Lalit Modi
-
స్వర్గం భూమ్మీదకు వచ్చిందా?.. అందాల లోకం.. వారెవ్వా వనాటు
స్వర్గం ఎలా ఉంటుందో ఎవడికి తెలుసు?. ఎవరో వర్ణిస్తే కానీ ఊహించుకోవడం తప్పించి!. ఒకవేళ అది భూమ్మీద గనుక ఉంటే.. అది అచ్చం ‘వనాటు’(Vanuatu)లాగే ఉంటుందని లలిత్ మోదీ అంటున్నారు. ఐపీఎల్ సృష్టికర్త కారణంగా ఇప్పుడు ఈ దేశం పేరు తెగ వినిపించేస్తుండగా.. దాని గురించి వెతికే వాళ్ల సంఖ్యా ఒక్కసారిగా పెరిగిపోయింది.ఆర్థిక నేరగాడికి అభియోగాలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ 2010లో దేశం విడిచి లండన్ పారిపోయారు. అయితే ఆయన్ని వెనక్కి రప్పించే ప్రయత్నాలు భారత్ ముమ్మరంగా చేయగా.. ఆయన తెలివిగా వనాటు పౌరసత్వం పొందారు. అయితే ఈ విషయం తెలియడంతో ఆ దేశం ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసింది. ఇది ఇక్కడితోనే ఆగలేదు. లలిత్ మోదీ పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు వనాటు ప్రధాని జోథం నపాట్ స్వయంగా ప్రకటించారు. ఆ ప్రకటన వెలువడిన కాసేపటికే.. ఎక్స్ వేదికగా లలిత్ ఓ పోస్ట్ చేశారు.‘‘వనాటు ఒక అందమైన దేశం, స్వర్గంలా ఉంది. మీ పర్యటనల జాబితాలో దీన్ని చేర్చాల్సిందే’’ అని సందేశం ఉంచారు. దీంతో నెటిజన్స్ ఆయన కామెంట్ సెక్షన్లో సరదా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వనాటు అందాల గురించి ఆరా తీస్తున్నారు.వనాటు.. ఎక్కడుంది?ఉత్తర ఆస్ట్రేలియాకు 1,750 కిలోమీటర్ల దూరంలో దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఉంది ఈ ద్వీప దేశం. మొత్తం 83 చిన్న చిన్న ద్వీపాల సముదాయంగా వై(Y) ఆకారంలో ఉంటుందీ దేశం. ఇందులో 65 ద్వీపాల్లో మాత్రమే ప్రజలు జీవిస్తున్నారు. ఎఫేట్ ఐల్యాండ్లో ఉండే పోర్టువిల్లా నగరం ఆ దేశ రాజధాని. పశ్చిమంగా ఫిజీ దేశం, ఇతర దిక్కుల్లో సాలామాన్ ద్వీపాలు, న్యూ కాలేడోనియా ఉన్నాయి. ఒకప్పుడు బ్రిటిష్ఫ్రెంచ్ సంయుక్త పాలనలో ఇది బానిస దేశంగా ఉండేది. 1980 జులై 30న వనాటు స్వాతంత్రం పొందింది. కరెన్సీ వనాటు వాటు. ప్రస్తుత జనాభా దాదాపు మూడున్నర లక్షలు. ‘‘దేవుడితో మేం నిలబడతాం’’ అనేది ఆ దేశపు నినాదం.అగ్నిపర్వతాలు.. భూకంపాల నేలఈ ద్వీప దేశంలో అగ్నిపర్వతాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని క్రియాశీలకంగా కూడా ఉన్నాయి. సంవత్సరంలో సుదీర్ఘంగా వేసవి వాతావరణంతో పొడిగా ఉంటుంది అక్కడ. అయితే నవంబర్-ఏప్రిల్ మధ్య వర్షాలు, తుపాన్లు సంభవిస్తుంటాయి. ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉండడం మూలంగా భూ కంపాలు షరామాములుగా మారాయి. అయితే కిందటి ఏడాది డిసెంబర్లో 7.3 తీవ్రతతో వచ్చిన భూకంపం ఆ దేశానికి తీవ్ర నష్టం కలిగించింది. ఈ భూకంపంలో 14 మంది చనిపోగా.. 265 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందాల లోకం.. వనాటులో ఉన్న వృక్ష, జంతు సంపద అత్యంత అరుదైంది. ఈ భూమ్మీద ఎక్కడా కనిపించని జీవ జాతులు ఉన్నాయక్కడ. ఎటు చూసినా.. దట్టమైన అడవులు, జలపాతాలు, అందమైన సముద్రం.. నిర్మానుష్యమైన తీరాలు, కొన్ని ద్వీపాల్లో లాగున్లూ.. ఓ ప్రత్యేక అనుభూతిని పంచుతాయి. సహజ సౌందర్యం, జీవ వైవిధ్యం.. వనాటును ప్రపంచ పర్యాటక జాబితాలో ‘ప్యారడైజ్ ఆఫ్ ది ఎర్త్’గా నిలబెట్టాయి.టూరిజం కోసమే..టూరిజం, వ్యవసాయం ఇక్కడి ప్రజల ప్రధాన ఆదాయ వనరులు. అలాగే జనాభాలో గ్రామీణ జనాభా ఎక్కువ. 80 శాతం వ్యవసాయమే చేస్తుంటారు. కావా పంట ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుంది. పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయం ఆ దేశ జీడీపీలో 65 శాతంగా ఉంది. పర్యాటకం మీద ఆధారపడిన ప్రజలు కావడంతో.. పర్యాటకులను మర్యాదలతో ముంచెత్తారు. అలాగే.. సంప్రదాయాలకు అక్కడి ప్రజలు పెద్ద పీట వేస్తుంటారు. పెంటెకాస్ట్ ఐల్యాండ్లో స్థానికులు ల్యాండ్ డైవింగ్ క్రీడ నిర్వస్తుంటారు. బొంగులలాంటి నిర్మాణలను ఎత్తుగా పేర్చి.. చెట్ల తీగలతో సాయంతో బంగీ జంప్లా కిందకు దూకుతారు. ఎవరి తల భూమికి మొదట తాకితే వాళ్లు విజేతలు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు చేసే ఈ ప్రయత్నాల్లో.. పాపం ఒక్కోసారి ప్రాణాలు పొగొట్టుకుంటారు కూడా. పన్నులు లేవు, కానీ..వనాటులో ఎలాంటి పన్నులు విధించరు. ఈ కారణంగా అంతర్జాతీయ నియంత్రణ సంస్థలు ఈ దేశంపై ప్రత్యేక దృష్టి సారించాయి. అదే టైంలో.. వనాటు ఆర్థిక నేరాలకు అడ్డా కూడా. మనీలాండరింగ్కు సంబంధించిన చట్టాలు కూడా అక్కడ బలహీనంగా ఉండడమే ప్రధాన కారణం. ఆర్థిక నేరాలతో పాటు డ్రగ్స్.. ఆయుధాల అక్రమ రవాణాలకు ఇది అడ్డాగా మారింది. ఈ కారణంగానే పైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈ దేశాన్ని గ్రే లిస్ట్లో చేర్చింది. అలాగే.. 2017లో వెలుగు చూసిన ప్యారడైజ్ పేపర్స్ లీక్.. అక్కడి అక్రమ సంపద వ్యవహారాలను బయటపెట్టింది. ఇక.. 2001 ఏప్రిల్లో అప్పటి ప్రధాని బరాక్ సోప్ ఫోర్జరీ కేసులో చిక్కుకున్నారు. భారత్కు చెందిన వ్యాపారవేత్త అమరేంద్ర నాథ్ ఘోష్కు వందల కోట్ల విలువ చేసే పైనాన్షియల్ గ్యారెంటీలను అనధికారికంగా కట్టబెట్టారని బరాక్పై అభియోగాలు వచ్చాయి. ఈ కారణంతో ఆయన అదే ఏడాది తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే.. ప్రపంచం దృష్టిలో ఏర్పడిన ఈ మచ్చని.. కఠిన చట్టాల ద్వారా తొలగించుకునే పనిలో ఉంది ఈ సుందర ద్వీప దేశం. -
లలిత్ మోదీ పాస్పోర్ట్ రద్దు
పోర్ట్ విలా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మాజీ వ్యవస్థాపకుడు లలిత్ మోదీకి ఇటీవల జారీ చేసిన పాస్పోర్ట్ను రద్దు చేయాలని పసిఫిక్ ద్వీప దేశం వనౌతు ప్రధానమంత్రి జొథమ్ నపట్ తమ అధికారులను ఆదేశించారు. పరారీలో ఉన్న ఈ నిందితుడు భారత్కు అప్పగింత నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్ సారథిగా ఉన్న సమయంలో కోట్లాది రూపాయలను లంచంగా తీసుకున్నాడన్న ఆరోపణలపై దర్యాప్తు విభాగాలు విచారణ చేపట్టాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు 2010లో దేశం వీడిన లలిత్ లండన్లో ఉంటున్నాడు. అయితే, ఇటీవల వనౌతు పాస్పోర్టు పొందిన లలిత్ మోదీ తన భారత పాస్పోర్టును లండన్లోని భారత హైకమిషన్ కార్యాలయానికి అప్పగిస్తూ దరఖాస్తు చేసుకున్నాడు. ఒకవేళ, ఈ దరఖాస్తును భారత ప్రభుత్వం ఆమోదిస్తే మోదీ లండన్లో చట్ట విరుద్ధంగా ఉంటున్న వ్యక్తి అవుతాడు. ఈ పరిణామాల నేపథ్యంలో వనౌతు ప్రధాని కార్యాలయం నుంచి సోమవారం తాజా ప్రకటన వెలువడటం గమనార్హం. లలిత్ పాస్పోర్టు దరఖాస్తు పరిశీలన సమయంలో ఇంటర్పోల్ వంటి అంతర్జాతీయ వ్యవస్థల నుంచి అతడిపై జారీ చేసిన ఎటువంటి నోటీసులు లేని విషయాన్ని అధికారులు గమనించారని చెప్పారు. అయితే, ఇటీవల అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా లలిత్ పాస్పోర్ట్ రద్దు చేయాలని సిటిజన్షిప్ కమిషన్ను ఆదేశించినట్లు చెప్పారు. లలిత్ మోదీపై అలెర్ట్ నోటీసు ఇవ్వాలంటూ భారత్ ప్రభుత్వం చేసిన వినతులను సరైన ఆధారాల్లేవంటూ ఇంటర్పోల్ 24 గంటల్లో రెండుసార్లు తోసిపుచ్చిందని చెప్పారు. అయితే, అతడు భారత్కు అప్పగించకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న విషయం స్పష్టమైనందునే పాస్పోర్టు రద్దుకు ఆదేశాలిచ్చినట్లు వనౌతు ప్రధాని వివరించారు. -
భారత పాస్పోర్టు అప్పగించేస్తా: ఐపీఎల్ మాజీ చైర్మన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మాజీ చైర్మన్ లలిత్ మోదీ(Lalit Modi) తన భారత పాస్పోర్ట్ను అప్పగించేందుకు లండన్లోని భారత హైకమిషన్కు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం వివరాలు వెల్లడించింది. ఐపీఎల్ చైర్మన్గా ఉన్న సమయంలో భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ... 2010లో భారత్ను వదిలి వెళ్లిపోయాడు.అప్పటి నుంచి లండన్లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో పసిఫిక్ దీవుల్లోని వనువాతు(Vanuatu) దేశం పౌరసత్వం కూడా పొందాడు. నిధుల దుర్వినియోగం అంశంలో భారత దర్యాప్తు సంస్థలు చాన్నాళ్లుగా లలిత్ మోదీ కోసం గాలిస్తున్నాయి. ‘లండన్లోని భారత హైకమిషన్లో లలిత్ మోదీ తన పాస్పోర్ట్ అప్పగించేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. నిబంధనల ప్రకారం లలిత్ దరఖాస్తును పరిశీలిస్తాం. వనువాతు పౌరసత్వం పొందాడనే విషయాన్ని కూడా అర్థం చేసుకున్నాం. చట్ట ప్రకారం అతడిపై కేసులు కొనసాగుతున్నాయి’ అని భారత విదేశంగా మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణదీర్ జైస్వాల్ వెల్లడించారు. టీ20 ఫార్మాట్, సినీ గ్లామర్తో 2008లో భారత్లో ఐపీఎల్ రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత సంపన్న లీగ్గా కొనసాగుతున్న ఈ మెగా టోర్నీ సృష్టికర్తగా లలిత్ మోదీకి పేరుంది. అయితే, ఎంత వేగంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడో అంతే వేగంగా పతనాన్ని చూశాడు లలిత్. 2010 ఫైనల్ తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అతడిని సస్పెండ్ చేసింది.పుణె, కొచ్చి ఫ్రాంఛైజీల బిడ్ల విషయంలో రిగ్గింగ్కు పాల్పడ్డాడని, క్రమశిక్షణారాహిత్యం, ఆర్థిక అవకతవల నేపథ్యంలో అతడిపై బోర్డు వేటు వేసి దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలో విచారణ కమిటి అతడిపై వచ్చిన అభియోగాలు నిజమేనని తేల్చడంతో 2013లో లలిత్ మోదీపై జీవితకాల నిషేధం విధించింది. అనంతరం అతడు లండన్కు పారిపోయి.. బీసీసీఐపై అనేక ఆరోపణలు చేశాడు. తాను అయాకుడినని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. -
61 ఏళ్ల వయసులో మరోసారి ప్రేమలో పడ్డ ‘ఐపీఎల్ సృష్టికర్త’!.. ఎవరీమె?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తొలి చైర్మన్, వ్యాపారవేత్త లలిత్ మోదీ(Lalit Modi) మరోసారి ప్రేమలో పడ్డాడు. రీమా బౌరీ(Rima Bouri)తో పాతికేళ్లుగా తనకున్న స్నేహం ప్రేమగా రూపాంతరం చెందిందని తెలిపాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఈ విషయాన్ని లలిత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.దేశం విడిచిపారిపోయికాగా వ్యాపార కుటుంబానికి చెందిన లలిత్ మోదీ ఢిల్లీలో జన్మించాడు. ఐపీఎల్(IPL) సృష్టికర్తగా పేరు ప్రఖ్యాతులు పొందిన అతడు.. అదే స్థాయిలో అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఆర్థిక అవకతవలకు పాల్పడి దేశం విడిచిపారిపోయే పరిస్థితికి చేరుకున్నాడు. ప్రస్తుతం లలిత్ మోదీ లండన్లో తలదాచుకుంటున్నట్లు జాతీయ మీడియా కథనాల ద్వారా వెల్లడైంది.భార్య కంటే తొమ్మిదేళ్లు చిన్నఇదిలా ఉంటే.. లలిత్ మోదీ వృత్తిగత జీవితం మాదిరే వ్యక్తిగత జీవితం కూడా సంచలనాల మయమే. వయసులో తనకంటే తొమ్మిదేళ్లు పెద్దదైన, డివోర్సీ మినాల్ను లలిత్ మోదీ ప్రేమించి పెళ్లాడాడు. ఆమె కోసం కుటుంబాన్ని ఎదిరించి మరీ ఢిల్లీ నుంచి ముంబైకి మకాం మార్చిన లలిత్.. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగాడు.ఇక లలిత్- మినాల్ దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె అలియా, కుమారుడు రుచిర్ మోదీ ఉన్నారు. వీరిద్దరితో పాటు మినాల్కు మొదటి వివాహం ద్వారా కలిగిన కుమార్తె కరీమా సంగ్రాణిని కూడా లలిత్ మోదీ చేరదీసినట్లు కథనాలు ఉన్నాయి. లలిత్ ప్రాణంగా ప్రేమించిన మినాల్ క్యాన్సర్తో పోరాడి దురదృష్టవశాత్తూ 2018లో కన్నుమూశారు.సుస్మితా సేన్తో ప్రేమలో ఉన్నట్లుఅప్పటి నుంచి ఒంటరి జీవితం గడుపుతున్న లలిత్ మోదీ గతేడాది.. విశ్వ సుందర్ సుస్మితా సేన్తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించి సంచలనానికి తెరదీశాడు. అనంతరం.. ఆమెను బెటర్ హాఫ్ అని సంబోధిస్తూ పెళ్లి వార్తలకు ఊతమిచ్చాడు. అయితే, ఆ తర్వాత ఇద్దరూ వీటిని ఖండించడంతో ఊహాగానాలకు చెక్ పడింది.అయితే, తాజాగా.. 61 ఏళ్ల లలిత్ మోదీ తాను మరోసారి ప్రేమలో పడ్డట్లు తెలపడం విశేషం. ‘‘ఒక్కసారి అదృష్టం అంటారు... మరి నేను మాత్రం రెండుసార్లు లక్కీ అయ్యాను. 25 ఏళ్ల స్నేహం ప్రేమగా రూపాంతరం చెందిన వేళ.. అవును ఇది రెండోసారి జరిగింది. మీ జీవితాల్లోనూ ఇలా జరిగే ఉంటుంది. హ్యాపీ వాలైంటైన్స్ డే’’ అంటూ రీమా బౌరీతో ఉన్న ఫొటోలతో కూడిన వీడియోను లలిత్ మోదీ షేర్ చేశాడు.జీవితాంతం నువ్వే నా ప్రేమఇందుకు స్పందిస్తూ.. ‘‘లవ్ యూ మోర్’’ అని రీమా పేర్కొనగా.. లలిత్.. ‘‘జీవితాంతం నువ్వే నా ప్రేమ’’ అంటూ రొమాంటిక్గా బదులివ్వడం విశేషం. కాగా రీమా బౌరీ వృత్తిరీత్యా మార్కెటింగ్ కన్సల్టెంట్గా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. 2022లో లలిత్ మోదీ తన కుమార్తె ఆలియా వివాహం జరిపించాడు. బ్రెట్ కార్ల్సన్ అనే విదేశీయుడిని ఆలియా పెళ్లి చేసుకున్నారు. ఇటలీలోని వెనిస్ నగరంలో వీరి వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఇదిలా ఉంటే.. 2008లో మొదలైన ఐపీఎల్ పదిహేనేళ్లుగా విజయవంతమైన లీగ్గా కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చి 21 నుంచి ఈ మెగా క్రికెట్ ఈవెంట్ మొదలుకానుంది.చదవండి: అప్పుడే ఆఫర్ వచ్చింది.. కానీ!.. వదిలేసిన ఫ్రాంఛైజీ జట్టుకే కెప్టెన్గా.. View this post on Instagram A post shared by Lalit Modi (@lalitkmodi) -
‘మిత్రమా.. మనకు అన్యాయం జరిగింది!’
బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి విదేశాల్లో దాక్కొన్న బిలియనీర్ విజయ్ మాల్యా.. లలిత్ మోదీ మధ్య ఎక్స్ వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది. విజయ్ మాల్యాకు ఇవాళ లలిత్ మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయగా.. అందుకు విజయ్ మాల్యా తనదైన శైలిలో స్పందించారు. ఈ క్రమంలో చర్చ తాజా పరిణామాలపైకి దారి మళ్లింది.‘‘నా ప్రియమైన మిత్రుడు విజయ్మాల్యాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. మనిద్దరమూ అది చూశాం. అయ్యిందేదో అయ్యింది.. రాబోయే సంవత్సరం నీదే మిత్రమా. ప్రేమ.. చిరునవ్వులతో సంతోషంగా ఉండూ.. అంటూ పోస్ట్ చేశారు. దానికి విజయ్ మాల్యాస్పందిస్తూ.. థ్యాంక్యూ మై డియరెస్ట్ ఫ్రెండ్. దేశానికి మనం ఎంతో చేశాం.. అయినా మనకు అన్యాయమే జరిగింది అనే అర్థం వచ్చేలా బదులిచ్చారు.Wishing you my friend #vijaymallya a very #happybirthday - life sure has its ups and downs we have both seen it. This too shall pass. May the year ahead be your year. And you are surrounded by love and laughter. Big big hug 🤗🥰🙏🏽@TheVijayMallya pic.twitter.com/ca5FyMFnqr— Lalit Kumar Modi (@LalitKModi) December 18, 2024ఇదిలా ఉంటే.. భారత బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థులపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలిస్తున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. ఈ ఏడాది ఎగవేతదారుల నుంచి ఆస్తులను జప్తు చేసి బ్యాంకుల్లో జమ చేస్తున్నామని.. ఈ ఏడాది రూ.22,280 కోట్లు రాబట్టామని.. ఇందులో విజయ్ మాల్యాకు చెందిన రూ.14 వేల కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈ ప్రకటనపైనా విజయ్ మాల్యా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ బాకీలు రూ.6,203 కోట్లు, వడ్డీ.. రూ. 1,200 కోట్ల వడ్డీ. కానీ, ఈడీ సాయంతో బ్యాంకులు 14,131 కోట్లు వసూలు చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంటే అప్పు కంటే రెట్టింపు వసూలు చేశారన్నమాట. అయినా నన్ను ఆర్థిక నేరస్థుడిగానే చూస్తున్నారు. నన్ను యధేచ్ఛగా విమర్శిస్తున్నవాళ్లు.. నాకు జరిగిన ఈ అన్యాయం మీద మాట్లాడగలరా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారాయన. అలాగే సీబీఐ తన మీద పెట్టిన కేసు గురించి.. జప్తు గురించి మరో ట్వీట్ చేశారు. ఈ జప్తు చర్యను ఈడీ, బ్యాంకులు చట్టబద్ధంగా సమర్థించుకోవాలి. లేకుంటే.. ఉపశమనం కోసం పోరాడే అర్హత నాకు ఉన్నట్లే! అని ట్వీట్ చేశారాయన. అయితే దానికి కూడా లలిత్ మోదీ స్పందిస్తూ.. ‘‘నా స్నేహితుడు దీనిని కూడా అధిగమిస్తాడు.. బర్త్డే శుభాకాంక్షలు’’ అంటూ మరో పోస్ట్ చేశారు. ఇక ఈ ఇద్దరి మధ్య సంభాషణపై నెటిజన్లు జోకులేస్తూ.. ట్రోల్ చేస్తున్నారు. మరికొందరేమో విజయ్ మాల్యా తీరుపై మండిపడుతున్నారు.This too shall pass my friend @TheVijayMallya and wish a very happy birthday today my friend https://t.co/HYJYKe1mcx— Lalit Kumar Modi (@LalitKModi) December 18, 2024 Government and my many critics say that I have CBI criminal cases to answer. What criminal cases filed by CBI ? Never borrowed a single rupee, never stole, but as guarantor of KFA debt I am accused by CBI together with many others including IDBI Bank officials of fraudulently…— Vijay Mallya (@TheVijayMallya) December 18, 2024Whatever I have stated about my liabilities as guarantor of KFA loans is legally verifiable. Yet more than Rs 8000 crores have been recovered from me over and above the judgement debt. Will anyone, including those who freely abuse me, stand up and question this blatant injustice…— Vijay Mallya (@TheVijayMallya) December 18, 2024 ఐపీఎల్ వ్యవస్థాపకుడైన లలిత్ మోదీ.. 2010లో పన్ను ఎగవేత, మనీలాండరింగ్ కేసులో దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం లండన్లో నివాసముంటున్న విషయం తెలిసిందే. అయితే.. న్యాయపరమైన చిక్కుల వల్ల తాను దేశం వీడలేదని, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి బెదిరింపులు రావడం వల్లే దేశాన్ని వీడాల్సి వచ్చిందని ఇటీవల ఓ పాడ్కాస్ట్లో లలిత్ మోదీ వెల్లడించారు. ఇక.. ముంబైలోని ప్రత్యేక కోర్టు ఆదేశాలతో ఈడీ, బ్యాంకులు సంయుక్తంగా ఎగవేతదారుల ఆస్తులను జప్తు చేసి వేలం వేస్తున్నాయని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వివిధ కేసుల్లో ప్రత్యేక దర్యాప్తు సంస్థ చర్యలు తీసుకోవడంతో నష్టపోయిన బ్యాంకులు కొంత ఉపశమనం పొందాయన్నారామె. విజయ్ మాల్యాకు చెందిన రూ.14 వేల కోట్ల ఆస్తులను జప్తు చేసి బ్యాంకుల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆస్తులను విక్రయించి వెయ్యి కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. గుజరాత్కు చెందిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ఆస్తుల నుంచి మరో రూ.2,566 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసి వేలం వేయబోతున్నట్లు ప్రకటించారామె. -
దావూద్ బెదిరింపుల వల్లే భారత్ వీడా
లండన్: 2010 నుంచి విదేశాల్లో గడుపుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వ్యవస్థాపకుడు లలిత్ మోదీ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. భారత్లో తనపై ఎలాంటి కేసులు లేవన్న లలిత్ మోదీ..చంపుతామంటూ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి వచ్చి,న బెదిరింపుల వల్లే విదేశాల్లో ఉంటున్నట్లు చెప్పుకున్నారు. ‘ఫిగరింగ్ ఔట్’అనే పాడ్ కాస్ట్లో రాజ్ షమానీకిచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల ఈ విషయాలను ఆయన వెల్లడించారు. ‘వాస్తవానికి, దేశం విడిచి పెట్టేటంతటి సీరియస్ కేసులేవీ నాపైన అప్పట్లో లేవు. దావూద్ ఇబ్రహీం నుంచి చంపేస్తామంటూ నాకు బెదిరింపులు వచ్చాయి. మ్యాచ్ ఫిక్సింగ్ను అస్సలు సహించను. అయితే, క్రికెట్ మ్యాచ్లు ఫిక్స్ చేయాలనుకున్న దావూద్ ఇబ్రహీం నాపై ఒత్తిడి పెంచాడు. అయితే, అవినీతికి వ్యతిరేకంగా ఆట సమగ్రతను కాపాడటంపైనే నా దృష్టంతా ఉంది. దీనికి తోడు వ్యతిరేక ప్రచారం నాపై ఎక్కువగా జరిగింది’అని లలిత్ పేర్కొన్నారు. ‘ఈ పరిస్థితుల్లో హిట్ లిస్ట్లో ఉన్నందున నాకు 12 గంటలపాటు మాత్రమే భద్రత కల్పించగలమని సీనియర్ పోలీసు అధికారులు చెప్పారు. నా వ్యక్తిగత సిబ్బంది సూచనమేరకు ముందు జాగ్రత్తగా ఎయిర్పోర్టు నుంచి వీఐపీ గేట్ ద్వారానే బయటకు వెళ్లా’అని వివరించారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు భారత్ వెళ్లగలనంటూ ఆయన..‘చట్ట పరంగా నేను పరారీలో ఉన్న నేరగాణ్ని కాను. అక్కడ ఏ కోర్టులోనూ నాపైన ఎలాంటి కేసులూ లేవు. అందుకే భారత్కు రేపు ఉదయం వెళ్లాలన్నా వెళ్లగలను. అందులో నాకెలాంటి సమస్యాలేదు’అని తెలిపారు. దావూద్ ఇబ్రహీం హిట్ లిస్ట్లో ఉన్న వాళ్లలో లలిత్ మోదీ ఒకరు. లలిత్ను చంపేందుకు తమ షార్ప్ షూటర్ల బృందం థాయ్ల్యాండ్ రాజధాని బ్యాంకాక్లో సిద్ధంగా ఉందంటూ కొన్నేళ్ల క్రితం దావూద్ సన్నిహితుడు చోటా షకీల్ వ్యాఖ్యా నించడం తెలిసిందే. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. విజయ్ మాల్యా కొడుకు పెళ్ళిలో లలిత్ మోదీ
మాజీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చీఫ్, పరారీలో ఉన్న లలిత్ మోదీ.. ఇటీవల విజయ్ మాల్యాకు కొడుకు 'సిద్ధార్థ మాల్యా' వివాహంలో కనిపించారు. లండన్లోని హెర్ట్ఫోర్డ్షైర్లోని విజయ్ మాల్యాకు చెందిన ఎస్టేట్లో మోదీ ప్రత్యక్షమయ్యారు. ఈయన పెళ్ళిలో కాకుండా.. సన్నిహితులు & కుటుంబ సభ్యులు కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కనిపించారు.సిద్ధార్థ మాల్యా పెళ్ళికి సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి వివాహం కొంతమంది సన్నితుల సమక్షంలో జరిగింది. ఏడాదికి పైగా డేటింగ్లో ఉన్న సిద్ధార్థ మాల్యా, జాస్మిన్ల నిశ్చితార్థం గతేడాది నవంబర్లో జరిగింది. అప్పట్లో జాస్మిన్ సోషల్ మీడియాలో కొన్ని చిత్రాలను పంచుకోవడం ద్వారా వారి నిశ్చితార్థ వార్తలను ప్రకటించింది. కాగా ఇప్పుడు వివాహబంధంలోకి అడుగుపెట్టారు.సిద్ధార్థ్ మాల్యా & జాస్మిన్లు భార్యాభర్తలుగా ఉన్న మొదటి ఫోటో బయటకు వచ్చింది. ఇందులో సిద్ధార్థ్ ఆకుపచ్చ రంగు టక్సేడోలో ఉండగా, జాస్మిన్ తెల్లటి వెడ్డింగ్ గౌనులో వీల్తో మరియు ఆమె చేతిలో బొకేతో కనిపించారు. ఈ ఫోటోకు 'మిస్టర్ అండ్ మిసెస్ ముప్పెట్' అని క్యాప్షన్ కూడా ఇచ్చారు.Siddharth Mallya gets married in London.Indian middle class : “Yeh taufa humne tumko diya hai”pic.twitter.com/VYapa1ZoMe— Doctor (@DipshikhaGhosh) June 23, 2024 -
IPL: వేల కోట్లకు వారసురాలు.. ఇంతకీ ఎవరీ బ్యూటీ? (ఫొటోలు)
-
ఐపీఎల్ సృష్టికర్త కుమార్తె.. వేల కోట్లకు వారసురాలు! ఆమె ప్రత్యేకత ఇదే!
ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన టీ20 లీగ్గా పేరొందింది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఈ క్యాష్ రిచ్ లీగ్ సృష్టికర్త లలిత్ కుమార్ మోదీ. సినీ సెలబ్రిటీలు, కార్పొరేట్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించి.. ప్రపంచ క్రికెటర్లందినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చిన ఘనత సొంతం చేసుకున్నాడు ఈ బిజినెస్మేన్.అప్పటి వరకు ఎన్ని వ్యాపారాలు ఉన్నా ఐపీఎల్తోనే పాపులర్ అయిన లలిత్ మోదీ.. క్రికెట్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగాడు. అయితే, ఆర్థిక లావాదేవీల విషయంలో అవకతవలకు పాల్పడి అదే స్థాయిలో అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. దేశం నుంచి పారిపోయి ఆర్థిక నేరగాడిగా ముద్రవేసుకున్నాడు.ఆ మధ్య సుస్మితా సేన్తో ప్రేమాయణంతో మళ్లీ వార్తల్లోకి వచ్చిన లలిత్ మోదీ.. ఇటీవల టీ20 ప్రపంచకప్-2024లో ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ రేట్ల విషయమై ఐసీసీని విమర్శిస్తూ తెరమీదకు వచ్చాడు.ఈ నేపథ్యంలో లలిత్ మోదీ వ్యక్తిగత జీవితం, నెట్వర్త్, ఆయన వారసుల గురించి తాజాగా నెటిజన్లలో చర్చ మొదలైంది. తనకంటే వయసులో తొమ్మిదేళ్లు పెద్దదైన మినాల్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న లలిత్ మోదీకి కుమార్తె అలియా, కుమారుడు రుచిర్ ఉన్నారు.DNA ఇండియా నివేదిక ప్రకారం.. జూలై 2022 నాటికి లలిత్ మోదీ నికర ఆస్తుల విలువ 4,555 కోట్ల రూపాయలు. ఇక ఆయనకు సంబంధించిన మోది ఎంటర్ప్రైజెస్ విలువ రూ. 23,450 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.అలియా మోదీ.. ఆసక్తికర నేపథ్యంలలిత్ మోదీ ఆస్తులకు వారసురాలైన అలియాకు తన తమ్ముడు రుచిర్తో మంచి అనుబంధం ఉంది. తోబుట్టువులిద్దరు ఒకరికి ఒకరు అండగా ఉంటూ.. వ్యాపారంలో రాణిస్తున్నారు.అలియా మోదీ ఇంటీరియర్ డిజైనర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె సొంతంగా రూ. 41 కోట్ల మేర ఆస్తి కలిగి ఉన్నట్లు సమాచారం. ఇక అలియా వ్యక్తిగత జీవితానికొస్తే.. 2022 మేలో ఆమె బ్రెట్ కార్ల్సన్ను పెళ్లి చేసుకున్నారు.ఇటలీలోని వెనిస్ నగరంలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో కూతురు- అల్లుడి ఫొటోలను షేర్ చేస్తూ లలిత్ మోదీ మురిసిపోయాడు. ఇక సెలబ్రిటీల జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న నెటిజన్లు ఈ ఫొటోలను తవ్వితీసి.. అలియా మోదీని హైలైట్ చేస్తున్నారు. అదీ.. ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ కుటుంబం సంగతి! -
IND vs PAK: ఒక్క టికెట్ రూ. 16 లక్షలా?.. ఐసీసీపై లలిత్ మోదీ ఫైర్
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభానికి సమయం సమీపిస్తోంది. జూన్ 1 ఈ ఐసీసీ ఈవెంట్కు తెరలేవనుంది. ఇక ఈ మెగా టోర్నమెంట్కు అమెరికా తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.వెస్టిండీస్తో కలిసి వరల్డ్కప్ నిర్వహణ హక్కులు దక్కించుకున్న యూఎస్ఏ.. ఇప్పటికే మ్యాచ్లు జరిగే స్టేడియాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పనిలో మునిగిపోయింది.చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఆరోజేఇదిలా ఉంటే.. టీమిండియా ఈ ఈవెంట్లో తమ లీగ్ మ్యాచ్లన్నీ యూఎస్ఏలోనే ఆడనుంది. జూన్ 5 న ఐర్లాండ్తో మ్యాచ్ ద్వారా తాజా ఎడిషన్లో తమ ప్రయాణం మొదలుపెట్టనున్న రోహిత్ సేన.. జూన్ 9న తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది.ఇక దాయాదుల పోరు అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక సిరీస్లు ఎప్పుడో రద్దు కాగా.. కేవలం ఆసియా కప్, ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్లలో మాత్రమే టీమిండియా- పాక్లు ముఖాముఖి తలపడుతున్నాయి.ఈ నేపథ్యంలో ఈ హైవోల్టేజీ మ్యాచ్లకు మరింత ఆదరణ పెరిగింది. ఈ క్రమంలో ఐసీసీ ఈ క్రేజ్ను క్యాష్ చేసుకునే క్రమంలో మరీ దారుణంగా ప్రవర్తిస్తోందంటూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సృష్టికర్త, మాజీ కమిషనర్ లలిత్ మోదీ మండిపడ్డాడు.లాభాలు దండుకోడానికి కాదుఇండియా- పాక్ మ్యాచ్కు వేదికైన న్యూయార్క్లోని నసావూ కౌంటీ స్టేడియంలో టికెట్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు.. ‘‘వరల్డ్కప్లో ఇండియా- పాక్ మ్యాచ్ నేపథ్యంలో డైమండ్ క్లబ్ సీటు టిక్కెట్లను ఏకంగా 20000 డాలర్లకు అమ్ముతున్నారని తెలిసి షాకయ్యాను.అమెరికాలో వరల్డ్కప్ నిర్వహిస్తోంది క్రికెట్కు ఇక్కడ ఆదరణ పెంచడానికి, ఫ్యాన్ ఎంగేజ్మెంట్ కోసం మాత్రమే అనుకున్నాం. కానీ మీరు లాభాలు దండుకోడానికి కాదు’’ అంటూ ఐసీసీ తీరును లలిత్ మోదీ ఎక్స్ వేదికగా విమర్శించాడు. దాదాపు రూ. 16 లక్షలకు పైనే!కాగా 20 వేల అమెరికన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో ఈ మొత్తం దాదాపు రూ. 16 లక్షలకు పైనే! ఇక లలిత్ మోదీ ట్వీట్ చూసిన ఫ్యాన్స్ టికెట్ ధర తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే, ఈ ధరలకు సంబంధించి ఇంత వరకు అధికారిక సమాచారం మాత్రం లేదు.కాగా క్యాష్ రిచ్ లీగ్ను సృష్టించిన లలిత్ మోదీ ఆర్థిక అవకతవకలకు పాల్పడి దేశం నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు లండన్లో తలదాచుకుంటున్నట్లు సమాచారం.Shocked to learn that @ICC is selling tickets for Diamond Club at $20000 per seat for the #indvspak WC game. The WC in the US is for game expansion & fan engagement, not a means to make profits on gate collections. $2750 for a ticket It’s just #notcricket #intlcouncilofcrooks pic.twitter.com/lSuDrxHGaO— Lalit Kumar Modi (@LalitKModi) May 22, 2024 -
'పెళ్లైతే చేసుకుంటా.. కానీ మాజీ బాయ్ఫ్రెండ్స్తో'.. హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది తాలి, ఆర్య-3 వెబ్ సిరీస్లతో ప్రేక్షకులను అలరించింది. అయితే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోని ప్రపంచసుందరి చాలాసార్లు డేటింగ్ రూమర్స్ వినిపించాయి. అంతే కాదు.. ఐపీఎల్ మాజీ ఛైర్మన్తో లలిత్ మోదీతో కొంత కాలం సుష్మిత డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది దీపావళి సందర్భంగా సుస్మిత తన మాజీ ప్రియుడు రోహ్మాన్ షాల్తో కనిపించింది. 2022లోనే వీరిద్దరికీ బ్రేకప్ అయినప్పటికీ.. చాలా సందర్భాల్లో జంటగా కనిపించారు. దీంతో మరోసారి సుస్మిత సేన్పై పెళ్లి వార్తలొచ్చాయి. దీంతో మరోసారి వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. మీ లైఫ్లో బ్రేకప్ అయినప్పుడు ప్రశ్నించగా.. సుస్మిత తనదైన శైలిలో సమాధానాలిచ్చింది. సుస్మిత మాట్లాడుతూ..'నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. నేను చాలా నిజాయితీగా, నిర్భయంగా జీవిస్తున్నా. గౌరవం అనేది మన జీవితంలో ఒక అంశం మాత్రమే కాదు. అది మీరంటే ఏంటో నిర్ణయిస్తుంది. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలు బాధపెట్టాయా? లేదా ద్రోహం చేశాయా? లేదా మీరు మనం ఏదైనా తప్పు చేశామా? అన్నవి నేను పెద్దగా పట్టించుకోను. జీవితంలో ఎదురయ్యే వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడం.. ముందుకు సాగడమేనని' చెప్పుకొచ్చింది. ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే.. మాజీలతో స్నేహితులుగా ఉండగలరా? అని యాంకర్ ప్రశ్నించారు. దీనిపై సుస్మిత మాట్లాడుతూ..'కచ్చితంగా వారితో ఫ్రెండ్లీగానే ఉంటాను. కానీ కాస్తా కష్టంగానే ఉంటుందని భావిస్తున్నా. చాలా మంది తమ మాజీలతో అలానే ఉంటారు. కానీ ఇక్కడ వారితో లిమిట్స్ ఉంటాయా అనే విషయమైతే తెలియదు. కానీ అది సాధ్యమే. ఇలాంటివీ నేను చూశాను కూడా. ఎందుకంటే ప్రస్తుతం నా జీవితంలో సంతోషంగా ఉన్నా. పెళ్లి చేసుకోవడానికి కావాల్సింది సరైన సమయం, కారణం కాదు. నాకు తగినట్లుదా సరైన వ్యక్తి దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటా' అని తెలిపింది. సుస్మితా సేన్ రిలేషన్స్ సుస్మిత సేన్ మొదట బాలీవుడ్ నటుడు రణ్దీప్ హుడాతో డేటింగ్లో ఉన్నారు. ఆ తర్వాతమోడల్ రోహ్మన్ షాల్తో 2018 నుండి 2021 వరకు మూడేళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించారు. ఆ తర్వాతవ్యాపారవేత్త, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. -
లలిత్ మోడీతో ప్రేమాయణం.. సుస్మితా సేన్ క్లారిటీ!
బాలీవుడ్ హీరోయిన్ సుస్మితా సేన్ ఇటీవలే ఆర్య -3 వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుండగా.. అభిమానుల నుంచి విశేష ఆదరణ దక్కించుకుంటోంది. ఈ వెబ్ సిరీస్ను రామ్ మాధ్వని దర్శకత్వంతో తెరకెక్కించారు. అయితే తాజాగా ఇంటర్వ్యూకు హాజరైన సుస్మితా సేన్ ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీతో తన ప్రేమయాణం గురించి నోరు విప్పింది. (ఇది చదవండి: కావాలయ్యా సాంగ్.. తమన్నా స్టెప్పు చెండాలం అంటూ నటుడి విమర్శలు) మీకు లలిత్ మోడీని పెళ్లి చేసుకోవాలనుకున్నారా ప్రశ్నించగా?..'నేను ఎవరినైనా పెళ్లి చేసుకోవాలనుకంటే చేసుకుంటా. అంతే కానీ ఇలా ప్రయత్నించను. ఇష్టముంటే చేసుకుంటా అంతే. తనపై వచ్చిన మీమ్స్ చూస్తే చాలా ఫన్నీగా అనిపించాయి. మీరు ఎవరినైనా గోల్డ్ డిగ్గర్ అని పిలిచేముందు వాస్తవాలు తెలుసుకోండి. నేను బంగారం కంటే ఎక్కువగా వజ్రాలను ఇష్టపడతాను. మన నిశ్శబ్దంగా ఉంటే మౌనాన్ని బలహీనతగా భావిస్తారు. అందుకే వారికి తెలియజేయడానికి నేను ఒక పోస్ట్ పెట్టవలసి వచ్చింది.' అని అన్నారు. కాగా.. ఇటీవలే దీపావళి సందర్భంగా సుస్మిత తన మాజీ ప్రియుడు రోహ్మాన్ షాల్తో కనిపించింది. వీరిద్దరూ 2022లో బ్రేకప్ అయినప్పటికీ.. చాలా సందర్భాల్లో జంటగా కనిపించారు. దీపావళి సందర్భంగా సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
రక్తసంబంధం లేకున్నా ఆ పిల్లల కోసం సుస్మితా సేన్ ఏం చేసిందంటే
బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తాజాగా ‘తాలీ’ వెబ్ సీరిస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఇది జియో టీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సీరిస్ ట్రైలర్ విడుదలైనప్పుడు తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్న ఆమె ఇందులో ట్రాన్స్జెండర్గా అద్భుతంగా నటించి విమర్శించిన వారికి సమాధానం చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ జర్నీ ఎలా ముగిసింది. అప్పుడు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది. అనే అంశాలపై సుస్మిత కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సుస్మితా సేన్ తన కుమార్తె యొక్క ఆరోగ్య సమస్యల గురించే కాకుండా తన బిడ్డ పట్ల ఎలాంటి విధులను నిర్వహించింది అనే దాని గురించి మాట్లాడారు. ఒక సంఘటనను గుర్తుచేసుకుంటూ.. ఈ సంఘటనతో సినిమాలకు దూరం సుస్మితా సేన్కు 24 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక కుమార్తెను దత్తత తీసుకుంది. ఆ సమయంలో తన తల్లి వద్దని వారించినా మెండిగా నిర్ణయం తీసుకుంది. అప్పుడు ఆమెకు పలు భారీ సినిమా అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పలువురు సన్నిహితులు కూడా వద్దని చెప్పినా సుస్మిత మనుసు మార్చుకోలేదు. కుమార్తెను దత్తత తీసుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇలా చెప్పింది. 'రెనీ నా జీవితంలోకి వచ్చినప్పుడు తన ఆరోగ్యం మెరుగ్గాలేదు. అదే సమయంలో నేను కెనడాలో ఉన్నాను. అక్షయ్ కుమార్, కరీనాతో కలిసి ఒక సినిమా చిత్రీకరణలో ఉన్నాను. పాపను అలా వదిలి రావడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు.. కానీ తప్పలేదు. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ప్రాజెక్ట్లోకి ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి) అలా షూటింగ్లో ఉండగా నా తండ్రి నుంచి ఫోన్ వచ్చింది. పాపకు సీరియస్గా ఉంది. ఆస్పత్రిలో చేర్పించామని నాన్న చెప్పాడు. అలాంటి సమయంలో నేను షూటింగ్లో పాల్గొనలేకపోయాను. తనను నేను నవమాసాలు మోసి కనకపోయినా అంతే సమానమైన బంధం రెనీతో ఉంది. దీంతో సినిమా షూటింగ్లో ఒక్క క్షణం ఉండలేకపోయాను.. సెట్లో అందరి ముందు విషయం చెప్పి కెనడా నుంచి తిరిగి ముంబయ్కు బయల్దేరాను. విదేశాల్లో షూటింగ్లో ఉన్న నేను సినిమాను మధ్యలో ఆపేసి వచ్చేశాను. ఆ క్షణమే నాకు తెలుసు నా సినిమా కెరీర్ ఇక్కడితో ముగిసిందని. అప్పట్లో నాకు కెరీర్పై సీరియస్నెస్ లేదని, అందుకే 24 ఏళ్లకే తల్లినయ్యానని కామెంట్స్ చేసేవారు ఎందరో. దీంతో నా పనిలో ఇంకా ఎక్కువ కష్టపడేదానిని కానీ, అప్పటికే నాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.’ అని సుస్మిత తెలిపింది. 1994లో విశ్వ సుందరిగా నెగ్గిన సుష్మితా సేన్ బాలీవుడ్తో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. తర్వాత ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. (ఇదీ చదవండి: అందరిలా నేనెందుకు ఆనందంగా లేనంటే: టాప్ హీరోయిన్) భారత మెగా టీ20 క్రికెట్ లీగ్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీతో కొంత కాలం సుష్మిత డేటింగ్లో ఉన్నారు. సుష్మితా సేన్ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా 2013లో మదర్ థెరిసా అంతర్జాతీయ అవార్డును ఆమె పొందింది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిద్దరూ కూడా దత్తత తీసుకున్నవారే కావడం విశేషం. -
లలిత్ మోదీతో బ్రేకప్.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన సుష్మితాసేన్!
మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్.. సినిమాలతో పాటు లవ్ ఎఫైర్లతోనూ బాగా ఫేమస్ అయింది. సినిమాల్లో హీరోయిన్గా రాణించిన సమయంలో ఎంతోమందితో ప్రేమాయణం నడిపింది. ఈ క్రమంలో తనకంటే చిన్నవాడైన రోహ్మన్ షాల్తోనూ లవ్వాయణం నడిపింది. కానీ తర్వాత అతడికి బ్రేకప్ చెప్పింది. కొంతకాలానికే ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీతో ప్రేమలో పడింది. వీరిద్దరూ డేటింగ్లో ఉన్న విషయాన్ని తెలియజేస్తూ లలిత్ మోదీ ట్విటర్లోనూ కొన్ని ఫోటోలు రిలీజ్ చేశాడు. ఇది చూసిన జనాలు.. డబ్బు కోసమే సుష్మిత అతడిని ప్రేమిస్తోందంటూ విమర్శలు గుప్పించారు. ఏదైనా అనుకోండి, డోంట్ కేర్ అయితే ఏమైందో ఏమో కానీ కొంతకాలానికే వీరిద్దరు కూడా బ్రేకప్ చెప్పుకున్నారని ప్రచారం జరిగింది. తాజాగా ఈ ట్రోలింగ్పై, బ్రేకప్పై క్లారిటీ ఇచ్చింది నటి. తాలి వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో పాల్గొన్న సమయంలో ఆమె మాట్లాడుతూ.. 'నా గురించి మీరెలా మాట్లాడుకున్నా మంచిదే! డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతానని అంటున్నారు.. ఈ అవమానాలను నేను స్వీకరించినప్పుడే అవమానం.. కానీ అలాంటివి నేనసలు పట్టించుకుంటే కదా! నేనిప్పుడు సింగిల్.. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత విషయాలంటూ కొన్నుంటాయి.. వాటితో మీకు సంబంధం లేదు. ప్రతిదాంట్లో దూరే హక్కు మీకు లేదు. ఇంకో విషయం చెప్పాలి, నేనిప్పుడు సింగిల్గా ఉంటున్నాను. దాని గురించి కూడా మీకనవసరం!' అని ఘాటుగా వ్యాఖ్యానించింది. లలిత్ మోదీతో బ్రేకప్ అయిన విషయాన్ని చెప్పకనే చెప్పింది సుష్మిత. కాగా ఈ నటి ఈ ఏడాది ఫిబ్రవరిలో గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరగా ఓ మేజర్ సర్జరీ జరిగింది. అప్పుడు సినిమాలకు విరామం పలికిన ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుని తిరిగి షూటింగ్లో పాల్గొంటోంది. ప్రస్తుతం ఆర్య 3, తాలి అనే వెబ్ సిరీస్లు చేస్తోంది. చదవండి: మా నాన్న ఎలా ఉంటాడో తెలియదు: ఏడ్చేసిన ధనరాజ్ -
వైరల్ అవుతున్న లలిత్ మోడీ ఆస్తుల విలువ.. ఎన్ని వేల కోట్లంటే?
ఐపీఎల్! వేల కోట్లలో లావాదేవీలు. పరుగు చేస్తే నోటు, బౌండరీ పడితే కట్ట..గెలిస్తే కోటితో వ్యవహారం అది..! కానీ ఓడినా కోట్లు, నోట్లు వస్తాయండోయ్ అదే ఐపీఎల్లో మజా. ఇటువంటి మజాను అందించేలా కార్పొరేట్ క్రికెట్ను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనుడే ఈ లలిత్ మోడీ! కానీ ఐపీఎల్ను తన సొంత అవసరాలకు వాడుకొని అప్రతిష్టను మూటగట్టుకున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. చివరికి పన్ను ఎగవేత, మనీలాండరింగ్లో కేసులో దేశం విడిచి పారిపోయిన లలిత్ మోడీ 2010 నుంచి లండన్లో ఉంటున్నారు. ఎప్పుడూ వివాదాలు, కొత్త సంచలనాలను వెంట పెట్టుకొని తిరిగే లలిత్ మోడీకి ఆయన తల్లి బీనా మోడీ, ఇతర కుటుంబసభ్యులకు మధ్య ఆస్తి వివాదం కొనసాగుతోంది. ఈ వివాదంలో బీనా మోడీ తరుపు వాదిస్తున్న సీనియర్ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీపై నోరు జారారు. సుప్రీం కోర్ట్ చివాట్లు పెట్టడంతో వెనక్కి తగ్గారు. ఈ తరుణంలో లలిత్ మోడీ ఎక్కడ ఉంటున్నారు? బిజినెస్లు ఏమైనా చేస్తున్నారా? చేస్తుంటే ఆయనకి ఎంత ఆస్తి ఉంది? అని నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు. (ఓర్నీ వయ్యారం..ఇదేమి ట్రైన్ భయ్యా! ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న వీడియో) ఐపీఎల్ కుంభకోణం వెలుగులోకి రావడంతో లలిత్ మోడీని బీసీసీఐ నిషేధించింది. కేసులు, విచారణనుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోయినా అక్కడ కూడా దర్జాగా బతికేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మీడియా ఎప్పుడు ఆయనను పలికరించినా నేను గోల్డెన్ స్పూన్తో పుట్టానని చెప్పుకునే లలిత్.. క్రికెట్ను వదిలేసినా ఇతర వ్యాపార వ్యవహారాల్ని చక్క బెట్టుకుంటున్నారు. (ముంబై ఇండియన్స్ బాస్ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన) లలిత్ మోడీ తన కెరీర్లో భారీ ఆస్తులే కూడబెట్టారు. పరారీలో ఉన్నప్పటికీ తన తండ్రికి చెందిన మోడీ ఎంటర్ప్రైజెస్కు అధిపతిగా కొనసాగుతున్నారు. సిగరెట్ తయారీ, విద్య, వ్యవసాయం,ఎంటర్టైన్మెంట్ ఇలా అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న మోడీ ఎంటర్ప్రైజెస్కు అధ్యక్షుడు కూడా. పలు నివేదికల ప్రకారం, 2021లో మోడీ కంపెనీ టర్నోవర్ రూ.1750 కోట్లు. నెలవారీ ఆదాయం దాదాపు రూ.16.5 కోట్లు కాగా, ఆయన వ్యక్తిగత ఆస్తులలో లండన్లో 5 అంతస్తుల విలాసవంతమైన ఇల్లు, రూ.12,000 కోట్ల భారీ వ్యాపారం, అనేక లగ్జరీ కార్లు ఉన్నాయని సమాచారం. 2023 నాటికి, భారత్లో అతని నికర ఆస్తుల విలువ రూ. 4555 కోట్లకు పైగా ఉందని సమాచారం. చదవండి👉 ‘మమ్మల్ని ఆదుకోండి సార్’.. రతన్ టాటాకు చేరిన పైలెట్ల పంచాయితీ! -
రాహుల్ గాంధీని కోర్టుకు ఈడుస్తా.. కాంగ్రెస్ నేతపై లలిత్ మోదీ ఫైర్..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ. ఆయనపై లండన్ కోర్టులో కేసు పెడతానని చెప్పారు. మోదీ ఇంటిపేరుపై రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో సూరత్ కోర్టు ఆయనను దోషిగా తేల్చి రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. దేశంలోని దొంగల ఇంటిపేరు మోదీనే అని ఎందుకు ఉందని రాహుల్ 2019 ఎన్నికల సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే తాను ఇప్పటివరకు ఏ కేసులోనూ దోషిగా తేలలేదని, అలాంటప్పుడు దేశం వీడిపోయిన ఆర్థిక నేరగాడు అని ఎలా అంటారని లలిత్ మోదీ ప్రశ్నించారు. రాహుల్ అనుచరులు, కాంగ్రెస్ నేతలు ఏ ఆధారాలతో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. రాహుల్పై యూకే కోర్టులో కేసు పెడతానని, ఆయన న్యాయస్థానం ముందు హాజరుకావాల్సిందేనని పేర్కొన్నారు. ఈమేరకు లలిత్ మోదీ ట్విట్టర్లో వరుస ట్వీట్లు చేసి రాహుల్, కాంగ్రెస్పై ఫైర్ అయ్యారు. 'పప్పు అనబడే రాహుల్ గాంధీ నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఓ కేసులో దోషిగా తేలారు. నేను మాత్రం గత 15 ఏళ్లలలో ఏ కేసులోనూ దోషిగా తేలలేదు అలాంటప్పుడు నన్ను నేరగాడు అని ఎలా అంటారు. నేనొక సాధారణ వ్యక్తిని. 100 బిలియన్ డాలర్లు విలువ చేసే అతిపెద్ద క్రీడా కార్యక్రమానికి ఆధ్యుడిని.' అని లలిత్ మోదీ ట్వీట్ చేశారు. i see just about every Tom dick and gandhi associates again and again saying i ama fugitive of justice. why ?How?and when was i to date ever convicted of same. unlike #Papu aka @RahulGandhi now an ordinary citizen saying it and it seems one and all oposition leaders have nothing… — Lalit Kumar Modi (@LalitKModi) March 30, 2023 చదవండి: సీబీఐ అప్పుడు నాపై ఎంతో ఒత్తిడి చేసింది: అమిత్ షా -
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీకి తీవ్ర అనారోగ్యం.. ఆస్పత్రిలో చికిత్స
ఐపీఎల్ మాజీ చైర్మెన్ లలిత్ మోదీ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆతడికి కరోనాతో పాటు న్యూమోనియా కూడా సోకింది. ఈ క్రమంలో లండన్లోని ఓ ఆసుపత్రిలో చేరి ఆక్సిజన్ సపోర్ట్పై మోదీ చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. రెండు వారాల్లో రెండు సార్లు కరోనా బారిన పడినట్లు లలిత్ మోదీ తెలిపాడు. అంతేకాకుండా న్యూమోనియా కూడా సోకినట్లు అతడు వెల్లడించాడు. మూడు వారాల పాటు క్వారంటైన్లో ఉన్నట్లు అతడు చెప్పాడు. అదే విధంగా ఆరోగ్యం విషమించడంతో మెక్సికో నుంచి ఇద్దరు వైద్యుల పర్యవేక్షణలో ఎయిర్ అంబులెన్స్ ద్వారా లండన్కు వచ్చి ఆసుపత్రిలో చేరినట్టు అతడు పేర్కొన్నాడు. తనకు ఆసుపత్రికి తరలించడానికి సహాయపడిన వాళ్లందరికీ మోదీ ధన్యవాదాలు తెలియజేశాడు. లలిత్ మోదీ పోస్ట్పై స్పందించిన పలువురు ప్రముఖులు అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చదవండి: చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల బాలుడు.. ఏకంగా 508 పరుగులు బాదిన యష్ -
ఇద్దరు మాజీ బాయ్ఫ్రెండ్స్తో సుష్మితా సేన్ పార్టీ!
మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్, ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ విడిపోయారంటూ బీటౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు సుష్మితా మొన్నటినుంచి తన మాజీ బాయ్ఫ్రెండ్ రోహ్మన్షాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. తాజాగా ఆమె కూతురు రినీ సేన్ బర్త్డే గ్రాండ్గా జరిగింది. ఈ పార్టీకి రోహ్మన్తో పాటు తన మరో మాజీ ప్రియుడు రితిక్ భాసిన్ కూడా వచ్చాడు. ఈ మేరకు పలు ఫొటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా వదిలింది. 'సెప్టెంబర్ 4న నా ఫస్ట్ లవ్ రినీ సేన్ 23వ పుట్టినరోజు జరుపుకుంది. నా కుటుంబసభ్యులు, రినీ ఫ్రెండ్స్తో రాత్రి పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేశాం. రినీ బర్త్డేను ఇంత అద్భుతంగా సెలబ్రేట్ చేసిన రితిక్కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఐ లవ్యూ గయ్స్' అని రాసుకొచ్చింది. సుష్మిత కూతురు పుట్టినరోజున లలిత్ రాలేదు, కానీ ఆమె మాజీ బాయ్ఫ్రెండ్స్ రావడం ఏంటో? వారితో పార్టీ చేసుకోవడమేంటో అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) చదవండి: బిగ్బాస్ 6: నామినేషన్స్లో ఉన్నది వీళ్లే! ఐశ్వర్యపై నెటిజన్ల ప్రశంసలు -
మాజీ బాయ్ప్రెండ్తో సుష్మితా సేన్ షాపింగ్, వీడియో వైరల్
మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుష్మితా సేన్ వృత్తిపరమైన విషయాలకంటే కూడా వ్యక్తిగత విషయాలతోనే తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీతో లవ్లో పడ్డనాటి నుంచి సుష్మిత ప్రతి కదలిక మీద కన్నేసారు నెటిజన్లు. ఈ క్రమంలో పలుమార్లు తన మాజీ బాయ్ఫ్రెండ్ రోహ్మన్ షాతో షాపింగ్లు, సినిమాలకు వెళ్లడం చూసి ముక్కున వేలేసుకున్నారు. కొందరు మాత్రం బ్రేకప్ తర్వాత ఫ్రెండ్స్గా ఉండకూడదా? ఏంటని సుష్మితను సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ నటి తన కూతురు రినీ సేన్, మాజీ ప్రియుడు రోహ్మన్తో కలిసి షాపింగ్కు వెళ్లింది. ఈ సందర్భంగా కెమెరా కంట పడ్డ ఈ బ్యూటీ రినీ, రోహ్మన్తో కలిసి ఫొటోలను పోజులిచ్చింది. కూతురు అలిషా బర్త్డే కోసం షాపింగ్ చేస్తున్నామని వెల్లడించింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు పలువిధాలుగా స్పందిస్తున్నారు. 'నువ్విలా నీ మాజీతో తిరుగుతుంటే అది చూసిన లలిత్ మోదీ ఏమైపోవాలి?', 'అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు'', 'అబ్బా.. వాళ్లిద్దరూ ఒకప్పుడు లవర్స్, ఇప్పుడు మంచి ఫ్రెండ్స్' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా సుష్మిత రినీ, అలిషా అనే ఇద్దరు కూతుళ్లను దత్తత తీసుకుని పెంచుకుంటోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఆమె ఇటీవలే ఆర్య 2 వెబ్సిరీస్తో కమ్బ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే! View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: టాలీవుడ్లో విషాదం, సీనియర్ హీరో కన్నుమూత విజయ్కు తలపొగరు అన్నాడు, సారీ చెప్పాడు -
సుష్మితా సేన్ లైవ్ వీడియోలో మాజీ బాయ్ఫ్రెండ్.. లలిత్ ఎక్కడ?
Sushmita Sen Parties With Her Ex Boyfriend Rohman Shawl: గత కొద్ది రోజులుగా మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ వార్తల్లో ప్రధానంగా నిలుస్తూ వస్తోంది. సుష్మితా సేన్ తనతో డేటింగ్లో ఉందని వ్యాపారవేత్త, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ జులై 14న సాయంత్రం సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. లలిత్తో సుష్మితా డేటింగ్ చేయడాన్ని పలువురు విమర్శిస్తే, కొంతమంది ఆమెకు మద్దుతుగా నిలిచారు. ఇదిలా ఉంటే వారు డేటింగ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసినప్పటి నుంచి వీరిద్దరూ ఏం చేసిన హాట్ టాపిక్గా మారింది. అయితే తాజాగా లలిత్ మోది ఎక్కడా అంటూ సుష్మితా సేన్పై ప్రశ్నల వర్షం కురింపించారు నెటిజన్లు. సుష్మితా సేన్ తల్లి సుభ్రా సేన్ ఆగస్టు 8న పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన ఇన్స్టాగ్రామ్లో లైవ్ వీడియోను పోస్ట్ చేసింది సుష్మితా సేన్. ఈ వీడియోలో సుష్మితా సేన్ ఎక్స్ బాయ్ఫ్రెండ్ రోహ్మాన్ షా దర్శనమిచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు 'లలిత్ ఎక్కడ?', 'ఎక్కడ మోది?' అంటూ ప్రశ్నించారు. ఈ వీడియోలో సుష్మితా కూతుళ్లతో మాట్లాడుతూ కనిపించాడు రోహ్మాన్ షా. అలాగే సుష్మితా సేన్ లైవ్లో కనిపించమని అందరిని కోరినప్పుడు రోహ్మాన్ మాత్రం దూరంగా ఉండటాన్ని గమనించవచ్చు. కాగా తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్ రోహ్మన్ షాతో సుష్మితా సేన్ మూడేళ్లు డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Nikhil Rao (@bg0260) View this post on Instagram A post shared by Lalit Modi (@lalitkmodi) -
సుష్మితను బతకనివ్వండి.. ట్రోలర్స్కు డైరెక్టర్ కౌంటర్
పక్కింటి పుల్లకూర రుచి అన్న సామెత తెలిసిందే కదా! పక్కింట్లోని వంటలే కాదు, వారి జీవితాల్లో తొంగి చూడటం కూడా సర్వసాధారణమైపోయింది ఈ రోజుల్లో! మరీ ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల్లో కూడా సాధారణ జనాల జోక్యం ఎక్కువైపోయిందీ రోజుల్లో.. వారు ఏం చేసినా తప్పుపట్టడమే తరువాయి అన్న చందంగా తయారైంది సోషల్ మీడియా. గత కొద్ది రోజులుగా నటి సుష్మితా సేన్, లలిత్ మోదీల ప్రేమ గురించైతే ఎన్ని పోస్టులు, మీమ్స్ వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె నిర్ణయాన్ని విమర్శిస్తూ ఇద్దరినీ తిట్టిపోసినవారే ఎక్కువమంది. అయితే ఈ వైఖరి అంత మంచిది కాదని విమర్శించాడు దర్శకుడు మహేశ్ భట్. అదే సమయంలో సుష్మిత ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. 'ఆమె తనకు నచ్చినట్లుగా బతుకుతోంది. ఎలాంటి కట్టుబాట్లు విధించుకోకుండా స్వేచ్ఛగా జీవిస్తోంది. అంతటి గట్స్ ఆమెకున్నాయి. తనను ఇప్పటికీ అసాధారణమైన వ్యక్తిగానే గుర్తుంచుకున్నాను. తనకు నచ్చినట్లుగా బతుకుతున్న ఆమె గుండె ధైర్యానికి నేను సెల్యూట్ చేయాల్సిందే! ఇంకా ఆమెను వేధించకుండా ఆమె బతుకేదో ఆమెను బతకనివ్వండి' అని ట్రోలర్స్కు గట్టి కౌంటరిచ్చాడు. గతంలో విక్రమ్ భట్తో నడిపిన ప్రేమాయణం గురించి చెప్తూ.. 'దస్తక్ సినిమా చేద్దామనుకున్నాను. అందుకామె ఓకే చెప్పింది. తర్వాతేం జరిగిందో మీకందరికీ తెలుసు. దస్తక్ షూటింగ్ సమయంలో సుష్మితా సేన్, విక్రమ్ భట్ ప్రేమించుకున్నారు. విక్రమ్ నాకు కుడిభుజంలా ఉండేవాడు. అతడిని ఆధారంగా చేసుకునే నేను నా పని పూర్తి చేసేవాడిని. సెట్స్లో ఆమెతో సరదాగా కలిసిపోయేవాడు. అలా వాళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలైంది' అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు మహేశ్ భట్. చదవండి: గర్ల్ఫ్రెండ్తో సిద్దార్థ్ షికార్లు.. ఫొటోలు తీసినవారికి హీరో వార్నింగ్! క్యాస్టింగ్ కౌచ్ వల్ల పెద్ద పెద్ద ప్రాజెక్టులు వదులుకున్నా.. -
ఇద్దరు వ్యక్తులు ఫ్రెండ్స్గా ఉండకూడదా? పుట్టుకతోనే సంపన్నుడిని.. నన్నే అంటారా?
ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ.. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్తో తాను ప్రేమలో ఉన్నట్లు ప్రకటించి క్రీడా, సినీ వర్గాల్లో హాట్టాపిక్గా మారాడు. సుస్మితను తన భాగస్వామి అని పేర్కొంటూ ఆయన షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు లలిత్ మోదీపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన లలిత్.. ఇప్పుడేమో కాలేజీ కుర్రాడిలా గర్ల్ఫ్రెండ్తో ఉన్నానంటూ ఫొటోలు షేర్ చేస్తున్నాడంటూ విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో సుస్మితతో తన రిలేషన్షిప్పై స్పందించిన లలిత్ మోదీ ఆదివారం ట్విటర్ వేదికగా విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. అదే విధంగా తన భార్య మినాల్ గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారంటూ మండిపడ్డాడు. మధ్య యుగ కాలంలో ఉన్నామా? ఈ సందర్భంగా సుస్మితా సేన్, తన దివంగత భార్య మినాల్ మోదీ, కూతురు అలియా మోదీలతో పాటు నెల్సన్ మండేలా, దలైలామా, భారత ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా తదితర ప్రముఖులతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ కౌంటర్ ఇచ్చాడు. ఈ మేరకు.. ‘‘మనమింకా మధ్య యుగం కాలంలోనే నివసిస్తున్నామా? ఇద్దరు వ్యక్తులు స్నేహితులుగా ఉండకూడదా? ఒకవేళ వారి మధ్య కెమిస్ట్రీ కుదిరి కాలం కలిసి వస్తే.. అద్భుతం జరుగుతుంది కదా!.. నాదొక సలహా మీరు సంతోషంగా జీవించండి.. ఇతరులను కూడా వాళ్ల బతుకు వారిని బతకనివ్వండి. ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలుసుకుని వార్తలు రాయండి.. డొనాల్డ్ ట్రంప్ లాగా నకిలీ వార్తలు వ్యాప్తి చేయకండి’’ అంటూ మీడియాపై కూడా విరుచుకుపడ్డాడు. ఇక తన భార్య మినాల్ మోదీ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ప్రియమైన నా భార్య, దివంగత మినాల్ మోదీ.. మా పెళ్లి కంటే 12 ఏళ్ల ముందు నుంచి నాకు బెస్ట్ ఫ్రెండ్.. అందరూ అనుకుంటున్నట్లుగా తను మా అమ్మ స్నేహితురాలు కాదు. కొంతమంది వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి చెత్త వార్తలు రాస్తున్నారు. మెదడు తక్కువ పనులు చేయొద్దు. ఎవరైనా ఓ వ్యక్తి తన దేశం కోసం.. లేదంటే వ్యక్తిగత జీవితంలో ఏదైనా సాధిస్తే ఎంజాయ్ చేయండి. మీ అందరి కంటే నేను బెటర్.. మీకంటే గొప్పగా తలెత్తుకుని తిరిగే అర్హత నాకుంది’’ అంటూ లలిత్ మోదీ సుదీర్ఘ నోట్ షేర్ చేశాడు. అదే విధంగా తనను ఆర్థిక నేరగాడు అని పిలిస్తే పట్టించుకోనన్న లలిత్ మోదీ.. తాను డైమండ్స్పూన్తో పుట్టానని.. పుట్టుకతోనే సంపన్నుడినని పేర్కొన్నాడు. తన వల్లే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పుట్టుకొచ్చిందని.. దేశానికి తాను ఓ గొప్ప బహుమతి ఇచ్చానని చెప్పుకొచ్చాడు. కాగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ ప్రస్తుతం లండన్లో తలదాచుకుంటున్నాడు. ఇక సుస్మిత సేన్తో మాల్దీవుల్లో లలిత్ ఫొటోలు షేర్ చేస్తూ బెటర్ పార్ట్నర్ అనడంతో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. తాము ప్రేమలో ఉన్నామే తప్ప పెళ్లి చేసుకోలేదని వెల్లడించారు. కాగా సుస్మిత సైతం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికపుడు తన అప్డేట్లు పంచుకుంటుందన్న సంగతి తెలిసిందే. చదవండి: Lalit Modi- Sushmita Sen: తనకంటే తొమ్మిదేళ్లు పెద్దది.. మినాల్ను పెళ్లాడేందుకు లలిత్ ఫైట్! చివరికి ఇలా! Too long to write so I put it on a picture slide. For those who don’t have instagram 🙏🏾 pic.twitter.com/v2sXCvyacn — Lalit Kumar Modi (@LalitKModi) July 17, 2022 View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
తనకంటే తొమ్మిదేళ్లు పెద్దదైన మినాల్ను పెళ్లాడేందుకు లలిత్ ఫైట్.. ఇప్పుడు ఇలా!
Lalit Modi Love Story With Minal: లలిత్ కుమార్ మోదీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సృష్టికర్తగా పేరు ప్రఖ్యాతులు పొందాడు. సినీ సెలబ్రిటీలు, కార్పొరేట్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించి.. ప్రపంచ క్రికెటర్లందినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి క్యాష్ రిచ్ లీగ్ను సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టీ20 లీగ్లు ఉన్నా ఐపీఎల్ విజయవంతం కావడంలో లలిత్ మోదీదే కీలకపాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన లలిత్ మోదీ.. ఒకప్పుడు ప్రపంచంలోని వంద శక్తిమంతుల జాబితాలో కూడా స్థానం సంపాదించడం విశేషం. అయితే, ఎంత వేగంగా కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్నాడో అదే తరహాలో పాతాళానికి దిగజారిపోయాడు. ఆర్థిక అవకతవకలకు పాల్పడి దేశం నుంచి పారిపోయాడు. ప్రస్తుతం ఆయన లండన్లో తలదాచుకుంటున్నాడు. మాజీ విశ్వసుందరితో ప్రేమాయణం! ఇక ఇన్నాళ్లూ పెద్దగా లైమ్లైట్లో లేని 58 ఏళ్ల లలిత్ మోదీ.. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్తో డేటింగ్ అంటూ ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారాడు. ఆమెతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేస్తూ బెటర్ పార్ట్నర్ అంటూ చర్చకు తెరలేపాడు. PC: lalit modi Instagram ఈ క్రమంలో వీళ్లిద్దరి పెళ్లి అయి పోయిందని నెటిజన్లు ఫిక్సైపోగా అలాంటిదేమీ లేదని సుస్మిత, లలిత్ ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రేమలో మునిగితేలుతున్నామని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. కాగా 46 ఏళ్ల సుస్మితాసేన్ ఇప్పటికే ఎంతో మందితో డేటింగ్ చేసింది. సుస్మిత రూటు సెపరేటు! స్థాయి.. వయసుతో సంబంధం లేకుండా తన కంటే చిన్నవాళ్లూ, పెద్దవాళ్లతోనూ ప్రణయ బంధం కొనసాగించింది సుస్మిత. కానీ ఎవ్వరికీ తనను వివాహం చేసుకునే అవకాశం ఇవ్వలేదు. స్వేచ్ఛాయుత జీవనం గడపడానికే ఆమె ప్రాధాన్యం ఇచ్చింది. ప్రస్తుతం లలిత్తో ప్రేమ వ్యవహారం కూడా అలాంటిదేనా.. లేదంటే పెళ్లిదాకా వెళ్తారా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది. PC: lalit modi Instagram కాగా సుస్మిత ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుని తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఇక లలిత్తో సుస్మిత పరిచయం ఈనాటిది కాదు. లలిత్ మోదీ దివంగత భార్య మినాల్ మోదీకి కూడా ఆమె ఫ్రెండ్ కావడం విశేషం. వీళ్లు ముగ్గురూ కలిసి ఐపీఎల్ మ్యాచ్లు వీక్షించేవారట. ఇంతకీ మినాల్ ఎవరు? మినాల్ సంగ్రాణి నైజీరియాకు చెందిన సింధీ హిందూ వ్యాపారవేత్త పెసూ అస్వాని కుమార్తె. లలిత్ మోదీతో స్నేహానికి కంటే ముందే ఆమెకు వివాహమైంది. వ్యాపారవేత్త జాక్ సాంగ్రాణిని ఆమె పెళ్లాడింది. వారికి కూతురు సంతానం. అయితే, జాక్ ఓ స్కామ్లో ఇరుక్కోవడంతో జైలుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొన్నాళ్ల తర్వాత ఈ జంట విడాకులు తీసుకుంది. PC: lalit modi Instagram లలిత్ కంటే తొమ్మిదేళ్లు పెద్ద! భర్తకు విడాకులిచ్చిన మినాల్తో ప్రేమలో పడ్డ లలిత్ మోదీ ఆమెను పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. అయితే, మోదీ కుటుంబం ఇందుకు అంగీకరించలేదు. ఆమె డివోర్సీ కావడం ఒక అభ్యంతరమైతే.. లలిత్ కంటే మినాల్ వయసులో దాదాపు తొమ్మిదేళ్లు పెద్దది కావడం మరో కారణం. కుటుంబాన్ని ఎదిరించి! అయినా, అతడు ఆమె చేయిని వీడలేదు. కుటుంబంతో విభేదించాడు. 1991లో మినాల్ను పెళ్లిచేసుకున్నాడు. దీంతో తన ఫ్యామిలీకి దూరమయ్యాడు. తమను అందరూ దూరం పెట్టడంతో ఢిల్లీ నుంచి ముంబైకి మకాం మార్చాడు. ఎంతో అన్యోన్యంగా ఉండే లలిత్- మినాల్లకు ఇద్దరు సంతానం. PC: lalit modi Instagram కొడుకు రుచిర్, కూతురు అలియా ఉంది. వీరితో పాటు మినాల్ మొదటి కూతురు కరిమా సంగ్రాణిని కూడా చేరదీశాడని జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. కాగా క్యాన్సర్ బారిన పడ్డ మినాల్ ఆఖరి వరకు వ్యాధితో పోరాడి 64 ఏళ్ల వయస్సులో 2018లో కన్నుమూశారు. అప్పటి నుంచి ఒంటరి జీవితం గడుపుతున్న లలిత్ మోదీ సుస్మితతో ప్రేమాయణంతో అటు క్రీడా, ఇటు సినీ వర్గాల్లో మరోసారి హాట్ టాపిక్గా మారాడు. చదవండి: Ire Vs NZ 3rd ODI: మొన్న టీమిండియాను.. ఇప్పుడు న్యూజిలాండ్ను వణికించారు! వరుస సెంచరీలతో.. Ind Vs Eng 2nd ODI: తప్పంతా వాళ్లదే.. అందుకే భారీ మూల్యం.. మైండ్సెట్ మారాలి! మూడో వన్డేలో గనుక ఓడితే.. -
లేటు వయసులో ఘాటు ప్రేమ.. 9 ఏళ్లకు సుష్మిత రిప్లై?!
ప్రేమ పుట్టడాని ఒక్క క్షణం చాలు.. అన్న మాటకు ప్రత్యక్ష నిదర్శనంలా మారారు ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ, మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్. వీరి మధ్య ఉన్న పరిచయం కొత్తేమీ కాదు. ఎన్నో ఏళ్ల కిందటే ఒకరికొకరు తెలుసు. కానీ ఉన్నట్టుండి సడన్గా లవ్లో జారి పడ్డారు. ఒక్కరోజులోనే డేటింగ్ మొదలు పెట్టారు. పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అంటూ ఫొటోలు వదిలారు. ఇది చూసి సోషల్ మీడియా యూజర్స్ విస్తుపోయారు. వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారా? త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారా? అంటూ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే కలిసి జీవితాన్ని పంచుకోబోతున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో లలిత్ మోదీ గతంలో చేసిన ట్వీట్ ఒకటి వైరల్గా మారింది. 2013లో లలిత్ మోదీ.. సుష్మితతో చాట్ చేసిన స్క్రీన్షాట్ను ట్విటర్లో షేర్ చేశాడు. ఇందులో మోదీ.. 'ఓకే ఐ కమిట్' అంటుంటే సుష్మిత మాత్రం.. 'మీరు చాలా మంచివారు. హామీలను నిలబెట్టుకోలేకపోవచ్చేమోగానీ కమిట్మెంట్లను మాత్రం గౌరవించాల్సిందే' అని రిప్లై ఇచ్చింది. మరో ట్వీట్లో సుష్మితను ట్విటర్లో కాకుండా ఎస్ఎమ్ఎస్ ద్వారా రిప్లై ఇవ్వమన్నాడు లలిత్. ఈ ట్వీట్ కాస్తా ఇప్పుడు వైరల్ కావడంతో నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. '9 ఏళ్లకు సుష్మిత కనికరించింది', 'లేటు వయసులో ఘాటు ప్రేమ', 'మోదీ గట్టిగానే ట్రై చేసినట్లున్నాడే', 'ఓపిక, పట్టుదల, కృషితో లలిత్ మోదీ విజయం సాధించాడు' అంటూ జోకులు పేలుస్తున్నారు. కాగా లలిత్ మోదీ 1991లో మినాల్ మోదీని పెళ్లాడాడు. క్యాన్సర్ కారణంగా మినాల్ 2018 డిసెంబర్ 10న మరణించింది. మనీలాండరింగ్ కేసులో భారత్ నుంచి పారిపోయిన లలిత్ మోదీ 2010 నుంచి లండన్లో నివసిస్తున్నాడు. Okay I commit 😋😋"@thesushmitasen: @LalitKModi u r too kind:)) however, promises are meant to be (cont) pic.twitter.com/JrgEwC1btR — Lalit Kumar Modi (@LalitKModi) April 27, 2013 @thesushmitasen reply my SMS — Lalit Kumar Modi (@LalitKModi) April 27, 2013 Just back in london after a whirling global tour #maldives # sardinia with the families - not to mention my #better looking partner @sushmitasen47 - a new beginning a new life finally. Over the moon. 🥰😘😍😍🥰💕💞💖💘💓. In love does not mean marriage YET. BUT ONE THAT For sure pic.twitter.com/WL8Hab3P6V — Lalit Kumar Modi (@LalitKModi) July 14, 2022 చదవండి: లలిత్ మోదీతో డేటింగ్పై స్పందించిన సుష్మితా సేన్ నన్ను పెళ్లి చేసుకుంటే నా ప్రియుడి చెల్లికి పెళ్లవదా? -
ఇంక ఆపుతారా? మాకింకా పెళ్లవలేదు: సుష్మితా సేన్
మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్, మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీ లవ్లో ఉన్నామంటూ ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేశారు. అది కూడా ఒక్కరోజులోనే తమ మధ్య ప్రేమ చిగురించిందని, ప్రస్తుతం డేటింగ్లో ఉన్నప్పటికీ త్వరలో పెళ్లి కూడా చేసుకుంటామని సోషల్ మీడియా వేదికగా వారి మధ్య ఉన్న రిలేషన్ను బయటపెట్టాడు లలిత్ మోదీ. అయితే సుష్మితతో కొత్త జీవితం ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ ఆమెను భాగస్వామిగా పేర్కొన్నాడు. దీంతో అయోమయానికి లోనైన నెటిజన్లు ఆల్రెడీ వీళ్లు పెళ్లి చేసుకున్నారనుకుని శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో లలిత్ మోదీ తమకింకా పెళ్లవలేదని ట్వీట్తో క్లారిటీ ఇచ్చాడు. తాజాగా సుష్మితా సేన్ సైతం ఈ విషయంపై స్పందించింది. 'ప్రస్తుతం నేను నాకు నచ్చిన ప్రదేశంలో సంతోషంగా ఉన్నాను. ఇంకా ఉంగరాలు మార్చుకోలేదు, పెళ్లి అవలేదు. కేవలం ప్రేమలో మునిగి తేలుతున్నా.. ఈ వివరణ సరిపోతుందనుకుంటా.. ఇక నా పని నేను చూసుకుంటా.. నా సంతోషాన్ని పంచుకునేవారికి థ్యాంక్యూ.. ఎవరైతే పంచుకోరో.. వారికి నా గురించి అవసరం లేదు.. ఏదేమైనా లవ్ యూ గయ్స్..' అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) చదవండి: నేనేమైనా ఉగ్రవాదినా? పెళ్లి చేసుకోకూడదా? మాజీ ఐపీఎల్ చైర్మన్తో సుష్మితా సేన్ డేటింగ్ -
లలిత్ మోదీ ప్రేమలో సుస్మితా.. ‘లవ్ ఆఫ్ మై లైఫ్’ అంటూ వీడియో..
మాజీ విశ్వసుందరి, నటి సుస్మితా సేన్, తాను డేటింగ్లో ఉన్నామని మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీ గురువారం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించాడు. వీరిద్దరు మాల్దీవుల్లో షికార్లు చేసిన ఫొటోలు, లండన్లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నా పిక్స్ను లలిత్ మోదీ షేర్ చేశాడు. ఈ సందర్భంగా సుస్మితాను తన బెటర్ హాఫ్(భార్య) అంటూ పరిచయం చేశాడు మోదీ. ఆ తర్వాత ప్రస్తుతం తాము డేటింగ్లో ఉన్నామనీ, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు స్పష్టం చేశాడు. చదవండి: ప్రముఖ నటుడు, నటి రాధిక మాజీ భర్త మృతి దీంతో వీరిద్దరి ప్రేమ వ్యవహరం మీడియాలో, సోషల్ మీడియాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఇప్పటి వరకు సుస్మితా దీనిపై స్పందించలేదు. ఈ క్రమంలో మాల్దీవ్స్లోని స్వీమ్మింగ్ ఫూల్లో ఆమె ఒక్కతే ఎంజాయ్ చేస్తున్న వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దీనికి బ్యాగ్రౌండ్లో ‘ఐ వాంట్ యు టూ నో.. యూ ఆర్ ద లవ్ ఆఫ్ మై లైఫ్’ అనే ఇంగ్లిష్ సాంగ్ను జత చేసింది. కాగా సుస్మితా గతంలో తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్ రోహ్మన్ షాతో మూడేళ్లు డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: నెలకు రూ. 25 లక్షలు ఇస్తాను, భార్యగా ఉండమన్నాడు మూడోసారి ప్రేమలో పడ్డ సుష్మితా సేన్, ప్రియుడు ఎవరో తెలుసా? View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) View this post on Instagram A post shared by Lalit Modi (@lalitkmodi) -
మూడోసారి ప్రేమలో పడ్డ సుష్మితా సేన్, ప్రియుడు ఎవరో తెలుసా?
మాజీ విశ్వసుందరి, నటి సుష్మితా సేన్ మరోసారి ప్రేమలో పడింది. మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీతో డేటింగ్ చేస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు లలిత్. సుష్మితను తన భాగస్వామిగా పరిచయం చేస్తూ వీరిద్దరూ కలిసి ఉన్న పలు ఫొటోలను షేర్ చేశాడు. 'మాల్దీవుల్లో షికార్లు కొట్టాక లండన్లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నా. నా జీవిత భాగస్వామి సుష్మిత సేన్తో కొత్త జీవితం ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని రాసుకొచ్చాడు. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారేమోననుకున్న నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేశారు. కాసేపటికే లలిత్ మోదీ తమ పెళ్లి గురించి క్లారిటీ ఇస్తూ.. 'ప్రస్తుతానికి తామింకా డేటింగ్లోనే ఉన్నామని, ఒక్కరోజులోనే ఒకరితో ఒకరం ప్రేమలో పడిపోయాం' అని చెప్పుకొచ్చాడు. కాగా సుష్మితా సేన్ మొదట్లో పాక్ క్రికెటర్ వసీమ్ అక్రమ్తో ప్రేమాయణం నడిపింది. వీరిద్దరూ సహజీవనమూ మొదలుపెట్టారు. కానీ క్షణం తీరికలేని సుష్మితా షెడ్యూల్ వల్ల వసీమ్ తీవ్రమైన అభద్రతకు లోనయ్యాడట. అంతేకాదు ఆ అభద్రత అతనిలో ఆమె పట్ల అనుమానాలను రేకెత్తించి.. సుష్మితాను చిరాకు పరచే వరకు వెళ్లింది. దాంతో ఆ అనుబంధం పెళ్లి దాకా వెళ్లకుండానే బ్రేక్ అయింది. కొన్నాళ్ల తర్వాత.. సుష్మితా సేన్ ప్రముఖ మోడల్ రోహ్మన్తో ప్రేమలో పడింది. కానీ అది కూడా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. Just back in london after a whirling global tour #maldives # sardinia with the families - not to mention my #betterhalf @sushmitasen47 - a new beginning a new life finally. Over the moon. 🥰😘😍😍🥰💕💞💖💘💓 pic.twitter.com/Vvks5afTfz — Lalit Kumar Modi (@LalitKModi) July 14, 2022 Just for clarity. Not married - just dating each other. That too it will happen one day. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾 pic.twitter.com/Rx6ze6lrhE — Lalit Kumar Modi (@LalitKModi) July 14, 2022 View this post on Instagram A post shared by Lalit Modi (@lalitkmodi) చదవండి: గ్లామర్ తప్ప యాక్టింగ్ రాదంటూ టార్చర్ పెట్టారు -
ఐపీఎల్ వ్యవస్థాపకుడి బయోపిక్ను తెరకెక్కించనున్న బాలయ్య నిర్మాత
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు లలిత్ మోడీ జీవితంపై స్పోర్ట్స్ జర్నలిస్ట్ బోరియా మజుందార్ 'మవెరిక్ కమిషనర్' ద ఐపీఎల్- లలిత్ మోడీ సాగా అనే పుస్తకాన్ని రచించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే పుస్తకం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. బాలయ్య సినిమాల సహా నిర్మాత ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించిన విష్ణువర్ధన్ ఇందూరి లలిత్ మోడీ బయోపిక్ను తెరకెక్కించనున్నట్లు ప్రకటించాడు. Winning the 83 World Cup was the tip of the iceberg. The book "Maverick Commissioner" by sports journalist @BoriaMajumdar is a fascinating account of the IPL and the Man behind it Lalit Modi. Elated to announce that we are adapting this book into a feature film. @SimonSchusterIN pic.twitter.com/tLEGGCkkxn — Vishnu Vardhan Induri (@vishinduri) April 18, 2022 విష్ణువర్ధన్ ఇందూరి.. తమిళనాడు ముఖ్యమంత్రి, దివంగత జయలలిత జీవితంపై తలైవీ అనే చిత్రాన్ని నిర్మించాడు. అలాగే స్పోర్ట్స్ డ్రామా 83 సినిమాకు కూడా ఆయనే నిర్మాతగా వ్యవహరించాడు. ఐపీఎల్ ప్రారంభమై నేటికి 15 సంవత్సరాలు (ఏప్రిల్ 18, 2008) అయిన సందర్భంగా విష్ణువర్ధన్ ఇందూరి లలిత్ మోడీ బయోపిక్ ప్రాజెక్ట్ను ప్రకటించాడు. ఈ బయోపిక్కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: ఉమ్రాన్ మాలిక్ స్పీడ్కు ఫిదా అయిన కేటీఆర్ -
ఆర్థిక నేరగాళ్లకు లండన్ స్వర్గధామం ఎలా ?
లండన్: విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, లలిత్ మోదీ, సంజయ్ భండారీ.. భారత్ బ్యాంకులకు కోట్లాది రూపాయలకు కుచ్చుటోపి పెట్టి బ్రిటన్కు పరారైన ఆర్థిక నేరగాళ్లలో వీరు కొందరు. మన దేశంలో నేరం చేసిన వారందరూ బ్రిటన్కే ఎందుకు ఉడాయిస్తున్నారు ? ఆర్థిక నేరగాళ్లకు లండన్ స్వర్గధామంగా ఎలా మారింది ? ఈ ప్రశ్నలకు జవాబుల్ని లండన్కు చెందిన జర్నలిస్టు దంపతులు డేనిష్ ఖాన్, రుహి ఖాన్లు ఒక పుస్తకం ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ‘ఎస్కేప్డ్ @ ట్రూ స్టోరీస్ ఆఫ్ ఇండియన్ ఫ్యుజిటివ్స్ ఇన్ లండన్’ అన్న పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు. సోమవారం విడుదల కానున్న ఈ పుస్తకంలో 12 కేసుల్ని విస్తృతంగా అధ్యయనం చేసి భారత్ నేరగాళ్లకి లండన్ ఎలా సురక్షితంగా మారిందో వివరించారు. రుణాల ఎగవేత దగ్గర్నుంచి హంతకుల వరకు అన్ని రకాల కేసుల్ని రచయితలు అధ్యయనం చేశారు. కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, భారత్ నావికాదళ మాజీ అధికారి రవి శంకరన్, మ్యుజీషియన్ నదీమ్ సైఫీ వంటి వారి గురించి ఈ పుస్తకంలో రాశారు. ఈ కేసులకు సంబంధించి కోర్టులో జరిగిన వాదోపవాదాలు, భారత్, బ్రిటన్ మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందాలు, బ్రిటన్లో తలదాచుకోవడానికి వచ్చిన వారు ఇచ్చిన వివిధ ఇంటర్వ్యూలు, కొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులు అన్నింటిని విస్తృతంగా పరిశీలించి, అన్నింటినీ క్రోడీకరించి లండన్ ఏ విధంగా భారత్ నేరగాళ్లకు సురక్షితమో పుస్తకంలో చెప్పే ప్రయత్నం చేశామని డేనిష్ ఖాన్ తెలిపారు. ప్రధానంగా నేరస్తుల అప్పగింతకు సంబంధించిన కేసుల విచారణ బ్రిటన్ కోర్టుల్లో నత్తనడకన సాగుతుంది. ఆ ధీమాతోనే నేరస్తులందరూ లండన్కి పారిపోతూ ఉంటారన్న అభిప్రాయాలున్నాయి. భారత్, బ్రిటన్ మధ్య 1992లో నేరస్తుల అప్పగింత ఒప్పందం కుదిరితే ఇప్పటివరకు ఆ దేశం ఇద్దరిని మాత్రమే అప్పగించింది. మిగిలిన కేసులన్నీ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. -
లలిత్మోదీ, ఆయన భార్యకు స్విట్జర్లాండ్ నోటీసులు
న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్మోడీ, ఆయన భార్య మినాల్ మోడీలకు స్విట్జర్లాండ్ నోటీసులు జారీ చేసింది. నల్లధనంపై పోరులో భాగంగా ఈ దంపతుల డిపాజిట్ వివరాలు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం స్విట్జర్లాండ్ను కోరడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. 2010లో దేశం నుంచి లండన్కు పారిపోయిన లలిత్మోడీ ఇప్పటికే మనీల్యాండరింగ్ కేసులను ఎదుర్కొంటున్నారు. భారత ప్రభుత్వం కోరిన సమాచారం విషయంలో తమ స్పందన తెలియజేసేందుకు లలిత్మోడీ దంపతులకు స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ విభాగం పది రోజుల గడువు ఇచ్చింది. -
రాహుల్ను బ్రిటన్ కోర్టుకు లాగుతా : లలిత్ మోదీ
లండన్ : మోదీ పేరున్న వారంతా దొంగలేనంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయనను బ్రిటన్ కోర్టుకు లాగుతానని లలిత్ మోదీ హెచ్చరించారు. లలిత్ మోదీ, నీరవ్ మోదీ, ప్రధాని నరేంద్ర మోదీలను ప్రస్తావిస్తూ దొంగలందరి పేర్లలో మోదీ పేరు ఎందుకుందని, ఇంకా ఎంత మంది ఇలాంటి మోదీలు బయటికొస్తారో మనకు తెలియదని మహారాష్ట్రలో ఇటీవల ఓ ర్యాలీలో రాహుల్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాహుల్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బ్రిటన్లో తాను కోర్టును ఆశ్రయిస్తానని లలిత్ మోదీ ట్వీట్ చేశారు. ఐదు దశాబ్ధాల పాటు భారత్ను రాహుల్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. ఎవరు దొంగో..ఎవరు కాపలాదారో మీరే తేల్చుకోవాలని ప్రజలను కోరారు. ఐపీఎల్ మాజీ ఛైర్మన్గా వ్యవహరించిన లలిత్ మోదీ తనపై మనీల్యాండరింగ్ ఆరోపణలు రావడంతో భారత్ను విడిచిపెట్టి వెళ్లారు. మోదీలందరూ దొంగలని చెబుతున్న రాహుల్ గాంధీపై బ్రిటన్ కోర్టులో తాను కేసు వేస్తానని లలిత్ మోదీ హెచ్చరించారు.మరోవైపు తనపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ సైతం తప్పుపట్టారు. మోదీల పేరున్న వారంతా దొంగలేనంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు బీసీలను అవమానించడమేనని దుయ్యబట్టారు. -
నేరస్తుల గమ్యం.. లండన్
ఐపీఎల్ క్రికెట్ మాజీ సారథి లలిత్ మోదీ.. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అధిపతి విజయ్ మాల్యా.. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. వేలకోట్ల రూపాయల కుంభకోణాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు వీరంతా. వీరందరి గమ్యం మాత్రం బ్రిటన్ దేశమే. వీరే కాకుండా వివిధ దేశాలకు చెందిన రాజకీయ వేత్తలు, అసమ్మతి నాయకులు, ప్రవాసంలో ఉన్న వారికి, సొంత దేశాల్లో ప్రాణ భయాన్ని ఎదుర్కొంటున్న వారికి బ్రిటన్ భద్రంగా తలదాచుకునే గమ్యస్థానంగా నిలుస్తోంది. ఒక్క 2013లో 5,500 మందికి పైగా భారతీయులు బ్రిటన్లో రాజకీయ ఆశ్రయం కోరుకున్నారు. వారికి శరణార్థి హోదా లభించడమే కాకుండా అక్కడ ఐదేళ్ల పాటు ఉండేందుకు అనుమతి లభిస్తుంది. మానవ హక్కులకు ప్రాధాన్యమెక్కువ పటిష్టమైన మానవ హక్కుల పరిరక్షణ చట్టాల కారణంగానే అనేక మంది ఇంగ్లండ్లో ఆశ్రయం పొందేందుకు తహతహలాడుతున్నారు. ప్రపంచంలోనే కట్టుదిట్టమైనదిగా బ్రిటన్ మానవ హక్కుల సంఘం పేరు గడించింది. మానవ హక్కులకు సంబంధించి ఐరోపా దేశాల ఒప్పందంలో బ్రిటన్ భాగస్వామిగా ఉంది. వివిధ దేశాలకు చెందిన రాజకీయవేత్తలు లేదా ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బ్రిటన్ నుంచి సొంత దేశానికి తిప్పి పంపిస్తే.. వారికి మరణశిక్ష పడడమో లేదా వారికి చిత్రహింసలు తప్పవనో భావిస్తే అక్కడి కోర్టులు స్వదేశాలకు పంపేందుకు అంగీకరించవు. రాజకీయ కారణాల వల్ల ఎవరినైనా వెనక్కి పంపించాలని ఆయా దేశాల నుంచి విజ్ఞప్తులు వచ్చినా.. తిరస్కరించే అవకాశాలే ఎక్కువ. ఓ పట్టాన తేలదు... తీవ్రవాద కార్యకలాపాల్లో పాత్ర కారణంగా 2004లో టైగర్ హనీఫ్ను.. అదే ఏడాది కుట్ర, చౌర్యం కేసుల్లో షేక్ సాదిక్ను.. ఫోర్జరీ కేసులో 2009లో రాజ్కుమార్ పటేల్ను.. ఫోర్జరీ, మోసానికి సంబంధించిన కేసుల్లో 2011లో రాజేశ్కుమార్ను.. లైంగికపరమైన నేరాల విషయంలో 2012లో అతుల్సింగ్ను.. బ్యాంకింగ్ రంగ మోసాలపై 2014లో జతీందర్ కుమార్, ఆశారాణి అంగురాల దంపతులను భారత్కు తిప్పి పంపాలని మన కేంద్ర ప్రభుత్వం బ్రిటన్ను కోరింది. ఈ విజ్ఞప్తులన్నీ కూడా అక్కడి కోర్టుల్లో ఇంకా పెండింగ్లోనే ఉండటం గమనార్హం. మోసాలు, అక్రమాలతో దేశానికి ఆర్థికంగా నష్టం కలిగించిన లలిత్మోదీ, విజయ్మాల్యా, నీరవ్ మోదీలను తిప్పి పంపించాలన్న విజ్ఞప్తులపై ఇంకా విచారణ సాగుతూనే ఉంది. వెనక్కొచ్చింది ఒక్కరే.. వివిధ కేసుల్లోని నిందితులు, దోషులను పరస్పరం అప్పగించుకునేలా 1992లో బ్రిటన్–భారత్ల మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పటివరకు కేవలం సమీర్భాయ్ వినూభాయ్ పటేల్ను మాత్రమే బ్రిటన్ భారత్కు తిప్పి పంపింది. గుజరాత్ గోధ్రా ఘటన అనంతరం చోటుచేసుకున్న అల్లర్లలో ప్రమేయముందన్న ఆరోపణలున్న సమీర్భాయ్ను 2016లో అప్పగించింది. భారత అధికారులు జారీ చేసిన రెడ్కార్నర్ నోటీసులపై స్పందించి.. లండన్లో స్కాట్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వివిధ కేసుల్లో బ్రిటన్ నుంచి పారిపోయి భారత్లో తలదాచుకుంటున్న నలుగురిని భారత్ తిప్పి పంపించింది. పలు కేసుల్లో నిందితులైన 57 మందిని భారత్కు అప్పగించాలంటూ చేసిన విజ్ఞప్తులను (ఒకటి మినహా) బ్రిటన్ తోసిపుచ్చింది. అప్పగింత ప్రక్రియ,ఇబ్బందులివీ.. వివిధ కేసుల్లో నిందితులైన వారిని భారత్కు తిప్పి పంపించే విషయంలో బ్రిటన్ న్యాయవ్యవస్థలోని పలు అంశాలు అడ్డంకిగా మారుతున్నాయి. అక్కడి సంక్లిష్టమైన ప్రక్రియ వల్లనే నిందితులను భారత్కు రప్పించడంలో జాప్యం జరుగుతోంది. ఆ అంశాలివీ.. - ఫలానా కేసులో ఫలానా వ్యక్తిని తిప్పిపంపాలంటూ భారత్ పంపించిన విజ్ఞప్తిని ఆమోదించాలా లేదా అన్నది బ్రిటన్ విదేశాంగశాఖ మంత్రి నిర్ణయించాలి. - ఆ నిర్ణయానికి అనుగుణంగా ఆ వ్యక్తి అరెస్ట్కు వారంట్ జారీ చేయాలా వద్దా అన్న దానిపై అక్కడి కోర్టు నిర్ణయిస్తుంది. తర్వాత సంబంధిత వ్యక్తిని అరెస్టు చేసి అక్కడి కోర్టు ఎదుట హాజరుపరుస్తారు. - ముందుగా ప్రాథమిక విచారణ జరుగుతుంది. అనంత రం స్వదేశానికి తిప్పిపంపే అంశంపై విచారణ ఉంటుంది. నిందితుడిని వెనక్కు పంపేందుకు న్యాయస్థానం సానుకూలంగా స్పందిస్తే.. దానిపై ఆదేశాలు ఇవ్వాలా వద్దా అన్న దానిపై విదేశాంగ మంత్రి నిర్ణయించాలి. - ఫలానా వ్యక్తిని తిప్పి పంపాలంటూ భారత్ పంపించిన వారంట్లో పేర్కొన్న అంశాలు, చేసిన నేరం స్వదేశానికి పంపించేంత తీవ్రమైనదా కాదా అన్న దానిపై కేసు విచారణ సందర్భంగా జడ్జి సంతృప్తి చెందాలి. - నిందితుడిని వెనక్కి పంపించడం సరైనదా కాదా అన్న అంశంపై జడ్జి నిర్ణయం తీసుకోవాలి. - తిప్పి పంపించడం వల్ల నిందితుడి మానవ హక్కులకు భంగం వాటిల్లుతుందా అన్నది జడ్జి పరిశీలిస్తారు ఉదాహరణకు ఏదైనా కేసులో ఓ వ్యక్తిని భారత్కు పంపించేందుకు విదేశాంగ మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి హైకోర్టులో సవాల్ చేయవచ్చు. దానిపై హైకోర్టు ఇచ్చే ఆదేశాలపై సుప్రీంను ఆశ్రయించొచ్చు. స్వదేశానికి పంపించే వ్యక్తి మరణశిక్షకు గురయ్యే అవకాశం ఉందంటే మాత్రం వెనక్కి పంపించేందుకు అంగీకరించరు. -
ఐపీఎల్: బీసీసీఐకి భారీ షాక్
సాక్షి, ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి ఎన్ఫోర్స్మెంట్ విభాగం(ఈడీ) షాకిచ్చింది. 2009 ఐపీఎల్ సీజన్ నిర్వాహణకు సంబంధించి బీసీసీఐకి భారీ జరిమానాను విధించింది. బీసీసీఐతోపాటు మాజీ సభ్యులకు కలిపి మొత్తం రూ. 121 కోట్ల జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేసింది. 2009 ఐపీఎల్ సీజన్ను సౌతాఫ్రికాలో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ.. విదేశీ ఖాతా తెరవకుండానే రూ. 243 కోట్లను టోర్నీ నిర్వహణ కోసం బీసీసీఐ సౌతాఫ్రికాకు బదిలీ చేసింది. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) అతిక్రమణ ఆరోపణలతో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేపట్టింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావటంతో భారీ జరిమానాను విధించింది. బీసీసీఐతోపాటు బోర్డు మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్తోపాటు ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ, ఇతరులకు కలిపి ఈడీ రూ.121 కోట్ల జరిమానా విధించింది. బీసీసీఐకు రూ. 82.66 కోట్లు శ్రీనివాసన్కు రూ.11.53 కోట్లు, లలిత్ మోదీకి రూ.10.65 కోట్లు, బోర్డు మాజీ కోశాధికారి పాండవ్కు రూ. 9.72 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ (ఎస్బీఐతో విలీనమైంది)కు రూ.7 కోట్లను జరిమానాగా విధించింది. ఈ జరిమానాను 45రోజుల్లోగా చెల్లించాలంటూ ఈడీ ఆదేశించింది. -
మాల్యాను అప్పగించండి
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి పరారైన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా, ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీని త్వరగా అప్పగించాలని బ్రిటన్కు భారత్ విజ్ఞప్తి చేసింది. అలాగే వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆచూకీ కనుగొనేందుకు సహకరించాలని విన్నవించింది. కశ్మీర్, ఖలిస్తాన్ వేర్పాటువాదులు బ్రిటన్ భూభాగంలో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేందుకు అనుమతించొద్దని కోరింది. బుధవారం ఢిల్లీలో జరిగిన మూడో ఇండో–యూకే హోం అఫైర్స్ సమావేశంలో హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ మేరకు బ్రిటన్కు విజ్ఞప్తి చేసింది. -
ఐ విల్ మిస్ యూ బ్రదర్: లలిత్ మోదీ
లండన్: మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి హిమాన్షు రాయ్ ఆత్మహత్య చేసుకోవడంపై ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న లలిత్ మోదీ.. హిమాన్షు రాయ్ ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీటర్ వేదికగా సంతాపం తెలిపారు. ‘ఐ రియల్లీ మిస్ యూ. నీ ఉద్యోగ ధర్మాన్ని చాలా చక్కగా నిర్వర్తించావు. కానీ నీ ఆత్మహత్యకు కారణాన్ని నేను అర్థం చేసుకోగలను. మా గుండెల్లో ఎప్పుడూ నీవు చిరస్థాయిగా ఉంటావు. ఇకనైనా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో..ఇక నీకు ఏ బాధ ఉండదూ. నీవు ఒక మెరిసే నక్షత్రానివి’ అని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు. శుక్రవారం హిమాన్షు రాయ్ ముంబయిలోని తన నివాసంలో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 1988 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హిమాన్షు రాయ్ ...2013లో సంచలనం సృష్టించిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణలో కీలకంగా వ్యవహరించారు. ఈ కేసులో బాలీవుడ్ నటుడు విందు దారా సింగ్ను అరెస్ట్ చేశారు. వీటితో పాటు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ డ్రైవర్ ఆరీఫ్ కాల్పులు కేసు, జర్నలిస్ట్ జాడే హత్యకేసు, విజయ్ పాలెండే, లైలా ఖాన్ డబుల్ మర్డర్ కేసుల విచారణలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. హిమాన్షు రాయ్ గత కొంతకాలంగా బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు ‘మరాఠీ దినపత్రిక లోక్మఠ్’ పేర్కొంది. అంతేకాకుండా ఆయన డిప్రెషన్లో ఉన్నట్లు తెలుస్తోంది.కాగా, ఏడాదిన్నరగా మెడికల్ లీవ్లో ఉన్న హిమాన్షు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. May you #restinpeace my brother. I Really will miss u. You were doing so well but ...I understand.... you will always be in our heart. Go my brother and now rest. No more Pain. Just Love 😢💔 u were the brightest of the ⭐️ and it was truly a blessing to have u watch over us. 😢 pic.twitter.com/00Bf6GjHms — Lalit Kumar Modi (@LalitKModi) 11 May 2018 -
ఐపీఎల్ ప్లేయర్లు మ్యాచ్కు ఆరున్నర కోట్లు సంపాదిస్తారు
లండన్: భవిష్యత్తులో ఐపీఎల్ ఆడే ఆటగాళ్లు మ్యాచ్కు రూ. 6.5 కోట్లు (మిలియన్ డాలర్లు) సంపాదిస్తారని ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ చెప్పుకొచ్చారు. దశాబ్దం క్రితం మోదీ నేతృత్వంలో రూపొందిన ఈ లీగ్ అచిర కాలంలోనే విశ్వవ్యాప్తమైంది. ఇంటా బయటా ఇప్పుడున్న ఎన్నో లీగ్లకు ఐపీఎలే ప్రేరణ. ఐపీఎల్కు పదేళ్లు పూర్తయిన సందర్భంగా లలిత్ మోదీ స్థానిక దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఐపీఎల్ ఇప్పుడు ఉన్నత శిఖరంలో ఉంది. ప్రపంచంలోనే మేటి క్రికెట్ లీగ్గా ఎదిగింది. ఎంతో మంది ప్రేక్షకుల్ని, స్పాన్సర్లను ఆకట్టుకుంది. ఫ్రాంచైజీ యాజమాన్యాలు బాగా ఆర్జిస్తున్నాయి. భారత్లోని క్రికెట్ క్రేజ్ను క్యాష్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు స్టోక్స్ సీజన్కు రూ. 12 కోట్లు (1.95 మిలియన్స్) సంపాదిస్తున్నాడు. త్వరలో రూ. 72 కోట్లు (12 మిలియన్స్) సంపాదిస్తాడు. క్రికెటర్లు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్లో ఫుట్బాలర్ల ఆదాయాన్ని అందుకోగలరు. ఇది ఇప్పుడు కాకపోయిన సమీప భవిష్యత్తులో సాధ్యమవుతుంది’ అని అన్నారు. లీగ్ల ప్రాచుర్యంతో సంప్రదాయ క్రికెట్కు గడ్డుకాలం తప్పదన్నారు. పెద్ద పెద్ద సిరీస్లే మూడు, నాలుగేళ్లకోసారి జరిగే పరిస్థితి వస్తుందని, ఐసీసీ ప్రాభవం కోల్పోతుందని చెప్పారు. టెస్టు చాంపియన్షిప్ నిర్వహిస్తేనే ఐదు రోజుల ఆట బతుకుతుందని విశ్లేషించారు. -
దర్జా దొంగలు
-
దోపిడీ బ్యాంక్ ఆఫ్ ఇండియా
-
ఐపీఎల్పై బాంబే హైకోర్టు ఫైర్..!
సాక్షి, ముంబై: ఐపీఎల్ పుణ్యమాని ఫిక్సింగ్, బెట్టింగ్లు బాగా ప్రాచుర్యం పొందాయని, మరి ఈ లీగ్తో క్రికెట్ ఆటకు ఒనగూరిన ప్రయోజనమెంటో చూడాలని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడిపై నమోదైన విదేశీ మారక నిల్వల (ఫెమా) కేసు విచారణ సందర్భంగా డివిజన్ బెంచ్లోని న్యాయమూర్తులు జస్టిస్ ధర్మాధికారి, భారతి దంగ్రే వ్యాఖ్యానిస్తూ ‘ఐపీఎల్ను విజయవంతం చేశారు సరే. గడిచిన పదేళ్లలో ఆర్థిక అవకతవకలు, కేసుల కంటే ఈ లీగ్ ఆటకెంత మేలు చేసిందో నిర్వాహకులు సమీక్షించుకోవాలి. ఇప్పటికే ఫిక్సింగ్–బెట్టింగ్లతో ఐపీఎల్ బాగా పాపులర్ అయింది. ఈ నేపథ్యంలో కేంద్రం, రిజర్వ్ బ్యాంక్, ఐపీఎల్ నిర్వాహకులు ఈ లీగ్ క్రికెట్ క్రీడ కోసమా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది’ అని అన్నారు. లలిత్ మోడిపై నమోదైన కేసు దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను తమ మార్గదర్శనంలో చేయాలని ఈడీని ఆదేశించింది. మార్చి 2న మొదలయ్యే ఈ ప్రక్రియను 31లోగా పూర్తి చేయాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది. -
క్రికెట్కు గుడ్బై చెప్పేశాడు!
జైపూర్: ఐపీఎల్ మాజీ చైర్మన్, వివాదాస్పద వ్యాపారవేత్త లలిత మోదీ క్రికెట్తో తన అనుబంధానికి స్వస్తి పలికాడు. రాజస్థాన్లోని నాగౌర్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు మూడు పేజీల లేఖను శుక్రవారం అర్ధరాత్రి రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్కు పంపించాడు. 'రాబోవు తరాలకు అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను. అందుకు క్రికెట్ అడ్మినిస్ట్రేషన్కు గుడ్బై పలుకాలని నిర్ణయించాను' అని మోదీ తన లేఖలో పేర్కొన్నారు. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ ప్రస్తుతం భారత ఏజెన్సీల నుంచి తప్పించుకొని విదేశాల్లో ప్రవాసముంటున్న సంగతి తెలిసిందే. అతనికి వ్యతిరేకంగా అంతర్జాతీయ వారెంట్ జారీ చేయాలంటూ భారత్ ఇంటర్పోల్ను కోరినా.. ఇంటర్పోల్ అందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. నాగౌర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్లో లలిత్ మోదీ ఉండటంతో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ను బీసీసీఐ నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో గత మూడేళ్లలో రాజస్థాన్ ఒక్క ఐపీఎల్ మ్యాచ్గానీ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్గానీ అతిథ్యం ఇవ్వలేకపోయింది. -
మాల్యా, లలిత్లను అప్పగించండి
►బ్రిటన్ ప్రధానిని కోరిన మోదీ ► జీ–20 సదస్సులో భాగంగా థెరిసా మేతో ప్రత్యేక భేటీ ► మలబార్ విన్యాసాలపై జపాన్ ప్రధానితో సమీక్ష ► పలు దేశాధినేతలతో వేర్వేరుగా ద్వైపాక్షిక చర్చలు హాంబర్గ్: భారతదేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి బ్రిటన్లో ఆశ్రయం పొందుతున్న వారిని తిరిగి భారత్కు రప్పించటంలో సహకరించాలని ప్రధాని మోదీ కోరారు. జీ–20 సదస్సులో భాగంగా బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో భేటీ సందర్భంగా మద్యం వ్యాపారి విజయ్ మాల్యా, ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీలను భారత్ రప్పించటంలో సహకరించాలని కోరారు. భారత బ్యాంకుల్లో రూ.9వేలకోట్ల రుణాలు తీసుకుని గతేడాది మార్చిలో మాల్యా లండన్ పారిపోయారు. తనపై జారీ అయిన అరెస్టు వారెంటులనుంచీ తప్పించుకుంటున్నారు. మనీ లాండరింగ్ కేసులో విచారణ జరుగుతున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీనీ అప్పగించాలని థెరిసా మేను మోదీ కోరారు. ఉగ్రవాదంతోపాటుగా పలు ద్వైపాక్షిక అంశాలపైనా వీరి మధ్య చర్చ జరిగింది. జీ–20 సదస్సులో భాగంగా పలుదేశాల అధినేతలతో ప్రత్యేకంగా ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ‘మలబార్’పై సమీక్ష: భారత్–జపాన్ దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్న మలబార్ సైనిక విన్యాసాలపై ఇరుదేశాల ప్రధానులు మోదీ, షింజో అబేలు చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలపైనా వీరిమధ్య చర్చ జరిగింది. జపాన్ సాయం చేస్తున్న ప్రాజెక్టుల పురోగతిపై మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. వాణిజ్యం, పెట్టుబడులపై చర్చలు భారత జాతీయ పెట్టుబడులు, మౌలికవసతుల నిధిలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని నార్వేను మోదీ కోరారు. నార్వే ప్రధాని ఎర్నా సోల్బర్గ్తో జరిగిన భేటీలో మోదీ ఈ ప్రతిపాదన చేశారు. దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ ఇన్, ఇటలీ ప్రధాని పాలో జెంటిలోనీ, అర్జెంటీనా అధ్యక్షుడు మౌరిషి యోతోనూ మోదీ వేర్వేరుగా భేటీ అయ్యారు. వియత్నాం ప్రధాని ఎన్గుయెన్ ఫుక్, సెనెగల్ అధ్యక్షుడు మేకీ సాల్తోనూ మోదీ భేటీ అయ్యారు. మోదీ ‘ఉగ్ర’ ప్రకటనకు భారీ స్పందన జీ–20 సదస్సులో ఉగ్రవాదంపై మోదీ చేసిన ప్రసంగంపై సభ్యదేశాల్లో సానుకూల స్పందన కనిపించిందని భారత్ వెల్లడించింది. జర్మన్ చాన్సెలర్ మెర్కెల్ సహా యూరోపియన్ నేతలు మోదీ అభిప్రాయాలతో ఏకీభవించారని భారత్ తెలిపింది. ఉగ్రవాద సంస్థలతోపాటుగా ఉగ్రవాదులకు ఆశ్రయం, ఆర్థిక సాయం చేస్తున్న వారిపైనా కఠినంగా వ్యవహరించే విషయంలో సంయుక్తంగా ముందుకెళ్లేందుకు మెజారిటీ దేశాలు ముందుకొచ్చాయని ఆయన వెల్లడించారు. జీ–20 సదస్సు పూర్తవటంతో ప్రధాని మోదీ భారత్ తిరుగుప్రయాణమయ్యారు. ‘మాటల్లో చెప్పలేనిది ఫొటో చెబుతుంది’ మోదీ, జిన్పింగ్ చర్చలపై భారత్ హాంబర్గ్: మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో శుక్రవారం బ్రిక్స్ సదస్సు సందర్భంగా జరిపిన అనధికారిక చర్చల వివరాలను వెల్లడించడానికి భారత్ నిరాకరించింది. వారిద్దరూ విస్తృత అంశాలపై చర్చించారని, అంతకుమించి చెప్పలేమని విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే తెలిపారు. మోదీ, జిన్పింగ్ నవ్వుతూ తీయించుకున్న ఫొటో.. ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తత తొలగిందనడానికి నిదర్శనమా అని విలేకర్లు అడగ్గా.. ‘మేం చెప్పాల్సింది చెప్పాం. ఫొటో విషయానికి వస్తే.. వెయ్యిమాటల్లో చెప్పలేనిది ఒక ఫొటో చెబుతుంది అన్న నానుడి ఉండనే ఉంది’ అని బదులిచ్చారు. -
లలిత్ మోదీకి చుక్కెదురు
జైపూర్: విదేశాల్లో ఉంటూనే రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్సీఏ)లో చక్రం తిప్పాలనుకున్న లలిత్ మోదీకి చుక్కెదురైంది. ఆర్సీఏ అధ్యక్షుడిగా పోటీచేసిన లలిత్ తనయుడు రుచిర్ మోదీ ఓటమిపాలయ్యారు. కోర్టు ఆదేశాల ప్రకారం శుక్రవారం వెల్లడైన ఆర్సీఏ ఎన్నికల ఫలితాల్లో.. మోదీ ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన సీపీ జోషి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో జోషి 19 ఓట్లు సాధించగా, రుచిర్ మోదీకి కేవలం 14 ఓట్లు మాత్రమే పొలయ్యాయి. అయితే ఆర్సీఏ కార్యదర్శి, కోశాధికారి పదవులు మాత్రం మోదీ అనునాయులకే దక్కడం గమనార్హం. సెక్రటరీగా రాజేంద్ర నందు, ట్రజరర్గా పింకేశ్జైన్లు ఎన్నికయ్యారు. ఐపీఎల్లో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడిన లలిత్ మోదీ అరెస్ట్ భయంతో కొన్నేళ్ళ కిందటే భారత్ నుంచి పారిపోయిన సంగతి తెలిసిందే. దేశం విడిచివెళ్లే క్రమంలో ఆయనకు పలువురు బీజేపీ నేతలు సహకరించారనే ఆరోపణలున్నాయి. -
ధోనీ జాబ్ వెనక వందల కోట్ల స్కామ్!
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఆఫర్ లెటర్ సోషల్ మీడియలో హల్ చల్ చేస్తోంది. ఇండియా సిమెంట్స్ ఓనర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ తన కంపెనీలో ధోనీకి ఉద్యోగం ఇచ్చిన వివరాలను ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ లీక్ చేశారు. ధోనీ, శ్రీనీకి మధ్య ఎన్నో కాంట్రాక్టులలో సంబంధాలు ఉన్నాయని ఈ జాబ్ వెనక అసలు ఉద్దేశమిదేనని అభిప్రాయపడ్డారు. ఏడాదికి వంద కోట్లు ధోనీకి ముట్టజెప్పడమే ఉద్యోగం ఇవ్వడానికి కారణమని లలిత్ మోడీ ఆరోపించారు. 2012 జూన్లో ధోనీని ఇండియా సిమెంట్స్ కంపెనీ మార్కెటింగ్ విభాగంలో వైస్ ప్రెసిడెంట్గా నియమించినట్లు ఓ ఆఫర్ లెటర్ను మోడీ బయటపెట్టారు. దీని ప్రకారం చూస్తే ధోనీకి నెలకు బేసిక్ పే రూ. 43000, డీఏ రూ. 21,970, స్పెషల్ పే రూ. 20,000, ప్రత్యేక సదుపాయాల కోసం రూ. 60,000 సహా ఓవరాల్గా రూ.100 కోట్లు కంపెనీ అందిచనుంది. ఇండియా సిమెంట్స్లో పనిచేసిన ధోనీ శ్రీనివాసన్ కంపెనీ ఉద్యోగిగా వందల కోట్లు ఆర్జించానని అంగీకరిస్తాడా అని ప్రశ్నించారు. రాజస్థాన్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయనున్న లలిత్ మోడీ కుమారుడు రుచిర్ మోడీ ఈ ఆఫర్ లెటర్పై స్పందించారు. బీసీసీఐలో ఇలాంటివి జరగడంపై షాక్కు గురయ్యానని, చెన్నై సిమెంట్స్ ఉద్యోగిగా ధోనీ ఏడాదికి వందకోట్లు ఆర్జిస్తున్నాడని ట్వీట్ చేశారు. మరోవైపు రెండేళ్ల నిషేధం అనంతరం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఐపీఎల్ 11లో సందడి చేయనున్నాయి. -
మాల్యా తర్వాత.. అరెస్ట్ చేసేది ఆయన్నే
న్యూఢిల్లీ: బ్యాంకులకు దాదాపు 9 వేల కోట్ల రూపాయల బకాయిలను ఎగవేసి విచారణకు హాజరుకాకుండా లండన్లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత్ అభ్యర్థన మేరకు బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేయడంపై పలువురు రాజకీయ నాయకులు స్పందించారు. మాల్యా తర్వాత ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీని అరెస్ట్ చేయవచ్చని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. 'మాల్యాను అరెస్ట్ చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మోదీ ఎప్పుడూ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతారు. మాల్యా జైలుకు వెళ్లే సమయం వచ్చింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ జాబితాలో తర్వాత లలిత్ మోదీ ఉండవచ్చు' అని సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. ఐపీఎల్లో అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ.. ఈడీ విచారణకు హాజరుకాకుండా ఇంగ్లండ్లో తలదాచుకుంటున్నాడు. ఆయన్ను రప్పించేందుకు భారత్ ప్రయత్నించినా సాధ్యంకాలేదు. మాల్యాను అరెస్ట్ చేయడం భారత ప్రభుత్వం, ఆర్థిక శాఖ పెద్ద విజయమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. మాల్యాను భారత్కు రప్పిస్తామని మరో కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ అన్నారు. -
లలిత్ మోదీకి ఊరట
రెడ్ కార్నర్ నోటీసుల జారీకి ఇంటర్పోల్ తిరస్కరణ! న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలన్న భారత్ విన్నపాన్ని ఇంటర్పోల్ తిరస్కరించింది. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరు కాకుండా లండన్లో తలదాచుకుంటున్న లలిత్ మోదీకి ఊరట లభించినట్లైంది. ఐపీఎల్ చైర్మన్ హోదాలో లలిత్ మోదీ అధికార, నిధుల దుర్వినియోగానికి పాల్ప డ్డారంటూ ఆయనపై అభియోగాలు నమో దయ్యాయి. ఈడీ ఆయనపై కేసు నమోదు చేసి విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. లండన్లో ఉంటున్న మోదీ భారత్లో తనకు ప్రాణహాని ఉందని, అందువల్ల విచారణకు రాలేనంటూ తప్పించు కుంటున్నారు. ఈ నేపథ్యంలో లలిత్ను తమకు అప్పగించాల్సిందిగా భారత్ ఇంటర్పోల్ సాయం కోరింది. ఐపీల్ టీ20 క్రికెట్ టోర్నీ–2009 ఓవర్సీస్ టెలీకాస్ట్ హక్కుల కేటాయింపులో అవకతవకలకు పాల్పడ్డా రని లలిత మోదీపై 2010లో అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఫిర్యాదుచేశారు. -
లలిత్ మోదీకి భారీ ఊరట
న్యూఢిల్లీ: ఈడీ విచారణకు హాజరుకాకుండా ఇంగ్లండ్లో తలదాచుకుంటున్న ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి భారీ ఊరట లభించింది. లలిత్ మోదీపై రెడ్ నోటీసు జారీ చేయాలన్న భారత్ విన్నపాన్ని ఇంటర్పోల్ తిరస్కరించింది. మోదీని తమకు అప్పగించాలన్న భారత్ అభ్యర్థన విషయంలో ఇంటర్పోల్ ఆయన్ను అరెస్ట్ చేయదు. ఐపీఎల్ చైర్మన్ హోదాలో లలిత్ మోదీ అధికార, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఈడీ ఆయనపై కేసు నమోదు చేసి విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. లండన్లో ఉంటున్న మోదీ భారత్లో తనకు ప్రాణహాని ఉందని, అందువల్ల విచారణకు రాలేనంటూ తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లలిత్ను తమకు అప్పగించాల్సిందిగా భారత్ ఇంటర్పోల్ సాయం కోరింది. అయితే భారత్ విన్నపాన్ని ఇంటర్పోల్ తిరస్కరించింది. -
అపోలో డేటా హ్యాక్? నెక్ట్స్ లలిత్ మోదీనే!
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, విజయ్ మాల్యా, ప్రముఖ జర్నలిస్టు బర్కా దత్ ల ట్విట్టర్ అకౌంట్లు, ఈ-మెయిళ్ల సర్వర్లు హ్యాక్ చేసిన లెజియన్ హ్యాకర్ల బృందం తాము అపోలో ఆసుపత్రికి చెందిన సర్వర్లను హ్యాక్ చేసినట్లు పేర్కొన్నారు. వాషింగ్టన్ పోస్టుకు ఇచ్చిన ఓ రహస్య ఇంటర్వూలో వారు ఈ విషయాన్ని వెల్లడించారు. అపోలోకు సంబంధించిన కీలక సమాచారం మొత్తం తమ వద్ద ఉందని చెప్పారు. వారికి లభ్యమైన డేటా వివరాలను బయటపెడితే భారతదేశ ప్రజలు ఆందోళనలకు గురయ్యే అవకాశం ఉంటడంతో వాటిని విడుదల చేయడం లేదని తెలిపారు. భారత్ లోని 40 వేల సర్వర్లకు చెందిన గిగాబైట్ల కొద్దీ సమాచారం తమ వద్ద ఉందని చెప్పారు. అంతేకాకుండా భారత రాజకీయ నాయకుల వ్యక్తిగత సమాచారం కూడా తమ ఉందని పేర్కొన్నారు. త్వరలో ఐపీఎల్ మాజీ అధ్యక్షుడు లలిత్ మోదీకి చెందిన వ్యక్తిగత సమాచారాన్ని విడుదల చేయనున్నట్లు చెప్పారు. బీజేపీ ప్రభుత్వానికి సన్నిహితులైన వారి సమాచారాన్ని కూడా హ్యాక్ చేసినట్లు వెల్లడించారు. -
లలిత్ మోదీకి షాక్
ముంబై: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీని యూకే నుంచి భారత్ కు రప్పించడానికి మార్గం సుగమం అయింది. లలిత్ మోదీని భారత్ కు పంపాలని యూకే ప్రభుత్వానికి లేఖ రాయాలని ఈడీ చేసిన అభ్యర్ధనకు కోర్టు అంగీకరించింది. లలిత్ మోదీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయి ఉన్నా ఆయన యూకేలో ఉండటంతో కేసు విచారణకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్నే కోర్టు లో ప్రస్తావించిన ఈడీ తరఫు న్యాయవాది.. మోదీని వెనక్కు పంపాలని యూకే ప్రభుత్వానికి కోర్టు లేఖ రాయాలని కోరారు. విజయ్ మాల్యా విషయంలో కూడా ఈడీ ఇలాంటి ప్రయత్నమే చేయగా అందుకు చట్టపరంగా అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో కోర్టు ద్వారా యూకే ప్రభుత్వానికి లేఖ పంపేదుకు ఈడీ సిద్ధమవుతోంది. -
అనురాగ్ పై లలిత్ మోదీ తీవ్ర వ్యాఖ్యలు
లండన్:ఆర్థిక నేరారోపణలతో దేశం విడిచి పారిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనురాగ్ ఠాకూర్ కు సంబంధించిన క్రికెటింగ్ పత్రాలు నకిలీవంటూ లలిత్ మోడీ విమర్శించారు. అసలు భారత క్రికెట్ లో ఫిక్సర్లు ఎవరైనా ఉన్నారంటే అది బోర్డు అధ్యక్షుడు అనురాగేనని ధ్వజమెత్తారు. లోధా కమిటీ సిఫారుసుల అమలు విషయంలో ఇప్పటికే బీసీసీఐ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంటే లలిత్ మోదీ ఆ అంశాన్ని తన ఆయుధంగా చేసుకుని అనురాగ్ పై విమర్శలు గుప్పించారు. ఒక సెలక్టర్ కావడానికి కేవలం ఒకే రంజీ ట్రోఫీ గేమ్ ఎలా ఆడావో అనే దానిపై సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నావా?అని లలిత్ చమత్కరించారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో అనురాగ్ రియల్ ఫిక్సర్ అయితే, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ఒక మోసగాడంటూ లలిత్ మోదీ విమర్శించారు. -
లలిత్ మోదీ వారసుడొస్తున్నాడు..
జైపూర్: ఐపీఎల్ బహిష్కృత చైర్మన్ లలిత్ మోదీ కుమారుడు రుచిర్ క్రికెట్ రాజకీయాల్లో క్రీయాశీలకం కానున్నాడు. ఇటీవల అల్వార్ జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన 22 ఏళ్ల రుచిర్.. రాజస్థాన్ క్రికెట్ సంఘం (ఆర్సీఏ) అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆర్సీఏ ఎన్నికల్లో గెలిస్తే లలిత్ మోదీ స్థానంలో రుచిర్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతాడు. ప్రస్తుతం ఆర్సీఏ అధ్యక్షుడు లలిత్ మోదీనే. కాగా ఐపీఎల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొన్న లలిత్ మోదీ ఆర్సీఏ అధ్యక్షుడు కావడంపై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆర్సీఏను సస్పెండ్ చేసింది. మోదీ పదవి నుంచి తప్పుకున్న తర్వాతే సస్పెన్షన్ను ఎత్తివేస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. అంతేగాక మూడేళ్లుగా ఆర్సీఏకు అన్ని రకాల నిధులను ఆపివేసింది. ఈ నేపథ్యంలో మోదీ అనుచరులు రుచిర్ను తెరపైకి తీసుకువస్తున్నారు. ఆర్సీఏ అధ్యక్షుడిగా రుచిర్ ఎన్నికైతే బీసీసీఐ సస్పెన్షన్ను తొలగించకతప్పదని మోదీ మద్దతుదారులు భావిస్తున్నారు. లలిత్ మోదీ ప్రస్తుతం ఇంగ్లండ్లో ఉంటున్నాడు. -
లలిత్ మోదీ.. బ్రిటన్ టూ కరీబియన్!
లండన్:ఆర్థిక నేరారోపణలతో భారత్ నుంచి బ్రిటన్కు పారిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మాజీ చైర్మన్ లలిత్ మోదీ చట్టం నుంచి తప్పించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. భారత్ లో అతనిపై ఉచ్చు బిగుసుకోవడంతో బ్రిటన్ నుంచి కరీబియన్కు వెళ్లి అక్కడ పౌరసత్వాన్ని పొందేందుకు యత్నిస్తున్నారు. దీనిలో భాగంగా సెయింట్ లూసియా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ పెట్టుబడుల స్కీమ్ ద్వారా కరీబియన్ పౌరసత్వాన్ని పొందాలని భావిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత తక్కువ మొత్తంలో పన్ను చెల్లించే వెసులుబాటు సెయింట్ లూసియాలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. దాంతో పాటు సెయింట్ లూసియానాలో బ్యాంకింగ్ స్టాండర్డ్స్ అత్యంత గోప్యత కల్గి ఉండటం కూడా అక్కడ పౌరసత్వంపై మోదీ ఆసక్తి కనబరచడానికి మరో కారణం. తన కుటుంబంతో కలిసి సెయింట్ లూసియా పౌరసత్వానికి మోదీ దరఖాస్తు చేసినట్లు జాతీయ మీడియాలో వెలుగు చూసింది. కాగా, వివాదాస్పద లలిత్ మోదీ తమ దేశ పౌరసత్వానికి దరఖాస్తు చేయడంపై సెయింట్ లూసియా ఇంటర్ పోల్ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అతనిపై ఏ విధమైన క్రిమినల్ కేసులు లేవని స్పష్టత వచ్చిన పక్షంలోనే తమ దేశ పౌరసత్వాన్ని ఇవ్వాలని సెయింట్ లూసియా భావిస్తోంది. -
లలిత్ మోదీ, ఆయన భార్యకు నోటీసులు
బెర్న్: భారత విచారణ బృందాలకు సమాచారం అందించే అంశంలో ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ, ఆయన భార్య మినాల్ల నుంచి సమాధానం కోరుతూ స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ విభాగం(ఎఫ్టీఏ) గెజిట్ నోటిఫికేషన్లను జారీచేసింది. దౌత్య సహకారం కోసం సోమవారం జారీ చేసిన ఈ నోటిఫికేషన్లలో ఒకటి లలిత్ మోదీకి, మరొకటి మినాల్ మోదీ అలియాస్ మినాలినీ మోదీకి పంపారు. వీటిపై స్పందించేందుకు వారికి పదిరోజుల గడువునిచ్చారు. స్విట్జర్లాండ్లో వారిద్దరికి సంబంధించిన అధికార ప్రతినిధుల పేర్లను తెలపాలంటూ అందులో కోరారు. మరికొద్ది రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ పర్యటన నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. -
'బీజేపీ మద్దతుతోనే మాల్యాకు ఎంపీ సీటు'
న్యూఢిల్లీ: బ్యాంకులను బురిడీ కొట్టించి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాను స్వదేశానికి రప్పించాలని రాజ్యసభలో విపక్షాలు గట్టిగా డిమాండ్ చేశాయి. ఆర్థిక మోసాలకు పాల్పడిన ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీని స్వదేశానికి తీసుకురావాలని సభలో ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారి జీరో అవర్ లో ఈ అంశాన్ని లేవనెత్తారు. బీజేపీ మద్దతుతోనే మాల్యా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన విషయాన్ని గుర్తు చేశారు. ఈ అంశంపై చర్చకు పట్టుబట్టారు. తర్వాత కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసుకువచ్చి నినాదాలు చేశారు. తివారి ఇచ్చిన నోటీసును రాజ్యసభ చైర్మన్ హమిద్ అన్సారీ తిరస్కరించారని డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ తెలిపారు. ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి నివేదించినట్టు చెప్పారు. అయినా కాంగ్రెస్ సభ్యులు శాంతించలేదు. విజయ్ మాల్యా, లలిత్ మోదీలను స్వదేశానికి రప్పించాల్సిందేనని నినాదాలతో సభను హోరెత్తించారు. దీంతో ప్రశ్నోత్తరాలకు ముందే సభను కొద్ది నిమిషాల పాటు వాయిదా వేశారు. -
సీఎంకు, ఆమె తనయుడికి పెద్ద ఊరట
జైపూర్: ధోల్పూర్ రాజసౌధం వివాదంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కు ఊరట లభించింది. ఈ వివాదంపై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ధోల్పూర్ రాజసౌధం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి అని దీనిపై సీబీఐ విచారణ జరపించాలని దాఖలైన పిటిషన్పై విచారణకు ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ధోల్పూర్, లలిత్ గేట్ వివాదంలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్న ముఖ్యమంత్రికి, ఆమె కుమారుడు దుష్యంత్ కు పెద్ద ఊరట లభించిట్టే. కాగా ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీతో కుమ్మక్కయి దానిని భారీస్థాయి లగ్జరీ హోటల్గా మార్చారన్న కాంగ్రెస్ విమర్శించింది. ఆ సౌధం రాజస్తాన్ ప్రభుత్వ ఆస్తి అని రాజే మాజీ భర్త హేమంత్సింగ్ ఒక కోర్టులో అంగీకరించారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. అయితే దీన్ని ఈ విమర్శలను తిప్పి కొట్టిన బీజేపీ ధోల్ పూర్ ప్యాలెస్ వసుంధరా రాజే కుమారుడు దుష్యంత్ సింగ్ ఆస్తిగా స్పష్టం చేసింది. ఆ ప్యాలెస్ కు చెందిన డాక్యుమెంట్లను, కోర్టు, కుటుంబ సంబంధిత సెటిల్ మెంట్ పేపర్లను బీజేపీ మీడియా ఎదుట ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. -
ఆర్సీఏలోకి మళ్లీ లలిత్ మోడి!
జైపూర్: వివాదాస్పద ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి.. మళ్లీ రాజస్తాన్ క్రికెట్ సంఘం (ఆర్సీఏ) పగ్గాలు చేపట్టనున్నారు. ఈ మేరకు అతనిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని అమిన్ పఠాన్ బుధవారం అధికారికంగా వెనక్కి తీసుకున్నారు. ఈ విషయంపై జస్టిస్ జ్ఞాన్ సుధ మిశ్రా.. ఆర్సీఏ అధికారులతో కలిసి చర్చించారు. ‘క్రికెట్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 15 జిల్లా సంఘాలు, ముగ్గురు ఆఫీస్ బేరర్లు మోడిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇక నిబంధనల ప్రకారం తీర్మానంపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నిబంధనల ప్రకారం ఎన్నికైన మోడి తిరిగి బాధ్యతలు స్వీకరించొచ్చు. ఈ సమావేశానికి అన్ని సంఘాలు, బేరర్లు హాజరయ్యారు. పఠాన్ దరఖాస్తును వెనక్కి తీసుకోవడానికి అందరూ మద్దతిచ్చారు’ అని మిశ్రా పేర్కొన్నారు. గతంలో ఆర్సీఏను తమ ఆధీనంలో తీసుకోవాలని పఠాన్ వర్గం... తీర్మానం సందర్భంగా మోడి గ్రూప్పై రాళ్ల వర్షం కురిపించింది. అయినప్పటికీ 2/3 మెజారిటీని సాధించడంలో విఫలమయ్యారు. -
నవంబర్ 29న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
నవంబర్ 29 హ్యాపీ బర్త్ డే రమ్య (నటి), లలిత్ మోడి (బిజినెస్మేన్), ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. ఇది గురుసంఖ్య కాబట్టి వీరు ఈ సంవత్సరమంతా సుఖ సంతోషాలతో, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. కార్యదక్షులుగా పేరుతెచ్చుకుంటారు. ఉద్యోగులకు మంచి సలహాదారులుగా గుర్తింపు వస్తుంది. సమాజంలో గౌరవం, కుటుంబంలో మీ మాటకు విలువ ఏర్పడతాయి. విద్యార్థులు వారు కోరుకున్న కోర్సులలో సీట్లు పొందుతారు. జ్యోతిష్యులు, న్యూమరాలజిస్టులు, వేదపండితులు గుర్తింపును, పేరు ప్రఖ్యాతులను పొందుతారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. రచయితలు, వక్తలు, సంగీత క ళాకారులకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలూ లభిస్తాయి. పుట్టిన తేదీ 29 ఇది చంద్రుని సంఖ్య కాబట్టి ఈ సంవత్సరం విదేశీ యానం, స్థిరాస్తుల కొనుగోలు లేదా అభివృద్ధి జరుగుతుంది. 29 సంవత్సరాలు దాటిన వారికి మంచి మార్పులు వస్తాయి. అయితే ఇతర కులస్థులతో ప్రేమలో ఉన్న వారికి అంతగా ఫలప్రదంగా ఉండదు కాబట్టి తగిన జాగ్రత్త అవసరం. రాజకీయాలలో ఉన్న వారికి పదవీ యోగం. ఉద్యోగస్థులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. వ్యాపారులకు ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు, సబ్సిడీలు అందుతాయి. లక్కీ నంబర్స్: 1,2,3,6,9; లక్కీ కలర్స్: వైట్, సిల్వర్, క్రీమ్, గోల్డెన్, శాండల్; లక్కీ డేస్: సోమ, గురు, శుక్రవారాలు. సూచనలు: ఈశ్వరునికి రుద్రాభిషేకం, దక్షిణామూర్తి, సాయిబాబా, దత్తాత్రేయుడు వంటి వారిని ఆరాధించడం, పండితులను, మతగురువులను గౌరవించడం, అనాథలను, సోదరులను, తల్లిని ఆదరించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
ఆ మోదీ గురించి ఈ మోదీ ఏం చేస్తారు?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడు రోజుల పర్యటనకు బ్రిటన్ వెళ్లారు. మరి ఆయన కళంకిత క్రికెట్ బాస్ లలిత్ మోదీని భారత్కు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తారా? అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఐఎపీఎల్ అవినీతి వ్యవహారంలో దేశంలో పలు కేసులను ఎదుర్కొంటున్న లలిత్ మోదీ 2010 నుంచి లండన్లో నివసిస్తున్నారు. 'గత విదేశీ పర్యటనల ద్వారా సెల్ఫీలు తీసుకోవడం, బ్రాండ్ మోదీని పెంపొందించుకోవడం తప్ప దేశానికి సాధించింది ఏమీ లేదని విశ్లేషణలు చాటుతున్నాయి' అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సింగ్ సుర్జేవాలా అన్నారు. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీని భారత్కు తిరిగి రప్పించకపోతే.. చిన్న మోదీకి పెద్ద మోదీ సహాయం చేస్తున్నారని దేశ ప్రజలు భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రయాణ పత్రాలు పొందడంలో లలిత్ మోదీకి విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ సహకరించారనే ఆరోపణలపై మరోసారి పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటారా? అన్న ప్రశ్నకు.. లలిత్ మోదీని భారత్కు తీసుకొచ్చి విచారణ జరిపితే.. ఆ అవసరం రాదని సుర్జేవాలా పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. -
’లలిత్ మోదీకి దావూద్తో సన్నిహిత సంబంధాలు’
-
'అతను మాకు కావాలి.. మీరు బహిష్కరించండి'
న్యూఢిల్లీ: దేశంలో సంచనలం సృష్టించిన లలిత్ గేట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు లలిత్ మోదీని వెంటనే బ్రిటన్ నుంచి బహిష్కరించాలని నాటి ఆర్థిక మంత్రి పీ చిదంబరం బ్రిటన్ కు లేఖ రాసినట్లు తెలిసింది. సమాచారం హక్కు చట్టం ద్వారా ఓ వ్యక్తి ఈ విషయంపై వివరణ కోరగా ఈ వివరాలు తెలిశాయి. భారీ కుంభకోణం అనంతరం 2010 నుంచి లలిత్ మోదీ బ్రిటన్ లోనే ఉంటున్న విషయం తెలిసిందే. అయితే, ఆయనను వెనక్కి రప్పించేందుకునాటి కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నించిందని చిదంబరం లేఖ ద్వారా తెలుస్తోంది. ఆ లేఖలో.. తప్పు చేసిన అపరాధి అయిన మోదీని ఇక ఎక్కువ రోజులు బ్రిటన్లో ఎక్కువ రోజులు ఉండనివ్వాలని అనుకోవడం లేదని, అతడిని తిరిగి వెనక్కి రప్పించే కార్యకలాపాలు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉన్నందున వెంటనే బ్రిటన్ నుంచి బహిష్కరించాలని చిదంబరం విజ్ఞప్తి చేశారు. ఆయనపై ఉన్న తీవ్రమైన నేరాల కేసుల విచారణను భారత్ లోని కీలక విచారణ సంస్థలు పనిచేస్తున్నాయని కూడా అందులో ప్రస్తావించారు. ఆయన పాస్ పోర్టును చట్ట వ్యతిరేకమైనదిగా తాము గుర్తించినందున ఎక్కువకాలంపాటు ట్రావెలింగ్ డాక్యుమెంట్స్ పనిచేసే అవకాశం ఉండదని, అయినా అతడు బ్రిటన్ లో ఉంటున్నాడని, వెంటనే అక్కడి నుంచి బహిష్కరించాలని విన్నవించారు. ఇలాంటి తప్పిదాల పేరుతో గతంలో 3000మంది ఇండియన్స్ ను బ్రిటన్ నుంచి బహిష్కరించిన విషయం కూడా చిదంబరం గుర్తు చేశారు. దీనికి బ్రిటన్ స్పందించి తిరిగి బదులు సమాధానం కూడా ఇచ్చింది. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అయినా, ఇప్పటివరకు బ్రిటన్ ఈ విషయంలో చర్యలు తీసుకోకపోవడం వెనుక మతలబు ఏమిటో తెలియాలి. -
'మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు ఎందుకు ?'
న్యూఢిల్లీ: ఇంటర్ పోల్ నుంచి ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్కు చుక్కెదురైంది. లలిత్ మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు ఎందుకు జారీ చేయాలనుకుంటున్నారో చెప్పాలని ఇంటర్ పోల్ ఈడీని ప్రశ్నించింది. ఈ మేరకు గత నెల 20న ఇంటర్ పోల్ నుంచి ఈడీకి ఓ లేఖ కూడా అందింది. ఆర్థిక నేరారోపణలతో విదేశాలకు పారిపోయిన ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి అతడిని తిరిగి వెనక్కి రప్పించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు ముందుకు కదిలిన విషయం తెలిసిందే. ఈడీ కూడా లలిత్ మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సీబీఐని కోరింది. దీంతో ఆ నోటీసులు జారీచేసే విషయంలో ఇంటర్ పోల్ను సంప్రదించింది. ఈ నేపథ్యంలో ఏప్రాతిపదికన ఆయనకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తారో చెప్పాలంటూ ఇంటర్ పోల్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
మనోహర్తో మోదీ సంప్రదింపులు
ముంబై : ఐపీఎల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఇంగ్లండ్లో ప్రవాస జీవితం గడుపుతున్న లలిత్ మోదీ.. తెర వెనుక మాత్రం తన ప్రయత్నాలు ఆపడం లేదు. తనకు బద్ద శత్రువుగా భావించే ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ వ్యతిరేకులతో నిత్యం సంప్రదింపులు చేస్తున్నట్టు వెల్లడయ్యింది. శ్రీనికి ముందు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న శశాంక్ మనోహర్తో ఈమెయిల్స్ ద్వారా మోదీ టచ్లో ఉన్నట్టు తేలింది. గురునాథ్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారం బయటపడినప్పుడు ఆ జట్టును రద్దు చేయాల్సిందిగా ఒత్తిడి పెంచాలని మనోహర్కు సూచించారు. ‘జరుగుతున్న వ్యవహారం మీకు తెలిసిందే. ‘సాహిబ్’ (శరద్ పవార్)కు కూడా లండన్లో ఈ విషయాలను తెలిపాను. నా అభిప్రాయం ప్రకారం చెన్నై, రాజస్తాన్ జట్లను లీగ్ నుంచి తొల గించాలని అంతా ఒత్తిడి తేవాలి. తిరిగి కొత్త యజమానుల కోసం తాజాగా వేలం జరగాలి’ అని 2013లో పంపిన మెయిల్లో మోదీ పేర్కొన్నారు. మనోహర్ నుంచి కూడా మెయిల్స్ వెళ్లినట్టు సమాచారం. అలాగే శ్రీనిపై సుప్రీం కోర్టులో కేసు వేసిన బిహార్ క్రికెట్ సంఘం కార్యదర్శి ఆదిత్య వర్మకు కూడా తాను ఆర్థిక సహాయం చేసినట్టు లలిత్ మోదీ గతంలోనే పేర్కొన్నారు. అయితే మనోహర్ మాత్రం తనకు మోదీ నుంచి ఎలాంటి మెయిల్స్ రాలేదని చెబుతున్నారు. -
స్పీకర్పై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది..
అందుకే సమావేశాల చివర్లో లలిత్ మోదీ అంశంపై చర్చ: కాంగ్రెస్ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా లలిత్ మోదీ అంశంపై పార్లమెంట్ సమావేశాల చివర్లో చర్చ చేపట్టిందని కాంగ్రెస్ విమర్శించింది. లలిత్గేట్, వ్యాపం స్కాంలపై ప్రతిపక్షాలు ఆందోళన చేస్తాయని తెలిసే ఆ విషయంపై చివరి వరకూ ప్రభుత్వం చర్చను చేపట్టలేదని ఆరోపించింది. ప్రభుత్వం ఒత్తిడి చేయబట్టే మరో రోజులో సమావేశాలు ముగుస్తాయనగా లలిత్ వ్యవహారంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్చకు అనుమతిచ్చారని విమర్శించింది. లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మలికార్జున ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులామ్ నబీ ఆజాద్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వర్షాకాల సమావేశాలు ప్రారంభం నుంచి వాయిదా తీర్మానం ద్వారా తాము చర్చకు పట్టుబడితే తిరస్కరించిన స్పీకర్.. మరో రోజులో సమావేశాలు ముగుస్తాయనగా అదే వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతివ్వడం ఆశ్చర్యపరిచిందన్నారు. దీనిని బట్టే స్పీకర్పై ప్రభుత్వం ఏ మేరకు ఒత్తిడి తెచ్చిందనేది అర్థమవుతుందన్నారు. మంత్రి సుష్మ వినతి, మరో మంత్రి వెంకయ్య మద్దతుతో వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టారని చెప్పారు. ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో అప్పటికప్పుడు చర్చకు స్పీకర్ అంగీకరించారన్నారు. తమ సాయంతో పలు బిల్లులు పాస్ అయ్యాయని, కానీ ప్రభుత్వం ఇప్పుడు తమను లక్ష్యంగా చేసుకుందన్నారు. తమ పార్టీని బ్రిటిష్ సామ్రాజ్యమే ఏమీ చేయలేకపోయిందని, బీజేపీ ఎంతని పేర్కొన్నారు. -
'ఇటలీ మాఫియారాణికి డబ్బు ఇచ్చి ఉండాల్సింది'
పార్లమెంటులో చర్చ మొత్తం తనమీదే సాగుతున్న తరుణంలో.. లలిత్ మోదీ మరో బాంబు పేల్చారు. ఇటాలియన్ మాఫియా రాణికి తాను డబ్బు ఇచ్చి ఉండాల్సిందని, ఆ డబ్బును తనకు అప్పు ఇవ్వాల్సిందిగా వరుణ్ గాంధీని అడిగి ఉండాల్సిందని ట్వీట్ చేశారు. ఇటాలియన్ ఆంటీకి లలిత్ మోదీ 400 కోట్ల రూపాయలు ఇచ్చి ఉంటే.. ఈరోజు పార్లమెంటు సజావుగా సాగి ఉండేదంటూ ఓ ఫాలోవర్ ఇచ్చిన ట్వీట్కు సమాధానంగా లలిత్ మోదీ స్పందించారు. తనకు ఓ కప్పు టీ కోసం సంతకం చేసేంత శక్తి లేదని, కేవలం డబ్బు తీసుకొచ్చే శక్తి మాత్రమే ఉందని తెలిపారు. అయితే అలా తాను తెచ్చిన డబ్బును క్రికెట్ మాఫియా ఖర్చు పెడుతుందని వ్యాఖ్యానించారు. తాను 1987లో వ్యాపారం మొదలు పెట్టినప్పుడు.. శ్రేయోభిలాషులు ముందుగా వెళ్లి నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని కలిసి ఓ కప్పు టీ తాగాలని చెప్పారని లలిత్ మోదీ ట్వీట్ చేశారు. తనను అక్కడకు కెప్టెన్ సతీష్ శర్మ తీసుకెళ్లారని, కావాలంటే ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకోడానికి ప్రధానమంత్రి ఇంటి రికార్డులు సరిచూసుకోవచ్చని సవాలు చేశారు. తర్వాత కెప్టెన్కు సూట్కేసు ఇవ్వాల్సిందిగా చెప్పారని, తాను అలాగే ఇచ్చినని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు వ్యాపారం అలా చేస్తారని లలిత్ మోదీ తెలిపారు. కావాలంటే వాళ్లు దీన్ని ఖండించుకోవచ్చని.. అయితే ఏదైనా చేసేముందు ప్రధాని ఇంటి రికార్డులు చెక్ చేసుకోవాలని అన్నారు. తన ఎంట్రీ అందులో రికార్డు అయి ఉంటుందని స్పష్టం చేశారు. కావాలంటే కెప్టెన్ లేదా ఇటాలియన్ దీన్ని ఖండించుకోవచ్చన్నారు. ఇక ఎవరైనా ఢిల్లీలోని సతీష్ శర్మ ఇంటికి వెళ్తే, ఆయన వాళ్లను గర్వంగా ఒక గదిలోకి తీసుకెళ్లి చూపిస్తారని, అందులో కింద ఫ్లోర్ దగ్గర నుంచి సీలింగ్ వరకు అంతా డబ్బు నిండి ఉంటుందని లలిత్ మోదీ ఆరోపించారు. True. I should have asked @varungandhi80 to loan it to me. Then all would have been happy and Italian mafia queen -
లలిత్ మోదీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఐపీఎల్ బహిష్కృత చైర్మన్ లలిత్ మోదీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరుకాకుండా లండన్లో తలదాచుకుంటున్న మోదీని భారత్ రప్పించే ప్రయత్నాలను వేగవంతం చేశారు. మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఈడీ.. సీబీఐని కోరింది. ఈ విషయంపై సీబీఐ ఇంటర్పోల్ను సంప్రదించనుంది. త్వరలో మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే అవకాశముంది. ఇదే కేసులో ఇటీవల ప్రత్యేక పీఎమ్ఎల్ఏ కోర్టు మోదీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాక 2010లో మోదీ లండన్కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి భారత్కు తిరిగి రాని మోదీ ఈడీ విచారణకు సహకరించడం లేదు. -
ICCపై లలిత్ మోది తిరుగుబాటు!
-
ఐసీసీకి పోటీగా మరో వ్యవస్థ
బ్లూ ప్రింట్ సిద్ధంగా ఉంది లలిత్ మోదీ ప్రకటన లండన్: ఐపీఎల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రవాస జీవితం గడుపుతున్న లలిత్ మోదీ.. బీసీసీఐని ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నాలు మానడం లేదు. బోర్డుచేత జీవిత కాల నిషేధం ఎదుర్కొంటున్న తను తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి సమాంతరంగా మరో వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు బ్లూప్రింట్ సిద్ధం చేసినట్టు ప్రకటించారు. అయితే ఇందులో టెస్టులు, టి20 ఫార్మాట్ మాత్రమే ఉంటుందని.. వన్డే క్రికెట్ను తొలగిస్తున్నట్టు చెప్పారు. ఈ కొత్త బాడీ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి అనుబంధంగా వ్యవహరిస్తుందని కూడా తెలిపారు. అయితే గతంలోనే ఐసీసీకి సమాంతరంగా మరో వ్యవస్థ రానుందని వార్తలు వచ్చినప్పుడు అందులో తన భాగస్వామ్యాన్ని మోదీ ఖండించారు. ‘నేనిప్పుడు మరో క్రికెట్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను. బ్లూ ప్రింట్ కూడా సిద్ధంగా ఉంది. ఇప్పటికే నా ఆమోద ముద్ర కూడా పడిపోయింది. నేనిందులో పూర్తిగా భాగస్వామ్యమయ్యానని తొలిసారిగా చెబుతున్నాను. త్వరలోనే ఆమల్లోకి తెస్తాం. అయితే ఇందుకోసం వందల కోట్ల డాలర్లు ఖర్చు అవుతాయి. కానీ ఇది పెద్ద సమస్య కాదనే అనుకుంటున్నాను. ఒకవేళ ఇప్పుడున్న ఐసీసీలో సంస్కరణలు ప్రారంభమైతేనే నా పథకం విఫలమవుతుంది. ఈ బ్లూ ప్రింట్ అమల్లోకి రావద్దనే ఆశిస్తున్నాను. అయితే ఐసీసీ మారకపోతే మాత్రం మేమనుకున్న కొత్త వ్యవస్థ సంచలనం సృష్టించడం ఖాయం’ అని ఆస్ట్రేలియా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లలిత్ మోదీ స్పష్టం చేశారు. ఐసీసీ కూడా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) గుర్తింపు పొందాలని ఆయన సూచించారు. తానెప్పటి నుంచో ఈ మాట చెబుతున్నా వారు వినడం లేదని, ఐపీఎల్ కూడా తన మార్కెటింగ్ చాతుర్యంతోనే విజయవంతమయిందని మోదీ గుర్తుచేశారు. -
అందుకే తీసేశారా!
ఇటీవల భారత జట్టు జింబాబ్వేలో మూడు వన్డేలు, రెండు టి20ల సిరీస్ ఆడిన విషయం గుర్తిందిగా. ఆ పర్యటనకు అజింక్య రహానేను కెప్టెన్గా ఎంపిక చేసిన విషయమూ తెలిసిందే. తనలో నాయకత్వ లక్షణాలు ఎలా ఉన్నాయో పరిశీలించడానికి రహానేను ఎంపిక చేశామని ఆనాడు చెప్పారు. కానీ వాస్తవం అది కాదట. సురేశ్ రైనాను ఈ సిరీస్కు కెప్టెన్ను చేద్దామని తొలుత భావించారు. అయితే సరిగ్గా జట్టు ఎంపిక కోసం సెలక్టర్లు సమావేశమైన రోజే... ఓ వార్త బయటకు వచ్చింది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి రైనా, జడేజా, బ్రేవో డబ్బులు తీసుకున్నారంటూ లలిత్ మోదీ ఐసీసీకి ఓ లేఖ రాశారు. ఆ విషయం బయటకు రావడంతో సెలక్టర్లు రక్షణాత్మక ధోరణిలో వ్యవహరించారు. ఎందుకైనా మంచిదని రైనాకు విశ్రాంతి ఇచ్చి రహానేకు పగ్గాలు అప్పజెప్పారు. అయితే లలిత్ మోదీ లేఖలో వాస్తవాలు లేవంటూ ఐసీసీ దీనిని కొట్టి పారేసింది. కానీ పాపం రైనా. భారత జట్టుకు మరోసారి సారథిగా వ్యవహరించే అవకాశం కోల్పోయాడు. -
రైనా 'రెస్ట్' వెనుక 'పెద్ద' కథే నడిచిందట!
గత నెల జింబాబ్వేలో పర్యటించిన భారత జట్టులో సభ్యుల ఎంపిక, కెప్టెన్సీ ఎవరికి కట్టబెట్టాలనే నిర్ణయాల వెనుక పెద్ద కథే నడిచినట్లు తెలిసింది. నిజానికి ఆ పర్యటనకు టీమిండియా కెప్టెన్గా సురేశ్ రైనా పేరును సెలక్షన్ కమిటీ ఖరారు చేసింది. కానీ చివరి నిమిషంలో బీసీసీఐలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ పెద్ద మనిషి ఒత్తిడి మేరకు రైనాకు రెస్ట్ ఇచ్చి అజింక్యా రహానేను కెప్టెన్గా ప్రకటించింది. జింబాబ్వే టూర్కు జట్టును ఎంపిక చేసేందుకు సెలక్షన్ కమిటీ జూన్ 29న ముంబైలో సమావేశమైంది. సీనియర్లకు విశ్రాంతి కల్పించడంతోపాటు యువ జట్టును సిద్ధం చేసి.. వారికి సారధిగా రైనాను ఎంపికచేశారు. కానీ బీసీసీఐ పెద్ద రాకతో సీన్ రివర్సయింది. రైనాకు కెప్టెన్సీ వద్దని, ఇతర సీనియర్లలాగే అతనికి కూడా రెస్ట్ ఇవ్వమని సెలక్షన్ కమిటీని ఒత్తిడి చేశాడట ఆ పెద్దమనిషి. మరోదారిలేని సెలెక్టర్లు ఆయన చెప్పినట్లే రైనాకు విశ్రాంతినిచ్చారు. ఎందుకిలా చేశారంటే.. సెలక్షన్ కమిటీ సమావేశానికి సరిగ్గా రెండురోజుల ముందు ఐపీఎల్ స్కాంస్టర్ లలిత్ మోదీ ఓ సంచనల ట్వీట్ వదిలాడు. 'చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడే సురేశ్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, డ్వెయిన్ బ్రావోలు ఓ రియల్ ఎస్టేట్ దిగ్గజం నుంచి ముడుపులు తీసుకుని ఫిక్సింగ్ కు పాల్పడ్డారు' అని మోదీ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. దీంతో రైనాపై నమ్మకం సడలిందని, ప్రస్తుత పరిస్థితుల్లో అతనికి కెప్టెన్సీ కట్టబెట్టడం అంగీకారం కాదని బీసీసీఐ పెద్దలు భావించారట. అదే విషయాన్ని తమ సహచరుడి ద్వారా సెలక్షన్ కమిటీకి చెప్పించారట. ఆ సందర్భంలోనే 'సెలక్షన్ కమిటీ నిర్ణయాం వెనుక లలిత్ మోదీ ట్వీట్ ప్రభావమేమైనా ఉందా?' అనే ప్రశ్నకు బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ బదులిస్తూ 'రైనా అంతర్జాతీయ స్థాయి ఆటగాడు కనుక ఐసీసీయే అతడి వ్యవహార్ని పర్యవేక్షిస్తుంది' అని చెప్పడం, రైనా కూడా 'నేను ఎలాంటి తప్పుచేయలేదు. ఆటే ప్రాణంగా శ్వాసించాను' అని ప్రకటించడం తెలిసిందే. -
రెండు నెలలుగా మీడియాలో నాపై దుష్ప్రచారం
-
రెండు నెలలుగా మీడియాలో నాపై దుష్ప్రచారం
న్యూఢిల్లీ: లలిత్ గేట్ వ్యవహారంపై కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ గురువారం లోక్సభలో ఆవేశంగా ప్రసంగించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ఆమె కొట్టి పారేశారు. లలిత్ మెదీ విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. లలిత్ మోదీ కోసం తాను బ్రిటన్ ప్రభుత్వానికి ఎలాంటి సిఫార్సు చేయలేదన్నారు. సిఫార్సు చేసిన ఆధారాటు ఉంటే బయటపెట్టాలని, తనపై ఆరోపణలకు సంబంధించి చర్చ జరగాలన్నారు. లలిత్ గేట్పై కాంగ్రెస్ తో చర్చకు తాను సిధ్దమని స్పష్టం చేశారు. కాంగ్రెస్తో చర్చకు తాను సిద్ధమే అని, వారి ప్రశ్నలకు సమాధానం ఉందని తెలిపారు. రెండు నెలలుగా తనపై మీడియాపై దుష్ప్రచారం జరుగుతుందని సుష్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆరోపణలను తన దగ్గర ధీటైన సమాధానం ఉందని పేర్కొన్నారు. తన స్థానంలో సోనియా గాంధీ ఉంటే ఏం చేసేవారని సుష్మా స్వరాజ్ ప్రశ్నించారు. లలిత్ మోదీకి సంబంధించిన అంశాన్ని బ్రిటన్ ప్రభుత్వానికే వదిలేశానని, సిఫార్స్ చేసినట్లు ఉన్న మెయిల్, లేఖ ఉంటే చూపించాలని సుష్మా స్వరాజ్ ప్రశ్నల వర్షం కురిపించారు. -
లలిత్ మోదీపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరుకాకుండా లండన్లో తలదాచుకుంటున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల విన్నపం మేరకు బుధవారం ప్రత్యేక పీఎమ్ఎల్ఏ న్యాయస్థానం వారెంట్ జారీ చేసింది. ఐపీఎల్ కమిషనర్గా పనిచేసిన కాలంలో మోదీ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్ కేసులో ఈడీ మోదీపై కేసు నమోదు చేసింది. కాగా ఐపీఎల్ చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురికావడం, కేసులు నమోదు కావడంతో మోదీ లండన్ పారిపోయారు. 2010 నుంచి మోదీ లండన్లోనే ఉంటున్నారు. విచారణకు హాజరు కావాలని గతంలో ఈడీ సమన్లు పంపినా.. తనకు భారత్లో ప్రాణభయం ఉందంటూ మోదీ రాలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కోర్టు వారెంట్ జారీ చేసింది. -
లలిత్ కోసం సిఫారసు చేయలేదు
రాజ్యసభలో సుష్మా స్వరాజ్ స్పష్టీకరణ * సుష్మా ప్రకటనపై కాంగ్రెస్ అభ్యంతరం న్యూఢిల్లీ: లలిత్ మోదీ విషయంలో తనపై గత కొంతకాలంగా వస్తున్న విమర్శలమీద విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఎట్టకేలకు మౌనం వీడారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆమె సోమవారం రాజ్యసభలో ఖండించారు. వివాదాస్పదుడైన ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి ప్రయాణ పత్రాలు ఇవ్వాల్సిందిగా తాను బ్రిటన్ ప్రభుత్వానికి ఎలాంటి సిఫారసు చేయలేదని స్పష్టంచేశారు. ఈ విషయంలో విపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. లలిత్ అంశంపై కాంగ్రెస్ సభ్యులు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండగా, కొద్దిసేపు ఆమె మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. అయితే పెద్ద ఎత్తున గందరగోళం చెలరేగడంవల్ల రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను వాయిదా వేయడంతో ఆమె తన వాదనను పూర్తిగా చెప్పలేకపోయారు. అంతకు ముందు కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణివల్లే సభ సజావుగా సాగడం లేదని, లలిత్గేట్ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో ప్రధాని స్పష్టం చేసేవరకు సభ కుదుటపడదని అన్నారు. డిప్యూటీ చైర్మన్ జోక్యంచేసుకుని చర్చ ప్రారంభిస్తేనే ప్రధాని సమాధానం చెప్పడానికి వీలుంటుందని సూచించారు. గందరగోళం నడుమ సభ 12 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి మొదలయ్యాకా అదే పరిస్థితి కొనసాగడంతో ప్రశ్నోత్తరాలు మరోసారి వాయిదాపడ్డాయి. 2గంటలప్పుడు సభ తిరిగి మొదలయ్యాక పరిస్థితిలో మార్పు లేకపోవడంతో చెప్పుకోదగ్గ కార్యక్రమాలేమీ చేపట్టకుండానే రోజు మొత్తానికి వాయిదాపడింది. సుష్మా ప్రకటనపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తంచేసింది. నోటీసు ఇవ్వకుండానే మంత్రి ప్రకటన చేయడం నిబంధనలకు విరుద్ధమని, అది చెల్లదని, దానిని రికార్డుల్లోకి తీసుకోరాదని కాంగ్రెస్ సభ్యులు రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీని కోరారు. -
'మోదీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయండి'
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరుకాకుండా లండన్లో తలదాచుకుంటున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీని భారత్ రప్పించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. లలిత్ మోదీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రత్యక న్యాయస్థానాన్ని కోరింది. సోమవారం ప్రత్యేక పీఎమ్ఎల్ఏ న్యాయస్థానంలో ఈడీ తరపు న్యాయవాదులు ఈ మేరకు విన్నవించారు. ఐపీఎల్ కమిషనర్గా పనిచేసిన కాలంలో మోదీ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్ కేసులో ఈడీ మోదీపై కేసు కూడా నమోదు చేసింది. ఐపీఎల్ చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురికావడంతో పాటు కేసులు నమోదు కావడంతో మోదీ లండన్ పారిపోయారు. 2010 నుంచి మోదీ లండన్లో ఉంటున్నారు. విచారణకు హాజరు కావాలని గతంలో ఈడీ సమన్లు పంపినా.. తనకు భారత్లో ప్రాణభయం ఉందంటూ మోదీ తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోర్టును ఆశ్రయించింది. ఇదిలావుండగా, ఇటీవల లలిత్ మోదీ ట్వీట్లతో బీజేపీ తలనొప్పిగా మారాడు. లలిత్ గేట్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, కేంద్ర మంత్రి విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాంటూ డిమాండ్లు ఊపందుకున్నాయి. వీసా విషయంలో సుష్మా, వసుంధర.. లలిత్ మోదీకి సాయం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇక వసుంధర కుటుంబానికి ఆర్థిక ప్రయోజనం కలిగిందనే విమర్శలూ వచ్చాయి. -
లలిత్ మోదీ కోసం ప్రయాణ పత్రాలు కోరలేదు
సుష్మా స్వరాజ్ స్పష్టీకరణ న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీకి సాయం చేసినట్లు వచ్చిన ఆరోపణల విషయంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తనను సమర్థించుకున్నారు. మోదీకి ప్రయాణ పత్రాలు ఇవ్వాల్సిందిగా తాను ఎవరికీ విజ్ఞప్తి లేదా సిఫార్సు చేయలేదని శనివారం స్పష్టం చేశారు. ఈ విషయంలో విపక్షాలు తన రాజీనామాకు పట్టుబడుతున్న నేపథ్యంలో ఆమె పలు ట్వీట్లు చేశారు. బ్రిటన్లో తలదాచుకుంటున్న లలిత్ పోర్చుగల్ వెళ్లేందుకు అనుమతించాలంటూ బ్రిటన్ ఎంపీ కీత్ వాజ్తో తాను మాట్లాడినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. మానవతా దృష్టితోనే మోదీకి సాయం చేసినట్లు గతంలో చేసిన స్పందిస్తూ ‘బ్రిటన్ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునేలా ఆ దేశ ప్రభుత్వానికే వదిలేశాను. దీనిపై తొలి రోజునే ట్వీట్ చేశా. నేను ప్రతిరోజూ ప్రజలకు సాయం చేస్తా. అది కూడా ఒకే ట్వీట్ ద్వారా. ఆవిడ (లలిత్ మోదీ భార్య) గత 17 ఏళ్లుగా కేన్సర్తో బాధపడుతున్నారు. ఆమెకు కేన్సర్ తిరగబెట్టడం ఇది పదోసారి’ అని సుష్మ పేర్కొన్నారు. -
వారి తీరు దురదృష్టకరం
న్యూఢిల్లీ: పార్లమెంటులో ప్రతిపక్షాల ప్రవర్తన తీరు దురదృష్టకరమని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు. లలిత్ మోదీ వ్యవహారంపై విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ పార్లమెంటులో ప్రకటన చేస్తారని చెప్పిన కూడా వారు వినకుండా సభా కార్యక్రమాలు అడ్డుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలనీ సుష్మా చెప్తూనే ఉన్నారని, దానికి సంబంధించే ఓ స్పష్టమైన వివరణ ఇస్తానని చెప్తున్నా వినకుండా విపక్షాలు ప్రవర్తిస్తున్న తీరు నిజంగా దురదృష్టమే అని పార్లమెంటు వెలుపల విలేకరులతో చెప్పారు. మరోపక్క, కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాధిత్య సిందియా మాట్లాడుతూ తమ పార్టీ ఇతర పార్టీలైన తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీవంటివన్నీ కూడా లలిత్ మోదీ వ్యవహారంలో అవినీతికి పాల్పడిన మంత్రులు ఇద్దరు ముఖ్యమంత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం తప్ప తాము ఇంకే కోరడం లేదని అన్నారు. మొత్తం విపక్షమంతా కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా కోరుతున్నాయని అన్నారు. -
'నిజాయితీతో కూడిన తొలి నిర్ణయం'
లండన్: చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ పై జట్లపై రెండేళ్ల నిషేధం విధించడాన్నిఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ సమర్ధించాడు. ఇది భారత్ క్రికెట్ లో నిజాయితీతో కూడిన తొలి నిర్ణయంగా పేర్కొన్నాడు. ఈ నిర్ణయం బీసీసీఐకి సిగ్గుచేటని ఎద్దేవా చేశాడు. ఆ రెండు జట్లపై రెండేళ్ల నిషేధం కాదు.. పూర్తిగా నిషేధిస్తే మరింత బాగుండేదన్నాడు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపీఎల్లో కోర్టులు జోక్యం చేసుకోవడంతోనే బీసీసీఐ వైఫల్యం కనబడుతోందన్నాడు. మంగళవారం చెన్నై, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల పాటు నిషేధం విధిస్తూ సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రాజేంద్ర మాల్ లోధా సారథ్యంలోని ముగ్గురు సభ్యుల కమిటీ తీర్పు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు నుంచే తీర్పు అమల్లోకి వస్తుందని వస్తుందని ప్రకటించింది. చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ భాగస్వామి రాజ్ కుంద్రాపై జీవితకాల నిషేధం విధించింది. వీరిద్దరూ క్రికెట్ సంబంధిత వ్యవహారాల్లో పాల్గొనకుండా నిషేధం పెట్టింది. మేయప్పన్, కుంద్రా బెట్టింగ్ వ్యవహారాలతో బీసీసీఐ, ఐపీఎల్ తో పాటు క్రికెట్ కు చెడ్డ పేరు వచ్చిందని లోధా కమిటీ పేర్కొంది. -
లలిత్కు ‘పద్మ’ సిఫార్సు!
మరో వివాదంలో రాజస్తాన్ సీఎం వసుంధర రాజే రాజేపై విరుచుకుపడ్డ కాంగ్రెస్.. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ జైపూర్: ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ కారణంగా ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. లలిత్మోదీకి పద్మ పురస్కారం ఇవ్వాలంటూ ఆమె 2007లో కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు ఇప్పుడు బయటకు రావడంతో రాజేకు మరో తలనొప్పి ఎదురైంది. రాజస్తాన్లో క్రికెట్ అభివృద్ధికి, అలాగే క్రీడారంగానికి లలిత్ మోదీ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన పేరును పద్మ పురస్కారానికి సిఫార్సు చేయాలని రాజస్తాన్ రాష్ట్ర క్రీడా మండలి(ఆర్ఎస్ఎస్సీ)కి సూచించినట్టుగా బుధవారం వార్తలు వెలువడ్డాయి. అయితే ముఖ్యమంత్రి మీడియా సలహాదారు ఈ అంశంపై స్పందించేందుకు నిరాకరించారు. కాగా, దీనిపై రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్సీఏ) మాజీ గౌరవ కార్యదర్శి సుభాష్ జోషి స్పందిస్తూ.. అప్పట్లో ఆర్సీఏ అధ్యక్షునిగా, బీసీసీఐ ఉపాధ్యక్షునిగా ఉన్న లలిత్ మోదీ పేరును పద్మ అవార్డులకు సిఫార్సు చేసేందుకుగానూ ఆయనకు సంబంధించిన వివరాలు, పత్రాలు అందించాలని జూలై 27, 2007న ఆర్ఎస్ఎస్సీ నుంచి తమకు లేఖ అందిందని చెప్పారు. అనంతరం కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ప్రధాన కార్యదర్శికి ఆర్ఎస్ఎస్సీ పద్మ పురస్కారానికి లలిత్మోదీ పేరు సిఫార్సు చేస్తూ ప్రతిపాదన పంపిందని చెప్పారు. అయితే కేంద్రం రాజస్తాన్ ప్రభుత్వ సిఫార్సును పట్టించుకోలేదు. కాగా, ఈ వ్యవహారంలో వసుంధరా రాజేపై రాజస్థాన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సచిన్ పైలట్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో లలిత్మోదీ సంస్థాగత అవినీతికి పాల్పడ్డాడని, లలిత్మోదీ పేరును పద్మ అవార్డుకు సిఫార్సు చేయడంతో రాజేకు, లలిత్మోదీకి ఉన్న బంధం మరోసారి బయటపడిందని చెప్పారు. వసుంధర రాజే తక్షణం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
లలిత్ మోదీకి ఈడీ నోటీసులు
ఢిల్లీ:ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం సమన్లు జారీ చేసింది.మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి విచారణలో భాగంగానే మోదీకి ఈడీ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా బ్రిటన్ లో ఉంటున్న లలిత్ మోదీ.. అనేక మందిపై వివాదాస్పద ఆరోపణలు చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. లలిత్ మోదీకి బ్రిటన్ ట్రావెల్ డాక్యుమెంట్స్ అందేందుకు సుష్మా స్వరాజ్, అంతకుముందు బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ విషయంలో వసుంధర రాజే సహకరించారన్న వార్తలు వెలుగులోకి రావడంతో భారత్ లో రాజకీయ దుమారం లేచిన విషయం తెలిసిందే. -
జీఎస్టీ, భూసేకరణ బిల్లులకు మద్దతివ్వండి..
వృద్ధి, పెట్టుబడుల జోరుకు ఈ చట్టాలు తప్పనిసరి... {పతిపక్షాలకు ఆర్థిక మంత్రి జైట్లీ విజ్ఞప్తి న్యూఢిల్లీ : పెండింగులో ఉన్న వస్తు, సేవల పన్ను(జీఎస్టీ), భూసేకరణ బిల్లులు ఆమోదం పొందేందుకు మద్దతివ్వాల్సిందిగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. వృద్ధి, పెట్టుబడులకు ఊతమివ్వడంతోపాటు భారీగా ఉద్యోగాల సృష్టి, పేదరిక నిర్మూలనకు ఈ రెండు చట్టాలు చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు. ఫేస్బుక్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో లలిత్ మోదీ స్కామ్ తీవ్ర ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉన్న నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ స్కామ్తో ఇద్దరు సీనియర్ బీజేపీ నేతల(సుష్మా స్వరాజ్, వసుంధరా రాజే)కు సంబంధాలున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా, ఇతర విపక్షాలన్నీ మోదీ సర్కారుపై పార్లమెంటులో ధ్వజమెత్తేందుకు సిద్ధమవుతున్నాయి. వచ్చే నెల 13 వరకూ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. కాగా, జీఎస్టీ బిల్లు ప్రస్తుతం రాజ్యసభ సెలెక్ట్ కమిటీ పరిశీలనలో ఉండగా.. భూసేకరణ బిల్లుపై పార్లమెంటు జాయింట్ కమిటీ సంప్రతింపులు జరుపుతోంది. వర్షాకాల సమావేశాల్లోనే రెండు కమిటీలూ తమ నివేదికను అందించే అవకాశం ఉంది. సామాజిక సర్వేపై... గ్రామీణ భారతావనిలో ప్రజల జీవన పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉన్నాయంటూ తాజా సర్వేలో వెల్లడైన అంశాలపై జైట్లీ మాట్లాడుతూ.. ఆర్థిక వృద్ధి రేటును 8-10 శాతానికి పెంచడం కోసం తమ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు. జీఎస్టీద్వారా ఏకీకృత మార్కెట్ను సృష్టించడం, వ్యాపారాలకు సానుకూల పరిస్థితుల కల్పన, పెట్టుబడులకు మెరుగైన వాతావరణం వంటివి ఇందులో ఉన్నాయని చెప్పారు. పేదలు, సామాజిక పథకాలపై ఆధారపడుతున్నవారికి చేదోడుగా నిలవాలంటే వృద్ధిరేటు పెంపు, ఆర్థిక సంస్కరణలే శరణ్యమన్నారు. బ్రిక్స్ బ్యాంక్ తొలి సమావేశానికి జైట్లీ... ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేడు రష్యా రాజధాని మాస్కోకు పయనమవుతున్నారు. బ్రిక్స్ బ్యాంక్(న్యూ డెవలప్మెంట్ బ్యాంక్) పాలక మండలి తొలి సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఆతర్వాత మంగళవారంనాడు బ్రిక్స్ దేశాల(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) ఆర్థిక మంత్రుల సమావేశానికి కూడా జైట్లీ హాజరవుతారు. ఈ నెల 8, 9 తేదీల్లో రష్యాలోని ఉఫా నగరంలో నిర్వహిస్తున్న బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు జైట్లీ కూడా పాల్గొంటారు. బ్రిక్స్ బ్యాంకుకు ప్రారంభ నిధులను సమకూర్చే అంశంపై సదస్సులో ప్రధానంగా దృష్టిపెట్టనున్నారు. ఈ బ్యాంకుకు తొలి సారథిగా భారతీయుడైన ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ ఎంపికైన సంగతి తెలిసిందే. -
సుష్మ, రాజే, లలిత్లపై ఫిర్యాదు
పట్నా: విదే శాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్మోదీకి వ్యతిరేకంగా పట్నాలోని జిల్లా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ భరత్సింగ్కు శుక్రవారం ఫ్రెండ్ ఆఫ్ బిహారీ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు వినయ్కుమార్ ఫిర్యాదు చేశారు. కానీ కోర్టు ఈ కేసులో వాదనలు వినేందుకు శనివారం అనుమతి ఇవ్వలేదు. ఈ కేసు విచారణార్హమా కాదా అనే విషయాన్ని మరో రోజు తేలుస్తామని కోర్టు తెలిపింది. లలిత్ అక్రమాలకు సంబంధించి తన ట్విటర్ ఖాతా ద్వారా ఒకరి పేరు తర్వాత మరొకరి పేరు వెల్లడిస్తూ దేశాన్ని అస్థిరపరచేందుకు ప్రయత్నిస్తున్నారని వినయ్ కుమార్ తన ఫిర్యాదులో ఆరోపించారు. దీనికోసం మీడియాలో వచ్చిన పలు కథనాలను పొందుపరుస్తూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000, ఐసీసీ 120, 124 సెక్షన్ల కింద ఆయన ఫిర్యాదు చేశారు. సుష్మా స్వరాజ్, వసుంధర రాజే, లలిత్ మోదీలపై కడమ్ కౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని వినయ్ కోర్టును అభ్యర్థించాడు. -
'నా ఆతిథ్యంతో రాహుల్ -వాద్రాలు లబ్దిపొందారు'
న్యూఢిల్లీ:ట్వీట్ల మీద ట్వీట్లతో రాజకీయ నేతలకు గుబులు పుట్టిస్తున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ ... తన ఖాతాలోంచి మరో వికెట్ బయటకు తీశారు. మోదీ గేట్లో రోజుకొక పేరు బయటపెడుతూ గందరగోళం సృష్టిస్తున్న లలిత్ మరో ట్విట్టర్ బాంబ్ పేల్చారు. అంతకుముందు బీజేపీ యువ నాయకుడు వరుణ్ గాంధీని టార్గెట్ చేసిన లలిత్ మోదీ.. ఇప్పుడు నేరుగా రాహుల్ గాంధీని కూడా వివాదంలోకి లాగారు. తన ఆతిథ్యంతో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లబ్ధిపొందారని పేర్కొన్నాడు. రాహుల్ తో పాటు అతని బావ రాబర్ట్ వాద్రా కూడా తనను కలిసినట్లు స్పష్టం చేశాడు. ఈ మేరకు శుక్రవారం రాహుల్-వాద్రాలతో కలిసి దిగిన పలు ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ మండిపడ్డారు. లలిత్ అధికార పార్టీ బీజేపీ లబ్ది పొందే క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ నేతలపై టార్గెట్ చేస్తున్నాడని విమర్శించారు. -
ఎప్పుడూ తప్పు చేయలేదు
సురేశ్ రైనా స్పష్టీకరణ న్యూఢిల్లీ: వ్యాపారవేత్తనుంచి డబ్బులు తీసుకున్నానంటూ తనపై ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోది చేసిన ఆరోపణలను భారత క్రికెటర్ సురేశ్ రైనా ఖండించాడు. ఏ స్థాయిలో అయినా తాను ప్రాతినిధ్యం వహించిన జట్టు తరఫున నిజాయితీగా ఆడానని, ఎలాంటి తప్పుడు పనులకు పాల్పడలేదని అతను అన్నాడు. తన మేనేజ్మెంట్ కంపెనీ రితి స్పోర్ట్స్ ద్వారా రైనా ఒక మీడియా ప్రకటనను విడుదల చేశాడు. ‘నా గురించి ఇటీవల మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో స్పందించాల్సి వస్తోంది. కెరీర్ ఆసాంతం నేను నిజాయితీగా, అంకిత భావంతో క్రికెట్ ఆడాను. ఏ దశలోనూ ఎలాంటి తప్పు చేయలేదు. నాపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవం. సదరు వ్యక్తిపై న్యాయపరమైన చర్యలు తీసుకునే ఆలోచన కూడా ఉంది’ అని రైనా వివరణ ఇచ్చాడు. రైనాతో పాటు జడేజా, బ్రేవో బయటి వ్యక్తులనుంచి లంచాలు తీసుకున్నారని ఇటీవల లలిత్ మోది వెల్లడించారు. అయితే ఐసీసీ, బీసీసీఐ ఈ విషయంలో ముగ్గురు ఆటగాళ్లకూ క్లీన్చిట్ ఇచ్చాయి. -
నేటి బలిపశువు.. సుధాంశు మిట్టల్
ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ మరో అస్త్రాన్ని బయటకు తీశారు. తాజాగా బీజేపీ నాయకుడు సుధాంశు మిట్టల్ను బలిపశువుగా చేశారు. ఆయన ఏమీ లేని స్థాయి నుంచి కోటీశ్వరుడిగా ఎలా ఎదిగారో త్వరలోనే 'లలిత్గేట్' ద్వారా వెల్లడిస్తానని ట్వీట్ చేశారు. ఒకప్పుడు టెంట్వాలాగా ఉండే సుధాంశు మిట్టల్ కథను వచ్చే వారం అందిస్తానని తెలిపారు. ఐపీఎల్ కుంభకోణంలో పీకల్లోతు మునిగిపోయిన లలిత్ మోదీ.. ఇప్పుడు తాజాగా హవాలా ఆపరేటర్ వివేక్ నాగ్పాల్తో మిట్టల్కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. 'బ్రేకింగ్ న్యూస్' అంటూ మొదలుపెట్టిన ట్వీట్లో.. వివేక్ నాగ్పాల్ అనే హవాలా ఆపరేటర్తో సుధాంశు మిట్టల్కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఆ తర్వాత వరుసపెట్టి మరో రెండు ట్వీట్ అస్త్రాలు సంధించారు. అటు కాంగ్రెస్ పార్టీని, ఇటు బీజేపీని రెండింటినీ టార్గెట్ చేస్తున్న లలిత్ మోదీ.. ఇంకా ఎవరెవరి పేర్లు బయటపెడతారో, ఎన్ని సంచలనాలకు దారితీస్తారోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. Wait 4 details on #racketeer #Tentwala @SudhanshuBJP Rags to #riches story coming live via #LALITGATE in next week pic.twitter.com/PhQbye1jud — Lalit Kumar Modi (@LalitKModi) July 1, 2015 BREAKING NEWS : WORLD EXCLUSIVE Bought to u by #LALITGATE 🇮🇳 wants to know @SudhanshuBJP what is your relationship pic.twitter.com/ZoB2OsZME9 — Lalit Kumar Modi (@LalitKModi) July 1, 2015 2/2 with master hawala racketeer and bagman #viveknagpal #Lalitgate #🇮🇳wantstoknowtruth from @SudhanshuBJP pic.twitter.com/oM5ckB1ibX — Lalit Kumar Modi (@LalitKModi) July 1, 2015 -
సుష్మ భర్తకు డెరైక్టర్ పదవి!
-
సుష్మ భర్తకు డైరెక్టర్ పదవి!
సొంత కంపెనీలో స్వరాజ్ కౌశల్కు డైరెక్టర్ షిప్ ఆఫర్ చేసిన లలిత్ మోదీ సోనియా ద్వారా నా ఇష్యూస్ని వరుణ్ గాంధీ సెటిల్ చేస్తానన్నారు మోదీ సంచలన ట్వీట్; ఖండించిన బీజేపీ నేత వరుణ్ న్యూఢిల్లీ: ‘లలిత్గేట్’లో మరో మలుపు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కుటుంబంతో ఐపీఎల్ స్కామ్స్టర్ లలిత్ మోదీకున్న సంబంధాలకు సంబంధించిన అంశమొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. లలిత్ తండ్రి కేకే మోదీ చైర్మన్, ఎండీగా ఉన్న ఇండోఫిల్ ఇండస్ట్రీస్ సంస్థలో డైరెక్టర్ పదవి ఇస్తామని సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్కు లలిత్ ప్రతిపాదించారన్న వార్త తాజా వివాదాన్ని మరింత పెంచింది. ఆ వార్త నిజమేనని, అయితే, తాను ఆ ప్రతిపాదనను తిరస్కరించానని స్వరాజ్ కౌశల్ వివరణ ఇచ్చారు. అలాగే, సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పరిశీలనకు రాకముందే ఆ ప్రతిపాదనను లలిత్ వెనక్కి తీసుకున్నారని కేకే మోదీ వివరణ ఇచ్చారు. మోదీ, సుష్మ కుటుంబాల మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలను ఇది వెల్లడి చేస్తోందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. పోర్చుగల్ వెళ్లేందుకు లలిత్కు బ్రిటన్ నుంచి ట్రావెల్ డాక్యుమెంట్లు లభించేలా సుష్మ సహకరించిన కొన్ని నెలలకే ఆమె భర్త స్వరాజ్ కౌశల్కు డెరైక్టర్ పదవి ఆఫర్ చేశారని, ఇదంతా ఇద్దరికీ లబ్ధి చేకూరే డీల్లో భాగమేనని ఆరోపించింది. దీనిపై సుష్మా స్వరాజ్ వివరణ ఇవ్వాలని, ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికైన మౌనం వీడాలని డిమాండ్ చేసింది. విదేశాంగ మంత్రులుగా ఉండగా మాధవ్ సింగ్ సోలంకీ, నట్వర్ సింగ్లపై ఆరోపణలు వచ్చినప్పుడు.. తక్షణమే రాజీనామా చేయాలని వారిని కాంగ్రెస్ పార్టీ ఆదేశించిన విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జెవాలా గుర్తు చేశారు. యూకే హైకమిషనర్ జేమ్స్ బేవన్తో సుష్మా స్వరాజ్ లలిత్ మోదీ ట్రావెల్ డాక్యుమెంట్స్ గురించి చర్చించినప్పటి సమావేశం పూర్తి వివరాలను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ఎవరైనా కేంద్ర మంత్రి బంధువుకు లలిత్ మోదీ ఇటీవల ఉద్యోగం ఆఫర్ చేశారా?, ఒకవేళ అదే నిజమైతే, అది ఎలాంటి జాబ్?’ అనే విషయంపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలన్నారు. ప్రధాని మోదీ శాశ్వత మౌన యోగాలో ఉన్నారని పార్టీ మరో అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ఎద్దేవా చేశారు. ‘ఎంతమంది బీజేపీ నేతలకు, ముఖ్యమంత్రులకు లలిత్ మోదీతో స్నేహపూర్వక, మానవతావాద, కుటుంబ సంబంధాలున్నాయో ప్రధాని చెప్పాలి’ అని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘సుష్మ, రాజేలను తొలగించండి’ పరారీలో ఉన్న నిందితుడు లలిత్ మోదీకి సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి సుష్మ, రాజస్తాన్ సీఎం వసుంధర రాజేలను తక్షణమే పదవుల్లోనుంచి తొలగించాలని సీపీఐ డిమాండ్ చేసింది. విద్యార్హతల విషయంలో పరస్పర విరుద్ధ విషయాలను వెల్లడించిన ఇరానీపై చర్యలు తీసుకోవాలంది. చండీగఢ్లో జరుగుతున్న పార్టీ జాతీయ మండలి సమావేశాల్లో ఆమోదించిన 4 తీర్మానాల్లో సుష్మ, రాజేల తొలగింపునకు సంబంధించిన తీర్మానమూ ఒకటి. రోజుకో కొత్త వార్త బయటపడుతున్న నేపథ్యంలో.. మొత్తం లలిత్ వ్యవహారంపై కోర్టు నియమిత ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఆరు కోట్ల డాలర్లు అడిగారు..! ‘లలిత్గేట్’లోకి తాజాగా వరుణ్గాంధీని లలిత్ మోదీ లాగారు. కొన్నేళ్ల క్రితం వరుణ్ లండన్లోని తన ఇంటికి వచ్చి, సోనియాగాంధీ ద్వారా తన సమస్యలను పరిష్కరిస్తానని ప్రతిపాదించారంటూ లలిత్ బుధవారం వరుస ట్వీట్లు వదలడంతో కొత్త వివాదానికి తెర లేచింది. ఆ వార్తలు నిరాధారమని, ఆ మతిలేని ఆరోపణలకు స్పందించడం తన స్థాయికి తగనిదంటూ వరుణ్ తీవ్రంగా స్పందించారు. ‘వరుణ్ కొన్నేళ్ల క్రితం లండన్లోని మా ఇంటికొచ్చారు. కాంగ్రెస్తో, తన ఆంటీ(పెద్దమ్మ) సోనియాగాంధీతో నా వ్యవహారాలను సెటిల్ చేస్తానని హామీ ఇచ్చారు. తన పెద్దమ్మ(సోనియా) సోదరిని కలవమని నాకు సూచించారు’ అని లలిత్ ట్వీట్ చేశారు. ‘ఆ తర్వాత ఆ ఇటలీ ఆంటీ 6 కోట్ల డాలర్లు(రూ. 381 కోట్లు) కావాలంటున్నారని మా కామన్ ఫ్రెండ్ నాకు చెప్పాడు. తర్వాత వరుణ్ నాకు ఫోన్ చేశారు. నేను కోపంగా ‘మీకు పిచ్చా? మీ పని మీరు చూసుకోండి’ అని చెప్పా. ఈ విషయాల్ని వరుణ్ ఖండించగలరా?’ అంటూ మరో ట్వీట్లో ఆరోపించారు. ‘మీ ఆంటీ(సోనియా గాంధీ) ఏం అడిగారో దయచేసి ప్రపంచానికి చెప్పండి. ప్రఖ్యాత జ్యోతిష్యుడైన, మనిద్దరికీ బాగా స్నేహితుడైన వ్యక్తే దీనంతటికి సాక్ష్యం. నిజం చెప్పండి. కొన్నేళ్ల క్రితం లండన్లోని రిట్జ్ హోటల్లో మీరున్నప్పుడు ఓసారి మా ఇంటికొచ్చారా, లేదా?’ అని వరుణ్ను ఉద్దేశించి మరో ట్వీట్ వదిలారు. ఈ ఆరోపణలను వరుణ్తో పాటు బీజేపీ కూడా ఖండించింది. ‘సోనియా, వరుణ్ వేర్వేరు పార్టీల వారు. వారిద్దరి కుటుంబాల మధ్య ఎలాంటి సంబంధాలున్నాయో అందరికీ తెలుసు’ అని బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ అన్నారు. లలిత్ ఆరోపణలపై సోనియా గాంధీ జవాబివ్వాలని బీజేపీ నేత శ్రీకాంత్ శర్మ డిమాండ్ చేశారు. -
మరో ట్వీట్ బాంబ్ పేల్చిన మోదీ..
న్యూఢిల్లీ : ట్వీట్ల మీద ట్వీట్లతో రాజకీయ నేతలకు గుబులు పుట్టిస్తున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ ...తన ఖాతాలోంచి మరో వికెట్ బయటకు తీశారు. మోదీ గేట్లో రోజుకొక పేరు బయటపెడుతూ గందరగోళం సృష్టిస్తున్న మోదీ మరో ట్వీట్ బాంబ్ పేల్చారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలోని అగ్ర నాయకులపై ట్విట్టర్ అస్త్రాలు సంధించిన లలిత్ తాజాగా బీజేపీ యువ నాయకుడు వరుణ్ గాంధీని టార్గెట్ చేశారు. వరుసగా కాంగ్రెస్ నాయకులు రాజీవ్ శుక్లా, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై ఎక్కుపెట్టిన ట్వీట్ల బాణాన్ని ఇపుడు వరుణ్ పై గురిపెట్టారు. కొన్ని సంవత్సరాల క్రితం తనను వరుణ్ లండన్లో కలిశారని...మొత్తం వ్యవహారాన్ని సెటిల్చేయడానికి 60 మిలియన్ డాలర్లు డిమాండ్ చేశాడని తెలిపారు. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, తన ఆంటీ సోనియాగాంధీతో మాట్లాడతానన్నారంటూ ట్వీట్ చేశారు. సినిమా చాలా ఉంది. మెల్లమెల్లగా బయటపెడతా అని హెచ్చరిస్తూ వస్తున్న లలిత్ మోదీ నిన్నగాక మొన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక, అల్లుడు రాబర్ట్ వాద్రాలను గత ఏడాది లండన్లో కలిశానంటూ వివాదాన్ని రాజేశారు. గాంధీ కుటుంబ సభ్యులను వివాదంలోకి లాగి కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేశారు. అనేక నర్మగర్భ వ్యాఖ్యలు, పరోక్ష హెచ్చరికలతో లలిత్ మోదీ వరుస ట్వీట్లు సంధిస్తున్న సంగతి తెలిసిందే. -
ఆ రాజసౌధంపై సవాల్ కు సిద్ధమా?
జైపూర్:ధోల్పూర్ రాజసౌధం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తిలో భాగమని.. ప్రభుత్వ పాత్ర ఏమీ లేకుండా రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీలు కలిసి దానిని భారీస్థాయి లగ్జరీ హోటల్గా మార్చారన్న కాంగ్రెస్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ సవాల్ విసిరిన బీజేపీ.. ధోల్ పూర్ ప్యాలెస్ వసుంధరా రాజే కుమారుడు దుష్యంత్ సింగ్ ఆస్తిగా స్పష్టం చేసింది. దీనిపై తాము విసిరిన ఛాలెంజ్ కు కాంగ్రెస్ సిద్ధంగా ఉందా? అని పార్టీ చీఫ్ అశోక్ పర్నామీ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన మంగళవారం మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఆ ప్యాలెస్ కు చెందిన డాక్యుమెంట్లను, కోర్టు, కుటుంబ సంబంధిత సెటిల్ మెంట్ పేపర్లను ఆయన మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ధోల్ పూర్ ప్యాలెస్ పూర్తిగా దుశ్యంత్ కు చెందిన ఆస్తిగానే ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తూ, నీచమైన రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. అవసరమైతే ఆర్టీఐ నుంచి డాక్యుమెంట్లను తెప్పించుకుని పరీక్షించుకోవచ్చని అశోక్ పేర్కొన్నారు. ఒకవేళ ప్యాలెస్ కు సంబంధించి ఎటువంటి అవతవకలకు పాల్పడినా.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఏం చేశారని ప్రశ్నించారు. రాజే.. లలిత్తో కలసి ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా అక్రమంగా, బలవంతంగా ఆక్రమించుకున్నారని కాంగ్రెస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ సౌధం రాజస్తాన్ ప్రభుత్వ ఆస్తి అని రాజే మాజీ భర్త హేమంత్సింగ్ ఒక కోర్టులో అంగీకరించారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సోమవారం ఢిల్లీలో విలేకర్లకు చెప్పారు. 1954 - 2010 మధ్య కాలానికి సంబంధించిన రెవెన్యూ శాఖ పత్రాలు కొన్ని.. ధోల్పూర్ రాజసౌధం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి అని చూపుతున్నాయని.. కానీ ప్రభుత్వ పాత్ర ఏమీ లేకుండా రాజే, లలిత్లు కలిసి దానిని భారీస్థాయి లగ్జరీ హోటల్గా మార్చారని, రూ. 100 కోట్లు పెట్టుబడులుగా పెట్టారని చెప్పారు. -
రాజసౌధాన్ని ఆక్రమించారు
వసుంధర, లలిత్మోదీలపై కాంగ్రెస్ దాడి తీవ్రం * ధోల్పూర్ ప్యాలెస్ను అక్రమంగా ఆక్రమించారని జైరాం రమేష్ ధ్వజం * ఆ ప్యాలెస్లోని హోటల్లో రాజే, ఆమె కుమారుడు దుష్యంత్, కోడలితో పాటు లలిత్మోదీకీ వాటాలు ఉన్నాయని ఆరోపణలు * రాజే ఎన్నికల అఫిడవిట్లోనే ఈ విషయం చెప్పారని వెల్లడి న్యూఢిల్లీ/జైపూర్: లలిత్ మోదీ వివాదంలో చిక్కుకున్న రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై కాంగ్రెస్ సరికొత్త ఆరోపణలతో ఒత్తిడి తీవ్రం చేసింది. ధోల్పూర్ రాజసౌధాన్ని(ప్యాలెస్ను) రాజే.. లలిత్తో కలసి ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా అక్రమంగా, బలవంతంగా ఆక్రమించుకున్నారని ఆరోపించింది. ఆ సౌధం రాజస్తాన్ ప్రభుత్వ ఆస్తి అని రాజే మాజీ భర్త హేమంత్సింగ్ ఒక కోర్టులో అంగీకరించారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సోమవారం ఢిల్లీలో విలేకర్లకు చెప్పారు. 1954 - 2010 మధ్య కాలానికి సంబంధించిన రెవెన్యూ శాఖ పత్రాలు కొన్ని.. ధోల్పూర్ రాజసౌధం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి అని చూపుతున్నాయని.. కానీ ప్రభుత్వ పాత్ర ఏమీ లేకుండా రాజే, లలిత్లు కలిసి దానిని భారీస్థాయి లగ్జరీ హోటల్గా మార్చారని, రూ. 100 కోట్లు పెట్టుబడులుగా పెట్టారని చెప్పారు. అయితే.. ఇది రాజస్తాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న 2009 సంవత్సరానికి ముందు జరగటం గమనార్హం. నియత్ హెరిటేజ్ హోటల్ ప్రైవేట్ లిమిటెడ్లో.. తన కుమారుడు, ఎంపీ అయిన దుష్యంత్ సింగ్, కోడలు నీహారిక, ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీలతో పాటు తనకూ వాటాలు ఉన్నాయని రాజే 2013 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారని రమేష్ తెలిపారు. ఆ సంస్థలో రాజేకు 3,280 షేర్లు, ఆమె కుమారుడికి 3,225 షేర్లు, కోడలికి మరో 3,225 షేర్లు, లలిత్కు చెందిన ఆనంద హెరిటేజ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 815 షేర్లు ఉన్నాయని అఫిడవిట్ చూపుతోందన్నారు. ఇది.. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు లలిత్కు రాజేకు మధ్య వ్యాపార సంబంధం, భాగస్వామ్యం, పన్నుల భారం లేని ప్రాంతం నుంచి విదేశీ పెట్టుబడులు పెట్టటాన్ని నిర్ధారిస్తోందని జైరాం పేర్కొన్నారు. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు లలిత్మోదీ మారిషస్ మార్గాన్ని వినియోగించుకున్నారని ఆరోపించారు. లలిత్గేట్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనాన్ని కొనసాగించటాన్ని ఎద్దేవా చేస్తూ ఆయనను ‘స్వామి మౌనానంద బాబా’గా జైరాం అభివర్ణించారు. ప్యాలెస్ యజమాని దుష్యంత్సింగే: బీజేపీ జైరాం ఆరోపణలను.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ పర్నామి, రాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేంద్ర రాథోడ్లు జైపూర్లో మీడియాతో మాట్లాడుతూ తిరస్కరించారు. ఈ రాజసౌధాన్ని హేమంత్సింగ్.. వసుంధర కుమారుడు దుష్యంత్సింగ్కు అప్పగించారని స్పష్టంగా చెప్తున్నాయంటూ పలు పత్రాలను ప్రదర్శించారు. రాజే ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పది రోజులుగా ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వపు సాధారణ పరిపాలన విభాగం 1956 డిసెంబర్లో ఒక నోటిఫికేషన్లో, ఆ తర్వాత కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల్లో.. ధోల్పూర్ ప్యాలెస్కు చట్టబద్ధ వారసుడిగా మహారాజా రాణా హేమంత్సింగ్ (దుష్యంత్ తండ్రి)ను ప్రకటించారని వివరించారు. అనంతరం 2007లో భరత్పూర్లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. ధోల్పూర్ ప్యాలస్ను దుష్యంత్కు అనుకూలంగా నిర్ణయించిందని.. దీనికి సంబంధించి హేమంత్సింగ్ డిక్రీ ఇచ్చారని, అది రిజిస్టరు కూడా అయిందని తెలిపారు. మునిసిపల్ పత్రాల్లో సైతం ఆ ప్యాలెస్ యజమానిగా దుష్యంత్ పేరునే పేర్కొన్నారని చూపారు. ధోల్పూర్ ప్యాలెస్పై యాజమాన్య హక్కులు దుష్యంత్కు ఉన్నాయనేందుకు తమ వద్ద ఆధారాలన్నీ ఉన్నాయని.. దీనికి సంబంధించి వాస్తవాలు తెలియకుండా సీఎంపై, ఆమె కుటుంబ సభ్యులపై జైరాం రమేష్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తప్పుపట్టారు. జవాబులెందుకు నిలిపేశారు?: చిదంబరం న్యూఢిల్లీ: లలిత్మోదీ గేట్ అంశంపై ఆర్టీఐ చట్టం కింద తాను అడిగిన ఏడు ప్రశ్నలకు సుష్మా స్వరాజ్ నేతృత్వంలోని విదే శాంగ శాఖ జవాబులను ఎందుకు నిలిపివేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం సోమవారం ట్విటర్లో ప్రశ్నించారు. ప్రశ్నలకు సమాధానాలను నిలిపివేసిన విషయం మంత్రి సుష్మకు తెలుసా అని కూడా ఆయన ప్రశ్నించారు. లలిత్ పాస్పోర్టు పునరుద్ధరణ వివాదంపై సమాచారమిచ్చేందుకు విదేశాంగ శాఖ నిరాకరించిందంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో చిదంబరం పై ప్రశ్నలు వేశారు. -
ప్రధాని స్పందించాల్సిన అవసరం ఏముంది?
న్యూఢిల్లీ:ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ ఉదంతంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌన ముద్ర దాల్చుతున్నారన్న కాంగ్రెస్ ఆరోపణలపై విదేశీ వ్యవహారాల సహాయమంత్రి వీకే సింగ్ మండిపడ్డారు. అసలు ప్రధానికి ఆ అంశంపై మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వచ్చే ప్రతీ ఆరోపణపై ప్రధాని స్పందించాలిన కోరడం భావ్యం కాదన్నారు. లలిత్ మోదీ అంశంపై ప్రధానిని ఎందుకు బలవంతం చేస్తున్నారంటూ వీకే సింగ్ ప్రశ్నించారు. అలా చేయడం సరైన పనేనా అంటూ కాంగ్రెస్ ను నిలదీశారు. ఒకవేళ ప్రధాని మాట్లాడాల్సి వస్తే దానికి తగిన సమయంలో తప్పకుండా స్పందిస్తారన్నారు. ఒక న్యూస్ ఛానల్ ఏదో ప్రసారం చేస్తే.. దానికి కూడా ప్రధాని స్పందించాలని అడగడం సరైన పద్ధతి అనిపించుకుంటుందా? అని విమర్శలను తిప్పికొట్టే యత్నం చేశారు. -
లలిత్ మోదీ లేఖ నిజమే: ఐసీసీ
దుబాయ్: ముగ్గురు అంతర్జాతీయ ఆటగాళ్లకు రియట్ ఎస్టేట్ దిగ్గజం భారీగా లంచం ఇచ్చినట్టు ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ తమకు లేఖ రాసింది నిజమేనని ఐసీసీ ధృవీకరించింది. ఈ వ్యవహారంపై మోదీ శనివారం ట్విట్టర్ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. ముడుపులు అందుకున్న వారిలో ఇద్దరు భారత్, ఒకరు విండీస్ ఆటగాడున్నట్టు ఆయన చెప్పారు. ‘మోదీ మాకు జూన్ 2013లో ఈ-మెయిల్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. ఆ సమయంలోనే దీన్ని ఏసీఎస్యూకు తెలిపాం. వారు బీసీసీఐ అవినీతి వ్యతిరేక యూనిట్కు కూడా పంపారు’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. అంతకుముందు మోదీ లేఖపై ఐసీసీ వివరణ ఇవ్వాల్సిన అవసరముందని బీహార్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు ఆదిత్య వర్మ డిమాండ్ చేశారు. -
'ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి'
హైదరాబాద్:ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ వ్యవహారంలో బీజేపీ నేతల పాత్రపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. లలిత్ మోదీ విదేశాలకు వెళ్లడానికి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధరా రాజేలు సహకరించారని ఆరోపణలు చుట్టుముట్టినా ప్రధాని నోరు ఎందుక మెదపడం లేదన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని ఆయన హెచ్చరించారు. ఏడాది పాలనలోనే బీజేపీ నేతలు చాలా అవినీతికి పాల్పడ్డారని ఖర్గే ఎద్దేవా చేశారు. -
'రాజెకు మోదీ వ్యాపార భాగస్వామి'
న్యూఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెకు ఐపీఎల్ మాజీ వివాదాస్పద కమిషనర్ లలిత్ మోదీ వ్యాపార భాగస్వామి అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రాజె కుమారుడు, ఎంపీ దుష్యంత్ సింగ్ కంపెనీలో మోదీ 13 కోట్ల రూపాయలు పెట్టుబడిపెట్టారని పేర్కొంది. 2013 ఎన్నికల సందర్భంగా రాజె దాఖలు చేసిన పత్రాలను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. నియంత్ హెరిటేజ్ హోటల్స్ లిమిటెడ్లో 3 వేల షేర్లు ఉన్నట్టు రాజె ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారని వెల్లడించింది. -
'మావాళ్లు మోదీని కలవడం తప్పు కాదు'
తాను లండన్లో ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రాలను కలిశానంటూ లలిత్ మోదీ చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. ఇన్నాళ్లుగా రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్లపై ఈ విషయంలో తీవ్రస్థాయిలో మండిపడుతున్న కాంగ్రెస్.. ఇప్పుడు ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. లలిత్ మోదీ వివాదంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ స్పందించారు. రాబర్ట్ వాద్రా, ప్రియాంకా గాంధీ ఇద్దరూ ప్రభుత్వంలో భాగం కారని, అందువల్ల వాళ్లు లలిత్ మోదీని కలిసినా తప్పు లేదని డిగ్గీ రాజా వ్యాఖ్యానించారు. అయినా వాళ్లు లలిత్ మోదీని కలవడం పెద్ద నేరమేమీ కాదుగా అని దిగ్విజయ్ సింగ్ అన్నారు. ''ప్రియాంకా గాంధీ ఏదైనా అధికారిక పదవిలో ఉన్నారా.. ఆమె ఎవరికోసమైనా రికమండ్ చేశారా.. ఆమె ఎందుకు తప్పు చేసినట్లవుతుంది?'' అంటూ మీడియా ప్రతినిధులను ఎదురు ప్రశ్నించారు. కాగితాల మీద లలిత్ మోదీకి సాయం చేసినవాళ్లు ఇప్పుడు ప్రియాంక, రాబర్ట్ వాద్రాలను తమ రక్షణ కోసం వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. -
'రేపు ఇంకొకరి పేరు చెబుతారు'
బెంగళూరు: ఆర్థిక నేరారోపణలతో దేశం విడిచి పారిపోయిన ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీపై కేంద్ర న్యాయశాఖ మంత్రి డీవీ సదానంద గౌడ మండిపడ్డారు. రోజుకొకరి పేరు తెరపైకి తెస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. నిరాధార ఆరోపణలు చేస్తూ కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చట్టం నుంచి లలిత్ మోదీ తప్పించుకోలేరని అన్నారు. 'ఈ రోజు ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా పేర్లు బయపెట్టిన లలిత్ మోదీ రేపు ఇంకొకరి పేరు చెబుతారు. ఆ తర్వాత మరొకరి పేరు బయటపెడతారు. గందరగోళం సృష్టించేందుకే ఇదంతా చేస్తున్నారు. దీనిక రాజకీయ కుట్ర ఉన్నట్టు కనబడుతోంద'ని సదానందా గౌడ అన్నారు. లండన్ లో ప్రియాంక, వాద్రాలను కలిశానని ట్విటర్ లో లలిత్ మోదీ పేర్కొన్నారు. -
గతేడాది రాహుల్, ప్రియాంకలను కలిశా: మోదీ
న్యూఢిల్లీ : ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ నుంచి మరో బుల్లెట్ వెలువడింది. ఎవరెవరు తనను కలిసింది, ఎక్కడ సమావేశమైంది తదితర విషయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్న లలిత్ మోదీ తాజాగా మరో కీలక విషయం వెల్లడించారు. తాను బీజేపీ నేతలను మాత్రమే కలవలేదని, కాంగ్రెస్ అగ్రనేతలతోనూ టచ్లో ఉన్నానని లలిత్ తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె-అల్లుడు ప్రియాంక రాబర్ట్వాధ్రాలను తాను కలుసుకున్నానని లలిత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ తో కూడా తాను భేటీ అయ్యానని లలిత్ తెలిపారు. గత ఏడాది లండన్లో ఆ ముగ్గురితో సమావేశం అయ్యానని తెలిపిన లలిత్ ఆ సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు కేంద్రంలో అధికారంలో ఉందని గుర్తు చేశారు. ఆనాటి సమావేశం గురించి ఆ ముగ్గురు వ్యక్తులు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. తాను వారిని రెస్టారెంట్ లో కలుసుకున్నప్పుడు గాంధీ కుటుంబీకులతో పాటు టిమ్మీ సర్నా ఉన్నాడని, అతడితో తన కాంటాక్ట్ నంబర్ ఉందన్నాడు. అతడికి కాల్ చేస్తే నేను ఏ విధంగా స్పందించానన్నది తెలుస్తుందని రెండో ట్వీట్ లలో మోదీ పేర్కొన్నాడు. కాగా లలిత్ మోదీకి వీసా పత్రాలకు సాయం చేశారని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలు తమ పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. 1/3 Happy to meet the Gandhi Family http://t.co/43iiC6mL9w in London. I had run into Robert and Priyanka separately pic.twitter.com/JTnaE6eX1A — Lalit Kumar Modi (@LalitKModi) June 25, 2015 2/3 in a resturant - they were with Timmy Sarna. He has my no. They can call me. Will tell them what I feel about pic.twitter.com/uz4SBMayXS — Lalit Kumar Modi (@LalitKModi) June 25, 2015 3/3 them exactly. Will mince no words. Will make no deal. But tell them witch hunt will now make them realize I was -
అవును.. ఆ సంతకం నాదే: వసుంధర రాజె
-
రాజస్థాన్ లో శరవేగంగా రాజకీయ పరిణామాలు
-
రాజస్థాన్ లో శరవేగంగా రాజకీయ పరిణామాలు
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ విదేశాలకు వెళ్లిపోవడానికి ముఖ్యమంత్రి వసుంధరా రాజే సహకరించారనే ఆరోపణలు తీవ్రం కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవికి వసుంధరా రాజీనామా చేస్తారని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె కుటుంబానికి ఆప్త మిత్రుడు, క్యాబినెట్ మంత్రి రాజేంద్ర రాథోడ్ తో గురువారం ఉదయం వసుంధర భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా ఈ రోజు మధ్యాహ్నం బీజేపీ అగ్రనేతలతో రాజేంద్ర రాధోడ్ సమావేశం కానున్నారు. వసుంధర సీఎంగా కొనసాగుతారని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ బుధవారం ప్రకటించినా.. పరిస్థితులు మారవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉందని ఢిల్లీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. లలిత్మోదీ విదేశాలకు వెళ్లిపోవడానికి వసుంధర రాజే సహకరించినట్లుగా స్పష్టమైన ఆధారాలుండటంతో ఆమె వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ తీవ్రతరం చేసింది. రాజే సంతకంతో కూడిన రహస్య పత్రాలను ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ బుధవారమిక్కడ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2011 ఆగస్టు 18వ తేదీతో ఉన్న ఆ పత్రాల్లో.. ‘ఇమిగ్రేషన్ కోసం లలిత్ పెట్టుకున్న దరఖాస్తుకు మద్దతుగా ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాను. అయితే నా ఈ సహాయాన్ని భారత అధికారులెవరికీ వెల్లడించవద్దనే స్పష్టమైన షరతు మీద మాత్రమే..’ అని ఉంది. దీనికోసమే ఆమె తన లండన్ పర్యటనను మరికొంతం కాలం పొడిగించుకున్నట్లు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. -
'లలిత్ కళా అకాడమీ తెరిచిన బీజేపీ'
న్యూఢిల్లీ: 'లలిత్ గేట్'లో చిక్కుకున్న తమ నాయకులను సమర్థించుకుంటున్న బీజేపీపైకి కాంగ్రెస్ పార్టీ విమర్శనాస్త్రాలు వదులుతూనే ఉంది. లలిత్ మోదీ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కాపాడేందుకు అధికార బీజేపీ 'లలిత్ కళా అకాడమీ' తెరిచిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి టామ్ వదక్కన్ ఎద్దేవా చేశారు. 'లలిత్ గేట్'లో చిక్కుకున్న వారిని ఏవిధంగా రక్షించాలనే దానిపై ఇందులో బీజేపీ అధికార ప్రతినిధులకు శిక్షణనిస్తారని వ్యంగ్యంగా అన్నారు. లలిత్ మోదీ బాధితుడని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. బాధితుడయితే రక్షణ కల్పించాల్సి వుంటుందని గుర్తు చేశారు. -
మోదీగేట్: ఈసారి ఎన్ని వికెట్లో?
లలిత్ మోదీ.. మన ప్రధాని నరేంద్ర మోదీ కంటే కూడా ఈ పేరుకు ఒకప్పుడు ఎంతో ప్రాచుర్యం. ఐపీఎల్ సృష్టికర్తగా మోదీ ఓ వెలుగు వెలిగారు. సినీ తారలు, కార్పొరేట్ దిగ్గజాలను ఆకర్షించి.. ప్రపంచ క్రికెటర్లందినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి ఐపీఎల్ను సృష్టించారు. ఐపీఎల్ విజయవంతం కావడంలో మోదీదే కీలకపాత్ర. ఒకప్పుడు ప్రపంచంలోని వంద శక్తిమంతుల జాబితాలో కూడా లలిత్ మోదీ స్థానం సంపాదించాడంటే ఆయన స్థాయి ఏపాటిదో ఊహించుకోవచ్చు. అయితే ఇదంతా నాణేనికి ఓ పార్శ్వం మాత్రమే. ఐపీఎల్ కమిషనర్గా ఎంతో కీర్తిప్రతిష్టలు సంపాదించిన మోదీ.. ఆర్థిక అవకతవకలకు పాల్పడి పాతాళానికి దిగజారారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు దేశం నుంచి పారిపోయి లండన్లో తలదాచుకుంటున్నారు. ఈడీ, ఐటీ విచారణలకు సహకరించకుండా కాలం వెళ్లదీస్తున్నారు. మోదీ ఎఫెక్ట్కు గతంలో కేంద్ర మంత్రి శశిథరూర్ మాత్రమే పదవి పోగొట్టుకోగా.. ప్రస్తుతం ఎంతో మంది పదవులు అనుమానంలో పడ్డాయి. ఐపీఎల్ ఫ్రాంచైజీ కొచ్చి టస్కర్స్లో నాటి కేంద్రమంత్రి శశి థరూర్ భార్య సునంద్ పుష్కర్ కు వాటాలున్నాయని మోదీ బాంబు పేల్చారు. ఈ యాజమాన్యానికి శశి థరూర్ సాయం చేసినందుకు ప్రతిగా సునందకు ఉచితంగానే వాటాలు ఇచ్చారని మోదీ ఆరోపించారు. ఈ దెబ్బకు థరూర్ మంత్రి పదవి ఊడింది. ఆ తర్వాత మోదీకి కష్టాలు ఆరంభమయ్యాయి. ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఐపీఎల్ కమిషనర్ పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. కేసు నుంచి తప్పించుకునేందుకు 2010లో మోదీ లండన్ పారిపోయారు. తాజాగా లలిత్ మోదీ మరో తేనెతుట్టెను కదిపారు. ఆయనకు వీసా మంజూరు విషయంలో సాయం చేశారంటూ ప్రస్తుత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. న్యాయవాదులైన సుష్మా భర్త, కుమార్తె కూడా మోదీ సేవలోనే తరించారంటున్నారు. ఇక రాజస్థాన్ సీఎం వసుంధర రాజె పేరు కూడా మోదీ వీసా విషయంలో బయటకు వస్తోంది. వసుంధర కుమారుడు, ఎంపీ దుష్యంత్ కంపెనీలో లలిత్ మోదీ పెట్టుబడులు పెట్టారు. నిందితుడిగా ఉన్న మోదీకి బీజేపీ నేతలు సాయం చేయడంపై పెద్ద దుమారమే చెలరేగింది. వీరు రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ తొలుత మౌనం పాటించినా ఆనక తమవారిని సమర్థించింది. ఈ వివాదం కొనసాగుతుండగానే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఢిల్లీ జిల్లాల క్రికెట్ సంఘం (డీడీసీఏ) కుంభకోణంలో ప్రమేయముందని మోదీ మరో బాంబు పేల్చారు. బ్రహ్మాండం బద్దలయ్యే విషయాలెన్నో వెల్లడిస్తానని ట్వీట్ చేశారు. ఇక ఈడీ కేసు విచారణలో నిందితుడిగా అజ్ఞాతంలో ఉన్న మోదీని లండన్లో ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా కలిసిన సంఘటన వెలుగు చూడటం కలకలం రేపింది. రాకేష్పై చర్యలు తీసుకునేందుకు మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం సిద్ధం కావడంతో.. ఎన్డీయే పక్షాలు బీజేపీ, శివసేన మధ్య చిచ్చు రగిలింది. మోదీ ఈ వ్యవహారం చివరకు ఎక్కడికి దారితీస్తుందో? ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ చేస్తే ఎంతమంది పదవులు ఊడుతాయో? -
మోదీ ఎఫెక్ట్: రాజె లండన్ టూర్ రద్దు
జైపూర్: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ వివాదం రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెను వెంటాడుతోంది. రాజె లండన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. మోదీ వ్యవహారంలో రాజెపై విమర్శలు రావడమే దీనికి కారణమని భావిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న రాజె బ్రిటన్ పర్యటనకు వెళ్లాల్సివుంది. లండన్లో వ్యాపారవేత్తలతో సమావేశం కావాల్సివుంది. కాగా ఈ నెల 28న ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొనాల్సివున్నందున వసుంధర బ్రిటన్ పర్యటనను రద్దు చేసుకున్నారని సీఎంఓ ప్రతినిధి ఒకరు చెప్పారు. మోదీకి వీసా మంజూరు విషయంలో రాజెతో పాటు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సాయం చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆర్థిక అవకతవకలకు పాల్పడిన మోదీ విచారణకు సహకరించకుండా లండన్లో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజె లండన్ పర్యటన రద్దు కావడం చర్చనీయాంశంగా మారింది. -
సుష్మ, రాజెలపై మరో పిడుగు
న్యూఢిల్లీ: 'లలిత్ గేట్'లో ఉక్కిరిబక్కిరి అవుతున్న బీజేపీ నాయకులు సుష్మా స్వరాజ్, వసుంధరా రాజెలపై మరో పిడుగు పడింది. సొంత పార్టీ ఎంపీ ఒకరు వారి చర్యలను బహిరంగంగా తప్పుబట్టారు. ఆర్థిక నేరాలకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి చట్టపరంగా, నైతికంగా సహాయం చేసినా తప్పేనని బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్ అన్నారు. లలిత్ మోదీని స్వదేశానికి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. లలిత్ మోదీకి సుష్మ, రాజె సహాయం చేయడంపై రాజకీయం దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే వీరిపై సొంత పార్టీ ఎంపీ బహిరంగంగా విమర్శలు చేయడంతో కమలం పార్టీలో కలకలం రేగింది. కాగా, లలిత్ మోదీ- రాజె తనయుడు దుష్యంత్ సింగ్ పెట్టుబడులపై దర్యాప్తు కొనసాగుతోందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. -
మోదీ లండన్ వెళ్లాక ఈమెయిల్స్ తొలగింపు
న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ వ్యవహారంలో మరో అంశం వెలుగు చేసింది. 2010లో మోదీ లండన్ వెళ్లిపోయాక ఆయన సెక్రటరీ దీపా పాలేకర్.. మోదీకి సంబంధించిన ఈమెయిల్స్ అన్నింటినీ తొలగించారు. ఐపీఎల్, వ్యాపార లావాదేవీలు, రాజకీయ ప్రముఖులతో మోదీకి సంబంధించిన ఈమెయిల్స్ అన్నింటినీ మాయం చేశారు. దీపకు 8 ఈమెయిల్ ఎకౌంట్లు ఉండేవి. 2010 తర్వాత కమ్యూనికేషన్స్ కోసం ఓ ఈమెయిల్ ఎకౌంట్ను వాడుకుని మిగిలినవి తొలగించారని ఐటీ విచారణలో వెల్లడైంది. మోదీ వ్యాపారాలన్నింటినీ దీపనే చూసేవారు. మోదీకి సెక్రటరీనే గాక ఆయనకు చెందిన 9 కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నారు. ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాక మోదీ లండన్ వెళ్లారు. ఆ తర్వాత ఆదాయపన్ను శాఖ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసింది. ఐటీ అధికారులు ఈమెయిల్స్ విషయంపై దీపను ప్రశ్నించగా.. పని పూర్తయినందున వీటిని తొలగించినట్టు చెప్పారు. ఇతర ఈమెయిల్స్ ఎకౌంట్లు కంప్యూటర్లో సమస్య కారణంగా తొలగిపోయానని దీప తెలిపారు. ఐపీఎల్ వ్యవహారాలు సహా 2010కి ముందు మోదీకి సంబంధించిన ఈమెయిల్స్ తన వద్ద లేవని దీప చెప్పారు. -
లలిత్ మోదీతో భేటీపై మారియా వివరణ
ముంబై: మనీ లాండరింగ్ సహా ఇతర ఆర్థిక ఆరోపణలు ఎదుర్కొంటూ లండన్కు పరారైన ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీతో భేటీపై మహారాష్ట్ర ప్రభుత్వానికి ముంబై పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా వివరణ ఇచ్చారు. మరియా గతేడాది లండన్లో లలిత్ ను కలిసిన విషయం వెల్లడి కావడంతో ప్రభుత్వం ఆయనను వివరణ కోరింది. మోదీ న్యాయవాది పట్టుబట్టడంతో తాను లలిత్ మోదీని కలిసింది వాస్తవమేనని రాకేశ్ అంతకుముందు అంగీకరించారు. అయితే, తాను లండన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే హోం మంత్రికి ఆ విషయం తెలియజేశానని తెలిపారు. లలిత్ మోదీ, రాకేశ్ మరియా కలిసి ఉన్న ఫొటోను శనివారం తొలుత ఓ టీవీ చానెల్ ప్రసారం చేయడంతో దుమారం రేగింది. -
అరుణ్ జైట్లీపై మోదీ తీవ్ర ఆరోపణలు
న్యూయార్క్: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ వ్యవహారంలో బీజేపీ కీలక నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే విమర్శలపాలవగా.. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేరు తెరపైకి వచ్చింది. జైట్లీని లక్ష్యంగా చేసుకుని మోదీ విమర్శలు చేశాడు. జైట్లీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు చేస్తూ మోదీ ట్వీట్లు చేశాడు. జైట్లీని కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా మోదీ ఆరోపించాడు. ఢిల్లీ జిల్లా క్రికెట్ సంఘం (డీడీసీఏ) స్కాంలో జైట్లీ ప్రమేయముందని ఆరోపించాడు. జైట్లీ తన ఫోన్ కాల్స్ డేటాను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశాడు. కాగా మోదీ వ్యాఖ్యాలపై స్పందించేందుకు జైట్లీ నిరాకరించారు. మోదీ వ్యాపారంలో భాగంగాగానే 11 కోట్ల రూపాయలను రాజస్థాన్ ముఖ్యమంత్రి కుమారుడు, ఎంపీ దుష్యంత్ సింగ్కు చెందిన కంపెనీలో పెట్టుబడులు పెట్టారని జైట్లీ చెప్పారు. ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదీకి వీసా మంజూరు విషయంలో సాయపడినందుకు సుష్మా, వసుంధర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. -
బ్రిటన్ రాజకుటుంబాన్నీ వదల్లేదు
లలిత్ మోదీ ట్రావెల్ డాక్యుమెంట్లకోసం ఆండ్రూ పేరు వాడుకున్నట్లు కథనాలు లండన్/ వాషింగ్టన్/ భోపాల్ : ఆర్థిక నేరాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ బ్రిటన్ హోంశాఖనుంచి ట్రావెల్ డాక్యుమెంట్లు పొందడానికి బ్రిటన్ యువరాజు చార్లెస్, ఆయన సోదరుడు ఆండ్రూతోపాటు ఇతర రాజ కుటుంబీకుల పేర్లను కూడా వాడుకున్న సంగతి వెలుగులోకి వచ్చింది. ఆదివారం సండేటైమ్స్ అనే పత్రిక ఈ విషయాన్ని బయటపెట్టింది. ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్-2 రెండో కుమారుడు, డ్యూక్ ఆఫ్ యార్క్ ఆండ్రూకు లలిత్ మోదీ చాలా ఏళ్లనుంచి తెలుసునని, మోదీకి ట్రావెల్ డాక్యుమెంట్లు మంజూరు కావడానికి కొద్దిరోజుల ముందు గత ఏడాది జూలైలో లండన్లో ఆండ్రూ, మోదీని కలిశారని ఆ పత్రిక వెల్లడించింది. ఇదిలా ఉంటే వీరిద్దరిమధ్య జరిగిన సంభాషణలను వెల్లడించడానికి బకింగ్హామ్ ప్యాలెస్ వర్గాలు నిరాకరించాయి. అయితే లలిత్ మోదీకి ట్రావెల్ డాక్యుమెంట్లు ఇప్పించడానికి ఆండ్రూ ఎలాంటి సిఫారసులు చేయలేదని ఆ వర్గాలు స్పష్టంచేశాయి. కాగా, మోదీకి ట్రావెల్ డాక్యుమెంట్లు ఇప్పించడంలో భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ సాయం చేశారన్న విషయం బయటకు రావడం భారత్లో తీవ్ర దుమారం సృష్టించిన సంగతి తెలిసిందే. మానవతా దృక్పథంతో మాటసాయం చేశానని సుష్మా చెబుతున్నప్పటికీ ఆమె రాజీనామా చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. స్పందించని జైట్లీ లలిత్ మోదీ వ్యవహారంపై వ్యాఖ్యానించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిరాకరించారు. శనివారం వాషింగ్టన్లో మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేశారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు?, లలిత్కు సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్తాన్ సీఎం వసుంధర రాజే ఎప్పుడు రాజీనామా చేస్తారు.. అని మీడియా ప్రశ్నలు సంధించగా జైట్లీ సమాధానాలు చెప్పలేదు. అయితే వసుంధర రాజే కుమారుడు, బీజేపీ నేత దుశ్యంత్ సింగ్కు లలిత్ మోదీకి మధ్య జరిగిన రూ.11 కోట్ల వాణిజ్య లావాదేవీలు వ్యక్తిగతంగా వారిద్దరికి సంబంధించినవని జైట్లీ పేర్కొన్నారు. చాలా ఏళ్లకిందట వీరిమధ్య బ్యాంకుల ద్వారా చెక్కుల రూపంలో జరిగిన రుణ లావాదేవీలకు ప్రభుత్వానికి ఏం సంబంధం ఉందని జైట్లీ అన్నారు. సుష్మకు మరో తలనొప్పి ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీకి సాయం చేశారన్న అంశంపై ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్కు ఇప్పుడు మరో తలనొప్పి వచ్చిపడింది. సుష్మ భర్త, ఆమె కూతురిని ప్రభుత్వ లాయర్లుగా మధ్యప్రదేశ్ సర్కారు నియమించడం ఇప్పుడు తాజా వివాదంగా మారింది. అయితే ఇందులో ఎలాంటి తప్పు జరగలేదని, నిబంధనల ప్రకారమే వారి నియామకం జరిగిందని బీజేపీ విపక్షాల విమర్శలను ఖండిస్తోంది. -
సుష్మాకు మరో తలనొప్పి?
భోపాల్: భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్కు మరో కొత్త తలనొప్పి తయారైంది. ఇప్పటికే లలిత్ మోడీకి వీసా ఇప్పించేందుకు సహాయపడినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మా స్వరాజ్ సరికొత్త వివాదంలో చిక్కుకోబోతున్నారని తెలుస్తోంది. ఆమె భర్త, కుమార్తెలను మధ్యప్రదేశ్ ప్రభుత్వం నేరుగా ప్రభుత్వ అడ్వకేట్లుగా నియామకాలు చేపట్టినట్లు ఓ సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. దీంతో భారీ స్థాయిలో మరోసారి విమర్శలు తలెత్తాయి. కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మరోసారి విరుచుకుపడింది. అయితే, నిబంధనల ప్రకారమే వారి నియామకాలు జరిపినట్లు, వారి మెరిట్ ఆధారంగానే అడ్వకేట్లుగా నియామకం చేసినట్లు ప్రభుత్వం తరుపు అధికారులు ప్రకటించారు. అజయ్ దుబే అనే సామాజిక ఉద్యమకారుడు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయగా సుష్మా భర్త స్వరాజ్ కౌశల్, కుమార్తె బన్సూరీ కౌశల్ 2009, 2013 సంవత్సరాల్లో నియామకాలు జరిపినట్లు తెలిపారు. -
లలిత్ మోదీని ఎందుకు కలిశారు?
ముంబై: మనీ లాండరింగ్ సహా ఇతర ఆర్థిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ లలిత్ మోదీని గతేడాది లండన్ లో ముంబై నగర పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా కలవడంపై మహారాష్ట్ర ప్రభుత్వం వివరణ కోరింది. అసలు లలిత్ మోదీని ఎందుకు కలిశారో చెప్పాలంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. గత సంవత్సరం జూలై 17 వ తేదీన మోదీని మారియా కలిసిన సంఘటన ప్రస్తుత్తం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలను ఓ న్యూస్ ఛానల్ విడుదల చేయడంతో మారియా-లలిత్ మోదీల భేటీ అంశం వెలుగు చూసింది. దీనిపై ప్రభుత్వం విచారణ చేపట్టినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ఇందులో అసంబద్ధతతో కూడిన ఏవైనా కారణాలు ముడిపడి ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. -
బ్రిటన్ రాజులనూ వదలని లలిత్ మోదీ
లండన్: మనీ లాండరింగ్ సహా తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ.. బ్రిటన్ రాజకుంటుబాన్ని వదలలేదు. బ్రిటన్ రాజు చార్లెస్, ఆయన సోదరుడు ఆండ్రూ పేర్లు వాడుకుని యూకే హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి లలిత్ మోదీ ట్రావెట్ డాక్యుమెంట్లు పొందినట్టు 'ద సండే టైమ్స్' వెల్లడించింది. క్వీన్ ఎలిజబెత్ రెండో కుమారుడైన ఆండ్రూతో ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకుని లలిత్ ప్రయాణ పత్రాలు పొందారని తెలిపింది. ట్రావెల్ డాక్యుమెంట్స్ తన చేతికి రావడానికి కొన్ని రోజుల ముందే ఆండ్రూను మోదీ కలిశారని వెల్లడించింది. లలిత్ మోదీకి బ్రిటన్ ట్రావెల్ డాక్యుమెంట్స్ అందేందుకు సుష్మా స్వరాజ్, అంతకుముందు బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ విషయంలో వసుంధర రాజే సహకరించారన్న వార్తలు వెలుగులోకి రావడంతో భారత్ లో రాజకీయ దుమారం లేచిన విషయం తెలిసిందే. -
ఎక్కడ చెడింది?
‘మోదీగేట్’లో వసుంధర రాజే పేరు తెరపైకి రావడం వెనుక కథ! ‘మోదీగేట్’లో రాజస్తాన్ సీఎం వసుంధర రాజే పేరు హఠాత్తుగా తెరపైకి రావడం వెనుక పెద్ద కథే ఉంది. లలిత్ మోదీ బ్రిటన్ ట్రావెల్ డాక్యుమెంట్స్ పొందేందుకు మాట సాయం చేసిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పేరే మొదట తెరపైకి వచ్చింది. కానీ హఠాత్తుగా రాజే, ఆమె కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్ల పేర్లు, లలిత్తో వారి సాన్నిహిత్యం పతాక శీర్షికలకెక్కాయి. ‘మోదీగేట్’లో రాజే పాత్రను వెల్లడి చేసింది స్వయంగా లలితే. బీసీసీఐలో లలిత్ ప్రస్థానానికి సంపూర్ణ సాయం చేసింది రాజేనే. ఆమె మద్దతుతోనే.. రాజస్తాన్ క్రికెట్ సంఘం నుంచి ప్రారంభించి, బీసీసీఐని శాసించే స్థాయికి లలిత్ ఎదిగారు. ఐపీఎల్ ఆయన బ్రెయిన్ చైల్డే. ఐపీఎల్ వ్యవస్థాపక చైర్మన్ కూడా లలితే. ఐపీఎల్తో తారస్థాయికి చేరి.. అదే ఐపీఎల్లో అవకతవకలకు పాల్పడి అధఃపాతాళానికి చేరాడు. - సెంట్రల్ డెస్క్ లలిత్ వెనుక రాజే.. 2005లో జరిగిన రాజస్తాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్సీఏ) అధ్యక్ష ఎన్నికల్లో అప్పటివరకు ఎవరికీ అంతగా తెలియని లలిత్ మోదీ.. అప్పటికే 40 ఏళ్లుగా రాజస్తాన్ క్రికెట్ను శాసిస్తున్న రుంగ్తా కుటుంబానికి చెందిన కిషోర్ రుంగ్తాను ఓడించాడు. లలిత్ విజయం వెనుక, తెరవెనుక కృషి అంతా అప్పుడు కూడా సీఎంగా ఉన్న రాజేదే. రాజస్తాన్లోని అన్ని జిల్లా క్రికెట్ సంఘాలు, వ్యక్తిగత సభ్యులు అంతా రుంగ్తా కుటుంబానికి విశ్వాసపాత్రులే. దాంతో సీఎంగా అధికారాన్ని ఉపయోగించిన రాజే జిల్లా క్రికెట్ సంఘాలను బెదరించి, రిగ్గింగ్ జరిపి లలిత్ గెలుపునకు బాటలు వేశారని వార్తలు వచ్చాయి. వ్యక్తిగత సభ్యులు కిషోర్త్కు ఓటేయకుండా వారికి ఓటు హక్కుల్ని తొలగిస్తూ ఆర్డినెన్సునే జారీ చేశారు. రాజే కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో లలిత్.. రాజస్తాన్ సూపర్ సీఎంగా వ్యవహరించారన్న ఆరోపణలూ వచ్చాయి. వ్యాపార సంబంధాలు.. 2007లో.. రాజస్తాన్ ప్రభుత్వం సీఎం వసుంధర రాజే కూడా ఒక ప్రమోటర్గా అంబర్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీని ప్రారంభించింది. ఆ అథారిటీ పురాతత్వ ప్రాముఖ్యమున్న, 2 వేల గజాల విస్తీర్ణంలో ఉన్న రెండు హవేలీలు.. చాబ్రోంకి హవేలీ(466 గజాలు), బైరాతియోంకి హవేలీ(1,463 గజాలు)లను అంబర్ హెరిటేజ్ సిటీ కన్స్ట్రక్షన్ సంస్థకు కారుచవకగా అమ్మేసింది. చాబ్రోంకిని రూ. 9 లక్షలకు, బైరాంకిని రూ. 21 లక్షలకు అమ్మేసింది. ఆ తరువాత ఆ అంబర్ హెరిటేజ్ సంస్థ.. ఆనంద్ హోటల్స్గా పేరు మార్చుకుంది. ఈ ఆనంద్ హోటల్స్ సంస్థ ప్రమోటర్స్ ఎవరో కాదు.. మోదీ, ఆయన భార్య మినాల్. ఈ అంశంతో పలు ఇతర అవినీతి ఆరోపణలూ రావడం రాజే ప్రతిష్టను దిగజార్చింది. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి అంశంగా ప్రచారం చేపట్టిన కాంగ్రెస్ లలిత్ను పవర్ బ్రోకర్గా అభివర్ణించింది. ఆ ఎన్నికల్లో రాజే ఓడిపోయారు. మోదీ వర్సెస్ రాజే.. ఆ తర్వాతా లలిత్, రాజేల మధ్య.. వారి కుటుంబాల మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. ఐపీఎల్ అవకతవకలు బయటపడ్డాక 2013 సెప్టెంబర్లో బీసీసీఐ లలిత్పై జీవితకాల నిషేధం విధించింది. అయినా, పట్టించుకోని రాజే(2013 ఎన్నికల్లో ఆమె ఘనవిజయం సాధించి మళ్లీ సీఎం అయ్యారు) 2014 మేలో లలిత్ ఆర్సీఏ అధ్యక్షుడయ్యేలా చూశారు. దాంతో ఆగ్రహించిన బీసీసీఐ ఆర్సీఏను సస్పెండ్ చేసింది. దేశవాళీ పోటీల్లో రాజస్తాన్ క్రికెటర్లపై నిషేధం విధించింది. ఆ క్రికెటర్లు హైకోర్టును ఆశ్రయించడంతో.. కోర్టు ఆదేశాల మేరకు వారికి మళ్లీ ఆడే అవకాశం కల్పించారు. ఆ తరువాతే, ఆర్సీఏ ఉపాధ్యక్షుడు అమిన్ పఠాన్ నేతృత్వంలోని మోదీ వ్యతిరేక బృందం రాజేకు దగ్గరైంది. 2014, అక్టోబర్లో రాజస్తాన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి లలిత్ తొలగింపుతో లలిత్, రాజేల మధ్య విబేధాలు ప్రారంభమయ్యాయి. లలిత్ స్థానంలో బీజేపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కన్వీనర్, లలిత్కు ఒకప్పటి అనుచరుడు అమిన్ పఠాన్ ఆర్సీఏ అధ్యక్షుడు కావడం వెనుక రాజే హస్తం ఉందని లలిత్ భావించాడు. ఆ నియామకాన్ని లలిత్ సవాలు చేయడంతో.. 2015 మార్చిలో ఆర్సీఏ జనరల్ బాడీ సమావేశంలో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టి మరీ తొలగించారు. దీనిపై లలిత్ గ్రహం ఆయన ట్వీట్స్లో కనిపించింది. ‘నా దగ్గర చాలా మిస్సైల్స్ ఉన్నాయి, జాగ్రత్త’ అని రాజేను ఉద్దేశించి హెచ్చరిస్తూ ట్వీట్ చేశాడు. తర్వాత తన పీఆర్ బృందం ద్వారా.. 2010లో తన బ్రిటన్ ఇమ్మిగ్రేషన్కు రాజే సహకరించడానికి సంబంధించిన డాక్యుమెంట్ను మీడియాకు విడుదల చేశాడు. తర్వాత పలు ట్వీట్ల ద్వారా, సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయికి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా రాజేను ‘మోదీగేట్’లో భాగం చేశాడు. లలిత్, రాజేల విభేదాలు తీవ్రం కావడానికి కేంద్ర మంత్రి అరుణ్జైట్లీ కూడా ఒక కారణమన్న వార్తలు సైతం వినిపిస్తున్నాయి. -
లలిత్ మోదీ ఎందుకు ఎదురు తిరిగారు?
న్యూఢిల్లీ: ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ చీఫ్ లలిత్ మోదీ బ్రిటన్ ఇమిగ్రేషన్ వీసా కేసులో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె పీకలోతువరకు ఇరుక్కుపోయారు. తన ఇమిగ్రేషన్ వీసాకు సిఫారసు చేసింది వసుంధర రాజె అని ముందుగా వెల్లడించిన లలిత్ మోదీ 2012, 2013లలో తన బార్య మినాల్ను పోర్చుగల్ కేన్సర్ ఆస్పత్రికి వసుంధర రాజెనే స్వయంగా తీసుకెళ్లారని కొత్తగా బయటపెట్టారు. ఈ విషయాన్ని ఆయన మాంటెనిగ్రోలో ‘ఇండియా టుడే టీవీ’ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అందుకేనేమో ఈ వ్యవహారంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ను వెనకేసుకొస్తున్న ప్రధాని మోదీ ప్రభుత్వం వసుంధర గురించి మాట్లాడడం లేదు. 30 ఏళ్ల నుంచి వసుంధర రాజె తనకు ఫ్యామిలీ ఫ్రెండని, తన భార్యకు అత్యంత సన్నిహితురాలని చెబుతున్న మోదీ, హఠాత్తుగా వసుంధర రాజె కు ఎందుకు ఎదురు తిరిగారు? తన ఎదుగుదలకు ఆమె కారణమని చెబుతూ వచ్చి, అందుకు ప్రతిఫలంగా(క్విడ్ ప్రోకో) ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్కు చెందిన ‘నియంత్ హెరిటేజ్ హోటల్ ప్రవేట్ లిమిటెడ్ కంపెనీలో పది రూపాయల షేరును ఏకంగా 96 వేల రూపాలకు కొనుగోలు చేసిన మోదీ ఎందుకు ఆమెను ఈ కేసులో ఇరికిస్తున్నారనే సందేహం ఎవరికైనా రావచ్చు. దీనివెనక పెద్ద కథే ఉంది. ఐపీఎల్ ఫిక్సింగ్, ఫెమా కేసుల్లో నిందితుడైన లలిత్ మోదీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు 2013, సెప్టెంబర్ నెలలో బోర్డు నుంచి శాశ్వతంగా వెలివేసిన విషయం తెల్సిందే. ఆదే ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన వసుంధర రాజె తన పలుకుబడిని ఉపయోగించి రాజస్థాన్ క్రికెట్ అసోసియోషన్ అధ్యక్షుడిగా లలిత్ మోదీ ఎన్నికయ్యేలా చూశారు. 2014, మే నెలలో రాజస్థాన్ క్రికెట్ అసోసియోషన్కు మోదీ ఎన్నికవడం పట్ల బీసీసీఐ కన్నెర్ర చేసింది. తాము శాశ్వతంగా బహిష్కరించిన ఓ వ్యక్తిని ఎలా ఎన్నుకుంటారంటూ రాజస్థాన్ క్రికెట్ అసోసియోషన్ను హెచ్చరించడమే కాకుండా ఏ లీగ్ మ్యాచుల్లోనూ ఆ రాష్ట్ర జట్టును ఆడనీయమని తాకీదు ఇచ్చింది. దీనిపై అసోసియోషన్ కోర్టుకెక్కింది. రాష్ట్రానికి చెందిన దాదాపు 75 మంది క్రికెట్ క్రీడాకారులు తాము రోడ్డునపడుతున్నామంటూ ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పైనుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు వసుంధర రాజె జోక్యం చేసుకొని 2014, అక్టోబర్ నెలలో లలిత్ మోదీని తొలగించి, ఆ స్థానంలో రాష్ట్ర బీజేపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు అమిన్ పఠాన్ను ఎంపికయ్యేలా చూశారు. దీంతో లండన్లోవున్న మోదీకి కోపం వచ్చింది. ఆగ్రహంతో వసుంధర రాజె స్థానంలో బీజేపీ నాయకులు ఓం మాథూర్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సిందిగా కూడా రాష్ట్ర బీజేపీ నేతలకు ట్వీట్ పంపించారు. లలిత్ మోదీకి ఇమిగ్రేషన్ వీసా ఇవ్వండంటూ సిఫారసు లేఖపై సంతకం చేసిన వసుంధర రాజె, అసలు సంతకం చేశానా, లేదా, ఏ పత్రం మీద సంతకం చేశానో కూడా గుర్తులేదంటూ బుకాయిస్తున్న వసుంధర రాజె, మోదీ వెల్లడించిన తాజా అంశంపై ఓం మాట్లాడతారో చూడాలి. -
సంస్కరణలు.. చకచకా
♦ గ్లోబల్ ఇన్వెస్టర్లకు జైట్లీ హామీ ♦ 7.5 శాతం కన్నా అధిక వృద్ధి సాధ్యమేనని ధీమా ♦ 10 రోజుల అమెరికా పర్యటన ప్రారంభం న్యూయార్క్ : దేశంలో సంస్కరణల ప్రక్రియను మోదీ ప్రభుత్వం మరింత వేగవంతం చేస్తుందని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ అన్నారు. భారత్కు 7.5 శాతం కన్నా అధికంగా మంచి ఆర్థికవృద్ధి రేటును సాధించే సత్తా ఉందని పేర్కొంటూ... పెట్టుబడులకు దేశం అత్యుత్తమమైన ప్రాంతమని తెలిపారు. 10 రోజుల అమెరికా పర్యటనను బుధవారం ప్రారంభించిన జైట్లీ, దేశానికి పెట్టుబడులు ఆకర్షించడమే ప్రధాన ధ్యేయంగా గ్లోబల్ ఇన్వెస్టర్లతో సమావేశాలు జరుపుతున్నారు. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ని సందర్శించారు. భారత్లో స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు ముగిసి, స్థిరత్వం నెలకొంటుందని అన్నారు. పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడిన ముఖ్యాంశాల్లో కొన్ని.... ► భారత్లో గత ఏడాదిగా సంస్కరణల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాం. ఈ ప్రక్రియ మున్ముం దు మరింత క్రియాశీలకంగా కొనసాగుతుంది. ► భారత్ పన్నుల వ్యవస్థ సంస్కరణలపై సైతం కేంద్రం దృష్టి సారించింది. ముఖ్యంగా గత ఎంతో కాలంగా సమస్యాత్మకంగా ఉన్న పన్నుల చట్ట సంస్కరణలకు కేంద్రం కట్టుబడి ఉంది. వస్తువులు, సేవల పన్ను(జీఎస్టీ) మొత్తం పరోక్ష పన్నుల వ్యవస్థను సమూలంగా ప్రయోజనాత్మకంగా మార్చడానికి దోహదపడుతుంది. విదేశీ ఇన్వెస్టర్లకు పన్ను పరమైన అడ్డంకుల్లేకుండా ప్రభుత్వం తగిన చొరవలు తీసుకుంటోంది. ► కార్పొరేట్ పన్నులను అంతర్జాతీయ పోటీ పూర్వక స్థాయిలో రానున్న నాలుగేళ్లలో 25% స్థాయికి తీసుకువెళతామని బడ్జెట్లో పేర్కొన్నాం. ► భారత్లో భారీ పెట్టుబడుల ద్వారా వృద్ధి ప్రక్రియలో మాకు సహకరించాలని కోరడానికి నేను అమెరికాకు వచ్చాను. వృద్ధి ద్వారా దేశంలో పేదరిక నిర్మూలన మా లక్ష్యం. అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచీ చక్కటి ప్రతిస్పందన ఉంది. గత ఏడాది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) 39 శాతం పెరగడం సానుకూల అంశం. ► రానున్న సంవత్సరాల్లో 7.5 శాతంకన్నా అధిక వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ఏడాది వృద్ధి 8 శాతం ఉంటుందని అంచనా. భవిష్యత్తులో మరింత వృద్ధి ప్రభుత్వ ధ్యేయం. కొత్త జీడీపీ గణాంకాలు విశ్వసనీయమైనవే. ► పెట్టుబడులకు సంబంధించి భారత్-చైనాలను ఒకదానితో ఒకటి పోల్చలేం. ఇటీవలే మేము మంచి వృద్ధి రేటును సాధించాం. అయితే చైనా మూడు దశాబ్దాలకు పైగా 9 శాతంపైన వృద్ధిని నమోదుచేసుకుంది. చైనా తరహాలో వృద్ధి రేటును సాధించాలన్నదే మోదీ ప్రభుత్వ లక్ష్యం. ► అమెరికా వడ్డీరేట్లు పెంచినా... ఆ ఇబ్బందులను తట్టుకోగలిగిన స్థాయిలోనే భారత్ ఉంది. ‘లలిత్ మోదీ’పై నో కామెంట్.. న్యూయార్క్ పర్యటన సందర్భంగా అరుణ్జైట్లీ వద్ద కొందరు విలేకరులు మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీకి సంబంధించి నెలకొన్న వివాదం గురించి ప్రస్తావించారు. అయితే దీనిపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు. జైట్లీ వెంట సీఐఐ బృందం... అమెరికాలో జై ట్లీ పర్యటనలో పారిశ్రామిక సంస్థ- సీఐఐ వాణిజ్య ప్రతినిధి బృందం పాల్గొంటోంది. ఈ బృందానికి ప్రెసిడెంట్ డిజిగ్నేట్ నౌషాద్ నేతృత్వం వహిస్తున్నారు. అమెరికా కార్పొరేట్లు, పెన్షన్ ఫండ్లు, వ్యవస్థాగత ఇన్వెస్టర్లసహా గ్లోబల్ ఇన్వెస్టర్లతో పలు ఈవెం ట్లను సీఐఐ నిర్వహిస్తోంది. అమెరికా నుంచి భారత్కు దీర్ఘకాలికంగా భారీ పెట్టుబడులు లక్ష్యంగా సీఐఐ చొరవలు ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ద్యానం వీడి.. నోరు విప్పండి!
మోదీజీ.. ‘మోదీగేట్’పై స్పందించండి * లలిత్మోదీ వ్యవహారంపై ప్రధానికి కాంగ్రెస్ డిమాండ్ న్యూఢిల్లీ: లలిత్ మోదీ వ్యవహారంలో ప్రభుత్వంపై దాడిని విపక్ష పార్టీలు గురువారం మరింత తీవ్రం చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ధ్యానం’లో నుంచి బయటకు వచ్చి, మౌనం వీడాలని కాంగ్రెస్ వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్ స్కామ్స్టర్ లలిత్ మోదీకి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెలు సహకరించడం తన అనుమతితోనే జరిగిం దా? అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని ప్రధానిని డిమాండ్ చేసింది. సుష్మా స్వరాజ్, వసుంధర రాజె తక్షణమే రాజీనామా చేయాలని మరోసారి డిమాండ్ చేసింది. ‘కేంద్ర మంత్రులంతా ప్రధాని చేతిలో తంత్రులే. వారేం చేస్తున్నారు? ఏం తింటున్నారు? ఎక్కడికెళ్తున్నారు? ఇలా అన్ని విషయాలు ప్రధానికి తెలుస్తున్నాయి. లలిత్ మోదీకి ట్రావెల్ డాక్యుమెంట్స్ విషయంలో బ్రిటన్ అధికారులతో సుష్మా మాట్లాడిన విషయం కూడా ఆయనకు తెలిసుండాలి. అంటే ప్రధాని అనుమతితోనే ఆమె ఆ పని చేశారా? అలాగే, లలిత్ మోదీకి వసుంధర రాజె సహకరించడం కూడా ప్రధానికి తెలుసా? రాజకీయ విపాసన ధ్యానం నుంచి బయటకు వచ్చి ప్రధాని ఈ ప్రశ్నలకు సమాధానమివ్వాలి. తన నిర్దోషిత్వం రుజువు చేసుకోవాలి’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి టామ్ వదక్కన్ డిమాండ్ చేశారు. వసుంధర రాజె కుమారుడు దుష్యంత్ సింగ్ కంపెనీలో లలిత్ మోదీ పెట్టుబడులపై విచారణ జరపాలన్నారు. చోటామోదీ(లలిత్)కి సహకరిస్తోంది ఎవరో బయటపడాల్సి ఉందన్నారు. వసుం ధర రాజె లలిత్ మోదీకి సహకరించారన్న విషయం నిర్ధారణ అయిందని, తప్పును సమర్ధించుకోలేని స్థితిలో ప్రస్తుతం ఆమె ఉన్నారని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ వ్యాఖ్యానించారు. ప్రధాని మౌనం అంగీకార సూచకమని బిహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. ప్రధాని నోరు విప్పాలని సీపీఐ ఎంపీ రాజా డిమాండ్ చేశారు. సుష్మా, రాజెలు రాజీనామా చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. మోదీ తదుపరి లక్ష్యం ఆరెస్సెస్: దిగ్విజయ్ తానుఎదగడానికిసహకరించిన వారిని, తనతో నడిచిన వారిని అణచివేయాలన్న సిద్ధాంతంలో ప్రధాని మోదీకి సంపూర్ణ విశ్వాసం ఉందని కాంగ్రెస్ నేత దిగ్విజయ్సింగ్ అన్నారు. ‘గతంలో హిరేన్ పాఠక్, అద్వానీజీ, మురళీ మనోహర్ జోషీ.. ఇప్పుడు సుష్మా స్వరాజ్, వసుంధర రాజె. ఆయన(మోదీ) తదుపరి లక్ష్యం అరుణ్ జైట్లీ,రాజ్నాథ్ సింగ్లే కావచ్చు. జైట్లీ, రాజ్నాథ్.. జాగ్రత్తగా ఉండండి’ అంటూ బుధవారం ట్విటర్లో హెచ్చరించారు. ‘మోదీ జాబితాలో ఆరెస్సెస్ ఉన్నా ఆశ్చర్యం లేదు. ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ వర్ధంతి రోజైన జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా.. ఆ రోజు తన ప్రాముఖ్యత ఎక్కువ ఉండేలా చూసుకున్నారు’ అంటూ దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. మరోవైపు లలిత్ పాల్పడిన నేరాలన్నీ యూపీఏ హయాంలోనే జరిగాయంటూ ప్రభుత్వం విపక్షంపై ఎదురుదాడి ప్రారంభించింది. అప్పుడు లలిత్పై యూపీఏ ఏ చర్యలూ తీసుకోలేదని, ఆయనను భారత్కు తీసుకువచ్చే ప్రయత్నించలేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ విమర్శించారు. తప్పేం చేయలేదు: దుష్యంత్ సింగ్ లలిత్ మోదీ నుంచి తన కంపెనీ నియంత్ హెరిటేజ్ హోటల్స్కు పెట్టుబడులు రావడంపై వసుంధరరాజె కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్ స్పందించారు. తన కంపెనీ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు. ‘కొ న్ని రోజులుగా మీడియాలో నా వ్యక్తిత్వాన్ని కించపరిచే దుష్ర్పచారం జరుగుతోంది. కంపెనీల చట్టం, ఆదాయపన్ను నిబంధనల ప్రకారమే నా కంపెనీలో లావాదేవీలన్నీ జరిగాయి’ అని గురువారం ప్రకటన జారీ చేశారు. కాగా, సుష్మా స్వరాజ్తో గురువారం బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి భేటీ అయ్యారు. -
'నా కూతురు బారిస్టర్'
న్యూఢిల్లీ: లలిత్ మోదీ వివాదంలో చిక్కుకున్న విదేశీ వ్యవహారాల శాఖ సుష్మా స్వరాజ్ ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్నారు. సుష్మ కుటుంబం మొత్తం లలిత్ మోదీ సేవలో తరించిందన్న ఆరోపణల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆమెపై నెటిజన్లు విమర్శులు గుప్పిస్తున్నారు. తన కుమార్తెకు ఈశాన్య కోటాలో మెడికల్ సీటు ఇప్పించుకున్నారని వచ్చిన ట్వీటుపై సుష్మ మండిపడ్డారు. 'నా కూతురు బారిస్టర్. ఆక్స్ ఫర్డ్ గ్రాడ్యుయేట్. ఎందుకు అబద్దాలు చెబుతారు' అంటూ సదరు ట్వీటుకు బదులిచ్చారు. సుష్మ ఘాటుగా సమాధానం ఇవ్వడంతో సదరు ట్విటర్ ఖాతాను తొలగించారు. అయితే ఇటువంటి వాటికి స్పందించి సమయం వృధా చేసుకోవద్దని సుష్మ మద్దతుదారులు ఆమెకు సలహా యిచ్చారు. న్యాయవాదిగా పనిచేస్తున్న సుష్మ తనయ బాసురి.. లలిత్ మోదీ పాస్ పోర్టు రద్దు వ్యవహారంలో ఆయన తరపు వాదించినట్టు తెలుస్తోంది. — Sushma Swaraj (@SushmaSwaraj) June 17, 2015 -
చిక్కుల్లో వసుంధర రాజే!
-
చిక్కుల్లో వసుంధర రాజే!
తనయుడు దుష్యంత్ కంపెనీల్లో లలిత్ మోదీ పెట్టుబడులు ♦ రూ.10 షేరుకు రూ.96,180; మొత్తం రూ.11.36 కోట్ల పెట్టుబడులు ♦ అది తెలివైన వ్యాపార నిర్ణయమన్న బీజేపీ ఎంపీ దుష్యంత్ ♦ లలిత్ మోదీని భారత్ రప్పించాలని చిదంబరం డిమాండ్ ♦ ఆత్మరక్షణలో బీజేపీ.. మౌనాన్ని ఆశ్రయించిన పార్టీ నేతలు న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ కమిషనర్, మనీ ల్యాండరింగ్ సహా పలు కేసుల్లో నిందితుడుగా పరారీలో ఉన్న లలిత్ మోదీ వ్యవహారం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేల తరువాత ‘మోదీగేట్’లో తాజాగా తెరపైకి వచ్చిన మరో పేరు దుష్యంత్ సింగ్. వసుంధర రాజే తనయుడైన దుష్యంత్కు చెందిన కంపెనీ ‘నియంత్ హెరిటేజ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్’లో 2008లో లలిత్ మోదీ రూ. 11.63 కోట్లు పెట్టుబడిగా పెట్టిన విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. వాటిలో రూ. 3.8 కోట్లు రుణం కాగా, మిగతా మొత్తాన్ని 815 షేర్ల కొనుగోలుకు వెచ్చించారు. ఈ లావాదేవీలో రూ. 10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు అసాధారణ రీతిలో రూ. 96,180ల భారీమొత్తం చెల్లించారు. లలిత్ ఆర్థిక అవకతవకలపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) జరుపుతున్న దర్యాప్తులో ఈ విషయం వెల్లడైంది. దుష్యంత్ ప్రస్తుతం బీజేపీ ఎంపీ. దీనిపై ప్రశ్నించగా.. ఆ షేర్ల కొనుగోలు కంపెనీ విలువను, భవిష్యత్ వృద్ధి సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న తెలివైన వ్యాపార నిర్ణయమంటూ దుష్యంత్ స్పందించారు. ఆ లేఖలు బయటపెట్టాలి: చిదంబరం లలిత్ కేసుకు సంబంధించి బ్రిటన్ అధికారులకు యూపీఏ ప్రభుత్వం రాసిన అన్ని లేఖలను బహిర్గతం చేయాలని మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం డిమాండ్ చేశారు. తనపై, కాంగ్రెస్పై, యూపీఏపై లలిత్ చేస్తున్న ఆరోపణలకు ఆ లేఖలే సమాధానమిస్తాయన్నారు. ఆయనను భారత్ రప్పించి, ఈడీ సహా దర్యాప్తు సంస్థల విచారణకు హాజరయ్యేలా చూడాలని కేంద్రానికి సూచించారు. లలిత్ మోదీ బ్రిటన్ ట్రావెల్ డాక్యుమెంట్స్ పొందేందుకు సుష్మా స్వరాజ్ సహకరించడం కచ్చితంగా నిబంధనల ఉల్లంఘన, ఆశ్రీత పక్షపాతమేనని వ్యాఖ్యానించారు. లలిత్పై అనుసరిస్తున్న తీరుకు సంబంధించి ప్రభుత్వానికి చిదంబరం ఏడు ప్రశ్నలు సంధించారు. ఐపీఎల్ స్కామ్ కారణంగా శశి థరూర్ కేంద్ర మంత్రి పదవి పోగొట్టుకోవడంతో కక్ష పెట్టుకున్న కాంగ్రెస్, నాటి మంత్రి చిదంబరం, యూపీఏ తనను లక్ష్యం చేసుకున్నారని మంగళవారం లలిత్ ఆరోపించడం తెలిసిందే. బ్రిటన్ ట్రావెల్ డాక్యుమెంట్స్ విషయంలో సుష్మ, యూకే ఇమిగ్రేషన్లో వసుంధర రాజే తనకు సహకరించారని ఆయన చెప్పారు. ఇన్నాళ్లూ ఏం చేశారు?: ప్రభుత్వం మోదీని వెనక్కు రప్పించాలన్న చిదంబరం డిమాండ్పై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు ‘లలిత్పై రెడ్ కార్నర్, బ్లూ కార్నర్.. తదితర నోటీసులు జారీ అయి చాలా ఏళ్లే అయింది. అధికారం కోల్పోయాక చిదంబరం తెలివిమీరారు’ అని ఎద్దేవా చేశారు. ‘సుష్మ, రాజేలను బర్తరఫ్ చేయాలి’ ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీకి సాయం చేసిన సుష్మ, వసుంధర రాజేలను తక్షణం బర్తరఫ్ చేయాలని కాంగ్రె్ ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రధాని కుట్రపూరిత మౌనాన్ని పాటిస్తున్నారని ఆరోపించారు. రాజే రాజీనామాను కోరుతూ గురువారం రాజస్తాన్ నుంచి ఆందోళన చేపడతామన్నారు. సుష్మ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు కనుక, ఈ ఇద్దరిపై అవినీతి నిరోధక చట్టం కింద వెంటనే విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. సుష్మ, రాజేలు రాజీనామా చేయాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కూడా డిమాండ్ చేశారు. కాగా వసుంధర రాజేపై వచ్చిన ఆరోపణలపై బీజేపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. ఈ వ్యవహారంపై ఆ పార్టీ నేతలెవరూ స్పందించలేదు. మరోపక్క.. ఈ మేలో లండన్లో లలిత్ను కలిసినప్పుడు భారత్కు తిరిగివచ్చి విచారణను ఎదుర్కోవాలని సూచించానని ఎన్సీపీ నేత శరద్ పవార్ చెప్పారు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున భారత్ రాలేనని లలిత్ చెప్పారన్నారు. అమిత్షాకు వసుంధర వివరణ న్యూఢిల్లీ: ‘మోదీగేట్’లో తన పేరు కూడా చేరిన నేపథ్యంలో.. రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే బుధవారం బీజేపీ అధ్యక్షుడు అమిత్షాకు ఫోన్చేసి వివరణ ఇచ్చారు. బ్రిటన్లో తాను చేసుకున్న విదేశీ ప్రయాణ దరఖాస్తుకు వసుంధర మద్దతు ఇచ్చారని ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్మోదీ పేర్కొనటంపై తన వైఖరిని ఆమె అమిత్షాకు వివరణ ఇచ్చారని.. లలిత్మోదీతో తమకు కుటుంబ సంబంధాలు ఉన్నాయని, ఈ విషయంలో తాను ఎలాంటి తప్పూ చేయలేదని ఆమె వివరించారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే.. మీడియాలో ప్రచారం జరుగుతున్న పత్రాల గురించి తనకు తెలియదని ఆమె పేర్కొన్నట్లు ఆ వర్గాలు చెప్పాయి. ఈడీ దర్యాప్తు ముమ్మరం: కాగా, లలిత్మోదీ సంస్థకు సంబంధించిన ఫెమా (విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం) ఉల్లంఘన కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. మారిషస్ కేంద్రంగా ఉన్న ఒక సంస్థ నుంచి లలిత్ డెరైక్టర్గా ఉన్న సంస్థలోకి రూ. 21 కోట్లను అక్రమంగా తరలించారన్న ఆరోపణలపై ఈడీ గత అక్టోబర్లో దర్యాప్తు చేపట్టింది. వివాదం ఇదీ... లలిత్ మోదీ.. మోదీ ఎంటర్ప్రైజెస్ సీఎండీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి చైర్మన్గా, బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా.. రకరకాలుగా భారత క్రికెట్ రంగంతో పెనవేసుకుపోయిన వ్యక్తి.. తాజాగా రాజకీయ సంచలనమయ్యాడు. ఆయన 2010లో ఐపీఎల్ బిడ్డింగ్లో, రెండు కొత్త టీంల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. పుణె, కొచ్చి టీంలకు కొత్త ఫ్రాంచైజీలు ప్రకటించారు. అదే సమయంలో కొచ్చి టీం భాగస్వాములు ఒప్పందాలను ఉల్లంఘించారని లలిత్ ట్వీట్ చేయటంతో అప్పటి కేంద్ర మంత్రి శశిథరూర్ తన పదవికి రాజీనామా చేశారు. తర్వాత కొద్దికాలానికే 22 ఆరోపణలపై లలిత్ ఐపీఎల్ చైర్మన్ పదవి నుంచి సస్పెండ్ అయ్యారు. రూ. 425 కోట్ల అక్రమాల కేసులో ఈడీ ఆయనపై కేసు నమోదు చేసింది. అప్పుడే లలిత్ లండన్ పారిపోయారు. బ్రిటన్ ఇమిగ్రేషన్లో రాజస్థాన్ సీఎం వసుంధర రాజే సాయం పొందారు. విచారణకు భారత్కు రమ్మని సమన్లు పంపించినా ప్రాణానికి ముప్పుందంటూ రాలేదు. భారత్ అతని పాస్పోర్ట్ను రద్దు చేసినా తమ దేశంలో ఉండొచ్చని బ్రిటన్ తెలిపింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక లలిత్, తన భార్యకు కేన్సర్ చికిత్స కోసం పోర్చుగల్ వెళ్లేందుకు కుటుంబ స్నేహితురాలైన సుష్మ సాయం పొందారు. పోర్చుగల్ వెళ్లేందుకు ట్రావెల్ డాక్యుమెంట్లు ఇప్పించాలని కోరగా సుష్మ బ్రిటన్ ఎంపీ కీత్వాజ్ను, భారత్లోని బ్రిటన్ హైకమిషనర్ను ‘మానవతా కోణం’లో పరిశీలించాలని కోరారు. 18 రోజుల్లోనే లలిత్ బ్రిటన్ అధికారుల నుంచి ట్రావెల్ డాక్యుమెంట్లను సంపాదించారు. -
లండన్లో సుష్మాను కలసిన లలిత్ మోదీ
న్యూఢిల్లీ : ఐపీఎల్ కుంభకోణంలో ఇరుక్కున్న ఆ సంస్థ చైర్మన్ లలిత్ మోదీ... భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్తో గతేడాది అక్టోబర్లో లండన్లో కలిశారు. అయితే.. అది కెన్సింగ్టన్ హోటల్ అధినేత జోగీందర్ సంగర్ ఇచ్చిన ప్రైవేటు డిన్నర్లో మాత్రమేనట. ప్రవాస భారతీయ దివస్ కోసం లండన్ వెళ్లిన సుష్మా, ఆ హోటల్లోనే బస చేశారు. ఆ సందర్భంగానే సంగర్ ఆమె గౌరవార్థం ఓ డిన్నర్ ఇవ్వగా, దానికి కేవలం 15 మందినే పిలిచారు. వాళ్లలో లలిత్ మోదీ కూడా ఒకరు. ఆ సమయంలో ఆయనతో పాటు మరెవ్వరూ కూడా రాలేదని సుష్మా స్వరాజ్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. కాగా లండన్లోని భారత హై కమిషనర్ రంజన్ మత్తయి్ ఈ డిన్నర్కు రాలేదని స్పష్టం చేసింది. అయితే సుష్మా స్వరాజ్ ఇదే పర్యటనలో హిందుజా గ్రూప్స్కు చెందిన గోపి హిందూజా ఎన్నారైలకు ఇచ్చిన డిన్నర్లో కూడా పాల్గొన్నారు. ఈ డిన్నర్లో దాదాపు 300 మంది అతిథిలు హాజరయ్యారు. వారిలో కీత్వాజ్, లలిత్ మోడీతోపాటు రంజన్ మత్తయి్ ఉన్నారని కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. లండన్లో పలు హోటళ్ల అధినేత జోగీందర్ సంగర్... సుష్మా స్వరాజ్కు కుటుంబ స్నేహితుడన్న విషయం తెలిసిందే. కానీ సుష్మాస్వరాజ్ ... లండన్లోని భారతీయ సంతతికి చెందిన ఎంపీ కీత్ వాజ్ రెండు సార్లు భేటీ అయ్యారు. అయితే సుష్మా తన మేనల్లుడికి సుసెక్స్ యూనివర్శిటీలో సీటు కోసం కీత్ వాజ్ని లలిత్ మోదీ కలిశాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే లలిత్ మోదీ పోర్చుగల్ ప్రయాణానికి వీసా మంజూరుకు సుష్మా స్వరాజ్ సిఫార్సు చేశారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. అయితే లలిత్ మోదీకి మానవతా హృదయంతోనే వీసా మంజూరుకు సాయం చేశానన్న విషయాన్ని సుష్మా స్వరాజ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. సుష్మా స్వరాజ్ కుటుంబానికి లలిత్ మోదీ ఫ్యామిలీ ప్రెండ్ అన్న విషయం విదితమే. -
లలిత్ వివాదంలోకి రాజే!
బ్రిటన్ ఇమిగ్రేషన్లో వసుంధర రాజే తనకు లిఖితపూర్వకంగా సహకరించారన్న లలిత్ మోదీ సుష్మా స్వరాజ్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయని వెల్లడి ఇండియా టుడే చానల్ ఇంటర్వ్యూలో పలు సంచలన వ్యాఖ్యలు న్యూఢిల్లీ: ఐపీఎల్ స్కామ్స్టర్, తాజా వివాదానికి కేంద్ర బిందువైన లలిత్ మోదీ మంగళవారం నోరు విప్పారు. బ్రిటన్లో తన ఇమిగ్రేషన్కు సంబంధించిన అభ్యర్థనకు రాజస్థాన్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత వసుంధర రాజే లిఖిత పూర్వక సహకారం అందించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని, సుష్మా స్వరాజ్ భర్త, ఆమె కూతురు తనకు ఉచితంగా న్యాయ సహాయం అందించారని పేర్కొన్నారు. యూరప్లోని మాంటెనెగ్రో దేశంలో విహారయాత్రంలో ఉన్న లలిత్ ఇండియా టుడే చానెల్లో సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భార్య మినాల్ కేన్సర్ చికిత్స కోసం రెండేళ్ల క్రితం పోర్చుగల్ వెళ్లినప్పుడు.. వసుంధర రాజే ఆమెకు తోడుగా వెళ్లారని మోదీ వెళ్లడించారు. ‘వసుంధర రాజె నాకు 30 ఏళ్లుగా తెలుసు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మా కుటుంబానికి, నా భార్యకు ఆమె సన్నిహితురాలు. ఇమిగ్రేషన్ అధికారుల వద్ద సాక్ష్యమిచ్చేందుకు ఆమె సంతోషంగా అంగీకరించారు. అయితే, విచారణ ప్రారంభమయ్యేనాటికే ఆమె ముఖ్యమంత్రి కావడంతో ఆమె సాక్షిగా రావడం కుదరలేదు. ఇవన్నీ కోర్టు రికార్డుల్లో కూడా ఉన్నాయి. నా భార్యకు ఆరోగ్యం బాలేనప్పుడు వసుంధర, సుష్మ నాకెంతో అండగా నిలిచారు. వారే కాదు రాజకీయ నేతలెందరో నాకు అత్యంత సన్నిహితులు’ అని మోదీ తెలిపారు. ఐపీఎల్లో నిధుల దుర్వినియోగం, మనీ లాండరింగ్, బెటింగ్ తదితర ఆరోపణలపై కేసులు నమోదైన తరువాత లలిత్ బ్రిటన్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మోదీకి మద్దతుగా ఇమిగ్రేషన్ అధికారుల ముందు రాజే లిఖిత పూర్వక సాక్ష్యమిచ్చారని వార్తలు వచ్చిన కొన్ని గంటల తరువాత లలిత్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఎన్సీపీ నేత శరద్ పవార్, కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లాలు కూడా తనకు సాయం చేశారని లలిత్ అన్నారు. ఐపీఎల్ స్కాంలో శశిథరూర్ మంత్రి పదవి పోగొట్టుకోవడంతో నాటి యూపీఏ సర్కారు తనపై కక్ష గట్టిందన్నారు. ఈ వార్తలపై రాజే స్పందిస్తూ.. ఆ(లలిత్) కుటుంబం నాకు చాన్నాళ్లుగా తెలుసు. కాకపోతే వారు చెప్పే ఇమ్మిగ్రేషన్ పత్రాల గురించి మాత్రం తెలియదు’ అని అన్నారు. బ్రిటన్ ట్రావెల్ డాక్యుమెంట్స్ విషయంలో సాయం చేయాల్సిందిగా తాను సుష్మను కోరానని లతిత్ నిర్ధారించారు. ‘సుష్మనే కాదు.. విదేశాంగ మంత్రిగా ఎవరున్నా సాయం కోరేవాడిని’ అన్నారు. ‘సుష్మ భర్త స్వరాజ్ కౌశల్ 20 ఏళ్లు నా న్యాయవాదిగా ఉన్నారు. వారి కూతురు బస్సురి నాలుగేళ్ల పాటు నాకు న్యాయ సహకారం అందించారు. అవన్నీకూడా ఉచితంగానే అందించారు’ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి జైట్లీ మంగళవారం సుష్మకు మద్దతిస్తూ మాట్లాడిన కాసేపటికే వసుంధర మోదీ ఇమ్మిగ్రేషన్కు సహకరించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇమిగ్రేషన్ డాక్యుమెంట్లోని రహస్య నిబంధనలో.. మోదీకి మద్దతుగా తాను సాక్ష్యం ఇచ్చిన విషయం భారత అధికారులకు తెలియకూడదని రాజే పేర్కొన్నట్లు సమాచారం. కాగా, లలిత్కు ప్రయాణ పత్రాలు జారీలో నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని బ్రిటన్ హోం శాఖ పేర్కొంది. -
మోడీ బ్రిటన్లో దర్జాగా ఎలా ఉన్నారు?
న్యూఢిల్లీ: దేశీయంగా పలు అవినీతి కేసుల్లో నిందితుడై పరారీలో ఉన్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మాజీ చైర్మన్ లలిత్ మోడీ బ్రిటన్ నుంచి పోర్చుగల్ వెళ్లేందుకు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సహకరించారన్న సమాచారంపై నేడు రాజకీయ వర్గాల్లో దుమారం రేగుతోంది. ఆమె తక్షణం రాజీనామా చేయాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీతోపాటు మరికొన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. పరారీలోఉన్న నిందితుడైన మోడీని భారత్ రప్పించేందుకు స్వయంగా విదేశాంగ మంత్రిగా ఉన్న సుష్మా స్వరాజ్ ఎందుకు ప్రయత్నించలేదని ఏ రాజకీయ పార్టీ మాత్రం ఎందుకు ప్రశ్నించడం లేదు? తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా రాజకీయ పార్టీలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగా మోడీ అవినీతి కార్యకలాపాలతో సంబంధం ఉండడం వల్లనా ? లలిత్ మోడీ చేసిన అవినీతి, అక్రమాలు ప్రజలపై ప్రత్యక్ష ప్రభావం చూపడం లేదు కనుక ప్రజలుగానీ, ప్రజల పక్షాన పని చేస్తున్న ఎన్జీవో సంస్థలు పాటిస్తున్న మౌనాన్ని అర్థం చేసుకోవచ్చు. పొద్దునలేస్తే ఒకరికొకరు తిట్టుకుంటూ, దూషణలతో దుమ్మెత్తి పోసుకునే రాజకీయ పార్టీలు అసలు ప్రశ్నలను పక్కన పెట్టి బ్రిటన్ నుంచి పోర్చుగల్ వెళ్లేందుకు మోడీకి ఎందుకు సహకరించారంటూ కొన్ని పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు గగ్గోలు పెడుతోంది? అసలు బ్రిటన్లో మాత్రం ఇంతకాలం మోడీని ఎలా ఉంచగలిగారు? తీవ్ర అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న మోడీ , 'బ్లూ కార్నర్' నోటీసులిచ్చినా భారత్కు రాకపోవడంతో ఆయన వీసాను కోర్టు ప్రమేయంతో భారత్ ప్రభుత్వం రద్దు చేసింది కదా! అలాంటప్పుడు మరో దేశం వెళ్లడం ప్రశ్నను పక్కన పెడితే వీసా లేకుండా మోడీ బ్రిటన్లో దర్జాగా ఎలా ఉంటూ వచ్చారు? పార్లమెంట్ ఎన్నికల ముందు అధికారంలోవున్న కాంగ్రెస్ పార్టీ ఆయన్ని భారత్కు రప్పించేందుకు చర్యలు తీసుకోలేదని భావిస్తే, అవినీతిని అరికట్టే నినాదంతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోవడంలో ఎందుకు చేష్టలుడిగిందన్నది తార్కికుల ప్రశ్న. విశేష ప్రాచుర్యం పొందిన ఐపీఎల్ వ్యవస్థాపకుడిగా పేరొపొందిన లలిత్ మోడీ ఇస్టారాజ్యంగా వ్యవహరించి క్రికెట్ బోర్డు అనుమతులు లేకుండా ఏకపక్షంగా ఫ్రాంచెజ్లు కేటాయించడం, రిగ్గింగ్ బిడ్లకు పాల్పడడం ద్వారా అనతికాలంలోనే అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. 2013, సెప్టెంబర్ నెలలో బీసీసీఐ పదవికి శాశ్వతంగా దూరమయ్యారు. అంతకుముందే ఈ వ్యవహారాలకు సంబంధించి ఆయనపై భారత ఎన్ ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ కేసులు దాఖలు చేసింది. ఈ విచారణ క్రమంలో ఏదో పనిపై లండన్ వెళ్లిన మోడీ, తనకు బిగిసుకోనున్న ఉచ్చును ముందే పసిగట్టి అక్కడే ఉండిపోయారు. తన ప్రాణాలకు ముప్పుందంటూ భారత్ రావడానికి నిరాకరిస్తూ వచ్చారు. అతన్ని పట్టించాల్సిందిగా కోరుతూ 'రెడ్ కార్నర్' నోటీసు ఇవ్వాల్సిన భారత్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ 'బ్లూ కార్నర్' నోటీసు జారీ చేసింది. రెడ్ కార్నర్ నోటీసు ఇస్తే అరెస్ట్చేసి తమకు అప్పగించాల్సిందిగా కోరడం, బ్లూ కార్నర్ నోటీసు ఇవ్వడం అంటే నిందితుడు ఎక్కడున్నాడో తమకు సమాచారం ఇవ్వాల్సిందిగా అభ్యర్థించడం. కాంగ్రెస్ హయాంలోనే బ్లూ కార్నర్ నోటీసులు ఇచ్చినా మోడీ స్పందించనప్పుడు అప్పుడే ఎందుకు రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎందుకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దాదాపు లలిత్ మోడీ గురించి భారతీయులు మరిచిపోతున్న తరుణంలో సుష్మా స్వరాజ్ చర్య వల్ల మళ్లీ ఆయన కేసు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. స్వయంగా సుష్మా స్వరాజ్ కూతురే లలిత్ మోడీకి న్యాయవాదిగా వ్యవహరించిన విషయం తెల్సిన వారికి సుష్మా నిర్ణయం వెనుక ఎవరి ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యవహారాన్ని మొదటి నుంచి పరిశీలిస్తే అవినీతిని అరికట్టడంలో రాజకీయ పార్టీలన్నీ ఒకే తాను ముక్కలని తెలిసిపోతోంది. -
ఆ మోదీ వెనుక ఈ మోదీ
► లలిత్మోదీని నరేంద్రమోదీ రక్షిస్తున్నారు: రాహుల్ ► సుష్మాను తొలగించాలని డిమాండ్ ► నిందితుడికి సుష్మా ‘సాయం’పై రాజకీయ దుమారం సాక్షి, న్యూఢిల్లీ: వివిధ కేసుల్లో నిందితుడిగా ఉండి పరారీలో ఉన్న ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్మోదీకి బ్రిటన్లో ప్రయాణ పత్రాలు లభించేలా విదే శాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సాయం చేసిన ఉదంతం రాజకీయ దుమారంగా మారింది. ఇందులో ప్రధాని నరేంద్రమోదీ పాత్రపై విపక్ష కాంగ్రెస్ నేతలు, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ సోమవారం తీవ్ర ఆరోపణలు గుప్పించారు. లలిత్కు సుష్మా సాయంలో ‘క్విడ్ ప్రో కో’ ఉందా? ప్రధాని పాత్ర ఏమిటి? అని కాంగ్రెస్ ప్రశ్నల వర్షం కురిపించింది. కాగా, సుష్మ ఏ తప్పూ చేయలేదని సర్కారు సమర్థించుకుంది. ‘ప్రధాని తాను పరిరక్షకుడినని, నల్లధనాన్ని వెనక్కు తెచ్చేది తనేనని చెప్తుంటారు. విదేశాల్లో నల్లధనానికి ప్రతీక లలిత్ మోదీ. ఇప్పుడు.. ప్రధాని మోదీ విదేశాంగ మంత్రి సుష్మ ద్వారా లలిత్ను రక్షిస్తున్నారు. ఏమిటిది?’ అని ఛత్తీస్గఢ్ పర్యటనలో ఉన్న రాహుల్ మండిపడ్డారు. సుష్మను బీజేపీ సమర్థించడాన్ని ప్రస్తావించగా.. ‘‘అవును.. ఆ పార్టీ సుష్మకు అండగా ఉంటుంది. పార్టీ అంటే నరేంద్ర మోదీ. ఈ మోదీ ఆ మోదీ(లలిత్మోదీ)కి అండగా నిలుచున్నారు. సుష్మ ఎవరు? చిన్న మంత్రి. ఆమె అంటే ప్రభుత్వానికి లెక్క లేదు. ఈ ప్రభుత్వాన్ని నడుపుతోంది ఒక్క నరేంద్ర మోదీనే. లలిత్ను కాపాడటాన్ని నరేంద్రమోదీ ఆపాలి. సుష్మను పదవి నుంచి తప్పించాలి’ అని డిమాండ్ చేశారు. అంతా ప్రధాని కనుసన్నల్లోనే... అంతకుముందు.. హవాలా, బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్, మనీ లాండరింగ్ తదితర అక్రమాల్లో రూ. 700 కోట్ల మేర స్కాంలో నిందితుడిగా ఉండి పరారీలో ఉన్న లలిత్కు.. ప్రధాని మోదీ రహస్య సమ్మతితో కేంద్రం, బీజేపీలు సాయం చేస్తున్నాయని, నేరాన్ని ప్రోత్సహిస్తున్నాయని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణ్దీప్సింగ్ సుర్జేవాలా మీడియా సమావేశంలో ఆరోపణలు గుప్పించారు. ‘ఇదంతా ప్రధాని మోదీ కనుసన్నల్లోనే జరిగింది. లలిత్కు ప్రయాణ పత్రాలు ఇవ్వరాదని, అతడిని భారత చట్టం ముందు నిలిపేందుకు వీలుగా అరెస్ట్ చేయాలని గత యూపీఏ ప్రభుత్వం బ్రిటన్ను కోరింది. బ్రిటన్తో మన దేశం చేసిన సంప్రదింపులను సుష్మ కాలరాశారు’ అని ధ్వజమెత్తారు. ‘‘లలిత్కు సుష్మతో పరిచయముంది. ఆమె కుటుంబసభ్యులు అతడికి న్యాయవాదిగా వ్యవహరించారు. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్షాలతోనూ అతడికి దీర్ఘకాలిక సంబంధాలున్నాయి’ అంటూ.. మోదీ, అమిత్షాలతో లలిత్ కలసివున్న ఫొటోలను చూపారు. ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలంటూ ప్రధానికి ప్రశ్నలు వేశారు. ప్రధాని మోదీకి కాంగ్రెస్ ప్రశ్నలివీ... మనీ లాండరింగ్ తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్కు సాయం చేయటంలో ఏదైనా ‘క్విడ్ ప్రో కో’ ఉందా? నరేంద్రమోదీ, అమిత్షా, లలిత్ల మధ్య సంబంధం ఏమిటి? ప్రధాని సూచనల మేరకు సుష్మాస్వరాజ్ నడుచుకున్నారా? గత యూపీఏ ప్రభుత్వం తెలిపిన అభ్యంతరాలను కాలరాసి లలిత్కు ఎందుకు సాయం చేశారు? ఈ విషయం ప్రధానమంత్రి, ఆర్థికమంత్రికి ముందే తెలుసా? భారత్లో నేరాలు చేసి తప్పించుకున్న వ్యక్తికి ట్రావెల్ డాక్యుమెంట్లు సమకూర్చాలని విదేశాంగ మంత్రి ఎలా అడుగుతారు? మానవీయ కోణంలోనే అతడికి పోర్చుగల్ వెళ్లేందుకు డాక్యుమెంట్లు సమకూర్చితే.. మరి అక్కడి నుంచి భారత్కు పంపే ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? బ్లూకార్నర్ నోటీసున్న లలిత్ లాంటి వ్యక్తి తప్పించుకునేందుకు సాయపడ్డ సుష్మపై నేరాభియోగం ఎందుకు మోపకూడదు? ‘నిందితులకు మంచి రోజులొచ్చాయి’ క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న అమిత్షా, రామ్దేవ్, లలిత్ వంటి వారికి ‘అచ్ఛే దిన్’ (మంచి రోజులు) వచ్చాయని కాంగ్రెస్ నేత దిగ్విజయ్సింగ్ ట్విటర్లో ఎద్దేవా చేశారు. సుష్మ రాజీనామా చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సోమవారం ఢిల్లీలోని ఆమె నివాసం ఎదుట ధర్నా చేశారు. కాంగ్రెస్వి చౌకబారు రాజకీయాలు: బీజేపీ ఈ అంశంలో సుష్మను సమర్థిస్తూ బీజేపీ.. కాంగ్రెస్పై ఎదురుదాడి చేసింది. లలిత్, ప్రధాని మోదీ కలిసివున్న ఫొటోలను విడుదల చేసి కాంగ్రెస్ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ నేత, కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. బొగ్గు, 2జీ వంటి స్కాంల నిందితులతో సోనియా, రాహుల్ కలిసివున్న ఫొటోలను తామూ బయటపెట్టగలమన్నారు. సుష్మ చేసిన పని చట్టవ్యతిరేకం, అనైతికం కాదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సమర్థించారు. నైతిక పాఠాలు చెప్తోంది ఎవరో చూడండి: సుష్మా ఈ వివాదంలో నైతిక విలువల అంశాన్ని లేవనెత్తిన ఒక టీవీ పాత్రికేయుడిపై సుష్మ ప్రతి విమర్శలు చేశారు. ‘అందరిలోకీ నైతిక విలువల పాఠాలు బోధిస్తోంది ఎవరో చూడండి...’ అని ట్విటర్లో అన్నారు. వజ్పై దర్యాప్తు లేదు: బ్రిటన్ లండన్: లలిత్కు సుష్మ సాయం చేసిన వివాదంలో భారత సంతతికి చెందిన బ్రిటన్ ఎంపీ కీత్వజ్ పాత్రపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయించబోమని ఆ దేశ పార్లమెంటరీ కమిషనర్ ఫర్ స్టాండర్స్ కమిషనర్ కేథరిన్ హడ్సన్ స్పష్టంచేశారు. -
'బ్రహ్మాండం బద్దలయ్యే విషయాలు వెల్లడిస్తా'
న్యూఢిల్లీ: తనకు సహాయం చేసిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చిక్కుల్లో పడిన నేపథ్యంలో ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ స్పందించారు. భారత్లో తనపై చేస్తున్న కుట్రలను గమనిస్తున్నానని, తాను స్పందించాల్సిన సమయం వచ్చిందని మోడీ ట్వీట్ చేశారు. బ్రహ్మాండం బద్దలయ్యే విషయాలెన్నో బయటపెడతానని వెల్లడించారు. తనపై మీడియా బురదజల్లుతోందని మోడీ ఆరోపించారు. 2010 నుంచి ఇప్పటి వరకు బీసీసీఐ, ఐపీఎల్లో ఎవరెవరు ఏం చేశారన్న విషయాలన్నింటినీ సవివరంగా బయటపెడతానని మోడీ పేర్కొన్నారు. లలిత్ మోడీ బ్రిటన్ నుంచి ప్రయాణ పత్రాలు(ట్రావెల్ డాక్యుమెంట్స్- టీడీ) పొందేందుకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సహకరించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. -
దావూద్ ఇబ్రహీంకు సహాయం చేస్తారా?
న్యూఢిల్లీ: అభ్యర్థిస్తే అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సహాయం చేస్తారా అని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. వాంటెడ్ జాబితాలో ఉన్న ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీకి మానవతా దృక్పథంతోనే విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సాయం చేశారని బీజేపీ వెనకేసుకురావడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. మోడీకి మోదీ సాయం చేస్తున్నట్టుగా కనబడుతోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సుజ్రీవాలా ఆరోపించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు లలిత్ మోడీ సన్నిహితుడన్న విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. పలువురు బీజేపీ నాయకులతోనూ లలిత్ కు సంబంధాలున్నాయని పేర్కొన్నారు. ఇటీవలే గుజరాత్ లో రూ.1000 కోట్ల అక్రమ బెట్టింగ్ రాకెట్ వెలుగు చూసిన విషయాన్ని ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు. మానవతా కోణంలో లలిత్ మోడీకి సహాయం చేశామని బీజేపీ సమర్థించుకోవడాన్ని తప్పుపట్టారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు దేశం విడిచి పారిపోయేందుకు సహకరించడమే మోదీ ప్రభుత్వ విధానం అన్నట్టుగా కమలనాథులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. -
ఆమె తప్పేంలేదు: రాజ్ నాథ్
-
ఆమె తప్పేంలేదు: రాజ్ నాథ్
న్యూఢిల్లీ: లలిత్ మోదీకి వీసా వ్యవహారంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తప్పేంలేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఈ విషయంలో ఆమె కరెక్టుగానే వ్యవహారించారని సమర్థించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మానవతా దృక్పథంతోనే లలిత్ మోదీకి సుష్మ సహాయం చేశారని తెలిపారు. ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి వీసా కోసం సుష్మా స్వరాజ్ సిఫార్సు చేశారని ఆరోపణలు రావడంతో ఆమె రాజీనామాకు విపక్షాలు డిమాండ్ చేశాయి. -
సుష్మా వెంటనే రాజీనామా చేయాలి
-
సుష్మా వెంటనే రాజీనామా చేయాలి
న్యూఢిల్లీ: కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రెడ్ కార్నర్ నోటీసులు ఎదుర్కొంటున్న ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి వీసా మంజూరు చేయాలని ఏ విధంగా సిఫార్సు చేస్తారని సుష్మాను...కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. ఆదివారం న్యూఢిల్లీలో సుష్మా స్వరాజ్ వైఖరిపై దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. నైతికత ఆధారంగా సుష్మా వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి వీసా కోసం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సిఫార్సు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే లలిత్ మోదీ భార్య గతకొద్ది కాలంగా కాన్సర్తో బాధపడుతున్నారు. అందుకు వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందులోభాగంగానే తాను మానవత్వంతోనే వారికి సహాయం చేసినట్లు సుష్మా స్వరాజ్ వివరణ ఇచ్చినట్లు సమాచారం. -
ఒక్కో ఐపీఎల్ మ్యాచ్.. రూ.10 వేల కోట్ల బెట్టింగ్
ముంబయి: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్లోని నలుగురు ఆటగాళ్లకు ఫిక్సింగ్తో సంబంధాలు ఉన్నాయని ఆయన ట్విట్టర్లో ఆరోపించారు. ఫిక్సింగ్ కుంభకోణంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు ఉన్నారని మోడీ వ్యాఖ్యానించారు. ఐపీఎల్ లో ఒక్కో మ్యాచ్కు రూ.10వేల కోట్ల వరకూ బెట్టింగ్ జరుగుతోందని ఆయన ట్వీట్ చేశారు. కాగా ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ పై విచారణకు గతంలో సుప్రీం కోర్టు ముద్గల్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. -
లలిత్ మోడీకి ఉద్వాసన
జైపూర్: ఐపీఎల్ చైర్మన్గా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన లలిత్ మోడీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్ క్రికెట్ సంఘం అధ్యక్ష పదవి నుంచి లలిత్ మోడీని తొలగించారు. సోమవారం జరిగిన ప్రత్యేక కార్యవర్గ సమావేశంలో మోడీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. రాజస్థాన్ క్రికెట్ సంఘంలో మొత్తం 18 మంది సభ్యులుండగా, 17 మంది మోడీకి వ్యతిరేకంగా ఓటేశారు. రాజస్థాన్ క్రికెట్ సంఘం కొత్త చీఫ్గా ఆమిన్ పఠాన్ పేరు ఖరారైంది. ఐపీఎల్లో అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలపై గతంలో మోడీని చైర్మన్ పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత బీసీసీఐ, ఐపీఎల్కు దూరమయ్యారు. బోర్డు హెచ్చరికలను భేఖాతరు చేస్తూ మోడీ రాజస్థాన్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయనను పదవి నుంచి తొలగించారు. -
లలిత్ మోడికి షాక్
ఆర్సీఏ అధ్యక్ష పదవి నుంచి తొలగింపు జైపూర్: రాజస్థాన్ క్రికెట్ సంఘం (ఆర్సీఏ)లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడిని ఆర్సీఏ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఈ మేరకు శనివారం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 33 జిల్లా సంఘాలకుగాను 23 సంఘాలు మోడిని తొలగించడాన్ని సమర్థించాయి. ఈ ఎత్తుగడను ముందుండి నడిపిన స్థానిక బీజేపీ నాయకుడు అమిన్ పఠాన్ను తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మోడి అనుచరులు పవన్ గోయల్ (కోశాధికారి), మహ్మద్ అబ్ది (ఉపాధ్యక్షుడు)లపై కూడా వేటు పడింది. బీసీసీఐ నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఐదు నెలల కిందట మోడి ఆర్సీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు మోడిపై వేటు పడటంతో ఆర్సీఏ, బీసీసీఐల మధ్య మళ్లీ సత్సంబంధాలు నెలకొంటాయని క్రికెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు కోటా జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా పని చేస్తున్న అమిన్కు రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే సింధియా అండదండలు పుష్కలంగా ఉన్నాయి. -
దేశవాళీ సీజన్ నుంచి రాజస్థాన్ అవుట్!
ముంబై: తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ) అధ్యక్షుడిగా లలిత్ మోడిని ఎన్నుకున్నందుకు బీసీసీఐ తగిన చర్యలకు దిగినట్టే కనిపిస్తోంది. వచ్చే దేశవాళీ సీజన్ షెడ్యూల్లో ఆర్సీఏను పేర్కొనలేదు. అండర్-16, 19, 23, రంజీ ట్రోఫీ, మహిళల టోర్నీ పోటీల వివరాలతో కూడిన హ్యాండ్బుక్ను బోర్డు అన్ని గుర్తింపు సంఘాలకు పంపిణీ చేసింది. అయితే ఇందులో రాజస్థాన్ ఊసు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వివిధ అంశాలపై ఆర్సీఏతో బీసీసీఐకి విబేధాలున్న విషయం తెలిసిందే. ‘ఆర్సీఏను దేశవాళీ సీజన్ నుంచి మేం తొలగించలేదు. వారి కోసం స్లాట్ను ఉంచాం. ప్రభుత్వ, బోర్డు అంతర్గత నిర్ణయాలపై ఆధారపడి ఏ విషయాన్నీ ఖరారు చేస్తాం. రాజస్థాన్ ఆటగాళ్లతో పాటు అందరూ ఆడాలనే కోరుకుంటున్నాం. అన్ని సమస్యలు పరిష్కారమై సీజన్లో అన్ని రాష్ట్రాలు ఆడతాయనే ఆశిస్తున్నాను’ అని బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యాదవ్ అన్నారు. అక్టోబర్లో ప్రారంభమయ్యే ఇంటర్ స్టేట్ జూనియర్ క్రికెట్ టోర్నీకి ముందు ఆర్సీఏపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరోవైపు బీసీసీఐ హ్యాండ్బుక్ను తామింకా చూడలేదని ఆర్సీఏ ఉపాధ్యక్షుడు మెహమూద్ అబ్ది పేర్కొన్నారు. క్రికెట్ కార్యకలాపాలకు బింద్రా దూరం చండీగఢ్: 36 ఏళ్లుగా క్రికెట్ పాలనాధికారిగా సేవలందిస్తున్న ఇందర్జిత్ సింగ్ బింద్రా ఇక విశ్రాంతి తీసుకోనున్నారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన బాధ్యతల నుంచి వైదొలిగారు. బింద్రా స్థానంలో డీపీ రెడ్డిని నియమించారు. పీసీఏ రోజువారీ వ్యవహారాలను చూడలేకపోతున్నందుకు తనను బాధ్యతల నుంచి రిలీవ్ చేయాల్సిందిగా పీసీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీని బింద్రా కోరారు. -
ఆర్సీఏ అధ్యక్షుడిగా లలిత్ మోడి
24-5 ఓట్లతో రాంపాల్పై గెలుపు ఫలితాలను ప్రకటించిన రిటైర్డ్ జస్టిస్ కస్లివాల్ కొద్దిగంటల్లోనే ఆర్సీఏపై బీసీసీఐ సస్పెన్షన్ వేటు జైపూర్: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడి... రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నాలుగు నెలల కిందట జరిగిన ఎన్నికల ఫలితాలను... కోర్టు నియమించిన పరిశీలకుడు రిటైర్డ్ జస్టిస్ ఎన్.ఎమ్. కస్లివాల్ మంగళవారం ప్రకటించారు. ఈ ఫలితాల్లో మోడి 24-5 తేడాతో తన ప్రత్యర్థి రాంపాల్ శర్మపై విజయం సాధించి అధ్యక్ష పీఠానికి మార్గం సుగమం చేసుకున్నారు. మొత్తం 33 ఓట్లలో రాంపాల్కు ఐదు మాత్రమే దక్కాయి. అయితే ఫలితాలు ప్రకటించిన కొద్ది గంటల్లోనే బీసీసీఐ.... మోడికి షాకిచ్చింది. ఆర్సీఏపై సస్పెన్షన్ విధిస్తూ కొత్త అంకానికి తెరతీసింది. అసోసియేషన్ కార్యకలాపాలను నిర్వహించేందుకు త్వరలో అడ్హక్ కమిటీని నియమించనుంది. ఉపాధ్యక్షుడిగా ఆబ్ది ఆర్సీఏ తాజా ఫలితాల్లో ఉపాధ్యక్షుడిగా మహ్మద్ ఆబ్ది; కార్యదర్శిగా సోమేంద్ర తివారీ; కోశాధికారిగా పవన్ గోయల్ ఎన్నికయ్యారు. మోడి లండన్లో ఉంటున్నా అసోసియేషన్ కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యం ఆయనకు ఉందని ఆబ్ది అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ను ఉపయోగించుకుని ఎగ్జిక్యూటివ్ కమిటీ ద్వారా కార్యక్రమాలు చేపడతారన్నారు. భారత్లో భద్రతా పరిస్థితులు మెరుగుపడిన తర్వాత మోడి ఇక్కడకు వస్తారని చెప్పారు. బీసీసీఐలో శ్రీనివాసన్ ఇంకా జోక్యం చేసుకుంటున్నారని ఆబ్ది ఆరోపించారు. తాత్కాలిక అధ్యక్షులు గవాస్కర్, శివలాల్ యాదవ్... ఆయన గీసిన గీతను దాటడం లేదన్నారు. కోర్టుకెళ్తాం...: ఆర్సీఏ బీసీసీఐ చర్యలపై హైకోర్టును సంప్రదిస్తామని మోడి తరఫు లాయర్ మహ్మద్ ఆబ్ది తెలిపారు. ‘రాష్ట్రంలోని క్రీడా చట్టం ప్రకారం మేం పని చేస్తున్నాం. ఆర్సీఏను సస్పెండ్ చేసే హక్కు బీసీసీఐకి లేదు. ఎందుకంటే అది కేవలం రిజిస్టర్డ్ బాడీ మాత్రమే. ఈ విషయాన్ని అన్ని కోర్టుల దృష్టికి తీసుకెళ్తాం. ఒక వ్యక్తిపై కక్ష సాధించేందుకు అసోసియేషన్పై నిషేధం విధించడం సరైంది కాదు. ఈ విషయంపై వీలైనంత త్వరగా బీసీసీఐ పత్యేక ఏజీఎమ్ ఏర్పాటు చేయాలని కొంత మంది సభ్యులు కోరుతున్నారు. అక్కడ ఇది చర్చకు వచ్చే అవకాశం ఉంది’ అని ఆబ్ది వివరించారు. ‘బీసీసీఐలో పాగాకు తొలి అడుగు’ లండన్: ఆర్సీఏ ఎన్నికల్లో గెలవడం... బీసీసీఐలో తిరిగి పాగా వేయడానికి తొలి అడుగు అని మోడి వ్యాఖ్యానించారు. ‘ఇది చాలా పెద్ద విజయం. ఆర్సీఏలో నెలకొన్న సౌకర్యాలపై గత నాలుగేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నా. ఈ గెలుపు మాకు తొలి అడుగు. క్రికెట్ను ప్రక్షాళన చేయాలి. ఐపీఎల్ ఫిక్సింగ్పై విచారణ జరిపేందుకు ముద్గల్ కమిటీని నియమించి సుప్రీంకోర్టు మంచి పని చేసింది. ఆర్సీఏ కార్యక్రమాలను మెరుగుపర్చడమే నా ముందున్న లక్ష్యం’ అని మోడి వ్యాఖ్యానించారు. వీలైనంత త్వరగా భారత్కు తిరిగి వస్తానని చెప్పిన మోడి బీసీసీఐ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. అసలు కథ ఇది... ఐపీఎల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడని మోడిని బహిష్కరించిన బీసీసీఐ అతనిపై జీవితకాల నిషేధం విధించింది. దీంతో గత నాలుగేళ్లుగా లండన్లో నివసిస్తున్న మోడి ఈ అంశంపై చాలాసార్లు కోర్టుల్లో పోరాడినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. అయితే ఆర్సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైతే బోర్డుతో నేరుగా సంబంధాలు జరిపే అవకాశం ఉండటంతో ఎన్నికల బరిలోకి దిగాడు. కానీ ఎన్నికల్లో పాల్గొనకుండా బీసీసీఐ చాలా విధాలుగా అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. చివరకు సుప్రీం కోర్టు జోక్యంతో ఎన్నికలు సజావుగా ముగిశాయి. ఫలితాల విడుదల్లో జాప్యం జరిగినా చివరకు మోడి అధ్యక్షుడిగా ఎన్నికవడం బోర్డుకు రుచించలేదు. దీంతో సస్పెన్షన్ ఆయుధాన్ని ప్రయోగించింది. ‘సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఏ వ్యక్తి అయినా బోర్డు నిబంధనలను ఉల్లంఘించినట్లయితే వారిపై చర్య తీసుకునే హక్కు బీసీసీఐకి ఉంది. ఇదే తరహాలో బోర్డు నియమావళిలోని నిబంధన 32 (7) ప్రకారం బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యాదవ్... ఆర్సీఏ మెంబర్షిప్ను సస్పెండ్ చేశారు’ అని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ వెల్లడించారు. -
రాజస్థాన్ క్రికెట్ సంఘంపై బీసీసీఐ వేటు
జైపూర్: రాజస్థాన్ క్రికెట్ సంఘం అద్యక్షుడిగా ఐపీఎల్ మాజీ వివాదాస్పద కమిషనర్ లలిత్ మోడీని ఎన్నుకోవడాన్ని వ్యతిరేకిస్తూ బీసీసీఐ రాజస్థాన్ క్రికెట్ సంఘంపై వేటు వేసింది. జీవితకాల నిషేధానికి గురైన మోడీ ఎన్నికైన కాసేపటికే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం డిసెంబర్ 19వ తేదీన జరిగిన ఎన్నికల ఫలితాలను కోర్టు పరిశీలకుడు జైపూర్లో మంగళవారం ప్రకటించారు. సుప్రీంకోర్టు గత వారం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కోర్టు పరిశీలకుడు సీల్డ్ కవర్లో ఉన్న ఓట్లను తెరిచారు. మొత్తం 33 ఓట్లు ఉండగా వాటిలో 26 ఓట్లు లలిత్ మోడీకే దక్కడంతో ఆయనను విజేతగా ప్రకటించారు. ఐపీఎల్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోడీ ప్రస్తుతం ఇంగ్లండ్లో ఉంటున్నారు. బీసీసీఐ నిబంధనలను ఉల్లంఘించడంతో రాజస్థాన్ క్రికెట్ సంఘ సభ్యత్వం రద్దు చేస్తున్నట్టు బోర్డు ప్రకటించింది. -
రాజస్థాన్ క్రికెట్ సంఘ అధ్యక్షుడిగా లలిత్ మోడీ
ఐపీఎల్ వ్యవహారంలో పీకల్లోతు మునిగిపోయినా.. రాజస్థాన్ క్రికెట్ సంఘం అద్యక్షుడిగా లలిత్ మోడీ ఎన్నికయ్యారు. గత సంవత్సరం డిసెంబర్ 19వ తేదీన జరిగిన ఈ ఎన్నికల ఫలితాలను కోర్టు పరిశీలకుడు జైపూర్లో మంగళవారం ప్రకటించారు. సుప్రీంకోర్టు గత వారం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కోర్టు పరిశీలకుడు సీల్డ్ కవర్లో ఉన్న ఓట్లను తెరిచారు. మొత్తం 33 ఓట్లు ఉండగా వాటిలో 26 ఓట్లు లలిత్ మోడీకే దక్కడంతో ఆయనను విజేతగా ప్రకటించారు. అయితే.. ఆర్సీఏ అధ్యక్ష పదవి మోడీకి అంత సులభంగా ఏమీ దక్కేలా లేదు. న్యాయపరమైన అడ్డంకులతో పాటు.. బీసీసీఐ నిబంధనలు కూడా ఆయనకు అడ్డుపడేలాగే ఉన్నాయి. బీసీసీఐతో పాటు ఆర్సీఏకు కూడా గతంలో అధ్యక్షుడిగా వ్యవహరించిన కిషోర్ రుంగ్తా ఇప్పుడు మోడీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సుప్రీంకోర్టులో బీసీసీఐకి చుక్కెదురైనా, బోర్డు మాత్రం రాజస్థాన్ క్రీడా చట్టాన్ని సవాలు చేయాలని యోచిస్తోంది. అలా చేస్తే లలిత్ మోడీ రెండోసారి రాజస్థాన్ క్రికెట్ సంఘానికి అధ్యక్షుడు అయ్యే అవకాశం కోల్పోతారు. సస్పెండైన బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్తో మోడీకి ఏమాత్రం పడకపోవడంతో లలిత్ మోడీ ఇప్పుడు ఇంగ్లండ్లో ఉంటున్నారు. శ్రీనివాసన్ కూడా ప్రస్తుతం ఐపీఎల్ కుంభకోణంలో సుప్రీంకోర్టు విచారణ ఎదుర్కొంటున్నా, బీసీసీఐలో మాత్రం ఆయన బలం బాగానే ఉంది. దాంతో లలిత్ మోడీ తిరిగి భారత క్రికెట్ రాజకీయాల్లోకి రావడం అంత సులభంగా అయ్యేలా లేదు. -
ఆర్సీఏ ఫలితాల వెల్లడి మరోసారి వాయిదా
న్యూఢిల్లీ: రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ) అధ్యక్ష ఎన్నికల ఫలితాల వెల్లడిని సుప్రీం కోర్టు ఐదోసారి వాయిదా వేసింది. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఎన్నిక లాంఛనమే అయినప్పటికీ ఫలితాలు వెల్లడించకుండా ఉండేందుకు బీసీసీఐ విశ్వప్రయత్నాలు చేస్తోంది. తాజాగా సుప్రీం ఈ ఫలితాలను ఈనెల 25కు వాయిదా వేసింది. అదే రోజు ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఉదంతాలపై ముద్గల్ కమిటీ అందించిన నివేదికపై కూడా సుప్రీం కోర్టు మరో బెంచ్ విచారించనుంది. డిసెంబర్లో జరిగిన ఆర్సీఏ ఎన్నిక ల్లో 33 ఓట్లకు గాను 26 ఓట్లు మోడికి పడినట్టు తమకు తెలుసని గత జనవరిలో బీసీసీఐ లాయర్లు కోర్టుకు తెలిపారు. మోడిపై తాము జీవితకాల నిషేధం విధించామని, ఈ ఎన్నికల్లో పాల్గొనే అర్హత లేదని బోర్డు వాది స్తోంది. అయితే ఆర్సీఏ అనేది రాజస్థాన్ క్రీడా చట్టం పరిధిలో ఉంటుందని మోడి వర్గం తిప్పికొడుతోంది. -
జీవితకాలపు వేటు వేయాల్సిందే: మోడీ
బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్, అతని అల్లుడు గురునాథ్ మేయప్పన్ పై జీవితకాలపు నిషేధం విధించాలని బహిష్కృత ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడీ డిమాండ్ చేశారు. ఐపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో గురునాథ్ మేయప్పన్ పై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ ముగ్దల్ కమిటి నేరారోపణ చేసిన సంగతి తెలిసిందే. క్రికెట్ ఇండియా సిమెంట్ యాజమాన్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై చర్యలు తీసుకోవడానికి అధికారులు నిద్ర మత్తు నుంచి బయటపడాల్సిన సమయం ఆసన్నమైంది లలిత్ మోడీ ట్విటర్ లో తెలిపారు. ఈ వ్యవహారం గురించి నేనెప్పటి నుంచో చెబుతున్నాను. ఈ కుంభకోణంతో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై జీవితకాలపు బహిష్కరణ విధించాలి అని ఆయన అన్నారు. నివేదిక కాపీ కోసం వేచి చూస్తున్నాను. ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ యజమాని బెట్టింగ్, ఫిక్సింగ్ పాల్పడితే.. నిబంధనల ప్రకారం వేటు వేయాలని ఆయన అన్నారు. -
మోడియే గెలుస్తాడని తెలుసు
న్యూఢిల్లీ: రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ) అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిందెవరో సుప్రీం కోర్టు ప్రకటించకముందే బీసీసీఐ చెప్పేసింది. బోర్డు నుంచి జీవితకాల బహిష్కరణ ఎదుర్కొంటున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడియే విజేత అని స్పష్టం చేసింది. మొత్తం 33 ఓట్లలో 26 ఓట్లు మోడికే పడినట్టు చెప్పింది. అయితే అధికారికంగా ఈ ఫలితాలున్న సీల్డ్ కవర్ను తెరవకూడదని... అంతకన్నా ముందు తమ వాదనలు వినాలని కోర్టులో గట్టిగా వాదించింది. దీంతో తదుపరి విచారణ, ఫలితాల వెల్లడిని సుప్రీం కోర్టు మార్చి 4కు వాయిదా వేసింది. ‘ఆర్సీఏ అధ్యక్షుడిగా గెలిచేదెవరో మాకు తెలుసు. 33 ఓట్లలో 26 ఓట్లు లలిత్ మోడికి మద్దతుగా ఉన్నాయి. కాబట్టి అతడే విజేత. అయితే అతడు జీవిత కాల బహిష్కరణ ఎదుర్కొంటున్నాడు. పోటీ చేసే అర్హతే తనకు లేదు. ఒకవేళ మోడి ఆర్సీఏ అధ్యక్షుడిగా నెగ్గితే మాకు ఆ సంఘాన్ని సస్పెండ్ చేయడం మినహా మరో దారి లేదు. ఒకవేళ అదే జరిగితే భారత జట్టులో ఉన్న రాజస్థాన్ ఆటగాళ్లు వెంటనే చోటు కోల్పోవాల్సి వస్తుంది’ అని బీసీసీఐ తెలిపింది. ఇప్పటికే వాయిదా పడుకుంటూ వస్తున్న ఆర్సీఏ ఎన్నికల ఫలితాలను వాస్తవానికి సోమవారం ప్రకటించాల్సి ఉంది. అయితే బోర్డు దీన్ని సమర్థవంతంగా అడ్డుకోగలిగింది. బీసీసీఐతో పాటు మోడికి వ్యతిరేకంగా పోటీలో నిలిచిన ఆర్పీ శర్మ ఈ ఎన్నికలపై కోర్టులో ఫిర్యాదు చేశారు. అంతకుముందు కోర్టులో ఇరువర్గాల న్యాయవాదుల మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. ఒప్పుకున్నందుకు సంతోషం: మోడి లండన్: ఆర్సీఏ అధ్యక్ష ఎన్నికల్లో తన విజయం బీసీసీఐకి తెలిసినందుకు సంతోషంగా ఉందని లలిత్ మోడి అన్నారు. అయితే అధికారికంగా ఫలితాల వెల్లడి ఆలస్యం కావడంపై విచారం వ్యక్తం చేశారు. -
రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వాయిదా
న్యూఢిల్లీ: రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాల విడుదలను సుప్రీం కోర్టు ఈనెల 17 వరకూ వాయిదా వేసింది. దీంతో ఆర్సీఏ ప్రెసిడెంట్గా పోటీ చేసిన లలిత్ మోడి భవితవ్యం తేలేందుకు మరో 11 రోజుల పాటు ఎదురు చూడాల్సి వస్తోంది. ఒకవైపు ఐపీఎల్ చైర్మన్గా కొనసాగిన రోజుల్లో ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడంటూ బిసిసిఐ ప్రెసిడెంట్ శ్రీనివాసన్ ఒత్తిడి మేరకు లలిత్ మోడిని జీవిత కాలం నిషేధించారు. దాంతో బోర్డు అనుబంధ రాష్ట్రాల్లో పోటీ చేసే అవకాశం మోడికి లేదు. రాజస్థాన్ స్పోర్ట్స్ యాక్ట్లో వున్న వెసలు బాటు మేరకు పోటీ చేసిన మోడి దాదాపు ఎన్నికయ్యారని అనధికార సమాచారంతో తెలుస్తోంది. అయితే రాజస్థాన్ క్రికెట్ మాజీ కార్యదర్శి కిషన్ రూంగ్టా రాజస్థాన్ స్పోర్ట్స్ యాక్ట్ని సవాల్ చేసిన కేసులోనే బిసిసిఐ కూడా ఇంప్లీడ్ పిటీషన్ వేసింది. మోడిని ఎన్నుకుంటే రాజస్థాన్ను నిషేధిస్తామంటూ శ్రీనివాసన్ వర్గం హెచ్చరించింది కూడా. కాగా, ప్లేయర్లకు అన్యాయం జరగకుండా రంజీ సహా ఇతర టోర్నీల్లో పాల్గొనే వెసలు బాటు కల్పించే చాన్సెస్ వున్నాయి. -
మరో 11 రోజుల్లో తేలనున్నలలిత్ మోడీ భవితవ్యం
జైపూర్ : రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాల విడుదలను ఈనెల 17కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఆర్సీఏ ప్రెసిడెంట్గా పోటీ చేసిన లలిత్ మోడి భవితవ్యం తేలేందుకు మరో 11 రోజుల పాటు ఎదురు చూడాల్సి వస్తోంది. ఒకవైపు ఐపీఎల్ చైర్మన్గా కొనసాగిన రోజుల్లో ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడంటూ బిసిసిఐ ప్రెసిడెంట్ శ్రీనివాసన్ ఒత్తిడి మేరకు లలిత్ మోడిని జీవిత కాలం నిషేధించారు. దాంతో బోర్డు అనుబంధ రాష్ట్రాల్లో పోటీ చేసే అవకాశం మోడికి లేదు. రాజస్థాన్ స్పోర్ట్స్ ఏక్ట్లో ఉన్న వెసులుబాటు మేరకు పోటీ చేసిన మోడి దాదాపు ఎన్నికయ్యారని అనధికార సమాచారంతో తెలుస్తోంది. అయితే రాజస్థాన్ క్రికెట్ మాజీ కార్యదర్శి కిషన్ రూంగ్టా రాజస్థాన్ స్పోర్ట్స్ ఏక్ట్ని సవాల్ చేసిన కేసులోనే బిసిసిఐ కూడా ఇంప్లీడ్ పిటీషన్ వేసింది. మోడిని ఎన్నుకుంటే రాజస్థాన్ను నిషేధిస్తామంటూ శ్రీనివాసన్ వర్గం హెచ్చరించింది. కాగా, ప్లేయర్లకు అన్యాయం జరగకుండా రంజీ సహా ఇతర టోర్నీల్లో పాల్గొనే వెసలు బాటు కల్పించే అవకాశాలు వున్నాయి. -
మోడిపై సుప్రీంకు వెళ్లిన బోర్డు
ముంబై: రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ) అధ్యక్షుడిగా ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి నియామకాన్ని అడ్డుకునేందుకు బీసీసీఐ తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈమేరకు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. క్రికెట్ బోర్డు నుంచి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్నప్పటికీ లెక్కచేయకుండా గత నెల 19న జరిగిన ఆర్సీఏ ఎన్నికల్లో మోడి అధ్యక్ష బరిలోకి దిగారు. వచ్చే వారం సుప్రీం కోర్టు ప్రకటించే ఈ ఫలితాల్లో మోడి దాదాపుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఆర్సీఏ అనేది రాజస్థాన్ క్రీడా చట్టం కిందికి వస్తుందని, ఈ ఎన్నికల్లో బోర్డు నిషేధం పనిచేయదని మోడి మద్దతుదారులు వాదిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ చట్టంపై ఆర్సీఏ మాజీ కార్యదర్శి కిశోర్ రుంగ్తా సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు బీసీసీఐ కూడా దీంట్లో ఇంప్లీడ్ అయ్యింది. ఈనెల 6న ఇది విచారణకు రానుంది. ఆర్సీఏలో మోడి తిరిగి క్రియాశీలకంగా మారితే బోర్డు ప్రతిష్ట దెబ్బతింటుందని, మోడి అభ్యర్థిత్వంపై బీసీసీఐ అభ్యంతరాలను ఆర్సీఏ పట్టించుకోకపోవడంతో అతడి నామినేషన్ను పరిగణనలోకి తీసుకోకూడదని తమ పిటిషన్లో పేర్కొంది. -
లలిత్ మోడిపైనే చర్చ
చెన్నై: జీవిత కాల నిషేధం ఎదుర్కొంటున్నప్పటికీ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ) ఎన్నికల బరిలోకి దిగిన ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి వ్యవహారంపై బీసీసీఐ వర్కింగ్ కమిటీ అత్యవసర సమావేశంలో చర్చించనుంది. నేడు (శనివారం) చెన్నైలో ఈ సమావేశం జరుగనుంది. ఈనేపథ్యంలో బోర్డు గుర్తింపు పొందిన అన్ని యూనిట్ల ప్రతినిధులు ఈ మీటింగ్కు హాజరుకానున్నారు. దీంట్లో మోడి భవితవ్యంతో పాటు ఆర్సీఏపై నిషేధం విధిస్తే ఎదురయ్యే పరిస్థితులపై చర్చ జరిగే వీలుంది. సుప్రీం కోర్టు నియమించిన ఎన్నికల పరిశీలకుడి అనుమతితో మోడి ఈ ఎన్నికల్లో పోటీ చేయగా అధ్యక్షుడిగానూ ఎన్నికయ్యే అవకాశం ఉంది. ‘క్రికెట్కు, క్రికెటర్ల ప్రయోజనాలకు వ్యతిరేకంగా బీసీసీఐ ఎప్పటికీ పనిచేయదు. మేం ఏ నిర్ణయం తీసుకున్నా రాజస్థాన్ క్రికెటర్లకు ఎలాంటి సమస్య ఉండబోదు. అలాగే మోడి తిరిగి క్రికెట్ కార్యకలాపాల్లోకి రావాలనే ప్రయత్నంపై కూడా చర్చించనున్నాం. అతడిపై ఏ చర్య అయినా తీసుకునే ముందు అందరి సభ్యుల వాదనను వింటాం’ అని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ అన్నారు. అబ్ది వివరిస్తారు: ఆర్సీఏ జైపూర్: లలిత్ మోడి తమ ఎన్నికల బరిలోకి దిగిన వైనంపై బీసీసీఐ వర్కింగ్ కమిటీ ముందు వాదన వినిపించేందుకు ఆర్సీఏ.. మెహమూద్ అబ్దిని నియమించుకుంది. ‘బీసీసీఐ ప్రజాస్వామిక పద్ధతిలో సమావేశానికి నన్ను అనుమతిస్తుందనే నమ్మకం ఉంది. లేకుంటే ప్రతీ సభ్యున్ని వ్యక్తిగతంగా కలుసుకుని పరిస్థితిని వివరిస్తాను. రాజస్థాన్ క్రీడా చట్టం కింద ఆర్సీఏ నడుస్తోంది కాబట్టి మోడిపై బీసీసీఐ నిషేధం లెక్కలోకి రాదు’ అని అబ్ది తెలిపారు. -
6న ఆర్సీఏ ఎన్నికల ఫలితాలు
జైపూర్: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి పోటీ చేసిన రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ) ఎన్నికలు గురువారం జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 6న వెల్లడి కానున్నాయి. సుప్రీం కోర్టు నియమించిన పరిశీలకులు జస్టిస్ ఎన్ఎమ్ కస్లీవాల్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఓటింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి పూర్తి నివేదికతో ఆయన సుప్రీం కోర్టుకు పంపించారు. జనవరి 6న విచారణ అనంతరం ఫలితాలు రానున్నాయి. మరోవైపు... తమ ఎన్నికల్లో నిషేధిత లలిత్ మోడిని అనుమతిస్తే వేటు తప్పదని బీసీసీఐ హెచ్చరించిన నేపథ్యంలో ఆర్సీఏ స్పందించింది. ‘రాజస్థాన్ క్రీడా చట్టం-2005 ప్రకారమే ఆర్సీఏ తమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అలాగే సుప్రీం కోర్టులో దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ ఆధారంగా ఈ ఎన్నికలు జరిగాయి’ అని బోర్డుకు లేఖ రాసింది. -
ఆర్సీఏ అధ్యక్షుడిగా మోడి?
జైపూర్: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి.. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ) అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు రంగం సిద్ధమైంది. గురువారం జరగనున్న సంఘం ఎన్నికల్లో 33 జిల్లా సంఘాలకు గాను అతనికి 28 జిల్లాలు మద్దతు ఇవ్వనున్నాయి. దీంతో ఎన్నికలు ఏకపక్షంగా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ పరిణామం మొత్తాన్ని చూస్తే బీసీసీఐకి ఇది పెద్ద ఎదురుదెబ్బ కానుంది. జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న మోడి... ఎన్నికల్లో పాల్గొనకుండా మొదట్నించీ బోర్డు చేసిన ప్రయత్నాలన్నీ ఒక్కొక్కటిగా బెడిసి కొడుతున్నాయి. అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న రాంపాల్ శర్మ (బిల్వారా సంఘం కార్యదర్శి)పై మోడిదే పైచేయిగా కనిపిస్తోంది. ఉపాధ్యక్ష పదవి కోసం మోడి తరఫున న్యాయవాది ఆబ్ది, కరుణేశ్ల మధ్య పోటీ నెలకొంది. మరోవైపు అధ్యక్ష పదవి కోసం మోడి దాఖలు చేసిన నామినేషన్కు సుప్రీం కోర్టు నియమించిన ఎన్నికల ముఖ్య పరిశీలకుడు రిటైర్డ్ జస్టిస్ నరేంద్ర మోహన్ కస్లివాల్ బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శర్మ తరఫు లాయర్ మూడు పాయింట్లపై చేసిన వాదనలను జడ్జి తోసిపుచ్చారు. ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ ఆదేశాల మేరకు ముంబై రీజినల్ పాస్పోర్ట్ ఆఫీస్... మోడి పాస్పోర్ట్ని రద్దు చేసిందని, దీనివల్ల అతను లండన్లో ఉండి ఇక్కడ ఆర్సీఏ రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడం సాధ్యం కాదని వాదించడంతో పాటు క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న వ్యక్తి బీసీసీఐ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడని లాయర్ స్పష్టం చేశారు. దీనికి మోడి తరఫు లాయర్ అభినవ్ శర్మ ప్రతివాదనలు వినిపిస్తూ... రాజస్థాన్ క్రీడా చట్టాలు-2005 ప్రకారం అధ్యక్షుడు తన కార్యకలాపాలను నిర్వహించేందుకు ప్రతీసారి వ్యక్తిగతంగా హాజరుకావాల్సిన అవసరం లేదని తెలిపారు. -
ఆర్సీఏ ఎన్నికల బరిలో లలిత్ మోడి
జైపూర్: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ) ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆయన లీగల్ కౌన్సిల్ మెహమూద్ అబ్ది ధృవీకరించారు. ఈనెల 19న ఆర్సీఏ ఎన్నికలు జరుగనున్నాయి. ఐపీఎల్లో ఆర్థిక అవకతవకల కారణంగా మోడిపై బీసీసీఐ ఇప్పటికే జీవితకాల బహిష్కరణ విధించింది. ప్రస్తుతం ఆయన లండన్లో ఉంటున్న విషయం తెలిసిందే. ‘ఆర్సీఏ మాజీ అధ్యక్షుడు లలిత్ మోడి ఈనెల 19న జరిగే ఎన్నికల్లో పోటీపడనున్నారు. తనపై జీవితకాల వేటు వేసిన బీసీసీఐని ఆయన సవాల్ చేయనున్నారు. పోటీ విషయంలో ఆయనకు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం లేదు. ఎందుకంటే నాగ్పూర్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇప్పటికే ఆయన అర్హులైన జాబితాలో ఉన్నారు. అంతేకాకుండా రాజస్థాన్ తమ స్పోర్ట్స్ యాక్ట్-2005 ప్రకారం క్రీడలను నిర్వహిస్తుంది. ఆయా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ల నుంచి మాకు మద్దతు లభిస్తోంది. కచ్చితంగా మా గ్రూపు విజయం సాధిస్తుంది’ అని అబ్ది అన్నారు. ఈ ఎన్నికల పరిశీలకులుగా జస్టిస్ కస్లివాల్ను సుప్రీం కోర్టు నియమించింది. -
శ్రీనివాసన్పై మోడి లాయర్ ఫిర్యాదు
ముంబై: బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్పై ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి లాయర్ మెహమూద్ అబ్ది పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీడియా హక్కుల విషయంలో క్రికెట్ బోర్డుకు శ్రీనివాసన్ రూ.2,882 కోట్ల మేర నష్టం కలిగించాడని ఆరోపించారు. ఆయతో పాటు ఐపీఎల్ స్పాన్సరర్స్ మల్టీ స్క్రీన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎస్ఎం) అధికారులపై క్రిమినల్ కేసును దాఖలు చేయాలని గంగానగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో అబ్ది ఈ ఫిర్యాదు చేశారు. ఈ అసోసియేషన్కు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ గుర్తింపు ఉంది. ‘సెప్టెంబర్ 23న మాకు అబ్ది లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. శ్రీనివాసన్ ఇతరులపై క్రిమినల్ కేసు పెట్టాలని ఆయన కోరారు. అబ్ది నుంచి స్టేట్మెంట్ను రికార్డు చేశాం. అయితే ఆయన ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తుల నుంచి ఇంకా ఎలాంటి స్టేట్మెంట్ తీసుకోలేదు. ఈ ఆరోపణలపై ప్రాథమిక విచారణను ప్రారంభించాం. ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. మా నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తాం. వారు దీన్ని కేసు పెట్టదగిన నేరమా? కాదా? అని నిర్ణయిస్తారు’ అని మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ రామేశ్వర్ సూప్లే వివరించారు. మరోవైపు తామెలాంటి తప్పు చేయలేదని, పోలీసులకు సహకరిస్తామని బోర్డు అధ్యక్షుడు శ్రీనివాసన్ తెలిపారు. -
నిషేధంతో బీసీసీఐలో లలిత్ మోడీ ఖేల్ఖతమ్
-
జీవితకాల నిషేధం
చెన్నై: ఊహించినట్లుగానే ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడిపై జీవితకాలం నిషేధం పడింది. ఆర్థిక అవకతవకలతో పాటు క్రమశిక్షణరాహిత్యం, దుష్ర్పవర్తన, బోర్డు హక్కులకు భంగం కలిగించడం వంటి అంశాలను కారణాలుగా చూపుతూ బుధవారం జరిగిన బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎమ్)లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బోర్డు చీఫ్ ఎన్.శ్రీనివాసన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికపై సభ్యులు చర్చలు జరిపారు. ఆ తర్వాత జీవితకాల బహిష్కరణ వేటుకు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. తీవ్రమైన క్రమశిక్షణరాహిత్యంతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడిన మోడి ని... బీసీసీఐ నియమావళిలోని క్లాజ్ 32 (4) ప్రకారం నిషేధించామని బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక నుంచి బీసీసీఐకి సంబంధించిన కమిటీలు, ఆఫీసుల్లో బాధ్యతలు చేపట్టే హక్కు అతనికి లేదని స్పష్టం చేసింది. సమావేశంలో పాల్గొన్న సభ్యుల్లో కనీసం ఒక్కరు కూడా మోడికి మద్దతుగా నిలువలేదని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరోవైపు మోడిపై విధించిన నిషేధాన్ని కోర్టులో సవాలు చేస్తామని అతని తరఫు లాయర్ మహమూద్ ఆబ్ది చెప్పారు. అంశం కోర్టు పరిధిలో ఉన్నా.... వ్యక్తిగత పక్షపాతంతో పూర్తి ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని వ్యాఖ్యానించారు. ఢిల్లీ హైకోర్టు అనుమతితో... మూడేళ్ల నుంచి మోడిపై విచారణ జరిపిన అరుణ్ జైట్లీ, జ్యోతిరాధిత్య సింధియాలతో కూడిన క్రమశిక్షణ కమిటీ 134 పేజీల నివేదికను జూలైలో బోర్డుకు అందజేసింది. ఎనిమిది అంశాల్లో అతన్ని దోషిగా ఖరారు చేసింది. దీనిపై చర్యలు తీసుకోవడానికి పూనుకుంటున్న తరుణంలో మోడి కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు. కొంతకాలం వేచి చూసిన బీసీసీఐ ఢిల్లీ హైకోర్టు అనుమతితో బుధవారం ఎస్జీఎమ్ను నిర్వహించింది. అయితే ఈ ఎపిసోడ్లో అంతకుముందు చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కింది కోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయొద్దని సుప్రీం కోర్టును ఆశ్రయించిన మోడికి అక్కడ కాస్త ఉపశమనం లభించింది. అతని ఫిర్యాదును స్వీకరించేందుకు కోర్టు అంగీకరించడంతో ఎస్జీఎమ్ను వాయిదా వేయాలని మోడి బోర్డు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. కానీ దీన్ని తిరస్కరించిన బీసీసీఐ... సమావేశాన్ని నిర్వహించేందుకు మొగ్గు చూపింది. అసలేం జరిగింది..! 2010 ఐపీఎల్ బిడ్డింగ్ సమయంలో రెండు కొత్త జట్లకు అనుకూలంగా కొన్ని నిబంధనలు మార్చడంతో పాటు కొచ్చి జట్టుకు సంబంధించిన యాజమాన్య విషయాలను మోడి ట్విట్టర్లో బయటపెట్టారు. బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సంబంధించిన అత్యంత రహస్య అంశాలను బహిర్గతం చేశాడనే ఆరోపణలతో 25 ఏప్రిల్ 2010 (ఐపీఎల్-3 ఫైనల్ తర్వాత)న క్లాజ్ 32 (4) ప్రకారం బీసీసీఐ... మోడిపై సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే ఐపీఎల్ కమిషనర్ పదవి నుంచీ తొలగించింది. 2008-10లో ఆర్థిక అవకతవకలకు పాల్పడటంతో పాటు మొత్తం 22 నేరాలను అతనిపై ఆరోపిస్తూ 34 పేజీల సస్పెన్షన్ నోటీసును బోర్డు జారీ చేసింది. ఆ తర్వాత విచారణ కోసం త్రిసభ్య క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసినా అందులో నుంచి చిరయు అమిన్ తప్పుకున్నారు. ద్విసభ్య కమిటీ పంపిన మూడు షోకాజ్ నోటీసులకు మోడి సమాధానమిచ్చినా వ్యక్తిగతంగా మాత్రం హాజరుకాలేదు. మూడేళ్ల పాటు విచారణ చేసిన కమిటీ తమ నివేదికను బోర్డుకు అందజేసింది. పోరాడతా: మోడి ‘బీసీసీఐ తన నిర్ణయం తీసుకుంది. దానికి తగిన విధంగా నేను కూడా స్పందిస్తా. నేను ఎక్కడికీ వెళ్లదల్చుకోలేదు. ఇక్కడే ఉండి పోరాడతా. శ్రీనివాసన్ చర్యలపై బోర్డు సభ్యులు నిరసన వ్యక్తం చేయాలి. లీగ్ సృష్టికర్త అయిన నాపై నిషేధం విధించారు. శ్రీనివాసన్ పెద్ద మ్యాచ్ ఫిక్సర్. కానీ ఆయనే బోర్డును నడుపుతున్నారు. ఏదేమైనా వ్యక్తి కంటే బ్రాండ్ గొప్పది. కాబట్టి ఐపీఎల్తో నా సంబంధాలు తెగిపోవు. దానికి రూపకల్పన చేసిందే నేను. బోర్డుకు 8 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సమకూర్చా. నేనెప్పుడైనా బీసీసీఐ హక్కులను కాపాడటానికే కృషి చేశా. నేను వైదొలిగిన తర్వాత డెక్కన్ చార్జర్స్, కొచ్చి టస్కర్స్ ఫ్రాంచైజీలను రద్దు చేశారు. దీంతో 700 మిలియన్ డాలర్ల నష్టం కలిగింది. దాన్ని వదిలిపెట్టి నాపై ఆర్థిక ఆరోపణలు చేస్తే ఎలా’ - లలిత్ మోడి నాడు కింగ్ మేకర్ ‘మోడి అంటేనే ఐపీఎల్...నేను సృష్టించిన బ్రాండ్ నాకు పర్యాయపదంగా మారిపోయింది’...లలిత్మోడి అధికారిక వెబ్సైట్లో తన గురించి తాను ఇప్పటికీ చెప్పుకునే పరిచయ వాక్యం ఇది. చాలా మంది వైఫల్యం ఊహించిన చోట మోడి విజయవంతం అయ్యాడు. వ్యాపారవేత్తల కుటుంబం నుంచి వచ్చిన అతను క్రికెట్కు కొత్త వ్యాపార సూత్రాలు నేర్పించాడు. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్లో మొదలైన మోడి ప్రస్థానం ఇప్పుడు బీసీసీఐ బహిష్కరణతో ముగిసింది. క్రికెట్ అభిమాని ప్లస్ బిజినెస్మన్గా ‘మోడి ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్’ పేరుతో స్పోర్ట్స్ చానల్స్తో కలిసి చేసిన వ్యాపారం అతనిలో కొత్త లీగ్ ఆలోచనకు ఊపిరి పోసింది. ఫలితమే టి20 క్రికెట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో కొత్త అధ్యాయం మొదలైంది. ఐపీఎల్ రూపకర్తగా తెచ్చుకున్న గుర్తింపుతో మోడి చాంపియన్స్ లీగ్ టి20కి కూడా అంకురార్పణ చేశాడు. ఐపీఎల్కు తానే కర్త, కర్మ, క్రియగా ఉంటూ దాదాపు నాలుగేళ్ల పాటు హవా నడిపించిన మోడి, ఈ కాలంలో బీసీసీఐ ఆదాయం దాదాపు రూ. 48 వేల కోట్లకు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. కొత్త కొత్త ఆలోచనలతో బోర్డుకు భారీగా సొమ్ము తెచ్చిపెట్టిన దాదాపు 15కు పైగా కీలక ఒప్పందాల్లో మోడినే సూత్రధారిగా వ్యవహరించాడు. ఒకప్పుడు అంతా తానే అయి నడిపించి...చివరకు అవినీతి ఆరోపణలు, నిబంధనల ఉల్లంఘనలతో దేశం విడిచి వెళ్లిపోవడంతో పాటు నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. మోడిపై జీవితకాల నిషేధం విధించాలనేది ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం. ఇందులో ఎలాంటి ద్వంద్వర్థాలు లేవు. మొదట అనిరుధ్ చౌదరి (హర్యానా) దీన్ని ప్రవేశపెట్టగా... తర్వాత రంజిబ్ బిస్వాల్ (ఒడిస్సా), ఆ తర్వాత అందరూ ఆమోదం తెలిపారు. ఒక్క ఓటు కూడా వ్యతిరేకంగా పడలేదు . - రాజీవ్ శుక్లా (బీసీసీఐ ఉపాధ్యక్షుడు) -
శిఖరం నుంచి పాతాళానికి..
లలిత్ మోడీ.. భారత క్రికెట్లో ఓ సంచలనం. విజయాలకే కాదు వివాదాలకూ అతనో చిరునామా. ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు కర్త, కర్మ, క్రియ అన్నీ మోడీనే. ఈ ఈవెంట్ను అత్యంత విజయవంతం చేసిన ఘనత అతనిదే. ఐపీఎల్ ఆరంభ చైర్మన్గా మోడీ తన వ్యాపార తెలివితేటలతో లీగ్ను కొత్త పుంతలు తొక్కించాడు. అయితే ఇదంతా గతం. నేడు అదే మోడీపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. ఇంతకుముందు ఐపీఎల్ చైర్మన్ పదవి నుంచి బహిష్కరణకు గురయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే శిఖరాగ్రం నుంచి పాతాళానికి పడిపోయాడు. ఇదంతా 49 ఏళ్ల మోడీ స్వయం కృతాపరాధం. 2008లో ఆరంభమైన ఐపీఎల్ను మోడీ సర్వం తానై నడిపించాడు. లీగ్లో కార్పొరేట్ దిగ్గజాలు, బాలీవుడ్ ప్రముఖులను భాగస్వాముల్ని చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా స్టార్ క్రికెటర్లందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి అభిమానులకు వినోదాన్ని అందించాడు. బీసీసీఐకి కాసుల పంట పండింది. దీంతో మోడీ పేరు ప్రపంచ క్రికెట్లో మార్మోగిపోయింది. లీగ్కు సమాంతరంగా అతనికీ మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఏడాది భారత్లో సార్వత్రిక ఎన్నికలు జరగడంతో భద్రత కారణాల రీత్యా ఐపీఎల్ రెండో సీజన్ నిర్వహణకు అనుమతి దక్కలేదు. అయినా పట్టువీడని మోడీ పోటీలను దక్షిణాఫ్రికాలో నిర్వహించాడు. ఐపీఎల్ ఆరంభమయ్యాక తొలి రెండేళ్లు విజయవంతంగా నెట్టుకొచ్చిన మోడీకి 2010 తర్వాత కష్టాలు మొదలయ్యాయి. ఈ సీజన్కు కొత్తగా రెండు టీమ్లు పుణె, కోచి అరంగేట్రం చేశాయి. కోచి భాగస్వాముల వివరాలను మోడీ వెల్లడించడం పెద్ద దుమారం రేపింది. ఈ వివాదంలో కేంద్ర మంత్రి పదవికి శశిథరూర్ రాజీనామా చేయగా, ఆనక మోడీ కూడా చిక్కుల్లో పడ్డాడు. ఐపీఎల్ నిర్వహణలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాననే ఆరోపణలు ఎన్నో వచ్చాయి. ఫ్రాంచైలీ వేలంలో తనకు కావాల్సిన వారి కోసం నిబంధనలను అతిక్రమించి అనుకూలంగా వ్యవహరించాడనే విమర్శల్ని మూటగట్టుకున్నాడు. దీంతో ఐపీఎల్ చైర్మన్ పదవి నుంచి అతణ్ని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత లండన్ వెళ్లిన మోడీ భారత్లో తనకు ప్రాణ హాని ఉందంటూ అక్కడే ఉండిపోయాడు. మోడీపై వచ్చిన ఆరోపణలపై విచారించిన బీసీసీఐ క్రమశిక్షణ సంఘం ఇటీవల నివేదిక సమర్పించింది. మోడీపై జీవితకాల నిషేధం విధించాలని నివేదించింది. తాజాగా సమావేశమైన బోర్డు మోడీపై వేటు వేసింది. దీంతో ఒకప్పడు విజయవంతమైన అధికారిగా మన్ననలందుకున్న లలిత్ మోడీ నేడు దోషిగా ముద్ర వేయించుకుని బోర్డుకు శాశ్వతంగా దూరమయ్యాడు. -
లలిత్ మోడీపై జీవితకాల నిషేధం
-
లలిత్ మోడీపై జీవితకాల నిషేధం
ఐపీఎల్ బహిష్కృత చైర్మన్ లలిత్ మోడీపై బీసీసీఐ జీవిత కాల నిషేధం విధించింది. బుధవారమిక్కడ జరిగిన బోర్డు ప్రత్యేక వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. మోడీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డానే ఆరోపణలు రావడంతో ఐపీఎల్ చైర్మన్ పదవి నుంచి మోడీని తొలగించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై విచారించిన బీసీసీఐ క్రమిశిక్షణ సంఘం మోడీపై వేటు వేయాలని ఇటీవల బోర్డుకు నివేదించింది. ఈ నేపథ్యంలో బోర్డు ప్రత్యేకంగా సమావేశమై మోడీపై కఠిన చర్యలు తీసుకుంది. కాగా అంతకుముందు బోర్డు సమావేశాన్ని అడ్డుకునేందుకు మోడీ చివరి ప్రయత్నంగా సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. మోడీ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. లలిత్ మోడీ ప్రస్తుతం లండన్లో నివసిస్తున్నాడు. -
మోడిపై వేటుకు రంగం సిద్ధం
చెన్నై: బీసీసీఐకి కొరకరాని కొయ్యలా తయారైన ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడిపై జీవిత కాల బహిష్కరణకు రంగం సిద్ధమైంది. ఐపీఎల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడనే ఆరోపణలపై బోర్డు క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికపై నేడు (బుధవారం) ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) జరగనుంది. ఈ మీటింగ్కు బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ అధ్యక్షత వహించనున్నారు. ప్రధానంగా ఇందులో మోడిపై వేటు గురించి చర్చించనున్నారు. జీవిత కాల బహిష్కరణ విధించాలంటే సమావేశంలో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం ఉంటుంది. మొత్తం 31 యూనిట్లలో కనీసం 21 ఓట్లు మోడిపై వేటుకు అనుకూలంగా పడాలి. పంజాబ్ (పీసీఏ) తప్ప ఇతర యూనిట్లు మోడికి మద్దతునిచ్చేందుకు సిద్ధంగా లేవు. అంతకుముందు ఈ మీటింగ్ జరగకుండా మోడి పాటియాల హౌస్ కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా ఢిల్లీ హైకోర్టు మాత్రం బీసీసీఐకి అనుకూలంగా తీర్పునిచ్చింది. చూస్తూ ఊరుకోను: మోడి శ్రీనివాసన్ మరోసారి బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికై భారత క్రికెట్ను నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోనని లలిత్ మోడి హెచ్చరించారు. శ్రీనివాసన్ చేసిన కొన్ని అనైతిక పనులకు తాను కూడా బాధ్యత వహించాల్సి ఉందని అంగీకరించారు. నిషేధం విధించినా బాధపడేది లేదని, ఇప్పటికే సస్పెన్షన్లో ఉన్నానని గుర్తుచేశారు. 27న శ్రీనివాసన్ పోటీపై విచారణ న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ మరోసారి ఎన్నికల బరిలో నిలవకుండా అడ్డుకోవాలని బీహార్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ ఈనెల 27న విచారణకు రానుంది. ఈనెల 29న చెన్నైలో జరిగే బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశంలో మరో ఏడాది పదవి కోసం శ్రీనివాసన్ పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పోటీపై అత్యవసరంగా విచారణ జరిపి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్, సీఏబీ కార్యదర్శి ఆదిత్య వర్మ కోర్టును కోరారు. దీనికి స్పందించిన జస్టిస్ ఏకే పట్నాయక్ సమాధానమిస్తూ శుక్రవారం విచారిస్తామని చెప్పారు.