Navaratnalu Scheme
-
Gullamarsu Suresh: ఎవరెస్టుపై నవరత్న కీర్తి
సాక్షి, మచిలీపట్నం: వైఎస్ జగన్ పాలనలో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన నవరత్న పథకాల కీర్తి ఇప్పుడు ఎవరెస్టుపై రెపరెపలాడుతోంది. కర్నూలు జిల్లా గోనెగండ్లకు చెందిన గుల్లమర్సు సురేష్ బాబు ఎవరెస్టు బేస్ నుంచి ఒక్కో శిఖరాన్ని అధిరోహిస్తూ.. ఒక్కో పర్వతంపై ఒక్కో పథకం ఫ్లెక్సీల్ని ఎగురవేసి సీఎం జగన్ ఖ్యాతిని చాటిచెప్పాడు. వాస్తవాన్ని ఖండాంతరాలకు తెలిజేయాలనుకున్న అతని వజ్ర సంకల్పాన్ని సీఎం జగన్ గతంలో ట్వీట్ ద్వారా అభినందించారు. My warm wishes to G Suresh Babu, the mountaineer from Kurnool who scaled peaks worldwide promoting our Navaratnalu schemes! Your dedication and love for Andhra Pradesh are truly inspiring and we're grateful for your support Suresh. pic.twitter.com/PNyUX6viKX— YS Jagan Mohan Reddy (@ysjagan) May 27, 2023ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. మా తండ్రి హమాలీ. నేను ఇంటర్లో ఉండగా ప్రభుత్వం పర్వతారోహణకు ఆసక్తి ఉన్న వారి పేర్లను కోరింది. ప్రిన్సిపల్ ప్రోత్సాహంతో దరఖాస్తు చేశా. అంతకుముందు అరికెర హాస్టల్లో చదువుకునే రోజుల్లో సీతాఫలం, తేనె కోసం అక్కడున్న 200–300 మీటర్ల ఎత్తయిన కొండలు అవలీలగా ఎక్కేవాడిని. ప్రిన్సిపల్ పేర్ల జాబితా పంపాక.. ప్రభుత్వం ఎంపిక చేసి, విజయవాడలో శిక్షణ ఇచ్చింది. అందులో ప్రతిభ చూపిన 35 మందిని ఎంపిక చేసి, పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ కొండలపై మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో 35 రోజులు శిక్షణ ఇచి్చంది. ఆ తర్వాత పర్వతారోహణను నా హాబీగా మార్చుకున్నా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవరత్న పథకాలు నన్ను అమితంగా ఆకర్షించాయి. ఆయన ప్రవేశపెట్టిన వలంటీర్లు, సచివాలయ వ్యవస్థలు అద్భుతం. మా మామ అనారోగ్యంగా ఉంటే రూ.1.50 లక్షల ఖరీదైన వైద్యం ప్రైవేటు ఆసుపత్రిలో ఉచితంగా చేశారు. అందుకే నవరత్న పథకాల కీర్తిని చాటిచెప్పాలని భావించా. ఎవరెస్టు బేస్ నుంచి ఒక్కో శిఖరంపై ఒక్కో పథకం ఫ్లెక్సీని ప్రదర్శించారు. ప్రదర్శన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2023 మే 27న నన్ను ఉద్దేశించి ‘నీ అంకితభావం స్ఫూర్తిదాయకం’ అని ట్వీట్ చేశారు. అదే సంవత్సరం జూన్ 1న కర్నూలు జిల్లా పత్తికొండకు వచి్చనప్పుడు సీఎం జగన్ను కలవగా అభినందించారు. మరింత ముందుకు సాగాలని వెన్నుతట్టారు. పర్వతారోహణకు సుమారు రూ.35 లక్షలు ఖర్చవుతుంది. నా ఆర్థిక పరిస్థితి తెలిసిన దాతలు, సిల్వర్ జూబ్లీ కళాశాల పూర్వ విద్యార్థులు, మిత్రులు సహకారం అందించారు. ఐఏఎస్ అధికారి సత్యనారాయణ కూడా సిల్వర్ జూబ్లీ పూర్వ విద్యార్థి కావడంతో చేయూత లభించింది. ఇప్పుడు నా వయసు 24 ఏళ్లు. ఐదేళ్లలోనే దేశంలోని 25 శిఖరాలు అధిరోహించిన తొలి దక్షిణ భారతీయుడిగా పేరుపొందడం గర్వకారణం. తెలుగు బుక్ ఆఫ్ రికా>ర్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించా. పర్వతాలు అధిరోహించేటప్పుడు ఐదు సార్లు చావు అంచుదాకా వెళ్లి వచ్చా. 2019 మే 23న మౌంట్ లోథ్సే ఎక్కుతూ చాలా ఇబ్బంది పడ్డా. -
మధ్య తరగతికి మరింత భరోసా.. వైఎస్సార్సీపీ నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మధ్యతరగతి వర్గాల సంక్షేమానికి పలు చర్యలు చేపట్టి, ఆ వర్గాలను ఉన్నత స్థితికి తెస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘నవరత్నాలు ప్లస్’తో కూడిన మేనిఫెస్టోతో మరోసారి సంపూర్ణ భరోసా కల్పించారు. పట్టణాల్లోని మధ్య తరగతి కుటుంబాల దశాబ్దాల సొంతింటి కలను సాకారం చేసేలా కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. 123 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేకంగా ఎంఐజీ లేఅవుట్లను అభివృద్ధి చేసి, సరసమైన ధరలకే ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నారు. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో ప్రతి ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయించి.. రూ.2 వేల కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటుకు నిర్ణయించారు. 17 కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 29 నగర పంచాయతీల్లో దశలవారీగా ఎంఐజీ లేఅవుట్లను అభివృద్ధి చేయనున్నారు. ఇదే కాకుండా, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపట్టారు. అవి..– ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు విదేశాల్లో చదువుకునేందుకు అండగా నిలవనున్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల ఉన్నత చదువుల కోసం తీసుకునే రుణంలో రూ.10 లక్షల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యేంత వరకు చెల్లించనున్నారు. గరిష్టంగా ఐదేళ్ల పాటు వడ్డీ చెల్లింపుతో ఆర్థిక భరోసానిచ్చారు. – ప్రభుత్వ పాలనలో భాగస్వాములుగా ఉంటూ ఆప్కాస్, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు విద్య, వైద్యం, ఇళ్ల స్థలాలు సహా పూర్తి నవరత్న పథకాలను వర్తింజేయనున్నారు. దీనివల్ల రూ.25 వేల వరకు జీతం పొందుతున్న ఈ తరహా ఉద్యోగులందరికీ ఎంతో మేలు జరగనుంది. వీరితో పాటు ఇళ్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు వారి సొంత జిల్లాల్లోనే ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నారు. ఆ స్థలం ఖరీదులో ప్రభుత్వం 60 శాతం ఖర్చును భరించనుంది.– వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా మధ్యతరగతికి ఆరోగ్య రక్షణ కల్పిస్తున్నారు. రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చారు. వీరికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించనున్నారు.– వైఎస్సార్ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ద్వారా గతంలో మాదిరిగానే ఏటా రూ.15 వేలు అందిస్తూ వచ్చే ఐదేళ్లలో నాలుగు విడతల్లో రూ.60 వేల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులైన అక్కచెల్లెమ్మల ఖాతాల్లో క్రమం తప్పకుండా ఈ ఆర్థిక సాయం జమ చేస్తారు.ఆర్యవైశ్యులకు అండగా..ఇప్పటికే ఓసీల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు నిధులను సైతం ఇస్తున్నారు తొలిసారిగా ఆర్య వైశ్యులకు ఒక కార్పొరేషన్ను తీసుకొచ్చి అండగా నిలిచారు. ఆర్యవైశ్య సత్రాలను సొంతంగా వారే నిర్వహించే హక్కులను కల్పించారు. ఇంతటి సంక్షేమాన్ని వచ్చే ఐదేళ్ల పాటు కొనసాగిస్తామంటూ 2024 మేనిఫెస్టో ద్వారా మరోసారి భరోసా ఇచ్చారు.చెప్పినదానికంటే మిన్నగా..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజికవర్గాలకు మాత్రమే కాకుండా ఇతర వర్గాలకు సైతం నవరత్నాలు పథకాలతో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఆర్థిక లబ్ధిని పెద్ద ఎత్తున అందించడం ద్వారా సీఎం వైఎస్ జగన్ రికార్డు సృష్టించారు. రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాల అక్కచెల్లెమ్మలను సంక్షేమ పథకాలతో ఆర్థికంగా బలోపేతం చేశారు. ఈ ఐదేళ్లలో ఆయా వర్గాలకు డీబీటీ ద్వారా 1,66,45,078 మందికి రూ.43,132.75 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా 2,00,59,280 మందికి రూ.86,969.93 కోట్లు కలిపి మొత్తం 3,67,04,358 మందికి రూ.1,30,102.68 కోట్లు లబ్ధి చేకూర్చడం విశేషం.కాపుల అభివృద్ధికి..కాపుల సంక్షేమానికి గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నూరు శాతం అమలు చేశారు. మేనిఫేస్టోలో చెప్పినదానికి మించి భారీ ఆర్థిక సాయం అందించారు. ఏడాదికి రూ.2 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు సాయం చేస్తామని చెప్పగా.. ఐదేళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ కలిపి మొత్తంగా రూ.34,005.12 కోట్లు సాయమందించడం విశేషం. ఇందులో డీబీటీ ద్వారానే 65,34,600 ప్రయోజనాల కింద కాపులకు రూ.26,232.84 కోట్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. నాన్ డీబీటీ కింద మరో రూ.7,772.19 కోట్లు ప్రయోజనాలను కల్పించారు. వాస్తవానికి చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కాపుల సంక్షేమానికి కేటాయించింది కేవలం రూ.1,340 కోట్లే. -
సర్కారు ఊతంతో పూల బాట
నవరత్నాల పేరుతో రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిరుపేదల జీవితాల్లో వెలుగు రేఖలు నింపుతు న్నాయి. లక్షలాది మంది జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. తిరుపతి జీవకోనలోని రాఘవేంద్ర నగర్కు చెందిన వెంకటేష్, మునీశ్వరి కుటుంబమే ఇందుకు నిదర్శనం వెంకటేష్ 2019కి ముందు భవన నిర్మాణ సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేస్తూ చాలీ చాలని ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తుండేవారు. పని దొరికిన రోజు వచ్చే కూలి రూ.400తో ఆ కుటుంబంలోని ఆరుగురు జీవించాల్సి వచ్చేది. ఆయన భార్య మునీశ్వరి గృహిణి. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ముగ్గురు పిల్లలను చదివించేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు తప్ప ఎలాంటి పథకాలు అందలేదు. మునీశ్వరి అత్తమ్మకు పింఛన్ కూడా వచ్చేది కాదు. జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్లరిగే లా తిరిగినా ఫలితం లేకపోయింది. పిల్లలను చది వించగలమా అనే బెంగతో ఉండేవారు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త ప్రవేశపెట్టిన నవరత్నాలతో ఆ కుటుంబానికి భరోసా లభించింది. వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు, ముగ్గురు పిల్లలకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్, అమ్మ ఒడి, కుటుంబంలోని మునీశ్వరి అత్తమ్మకు వృద్ధాప్య పింఛన్ లభిస్తోంది. ప్రస్తుతం ఒక కుమార్తె ఇంజినీరింగ్ పూర్తి చేసింది, మరో కుమార్తె డిగ్రీ పూర్తి చేసింది. వీరిద్ధరూ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. కూలిపని మానేసి చెన్నై నుంచి ముడిసరుకు తెప్పించుకుని గృహాలకు ప్లాస్టిక్ పూల తోరణాలు, దేవుని చిత్రపటాలకు అవసరమైన పలు రకాల రంగులతో మాలలు, ప్లాస్టిక్ పూలతో షోకేజ్ డెకరేషన్ బొకేలు తయారు చేస్తూ మరో ఆరు మంది మహిళలకు ఉపాధి కబ్ధి స్తున్నారు. –తిరుపతి సిటీ\తలసరి ఆదాయం పెరిగింది గతంలో నిరుపేద మహిళలు కూలి పనులు చేసుకుంటూ లేదా ఇళ్లల్లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. పిల్లలను చదివించలేక పోవడంతో వారు షాపుల్లో పనులు చేసుకుంటూ మంచి భవిష్యత్తు కోల్పోయి జీవితాలను సర్వనాశనం చేసుకునేవారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, నవరత్నాలు పేదల పాలిట వరాలుగా మారాయి. వారి జీవన ప్రమాణాలు పెరిగాయి. తలసరి ఆదాయం పెరిగింది. ఇది కాదనలేని నిజం. అమ్మ ఒడి, ఫీజురియింబర్స్మెంట్, విద్యాదీవెన, వసతి దీవెనతో పేద పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుతున్నారు. –జి సవరయ్య, రిటైర్డ్ ఎకనమిక్స్ ప్రొఫెసర్ ఎస్వీ యూనివర్సిటీ, తిరుపతివైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మునీశ్వరి కుటుంబానికి కలిగిన లబ్ధి వైఎస్సార్ ఆసరా రూ.68,000 వైఎస్సార్ చేయూత రూ.75,000 జగనన్న విద్యాదీవెన రూ.28,000 వసతి దీవెన రూ.20,000 అమ్మ ఒడి రూ.30,000 సున్న వడ్డీ రూ.2,250 పింఛన్ కానుక రూ.96,000 మొత్తం రూ.3,19,250 -
సంక్షేమ సిరిమల్లిక
మదనపల్లె పట్టణం సుభాష్రోడ్డు వీధికి చెందిన రాజేంద్రప్రసాద్, నాగమల్లిక భార్యభర్తలు. చిన్నపాటి వ్యాపారం ద్వారా వచ్చే చాలీచాలనీ ఆదాయంతో కుటుంబాన్ని గడపాల్సి వచ్చేంది. వీరికి అమృత, వర్షిత ఇద్దరు కుమార్తెలు. పిల్లలను చదివించేందుకు ఆరి్థకంగా ఇబ్బందులు పడేవారు. రేషన్కార్డు తప్ప ఎటువంటి పథకాలు అందేవి కావు. నాగమల్లిక తెలిసిన వారి దగ్గర అప్పు చేసి సుభాష్రోడ్డులోనే చిరుతిళ్ల దుకాణం ప్రారంభించారు. వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబ పోషణ కష్టంగానే ఉండేది. దీనికి తోడు పిల్లల్ని గొప్పగా చదివించాలన్న కోరిక తీరేనా? అన్న బెంగ వెంటాడేది. ఇదంతా 2019కి ముందు పరిస్థితి. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేసిన సంక్షేమ పథకాలలతో ఆ కుటుంబానికి భరోసా కలిగింది. వైఎస్సార్ ఆసరా, ఇద్దరు పిల్లలకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి వస్తోంది. రూ.6 లక్షలు విలువ చేసే ఇంటి స్థలం ఇచ్చారు. ప్రస్తుతం పెద్ద కుమార్తె అమృత బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తోంది. చిన్న కుమార్తె హర్షిత డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.గతంలో కష్టాలు పడిన నాగమల్లిక కుటుంబం ప్రభుత్వ పథకాల ద్వారా సుభాష్రోడ్డులోనే ఓ షాపు పెట్టి అందులో చిరుతిళ్లు తయారు చేస్తున్నారు. నిప్పట్లు, చెక్కిలాలు, అత్తిరాసలు, మిక్చర్ వంటివి తయారు చేస్తూ హోల్సేల్గా అమ్ముతున్నారు. చిరుతిళ్ల తయారీలో 10 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. వీటిని తయారు చేసి షాపులో రిటైల్ అమ్మకాలతో పాటు పరిసర ప్రాంతాలకు హోల్సేల్ ధరకు సరఫరా చేస్తున్నారు. దీంతో వారి కుటుంబం ఆరి్థకంగా నిలదొక్కుకుంది. –మదనపల్లె జీవన ప్రమాణాలు పెరిగాయి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో చాలా మందిలో జీవన ప్రమాణాలు పెరిగాయి. తలసరి ఆదాయం పెరిగింది. ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా బలహీన వర్గాలకు అందిస్తున్న నిధులతో వారు సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు వీలవుతుంది. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెనతో పేద పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుకుని స్థిరపడ్డారు. ఇది చాలా శుభపరిణామం. – జీఆర్ రుక్మిణి, పూర్వ ప్రిన్సిపాల్, మహిళా డీగ్రీ కళాశాల, మదనపల్లెవైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కలిగిన లబ్ధివైఎస్సార్ ఆసరా రూ.32,328 జగనన్న వసతి దీవెన రూ.23,350 జగనన్న విద్యాదీవెన రూ.41,201 సున్నా వడ్డీ రూ.2,850 అమ్మ ఒడి రూ.45,000 ఇంటి స్థలం రూ.6,00,000 -
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
మంచి ప్రభుత్వం అధికారం చేపడితే... మనసున్న నేత ముఖ్యమంత్రి పదవిలో ఉంటే కుటుంబాలు దశ ఏ విధంగా తిరగనుందోననడానికి ఉదాహరణ కొవ్వూరు మండలం వేములూరుకి చెందిన మారిశెట్టి సత్యనారాయణ బతుకు చిత్రం. పూరిపాకలోనే తుదివరకూ జీవితం కొడిగట్టిపోవల్సిందేమోననే వేదనతో ఆ కుటుంబం విచారవదనంతో ఉండేది. కానీ ఆ పాకలో క్రమేపీ వెలుతుర్లు విరజిమ్మాయి. ఆ మోములో చిరునవ్వులు చిందాయి. దీనికంతటికీ కారణం జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నవ వసంతాలు పూయించాయి. అదెలానో చూద్దాం. – కొవ్వూరు, తూర్పుగోదావరి జిల్లామూడు దశాబ్ధాలకు పైగా రోడ్డు మార్జిన్లో పూరిపాకలోనే సత్యనారాయణ కుటుంబ నివాసం. సొంత ఇల్లంటూ వీరికి లేదు. ఓ గూడు కల్పించాలంటూ ఎంతో మంది నాయకుల చుట్టూ తిరిగి విసిగిపోయారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సొంతింటి కల సాకారమైంది. ఎవరి సిఫార్సులు లేకుండానే వలంటీర్ ఇంటికి వచ్చి వివరాలు తీసుకుని వెళ్లారు. ఆ వెంటే ఇంటి స్ధలం మంజూరైంది.ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల సాయం అందించారు. జీవితంలో సొంతంటి కల నెరవేరుతుందా అనుకున్న వారి బతుకుల్లోకి ముప్పై ఏళ్ల తర్వాత ఓ పొదిరిల్లు పలకరించింది. గీత కార్మిక వృత్తి చేసుకున్న ఆ ఇంటి యజమానికి రూ.3 వేలు గీత కార్మిక పింఛన్ మంజూరైంది. వయస్సు మీద పడిన సమయంలో ఆ సొమ్ము వారి కుటుంబానికి ఎంతో ఊరటనిస్తోంది. ఇప్పటి వరకూ రూ.1,40,750 అందుకున్నారు.సత్యనారాయణ భార్య గన్నెమ్మకి చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,500 చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.56.250 అందాయి. ఇంటి స్ధలం, ఇంటి రుణం అన్నీ కలిపి రూ.5.77 లక్షల లబ్ధి చేకూరింది. వారి మనవరాలికి అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు అందుతోంది. జగన్మోహన్రెడ్డి మేలు ఎప్పటికీ మరిచిపోలేమని వారు సంతోషంగా చెబుతున్నారు.చేయూత అందించారు ప్రభుత్వం 45 ఏళ్లు పైబడిన మహిళలకు అందించే చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,500 అందిస్తున్నారు. ఈ సొమ్ము నా కుటుంబానికి ఎంతో ఉపకరిస్తుంది. నా భర్త గీత కార్మికుడు. వయస్సు మీదపడడంతో పనులకు వెళ్లలేకపోతున్నాం. ఈ సొమ్ముతో ఏటా అందించడంతో మా కుటుంబానికి ఆసరాగా నిలుస్తోంది. సంక్షేమ పథకాల ద్వారా పేదల బతుకుల్లో భరోసా కల్పించారు. – మారిశెట్టి గన్నెమ్మ, వేములూరు, జగనన్న కాలనీ, కొవ్వూరు మండలంవైఎస్సార్సీపీ సంక్షేమ పథకాల ద్వారా చేకూరిన లబ్ధి వైఎస్సార్ పింఛన్ కానుక రూ.1,40,750. వైఎస్సార్ చేయూత రూ.56,250 ఇంటి స్థలం విలువ రూ.2,00,000 ఇంటినిర్మాణానికి ఆర్థిక సాయం రూ.1,80,000 మొత్తం లబ్ధి రూ.5,77,000 -
పేదలకు ఇళ్లు కాలనీలు కాదు ఊళ్లు
నిన్నటి కన్నా ఈ రోజు బాగుండాలి...ఈ రోజు కన్నా రేపు బాగుండాలి...ఎవరైనా కోరుకునేది ఇదే...సగటు మనిషి కాస్తంత నీడ కోసం పరితపిస్తాడు...తన సంపాదన ఓ చిన్న గూడును కట్టుకోవడానికీ చాలకపోతే ప్రభుత్వం సాయపడుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తాడు...ప్రభుత్వం ఓట్ల కోసం తప్పుడు వాగ్దానం చేసి అధికారంలోకి వస్తే మోసపోయానే...అని తనలో తానే మథనపడతాడు...మోసమనే ఇటుకతో గాలిలో మేడలు కట్టిన చంద్రబాబు ప్రభుత్వం నిరుపేదలను ఇలాగే వంచించింది... ఆ వంచనకు శాస్తిగా బాబును చిత్తుగా ఓడించింది జనసామాన్యం...ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలకు ఆచరణ రూపమిస్తే జననీరాజనం ఎలా ఉంటుందో నేడు జగన్ మేం సిద్ధం యాత్ర సాక్ష్యంగా నిరూపిస్తోంది... ఆ హామీ పేరు పేదలకు ఇళ్లు...అర్హతే ప్రాతిపదికగా దేశంలోనే రికార్డుగా...ఒక ఘనతగా చెప్పేలా 31 లక్షల మంది అక్కచెల్లెమ్మల సొంతింటి కలకు గాలిలో కాదు...నేలపైనే మేడలు...ఇంకా చెప్పాలంటే ఊళ్లకు ఊళ్లను నిర్మిస్తూ...నవ్యాంధ్ర చరితను సీఎం జగన్ తిరగరాస్తున్నారు... స్థలం విలువ ఆధారంగా చూస్తే ఒక్కొక్కరికి రూ.6 లక్షల నుంచి రూ.20 లక్షల ఆస్తిని ఉచితంగా కట్టబెట్టిన ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామని జనసామాన్యమే ఉప్పొంగిపోతోంది...ఇది కదా మాటకు కట్టుబడి...మడమ తిప్పని ప్రభుత్వానికి సార్థకత. –వడ్డే బాలశేఖర్, సాక్షి ప్రతినిధిప్రతి పేదవాడు ఏం కోరుకుంటాడు? ‘కడుపు నింపుకోవడానికి గుప్పెడు మెతుకులు, తలదాచుకోవడానికి ఓ సొంత గూడు’.. అయితే దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా తమకంటూ ఓ సొంత గూడు లేని పేదలు ఎందరో ఉన్నారు. ఆ కోవకు చెందిన వేళంగిణి, దుర్గ తరహాలనే రాష్ట్రంలో తమకంటూ ఓ పక్కా ఇల్లు ఉండాలనే ప్రతి పేదింటి అక్క చెల్లెమ్మల చిరకాల స్వప్నాన్ని తోబుట్టువుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేశారు. రాష్ట్ర, దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా పేదలకు పెద్ద ఎత్తున ఉచితంగా ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇంటి నిర్మాణానికి సాయం, కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన ఇలా ప్రతి అడుగులోనూ చేయి పట్టి అక్కచెల్లెమ్మలను ముందుకు నడిపారు. ఇదిలా ఉండగా 40 ఇయర్స్ ఇండస్ట్రీ, విజనరీ లీడర్ అని చెప్పుకునే చంద్రబాబు పేదల ఇళ్ల స్థలాలను శ్మశానాలతో పోల్చిన దుస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, విభజిత ఏపీలో ఒక పర్యాయం సీఎంగా పనిచేసిన ఈ పెద్ద మనిషి ఏనాడు పేదల గూడు గోడును పట్టించుకోలేదు. అడ్డంకులను అధిగమిస్తూ... రాష్ట్రంలో పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం రూపంలో ఏకంగా కొత్తగా ఊళ్లకు ఊళ్లనే సీఎం జగన్ గడిచిన ఐదేళ్లలో నిర్మించ తలపెట్టారు. 71,811 ఎకరాల్లో 31.19 లక్షల మంది నిరుపేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. తద్వారా 17,005 వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్లనే నెలకొల్పారు. పేదలకు పంపిణీ చేసిన ఒక్కో ప్లాట్ విలువ రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ఉంటుంది. ఈ లెక్కన ఏకంగా పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన ప్లాట్ల మార్కెట్ విలువ రూ.76 వేల కోట్లకు పైమాటే. నిరుపేదల దశాబ్దాల సొంతింటి కల సాకారానికి చిత్తశుద్ధితో సీఎం జగన్ అడుగులు వేస్తుండటంతో తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని అడుగడుగునా పథకాన్ని చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ, తమ మద్దతుదారుల ద్వారా కోర్టుల్లో 1,000 కేసులను వేయించి, ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలను పలు సందర్భాల్లో అడ్డుకున్నారు. ఈ అడ్డంకులేవీ జగన్ మనోధైర్యాన్ని సడలనివ్వలేదు. దేశంలోనే తొలిసారిగా ఉచితంగా పంపిణీ చేసిన స్థలాలపై లబ్ధిదారులకు సర్వహక్కులను సీఎం జగన్ ప్రభుత్వం కల్పించింది. వారి పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ అందించింది. 2024లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు పెట్టి 15 లక్షల మందికి రిజిస్ట్రేషన్లు చేసి ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో మిగిలిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. పేదల తరపున పెత్తందారులతో యుద్ధం అమరావతిలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాలకు చెందిన నిరుపేదలకు సీఎం జగన్ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక అసమతుల్యత (డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్) ఏర్పడుతుందని టీడీపీ కోర్టులకు వెళ్లి స్టే తెచ్చింది. అయినా జగన్ మనోబలం సడలిపోలేదు. పేదల తరపున పెత్తందారులతో సీఎం జగన్ ప్రభుత్వం యుద్ధం చేసింది. హైకోర్టు, సుప్రీం కోర్టులకు వెళ్లి విజయం సాధించి గత ఏడాది 50,793 ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడంతో పేదలకు అమరావతిలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వద్దంటూ కేంద్ర ప్రభుత్వానికీ టీడీపీ మద్దతుదారులు అనేక ఫిర్యాదులు చేశారు. ఈ అడ్డంకులను సైతం అధిగమించి అనుమతులు రాబట్టి పేదల ఇళ్ల నిర్మాణానికి గత ఏడాది జూలై 24న సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అయినప్పటికీ టీడీపీ పేదల ఇళ్లకు అడ్డుపడుతూ తన కపటబుద్ధిని ప్రదర్శించింది. మరోమారు కోర్టుకు వెళ్లి పేదల ఇళ్ల నిర్మాణంపై స్టే తెచ్చి నిర్మాణాలను అడ్డుకుంది. కోర్టులనూ మోసం చేసిన టీడీపీ... మహిళల పేరిటే ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఎందుకివ్వాలనే అభ్యంతరాలతో హైకోర్టులో తెనాలికి చెందిన పొదిలి శివమురళి, మరో 128 మంది పిటిషన్ వేశారు. దీనిపై విచారణæ జరిపిన న్యాయస్థానం 2021లో ఇళ్ల నిర్మాణంపై స్టే ఇచ్చింది. కొద్ది రోజుల తర్వాత తాము కోర్టులో పిటిషన్ వేయలేదంటూ వారు వెల్లడించారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ దళారులు పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ ఆధార్, రేషన్ కార్డులతో పాటు, వారి సంతకాలు, రూ.5 వేల నుంచి రూ.40 వేల వరకూ డబ్బు వసూళ్లు చేశారు. ఇలా మా నుంచి తీసుకున్న ధ్రువపత్రాలతో మాకే తెలియకుండా కోర్టుల్లో టీడీపీ నాయకులే కేసులు వేశారంటూ అప్పట్లో పేదలు బయటకు వచ్చి చెప్పారు. యర్రజర్ల కాల్వ సమస్యకు ఫిర్యాదు చేద్దామంటూ బల్లి ప్రభాకర్రావు, జాజుల హరికృష్ణ అనే ఇద్దరు వ్యక్తుల నుంచి తెల్ల కాగితంపై సంతకం, ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు తీసుకుని ఇళ్ల పట్టాల పంపిణీపైనా టీడీపీ నాయకులు కోర్టులో కేసులు వేశారు. తమను టీడీపీ నాయకులు మోసగించినదానిపై లిఖితపూర్వకంగా వివరించారు. రికార్డు స్థాయిలో 31.19 లక్షల ఇళ్ల పట్టాలు రికార్డు సృష్టించడమే కాకుండా, కరోనా, కోర్టు కేసులు, ఇతర అడ్డంకులను ఎదురొడ్డి అనతికాలంలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలను చేపట్టి మరో సరికొత్త రికార్డును సీఎం జగన్ కైవసం చేసుకున్నారు. 2020 డిసెంబర్లో ఇళ్ల స్థలాల పంపిణీ అనంతరం వివిధ దశలుగా 21.75 లక్షల ఇళ్ల (19.13 లక్షలు సాధారణ ఇళ్లు, 2.62 లక్షలు టిడ్కో ఇళ్లు) నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. వీటిలో ఇప్పటికే 9 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, మిగిలినవి శరవేగంగా నిర్మితమవుతున్నాయి. సాధారణ ఇళ్లలో 11.61 లక్షల గృహాలు వివిధ దశల్లో నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాయి. 2020 డిసెంబర్ 25న కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో పట్టాలను పంపిణీ చేయడంతో పాటు పేదల ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. కేవలం మూడేళ్ల నాలుగు నెలల్లోనే రికార్డు స్థాయిలో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి పేదలకు అందించారు. ఉచితంగా స్థలం... ఆపై అమిత సాయం ఇళ్ల లబ్ధిదారులకు ఖరీదైన స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన సీఎం జగన్ ప్రభుత్వం అక్కడితో ఆగలేదు. ఇంటి నిర్మాణానికి యూనిట్కు రూ.1.80 లక్షల బిల్లు మంజూరు చేయడంతో పాటు, ఎస్హెచ్జీల ద్వారా లబ్ధిదారులైన మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేల రుణ సాయం అందించింది. ఉచితంగా ఇసుకను పంపిణీ చేయడం ద్వారా రూ.15 వేలు, స్టీల్, సిమెంట్, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై సరఫరా చేయడం ద్వారా మరో రూ.40 వేల చొప్పున మొత్తంగా రూ.2.70 లక్షల చొప్పున ప్రయోజనం చేకూర్చింది. గేటెడ్ కమ్యూనిటీల తరహాలో... పేదలకు సొంత గూడు కల్పించడమే కాకుండా కాలనీలను ప్రైవేట్ గేటెడ్ కమ్యూనిటీల తరహాలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. విశాలమైన రోడ్లు, విద్యుత్ సరఫరా, డ్రైనేజీ, పార్కులు, ఇంటర్నెట్ సహా అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. ఈ క్ర మంలో మౌలిక సదుపాయా ల కల్పన కోసమే ఏకంగా రూ.32,909 కోట్లను వెచ్చిస్తోంది. చంద్రబాబు రూ.8,929.81కోట్ల అవినీతి చంద్రబాబు తన అక్రమాలకు పట్టణాల్లో ఇల్లు లేని నిరుపేదల జీవితాలను ‘తాకట్టు’ పెట్టారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టించేందుకు 2016–17లో రాష్ట్రంలో అధికంగా నిర్మాణ వ్యయాన్ని చూపి లబ్ధిదారులను దోచుకున్నారు. ఏపీ టిడ్కో ద్వారా రాష్ట్రంలోని పట్టణాల్లో నివశిస్తున్న ఇళ్లు లేని 5 లక్షల మందికి ప్రభుత్వ స్థలాల్లో 300, 365, 415 చ.అ విస్తీర్ణంలో జీ+3 విధానంలో ఫ్లాట్లు కట్టిస్తామని చెప్పారు. 300 చ.గ విస్తీర్ణం గల ఫ్లాట్కు రూ.2.60 లక్షల ధర నిర్ణయించి బ్యాంకు రుణాలు ఇప్పించి, నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్లు చెల్లించాలని (రూ.7.20 లక్షలు) షరతు పెట్టారు. ఇలా నిర్మాణ కంపెనీల నుంచి ముడుపులు తీసుకుని, అధికంగా ముడుపులు ఇచ్చుకున్న కంపెనీకి అధిక ధరకు, తక్కువగా ఇచ్చిన కంపెనీకి తక్కువ ధరకు నిర్మాణ అనుమతులు కట్టబెట్టింది. 2016–17లో మార్కెట్లో చ.అడుగు నిర్మాణ ధర రూ.900 నుంచి రూ.1,000 మధ్య ఉండగా... కంపెనీలకు రూ.2,534.75 నుంచి రూ.2034.59గా నిర్ణయించి సగటు చ.అ నిర్మాణ ధర రూ.2,203.45గా చెల్లించారు. అంటే అప్పటి మార్కెట్ ధరతో పోలిస్తే రూ.1,203.45 అదనంగా నిరుపేదల నుంచి వసూలు చేశారు. ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు మార్కెట్ ధర కంటే తగ్గాల్సింది పోయి భారీగా పెంచేశారు. ఇలా తలపెట్టిన 5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు చాలినంత భూమి లేదని 3.15 లక్షల ఇళ్లకే శ్రీకారం చుట్టింది. తొలి విడతగా 2,08,160 యూనిట్లను 7,42,01,820 చ.అ. విస్తీర్ణంలో నిర్మించేందుకు అనుమతులిచ్చి రూ.8,929.81 కోట్ల అవినీతికి పాల్పడింది. పేదలు 300 చ.అ. ఇంటికి బాబు ప్రభుత్వం రూ.7.20 లక్షల భారం మోపి, 20 ఏళ్ల పాటు వాయిదాలు కట్టాలని షరతు పెట్టింది. దీని ప్రకారం లబ్ధిదారులపై రూ.3,805 భారం మోపింది. ఇంకా 365 చ.అ. ఇంటికి రూ.50 వేలు, 430 చ.అ. ఇంటికి రూ.లక్ష వసూలు చేసింది. వాళ్లిప్పుడు లక్షాధికారులుఒకప్పుడు అద్దె ఇళ్లలో, పూరిగుడిసెల్లో ఎన్నో అగచాట్లు, ఇబ్బందులు పడ్డ మహిళలు, నిరుపేద కుటుంబాలు సీఎం జగన్ చొరవతో లక్షాధికారులుగా మారారు. అది ఎలాగంటే... మహిళల పేరిట రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ విలువ చేసే స్థలాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికీ సాయం చేశారు. స్థలం, ఇంటి రూపంలో ప్రతి పేదింటి అక్కచెల్లెమ్మ పేరిట ప్రాంతాన్ని బట్టి రూ.6 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ మార్కెట్ విలువ చేసే స్థిరాస్తి సమకూరినట్లయింది. ఇలా రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల మేర సంపదను ప్రభుత్వం సృష్టించింది. సమాజంలో గౌరవం పెరిగింది. నా భర్త భవన నిర్మాణ కార్మికుడు. మాకు సొంత ఇల్లు లేకపోవడంతో అద్దె ఇంటిలో ఉంటున్నాము. ఓ వైపు పిల్లల చదువులు, మరోవైపు ఇంటి అద్దెలు. కుటుంబ పోషణ భారం. మా అద్దె ఇంటి కష్టాల నుంచి ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. ఎటువంటి సిఫార్సులు లేకుండా ఇంటి స్థలాన్ని ప్రభుత్వం కేటాయించి ఇంటిస్థలం రిజిస్ట్రేషన్ చేశారు. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు మంజూరు చేశారు. జగనన్న దయతో సొంతింటి భాగ్యం కలిగింది. గతంలో మాకంటూ సొంతిల్లు లేదని బంధువులు, సన్నిహితుల్లో చిన్న చూపు ఉండేది. ప్రస్తుతం ఆ సమస్య లేదు. సమాజంలో మాకు గౌరవమూ పెరిగింది. – మీసాల వనజాక్షి, వైఎస్సార్ జగనన్న కాలనీ, పాలకొండ, పార్వతీపురం మన్యం జిల్లా మాగోడు విన్న నేత సీఎం కావాలి నా భర్త భానుప్రసాద్ పెయింటింగ్ పని చేస్తారు. మా ఇద్దరు పిల్లలతో కలిసి మా అత్తమ్మ వాళ్లింట్లో ఉండేవాళ్లం. ఒకే ఒక గది. ఆ గదిలోనే వంట చేసుకోవాలి. ఇరుకు ఇంట్లో ఉండడం వల్ల అనేక ఇబ్బందులు పడ్డాం. మా కష్టాలను సీఎం జగన్ ప్రభుత్వం ఆలకించింది. ఇంటి స్థలంతో పాటు, ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల రుణమూ ఇచ్చింది. ఇప్పుడు మాకు రూ.15 లక్షలకు పైగా విలువైన సొంత ఆస్తి ఉంది. మా గూడు గోడు విని, గోడు తీర్చిన నేతనే సీఎంగా మళ్లీ కావాలి. ఆయన్ని మేం సీఎం చేసుకుని తీరుతాం. – బుడితి బాలామణి, దగ్గులూరు, పశ్చిమగోదావరి జిల్లా పథకం అమలులో కీలక ఘట్టాలు► 2020 డిసెంబర్: 25 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ. తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు. ► 28 ఏప్రిల్ 2022: పథకంలో రెండో దశకు శ్రీకారం. 1.24 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ. 3.53 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు. ► 27 మే 2023: సీఆర్డీఏలో రూ.3,506 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 1,402.58 ఎకరాల భూమి 50,793 మంది అక్కచెల్లెమ్మలకు పంపిణీ. ► 24 జూలై 2023: సీఆర్డీఏలో 47,071 పేదల ఇళ్ల నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్థాపన. బాబు చేతిలో దగాపడ్డ టిడ్కో లబ్ధిదారులకు అండగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 88 పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) పరిధిలోని 163 ప్రాంతాల్లో జీ+3 విధానంలో ప్రభుత్వం 2,62,212 టిడ్కో ఇళ్లను నిర్మిస్తోంది. పేదలకు కేటాయించిన 300 చ.అ. ఇంటిని ఉచితంగా (రూ.1కి) ఇవ్వడంతో 1,43,600 మంది లబ్ధిదారులకు ఈఎంఐ రూపంలో చెల్లించే రూ.10,339 కోట్లను ప్రభుత్వమే చెల్లిస్తోంది. 365 చ.అ ఇళ్లలో 44,304 మంది లబ్ధిదారులు రూ.50 వేలు, 430 చ.అ. ఇళ్లలో 74,312 మంది లబ్ధిదారులు రూ. లక్ష చొప్పున వాటా చెల్లించాలనే నిబంధనలో సగానికి తగ్గించి, మిగతా సగం వాటా నగదు రూ.482.32 కోట్లను ఈ ప్రభుత్వమే చెల్లించింది. దీంతో రెండు, మూడు కేటగిరీల పేదలు గత ధరల ప్రకారం చెల్లించాల్సిన రూ.10,797 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఆ మొత్తం రూ.4,590 కోట్లకు ఈ సర్కారు తగ్గించింది. విద్యుత్, రోడ్లు వంటి అన్ని వసతుల కేటగిరీల ఇళ్ల లబ్ధిదారులకు సేల్డీడ్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, యూజర్ చార్జీలు భరించడంతో లబ్ధిదారులు మొత్తం రూ.5,487.32 కోట్ల మేలు పొందారు. మొత్తం ఇళ్లలో ఫేజ్–1 కింద 1,51,298 ఇళ్లను నూరు శాతం నిర్మాణం పూర్తి చేసి, 1.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించింది. ► ఈ ఫొటోలో సెల్ఫీ తీసుకుంటున్న టి.తిరుపతి స్వామి, వేళంగిణిలది బాపట్ల జిల్లా, భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామం. వీరు రెండేళ్ల క్రితం గ్రామంలోని కృష్ణా కెనాల్కు సంబంధించిన పిల్లకాలువ గట్టుపై పూరి గుడిసెలో నివసించేవారు. ఆ గుడిసెలోనే వేళంగిణి అమ్మ, అన్నయ్య కుటుంబాలూ ఉండేవి. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ...ఈ కుటుంబం ప్రత్యక్ష నరకాన్ని అనుభవించింది. గత ప్రభుత్వంలో ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకున్నా...ఇంటి స్థలం మంజూరు కాలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద వేళంగిణికి ఇంటి స్థలం, ఇంటిని మంజూరు చేసి నిర్మించి ఇచ్చింది. 2022 సెప్టెంబర్లో ఈ కుటుంబం ఆ ఇంటిలోకి మారింది. ‘నా చిన్నప్పటి నుంచి కాలువ గట్టుపై మురికి కూపంలో గుడిసెల్లోనే బతికాను. దీపం వెలుతురు తప్ప కరెంటు కనెక్షన్ ఉండేది కాదు. వర్షాలు కురిస్తే మా గుడిసె వరదనీటిలో మునిగిపోయేది. మురుగు నీరు బయటకు వెళ్లిపోయి, సాధారణ పరిస్థితి నెలకొనే వరకూ రోడ్డు పక్కనే ఉండేవాళ్లం. సాధారణ రోజుల్లోనూ మురికి నీటి కారణంగా దోమల బెడద తీవ్రంగా ఉండేది. పాములు, తేళ్లు, కీటకాలు గుడిసెల్లోకి వచ్చేసేవి. సీఎం జగన్ ప్రభుత్వం మా గోడును ఆలకించింది. ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు, ఇంటినీ నిర్మించి ఇచ్చింది. గుడిసెల్లో నివాసం దినదినగండమే. కంటి నిండా నిద్రపోయిన రోజులే లేవు. ఇప్పుడు మాకంటూ ఓ సొంత ఇల్లుంది. గుడిసె కష్టాలన్నీ తొలగిపోయాయి..’ అని వేళంగిణి సంతోషం వ్యక్తం చేస్తోంది. ► పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మెంటేవారితోటకు చెందిన మేడిశెట్టి దుర్గ భర్త సంచులు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. దుర్గ కూలి పనులకు వెళుతుంటారు. వారికి ఇద్దరు పిల్లలు. సొంత ఇల్లు లేదు. 20 ఏళ్లుగా అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. దంపతుల అరకొర సంపాదన ఇంటి అద్దె, కుటుంబ పోషణకే సరిపోతుంది. సీఎం జగన్ ప్రభుత్వంలో దుర్గకు విస్సాకోడేరు జగనన్న లే అవుట్లో స్థలంతో పాటు ఇల్లు మంజూరయింది. ప్రభుత్వ సాయం రూ.1.80 లక్షలకు, కొంత సొంత నగదు జోడించి ఇంటి నిర్మాణం పూర్తిచేసుకున్నారు. ఇప్పుడు అద్దె బాధలు తప్పాయని ఆ కుటుంబం సంబరంగా చెబుతోంది. ఇక్కడ సెంటు స్థలం రూ.4 లక్షలు ఉంటుందని, జగనన్న దయతోనే తమ కల నెరవేరిందని ఈ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లలైనా సొంతింటిలో జీవించాలని మాకు కోరిక. సీఎం జగన్ మా కోరికను నెరవేర్చారని భావోద్వేగానికి గురయ్యారు. -
దిక్కుతోచని కుటుంబం దిశ మారింది..!
ఆ ఇంటి యజమాని ఓ ప్రైవేట్ డ్రైవర్. తన సంపాదనతోనే సంసారాన్ని నెట్టుకొచ్చేవాడు. ఆ కుటుంబంలో తల్లి, భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. అరకొర సంపాదన తిండికే సరిపోయేది కాదు. తల్లికి రూ.200 మాత్రమే వితంతు పింఛన్ వచ్చేది. భార్య ఎంఏ, బీఈడీ చదివింది. నాలుగురాళ్లు వెనకేసుకుని పిల్లలను బాగా చదివించుకోవాలనే ఆశ ఉన్నా... సర్కారు సహకారం కొరవడింది. ఇదీ గతంలో అనంతపురం జిల్లాలోని అనంతపురం రూరల్ మండలం పాపంపేటకు చెందిన వెన్నపూస ఓబిరెడ్డి కుటుంబ పరిస్థితి. ఎన్నో ఒడుదుడుకులను తట్టుకుంటూ నెట్టుకు వచ్చిన ఈ కుటుంబం నేడు వైఎస్సాసీపీ ప్రభుత్వ సహకారంతో సుఖసంతోషాలతో జీవిస్తోంది. – అనంతపురం 2014 ఎన్నికల సమయంలో టీడీపీకి ఓట్లు వేస్తే డ్వాక్రా రుణాలు, బంగారు రుణాలు మాఫీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం లేదా ప్రతినెలా రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మాటలతో ఓబిరెడ్డి కుటుంబం గంపెడు ఆశలు పెట్టుకుంది. తీరా ఆయన డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు. వారి హామీతో మూడు నెలలు అప్పు కట్టలేదు. నెలనెలా వడ్డీ పెరుగుతోందని బ్యాంకు సిబ్బంది హెచ్చరిస్తూ వచ్చేవారు. ఒకవేళ మాఫీ చేసినా..మీరు చెల్లించిన సొమ్ము వెనక్కు ఇస్తామని, మాఫీ చేయకపోతే వడ్డీ మీ నెత్తిన పడుతుందని చెప్పారు. దీంతో సభ్యులంతా మాట్లాడుకుని అప్పు కడుతూ వచ్చారు. అలాగే ఇంట్లో ఉన్న బంగారమంతా బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.70 వేలు రుణం తీసుకున్నారు. అదికూడా మాఫీ కాలేదు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన ఈ నాలున్నరేళ్లలో మొత్తం రూ.7,36,000 మేరకు ఆర్థిక సహాయాన్ని పొందారు. వైఎస్సార్ ఆసరా కింద భార్యకు రూ.44 వేలు వచ్చింది. వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చారు. ఇంటి పెద్ద కన్నుమూయగా వైఎస్సార్ బీమా కింద రూ.లక్ష వచ్చింది. యానిమేటర్గా ఉద్యోగం ఇచ్చారు. ఇంట్లో ఇద్దరికి పింఛన్ వస్తోంది. ఇప్పుడు తమ కుటుంబం ఆనందంగా గడుపుతోందని ఓబిరెడ్డి ప్రమీల చెప్పారు. ‘సంక్షేమం’ లేకుండా సుస్థిరాభివృద్ధి అసాధ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయి. దేశంలో ఎక్కడైనా ఈ సంక్షేమ పథకాలు అమలు చేయకుండా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించడం అసాధ్యం. ఏపీ ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేని విధంగా అమలు చేస్తున్న నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. వీటిద్వారా సగటు మానవుని జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయి. – గుర్రం జయపాల్రెడ్డి, జెడ్పీ రిటైర్డ్ సీఈఓ ఓబిరెడ్డి కుటుంబానికి కలిగిన లబ్ధి ఇలా... పథకం టీడీపీలో వైఎస్సార్సీపీలో డ్వాక్రా రుణమాఫీ 00 రూ.44 వేలు పింఛన్ రూ.62,000 రూ.1.89 లక్షలు ఆరోగ్యశ్రీ 00 రూ.60 వేలు వైఎస్సార్బీమా 00 రూ.1 లక్ష సున్నా వడ్డీ 00 రూ.8 వేలు విద్యా దీవెన 00 రూ.25 వేలు వసతి దీవెన 00 రూ.15 వేలు అమ్మ ఒడి 00 రూ.55 వేలు నిరుద్యోగ భృతి రూ.4 వేలు 00 యానిమేటర్ 00 రూ.2.40 లక్షలు -
అప్పులు లేకుండా ఆనందంగా..
ఉన్నది 20 సెంట్ల భూమి. కౌలుకు మరో ఎకరం దేవదాయ శాఖ భూమి. అదే ఆ కుటుంబానికి ఆధారం. సమయానికి విత్తుకుంటే సరేసరి... లేదంటే అంతేమరి. ప్రకృతి సహకరిస్తే నాలుగు వేళ్లు నోట్లోకెళ్లేది. లేదంటే అప్పులకోసం తప్పని తిప్పలు. తరువాత వాటిని తీర్చడానికి నానా అగచాట్లు. చినుకు రాలకుంటే ఆవేదన... అతిగా వానపడితే ఆందోళన. అదనుకు విత్తనం దొరక్కున్నా... అవసరం మేరకు ఎరువులు లభించకపోయినా... ఆ ఏడాదంతా బతుకు దినదిన గండమే. ఇదీ శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం గోకర్ణపురానికి చెందిన కర్తల చిరంజీవులు కుటుంబ పరిస్థితి. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు. తోడబుట్టిన చెల్లెలు వారితోనే. కుటుంబమంతా కష్టపడితేనే కడుపునిండేది. లేకుంటే పస్తులే గతి. అలాంటి కుటుంబానికి ప్రభుత్వాల సాయం ఎంతో అవసరం. –కంచిలి 2019లో రాష్ట్రంలో వెఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. కుటుంబం ఆర్థి కంగా నిలదొక్కుకుంది. అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి సాయం అందింది. వ్యవసాయం పండగైంది. అవసరమైన పెట్టుబడి అదనుకు ముందే అందుతోంది. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేదు. సొసైటీ గోదాముల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఇంటి ముంగిటకే రైతు భరోసా కేంద్రాల ద్వారా అవి వచ్చిచేరుతున్నాయి. పండించిన పంటకు ఈ క్రాప్లో నమోదు కావడంతో మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ప్రకృతి పగబట్టి పంటను తినేస్తే నష్టపరిహారం సొమ్ము ఆ సీజన్ ముగియక ముందే అందుతోంది. ఇంటి ఇల్లాలు రత్నానికి వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత కింద ఏటా నగదు ఖాతాలో పడుతోంది. సోదరి రుక్మిణమ్మకు ఒంటరి మహిళ పింఛన్ వస్తోంది. గడచిన నెలలో వివాహమైన పెద్దకొడుకు మాధవరావుకు కల్యాణ మస్తు పథకం కింద రూ. 50వేలు అందింది. చిన్నకొడుకు జోగారావు కిడ్నీలో రాళ్లు చేరితే డాక్టర్లు రూ. 50వేలు ఖర్చవుతుందన్నారు. పైసా ఖర్చులేకుండా ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు ఏ సమస్య వచ్చినా దానిని ప్రభుత్వ సాయంతో ఎదుర్కోగలమన్న నమ్మకం ఏర్పడింది. బతుకుపై భరోసా దక్కింది. ఆర్థిక సమస్యలు తీరాయి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే మా ఆర్ధిక సమస్యలు తీరాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క నయాపైసా సాయం అందలేదు. వ్యవసాయ ఖర్చులు మొదలుకొని, కుటుంబ అవసరాలకు సైతం ఇబ్బంది పడేవాళ్లం. చిన్నపాటి అవసరానికీ అప్పులు చేయాల్సి వచ్చేది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతీ నెల ఇంచుమించు ఏదో ఒక పథకం ద్వారా ఆర్థిక సాయం అందుతోంది. తద్వారా మేము నిశ్చింతంగా జీవిస్తున్నాం. మా కుటుంబానికి ఈ ఐదేళ్ల కాలంలో నాలుగు లక్షలకు పైబడి లబ్ధి చేకూరింది. – కర్తల చిరంజీవులు -
నిస్సహాయ స్థితిలో పెద్దదిక్కులా
సిఫార్సు లేకుండానే పింఛన్ మంజూరు ఆరు నెలల క్రితమే నా భర్త మృతి చెందారు. వలంటీర్ వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. ఎలాంటి సిఫార్సులు లేకుండానే పింఛన్ మంజూరైంది. ఎవరికీ రూపాయి లంచం ఇవ్వలేదు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్, పింఛన్ సొమ్ములతో బతుకుతున్నాను. మా లాంటి పేదోళ్లను ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోంది. – తిగిరిపల్లి దమయంతి, వీర్రాజు తల్లి, పెద్దేవం తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామానికి చెందిన తిగిరిపల్లి వీర్రాజు కుటుంబానిది అత్యంత దయనీయ గాథ.. వీర్రాజు, అతని భార్య ఇద్దరూ దివ్యాంగులే. ఇంతలో అతనికి పక్షవాతం రావడంతో కుటుంబం ఒక్కసారిగా ఉపాధి మార్గం కోల్పోయింది. ఆ తరుణంలో వారికి ఈ ప్రభుత్వం అందించిన నవరత్నాలు ఆదుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మోపెడ్పై ఆకుకూరలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడిని. దివ్యాంగుడినైన నాకు నాలుగేళ్ల క్రితం పక్షవాతం వచి్చంది. కుటుంబ పోషణ భారమైంది. నా భార్య బధిరురాలు. ఇప్పుడు జగనన్న దయతో ఇద్దరికీ దివ్యాంగ పింఛన్ అందుతోంది. ఇంటి స్థలం కూడా మంజూరైంది’ అని ఆనందం వ్యక్తం చేశారు. ఆయన తల్లికి రూ.3 వేలు వితంతు పింఛన్ ఇస్తున్నారు. ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించారు. కుమార్తె చదువుకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వచ్చాయి. అంతేగాకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో వారి పెద్దమ్మాయి దివ్యకు ఉద్యోగం లభించింది. దివ్య డిగ్రీ వరకు చదువుకుంది. ఆమెకు జీఎస్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా ఉద్యోగం ఇచ్చారు. నెలకు రూ.18 వేలు జీతం ఇస్తున్నారు. త్వరలో ఇంటి నిర్మాణం కూడా ప్రారంభిస్తాం అని వీర్రాజు ఆనందం చేస్తున్నారు. –కొవ్వూరు -
ఉన్నత చదువులకు జగనన్న దీవెన
మదనపల్లె పట్టణం ఎస్బీఐ కాలనీకి చెందిన బోనాసి జాన్బాబు మండల పరిధిలోని ఓ చర్చిలో ఫాదర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆయన భార్య బోనాసి రేచల్ గృహిణి. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అత్త వెంకటమ్మ ఆలనాపాలనా కూడా వీరిదే. చర్చికి వచ్చే దాతలు ఇచ్చే అరకొర కానుకలతో కుటుంబ పోషణ భారంగా నడిచేది. ఇలాంటి తరుణంలో పిల్లల చదువులెలా? అన్న భయం వెంటాడేది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ కుటుంబం దిశ తిరిగింది. సంక్షేమ పథకాలు ఆ ఇంటి ఇబ్బందుల్ని పూర్తిగా తొలగించాయి. పాస్టర్ జాన్బాబు పెద్ద కుమారుడు బోనాసి విలియయ్బాబు మదనపల్లె సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ చేశాడు. విద్యాదీవెన కింద రూ.3,28,000, వసతి దీవెన కింద రూ.20,800 అందాయి. దీంతో విజయ్బాబు చదువు సాఫీగా సాగింది. బీటెక్ పూర్తవడంతో విదేశాల్లో ఉన్నత చదువుల కోసం 2023లో విదేశీ విద్యాదీవెన కింద దరఖాస్తు చేసుకున్నారు. రూ.51 లక్షలు మంజూరైంది. ప్రస్తుతం అస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఉన్న మోనాస్ యూనివర్సిటీలో ఎంఎస్ ఫస్టియర్ చదువుతున్నాడు. కుమార్తె బోనాసి ఏంజెల్ ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఆమెకు అమ్మఒడి పథకంలో ఇప్పటి వరకు రూ.75 వేలు లబ్ధి చేకూరింది. చిన్నబ్బాయి బోనాసి బిడియన్ 7వ తరగతి చదువుతున్నాడు. జగనన్న విద్యాకానుక కింద యూనిఫాం, పాఠ్యపుస్తకాలు ఇలా చదువుకు అవసరమైనవన్నీ ప్రభుత్వం ఉచితంగా అందించింది. పైసా ఖర్చు లేకుండానే తన బిడ్డల్ని చదివించుకుంటున్నట్లు జాన్బాబు తెలిపారు. పాస్టర్లకు ఇచ్చే గౌరవ వేతనంతో సగర్వంగా బతుకుతున్నట్లు చెప్పారు. ఆయన అత్త వెంకటమ్మకు రూ.3 వేలు వృద్ధాప్య పింఛన్ అందుతోంది. –మదనపల్లె సిటీ కుటుంబ ఆర్థిక పరిస్థితిలో గణనీయ మార్పు గతంలో పేద, సామాన్య కుటుంబాల పిల్లలు ఉన్నత చదువులు చదవాలంటే కష్టంగా ఉండేది. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, నవరత్నాలు పేదల పాలిట వరాలుగా మారాయి. వీరి జీవన ప్రమాణాలు పెరిగాయి. అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యాదీవెన, విదేశీ విద్యా దీవెన, వసతి దీవెనలతో పేద పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుతున్నారు. ఇలాంటి విద్యార్థుల ఎదుగుదల, వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితుల్ని సమూలంగా మార్చివేస్తున్నాయి. – ఎం.నాగేంద్ర, రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్, బీటీ కళాశాల, మదనపల్లె కుటుంబసభ్యులతో జాన్బాబు ► జాన్బాబు కుటుంబానికి కలిగిన లబ్ధి విదేశీ విద్యాదీవెన రూ.51,00,000 ►విద్యాదీవెన రూ.3,28,000 ►వసతి దీవెన రూ.20,800 ►అమ్మ ఒడిరూ.75,000 ►సున్నా వడ్డీ రూ.1,167 ►ఇంటి స్థలం రూ.6,00,000 ►పాస్టర్ల గౌరవ వేతనం రూ.1,25,000 -
AP Navaratnalu Scheme: నాడు బతుకు భయం.. నేడు కొండంత ధైర్యం..
అర్చకత్వం వారి వృత్తి. గ్రామంలో ఉన్న శివాలయాన్నే నమ్ముకుని ఓ కుటుంబం జీవిస్తోంది. సొంత భూమి లేదు. కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే శక్తి లేదు. ఆలయానికి చెందిన రెండెకరాల భూమి వేరేవారి ఆదీనంలో ఉంది. దానిపై వచ్చే ఆదాయం అంతంతమాత్రమే. దేవాలయానికి వచ్చే భక్తులు ఇచ్చిన దక్షిణలతోనే వారి కుటుంబపోషణ సాగుతోంది. దీనికి తోడు పుట్టిన కొడుకు, కూతురు ఇద్దరూ బధిరులే. ఇద్దరిలో కొడుక్కు అతికష్టమ్మీద పెళ్లి చేసినా... కూతురుకు పెళ్లికాక జీవితాంతం తమతోనే గడపాల్సి వస్తోంది. ఆదుకోవాల్సిన గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఆ కుటుంబాన్ని ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులనుంచి గట్టెక్కించింది. ఇదీ శ్రీకాకుళం జిల్లా బూర్జ గ్రామానికి చెందిన వారణాసి కుమార స్వామి, శ్యామలాంబ కుటుంబ గాథ. అడగకుండానే.. అన్నీ ఇచ్చిన జగనన్న ప్రభుత్వం 2019లో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. ఏదో రకంగా ఏడాది పొడవునా ప్రభుత్వం నుంచి సహాయం అందుతోంది. ఇంటి ఇల్లాలు శ్యామలాంబకు వైఎస్సార్ ఆసరా(రుణమాఫీ), వైఎస్సార్ సున్నా వడ్డీ, కుమార స్వామికి పింఛన్, కొడుకు, కూతురుకు దివ్యాంగ పింఛన్లు, కొడుకు చంద్రశేఖర్ కుట్టు పని నేర్చుకోవడంతో మెషీన్ ఉన్నందున జగనన్న చేదోడు అందుతున్నాయి. అతని భార్య పేరున కాలనీలో ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం అందింది. ఇప్పుడు పనులు పురోగతిలో ఉన్నాయి. వారి పిల్లలు బడికి వెళ్తున్నందున అమ్మ ఒడి నిధులు జమవుతున్నాయి. తమకు ఎలాంటి కష్టం వచ్చినా ఈ ప్రభుత్వం ఆదుకోగలదన్న నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు ఆ కుటుంబం ఎంతో దర్జాగా బతికేస్తోంది. –బూర్జ సుస్థిర ఆర్థిక వ్యవస్థకు దోహదం వైఎస్సార్సీపీ ప్రభు త్వం వచ్చాక అమలు చేస్తు న్న వివిధ రకాల సంక్షేమ పథకాల వల్ల ప్రతీ కుటుంబంలోనూ ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యాయి. రైతులకు వైఎస్సార్ రైతుభరోసా వల్ల వ్యవసాయం కోసం అప్పు చేయాల్సిన బాధ తప్పింది. వైఎస్సార్ ఆరో గ్యశ్రీ వల్ల నిరుపేదలకు వైద్యం ఉచితంగా అందుతోంది. పిల్లల చదువు తల్లి దండ్రులకు భారం కాకుండా అమ్మ ఒడి, బతుకుపై భరోసా కల్పించేందుకు పింఛన్లు అందుతున్నాయి. ఈ ఆర్థిక సహాయం వల్ల రాష్ట్రంలో సుస్థిర ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతోంది. – కె.కె.కామేశ్వరరావునాయుడు, ఎకనమిక్స్ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, బూర్జ -
AP Navaratnalu Scheme: మా బతుకులు మార్చిన దేవుడు
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో అప్రతిహతంగా అమలవుతున్న నవరత్నాల పథకాల ద్వారా తమ బతుకులు ఎలా మెరుగుపడ్డాయో ‘సాక్షి’తో పంచుకున్న అభిప్రాయాలు వారి మాటల్లోనే... మా బతుకులు మార్చిన దేవుడు చిన్నపాటి వ్యాపారం చేసుకుని బతికే కుటుంబం మాది. ఇటీవలి కాలం వరకూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో చిన్న కిరాణా షాపు ద్వారా జీవనం సాగించాం. నా భర్త సుతాపల్లి సర్రాజుకు వయసుమీరడం, వ్యాపారం తగ్గిపోవడంతోపాటు స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో దుకాణం ఆపేశాం. దీంతో తీవ్ర ఆరి్థక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఆపద్బాంధువునిలా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా మంజూరు కాని వృద్ధాప్య పింఛను నా భర్తకు మంజూరైంది. నాకు ఈబీసీ నేస్తం కింద ఏడాదికి రూ.15 వేలు, ఇంటర్ చదువుతున్న మా అబ్బాయి శ్రీదత్తసాయి నాగపుష్యంత్కు అమ్మఒడి కింద రూ.15 వేలు ఆరి్థక సాయం ఏటా అందుతోంది. సుమారు రూ.3 లక్షల విలువైన ఇంటి స్థలం దక్కింది. వివిధ పథకాల ద్వారా అందిన ఆరి్థక సాయంతో రాజమహేంద్రవరంలో హోల్సేల్గా టీ పొడి, బిర్యానీ మసాలా సరుకులు కొనుగోలు చేసి తెచ్చుకుని, ఇంటి వద్ద ప్యాకెట్లుగా తయారుచేసి విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నాం. మా బతుకులు మార్చిన దేవుడికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – సుతావల్లి సుబ్బలక్ష్మి, కొత్తపేట (జగత శ్రీరామచంద్రమూర్తి, విలేకరి, కొత్తపేట) పస్తులు లేకుండా జీవిస్తున్నాం నేను కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించేవాడిని. నాకు వృద్దాప్యం రావడంతో ఇప్పుడు పనులు చేయలేకపోతున్నాను. నా కుమార్తె పత్తి సైలేంద్రకు భర్త లేడు, ఆమె కొడుకు రాజశేఖర్ దివ్యాంగుడు. ముగ్గురం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మదనాపురం పంచాయతీ రామకృష్ణాపురంలో నివాసం ఉంటున్నాం. నా వయస్సు 80 సంవత్సరాలు, కూలి పనులకు వెళ్ళడానికి అవకాశం లేక పోవడంతో అదాయం లేక తినడానికి ఇబ్బందులు పడ్డాం. పింఛన్కోసం గత ప్రభుత్వం హయాంలో ఎన్నిమార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయింది. జగన్మోహన్రెడ్డి వచి్చన తరువాత నా మనవడికి దివ్యాంగ పింఛన్ నెలకు మూడు వేలు, నాకు వృద్దాప్య పింఛన్ వస్తోంది. ఈ మొత్తంతో జీవనోపాధి పొందుతున్నాం. జగనన్న పుణ్యమాని మా బతుకులు మారాయి. ఆయనే లేకుంటే మా కుటుంబం పస్తులుండాల్సి వచ్చేది. ఆయన సాయం ఎప్పటికీ మరువలేం. – చింతాడ అప్పారావు, రామకృష్ణాపురం (అల్లు నరసింహ రావు విలేకరి కొత్తూరు) -
AP Navaratnalu Scheme: ఆపద వేళ ఆదుకున్న సర్కారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ఆపద వేళ ఆదుకున్న సర్కారు నా పిల్లలు చిన్నగున్నప్పుడే మా ఆయన కన్నుమూశారు. అప్పటి నుంచి కుటుంబ పోషణ బాధ్యత నాపై పడింది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఉంటున్నాం. ఏదో ఒక పనికి వెళితేగాని పూట గడిచేది కాదు. కొన్నిసార్లు పస్తులు కూడా ఉండాల్సి వచ్చేది. గత ప్రభుత్వం మమ్మల్ని ఏ విధంగానూ ఆదుకోలేదు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక నా పరిస్థితి బాగుపడింది. ఏ దిక్కూ లేని మా కుటుంబానికి సంక్షేమ పథకాలు అండగా నిలిచాయి. వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.28 వేలు వచ్చిది. పెన్షన్ కానుక ప్రతి నెలా వస్తోంది. ఆ డబ్బులతో కిరాణా, కూరగాయల వ్యాపారం ప్రారంభించాను. దాంతోపాటు కుట్టు మెషిన్ కొనుగోలు చేసి ఖాళీ సమయాల్లో బట్టలు కుడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. జగనన్న చేదోడు ద్వారా లబ్ధి పొందాను. అమ్మఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం అందించింది. దాంతో పిల్లల చదువుల భారం తప్పింది. మా కష్టాలన్నీ తీరాయి. దానికి కారణమైన ఈ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. – జుత్తిక వెంకటలక్ష్మి, చేబ్రోలు (సూర్యనారాయణమూర్తి, విలేకరి, గొల్లప్రోలు) భర్త చనిపోతే అండగా నిలిచారు నేను ఓ ఇంట్లో పని చేసుకుంటున్నా. కూలి పనులు చేసుకుంటూ నన్ను, పిల్లల్ని పోషించిన మా ఆయన సీతా రామ్కుమార్ రెండేళ్ల క్రితం ఆకస్మికంగా చనిపోయారు. అప్పుడు ఈ ప్రభుత్వమే ఆదుకుని మా కుటుంబాన్ని నిలబెట్టింది. విశాఖ జిల్లా భీమిలి జోన్ పరిధిలోని సంతపేటలో నివసిస్తున్న మాకు నా భర్త చనిపోయిన తర్వాత ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకం కింద రూ.లక్ష అందించింది. దరఖాస్తు చేసిన వెంటనే వితంతు పింఛన్ మంజూరైంది. నా పెద్ద కుమారుడు కేశవ సాయి శ్రీ ఆంజనేయ సంతపేటలోని అంబేడ్కర్ జీవీఎంసీ హైసూ్కల్లో 6వ తరగతి, రెండో అబ్బాయి దిల్వర్ధన్ జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో 3 తరగతి చదువుతున్నారు. ఏటా రూ.15 వేల వంతున అమ్మఒడి వస్తోంది. కావలసిన పుస్తకాలు, యూనిఫాం వంటివన్నీ ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుండడంతో పిల్లల చదువు భారం తప్పింది. ప్రతి నెలా ఉచితంగా 15 కిలోల రేషన్ బియ్యం ఇస్తున్నారు. ఇల్లు లేని నాకు ఆనందపురం మండలం జగన్నాథపురంలో రూ.3 లక్షల విలువైన స్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణం చేపట్టవలసి ఉంది. మా కుటుంబాన్ని ఎంతగానో ఆదుకున్న జగనన్నే మళ్లీ సీఎం కావాలని ఆశిస్తున్నా. – బోర గౌరి, సంతపేట (గేదెల శ్రీనివాసరెడ్డి, విలేకరి, తగరపువలస) చేనేత వృత్తికి పునరుజ్జీవం మా తాతల కాలం నుంచి చేనేత వృత్తినే జీవనాధారంగా చేసుకుని కాలం గడుపుతున్నాం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కొనుసుల కొత్తూరులో బట్టలు నేసుకుని వాటిని అమ్ముకుని జీవించేవాళ్లం. కానీ పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఈ వృత్తిలో కొనసాగడం కష్టమైంది. దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో వ్రస్తాల తయారీకి అవసరమైన ముడి సరుకు ధరలపై ట్యాక్స్ ఎత్తివేయడంతో కొంత వరకు మాకు సాయ పడింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు. బతుకు తెరువుకోసం వలస పోవాలని అనుకున్నాం. అదృష్టవశాత్తు ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి వచ్చాక మా పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి. మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ఏటా రూ.24 వేలు వంతున నేతన్న నేస్తం పథకం కింద అందించారు. దాంతో మా వృత్తికి కొంత భరోసా లభించింది. ముడి సరుకు తెచ్చుకునేందుకు అప్పు చేయాల్సిన బాధ తప్పింది. ఇప్పటి వరకు ఐదు దఫాలుగా మొత్తం రూ.1.20 లక్షలు వచ్చిది. మా నాన్నకు వృద్దాప్య పింఛన్, అమ్మకు వైఎస్సార్ చేయూత ద్వారా రూ.18,750 వచ్చిది. మగ్గం ఉన్న చేనేత కుటుంబానికి విద్యుత్ సబ్సిడీ వస్తోంది. ఇంత కంటే మాకింకేం కావాలి? మా సంక్షేమానికి కృషి చేసిన జగనన్న రుణం తీర్చుకుంటాం. – యర్ర సూర్యనారాయణ, కొనుసులకొత్తూరు (లింగూడు వెంకటరమణ, విలేకరి, టెక్కలి) -
AP Navaratnalu Scheme: పాపను బతికిస్తున్న పింఛన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. పాపను బతికిస్తున్న పింఛన్ థలసేమియా వ్యాధితో బాధ పడుతున్న నా కుమార్తె రక్షితకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి నెలా రూ.10 వేలు పింఛన్ అందిస్తున్నారు. నా కుమార్తె రక్షిత ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ఐదు నెలల వయస్సులో పాప అనారోగ్యానికి గురైంది. ఆస్పత్రికి తీసుకెళితే ఎనిమిదో నెల వయసులో థలసేమియాగా వైద్యులు నిర్ధారించారు. నా భర్త రవికుమార్ వ్యవసాయ కూలీ. ఇంతకు ముందు ఆటో ఉండేది. పాప వైద్యం కోసం అమ్మేశాం. ప్రస్తుతం పాప వయస్సు 11 ఏళ్లు. నెలకు రెండుసార్లు బీ పాజిటివ్ రక్తం ఎక్కించాలి. మందులు, రక్తమార్పిడికి నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చవుతోంది. సీఎంగా జగనన్న అధికారంలోకి రాగానే పాపకు నెలకు రూ.10 వేలు పింఛన్ అందించారు. పాప బతికి ఉండడానికి కారణం సీఎం జగనన్నే. ఆయన రుణం తీర్చుకోలేం. నాకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా రుణమాఫీ అయింది. మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. పాపకు బోన్మ్యారో శస్త్ర చికిత్స చేయిస్తే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సీఎం జగన్నే నమ్ముకున్నాం. – కాంతామణి, వాలమర్రు (కె.శాంతారావు, విలేకరి, పాలకొల్లు అర్బన్) ఈ మేలును మరచిపోం మాది కాకినాడ జిల్లా ప్రత్తిపాడు గ్రామం. నా భర్త కడాలి వెంకట రమణ 20 ఏళ్ల కిందటే మృతి చెందారు. నాకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఐదుగురికి వాహాలయ్యాయి. కుమారులు ఇద్దరూ తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆడపిల్లలు ఇక్కడే ఉంటున్నారు. నా భర్త మరణానంతరం వైఎస్సార్ ప్రభుత్వంలో నాకు పింఛన్ మంజూరైంది. ప్రతి నెలా రూ.3 వేలు వస్తోంది. నా కుమార్తెలు ముగ్గురికీ అమ్మ ఒడి కింద ఏటా రూ.15,000 చొప్పున అందుతోంది. వీటితోపాటు వీరికి ఆసరా, చేయూత పథకాలు వర్తిస్తున్నాయి. ఈ ప్రభుత్వం నిర్ణయాల వల్ల మాలాంటి పేదలు హాయిగా జీవిస్తున్నారు. పిల్లల చదువులకు దిగుల్లేకుండా పోయింది. ఇంటిల్లిపాది ఆరోగ్యానికి ప్రభుత్వమే అండగా నిలిచింది. ఆసరా, చేయూత పథకాల ద్వారా వచ్చిన సొమ్ముతో ఎంతో మంది సొంత కాళ్లపై నిలబడటం ఊరూరా కనిపిస్తోంది. ఇంత మేలు చేసిన సీఎం జగన్ను ఎవరు మరచిపోతారు? – కడాలి రాములమ్మ, ప్రత్తిపాడు (ప్రగడ రామకృష్ణ, విలేకరి, ప్రత్తిపాడు రూరల్) అప్పులబారి నుంచి బయటపడ్డాం మాది డా.బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి గ్రామం. నిరుపేద రజకుల కుటుంబం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సంక్షేమ పథకాలు మాకు అందడంతో జీవనం హాయిగా సాగుతోంది. నాకు, నా కూతురికి ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.15 వేలు చొప్పున నాలుగు విడతల్లో రూ.1.20 లక్షలు వైఎస్సార్ ఆసరా అందింది. చేయూత పథకం కింద రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో రూ.75,000 అందాయి. జగనన్న చేదోడు కింద ఐదు విడతల్లో రూ.50 వేలు అందించారు. నా భర్తకు ప్రతి నెలా రూ.3 వేలు పింఛన్, మా అమ్మాయికి వికలాంగ పింఛన్ రూ.3 వేలు అందుతోంది. మా వలంటీర్ మాతో అన్నీ పూర్తి చేయించి ఈ సంక్షేమ పథకాలు అందేలా చేశారు. పథకాలతో వచ్చిన ఆర్థిక సాయంతో పాడి పశువులు పెంచుకుంటూ లబ్ధి పొందుతున్నాం. అప్పులు తీర్చుకున్నాం. సీఎం జగన్ చేసిన మేలు మరచిపోలేం. – నందంపూడి సత్యవతి, గొల్లవిల్లి(నల్లా విజయ్కుమార్, విలేకరి, ఉప్పలగుప్తం -
ఆక్వా, పాడి రైతులకు భరోసా
సాక్షి, అమరావతి: కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా పాడి, ఆక్వా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఒక్కో ఆక్వా రైతుకు గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఆరి్థక చేయూతనిస్తుండగా.. పాడి రైతులకు ఎలాంటి హామీ లేకుండా రూ.1.60 లక్షల వరకు రుణాలిస్తోంది. కార్డుల జారీ, రుణ పరపతి కోసం ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ ఆధారిత అప్లికేషన్ కూడా అభివృద్ధి చేసింది. జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించి మరీ రుణాలు మంజూరు చేస్తోంది. ముందెన్నడూ లేనివిధంగా ఐదేళ్లలో రూ.4,420.38 కోట్ల రుణాలను ప్రభుత్వం అందించింది. కార్డు పొందే పాడి రైతులకు బీమా సదుపాయం కూడా కల్పించింది. తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీలో 1.5 శాతం చొప్పున ఏటా వడ్డీ రాయితీ పొందొచ్చు. సకాలంలో చెల్లించిన వారికైతే 3 శాతం వరకు వడ్డీ రాయితీ పొందే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఐదేళ్లలో 1.30 లక్షల మంది పాడి, ఆక్వా రైతులకు రూ.4,420 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రుణాలుగా అందించింది. పాడి రైతులకు రూ.1,747.18 కోట్లు వైఎస్సార్ చేయూత, ఆసరా వంటి పథకాల ద్వారా పొందిన లబి్ధతో పాడి పశువులు, సన్న జీవాలు కొనుగోలు చేసిన పాడి రైతులకు ప్రభుత్వం పశు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేసింది. జగనన్న పాలవెల్లువ, జగనన్న జీవక్రాంతి పథకాల కింద ఐదేళ్లలో 5.15 లక్షల మందికి మూగ, సన్నజీవాలను అందించింది. వీరందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేసింది. కార్డులు పొందిన వారిలో ఇప్పటివరకు 1,38,392 మంది రుణాల కోసం దరఖాస్తు చేయగా, వారిలో 1,13,399 మందిని అర్హులుగా గుర్తించింది. వీరిలో ఇప్పటికే 1,09,199 మందికి రూ.1.60 లక్షల వరకు రుణాలు ఇచి్చంది. ఇలా రూ.1,747.18 కోట్ల రుణం అందించింది. వ్యక్తిగతంగానే కాకుండా గ్రూపులుగా ఏర్పడినా కేసీసీ కార్డులు జారీ చేసేందుకు అవకాశం కల్పించింది. ఆర్బీకేల ద్వారా దరఖాస్తు చేసే పాడి రైతులు ఎంతకాలం నుంచి పశుపోషణ చేస్తున్నారు, ఎంత పాడి ఉంది, ఎన్ని పాలను ఉత్పత్తి చేస్తున్నారనే వివరాలను స్థానిక పశువైద్యాధికారి ధ్రువీకరిస్తే చాలు. ఎలాంటి హామీ లేకుండా రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంది. ఈ రుణాలతో పాడి రైతులు పశువులు, సన్నజీవాలకు షెడ్లు, మంచినీటి తొట్టెల నిర్మాణం, తాళ్లు, ఇతర సామగ్రితో పాటు పశుగ్రాసం కొనుగోలు చేశారు. ఆక్వా రైతులకు రూ.2,673 కోట్లు ఐదేళ్లలో 19,059 మంది ఆక్వా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. కార్డులు పొందిన ఆక్వా రైతులకు ప్రతి సీజన్లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణం ఇస్తోంది. ఇందులో మొదటి రూ.2 లక్షలను కేసీసీ రుణంగా పరిగణిస్తోంది. రూ.2 లక్షలపై 2 శాతం, మిగిలిన రుణం సకాలంలో చెల్లిస్తే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కింద మరో 3 శాతం వడ్డీ రాయితీ పొందే వెసులుబాటు కల్పించింది. ఇలా ఐదేళ్లలో రూ.2,673 కోట్లను రుణాలుగా ఇచ్చింది. -
సమస్యలు తీరి సంతోషంగా జీవనం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. సమస్యలు తీరి సంతోషంగా జీవనం నేను వ్యవసాయ కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నా. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురంలో కాపురం ఉంటూ వచ్చిన అరకొర ఆదాయంతో పిల్లల చదువులు ఎలా అని నిత్యం తల్లడిల్లిపోయే వాళ్లం. గత ప్రభుత్వ హయాంలో మాకు ఎలాంటి సాయం అందలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత మాకు చాలా మేలు జరిగింది. బడికెళ్తున్న మా అమ్మాయికి ఐదేళ్లుగా జగనన్న అమ్మఒడి పథకం ద్వారా ఏడాదికి రూ. 15 వేలు వంతున వచ్చింది. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా రూ.13,500 వంతున, వైఎస్సార్ ఉచిత పంట బీమా ద్వారా రూ.6,460, ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా రూ.31,950 వచ్చాయి. ముఖ్యంగా నిరుపేదలైన మాకు విలువైన ఇంటి స్థలంతోపాటు ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయంగా రూ.1.80 లక్షలు మంజూరయ్యాయి. దాంతో ఇంటి నిర్మాణం చేపట్టాం. ఇప్పుడు మా కుటుంబం హాయిగా జీవిస్తోందంటే దానికి కారణమైన ముఖ్యమంత్రి జగనన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. – అంసూరి జయపాలకృష్ణ, కపిలేశ్వరపురం (పెద్దింశెట్టి లెనిన్ బాబు, విలేకరి, కపిలేశ్వరపురం) బిచ్చగాళ్లను కాస్తా లక్షాధికారులను చేశారు మా తల్లిదండ్రులు, తాతలు సంచార జీవనం గడుపుతూ... ఆకివీడులోని దుంపగడప రైల్వే గేటు వద్ద రైల్వే స్థలంలో 50 ఏళ్లుగా గుడారాల్లో జీవనం గడిపారు. నా తల్లిదండ్రులు రైల్వే స్థలంలో గుడిసె వేసుకుని జీవించారు. మాకు, మా తల్లిదండ్రులకు, తాత ముత్తాతలకు చదువులు లేవు. గుంతలు, కాల్వల్లో చేపలు పట్టుకుని భిక్షాటన చేసి జీవనం సాగించాం. రైల్వే స్థలం నుంచి మమ్మల్ని ఖాళీ చేయించినప్పుడు అప్పటి ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు పెద్ద మనస్సుతో మా తల్లిదండ్రులకు సమతానగర్ రోడ్డులోని చినకాపవరం డ్రెయిన్ వద్ద స్థలాలు ఇచ్చారు. పాకలు, రేకుల షెడ్లు వేసుకుని మా తల్లిదండ్రులతో కలిసి ఉన్నాం. నాకు పెళ్లయిన తరువాత ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో 11 మంది చెంచులకు కుప్పనపూడి శివారు తాళ్లకోడు వద్ద ఒక్కొక్కరికి సెంటు భూమి చొప్పున కేటాయించారు. ఇంటి నిర్మాణానికి రూ. 1.80లక్షలు ఆర్థిక సాయం చేశారు. డ్వాక్రా రుణం తీసుకుని, కొద్దిగా అప్పు చేసి ఆ మొత్తానికి జమచేసి మేము పక్కా భవనం నిర్మించుకుంటున్నాం. జగనన్న దయతో మా పిల్లల్ని చదివించుకుంటున్నాం. అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ. 15వేలు వంతున సాయం అందుతోంది. ప్రభుత్వ పాఠశాలలో మంచిగా చదువు చెబుతున్నారు. మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. స్కూలుకు వెళ్లే పిల్లలకు దుస్తులు, బ్యాగ్లు, పుస్తకాలు, టై, బూట్లు ఇవ్వడం బాగుంది. ప్రస్తుతం మేము చేపలు పట్టుకోవడంతోపాటు చిన్నచిన్న పనులు చేసుకుని జీవిస్తున్నాం. బిక్షగాళ్లుగా ఉన్న మమ్మల్ని లక్షాధికారులను చేసిన ఘనత జగన్దే. ఆయనకు రుణపడి ఉంటాం. – నల్లబోతుల అప్పన్న తాళ్లకోడు (బీఆర్ కోటేశ్వరరావు, విలేకరి, ఆకివీడు) ఇంతటి సాయం ఎన్నడూ ఎరుగం మాది నిరుపేద కుటుంబం. ఈ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు మా కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలిచాయి. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు గ్రామంలో చిన్న చికెన్ దుకాణాన్ని పెట్టుకొని నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నాకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. గత ప్రభుత్వంలో ఏ మేలూ జరగలేదు. ఈ ప్రభుత్వంలో సొంతింటి కల నెరవేరింది. స్థలం మంజూరు చేయడమే గాకుండా ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. నా భార్య వరలక్ష్మి ఇంటి దగ్గర టైలరింగ్ చేస్తూ నాకు అండగా నిలుస్తోంది. ఆమెకు చేదోడు కింద గత మూడేళ్లగా ఏటా రూ.10 వేలు, అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందింది. మాకు ఆర్థికంగా అండగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణ పడి ఉంటాం. – దొమ్మా వీరబాబు, ప్రత్తిపాడు (ప్రగడ రామకృష్ణ, విలేకరి, ప్రత్తిపాడు రూరల్) -
ఎవరి సిఫార్సు లేకుండా ఇల్లు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ఎవరి సిఫార్సు లేకుండా ఇల్లు నేను తాపీ పని చేస్తుంటాను. పార్వతీపురం మన్యం జిల్లాలోని వీరఘట్టానికి చెందిన మేము పొట్టకూటికోసం విజయనగరం జిల్లా రాజాం పట్టణానికి కొన్నేళ్ల క్రితం వలస వచ్చాం. గాయత్రీకాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉండేవాళ్లం. నా కొచ్చే అరకొర ఆదాయం సరిపోకపోవడంతో నా భార్య సంధ్య.. ఇంట్లో టైలరింగ్ పని చేస్తోంది. మాకు ఇద్దరు పిల్లలు. గత ప్రభుత్వ హయాంలో మాకు పని సరిగ్గా ఉండేది కాదు. ఎలాంటి సాయమూ అందేది కాదు. కానీ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మా పరిస్థితి మెరుగు పడింది. మాకు చేతి నిండా పని దొరుకుతోంది. ఈ ప్రభుత్వంలోనే మాకు రైస్ కార్డు ఇచ్చారు. బడికెళ్తున్న మా అబ్బాయికి అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు వంతున వచ్చింది. మరీ ముఖ్యంగా ఎవరి సిఫారసు లేకుండానే ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి నిధులు ఇచ్చారు. అందరిలానే మేం కూడా కంచరాం సమీపంలో మాకు ఇచ్చిన స్థలంలో సొంత ఇంటిని నిరి్మంచుకున్నాం. నెల రోజుల క్రితం గృహ ప్రవేశం చేశాం. కేవలం అర్హతే ప్రామాణికంగా ఎలాంటి పైరవీలు లేకుండా ఇన్ని సౌకర్యాలు కల్పించిన ఈ ప్రభుత్వం రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. – గంధవరపు సురేష్, రాజాం. (వి.వి.దుర్గారావు, విలేకరి, రాజాం) పేపర్ ప్లేట్ల తయారీతో దర్జాగా జీవనం నేను సాధారణ గృహిణిని. విశాఖ జిల్లా చిట్టివలస గ్రామానికి చెందిన నేను గత ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకుని స్వయం సమృద్ధి సాధించే దిశగా సాగుతున్నాను. నేను డ్వాక్రా గ్రూప్ సభ్యురాలిని కావడంతో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా జీవీఎంసీ భీమిలి జోన్ ద్వారా పట్టణ ప్రగతి యూనిట్ పేరుతో రెండు నెలల క్రితం పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ పెట్టుకున్నా. ఈ యూనిట్ విలువ రూ.2,02,500. ఇందులో ప్రభుత్వ సబ్సిడీ రూ.39,600. యూనిట్కు యంత్ర పరికరాలు, మెటీరియల్ ప్రభుత్వమే ఇచ్చింది. ప్రోత్సాహకంగా నాలుగు నెలల అద్దె కింద మరో రూ.20 వేలు ఇచ్చారు. పేపర్ ప్లేట్ల తయారీలో భాగంగా పాలిథిన్ రహిత పేట్ల తయారీలో శిక్షణ తీసుకున్నా. పేపర్ అట్టలపై విస్తర్లు ఉంచి సంప్రదాయ పద్ధతిలో భోజనాలకు అనువుగా వినియోగదారుల అభిరుచి మేరకు తయారు చేయగలుగుతున్నా. వ్యాపారం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఇల్లు లేని మాకు ఇంటి స్థలం ఇవ్వడమే గాకుండా ఇంటి నిర్మాణానికి రూ. 1.80 లక్షల ఆర్థికసాయం చేశారు. దాంతో ఇంటి నిర్మాణం పూర్తిచేసుకోగలిగాం. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసిన ఈ ముఖ్యమంత్రికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – వెంపాడ అరుణ, చిట్టివలస (గేదెల శ్రీనివాసరెడ్డి, విలేకరి, తగరపువలస) -
త్వరలో మా గృహ ప్రవేశం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. త్వరలో మా గృహ ప్రవేశం రెక్కాడితేగాని డొక్కాడని మాకు గూడు కల్పించిన దేవుడు సీఎం జగన్. మాది పేద కుటుంబం. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల శ్రీనివాస కాలనీ తండాలో అద్దె ఇంట్లో ఉంటున్నాం. మేము కూలి పనులకు వెళ్తేనే పూట గడిచేది. కొన్నేళ్ల క్రితం నా భర్త స్వామినాయక్కు ప్రమాదం వల్ల రెండు కాళ్లు చచ్చుబడిపోవడంతో నడవలేని పరిస్థితి ఏర్పడి మంచానికే పరిమితమయ్యారు. ఈ స్థితిలో నా కూలి డబ్బులతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చా. ఒక రోజు పని ఉంటే రెండో రోజు దొరికేది కాదు. అటువంటప్పుడు ఒక పూట పస్తులతోనే పడుకునే వాళ్లం. గత ప్రభుత్వంలో నా భర్తకు దివ్యాంగ పింఛను కోసం దరఖాస్తు చేసినా మంజూరు చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దివ్యాంగ పింఛను మంజూరు చేశారు. మా పెద్దబ్బాయి దత్తసాయి నాయక్ పిడుగురాళ్లలోని ప్రభుత్వ జూనియర్ కాలేజిలో ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో అబ్బాయి పవన్నాయక్ మన్నెం పుల్లా రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో 7వ తరగతి చదువుతున్నారు. అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు వస్తుండడంతో వారి చదువులకు ఎటువంటి ఇబ్బందులు లేవు. కూలి డబ్బుల్లో అధిక భాగం ఇంటి అద్దెకే సరిపోయేది. ఈ ప్రభుత్వం వచ్చాక నా పేరుతోనే ఆదర్శనగర్ జగనన్న కాలనీలో ఇంటి స్థలంతో పాలు ఇల్లు కూడా నిర్మించి మా సొంతింటి కల నెరవేర్చారు. త్వరలో గృహ ప్రవేశం చేయబోతున్నాం. నాకు ఆసరా, సున్నా వడ్డీ ద్వారా సాయం అందింది. మాలాంటి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం జగన్ కు మేమంతా రుణపడి ఉంటాం. – రామావత్ సరితాబాయి, పిడుగురాళ్ల (షేక్ మస్తాన్వలి, విలేకరి, పిడుగురాళ్ల) మా బతుకుల్లో ఎంతో మార్పు మాది పేద కుటుంబం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక మా బతుకులు మారాయి. మాది ఏలూరు జిల్లా మండవల్లి గ్రామం. నా వయసు 38 ఏళ్లు. నా కుమార్తె 9వ తరగతి చదువుతోంది. అమ్మఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేలు వస్తున్నాయి. దీంతో పాటు కావలసిన పుస్తకాలు, యూనిఫాం, స్కూలు బ్యాగు, షూస్ వంటివన్నీ ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుండడంతో చదువు భారం పూర్తిగా తప్పింది. ఆసరా ద్వారా రూ.15 వేలు లబ్ధి చేకూరింది. నా భర్త కాలికి గాయం కావడంతో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యానికి రూ.80 వేలు ప్రభుత్వం అందించింది. మా అత్తకు ప్రతి నెలా ఒకటో తారీఖునే రూ.3 వేల వృద్ధాప్య పింఛన్ అందుతోంది. జగనన్న పాలన స్వర్ణయుగం. మాకు ఏ చీకూ చింతా లేదు. గత ప్రభుత్వం మాలాంటి వారికి ఎలాంటి సాయం అందించలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక ఆర్థికంగా నిలదొక్కుకున్నాం. మా కుటుంబాన్ని ఆదుకున్న జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. మళ్లీ ఆయనే సీఎం అయితేనే మాలాంటి పేదలు హాయిగా బతుకుతారు. – చిగురిపాటి ప్రశాంతి, మండవల్లి (భోగాది వీరాంజనేయులు, విలేకరి, మండవల్లి) పెద్దన్నలా ఆదుకున్నారు మాది పేద కుటుంబం. పశి్చమగోదావరి జిల్లాలోని పెనుగొండ మా ఊరు. చాలా ఏళ్ల కిందటే నా భర్త మృతి చెందాడు. తల్లిదండ్రులు, సోదరులపై ఆధారపడి జీవిస్తున్నా. ఇద్దరు కుమార్తెలతో జీవిస్తున్న నన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దన్నలా ఆదుకున్నారు. మాకు ఇంటి స్థలం మంజూరైంది. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు అందించారు. మా సొంతింటి కల సాకారమైంది. వైఎస్సార్ ఆసరా కింద డ్వాక్రా రుణమాఫీ రూ.37,600 నా ఖాతాలో జమ చేశారు. నా కుమార్తెకు జగనన్న అమ్మఒడి ద్వారా ఏటా రూ.15 వేలు లబ్ధి చేకూరుతోంది. వితంతు పింఛను సొమ్ము రూ.3 వేల వంతున ప్రతి నెలా అందుతోంది. దీంతో కుటుంబ పోషణకు ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఎప్పుడూ రుణపడి ఉంటాం. – కొమ్మోజు అనంతలక్ష్మి, పెనుగొండ, పశ్చిమగోదావరి జిల్లా గుర్రాల శ్రీనివాసరావు, విలేకరి, పెనుగొండ) -
మా బతుకులు మార్చిన సర్కారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. మా బతుకులు మార్చిన సర్కారు మాది అరకొర ఆదాయంతో జీవించే కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. గత ప్రభుత్వాల నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో ఒడిదొడుకుల జీవనం గడపాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చాక మా ఆర్థిక పరిస్థితి ఎంతో మారిపోయింది. మేము విశాఖ జిల్లా భీమిలి మండలం మజ్జివలసలో ఉంటున్నాం. డ్వాక్రా గ్రూప్ సభ్యురాలినైన నాకు వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.40 వేలు వచ్చింది. నా కుమారుడు శ్యామ్ సందీప్కు స్కూల్లో ట్యాబ్ ఇచ్చారు. కుమార్తె జెస్సికాకు అమ్మఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు వంతున వచ్చింది. నా భర్త చంటికి సెర్ప్ ద్వారా ఆటో కొనుగోలుకు వడ్డీ లేని రుణం రూ.3.30 లక్షలు వచ్చింది. వాహనమిత్ర ద్వారా ఏటా రూ.10 వేలు వంతున లబ్ధి కలిగింది. మా అత్త సరస్వతికి పెన్షన్ కానుక అందుతోంది. పద్మనాభం మండలం కురపల్లిలో 78 గజాల ఇంటి స్థలం ప్రభుత్వం అందించింది. ప్రభుత్వం అందించిన ఆర్థి క సాయంతో దుస్తుల వ్యాపారం చేస్తున్నా. నెలకు రూ.10 వేల వరకు ఆదాయం లభిస్తోంది. ఇప్పుడు మేమంతా సంతోషంగా ఉన్నాం. ఇందుకు కారణమైన జగనన్న రుణం తీర్చుకుంటాం. – పందిరి లక్ష్మి, మజ్జివలస (గేదెల శ్రీనివాసరెడ్డి, విలేకరి, తగరపువలస) ఒంటరి బతుక్కు అండగా నిలిచారు నేను ఒంటరి మహిళను. రజక వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా. ఏలూరు జిల్లా పోలవరం పంచాయతీ పరిధిలోని కొత్తపేటలో నివాసం ఉంటున్నా. రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు మావి. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక నా బతుకు చిత్రం మారింది. జగనన్న ప్రభుత్వంలో అందుతున్న సాయంతో ఇప్పుడు నేను సంతోషంగా జీవిస్తున్నా. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,750 ఆర్థి క సహాయం అందుతోంది. రజకులకు ప్రభుత్వం అందిస్తున్న చేదోడు పథకం ద్వారా రూ.10 వేలు అందుతోంది. ఒంటరి మహిళ పింఛన్ రూ.3 వేలు ప్రతి నెలా వలంటీర్ ఇంటికి తీసుకువచ్చి ఇస్తోంది. దీంతోపాటు ఇంటి బయట బడ్డీ పెట్టుకుని ఇస్త్రీ పెట్టె కొనుక్కొని.. బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ కొంత సంపాదిస్తున్నా. మాలాంటి పేదోళ్లకు, భర్త లేని వారికి, ఒంటరి మహిళలకు జగనన్న అందిస్తున్న సాయం మరువలేనిది. ఆయన రుణం తీర్చుకోలేనిది. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి పథకాలు ఏవీ అందలేదు. జగనన్న రుణం తీర్చుకోలేనిది. – ఉంగుటూరు లక్ష్మి, పోలవరం (వ్యాఘ్రేశ్వరరావు, విలేకరి, పోలవరం రూరల్) ఇప్పుడు హాయిగా జీవిస్తున్నాం మాది కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలోని సాధారణ మధ్య తరగతి కుటుంబం. ఈ ప్రభుతం వచ్చాక వైఎస్సార్ ఆసరా పథకం కింద రూ.10,950,డ్వాక్రా రుణం రూ.లక్ష, స్త్రీనిధి కింద రూ.50 వేలు వచ్చింది. దీంతో మా గ్రామంలో నేను, నా భర్త రామచంద్రరావు దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాం. మాకు శివ, పవన్ అనే ఇద్దరు కుమారులున్నారు. వీరిద్దరికీ వివాహాలు కావడంతో వారు రోజువారీ పనులు చేసుకుంటూ వారి బతుకులు వారు బతుకుతున్నారు. మా మనవళ్లకు అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేలు వస్తోంది. డ్వాక్రా రుణంతో దుకాణం పక్కనే చిన్న ఇల్లు కట్టుకొని కాపురం ఉంటున్నాం. ఈ ప్రభుత్వంలో వచ్చిన పథకాలతో ఆర్థి క ఇబ్బందులు తీరి ఆనందంగా జీవిస్తున్నాం. – సాలారపు సత్యవతి, పెద్దిపాలెం (ప్రగడ రామకృష్ణ, విలేకరి, ప్రత్తిపాడు రూరల్) -
ఆపత్కాలంలోనూ ఆదుకున్న దేవుడు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ఆపత్కాలంలోనూ ఆదుకున్న దేవుడు మాది మధ్యతరగతి కుటుంబం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన మాకు కొద్దిపాటి భూమి ఉన్నా... పంటలు పండిన దాఖలాల్లేవు. ప్రతి ఏటా పెట్టుబడి పెట్టడం... ఆనక పరిస్థితులు అనుకూలించక నష్టపోవడం మాకు అలవాటైపోయింది. ఈ పరిస్థితుల్లో అప్పులు తప్పేవి కాదు. గత ప్రభుత్వం మాకు ఏ విధంగానూ సాయమందించిన దాఖలాల్లేవు. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తరువాత అందించిన నవరత్నాల ద్వారా మా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. నా భార్యకు వైఎస్సార్ చేయూత ద్వారా ఏడాదికి రూ.18,750లు, వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.600, వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.6,204 అందాయి. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏడాదికి రూ. 13,500 వంతున, వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా ఏడాదికి రూ. 24వేలు అందింది. అంతేగాకుండా ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్ వచ్చింది. కోవిడ్ వంటి ఆపత్కాలంలో కూడా సంక్షేమ పథకాలు అందించిన మహానుభావుడు జగనన్న. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. – భళ్ల సాయిమల్లికార్జున, అప్పనపల్లి (యేడిద బాలకృష్ణ, విలేకరి, మామిడికుదురు) పైసా ఖర్చు లేకుండా సచివాలయ ఉద్యోగాలు ఉన్న ఊళ్లో ఉపాధి లేక ప్రస్తుతం విజయనగరం జిల్లా రేగిడి మండలం మడ్డువలస రిజర్వాయర్ ముంపు గ్రామం కొట్టిశ నుంచి 2001లో పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట గ్రామానికి వలస వచ్చాం. నేను బీఏ, బీఈడీ చేసినా ప్రభుత్వ ఉద్యోగం దొరకక ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్ పనిచేస్తూ ఇద్దరు పిల్లల్ని చదివించుకున్నాను. నాకు రెండెకరాల భూమి, ఇల్లు ఉంది. పిల్లలు ఇద్దరూ పదో తరగతి పాసయిన తరువాత ఉన్నత చదువులు చదివించేందుకు శక్తి చాలక డిప్లమోలు చేయించాను. అబ్బాయి మణికృష్ణ అగ్రికల్చర్ డిప్లమో, అమ్మాయి కీర్తిప్రియ ఫిషరీస్ డిప్లమో చేశారు. అదృష్టవశాత్తూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సచివాలయాలు ఏర్పాటు చేయడంతో మా పిల్లలు ఇద్దరికీ సచివాలయ ఉద్యోగాలు వచ్చాయి. అబ్బాయి నూకలవాడ సచివాలయం, అమ్మాయి వెంగాపురం సచివాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలకు ఎవరి చుట్టూ తిరగలేదు. ఎవరికీ ఒక్క పైసా అయినా ఇవ్వలేదు. పూర్తిగా మెరిట్తోనే తప్ప లంచాలకు, సిఫార్సులకు తావులేకుండా నియామకాలు జరిగాయి. ఇంతటి పారదర్శకంగా మా పిల్లలకు ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – ఎ.పోలినాయుడు, బలిజిపేట (పి.కోటేశ్వరరావు, విలేకరి, సీతానగరం) ప్రభుత్వ సాయంతో చేపల వ్యాపారం ఈ ప్రభుత్వం అందించిన సాయంతో చేపల వ్యాపారం ప్రారంభించాను. రోజూ వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తూ కుటుంబానికి చేదోడుగా ఉంటున్నాను. మాది విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం పెదనాగమయ్యపాలెం. నేను మణికంఠ డ్వాక్రా గ్రూప్లో సభ్యురాలిగా ఉన్నాను. వైఎస్సార్ ఆసరా ద్వారా ఇప్పటివరకు రూ.72 వేలు లబ్ధిపొందాను. చేయూత ద్వారా ఏటా 18,750 వంతున వచ్చింది. నా భర్త కొండకు వైఎస్సార్ పెన్షన్ కానుక అందుతోంది. మా అబ్బాయి మత్స్యకార భరోసా ద్వారా రూ.50 వేలు వచ్చాయి. మనుమడు అప్పలరాజుకు విద్యాదీవెన కింద రూ.24వేలు, మనుమరాలు పూర్ణకు అమ్మఒడి ద్వారా ఏడాదికి రూ. 15వేలు వంతున ప్రభుత్వం నుంచి పొందాము. ఈ ప్రభుత్వం అందించిన పథకాల వల్ల వచ్చిన డబ్బుతో చేపల వ్యాపారం చేస్తున్నాను. విశాఖ ఫిషింగ్ హార్బర్లో చేపలు కొని తగరపువలస ప్రైవేట్ మార్కెట్కు వెళ్లి విక్రయిస్తాను. రోజుకు రూ.400 నుంచి రూ.1000 ఆదాయం వస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాలనలో మా కుటుంబం ఎంతో ఆనందంగా ఉంది. మళ్లీ ఈ ప్రభుత్వమే రావాలి. – గరికిన ధనలక్ష్మి, పెదనాగమయ్యపాలెం (గేదెల శ్రీనివాసరెడ్డి, విలేకరి, తగరపువలస) -
కుటుంబానికి ఆసరా దొరికింది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. కుటుంబానికి ఆసరా దొరికింది నేను, నా భర్త సుధాకర్తో కలిసి కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. మాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు సునీల్శర్మ పుట్టుకతోనే మానసిక దివ్యాంగుడు. మాది ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం చినమనగుండం. కూలినాలి చేసుకుని బతుకుతున్న తరుణంలో 2018లో నా భర్త ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆస్పత్రిలో చూపిస్తే కిడ్నీ పాడైందని డాక్టర్లు చెప్పారు. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలని దిగులుపడిన తరుణంలో 2019లో ముఖ్యమంత్రి జగనన్న కిడ్నీ బాధితులకు బాసటగా నిలిచారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కిడ్నీ ఆపరేషన్ చేయించారు. ప్రతి నెలా పింఛన్ రూ.5 వేలు మంజూరు చేశారు. పెద్ద కుమారుడికి దివ్యాంగ పింఛన్ రూ.3 వేలు ఇస్తున్నారు. నాకు వైఎస్సార్ చేయూత ద్వారా ఏటా రూ.18,750 అందుతోంది. వైఎస్సార్ ఆసరా పథకం వర్తించింది. మా అమ్మాయికి వివాహం చేశాను. చిన్నబ్బాయి అనిల్వర్మకు ఏటా అమ్మ ఒడి పథకం ద్వారా రూ.15 వేలు అందింది. ఈ రోజు మా జీవితం బాగుండటానికి కారణమైన ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – కందుల ఎలీశమ్మ, చినమనగుండం (నాగం వెంకటేశ్వర్లు, విలేకరి, కొనకనమిట్ల) నా గుండె చప్పుడు సీఎం జగన్ నేను గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నా. మేము వెల్దుర్తి ఎస్సీకాలనీలో నివసిస్తున్నాం. ఆదాయం అంతంత మాత్రమే. వచ్చిన ఆదాయంతోనే ఎలాగోలా జీవిస్తున్న తరుణంలో అనుకోకుండా గుండెకు సంబంధించిన సమస్య తలెత్తింది. హైదరాబాద్లో వైద్యులను సంప్రదిస్తే గుండె మార్పిడి ఆపరేషన్ చేయాలన్నారు. సుమారు రూ.33 లక్షలు ఖర్చవుతాయని చెప్పారు. అంతంత మాత్రం జీతంతో జీవిస్తున్న మాకు అంత డబ్బు ఎలా తేవాలో అర్థం కాలేదు. ఇక బతుకుపై ఆశ సన్నగిల్లింది. అప్పటికే వైద్య పరీక్షల నిమిత్తం సుమారు రూ.2 లక్షల వరకు ఖర్చు చేశాం. ఏంచేయాలో పాలుపోలేదు. నా సమస్యను ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చెప్పాను. ఆయన ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లడంతో నాకు ప్రత్యేకంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.33 లక్షలు మంజూరు చేశారు. ఐదు నెలల క్రితం తిరుపతి స్విమ్స్ వైద్యశాలలో డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నాకు ఆపరేషన్ చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బ్రెయిన్ డెడ్ కావటంతో అతడి గుండెను నాకు అమర్చారు. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను. సీఎం జగన్ నాకు పునర్జన్మ ప్రసాదించారు. నా కుమారుడికి అమ్మఒడి కింద ఏడాదికి రూ.15 వేలు వంతున వస్తోంది. ప్రభుత్వం మా గ్రామంలోని జగనన్న కాలనీలో మాకు ఇంటి స్థలం కూడా మంజూరు చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో సంతోషంగా జీవిస్తున్నాం. నా గుండె చప్పుడుగా మారిన జగన్కు జీవితాంతం రుణపడి ఉంటాం. – చాగంటి సుమతి, వెల్దుర్తి(డి.వెంకటేశ్వర్లు, విలేకరి, వెల్దుర్తి) మమ్మల్ని దేవుడిలా ఆదుకున్నారు మాది నిరుపేద కుటుంబం. మా ఆయన గోవిందరావు రోజువారీ కూలీ. ఆయన అరకొర సంపాదనతోనే మా జీవితం సాగుతోంది. నేను దివ్యాంగురాలిని కావడంతో ఏ పనీ చేయలేను. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్లోని రామకృష్ణాపురంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాం. మాకు వైష్ణవి అనే కూతురు ఉంది. ప్రస్తుతం 4వ తరగతి చదువుతోంది. గత ప్రభుత్వం మాలాంటి వారికి ఎలాంటి సాయం చేయలేదు. ఇటీవల నాకు అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రిలో చూపించుకుంటే పరీక్షలు చేసిన డాక్టర్లు క్యాన్సర్గా నిర్ధారించారు. ఏం చేయాలో పాలుపోలేదు. అయితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పడంతో దాని ద్వారా శస్త్రచికిత్స చేయించుకున్నా. ఇప్పడు ఆరోగ్యంగా ఉన్నా. జగనన్న ప్రభుత్వం శస్త్రచికిత్స సమయంలో రూ.పది వేలు సాయం అందించింది. కీమో థెరపీ సమయంలోనూ రూ.ఐదు వేల చొప్పున అందిస్తున్నారు. దివ్యాంగురాలినైన నాకు పింఛను వస్తోంది. మా పాపకు మూడేళ్లుగా అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేలు వంతున వచ్చాయి. ఇంటి పట్టా కూడా మంజూరైంది. ఎటువంటి ఆసరా లేని మమ్మల్ని జగనన్న దేవుడిలా ఆదుకున్నారు. జగనన్నకు మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. – కుంటిమద్ది సుజాత, రామకృష్ణాపురం, విజయవాడ (సిద్దుబల్ల రాజేంద్రప్రసాద్, విలేకరి, పూర్ణానందంపేట) -
ఇంటి స్థలం ఇచ్చి ఆదుకున్నారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ఇంటి స్థలం ఇచ్చి ఆదుకున్నారు మాది నిరుపేద కుటుంబం. మాకు ఏ విధమైన ఆస్తులూ లేవు. ఉండటానికి సొంత ఇల్లు కూడా లేని పరిస్థితి. అటువంటి మాకు ఒకటిన్నర సెంటులో ఇంటి స్థలం ఇచ్చి మా కుటుంబాన్ని జగన్ సర్కారు ఆదుకుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురుకు చెందిన మా కుటుంబానికి నవరత్నాల ద్వారా ఎంతో లబ్ధి చేకూరింది. నా భర్త వెంకటేశ్వరరావు కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రూ.రెండు లక్షలు విలువైన ఇంటి స్థలం ఇచ్చారు. మా అబ్బాయి జగదీశ్కు జగనన్న విద్యా దీవెన ద్వారా రూ.23,850 అందించారు. వైఎస్సార్ ఆసరా కింద ఇప్పటి వరకు రూ.68 వేలు అందింది. మా కుటుంబం ఈ రోజు ఆర్థి కంగా నిలదొక్కుకోవడానికి కారణమైన ఈ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – యడ్ల దుర్గ, మామిడికుదురు (యేడిద బాలకృష్ణ, విలేకరి, మామిడికుదురు) సంతోషంగా వ్యవసాయం మాది వ్యవసాయ కుటుంబం. సొంత భూమి లేకపోయినా పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కిమ్మి గ్రామంలో మూడెకరాలు కౌలుకు తీసుకుని మా ఆయన శంకరరావు సాగు చేస్తున్నారు. అందులో వరి, చెరకు పండిస్తున్నాం. ఏటా వ్యవసాయానికి పెట్టుబడి అవసరం ఉంటుంది. అప్పుడు తప్పనిసరిగా అప్పు చేయడం.. పంట చేతికొచ్చాక తీర్చేయడం అలవాటు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత అప్పు చేయాల్సిన అవసరం తప్పింది. ఇప్పుడు రైతు భరోసా వస్తోంది. మా మామగారికి వృద్ధాప్య పింఛన్ వస్తోంది. మా అత్తకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ.18,750 చొప్పు అందింది. మా అత్త చేయి ఆపరేషన్కు పైసా ఖర్చు లేకుండా ఆరోగ్య శ్రీ పథకం ద్వారా చేయించుకోగలిగాం. మాకు ఇద్దరు పిల్లలు. వారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. పాప పేరున మూడేళ్లుగా అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేలు వంతున వస్తోంది. మా కుటుంబానికి ఇంత మేలు జరిగిందంటే కారణం ఈ ప్రభుత్వమే. సీఎం జగనన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. – అలుజు రజిని, కిమ్మి (కొలిపాక సింహాచలం, విలేకరి, వీరఘట్టం) అమ్మాయి చదువు బెంగతీరింది మా ఆయన విజయనగరం జిల్లా బాడంగి మండలం గూడెపువలస గ్రామంలో చిల్లర వ్యాపారం చేసేవారు. ఆయన సంపాదనతోనే మా కుటుంబం గడిచేది. అనుకోకుండా గతేడాదే ఆయన కన్ను మూయడంతో అక్కడ వ్యాపారాన్ని మూసేసి బాడంగిలో టీ కొట్టు పెట్టుకుని ఒక్కగానొక్క కుమార్తెను చదివించుకుంటున్నా. వచ్చిన ఆదాయంతో మా పాపకు ఉన్నత చదువులు అందించగలనా.. అన్న భయం ఉండేది. రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం రావడంతో ఆ భయం తీరిపోయింది. మా అమ్మాయి సాహితి ప్రస్తుతం బాడంగిలోని ఒక ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఆమెకు అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేలు అందుతోంది. దీనివల్ల అమ్మాయి చదువు బెంగ తీరింది. నాకు వైఎస్సార్ పింఛన్ కానుక ప్రతి నెలా ఒకటో తేదీనే అందుతోంది. వైఎస్సార్ ఆసరా ద్వారా ఇప్పటి వరకూ రూ.30 వేలు, సున్నా వడ్డీ కింద రూ.12 వేలు అందింది. ప్రస్తుతానికి మేము ఆర్థి కంగా కుదుటపడగలిగాం. ఇందుకు కారణమైన జగనన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. – బండి సంతోష్, గూడెపువలస (గొట్టాపు కృష్ణమూర్తి, విలేకరి, బాడంగి) -
ధైర్యంగా బతకగలుగుతున్నా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ధైర్యంగా బతకగలుగుతున్నా మా ఆయన తిక్కస్వామి వ్యవసాయ కూలీ. ఆయన సంపాదనతోనే కర్నూలు జిల్లా పెద్దతుంబళం గ్రామంలో ఒడుదొడుకులతో సంసారం సాగేది. పనిలేనిరోజు పస్తులుండాల్సి వచ్చేది. పదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. మాకు ఒక కుమార్తె, కుమారుడు సంతానం. భర్త మరణంతో కుటుంబ పోషణ చాలా భారమైంది. గత ప్రభుత్వంలో మాకు ఎలాంటి సాయం అందలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మా కుటుంబానికి ఆసరా దొరికినట్టయింది. రూ. 30 వేలు పొదుపు రుణం సున్నావడ్డీ కింద తీసుకుని కుట్టుమెషీన్ కొనుక్కున్నా. నాకు వితంతు పింఛను కూడా వస్తోంది. మా ఇద్దరు పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు. ఒకరికి అమ్మ ఒడి కింద రూ.15వేలు అందుతోంది. బడిలో మంచి ఆహారం, అవసరమైన పుస్తకాలు, యూనిఫాం వంటివి అందిస్తున్నారు. జగనన్న కాలనీలో ఇంటి స్థలం కూడా మంజూరైంది. ఎలాంటి భయం లేకుండా బతుకుతున్నానంటే జగనన్న ఆశీర్వాదమే కారణం. – బయటిగేరి రాజేశ్వరి, పెద్దతుంబళం (కపటి రామచంద్ర, విలేకరి, ఆదోని రూరల్) సాయం చేసి.. ఉపాధి బాట వేసి.. నా భర్త ఏలేటి కిరణ్తోపాటు నేను కూడా అద్దె ఆటో నడుపుతూ రాజమహేంద్రవరం మండలం కొంతమూరులో ఇద్దరు మగ పిల్లలను పోషించుకుంటూ జీవిస్తున్నాం. అద్దె ఆటో కన్నా సొంత ఆటో కొనుగోలు చేయాలనుకున్నాం. ధర కనుక్కుంటే రూ.4.50 లక్షల వరకూ అవుతుందని తెలిసింది. అంత సొమ్ము భరించలేమని భయపడ్డాం. ఆ సమయంలో సీఎం జగనన్న ‘ఉన్నత మహిళా శక్తి’ పథకం ద్వారా ఉపాధికి భరోసా కల్పించారు. ఎటువంటి వడ్డీ లేకుండా రూ.2.79 లక్షల విలువైన ఆటోను ప్రభుత్వం అందించింది. దీంతో మా కుటుంబం కుదుటపడింది. అంతేగాకుండా ఇంటి స్థలాన్ని మంజూరు చేసి పట్టా అందించారు. ఇద్దరు మగ పిల్లల్లో ఏలేటి సంజయ్ సాత్విక్ ఐదో తరగతి, ఏలేటి సంజయ్ సంపత్ మూడో తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఇద్దరిలో చిన్నవాడికి అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేలు వస్తోంది. అంతేకాకుండా వైఎస్సార్ విద్యా కానుక ద్వారా పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగ్లు, షూలు, సాక్సులు సైతం అందించారు. జగనన్న గోరుముద్ద ద్వారా మధ్యాహ్నం పౌష్టికాహారమైన భోజనాన్ని పెడుతున్నారు. సీఎం జగనన్న ద్వారా జరిగిన మేలు మా కుటుంబం మరచిపోదు. జీవితాంతం రుణపడి ఉంటాం. – ఏలేటి దేవీదుర్గ, ఆటో డ్రైవర్ కొంతమూరు (యెనుముల విశ్వనాథం, విలేకరి, రాజమహేంద్రవరం రూరల్) పోతాయనుకున్న ప్రాణాలు నిలిపారు దుకాణాల్లోనూ, ఇళ్లలోనూ ధూపం వేస్తూ, దిష్టి తాళ్లు కడుతూ పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో జీవించే కుటుంబం మాది. జిల్లాలో కోవిడ్ బారిన పడిన మొదటి వరుసలోని వ్యక్తిని. దాంతో మేమంతా తీవ్ర భయభ్రాంతులకు గురై, తీవ్ర మానసిక వేదన అనుభవించాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖర్చుకు వెరవకుండా అండగా నిలిచి ప్రాణాలు నిలిపారు. ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించి 16 రోజుల పాటు వైద్యం చేయించారు. రెండు పూటలా పౌష్టికాహారం అందించడంతోపాటు ఉదయం, సాయంత్రం టిఫిన్ ఇచ్చారు. సమయానికి మందులు ఇచ్చి ప్రాణాలకు అండగా నిలిచారు. భయభ్రాంతుల నుంచి నేడు సాధారణ జీవితంలోకి వచ్చి మళ్లీ జీవనోపాధిలో ముందుకు సాగడం అంతా సీఎం జగన్ చలవే. అంతేగాకుండా మా కుటుంబానికి అమ్మఒడి ద్వారా ఏడాదికి రూ. 15వేలు, నా భార్యకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా రూ.36 వేలు లబ్ధి చేకూరింది. సీఎంకు మా కుటుంబం అంతా రుణపడి ఉంటుంది. – షేక్ ఖాసీం, పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా (గుర్రాల శ్రీనివాసరావు, పెనుగొండ, పశ్చిమగోదావరి జిల్లా) -
క‘న్నీటి’ కష్టాలు తీరాయి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. క‘న్నీటి’ కష్టాలు తీరాయి మాది శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దాన ప్రాంతం. వజ్రపుకొత్తూరు మండలం సీతాపురంలో చిన్నపాటి కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నా. నా భర్త చనిపోయారు. కొడుకు పెళ్లయ్యాక వేరే కాపురం ఉంటున్నాడు. కుమార్తె దివ్యాంగురాలు కావడంతో ఆమెను నేనే సాకుతున్నా. మా ప్రాంతంలో దశబ్దాలుగా కిడ్నీ వ్యాధిబారిన పడి ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే పట్టించుకోనే నాథుడే కరువయ్యారు. అనేక పరిశోధన సంస్థలు మా ప్రాంతానికి వచ్చి కిడ్నీ వ్యాధికి తాగు నీరు ఒక కారణం అని తేల్చి చెప్పారు. మా గ్రామంలో ఉన్న బావి నీటిని తాగవద్దని అధికారులు చెప్పారు. అప్పటి నుంచి మంచి నీటి కోసం అనేక ఇబ్బందులు పడ్డాం. ఈ తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మా ప్రాంతంలో ఇంటింటికి రక్షిత మంచి నీటిని కుళాయిల ద్వారా అందించి శాశ్వత పరిష్కారం చూపారు. గతంలో ఏ నాయకుడు మా బాగోగులను పట్టించుకున్న పాపాన పోలేదు. మా ఇంటికి కుళాయి నీరు వస్తుందని కలలో కుడా ఊహించలేదు. నాకు వైఎస్సార్ చేయూత ద్వారా ఏడాదికి రూ.18,750 వచ్చింది. సున్నా వడ్డీ కింద రూ.5,694 వచ్చింది. నాకు, నా కుమార్తె(దివ్యాంగురాలు)కు పెన్షన్ వస్తుండటంతో హాయిగా జీవనం సాగిస్తున్నాం. ఉద్దాన ప్రజల ప్రాణాలు కాపాడిన దేవుడికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – కోటి జయమ్మ, సీతాపురం (కుసుమూరి చలపతిరావు విలేకరి, వజ్రపుకొత్తూరు రూరల్) ఇంత సాయం ఎన్నడూ ఎరుగం మాది నిరుపేద కుటుంబం. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మా కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలిచాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు గ్రామంలో నా భర్త అల్లు నరసింహారావు ఆర్ఎంపీ వైద్యునిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మాకు ఏవిధమైన ఆస్తులు లేవు. గత ప్రభుత్వం మాకు ఏ విధంగానూ సహాయ పడలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపు నేస్తం పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేల వంతున అందింది. జగనన్న ఇళ్ల కాలనీలో ఒకటిన్నర సెంటు స్థలం కూడా మంజూరైంది. మా అమ్మాయి ప్రసవానికి ఆరోగ్యశ్రీ ద్వారా రూ.35 వేల విలువైన చికిత్సను ఉచితంగా చేశారు. మా మనుమలకు అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేల వంతున సాయం అందిస్తున్నారు. మా లాంటి ఎంతో మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తోడుగా నిలిచారు. మేమంతా ఆయనకు ఎంతో రుణపడి ఉంటాం. – అల్లు మాధవి, మామిడి కుదురు (యేడిద బాలకృష్ణ, విలేకరి, మామిడి కుదురు) ఇప్పుడు హాయిగా జీవిస్తున్నాం నేను ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పోలీస్స్టేషన్ సమీపంలో టీ కొట్టు నడుపుకునేదాన్ని. నా భర్త సామ్యూలు గేదెల మారుబేరం వ్యాపారం చేసేవారు. ఏడాది క్రితం పక్షవాతం రావడంతో ఇంటికే పరిమితమయ్యారు. దీంతో మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ సమయంలో ప్రభుత్వం మాకు అండగా నిలిచింది. జగనన్న ప్రవేశ పెట్టిన వైఎస్సార్ చేయూత పథకం కింద ఏడాదికి రూ.18750, రైతు భరోసా కింద ఏడాదికి రూ.13,500 వంతున వచ్చింది. ఆ మొత్తంతో టీకొట్టు మానేసి ఇంటి వద్దే చిల్లర కొట్టు పెట్టుకున్నా. రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు సంపాదించగలుగుతున్నా. నా భర్తకు పక్షవాతం రావడంతో నెలకు రూ.3 వేల వంతున పింఛన్ వస్తోంది. రెండో కొడుకు దివ్యాంగుడు కావడంతో పింఛన్ వస్తోంది. ఇప్పుడు నా కుటుంబం గడవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మా కుటుంబానికి అండగా నిలిచిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. – గుంటి మార్తమ్మ, బేస్తవారిపేట (పెరుమారెడ్డి హనుమంతారెడ్డి, విలేకరి, బేస్తవారిపేట) -
కష్టాల నుంచి బయటపడ్డాం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. కష్టాల నుంచి బయటపడ్డాం మాది సామాన్య కుటుంబం. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని నంబర్–1 పాఠశాల సమీపంలో నివసిస్తున్నాం. నా భర్త 2014లో మృతి చెందిన తరువాత నేను టైలరింగ్ చేయడం మొదలుపెట్టాను. అయినా కుటుంబాన్ని పోషించుకోవడం కొంచెం కష్టంగా మారింది. జగనన్న అధికారంలోకి వచ్చాక మేం ఆర్థిక సమస్యల నుంచి బయటపడ్డాం. మా ఇంటికి వలంటీర్ వచ్చి నాతో పింఛనుకు దరఖాస్తు చేయించారు. పింఛన్ మంజూరైంది. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా రుణమాఫీ మొత్తం రూ.54,400లు, వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ. 18,750లు వంతున అందింది. జగనన్న చేదోడు పథకం ద్వారా ఏడాదికి రూ. పదివేలు వంతున వచ్చింది. నా కుమారుడు ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నాడు. నేను ప్రస్తుతం టైలరింగ్ చేసుకుంటూ జగనన్న పుణ్యంతో çఎటువంటి సమస్యలూ లేకుండా సంతోషంగా జీవిస్తున్నాం. జగనన్న అందిస్తున్న సాయానికి మా కుటుంబం రుణపడి ఉంటుంది. – షేక్ మీరా బేగం, మొగల్తూరు (వి.లక్ష్మీ గణేష్, విలేకరి, మొగల్తూరు) సమస్యలు తీరి సంతోషంగా జీవనం మాది పేద కుటుంబం. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం ఇందుకూరుపేటలో గతంలో కూలీ పనులు చేసుకుని జీవించేవాళ్లం. వచ్చిన అరకొర ఆదాయంతో కుటుంబ పోషణ కష్టంగా ఉండేది. వయసు రీత్యా కొంత అనారోగ్యంతో పనులకు వెళ్లలేకపోయాం. గత ప్రభుత్వం ఏ విధంగానూ మాకు సాయం అందించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలు కొండంత అండగా నిలిచాయి. వైఎస్సార్ పింఛన్ అందుతోంది. నా భార్యకు కాపు నేస్తం కింద ఏడాదికి రూ.15 వేలు వంతున అందింది. రైతు భరోసా ద్వారా ఇప్పటివరకు ఏటా రూ. 13,500లువంతున, టైలరింగ్ చేసే నా కోడలికి జగనన్న చేదోడు పథకం ద్వారా ఏడాదికి రూ. పదివేలు వంతున, వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా రూ.50 వేలు జమయ్యాయి. నా మనవరాలికి అమ్మఒడి పథకం ద్వారా ఏడాదికి రూ. 15వేలు అందింది. జగనన్న ప్రభుత్వంలో మా పేద కుటుంబం కష్టాలు తీరాయి. మా కుటుంబమంతా జగనన్నకు రుణపడి ఉంటుంది. – రావిపాటి చెల్లారావు, దేవీపట్నం (కె.వెంకటేశ్వరరావు, విలేకరి, దేవీపట్నం) అద్దె ఇంటి బాధ తప్పింది మాది వ్యవసాయ కుటుంబం. నా భర్త కుటుంబరావుకు నేను తోడుగా ఉండి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలో వ్యవసాయం చేసేవాళ్లం. అన్ని సీజన్లూ అనుకూలంగా ఉండేవి కాదు. అప్పుడప్పుడు పంట చేతికందకపోతే నష్టాలు చవిచూసేవాళ్లం. అప్పుడు అప్పులు చేయాల్సి వచ్చేది. మమ్ములను గత ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోలేదు. కనీసం ఇల్లయినా మంజూరు చేయలేదు. ఇక సొంతిల్లు కలగానే మిగిలిపోతుందని భయపడ్డాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ కల తీరింది. మాకు ఇంటి స్థలమే గాకుండా ఇంటి నిర్మాణానికి రూ. 1.80లక్షలు ఆర్థిక సాయం అందించింది. ఇంటినిర్మాణం పూర్తికావచ్చింది. మా అబ్బాయి ఉన్నత చదువులు చదువుతున్నాడు. వాడికి జగనన్న విద్యా దీవెన ద్వారా రూ.90,500లు, వసతి దీవెన ద్వారా రూ.50 వేలు వచ్చింది. నాకు వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.13,909, వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా రూ.6,255, వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏడాదికి రూ. 13,500 వంతున వచ్చింది. ఇన్ని విధాలుగా ఆదుకున్న జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. – వల్లూరి వాణి, మైసన్నగూడెం (అచ్యుతరామ్, విలేకరి, జంగారెడ్డిగూడెం రూరల్) -
సొంతింటి కల నెరవేరింది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. సొంతింటి కల నెరవేరింది నా భర్త 30 ఏళ్ల క్రితమే వదిలేశాడు. విశాఖ పట్నంలోని 89వ వార్డు నాగేంద్ర కాలనీలో ఉంటున్న అక్క ఇంటి వద్దే నివసిస్తున్నాను. మా అక్కకు చిన్న టీ దుకాణం ఉంది. అక్కడే పని చేస్తూ జీవిస్తున్నా. నాకు ఒక పాప. పాపను త్రిబుల్ ఐటీ చదివించాను. ఇపుడు ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. గత ప్రభుత్వంలో నాకు ఏ ప్రయోజనం అందలేదు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒంటరి మహిళ పింఛను రూ.3,000 వస్తోంది. చేయూత ద్వారా రూ.18,750 అందుకున్నా. ఇప్పుడు నాకు ఇంటి స్థలం వచ్చింది. ఇంటి నిర్మాణం జరుగుతోంది. ఆ ఇంటి విలువ సుమారు రూ.35 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. నా ఇంటి కల జగనన్న వల్లే నెరవేరింది. – షేక్ అన్నపూర్ణ, నాగేంద్ర కాలనీ 89వ వార్డు, విశాఖపట్నం సిటీ (చింతాడ వెంకటరమణ, విలేకరి, గోపాలపట్నం) మా బతుకులకు చింతలేదు మాది అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం డి.పోలవరప్పాడు. మా గ్రామంలో మాకు కొద్దిపాటి భూమి ఉంది. కడుపు నింపుకోవడానికి నా భార్య రామయ్యమ్మతో కలిసి కూలి పనుల కోసం వలస వెళ్లేవాళ్లం. వచ్చిన సొమ్ముతో కుటుంబ పోషణ జరిగేది. జగనన్న ప్రభుత్వం వచ్చాక మా పేద కుటుంబాన్ని నవరత్నాల పథకాలు ఎంతో ఆదుకున్నాయి. రైతు భరోసా కింద ఏటా నాకు అందిన రూ.13,500 సొమ్మును జీడి మామిడి తోట సాగుకు ఉపయోగించా. దిగుబడి బాగుండడంతో అప్పులు తీర్చేశా. దీంతో పాటు నాకు ప్రతి నెలా వైఎస్సార్ పింఛన్ వస్తోంది. నా భార్య డ్వాక్రా గ్రూపు సభ్యురాలు. ఆమెకు చేయూత పథకం కింద నాలుగు విడతల్లో రూ.75,000 జమయింది. నా కుమార్తె సావిత్రి నాలుగో తరగతి చదువుతోంది. ఏటా అమ్మఒడి సొమ్ము వచ్చింది. నా బిడ్డకు జగనన్న విద్యా కానుక ద్వారా పుస్తకాలు, బ్యాగులు, షూ తదితర సామగ్రి అందుతోంది. సీఎం జగనన్న వల్ల మా కుటుంబానికి కలిగిన మేలు ఎప్పటికీ మరిచిపోం. మా బతుకులకు ఎటువంటి చింతా లేదు. మళ్లీ ఆయనే సీఎంగా రావాలి. – వంతల బిరసయ్య, డి.పోలవరప్పాడు (సింగిరెడ్డి శ్రీనివాసరావు, విలేకరి, అడ్డతీగల) కూలి పని మానేసి వెల్డింగ్ షాపు పెట్టుకున్నా మాది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి. షాపులో కూలిగా పని చేసుకునే నేను సొంతంగా షాపు పెట్టుకునే స్థాయికి ఎదిగాను. ఇదంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల పుణ్యమే. ఏడో తరగతి వరకూ చదువుకున్న నేను 2019 వరకు ఒక వెల్డింగ్ షాపులో రోజువారీ కూలీగా పనిచేశా. నాకు భార్య, ముగ్గురు పిల్లలు. డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా ఉన్న నా భార్య నాగ వెంకట జ్యోతికి రూ.70 వేల రుణం మంజూరైంది. ఆ సొమ్ముతోపాటు మరికొంత జత చేసి మా ఊళ్లోనే గీతిక వెల్డింగ్ షాపు పేరుతో సొంతంగా పనులు చేయడం ప్రారంభించా. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాల ద్వారా మా కుటుంబానికి చేకూరిన రూ.36 వేలు, సున్నా వడ్డీ ద్వారా వచ్చిన రూ.5,028.. షాపు నడపడానికి అవసరమైన పెట్టుబడిని సమకూర్చాయి. ఆ తర్వాత జగనన్న కాలనీలో ఇంటి స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం మంజూరైంది. ఇంటి స్థలం విలువతో కలిపి జగనన్న ప్రభుత్వ హయాంలో నాకు మొత్తం రూ.5.47 లక్షల మేర ప్రయోజనం చేకూరింది. – గారపాటి నాగరాజు, తేతలి (కె.కృష్ణ, విలేకరి, తణుకు టౌన్) -
ప్రభుత్వం వల్లే మా కుటుంబం బాగుంది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ప్రభుత్వం వల్లే మా కుటుంబం బాగుంది మాది వ్యవసాయ కుటుంబం. మేడి పడితే గానీ మా కడుపు నిండదు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం, కోటపోలూరు గ్రామంలో మాకున్న పొలంలోనే కొడుకు, కోడలు వ్యవసాయం చేస్తుండేవారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయంపై ఎటువంటి సహాయం అందలేదు. అప్పు చేసి వ్యవసాయం చేశాం. వాటిని తీర్చలేక నానా కష్టాలు పడ్డాం. ఇక నష్టాన్ని భరించలేక ఉన్న వ్యవసాయ భూమిని అమ్ముకుని వెళ్లాలనుకున్నాం. కొంత కాలం సాగు నిలిపివేశాం. మా అదృష్టం కొద్దీ వైఎస్సార్పీసీ ప్రభుత్వం వచ్చింది. వారి దయవల్ల మళ్లీ వ్యవసాయానికి మంచి రోజులు వచ్చాయి. రైతులకు వైఎస్సార్ రైతు భరోసా కింద ఏడాదికి రూ. 13,500 వంతున వచ్చింది. దాంతో 1.7 ఎకరాల్లో మళ్లీ వ్యవసాయం చేస్తున్నాం. పరిస్థితులు అనుకూలించడంతో గతంలో చేసిన అప్పులన్నీ తీర్చేశాం. ఇంతలో నాకు శ్వాస కోస సంబంధిత వ్యాధి రావడంతో.. ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. చికిత్స చేసే స్తోమత లేక సతమతమయ్యాం. ఇంతలో వలంటీర్ ఇంటికి వచ్చి ఆరోగ్యశ్రీ పథకం గురించి చెప్పింది. వెంటనే నెల్లూరులో ఆపరేషన్ చేసుకున్నాను. రూ. 50వేలు ప్రభుత్వ సహాయం అందింది. నాకు ప్రతి నెలా పింఛన్ అందుతోంది. నా మనవరాలు చెంచు ప్రియకు అమ్మఒడి కింద ఏడాదికి రూ. 15వేలు వస్తోంది. పాఠశాలలో ఆనందంగా చదువుతోంది. పొదుపు ద్వారా నా కోడలు హైమావతి రూ.60 వేల రుణం తీసుకుని 2 బర్రెలను కొనుక్కుని నెలకు రూ.10వేల వరకు సంపాదిస్తోంది. స్త్రీనిధి ద్వారా మరో రూ.50 వేలు పొదుపు రుణం అందింది. వైఎస్సార్ ఆసరా కింద రూ.14వేలు వరకు వచ్చింది. నాకే కాకుండా మా కుటుంబానికి కూడా ప్రభుత్వం అండగా నిలిచింది. – గుమ్మడి కస్తూరమ్మ, కోటపోలూరు(మహమ్మద్ నాజీం, విలేకరి, సూళ్లూరుపేట రూరల్) సంక్షేమానికి జై‘కొట్టు’ నేను, మా ఆయన గతంలో చిన్నపాటి పనులు చేసుకుని జీవనం సాగించేవాళ్లం. ఆ వచ్చిన ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించుకునేవాళ్లం. ఎంతో కష్టమ్మీద పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేశాం. వారిద్దరూ వేరేగా కాపురం ఉంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడిలో ఉంటున్న నేను మహిళా సంఘ సభ్యురాలిగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో ఎలాంటి మేలు జరగలేదు. పైగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన నకిలీ హామీల కారణంగా చేసిన అప్పులు తీర్చకపోవడంతో ఆ వడ్డీకాస్తా ఎక్కువై మరింత ఆర్థికంగా కుదేలయ్యాం. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఇప్పటివరకూ రూ.60 వేలు వచ్చాయి. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ.18,750లు వంతున వచ్చింది. ఆ మొత్తంతో మా గ్రామంలో బడ్డీ కొట్టు పెట్టుకుని వ్యాపారం ప్రారంభించాం. ఇప్పుడు మాకు ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయాయి. హాయిగా కుటుంబం గడుస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మా కుటుంబం రుణపడి ఉంటుంది. – నెరుసు కుసుమ, తడికెలపూడి(యు.లక్ష్మీనారాయణ, విలేకరి, కామవరపుకోట) కూలిపని మాని వ్యాపారం చేసుకుంటున్నా.. నేను, నా భర్త గతంలో కూలిపనులు చేసేవాళ్లం. రోజువారీ వచ్చే డబ్బులతోనే జీవనం గడిచేది. పనులు లేనప్పుడు అప్పులు చేయక తప్పేది కాదు. ఏదైనా సొంతంగా వ్యాపారం చేసుకుందామని అనుకున్నా అప్పట్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. కానీ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగనన్న పాలనలో మహిళలకు అన్ని విధాల బాగుంది. సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, ఆసరా, స్త్రీనిధి పథకాలు మహిళలకు వరంగా మారాయి. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల పంచాయతీ పుట్లూరువారి పల్లె గ్రామ సంఘంలో సభ్యురాలుగా ఉన్న నాకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ. 18,750లు వంతున, వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఇప్పటివరకూ రూ.70 వేలు వచ్చింది. ఆ మొత్తానికి బ్యాంక్ ద్వారా తీసుకున్న లోన్ రూ.2 లక్షలు కలిపి కొనకనమిట్ల బస్టాండ్ సెంటర్లో భర్త వెంకటేశ్వర్లుతో కలిపి కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పుడు కూలి పనులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గౌరవంగా వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాం. అమ్మ ఒడి పథకం అందడంతో పిల్లల చదువుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా పోయింది. మేము ఈ పరిస్థితికి రావడానికి కారణమైన జగనన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. – శిగినం ఆదెమ్మ, పుట్లూరివారిపల్లి (నాగం వెంకటేశ్వర్లు, విలేకరి, కొనకనమిట్ల మండలం) -
జగనన్న సాయంతో నా కుటుంబం ఖుషీ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. జగనన్న సాయంతో నా కుటుంబం ఖుషీ జగనన్న ప్రభుత్వంలో అందుతున్న సంక్షేమ సాయంతో ఇప్పుడు నా కుటుంబం హ్యాపీగానే ఉంది. మాది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం సీతాపతిరావు పేటవీధి. నేను ఇంటి వద్దే స్వయం ఉపాధి పొందుతున్నాను. నా కుటుంబం ప్రభుత్వం అందించే పలు సంక్షేమ పథకాలనుంచి లబ్ధి అందుకుంటున్నారు. స్వయం సహాయక సంఘం సభ్యురాలినైన నేను ప్రస్తుతం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ప్రగతి యూనిట్ ద్వారా ఇచ్చిన రుణంతో పేపర్ ప్లేట్ల యూనిట్ను ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందుతున్నాను. జగనన్న ప్రభుత్వం వచ్చాక మా అబ్బాయిని ఓ దారిలో పెట్టుకునే అవకాశం కూడా వచ్చింది. ప్రస్తుతం మా అబ్బాయి వార్డు సచివాలయం పరిధిలో వలంటీర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రతీ నెలా నేను వితంతు పింఛన్ రూ.3 వేలు అందుకుంటున్నాను. ఆసరా పథకం ద్వారా కూడా లబ్ధి పొందాను. గత ప్రభుత్వంలో సాయం పొందాలంటే ఎన్నో వ్యయప్రయాసలకోర్చాల్సి వచ్చేది. ఇప్పడు జగనన్న ప్రభుత్వంలో అందుతున్న సాయంతో సంతోషంగా ఉంటున్నాం. – కుడుపూడి సుజాత, సీతాపతిరావుపేట వీధి – (పరసా సుబ్బారావు, విలేకరి, అమలాపురం టౌన్) పెద్ద కొడుకులా ఆదుకున్నారు ముప్పై ఏళ్ల నుంచి రోడ్డు మార్జిన్లో పూరిపాకలో నివాసం ఉండేవాళ్లం. బిక్కు బిక్కుమంటూ గడిపాం. సొంతింటి కల సాకారం అవుతుందని అనుకోలేదు. గతంలో ఇంటి కోసం నాయకులు చుట్టూ తిరిగి అలసి పోయాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వలంటీర్లు ఇంటికి వచ్చి మా వివరాలు తీసుకుని వెళ్లారు. ఇంటి స్థలం, ఇల్లు మంజూరైంది. జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకోగలిగాం. మాకు ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అందరికి పెళ్లిళ్లు చేశాం. జగన్మోహన్రెడ్డి నా పెద్ద కొడుకులా ఆదరించారు. నేను మాంసం దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే వాడిని. అనుకోకుండా రెండేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది. మూలన పడ్డాను. ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్న రూ.3 వేలు పింఛనే నా కుటుంబానికి ఆధారమైంది. గత ఏడాది వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో గుండె ఆపరేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్ అనంతరం ఇంటికి వచ్చే సమయంలో పోషణ నిమిత్తం రూ.30 వేలు ఇచ్చారు.. నా భార్య మదీనా బీబీకి చేయూత పథకం ద్వారా మూడేళ్ల నుంచి ఏటా రూ.18,500 సాయం అందుతోంది. మాది తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం వేములూరు గ్రామం. మాలాంటి వాళ్లం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. – ఎస్కే వల్లీ మస్తాన్, –జీవీవీ సత్యనారాయణ, విలేకరి, కొవ్వూరు మా కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకున్నారు నాయీ బ్రాహ్మణ కుటుంబం మాది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం బొంతల వీధి. తెలుగు దేశం హయాంలో ఎటువంటి పథకాలూ వర్తించలేదు. ఇంటి కోసం కాళ్లావేళ్లా పడ్డా ప్రయోజనం లేకపోయింది. జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత పలు పథకాలు మాకు వర్తిస్తున్నాయి. ఆనందంగా జీవిస్తున్నాం. జమ్ము పంచాయతీ గడ్డెయ్యపేట వద్ద మూడు లక్షల విలువైన ఇంటి స్థలం ఇచ్చారు. ఇళ్లు కట్టుకోవడానికి రూ.1.85 లక్షలు మంజూరు చేశారు. డబ్బు సరిపోకపోతే డ్వాక్రా నుంచి రూ. 50 వేలు వడ్డీలేని రుణం ఇచ్చారు. మా భార్యకు ఆసరా పథకం వర్తించింది. రూ.60 వేలు మాఫీ చేశారు. పాప 8వ తరగతి చదువుతోంది. అమ్మ ఒడి నాలుగేళ్లుగా వస్తోంది. ఈ ఏడాది ట్యాబు కూడా ఇచ్చారు. నాకు మెయిన్ రోడ్డులో సెలూన్ షాపు ఉంది. దీనికి జగనన్న చేదోడు పథకంలో రూ.10 వేలు చొప్పున నాలుగు సంవత్సరాలు ఇచ్చారు. షాపునకు కరెంట్ బిల్లు కూడా ప్రభుత్వమే కడుతోంది. ఇంటిల్లిపాదీ అందరికీ పథకాలు అమలు చేయడంతో మాకు ఎంతో మేలు జరిగింది. – దాసరి శ్రీరాములు, బొంతల వీధి – మామిడి రవి, విలేకరి, నరసన్నపేట -
ఆరోగ్యశ్రీతో క్యాన్సర్ను జయించా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ఆరోగ్యశ్రీతో క్యాన్సర్ను జయించా మాది పేద కుటుంబం. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని కలివరపుపేటలో ఉంటున్నాం. రెక్కాడితే గాని పూట గడవని పరిస్థితి. ఇద్దరు పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే నా భర్త మృతి చెందారు. కాయ కష్టం చేసి పిల్లలను పెంచాను. అమ్మయికి వివాహం చేశాను. కుమారుడు చేతికందొచ్చి కూలి పనులకు వెళుతున్నాడు. ఇక హాయిగా జీవనం సాగించవచ్చని అనుకుంటున్న పరిస్థితుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. వైద్యులను సంప్రదిస్తే లక్షల్లో ఖర్చవుతుందని అన్నారు. పూట గడవడమే కష్టంగా ఉన్న మాకు అంత డబ్బు సమకూర్చలేక చతికల పడ్డాం. ప్రాణాల మీద ఆశలు వదులుకున్నా. ఇంతలో మా వీధి వలంటీరు వచ్చి క్యాన్సర్ చికిత్సను కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చారని చల్లని కబురు చెప్పారు. వెంటనే వైద్యులను సంప్రదిస్తే విశాఖ నగరంలోని మహాత్మా గాంధీ ఆసుపత్రికి రిఫర్చేశారు. అక్కడ ఉచితంగా అన్ని తనిఖీలు చేసి కీమోథెరఫీ చేశారు. ఆరు నెలల క్రితం ఆపరేషన్ చేశారు. ఇప్పుడు ప్రతి నెలా ఇంజక్షన్లు ఇస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నాను. నా కోసం ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి ఆరోగ్యశ్రీ లో వైద్యం అందించింది. నేను ఇప్పుడు ఇలా ప్రాణాలతో ఉన్నానంటే దీనికి కారణం జగనన్న పుణ్యమే. జీవితాంతం ఆయన మేలు మరిచి పోలేను. ఇల్లు కూడా మంజూరు చేశారు. నాకు వితంతు పింఛన్ కూడా వస్తోంది. హాయిగా జీవిస్తున్నాము. – వైశ్యరాజు శాంత లక్ష్మి, కలివరపుపేట, నరసన్నపేట (మామిడి రవి, విలేకరి, నరసన్నపేట) మా బతుకుల్లో ఎంతో మార్పు నా పేరు గుడివాడ వెంకటరత్నం. మాది విజయనగరం. ఉపాధి నిమిత్తం పది సంవత్సరాల క్రితం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు వలస వచ్చాం. నా భర్త గౌరినాయుడు మేస్త్రీగా పనిచేస్తున్నాడు. చంద్రబాబు ప్రభుత్వంలో మాకు ఏ లబ్ధీ రాలేదు. సీఎం జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇంటి స్థలం వచ్చింది. రిజి్రస్టేషన్ చేసి పట్టా నాకు అందజేశారు. వైఎస్సార్ ఆసరాలో రుణమాఫీ కింద రూ.15 వేలు చొప్పున లబ్ధి పొందాను. నాకు త్రివేణి, నవీన్ ఇద్దరు సంతానం. కూతురు త్రివేణి ఎంఎంకేఎన్ మున్సిపల్ హైస్కూల్లో నాలుగో తరగతి చదువుతోంది. అమ్మఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు వస్తోంది. మా అత్త రమణమ్మ వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల ద్వారా లబ్ధి పొందింది. మా లాంటి పేదలకు నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, దుస్తులు, బూట్లు కొనాలంటే భారమే. పాఠశాలలు తెరవగానే విద్యాకానుక కిట్టులో ఇవన్నీ అందజేస్తున్నారు. దీంతో మాకు భారం తగ్గింది. పాఠశాలల్లో గోరుముద్ద పథకం కింద పిల్లలకు మధ్యాహ్న భోజనం ఎంతో రుచికరంగా అందిస్తున్నారు. ఈ ప్రభుత్వ పాలనలో హాయిగా జీవిస్తున్నాం. మళ్లీ సీఎంగా జగనే రావాలని కోరుకుంటున్నాం. – గుడివాడ వెంకటరత్నం, లక్ష్మినగర్, పాలకొల్లు పట్టణం (కె శాంతారావు, విలేకరి, పాలకొల్లు అర్బన్) మా ఇంట్లో ఇద్దరికి దివ్యాంగ పింఛన్లు ఒకప్పుడు సాధారణంగా బతికిన ఉమ్మడి కుటుంబం మాది. చాలా కాలం కిందటే విడిపోయి ఎవరి బతుకు వారు బతుకుతున్నాం. కాలక్రమేణా ఉన్న కొద్ది ఆస్తి కరిగిపోయింది. మాది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట. ప్రస్తుతం భర్త, కుమారునితో కలిసి జీవనం సాగిస్తున్నాం. భర్త పళ్లంరాజు, కుమారుడు సాయిరామ్ పుట్టుకతోనే దివ్యాంగులు. వారు ఏ పనీ చేయలేరు. వారి ఆలనా పాలనా అన్నీ నేనే చూసుకోవాలి. ఈ పరిస్థితుల్లో ఉన్న మా కుటుంబానికి నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పింఛన్ మంజూరు చేయగా నేడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం దివ్యాంగ పింఛన్ను రూ.3 వేలకు పెంచి ఇవ్వడంతో ఇబ్బంది లేకుండా జీవనం సాగిస్తున్నాం. భర్త, కుమారుడికి ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున ఇద్దరికీ రూ.6 వేలు వికలాంగ పింఛన్ ప్రతి నెలా వస్తోంది. నేను చిన్నచిన్న పనులు చేసుకుంటుండడంతో ఇంటి భత్యం గడిచిపోతోంది. ఉన్న కొద్దిపాటి ఇంటి స్థలంలో చిన్న ఇల్లు కట్టుకొని జీవిస్తున్నాం. – బచ్చు మంగతాయారు, కొత్తపేట (జగత శ్రీరామచంద్రమూర్తి,విలేకరి, కొత్తపేట) -
ఎంబ్రాయిడరీ మెషీన్తో స్వయం ఉపాధి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ఎంబ్రాయిడరీ మెషీన్తో స్వయం ఉపాధి మా ఆయన సెక్యూరిటీ ఏజెన్సీలో పని చేస్తున్నారు. మేము గతంలో విశాఖ నగరంలోని పూర్ణా మార్కెట్ ప్రాంతంలో ఉండేవారం. పదేళ్ల క్రితం బతుకు తెరువు కోసం 92వ వార్డులోని పద్మనాభనగర్ వచ్చేశాం. ఆయనకొచ్చే అరకొర జీతంతో బతుకు దుర్భరంగా ఉండేది. తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఇంట్లోనే టైలరింగ్ చేసేదాన్ని. పెద్దగా ఆదాయం ఉండేదికాదు. జగనన్న ప్రభుత్వం వచ్చాక నవరత్నాల పథకాల ద్వారా మా బతుకుల్లో చాలా మార్పు వచ్చింది. వైఎస్సార్ చేయూత ద్వారా ఏడాదికి రూ.18,750 వంతున వచ్చింది. ఆ మొత్తంతోపాటు జగనన్న తోడు ద్వారా రూ.10 వేలు వచ్చాయి. దానికి మరికొంత కలిపి ఎంబ్రాయిడరీ మెషీన్ కొనుక్కున్నాం. దీంతో నా వ్యాపారం అభివృద్ధి చెందింది. నా అవసరాలతో పాటు స్థానికంగా ఉన్న టైలర్లకు కావలసిన మెటీరియల్ తీసుకు వచ్చి అందిస్తున్నా. అంతేకాకుండా మాకు టిడ్కో ఇల్లు మంజూరైంది. నాకు ఇద్దరు కొడుకులు. భువన తేజ పదో తరగతి, చిన్నబాబు ధావన్ 5వ తరగతి చదువుతున్నాడు. అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు వంతున వస్తోంది. ప్రభుత్వ పథకాలు మా కుటుంబ ఆదాయానికి ఎంతో దోహదపడ్డాయి. ఇప్పుడు ఇల్లు బాగానే గడుస్తోంది. చాలా సంతోషంగా ఉన్నాము. ఈ ప్రభుత్వం చేసిన మేలు ఎప్పటికీ మరువలేము. – సిలుకోటి మాధురి, పద్మనాభనగర్, విశాఖపట్నం (చింతాడ వెంకటరమణ, విలేకరి, గోపాలపట్నం) ఒక ఇంటివారమయ్యాం వృత్తి రీత్యా ఎలక్ట్రీషియన్ను. బతుకు తెరువుకోసం విజయనగరం జిల్లా తెర్లాం మండలం ఎం.బి.వలస నుంచి రాజాం వచ్చి అక్కడి వస్త్రపురికాలనీలో కాపురం ఉండేవాళ్లం. అద్దె ఇంట్లో ఉంటూ ప్రతి నెల రూ.2 వేలు చెల్లించేవాళ్లం. రాజాంలో కనీసం రూ.8 లక్షలు ఇంటి స్థలానికే వెచ్చించాలి. గత ప్రభుత్వ హయాంలో మాలాంటి వారికి ఎలాంటి సహకారం అందలేదు. జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టి, సచివాలయ వ్యవస్థ వచ్చిన వెంటనే మాకు సకాలంలో రేషన్ కార్డు వచ్చింది. పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా కంచరాం జగనన్నకాలనీ వద్ద స్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఆరి్థక సహాయం అందింది. ఆ మొత్తంతో ఇల్లు కట్టుకున్నాం. ఇటీవలే గృహ ప్రవేశం చేసి, ఓ ఇంటివారమయ్యాం. మాకు ఇద్దరు పిల్లలున్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు వంతున వస్తోంది. ఇప్పుడు వారి చదువుల బెంగలేదు. మేము ఈ రోజు ఈ స్థితిలో ఉండటానికి కారణమైన జగనన్న మేలు మరచిపోలేం. – చింతా సత్యన్నారాయణ, రాజాం (దుర్గారావు, విలేకరి, రాజాం) పైసా ఖర్చు లేకుండా ఇద్దరికి శస్త్రచికిత్స మాది నిరుపేద కుటుంబం. నా భర్త మూడెడ్ల రామకృష్ణ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నాలుగు చక్రాల తోపుడు బండి మీద ఫ్యాన్సీ వస్తువులు అమ్మేవారు. నేను ఇంటి వద్ద పాలు, పెరుగు, కూల్డ్రింక్స్ అమ్మి అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నాం. మా అబ్బాయి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, కుమార్తెకు వివాహం కావడంతో ఆమె తన భర్తతో వేరేగా ఉంటోంది. నా భర్తకు బొడ్డు పెరిగింది. పొట్టమీద కుడి, ఎడమ వైపు ఎత్తుగా రావడంతో కంగారు పడ్డాం. ఫ్యామిలీ ఫిజీషియన్ క్యాంపులో ప్రభుత్వ వైద్యులకు చూపిస్తే శస్త్రచికిత్స చేయాలన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని మాకు శస్త్ర చికిత్స అంటే భయపడ్డాం. ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఆపరేషన్ చేస్తామంటే విజయవాడలోని రామవరప్పాడులో గల ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లాం. అక్కడ గత ఫిబ్రవరిలో శస్త్ర చికిత్స చేశారు. బొడ్డు చుట్టూ మెస్ వేశారు. ఆ మెస్ రెండు సంవత్సరాలపాటు కడుపులోనే ఉంటుందన్నారు. ఆరోగ్యం బాగా కుదుట పడింది. ఇప్పుడిప్పుడే లేచి అటూ ఇటూ తిరగగలుగుతున్నారు. నాకు గర్భసంచిలో కణితి ఉండింది. తొమ్మిది నెలల క్రితం విజయవాడలోని అదే ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీలో శస్త్ర చికిత్స చేయించుకున్నా. నా భర్తను, నన్ను ఆరోగ్యశ్రీ బతికించింది. నా భర్త రామకృష్ణకు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. పేదలందరికీ ఇళ్లు పథకంలో మాకు ఇంటి స్థలం ఇచ్చారు. ఇల్లు నిర్మించాల్సి ఉంది. మళ్లీ సీఎంగా జగనే రావాలని దేవుడిని కోరుకుంటున్నాం. – మూడెడ్ల కుమారి, పాలకొల్లు (కె శాంతారావు, విలేకరి. పాలకొల్లు అర్బన్) -
ఇలాంటివన్నీ రాజకీయ ప్రయోజన వ్యాజ్యాలే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు జారీ చేసే కుల, స్థానికత, జనన ధ్రువీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటో, నవరత్నాల లోగో ముద్రించడం వల్ల ప్రజల హక్కులు ఎలా ప్రభావితం అవుతాయని హైకోర్టు ప్రశ్నించింది. వాటిపై సీఎం ఫొటో, నవరత్నాల లోగో ఉంటే పిటిషనర్ హక్కులు ఎలా ప్రభావితం అవుతాయని కూడా ప్రశ్నించింది. ముఖ్యమంత్రి ఫొటో ఉంటే వచ్చిన నష్టం ఏమిటని నిలదీసింది. ఎన్నికల సమయంలో దాఖలు చేసే ఇలాంటి వ్యాజ్యాలన్నీ రాజకీయ ప్రయోజన వ్యాజ్యాలే అవుతాయని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి మరింత గడువునిచ్చింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీల కుల, స్థానికత, జనన ధృవీకరణ పత్రాలపై సీఎం వైఎస్ జగన్ ఫొటో, నవరత్నాల లోగో ముద్రించడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించి, వాటిని ముద్రించకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ అమరావతి బహుజన సొసైటీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ వాదనలు విపిస్తూ ధృవీకరణ పత్రాల మీద సీఎం ఫొటో, నవరత్నాల లోగో ముద్రిస్తున్నారని, వాటిని పరిశీలించాలని కోర్టును కోరారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం.. ధృవీకరణ పత్రాలపై సీఎం ఫొటో, నవరత్నాల లోగో ఉంటే నష్టం ఏముందని ప్రశ్నించింది. అసలు పిటిషనర్ ఎవరని ఆరా తీసింది. పిటిషనర్ ఎస్సీ, ఎస్టీ, సంఘం అధ్యక్షుడని రవిప్రసాద్ తెలిపారు. సీఎం ఫోటో, లోగో వల్ల ఎన్నికల సమయంలో ప్రజలు ప్రభావితం అవుతారని అన్నారు. ఎలా ప్రభావితం అవుతారన్న ధర్మాసనం.. ఎన్నికల సమయంలో దాఖలు చేసే ఇలాంటి వ్యాజ్యాలన్నీ రాజకీయ ప్రయోజన వ్యాజ్యాలే అవుతాయని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వ న్యాయవాది జీఎల్ నరసింహారెడ్డి వినతి మేరకు కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి మరింత గడువునిచ్చింది. -
సమస్యల నుంచి గట్టెక్కించారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. సమస్యల నుంచి గట్టెక్కించారు మాది చిన్నకారు రైతు కుటుంబం. మా ఆయన, నేను కుటుంబ పోషణ కోసం చాలా కష్టపడేవాళ్లం. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం అత్తికొత్తూరు గ్రామంలో భూమిని కౌలుకు తీసుకుని అందులో వ్యవసాయం చేసుకుంటూ ఎలాగోలా కాలం వెళ్లదీస్తున్నాం. ప్రతి ఏటా నష్టాలు చవిచూసేవాళ్లం. కానీ ఏ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చాక మహిళలకు అందించే సంక్షేమ పథకాలతో కుటుంబం ఆర్థికంగా స్థిర పడింది. నేను నేర్చుకొన్న టైలరింగ్ మమ్ములను ఆదుకుంది. జగనన్న చేదోడు పథకం ద్వారా ఏడాదికి 10 వేల రూపాయల వంతున సాయం అందింది. ఆ మొత్తంతో బాలేరు సెంటర్లో టైలరింగ్ షాపు, బట్టల వ్యాపారం పెట్టుకొన్నా. నాకు వైఎస్సార్ ఆసరా కింద నాలుగేళ్లకు రూ. 18 వేలు, మా అత్త నెయ్యిగాపుల వెంకటమ్మకు వైఎస్సార్ చేయూత కింద ఏడాదికి రూ.18,750 వంతున అందడంతో ఆ మొత్తాన్ని బట్టల వ్యాపారానికి పెట్టుబడిగా పెట్టాం. మా పిల్లలు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిషు మీడియంలో చదువుకుంటున్నారు. ఒకరికి అమ్మ ఒడి కింద ఏడాదికి రూ. 15 వేలు వంతున వస్తోంది. మమ్మల్ని కష్టాల నుంచి గట్టెక్కించిన ఈ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – నెయ్యిగాపుల రమణమ్మ, అత్తికొత్తూరు (టంకాల మోహనరావు, విలేకరి, భామిని) మా బిడ్డకు ప్రాణం పోశారు మాది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు. మా ఇంటాయన వెంకటేష్ నాయక్ తాపీ పనులు చేస్తుంటారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్కు చెందిన మాకు రాజునాయక్(14), ప్రణీత బాయి(8) అనే ఇద్దరు పిల్లలున్నారు. మా అబ్బాయి పుట్టిన ఆరు నెలలకే అస్వస్థతకు గురవ్వడంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు తలసేమియా వ్యాధితో బాధ పడుతున్నట్లు గుర్తించారు. ప్రతి 20 రోజులకోసారి రక్తం ఎక్కించాలన్నారు. పూట గడవటమే కష్టంగా ఉన్న మాకు వైద్యం చేయించడం కత్తిమీద సాములా మారింది. ఒక్కసారి రక్తం ఎక్కించడానికి రూ.6 వేలు, టాబ్లెట్స్కి మరో రూ.4 వేలు ఖర్చయ్యేది. బంధువులు, తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చేయాల్సి వచ్చేది. ఒక్కోసారి వారు ముఖం చాటేసేవారు. గత ప్రభుత్వం స్పందించకపోవడంతో దాతల సాయంతో హైదరాబాద్, గుంటూరులో తొమ్మిదేళ్లు వైద్యం చేయించాం. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తలసేమియాతో బాధ పడుతున్న మా అబ్బాయికి నెలకు రూ.10 వేలు పింఛను మంజూరు చేశారు. గుంటూరు, నరసరావుపేటలోని ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యం చేయించడంతో పాటు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.5 వేలు విలువ చేసే మందులు కూడా ఇస్తున్నారు. దీంతో అప్పులు చేయాల్సిన బాధ తప్పింది. మా అబ్బాయికి బోన్మ్యారో శస్త్ర చికిత్స చేయాలని డాక్టర్లు చెప్పారు. దీనికి రూ.25 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. ఈ ప్రభుత్వంలోనే ఆ చికిత్స కూడా జరుగుతుందని ఆశిస్తున్నా. మా అబ్బాయిని ఆదుకుంటున్న జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. – భూలక్ష్మీబాయి, శ్రీనగర్ (వినుకొండ అజయ్కుమార్, విలేకరి, దాచేపల్లి) చింత తీరి హాయిగా జీవిస్తున్నాం మాది చేనేత కుటుంబం. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉంటున్న మేము ఇంటిల్లిపాదీ కష్టపడినా రోజువారీ జీవనమే కష్టమయ్యేది. ఏ ప్రభుత్వం కూడా మమ్ములను ఆదుకోలేదు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక మా బతుకుల్లో మార్పులు వచ్చాయి. మా వృత్తికి సరైన గుర్తింపు లభించడంతోపాటు సంక్షేమ పథకాలతో పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న మా ఇద్దరు కుమారుల్లో ఒకరికి అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు చొప్పున అందుతోంది. నేతన్న నేస్తం కింద ఏటా రూ.24 వేల ఆర్థిక సాయం అందింది. మా అమ్మ పద్మావతికి నెలకు రూ.3 వేల పింఛన్తో పాటు వైఎస్సార్ చేయూత పథకం కింద ఏడాదికి రూ.18,750 చొప్పున లబ్ధి చేకూరింది. జగనన్న లే అవుట్లో రూ.5 లక్షల విలువ చేసే స్థలంతో పాటు పక్కా గృహం కూడా మంజూరైంది. ఇటీవలే నా భార్య చూపు మందగించింది. ఆమెను జగనన్న ఆరోగ్య సురక్ష పథకంలో శస్త్రచికిత్సకు ఎంపిక చేశారు. మమ్ములను ఇంత గొప్పగా ఆందుకుంటున్న జగనన్నకు మేమెప్పుడూ రుణపడి ఉంటాం. – నున్నా సురేష్, ఉరవకొండ (బళ్లారి సాదిక్, విలేకరి, ఉరవకొండ) -
చిన్నపాటి వ్యాపారంతో చింత తీరింది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. చిన్నపాటి వ్యాపారంతో చింత తీరింది మాది నిరుపేద కుటుంబం. విజయనగరం గజపతినగరం మండలం కొణిశ గ్రామ ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్నాం. కుటుంబంలో అందరం రోజు కూలీలమే. ప్రతి రోజూ కూలి లభించేది కాదు. దీంతో రోజు గడవడం కష్టంగా మారింది. మా ఆయన చేసిన కూలీకి వచ్చే డబ్బులు దుబారా చేసేవాడు. ఇంటికి సక్రమంగా ఇచ్చేవాడు కాదు. పిల్లలను పెంచడానికి ఇబ్బంది పడేదాన్ని. ఆ సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. జగనన్న తోడు పథకానికి దరఖాస్తు చేసుకోగానే ఏడాదికి రూ.పది వేలు వంతున వచ్చింది. దీనికి తోడు వైఎస్సార్ ఆసరా ద్వారా వచ్చిన రూ.12,500 కలిపి ఆ మొత్తంతో ఇంట్లోనే చిన్నపాటి పాన్ షాపు పెట్టుకున్నా. మా అబ్బాయి వినయ్ ఇప్పుడు ఏడో తరగతి చదువుతున్నాడు. అమ్మఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు వంతున మూడేళ్లుగా అందుతోంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మామ గారికి పింఛన్ కూడా అందుతోంది. కుటుంబం ఆరి్ధకంగా నిలదొక్కుకుంది. మమ్మల్ని ఆదుకున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – సాంబారిక మంగ, కొణిశ (పాండ్రంకి అప్పలనాయుడు, విలేకరి, గజపతినగరం రూరల్) అద్దె ఇంటి బాధ తప్పింది మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. నాకు భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు. విజయనగరం జిల్లా జి.సిగడాం మండలం, పెనసాం గ్రామంలో నివాసం. కుటుంబ పోషణ కోసం భార్యా, పిల్లలతో గుంటూరు వలస వెళ్లాను. అక్కడ రోజు వారీ వేతనదారుగా మిర్చి గోదాంలో పనికి చేరాను. రాబడి అంతంత మాత్రమే. అద్దె ఇళ్లలో ఉంటూ అవస్థలు పడ్డాం. ఆ తర్వాత పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ చేరుకున్నాం. ఇక్కడ కూడా అద్దె ఇళ్లలోనే నివాసం. కష్టపడిన సొమ్ము అద్దెకే సరిపోయేది. నా భార్య బొంతలు కుడుతూ ఆరి్థకంగా సహకరించినా.. ఎదుగుతున్న పిల్లలు, పెరుగుతున్న వారి అవసరాలు.. నిత్యం ఆందోళనగా ఉండేది. గత ప్రభుత్వాల నుంచి ఎలాంటి పథకాలు అందలేదు. ఇలాంటి పరిస్థితుల్లో జగనన్న ప్రభుత్వం అండగా నిలిచింది. అమ్మఒడి ఆదుకోవడంతో పిల్లలు బడిబాట పట్టారు. ప్రభుత్వ పాఠశాలల ద్వారా అందాల్సిన అన్ని సౌకర్యాలు సమకూరాయి. జగనన్న అర్బన్ కాలనీలో సెంటు స్థలం మంజూరైంది. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఆరి్థక సాయం అందింది. ఇక్కడ సొంత గృహాన్ని కట్టుకున్నాం. ఇటీవలే గృహ ప్రవేశం చేశాం. మమ్మల్ని చూసి నిట్టూర్చిన వారే.. నేడు భుజం తడుతున్నారు. – పిల్లల జగదీశ్వరావు, పాలకొండ (మారోజు కళ్యాణ్కుమార్, విలేకరి, పాలకొండ) ధైర్యంగా జీవిస్తున్నాం మాది రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. భార్య, ఇద్దరు కూతుళ్లను పోషించుకునేందుకు నానా పాట్లు పడ్డాను. చివరకు బతుకు తెరువుకోసం కువైట్ వెళ్లాను. 2018లో పక్షవాతం రావడంతో సొంత ఊరైన వైఎస్సార్ జిల్లా చాపాడు గ్రామానికి తిరిగొచ్చేశా. ఉన్న కాస్త డబ్బులూ వైద్యానికే ఖర్చయిపోయాయి. జీవనోపాధి లేక, కుటుంబ పోషణకు ఎన్ని నిద్రలేని రాత్రుళ్లు గడిపానో భగవంతుడికే తెలుసు. 2019లో జగనన్న అధికారంలోకి వచ్చాక మా బాధలు తీరాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మా కుటుంబానికి ఆసరాగా నిలిచాయి. పెరాలసిస్ రోగిని కావడంతో ప్రతి నెలా ఒకటో తేదీనే రూ.5 వేలు పింఛన్ అందుతోంది. రైతు భరోసా పథకంలో ఏటా రూ.13,500 మా బ్యాంకు ఖాతాలో జమవుతున్నాయి. నా భార్య మాబుఛాన్కు వైఎస్సార్ చేయూత పథకంలో ఏటా రూ.18,750 చొప్పున అందింది. ఆసరా పథకంలో ఏటా రూ.7,200 బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. నా కుమార్తె కౌసర్భాను గ్రామ వలంటీర్గా చేస్తోంది. మరో కుమార్తె ముబారక్ ప్రైవేట్ స్కూల్ టీచర్గా పని చేస్తోంది. ఉన్న కాస్త పొలంలో ఓపిక ఉన్నంత మేరకు వ్యవసాయం చేసుకుంటూ, ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలతో కుటుంబాన్ని ధైర్యంగా పోషించుకోగలుగుతున్నా. మాలాంటి కుటుంబాలకు అండగా నిలుస్తున్న సీఎం జగన్కు రుణపడి ఉంటాం. – కొర్రపాటి అబ్దుల్ రసూల్, చాపాడు గ్రామం (శ్రీపతి సుబ్బయ్య, విలేకరి, చాపాడు) -
కోటలు కూలుతాయనే కాకమ్మ కథలు
సాక్షి, అమరావతి: త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైతే తాను భూములను కబ్జాచేసి, చట్టాలను ఉల్లంఘించి కట్టుకున్న ఫిలిం సిటీ, సహా తన కోటలకు బీటలు వారుతాయన్న ఆందోళనతో రామోజీరావు కల్లు తాగిన కోతిలా చెలరేగిపోతున్నారు. ఏదో ఒకటి చేసి తన పార్ట్నర్ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న తపనతో సీఎం జగన్ ప్రభుత్వంపై తన అక్కసును నిత్యం వెళ్లగక్కుతున్నారు. తాజాగా.. పేదలకు ‘సొంతిళ్లు నమ్మక ద్రోహం’.. ‘ఏ నిమిషానికి ఏమి కూలునో!’ అంటూ నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంపై విషం చిమ్ముతూ గురువారం తన క్షుద్ర పత్రిక ఈనాడులో వాస్తవాలకు దూరంగా అవాస్తవ కథనాలను వండి వార్చడం ఇందులో భాగమే. జగనన్న ఇళ్లు ఏ నిమిషంలో కూలుతాయో.. తద్వారా పేదల ప్రాణాలకు ముప్పు అంటూ ఓ సరికొత్త డ్రామాకు ఈ కథనం ద్వారా రామోజీరావు తెరతీశారు. నిజానికి.. పేదలందరికీ ఇళ్ల పథకం కింద రాష్ట్రంలో 31.19 లక్షల మంది నిరుపేదలకు ఉచితంగా ఖరీదైన ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి, వాటిల్లో సొంతిళ్లు సమకూరుస్తుంటే సిగ్గూశరం లేకుండా ఈ రాతలు ఏమిటి రామోజీ అంటూ పేదలు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ పాలనలో పేదల గూటికి, పేదోడికి ఏ ఢోకాలేదు.. అసలు ఈ రాష్ట్రంలో పేదలకు పట్టిన ఏలినాటి శని నువ్వు, మీ బాబే రామోజీ అని పేదలు చెబుతున్నారు. దీంతో పేదలు ఈ జన్మలో బాబుకు ఓటు వేయరని.. అదే జరిగితే తన కోటలు కూలుతాయని రామోజీ బెంబేలెత్తి కట్టుకథలు, కాకమ్మ కబుర్లతో ఈనాడులో చేతికొచ్చింది నిస్సిగ్గుగా రాసిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పేదల గూడుపై ఈనాడులో ప్రచురించిన దుర్మార్గపు రాతల వెనుక వాస్తవాలు ఏమిటంటే.. ఈనాడు ఆరోపణ: అనంతపురం జిల్లా రాయదుర్గం పరిధిలోని మల్లాపురం లేఅవుట్లో ఓ లబ్ధిదారునికి ప్రభుత్వం కట్టించిన ఇల్లు నెలైనా కాకముందే కూలింది. కాంట్రాక్టర్ శ్లాబ్ వేస్తున్న సమయంలో సిమెంట్ తక్కువ వాడాడు.. వాస్తవం: రాయదుర్గం మున్సిపాలిటీలో ఉండే హేమజ్యోతి, ఆనందు దంపతులకు మల్లాపురం లేఅవుట్లో ఇల్లు మంజూరైంది. వీరు తమ ఇంటిని తామే నిర్మించుకునే ఆప్షన్ 1, 2 ఎంచుకున్నారు. ఇంటి నిర్మాణానికి బిల్లులు మంజూరుచేయడంతో పాటు, 15 టన్నుల ఇసుకను ఉచితంగా, 55 బస్తాల సిమెంట్, 270 కిలోల స్టీల్ సబ్సిడీపై ప్రభుత్వం సరఫరా చేసింది. లబ్ధిదారులే ఒక తాపీ మేస్త్రీని గుర్తించి ఇంటి నిర్మాణం చేసుకున్నారు. గత ఏడాది ఆగస్టులోనే ఇంటి నిర్మాణం పూర్తయింది. ఈ ఇల్లు ఆప్షన్–3 (ప్రభుత్వమే నిర్మించి లబ్ధిదారులకు ఇచ్చే ఇళ్లు) కింద నిర్మించినది కాదు. పైగా.. కూలింది శ్లాబ్ కాదు. ఇంటి ముందు భాగంలో ఉండే మూడు అడుగుల సన్షేడ్ భాగం. ఎక్కడ ఏం జరిగినా దానిని ప్రభుత్వానికి ఆపాదించి దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్న రామోజీరావు.. ఈ వ్యవహారంలోనూ తన దగుల్భాజితనాన్ని ప్రదర్శించారు. ఆరోపణ: పట్టణ ప్రాంతాల్లో పేదల ఇంటి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.30 వేలు మాత్రమే ఖర్చుచేస్తోంది. వాస్తవం: ఇల్లులేని నిరుపేదలందరికీ రూ.15 లక్షల వరకూ మార్కెట్ విలువైన ఇంటి స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఉచితంగా పంపిణీ చేసింది. ఈ లేఅవుట్లలో లెవెలింగ్, తాత్కాలిక నీటి సరఫరా కోసం రూ.రెండు వేల కోట్లు వెచ్చించారు. శాశ్వత మౌలిక సదుపాయాల కోసం రూ.32,909 కోట్లు ఖర్చుచేస్తున్నారు. దీనికితోడు.. ఒక్కో యూనిట్కు ఇంటి నిర్మాణం కోసం రూ.1.80 లక్షలు ఇస్తున్నారు. ఇందులో పట్టణాల పరిధిలో రూ.30 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.78 వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. దీనికి అదనంగా పావలా వడ్డీకి రూ.35వేలు బ్యాంకు లోన్ సమకూరుస్తున్నారు. రూ.15 వేలు విలువైన 20 టన్నుల ఇసుకను ఉచితంగా ఇవ్వడంతోపాటు, రూ.40వేల వరకూ మేలుచేస్తూ స్టీల్, సిమెంట్ ఇతర నిర్మాణ సామాగ్రిని ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తోంది. ప్రభుత్వం పేదలకు ఇంత పెద్దఎత్తున మేలు చేస్తుంటే కేవలం రూ.30 వేలు ఖర్చుచేస్తున్నారని రామోజీరావు రాయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. ఆరోపణ: ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణం కేవలం ఒక శాతం మాత్రమే పూర్తయింది. ఇళ్ల నిర్మాణాల కేటాయింపులో కేవలం ఒక ఏజెన్సీకే మేలు చేశారు.. వాస్తవం: ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోలేమని, ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇచ్చే ఆప్షన్–3ని 3,55,256 మంది ఎంచుకున్నారు. వీరందరినీ స్థానికంగా గుర్తించిన లేబర్ ఏజెన్సీలకు అనుసంధానం చేసి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షిస్తోంది. ఇప్పటివరకూ 72,906 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అంటే మొత్తం ఆప్షన్–3 ఇళ్లలో 20 శాతం నిర్మాణం పూర్తయ్యాయి. కానీ, ఈనాడు మాత్రం ఒక శాతం మాత్రమే పూర్తయ్యాయని ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించే రాతలు రాశారు. లబ్ధిదారుల అంగీకారం మేరకు లేబర్ ఏజెన్సీలతో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలా రాష్ట్రంలో మొత్తం 897 ఏజెన్సీలు నిర్మాణాలు చేపడుతున్నాయి. ఇందులో 57 ఏజెన్సీలు వివిధ జిల్లాల్లో పనులు చేస్తున్నాయి. గరిష్టంగా ఒక్కో ఏజెన్సీకి 40,590 ఇళ్లను కేటాయించారు. దీన్నిబట్టి చూస్తే ఒక ఏజెన్సీకే మేలు చేసినట్లు ఎక్కడాలేదు. -
పోతుందనుకున్న ప్రాణం నిలబడింది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. పోతుందనుకున్న ప్రాణం నిలబడింది మాది రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో సెలూన్ షాపు నడుపుకుంటున్నా. నాకు భార్య, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో నాలుగేళ్ల కిందట ఉదర సంబంధిత అనారోగ్యంతో మంచం పట్టాను. చికిత్స చేయించుకుందామంటే ఆరి్థక పరిస్థితి అంతంత మాత్రమే. అలాంటి దీన పరిస్థితిలో జగనన్న ప్రభుత్వం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ. 2,64,626 విలువైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించి ప్రాణం నిలబెట్టింది. శస్త్రచికిత్స అనంతరం మందుల ఖర్చులు, రవాణా ఖర్చులకు వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా రూ.28,900 నేరుగా నా బ్యాంకు ఖాతాలో జమ చేసింది. సెలూన్ షాపు ఉండటంతో జగనన్న చేదోడు కింద ఏటా రూ.10,000 వంతున అందింది. షాపునకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. నా భార్యకు వైఎస్సార్ ఆసరా కింద రూ.20,848, పెద్ద కొడుకు పవన్సాయికి విద్యా దీవెన కింద రూ.12,000, చిన్న కొడుకు ఆదిత్యసాయికి అమ్మఒడి కింద రూ.30,000 వచ్చాయి. టీడీపీ ప్రభుత్వ పాలనలో మాకు ఎలాంటి లబ్ధి కలగలేదు. నా ప్రాణం నిలబెట్టిన, మా కుటుంబ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడిన సీఎం జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. – అజ్జాడ సింహాచలం, కురుపాం (కె.చంద్రమౌళి, విలేకరి, కురుపాం) సర్కారు సాయంతో హాయిగా జీవనం నాకు ఐదుగురు సంతానం. అందరికీ వివాహాలు చేశా. ఎవరి బతుకులు వాళ్లు బతుకున్నారు. నా భర్త చనిపోయి నాలుగేళ్లయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా బిడ్డలపై ఆధారపడకుండా ధైర్యంగా బతుకుతున్నా. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశివేదల గ్రామంలో జీవిస్తున్నా. ఒంటరిగా బతుకుతున్నానన్న బాధ ఏ రోజూ కలగలేదు. ప్రతినెలా వితంతు పింఛన్ అందుకుంటున్నా. ఈ సొమ్ము నా నెలవారీ ఖర్చుకు సరిపోతుంది. వైఎస్సార్ ఆసరా కింద రూ.30,144 రుణమాఫీ సొమ్ముని నా ఖాతాలో జమ చేశారు. వైఎస్సార్ చేయూత పథకం కింద ఏడాదికి రూ.18,750 వంతున అందింది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా రూ.4,898 జమయ్యింది. చిత్తశుద్ధితో నాలాంటి కుటుంబాలకు అండగా నిలుస్తున్న ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. – కాకరపర్తి మంగాయమ్మ, పశివేదల (జి.వి.వి.సత్యనారాయణ,విలేకరి, కొవ్వూరు) ఒంటరి బతుక్కి ప్రభుత్వం అండ భర్తను కోల్పోయి, పిల్లలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న నాకు జగనన్న ప్రభుత్వం అడుగడుగునా చేదోడుగా నిలిచింది. నా భర్త సుబ్బారావు పదేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. వైఎస్సార్ జిల్లా సిద్దవటం గ్రామంలో టైలరింగ్ వృత్తి చేసుకుంటూ ఆడ పిల్లలిద్దర్ని పెంచి, పెద్దచేసి పెళ్లి చేశా. కొడుకు పృధ్విని పీజీ వరకు చదివించా. నాకు వితంతు పింఛన్ మంజూరైంది. అప్పుడు రూ.200 ఇచ్చేవారు. తర్వాత రూ.2 వేలకు పెంచారు. గత ప్రభుత్వంలో పింఛన్ డబ్బులు తీసుకోవాలంటే పనులు మానేసి, పంచాయతీ ఆఫీసు వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చేది. పింఛన్ కోసం కూలి పనుల్ని వదులుకున్న రోజులూ ఉన్నాయి. జగనన్న ప్రభుత్వం వచ్చాక పింఛన్ రూ.3 వేలకు పెరిగింది. వలంటీర్ ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటికొచ్చి మరీ పింఛన్ డబ్బులు అందిస్తున్నారు. మా అబ్బాయికి ఫీజు రీయింబర్స్మెంట్లో రూ.15 వేలు లబ్ధి కలిగింది. టైలర్లకు ప్రభుత్వం ప్రకటించిన జగనన్న చేదోడు పథకం ద్వారా ఏటా రూ.10 వేలు చొప్పున బ్యాంక్ ఖాతాలో జమవుతోంది. వైఎస్సార్ ఆసరా ద్వారా ఏటా రూ.3 వేలు చొప్పున అందింది. ప్రభుత్వం అందిస్తున్న సాయం, కుట్టు మిషన్ ద్వారా వస్తున్న ఆదాయంతో ఆనందంగా బతుకుతున్నా. మాలాంటి పేదల బతుకుల్లో వెలుగులు నింపుతున్న జగనన్న రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. – మేరువ బుజ్జమ్మ, సిద్దవటం (పాలెం శ్రీనివాసబాబు, విలేకరి, సిద్దవటం) -
మేము టీడీపీ.. అయినా పథకాలు ఆగలేదు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. మేము టీడీపీ.. అయినా పథకాలు ఆగలేదు మాది రాజకీయ కుటుంబం. తెలుగుదేశం పార్టీకి చెందిన నేను 2007 నుంచి 2012 వరకు విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కొణిశ సర్పంచ్గా పని చేశాను. మా ఆయన సత్యనారాయణ రేషన్డీలర్గా కొనసాగుతున్నారు. మాకు కొద్దిపాటి వ్యవసాయ భూమి కూడా ఉంది. అందులో పంటలు సాగు చేసుకుంటున్నాం. ఇప్పటికీ మేము టీడీపీ సానుభూతి పరులమే అయినా మాకు అర్హత ఉందంటూ అన్ని ప్రభుత్వ పథకాలూ వర్తింపచేశారు. మా పార్టీ పాలనలో కనీసం ఇల్లు కూడా మంజూరు కాలేదు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ రైతు భరోసా కింద ఏడాదికి రూ.13,500 వంతున వచ్చింది. వైఎస్సార్ ఆసరా కింద నాకు ఇప్పటి వరకు రూ.18,200, మా పాప డిగ్రీ చదివినపుడు విద్యాదీవెన కింద రూ.6,500 వచ్చింది. మాకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల ఆర్థిక సాయం కూడా అందింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు మంజూరవుతున్నాయి. పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలు మంజూరు చేస్తున్నారనడానికి మేమే ఉదాహరణ. – శీరంరెడ్డి లక్ష్మి, కొణిశ (పాండ్రంకి అప్పలనాయుడు, విలేకరి, గజపతినగరం రూరల్) పది మందికి ఉపాధి కల్పిస్తున్నా.. మాది మధ్య తరగతి కుటుంబం. ఇద్దరు బిడ్డల్ని పోషించుకుంటూ.. వారిని చదివించేందుకు ఎంతో కష్టపడేవాళ్లం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎగువ రెడ్డివారిపల్లెలో కుటుంబ పోషణ కోసం 2008 నుంచి ఇంట్లోనే మగ్గం నేస్తున్నాం. జగనన్న ప్రభుత్వం వచ్చాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సమకూరిన సుమారు రూ.8 లక్షల రుణంతో పాటు మరో రూ.2 లక్షలు సమకూర్చుకుని చంద్రగిరిలో శారీ రోలింగ్ సెంటర్ ప్రారంభించా. మొదట విడత ఆసరా డబ్బులతో మరో మగ్గంపై పని ప్రారంభించా. రెండో విడత ఆసరాతో టైలరింగ్, మూడో విడత ఆసరాతో శారీ రోలింగ్ యంత్రాలు ఏర్పాటు చేశా. నాలుగో విడత ఆసరా డబ్బులతో శారీ బ్లాక్ ప్రింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్ ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నా. ప్రస్తుతం విజయవాడ, హైదరాబాద్లో మాత్రమే శారీ బ్లాక్ ప్రింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని తిరుపతి ప్రజలకు పరిచయం చేసేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నా. ప్రస్తుతం నా వ్యాపారం ద్వారా మరో పది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నా. ఆసరా ద్వారా వచ్చిన రూ.1.04 లక్షలు, డ్వాక్రా రుణం రూ.5.25 లక్షలు, సున్నా వడ్డీ కింద వచ్చిన రూ.20 వేలతో వ్యాపారం అభివృద్ధి చేసుకున్నాం. నా ఇద్దరు పిల్లల చదువులకు జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన అందించారు. వారు డిగ్రీ పూర్తి చేసుకుని, వ్యాపారంలో నాకు చేదోడుగా నిలిచారు. మా జీవితంలో వెలుగులు నింపిన సీఎం జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాం. – ఎస్.మునికుమారి, ఎగువ రెడ్డివారిపల్లి (భూమిరెడ్డి నరేష్ కుమార్, విలేకరి, చంద్రగిరి) కష్టాల నుంచి గట్టెక్కాం రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం నాది. నేను లారీ డ్రైవర్గా పనిచేసేవాడిని. మేం వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలం గండికొవ్వూరులో భార్య వెంకటసుబ్బమ్మ, ముగ్గురు ఆడపిల్లలతో ఉంటున్నాం. 2019కి ముందు మాకు ఎలాంటి ప్రభుత్వ సాయం అందలేదు. నేను సంపాదించి తెస్తేనే నాలుగువేళ్లు నోట్లోకెళ్లేవి. ప్రస్తుతం ఆటో నడుపుతూ కుటుంబ పోషణ, పిల్లల చదువులు నెట్టుకొస్తున్నా. జగనన్న ప్రభుత్వం వచ్చాక మా బతుకులు మారాయి. జగనన్న సాయంతో పాటు నేను కూడబెట్టిన సొమ్ముతో పెద్ద కూతురు మనీషకు పెళ్లి చేశా. రెండో పాప అంజలి డిగ్రీ సెకెండియర్, చిన్నపాప జ్యోత్స్న ఓపెన్ స్కూల్లో ఇంటర్ చదువుతున్నారు. వాహన మిత్ర ద్వారా నాకు ఏటా రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందుతోంది. రైతు భరోసా కింద రూ.40 వేలు లబ్ధి కలిగింది. మా పాపకు అమ్మఒడి పథకంలో ఇప్పటి వరకు రూ.30 వేలు అందాయి. రెండో పాపకు విద్యా దీవెన పథకంలో రూ.13 వేలు, వసతి దీవెన కింద రూ.10 వేలు బ్యాంక్ ఖాతాలో జమయింది. నా భార్యకు సున్నా వడ్డీ ద్వారా రూ.10 వేలు లబ్ధి చేకూరింది. జగనన్న కాలనీలో ఇల్లు కూడా మంజూరైంది. అప్పటికే నేను కొత్తగా ఇల్లు కట్టుకుని ఉండటంతో వేరే వారికి ఇవ్వండని మనస్ఫూర్తిగా చెప్పేశా. ఇద్దరు బిడ్డల చదువు జగనన్న ప్రభుత్వమే చూసుకుంటోంది. జగనన్న ఉండగా మాకేం చింతలేదు. ఆయన మేలు ఎప్పటికీ మరచి పోలేం. – గిత్తోళ్ల రామాంజనేయులు, గండికొవ్వూరు (ఇందుకూరు మురళీధర్, విలేకరి, చక్రాయపేట) -
సర్కారు ‘చేయూత’తో సాఫీగా జీవనం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. సర్కారు ‘చేయూత’తో సాఫీగా జీవనం మాకున్న ఎకరం పొలంలో వరిసాగు చేసేవాళ్లం. ఐదేళ్ల క్రితం సంభవించిన వరుస తుపాన్లు.. చీడ, పీడల వల్ల పంట దిగుబడి రాకపోవడంతో అప్పులపాలయ్యాం. గత ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదు. నేను కస్తూర్భా స్వయం శక్తి సంఘంలో ఉండటంతో మా సీఎఫ్ సలహా మేరకు బ్యాంకు ద్వారా రూ.50 వేలు తీసుకొని ఆటో కొనుక్కుని దానినే జీవనాధారంగా చేసుకున్నాం. దానివల్ల కూడా కష్టాలు తీరలేదు. ఈ లోగా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక వైఎస్సార్ చేయూత ద్వారా ఏటా రూ.18,750 చొప్పున మూడు పర్యాయాలు వచ్చింది. వైఎస్సార్ ఆసరా కింద రూ.5 వేలు చొప్పున నాలుగు పర్యాయాలు అందింది. ఆ మొత్తంతో సాగుకు పనికి రాని ఎకరా భూమిపై పెట్టుబడి పెట్టాం. నిత్య పంటగా కాయగూరలు పండించడం ప్రారంభించాం. ఇప్పుడు కాయగూరల సాగు ఆశాజనకంగా ఉండటంతో నెలవారీ మంచి ఆదాయం వస్తోంది. మా ఆయనకు వాహనమిత్ర ద్వారా ఏటా రూ.పది వేలు వంతున అందుతోంది. మా అమ్మాయికి అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు వస్తోంది. ఇప్పుడు మా కుటుంబమంతా సంతోషంగా ఉంది. కుటుంబానికి అండగా ఉన్న సీఎం జగనన్న రుణం తీర్చుకోలేనిది. – కొల్ల లక్ష్మి, కొళిగాం (మద్దిలి కేశవరావు, విలేకరి, ఇచ్ఛాపురం రూరల్) ఉచితంగా ఉన్నత విద్య మా నాన్న కరీముల్లా స్వర్ణకారుడు. అమ్మ సాధారణ గృహిణి. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణం భగత్సింగ్ కాలనీలో ఉంటున్న మా నాన్నకు వచ్చే అరకొర ఆదాయం కుటుంబ పోషణకే సరిపోయేది కాదు. ఇక ముగ్గురు పిల్లల చదువులు సాగించడం ఎలా అని నిత్యం మదన పడుతుండేవారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక మా సమస్య పరిష్కారమైంది. నేను రాజంపేటలోని అన్నమాచార్య ఇంజినీరింగ్ కాలేజీలో నాలుగో సంవత్సరం ఈసీఈ చదువుతున్నాను. చెల్లి సనా కూడా అదే కాలేజీలో డిప్లమో అనంతరం బీటెక్ రెండో సంవత్సరంలో చేరింది. నా తమ్ముడు మహమ్మద్ తాహిర్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్మెంట్) పథకం ద్వారా నాకు నాలుగేళ్లకు రూ.1.87 లక్షలు మా అమ్మ బ్యాంక్ ఖాతాలో జమ అయింది. నా చెల్లికి కూడా మొదటి ఇన్స్టాల్మెంట్ కింద డబ్బు వచ్చింది. నా తమ్ముడికి అమ్మఒడి సొమ్ము ఏటా రూ.15 వేలు వంతున వస్తోంది. ఇప్పుడు మా అమ్మ, నాన్నకు మా చదువుల గురించి బెంగ లేదు. మా భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. – సీఎఎస్ అబ్దుల్ రెహమాన్, ప్రొద్దుటూరు (వీరారెడ్డి, విలేకరి, ప్రొద్దుటూరు) సంక్షేమ పథకాలతో చింతలేని జీవితం బతుకు తెరువు కోసం ఆటో నడుపుతున్నా. దాని ద్వారా వచ్చే ఆదాయమే మా కుటుంబానికి ఆధారం. అన్ని రోజులూ ఒకేలా ఉండవు. అప్పుడప్పుడు వాహనానికి మరమ్మతులు తప్పనిసరి. ఏటా ఇన్సూరెన్స్ చెల్లించాలి. ఇంకా కేసుల సంగతి సరేసరి. ఇలాంటి సందర్భాల్లో అప్పులు చేయడం తప్పనిసరి అయ్యేది. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక అప్పులు చేయాల్సిన బాధ తప్పింది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కె.శివడ గ్రామానికి చెందిన నాకు వాహనమిత్ర పథకం ద్వారా ఏటా రూ.10 వేలు అందుతోంది. ఈ ప్రభుత్వ సాయంతో ఏటా ఇన్సూరెన్స్, ఆటో రిపేర్లు చేయించుకుంటున్నా. ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థలో నా భార్య సురేఖకు వలంటీర్గా ఉన్న ఊళ్లోనే ఉపాధి లభించింది. నా భార్యకు, మా అమ్మ సావిత్రికి ‘వైఎస్సార్ ఆసరా పథకం’ ద్వారా ఏటా చెరో రూ.1200 చొప్పున లభించింది. ఇద్దరు పిల్లలూ చదువుకుంటున్నారు. ఏటా అమ్మ ఒడి పథకం ద్వారా రూ.15 వేలు అందుతోంది. మా అమ్మ సావిత్రికి వితంతు పింఛన్ అందుతోంది. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలతో మా జీవనం సాఫీగా సాగుతోంది. – నిమ్మల వెంకటరావు, కె.శివడ (జి.పెంటయ్య, విలేకరి, గుమ్మలక్ష్మీపురం) -
ఒంటరి బతుకుకు జగనన్న అండ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ఒంటరి బతుకుకు జగనన్న అండ ఐదేళ్ల క్రితం మా ఆయన ఈరోతు యుధిష్టరరావు అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పటికే ఇద్దరు పిల్లలున్న మా కుటుంబం కష్టాల్లో పడింది. ఎలా బతకాలో తెలియక సతమతమయ్యాను. అప్పటికే నాకు టైలరింగ్ రావడంతో పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం సొలికిరి గ్రామంలో దుకాణం పెట్టుకున్నాను. దానిపై కాస్తో కూస్తో ఆదాయం వచ్చేది. కానీ అది భరోసానివ్వలేదు. గత చంద్రబాబు పాలనలో పింఛన్ కోసం ఎన్నోమార్లు దరఖాస్తు చేసుకున్నాను. జన్మభూమి కమిటీలు నాకు పింఛన్ రాకుండా అడ్డుకున్నాయి. ఇంతలో దేవుడిలా జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు. నా కుటుంబాన్ని ఆదుకున్నారు. నాకు వితంతు పింఛన్ వచ్చింది. టైలరింగ్ షాప్ నడుపుతున్న నాకు జగనన్న చేదోడు పధకం ద్వారా ఏడాదికి రూ. 10వేల వంతున మూడేళ్ళుగా అందుకొంటున్నాను. ఆ మొత్తంతో నా టైలరింగ్ షాప్ను, ప్యాన్సీ షాప్గా మార్చుకున్నాను. నా ఇద్దరు పిల్లలను ఎంపీపీ స్కూల్లో చదివిస్తున్నాను. అందులో ఒకరి పేరున అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ. 15వేలు నా ఖాతాలో జమవుతున్నాయి. పిల్లల చదువుకు బెంగ లేకుండా పోయింది. నా ఒంటరి బతుకుకు జగనన్న అండ దొరికింది. ఇప్పుడు ఆర్థిక కష్టాల నుంచి బయట పడ్డాను. దానికి కారణమైన జగనన్నకు రుణ పడి ఉంటాను. – ఈరోతు కాంచన, సొలికిరి (టంకాల మోహనరావు, విలేకరి, భామిని) ప్రభుత్వ సాయంతో నిలదొక్కుకున్నాం రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి మాది. నా భర్త, నేను కూలి చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాళ్లం. ఆ సంపాదనతో ముగ్గురు పిల్లల పోషణ కష్టంగా మారింది. 2019 తర్వాత మా జీవితంలో వెలుగులు నిండాయి. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ.18,750లు చొప్పున, వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా నాలుగేళ్లకు రూ.63,012, జగనన్న తోడులో రూ.10 వేలు, సున్నా వడ్డీగా రూ.2,210, వడ్డీలేని రుణంగా రూ.50 వేలు, బ్యాంకు రుణంగా రూ.2 లక్షలు అందాయి. ఆ మొత్తంతో తిరుపతి నగరం బీటీఆర్ కాలనీలో చిల్లర దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దాని ద్వారా నెలకు రూ.10వేల నుంచి రూ.13 వేల వరకు ఆదాయం వస్తోంది. పిల్లలు సైతం ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం మా కుటుంబం సంతోషంగా ఉంది. జగనన్న సంక్షేమ పథకాలతో ఆర్థికంగా నిలదొక్కుకున్నాం. మా కుటుంబాన్ని ఆదుకున్న జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. మళ్లీ జగనన్నే సీఎంగా రావాలి. – బి.వనజమ్మ, తిరుపతి (పోగూరి చంద్రబాబు, విలేకరి, తిరుపతి సిటీ) సర్కారు సాయంతో సాఫీగా జీవనం మాది నిరుపేద కుటుంబం. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. టాక్సీడ్రైవర్గా ఉంటూ జీవనం సాగిస్తున్నాం. అనుకోకుండా నాకు ప్రమాదం జరిగింది. దాంతో ఏ పనీ చేయలేకపోయాను. గత ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఆసరా లభించలేదు. అప్పు చేసి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో చిన్నపాటి ఎలక్ట్రికల్ దుకాణం పెట్టుకుని జీవనం ప్రారంభించాను. అయితే అంతంతమాత్రంగానే వ్యాపారం సాగడం వల్ల రేపటిగురించి ఎప్పుడూ భయంగానే ఉండేది. అదృష్టవశాత్తూ రాష్టంలో జగనన్న ప్రభుత్వం ఏర్పడింది. నాకున్న ముగ్గురు కుమార్తెల చదువులు ఫీజు రీయింబర్స్మెంట్తో ఎంతోహాయిగా సాగిపోయాయి. పెద్దమ్మాయి కరీనా బీటెక్ పూర్తి చేసింది. రెండో అమ్మాయి షరీనా హారీ్టకల్చర్ మూడో ఏడాది చదువుతోంది. మూడో అమ్మాయి విలీనా బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ రావడం వల్ల వారి చదువులకు ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో కాలికి రూ.50 వేల విలువైన శస్త్ర చికిత్స ఉచితంగా జరిగింది. మా అమ్మకు రెండు కుంచాల భూమి ఉండడంతో రైతు భరోసా కింద రూ.7 వేలు వస్తోంది. నా భార్య మహాలక్ష్మికి వైఎస్సార్ చేయూత కింద ఏడాదికి రూ.18,750 వేలు వంతున అందింది. మా అమ్మ లలితమ్మకు పింఛన్ అందుతోంది. సీఎం జగన్ పాలనలో నా కుటుంబానికి అన్ని విధాలా మేలు జరిగింది. – నల్లి వెంకయ్యదాసు, మలికిపురం (తోట సత్యనారాయణ, విలేకరి, మలికిపురం) -
బతుకు బండికి సర్కారే ఇంధనం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. బతుకు బండికి సర్కారే ఇంధనం నేను దివ్యాంగుడిని. నాకు పదో తరగతి చదువుతున్న సమయంలో అంగ వైకల్యం ఏర్పడింది. విశాఖ కేజీహెచ్లో వైద్యం పొందడంతో ఆరోగ్యం బాగు పడింది. డిగ్రీ చదువుతున్న సమయంలో 2014లో మా బంధువుల అమ్మాయి పూర్ణమ్మతో వివాహం అయింది. మాకు పిల్లలు లేరు. కొన్నాళ్లు గడిచాక మళ్లీ రెండు కాళ్లకు అంగవైకల్యం ఏర్పడింది. దీంతో డిగ్రీ ద్వితీయ సంవత్సరంతో మానేశాను. మాలాంటి వారికి గతంలో ఏ ప్రభుత్వం అందించని సహాయం ఈ ప్రభుత్వ పాలనలో లభిస్తోంది. మాది అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం ఎం.నిట్టాపుట్టు గ్రామం. మాకున్న ఎకరం బంజరు భూమిలో వ్యవసాయం చేయగా వచ్చే తిండి గింజలతో, నా భార్య కూలి సొమ్ముతో గతంలో కష్టంగా జీవనం సాగించేవాళ్లం. నాకు 84 శాతం అంగవైకల్యం ఉందని వైద్యుల ధ్రువీకరణతో ఈ ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్ మంజూరు చేసింది. ప్రతి నెలా ఒకటో తేదీనే వలంటీర్ ఇంటికి వచ్చి ఆ మొత్తాన్ని అందిస్తున్నాడు. విభిన్న ప్రతిభావంతుల కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న వెంటనే ఈ ప్రభుత్వం రూ.లక్ష విలువ చేసే మూడు చక్రాల స్కూటీని మంజూరు చేసింది. ఏటా రైతు భరోసా కింద రూ.13,500 వస్తోంది. డ్వాక్రా సంఘంలో నా భార్య కొంత అప్పు తీసుకోగా సున్నా వడ్డీతో లబ్ధి చేకూరింది. మా నాన్నకు కూడా వృద్ధాప్య పింఛన్ వస్తోంది. ప్రభుత్వ సాయంతో మా జీవితం సాఫీగా సాగుతోంది. సీఎం జగన్ ప్రభుత్వమే మా జీవితాన్ని నడిపిస్తున్నారు. ఆయనకు రుణపడి ఉంటాం. – పరదాని జగన్నాథం, ఎం.నిట్టాపుట్టు (చుక్కల వెంకటరమణ, విలేకరి, జి.మాడుగుల) అనాథనైన నాకు పెద్ద దిక్కయ్యారు మా ఆయన సీతారాం పదేళ్ల క్రితం కన్ను మూశారు. ఆయన చనిపోయిన కొద్ది రోజులకే మా నాన్న భీముడు, అమ్మ లచ్చమ్మ కూడా వరుసగా కాలం చేశారు. పిల్లలు లేని నేను అనాథగా మిగిలిపోయాను. బతుకు తెరువుకోసం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గులివిందలపేటలో చిన్నపాటి పనులు చేసుకునేదాన్ని. నిరుపేదరాలినైన నాకు మా గ్రామానికి చెందిన పీఏసీఎస్ చైర్మన్ చింతాడ సూర్యనారాయణ దయతో ఓ ఇంటిని సమకూర్చి అందులో ఉండమని చెప్పారు. ఇటీవల అనారోగ్యం కారణంగా పని చేయలేకపోతున్నాను. ముఖ్యమంత్రి జగనన్న ఇస్తున్న పింఛన్ నాకు ఇప్పుడు అండగా నిలిచింది. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఒకటో తేదీ ఉదయాన్నే మా వలంటీర్ ఆ మొత్తాన్ని నా చేతిలో పెడుతున్నారు. రేషన్ బియ్యం ఉచితంగా అందుతున్నాయి. నాకు అవసరమైన మందులు ప్రతి నెలా 104 వాహనం ద్వారా ఉచితంగా సమకూరుతున్నాయి. ఈ ప్రభుత్వం దయతోనే నా అన్న వారు ఎవరూ లేకపోయినా చీకూ చింతా లేకుండా జీవనం సాగిపోతోంది. ముఖ్యమంత్రి జగన్కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. – చింతాడ లక్ష్మి, గులివిందలపేట (అల్లు నరసింహారావు విలేకరి, కొత్తూరు) కష్టకాలంలో ‘ఆసరా’గా నిలిచారు మాది నిరుపేద కుటుంబం. నా భర్త వడివేలు కూరగాయల దుకాణంలో కూలీగా పని చేసేవాడు. కరోనా సమయంలో వ్యాపారాలు బంద్ కావడంతో పూట గడవక ఇబ్బందులు పడ్డాం. ఆ సమయంలో వైఎస్సార్ ఆసరా పథకం మా కుటుంబాన్ని ఆదుకుంది. రూ.12 వేలతో తిరుపతి జిల్లా కోటలోని మా కాలనీలోనే కూరగాయల బండి పెట్టుకుని వ్యాపారం ప్రారంభించాం. తాజా కూరగాయలు అమ్ముతూ వ్యాపారాన్ని విస్తరించాం. జగనన్న తోడు పథకంలో అదనంగా మరో రూ.10 వేలు వచ్చాయి. ఆ డబ్బులను కూడా వ్యాపారానికి ఉపయోగించాం. దీంతో మా జీవితం గాడిలో పడింది. అప్పులు తీర్చుకుంటూ ఆరి్థకంగా నిలదొక్కుకున్నాం. వైఎస్సార్ ఆసరాలో నాలుగేళ్లు సాయం అందింది. హైసూ్కల్ చదువుతున్న మా అబ్బాయికి అమ్మఒడిలో ఏడాదికి రూ.15 వేలు వస్తోంది. జగనన్న లే అవుట్లో మాకు ఇంటి స్థలం కేటాయించారు. ఉన్నంతలో వ్యాపారం చేసుకుంటూ ఆనందంగా బతుకుతున్నాం. మాలాంటి పేదవాళ్లకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాం. – పేట పావని, కోట (యాకసిరి మధు, విలేకరి, కోట) -
పేదల కోసం పెత్తందారులపై పోరాటాలెన్నో చేశాం: సీఎం జగన్
ప్రకాశం, సాక్షి: చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నామని.. తద్వారా ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలు ఎన్.అగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అంతకు ముందు ఒంగోలు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారాయన. .. ‘‘మరో మంచి పనికి ఒంగోలు నుంచి శ్రీకారం చుడుతున్నాం. ప్రతీ అడుగు పేదల సంక్షేమం కోసం వేశాం. ఈ 58 నెలల కాలంలో పేదల బతుకులు మారాలని అడుగులు వేశాం. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నాం. ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నాం. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని అన్నారాయన. .. పేదల కోసం పెత్తందారులపై అనేక పోరాటాలు చేశామని సీఎం జగన్ ఒంగోలు సభలో గుర్తు చేశారు. అలాగే ఇంటింటికీ తలుపు తట్టి సేవలు అందిస్తున్నామని.. 58 నెలల పాలనలో మొత్తంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారాయన. వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాం ఆరోగ్యశ్రీ రిధిని రూ.25 లక్షలకు పెంచాం ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లను 3,300కు పెంచాం ఆస్పత్రిలో బిల్లు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు రోగులు కోలుకునే వరకు ఆసరాగా ఉంటున్నాం గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించండి -
31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం: సీఎం జగన్
CM Jagan Public Meeting At Ongole Updates ప్రకాశం జిల్లా ఒంగోలులో ముగిసిన పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఒంగోలు చరిత్రలో సువర్ణాధ్యాయం 21 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలతో భూ బదిలీ పత్రం అందజేసిన సీఎం జగన్ నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పంపిణీలో భాగంగా ఈ కార్యక్రమం ఇది దేశంలోనే ఒక చరిత్ర: సీఎం జగన్ పేదరికం నుంచి పేదలు బయటపడాలి: సీఎం జగన్ ఇళ్ల పట్టాలతో పాటు రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నాం: సీఎం జగన్ ఈ స్థలాలపై బ్యాంకు రుణాలు కూడా తీసుకోవచ్చు గ్రామ, వార్డు సచివాలయాల్లోనే సర్టిఫైడ్ కాపీలు తీసుకోవచ్చు రాష్ట్రవ్యాప్తంగా 17,005 జగనన్న లేఅవుట్లు ఆస్తి మీద అక్కచెల్లెమ్మలకు హక్కు కల్పిస్తున్నాం అక్కచెల్లెమ్మలను లక్షాధికారుల్ని కాదు.. మిలియనీర్లను చేస్తున్నాం వాళ్లు సిద్ధంగా లేరంట!: సీఎం జగన్ చురకలు చంద్రబాబు లాంటి వారితో రాజకీయాలు భ్రష్టు పట్టాయి మనం సిద్ధం అంటుంటే.. చంద్రబాబు సతీమణి సిద్ధంగా లేం అంటున్నారు కుప్పం నుంచే బైబై బాబు అంటున్నారు చంద్రబాబును కుప్పం ప్రజలు కూడా నమ్మట్లేదు చంద్రబాబు మాదిరి నాన్ రెసిడన్స్ ఆంధ్రాస్ మద్దతు నాకు లేదు బాబులా దళారులను, బ్రోకర్లను నేను నమ్ముకోలేదు నేను నమ్ముకుంది దేవుడు.. ప్రజల్ని మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలబడండి చంద్రబాబు దుర్మార్గం ఏపాటిదంటే.. చంద్రబాబు రాజకీయ రాక్షసుడు వంద సినిమాల విలన్ల దుర్మార్గం కంటే.. చంద్రబాబు దుర్మార్గం ఎక్కువ ఇళ్ల స్థలాల పంపిణీ జరగకుండా 1191 కేసులు వేయించాడు తన హయాంలో సెంటు భూమి కూడా ఇవ్వలేదు ఆ కుట్రలు అధిగమించి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తే.. కులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందట! ఎస్సీలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా? అని బాబు అన్నాడు చంద్రబాబు 650 హామీలిచ్చి.. 10 కూడా నెరవేర్చలేదు నిస్సిగ్గుగా ఇప్పుడు కొత్త మేనిఫెస్టోతో వస్తున్నాడు ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం గతంలో పెత్తందారులకు మాత్రమే నామినేటెడ్ పదవులు మన ప్రభుత్వంలో బలహీన వర్గాలకు పదవులు గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించండి పేదల ఆత్మగౌరవం గురించి గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు తెచ్చాం మన ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది పేద మహిళల సాధికారత కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాం ఆర్థిక అంతరాలు తొలగించాం రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వడం వల్ల అక్కచెల్లెమ్మలకు ఆస్తి మీద పూర్తి హక్కు భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేసే అవకాశం ఎవరికీ ఉండదు రిజిస్ట్రేషన్ పట్టాలు ఉండడం వల్ల కబ్జాలు కుదరదు గ్రామ సచివాలయాల నుంచి సర్టిఫైడ్ కాపీలు ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం గతంలో పెత్తందారులకు మాత్రమే నామినేటెడ్ పదవులు మన ప్రభుత్వంలో బలహీన వర్గాలకు పదవులు గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించండి పేదల ఆత్మగౌరవం గురించి గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం అక్కచెల్లెమ్మల కోసం అనేక పథకాలు తెచ్చాం మన ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది పేద మహిళల సాధికారత కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాం ఆర్థిక అంతరాలు తొలగించాం రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వడం వల్ల అక్కచెల్లెమ్మలకు ఆస్తి మీద పూర్తి హక్కు భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేసే అవకాశం ఎవరికీ ఉండదు రిజిస్ట్రేషన్ పట్టాలు ఉండడం వల్ల కబ్జాలు కుదరదు గ్రామ సచివాలయాల నుంచి సర్టిఫైడ్ కాపీలు ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాం చికిత్స కోసం వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షలకు పెంచాం ప్రొసీజర్స్ను 3,300కు పెంచాం పేదల ఇంటి వద్దకే ఫ్యామిలీ డాక్టర్ రోగులు కోలుకునేంత వరకు ప్రభుత్వమే ఆసరా పేదల సంక్షేమం కోసం ప్రతీ అడుగు వేశాం పోటీ ప్రపంచంలో నాణ్యమైన విద్య పేదలకు నాణ్యమైన విద్య అందించాలనే ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాం ఇంగ్లీష్, తెలుగు మీడియాల్లో పుస్తకాలు అందిస్తున్నాం ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాం కార్పొరేట్ స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ బడుల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం ఒంగోలు నుంచి మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం పేదల కోసం పెత్తందారులతో ఎన్నో పోరాటాలు చేశాం 58 నెలల కాలంలో ప్రతీ అడుగు పేదల మంచి కోసమే వేశాం పాలనతో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం ఇంటింటికే ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకు హక్కులు కల్పిస్తున్నాం పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు ఒక న్యాయం ఉండకూడదనే ఈ నిర్ణయం దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నాం. ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నాం. మాజీ మంత్రి బాలినేని ప్రసంగం పేదలకు ఇళ్ల పట్టాలు రాకుండా కోర్టుకు వెళ్లారు? పేదవాడికి మంచి జరగడం టీడీపీకి ఇష్టం లేదు టీడీపీ హయాంలో ఒక్క పేదవాడికైనా ఇల్లు ఇచ్చారా? ఒంగోలులో సీఎం జగన్.. ఎన్.అగ్రహారంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించిన సీఎం జగన్ సీఎం జగన్ వెంట స్థానిక ప్రజాప్రతినిధులు ఒంగోలు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన ఒంగోలులో సీఎం జగన్కు ఘన స్వాగతం జగనన్న పాలనలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కాసేపట్లో ఎన్.అగ్రహారంలో పేదలకు ఇళ్ల పట్టాల అందజేత కార్యక్రమం బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేత సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ సాక్షితో.. మాజీ మంత్రి బాలినేని ►ఒంగోలు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ కాసేపట్లో పేదలకు ఇళ్ల పట్టా పంపిణీ 21 వేలమంది అక్కాచెల్లెమ్మలకు పంపిణీ చేయనున్న సీఎం జగన్ ఒంగోలులో మంచి నీటి పథకం కూడా ప్రారంభం ► కాసేపట్లో ఒంగోలుకు చేరుకోనున్న సీఎం జగన్ సీఎం జగన్ ఒంగోలు పర్యటన ప్రకాశం జిల్లా ఒంగోలు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో ఎన్.అగ్రహారం చేరుకోనున్న సీఎం జగన్ 21వేల మంది అక్కచెళ్లెమ్మలకు ఇళ్లపట్టాలు పంపిణీ సీఎం జగన్ చేతుల మీదుగా ఒంగోలు మంచినీటి పథకం పనులు ప్రారంభం ఇళ్ల పట్టాల్లో చారిత్రక ఘట్టం పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ 31.19 లక్షల ఇళ్ల పట్టాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మరో చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుడుతోంది. దేశంలోనే తొలిసారిగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తోంది. ఇందుకోసం ఆ పట్టాలను వారి పేరు మీద ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు కన్వేయన్స్ డీడ్స్ (సర్వ హక్కులతో భూ బదిలీ పత్రం) అందించనుంది. 20,840 మంది అక్కచెల్లెమ్మలకు సీఎం జగన్ చేతుల మీదుగా.. ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 20,840 మంది అక్కచెల్లెమ్మలకు సర్వ హక్కులతో రిజిస్టర్ చేసిన కన్వేయన్స్ డీడ్లు, ఇళ్లు మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు. మల్లేశ్వరపురం, అగ్రహారం, యరజర్ల, వెంగముక్కల పాలెం గ్రామాల్లో 536.11 ఎకరాల భూసేకరణ ద్వారా రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్ డీడ్లను లబ్దిదారులకు అందించనున్నారు. సచివాలయాల్లో సర్టిఫైడ్ కాపీ ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధారణమే అయినా ఒకేసారి 30 లక్షల మందికి అందించడం, వాటిని సర్వ హక్కులతో రిజిస్ట్రేషన్ చేస్తుండడం దేశంలోనే ప్రథమం. గతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినా వాటిపై పేదలకు హక్కులు ఉండేవి కాదు. “డి’ పట్టాలు కావడంతో అనుభవించడం మినహా హక్కులు లేనందున అవసరానికి వినియోగించుకునే అవకాశం ఉండేది కాదు. ఈ సమస్యను పరిష్కరిస్తూ ఇళ్ల పట్టాలు పొందిన పదేళ్ల తర్వాత వాటిపై లబ్ధిదారులు సర్వ హక్కులు పొందేలా ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. ఇప్పుడు దాని ప్రకారమే ఇళ్ల స్థలాలకు సంబంధించిన యజమానులకు కన్వేయన్స్ డీడ్లు అందిస్తోంది. వారి పేరు మీద ఆ పట్టాలను రిజిస్ట్రేషన్ చేస్తోంది. ఈ డీడ్లు పదేళ్ల గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్గా సేల్ డీడ్లుగా మారతాయి. అప్పుడు ప్రభుత్వం జోక్యం లేకుండానే నేరుగా ఆ స్థలాలను అమ్ముకోవడానికి, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. విలువైన స్థిరాస్తి.. ఇంటి స్థలాన్ని ఉచితంగా ఇవ్వడమే కాకుండా గృహ నిర్మాణానికి రూ.1.80 లక్షల చొప్పున ప్రభుత్వం ఇస్తోంది. మరోవైపు పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంకు రుణం ఇప్పిస్తోంది. ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీల్, మెటల్ ఫ్రేమ్స్, ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకే అందించడంతో ఇంకో రూ. 40 వేల మేర లబ్ది చేకూరుస్తోంది. మొత్తంగా ఒక్కో లబ్దిదారుడికి రూ. 2.70 లక్షల మేర ప్రయోజనం దక్కుతోంది. మౌలిక వసతుల కల్పనతో ప్రతి ఇంటికి సగటున మరో రూ.లక్ష వరకు ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోంది. తద్వారా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు ప్రాంతాన్ని బట్టి ఇంటి విలువ రూపేణా కనీసం రూ. 6 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విలువ చేసే విలువైన స్థిరాస్తిని సమకూర్చుతోంది. 17,005 లేఅవుట్లు.. 71,811 ఎకరాలు ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కోసం దేశంలో ఏ రాష్ట్రం ఖర్చు చేయని రీతిలో సీఎం జగన్ ప్రభుత్వం నిధులు వెచ్చించింది. 71,811 ఎకరాలను సేకరించి 31.19 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇందుకోసం 17,005 లేఅవుట్లు నిర్మించింది. 71,811 ఎకరాల్లో ప్రైవేట్గా 25,374 ఎకరాలు సేకరించారు. ఇందుకు భూసేకరణకు రూ.11,343 కోట్లు ఖర్చు చేసింది. పేదలకిచ్చిన ఇళ్ల స్థలాల కోసం ఇంత భారీగా భూసేకరణ చేసిన ప్రభుత్వం మరొకటి లేదు. -
స్వయం ఉపాధికి సర్కారు ఊతం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. స్వయం ఉపాధికి సర్కారు ఊతం మా ఆయన చదువుకున్నప్పటికీ సరైన ఉద్యోగం లేదు. ఏదైనా వ్యాపారం చేసుకుని నిలదొక్కుకుందామనుకుంటే గత ప్రభుత్వం ఆశించిన సహకారం అందివ్వలేదు. ఇక చేసేది లేక ఎలాగోలా బతుకుతుండగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. మా కలలు సాకారం చేసుకోవడానికి అడుగులు పడ్డాయి. మహిళాభివృద్ధికి ఈ ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో మా సొంత ఊరైన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఆంధ్రా ఒడిశా సరిహద్దులోని బొడ్డపడలో సొంతంగా హోటల్ ఏర్పాటు చేసుకుందామని మా ఆయన నర్సింగ్ సాహు యోచించారు. వెంటనే పెట్టుబడి కోసం బ్యాంకు లింకేజీ ద్వారా లక్ష రూపాయల రుణం తీసుకున్నాం. ఆ సొమ్ముతో బస్టాండ్ కూడలిలో చిన్నపాటి హోటల్ ఏర్పాటు చేశాం. మౌలిక వసతులకోసం జగనన్న తోడు పథకం ద్వారా పది వేల రూపాయలు వడ్డీలేని రుణం తీసుకున్నాం. వైఎస్సార్ ఆసరా ద్వారా నాకు ప్రభుత్వం అందజేసిన రూ.14వేలు కూడా వ్యాపారానికి వినియోగించాం. ఇప్పుడు రోజుకు సుమారు ఐదు వందల వరకు లాభం వస్తోంది. అలాగే ప్రభుత్వం మాకు ఓ మంచి గూడును కూడా జగనన్న కాలనీలో సమకూర్చింది. ప్రతీ ఏడాది మా పాపకు జగనన్న విద్యా దీవెన అందుతుండటంతో ఆమె చదువు మాకు భారం కాలేదు. ఈ రోజు మా కుటుంబం ఇలా ఉందంటే దానికి కారణమైన ఈ ముఖ్యమంత్రికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – కుమారీ సాహూ, బొడ్డబడ (మద్దిలి కేశవరావు, విలేకరి, ఇచ్ఛాపురం రూరల్) ఏ దిక్కూ లేని నాకు పింఛనే ఆధారం నా వయస్సు 75 సంవత్సరాలు. భర్త దూరమై 20 ఏళ్లు అవుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరులో నివాసం ఉంటున్న నాకు బిడ్డలు, బంధువులు ఎవరూ లేరు. ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నాను. కిడ్నీ సమస్య, బీపీ, షుగర్తో బాధపడుతున్న నేను కనీసం కూలి పని కూడా చేసుకోలేను. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కొడుకులా ఆదుకున్నాడు. ప్రతి నెలా రూ.3 వేల పింఛన్ ఇంటికి వచ్చి ఇస్తున్నారు. నెలా నెలా ఇంటికి బియ్యాన్ని ఉచితంగా తీసుకువస్తున్నారు. ఏ దిక్కూ లేని నాకు పింఛనే ఆధారం. మూడు పూటలా తింటూ బతుకుతున్నాను. బీపీ, షుగర్, ఇతర సమస్యలకు మందులు క్రమం తప్పకుండా ఉచితంగా ఇస్తున్నారు. నాకు ఎవరూ అండగా లేకపోయినా ఈ ప్రభుత్వ సాయంతో బతకగలుగుతున్నాను. మళ్లీ జగన్ సీఎం అయితేనే మా లాంటి పేదలు హాయిగా బతుకుతారు. – పిల్లి శాంతమ్మ, సీలేరు (చీపురుపల్లి రామారావు, విలేకరి, సీలేరు) సమస్యలు తొలగి సంతోషంగా జీవనం మాది చేనేత కుటుంబం. మా వృత్తికి సరైన ఆదరణ లేక... చేసిన పనికి గిట్టుబాటైన కూలి లేక నానా అవస్థలు పడేవాళ్లం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బండార్లంకలో మా అబ్బాయి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చిన్నపాటి కమ్మరేకుల ఇళ్లలో జీవిస్తున్నాం. గత ప్రభుత్వం మాలాంటివారికి ఎలాంటి సాయం అందివ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక మా బతుకులు మారాయి. ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయాన్నే వలంటీర్ మా ఇంటి తలుపులు తట్టి నాకు వృద్ధాప్య పింఛన్ అందిస్తోంది. మా అబ్బాయి భోగ భాగ్య నారాయణ తాతారావుకు వాహన మిత్ర పథకం ద్వారా ఏటా రూ.10 వేలు అందుకుంటున్నాడు. నా కోడలు లక్ష్మి ఇంట్లోనే చేనేత మగ్గాన్ని నేస్తూ నేతన్న నేస్తం పథకం ద్వారా ఏటా రూ.24 వేలు తీసుకుంటోంది. డ్వాక్రా రుణ మాఫీతో వచి్చన సొమ్ముతో కుటుంబాన్ని తీర్చిదిద్దుతోంది. మా మనవడు క్రాంతికుమార్ స్కూల్లో చదువుకుంటున్నాడు. వాడికి అమ్మ ఒడి పథకం ద్వారా అందిస్తున్న రూ.15000లు ఏటా మా కోడలి ఖాతాలో జమవుతున్నాయి. మా కుటుంబానికి జగనన్న ఇంటి స్థలం కూడా ఇచ్చారు. త్వరలోనే ఇల్లు కట్టుకుని అక్కడకు వెళ్లిపోతాం. ఇప్పుడు నా కుటుంబం ఏ చీకూ చింతా లేకుండా ముందుకు సాగుతోంది. మాకుటుంబాన్ని ఆదుకున్న జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. – కూర్మా దుర్గ, బండార్లంక (పరసా సుబ్బారావు, విలేకరి, అమలాపురం టౌన్) -
నా పసుపు, కుంకుమ కాపాడిన సీఎం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. నా పసుపు, కుంకుమ కాపాడిన సీఎం నా భర్త గంగాధర్ ఎల్ఐసీ ఏజెంట్గా పని చేస్తున్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ముకుందాపురంలో మాకున్న తొమ్మిది ఎకరాల్లో చీనీ సాగు చేస్తున్నాం. పెద్ద కుమారుడు విజయవాడలోని ప్రైవేట్ కళాశాలలో, చిన్నకుమారుడు అనంతపురంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు. 2021లో కరోనా సమయంలో నా భర్తకు ఊపిరితిత్తుల సమస్య వచ్చింది. అప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేదు. శ్వాస తీసుకునేందుకూ తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో ఎక్కడికి పోవాలో కూడా నాకు దిక్కు తోచలేదు. నా భర్త ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న వలంటీర్ సూచన మేరకు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్లి అనంతపురంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించా. నయా పైసా ఖర్చు లేకుండా వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకుని రూ.4 లక్షలకు పైగా ఖర్చయ్యే చికిత్సను ఉచితంగా అందించారు. దీంతో నా భర్త ప్రాణాలతో బయటపడ్డారు. నా కుమారుడికి అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేలు చొప్పున, రైతు భరోసా పథకం ద్వారా ఏటా రూ.13,500 చొప్పున, పంటల బీమా పథకం ద్వారా రూ.72,000 వంతున రెండుసార్లు, రూ.58,000 వంతున ఇంకో రెండుసార్లు అందింది. నేను మహిళా సంఘంలో సభ్యురాలిని కావడంతో సున్నా వడ్డీ పథకం ద్వారా ఏటా రూ.3 వేలు చొప్పున మూడు పర్యాయాలు వచ్చింది. గతంలో ఏ ప్రభుత్వమూ ఇంతలా ఆదుకున్న దాఖలాల్లేవు. నా పసుపు కుంకుమ కాపాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎప్పుడూ రుణపడే ఉంటాను. – ఆదిలక్ష్మి, ముకుందాపురం (జె.ఆదినారాయణ, విలేకరి, గార్లదిన్నె) ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మాది సాధారణ కుటుంబం. విజయనగరం జిల్లా తెర్లాంలో ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. కిరాయి అన్ని రోజులూ ఒకేలా ఉండేది కాదు. బేరం లేకపోతే ఆ రోజు రాబడి సున్నా. అప్పుడప్పుడు మరమ్మతు చేయించాల్సి వస్తే అప్పు చేయక తప్పేది కాదు. మా గురించి ఏ ప్రభుత్వం ఆలోచించలేదు. సీఎం జగన్మోహన్రెడ్డి మాత్రం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఏటా రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటి వరకు నాకు రూ.40 వేలు వచ్చాయి. అమ్మఒడి పథకం ద్వారా నా కుమార్తెకు ఏటా రూ.15 వేలు చొప్పున నాలుగేళ్లకు రూ.60 వేలు నా భార్య ఖాతాలో జమయింది. వైఎస్సార్ ఆసరా కింద ఏడాదికి రూ.2,800, సున్నా వడ్డీ ద్వారా ఏటా రూ.840 చొప్పున వచ్చింది. ప్రజా సంకల్ప యాత్రలో ఆటోడ్రైవర్లకు ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన సీఎం వైఎస్ జగన్ మేలును ఎన్నటికీ మరచిపోలేం. – రాజాన రమేష్, తెర్లాం (గొండేల సూర్యనారాయణ, విలేకరి, తెర్లాం) జగనన్న దయతో డయాలసిస్ మాది పేద కుటుంబం. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం ప్రాతాళ్లమెరకకు చెందిన నా భర్త రేవు నాగరాజు 2013 మార్చి నుంచి కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నారు. అప్పటి ప్రభుత్వం ఎటువంటి వైద్య సాయం అందించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ చేయించడంతోపాటు నెలకు రూ.10 వేలు పింఛన్ సాయం ప్రకటించారు. ఫలితంగా మా పేద బతుకులకు ధైర్యం వచ్చింది. నాలుగేళ్లుగా ఆరోగ్యశ్రీ ద్వారా వారానికి రెండుసార్లు ఉచితంగా డయాలసిస్ చేయించుకుంటున్నాం. తోడబుట్టిన అన్నయ్యలా జగనన్న పింఛన్ సాయం అందిస్తున్నారు. పింఛన్గా ఇప్పటి వరకు రూ.4,80,000 మేర లబ్ధి పొందాం. మా పాప చదువుకు అమ్మ ఒడి ద్వారా ఏటా రూ.15 వేలు వంతున సాయం అందుతోంది. జగనన్న రుణం తీర్చుకోలేం. ఆయనే నిరంతరం ముఖ్యమంత్రిగా ఉండాలి. – రేవు ఎస్తేరు రాణి, ప్రాతాళ్లమెరక (కడితల శివాజీ, విలేకరి, కాళ్ల) -
మా పిల్లల ప్రాణాలు జగనన్నచలువే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. మా పిల్లల ప్రాణాలు జగనన్నచలువే మాది నిరుపేద కుటుంబం. మా ఆయన వసంతరావు శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో వ్యవసాయ కూలీగా ఉండేవారు. ఆయనకు నేను చేదోడుగా ఉండేదాన్ని. మా ఆయన అనుకోకుండా రెండేళ్ల క్రితం కాలం చేశారు. మాకు 12 ఏళ్ల బాబు, తొమ్మిదేళ్ల పాప ఉన్నారు. ఇద్దరూ సికిల్ సెల్ ఎనీమియా వ్యాధితో బాధ పడుతున్నారు. ఈ వ్యాధి ప్రభావం వల్ల పిల్లల్లో రక్తం తగ్గిపోవడంతో అనారోగ్యంతో బాధ పడేవారు. గత ప్రభుత్వ హయాంలో మాకు ఏ విధంగానూ సాయం అందలేదు. రక్తం తగ్గినప్పుడు అప్పు చేసి రక్తం ఎక్కించి పిల్లలను అతి కష్టం మీద బతికించుకునేవాళ్లం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మా పిల్లలిద్దరికీ నెలకు రూ.10 వేలు వంతున ఇద్దరికీ రూ.20 వేలు పింఛన్ మంజూరు చేశారు. ఆ మొత్తంతో పిల్లలిద్దరికీ రక్తం ఎక్కిస్తున్నా. పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం పెడుతున్నా. అవసరమైన మందులు కొనుగోలు చేస్తున్నా. నాకు వితంతు పింఛన్ వస్తోంది. పిల్లల సంరక్షణ చూసుకుంటుండటంవల్ల ఏ పనికీ వెళ్లలేకపోతున్నా. అయినా వచ్చిన పింఛన్ డబ్బులతో పిల్లలను కంటికి రెప్పల్లా కాపాడుకుంటున్నా. ఈ రోజు మా పిల్లలు బతికే ఉన్నారంటే అదంతా జగనన్న చలవే. – అందవరపు భవాని, కొత్తూరు (అల్లు నరసింహారావు విలేకరి, కొత్తూరు) కుటుంబానికి చేదోడుగా.. మాది మధ్య తరగతి కుటుంబం. విశాఖపట్నంలోని అల్లిపురం వెంకటేశ్వరమెట్టలో నివాసం ఉంటున్న మేమంతా కష్టపడినా గతంలో కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. ఆ సమయంలో ఈ ప్రభుత్వం అండగా నిలిచింది. టైలరింగ్ ప్రారంభించాను. ఈ మేరకు చేదోడు పథకానికి దరఖాస్తు చేసుకోగానే మంజూరైంది. రెండు సంవత్సరాలుగా ఈ పథకం కింద ఏటా రూ.10 వేల వంతున ఇప్పటికి రూ.20 వేలు వచ్చింది. ఈ మొత్తంతో కుట్టుమెషిన్ కొనుక్కొని టైలరింగ్ చేస్తూ కుటుంబానికి చేదోడుగా నిలుస్తున్నా. మా ఆయన ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. మా అబ్బాయి ఒకటో తరగతి చదువుతున్నాడు. అమ్మ ఒడి ద్వారా రూ.15 వేలు వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చాక మా మామగారికి 60 ఏళ్లు దాటడంతో వైఎస్సార్ ఆసరా ఫించన్ వస్తోంది. ఈ ప్రభుత్వం అందించిన సాయంతో ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్నాం. – మునశాల కనక, అల్లిపురం, విశాఖపట్నం (మద్దాల వెంకటసూరి అప్పారావు, విలేకరి, అల్లిపురం) దేవుడిలా ఆదుకున్నారు మా ఆయన రెడ్డి ప్రసాద్ రైతు. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన మాకు ఇద్దరు పిల్లలు. బాబు కేతన్, పాప షన్విత. కేతన్కు ఆరేళ్ల వయస్సులో స్కూల్లో ఉన్నపుడు గుండె నొప్పి రావడంతో స్థానికంగా ఓ ఆస్పత్రిలో చేర్పించాం. వైద్యులు ప్లేట్లెట్స్ తగ్గాయని వైద్య పరీక్షల ద్వారా గుర్తించి పెద్దాస్పత్రిలో చేర్చాలని చెప్పారు. దీంతో బెంగళూరులోని రెయిన్బో చిన్నపిల్లల ఆస్పత్రికి వెళితే బ్లడ్ క్యాన్సర్గా నిర్ధారించారు. చికిత్సకు రూ.8 లక్షల వరకు ఖర్చవుతుందన్నారు. బిడ్డను ఎలాగైనా దక్కించుకోవాలని ఉన్న పొలాలు, నగలు అమ్మి వైద్యానికి ఖర్చు చేశాం. రూ.8 లక్షలు అనుకున్నది కాస్తా రెండేళ్లలో రూ.70 లక్షల వరకు ఖర్చయింది. బిడ్డ వైద్యం కోసం డబ్బుల్లేక ఇబ్బంది పడుతుంటే.. తెలిసిన వారు సీఎం సహాయనిధి గురించి చెబితే దరఖాస్తు చేసుకున్నాం. బ్లడ్ క్యాన్సర్తో రెండేళ్లు పోరాడి ఈ నెల 2న బాబు చనిపోయాడు. సరిగ్గా వాడు చనిపోయిన 12 రోజులకు సీఎం సహాయనిధి నుంచి రూ.10 లక్షలు మంజూరైనట్లు తెలిసింది. ఇప్పుడు మాకు అదే ఆధారం. బిడ్డ పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మాకు సీఎం సహాయ నిధి ఆదుకుంది. కేతన్కు అమ్మ ఒడి పథకం కింద రెండు విడతల్లో రూ.30 వేలు అందింది. రెండో బిడ్డను ఇప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. జగనన్న ప్రభుత్వం మాలాంటి ఎందరికో మేలు చేస్తోంది. మళ్లీ మేము మామూలుగా మారడానికి ప్రయతి్నస్తున్నాం. ప్రజలందరికీ మంచి చేస్తున్న ప్రభుత్వం మళ్లీ అధికారంలో ఉండాలన్నది నా ఆకాంక్ష. – రోజారమణి, మదనపల్లె (వంశీధర్ సూరమాల, విలేకరి, మదనపల్లె) -
కష్టకాలంలో కన్న వారిలా ఆదుకున్నారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. కష్టకాలంలో కన్న వారిలా ఆదుకున్నారు మాది మధ్య తరగతి కుటుంబం. మా ఆయన శ్రీనివాసరావు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో టైలరింగ్ చేసి కుటుంబాన్ని పోషించేవారు. మూడేళ్ల కిందట ఆయన గుండెపోటుతో ఆకస్మికంగా కన్ను మూశారు. పిల్లలను ఎలా చదివించుకోవాలో తెలియక సతమతమయ్యా. నేను తప్పనిసరి పరిస్థితుల్లో టైలరింగ్ నేర్చుకుని ఆ పని మొదలుపెట్టా. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు నన్ను ఆదుకున్నాయి. మా ఆయన బతికి ఉన్నప్పుడు ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ.76,964, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ.8,375 వచ్చాయి. మా అబ్బాయి ఆకాశ్ పదో తరగతి చదువుతున్నాడు. వాడికి అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేలు వంతున వచ్చింది. మా అమ్మాయి మేఘన డిగ్రీ చదువుతోంది. ఆమెకు జగనన్న విద్యా దీవెన కింద ఇప్పటి వరకు రూ.12 వేలు వచ్చింది. నాకు వైఎస్సార్ ఆసరా కింద రూ.22,682, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రూ.1,577, జగనన్న చేదోడు ద్వారా ఏటా రూ.పది వేల వంతున వచ్చాయి. వితంతు పింఛన్ కూడా మంజూరైంది. ఇప్పుడు మేము ఎలాంటి చీకు చింతా లేకుండా జీవిస్తున్నామంటే కారణం ఈ ప్రభుత్వం అందించిన పథకాలే. ముఖ్యమంత్రి జగనన్న మేలును ఎప్పటికీ మరువలేం. – రౌతు అనూరాధ, కురుపాం (కె.చంద్రమౌళి, విలేకరి, కురుపాం) ‘వెన్ను’దన్నుగా జగనన్న ప్రభుత్వ వైద్య శాలలు అందుబాటులో లేని సమయంలో 2012కు ముందు వరకు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెం గ్రామంలో ఉంటూ సైకిల్పై ఊరూరా తిరుగుతూ ఆర్ఎంపీ వైద్యుడిగా ప్రజలకు వైద్యం అందిస్తూ వచ్చాను. నాడు కుటుంబ పోషణ బాగానే ఉండేది. 2012 ఏప్రిల్లో ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడ్డాను. వెన్నుపూసకు గాయమై మంచం పట్టాల్సి వచ్చింది. నాటి నుంచి ఎన్ని మందులు వాడినా, వైద్యం చేయించుకున్నా ఫలితం లేకపోయింది. మాకు ఒక కుమార్తె ఉంది. ఆమే కొడుకులా మారి కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తోంది. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు డీఎంహెచ్ఓ పింఛన్ రూ.5 వేలు వస్తోంది. దీనిలో రూ.3 వేలు నెలవారీ మందులకు ఖర్చవుతోంది. ప్రభుత్వం ఉచితంగా బియ్యం అందిస్తోంది. మిగిలిన రూ.2 వేలతో కుటుంబ పోషణ చేస్తున్నా. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా నా భార్యకు ఏటా రూ.18,750 వస్తోంది. జగనన్న మాకు వెన్నుదన్నుగా నిలిచారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను. – బెజ్జంకి పాండురంగారావు, బంగారుగూడెం (కొడమంచిలి ఆశీర్వాదరావు, విలేకరి, తాడేపల్లిగూడెం రూరల్) ఆపద వేళ సర్కారు ఆసరా మాది పేద కుటుంబం. నా భర్త వెంకటరమణ చిల్లరకొట్టులో గుమాస్తా. నేను టైలరింగ్ చేస్తుంటాను. మాకిద్దరు పిల్లలు. గుంటూరు జిల్లా తెనాలిలో ఉంటున్నాం. నా భర్త సంపాదనతోనే కుటుంబాన్ని నెట్టుకు రావడం కష్టం కావడంతో నేను టైలరింగ్ షాపు పెట్టుకున్నా. అదే సమయంలో కరోనా మహమ్మారి విలయ తాండవంతో వ్యాపారం లేక, ఆదాయం సరిపోక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం. షాపు మూసి వేయాల్సి వచ్చింది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో వైఎస్సార్ ఆసరా పథకం మా కుటుంబాన్ని ఆదుకుంది. ఏటా రూ.12 వేలు చొప్పున నాలుగు విడతలుగా రూ.48 వేలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ డబ్బుతో టైలరింగ్ షాపును మళ్లీ ప్రారంభించా. జగనన్న తోడు పథకం కింద అదనంగా మరో రూ.10 వేలు వచ్చాయి. ఆ డబ్బులను కూడా వ్యాపారానికి ఉపయోగించా. దీంతో మా జీవితం గాడిలో పడింది. నా కొడుకు ఇటీవలే గుమాస్తాగా చేరాడు. కుమార్తెకు వివాహం చేశాం. చేయూత పథకంలో భాగంగా నాకు ఏటా రూ.18,750 చొప్పున రావడంతో హోల్ సేల్ మార్కెట్ నుంచి చీరలు కొనుగోలు చేసి తీసుకువచ్చి మా టైలరింగ్ షాపులోనే విక్రయిస్తున్నా. సాధారణ కుట్టుమెషిన్ అమ్మేసి ఆధునిక యంత్రాన్ని కొనుగోలు చేశా. దీంతో ఆర్డర్లు కూడా బాగా వస్తున్నాయి. ఇప్పుడు ఉన్నంతలో ఆనందంగా బతుకుతున్నాం. మా ఆర్థికాభివృద్ధికి తోడ్పడిన సీఎం జగన్ మోహన్రెడ్డిని జీవితాంతం గుర్తుంచుకుంటాం. – మునిపల్లి పార్వతి, తెనాలి (ఆలపాటి సుదీర్ కుమార్, విలేకరి, తెనాలిఅర్బన్) -
మా బతుకులు బాగుపడ్డాయి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. మా బతుకులు బాగుపడ్డాయి మాది రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. మా ఆయన నాగరాజుతో కలిసి వ్యవసాయ పనులతోపాటు పాడి ఆవులు పెట్టుకున్నాం. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లు గ్రామంలోని పెద్ద దళితవాడలో ఉంటున్న మేము అరకొర ఆదాయంతోనే ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి సాయానికి నోచుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు వలంటీర్గా అవకాశం వచ్చింది. రెండేళ్ల క్రితం పాడి ఆవుల కోసం రూ.2 లక్షలు పొదుపు రుణం తీసుకున్నాం. రూ.1.50 లక్షలతో రెండు పాడి ఆవులు కొన్నాం. రూ.50 వేలతో పశుగ్రాసం కోసం కొంత భూమిని కౌలుకు తీసుకున్నాం. రోజూ ఉదయం, సాయంత్రం 30 లీటర్ల పాలు వస్తున్నాయి. అమూల్ డెయిరీకి పాలు పోయడం ద్వారా నెలకు రూ.27 వేలు వస్తోంది. దాణా, ఇతర ఖర్చులు పోను నెలకు రూ.10 వేలు మిగులుతోంది. 5వ తరగతి చదువుతున్న మా అమ్మాయి వర్షిత ప్రియకు అమ్మ ఒడి వస్తోంది. ఇప్పటి వరకు ఏడాదికి రూ.15 వేలు చొప్పున, నాలుగు విడతల్లో రూ.60 వేలు వచ్చింది. మా అత్త మల్లక్కకు వైఎస్సార్ చేయూత పథకంలో ఏటా రూ.18,750 వస్తోంది. వృద్ధాప్య పింఛన్ రూ.3 వేలు వస్తోంది. ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో హాయిగా బతుకుతున్నాం. జగనన్న సాయంతోనే మా బతుకులు బాగుపడ్డాయి. – మంచూరి దుర్గ, అంగళ్లు (సిద్దల కోదండరామిరెడ్డి, విలేకరి, కురబలకోట) నేను టీడీపీ.. అయినా ఇల్లు ఇచ్చారు చిన్న తనం నుంచీ టీడీపీ అంటే పిచ్చి. పసుపు చొక్కా వేసుకొని జెండా పట్టుకొని తిరిగే వాడిని. నన్ను అందరూ టీడీపీ కార్యకర్తగా ముద్ర వేశారు. 20 ఏళ్లుగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం జమ్ములో ఓ అద్దె ఇంట్లో ఉంటూ చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించాను. సొంత ఇంటి కోసం ఆ ప్రభుత్వ కాలంలో ఎంతో ప్రయత్నించాను. అందరి వద్దకూ వెళ్లాను. స్థలం ఉంటే ఇల్లు ఇస్తామన్నారు. స్థలం కొనుగోలు చేసే స్తోమత లేక ఆ ఆశ వదులుకున్నాను. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక జగనన్న కాలనీల్లో ఇంటి స్థలం ఇస్తూ ఇల్లు మంజూరు చేస్తున్నారు అంటే దరఖాస్తు చేశాను. జమ్ము పంచాయతీ గడ్డెయ్యపేటలో జగనన్న కాలనీలో స్థలం ఇచ్చారు. ఇల్లు కట్టుకునేందుకు రూ.1.80 లక్షలు ఇచ్చారు. డ్వాక్రా నుంచి నా భార్యకు మరో రూ.30 వేలు అప్పుగా ఇచ్చారు. మరికొంత అప్పు చేసి మా కల నెరవేర్చుకున్నాం. భార్య, కుమార్తెతో హాయిగా జీవిస్తున్నాం. నా భార్య శశికళకు రూ.12 వేలు డ్వాక్రాలో రుణ మాఫీ అయ్యింది. కుమార్తెకు విద్యా దీవెన పథకంలో మూడేళ్లలో రూ.60 వేలు వచ్చింది. ఇప్పుడు మాకు ఎలాంటి ఆర్థిక సమస్యా లేదు. ఇప్పుడు జగనన్న గెలుపే నా లక్ష్యం. – పొట్నూరు జగదీష్, గడ్డెయ్యపేట (మామిడి రవి, విలేకరి, నరసన్నపేట) ప్రభుత్వ పథకాలతో బతుకు చింత తీరింది మాది పేద కుటుంబం. నేను, మావారు చేనేత పనులు చేస్తుండేవాళ్లం. ముగ్గురు పిల్లలు పుట్టాక నా భర్త నన్ను వదిలేయడంతో మగ్గం పనులు చేస్తూనే వారిని పెంచి పెద్ద చేశాను. ముగ్గురికీ పెళ్లిళ్లు చేశాను. అబ్బాయి బంగారం వర్క్ షాపులో పని చేస్తుంటాడు. కోడలు, మనవడితో కలిసి పాత మంగళగిరిలో ఉంటున్నాం. నాకు వచ్చే పెన్షన్తో జీవనం కొనసాగిస్తున్నా. ఇప్పుడు ఓపిక లేక పనులకు కూడా వెళ్లడం లేదు. ఒకరోజు ఒక్కసారిగా గుండె నొప్పి వచ్చింది. డాక్టర్లను సంప్రదిస్తే ఆపరేషన్ చేయాలన్నారు. సుమారు ఏడు లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. కాళ్లూ చేతులు ఆడలేదు. అసలే ఆదాయం అంతంత మాత్రం. ఏమి చేయాలో అని ఆలోచిస్తున్న తరుణంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం మాకు శ్రీరామ రక్షగా నిలిచింది. లక్షలు ఖర్చు చేసే ఆపరేషన్ను విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు ఉచితంగా చేశారు. దీంతో నా ఆరోగ్యం మెరుగు పడింది. ఆరోగ్యశ్రీ లేకపోతే నా కుటుంబం రోడ్డున పడేది. నాకు సీఎం జగన్ పునర్జన్మ ప్రసాదించారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,750 అందుతోంది. దానిని కుటుంబ అవసరాలకు వినియోగిస్తున్నా. మా మనవడికి అమ్మ ఒడి డబ్బులు రావడంతో వాడి చదువులకు చింత లేకుండా పోయింది. ప్రభుత్వ పథకాలు మా కుటుంబాన్ని ఆదుకుంటున్నాయి. – చెరుకు ఆదిలక్ష్మి, పాత మంగళగిరి (ఐ.వి.రెడ్డి, విలేకరి, మంగళగిరి) -
ఇవిగో నవరత్నాల వెలుగులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. మా పాపకు మాటొచ్చింది మాది నిరుపేద కుటుంబం. పెద్దలిచ్చిన రెండెకరాల భూమే మాకు బతుకుదెరువు. అనంతపురం జిల్లా డీ హీరేహాళ్ మండలం జాజరకల్లు గ్రామంలో నేను, మా ఆయన జి.రామిరెడ్డి వ్యవసాయం చేసుకుంటున్నాం. మాకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ఉమేష్ బెంగళూరులో డిప్లొమా చదువుతున్నాడు. అమ్మాయి శ్రావణి పుట్టుకతోనే మూగ, చెవిటి. ఆమెలో ఉన్న లోపాన్ని చూసి బాధతో కుంగిపోయేవాళ్లం. పాపకు మాటలు రప్పించేందుకు ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగాం. ఎలాంటి ఫలితం కనిపించలేదు. మూగమ్మాయి అంటూ హేళన చేస్తారనే భయంతో స్కూలుకు వెళ్లకుండా అప్పుడప్పుడు మొండికేసేది. సర్దిచెప్పి మేమే పంపేవాళ్లం. ఈలోగా రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చింది. స్థానిక నాయకుల సలహాతో మా అమ్మాయి సమస్యను సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి ఒక లేఖ ద్వారా తీసుకెళ్లాం. సత్వరం స్పందించిన ముఖ్యమంత్రి.. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా చేయించారు. ఇప్పుడు మా అమ్మాయికి మాటొచ్చింది. ప్రస్తుతం బెంగళూరులో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బిడ్డకు నేను జన్మనిస్తే.. మేనమామగా సీఎం జగనన్న మాట్లాడే భాగ్యం కల్పించారు. మాలో ప్రాణం ఉన్నంత కాలం ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – లక్ష్మీ, జాజరకల్లు (ఈ.రాధాకృష్ణ, విలేకరి, రాయదుర్గం) జగనన్న సంక్షేమ ‘ఆటో’గ్రాఫ్ బతుకు తెరువుకోసం ఆటో నడుపుతుంటా. దాని ద్వారా వచ్చే ఆదాయమే మా కుటుంబానికి ఆధారం. అన్ని రోజులూ ఒకేలా ఉండవు. అప్పుడప్పుడు వాహనానికి మరమ్మతులు తప్పనిసరి. ఏటా ఇన్సూరెన్స్ చెల్లించాలి. ఇంకా కేసుల సంగతి సరేసరి. అలాంటి సందర్భాల్లో అప్పులు చేయడం తప్పనిసరి అయ్యేది. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక అప్పులు చేయాల్సిన బాధ తప్పింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం యాళ్లవానిగరువుకు చెందిన నాకు వాహనమిత్ర పథకం ద్వారా ఏటా రూ.10 వేలు అందుతోంది. ఈ సొమ్ముతో ఏటా ఇన్సూరెన్స్, ఆటో రిపేర్లు చేయించుకుంటున్నా. నాకు ఇద్దరు పిల్లలు. బాబు అభినయ్ ఐదో తరగతి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. పాప భవ్యశ్రీ స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు అందుతోంది. నా భార్య మణికి వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఏటా రూ.10 వేలు అందింది. సున్నా వడ్డీ ద్వారా మరో రూ.2 వేలు బ్యాంక్ ఖాతాలో పడింది. వాటితో మా జీవనం సాఫీగా సాగిపోతోంది. ఇప్పుడు మాకు బతుకు భయం లేదు. – కలిగితి రమేష్, యాళ్లవానిగరువు (కె శాంతారావు, విలేకరి, పాలకొల్లు అర్బన్) సర్కారు సాయంతో స్వయం ఉపాధి మాది వ్యవసాయ కుటుంబం. అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట గ్రామంలో మాకు సుమారు రెండెకరాల పొలం ఉంది. మా ఆయన గోవింద్ వ్యవసాయం చేస్తారు. మాకు ఇద్దరు ఆడపిల్లలు. ఒక అబ్బాయి. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం ఇంటి అవసరాలకు సరిపోయేది కాదు. పంట చేతికొస్తే సరేసరి. లేకుంటే అప్పులు చేయాల్సి వచ్చేది. దానిని తీర్చడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చేది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏటా రూ. 18,750 చొప్పున నగదు అందుకున్నా. దీనికి మరికొంత నగదు కలిపి రెండు ఆవులు కొనుగోలు చేశా. రెండేళ్లుగా పాల ద్వారా రోజుకు రూ.400కు పైగా.. నెలకు రూ.12 వేలకు పైగా సంపాదిస్తున్నా. రైతు భరోసా ద్వారా ఇప్పటి వరకు రూ.54 వేలు అందింది. దీంతో సాగుకు పెట్టుబడి ఇబ్బందులు తొలగాయి. 6 నెలల కిందట మా కుమార్తెకు వివాహం చేశాం. మా అబ్బాయి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. మా కుటుంబం అంతా సంతోషంగా ఉన్నాం. దానికి కారణం ఈ ప్రభుత్వమే. – ఎల్లపు వెంకటలక్ష్మి, విజయరామరాజుపేట (చప్పా రామలింగేశ్వరరావు, విలేకరి, బుచ్చెయ్యపేట) -
పేదలకు వరంగా మారిన నవరత్నాలు
-
కొత్తగా మరో 2.32 లక్షల ఇళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిరుపేదలైన అక్కచెల్లెమ్మలు మరింతమందికి సొంతింటి కలను సాకారం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఇప్పటికే దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద 31 లక్షలకు పైగా నిరుపేద మహిళల పేరిట ఉచితంగా స్థలాలను పంపిణీ చేసి రికార్డు సృష్టించారు. 17 వేల వైఎస్సార్, జగనన్న కాలనీల్లో పేదలకు స్థలాలు ఇచ్చి, ఇళ్ల నిర్మాణం ద్వారా కొత్తగా ఊళ్లనే నిర్మిస్తున్నారు. ఇప్పటికే 22 లక్షలకు పైగా ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి, శరవేగంగా నిర్మాణాలు చేపడుతున్నారు. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద జగనన్న కాలనీల్లోనే మరో 2,32,686 ఇళ్లు నిర్మించడానికి తాజాగా ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ నుంచి కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి. వేగంగా ఇళ్ల నిర్మాణం జగనన్న కాలనీల్లో అనుమతులు ఇచ్చిన 22 లక్షలకు పైగా ఇళ్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటిలో 19.13 లక్షలు సాధారణ ఇళ్లు కాగా, మిగిలినవి టిడ్కో ఇళ్లు. సాధారణ ఇళ్లలో ఇప్పటికే 7.25 లక్షల గృహాల నిర్మాణం పూర్తయింది. మరో 4.15 లక్షల ఇళ్లు పునాది నుంచి రూఫ్ లెవల్ వరకు వివిధ దశల్లో ఉన్నాయి. జిల్లాల వారీగా రోజువారి లక్ష్యాలను నిర్దేశించి నిర్మాణ పనులను గృహ నిర్మాణ శాఖ పర్యవేక్షిస్తోంది. వేగంగా బిల్లులు చెల్లిస్తూ త్వరితగతిన నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటోంది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో కొత్తగా నిర్మించనున్న 2.32 లక్షల ఇళ్లలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 30,652 ఉన్నాయి. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 29,892, కాకినాడ జిల్లాలో 25,826, పల్నాడు జిల్లాలో 22,202 ఇళ్లు ఉన్నాయి. పేదల ఇంటి నిర్మాణానికి యూనిట్కు రూ.1.80 లక్షలు చొప్పున ఇవ్వడమే కాకుండా, ఉచితంగా ఇసుక సరఫరా ద్వారా రూ.15వేలు, సిమెంట్, స్టీలు, మెటల్ ఫ్రేమ్స్, ఇతర నిర్మాణ సామగ్రిని తక్కువ ధరకే అందించడం ద్వారా మరో రూ.40 వేల మేర ప్రభుత్వం పేదలకు లబ్ధి చేకూరుస్తోంది. అదేవిధంగా పావలా వడ్డీకే రూ.35 వేలు చొప్పున బ్యాంకు రుణం అందిస్తున్నారు. ఇలా మొత్తంగా ఒక్కో లబ్దిదారుకు రూ.2.70 లక్షలు చొప్పున మేలు కలుగుతోంది. దీనికి అదనంగా మౌలిక వసతుల కోసం ప్రతి ఇంటిపై మరో రూ.లక్షకు పైగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. వసతులు కల్పిస్తున్నాం రాష్ట్రంలో మరో 2.32 లక్షల ఇళ్లు నిర్మించనున్నాం. కేంద్ర నుంచి అనుమతులు వచ్చేలోపు లేఅవుట్లలో నీరు, విద్యుత్ సరఫరా పనులు చేపడుతున్నాం. అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణం చేపడతాం. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్లకు విద్యుత్, నీటి సరఫరా, ఇతర వసతులు కల్పిస్తున్నాం.- ఎండీ కె.వెంకట రమణారెడ్డి, గృహ నిర్మాణ సంస్థ -
పుట్టింటి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. పుట్టింటి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంది నాకు 2010లో వివాహమైంది. అప్పటి నుంచి చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం నడింపల్లెలో భర్త మంజునాథ్తో కలసి వ్యవసాయ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తుండేవాళ్లం. మాకు ఇద్దరు పిల్లలు. చిన్నోడు కడుపులో ఉండగానే 2020లో నా భర్త అనారోగ్యం బారిన పడ్డాడు. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించినా ఆయనను కాపాడుకోలేకపోయాను. ఒక్కసారిగా నా జీవితం మొత్తం చీకటిగా మారిపోయింది. చిన్న పిల్లలతో ఎలా బతకాలో తెలియని అయోమయంలో పడ్డాను. బతకడానికి ఎన్ని పాట్లు పడాలోనని ఆందోళన చెందాను. అదృష్టవశాత్తు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చింది.అప్పటి నుంచి నా సమస్యలన్నీ పరిష్కారమైపోయాయి. ముఖ్యంగా నా భర్త మరణంతో బీమా రూ.2 లక్షలు నా బ్యాంకు అకౌంటులో వేశారు. కూలి పనులు చేస్తూ బిడ్డలను పోషించుకుంటున్న నాకు ప్రతి నెలా వితంతు పింఛన్ ఇస్తున్నారు. జగనన్న కాలనీలో ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చారు. ఇంటి నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. ఆరో తరగతి చదువుతున్న పెద్ద కొడుకు చరణ్కుమార్కు అమ్మఒడి పథకం కింద ఏటా రూ. 15 వేలు వంతున వస్తోంది. అంగన్వాడీ కేంద్రానికి వెళ్తున్న చిన్నోడు భరత్ పోషణ ప్రభుత్వమే చూస్తోంది. గత ఐదేళ్లలో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో నా కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.8 లక్షలకు పైగానే వచ్చింది. అనుకోని కష్టం వచ్చిన ఆడబిడ్డను పుట్టింటి వారికన్నా గొప్పగా ఈ ప్రభుత్వం ఆదుకుంది. జన్మజన్మలకీ మా జగనన్న మేలు మరువలేను. – చిన్నమ్మయ్య, నడింపల్లె (ఎస్.జి. హరినాథ్, విలేకరి, శాంతిపురం) మా ‘ఇంటి’వేల్పు జగనన్న మాది చాలా పేద కుటుంబం. పశి్చమగోదావరి జిల్లా ఉండి మండలంలోని యండగండి గ్రామంలో నేను ఆటో నడుపుతూ భార్య మాధవి, కుమార్తె శ్రావణి, కుమారుడు దావీదురాజును పోషించుకుంటున్నా. అన్ని రోజులూ గిరాకీ ఉండేది కాదు. వచ్చినపుడు ఏదోలా బతుకు సాగినా... గిరాకీ లేనినాడు నానా తిప్పలూ పడాల్సి వచ్చేది. ఆటోకి ఏదైనా మరమ్మతు వస్తే దానిని బాగు చేయించేందుకు అప్పులు చేయాల్సి వచ్చేది. దానిని తీర్చడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాను. కానీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మా జీవితం మారిపోయింది. నాకు వాహనమిత్ర పథకం ద్వారా ఏటా రూ.పది వేలు అందుతోంది. మా పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదువుతున్నారు. అమ్మాయికి అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ. 15 వేలు వస్తోంది. పిల్లలిద్దరికీ విద్యా కానుక ద్వారా ఉచిత పుస్తకాలు, బూట్లు, బెల్టు, టై అందుతున్నాయి. పాఠశాలలో జగనన్న గోరుముద్ద ద్వారా మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. మాకు ఇల్లు కట్టుకోవడమనేది ఓ కల. ఆటో నడిపే నేను ఇంటి స్థలం ఎలా కొనాలి అనుకునేవాడిని. కానీ జగనన్న ప్రభుత్వం ఇంటి స్థలం నా భార్య పేరుతో ఇవ్వడమే గాకుండా ఇల్లు కట్టుకునేందుకు రూ.1.80 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు నేను సొంత ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడు అద్దె బాధ తప్పింది. మా ఇంట ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు. మాకు ఇంతకంటే ఏం కావాలి.. మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలి. – ఎలకపల్లి శ్రీను, యండగండి (చాలంటి రత్నరాజు, విలేకరి, ఉండి) బతుకు బెంగ తీరింది బార్బర్ వృత్తి మాది. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి గ్రామంలో సెలూన్ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నా. నాతో పాటు భార్య నాగరత్నమ్మ, కుమారుడు జగదీష్ ఉంటున్నారు. సెలూన్పై వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబం మొత్తం గడవాలి. అన్ని రోజులూ ఒకేలా ఉండేవి కాదు. ఆదాయమే లేకుంటే బతకడానికి అప్పులు చేయాల్సి వచ్చేది. రోజొక గండంగా గడిచేది. కానీ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక మా కుటుంబ సమస్యలన్నీ తీరిపోయాయి. బతకడానికి ఎలాంటి బెంగ లేకుండా పోయింది. జగనన్న చేదోడు పథకం కింద నాకు ప్రతి సంవత్సరం రూ.10 వేలు అందుతోంది. ఈ మొత్తంతో సెలూన్ షాపునకు అవసరమైన సామగ్రి తెచ్చుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా కుల వృత్తి చేసుకుంటున్నాను. గతంలో మాకు సొంతిల్లు లేక బాడుగ ఇళ్లలో ఉంటూ ఎన్నో కష్టాలు పడ్డాం. ఈ ప్రభుత్వం మాకు ఇంటి స్థలం మంజూరు చేసింది. రూ.1.80 లక్షల సాయం అందించటంతో సొంతిల్లు నిర్మించుకున్నాం. నా భార్యకు వైఎస్సార్ చేయూత పథకం కింద ఏటా రూ.18,750 అందుతోంది. ఇంటర్మిడియట్ చదువుతున్న నా కుమారుడికి ఏటా రూ.15 వేలు వంతున ‘అమ్మఒడి’ వస్తోంది. ఈ విధంగా మాలాంటి పేదవాళ్ల కోసం అనేక మంచి పథకాలు అమలు చేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నా. – బి.ఆంజనేయులు, మామిళ్లపల్లి (వై.మహదేవరెడ్డి, విలేకరి, కనగానపల్లి) -
ఆరోగ్యశ్రీతో క్యాన్సర్ను జయించా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ఆరోగ్యశ్రీతో క్యాన్సర్ను జయించా నా పేరు బొప్పా నాగలక్ష్మి, నా భర్త శ్రీనివాస్. తాపీ పనిచేస్తారు. మాది పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లి గ్రామం. నాకు 2022లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. గుంటూరులోని క్యాన్సర్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా రేడియేషన్, కీమోథెరపీ చేశారు. ఆరోగ్యశ్రీలో శస్త్ర చికిత్స కూడా చేశారు. సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చయ్యింది. పూర్తిగా ప్రభుత్వమే భరించింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుంది. పూర్తిగా కోలుకున్నాను. ఇటీవల నా భర్త శ్రీనివాస్ ప్రమాదవశాత్తు పడిపోవడంతో కాలు విరిగింది. ప్లేట్లు వేశారు. ఆ తర్వాత ప్లేట్లు కూడా తీసేశారు. ప్రస్తుతం ఇంటివద్దనే విశ్రాంతి తీసుకుంటున్నారు. నాకు వైఎస్సార్ చేయూత పథకంలో మూడుసార్లు ఏడాదికి రూ.18,750 చొప్పున ఆర్థిక సహాయం అందింది. వైఎస్సార్ ఆసరాలో ఏడాదికి రూ.16 వేల చొప్పున మూడుసార్లు నా బ్యాంకు ఖాతాలో డబ్బులు పడ్డాయి. సున్నా వడ్డీ కింద ఏడాదికి రూ.2 వేల చొప్పున అందింది. నవరత్నాల పథకాలు మా కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలిచాయి. నాకు ఇద్దరు సంతానం. ఇద్దరికీ వివాహాలు చేశాను. – బొప్పా నాగలక్ష్మి, పూలపల్లి (కె.శాంతారావు, విలేకరి, పాలకొల్లు అర్బన్) వృద్ధాప్యంలో పింఛనే ఆధారం మాది పేద కుటుంబం. నా భర్త చాలా కాలం క్రితం మృతి చెందారు. నాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పిల్లలందరికీ వివాహం చేశాను. ఎవరి కుటుంబాలను వారు పోషించుకుంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాకే నాకు వితంతు పింఛన్ మంజూరైంది. ఇప్పుడు రూ.3 వేలు ఇస్తున్నారు. వృద్ధాప్యంలో ఈ సొమ్ము ఎంతగానో ఉపయోగపడుతోంది. మాది అనకాపల్లి జిల్లా మునగపాక మండల కేంద్రం. సొంతిల్లు లేకపోవడంతో దరఖాస్తు చేసిన వెంటనే ఇల్లు మంజూరైంది. ఇప్పుడు సొంతింట్లోనే ఉంటున్నాను. ఉపాధి హామీ పథకంలో కూలి పనులకు కూడా వెళుతుంటాను. నా లాంటి వృద్ధులను సీఎం జగన్మోహన్రెడ్డి పెద్ద కొడుకులా ఆదరిస్తున్నారు. నాకు వచ్చే పింఛన్ను కుటుంబ అవసరాలు, మందులకు వినియోగించుకుంటున్నా. పొద్దు పొడవక ముందే ప్రతి నెలా ఒకటో తారీఖునే వలంటీర్ వచ్చి పింఛన్ అందజేయడం సంతోషంగా ఉంది. – గుదే పార్వతి, మునగపాక (వెలగా జగదీష్కుమార్, విలేకరి, మునగపాక) ఈ మేలును జీవితాంతం మరవం భార్యాభర్తలిద్దరం పని చేస్తేగానీ పూట గడవని కుటుంబం మాది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారింది. మాది వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని హనుమాన్నగర్. నా భర్త తిరుమలేశు ఇక్కడే ఓ వస్త్ర దుకాణంలో గుమస్తాగా పని చేసేవాడు. నేను భాగ్యలక్ష్మి స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిని. మా సంఘం రూ.10 లక్షలు రుణం తీసుకుంది. ఈ ప్రభుత్వంలో వైఎస్సార్ ఆసరా ద్వారా ఆ రుణం నాలుగు విడతల్లో మాఫీ అయింది. గతంలో మేము మగ్గం నేసేవాళ్లం. అప్పుడు వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా ఏడాదికి రూ.24 వేలు చొప్పున మూడేళ్లు రూ.72 వేలు అందుకున్నాం. కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగు పడ్డాక చేనేత వృత్తిని వీడి, ప్రస్తుతం ఇంటి వద్ద బియ్యం వ్యాపారం చేస్తున్నాం. మా అమ్మాయి కళావతి బీటెక్ పూర్తి చేసి, ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ఆమెకు మూడేళ్లపాటు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా రూ.లక్షకు పైగా లబ్ధి చేకూరింది. కుమారుడు జయకృష్ణకు ఇంటర్లో అమ్మఒడి ద్వారా రూ.30 వేలు లబ్ధి చేకూరింది. ప్రస్తుతం బీటెక్ డేటా సైన్స్లో చేరాడు. గతంలో మా ప్రాంతానికి తాగునీరు వచ్చేది కాదు. ఇప్పుడు రోజూ ఇంటి వద్దకే నీటి సరఫరా జరుగుతోంది. జగనన్న పాలనలో మా కుటుంబం ఆర్థికంగా స్థిరపడింది. దిగుల్లేదిక. ఈ ప్రభుత్వం మేలును జీవితాంతం గుర్తుంచుకుంటాం. – తనికంటి లక్ష్మీదేవి, ప్రొద్దుటూరు (కుడుముల వీరారెడ్డి, విలేకరి, ప్రొద్దుటూరు) -
వెలుగులు నింపిన నవరత్నాలు...మాట ఇచ్చాడు..చేసి నిరూపించాడు
-
అప్పు చేయాల్సిన అవసరమే లేదు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. అప్పు చేయాల్సిన అవసరమే లేదు మా కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తోంది. నాకు ఒకటిన్నర ఎకరాల పొలం ఉంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం యరకన్నపాలెంలోని మా పొలాల పక్కనే తాండవ జలాశయం కాలువ పారుతుండటంతో నీటికి ఇబ్బంది లేదు. నీటి వసతి ఉండటంతో ఏటా వరి పంట వేస్తుంటాం. 30 సెంట్లలో జీడిమామిడి తోట ఉంది. మిగిలిన ఎకరా 20 సెంట్లలో వరి పంట వేశాను. జీడి తోట సంవరక్షణ, వరికి నాట్ల దగ్గర నుంచి కోతకోసే వరకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు ఖర్చవుతుంది. ఈ ప్రభుత్వం రాకమునుపు వ్యవసాయ పెట్టుబడికి అప్పుచేయాల్సి వచ్చేది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున వస్తుండటంతో పెట్టుబడికి ఇబ్బంది లేదు. వరి పంట కోత దశకు వచ్చింది. ఈ సమయంలో రైతు భరోసా కింద రూ. 4 వేలు పడింది. ఈ డబ్బు కోత పనులకు ఉపయోగపడుతుంది. నా భార్య రామలక్ష్మి కి వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.13 వేలు వచ్చింది. గుంటూరు ప్రైవేటు కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న నా కుమారుడు ప్రవీణ్కుమార్కు జగనన్న విద్యా దీవెన ద్వారా ఏటా రూ.55 వేల వంతున వచ్చింది. గుడ్ల వల్లేరు ఏఏఎన్ఎం కాలేజీలో డిప్లమా ఫైనల్ ఇయర్ చదువుతున్న మా అమ్మాయి శ్రావణికి ఏటా రూ.25 వేల వంతున వచ్చింది. జగనన్న ప్రభుత్వంలో పైసా ఖర్చు లేకుండా ఇద్దరు బిడ్డలను ప్రైవేటు కళాశాలలో చదివించుకుంటున్నాను. అప్పు కోసం తిరగాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఈ ప్రభుత్వంలో జరిగిన మేలు మరువలేను. – రుత్తల సాంబశివరావు, రైతు, యరకన్నపాలెం (ఏనుకూరి అప్పారావు, విలేకరి, నర్సీపట్నం, అనకాపల్లి జిల్లా) సొంతిల్లు కల్పించిన జగనే మా దేవుడు మా సొంతూరు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు. ఆర్ఎంపీగా జీవనం సాగిస్తున్నాను. 26 ఏళ్ల కిందట ఉపాధి కోసం అనంతపురం జిల్లాకు వలస వచ్చా. నాకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఉరవకొండ, విడపనకల్లు, అనంతపురం రూరల్ మండలం కందుకూరు తదితర ప్రాంతాల్లో పనిచేశా. ప్రస్తుతం కందుకూరు గ్రామంలో స్థిరపడ్డా. పిల్లలు పెద్దయ్యేకొద్ది ఖర్చులు పెరుగుతూ వచ్చాయి. వచ్చే సంపాదనంతా ఇంటి అద్దెలు, కుటుంబ నిర్వహణకే సరిపోయేది. సొంతగూడు కట్టుకోవాలని కలలు కనేవాడిని. ప్రతీరోజూ ఆ దేవుడ్ని మొక్కుకునేవాడిని. బాడుగ డబ్బు చెల్లించడంలో కాస్తా ఆలస్యమైతే చాలు ఇల్లు ఖాళీ చేయమనేవారు. ఇంతకుముందు ఎక్కడా అరసెంటు కూడా లబ్ధి పొందలేదు. మహానుభావుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత కందుకూరు జగనన్న లే అవుట్లో సెంటున్నర స్థలం ఇచ్చారు. ప్రస్తుతం ఈ స్థలం విలువ రూ.5 లక్షల దాకా ఉంది. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు మంజూరు చేయడంతో ఇల్లుకూడా నిర్మించుకున్నా. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసేశా. నా కొడుకుకు సచివాలయ ఉద్యోగం వచ్చింది. ఇంజినీరింగ్ అసిస్టెంట్గా అనంతపురంలో పనిచేస్తున్నాడు. ఇంతకంటే ఇంకేమి కావాలి? అందుకే నా ఇంట్లో దేవుని గూటిలో మా నాయన ఫొటో పెట్టుకోలేదు కాని వైఎస్ జగన్ ఫొటో పెట్టుకుని పూజిస్తున్నా. – సీహెచ్ గోవిందరెడ్డి, కందుకూరు (రిపోర్టర్: బొడ్డు నగేష్, అనంతపురం ఎడ్యుకేషన్) వృద్ధాప్యంలో ఈ ప్రభుత్వమే పోషిస్తోంది నేను వృద్ధురాలిని..ఒంటరి మహిళను. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం బాపులపాడులో వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాను. రెక్కాడితే కాని డొక్కాడని జీవితం నాది. వయోభారంతో కూలీ పనులు చేసే ఓపిక లేకపోవటంతో బతుకు భారంగా మారింది. ఆదాయం లేకపోవటంతో డ్వాక్రా గ్రూపు ద్వారా తీసుకున్న బ్యాంకు రుణం చెల్లించటం కష్టంగా మారింది. ఇలాంటి తరుణంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నన్ను భగవంతుడిలా ఆదుకుంది. ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మనోధైర్యాన్ని ఇచ్చాయి. వైఎస్సార్ చేయూత, ఆసరా, రైతు భరోసా, వైఎస్సార్ ఫించన్ కానుక పథకాలతో పెద్ద కొడుకుగా జగన్ నన్ను ఆదుకున్నాడు. వృద్ధాప్య ఫించన్తో పాటు ఏటా నాలుగు సంక్షేమ పథకాల ద్వారా బ్యాంకు ఖాతాలో నగదు జమ అవుతోంది. ప్రతి నెల ఒకటో తేదీనే వలంటీర్ ఇంటికి వచ్చి నాకు రూ.3 వేలు వృద్దాప్య పింఛన్ అందిస్తున్నారు. ఆసరా పథకం క్రింద రూ.30 వేలు డ్వాక్రా రుణమాఫీ చేశారు. వైఎస్సార్ చేయూత కింద ఏటా రూ.18,750, రైతు భరోసా కింద ఏటా రూ.13,500 అందుతున్నాయి. దీంతో ఎవ్వరిపైనా ఆధార పడకుండా ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తున్నాను. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు నెలకు సరిపడా అందిస్తున్నారు. జగనన్న రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. – జోగి లక్ష్మి, బాపులపాడు చలమలశెట్టి శ్యామ్, విలేకరి, హనుమాన్జంక్షన్ -
సుధాకర్ బాబు కుటుంబాన్ని ఆదుకున్న 'నవరత్నాలు'
-
ఆరోగ్యశ్రీ బతికించింది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ఆరోగ్యశ్రీ బతికించింది ఒకరోజు ఒంట్లో బాగోలేదని ఆసుపత్రుల చుట్టూ తిరిగా. వైద్యులు క్యాన్సర్ అని చెప్పారు. నేను చదువుకోలేదు. వయస్సు మీదపడటం, నిరక్షరాస్యతతో ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. నా కుమారుడు ఏసుబాబు కూడా చదువుకోలేదు. స్థానిక ఏఎన్ఎం కౌసల్య ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందవచ్చని చెప్పారు. నా పేరు వాసిరెడ్డి సుబ్బాయమ్మ. మా ఊరు పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని చినకాపవరం. నేను, నా కొడుకు విజయవాడలోని క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్లాం. ఆరోగ్య శ్రీ కార్డు ద్వారా వైద్యం చేస్తామని చెప్పారు. వైద్యం ప్రారంభించి ఇప్పటికి ఆరుసార్లు కీమో థెరపీ చేశారు. ఏడోసారి ఫిబ్రవరి 15న రమ్మన్నారు. నేను పౌష్టికాహారం తినేందుకు రోజుకు రూ.250 చొప్పున నా బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం రూ.5 వేలు జమ చేసింది. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు మావి. నా భర్త చనిపోయాడు. కొడుకు కూలి పనికి వెళ్లి నన్ను పోషిస్తున్నాడు. మనవరాలికి అమ్మఒడి వస్తోంది. కోడలికి ఆసరా ద్వారా లబ్ధి కలిగింది. నాకు వితంతు పింఛన్ నెలకు రూ.3 వేలు వస్తోంది. ప్రస్తుతం ఆరోగ్యం కుదుట పడుతోంది. ఆరోగ్యశ్రీ నన్ను బతికించింది. పెద్ద కొడుకులా ఆదుకున్న సీఎం జగన్కు రుణపడి ఉంటాను. – వాసిరెడ్డి సుబ్బాయమ్మ, చినకాపవరం (బీఆర్ కోటేశ్వరరావు, విలేకరి, ఆకివీడు) మలి వయసులో నడి‘పించెన్’ నా పేరు కుపిలి సూర్యారావు. మాది ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం యర్రమిల్లిపాడు. నాకు 74 సంవత్సరాలు. వ్యవసాయ కూలి పనులు చేసే నేను ఇప్పుడు ఏ పనులకూ వెళ్లలేకపోతున్నా. నా పిల్లల పెళ్లిళ్లు చేశాక ఎవరి దోవన వారు వెళ్లిపోయారు. మిగిలింది నేను, నా భార్య. ఇద్దరమూ ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్నాం. నేను వైకల్యంతో కదల్లేని స్థితిలో ఉన్నా. ఈ తరుణంలో జగన్ ప్రభుత్వం రావడం మా అదృష్టమని చెప్పాలి. ప్రభుత్వం రావడంతోనే అమలు చేసిన నవరత్నాలు మాకు ఎంతో ఆసరా అయ్యాయి. నేను, నా భార్య ప్రభుత్వం అందించే పథకాలతోనే బతుకుతున్నాం. నాకు డీఎంహెచ్ఓ పింఛన్ నెలకు రూ.5 వేలు వస్తోంది. నా భార్యకు వృద్ధాప్య పింఛను రూ.3 వేలు, అభయహస్తం పింఛను రూ.500 కలిపి మొత్తం ప్రతి నెలా రూ.8500 వస్తున్నాయి. వలంటీరు ఇంటికి తీసుకువచ్చి ఆ డబ్బు ఇస్తున్నారు. ఈ డబ్బుతోనే మేము జీవిస్తున్నాం. సీఎం జగన్కు ధన్యవాదాలు. మళ్లీ ఆయనే సీఎంగా రావాలి. – కుపిలి సూర్యారావు, యర్రమిల్లిపాడు (పాండ్రాకుల వెంకట పెద్దిరాజు, విలేకరి, ఉంగుటూరు) మా ఆనందం చెప్పలేనిది మేము కృష్ణా జిల్లా పెడన పట్టణంలోని ఏడో వార్డు వీరభద్రపురంలో ఉంటున్నాం. నా పేరు వాసా నాగలక్ష్మి. నేత కారి్మకురాలిని. నా భర్త పేరు శ్రీనివాసరావు. 30 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే జీవిస్తున్నాం. జగనన్న ప్రభుత్వం వచ్చాక నేతన్న నేస్తం పథకం కింద ఏటా రూ.24 వేల చొప్పున ఐదేళ్లు రూ.1.20 లక్షలు నేరుగా నా బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. మా అమ్మాయి పావన సాయి నాగ మల్లేశ్వరికి ఇంటర్మిడియట్లో అమ్మఒడి ద్వారా రూ.15 వేలు చొప్పున, డిగ్రీలో విద్యాదీవెన కింద రూ.35 వేల వరకు వచ్చాయి. నాకు ఆసరా కింద ఏటా రూ.16,300 చొప్పున వచ్చింది. పట్టణంలోని పల్లోటి లే అవుట్–1లో ఇంటి పట్టా ఇచ్చారు. రూ.1.80 లక్షలతో ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేసుకున్నాం. త్వరలో గృహ ప్రవేశం చేసి ఆ ఇంట్లోకి వెళ్లడానికి ముహూర్తం చూస్తున్నాం. నాకు ప్రమాదం జరిగి చేయి విరిగితే ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేయించుకున్నా. ఆ సమయంలో రూ.35 వేలు ఖర్చయింది. దానిని ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఆస్పత్రికి చెల్లించింది. విశ్రాంతి సమయంలో కూడా ఆరోగ్య ఆసరా కింద రెండు నెలలకు రూ.10 వేలు ఇచ్చారు. మా ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయి. చాలా సంతోషంగా ఉన్నాం. జగనన్నకు కృతజ్ఞతలు. మళ్లీ ఆయనే రావాలి. – వాసా నాగలక్ష్మి, పెడన (ఎన్.గంగాధరరావు, విలేకరి, పెడన) -
సొంతంగా చీరలు నేస్తున్నా..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. సొంతంగా చీరలు నేస్తున్నా.. నా భర్త మహదేవ్ టైలరింగ్ చేస్తారు. రోజుకు రూ.500 నుంచి 600 ఆదాయం వస్తుంది. ఇద్దరు పిల్లలు. సౌమ్య, స్వామి సమర్థ. అమ్మాయి కాలం చేసింది. స్వామి సమర్థ ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఇంటి అద్దె రూ.2,800 చెల్లిస్తున్నాం. ఒకరి ఆదాయంతో ఇల్లు నడపడం కష్టంగా ఉండేది. దాంతో చీరలు నేసే కూలి పనికి వెళ్లేదాన్ని. రోజుకు రూ.200 ఇచ్చేవారు. మా ఆయన ఆదాయానికి నా కూలి తోడవడంతో కొన్ని ఇబ్బందులు తొలిగిపోయాయి. మా వృత్తి చీరలు నేయడం. ఇంట్లో మగ్గం ఉన్నా నేయడానికి అవసరమైన పరికరాలు లేవు. వీటిని కొనుగోలు చేయాలంటే కనీసం రూ.30 వేలు ఉండాలి. ముడి సరుకు కొనాలన్నా రూ.30 నుంచి 40 వేలు ఉండాలి. ఈ ప్రభుత్వం వచ్చాక నేతన్న నేస్తం కింద ప్రతి ఏటా రూ.24,000 మంజూరు చేస్తున్నారు. ఈ సొమ్ముతో మగ్గం పరికరాలు, ముడి సరుకులు సమకూర్చుకున్నాం. ఇంటి పనులయ్యాక తీరిక సమయంలో చీరలు నేస్తుంటాను. ఒక్కో చీరపై ఖర్చులు పోను రూ.400 నుంచి 500 వస్తుంది. పొదుపు సంఘంలో ఉండడంతో రూ.10 వేలు రుణం అందింది. అబ్బాయికి ఏటా అమ్మ ఒడి పథకం కింద రూ.15,000 పడుతోంది. దీంతో పిల్లాడి చదువు బెంగ తీరింది. ఈ ప్రభుత్వం అందించిన సహకారంతో నలుగురిలో గౌరవంగా బతుకుతున్నాం. – కామ్లె సరోజమ్మ, ఆదోని (ఇ.సుంకన్న, విలేకరి, ఆదోని) నాకు ప్రాణభిక్ష పెట్టారు మా అమ్మా నాన్నలు పాప, యల్లావుల శ్రీను.. బాపట్ల జిల్లా చినగంజాం మండలం పెదగంజాం పంచాయతీలోని పల్లెపాలెం గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. మేము ముగ్గురం అమ్మాయిలమే. నేను రెండో కుమార్తెను. 2022లో పదో తరగతి చదువుతున్న సమయంలో నాకు కాలేయ సంబంధిత వ్యాధి వచ్చింది. చదువు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. సకాలంలో వైద్యం చేయాలని, లేకుంటే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పారు. మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో నాకు వచ్చిన వ్యాధి పరిస్థితిని వివరిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నాం. సీఎం కార్యాలయం అధికారులు నాకు రూ.10 లక్షలు ముఖ్యమంత్రి తక్షణ సహాయ నిధి నుంచి మంజూరు చేశారు. హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో నాకు కాలేయానికి సంబంధించిన శస్త్ర చికిత్స నిర్వహించారు. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుపడింది. సీఎం జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని నేను సకాలంలో వైద్యం చేయించుకోగలిగాను. నాకు ప్రాణభిక్ష పెట్టిన మావయ్యగా జగన్ ఎప్పటికీ నా మదిలో నిలిచిపోతారు. ప్రస్తుతం నేను ఉప్పుగుండూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాను. నాకు ప్రతి ఏటా అమ్మ ఒడి పథకం కింద నిధులు మంజూరయ్యాయి. మా అమ్మకు వైఎస్సార్ ఆసరా కింద డబ్బులు రావడంతో అప్పులు చేయకుండానే కుటుంబం గడుస్తోంది. పెదగంజాం జగనన్న కాలనీలో ఇంటి స్థలం కూడా ప్రభుత్వం కేటాయించింది. పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – యల్లావుల మేఘన, పెదగంజాం (పల్లపోలు శ్రీనివాసరావు, విలేకరి, చినగంజాం) నా షాపు ఆదాయం పెరిగింది నేను బార్బర్ పని చేస్తుంటా. పార్వతీపురం పట్టణంలో ఓ చిన్న సెలూన్ షాపు పెట్టుకుని దానిపై వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడిని. గత టీడీపీ ప్రభుత్వం మా లాంటి కులవృత్తిదారుల కష్టాలు పట్టించుకునేది కాదు. కనీసం మా వైపు కన్నెత్తి చూసేది కాదు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక చేదోడు పథకం కింద ఏటా రూ.10 వేలు ఇస్తుండటంతో షాపును ఆధునికంగా తీర్చిదిద్దాను. దీంతో కస్టమర్ల సంఖ్య పెరిగింది. ఆదాయం వస్తోంది. మా నాన్న కూర్మారావుకు వైఎస్సార్ పింఛన్ కానుక కింద నెలకు రూ.3 వేలు అందుతోంది. మా అమ్మ లక్ష్మమ్మకు వైఎస్సార్ చేయూత కింద ఏటా రూ.18,750 చొప్పున మూడు విడతల్లో 56,250 అందింది. అమ్మ పేరున జగనన్న కాలనీలో ఇంటి స్థలం మంజూరైంది. నిర్మాణానికి రూ.1.80 లక్షల సాయంతో పాటు నిర్మాణ సామగ్రిని రాయితీపై సమకూర్చింది. ఇసుక ఉచితంగా అందిస్తోంది. ఇదంతా జగనన్న దయ. ఆయనకు మా కుటుంబం రుణపడి ఉంటుంది. – అలజంగి రవికుమార్, పార్వతీపురం (ఆశపు జయంత్కుమార్, విలేకరి, పార్వతీపురం టౌన్) -
సొంతింటి కల నెరవేరింది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. సొంతింటి కల నెరవేరింది కూలి పని చేసుకొని బతుకు బండి లాగుతున్నాం. తద్వారా వచ్చిన డబ్బుల్లో సగం అద్దెలు కట్టేందుకే సరిపోయేది. ఇక సొంతిల్లు కలగానే మిగిలిపోతుందనుకున్నాం. మాది గుంటూరు జిల్లా చిలకలూరిపేట. బతుకుతెరువు కోసం 20 ఏళ్ల క్రితం బాపట్ల జిల్లా జె.పంగులూరుకు వలస వచ్చాం. నా భర్త సుబానీ ఆటో అద్దెకు తీసుకుని నడుపుతుంటారు. నేను టైలరింగ్ చేస్తాను. మాకు ఇద్దరు పిల్లలు. సొంత ఇల్లు లేకపోవడంతో 15 ఏళ్లుగా అద్దె ఇళ్లల్లోనే ఉన్నాం. ఇద్దరం సంపాదించిన డబ్బుతో కుటుంబం గడవడమే కష్టంగా ఉండేది. ఇంటి అద్దె కోసం నానా తిప్పలు పడాల్సి వచ్చేది. పస్తులుండి అద్దెలు కట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. గత ప్రభుత్వం మా కష్టాలను పట్టించుకోలేదు. ప్రజా ప్రతినిధులూ కన్నెత్తి చూడలేదు. కష్టాలతో సహవాసం చేస్తున్న సమయంలో వైఎస్సార్ïÜపీ ప్రభుత్వం వచ్చింది. నవరత్నాల్లో భాగంగా ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోగానే వలంటీరు వచ్చి స్థలం వచ్చిందని చెప్పాడు. మా సంతోషానికి ఎల్లలు లేవు. ఇల్లు కూడా మంజూరు కావడంతో ప్రభుత్వం రూ.1.80 లక్షలు అందించింది. ఆ డబ్బుతో ఇల్లు కట్టుకున్నాం. కాలనీలో మొట్టమొదటి ఇల్లు మాదే. ఇప్పుడు అందులోనే పిల్లలతో కలిసి ఆనందంగా ఉంటున్నాం. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న సొంతింటి కల నెరవేరింది. మా అమ్మాయి ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. మూడేళ్లు అమ్మ ఒడి కింద రూ.45 వేలు రావడంతో అమ్మాయి చదువు కోసం ఎటువంటి ఇబ్బంది పడలేదు. మాకు ఇప్పుడు ఏ చీకుచింతా లేదు. – షేక్ నన్నేబీ, జె.పంగులూరు (అడుసుమల్లి సోమ శ్రీనివాసరావు, విలేకరి, అద్దంకి) ఉపాధికి ఆసరా తోడైంది మాది చాలా పేద కుటుంబం. నా భర్త షేక్ అబ్దుల్లా కార్ డ్రైవర్. నేను గుంటూరు జిల్లా తెనాలిలో ఇంట్లోనే టైలరింగ్ చేస్తుంటా. ఇద్దరి కష్టంతో వచ్చే అరకొర ఆదాయంతోనే కుటుంబం గడిచేది. మాకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి సానియా రుక్సానా అయిదో తరగతి, చిన్న కూతురు ముస్కాన్ నాలుగో తరగతి చదువుతున్నారు. మా అమ్మ కూడా మాతోనే కలిసి ఉంటోంది. అయిదుగురు సభ్యుల కుటుంబం. మా సంపాదనతో రోజూ జీవనం గడవటమే కష్టంగా ఉండేది. ఇద్దరు పిల్లల్ని బాగా చదివించగలమా? అన్న ఆందోళనతో ఉండేవాళ్లం. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మా జీవితం మారిపోయింది. వైఎస్సార్ ఆసరా పథకం మా కుటుంబాన్ని ఆదుకుంది. ఏడాదికి రూ.12 వేల చొప్పున నాలుగు విడతలుగా రూ.48 వేలు వచ్చాయి. ఇదే పథకం కింద మా అమ్మకు కూడా రూ.48 వేలు వచ్చింది. ఇద్దరికీ కలిపి ప్రభుత్వం రూ.96 వేలు మా ఖాతాల్లో జమ చేసింది. వైఎస్సార్ చేయూత ద్వారా ఏడాదికి రూ.18,750 వంతున అందుతోంది. ఆ డబ్బుతో నాకున్న సాధారణ కుట్టుమెషీన్ అమ్మేసి, అధునాతన మెషీన్ కొనుక్కున్నా. నూతన మోడల్స్తో విభిన్నంగా మహిళల వస్త్రాలు కుడుతుండడంతో పనులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. దీనికితోడు టైలరింగ్ మెటీరియల్ కూడా విక్రయిస్తున్నా. ఇప్పుడు నా ఆదాయం పెరిగింది. త్వరలోనే మెయిన్బజార్లో టైలరింగ్ దుకాణం ప్రారంభించాలని సన్నాహాలు చేసుకుంటున్నా. పెద్దమ్మాయికి అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేలు వస్తోంది. దానివల్ల పిల్లల్ని ఇబ్బంది లేకుండా చదివించుకోగలుగుతున్నాం. గతంలో మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక మా పరిస్థితి మెరుగు పడింది. ఇందుకు కారకులైన జగన్మోహన్రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – షేక్ ఫాతిమున్నీసా, తెనాలి(బి.ఎల్.నారాయణ, విలేకరి, తెనాలి) ఆరోగ్యశ్రీతో పునర్జన్మ నేను వెల్డింగ్ పని చేస్తూంటా. రోజూ పనికెళ్తేనే మాకు పూట గడిచేది. ఏలూరు జిల్లా మండవల్లి గ్రామంలో భార్య నాంచారమ్మ, ఇద్దరు పిల్లలనూ అరకొర ఆదాయంతోనే పోషించుకుంటున్నా. గత ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సాయం అందలేదు. అతి కష్టంగా జీవనం సాగించాల్సి వచ్చింది. అంతలో ఓ రోజు నాకు అనారోగ్యం చేసింది. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తే నా గుండెకు స్టంట్లు వేయాలని డాక్టర్లు చెప్పారు. రోజంతా కష్టపడితే వచ్చిన మొత్తం కుటుంబ పోషణకే సరిపోతుంది. స్టంట్లు వేయించుకునే ఆర్థిక స్తోమత లేదు. ఇంతలో మా ఏఎన్ఎం ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తుందని చెప్పింది. వెంటనే విజయవాడలోని సెంటిని ఆస్పత్రిలో చేరగా 2022 ఆగస్టు 23న గుండెకు రెండు స్టంట్లు వేశారు. దీనికైన ఖర్చు రూ.3 లక్షలు మొత్తం ప్రభుత్వమే భరించింది. ప్రభుత్వం నాకు పునర్జన్మ ప్రసాదించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నా భార్యకు వైఎస్సార్ ఆసరా పథకం కింద ఏడాదికి రూ.18 వేలు వంతున అందింది. నాకు వైఎస్సార్ పింఛను కానుక కింద నెలకు రూ.3 వేలు ఒకటో తేదీనే వలంటీరు ఇంటికొచ్చి ఇస్తోంది. నా మనుమరాలు 8వ తరగతి చదువుతోంది. తనకు అమ్మఒడి పథకం ద్వారా ఏటా రూ.13 వేలు వస్తోంది. మా కోడలికి ఆసరా ద్వారా ఏటా రూ.14 వేలు వచ్చింది. మా కుటుంబానికి ఇంత మేలు చేస్తున్న జగన్ మేలు ఎన్నటికీ మరువలేము. – బోయిన నారాయణరావు, మండవల్లి (బోగాది వెంకట వీరాంజనేయులు, మండవల్లి) -
మా బతుకులకు భరోసా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. మా బతుకులకు భరోసా బతుకు తెరువు కోసం వలస వచ్చిన జీవితాలు మావి. నెల్లూరు జిల్లా జలదంకి మండలం శ్యామాదల గ్రామం నుంచి పొట్ట చేతపట్టుకుని 2015లో కడపకు వచ్చాం. మా ఆయన వేణుగోపాల్రెడ్డి కడప నగరంలో ఆటో నడుపుతారు. నేను కుట్టు మెషీన్పై దర్జీ పని చేస్తాను. మాకు రమాశ్రీ రెడ్డి, లక్ష్మీశ్రీ రెడ్డి అనే ఇద్దరు కవల పిల్లలు. 8వ తరగతి చదువుతున్నారు. మా అరకొర సంపాదనతోనే ఇంటి అద్దె చెల్లిస్తూ, ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ అతి కష్టంగా బతుకు వెళ్లదీస్తున్నాం. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మా బతుకులకు భరోసా కలిగింది. కడప నగర శివారు ఆచార్య కాలనీ వద్దనున్న జగనన్న కాలనీలో సెంటున్నర స్థలాన్నిచ్చారు. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఆర్థిక సాయం మంజూరు చేశారు. ప్రస్తుతం శ్లాబ్ వేశాం. దీనికి సంబంధించి బిల్లులు కూడా చెల్లించారు. వీలైనంత వేగంగా ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేస్తాం. మాలాంటి మధ్య తరగతి వారు అరకొర సంపాదనతో సొంతింటి కల నెరవేర్చుకోవడం జీవితంలో జరిగే పని కాదు. జగనన్న పుణ్యమా అని మా సొంతింటి కల నేరవేరబోతోంది. చాలా సంతోషంగా ఉంది. మా అమ్మాయి రమాశ్రీ రెడ్డికి ఏటా అమ్మ ఒడి కింద రూ.15 వేలు వస్తోంది. డ్వాక్రా రుణ మాఫీ ద్వారా నాకు రూ.4,200 లబ్ధి చేకూరింది. జగనన్న చేదోడులో ఏటా రూ.10 వేలు చొప్పున మూడేళ్లలో రూ.30 వేలు నా బ్యాంకు ఖాతాలో జమ అయింది. ఆరోగ్యశ్రీలో నాకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఆపరేషన్ జరిగింది. ఇందుకు ప్రభుత్వం రూ.30 వేలు ఆస్పత్రికి చెల్లించింది. వైఎస్సార్ వాహన మిత్ర పథకంలో నా భర్తకు నాలుగేళ్లలో రూ.40 వేలు లబ్ధి చేకూరింది. మేం ఇంత ఆనందంగా బతుకుతున్నామంటే ఈ ప్రభుత్వమే కారణం. – చిలకల లక్ష్మీప్రసన్న, కడప (గోసల యల్లారెడ్డి, విలేకరి, కడప) పక్క ఊరిలోనే ఉద్యోగావకాశం మాది సామాన్య వ్యవసాయ కుటుంబం. ఎంతో కష్టపడి మా నాన్న నన్ను బీఎస్సీ నర్సింగ్ చదివించారు. ఆ చదువు పూర్తయ్యాక ఎప్పుడు ఉద్యోగం వస్తుందో.. ఎంత దూరంలో వస్తుందోనని ఆందోళన చెందాను. అయితే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రూపకల్పన చేసిన ‘వైఎస్సార్ విలేజ్ క్లీనిక్’ వ్యవస్థ వల్ల శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నరసింగపల్లి పక్కనున్న గూడేం గ్రామంలో ఎంఎల్హెచ్పీ(మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్) ఉద్యోగం వచ్చింది. 2022 ఫిబ్రవరిలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేశాను. మే నెలలో ఉద్యోగం వచ్చింది. ఒకప్పుడు జిల్లాలు దాటి ఉద్యోగావకాశాల కోసం వెళ్లాల్సి వచ్చేది. వైఎస్సార్ విలేజ్ క్లినిక్ వ్యవస్థతో మా గ్రామం పక్కనే ఉద్యోగం రావడం ఎంతో ఆనందంగా ఉంది. నా జీతం మా కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చగలుగుతోంది. ఇలాంటి వ్యవస్థ వల్ల నాలాంటి ఎంతో మంది యువతకు సొంత మండలంలోనే ఉద్యోగాలు వస్తున్నాయి. – సింగుపురం ఈశ్వరి, గూడేం (లింగూడు వెంకటరమణ, విలేకరి, టెక్కలి) ‘మెట్ట’నింట జలకళ మాది వ్యవసాయ కుటుంబం. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం జలపవారిగూడెంలో మాకున్న సుమారు మూడు ఎకరాల భూమిలో మా బంధువైన నక్క డేవిడ్, నేను కలిసి వైఎస్సార్ జలకళ పథకం ద్వారా ఉచితంగా బోరు వేయించుకున్నాం. ఇప్పుడు ఆనందంగా వ్యవసాయం చేస్తున్నాం. కొంత మంది టీడీపీ నాయకులు ప్రభుత్వం అందించిన 10 హెచ్పీ మోటార్ మెట్ట ప్రాంతానికి ఎలా సరిపోతుందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం కంటితుడుపుగా రైతులను మోసం చేయడానికి ఈ పథకం పెట్టిందని, ఇది దండగని ఎగతాళి చేసి మాట్లాడారు. కానీ ఇప్పుడు మోటార్ నుంచి మూడు అంగుళాల నీళ్లు పోస్తుంటే, నవ్వినోళ్లే అవాక్కవుతున్నారు. మా కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. మా కష్టాలు తీరాయి. దీంతోపాటు నాకు రైతు భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ.13,500 అందడంతోపాటు, నా భార్యకు డ్వాక్రా ద్వారా సున్నా వడ్డీ లబ్ధి చేకూరింది. గత టీడీపీ ప్రభుత్వంలో మాకు ఎటువంటి సహాయం అందలేదు. మా కుటుంబానికి మేలు చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. – నక్కా దుర్గయ్య, జలపవారిగూడెం (యు.లక్ష్మీనారాయణ, విలేకరి, కామవరపుకోట) -
సమాజంలో మా గౌరవం పెరిగింది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. భయం పోయి ప్రశాంతంగా చదువుకుంటున్నా.. నేను కర్నూలు కృష్ణానగ ర్లో మా తాత, అమ్మ సంరక్షణలో ఉంటున్నా. అమ్మ షేక్ స్వాలేహా బేగం ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్. నెలకు రూ.10 వేలు వేతనం. తాత షేక్ సర్దార్ పటేల్ రిటైర్డు ప్రైవేటు ఉద్యోగి. అమ్మ ఆదాయంతో ఇల్లు గడవడం కష్టమే. ఈ పరిస్థితుల్లో నా చదువుపై బెంగ పెట్టుకున్నా. ఇంటరీ్మడియట్లో 93 శాతం మార్కులు, ఏపీ ఈఏపీ సెట్లో 15వేల ర్యాంకు సాధించా. ఇంటి ఆరి్థక పరిస్థితుల దృష్ట్యా పై చదువులు ఎలా చదవాలో అర్థం కాలేదు. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేవుడిలా ఆదుకుంది. స్థానిక రవీంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్లో బీటెక్(సీఎస్ఈ)లో జాయిన్ అయ్యా. ఫీజు రీయింబర్స్మెంట్ నాకు వర్తించింది. జగనన్న విద్యా దీవెన కింద మూడేళ్ళకు రూ.1.05 లక్షలు, వసతి దీవెన కింద రూ.30 వేలు విడుదలయ్యాయి. ఫీజుల భయం పోయింది. ప్రశాంతంగా చదువుకుంటున్నాను. ఇప్పుడు ఫైనలియర్ బీటెక్. క్యాంపస్ సెలక్షన్లో అసెంచర్ కంపెనీలో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగానికి ఎంపికయ్యా. ఏడాదికి రూ.6.5లక్షల వేతనం. మా అమ్మగారికి వైఎస్సార్ చేయూత కింద ఏటా రూ. 18,750లు వంతున వచ్చింది. ప్రభుత్వం మాలాంటి పేద, మధ్య తరగతి విద్యార్థులను ఇలా ఆదుకోవడంతో చాలా మందికి మంచి ఉద్యోగావకాశాలు లభించాయి. నేను, కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉన్నారు. సీఎం సర్కు ధన్యవాదాలు. – తయ్యిభా ఫాతిమా, బీటెక్ విద్యారి్థ, క్రిష్ణానగర్ (జి.రాజశేఖర్నాయుడు, విలేకరి, కర్నూలు అర్బన్) సమాజంలో మా గౌరవం పెరిగింది నే ను టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం భాసూరు గ్రామంలో భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమారులతోపాటు, వృద్ధురాలైన తల్లితో కలసి జీవిస్తున్నాను. రోజురోజుకూ రెడీమేడ్ దుస్తులు మార్కెట్లో విరివిగా లభిస్తున్న పరిస్థితుల్లో టైలరింగ్కు ఆదరణ తగ్గిపోయింది. దానివల్ల మాకు వచ్చే అరకొర ఆదాయం కూడా తగ్గిపోయింది. కుటుంబ పోషణ మరీ కష్టంగా తయారైంది. గత టీడీపీ హయాంలో రేషన్ బియ్యం పథకం తప్ప ఇంకేమీ వర్తించలేదు. ఈ తరుణంలో జగనన్న ప్రభుత్వం ఏర్పడ్డాక సంక్షేమ పథకాలు మమ్ములను ఆదుకున్నాయి. మా అమ్మకు వృద్ధాప్య పింఛన్ అందుతోంది. నా భార్యకు చేయూత కింద ఏటా రూ. 18,750లు వస్తోంది. నా మనవడు చదువుకుంటుండటంతో పెద్దకోడలు రాజ్యలక్ష్మి ఖాతాకు అమ్మఒడి డబ్బులు జమవుతున్నాయి. కొడుకు ఈశ్వరరావుకు సర్వేయర్గా గ్రామ సచివాయంలో ఉద్యోగం వచి్చంది. ఆరి్థకంగా చేయూత లభిస్తుండడంతో కష్టాలు ఒక్కొక్కటి గెట్టెక్కాయి. సహచరులు, బంధువుల మధ్య కుటుంబానికి గౌరవం పెరిగింది. ఈశ్వరరావు సార్ ఉన్నారా... అంటూ నా కొడుకు కోసం వచ్చేవారు మాకు ఇస్తున్న మర్యాద వెలకట్టలేనిది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో మాకు సొంత ఇల్లు వచి్చంది. ఆయన బిడ్డ జగన్ ప్రభుత్వంలో సమాజంలో మరింత గౌరవం పెరిగింది. – కడారు మోహనరావు, భాసూరు (మారోజు కళ్యాణ్కుమార్, విలేకరి, పాలకొండ) ఖర్చు లేకుండా రెండుసార్లు శస్త్రచికిత్స నే ను సాధారణ రైతును. నాకు భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం లుకలాంలో నాకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. అన్నీ అనుకూలిస్తే నాలుగు వేళ్లు నోటికెళ్లేవి. లేకుంటే అప్పులు చేయాల్సి వచ్చేది. కునికిన నక్కపై తాటిపండు పడ్డట్టు నాలుగేళ్ల క్రితం కిడ్నీలో రాళ్లు చేరాయి. తెలియక అశ్రద్ధ చేయడంతో కిడ్నీలు మరింత పాడయ్యాయి. వైద్యులకు చూపిస్తే ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీలు పోయే ప్రమాదం ఉందన్నారు. చికిత్సకు రెండు లక్షల వరకూ ఖర్చవుతుందన్నారు. అంత మొత్తం వెచి్చంచలేక సతమతమయ్యాను. అయితే నాకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని ఆరోగ్యమిత్ర చెప్పడంతో వారి ద్వారా విశాఖలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరా. పైసా ఖర్చు లేకుండా చికిత్స చేశారు. ప్రస్తుతం నయం అయింది. ఇప్పుడు ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాను. గడిచిన ఏడాదిలో మళ్లీ రాళ్లు చేరితే ఆరోగ్యశ్రీ ద్వారానే ఆపరేషన్ చేయించుకున్నా. నాలాంటి వారికి ఎందరికో ఈ పథకం ప్రాణదానం చేసినట్టయింది. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన వైఎస్సార్ పేరును నా కుడిచేయిపై పచ్చబొట్టు వేయించుకున్నా. కొడుకు, కూతురికి పెళ్లిళ్లయ్యాయి. వారు వేరేగా ఉంటున్నారు. జగనన్న అమలు చేస్తున్న వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా ఠంఛన్గా రూ. 13,500లు చొప్పున వస్తోంది. నా భార్య రమణమ్మకు వైఎస్సార్ ఆసరా పథకంలో భాగంగా రూ. 45 వేలు వచి్చంది. చేయూత పథకం ద్వారా ఏటా రూ. 18,750 వంతున వచి్చంది. మా ఆరి్థక పరిస్థితి ఇప్పుడు చాలా బాగుంది. – శానాపతి సూర్యనారాయణ(రోహిణి) లుకలాం (మామిడి రవి, విలేకరి, నరసన్నపేట) -
YSR Bima: దిగులు తీర్చి.. ధీమానిచ్చి
జీవన ప్రయాణంలో అన్ని వైపుల నుంచి అదృష్టం కలిసొస్తే జీవితం సాఫీగా సాగిపోతుంది. పొరపాటున ఊహించని సంఘటన ఏదైనా జరిగి, కుటుంబాన్ని పోషించే వ్యక్తి ప్రాణాలు వదిలితే ఆ కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది. అదే నిరు పేదల పరిస్థితైతే వర్ణణాతీతం. అలాంటి పేద కుటుంబాల దిగులు తీర్చి ధీమా నిస్తోంది వైఎస్సార్ బీమా పథకం. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పేదల కుటుంబాల్లో ఆర్థిక భరోసా కల్పిస్తోంది. కడప రూరల్: పేద కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. అనుకోని విధంగా ప్రమాదం జరిగినపుడు ఎవరూ ఆదుకోరనే భయాన్ని పోగొట్టారు. దీంతో నిరుపేదలకు భరోసా లభించింది. ప్రభుత్వం 2020 అక్టోబరు 22న రాష్ట్రంలో వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. తెల్లరేషన్కార్డు కలిగిన 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయస్సు వరకు ప్రజలందరూ ఈ పథకానికి అర్హులు. ప్రమాదవశాత్తు మరణించినా, వృద్ధాప్య తదితర సహజ కారణాలతో మృతిచెందినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా ఈ పథకం ద్వారా బాధిత కుటంబానికి ఆర్థికసాయం లభిస్తుంది. కుటుంబంలో నామినీగా ఉన్న వ్యక్తికి బీమా నగదు అందుతుంది. ఆ ప్రకారం ఏదైనా ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ. 5 లక్షలు, 18–50 ఏళ్లలోపు సహజ మరణం పొందిన వారికి రూ. లక్ష ఆర్థికసాయం అందుతుంది. తక్షణ సాయంగా దహన సంస్కారాలకు రూ. 10 వేలను అందజేస్తారు. 566 కుటుంబాలకు ప్రయోజనం జిల్లా వ్యాప్తంగా గత ఏడాది జులై నుంచి ఇప్పటివరకు వైఎస్సార్ బీమా కింద సహజ మరణాలకు సంబంధించి 572 నమోదయ్యాయి. అందులో ఒకరికి రూ. ఒక లక్ష చొప్పున 481 కుటుంబాలకు ప్రభుత్వం మొత్తం రూ 4.81 కోట్లు బీమా సొమ్మును అందజేసింది. అలాగే వివిధ ప్రమాదాల్లో 111 మంది మృత్యువాతపడగా, అందులో ఒకరికి రూ 5 లక్షల చొప్పున 85 మందికి మొత్తం 4.25 కోట్ల బీమా సొమ్ము లభించింది. మొత్తం 683 మందికిగాను 566 కుటుంబాలకు చెందిన నామినీలకు మొత్తం రూ.9.06 కోట్ల ప్రయో జనం చేకూరింది. బీమాకు సంబంధించిన పత్రాలను సమర్పించిన 21 రోజుల్లోపే ప్రభుత్వం నామినీ ఖాతా లకు సొమ్మును జమ చేయడం ప్రశంసనీయం. దీంతో బాధిత కుటుంబాలకు దిగులు తీర్చి బీమా ద్వారా ధీమాను కలిగించినట్లైంది. ఈ పథకం అమలు పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 1. పిల్లలతో ఉన్న ఈమె పేరు మూడే అరుణ. భర్త శ్రీను నాయక్. చేపలు పట్టేవారు. వారు మైదుకూరులో నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ఓ రోజు శ్రీనునాయక్ చేపలు పట్టడానికి వెళ్లారు. అక్కడ ఊహించని విధంగా నీళ్లలో పడి మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అలాంటి కుటుంబంలో వైఎస్సార్ బీమా పథకం వెలుగులు నింపింది. తనకు అధికారులు వైఎస్సార్ బీమా కింద రూ 5 లక్షలు ఇచ్చారని అరుణ తెలిపింది. ప్రభుత్వం తన కుటుంబానికి అండగా నిలిచినందుకు కృతజ్ఙతలు తెలిపింది. 2. ఈమె పేరు మాండ్ల వరలక్ష్మి. కూలీ పనికి వెళుతుంది. భర్త శివప్రసాద్ హమాలీ పని చేçస్తూ కుటుంబాన్ని పోషించేవారు. వీరిది రాజుపాళెం మండలం. వీరికి ఇద్దరు సంతానం. శివప్రసాద్ ప్రమాదంలో మరణించారు. దీంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఈ తరుణంలో ఆ కుటుంబంలో వైఎస్సార్ బీమా పథకం కొండంత అండగా నిలిచింది. నామినీగా ఉన్న వరలక్ష్మికి ప్రభుత్వం రూ 5 లక్షలను అందజేసింది. దీంతో ఆ కుటుంబానికి ఊరట లభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటామని ఆమె తెలిపింది. 3. ఈమె పేరు గోవిందు శ్యామల. కూలీ పనులకు వెళుతుంది. భర్త పేరు లక్షుమయ్య. మగ్గం పని చేసేవారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వీరిది మూద్దనూరు మండలం. ఒక రోజు పొలంలో గడ్డి కో స్తుండగా లక్షుమయ్యను పాము కాటుతో చనిపోయారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర మానసిక క్షోభకు గురైంది. ఈ నేపథ్యంలో నామినీగా ఉన్న లక్షుమయ్య భార్య శ్యామలకు బీమా కింద రూ 5 లక్షలు వచ్చింది. బీమా కారణంగా తనకు ఆర్థిక సహయం కలిగిందని, ప్రభుత్వం తమ కుటుంబానికి పెద్ద దిక్కులా నిలిచినందుకు సంతోషం వ్యక్తం చేసింది. వైఎస్సార్ బీమాను సద్వినియోగం చేసుకోవాలి తెల్ల రేషన్ కార్డు కలిగిన పేదలంతా వైఎస్సార్ బీమా పథకానికి అర్హులు. సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. ఇంటి పెద్దకు ఏమైనా జరిగితే నిబంధనల ప్రకారం అన్ని పత్రాలను సమరి్పంచిన 21 రోజుల్లోనే నామినీకి క్లైమ్ను అందజేస్తాం. ప్రభుత్వం ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు అండగా నిలుస్తోంది. – ఆనంద్ నాయక్, ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ -
ఈ ప్రభుత్వం వల్లే బతికున్నా..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ఈ ప్రభుత్వం వల్లే బతికున్నా.. క ర్నూలు ఇందిరా గాంధీ నగర్ కాలనీ మార్కెట్ యార్డుకు నా ఎద్దుల బండితో సరుకు రవాణా చేస్తుండేవాడిని. రోజుకు అన్ని ఖర్చులు పోను రూ.500 నుంచి రూ.700 వరకు మిగిలేది. సీజన్లో కాస్త ఎక్కువే మిగిలేది. దాంతోనే నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నా. గత నవంబర్ 5వ తేదీ ఉదయం ఎద్దుల బండిపై వెళ్తుంటే ఒళ్లంతా చెమట్లు పట్టాయి. ఒక చేయిలో పటుత్వం తగ్గుతోంది. ఏమీ తోచలేదు. వెంటనే బండి ఓ పక్క ఆపేశా. నా పరిస్థితి చూసి అక్కడివాళ్లు దగ్గరలోని మెడికవర్ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేశారు. రక్తనాళాల్లో సమస్య ఉన్నట్టు చెప్పారు. శస్త్ర చికిత్స చేయాలని చెప్పారు. అప్పుడే నా ఊపిరి ఆగినంత పనయింది. అంత డబ్బు ఎలా తేగలనని భయపడ్డా. కానీ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా శస్త్రచికిత్స చేస్తామన్నారు. అదే నెల 18న గుండెకు శస్త్రచికిత్స చేశారు. కాస్త కోలుకోవడంతో పది రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఇందుకోసం రూ.1,18,881 ఖర్చయ్యిందట. అంతా ప్రభుత్వమే ఇచ్చింది. రెండు నెలల నుంచి నేను ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నా. అయినా నా భుక్తికి లోటు లేకుండా ఆరోగ్య ఆసరా కింద రూ.9,500 నా బ్యాంకు ఖాతాలో పడింది. నా భార్య సుజాత పొదుపు సంఘంలో సభ్యురాలు. ఆమెకు ఇప్పటి వరకు వైఎస్సార్ ఆసరా పథకం కింద రూ.36 వేలు వచ్చింది. మా పాప చదువుకుంటున్నందున మూడేళ్లుగా అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేలు వస్తోంది. నాకే కాకుండా నా కుటుంబానికి కూడా ప్రభుత్వం దన్ను ఉండడంతో ధైర్యంగా ఉన్నా. ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని చక్కగా అమలు చేయడం వల్లే నేను ప్రాణాలతో ఉన్నాను. – ధనిగల శ్రీనివాసులు, కర్నూలు (జె.కుమార్, విలేకరి, కర్నూలు హాస్పిటల్) పేదరికాన్ని జయించాం రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం మాది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మా లాంటి పేదలకు ఎలాంటి సాయం, పథకాలు అందక బతకడం కష్టంగా ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చాక మా జీవితాలే మారిపోయాయి. పేదరికాన్ని జయించి మధ్య తరగతి కుటుంబంగా ఎదిగాం. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గాదిరాయి గ్రామానికి చెందిన నాకు వైఎస్సార్ చేయూత ద్వారా రూ 18,750 చొప్పున మూడు దఫాలుగా రూ.56,250 వచ్చింది. ఈ సొమ్ముతో రెండు పాడి గేదెలు కొనుగోలు చేశాం. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కాగానే నా భర్తకు వృద్ధాప్య పింఛను మంజూరైంది. జనవరి నుంచి అది రూ.3 వేలకు పెరిగింది. మాకు 20 సెంట్లే భూమి ఉన్నప్పటికీ ఏటా రైతు భరోసా కింద రూ.13,500 వంతున వస్తోంది. డ్వాక్రా రుణమాఫీగా వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా రూ.8 వేలు వచ్చింది. గతంలో అప్పులు ఉండేవి. ఈ ప్రభుత్వంలో వైఎస్సార్ చేయూత, రైతు భరోసా, పింఛను కానుక, ఆసరా వల్ల ఆర్థికంగా నిలదొక్కుకున్నాం. అప్పులు లేకుండా జీవిస్తున్నాం. గేదెలు చూడి దశలో ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రభుత్వానికి మా కుటుంబం రుణపడి ఉంటుంది. – పర్రే నాగమణి, గాదిరాయి (కరణం నారాయణరావు, విలేకరి, మాడుగుల) చీకూచింతా లేకుండా బతుకుతున్నాం మేము గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మపేటలో ఉంటూ పుస్తకాల బైండింగ్ పనులు చేస్తుంటాం. మా ఆయన వెంకటేశ్వరరావు, నేనూ ఇద్దరం కష్టపడితేనే రోజు గడిచేది. బైండింగ్ పని ఆదాయం ఇంటి ఖర్చులకు మాత్రమే సరిపోయేది. పిల్లల చదువులకు బయట అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వచ్చేది. దానికీ ఏదో ఒక వస్తువు తాకట్టు పెట్టాల్సి వచ్చేది. ఏళ్లు గడుస్తున్నా జీవితం ఎదుగూ బొదుగూ లేకుండా పోయిందనే నిస్పృహలో ఉండేవాళ్లం. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఏటా రూ.15 వేల చొప్పున వచ్చింది. నిధులతో బైండింగ్ వ్యాపారాన్ని విస్తరించాం. రోజూ వచ్చే ఆదాయం కూడా పెరిగింది. డ్వాక్రా సభ్యురాలిగా రూ.2 లక్షల రుణం వచ్చింది. ఆ మొత్తంతో వ్యాపారం మరింత అభివృద్ధి చేశాం. ఇంజినీరింగ్ చదువుతున్న మా కుమార్తెకు విద్యాదీవెన, వసతి దీవెన పథకం కింద నిధులు వచ్చాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మా కుటుంబానికి అండగా నిలిచాయి. ఇప్పుడు చీకూచింతా లేకుండా జీవించగలుగుతున్నాం. జగనన్న మేలు ఎన్నటికీ మరువలేం. – అవనిగడ్డ నాగమణి, తెనాలి (ఆలపాటి సుదీర్ కుమార్, విలేకరి, తెనాలి అర్బన్) -
పిల్లలపై ఆధార పడకుండా బతుకుతున్నా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. పిల్లలపై ఆధార పడకుండా బతుకుతున్నా మాది చేనేత కుటుంబం. మా ఆయన అశ్వర్థ నారాయణ ఏడేళ్ల క్రితం గుండెపోటుతో మరణించారు. మాకు ముగ్గురు కుమారులు. వారందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో మగ్గం నేతతోపాటు నేను కూలి పనులకు వెళ్లేదాన్ని. ఇప్పుడు నా వయసు 58 సంవత్సరాలు. ఒంట్లో సత్తువ తగ్గి బయట పనులకు వెళ్లలేకపోతున్నా. గతంలో కేవలం రూ.వెయ్యి మాత్రమే పెన్షన్ వచ్చేది. 2019లో జగన్ సీఎం అయ్యాక పెన్షన్ పెరిగింది. ఇపుడు రూ.3 వేలు వస్తోంది. చేనేత వృత్తిలో ఉండటంతో వలంటీరే ఇంటికొచ్చి మరీ వైఎస్సార్ నేతన్న నేస్తంలో నా పేరు నమోదు చేశారు. ఈ పథకం కింద ఏటా రూ.24 వేలు చొప్పున ఇప్పటి వరకు ఐదుసార్లు కలిపి మొత్తం రూ.1.20 లక్షలు నా బ్యాంకు ఖాతాలో జమ చేశారు. వైఎస్సార్ చేయూత పథకం కూడా వర్తించింది. రూ.18,750 చొప్పున మూడుసార్లు డబ్బులు అందుకున్నా. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నాకు కొండంత భరోసానిచ్చాయి. నాలాంటి ఒంటరి మహిళలు ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లేకుండా, సంతోషంగా బతికే ధైర్యాన్నిస్తున్నాయి. – శిరివెల్ల లక్ష్మీదేవి, జమ్మలమడుగు (నాయబ్ అబ్దుల్ బషీర్, విలేకరి, జమ్మలమడుగు) 30 ఏళ్ల కల నెరవేరింది కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే బతుకు తెరువు కోసం శ్రీకాకుళం జిల్లా బూర్జ గ్రామం నుంచి నరసన్నపేట మండలం ఉర్లాంకు 30 ఏళ్ల క్రితం వలస వచ్చాం. కొన్నాళ్లకు మా ఆయన కన్నుమూశారు. ఒక్కగానొక్క కొడుకుని చదివిస్తూ, షాపుల్లో పని చేస్తూ.. అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగించాను. గతంలో ఉన్న ప్రభుత్వాలకు పక్కా ఇంటి కోసం ఎన్నోసార్లు దరఖాస్తు చేశాను. స్థలం ఉంటే ఇల్లు ఇస్తామన్నారు. స్థలం కొనే స్తోమత లేక అద్దెలు చెల్లిస్తూ జీవనం కొనసాగించాం. జగన్ బాబు ముఖ్యమంత్రి అయ్యాక మా కోరిక తీరింది. ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకొనేందుకు ఆర్థిక సాయం చేశారు. డబ్బు సరిపోకపోతే డ్వాక్రా రుణం ఇప్పించారు. ఇంటి నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు సొంత ఇంట్లో హాయిగా జీవనం సాగిస్తున్నాం. ఇదివరకు సొంత ఇల్లు లేదని ప్రైవేటు దుకాణంలో పని చేస్తున్న మా అబ్బాయి వైకుంఠరావుకు పెళ్లి సంబంధాలు కుదరలేదు. ఇప్పుడు సంబంధాలు వస్తున్నాయి. ఈ వేసవికి పెళ్లి చేయాలనుకుంటున్నా. ఇదంతా ముఖ్యమంత్రి చలువే. ఆయన సీఎం కాకపోతే మా కల నెరవేరేదికాదు. అలాగే ఈ ప్రభుత్వం నుంచి నాకు ఎంతో మంచి జరుగుతోంది. ప్రతి నెలా ఒకటో తేదీనే వితంతు పింఛన్ వస్తోంది. డ్వాక్రా రుణం మాఫీ చేస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ ఆసరా కింద నాలుగు విడతల్లో రూ.60 వేలు వచ్చింది. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ప్రతి ఏటా రూ.18,750 చొప్పున వచ్చింది. సీఎం జగన్ రుణం తీర్చుకోలేం. – పైడిశెట్టి సత్యవతి, ఉర్లాం (మామిడి రవి, విలేకరి, నరసన్నపేట) పింఛన్ మా ఇంటికే వస్తోంది మాది నిరుపేద కుటుంబం. మేము పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఉంటున్నాం. మా నాన్న చిన్నతనంలోనే చనిపోయాడు. పుట్టుకతోనే నా రెండు కాళ్లు చచ్చుబడటంతో దివ్యాంగుడినయ్యాను. సెంటు భూమి కూడా లేని నన్ను మా అమ్మ కూలి పనులు చేసి బతికించింది. దివ్యాంగుడిని కావడంతో నన్ను ఎవరూ పనులకు పిలిచేవారు కాదు. అమ్మ కష్టాన్ని చూడలేకపోయాను. పెళ్లి మండపాల డేకరేషన్ పనులు నేర్చుకొని అప్పుడప్పుడు ఆ పనులకు వెళ్తున్నాను. ఎనిమిదేళ్ల క్రితం సలోమి అనే దివ్యాంగురాలితో నాకు వివాహమైంది. మాకు రాకేష్, సతీష్ అనే ఇద్దరు పిల్లలున్నారు. నా భార్య కూడా దివ్యాంగురాలు కావడంతో ఆమె కూడా పనులకు వెళ్లే వీలు లేకుండా పోయింది. ఇద్దరికీ వచ్చే పింఛనే జీవనాధారంగా మారింది. గతంలో పింఛను తీసుకోవాలంటే పంచాయతీ కార్యాలయం వద్ద రోజుల తరబడి నిరీక్షించేవాళ్లం. ట్రై సైకిల్ పై రోజూ అక్కడకు వెళ్లి రోజుల తరబడి తిరిగితే గాని పింఛను డబ్బులు వచ్చేవి కావు. కానీ నేడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత నాకు, నా భార్యకు మొత్తం రూ.6 వేలు మా వలంటీర్ ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దకు తెచ్చి అందిస్తున్నారు. మా అమ్మకు వితంతు పింఛను కింద రూ.3 వేలు వస్తున్నాయి. వైఎస్సార్ చేయూత కింద ఏటా రూ.18,750 వంతున వస్తోంది. మా బాబు ఈ ఏడాదే ఒకటో తరగతిలో చేరాడు. విద్యాకానుక కింద బూట్లు, బ్యాగ్, పుస్తకాలు అన్నీ ఉచితంగా ఇచ్చారు. మాకు వస్తున్న పింఛను డబ్బులతోనే మేము బతుకుతున్నాం. మా కుటుంబానికి ప్రభుత్వ పథకాలే అండగా నిలుస్తున్నాయి. ఈ ప్రభుత్వం చేస్తున్న సాయం ఎప్పటికీ మరచిపోలేం. – మేడి నాగరాజు, దాచేపల్లి(వినుకొండ అజయ్కుమార్, విలేకరి, దాచేపల్లి) -
ప్రభుత్వమే మా కుటుంబాన్ని నడిపిస్తోంది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. మాలాంటోళ్లకూ సొంతిల్లు మేం వలస జీవులం. బతుకు తెరువుకోసం ఒక చోట స్థిరంగా ఉండలేక ఊరూర భిక్షాటన చేసుకునే వాళ్లం. 20 ఏళ్ల కిందట కర్నూలు జిల్లా కోసిగికి వచ్చి ఊరు చివర గుడారాలు వేసుకుని జీవిస్తున్నాం. మాది ఉమ్మడి కుటుంబం. ఈరమ్మ, కాశమ్మ, అనుమంతి, యల్లమ్మ అనే నలుగురు కుమార్తెలు, శివశంకర్, శివచంద్రశేఖర్, శివరాములు అనే ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక మా కుటుంబంలో వెలుగు కనిపిస్తోంది. శివశంకర్ ఏపీ మోడల్ స్కూల్లో తొమ్మిదో తరగతి, శివ చంద్రశేఖర్ అయిదో తరగతి చదువుతున్నారు. ఒకరికి అ మ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15,000 వ స్తోంది. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశాం. నేను, నా భర్త అయ్యప్ప ఇంటి దగ్గర తట్టలు, బుట్టలు తయారు చేస్తుంటాం. మా పిల్లలు వాటిని చుట్టు పక్కల ఊళ్లల్లో అమ్ముతారు. రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు ఆదాయం వస్తోంది. ఈ సొమ్ము ఇంటి అవసరాలకే సరిపోయేది. చేయూత ద్వారా ప్రతి ఏటా రూ.18,750 నా ఖాతాలో జమవుతోంది. సొంతిల్లు లేదని మా ప్రాంత వలంటీర్కు చెప్పడంతో సచివాలయంలో దరఖాస్తు చేయించారు. కోసిగిలో సజ్జలగుడ్డం రోడ్డు జగనన్న లేఅవుట్లో ఇంటి స్థలం కేటాయించారు. నిర్మాణానికి నిధులు కూడా మంజూరయ్యాయి. ఎట్టకేలకు సొంతిల్లు కట్టుకున్నాం. – బేడ బుడగ జంగాల మారెమ్మ, కోసిగి (నీలి ఈరేష్, విలేకరి, కోసిగి) ప్రభుత్వమే మా కుటుంబాన్ని నడిపిస్తోంది నేను లారీ క్లీనర్గా పనిచేసేవాడిని. ఆరేళ్ల కిందట రాజమండ్రి వద్ద రోడ్డు ప్రమాదంలో నా కాళ్లు, ఎడమ చేయి కోల్పోయి వీల్ చెయిర్కే పరిమి తమయ్యాను. నా అవిటితనం చూసి నా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం పెదపూడిలో నాతో పాటు వృద్ధులైన అమ్మా నాన్న రాజమ్మ, రామునాయుడులు నా సంపాదనపైనే ఆధారపడి ఉన్నారు. సీఎంగా జగనన్న వచ్చాక నాకు నెలకు రూ.5 వేల వంతున పింఛన్ వస్తోంది. మా నాన్నకు వృద్ధాప్య పింఛన్ ఈ ప్రభుత్వ హయాంలోనే మంజూరైంది. నాతో పాటు వృద్ధులైన అమ్మ, నాన్న ఒక్క రూపాయి కూడా సంపాదించే అవకాశం లేదు. ఈ ప్రభుత్వం ద్వారా నాకు, మా నాన్నకు ప్రతినెలా రూ.8 వేలు పింఛన్ రూపంలో వ స్తుండడం, రేషన్ కార్డు ద్వారా బియ్యం, కందిపప్పు వంటివి అందుతున్నాయి. గతంలో మే ము పూరింట్లో ఉండేవాళ్లం. మేము పక్కా ఇంటికి దరఖాస్తు చేసుకోగా ఈ ప్రభుత్వం రూ. 1.80 లక్షలు మంజూరు చేసింది. దీనికి తోడు వైఎస్సార్సీపీ నేత, విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనందబాబు రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందించారు. ఈ మొత్తంతో పూరిల్లు ఉన్న స్థలంలోనే పక్కా ఇల్లు నిర్మించుకున్నాం. – వియ్యపు సోమునాయుడు, పెదపూడి (చప్పా రామలింగేశ్వరరావు, విలేకరి, బుచ్చెయ్యపేట) మా పిల్లలకు బంగారు బాట.. మా ఆయన కూలి పనులకు వెళ్తాడు. ఏలూరు జిల్లా కలిదిండి మండలం ఎస్సార్పీ అగ్రహారానికి చెందిన మాకు 6, 8 తరగతులు చదువుతున్న ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. వాళ్లను బాగా చదివించాలని మా కోరిక. దానికి పేదరికం అడ్డు వస్తుందేమో అని చాలా మదనపడ్డాం. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగనన్న అమ్మ ఒడి పథకం ప్రవేశ పెట్టడంతో వారి చదువుల సమస్య పరిష్కారమైంది. మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. అంతే కాకుండా వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా నాకు ఏటా రూ.10 వేలు చొప్పున ఇప్పటి వరకు రూ.40 వేలు వచ్చింది. ఆ మొత్తంతో రోడ్డు పక్కన కొబ్బరి»ొండాల విక్రయం సాగిస్తున్నాను. పేదల గురించి ఇంతగా ఆలోచించే ముఖ్యమంత్రిని నేను చూడలేదు. నా కళ్ల ముందు నా బిడ్డలు మంచి చదువులు చదువుతున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి భవిష్యత్తు తరాలకు ఎంతో అవసరం. – పి.అశి్వని, ఎస్సార్పీ అగ్రహారం (కొమ్మంటి లక్ష్మణ్, విలేకరి, కలిదిండి) -
బిడ్డ పెళ్లికి చేసిన అప్పు తీర్చాం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. బిడ్డ పెళ్లికి చేసిన అప్పు తీర్చాం నా భర్త కూలి పని చేస్తుంటాడు. పని లేనప్పుడు చేపలు పట్టుకోవడానికి వెళ్తుంటాడు. మాకు ఇద్దరు అమ్మాయిలు. మాకు వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. పిల్లల పెళ్లిళ్లు ఎలా చేయాలా అని ఎంతో సతమతం అయ్యాం. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చాక మాకు సంక్షేమ పథకాలు వరమయ్యాయి. వైఎస్సార్ చేయూత ద్వారా ఏటా రూ.18,750 చొప్పున మూడు విడతల్లో రూ.56,250 వచ్చింది. పెద్ద కుమార్తెకు గతంలోనే పెళ్లయింది. చిన్నమ్మాయికి ఈ మధ్యే పెళ్లి చేశాం. పెళ్లికి ముందు ఆ పాపకు అమ్మఒడి ద్వారా రెండేళ్లపాటు రూ.15 వేల చొప్పున లబ్ధి చేకూరింది. పెళ్లిచేసే సమయంలో బంధువులు, వలంటీర్లు జగనన్న ప్రభుత్వంలో కళ్యాణమస్తు ద్వారా సాయం లభిస్తుందని చెప్పారు. దీంతో కల్యాణమస్తుకు దరఖêస్తు చేశాం. పెళ్లయిన మూడు నెలల్లోనే కల్యాణమస్తు ద్వారా రూ.లక్ష వచ్చింది. ఆ మొత్తంతో పెళ్లికి చేసిన అప్పు తీర్చేశాం. త్వరలో టిడ్కో ఇల్లు చేతికి రానుంది. ప్రస్తుతం హాయిగా జీవిస్తున్నాం. ఇంతలా ఆదుకున్న జగనన్న ప్రభుత్వం పదికాలాల పాటు చల్లగా ఉండాలి. – గెడ్డం రత్నం, పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా (తోట రాంబాబు, విలేకరి, పాలకొల్లు సెంట్రల్) మా బతుకులు బాగుపడ్డాయి మాది చాలా పేద కుటుంబం. కూలి పని ద్వారా నా భర్త భాస్కరరావు తెచ్చే ఆదాయంతోనే కుటుంబ పోషణ సాగుతోంది. వచ్చిన అరకొర ఆదాయంతో బాపట్ల జిల్లా చినగంజాం జిల్లా సొపిరాలకు చెందిన మాకు.. ఉన్న ఒక్క కుమారుడిని బాగా చదివించగలమా.. అన్న భయం వెంటాడేది. అలాంటి పరిస్థితిలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ఏడాదికి రూ.15 వేలు చొప్పున నా ఖాతాలో నగదు జమ చేశారు. ఆ మొత్తంతో పిల్లాడిని చక్కగా చదివించుకోగలిగాం. ఈ ఏడాదే బీటెక్ మొదటి సంవత్సరంలో చేరాడు. ఈ ఏడాది జగనన్న విద్యా దీవెన పథకం వర్తించింది. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా నాకు ఇప్పటి వరకు రూ.2 లక్షలు అందింది. జగనన్న కాలనీలో మాకు స్థలం మంజూరు చేశారు. ఇల్లు కూడా మంజూరైంది. త్వరలో నిర్మాణ పనులు చేపడతాం. మా పరిస్థితి ఇప్పుడు బాగా మెరుగు పడింది. మమ్మల్ని ఈ పరిస్థితికి చేర్చిన ముఖ్యమంత్రికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – పర్వతరెడ్డి శివపార్వతి, సొపిరాల (పల్లపోలు శ్రీనివాసరావు, విలేకరి, చినగంజాం) ఇంటికల సాకారమైంది రోజూ పనికి వెళ్తే తప్ప మాకు పూట గడిచేది కాదు. ప్రకాశం జిల్లా కొనకమిట్ల మండలం గొట్లగట్టులో ఇల్లు కట్టుకోవాలనేది మా చిరకాల కోరిక. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఇల్లు కట్టుకోవాలన్న ఆశతో స్థలం మంజూరు చేయాలని ఎన్నోమార్లు విజ్ఞాపన పత్రాలు అందించాం. కానీ మంజూరు కాలేదు. స్థానిక నాయకులను ఎన్నిసార్లు ప్రాధేయపడినా మాపై జాలి చూపలేదు. ఈ సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం నియమించిన వలంటీర్ మా దగ్గరకు వచ్చి ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోమని చెప్పారు. సచివాలయంలో దరఖాస్తు చేశాము. నెల రోజులు గడవక ముందే నా పేరున స్థలం, ఇల్లు మంజూరైందని సమాచారం వచ్చింది. నా సంతోషానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. ఇల్లు మంజూరు పత్రాన్ని స్వయంగా నాకు అందించారు. వెంటనే ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయానికి మేము కొంత డబ్బు జమ చేసుకుని సొంతంగా ఇల్లు నిరి్మంచుకున్నాం. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా నాకు ఏటా రూ.18,750 వంతున అందుతోంది. నా కుమారుడికి చదువుకు అమ్మ ఒడి పథకం ఏటా రూ.15 వేలు ఇస్తున్నారు. ఇన్ని విధాలుగా మేలు చేసిన ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికీ మరచిపోము. – సుంకేసుల కళావతి, గొట్లగట్టు (నాగం వెంకటేశ్వర్లు, విలేకరి, కొనకనమిట్ల) -
కొడుకులా ఆదుకున్నారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. యాచన మాని గౌరవంగా బతుకుతున్నా.. మాది పేద కుటుంబం. విజయనగరం జిల్లా బాడంగి మండలం వాడాడ దళితవాడలో నేను, మా ఆయన కూలి పనులు చేసుకుని జీవించేవాళ్లం. మాకు ఇద్దరు ఆడపిల్లలు. వాళ్లు చిన్న వయసులో ఉన్నçప్పుడే మా ఆయన చనిపోయారు. ఆయన వారసత్వంగా వచ్చిన అరకొర ఆస్తితో వాళ్లను పెంచి, పెద్దచేసి పెళ్లుళ్లు చేశాను. వాళ్లకు భారం కాకూడదని తప్పనిసరి పరిస్థితుల్లో బతుకు తెరువుకోసం యాచన ప్రారంభించా. అప్పట్లో పింఛన్ వచ్చినా.. ఏ మూలకూ సరిపోయేదికాదు. దానికోసం కూడా ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వచ్చేది. పడిగాపులు పడాల్సిన దుస్థితి. నాలుగేళ్ల కిందటి వరకు సిగ్గు విడిచి చుట్టుపక్కల గుడులు, గోపురాల ముంగిట యాచించేదాన్ని. వచ్చిన చిల్లరతో బతికేదాన్ని. జగన్బాబు వచ్చాక పింఛన్ పెంచారు. ఇంటికే వచ్చి తలుపు తట్టి ఇస్తున్నారు. ఇప్పుడు రూ.3 వేలకు పెంచారు. పొదుపు సంఘాల్లో ఉన్న మా కూతుళ్లు ఇద్దరూ వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాల ద్వారా అందుతున్న సొమ్ముతో కూరగాయలు అమ్ముకొని బతుకున్నారు. ప్రభుత్వం ఇస్తున్న అమ్మ ఒడి సాయంతో మనవరాళ్లు స్కూళ్లలో ఇంగ్లిష్ చదువులు చదువుతున్నారు. జగన్బాబు ఇచ్చిన పింఛన్తో యాచన మానుకొని గౌరవంగా బతుకుతున్నాను. – బత్తిన అప్పమ్మ, వాడాడ (గొట్టాపు త్రినాథరావు, విలేకరి, విజయనగరం అర్బన్) నిలదొక్కుకుంటున్నాం.. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు మావి. నేను, మా ఆయన ఏడేళ్ల క్రితం వరకు ఇతర ప్రాంతాల్లో వలస కూలీలుగా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వాళ్లం. మాకు ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. మా స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం అరకబద్రకు వచ్చిన తర్వాత బతుకు భారంగా మారింది. ఏదైనా వ్యాపారం చేయాలని అనుకున్నాం. నేను స్వయం శక్తి సంఘంలో సభ్యురాలిగా ఉండటంతో మూడేళ్ల క్రితం బ్యాంకు లింకేజీ ద్వారా రూ.50 వేలు రుణం తీసుకున్నా. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా లభించిన రూ.36 వేలతో నేను, నా భర్త కలిసి హోటల్ ప్రారంభించాం. ఏడాదిన్నర క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో నా భర్తకు, నాకు తీవ్ర గాయాలు కావడంతో హోటల్ మూతబడింది. ఏడాది నుంచి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో మరోమారు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.50 వేలు, వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.18,750 వంతున రెండు విడతలుగా అందిన సొమ్ముతో రెండు ఆవులను కొనుగోలు చేశాం. ఇప్పుడు వాటి పాలను రోజు వారీ అమ్ముతూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం. మా జీవితానికి ఢోకా లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాకే మా లాంటి పేదలంతా హాయిగా జీవనం సాగిస్తున్నారు. – పొట్నూరు గీత, అరకబద్ర (మద్దిలి కేశవరావు, విలేకరి, ఇచ్ఛాపురం రూరల్) కొడుకులా ఆదుకున్నారు పిల్లలు లేని మాకు వృద్ధాప్యంలో ఈ ప్రభుత్వమే అండగా నిలిచింది. మాది శ్రీకాకుళం. వయసు మీద పడడంతో ఏపనీ చేయలేని స్థితిలో నా భార్య లక్ష్మితో కలిసి ఆరేళ్ల క్రితం విశాఖ వచ్చాము. ఇక్కడ ఆరిలోవ ఆపరేషన్కాలనీలో మా సమీప బంధువు కల్యాణి ఇంట్లో ఉంటున్నాం. ఆమె మమ్మల్ని ఆదరాభిమానంతో చూసుకుంటోంది. ఈ ప్రభుత్వం వచ్చాక వృద్ధాప్య పింఛన్ వస్తోంది. ఈ నెల నుంచి పింఛను డబ్బులు పెరిగాయని వలంటీరు లీలాకృష్ణ మా ఇంటికి వచ్చి రూ.3 వేలు అందించారు. మాకు అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. మా ఇద్దరికీ కంటి చూపు మందగించడంతో ఇబ్బంది పడేవాళ్లం. గత నెల 21న ఆరిలోవలో జగనన్న కంటి వెలుగు శిబిరం నిర్వహించారు. ఆ శిబిరానికి వెళ్లి్న మాకు పరీక్షలు చేసిన డాక్టరు ఆపరేషన్ చేయాలని చెప్పారు. అదే నెల 23న మా ఇద్దరికీ కంటి ఆపరేషన్ ఉచితంగా చేశారు. దీంతో పాటు నా భార్య లక్ష్మికి చేయూత కింద ఏటా రూ.18,750 వంతున వచ్చింది. మూడేళ్ల క్రితం ఆమెకు పొట్టలో భరించరాని నొప్పి రావడంతో కేజీహెచ్లో ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేశారు. అనేక విధాలుగా సహాయం అందిస్తూ పిల్లలులేని మమ్మల్ని సీఎం జగనే కొడుకులా ఆదుకుంటున్నారు. – రోణంకి చిరంజీవులు, విశాఖ (మీసాల కామేశ్వరరావు, విలేకరి, ఆరిలోవ) -
నా కాళ్లపై నిలబడ్డా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. నా కాళ్లపై నిలబడ్డా మాది మధ్య తరగతి కుటుంబం. తల్లిదండ్రులు లేకపోవడంతో అక్కే నాకు ప్రపంచం. అక్కకు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. అక్కకు చేదోడు, వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో నేను పెళ్లి కూడా చేసుకోకుండా ఆమె వద్దే ఉంటున్నా. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బిర్లంగి గ్రామానికి చెందిన స్వయం శక్తి సంఘానికి అధ్యక్షురాలిగా ఉన్నాను. స్వయం శక్తి సంఘం బ్యాంకు లింకేజీ రుణం రూ.50 వేలు, స్త్రీనిధి ద్వారా లక్ష రూపాయలు రుణం తీసుకున్నా. ఈ సొమ్ముతో ఇంటి వద్దనే చిన్నపాటి పరిశ్రమ ఏర్పాటు చేసుకొని అక్క కుటుంబ సభ్యులతో కలసి అగరువత్తులు, ఫినాయిల్, కొవ్వొత్తులు తయారు చేస్తున్నాం. ఇంటి వద్దనే చిన్నపాటి స్టాల్ను ఏర్పాటు చేసి అమ్మకాలు చేస్తున్నాం. మా అక్క కొడుకులు ఒడిశాలోని బరంపురం, ఇచ్ఛాపురం ప్రాంతాలకు తీసుకువెళ్లి వాటిని అమ్ముకొస్తున్నారు. ప్రస్తుతం ఆదాయం బాగానే ఉంది. ఆసరా పథకం ద్వారా నాకు ఏటా రూ.18,750 చొప్పున వచ్చిన సొమ్ముతో మాకున్న ఎకరంన్నర పంట పొలంలో ఆకు కూరలు, కూరగాయలు సాగు చేస్తున్నాం. మా ప్రాంతంలో వీటికి మంచి డిమాండ్ ఉండటంతో విక్రయాలు బాగానే జరుగుతున్నాయి. మా సంఘం ద్వారా మరో రూ.75 వేలు రుణం తీసుకుని కాయగూరల పెంపకాన్ని విస్తరించబోతున్నా. ఈ నెల నుంచే ఒంటరి మహిళకు ఇచ్చే పింఛన్ వస్తోంది. గత ప్రభుత్వ హయాంలో చాలా సార్లు పింఛన్ కోసం అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. మా వలంటీర్ స్వయంగా వచ్చి దరఖాస్తు చేయించి, మంజూరు చేయించింది. సీఎం జగన్మోహన్రెడ్డికి మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. – దేవాకి భడిత్యా, బిర్లంగి (మద్దిలి కేశవరావు, విలేకరి, ఇచ్ఛాపురం రూరల్) కూలి పనులు మాని వ్యాపారం మా ఆయన విజయనగరం జిల్లా రాజాం మండలం గడిముడిదాం గ్రామంలో కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషించేవారు. వచ్చిన అరకొర ఆదాయంతో కుటుంబ పోషణ కష్టంగా ఉండేది. మాకు ఒక బాబు, ఒక పాప ఉన్నారు. వారిని చదివించాలంటే మాకు తలకు మించిన భారంగా మారింది. ఏదైనా వ్యాపారం చేద్దామంటే పెట్టుబడి ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈలోగా ఈ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో చాలా వరకు మా సమస్యలు పరిష్కారమయ్యాయి. మా పిల్లలను బడికి పంపించడం వల్ల అమ్మ ఒడి పథకం వర్తించింది. దాని ద్వారా ఏటా రూ.15 వేలు వంతున వస్తోంది. నాకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఏడాదికి రూ.8,200 చొప్పున వచ్చింది. ఆ మొత్తానికి స్త్రీ నిధి ద్వారా లక్ష రూపాయలు రుణం తీసుకుని సొంతంగా మా గ్రామంలో ఎరువుల వ్యాపారం ప్రారంభించాం. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,750 వచ్చింది. దానిని వ్యాపారానికి వినియోగించాను. ఇప్పుడు ప్రతి నెల రూ.6 వేలు వరకు ఆదాయం వస్తోంది. భార్యభర్తలిద్దరం కలిసి ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు మేము గౌరవంగా బతుకుతున్నామంటే దానికి కారణం జగనన్న ప్రభుత్వమే. – ఏగిరెడ్డి లక్ష్మి, గడిముడిదాం (వావిలపల్లి వెంకట దుర్గారావు, విలేకరి, రాజాం) ప్రశాంతంగా జీవిస్తున్నాం మా ఆయన అనకాపల్లి జిల్లా చోడవరం మండలం రాయపురాజుపేటలో ఎలక్ట్రికల్ పనులు చేస్తుంటారు. సంపాదన అంతంత మాత్రమే. మాకు ఒక బాబు, పాప ఉన్నారు. కుటుంబ పోషణే కష్టమవుతుండేది. ఇక పిల్లల చదువులు భారంగానే అనిపించేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా కుమార్తెకు 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేల వంతున మూడేళ్ల పాటు రావడం ఎంతగానో ఉపకరించింది. ఇప్పుడు ఆమె డిగ్రీలో జాయిన్ అయ్యింది. ఈ ఏడాది జగనన్న విద్యా దీవెన కింద డిగ్రీ ఫీజుతో పాటు, జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఒక విడత రూ.10 వేలు వచ్చింది. మా కుమారుడు మహేష్ పాలిటెక్నిక్ చదివిన సమయంలో విద్యా దీవెన వచ్చింది. ప్రస్తుతం ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. రెండో సంవత్సరానికి రూ.40 వేలు ఫీజు, వసతి దీవెన పథకం సొమ్ము రూ.10 వేల వంతున రెండేళ్లుగా అందింది. నేను డ్వాక్రా గ్రూపులో సభ్యురాలిగా ఉన్నాను. ఆసరా పథకం సొమ్ము మా అకౌంట్లో పడింది. చేయూత పథకం ద్వారా ఏటా రూ. 18,750 వంతున వస్తోంది. మాకు కొంత భూమి ఉంది. రైతు భరోసా మొత్తం ఏటా రూ.13,500 పడింది. ఈ విధంగా జగనన్న ప్రభుత్వం మా కుటుంబాన్ని ఎంతగానో ఆర్థికంగా ఆదుకుంది. దీంతో మా ఇద్దరు పిల్లల్ని ఉన్నత చదువులు చదివించుకోవడం మాకు కష్టం అనిపించలేదు. – కోరిబిల్లి వెంకటి, రాయపురాజుపేట (వేగి మహాలక్ష్మినాయుడు, విలేకరి, చోడవరం రూరల్) -
మాకిక శాశ్వత చిరునామా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. మాకిక శాశ్వత చిరునామా రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి మాది. నేను, మా ఆయన అవుగడ్డ శ్రీరామమూర్తి కలసి కూలి పని చేస్తే వచ్చే కొద్ది పాటి ఆదాయంపైనే కుటుంబ పోషణ సాగేది. సొంత ఇల్లు లేకపోవడంతో అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తారువ గ్రామంలోని అమ్మోళ్ల ఇంట్లో చిన్నపాటి ఇరుకు గదిలో ఇద్దరు పిల్లలతో జీవనం సాగించేవారం. పిల్లలు ఎదుగుతున్నా సొంత ఇల్లు లేదన్న మనోవేదన వెంటాడేది. గత ప్రభుత్వంలో ఇంటి కోసం పలుమార్లు దరఖాస్తు చేసినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చింది. గ్రామ వలంటీర్, సచివాలయ సిబ్బంది మా ఇంటికి వచ్చి «ప్రభుత్వం ఉచితంగా ఇంటి స్థలం, ఇల్లు ఇస్తుందని చెప్పి, వారే దరఖాస్తు నింపి తీసుకెళ్లారు. వారి మాటలను తొలుత మేము నమ్మలేదు. కొన్ని రోజుల తర్వాత వలంటీర్ వచ్చి తారువలోని జగనన్న కాలనీలో ఇంటి స్థలం, ఇల్లు మంజూరైందని చెప్పారు. ఒకటిన్నర సెంటు స్థలంతో పాటు.. ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేసింది. మరికొంత సొమ్ము కలిపి ఇల్లు నిర్మించుకున్నాం. మూడు నెలల క్రితం గృహ ప్రవేశం చేశాం. ఆ రోజు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నిరుపేద కుటుంబానికి చెందిన మేము సొంతిల్లు నిర్మించుకుంటామని కలలో కూడా అనుకోలేదు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో హాయిగా నివసిస్తున్నాం. పెద్దబ్బాయి ఇంటర్, రెండో అబ్బాయి 9వ తరగతి చదువుతున్నారు. ఏటా 15 వేలు చొప్పున అమ్మ ఒడి పథకం ద్వారా నగదు వస్తుండడంతో వారి చదువులపై బెంగ లేదు. మాకు ఈ ప్రభుత్వం శాశ్వత చిరునామా కల్పించింది. – అవుగడ్డ సుగుణ, తారువ (పక్కుర్తి గణేష్ , విలేకరి, దేవరాపల్లి) పేద బతుకులకు సర్కారు అండ మాది నిరుపేద కుటుంబం. మాకు ఇద్దరు ఆడపిల్లలు. చాలా కాలం కిందటే మా ఆయన కాలం చేశారు. పిల్లలను ఎలా పెంచాలి, ఎలా ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని కుమిలిపోయేదాన్ని. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ భయం పోయింది. ప్రభుత్వం అందిస్తున్న సాయంతో ఇద్దరు పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. మా గ్రామంలో మహిళా పొదుపు సంఘంలో సభ్యురాలిగా ఉన్న నాకు వైఎస్సార్ ఆసరా పథకం కింద ఒక్కోవిడతలో రూ.15 వేలు చొప్పున నాలుగు విడతల్లో రూ.60 వేలు ప్రభుత్వం జమ చేసింది. దానిని సద్వినియోగం చేసుకుని, జగనన్న తోడు పథకం కింద రెండు విడతల్లో అందించిన రూ.20 వేలు, బ్యాంకు నుంచి రూ.50 వేలు రుణం తీసుకుని ఆ డబ్బుతో విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం గొల్లలములగాం గ్రామంలో కిరాణా దుకాణం పెట్టుకున్నాను. నెలకు రూ.16 వేలు ఆదాయం వస్తోంది. ప్రతినెలా వితంతు పింఛన్ రూ.3 వేలు అందుతోంది. నా పెద్ద కూతురు టి.భవానీ ఇంజినీరింగ్, చిన్న కూతురు వరలక్ష్మి డిగ్రీ చదువు ప్రభుత్వ తోడ్పాటుతో పూర్తయింది. సీఎంగా జగన్మోహన్రెడ్డి లేకుంటే మా పిల్లల భవిష్యత్తు అంధకారమయ్యేది. – తూమాడ శాంతమ్మ, గొల్లలములగాం (ఎమ్.సతీష్ కుమార్, విలేకరి, చీపురుపల్లి) మా పిల్లలను పనికి పంపట్లేదు మాఆయన మహ్మద్ మాబు హోటల్లో వంట మాస్టారుగా పని చేస్తున్నారు. వచ్చే కొద్దిపాటి ఆదాయంతో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గనికపూడి గ్రామంలో జీవనం సాగిస్తున్నాం. ఆరి్థక ఇబ్బందులు వెంటాడడంతో మా కుమారుడు ఖాసిం ఒకటో తరగతి చదువుతున్న సమయంలో బడి మాని్పంచి నా భర్త తనతో పాటు పనికి తీసుకెళ్లాలని భావించాడు. అయితే నాలుగేళ్ల క్రితం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక అమ్మ ఒడి పథకం కింద పిల్లలను బడికి పంపే తల్లికి ఏటా రూ.15 వేలు ఇస్తామని ప్రకటించడంతో బడికి పంపుతున్నాం. మా గ్రామంలోని ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో చేర్పించి చదివిస్తున్నాం. నాలుగేళ్లుగా అమ్మఒడి డబ్బులతో పాటు ప్రతి ఏడాది విద్యాకానుక కింద స్కూల్లోనే బ్యాగు, పుస్తకాలు, బట్టలు, బూట్లు, నోట్సులు అన్నీ ఇస్తున్నారు. పాఠశాలలోనే చక్కటి మధ్యాహ్న భోజనం కూడా పెడుతున్నారు. ఇప్పుడు ఐదో తరగతిలోకి వచ్చాడు. నాలుగేళ్లుగా అమ్మఒడి ద్వారా రూ.15 వేలు బ్యాంకులో వేస్తున్నారు. మా అబ్బాయిని ఇలాగే ఎక్కడా ఆపకుండా పెద్ద చదువులు చదివిస్తాం. మాలాంటి పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – కరీమూన్, గనికపూడి (కె.శ్రీనివాసరావు, విలేకరి, గుంటూరు ఎడ్యుకేషన్) -
ఒంటరి బతుక్కి ఓ గూడు దొరికింది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ఒంటరి బతుక్కి ఓ గూడు దొరికింది కుటుంబంలో సమస్యల కారణంగా నేను సుమారు 25 సంవత్సరాల క్రితం మా తాత ఉంటున్న శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండలంలోని తురకపేట గ్రామానికి వచ్చాను. కుమార్తెకు పెళ్లి చేశాను. కూలి పనులు చేసుకుని జీవిస్తున్నాను. ఊరిలో ఐదారు ఇళ్లు మారాను. నాకు ఇంటి స్థలం లేదు. సొంత ఇల్లు లేదని ఎంతగానో బాధ పడేదాన్ని. స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకునేంత ఆర్థిక స్తోమత లేదు. ఇంటి కోసమే ఎప్పుడూ ఆలోచించేదాన్ని. ఈ సమయంలోనే గత ఎన్నికల ముందు జగన్మోహన్రెడ్డి ఇంటి స్థలంతో పాటు ఇల్లు ఇస్తామని మాట ఇచ్చారు. ఆయన గెలిచాక ఇచ్చిన మాట ప్రకారం నాకు ఇంటి స్థలం ఇచ్చారు. ఇల్లు కట్టుకునేందుకు నిధులు మంజూరు చేశారు. సబ్సిడీ ధరలకు నిర్మాణ సామగ్రి అందించారు. వాటికి నేను కూలి చేసుకుని దాచుకున్న డబ్బులు జతచేసి ఇల్లు కట్టుకున్నాను. మరో నెల రోజుల్లో గృహ ప్రవేశం చేసేందుకు సిద్ధం అవుతున్నాను. ఓ ఇంటికి యజమాని అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఒంటరి మహిళగా గుర్తించిన నాకు ప్రతినెలా పెన్షన్ వస్తోంది. వైఎస్సార్ చేయూత కింద ఏటా రూ.18,750 వంతున వచ్చింది. వైఎస్సార్ ఆసరా కింద మూడు విడతల్లో రూ.11,000 వచ్చింది. ఇప్పుడు నాలుగో విడత కూడా ఇస్తున్నారు. నా జీవనానికి ఇక ఢోకా లేదు. – నానుపాత్రుని జయలక్ష్మి, తురకపేట (సీపాన నాగభూషణరావు, విలేకరి, ఎల్.ఎన్.పేట) కుటుంబ పోషణకు బెంగ లేదు మాది రజక కుటుంబం. నేను పదిహేనేళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నా. నాకు పదేళ్ల క్రితం పెళ్లయింది. ఇద్దరు కుమారులు. అంతంత మాత్రంగానే వచ్చే ఆదాయం కుటుంబ పోషణకే సరిపోవట్లేదు. పిల్లల చదువులు పెద్ద భారమయ్యాయి. మేము ఎలాగూ చదువుకోలేదు.. పిల్లలనైనా చదివిద్దాం అనే కల కలగానే మిగిలిపోతుందా అని భయపడేవాళ్లం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కల నిజం చేసుకునే అవకాశం వచ్చింది. మా కుటుంబానికి ఆర్థిక భరోసా లభించింది. జగనన్న చేదోడు పథకం కింద ఏటా రూ.10 వేలు వస్తోంది. విశాఖపట్నం జిల్లా అడవివరంలోని విజినిగిరిపాలెం గ్రామంలోని ఓ పైవ్రేటు పాఠశాలలో పిల్లలను చేర్పించాం. పెద్దోడు రెండో తరగతి, చిన్నోడు ఒకటో తరగతి చదువుతున్నారు. అమ్మ ఒడి పథకంలో నా భార్య ఖాతాలో çఏటా పదిహేను వేలు వంతున పడుతోంది. పిల్లల చదువుకి ఇబ్బంది తొలగిపోయింది. భవిష్యత్తులో నా పిల్లలు ఉన్నత చదువులు చదువుతారనే నమ్మకం కలుగుతోంది. మాకు ఒక పాత ఇల్లు ఉంది. అందుకే జగనన్న కాలనీ ఇంటికి దరఖాస్తు చేసుకోలేదు. నాలాగే చాలా మంది రజకుల జీవితాల్లో జగనన్న వెలుగులు నింపారు. ఆర్థిక భరోసా కల్పించారు. మళ్లీ ఆయనే సీఎం కావాలని నా ఆకాంక్ష. – ఈగులవలస అప్పలరాజు, సింహాచలం (అవసరాల గోపాలరావు, విలేకరి, సింహాచలం) కిడ్నీ రోగానికి ఉచిత చికిత్స చిన్న వయసులోనే దేవుడు అతి పెద్ద కష్టాన్నిచ్చాడు. నా వయసు 29 ఏళ్లు. నాకు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు. డిగ్రీ వరకు చదువుకున్నాను. అన్నమయ్య జిల్లా మదనపల్లె వీవర్స్ కాలనీకి చెందిన నా భర్త బొమ్మిశెట్టి రవి ప్రైవేట్ కంపెనీలో, నేను మణప్పురం ఫైనాన్స్లో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. గత ఏడాది ఫిబ్రవరిలో ఉన్నట్లుండి నాకు శ్వాస సమస్య తలెత్తింది. ఆస్పత్రికి వెళితే.. వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉంది.. పెద్దాస్పత్రికి వెళ్లాలన్నారు. బెంగళూరు బాప్టిస్ట్ హాస్పిటల్కు వెళ్లాం. అక్కడ డాక్టర్లు నా రెండు కిడ్నీలు పాడైపోయాయని, డయాలసిస్ చేయించుకోవాలని చెప్పి, వారం రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉండటంతో మదనపల్లెలోని చంద్రమోహన్ నర్సింగ్ హోంలో డయాలసిస్ చేయించుకుంటున్నాను. నా ఆర్థిక పరిస్థితి తెలుసుకుని ఆస్పత్రి వారే డయాలసిస్ పింఛన్కు దరఖాస్తు చేయించారు. నెల వ్యవధిలోనే పింఛన్ మంజూరైంది. గతేడాది ఏప్రిల్ నుంచి ప్రతి నెలా నాకు రూ.10 వేలు వంతున పింఛన్ వస్తోంది. జగనన్న ఇస్తున్న పింఛన్తోనే నా ఆరోగ్యానికి అవసరమైన మందులు, వైద్య చికిత్స చేయించుకుంటున్నాను. కిడ్నీ డోనర్ కోసం పోర్టల్లో రిజిస్టర్ చేయించాను. కష్టకాలంలో జగనన్న నా ప్రాణాలు కాపాడుతున్నారు. పెద్ద కూతురు యతిక ఒకటో తరగతి చదువుతోంది. అమ్మ ఒడి పథకం కింద రూ.15 వేలు సాయం అందుతోంది. జగనన్న ప్రభుత్వంలో అర్హత ఉన్న వారందరికీ సంక్షేమ ఫలాలు ఇంటి వద్దే అందించడం సంతోషంగా ఉంది. – బొమ్మిశెట్టి వసుంధర, మదనపల్లె (వంశీధర్ సూరమాల, విలేకరి, మదనపల్లె) -
శిఖరాలూ.. సలాం కొట్టాయ్!
బోణం గణేష్, సాక్షి ప్రతినిధి: సముద్రమట్టానికి వేల మీటర్ల ఎత్తు.. సహకరించని వాతావరణం.. అడుగడుగునా పొంచి ఉన్న ప్రమాదాలు.. గజగజలాడించే మంచు.. కానీ అతని సంకల్పానికి ఆ మహామహా శిఖరాలే తలవంచాయి. మార్షల్ ఆర్ట్స్లో అతని పట్టుదలకు అంతర్జాతీయ పతకాలు వరించాయి. ప్రపంచంలోని ఏడు అతిపెద్ద శిఖరాలను అధిరోహించిన అతని పేరు.. భూపతిరాజు అన్మీష్ వర్మ. విశాఖపట్నానికి చెందిన అన్మీష్ వర్మ తాను అధిరోహించిన ప్రతి పర్వతంపైనా జాతీయ జెండాతో పాటు వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాల జెండాను ఎగురవేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అన్మీష్ గురించి విశేషాలు ఆయన మాటల్లోనే.. సరదాగా మొదలై.. శిఖరాల అంచులకు ఎగసి చిన్నప్పుడు విశాఖపట్నంలోని కొండలను సరదాగా ఎక్కేవాడిని. ఆ ఆసక్తే ఎవరెస్ట్ గురించి తెలుసుకునేలా చేసింది. దానిపైకి ఎక్కడం కష్టమని.. అధిరోహించడానికి వెళ్లిన వారు చనిపోతే శవాన్ని తేవడం కూడా కష్టమేనని తెలుసుకున్నాక దానిపైకి ఎలాగైనా ఎక్కాలని నిర్ణయించుకున్నాను. ఎవరెస్ట్ను అధిరోహించేందుకు విజయవాడలో ప్రభుత్వం సెలక్షన్స్ నిర్వహిస్తోందని తెలుసుకుని.. నేనూ వెళ్లాను. అప్పుడు వందల మంది వచ్చారు. కానీ నాతో పాటు ఐదుగురే ఎంపికయ్యారు. లేహ్, లడఖ్లో ప్రాక్టికల్ టెస్ట్ పూర్తి చేసి.. ఎవరెస్ట్ను అధిరోహించడానికి అర్హత సాధించాను. మన దేశంలోనే అత్యంత వేగవంతమైన పర్వతారోహకుడిగా గుర్తింపు సంపాదించాను. ప్రపంచంలోనే ఎత్తయిన ఏడు పర్వతాలను అధిరోహించిన ఏకైన వ్యక్తిగా గుర్తింపు లభించింది. నవరత్నాలతో పేదలకెంతో లబ్ధి.. అలాగే తొమ్మిదేళ్లకే మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకున్నాను. ప్రపంచ చాంపియన్షిప్లలో మెడల్స్ సాధించాను. వరుసగా మూడు మెడల్స్ సాధించి రికార్డ్ సృష్టించాను. మా నాన్న వేణుగోపాలరాజు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కొన్నాళ్లు విధులు నిర్వర్తించి.. ఆ తర్వాత లారీ డ్రైవర్గా పనిచేశారు. 2014లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. నాన్న పోయిన 18 రోజులకు ఇంగ్లండ్లో కరాటే ప్రపంచ చాంపియన్షిప్కు వెళ్లి పతకం సాధించాను. ఇప్పుడు నేనే మన దేశ కరాటే టీమ్కు కోచ్గా ఉన్నాను. రాష్ట్రంలో వైఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాలు నాకెంతో నచ్చాయి. ఎంతోమంది పేదలకు వాటి ద్వారా లబ్ధి చేకూరుతోంది. అందుకే ఆ పథకాల లోగో ఉన్న జెండాను మన దేశ జెండాతో పాటు ప్రపంచ శిఖరాలపై ఎగురవేస్తుంటాను. ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో గ్రామీణ యువత, విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయం. బతికిరావడమూ కష్టమే.. అడ్వెంచర్ గ్రాండ్ స్లామ్.. అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన వారికి ఆ గ్రాండ్ స్లామ్ టైటిల్ లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ టైటిల్ దక్కించుకున్న వారి సంఖ్య 30లోపే ఉంటుంది. అంత గొప్ప టైటిల్ నాకు లభించింది. ఎవరెస్టు, ఎల్బ్రస్, కిలీమంజారో, దెనాలి, అకాంగువా, మౌంట్ విన్సన్, కోస్కియోస్కోను అధిరోహించాను. అలాగే మైనస్ డిగ్రీల సెల్సియస్లలో.. భూమి నార్త్, సౌత్ పోల్ 90 డిగ్రీల అక్షాంశానికి చేరుకున్నాను. అదో పెద్ద సాహసం. తేడా వస్తే బతికిరావడం కష్టం. ఆ చలికి రక్తం గడ్డకడుతుంది. ఒకసారి ఎవరెస్ట్ను అధిరోహిస్తున్నప్పుడు నా సహ పర్వతారోహకుడికి బ్రెయిన్లో రక్తం గడ్డకట్టింది. ఆ పరిస్థితిలో అతన్ని వదిలేసి వెళ్లలేకపోయాను. అతన్ని కాపాడటం కోసం వెనక్కి తిరిగొచ్చేశాను. ఆ తర్వాత ఏడాది మళ్లీ ప్రయత్నించాను. ప్రాణాలకు తెగించి లక్ష్యాన్ని చేరుకున్నాను. -
మా బతుకులు మారాయి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. మా బతుకులు మారాయి మాది వ్యవసాయ కుటుంబం. కర్నూలు జిల్లా ఆలూరులో మాకున్న మూడెకరాల భూమిలో మా ఆయన జ్ఞాన చంద్రబాబు రాజ్ వ్యవసాయం చేస్తుంటారు. వర్షాధారం కావడంతో కరువు వస్తే ఆదాయం రాకపోగా పెట్టుబడులు కూడా కోల్పోవాల్సి వచ్చేది. దానివల్ల చేసిన అప్పులు తీర్చలేక అవస్థలు పడేవాళ్లం. మా అబ్బాయి హర్షవర్ధన్ 8వ తరగతి, సాయిసుప్రజ ఇంటర్ చదువుతోంది. మేం పడే బాధలు పిల్లల పడకూడదని చాలీచాలని ఆదాయంతోనైనా ఇద్దరినీ కష్టపడి చదివిస్తున్నాం. నేను గృహిణిగా ఉంటూ, తీరిక సమయాల్లో ఇంట్లోనే టైలరింగ్ చేస్తుంటాను. తద్వారా కుటుంబానికి ఆసరాగా నిలిచాను. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత నాకు వైఎస్సార్ ఆసరా పథకం కింద ఇప్పటివరకూ రూ. 12,500లు వచ్చిది. అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ. 15వేలు వంతున నా ఖాతాలో జమయ్యాయి. వైఎస్సార్ రైతుభరోసా కింద ఏటా రూ. 13,500 వస్తోంది. వీటిద్వారా మా ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయాయి. టైలరింగ్లో మరో మెట్టు ఎదిగేందుకు రూ. 1.50లక్షల డ్వాక్రా రుణం, రూ. 6.50లక్షల బ్యాంకు రుణం తీసుకుని మగ్గం, ఎంబ్రాయిడర్ మెషిన్ కొనుగోలు చేశాను. సరికొత్త డిజైన్లతో గౌన్లు, డ్రస్సులు, జాకెట్లు, చీరలకు ఫాల్స్ వంటివి చేస్తున్నా. బంధువులు, స్నేహితులు నా పనికి మెచ్చుకుని, ప్రోత్సహిస్తున్నారు. మా అత్తగారు రామలక్ష్మి సహకారం అందిస్తున్నారు. నా ఆదాయం నెలకు 6 నుంచి 7 వేల రూపాయలకు పెరిగింది. నెల నెలా వస్తున్న ఆదాయంతో బ్యాంకు రుణం కూడా తీరుస్తున్నారు. ఇప్పుడు మేము హాయిగా జీవిస్తున్నాం. – కుమ్మర రమాదేవి, ఆలూరు, కర్నూలు జిల్లా (ఉలువ చంద్రబాబు, విలేకరి, ఆలూరు) నిరుపేదకు ప్రాణభిక్ష పెట్టారు నేను పేద రైతును. బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలోని కొప్పెరపాలెం గ్రామంలో ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుని బతుకు బండి లాగుతున్నాను. నాలుగు నెలల క్రితం నాకు గుండె బరువుగా ఉండడం, తిమ్మిర్లు, నొప్పిగా అనిపించింది. కుటుంబ సభ్యులు ఆందోళన చెంది స్థానికంగా ఉన్న ఆర్ఎంపీని సంప్రదించగా ఆయన గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లమని సూచించారు. అక్కడ వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించి బైపాస్ సర్జరీ చేయాలన్నారు. రెండు లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అసలే పేద కుటుంబం కావడంతో అంత మొత్తం భరించలేమని చెప్పాం. అప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు మాకు శ్రీరామరక్షగా నిలిచింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద సర్జరీ చేసి వైద్యులు నాకు పునర్జన్మ ప్రసాదించారు. ఆరోగ్యశ్రీ నన్ను బతికించింది. ఆపరేషన్ అనంతరం ఆరోగ్య ఆసరాగా రూ. 5 వేలు నా ఖాతాలో వేశారు. వృద్ధాప్య పింఛను కూడా మా వలంటీర్ క్రమం తప్పకుండా ప్రతి నెలా ఒకటోతేదీ వేకువజామునే ఇంటి వద్దకు వచ్చి ఇస్తున్నారు. రైతు భరోసా సొమ్ము కూడా అందుతుండడంతో సాగుకు అప్పు చేయాల్సిన దుస్థితి తప్పింది. నా మనవరాలికి కూడా మూడేళ్లుగా అమ్మ ఒడి వస్తుండడంతో వారి చదువులకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా సాగిపోతోంది. నాలాంటి పేదవారికి ప్రభుత్వ పథకాలు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. – కంచర్ల హరిబాబు, కొప్పరపాలెం, బల్లికురవ (గుంటుపల్లి ఆంజనేయులు, విలేకరి, బల్లికురవ) కాళ్లు కదపకుండా ఇంటివద్దే వ్యాపారం మా కుటుంబమంతా పూర్వకాలం నుంచి సైకిల్పై బట్టల మూటలు పెట్టుకుని గ్రామాల్లో విక్రయిస్తూ జీవనం సాగించేది. మా ఆయన కూడా ఆ వృత్తినే కొనసాగించారు. నాలుగేళ్లుగా మా ఆయన వయసు రీత్యా గ్రామాల్లో తిరిగేందుకు ఆరోగ్యం సహకరించక పోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. మాకు బట్టల వ్యాపారం తప్ప మరే పనీ చేత కాకపోవడంతో ఎలా బతకాలా అని మదనపడ్డాం. ఇంతలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు తీసుకున్నాక వైఎస్సార్ ఆసరా (డ్వాక్రా రుణమాఫీ) కింద రూ. 13వేల వంతున మూడేళ్లకు రూ. 39వేలు, వైఎస్సార్ చేయూత కింద ఏడాదికి రూ. 18,750లు వంతున మూడేళ్లకు రూ. 56,250లు అందింది. ఆ మొత్తంతో ఇంటివద్దే రెండేళ్లక్రితం బట్టల దుకాణం పెట్టుకున్నాం. జగనన్నతోడు పథకంలో ఏడాదికి పదివేల చొప్పన రూ.30 వేలు వచ్చిది. దానిని కూడా వ్యాపారానికి పెట్టుబడిగా వాడుకున్నాం. ఇప్పుడు మా వ్యాపారం బాగుంది. నా ఇద్దరు కుమార్తెలకు వివాహం చేసి పంపించాను. మేము నిలదొక్కుకునేందుకు సాయపడిన ఈ ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాం. – పొన్నగంటి నాగమణి, వరహాపురం, చీడికాడ మండలం, అనకాపల్లి జిల్లా (బోడాల శ్రీనివాసరావు, విలేకరి, చీడికాడ) -
జగనన్న దీవెన వల్లే ఉద్యోగం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. జగనన్న దీవెన వల్లే ఉద్యోగం ఈ రోజు నేను బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నానంటే ఈ ప్రభుత్వం దయే. మా నాన్న ఇప్పిలి అప్పారావు ఆటో డ్రైవర్. అమ్మ గృహిణి. తమ్ముడు మురళీకృష్ణ ఐటీఐ చదువుతున్నాడు. నాన్న విశాఖ జిల్లా పెందుర్తిలో ఆటో నడుపుతూ మా కుటుంబాన్ని పోషిస్తున్నారు. మా చదువులు, ఇతరత్రా అవసరాలకు దాదాపు రూ.5 లక్షల వరకు అప్పులు చేయాల్సి వచ్చింది. అదే సమయంలో నా డిప్లమో పూర్తయింది. ఈ–సెట్లో 600వ ర్యాంక్ సాధించాను. రెండో కౌన్సెలింగ్లో సీటు వచ్చింది. అయితే ఫీజు ఎక్కువ కట్టాల్సి రావడం.. చంద్రబాబు ప్రభుత్వం తీరు వల్ల రూ.35 వేలు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామనడంతో ఇక చదువు మానేద్దామని నిర్ణయించుకున్నా. అదే సమయంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా చెల్లిస్తామని ప్రకటించడంతో 2019లో బీటెక్లో చేరాను. అనుకున్నట్లుగానే సమయానికి జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా దాదాపు రూ.2.50 లక్షలు అందించారు. సొంత అన్నయ్యే నా చేయి పట్టుకుని చదివించిన అనుభూతి కలుగుతోంది. ఇప్పుడు ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. రానున్న రోజుల్లో గ్రూప్స్/సివిల్స్కి ప్రిపేర్ అవుతాను. వైఎస్ జగన్ సీఎంగా దీర్ఘకాలం కొనసాగితే మాలాంటి వారు ఎంతో మంది ఉన్నత స్థాయికి చేరుకోగలమన్న నమ్మకాన్ని కలిగించారు. మా అమ్మకు ఆసరా, నాన్నకు వాహన మిత్ర పథకం ద్వారా లబ్ధి కలిగింది. – ఇప్పిలి అప్పలరాజు, ఇప్పిలివానిపాలెం, పెందుర్తి (సమ్మంగి భాస్కర్, విలేకరి, పెందుర్తి) మేకల పెంపకంతో చక్కని ఉపాధి ఒకప్పుడు మా లాంటి గిరిజన మహిళలు వ్యవసాయ పనులతో పాటు కొండలపై నుంచి తెచ్చుకునే కర్రలను అమ్ముకొని కుటుంబానికి ఆసరాగా నిలిచేవాళ్లం. భర్త సంపాదన చాలక కుటుంబం పోషణ ఎంతో భారంగా ఉండేది. ఇంటిల్లిపాదీ కష్టపడినా ఆదాయం మాత్రం కష్టానికి తగినట్లుగా ఉండేది కాదు. వైఎస్సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,750 వస్తోంది. ఈ పథకం మా కుటుంబానికి ఎంతో మేలు చేసింది. మూడేళ్లుగా వస్తున్న సాయంతో మేకలు కొనుగోలు చేసి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం సవరగోపాలపురంలో వాటిని పెంచుతున్నా. దీనికి తోడు వైఎస్సార్ ఆసరా కింద ఇప్పటి వరకు రూ.36 వేలు వచ్చింది. ఈ సొమ్ము కూడా పెట్టుబడికి ఉపయోగపడింది. మేకల పెంపకం వల్ల ఆదాయం బాగుంది. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున అందుతోంది. దీనిని వ్యవసాయానికి పెట్టుబడిగా వాడుకుంటున్నాం. నాకో కుమారుడు. వాడు వ్యవసాయ కూలి. వాడి కుమార్తె టెక్కలి జూనియర్ కాలేజ్లో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఆమెకు అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ. 15 వేల వంతున మా కోడలు ఖాతాలో జమవుతోంది. నా భర్తకు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. నా కోడలి పేరున జగనన్న కాలనీలో ఇల్లు మంజూరైంది. ఇల్లు నిర్మాణ దశలో ఉంది. ఇప్పుడు మా కుటుంబం హాయిగా జీవనం సాగిస్తోంది. – చింతపల్లి పెంటమ్మ, సవరగోపాలపురం (ఎల్.వి.రమణ, విలేకరి, టెక్కలి) ప్రభుత్వ పథకాలే మా జీవనాధారం దివ్యాంగురాలినైన నాతో పాటు 70 ఏళ్ల వయస్సున్న మా అమ్మ ఉంటోంది. ఏలూరు జిల్లా నూజివీడులో చిన్నపాటి కూలి పనులు చేసుకుంటూ మా అమ్మను కంటికి రెప్పలా చూసుకోవడానికి చాలా అవస్థలు పడుతున్నా. ఈ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మాలాంటి పేదలను ఆదుకుంటోంది. నాకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున అందిస్తోంది. దీంతో కుటుంబ అవసరాలను తీర్చుకుంటున్నాం. జీవనానికి ఈ పథకం ద్వారా వస్తున్న డబ్బు ఎంతో తోడ్పడుతోంది. దీనికి తోడు ప్రభుత్వం నాకు దివ్యాంగ పింఛన్ కింద రూ.3 వేలు ఇస్తుండగా, మా అమ్మకు వద్ధాప్య పింఛను వస్తోంది. రేషన్కార్డు ద్వారా ఇద్దరికీ అవసరమైన బియ్యం, ఇతర సరుకులు అందుతున్నాయి. మా అమ్మకు అవసరమైన బీపీ, సుగర్ మందులతో పాటు బీ కాంప్లెక్స్, మోకాళ్ల నొప్పులకు సంబంధించిన మందులు ప్రతి నెలా విలేజ్ క్లినిక్లో ఉచితంగా అందిస్తున్నారు. అవసరమైనప్పుడు రక్త పరీక్షలను సైతం చేస్తున్నారు. ఇప్పుడు మా జీవనానికి ఎలాంటి ఇబ్బంది లేదు. – జె.రమాప్రభ, నూజివీడు, ఏలూరు జిల్లా (ఉమ్మా రవీంద్రరెడ్డి, విలేకరి, నూజివీడు) -
చరిత్ర ఎరుగని సాహసం..
సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, ఎవరూ సాహసించని రీతిలో అక్కచెల్లెమ్మలకు ఏకంగా 31.19 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వగలిగామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఇంటి స్థలం, ఇల్లు రూపంలో ప్రతి నిరుపేద అక్కచెల్లెమ్మకు రూ.20 లక్షల వరకు విలువైన ఆస్తిని ఇవ్వగలిగే గొప్ప అవకాశాన్ని దేవుడు తనకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద 4,07,323 మంది లబ్ధిదారులకు బ్యాంకు రుణాలపై వడ్డీని రీయింబర్స్ చేస్తూ రూ.46.90 కోట్ల మొత్తాన్ని సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడారు. అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ.. దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నవరత్నాలు –పేదలందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులైన 12,77,373 మంది అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.35 వేలు చొప్పున పావలా వడ్డీకే రుణాలిప్పించాం. వాటికి సంబంధించి తొలి దఫాలో 4,07,323 మందికి పావలా వడ్డీ కింద ఇవాళ సుమారు రూ.47 కోట్లు జమ చేస్తున్నాం. ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి ఈ కార్యక్రమం చేపడతాం. గతంలో సున్నా వడ్డీ డబ్బులు అక్కచెల్లెమ్మలకు విడుదల చేసినప్పుడు 5,43,140 మందికి దాదాపు రూ.54 కోట్లు విడుదల చేశాం. ప్రతి అక్కచెల్లెమ్మకు మంచి చేస్తూ పావలా వడ్డీకే రూ.35 వేలు రుణం అందించడం ద్వారా ఇళ్ల నిర్మాణం పురోగతిని వేగవంతం చేస్తున్నాం. బ్యాంకుల దగ్గర నుంచి పొందిన రుణాలను 9 నుంచి 11 శాతం వరకు వడ్డీతో తిరిగి చెల్లించే కార్యక్రమం అక్కచెల్లెమ్మలు సక్రమంగా చేయాలి. అది వారి బాధ్యత. అలా అక్కచెల్లెమ్మలు కట్టిన వడ్డీ సొమ్మును తిరిగి వారికి అందించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఈ క్రమంలో అక్కచెల్లెమ్మలకు నికరంగా రూ.35 వేలపై పావలా వడ్డీ మాత్రమే పడుతుంది. విలువైన స్థిరాస్తి.. రాష్ట్రంలో ఇప్పటికే 22.25 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. రాష్ట్ర చరిత్రలో ఇది ఎక్కడా, ఎప్పుడూ చూడని విధంగా చేపడుతున్నాం. ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపు రూ.2.70 లక్షలు ఖర్చవుతుంది. మరో రూ.లక్ష మౌలిక సదుపాయాల కోసం అదనంగా ఖర్చవుతుంది. ఇంటి నిర్మాణం, మౌలిక వసతుల కోసం దాదాపు రూ.3.70 లక్షలు ఖర్చు అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రూ.1.80 లక్షలు నేరుగా అక్కచెల్లెమ్మలకు ఇస్తున్నాం. మరో రూ.35 వేలు పావలా వడ్డీకి రుణాలను అందుబాటులోకి తెచ్చాం. దాదాపు రూ.15 వేలు ఖరీదు చేసే ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తున్నాం. సిమెంట్, మెటల్ ఫ్రేమ్స్ లాంటి వివిధ రకాల నాణ్యమైన వస్తువులను మార్కెట్ ధర కన్నా తక్కువకు సబ్సిడీపై అందించడం ద్వారా రూ.40 వేల దాకా ప్రయోజనం చేకూరుస్తున్నాం. మనం ఇచ్చిన ఇంటి స్థలం మార్కెట్ విలువ ప్రాంతాన్ని బట్టి కొన్ని జిల్లాల్లో రూ.15 లక్షల పైచిలుకు ఉంది. ఈ విలువ మీద ఇళ్లు, మౌలిక సదుపాయాల విలువలను కలిపితే ప్రతి అక్కచెల్లెమ్మకు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ ఆస్తిని తోబుట్టువుగా సమకూరుస్తున్నాం. ► కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఏపీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ షర్మిలారెడ్డి, సీఎస్ డాక్టర్ జవహర్రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్, ప్రత్యేక కార్యదర్శి బి.ఎండీ.దీవాన్ మైదిన్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ డాక్టర్ లక్ష్మీ షా, సెర్ప్ సీఈవో ఏఎండీ ఇంతియాజ్, మెప్మా ఎండీ వి.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కోటిమంది.. జయహో జగనన్నా పిల్లాపాపలతో కలిపి సుమారు కోటిమంది అక్కచెల్లెమ్మలకు శాశ్వత చిరునామా కల్పిస్తున్న గొప్ప యజ్ఞం జగనన్న ఇళ్ల నిర్మాణం. ఒక గ్రామం ఏర్పడాలంటే సుమారు 50 నుంచి 100 సంవత్సరాలు పడుతుంది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద రెండున్నర ఏళ్లలో 17 వేల జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్లను నిర్మించడం ఇదే ప్రథమం. ఇది దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. సీఎం జగన్కు మినహా మరెవరికీ ఇది సాధ్యం కాదు. ప్రభుత్వం 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి 22 లక్షల గృహ నిర్మాణాలు చేపట్టగా ఇప్పటికే 9 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తై నిరుపేద మహిళలు పిల్లాపాపలతో సంతోషంగా జీవిస్తున్నారు. కోటిమంది జయహో జగనన్నా అని నినదిస్తున్నారు. పేదలకు పక్కా గూడు కల్పించే ఈ మహా యజ్ఞం ఎంత మంది మారీచులు అడ్డుపడినా ఆగదు. – జోగి రమేష్, గృహ నిర్మాణ శాఖా మంత్రి ఓ ఆడబిడ్డకు ఇంకేం కావాలి? ఎన్నో ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఇంటి కోసం తిరిగి తిరిగి అలిసిపోయా. ఈ ప్రభుత్వం వచ్చాక వలంటీర్ ద్వారా సచివాలయంలో దరఖాస్తు చేసుకోగానే స్థలం మంజూరైంది. వెంటనే పట్టా ఇచ్చారు. విశాఖలో అడుగు భూమి లేని నాకు ఈ రోజు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల విలువైన స్ధలాన్ని, ఇంటిని కూడా అందించారు. ఇదంతా నమ్మలేకపోతున్నా. మాకిచ్చిన స్థలంలో ఇంటి నిర్మాణానికి ఎన్నో విధాలుగా అండగా నిలిచారు. బ్యాంకు ద్వారా పొందిన రుణానికి వడ్డీ కూడా మీరే కడుతున్నారు. కాలనీలో రోడ్లు, కరెంట్, నీళ్లు అన్నీ ఇచ్చారు. ఒక ఆడపిల్లకు అన్నగా మీరు (సీఎం జగన్) చేయాల్సిందంతా చేశారు. ఇంతకంటే ఏం కావాలి? మా పాపకు అమ్మ ఒడి వస్తోంది. నేను పొదుపు సంఘం ద్వారా లబ్ధి పొందా. కరోనా సమయంలో ఎంతో ఆందుకున్నారు. మళ్లీ మీరే మాకు సీఎంగా రావాలి. – హైమావతి, లబ్ధిదారు, విశాఖపట్నం ద్వారకను తలపించేలా కాలనీలు మేం తమిళనాడు నుంచి ఇక్కడ స్థిరపడ్డాం. గుంటూరు జిల్లా పేరేచర్ల జగనన్న కాలనీలో నాకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలం విలువ రూ.10 లక్షలు ఉంటుంది. దానికి తోడు ఇల్లు కట్టుకోవడానికి కూడా సాయం చేశారు. ఎన్ని జన్మలెత్తినా మీ (సీఎం జగన్) రుణం తీర్చుకోలేం. కాలనీలో కరెంటు, రోడ్లు, వాటర్ అన్ని సౌకర్యాలున్నాయి. ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా, ఏ కార్యాలయం చుట్టూ తిరగకుండా ఇచ్చారు. ఏడాదిన్నరగా ప్రభుత్వం ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నా. మా కాలనీలో లైటింగ్, ఆర్చ్ గేట్ కట్టారు. లైటింగ్ చూడటానికి రెండు కళ్లు సరిపోలేదు. అప్పట్లో శ్రీకృష్ణుడు ద్వారక కట్టిస్తే అన్ని కులాలు కలిసి బతికేవారట. ఇప్పుడు జగనన్న కాలనీలు కూడా ద్వారక లాంటివే. తల్లిదండ్రులు జన్మనిస్తే మీరు మాకు జీవితమిచ్చారు. మీలాంటి సీఎంను గతంలో ఎన్నడూ చూడలేదు. మా పిల్లలను స్కూల్కు పంపితే అన్నీ ఇస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నానని గర్వంగా చెబుతున్నా. మా ఇంట్లో రేషన్ బియ్యం తింటాం. రేషన్ బండి ఇంటి ముందుకే వస్తోంది. ఏ ప్రయాస లేకుండా సరుకులు తీసుకుంటున్నాం. మిమ్మల్ని మళ్లీ గెలిపించుకుంటాం జగనన్నా. – పగడాల స్వర్ణ సింధూర, లబ్ధిదారు, గుంటూరు మీ సంకల్పం గట్టిది పదేళ్లు అద్దె ఇంట్లో ఉన్నాం. కిరాయి కట్టలేక చాలా ఇబ్బందులు పడ్డాం. మీరు తెచ్చిన సచివాలయాల వ్యవస్థతో రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంటి స్థలం ఇచ్చారు. సొంతిల్లు కట్టుకునేందుకు రూ.35 వేలు బ్యాంకు రుణం అందించారు. ఆ వడ్డీ భారం మాపై పడకుండా మీరు తీసుకున్న నిర్ణయానికి హ్యాట్సాఫ్. నా ఇంటి స్థలం ఇప్పుడు రూ. 5 లక్షలు ఉంది. భవిష్యత్లో రూ.10 లక్షలు కూడా కావచ్చు. ఈ ప్రభుత్వంలో నాకు రేషన్ కార్డు కూడా మంజూరైంది. ఏ పథకం కావాలన్నా సులభంగా అందుతోంది. మా పాపకు అమ్మ ఒడి వస్తోంది. మా అత్తయ్య చేయూత డబ్బులతో చీరల వ్యాపారం చేస్తోంది. మామకు వృద్ధాప్య పింఛన్ ఇంటి వద్దకే తెచ్చి ఇస్తున్నారు. గతంలో పింఛన్ కోసం ఎంతో ప్రయాసలు పడ్డాం. పేద మహిళ లక్షాధికారి కావాలన్న మీ (సీఎం జగన్) సంకల్పం గొప్పది. మీ ద్వారా నా కుటుంబం రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు లబ్ధి పొందింది. – వహిదా ఖానం, లబ్ధిదారు, కడప -
వ్యాపారం చేస్తూ బతుకుతున్నాం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. వ్యాపారం చేస్తూ బతుకుతున్నాం నేను, నా భర్త మానుకొండ రామారావుతో కలసి గతంలో కూలిపనులు చేసుకుని జీవనం సాగించేవాళ్లం. మాకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె నిషికి ఐదు నెలల క్రితం వివాహం చేశాం. కుమారుడు ప్రసన్న కుమార్ ఐటీఐ చదువుతున్నాడు. చిన్న కుమార్తె రూప ఇంటర్ పూర్తి చేసింది. ముగ్గురికీ ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా అందించిన ఆర్థికసాయంతోనే చదివించగలిగాం. కూలి పనులకు వెళ్లలేక మూడేళ్ల క్రితం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం సత్తెన్నగూడెంలో ఇంటి వద్దే ఒక చిన్న పచారీ కొట్టు పెట్టాను. అప్పు చేసి, పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని అతి కష్టం మీద నడిపేదాన్ని. చేతిలో చిల్లిగవ్వ లేక, వ్యాపారం సజావుగా సాగక, కుటుంబ పోషణ భారమైన సమయంలో వైఎస్సార్ ఆసరా పథకం నా కుటుంబాన్ని ఆదుకుంది. ఏడాదికి 15,357 చొప్పున మూడు దఫాలుగా ఇప్పటి వరకు నా పొదుపు ఖాతాలో రూ.46,071 జమ అయ్యింది. దీనికి తోడు జగనన్న తోడు పథకం కింద రూ.10 వేలు చొప్పున రెండు దఫాలుగా రూ.20 వేలు సాయం అందింది. ఈ నగదు వ్యాపార అవసరాలకు ఎంతగానో ఉపయోగపడింది. ఈ దుకాణానికి అద్దె, కరెంటు బిల్లు పోను నెలకు సుమారు రూ.12 వేలు ఆదాయం వస్తోంది. – మానుకొండ శ్రీలత, సత్తెన్నగూడెం, ద్వారకాతిరుమల మండలం (యండమూరి నాగవెంకట శ్రీనివాస్, విలేకరి, ద్వారకాతిరుమల) కూలి పనులు మాని వస్త్రాలు నేస్తున్నాం మేం చేనేత కార్మికులం. మగ్గంపై వస్త్రాలు నేసి, ఆ ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. గత ప్రభుత్వాలు నేత కార్మికులను పట్టించుకోకపోవడం నూలు కొనుగోలుకు సబ్సిడీ ఇవ్వకపోవడం, పెట్టుబడి సాయం చేయకపోవడంతో వారంతా కులవృత్తికి దూరమయ్యారు. అప్పు చేసి ముడి సరుకు కొనుగోలు చేసి నేను నా భార్య కష్టపడి మగ్గం నేస్తే పెట్టుబడి, వడ్డీలు పోను రోజుకు రూ.500లు మిగలడం కష్టమయ్యేది. లాభం లేక పొట్టకూటి కోసం వ్యవసాయ కూలి పనులకు, సిమెంట్ కాంక్రీటు పనులకు, కంపెనీల్లో పనుల కోసం వలస పోవాల్సి వచ్చింది. భార్యభర్తలం ఎండలో కష్టపడితే రోజుకు రూ.700లు వచ్చేది. అలవాటు లేకపోయినా పొట్టపోషణకోసం ఆ పనులు చేయాల్సి వచ్చేది. దేవుడు జగనన్న రూపంలో వచ్చాడు. తాను అధికారంలోకి వస్తే చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకు వస్తానని ప్రకటించారు. పాదయాత్రలో నేతన్నల కష్టాలు స్వయంగా చూశారు. నేతన్నలకు నెలకు రూ.2 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామన్నారు. సీఎం అయిన వెంటనే మూడు మాసాలు తిరక్కుండానే నేతన్న నేస్తం పథకం కింద నెలకు రూ.2 వేల చొప్పున ఏడాదికి సరిపడా రూ.24 వేలు ఒకే విడతలో మా ఖాతాల్లో జమ చేశారు. ఐదేళ్లనుంచి నిరాటంకంగా ఈ సాయం అందిస్తున్నారు. ఇప్పటివరకు రూ.1.20 లక్షలు నా ఖాతాల్లో జమయ్యాయి. ఇప్పుడు మేము ఎంచక్కా కుల వృత్తికి దగ్గరయి, అప్పు చేయకుండా ముడిసరుకు కొనుగోలుచేసి వస్త్రాలు తయారు చేసి విక్రయించుకుంటున్నాం. రోజుకు సుమారు వెయ్యి రూపాయల ఆదాయం వస్తోంది. ఇంటివద్దే ఉంటూ ఉపాధి పొందుతూ కుటుంబాలను పోషించుకుంటున్నాం. ఈ ప్రభుత్వం చేసిన సాయాన్ని ఎన్నటికీ మరువలేం. – మాడెం రాజు, నక్కపల్లి, అనకాపల్లి జిల్లా (ఆచంట రామకృష్ణ, విలేకరి, నక్కపల్లి, అనకాపల్లి జిల్లా) వ్యవసాయానికి ఇప్పుడు చింత లేదు మాది వ్యవసాయ కుటుంబం. కొల్లేరు తీరంలోని కాళింగగూడెంలో నాకు ఎకరంన్నర సొంత భూమి ఉండగా మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాను. ఈ ప్రాంతంలో వ్యవసాయం కత్తిమీద సాములా ఉండేది. ముంపునకు ముందు.. సాగుకు వెనుక అన్న చందంగా ఉండేది. కొల్లేరు ముంపుతో ఖరీఫ్ సాగు నష్టపోతుండగా, తుఫాన్ల వల్ల రబీ సాగు కోల్పోయేవాళ్లం. కౌలు కూడా చెల్లించలేని దుస్థితిలో తినడానికి ఒక్క గింజైనా మిగిలేది కాదు. ప్రతి ఏటా అధిక వడ్డీలకు సొమ్ము తెచ్చి పెట్టుబడులు పెట్టి సాగు చేసినా చేతికి చిల్లిగవ్వ దక్కేది కాదు. అప్పుల ఊబిలో కూరుకుపోయేవాళ్లం. పిల్లల్ని చదివించలేక, పండగలు ఆనందంతో జరుపుకోలేక నానా అవస్థలూ పడేవాళ్లం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కష్టాలు చాలావరకూ తొలగిపోయాయి. సొంత భూమికి రైతు భరోసా సొమ్ము ఏటా రూ. 13,500లు వంతున వస్తోంది. పంట నష్టపరిహారం, బీమా సొమ్ములు ఏటా అందుతున్నాయి. పండించిన పంటకు మద్దతు ధర లభిస్తోంది. పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో అమ్మిన రెండు, మూడు రోజులకే సొమ్ము బ్యాంకు అకౌంట్లో పడిపోతోంది. నాకు ఇద్దరు కుమార్తెలున్నారు. ఒక పాపకు అమ్మ ఒడి సొమ్ము ఏటా రూ. 15వేలు వంతున నా భార్య అకౌంట్లో జమవుతోంది. మరో పాపకు విద్యాదీవెన, వసతి దీవెన వర్తిస్తోంది. ఇద్దరు పిల్లల చదువుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ఉంది. ఇప్పుడు సంతోషంగా జీవనం గడుపుతున్నాం. మా లాంటివారిని ఆదుకుంటున్న ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం. – తమ్మినేని రంగారావు, కాళింగగూడెం, ఆకివీడు మండలం (బి.ఆర్.కోటేశ్వరరావు, విలేకరి, ఆకివీడు) -
CM Jagan: పేద అక్కచెల్లెమ్మలకు అండగా..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇళ్లు లేని పేదింటి అక్కచెల్లెమ్మలకు తోబుట్టువుగా వారి సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రికార్డు స్థాయిలో నివేశన స్థలాలను పంపిణీ చేయడంతోపాటు ఇళ్లను మంజూరు చేశారు. ఇళ్ల నిర్మాణానికి ఆరి్థక సాయం చేయడంతోపాటు రాయితీపై సామగ్రి అందిస్తున్నారు. ఇళ్ల లబ్ధిదారులు బ్యాంకు నుంచి పొందిన రుణాలకు వడ్డీని కూడా రీయింబర్స్మెంట్ చేయనున్నారు. తొలి విడత లబ్ధిదారులకు వడ్డీని గురువారం రీయింబర్స్మెంట్ చేయనున్నారు. పేదలకు పావలా వడ్డీ.. ఆపై భారం భరిస్తున్న ప్రభుత్వం సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 71,811.50 ఎకరాల విస్తీర్ణంలో 31లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మల పేరిట పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికి యూనిట్కు రూ.1.80 లక్షలు చొప్పున ఇవ్వడమే కాకుండా, ఉచితంగా ఇసుక సరఫరా ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీలు, మెటల్ ఫ్రేమ్స్, ఇతర నిర్మాణ సామగ్రిని తక్కువ ధరకే అందించడంతో మరో రూ.40 వేల మేర లబ్ధి కల్పింస్తున్నారు. పావలా వడ్డీకే రూ.35వేలు చొప్పున బ్యాంకు రుణం అందిస్తున్నారు. ఇలా మొత్తంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.2.70 లక్షలు చొప్పున లబ్ధి చేకూరుస్తున్నారు. దీనికి అదనంగా మరో రూ.లక్షకు పైగా ప్రతి ఇంటిపై మౌలిక వసతులకు ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతుండగా, ఇప్పటికే 8.6 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం అందించింది. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కాగా, ఇప్పటి వరకు 12.77 లక్షల మంది లబ్ధిదారులకు రూ.4,500.19 కోట్లు బ్యాంకు రుణాల ద్వారా అందించారు. బ్యాంకులు 9 నుంచి 11 శాతం వడ్డీతో రుణాలు ఇస్తున్నాయి. అయినా అక్కచెల్లెమ్మలపై భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలు అందిస్తూ ఆపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. తొలి దఫా అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ కింద రూ.46.90 కోట్లను గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇలా సంవత్సరంలో రెండు పర్యాయాలు వడ్డీ రీయింబర్స్మెంట్ను ప్రభుత్వం అందించనుంది. -
మాలాంటోళ్లకు ఈ ప్రభుత్వమే దిక్కు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. మాలాంటోళ్లకు ఈ ప్రభుత్వమే దిక్కు మాది చాలా పేద కుటుంబం. నా వయసు 66 సంవత్సరాలు. విశాఖపట్నం మురళీనగర్లోని ఎన్జీవోస్ కాలనీలో ఉంటున్నాము. నేను గతంలో రజక వృత్తి చేసుకుని కుటుంబాన్ని పోషించే వాడిని. నాకు ఐదారేళ్ల కిందట కీళ్ల సమస్య రావడంతో కదలలేని పరిస్థితి ఏర్పడింది. మంచాన పడ్డ నన్ను ఎవరైనా లేవదీసి కూర్చోబెట్టినా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాను. గత ప్రభుత్వంలో పింఛన్ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక నా దీనస్థితిని తెలుసుకున్న వలంటీర్ ఇంటికి వచ్చి మరీ పింఛన్కు దరఖాస్తు చేయించారు. వెంటనే మంజూరైంది. ప్రస్తుతం నాకు ప్రతి నెలా ఒకటో తారీఖునే పింఛను వస్తోంది. ఈ నెల నుంచి రూ.3 వేలు ఇస్తున్నారు. ఈ సొమ్ము మా కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉంది. నా భార్య నారాయణమ్మ ఇళ్లల్లో పనిచేస్తూ కుంటుంబానికి చేదోడుగా ఉంటోంది. పెళ్లీడుకు వచ్చిన కూతురు మంగమ్మ ఉంది. మాకు ఆర్థిక స్తోమత లేక, ఆమె మానసిక పరిస్థితి బాగోలేక పెళ్లి చేయలేకపోయాం. ఆరోగ్యశ్రీ కార్డు కూడా వచ్చింది. పైసా ఖర్చు లేకుండా చికిత్స చేయించుకోగలుగుతున్నాం. రేషన్ కార్డుపై ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. మా లాంటి వారి కోసం శ్రద్ధ తీసుకుంటున్న ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. – గుమ్మిడి కనకం, విశాఖపట్నం (కసిరెడ్డి సూర్యకుమారి వెంకట్, విలేకరి, మురళీనగర్) పేదల ప్రాణానికి పెద్ద దన్ను ఆటోయే మా జీవనాధారం. మన్యం జిల్లా పార్వతీపురంలో నేను ఆటో నడపడం ద్వారా వచ్చిన ఆదాయంతో పాటు నా భార్య టైలరింగ్ చేయడం ద్వారా కొంత సంపాదిస్తోంది. దాంతో కుటుంబాన్ని గుట్టుగా పోషించుకుంటున్నాం. వచ్చిన ఆదాయంలోనే ఒకవైపు ఇన్సూరెన్స్, వివిధ మరమ్మతు పనులు వంటివి కూడా చేసుకోవాలి. మిగిలిన దాంతో జీవించాలి. ఇంతలో పులిమీద పుట్రలా 2019లో ఒకరోజు ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి రావడంతో వైద్యులను సంప్రదించాను. గుండెలో మూడు రక్తనాళాలు మూసుకుపోయినట్లు గుర్తించారు. బైపాస్ సర్జరీ తప్పనిసరిగా చేయాలని చెప్పారు. చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బంది పడుతున్న నాకు సర్జరీ అంటే భయం వేసింది. ఇక బతకనేమోనన్న భయం పట్టుకుంది. నా కుటుంబం గురించి ఆలోచించే సరికి ప్రాణం విలవిలలాడింది. ఆ సమయంలో స్నేహితుల సలహాతో విశాఖ మెడికవర్ ఆస్పత్రికి వెళ్లగా.. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రెండున్నర లక్షల రూపాయల ఆపరేషన్ను ఉచితంగా చేశారు. ఏడాదికి సరిపడా మందులు ఇచ్చి కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. ఆ సమయంలో కుటుంబ పోషణ నిమిత్తం రెండు నెలలకు రూ.10,000 అందజేశారు. నెమ్మదిగా కోలుకున్నాను. ఇప్పుడు మళ్లీ ఆటో నడుపుకోగలుగుతున్నా. ఏటా నాకు వాహన మిత్ర ద్వారా రూ.10 వేలు అందుతోంది. నా కుమార్తె హిమబిందు నాలుగో తరగతి చదువుతోంది. ఆమెకు అమ్మ ఒడి పథకం వర్తించింది. ఏటా రూ.15 వేలు వంతున నా భార్య ఖాతాలో నగదు జమవుతోంది. టైలరింగ్ చేస్తుండటం వల్ల ఆమెకు చేదోడు పథకం ద్వారా ఏటా రూ.10 వేలు అందుతోంది. మాకు జగనన్న కాలనీలో ఇంటి స్థలం, ఇల్లు మంజూరైంది. నిర్మాణం పురోగతిలో ఉంది. మాలాంటి పేద బతుకులకు ఈ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. – పొందూరు విజయ్కుమార్, పార్వతీపురం (ఆశపు జయంత్కుమార్, విలేకరి, పార్వతీపురం రూరల్) అప్పు చేయకుండా చేపల వ్యాపారం మేం మత్స్యకారులం. కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక గ్రామంలో చేపలతోపాటు ఎండు చేపలు అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్నాం. జగన్ వచ్చిన తర్వాత నాకు ఏటా క్రమం తప్పకుండా చేయూత పథకం ద్వారా డబ్బులొస్తున్నాయి. ఏడాదికి రూ.18,750 చొప్పున ఇంత వరకు రూ.56,250 వచ్చింది. ఆ డబ్బునే పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తున్నా. రేవు వద్ద చేపలుకొని మార్కెట్లో అమ్ముకుంటున్నా. పెట్టుబడికి అప్పులు చేయాల్సిన అవసరం లేదు. గతంలో మూడు రూపాయల వడ్డీకి తెచ్చుకొని చేపలు కొనుక్కుని, అమ్ముకునే వాళ్లం. లాభం చాలా వరకు వడ్డీలకే వెళ్లిపోయేది. ఇప్పుడు వడ్డీ బాధ లేదు. పేదల కోసం ఆలోచించే వ్యక్తి జగన్. అందుకే మాలాంటి వాళ్లం సంతోషంగా ఉంటున్నాం. వైఎస్సార్ ఆసరా కింద రూ.60 వేలు వచ్చింది. మా ఆయనకు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. దీంతో మా కుటుంబం హాయిగా జీవిస్తోంది. – ఓలేటి మంగాయమ్మ, పశువుల్లంక (డీవీవీ సుబ్బారావు, విలేకరి, ఐ పోలవరం -
కుటుంబానికి కొండంత ‘ఆసరా’
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. కుటుంబానికి కొండంత ‘ఆసరా’ ‘వై ఎస్సార్ ఆసరా కింద రుణ మాఫీ చేయడం మా కుటుంబానికి కొండంత ఆసరాగా నిలిచింది. ఈ డబ్బులతో ఫ్యాన్సీ స్టోర్ నడుపుతూ.. కుటుంబాన్ని పోషించుకుంటున్నా. మాది వైఎస్సార్ జిల్లా పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె. నేను మైథిలి మహిళా స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిని. ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు ‘వైఎస్సార్ ఆసరా’ పథకం కింద మూడు విడతలుగా రుణ మాఫీ చేశారు. మా సంఘంలో మొత్తం 10 మంది సభ్యులున్నారు. బ్యాంకు ద్వారా మొత్తం రూ.8 లక్షలు రుణంగా పొందాం. అందులో నాకు రూ.80 వేలు వచ్చింది. ఆసరా కింద మా గ్రూపునకు రూ.2,31,171 మాఫీ అయింది. అందులో నాకు రూ.30,822 వచ్చింది. ఈ డబ్బులతో ఫ్యాన్సీ స్టోర్ ప్రారంభించి నా కాళ్ల మీద నేను బతుకుతున్నాను. కూతురికి పెళ్లి చేశాను. కుమారుడిని డిగ్రీ వరకు చదివించాను. అతను ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. మాకు కొంత పొలం ఉంది. నాలుగేళ్లుగా రైతు భరోసా డబ్బులు కూడా వస్తున్నాయి. నా భర్త వ్యవసాయ పనులు చూసుకుంటాడు. ఫ్యాన్సీ స్టోర్ నిర్వహణలో కూడా సహాయ పడుతుంటాడు. భవిష్యత్తు గురించి ఏ దిగులూ లేదు. – పోరెడ్డి మాధవి, నెమళ్లదిన్నె (ఎస్.విశ్వప్రసాద్, విలేకరి, కడప రూరల్) ఆయుష్షు పెంచిన దేవుడు రోజూ పనులకు వెళ్తే గాని ఇల్లు గడవని పరిస్థితి మాది. బేల్దారి మేస్త్రీగా చేసే నాకు ఒకసారి ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రికి వెళ్లాను. కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని చెప్పారు. డయాలసిస్ చేయాలన్నారు. పై ప్రాణాలు పైనే పోయాయి. ప్రభుత్వం డయాలసిస్ పెన్షన్ మంజూరు చేయడంతో క్రమం తప్పకుండా చేయించుకుంటున్నా. మాది పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం కంచరగుంట. పేద కుటుంబం. బేల్దారి మే్రస్తిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ఇప్పటి వరకు నాకు రూ.1.50 లక్షలు పెన్షన్ రూపంలో అందింది. 108 ద్వారా నెలకు 12 సార్లు 30 కి.మీల దూరంలోని మాచర్ల డయాలసిస్ సెంటర్కు వెళ్లి వస్తున్నా. క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోవడం వల్ల నా జీవన కాలం పెరిగింది. నా ఆయుష్షు పెంచిన దేవుడు జగన్మోహన్రెడ్డి. నాకు పునర్జన్మ ప్రసాదించిన ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాను. నాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి చదువు పూర్తి కావడంతో పెళ్లి చేశాము. అబ్బాయి చదువుకుంటున్నాడు. ఇద్దరికీ విద్యా దీవెన పథకం ద్వారా సాయం అందింది. మాలాంటి పేదల జీవితాల్లో ఈ ప్రభుత్వం వెలుగులు నింపింది. – బండి శ్రీహరి, కంచరగుంట (ఎం.వెంకటనారాయణ, విలేకరి, దుర్గి) ఇంటిల్లిపాదికీ లబ్ధి మాది పేద కుటుంబం. గతంలో కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కష్టాలు తీరాయి. మా ఇంట్లో ఉన్న నలుగురికీ ఏదో రూపంలో లబ్ధి చేకూరింది. మేము విశాఖపట్నం నగరంలోని తాటిచెట్లపాలెం సంతోషిమాత కాలనీలో నివాసం ఉ«ంటున్నాము. నేను మొదట్లో బుట్టలో పండ్లు అమ్ముకుని జీవనం సాగించేదాన్ని. ఈ ప్రభుత్వంలో వైఎస్సార్ చేయూత పథకం ద్వారా వచ్చిన సొమ్ముతో నా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది. ఈ పథకం ద్వారా ఏటా రూ.18,750 వస్తోంది. ఈ డబ్బుతో విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీ మెయిన్రోడ్డులో తోపుడు బండి ఏర్పాటు చేసుకొని పండ్ల వ్యాపారం చేసుకుంటున్నా. దీని ద్వారా ఒకరిపై ఆధారపడకుండా, ఎవరి వద్దా అప్పు చేయకుండా సొంత కాళ్లపై నిలబడి కుటుంబాన్ని నడిపిస్తున్నా. కరోనా లాక్డౌన్ సమయంలో కూడా క్రమం తప్పకుండా ఈ చేయూత పథకం మమ్మల్ని మాదుకుంది. నా భర్త ఆటో నడుపుతున్నారు. వాహనమిత్ర ద్వారా ఏటా రూ.పది వేలు ఈ ప్రభుత్వం అందిస్తోంది. దీనివల్ల ఆటో నిర్వహణకు అవసరమైన ఖర్చులకు ఇబ్బంది లేకుండా పోయింది. మా చిన్న పాప సాయి లావణ్య ఇంటర్మిడియట్ వరకు చదువుకుంది. వలంటీర్గా విధులు నిర్వహిస్తోంది.మా పెద్ద పాప ధనలక్ష్మి మానసిక స్థితి బాగోదు. ఆమె దివ్యాంగురాలు కూడా. ఆమెకు దివ్యాంగ పింఛన్ వస్తోంది. ఇన్నేళ్లలో ఏ ప్రభుత్వమూ, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి నెలా రూ.3 వేల పింఛను ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. ఇలా మా ఇంట్లో ప్రతి ఒక్కరం జగనన్న ద్వారా లబ్ధి పొందాము. – బాదా జయమ్మ, విశాఖపట్నం (పి.విజయ్కుమార్, విలేకరి, తాటిచెట్లపాలెం, విశాఖపట్నం) -
కష్టాలనుంచి గట్టెక్కించిన సర్కారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. కష్టాలనుంచి గట్టెక్కించిన సర్కారు నా భర్త శ్రీనివాసులు గృహ నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ నెలకు సుమారు పది వేల రూపాయలు సంపాదించేవారు. నేనూ కూలికి వెళ్లేదాన్ని. నా భర్త ఆదాయానికి నా కూలి డబ్బులు తోడయ్యేవి. ఇలా కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జీ.ఎర్రగుడిలో ఎలాగోలా జీవిస్తున్నాం. హఠాత్తుగా మా బతుకులో పెద్ద ఆపదొచ్చి పడింది. అయిదేళ్ల క్రితం నా భర్త ప్రమాదానికి గురయ్యారు. వెన్నెముక దెబ్బతిని ఏ పని చేయలేకపోతున్నారు. దీంతో కుటుంబ భారమంతా నాపై పడింది. మాకు ఎకరంన్నర పొలం ఉంది. కంది, వేరుశనగ తదితర పంటలు సాగుచేస్తుంటాం. వర్షాలు కురిస్తేనే పంట చేతికి వస్తుంది. ఏడాదికి సుమారు పది నుంచి 15 వేల రూపాయలు ఆదాయం ఉంటుంది. లేదంటే లేదు. పెద్దకొడుకు కార్తీక్ 10వ తరగతి, చిన్న కొడుకు నవీన్ 8వ తరగతి జొన్నగిరి జెడ్పీ స్కూల్లో చదువుతున్నారు. కుటుంబ పెద్ద మంచం పట్టడంతో పిల్లల చదువులు సాగవని బెంగ పెట్టుకున్నాం. ఇలాంటి సమయంలో ప్రభుత్వ పథకాలు మాకు ఎంతగానో ఆదుకున్నాయి. పొదుపు సంఘంలో లింకేజీ కింద రూ.80వేలు, పొదుపు సంఘం నుంచి రూ.50వేలు రుణం తీసుకొని పొట్టేళ్లు కొనుగోలు చేశాను. వైఎస్సార్ ఆసరా కింద రూ.20,400 మాఫీ సొమ్ము బ్యాంకు ఖాతాకు జమ అయింది. నాకొడుకు చదువుకు అమ్మ ఒడి పథకం ఆధారమైంది. రైతు భరోసా సొమ్ము కూడా అందుతోంది. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా మంజూరైన రూ.18,750తో మరో నాలుగు పొట్టేళ్లు కొనుగోలు చేసి మేపుతున్నా. వీటి వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. కష్టాల నుంచి గట్టెక్కించిన ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – వడ్డే రాజేశ్వరి, జి.ఎర్రగుడి, తుగ్గలి మండలం (కె.రామచంద్రారెడ్డి, విలేకరి, తుగ్గలి) పెద్ద కొడుకులా ఆదుకున్నారు మాది కూలి పనులు చేసుకునే నిరుపేద కుటుంబం. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన నేను నా భార్య పనులకు వెళ్తే తప్ప కుటుంబం గడవని పరిస్థితి. మాకు ఇద్దరు పిల్లలు. కుమార్తె శివశంకరమ్మ 20ఏళ్ల క్రితమే అనారోగ్యంతో చనిపోయింది. కుమారుడు గురుశంకర్ బతుకుతెరువు కోసం కువైట్కు వెళ్లి, డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మాకున్న ఇల్లు వర్షానికి తడుస్తుండటంతో టార్పాన్లు వేసుకుని కాలం గడుపుతున్నాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా బతుకులకు భరోసా దక్కింది. నాకు పింఛన్తోపాటు చౌటపల్లె గ్రామం కొత్తపల్లెలో సెంటు భూమిలో పక్కా గృహం మంజూరైంది. నా భార్య లక్ష్మీదేవికి వైఎస్సార్ చేయూత ద్వారా ఏడాదికి రూ.18,750లు వంతున ఇప్పటికి మూడు విడతల్లో రూ.56,250లు అందింది. దీంతో గొర్రెలు, మేకలు కొని కొంత ఉపాధి పొందుతున్నాం. పింఛన్ ఈ నెల నుంచి రూ.3 వేలు చేశారు. జగన్బాబు ఇచ్చిన సెంటు స్థలంలో ఇంటి నిర్మాణం చివరి దశకు వచి్చంది. దీన్ని పూర్తిచేసుకుని, మిగిలిన జీవితం ఆనందంగా గడిపేస్తామన్న నమ్మకం పెరిగింది. రోగం వస్తే టౌన్కు పోవాల్సిన పనిలేదు. ఊళ్లోకే డాక్టర్ వస్తున్నారు. జగనన్న ఆరోగ్య సురక్షలో నాకు, నా భార్యకు పరీక్షలు చేసి, మందులు ఉచితంగానే ఇచ్చారు. పెద్ద కొడుకులా సీఎం జగన్ మమ్మల్ని ఆదుకుంటున్నాడు. మళ్లీ జగన్బాబే సీఎం కావాలి. – ఉప్పుతోళ్ల గంగయ్య, కొత్తపల్లె, చౌటపల్లె గ్రామం, లక్కిరెడ్డిపల్లె మండలం, అన్నమయ్య జిల్లా (ముప్పాల నరసింహరాజు, విలేకరి, లక్కిరెడ్డిపల్లె) జగనన్న ప్రభుత్వం అండగా నిలిచింది మాది రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడి గ్రామంలో నేను నా భర్త కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్న తరుణంలో విధి వక్రించి మా కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది. సుమారు 20 ఏళ్ల కిందట నేను నాల్గో నెల గర్భిణిగా ఉన్నప్పుడు నా భర్త చనిపోయారు. తరువాత నాకు ఒక ఆడపిల్ల పుట్టింది. కూలిపని చేసుకుంటూ, ఆ పిల్లను కంటికి రెప్పలా పెంచుకుంటూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తూ వచ్చాను. ఆమెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించాను. ఒంటరిగా మిగిలిన నాకు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వితంతు పింఛను మంజూరైంది. ఈ ప్రభుత్వం వచ్చాక పింఛను రూ. 3000కు పెరిగింది. వైఎస్సార్ ఆసరా పథకం కింద ఏడాదికి రూ 16 వేలు వంతున ఇప్పటివరకూ అందింది. జగనన్న కాలనీ పథకంలో భాగంగా ఎంతో ఖరీదైన ఇంటి స్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణం కూడా త్వరలో ప్రారంభిస్తామని మా వూరి సర్పంచ్ చెప్పారు. ఏ ఆసరా లేని మాలాంటివారిని ఆదుకుంటున్న జగనన్నకు ఎప్పుడూ రుణపడిఉంటాం. – దాసరి పళ్లాలమ్మ, అవిడ గ్రామం(జగత శ్రీరామచంద్రమూర్తి, విలేకరి, కొత్తపేట) -
కిరాణా దుకాణంతో బతుకు మారింది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. కిరాణా దుకాణంతో బతుకు మారింది ఉ న్న ఊళ్లో ఉపాధి లేక మా ఆయన వెంకటరావు విశాఖలో వివిధ పనులు చేసేవారు. రోజూ మేముండే భీమిలి మండలం నగరంపాలెం నుంచి అక్కడికి వెళ్లి వచ్చేందుకు ఇబ్బందిగా ఉండేది. అత్తా, మామ ఇద్దరు ఆడ పిల్లలు కలిపి ఇంట్లో ఆరుగురు కుటుంబ సభ్యులం ఉండేవాళ్లం. పిల్లల ఫీజులు, రవాణా చార్జీలు కాకుండా ఇంటి ఖర్చు నెలకు కనీసం రూ.15 వేలయ్యేది. ఇద్దరు పిల్లలను తగరపువలసలోని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాం. ఈ ఖర్చులు మాకు భారంగా అనిపించేవి. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తరువాత నా భర్తకు మా పంచాయతీలోనే వలంటీర్గా అవకాశం వచ్చింది. 3వ తరగతి చదువుతున్న పెద్దమ్మాయి తపస్వికి మూడేళ్లుగా అమ్మ ఒడి కింద రూ.15 వేల వంతున వస్తోంది. చిన్న పాప తేజ ఒకటో తరగతి చదువుతోంది. మా మామ పల్లా రాముకు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. మా అత్తగారు రాములమ్మకు నాలుగేళ్లుగా వైఎస్సార్ చేయూత కింద రూ.18,750లు వంతున, వైఎస్సార్ ఆసరా కింద ఇప్పటివరకు రూ.25వేలు వచ్చింది. నాలుగేళ్లలో వచి్చన ఈ లబి్ధతో రూ.1.50 లక్షలు పెట్టుబడిగా పెట్టి ఇంటి ముందు కిరాణా దుకాణం తెరిచాను. ఖాళీ సమయంలో టైలరింగ్ చేస్తాను. రోజుకు ఖర్చులన్నీ పోను ఇంటి వద్దే రూ.వెయ్యి వరకు ఆదాయం సమకూరుతోంది. నా భర్త ఖాళీ సమయంలో తగరపువలస నుంచి సామాన్లు తీసుకువచ్చి షాపులో వేస్తారు. ఒకరి వద్ద పనిచేయకుండానే హాయిగా గడచిపోతోంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంతలా మాలాంటి పేద ప్రజలను ఆదుకోలేదు. – పల్లా కృష్ణవేణి, టి.నగరపాలెం, భీమిలి మండలం (గేదెల శ్రీనివాసరెడ్డి, విలేకరి, తగరపువలస) ఇప్పుడు సొంతిల్లు సమకూర్చుకున్నాం మాది చిన్నపాటి కిరాణా దుకాణం. నెలకు అయిదు నుంచి ఆరు వేల రూపాయలు ఆదాయం వస్తుంది. నా భర్త విజయకృష్ణ కుమార్, నేనూ ఈ దుకాణంలో ఉంటాం. రెండెకరాల భూమి ఉంది. ఇందులో రేగుపంట వేస్తాం. వర్షాలు పడితేనే పంట పండుతుంది. బాగా పండితే ఏడాదికి సుమారు 20వేల రూపాయల వరకూ ఆదాయం వస్తుంది. ఈ మొత్తం మా కుటుంబ పోషణకే సరిపోయేది కాదు. ఇద్దరు ఆడపిల్లలు ఉషశ్రీ, కావ్యశ్రీలను చదివించాలి. ఈ పరిస్థితుల్లో మాకు సొంతిల్లు అనేది కలలో కూడా ఊహించుకోలేకపోయాం. కానీ అదృష్టవశాత్తూ ఈ ప్రభుత్వం రావడంతో వారి సహకారంతో ఆ కోరిక తీర్చుకోగలిగాం. అంతేనా... మా పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఇంజినీరింగ్ చదివించుకోగలిగాం. పెద్దమ్మాయికి ఫైనల్ ఇయర్కు, చిన్నమ్మాయికి నాలుగేళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించడంతో ఇద్దరి చదువులు పూర్తయి ఉద్యోగాల్లో చేరారు. జగనన్న కాలనీలో మాకు స్థలం మంజూరు కావడంతోపాటు, ఇంటి నిర్మాణం కోసం రూ. 1.80లక్షలు మంజూరు చేశారు. సబ్సిడీ ధరలకే ఇంటి నిర్మాణ సామగ్రి అందివ్వడంతో మేము కొంత డబ్బు జతచేసి పక్కా ఇంటిని నిర్మించుకోగలిగాం. ఇన్నాళ్లకు సొంతింటికల నెరవేరడంతో మేము ఆనందంగా ఉన్నాం. మాకున్న పంట పొలంపై వైఎస్సార్ రైతుభరోసా కింద ఏటా రూ.13,500లు లభిస్తోంది. వైఎస్సార్ సున్నావడ్డీ కింద సుమారు రూ. 50వేలు నా ఖాతాలో జమయ్యింది. మా అత్త గారు వరలచ్చమ్మకు ప్రతి నెల పింఛన్ అందుతోంది. ఇప్పుడు మేము ఎలాంటి ఆర్థిక కష్టాలు లేకుండా జీవనం సాగిస్తున్నామంటే అదంతా ఈ ప్రభుత్వం చలువే. – జక్కా రాధాదేవి, ఇల్లూరు కొత్తపేట, బనగానపల్లె మండలం (జి.సర్వేశ్వర్ రెడ్డి, విలేకరి, బనగానపల్లె) ఒంటరి జీవితానికి కొండంత భరోసా మాది పేద కుటుంబం. నేను, మా ఆయన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నంలంకలో కష్టపడి పనిచేస్తేనే జీవితం సాగేది. దురదృష్టవశాత్తూ నా భర్త గుండెపోటుతో ఇటీవల మృతి చెందారు. దాంతో నేను ఒంటరిదానిగా మారాను. రోజువారి కూలీ నాకు ఏమాత్రం సరిపోయేది కాదు. జీవనం కష్టంగా మారింది. ఇటీవల వితంతు పెన్షన్ మంజూరైంది. ప్రతి నెలా ఆ మొత్తం నన్నెంతగానో ఆదుకుంటోంది. అంతేగాకుండా మూడేళ్ల నుంచి కాపు నేస్తం పథకం ద్వారా ఏటా రూ.15 వేలు వంతున ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ సాయంతో బతుకు సాఫీగా సాగుతోంది. రేషన్ కార్డు ఉండటంతో బియ్యం ఉచితంగా అందిస్తున్నారు. ఇప్పుడు నా ఒంటరి జీవితానికి ఇంక భయం లేకుండా పోయింది. – పేరాబత్తుల రామలక్ష్మి, పెదపట్నం లంక, మామిడికుదురు మండలం (యేడిద బాలకృష్ణారావు, విలేకరి, మామిడికుదురు) -
సచివాలయాలతో ఉద్యోగ విజయం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. సచివాలయాలతో ఉద్యోగ విజయం మాది పెద్ద కుటుంబం. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బుడ్డేపుపేట పల్లె గ్రామం మాది. ఇద్దరు అన్నయ్యలు, అక్క, తమ్ముడు, అమ్మా, నాన్న అందరం కలసి ఉండేవాళ్లం. కుటుంబాన్నిపోషించాల్సిన నాన్న పాపయ్య మా అందరినీ విడిచి అనంతలోకానికి వెళ్లిపోయారు. కుటుంబ బాధ్యత అమ్మా, అన్నయ్యలపైనే పడింది. అక్కతో పాటు ఇద్దరు అన్నయ్యలకు పెళ్లైంది. ఇక మిగిలింది నేను. తమ్ముడు. పుట్టినప్పటి నుంచి నా రెండు చేతులు మరుగుజ్జువి కావడంతో బడిలో చాలా మంది నన్ను చూసి జాలి పడేవారు. అది నచ్చని నాకు బాగా చదువుకొని జీవితంలో ఏదో ఒకటి సాధించాలనుకున్నాను. అందుకు మా అమ్మ, అన్నయ్యలు ఎంతగానో ప్రోత్సహించారు. డిగ్రీలో ఉండగానే గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ వేటలో పడ్డాను. ఒక్క ఉద్యోగం కూడా దక్కలేదు. 2018లో డిగ్రీ పూర్తి చేసిన నేను రెండేళ్లలో ఎంఎస్సీ ఆర్గానిక్ పూర్తి చేశాను. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక నాకు రూ.3వేలు వికలాంగుల పింఛన్, మా అమ్మకు వితంతు పింఛన్ మంజూరైంది. ఈ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. తొలి ప్రయత్నంలోనే నేను 2020 డిసెంబర్ నెలలో వెల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని సంపాదించాను. ప్రస్తుతం బూర్జపాడు గ్రామ సచివాలయంలో చేస్తున్న ఉద్యోగం ఎంతగానో సంతృప్తినిస్తోంది. ఈ రోజు నేను సమాజంలో దర్జాగా బతుకుతూ, నా కుటుంబ సభ్యులకు చేదోడు, వాదోడుగా ఉన్నానంటే అందుకు ఈ ప్రభుత్వమే కారణం. – ఉప్పిలి విజయలక్ష్మీ, వెల్ఫేర్ అసిస్టెంట్, బూర్జపాడు (మద్దిలి కేశవరావు, విలేకరి, ఇచ్ఛాపురం రూరల్) సొంతింటి కల నెరవేరింది పొట్ట కూటి కోసం తమిళనాడు రాష్ట్రం సేలం నుంచి బాపట్ల జిల్లా బల్లికురవ గ్రామానికి వలస వచ్చాం. రెండు దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్నాం. నా భర్త వెంకటాచలం రమేష్ గ్రానైట్ క్వారీలో పని చేస్తుండగా... నేను ఓ ప్రైవేటు స్కూల్లో పని చేస్తున్నాను. మాకు ఇద్దరు పిల్లలు. మా అబ్బాయి సంజయ్ తమిళనాడులో చదువుకొంటున్నాడు. అమ్మాయి సన్మాది బాపట్లలో బీ ఫార్మసీ విద్యనభ్యసిస్తోంది. మా ఇద్దరికీ వచ్చే అరకొర సంపాదనతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చాం. ఇంటి అద్దె చెల్లించేందుకు నానా ఇబ్బందులు పడ్డాం. మాకు రేషన్ కార్డు ఉండడంతో గత ప్రభుత్వ హయాంలో అనేక సార్లు ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నా ఎవరూ మా మొర ఆలకించలేదు. కానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక నవరత్నాల్లో భాగంగా సచివాలయంలో నివేశన స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నాం. దీంతో బల్లికురవ లేఅవుట్లో సెంటున్నర స్థలంతో పాటు పక్కా ఇల్లు మంజూరైంది. రూ. 1.80 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతోపాటు డ్వాక్రా బ్రిడ్జి రుణం రూ. 35 వేలు కలిపి అందమైన ఇంటిని నిర్మించుకొని అందులోనే ఆనందంగా జీవిస్తున్నాం. బతుకు తెరువు కోసం వలస వచ్చిన మా లాంటి వారికి కూడా గూడు కల్పించిన ఈ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. మా అమ్మాయికి తొలుత అమ్మ ఒడి, తరువాత విద్యాదీవెన పథకాల ద్వారా నిధులు మంజూరు కావడంతో అప్పు చేయకుండా ఉన్నత విద్యను చదివించగలుగుతున్నాం. మాలాంటి వారి ఇళ్లల్లో సంతోషాల వెలుగులు పంచుతున్న ముఖ్యమంత్రి మేలు ఎప్పటికీ మరవలేము. – రమేష్ సత్య, బల్లికురవ, బాపట్ల జిల్లా (ఆంజనేయులు, విలేకరి, బల్లికురవ) నిరుపేదల బతుకుల్లో సంక్షేమ వెలుగులు మాది సాధారణ కుటుంబం. మా ఆయన ల్యాబ్ టెక్నీషియన్గా రెండు చోట్ల పనిచేస్తున్నారు. ఆయనకొచ్చే ఆదాయం అంతంతమాత్రమే. నేను, నా భర్త, పాప, బాబు కలిసి విశాఖ నగరం సీతంపేటలో సొంతింట్లో నివసిస్తున్నాం. నేను డ్వాక్రా సంఘంలో సభ్యురాలిని కావడంతో గతంలో తీసుకున్న రుణమాఫీకి సంబంధించి వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.16 వేలు వచ్చింది. సున్నా వడ్డీ కింద ఏడాదికి మూడు వేల వంతున ఇప్పటికి మూడు సార్లు జమయ్యింది. మా అబ్బాయికి టెన్త్, ఇంటర్లో అమ్మ ఒడి కింద ఏడాదికి రూ.15వేల వంతున మూడేళ్లు అందుకున్నాము. ఆ తర్వాత డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వాడికి విద్యాదీవెన, వసతిదీవెన అందింది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం మా లాంటి వారికి ఇన్ని రకాల సంక్షేమ పథకాలు అమలుచెయ్యడం చూడలేదు. గత ప్రభుత్వంలో మాకు ఎలాంటి పథకాలు అందలేదు. ఇపుడు వలంటీర్ ఇంటికి వచ్చి పలానా పథకానికి మీకు అర్హత ఉంది« దరఖాస్తు చెయ్యమని చెబుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన టైమ్కు ఠంచన్గా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – రెడ్డి కుమారి, సీతంపేట, విశాఖపట్నం (బి.అనితా రాజేష్, రిపోర్టర్, సీతంపేట(విశాఖపట్నం)) -
‘జగనన్న తోడు’ పథకం కింద 8వ విడతలో లబ్ధిదారుల ఖాతాల్లో 431 కోట్ల రూపాయలు జమ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి...ఇంకా ఇతర అప్డేట్స్