Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Lok Sabha Speaker Election June 26 Live Updates
18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా

న్యూఢిల్లీ, సాక్షి: లోక్‌సభ స్పీకర్‌ ఎవరనేదానిపై ఉత్కంఠకు తెరపడింది. బుధవారం ఉదయం జరిగిన ఎన్నికలో.. 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా.. వరుసగా మంత్రులు ఆ ప్రతిపాదనను బలపరిచారు. అటు ఇండియా కూటమి తరపున కె.సురేశ్ పేరును శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్‌ సావంత్‌ తీర్మానం తీసుకొచ్చారు. దీన్ని పలువురు విపక్ష ఎంపీలు బలపర్చారు. అనంతరం మూజువాణీ విధానంలో ఓటింగ్‌ చేపట్టా.. ఇందులో ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ప్రకటించారు.విపక్ష కూటమి ఓటింగ్‌కు పట్టుబట్టకపోవడంతో.. ఓం బిర్లా ఎన్నిక సుగమమైంది. ఓం బిర్లా ఎన్నికపై ప్రధాని మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పరస్పర కరచలనం ద్వారా అభినందనలు తెలియజేశారు. ఈ ఇద్దరితో పాటు పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు దగ్గరుండి ఓం బిర్లాను స్పీకర్‌ చెయిర్‌లో కూర్చోబెట్టారు. #WATCH | BJP MP Om Birla occupies the Chair of Lok Sabha Speaker after being elected as the Speaker of the 18th Lok Sabha.Prime Minister Narendra Modi, LoP Rahul Gandhi and Parliamentary Affairs Minister Kiren Rijiju accompany him to the Chair. pic.twitter.com/zVU0G4yl0d— ANI (@ANI) June 26, 2024ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సభను నడిపించడంలో స్పీకర్‌ పాత్ర ఎంతో కీలకం. కొత్తగా ఎన్నికైన ఎంపీలకు స్పీకర్‌ స్ఫూర్తిగా నిలుస్తారు. గత ఐదేళ్లుగా విజయవంతంగా సభను నడిపించారు. ఓం బిర్లా చరిత్ర సృష్టించారు. 17వ లోక్‌సభను నిర్వహించడంలో ఆయన పాత్ర అమోఘం. ఆయన నేతృత్వంలోనే కొత్త పార్లమెంట్‌ భవనంలోకి అడుగుపెట్టాం. జీ-20 సమ్మిట్‌ ఆయన సలహాలు, సూచనలు అవసరం. మరో ఐదేళ్లు కూడా సభను విజయవంతంగా నడిపిస్తారని ఆశిస్తున్నా. ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. సభలో విపక్షాల సభ్యులు చర్చించేందుకు అవకాశం ఇవ్వలి. మా గొంతు నొక్కితే సభ సజావుగా నిర్వహించినట్లు కాదు. ప్రజల గొంతుక ఎంత సమర్థవంతంగా వినిపించామన్నదే ముఖ్యం. ఓం బిర్లాకు వైఎస్సార్‌సీపీ అభినందనలులోక్ సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు వైఎస్ఆర్సీపీ అభినందనలు తెలిపింది. లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘గడిచిన లోక్‌సభను ఓం బిర్లా ఎంతో హుందాగా నడిపారు. ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు మాట్లాడే అవకాశం ఇచ్చారు.అదే తరహాలో ఈసారి కూడా విజయవంతంగా సభను నడపాలి’’ అని ఆకాంక్షించారు. ఇక.. రెండోసారి స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. విజయవంతంగా స్పీకర్ పదవి నిర్వహించాలని కోరారాయన. స్పీకర్‌గా ఓం బిర్లా ట్రాక్‌ రికార్డు.. లోక్‌సభ స్పీకర్‌ పదవికి ఎన్నిక జరగడం 48ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. బుధవారం జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థి సురేష్‌పై ఓం బిర్లా విజయం సాధించారు. ఓం బిర్లా(61) రాజస్థాన్‌లోని కోటా నుంచి మూడోసార్లు ఎంపీగా గెలిచారు. 2014లో ఎన్నికైన ఆయన లోక్‌సభలో 86శాతం హాజరును నమోదు చేసుకున్నారు. 671 ప్రశ్నలడిగారు. 2019లో గెలిచాక అనూహ్యంగా స్పీకర్‌ పదవి చేపట్టారు. ఇప్పుడు.. తొలి నుంచి జరుగుతున్న ప్రచారం నడుమే రెండోసారి స్పీకర్‌ పదవి చేపట్టబోతున్నారు. లోక్‌సభ స్పీకర్‌ పదవిని వరుసగా రెండుసార్లు చేపట్టిన ఐదో వ్యక్తి ఓం బిర్లా. ఆయనకంటే ముందు ఎం.ఎ.అయ్యంగార్, జి.ఎస్‌.ధిల్లాన్, బలరాం ఝాఖడ్‌, జి.ఎం.సి.బాలయోగి వరసగా రెండు విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు. వీరిలో బలరాం ఝాఖడ్‌ ఒక్కరే పదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేశారు.

Ksr Comments On Conduct Of TDP On Implementation Of Promised Schemes And Volunteer System
ఏపీలో ‘పక్కదారి’ పాలన షురూ!

ఏపీ శాసనసభ ఎన్నికలకు ముందు ఎవరైనా టీడీపీ వారిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసి ఇచ్చిన హామీలు ఎలా ఆచరణ సాధ్యం? అని ప్రశ్నిస్తే వారు ఠకీమని ఒక సమాధానం ఇచ్చేవారు. మా నాయకుడు అంత తెలివితక్కువవాడు కాదు. అవేమీ అమలు చేసేది ఉండదు. అవసరమైనవి, సాధ్యమైనవి మాత్రమే చేస్తారు అని చెప్పేవారు. మరి అది మోసం కాదా అని ప్రశ్నిస్తే, ఆ సంగతి తర్వాత, ముందు అధికారం రావాలి కదా! అని అనేవారు. సరిగ్గా అదే పంధాలో చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లుగా ఉంది. కాకపోతే ఈసారి ఆయనకు పవన్ కల్యాణ్ కూడా తోడయ్యారు.ఇంతకాలం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన వ్యవస్థలను మార్పు లేదా ఖతం చేసే దారిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఉన్నారనిపిస్తుంది. వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థలు ఎంతో పేరు తెచ్చి పెట్టాయి. ప్రజల అవసరాలను తీర్చడానికి, గడప వద్దకే పాలనను తీసుకువెళ్లడానికి అవి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ఆ వ్యవస్థలను యధాతధంగా కొనసాగించడం టీడీపీ, జనసేన, బీజేపీల కూటమికి అంత ఇష్టం ఉండదు. అందుకే కీలకమైన ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లు కనిపిస్తుంది.ప్రతి నెల మొదటి తేదీన వృద్దాప్య పెన్షన్ లు వలంటీర్ల ద్వారా కాకుండా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్దిదారుల ఇళ్లవద్ద పంపిణీ చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని, వారికి ఇచ్చే గౌరవ వేతనం ఐదువేల నుంచి పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. చంద్రబాబు అయితే మరో అడుగు ముందుకు వేసి వలంటీర్లకు గౌరవవేతనంతో పాటు ఇళ్లవద్దే ఉండి నెలకు ఏభైవేల రూపాయల వరకు సంపాదించుకునేలా తాను చేస్తానని చెప్పేవారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పది రోజులలోనే వలంటీర్లను వారి విధుల నుంచి పక్కనబెట్టడం విశేషం. దీంతో వీరి మనుగడ కొనసాగుతుందా? లేదా? అన్న చర్చ జరుగుతోంది.ఏపీలో తొలుత రెండున్నర లక్షల మంది వలంటీర్లు ఉండేవారు. ఎన్నికల సమయంలో నిమ్మగడ్డ రమేష్ రూపేణ వలంటీర్ల వ్యవస్థను కొంత డిస్టర్బ్ చేయడంలో టీడీపీ సఫలం అయింది. వారి ద్వారా పెన్షన్ లు పంపిణీ కాకుండా ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు తెప్పించగలిగారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడడంతో ఎన్నికల కమిషన్ కూటమికి పూర్తిగా సహకరించిందన్న సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం నిర్ణయం తర్వాత సుమారు ఎనభై వేల మంది వలంటీర్లు రాజీనామాలు చేశారు. అయినా ఇప్పటికీ సుమారు లక్షన్నర మందివరకు వలంటీర్లు కొనసాగుతున్నారు. ఆ వలంటీర్లను వాడుకుంటూ, వలంటీర్లు లేనిచోట సచివాలయ సిబ్బందితో పెన్షన్ లు పంపిణీ చేస్తామని చెప్పి ఉంటే ఎవరికి సందేహం వచ్చేది కాదు.వలంటీర్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి పార్ధసారథి చెప్పడం విశేషం. అంటే ఇందులో కొత్తగా తీసుకోవలసిన నిర్ణయం ఏమి ఉంటుంది? వలంటీర్ల వ్యవస్థను ఉంచాలా? వద్దా? అన్నదానిపైనే ప్రభుత్వం ఆలోచిస్తుండాలి. ఒకప్పుడు ఈ వలంటీర్లను ఉద్దేశించి చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారిని ఒక రకంగా అవమానించేలా మాట్లాడారు. సంఘ వ్యతిరేక శక్తులతో పోల్చారు. కానీ ఎన్నికల టైమ్ కు వలంటీర్లను వ్యతిరేకించడం వల్ల తమకు నష్టం వస్తుందని అనుమానించి, వెంటనే ప్లేట్ మార్చి వారికి పదివేల రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తామని, వ్యవస్థను కొనసాగిస్తామని ప్రకటించారు. ఎన్నికల మానిఫెస్టోలో కూడా ఇదే వాగ్దానం చేశారు. కానీ ఇప్పుడు వలంటీర్లను సస్పెన్స్ లో పెట్టారు.వలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రజలకు ఉపయోగం లేదని అనుకుంటే, అదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో చెప్పి ఉండవచ్చు. అలా చేయలేదు. పైగా వారిపట్ల సానుకూలంగా మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఉన్న వలంటీర్లను మార్చుతారేమోనన్న ప్రచారం జరిగేది. ప్రస్తుతం ఉన్నవారు వైఎస్సార్‌సీపీకి అనుకూలమైన వారన్నది టీడీపీ భావన. వీరికి బదులు టీడీపీకి సంబంధించినవారిని నియమించుకోవాలన్న ఆలోచన చేయవచ్చని అనుకున్నారు. కానీ అందుకువిరుద్ధంగా ఆ వ్యవస్థపైనే అనుమానాలు సృష్టించారు. వైఎస్సార్‌సీపీకి ఎన్నికలలో వలంటీర్ల వ్యవస్థ వల్ల రాజకీయంగా ఉపయోగం జరగలేదన్న అభిప్రాయం ఏర్పడింది.ఈ నేపథ్యంలో టీడీపీలో కూడా పునరాలోచన ఏర్పడి ఉండవచ్చని అంటున్నారు. ఇదే సమయంలో సచివాలయాల సిబ్బందితో ఇళ్ల వద్ద పెన్షన్ లు పంపిణీ చేయించడం కూడా కొంత వివాదాస్పదం కావచ్చు. తమకు కొత్త బాధ్యత పెడుతున్నారన్న అసంతృప్తి ఏర్పడవచ్చు. అయినా ప్రభుత్వం వారిపైనే ఒత్తిడి పెడుతున్నదంటే ఈ వ్యవస్థలో ఇంకా పలుమార్పులు తీసుకురావాలని ఆలోచిస్తుండవచ్చనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి మార్కు పాలన కనిపించకూడదని కూటమి నేతలు భావిస్తుండవచ్చు. సచివాలయాల సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అవసరమైన పౌరసేవలు అందిస్తుంటారు. వలంటీర్లు ప్రజల నుంచి ఆయా దరఖాస్తులు తీసుకుని స్కీములలో చేర్చడం, వారికి కావల్సిన సర్టిఫికెట్లను సమకూర్చడం తదితర సేవలు అందించేవారు. ఇప్పుడు వీటన్నిటిని నిలుపుదల చేస్తే ఈ వలంటీర్లకు, సచివాలయాల సిబ్బందికి పని ఉండదు.ప్రస్తుతానికి సచివాలయాల సిబ్బందికి డిప్రమోషన్ ఇచ్చిన రీతిలో వారినే లబ్దిదారుల ఇళ్లచుట్టూ తిప్పాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఇష్టం లేనివారు ఉద్యోగాలు మానుకుంటారు. లేదా, భవిష్యత్తులో వేరే రకంగా వాడుకునే ఉద్దేశంతో ఈ బాధ్యత అప్పగించి ఉండవచ్చు. చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం చేయడంతో మానిఫెస్టోలో చెప్పినవాటికి భిన్నంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తాయి. అందుకే ఇప్పటికిప్పుడు ఒక నిర్ణయం తీసుకోకుండా, అంతా పరిశీలనలో ఉందని చెప్పవచ్చు. ప్రజాభిప్రాయం తీసుకుంటున్నామని తెలపవచ్చు. అలాగే అభిప్రాయాలు సేకరించామని, ప్రజలకు వలంటీర్లవల్ల ఉపయోగం లేదని, పేర్కొనవచ్చు. వలంటీర్ల వ్యవస్థను ఒకవేళ తొలగిస్తే రెండున్నర లక్షల మంది ప్రస్తుతం ఏదో రూపంలో పొందుతున్న ఉపాధిని కోల్పోయినట్లు అవుతుంది. దానిని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏదైనా కొత్త నిర్ణయం చేస్తుందా? అనేది చూడాలి.అలాగే.. ఇన్నివేల సచివాలయాల అవసరం లేదని, సిబ్బందిని వేరే రూపంలో వినియోగించుకోవచ్చని ఏమైనా ఆలోచన జరుగుతుందా అన్న సందేహం కూడా ఉంది.చంద్రబాబు నాయుడుకు ప్రజలలో ఉన్న అభిప్రాయానికి తగినట్లుగానే మాట మార్చుతారా అనే ప్రశ్న వస్తోంది. విశేషం ఏమిటంటే వలంటీర్లకు పదివేల రూపాయల వేతనం ఇస్తారని ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా జాగ్రత్తపడడం కూడా గమనించదగ్గ అంశమే. అదే ఇలాంటి నిర్ణయం ఏదైనా వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో చేస్తే.. ఈ మీడియా పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేసేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏమి చేసినా సమర్థించే మీడియా కనుక వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు మాట తప్పారని ఎక్కడా ఒక్క మాట రాయలేదు. పైగా క్యాబినెట్ కీలక హామీలను నెరవేర్చిందని హెడింగ్ లు పెట్టి మరీ జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేశాయి.చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాలనే క్యాబినెట్ లో తీర్మానం చేశారు. మెగా డీఎస్సీ, వృద్దుల పెన్షన్ నాలుగువేల రూపాయలు చేయడం తప్ప మిగిలినవాటికి పెద్ద ప్రాధాన్యత లేదు. లేని టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేయడం మరో ప్రత్యేకత. టీడీపీ మీడియాకు ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ లు ప్రకటించిన సూపర్ సిక్స్ వాగ్దానాలు కీలకమైనవిగా కనిపించడం లేదు. స్కూళ్లు తెరిచిన ఈ టైమ్ లో తల్లికి వందనం పేరుతో బడికి వెళ్లే పిల్లలందరికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని చేసిన వాగ్దానం ప్రస్తావనే లేదు.ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ప్రతి రైతుకు ఏటా ఇరవైవేల రూపాయల ఆర్దిక సాయం, నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు, ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు వంటి పలు హామీలు ఎప్పుడు అమలు చేసేది క్యాబినెట్ లో చర్చించలేదు. అదే వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో ఆ ఏడాది కాలానికి అమలు చేయవలసిన స్కీముల గురించి మంత్రివర్గంలో చర్చించి షెడ్యూల్ ఖరారు చేసేవారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల ప్రభుత్వం ఆ పని చేయకపోగా, ఒక్కో హామీని ఏ రకంగా ఎగవేయాలా అనేదానిపై దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తుంది. దానిని పక్కదారి పట్టించడానికి వీలుగా గత ప్రభుత్వంపై శ్వేతపత్రాలు విడుదల చేసే కథను నడపడానికి ప్రభుత్వం సిద్దమైందని అనుకోవచ్చు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Prabhas Kalki 2898 AD Specialities And Latest Details
ప్రభాస్ 'కల్కి' సినిమా ప్రత్యేకతలు.. మీకు ఇవి తెలుసా?

డార్లింగ్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ 'కల్కి' రిలీజ్‌కి రెడీ. మరికొన్ని గంటల్లో థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ అనిపిస్తోంది. ఎందుకంటే మూవీపై అంచనాలు మామూలుగా లేవు. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తొలిరోజు వసూళ్లలో రికార్డులు బద్దలవ్వొచ్చని మాట్లాడుకుంటున్నారు. అయితే మీకు 'కల్కి' గురించి విశేషాలు ఎన్ని తెలుసు? ఇంతకీ 'కల్కి' ఎప్పుడు మొదలైంది అనేది ఇప్పుడు చూద్దాం.ప్రభాస్ 'కల్కి' విశేషాలుడార్లింగ్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ 'కల్కి'.జూన్ 27న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకుడు.ప్రపంచవ్యాప్తంగా 10 వేలకు పైగా స్క్రీన్లలో 'కల్కి' రిలీజ్ అవుతోంది.తెలుగులో 1600కి పైగా.. మిగతా భాషలన్నీ కలిపి 4000కి పైగా స్క్రీన్లలో రిలీజ్ఓవర్సీస్‌లో 4500కి పైగా స్క్రీన్స్‌లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.మన దగ్గరతో పాటు ఓవర్సీస్‌లోనూ కనివినీ ఎరుగని రీతిలో టికెట్స్ బుక్.రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్ రేట్లు, అదనపు షోలు భారీ ఎత్తున అనుమతి.'కల్కి'లో ప్రభాస్, అమితాబ్, కమల్, దీపిక, దిశా పటానీ, శోభన లాంటి స్టార్స్ నటించారు.విజయ్ దేవరకొండ, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్, ఆర్జీవీ కూడా ఉన్నారని టాక్.వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ రూ.600 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.ఫిబ్రవరి 2020న 'ప్రాజెక్ట్ కె' పేరుతో ఈ సినిమాని అనౌన్స్ చేశారు.అదే ఏడాది కరోనా రావడంతో దాదాపు ఏడాది వాయిదా పడింది.2021 జూలై నుంచి మార్చి 2024 వరకు షూటింగ్ జరిగింది.ఈ ఏడాది మే 9నే రిలీజ్ చేస్తామని ప్రకటన. కానీ ఎన్నికల కారణంగా జూన్ 27కి వాయిదా.క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి 2898 AD వరకు విస్తరించే కథనే 'కల్కి'మహాభారతం సంఘటనలతో పాటు వర్తమాన, భవిష్యత్‌ని ఇందులో చూపించబోతున్నారు.ఇకపోతే 'కల్కి' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.370 కోట్ల వరకు జరిగిందని సమాచారం.తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.168 కోట్లు కాగా.. కర్ణాటక 25, తమిళనాడు 16, కేరళ 6, హిందీ ప్లస్ నార్త్ కలిపి రూ.85 కోట్లు!ప్రభాస్ గత సినిమా 'సలార్' తొలిరోజు కలెక్షన్స్ రూ.178 కోట్లు.దీన్ని సులభంగా 'కల్కి' అధిగమిస్తుందని ట్రేడ్ పండితులు జోస్యం.

Delhi Liquor Case: Arvind Kejriwal CBI Case hearing June 26 Updates
లిక్కర్‌ కేసులో కేజ్రీవాలే కీలకం: సీబీఐ

న్యూఢిల్లీ, సాక్షి: లిక్కర్‌ కేసు విచారణలో భాగంగా.. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇవాళ హైడ్రామా నడిచింది. కోర్టులోనే కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసిన సీబీఐ.. లిక్కర్‌ కేసులో కీలక విషయాలు రాబట్టాలంటే ఆయన్ని విచారించాల్సిన అవసరం ఉందని వాదించింది. ఈ క్రమంలో ఐదు రోజుల కస్టడీ కోరింది. లిక్కర్‌ కేసులో సోమవారం నాడు తీహార్‌ జైల్లోనే సీబీఐ విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టేందుకు కోర్టు నుంచి అనుమతి తీసుకుంది. బుధవారం ఉదయం తీహార్‌ జైలు అధికారులు ఆయన్ని కోర్టుకు తీసుకొచ్చారు. అనంతరం.. కేజ్రీవాల్‌ను సీబీఐ తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది. అయితే.. కేజ్రీవాల్‌ను ఇంకా అధికారికంగా అరెస్ట్‌ చేయని విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. దీంతో కోర్టు అనుమతి కోరారు సీబీఐ తరఫు లాయర్‌. అయితే.. కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది విక్రమ్‌ చౌదరి అందుకు అభ్యంతరం తెలిపారు. అయితే కేజ్రీవాల్‌ అరెస్ట్‌ చేయాల్సిన అవసరానికి గల కారణాలను సీబీఐ, న్యాయమూర్తికి వివరించారు.‘‘లిక్కర్‌ స్కాం కేసులో కేజ్రీవాలే కీలకం. ఆయన నివాసంలోనే మద్యం పాలసీ తయారైంది. సౌత్‌లాబీకి కేజ్రీవాల్‌ పూర్తిగా సహకరించారు. సమీర్‌ మహేంద్రు, విజయ్‌ నాయర్‌ మధ్య మీటింగ్‌ ఏర్పాటు చేశారు. కేజ్రీవాల్‌ గోవా పర్యటనకు నగదును హవాలా మార్గంలో సమకూర్చారు. రూ.338 కోట్లు ేతులు మారినట్లు ఆధారాలున్నాయి. అందుకే ఆయన్ని ప్రశ్నించాల్సి ఉంది’’ అని సీబీఐ వాదించింది. విచారణ జరుగుతున్న సమయంలో.. కేజ్రీవాల్‌ కళ్లు తిరుగుతున్నాయని, టీ-బిస్కెట్‌ కావాలని కోరారు. దీంతో ఆయన షుగర్‌ లెవల్స్‌ పడిపోతున్నాయని నిర్ధారించుకున్న అధికారులు.. కోర్టు అనుమతితో ఆయన్ని మరో గదిలోకి తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు. #WATCH | Delhi CM and AAP National Convenor Arvind Kejriwal being produced at the Rouse Avenue Court by CBI for a hearing in the liquor policy case. pic.twitter.com/ruFdQNecu4— ANI (@ANI) June 26, 2024

Virat Kohli In Poor Form In T20 World Cup 2024, Fans Expecting To Regain His Form In Semifinal Against England
T20 World Cup 2024: పేలవ ఫామ్‌లో విరాట్‌.. సెమీఫైనల్లో అయినా పుంజుకుంటాడా..?

ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి పేలవమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం 66 పరుగులు మాత్రమే చేసి దారుణంగా నిరాశపరిచాడు. ఇందులో రెండు డకౌట్లు కూడా ఉన్నాయి.ఇంగ్లండ్‌తో సెమీఫైనల్‌కు ముందు భారత క్రికెట్‌ అభిమానులను విరాట్‌ ఫామ్‌ కలవరపెడుతుంది. సెమీస్‌లో అయినా విరాట్‌ బ్యాట్‌ ఝులిపించాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఒకవేళ విరాట్‌ ఇదే పేలవ ఫామ్‌ను కొనసాగిస్తే టీమిండియా విజయావకాశాలు భారీగా దెబ్బ తింటాయి. విరాట్‌ ఎలాగైనా ఫామ్‌లోకి రావాలని టీమిండియా అభిమానులు దేవుళ్లకు ప్రార్ధిస్తున్నారు.ప్రస్తుత వరల్డ్‌‍కప్‌లో విరాట్‌ చేసిన స్కోర్లు..ఐర్లాండ్‌పై 1(5)పాక్‌పై 4 (3)యూఎస్‌ఏపై 0 (1)ఆఫ్ఘనిస్తాన్‌పై 24 (24)బంగ్లాదేశ్‌పై 37 (28)ఆస్ట్రేలియాపై 0 (5)కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో రోహిత్‌కు జతగా విరాట్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఓపెనర్‌గా ప్రమోషన్‌ లభించాక విరాట్‌ ఐపీఎల్‌ తరహాలో రెచ్చిపోతాడని అంతా అనుకున్నారు. అయితే విరాట్‌ పేలవ ఫామ్‌న ప్రదర్శిస్తూ అందరినీ నిరాశపరుస్తున్నారు. ఐపీఎల్‌ 2024లో భీకర ఫామ్‌లో ఉండిన విరాట్‌ దేశం తరఫున ఆడాల్సి వచ్చే సరికి తేలిపోతుండటంతో అతని వ్యతిరేకులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.ఏకంగా విరాట్‌ను జట్టు నుంచి తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నారు. విరాట్‌ స్థానంలో యశస్వి జైస్వాల్‌ లేదా సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. విమర్శకుల నోళ్లు మూయించాలంటే విరాట్‌ కీలకమైన సెమీస్‌లో ఎట్టి పరిస్థితుల్లో ఫామ్‌లోకి రావాలి.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌ 2024 తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్‌.. రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ తలపడనున్నాయి. తొలి సెమీస్‌ ట్రినిడాడ్‌ వేదికగా రేపు (జూన్‌ 27) ఉదయం 6 గంటలకు (భారతకాలమానం ప్రకారం) ప్రారంభంకానుండగా.. రెండో సెమీస్‌ గయానా వేదికగా రేపు రాత్రి 8 గంటలకు మొదలవుతుంది.

 I thought Wrong number Sudha Murty  recalls  former president APJ Abdul Kalam call
నన్ను ప్రశంసించడానికి కాల్‌ చేస్తే.. రాంగ్‌ కాల్‌ అని పొరబడ్డా : సుధామూర్తి

‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత, రచయిత, రాజ్యసభ ఎంపీ, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య సుధామూర్తి తాజాగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. మాజీ రాష్ట్రపతి దివంగత డా. ఏపీజే అబ్దుల్ కలాం నుంచి తనకు పోన్‌ వస్తే రాంగ్‌ కాల్‌ అంటూ ఆపరేటర్‌కి చెప్పిన సంగతిని ప్రస్తావించారు. నిజానికి తన భర్త నారాయణ మూర్తికి ఉద్దేశించిన కాల్‌ ఏమో అనుకుని పొరపాటు పడ్డానని చెప్పారు. ఆ తరువాత విషయం తెలిసి చాలా సంతోషించానని ఆమె పేర్కొన్నారు.Once I received a call from Mr. Abdul Kalam, who told me that he reads my columns and enjoys them. pic.twitter.com/SWEQ6zfeu4— Smt. Sudha Murty (@SmtSudhaMurty) June 25, 2024 విషయం ఏమిటంటే..ఎక్స్ వేదికగా సుధామూర్తి దీనికి సంబంధించిన ఒక ఆడియో క్లిప్‌ను షేర్ చేశారు. ఇందులో అబ్దుల్‌ కలామ్‌ నుంచి తనకు ఫోన్ వచ్చినప్పుడు ఏం జరిగిందో వివరించారు. ‘ఐటీ డివైడ్' పేరుతో సుధామూర్తి ఒక కాలమ్‌ నడిపేవారు. దీన్ని అబ్దుల్‌ కలాం క్రమం తప్పకుండా చదివేవారట. అంతేకాదు ఈ రచనను బాగా ఆస్వాదించేవారు కూడా. ఇదే విషయాన్ని స్వయంగా ఆమెకు చెప్పేందుకు అబ్దుల్‌ కలాం ఫోన్‌ చేశారు. అయితే రాష్ట్రపతి భవన్ నుంచి తనకు ఫోన్ కాల్ వస్తే ‘రాంగ్ కాల్’ అని (ఆపరేటర్‌కి) తాను సమాధానం ఇచ్చానని సుధామూర్తి వెల్లడించారు. తన భర్త నారాయణమూర్తికి చేయబోయి తనకు చేశారేమో అనుకున్నానని, అందుకే అలా చెప్పినట్టు ఆమె పేర్కొన్నారు. అయితే ‘‘లేదు లేదు.. ఆయన (అబ్దుల్ కలాం) ప్రత్యేకంగా మీ పేరే చెప్పారు’ అని ఆపరేటర్‌ చెప్పడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతైంది. తాను కాలమ్‌ని చదివి ప్రశంసించడానికి కలాం ఫోన్ చేశారని తెలిసి చాలా సంతోషించాననీ, చాలా బావుందంటూ మెచ్చుకున్నారని సుధా మూర్తి ప్రస్తావించారు. ఈ సందర్బంగా కలాం నుంచి పౌరపురస్కారం అందుకుంటున్న ఫోటోని కూడా ఆమె పోస్ట్‌ చేశారు. కాగా రచయితగా పరోపకారిగా సుధామూర్తి అందరికీ సుపరిచితమే. బాల సాహిత్యంపై పలు పుస్తకాలు రాశారు. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఆమె సాహిత్యానికి పలు అవార్డులు కూడా దక్కాయి. 73 ఏళ్ళ వయసులో సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం లభించింది. ఇంకా అత్యున్నత పౌరపురస్కారాలైన పద్మశ్రీ (2006), పద్మ భూషణ్ (2023) కూడా ఆమెను వరించాయి. కాగా ఈ ఏడాది ప్రారంభంలో సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.

India’s rising water stress can dent its sovereign credit profile: Moody’s Ratings
నీటి కొరతతో.. ఎకానమీకి కష్టమే

న్యూఢిల్లీ: భారత్‌లో నీటి కొరత ఎకానమీకి తీవ్ర నష్టం చేకూర్చే అవకాశం ఉందని మూడీస్‌ రేటింగ్స్‌ హెచ్చరించింది. భారతదేశంలో పెరుగుతున్న నీటి కొరత వ్యవసాయ, పరిశ్రమల రంగాలకు అంతరాయం కలిగిస్తుందని అలాగే ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదలకు, ఆదాయంలో క్షీణతకు, సామాజిక అశాంతికి దారితీయవచ్చనివిశ్లేషించింది. ఆయా ప్రభావాలు సావరిన్‌ క్రెడిట్‌ రేటింగ్‌పై ప్రభావం చూపుతుందని సూచించింది. బొగ్గు విద్యుత్‌ జనరేటర్లు, ఉక్కు తయారీ వంటి నీటిని అధికంగా వినియోగించే రంగాల ప్రయోజనాలకు సైతం నీటి కొరత విఘాతం కలిగిస్తుందని హెచ్చరించింది. భారత్‌ వేగవంతమైన ఆర్థిక వృద్ధి, వేగవంతమైన పారిశ్రామికీకరణ, పట్టణీకరణతో పాటు ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంలో నీటి లభ్యత తగ్గుతుండడం ఆందోళన కలిగించే అంశంగా పేర్కొంది. అలాగే వాతావరణ మార్పుల కారణంగా నీటి ఒత్తిడి తీవ్రమవుతోందని కూడా పేర్కొంది. వాతావరణ మార్పులు కరువు, తీవ్ర వేడి, వరదలు వంటి తీవ్రమైన సంఘటనలకు కారణమవుతాయని వివరించింది. భారత్‌ ఎదుర్కొంటున్న వాతావరణ సమస్యలపై మూడీస్‌ రేటింగ్స్‌ వెలువరించిన తాజా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు.. 👉ఢిల్లీ, ఉత్తర భారత రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు జూన్‌ 2024లో 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడంతో నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారతదేశంలోని అత్యంత సాధారణ ప్రకృతి వైపరీత్యాలలో వరదలు కూడా కారణం. ఇది నీటి మౌలిక సదుపాయాలకు అంతరాయం కలిగిస్తాయి. ఆకస్మిక భారీ వర్షాల నుండి నీటిని నిలుపుకోవడం సాధ్యమయ్యే పనికాదు. 👉 2023లో ఉత్తర భారతదేశంలోని వరదలు, గుజరాత్‌లోని బిపార్జోయ్‌ తుఫాను కారణంగా 1.2–1.8 బిలియన్‌ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని, మౌలిక సదుపాయాలకు నష్టం జరిగిందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అంచనా వేసిన విషయం ఇక్కడ గమనార్హం.👉 రుతుపవన ఆధారిత వర్షపాతం కూడా తగ్గుతోంది. 1950–2020 సమయంలో హిందూ మహాసముద్రం దశాబ్దానికి 1.2 డిగ్రీల సెల్సియస్‌ చొప్పున వేడెక్కింది. ఇది 2020–2100 మధ్యకాలంలో 1.7–3.8 డిగ్రీల సెల్సియస్‌కు పెరుగుతుందని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటియోరాలజీ తెలపడం గమనార్హం. 👉 వర్షపాతం తగ్గుతున్న నేపథ్యంలో కరువు పరిస్థితులు తరచూ సంభవించే అవకాశాలు ఉత్పన్నమవుతున్నాయి. భారతదేశంలో రుతుపవన వర్షపాతం 2023లో 1971–2020 సగటు కంటే 6 శాతం తక్కువగా ఉంది. అకాల వర్షాలనూ ఇక్కడ ప్రస్తావించుకోవాలి. భారతదేశంలో 70 శాతానికి పైగా వర్షపాతం ప్రతి సంవత్సరం జూన్‌–సెపె్టంబరులో కేంద్రీకృతమై ఉంటోంది. 2023 ఆగస్టులో దేశంలో భారీగా వర్షపాతం నమోదుకావడం పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం. 👉 గతంలో సంభవించి న వ్యవసాయ ఉత్పత్తికి ఆటంకాలు, ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరుగుదల వల్ల ఆహార సబ్సిడీల భారం నెలకొంది. ఇది దేశంలో ద్రవ్యలోటు పరిస్థితులకూ దారితీసింది. ఆహార సబ్సిడీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) కేంద్ర ప్రభుత్వ వ్యయంలో 4.3 శాతంగా బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి. బడ్జెట్‌లోని భారీ కేటాయింపుల్లో ఈ విభాగం ఒకటి. 👉భారత ప్రభుత్వం నీటి మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెడుతోంది. పునరుత్పాదక ఇంధన అభివృద్ధికి కృషి చేస్తోంది. అదే సమయంలో నీటి భారీ పారిశ్రామిక వినియోగదారులు తమ నీటి వినియోగం సామర్థ్యాన్ని మెరుగుపరచుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలు అటు దేశానికి సంబంధించి సావరిన్‌ రేటింగ్‌ మెరుగుపరచుకోడానికి, కంపెనీలకు సంబంధించి దీర్ఘకా లికంగా నీటి నిర్వహణ ప్రతికూలత రేటింగ్‌లను తగ్గించుకోవడానికి దోహదపడతాయి. 👉భారతదేశంలో ఫైనాన్స్‌ మార్కెట్‌ చిన్నది. కానీ వే గంగా అభివృద్ధి చెందుతోంది. కంపెనీలకు, ప్రాంతీయ ప్రభుత్వాలకు నిధుల సేకరణ విషయంలో ఇది కీలకమైన అంశం. తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్న కొన్ని రాష్ట్రాలు నీటి నిర్వహణలో పెట్టుబడి కోసం నిధులను సమీకరించడానికి దేశ ఫైనాన్స్‌ మార్కెట్‌ను ఉపయోగించాయి. 👉పారిశ్రామికీకరణ, పట్టణీకరణ దేశంలో వేగంగా విస్తరిస్తున్నాయి. 2022 లెక్కల ప్రకారం, భారత్‌ స్థూల దేశీయోత్పత్తిలో పారిశ్రామిక రంగం వాటా 26 శాతం. ఇప్పటికి జీ–20 వర్థమాన దేశాల (ప్రపంచ బ్యాంక్‌ అంచనాల ప్రకారం 32 శాతం) కన్నా ఇది తక్కువ. మున్ముందు పరిశ్రమల రంగం మరింత విస్తరించే వీలుంది. ఇక పట్టణ ప్రాంతాల్లో నివసించేవారు దేశ మొత్తం జనాభాలో ప్రస్తుతం 36 శాతం. ప్రపంచ బ్యాంక్‌ అంచనాల ప్రకారం, జీ–20 వర్థమాన దేశాల్లో ఇది 76 శాతం వరకూ ఉంది. పట్టణ ప్రాంతాల్లోనూ ప్రజల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థలు –నివాసితుల మధ్య మున్ముందు నీటి కోసం తీవ్ర పోటీ నెలకొనే వీలుంది. 👉ఫిబ్రవరి 2023 నాటి ప్రపంచ బ్యాంక్‌ నివేదిక ప్రకారం, గత దశాబ్దంలో గ్రామీణ ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీటిని తీసుకురావడానికి భార త ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు బహుళజాతి బ్యాంకింగ్‌ (ప్రపంచబ్యాంక్‌) మద్దతు ఇచ్చింది. 1.2 బిలియన్‌ డాలర్ల మొత్తం ఫైనా న్సింగ్‌తో చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా దాదాపు 2 కోట్ల మంది ప్రయోజనం పొందారు.జలవనరుల శాఖ డేటాజలవనరుల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం భారత్‌ సగటు వార్షిక తలసరి నీటి లభ్యత 2021 నాటికి 1,486 క్యూబిక్‌ మీటర్ల నుండి 2031 నాటికి 1,367 క్యూబిక్‌ మీటర్లకు పడిపోవచ్చు. 1,700 క్యూబిక్‌ మీటర్ల కంటే తక్కువ స్థాయి నీటి ఒత్తిడిని సూచిస్తుంది. 1,000 క్యూబిక్‌ మీటర్లకు పడిపోతే అది నీటి కొరతకు కొలమానం.నివేదిక నేపథ్యం ఇదీ..ఇటీవల బెంగళూరు, ఇప్పుడు దేశ రాజధాని న్యూఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో నివాసితులు తీవ్ర నీటి నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామాలు నిరసనలు, రాజకీయ సంఘర్షణకు దారితీస్తోంది. ఈ అంశంపై జూన్‌ 21న నిరాహార దీక్ష ప్రారంభించిన ఢిల్లీ జల వనరుల మంత్రి అతిషి ఆరోగ్యం క్షీణించడంతో తాజాగా ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలోనే మూడీస్‌ తాజా నివేదిక వెలువరించింది.

Mla Padi Kaushikreddy Oath At Filmnagar Temple
‘బ్లాక్‌ బుక్‌’లో మంత్రి పొన్నం పేరు: పాడి కౌశిక్‌రెడ్డి

సాక్షి,హైదరాబాద్‌: తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఫిలింనగర్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి బుధవారం(జూన్‌ 26) ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినీతికి పాల్పడలేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ కూడా వచ్చి తనతో పాటు ప్రమాణం చేయాలని సవాల్‌ విసిరారు. ‘మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఫిలింనగర్‌లోని వేంకటేశ్వర ఆలయంలో ప్రమాణం చేయాలని డిమాండ్ చేశా. ఫ్లైయాష్ స్కామ్‌ చేయలేదని ప్రమాణం చేయాలని కోరాను. నువ్వు నీతి మంతుడివి అయితే ఎందుకు రాలేదు. నాపై తప్పుడు ఆరోపణలు చేశారు పొన్నం. తడి బట్టలతో హుజురాబాద్‌లో హనుమాన్ విగ్రహం సాక్షిగా ప్రమాణం చేశాను.నీ నిజాయితీ ఎందుకు నిరూపించుకోవడం లేదు పొన్నం ప్రభాకర్. వే బ్రిడ్జిలో కొలతలు తక్కువ వచ్చాయి. దీనికి ప్రూఫ్ ఉంది. వే బిల్ సరిగా లేదు. రవాణా శాఖ మంత్రిగా మీకు బాధ్యత లేదా? రోడ్లు నాశనం చేస్తున్నారు. ఫ్లైయాష్ వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజల శవాల మీద పైసలు ఏరుకుంటున్నాడు’అని కౌశిక్‌రెడ్డి మండిపడ్డారు. ప్రమాణం సందర్భంగా బ్లాక్ బుక్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పేరును కౌశిక్‌రెడ్డి రాశారు. తాము అధికారంలోకి వచ్చాక పొన్నంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, ప్రమాణం చేసేందుకుగాను బుధవారం ఉదయం బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌కు చేరుకున్న కౌశిక్‌రెడ్డి అక్కడి నుంచి వెంకటేశ్వరస్వామి గుడికి బయలుదేరారు.

What Happens If India VS England T20 World Cup 2024 Semifinal Is Washed Out
T20 World Cup 2024: ఇలా జరిగితే ఫైనల్స్‌కు టీమిండియా..!

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా గయానా వేదికగా రేపు (భారతకాలమానం ప్రకారం​ రాత్రి 8 గంటలకు) జరగాల్సిన భారత్‌-ఇంగ్లండ్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌కు వరుణ గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మ్యాచ్‌ జరిగే సమయానికి 88 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వెదర్‌ ఫోర్‌క్యాస్ట్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్‌ రద్దైతే పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే పరిస్థితి ఏంటి..?షెడ్యూల్‌ ప్రకారం భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరిగే రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే లేదు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే (ఒ‍క్క బంతి కూడా పడకుండా) సూపర్‌-8 దశలో గ్రూప్‌ (గ్రూప్‌-1) టాపర్‌గా ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్‌ చేరుతుంది.ఒకవేళ భారత్‌-ఇంగ్లండ్‌ సెమీస్‌ మ్యాచ్‌కు వర్షం​ కారణంగా పాక్షికంగా అంతరాయం కలిగితే.. ఫలితం తేలేందుకు 250 నిమిషాల అదనపు సమయం ఉంటుంది. ఇక్కడ కూడా ఫలితం తేలకపోతే డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో ఫలితాన్ని నిర్దారిస్తారు.తొలి సెమీఫైనల్‌కు రిజర్వ్‌ డేమరోవైపు సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య ట్రినిడాడ్‌ వేదికగా రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభంకావాల్సిన తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే ఉండటంతో వంద శాతం ఫలితం తేలే అవకాశం ఉంది.

If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?

NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement