Virender Sehwag
-
ఆ జట్టేమైనా పాకిస్తానా? ఆసీసా?.. ముందే కొట్టేస్తారు అనుకున్నా: సెహ్వాగ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. గురువారం దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. అయితే భారత్ విజయం సాధించినప్పటికి ఛేజింగ్లో మాత్రం కాస్త తడబడిందనే చెప్పాలి.ఎందకంటే 229 పరుగుల టార్గెట్ను చేధించేందుకు భారత్ ఏకంగా 46.3 ఓవర్ల సమయం తీసుకుంది. లక్ష్య చేధనలో భారత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. రోహిత్ శర్మ ఔటైన తర్వాత భారత ఇన్నింగ్స్లో స్పీడ్ తగ్గింది. 30 ఓవర్లు ముగిసే సరికి 144/4 స్కోరుతో భారత్ ఇబ్బందుల్లో పడేలా కనిపించింది.కానీ శుబ్మన్ గిల్(101), కేఎల్ రాహుల్(41) ఆచితూచి ఆడుతూ భారత్ను విజయతీరాలకు చేర్చారు. తాజాగా ఈ స్లో రన్ ఛేజింగ్పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఇంకాస్త ముందుగానే టార్గెట్ను చేధిస్తుందని భావించానని సెహ్వాగ్ అన్నాడు."బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో భారత అభిమానులు టెన్షన్ పడి ఉంటారు నేను అనుకోను. ఎందుకంటే ప్రత్యర్ధిగా ఉన్నది బంగ్లాదేశ్. మీరు బంగ్లాను చాలా అద్భుతమైన జట్టుగా నాతో పొగిడించు కోవాలనుకుంటున్నారా? అలా జరగాలంటే వారు ఆట తీరులో మార్పు రావాలి.బంగ్లాదేశ్తో ఆడేటప్పుడే నేను భయపడలేదు, ఇప్పుడు ఇంకా ఏమి భయపడతాను. టెన్షన్ పడడానికి ప్రత్యర్ది ఏమైనా పాకిస్తానా..? ఆస్ట్రేలియానా? ఇది చాలా ఈజీ మ్యాచ్. దాదాపు నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించారు. గిల్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.తొలుత దూకుడుగా ఆడిన గిల్.. ఆ తర్వాత కొంచెం నెమ్మదిగా ఆడాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేదా శ్రేయాస్ అయ్యర్ ఎక్కువసేపు క్రీజులో ఉండి ఉంటే, ఈ మ్యాచ్లో 35 ఓవర్లలోనే ముగిసి ఉండేదని" క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. -
సచిన్ కాదు!.. నంబర్ వన్ వన్డే బ్యాటర్ అతడే: సెహ్వాగ్
క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) గురించే చర్చ. ఈ వన్డే ఫార్మాట్ టోర్నమెంట్ కోసం అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్లో సెమీ ఫైనలిస్టులు, ఫైనల్స్ చేరే జట్లు, విజేతపై తమ అంచనాలు తెలియజేస్తూ సందడి చేస్తున్నారు.సచిన్ టెండ్కులర్కు రెండో స్థానంఈ నేపథ్యంలో భారత మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) వన్డే క్రికెట్లో టాప్-5 ఆల్టైమ్ గ్రేట్ బ్యాటర్లు వీరేనంటూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇందులో తన సహచర ఓపెనర్, దిగ్గజ ఆటగాడు సచిన్ టెండ్కులర్(Sachin Tendulkar)కు వీరూ భాయ్ రెండో స్థానం ఇవ్వడం విశేషం. మరి ఆ మొదటి ప్లేయర్ ఎవరంటారా?!..అప్పుడే తొలిసారిగా చూశానుచాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ నేపథ్యంలో క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘నా ఆల్టైమ్ గ్రేటెస్ట్ వన్డే బ్యాటర్లలో క్రిస్ గేల్ ఐదో స్థానంలో ఉంటాడు. అతడు గొప్ప బ్యాటర్. గొప్ప ఓపెనర్ కూడా! 2002-03లో టీమిండియా వెస్టిండీస్కు వెళ్లింది. నాటి ఆరు మ్యాచ్ల సిరీస్లో గేల్ మూడు శతకాలు బాదాడు.అంతర్జాతీయ స్థాయిలో ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్లో బ్యాక్ ఫుట్ షాట్లతో సిక్సర్లు బాదిన క్రికెటర్ను నేను అప్పుడే తొలిసారిగా చూశాను’’ అని సెహ్వాగ్ గేల్పై ప్రశంసలు కురిపించాడు. ఇక నాలుగో స్థానంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్కు చోటిచ్చిన వీరూ భాయ్.. ‘‘డివిలియర్స్ బ్యాటింగ్ చేసే విధాననం నాకెంతో ఇష్టం. సిక్సర్లు కొట్టడంలో అతడిదొక ప్రత్యేక శైలి’’ అని పేర్కొన్నాడు.అతడిని చూసే నేర్చుకున్నాఅదే విధంగా.. పాకిస్తాన్ మాజీ స్టార్ ఇంజమామ్ ఉల్ హక్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఆసియాలోని అత్యుత్తమ వన్డే బ్యాటర్లలో ఇంజమామ్ ఒకడు. అతడు నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చేవాడు. మ్యాచ్ను ఎలాగోలా తన ఆధీనంలోకి తెచ్చుకునేవాడు.చివరిదాకా ఇన్నింగ్స్ ఎలా కొనసాగించాలో నేను అతడిని చూసే నేర్చుకున్నా. ఓవర్కు ఏడు లేదంటే ఎనిమిది పరుగులు రాబట్టడం అప్పట్లో చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే, ఇంజమామ్ మాత్రం మంచినీళ్లు తాగినంత సులువుగా ఇన్నింగ్స్ ఆడేవాడు. ఎవరి బౌలింగ్లో ఎప్పుడు సిక్సర్లు కొట్టాలన్న విషయంపై అతడికి స్పష్టమైన అవగాహన ఉండేది’’ అని సెహ్వాగ్ కొనియాడాడు.సింహంతో కలిసి వేటకు వెళ్తున్నట్లుఇక సచిన్ టెండుల్కర్ గురించి సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరికి అభిమాన క్రికెటర్.. నాకు ఆదర్శమూర్తి అయిన సచిన్ టెండుల్కర్ గురించి చెప్పాలంటే.. ఆయనతో కలిసి బ్యాటింగ్కు వెళ్తుంటే... అడవిలో సింహంతో కలిసి వేటకు వెళ్తున్నట్లు ఉండేది.అప్పుడు ప్రతి ఒక్కరి కళ్లు ఆ సింహంపైనే ఉండేవి. నేను సైలెంట్గా నా పనిచేసుకుపోయేవాడిని’’ అని అభిమానం చాటుకున్నాడు. ఇక వన్డేల్లో అత్యుత్తమ బ్యాటర్లలో విరాట్ కోహ్లికి అగ్రస్థానం ఇచ్చిన సెహ్వాగ్.. ‘‘నంబర్ వన్ విరాట్ కోహ్లి. సరైన సమయంలో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడటం అతడికి వెన్నతో పెట్టిన విద్య.అతడొక ఛేజ్మాస్టర్. ఆరంభంలో ఉన్న కోహ్లికి.. ఇప్పటి కోహ్లికి చాలా తేడా ఉంది. రోజురోజుకు అతడు మరింత పరిణతి చెందుతున్నాడు. 2011-12 తర్వాత మాత్రం సూపర్స్టార్గా ఎదిగాడు. ఫిట్నెస్, ఆటలో నిలకడ.. ఈ రెండింటిలో తనకు తానే సాటి. అద్భుతమైన ఇన్నింగ్స్కు అతడు పెట్టింది పేరు’’అని రన్మెషీన్పై ప్రశంసల జల్లు కురిపించాడు.వీరేంద్ర సెహ్వాగ్ ఆల్టైమ్ బెస్ట్ టాప్-5 క్రికెటర్లు1. విరాట్ కోహ్లి(ఇండియా)2. సచిన్ టెండుల్కర్(ఇండియా)3. ఇంజమామ్ -ఉల్ -హక్(పాకిస్తాన్)4. ఏబీ డివిలియర్స్(సౌతాఫ్రికా)5. క్రిస్ గేల్(వెస్టిండీస్).చదవండి: బంగ్లాదేశ్తో మ్యాచ్కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్ -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. తిరుగులేని హిట్మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar)ను అధిగమించాడు. ఇంగ్లండ్తో రెండో వన్డే(India vs England) సందర్భంగా ఈ ఘనత సాధించాడు. అదే విధంగా.. ఈ మ్యాచ్లో శతక్కొట్టడం ద్వారా మరిన్ని రికార్డులను హిట్మ్యాన్ తన ఖాతాలో వేసుకున్నాడు.అద్భుత ఇన్నింగ్స్కాగా రోహిత్ శర్మ గత కొంతకాలంగా పేలవ ఫామ్తో విమర్శలు మూటగట్టుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టెస్టుల్లో కెప్టెన్గా, బ్యాటర్గా దారుణంగా విఫలమైన అతడు రిటైర్ అయిపోవాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే, ఇంగ్లండ్తో కటక్ వన్డేలో తనదైన శైలిలో విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడి.. విమర్శించినవాళ్లే ప్రశంసించేలా రోహిత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.వన్డే కెరీర్లోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీబరాబతి స్టేడియంలో లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు రోహిత్ శర్మ. ఫ్లడ్లైట్ల సమస్య కారణంగా కాసేపు అవాంతరాలు ఎదురైనా.. అతడి ఏకాగ్రత చెదరలేదు. ఒంటిమీదకు బాణాల్లా దూసుకువస్తున్న ఇంగ్లండ్ ఫాస్ట్బౌలర్ల బంతులను సమర్థవంతంగా ఎదుర్కొన్న రోహిత్ శర్మ తన వన్డే కెరీర్లోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు.డెబ్బై ఆరు బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ ఇన్నింగ్స్లో ఏకంగా పన్నెండు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. అయితే, లియామ్ లివింగ్స్టోన్ బౌలింగ్లో ఆదిల్ రషీద్కు క్యాచ్ ఇవ్వడంతో హిట్మ్యాన్ ధనాధన్ ఇన్నింగ్స్కు తెరపడింది.ఇక ఈ మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్గా నిలిచాడు. మూడు ఫార్మాట్లలో కలిపి ఓపెనర్గా రోహిత్ శర్మ ఇప్పటి వరకు 15404 పరుగులు చేశాడు. తద్వారా సచిన్ టెండుల్కర్ను అధిగమించాడు.కాగా ఓపెనర్గా సచిన్ టెండుల్కర్ 15335 పరుగులు చేశాడు. మరోవైపు.. ఈ జాబితాలో విధ్వంసకర మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 15758 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడి తర్వాతి స్థానంలోకి ఇప్పుడు రోహిత్ దూసుకువచ్చాడు. కాగా 2007లో అరంగేట్రం చేసిన రోహిత్.. 2013లో ఓపెనర్గా ప్రమోట్ అయ్యాడు.ద్రవిడ్ను అధిగమించివన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ (267 వన్డేల్లో 10,987 పరుగులు) నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇప్పటి వరకు నాలుగో స్థానంలో ఉన్న రాహుల్ ద్రవిడ్ (344 వన్డేల్లో 10,889 పరుగులు) ఐదో స్థానానికి చేరాడు. టాప్–3లో సచిన్ టెండూల్కర్ (463 వన్డేల్లో 18,246 పరుగులు), విరాట్ కోహ్లి (296 వన్డేల్లో 13,911 పరుగులు), సౌరవ్ గంగూలీ (311 వన్డేల్లో 11,363 పరుగులు) ఉన్నారు.32వ శతకంవన్డేల్లో రోహిత్ శర్మ సెంచరీలు 32. తద్వారా అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ మూడో స్థానంలో ఉన్నాడు. టాప్–2లో విరాట్ కోహ్లి (50), సచిన్ టెండూల్కర్ (49) ఉన్నారు.ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. కటక్లో ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. 49.5 ఓవర్లలో 304 పరుగులకు బట్లర్ బృందం ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రోహిత్ సేన 44.3 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది. ఆరు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసిన భారత్.. నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. భారత్- ఇంగ్లండ్ మధ్య నామమాత్రపు మూడో వన్డే అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరుగుతుంది.చదవండి: జట్టు కోసం కొన్ని పరుగులు చేశా.. అతడొక క్లాసీ ప్లేయర్: రోహిత్ శర్మ -
CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వన్డే ఫార్మాట్ టోర్నీలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఓ ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ను పంపించాలని సూచించాడు. తద్వారా శుబ్మన్ గిల్పై వేటు వేయాలని పరోక్షంగా సెలక్టర్లకు సలహా ఇచ్చాడు.దుబాయ్ వేదికగాపాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) మొదలుకానుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తటస్థ వేదికైన దుబాయ్(Dubai)లో భారత జట్టు తమ మ్యాచ్లు ఆడనుంది.ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్లో టీమిండియా ఫిబ్రవరి 20న తమ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనుంది. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించేందుకు ఐసీసీ జనవరి 13 డెడ్లైన్ విధించగా.. బీసీసీఐ మాత్రం మినహాయింపు కోరింది. జనవరి 17 నాటికి తమ జట్టును ప్రకటిస్తామని పేర్కొన్నప్పటికీ.. ఇంత వరకు ఆ వివరాలు వెల్లడించలేదు.అతడిని సెలక్ట్ చేయండిఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ హిందుస్తాన్ టైమ్స్తో ఈ విషయం గురించి మాట్లాడాడు. ‘‘సెలక్టర్లకు నాదో సలహా. యశస్వి జైస్వాల్ను 50 ఓవర్ల ఫార్మాట్లో కూడా ఆడించండి. అంతర్జాతీయ టీ20, వన్డేల్లో అతడు బ్యాటింగ్ చేసే విధానం అద్బుతం. వన్డే ఫార్మాట్కు కూడా అతడు సరిగ్గా సరిపోతాడు. కచ్చితంగా అతడిని టీమిండియా వన్డే జట్టులోకి తీసుకోవాలి’’ అని వీరూ భాయ్ పేర్కొన్నాడు.పంత్ వద్దు: భజ్జీమరోవైపు.. టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా చాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత జట్టుపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్గా తన మొదటి ఓటు సంజూ శాంసన్కే వేస్తానని కుండబద్దలు కొట్టాడు. కాగా ఓపెనింగ్ జోడీగా సెహ్వాగ్ రోహిత్- జైస్వాల్ల పేర్లను సూచించగా.. భజ్జీ రిషభ్ పంత్ను కాదని సంజూ శాంసన్కే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించడం విశేషం.కాగా ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్ టెస్టు, టీ20లలో టీమిండియా ఓపెనర్గా పాతుకుపోయాడు. అరంగేట్రంలోనే టెస్టుల్లో భారీ శతకం(171)తో మెరిసిన జైసూ ఖాతాలో రెండు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.ఇక ఇప్పటి వరకు ఓవరాల్గా భారత్ తరఫున 19 టెస్టులు, 23 టీ20 మ్యాచ్లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో 1798, 723 పరుగులు చేశాడు. అయితే, జైస్వాల్కు ఇంత వరకు వన్డేల్లో ఆడే అవకాశం మాత్రం రాలేదు. రోహిత్ శర్మతో కలిసి శుబ్మన్ గిల్ యాభై ఓవర్ల ఫార్మాట్లో ఓపెనర్గా బరిలోకి దిగుతున్నాడు.జైసూ భేష్అయితే, ఇటీవలి కాలంలో గిల్ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ యశస్వి జైస్వాల్ పేరు చెప్పడం గమనార్హం. కాగా లిస్ట్-‘ఎ’ క్రికెట్లో జైసూ గణాంకాలు మెరుగ్గానే ఉన్నాయి. కేవలం 32 మ్యాచ్లలోనే అతడు ఐదు సెంచరీలు, ఏడు అర్ధ శతకాలు, ఓ డబుల్ సెంచరీ సాయంతో 1511 పరుగులు సాధించాడు. చదవండి: ILT20 2025: చరిత్రపుటల్లోకెక్కిన పోలార్డ్ -
కోచ్లకు ‘టీ’ అందించేవాడిని.. ఇంకా: శిఖర్ ధావన్
క్రికెటర్ కావాలనే కలను నెరవేర్చుకునే క్రమంలో తాను చేసిన పనుల గురించి శిఖర్ ధావన్(Shikhar Dhawan) తాజాగా వెల్లడించాడు. పిచ్ను రోల్ చేయడం సహా కోచ్లకు ‘టీ’లు అందించడం వరకు అన్నీ తానే చేసేవాడినని తెలిపాడు. పది నిమిషాల పాటు బ్యాటింగ్ చేసేందుకు రోజంతా ఎండలో నిలబడేవాడినని గుర్తు చేసుకున్నాడు.కాగా ఢిల్లీకి చెందిన శిఖర్ ధావన్ ఎడమచేతి వాటం బ్యాటర్. అండర్-19 వరల్డ్కప్-2004లో సత్తా చాటడం ద్వారా వెలుగులోకి వచ్చాడు. నాటి టోర్నీలో మూడు శతకాల సాయంతో 505 పరుగులు చేసి సత్తా చాటాడు. అయినప్పటికీ టీమిండియాలోకి రావడానికి ధావన్ చాలా రోజుల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది.ఢిల్లీ తరఫున ఓపెనర్గావీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్లతో కలిసి ఢిల్లీ తరఫున ఓపెనర్గా బరిలోకి దిగిన ధావన్.. ఎట్టకేలకు 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. టీమిండియా తరఫున మొత్తంగా 167 వన్డేలు ఆడి 6793 పరుగులు చేసిన గబ్బర్.. 68 టీ20లలో 1759 పరుగులు సాధించాడు. ఇక టెస్టు ఫార్మాట్లో 34 మ్యాచ్లు ఆడి 2315 రన్స్ చేశాడు. 2022లో చివరగా భారత్కు ప్రాతినిథ్యం వహించిన శిఖర్ ధావన్కు.. ఆ తర్వాత అవకాశాలు కరువయ్యాయి.టీమిండియాలో చోటు కరువుశుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్ తదితర యువ బ్యాటర్లు ఓపెనర్లుగా టీమిండియాలో స్థానం సుస్థిరం చేసుకోవడంతో ధావన్కు మొండిచెయ్యి ఎదురైంది. ఈ నేపథ్యంలో గతేడాది ఆగష్టులో అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాను అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు కూడా గుడ్బై చెప్పాడు.ఇక ప్రస్తుతం లెజెండ్స్ లీగ్, నేపాల్ ప్రీమియర్ లీగ్ వంటి టోర్నీలలో పాల్గొంటున్న శిఖర్ ధావన్ తాజాగా చిన్నారులతో ముచ్చటించాడు. శిఖర్ ధావన్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఓ పిల్లాడు.. ‘‘మీ క్రికెట్ ప్రయాణం ఎలా మొదలైంది’’ అని అడిగాడు.కోచ్లకు ‘టీ’ అందించేవాడినిఇందుకు బదులిస్తూ.. ‘‘చిన్నతనంలో క్లబ్ క్రికెట్ ఆడేవాడిని. అక్కడ దాదాపు ఏడాది పాటు సాధన చేశాను. ఆ మరుసటి ఏడాది నాకు టోర్నమెంట్లో ఆడే అవకాశం వచ్చింది. అయితే, ఖాళీగా ఉన్న ఆ ఏడాదిలో నేను ఎన్నెన్నో చిత్రమైన పనులు చేశాను.పిచ్ను రోల్ చేయడం, కోచ్ల కోసం టీ తీసుకురావడం.. పది నిమిషాల పాటు బ్యాటింగ్ చేసేందుకు గంటల పాటు ఎండలో నిల్చోవడం.. ఇలాంటివి చాలానే చేశాను’’ అని శిఖర్ ధావన్ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.కుమారుడికి దూరంగా.. కాగా శిఖర్ ధావన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆయేషా ముఖర్జీ అనే ఆస్ట్రేలియా మహిళను అతడు 2012లో పెళ్లాడాడు. అప్పటికే ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉండగా.. ధావన్తో కలిసి జోరావర్కు జన్మనిచ్చింది. అయితే, ఎంతో అన్యోన్యంగా ఉండే ఆయేషా- శిఖర్ ధావన్ రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. ఇక కుమారుడు జొరావర్ను ఆయేషా తనతో పాటు ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లగా.. ధావన్ తన గారాలపట్టిని మిస్సవుతున్నట్లు చాలాసార్లు సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలిపాడు. ధావన్ తన తల్లిదండ్రులతో కలిసి ఢిల్లీలో ఉంటున్నట్లు సమాచారం.చదవండి: ఇలాంటి కెప్టెన్ను ఎప్పుడూ చూడలేదు: రోహిత్ శర్మపై టీమిండియా స్టార్ కామెంట్స్ -
బుమ్రా బౌలింగ్లో చితక్కొట్టాడు.. సెహ్వాగ్ను గుర్తుచేస్తున్నాడు: భారత మాజీ క్రికెటర్
ఆస్ట్రేలియా యువ ఓపెనర్ సామ్ కొన్స్టాస్(Sam Konstas)పై టీమిండియా మాజీ హెడ్కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. పందొమ్మిదేళ్ల ఈ యువ సంచలనం అద్భుత ఆట తీరుతో తనకు వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag)ను గుర్తుచేశాడని పేర్కొన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) బౌలింగ్లోనూ చితక్కొట్టిన ఇలాంటి బ్యాటర్ను తాను చూడలేదంటూ కొన్స్టాస్ను రవిశాస్త్రి ఆకాశానికెత్తాడు.మెస్వీనీ స్థానంలోబోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా సొంతగడ్డపై భారత్తో ఐదు టెస్టులు ఆడుతోంది. పెర్త్లో జరిగిన మొదటి మ్యాచ్ సందర్భంగా నాథన్ మెక్స్వీనీ ఆసీస్ తరఫున అరంగేట్రం చేయగా.. అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టుల తర్వాత అతడిపై వేటు పడింది. వరుస ఇన్నింగ్స్లో విఫలమైన మెక్స్వీనీ స్థానంలో క్రికెట్ ఆస్ట్రేలియా సామ్ కొన్స్టాస్కు పిలుపునిచ్చింది.ఊహించని రీతిలో దంచికొట్టాడుఈ క్రమంలో మెల్బోర్న్లో గురువారం మొదలైన బాక్సింగ్ డే టెస్టు సందర్భంగా పందొమ్మిదేళ్ల ఈ కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆరంభంలో భారత బౌలర్లకు ఎదుర్కొనేందుకు కాస్త సమయం తీసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆ తర్వాత ఊహించని రీతిలో దంచికొట్టాడు.బుమ్రాకే చుక్కలు చూపించాడుముఖ్యంగా బుమ్రాను కొన్స్టాస్ ఎదుర్కొన్న తీరు విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. 2021 సిడ్నీ టెస్టులో చివరిసారిగా బుమ్రా బౌలింగ్లో ఆసీస్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ సిక్స్ కొట్టగా... మూడేళ్ల తర్వాత మెల్బోర్న్ టెస్టులో మళ్లీ కొన్స్టాస్ రివర్స్ స్కూప్ ద్వారా సిక్స్ బాదాడు. తద్వారా తన బ్యాటింగ్ పవరేంటో చూపించాడు. మొత్తంగా 65 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, రెండు సిక్స్ల సాయంతో 60 పరుగులు సాధించాడు.ఈ నేపథ్యంలో రవిశాస్త్రి సామ్ కొన్స్టాస్ ఆట తీరును తనదైన శైలిలో విశ్లేషించాడు. ‘‘కేవలం టెస్టులే కాదు.. వన్డే, టీ20లలోనూ బుమ్రాను ఇలా ట్రీట్ చేసిన బ్యాటర్ను చూడలేదు. విధ్వంసకర షాట్లు ఆడటంలో అతడు తన స్వాగ్ను చూపించాడు. క్రికెట్ నిబంధనలనే మార్చేసేలా అతడి ఆట ఉందనడం అతిశయోక్తి కాదు.వీరేంద్ర సెహ్వాగ్ గుర్తుకు వచ్చాడుఒకానొక సమయంలో కొన్స్టాస్ను కట్టడి చేసేందుకు తమ వద్ద ప్రణాళికలు లేక టీమిండియా బిక్క ముఖం వేసినట్లు కనిపించింది. ఆరంభంలో అతడు రెండు షాట్లు మిస్ చేసినపుడు కనిపించిన ఆనందం.. కాసేపట్లోనే ఆవిరైంది. అతడు హిట్టింగ్ మొదలుపెట్టగానే నాకు వీరేంద్ర సెహ్వాగ్ జ్ఞప్తికి వచ్చాడు.క్రీజులో కుదురుకున్నాక వీరూ ఎంతగా వినోదం పంచుతాడో.. కొన్స్టాస్ కూడా అలాగే చేశాడు. ఆసీస్ జట్టులో కొన్స్టాస్ గనుక తన స్థానం సుస్థిరం చేసుకుంటే భవిష్యత్తులో అతడికి తిరుగు ఉండదు’’ అని కొన్స్టాస్పై రవిశాస్త్రి ప్రశంసల జల్లు కురిపించాడు. కాగా భారత లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్లో కొన్స్టాస్ లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగిన విషయం తెలిసిందే.చదవండి: విశ్రాంతి కాదు.. నిర్దాక్షిణ్యంగా అతడిపై వేటు వేయండి.. అప్పుడైనా..: టీమిండియా దిగ్గజంWHAT ARE WE SEEING! Sam Konstas just whipped Jasprit Bumrah for six 😱#AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/ZuNdtCncLO— cricket.com.au (@cricketcomau) December 26, 2024 -
క్రికెట్ జట్టులోకి పుల్వామా అమరవీరుడి కుమారుడు.. సెహ్వాగ్ పోస్ట్ వైరల్
టీమిండియా దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉద్వేగానికి లోనయ్యాడు. తమ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న రాహుల్ సోరెంగ్ విజయ్ మర్చంట్ ట్రోఫీ ఆడే జట్టుకు ఎంపిక కావడం గర్వంగా ఉందన్నాడు. కాగా రాహుల్ మరెవరో కాదు.. పుల్వామా ఘటనలో నింగికేగిన అమర వీరుడు విజయ్ సోరెంగ్ కుమారుడు.నాడు శోక సంద్రంలోకాగా కశ్మీర్లో 2019లో జరిగిన ఉగ్రదాడిలో నలభై మందికి పైగా భద్రతా బలగాల జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. దేశం మొత్తాన్ని శోక సంద్రంలో ముంచిన ఈ ఘటన నేపథ్యంలో వీరూ భాయ్ నాడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అదే సమయంలో గొప్ప మనసు కూడా చాటుకున్నాడు.అమర వీరుల పిల్లలకు హర్యానాలోని సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉచితంగా విద్యనందిస్తామని వాగ్దానం చేశాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు తమకు చేతనైంత మేర రుణం తీర్చుకుంటామని పేర్కొన్నాడు. పిల్లలను ప్రయోజకులు చేయడంలో తమ వంతు పాత్ర పోషిస్తామని తెలిపాడు. ఆ హామీని వీరూ భాయ్ నిలబెట్టుకున్నాడు కూడా!సెహ్వాగ్ భావోద్వేగంఇప్పుడు అందుకు తగ్గ ప్రతిఫలం లభించింది. సెహ్వాగ్ స్కూళ్లో చదువుతూనే.. క్రికెట్లోనూ శిక్షణ తీసుకుంటున్న రాహుల్ సోరెంగ్.. హర్యానా అండర్-16 జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో హర్షం వ్యక్తం చేసిన వీరేంద్ర సెహ్వాగ్.. ‘‘రాహుల్ సోరెంగ్. ఈ పేరును గుర్తు పెట్టుకోండి.నా జీవితంలోని అత్యంత సంతోషకరమైన క్షణాల్లో ఇదీ ఒకటి. పుల్వామా దాడి వంటి విషాదకర ఘటన తర్వాత.. అమరుల పిల్లలకు సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూళ్లో ఉచిత విద్య, ఆవాసం కల్పిస్తానని మాట ఇచ్చాను.పుల్వామా అమరవీరుడు విజయ్ సోరెంగ్ గారి కుమారుడు రాహుల్ సోరెంగ్ 2019లో సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చేరాడు. నాలుగేళ్లుగామ మాతో ప్రయాణం సాగిస్తున్న రాహుల్.. విజయ్ మర్చంట్ ట్రోఫీ అండర్-16 హర్యానా జట్టుకు ఎంపికయ్యాడు. కొన్ని విషయాలు మనసును రంజింపజేస్తాయి. మన జవాన్లకు ధన్యవాదాలు’’ అని సెహ్వాగ్ ఎక్స్ వేదికగా తన మనసులోని భావాలు పంచుకున్నాడు. చదవండి: D Gukesh: ప్రైజ్మనీలో టాక్స్ మినహాయింపు ఇవ్వండి: లేఖ రాసిన ఎంపీRemember the Name- Rahul Soreng. This is one of the happiest feelings in life. After the tragic Pulwama attack, had made an appeal to offer free education to children of our martyr’s study and stay in my @sehwagschool . I feel so privileged that Rahul Soreng , son of Pulwama… https://t.co/gKvrcyy767 pic.twitter.com/L0Qlc1hh3j— Virender Sehwag (@virendersehwag) December 18, 2024 -
IND VS AUS 2nd Test: సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టిన నితీశ్ రెడ్డి
టీమిండియా యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉండిన ఓ లాంగ్ స్టాండింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాపై ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు (భారత్ తరఫున) గతంలో సెహ్వాగ్ పేరిట ఉండేది. 2003 పర్యటనలో సెహ్వాగ్ ఆస్ట్రేలియాపై 6 సిక్సర్లు బాదాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్లో నితీశ్ కుమార్ రెడ్డి సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ సిరీస్లో నితీశ్ ఇప్పటికే 7 సిక్సర్లు బాదాడు. ఈ సిరీస్లో ఇంకా మూడు టెస్ట్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. నితీశ్ ఈ సిరీస్లో మరిన్ని సిక్సర్లు బాదే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్లు..నితీశ్ కుమార్ రెడ్డి-7 (2024)వీరేంద్ర సెహ్వాగ్-6 (2003)మురళీ విజయ్-6 (2014)సచిన్ టెండూల్కర్-5 (2007)రోహిత్ శర్మ-5 (2014)మయాంక్ అగర్వాల్-5 (2018)రిషబ్ పంత్-5 (2018)ఇదిలా ఉంటే, అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 180 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో నితీశ్ రెడ్డి (42) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్లో మిచెల్ స్టార్క్ (6/48) టీమిండియాను దెబ్బకొట్టాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (140) శతక్కొట్టడంతో 337 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో సిరాజ్, బుమ్రా తలో నాలుగు వికెట్లు పడగొట్టారు.157 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. మరోసారి ఘోరంగా విఫలమైంది. కమిన్స్ (5/57) ధాటికి భారత్ 175 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్లోనూ నితీశ్ కుమార్ రెడ్డే (42) టాప్ స్కోరర్గా నిలిచాడు.19 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ 3.2 ఓవర్లలో వికెట్ నష్ట పోకుండా విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో ఆసీస్ 1-1తో సమంగా నిలిచింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో భారత్ 295 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. -
తృటిలో ట్రిపుల్ సెంచరీ చేజార్చుకున్న సెహ్వాగ్ తనయుడు
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తృటిలో ట్రిపుల్ సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నాడు. బీసీసీఐ ఆథ్వర్యంలో నడిచే కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ టోర్నీలో ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్యవీర్ 309 బంతుల్లో 51 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 297 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆర్యవీర్ మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్లో ఈ స్కోర్ చేశాడు. ఆర్యవీర్ ఔట్ కాగానే ఢిల్లీ తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ (623/5) చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 98 పరుగుల వద్ద ఉండిన ధన్య నక్రా ఈ రోజు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నక్రా 122 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 130 పరుగులు చేసి ఔటయ్యాడు. ఢిల్లీ ఇన్నింగ్స్లో ఓపెనర్ అర్నవ్ బుగ్రా (114) కూడా సెంచరీతో చెలరేగాడు. మూడో రోజు లంచ్ సమయానికి మేఘాలయ రెండు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసి సెకెండ్ ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. మంధన్ (32), నర్లెంగ్ (11) క్రీజ్లో ఉన్నారు. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు మేఘాలయ ఇంకా 293 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు మేఘాలయ తొలి ఇన్నింగ్స్లో 260 పరుగులకే ఆలౌటైంది.తండ్రి బాటలోనే తనయుడుఆర్యవీర్ సెహ్వాగ్ బాటలోనే నడుస్తున్నాడు. ఆర్యవీర్ సైతం తండ్రిలాగే వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఎదురుచూడలేదు. ఏ స్కోర్ వద్ద ఉన్న దూకుడే మంత్రంగా ఆడాడు. అందుకే ఈ మ్యాచ్లో ఆర్యవీర్ ట్రిపుల్ సెంచరీని లెక్క చేయలేదు. వీరేంద్ర సెహ్వాగ్ తన కెరీర్లో చాలా సందర్భాల్లో సెంచరీలు, డబుల్, ట్రిపుల్ సెంచరీలు మిస్ అయ్యాడు. 2009లో సెహ్వాగ్ ఓ టెస్ట్ మ్యాచ్లో 293 స్కోర్ వద్ద ఔటయ్యాడు. సెహ్వాగ్ కెరీర్లో అప్పటికే రెండు ట్రిపుల్ సెంచరీలు ఉన్నాయి. ఆర్యవీర్ ఇప్పుడిప్పుడే క్రికెట్లోకి అడుగుపెడుతున్నాడు. అతని నుంచి కూడా తండ్రి లాంటి ఇన్నింగ్స్లే ఆశించవచ్చు. ఆర్యవీర్ ఈ ఏడాది అక్టోబర్లో వినూ మన్కడ్ ట్రోఫీతో ప్రొఫెషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్లోనే ఆర్యవీర్ 49 పరుగులు చేసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. -
విధ్వంసం.. డబుల్ సెంచరీతో చెలరేగిన సెహ్వాగ్ కొడుకు
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాడు. తండ్రికి తగ్గ తనయుడుగా నిరూపించుకుంటున్నాడు. కూచ్ బెహార్ ట్రోఫీ-2024లో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్యవీర్..మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్లో డబుల్ సెంచరీతో చెలరేగాడు.తండ్రిలానే ప్రత్యర్ధి బౌలర్లను ఆర్యవీర్ ఊచకోత కోశాడు. తనదైన స్టైల్లో కేవలం 229 బంతుల్లోనే తన డబుల్ సెంచరీ మార్క్ను జూనియర్ సెహ్వాగ్ అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో 34 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. ఆర్యవీర్ సరిగ్గా 200 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ల్లీ తమ తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 468 పరుగులు చేసింది. అతడితో పాటు ధన్యా నక్ర(98) పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇక ఢిల్లీ ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్లో 208 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.అరంగేట్రంలోనే అదుర్స్..ఈ ఏడాది అక్టోబర్లో ఆర్యవీర్ వినూ మన్కడ్ ట్రోఫీలో ఢిల్లీ తరపున ప్రొఫెషనల్ క్రికెట్లో అడుగు పెట్టాడు. తన డెబ్యూ మ్యాచ్లోనే ఆర్యవీర్ అదరగొట్టాడు. మణిపూర్తో జరిగిన మ్యాచ్లో 49 పరుగులు చేసిన తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని ఈ ఢిల్లీ చిచ్చరపిడుగు అందించాడు. ఆ తర్వాత ఆర్యవీర్ సెహ్వాగ్ తన ప్రతిభను చాటుకుంటూ వస్తున్నాడు. మరోవైపు ఆర్యవీర్ ఐపీఎల్లో ఆడితే చూడాలన్న తన కోరికను సెహ్వాగ్ ఇప్పటికే వెల్లడించాడు.చదవండి: IND vs AUS: టీమిండియాకు గుడ్ న్యూస్.. రోహిత్ శర్మ వచ్చేస్తున్నాడు! -
సౌథీ అరుదైన ఘనత.. సెహ్వాగ్ సిక్సర్ల రికార్డు బ్రేక్
బెంగళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ స్టార్ టిమ్ సౌథీ అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. కివీస్ మొదటి ఇన్నింగ్స్లో 402 పరుగుల భారీ స్కోర్ను సాధించడంలో సౌథీ కీలక పాత్ర పోషించాడు. రచిన్ రవీంద్రతో కలిసి ఎనిమిదో వికెట్కు 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.73 బంతులు ఎదుర్కొన్న సౌథీ 5 ఫోర్లు, 4 సిక్స్లతో 65 పరుగులు చేశాడు. ఈ ఇక మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెరిసిన సౌథీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక సిక్స్లు కొట్టిన జాబితాలో సౌథీ ఆరో స్ధానానికి ఎగబాకాడు. ఇప్పటివరకు 147 టెస్టు ఇన్నింగ్స్లలో సౌథీ 92 సిక్స్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్(91) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో సెహ్వాగ్ను ఈ కివీ వెటరన్ అధిగమించాడు. ఇక అరుదైన ఫీట్ నమోదు చేసిన జాబితాలో బెన్ స్టోక్స్(131) అగ్రస్ధానంలో ఉన్నాడు.చదవండి: IND vs PAK 2nd Test: ఇంగ్లండ్ను చిత్తు చేసిన పాకిస్తాన్.. -
అరంగేట్రంలోనే దుమ్ములేపిన సెహ్వాగ్ కుమారుడు
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. తన అద్భుత ప్రదర్శనతో ఢిల్లీ జట్టుకు విజయం అందించాడు. దీంతో వీరూ భాయ్ వారసుడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా వినూ మన్కడ్ ట్రోఫీ-2024 సందర్భంగా ఆర్యవీర్ సెహ్వాగ్ ఢిల్లీ తరఫున ఎంట్రీ ఇచ్చాడు.బౌలర్లు పడగొట్టారుపాండిచ్చేరి వేదికగా మణిపూర్తో జరిగిన వన్డే మ్యాచ్లో ఢిల్లీ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో మణిపూర్ 49.1 ఓవర్లలో 168 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో లక్ష్మణ్(24/3), దేవాన్ష్ రావత్(44/2), అమన్ చౌదరి(29/2) అదరగొట్టారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీకి ఓపెనర్లు ఆర్యవీర్ సెహ్వాగ్- సార్థక్ రే శుభారంభం అందించారు.ఇద్దరూ కలిసి 4.5 ఓవర్లలో 33 పరుగులు చేశారు. సార్థక్ 17 బంతుల్లో 25 పరుగులు చేసి తొలి వికెట్గా నిష్క్రమించగా.. వన్డౌన్ బ్యాటర్ ఆదిత్య కుమార్ ఎనిమిది పరుగులకే అవుటయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్ ప్రణవ్ పంత్తో కలిసి ఆర్యవీర్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా ఢిల్లీ 20 ఓవర్లలోనే వంద పరుగుల మార్కు అందుకుంది.మొత్తంగా 64 బంతులు ఎదుర్కొన్న ఆర్యవీర్ 49 పరుగుల వద్ద అవుటయ్యాడు. తృటిలో అర్ధ శతకం చేజార్చుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. మరోవైపు.. ప్రణవ్ పంత్ కూడా 45 బంతుల్లో ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో ఏకంగా 75 రన్స్ సాధించాడు. వీరిద్దరి అద్భుత బ్యాటింగ్ కారణంగా ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో మణిపూర్పై గెలుపొందింది.కాగా ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ట్రయల్ మ్యాచ్లో ఆర్యవీర్ దుమ్ములేపాడు. 136 బంతుల్లోనే ఏకంగా 183 రన్స్ చేశాడు. ఈ క్రమంలో వినూ మన్కడ్ వన్డే టోర్నీకి ఢిల్లీ సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. అరంగేట్ర మ్యాచ్లోనే ఇలా సత్తా చాటి వారి నమ్మకాన్ని ఆర్యవీర్ నిలబెట్టాడు. ఇద్దరు కుమారులు2004లో ఆర్తీ అహ్లావత్ను పెళ్లాడిన వీరేంద్ర సెహ్వాగ్కు ఇద్దరు కుమారులు జన్మించారు. పెద్దవాడు ఆర్యవీర్(2007), చిన్నోడు వేదాంత్(2010). ఇద్దరూ క్రికెటర్లుగా అదృష్టం పరీక్షించుకుంటున్నారు. చదవండి: అంపైర్ల తీరుపై హర్మన్ప్రీత్ అసహనం.. తప్పెవరిది? -
సెహ్వాగ్ రికార్డు బ్రేక్ చేసిన జైస్వాల్
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టుల్లో ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. సంప్రదాయ క్రికెట్లో ఇప్పటికే ఎన్నో అరుదైన ఘనతలు సాధించిన ఈ లెఫ్టాండర్.. తాజాగా బంగ్లాదేశ్తో రెండో టెస్టు సందర్భంగా మరో రికార్డు నమోదు చేశాడు. భారత్ తరఫున టెస్టుల్లో అత్యంత వేగంగా అర్ధ శతకం బాదిన క్రికెటర్ల జాబితాలో చేరాడు.ఈ క్రమంలో భారత డాషింగ్ ఓపెనర్, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ను జైస్వాల్ అధిగమించాడు. బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా చెన్నై టెస్టులో 280 పరుగులతో గెలిచిన టీమిండియా.. కాన్పూర్ వేదికగా రెండో మ్యాచ్ ఆడుతోంది. గ్రీన్పార్క్ స్టేడియంలో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్కు తొలిరోజు నుంచే వర్షం ఆటంకం కలిగించింది. ఈ క్రమంలో రెండు, మూడో రోజు ఆట రద్దు కాగా.. సోమవారం మ్యాచ్ మళ్లీ మొదలైంది.ఆది నుంచే దూకుడుగాఈ నేపథ్యంలో 107/3 స్కోరుతో నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన బంగ్లాదేశ్.. 233 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత జట్టు ఆది నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 11 బంతుల్లోనే ఒక ఫోర్, మూడు సిక్సర్ల సాయంతో 23 పరుగులు చేశాడు. 209కి పైగా స్ట్రైక్రేటుతో ఆకట్టుకున్నాడు.టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ సైతం ‘బజ్బాల్’ తరహా ఇన్నింగ్స్తో దుమ్ములేపాడు. కేవలం 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు. తద్వారా టీమిండియా తరఫున టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన నాలుగో బ్యాటర్గా నిలిచాడు. మొత్తంగా తొలి ఇన్నింగ్స్లో 51 బంతులు ఎదుర్కొన్న ఈ ముంబై బ్యాటర్.. 12 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 72 పరుగులు రాబట్టాడు.టీమిండియా తరఫున టెస్టుల్లో వేగవంతమైన అర్ధ శతకం సాధించినది వీరే👉రిషభ్ పంత్- బెంగళూరులో 2022 నాటి శ్రీలంకతో మ్యాచ్లో 28 బంతుల్లోనే 50 రన్స్👉కపిల్ దేవ్- కరాచిలో 1982 నాటి మ్యాచ్లో పాకిస్తాన్తో మ్యాచ్లో 30 బంతుల్లోనే 50 రన్స్👉శార్దూల్ ఠాకూర్- ఓవల్లో 2021 నాటి మ్యాచ్లో ఇంగ్లండ్ మీద 31 బంతుల్లోనే 50 రన్స్👉యశస్వి జైస్వాల్- కాన్పూర్లో 2024 నాటి మ్యాచ్లో బంగ్లాదేశ్ మీద 31 బంతుల్లోనే 50 రన్స్👉వీరేంద్ర సెహ్వాగ్- చెన్నైలో 2008 నాటి మ్యాచ్లో ఇంగ్లండ్ మీద 32 బంతుల్లో 50 రన్స్.ప్రపంచ రికార్డుఇక ధనాధన ఇన్నింగ్స్తో అలరించిన రోహిత్ శర్మ- యశస్వి జైస్వాల్ జోడి టెస్టుల్లో హయ్యస్ట్ స్కోరింగ్ రేటు(14.34) పార్ట్నర్షిప్ సాధించిన తొలి జంటగా అరుదైన ఘనత సాధించింది. ఇద్దరూ కలిసి 23 బంతుల్లోనే 55 పరుగులు సాధించి ఈ ఫీట్ నమోదు చేశారు. వీరి తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్ జోడీ బెన్ స్టోక్స్- బెన్ డకెట్(44 బంతుల్లో 87 నాటౌట్), వాగ్నర్- ట్రెంట్ బౌల్ట్(27 బంతుల్లో 52) ఉన్నారు. చదవండి: రాహుల్ ద్రవిడ్ కుమారుడికి షాక్.. ఇకపై ఆ జట్టుకు ఆడలేడు! View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
చరిత్రకు అడుగు దూరంలో రోహిత్.. సెహ్వాగ్ ఆల్ టైమ్ రికార్డుపై కన్ను
దాదాపు నెల రోజుల సుదీర్ఘ విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు తిరిగి మైదానంలో అడుగుపెట్టనుంది. బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు టీమిండియా సిద్దమవుతోంది. ఈ సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే చెన్నైకు చేరుకున్న టీమిండియా నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. కొత్త బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కల్ సైతం భారత జట్టుతో చేరాడు. బంగ్లా క్రికెట్ జట్టు కూడా సోమవారం(సెప్టెంబర్ 16)న భారత గడ్డపై అడుగుపెట్టే అవకాశముంది. కాగా వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో ఫైనల్ కు చేరాలంటే భారత్ కు ఈ సిరీస్ చాలా కీలకం. అందుకు తగ్గట్టే భారత్ తమ వ్యూహాలు రచిస్తోంది.సెహ్వాగ్ రికార్డుపై కన్నేసిన హిట్మ్యాన్..బంగ్లాతో తొలి టెస్టుకు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. చెపాక్ టెస్టులో హిట్మ్యాన్ మరో 7 సిక్సర్లు బాదితే టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు నమోదు చేసిన వీరేంద్ర సెహ్వాగ్ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు.సెహ్వాగ్ 103 టెస్టుల్లో 90 సిక్స్లు బాదగా.. రోహిత్ శర్మ 59 టెస్టు మ్యాచ్ల్లో ఇప్పటి వరకు 84 సిక్స్లు కొట్టాడు. ప్రస్తుతం ఈ జాబితాలో రోహిత్ రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. హిట్మ్యాన్ తర్వాతి స్ధానాల్లో 78 సిక్స్లతో ధోనీ, 69 సిక్స్లతో సచిన్, 64 సిక్స్లతో రవీంద్ర జడేజా వరుసగా కొనసాగుతున్నారు.చదవండి: ఒకవేళ టీమిండియా మా దేశానికి రాకపోతే: పాక్ మాజీ క్రికెటర్ -
ఆల్టైమ్ రికార్డుకు ఏడు సిక్సర్ల దూరంలో ఉన్న రోహిత్
టెస్ట్ల్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్ల రికార్డు సాధించేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం ఏడు సిక్సర్లు దూరంలో ఉన్నాడు. హిట్మ్యాన్ త్వరలో బంగ్లాదేశ్తో జరుగబోయే సిరీస్లో మరో ఏడు సిక్సర్లు బాదితే టీమిండియా తరఫున టెస్ట్ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వీరేందర్ సెహ్వాగ్ రికార్డును అధిగమిస్తాడు. వీరూ 103 టెస్ట్ల్లో 90 సిక్సర్లు బాదగా.. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 84 సిక్సర్లు (59 టెస్ట్ల్లో) ఉన్నాయి. టెస్ట్ల్లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో వీరూ, రోహిత్ తర్వాత ధోని (78), సచిన్ (69), రవీంద్ర జడేజా (64) టాప్-5లో ఉన్నారు. సుదీర్ఘ ఫార్మాట్లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి కేవలం 26 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. మూడు ఫార్మాట్ల విషయానికొస్తే.. రోహిత్ ప్రపంచంలోనే అందరి కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఉన్నాడు. హిట్మ్యాన్ తన కెరీర్లో 483 మ్యాచ్లు ఆడి 620 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితాలో రోహిత్ తర్వాతి స్థానాల్లో క్రిస్ గేల్ (553), షాహిద్ అఫ్రిది (476) టాప్-3లో ఉన్నారు.బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ విషయానికొస్తే.. రెండు టెస్ట్లు, మూడు టీ20ల సిరీస్ల కోసం బంగ్లాదేశ్ జట్టు ఈ నెల 19 నుంచి భారత్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగనుంది. తొలి టెస్ట్ సెప్టెంబర్ 19, రెండో టెస్ట్ సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమవుతాయి. టీ20 సిరీస్ అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో జరుగుతుంది. -
టీమిండియాకు కాదు.. ఐపీఎల్ కోచ్గా ఉండటం బెటర్: సెహ్వాగ్
టీమిండియా హెడ్కోచ్ పదవి గురించి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జాతీయ జట్టు శిక్షకుడిగా ఉండటం కంటే.. ఐపీఎల్ కోచ్గా ఉండటమే తనకు ఇష్టమని పేర్కొన్నాడు. భారత విధ్వంసకర ఓపెనర్గా గుర్తింపు పొందిన వీరూ భాయ్.. 2015లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అదే ఏడాది ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్కు చివరిసారిగా ప్రాతినిథ్యం వహించాడు.అనంతరం అదే జట్టుకు 2016లో మెంటార్గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత పంజాబ్ ఫ్రాంఛైజీ క్రికెట్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టాడు సెహ్వాగ్. 2018 వరకు అదే పదవిలో కొనసాగాడు. అయితే, 2017లోనే టీమిండియా హెడ్కోచ్ రేసులో నిలిచినా.. రవిశాస్త్రికి అవకాశం దక్కగా.. సెహ్వాగ్కు మొండిచేయి ఎదురైంది. అప్పటి నుంచి మళ్లీ అతడు ఎన్నడూ జాతీయ జట్టు కోచ్గా వెళ్లాలన్న ప్రయత్నం చేయలేదు.టీమిండియాకు కాదు.. ఐపీఎల్ కోచ్గా ఉండటం బెటర్ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీరేంద్ర సెహ్వాగ్ అందుకు గల కారణం వెల్లడించాడు. ‘‘టీమిండియా కోచ్గా ఉండటం కంటే ఐపీఎల్ జట్టు కోచ్గా ఉండటానికే నేను మొగ్గుచూపుతాను. నిజానికి నేను గనుక భారత జట్టు కోచ్ని అయితే.. మళ్లీ పాతరోజుల్లాగే గడుస్తుంది. సిరీస్లు ఉన్నపుడు ఇంటికి ఏడెనిమిది నెలలపాటు దూరంగా ఉండాల్సి వస్తుంది.నా కుమారులూ క్రికెటర్లేఇప్పుడు నా పిల్లల వయసు 14, 16 ఏళ్లు. వాళ్లకు నా అవసరం ఉంది. వాళ్లిద్దరు క్రికెటర్లే. ఒకరు ఆఫ్ స్పిన్నర్ అయితే.. మరొకరు ఓపెనింగ్ బ్యాటర్. నా కుమారులకు దిక్సూచిలా ఉంటూ.. వారికి తగినంత సమయం కేటాయించడమే నా ముందున్న కర్తవ్యం’’ అని సెహ్వాగ్ అమర్ ఉజాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ కోచ్గా మారితే స్వల్పకాలం మాత్రమే కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుందని.. అందుకే తన ఓటు అటు వేశానని పేర్కొన్నాడు.చదవండి: అందుకు నువ్వే కారణమవుతావని కోహ్లితో చెప్పా.. ఆ తర్వాత: భజ్జీ -
’మిగతా సెలక్టర్లు అతడిని వద్దన్నారు... అయినా నేను వినలేదు’
ఫామ్లో ఉన్న యువ క్రికెటర్లకు అవకాశం ఇస్తేనే వారి సత్తా బయటపడుతుందని టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ అన్నాడు. ప్రతిభను గుర్తించడం ఎంత ముఖ్యమో.. సరైన సమయంలో జట్టుకు ఎంపిక చేయడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నాడు. అప్పుడే సెలక్టర్లు తమ పాత్రకు న్యాయం చేసిన వాళ్లవుతారని అభిప్రాయపడ్డాడు.సెహ్వాగ్ను కాదని ధావన్ను ఆడించాశిఖర్ ధావన్ అరంగేట్రం విషయంలో తన అంచనా తప్పలేదని.. తన నిర్ణయం సరైందేనని గబ్బర్ నిరూపించాడని సందీప్ పాటిల్ ఈ సందర్భంగా వెల్లడించాడు. సహచర నలుగురు సెలక్టర్లు వ్యతిరేకించినా.. నాడు వీరేంద్ర సెహ్వాగ్ను కాదని ధావన్ను తుదిజట్టుకు ఎంపిక చేసిన విషయాన్ని తాజాగా గుర్తు చేసుకున్నాడు. కాగా 2013లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సందర్భంగా డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ వరుసగా తొలి రెండు మ్యాచ్లలో విఫలమయ్యాడు.అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డుఈ క్రమంలో మూడో టెస్టులో వీరూ భాయ్పై వేటు వేసిన సెలక్టర్లు ధావన్కు టెస్టు అరంగేట్రం అవకాశం కల్పించారు. అయితే, వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. కేవలం 85 బంతుల్లోనే శతకం బాదాడు. తద్వారా టెస్టు అరంగేట్రంలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.ఇక ఆసీస్తో మూడో టెస్టులో మొత్తంగా 174 బంతులు ఎదుర్కొన్న గబ్బర్.. 187 పరుగులతో అదరగొట్టాడు. ఆ తర్వాత టీమిండియాలో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు ఈ మొహాలీ హ్యారికేన్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘యువ క్రికెటర్లు ఫామ్లో ఉన్నపుడే వారికి అవకాశాలు ఇవ్వాలి.నన్ను కాపాడాడుసరైన సమయంలో పిలుపునిస్తేనే వారి ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆ సమయంలో శిఖర్ సౌతాఫ్రికా టూర్లో ఇండియా-ఏ తరఫున డబుల్ సెంచరీ, సెంచరీ బాదాడు. అప్పుడు అతడిని జాతీయ జట్టుకు ఆడించాలని నేను భావించాను. సెహ్వాగ్ను కాదని.. ధావన్ను ఆడించాలనే నా నిర్ణయాన్ని నా సహచర సెలక్టర్లు వ్యతిరేకించారు.అయితే, ఆ తర్వాత వారిని ఒప్పించగలిగాను. అలా శిఖర్ జట్టులోకి వచ్చి తొలి టెస్టులోనే రికార్డు సెంచరీ బాదాడు. నా నిర్ణయం సరైందని నిరూపించాడు. అయినా.. నేనేమీ క్రెడిట్ తీసుకోవాలనుకోలేదు. నిజానికి శిఖర్ శతకం చేసి ఒకరకంగా నన్ను రక్షించాడనుకోండి(నవ్వుతూ)’’ అంటూ గత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నాడు. కాగా సందీప్ పాటిల్ టీమిండియా తరఫున 29 టెస్టులు, 45 వన్డేలు ఆడాడు. 2012- 2016 మధ్య బీసీసీఐ చీఫ్ సెలక్టర్గా పనిచేశాడు. చదవండి: Duleep Trophy: కళ్లన్నీ ఈ ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లపైనే! -
ఓపెనర్లుగా వీరూ, రోహిత్.. మిడిలార్డర్లో సచిన్, విరాట్: డీకే
టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ కామెంటేటర్గా మరింత బిజీ అయ్యాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత మ్యాచ్ ఫలితాలు, ఆటగాళ్ల ప్రదర్శనను తనదైన శైలిలో విశ్లేషిస్తూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఆడనున్న తొలి భారత క్రికెటర్గానూ చరిత్ర సృష్టించిన డీకే తాజాగా.. తన ఆల్టైమ్ టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించాడు.ఓపెనర్లుగా వీరూ, రోహిత్మూడు ఫార్మాట్లలో కలిపి టీమిండియా తరఫున అత్యుత్తమంగా రాణించిన ఆటగాళ్లకు తన జట్టులో దినేశ్ కార్తిక్ చోటిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు సింహస్వప్నంగా మారి.. విధ్వంసకర బ్యాటర్గా పేరొందిన వీరేంద్ర సెహ్వాగ్తో పాటు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు డీకే.మిడిల్ ఆర్డర్లో సచిన్, విరాట్పరిమిత ఓవర్ల క్రికెట్లో 100కు పైగా స్ట్రైక్రేటుతో పరుగులు రాబట్టిన వీరూతో పాటు.. ఇటీవలి టీ20 ప్రపంచకప్-2024లో 257 పరుగులతో రెండో హయ్యస్ట్ రన్స్కోరర్గా నిలిచిన రోహిత్కు ఇన్నింగ్స్ ఓపెన్ చేసే అవకాశమిస్తానన్నాడు. ఇక వన్డౌన్ బ్యాటర్గా మాజీ కెప్టెన్, మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ను ఎంచుకున్న డీకే.. వంద సెంచరీల దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ను నాలుగో స్థానానికి ఎంచుకున్నాడు.ఇక ఆ తర్వాతి స్థానంలో రన్మెషీన్, 80 శతకాల వీరుడు విరాట్ కోహ్లికి చోటిచ్చిన దినేశ్ కార్తిక్.. ఆల్రౌండర్ల జాబితాలో వరల్డ్కప్ విన్నర్స్ యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజాలను ఎంపిక చేసుకున్నాడు. అదే విధంగా బౌలింగ్ విభాగంలో.. సీమర్లు జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్, స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, లెజెండ్ అనిల్ కుంబ్లేలకు స్థానం కల్పించాడు డీకే. పన్నెండో ఆటగాడిగా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ను ఎంచుకున్నాడు ఈ తమిళనాడు మాజీ బ్యాటర్. క్రిక్బజ్ షోలో ఈ మేరకువ్యాఖ్యలు చేశాడు.వన్డే, టీ20, టెస్టు ఫార్మాట్లలో డీకే ఎంచుకున్న భారత అత్యుత్తమ జట్టువీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖన్.12th మ్యాన్: హర్భజన్ సింగ్. -
DPL 2024: వీరేంద్ర సెహ్వాగ్కు కీలక బాధ్యతలు...
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ అరంగేట్ర సీజన్కు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఈ తొట్టతొలి ఎడిషన్ ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరగనుంది. ఈ లీగ్లోని అన్ని మ్యాచ్లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ లీగ్లో ఫస్ట్క్లాస్ క్రికెటర్లతో భారత స్టార్ క్రికెటర్లు రిషబ్ పంత్, ఇషాంత్ శర్మ, నవదీప్ సైనీ భాగం కానున్నారు.డీపీఎల్ బ్రాండ్ అంబాసిడర్గా సెహ్వాగ్..ఇక ఇది ఇలా ఉండగా.. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్ బ్రాండ్ అంబాసిడర్గా భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ను డీడీసీఎ నియమించింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో డీడీసీఎ తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రామానికి సెహ్వాగ్ సైతం హాజరయ్యాడు. కాగా ఢిల్లీ నుంచే భారత జట్టుకు సెహ్వాగ్ ప్రాతినిథ్యం వహించాడు. ఇక ఢిల్లీలోని అత్యుత్తమ ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని డీడీసీఏ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రీమియర్ లీగ్ను డీడీసీఎ ప్రారంభించనుంది. లీగ్ ప్రారంభ ఎడిషన్లో ఆరు ఫ్రాంచైజీలు భాగం కానున్నాయి. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్, పురాణి డిల్లీ 6, సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ జట్లు మొత్తం రూ. 49.65 కోట్ల రూపాయలకు విక్రయించబడ్డాయి. -
వన్డే ప్రపంచకప్ ఆల్టైమ్ అత్యుత్తమ జట్టు.. కోహ్లికి నో ఛాన్స్!
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ 2012లో అంతర్జాతీయ క్రికెట్లో వందో సెంచరీ కొట్టి.. శతక శతకాల ధీరుడిగా ప్రపంచ రికార్డు సాధించాడు. సమకాలీన క్రికెటర్లు ఎవరికీ సాధ్యం కాని ఫీట్ నమోదు చేసి.. శిఖరాగ్రాన నిలిచాడు. వన్డేల్లో 49, టెస్టుల్లో 51 సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ పేరిట ఉన్న ఈ రికార్డు బద్దలయ్యే అవకాశమే లేదని భావిస్తున్న తరుణంలో.. విరాట్ కోహ్లి అనే కుర్రాడు తెరమీదకు వచ్చాడు.ఇప్పటికే వన్డేల్లో 50 శతకాలు బాదిన ఈ రన్మెషీన్.. సచిన్ రికార్డు బ్రేక్ చేశాడు. టెస్టుల్లో 29, టీ20లలో ఒక సెంచరీ బాది.. ఆల్టైమ్ రికార్డుకు ఎసరుపెట్టాడు. 35 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్కు మారుపేరుగా కొనసాగుతున్న కోహ్లి వరల్డ్కప్ టోర్నీల్లోనూ సత్తా చాటుతున్నాడు. వన్డే రారాజుగా కొనసాగుతున్నాడు. అయితే, ఇలాంటి రికార్డుల వీరుడికి తన ఆల్టైమ్ గ్రేటెస్ట్ వన్డే వరల్డ్కప్ ప్లేయింగ్ ఎలెవన్లో చోటు లేదంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ మాథ్యూ హెడెన్.భారత్ నుంచి ఇద్దరు లెజెండ్స్ మాత్రమే ఈ టీమ్లో స్థానం సంపాదించడానికి అర్హులు అన్నట్లుగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ జట్టులో ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా నలుగురిని ఎంపిక చేసుకున్న ఈ కంగారూ బ్యాటర్.. పాకిస్తాన్ నుంచి ఇద్దరి చోటు ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లి శ్రీలంకతో వన్డే సిరీస్కు సిద్ధమవుతున్నాడు. గౌతం గంభీర్ గైడెన్స్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు.మాథ్యూ హెడెన్ ఎంచుకున్న గ్రేటెస్ట్ వన్డే వరల్డ్కప్ ఆల్టైమ్ ప్లేయింగ్ ఎలెవన్ఆడం గిల్క్రిస్ట్(ఆస్ట్రేలియా), వీరేంద్ర సెహ్వాగ్(ఇండియా), రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా- కెప్టెన్), సచిన్ టెండుల్కర్(ఇండియా), బ్రియన్ లారా(వెస్టిండీస్), జాక్వెస్ కలిస్(సౌతాఫ్రికా), వకాన్ యూనిస్(పాకిస్తాన్), వసీం అక్రం(పాకిస్తాన్), షేన్ వార్న్(ఆస్ట్రేలియా), ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక), గ్లెన్ మెగ్రాత్(ఆస్ట్రేలియా).చదవండి: SA20 2025: సౌతాఫ్రికా కెప్టెన్కు షాకిచ్చిన సన్రైజర్స్.. జట్టు నుంచి ఔట్ -
టీమిండియా కెప్టెన్గా అతడే సరైనోడు: సెహ్వాగ్
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది.జూలై 6, 7, 10, 13, 14వ తేదీల్లో హరారే వేదికగా జరుగనున్న ఈ సిరీస్కు టీమిండియా సీనియర్లంతా దూరంగా ఉండనున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి యువ ఓపెనర్ శుబ్మన్ గిల్కు సారథ్య బాధ్యతలు అప్పగించింది.రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ గైర్హాజరీ కారణంగా.. తొలిసారిగా ఈ పంజాబీ బ్యాటర్కు టీమిండియా కెప్టెన్గా వ్యవహరించే సువర్ణావకాశం లభించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.రోహిత్ శర్మ తర్వాత అతడేరోహిత్ శర్మ వారసుడిగా శుబ్మన్ గిల్ సరైన ఎంపిక అంటూ సెలక్షన్ కమిటీ నిర్ణయాన్ని సమర్థించాడు. ఈ మేరకు క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘శుబ్మన్ గిల్కు ఎంతో భవిష్యత్తు ఉంది.మూడు ఫార్మాట్లలోనూ అద్భుతంగా ఆడగల సత్తా అతడికి ఉంది. గతేడాది తనకు గొప్పగా గడిచింది. అయితే, దురదృష్టవశాత్తూ టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.సరైన నిర్ణయంనా అభిప్రాయం ప్రకారం.. గిల్ను కెప్టెన్ చేయడం సరైన నిర్ణయం. రోహిత్ శర్మ వెళ్లిన తర్వాత శుబ్మన్ గిల్ మాత్రమే కెప్టెన్సీకి పూర్తి న్యాయం చేయగలుగుతాడు’’ అని వీరేంద్ర సెహ్వాగ్ గిల్ నైపుణ్యాలపై తనకు నమ్మకం ఉందని పేర్కొన్నాడు.అదే విధంగా.. జింబాబ్వేతో సిరీస్కు అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, తుషార్ దేశ్పాండే, రియాన్ పరాగ్ వంటి ఐపీఎల్ హీరోలను ఎంపిక చేయడం పట్ల సెహ్వాగ్ స్పందించాడు. దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్ ద్వారా ఆటగాళ్లను ఎంపిక చేయడంలో తనకు తప్పేమీ కనిపించడం లేదన్నాడు.జింబాబ్వే టూర్కు టీమిండియాశుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ , తుషార్ దేశ్పాండే. -
నాకు నచ్చినవాళ్లను సెలక్ట్ చేస్తా అంటావా?: సెహ్వాగ్ ఫైర్
పాకిస్తాన్ చీఫ్ సెలక్టర్ వహాబ్ రియాజ్ తీరుపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శల వర్షం కురిపించాడు. జట్టు ఎంపిక విషయంలో తనకు నచ్చినట్లుగా వ్యవహరించి.. పాక్ భారీ మూల్యం చెల్లించేలా చేశాడని అభిప్రాయపడ్డాడు.అధికారం చేతుల్లో ఉంది కదా అని ఇష్టారీతిన ప్రవర్తిస్తే ఇలాంటి ఫలితాలే చూడాల్సి వస్తుందని ఘాటుగా విమర్శించాడు. గతంలో పాక్ జట్టును విమర్శించిన రియాజ్.. ఇప్పుడు తన పనితనాన్ని ఎలా సమర్థించుకుంటాడోనంటూ సెహ్వాగ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్ కనీసం సూపర్-8 కూడా చేరకుండానే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా జట్టు ఎంపిక విషయంలో ఫేవరెటిజం, బంధుప్రీతి చూపడం వల్లే కొంపమునిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ పాక్ చీఫ్ సెలక్టర్ వహాబ్ రియాజ్ తీరును తప్పుబట్టాడు. ‘‘వహాబ్ రియాజ్, మహ్మద్ ఆమిర్... ఇద్దరూ పాకిస్తాన్ జట్టును విమర్శించిన వాళ్లే.ఏ టీవీ చానెల్లో అయితే వీళ్లిద్దరూ ఈ పని చేశారో.. ఇప్పుడు అదే చానెల్లో వీళ్లను విమర్శిస్తున్నారు. ఆనాడు అలా మాట్లాడిన వాళ్లలో ఒకరు ఇప్పుడు చీఫ్ సెలక్టర్(రియాజ్).. మరొకరు తుదిజట్టులో చోటు దక్కించుకున్న ఆటగాడు(ఆమిర్).మహ్మద్ ఆమిర్ అప్పుడు నాతో ఉన్నాడు కాబట్టి.. అతడిని జట్టుకు ఎంపిక చేస్తాననుకోవడం సరైందేనా?! ఇప్పుడు అజిత్ అగార్కర్ టీమిండియా చీఫ్ సెలక్టర్గా ఉన్నాడు.కాబట్టి తను నా దగ్గరికి వచ్చి.. ‘వీరూ, జాక్(జహీర్ ఖాన్).. మీరిద్దరూ రండి. రీఎంట్రీ ఇచ్చేందుకు నేను అవకాశం కల్పిస్తా’ అంటే ఎలా ఉంటుంది. ఆమిర్ పట్ల రియాజ్ చేసింది కూడా ఇలాగే ఉంది’’ అని క్రిక్బజ్ షోలో సెహ్వాగ్ తీవ్ర విమర్శలు చేశాడు.కాగా 2020లో అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన మహ్మద్ ఆమిర్ టీ20 ప్రపంచకప్-2024కు ముందు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అనూహ్య రీతిలో అతడు వరల్డ్కప్ జట్టుకు కూడా ఎంపికయ్యాడు.ఇమాద్ వసీం సైతం ఇలాగే ఆఖరి నిమిషంలో ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో వీరి ఎంపికకు వహాబ్ రియాజే కారణమని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.కాగా మహ్మద్ ఆమిర్ వరల్డ్కప్-2024లో ఏడు వికెట్లు తీయగలిగాడు. అయితే, అమెరికాతో సూపర్లో పద్దెనిమిది పరుగులు సమర్పించుకుని పాక్ ఓటమికి కారణమయ్యాడు ఈ లెఫ్టార్మ్ పేస్ బౌలర్.చదవండి: కోట్లకు కోట్లు తీసుకుంటారు.. భార్యల్ని తీసుకెళ్లడం బాగా అలవాటైంది! -
అతడికి టీ20 జట్టులో ఉండే అర్హతే లేదు: సెహ్వాగ్
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఆట తీరును టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర స్థాయిలో విమర్శించాడు. అసలు అతడికి టీ20 జట్టులో ఉండే అర్హతే లేదని అభిప్రాయపడ్డాడు.టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్ సూపర్-8కు కూడా అర్హత సాధించకుండానే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. గత ప్రపంచకప్ టోర్నీ(2022)లో రన్నరప్గా నిలిచిన బాబర్ బృందం.. ఈసారి చెత్త ప్రదర్శనతో లీగ్ దశలోనే నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీ, బ్యాటింగ్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే అతడిని కెప్టెన్గా తొలగించాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.టాపార్డర్లో సిక్సర్లు బాదే ఆటగాళ్లు ఉండాలిబాబర్ ఆజం టీ20 ఫార్మాట్కు తగడని.. అతడికి జట్టులో చోటే అనవసరం అని పేర్కొన్నాడు. క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘టాపార్డర్లో సిక్సర్లు బాదే ఆటగాళ్లు ఉండాలి. బాబర్ ఆజం అలాంటి ప్లేయర్ కాదు.కేవలం స్పిన్నర్ల బౌలింగ్లోనే అతడు హిట్టింగ్ ఆడగలడు. ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్లో అతడు ఇలాంటి సాహసం చేయడం నేనెప్పుడూ చూడలేదు.అతడు ఆచితూచి నెమ్మదిగా ఆడటమే మనకు కనబడుతుంది. బాబర్ పరుగులు సాధిస్తున్న మాట నిజమే. కానీ అతడి స్ట్రైక్రేటును కూడా గమనించాలి కదా!అసలు టీ20 జట్టులో ఉండే అర్హతే అతడికి లేదునాయకుడిగా ఉన్నపుడు మన ఆట వల్ల జట్టుకు ప్రయోజనం కలుగుతుందా లేదో చూసుకోవాలి. అవసరమైతే బ్యాటింగ్ ఆర్డర్లో డిమోట్ అయి.. తన స్థానాన్ని హిట్టింగ్ ఆడగల ప్లేయర్ల కోసం త్యాగం చేయగలగాలి.ఒకవేళ అతడు గనుక కెప్టెన్ కాకపోయి ఉంటే.. అసలు టీ20 జట్టులో ఉండే అర్హతే అతడికి లేదు. నేను కఠినంగా మాట్లాడుతున్నానని మీకు అనిపించవచ్చు.. కానీ ఇదే నిజం. ఎందుకంటే నేటి టీ20 క్రికెట్ ప్రమాణాలకు తగ్గట్లు అతడి ఆట లేనేలేదు’’ అని సెహ్వాగ్ నిక్కచ్చిగా తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.కాగా టీ20 ప్రపంచకప్ తాజా ఎడిషన్లో ఆడిన నాలుగు మ్యాచ్లలో కలిపి బాబర్ ఆజం 122 పరుగులు చేశాడు. అయితే అతడి స్ట్రైక్రేటు మాత్రం కేవలం 101.66 కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. గ్రూప్-ఏ నుంచి టీమిండియాతో పాటు అమెరికా సూపర్-8కు చేరగా.. పాక్, కెనడా, ఐర్లాండ్ ఇంటిబాట పట్టాయి.చదవండి: T20 WC: కెప్టెన్సీకి గుడ్ బై?.. బాబర్ ఆజం ఘాటు స్పందన -
సెహ్వాగా?.. అతడెవరు? షకీబ్ అల్ హసన్ కామెంట్స్ వైరల్
బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అసలు సెహ్వాగ్ ఎవరో తనకు తెలియదంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 ఆడే బంగ్లాదేశ్ జట్టుకు ఎంపికైన షకీబ్ అల్ హసన్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అరుదైన రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్ వరల్డ్కప్ కప్ ఆరంభ ఎడిషన్ నుంచి ఇప్పటిదాకా కొనసాగిన ఆటగాడిగా రోహిత్తో పాటు అతడు నిలిచాడు.అయితే, గ్రూప్ దశలోని తొలి రెండు మ్యాచ్లలో ఈ వెటరన్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. శ్రీలంక, సౌతాఫ్రికా మ్యాచ్లలో వరుసగా ఎనిమిది, మూడు పరుగులు చేసిన షకీబ్.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.ముఖ్యంగా సౌతాఫ్రికాతో మ్యాచ్లో అతడు అవుటైన తీరు విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. అనవసర షాట్లకు అవుట్ కావడం ఏమిటని, ఎప్పుడో రిటైర్ అవ్వాల్సిన క్రికెటర్ ఇంకా ఆడితే ఇలాగే ఉంటుందని విమర్శించాడు.అంతేకాకుండా నువ్వేమీ మాథ్యూ హెడ్న్, ఆడం గిల్క్రిస్ట్ కాదని.. జస్ట్ బంగ్లాదేశ్ ప్లేయర్వి అని వీరూ భాయ్ షకీబ్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే, తాజాగా నెదర్లాండ్స్తో మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలుపొంది సూపర్-8కు చేరువైంది.ఈ విజయంలో షకీబ్ అల్ హసన్ కీలక పాత్ర పోషించాడు. 46 బంతుల్లో 64 పరుగులతో రాణించి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. కీలక సమయంలో రాణించి.. జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా సెహ్వాగ్ విమర్శల గురించి ఓ జర్నలిస్టు ప్రశ్నించగా.. ‘‘సెహ్వాగ్? అతడెవరు?’’ అంటూ షకీబ్ అల్ హసన్ ఎదురు ప్రశ్నించాడు. ‘‘విమర్శకులు చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం ఆటగాళ్లకు లేదు.జట్టుకు ఏ విధంగా ఉపయోగపడగలం అని మాత్రమే మనం ఆలోచించాలి. అలా ఆలోచించని వాళ్లే అనవసరపు విషయాల గురించి పట్టించుకుంటారు.బ్యాటర్ బ్యాటింగ్ గురించి.. బౌలర్ బౌలింగ్ గురించి.. ఫీల్డింగ్ చేసే సమయంలో క్యాచ్లు లేదంటే పరుగులు సేవ్ చేయడం గురించి మాత్రమే ఆలోచిస్తారు. అంతేగానీ ఇలాంటి వాటికి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఆటగాళ్లకు ఏమాత్రం ఉండదు’’ అని షకీబ్ అల్ హసన్ సెహ్వాగ్ను ఉద్దేశించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.చదవండి: అందరికీ పది నిమిషాలు.. అతడికి ఇరవై: పాక్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలుShakib Al Hasan, the most arrogant cricketer in the his history.Journalist: There has been lot of discussions about your performance especially criticize by Virendra Sehwag"Shakib: Who is Sehwag?pic.twitter.com/wtqlGrdeX3— Farrago Abdullah Parody (@abdullah_0mar) June 14, 2024 -
నువ్వేమీ హెడెన్ కాదు.. జస్ట్ బంగ్లాదేశ్ ప్లేయర్వి: సెహ్వాగ్
‘‘అనుభవమే ప్రాతిపదికగా అతడిని జట్టులోకి తీసుకుని ఉంటే మాత్రం.. అతడు అందుకు ఏమాత్రం న్యాయం చేయడం లేదు. కనీసం కొంతసేపైనా క్రీజులో నిలబడాలి కదా.షార్ట్ బాల్ను కూడా పుల్ షాట్ ఆడటానికి నువ్వేమీ మాథ్యూ హెడెన్వో లేదంటే ఆడం గిల్క్రిస్ట్వో కాదు. కేవలం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆటగాడివి అంతే. నీ స్థాయి, ప్రమాణాలకు తగ్గట్లు ఆడాలి.హుక్ లేదంటే పుల్ షాట్ ఆడే నైపుణ్యం నీకు లేనట్లయితే.. నీకు తెలిసిన షాట్లు మాత్రమే ఆడవచ్చు కదా!’’ అంటూ బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు.టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్లో షకీబ్ పూర్తిగా విఫలం కావడంతో ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా గ్రూప్-డిలో భాగమైన బంగ్లాదేశ్ సోమవారం నాటి మ్యాచ్లో ప్రొటిస్ జట్టు చేతిలో ఓటమిపాలైంది.ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో గెలుపునకు దూరమైంది. న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసి 113 పరుగులు చేసింది.స్వల్ప లక్ష్య ఛేదనలో బంగ్లా ఆది నుంచే తడబడింది. టాపార్డర్ చేతులెత్తేయగా.. నాలుగో స్థానంలో వచ్చిన షకీబ్ అల్ హసన్ కేవలం మూడు పరుగులే చేశాడు. అనవసరపు షాట్కు యత్నించి అన్రిచ్ నోర్జే బౌలింగ్లో ఐడెన్ మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.జట్టులో సీనియర్ ఆటగాడైన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ఇలా పూర్తిగా నిరాశపరచడంతో సెహ్వాగ్ పైవిధంగా స్పందించాడు. ఆస్ట్రేలియా దిగ్గజాలు మాథ్యూ హెడెన్, ఆడం గిల్క్రిస్ట్ల పేర్లు ప్రస్తావిస్తూ విమర్శించాడు. తెలిసిన షాట్లు మాత్రమే ఆడుతూ తెలివిగా వ్యవహరించే బాగుండి ఉండేదని క్రిక్బజ్ షోలో షకీబ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.కాగా ఈ మ్యాచ్లో షకీబ్ అల్ హసన్ ఒక ఓవర్ బౌలింగ్ చేసి ఆరు పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టీ20 ప్రపంచకప్ మొదటి ఎడిషన్(2007) నుంచి ఇప్పటిదాకా ఈ మెగా టోర్నీలో ఆడుతున్న ప్లేయర్ షకీబ్ అల్ హసన్ మాత్రమే! ఇదిలా ఉంటే.. వరల్డ్కప్-2024 గ్రూప్-డిలో ఉన్న బంగ్లాదేశ్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు ఆడి.. ఒకటి మాత్రమే గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు.. బంగ్లాపై విజయంతో మూడో గెలుపు నమోదు చేసిన సౌతాఫ్రికా సూపర్-8లో అడుగుపెట్టింది.చదవండి: SA vs Ban: నరాలు తెగే ఉత్కంఠ: ఆ క్యాచ్ గనుక వదిలేసి ఉంటే.. -
MI: రోహిత్, హార్దిక్ వద్దు.. వాళ్లిద్దరినే రిటైన్ చేసుకోండి: సెహ్వాగ్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ‘స్టార్’ క్రికెటర్ల ఆట తీరుపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. వచ్చే ఏడాది వేలంలో సోకాల్డ్ ‘స్టార్ల’ను వదిలేయాలని మేనేజ్మెంట్కు సూచించాడు.కాగా ముంబై ఇండియన్స్లో స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, టీ20 వరల్డ్ నంబర్ వన్ స్టార్ సూర్యకుమార్ యాదవ్తో పాటు యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ తదితరులు ఉన్నారు.ఇక రోహిత్ శర్మ ఈ జట్టుకు ఐదుసార్లు ట్రోఫీ అందించినా.. ఐపీఎల్-2024 సీజన్లో కెప్టెన్గా అతడిని తప్పించింది యాజమాన్యం. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న పాండ్యాకు పగ్గాలు అప్పగించింది.రెండు వర్గాలుగా విడిపోయిన జట్టు?ఈ నేపథ్యంలో వేదనకు గురైన రోహిత్ శర్మతో పాటు బుమ్రా, సూర్య తదితరులు ఒక బృందంగా.. పాండ్యా, ఇషాన్లతో కూడిన మరికొందరు మరో బృందంగా ఏర్పడ్డారని.. జట్టులో విభేదాలు తారస్థాయికి చేరాయనే వార్తలు వినిపిస్తున్నాయి.జట్టు ప్రదర్శనపై ఇది ప్రభావం చూపిందని.. అందుకే ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై నిలిచిందనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ ఎడిషన్ లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్లో భాగంగా ముంబై శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది.ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ ముంబై మేనేజ్మెంట్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. 2025 వేలానికి ముందే రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్లను వదిలేయాలని సూచించాడు.షారుఖ్, సల్మాన్, ఆమిర్ ఉంటే సరిపోదుఇందుకు సినిమాను ఉదాహరణగా ప్రస్తావిస్తూ ఈ మేరకు ‘‘షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ కలిసి ఒకే సినిమాలో నటించినా.. అది హిట్టవుతుందనే గ్యారెంటీ లేదు. సినిమాలో స్టార్లు ఉన్నంత మాత్రాన సరిపోదు.మంచి స్క్రిప్టు ఉండాలి. అందరూ బాగా నటించగలగాలి. ఇలా ఇంకెన్నో అంశాలు కలిసిరావాలి. అలాగే జట్టులో పేరున్న ఆటగాళ్లు ఉన్నంత మాత్రాన సరిపోదు.అసలు రోహిత్ శర్మ ఏం చేశాడు?మైదానంలో వాళ్లు సరిగ్గా ఆడితేనే అనుకున్న ఫలితాలు వస్తాయి. రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్లో సెంచరీ చేశాడు. కానీ ఆ మ్యాచ్లో ముంబై ఓడిపోయింది. మరి మిగతా మ్యాచ్లలో అతడి ప్రదర్శన మాటేమిటి?ఇక ఇషాన్ కిషన్.. ఈ సీజన్ మొత్తంలో ఒక్కసారి కూడా కనీసం పవర్ ప్లే ముగిసే వరకైనా ఉన్నాడా?.. నా దృష్టిలో ముంబై ఇండియన్స్ కేవలం జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్లనే నమ్ముకోవాలిక! వీళ్లిద్దరిని మాత్రమే రిటైన్ చేసుకోవాలివచ్చే సీజన్ కోసం వీళ్లిద్దరిని మాత్రమే రిటైన్ చేసుకుంటే బాగుంటుంది. మిగతా వాళ్లు అసలు అవసరమే లేదు’’ అని సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఈ సీజన్లో ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ 349, ఇషాన్ కిషన్ 306 పరుగులు చేశారు. మరోవైపు గాయం కారణంగా ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ 345 పరుగులు సాధించాడు. ఇక బుమ్రా 20 వికెట్లు తీయగా.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 11 వికెట్లు తీయడంతో పాటు 200 పరుగులు చేశాడు. చదవండి: Kavya Maran- SRH: కేన్ మామను హత్తుకున్న కావ్యా.. వీడియో వైరల్అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్ను అంటారా?.. గంభీర్ ఫైర్ -
కోహ్లి కాదు!.. అతడు 50 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడగలడు!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు గత కొంతకాలంగా పొట్టి ఫార్మాట్లో ఏదీ కలిసి రావడం లేదు. టీ20 ప్రపంచకప్-2022 సెమీస్లోనే భారత జట్టు నిష్క్రమించిన తర్వాత.. సుదీర్ఘకాలం అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉన్నాడు హిట్మ్యాన్.ప్లే ఆఫ్స్ చేర్చినాగతేడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బరిలోకి దిగిన రోహిత్ బ్యాటర్గా స్థాయికి తగ్గట్లు రాణించలేదు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ 16 మ్యాచ్లలో కలిపి 332 పరుగులు మాత్రమే చేశాడు. ఇక జట్టును ప్లే ఆఫ్స్ చేర్చి సారథిగా సఫలమైనా.. ముంబై ఫ్రాంఛైజీ అతడిపై ఈసారి వేటు వేసింది.గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించింది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన రోహిత్ శర్మ వచ్చే ఏడాది ఫ్రాంఛైజీని వీడేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఫోకస్ చేయలేకఇక పాండ్యా ప్రవర్తనతో విసిగిపోయిన రోహిత్ బ్యాటింగ్పై కూడా ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతున్నాడని గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. ఐపీఎల్-2024లో ఇప్పటి దాకా 13 మ్యాచ్లు ఆడి 349 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ తర్వాత టీమిండియా జూన్ 1నుంచి మొదలుకానున్న ప్రపంచకప్-2024కు సన్నద్ధంకానుంది. ఇందుకోసం ఇప్పటికే రోహిత్ శర్మ సారథ్యంలో బీసీసీఐ 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది.అయితే, ఈ మెగా టోర్నీ తర్వాత 37 ఏళ్ల రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలకనున్నట్లు సమాచారం. వయసు, ఫిట్నెస్ రీత్యా రెండు ఫార్మాట్లకు కూడా గుడ్బై చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది నిజం కాదుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ రోహిత్ శర్మ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. "అసలు వయసు గురించి ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు.40, 42.. 45 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్తో ఉండి.. బాగా ఆడుతుంటే.. ఆ ఆటగాడి రిటైర్మెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మన దేశంలో చాలా మంది 40 ఏళ్ల వయసు వచ్చిందంటే.. పిల్లల పెంపకం గురించి ఆలోచిస్తూ కాలం గడిపేయాలనే ఆలోచనతో ఉంటారు. వయసు అయిపోయిందని.. ఆటకు పనికిరామని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. 50 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడగలడుటీమిండియా తొలిసారి వరల్డ్ కప్ గెలిచినపుడు మొహిందర్ అమర్నాథ్ వయసు 38 ఏళ్లు. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతడే. అసలు ఏజ్ గురించి టీమిండియాలో చర్చ అనవసరం అంటాను.రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్ వంటి గొప్ప ప్లేయర్లు ఫిట్నెస్ గురించి పెద్దగా అవసరం లేదు. ఒకవేళ రోహిత్ ఆడాలనుకుంటే 50 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడగలడు" అని యోగ్రాజ్ సింగ్ అని స్పోర్ట్స్18తో చెప్పుకొచ్చాడు.కాగా ఫిట్నెస్కు మారుపేరైన విరాట్ కోహ్లి కెరీర్ సుదీర్ఘకాలం కొనసాగించగలడన్న విశ్లేషణల నేపథ్యంలో అతడి పేరు ఎత్తకుండా యోగ్రాజ్ కేవలం రోహిత్, వీరూ పేర్లు చెప్పడం విశేషం.చదవండి: T20 WC: హార్దిక్ను సెలక్ట్ చేయడం రోహిత్కు ఇష్టం లేదు.. కానీ! -
రూ. 400 కోట్ల లాభం వస్తోంది.. చాలదా?: సెహ్వాగ్ కామెంట్స్ వైరల్
ఐపీఎల్ ఫ్రాంఛైజీ యజమానులను ఉద్దేశించి టీమిండియా మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లు, కోచ్లే జట్టును ముందుకు నడిపిస్తారని.. ఈ విషయంలో ఓనర్ల జోక్యం అనవసమా అంటూ ఘాటుగా విమర్శించాడు.వ్యాపారవేత్తలు కేవలం లాభనష్టాల గురించే ఆలోచిస్తారని.. అయితే, మైదానంలోనే ఆటగాళ్లను కించపరిచేలా వ్యవహరించడం సరికాదని హితవు పలికాడు. లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన నేపథ్యంలో సెహ్వాగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో కేఎల రాహుల్ కెప్టెన్గా, బ్యాటర్గా విఫలమయ్యాడు. ఫలితంగా రైజర్స్ చేతిలో లక్నో చిత్తుగా ఓడిపోయింది. ఈ క్రమంలో సంజీవ్ గోయెంకా మైదానంలోనే రాహుల్తో వాదనకు దిగాడు.అతడు సర్దిచెప్తున్నా వినిపించుకోకుండా ఆగ్రహం ప్రదర్శించాడు. అదే విధంగా కోచ్ జస్టిన్ లాంగర్ పట్ల కూడా ఇదే తరహాలో వ్యవహరించాడు గోయెంకా. ఈ విషయంపై స్పందించిన సెహ్వాగ్ క్రిక్బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.‘‘డ్రెస్సింగ్ రూం లేదంటే ప్రెస్ మీట్ సమయంలోనే ఓనర్లు ఆటగాళ్లతో మాట్లాడాలి. అది కూడా వాళ్లలో స్ఫూర్తి నింపేలా వ్యవహరించాలి గానీ.. ‘‘సమస్య ఏంటి? ఏం జరుగుతోంది?’’ అంటూ మైదానంలోనే ఇలా వ్యవహరించకూడదు.కోచ్లు, కెప్టెన్ జట్టును నడిపిస్తారు. కాబట్టి ఓనర్లు ఆటగాళ్ల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే బెటర్. వాళ్లంతా వ్యాపారవేత్తలు. వాళ్లకు కేవలం లాభం, నష్టం గురించి మాత్రమే తెలుసు.అయినా ఇక్కడ వారికి ఎలాంటి లాస్ లేదు. 400 కోట్ల రూపాయల వరకు లాభం ఆర్జిస్తున్నారు. అంటే.. ఇక్కడ వాళ్లకు నష్టమేమీ ఉండదు కదా అని అంటున్నా! లాభాలు తీసుకోవడం తప్ప జట్టులో ఏం జరిగినా పట్టించుకునే అవసరం పెద్దగా లేదనే అనుకుంటున్నా. మీరేమైనా చెప్పాలనుకుంటే ఆటగాళ్లను మోటివేట్ చేసేలా ఉండాలి.ఐపీఎల్లో చాలా ఫ్రాంఛైజీలు ఉన్నాయి. ఆటగాడు ఓ జట్టును వీడితే మరో జట్టు అతడిని తీసుకుంటుంది. కీలకమైన ఆటగాడిని కోల్పోతే మీ విజయాల శాతం సున్నా అవుతుంది. నేను పంజాబ్ జట్టును వీడినపుడు వాళ్లు ఐదో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడూ కనీసం ఐదో స్థానంతో ముగించలేకపోయారు’’ అని సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. -
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఐపీఎల్ ఫ్రాంఛైజీ పంజాబ్ కింగ్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఇటీవల సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. తమ జట్టుకు సంబంధించి అభిమానులు వేస్తున్న ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇస్తూ వారిని ఖుషీ చేస్తున్నారు.ఈ క్రమంలో ఓ నెటిజన్.. ‘‘పంజాబ్ కింగ్స్లో మీకిష్టమైన ఆటగాడు ఎవరు?’’ అని ప్రశ్నించారు. ఇందుకు సమాధానంగా.. ప్రీతి జింటా వీరేంద్ర సెహ్వాగ్, ఆడం గిల్క్రిస్ట్ పేర్లను చెప్పారు.ఈ మేరకు.. ‘‘డేంజరస్ వీరూగా ఉన్నందుకు వీరేంద్ర సెహ్వాగ్’’ అంటూ హార్ట్ సింబల్ జత చేసిన ప్రీతి జింటా.. ఆడం గిల్క్రిస్ట్ అంటే కూడా తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. నాయకుడిగా, ఆటగాడిగా అతడు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.కాగా 2014, 2015 సీజన్లలో పంజాబ్ జట్టు తరఫున టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ దుమ్ములేపాడు. 30 మ్యాచ్లలో కలిపి 660 పరుగులు సాధించాడు. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్తో క్వాలిఫయర్ మ్యాచ్లో అతడు 122 పరుగులు సాధించడం హైలైట్గా నిలిచింది.ఇక ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఆడం గిల్క్రిస్ట్ సైతం 2011- 2103 మధ్య పంజాబ్కు ప్రాతినిథ్యం వహించాడు. 34 మ్యాచ్లలో కలిపి 849 రన్స్ చేశాడు. నిలకడైన ఫామ్తో జట్టుకు విజయాలు అందించాడు. కెప్టెన్గానూ రాణించాడు.గిల్క్రిస్ట్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ 2011లో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. 2012, 2013లో ఆరో స్థానం సంపాదించింది.ఇక ఫేవరెట్ ప్లేయర్ ప్రశ్న తర్వాత.. ‘‘పంజాబ్ కింగ్స్ జట్టు కోసం మీరింకా ఆలూ పరాఠాలు చేస్తున్నారా?’’ అని ఓ నెటిజన్ అడిగారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘లేదు.. అప్పట్లో సౌతాఫ్రికాలో ఓసారి మా జట్టు గెలిచిన తర్వాత పరాఠాలు చేసిచ్చాను. ఆ తర్వాత అలాంటివేమీ చేయలేదు’’ అని ప్రీతి జింటా పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ మరోసారి పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరుస్తోంది. ఇప్పటి వరకు ఆడిన పదకొండు మ్యాచ్లలో కేవలం నాలుగు గెలిచి పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో తాను జట్టు ప్రదర్శన పట్ల సంతోషంగా లేనంటూ ప్రీతి జింటా ఇటీవల పేర్కొన్నారు. ఇక పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదన్న విషయం తెలిసిందే. కాగా టీమిండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ గతంలో పంజాబ్ జట్టుకు ఆడాడు. అదే విధంగా.. శిఖర్ ధావన్ ప్రస్తుతం కెప్టెన్గా ఉన్నాడు. అయితే, గాయం కారణంగా అతడు మ్యాచ్లకు దూరం కాగా సామ్ కరన్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. -
మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అనుసరించిన వ్యూహాలను భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తప్పుబట్టాడు. హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్ మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా అంటూ మేనేజ్మెంట్కు చురకలు అంటించాడు.ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా కేకేఆర్తో తలపడిన ముంబై ఓడిపోయిన విషయం తెలిసిందే. సొంత మైదానంలో 24 పరుగుల తేడాతో ఓటమి ఈ సీజన్లో ఎనిమిదో పరాజయాన్ని నమోదు చేసింది.ఛేదనలో తడ‘బ్యా’టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై.. కేకేఆర్ను 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్ చేసి ఫర్వాలేదనిపించింది. కానీ లక్ష్య ఛేదనలో మాత్రం తడ‘బ్యాటు’కు గురైంది. 18.5 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది.టాపార్డర్ మొత్తం చేతులెత్తేయగా.. మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 56) ఒక్కడే రాణించాడు. మిగిలిన వాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.ఇలాంటి తరుణంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా(1) ఏడు, టిమ్ డేవిడ్(24) ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. తర్వాత టెయిలెండర్లు పెవిలియన్కు క్యూ కట్టడంతో ముంబై కథ ముగిసింది.మరీ అంత చెత్తగా ఆడతారా?ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్ను ఎందుకు దాచిపెట్టిందో తెలియదు. అలా చేయడం వల్ల మీకు ఏం ప్రయోజనం చేకూరింది?ఇంకా బంతులు మిగిలే ఉన్నాయి. జట్టు మొత్తం ఆలౌట్ అయింది. నిజానికి హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్లను ఇంకాస్త ముందుగా బ్యాటింగ్కు పంపాల్సింది.కానీ ఛేజ్ చేస్తున్న సమయంలో వరుసగా వికెట్లు పడుతున్నా హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్లను ఏడు, ఎనిమిదో స్థానాల్లో ఎందుకు ఆడించారో అర్థం కాలేదు.లోయర్ ఆర్డర్లో వీళ్లు ఇంకాస్త ముందుగా వస్తే మరీ అంత చెత్తగా ఆడతారని అనుకున్నారా?’’ అని ముంబై మేనేజ్మెంట్ను ప్రశ్నించాడు. గుజరాత్ టైటాన్స్తో ఉన్నపుడు పాండ్యా నాలుగో స్థానంలో నిలకడగా రాణించిన విషయాన్ని సెహ్వాగ్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు.చదవండి: T20 WC: హార్దిక్ బదులు అతడిని సెలక్ట్ చేయాల్సింది: పాక్ దిగ్గజం -
T20 WC: సచినే ఓపెనర్గా రాలేదు.. నువ్వెందుకు కోహ్లి?
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలో ఆడటానికైనా సిద్ధంగా ఉండాలని సూచించాడు. అంతటి సచిన్ టెండుల్కరే 2007 వరల్డ్కప్ టోర్నీలో మిడిలార్డర్లో బ్యాటింగ్ చేశాడని సెహ్వాగ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఓపెనింగ్ జోడీ గురించి మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.మూడో స్థానంలో ఆడిస్తాను‘‘నాకు గనుక అవకాశం ఉంటే.. అతడి(కోహ్లి)ని ఓపెనింగ్కు పంపించను. అతడిని మూడో స్థానంలో ఆడిస్తాను. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా నా ఆప్షన్. కోహ్లి వన్డౌన్లోనే రావాలి.మిడిల్ ఓవర్లలో ఎలా ఆడాలి అనేది అతడి తలనొప్పి. ఒకవేళ ఆరంభంలోనే వికెట్ పడితే కోహ్లి బ్యాటింగ్కు వస్తాడు. కాబట్టి పవర్ ప్లేలో తను ఇన్నింగ్స్ చక్కదిద్దగలడు.ఒకవేళ వికెట్ తొందరగా పడకపోతే.. ఎలా ఆడాలో కెప్టెన్, కోచ్ల సూచనలకు అనుగుణంగా అతడు ఆడాలి. జట్టులో ఒక ఆటగాడిగా అతడు తప్పక ఇది చేయాల్సిందే’’ అని క్రిక్బజ్ షోలో అతడు వ్యాఖ్యానించాడు.మిడిలార్డర్లో ఆడటం సచిన్కు అస్సలు ఇష్టం లేదుఇందుకు ఉదాహరణగా సచిన్ టెండుల్కర్ పేరును ప్రస్తావించిన సెహ్వాగ్.. ‘‘2007 ప్రపంచకప్ టోర్నీలో సచిన్ టెండుల్కర్ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేశాడు. నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేశాడు.మిడిలార్డర్లో ఆడటం సచిన్కు అస్సలు ఇష్టం లేదు. అయినా.. జట్టు ప్రయోజనాల కోసం ఒప్పుకొన్నాడు. మీ జట్టులో ఇద్దరు మంచి ఓపెనర్లు ఉండి.. నిన్ను(కోహ్లిని ఉద్దేశించి) మూడో స్థానంలో ఆడమన్నపుడు.. కచ్చితంగా అలాగే చేయాలి.ఓపెనర్లు సెట్ చేసిన మూమెంటమ్ను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత వన్డౌన్ బ్యాటర్కు ఉంటుంది. నాకు తెలిసి ఈ విషయంలో విరాట్ కోహ్లికి ఎలాంటి అభ్యంతరం ఉండదనే అనుకుంటున్నా’’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.ఓపెనర్లుగా వాళ్లేకాగా ఈసారి పొట్టి ప్రపంచకప్ ఈవెంట్లో కోహ్లి రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడిగా దిగనున్నాడని.. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ లేదంటే.. శుబ్మన్ గిల్పై వేటు పడనుందన్న వార్తల నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా జూన్ 5న వరల్డ్కప్లో ఐర్లాండ్తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
నేనే కోచ్ అయివుంటే.. అతడికి జట్టులో నో ఛాన్స్: సెహ్వాగ్
ఐపీఎల్-2024లో టీమిండియా వెటరన్, రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన అశ్విన్ కేవలం రెండు వికెట్లు మాత్రమే సాధించాడు. వికెట్లు విషయం పక్కన పెడితే తన బౌలింగ్లో భారీగా పరుగులు కూడా సమర్పించుకుంటున్నాడు.8 మ్యాచ్ల్లో 9.00 ఏకానమీతో 278 పరుగులిచ్చాడు. ఈ క్రమంలో అశ్విన్పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శల వర్షం కురిపించాడు. తనే రాజస్తాన్ కోచ్గా గానీ మెంటార్ ఉండి ఉంటే అశ్విన్కు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు ఇచ్చేవాడిని కాదని సెహ్వాగ్ మండిపడ్డాడు."అశ్విన్ వైట్బాల్ క్రికెట్కు సెట్ కాడు. అశ్విన్కు మిడిల్ ఓవర్లలలో వికెట్లు తీసే సత్తా లేదు. గతంలో ఓసారి కేఎల్ రాహుల్ తన స్ట్రైక్ రేట్ గురించి ఎవరు ఏమనుకున్న పట్టించుకోని వ్యాఖ్యనించాడు. ఇప్పుడు అదే తరహాలో అశ్విన్ కూడా వికెట్లు తీయకపోతేనేం బాగానే బౌలింగ్ చేస్తున్నా కాదా అన్నట్లు మాట్లాడుతున్నాడు. అశ్విన్ ఈ ఏడాది సీజన్లో ఇదే ప్రదర్శన కొనసాగిస్తే.. వచ్చే ఏడాది మెగా వేలంలో కచ్చితంగా అమ్ముడుపోడు. ఏ జట్టు అయినా బౌలర్ను సొంతం చేసుకున్నప్పుడు అతడి నుంచి వికెట్లు ఆశిస్తోంది. అంతేతప్ప 4 ఓవర్లలో 25 నుంచి 30 పరుగులు ఇస్తే చాలు అని ఏ జట్టు అనుకోదు . రెండు లేదా మూడుసార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలవాలని ఏ ప్రాంఛైజీనా భావిస్తోంది. అతడి సహచరలు చాహల్, కుల్దీప్ యాదవ్ ఈ ఏడాది సీజన్లో అద్బుతంగా రాణిస్తున్నాడు. అశ్విన్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తే బ్యాటర్లు టార్గెట్ చేస్తారని, క్యారమ్ బాల్స్ వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే అతడికి వికెట్లు పడడం లేదు. అతడు తన ఆఫ్ స్పిన్ను నమ్ముకుంటే వికెట్లు పడే ఛాన్స్ ఉంది. కానీ నేను రాజస్తాన్ ఫ్రాంచైజీకి మెంటార్ లేదా కోచ్గా ఉండి ఉంటే అతడి తుది జట్టులో చోటు దక్కేది కాదని క్రిక్ బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. -
అప్పుడు సెహ్వాగ్కు ఏడేళ్లు.. ఆర్తికి ఐదేళ్లు.. 20 ఏళ్ల పెళ్లి బంధం! (ఫొటోలు)
-
IPL: సెహ్వాగ్ రికార్డు బ్రేక్ చేసిన స్టొయినిస్..
లక్నో సూపర్ జెయింట్స్ ఆల్రౌండర్ మార్కస్ స్టొయినిస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో అజేయ శతకంతో చెలరేగిన 34 ఏళ్ల ఈ ఆసీస్ స్టార్.. పదేళ్లుగా వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు.ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై- లక్నో మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ సేన విజయం సాధించింది. సొంతమైదానంలోనే చెన్నైని ఆరు వికెట్ల తేడాతో ఓడించి సత్తా చాటింది. లక్నో గెలుపులో స్టొయినిస్దే కీలక పాత్ర.Have a look at those emotions 🥳The Lucknow Super Giants make it 2/2 this season against #CSK 👏👏Scorecard ▶️ https://t.co/MWcsF5FGoc#TATAIPL | #CSKvLSG | @LucknowIPL pic.twitter.com/khDHwXXJoF— IndianPremierLeague (@IPL) April 23, 2024సీఎస్కే విధించిన 211 లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఆరంభంలోనే ఓపెనర్లు క్వింటన్ డికాక్(0), కేఎల్ రాహుల్(16) వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. తానున్నానంటూ స్టొయినిస్ బ్యాటెత్తాడు.మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అతడు 26 బంతుల్లోనే అర్ధ శతకం, 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 63 బంతులు ఎదుర్కొని 124 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక స్టొయినిస్ ఇన్నింగ్స్లో ఏకంగా 13 ఫోర్లు, 6 సిక్స్లు ఉండటం విశేషం.Maiden #TATAIPL century ✅Highest T20 chase at Chepauk ✅Double over #CSK ✅Highest individual score in an IPL chase ✅#CSKvLSG #TATAIPL #IPLonJioCinema #MarcusStoinis pic.twitter.com/imjZQcLXa7— JioCinema (@JioCinema) April 23, 2024కాగా ఐపీఎల్ 17 ఏళ్ల చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్పై నమోదైన వ్యక్తిగత స్కోరు స్టొయినిస్దే. అంతకు ముందు 2014లో వీరేంద్ర సెహ్వాగ్ చెన్నై మీద 122 పరుగులు సాధించాడు. నాడు పంజాబ్ కింగ్స్ తరఫున ముంబైలోని వాంఖడే వేదికగా క్వాలిఫయర్-2 మ్యాచ్లో సెహ్వాగ్ ఈ మేరకు పరుగులు రాబట్టాడు.అయితే, చెపాక్ వేదికగా మంగళవారం నాటి మ్యాచ్లో స్టొయినిస్.. సెహ్వాగ్ పేరిట ఉన్న ఈ అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు. అంతేకాదు.. నికోలస్ పూరన్(34), దీపక్ హుడా(6 బంతుల్లో 17 నాటౌట్)తో కలిసి లక్నోను విజయతీరాలకు చేర్చి మరో రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ రన్ ఛేజింగ్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు(124*) సాధించిన ఆటగాడిగా స్టొయినిస్ చరిత్రకెక్కాడు. చదవండి: CSK vs LSG: అతడు అద్భుతం.. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం: గైక్వాడ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రోహిత్ కూడా విఫలం.. ట్రోఫీ గెలవలేదు కదా!
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. క్లిష్ట పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో ఆ జట్టుకు తెలుసునని.. అయితే, సమిష్టిగా రాణిస్తేనే అది సాధ్యపడుతుందని పేర్కొన్నాడు. అదే విధంగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఆర్డర్లో తనను తాను ప్రమోట్ చేసుకుంటే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని సూచించాడు. అతడు గనుక బ్యాట్ ఝులిపించగలిగితే ఆత్మవిశ్వాసం పెరిగి.. బౌలర్గా, కెప్టెన్గానూ రాణించగలడని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.కాగా ఐపీఎల్-2024లో రోహిత్ శర్మపై వేటు వేసిన ముంబై ఇండియన్స్.. గుజరాత్ టైటాన్స్ నుంచి వచ్చిన హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, ఒత్తిడిలో చిత్తవుతున్న హార్దిక్ సారథ్యంలో తొలి మూడు మ్యాచ్లలో ముంబై ఓడింది.ఆ తర్వాత గెలుపుబాట పట్టినా నిలకడ ఉండటం లేదు. రాజస్తాన్ రాయల్స్తో సోమవారం నాటి మ్యాచ్లోనూ పరాజయం పాలై ఎనిమిదింట ఐదో ఓటమిని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ, వ్యక్తిగత ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ హార్దిక్ పాండ్యాకు అండగా నిలిచాడు. గత రెండు- మూడు సీజన్లలో రోహిత్ శర్మ కూడా టైటిల్ సాధించలేకపోయాడని.. స్థాయికి తగ్గట్లు పరుగులు కూడా రాబట్టలేకపోయాడని పేర్కొన్నాడు. కాబట్టి హార్దిక్ పాండ్యా ఇవన్నీ పట్టించుకోకుండా.. ఆట మీద మాత్రమే దృష్టి పెట్టాలని సూచించాడు.‘‘తన వ్యక్తిగత ప్రదర్శన గురించి హార్దిక్ పెద్దగా ఆందోళన చెందడం లేదనే అనుకుంటున్నా. కానీ తనపై ఉన్న భారీ అంచనాల కారణంగా ఒత్తిడికి లోనవుతున్నాడు. ఇక జట్టుగా ముంబై ఇండియన్స్ విషయానికొస్తే.. గతేడాది కూడా వాళ్ల పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. వాళ్లకు ఇదేం కొత్త కాదు. ఆరంభంలో తడబడ్డా నిలదొక్కుకోగలరు. గతంలో కెప్టెన్గా ఉన్నపుడు రోహిత్ శర్మ కూడా పరుగులు చేయలేదు. గత రెండు- మూడేళ్లుగా టైటిల్ కూడా గెలవలేదు. ఇప్పటికీ మించి పోయిందేమీ లేదు. సమిష్టిగా రాణిస్తే ముందుకు వెళ్లగలరు. అయితే, హార్దిక్ పాండ్యా మాత్రం ఒత్తిడికి లోనుకాకూడదు. ముఖ్యంగా కెప్టెన్సీని భారంగా భావించకూడదు. బ్యాటింగ్ ఆర్డర్లో తనను ప్రమోట్ చేసుకున్నా తప్పేం లేదు. కానీ లోయర్ ఆర్డర్లో వచ్చినా అతడు పరుగులు చేయడం లేదంటూ విమర్శించడం సరికాదు. తను కాస్త ముందుగా వస్తే బాగుంటుంది. బ్యాటింగ్ మెరుగుపడిందంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. బౌలింగ్ కూడా చేయగలడు. కెప్టెన్గానూ తనను తాను నిరూపించుకోగలడు’’ అని సెహ్వాగ్ క్రిక్బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. -
ఓ జట్టు నుంచి నాకు ఆఫర్ వచ్చింది.. నా పార్టీ బిల్ కంటే: సెహ్వాగ్
వీరేంద్ర సెహ్వాగ్.. ప్రపంచ క్రికెట్లో పరిచయం అవసరం లేని పేరు. 14 ఏళ్ల పాటు భారత క్రికెట్కు సేవలు అందించిన సెహ్వాగ్.. క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. తన కెరీర్లో సెహ్వాగ్ ఎన్నో అద్భుత మైలురాయిలను అందుకున్నాడు. ఇప్పటికే టెస్ట్ క్రికెట్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచూరియాన్గా వీరేంద్రుడు కొనసాగుతున్నాడు. తన అంతర్జాతీయ కెరీర్లో 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20ల్లొ భారత్కు ప్రాతినిథ్యం వహించాడు. 2011 వన్డే ప్రపంచకప్, 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యునిగా సెహ్వాగ్ ఉన్నాడు. సెహ్వాగ్ ఐపీఎల్లో కూడా తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా సెహ్వాగ్ ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్క్రిస్ట్తో చిట్ చాట్లో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.గతంలో బిగ్ బాష్ లీగ్ నుంచి తనకు వచ్చిన గొప్ప ఆఫర్ను తిరస్కరించినట్లు సెహ్వాగ్ తెలిపాడు. బిగ్ బాష్ లీగ్లో భారత ఆటగాళ్లు ఆడే అవకాశముందా అన్న ప్రశ్న సందర్భంగా సెహ్వాగ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. గిల్క్రిస్ట్, సెహ్వాగ్ మధ్య జరిగిన చిట్చాట్పై ఓ లుక్కేద్దాం.ఆడమ్ గిల్క్రిస్ట్: భవిష్యత్తులో భారత ఆటగాళ్లు ఐపీఎల్ కాకుండా ఇతర టీ20 లీగ్ల్లో ఆడే ఛాన్స్ ఉందా?వీరేంద్ర సెహ్వాగ్: "లేదు , మాకు అవసరం లేదు. ఎందుకంటే మేము చాలా రిచ్. పేద దేశాలకు వెళ్లి ఆడము (నవ్వుతూ). నేను భారత జట్టులో చోటు కోల్పోయినప్పుడు నాకు బిగ్ బాష్ లీగ్లో ఆడమని ఓ ఫ్రాంచైజీ నుంచి ఆఫర్ వచ్చింది. ఎంత మొత్తం ఇస్తారని నేను ఆడిగాను. అందుకు వారి నుంచి వచ్చిన సమాధానం విని ఆశ్చర్యపోయాను.వారు నాకు లక్ష డాలర్లు( భారత కరెన్సీలో సుమారు రూ.84 లక్షలు) ఇస్తామని చెప్పారు. వెంటనే నేను నవ్వుకుని అంతకంటే ఎక్కువ డబ్బులను నా సెలవుల్లో ఖర్చుచేస్తానని, గత రాత్రి పార్టీ బిల్లు కూడా లక్ష డాలర్లు దాటిందని వారికి చెప్పానని" సెహ్వాగ్ తెలిపాడు. -
అప్పుడు సెహ్వాగ్కు ఏడేళ్లు.. ఆర్తికి ఐదేళ్లు.. 20 ఏళ్ల పెళ్లి బంధం!(ఫొటోలు)
-
RCB కెప్టెన్గా అతడు ఉంటే ఏం మాట్లాడగలరు: సెహ్వాగ్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆట తీరుపై విమర్శలు వెల్లుతుతున్నాయి. సొంతమైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో సొంత జట్టు అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే ఐపీఎల్-2024లో కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరే అవకాశం ఉండదని మండిపడుతున్నారు. ఇక ఇప్పటికే భారత టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతి సైతం ఆర్సీబీని కొత్త వాళ్లకు అమ్మేయాలంటూ యాజమాన్యం తీరును విమర్శించాడు. జట్టు నిండా స్టార్లు ఉన్నా ఇలాంటి చెత్త ప్రదర్శన ఏమిటని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అదే ఇక్కడ ప్రధాన సమస్య ‘‘జట్టులో 12- 15 మంది భారత ఆటగాళ్లు ఉన్నారు. కేవలం 10 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. కానీ ఆర్సీబీ కోచింగ్ సిబ్బందిలో దాదాపుగా అందరూ విదేశీయులే ఉన్నారు. అదే ఇక్కడ ప్రధాన సమస్య. ఇక ఆటగాళ్లలో కొంతమంది మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నారు. వీరిలో సగం మందికి ఇంగ్లిష్ పూర్తిగా అర్థమే కాదు. అలాంటపుడు ఆ విదేశీ కోచ్లు వీరిని ఎలా మోటివేట్ చేయగలరు? వారితో ఎక్కువ సమయం ఎలా గడపగలరు? భాష పూర్తిగా రాని ఆటగాళ్లు తమ సమస్యలను కోచ్లకు ఎలా వివరించగలరు? నాకైతే ఆర్సీబీలో ఒక్క ఇండియన్ కోచ్ కూడా కనిపించడం లేదు. కనీసం ఒక్కరైనా అనుభవజ్ఞుడైన కోచ్ ఉంటే బాగుంటుంది కదా! ఆటగాళ్లు ఏది చర్చించాలన్నా అందుకు తగిన వాతావరణం ఉండాలి. కెప్టెన్గా అతడు ఉంటే ఏం మాట్లాడతారు? నాకు తెలిసి చాలా మంది ఆటగాళ్లు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ దగ్గరికి వెళ్లడానికే సంశయిస్తారు. ఎందుకంటే అతడు ఏదైనా అడిగితే వీరు సమాధానం చెప్పలేరు కదా! ఒకవేళ కెప్టెన్ గనుక భారతీయుడైతే.. సదరు ఆటగాళ్లు తాము అనుకుంటున్న విషయాన్ని స్పష్టంగా అతడికి తెలియజేయగలరు. కానీ విదేశీ ఆటగాడితో సరిగా కమ్యూనికేట్ చేయలేక.. ఒకదానికి బదులు ఇంకొకటి మాట్లాడితే తదుపరి మ్యాచ్లో తుదిజట్టులో చోటు దక్కే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఆర్సీబీ సహాయక సిబ్బందిలో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురైనా భారతీయులు ఉండాలి’’ అని క్రిక్బజ్ షోలో సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్-2024లో ఆర్సీబీ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్లలో కేవలం ఒక్కటి గెలిచి ఆరు ఓడిపోయింది. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ఇక ఈ సీజన్లో ఆర్సీబీ హెడ్కోచ్గా ఆండీ ఫ్లవర్ బాధ్యతలు చేపట్టగా.. బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్ కోచ్గా టీమిండియా మాజీ ఆల్రౌండర్ శ్రీధరన్ శ్రీరామ్, బౌలింగ్ కోచ్గా ఆడం గ్రిఫిత్(టాస్మేనియా మాజీ క్రికెటర్), ఫీల్డింగ్ కోచ్గా మలోలన్ రంగరాజన్ వ్యవహరిస్తున్నారు. చదవండి: SRH: ‘బాధితులు’ కూడా అసూయ పడేలా.. కమిన్స్ ఏమన్నాడో తెలుసా? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కోహ్లి ఆ తప్పు చేయకపోయి ఉంటేనా..: సెహ్వాగ్
‘‘ఇలాంటి ప్రశ్నలకు జవాబు మీకు కూడా తెలుసు కదా? అయినా ప్రతిసారీ మమ్మల్నే ఎందుకు ఇలా కఠినమైన ప్రశ్నలు అడుగుతారు? మాతో బ్యాడ్ కామెంట్స్ చెప్పించాలనే కదా మీ ప్రయత్నం. 183 పరుగులు చాలా? విరాట్ కోహ్లి స్లోగా ఆడాడా? ఫాఫ్ డుప్లెసిస్ ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగిందా? లేదంటే.. ఆర్సీబీ ఇంకా కనీసం 20 పరుగులు చేయాల్సిందా? ఇలాంటి ప్రశ్నలకు మీరు కూడా సమాధానం చెప్పవచ్చు’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనకు ప్రశ్నలు సంధించిన స్పోర్ట్స్ ప్రజెంటర్ను సరదాగా ట్రోల్ చేశాడు. కావాలనే కఠినమైన ప్రశ్నలు వేసి తమను బ్యాడ్ చేసేందుకు చూస్తున్నారంటూ ఆటపట్టించాడు. కాగా సెహ్వాగ్ ప్రస్తుతం ఐపీఎల్-2024 కామెంటేటర్గా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజస్తాన్ రాయల్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య శనివారం నాటి మ్యాచ్ సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఒక్కడే లాక్కొచ్చాడు ఇక రాజస్తాన్ చేతిలో ఓటమిపాలైన ఆర్సీబీ ఇన్నింగ్స్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అవును.. ఈరోజు కోహ్లి శతకం బాదాడు. ఆర్సీబీ తరఫున ప్రస్తుతం అతడు ఒక్కడు మాత్రమే ఫామ్లో ఉన్నాడు. మిగతా వాళ్లలో ఎవరూ కూడా పరుగులు చేయడం లేదు. నిజానికి కోహ్లి ఆఖరి వరకు క్రీజులో ఉండటం మంచిదైంది. మిగతా వాళ్ల నుంచి ఎటువంటి సహకారం లేకపోయినా ఒంటరిగా లాక్కొచ్చాడు. కానీ కోహ్లి చేసిన తప్పు అదే మాక్స్వెల్, గ్రీన్ అసలు ప్రభావం చూపలేదు. మహిపాల్ లామ్రోర్, దినేశ్ కార్తిక్ ఏమయ్యారో అర్థం కాలేదు. వాళ్లిద్దరూ మంచి ఫామ్లో ఉన్నారు. ఇద్దరిలో ఒక్కరు బ్యాటింగ్కు వచ్చినా బాగుండేది. ఇక కోహ్లి హాఫ్ సెంచరీ(39 బంతుల్లో 50) తర్వాత వేగం పెంచాల్సింది. అలా చేయకుండా కోహ్లి తప్పు చేశాడు. అతడి స్ట్రైక్రేటు పెరిగితే ఆర్సీబీ 200 పరుగులు మార్కు చేరుకునేది ’’ అని వీరూ భాయ్ అభిప్రాయపడ్డాడు. కాగా జైపూర్లో రాజస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. కోహ్లి అజేయ శతకం(113) వృథాగా పోగా.. ఆర్సీబీ ఈ సీజన్లో నాలుగో పరాజయాన్ని మూటగట్టుకుంది. రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు: ►వేదిక: జైపూర్.. సవాయి మాన్సింగ్ స్టేడియం ►టాస్: రాజస్తాన్.. బౌలింగ్ ►ఆర్సీబీ స్కోరు: 183/3 (20) ►రాజస్తాన్ స్కోరు: 189/4 (19.1) ►ఫలితం: ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీపై రాజస్తాన్ విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జోస్ బట్లర్(రాజస్తాన్). చదవండి: Virat Kohli: ఇంత స్వార్థమా?.. ఐపీఎల్ చరిత్రలో కోహ్లి చెత్త రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024: ముంబై కెప్టెన్సీ నుంచి హార్దిక్ ఔట్.. ? రియాక్ట్ అయిన సెహ్వాగ్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ను ఓసారి ఛాంపియన్, మరోసారి రన్నరప్గా నిలిపిన హార్దిక్.. ఈసారి మాత్రం తన కెప్టెన్సీ మార్క్ చూపించలేకపోతున్నాడు. ఈ ఏడాది సీజన్లో అతడి సారథ్యంలో ముంబై ఇండియన్స్ వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యా తప్పుకోవాలని పెద్దఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. మళ్లీ రోహిత్ శర్మకు జట్టు పగ్గాలను అప్పగించాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కూడా చేరాడు. ఈ మెగా ఈవెంట్లో తమ తదుపరి మ్యాచ్కు ముందు హార్దిక్ పాండ్యా ముంబై కెప్టెన్సీ నుంచి వైదొలగతాడని తివారీ జోస్యం చెప్పాడు. అంతేకాకుండా రోహిత్ శర్మనే తిరిగి మళ్లీ ముంబై సారథ్య బాధ్యతలు చేపడతాడని అతడు అభిప్రాయపడ్డాడు. కాగా ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 7న వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. ఈ విరామంలోనే ముంబై కెప్టెన్సీలో మార్పు జరుగుతుందని తివారీ చెప్పుకొచ్చాడు. "హార్దిక్ పాండ్యా ప్రస్తుతం తీవ్రమైన ఒత్తడిలో ఉన్నాడు. గత మూడు మ్యాచ్ల్లో బౌలర్లను హార్దిక్ సరిగ్గా ఉపయోగించలేకపోయాడు. ఆరంభంలో బౌలర్లు విఫలమవుతున్నప్పటికి మళ్లీ వారినే ఎటాక్లో తీసుకువచ్చి హార్దిక్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ముంబై ఇండియన్స్లో అద్బుతమైన బౌలర్లు ఉన్నారు. సరిగ్గా రోటాట్ చేయడంలో పాండ్యా విఫలమయ్యాడు. స్వింగ్ అవుతున్న పిచ్లపై బుమ్రాను కాదని తొలుత తను బౌలింగ్ చేయడం కూడా హార్దిక్ తప్పిదమే అని చెప్పుకోవాలి. హార్దిక్ కూడా బంతిని స్వింగ్ చేయగలడు. కానీ ముంబై తరపున ఇప్పటివరకు మూడు మ్యాచ్ల్లో హార్దిక్ బౌలర్గా తన మార్క్ను చూపించలేకపోయాడు. ముంబై తమ తదుపరి మ్యాచ్లో ఢిల్లీతో తలపడనుంది. ఈ విరామంలో ముంబై ఫ్రాంచైజీ నుంచి ఓ బిగ్ న్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించేస్తాడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా చాలా ఫ్రాంచైజీలు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పుడు ముంబై కెప్టెన్సీ విషయంలో కూడా అదే జరిగే అవకాశముందని" క్రిక్బజ్ షోలో తివారీ పేర్కొన్నాడు. ఇదే షోలో పాల్గోన్న టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. మనోజ్ తివారీ కామెంట్స్పై స్పందించాడు. "హార్దిక్ కెప్టెన్సీపై మనోజ్ కాస్త తొందపడి ఇటువంటి వ్యాఖ్యలు చేశాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రోహిత్ కెప్టెన్సీలో కూడా జట్టు వరుసగా ఐదు మ్యాచ్లలో ఓడిపోయింది. ఆ ఏడాది సీజన్లో వారు ఛాంపియన్లుగా నిలిచారు. కాబట్టి మనం కాస్త ఓపిక పట్టాలి. మనం మరో రెండు మ్యాచ్ల కోసం వేచి ఉండాలి. ఆ తర్వాతే మన అభిప్రాయాలను వెల్లడిస్తే బాగుంటుందని సెహ్వాగ్ రిప్లే ఇచ్చాడు. -
అతడు చాలా బాధపడ్డాడు.. అందుకే చెలరేగిపోయాడు: సెహ్వాగ్
ఐపీఎల్-2024 సీజన్ను ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా ఘనంగా ఆరంభించాడు. ఈ ఏడాది సీజన్లో తొలి రెండు మ్యాచ్లకు బెంచ్కే పరిమితమైన పృథ్వీ షా.. ఆదివారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్కు ఢిల్లీ తుది జట్టులోకి వచ్చాడు. తనకు వచ్చిన అవకాశాన్ని పృథ్వీ షా సద్వినియోగ పరుచుకున్నాడు. షా అద్బుతమైన ఇన్నింగ్స్తో ఢిల్లీ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. కేవలం 27 బంతుల్లోనే 4 ఫోర్లు,2 సిక్స్లతో అతడు 43 పరుగులు చేశాడు. డేవిడ్ వార్నర్తో కలిసి ఢిల్లీ జట్టుకు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు ఈ ముంబైకర్. ఈ నేపథ్యంలో పృథ్వీ షా ఉద్దేశించి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పృథ్వీ షా తనలో ఉన్న బాధనంతా తన ఇన్నింగ్స్ రూపంలో చూపించాడని సెహ్వాగ్ అన్నాడు. "ప్రతీ టీమ్ మేనేజ్మెంట్ తమ ఆటగాడు రిథమ్లో ఉన్నాడా లేదా నెట్స్లో ఎప్పుడూ పరిశీలిస్తుంటుంది. ఈ ఇన్నింగ్స్ పృథ్వీకి చాలా ముఖ్యమైనది. గత సీజన్లో కూడా పెద్దగా జట్టులో షా కన్పించలేదు. ఈ ఏడాది సీజన్లో కూడా తొలి రెండు మ్యాచ్ల్లో అతడికి ఆడే ఛాన్స్ రాలేదు. ఈ విషయంలో అతడు బాధపడి ఉండవచ్చు. అందుకే తన బాధను ఆట రూపంలో చూపించాడని" క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. -
ధోని ముసలోడే కదా.. అందుకే అలా అన్నాను: సెహ్వాగ్
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఛలోక్తులు విసరడంలో దిట్ట అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రిటైర్మెంట్ తర్వాత ఈ విధ్వంసకర ఓపెనర్ కామెంటేటర్, విశ్లేషకుడిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్-2024 హర్యానా కామెంట్రీతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని ఉద్దేశించి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశాడు సెహ్వాగ్. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో సీఎస్కే ఫీల్డింగ్ను ప్రశంసిస్తూ.. ‘‘క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు కదా. అజింక్య రహానే మంచి క్యాచ్ అందుకున్నాడు. రచిన్ రవీంద్ర కూడా అద్బుతంగా క్యాచ్ పట్టాడు. వయసు మీద పడ్డ ధోని కూడా ఓ క్యాచ్ అందుకున్నాడు’’ అని క్రిక్బజ్ షోలో వ్యాఖ్యానించాడు. ఇందుకు స్పందనగా అక్కడే ఉన్న మరో మాజీ క్రికెటర్ రోహన్ గావస్కర్.. ‘‘రహానే విషయంలో ఆ పదం(ముసలోడు అన్న అర్థంలో) ఎందుకు వాడలేదు’’ అని ప్రశ్నించాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘వాళ్లిద్దరి వయసు ఒకటి కాదు కదా! ధోని కంటే రహానే ఫిట్గా ఉన్నాడు. 35 ఏళ్ల వ్యక్తికి.. 41 ఏళ్లు పైబడిన వ్యక్తికి మధ్య కచ్చితంగా తేడా ఉంటుంది. ధోనికి వయసు మీద పడుతుందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు కదా’’ అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. రహానే నూటికి నూరు శాతం ధోని కంటే ఎక్కువ ఫిట్గా ఉన్నాడు కాబట్టే అతడిని అలా అనలేదని పేర్కొన్నాడు. కాగా గుజరాత్ టైటాన్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో సీఎస్కే 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్లో జరిగిన ఈ మ్యాచ్లో ధోని అద్బుత రీతిలో డైవ్ చేసి.. గుజరాత్ బ్యాటర్ విజయ్ శంకర్ను పెవిలియన్కు పంపాడు. 𝗩𝗶𝗻𝘁𝗮𝗴𝗲 𝗠𝗦𝗗 😎 An excellent diving grab behind the stumps and the home crowd erupts in joy💛 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #CSKvGT pic.twitter.com/n5AlXAw9Zg — IndianPremierLeague (@IPL) March 26, 2024 పాదరసంలా కదిలి శరీరాన్ని స్ట్రెచ్ చేసి బంతిని ఒడిసిపట్టాడు. ఇక ఈ మ్యాచ్లో డేవిడ్ మిల్లర్(16 బంతుల్లో 21) ఇచ్చిన క్యాచ్ను అజింక్య రహానే, అజ్మతుల్లా ఇచ్చిన క్యాచ్ను రచిన్ రవీంద్ర సంచలన క్యాచ్లతో మెరిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. Give your hearts to Rahane! He’ll carry it safe! 🧲💛 pic.twitter.com/95k8QD94wz — Chennai Super Kings (@ChennaiIPL) March 26, 2024 ఈ విషయంపై స్పందిస్తూ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సైతం.. ధోని, రహానే, రచిన్లను కొనియాడాడు. ధోని, రహానేను చూస్తుంటే తమ జట్టులో అదనంగా ఇద్దరు కుర్రాళ్లు ఉన్నట్లు అనిపిస్తోందంటూ ప్రశంసలు కురిపించాడు. -
బజ్ బాల్ బద్దలైంది.. అతడే ఇంగ్లండ్ కొంపముంచాడు: సెహ్వాగ్
భారత పర్యటనను ఇంగ్లండ్ జట్టు ఘోర ఓటమితో ముగించింది. ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. బాజ్ బాల్ అంటూ వీరవీగ్రుతన్న ఇంగ్లండ్ జట్టు ఆఖరి టెస్టులో కనీస పోటీ ఇవ్వలేకపోయింది. భారత దెబ్బకు ఇంగ్లండ్ బజ్ బాల్ పగిలిపోయింది. ఐదు మ్యాచ్ల సిరీస్ను ఇంగ్లండ్ 1-4 తేడాతో భారత్కు సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ బజ్ బాల్ విధానంపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శల వర్షం కురిపించాడు. "భారత్ దెబ్బకు ఇంగ్లండ్ బాజ్ బాల్ బద్దలైంది. వారు ఆప్రోచ్ సరైనది కాదు. పిచ్చికి కూడా ఓ పద్దతి ఉంటుంది. ఇంగ్లండ్ తమ స్ధాయికి తగ్గట్టు ఆడలేకపోయింది. రెండో టెస్టు ఓటమి తర్వాత ఇంగ్లండ్ జట్టు పూర్తిగా తేలిపోయింది. కెప్టెన్ స్టోక్స్ విఫలమవడం వారి కష్టాలను మరింత రెట్టింపు చేసింది. ఇంగ్లండ్ ఇంకా బజ్బాల్ భ్రమలోనే ఉన్నారు. వారు ఈ విధానంతోనే విజయవంతం కావాలంటే ఒక పద్దతి, ప్రణాళిక ఉండాలని" ఎక్స్లో సెహ్వాగ్ రాసుకొచ్చాడు. -
సెహ్వాగ్ కాదు!.. గావస్కర్ తర్వాత అతడే టెస్టు బెస్ట్ ఓపెనర్!
టీమిండియా బౌలింగ్ విభాగం మాజీ కోచ్ భరత్ అరుణ్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. రవిశాస్త్రి దృష్టిలో సునిల్ గావస్కర్ తర్వాత అంతటి గొప్ప ఓపెనర్ మళ్లీ మురళీ విజయ్ అని పేర్కొన్నాడు. తనకు కూడా మురళీనే అభిమాన క్రికెటర్ అని తెలిపాడు. కాగా 2008లో నాగ్పూర్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా తమిళనాడుకు చెందిన మురళీ విజయ్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్లో వరుసగా 33, 41 పరుగులు సాధించాడు. ఓపెనర్గా సత్తా చాటి టెస్టు జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. కెరీర్లో మొత్తంగా 61 టెస్టులు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో వరుసగా 3982, 339, 169 పరుగులు సాధించాడు మురళీ విజయ్. గతేడాది జనవరిలో అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా మురళీ విజయ్ గురించి క్రికెట్.కామ్ ఇంటర్వ్యూలో భరత్ అరుణ్ మాట్లాడుతూ.. ‘‘యువకుడిగా ఉన్నప్పటి నుంచి నాకు మురళీ విజయ్తో పరిచయం ఉంది.కాలేజీలో తనను మొదటిసారి చూశాను. ఫస్ట్ డివిజన్ జట్టుకు అతడి పేరును రికమెండ్ చేశాను. అలా అతడి ప్రయాణం మొదలైంది. రవిశాస్త్రి ఎల్లప్పుడూ నాతో ఓ మాట అంటూ ఉండేవాడు. సునిల్ గావస్కర్ తర్వాత ఆ స్థాయిలో టెస్టుల్లో ఆకట్టుకున్న ఓపెనర్ మురళీ విజయ్ అని చెప్పేవాడు. నా ఫేవరెట్ క్రికెటర్ కూడా మురళీ విజయే’’ అని పేర్కొన్నాడు. కాగా టీమిండియా విధ్వంసకర ఓపెనర్గా పేరొందిన దిగ్గజ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మలను కాదని.. గావస్కర్ తర్వాతి స్థానాన్ని రవిశాస్త్రి మురళీ విజయ్కు ఇవ్వడంపై నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: అప్పుడు పుజారాకు ఫోన్ చేశా.. రోహిత్, రాహుల్ భయ్యాకు థాంక్స్: అశూ భార్య -
'అతడేం తప్పు చేశాడు.. ధ్రువ్ జురెల్కు తీవ్ర అన్యాయం'
ధ్రువ్ జురెల్.. ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో మారు మ్రోగుతున్న పేరు. రాంఛీ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో అద్బుత ఇన్నింగ్స్ ఆడిన ధ్రువ్ జురెల్.. ఓవర్ నైట్ స్టార్గా మారిపోయాడు. ఈ క్రమంలో జురెల్పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అయితే మరో ఎంఎస్ ధోని దొరికాడంటూ దృవ్ను కొనియాడాడు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ధ్రువ్ విరోచిత పోరాటం కనబరిచాడు. టీమిండియా 307 పరుగుల మెరుగైన స్కోర్ చేయడంలో జురెల్ ముఖ్య పాత్ర పోషించాడు. లోయార్డర్ బ్యాటర్ కుల్దీప్ యాదవ్తో కలిసి ఎనిమిదో వికెట్కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 149 బంతులు ఎదుర్కొన్న ధ్రువ్ రెండు సిక్స్లు, నాలుగు ఫోర్లతో 90 పరుగులు చేశాడు. అయితే దురదృష్టవ శాత్తూ జురెల్ తన తొలి అంతర్జాతీయ సెంచరీని అందుకోవడంలో విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో జురెల్ను భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసించాడు. జురెల్కు అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయని సెహ్వాగ్ కొనియాడు. అయితే ధ్రువ్ ఇన్నింగ్స్కు మీడియాలో సరైన గుర్తింపు లభించలేదని, తీవ్ర అన్యాయం జరిగిందని వీరూ ఆరోపించాడు. "ధ్రువ్ జురెల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కష్టాల్లో ఉన్న జట్టును అదుకున్నాడు. కానీ మీడియాలో ధ్రువ్ ఇన్నింగ్స్కు అంత హైప్ దక్కలేదు. కనీసం ఆ చర్చే లేదు. ఏదేమైనప్పటికీ చాలా బాగా ఆడావు. ధ్రువ్కు శుభాకాంక్షలు అంటూ ఎక్స్లో సెహ్వాగ్ రాసుకొచ్చాడు. కాగా సానుకూలంగా స్పందిస్తున్నారు. అవున్ సర్ మీరు చెప్పిందే నిజమే అంటూ కామెట్లు చేస్తున్నారు. ఆ తర్వాత మొదటి పోస్ట్కు వివరణ ఇస్తూ సెహ్వాగ్ మరో ట్వీట్ చేశాడు. "ఎవరినీ కించపరచాలి లేదా అవమానించాలన్నది నా ఉద్దేశ్యం కాదు. కానీ ఆటగాళ్ల ప్రదర్శనపై సమానమైన హైప్ ఉండాలి. ఈ మ్యాచ్లో ఆకాష్ దీప్ వంటి డెబ్యూ బౌలర్ సంచలన ప్రదర్శన చేశాడు. కానీ అతడికి కూడా అంత ఆదరణ దక్కలేదు. ధ్రువ్ విషయంలో కూడా ఇదే జరిగిందంటూ ట్వీట్(ఎక్స్) చేశాడు. -
సెహ్వాగ్ ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన జైస్వాల్
India vs England, 4th Test Day 2- Yashasvi Jaiswal: వేదిక ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా.. ఏమాత్రం బెదురు లేకుండా బ్యాట్ ఝులిపించడమే తనకు తెలిసిన విద్య అన్నట్లుగా ముందుకు సాగుతున్నాడు టీమిండియా నయా సంచలనం యశస్వి జైస్వాల్. అరంగేట్రంలోనే వెస్టిండీస్ గడ్డపై సెంచరీతో చెలరేగి అరుదైన రికార్డులు సాధించాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్తో సిరీస్లోనూ అదే జోరును కొనసాగిస్తున్నాడు జైస్వాల్. తొలి మూడు టెస్టుల్లో అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 80, 15, 209, 17, 10, 214(నాటౌట్). తాజాగా రాంచి మ్యాచ్ సందర్భంగానూ కూడా విలువైన అర్ధ శతకం బాదాడు. Jaiswal has cracked the code for run-making! 🙌🏻 He brings up his fiery 5️⃣0️⃣ in style to keep #TeamIndia's momentum. 🔥#INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/nFAmYZPaX4 — JioCinema (@JioCinema) February 24, 2024 నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 130 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి టీమిండియా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ ఈ ఓపెనింగ్ బ్యాటర్ పట్టుదలగా నిలబడ్డాడు. వరుసగా వికెట్లు పడుతున్నా ఏకాగ్రత కోల్పోకుండా అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 117 బంతులు ఎదుర్కొని 73 పరుగులు సాధించాడు. ఇందులో 8 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్లో లాంగాన్ మీదుగా అద్భుత రీతిలో బాదాడు ఆ సిక్స్ను జైస్వాల్. తద్వారా టీమిండియా విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరు మీద 16 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా బ్యాటర్గా అవతరించాడు. సెహ్వాగ్ 14 మ్యాచ్లు ఆడి 27 ఇన్నింగ్స్లో ఈ ఫీట్ నమోదు చేస్తే.. జైస్వాల్ ఐదో మ్యాచ్లోనే ఈ ఘనత సాధించడం మరో విశేషం. ఇదిలా ఉంటే.. శనివారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అంతకుముందు ఇంగ్లండ్ 353 పరుగులకు ఆలౌట్ అయింది. క్యాలెండర్ ఇయర్లో టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్లు ►యశస్వి జైస్వాల్- 23* సిక్సర్లు- 2024లో ►వీరేంద్ర సెహ్వాగ్- 22 సిక్సర్లు- 2008లో ►రిషభ్ పంత్- 21 సిక్సర్లు- 2022లో ►రోహిత్ శర్మ- 20 సిక్సర్లు- 2019లో ►మయాంక్ అగర్వాల్- 18 సిక్సర్లు- 2019లో. చదవండి: Ind Vs Eng 4th Test: ‘ఛీ.. ఛీ.. చీటింగ్కు కూడా వెనుకాడరు’.. ఇలా ఉన్నారేంట్రా బాబూ! -
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ 2024.. జట్ల వివరాలు
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (IVPL) తొలి ఎడిషన్ గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా ఇవాల్టి (ఫిబ్రవరి 23) నుంచి ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ టైగర్స్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్గఢ్ వారియర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు ఈ వెటరన్ లీగ్లో అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఇవాళ జరుగనున్న తొలి మ్యాచ్లో వీరేంద్ర సెహ్వాగ్ నేతృత్వంలోని ముంబై ఛాంపియన్స్.. క్రిస్ గేల్ సారథ్యంలోని తెలంగాణ టైగర్స్తో తలపడుతుంది. 10 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో డబుల్ హెడర్ మ్యాచ్లు కూడా జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్ 2 గంటలకు, రాత్రి మ్యాచ్ ఏడు గంటలకు ప్రారంభమవుతాయి. ఈ టీ20 లీగ్ను డీడీ స్పోర్ట్స్, యూరోస్పోర్ట్స్తో పాటు ఫ్యాన్కోడ్లో వీక్షించవచ్చు. ఈ మెగా ఈవెంట్లో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్తో పాటు హెర్షల్ గిబ్స్, యూసఫ్ పఠాన్, సురేశ్ రైనా, మునాఫ్ పటేల్, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్ వంటి స్టార్ ఆటగాళ్లు భాగం కానున్నారు. జట్ల వివరాలు.. రాజస్థాన్ లెజెండ్స్: ప్రవీణ్ కుమార్ (కెప్టెన్), ఏంజెలో పెరీరా, సీక్కుగే ప్రసన్న, పర్వీందర్ అవానా, లఖ్వీందర్ లఖా, దీపక్ మోహన్ కుక్కర్, సంజయ్ బామెల్, ఇషాన్ మల్హోత్రా, తరుణ్ కుమార్, గౌరవ్ సచ్దేవా, రవి కుమార్ అరోరా, లక్ష్మణ్ సింగ్, ముఖేష్ శర్మ, నరేష్ గహ్లోత్, రోహిత్ ఝలానీ, డాక్టర్ సతీష్ జైన్, నరేంద్ర కుమార్ మీనా, అమన్ వోహ్రా తెలంగాణ టైగర్స్: క్రిస్ గేల్ (కెప్టెన్), రికార్డో పావెల్, దిల్షన్ మునవీర, సుదీప్ త్యాగి, మన్ప్రీత్ గోనీ, మల్లికార్జున్ జగితి, రవి కుమార్, ఉమామేశ్ జి, కొడమర్తి కమలేష్, రాఘవ అమ్మిరెడ్డి, డాక్టర్ గిరి, తోట చంద్రశేఖర్, కేసరి శ్రీకాంత్, జె జగదీష్ రెడ్డి, ఎం రాజకృష్ణ, అభిజీ కదమ్, అహ్మద్ క్వాద్రీ, సమీర్ షేక్, గోవింద రాజు వీవీఐపీ ఉత్తర ప్రదేశ్: సురేష్ రైనా (కెప్టెన్), డాన్ క్రిస్టియన్, క్రిస్ ఎంఫోఫు, రజత్ భాటియా, అనురీత్ సింగ్, పర్విందర్ సింగ్, భాను సేథ్, రోహిత్ ప్రకాష్ శ్రీవాస్తవ, మిరతుంజయ్, కెఎస్ రాణా, జోగిందర్ సింగ్, వినోద్ విల్సన్, అన్షుల్ కపూర్, పర్వీన్ తహప్పర్, రాజేందర్ బిష్త్, దామోదర్ రెడ్కర్ , ప్రదీప్ కుమార్ పింటు, చంద్ర శేఖర కె, మోను కుమార్ ముంబై ఛాంపియన్స్: వీరేంద్ర సెహ్వాగ్ (కెప్టెన్), ఫిల్ మస్టర్డ్, అభిషేక్ జున్జున్వాలా, పీటర్ ట్రెగో, పంకజ్ సింగ్, గౌరంగ్ అగర్వాల్, ముఖేష్ సైనీ, అమిత్ సనన్, వినయ్ యాదవ్, నిర్వాన్ అత్రి, ప్రశాంత్ ఎ తగాడే, విజయ్ సింగ్, ఇక్బాల్ అబ్దుల్లా, విశ్వజిత్సిన్హ్ సోలన్సిన్హ్ సోలన్వాలా, సింగ్, అజయ్ సింగ్, మొహమ్మద్ జావేద్ మన్సూరి, విక్రమ్ భాస్కర్, కపిల్ మెహతా రెడ్ కార్పెట్ ఢిల్లీ: హర్షల్ గిబ్స్ (కెప్టెన్), అస్గర్ ఆఫ్ఘన్, తిసారా పెరీరా, ఇమ్రాన్ తాహిర్, అభిమన్యు మిథున్, రాజీవ్ త్యాగి, జితేంద్ర కుమార్, షాజిల్ బి, కపిల్ రాణా, విక్రమ్ ధనరాజ్ బాత్రా, బాబూరావ్ యాదవ్, అషు శర్మ, యుజ్వేందర్ సింగ్, అమిత్ శర్మ, ఆశిస్ శర్మ, మన్విన్దర్ శర్మ బిస్లా, రాకేష్ టాండేల్, విక్రాంత్ యాదవ్, అమిత్ తోమర్ ఛత్తీస్గఢ్ వారియర్స్: యూసుఫ్ పఠాన్ (కెప్టెన్), స్టువర్ట్ బిన్నీ, మునాఫ్ పటేల్, నమన్ ఓజా, డ్వేన్ స్మిత్, అమిత్ పాల్, రోహిత్ కుమార్ ధృవ్, ధీరజ్ జి నర్వేకర్, ఆశిష్ శర్మ, మహ్మద్ కలీం ఖాన్, అనిమేష్ శర్మ, అభిషేక్ తామ్రాకర్, జతిన్ సహాయ్ సక్సేనా, సుశాంత్ శుక్లా, సుశాంత్ శుక్లా గిరి, షాదాబ్ జకాతి, హర్ప్రీత్ సింగ్, క్రాంతి కుమార్ వర్మ, రూపేష్ నాయక్ -
ఫిబ్రవరి 23 నుంచి వెటరన్ ఐపీఎల్.. తెలంగాణ కెప్టెన్గా క్రిస్ గేల్
విధ్వంసకర బ్యాటర్లు వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, హెర్షల్ గిబ్స్, సురేశ్ రైనా, యూసఫ్ పఠాన్ మరోసారి విధ్వంసానికి రెడీ అంటున్నారు. ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యే వెటరన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో వీరు మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నారు. తొలిసారి నిర్వహించబడుతున్న ఈ టోర్నీ ఫిబ్రవరి 23న ప్రారంభమై మార్చి 3న ముగుస్తుంది. తొలుత ఈ టోర్నీని డెహ్రడూన్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించాలని అనుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల వేదికను గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కు మారుస్తున్నట్లు నిర్వహకులు ప్రకటించారు. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ టైగర్స్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్గఢ్ వారియర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు ఈ వెటరన్ లీగ్లో అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఫిబ్రవరి 23న జరుగునున్న తొలి మ్యాచ్లో వీరేంద్ర సెహ్వాగ్ నేతృత్వంలోని ముంబై ఛాంపియన్స్.. క్రిస్ గేల్ సారథ్యంలోని తెలంగాణ టైగర్స్తో తలపడుతుంది. 10 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో డబుల్ హెడర్ మ్యాచ్లు కూడా జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్ 2 గంటలకు, రాత్రి మ్యాచ్ ఏడు గంటలకు ప్రారంభమవుతాయి. ఈ టీ20 లీగ్ను డీడీ స్పోర్ట్స్, యూరోస్పోర్ట్స్తో పాటు ఫ్యాన్కోడ్లో వీక్షించవచ్చు. ఈ మెగా ఈవెంట్లో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్తో పాటు హెర్షల్ గిబ్స్, యూసఫ్ పఠాన్, సురేశ్ రైనా, మునాఫ్ పటేల్, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్ వంటి స్టార్ ఆటగాళ్లు భాగం కానున్నారు. -
'వారిద్దరూ అద్భుతం.. కచ్చితంగా వరల్డ్ క్రికెట్ను ఏలుతారు'
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఆటగాళ్లు యశస్వీ జైశ్వాల్, శుబ్మన్ గిల్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. తొలి ఇన్నింగ్స్లో జైశ్వాల్(209) విరోచిత డబుల్ సెంచరీతో చెలరేగగా.. రెండో ఇన్నింగ్స్లో గిల్(104) సైతం శతకంతో మెరిశాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించారు. భవిష్యత్తులో యశస్వీ, శబ్మన్ ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం చెలాయిస్తారని సెహ్వాగ్ జోస్యం చెప్పాడు. "అతి చిన్న వయస్సులోనే గిల్, జైశ్వాల్ అసాధారణమైన ప్రతిభను కనబరుస్తున్నారు. వారు ఆటతీరును చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం వారి స్పెషల్. వీరిద్దరూ రాబోయే రోజుల్లో కచ్చితంగా వరల్డ్ క్రికెట్ను ఏలుతారు" అని ఎక్స్(ట్విటర్)లో సెహ్వాగ్ రాసుకొచ్చాడు. ఇక రెండో టెస్టు రసవత్తరంగా మారింది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించాలంటే ఇంకా 9 వికెట్లు పడగొట్టాలి. 399 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. మూడో రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. ఇంగ్లండ్ మరో విజయాన్ని తమఖాతాలో వేసుకోవాలంటే 332 పరుగులు చేయాల్సింది. ఒకవేళ ఇంగ్లండ్ ఈ లక్ష్యాన్ని ఛేదిస్తే భారత్ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఎందుకంటే భారత గడ్డపై టెస్టు క్రికెట్లో ఈ జట్టు కూడా ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించలేదు. భారత్లో ఓ జట్టు ఛేదించిన అత్యధిక లక్ష్యం 387గా ఉంది. 2008లో చెన్నైలో ఇంగ్లాండ్పై భారత్ ఈ ఛేదన చేసింది. చదవండి: NZ vs SA: రచిన్ రవీంద్ర విధ్వంసం.. ఏకంగా డబుల్ సెంచరీతో -
ఇంగ్లండ్తో తొలి టెస్టు.. అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల సిరీస్కు రంగం సిద్దమైంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు హైదరాబాద్ చేరుకోగా.. టీమిండియా సోమవారం భాగ్యనగరానికి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ మ్యాచ్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్లో హిట్మ్యాన్ మరో 14 సిక్స్లు బాదితే టెస్టు క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ఈ క్రమంలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(91) రికార్డును రోహిత్ బ్రేక్ చేస్తాడు. ఈ జాబితాలో రోహిత్ ప్రస్తుతం 77 సిక్సర్లతో మూడో స్ధానంలో ఉన్నాడు. రోహిత్ కంటే ముందు రెండో స్ధానంలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(78) ఉన్నాడు. కాగా రోహిత్కు టెస్టుల్లో ఇంగ్లండ్పై మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇంగ్లండ్తో 9 మ్యాచ్లు ఆడిన రోహిత్ 49.80 సగటుతో 747 పరుగులు చేశాడు. -
‘మనం వద్దని మాల్దీవులు ఓటేసింది.. ఇకపై అక్కడికి వెళ్తారా? లేదా..’
Cricket Stars Fume Over Maldives Row: భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులను టీమిండియా మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. భారతీయులను తక్కువ చేసేలా మాట్లాడటం తగదని హితవు పలుకుతున్నారు. గతంలో ఎన్నోసార్లు మాల్దీవుల పర్యటనకు వెళ్లామని.. కానీ ఇకపై అలాంటి పరిస్థితులు ఉండబోవని స్పష్టం చేస్తున్నారు. భారతదేశంలో ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయని.. ఇకపై వాటిపైనే మనమంతా దృష్టి సారించాలని పిలుపునిస్తున్నారు. భారత పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేలా తమ వంతు సహకారం అందిస్తామంటూ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీకి మద్దతు తెలుపుతున్నారు. మోదీ ఫొటోలు వైరల్.. మాల్దీవుల మంత్రుల నోటి దురుసు కాగా ప్రధాని మోదీ.. కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్లో ఇటీవల పర్యటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో లక్షద్వీప్ను పర్యాటక ధామంగా మార్చాలంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు మాల్దీవులతో లక్షద్వీప్ను పోలుస్తూ ప్రధాని మోదీ ఫొటోలను నెట్టింట వైరల్ చేశారు. ఈ నేపథ్యంలో మాల్దీవుల మంత్రులు మోదీని కించపరిచే విధంగా తోలుబొమ్మ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. భారత్లో బీచ్లు, హోటల్ గదులు శుభ్రంగా ఉండవని.. అలాంటి దేశంతో తమకు పోలికేంటని వివాదాస్పద రీతిలో కామెంట్లు చేశారు. దీంతో బాయ్కాట్ మాల్దీవ్స్, #ExploreIndianIslands ట్రెండ్ చేస్తున్నారు భారత నెటిజన్లు. మన పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా, మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, మాజీ బ్యాటర్ సురేశ్ రైనా తదితరులు స్పందించారు. ఈ మేరకు సెహ్వాగ్.. ‘‘ఉడుపి, పాండిలోని పారడైజ్ బీచ్, అండమాన్లోని నీల్, హవెలాక్తో పాటు దేశంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇంతవరకు మనం చూడని చక్కటి బీచ్లు కూడా చాలా ఉన్నాయి. మన ప్రధాని పట్ల మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసిన తీరును అందరూ గమనించాలి. ఇకపై అవసరమైన చోట్ల మౌలిక సదుపాయాలు మరింత అభివృద్ధి చేసి మన పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసి.. ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకోవాలి’’ అని పేర్కొన్నాడు. Whether it be the beautiful beaches of Udupi , Paradise Beach in Pondi, Neil and Havelock in Andaman, and many other beautiful beaches throughout our country, there are so many unexplored places in Bharat which have so much potential with some infrastructure support. Bharat is… pic.twitter.com/w8EheuIEUD — Virender Sehwag (@virendersehwag) January 7, 2024 ఇక ఇర్ఫాన్ పఠాన్.. ‘‘నాకు 15 ఏళ్ల వయసు ఉన్నపటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో పర్యటించాను. ఇండియన్ హోటల్స్లో లభించిన ఆతిథ్యం మరెక్కడా లభించదు. మన దేశంలో ఉన్నన్ని పర్యాటక ప్రాంతాలు మరెక్కడా లేవు. మనం ప్రతి దేశ సంస్కృతిని గౌరవిస్తాం. కానీ.. నా మాతృదేశం గురించి, ఇక్కడి ఆతిథ్యం గురించి ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలు వినడం ఎంతో బాధిస్తోంది’’ అని మాల్దీవుల మంత్రులకు చురకలు అంటించాడు. Having traveled the world since I was 15, every new country I visit reinforces my belief in the exceptional service offered by Indian hotels and tourism. While respecting each country's culture, it's disheartening to hear negative remarks about my homeland's extraordinary… — Irfan Pathan (@IrfanPathan) January 7, 2024 మనం వద్దని మాల్దీవులు ఓటేసింది.. ఇక వెళ్లాలా లేదా? అదే విధంగా ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘ఇండియా వద్దని మాల్దీవులు ఓటేసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో.. వెళ్లవద్దో అన్న అంశంలో భారతీయులు తెలివిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా కుటుంబం అయితే, ఇలాగే చేస్తుంది. జై హింద్’’ అని పేర్కొన్నాడు. ‘India Out’ was a part of the manifesto. Maldives voted for it. Now, it’s up to us, Indians, to choose wisely. I know that my family will. Jai Hind 🇮🇳 — Aakash Chopra (@cricketaakash) January 6, 2024 కాగా మోదీపై అనుచిత వ్యాఖ్యల కారణంగా ఇప్పటికే చాలా మంది భారత ప్రముఖులు మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. పర్యాటకమే ఆయువుపట్టుగా ఉనికిని చాటుకుంటున్న తమకు.. తాజా పరిణామాలు భారీ నష్టం చేకూరుస్తాయని పసిగట్టిన మాల్దీవుల ప్రభుత్వం.. ఇప్పటికే సదరు మంత్రులపై వేటు వేసింది. -
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్.. అరుదైన రికార్డు ముంగిట కోహ్లి
India Vs South Africa 1st Test: సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు. మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు భారత జట్టు ప్రొటిస్ దేశానికి వెళ్లింది. పరిమిత ఓవర్ల సిరీస్లో మరోసారి సత్తా చాటి ఇందులో భాగంగా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీ20 సిరీస్ను 1-1తో సమం చేసిన టీమిండియా.. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో వన్డేలను 2-1 తేడాతో గెలుచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా తదితర కీలక ఆటగాళ్లు లేకుండానే సౌతాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడి ఈ విజయాలు సాధించింది. అయితే, వరల్డ్కప్-2023 ఫైనల్ ఓటమి తర్వాత విశ్రాంతి తీసుకున్న ఈ ముగ్గురు స్టార్లు టెస్టు సిరీస్కు మాత్రం అందుబాటులోకి వచ్చారు. కాగా సఫారీ గడ్డపై ఇంతవరకు టెస్టు సిరీస్ గెలిచిన ఘనత ఏ భారత జట్టుకూ లేదు. అయితే, రోహిత్ సేన ఆ అపవాదును చెరిపివేయాలని భావిస్తోంది. ఈ సిరీస్లో కోహ్లి 70 పరుగులు చేశాడంటే ఇందుకోసం ఇప్పటికే బాక్సింగ్ డే నాటి తొలి టెస్టుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి అరుదైన ఫీట్ నమోదు చేసే అవకాశం ఉంది. కాగా సౌతాఫ్రికాతో టెస్టుల్లో కోహ్లి ఇప్పటి వరకు 14 ఇన్నింగ్స్ ఆడి 1236 పరుగులు సాధించాడు. ఈ రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా అతడు.. 70 రన్స్ చేయగలిగితే... సఫారీ జట్టుతో టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో భారత బ్యాటర్గా చరిత్ర సృష్టిస్తాడు. తద్వారా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ను అధిగమించి దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ తర్వాతి స్థానాన్ని ఆక్రమిస్తాడు. (ఒకవేళ ఈ సిరీస్లో పూర్తిగా విఫలమై కేవలం 15 పరుగులకే పరిమితమైతే సెహ్వాగ్ తర్వాతి స్థానంలో ఉన్న రాహుల్ ద్రవిడ్ను కూడా అధిగమించలేడు). సౌతాఫ్రికాతో టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్లు 1.సచిన్ టెండుల్కర్- 24 టెస్టుల్లో 1741 రన్స్ 2.వీరేంద్ర సెహ్వాగ్- 15 టెస్టుల్లో 1306 పరుగులు 3.రాహుల్ ద్రవిడ్- 21 టెస్టుల్లో 1252 పరుగులు 4.విరాట్ కోహ్లి- 14 ఇన్నింగ్స్లో 1236 పరుగులు 5.వీవీఎస్ లక్ష్మణ్- 17 మ్యాచ్లలో 976 పరుగులు 6. సౌరవ్ గంగూలీ- 17 మ్యాచ్లలో 947 పరుగులు 7. అజింక్య రహానే- 13 టెస్టుల్లో 884 పరుగులు. చదవండి: స్టార్ బౌలర్లకు షాకిచ్చిన అఫ్గన్ బోర్డు.. రెండేళ్ల నిషేధం! ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు ఎదురుదెబ్బ -
ద్రవిడ్ను కొనసాగిస్తారా? సాగనంపితే... టీమిండియా కొత్త కోచ్ ఎవరు..?
టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల పదవీకాలం వరల్డ్కప్ 2023 ఫైనల్తో ముగిసింది. దీంతో భారత జట్టు కొత్త హెడ్ కోచ్ ఎవరనే అంశంపై చర్చ మొదలైంది. మరో దఫా కొనసాగాలా లేదా అనే దానిపై ఇంకా తేల్చుకోలేదని ద్రవిడ్ వరల్డ్కప్ అనంతరం మీడియా సమావేశంలో తెలిపాడు. మరి బీసీసీఐ రవిశాస్త్రిలా ద్రవిడ్ను రెండో దఫా కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి. ప్రస్తుతానికి అయితే ఆసీస్తో టీ20 సిరీస్కు స్టాండ్ ఇన్ కోచ్గా ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఒకవేళ ద్రవిడ్ రెండో దఫా కోచ్గా పని చేసేందుకు నిరాకరిస్తే లక్ష్మణ్ భారత జట్టు హెడ్ కోచ్ పదవి రేసులో ముందువరుసలో ఉంటాడు. ఈ పదవి కోసం లక్ష్మణ్తో పాటు మరో ఇద్దరు టీమిండియా దిగ్గజాలు పోటీలో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇటీవలే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్గా ప్రకటించబడ్డ వీరేంద్ర సెహ్వాగ్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే లక్ష్మణ్తో పాటు ప్రధాన పోటీదారులుగా నిలిచే ఛాన్స్ ఉంది. వీరిలో కుంబ్లేకు గతంలో భారత జట్టు హెడ్ కోచ్గా పని చేసిన అనుభవం ఉంది. ధోనిని ఒప్పించి అప్పచెబితే.. టీమిండియా హెడ్ కోచ్ పదవి ఖాళీ అయిన నేపథ్యంలో ఈ అంశంపై నెట్టింట జోరుగా చర్చలు సాగుతున్నాయి. కొందరు ద్రవిడ్నే కొనసాగించాలని అంటుంటే, మరికొందరు అతడిని సాగనంపాలని వాధిస్తున్నారు. ఒకవేళ హెడ్ కోచ్ పదవిలో కొనసాగేందుకు ద్రవిడ్ ఆసక్తి కనబర్చకపోతే లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, సెహ్వాగ్లు రేసులో ఉంటారని ప్రచారం జరుగుతుంది. కొత్తగా కొందరు టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరును తెరపైకి తెస్తున్నారు. ధోనికి ఇష్టం లేకపోయినా అతన్ని ఒప్పించి మరీ భారత క్రికెట్ జట్టు కోచింగ్ బాధ్యతలు అప్పజెప్పాలని వారు పట్టుబడుతున్నారు. మరి భారత జట్టుకు కోచింగ్ ఇచ్చేందుకు ధోని ముందుకు వస్తాడో లేదో వేచి చూడాలి. -
రోహిత్ నిరాశ చెందాడో లేదో కానీ.. వాళ్లు మాత్రం: సెహ్వాగ్ విమర్శలు
ICC CWC 2023 Final- Rohit Sharma: టీమిండియా ఈసారి కచ్చితంగా ట్రోఫీ గెలుస్తుందనే అభిమానుల ఆశలు అడియాసలయ్యాయి. సొంతగడ్డపై 2011 నాటి ఫలితం పునరావృతమవుతుందనుకుంటే తీవ్ర నిరాశే మిగిలింది. తుదిపోరుకు ముందు దాకా అజేయంగా ముందుకు సాగిన రోహిత్ సేన అసలు మ్యాచ్లో తడబడి భారీ మూల్యమే చెల్లించింది. ఆఖరి మెట్టుపై ఆస్ట్రేలియా ఒత్తిడిని చిత్తు చేసి ట్రోఫీ గెలవగా.. భారత జట్టుతో పాటు అభిమానుల గుండెలు ముక్కలయ్యాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఆట తీరుపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దూకుడుగా ఆడిన రోహిత్ అహ్మదాబాద్ వేదికగా ఆసీస్తో మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది టీమిండియా. ఓపెనర్ రోహిత్ శర్మ ఆది నుంచే దూకుడుగా ఆడి అద్భుత ఆరంభం అందించాడు. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్(4) విఫలమైనా వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి(54)తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. వీరిద్దరు క్రీజులో కుదురుకుంటే మెరుగైన భాగస్వామ్యంతో భారీ స్కోరుకు పునాది పడేది. కానీ రోహిత్ శర్మ అనూహ్య రీతిలో అవుట్ కావడం కొంపముంచింది. టీమిండియా ఇన్నింగ్స్ పదో ఓవర్లో ఆసీస్ స్పిన్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ బౌలింగ్కు వచ్చాడు. హెడ్ అద్భుత క్యాచ్తో హిట్మ్యాన్ ఇన్నింగ్స్కు తెర అతడి బౌలింగ్లో రెండో బంతికి సిక్స్ కొట్టిన రోహిత్.. మరుసటి బంతికి ఫోర్ బాదాడు. కానీ మరోసారి భారీ షాట్కు యత్నించి మూల్యం చెల్లించాడు. మాక్సీ విసిరిన బంతిని మిడాన్ దిశగా రోహిత్ గాల్లోకి లేపగా.. కవర్ పాయింట్లో ఉన్న ట్రవిస్ హెడ్ పాదరసంలా వెనక్కి కదిలి అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్నాడు. దీంతో మాక్సీ, ఆసీస్ కెప్టెన్ గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకోగా.. మోదీ స్టేడియంలో ఉన్న అభిమానులు ఒక్కసారిగా మూగబోయారు. అలా హాఫ్ సెంచరీకి చేరువైన రోహిత్.. తొందరపడి తప్పుడు షాట్ సెలక్షన్తో 47 పరుగుల వద్ద నిష్క్రమించాడు. మిగతా వాళ్లలో కోహ్లి 54, రాహుల్ 66 పరుగులతో రాణించగా.. 240 పరుగులకు ఆలౌట్ అయిన భారత్.. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోలేక ఓటమిపాలైంది. చెత్త షాట్ సెలక్షన్ ఈ నేపథ్యంలో సెహ్వాగ్ క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఈ విషయంలో రోహిత్ నిరాశ చెందాడో లేదో కానీ మేనేజ్మెంట్ మాత్రం కచ్చితంగా డిస్సప్పాయింట్ అయి ఉంటుంది. వరుస బంతుల్లో సిక్స, ఫోర్ బాదిన తర్వాత కూడా ఇలాంటి షాట్లు ఎంపిక చేసుకోవద్దని శిక్షణా సిబ్బంది అతడికి చెప్పండి. పవర్ ప్లే ముగస్తుంది కాబట్టి మాక్స్వెల్ బౌలింగ్లో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాలని రోహిత్ భావించి ఉంటాడు. ఏదేమైనా.. నిజంగా అది చెత్త షాట్ సెలక్షన్. ఒకవేళ రోహిత్ గనుక అలా చేయకపోయి ఉంటే కథ వేరుగా ఉండేది’’ అని విమర్శించాడు. చదవండి: CWC 2023 Final: మిచెల్ మార్ష్ అనుచిత ప్రవర్తన.. ! View this post on Instagram A post shared by ICC (@icc) -
ICC Cricket World Cup: ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో సెహ్వాగ్, ఎడుల్జీ
దుబాయ్: భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కించుకున్నారు. ఈ ఇద్దరు భారత క్రికెటర్లతో పాటు శ్రీలంక దిగ్గజం అరవింద డిసిల్వాను కూడా తాజాగా ఐసీసీ ఈ విశిష్ట క్రికెటర్ల జాబితాలో చేర్చింది. భారత్ నుంచి ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో ఇప్పటి వరకు తొమ్మిది మందికి చోటు లభించగా... ఎడుల్జీ ఈ జాబితాలో చోటు దక్కించుకున్న తొలి భారత మహిళా క్రికెటర్ కావడం విశేషం. ఆయా జట్లకు అందించిన సేవలు, నడిపించిన తీరు, గెలిపించిన ఘనతలు అన్నీ పరిగణించే ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లోకి ఎంపిక చేస్తారు. డయానా ఎడుల్జీ: భారత్లో అమ్మాయిల క్రికెట్వైపు కన్నెత్తి చూడని రోజుల్లోనే క్రికెటరై తర్వాత సారథిగా ఎదిగింది. 1976 నుంచి 1993 వరకు భారత జట్టుకు ఆడి స్పిన్ ఆల్రౌండర్గా రాణించింది. 20 టెస్టులాడి 63 వికెట్లు తీసి, 404 పరుగులు చేసింది. 34 వన్డేల్లో 211 పరుగులు సాధించి 46 వికెట్లు పడగొట్టింది. సెహ్వాగ్: భారత టెస్టు క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్గా సెహ్వాగ్ రికార్డుల్లోకెక్కాడు. భారత్ 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ సాధించడంలో తనవంతు పాత్ర పోషించాడు. సెహ్వాగ్ 104 టెస్టులు ఆడి 8586 పరుగులు సాధించాడు. 23 సెంచరీలు చేశాడు. 40 వికెట్లు తీశాడు. 251 వన్డేలాడి 8273 పరుగులు, 15 సెంచరీలు సాధించాడు. 96 వికెట్లు కూడా తీశాడు. 19 టి20లు ఆడి 393 పరుగులు సాధించాడు. అరవింద డిసిల్వా: ఆ్రస్టేలియాతో జరిగిన 1996 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో డిసిల్వా వీరోచిత సెంచరీతో జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. 308 వన్డేల్లో 9284 పరుగులు చేశాడు. 106 వికెట్లు పడగొట్టాడు. 93 టెస్టుల్లో 6361 పరుగులు సాధించాడు. -
వీరేంద్ర సెహ్వాగ్కు ఐసీసీ అత్యున్నత గౌరవం.. మరో ఇద్దరి కూడా..!
టీమిండియా డాషింగ్ బ్యాటర్, మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్కు ఐసీసీ అత్యున్నత గౌరవం లభించింది. ఐసీసీ ప్రతిష్టాత్మక హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో వీరూకు చోటు కల్పించింది. వీరూతో పాటు భారత మాజీ మహిళా క్రికెటర్ డయానా ఎడుల్జీ, శ్రీలంక దిగ్గజ ఆటగాడు అరవింద డిసిల్వకు కూడా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో చోటు దక్కింది. ఈ ముగ్గురిని హాల్ ఆఫ్ ద ఫేమర్ల జాబితాలోకి చేరుస్తున్నట్లు ఐసీసీ ట్విటర్ వేదికగా ప్రకటించింది. 🇮🇳 🇱🇰 🇮🇳 Three stars of the game have been added to the ICC Hall of Fame 🏅 Details 👇https://t.co/gLSJSU4FvI — ICC (@ICC) November 13, 2023 45 ఏళ్ల వీరేంద్ర సెహ్వాగ్ 1999-2013 మధ్యలో 104 టెస్ట్లు, 251 వన్డేలు, 19 టీ20ల్లో భారత్కు ప్రాతినిథ్యం వహించి 18641 పరుగులు సాధించాడు. ఇందులో 38 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పార్ట్ టైమ్ స్పిన్నర్ కూడా అయిన వీరూ తన కెరీర్లో 136 వికెట్లు పడగొట్టాడు. 67 ఏళ్ల డయానా 1976-1993 మధ్యలో 20 టెస్ట్లు, 34 వన్డేల్లో భారత్కు ప్రాతినిథ్యం వహించింది. మహిళల టెస్ట్ క్రికెట్లో అత్యధిక బంతులు సంధించిన రికార్డు ఇప్పటికీ డయానా పేరిటే ఉంది. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ అయిన డయానా తన అంతర్జాతీయ కెరీర్లో 109 వికెట్లు పడగొట్టింది. 58 ఏళ్ల అరవింద డిసిల్వ 1984-2003 మధ్యలో 93 టెస్ట్లు, 308 వన్డేల్లో శ్రీలంకకు ప్రాతినిథ్యం వహించి 15645 పరుగులు సాధించాడు. ఇందులో 31 సెంచరీలు, 86 అర్ధ సెంచరీలు ఉన్నాయి. డిసిల్వ తన కెరీర్లో 135 వికెట్లు కూడా పడగొట్టాడు. -
బాగా ఎంజాయ్ చేశారనుకుంటా.. బై బై! మీ స్థాయికి తగునా భయ్యా?
ICC WC 2023: వన్డే వరల్డ్కప్-2023 సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సత్తా చాటిన న్యూజిలాండ్ పాకిస్తాన్ అవకాశాలను గల్లంతు చేసింది. లీగ్ దశలో ఆఖరిగా శ్రీలంకతో మ్యాచ్లో 23.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి మొత్తంగా 10 పాయింట్లు తమ ఖాతాలో జమచేసుకుంది. దీంతో పాక్ ఆశలు అడియాసలయ్యాయి. అయితే, కివీస్- లంక మ్యాచ్ ఫలితం తేలిన తర్వాత కూడా బాబర్ ఆజం బృందం సెమీస్ రేసులో నిలవాలని భావిస్తే వన్డే క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని అద్భుతం జరగాల్సిందే. అద్భుతం జరగాల్సిందే పాకిస్తాన్ తమకు మిగిలిన మ్యాచ్లో ఇంగ్లండ్పై గెలిస్తే న్యూజిలాండ్ మాదిరే 10 పాయింట్లు సాధిస్తుంది. కానీ రన్రేటు పరంగా ఎంతో ముందున్న కివీస్ జట్టును దాటాలంటే.. కోల్కతాలో శనివారం నాటి మ్యాచ్లో ఇంగ్లండ్పై పాక్ ఏకంగా 287 పరుగుల తేడాతో గెలవాలి. కర్మకాలి ఇంగ్లండ్ గనుక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంటే అక్కడే పాక్ కథ ముగిసిపోతుంది. ఎందుకంటే.. ఇంగ్లండ్ ఎంతటి లక్ష్యం విధించినా దానిని మూడు ఓవర్లలోపే పాక్ ఛేజ్ చేయాల్సి ఉంటుంది. ఇది సాధ్యమయ్యే పనైతే కాదు! కాబట్టి భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్-2023 నుంచి పాక్ అనధికారికంగా నిష్క్రమించినట్లే! ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పాకిస్తాన్ జట్టును తనదైన శైలిలో ట్రోల్ చేశాడు. సురక్షితంగా వెళ్లండి.. బైబై ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా.. ‘‘బై బై పాకిస్తాన్’’ అని రాసి ఉన్న అక్షరాల ఫొటోను హైలైట్ చేస్తూ..‘‘పాకిస్తాన్ జిందా‘భాగ్’(పారిపోండి అన్న అర్థంలో) ! మీరింతే.. ఇక్కడి దాకా రాగలరంతే! ఇక్కడి బిర్యానీ రుచి, ఆతిథ్యాన్ని పూర్తిగా ఆస్వాదించారనే అనుకుంటున్నా. విమానంలో సురక్షితంగా ఇంటికి తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నా. బై బై పాకిస్తాన్’’ అంటూ క్యాప్షన్ జత చేశాడు. దాయాది జట్టును ఉద్దేశించి ఈ మాజీ ఓపెనర్ చేసిన పోస్టు నెట్టింట వైరల్గా మారింది. కాగా వన్డే వరల్డ్కప్ ఆడేందుకు తొలుత హైదరాబాద్ చేరుకున్న పాకిస్తాన్ జట్టుకు ఘన స్వాగతం లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ ప్రేమికుల అభిమానానికి ఫిదా అయిన కెప్టెన్ బాబర్ ఆజం, పేసర్ షాహిన్ ఆఫ్రిది తదితరులు కృతజ్ఞతా భావం చాటుకున్నారు. ఇక ఆ తర్వాత వెళ్లిన ప్రతిచోటా హోటల్ నుంచి కాకుండా పాక్ ఆటగాళ్లు.. బయట నుంచి బిర్యానీలు ఆర్డర్ చేశారన్న వార్తలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో వరుస ఓటముల నేపథ్యంలో ఆ జట్టు అభిమానులు సైతం పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో పాక్ సెమీస్ ఆశలు గల్లంతైన తరుణంలో సెహ్వాగ్ ఈ మేరకు పోస్టు పెట్టడం గమనార్హం. మీ స్థాయికి తగునా? అయితే, చాలా మంది నెటిజన్లు వీరేంద్ర సెహ్వాగ్ తీరును తప్పుబడుతున్నారు. ‘‘శత్రువుకు కూడా ప్రేమను పంచే దేశానికి మీరు.. మీ స్థాయిని మరచి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు సర్. గొప్ప క్రికెటర్గా చరిత్రలో స్థానం సంపాదించిన మీకు ఆటను ఆటలాగే చూడాలని తెలియదా’’ అంటూ చురకలు అంటిస్తున్నారు. మరి వాళ్లు అన్నపుడు ఏం చేశారు? అయితే, వీరూ ఫ్యాన్స్ మాత్రం.. ‘‘భయ్యా అన్నదాంట్లో తప్పేముంది? మన జట్టును ఉద్దేశించి పాక్ క్రికెటర్లు చేసిన వ్యాఖ్యలు మీకు కనిపించవా?’’ అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. పాక్ మాజీ సారథి మహ్మద్ హఫీజ్ విరాట్ కోహ్లిని సెల్ఫిష్ అంటూ చేసిన కామెంట్లు, భారత బౌలర్లకు ప్రత్యేక బంతులు ఇచ్చారన్న రజా వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఏదేమైనా సెహ్వాగ్ చేసిన పోస్టు నెట్టింట ఇలా చర్చకు దారితీసింది. చదవండి: ఇలాంటి తోడు ఉంటే ఏదైనా సాధ్యమే! ప్రేమ, పెళ్లి.. రెయిన్బో బేబీ! View this post on Instagram A post shared by Virender Sehwag (@virendersehwag) -
WC 2023: ముష్ఫికర్- షకీబ్ సరికొత్త చరిత్ర.. సెహ్వాగ్- సచిన్ రికార్డు బ్రేక్
ICC Cricket World Cup 2023- New Zealand vs Bangladesh: బంగ్లాదేశ్ బ్యాటర్లు ముష్ఫికర్ రహీం- షకీబ్ అల్ హసన్ చరిత్ర సృష్టించారు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో అరుదైన ఘనత సాధించారు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ జోడీ వీరేంద్ర సెహ్వాగ్- సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టారు. వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్.. తమ మూడో మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడుతోంది. చెన్నైలోని చెపాక్(ఎంఏ చిదంబరం స్టేడియం) వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన కివీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. బంగ్లాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. సెంచరీ భాగస్వామ్యంతో.. ఈ క్రమంలో తొలి బంతికే ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో ఓపెనర్ లిటన్ దాస్ డకౌట్గా వెనుదిరగగా.. మరో ఓపెనర్ తాంజిద్ హసన్ 16 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. ఇక వన్డౌన్ బ్యాటర్ మెహిదీ హసన్ మిరాజ్ 30 పరుగులతో రాణించగా.. నాలుగో స్థానంలో వచ్చిన నజ్ముల్ హొసేన్ షాంటో(7) పూర్తిగా నిరాశపరిచాడు. ఇలా 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన జట్టును కెప్టెన్ షకీబ్ అల్ హసన్, వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం ఆదుకున్నారు. అద్భుత భాగస్వామ్యంతో బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోరు చేసేందుకు బాటలు వేశారు. షకీబ్ 51 బంతుల్లో 40 రన్స్ తీయగా.. ముష్ఫికర్ రహీం 75 బంతులు ఎదుర్కొని 66 పరుగులు సాధించాడు. అత్యధిక పార్ట్నర్షిప్ నమోదు చేసిన జోడీగా.. ఈ క్రమంలో వన్డే వరల్డ్కప్ చరిత్రలో అరుదైన భాగస్వామ్య రికార్డు నెలకొల్పారు. ఇద్దరూ కలిపి 19 ఇన్నింగ్స్లో 972 పరుగుల పార్ట్నర్షిప్ సాధించారు. తద్వారా సెహ్వాగ్- సచిన్ల రికార్డును అధిగమించారు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్- సచిన్ టెండుల్కర్ కలిపి 20 ఇన్నింగ్స్లో 971 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఈ జాబితాలో 20 ఇన్నింగ్స్లో 1220 పరుగుల భాగస్వామ్యంతో ఆస్ట్రేలియా మాజీ స్టార్లు ఆడం గిల్క్రిస్ట్- మాథ్యూ హెడెన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. బంగ్లా, టీమిండియా జోడీలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మరో రికార్డు.. ఇది సమంగా.. వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక 50+ పార్ట్నర్షిప్స్ నమోదు చేసిన జోడీలు ఆడం గిల్క్రిస్ట్- మాథ్యూ హెడెన్- 12 వీరేంద్ర సెహ్వాగ్- సచిన్ టెండుల్కర్- 8 ముష్ఫికర్ రహీం- షకీబ్ అల్ హసన్- 8. కాగా కివీస్తో మ్యాచ్లో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు స్కోరు చేసింది. చదవండి: ‘శార్దూల్ ఎందుకు? సిరాజ్ను ఎందుకు ఆడిస్తున్నారు?.. అసలేంటి ఇదంతా?’ View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2011లో నేనే కెప్టెన్ అయి ఉంటే అతడిని తప్పక తీసుకునేవాడిని.. కానీ!
ICC WC 2023- Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఉద్దేశించి భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్కప్-2011 సమయంలో తాను సెలక్టర్ లేదంటే కెప్టెన్ అయి ఉంటే.. రోహిత్ను తప్పక జట్టుకు ఎంపిక చేసేవాడినని పేర్కొన్నాడు. అయితే, నాడు రోహిత్ శర్మ ఇలా లేడన్న వీరూ భాయ్.. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే అప్పటి కెప్టెన్, సెలక్టర్లు నిర్ణయం తీసుకుని ఉంటారని పేర్కొన్నాడు. బహుశా అప్పుడలా జట్టులో చోటు దక్కకపోవడం వల్లే హిట్మ్యాన్కు మేలు జరిగిందని అభిప్రాయపడ్డాడు. రోహిత్ను వద్దని అతడి వైపు మొగ్గు కాగా మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2011లో సొంతగడ్డ మీద టీమిండియా వన్డే ప్రపంచకప్ ట్రోఫీని గెలిచిన విషయం తెలిసిందే. నాటి జట్టులో భారత దిగ్గజ బ్యాటర్లు సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ సహా విరాట్ కోహ్లి వంటి యువకులకు చోటు దక్కింది. అయితే, రోహిత్ శర్మకు మాత్రం మొండిచేయి ఎదురైంది. జట్టు సమతూకం కోసం స్పిన్నర్ పీయూష్ చావ్లా వైపు మొగ్గుచూపాడు ధోని. దీంతో ఈ ముంబై బ్యాటర్ ఆశలకు గండిపడింది. ఈ నేపథ్యంలో నాడు స్వదేశంలో వరల్డ్కప్ ఆడలేకపోయిన రోహిత్ శర్మ.. పుష్కరకాలం తర్వాత సొంతగడ్డపై టీమిండియా కెప్టెన్ హోదాలో బరిలోకి దిగడం విశేషం. View this post on Instagram A post shared by ICC (@icc) సెంచరీతో రికార్డులు బద్దలు ఈ క్రమంలో వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్తో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరల్డ్కప్లో ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక సెంచరీలు(7) చేసిన ఆటగాడిగా నిలిచి.. సచిన్ టెండూల్కర్ (6) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. అదే విధంగా.. అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో కలిపి) 556 సిక్సర్లు బాదిన రోహిత్.. క్రిస్గేల్ (553) రికార్డు అధిగమించాడు. అంతేకాదు.. ఈ మ్యాచ్లో 63 బంతుల్లోనే సెంచరీ చేసి.. వరల్డ్కప్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఇక ఈ మ్యాచ్లో అఫ్గన్పై 8 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా టోర్నీలో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. నేనైతే రోహిత్ను సెలక్ట్ చేసేవాడిని.. కానీ ఈ మ్యాచ్ అనంతరం క్రిక్బజ్ షోలో సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘‘ఆరోజు నేను కెప్టెన్ లేదంటే సెలక్టర్ అయి ఉంటే రోహిత్ను తప్పకుండా జట్టుకు ఎంపిక చేసేవాడిని. అయితే, అప్పుడు రోహిత్ ఇప్పటిలా లేడు. ఏదేమైనా జట్టును సమతూకంగా ఉంచేందుకు నాడు కెప్టెన్(ధోని) ఆ నిర్ణయం తీసుకున్నాడు. అయితే, ఆరోజు జట్టులో చోటు లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన రోహిత్.. రియలైజ్ అయి తనను తాను మార్చుకున్నాడు. నిలకడైన ఆటతో ఈ స్థాయికి చేరుకున్నాడు. మరి ఈసారి వరల్డ్కప్లో వచ్చిన ఛాన్స్ను ఎలా మిస్ చేసుకుంటాడు’’ అని ప్రశంసలు కురిపించాడు. 2011లో యూసఫ్ పఠాన్ కొన్ని కీలక ఇన్నింగ్స్ ఆడిన కారణంగా రోహిత్ శర్మను కాదని అదృష్టం అతడిని వరించిందని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. చదవండి: WC: అప్పుడు స్మిత్.. ఇప్పుడు నవీన్! కోహ్లి చర్య వైరల్.. గంభీర్ ప్రశంసలు View this post on Instagram A post shared by ICC (@icc) -
సచిన్, కోహ్లి,ధోని కాదు.. ఆల్టైమ్ గ్రేటస్ట్ బ్యాటర్ అతడే
వరల్డ్క్రికెట్లో ఆల్టైమ్ గ్రేటస్ట్ బ్యాటర్ అంటే చాలా మంది భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరునే చెబుతారు. లేదంటే ఏ సర్ వివియన్ రిచర్డ్స్, రికీ పాంటింగ్, కుమార సంగక్కర, ధోని వంటి వారి పేర్లను చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుత తరంలో అయితే విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, బాబర్ ఆజం, రోహిత్ శర్మలో ఎవరో ఒకరని అత్యుత్తమ బ్యాటర్గా ఎంచుకుంటారు. కానీ శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ దృష్టిలో వీరవరూ గ్రేటెస్ట్ ఆటగాళ్లు కాదంట. వరల్డ్ క్రికెట్లో లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్న మురళీధరన్ తాజాగా స్టార్ స్పోర్ట్స్ షోలో పాల్గోనున్నాడు. ఈ సందర్భంగా మురళీధరన్కు మీ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ క్రికెటర్ ఎవరన్న ప్రశ్న ఎదురైంది. అక్కడ ఉన్నవారంతా సచిన్ లేదా కోహ్లి పేరును చెబుతారని భావించారు. కానీ ముత్తయ్య మాత్రం అందరి ఊహలను తలకిందులు చేస్తూ టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరును ముత్తయ్య చెప్పాడు. కాగా భారత క్రికెట్లో సెహ్వాగ్కు కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 14 ఏళ్ల పాటు టీమిండియాకు సెహ్వాగ్ ప్రాతినిథ్యం వహించాడు. వీరేంద్రడు తన అంతర్జాతీయ కెరీర్లో 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20 ఆడాలు ఆడాడు. 2011 వన్డే ప్రపంచకప్, 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యునిగా సెహ్వాగ్ ఉన్నాడు. చదవండి: ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్లో ఫాస్టెస్ట్ సెంచరీ ఎవరిదో తెలుసా? Recalling those names etched in GOLD! 😍 Our StarCast @IrfanPathan, @wasimakramlive, @M_Raj03, @PiyushChawla255 & more name their greatest of all time ODI cricketers! Name yours 👇 pic.twitter.com/gP8UCAnNgu — Star Sports (@StarSportsIndia) October 3, 2023 -
వాళ్లిద్దరూ అందుకు అర్హులే.. రోహిత్ అప్పుడు మిస్ అయ్యాడు.. ఈసారి: సెహ్వాగ్
ICC ODI World Cup 2023: 2011, 2015 వరల్డ్కప్ జట్లలో సభ్యుడిగా.. 2019 ప్రపంచకప్ టోర్నీలో కెప్టెన్గా.. 2023లో మరోసారి ఆటగాడిగా.. మీరు ఊహించిన పేరు కరెక్టే.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి.. ధోని సారథ్యంలోని జట్టులో భాగమై ట్రోఫీని ముద్దాడాడు. నాడు సచిన్ను భుజాలపై మోసిన కోహ్లి పన్నెండేళ్ల క్రితం భారత్ సొంతగడ్డ మీద తొలిసారి ప్రపంచకప్ గెలిచిన సంబరంలో పాలుపంచుకున్నాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ను భుజాల మీద మోస్తూ.. దిగ్గజానికి సహచర ఆటగాడిగా తనకు దక్కిన గౌరవానికి మురిసిపోయాడు. అదే తరహాలో విరాట్ కోహ్లికి సైతం ఈసారి సన్మాన సత్కారం జరగాలని టీమిండియా మాజీ ఓపెనర్, 2011 వరల్డ్కప్ విన్నర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆకాంక్షించాడు. వన్డే ప్రపంచకప్-2023లో ట్రోఫీ గెలిచి.. నాడు సచిన్ మాదిరే ఈసారి కోహ్లిని కూడా అలా భుజాలపై మోస్తూ మైదానమంతా తిప్పితే చూడాలని ఉందని పేర్కొన్నాడు. చీకూని అలా భుజాలపై మోస్తే ‘‘చీకూ(కోహ్లి) 2019 వరల్డ్కప్ టోర్నీలో ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు. ఈసారి అతడు వీలైనన్ని ఎక్కువ శతకాలు బాదుతాడనుకుంటున్నా. ఈసారి టోర్నమెంట్లో టాప్ రన్ స్కోరర్గా నిలిస్తే బాగుంటుంది. ఇక ట్రోఫీ గెలిస్తే సహచర ఆటగాళ్లు కోహ్లిని భుజాలపై ఎత్తుకుని గ్రౌండ్ అంతా కలియదిరిగితే చూడాలనేది నా కోరిక’’ అని వీరూ భాయ్ క్రిక్బజ్తో మాట్లాడుతూ తన మనసులోని మాట వెల్లడించాడు. వాళ్లిద్దరూ అర్హులే.. అప్పుడు రోహిత్ మిస్ అయ్యాడు అదే విధంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘కోహ్లి- రోహిత్.. ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు వరల్డ్కప్ గెలిచేందుకు పూర్తి అర్హులు. 2011లో ప్రపంచకప్ ఆడాల్సిన రోహిత్ కొద్దిలో మిస్ అయ్యాడు. ఆ తర్వాత వన్డే ఫార్మాట్లో అతడు బాద్షా అయిపోయాడు. ఈసారి కెప్టెన్ హోదాలో ట్రోఫీ గెలిస్తే అంతకంటే సంతోషం ఉండదు. అద్భుతమైన ఆటగాడు రోహిత్’’ అంటూ సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో మ్యాచ్తో టీమిండియా ఐసీసీ ఈవెంట్ను మొదలుపెట్టనుంది. చదవండి: 1987లో జన్మించిన కెప్టెన్దే ఈసారి వరల్డ్కప్ ట్రోఫీ! లిస్టులో ఎవరంటే! -
కౌన్ బనేగా కరోడ్పతిలో మరో క్రికెట్ ప్రశ్న.. ఈసారి 3 లక్షల 20 వేలకు..!
బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న ప్రముఖ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్పతిలో వరుసగా రెండో ఎపిసోడ్లో క్రికెట్కు సంబంధించిన ప్రశ్న వచ్చింది. సెప్టెంబర్ 19న ప్రసారమైన ఎపిసోడ్లో ఓ కంటెస్టెంట్ను భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 10కి 10 వికెట్లకు సంబంధించిన ప్రశ్నను ఎదుర్కొనగా.. నిన్న (సెప్టెంబర్ 20) ప్రసారమైన ఎపిసోడ్లో మరో కంటెస్టెంట్ వీరేంద్ర సెహ్వాగ్కు సంబంధించిన ప్రశ్నను ఎదుర్కొన్నాడు. 19వ తారీఖున ప్రసారమైన ఎపిసోడ్లో కుంబ్లేకు సంబంధించిన ప్రశ్నకు ప్రైజ్మనీ 12 లక్షల 50 వేల రూపాయలు కాగా.. సెప్టెంబర్ 20న సెహ్వాగ్ గురించిన ప్రశ్నకు ప్రైజ్మనీ 3 లక్షల 20 వేల రూపాయలుగా ఉంది. ఇంతకీ ప్రశ్న ఏంటంటే..? వీరేంద్ర సెహ్వాగ్ వన్డేల్లో తాను చేసిన ఏకైక డబుల్ సెంచరీని ఏ స్టేడియంలో చేశాడు..? ఈ ప్రశ్నకు ఆప్షన్స్గా బారాబతి స్టేడియం, కటక్.. ఈడెన్ గార్డెన్స్ కోల్కతా.. హోల్కర్ స్టేడియం, ఇండోర్.. బ్రబోర్న్ స్టేడియం, ముంబైలను ఇచ్చారు. మరి ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలిస్తే కామెంట్ చేయండి. గత ఎడిసోడ్లోని ప్రశ్న ఏంటంటే..? భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే టెస్ట్ల్లో ఒకే ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు (పాక్పై) తీసినప్పుడు బౌలర్ ఎండ్లో ఉన్న అంపైర్ ఎవరు..? ఈ ప్రశ్నకు ఆప్షన్స్గా పిలూ రిపోర్టర్, ఎస్ వెంకట్రాఘవన్, డేవిడ్ షెపర్డ్, ఏవీ జయప్రకాశ్ పేర్లు ఇచ్చారు. ఇదిలా ఉంటే, వీరేంద్ర సెహ్వాగ్ వన్డేల్లో తాను చేసిన ఏకైక డబుల్ సెంచరీ 2011లో వెస్టిండీస్పై చేశాడు. నాటి మ్యాచ్లో వీరూ 149 బంతుల్లో 25 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 219 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్లో గౌతమ్ గంభీర్ (67), సురేశ్ రైనా (55) కూడా అర్ధసెంచరీలతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 418 పరుగుల భారీ స్కోర్ చేసింది. అతి భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటై 153 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. -
విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్లా ఆడగలను: సింథియా
ఢిల్లీ: ప్రతీకార రాజకీయాలు చేయడం తనకు ఇష్టం ఉండదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు కమల్నాథ్, దిగ్విజయ్ సింగ్లపై తనకు ఎలాంటి పగ లేదని చెప్పారు. తాను ఎప్పుడూ ముఖ్యమంత్రి పదవి రేసులో లేనని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ అభివృద్ధిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించే వ్యక్తినని ఆయన అన్నారు. 2018లో కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం కమల్నాథ్ను సీఎంగా ప్రకటించడం పట్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సింథియా చెప్పారు. సీఎం రేసులో తాను ఎప్పుడూ లేనని స్పష్టం చేశారు. పైగా కమల్నాథ్ సీఎం అభ్యర్థిగా ప్రకటించడంపై తాను కూడా మద్ధతు తెలిపినట్లు గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దోపిడీ పాలన జరిగిందని కాంగ్రెస్పై మండిపడ్డారు. అన్ని వాగ్దానాలను మరిచిపోయారని కాంగ్రెస్ను దుయ్యబట్టారు. 2018లో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కమల్నాథ్ను అధిష్ఠానం సీఎంగా నిర్ణయించింది. 2020లో జ్యోతిరాదిత్య సింథియా 20 మంది ఎమ్మెల్యేలతో పార్టీని ఫిరాయించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. విరాట్ కోహ్లీ, సెహ్వాగ్లా ఆడగలను.. భవిష్యత్పైనే తనకు దృష్టి ఉంటుందని సింథియా అన్నారు. విరాట్ కోహ్లీ, సెహ్వాగ్లాగా తాను ఆడగలనని అన్నారు. ఒకవేళ తాను అలా ఆడకపోయి ఉంటే.. 2020లో మధ్యప్రదేశ్లో ప్రభుత్వం కూలిపోయేది కాదని అన్నారు. కాంగ్రెస్లో సీట్ల కేటాయింపులో ఉండే అర్హత సంస్కృతిపై సింథియా మండిపడ్డారు. బీజేపీలో కష్టపడ్డవారికే ఫలితం ఉంటుందని, కాంగ్రెస్లో అలా కాదని అన్నారు. మధ్యప్రదేశ్లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: Nuh Violence: కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. ఇంటర్నెట్ బంద్.. -
ఇండియా పేరు మార్చాలన్న సెహ్వాగ్.. ఏం ఉపయోగమంటూ హీరో కౌంటర్
ఇండియా.. భారత్గా మారబోతుందా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూస్తుంటే త్వరలోనే అది నిజం కానున్నట్లు కనిపిస్తోంది. అయితే చాలామంది పేరు మార్పును సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పేరు మార్పును సమర్థించే లిస్ట్లో ప్రముఖ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ ముందు వరుసలో ఉన్నారు. భారత్గా పేరు మార్చాలి 'మనకు గర్వకారణంగా అనిపించే పేరు ఒకటి ఉండాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. మనమంతా భారతీయులం. ఇండియా అనే పేరు బ్రిటీష్ వాళ్లు ఇచ్చారు. దాన్ని త్యజించాల్సిన సమయం వచ్చింది. మన దేశానికి భారత్ అనే పేరును ఖరారు చేయాలి. అలాగే వరల్డ్ కప్లో ఆడే క్రికెటర్ల షర్ట్లపై కూడా ఇండియాకు బదులు భారత్ అన్న పేరు ఉండేలా చర్యలు తీసుకోవలి' అంటూ బీసీసీఐని కోరారు. ఈ ట్వీట్కు కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ కౌంటరిచ్చాడు. 'సర్.. మీకు ఇన్నేళ్లుగా ఇండియా అనే పదం గర్వంగా అనిపించలేదా?' అని ప్రశ్నించాడు. దేనికి ఉపయోగం? మరో ట్వీట్లో షూటింగ్ లొకేషన్లో ఉన్న ఫోటో షేర్ చేస్తూ.. 'అసలు ఈ పేరు మార్పు దేనికి? మన దేశ ఉన్నతికి, ఆర్థిక వ్యవస్థకు ఇది ఏమేరకు ఉపయోగపడుతుంది? ఈ మధ్యకాలంలో నేను చూసిన వింతవార్త ఇదే.. ఇండియా అంటే భారత్.. మన దేశాన్ని ఇండియా, భారత్గా.. ఇలా రెండు పేర్లతో పిల్చుకుంటూ వచ్చాం.. కానీ ఉన్నట్లుండి భారత్ అనే పదాన్ని ఎందుకు వదిలించుకోవాలనుకుంటున్నారు?' అని ప్రశ్నించాడు. నీ గట్స్కు హ్యాట్సాఫ్ కేరళను కేరళంగా మార్చితే లేనిది.. ఇండియాను భారత్గా మార్చితే మాత్రం తప్పవుతుందా? అని నిలదీస్తున్నారు కొందరు నెటిజన్లు. మరికొందరేమో.. ప్రతిపక్షం ఇండియా అనే కూటమిగా ఏర్పడింది కాబట్టే ప్రభుత్వం తట్టుకోలేక భారత్ అని పేరు మారుస్తోందంటున్నారు. ఏదేమైనా ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా గళం వినిపించావంటే నువ్వు గ్రేట్ అని కొనియాడుతున్నారు అభిమానులు. Thinking deep from this shoot location… Wat ?????? name change ???? But why????? How does this help our country’s progress and its economy? This is the strangest news ive come accross in recent times… India was always bharat… We always knew our country as INDIA AND… pic.twitter.com/4X6Y8XbrL6 — VISHNU VISHAL - VV (@TheVishnuVishal) September 5, 2023 Sir with due respect… The name INDIA didn instill pride in you all these years?? https://t.co/ibm68uZ7e8 — VISHNU VISHAL - VV (@TheVishnuVishal) September 5, 2023 చదవండి: అడల్ట్ సినిమాలు చేస్తే తప్పేంటి? టేస్టీ తేజకు షకీలా కౌంటర్ -
సచిన్ వికెట్ తీసిన పాక్ బౌలర్! ఆస్తులన్నీ అమ్మి ఆస్ట్రేలియాలో డ్రైవర్గా.. ఆ తర్వాత
క్రికెటర్లుగా మారి సంపన్నలుగా ఎదిగిన ఆటగాళ్లు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా టీమిండియా క్రికెటర్లలో సచిన్ టెండుల్కర్ మొదలు.. మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వందలాది కోట్ల రూపాయలు ఆర్జించి రిచెస్ట్ ప్లేయర్ల జాబితాలో స్థానం సంపాదించారు. ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ కూడా బాగానే ఆర్జించాడు. అయితే, అందరు క్రికెటర్ల పరిస్థితి ఇలాగే ఉండదు. దురదృష్టం వెక్కిరిస్తే.. ఆకలికి అలమటించాల్సిన రోజులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకప్పుడు ఉత్తమ బౌలర్లలో ఒకడిగా ఎదుగుతాడని భావించిన పాకిస్తాన్ క్రికెటర్ కథే ఇందుకు నిదర్శనం. జింబాబ్వేతో మ్యాచ్తో అరంగేట్రం 1971, మార్చి 22న పెషావర్లో జన్మించాడు అర్షద్ ఖాన్. క్రికెట్పై ఆసక్తి పెంచుకున్న అతడు.. 1993లో జింబాబ్వేతో వన్డే సందర్భంగా పాకిస్తాన్ తరఫున అరంగేట్రం చేశాడు. 1997లో వెస్టిండీస్తో మ్యాచ్ నేపథ్యంలో అంతర్జాతీయ టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. 1993- 2006 వరకు అంతర్జాతీయ కెరీర్లో మొత్తంగా 9 టెస్టులు, 58 వన్డేలు ఆడిన ఈ రైట్ఆర్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ వరుసగా 32, 56 వికెట్లు పడగొట్టాడు. తన అంతర్జాతీయ కెరీర్లో ప్రత్యర్థి బ్యాటర్లకు చెమటలు పట్టించిన అర్షద్ ఖాన్.. టీమిండియాతో మ్యాచ్లలోనూ సత్తా చాటాడు. అర్షద్ ఖాన్(PC: PCB) సచిన్, సెహ్వాగ్ వికెట్లు తీసిన ఘనత భారత్లో పర్యటించిన జట్టులో భాగమైన అతడు.. టీమిండియా లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ సహా విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఆల్రౌండర్ యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ తదితరులను అవుట్ చేశాడు. ఇక చివరిసారిగా 2005లో టీమిండియాతో అర్షద్ ఖాన్ తన ఆఖరి వన్డే ఆడాడు. ఆస్తులన్నీ అమ్మి ఆస్ట్రేలియాలో టాక్సీ డ్రైవర్గా అయితే, ఇండియన్ క్రికెట్ లీగ్ బరిలో దిగిన తర్వాత అర్షద్ ఖాన్.. కెరీర్ చరమాంకానికి చేరుకుంది. జాతీయ జట్టులో పునరాగమనం చేయాలన్న అతడి ఆశలు అడియాసలయ్యాయి. అప్పటికే పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన అర్షద్ ఖాన్.. పాకిస్తాన్లో ఉన్న తన ఆస్తులన్నీ అమ్మి ఆస్ట్రేలియాకి వలస వెళ్లాడు. సిడ్నీలో టాక్సీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో 2020లో ఓ క్రికెట్ ఫ్యాన్ సిడ్నీలో అర్షద్ను గుర్తుపట్టడంతో అతడి ఆర్థిక స్థితి గురించి ప్రపంచానికి తెలిసింది. పీసీబీ సాయంతో మళ్లీ క్రికెట్తో అనుబంధం ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అర్షద్ ఖాన్కు సాయం చేయాలని నిర్ణయించుకుంది. తన బౌలింగ్ నైపుణ్యాలతో జట్టు విజయాల్లో భాగమైన అతడికి మహిళా క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్గా అవకాశం కల్పించింది. అలా.. మళ్లీ 52 ఏళ్ల అర్షద్ పాకిస్తాన్కు చేరుకోగలిగాడు. ఆసియా కప్-2023 నేపథ్యంలో సెప్టెంబరు 2న దాయాదులు భారత్- పాకిస్తాన్ తలపడనున్న తరుణంలో అర్షద్ ఖాన్ గతానికి సంబంధించిన వార్త ఆసక్తికరంగా మారింది. చదవండి: WC 2023: వరల్డ్కప్ జట్టులో సంజూకు ఛాన్స్! వాళ్లిద్దరికీ షాక్.. ఈసారి ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక వికెట్ల వీరుడు అతడే: విండీస్ దిగ్గజం -
40 బంతుల్లో శతక్కొట్టిన టీమిండియా ట్రిపుల్ సెంచూరియన్
వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్ట్ల్లో భారత్ తరఫున ట్రిపుల్ సెంచరీ సాధించిన కరుణ్ నాయర్.. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహారాజా టీ20 టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే లీడింగ్ రన్స్కోరర్గా కొనసాగుతున్న నాయర్.. గుల్భర్గా మిస్టిక్స్తో ఇవాళ (ఆగస్ట్ 28) జరుగుతున్న రెండో సెమీఫైనల్లో 40 బంతుల్లోనే శతక్కొట్టి, తన జట్టు (మైసూర్ వారియర్స్) భారీ స్కోర్ సాధించడంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా 42 బంతులు ఎదుర్కొన్న నాయర్.. 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేసి, అజేయంగా నిలిచాడు. నాయర్కు ఆర్ సమర్థ్ (50 బంతుల్లో 80; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), ఎస్ కార్తీక్ (23 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన మైసూర్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోర్ చేసింది. Karun Nair continues his dream run in the Maharaja T20 League 2023. pic.twitter.com/MojOUiPtim — CricTracker (@Cricketracker) August 28, 2023 నాయర్ విధ్వంసం ధాటికి గుల్భర్గా బౌలర్లు అభిలాష్ షెట్టి (4-0-63-1), విజయ్కుమార్ వైశాక్ (4-0-45-0), అవినాశ్ (3.4-0-44-1), నొరోన్హా (2-0-36-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం 249 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుల్భర్గా.. 9 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. గుల్భర్గా ఇన్నింగ్స్లో చేతన్ 28, ఆనీశ్ 23, నొరోన్హా 39 నాటౌట్, స్మరణ్ 0, అమిత్ వర్మ 11, హసన్ ఖలీద్ 4 నాటౌట్ పరుగులు చేశారు. మైసూర్ బౌలర్లలో జగదీశ సుచిత్ 2, మోనిశ్ రెడ్డి, గౌతమ్ మిశ్రా తలో వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే, టెస్ట్ల్లో భారత్ తరఫున సెహ్వాగ్ 2, కరుణ్ నాయర్ ఓసారి ట్రిపుల్ సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే. సెహ్వాగ్ 2004లో పాకిస్తాన్పై తన తొలి ట్రిపుల్ సెంచరీని (309) (భారత్ తరఫున మొట్టమొదటిది), 2008లో సౌతాఫ్రికాపై తన రెండో ట్రిపుల్ హండ్రెడ్ను (319) బాదాడు. ఆ తర్వాత 2016లో కరుణ్ నాయర్ ఇంగ్లండ్పై చెన్నైలో ట్రిపుల్ సెంచరీని (303 నాటౌట్) సాధించి, భారత్ తరఫున టెస్ట్ల్లో సెహ్వాగ్ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. -
కోహ్లి కాదు! వరల్డ్కప్ అంటే అతడికి ఊపొస్తుంది.. టాప్ స్కోరర్ తనే: సెహ్వాగ్
Virender Sehwag Picks WC 2023 Top Run-Getter: ‘‘వరల్డ్కప్ అంటే చాలు అతడిలో కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది. అద్బుతమైన ప్రదర్శనలతో చెలరేగుతాడు. ఈసారి కూడా అదరగొడుతాడు. ఈసారి కేవలం ఆటగాడిగా మాత్రమే కాదు.. కెప్టెన్గానూ బరిలోకి దిగుతున్నాడు. కాబట్టి ఇంకాస్త జాగ్రత్తగా ఉంటాడు. కచ్చితంగా తనదైన ముద్ర వేస్తాడు. టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తాడు’’ అని టీమిండియా విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023 నిర్వహణకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. వరల్డ్కప్ పోటీలో పది జట్లు! ఆతిథ్య టీమిండియాతో పాటు శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, నెదర్లాండ్స్ ఈ ఐసీసీ ఈవెంట్లో తలపడనున్నాయి. పది వేదికల్లో నిర్వహించే ప్రపంచకప్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సెమీస్ చేరే జట్లు, విజేతపై పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ టాప్ స్కోరర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్కప్-2023లో అత్యధిక పరుగులు సాధిస్తాడని అంచనా వేశాడు. అందుకే రోహిత్ శర్మ పేరు చెప్పాను హిట్మ్యాన్ను ఉద్దేశించి పైవిధంగా స్పందించిన వీరూ భాయ్.. ‘‘ఇండియా పిచ్లపై ఓపెనర్లు మంచి స్కోర్లు సాధిస్తారనుకుంటున్నా. ఎవరో ఒకరిని ఎంపిక చేసుకోవాలంటే నేనైతే రోహిత్ శర్మ పేరు చెబుతా. ఇంకో ఇద్దరు ముగ్గురు పేర్లున్నా.. నేను ఇండియన్ కాబట్టే ఇండియన్ పేరే చెప్తాను.. అది మరెవరో కాదు రోహిత్ శర్మనే!’’ అని పేర్కొన్నాడు. కోహ్లి ఫ్యాన్స్ హర్ట్! ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా వైరల్గా మారింది. అయితే సెహ్వాగ్ వ్యాఖ్యలపై రోహిత్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తుండగా.. విరాట్ కోహ్లి ఫ్యాన్స్ మాత్రం హర్ట్ అవుతున్నారు. మీరు కింగ్ పేరు కావాలనే మర్చిపోయినట్లున్నారు అని వీరూను ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు. కాగా ప్రపంచకప్ టోర్నీలో రోహిత్ సేన అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. చదవండి: గంగూలీ కీలక వ్యాఖ్యలు.. కోహ్లినే కరెక్ట్ అన్న ఏబీడీ! ఇష్టం ఉన్నా లేకపోయినా.. WC: కోహ్లి, బాబర్ కాదు.. ఈసారి అతడే టాప్ స్కోరర్: సౌతాఫ్రికా లెజెండ్ Asia Cup: కోహ్లి కాదు.. యో- యో టెస్టులో అతడే టాప్! స్కోరెంతంటే? View this post on Instagram A post shared by ICC (@icc) -
అరంగేట్రంలో 4 రన్స్! మూడో మ్యాచ్లో ఏకంగా ట్రిపుల్ సెంచరీ.. కానీ ఏడాదిలోనే ఖతం!
After Virender Sehwag Only Other Indian To Score Triple Century: అంతర్జాతీయ టెస్టు మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లో శతక్కొట్టిన బ్యాటర్లు కోకొల్లలు. అదే ట్రిపుల్ సెంచరీ సాధించిన వాళ్లు మాత్రం అరుదు. ఆ జాబితాలో ఉన్న వాళ్లెవరనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు వీరేంద్ర సెహ్వాగ్. ఈ టీమిండియా విధ్వంసకర ఓపెనర్ 2004లో తొలిసారి ఈ ఫీట్ అందుకున్నాడు. అది కూడా మన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ గడ్డపై 309 పరుగులు సాధించి ముల్తాన్ కింగ్గా నీరజనాలు అందుకున్నాడు. 2008లో స్వదేశంలో సౌతాఫ్రికాతో మ్యాచ్లో చెన్నైలో 319 పరుగులతో మెరిశాడు. ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టి మరి వీరూతో పాటుగా ఈ త్రిశతక లిస్టులో ఉన్న మరో భారత క్రికెటర్ గురించి తెలుసా? దేశవాళీ క్రికెట్లో కర్ణాటకకు ప్రాతినిథ్యం వహించే రాజస్తాన్ బ్యాటర్ కరుణ్ నాయర్. 2013-14 సీజన్లో రంజీ ట్రోఫీలో అదరగొట్టిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ ఫైనల్లో ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. 328 పరుగులతో రాణించి కర్ణాటకు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాతి రంజీ సీజన్లో రెండు శతకాలు బాదడంతో పాటుగా మరో రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇలా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన కరుణ్ నాయర్ 2016లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. 4 పరుగుల వద్ద రనౌట్.. తర్వాత ఎల్బీగా.. జింబాబ్వేతో వన్డే మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అతడు.. అదే ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్తో సిరీస్తో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. మొహాలీలో మూడో టెస్టు సందర్భంగా తన తొలి మ్యాచ్ ఆడిన కరుణ్ నాయర్.. 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయి పూర్తిగా నిరాశపరిచాడు. బ్యాట్ ఝులిపించి.. ట్రిపుల్ సెంచరీ బాది తదుపరి ముంబై మ్యాచ్లోనూ 13 పరుగులకే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో తీవ్ర విమర్శలు మూటగట్టుకున్న కరుణ్.. ఐదో టెస్టులో మాత్రం బ్యాట్ ఝులిపించాడు. తొలి ఇన్నింగ్స్లో 381 బంతులు ఎదుర్కొని 303 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతర్జాతీయ కెరీర్లో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయకుండానే ఏకంగా త్రిశతకం బాది సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్పై టీమిండియా ఇన్నింగ్స్ 75 పరుగుల భారీ తేడాతో గెలవగా.. కరుణ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సెహ్వాగ్ తర్వాత రెండో భారత క్రికెటర్గా.. అలా ప్రపంచంలో నంబర్ 1 ఇక ఈ మ్యాచ్ సందర్భంగా.. ట్రిపుల్ సెంచరీతో మెరిసి ప్రపంచంలో ఈ ఘనత సాధించి మూడో క్రికెటర్గా కరుణ్ నాయర్ రికార్డులకెక్కాడు. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్గా నిలిచాడు. ఏడాదిలోనే ముగిసిన కెరీర్ అదే విధంగా.. తక్కువ మ్యాచ్లు ఆడి టెస్టుల్లో త్రిశతకం నమోదు చేసిన ఏకైక బ్యాటర్గా అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత మెరుగ్గా రాణించలేకపోయిన కరుణ్ నాయర్ కెరీర్ మరుసటి ఏడాదే ముగిసింది. 2017 మార్చిలో ఆస్ట్రేలియాతో టెస్టులో చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. తన కెరీర్లో మొత్తంగా టీమిండియా తరఫున 6 టెస్టులు, రెండు వన్డేలు ఆడిన కరుణ్ నాయర్ వరుసగా ఆయా ఫార్మాట్లలో మొత్తంగా 374, 39 పరుగులు చేయగలిగాడు. ఇక 2013 నుంచే ఐపీఎల్ ఆడుతున్న కరుణ్ ఆర్సీబీతో తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఎక్కడ? డానియల్ వెటోరీ, విరాట్ కోహ్లి సారథ్యంలో బెంగళూరు జట్టుకు ఆడిన అతడు.. తర్వాత కోల్కతా నైట్రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లకు కూడా ప్రాతినిథ్య వహించాడు. ఇక 2023 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయపడిన నేపథ్యంలో.. అతడి స్థానాన్ని 31 ఏళ్ల కరుణ్ నాయర్తో భర్తీ చేసింది మేనేజ్మెంట్. ఇక కరుణ్ సనయ తంకరివాలాను వివాహమాడగా.. వారికి కుమారుడు జన్మించాడు. చదవండి: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు షాక్.. విండీస్కు కూడా..! ఏదో క్లబ్గేమ్ ఆడుతున్నట్లు.. రాష్ట్రస్థాయి మ్యాచ్ అన్నట్లు! తిలక్ అలా.. -
కోచ్ నన్ను కొట్టాడు.. వీరేంద్ర సెహ్వాగ్ సంచలన ఆరోపణలు
టీమిండియా మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన ఆరోపణలు చేశాడు. 2002 నాట్వెస్ట్ ట్రోఫీ సందర్భంగా నాటి భారత హెడ్ కోచ్ జాన్ రైట్ తనను కాలర్ పట్టుకుని, చైర్ పైకి తోసేశాడని బాంబు పేల్చాడు. శ్రీలంకతో మ్యాచ్లో తొందరగా ఔటవ్వడంతో రైట్ తన పట్ల అమానవీయంగా వ్యవహరించాడని గుర్తు చేసుకున్నాడు. ఆ సందర్భంలో తనకు పట్టలేని కోపం వచ్చిందని.. ఓ తెల్లోడు మనంపై పెత్తనం చేయడమేంటని జట్టు సభ్యులందరినీ ప్రశ్నించానని.. నాటి టీమ్ మేనేజర్ జోక్యంతో తన కోపం చల్లారిందని ఇటీవల జరిగిన ఓ బుక్ లాంచింగ్ ప్రోగ్రాం సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఈ విషయం బయటికి పొక్క కూడదని నాటి భారత బృందం సభ్యులు సచిన్కు మాట ఇచ్చారని, అందుకే ఎవరికీ తెలియ లేదని అన్నాడు. ఇలాంటి ఘటనే ఇప్పుడున్న పరిస్థితుల్లో జరిగితే పెద్ద రాద్దాంతం అవుతుందని, ఓ విదేశీ కోచ్ అలా చేస్తే బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపాడు. కాగా, నాటి నాట్వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో భారత్.. ఇంగ్లండ్ను ఓడించి టైటిల్ గెలిచింది. ఫైనల్లో మహ్మద్ కైఫ్ (87), యువరాజ్ సింగ్ (69) వీరోచితంగా పోరాడి టీమిండియాను గెలిపించారు. కైఫ్ విన్నింగ్ షాట్ కొట్టాక నాటి భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ చొక్కా విప్పి చేసుకున్న సెలబ్రేషన్స్ ఎప్పటికీ భారత అభిమానులు కళ్ల ముందే మెదులుతూ ఉంటుంది. -
సన్రైజర్స్ హెడ్కోచ్గా వీరేంద్ర సెహ్వాగ్.. ఇక తిరుగుండదు!
ఐపీఎల్లో గత కొన్ని సీజన్లగా సన్రైజర్స్ హైదరాబాద్ హెడ్కోచ్లు మారుతున్నప్పటికీ.. జట్టు ఆటతీరు మాత్రం మారడంలేదు. ఈ క్రమంలో ఐపీఎల్-2024 సీజన్కు ముందు తమ జట్టును మరోసారి ప్రక్షాళన చేయాలని సన్రైజర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా హెడ్ కోచ్ బ్రియాన్ లారాపై వేటు వేయనున్నట్లు సమాచారం. అతడి నేతృత్వంలో ఎస్ఆర్హెచ్ జట్టు ఈ ఏడాది సీజన్లో తీవ్ర నిరాశ పరిచింది. ఐపీఎల్ 2023లో 14 మ్యాచ్లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ.. కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచింది. కొత్త కెప్టెన్, కొత్త హెడ్కోచ్తో బరిలోకి దిగిన సన్రైజర్స్ తమ స్ధాయికి తగ్గట్టు రాణించలేకపోయింది. ఈ క్రమంలో లారాను తప్పించాలని ఎస్ఆర్హెచ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విండీస్ క్రికెట్ జట్టును చక్కదిద్దే బాధ్యతను కూడా లారా తీసుకోవడంతో.. అతడు కూడా ఐపీఎల్ వైపు అంత మొగ్గు చూపకపోతునున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విండీస్ హెడ్ కోచ్ ఆండీ కోలీతో పాటు బ్రియాన్ లారా కూడా టీమ్కి సలహాదారుగా వ్యవహరిస్తున్నాడు. ఎస్ఆర్హెచ్ హెడ్కోచ్గా వీరేంద్ర సెహ్వాగ్ ప్రస్తుత పరిస్ధితులను బట్టి చూస్తే కచ్చితంగా వచ్చే ఏడాది సీజన్లో సన్రైజర్స్కి కొత్త హెడ్కోచ్ వచ్చే అవకాశం ఉంది. అయితే తమ జట్టు హెడ్కోచ్ పదవి కోసం టీమిండియా మాజీ ఓపెనర్ను వీరేంద్ర సెహ్వాగ్ను సన్రైజర్స్ యాజమాన్యం సంప్రదించినట్లు తెలుస్తోంది. అతడి సమాధానం కోసం ఎస్ఆర్హెచ్ ఎదురుచూస్తున్నట్లు సమాచారం. గతంలో సెహ్వాగ్ పంజాబ్ కింగ్స్కు మెంటార్గా నాలుగు సీజన్ల పాటు పనిచేశాడు. అదే విధంగా ఈ క్యాష్ రిచ్ లీగ్లో అడిన అనుభవం కూడా సెహ్వాగ్ ఉంది. ఈ క్రమంలోనే అతడిని తమ జట్టు కోచింగ్ పగ్గాలు అప్పజెప్పాలని ఎస్ఆర్హెచ్ భావిస్తోంది. కానీ అభిమానులు మాత్రం డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్కి 2009లో టైటిల్ అందించిన ఆడమ్ గిల్క్రిస్ట్ని హెడ్ కోచ్గా నియమిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. చదవండి: Ind Vs WI 2nd Test: ధోని భయ్యా లేడు కదా.. ఇలాగే ఉంటది! ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి! వాళ్లకు కూడా.. -
‘సెహ్వాగ్ నీకు బ్యాటింగే రాదు! పాక్లో ఉంటే ఇక్కడి దాకా వచ్చేవాడివే కాదు’
India Vs Pakistan ODI Series 2005: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలు చూపించి ఎన్నో అరుదైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడీ విధ్వంసక ఆటగాడు. టీమిండియా తరఫున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ, వన్డేల్లో ద్విశతకం సాధించిన బ్యాటర్గా సచిన్ టెండుల్కర్కు కూడా సాధ్యం కాని ఘనత సాధించాడు. వీరూ భాయ్ క్రీజులో ఉన్నాడంటే బౌలర్ వెన్నులో వణుకు పుట్టాల్సిందే! సెహ్వాగ్ను అవుట్ చేయడమే ఈజీ అలాంటి సెహ్వాగ్ను అవుట్ చేయడమే తనకు అత్యంత సులువుగా ఉండేదంటూ పాకిస్తాన్ మాజీ పేసర్ రానా నవీద్ ఉల్ హసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తను పాక్ జట్టుకు ఆడే రోజుల్లో టీమిండియా మిగతా బ్యాటర్లందరికంటే ఈ ముల్తాన్ కింగ్నే ఈజీగా పెవిలియన్కు పంపవచ్చని భావించేవాడినని తెలిపాడు. వీరూతో పోలిస్తే రాహుల్ ద్రవిడ్ను ఎదుర్కోవడం కష్టంగా ఉండేదని పేర్కొన్నాడు. 2005 నాటి వన్డే సిరీస్ సంగతుల గురించి తాజాగా ప్రస్తావించిన నవీద్ ఉల్ హసన్.. ‘తొలి రెండు మ్యాచ్లలో సెహ్వాగ్ అద్భుతంగా ఆడాడు. అప్పటికి మేము ఆరు మ్యాచ్ల సిరీస్లో 0-2తో వెనుకబడి ఉన్నాం. ఒక మ్యాచ్లో అయితే సెహ్వాగ్ ఏకంగా సెంచరీ కొట్టాడు. రెండో మ్యాచ్లో 70కి పైగా స్కోర్ చేశాడు. నీకసలు ఆడటమే సరిగ్గా రాదు.. పాక్లో ఉండి ఉంటేనా! అప్పుడు నేను ఇంజీ భాయ్ దగ్గరకు వెళ్లి బంతిని నాకివ్వమని అడిగాను. స్లో బౌన్సర్తో సెహ్వాగ్ను బోల్తా కొట్టించాను. అంతకంటే ముందు అతడిని నేను స్లెడ్జ్ చేశాను. సెహ్వాగ్ దగ్గరికి వెళ్లి.. ‘‘నీకు అసలు ఎలా ఆడాలో తెలియదు. నువ్వు ఒకవేళ పాకిస్తాన్లో గనుక ఉండి ఉంటే.. ఇంత ఈజీగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టేవాడివి కాదు’’ అని అన్నాను. అందుకు బదులుగా తను కూడా నన్ను ఏవో మాటలు అన్నాడు. ఆ వెంటనే నేను ఇంజీ భాయ్ దగ్గరికి వెళ్లి.. ‘‘తదుపరి బంతికి అతడు అవుట్ అవుతాడు చూడు అని చెప్పాను. నిజానికి తను అప్పుడు ఆశ్చర్యపోయాడు. అయితే, నా వ్యూహాన్ని అమలు చేస్తూ.. స్లో బాల్ను వేశాను. వెంటనే అవుటయ్యాడు అప్పటికే కోపంగా ఉన్న సెహ్వాగ్ భారీ షాట్కు యత్నించి అవుటయ్యాడు. ఆ మ్యాచ్లో ఇలా అత్యంత ముఖ్యమైన వికెట్ను పడగొట్టడం ద్వారా మ్యాచ్ గెలవడంలో నేను కీలక పాత్ర పోషించాను. ఫాస్ట్బౌలర్ల దగ్గర ఇలాంటి కొన్ని ట్రిక్స్ ఉంటాయి. నిజానికి నా దృష్టిలో సెహ్వాగ్ను అవుట్ చేయడం సులువే. కానీ రాహుల్ ద్రవిడ్కు బౌలింగ్ చేయడం మాత్రం అత్యంత కష్టమైనది’’ అని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు నాదిర్ అలీ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. నవీద్ ఉల్ హసన్.. సెహ్వాగ్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు. సెహ్వాగ్ వికెట్ అతడి ఖాతాలో కాగా 2005లో పాకిస్తాన్ ఆరు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడేందుకు భారత పర్యటనకు వచ్చింది. ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లలో టీమిండియా గెలుపొందగా.. ఆఖరి నాలుగు వన్డేలు గెలిచి పాక్ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఈ సిరీస్లో నవీద్ ఉల్ హసన్ ఏకంగా నాలుగుసార్లు సెహ్వాగ్ను అవుట్ చేయడం గమనార్హం. ఇక నవీద్ పాక్ తరఫున 74 వన్డేలు ఆడి 110 వికెట్లు పడగొట్టాడు. తొమ్మిది టెస్టులు, నాలుగు టీ20లు ఆడి వరుసగా 18, 5 వికెట్లు తీశాడు. కాగా సెహ్వాగ్పై నవీద్ వ్యాఖ్యల నేపథ్యంలో టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వీరూ గురించి మాట్లాడే సీన్ నీకు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: IND VS WI 2nd Test: రాహుల్ ద్రవిడ్కు విశ్రాంతి -
Ind Vs WI: చరిత్ర సృష్టించిన రోహిత్- యశస్వి.. 17 ఏళ్ల రికార్డు బద్దలు
West Indies vs India, 1st Test: వెస్టిండీస్తో తొలి టెస్టులో ఓపెనర్లు సెంచరీలతో చెలరేగడం టీమిండియాకు కలిసివచ్చింది. దీంతో డొమినికా వేదికగా విండ్సర్ పార్క్లో జరుగుతున్న మ్యాచ్లో రోహిత్ సేన పట్టు బిగించింది. కాగా విండీస్తో టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన ముంబై బ్యాటర్ యశస్వి వ్యక్తిగతంగా పలు రికార్డులు సాధించిన విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా ఓపెనర్గా వచ్చిన యశస్వి రెండో రోజు ఆట ముగిసే సరికి 143 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇప్పటి వరకు మొత్తంగా 350 బంతులు ఎదుర్కొన్న అతడు 14 ఫోర్ల సాయంతో ఈ మేరకు స్కోరు చేశాడు. మరోవైపు.. రోహిత్ 221 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 103 పరుగులు సాధించాడు. 17 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కొత్త జోడీ ఈ క్రమంలో వీరిద్దరు సెహ్వాగ్- జాఫర్ పేరిట ఉన్న 17 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు. కాగా డొమినికా టెస్టులో ఓపెనర్లు రోహిత్- యశస్వి 229 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. వెస్టిండీస్పై టెస్టుల్లో భారత ఓపెనింగ్ జోడీకి ఇదే అత్యధిక పార్ట్నర్షిప్ కావడం విశేషం. గతంలో 2006లో గ్రాస్ ఐస్లెట్ టెస్టు సందర్భంగా నాటి ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్- వసీం జాఫర్ 159 పరుగులు భాగస్వామ్యం నమోదు చేయగా.. రోహిత్- యశస్వి జోడీ ఇప్పుడు వాళ్లను అధిగమించింది. ఇక ఈ జాబితాలో సునిల్ గావస్కర్- చేతన్ చౌహాన్ 153, సునిల్ గావస్కర్- అన్షుమన్ గైక్వాడ్ 136 పరుగుల భాగస్వామ్యంతో ఈ జోడీల తర్వాతి స్థానాలు ఆక్రమించారు. కాగా రెండో రోజు ఆట ముగిసే సరికి విండీస్ మీద 162 పరుగుల ఆధిక్యంతో ఉంది. చదవండి: Ind Vs WI: ఏరికోరి వచ్చావు! ఏమైందిపుడు? అప్పుడు కూడా ఇలాగే! మార్చుకో.. విండీస్ ఆటగాడిపై జైశ్వాల్ దూషణల పర్వం; కోహ్లి సీరియస్ यशस्वी भवः 💯 . .#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/59Uq9ik1If — FanCode (@FanCode) July 13, 2023 -
ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023 ట్రోఫీ ఫొటోలు చూశారా
-
మా వల్లే కిర్స్టన్కు పేరు.. ఆ తర్వాత అతడు సాధించింది సున్నా! మరి ద్రవిడ్..
ICC ODI World Cup 2023: జట్ల విజయాల్లో కోచ్ల పాత్రపై టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోచ్లు పేరుప్రఖ్యాతులు పొందాలన్నా, విమర్శలపాలైనా.. అంతా ఆటగాళ్ల చేతుల్లోనే ఉంటుందని వ్యాఖ్యానించాడు. తాము 2011లో ప్రపంచకప్ గెలిచి గ్యారీ కిర్స్టన్కు కోచ్గా పేరు సంపాదించిపెట్టామని పేర్కొన్నాడు. వన్డే వరల్డ్కప్-2023 షెడ్యూల్ విడుదల సందర్భంగా మంగళవారం ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో సెహ్వాగ్ పాల్గొన్నాడు. ఈ క్రమంలో పలు అంశాలపై మాట్లాడిన వీరూ భాయ్.. టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్పై విమర్శలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు. బాగా ఆడితే పూలు.. లేదంటే రాళ్లు ‘‘ఒక్కసారి ఆటగాళ్లు మైదానంలోకి దిగిన తర్వాత కోచ్ భవిష్యత్తు వారి ఆటతీరుపైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ సదరు ప్లేయర్ బాగా ఆడితే కోచ్కు ప్రశంసలు దక్కుతాయి. లేదంటే విమర్శలు తప్పవు. భారత జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ చేరింది. కానీ ఆ విషయం గురించి ఎవరూ మాట్లాడరు. అయితే, ఫైనల్లో ఓడిన విషయం గురించి మాత్రం పదే పదే చర్చిస్తారు. ప్రతిఒక్కరు విమర్శలు గుప్పిస్తారు. మా వల్లే కిర్స్టన్కు పేరు.. మరి ద్రవిడ్ నిజానికి రాహుల్ ద్రవిడ్ మంచి కోచ్. కానీ కోచ్లు ఎంత గొప్పగా ఉన్నా చివరికి ఆటగాళ్ల ప్రదర్శన మీదే అంతా ఆధారపడి ఉంటుంది. 2011 వరల్డ్కప్ గెలిచి మేము గ్యారీ కిర్స్టన్కు మంచి పేరు తీసుకువచ్చాం. ఆ తర్వాత అతడు ఎన్నో జట్లకు కోచింగ్ ఇచ్చాడు. కానీ ఐపీఎల్ మినహా ఎక్కడా టైటిల్ గెలవలేదు. ఇప్పుడు ఆశిష్ నెహ్రా కిర్స్టన్ కంటే ఎక్కువే కష్టపడుతున్నాడు. టీవీల్లో మ్యాచ్లు చూసే వాళ్లందరికీ ఈ విషయం తెలుసు. అలా అయితే ట్రోఫీ ఎత్తడం ఖాయం ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే.. టీమిండియా కోచింగ్ సిబ్బంది ఆటగాళ్ల నైపుణ్యాలపై మరింత దృష్టిసారించి వాళ్ల నుంచి 100 శాతం అవుట్పుట్ రాబట్టేలా చూసుకోవాలి. అదే జరిగితే టీమిండియా కెప్టెన్ వరల్డ్కప్ ట్రోఫీని ఎత్తడం ఖాయంగా చూస్తారు’’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. కాగా 2011లో గ్యారీ కిర్స్టన్ టీమిండియా కోచ్గా ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అక్టోబరు 5- నవంబరు 19 వరకు వన్డే వరల్డ్కప్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: 18 నెలలు జట్టుకు దూరం.. వచ్చి ఒక్క మ్యాచ్ ఆడగానే! జడ్డూ..: గంగూలీ వన్డే వరల్డ్కప్లో సెమీ ఫైనలిస్టులు ఆ జట్లే.. ఆ రెండు మాత్రం పక్కా: సెహ్వాగ్ -
వన్డే వరల్డ్కప్లో సెమీ ఫైనలిస్టులు ఆ జట్లే.. ఆ రెండు మాత్రం పక్కా: సెహ్వాగ్
ఐసీసీ వన్డే వరల్డ్కప్-2023 రూపంలో క్రికెట్ ప్రేమికులకు మరో పండుగ రాబోతోంది. భారత్ వేదికగా అక్టోబరు 5న ఈ మెగా ఈవెంట్ మొదలుకానుంది. ఈ క్రమంలో వంద రోజుల ముందుగానే(మంగళవారం) అంతర్జాతీయ క్రికెట్ మండలి షెడ్యూల్ను ప్రకటించింది. దీంతో క్రికెట్ అభిమానులు ఎప్పుడెపుడు ఈ ఈవెంట్ మొదలవుతుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక మరికొంత మంది సెమీస్ చేరే జట్లు, విజేతగా నిలిచే జట్టుపై అంచనా వేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. టాప్-4లో ఉండే జట్లు ఇవే కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు.. క్రికెట్ దిగ్గజాలు, మాజీ ఆటగాళ్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇక టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం వన్డే ప్రపంచకప్-2023లో టాప్-4లో నిలవలగల సత్తా ఉన్న జట్లను ఎంచుకున్నాడు. ఐసీసీ ఈవెంట్ సందర్భంగా వీరూ మాట్లాడుతూ.. ‘‘నేను నాలుగు జట్లను ఎంచుకోవాలంటే.. నా మదిలో మెదిలే పేర్లు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఇండియా, పాకిస్తాన్. ఈసారి సెమీ ఫైనలిస్టులు ఈ జట్లే. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ అయితే కచ్చితంగా టాప్-4లో ఉంటాయి. ఆ రెండు టీమ్లు పక్కా ఎందుకంటే వాళ్లు సంప్రదాయ షాట్లు ఆడరు.. రొటీన్కి భిన్నంగా ఉంటారు. అద్భుతమైన ఆట తీరుకు ఈ జట్లు పెట్టింది పేరు. అంతేకాదు మిగతా జట్లతో పోలిస్తే ఉపఖండంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మెరుగ్గా రాణించగలవు’’ అని అభిప్రాయపడ్డాడు. ఇక శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ.. ఈ టోర్నీలో టీమిండియా- ఇంగ్లండ్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. సొంతగడ్డపై ఆడనుండటం భారత్కు కలిసి వచ్చే అంశమే అయినా.. ఇంగ్లండ్ కూడా గట్టిపోటీనిస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. కాగా అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్కప్ జరుగనుంది. ఇక భారత్లో జరుగునున్న ఈ మెగా టోర్నీకి ఆతిథ్య టీమిండియా సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన రెండు స్థానాల కోసం వెస్టిండీస్, శ్రీలంక వంటి ఒకప్పటి మేటి జట్లతో పాటు పసికూనలు క్వాలిఫైయర్స్లో పోటీపడుతున్నాయి. చదవండి: CWC Qualifiers 2023: హ్యాట్రిక్ సెంచరీ.. జట్టును వరల్డ్కప్కు చేర్చడమే ధ్యేయంగా! -
మాకు భుజాల నొప్పులు.. ధోనికి మెకాలి సమస్య.. అసలే సచిన్ బరువు! అందుకే..
Sehwag's epic take on Kohli lifting Sachin Tendulkar on shoulders: ఐసీసీ వన్డే ప్రపంచకప్-2011లో ధోని సేన అద్భుతం చేసింది. దిగ్గజ ఓపెనర్లు సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ సహా గౌతం గంభీర్, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్, శ్రీశాంత్లతో కూడిన భారత జట్టు ఫైనల్లో శ్రీలంకను ఓడించి విశ్వవిజేతగా అవతరించింది. తద్వారా టీమిండియా రెండోసారి వన్డే వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడింది. ఆ విన్నింగ్ సిక్సర్ ముంబైలోని వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్లో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని విన్నింగ్ సిక్సర్ను ఎవరూ అంతతేలికగా మర్చిపోరు. అదే విధంగా చాంపియన్గా నిలిచిన అనంతరం సచిన్ టెండుల్కర్ను భుజాల మీద ఊరేగిస్తూ ఘనంగా సత్కరించుకున్న తీరు కూడా సగటు అభిమాని గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కోహ్లి భుజాలపై సచిన్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ చేతిలో జాతీయ జెండా రెపరెపలాడిస్తుండగా.. నాటి కుర్ర బ్యాటర్ విరాట్ కోహ్లి అతడిని భుజాల మీద మోశాడు. సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, యూసఫ్ పఠాన్ తదితరులు అతడికి సాయం అందించారు. మరుపురాని ఈ దృశ్యాలు నెమరువేసుకున్నడప్పుల్లా అభిమానుల గుండెలు ఆనందంతో ఉప్పొంగుతాయనడంలో సందేహం లేదు. ఇక ఇప్పుడు.. దాదాపు పన్నెండేళ్ల తర్వాత మరోసారి వన్డే వరల్డ్కప్ నిర్వహణ హక్కులను భారత్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. సచిన్ను భుజాలపై ఊరేగించిన ఘటన గురించి ఆసక్తికర విషయం పంచుకున్నాడు. సచిన్ను మోయడం మావల్ల కాదు బాబోయ్! ‘‘సచిన్ను మోయడం మావల్ల కాదని చేతులెత్తేశాం. ఎందుకంటే సచిన్ చాలా బరువుగా ఉంటాడు కదా! అసలే అప్పటికే మేం ముసలోళ్లం. మాకు భుజం నొప్పులు.. ధోనికేమో మోకాలి సమస్యలు.. మిగతా వాళ్లకు మరేవో ఇబ్బందులు.. అందుకే కోహ్లి అలా అందుకే భారమంతా యువ ఆటగాళ్లపైనే వేశాం. మీరు వెళ్లి సచిన్ టెండుల్కర్ను ఎత్తుకోండి అని చెప్పాం. అందుకే విరాట్ కోహ్లి ఆ పని చేశాడు’’ అని వీరూ భాయ్ సరదాగా చెప్పుకొచ్చాడు. కాగా అక్టోబరు 5- నవంబరు 19 వరకు జరుగనున్న వన్డే వరల్డ్కప్-2023 రోహిత్ సేనకు ప్రతిష్టాత్మకంగా మారింది. సొంతగడ్డపై మెగా టోర్నీ నేపథ్యంలో ఐసీసీ ట్రోఫీ గెలిచి పదేళ్ల నిరీక్షణకు తెరదించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈసారి ఏం జరుగుతుందో?! ఇక 1983లో తొలిసారి ఐసీసీ టైటిల్ గెలిచిన భారత్.. 2007లో టీ20 వరల్డ్కప్, 2011లో వన్డే వరల్డ్కప్, 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. 2019లో తొలిసారి ప్రవేశపెట్టిన ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు రెండుసార్లు చేరుకున్నప్పటికీ తుదిపోరులో చేతులెత్తేసింది. చదవండి: WC 2023: ఈసారి హోరాహోరీ తప్పదు.. ట్రోఫీ ఆ జట్టుదే: టీమిండియా మాజీ కెప్టెన్ పిచ్ మీదకు దూసుకొచ్చే యత్నం.. ఎత్తిపడేసిన బెయిర్ స్టో -
2011 టోర్నీ మొత్తం ధోని కిచిడీనే తిన్నాడు: సెహ్వాగ్.. రోహిత్ ఆ వడాపావ్ మానేసి..
Check CSK captain’s diet plan, workout routine: పుష్కర కాలం తర్వాత భారత్ మరోసారి వన్డే ప్రపంచకప్ ఈవెంట్కు ఆతిథ్యం ఇవ్వనుంది. 2011లో సొంతగడ్డపై ఐసీసీ ట్రోఫీ గెలిచిన టీమిండియా ఈసారి కూడా అదే ఫీట్ పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. ఇక అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం వన్డే వరల్డ్కప్ ఈవెంట్ అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు జరుగనుంది. ధోని మేనియా ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానుల్లో నూతనోత్సాహం నిండింది. ముఖ్యంగా ధోని మేనియాతో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. 2011 నాటి సంగతులు గుర్తు చేసుకుంటూ రోహిత్ సేన కూడా ట్రోఫీని ముద్దాడితే చూడాలని ఉందంటూ సోషల్ మీడియా వేదికగా తమ ఆకాంక్షను వెలిబుచ్చుతున్నారు. జట్టు గెలుస్తుందని కిచిడీ మాత్రమే తినేవాడు ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్, 2011 వరల్డ్కప్ విజేత వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. గౌరవ్ కపూర్ షోలో మాట్లాడుతూ.. ‘‘మేమెక్కడికి వెళ్లినా.. చాలా మంది.. ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే జట్టు గెలిచిన దాఖలాలు లేవని నిరుత్సాహపరిచేవారు. ప్రతిఒక్కరికి ఏదో ఒక మూఢనమ్మకం ఉంటుంది కదా! అలాగే.. మహేంద్ర సింగ్ ధోని.. 2011 టోర్నమెంట్ ఆసాంతం కిచిడీ మాత్రమే తిన్నాడు. ఒకవేళ తాను రన్స్ స్కోరు చేయకపోయినా.. జట్టైనా గెలుస్తుందని నమ్మేవాడు’’ అని సెహ్వాగ్ సరదాగా వ్యాఖ్యానించాడు. కాగా ముంబైలోని వాంఖడే వేదికగా 2011 వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియా- శ్రీలంక తలపడ్డాయి. విన్నింగ్ సిక్సర్తో ఈ మ్యాచ్లో ధోని సిక్సర్ బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. విన్నింగ్ షాట్తో ఈ మిస్టర్ కూల్ కెప్టెన్ భారత్కు రెండో ప్రపంచకప్ అందించాడు. లంకను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా 1983 తర్వాత మరోసారి ఐసీసీ వన్డే వరల్డ్కప్ ట్రోఫీని గెలిచింది. ధోని డైట్, జిమ్ వర్కౌట్ ఎలా ఉంటుందంటే! టీమిండియా మాజీ సారథి ధోని ఎక్కువగా కూరగాయలు, ప్రొటిన్ ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు తింటాడట. అతడి రోజూవారీ డైట్లో పాలు, పండ్లు, బాదం ఉండాల్సిందేనట. ఇక లంచ్లో ఇంట్లో చేసిన పప్పన్నం అంటే ఇష్టంగా తింటాడట. అలాగే అప్పుడప్పుడు చపాతీలు కూడా లాగించేస్తాడట. డిన్నర్లో మాత్రం ఫ్రూట్ సలాడ్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడని తెలుస్తోంది. అదే విధంగా ప్రొటిన్ షేక్స్, తాజా పండ్లరసాలు తీసుకుంటాడని అతడి సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఇక ఆహార నియమాలు పాటించడంతో పాటు జిమ్లో వర్కౌట్లు చేస్తూ ధోని 41 ఏళ్ల వయసులో ఫిట్నెస్తో ఉన్నాడు. మెషీన్ చెస్ట్ ప్రెస్, డంబెల్ చెస్ట్ ప్రెస్, సింగిల్ లెగ్ డెడ్లిఫ్ట్, ప్రోన్ డంబెల్ రోయింగ్ తదితర వర్కౌట్లు ధోని జిమ్ రొటిన్లో భాగం. రోహిత్ భయ్యా వడాపవ్ మానేసి! ఇక ధోని డైట్ గురించి సెహ్వాగ్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో నెటిజన్లు టీమిండియా ప్రస్తుత సారథి రోహిత్ శర్మ పేరును లాగుతున్నారు. ధోని కిచిడీ తిని గెలిచాడట.. నువ్వు కూడా వడావపావ్ మానేసి కిచిడీ తిను భయ్యా.. కనీసం ఈసారైనా టైటిల్ గెలుస్తాం అని సరదాగా ట్రోల్ చేస్తున్నారు. కాగా ముంబై ఫేమస్ వడాపావ్ అంటే రోహిత్కు మహాప్రీతి అన్న విషంయ తెలిసిందే. చదవండి: సత్తా చాటిన సికందర్ రజా, నికోలస్ పూరన్ 2011 నుంచి ఆతిథ్య జట్టుదే.. ఈ లెక్కన వరల్డ్కప్ మనదేనా! ధోని జీవితంలో తీరని విషాదం..! మిస్టర్ కూల్ నాలో ఆ అమ్మాయిని చూస్తాడనుకున్నా.. -
'అప్పుడు సచిన్ కోసం.. ఇప్పుడు కోహ్లి కోసం'
ఐసీసీ వన్డే వరల్డ్కప్ 2023 జరగడానికి ఇవాళ్టికి సరిగ్గా వంద రోజులు మిగిలిఉంది. అంటే మూడునెలలకు పైగా సమయం ఉన్నా మెగా టోర్నీ అందునా నాలుగేళ్లకోసారి జరిగే సమరం కాబట్టి అంచనాలు భారీగా ఉంటాయి. పైగా ఈసారి వన్డే వరల్డ్కప్కు క్రికెట్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే మన దేశం ఆతిథ్యం ఇస్తుండడం వాటిని మరింత పెంచేసింది. దీనికి తోడు ఇవాళ(జూన్ 27న) వన్డే వరల్డ్కప్ పూర్తి షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేయడం అభిమానుల సంతోషాన్ని మరింత రెట్టింపు చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ డాషింగ్ ఆల్రౌండర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2011 వన్డే వరల్డ్కప్ను గెలిచి సచిన్ పాజీకి అంకితమిచ్చాం.. ఇప్పుడు 2023 వన్డే వరల్డ్కప్ కోహ్లి కోసం గెలవాలి. సచిన్ తర్వాత టీమిండియా క్రికెట్లో అనితరసాధ్య రికార్డులు సాధించిన కోహ్లికి బహుశా ఇదే చివరి ప్రపంచకప్ అయ్యే అవకాశం ఉంది. అతని కోసం టీమిండియా ఈసారి కప్పు కొట్టబోతుంది అంటూ తెలిపాడు. స్టార్స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్య్వూలో సెహ్వాగ్ మాట్లాడుతూ.. ''2011 వన్డే వరల్డ్కప్ మేము సచిన్ గెలుపు కోసం ఆడాం. వరల్డ్కప్ కొట్టి సచిన్ పాజీకి ఒక గ్రేట్ ముగింపునిచ్చాం. ఇప్పుడు కోహ్లి పరిస్థితి కూడా సచిన్నే తలపిస్తోంది. ఈసారి కోహ్లి కోసమైనా వరల్డ్కప్ కొట్టాలని ప్రతీ అభిమాని ఆశిస్తున్నాడు. ఇక కోహ్లి తన బ్యాటింగ్లో వందశాతం ఇచ్చేందుకు శాయాశక్తులా ప్రయత్నిస్తాడు. ఇక కోహ్లి కూడా ఈ వరల్డ్కప్ను గొప్పగా మలుచుకోవాలని చూస్తున్నాడు. లక్షలాది మంది అభిమానుల మధ్య అహ్మదాబాద్ వేదికగా టీమిండియా ఫైనల్ ఆడితే చూడాలని ఉంది. ఈసారి స్వంతగడ్డపై జరగడం టీమిండియాకు సానుకూలాంశం. ఇక కోహ్లికి టీమిండియా తమ మ్యాచ్లను ఏ మైదానంలో ఆడుతుందో వాటి పిచ్లపై కోహ్లికి పూర్తి అవగాహన వచ్చేసింది. ఈ నేపథ్యంలో కోహ్లి ఈసారి వరల్డ్కప్లో పరుగుల జడివాన సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పుష్కరకాలం కిందట ధోని సారధ్యంలో స్వంతగడ్డపై జరిగిన వరల్డ్కప్ను టీమిండియా ఎగరేసుకుపోయింది. అప్పుడు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ సహా విరాట్ కోహ్లి లాంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. అయితే అప్పుడు టీమిండియా కప్ కొట్టడంలో ధోని, యువరాజ్, గంభీర్లు ముఖ్యపాత్ర పోషిస్తే..సచిన్, సెహ్వాగ్లు పెద్దన్న పాత్ర పోషించారు. అప్పటికి కెరీర్లో అన్ని రికార్డులు తన పేరిట లిఖించుకున్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు వన్డే వరల్డ్కప్ లేదన్న వెలితి ఉండేది. యువరాజ్ సింగ్ వరల్డ్కప్ ఆరంభానికి ముందు ఈసారి ప్రపంచకప్ గెలిచి సచిన్కు బహుమతిగా అందిస్తాం అని శపథం చేశాడు. ఆ టోర్నీలో ఆల్రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్న యువరాజ్ సింగ్ వన్డే వరల్డ్కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో పాటు సచిన్కు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. వాంఖడే వేదికగా జరిగిన ఆనాటి ఫైనల్లో టీమిండియా గెలవగానే జట్టు సభ్యులు స్టేడియం మొత్తం కలియదిరిగారు. క్రికెట్ గాడ్ సచిన్ను కోహ్లి, యూసఫ్ పఠాన్లు తమ భుజాలపై ఎత్తుకొని స్టేడియం మొత్తం తిప్పుతుంటే.. సచిన్ చేతిలో జెండా పట్టుకొని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టడం అప్పటి అభిమానులు ఇంకా మరిచిపోలేదు. Virender Sehwag said, "everyone needs to win this World Cup for Virat Kohli. The kind of great player he is, a great human being also, he always helps other players". pic.twitter.com/tgxMpZFxK7 — Mufaddal Vohra (@mufaddal_vohra) June 27, 2023 చదవండి: పుండు మీద కారం చల్లేలా.. పీసీబీకి హైకోర్టు షాక్ World Cup: హైదరాబాద్లో జరుగబోయే మ్యాచ్లు ఇవే.. పాకిస్తాన్వే రెండు మ్యాచ్లు -
చీఫ్ సెలెక్టర్ పదవికి ఆహ్వానాలు.. ముందు వరుసలో సెహ్వాగ్! ఖండించిన మాజీ ఓపెనర్
కొత్త చీఫ్ సెలెక్టర్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ఫిబ్రవరిలో చేతన్ శర్మ సెలెక్టర్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత నాలుగు నెలలుగా ఆ పదవి ఖాళీగానే ఉంది. తాజాగా చీఫ్ సెలెక్టర్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ అందుకు సంబంధించిన అప్లికేషన్ను బీసీసీఐ తన అధికారిక వెబ్సైట్తో పాటు సోషల్ మీడియా అకౌంట్స్లోనూ ఉంచింది. అప్లికేషన్లో జాబ్ రోల్తో పాటు అందుకు కావాల్సిన అర్హతలను అందుబాటులో ఉంచింది. చీఫ్ సెలెక్టర్ పదవికి ఎంపికైన వ్యక్తి టెస్టులు, వన్డేలు, టి20లకు జాతీయ టీమ్ను ఎంపిక చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాగా దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 30 అని బీసీసీఐ పేర్కొంది. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేయాల్సిన పనులు, బాధ్యతలు.. 1. న్యాయమైన, పారదర్శక పద్ధతిలో సాధ్యమైనంత ఉత్తమమైన జట్టును ఎంచుకునే ప్రయత్నం చేయాలి. 2. సీనియర్ జాతీయ జట్టు కోసం ఒక బలమైన బెంచ్ బలాన్ని సిద్ధం చేసుకోవాలి 3. అవసరమైన సమయంలో బృంద సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. 4. దేశీయ, అంతర్జాతీయ మ్యాచ్లను చూడటానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలి 5. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్కు సంబంధిత జట్టు ప్రదర్శనల మూల్యాంకన నివేదికలను సిద్ధం చేయడంతో పాటు త్రైమాసిక రిపోర్టులు అందించాల్సి ఉంటుంది. 6. జట్టు ఎంపికపై బీసీసీఐ సూచనలను మీడియా సమావేశంలో వెల్లడించేందుకు సిద్దంగా ఉండాలి 7.ప్రతి ఫార్మాట్లో జట్టుకు కెప్టెన్ని నియమించండి. 8. బీసీసీఐ నియమాలు,నియంత్రణలకు ఎల్లప్పుడు కట్టుబడి ఉండాలి. ► ఇక టీమిండియా తరపున ఏడు టెస్టులు లేదా కనీసం 30 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు.. లేదా 10 వన్డేలు లేదా 20 టి20ల్లో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. ఇక అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి కనీసం ఐదేళ్లు దాటి ఉండాలి. ముందు వరుసలో వీరేంద్ర సెహ్వాగ్.. ఇక బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవికి టీమిండియా మాజీ డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందు వరుసలో ఉన్నాడు. బీసీసీఐకి చెందిన ఒక అధికారి సెహ్వాగ్ వద్దకు వెళ్లి ప్రతిపాదన చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ సెహ్వాగ్ ఆ వార్తలను ఖండించాడు. తాను బీసీసీఐ సెలెక్టర్ పదవిపై ఆశపడడం లేదు.. కానీ అవకాశం వస్తే ఆలోచిస్తా. అయితే రెమ్యునరేషన్ విషయంలో కాస్త గందరగోళం ఉందని తేలింది. అయితే తాజాగా సెలెక్టర్ పదవి కోసం దరఖాస్తులకు ఆహ్వనాలు ఇవ్వడంతో సెహ్వాగ్ ఎంపిక దాదాపు ఖరారైనట్లేనని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. చేతన్ శర్మ స్థానంలో ప్రస్తుతం శివ్సుందర్ దాస్ తాత్కాలిక సెలెక్టర్గా కొనసాగుతున్నాడు. చదవండి: భార్య ఆట చూద్దామని వస్తే నిరాశే మిగిలింది -
ఏడాదికి కేవలం కోటి రూపాయలే! అందుకే వీరూ పట్టించుకోలేదా? 4-5 కోట్లు ఇవ్వడం..
BCCI- Team India- Chief Selector: టీమిండియా ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ పదవి నుంచి చేతన్ శర్మకు బీసీసీఐ ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. భారత క్రికెటర్లు పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించనప్పటికీ ఇంజక్షన్లు వేసుకుని బరిలోకి దిగుతారంటూ సంచలన వ్యాఖ్యలతో క్రికెట్ వర్గాల్లో దుమారం రేపాడు. ఈ మేరకు ఓ చానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ బహిర్గతం కావడంతో చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సెలక్షన్ కమిటీలోని శివ్ సుందర్ దాస్ తాత్కాలిక చైర్మన్గా వ్యవహరిస్తుండగా.. శరత్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా అతడికి డిప్యూటీలుగా సేవలు అందిస్తున్నారు. దీంతో కొత్త చీఫ్ సెలక్టర్గా ఎవరిని నియమిస్తారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో బీసీసీఐ అధికారి ఒకరు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. భారత క్రికెట్లో స్టార్లుగా వెలుగొందిన వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ వంటి ఆటగాళ్లు చీఫ్ సెలక్టర్ పదవి పట్ల ఎందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారో సదరు అధికారి వివరించారు. నిజానికి ఐదేళ్ల కాలం కలిగిన టీమిండియా చీఫ్ సెలక్టర్ పదవిలో ఉన్న వ్యక్తి ఏడాదికి రూ. కోటి జీతంగా పొందనున్నట్లు తెలుస్తోంది. సెలక్షన్ కమిటీలోని మిగతా నలుగురు సభ్యులకు 90 లక్షల ప్యాకేజీ ఉంటుందని సమాచారం. అయితే, తమకున్ను క్రేజ్ దృష్ట్యా సెహ్వాగ్, భజ్జీ వంటి స్టార్లు ఎండార్స్మెంట్లు, కామెంట్రీ రూపంలో ఇంతకంటే ఎక్కువే సంపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి బిగ్స్టార్లు ఈ పదవిపై ఆసక్తి చూపడం లేదని చెప్పవచ్చు. ‘‘కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్(CoA) నియామక సమయంలో వీరూను హెడ్కోచ్ జాబ్కి అప్లై చేయమనే ప్రతిపాదనలు వెళ్లాయి. కానీ అతడు పట్టించుకోలేదు. అప్పుడు అనిల్ కుంబ్లేకు అవకాశం వచ్చింది. ఆర్థికంగానూ పదవులు మనకు దోహదం చేస్తేనే ఎవరైనా ఇలాంటి వాటికి మొగ్గుచూపుతారు. తర్వాత సెహ్వాగ్ నార్త్ జోన్ నుంచి సెలక్టర్గా వచ్చే ఛాన్స్ ఉండింది. కానీ అదీ జరుగలేదు’’ అని సదరు అధికారి పేర్కొన్నారు. 4-5 కోట్లు ఇవ్వడం సమస్యేమీ కాదు ‘‘చీఫ్ సెలక్టర్కు 4-5 కోట్ల రూపాయలు చెల్లించడం పెద్ద సమస్యేమీ కాదు. కేవలం జీతం తక్కువ అన్న కారణంగా కాకుండా.. తాము అనుకున్న స్థాయిలో ముందుకు వెళ్లలేమనే కారణంగానే ప్రసిద్ధ ఆటగాళ్లు సెలక్షన్ కమిటీలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు’’ అని తెలిపారు. అంతేగాక.. అన్ని సవాళ్లను అధిగమించి సరైన జట్టును ఎంపిక చేయడం కూడా కత్తిమీద సాములాంటిదే అని వ్యాఖ్యానించారు. చదవండి: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. భారత జట్టులోకి ఎవరూ ఊహించని ఆటగాడు! ఆడపడుచు అడ్డుపడినా! జడ్డూ భార్య రివాబా బ్యాగ్రౌండ్ తెలుసా? వందల కోట్లు! ODI WC 2023: టీమిండియా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. మరోసారి భారత జట్టులోకి ధోని!