automobiles
-
ఎంజీ సెలెక్ట్ డీలర్గా ఐకానిక్ ఆటోమొబైల్స్
ముంబై: జేఎస్డబ్ల్యూ ఎంజీ లగ్జరీ బ్రాండ్ ‘ఎంజీ సెలెక్ట్’ డీలర్గా ‘ఐకానిక్ ఆటోమొబైల్స్’ ఎన్నికైంది. బెంగళూరు కేంద్రంగా కొత్త తరం కొనుగోలుదారులకు నాణ్యమైన సేవలు అందించనుంది. ఎంజీ సెలెక్ట్ బ్రాండ్లో భాగంగా వస్తున్న తొలి విద్యుత్ స్పోర్ట్స్ కారు ‘సైబర్స్టర్’, ఎంజీ ఎం9 మోడళ్లను కస్టమర్లకు మరింత చేరువ చేస్తుందని ఎంజీ సెలెక్ట్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మిలింద్ అన్నారు. ఐకానిక్ ఆటోమొబైల్స్తో మొత్తం 12 డీలర్లను ఎంజీ సెలెక్ట్ ఎంపిక చేసుకుంది. ఈ డీలర్íÙప్ భాగస్వాములు దేశవ్యాప్తంగా 13 నగరాల్లో నెలకొల్పిన 14 ఎంజీ సెలెక్ట్ టచ్ పాయింట్ల ద్వారా సేవలు అందించనున్నాయి. -
నాలుగేళ్లలో 5 లక్షలమంది కొన్న కారు ఇదే
భారతీయ మార్కెట్లో అత్యంత సురక్షితమైన కారు.. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన వాహనాల జాబితాలో ఒకటైన 'టాటా పంచ్' (Tata Punch) తాజాగా.. అమ్మకాల్లో అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది. కేవలం 4 సంవత్సరాల్లో ఏకంగా 5 లక్షల సేల్స్ (Sales) మైలురాయిని దాటేసింది.టాటా పంచ్ 2021 అక్టోబర్లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 5,04,679 మంది దీనిని కొనుగోలు చేసినట్లు సమాచారం. 2021లో 22,571 యూనిట్లు, 2022లో 1,29,895 యూనిట్లు, 2023లో 1,50,182 యూనిట్లు, 2024లో 2,02,031 యూనిట్ల సేల్స్ జరిగాయి. అంతే కాకుండా గత ఏడాది ఎక్కువమంది కొనుగోలు చేసిన కారుగా కూడా ఓ హిస్టరీ క్రియేట్ చేసింది.సింపుల్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు కావలసినన్ని సేఫ్టీ ఫీచర్స్ పొందింది. ఇది ప్రస్తుతం పెట్రోల్, CNG, ఎలక్ట్రిక్ రూపాల్లో అమ్మకానికి ఉంది. ఈ కారు ధరలు రూ. 6.19 లక్షల నుంచి రూ. 14.44 లక్షల మధ్య ఉన్నాయి. అయితే ఈ అన్ని మోడల్స్.. ఉత్తమ సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉన్నాయి. -
ఐదు బెస్ట్ కార్లు: తక్కువ ధర & ఎక్కువ సేఫ్టీ!
ఓ కారును కొనాలంటే డిజైన్, మైలేజ్ చూస్తే సరిపోదు. అందులోని సేఫ్టీ ఫీచర్స్ కూడా చూడాలి. అంటే.. ఆ కారులో ఎన్ని ఎయిర్ బ్యాగులున్నాయి.. రియర్ కెమెరా వంటివి ఉన్నాయా? లేదా? అనే విషయాలు కూడా తప్పకుండా పరిశీలించాలి. ఇవన్నీ ఉన్న కారు కొనాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలేమో అనే అనుమానం మీకు రావచ్చు. కానీ ఈ కథనంలో తక్కువ ధర వద్ద.. 6 ఎయిర్ ఎయిర్బ్యాగ్లను కలిగిన టాప్ 5 కార్లను గురించి తెలుసుకుందాం.హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios)ఇండియన్ మార్కెట్లో అధిక అమ్మకాలు పొందిన 'హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్' అన్ని వేరియంట్లలోనూ ఆరు ఎయిర్బ్యాగ్లు లభిస్తాయి. ఈ కారు ధర రూ. 5.92 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ హ్యాచ్బ్యాక్ 1.2 లీటర్ ఇంజిన్ ద్వారా 82 Bhp పవర్, 114 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ & ఆటోమాటిక్ గేర్బాక్స్ ఎంపికలను పొందుతుంది.హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ 6 ఎయిర్బ్యాగ్లతో పాటు ఏబీఎస్ విత్ ఈబీడీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite)ఇటీవల ఫేస్లిఫ్ట్ రూపంలో మార్కెట్లో లాంచ్ అయిన నిస్సాన్ మాగ్నైట్ ధర రూ. 5.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ మోడల్ ఎంట్రీ-లెవల్ వేరియంట్ ఆరు ఎయిర్బ్యాగ్లను పొందుతుంది. ఇందులోని 1 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 71 Bhp, 96 Nm టార్క్ అందిస్తే.. 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 99 Bhp పవర్, 160 Nm టార్క్ డెలివరీ చేస్తుంది. ఈ కారులో 360 డిగ్రీ కెమెరా, ఏబీఎస్ విత్ ఈబీడీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవన్నీ ఉన్నాయి.మారుతి స్విఫ్ట్ (Maruti Swift)మారుతి సుజుకి కంపెనీకి చెందిన స్విఫ్ట్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మారుతి కార్లను ఉపయోగిస్తున్న వారిలో చాలామంది ఈ 'స్విఫ్ట్' కారునే ఉపయోగిస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 6.5 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారులో 5 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది 6 ఎయిర్బ్యాగ్లతో పాటు ఏబీఎస్ విత్ ఈబీడీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది.ఇదీ చదవండి: అంబానీ ఇంటికి కొత్త అతిథి.. ఇది చాలా స్పెషల్!హ్యుందాయ్ ఎక్స్టర్ (Hyundai Exter)హ్యుందాయ్ కంపెనీకి చెందిన కాంపాక్ట్ ఎస్యూవీ ఎక్స్టర్.. ఆరు ఎయిర్బ్యాగ్లను పొందుతుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 5.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది డాష్క్యామ్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటి అనేక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని 1.2 లీటర్ ఇంజిన్ మంచి పనితీరును అందిస్తుంది.సిట్రోయెన్ సీ3 (Citroen C3)రూ. 6.16 లక్షల ఎక్స్ షోరూమ్ వద్ద లభించే 'సిట్రోయెన్ సీ3' కూడా ఆరు ఎయిర్బ్యాగ్లు పొందుతుంది. ఆరు ఎయిర్బ్యాగ్లు ఫీల్ (ఓ), షైన్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఎయిర్బ్యాగ్లు కాకుండా ఇందులో ఈబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్పెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, డే-నైట్ ఐవీఆర్ఎం వంటివి కూడా ఉన్నాయి. -
తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్: ఇదిగో టాప్ 5 బైకులు
మార్కెట్లో లక్ష రూపాయల నుంచి రూ.70 లక్షల వరకు బైకులు అందుబాటులో ఉన్నాయి. అయితే.. చాలామంది ధరను మాత్రమే కాకుండా మైలేజ్ను దృష్టిలో ఉంచుకుని టూ వీలర్స్ కొనుగోలు చేస్తున్నారు. ఈ కథనంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 బైకులు గురించి వివరంగా తెలుసుకుందాం.బజాజ్ ఫ్రీడమ్ 125'బజాజ్ ఫ్రీడమ్ 125' అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ బైక్. దీని ధర రూ.89,997 నుంచి రూ. 1.09 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ బైకులోని 125 సీసీ ఇంజిన్ 9.3 బిహెచ్పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఇందులో సీఎన్జీ, పెట్రోల్ కోసం రెండు ఫ్యూయల్ ట్యాంకులు ఉంటాయి. ఈ బైక్ 65 కిమీ/లీ మైలేజ్ ఇస్తుందని సమాచారం.టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకుల జాబితాలో 'టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్' ఒకటి. ఈ బైక్ ధరలు రూ. 75541 నుంచి రూ. 78541 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ బైకులో ఎకోథ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (ETFi) టెక్నాలజీ ఉంది. కాబట్టి ఇది సాధారణ మోడల్ కంటే కూడా ఎక్కువ పనితీరును అందిస్తుంది. ఈ బైకులోని 110 సీసీ ఇంజిన్ 8 బీహెచ్పీ పవర్, 8.7 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 86 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.బజాజ్ ప్లాటినా 110రూ. 71,354 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభిస్తున్న బజాజ్ ప్లాటినా 110 బైక్ 70 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 115 సీసీ ఇంజిన్ 8.4 బీహెచ్పీ పవర్, 9.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైకులో ఎల్ఈడీ డీఆర్ఎల్, హ్యాండ్ గార్డ్లు, వైడ్ ఫుట్పెగ్లు, 5 స్పీడ్ గేర్బాక్స్ వంటివి ఉన్నాయి.హోండా సీడీ 110 డ్రీమ్ డీలక్స్హోండా సీడీ 110 డ్రీమ్ డీలక్స్ కూడా ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకుల జాబితాలో ఒకటి. రూ. 74401 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తున్న ఈ బైక్ 110 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది జపనీస్ ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ (ESP) టెక్నాలజీ పొందుతుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ బైక్ మైలేజ్ 65 కిమీ/లీ అని తెలుస్తోంది.ఇదీ చదవండి: 10 రోజుల్లో 10000 మంది కొన్న కారు ఇదే..హీరో స్ప్లెండర్ ప్లస్భారతదేశంలో ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న బైకుల జాబితాలో ప్రధానంగా చెప్పుకోదగ్గ బైక్ హీరో స్ప్లెండర్ ప్లస్. ఈ బైక్ ధరలు రూ. 75441 నుంచి రూ. 78286 మధ్య ఉన్నాయి. 100 సీసీ ఇంజిన్, ఐ3ఎస్ టెక్నాలజీ కలిగిన ఈ బైక్ 80.6 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. కాబట్టి దీనిని మైలేజ్ రాజు అని కూడా పిలుస్తారు. -
2025 కవాసకి కొత్త బైక్.. రేటెంతో తెలుసా?
కవాసకి ఇండియా తన జెడ్ఎక్స్-4ఆర్ఆర్ బైకును కొత్త కలర్ ఆప్షన్లో లాంచ్ చేసింది. దీని ధర రూ. 9.42 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది ఇప్పుడు లైమ్ గ్రీన్/ఎబోనీ/బ్లిజార్డ్ వైట్ అనే కొత్త రంగులో అందుబాటులో ఉంది. ఈ కొత్త బైక్ 2024 మోడల్ కంటే రూ. 32,000 ఖరీదైనది.కవాసకి నింజా జెడ్ఎక్స్-4ఆర్ఆర్ బైక్ 399సీసీ లిక్విడ్-కూల్డ్, ఇన్లైన్-ఫోర్ ఇంజన్ పొందుతుంది. ఇది 14500 rpm వద్ద 77 Bhp పవర్, 13000 rpm వద్ద 39 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది.2025 కవాసకి నింజా జెడ్ఎక్స్-4ఆర్ఆర్ ట్విన్ ఎల్ఈడీ హెడ్లైట్స్, అప్స్వెప్ట్ టెయిల్ లాంప్, టెన్సిల్ స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్ వంటివి పొందుతుంది. యూఎస్డీ ఫోర్క్, బ్యాక్-లింక్ మోనోషాక్ కలిగిన ఈ బైక్ 17 ఇంచెస్ వీల్స్ కలిగి ఉంటుంది. సుమారు 189 కేజీల బరువున్న కొత్త కవాసకి బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 135 మిమీ.నింజా జెడ్ఎక్స్-4ఆర్ఆర్ బైక్ స్పోర్ట్, రోడ్, రెయిన్ లేదా కస్టమ్ అనే నాలుగు రైడ్ మోడ్లను పొందుతుంది. ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్, కలర్డ్ టీఎఫ్టీ డిస్ప్లే వంటివి కూడా ఈ బైకులో చూడవచ్చు. ఇది కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కంపెనీ అధికారిక డీలర్షిప్లలో బుకింగ్లను స్వీకరించడం ప్రారంభించింది. -
టయోటా లాంచ్ చేసిన మరో ఫెస్టివ్ ఎడిషన్ ఇదే..
టయోటా కంపెనీ గ్లాన్జా, టైసర్, హైరైడర్ ఫెస్టివల్ ఎడిషన్లను లాంచ్ చేసింది. ఇప్పుడు తాజాగా రూమియన్ ఫెస్టివ్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ కారు కొనుగోవులు చేసేవారు ఎటువంటి అదనపు ఖర్చులు లేకుండానే రూ. 20608 విలువైన యాక్సెసరీలను పొందవచ్చు.టయోటా రూమియన్ ఫెస్టివ్ ఎడిషన్ మడ్ ఫ్లాప్లు, మ్యాట్లు, క్రోమ్ డోర్ వైజర్, స్పాయిలర్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా టెయిల్గేట్, రియర్ బంపర్, హెడ్ల్యాంప్, నంబర్ ప్లేట్, బాడీ మౌల్డింగ్లకు గార్నిష్లు ఉన్నాయి. ఈ కొత్త యాక్ససరీస్ వల్ల కారు మరింత అద్భుతంగా కనిపిస్తుంది.టయోటా రూమియన్ దాని మునుపటి మోడల్లోని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 102 Bhp పవర్, 138 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్ అప్షన్స్ పొందుతుంది. ఈ ఫెస్టివల్ ఎడిషన్ ఎస్, జీ, వీ ట్రిమ్లలో మాత్రమే కాకుండా CNG రూపంలో కూడా అందుబాటులో ఉంది.ఇదీ చదవండి: టయోటా టైజర్ లిమిటెడ్ ఎడిషన్.. మంచి ఆఫర్తో..మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టయోటా రూమియన్ ప్రధానంగా మారుతి సుజుకి ఎర్టిగా, కియా కారెన్స్, హ్యుందాయ్ అల్కాజార్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఇది ఫెస్టివ్ ఎడిషన్ కాబట్టి మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. అయితే ఈ కారు ఎప్పటి వరకు మార్కెట్లో విక్రయానికి ఉంటుందనేది తెలియాల్సి ఉంది. -
మొదటిసారి కారు కొన్నవారు ఇంతమందా?
కరోనా మహమ్మారి తరువాత చాలామంది సొంత వాహనం కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆటోమొబైల్ మార్కెట్ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. మొదటిసారి కార్లను కొనుగోలు చేసినవారు 67 శాతం మంది ఉన్నట్లు రిటైల్ ప్లాట్ఫారమ్ స్పిన్నీ ఒక నివేదికలో వెల్లడించింది.మొదటిసారి వాహనం కొనుగోలు చేసిన మొత్తం 67 శాతం మందిలో 30 శాతం మహిళలే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో కూడా 80 శాతం మంది పెట్రోల్ కార్లను కొనుగోలు చేశారు. డీజిల్ కార్ల కొనుగోలుకు కేవలం 12 శాతం మంది మాత్రమే ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఐదు శాతం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) మోడల్ ఎంచుకున్నారు.కొత్త వాహనాలను కొనుగోలు చేసినవారిలో చాలామంది వైట్, రెడ్, గ్రే కలర్స్ ఎంచుకున్నారు. సుమారు 60 శాతంమంది ఫైనాన్సింగ్ ద్వారా కార్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. డెలివరీల విషయానికి వస్తే.. 82 శాతం మంది డీలర్షిప్స్ నుంచి డెలివరీ తీసుకున్నట్లు, 18 శాతం మంది హోమ్ డెలివరీ ద్వారా డెలివరీ తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: కోటి మంది కొన్న హోండా స్కూటర్ ఇదే..ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 76 శాతం మంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ కలిగిన కార్లను కొనుగోలు చేశారు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ వాహనాలను కొనుగోలు చేసినవారు 24 శాతం మంది మాత్రమే. దీన్ని బట్టి చూస్తే.. టెక్నాలజీ పెరిగినప్పటికీ.. మాన్యువల్ ట్రాన్స్మిషన్ వాహనాలనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.కొత్త వాహనాల అమ్మకాలు ఢిల్లీలో ఎక్కువగా ఉన్నాయి. ఆ తరువాత స్థానంలో బెంగళూరు, ముంబై ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ ఆటోమొబైల్ భారత్ మూడో స్థానంలో ఉంది. నేడు మన దేశంలో చైనా, జపాన్, జర్మన్ వంటి అనేక దేశాల బ్రాండ్స్ కూడా గొప్ప అమ్మకాలను పొందుతున్నాయి. -
హోండా బైకులకు రీకాల్: జాబితాలోని మోడల్స్ ఇవే..
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'హోండా మోటార్సైకిల్ & స్కూటర్ ఇండియా' తన సీబీ350, హైనెస్ సీబీ350 బైకులకు రీకాల్ ప్రకటించింది. వీల్ స్పీడ్ సెన్సార్, క్యామ్షాఫ్ట్ సమస్యల కారణంగానే ఈ రీకాల్ ప్రకటించినట్లు కంపెనీ వెల్లడించింది.2020 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య తయారైన సీబీ300ఎఫ్, సీబీ300ఆర్, సీబీ350, హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్ బైకులకు కంపెనీ రీకాల్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ బైకులలో ఎలాంటి సమస్య తలెత్తలేదు, కానీ కంపెనీ ముందుగానే ఈ నిర్ణయం తీసుకుంది.వీల్ స్పీడ్ సెన్సార్లో ఉన్న సమస్య వల్ల అందులోని నీరు ప్రవేశించే అవకాశం ఉంది. ఇది స్పీడోమీటర్, ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్ వంటి వాటిమీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యను రీకాల్ ద్వారా పరిష్కరించడానికి కంపెనీ సిద్ధమైంది.ఇదీ చదవండి: 809కిమీ రేంజ్ అందించే బెంజ్ కారు లాంచ్: ధర ఎంతంటే? ఇక క్యామ్షాఫ్ట్ కాంపోనెంట్తో వచ్చే సమస్యలు.. వెహికల్ పనితీరు మీద ప్రభావితం చూపుతాయి. కాబట్టి 2020 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య తయారైన.. కంపెనీ వెల్లడించిన బైకులకు సంస్థ ఉచితంగానే సమస్యను పరిష్కరిస్తుంది. వాహనం వారంటీతో సంబంధం లేకుండా సమస్యకు కారణమైన భాగాలను కంపెనీ ఉచితంగానే రీప్లేస్ చేస్తుంది. -
ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు ఊరట
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర మంత్రివర్గం కొత్త పథకానికి ఆమోదం తెలిపింది. ఈ కొత్త స్కీమ్ పేరు ''పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్'' (PM E-DRIVE). ఇది మార్చి వరకు తొమ్మిదేళ్లపాటు అమలులో ఉన్న ప్రస్తుత 'ఫేమ్' ప్రోగ్రామ్ను భర్తీ చేస్తుంది.ఈ కొత్త పథకం ద్వారా ఎలక్ట్రిక్ కార్లకు ఎటువంటి సబ్సిడీలు లభించదు. కానీ ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్స్, బస్సులకు సబ్సిడీ లభించే అవకాశం ఉంది. దీనికోసం కేంద్రం రెండేళ్లకు రూ. 10900 కోట్లు కేటాయించారు. ఇందులో హైబ్రిడ్ అంబులెన్స్లు, ఎలక్ట్రిక్ ట్రక్కులకు కూడా కొంత ప్రోత్సాహాలు లభిస్తాయి.పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్ కింద 88500 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్లను ఏర్పాటు చేయనున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి 'అశ్విని వైష్ణవ్' ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్పై నిర్ణయం తీసుకున్నట్లు వైష్ణవ్ విలేకరులతో చెప్పారు.రాష్ట్ర రవాణా సంస్థలు & ప్రజా రవాణా సంస్థల ద్వారా 14,028 ఎలక్ట్రిక్ బస్సుల సేకరణకు రూ.4,391 కోట్లు అందించారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, అహ్మదాబాద్, సూరత్, బెంగళూరు, పూణె, హైదరాబాద్ల వంటి 40 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న తొమ్మిది నగరాల్లో CESL ద్వారా డిమాండ్ అగ్రిగేషన్ చేయనున్నారు. రాష్ట్రాలతో సంప్రదించిన తరువాత ఇంటర్సిటీ, ఇంటర్స్టేట్ ఎలక్ట్రిక్ బస్సులకు కూడా మద్దతు లభిస్తుంది.ఎలక్ట్రిక్ అంబులెన్స్ల ఏర్పాటు చేయడానికి కేంద్రం రూ.500 కోట్లు కేటాయించింది. రోగుల రవాణా కోసం ఎలక్ట్రిక్ అంబులెన్స్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎలక్ట్రిక్ ట్రక్కుల ప్రోత్సహించేందుకు కూడా రూ.500 కోట్లు అందించారు.ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్స్టాలేషన్స్భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ఇప్పటికి కూడా చాలామంది కొనుగోలు చేయకపోవడానికి ప్రధాన కారణం.. ఛార్జింగ్ సదుపాయాలు లేకపోవడమే. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయనుంది. ఎంపిక చేసిన నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్స్టాల్ చేయనున్నారు. ఇందులో ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్స్ కోసం 22,100 ఫాస్ట్ ఛార్జర్లు, ఈ-బస్సుల కోసం 1,800 ఫాస్ట్ ఛార్జర్లు, టూ వీలర్ & త్రీ వీలర్స్ కోసం 48400 ఫాస్ట్ ఛార్జర్లను ఇన్స్టాల్ చేయనున్నట్లు సమాచారం. దీనికోసం రూ. 2000 కోట్లు వెచ్చించారు. -
భారత్లో జపనీస్ బ్రాండ్ కారు లాంచ్: ధర రూ. 69.70 లక్షలు
ప్రముఖ కార్ల తయారీ సంస్థ లెక్సస్ ఇండియా.. భారతీయ మార్కెట్లో 'ఈఎస్ లగ్జరీ ప్లస్ ఎడిషన్' లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ. 69.70 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్ పొందుతుంది.లెక్సస్ ఈఎస్ లగ్జరీ ప్లస్ ఎడిషన్ కొత్త సిల్వర్ గ్రిల్, రియర్ ల్యాంప్ క్రోమ్ గార్నిష్, ఎల్ఈడీ లైట్ లెక్సస్ లోగోతో కూడిన ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్, లోగో ల్యాంప్, రియర్ సీట్ పిల్లో వంటి ఫీచర్స్ పొందుతుంది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు మీద 8 సంవత్సరాలు / 160000 కిమీ వారంటీ అందిస్తుంది. కస్టమర్లు 5 సంవత్సరాల వరకు రోడ్సైడ్ అసిస్టెన్స్ కూడా పొందవచ్చు.లెక్సస్ కొత్త కారు లాంచ్ చేసిన సందర్భంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తన్మయ్ భట్టాచార్య మాట్లాడుతూ.. రాబోయే పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకుని కొత్త ఎడిషన్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. ఇది లేటెస్ట్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. పనితీరు కూడా చాలా ఉత్తమంగా ఉంటుందని ఆయన అన్నారు.2024 ప్రథమార్థంలో, జపనీస్ కార్ల తయారీ కంపెనీ లెక్సస్ భారతదేశంలో 55 శాతం ఈఎస్ కార్లను విక్రయించింది. ఇప్పుడు ఇందులో లగ్జరీ ప్లస్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇది కూడా మనషి మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నారు. -
భారత్లో టాటా కర్వ్ లాంచ్: ధర & వివరాలు
టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో కర్వ్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లను లాంచ్ చేసింది. ఇవి మొత్తం ఎనిమిది వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్స్ ప్రారంభ ధర రూ. 10 లక్షల నుంచి రూ. 17.5 లక్షలు. డీజిల్ వేరియంట్స్ ధరలు రూ. 11.5 లక్షల నుంచి రూ. 17.7 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.కొత్త టాటా కర్వ్ 1.2 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ అనే మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. మూడు ఇంజన్లు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ఆప్షన్తో పాటు 6-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో స్టాండర్డ్గా వస్తాయి. ఇది భారతదేశంలో డ్యూయల్-క్లచ్ గేర్బాక్స్ పొందిన ఏకైక డీజిల్ కారుగా నిలిచింది.టాటా కర్వ్ కారు లేటెస్ట్ డిజైన్ పొందుతుంది. ఇందులో ఫోర్ స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఇది 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 12.3 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పనోరమిక్ సన్రూఫ్, రిక్లైనింగ్ రియర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటివి పొందుతుంది.సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. టాటా కర్వ్ ఆరు ఎయిర్బ్యాగ్లు, లెవెల్ 2 ఏడీఏఎస్, ఈసీఎస్, డిస్క్ బ్రేక్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, 360 డిగ్రీ కెమెరా, ఆటో-హోల్డ్తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివన్నీ పొందుతుంది. ఈ కొత్త కారు సిట్రోయెన్ బసాల్ట్ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
లాంచ్కు సిద్ధమవుతున్న జర్మన్ బ్రాండ్ కారు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'ఆడి' కొత్త తరం 'క్యూ5' కారును ఆవిష్కరించింది. ఇది ప్రీమియం ప్లాట్ఫారమ్ కంబస్షన్ (PPC) ఆధారంగా తయారైన బ్రాండ్ మొదటి వెహికల్. ఈ కారు వచ్చే ఏడాది దేశీయ విఫణిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.కొత్త ఆడి క్యూ5 మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్లైట్స్, అప్డేటెడ్ ఫ్రంట్ బంపర్, చిన్న గ్రిల్, వెనుకవైపు కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, డ్యూయల్ టోన్ బంపర్ వంటివి పొందుతుంది. ఇంటీరియర్ డిజైన్ ఆడి క్యూ6 ఈ-ట్రాన్ మాదిరిగా ఉంటుంది.కొత్త తరం ఆడి క్యూ5 11.9 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 14.5 ఇంచెస్ టచ్స్క్రీన్, త్రీ-స్పోక్ స్టీరింగ్ వంటివి కలిగి ఉంటుంది. ఇది మూడు పవర్ట్రెయిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. అవి 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్, 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్, 3.0 లీటర్ వీ6 టర్బో పెట్రోల్ ఇంజిన్స్.ఆడి క్యూ5 కారు ఈ నెల చివరినాటికి జర్మనీలో, ఆ తరువాత యూరప్లోని ఇతర దేశాలలో లాంచ్ అవుతుంది. 2025 మొదటి త్రైమాసికంలో డెలివరీలు ప్రారంభమవుతాయి. ఇది భారతీయ మార్కెట్లో వచ్చే ఏడాది లాంచ్ అవుతుందని సమాచారం. కంపెనీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడించాల్సి ఉంది.భారతదేశంలో లాంచ్ అయిన తరువాత, ఆడి క్యూ5 కారు ఇప్పటికే విక్రయానికి ఉన్న మెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ, వోల్వో ఎక్స్సీ60 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కారు ధర రూ. 65 లక్షల కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అధికారిక ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
రూ.1.15 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్: 137 కిమీ రేంజ్
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'బజాజ్ ఆటో'.. చేతక్ బ్లూ 3202 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. రూ. 1.15 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ అయిన ఈ కొత్త స్కూటర్ బ్రూక్లిన్ బ్లాక్, సైబర్ వైట్, ఇండిగో మెటాలిక్, మాట్ కోర్స్ గ్రే అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.బజాజ్ ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. రూ.2000 చెల్లించి స్కూటర్ బుక్ చేసుకోవచ్చు. చేతక్ 3202 ఈవీ 3.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. చూడటానికి ఇది ప్రీమియం వేరియంట్ మాదిరిగా అనిపిస్తుంది. ఒక ఫుల్ చార్జితో 137 కిమీ రేంజ్ అందిస్తుంది.బజాజ్ చేతక్ బ్లూ 3202 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్ఈడీ హెడ్లైట్, ఓటీఏ అప్డేట్లు, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, రివర్స్ ఫంక్షన్స్, స్మార్ట్ కీతో పాటు ఎకో-రైడింగ్ మోడ్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా ఇందులో హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు రోల్-ఓవర్ డిటెక్షన్ కూడా ఉంటాయి. ఇది ఓలా ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
సెప్టెంబర్లో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు
పండుగ సీజన్లో దేశీయ మార్కెట్లో లాంచ్ కావడానికి కొత్త ఎలక్ట్రిక్ కార్లు సిద్ధమవుతున్నాయి. ఇందులో మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్, ఎంజీ విండ్సర్ ఈవీ, బీవైడీ ఈ6 ఫేస్లిఫ్ట్ ఉన్నాయి. త్వరలో లాంచ్ కానున్న ఈ కొత్త కార్ల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన మేబ్యాచ్ ఈక్యూఎస్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇది అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో ఒకటిగా నిలువనుంది. సరికొత్త ఈక్యూఎస్ సీబీయూ మార్గం ద్వారా భారతదేశానికి రానుంది. కాబట్టి దీని ధర కొంత ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్ ప్రత్యేకమైన కలర్ ఆప్షన్ కలిగి ఒక సింగిల్ చార్జితో 600 కిమీ రేంజ్ అందించేలా రూపొందించారు. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 649 Bhp పవర్, 950 Nm టార్క్ అందిస్తుంది. ఈ కారు 4.4 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 210 కిమీ.ఎంజీ విండ్సర్ ఈవీసెప్టెంబర్ 11న ఎంజీ విండ్సర్ ఈవీ లాంచ్ కానుంది. ఇది మార్కెట్లో అడుగుపెట్టనున్న కంపెనీ మూడో ఎలక్ట్రిక్ కారు. లాంచ్ తరువాత బుకింగ్స్ ప్రారంభమవుతాయని సమాచారం. దీని ధర రూ. 20 లక్షల లోపు ఉండే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఇప్పటికే పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది.త్వరలో లాంచ్ కానున్న కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ.. కొత్త డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఒక పెద్ద 15.6 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 135-డిగ్రీల రిక్లైనింగ్ ఫంక్షన్లతో రియర్ సీట్లు, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.బీవైడీ ఈ6 ఫేస్లిఫ్ట్బీవైడీ ఈ6 ఫేస్లిఫ్ట్ వచ్చే నెలలో లాంచ్ కానుంది. ఈ6 ఎలక్ట్రిక్ ఎమ్పివి ఇటీవలే గ్లోబల్ మార్కెట్లో ఎం6గా లాంచ్ అయింది. కంపెనీ ఈ కారుకు సంబంధించిన టీజర్ను ఇప్పటికే రిలీజ్ చేసింది. ఈ కొత్త కారు 55.4 కిలోవాట్, 71.8 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ ఉంటాయి. ఇవి వరుసగా 420 కిమీ, 530 కిమీ రేంజ్ అందిస్తాయి. -
భారత్లో మరో మసెరటి కారు లాంచ్: ధర ఎంతో తెలుసా?
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'మసెరటి'.. భారతీయ మార్కెట్లో సెకండ్ జనరేషన్ 'గ్రాన్టూరిస్మో' (GranTurismo) లాంచ్ చేసింది. ఈ కారు ప్రారంభ ధరలు రూ. 2.72 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది మోడెనా, ట్రోఫియో అనే రెండు ట్రిమ్లలో లభిస్తుంది.రెండు డోర్స్, నాలుగు సీట్లు కలిగిన ఈ కారు 3.0 లీటర్ వీ6 ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 490 హార్స్ పవర్, 600 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు 3.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది.మసెరటి గ్రాన్టూరిస్మో 12.2 ఇంచెస్ డిజిటల్ డయల్ డిస్ప్లే, 12.3 ఇంచెస్ సెంట్రల్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఉన్నాయి. దానికి కింద భాగంలో క్లైమేట్ కంట్రోల్స్ కోసం 8.8 ఇంచెస్ టచ్స్క్రీన్ కూడా ఉంటుంది. డిజిటల్ క్లాక్, ఆప్షనల్ హెడ్ అప్ డిస్ప్లే, సోనస్ ఫాబ్రే ఆడియో సిస్టమ్ మొదలైనవి కూడా ఇందులో చూడవచ్చు.20 ఇంచెస్ ఫ్రంట్ వీల్, వెనుకవైపు 21 ఇంచెస్ వీల్స్ పొందిన మసెరటి గ్రాన్టూరిస్మో ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న బీఎండబ్ల్యూ ఎం8 కాంపిటీషన్, ఫెరారీ రోమా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
కొత్త బైక్ లాంచ్ చేసిన ట్రయంఫ్ - ధర రూ.9.72 లక్షలు
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'ట్రయంఫ్ మోటార్సైకిల్' భారతీయ విఫణిలో 'డేటోనా 660' బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 9.72 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని డేటోనా 675 ఆధారంగా తయారైంది.లేటెస్ట్ డిజైన్ కలిగిన ట్రయంఫ్ డేటోనా 660 బైక్.. ఎల్ఈడీ హెడ్ల్యాంప్ సెటప్, కాంపాక్ట్ టెయిల్ సెక్షన్ పొందుతుంది. ఇది షోవా 41 మిమీ బిగ్ పిస్టన్ అప్సైడ్ డౌన్ ఫోర్క్, వెనుకవైపు 130 మిమీ షోవా మోనోషాక్ ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఈ బైక్ రేడియల్ కాలిపర్లతో 310 మిమీ ట్విన్ డిస్క్లు, వెనుక స్లైడింగ్ కాలిపర్తో 220 మిమీ సింగిల్ డిస్క్ ఉన్నాయి.డేటోనా 660 బైక్ 660 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇన్లైన్ ట్రిపుల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 95 Bhp పవర్, 69 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ కలిగి, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ పొందుతుంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్లు. కాబట్టి లాంగ్ రైడింగ్ చేయడానికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.డేటోనా 660 బైక్ ఇన్స్ట్రుమెంటేషన్ కోసం మల్టీ ఫంక్షన్ కలర్ TFT స్క్రీన్ పొందుతుంది. ఈ బైక్ రోడ్, రైన్, స్పోర్ట్ అనే మూడు రైడ్ మోడ్లను పొందుతుంది. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇందులో ఉంటుంది. ఈ కొత్త బైక్ కవాసకి నింజా 650, ఎప్రిలియా ఆర్ఎస్ 660 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.It’s GAME ON! The moment you've been waiting for is here. Introducing the ALL-NEW Daytona 660, priced at ₹9 72 450/- Ex-Showroom.Get ready to experience the thrilling triple-powered performance, delivering pure exhilaration.Bookings are open now at Triumph dealerships near you pic.twitter.com/KyBEMWKcw5— TriumphIndiaOfficial (@IndiaTriumph) August 29, 2024 -
నిబంధనలు పాటించని మెర్సిడెస్ బెంజ్!.. ఎంపీసీబీ
పూణె తయారీ కేంద్రంగా ఉన్న లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్ ఇండియా' పర్యావరణ ప్రమాణాలను పాటించడం లేదని మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (MPCB) ఆరోపించింది. ప్లాంట్ కార్యకలాపాలను సమగ్రంగా సమీక్షించాలని కోరింది.మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఎలాంటి వ్రాతపూర్వక నోటీసు అందుకోలేదని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. అవసరమైతే ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కంపెనీ పేర్కొంది.2024 ఆగస్టు 23న నిర్వహించిన సాధారణ తనిఖీలో.. పూణేలోని చకాన్లోని మెర్సిడెస్ బెంజ్ అసెంబ్లీ ప్లాంట్ మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (MPCB) నిర్దేశించిన కాలుష్య నియంత్రణ మార్గదర్శకాలకు కట్టుబడి లేదని గుర్తించినట్లు బోర్డు తెలిపింది. దీంతో బెంజ్ అసెంబ్లీ ప్లాంట్ మీద తగిన చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ అధికారులను ఆదేశించింది. తక్షణ చర్యగా.. రూ. 25 లక్షల బ్యాంక్ గ్యారెంటీని జప్తు చేసినట్లు వెల్లడించింది.ఆటోమోటివ్ ఇన్నోవేషన్లో అగ్రగామిగా ఉన్న మెర్సిడెస్ బెంజ్ స్థిరమైన ఉత్పత్తి పద్ధతుల్లో పర్యావరణ ప్రమాణాలను పాటించకపోవడం అనేది ఆందోళన కలిగించే విషయం. ఇది బ్రాండ్ మీదున్న నమ్మకాన్ని ఒమ్ముచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పర్యావరణం, సుస్థిరత పద్ధతులను నిలబెట్టడానికి.. తప్పనిసరి నిబంధనలను పాటిస్తామని, ప్రమాణాలకు కట్టుబడి ఉండటానికి కంపెనీ అధిక ప్రాధాన్యతనిస్తుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా తెలిపింది. -
వెహికల్ కొంటున్నారా?.. దీన్ని ఓ లుక్ వేయండి!
ఒక వాహనం కొనుగోలు చేయాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి మొత్తం డబ్బు ఒకేసారి చెల్లించి తీసుకోవడం. రెండు 'ఈఎమ్ఐ' రూపంలో తీసుకోవడం. ఇంతకీ ఏ విధంగా కొనుగోలు చేస్తే ఉత్తమం? మొత్తం డబ్బు చెల్లించడం (ఫుల్ క్యాష్) ద్వారా లాభాలేంటి? ఈఎమ్ఐ ద్వారా కొనుగోలు చేస్తే వచ్చే లాభ, నష్టాల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.బంధువులు కొన్నారు, పక్కింటి వాళ్ళు కొన్నారు, ఎదురింటి వాళ్ళు కొన్నారు అని, ఆవేశంతో ఆలోచించకుండా వాహనాలు కొనుగోలు చేస్తే.. ఆ తరువాత ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధిక వడ్డీలు ఆర్థిక ఒత్తిడికి గురి చేస్తాయి. కాబట్టి ఒక వాహనం కొనుగోలు చేసే ముందు ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకోవడం మాత్రమే.. సంపాదనను కూడా బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది.మొత్తం డబ్బు చెల్లించి (ఫుల్ క్యాష్)ఏదైనా వాహనం (కారు / బైక్) కొనాలంటే మొత్తం డబ్బు చెల్లించడం అనేది ఉత్తమ ఎంపిక. ఎందుకంటే ఒకేసారి వాహన ఖరీదును చెల్లించాలమంటే.. ప్రతి నెలా ఈఎమ్ఐలు చెల్లించాల్సిన అవసరం లేదు. రిజిస్టేషన్స్, యాక్ససరీస్ వంటివన్నీ ఒకేసారి పొందవచ్చు. వడ్డీ చార్జీలు నుంచి తప్పించుకోవచ్చు. అంతే కాకుండా వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా కొన్ని సార్లు ఆఫర్స్ కూడా లభిస్తాయి. తక్షణమే మీరు వాహనానికి ఓనర్ కూడా అవ్వొచ్చు.లోన్ మీద కారు కొనుగోలునిజానికి ప్రతి ఒక్కరూ మొత్తం డబ్బు చెల్లించే విధానం పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక కారు కొనాలంటే కనీసం రూ. 10 లక్షల కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఒకేసారి అంత మొత్తం చెల్లించడం కొందరికి కష్టమే. కానీ వారు ప్రతి నెలా కొంత మొత్తంగా చెల్లిస్తూ కారును కొనుగోలు చేసే స్థోమత ఉంటుంది. అలాంటి వారు తప్పకుండా లోన్ మీద కారును తీసుకోవచ్చు.లోన్ ద్వారా కారు కొనుగోలు చేసేవారు తెలుసుకోవాల్సిన విషయాలు👉లోన్ తీసుకుని కారు కొనేయాలనుకుంటే సరిపోదు. ఎందుకంటే ఒక బ్యాంకు మీకు వెహికల్ లోన్ ఇవ్వాలంటే ముందుగా మీ సంపాదన, సిబిల్ స్కోర్ వంటి వాటిని చూస్తుంది. ఇవన్నీ బేరీజు వేసుకుని మీరు లోన్ తీసుకోవడానికి అర్హులేనా? అర్హులైతే ఎంత వరకు లోన్ మంజూరవుతుంది, అనే విషయాలను పరిగణలోకి తీసుకుంటుంది.👉వెహికల్ లోన్ తీసుకునే వ్యక్తి తిరిగి చెల్లించే సమయం (డ్యూరేషన్) ఎంచుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయమును ఏమిటంటే? మీరు ఎంచుకున్న సమయం లేదా సంవత్సరాలను బట్టి వడ్డీ అనేది నిర్ణయిస్తారు. డ్యూరేషన్ అనేది వీలైనంత తక్కువ సెలక్ట్ చేసుకుంటే వడ్డీ తగ్గుతుంది.👉కొన్ని సందర్భాల్లో కొన్ని డీలర్షిప్లు కొంత కాలానికి 0% ఫైనాన్సింగ్తో సహా ప్రమోషనల్ వడ్డీ రేట్లను అందిస్తాయి. ఇది మీరు తీసుకునే లోన్కు సంబందించిన ఖర్చులను కొంత తగ్గించడానికి ఉపయోగపడుతుంది.👉లోన్ తీసుకునే వ్యక్తి వడ్డీ రేట్లను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో తొందరపడితే నష్టపోయేది మీరే. కాబట్టి తక్కువ వడ్డీ రేటుకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వడం మర్చిపోకండి. కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఈ విషయంలో భారీ వడ్డీలను వసూలు చేసి అమాయక ప్రజలను దోచుకునే అవకాశం ఉంది.లోన్ తీసుకుని వాహనాలను కొనుగోలు చేయడంలో పెద్దగా లాభాలు కనిపించవు, కానీ ఆదమరిస్తే నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.👉రుణ గ్రహీత లోన్ తీసుకున్నప్పుడు వడ్డీ చార్జీలను తీసుకోకుండా ముందడుగు వేస్తే.. అసలు ధర కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మళ్ళీ మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.👉వడ్డీ అనేది కూడా చివరి వరకు ఒకేలా ఉండదు. ఇందులో కొన్ని సార్లు పెరుగుదలలు కూడా ఉంటాయి. రేపో రేటు పెరిగితే కొన్ని బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు వడ్డీలను అమాంతం పెంచేస్తాయి. ఇది రుణ గ్రహీత మీద భారం పడేలా చేస్తాయి.👉ముందుగానే మీ సంపాదన, ఈఎమ్ఐ వంటి వాటిని లెక్కించుకోవాలి. ఒకసారి ఈఎమ్ఐ మొదలు పెట్టిన తరువాత.. ఇతరత్రా ఖర్చులు తగ్గించుకోవాలి. లేకుండా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుపోవాల్సి ఉంటుంది. నెలవారీ ఖర్చులు కూడా లెక్కించుకోవడం ఉత్తమం. పొరపాటున ఈఎమ్ఐ కట్టడం ఆలస్యమైతే.. కట్టాల్సిన డబ్బు కంటే ఇంకా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఇది సిబిల్ స్కోర్ మీద కూడా ప్రభావం చూపుతుంది.10 లక్షల కారును 7 సంవత్సరాల వ్యవధితో లోన్ ద్వారా తీసుకుంటే?👉ఒక వ్యక్తి రూ. 10 లక్షల కారును కొనాలనుకుంటే.. దానికి కావాల్సిన లోన్ను బ్యాంక్ / ఆర్థిక సంస్థ నుంచి తీసుకుంటారు. డ్యూరేషన్ 7 సంవత్సరాలు ఎంచుకున్నట్లయితే.. నెలకు సుమారు రూ. 15వేలు కంటే ఎక్కువ ఈఎమ్ఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా మీకు లోన్ ఇచ్చే బ్యాంక్ ఫిక్స్ చేసే వడ్డీ రేటు మీద ఆధారపడి ఉంటుంది.ఉదాహరణకు.. ఒక బ్యాంక్ 8.65 శాతం వడ్డీతో రూ. 10 లక్షలు లోన్ ఇస్తే (7 సంవత్సరాల కాల వ్యవధి) నెలకు రూ. 15912 చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీరు 7 సంవత్సరాల్లో మొత్తం రూ. 13,36,608 చెల్లించాల్సి ఉంటుంది. అంటే తీసుకున్నదానికంటే సుమారు రూ. 3.36 లక్షలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.అదే వడ్డీ రేటు 11 శాతం అనుకుంటే (10 లక్షలు 7 సంవత్సరాల డ్యూరేషన్) అప్పుడు నెలకు రూ. 17122 చొప్పున మొత్తం రూ. 14,38,248 చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి ఎంత వడ్డీకి ఎంత చెల్లించాల్సి ఉంటుందనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. -
ప్రజలపై ట్యాక్స్ పిడుగు.. భారీగా పెరిగిన వెహికల్స్ ధరలు
కార్లు, బైకుల ధరలను అప్పుడప్పుడు తయారీ సంస్థలే పెంచుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వమే వెహికల్ ట్యాక్స్ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అక్కడి వాహనాల ధరలు మరింత పెరుగుతాయి.పంజాబ్ ప్రభుత్వం ప్యాసింజర్ వాహనాలు, టూ వీలర్స్ మీద మోటార్ వెహికల్ ట్యాక్స్ను 05 నుంచి 1 శాతానికి పెంచింది. త్వరలో పండుగ సీజన్.. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వాహన అమ్మకాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంది.పంజాబ్ రవాణాశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. రూ. 15 లక్షల విలువైన ప్యాసింజర్ వాహనాలపైన ట్యాక్స్ 9 నుంచి 9.5 శాతానికి పెంచింది. దీంతో వాహనాలపై చెల్లించాల్సిన పన్ను రూ. 7000 నుంచి రూ. 20వేలకు పెరిగింది. అదే సమయంలో రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షల విలువైన వాహనాలపైన ట్యాక్స్ 11 శాతం నుంచి 12 శాతానికి పెరిగింది. రూ. 25 లక్షల కంటే ఎక్కువ విలువైన వాహనాలపైన ట్యాక్స్ 13 శాతంగా ఉంది.ఇదీ చదవండి: రూ.30 లక్షల జీతం.. ట్రైన్లోనే ప్రయాణం: ఓ టెకీ సమాధానం ఇదేఇక ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే.. రూ. 1 లక్ష కంటే తక్కువ ఖరీదైన ద్విచక్ర వాహనాల మీద ట్యాక్స్ 7 శాతం నుంచి రూ. 7.5 శాతానికి పెరిగింది. అలాగే రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల ఖరీదైన వాహనాలపైన ట్యాక్స్ 10 శాతంగా ఉంది. రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన టూ వీలర్స్ మీద ప్రభుత్వం ట్యాక్స్ను 11 శాతానికి చేర్చింది.పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం వాహనాలపైన పెంచిన ట్యాక్స్.. తక్షణమే అమలులోకి వస్తుంది. దీంతో కార్లు, బైకుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ట్యాక్స్ పెరుగుదల అమ్మకాలపైన ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయం త్వరలోనే తెలుస్తుంది. -
టీవీఎస్ జుపీటర్ 110 లాంచ్: ధర ఎంతంటే?
టీవీఎస్ మోటార్ కంపెనీ భారతీయ మార్కెట్లో 'జుపీటర్ 110' స్కూటర్ లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 73,700 (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లలో.. ఆరు కొత్త కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.కొత్త జుపీటర్ 110 స్కూటర్ కొత్త కలర్ స్కీమ్ మాత్రమే కాకుండా.. డ్యూయల్ టోన్ సీట్, ఫ్రంట్ ఫోర్క్లపై రిఫ్లెక్టర్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్, స్మార్ట్ఫోన్ కనెక్టివిటీతో కూడిన కొత్త ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్స్ అండ్ ఎస్ఎమ్ఎస్ అలర్ట్ వంటివన్నీ పొందుతుంది.33 లీటర్లు అండర్ సీట్ స్టోరేజ్ పొందిన జుపీటర్ 113 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8 బిహెచ్పి పవర్, 9.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పర్ఫామెన్స్ అనేది దాదాపు దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. -
కారు ప్రమాదానికి గురైందా? ఇన్సూరెన్స్ ఇలా క్లెయిమ్ చేసుకోండి
ఒకప్పుడు ఇంటికో వాహనం ఉండేది. ఇప్పుడు మనిషికో వాహనం అన్నట్టుగా వెహికల్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. వాహనాలను వినియోగించే ప్రతి ఒక్కరూ భీమా / ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఇది ప్రమాదం జరిగినప్పుడు నష్టాన్ని కొంత వరకు భర్తీ చేస్తుంది. కాబట్టి అది కొత్త కారు అయినా.. పాత కారు అయినా ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి.చట్టప్రకారం కూడా మీ కారుకు భీమా ఉండాల్సిందే. చాలా మంది తమ వాహనాలకు ఇన్సూరెన్స్ తీసుకున్నప్పటికీ.. వాటిని ఎలా క్లెయిమ్ చేయాలో కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.ఇన్సూరెన్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఇందులో ఒకటి క్యాష్లెస్ క్లెయిమ్.. రెండు రీయింబర్స్మెంట్ క్లెయిమ్. ఇందులో క్యాష్లెస్ క్లెయిమ్ అనేది ఉత్తమ ఎంపిక. ఎందుకంటే కారుకు ప్రమాదం జరిగితే.. దాన్ని రిపేర్ చేసుకోవడానికి అయ్యే మొత్తం ఖర్చు సదరు కంపెనీ భరిస్తుంది. రీయింబర్స్మెంట్ క్లెయిమ్ అయితే.. ముందుగా కారును రిపేర్ చేసుకుని, ఆ తరువాత బిల్స్ను కంపెనీలకు చూపించి క్లెయిమ్ చేసుకోవాలి ఉంటుంది. ఆ బిల్స్ అన్నీ ఇన్సూరెన్స్ కంపెనీ అంగీకరిస్తే.. మీ డబ్బు మీకు వస్తుంది.క్యాష్లెస్ క్లెయిమ్ కింద జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే.. కారు ప్రమాదానికి గురైన వెంటనే ఇన్సురెన్స్ కంపెనీకి సమాచారం ఇవ్వాలి. ఆ ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ఆ తరువాత ఇన్సూరెన్స్ సంస్థ కారును ఏదైనా గ్యారేజిలో జరిగిన నష్టాన్ని లేదా ప్రమాదాన్ని అంచనా వేసి ఖర్చు ఎంతవుతుందో లెక్కిస్తారు. అయితే ఇన్సురెన్స్ కంపెనీలకు తెలియకుండా కారును రిపేర్ షాపుకు లేదా గ్యారేజీకి తీసుకెళ్లకూడదు.కారును గ్యారేజీ సిబ్బంది రిపేర్ చేసిన తరువాత.. రిపేర్ చేయడానికి అయిన ఖర్చును నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీ నేరుగా గ్యారేజికే చెల్లిస్తుంది. ఒకవేళా కారును రిపేర్ చేయడానికి వీలుకానప్పుడు కారు విలువ మొత్తాన్ని సంస్థ కారు యజమానికి చెల్లిస్తుంది.ఇక రెండోది.. రీయింబర్స్మెంట్ క్లెయిమ్. దీని కింద ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే.. ముందుగా కారు ప్రమాదానికి గురైన 24 గంటలలోపు ఫోన్ చేసి లేదా ఆన్లైన్లో చెప్పే అవకాశం ఉంటే తెలియజేయాలి. ఆ తరువాత క్లెయిమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ తరువాత ఎప్పుడైనా ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఉపయోగపడుతుంది. సంస్థకు సమాచారం అందించిన తరువాత మీ వాహనాన్ని మీకు నచ్చిన గ్యారేజికి తీసుకెళ్లి రిపేర్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: నష్టం జరిగింది.. రూ.50 కోట్లు ఇవ్వండి: రిమీ సేన్కారు రిపేర్ పూర్తయిన తరువాత.. దానికైన ఖర్చు సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ ఇన్సూరెన్స్ సంస్థకు అందించాలి. వాటన్నింటినీ కంపెనీ పరిశీలించి కారు యజమానికి డబ్బు చెల్లిస్తుంది. -
మాటలకు అందని ఆటోమొబైల్ చరిత్ర! తొలిసారి కారు వాడకం ఎప్పుడంటే?
సువిశాలమైన భారతదేశం ఈ రోజు అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకెళ్తూ ప్రపంచానికే పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగిందంటే.. ఇదంతా ఒక్క రోజులో జరిగిన పురోగతి కాదు, దశాబ్దాల తదేక కృషి ఫలితమే ఈ అభివృద్ధి. ఇండియాలో ఇతర రంగాలు ఒక ఎత్తయితే, ఆటో మొబైల్ రంగం మరో ఎత్తు అనే చెప్పాలి.1957 వరకు కూడా సొంతంగా కారుని ఉత్పత్తి చేయలేని భారత్ ఈ రోజు ప్రపంచ ఆటోమొబైల్ పవర్హౌస్లలో ఒకటిగా ఎదిగింది. ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ.. అఖండ విజయం సాధించడానికి అహర్నిశలు పాటుపడింది. నిజానికి భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ప్రయాణం చాలా బిన్నంగా ఉంటుంది. మన దేశంలో మొదటి వాహనం 1897లో అడుగుపెట్టినప్పటికీ దానిని ఒక ఆంగ్లేయుడు దిగుమతి చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది.టాటా కారును కలిగిన మొదటి భారతీయ సంతతి వ్యక్తి..ఇండియా.. బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు బొంబాయి, మద్రాస్, కలకత్తా వంటి నగరాల్లో కేవలం కొద్దిమందికి మాత్రమే కార్లు ఉండేవి. 20వ శతాబ్దం మొదటి అర్ధభాగం వరకు భారతదేశంలోని దాదాపు అన్ని కార్లు దిగుమతి చేసుకున్నవే. 1898లో జమ్సెట్జీ నుస్సర్వాన్జీ (Jamsetji Nusserwanji) టాటా కారును కలిగి ఉన్న భారతీయ సంతతికి చెందిన మొదటి వ్యక్తి అయ్యాడు.ఆవిరితో నడిచే వాహనాలు..తరువాత కాలక్రమంలో ఆవిరితో నడిచే వాహనాలు ఆధిపత్యం చెలాయించాయి. 1903వ సంవత్సరంలో మద్రాస్లోని సింప్సన్ & కోకి చెందిన 'శామ్యూల్ జాన్' భారతదేశపు మొట్టమొదటి ఆవిరి కారును నిర్మించాడు. అప్పట్లో ఈ కారు గొప్ప ప్రశంసలు అందుకుంది. ఇది తరువాత వచ్చిన భవిష్యత్ ఆవిష్కరణలకు కూడా ఆధారంగా నిలిచింది. 1928లో జనరల్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ తన బొంబాయి ఫ్యాక్టరీలో ట్రక్కులు, కార్లను అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించింది. 1930 నాటికి ఫోర్డ్ మోటార్ కో ఆఫ్ ఇండియా లిమిటెడ్ మద్రాస్లో ఆటోమొబైల్స్ అసెంబ్లీని ప్రారంభించింది.భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ప్రారంభ రోజుల్లో 1948 నాటికి హిందుస్థాన్ మోటార్స్, మహీంద్రా, స్టాండర్డ్, ప్రీమియర్, టాటా మోటార్స్ వంటి ప్రధాన కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఆ తరువాత కాలంలోనే దేశం కొత్త ప్రగతి యుగానికి నాంది పలికేందుకు సిద్ధమైంది. మహాత్మా గాంధీ స్వావలంబన సూత్రాలకు అనుగుణంగా, స్వదేశీ ఆటో పరిశ్రమను నిర్మించాలనే కలను భారత ప్రభుత్వం సాకారం చేసింది.భారతీయ ఆటోరంగానికి ఆటంకం..ఆటోమోటివ్ భాగాలను మాత్రమే కాకుండా వాహనాల కోసం అంతర్గత పర్యావరణ వ్యవస్థను నిర్మించాలనే నిర్ణయం 1952 నాటి టారిఫ్ కమిషన్ సృష్టికి దారితీసింది. ఆ తరువాత కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో 1954 నాటికి, ఫోర్డ్, జనరల్ మోటార్స్, రూట్స్ వంటి కొన్ని అతిపెద్ద ఆటోమోటివ్ ఎగుమతిదారులు తక్షణమే దుకాణాన్ని మూసివేశారు. ఇది ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి భారతీయ మార్కెట్ను దూరం చేశారు. అంతే కాకుండా స్థానిక కంపెనీలు తయారు చేసిన మోడల్స్ అమ్మకపు ధరలపై తీవ్రమైన షరతులను ఎదుర్కొంటున్నందున భారతీయ ఆటో రంగం దాదాపు ఆగిపోయినట్లయింది.అంబాసిడర్ & ప్రీమియర్ పద్మిని..అయినప్పటికీ ఆటోమొబైల్ పరిశ్రమ మళ్ళీ సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే 1957లో హిందుస్థాన్ అంబాసిడర్ రూపంలో మొట్టమొదటి ఆల్-ఇండియన్ కారు ఉనికిలోకి వచ్చింది. ఆ తరువాత 1964లో ప్రీమియర్ కంపెనీ అంబాసిడర్కు ప్రత్యర్థిగా 'పద్మిని' కారుని ప్రారంభించింది. ఈ రెండు కార్లు ఆటోమొబైల్ పరిశ్రమను తిరుగులేకుండా దశాబ్ద కాలం పాటు పాలించాయి.SIAM ఏర్పాటు..భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధి చెందిన ప్రారంభ రోజులలో స్థిరమైన పురోగతి, పరిశోధన ద్వారా పరిశ్రమకు మద్దతునిచ్చే లక్ష్యంతో దేశీయ సంస్థలు ఏర్పడ్డాయి. 1960లో, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్ (SIAM) భారతదేశంలో ఆటోమొబైల్స్ కోసం స్థిరమైన అభివృద్ధి వ్యవస్థను రూపొందించే దృష్టితో ఏర్పడింది.భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ చరిత్రను మనం పరిశీలిస్తే.. 1980లలో సాధించిన విజయాలే ఈ రోజు బలమైన పరిశ్రమలకు పునాదులని తెలుస్తోంది. 21వ శతాబ్దంలో మారుతీ సుజుకిగా పిలువబడే మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్, జపాన్ ఆటోమోటివ్ పవర్హౌస్ సుజుకితో జాయింట్ వెంచర్గా ఏర్పడింది. ఆ తరువాత బాలీవుడ్ రంగం ఈ పరిశ్రమను పరిచయం చేయడంలో ప్రధాన పాత్ర వహించింది.వేగం పెరిగిన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్..విదేశీ ప్రభావంతో పాటు పెట్టుబడి పరంగా కూడా 1990 వ దశకంలో భారతీయ ఆటో మార్కెట్ వేగంగా ముందుకు సాగింది. పెట్టుబడులు వెల్లువెత్తడంతో 1993 & 1996 మధ్య కార్ల విక్రయాలు రెట్టింపయ్యాయి. ఆ తరువాత మెర్సిడెస్ బెంజ్ 2004లో భారతదేశానికి వచ్చి దేశంలోని మొట్టమొదటి విదేశీ లగ్జరీ ఆటోమేకర్గా చరిత్ర సృష్టించింది. 2006లో బీఎండబ్ల్యూ, 2007లో ఆడి అరంగేట్రం చేశాయి. అప్పటి నుంచి ఈ మూడు జర్మన్ కంపెనీలు భారతదేశంలోని లగ్జరీ కార్ల మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.ప్రస్తుతం మనం కంప్యూటర్ యుగంలో ఉన్నాము. కావున కొత్త ఆవిష్కరణలు పుట్టుకొచ్చాయి. ఇందులో భాగంగానే ఆధునిక ఆటో పరిశ్రమ కొత్త మార్గాల్లో ప్రవేశించింది. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ఆధునిక హంగులను పొందగలిగింది.➤ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: వాహనాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఒక కొత్త శకానికి నాంది పలికింది. AI సామర్థ్యాలు కలిగిన కార్లు మునుపటి వాటికంటే మరింత ఆధునికంగా మారాయి. తయారీ ప్రక్రియ నుంచి మొత్తం ఉత్పత్తి వరకు ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది.ఇప్పుడు మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని వాహనాలు బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారవుతున్నాయి. నేడు బిఎస్ 4 వాహనాల ఉత్పత్తి ఆగిపోయింది. రానున్న రోజుల్లో డీజిల్ కార్లు కూడా కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.➤ఎలక్ట్రిక్ మొబిలిటీ: ఒకప్పుడు నీటి ఆవిరి ద్వారా.. ఆ తరువాత డీజిల్, పెట్రోల్ వంటి కార్లు మార్కెట్లో అడుగుపెట్టాయి. ఆ తరువాత ఎలక్ట్రిక్ వాహనాలు అరంగేట్రం చేసి భారదేశాన్ని మరింత ప్రగతి మార్గంలో పయనించేలా చేశాయి. చాలామంది ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.➤స్వయంప్రతిపత్త వాహనాలు (Autonomous Vehicles): భారతీయ ఆటో పరిశ్రమలో చెప్పుకోదగ్గ మార్పు ఈ స్వయంప్రతిపత్తి వాహనాలు. అంటే ఈ వాహనాలు తనకు తానుగానే ముందుకు సాగుతాయి. ఇది మానవుడు కనిపెట్టిన అద్భుత సృష్టి అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వాహనాలు ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్ ద్వారా ఆపరేట్ అయ్యే ఆ వాహనాలు ప్రమాదాల నుంచి మనుషులను కాపాడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి.➤భద్రతపై దృష్టి: ఇప్పుడు మార్కెట్లో విడుదలయ్యే చాలా కంపెనీల వాహనాలు భద్రతాపరంగా చాలా ఫీచర్స్ కలిగి ఉన్నాయి. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేయడంలో భాగంగానే సంస్థలు ఈ విధమైన వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఆధునిక కాలంలో ADAS టెక్నాలజీ కూడా ఎక్కువ భద్రతను కల్పిస్తుంది. రానున్న రోజుల్లో ఎగిరే కార్లు కూడా భారతదేశంలో అరంగేట్రం చేయనున్నాయి.ఒకప్పుడు కారునే తయారు చేయలేని భారత్.. ఈ రోజు ఎన్నెన్నో దేశాలకు కార్లను ఎగుమతి చేస్తోంది. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి నాటికి మన దేశంలో 22,933,230 వాహనాలు ఉత్పత్తయ్యాయని SIAM నివేదించింది. దీన్ని బట్టి చూస్తే ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమ ఎంతగా అభివృద్ధి చెందిందో మనకు ఇట్టే అర్థమవుతుంది. రానున్న రోజుల్లో మరింత ఎత్తుకి ఎదుగుతుందని స్పష్టంగా అర్థమవుతోంది. -
భారత్లో సరికొత్త జర్మన్ బ్రాండ్ కారు లాంచ్: వివరాలు
మెర్సిడెస్ బెంజ్ ఇండియన్ మార్కెట్లో 'జీఎల్ఈ 300డీ 4మ్యాటిక్ ఏఎంజీ లైన్' లాంచ్ చేసింది. సంస్థ లాంచ్ చేసిన ఈ లగ్జరీ కారు ధర రూ. 97.85 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఎక్కువ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.కొత్త మెర్సిడెస్ బెంజ్ కారు త్రీ-పాయింటెడ్ స్టార్ ప్యాటర్న్తో కూడిన డైమండ్ గ్రిల్, స్పోర్టియర్ ఎయిర్ ఇన్లెట్లు, క్రోమ్ ఇన్సర్ట్ & బ్లాక్ సరౌండ్తో మ్యాట్ డార్క్ గ్రేలో పెయింట్ చేసి ఉండటం చూడవచ్చు. ఇందులోని అప్డేటెడ్ ఫీచర్స్ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 300డీ 4మ్యాటిక్ ఏఎంజీ లైన్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 269 హార్స్ పవర్, 550 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 48వీ మైల్డ్-హైబ్రిడ్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్-జెనరేటర్ కూడా పొందుతుంది. ఇది 20 హార్స్ పవర్, 200 న్యూటన్ మీటర్ టార్క్ అదనంగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లగ్జరీ కారు టాప్ స్పీడ్ గంటకు 230 కిమీ. -
అప్డేటెడ్ జావా 42 బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
ప్రముఖ బైక్ తయారీ సంస్థ జావా మోటార్సైకిల్ అప్డేటెడ్ బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త జావా 42 బైక్ ధరలు రూ. 1.73 లక్షల నుంచి రూ. 1.98 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 16000 తక్కువ ధరకే లభిస్తుంది.2024 జావా 42 బైక్ 294 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 27.32 హార్స్ పవర్ మరియు 26.84 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ పొందుతుంది. రీడిజైన్ పొందిన ఈ బైక్ సింగిల్ ఛానల్ ఏబీఎస్ పొందుతుంది. అనలాగ్ ఎల్సీడీ సెటప్ కూడా ఇందులో గమనించవచ్చు.మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన ఈ బైక్ సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. అప్డేటెడ్ జావా 42 సీటు ఎత్తు 788 మిమీ వరకు ఉంటుంది. ఈ అప్డేటెడ్ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.The 2024 Jawa 42 is here! This is the answer you’ve been waiting for. With the perfect trinity of Performance, Neo-Classic Design and Engineering - you are in for a ride like no other!#Jawa42TheAnswer #Jawa42 #JPanther #JawaMotorcycles pic.twitter.com/AA4qFLCT3g— Jawa Motorcycles (@jawamotorcycles) August 13, 2024 -
2025-26 నాటికి ఇదే లక్ష్యం: అమిత్ షా
ఫ్యూయెల్ (పెట్రోల్, డీజిల్) వాడకాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలు ఉత్పత్తిని ప్రోత్సహించడం చేస్తోంది. కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' హైడ్రోజన్ వాహనాలను ఉత్పత్తి చేయాలని కంపెనీలకు చెబుతున్నారు. అంతే కాకుండా ఇథనాల్ వాడకాన్ని పెంచాలని సూచిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర హోం మంత్రి 'అమిత్ షా' కూడా ఇథనాల్ ఉత్పత్తిని పెంచాలని కోరుతున్నారు.మోదీ ప్రభుత్వం 2025-26 నాటికి 20 శాతం ఇథనాల్ను కలపాలనే లక్ష్యాన్ని సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం అన్నారు. ఇథనాల్ ఉత్పత్తి పెరిగితే ముడిచమురు దిగుమతి తగ్గుతుందని అమిత్ షా చెప్పారు. దీనికోసం చక్కెర మిల్లులు ఇథనాల్ను ఉత్పత్తి చేయాలని కోరారు.పెట్రోల్ వినియోగం తగ్గితే.. పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో అమిత్ షా అన్నారు. దాదాపు 5000 కోట్ల లీటర్ల పెట్రోలుకు వెయ్యి కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం ఉంటుందని కూడా ఆయన చెప్పారు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ యూనివర్సల్ 4జీ, 5జీ సిమ్: ఎక్కడైనా.. ఎప్పుడైనాఇథనాల్ను కలపడం వల్ల పర్యావరణం మెరుగుపడటమే కాకుండా.. చక్కెర మిల్లుల లాభాలు పెరగడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని అమిత్ షా అన్నారు. ఇథనాల్ ఉత్పత్తిపైన ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటామని, మంత్రుల బృందం ద్వారా ఇథనాల్ మిశ్రమాన్ని ప్రధానమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తారని షా అన్నారు. -
భారత్లో రూ.1.11 కోట్ల జర్మన్ బ్రాండ్ కారు లాంచ్ - వివరాలు
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz) దేశీయ మార్కెట్లో 'ఏఎంజీ జీఎల్సీ 43 4మ్యాటిక్' కూపే లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ధర రూ.1.11 కోట్లు (ఎక్స్ షోరూమ్).బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎం40ఐకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కొత్త ఏఎంజీ జీఎల్సీ 43 4మ్యాటిక్ 2.0 లీటర్, ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 421 హార్స్ పవర్, 500 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఇది 4.7 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.కొత్త మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీఎల్సీ 43 4మ్యాటిక్ స్లోపింగ్ రూఫ్లైన్, స్పోర్టియర్ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు, 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటివి పొందుతుంది. ఈ కారు లోపల 12.3 ఇంచెస్ డ్రైవర్ డిస్ప్లే, 11.9 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వంటి వాటితో పాటు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. -
కార్గిల్ యుద్ధవీరుల గుర్తుగా 'రోనిన్ పరాక్రమ్ ఎడిషన్'
టీవీఎస్ మోటార్ కంపెనీ కార్గిల్ విజయ్ దివస్ జ్ఞాపకార్థం 'రోనిన్ పరాక్రమ్ ఎడిషన్' ఆవిష్కరించింది. ఈ బైక్ ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందినప్పటికీ.. యాంత్రికంగా ఎటువంటి మార్పులు లేదు. అంటే ఈ బైకులో స్టాండర్డ్ మోడల్లోని అదే ఇంజిన్ పొందుతుంది.టీవీఎస్ రోనిన్ పరాక్రమ్ ఎడిషన్ చూడటానికి చాలా కొత్తగా కనిపిస్తుంది. సిల్వర్ యాక్సెంట్స్ కలిగి ఆలివ్ గ్రీన్ కలర్ స్కీమ్ కూడా పొందుతుంది. ఈ ఫ్యూయెల్ ట్యాంక్ మీద జాతీయ జెండా రంగులను చూడవచ్చు. బైక్ మీద కార్గిల్ యుద్దాన్ని తెలిపే సైనికుల పెయింటింగ్ ఉంది. వెనుక స్టెయిన్లెస్ స్టీల్ లగేజ్ క్యారియర్ ఉంటుంది.రోనిన్ పరాక్రమ్ ఎడిషన్ 20.4 హార్స్ పవర్, 19.93 ఎన్ఎమ్ టార్క్ అందించే 225.9 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ పొందుతుంది. ఈ బైక్ USD ఫోర్క్, ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ కలిగి ఉంటుంది. ఇది డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ మాత్రమే కాకుండా రెండు చివర్లలో డిస్క్ బ్రేక్లను పొందుతుంది. కాబట్టి అదే పర్ఫామెన్స్ అందిస్తుంది. -
మరో స్కూటర్ లాంచ్కు సిద్దమవుతున్న జర్మన్ కంపెనీ
బీఎండబ్ల్యూ మోటోరాడ్ దేశీయ విఫణిలో తన ఉనికిని విస్తరించడంతో బిజీ అయిపోయింది. ఇటీవల సీఈ04 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఇప్పుడు సీఈ 02ను లాంచ్ చేయడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. రూ. 14.90 లక్షలు ఖరీదైన సీఈ04 ప్రస్తుతం దేశంలో ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్గా అవతరించింది.బీఎండబ్ల్యూ సీఈ 02 అనేది సీఈ04 కంటే సరసమైనదిగా ఉండనున్నట్లు సమాచారం. ఇది ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇది ఎలక్ట్రిక్ కారు స్కూటర్ కాదని కంపెనీ వెల్లడించింది. అయితే 310 సీసీ విభాగంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.సీఈ02 స్కూటర్ మంచి డిజైన్, ఫీచర్స్ పొందనున్నట్లు సమాచారం. అయితే కంపెనీ లాంచ్ చేయనున్న ఈ వెహికల్స్ ధరలు, ఇంజిన్ వంటి మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. అయితే ఇది సీబీయూ మార్గం ద్వారా దేశానికి దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. -
రూ.72.90 లక్షల కొత్త బీఎండబ్ల్యూ కారు - వివరాలు
బీఎండబ్ల్యూ కంపెనీ సరికొత్త 5 సిరీస్ కారు ఎల్డబ్ల్యుబీ లాంచ్ చేసింది. ఇది 530ఎల్ఐ అనే సింగిల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. దీని ధర రూ. 72.90 లక్షలు (ఎక్స్ షోరూమ్).కొత్త బీఎండబ్ల్యూ 530ఎల్ఐ వేరియంట్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్తో 48వోల్ట్స్ మైల్డ్ హైబ్రిడ్ అసిస్ట్ పొందుతుంది.ఇది 8 స్పీడ్ ఆటోమాటిక్ గేర్బాక్స్ ద్వారా వెనుక చక్రాలను పవర్ డెలివరీ చేస్తుంది. ఇది 6.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ లగ్జరీ కారు టాప్ స్పీడ్ 250 కిమీ/గం.కొత్త డిజైన్ కలిగిన బీఎండబ్ల్యూ 5 సిరీస్.. పరిమాణంలో దాని మునుపటి మోడల్స్ కంటే కూడా కొంత పెద్దగా ఉంటుంది. ఇందులో కిడ్నీ గ్రిల్, 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, స్పోర్టియర్ ఫ్రంట్, రియర్ బంపర్లు ఉన్నాయి. లోపల 12.3 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ మొదలైనవి ఉన్నాయి. -
భారత్లో రూ.14.90 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. వివరాలు
భారతీయ మార్కెట్లో బీఎండబ్ల్యూ సీఈ (BMW CE) లాంచ్ అయింది. దీని ధర రూ. 14.90 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ధరలను బట్టి చూస్తే ప్రస్తుతం మార్కెట్లో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ టూ వీలర్ అదే అని తెలుస్తోంది.దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ 8.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 130 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ 2.3 kW ఛార్జర్ ద్వారా 4 గంటల 20 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ అవుతుంది. 6.9 kW ఛార్జర్ ద్వారా 1 గంట 40 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది.సీఈ04 ఎలక్ట్రిక్ స్కూటర్లోని మోటారు 42 హార్స్ పవర్, 62 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్ 2.6 సెకన్లలో 0 నుంచి 50 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టాప్ స్పీడ్ 120 కిమీ.ఎల్ఈడీ లైటింగ్స్, 10.25 ఇంచెస్ TFT డిస్ప్లే, కీలెస్ ఇగ్నిషన్, ట్రాక్షన్ కంట్రోల్, USB ఛార్జర్, సైడ్-మౌంటెడ్ స్టోరేజ్ కంపార్ట్మెంట్ వంటివి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పొందుతుంది. ఇది బ్లూ, వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది ఎకో, రెయిన్, రోడ్ అనే మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. -
రెండేళ్లలో రెండు లక్షల సేల్స్!.. అమ్మకాల్లో అరుదైన రికార్డ్
2022 సెప్టెంబర్ 26న లాంచ్ అయిన మారుతి సుజుకి గ్రాండ్ విటారా అమ్మకాల్లో అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు కేవలం 22 నెలల్లో 2 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలను పొందగలిగింది.మారుతి గ్రాండ్ విటారా 2023 ఆర్థిక సంవత్సరంలో 51315 యూనిట్ల సేల్స్, 2024 ఆర్ధిక సంవత్సరం చివరినాటికి 1,21,169 యూనిట్లను విక్రయించగలిగింది. మొత్తం మీద గత జూన్ చివరి నాటికి మొత్తం 1,99,550 యూనిట్ల విక్రయాలను పొందగలిగింది.కేవలం 12 నెలల కాలంలో లక్ష యూనిట్ల అమ్మకాలను పొందిన గ్రాండ్ విటారా.. ఆ తరువాత కూడా అధిక అమ్మకాలను పొందగలిగింది. దీంతో కేవలం 10 నెలల కాలంలోనే మరో లక్షల యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది. గ్రాండ్ విటారా మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ కారణంగానే ఈ కారు ఉత్తమ అమ్మకాలను పొందగలిగింది. -
రెండేళ్ల తరువాత లాంచ్కు సిద్దమవుతున్న కారు ఇదే..
ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ సుమారు రెండేళ్ల తరువాత ఇండియన్ మార్కెట్లో టాటా కర్వ్ కారును ఆవిష్కరించింది. ఇది ఆగష్టు 7న భారతీయ విఫణిలో లాంచ్ అవుతుంది. ఏప్రిల్ 2022 లో కాన్సెఫ్ట్ మోడల్గా కనిపించిన ఈ కారు త్వరలోనే రోడ్డు మీదికి రానుంది.కంపెనీ లాంచ్ చేయనున్న ఈ మిడ్ సైజ్ SUV పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ అవుతుంది. ఈ కారు ఎల్ఈడీ హెడ్లైట్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్లైట్ పొందుతుంది. ఫ్రంట్ ఫాసియా కొంతవరకు హారియర్, సఫారీకి మాదిరిగా ఉంటాయి. రియర్ ప్రొఫైల్ కూడా చూడచక్కగా ఉంటుంది.టాటా కర్వ్ ఫ్లోటింగ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, టచ్ బేస్డ్ హెచ్విఎసి కంట్రోల్స్ వంటి ఫీచర్లను పొందవచ్చని సమాచారం. ఇందులో 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్ కూడా ఉన్నాయి.టాటా కర్వ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ను పొందుతుందని భావిస్తున్నాము. ఎలక్ట్రిక్ మోడల్ 450 కిమీ రేంజ్ అందించడానికి ఉపయోగపడే బ్యాటరీ ప్యాక్ అందిస్తుందని సమాచారం. -
దశాబ్దాల తర్వాత మళ్ళీ అలాంటి బైక్: ధర ఎంతో తెలుసా?
డుకాటి భారతదేశంలో హైపర్మోటార్డ్ 698 మోనో పేరుతో సరికొత్త బైకును రూ. 16.50 లక్షలకు లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ఇప్పటికే మార్కెట్లో అమ్ముడవుతున్న హైపర్మోటార్డ్ 950 ఆర్విఇ ధర కంటే రూ.50000 ఎక్కువ. ఈ బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డెలివరీలు ఈ నెల (జులై) చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.హైపర్మోటార్డ్ 698 మోనో అనేది.. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత సింగిల్ సిలిండర్ మోటార్సైకిల్పై డుకాటి చేసిన ప్రయత్నం. కంపెనీ 1950 నుంచి 1970 వరకు సింగిల్ సిలిండర్ కాన్ఫిగరేషన్తో ఇంజిన్లను తయారు చేసింది. మళ్ళీ ఇప్పుడు ప్రయత్నిస్తూ సింగిల్ సిలిండర్ మోటార్సైకిల్ లాంచ్ చేసింది.డుకాటీ లాంచ్ చేసిన హైపర్మోటార్డ్ 698 బైక్ 659 సీసీ సింగిల్ సిలిండర్ కలిగి 77.5 హార్స్ పవర్, 63 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. డబుల్ ఎగ్జాస్ట్, ఫైవ్ స్పోక్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ హెడ్లైట్, హై ఫ్రంట్ మడ్గార్డ్, షార్ప్ టెయిల్, ఫ్లాట్ సీటు వంటి అంశాలతో ఈ బైక్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. -
ఇదే జరిగితే.. జర్మన్ బ్రాండ్ కార్ల ధరలు తగ్గుతాయి
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలోని తన తయారీ కర్మాగారంలో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను అసెంబ్లింగ్ చేయాలని యోచిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కొంత తక్కువ ఖర్చుతో కూడుకున్నదయినా.. జీరో ఎమిషన్ మొబిలిటీ సాధ్యమవుతుంది. తద్వారా కార్బన్ ఉద్గారాలు తగ్గుముఖం పడతాయి.మెర్సిడెస్ బెంజ్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ విభాగంలో.. దేశీయ విఫణిలో ఈక్యూఎస్ కారును మాత్రమే తయారు చేస్తోంది. డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను స్థానీకరించడానికి కావలసిన ఏర్పాట్లను చేయనున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ సంతోష్ అయ్యర్ పేర్కొన్నారు.భారతదేశంలోని చకన్ ప్లాంట్లో కంపెనీ 2022 నుంచి బెంజ్ ఈక్యూఎస్ అసెంబ్లింగ్ ప్రారంభించింది. మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ విభాగంలో ఈక్యూఎస్ మాత్రమే కాకుండా ఈక్యూఏ, ఈక్యూబీ, ఈక్యూఈ వంటివి ఉన్నాయి. అయితే ఇండియాలో ఈక్యూఎస్ అసెంబ్లింగ్ మాత్రమే జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఈ కార్ల ఉత్పత్తి కూడా మన దేశంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ దేశీయ విఫణిలో తయారవుతోంది, కాబట్టి దీని ధర కొంత తక్కువగా ఉంది. లేకుంటే దీని ధర చాలా ఎక్కువగా ఉండేదని సంతోష్ అయ్యర్ వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే కంపెనీ తన ఉత్పత్తులను ఇక్కడే అసెంబ్లింగ్ చేస్తే ధరలు తగ్గుతాయి.ఇదీ చదవండి: గౌతమ్ అదానీ కొత్త ప్లాన్.. వియత్నాంలో పోర్ట్!ధరల విషయం పక్కన పెడితే.. దేశంలో కాలుష్య భూతం ప్రజలను పట్టిపీడిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో కార్బన్ ఉద్గారాలు భారీగా పెరిగిపోతాయి. ఇది జీవరాశి మనుగడకే ప్రమాద హేతువు అవుతుంది. కాబట్టి కచ్చితంగా పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయాలు పుట్టుకురావాలి. దీనిని దృష్టిలో ఉంచుకునే పలు కంపెనీలు ఇప్పటికే CNG, ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. -
సీఎన్జీ విభాగంలోకి మరో వెహికల్!.. లాంచ్ ఎప్పుడంటే?
ఇటీవల బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్ట మొదటి సీఎన్జీ బైక్ ఫ్రీడమ్ 125 లాంచ్ చేసింది. ఈ తరుణంలో టీవీఎస్ కంపెనీ కూడా ఈ విభాగంలో స్కూటర్ లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. సంస్థ 2025 నాటికి మార్కెట్లో జుపిటర్ సీఎన్జీ స్కూటర్ లాంచ్ చేయనున్నట్లు సమాచారం.టీవీఎస్ కంపెనీ తన జుపిటర్ స్కూటర్ను సీఎన్జీ రూపంలో లాంచ్ చేయడానికి యూ740 పేరుతో ఓ ప్రాజెక్ట్ ప్రారంభించింది. రాబోయే ఈ స్కూటర్ 125 సీసీ ఇంజిన్ పొందనున్నట్లు సమాచారం. అనుకున్నవన్నీ సవ్యంగా జరిగితే.. టీవీఎస్ జుపిటర్ సీఎన్జీ ఈ ఏడాది చివరినాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది.టీవీఎస్ సీఎన్జీ స్కూటర్ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత నెలకు సుమారు 1000 యూనిట్లను విక్రయించనున్నట్లు సమాచారం. వాతావరణంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా కంపెనీ లాంచ్ చేయనున్న ఈ సీఎన్జీ స్కూటర్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అమ్మకాల్లో దేశీయ దిగ్గజం అరుదైన రికార్డ్.. 20 లక్షల యూనిట్లు
భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్.. దేశంలో ఇప్పటికి 20 లక్షల ఎస్యూవీలను విక్రయించి అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇందులో అత్యధికంగా అమ్ముడైన ఎస్యూవీలుగా టాటా సఫారీ, హారియర్, నెక్సాన్, పంచ్ ఉన్నాయి. వీటితో పాటు పాత మోడల్ సియెర్రా, సఫారీ కూడా ఉన్నాయి.కంపెనీ సాధించిన ఈ విజయాన్ని సంస్థ 'కింగ్ ఆఫ్ ఎస్యూవీస్' పేరిట ఆఫర్స్ కూడా ప్రకటించింది. దీంతో హారియర్, సఫారీ, పంచ్ వంటి వాటిని కొంత తగ్గింపుతో కొనుగోలు చేసుకోవచ్చు. ఇందులో అడిషినల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. టాటా మోటార్స్ గత నెలలో (2024 జూన్) ఎక్కువ సంఖ్యలో విక్రయించిన ఎస్యూవీ పంచ్ కావడం గమనించదగ్గ విషయం. కాగా కంపెనీ ఇప్పుడు తన నెక్సాన్ కార్టూను CNG రూపంలో కూడా లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది త్వరలో మార్కెట్లో అధికారికంగా లాంచ్ కానుంది. -
శుభవార్త.. హైబ్రిడ్ కార్ల కొనుగోలుపై రోడ్ ట్యాక్స్ లేదు
భారతదేశంలో పలు వాహన తయారీ సంస్థలు ఇప్పటికే డీజిల్ కార్ల ఉత్పత్తులను పూర్తిగా నిలిపివేశాయి. ఢిల్లీ వంటి నగరాల్లో డీజిల్ వాహనాల వినియోగాన్ని కూడా అక్కడి ప్రభుత్వం నిషేదించింది. దీనికి ప్రధాన కారణం పర్యావరణ హితమే. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం ప్రకారం, రాష్ట్రంలో హైబ్రిడ్ కార్లపై రోడ్ ట్యాక్స్ పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది. ఇది హైబ్రిడ్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్లకు వర్తిస్తుంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి, పచ్చదనాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.యూపీ ప్రభత్వం తీసుకున్న నిర్ణయంతో మారుతి సుజుకి, టయోటా వంటి సంస్థలు బాగా లాభపడే అవకాశం ఉంది. అయితే పన్నుల తగ్గింపు ఎంత వరకు ఉంటుందని నోటిఫికేషన్లో వెల్లడించలేదు, కానీ 100 శాతం రాయితీ ఉంటుందని సమాచారం. ఇప్పటికే మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి కార్లు ఉత్తమ అమాంకాలను పొందుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వీటి సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.ప్రస్తుతం గ్రాండ్ విటారా, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ హైబ్రిడ్ కార్ల రిజిస్ట్రేషన్ ధర యూపీలో సుమారు రూ. 1.80 లక్షల వరకు ఉంటుంది. ఇది ఎంచుకున్న వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది. గరిష్టంగా రూ.3 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ మొత్తాన్ని కస్టమర్ లాభంపొందవచ్చు. హైబ్రిడ్ కార్ల మీద రోడ్ ట్యాక్ రద్దుకు సంబంధించిన కీలక ప్రకటన కేవలం యూపీ ప్రభుత్వం మాత్రమే ప్రకటించింది. ఈ నిరయాన్ని మరిన్ని రాష్ట్రాలు ఆహ్వానించే అవకాశం ఉంది. ఇదే జరిగితే రోడ్లమీద హైబ్రిడ్ వాహనాల సంఖ్య పెరుగుతుంది. తద్వారా కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది. -
ఫుల్ ఛార్జ్తో 560 కిమీ రేంజ్.. సరికొత్త ఎలక్ట్రిక్ కారు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' భారతీయ మార్కెట్లో సరికొత్త ఎలక్ట్రిక్ కారు 'ఈక్యూఏ' లాంచ్ చేసింది. ఈ కారు కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు 2025 జనవరి నుంచి ప్రారంభమవుతాయి.దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త 'మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ' 250 ప్లస్ అనే ట్రిమ్లో మాత్రమే లభిస్తుంది. దీని ధర రూ. 66 లక్షలు (ఎక్స్ షోరూమ్). మంచి డిజైన్ కలిగిన ఈ కారు పోలార్ వైట్, కాస్మోస్ బ్లాక్, మౌంటైన్ గ్రే, హై-టెక్ సిల్వర్, స్పెక్ట్రల్ బ్లూ, పటగోనియా రెడ్ మెటాలిక్, మౌంటైన్ గ్రే మాగ్నో అనే ఏడు కలర్ ఆప్షన్స్ పొందుతుంది.మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, హెడ్స్-అప్ డిస్ప్లే, ఆగ్మెంటెడ్ రియాలిటీ మావిగేషన్, 10.25 ఇంచెస్ టచ్స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా వంటి వాటితో పాటు లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది.మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ 70.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 560 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 190 హార్స్ పవర్, 385 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 8.6 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 160 కిమీ.ఈక్యూఏ ఎలక్ట్రిక్ కారు 100 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 35 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది. స్టాండర్డ్ 11 కిలోవాట్ ఏసీ ఛార్జర్ ద్వారా 10 నుంచి 80 శాతం ఛార్జ్ కావడానికి 7:15 గంటకు పడుతుంది. మొత్తం మీద ఈ కారు అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది.The wait is almost over! We are ready to introduce the new all-electric Mercedes-Benz EQA to India. Get ready for a new generation of electric luxury. #SwitchOnToStandOut#EQA #MercedesBenzIndia pic.twitter.com/50EqWDwKAA— Mercedes-Benz India (@MercedesBenzInd) July 8, 2024 -
ఇండియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న ఇటలీ టూ వీలర్ బ్రాండ్
ఇటాలియన్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్ వీఎల్ఎఫ్.. ఇండియన్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. అద్భుతమైన డిజైన్కు ప్రసిద్ధి చెందిన వీఎల్ఎఫ్ కేఏడబ్ల్యు వెలోస్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్తో జట్టుకట్టింది. ఈ భాగస్వామ్యంతో కంపెనీ ఓ సరికొత్త వెహికల్ లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.భారతదేశంలో మొదలయ్యే పండుగ సీజన్ సమయానికి కంపెనీ తన స్కూటర్ లాంచ్ చేయనున్నట్లు సమాచారం. కంపెనీ ప్రధానంగా టైర్ 1, టైర్ 2 నగరాలను లక్ష్యంగా చేసుకుని ఈ స్కూటర్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. దీనికోసం సంస్థ డీలర్ నెట్వర్క్ను కూడా ఏర్పాటు చేయడానికి సంకల్పించింది.వీఎల్ఎఫ్ కంపెనీ 2024 నాటికి 15 డీలర్షిప్లను ఏర్పాటు చేయాలని, అదే విధంగా ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి డీలర్షిప్ల సంఖ్యను 50కి పెంచనున్నట్లు సమాచారం. కేఏడబ్ల్యూ వెలోస్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ తుషార్ షెల్కే దీని గురించి మాట్లాడుతూ.. వీఎల్ఎఫ్ భారతీయ వినియోగదారులకు ఎలక్ట్రిక్ స్కూటర్లను త్వరలోనే అందిస్తుందని పేర్కొన్నారు. -
ఇకపై ఈ మహీంద్రా కొత్త కారు కనిపించదు!.. ఎందుకంటే?
భారతీయ మార్కెట్లో ఒకప్పుడు ఉత్తమ అమ్మకాలు పొందిన 'మహీంద్రా మరాజో' ఉత్పత్తిని కంపెనీ త్వరలో నిలిపివేయనున్నట్లు సమాచారం. 2018లో మారుతి ఎర్టిగా, ఎక్స్ఎల్6, కియా కారెన్స్ వంటి వాటికి ప్రత్యర్థిగా దేశీయ విఫణిలో అడుగుపెట్టిన మరాజో 7 సీటర్, 8 సీటర్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో ఈ ఎమ్పీవీ ధర రూ. 9.99 లక్షల నుంచి రూ. 13.90 లక్షల మధ్య ఉండేది.ప్రారంభంలో ఉత్తమ అమ్మకాలు పొందినప్పటికీ.. క్రమంగా ఇది ఆశించిన స్థాయిలో అమ్మకాలను పొందలేకపోయింది. గత ఐదు నెలలో ఈ కారు కేవలం 34 యూనిట్ల అమ్మకాలను మాత్రమే సాధించింది. ప్రస్తుతం ప్యాసింజర్ ఎమ్పీవీ మార్కెట్లో టయోటా, మారుతి సుజుకి ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. దీంతో కంపెనీ మరాజో కారును నిలిపివేయడానికి సంకల్పించింది.ప్రారంభం నుంచి జూన్ 2024 వరకు మహీంద్రా మరాజో సేల్స్ మొత్తం 44793 యూనిట్లు మాత్రమే. నెలకు సగటున కేవలం 640 యూనిట్ల మరాజో కార్లు మాత్రమే అమ్ముడైనట్లు కంపెనీ గణాంకాలు చెబుతున్నాయి. అమ్మకాలు తగ్గడమే కాకుండా.. బిఎస్6 ఫేజ్ 2 నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ అవ్వలేదు. ఇది కూడా కంపెనీ మార్కెట్లో విజయం పొందకపోవడానికి కారణమనే తెలుస్తోంది. -
వరల్డ్ ఫస్ట్ సీఎన్జీ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరల్డ్ ఫస్ట్ సీఎన్జీ బైక్ దేశీయ విఫణిలో లాంచ్ అయింది. బజాజ్ ఫ్రీడమ్ 125 పేరుతో భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన ఈ బైక్ ప్రతిభ ధర రూ. 95000 (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ మూడు వేరియంట్లలో లభిస్థుంది. కంపెనీ ఇప్పటికే ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 బైకులో 2 కేజీల కెపాసిటీ కలిగిన సీఎన్జీ ట్యాంక్, అదే పరిమాణంలో పెట్రోల్ ట్యాంక్ ఉంటారు. పెట్రోల్, సీఎన్జీ సామర్థ్యాలను పరిగణలోకి తీసుకుంటే బైక్ మైలేజ్ 330 కిమీ వరకు ఉంటుంది. ఈ బైకులోని 125 సీసీ ఇంజిన్ 8000 rpm వద్ద 9.5 Bhp పవర్, 6000 rpm వద్ద 9.7 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది.బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ డిజైన్.. మార్కెట్లోని ఇతర కమ్యూటర్ మోటార్సైకిళ్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్లైట్, డర్ట్ బైక్ స్టైల్ ఫ్యూయల్ ట్యాంక్, పొడవైన సింగిల్ పీస్ సీటు వంటివి ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.World‘s first #CNG motorcycle has been launched! Meet the Bajaj #Freedom125. 🏍️That’s a good looker, eh? Kinda has to be for the kind of premium over a regular petrol 125cc bike. Initially launching only in Maha/Guj; phased pan India launch to follow. Prices: ₹ 95-110k. SVP pic.twitter.com/9V9KGKLxrZ— Siddharth Vinayak Patankar (@sidpatankar) July 5, 2024 -
ప్రకటన కోసం వేచి చూడకండి.. 2027 నాటికి బిఎస్7: నితిన్ గడ్కరీ
రోజురోజుకు ఆటోమొబైల్ మార్కెట్లో కీలక మార్పులు సంభవిస్తున్నాయి. ఇప్పటికే బిఎస్4 పోయి బిఎస్6 ప్రమాణాలు వచ్చాయి. రాబోయే రోజుల్లో ఆటోమొబైల్ పరిశ్రమ బిఎస్7 ఉద్గార నిబంధనలకు సిద్ధంగా ఉండాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. దీని గురించి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే వరకు వేచి ఉండకూడదని అన్నారు.బీఎస్7 వాహనాల తయారీకి సంబంధించి సన్నాహాలు తప్పకుండా వేగవంతం చేయాలని గడ్కరీ అన్నారు. యూరోపియన్ మార్కెట్లో యూరో 7 ప్రమాణాలు 2025 నుంచి అమలులోకి రానున్నాయి. కాబట్టి భారతదేశంలో తయారయ్యే కార్లు కూడా వాటికి ధీటుగా ఉండాలని, దీనికోసం తప్పకుండా బిఎస్7 రూల్స్ పాటించాలని అన్నారు. 2027 నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నట్లు పేర్కొన్నారు.వాహన తయారీ సంస్థలు తమ వాహనాలలోని ఇంజిన్లను రీట్యూన్ చేయాల్సి ఉంటుంది. ఇవి యూరో7 ప్రమాణాలను దాదాపు సమానంగా ఉంటాయి. కాబట్టి గ్లోబల్ మార్కెట్లో దేశీయ ఆటోమొబైల్ మార్కెట్ హవా దూసుకెళ్తుంది. బిఎస్7 రూల్స్ అన్నీ కూడా బిఎస్6 కంటే మరింత కఠినంగా ఉంటాయని గడ్కరీ పేర్కొన్నారు.బిఎస్7 ప్రమాణాలతో వాహనాలు తయారైన తరువాత వెహికల్స్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంజిన్లను రీచున్ చేసినప్పుడు సంస్థలు కూడా కొంతమొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో పెట్రోల్ వాహనాల ధరలతో పోలిస్తే.. డీజిల్ వాహనాల ధరలు పెరిగే సూచలను ఉన్నాయి. మార్కెట్లో డీజిల్ వాహనాల డిమాండ్ తగ్గిదే.. భవిష్యత్తులో ఈ వాహనాలు కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. -
అరుదైన సేల్స్ రికార్డ్.. అమ్మకాల్లో దేశీయ దిగ్గజం హవా!
మహీంద్రా స్కార్పియో, స్కార్పియో ఎన్ రెండూ అమ్మకాలలో అద్భుతమైన రికార్డ్ క్రియేట్ చేశాయి. 2003 నుంచి 2024 వరకు ఈ రెండు కార్లు ఏకంగా 10,42,403 యూనిట్ల అమ్మకాలను కైవసం చేసుకున్నాయి. అత్యధికంగా FY2024లో నమోదయ్యాయి. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే కంపెనీ 1,41,462 యూనిట్ల స్కార్పియో కార్లను విక్రయించింది.2013 ఆర్థిక సంవత్సరంలో 50168 యూనిట్లు, 2014వ ఆర్థిక సంవత్సరంలో 50,949 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇలా ప్రతి ఏటా మహీంద్రా స్కార్పియో అమ్మకాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. మొత్తం మీద ప్రారంభం నుంచి గత నెల వరకు కంపెనీ 10 లక్షల కంటే ఎక్కువ కార్లను విక్రయించి.. విక్రయాల్లో సరికొత్త మైలురాయిని చేరుకున్నాయి. ప్రారంభంలో కంపెనీ స్కార్పియో కార్లను మాత్రమే విక్రయించింది. 2022లో కంపెనీ స్కార్పియో ఎన్ లాంచ్ చేసింది. ఈ మోడల్ కూడా అమ్మకాల పెరుగుదలకు దోహదపడింది.మహీంద్రా స్కార్పియో, స్కార్పియో ఎన్ రెండూ కూడా మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇవి మల్టిపుల్ వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పనితీరుపరంగా ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ అందించాయి. ఇవన్నీ ఎక్కువమంది కస్టమర్లను ఆకర్శించడంలో సహాయపడ్డాయి. -
కేవలం 100 మందికి మాత్రమే ఈ బైక్.. వేలంలో కొనాల్సిందే
దేశంలో అతి పెద్ద టూ-వీలర్ తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన హీరో మోటోకార్ప్ తన సెంటెనియల్ ఎడిషన్ మోటార్సైకిల్ విక్రయాలను ప్రకటించింది. జనవరిలో జరిగిన హీరో వరల్డ్ ఈవెంట్లో పరిచయమైన ఈ బైక్ త్వరలో రోడ్డుపైకి రానుంది. అయితే కేవలం 100 యూనిట్లను మాత్రమే కంపెనీ విక్రయించనుంది.హీరో మోటోకార్ప్ ఫౌండర్ డాక్టర్ బ్రిజ్మోహన్ లాల్ ముంజాల్ 101వ పుట్టినరోజు సందర్బంగా కంపెనీ సెంటెనియల్ ఎడిషన్ బైకును విక్రయించనుంది. ఈ బైక్ను తమ 'ఉద్యోగులు, సహచరులు, వ్యాపార భాగస్వాములు, వాటాదారుల' కోసం ప్రత్యేకంగా వేలం వేయనున్నట్లు హీరో ప్రకటించింది. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంస్థ సమాజం మేలు కోసం ఉపయోగించనున్నట్లు సమాచారం. డెలివరీలు సెప్టెంబర్లో ప్రారంభం కానున్నాయి.హీరో సెంటెనియల్ ఎడిషన్ అనేది కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్ ప్లాట్ఫామ్పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది కార్బన్ ఫైబర్ బాడీవర్క్, సింగిల్ సీట్, ఫుల్లీ అడ్జస్టబుల్ సస్పెన్షన్, కార్బన్ ఫైబర్ ఎగ్జాస్ట్ మఫ్లర్ వంటి వాటిని పొందుతుంది. ఇవన్నీ కలిగి ఉండటం వల్ల స్టాండర్డ్ బైక్ కంటే ఇది 5.5 కేజీలు ఎక్కువ బరువును కలిగి ఉంటుంది.Hero MotoCorp introduces The Centennial Collector's Edition Motorcycle. Designed, sculpted, and etched with the utmost reverence. This masterpiece is meticulously handcrafted for only the chosen one hundred. On auction for the greater good.#HeroMotoCorp #TheCentennial pic.twitter.com/nD9ddlkq3j— Hero MotoCorp (@HeroMotoCorp) July 1, 2024 -
మీకు తెలుసా? ఈ కారును భారత్లో 30లక్షల మంది కొన్నారు
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'మారుతి స్విఫ్ట్' అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. తొలిసారిగా కంపెనీ 2005లో తన స్విఫ్ట్ కారును ప్రారంభించింది. ఆ తరువాత ఇప్పటివరకు అనేక అప్డేట్స్ పొందూతూ వాహన వినియోగదారులను ఆకర్శించడంలో విజయం సాధించింది. దీంతో భారతదేశంలో స్విఫ్ట్ సేల్స్ 30లక్షల యూనిట్లకు చేరుకుంది.అమ్మకాల్లో స్విఫ్ట్ అరుదైన మైలురాయిని చేరుకున్న సందర్భాంగా మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ.. లక్షలాది మంది స్విఫ్ట్ కారును ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న స్విఫ్ట్ యజమానులందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.ఇప్పటి వరకు పెట్రోల్ వేరియంట్ రూపంలో అందుబాటులో ఉన్న మారుతి స్విఫ్ట్.. త్వరలో CNG రూపంలో కూడా లాంచ్ అవ్వడానికి సిద్ధమవుతోంది. ఇది పెట్రోల్ వెర్షన్ మాదిరిగానే.. 1197 సీసీ త్రీ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 80.4 Bhp పవర్, 111.7 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుందని సమాచారం. ఈ మోడల్ కేవలం మాన్యువల్ గేర్బాక్స్తో మాత్రమే లభించే అవకాశం ఉంది. -
తగ్గిన ఇంధన ధరలు.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన
మహారాష్ట్ర ప్రభుత్వం.. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఇంధనంపై పన్నులను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్ ధరలను తగ్గించే వ్యాల్యువ్ యాడెడ్ ట్యాక్స్ (VAT)ని ప్రభుత్వం సవరించింది. లీటరు పెట్రోల్ ధరలను 65 పైసలు తగ్గించింది. డీజిల్ ధరలను రూ.2.60 పైసలు తగ్గిస్తూ ప్రకటించింది. ఈ ధరలు బృహన్ ముంబై, థానే, నవీ ముంబై మునిసిపల్ ప్రాంతాల్లో ధర తగ్గింపు వర్తిస్తుందని అధికారులు పేర్కొన్నారు.వ్యాట్ తగ్గింపు నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.200 కోట్ల భారం పడుతుందని మంత్రి స్పష్టం చేశారు. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో ఇంధన ధరలను పెంచిన తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంధన ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.ధరల పెరుగుల తరువాత గోవాలో లీటరు పెట్రోల్ ధర రూ. 95.40, డీజిల్ రూ. 87.90 వద్ద ఉంది. కర్ణాటకలో ఇంధన ధరలను పెంచుతూ ప్రకటనలు జారీ చేసిన తరువాత గోవా ప్రభుత్వం కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. అయితే కర్ణాటక పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా రూ. 3, రూ. 3.5 పెంచుతూ ఇటీవలే కీలక ప్రకటన వెల్లడించింది. -
ఖండాంతరాలు దాటిన ఇండియన్ కంపెనీ.. బ్రెజిల్లో కొత్త ప్లాంట్
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'బజాజ్ ఆటో' బ్రెజిల్లో కొత్త ప్లాంట్ ప్రారంభించింది. ఈ కొత్త సదుపాయంతో కంపెనీ సంవత్సరానికి 20,000 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటికే వంద దేశాల్లో కంపెనీ తన వాహనాలను విక్రయిస్తోంది. ఈ కొత్త ప్లాంట్లో ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది, కాబట్టి మరిన్ని దేశాలకు బజాజ్ వాహనాలు ఎగుమతి అయ్యే అవకాశం ఉంది.కంపెనీ ఈ కొత్త ప్లాంట్లో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని 50,000 యూనిట్లకు విస్తరించనున్నట్లు సమాచారం. ఇందులో కేవలం వాహనాలు మాత్రమే కాకుండా వాహనాలకు కావలసిన విడి భాగాలను కూడా ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ప్రారంభంలో కంపెనీ బజాజ్ డామినర్ బైకులను మాత్రమే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.బ్రెజిల్ దేశంలో ఉత్పత్తి చేసిన డామినార్ బైకులు లాటిన్ అమెరికన్ మార్కెట్లలో విక్రయించనున్నారు. కంపెనీ సొంత ప్లాంట్ ఏర్పాటు చేయడంతో.. ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా కస్టమర్లకు త్వరితగతిన వాహనాలను డెలివరీ చేయవచ్చని బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో బ్రెజిల్లో మోటార్సైకిల్ అమ్మకాలు 20 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. డేటా ప్రకారం, 2024లో దక్షిణ అమెరికా మోటార్సైకిల్ మార్కెట్ భారీగా పుంజుకుంది. భారతదేశంలో కూడా బజాజ్ ఆటో అమ్మకాలు ఆశాజనకంగానే ఉన్నట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ వెల్లడించింది. -
అంబానీ మరో ఖరీదైన కారు.. వీడియో వైరల్
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ వద్ద ఇప్పటికే ఖరీదైన అనేక అన్యదేశ్య కార్లు ఉన్నాయి. కాగా ఇటీవల మరో రోల్స్ రాయిస్ కారు వారు గ్యారేజిలో చేరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇప్పటికే ముకేశ్ అంబానీ గ్యారేజిలో ఎనిమిది రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు వీడియోలో కనిపించే రోల్స్ రాయిస్.. 9వ కారు అని తెలుస్తోంది. వీడియోలో మహీంద్రా స్కార్పియో, టయోటా ఫార్చ్యూనర్, మెర్సిడెస్ జీ63 ఏఎంజీ కార్లు కాన్వాయ్ ముందు భాగంలో ఉన్నాయి. ఆ తరువాత రోల్స్ రాయిస్ కారు రావడం గమనించవచ్చు.వీడియో రాత్రి సమయంలో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. కాబట్టి కారు ఏ కలర్ అనేది స్పష్టంగా తెలియడం లేదు. బహుశా ఇది వైట్ కలర్ అని తెలుస్తోంది. దీని ధర రూ. 10 కోట్లు కంటే ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. ముకేశ్ అంబానీ గ్యారేజిలో రోల్స్ రాయిస్ కార్లు మాత్రమే కాకుండా ఇతర సూపర్ కార్లు కూడా ఉన్నట్లు సమాచారం. -
ఇకపై కావాలన్నా.. ఈ కారును కొనలేరు!.. ఎందుకంటే?
హ్యుందాయ్ ఇండియా తన లైనప్ నుంచి కోనా ఎలక్ట్రిక్ కారును నిలిపివేసింది. 2019 నుంచి సుమారు ఐదేళ్లపాటు భారత మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఈ కారు ఉత్పత్తి ఇప్పుడు నిలిచిపోయింది. ఇది దేశీయ విఫణిలో లాంచ్ అయిన మొట్టమొదటి హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కారు. ప్రస్తుతం కోనా ఎలక్ట్రిక్ నిలిచిపోవడంతో.. ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు మాత్రమే అమ్మకానికి ఉంది.ప్రస్తుతం నిలిచిపోయిన హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ స్థానంలోకి 2025లో లాంచ్ కానున్న క్రెటా ఈవీ రానున్నట్లు సమాచారం. హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 25.30 లక్షలు (లాంచ్ సమయంలో.. ఎక్స్ షోరూమ్). ఇది 29.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి, ఒక సింగిల్ చార్జితో 452 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 100 కిలోవాట్ మోటారు 131 Bhp పవర్, 395 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. -
జులై 24న లాంచ్ కానున్న రెండు కార్లు ఇవే!
భారతీయ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన మినీ ఇండియా ఈ నెల ప్రారంభంలోనే తన 'కూపర్ ఎస్, న్యూ జనరేషన్ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్' కార్ల కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కంపెనీ ఈ రెండు కార్లను జూలై 24న దేశీయ విఫణిలో అధికారికంగా లాంచ్ చేయనుంది.మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్కొత్త మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ మంచి డిజైన్ కలిగి అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు రీడిజైన్డ్ హెడ్లైట్స్, రివైజ్డ్ టెయిల్లైట్స్, 9.5 ఇంచెస్ రౌండ్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే మొదలైనవి పొందుతుంది. ఇందులో ఎలక్ట్రిక్ మోటారు 201 Bhp పవర్, 250 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని 66.45 కిలోవాట్ బ్యాటరీ ఒక సింగిల్ చార్జితో 462 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారు ధర రూ. 70 లక్షల వరకు ఉంటుంది. ఇది కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU)గా దిగుమతి అవుతుంది.మినీ కూపర్ ఎస్ఇప్పటికే మంచి అమ్మకాలు పొందుతున్న మినీ కూపర్ ఎస్.. మరికొత్త హంగులతో లాంచ్ కానుంది. ఇది రౌండ్ హెడ్ల్యాంప్స్, ఇందులో రౌండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఫీచర్స్ ఉంటాయి. ఇందులో 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 201 Bhp పవర్, 300 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ద్వారా శక్తిని ఫ్రంట్ వీల్స్కు పంపుతుంది. ఈ కారు 6.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవతం అవుతుంది. దీని ధర రూ. 42 లక్షల కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. -
500 కిమీ/గం స్పీడ్.. బుగాటి సరికొత్త హైపర్ కారు
ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కారును అభివృద్ధి చేసిన సుమారు ఎనిమిది సంవత్సరాల తరువాత 'బుగాటి' (Bugatti) మరో సూపర్ కారును లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. దీని వేగం 500 కిమీ/గం. ఈ కారుకు సంబంధించిన యాక్సలరేషన్ వీడియోను కంపెనీ ఇప్పటికే తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.స్పీడోమీటర్కు ఎడమవైపున మూడు గేజ్లు సెట్ చేసి ఉండటం ఇక్కడ గమనించవచ్చు. ఇందులో రీడింగ్ గరిష్టంగా 350 కిమీ/గం మాత్రమే చూపిస్తుంది. అయితే వీడియోలో గేజ్లు ఈ వేగాన్ని అధిగమించడం చూడవచ్చు. బుగాటి రిమాక్ సీఈఓ మేట్ రిమాక్ కొత్త బుగాటి హైపర్కార్లో హైబ్రిడ్ పవర్ట్రెయిన్ ఉంటుందని ఇప్పటికే ధ్రువీకరించారు.ఐకానిక్ క్వాడ్ టర్బో డబ్ల్యూ16 స్థానంలో.. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వీ16 ఇంజిన్ మాత్రమే కాకుండా మూడు ఎలక్ట్రిక్ మోటార్లను పొందనున్నట్లు సమాచారం. కారు ముందు భాగంలో రెండు మోటార్లు, వెనుక భాగంలో ఒక మోటార్ ఉంటుంది. ఇవన్నీ 25 కిలోవాట్ సామర్థ్యంతో ఉన్నట్లు సమాచారం.బుగాటి కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారు ఇప్పటికే మార్కెట్లో ఉన్న చిరోన్ కంటే కొంచెం బరువుగా ఉంటుంది. పవర్ అవుట్పుట్ కూడా దాని స్టాండర్డ్ మోడల్ కంటే ఎక్కువగానే ఉంటుంది. కంపెనీ సరికొత్త హైపర్ కారు గురించి మరిన్ని వివరాలను జూన్ 21న అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.Engineered for speed.Pour l’éternité.Watch ‘La Grande Première’ live: https://t.co/D4Er3Kg34c20.06.2024#BUGATTI #PourLÉternité pic.twitter.com/29Wj6G1M6Y— Bugatti (@Bugatti) June 20, 2024 -
మస్క్ సంచలన నిర్ణయం: 2026 నాటికి..
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఇలాన్ మస్క్ (Elon Musk) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీలో అగ్రగామిగా ఉన్న టెస్లా రాబోయే రోజుల్లో హైడ్రోజన్ కార్లను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో చైనా కంపెనీ బివైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్) గట్టి పోటీ ఇస్తోంది. ఈ తరుణంలో మస్క్ హైడ్రోజన్ కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. కంపెనీ 2026 నాటికి టెస్లా హైడ్రోజన్ కార్లను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.టెస్లా కంపెనీ త్వరలోనే హైడ్రోజన్ కార్ల ప్రాజెక్టు మీద పనిచేయనుంది. హైడ్రోజన్తో నడిచే మొదటి కారు 'మోడల్ హెచ్'ను 2026లో ఆవిష్కరించనున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ కార్లను కేవలం అమెరికా మార్కెట్లో మాత్రమే లాంచ్ చేస్తారా?.. ఇతర దేశాల్లో కూడా లాంచ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. -
రూ.1.40 లక్షల కొత్త బైక్.. పూర్తి వివరాలు
బజాజ్ ఆటో భారతదేశంలో పల్సర్ ఎన్160 పేరుతో మరో కొత్త వేరియంట్ లాంచ్ చేసింది. కొత్త వేరియంట్ ఇప్పుడు అప్సైడ్ డౌన్ ఫోర్క్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఏబీఎస్ మోడ్లను పొందుతుంది. ఈ బైక్ ధర రూ. 1.40 లక్షలు (ఎక్స్ షోరూమ్).చూడటానికి స్టాండర్డ్ బజాజ్ పల్సర్ ఎన్160 మాదిరిగా అనిపించినప్పటికీ.. ఇందులోని డిజిటల్ కన్సోల్ బ్లూటూత్ కనెక్టివిటీని పొందుతుంది. కాబట్టి టర్న్ బై టర్న్ న్యావిగేషన్, ఇతర కనెక్టెడ్ ఫీచర్లను సులభంగా పొందవచ్చు. ఈ బైక్ ఇప్పుడు రెయిన్, రోడ్, ఆఫ్-రోడ్ అనే మూడు రైడింగ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది.కొత్త పల్సర్ ఎన్160 మోడల్ సాధారణ మోడల్ మాదిరిగానే 164.82 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 8750 rpm వద్ద 16 హార్స్ పవర్, 6750 rpm వద్ద 14.7 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది. ఇంజిన్లో ఎటువంటి అప్డేట్ లేదు, కాబట్టి అదే పనితీరును అందిస్తుంది. -
రూ.20.95 లక్షల బీఎండబ్ల్యూ బైక్ లాంచ్ - పూర్తి వివరాలు
భారతీయ విఫణిలో బీఎండబ్ల్యూ మోటోరాడ్ తన 'ఆర్ 1300 జీఎస్' బైకును లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ధర రూ. 20.95 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్ కంటే రూ. 40000 ఎక్కువ.కొత్త బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ 1300 సీసీ లిక్విడ్ కూల్డ్ బాక్సర్ ట్విన్ ఇంజన్ పొందుతుంది. ఇది 7750 rpm వద్ద 143.5 Bhp పవర్, 6500 rpm వద్ద 149 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది. పవర్, టార్క్ అనేవి దాని మునుపటి మోడల్ కంటే ఎక్కువ.బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ చూడటానికి దాని ఆర్ 1300 జీఎస్ మాదిరిగానే ఉంటుంది. కానీ కొన్ని అప్డేటెడ్ మార్పులను చూడవచ్చు. ఇందులో రీడిజైన్ ఫ్రంట్, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ హెడ్ల్యాంప్, స్టీల్ షీట్-మెటల్ ఫ్రేమ్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు ఈ బైకులో 6.5 ఇంచెస్ ఫుల్ కలర్ TFT స్క్రీన్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ పొందుతుంది.సుమారు 237 కేజీల బరువున్న ఈ ఆర్ 1300 జీఎస్.. తక్కువ హైట్ ఉన్న సీటును పొందుతుంది. పొట్టిగా ఉన్న రైడర్లకు కూడా ఇది ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇది ట్రయంఫ్ టైగర్ 1200 జిటి ప్రో, హార్లీ-డేవిడ్సన్ పాన్ అమెరికా 1250 వంటి బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.Let's set the pace together. The all-new BMW R 1300 GS starts at an introductory price of INR 20.95 Lakhs*.Have you booked yours? ⬇️https://t.co/NIhvPAPFXK#r1300gs #1300gs #bmw1300gs #pricelaunch #adventurebike #kingofadventure #bmwmotorradlndia #makelifearide pic.twitter.com/Pl9KOODGs0— BMWMotorrad_IN (@BMWMotorrad_IN) June 13, 2024 -
ఇండియన్ మార్కెట్లో రూ.20.98 లక్షల బైక్ లాంచ్ - వివరాలు
ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'డుకాటీ ఇండియా' దేశీయ మార్కెట్లో కొత్త 'పానిగేల్ వీ2' బైకును బ్లాక్ కలర్ ఆప్షన్లో లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 20.98 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీని ధర దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 30000 ఎక్కువ. ఇప్పటికే కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.కొత్త డుకాటీ పానిగేల్ వీ2 బ్లాక్ ఫెయిరింగ్ పొందటమే కాకుండా.. ఫ్యూయల్ ట్యాంక్ మీద, వీల్స్ మీద, వెనుక భాగంలో రెడ్ కలర్ స్కీమ్ చూడవచ్చు. డిజైన్ దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. కాబట్టి అదే కన్ను మాదిరిగా ఉండే ఎల్ఈడీ డీఆర్ఎల్, ట్విన్ హెడ్ల్యాంప్ వంటివి ఉన్నాయి.పానిగేల్ వీ2 బైక్ అదే 995 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 10750 rpm వద్ద 155 Bhp పవర్, 9000 rpm వద్ద 104 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో జత చేయబడి ఉంటుంది. ఈ బైక్ 43 మిమీ ఫుల్లీ అడ్జస్టబుల్ షోవా యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు ఫుల్లీ అడ్జస్టబుల్ మోనోషాక్ పొందుతుంది. బ్రేకింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ కలిగిన ఈ బైక్.. కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, ఇంజన్ బ్రేక్ కంట్రోల్ వంటి వాటితో పాటు.. పైరెల్లీ డయాబ్లో రోస్సో కోర్సా II టైర్లను కలిగి 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఈ బైక్ రైడర్లకు అత్యుత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. -
భారత్లో జపనీస్ బ్రాండ్ స్కూటర్ లాంచ్ - ధర ఎంతో తెలుసా?
జపనీస్ టూ వీలర్ తయారీ సంస్థ యమహా దేశీయ మార్కెట్లో 'ఫాసినో ఎస్' వేరియంట్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ స్కూటర్ ధర ధర రూ. 93730 (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త స్కూటర్ ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్లతో వస్తుంది. ఇందులో ఆన్సర్ బ్యాక్ అనే ఫైండ్ మై స్కూటర్ యాప్ కూడా ఉంది.యమహా ఫాసినో ఎస్ వేరియంట్ 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8.2 హార్స్ పవర్ మరియు 10.3 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని బరువు కేవలం 99 కేజీలు మాత్రమే. ఇది 21 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ పొందుతుంది.యమహా ఫాసినో ఇప్పుడు డ్రమ్, డిస్క్, ఎస్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 79900, రూ. 91130, రూ. 93730 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ఈ స్కూటర్ దేశీయ మార్కెట్లో సుజుకి యాక్సెస్ 125, హోండా యాక్టివా 125, టీవీఎస్ జుపీటర్ 125, యమహా రే జెడ్ఆర్ 125 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
జూన్ 13న లాంచ్ అయ్యే బీఎండబ్ల్యూ బైక్ ఇదే - వివరాలు
ఖరీదైన బైకులను లాంచ్ చేసే బీఎండబ్ల్యూ మోటోరాడ్ సరికొత్త 'ఆర్ 1300 జీఎస్'ను జూన్ 13న లాంచ్ చేయడానికి సిద్ధమైంది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ బైక్ ఆధునిక హంగులతో, అద్భుతమైన పనితీరును అందించడానికి కావాల్సిన ఇంజిన్ ఆప్షన్ పొందనున్నట్లు తెలుస్తోంది.బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ మంచి డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ట్విన్ పాడ్ హెడ్లైట్, ఎల్ఈడీ డీఆర్ఎల్ వంటివి ఉంటాయి. ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే స్టాండర్డ్ రైడింగ్ మోడ్లు, ఎలక్ట్రానిక్ సస్పెన్షన్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ పొందుతుంది.బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ 1300 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజన్ పొందుతుంది. ఇది 7750 rpm వద్ద 145 Bhp పవర్, 6500 rpm వద్ద 149 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది.త్వరలో లాంచ్ కానున్న కొత్త బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, BMW రాడార్ అసిస్టెడ్ క్రూయిజ్ కంట్రోల్, మల్టిపుల్ రైడ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్, స్విచ్ చేయగల ఏబీఎస్ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఈ బైక్ ధర రూ. 20 లక్షల కంటే ఎక్కువ ధర వద్ద లాంచ్ అవుతుందని సమాచారం. ఖచ్చితమైన ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
భారత్లో కొత్త కారు లాంచ్ చేసిన దేశీయ కంపెనీ
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో లాంచ్ అయింది. మూడు వేరియంట్లలో లభించే ఈ కారు ప్రారంభ ధర రూ. 9.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ హ్యాచ్బ్యాక్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ 1.2 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 120 హార్స్ పవర్, 170 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో లభిస్తుంది. కాబట్టి ఇది స్టాండర్డ్ ఆల్ట్రోజ్ కారు కంటే కూడా ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది.అటామిక్ ఆరెంజ్, అవెన్యూ వైట్, ప్యూర్ గ్రే అనే మూడు కలర్ ఆప్షన్లలో లభించే టాటా ఆల్ట్రోజ్ రేసర్.. దాని బోనెట్, రూఫ్ వంటి వాటి మీద వైట్ రేసింగ్ స్ట్రిప్స్ పొందుతుంది. అక్కడక్కడా రేసింగ్ బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ అలాగే ఉన్నాయి.డిజైన్ మాత్రమే కాకుండా టాటా ఆల్ట్రోజ్ రేసర్ వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 10.25 ఇంచెస్ టచ్స్క్రీన్, 7.0 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటితో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సెంటర్ కన్సోల్లోని గేర్ లివర్ మొదలైనవి కూడా ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్స్ పరంగా కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. -
గాల్లో తేలుతూ గమ్యస్థానానికి.. ఇక ట్రాఫిక్ గురించి భయమేల?
నగరాలు అభివృద్ధి చెందుతున్నాయి, ట్రాఫిక్ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. రోజువారీ ట్రాఫిక్ ఎలా ఉన్నా.. వర్షాకాలంలో మాత్రం ట్రాఫిక్లో చిక్కుకుంటే నరకం కనిపిస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కొన్ని కంపెనీలు గత కొంత కాలంగా ఎయిర్ టాక్సీలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా రోడ్మ్యాప్ సిద్ధం చేస్తోంది.సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే.. విమానయాన మంత్రిత్వ శాఖ కొత్త ప్రాజెక్ట్పై ప్రయత్నాలను ప్రారంభించింది. భారతదేశంలో ఎయిర్ ట్యాక్సీలను ప్రవేశపెట్టడానికి రోడ్మ్యాప్ను రూపొందించడానికి భారతదేశపు ఏవియేషన్ రెగ్యులేటర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అనేక సాంకేతిక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్ 2026 నాటికి ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగుళూరు వంటి ప్రధాన పట్టణ కేంద్రాలలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత చెన్నై, హైదరాబాద్ వంటి ఇతర నగరాలకు విస్తరించనున్నట్లు సమాచారం.ఇండిగో పేరెంట్ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ (IGE) అమెరికన్ ఎయిర్ టాక్సీ తయారీదారు ఆర్చర్ ఏవియేషన్తో అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే పనిని ప్రారంభించింది. ఎయిర్ టాక్సీ అందుబాటులో వచ్చిన తరువాత.. ఇందులో ప్రయాణించడానికి ప్రయాణికుడికి అయ్యే ఖర్చు ఉబర్ కంటే కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని సమాచారం.2026 నాటికి భారతదేశంలో ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి రానున్నాయని ఆర్చర్ సీసీఓ నిఖిల్ గోయెల్ వెల్లడించారు. దీని కోసమే ఆర్చర్కు చెందిన ఒక బృందం ఇటీవల భారతదేశంలోని విమానయాన అధికారులను కలిసింది.భారతదేశంలోని ప్రధాన నగరాల్లో విపరీతమైన రద్దీ ఏర్పడుతోంది. దీంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఎక్కువ సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అయితే ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రయాణికులు వేగంగా గమ్యం చేరుకోవచ్చు.ఎయిర్ టాక్సీ ధరలు..ఢిల్లీ నుంచి గుర్గావ్ వెళ్ళడానికి ఉబర్ ఛార్జ్ రూ. 1500 నుంచి రూ. 2000. అయితే ఎయిర్ టాక్సీ అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఢిల్లీ నుంచి గుర్గావ్ వెళ్ళడానికి సుమారు రూ. 2000 నుంచి రూ. 3000 వెచ్చించాల్సి ఉంటుందని ఐజీఈ చీఫ్ రాహుల్ భాటియా పేర్కొన్నారు. ఖచ్చితమైన ధరలు ఎయిర్ టాక్సీ అందుబాటులోకి వచ్చిన తరువాత వెల్లడవుతాయి.ప్రయాణ సమయం తగ్గుతుంది..ఒకసారి భారతదేశంలో ఎయిర్ టాక్సీ సర్వీస్ ప్రారంభమైతే.. ప్రయాణ సమయం చాలా వరకు తగ్గుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్ నుంచి తప్పించుకోవచ్చు. రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీలోని కన్నాట్ నుంచి గురుగ్రామ్ చేరుకోవడానికి 27 కిలోమీటర్లు 90 నిముషాలు ప్రయాణించాల్సి ఉంటుంది. అదే ఈ దూరాన్ని ఎయిర్ టాక్సీ ద్వారా 7 నిమిషాల్లో చేరుకోవచ్చని తెలుస్తోంది.ఒకసారికి నలుగురు మాత్రమే..ఎయిర్ టాక్సీలు పూర్తిగా ఎలక్ట్రిక్.. వీటిని ఫుల్ ఛార్జ్ చేయడానికి కేవలం 30 నుంచి 40 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. చూడటానికి ఇవి హెలికాప్టర్ల మాదిరిగా ఉన్నప్పటికీ చాలా నిశ్శబ్దంగా ప్రయాణిస్తాయి. ఎయిర్ టాక్సీలో ఒకసారికి నలుగురు మాత్రమే ప్రయాణించవచ్చు.ఇదీ చదవండి: పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు ఎయిర్ టాక్సీల వల్ల ఉపయోగాలుట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నగరాల్లో ఎయిర్ టాక్సీ అవసరం ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అత్యవసర సమయాల్లో వైద్యశాలకు వెళ్లాలన్నా.. సరైన సమయానికి గమ్యస్థానానికి చేరుకోవాలన్నా.. ఎయిర్ టాక్సీలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.ఈ రోజు సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రముఖులు దగ్గర వద్దకు ట్రాఫిక్ సమస్యను ఎదుర్కుంటున్నారు. ట్రాఫిక్ కారణంగా చాలా మంది ప్రముఖులు మెట్రోలో ప్రయాణించిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి ఎయిర్ టాక్సీ నేడు చాలా అవసరం. -
భారత్లో భారీగా పెరిగిన జపనీస్ బ్రాండ్ కారు సేల్స్
2024 మే నెల ముగియడంతో వాహన తయారీ సంస్థలు తమ అమ్మకాల గణాంకాలను విడుదల చేస్తున్నాయి. ఈ తరుణంలో భారతదేశంలో అధిక ప్రజాదరణ పొందిన జపనీస్ ఆటోమొబైల్ తయారీదారు 'నిస్సాన్ ఇండియా' కూడా సేల్స్ డేటా రిలీజ్ చేసింది.కంపెనీ విడుదల చేసిన డేటా ప్రకారం.. నిస్సాన్ కంపెనీ మే 2024లో 6204 యూనిట్ల మాగ్నైట్ కార్లను విక్రయించినట్లు సమాచారం. ఈ సంఖ్య ఏప్రిల్ 2024లో 3043 యూనిట్లు మాత్రమే. దీన్నిబట్టి చూస్తే కంపెనీ సేల్స్ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. మొత్తం అమ్మకాల్లో కంపెనీ మునుపటి కంటే కూడా 34 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి.మే 2023లో నిస్సాన్ అమ్మకాలు 4631 యూనిట్లు మాత్రమే. అదే మే 2024లో కంపెనీ సేల్స్ 6204కు చేరాయి. ఇందులో దేశీయ విక్రయాలు 2211 కాగా.. ఎగుమతులు 3993గా నమోదయ్యాయి. క్రమంగా నిస్సాన్ మాగ్నైట్ సేల్స్ పెరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో ఇది మరింత మంది కస్టమర్లను ఆకర్షిస్తుందని.. నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ 'సౌరభ్ వత్సా' పేర్కొన్నారు.నిస్సాన్ కంపెనీ భారతీయ మార్కెట్లో ఇప్పడు కేవలం ఒకే కారును విక్రయిస్తోంది. రాబోయే రోజుల్లో కంపెనీ కొత్త కార్లను లాంచ్ చేస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అయితే కంపెనీ ఇండియాలో తన నెట్వర్క్ పెంచుతూనే ఉంది. ప్రస్తుతం నిస్సాన్ 272 టచ్పాయింట్లను కలిగి ఉంది. వీటి ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు సేల్స్ మాత్రమే కాకుండా సర్వీస్ కూడా అందిస్తోంది.కంపెనీ తన నిస్సాన్ మాగ్నైట్ SUVని ప్రపంచ వ్యాప్తంగా 15 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. ఇందులో సీషెల్స్, బంగ్లాదేశ్, ఉగాండా, బ్రూనై వంటి దేశాలు మాత్రమే కాకుండా.. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, కువైట్ వంటి మధ్యప్రాచ్య దేశాలు ఉన్నాయి. -
అమెరికా ఆంక్షలు.. చైనా కంపెనీ కొత్త ప్రణాళిక
గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం ఎక్కువవుతున్న తరుణంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నాయి, విక్రయిస్తున్నాయి. అయితే మొత్తం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో లేదా వినియోగంలో చైనా కార్ల సంఖ్య ఎక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణం.. చైనా కార్ల ధరలు ఇతర బ్రాండ్ కార్ల కంటే తక్కువగా ఉండటమే..!ఇప్పటికే కొన్ని దేశాలు చైనా వాహనాల దిగుమతి పూర్తిగా నిషేధించాయి, మరికొన్ని భారీ సుంకాలను విధించాయి. అయినప్పటికీ గ్లోబల్ మార్కెట్లో చైనా కంపెనీ సరసమైన కార్లను విక్రయించడానికి సర్వత్రా సిద్ధమైంది. ఇందులో బీవైడీ ప్రధానంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే భారతదేశంలో కూడా ఈ కంపెనీ ఉత్తమ అమ్మకాలను పొందుతూ.. ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూనే ఉంది.ప్రపంచ మార్కెట్లో తమ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడానికి.. దానికి అవసరమైనన్ని కార్లను ఉత్పత్తి చేయడానికి బీవైడీ కమకారీలోని పాత ఫోర్డ్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంది. ఇందులో భాగంగానే కంపెనీ బ్రెజిల్లో కూడా తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి సిద్ధమైంది.బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా గత సంవత్సరం చైనాను సందర్శించినప్పుడు, అతను బీవైడీ బిలియనీర్ వ్యవస్థాపకుడు, చైర్ వాంగ్ చువాన్ఫును కలిశారు. ఆ సమావేశం తరువాత, బీవైడీ ఆసియా వెలుపల మొదటి కార్ల తయారీ కేంద్రంగా దేశాన్ని ఎంచుకుంది.బీవైడీ ఈ సంవత్సరం బహియా రాష్ట్రంలోని సైట్లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ ఆటోమొబైల్స్ ఉత్పత్తిని ప్రారంభించాలని భావిస్తోంది. ఇక్కడ బస్సులు, ట్రక్కులు మాత్రమే కాకుండా ప్రాసెస్ బ్యాటరీ పదార్థాలను కూడా తయారు చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో.. బీవైడీ ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా ఎదుగుతుందా? అనే సూచనలు కూడా కనిపిస్తున్నాయని పలువురు నిపుణులు భావిస్తున్నారు.గత నెలలో అమెరికా అధ్యక్షుడు.. జో బైడెన్ చైనా ఎలక్ట్రిక్ వాహనాలపై 100 శాతం సుంకం ప్రకటించారు. స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాలను పెంచడానికి.. చైనా ఉత్పత్తుల సంఖ్యను తగ్గించడానికి అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అమెరికాలో చైనా ఉత్పత్తుల సంఖ్య తగ్గుతుందని స్పష్టంగా తెలుస్తోంది. -
భారత్లో సరికొత్త అమెరికన్ బ్రాండ్ కారు లాంచ్.. ధర ఎంతో తెలుసా?
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన అమెరికన్ బ్రాండ్ జీప్.. భారతీయ విఫణిలో సరికొత్త 'స్పెషల్ ఎడిషన్ మెరిడియన్ ఎక్స్' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ధర రూ. 34. 27 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా వరకు అప్డేట్స్ పొందింది.జీప్ మెరిడియన్ స్పెషల్ ఎడిషన్.. గ్రే రూఫ్, గ్రే యాక్సెంట్లతో అల్లాయ్ వీల్స్ను పొందుతుంది. ఇందులో సైడ్ మౌల్డింగ్, పుడిల్ ల్యాంప్స్, ప్రోగ్రామబుల్ యాంబియంట్ లైటింగ్, సన్షేడ్స్, ఎయిర్ ప్యూరిఫైయర్, ప్రీమియం కార్పెట్ మ్యాట్స్ మొదలైనవి ఉన్నాయి. ఈ స్పెషల్ ఎడిషన్ ధర దాని ఎంట్రీ లెవల్ లిమిటెడ్ (ఓ) వేరియంట్ కంటే రూ. 50000 ఖరీదైనది.కొత్త జీప్ మెరిడియన్ ఎక్స్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 170 హార్స్ పవర్ మరియు 350 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ లేదా 9 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్తో లభిస్తుంది.జీప్ కంపెనీ ఈ ఏడాది చివర్లో మిడ్-లైఫ్ అప్డేట్ను అందుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ అప్డేటెడ్ SUV ఇటీవలే టెస్టింగ్ దశలో కనిపించింది. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందిందని తెలుస్తోంది. ఇది దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత స్కోడా కొడియాక్, ఎంజీ గ్లోస్టర్, టయోటా ఫార్చ్యూనర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
ప్రపంచంలో మొదటి సీఎన్జీ బైక్ ఇదే.. ఆటోమొబైల్ చరిత్రలో నవశకం
దశాబ్దాల క్రితం డీజిల్ బైకులు వినియోగంలో ఉండేవి. ఆ తరువాత పెట్రోల్ బైకులు వచ్చాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ బైకులు అందుబాటులో ఉన్నాయి. కాగా.. త్వరలో సీఎన్జీ బైక్ లాంచ్ అవ్వడానికి సిద్ధమైంది.ప్రస్తుతం భారతీయ విఫణిలో సీఎన్జీతో నడిచే వాహనాల జాబితాలో కార్లు, ఆటో రిక్షాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు సీఎన్జీ బైకులు ప్రపంచ మార్కెట్లో అడుగుపెట్టలేదు. కాబట్టి బజాజ్ ఆటో సీఎన్జీ బైక్ లాంచ్ చేసి.. నవ శకానికి నాంది పలకడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త సీఎన్జీ బైక్ కోసం ఇప్పటికే ట్రేడ్మార్క్ను కూడా దాఖలు చేసింది.బజాజ్ కంపెనీ లాంచ్ చేయనున్న సీఎన్జీ బైకును ఈ నెల (జూన్ 18) అధికారికంగా పరిచయం చేయనుంది. లాంచ్కు సిద్దమవుతున్న ఈ బైక్కు 'ఫైటర్' అని నామకరణం చేశారు. బజాజ్ కంపెనీ గత కొంత కాలంగా ఈ సీఎన్జీ బైక్ మీద పనిచేస్తోంది. త్వరలో దీనిని అధికారికంగా ఆవిష్కరించడానికి సిద్ధమైంది.ఇప్పటికే అనేక సార్లు టెస్టింగ్ దశలో కనిపించిన బజాజ్ సీఎన్జీ బైక్ హాలోజన్ టర్న్ ఇండికేటర్లు, టెలిస్కోపిక్ ఫోర్క్లు, సస్పెన్షన్ డ్యూటీల కోసం మోనోషాక్ యూనిట్ వంటి వాటితోపాటు మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్, సింగిల్ పీస్ సీటు, డిస్క్ & డ్రమ్ బ్రేక్ యూనిట్ పొందనున్నట్లు సమాచారం. -
నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు: పెట్రోల్, డీజిల్ వాహనాలు బ్యాన్?
దేశంలో ఫ్యూయెల్ (పెట్రోల్, డీజిల్) వాహనాల వినియోగం గతంతో పోలిస్తే.. ఇప్పుడు కొంత తక్కువగా ఉందనే తెలుస్తోంది. కొత్త ఎలక్ట్రిక్ కార్లు పుట్టుకొస్తున్న సమయంలో కొందరు వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరుణంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాబోయే 10 సంవత్సరాల్లో.. డీజిల్, పెట్రోల్ వాహనాలను తొలగించే యోచనలో ఉన్నట్లు సంచలన ప్రకటన చేశారు.మార్కెట్లో బైకులు, స్కూటర్లు, కార్లు, బస్సులు మాత్రమే కాకుండా ఆటో రిక్షాలు కూడా ఎలక్ట్రిక్ వెర్షన్లో లభిస్తున్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఇతర వాహనాలు కూడా తప్పకుండా ఈవీల రూపంలో అందుబాటులో ఉంటాయి. ఈ రోజు పెట్రోల్ వాహనాల కోసం పెట్టే ఖర్చు కంటే.. ఎలక్ట్రిక్ కార్ల కోసం పెట్టే ఖర్చు చాలా తక్కువ కూడా. కాబట్టి రాబోయే రోజుల్లో డీజిల్ మరియు పెట్రోల్ వాహనాలను తొలగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు.. గడ్కరీ హిమాచల్ ప్రదేశ్లోని బహిరంగ ర్యాలీలో పేర్కొన్నారు.ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని పెండానికి కేంద్రం ఇప్పటికే సబ్సిడీలను కూడా అందిస్తోంది. ఇవన్నీ ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచడంలో ఉపయోగపడ్డాయి. ప్రజలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి, వినియోగించడానికే ఆసక్తి చూపుతున్నారు. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత పెరుగుతుందని స్పష్టంగా తెలుస్తోంది.కొత్త ఈవీ పాలసీలు ఆమోదం పొందిన తరువాత ఈవీల సేల్స్ పెరుగుతాయని తెలుస్తోంది. కాబట్టి 2030 నాటికి ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల సంఖ్య ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ మాత్రమే కాకుండా అమెరికా, యూకే వంటి దేశాలు కూడా ఇదే విధాన్ని పాటించడానికి సుముఖత చూపుతున్నాయి.భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతోంది. కానీ ఈవీలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు విరివిగా అందుబాటులో లేదు. ఇప్పటికి కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునే వారు ఛార్జింగ్ సదుపాయాలు ఎక్కువగా లేదనే కారణంగానే.. పెట్రోల్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కేంద్రం చెప్పినట్లు 2034 నాటికి డీజిల్, పెట్రోల్ కార్లను తొలగించాలంటే.. కావలసినన్ని ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. -
రూ. 82911లకే కొత్త బైక్.. 73 కిమీ మైలేజ్
హీరోమోటోకార్ప్ కంపెనీ దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు సరికొత్త స్ప్లెండర్ ప్లస్ XTEC 2.0 లాంచ్ చేసింది. కంపెనీ ఎవర్గ్రీన్ కమ్యూటర్ యొక్క 30వ వార్షికోత్సవాన్ని జరుపుకునే సందర్భంగా ఈ బైకును రూ. 82911 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది.కొత్త హీరో స్ప్లెండర్ ప్లస్ 97.2 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8000 rpm వద్ద 8.02 hp పవర్, 6000 rpm వద్ద 8.05 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 4 స్పీడ్ గేర్బాక్స్తో జతచేయబడి ఉంటుంది. ఇది ఒక లీటరుకు ఏకంగా 73 కిమీ మైలేజ్ అందిస్తుంది.డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్ పొందిన ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా అద్భుతమైన డిజైన్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో డిజిటల్ డిస్ప్లే.. బ్లూటూత్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఇందులో USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది.డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉన్న ఈ బైక్ దాని స్టాండర్డ్ XTEC మోడల్ కంటే కూడా రూ. 3000 ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఇది దేశీయ మార్కెట్లో ఉఇప్పటికే అమ్మకానికి ఉన్న హోండా షైన్ 100, బజాజ్ ప్లాటినా 100 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
హైబ్రీడ్ కార్.. ఒక్కసారికి 2000 కిమీ ప్రయాణం
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో ఆధునిక ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఈ తరుణంలో చైనాకు చెందిన బీవైడీ కంపెనీ సింగిల్ చార్జితో ఏకంగా 2000 కిమీ కంటే ఎక్కువ ప్రయాణించే హైబ్రిడ్ కారును ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.బీవైడీ కంపెనీ ఆవిష్కరించిన కొత్త హైబ్రిడ్ కారును ఒక ఫుల్ ఛార్జ్ చేసి.. ఫుల్ ట్యాంక్ ఇంధనం నింపిన తరువాత, ప్రయాణం ప్రారంభిస్తే.. 2000 కిమీ ప్రయాణించే వరకు మళ్ళీ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్యూయల్ ట్యాంక్లో ఇంధనం నింపాల్సిన అవసరం కూడా లేదు.కంపెనీ ఆవిష్కరించిన కారు పేరు తెలియాల్సి ఉంది. అయితే దీని ధర 100000 యువాన్లు (13800 అమెరికన్ డాలర్లు) వరకు ఉంటుందని సమాచారం. లాంచ్ సమయంలో కంపెనీ అధికారిక ధరలను వెల్లడిస్తుంది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ హైబ్రిడ్ కారుకు సంబంధించిన ఫీచర్స్ మాత్రమే కాకుండా.. లాంచ్ డేట్ వంటి వివరాలు కూడా అధికారికంగా త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
ఈ స్కూటర్ను 8 లక్షల కంటే ఎక్కువ మంది కొనేశారు
దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్.. గత దశాబ్ద కాలంలో 10 మిలియన్ స్కూటర్లను విక్రయించింది. ఇందులో జుపీటర్, జుపీటర్ 125 అమ్మకాలు మాత్రం 63 శాతం ఉన్నట్లు సమాచారం.భారతీయ స్కూటర్ మార్కెట్లో జుపీటర్, జుపీటర్ 125 వాటా 25 శాతం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. జుపీటర్ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 844863 యూనిట్లు. గడిచిన 10 ఆర్ధిక సంవత్సరాల్లో జుపీటర్ పొందిన అత్యుత్తమ అమ్మకాలు ఇవే అని స్పష్టమవుతోంది. 2014 ఆర్థిక సంవత్సరంలో జుపీటర్ అమ్మకాలు కేవలం 98937 యూనిట్లు మాత్రమే.110సీసీ, 125సీసీ వేరియంట్లలో అమ్ముడవుతున్న ఈ స్కూటర్ ప్రస్తుతం టీవీఎస్ బెస్ట్ సెల్లింగ్ వెహికల్3. కాగా టీవీఎస్ కంపెనీకి చెందిన రైడర్ 125 (478443 యూనిట్లు), ఎక్స్ఎల్ (481803 యూనిట్లు), అపాచీ (378112 యూనిట్లు), ఎన్టార్క్ 125 (331865 యూనిట్లు) వేహనాలు ఉత్తమ అమ్మకాలను పొందగలిగాయి. -
భారత్ నుంచి 40 దేశాలకు మేడ్ ఇన్ ఇండియా కార్లు
స్కోడా ఆటో ఫోక్స్వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SAVWIPL) పూణేలోని చకన్లోని తన తయారీ కేంద్రంలో 15 లక్షల మేడ్-ఇన్-ఇండియా వాహనాలను తయారు చేసి.. ఉత్పత్తిలో ఓ సరికొత్త మైలురాయిని దాటేసింది.స్కోడా ఆటో ఫోక్స్వ్యాగన్ భారతదేశంలో స్థానికంగా తన కార్యకలాపాలను 2007లో ప్రారంభించి.. తమ మొదటి ఉత్పత్తిగా 'స్కోడా ఫాబియా' లాంచ్ చేశారు. ఆ తరువాత స్కోడా రాపిడ్, ఫోక్స్వ్యాగన్ పోలో, వెంటో, అమియో వంటి కార్లను లాంచ్ చేశాయి. ప్రస్తుతం ఈ కార్ల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.ప్రస్తుతం సంస్థ కుషాక్, టైగన్, స్లావియా, వర్టస్ కార్లను మాత్రమే చకాన్ ఫెసిలిటీలో ఇండియా 2.0 ఉత్పత్తులుగా ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ స్థానికంగా ఉత్పత్తి చేసిన కార్లను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. ఉత్పత్తిలో సుమారు 30 శాతానికి పైగా ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు బ్రాండ్ ప్రకటించింది.స్కోడా, ఫోక్స్వ్యాగన్ స్థానికంగా కార్లను మాత్రమే కాకుండా.. ఇంజిన్లను కూడా తయారు చేస్తోంది. అప్పట్లో పోలో హ్యాచ్బ్యాక్ కారులో అందించే 1.5 లీటర్ టీడీఐ డీజిల్ ఇంజిన్ను కంపెనీ తయారు చేసిందే. ఆ తరువాత 2.0 లీటర్ టీడీఐ డీజిల్, 1.0 లీటర్, 1.2 ఎంపీఐ పెట్రోల్ ఇంజిన్లను చేసింది. ఇప్పటికి స్కోడా, ఫోక్స్వ్యాగన్ ఏకంగా 3.80 లక్షల ఇంజిన్లను ఉత్పత్తి చేసినట్లు సమాచారం. -
ఒక్క చూపుకే ఫిదా చేస్తున్న 'బీఎండబ్ల్యూ ఆర్20' - వివరాలు
ప్రముఖ బైక్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటొరాడ్ (BMW Motorrad) సరికొత్త కాన్సెప్ట్ మోటార్సైకిల్ 'బీఎండబ్ల్యూ ఆర్20' ఆవిష్కరించింది. చూడటానికి చాలా అద్భుతంగా ఉన్న ఈ బైక్ ఓ ప్రత్యేకమైన డిజైన్ కలిగి.. చూడగానే ఆకర్శించే విధంగా ఉంది.కొత్త బీఎండబ్ల్యూ ఆర్20 బైక్ 2000 సీసీ ఎయిర్ ఆయిల్ కూల్డ్ బాక్సర్ ఇంజన్ను పొందుతుంది. అయితే ఈ ఇంజిన్ పనితీరు గణాంకాలను కంపెనీ వెల్లడించలేదు. ఇంజన్ కొత్త సిలిండర్ హెడ్ కవర్లు, కొత్త బెల్ట్ కవర్, కొత్త ఆయిల్-కూలర్ కూడా ఉన్నాయి.మోడ్రన్ క్లాసిక్ మోటార్సైకిల్ డిజైన్ కలిగిన ఈ బైక్ సరికొత్త గులాబీ రంగులో ఉంటుంది. సింగిల్ సీటును క్విల్టెడ్ బ్లాక్ ఆల్కాంటారా అండ్ ఫైన్-గ్రెయిన్ లెదర్లో అప్హోల్స్టర్ చేసారు. ఇందులో కొత్త ఎల్ఈడీ హెడ్లైట్, 3డీ ప్రింటెడ్ అల్యూమినియం రింగ్లో ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్ వంటివి ఉన్నాయి.బీఎండబ్ల్యూ ఆర్20 బైక్ 17 ఇంచెస్ ఫ్రంట్ స్పోక్ వీల్.. 17 ఇంచెస్ రియర్ బ్లాక్ డిస్క్ వీల్ పొందుతుంది. వెనుక టైర్ 200/55, ముందు టైరు 120/70 పరిమాణం పొందుతుంది. బీఎండబ్ల్యూ పారాలెవర్ సిస్టమ్ క్రోమ్-మాలిబ్డినం స్టీల్ స్వింగార్మ్, అల్యూమినియం పారాలెవర్ స్ట్రట్ ఇందులో ఉపయోగించారు. కాబట్టి రైడర్ మంచి రైడింగ్ అనుభూతిని పొందవచ్చు. -
జావా 42 బాబర్ కొత్త వేరియంట్.. ధర ఎంతో తెలుసా?
జావా మోటార్సైకిల్స్ తన '42 బాబర్' బైకును కొత్త 'రెడ్ షీన్' వేరియంట్లో లాంచ్ చేసింది. ఇది కొత్త పెయింట్ స్కీమ్ పొందటమే కాకుండా.. కొత్త అల్లాయ్ వీల్స్, కొన్ని కాస్మెటిక్ ట్వీక్లను పొందుతుంది. ఈ బైక్ ధర రూ. 2.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). స్టాండర్డ్ వేరియంట్ కంటే దీని ధర రూ. 9550 ఎక్కువ.కొత్త కలర్ జావా 42 బాబర్.. రెడ్ షీన్ ట్రిమ్ ట్యూబ్లెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్తో పాటు రెడ్ అండ్ క్రోమ్లలో పూర్తి చేసిన సరికొత్త డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్ను పొందుతుంది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కొంత ఆకర్షణీయంగా ఉంటుంది.జావా 42 బాబర్ కొత్త వేరియంట్లో కాస్మొటిక్ అప్డేట్స్ కాకుండా.. ఇంజిన్, పర్ఫామెన్స్ వంటి వాటిలో ఎటువంటి అప్డేట్స్ లేదు. కాబట్టి ఇందులో అదే 334 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 29.5 Bhp పవర్ మరియు 30 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో జత చేయబడి ఉంటుంది. -
అగ్రరాజ్యంలో తగ్గినా.. భారత్లో తగ్గని ఈవీ సేల్స్
ఎలక్ట్రిక్ వాహనాల (EV) విక్రయాల వృద్ధి రేటు ప్రపంచవ్యాప్తంగా మందగిస్తోందని.. ఇటీవలి గోల్డ్మన్ సాక్స్ పేర్కొంది. ఇంతకీ ఈవీల వృద్ధి ఎందుకు తగ్గుతోంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధి రేటు తగ్గడానికి ప్రధాన కారణం.. నిర్వహణ సంస్థల అధిక మూలధన వ్యయాలు, ఎన్నికల అనిశ్చితులు మాత్రమే కాకుండా ఛార్జింగ్ స్టేషన్ల కొరత అని తెలుస్తోంది.వెహికల్ వాల్యుయేషన్ అండ్ ఆటోమోటివ్ రీసెర్చ్ కంపెనీ ప్రకారం.. అమెరికన్లు 2024 మొదటి త్రైమాసికంలో 2,00,000 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసారు. ఈవీల అమ్మకాలు 2023 కంటే 2024లో 7.3 శాతం వృద్ధి చెందినట్లు తెలుస్తోంది. విక్రయాలు కొంత పెరిగినప్పటికీ.. వృద్ధి రేటు మాత్రం గణనీయంగా తగ్గింది.యూరోపియన్ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(ACEA ) నివేదిక ప్రకారం.. EV రిజిస్ట్రేషన్లు తగ్గడం, ఈస్టర్ సెలవుల సమయం కారణంగా ఈ సంవత్సరం మార్చిలో మొదటిసారిగా యూరప్లో కొత్త కార్ల అమ్మకాలు క్షీణించాయని తెలిసింది. యూరోపియన్ యూనియన్ (EU)లో కొత్త ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు మార్చిలో 11.3 శాతం తగ్గి 134,397 యూనిట్లకు చేరుకున్నాయి. ఐరోపాలో అతిపెద్ద మార్కెట్ అయిన జర్మనీలో కూడా EV అమ్మకాల్లో 29 శాతం తగ్గుదలను నమోదు చేసింది.ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ తగ్గడంతో.. మిడ్, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు.. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. గత కొన్ని నెలలోగా అమెరికాలో వీటి వృద్ధి ఎలక్ట్రిక్ వాహనాల కంటే గణనీయంగా పెరిగింది.భారతదేశంలో ఏం జరుగుతోంది?జీఎంకే రీసెర్చ్ & అనలిటిక్స్ నివేదిక ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 1.7 మిలియన్ యూనిట్లను అధిగమించినట్లు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ గణనీయమైన పెరుగుదలను నమోదు చేసినట్లు స్పష్టమవుతోంది. మన దేశమ్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 2023 కంటే 10 శాతం వృద్ధిని నమోదు చేసాయి. ఇందులో ఎక్కువ భాగం ప్యాసింజర్ వెహికల్స్ ఉన్నాయి. -
భారత్లో మరో బెంజ్ కారు లాంచ్ - ధర ఎంతో తెలుసా?
మెర్సిడెస్ బెంజ్ దేశీయ విఫణిలో 'మేబ్యాక్ జీఎల్ఎస్ 600 ఫేస్లిఫ్ట్' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ప్రారంభ ధర రూ. 3.35 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా అప్డేటెడ్ కాస్మొటిక్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది.మేబ్యాక్ GLS 600 సరికొత్త బంపర్ను పొందింది. ఎయిర్ ఇన్టేక్స్లోని గ్రిల్ మేబ్యాక్ లోగో నమూనాను కూడా పొందుతుంది. వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ పొందుతుంది. ఇది పోలార్ వైట్, సిల్వర్ మెటాలిక్ అనే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే డ్యూయెల్ పెయింట్ స్కీమ్ అనేది ఆప్షనల్ అని తెలుస్తోంది.ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో పెద్దగా గమనించదగ్గ అప్డేట్స్ లేదు. అయితే కొత్త స్టీరింగ్ వీల్, ఏసీ వెంట్స్, అప్డేటెడ్ టెలిమాటిక్స్, ఫింగర్ప్రింట్ సెన్సార్ వంటివి ఇందులో లభిస్తాయి. ఇందులో అదే 11.6 ఇంచెస్ ఎంబీయూఎక్స్ స్క్రీన్స్ మొదలైనవి ఉంటాయి.మెర్సిడెస్ మేబ్యాక్ జీఎల్ఎస్ 600 ఫేస్లిఫ్ట్ 4.0 లీటర్ ట్విన్ టర్బోఛార్జ్డ్ వీ8 ఇంజిన్ పొందుతుంది. ఇది 557 హార్స్ పవర్ మరియు 770 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 22 హార్స్ పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 48వీ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ను కూడా పొందుతుంది. ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో జతచేయబడి, 4మ్యాటిక్ సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. -
'అదర్ పూనావాలా' రూ.10.5 కోట్ల కారు ఇదే.. చూసారా!
సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ 'అదర్ పూనావాలా' ఇటీవల 'ఫెరారీ పురోసాంగ్యూ' కొనుగోలు చేశారు. దీని ధర దాదాపు రూ. 10.5 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.అదర్ పూనావాలా కొనుగోలు చేసిన కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రకారం.. ఇది ఇండియాలో కొనుగోలు చేసింది కాదని తెలుస్తోంది. నాలుగు డోర్స్ కలిగిన ఈ కారు నీరో డేటోనా షేడ్లో ఉండటం గమనించవచ్చు. ఎల్లో కలర్ బ్రేక్ కాలిపర్లు కలిగిన ఈ కారు బ్లాక్-అవుట్ ఎక్ట్సీరియర్ పొందుతుంది. ఇంటీరియర్ కూడా ఇదే బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కలయికతో ఉండటం చూడవచ్చు.అద్భుతమైన డిజైన్, ఫీచర్స్ కలిగిన ఈ కారు 6.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి.. 725 పీఎస్ పవర్, 716 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మార్కెట్లో లంబోర్ఘిని ఉరస్, ఆస్టన్ మార్టిన్ డీబీఎక్స్ కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ధర పరంగా ఫెరారీ కారు దాని ప్రత్యర్థుల కంటే ఎక్కువ.అదార్ పూనావాలా గ్యారేజిలో ఫెరారీ పురోసాంగ్యూ మాత్రమే కాకుండా.. రోల్స్ రాయిస్, ఫెరారీ 488 పిస్టా సూపర్కార్, బెంట్లీ బెంటెగా EWB, పోర్స్చే కయెన్, బీఎండబ్ల్యూ 7 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ ఎస్600, బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్ మొదలైన అన్యదేశ్య కార్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by Automobili Ardent India (@automobiliardent) -
'బుజ్జి' ఎక్కడ తయారైందంటే?.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే 'ఆనంద్ మహీంద్రా' తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఇందులో ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో కనిపించే ఓ ప్రత్యేకమైన వాహనానికి సంబంధించిన వీడియో షేర్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో కనిపించే వాహనం పేరు 'బుజ్జి'. ఇది ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898 ఏడీ' సినిమాలో కనిపిస్తుంది. ఇది చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో ఉన్న మా బృందం తయారు చేసిందని పేర్కొన్నారు. ఇది ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఏఐ టెక్నాలజీని పొందుతుందని వివరించారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ ట్వీట్.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.కల్కి 2898 ఏడీపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ'. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ మొత్తం ఆరు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న విడుదల కానుంది.Fun stuff does, indeed, happen on X …We’re so proud of @nagashwin7 and his tribe of filmmakers who aren’t afraid to think big…and I mean REALLY big..Our team in Mahindra Research Valley in Chennai helped the Kalki team realise its vision for a futuristic vehicle by… pic.twitter.com/yAb47nx7ut— anand mahindra (@anandmahindra) May 23, 2024 -
రూ.46.90 లక్షల కారు లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - పూర్తి వివరాలు
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారతదేశంలో 2 సిరీస్ షాడో ఎడిషన్ను రూ. 46.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ షాడో ఎడిషన్ 220ఐ ఎం స్పోర్ట్స్ అనే ట్రిమ్లో మాత్రమే లభిస్తుంది. ఇది బ్లాక్ అవుట్ ఎక్స్టీరియర్ ఎలిమెంట్స్తో సూక్ష్మమైన అప్డేట్లను పొందుతుంది.బీఎండబ్ల్యూ షాడో ఎడిషన్ బ్లాక్ ఎడిషన్ కిడ్నీ గ్రిల్, అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్, రియర్ స్పాయిలర్ వంటి వాటితో పాటు.. ఆధునిక ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఇందులో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెట్ సిస్టం, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మొదలైనవి ఉన్నాయి.ఆల్పైన్ వైట్, స్కైస్క్రాపర్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 179 హార్స్ పవర్ మరియు 280 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా ముందు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఇది 7.1 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.కొత్త బీఎండబ్ల్యూ 2 సిరీస్ షాడో ఎడిషన్.. 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ కూడా పొందుతుంది. ఇది 190 హార్స్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటో గేర్బాక్స్తో జత చేయబడి ఉంటుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము. -
సింగిల్ ఛార్జ్.. 230 కిమీ రేంజ్!.. మారుతి ఎలక్ట్రిక్ కారు
ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో మారుతి సుజుకి తన 'వ్యాగన్ఆర్'ను ఎలక్ట్రిక్ కారుగా లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ దీనిని 'ఈడబ్ల్యూఎక్స్' (eWX) పేరుతో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే దీని కోసం పేటెంట్ దాఖలు చేసింది.2023 ఆటో ఎక్స్పోలో మొదటిసారి కనిపించిన ఈ కారు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు సీ షేప్ లైట్ క్లస్టర్లతో క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్ పొందుతుంది. ప్లాస్టిక్ క్లాడింగ్ బంపర్ ఉంటుంది. వీల్స్, సైడ్ స్కర్ట్లపై పసుపు రంగుతో ఉండటం చూడవచ్చు. ఇది ఒక ఫుల్ చార్జితో 230 కిమీ రేంజ్ అందిస్తుందని మారుతి సుజుకి పేర్కొంది. అయితే కచ్చితమైన గణాంకాలు లాంచ్ తరువాత తెలుస్తాయి.మారుతి సుజుకి ఈ కారును భారతదేశంలో లాంచ్ చేస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇండియన్ మార్కెట్లో మారుతి సుజుకి హైబ్రిడ్ కార్లను లాంచ్ చేయాలనీ యోచిస్తోంది. ఇందులో భాగంగానే స్విఫ్ట్ వంటి కార్లను హైబ్రిడ్ వెర్షన్లలో పరిచయం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. -
బజాజ్ ఫైనాన్స్తో చేతులు కలిపిన టాటా మోటార్స్.. ఎందుకో తెలుసా?
డీలర్లకు ఫైనాన్సింగ్ ఎంపికలను మెరుగుపరచడానికి, అలాగే సులభతరం చేసే ప్రయత్నంలో భాగంగా టాటా మోటార్స్ అనుబంధ సంస్థలైన టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (TMPV), టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (TPEM).. బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్లో భాగమైన బజాజ్ ఫైనాన్స్తో చేతులు కలిపాయి. ఈ భాగస్వామ్యానికి సంబంధించిన MoUపై టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ & డైరెక్టర్ ధీమన్ గుప్తా.. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సిద్ధార్థ భట్ సంతకం చేశారు.ఈ భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ.. మా డీలర్ భాగస్వాములు మా వ్యాపారంలో అంతర్భాగంగా ఉన్నారు. వారి కార్యకలాపాలను సులభతరం చేయడంలో వారికి సహాయపడే పరిష్కారాల కోసం చురుకుగా పని చేయడం మాకు సంతోషంగా ఉంది. ఈ ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్ కోసం బజాజ్ ఫైనాన్స్తో భాగస్వామిగా ఉండటం చాలా సంతోషంగా ఉందని ధీమాన్ గుప్తా అన్నారు.బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అనూప్ సాహా మాట్లాడుతూ.. బజాజ్ ఫైనాన్స్లో వ్యక్తులు, వ్యాపారాలు రెండింటినీ శక్తివంతం చేసే ఫైనాన్సింగ్ సొల్యూషన్లు ఉన్నాయని అన్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా.. మేము TMPV & TPEM అధీకృత ప్రయాణీకులకు, ఎలక్ట్రిక్ వాహనాల డీలర్లకు ఆర్థిక మూలధనాన్ని అందిస్తాము. ఈ సహకారం డీలర్లకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా భారతదేశంలో ఆటోమోటివ్ పరిశ్రమ వృద్ధికి దోహదం చేస్తుందని మేము విశ్వసిస్తున్నామని అన్నారు. -
భారత్లో మరో జర్మన్ బ్రాండ్ కారు లాంచ్.. ధర ఎంతో తెలుసా?
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి.. ఎట్టకేలకు 'క్యూ7 బోల్డ్ ఎడిషన్' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కారు ప్రారంభ ధర రూ.97.84 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త ఎడిషన్ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.కొత్త ఆడి క్యూ7 బోల్డ్ ఎడిషన్ గ్లేసియర్ వైట్, మైథోస్ బ్లాక్, నవర్రా బ్లూ, సమురాయ్ గ్రే. అనే నాలుగు కొత్త కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కొత్త వెర్షన్ లేటెస్ట్ డిజైన్, ఫీచర్స్ పొందినప్పటికీ.. యాంత్రికంగా ఎటువంటి మార్పులు పొందలేదు. కాబట్టి అదే ఇంజిన్ ఉంటుంది. పనితీరు పరంగా ఎటువంటి మార్పులు ఉండదు.ఆడి క్యూ7 బోల్డ్ ఎడిషన్ 3.0 లీటర్ వి6 పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. 335 హార్స్ పవర్, 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసింది. ఇది కేవలం 5.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. క్యూ 7 మోడల్ ఆడి ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్తో పాటు ఆటో, కంఫర్ట్, డైనమిక్, ఎఫిషియెన్సీ, ఆఫ్-రోడ్, ఆల్ రోడ్, ఇండివిజువల్ అనే 7 డ్రైవ్ మోడ్లను పొందుతుంది.Make heads turn as you drive the new Audi Q7 Bold Edition.*Terms and conditions apply. European model shown. Accessories and equipment shown may not be currently offered in India. Bold Edition is available on select variants and select colours only.#AudiQ7 #BoldEdition pic.twitter.com/5hQZVQpQXL— Audi India (@AudiIN) May 21, 2024 -
2030 నాటికి 16 కొత్త కార్లు.. దేశీయ దిగ్గజం కీలక నిర్ణయం
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' భారతీయ మార్కెట్లో రాబోయే 6 సంవత్సరాల్లో ఏకంగా 16 కొత్త కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. 2030 నాటికి 9 ఫ్యూయెల్ కార్లు, 7 ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయాలని సంస్థ యోచిస్తోంది.కంపెనీ కొత్త కార్లను లాంచ్ చేయడంతో పాటు తన వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి యోచిస్తోంది. దీనికోసం మహీంద్రా రాబోయే మూడు ఆర్థిక సంవత్సరాల్లో 27,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. కంపెనీ ప్యాసింజర్ వాహనాలను మాత్రమే కాకుండా కమర్షియల్ వాహనాలను విడుదల చేస్తూ దేశీయ విఫణిలో, గ్లోబల్ మార్కెట్లో కూడా దూసుకెళ్తోంది.మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్ (MEAL)లో కంపెనీ ఇప్పటికే రూ. 12,000 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడి ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధికి మాత్రమే కాకుండా.. మార్కెట్లో కంపెనీ ఉత్పత్తుల డిమాండ్ను తీర్చడానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగించనుంది.ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరం చివరి నాటికి కంపెనీ 10000 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ సంఖ్య FY2026 నాటికి 18000 చేరే అవకాశం ఉంది. కాగా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి FY2025 చివరి త్రైమాసికం నుంచి ప్రారంభమవుతుందని సమాచారం. -
రూ.45 లక్షల బీఎండబ్ల్యూ బైక్ - పూర్తి వివరాలు
'బీఎండబ్ల్యూ మోటొరాడ్' దేశీయ మార్కెట్లో సరికొత్త 'ఎమ్ 1000 ఎక్స్ఆర్' బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 45 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇప్పటికే భారతీయ విఫణిలో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన బైకుల జాబితాలో ఇది కూడా ఒకటిగా చేరింది. ఇది సీబియూ మార్గం ద్వారా ఇండియాకు దిగుమతి అవుతాయి. ఈ బైక్ బుక్ చేసుకుంటే డెలివరీలు జూన్ నుంచి ప్రారంభమవుతాయి.మంచి డిజైన్ కలిగిన ఈ బైక్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 6.5 ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లే ఉంటుంది. అంతే కాకుండా ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వీలీ కంట్రోల్, బ్రేక్ స్లైడ్ అసిస్ట్ ఫంక్షన్, లాంచ్ కంట్రోల్ మరియు పిట్ లేన్ లిమిటర్ ఫంక్షన్లు వంటి అనేక ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.బీఎండబ్ల్యూ ఎమ్ 1000 ఎక్స్ఆర్ బైక్ 999సీసీ ఇన్లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 199 Bhp పవర్ మరియు 113 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ బై-డైరెక్షనల్ క్విక్షిఫ్టర్తో 6-స్పీడ్ గేర్బాక్స్తో జత చేయబడి ఉంటుంది. ఇది కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం వాడుతుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 278 కిమీ కావడం గమనార్హం. ఇందులో రెయిన్, రోడ్, డైనమిక్, డైనమిక్ ప్రో మరియు రేస్ ప్రో మోడ్ అనే ఐదు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. -
త్వరలో లాంచ్ కానున్న కొత్త బెంట్లీ కారు ఇదే.. ఫోటోలు
బెంట్లీ కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త 'కాంటినెంటల్ జీటీ పీహెచ్ఈసీ' అధికారికంగా మార్కెట్లో లాంచ్ కాకముందే.. ఫోటోలు విడుదలయ్యాయి. ఇప్పటికి విడుదలైన ఫోటోల ప్రకారం.. బెంట్లీ కాంటినెంటల్ జీటీ మంచి స్టైలింగ్ అప్డేట్లను పొందుతుందని స్పష్టమవుతోంది. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా ఉత్తమ పనితీరును అందిస్తుందని సమాచారం.కొత్త బెంట్లీ కాంటినెంటల్ జీటీ పీహెచ్ఈసీ టియర్డ్రాప్ డిజైన్ హెడ్లైట్లను పొందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది ఇంకా టెస్టింగ్ దశలోనే ఉండటం వల్ల మొత్తం డిజైన్ వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. అయినప్పటికీ ఇది అద్భుతమైన డిజైన్ పొందుతుందని స్పష్టమవుతోంది.బెంట్లీ కాంటినెంటల్ జీటీ పీహెచ్ఈసీ ఒక ఎలక్ట్రిక్ మోటార్తో 4.0 లీటర్ వీ8 ఇంజిన్ పొందుతుంది. ఎలక్ట్రిక్ మోటార్, ఇంజిన్ రెండూ కలిసి 782 హార్స్ పవర్, 1001 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 3.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.లాంచ్కు సిద్దమవుతున్న కొత్త బెంట్లీ కాంటినెంటల్ జీటీ పీహెచ్ఈవీ మొదట గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఆ తరువాత భారతీయ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాలు తెలియాల్సి ఉంది.A new era is coming.Discover more: https://t.co/anuS4iG6oX-CO2 Emissions and fuel consumption data for EU27 is pending; subject to EU Type Approval pic.twitter.com/eJZih65PYf— Bentley Motors (@BentleyMotors) May 16, 2024 -
బుకింగ్స్లో సరికొత్త రికార్డ్.. మార్కెట్లో మహీంద్రా కారు సంచలనం
గత నెల చివరలో దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త మహీంద్రా XUV 3XO కారు బుకింగ్స్ బుధవారం (మే 15) ప్రారంభయ్యాయి. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 10 నిమిషాల్లో మహీంద్రా కొత్త కారు 27000 బుకింగ్స్ పొందింది. అదే విధంగా 60 నిమిషాల్లో 50000 బుకింగ్స్ పొందింది.మహీంద్రా కంపెనీ ఇప్పటికే 10000 కార్లను (XUV 3XO) ఉత్పత్తి చేసినట్లు సమాచారం. కాబట్టి డెలివరీలు ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త కారు మొత్తం 9 వేరియంట్లలో విడుదలైంది. XUV 3XO ప్రారంభ ధర రూ. 7.49 లక్షలు.తొమ్మిది వేరియంట్లు, ఎనిమిది కలర్ ఆప్షన్లలో లాంచ్ అయిన ఈ కొత్త కారు మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో కొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు, లెవల్ 2 ఏడీఏఎస్, పనోరమిక్ సన్రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 65W టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, ఆటో హోల్డ్ ఫంక్షన్తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.Crossing milestones even before it hits the roads. A big thank you to all our customers who have made this possible. Be a part of our journey, book now: https://t.co/P7UUnkoyxv#XUV3XO #EverythingYouWantAndMore #The3XFactor pic.twitter.com/HMNylKisa1— Mahindra XUV 3XO (@MahindraXUV3XO) May 15, 2024 -
గౌతమ్ సింఘానియా రూ.5.91 కోట్ల కారు ఇదే!
ప్రముఖ బిలినీయర్ 'గౌతమ్ సింఘానియా' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రేమండ్ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఈయన ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. ఇటీవల కూడా ఈయన మరో కారును కొనుగోలు చేశారు.గౌతమ్ సింఘానియా కొనుగోలు చేసిన కారు మెక్లారెన్ కంపెనీకి చెందిన 750ఎస్. దీని ధర మార్కెట్లో రూ.5.91 కోట్లు వరకు ఉంటుంది. అయితే సింఘానియా గ్యారేజిలో ఇప్పటికే రెండు మెక్లారెన్ కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం. తాజాగా కొనుగోలు చేసిన మెక్లారెన్ 750ఎస్ కారు ఆరెంజ్ అండ్ బ్లాక్ డ్యుయల్-టోన్ షేడ్లో ఉండటం చూడవచ్చు.మెక్లారెన్ 750ఎస్ అనేది 720ఎస్ కంటే ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ కారు 4.0 లీటర్ ట్విన్ టర్బో ఇంజిన్ కలిగి.. 750 పీఎస్ పవర్, 800 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 2.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. -
భారత్లో లాంచ్ అయిన జర్మన్ బ్రాండ్ కార్లు - వివరాలు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి (Audi) భారతీయ మార్కెట్లో క్యూ3 SUV , క్యూ3 స్పోర్ట్బ్యాక్ బోల్డ్ ఎడిషన్ వేరియంట్లను లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన కార్ల ధరలు వరుసగా రూ. 54.65 లక్షలు, రూ. 55.71 లక్షలు.కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కార్లు అద్భుతమైన డిజైన్ పొందుతుంది. అయితే ఇంటీరియర్, పవర్ట్రెయిన్ విషయంలో ఎటువంటి మార్పులు లేదని తెలుస్తోంది. బోల్డ్ ఎడిషన్ వేరియంట్లు ఎక్కువగా బ్లాక్ అవుట్ ఎలిమెంట్స్ పొందుతాయి. ఇందులోని గ్రిల్పై గ్లోస్ బ్లాక్ ట్రీట్మెంట్, ఫ్రంట్ బంపర్పై ఎయిర్ ఇన్టేక్ సరౌండ్లు, విండో లైన్ సరౌండ్, వింగ్ మిర్రర్ క్యాప్స్, రూఫ్ రైల్స్ మొదలైనవి చూడవచ్చు. ఈ కార్లు 18 ఇంచెస్ 5 స్పోక్ అల్లాయ్ వీల్స్ పొందుతాయి.స్టాండర్డ్ వెర్షన్ కార్ల ధరలతో పోలిస్తే.. బోల్డ్ ఎడిషన్ ధరలు వరుసగా రూ. 1.48 లక్షలు, రూ. 1.49 లక్షలు ఎక్కువ. ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇందులో పనోరమిక్ సన్రూఫ్, ఫోర్-వే లంబార్ సపోర్ట్తో పవర్డ్ ఫ్రంట్ సీట్లు, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జర్, రియర్ వ్యూ కెమెరా మొదలైనవి ఉన్నాయి.ఆడి క్యూ3, క్యూ3 స్పోర్ట్బ్యాక్ బోల్డ్ ఎడిషన్లు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతాయి. ఇవి 190 హార్స్ పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్స్ 7 స్పీడ్ డీసీటీ గేర్బాక్స్తో లభిస్తాయి.Make a bold statement with the Audi Q3 and Audi Q3 Sportback Bold Edition that come with the black styling package plus.*Terms and conditions apply.#AudiIndia #AudiQ3models #AudiBoldEdition pic.twitter.com/t6Yeq5CKT0— Audi India (@AudiIN) May 10, 2024 -
బీజింగ్ మోటార్ షోలో అడుగుపెట్టిన ఫోక్స్వ్యాగన్ కారు ఇదే..
బీజింగ్ మోటార్ షో 2024లో సరికొత్త 'ఫోక్స్వ్యాగన్ టైరాన్' అధికారికంగా వెల్లడైంది. చైనా మార్కెట్లో విక్రయానికి రానున్న ఈ కొత్త కారు 5 సీటర్ టైగన్ ఎల్ ప్రో పేరుతో విక్రయానికి రానుంది. ఇది 2025 నాటికి దేశీయ మార్కెట్లో 7 సీటర్ రూపంలో అడుగుపెట్టనుంది.ఫోక్స్వ్యాగన్ టైరాన్ చూడటానికి చాలా వరకు టైగన్ మాదిరిగా ఉంటుంది. కాబట్టి ఇది ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్లు, పెద్ద గ్లాస్హౌస్ వంటి వాటిని పొందుతుంది. ఇది దాని ఇతర మోడల్స్ కంటే కూడా కొంత పొడవుగా ఉంటుంది. ఇది సెంటర్ కన్సోల్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్రైవ్ సెలెక్టర్ కోసం రోటరీ డయల్, రెండు కప్హోల్డర్లతో మంచి లేఅవుట్ను పొందుతుంది. వీటితో పాటు 360-డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్ప్లే, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ADAS ఫీచర్స్ కూడా ఉన్నాయి.ఫోక్స్వ్యాగన్ టైరాన్ 2.0-లీటర్, ఫోర్ సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ రెండు ట్యూన్లలో లభిస్తుంది. బేస్ మోడల్ 184 హార్స్ పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టాప్ వేరియంట్ 217 హార్స్ పవర్, 350 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డీసీటీ గేర్బాక్స్తో లభిస్తుంది.ఫోక్స్వ్యాగన్ టైరాన్ గ్లోబల్ మోడల్ అని సీఈఓ థామస్ షాఫర్ వెల్లడించారు. చైనా తరువాత జపాన్, ఆ తరువాత మెక్సికోలో తయారవుతుంది. 2025లో భారతీయ తీరాలను చేరే అవకాశం ఉందని సమాచారం. ఇది దేశీయ విఫణిలో లాంచ్ అయిన తరువాత జీప్ మెరిడియన్, స్కోడా కొడియాక్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
ప్రపంచంలో వేగవంతమైన కారు ఇదే!.. లాంచ్ ఎప్పుడంటే?
అమెరికన్ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కారును లాంచ్ చేయడానికి సిద్ధమైపోయింది. టెస్లా రోడ్స్టర్ (Tesla Roadster) పేరుతో కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారు 0 నుంచి 60 కిమీ/గం వేగాన్ని సెకను కంటే తక్కువ వ్యవధిలోనే చేరుకుంటుందని సమాచారం.ఈ కారు గురించి టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్' (Elon Musk) కొన్ని వివరాలను వెల్లడిస్తూ.. ఇది 2024 చివరి నాటికి లేదా 2025 ప్రారంభంలో మార్కెట్లో లాంచ్ అవుతుందని పేర్కొన్నారు. ఈ కారుని టెస్లా, స్పేస్ఎక్స్ సహకారంతో తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.Tonight, we radically increased the design goals for the new Tesla Roadster.There will never be another car like this, if you could even call it a car.— Elon Musk (@elonmusk) February 28, 2024టెస్లా లాంచ్ చేయనున్న ఈ కొత్త కారు అత్యంత ఆకర్షణీయమైన కారుగా పేర్కొన్నారు. ఈ కారు డిజైన్ మాత్రమే కాకుండా, ఫీచర్స్ కూడా చాలా వరకు అప్డేట్ పొందినట్లు తెలుస్తోంది. ఇది 4 సీట్లు కలిగిన ఎలక్ట్రిక్ కారు. దీని గురించి మస్క్ 2017లోనే వెల్లడించారు.కంపెనీ టెస్లా రోడ్స్టర్ ఎలక్ట్రిక్ కారు కోసం ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఈ కారును బుక్ చేసుకోవాలనుంటే 50000 డాలర్ల టోకెన్ మొత్తాన్ని వెచ్చించి బుక్ చేసుకోవచ్చు. నిజానికి 2021లో లాంచ్ కావలసిన ఈ కారు 2024 చివరి నాటికి లాంచ్ అవుతుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: భారత యాప్స్పై గూగుల్ కన్నెర్ర.. ప్లేస్టోర్లో అవి మాయం!0-60mph < 1 secAnd that is the least interesting part— Elon Musk (@elonmusk) February 28, 2024 -
'ఫెరారీ పురోసాంగ్యూ' కొన్న బిజినెస్ మ్యాన్ - ధర ఎంతో తెలుసా?
బెంగళూరులో ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ డెవలపర్లలో ఒకరైన 'బ్రెన్ కార్పొరేషన్' ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'బూపేష్ రెడ్డి' ఇటీవల ఓ ఖరీదైన ఇటాలియన్ సూపర్ కారును కొనుగోలు చేశారు. భారతదేశంలో ఈ కారును కొన్న మొదటి వ్యక్తిగా బూపేష్ రెడ్డిగా నిలిచారు. బూపేష్ రెడ్డి కొనుగోలు చేసిన కారు ఫెరారీ కంపెనీకి చెందిన 'పురోసాంగ్యూ' (Purosangue). దీని ధర రూ.6.5 కోట్లు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. ఈ కారుకు సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఫెరారీ పురోసాంగ్యూ మంచి డిజైన్ కలిగి.. చూడగానే ఆకర్శించే విధంగా ఉంది. బ్లాక్ కలర్ పొందిన ఈ కారు రెడ్ కలర్ బ్రేక్ కాలిపర్స్ కలిగి ఉండటం గమనించవచ్చు. ఇంటీరియర్ గోధుమ రంగులో ఉంది. లోపలి భాగంలో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా చూడవచ్చు. ఫెరారీ పురోసాంగ్యూ SUV 6.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వీ12 పెట్రోల్ ఇంజిన్ కలిగి 725 పీఎస్ పవర్, 716 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 3.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ, 10.6 సెకన్లలో గంటకు 200 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ సూపర్ కారు టాప్ స్పీడ్ గంటకు 310 కిమీ కావడం గమనార్హం. ఇదీ చదవండి: ఇది లక్నో విమానాశ్రయమేనా? ఆశ్చర్యపోతున్న ఆనంద్ మహీంద్రా.. బూపేష్ రెడ్డి గ్యారేజిలో కేవలం ఫెరారీ పురోసాంగ్యూ కారు మాత్రమే కాకుండా లంబోర్ఘిని హురాకాన్ ఎస్టీఓ, లంబోర్ఘిని ఉరస్, లంబోర్ఘిని అవెంటడోర్ ఎస్వీజే, లంబోర్ఘిని ముర్సిలాగో, మెర్సిడెస్ ఏఎంజీ జీ63, మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎంజీ, ఫెరారీ 458స్పెషలే, ఫెరారీ 296 జీటీబీ, ఫెరారీ 812 సూపర్ఫాస్ట్, టెక్ఆర్ట్ పోర్స్చే జీటీ స్ట్రీట్ ఆర్, పోర్స్చే 911 ఆర్, పోర్స్చే 911 జీతీ2 ఆర్ఎస్, పోర్స్చే కేమాన్ జీటీ4, పోర్స్చే 911 కారెరా ఎస్, పోర్స్చే 39, పోర్స్చే 911 డీబీఎస్ కార్బన్ బ్లాక్ మొదలైన అన్యదేశ్య కార్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by Boopesh Reddy (@bren_garage) -
భారత్లో లాంచ్ అయిన కొత్త బైకులు ఇవే..
గత కొన్ని రోజులుగా కొత్త వాహనాలు దేశీయ మార్కెట్లో లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో బైకులు, కార్లు ఉన్నాయి. ఈ కథనంలో ఈ మధ్య కాలంలో భారతీయ విఫణిలో లాంచ్ అయిన బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.కవాసకి జెడ్650ఆర్ఎస్జపాన్ బైక్ తయారీ సంస్థ కవాసకి దేశీయ మార్కెట్లో జెడ్650ఆర్ఎస్ బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 6.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీని ధర మునుపటి మోడల్ కంటే కూడా రూ. 7000 ఎక్కువ కావడం గమనార్హం. ఇది 649 సీసీ ఇంజిన్ కలిగి, 68 హార్స్ పవర్, 64 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.హీరో మావ్రిక్ 440హీరో మోటోకార్ప్ కూడా ఇటీవల మార్కెట్లో మావ్రిక్ 440 అనే కొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర 1.99 లక్షల నుంచి రూ. 2.24 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది. ఈ బైక్ 440 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 27 హార్స్ పవర్, 36 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్తో 6 స్పీడ్ గేర్బాక్స్ను పొందుతుంది.కవాసకి జెడ్900కవాసకి లాంచ్ చేసిన మరో బైక్ జెడ్900. దీని ధర రూ. 9.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ధర మాత్రం దాని కంటే రూ. 9000 ఎక్కువ. ఈ బైక్ 948 సీసీ ఇంజిన్ కలిగి, 125 హార్స్ పవర్, 98.6 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.కవాసకి నింజా 500మార్కెట్లో లాంచ్ అయిన మరో బైక్ కవాసకి నింజా 500. దీని ధర రూ. 5.24 లక్షలు (ఎక్స్ షోరూమ్). 451 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 45 హార్స్ పవర్, 42.6 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది భారతదేశానికి కంప్లైట్ బిల్డ్ (CBU) ద్వారా దిగుమతి అవుతుంది. -
మార్కెట్లో రూ.9.29 లక్షల బైక్ లాంచ్ - వివరాలు
కవాసకి కంపెనీ ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో జెడ్900 బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ.9.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 9000 ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంది. కవాసకి జెడ్900 బైక్ 948 సీసీ ఇంజిన్ కలిగి 125 హార్స్ పవర్, 98.6 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో జత చేయబడింది. డిజైన్ పరంగా చూడటానికి 2023 మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. ఈ బైకులో USD ఫోర్క్, మోనోషాక్ వంటివి ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ముందు భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్స్, వెనుకవైపు 250 మిమీ డిస్క్ ఉంటుంది. జెడ్900 బైక్ రెండు పవర్ మోడ్లు, మూడు రైడింగ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటి వాటితో పాటు నాన్ స్విచ్బుల్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఉంటుంది. ఇది దేశీయ మార్కెట్లో ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైకుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
ఈ బైక్ కేవలం 350 మందికి మాత్రమే.. ధర ఎంతంటే?
గ్లోబల్ మార్కెట్లో కేవలం సాధారణ బైకులకు మాత్రమే కాకుండా.. లగ్జరీ బైకులకు కూడా డిమాండ్ భారీగానే ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'ఇండియన్ మోటార్సైకిల్' త్వరలోనే '2024 రోడ్మాస్టర్ ఎలైట్' లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. ఇండియన్ మోటార్సైకిల్ లాంచ్ చేయనున్న కొత్త 2024 రోడ్మాస్టర్ ఎలైట్ కేవలం 350 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది. డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్ కలిగిం ఈ బైక్ గ్లోస్ బ్లాక్ డాష్, బ్లాక్-అవుట్ విండ్స్క్రీన్, హ్యాండ్-పెయింటెడ్ గోల్డెన్ పిన్స్ట్రైప్స్, కలర్ మ్యాచింగ్ సీట్లు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ ఆపిల్ కార్ప్లేతో కూడిన ఈ బైక్ 7 ఇంచెస్ TFT కలిగి టర్న్-బై-టర్న్ నావిగేషన్ సిస్టమ్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇందులో 12 స్పీకర్ ఆడియో-సిస్టమ్ సెటప్, 136 లీటర్లు స్టోరేజ్ స్పేస్ వంటివి లభిస్తాయి. కొత్త 2024 రోడ్మాస్టర్ ఎలైట్ బైక్ 1890 సీసీ వీ ట్విన్ ఇంజిన్ కలిగి 170 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సుమారు 412 కేజీల బరువు కలిగిన ఈ బైక్ పనితీరు పరంగా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ బైక్ ధర 41999 డాలర్ల వరకు ఉండవచ్చని సమాచారం. (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 34.85 లక్షలు). అయితే ఈ బైక్ భారతదేశంలో లాంచ్ అవుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: ఒకప్పుడు రెస్టారెంట్లో సర్వర్.. ఇప్పుడు వేలకోట్లకు అధిపతి - ఎవరీ హువాంగ్! -
లాంచ్కు సిద్దమవుతున్న కొత్త కారు ఇదే - టెస్లాకు గట్టి పోటీ!
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈవీ తయారీదారు బీవైడీ ఆటో భారతీయ మార్కెట్లో తన సీల్ మిడ్-సైజ్ సెడాన్ను మార్చి 5న లాంచ్ చేయనుంది. దేశీయ మార్కెట్లో లాంచ్ కావడానికి సిద్దమవుతున్న ఈ కొత్త చైనా మోడల్ బ్యాటరీ, రేంజ్ వంటి వివరాలు ఇప్పటికే తెలిసిపోయాయి. బీవైడీ కంపెనీ లాంచ్ చేయనున్న సీల్ ఈవీ 61.4 కిలోవాట్, 82.5 కిలోవాట్ బ్యాటరీ పొందనుంది. ఈ రెండు బ్యాటరీలు ఒక సింగిల్ చార్జితో 550 కిమీ, 700 కిమీ రేంజ్ అందిస్తాయని కంపెనీ వెల్లడించింది. పెద్ద బ్యాటరీ ప్యాక్ కోసం 150 kW ఛార్జర్, చిన్న బ్యాటరీ కోసం 110 kW ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. బీవైడీ సీల్ ఈవీ 3.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు 15.6 ఇంచెస్ రొటేటింగ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, హెడ్స్ ఆఫ్ డిస్ప్లే, రెండు వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ వంటి అనేక ఫీచర్స్ పొందుతుంది. స్వెప్ట్బ్యాక్ హెడ్ల్యాంప్లు, ర్యాప్రౌండ్ ఎల్ఈడీ టైల్లైట్లు, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, పనోరమిక్ సన్రూఫ్, 360 డిగ్రీ కెమెరా, సేఫ్టీ కోసం ఏడీఏఎస్ వంటి ఫీచర్స్ ఉంటాయి. కంపెనీ బీవైడీ సీల్ ఈవీ కోడం త్వరలోనే బుకింగ్స్ ప్రారంభించనుంది. దీని ధర రూ. 65 లక్షల నుంచి రూ. 70 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా. ఇదీ చదవండి: 20 ఏళ్లకే క్యాన్సర్.. 33 ఏళ్లకు రూ.420 కోట్లు - ఎవరీ కనికా టేక్రీవాల్.. -
మార్కెట్లో లాంచ్ అయిన 'మార్విక్ 440' బైక్ - వివరాలు
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎట్టకేలకు 'మార్విక్ 440' బైక్ లాంచ్ చేసింది. దేశీయ విఫణిలో లాంచ్ అయిన ఈ బైక్ ధరలు రూ. 1.99 లక్షల నుంచి రూ. 2.24 లక్షల మధ్య ఉన్నాయి. కంపెనీ ఈ బైక్ కోసం రూ. 5000 మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే మార్చి 15లోపల బుక్ చేసుకున్న కస్టమర్లకు రూ. 10000 విలువైన యాక్ససరీస్ లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. చూడటానికి హార్లే డేవిడ్సన్ ఎక్స్440 మాదిరిగా ఉండే హీరో మార్విక్ 440 బైక్ 440 సీసీ ఇంజిన్ కలిగిన ఈ హీరో మావ్రిక్ 26 హార్స్ పవర్, 36 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ కలిగి ఉత్తమ పనితీరుని అందించనుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ బైక్ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350, క్లాసిక్ 350, హోండా సిబి350, జావా 350 వంటి బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది, కాబట్టి ఇది అమ్మకాల పరంగా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇదీ చదవండి: గర్ల్ఫ్రెండ్కు పువ్వులిచ్చేందుకు తిప్పలు - బ్లింకిట్లో యూజర్ చాట్ వైరల్ -
పర్యావరణ హితం ప్రధానం! నాలుగేళ్లలో సగానికిపైగా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ఆధారిత ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు భారత్లో జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో 46 శాతం వృద్ధితో 48,714 యూనిట్లు రోడ్డెక్కాయి. 2023 జనవరిలో ఈ సంఖ్య 33,334 యూనిట్లు నమోదైంది. 2023–24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జనవరి మధ్య దేశవ్యాప్తంగా రిటైల్లో సీఎన్జీ ప్యాసింజర్ వాహనాలు 3,64,528 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 29 శాతం అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వీటి సంఖ్య 4,75,000 యూని ట్లు దాటవచ్చని పరిశ్రమ అంచనా వేస్తోంది. 2022– 23లో 39 శాతం వృద్ధితో 3,27,820 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. తొలి స్థానంలో మారుతి.. దేశంలో సీఎన్జీ ఆధారిత ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో మారుతి సుజుకి 69 శాతం వాటాతో అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. కంపెనీ ఏకంగా 13 మోడళ్లలో సీఎన్జీ వేరియంట్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,51,620 యూనిట్లను విక్రయించింది. 14 శాతం వాటా కలిగిన టాటా మోటార్స్కు నాలుగు సీఎన్జీ మోడళ్లు ఉన్నాయి. 2023–24 ఏప్రిల్–జనవరిలో 64,972 యూనిట్లు కస్టమర్లకు చేరాయి. మూడు సీఎన్జీ మోడళ్లతో హ్యుండై మోటార్ ఇండియా 41,806 యూనిట్లు విక్రయించింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రస్తుతం మూడు మోడళ్లలో సీఎన్జీని ఆఫర్ చేస్తోంది. జనవరితో ముగిసిన 10 నెలల కాలంలో ఈ కంపెనీ 6,064 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. నాలుగేళ్లలో సగానికిపైగా.. 2014–15లో సీఎన్జీ ప్యాసింజర్ వాహనాలు దేశవ్యాప్తంగా 1,48,683 యూనిట్లు పరుగుతీశాయి. 2019– 20లో కరోనా కారణంగా పరిశ్రమ 7 శాతం క్షీణించింది. 2021–22 నుంచి వీటి అమ్మకాల్లో 30 శాతంపైగా వృద్ధి నమోదవుతూ వస్తోంది. ఇప్పటి వరకు 21,16,629 యూనిట్ల సీఎన్జీ ఆధారిత కార్లు, ఎస్యూవీలు కస్టమర్ల చేతుల్లోకి చేరాయి. ఇందులో గడిచిన నాలుగేళ్లలో 52 శాతం యూనిట్లు రోడ్డెక్కాయంటే వీటికి ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. పెట్రోల్, డీజిల్తో పోలిస్తే సీఎన్జీ వాహనాలతో ఖర్చు తక్కువ కాబట్టే వినియోగదార్లు వీటికి మొగ్గు చూపుతున్నారు. రెండేళ్లలో సీఎన్జీ స్టేషన్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న 4,500 నుంచి 8,000 కేంద్రాలకు చేర్చాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. టాటా నుంచి పోటీ.. సీఎన్జీకి ఊతమిచ్చేలా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో టియాగో హ్యాచ్బ్యాక్, టిగోర్ కాంపాక్ట్ సెడాన్ సీఎన్ జీ వేరియంట్లను టాటా మోటార్స్ జనవరి 24న పరిచయం చేసింది. ఫ్యాక్టరీలో ఫిట్ అయిన కిట్తో సీఎన్ జీ వాహనాలు ఆటోమేటిక్ గేర్ బాక్స్తో రావడం దేశంలో ఇదే తొలిసారి. సంస్థ మొత్తం అమ్మకాల్లో సీఎన్జీ వాటా 2026 నాటికి 25 శాతానికి చేర్చాలని టాటా లక్ష్యంగా చేసుకుంది. ఇందులో భాగంగా నెక్సన్ సీఎన్జీ వేరియంట్ తీసుకొస్తోంది. 2022–23 ఏప్రిల్–జనవరిలో టాటా మోటార్స్ 36,963 యూని ట్ల అమ్మకాలను సాధించి మూడవ స్థానంలో ఉంది. 2024 జనవరితో ముగిసిన 10 నెలల్లో 64,972 యూనిట్లతో రెండవ స్థానానికి దూసుకు వచ్చింది. పర్యావరణహిత వాహనాలపై కంపెనీల దృష్టి భారత్ మొబిలిటీ ఎక్స్పోలో వెల్లడి దేశీయంగా ఆటోమొబైల్ దిగ్గజాలు పర్యావరణహిత వాహనాలపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. ఇందులో భాగంగా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024 ఎగ్జిబిషన్లో పలు వాహనాలను ప్రదర్శించాయి. వీటిలో సీఎన్జీ, హైబ్రిడ్స్ మొదలుకుని ఎలక్ట్రిక్ వరకు వివిధ రకాల వాహనా లు ఉన్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోట ర్ ఇండియా, టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా, బీఎండబ్ల్యూ మొదలైన దిగ్గజాలు వీటిని ప్రదర్శించాయి. మారుతీ సుజుకీ ఇండియా తమ కాన్సెప్ట్ ఈవీఎక్స్, ఫ్లెక్స్–ఫ్యూయల్ వ్యాగన్ఆర్, హైబ్రీడ్ గ్రాండ్ విటారా.. జిమ్నీ, స్కైడ్రైవ్ ఈ–ఫ్లయింగ్ కారు మొదలైనవి ప్రదర్శించింది. ఈ ఏడాది తమ తొలి పూర్తి ఎలక్ట్రిక్ ఈవీఎక్స్ ఎస్యూవీని ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ ఈడీ రాహుల్ భారతి తెలిపారు. భారతీయ మొబిలిటీ రంగ ప్రాధాన్యాన్ని మొబిలిటీ ఎక్స్పో తెలియజేస్తోందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. ఎక్స్పో విశేషాలు.. మెర్సిడెస్ బెంజ్ తమ ఆఫ్ రోడ్ జీ వాగన్ ఎలక్ట్రిక్ వెర్షన్ ’కాన్సెప్ట్ ఈక్యూజీ’, జీఎల్ఏ, ఏఎంజీ జీఎల్ఈ 53 కూపే వాహనాలను ప్రదర్శించింది. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ర్యాల్–ఈ, ఎలక్ట్రిక్ ఎక్స్యూవీ 400, ఎలక్ట్రిక్ 3 వీలర్ ట్రియో మొదలైనవి ప్రదర్శనకు ఉంచింది. ఫోర్స్ మోటర్స్ .. ట్రావెలర్ ఎలక్ట్రిక్, అర్బానియా డీజిల్, ట్రావెలర్ సీఎన్జీల వాహనాలను ప్రదర్శించింది. ప్రదర్శనలో టాటా మోటార్స్ 18 ‘ఫ్యూచర్ రెడీ‘ కమర్షియల్, ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. బీఎండబ్ల్యూ తమ ఈవీలు, బీఎండబ్ల్యూ ఐ7, బీఎండబ్ల్యూ ఐ4, మినీ 3–డోర్ కూపర్ ఎస్ఈలను ప్రదర్శనకు ఉంచింది. -
సుంకాలు తగ్గిస్తే ఆటో పరిశ్రమకు చేటు
న్యూఢిల్లీ: బ్రిటన్ వంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్టీఏ) కింద ఆటోమొబైల్స్పై దిగుమతి సుంకాలను తగ్గిస్తే దేశీ పరిశ్రమకు ప్రతికూలం అవుతుందని ఆర్థికవేత్తల సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) ఒక నివేదికలో తెలిపింది. ఆగ్నేయాసియా దేశాలు, జపాన్, కొరియాలతో ఉన్న ఎఫ్టీఏల్లో కూడా కార్లపై సుంకాలను భారత్ తగ్గించలేదని పేర్కొంది. ‘ఎఫ్టీఏల కింద ఎలక్ట్రిక్ వాహనాలు సహా ఆటోమొబైల్స్పై కస్టమ్స్ సుంకాలను భారత్ తగ్గించరాదు. అలా చేస్తే భారత్లో బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడి పెట్టిన ఆటో దిగ్గజాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అవి సంస్థలను మూసుకునే పరిస్థితి ఏర్పడుతుంది‘ అని జీటీఆర్ఐ తెలిపింది. బ్రిటన్ ఎక్కువగా యూరోపియన్ యూనియన్, చైనా నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలతో కార్లను అసెంబుల్ మాత్రమే చేస్తుంది కాబట్టి ఆ దేశానికి సుంకాలపరమైన మినహాయింపుని ఇచ్చేందుకు సరైన కారణమేమీ లేదని స్పష్టం చేసింది. ఒకవేళ బ్రిటన్కి గానీ మినహాయింపులు ఇస్తే జపాన్, కొరియా వంటి ఇతరత్రా ఎఫ్టీఏ భాగస్వాములు తమకు కూడా ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత టారిఫ్ విధానాన్ని కొనసాగిస్తూ, అదనంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలపరమైన మద్దతును పరిశ్రమకు అందించే అవకాశాన్ని పరిశీలించవచ్చని జీటీఆర్ఐ సూచించింది. పరిశోధనలపై ఇన్వెస్ట్ చేయాలి.. 70 శాతం విద్యుదుత్పత్తి బొగ్గు నుంచే ఉంటున్నందున ఎలక్ట్రిక్ వాహనాలనేవి భారత్లో అంతగా పర్యావరణ అనుకూలమైనవేమీ కాదని తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలు ఇచ్చే బదులు కొత్త తరం బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి సంబంధించి పరిశోధన కార్యకలాపాలపై ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరమని జీటీఆర్ఐ పేర్కొంది. దిగుమతి సుంకాలను క్రమంగా 45 శాతం నుంచి 5 శాతానికి తగ్గించేయడంతో ఆ్రస్టేలియాలో చాలా మటుకు స్థానిక కార్ల కంపెనీలు మూతబడ్డాయని తెలిపింది. దానికి విరుద్ధంగా భారత్ అధిక సుంకాలను కొనసాగించడం వల్ల కార్ల పరిశ్రమలోకి గణనీయంగా పెట్టుబడులను ఆకర్షించవచ్చని జీటీఆర్ఐ అభిప్రాయపడింది. దీనివల్ల దేశీయంగా కార్లు, ఆటో విడిభాగాల పరిశ్రమ కూడా అభివృద్ధి చెందగలదని పేర్కొంది. -
రూ.32 లక్షల సైకిల్ - ఎందుకింత రేటు?
ఒక సాధారణ సైకిల్ ధర ఎంత ఉంటుంది? మహా అయితే ఓ 20,000 రూపాయలు ఉండొచ్చు. కానీ ఇక్కడ కనిపించే సైకిల్ ధర మాత్రం ఏకంగా రూ. 32 లక్షలు. సైకిల్ ఏంటి? రూ. 32 లక్షలు ఏంటి? అని చాలామంది ఒక్కసారిగా షాకవొచ్చు! అయితే మరిన్ని వివరాల కోసం ఇక్కడ చూసెయ్యండి. ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే 'బుగాటీ' (Bugatti) కంపెనీ 'పీజీ ఎక్స్' తయారు చేసింది. ఇది చూడటానికి సాధారణ సైకిల్ మాదిరిగా అనిపించినప్పటికీ ఇది చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇది బుగాటీ చిరోన్ కారు నుంచి ప్రేరణ పొంది ఖరీదైన మెటీరియల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్లను ఉపయోగించి తయారైంది. 2017 జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షోలో కనిపించిన ఈ పీజీ ఎక్స్ బుగాటీ కేవలం 667 యూనిట్లకు మాత్రమే పరిమితం. దీని ధర రూ. 39000 డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 32 లక్షల కంటే ఎక్కువ). ఈ సైకిల్ తయారీలో అగ్రశ్రేణి స్పోర్ట్స్ ఆటోమొబైల్స్, నాసా, ఏరోనాటిక్ దిగ్గజాలలో ఉపయోగించే హై-ఎండ్ మెటీరియల్స్ ఉపయోగించారు. ఈ సైకిల్ను 95 శాతం అధిక శక్తి కలిగిన కార్బన్ ఫైబర్తో తయారు చేశారు, కాబట్టి ఇది ఐదు కిలోల కంటే తక్కువ బరువును కలిగి ఉంది. ఇదీ చదవండి: రూ. 700లకు థార్ అడిగిన బుడ్డోడు.. ఫ్యాక్టరీలో హల్చల్ చేశాడు - వీడియో ప్రపంచంలో అత్యంత ఖరీదైన, తక్కువ బరువున్న సైకిల్ బహుశా ఇదే అయి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఒక సీటు కలిగిన ఈ సైకిల్ సింగిల్ వీల్ బ్రేక్ మాత్రమే కలిగి ఉంటుంది. పీజీ బుగాటీ సైకిల్ కార్బన్ ఫ్రేమ్ను ఫార్ములా వన్ కార్లను తయారు చేసే అదే కార్మికులు తయారు చేశారు. ఈ కారణంగానే దీని ధర చాలా ఎక్కువ. -
Budget 2024: పెరుగుతున్న ఈవీ రంగం అంచనాలు - కొత్త స్కీమ్ వస్తుందా..
ఫేమ్ II సబ్సిడీ పథకం ముగియడంతో, ఫేమ్ III సబ్సిడీ పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహకాలు మార్చి 2024 తర్వాత కూడా కొనసాగుతాయని చెబుతున్నారు. భారత ప్రభుత్వం ఫేమ్ II స్కీమ్ కింద రూ. 10,000 కోట్ల బడ్జెట్తో వాహనాలను ఎలక్ట్రిక్ విభాగంలో జోడించడానికి ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఫేమ్ II గడువు ముగిసిన తర్వాత అమలు చేయడానికి సిద్దమవుతున్న ఫేమ్ III అంత విస్తృతంగా ఉండకపోవచ్చని, రానున్న బడ్జెట్లో ఈ స్కీమ్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం పరిశ్రమలకు సహాయం చేయాలి. అప్పుడే ఆశించిన రీతిలో ఎలక్ట్రిక్ వాహనాలు పుట్టుకొస్తాయి. కాబట్టి ఫేమ్ III ప్రోత్సాహకాలు ఎలా ఉంటాయనేది త్వరలోనే తెలుస్తుంది. FAME IIIని రాబోయే కేంద్ర బడ్జెట్ 2024లో ఆర్థిక మంత్రి సీతారామన్ నిస్సందేహంగా ప్రవేశపెడతారని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి ఇప్పటికే ధృవీకరించారు. అయితే ఫేమ్ III కూడా ఫేమ్ II మార్గదర్శకాలనే కొనసాగించే అవకాశం ఉంది. 2021 సెప్టెంబర్ 15న PLI-ఆటో స్కీమ్కు కేంద్ర మంత్రివర్గం ఐదేళ్లకు రూ. 25,938 కోట్లు కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. ఆ తరువాత ఈ పథకం 2027-28 ముగిసే వసరకు పొడిగించారు. అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీ (AAT) ఉత్పత్తి తయారీని పెంచడం, దాని కోసం లోతైన స్థానికీకరణను ప్రోత్సహించడం, బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్-అమర్చిన వాహనాల వంటి జీరో ఎమిషన్ వెహికల్స్ (ZEVలు) కోసం ప్రపంచ సరఫరా గొలుసును ఏర్పాటు చేయడం ఈ పధకం ముఖ్య లక్ష్యం. ఇదీ చదవండి: ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం! త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2024 మీద ఆటోమొబైల్ పరిశ్రమ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కేంద్రం ఈ ఆశలను నిజం చేస్తుందా? లేక షాకిస్తుందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఆటోమొబైల్ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో వేగంగా అభివృద్ధి చెందాలంటే తప్పకుండా ప్రోత్సాహాలు అవసరం, కాబట్టి రానున్న బడ్జెట్ సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. 2024-25 బడ్జెట్ కథనాల కోసం క్లిక్ చేయండి. -
మంటల్లో కాలి బూడిదైన రూ.63 లక్షల ఎలక్ట్రిక్ కారు - వీడియో వైరల్
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్వీడన్ కార్ల తయారీ సంస్థ 'వోల్వో' (Volvo)కు చెందిన రూ. 63 లక్షల ఎలక్ట్రిక్ కారు మంటల్లో చిక్కుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మంటల్లో కాలుతున్న కారు వోల్వో సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ అని తెలుస్తోంది. ఈ సంఘటన ఛత్తీస్గఢ్లో జరిగినట్లు సమాచారం. రాయ్పూర్కు చెందిన కారు ఓనర్ సౌరభ్ రాథోడ్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఎన్హెచ్ 53 హైవేలో ప్రయాణిస్తుండగా కారులో మంటలు చెలరేగాయి. కారులో మంటలు ప్రారంభమైన వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే కారు దిగి బయటకు వచ్చారు. ఆ తరువాత కొంత సేపటికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి కారు మొత్తం కాలి బూడిదైపోయింది. దీనికి సంబంధించిన చిత్రాలు టెస్లా క్లబ్ ఇండియా ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ఈ ఘటనపై వోల్వో సంస్థ అధికారులు ఇంకా స్పందించలేదు. కారులో మంటలు చెలరేగడానికి కారణం ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. కాబట్టి వోల్వో సీ40 ఎలక్ట్రిక్ కారు మంటల్లో కాలిపోవడానికి గల కారణాలు ఖచ్చితంగా చెప్పలేము. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే వోల్వో కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కార్లు మంటల్లో కాలిపోవడం ఇదే మొదటిసారి. కాలిపోవడానికి గల కారణాలకు కంపెనీ తప్పకుండా వెల్లడించగలదని ఆశిస్తున్నాము. గతంలో మంటల్లో కాలిన ఎలక్ట్రిక్ వాహనాలు భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లు మంటల్లో కాలిపోవడం ఇదే మొదటి సారి కాదు. గతంలో దేశీయ దిగ్గజం టాటా మోటార్ కంపెనీకి చెందిన నెక్సాన్ ఈవీలో కూడా మంటలు చెలరేగి కాలిపోయింది. ఇదీ చదవండి: అమెరికన్ యూనివర్సిటీ అద్భుత సృష్టి - ఐదు నిమిషాల్లో చార్జ్ అయ్యే బ్యాటరీ! ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయానికి వస్తే.. మంటలకు ఆహుతైన ఎలక్ట్రిక్ స్కూటర్లు కోకోల్లలుగానే ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లలో జరిగిన షార్ట్ సర్క్యూట్లు, అధిక ఛార్జింగ్ వంటి సమస్యల కారణంగా మంటలు చెలరేగిన సందర్భాలు ఎక్కువ. ఈ ప్రమాదాలు 2022లో చాలా వెలుగులోకి వచ్చాయి. ఆ తరువాత కొంత తక్కు ముఖం పట్టినప్పటికీ.. అక్కడక్కడా ఒక్కో సంఘటన అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తూనే ఉంది. LG Pouch NMC cells strike again? Sadly a case of Volvo C40 Recharge getting caught on fire on NH53 has come up. From video fire is starting from the bottom. Volvo sells 78kWh pack in India which uses LG Pouch NMC cells. Hope @volvocarsin @volvocars investigates this soon. pic.twitter.com/FRnL60Cdnw — Tesla Club India® (@TeslaClubIN) January 28, 2024 -
అంబానీ కంటే ముందే 'లోటస్' కారు కొన్న హైదరాబాద్ మహిళ
భారతదేశంలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి కుబేరులు ఎప్పటికప్పుడు అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటారన్న సంగతి తెలిసిందే.. అయితే ఇటీవల ఓ ఖరీదైన కారుని వారికంటే ముందే, హైదరాబాద్ మహిళ కొనుగోలు చేసింది. హైదరాబాద్ వాసి 'హర్షిక రావు' ఇటీవలే రూ. 2.55 కోట్ల లోటస్ ఎలెట్రే ఎలక్రిక్ కారును కొనుగోలు చేసి, ఈ కారు కొన్న మొట్ట మొదటి భారతీయురాలిగా రికార్డ్ క్రియేట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లోటస్ ఎలెట్రే ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన లోటస్ ఎలెట్రే ఎలక్ట్రిక్ కారు మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎలెట్రే, ఎలెట్రే ఎస్, ఎలెట్రే ఆర్. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు ఆధునిక ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇదీ చదవండి: నీతా అంబానీ వాడే ఫోన్ ధర రూ.400 కోట్లా? అసలు నిజమేంటంటే? పవర్ట్రెయిన్ విషయానికి వస్తే.. Eletre అండ్ Eletre S మోడల్స్ 603 హార్స్ పవర్ అందించే డ్యూయల్-మోటార్ సిస్టమ్ను కలిగి 600 కిమీ రేంజ్ అందిస్తాయి. Eletre R మోడల్ 905 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు 2.95 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ మోడల్ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 20 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. అంతే కాకుండా ఇది స్టాండర్డ్ 22 kWh AC ఛార్జర్ కూడా పొందుతుంది. View this post on Instagram A post shared by Car Crazy India® (@carcrazy.india) -
ఆటో రిక్షా.. అదే స్కూటర్ - ఇప్పటి వరకు ఇలాంటి వెహికల్ చూసుండరు!
భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల హీరో మోటోకార్ప్ మొదటిసారి ఓ వినూత్న వాహనాన్ని ఆవిష్కరించింది. ఇది ఇప్పటి వరకు మార్కెట్లో లాంచ్ అయిన వాహనాల కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హీరో మోటోకార్ప్ ఆవిష్కరించిన ఈ కొత్త వెహికల్ 'సర్జ్ ఎస్32' కన్వర్టిబుల్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ చూడటానికి ఆటో రిక్షా మాదిరిగా ఉంటుంది. కానీ ఇది ఒక ఎలక్ట్రిక్ స్కూటర్కి జత చేసి ఉండటం చూడవచ్చు. కాబట్టి ఈ వెహికల్ అటు స్కూటర్గా, ఆటో రిక్షాగా కూడా పనిచేస్తుంది. కంపెనీ ప్రత్యేకంగా దీనిని స్వయం ఉపాధి పొందే వారికోసం రూపొందించినట్లు వెల్లడించింది. ఇటీవల జరిగిన ‘హీరో వరల్డ్’ ఈవెంట్లో కంపెనీ దీన్ని ప్రదర్శించింది. ఈ వాహనానికి విండ్ స్క్రీన్, హెడ్ల్యాంప్, టర్న్ ఇండికేటర్లు, విండ్ స్క్రీన్ వైపర్లు ఉన్నాయి, డోర్స్ మాత్రం లేదు. కానీ జిప్తో కూడిన సాఫ్ట్డోర్లు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: మూడు నెలల బిడ్డను అక్కడ విడిచిపెట్టి.. ఇన్ఫోసిస్ కోసం సుధామూర్తి.. కొత్త సర్జ్ ఎస్32 త్రీవీలర్లో 10 kW ఇంజిన్, 11 kWh బ్యాటరీ ఉంటుంది. అదే సమయంలో రోజు వారీ వినియోగనైకి అనుకూలంగా ఉండటానికి స్కూటర్లో 3kw ఇంజిన్, 3.5 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. త్రీవీలర్ 50 కిమీ/గం వేగంతో 500 కిమీ బరువుని మోయగల కెపాసిటీ కలిగి ఉంటుంది. స్కూటర్ మాత్రం 60 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. -
అమెరికాలో రెండు లక్షల టెస్లా కార్లు వెనక్కి! - కారణం ఇదే..
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా USAలో దాదాపు 2,00,000 వాహనాలకు రీకాల్ ప్రకటించింది. కారు రివర్స్లో ఉన్నప్పుడు బ్యాకప్ కెమెరా పనిచేయకపోవచ్చనే కారణంతో కంపెనీ రీకాల్ ప్రకటించినట్లు తెలుస్తోంది. టెస్లా రీకాల్ అనేది 2023 మోడల్ ఎస్, ఎక్స్, వై వాహనాలకు వర్తిస్తుంది. ఇవన్నీ కూడా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కంప్యూటర్ 4.0ని కలిగి ఉన్నాయి. ఇది 2023.44.30 సాఫ్ట్వేర్ వెర్షన్పై పనిచేస్తుంది. ప్రస్తుతానికి టెస్లా కార్లలో ఈ లోపాలకు సంబంధించిన ఎలాంటి ప్రమాదం జరగలేదని టెస్లా యూఎస్ నేషనల్ హైవేస్ ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్కు తెలిపింది. భవిష్యత్తులో కూడా టెస్లా కార్లలో ఎలాంటి సమస్య తలెత్తకూడదనే భావనతోనే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం కంపెనీ జనవరి 12 నుంచి రీకాల్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నష్టాల్లో టెస్లా.. ఇదిలా ఉండగా టెస్లా కంపెనీ షేర్లు ఒక్కరోజులోనే ఏకంగా 12 శాతానికిపైగా నష్టపోయినట్లు తెలిసింది. టెస్లా ధరలను తగ్గిస్తున్నా.. సేల్స్ మాత్రం తగ్గుముఖం పడుతున్నట్లు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమ్మకాలు తగ్గడం మాత్రమే కాకుండా జనవరి 15న స్టాక్ విలువ 12.13 శాతం పడిపోయి 182.63 డాలర్ల వద్ద స్థిరపడింది. దీంతో మార్కెట్ విలువ బాగా తగ్గడం వల్ల టెస్లా మార్కెట్ వ్యాల్యూ ఒక్కరోజే 80 బిలియన్ డాలర్ల వరకు తగ్గింది. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 6.64 లక్షల కోట్లకు పైనే అని తెలుస్తోంది. -
చిన్న పరికరం.. పెద్ద ప్రయోజనం - వీడియో
ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లు, బైకులు మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా విరివిగా అందుబాటులో ఉన్నాయి. బైకులు, కార్లలో మాదిరిగా కాకుండా.. సైకిల్స్లో చిన్న బ్యాటరీ లేదా ఈ-బైక్ కన్వర్షన్ కిట్లు ఉంటాయి. బ్యాటరీల గురించి విన్న చాలామందికి కన్వర్షన్ కిట్ల గురించి తెలియకపోవచ్చు. ఈ కథనంలో మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం. ఈ-బైక్ కన్వర్షన్ కిట్లు సాధారణ సైకిల్కు అదనంగా యాడ్ చేయడానికి అనుగుణంగా ఉంటాయి. ఇది మౌంట్ చేసుకున్న తరువాత మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇక్కడ ఫోటోలలో గమనించినట్లయితే డిస్క్ బ్రేక్కు అమర్చిన కన్వర్షన్ కిట్ చూడవచ్చు. (Image credit: Skarper / Red Bull) ఇక్కడ కనిపించే కన్వర్షన్ కిట్ను స్కార్పర్ అనే స్టార్టప్ ఈ ఏడాది పరిచయం చేసింది. ఇది ఒక అధునాతన టూ-మోడ్ ఎలక్ట్రిక్ బైక్ మోటారు. కస్టమ్ డిజైన్ చేసిన డిస్క్ బ్రేక్కు క్లిప్ చేసుకోవచ్చు. ఇది పూర్తి గేర్బాక్స్గా పనిచేస్తుంది. బైక్పై కస్టమ్ డిస్క్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత, మోటారును ఆన్ లేదా ఆఫ్ చేయడానికి కొన్ని సెకన్ల సమయం పడుతుంది. పవర్ అనేది వెంటనే మారుతుంది. కన్వర్షన్ కిట్ తయారీకి సంస్థకు ఏకంగా మూడు సంవత్సరాల సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఇది సైకిల్లో డిస్క్ బ్రేక్ మాదిరిగా కూడా పనిచేస్తుంది. ఈ కిట్ను మౌంట్ చేయడం లేదా రిమూవ్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి వినియోగదారుని అవసరమైనప్పుడు మౌంట్ చేసుకోవచ్చు, మిగిలిన సమయంలో తీసి ఇంట్లో జాగ్రత చేసుకోవచ్చు. ఇదీ చదవండి: భారత్ నెలలో చేసేది అమెరికాకు మూడేళ్లు - కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేతిలో పట్టుకెళ్ళడానికి అనుకూలంగా ఉండే కన్వర్షన్ కిట్ ధర 1295 యూకే పౌండ్స్ (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 1.30 లక్షలకంటే ఎక్కువ) అని తెలుస్తోంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన ఈ కిట్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో గొప్ప ఆదరణ పొందుతుందని తయారీదారులు భావిస్తున్నారు. -
చైనా కంపెనీ ముక్కు పిండి వసూలు చేశాడు
గత ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ పేలిన సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇందులో కొన్ని కంపెనీలు కస్టమర్లకు జరిగిన నష్టాన్ని రీప్లేస్ చేయగా.. మరో కొన్ని కంపెనీలు ఊరుకున్నాయి. తన ఎలక్ట్రిక్ స్కూటర్ కాలిపోవడం వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి కోర్టుకెళ్లి నష్ట పరిహారంగా రూ.10 లక్షలు సొంతం చేసుకున్నాడు. తెలంగాణకు చెందిన వ్యక్తి బెన్లింగ్ అనే చైనా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ను 2021 ఏప్రిల్ 7న సంస్థకు చెందిన డీలర్ నుంచి కొనుగోలు చేసి వినియోగిస్తుండేవాడు. అతడు రోజూ మాదిరిగానే 2023 ఫిబ్రవరి 26న కూడా ఛార్జ్ చేయడానికి ప్లగ్ చేసాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఆ స్కూటర్ పేలిపోయి మొత్తం కాలిపోయింది. మంటల వల్ల పొగలు ఎక్కువగా వ్యాపించడంతో ఇంట్లోని వారు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. తన ఎలక్ట్రిక్ స్కూటర్ కాలిపోవడంతో వినియోగదారుడు మాత్రమే కాకుండా.. అతని కుటుంబం మొత్తం మానసిక క్షోభకు గురైందని తెలిపాడు. జరిగిన నష్టం గురించి సంబంధిత డీలర్కు వెల్లడించారు. దీంతో కంపెనీ ప్రతినిధి కస్టమర్ను సంప్రదించి, కాలిన స్కూటర్ ఫోటోలను సేకరించుకున్నారు. ఇదీ చదవండి: ఐదు బ్యాంకులకు జరిమానా విధించిన ఆర్బీఐ - ఎందుకంటే? ఎన్ని రోజులకూ కంపెనీ అధికారులు స్పందించకపోవడంతో విసుగు చెందిన కస్టమర్ తమ లాయర్ ద్వారా తయారీదారు, డీలర్తో సహా ఇరువర్గాలకు నోటీసులు అందజేసింది. అయితే వీరిద్దరూ కమిషన్ ముందు హాజరుకాలేదు. దీంతో కోర్టు డీలర్ నిర్లక్ష్యానికి, వెహికల్ తయారీలో నాసిరకమైన పరికరాలను ఉపయోగించిన కారణంగా కంపెనీకి.. రూ.10 లక్షల జరిమానా, ఖర్చుల కింద రూ.10,000 చెల్లించాలని ఆదేశించింది. అంతే కాకుండా స్కూటర్ ధరను కస్టమర్కు చెల్లించాలని లేదా స్కూటర్ను భర్తీ చేయాలని కూడా ఆదేశించింది. -
గుజరాత్ సమ్మిట్లో కనిపించని 'ఇలాన్ మస్క్'.. టెస్లా ఫ్యూచర్ ఏంటి?
భారతదేశంలో టెస్లా అరంగేట్రం చేయడానికి గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉంది. ప్రయత్నాలన్నీ సఫలీకృతమై గుజరాత్ రాష్ట్రంలో కంపెనీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సిద్దమైనట్లు వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఇటీవల ప్రారంభమైన 'వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ 2024' (2024 Vibrant Gujarat Global Summit)కు మాత్రం 'మస్క్' హాజరు కాలేదు. నిజానికి వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ 2024 వేదికగా టెస్లా చర్చలు జరగనున్నట్లు జరుగుతాయని చాలామంది భావించారు, కానీ టెస్లా అధినేత ఈ సమావేశానికి హాజరు కాలేదు. దీనిపై స్పందించిన గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ 'రాహుల్ గుప్తా' మస్క్ ఈ సమ్మిట్కు హాజరు కానప్పటికీ పెట్టుబడులు పెట్టడానికి స్వాగతం రాష్ట్రం పలుకుతోందని స్పష్టం చేశారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని అమెరికన్ కంపెనీ కూడా ఇండియాలో ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సన్నద్ధమైంది. దీనికోసం కంపెనీ గుజరాత్ను మొదటి ఎంపిక చేసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్లాంట్ ఏర్పాటుకు అనువైన స్థలం గుజరాత్ అని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఇదీ చదవండి: వెనుకపడ్డ యాపిల్.. వ్యాల్యుబుల్ కంపెనీగా మైక్రోసాఫ్ట్ ఎలోన్ మస్క్ 2024లో భారతదేశంలో టెస్లా వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. త్వరలో గుజరాత్లో ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు టెస్లా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోందని. 2023లోనే యునైటెడ్ స్టేట్స్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మస్క్ సమావేశమై టెస్లా ఫ్యాక్టరీ గురించి చర్చలు జరిపారు. మొత్తం మీద మస్క్ టెస్లా ఫ్యాక్టరీని ఈ ఏడాది భారత్కు వచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
రూ.20000 తగ్గింపుతో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ - వివరాలు
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బెంగళూరు బేస్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ 'ఏథర్ ఎనర్జీ' 2024 ప్రారంభంలోనే తమ అమ్మకాలను పెంచుకోవడానికి, కొత్త కస్టమర్లను ఆకర్శించడానికి '450ఎస్' ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు మీద అద్భుతమైన ఆఫర్స్ అందించడం ప్రారంభించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు మీద కంపెనీ ఇప్పుడు రూ. 20000 తగ్గింపును ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఈ స్కూటర్ బెంగళూరులో రూ.1.09 (ఎక్స్-షోరూమ్) లక్షలకు, ఢిల్లీలో రూ.97,500 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరలు లభిస్తోంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ ఏథర్ 450 ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఒక సింగిల్ చార్జితో 115 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది కేవలం 3.9 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 90 కిమీ వరకు ఉంటుంది. ఇదీ చదవండి: అబ్బురపరుస్తున్న గ్యాడ్జెట్స్.. ఎప్పుడైనా చూసారా! ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ హోమ్ ఛార్జర్ ద్వారా 0 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోవడానికి సుమారు 6 గంటల 36 నిమిషాల సమయం పడుతుంది. సంక్రాంతి పండుగలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారు రూ. 20000 తగ్గింపుతో కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కేవలం ఈ నెలలో మాత్రమే లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
సీఈఎస్ వేదికపై అట్రాక్ట్ చేస్తున్న 'అఫీలా' కారు - వివరాలు
అంతర్జాతీయ మార్కెట్లో రోజు రోజుకి కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఈ రోజు నుంచి లాస్ వెగాస్లో ప్రారంభమైన సీఈఎస్ 2024 వేదికగా మరిన్ని కొత్త వాహనాలు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. లాస్ వేగాస్లో జరుగుతున్న ఈ ఈవెంట్లో 'సోనీ' (Sony) కంపెనీ ఓ సరికొత్త ఎలక్ట్రిక్ కారుని ప్రదర్శించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత కొన్ని సంవత్సరాలుగా సోనీ, హోండా కలిసి 'అఫీలా' (Afeela) అనే కొత్త కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. ఆ కారుని కంపెనీ ఎట్టకేలకు ఈ CES 2024 వేదికగా ప్రదర్శించింది. ఇక్కడ కనిపించే కారు కేవలం డెమో కోసం మాత్రమే అని, రానున్న రోజుల్లో టెస్టింగ్ వంటివి నిర్వహించి మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ 'ఇజుమి కవానిషి' ప్రకారం, ఈ కారు 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభం నాటికి మార్కెట్లో లాంచ్ అవుతుంది, ఈ కారు లాంచ్ అయిన తరువాత మరిన్ని ఉత్పత్తులు పుట్టుకొస్తాయని వెల్లడించారు. ఇదీ చదవండి: వాచ్మెన్కు ఇప్పుడే సారీ చెప్పు.. ఆకాశ్ను ఆదేశించిన ముకేశ్ అంబానీ - ఎందుకంటే? అఫీలా (Afeela) కారు అద్భుతమైన డిజైన్ పొందనున్నట్లు తెలుస్తోంది. ఇది 3డీ గ్రాఫిక్స్, విజువల్స్ కలిగి మల్టిపుల్ కెమెరా సెటప్ వంటి వాటిని కలిగి ఉంటుంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా.. ఇందులో ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉంటాయని చెబుతున్నారు. కంపెనీ ఈ కారుకు సంబంధించిన చాలా విషయాలను రానున్న రోజుల్లో వెల్లడించనుంది. అయితే ఈ మోడల్ భారతీయ తీరానికి చేరుకుంటుందా? లేదా?.. ఒక వేళా ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయితే ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. -
న్యూ ఇయర్లో లాంచ్ అయిన కొత్త వెహికల్స్ - వివరాలు
గత ఏడాది భారతీయ మార్కెట్లో లెక్కకు మించిన వాహనాలు లాంచ్ అయ్యాయి, ఈ ఏడాది కూడా కొన్ని లాంచ్ అయ్యాయి.. లాంచ్ అవ్వడానికి సిద్దమవుతున్నాయి. ఈ కథనంలో న్యూ ఇయర్లో విడుదలైన బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కవాసకి జెడ్ఎక్స్-6ఆర్ కవాసకి కంపెనీ 2024 ప్రారంభంలో రూ. 11.09 లక్షల 'జెడ్ఎక్స్-6ఆర్' బైక్ లాంచ్ చేసింది. బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్స్ పొందిన ఈ బైక్ డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇందులోని 636 సీసీ ఇంజిన్ 129 హార్స్ పవర్, 69 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కవాసకి ఎలిమినేటర్ 500 ఈ ఏడాది ప్రారంభంలోనే కవాసకి 'ఎలిమినేటర్ 500' అనే మరో బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 5.62 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇందులోని 451 సీసీ ఇంజిన్ 45 హార్స్ పవర్, 42.6 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్లిప్/అసిస్ట్ క్లచ్తో 6-స్పీడ్ గేర్బాక్స్ ద్వారా పవర్ వెనుక చక్రానికి డెలివరీ చేస్తుంది. ఇదీ చదవండి: టిప్స్ అక్షరాలా రూ.97 లక్షలు - సీఈఓ రియాక్షన్ ఏంటంటే? బజాజ్ చేతక్ ప్రీమియం ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బజాజ్ చేతక్.. సరికొత్త అప్డేట్లతో ప్రీమియం అనే పేరుతో లాంచ్ అయింది. రూ. 1.35 లక్షల ధర వద్ద విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ చార్జితో 157 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్ పరంగా దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. నావిగేషన్ అప్డేట్లు, నోటిఫికేషన్ అలర్ట్ వంటి కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ ఇందులో గమనించవచ్చు. ఏథర్ 450 అపెక్స్ బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఏథర్ ఇటీవల 450 అపెక్స్ అనే పేరుతో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులోని 3.7 కిలోవాట్ బ్యాటరీ దాని మునుపటి మోడల్ కంటే కూడా ఎక్కువ రేంజ్ అందించేలా తయారైంది. ఈ స్కూటర్ రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్స్తో పాటు వేణు భాగం పనారదర్శకంగా ఉంటుంది. -
ఈ నెలలో లాంచ్ అయ్యే కొత్త కార్లు.. ఇవే!
2024 మొదలైపోయింది, ఈ ఏడాది కొత్త కార్లు లాంచ్ అవ్వడానికి రెడీ అయిపోతున్నాయి. ఈ ఏడాది ఈ నెలలో దేశీయ మార్కెట్లో విడుదలయ్యే 5 కార్లు గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ ఫేస్లిఫ్ట్ 2024 జనవరి 8న మెర్సిడెస్ బెంజ్ కంపెనీ తన జీఎల్ఎస్ ఫేస్లిఫ్ట్ లాంచ్ చేయనుంది. అప్డేటెడ్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు సిల్వర్ షాడో ఫినిషింగ్, ఎయిర్ ఇన్లెట్ గ్రిల్స్, హై-గ్లోస్ బ్లాక్ సరౌండ్లతో కూడిన కొత్త ఫ్రంట్ బంపర్ వంటివి పొందుతుంది. ఇందులో 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ డీజిల్, పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్, 4 మ్యాటిక్ AWD పొందుతాయి. హ్యుందాయ్ క్రెటా ఫేస్లిఫ్ట్ దేశీయ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ క్రెటా ఆధునిక హంగులతో 'ఫేస్లిఫ్ట్'గా మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఇది ఈ నెల 16న అధికారికంగా మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ SUV కోసం బుకింగ్స్ ప్రారంభించిన కంపెనీ.. ధరలను లాంచ్ సమయంలో వెల్లడించనున్నట్లు సమాచారం. డిజైన్, ఫీచర్స్ పరంగా కొన్ని అప్డేట్స్ ఉండే అవకాశం ఉంది. కియా సోనెట్ ఫేస్లిఫ్ట్ భారతీయ విఫణిలో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న కియా సోనెట్ కూడా ఫేస్లిఫ్ట్ రూపంలో ఈ నెల చివరి నాటికి మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ అప్డేటెడ్ కారు కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం కూడా స్టార్ట్ చేసింది. మూడు ఇంజిన్ ఎంపికలతో రానున్న ఈ కారు డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది. మార్కెట్లో టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి బ్రెజ్జా, నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంది. మహీంద్రా ఎక్స్యువీ300 ఫేస్లిఫ్ట్ మహీంద్రా కంపెనీ పాపులర్ కారు ఎక్స్యువీ300 కూడా ఫేస్లిఫ్ట్ రూపంలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇది ఈ నెల చివరి నాటికి మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫేస్లిఫ్ట్ 1.2 లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లకు పొందనుంది. పనితీరు పరంగా కూడా దాని స్టాండర్డ్ మోడల్కు ఏ మాత్రం తీసిపోదని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ ఆటోలో కనిపించిన సీఈఓ - ఆనంద్ మహీంద్రా రియాక్షన్ ఇలా.. మహీంద్రా ఎక్స్యువీ400 ఈవీ ఫేస్లిఫ్ట్ జనవరి చివరి నాటికల్లా దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న కార్ల జాబితాలో మహీంద్రా ఎక్స్యువీ400 ఈవీ ఫేస్లిఫ్ట్ కూడా ఉంది. ఇది కూడా దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఉత్తమంగా ఉండే అవకాశం ఉంది. ఇందులో వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేసే 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ వంటివి ఉన్నాయి. ధరలు, రేంజ్ వంటి వివరాలు త్వరలోనే తెలుస్తాయి. -
ఫేమ్ 3 పేరుతో కొత్త సబ్సిడీ.. మహిళలకు అదనపు రాయితీ!
భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 'ఫేమ్ 3' (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్షరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్)ను తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడీ కోసం రూ.26,400 కోట్లు కేటాయించాలని మంత్రిత్వ శాఖ ఆలోచిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కేంద్రం కేటాయించనున్న రూ.26400 కోట్లలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం రూ.8158 కోట్లు, ఎలక్ట్రిక్ బస్సులు కోసం రూ. 9,600 కోట్లు, ఎలక్ట్రిక్ త్రీవీలర్ల కోసం రూ.4,100 కోట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. కొనుగోళ్లపై అందించే రాయితీ మాత్రమే కాకుండా టెక్నాలజీ డెవలప్మెంట్, ట్రయల్ రన్ వర్క్స్ కోసం ఈ పథకంలో భాగంగానే నిధులు కేటాయించాలన్నది కేంద్రం ఆలోచన. మొత్తంగా రూ.33వేల కోట్లను మూడో దశకు కేటాయించే అవకాశం ఉంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాలను ప్రోత్సహించడానికి.. కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 2 సబ్సిడీ పథకాన్ని 2019 ఏప్రిల్ 1న తీసుకువచ్చింది. ఈ సబ్సిడీ కింద టూ వీలర్స్, త్రీ వీలర్స్, ఫోర్ వీలర్స్కు వర్తించేలా చేశారు. ఈ స్కీమ్ అమలులోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే లెక్కకు మించిన వాహనాలు సేల్ అయ్యాయి. ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిటర్లకు శుభవార్త - భారీగా పెరిగిన వడ్డీ రేట్లు కొన్ని సంస్థలు చేసిన అవకతవకల వల్ల.. ఇప్పటికే కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు ఫేమ్ 2 సబ్సిడీ నిలిపివేశారు. కాగా 2024 మార్చి 31 నాటికి ముగుస్తుంది. దీనిని సృష్టిలో ఉంచుకుని ఫేమ్ 3 స్కీమ్ తీసుకురావడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇది కూడా రెండు దశల్లో అమల్లోకి రానున్నట్లు సమాచారం. ఫేమ్ 3 స్కీమ్ కింద వాహనాలను మహిళల పేరుతో రిజిస్టర్ చేస్తే 10 శాతం అదనపు సబ్సిడీ కూడా ఇవ్వనున్నట్లు కేంద్రం యోచిస్తోంది. -
కొత్త కార్ల పరుగు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2023లో ప్యాసింజర్ వాహన విక్రయాలు 41.08 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. 2022తో పోలిస్తే ఇది 8.3 శాతం అధికం. గతేడాది నమోదైన రికార్డుతో 2024లోనూ అదే ఊపును కొనసాగించాలని ప్యాసింజర్ వాహన తయారీ సంస్థలు ఉవి్వళ్లూరుతున్నాయి. ఈ ఏడాది 100కుపైగా కొత్త మోడళ్లు, వేరియంట్లు రోడ్డెక్కనున్నట్టు మార్కెట్ వర్గాల సమాచారం. వీటిలో అత్యధికంగా ఎస్యూవీలు ఉండనున్నాయి. దీనికి కారణం ఏమంటే 2023లో అమ్ముడైన మొత్తం ప్యాసింజర్ వాహనాల్లో ఎస్యూవీల వాటా ఏకంగా 49 శాతం ఉండడమే. అంతకుముందు ఏడాది వీటి వాటా 42 శాతం నమోదు కావడం గమనార్హం. 2024 కోసం తయారీ కంపెనీలు పోటాపోటీగా కొత్త మోడళ్ల రూపకల్పనలో ఇప్పటికే నిమగ్నమయ్యాయి. మరోవైపు దేశీయ మార్కెట్లో విజయవంతం అయిన మోడళ్లకు మరిన్ని హంగులు జోడించి ఫేస్లిఫ్ట్ వేరియంట్ల విడుదలకు సన్నాహాలు చేస్తున్నాయి. మెర్సిడెస్తో బోణీ.. ఈ ఏడాది మెర్సిడెస్ బెంజ్ తొలుత బోణీ చేయబోతోంది. జనవరి 8న ఈ కంపెనీ జీఎల్ఎస్ లగ్జరీ ఎస్యూవీని ప్రవేశపెడుతోంది. కియా ఇండియా నుంచి నూతన సోనెట్ కాంపాక్ట్ ఎస్యూవీ జనవరి 15న రాబోతోంది. ఆధునీకరించిన క్రెటా వేరియంట్ను జనవరి 16న విడుదలకు హ్యుందాయ్ రెడీ అయింది. మారుతీ సుజుకీ నుంచి కొత్త తరం స్విఫ్ట్ ఫిబ్రవరిలో అడుగుపెడుతోంది. మార్చిలో స్విఫ్ట్ డిజైర్ రోడ్డెక్కనుంది. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ కాంపాక్ట్ ఎస్యూవీ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఏడు సీట్ల ఎస్యూవీ టైసర్ మోడల్ను ప్రవేశపెట్టేందుకు టయోటా కసరత్తు ప్రారంభించింది. కొత్త ఫార్చూనర్ సైతం దూసుకుపోనుంది. హ్యుందాయ్ నుంచి క్రెటా ఎన్ లైన్, ఫేస్లిఫ్ట్ టక్సన్, ఆల్కజార్ సైతం రానున్నాయి. కొత్తతరం అమేజ్ విడుదలకు హోండా కార్స్ సన్నద్ధం అయింది. ఫోక్స్వేగన్, స్కోడా, నిస్సాన్, రెనో, సిట్రోయెన్ ఫేస్లిఫ్ట్ మోడళ్లను తేనున్నాయి. ఈవీలు సైతం మార్కెట్లోకి.. ఎలక్ట్రిక్ కార్లకు క్రమంగా ఆదరణ పెరుగుతుండడంతో కొన్ని కంపెనీలు ఈ విభాగంలో నూతన మోడళ్లను తెచ్చే పనిలో ఉన్నాయి. హ్యారియర్ ఈవీని ఏప్రిల్లో తీసుకొచ్చేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక చేస్తోంది. 2024 చివరికల్లా టాటా కర్వ్ ఈవీ రానుంది. అలాగే టాటా పంచ్ ఈవీ సైతం పరుగుతీయనుంది. మారుతీ సుజుకీ నుంచి తొలి ఈవీ ఈ ఏడాది భారత రోడ్లపై అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతోంది. కియా ఈవీ9 పండుగల సీజన్లో రానుందని సమాచారం. -
ఈవీ రంగంలో అద్భుతం.. 1000 కిమీ రేంజ్ అందించే బ్యాటరీ
ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్ రోజు రోజుకు ఎలక్ట్రిక్ వాహన రంగం వైపు వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే చైనా కంపెనీ 'నియో' (Nio).. అద్భుతమైన రేంజ్ (సింగిల్ ఛార్జ్ 1000 కిమీ) అందించడానికి అనుగుణంగా ఉండే ఓ బ్యాటరీని తయారు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మార్కెట్లో పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడానికి.. ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని పెంచడానికి చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ కారణంగానే చాలా సంస్థలు తమ ఉత్పత్తులను ఈవీలుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు చైనా కంపెనీ పరిచయం చేసిన బ్యాటరీ టెస్లాకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ బ్యాటరీతో తయారైన నియో ఈటీ7 ఎలక్ట్రిక్ కారులో కంపెనీ అధికారులు సుమారు 1000 కిమీ దూరం ప్రయాణించి దానికి సంబంధించిన జర్నీ లైవ్ స్ట్రీమ్ 2023 డిసెంబర్ 17న షాంఘైలో ప్రదర్శించినట్లు సమాచారం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎనర్జీ డెన్సిటీ కలిగిన బ్యాటరీ అని కంపెనీ వెల్లడించింది. ఇదీ చదవండి: అమితాబ్ బచ్చన్ ఆస్తులు అద్దెకు - సంవత్సరానికి అన్ని కోట్లా.. 2024 ఏప్రిల్ నాటికి ఈ బ్యాటరీల ప్రొడక్షన్ ప్రారంభమవుతుందని కంపెనీ చెబుతోంది. సంస్థ తయారు చేసే ఈ బ్యాటరీ విలువ సుమారు 42100 డాలర్ల (రూ.32 లక్షలు) వరకు ఉంటుందని సమాచారం. నిజానికి ఈ ధరతో ఓకే లగ్జరీ కారునే కొనుగోలు చేయవచ్చు. కాబట్టి ఈ బ్యాటరీ మార్కెట్లో ఎలాంటి ఆదరణ పొందుతుందనేది తెలియాల్సి ఉంది. -
వాహన ప్రియులకు షాక్.. రేపటి నుంచి అమల్లోకి కొత్త ధరలు!
దేశీయ మార్కెట్లో చాలా కంపెనీలు ఇప్పటికీ 'ఇయర్ ఎండ్ 2023' ఆఫర్స్ కింది అద్భుతమైన డిస్కౌంట్స్ అందించాయి. ఈ ఆఫర్స్ అన్నీ కూడా దాదాపు ఈ రోజుతో ముగియనున్నాయి. రేపటి నుంచి కొత్త ధరలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో 2024 జనవరి 1 నుంచే వాహనాల ధరలు పెరుగుతాయని ఇప్పటికే చాలా సంస్థలు అధికారికంగా వెల్లడించాయి. ఇందులో మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి వాటితో పాటు మెర్సిడెస్ బెంజ్, ఆడి కంపెనీలు ఉన్నాయి. ఇన్పుట్ ఖర్చులు ఎక్కువగా ఉండడంతో ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు కంపెనీలు ఇదివరకే తెలిపాయి. దీని ప్రకారం ధరల పెరుగుదల 2 నుంచి 3 శాతం పెరిగే అవకాశం ఉంది. పెరిగిన ధరలు లేదా కొత్త ధరలు త్వరలోనే వెల్లడవుతాయి. ఇప్పటికే పలు కంపెనీలు 0.8 శాతం ధరలను ఏప్రిల్ నెలలో పెంచాయి. కాగా ఇప్పుడు మరో సారి పెంచడానికి సన్నద్ధమైపోయాయి. ఇదీ చదవండి: మునుపెన్నడూ చూడని అద్భుతాలు 'ఏఐ'తో సాధ్యం - బిల్ గేట్స్ ప్యాసింజర్ కార్ల ధరలు మాత్రమే కాకుండా.. లగ్జరీ కార్ల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కార్ల ధరలు పెరగటం వల్ల అమ్మకాలు తగ్గుతాయా? లేదా కార్ల విక్రయాను పెంచడానికి కంపెనీలు ఏమైనా వారంటీలు వంటివి అందిస్తాయా అనే వివరాలు తెలియాల్సి ఉంది. -
స్మార్ట్ఫోన్ కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ కారు - సింగిల్ ఛార్జ్తో 800కిమీ రేంజ్
చైనాలోని బీజింగ్లో గురువారం జరిగిన 'షావోమి' (Xiaomi) ఈవీ టెక్నాలజీ లాంచ్ ఈవెంట్ వేదికగా.. కంపెనీ తన సరికొత్త ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించింది. చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఆవిష్కరించిన ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. షావోమి కంపెనీ మార్కెట్లో విడుదల చేయనున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు 'SU7' (స్పీడ్ అల్ట్రా7). ఇది ప్రపంచ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న అగ్ర సంస్థల ఎలక్ట్రిక్ కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉండనున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తప్పకుండా గొప్ప గుర్తింపు పొందటానికి కంపెనీ కృషి చేస్తున్నట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. SU7 అనేది నాలుగు డోర్స్ కలిగిన ఎలక్ట్రిక్ కారు. ఇది అద్భుతమైన డిజైన్ కలిగి, ఆధునిక ఫీచర్స్ పొందనుంది. పరిమాణం పరంగా ఉత్తమంగా ఉండే ఈ కారు 73.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి, ఒక సింగిల్ చార్జితో గరిష్టంగా 800కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. 2025నాటికి లాంచ్ షావోమి ఎలక్ట్రిక్ కారు 2025 నాటికి మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ కార్లు మొత్తం చైనాలోని బీజింగ్ తయారీ కర్మాగారంలోనే తయారవుతాయని కంపెనీ వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే ఈ కార్లు చైనా నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదీ చదవండి: రతన్ టాటా గురించి ఐదు ఆసక్తికర విషయాలు అంచనా ధర SU7 ధరలు 200000 యువాన్ల నుంచి 300000 యువాన్ల వరకు ఉండే అవకాశం ఉంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ. 25 లక్షల నుంచి రూ. 35 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ కారు భారతీయ మార్కెట్లో విడుదలవుతుందా.. లేదా అనేదానిపైన అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. #XiaomiSU7 makes a significant #Stride as Xiaomi expands from the smartphone industry to the automotive sector, completing the Human x Car x Home smart ecosystem. #XiaomiSU7 will forever journey alongside those steering toward their dreams.#XiaomiEVTechnologyLaunch pic.twitter.com/ZLW5m7PTQN — Xiaomi (@Xiaomi) December 28, 2023 -
మహీంద్రా థార్ పేరు మారనుందా..? కొత్త పేరు ఏదంటే!
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరను పొందిన 'మహీంద్రా థార్' (MahindraThar) 5 డోర్ వేరియంట్ రూపంలో విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. అయితే కంపెనీ ఈ కారు పేరుని మార్చున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ థార్ SUV కొత్త పేరు కోసం ట్రేడ్మార్క్ దాఖలు చేసింది. ఇందులో 'సెంచూరియన్, కల్ట్, గ్లాడియస్, రెక్స్, రోక్స్, సవన్నా, ఆర్మడ' అనే ఏడు పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 'ఆర్మడ' అనేది మహీంద్రా కంపెనీకి చెందిన 1993 నుంచి 2001 మధ్య అమ్ముడైన కారు అని తెలుస్తోంది. మహీంద్రా థార్ 5 డోర్ మోడల్ దాని 3 డోర్స్ వెర్షన్ కంటే కూడా పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. డిజైన్ పరంగా 3 డోర్ థార్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఫీచర్స్ పరంగా కొంత అప్డేట్ పొందినట్లు తెలుస్తోంది. థార్ 5 డోర్ SUV టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్, సన్రూఫ్, రియర్ పార్కింగ్ కెమెరా, పిల్లర్ మౌంటెడ్ గ్రాబ్ హ్యాండిల్ వంటి వాటితో పాటు ADAS వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని కలిగి ఉండనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: అప్పుడు ఆస్తి పోగొట్టుకున్నాడు.. ఇప్పుడు రూ.37000 కోట్ల సామ్రాజ్యం.. అనేక సార్లు టెస్టింగ్ సమయంలో కనిపించిన మహీంద్రా థార్ 5 డోర్ మోడల్ 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్, 2.0 లీటర్ mStallion పెట్రోల్ ఇంజిన్లను పొందుతుంది. ఇంజిన్లు 6 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది. మహీంద్రా థార్ 5 డోర్ మోడల్ 2024లో లాంచ్ అవుతుందని సమాచారం, అయితే ఎప్పుడు లాంచ్ అవుతుందనేది కంపెనీ స్పష్టంగా వెల్లడించలేదు. ధరలు, బుకింగ్స్ వంటి వివరాలతో పాటు డెలివరీలకు సంబంధించిన విషయాలు కూడా లాంచ్ సమయంలోనే అధికారికంగా వెల్లడవుతాయి. -
ఈ కారుని 10 లక్షల మంది కొనేశారు
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'మారుతి సుజుకి' (Maruti Suzuki) యొక్క 'బ్రెజ్జా' (Brezza) విక్రయాల పరంగా ఓ సరికొత్త రికార్డుని కైవసం చేసుకుంది. దేశీయ విఫణిలో అడుగుపెట్టినప్పటిన ఏడు సంవత్సరాల ఎనిమిది నెలలు కాలంలో ఈ రికార్డుని సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం 2016 మార్చి నుంచి ఇప్పటికి 10 లక్షలు లేదా 1 మిలియన్ కార్లను విక్రయించినట్లు మారుతి సుజుకి వెల్లడించింది. కంపెనీ 9 లక్షల యూనిట్లను విక్రయించిన తరువాత కేవలం ఎనిమిది నెలల్లో మరో లక్ష యూనిట్లను విక్రయించినట్లు సమాచారం. దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సగటు నెలవారీ అమ్మకాలు 13,921 యూనిట్లు లేదా వారానికి 3480 లేదా ప్రతిరోజూ 497 యూనిట్లు అని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఆర్బీఐ గవర్నర్గా 'రఘురామ్ రాజన్' జీతం ఎంతంటే? ఈ ఏడాది మార్చిలో CNG వేరియంట్ని ప్రవేశపెట్టిన తరువాత అమ్మకాలు మరింత వేగవంతమయ్యాయి. అంతకు ముందు బ్రెజ్జా ప్రత్యర్థి నెక్సాన్ వల్ల అమ్మకాలు కొంత మందగించాయి. కానీ 2022 - 23 ఆర్ధిక అసంవత్సరంలో బ్రెజ్జా అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది. -
భారత్లో విడుదలైన ల్యాండ్ రోవర్ కొత్త కారు - ధర ఎంతంటే?
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'ల్యాండ్ రోవర్' ఎట్టకేలకు దేశీయ విఫణిలో సరికొత్త 'రేంజ్ రోవర్ స్పోర్ట్ వీ8' లాంచ్ చేసింది. రెండు వేరియంట్లలో లభించే ఈ కారు డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ వీ8 ధరలు రూ. 2.01 కోట్ల నుంచి రూ. 2.80 లక్షల వరకు ఉంటుంది. ఈ కారులో 4.4-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్, 3.0-లీటర్, 6-సిలిండర్ ఇంజన్తో 38.2kWh బ్యాటరీ ప్యాక్ అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి రెండూ కూడా ఉత్తమ పనితీరుని అందిస్తాయి. డిజైన్ విషయానికి వస్తే.. ఇందులో కొత్త ఫ్రంట్ బంపర్, గ్రిల్ ట్రీట్మెంట్, సైడ్ స్కర్ట్స్, డ్యూయల్ ట్విన్ ఎగ్జాస్ట్లతో రియర్ బంపర్ వంటివి ఉన్నాయి. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్ డిజిటల్ ఎల్ఈడీ హెడ్లైట్లు, పనోరమిక్ సన్రూఫ్, 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, యాంబియంట్ లైటింగ్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటివి పొందుతుంది. ఇదీ చదవండి: ఓలా ఎలక్ట్రిక్ నష్టాలు ఇన్ని కోట్లా.. కారణం ఏంటంటే? రేంజ్ రోవర్ స్పోర్ట్ వీ8 అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇది దేశీయ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న లంబోర్ఘిని ఉరుస్, ఆడి ఆర్ఎస్ క్యూ8, ఆస్టన్ మార్టిన్ డీబీఎక్స్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
వాహనదారులకు షాక్.. 80 శాతం పెరగనున్న పీయూసీ సర్టిఫికేట్ చార్జీలు
భారతదేశంలో వాయుకాలుష్యం భారీగా పెరిగిపోతున్న తరుణంలో రవాణా శాఖ 'పొల్యూషన్ అండర్ కంట్రోల్' (పియుసి) సర్టిఫికేట్ల కోసం చార్జీలను పెంచే దిశగా ఆలోచిస్తున్నట్లు ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పియుసి) సర్టిఫికేట్ల కోసం రవాణా శాఖ ఛార్జీలను పెంచనున్నట్లు, దీనికి సంబంధించిన ఒక ప్రతిపాదన రూపొందించి ఉన్నతాధికారులకు సమర్పించినట్లు సీనియర్ డిపార్ట్మెంట్ అధికారి వెల్లడించారు. 2011 నుంచి PUC చార్జీలు పెంచలేదని.. రానున్న కొత్త రేట్లు ద్రవ్యోల్బణం రేటుపై ఆధారపడి ఉంటాయని స్పష్టం చేసారు. కొత్త రేట్లు అమల్లోకి వస్తే ధరలు మునుపటి కంటే దాదాపు 80 శాతం పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు రవాణా మంత్రి 'కైలాష్ గహ్లోట్' తెలిపారు. కొత్త ధరలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనేది త్వరలోనే తెలుస్తుంది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 ప్రకారం, ప్రతి వాహనం నిర్ణీత వ్యవధి ముగిసిన తర్వాత తప్పకుండా పీయూసీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ప్రస్తుతం ఢిల్లీలో PUC ప్రూఫ్ పీజు ద్విచక్ర వాహనాలకు రూ.60, పెట్రోల్ ఫోర్ వీలర్ల కోసం రూ. 80, డీజిల్ ఫోర్ వీలర్స్ కోసం రూ. 100. ఈ రేటుపైన 18 శాతం GST కూడా వసూలు చేస్తారు. ఇదీ చదవండి: ఒకప్పుడు పాములు, తేళ్లు తిరిగే కంపెనీ.. టాటా చేతిలో పడ్డాక.. PUC సర్టిఫికెట్ లేని వాహనాలకు రూ.10000 జరిమానా లేదా ఆరు నెలలు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ఢిల్లీలో సుమారు 85 శాతం టూ వీలర్స్ పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండానే తిరుగుతున్నట్లు సమాచారం. ఇందులో సుమారు 27.8 లక్షల కార్లకు, 69.8 లక్షల టూ వీలర్లకు పీయూసీ సర్టిఫికేట్ లేకుండా తిరుగుతున్నాయని తెలుస్తోంది. రానున్న రోజుల్లో సంబంధిత శాఖ ఇలాంటి వాహనాల మీద కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని సమాచారం. -
భారత్లో లాంచ్ అయిన బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు - వివరాలు
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ 2022 కంటే 2023లో విపరీతంగా పెరిగింది. దీంతో ఈ ఏడాది దేశీయ విఫణిలో లాంచ్ అయిన వాహనాల సంఖ్య కూడా ఎక్కువైంది. ఈ కథనంలో ఈ సంవత్సరం మార్కెట్లో విడుదలైన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లను గురించి వివరంగా తెలుసుకుందాం. ఓలా ఎస్1 ఎక్స్ ఈ ఏడాది దేశీయ మార్కెట్లో విడుదలై ఉత్తమ అమ్మకాలు పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి 'ఓలా ఎస్1 ఎక్స్'. రూ.89999 ప్రారంభ ధర వద్ద విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇవి డ్యూయెల్ టోన్ డిజైన్, సింగిల్ పీస్ సీటుతో, ట్యూబ్యులర్ గ్రాబ్ రెయిల్, డ్యూయెల్ పాడ్ ఎల్ఈడీ హెడ్లైట్ వంటి వాటిని పొందుతుంది. ఇందులో 2 కిలోవాట్, 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి 91 కిమీ, 151 కిమీ రేంజ్ అందిస్తాయి. ఏథర్ 450ఎస్ బెంగళూరు బేస్డ్ కంపెనీ ఏథర్ ఈ ఏడాది '450ఎస్' ఎలక్ట్రిక్ స్కూటర్ను లాంచ్ చేసింది. మంచి స్పోర్టివ్ డిజైన్ కలిగిన ఈ స్కూటర్ 7 ఇంచెస్ టచ్స్క్రీన్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్ల్యాంప్, 12 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. 2.9 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్ ఒక సింగిల్ చార్జితో 115 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని ధర రూ.1.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). రివర్ ఇండీ ( River Indie) దేశీయ విఫణిలో లాంచ్ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్ 'రివర్ ఇండీ'లో డ్యూయెల్ పాడ్ హెడ్లైట్ సెటప్, సింగిల్ పీస్ సీటు, 42 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, 14 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఇందులోని 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 120 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని ధర రూ.1.25 లక్షలు. సింపుల్ డాట్ 1 బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ 'సింపుల్ ఎనర్జీ' (Simple Energy) దేశీయ మార్కెట్లో డిసెంబర్ 15న 'డాట్ వన్' (Dot One) ఎలక్ట్రిక్ స్కూటర్ను రూ. 99,999 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది. మంచి డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగిన ఈ స్కూటర్ 3.7 కిలోవాట్ బ్యాటరీతో 151 కిమీ రేంజ్(సింగిల్ ఛార్జ్) అందిస్తుంది. టీవీఎస్ ఎక్స్ రూ. 2.50 లక్షల ధర వద్ద ఈ ఏడాది విడుదలైన టీవీఎస్ ఎక్స్.. మార్కెట్లో లాంచ్ అయిన ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. ఇందులో వర్టికల్లీ స్టేక్డ్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్ క్లస్టర్, వైడ్ హ్యాండిల్ బార్, స్లిమ్ ఎల్ఈడీ టెయిల్ లాంప్, 10.25 ఇంచెస్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉన్నాయి. ఇందులోని 3.8 కిలోవాట్ బ్యాటరీ ఒక సింగిల్ చార్జితో 140 కిమీ రేంజ్ అందిస్తుంది. -
రూ.167 కోట్ల కారులో కనిపించిన 'శామ్ ఆల్ట్మన్' - వీడియో వైరల్
గత నెలలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచిన ఓపెన్ ఏఐ(OpenAI) సీఈఓ 'శామ్ ఆల్ట్మన్' ఇటీవల ఓ ఖరీదైన కారులో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇందులో కనిపించే ప్రత్యేకమైన సూపర్కార్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కథనంలో ఆ కారు గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం. వెల్థినెక్స్జెన్ ఇన్స్టాగ్రామ్లో కనిపించే వీడియోలో అత్యంత ఖరీదైన 'మెక్లారెన్ F1' సూపర్ కారును చూడవచ్చు. 1992లో ప్రారంభమైన ఈ కారు ధర భారతదేశంలో రూ. 167 కోట్ల కంటే ఎక్కువే. ఇది ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన సూపర్ కార్ల జాబితాలో ఒకటి కావడం గమనార్హం. శామ్ ఆల్ట్మాన్ తన మెక్లారెన్ ఎఫ్1 సూపర్కార్లో కాలిఫోర్నియాలోని ఫ్యూయెల్ స్టేషన్ వద్ద ఉంటడం వీడియోలో చూడవచ్చు. వెర్మిలియన్ రెడ్ కలర్లో కనిపించే ఈ కారు సిల్వర్ కలర్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఈ కారుని స్వయంగా ఆల్ట్మాన్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం గమనించవచ్చు. మెక్లారెన్ ఎఫ్1 నిజానికి కారు అనగానే అందులో కనీసం నలుగురు కూర్చోవడానికి సీట్లు ఉంటాయని తెలుసు. కానీ ఇక్కడ కనిపించే మెక్లారెన్ ఎఫ్1 మూడు సీట్ల కారు. మధ్యలో డ్రైవర్ సీటింగ్ పొజిషన్తో కేవలం ఒకే సీటు ఉంటుంది. వెనుకవైపు ఇద్దరు కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కారును 1992లో ప్రముఖ కార్ డిజైనర్ 'గోర్డాన్ ముర్రే' ప్రత్యేకంగా తయారుచేశారు. ఇవి కేవలం 106 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. మెక్లారెన్ ఎఫ్1 సూపర్ కారులో 6.1 లీటర్ వీ12 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 627 పీఎస్ పవర్, 650 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ కలిగిన ఈ కారు సుమారు కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు రూ. 386 కిమీ/గం కావడం గమనార్హం. ఇదీ చదవండి: నాలుగు అపార్ట్మెంట్లను అమ్మేసిన శ్రీదేవి ఫ్యామిలీ! మెక్లారెన్ ఎఫ్1 కారు ఇప్పటికే రోవాన్ అట్కిన్సన్ (మిస్టర్ బీన్), ఎలోన్ మస్క్ వద్ద కూడా ఉంది. అయితే రోవాన్ అట్కిన్సన్ కొన్ని రోజుల తరువాత ఈ కారుని విక్రయించినట్లు సమాచారం, మస్క్ మాత్రం ఈ కారును ఇప్పటికీ వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Motivation | Business | Wealth (@wealthynexgen) -
2030 నాటికి అగ్రగామిగా భారత్ - ఇలా..
భారతదేశంలో రోజురోజుకి ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి, వినియోగం పెరుగుతూనే ఉంది. వాహన తయారీ సంస్థలు కూడా ఈ విభాగంలో లెక్కకు మించిన వాహనాలను విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్రమంత్రి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో ఏడాదికి 10 మిలియన్ల ఎలక్ట్రిక్ వెహికల్ (EV) విక్రయాలు జరిగే అవకాశం ఉందని, 2030 నాటికి ఈ విభాగంలో దాదాపు 50 మిలియన్ల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నట్లు కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' తాజాగా వెల్లడించారు. దేశంలో ఇప్పటికే 3,45,4000 ఎలక్ట్రిక్ వాహనాలు నమోదైనట్లు.. ఈ విభాగంలో భారత్ ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానం పొందనున్నట్లు నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఇంధన దిగుమతులు కూడా తగ్గుతాయని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడంలో సహాయపడుతుందని అన్నారు. వాయుకాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా దేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లు తయారవుతున్నాయి. అంతే కాకుండా ఇప్పటికే ఉన్న కార్లను కూడా ఎలక్ట్రిక్ కార్లుగా మార్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని గడ్కరీ తెలిపారు. కేవలం రోజు వారీ వినియోగానికి ఉపయోగించే వాహనాలు మాత్రమే కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్ వంటి వాటిలో కూడా ఈవీల వినియోగం పెంచడానికి తగిన చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇదీ చదవండి: భవిష్యత్తు వీటిదే అంటున్న నితిన్ గడ్కరీ - వైరల్ వీడియో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలను అందించాయి. దీంతో తక్కువ కాలంలోనే ఈవీల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఈ సబ్సిడీలను పరిమితం చేసినప్పటికీ.. కొన్ని రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు కల్పిస్తున్నారు. -
2023లో ఎక్కువగా ఈ కార్ల కోసమే సెర్చ్ చేశారు
టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతున్న సమయంలో ఎప్పుడు ఏం కావాలన్నా గూగుల్ సెర్చ్ చేయడం అలవాటు అయిపోయింది. ఈ ఏడాది (2023లో) ఎక్కువ మంది గూగుల్లో ఏ కార్ల కోసం సెర్చ్ చేశారు, ఎన్ని దేశాల్లో సెర్చ్ చేశారు అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. 👉2023లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన కార్ బ్రాండ్స్ జాబితాలో ప్రధానంగా జపనీస్ కార్ల తయారీ సంస్థ 'టయోటా' అగ్రస్థానం పొందింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 64 దేశాల్లో ఈ బ్రాండ్ కార్ల కోసం శోధించినట్లు తెలుస్తోంది. 👉ఆ తరువాత స్థానంలో అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఉంది. టెస్లా బ్రాండ్ కార్లను ప్రపంచంలోని సుమారు 29 కంటే ఎక్కువ దేశాలలో సెర్చ్ చేసినట్లు సమాచారం. ఇందులో కూడా ఎక్కువ టెస్లా మోడల్ 3, మోడల్ వై, సైబర్ ట్రక్ కోసం శోధించినట్లు సమాచారం. 👉ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచిన కంపెనీ బీఎండబ్ల్యూ. ప్రపంచంలోని 29 కంటే ఎక్కువ దేశాలలోని ప్రజలు ఈ బ్రాండ్ కార్ల కోసం సెర్చ్ చేశారని తెలుస్తోంది. గత ఏడాది ఎక్కువ సెర్చింగ్స్ పొందిన రెండవ కంపెనీకి నిలిచిన BMW ఈ ఏడాది మూడవ స్థానంలో నిలిచింది. 👉నాలుగవ స్థానంలో నిలిచిన 'ఆడి' కార్ బ్రాండ్ కోసం 7 దేశాల్లోని ప్రజలు ఎక్కువగా సెర్చ్ చేసినట్లు సమాచారం. గత ఏడాది మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఆడి సెర్చింగ్ విషయంలో నాల్గవ స్థానంలోనే నిలిచింది. 👉ఇక చివరగా ఐదవ స్థానం పొందిన కంపెనీ మెర్సిడెస్ బెంజ్. గత ఏడాది మూడవ స్థానం పొందిన బెంజ్.. ఈ ఏడాది 5వ స్థానంలో చేరింది. కేవలం ఆరు దేశాలలో మాత్రమే ఎక్కువగా ఈ కార్లను సెర్చ్ చేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: న్యూ ఇయర్ రాకముందే ఉద్యోగులకు షాకిచ్చిన కంపెనీ.. -
ఇలా ఎలా అనిపించిన ఓలా..
ప్రారంభంలో మంచి ప్రజాదరణ పొందిన ఓలా ఎలక్ట్రిక్.. క్రమంగా తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద లెక్కకు మించిన కంప్లైంట్ అందుకుంది. స్కూటర్లలో ఎన్ని సమస్యలు తలెత్తినప్పటికీ.. అమ్మకాల్లో మాత్రం కనీవినీ ఎరుగని విధంగా దూసుకెళ్లినట్లు నివేదికల ద్వారా తెలిసింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. ఓలా ఎలక్ట్రిక్ నివేదికల ప్రకారం, 2023 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ వరకు కంపెనీ మొత్తం సేల్స్ 2,52,647 యూనిట్లుగా నమోదైనట్లు తెలుస్తోంది. కేవలం ఒక సంవత్సర కాలంలో 2.5 లక్షల యూనిట్ల అమ్మకాలు సొంతం చేసుకున్న కంపెనీకి ఓలా ఈ ఏడాది కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది అత్యధిక అమ్మకాలు చేపట్టిన కంపెనీగా ఓలా ఎలక్ట్రిక్ నిలిచింది. ఆ తరువాత స్థానాల్లో టీవీఎస్ (1,62,399 యూనిట్లు), ఏథర్ ఎనర్జీ (1,01,940 యూనిట్లు) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ లెక్కన ఓలా ఎలక్ట్రిక్ నెలకు సుమారు 20000 యూనిట్లను విక్రయించినట్లు సమాచారం. ఇదీ చదవండి: న్యూ ఇయర్ రాకముందే ఉద్యోగులకు షాకిచ్చిన కంపెనీ.. నెలవారీ అమ్మకాల పరంగా ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ వాటా 30.50శాతం, టీవీఎస్ వాటా 19.60 శాతం, ఏథర్ వాటా 12.30శాతంగా ఉంది. ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో రూ. 90000 నుంచి రూ. 1.47 లక్షల ధర మధ్య లభించే స్కూటర్లను విక్రయిస్తోంది. కంపెనీ రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. బహుశా ఇది 2024 చివరి నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. -
2023లో బెస్ట్ సీఎన్జీ కార్లు.. ఇవే!
దేశీయ విఫణిలో కేవలం పెట్రోల్, డీజిల్ కార్లకు మాత్రమే కాకుండా CNG కార్లకు కూడా డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు కూడా తమ కార్లను CNG కార్లుగా రూపొందించి మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ఈ కథనంలో 2023లో లాంచ్ అయిన బెస్ట్ సీఎన్జీ కార్లను గురించి తెలుసుకుందాం. మారుతి గ్రాండ్ విటారా సీఎన్జీ (Maruti Grand Vitara CNG) ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి 'సుజుకి గ్రాండ్ వితారా'.. ఏప్రిల్ 2023న సీఎన్జీ కారుగా అడుగుపెట్టింది. 1.5 లీటర్ కె15సీ ఇంజిన్ కలిగిన ఈ కారు 26 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉన్న ఈ మోడల్ కేవలం సిటీ డ్రైవింగ్కు మాత్రమే కాకుండా హైవేలలో కూడా మంచి పనితీరుని అందిస్తుంది. మారుతి బ్రెజ్జా సీఎన్జీ (Maruti Brezza CNG) దేశీయ విఫణిలో లాంచ్ అయిన మరో మారుతి CNG కారు బ్రెజ్జా. 2023 'మే'లో విడుదలైన ఈ కారు డిజైర్ సీఎన్జీ మాదిరిగానే 1.5 లీటర్ కె12సీ ఇంజిన్ కలిగి 20.15 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. మంచి డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు సరసమైన ధర వద్ద లభిస్తున్న బెస్ట్ CNG కార్లలో ఒకటిగా ఉంది. టాటా పంచ్ సీఎన్జీ (Tata Punch CNG) దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ కంపెనీకి చెందిన 'పంచ్' మైక్రో SUV కూడా జూన్ 2023న CNG కారుగా లాంచ్ అయింది. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ కలిగిన ఈ కారు 73 పీఎస్ పవర్, 113 న్యూటన్ మీటర్ టార్క్ అందించే 1.2 లీటర్ 3 సిలినార్ ఇంజిన్ పొందుతుంది. ఇది 18.5 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. హ్యుందాయ్ ఎక్స్టర్ సీఎన్జీ (Hyundai Exter CNG) 2023 ఆటో ఎక్స్పోలో అరంగేట్రం చేసిన 'హ్యుందాయ్ ఎక్స్టర్' 2023 జులైలో CNG కారుగా మార్కెట్లో లాంచ్ అయింది. 1.2 లీటర్ ఫోర్ సిలినార్ ఇంజిన్ కలిగిన ఈ కారు 74 పీఎస్ పవర్, 114 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ మోడల్ 21 కిమీ?కేజీ మైలేజ్ అందిస్తుంది. ఇదీ చదవండి: టెక్ దిగ్గజం ఒక్క నిర్ణయం.. చెత్తలోకి 24 కోట్ల కంప్యూటర్లు! టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ (Tata Altroz CNG) టాటా ఆల్ట్రోజ్ కూడా ఇప్పుడు మార్కెట్లో CNG కారుగా అందుబాటులో ఉంది. దాని స్టాండర్డ్ మోడల్ కంటే ఎక్కువ మైలేజ్ అందించే ఈ కారు డిజైన్ పరంగా పెద్దగా మార్పు పొందినప్పటికీ కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. ఇందులో 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 74 పీఎస్ పవర్, 110 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 25.15 కిమీ/కేజీ మైలేజ్ అందించే ఈ కారు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. -
2023లో భారత్లో అడుగుపెట్టిన టాప్ ఎలక్ట్రిక్ కార్లు.. ఇవే!
రోజు రోజుకి ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతున్న సమయంలో వాహన తయారీ సంస్థలు కూడా ఈవీలనే లాంచ్ చేయడానికి సుముఖత చూపుతున్నాయి. 2023లో దేశీయ విఫణిలో అడుగుపెట్టిన టాప్ 5 బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లోటస్ ఎలెట్రా (Lotus Eletre) ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు 'లోటస్ ఎలెట్రా'. నవంబర్ 2023న అధికారికంగా లాంచ్ అయిన ఈ కారు ధర రూ.2.55 కోట్ల నుంచి రూ.2.99 కోట్లు. ఈ కారు కేవలం 2.95 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 265కిమీ. సింగిల్ చార్జితో 600 కిమీ ప్రయాణించే ఈ కారు రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో లభిస్తుంది. హ్యుందాయ్ ఐయోనిక్ 5 (Hyundai Ioniq 5) హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఐయోనిక్ 5 దేశీయ మార్కెట్లో 2022లో అడుగు పెట్టినప్పటికీ 2023లో అధికారిక ధరలు వెల్లడయ్యాయి. 2023లో భారతీయ విఫణిలో అడుగుపెట్టిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం గమనార్హం. దీని ధర రూ. 44.95 లక్షలు (ఎక్స్ షోరూమ్). సింగిల్ చార్జితో 600 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించే ఈ కారు డిజైన్ పరంగా చాలా కొత్తగా ఉంటుంది. 2023 టాటా నెక్సాన్ ఈవీ ఫేస్లిఫ్ట్ (2023 Tata Nexon EV Facelift) దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఈ ఏడాది టాటా నెక్సాన్ ఈవీ ఫేస్లిఫ్ట్ వెర్షన్ లాంచ్ చేసింది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో లభించే ఈ కారు ప్రారంభం నుంచి ఇండియన్ మార్కెట్లో అత్యుత్తమ అమ్మకాలు పొందుతూ దూసుకెళ్తోంది. సింగిల్ చార్జితో 325 కిమీ రేంజ్ అందించే ఈ కారు ప్రారంభ ధర రూ. 14.74 లక్షలు. ఎంజీ కామెట్ (MG Comet) ఇండియన్ మార్కెట్లో సరసమైన ధరకు లభించే ఎంజి ఈవీ కామెట్ ఏప్రిల్ 2023లో లాంచ్ అయింది. రూ. 7.89 లక్షల వద్ద లభించే ఈ కారు సింగిల్ చార్జితో 230కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు టాటా టియాగో ఈవీ, సిట్రోయిన్ ఈసీ3 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. సిట్రోయిన్ ఈసీ3 (Citroen EC3) 'సిట్రోయెన్ సీ3'తో భారతదేశంలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్.. ఈ ఏడాది రూ. 11.50 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద ఈసీ3 విడుదల లాంచ్ చేసింది. సింగిల్ చార్జితో 320కిమనీ రేంజ్ అందించే ఈ ఎలక్ట్రిక్ కారు ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచేలా తయారైంది. -
11.2 లక్షల టయోటా కార్లు వెనక్కి! అగ్ర రాజ్యంలో అత్యధికం..
ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'టయోటా' (Toyota) ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 11.2 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. ఇన్ని కార్లకు కంపెనీ ఎందుకు రీకాల్ ప్రకటించింది, ఈ కార్లలో ఉన్న లోపాలు ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, 2020 నుంచి 2022 మధ్యలో తయారైన అవలాన్, కామ్రీ, కరోలా, ఆర్ఏవీ4, లెక్సస్ ఈఎస్ 250, ఈఎస్300హెచ్, ఈఎస్350, ఆర్ఎక్స్350 హైల్యాండర్, సియన్నా హైబ్రిడ్ వెహికిల్స్ వంటి వాటికి రీకాల్ ప్రకటించింది. సమస్య ఏంటంటే? 2020 నుంచి 2022 మధ్యలో తయారైన ఈ కార్లలో ఎయిర్ బ్యాగులో ఏర్పడే లోపం కారణంగా ఆక్యుపెంట్ క్లాసిఫికేషన్ సిస్టమ్ (OCS) సెన్సార్లకు సంబంధిచిన సమస్యలు తలెత్తవచ్చని సంస్థ భావించి, దీనిని భర్తీ చేయడానికి ఈ రీకాల్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఒక్క అమెరికాలో మాత్రమే సుమారు 10 లక్షల కార్లలో ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. రీకాల్ సమయంలో సదరు వినియోదారుడు తన కారుని కంపెనీ అధికారిక డీలర్షిప్ వద్ద సమస్యను పరిష్కరించుకోవచ్చు. ప్రస్తుతానికి కంపెనీ కార్ ఓనర్లకు సమాచారం అందించలేదని, 2024 ఫిబ్రవరి సమయంలో అందరికి సమాచారం అందించే అవకాశం ఉందని సమాచారం. ఇదీ చదవండి: భారత్ ఒక్కరోజు అమ్మకాలను చేరుకోలేకపోయిన పాకిస్తాన్ - కారణం ఇదే! కార్లలోని లోపాలకు పరిష్కరించడానికి రీకాల్ ప్రకటించడం ఇదే మొదటి సారి కాదు, గతంలో చాలా కంపెనీలు ఇలా రీకాల్ ప్రకటించి సమస్యలను పరిష్కరించాయి. ఇటీవల టెస్లా కూడా ఆటోపైలట్ సిస్టమ్లోని లోపాన్ని సరి చేయడానికి 20 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. -
2023లో మగువలు మెచ్చిన బెస్ట్ స్కూటర్లు.. ఇవే!
Best Scooters For Womens: భారతదేశంలో రోజురోజుకి లెక్కకు మించిన టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో మగవారికి నచ్చినవి, మహిళకు నచ్చినవి రెండూ ఉన్నాయి. ఈ కథనంలో మహిళలకు ఇష్టమైన టాప్ 5 స్కూటర్లు ఏవి? వాటి ధరలు ఎలా ఉన్నాయి? వివరాలు ఏంటి అనే సమాచారం వివరంగా చూసేద్దాం.. హోండా యాక్టివా జి6 (Honda Activa G6) దేశీయ విఫణిలో ప్రారంభం నుంచి మంచి అమ్మకాలు పొందుతున్న 'హోండా యాక్టివా జి6' మగువలు మెచ్చిన టాప్ స్కూటర్లలో ఒకటని చెప్పవచ్చు. ఇది కొంత ఖరీదైన స్కూటర్ అయినప్పటికీ.. మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి, ఎక్కువ అండర్ సీట్ స్టోరేజ్ కలిగి అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. ఈ స్కూటర్ ధరలు రూ. 77,710 నుంచి రూ. 84,207 వరకు (ఎక్స్ షోరూమ్) ఉంది. టీవీఎస్ జుపీటర్ (TVS Jupiter) టీవీఎస్ కంపెనీకి చెందిన జుపీటర్ కూడా ఎక్కువ మంది మహిళకు ఇష్టమైన మోడల్. రూ. 76,738 నుంచి రూ. 91,739 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తున్న ఈ స్కూటర్ డిజైన్ పరంగా, ఫీచర్స్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. 109.7 సీసీ ఇంజిన్ కలిగిన జుపీటర్ 7.88 పీఎస్ పవర్, 8.8 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125) మంచి రైడింగ్ అనుభూతిని అందించే స్కూటర్ల జాబితాలో ఒకటైన సుజుకి యాక్సెస్ 125 రూ. 82,171 రూ. 92,271 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తోంది. బ్లూటూత్ కనెక్టివిటీ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ స్కూటర్ మంచి అండర్ సీట్ స్టోరేజ్ పొందుతుంది. 50 నుంచి 62 కిమీ/లీ మైలేజ్ అందించే ఈ స్కూటర్ 124 సీసీ ఇంజిన్ కలిగి 8.7 పీఎస్ పవర్, 10 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హోండా డియో (Honda Dio) అతి తక్కువ కాలంలో ఎక్కువ అమ్మకాలు పొందిన హోండా డియో మహిళలకు బాగా నచ్చిన మరో మోడల్. రూ. 74,231 నుంచి రూ. 81,732 మధ్య లభించే ఈ స్కూటర్ 109.51 సీసీ ఇంజిన్ కలిగి 7.76 పీఎస్ పవర్, 9 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ స్కూటర్ మంచి రైడింగ్ అనుభూతిని అందించే కారణంగానే కొనుగోలుదారులు ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. ఇదీ చదవండి: భారత్ ఒక్కరోజు అమ్మకాలను చేరుకోలేకపోయిన పాకిస్తాన్ - కారణం ఇదే! టీవీఎస్ స్కూటీ జెస్ట్ (TVS Scooty Zest) మన జాబితాలో మహిళలకు ఇష్టమైన మరో స్కూటర్ టీవీఎస్ కంపెనీకి చెందిన 'స్కూటీ జెస్ట్'. దీని ధర రూ. 71,636 నుంచి రూ. 73,313 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభిస్తుంది. 109.7 సీసీ ఇంజిన్ కలిగి 7.81 పీఎస్ పవర్, 8.8 న్యూటన్ మీటర్ టార్క్ అందించే ఈ స్కూటర్ సింపుల్ డిజైన్ కలిగి ఉత్తమ పనితీరుని అందిస్తుంది. -
తుక్కు చేయడానికి ఎన్ని కేంద్రాలు అవసరమంటే..
న్యూఢిల్లీ: దేశీయంగా 1,000 వాహన తుక్కు కేంద్రాలు, 400 ఆటోమేటెడ్ ఫిట్నెస్ టెస్ట్ సెంటర్లు అవసరమని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 85 స్క్రాపింగ్ సెంటర్లకు ప్రభుత్వం అనుమతిన్చినట్లు ’డిజిఈఎల్వీ’ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన వివరించారు. జాతీయ వాహన స్క్రాపేజీ పాలసీ అనేది అన్ని వర్గాలకు ప్రయోజనకరమని, దక్షిణాసియాలో భారత్ స్క్రాపింగ్ హబ్గా ఎదిగేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. వాహన స్క్రాపింగ్ కోసం వాహనదారుకు స్క్రాపింగ్ కేంద్రం (ఆర్వీఎస్ఎఫ్) జారీ చేసిన సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ (సీడీ)లను ట్రేడింగ్ చేసుకునేందుకు డిజిఈఎల్వీ ప్లాట్ఫాం ఉపయోగపడుతుంది. గత మూడు నెలలుగా బీటా ఫేజ్లో ఉన్న డిజిఈఎల్వీ దాదాపు 800 సర్టిఫికెట్ల ట్రేడింగ్కు తోడ్పడింది. పాతబడిన, ఫిట్నెస్ కోల్పోయిన, కాలుష్యకారక వాహనాలను దశలవారీగా తప్పించేందుకు 2021 ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ వాహన స్క్రాపేజీ పాలసీని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం పాత వాహనాలను స్క్రాపింగ్ చేసిన వారు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తే రోడ్ ట్యాక్స్లో పాతిక శాతం వరకు రిబేటు పొందవచ్చు. ఈ పాలసీ 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. -
కారు కొనుగోలుపై రూ.1.10 లక్షల డిస్కౌంట్ - వివరాలు
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' తన ఈవీ పోర్ట్ఫోలియో మీద సంవత్సరాంతంలో గణనీయమైన తగ్గింపులను ప్రకటించింది. ఈ లైనప్లో టియాగో ఈవీ హ్యాచ్బ్యాక్, టిగోర్ ఈవీ ఉన్నాయి. కంపెనీ ఈ కార్లపై అందిస్తున్న ఆఫర్లను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. టిగోర్ ఈవీ టాటా టిగోర్ ఈవీ కొనుగోలుపైన కంపెనీ రూ. 1.10 లక్షల తగ్గింపుని అందిస్తోంది. ఇందులోని అన్ని వేరియంట్లపై రూ. 50,000 ఎక్స్చేంజ్ బోనస్తో పాటు రూ. 50,000 ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు. వీటితో పాటు రూ.10,000 వరకు కార్పొరేట్ ప్రయోజనాలు లభిస్తాయి. మంచి డిజైన్, ఫీచర్స్ కలిగిన ఈ కారు ఒక చార్జితో గరిష్టంగా 315 కిమీ రేంజ్ అందిస్తుంది. టియాగో ఈవీ టాటా టియాగో ఈవీ కొనుగోలుపైన కంపెనీ రూ. 77000 వరకు తగ్గింపుని అందిస్తోంది. ఎంపిక చేసిన కొన్ని వేరియంట్ల మీద కంపెనీ రూ. 1,5000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ లేదు. దీనికి బదులుగా కొనుగోలుదారులు రూ.55,000 వరకు గ్రీన్ బోనస్ను పొందవచ్చు. కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ. 7,000 తగ్గింపు లభిస్తుంది. టియాగో ఈవీ మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. మీడియం రేంజ్ వేరియంట్ ఒక చార్జితో 250 కిమీ పరిధిని, లాంగ్ రేంజ్ వేరియంట్ ఒక చార్జితో 315 కిమీ రేంజ్ అందిస్తుంది. NOTE: కంపెనీ అందించే ఆఫర్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన డిస్కౌంట్ వివరాలు తెలుసుకోవడానికి కొనుగోలుదారుడు సమీపంలోని సంస్థ అధీకృత డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
పరుగులు పెట్టిన ఈవీ రంగం.. 2023లో ఇవే హైలెట్స్
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. 2022తో పోలిస్తే 2023లో మార్కెట్లో విడుదలైన ఈవీల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనికి కారణం పెరిగిన ఇంధన ధరలు కావొచ్చు లేదా వాతావరణ సమతుల్యతను కాపాడుకోవడం కోసం కావొచ్చు. ఏదేమైనా.. సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా, ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు చూస్తున్నాయి. 2023లో గొప్ప పురోగతి చూసిన ఎలక్ట్రిక్ వాహన రంగం రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని ఇప్పుడే స్పష్టమవుతోంది. ఈ కథనంలో ఈవీ రంగం 2023లో ఎలాంటి పురోగతి కనపరిచింది? వాటి వివరాలు ఏంటనేది.. వివరంగా చూసేద్దాం.. బ్యాటరీ టెక్నాలజీ 1993లో భారతదేశంలో 'లవ్బర్డ్' పేరుతో అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రిక్ కారు కేవలం 60 కిమీ రేంజ్ మాత్రమే అందించింది. అయితే ఈ ఏడాది దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన 'మెర్సిడెస్ బెంజ్ EQC' ఒక సింగిల్ ఛార్జ్తో 850 కిమీ అందిస్తోంది. దీన్ని బట్టి చూస్తే 2023లో బ్యాటరీ టెక్నాలజీ, కెపాసిటీ ఏ స్థాయిలో పెరిగిందో అర్థమైపోతుంది. అంతే కాకుండా ఛార్జింగ్ స్పీడ్, డిజైన్, ఫీచర్స్ వంటి వాటిలో కూడా ఈ ఏడాది చాలా మార్పులు సంభవించాయి. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలక్ట్రిక్ వాహనాలు పెరిగితే తప్పకుండా వాటికి కావలసిన ఛార్జింగ్ స్టేషన్స్ పెరగాలి. 2022లో కావలసినన్ని ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల కొందరు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు సంబంధిత సంస్థలను ప్రోత్సహించడం జరిగింది. దీంతో ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ సంఖ్య పెరిగింది, రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. టూ వీలర్స్ నుంచి పెద్ద ట్రక్కుల వరకు ప్రారంభంలో కార్లు మాత్రమే ఎలక్ట్రిక్ వాహనాలుగా పుట్టుకొచ్చాయి. నేడు ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు, పెద్ద ట్రక్కులు, బస్సులు వరకు ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందింది. నేడు దాదాపు అన్ని విభాగాల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అంతలా ఈ ఏడాది ఎలక్ట్రిక్ వాహన రంగం విస్తరించింది. ఈవీ రంగంలో ఏఐ ప్రవేశం కొంతకాలం క్రితం ఎలక్ట్రిక్ కార్లలో కూడా సాధారణ కార్లలోని ఫీచర్స్ మాత్రమే అందుబాటులో ఉండేవి, ప్రస్తుతం విడుదలవుతున్న చాలా కార్లలో ఏఐ సంబంధిత ఫీచర్స్ వస్తున్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్దారించడంలో సహాయపడుతున్నాయి. ముఖ్యంగా ఏఐ అనేది సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల అభివృద్ధిలో చాలా సహాయపడుతుంది. తప్పకుండా భవిష్యత్తులో మార్కెట్లో విడుదలయ్యే కార్లలో ఎక్కువ భాగం సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నాము. ఖచ్చితమైన నావిగేషన్, సెన్సార్ సిస్టమ్స్, డెస్టినేషన్ వంటివి ఇలాంటి కార్లలో బాగా అభివృద్ధి చెందితే ఓ కొత్త శకానికి నాందీ భూతమవుతుందని ఆశిస్తున్నాము. -
15 నిమిషాల ఛార్జ్తో 500 కిమీ ప్రయాణం.. ఈవీ సెక్టార్లో సంచలన ఆవిష్కరణ
గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ఛార్జింగ్ సమస్య ఓ పెనుభారంగా మారుతోంది. దీనిని పరిష్కరించడానికి చైనీస్ ఆటోమేకర్ గీలీ ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ 'జీకర్' (Zeekr) సరికొత్త ఛార్జింగ్ సొల్యూషన్ పరిచయం చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఓ పెను మార్పును తీసుకువచ్చే క్రమంలో కంపెనీ జెజియాంగ్ ప్రావిన్స్లోని గీలీ హోల్డింగ్ గ్రూప్కు చెందిన బ్యాటరీ ప్లాంట్లో వినూత్న టెక్నాలజీ ఆవిష్కరించింది. దీని ద్వారా కేవలం 15 నిమిషాల్లో ఛార్జ్ చేసుకుంటే ఏకంగా 500 కిమీ (300 మైల్స్) ప్రయాణం చేయవచ్చని తెలుస్తోంది. జీకర్ ఆవిష్కరించిన ఈ టెక్నాలజీ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ వేసుకునే సమయం కూడా చాలా ఆదా అవుతుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ చైనాలో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. చైనాలో జీకర్ ప్రత్యర్థి నియో( Nio) కూడా ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇలాంటి టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. మరోవైపు CATL కూడా ఎలక్ట్రిక్ వాహనాల ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలలో పురోగతి సాధించింది. కంపెనీ Li Auto మొట్టమొదటి ప్యూర్ ఎలక్ట్రిక్ మల్టీపర్పస్ వెహికిల్ MEGA కోసం ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీలను పరిచయం చేసింది. ఇది కేవలం 12 నిమిషాల ఛార్జింగ్తో 500 కిలోమీటర్ల (300 మైళ్ళు) డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. ఇదీ చదవండి: ఇలాంటి టెక్నాలజీ తెలంగాణలో ఫస్ట్.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా ఇండియాలో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇంత ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ భారతదేశంలో లేదు, కానీ కొన్ని కంపెనీల ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్లో మాత్రం సుమారు 20 నుంచి 30 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం లేదా 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఎప్పుడూ ఫాస్ట్ ఛార్జింగ్ ఉపయోగించి ఛార్జ్ చేసుకోవడం వల్ల బ్యాటరీలో ఏదైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. -
సింగిల్ ఛార్జ్తో 160 కిమీ రేంజ్ అందించే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ 'సింపుల్ ఎనర్జీ' (Simple Energy) దేశీయ మార్కెట్లో సర్వ్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'డాట్ వన్' (Dot One) లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు, ఆఫర్ వివరాలు వంటి వాటితో పాటు రేంజ్ గురించి కూడా ఈ కథనంలో తెలుసుకుందాం. దేశీయ విఫణిలో విడుదలైన కొత్త 'డాట్ వన్' ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 99,999 (ఎక్స్ షోరూమ్, బెంగళూరు). ముందుగా బుక్ చేసుకున్న వారికి ముందస్తు డెలివరీలు ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. పరిచయ ధరలు ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఆ తరువాత ధరల పెరుగుదల జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. నాలుగు కలర్ఆప్షన్లలో లభించే ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్తో గరిష్టంగా 160 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. వాస్తవ ప్రపంచంలో వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఈ స్కూటర్ రేంజ్ 151 కిమీ వరకు ఉంటుందని సమాచారం. ఇదీ చదవండి: అనిల్ అంబానీ ఆస్తులు అమ్మకానికి గ్రీన్ సిగ్నల్.. జాబితాలో ఉన్నవేంటో తెలుసా? 3.7 కిలోవాట్ బ్యాటరీ కలిగిన సింపుల్ ఎనర్జీ కొత్త స్కూటర్ కేవలం 2.77 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులోని 8.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ 72 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. మొత్తం మీదే పనితీరు పరంగా ఇచ్చి చాలా ఉత్తమంగా ఉంటుంది. డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 35 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కలిగి.. మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఈ కొత్త స్కూటర్ భారతీయ మార్కెట్లో ఇప్పటికే విక్రయానికి ఉన్న ఓలా ఎస్1 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
వోల్వో కార్ ప్రియులకు షాక్.. జనవరి నుంచి ప్రైస్ హైక్
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్వీడిష్ కార్ల తయారీ సంస్థ 'వోల్వో' (Volvo) 2024 ప్రారంభం (జనవరి) నుంచి తమ బ్రాండ్ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి రెండు శాతం ధరలను పెంచనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు మాత్రమే కాకుండా.. అస్థిర విదేశీ మారకపు రేట్లు కారణంగా ధరలను పెంచడం జరిగిందని కంపెనీ తెలిపింది. ధరల పెరుగుల ప్రకటించిన కంపెనీలలో వోల్వో మాత్రమే కాకుండా మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్ల తయారీ సంస్థలు.. టాటా మోటార్స్, మహీంద్రా వంటి దేశీయ సంస్థలు ఉన్నాయి. వోల్వో కంపెనీ ఇప్పటికే భారతీయ మార్కెట్లో సీ40 రీఛార్జ్, XC40, XC40 రీఛార్జ్ వంటి ఎలక్ట్రిక్ కార్లను అందిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త కార్లను దేశీయ విఫణిలో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ విడుదల చేస్తున్న కార్లు మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా అద్భుతమైన పర్ఫామెన్స్ కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది వాహన ప్రియులు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. ఇదీ చదవండి: మహమ్మారిలా వ్యాపిస్తున్న డీప్ ఫేక్.. మొన్న రతన్ టాటా.. నేడు నారాయణ మూర్తి ధరల పెరుగుదల గురించి వోల్వో కార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ 'జ్యోతి మల్హోత్రా' మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ డైనమిక్స్, పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులకు భరించడానికి ధరలను సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. -
సింగిల్ ఛార్జ్తో 104 కిమీ రేంజ్ - ధర ఎంతంటే?
దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం పెరుతున్న తరుణంలో 'కైనెటిక్ గ్రీన్' ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. 'కైనెటిక్ జులు' పేరుతో విడుదలైన ఈ స్కూటర్ ధర రూ. 94,990 (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త మోడల్ కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరిస్తుంది. డెలివరీలు 2024 ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. సుమారు 93 కేజీల బరువున్న కైనెటిక్ జులు ఎలక్ట్రిక్ స్కూటర్ 2.1 కిలోవాట్ హబ్ మోటార్ కలిగి గంటకు 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులో ఉన్న 2.27 కిలోవాట్ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్తో గరిష్టంగా 104 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది 15 ఏఎంపీ స్టాండర్డ్ ఛార్జర్ ద్వారా కేవలం 30 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్ చేసుకుంటుంది. మంది డిజైన్ కలిగిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టెలిస్కోపిక్ ఫోర్క్, ట్విన్ షాక్ అబ్జార్బర్లు, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్లు, 10 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో ఆప్రాన్-మౌంటెడ్ హెడ్ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్, డిజిటల్ స్పీడోమీటర్, సైడ్ స్టాండ్ సెన్సార్, బూట్ లైట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇదీ చదవండి: పతనమవుతున్న పసిడి.. మరింత తగ్గిన వెండి - నేటి కొత్త ధరలు ఇవే ఒక ఫుల్ చార్జితో 104 కిమీ రేంజ్ అందించే ఈ జులు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియన్ మార్కెట్లో ఒకినావా ప్రైజ్ ప్రో, ఓలా ఎస్1 ఎక్స్+, ఏథర్ 450ఎస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఈ స్కూటర్ అమ్మకాల పరంగా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. -
ఒక్క నిర్ణయం.. ఈవీ ఛార్జింగ్ సమస్యలకు చెక్!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది, పెరుగుతున్న వాహనాలకు కావలసినన్ని 'ఛార్జింగ్ స్టేషన్స్' మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని టాటా పవర్ ఈవీ చార్జింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ (TPEVCSL).. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా పవర్ అనుబంధ సంస్థ TPEVCSL దేశంలో ఛార్జింగ్ స్టేషన్స్ సంఖ్యను పెంచడానికి IOCLతో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ప్రకారం ఈ రెండూ కలిసి దేశవ్యాప్తంగా సుమారు 500 కంటే ఎక్కువ హైస్పీడ్, అల్ట్రా-ఫాస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) చార్జింగ్ పాయింట్లను ఇన్స్టాల్ చేయనున్నాయి. త్వరలో ఇన్స్టాల్ చేయనున్న ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, అహ్మదాబాద్, పూణే, కొచ్చి వంటి ప్రధాన నగరాల్లో మాత్రమే కాకుండా.. ముంబై-పూణె ఎక్స్ప్రెస్వే, సేలం-కొచ్చి హైవే, గుంటూరు-చెన్నై హైవే వంటి ప్రధాన రహదారులపై ఉన్న 'ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్' అవుట్లెట్లలో ప్రారంభించనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో లాంగ్ జర్నీ చేయాలనుకునే వారికి ఈ కొత్త ఛార్జింగ్ స్టేషన్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయని, 'టాటా పవర్ ఈజెడ్ ఛార్జ్' యాప్ ద్వారా లేదా 'ఇండియన్ ఆయిల్ ఈ-ఛార్జ్' మొబైల్ యాప్ ద్వారా ఛార్జింగ్ స్టేషన్స్ గురించి సమాచారం తెలుసుకోవచ్చని టాటా పవర్ బిజినెస్ డెవలప్మెంట్-ఈవీ చార్జింగ్ హెడ్ వీరేంద్ర గోయల్ తెలిపారు. ఇదీ చదవండి: కోకా కోలా నుంచి మద్యం.. రేటెంతో తెలుసా? ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధి పెరుగుతున్న సమయంలో ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య కూడా పెరగాల్సి ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 6000 కంటే ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నట్లు, వీటి సంఖ్యను 2024 నాటికి 10000 చేర్చడానికి కంపెనీ కృషి చేస్తున్నట్లు సమాచారం. అనుకున్నవన్నీ సక్రమంగా జరిగితే రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ సమస్యలు దాదాపు తొలగిపోతాయని స్పష్టంగా తెలుస్తోంది. -
ఆస్ట్రేలియాలో ఇండియన్ బ్రాండ్ డీలర్షిప్ ఎలా ఉందో చూసారా.. (వీడియో)
Mahindra Dealership In Austrelia: ఇటీవల ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ 'మాథ్యూ హేడెన్' కుమార్తె 'గ్రేస్ హేడెన్' ఇండియన్ బ్రాండ్ కారుని ఆస్ట్రేలియాలో కొనుగోలు చేసింది. కారు డెలివరీకి సంబంధించిన వీడియోను 'మహీంద్రా ఆస్ట్రేలియా' తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసింది. ఇందులో మహీంద్రా డీలర్షిప్ ఆస్ట్రేలియాలో ఎలా ఉందనేది స్పష్టంగా చూడవచ్చు. భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా సంస్థ కార్లు, ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. అక్కడ ఇండియన్ బ్రాండ్ కార్లకు మంచి డిమాండ్ ఉన్న కారణంగానే ఈ ఎగుమతులు జరుగుతాయి. ఇటీవల గ్రేస్ భారతదేశానికి వచ్చినప్పుడు మహీంద్రా తయారీ కర్మాగారాన్ని సందర్శించే అవకాశం లభించిందని, అక్కడే మహీంద్రా కార్లు ఎలా తయారవుతాయనేది చూసినట్లు ఆమె వెల్లడించింది. ఆ తరువాత తాను మహీంద్రా XUV700 కారుని కొనుగోలు చేయాలనుకుని.. ఆస్ట్రేలియాలోని కంపెనీ డీలర్షిప్ వద్ద డెలివరీ తీసుకుంది. యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయిన వీడియోలో గ్రేస్ డీలర్షిప్ సందర్శించడం, అక్కడ తనకు నచ్చిన మిడ్నైట్ బ్లాక్ షేడ్లోని XUV700 డెలివరీ తీసుకోవడం వంటివి చూడవచ్చు. ఈ డీలర్షిప్ లోపల ఇతర కార్లు కూడా ఉండటం చూడవచ్చు. ఇదీ చదవండి: ఏం ప్లానింగయ్యా.. ఏమీ చేయకపోయినా నెలకు రూ.9 లక్షలు సంపాదన ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ.. బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం చూస్తుంటే ఓ కొత్త ఎనర్జీ వస్తుందని ట్వీట్ చేశారు. ఈ వీడియో అతి తక్కువ సమయంలోనే తెగ వైరల్ అయింది. వేలమంది వీక్షించిన వీడియోపై కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. Very few things in business more energizing than seeing your brand expand globally… pic.twitter.com/3S5rijDbvS — anand mahindra (@anandmahindra) December 10, 2023 -
రూ.1.32 లక్షల కవాసకి బైక్ - వివరాలు
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జపనీస్ బైక్ తయారీ సంస్థ కవాసకి.. ఎట్టకేలకు దేశీయ విఫణిలో ఓ సరికొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ కంటే తక్కువ ధర వద్ద అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త కవాసకి బైక్ పేరు 'డబ్ల్యూ175 స్టీట్'. దీని ధర రూ. 1.35 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 12000 తక్కువ ధరకే లభిస్తుంది. బుకింగ్స్, డెలివరీలకు సంబంధించిన వివరాలు కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. సింపుల్ డిజైన్ కలిగిన ఈ బైక్ బ్లాక్-అవుట్ ఫినిషింగ్లతో చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో 177 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 13 హార్స్ పవర్, 13.2 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పనితీరు పరంగా అద్భుతంగా ఉండవచ్చని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఈ బైక్ కొనుగోలుపై రూ.60,000 డిస్కౌంట్.. కవాసకి డబ్ల్యూ175 స్టీట్ బైక్ హాలోజన్ హెడ్లైట్, అనలాగ్ ఇన్స్ట్రుమెంటేషన్ వంటివి పొందుతుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ బైక్ తక్కువ ధర వద్ద విడులవడంతో మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నారు. -
లాంచ్కు సిద్దమవుతున్న సరికొత్త హెలికాఫ్టర్ - ఇది చాలా స్పెషల్..
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో కొత్త కొత్త వాహనాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్, CNG కార్లతో పరుగులు పెడుతున్న ఆటోమొబైల్ మార్కెట్లో మరో అడుగు ముందుకు వేసి మానవరహిత హెలికాప్టర్ను ఉత్పత్తి చేస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రోటర్ టెక్నాలజీస్ ఇప్పుడు ఓ మానవ రహిత హెలికాప్టర్ తయారు చేయడంలో నిమగ్నమైంది. రాబిన్సన్ ఆర్44 రావెన్ II ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ ఆర్550ఎక్స్ హెలికాఫ్టర్ మూడు గంటల కంటే ఎక్కువ సమయం, గంటకు 241 కిమీ/గం వేగంతో ప్రయాణించనుంది. ఇది సుమారు 550 కేజీల బరువును తీసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఆర్550ఎక్స్ హెలికాఫ్టర్ టెస్టింగ్కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చాలా సింపుల్గా కనిపించే ఈ హెలికాప్టర్ను రిమోట్స్ వంటి పరికరాల ద్వారా ఆపరేట్ చేయడం చూడవచ్చు. ఇది చూడటానికి ఓ డ్రోన్ తరహాలో ఉంది. ఇందులో సెన్సార్లు, ఇతర ఆధునిక పరికరాలు ఉండటం వల్ల రాత్రి పూట కూడా వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు. ఇది సాధారణ నాలుగు సీట్లు కలిగిన హెలికాఫ్టర్ మాదిరిగానే కనిపించినప్పటికీ.. ఇందులో పెద్ద కార్గో బే తప్ప సీట్లు లేదు. ఇందులో ఏదైనా లోడ్ (సరుకులు) వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. గ్రౌండ్ బేస్డ్ శాటిలైట్ కమ్యూనికేషన్ రిలే నుంచి 16 కిమీ లేదా ఎయిర్బోర్న్ రిలే 16000 కిమీ వరకు కమ్యూనికేట్ చేయడానికి అనుకూలంగా ఉందనున్నట్లు సమాచారం. కమ్యూనికేషన్లు పోయినట్లయితే.. ఏక కాలంలో ఆరు వేర్వేరు డేటా లింక్లను రన్ చేయగలదు, తద్వారా మళ్ళీ కనెక్ట్ చేసుకోవచ్చు, తద్వారా తిరిగి దాని బేస్లోకి తీసుకురావచ్చు. ఇలాంటి హెలికాఫ్టర్లు కార్గో డెలివరీలు, అగ్నిప్రమాదం సమయంలో అగ్నిమాపక మిషన్లుగా కూడా పనిచేస్తాయి. ఇదీ చదవండి: దిగ్గజ వ్యాపారవేత్తల రైట్ హ్యాండ్స్.. వీళ్లు ఎంత చెప్తే అంతే! ఈ లేటెస్ట్ హెలికాఫ్టర్ల కోసం కంపెనీ స్పెషల్ ఎయిర్వర్తినెస్ సర్టిఫికేట్ కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఇవి ఇంకా టెస్టింగ్ దశలోనే ఉన్నాయి, త్వరలోనే అవసరమైన సర్టిఫికెట్స్ కూడా పొందనున్నట్లు తెలుస్తుంది. సంస్థ ఈ రోటర్ ధరను అధికారికంగా వెల్లడించలేదు, అయితే వీటి డెలివరీలు 2024లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Images Source: Rotor Technologies -
ఈ బైక్ కొనుగోలుపై రూ.60,000 డిస్కౌంట్..
జపనీస్ బైక్ తయారీ సంస్థ కవాసకి భారతీయ మార్కెట్లో అమ్మకాలను పెంచుకోవడానికి, కొత్త కస్టమర్లను ఆకర్శించడానికి ఇయర్ ఎండ్ ఆఫర్స్ ప్రకటించింది. ఎంపిక చేసిన కొన్ని బైక్స్ మీద కంపెనీ రూ. 20,000 నుంచి రూ. 60,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 👉 కవాసకి వెర్సిస్ 650 అడ్వెంచర్ టూరర్ కొనుగోలుపై సంస్థ రూ. 20,000 తగ్గింపుని అందిస్తోంది. రూ. 7.77 లక్షల ధర వద్ద లభించే ఈ బైక్ డిస్కౌంట్ తరవాత రూ. 7.57 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. 👉 నింజా 650 స్పోర్ట్బైక్ కొనుగోలుపైన కవాసకి రూ. 35,000 తగ్గింపుని అందిస్తోంది. దీంతో రూ. 7.16 లక్షల ధర వద్ద ఉన్న ఈ బైకుని రూ. 6.81 లక్షలకు సొంతం చేసుకోవచ్చు. 👉 కంపెనీ అందించే గరిష్ట మొత్తం రూ. 60,000. ఈ డిస్కౌంట్ కేవలం వల్కన్ S క్రూయిజర్పై మాత్రమే లభిస్తుంది. రూ. 7.10 లక్షల ఖరీదైన ఈ బైకుని డిస్కౌంట్ తరువాత రూ. 6.50 లక్షలకు కొనుగోలు చేసుకోవచ్చు. 👉 కంపెనీ ప్రస్తుతం ట్విన్ సిలిండర్ మోడళ్లపై మాత్రమే డిస్కౌంట్లను అందిస్తోంది. రానున్న రోజుల్లో సింగిల్ సిలిండర్ మోడల్స్ మీద కూడా మంచి తగ్గింపులను అందించే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
చేతులు లేని మహిళకు డ్రైవింగ్ లైసెన్స్.. సీఎం చేతుల మీదుగా..
మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం, వాహనాలను డ్రైవ్ చేయాలంటే తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయం దాదాపు అందరికి తెలుసు. ఇటీవల రెండు చేతులూ లేని ఓ మహిళకు కేరళ మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ లైసెన్స్ జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పుట్టుకతోనే చేతులు లేకుండా పుట్టిన 'జిలుమోల్ మరియెట్ థామస్' (Jilumol Mariet Thomas) ఎలాగైనా డ్రైవింగ్ నేర్చుకోవాలనే పట్టుదలతో ఐదు సంవత్సరాలు కృషి చేసి డ్రైవింగ్ నేర్చుకుంది. నేర్చుకోవడమే కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందింది. జిలుమోల్ కారు డ్రైవింగ్ చేయడానికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో మీరు గమనించినట్లయితే ఈమె కాళ్లతోనే కారుని డ్రైవ్ చేయడం చూడవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం మొదట్లో అప్లై చేసుకున్నప్పుడు అధికారులు తిరస్కరించారు. కానీ పట్టు వదలకుండా డ్రైవింగ్ నేర్చుకుని చివరికి సంబంధిత అధికారుల చేతులమీదుగానే డ్రైవింగ్ లైసెన్స్ పొందింది. లైసెన్స్ కోసం జిలుమోల్ చేసిన అభ్యర్థనను ఐదేళ్ల క్రితం అధికారులు తిరస్కరించడంతో ఆమె రాష్ట్ర వికలాంగుల కమిషన్ను ఆశ్రయించారు. ఈ కేసు కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ను కోరింది. ఈ కేసును క్షుణ్ణంగా అధ్యయనం చేసి తగిన పరిష్కారం చూపాలని ఎర్నాకులం జిల్లాలోని మోటారు వాహన శాఖ అధికారులను రవాణా కమిషనర్ ఆదేశించింది. జిలుమోల్ కారుని సవ్యంగా డ్రైవింగ్ చేయగలదా లేదా అనే విషయాన్నీ మోటారు వాహన శాఖ అధికారులు పూర్తిగా తెలుసుకున్నారు. అయితే ఈమె కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కారు ఉండాలని వారు తీర్మానించారు. దీంతో ఒక సంస్థ 2018 మోడల్ సెలెరియో హ్యాచ్బ్యాక్కి కావలసిన మార్పులను చేస్తూ సవరించింది. జిలుమోల్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కారుని ఆమె తన పాదాలతోనే ఆపరేట్ చేయవచ్చు. అంతే కాకుండా ఈ కారులోని కొన్ని ఫీచర్స్ యాక్టివేట్ చేయడానికి వాయిస్ రికగ్నిషన్ కూడా అందించింది. ఈమె ఈ ఏడాది మార్చిలో లెర్నర్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, నవంబర్లో డ్రైవింగ్ టెస్ట్ కూడా పాసయ్యింది. ఇదీ చదవండి: ఆర్బీఐ ఖాతాలో మరో బ్యాంక్.. లైసెన్స్ క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వు కస్టపడి అనుకున్నది సాధించిన 'జిలుమోల్'కు కేరళ ముఖ్యమంత్రి స్వయంగా డ్రైవింగ్ లైసెన్స్ అందించారు. చేతులు లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ సాధించిన మొదటి మహిళా ఈమె కావడం గమనార్హం. జిలుమోల్ ఆర్టిస్ట్ కావడం వల్ల ప్రస్తుతం ఒక ప్రైవేట్ సంస్థలో గ్రాఫిక్ డిజైనర్గా పనిచేస్తోంది. -
భారత్లో లాంచ్ అయిన ఇటాలియన్ సూపర్ - ధర తెలిస్తే అవాక్కవుతారు
ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు తన కొత్త 'రెవెల్టో' (Revuelto) కారుని లాంచ్ చేసింది. రూ.8.89 కోట్ల ధర వద్ద విడుదలైన ఈ కారు డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఈ కొత్త కారు డిజైన్, ఫీచర్స్, ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ రెవెల్టో చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. వై షేప్ హెడ్లైట్, ఎయిర్ ఇన్టేక్లు, టెయిల్ లైట్స్ వంటి వాటిని పొందుతుంది. వెనుక భాగంలో హెక్సా గోనల్ ఎగ్జాస్ట్ పోర్ట్లు చూడవచ్చు. ముందు భాగంలో 20 ఇంచెస్ వీల్స్, వెనుక భాగంలో 21 ఇంచెస్ వీల్స్ ఉంటాయి. ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 8.4 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్స్క్రీన్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ డిస్ప్లే, 9.1 ఇంచెస్ ప్యాసింజర్-సైడ్ డిస్ప్లే వంటివి ఉన్నాయి. ఈ మూడు స్క్రీన్లు ఫిజికల్ కంట్రోల్స్ పొందుతుంది. స్టీరింగ్ వీల్ కూడా కంట్రోల్ బటన్స్ పొందుతుంది. సౌకర్యవంతమైన సీట్లు కలిగిన ఈ కారు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇదీ చదవండి: షారుక్ ఖాన్ గ్యారేజిలో ఇదే ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు - ధర ఎంతో తెలుసా? లంబోర్ఘిని రెవెల్టో సూపర్ కారు మూడు ఎలక్ట్రిక్ మోటార్లతో 1015 హార్స్ పవర్, 807 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 2.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ సూపర్ కారు టాప్ స్పీడ్ గంటకు 350 కిమీ కావడం గమనార్హం. ఇది ఇండియన్ మార్కెట్లో 'ఫెరారీ SF90 స్ట్రాడేల్'కి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
షారుక్ ఖాన్ గ్యారేజిలో ఇదే ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు - ధర ఎంతో తెలుసా?
భారతీయ మార్కెట్లో 'హ్యుందాయ్' (Hyundai) కంపెనీ తన 'ఐయోనిక్ 5' (Ioniq 5) ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించినప్పటి నుంచి ఎంతోమంది వాహన ప్రియుల మనసు దోచేసింది. ఇటీవల బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కూడా ఈ కారుని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత 20 సంవత్సరాలుగా హ్యుందాయ్ ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్న షారూఖ్ ఖాన్కు కంపెనీ 'ఐయోనిక్ 5' 1100వ యూనిట్ను డెలివరీ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్పో 2023లో ఐయోనిక్ 5 ఈవీ లాంచ్ సమయంలో కూడా షారుక్ పాల్గొన్నారు. ఇప్పటికే అత్యంత ఖరీదైన కార్లను కలిగి ఉన్న షారుక్ ఖాన్ గ్యారేజిలో చేరిన మొదటి ఎలక్ట్రిక్ కారు 'హ్యుందాయ్ ఐయోనిక్ 5' కావడం గమనార్హం. మొదటి సారి గ్యారేజిలో ఎలక్ట్రిక్ కారు చేరటం ఆనందంగా ఉందని, అందులోనూ హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కారు చేరటం మరింత సంతోషంగా ఉందని షారుక్ వెల్లడించారు. భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు 72.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఒక ఫుల్ ఛార్జ్తో 630 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారు 350 కిలోవాట్ డీసీ ఛార్జర్ ద్వారా 18 నిముషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకుంటుంది. హ్యుందాయ్ ఐయోనిక్ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 46 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇదీ చదవండి: తుఫాన్ ప్రభావం.. కొత్త సర్వీసులకు శ్రీకారం చుట్టిన ఆటోమొబైల్ కంపెనీలు షారూఖ్ ఖాన్ ఇతర కార్లు ప్రపంచంలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటుల జాబితాలో ఒకరైన షారుక్ అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కార్లను కొనుగోలు చేశారు. ఈయన వద్ద ఉన్న కార్లలో బెంట్లీ కాంటినెంటల్ GT, రోల్స్ రాయిస్ ఫాంటమ్, మెర్సిడెస్-బెంజ్ S-క్లాస్, బుగట్టి వేరాన్ స్పోర్ట్స్, ఆడి A6, రేంజ్ రోవర్ వోగ్, హ్యుందాయ్ క్రెటా వంటివి మరెన్నో ఉన్నాయి. -
కొత్త కారు కష్టమే..! పెరగనున్న ఆ బ్రాండ్ ధరలు
2023 ముగియడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. రానున్న కొత్త సంవత్సరంలో ఆటోమొబైల్ సెక్టార్లోని చాలా కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచడానికి చూస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2024 ప్రారంభం నుంచి 'హోండా కార్స్ ఇండియా' (Honda Cars India) కార్ల ధరలను పెంచనున్నట్లు తెలిపింది. ముడిసరుకుల ధరలు పెరగటం వల్ల ధరల పెరుగుదల తప్పడం లేదని కంపెనీ స్పష్టం చేసింది. ధరల పెరుగుదల ఎంత శాతం అనే వివరాలు ఈ నెల చివరి నాటికి వెల్లడించనున్నట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ 'కునాల్ బెహ్ల్' వెల్లడించారు. భారతీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు వెళుతున్న హోండా.. తమ ఉత్పత్తుల ధరలను పెంచినట్లయితే అమ్మకాల మీద ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు, కానీ హోండా బాటలోనే మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆడి వంటి కంపెనీలు నడుస్తుండటంతో సేల్స్ మీద ప్రభావం పెద్దగా ఉండక పోవచ్చని తెలుస్తోంది. ఇదీ చదవండి: చైనా వద్దు భారత్ ముద్దు.. ఇండియాపై పడ్డ అమెరికన్ కంపెనీ చూపు.. దేశీయ దిగ్గజం టాటా మోటార్స్, జర్మన్ బేస్డ్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ కూడా తమ ఉత్పత్తుల ధరలను 2024 ప్రారంభం నుంచి పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే నిజమైతే టాటా, బెంజ్ కార్లు కొత్త సంవత్సరంలో ఖరీదైనవిగా మారతాయి. -
7 సీటర్ విభాగంలో టాప్ 5 కార్లు, ఇవే..
భారతీయ మార్కెట్లో కేవలం చిన్న కార్లకు మాత్రమే కాకుండా 7 సీటర్ కార్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ కథనంలో దేశీయ విఫణిలో కొంత తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ టాప్ 5.. 7 సీటర్ కార్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రెనాల్ట్ ట్రైబర్ ఇండియన్ మార్కెట్లో రూ. 6.34 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే రెనాల్ట్ ట్రైబర్'' ఈ జాబితాలో చెప్పుకోదగ్గ 7 సీటర్. సేఫ్టీలో 4 స్టార్ రేటింగ్ పొందిన ఈ కారు 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 71 Bhp పవర్, 96 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్బాక్స్ కలిగి మంచి పనితీరుని అందిస్తుంది. మారుతి సుజుకి ఎర్టిగా మారుతి సుజుకి కంపెనీకి చెందిన ఎర్టిగా భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న 7 సీటర్ కారు. దీని ధరలు రూ. 8.64 లక్షల నుంచి రూ. 13.08 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇందులోని 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 102 బీహెచ్పి పవర్ 136 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్ పొందుతుంది. టయోటా రూమియన్ టయోటా కంపెనీకి చెందిన రూమియన్ అనేది మారుతి సుజుకి ఎర్టిగా రీబ్యాడ్జ్ వెర్షన్. ఈ MPV ధరలు రూ. 10.29 లక్షల నుంచి రూ. 13.68 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇది కూడా మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరుని అందిస్తుంది. మహీంద్రా బొలెరో నియో దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన బొలెరో నియో ధరలు రూ. 9.64 లక్షల నుంచి రూ. 11.38 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇందులోని 1.5 లీటర్, 4 సిలిండర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ 99 బీహెచ్పి పవర్, 260 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ని విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్తో వస్తుంది. ఇదీ చదవండి: నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. సైబర్ట్రక్ లాంచ్ చేసిన టెస్లా - ధర ఎంతంటే? కియా కారెన్స్ 7 సీటర్ విభాగంలో చెప్పుకోదగ్గ కారు కియా కారెన్స్. దీని ధర రూ. 10.45 లక్షల నుంచి రూ. 19.45 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు 113 బీహెచ్పి పవర్, 144 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కియా కారెన్స్ కారులోని 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్, 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్లలో లభిస్తుంది. ఇవన్నీ కూడా మంచి పనితీరుని అందిస్తాయి. -
నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. సైబర్ట్రక్ లాంచ్ చేసిన టెస్లా - ధర ఎంతంటే?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టెస్లా 'సైబర్ట్రక్' (Cybertruck) డెలివరీలు ఎట్టకేలకు మొదలయ్యాయి. ఈ కొత్త సైబర్ట్రక్ వేరియంట్స్, ధరలు, రేంజ్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టెస్లా సైబర్ట్రక్ ప్రారంభ ధర 60990 డాలర్లు (రూ. 50.83 లక్షలు), హై వేరియంట్ ధర 99,990 డాలర్లు (రూ. 83.21 లక్షలు). ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ ట్రక్ డెలివరీలు సౌత్ అమెరికాలో మాత్రమే జరిగినట్లు సమాచారం. రానున్న రోజుల్లో మరిన్ని డెలివరీలు జరిగే అవకాశం ఉంది. కొత్త టెస్లా సైబర్ట్రక్ కోసం బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. దీని కోసం ముందస్తుగా 100 డాలర్లు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇది డ్యూయెల్, ట్రై మోటర్ అనే రెండు ఆప్షన్లలలో లభిస్తుంది. డ్యూయెల్ మోటార్ 600 బీహెచ్పీ పవర్, ట్రై మోటార్ 845 బీహెచ్పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదీ చదవండి: చైనా వద్దు భారత్ ముద్దు.. ఇండియాపై పడ్డ అమెరికన్ కంపెనీ చూపు.. డ్యూయెల్ మోటార్ మోటార్ 3.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ, ట్రై మోటార్ మోడల్ 2.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టెస్లా సైబర్ట్రక్ రేంజ్ 547 కిమీ వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ ట్రక్ మంచి డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ ట్రక్ను 2025 నాటికి తక్కువ ధరతో విడుదల చేసే అవకాశం ఉంది. -
చిరంజీవితో స్టెప్పులేసిన బ్యూటీ.. ఇప్పడు కారు కొన్న ఆనందంలో..
ప్రముఖ నటి 'గౌహర్ ఖాన్' (Gauahar Khan) ఇటీవల ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈమె కొన్న ఆ కారు ఏది? దాని ధర ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నా పేరే కాంచనమాలా పాటతో శంకర్ దాదా MBBS సినిమాలో చిరంజీవితో స్టెప్పులేసి తెలుగు ప్రేక్షకులను అలరించిన 'గౌహర్ ఖాన్' కొనుగోలు చేసిన లగ్జరీ కారు 'మెర్సిడెస్ బెంజ్' కంపెనీకి చెందిన 'జీఎల్ఈ'. ఈ కారు ధర సుమారు రూ. కోటి కంటే ఎక్కువ అని తెలుస్తోంది. ఈ కారుని డెలివరీ చేసుకోవడానికి సంబంధించిన ఫోటోలను ముంబైలోని కంపెనీ అధీకృత మెర్సిడెస్-బెంజ్ డీలర్ అయిన ఆటోహంగర్ అండ్ గ్లామర్ డైరీస్ ఫోటోలను, వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీడియోలో గమనించినట్లైతే గౌహర్ ఖాన్ తన భర్త జైద్ దర్బార్తో కలిసి ముంబైలోని మెర్సిడెస్-బెంజ్ డీలర్షిప్లోకి వెళ్లడాన్ని చూడవచ్చు. లగ్జరీ కారుని మాత్రమే కాకుండా వీరు తమ పిల్లల కోసం ఓ బొమ్మ బెంజ్ కారుని కొన్నట్లు తెలుస్తోంది. వీడియోలో ఈ చిన్న కారు కూడా పార్క్ చేసి ఉండటం చూడవచ్చు. గౌహర్ ఖాన్ తన భర్త జైద్ దర్బార్ ఇద్దరూ బొమ్మ కారుని ఆవిష్కరించిన తరువాత, బెంజ్ కారుని ఆవిష్కరించారు. ఇది బెంజ్ GLE300d LWB వెర్షన్ అని తెలుస్తోంది. ఇది మంచి డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇదీ చదవండి: ఆ రోజు మీటింగ్లో కూడా సత్య నాదెళ్లకు అదే ధ్యాస.. బ్లాక్ షేడ్లో కనిపించే ఈ కారు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ కలిగి 245 పీఎస్ పవర్, 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 9జీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో ఉత్తమ పనితీరుని అందిస్తుంది. ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ కలిగిన ఈ కారు వాహన వినియోగదారుల భద్రతకు పెద్ద పీట వేస్తుంది. View this post on Instagram A post shared by Mercedes-Benz Auto Hangar India Pvt Ltd (@autohangar) -
సింగిల్ ఛార్జ్ 200 కిమీ రేంజ్! ధర కూడా తక్కువే..
Komaki LY Electric Scooter: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న తరుణంలో దాదాపు అన్ని సంస్థలు ఈ రంగం వైపే జోరుగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే దేశీయ మార్కెట్లో విడుదలైన 'కొమాకి ఎల్వై' (Komaki LY) ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కంపెనీ ఇప్పుడు అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లాంచ్ సమయంలో రూ. 96,968 వద్ద అమ్ముడైన ఈ స్కూటర్ ఇప్పుడు రూ. 78,000 వద్ద లభిస్తోంది. అంటే కంపెనీ ఈ స్కూటర్ మీద రూ. 18,968 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ కేవలం పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. నగర ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని తయారైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్, డ్యూయల్ బ్యాటరీ ఎంపికలలో అందుబాటులో ఉంది. సింగిల్ బ్యాటరీతో కూడిన స్కూటర్ 85 కిలోమీటర్ల రేంజ్ అందిస్తే, డ్యూయల్ బ్యాటరీ స్కూటర్ 200 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే వాస్తవ ప్రపంచంలో రేంజ్ కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఇదీ చదవండి: కలిసొచ్చిన చంద్రయాన్ 3 సక్సెస్ - బిలియనీర్ల జాబితాలోకి కొత్త వ్యక్తి రిమూవబుల్ బ్యాటరీ కలిగిన 'కొమాకి ఎల్వై' (Komaki LY) ఎలక్ట్రిక్ స్కూటర్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. ఇది బ్యాటరీ స్టేటస్, న్యావిగేషన్ వంటి మరిన్ని వివరాలను రైడర్కు తెలియజేస్తుంది. ఆన్బోర్డ్లో సౌండ్ సిస్టమ్ ఉండటం వల్ల, బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా ప్లే చేయవచ్చు. డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. -
ఈ బైక్ కొనుగోలుపై రూ.1.97 లక్షల డిస్కౌంట్ - నేడే ఆఖరు..
భారతీయ మార్కెట్లో ఎక్కువ మంది బైక్ రైడర్లు ఇష్టపడే బైక్ బ్రాండ్లలో ఒకటి 'డుకాటి' (Ducati). ఫెస్టివల్ సీజన్ పూర్తయిన తరువాత కూడా ఈ కంపెనీ కస్టమర్ల కోసం ఎంపిక చేసిన మోడల్ మీద భారీ డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. ఇంతకీ ఏ బైకుపై సంస్థ డిస్కౌంట్ అందిస్తోంది, డిస్కౌంట్ తర్వాత ఈ బైక్ ధర ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డుకాటి కంపెనీకి చెందిన మాన్స్టర్ (Monster) బైకుపై సంస్థ ఏకాంగి రూ. 1.97 లక్షలు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ బైక్ ధర రూ. 12.95 లక్షలు కాగా.. డిస్కౌంట్ తరువాత ఇది రూ. 10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ కేవలం ఈ రోజు (నవంబర్ 30) వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. డుకాటి మాన్స్టర్ బైక్ 937 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజన్ కలిగి 9250 ఆర్పీఎమ్ వద్ద 109 బీహెచ్పీ పవర్, 6500 ఆర్పీఎమ్ వద్ద 92 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది స్లిప్పర్ క్లచ్, డుకాటి క్విక్ షిఫ్ట్ ద్వారా 6-స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది, తద్వారా అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీల నిర్ణయంపై 'ఎలాన్ మస్క్' ఘాటు వ్యాఖ్యలు దేశీయ మార్కెట్లో డుకాటి మాన్స్టర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి స్టాండర్డ్, ఎస్పీ వేరియంట్లు. ప్రారంభంలో ఈ బైక్ రూ. 15.95 లక్షల ధర వద్ద విడుదలైంది, ఆ తరువాత ఈ ధరలు కొంత అతగ్గుముఖం పట్టాయి. దీంతో ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. -
నయనతార కోసం ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఫోటోలు వైరల్
Mercedes-Benz Maybach: ప్రముఖ నటి నయనతార నవంబర్ 18న తన 39వ పుట్టినరోజు జరుపుకుంది. బర్త్డే జరిగిన రెండు వారాల తరువాత తన భర్త శివన్ నుంచి ఓ ఖరీదైన గిఫ్ట్ అందుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నయనతార కోసం.. శివన్ సుమారు రూ. 3 కోట్ల జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెస్ బెంజ్ గిఫ్ట్గా ఇచ్చాడు. ఖరీదైన గిఫ్ట్ అందుకున్న నయన్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫోటోలు షేర్ చేస్తూ.. వెల్కమ్ హోమ్ యూ బ్యూటీ అంటూ.. మై డియర్ హస్బెండ్, మధురమైన పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు, లవ్ యు అంటూ వెల్లడించింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు తమదైన రీతిలో శుభాకంక్షలు తెలియజేస్తున్నారు. నయనతార గిఫ్ట్గా పొందిన కారు మెర్సిడెజ్ బెంజ్ మేబ్యాచ్ అని తెలుస్తోంది. అయితే ఇందులో ఏ మోడల్ అనేది స్పష్టంగా తెలియడం లేదు. బెంజ్ మేబ్యాచ్ కార్లు జీఎల్ఎస్, ఎస్-క్లాస్ అనే రెండు వేరియంట్లలో లభిస్తున్నాయి. ఈ రెండు లగ్జరీ కార్ల ధరలు రూ. 3 కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది. ఇదీ చదవండి: రతన్ టాటా మేనేజర్ కొత్త కారు ఇదే.. చూసారా! ఇప్పటికే ఈ లగ్జరీ కారుని దీపికా పదుకొణె, కృతి సనన్, రామ్ చరణ్ వంటి ప్రముఖ సినీతారలు కూడా కొనుగోలు చేశారు. భారతదేశంలో లభిస్తున్న అత్యంత ఖరీదైన బీవేంజ్ కార్లలో మేబ్యాచ్ కూడా ఒకటి. ఇది చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగి, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఈ కారణంగానే చాలామంది సెలబ్రిటీలు దీనిని ఎగబడి మరీ కొనుగోలు చేస్తున్నారు. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
రతన్ టాటా మేనేజర్ కొత్త కారు ఇదే.. చూసారా!
Shantanu Naidu New Tata Safari Facelift: దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ ఇటీవలే భారతీయ మార్కెట్లో హారియర్, సఫారీ ఫేస్లిఫ్ట్ వెర్షన్లను విడుదల చేసింది. ప్రీ-ఫేస్లిఫ్ట్ వెర్షన్ల మాదిరిగానే అద్భుతంగా ఉన్న ఈ మోడల్స్ చాలా మంది కొనుగోలుదారులను మరింత ఆకర్షిస్తున్నాయి. ఇటీవల రతన్ టాటా మేనేజర్, గుడ్ఫెలోస్ వ్యవస్థాపకుడు 'టాటా సఫారీ ఫేస్లిఫ్ట్' (Tata Safari Facelift) కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గతంలో టాటా నానో కారుని ఉపయోగించే రతన్ టాటా మేనేజర్ 'శంతను నాయుడు' (Shantanu Naidu) తాజాగా ఖరీదైన సఫారీ ఫేస్లిఫ్ట్ సొంతం చేసుకున్నారు. వైట్ కలర్లో ఆకర్షణీయంగా ఉన్న ఈ కారులో ఇప్పటికే 1000 కిమీ ప్రయాణించినట్లు, దానికి 'యుకీ' అని పేరు కూడా పెట్టుకున్నట్లు సమాచారం. టాటా సఫారీ ఫేస్లిఫ్ట్ రూ. 16.19 లక్షల ప్రారంభ ధరలో దేశీయ విఫణిలో లాంచ్ అయిన సఫారీ ఫేస్లిఫ్ట్ మొత్తం 10 వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో టాప్ వేరియంట్ ధర రూ. 27.34 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు చాలా వరకు లేటెస్ట్ ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇదీ చదవండి: రూ.1000 కోట్ల కంపెనీకి తిరుగులేని అధినేత్రి.. చిన్నప్పుడే.. సఫారీ ఫేస్లిఫ్ట్ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి 170 హార్స్ పవర్, 350 న్యూటన్ మాటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ఆటోమేటిక్ గేర్బాక్స్ కలిగి ఉత్తమ పనితీరుని అందిస్తుంది. కాస్మిక్ గోల్డ్, గెలాక్సీ సఫైర్, లూనార్ స్లేట్, స్టార్డస్ట్ యాష్, స్టెల్లార్ ఫ్రాస్ట్, సూపర్నోవా కాపర్ వంటి ఆరు కలర్ ఆప్సన్లలో లభించే ఈ కారు ఎకో, సిటీ, స్పోర్ట్స్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ పొందుతుంది. -
మంటల్లో చిక్కుకున్న మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. వీడియో వైరల్!
పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి.. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. అయితే అప్పుడప్పుడు వెలుగులోకి వచ్చే సంఘటనలు మాత్రం ఎలక్ట్రిక్ వాహనాలను కొనాలనుకునే వారి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అనుకోకుండా ఎలక్ట్రిక్ వాహనాల్లో చెలరేగే మంటలు వినియోగదారుల్లో భయాన్ని కలిగిస్తున్నాయి. గత కొన్ని రోజులకు ముందు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ నడిరోడ్డుపై కాలిపోయిన సంఘటన మరిచిపోక ముందే.. ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాగిన నేషనల్ గ్రీన్ ఆటోమొబైల్ వినియోగదారు తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేసిన వీడియోలో.. ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లో పెద్దగా మంటలు రావడం చూడవచ్చు. నడిరోడ్డులో కాలుతున్న స్కూటర్లో మంటలు అదుపుచేయడానికి ప్రయత్నించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన పూణేలో జరిగినట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగటానికి సంబంధించిన వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు, గత రెండు సంవత్సరాల్లో, ఓలా ఎలక్ట్రిక్, ఆంపియర్ ఎలక్ట్రిక్, ఒకినావా, ప్యూర్ ఈవీ, జితేంద్ర ఈవీ వంటి అనేక బ్రాండ్ వాహనాలు మంటల్లో చిక్కుకున్న సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనల్లో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇదీ చదవండి: గేర్బాక్స్ రిపేర్కు రూ.5.8 లక్షలు - బిల్ చూసి అవాక్కయిన కారు ఓనర్.. ఈ సంఘటనల మీద కేంద్ర ప్రభుత్వం స్పందించి కంపెనీ అధికారులతో చర్చలు జరిగి.. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కానీ ఇప్పటికి కూడా అక్కడక్కడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం జరిగిన ఈ సంఘటన మీద కంపెనీ స్పందించకపోవడం గమనార్హం. స్కూటర్ కాలిపోవడానికి ప్రధాన కారణాలు తెలియాల్సి ఉంది. @futureiselectr2 @GreavesCottonIN @airnewsalerts @ABPNews @aajtak @ampere_ev @EVehiclesindia @NITIAayog @rushlane @NetflixIndia @OlaElectric Ampere Battery Blast in Ampere magnus ex, Why companies playing with the life of innocent customers, GOI must take strict action against . pic.twitter.com/FsVMTlGYET — Nagina National Green Automobile (@SanjayChou89866) November 20, 2023 -
లాంచ్కు సిద్దమవుతున్న కొత్త కార్లు - వివరాలు
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది, విస్తరిస్తున్న మార్కెట్ అవసరాలను తీర్చడానికి వాహన తయారీదారులు కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నారు. దేశీయ విఫణిలో త్వరలో విడుదలయ్యే టాప్ 5 కార్లను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 2024 మారుతి సుజుకి స్విఫ్ట్ దేశీయ మార్కెట్లో ఇప్పటికే అత్యధిక అమ్మకాలు పొందిన మారుతి సుజుకి సరికొత్త అవతార్లో విడుదలకావడానికి సిద్ధమవుతోంది. 2024 మారుతి సుజుకి స్విఫ్ట్ పేరుతో విడుదలకానున్న ఈ కొత్త కారు ఇప్పటికే చాలాసార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఇది 2024 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. టాటా పంచ్ ఈవీ సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ కలిగిన టాటా పంచ్ త్వరలో ఎలక్ట్రిక్ కారుగా విడుదల కావడానికి సన్నద్ధమవుతోంది. ఇది జెనరేషన్ 2 ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్తో వస్తుందని భావిస్తున్నారు. ఒక ఛార్జ్తో సుమారు 300 కిమీ నుంచి 350 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. సరైన గణాంకాలు లాంచ్ సమయంలో అధికారికంగా విడుడలవుతాయి. హ్యుందాయ్ క్రెటా ఫేస్లిఫ్ట్ కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్లిఫ్టెడ్ వెర్షన్ అవుట్గోయింగ్ మోడల్ కంటే ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంటుందని, ఇందులో ADAS వంటి లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయని తెలుస్తోంది. 2024 ప్రారంభంలో విడుదల కానున్న ఈ కారు ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. మహీంద్రా థార్ 5 డోర్ ప్రారంభం నుంచి ఉత్తమ అమ్మకాలు పొందిన మహీంద్రా థార్.. త్వరలో 5 డోర్ రూపంలో విడుదలకానుంది. ఇప్పటికే పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ కారు అవుట్గోయింగ్ వెర్షన్తో పోలిస్తే అదనపు టెక్నాలజీ, ఫీచర్స్ పొందనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ లైట్ - కొత్త ఫీచర్స్తో సరికొత్త ఎక్స్పీరియన్స్.. టాటా కర్వ్ ఈవీ 2023 ఆటో ఎక్స్పోలో కనువిందు చేసిన టాటా కర్వ్ ఈవీ 2024 చివరి నాటికి భారతీయ మార్కెట్లో లాంచ్ అవుతుందని సమాచారం. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు ఫుల్ ఛార్జ్తో 400 కిమీ నుంచి 500 కిమీ పరిధిని అందిస్తుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.