-
'పెళ్లైతే చేసుకుంటా.. కానీ మాజీ బాయ్ఫ్రెండ్స్తో'.. హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది తాలి, ఆర్య-3 వెబ్ సిరీస్లతో ప్రేక్షకులను అలరించింది. అయితే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోని ప్రపంచసుందరి చాలాసార్లు డేటింగ్ రూమర్స్ వినిపించాయి. అంతే కాదు.. ఐపీఎల్ మాజీ ఛైర్మన్తో లలిత్ మోదీతో కొంత కాలం సుష్మిత డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది దీపావళి సందర్భంగా సుస్మిత తన మాజీ ప్రియుడు రోహ్మాన్ షాల్తో కనిపించింది. 2022లోనే వీరిద్దరికీ బ్రేకప్ అయినప్పటికీ.. చాలా సందర్భాల్లో జంటగా కనిపించారు. దీంతో మరోసారి సుస్మిత సేన్పై పెళ్లి వార్తలొచ్చాయి. దీంతో మరోసారి వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. మీ లైఫ్లో బ్రేకప్ అయినప్పుడు ప్రశ్నించగా.. సుస్మిత తనదైన శైలిలో సమాధానాలిచ్చింది. సుస్మిత మాట్లాడుతూ..'నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. నేను చాలా నిజాయితీగా, నిర్భయంగా జీవిస్తున్నా. గౌరవం అనేది మన జీవితంలో ఒక అంశం మాత్రమే కాదు. అది మీరంటే ఏంటో నిర్ణయిస్తుంది. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలు బాధపెట్టాయా? లేదా ద్రోహం చేశాయా? లేదా మీరు మనం ఏదైనా తప్పు చేశామా? అన్నవి నేను పెద్దగా పట్టించుకోను. జీవితంలో ఎదురయ్యే వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడం.. ముందుకు సాగడమేనని' చెప్పుకొచ్చింది. ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే.. మాజీలతో స్నేహితులుగా ఉండగలరా? అని యాంకర్ ప్రశ్నించారు. దీనిపై సుస్మిత మాట్లాడుతూ..'కచ్చితంగా వారితో ఫ్రెండ్లీగానే ఉంటాను. కానీ కాస్తా కష్టంగానే ఉంటుందని భావిస్తున్నా. చాలా మంది తమ మాజీలతో అలానే ఉంటారు. కానీ ఇక్కడ వారితో లిమిట్స్ ఉంటాయా అనే విషయమైతే తెలియదు. కానీ అది సాధ్యమే. ఇలాంటివీ నేను చూశాను కూడా. ఎందుకంటే ప్రస్తుతం నా జీవితంలో సంతోషంగా ఉన్నా. పెళ్లి చేసుకోవడానికి కావాల్సింది సరైన సమయం, కారణం కాదు. నాకు తగినట్లుదా సరైన వ్యక్తి దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటా' అని తెలిపింది. సుస్మితా సేన్ రిలేషన్స్ సుస్మిత సేన్ మొదట బాలీవుడ్ నటుడు రణ్దీప్ హుడాతో డేటింగ్లో ఉన్నారు. ఆ తర్వాతమోడల్ రోహ్మన్ షాల్తో 2018 నుండి 2021 వరకు మూడేళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించారు. ఆ తర్వాతవ్యాపారవేత్త, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. -
లలిత్ మోడీతో ప్రేమాయణం.. సుస్మితా సేన్ క్లారిటీ!
బాలీవుడ్ హీరోయిన్ సుస్మితా సేన్ ఇటీవలే ఆర్య -3 వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుండగా.. అభిమానుల నుంచి విశేష ఆదరణ దక్కించుకుంటోంది. ఈ వెబ్ సిరీస్ను రామ్ మాధ్వని దర్శకత్వంతో తెరకెక్కించారు. అయితే తాజాగా ఇంటర్వ్యూకు హాజరైన సుస్మితా సేన్ ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీతో తన ప్రేమయాణం గురించి నోరు విప్పింది. (ఇది చదవండి: కావాలయ్యా సాంగ్.. తమన్నా స్టెప్పు చెండాలం అంటూ నటుడి విమర్శలు) మీకు లలిత్ మోడీని పెళ్లి చేసుకోవాలనుకున్నారా ప్రశ్నించగా?..'నేను ఎవరినైనా పెళ్లి చేసుకోవాలనుకంటే చేసుకుంటా. అంతే కానీ ఇలా ప్రయత్నించను. ఇష్టముంటే చేసుకుంటా అంతే. తనపై వచ్చిన మీమ్స్ చూస్తే చాలా ఫన్నీగా అనిపించాయి. మీరు ఎవరినైనా గోల్డ్ డిగ్గర్ అని పిలిచేముందు వాస్తవాలు తెలుసుకోండి. నేను బంగారం కంటే ఎక్కువగా వజ్రాలను ఇష్టపడతాను. మన నిశ్శబ్దంగా ఉంటే మౌనాన్ని బలహీనతగా భావిస్తారు. అందుకే వారికి తెలియజేయడానికి నేను ఒక పోస్ట్ పెట్టవలసి వచ్చింది.' అని అన్నారు. కాగా.. ఇటీవలే దీపావళి సందర్భంగా సుస్మిత తన మాజీ ప్రియుడు రోహ్మాన్ షాల్తో కనిపించింది. వీరిద్దరూ 2022లో బ్రేకప్ అయినప్పటికీ.. చాలా సందర్భాల్లో జంటగా కనిపించారు. దీపావళి సందర్భంగా సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
రక్తసంబంధం లేకున్నా ఆ పిల్లల కోసం సుస్మితా సేన్ ఏం చేసిందంటే
బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తాజాగా ‘తాలీ’ వెబ్ సీరిస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఇది జియో టీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సీరిస్ ట్రైలర్ విడుదలైనప్పుడు తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్న ఆమె ఇందులో ట్రాన్స్జెండర్గా అద్భుతంగా నటించి విమర్శించిన వారికి సమాధానం చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ జర్నీ ఎలా ముగిసింది. అప్పుడు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది. అనే అంశాలపై సుస్మిత కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సుస్మితా సేన్ తన కుమార్తె యొక్క ఆరోగ్య సమస్యల గురించే కాకుండా తన బిడ్డ పట్ల ఎలాంటి విధులను నిర్వహించింది అనే దాని గురించి మాట్లాడారు. ఒక సంఘటనను గుర్తుచేసుకుంటూ.. ఈ సంఘటనతో సినిమాలకు దూరం సుస్మితా సేన్కు 24 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక కుమార్తెను దత్తత తీసుకుంది. ఆ సమయంలో తన తల్లి వద్దని వారించినా మెండిగా నిర్ణయం తీసుకుంది. అప్పుడు ఆమెకు పలు భారీ సినిమా అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పలువురు సన్నిహితులు కూడా వద్దని చెప్పినా సుస్మిత మనుసు మార్చుకోలేదు. కుమార్తెను దత్తత తీసుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇలా చెప్పింది. 'రెనీ నా జీవితంలోకి వచ్చినప్పుడు తన ఆరోగ్యం మెరుగ్గాలేదు. అదే సమయంలో నేను కెనడాలో ఉన్నాను. అక్షయ్ కుమార్, కరీనాతో కలిసి ఒక సినిమా చిత్రీకరణలో ఉన్నాను. పాపను అలా వదిలి రావడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు.. కానీ తప్పలేదు. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ప్రాజెక్ట్లోకి ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి) అలా షూటింగ్లో ఉండగా నా తండ్రి నుంచి ఫోన్ వచ్చింది. పాపకు సీరియస్గా ఉంది. ఆస్పత్రిలో చేర్పించామని నాన్న చెప్పాడు. అలాంటి సమయంలో నేను షూటింగ్లో పాల్గొనలేకపోయాను. తనను నేను నవమాసాలు మోసి కనకపోయినా అంతే సమానమైన బంధం రెనీతో ఉంది. దీంతో సినిమా షూటింగ్లో ఒక్క క్షణం ఉండలేకపోయాను.. సెట్లో అందరి ముందు విషయం చెప్పి కెనడా నుంచి తిరిగి ముంబయ్కు బయల్దేరాను. విదేశాల్లో షూటింగ్లో ఉన్న నేను సినిమాను మధ్యలో ఆపేసి వచ్చేశాను. ఆ క్షణమే నాకు తెలుసు నా సినిమా కెరీర్ ఇక్కడితో ముగిసిందని. అప్పట్లో నాకు కెరీర్పై సీరియస్నెస్ లేదని, అందుకే 24 ఏళ్లకే తల్లినయ్యానని కామెంట్స్ చేసేవారు ఎందరో. దీంతో నా పనిలో ఇంకా ఎక్కువ కష్టపడేదానిని కానీ, అప్పటికే నాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.’ అని సుస్మిత తెలిపింది. 1994లో విశ్వ సుందరిగా నెగ్గిన సుష్మితా సేన్ బాలీవుడ్తో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. తర్వాత ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. (ఇదీ చదవండి: అందరిలా నేనెందుకు ఆనందంగా లేనంటే: టాప్ హీరోయిన్) భారత మెగా టీ20 క్రికెట్ లీగ్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీతో కొంత కాలం సుష్మిత డేటింగ్లో ఉన్నారు. సుష్మితా సేన్ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా 2013లో మదర్ థెరిసా అంతర్జాతీయ అవార్డును ఆమె పొందింది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిద్దరూ కూడా దత్తత తీసుకున్నవారే కావడం విశేషం. -
లలిత్ మోదీతో బ్రేకప్.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన సుష్మితాసేన్!
మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్.. సినిమాలతో పాటు లవ్ ఎఫైర్లతోనూ బాగా ఫేమస్ అయింది. సినిమాల్లో హీరోయిన్గా రాణించిన సమయంలో ఎంతోమందితో ప్రేమాయణం నడిపింది. ఈ క్రమంలో తనకంటే చిన్నవాడైన రోహ్మన్ షాల్తోనూ లవ్వాయణం నడిపింది. కానీ తర్వాత అతడికి బ్రేకప్ చెప్పింది. కొంతకాలానికే ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీతో ప్రేమలో పడింది. వీరిద్దరూ డేటింగ్లో ఉన్న విషయాన్ని తెలియజేస్తూ లలిత్ మోదీ ట్విటర్లోనూ కొన్ని ఫోటోలు రిలీజ్ చేశాడు. ఇది చూసిన జనాలు.. డబ్బు కోసమే సుష్మిత అతడిని ప్రేమిస్తోందంటూ విమర్శలు గుప్పించారు. ఏదైనా అనుకోండి, డోంట్ కేర్ అయితే ఏమైందో ఏమో కానీ కొంతకాలానికే వీరిద్దరు కూడా బ్రేకప్ చెప్పుకున్నారని ప్రచారం జరిగింది. తాజాగా ఈ ట్రోలింగ్పై, బ్రేకప్పై క్లారిటీ ఇచ్చింది నటి. తాలి వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో పాల్గొన్న సమయంలో ఆమె మాట్లాడుతూ.. 'నా గురించి మీరెలా మాట్లాడుకున్నా మంచిదే! డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతానని అంటున్నారు.. ఈ అవమానాలను నేను స్వీకరించినప్పుడే అవమానం.. కానీ అలాంటివి నేనసలు పట్టించుకుంటే కదా! నేనిప్పుడు సింగిల్.. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత విషయాలంటూ కొన్నుంటాయి.. వాటితో మీకు సంబంధం లేదు. ప్రతిదాంట్లో దూరే హక్కు మీకు లేదు. ఇంకో విషయం చెప్పాలి, నేనిప్పుడు సింగిల్గా ఉంటున్నాను. దాని గురించి కూడా మీకనవసరం!' అని ఘాటుగా వ్యాఖ్యానించింది. లలిత్ మోదీతో బ్రేకప్ అయిన విషయాన్ని చెప్పకనే చెప్పింది సుష్మిత. కాగా ఈ నటి ఈ ఏడాది ఫిబ్రవరిలో గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరగా ఓ మేజర్ సర్జరీ జరిగింది. అప్పుడు సినిమాలకు విరామం పలికిన ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుని తిరిగి షూటింగ్లో పాల్గొంటోంది. ప్రస్తుతం ఆర్య 3, తాలి అనే వెబ్ సిరీస్లు చేస్తోంది. చదవండి: మా నాన్న ఎలా ఉంటాడో తెలియదు: ఏడ్చేసిన ధనరాజ్ -
వైరల్ అవుతున్న లలిత్ మోడీ ఆస్తుల విలువ.. ఎన్ని వేల కోట్లంటే?
ఐపీఎల్! వేల కోట్లలో లావాదేవీలు. పరుగు చేస్తే నోటు, బౌండరీ పడితే కట్ట..గెలిస్తే కోటితో వ్యవహారం అది..! కానీ ఓడినా కోట్లు, నోట్లు వస్తాయండోయ్ అదే ఐపీఎల్లో మజా. ఇటువంటి మజాను అందించేలా కార్పొరేట్ క్రికెట్ను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనుడే ఈ లలిత్ మోడీ! కానీ ఐపీఎల్ను తన సొంత అవసరాలకు వాడుకొని అప్రతిష్టను మూటగట్టుకున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. చివరికి పన్ను ఎగవేత, మనీలాండరింగ్లో కేసులో దేశం విడిచి పారిపోయిన లలిత్ మోడీ 2010 నుంచి లండన్లో ఉంటున్నారు. ఎప్పుడూ వివాదాలు, కొత్త సంచలనాలను వెంట పెట్టుకొని తిరిగే లలిత్ మోడీకి ఆయన తల్లి బీనా మోడీ, ఇతర కుటుంబసభ్యులకు మధ్య ఆస్తి వివాదం కొనసాగుతోంది. ఈ వివాదంలో బీనా మోడీ తరుపు వాదిస్తున్న సీనియర్ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీపై నోరు జారారు. సుప్రీం కోర్ట్ చివాట్లు పెట్టడంతో వెనక్కి తగ్గారు. ఈ తరుణంలో లలిత్ మోడీ ఎక్కడ ఉంటున్నారు? బిజినెస్లు ఏమైనా చేస్తున్నారా? చేస్తుంటే ఆయనకి ఎంత ఆస్తి ఉంది? అని నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు. (ఓర్నీ వయ్యారం..ఇదేమి ట్రైన్ భయ్యా! ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న వీడియో) ఐపీఎల్ కుంభకోణం వెలుగులోకి రావడంతో లలిత్ మోడీని బీసీసీఐ నిషేధించింది. కేసులు, విచారణనుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోయినా అక్కడ కూడా దర్జాగా బతికేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మీడియా ఎప్పుడు ఆయనను పలికరించినా నేను గోల్డెన్ స్పూన్తో పుట్టానని చెప్పుకునే లలిత్.. క్రికెట్ను వదిలేసినా ఇతర వ్యాపార వ్యవహారాల్ని చక్క బెట్టుకుంటున్నారు. (ముంబై ఇండియన్స్ బాస్ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన) లలిత్ మోడీ తన కెరీర్లో భారీ ఆస్తులే కూడబెట్టారు. పరారీలో ఉన్నప్పటికీ తన తండ్రికి చెందిన మోడీ ఎంటర్ప్రైజెస్కు అధిపతిగా కొనసాగుతున్నారు. సిగరెట్ తయారీ, విద్య, వ్యవసాయం,ఎంటర్టైన్మెంట్ ఇలా అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న మోడీ ఎంటర్ప్రైజెస్కు అధ్యక్షుడు కూడా. పలు నివేదికల ప్రకారం, 2021లో మోడీ కంపెనీ టర్నోవర్ రూ.1750 కోట్లు. నెలవారీ ఆదాయం దాదాపు రూ.16.5 కోట్లు కాగా, ఆయన వ్యక్తిగత ఆస్తులలో లండన్లో 5 అంతస్తుల విలాసవంతమైన ఇల్లు, రూ.12,000 కోట్ల భారీ వ్యాపారం, అనేక లగ్జరీ కార్లు ఉన్నాయని సమాచారం. 2023 నాటికి, భారత్లో అతని నికర ఆస్తుల విలువ రూ. 4555 కోట్లకు పైగా ఉందని సమాచారం. చదవండి👉 ‘మమ్మల్ని ఆదుకోండి సార్’.. రతన్ టాటాకు చేరిన పైలెట్ల పంచాయితీ! -
రాహుల్ గాంధీని కోర్టుకు ఈడుస్తా.. కాంగ్రెస్ నేతపై లలిత్ మోదీ ఫైర్..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ. ఆయనపై లండన్ కోర్టులో కేసు పెడతానని చెప్పారు. మోదీ ఇంటిపేరుపై రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో సూరత్ కోర్టు ఆయనను దోషిగా తేల్చి రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. దేశంలోని దొంగల ఇంటిపేరు మోదీనే అని ఎందుకు ఉందని రాహుల్ 2019 ఎన్నికల సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే తాను ఇప్పటివరకు ఏ కేసులోనూ దోషిగా తేలలేదని, అలాంటప్పుడు దేశం వీడిపోయిన ఆర్థిక నేరగాడు అని ఎలా అంటారని లలిత్ మోదీ ప్రశ్నించారు. రాహుల్ అనుచరులు, కాంగ్రెస్ నేతలు ఏ ఆధారాలతో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. రాహుల్పై యూకే కోర్టులో కేసు పెడతానని, ఆయన న్యాయస్థానం ముందు హాజరుకావాల్సిందేనని పేర్కొన్నారు. ఈమేరకు లలిత్ మోదీ ట్విట్టర్లో వరుస ట్వీట్లు చేసి రాహుల్, కాంగ్రెస్పై ఫైర్ అయ్యారు. 'పప్పు అనబడే రాహుల్ గాంధీ నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఓ కేసులో దోషిగా తేలారు. నేను మాత్రం గత 15 ఏళ్లలలో ఏ కేసులోనూ దోషిగా తేలలేదు అలాంటప్పుడు నన్ను నేరగాడు అని ఎలా అంటారు. నేనొక సాధారణ వ్యక్తిని. 100 బిలియన్ డాలర్లు విలువ చేసే అతిపెద్ద క్రీడా కార్యక్రమానికి ఆధ్యుడిని.' అని లలిత్ మోదీ ట్వీట్ చేశారు. i see just about every Tom dick and gandhi associates again and again saying i ama fugitive of justice. why ?How?and when was i to date ever convicted of same. unlike #Papu aka @RahulGandhi now an ordinary citizen saying it and it seems one and all oposition leaders have nothing… — Lalit Kumar Modi (@LalitKModi) March 30, 2023 చదవండి: సీబీఐ అప్పుడు నాపై ఎంతో ఒత్తిడి చేసింది: అమిత్ షా -
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీకి తీవ్ర అనారోగ్యం.. ఆస్పత్రిలో చికిత్స
ఐపీఎల్ మాజీ చైర్మెన్ లలిత్ మోదీ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆతడికి కరోనాతో పాటు న్యూమోనియా కూడా సోకింది. ఈ క్రమంలో లండన్లోని ఓ ఆసుపత్రిలో చేరి ఆక్సిజన్ సపోర్ట్పై మోదీ చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. రెండు వారాల్లో రెండు సార్లు కరోనా బారిన పడినట్లు లలిత్ మోదీ తెలిపాడు. అంతేకాకుండా న్యూమోనియా కూడా సోకినట్లు అతడు వెల్లడించాడు. మూడు వారాల పాటు క్వారంటైన్లో ఉన్నట్లు అతడు చెప్పాడు. అదే విధంగా ఆరోగ్యం విషమించడంతో మెక్సికో నుంచి ఇద్దరు వైద్యుల పర్యవేక్షణలో ఎయిర్ అంబులెన్స్ ద్వారా లండన్కు వచ్చి ఆసుపత్రిలో చేరినట్టు అతడు పేర్కొన్నాడు. తనకు ఆసుపత్రికి తరలించడానికి సహాయపడిన వాళ్లందరికీ మోదీ ధన్యవాదాలు తెలియజేశాడు. లలిత్ మోదీ పోస్ట్పై స్పందించిన పలువురు ప్రముఖులు అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చదవండి: చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల బాలుడు.. ఏకంగా 508 పరుగులు బాదిన యష్ -
ఇద్దరు మాజీ బాయ్ఫ్రెండ్స్తో సుష్మితా సేన్ పార్టీ!
మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్, ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ విడిపోయారంటూ బీటౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు సుష్మితా మొన్నటినుంచి తన మాజీ బాయ్ఫ్రెండ్ రోహ్మన్షాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. తాజాగా ఆమె కూతురు రినీ సేన్ బర్త్డే గ్రాండ్గా జరిగింది. ఈ పార్టీకి రోహ్మన్తో పాటు తన మరో మాజీ ప్రియుడు రితిక్ భాసిన్ కూడా వచ్చాడు. ఈ మేరకు పలు ఫొటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా వదిలింది. 'సెప్టెంబర్ 4న నా ఫస్ట్ లవ్ రినీ సేన్ 23వ పుట్టినరోజు జరుపుకుంది. నా కుటుంబసభ్యులు, రినీ ఫ్రెండ్స్తో రాత్రి పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేశాం. రినీ బర్త్డేను ఇంత అద్భుతంగా సెలబ్రేట్ చేసిన రితిక్కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఐ లవ్యూ గయ్స్' అని రాసుకొచ్చింది. సుష్మిత కూతురు పుట్టినరోజున లలిత్ రాలేదు, కానీ ఆమె మాజీ బాయ్ఫ్రెండ్స్ రావడం ఏంటో? వారితో పార్టీ చేసుకోవడమేంటో అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) చదవండి: బిగ్బాస్ 6: నామినేషన్స్లో ఉన్నది వీళ్లే! ఐశ్వర్యపై నెటిజన్ల ప్రశంసలు -
మాజీ బాయ్ప్రెండ్తో సుష్మితా సేన్ షాపింగ్, వీడియో వైరల్
మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుష్మితా సేన్ వృత్తిపరమైన విషయాలకంటే కూడా వ్యక్తిగత విషయాలతోనే తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీతో లవ్లో పడ్డనాటి నుంచి సుష్మిత ప్రతి కదలిక మీద కన్నేసారు నెటిజన్లు. ఈ క్రమంలో పలుమార్లు తన మాజీ బాయ్ఫ్రెండ్ రోహ్మన్ షాతో షాపింగ్లు, సినిమాలకు వెళ్లడం చూసి ముక్కున వేలేసుకున్నారు. కొందరు మాత్రం బ్రేకప్ తర్వాత ఫ్రెండ్స్గా ఉండకూడదా? ఏంటని సుష్మితను సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ నటి తన కూతురు రినీ సేన్, మాజీ ప్రియుడు రోహ్మన్తో కలిసి షాపింగ్కు వెళ్లింది. ఈ సందర్భంగా కెమెరా కంట పడ్డ ఈ బ్యూటీ రినీ, రోహ్మన్తో కలిసి ఫొటోలను పోజులిచ్చింది. కూతురు అలిషా బర్త్డే కోసం షాపింగ్ చేస్తున్నామని వెల్లడించింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు పలువిధాలుగా స్పందిస్తున్నారు. 'నువ్విలా నీ మాజీతో తిరుగుతుంటే అది చూసిన లలిత్ మోదీ ఏమైపోవాలి?', 'అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు'', 'అబ్బా.. వాళ్లిద్దరూ ఒకప్పుడు లవర్స్, ఇప్పుడు మంచి ఫ్రెండ్స్' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా సుష్మిత రినీ, అలిషా అనే ఇద్దరు కూతుళ్లను దత్తత తీసుకుని పెంచుకుంటోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఆమె ఇటీవలే ఆర్య 2 వెబ్సిరీస్తో కమ్బ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే! View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: టాలీవుడ్లో విషాదం, సీనియర్ హీరో కన్నుమూత విజయ్కు తలపొగరు అన్నాడు, సారీ చెప్పాడు -
సుష్మితా సేన్ లైవ్ వీడియోలో మాజీ బాయ్ఫ్రెండ్.. లలిత్ ఎక్కడ?
Sushmita Sen Parties With Her Ex Boyfriend Rohman Shawl: గత కొద్ది రోజులుగా మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ వార్తల్లో ప్రధానంగా నిలుస్తూ వస్తోంది. సుష్మితా సేన్ తనతో డేటింగ్లో ఉందని వ్యాపారవేత్త, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ జులై 14న సాయంత్రం సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. లలిత్తో సుష్మితా డేటింగ్ చేయడాన్ని పలువురు విమర్శిస్తే, కొంతమంది ఆమెకు మద్దుతుగా నిలిచారు. ఇదిలా ఉంటే వారు డేటింగ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసినప్పటి నుంచి వీరిద్దరూ ఏం చేసిన హాట్ టాపిక్గా మారింది. అయితే తాజాగా లలిత్ మోది ఎక్కడా అంటూ సుష్మితా సేన్పై ప్రశ్నల వర్షం కురింపించారు నెటిజన్లు. సుష్మితా సేన్ తల్లి సుభ్రా సేన్ ఆగస్టు 8న పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన ఇన్స్టాగ్రామ్లో లైవ్ వీడియోను పోస్ట్ చేసింది సుష్మితా సేన్. ఈ వీడియోలో సుష్మితా సేన్ ఎక్స్ బాయ్ఫ్రెండ్ రోహ్మాన్ షా దర్శనమిచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు 'లలిత్ ఎక్కడ?', 'ఎక్కడ మోది?' అంటూ ప్రశ్నించారు. ఈ వీడియోలో సుష్మితా కూతుళ్లతో మాట్లాడుతూ కనిపించాడు రోహ్మాన్ షా. అలాగే సుష్మితా సేన్ లైవ్లో కనిపించమని అందరిని కోరినప్పుడు రోహ్మాన్ మాత్రం దూరంగా ఉండటాన్ని గమనించవచ్చు. కాగా తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్ రోహ్మన్ షాతో సుష్మితా సేన్ మూడేళ్లు డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Nikhil Rao (@bg0260) View this post on Instagram A post shared by Lalit Modi (@lalitkmodi) -
సుష్మితను బతకనివ్వండి.. ట్రోలర్స్కు డైరెక్టర్ కౌంటర్
పక్కింటి పుల్లకూర రుచి అన్న సామెత తెలిసిందే కదా! పక్కింట్లోని వంటలే కాదు, వారి జీవితాల్లో తొంగి చూడటం కూడా సర్వసాధారణమైపోయింది ఈ రోజుల్లో! మరీ ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల్లో కూడా సాధారణ జనాల జోక్యం ఎక్కువైపోయిందీ రోజుల్లో.. వారు ఏం చేసినా తప్పుపట్టడమే తరువాయి అన్న చందంగా తయారైంది సోషల్ మీడియా. గత కొద్ది రోజులుగా నటి సుష్మితా సేన్, లలిత్ మోదీల ప్రేమ గురించైతే ఎన్ని పోస్టులు, మీమ్స్ వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె నిర్ణయాన్ని విమర్శిస్తూ ఇద్దరినీ తిట్టిపోసినవారే ఎక్కువమంది. అయితే ఈ వైఖరి అంత మంచిది కాదని విమర్శించాడు దర్శకుడు మహేశ్ భట్. అదే సమయంలో సుష్మిత ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. 'ఆమె తనకు నచ్చినట్లుగా బతుకుతోంది. ఎలాంటి కట్టుబాట్లు విధించుకోకుండా స్వేచ్ఛగా జీవిస్తోంది. అంతటి గట్స్ ఆమెకున్నాయి. తనను ఇప్పటికీ అసాధారణమైన వ్యక్తిగానే గుర్తుంచుకున్నాను. తనకు నచ్చినట్లుగా బతుకుతున్న ఆమె గుండె ధైర్యానికి నేను సెల్యూట్ చేయాల్సిందే! ఇంకా ఆమెను వేధించకుండా ఆమె బతుకేదో ఆమెను బతకనివ్వండి' అని ట్రోలర్స్కు గట్టి కౌంటరిచ్చాడు. గతంలో విక్రమ్ భట్తో నడిపిన ప్రేమాయణం గురించి చెప్తూ.. 'దస్తక్ సినిమా చేద్దామనుకున్నాను. అందుకామె ఓకే చెప్పింది. తర్వాతేం జరిగిందో మీకందరికీ తెలుసు. దస్తక్ షూటింగ్ సమయంలో సుష్మితా సేన్, విక్రమ్ భట్ ప్రేమించుకున్నారు. విక్రమ్ నాకు కుడిభుజంలా ఉండేవాడు. అతడిని ఆధారంగా చేసుకునే నేను నా పని పూర్తి చేసేవాడిని. సెట్స్లో ఆమెతో సరదాగా కలిసిపోయేవాడు. అలా వాళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలైంది' అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు మహేశ్ భట్. చదవండి: గర్ల్ఫ్రెండ్తో సిద్దార్థ్ షికార్లు.. ఫొటోలు తీసినవారికి హీరో వార్నింగ్! క్యాస్టింగ్ కౌచ్ వల్ల పెద్ద పెద్ద ప్రాజెక్టులు వదులుకున్నా.. -
ఇద్దరు వ్యక్తులు ఫ్రెండ్స్గా ఉండకూడదా? పుట్టుకతోనే సంపన్నుడిని.. నన్నే అంటారా?
ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ.. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్తో తాను ప్రేమలో ఉన్నట్లు ప్రకటించి క్రీడా, సినీ వర్గాల్లో హాట్టాపిక్గా మారాడు. సుస్మితను తన భాగస్వామి అని పేర్కొంటూ ఆయన షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు లలిత్ మోదీపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన లలిత్.. ఇప్పుడేమో కాలేజీ కుర్రాడిలా గర్ల్ఫ్రెండ్తో ఉన్నానంటూ ఫొటోలు షేర్ చేస్తున్నాడంటూ విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో సుస్మితతో తన రిలేషన్షిప్పై స్పందించిన లలిత్ మోదీ ఆదివారం ట్విటర్ వేదికగా విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. అదే విధంగా తన భార్య మినాల్ గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారంటూ మండిపడ్డాడు. మధ్య యుగ కాలంలో ఉన్నామా? ఈ సందర్భంగా సుస్మితా సేన్, తన దివంగత భార్య మినాల్ మోదీ, కూతురు అలియా మోదీలతో పాటు నెల్సన్ మండేలా, దలైలామా, భారత ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా తదితర ప్రముఖులతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ కౌంటర్ ఇచ్చాడు. ఈ మేరకు.. ‘‘మనమింకా మధ్య యుగం కాలంలోనే నివసిస్తున్నామా? ఇద్దరు వ్యక్తులు స్నేహితులుగా ఉండకూడదా? ఒకవేళ వారి మధ్య కెమిస్ట్రీ కుదిరి కాలం కలిసి వస్తే.. అద్భుతం జరుగుతుంది కదా!.. నాదొక సలహా మీరు సంతోషంగా జీవించండి.. ఇతరులను కూడా వాళ్ల బతుకు వారిని బతకనివ్వండి. ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలుసుకుని వార్తలు రాయండి.. డొనాల్డ్ ట్రంప్ లాగా నకిలీ వార్తలు వ్యాప్తి చేయకండి’’ అంటూ మీడియాపై కూడా విరుచుకుపడ్డాడు. ఇక తన భార్య మినాల్ మోదీ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ప్రియమైన నా భార్య, దివంగత మినాల్ మోదీ.. మా పెళ్లి కంటే 12 ఏళ్ల ముందు నుంచి నాకు బెస్ట్ ఫ్రెండ్.. అందరూ అనుకుంటున్నట్లుగా తను మా అమ్మ స్నేహితురాలు కాదు. కొంతమంది వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి చెత్త వార్తలు రాస్తున్నారు. మెదడు తక్కువ పనులు చేయొద్దు. ఎవరైనా ఓ వ్యక్తి తన దేశం కోసం.. లేదంటే వ్యక్తిగత జీవితంలో ఏదైనా సాధిస్తే ఎంజాయ్ చేయండి. మీ అందరి కంటే నేను బెటర్.. మీకంటే గొప్పగా తలెత్తుకుని తిరిగే అర్హత నాకుంది’’ అంటూ లలిత్ మోదీ సుదీర్ఘ నోట్ షేర్ చేశాడు. అదే విధంగా తనను ఆర్థిక నేరగాడు అని పిలిస్తే పట్టించుకోనన్న లలిత్ మోదీ.. తాను డైమండ్స్పూన్తో పుట్టానని.. పుట్టుకతోనే సంపన్నుడినని పేర్కొన్నాడు. తన వల్లే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పుట్టుకొచ్చిందని.. దేశానికి తాను ఓ గొప్ప బహుమతి ఇచ్చానని చెప్పుకొచ్చాడు. కాగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ ప్రస్తుతం లండన్లో తలదాచుకుంటున్నాడు. ఇక సుస్మిత సేన్తో మాల్దీవుల్లో లలిత్ ఫొటోలు షేర్ చేస్తూ బెటర్ పార్ట్నర్ అనడంతో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. తాము ప్రేమలో ఉన్నామే తప్ప పెళ్లి చేసుకోలేదని వెల్లడించారు. కాగా సుస్మిత సైతం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికపుడు తన అప్డేట్లు పంచుకుంటుందన్న సంగతి తెలిసిందే. చదవండి: Lalit Modi- Sushmita Sen: తనకంటే తొమ్మిదేళ్లు పెద్దది.. మినాల్ను పెళ్లాడేందుకు లలిత్ ఫైట్! చివరికి ఇలా! Too long to write so I put it on a picture slide. For those who don’t have instagram 🙏🏾 pic.twitter.com/v2sXCvyacn — Lalit Kumar Modi (@LalitKModi) July 17, 2022 View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
తనకంటే తొమ్మిదేళ్లు పెద్దదైన మినాల్ను పెళ్లాడేందుకు లలిత్ ఫైట్.. ఇప్పుడు ఇలా!
Lalit Modi Love Story With Minal: లలిత్ కుమార్ మోదీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సృష్టికర్తగా పేరు ప్రఖ్యాతులు పొందాడు. సినీ సెలబ్రిటీలు, కార్పొరేట్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించి.. ప్రపంచ క్రికెటర్లందినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి క్యాష్ రిచ్ లీగ్ను సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టీ20 లీగ్లు ఉన్నా ఐపీఎల్ విజయవంతం కావడంలో లలిత్ మోదీదే కీలకపాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన లలిత్ మోదీ.. ఒకప్పుడు ప్రపంచంలోని వంద శక్తిమంతుల జాబితాలో కూడా స్థానం సంపాదించడం విశేషం. అయితే, ఎంత వేగంగా కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్నాడో అదే తరహాలో పాతాళానికి దిగజారిపోయాడు. ఆర్థిక అవకతవకలకు పాల్పడి దేశం నుంచి పారిపోయాడు. ప్రస్తుతం ఆయన లండన్లో తలదాచుకుంటున్నాడు. మాజీ విశ్వసుందరితో ప్రేమాయణం! ఇక ఇన్నాళ్లూ పెద్దగా లైమ్లైట్లో లేని 58 ఏళ్ల లలిత్ మోదీ.. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్తో డేటింగ్ అంటూ ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారాడు. ఆమెతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేస్తూ బెటర్ పార్ట్నర్ అంటూ చర్చకు తెరలేపాడు. PC: lalit modi Instagram ఈ క్రమంలో వీళ్లిద్దరి పెళ్లి అయి పోయిందని నెటిజన్లు ఫిక్సైపోగా అలాంటిదేమీ లేదని సుస్మిత, లలిత్ ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రేమలో మునిగితేలుతున్నామని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. కాగా 46 ఏళ్ల సుస్మితాసేన్ ఇప్పటికే ఎంతో మందితో డేటింగ్ చేసింది. సుస్మిత రూటు సెపరేటు! స్థాయి.. వయసుతో సంబంధం లేకుండా తన కంటే చిన్నవాళ్లూ, పెద్దవాళ్లతోనూ ప్రణయ బంధం కొనసాగించింది సుస్మిత. కానీ ఎవ్వరికీ తనను వివాహం చేసుకునే అవకాశం ఇవ్వలేదు. స్వేచ్ఛాయుత జీవనం గడపడానికే ఆమె ప్రాధాన్యం ఇచ్చింది. ప్రస్తుతం లలిత్తో ప్రేమ వ్యవహారం కూడా అలాంటిదేనా.. లేదంటే పెళ్లిదాకా వెళ్తారా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది. PC: lalit modi Instagram కాగా సుస్మిత ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుని తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఇక లలిత్తో సుస్మిత పరిచయం ఈనాటిది కాదు. లలిత్ మోదీ దివంగత భార్య మినాల్ మోదీకి కూడా ఆమె ఫ్రెండ్ కావడం విశేషం. వీళ్లు ముగ్గురూ కలిసి ఐపీఎల్ మ్యాచ్లు వీక్షించేవారట. ఇంతకీ మినాల్ ఎవరు? మినాల్ సంగ్రాణి నైజీరియాకు చెందిన సింధీ హిందూ వ్యాపారవేత్త పెసూ అస్వాని కుమార్తె. లలిత్ మోదీతో స్నేహానికి కంటే ముందే ఆమెకు వివాహమైంది. వ్యాపారవేత్త జాక్ సాంగ్రాణిని ఆమె పెళ్లాడింది. వారికి కూతురు సంతానం. అయితే, జాక్ ఓ స్కామ్లో ఇరుక్కోవడంతో జైలుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొన్నాళ్ల తర్వాత ఈ జంట విడాకులు తీసుకుంది. PC: lalit modi Instagram లలిత్ కంటే తొమ్మిదేళ్లు పెద్ద! భర్తకు విడాకులిచ్చిన మినాల్తో ప్రేమలో పడ్డ లలిత్ మోదీ ఆమెను పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. అయితే, మోదీ కుటుంబం ఇందుకు అంగీకరించలేదు. ఆమె డివోర్సీ కావడం ఒక అభ్యంతరమైతే.. లలిత్ కంటే మినాల్ వయసులో దాదాపు తొమ్మిదేళ్లు పెద్దది కావడం మరో కారణం. కుటుంబాన్ని ఎదిరించి! అయినా, అతడు ఆమె చేయిని వీడలేదు. కుటుంబంతో విభేదించాడు. 1991లో మినాల్ను పెళ్లిచేసుకున్నాడు. దీంతో తన ఫ్యామిలీకి దూరమయ్యాడు. తమను అందరూ దూరం పెట్టడంతో ఢిల్లీ నుంచి ముంబైకి మకాం మార్చాడు. ఎంతో అన్యోన్యంగా ఉండే లలిత్- మినాల్లకు ఇద్దరు సంతానం. PC: lalit modi Instagram కొడుకు రుచిర్, కూతురు అలియా ఉంది. వీరితో పాటు మినాల్ మొదటి కూతురు కరిమా సంగ్రాణిని కూడా చేరదీశాడని జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. కాగా క్యాన్సర్ బారిన పడ్డ మినాల్ ఆఖరి వరకు వ్యాధితో పోరాడి 64 ఏళ్ల వయస్సులో 2018లో కన్నుమూశారు. అప్పటి నుంచి ఒంటరి జీవితం గడుపుతున్న లలిత్ మోదీ సుస్మితతో ప్రేమాయణంతో అటు క్రీడా, ఇటు సినీ వర్గాల్లో మరోసారి హాట్ టాపిక్గా మారాడు. చదవండి: Ire Vs NZ 3rd ODI: మొన్న టీమిండియాను.. ఇప్పుడు న్యూజిలాండ్ను వణికించారు! వరుస సెంచరీలతో.. Ind Vs Eng 2nd ODI: తప్పంతా వాళ్లదే.. అందుకే భారీ మూల్యం.. మైండ్సెట్ మారాలి! మూడో వన్డేలో గనుక ఓడితే.. -
లేటు వయసులో ఘాటు ప్రేమ.. 9 ఏళ్లకు సుష్మిత రిప్లై?!
ప్రేమ పుట్టడాని ఒక్క క్షణం చాలు.. అన్న మాటకు ప్రత్యక్ష నిదర్శనంలా మారారు ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ, మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్. వీరి మధ్య ఉన్న పరిచయం కొత్తేమీ కాదు. ఎన్నో ఏళ్ల కిందటే ఒకరికొకరు తెలుసు. కానీ ఉన్నట్టుండి సడన్గా లవ్లో జారి పడ్డారు. ఒక్కరోజులోనే డేటింగ్ మొదలు పెట్టారు. పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అంటూ ఫొటోలు వదిలారు. ఇది చూసి సోషల్ మీడియా యూజర్స్ విస్తుపోయారు. వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారా? త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారా? అంటూ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే కలిసి జీవితాన్ని పంచుకోబోతున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో లలిత్ మోదీ గతంలో చేసిన ట్వీట్ ఒకటి వైరల్గా మారింది. 2013లో లలిత్ మోదీ.. సుష్మితతో చాట్ చేసిన స్క్రీన్షాట్ను ట్విటర్లో షేర్ చేశాడు. ఇందులో మోదీ.. 'ఓకే ఐ కమిట్' అంటుంటే సుష్మిత మాత్రం.. 'మీరు చాలా మంచివారు. హామీలను నిలబెట్టుకోలేకపోవచ్చేమోగానీ కమిట్మెంట్లను మాత్రం గౌరవించాల్సిందే' అని రిప్లై ఇచ్చింది. మరో ట్వీట్లో సుష్మితను ట్విటర్లో కాకుండా ఎస్ఎమ్ఎస్ ద్వారా రిప్లై ఇవ్వమన్నాడు లలిత్. ఈ ట్వీట్ కాస్తా ఇప్పుడు వైరల్ కావడంతో నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. '9 ఏళ్లకు సుష్మిత కనికరించింది', 'లేటు వయసులో ఘాటు ప్రేమ', 'మోదీ గట్టిగానే ట్రై చేసినట్లున్నాడే', 'ఓపిక, పట్టుదల, కృషితో లలిత్ మోదీ విజయం సాధించాడు' అంటూ జోకులు పేలుస్తున్నారు. కాగా లలిత్ మోదీ 1991లో మినాల్ మోదీని పెళ్లాడాడు. క్యాన్సర్ కారణంగా మినాల్ 2018 డిసెంబర్ 10న మరణించింది. మనీలాండరింగ్ కేసులో భారత్ నుంచి పారిపోయిన లలిత్ మోదీ 2010 నుంచి లండన్లో నివసిస్తున్నాడు. Okay I commit 😋😋"@thesushmitasen: @LalitKModi u r too kind:)) however, promises are meant to be (cont) pic.twitter.com/JrgEwC1btR — Lalit Kumar Modi (@LalitKModi) April 27, 2013 @thesushmitasen reply my SMS — Lalit Kumar Modi (@LalitKModi) April 27, 2013 Just back in london after a whirling global tour #maldives # sardinia with the families - not to mention my #better looking partner @sushmitasen47 - a new beginning a new life finally. Over the moon. 🥰😘😍😍🥰💕💞💖💘💓. In love does not mean marriage YET. BUT ONE THAT For sure pic.twitter.com/WL8Hab3P6V — Lalit Kumar Modi (@LalitKModi) July 14, 2022 చదవండి: లలిత్ మోదీతో డేటింగ్పై స్పందించిన సుష్మితా సేన్ నన్ను పెళ్లి చేసుకుంటే నా ప్రియుడి చెల్లికి పెళ్లవదా? -
ఇంక ఆపుతారా? మాకింకా పెళ్లవలేదు: సుష్మితా సేన్
మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్, మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీ లవ్లో ఉన్నామంటూ ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేశారు. అది కూడా ఒక్కరోజులోనే తమ మధ్య ప్రేమ చిగురించిందని, ప్రస్తుతం డేటింగ్లో ఉన్నప్పటికీ త్వరలో పెళ్లి కూడా చేసుకుంటామని సోషల్ మీడియా వేదికగా వారి మధ్య ఉన్న రిలేషన్ను బయటపెట్టాడు లలిత్ మోదీ. అయితే సుష్మితతో కొత్త జీవితం ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ ఆమెను భాగస్వామిగా పేర్కొన్నాడు. దీంతో అయోమయానికి లోనైన నెటిజన్లు ఆల్రెడీ వీళ్లు పెళ్లి చేసుకున్నారనుకుని శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో లలిత్ మోదీ తమకింకా పెళ్లవలేదని ట్వీట్తో క్లారిటీ ఇచ్చాడు. తాజాగా సుష్మితా సేన్ సైతం ఈ విషయంపై స్పందించింది. 'ప్రస్తుతం నేను నాకు నచ్చిన ప్రదేశంలో సంతోషంగా ఉన్నాను. ఇంకా ఉంగరాలు మార్చుకోలేదు, పెళ్లి అవలేదు. కేవలం ప్రేమలో మునిగి తేలుతున్నా.. ఈ వివరణ సరిపోతుందనుకుంటా.. ఇక నా పని నేను చూసుకుంటా.. నా సంతోషాన్ని పంచుకునేవారికి థ్యాంక్యూ.. ఎవరైతే పంచుకోరో.. వారికి నా గురించి అవసరం లేదు.. ఏదేమైనా లవ్ యూ గయ్స్..' అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) చదవండి: నేనేమైనా ఉగ్రవాదినా? పెళ్లి చేసుకోకూడదా? మాజీ ఐపీఎల్ చైర్మన్తో సుష్మితా సేన్ డేటింగ్ -
లలిత్ మోదీ ప్రేమలో సుస్మితా.. ‘లవ్ ఆఫ్ మై లైఫ్’ అంటూ వీడియో..
మాజీ విశ్వసుందరి, నటి సుస్మితా సేన్, తాను డేటింగ్లో ఉన్నామని మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీ గురువారం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించాడు. వీరిద్దరు మాల్దీవుల్లో షికార్లు చేసిన ఫొటోలు, లండన్లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నా పిక్స్ను లలిత్ మోదీ షేర్ చేశాడు. ఈ సందర్భంగా సుస్మితాను తన బెటర్ హాఫ్(భార్య) అంటూ పరిచయం చేశాడు మోదీ. ఆ తర్వాత ప్రస్తుతం తాము డేటింగ్లో ఉన్నామనీ, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు స్పష్టం చేశాడు. చదవండి: ప్రముఖ నటుడు, నటి రాధిక మాజీ భర్త మృతి దీంతో వీరిద్దరి ప్రేమ వ్యవహరం మీడియాలో, సోషల్ మీడియాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఇప్పటి వరకు సుస్మితా దీనిపై స్పందించలేదు. ఈ క్రమంలో మాల్దీవ్స్లోని స్వీమ్మింగ్ ఫూల్లో ఆమె ఒక్కతే ఎంజాయ్ చేస్తున్న వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దీనికి బ్యాగ్రౌండ్లో ‘ఐ వాంట్ యు టూ నో.. యూ ఆర్ ద లవ్ ఆఫ్ మై లైఫ్’ అనే ఇంగ్లిష్ సాంగ్ను జత చేసింది. కాగా సుస్మితా గతంలో తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్ రోహ్మన్ షాతో మూడేళ్లు డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: నెలకు రూ. 25 లక్షలు ఇస్తాను, భార్యగా ఉండమన్నాడు మూడోసారి ప్రేమలో పడ్డ సుష్మితా సేన్, ప్రియుడు ఎవరో తెలుసా? View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) View this post on Instagram A post shared by Lalit Modi (@lalitkmodi) -
మూడోసారి ప్రేమలో పడ్డ సుష్మితా సేన్, ప్రియుడు ఎవరో తెలుసా?
మాజీ విశ్వసుందరి, నటి సుష్మితా సేన్ మరోసారి ప్రేమలో పడింది. మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీతో డేటింగ్ చేస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు లలిత్. సుష్మితను తన భాగస్వామిగా పరిచయం చేస్తూ వీరిద్దరూ కలిసి ఉన్న పలు ఫొటోలను షేర్ చేశాడు. 'మాల్దీవుల్లో షికార్లు కొట్టాక లండన్లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నా. నా జీవిత భాగస్వామి సుష్మిత సేన్తో కొత్త జీవితం ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని రాసుకొచ్చాడు. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారేమోననుకున్న నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేశారు. కాసేపటికే లలిత్ మోదీ తమ పెళ్లి గురించి క్లారిటీ ఇస్తూ.. 'ప్రస్తుతానికి తామింకా డేటింగ్లోనే ఉన్నామని, ఒక్కరోజులోనే ఒకరితో ఒకరం ప్రేమలో పడిపోయాం' అని చెప్పుకొచ్చాడు. కాగా సుష్మితా సేన్ మొదట్లో పాక్ క్రికెటర్ వసీమ్ అక్రమ్తో ప్రేమాయణం నడిపింది. వీరిద్దరూ సహజీవనమూ మొదలుపెట్టారు. కానీ క్షణం తీరికలేని సుష్మితా షెడ్యూల్ వల్ల వసీమ్ తీవ్రమైన అభద్రతకు లోనయ్యాడట. అంతేకాదు ఆ అభద్రత అతనిలో ఆమె పట్ల అనుమానాలను రేకెత్తించి.. సుష్మితాను చిరాకు పరచే వరకు వెళ్లింది. దాంతో ఆ అనుబంధం పెళ్లి దాకా వెళ్లకుండానే బ్రేక్ అయింది. కొన్నాళ్ల తర్వాత.. సుష్మితా సేన్ ప్రముఖ మోడల్ రోహ్మన్తో ప్రేమలో పడింది. కానీ అది కూడా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. Just back in london after a whirling global tour #maldives # sardinia with the families - not to mention my #betterhalf @sushmitasen47 - a new beginning a new life finally. Over the moon. 🥰😘😍😍🥰💕💞💖💘💓 pic.twitter.com/Vvks5afTfz — Lalit Kumar Modi (@LalitKModi) July 14, 2022 Just for clarity. Not married - just dating each other. That too it will happen one day. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾 pic.twitter.com/Rx6ze6lrhE — Lalit Kumar Modi (@LalitKModi) July 14, 2022 View this post on Instagram A post shared by Lalit Modi (@lalitkmodi) చదవండి: గ్లామర్ తప్ప యాక్టింగ్ రాదంటూ టార్చర్ పెట్టారు -
ఐపీఎల్ వ్యవస్థాపకుడి బయోపిక్ను తెరకెక్కించనున్న బాలయ్య నిర్మాత
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు లలిత్ మోడీ జీవితంపై స్పోర్ట్స్ జర్నలిస్ట్ బోరియా మజుందార్ 'మవెరిక్ కమిషనర్' ద ఐపీఎల్- లలిత్ మోడీ సాగా అనే పుస్తకాన్ని రచించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే పుస్తకం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. బాలయ్య సినిమాల సహా నిర్మాత ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించిన విష్ణువర్ధన్ ఇందూరి లలిత్ మోడీ బయోపిక్ను తెరకెక్కించనున్నట్లు ప్రకటించాడు. Winning the 83 World Cup was the tip of the iceberg. The book "Maverick Commissioner" by sports journalist @BoriaMajumdar is a fascinating account of the IPL and the Man behind it Lalit Modi. Elated to announce that we are adapting this book into a feature film. @SimonSchusterIN pic.twitter.com/tLEGGCkkxn — Vishnu Vardhan Induri (@vishinduri) April 18, 2022 విష్ణువర్ధన్ ఇందూరి.. తమిళనాడు ముఖ్యమంత్రి, దివంగత జయలలిత జీవితంపై తలైవీ అనే చిత్రాన్ని నిర్మించాడు. అలాగే స్పోర్ట్స్ డ్రామా 83 సినిమాకు కూడా ఆయనే నిర్మాతగా వ్యవహరించాడు. ఐపీఎల్ ప్రారంభమై నేటికి 15 సంవత్సరాలు (ఏప్రిల్ 18, 2008) అయిన సందర్భంగా విష్ణువర్ధన్ ఇందూరి లలిత్ మోడీ బయోపిక్ ప్రాజెక్ట్ను ప్రకటించాడు. ఈ బయోపిక్కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: ఉమ్రాన్ మాలిక్ స్పీడ్కు ఫిదా అయిన కేటీఆర్ -
ఆర్థిక నేరగాళ్లకు లండన్ స్వర్గధామం ఎలా ?
లండన్: విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, లలిత్ మోదీ, సంజయ్ భండారీ.. భారత్ బ్యాంకులకు కోట్లాది రూపాయలకు కుచ్చుటోపి పెట్టి బ్రిటన్కు పరారైన ఆర్థిక నేరగాళ్లలో వీరు కొందరు. మన దేశంలో నేరం చేసిన వారందరూ బ్రిటన్కే ఎందుకు ఉడాయిస్తున్నారు ? ఆర్థిక నేరగాళ్లకు లండన్ స్వర్గధామంగా ఎలా మారింది ? ఈ ప్రశ్నలకు జవాబుల్ని లండన్కు చెందిన జర్నలిస్టు దంపతులు డేనిష్ ఖాన్, రుహి ఖాన్లు ఒక పుస్తకం ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ‘ఎస్కేప్డ్ @ ట్రూ స్టోరీస్ ఆఫ్ ఇండియన్ ఫ్యుజిటివ్స్ ఇన్ లండన్’ అన్న పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు. సోమవారం విడుదల కానున్న ఈ పుస్తకంలో 12 కేసుల్ని విస్తృతంగా అధ్యయనం చేసి భారత్ నేరగాళ్లకి లండన్ ఎలా సురక్షితంగా మారిందో వివరించారు. రుణాల ఎగవేత దగ్గర్నుంచి హంతకుల వరకు అన్ని రకాల కేసుల్ని రచయితలు అధ్యయనం చేశారు. కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, భారత్ నావికాదళ మాజీ అధికారి రవి శంకరన్, మ్యుజీషియన్ నదీమ్ సైఫీ వంటి వారి గురించి ఈ పుస్తకంలో రాశారు. ఈ కేసులకు సంబంధించి కోర్టులో జరిగిన వాదోపవాదాలు, భారత్, బ్రిటన్ మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందాలు, బ్రిటన్లో తలదాచుకోవడానికి వచ్చిన వారు ఇచ్చిన వివిధ ఇంటర్వ్యూలు, కొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులు అన్నింటిని విస్తృతంగా పరిశీలించి, అన్నింటినీ క్రోడీకరించి లండన్ ఏ విధంగా భారత్ నేరగాళ్లకు సురక్షితమో పుస్తకంలో చెప్పే ప్రయత్నం చేశామని డేనిష్ ఖాన్ తెలిపారు. ప్రధానంగా నేరస్తుల అప్పగింతకు సంబంధించిన కేసుల విచారణ బ్రిటన్ కోర్టుల్లో నత్తనడకన సాగుతుంది. ఆ ధీమాతోనే నేరస్తులందరూ లండన్కి పారిపోతూ ఉంటారన్న అభిప్రాయాలున్నాయి. భారత్, బ్రిటన్ మధ్య 1992లో నేరస్తుల అప్పగింత ఒప్పందం కుదిరితే ఇప్పటివరకు ఆ దేశం ఇద్దరిని మాత్రమే అప్పగించింది. మిగిలిన కేసులన్నీ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. -
లలిత్మోదీ, ఆయన భార్యకు స్విట్జర్లాండ్ నోటీసులు
న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్మోడీ, ఆయన భార్య మినాల్ మోడీలకు స్విట్జర్లాండ్ నోటీసులు జారీ చేసింది. నల్లధనంపై పోరులో భాగంగా ఈ దంపతుల డిపాజిట్ వివరాలు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం స్విట్జర్లాండ్ను కోరడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. 2010లో దేశం నుంచి లండన్కు పారిపోయిన లలిత్మోడీ ఇప్పటికే మనీల్యాండరింగ్ కేసులను ఎదుర్కొంటున్నారు. భారత ప్రభుత్వం కోరిన సమాచారం విషయంలో తమ స్పందన తెలియజేసేందుకు లలిత్మోడీ దంపతులకు స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ విభాగం పది రోజుల గడువు ఇచ్చింది. -
రాహుల్ను బ్రిటన్ కోర్టుకు లాగుతా : లలిత్ మోదీ
లండన్ : మోదీ పేరున్న వారంతా దొంగలేనంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయనను బ్రిటన్ కోర్టుకు లాగుతానని లలిత్ మోదీ హెచ్చరించారు. లలిత్ మోదీ, నీరవ్ మోదీ, ప్రధాని నరేంద్ర మోదీలను ప్రస్తావిస్తూ దొంగలందరి పేర్లలో మోదీ పేరు ఎందుకుందని, ఇంకా ఎంత మంది ఇలాంటి మోదీలు బయటికొస్తారో మనకు తెలియదని మహారాష్ట్రలో ఇటీవల ఓ ర్యాలీలో రాహుల్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాహుల్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బ్రిటన్లో తాను కోర్టును ఆశ్రయిస్తానని లలిత్ మోదీ ట్వీట్ చేశారు. ఐదు దశాబ్ధాల పాటు భారత్ను రాహుల్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. ఎవరు దొంగో..ఎవరు కాపలాదారో మీరే తేల్చుకోవాలని ప్రజలను కోరారు. ఐపీఎల్ మాజీ ఛైర్మన్గా వ్యవహరించిన లలిత్ మోదీ తనపై మనీల్యాండరింగ్ ఆరోపణలు రావడంతో భారత్ను విడిచిపెట్టి వెళ్లారు. మోదీలందరూ దొంగలని చెబుతున్న రాహుల్ గాంధీపై బ్రిటన్ కోర్టులో తాను కేసు వేస్తానని లలిత్ మోదీ హెచ్చరించారు.మరోవైపు తనపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ సైతం తప్పుపట్టారు. మోదీల పేరున్న వారంతా దొంగలేనంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు బీసీలను అవమానించడమేనని దుయ్యబట్టారు. -
నేరస్తుల గమ్యం.. లండన్
ఐపీఎల్ క్రికెట్ మాజీ సారథి లలిత్ మోదీ.. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అధిపతి విజయ్ మాల్యా.. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. వేలకోట్ల రూపాయల కుంభకోణాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు వీరంతా. వీరందరి గమ్యం మాత్రం బ్రిటన్ దేశమే. వీరే కాకుండా వివిధ దేశాలకు చెందిన రాజకీయ వేత్తలు, అసమ్మతి నాయకులు, ప్రవాసంలో ఉన్న వారికి, సొంత దేశాల్లో ప్రాణ భయాన్ని ఎదుర్కొంటున్న వారికి బ్రిటన్ భద్రంగా తలదాచుకునే గమ్యస్థానంగా నిలుస్తోంది. ఒక్క 2013లో 5,500 మందికి పైగా భారతీయులు బ్రిటన్లో రాజకీయ ఆశ్రయం కోరుకున్నారు. వారికి శరణార్థి హోదా లభించడమే కాకుండా అక్కడ ఐదేళ్ల పాటు ఉండేందుకు అనుమతి లభిస్తుంది. మానవ హక్కులకు ప్రాధాన్యమెక్కువ పటిష్టమైన మానవ హక్కుల పరిరక్షణ చట్టాల కారణంగానే అనేక మంది ఇంగ్లండ్లో ఆశ్రయం పొందేందుకు తహతహలాడుతున్నారు. ప్రపంచంలోనే కట్టుదిట్టమైనదిగా బ్రిటన్ మానవ హక్కుల సంఘం పేరు గడించింది. మానవ హక్కులకు సంబంధించి ఐరోపా దేశాల ఒప్పందంలో బ్రిటన్ భాగస్వామిగా ఉంది. వివిధ దేశాలకు చెందిన రాజకీయవేత్తలు లేదా ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బ్రిటన్ నుంచి సొంత దేశానికి తిప్పి పంపిస్తే.. వారికి మరణశిక్ష పడడమో లేదా వారికి చిత్రహింసలు తప్పవనో భావిస్తే అక్కడి కోర్టులు స్వదేశాలకు పంపేందుకు అంగీకరించవు. రాజకీయ కారణాల వల్ల ఎవరినైనా వెనక్కి పంపించాలని ఆయా దేశాల నుంచి విజ్ఞప్తులు వచ్చినా.. తిరస్కరించే అవకాశాలే ఎక్కువ. ఓ పట్టాన తేలదు... తీవ్రవాద కార్యకలాపాల్లో పాత్ర కారణంగా 2004లో టైగర్ హనీఫ్ను.. అదే ఏడాది కుట్ర, చౌర్యం కేసుల్లో షేక్ సాదిక్ను.. ఫోర్జరీ కేసులో 2009లో రాజ్కుమార్ పటేల్ను.. ఫోర్జరీ, మోసానికి సంబంధించిన కేసుల్లో 2011లో రాజేశ్కుమార్ను.. లైంగికపరమైన నేరాల విషయంలో 2012లో అతుల్సింగ్ను.. బ్యాంకింగ్ రంగ మోసాలపై 2014లో జతీందర్ కుమార్, ఆశారాణి అంగురాల దంపతులను భారత్కు తిప్పి పంపాలని మన కేంద్ర ప్రభుత్వం బ్రిటన్ను కోరింది. ఈ విజ్ఞప్తులన్నీ కూడా అక్కడి కోర్టుల్లో ఇంకా పెండింగ్లోనే ఉండటం గమనార్హం. మోసాలు, అక్రమాలతో దేశానికి ఆర్థికంగా నష్టం కలిగించిన లలిత్మోదీ, విజయ్మాల్యా, నీరవ్ మోదీలను తిప్పి పంపించాలన్న విజ్ఞప్తులపై ఇంకా విచారణ సాగుతూనే ఉంది. వెనక్కొచ్చింది ఒక్కరే.. వివిధ కేసుల్లోని నిందితులు, దోషులను పరస్పరం అప్పగించుకునేలా 1992లో బ్రిటన్–భారత్ల మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పటివరకు కేవలం సమీర్భాయ్ వినూభాయ్ పటేల్ను మాత్రమే బ్రిటన్ భారత్కు తిప్పి పంపింది. గుజరాత్ గోధ్రా ఘటన అనంతరం చోటుచేసుకున్న అల్లర్లలో ప్రమేయముందన్న ఆరోపణలున్న సమీర్భాయ్ను 2016లో అప్పగించింది. భారత అధికారులు జారీ చేసిన రెడ్కార్నర్ నోటీసులపై స్పందించి.. లండన్లో స్కాట్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వివిధ కేసుల్లో బ్రిటన్ నుంచి పారిపోయి భారత్లో తలదాచుకుంటున్న నలుగురిని భారత్ తిప్పి పంపించింది. పలు కేసుల్లో నిందితులైన 57 మందిని భారత్కు అప్పగించాలంటూ చేసిన విజ్ఞప్తులను (ఒకటి మినహా) బ్రిటన్ తోసిపుచ్చింది. అప్పగింత ప్రక్రియ,ఇబ్బందులివీ.. వివిధ కేసుల్లో నిందితులైన వారిని భారత్కు తిప్పి పంపించే విషయంలో బ్రిటన్ న్యాయవ్యవస్థలోని పలు అంశాలు అడ్డంకిగా మారుతున్నాయి. అక్కడి సంక్లిష్టమైన ప్రక్రియ వల్లనే నిందితులను భారత్కు రప్పించడంలో జాప్యం జరుగుతోంది. ఆ అంశాలివీ.. - ఫలానా కేసులో ఫలానా వ్యక్తిని తిప్పిపంపాలంటూ భారత్ పంపించిన విజ్ఞప్తిని ఆమోదించాలా లేదా అన్నది బ్రిటన్ విదేశాంగశాఖ మంత్రి నిర్ణయించాలి. - ఆ నిర్ణయానికి అనుగుణంగా ఆ వ్యక్తి అరెస్ట్కు వారంట్ జారీ చేయాలా వద్దా అన్న దానిపై అక్కడి కోర్టు నిర్ణయిస్తుంది. తర్వాత సంబంధిత వ్యక్తిని అరెస్టు చేసి అక్కడి కోర్టు ఎదుట హాజరుపరుస్తారు. - ముందుగా ప్రాథమిక విచారణ జరుగుతుంది. అనంత రం స్వదేశానికి తిప్పిపంపే అంశంపై విచారణ ఉంటుంది. నిందితుడిని వెనక్కు పంపేందుకు న్యాయస్థానం సానుకూలంగా స్పందిస్తే.. దానిపై ఆదేశాలు ఇవ్వాలా వద్దా అన్న దానిపై విదేశాంగ మంత్రి నిర్ణయించాలి. - ఫలానా వ్యక్తిని తిప్పి పంపాలంటూ భారత్ పంపించిన వారంట్లో పేర్కొన్న అంశాలు, చేసిన నేరం స్వదేశానికి పంపించేంత తీవ్రమైనదా కాదా అన్న దానిపై కేసు విచారణ సందర్భంగా జడ్జి సంతృప్తి చెందాలి. - నిందితుడిని వెనక్కి పంపించడం సరైనదా కాదా అన్న అంశంపై జడ్జి నిర్ణయం తీసుకోవాలి. - తిప్పి పంపించడం వల్ల నిందితుడి మానవ హక్కులకు భంగం వాటిల్లుతుందా అన్నది జడ్జి పరిశీలిస్తారు ఉదాహరణకు ఏదైనా కేసులో ఓ వ్యక్తిని భారత్కు పంపించేందుకు విదేశాంగ మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి హైకోర్టులో సవాల్ చేయవచ్చు. దానిపై హైకోర్టు ఇచ్చే ఆదేశాలపై సుప్రీంను ఆశ్రయించొచ్చు. స్వదేశానికి పంపించే వ్యక్తి మరణశిక్షకు గురయ్యే అవకాశం ఉందంటే మాత్రం వెనక్కి పంపించేందుకు అంగీకరించరు. -
ఐపీఎల్: బీసీసీఐకి భారీ షాక్
సాక్షి, ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి ఎన్ఫోర్స్మెంట్ విభాగం(ఈడీ) షాకిచ్చింది. 2009 ఐపీఎల్ సీజన్ నిర్వాహణకు సంబంధించి బీసీసీఐకి భారీ జరిమానాను విధించింది. బీసీసీఐతోపాటు మాజీ సభ్యులకు కలిపి మొత్తం రూ. 121 కోట్ల జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేసింది. 2009 ఐపీఎల్ సీజన్ను సౌతాఫ్రికాలో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ.. విదేశీ ఖాతా తెరవకుండానే రూ. 243 కోట్లను టోర్నీ నిర్వహణ కోసం బీసీసీఐ సౌతాఫ్రికాకు బదిలీ చేసింది. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) అతిక్రమణ ఆరోపణలతో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేపట్టింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావటంతో భారీ జరిమానాను విధించింది. బీసీసీఐతోపాటు బోర్డు మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్తోపాటు ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ, ఇతరులకు కలిపి ఈడీ రూ.121 కోట్ల జరిమానా విధించింది. బీసీసీఐకు రూ. 82.66 కోట్లు శ్రీనివాసన్కు రూ.11.53 కోట్లు, లలిత్ మోదీకి రూ.10.65 కోట్లు, బోర్డు మాజీ కోశాధికారి పాండవ్కు రూ. 9.72 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ (ఎస్బీఐతో విలీనమైంది)కు రూ.7 కోట్లను జరిమానాగా విధించింది. ఈ జరిమానాను 45రోజుల్లోగా చెల్లించాలంటూ ఈడీ ఆదేశించింది. -
మాల్యాను అప్పగించండి
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి పరారైన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా, ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీని త్వరగా అప్పగించాలని బ్రిటన్కు భారత్ విజ్ఞప్తి చేసింది. అలాగే వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆచూకీ కనుగొనేందుకు సహకరించాలని విన్నవించింది. కశ్మీర్, ఖలిస్తాన్ వేర్పాటువాదులు బ్రిటన్ భూభాగంలో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేందుకు అనుమతించొద్దని కోరింది. బుధవారం ఢిల్లీలో జరిగిన మూడో ఇండో–యూకే హోం అఫైర్స్ సమావేశంలో హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ మేరకు బ్రిటన్కు విజ్ఞప్తి చేసింది. -
ఐ విల్ మిస్ యూ బ్రదర్: లలిత్ మోదీ
లండన్: మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి హిమాన్షు రాయ్ ఆత్మహత్య చేసుకోవడంపై ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న లలిత్ మోదీ.. హిమాన్షు రాయ్ ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీటర్ వేదికగా సంతాపం తెలిపారు. ‘ఐ రియల్లీ మిస్ యూ. నీ ఉద్యోగ ధర్మాన్ని చాలా చక్కగా నిర్వర్తించావు. కానీ నీ ఆత్మహత్యకు కారణాన్ని నేను అర్థం చేసుకోగలను. మా గుండెల్లో ఎప్పుడూ నీవు చిరస్థాయిగా ఉంటావు. ఇకనైనా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో..ఇక నీకు ఏ బాధ ఉండదూ. నీవు ఒక మెరిసే నక్షత్రానివి’ అని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు. శుక్రవారం హిమాన్షు రాయ్ ముంబయిలోని తన నివాసంలో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 1988 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హిమాన్షు రాయ్ ...2013లో సంచలనం సృష్టించిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణలో కీలకంగా వ్యవహరించారు. ఈ కేసులో బాలీవుడ్ నటుడు విందు దారా సింగ్ను అరెస్ట్ చేశారు. వీటితో పాటు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ డ్రైవర్ ఆరీఫ్ కాల్పులు కేసు, జర్నలిస్ట్ జాడే హత్యకేసు, విజయ్ పాలెండే, లైలా ఖాన్ డబుల్ మర్డర్ కేసుల విచారణలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. హిమాన్షు రాయ్ గత కొంతకాలంగా బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు ‘మరాఠీ దినపత్రిక లోక్మఠ్’ పేర్కొంది. అంతేకాకుండా ఆయన డిప్రెషన్లో ఉన్నట్లు తెలుస్తోంది.కాగా, ఏడాదిన్నరగా మెడికల్ లీవ్లో ఉన్న హిమాన్షు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. May you #restinpeace my brother. I Really will miss u. You were doing so well but ...I understand.... you will always be in our heart. Go my brother and now rest. No more Pain. Just Love 😢💔 u were the brightest of the ⭐️ and it was truly a blessing to have u watch over us. 😢 pic.twitter.com/00Bf6GjHms — Lalit Kumar Modi (@LalitKModi) 11 May 2018
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
ఫ్యాన్స్లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement