ్, స్మాల్ క్యాప్ షేర్ల హైజంప్ ⇒ ఐదు రోజుల వరుస నష్టాలకు చెక్ వడ్డీరేట్ల పెంపు విషయంలో ఓపికతో వ్యవహరిస్తామని అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ .. బుధవారం రాత్రి ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. దీనికిఅనుగుణంగానే సెన్సెక్స్ నేలక్కొట్టిన బంతిలా రివ్వున పెకైగసింది. దీనికి షార్ట్ కవరింగ్ కూడా జతకలవడంతో 416 పాయింట్లు దూసుకెళ్లింది. గత ఆరు వారాల్లో ఇది అత్యధిక లాభంకాగా, 5 రోజుల వరుస నష్టాలకు చెక్ పెడుతూ మళ్లీ 27,000 పాయింట్లను దాటేసింది. 27,127 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 130 పాయింట్ల హైజంప్ చేసి 8,159 వద్ద నిలిచింది. గత ఐదు రోజుల్లో సెన్సెక్స్ 1,121 పాయింట్లు కోల్పోయిన సంగతి తె లిసిందే. అన్నింటా అదే జోరు...: వచ్చే ఏడాది ద్వితీయార్థంలో(2015 జూన్) మాత్రమే వడ్డీ రేట్ల పెంపు ఉండవచ్చునన్న ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంట్కు జోష్నిచ్చాయి. వెరసి ఐదున్నరేళ్ల కనిష్టం నుంచి చమురు, 13 నెలల కనిష్టం నుంచి రూపాయి కోలుకున్నాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు కూడా భారీగా పుంజుకున్నాయి. అమెరికా మార్కెట్లు బుధ, గురువారాల్లో భారీ ర్యాలీ జరిపాయి. దేశీయంగానూ వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) బిల్లుకు కేబినెట్ ఆమోదం లభించడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం రెట్టింపయ్యింది. బీఎస్ఈలో అన్ని రంగాలూ 1-5% మధ్య ఎగశాయి. మరిన్ని విశేషాలివీ.. ⇒వినియోగవస్తువుల సూచీ 5% జంప్చేయగా, విద్యుత్, యంత్రపరికరాలు, బ్యాంకింగ్, రియల్టీ, ఆటో, మెటల్ 3-2% మధ్య పురోగమించాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు 2.7%, 3.5% చొప్పున పుంజుకున్నాయి. ⇒బ్లూచిప్స్లో భెల్, హిందాల్కో, గెయిల్, మారుతీ, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ, టాటా పవర్, సిప్లా, యాక్సిస్, ఎల్అండ్టీ, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, భారతీ, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, ఆర్ఐఎల్ 5-1% మధ్య లాభపడ్డాయి. ⇒మిడ్ క్యాప్స్లో జేకే టైర్, పీసీ జ్యువెలర్, ఐవీఆర్సీఎల్, టొరంట్ పవర్, డీసీబీ, హెచ్డీఐఎల్, రెడింగ్టన్, అరవింద్, ఎస్సార్ ఆయిల్, పీఎఫ్సీ, పేజ్, గుజరాత్ గ్యాస్ 18-8% మధ్య దూసుకెళ్లాయి. రూపాయి రికవరీ.. 50 పైసలు అప్ ముంబై: వివిధ అంతర్జాతీయ పరిణామాల కారణంగా దేశీ స్టాక్స్ గణనీయంగా పెరగడంతో గురువారం రూపాయి కూడా భారీగా లాభపడింది. డాలర్తో పోలిస్తే దేశీ కరెన్సీ మారకం విలువ ఏకంగా యాభై పైసల మేర బలపడి 63.11 వద్ద ముగిసింది. ఒక్క రోజులోనే ఇంత పెరుగుదల నమోదు కావడం ఏడు నెలల్లో ఇదే ప్రథమం. వడ్డీ రేట్లు పెంచాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ.. మరికొన్నాళ్ల దాకా అమల్లోకి తేకపోవచ్చంటూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించడం ప్రపంచ మార్కెట్లకు కాస్త ఊతమిచ్చినట్లు వెరాసిటీ గ్రూప్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు. గడచిన మూడు రోజుల్లో రూపాయి మారకం విలువ 132 పైసల మేర (2.12 శాతం) క్షీణించిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 63.61తో పోలిస్తే మెరుగ్గా 63.35 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. చివరికి 0.79 శాతం లాభంతో 63.11 వద్ద ముగిసింది. ఎగుమతి సంస్థలు, కొన్ని బ్యాంకులు.. డాలర్లను విక్రయించడం కూడా రూపాయి పెరుగుదలకు తోడ్పడినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. -
చోర్ ... సిబ్బంది షేర్?
ఫైనాన్స్ కంపెనీలో భారీ చోరీ 15లక్షల సొత్తు అపహరణ షట్టర్ పగులగొట్టి.. అసలైనతాళపు చెవితో లాకర్లు తెరిచిన వైనం ఇంటి దొంగలపైనే అనుమానం ముగ్గురు బ్యాంకు సిబ్బందిని విచారిస్తున్న పోలీసులు మౌలాలి/గౌతంనగర్: ముఖానికి ముసుగు.. చేతికి గ్లౌజ్లు.. సీసీ పుటేజీలకు దొర క్కుండా జాగ్రత్తలు.. జాగిలాలు పసిగట్టకుండా ఉండేలా కారం పొడి చల్లి మాల్కాజిగిరిలోని ‘ఫెడ్బ్యాంక్’ (ఫెడరల్ బ్యాంక్ అనుబంధ సంస్థ)లో *15 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు, నగదును దోచుకెళ్లారు. బ్యాంక్లో లాక ర్ను ఒరిజనల్ తాళంతో తీయడాన్ని బట్టి ఇది ఇంటి దొంగల పనిగాపోలీసులు భావిస్తున్నారు. సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే...మల్కాజిగిరి పోలీసు స్టేషన్ పరిధిలోని గీతానగర్లో బంగారు ఆభరణాలపై రుణాలు ఇచ్చే ఫైనాన్స్ సంస్థ ‘ఫెడ్బ్యాంక్’ ఉంది. అక్కడి సిబ్బంది పనులు ముగించుకుని సోమవారం సాయంత్రం ఏడు గంటలకు బ్యాంకుకు తాళాలు వేసి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం బ్యాంకు వద్దకు వాచ్మన్, అపార్టుమెంట్ వాసులు వచ్చా రు. షట్టర్ పగులగొట్టి ఉండటాన్ని గుర్తించా రు. వారు వెంటనే పోలీసులకు, సంస్థ ఉద్యోగులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు, ఉద్యోగులు, ఫెడరల్ బ్యాంకు అధికారులు, డాగ్స్క్వాడ్, క్లూస్ టీం చేరుకున్నాయి. డీసీపీ రమా రాజేశ్వరి దోపిడీ తీరును నిశితంగా పరిశీలించారు. లోపలికి ప్రవేశించిన అగంతకులు ఆభరణాలు దాచి ఉంచిన లాకర్లను మాత్రం అసలైన తాళపు చెవితో తెరిచినట్టు గుర్తించారు. ఇంటి దొంగల పనే... ఫెడ్బ్యాంకు చోరీలో ఇంటి దొంగల పాత్ర ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులోకి ప్రవేశించిన దొంగలు లాకర్లను పగులగొట్టే ప్రయత్నం చేయకుండా, తాళం చెవులతోనే తెరిచి చోరీకి పాల్పడడంతో ఇందులో సిబ్బంది పాత్ర ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆధారం దొరకకుండా ఉండేందుకు దుండగులు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖానికి ముసుగు ధరించి, చేతులకు గ్లౌజ్లు వేసుకుని చోరీకి పాల్పడినట్టు సీసీటీవీ పుటేజీలో గుర్తించారు. పోలీసులు, జాగిలాలు గుర్తించకుండా ఉండేందుకు, ఆనవాళ్లు లేకుండా చేసేందుకు లాకర్లవద్ద కారంపొడి చల్లడం గమనార్హం. చోరీకి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముగ్గురు బ్యాంకు సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అవసరాల కోసం తనఖా పెట్టిన బంగారు నగలు చోరీకి గురికావడంపై ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఖాతాదారులు ఆందోళన చెందనవసరం లేదని పెడ్ ఫైనాన్స్ యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు బ్యాంకు అధికార ప్రతినిధి ఎన్.కుమార్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. -
క్యూ2 ఫలితాలే మార్కెట్లకు దిక్సూచి
జాబితాలో ఐసీఐసీఐ, మారుతీ, టెక్ మహీంద్రా చమురు ధరలు, రూపాయి కదలికలూ కీలకమే ఎఫ్ఐఐల పెట్టుబడులు, విదేశీ అంశాలపైనా దృష్టి అమెరికా ఫెడ్ సమీక్షపై అంచనాలు న్యూఢిల్లీ: రెండో దశలో వెల్లడికానున్న బ్లూచిప్ కంపెనీల ఫలితాలపైనే ఇకపై మార్కెట్ల నడక ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే తొలి దశలో భాగంగా సాఫ్ట్వేర్ దిగ్గజాలు, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఫలితాలు ప్రకటించగా, ప్రయివేట్ రంగ ఆయిల్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ పనితీరు సైతం వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్(క్యూ2) కాలానికి మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, టెక్ మహీంద్రా తదితర దిగ్గజాలు ఈ వారంలో ఫలితాలను ప్రకటించనున్నాయి. వీటికితోడు సిమెంట్ రంగ దిగ్గజాలు ఏసీసీ, అంబుజాలతోపాటు టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్, ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్, మెటల్స్ దిగ్గజం సెసాస్టెరిలైట్, లుపిన్, సుజ్లాన్ ఎనర్జీ క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. విదేశీ మార్కెట్ల ట్రెండ్ దేశీయంగా కంపెనీల క్యూ2 ఫలితాలపైనే ఇన్వెస్టర్లు దృష్టిపెట్టినప్పటికీ, ప్రపంచ స్టాక్ మార్కెట్ల తీరు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు సైతం కీలకంగా నిలవనున్నట్లు నిపుణులు తెలిపారు. మరోవైపు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు, దేశీయంగా డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు సెంటిమెంట్ను ప్రభావితం చేస్తాయని వివరించారు. రానున్న రోజుల్లో మార్కెట్లు సానుకూలంగా కదిలే అవకాశాలే అధికంగా ఉన్నాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అభిప్రాయపడ్డారు. అయితే ఫలితాల సీజన్ నేపథ ్యంలో ట్రేడర్లు షేర్ల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉన్నదని చెప్పారు. ఫె‘డర్’ల్ రిజర్వ్... ప్రపంచవ్యాప్తంగా కమోడిటీలు, స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయగల అమెరికా ఫెడలర్ రిజర్వ్ ఈ వారంలో పాలసీ సమీక్షను నిర్వహించనుంది. మంగళవారం(28న) మొదలుకానున్న రెండు రోజుల సమావేశం బుధవారం(29న) ముగుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చెలరేగిన రుణ సంక్షోభం నేపథ్యంలో కుదేలైన అమెరికా ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు ఫెడరల్ రిజర్వ్ 2009 నుంచీ సహాయక ప్యాకేజీలను అమలు చేస్తూ వస్తోంది. దీనిలో భాగంగా నామమాత్ర వడ్డీ రేట్లను కొనసాగించడంతోపాటు, బాండ్ల కొనుగోలు ద్వారా బిలియన్ల కొద్దీ డాలర్లను వ్యవస్థలోకి పంప్చేస్తూ వచ్చింది. అయితే గత కొన్ని నెలలుగా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, ఉద్యోగ గణాంకాలు మెరుగుపడటం వంటి అంశాల కారణంగా ప్యాకేజీలో కోత విధించింది. ఈ బాటలో నవంబర్కల్లా ప్యాకేజీకి పూర్తిగా మంగళం పాడనుంది. ఆపై మిగిలింది వడ్డీ రేట్ల పెంపే. అయితే సమీప భవిష్యత్లో వడ్డీ రేట్లను పెంచబోమంటూ గల సమీక్షలో ఫెడరల్ స్పష్టం చేసినప్పటికీ, ఈ అంశంపై అంచనాలు కొనసాగుతూనే ఉన్నాయ్. వెరసి ఫెడ్ పాలసీ సమీక్షపై అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకోవడం విశేషం! తాజాగా జరిగిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఒక్కసారిగా సెంటిమెంట్ పుంజుకుంది. దీంతో గడిచిన వారంలో సెన్సెక్స్ నికరంగా 743 పాయింట్లు ఎగసింది. 26,851 వద్ద ముగిసింది. అక్టోబర్లో విదేశీ పెట్టుబడులు రూ. 9,000 కోట్లు దేశీ క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) పెట్టుబడులు కొనసాగుతున్నాయి. సెబీ తాజా గణాంకాల ప్రకారం సెప్టెంబర్లో 1.5 బిలియన్ డాలర్లను(రూ. 9,000 కోట్లు) ఇన్వెస్ట్చేశారు. దీంతో జనవరి మొదలు ఇప్పటివరకూ ఈ ఏడాది ఎఫ్పీఐల పెట్టుబడులు 35 బిలియన్ డాలర్లను చేరుకున్నాయి. అయితే ఈ నెల అక్టోబర్లో 1 నుంచి 22 వరకూ రుణ సెక్యూరిటీల మార్కెట్లో రూ. 12,645 కోట్లు(2.06 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్చేయగా, ఈక్విటీల నుంచి మాత్రం రూ. 3,500 కోట్ల(57 కోట్ల డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. కాగా, జనవరి నుంచి చూస్తే ఈక్విటీలలో నికరంగా రూ. 79,938 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. రూ. 1.3 లక్షల కోట్ల విలువైన రుణ సెక్యూరిటీలను కొనుగోలు చేశారు. -
మార్కెట్లకు ఫెడ్ ఆక్సిజన్
390 పాయింట్లు అప్ 26,637 వద్దకు సెన్సెక్స్ 3 రోజుల నష్టాలకు చెక్ అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్ట రికవరీ సాధించేవరకూ వడ్డీ రేట్లను నామమాత్ర స్థాయిలోనే కొనసాగించేందుకు ఫెడరల్ రిజర్వ్ కమిటీ నిర్ణయించినట్లు వెలువడ్డ వార్తలు ప్రపంచ స్టాక్ మార్కెట్లకు జోష్నిచ్చాయి. దీంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించింది. సెన్సెక్స్ 390 పాయింట్లు జంప్చేసి రెండు వారాల గరిష్టం 26,637 వద్ద ముగిసింది. బుధవారం రాత్రి అమెరికా మార్కెట్లు హైజంప్ చేయడంతోపాటు, గురువారం ఆసియా మార్కెట్లు లాభపడటం దేశీయంగా సెంటిమెంట్ను మెరుగుపరచింది. వెరసి ఉదయం నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో నిఫ్టీ సైతం 118 పాయింట్లు ఎగసి 7,961 వద్ద నిలిచింది. ఇతర విశేషాలివీ... * బీఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడగా, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, బ్యాంకింగ్, పవర్, మెటల్ 3-2% మధ్య ఎగశాయి. * క్యాపిటల్ గూడ్స్ దిగ్గజాలలో భెల్ 8.5% జంప్చేసింది. తమిళనాడులో రూ. 7,800 కోట్ల విలువచేసే 1,320 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ ఆర్డర్ను పొందడం ఇందుకు కారణం. * బ్యాంకింగ్లో ఫెడరల్ బ్యాంక్ 8% దూసుకెళ్లగా, బీఓఐ, యస్ బ్యాంక్, కెనరా, ఎస్బీఐ, ఐసీఐసీఐ, పీఎన్బీ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 5-2% మధ్య పెరిగాయి. * రియల్టీలో డీబీ 8% పుంజుకోగా, యూని టెక్, హెచ్డీఐఎల్, ఇండియాబుల్స్, అనంత్రాజ్, డీఎల్ఎఫ్ 5-2.5% మధ్య పెరిగాయి. * పవర్ షేర్లు జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, జీఎం ఆర్, జేపీ పవర్, అదానీ పవర్, ఆర్పవర్, టాటా పవర్ 6.5-2.5% మధ్య ఎగశాయి. -
నష్టాల నుంచి రికవరీ
విదేశీ మార్కెట్ల అండతో రెండు రోజుల భారీ నష్టాలకు బుధవారం చెక్ పడింది. వెరసి మూడు వారాల కనిష్ట స్థాయి నుంచి మార్కెట్లు కోలుకున్నాయి. ప్రధానంగా ఐటీ, ఆటో, పవర్ రంగాలు 1%పైగా పుంజుకోవడంతో సెన్సెక్స్ 139 పాయింట్లు లాభపడింది. 26,631 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 43 పాయింట్లు పెరిగి 7,975 వద్ద నిలిచింది. చైనా కేంద్ర బ్యాంకు నుంచి భారీ సహాయక ప్యాకేజీ వార్తలతో ఆసియా మార్కెట్లు బలపడగా, యూరప్ సూచీలు సైతం లాభాలతో మొదలయ్యాయి. దీంతో దేశీయంగానూ సెంటిమెంట్ మెరుగుపడింది. అయితే ఫెడరల్ రిజర్వ్ సమీక్షపై దృష్టి పెట్టిన ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని విశ్లేషణ అమెరికా వడ్డీ పెంపు ఆందోళనలతో గత రెండు రోజుల్లో సెన్సెక్స్ 568 పాయింట్లు కోల్పోయింది. రెండు రోజుల ఫెడ్ సమీక్ష ఫలితాలు దేశీ కాలమానం ప్రకారం బుధవారం అర్థరాత్రి వెలువడనున్నాయి. కాగా, ప్యాకేజీలో భాగంగా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా 500 బిలియన్ యువాన్లను ఆ దేశ ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకులు ఐదింటికి అందించనున్నట్లు వార్తలు వెలువడటంతో జపాన్ మినహా ఆసియా మార్కెట్టు 0.5-1% లాభాలతో ముగిశాయి. ఒకటి మినహా...: బీఎస్ఈలో వినియోగ వస్తు రంగం మినహా అన్ని సూచీలూ లాభపడ్డాయి. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూర్ జిల్లాలో కొత్త ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్న హీరో మోటో దాదాపు 2% లాభపడింది. దక్షిణాఫ్రికా కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణ వార్తలతో అపోలో టైర్స్ షేరు 3% పుంజుకోగా, మణప్పురం, జేకే టైర్, నాల్కో, కోల్టేపాటిల్, ఏబీబీ, ఎన్సీసీ, చోళమండలం ఫైనాన్స్, సోలార్ ఇండస్ట్రీస్, అరవింద్ 11-4.5% మధ్య ఎగశాయి. ఎఫ్డీఐలకు ఈక్విటీల జారీ నిబంధనలు సరళతరం ముంబై: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐలు) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ సరళీకరించింది. తద్వారా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులకుగాను దేశీ కంపెనీలు ఆటోమాటిక్ మార్గంలో ఈక్విటీ షేర్లను జారీ చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అయితే కొన్ని పరిమితులకు లోబడి సంస్థకు లభించే ఏ విధమైన విదేశీ పెట్టుబడులైనప్పటికీ షేర్లు లేదా మార్పిడికి వీలయ్యే డిబెంచర్ల జారీకి కంపెనీలను అనుమతించింది. ఇందుకు ప్రభుత్వం లేదా రిజర్వ్ బ్యాంక్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవలసిన అవసరం ఉండదు. అయితే ఎఫ్డీఐ నిబంధనలకు అనుగుణంగా ఈక్విటీ షేర్లను రంగాలవారీగా పరిమితులు, ధరల మార్గదర్శకాలు, పన్ను చట్టాలు తదితరాలకు లోబడి జారీ చేయాల్సి ఉంటుంది. -
మార్కెట్కు ఫెడ్ ఫీవర్
అంచనాలకంటే ముందుగానే అమెరికా కేంద్ర బ్యాంకు ‘ఫెడరల్ రిజర్వ్’ వడ్డీ రేట్లను పెంచవచ్చునన్న అంచనాలు దేశీ స్టాక్ మార్కెట్లను ఒక కుదుపు కుదిపాయి. పాలసీ సమీక్షలో భాగంగా రెండు రోజుల ఫెడ్ సమావేశాలు మంగళవారం మొదలయ్యాయి. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఫెడ్ అమలు చేస్తున్న 80 బిలియన్ డాలర్ల సహాయక ప్యాకేజీ ముగింపునకు రావడంతో ఇక వడ్డీ రేట్లు పెంచడంపై దృష్టి పెడుతుందన్న ఆందోళనలు ఇన్వెస్టర్లలో చెలరేగాయి. ఇది జరిగితే విదేశీ పెట్టుబడులు నిలిచిపోవడంతోపాటు, వెనక్కి తరలిపోవచ్చునన్న భయాలు ఇన్వెస్టర్లను అమ్మకాలవైపు ఎగదోశాయి. దీంతో నిఫ్టీ సైతం 109 పాయింట్లు దిగజారి 7,933 వద్ద నిలిచింది. ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడం కూడా సెంటిమెంట్ను బలహీనపరచిందని విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా, ఇంతక్రితం ఆగస్ట్ 1న మాత్రమే సెన్సెక్స్ 414 పాయింట్లు పడింది. 6 సంవత్సరాల తరువాత: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం చెలరేగడంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ 2008 డిసెంబర్ నుంచీ వడ్డీ రేట్లను నామమాత్ర స్థాయిలోనే కొనసాగిస్తూ వస్తోంది. దీంతోపాటు మందగించిన ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు సమకూర్చే బాటలో సహాయక ప్యాకేజీల ద్వారా బిలియన్ల కొద్దీ డాలర్లను వ్యవస్థలోకి పంప్ చేస్తూ వస్తోంది. ఇటీవల ప్యాకేజీల ఉపసంహరణను చేపట్టడంతోపాటు, వడ్డీ రేటు పెంపుపై పునరాలోచన చేసే సంకేతాలు ఇస్తూ వస్తోంది. ఈ బాటలో తాజాగా పరపతి సమీక్షను చేపట్టడంతో ఆరేళ్ల తరువాత ఫెడ్ మళ్లీ వడ్డీ పెంపు విధానాలను ప్రకటించవచ్చునన్న భయాలు మార్కెట్లలో చెలరేగాయి. ఫలితంగా ఆసియా, యూరప్ మార్కెట్లు సైతం బలహీనపడ్డాయి. మరిన్ని విశేషాలివీ... అన్నింటా అమ్మకాలే: బీఎస్ఈలో అన్ని రంగాలూ అమ్మకాలతో నీరసించాయి. ప్రధానంగా రియల్టీ, పవర్, ఆయిల్, మెటల్, బ్యాంకింగ్, ఆటో 3.5-2% మధ్య పతనమయ్యాయి. బ్లూచిప్స్ బోర్లా: సెన్సెక్స్ దిగ్గజాలలో టాటా పవర్ 6% పతనంకాగా, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఎల్అండ్టీ, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఎస్బీఐ, రిలయన్స్, కోల్ ఇండియా, గెయిల్, హిందాల్కో, భెల్, ఐసీఐసీఐ, సిప్లా, విప్రో 3.5-1.5% మధ్య నష్టపోయాయి. ఏడు మాత్రమే అది కూడా నామమాత్ర లాభాలతో ముగిశాయి. పవర్ షాక్: విద్యుత్ రంగ షేర్లలో జీఎంఆర్ ఇన్ఫ్రా 10% పడిపోగా, టొరంట్ పవర్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, సీఈఎస్సీ, క్రాంప్టన్ గ్రీవ్స్, రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్, ఎన్హెచ్పీసీ 7-4% మధ్య తిరోగమించాయి. రియల్టీ దిగాలు: రియల్టీ షేర్లలో హెచ్డీఐఎల్, యూనిటెక్, అనంత్రాజ్, డీబీ, ఒబెరాయ్, ఇండియాబుల్స్, ప్రెస్టీజ్, డీఎల్ఎఫ్ 8-3% మధ్య క్షీణించాయి. చిన్న షేర్లు విలవిల: ప్రధాన సూచీలను మించుతూ మిడ్ క్యాప్ 3.5% పతనమైతే, స్మాల్ క్యాప్ మరింత అధికంగా 4% దిగజారింది. ట్రేడైన షేర్లలో ఏకంగా 2,230 నష్టపోతే, కేవలం 803 లాభపడ్డాయంటే అమ్మకాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఎఫ్ఐఐల యూటర్న్: ఇటీవల వరకూ నికర పెట్టుబడిదారులుగా నిలుస్తూ వచ్చిన ఎఫ్ఐఐలు తాజాగా రూ. 829 కోట్ల విలువైన షేర్లను విక్రయించడం గమనార్హం. నేలచూపులే: కాలపరిమితి రుణం చెల్లింపులో ఆలస్యం కారణంగా కంపెనీ రేటింగ్ను క్రిసిల్ డౌన్గ్రేడ్ చేయడంతో వీనస్ రెమిడీస్ షేరు 20% కుప్పకూలింది. ఇక ఎంఎస్సీఐ మిడ్ క్యాప్ సూచీలో స్థానం కోల్పోవడంతో యస్ బ్యాంక్ షేరు 4% పతనమైంది. -
ఫెడ్ పాలసీ సమీక్షపై దృష్టి
న్యూఢిల్లీ: అమెరికా ఫెడరల్ రిజర్వ్ చేపట్టనున్న పాలసీ సమీక్షపై ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు దృష్టిపెట్టాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇక దేశీయంగా ఆగస్ట్ నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. కాగా, గత వారం చివర్లో మార్కెట్లు ముగిశాక ఆగస్ట్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ)తోపాటు, జూలై నెలకు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు(ఐఐపీ) వెలువడ్డాయి. ఈ వారం స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ నిర్ణయంపై వీటి ప్రభావం ఉంటుందని ఎక్కువమంది నిపుణులు అభిప్రాయపడ్డారు. సోమవారం మధ్యాహ్నం డబ్ల్యూపీఐ గణాంకాలు వెల్లడికానున్నాయి. గత వారం వెలువడ్డ ఐఐపీ నిరాశపరచగా, సీపీఐ కాస్త ఫరవాలేదనిపించింది. వెరసి సోమవారం ఈ అంశాల ఆధారంగా మార్కెట్లు ఎలా స్పందించేదీ వేచిచూడాల్సి ఉందని విశ్లేషకులు పేర్కొన్నారు. వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు: పరపతి విధానాల సమీక్షపై ఫెడరల్ రిజర్వ్ నిర్వహించనున్న రెండు రోజుల సమావేశాలు బుధవారం ముగియనున్నాయి. ప్రధానంగా సహాయక ప్యాకేజీ నిలిపివేత, వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు వంటి అంశాలు అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావాన్ని చూపనున్నాయని నిపుణులు పేర్కొన్నారు. దేశీయంగానూ ఇన్వెస్టర్లు అమెరికా వడ్డీ పెంపు అంశాన్ని నిశితంగా పరిశీలిస్తారని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చె ప్పారు. అంచనాలకంటే ముందుగానే పెంపునకు అవకాశాలు కనిపిస్తే వర్థమాన మార్కెట్ల నుంచి పెట్టుబడులు తరలిపోతాయన్న ఆందోళనలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ముందస్తు పన్ను చెల్లింపులు సోమవారం వెల్లడికానున్న లిస్టెడ్ దిగ్గజాల ముందస్తు పన్ను చెల్లింపులపైనా ఇన్వెస్టర్లు కన్నేస్తారని విశ్లేషకులు తెలిపారు. వీటి ఆధారంగా కార్పొరేట్ల జూలై-సెప్టెంబర్(క్యూ2) ఫలితాలను అంచనా వేస్తారని తెలిపారు. ఇక మరోవైపు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడుల తీరు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు వంటి అంశాలు కూడా కీలకంగా నిలుస్తాయని వివరించారు. ప్రభుత్వం సంస్కరణల అజెండాను కొనసాగిస్తుందన్న అంచనాలతో ఎఫ్ఐఐలు ఈ నెలలోనూ రూ. 17,000 కోట్లను ఇన్వెస్ట్ చేశారని, దీంతో దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను అందుకుంటున్నాయని సియాన్స్ అనలిటిక్స్ సహవ్యవస్థాపకుడు, సీఈవో అమన్ చౌదరి చెప్పారు. మార్కెట్లు సానుకూలంగానే ఉన్నప్పటికీ సిరియా, ఇరాక్, అమెరికాల మధ్య ఏర్పడ్డ ఉద్రేక పరిస్థితుల కారణంగా సెంటిమెంట్ బలహీనపడవచ్చునని బొనాంజా పోర్ట్ఫోలియో సీనియర్ వైస్ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ అభిప్రాయపడ్డారు. -
‘పోలవరం’తో ఆదివాసీల జలసమాధి
ప్రాజెక్టును రద్దు చేసే వరకూ పోరాటం కొందరి ప్రయోజనాల కోసమే మోడీ, బాబు కుట్ర ద ళితులతో పాటు పేదలకూ భూమి పంచాలి టీపీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిక్కుడు ప్రభాకర్ కేయూ క్యాంపస్ : పోలవరం ప్రాజెక్టు నిర్మా ణం జరిగితే లక్షలాది మంది ఆదివాసీలు జల సమాధి కానున్నారని, ఈ విపత్తును చూడడానికేనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నదని తెలంగాణ ప్రజాఫ్రంట్(టీపీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిక్కుడు ప్రభాకర్ ప్రశ్నించారు. ఇదే జరిగితే ఆదివాసీ సమాజం తెలంగాణ పాలకు లను క్షమించబోదని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రాజెక్టును రద్దు చేసే వరకు ప్రత్యక్ష పోరాటాలు చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశా రు. తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య(టీఏకేఎస్) జిల్లా కమిటీ ఆధ్వర్యం లో హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక సదస్సు ఆదివారం జరిగింది. ఈ సదస్సులో ప్రభాకర్ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ సీమాంధ్ర పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ప్రధాని మోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుట్ర పన్ని పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగితే అటవీ ఉత్పత్తులపై ఆధారపడి, పోడు వ్యవసాయంతో బతుకీడుస్తున్న 2-3 లక్షల వరకు ఆదివాసీలు జలసమాధి అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక టీఆర్ఎస్, టీ జేఏసీ నాయకులు కూడా పోలవరం డిజైన్ మార్పునకు పోరాడుతున్నారే తప్ప ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేయకపోవడమేమిటని ఆయన ప్రశ్నించారు. మేధావులుగా భా వించే వారు స్వప్రయోజనాల కోసం సెక్రటరియేట్కు క్యూ కడుతూ పోలవరంపై పెదవి విప్పకపోవడం గర్హనీయమన్నారు. ఇప్పటికైనా తెలంగాణ యావత్ సమాజం రాష్ట్రం కోసం ఉద్యమించినట్లుగా పోలవరం ప్రాజెక్టును రద్దు చేయాలనే డిమాండ్తో పోరాడాలని, దీనికి తాను నేతృత్వం వహిస్తానని ప్రభాకర్ స్పష్టం చేశారు. మిగతా వర్గాల మాటేమిటి? తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం తన విధానాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరముందని ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెబుతున్న పాలకులు గిరిజ న, బీసీ తదితర వర్గాల్లో భూమి లేని నిరుపేదలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నక్సలైట్ల ఎజెండాయే మా ఎజెండా అని చెప్పిన టీఆర్ఎస్ నేతలు అధికారంలోకి వచ్చాక ఆదిలాబాద్ జిల్లాలో కాల్పు లు జరిపించడమేమిటని ఆయన ప్రశ్నించారు. పాలకులది మొండివైఖరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టు విషయంలో మొండివైఖరిని అవలంభిస్తున్నాయని తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘా ల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరనేని నర్సాగౌడ్ విమర్శించారు. ప్రాజెక్టు రద్దు కోసం పోరాడుతున్న ఆదివాసీలకు అందరూ సంఘీభావంగా నిలవాలని పిలుపునిచ్చారు. విరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాసిత్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు ఉన్నా ఆదివాసీలను ముంచే పోలవరం పై శ్రద్ధ ఎందుకు అర్థం కావడం లేదన్నారు. ఈక్రమంలో నిర్వాసితులయ్యే ఆదివాసీలను పట్టించుకోకపోవడం గర్హనీయమన్నారు. ససదస్సులో టీఏకేఎస్ రాష్ట్ర కార్యదర్శి సుద్దాల నాగరాజు, తుడందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్, తెలంగాణ సహజ వనరుల సంరక్షణ సమితి జిల్లా కన్వీనర్ నల్లెల రాజయ్య, టీఏకేఎస్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము రవి, టీవీవీ జిల్లా అధ్యక్షుడు బైరబోయిన సుధాకర్, తు డుందెబ్బ జిల్లా అధ్యక్షుడు బూరక యాదగిరి, సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్లు అక్కడక్కడే...
మార్కెట్ అప్డేట్ - సెన్సెక్స్ 20 పాయింట్లు ప్లస్ - రోజంతా స్వల్ప ఒడిదుడుకులు సెంటిమెంట్ను ప్రభావితం చేయగల అంశాలేవీ లేకపోవడంతో మార్కెట్లు స్వల్ప స్థాయి కదలికలకే పరిమితమయ్యాయి. రోజంతా చిన్నగా ఒడిదుడుకులకు లోనైనప్పటికీ చివరికి నామమాత్ర లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 20 పాయింట్లు లాభపడి 22,344 వద్ద నిలవగా, నిఫ్టీ 7 పాయింట్లు పెరిగి 6,660 వద్ద స్థిరపడింది. వినియోగ వస్తువులు, బ్యాంకింగ్, ఆటో రంగాలు 1-0.5% మధ్య బలపడగా, ఎఫ్ఎంసీజీ, రియల్టీ 1% స్థాయిలో నీరసించాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు మద్దతును కొనసాగిస్తామంటూ ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ జానెట్ యెలెన్ ప్రకటించడంతో అంతర్జాతీయ స్థాయిలో సెంటిమెంట్ మెరుగుపడిందని నిపుణులు విశ్లేషించారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ముందురోజు రూ. 119 కోట్లను ఇన్వెస్ట్చేసిన ఎఫ్ఐఐలు తాజాగా రూ. 363 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ ఫండ్స్ మాత్రం రూ. 120 కోట్ల అమ్మకాలు నిర్వహించాయి. ఐపీవో బాటలో రత్నాకర్ బ్యాంక్ న్యూఢిల్లీ: ఆర్బీఎల్ బ్యాంక్ (గతంలో రత్నాకర్ బ్యాంక్) పబ్లిక్ ఇష్యూ చేపట్టే ప్రణాళికల్లో ఉంది. తద్వారా కనీసం రూ. 500 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ4లో ఐపీవోను చేపట్టే యోచనలో ఉన్నట్లు బ్యాంక్ ఎండీ విశ్వవీర్ అహుజా పేర్కొన్నారు. రానున్న రెండు మూడు నెలల్లో ఇందుకు అవసరమైన సన్నాహాలను చేపడతామని చెప్పారు. ఆఫర్ ఏ స్థాయిలో చేపట్టేదీ ఇంకా నిర్ణయించనప్పటికీ కనీసం 10% వాటా విక్రయం ద్వారా రూ. 500 కోట్లను సమీకరించాలిని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 5 లక్షల కస్టమర్లకు బ్యాంక్ సేవలను అందిస్తున్నదని, రూ. 21,000 కోట్లకుపైగా బిజినెస్ను కలిగి ఉన్నదని వివరించారు. -
165 పాయింట్లు మైనస్
వివిధ అంశాల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నీరసించాయి. గత కొన్ని రోజులుగా మార్కెట్లలో వచ్చిన భారీ ర్యాలీలో భాగంగా ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించేందుకు అమ్మకాలు చేపడుతుండటం ప్రభావం చూపుతోంది. వీటికితోడు ఎల్నినో కారణంగా సాధారణంక ంటే తక్కువ వర్షపాతం నమోదుకావచ్చన్న ముందస్తు అంచనాలు కూడా సెంటిమెంట్ను దెబ్బకొట్టడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చారు. వెరసి సెన్సెక్స్ 165 పాయింట్లు క్షీణించి 22,466 వద్ద ముగిసింది. దీంతో మూడు రోజుల్లో 410 పాయింట్లు కోల్పోయింది. ఇక నిఫ్టీ కూడా 46 పాయింట్ల నష్టంతో 6,715 వద్ద నిలిచింది. మంగళవారం నుంచీ అమెరికా ఫెడరల్ రిజర్వ్ రెండు రోజులపాటు పాలసీ సమీక్షను నిర్వహించనుంది. జనవరి నుంచి నెలకు 10 బిలియన్ డాలర్ల చొప్పున కోత పెట్టడం ద్వారా గత కొన్ని నెలలుగా అమలు చేస్తున్న 85 బిలియన్ డాలర్ల సహాయక ప్యాకేజీని ఫెడ్ పూర్తి స్థాయిలో ఉపసంహరించనున్న సంగతి తెలిసిందే. ఇదయ్యాక వడ్డీ రేట్ల పెంపుపై దృష్టిపెట్టేందుకు అవకాశముండటంతో ఇన్వెస్టర్లలో కొంతమేర ఆందోళనలు చోటుచేసుకున్నాయని విశ్లేషకులు తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్ సంక్షోభ ప్రభావమూ ఉన్నదని వ్యాఖ్యానించారు. మెటల్స్ డీలా... బీఎస్ఈలో వినియోగ వస్తువులు మినహా అన్ని రంగాలూ నష్టపోగా, మెటల్స్ అత్యధికంగా 3% పతనమైంది. నిరుత్సాహకర ఫలితాల ప్రకటనతో జిందాల్ స్టీల్ 7.5% దిగజారగా, జేఎస్డబ్ల్యూ, టాటా స్టీల్, సెయిల్, హిందాల్కో 5-3% మధ్య పతనమయ్యాయి. మిగిలిన దిగ్గజాలలో హెచ్యూఎల్, టాటా పవర్, బజాజ్ ఆటో, ఎస్బీఐ, మారుతీ, టాటా మోటార్స్, సెసాస్టెరిలైట్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3-1% మధ్య నష్టపోయాయి. సెన్సెక్స్లో మూడు షేర్లు మాత్రమే నామమాత్రంగా లాభపడ్డాయి. ఎఫ్ఐఐల పెట్టుబడులు ఎఫ్ఐఐలు రూ. 288 కోట్లను ఇన్వెస్ట్చేయగా, దేశీ ఫండ్స్ రూ. 551 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,506 నష్టపోగా, 1,281 లాభపడ్డాయి. ఫలితాలు నిరుత్సాహపరచడంతో హెక్సావేర్ 11% పడిపోగా, ఫ్యూచర్ రిటైల్, హెచ్సీఎల్ ఇన్ఫో, డెల్టా కార్ప్, మహీంద్రా సీఐఈ, అడ్వాంటా, వోల్టాస్ 7-4% మధ్య పతనమయ్యాయి. అయితే మరోవైపు సన్ఫార్మా అడ్వాన్స్డ్, వోకార్డ్, సోలార్ ఇండస్ట్రీస్, ఫినొలెక్స్ కేబుల్స్, ఆప్టో సర్క్యూట్స్, జేబీఎఫ్, ప్రిజం సిమెంట్, టీవీఎస్ మోటార్, స్టెరిలైట్ టెక్, ఫస్ట్సోర్స్ 14-5% మధ్య దూసుకెళ్లాయి. -
అమెరికా చరిత్రలో తొలి మహిళా...జానెట్ యెలెన్
అమెరికా చరిత్రలో యూఎస్ ఫెడరల్ రిజర్వు సిస్టమ్ చైర్మన్ పదవి పగ్గాలను తొలిసారి ఓ మహిళ చేజిక్కించుకున్నారు. యూఎస్ ఫెడ్ చైర్ పర్సన్ గా జానెట్ యెల్లెన్ ప్రమాణ స్వీకారం చేశారు. 2013 లో అక్టోబర్ 9 తేదిన జానెట్ యెల్లెన్ ను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఫెడ్ వైస్ చైర్ పర్సన్ గా యెల్లెన్ సేవలందించారు. 2018 ఫిబ్రవరి 3 తేది వరకు ఫెడ్ చైర్ పర్సన్ గా యెల్లెన్ పదవిలో కొనసాగనున్నారు. ఇప్పటి వరకు ఫెడ్ రిజర్వ్ చైర్మన్ గా బెన్ బెర్నెంకే వ్యవహరించిన సంగతి తెలిసిందే. వృద్ధి రేటు పెంచడానికి బాండ్ల కొనుగోళ్లలో కొత, వడ్డీ రేట్లలో తగ్గింపు అంశాలు యెల్లెన్ కు సవాల్ గా నిలువనున్నాయి. అమెరికా ఆర్ధిక మాంద్యంలో చిక్కుకున్న సమయంలో అనుసరించిన వడ్డీ రేట్ల పెంపు అనుభవం యెల్లెన్ కు కలిసివచ్చే అంశమని ఆర్ధిక రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.