Contractors
-
కాంట్రాక్టర్లకు వరం ఖజానాకు సున్నం
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పనుల టెండర్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ వంటి పారదర్శక, అవినీతి రహిత విధానాలు రద్దయిపోయాయి. ఇష్టారీతిన నిబంధనల సడలింపులు, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేసి కాంట్రాక్టర్లకు ప్రభుత్వ ఖజానాను దోచి పెట్టి కమీషన్లు దండుకొనే పద్ధతులు వచ్చేశాయి. ఇందులో భాగంగా తాము కోరుకొనే బడా కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా తాజాగా నిబంధనలు రూపొందించారు. కాంట్రాక్టర్లు భారీ మొత్తంలో పనులు దక్కించుకునేలా బిడ్ సామర్థ్యం లెక్కింపు నిబంధనను 2 ఏఎన్–బీ నుంచి 3 ఏఎన్–బీగా సడలించే ప్రతిపాదనపై మంత్రివర్గంతో ఈనెల 6న ఆమోద ముద్ర వేయించారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2003 జూలై 1న జారీ చేసిన జీవో 94 ద్వారా రూపొందించిన టెండర్ విధానంలో బిడ్ కెపాసిటీని మార్చుతూ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నెంబరు 4) జారీ చేశారు.విదేశీ రుణ సాయంతో చేపట్టిన ప్రాజెక్టుల పనులు మినహా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ), అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్), జల్జీవన్ మిషన్ సహా అన్ని శాఖల ద్వారా చేపట్టే పనులకు జారీ చేసే టెండర్ నోటిఫికేషన్లకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే కాంట్రాక్టర్లు దక్కించుకున్న పనులను ఆ టెండర్ నిబంధనల్లో నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయకపోవడం వల్ల వాటి అంచనా వ్యయం పెరిగి ప్రభుత్వ ఖజానాపై భారం పడుతోంది.అయినా అదే కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో మరిన్ని పనులు అప్పగించేలా నిబంధనలను సడలించడంపై ఇంజినీరింగ్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అడిగినంత కమీషన్ ఇచ్చే కాంట్రాక్టర్లకే పనులు కట్టబెట్టడానికే బిడ్ సామర్థ్యం లెక్కించే ప్రతిపాదనను సడలించారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.రూ.వేల కోట్ల పనులు కట్టబెట్టేందుకే..అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) రుణం రూ.15 వేల కోట్లతో చేపట్టిన పనులకు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది. 2024 ఏప్రిల్ 1 నాటికి ఒప్పంద విలువలో 25 శాతం లోపు పూర్తయిన పనులను రద్దు చేసి, వాటి స్థానంలో కొత్తవి చేపట్టేందుకు సిద్ధమైంది. జల వనరులు, పురపాలక పట్టణాభివృద్ధి, రహదారులు భవనాలు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు – మౌలిక సదుపాయాల కల్పన శాఖల పరిధిలో పలు పనులు చేపడుతోంది.అడిగినంత కమీషన్ ఇచ్చే కాంట్రాక్టర్లకే కట్టబెట్టి వాటి ఒప్పంద విలువలో ప్రభుత్వ ఖజానా నుంచి 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి, అందులో 8 శాతాన్ని కమీషన్గా రాబట్టుకోవడానికి స్కెచ్ వేశారు. ఈ క్రమంలోనే బిడ్ సామర్థ్యం లెక్కింపు నిబంధనను 3 ఏఎన్–బీగా మార్చారు. ఈ నిబంధనలో ‘ఏ’ అంటే గత ఐదేళ్లలో ఏదైనా ఒక ఏడాది గరిష్టంగా పనులు పూర్తి చేసి, పురోగతిలో ఉన్న పనుల విలువ. ‘ఎన్’ అంటే టెండర్ నోటిఫికేషన్లో ఆ పని పూర్తి చేయడానికి నిర్దేశించిన సమయం. ‘బీ’ అంటే ఆ కాంట్రాక్టర్ అప్పటికే దక్కించుకున్న పనుల్లో మిగిలిన పనుల విలువ.ఉదాహరణకు ఓ కాంట్రాక్టర్ పదేళ్లలో ఒక ఏడాది గరిష్టంగా రూ.1000 కోట్ల విలువైన పనులు చేశారనుకుందాం. ప్రస్తుతం టెండర్ పిలిచిన పనిని రెండేళ్లలో పూర్తి చేయాలని నిబంధన పెట్టారనుకుందాం. అప్పటికే ఆ కాంట్రాక్టర్ దక్కించుకున్న పనుల్లో మిగిలిన పనుల విలువ రూ.500 కోట్లు అనుకుందాం. అప్పుడు 3 ఏఎన్–బీ కింద ఆ కాంట్రాక్టర్కు రూ.5,500 కోట్ల విలువైన పనులు దక్కించుకోవడానికి అర్హత వస్తుంది. అదే 2 ఏఎన్–బీ కింద అయితే ఆ కాంట్రాక్టర్కు రూ.3,500 కోట్ల విలువైన పనులకే అర్హత ఉంటుంది.పనుల్లో జాప్యం.. ఖజానాపై తీవ్ర భారం సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి పథకాలతోపాటు వివిధ విభాగాల్లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు గడువులోగా పనులు పూర్తి చేయడంలేదు. తీవ్ర జాప్యం జరుగుతోంది. సిమెంట్, ఇనుము, పెట్రోల్, డీజిల్ తదితర ధరలు పెరగడం వల్ల అంచనా వ్యయం కూడా భారీగా పెరుగుతోంది. దీని వల్ల ఖజానాపై తీవ్రంగా భారం పడుతోంది. ప్రభుత్వ తాజా నిబంధన వల్ల రూ.వంద కోట్ల విలువైన పనులను రెండేళ్లలో పూర్తి చేయలేక చతికిలబడిన కాంట్రాక్టర్కే కొత్తగా రూ.వెయ్యి కోట్ల విలువైన పనులు దక్కుతాయి.వీటినీ రెండేళ్లలో పూర్తి చేసేలా ప్రభుత్వం నిబంధనను సడలించింది. రూ.100 కోట్ల పనులకే వనరులు సమకూర్చుకోలేక, ఏళ్ల కొద్దీ జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లు.. అంతకంటే పదింతల పనిని ఎలా చేయగలుగుతారని ఇంజినీర్లు అంటున్నారు. ఫలితంగా ఆ పనుల ఫలితాలను ప్రజలకు అందించడంలో తీవ్ర జాప్యం జరగడంతోపాటు ప్రభుత్వ ఖజానాపై పెద్ద ఎత్తున భారం పడుతుందని, ఇది ప్రజలను ఇబ్బందులకు గురిచేయడమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కాలం చెల్లిన సరుకులు...కుళ్లిన గుడ్లు
సాక్షి, హైదరాబాద్: పురుగులు పట్టిన బియ్యం, కుళ్లిన గుడ్లు, పాడైపోయిన కూరగాయలు, గడువు తీరిపోయిన (ఎక్స్పైర్ అయిన) నిత్యావసరాలు, అపరిశుభ్ర పరిస్థితుల్లో వాటి నిల్వ... ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లలో ఎక్కడ చూసినా ఇదే దుస్థితి. ఇదేమిటని అధికారులు ప్రశి్నస్తే... కాంట్రాక్టర్ల నుంచి నాణ్యతలేని సరుకులు వస్తున్నాయని, ఇదేమిటంటే రాజకీయ నేతల పేర్లు చెప్తుండటంతో ఏమీ చేయలేకపోతున్నామనే సమాధానాలు వస్తున్నాయి. అదే సమయంలో విద్యా సంస్థల్లో అపరిశుభ్ర పరిసరాలు, నిర్లక్ష్యం కూడా అధికారుల తనిఖీలలో స్పష్టంగా బయటపడుతోంది.కలుషిత ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం... క్షేత్రస్థాయిలో తనిఖీలకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మండల స్థాయి అధికారులు మొదలుకొని కలెక్టర్ల వరకూ తనిఖీలు ప్రారంభించారు. అటు రాష్ట్రస్థాయి విద్యాశాఖ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, విద్యా కమిషన్ చైర్మన్, సభ్యులు కూడా పరిశీలన చేపట్టారు. ఈ క్రమంలో విద్యా సంస్థలు, హాస్టళ్లలో దారుణమైన పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి.కాంట్రాక్టర్లు కారణమంటూ.. ⇒ నాణ్యత లోపించిన ఆహారం కనిపించినా, కలుషితమైన ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురైనా... సంబంధిత స్కూల్ ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎంలు), ఇతర క్షేత్రస్థాయి విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవడం పరిపాటి అయిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. నాణ్యతలేని సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లను వదిలిపెట్టి తమను వెంటాడితే ఫలితం ఏమిటని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురుకులాలకు పాలు, పండ్లు, అల్లం, వెల్లుల్లి, కూరగాయలు, గుడ్లు, చికెన్ ఇతర నిత్యావసరాలను టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో జీసీసీ ద్వారా హాస్టళ్లకు కూడా కాంట్రాక్టర్లే సరుకులు ఇస్తున్నారు.గడువు తీరిన నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారని హెచ్ఎంలు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. కాంట్రాక్టర్లు పల్లీపట్టీలు, మసాలా దినుసులు ఎక్కడ కొనుగోలు చేసి, తెస్తున్నారో తెలియని పరిస్థితి ఉందని.. అరటిపండ్లను దూర ప్రాంతాల నుంచి తీసుకొస్తుండటంతో విద్యా సంస్థలకు చేరేలోగా కుళ్లిపోతున్నాయని అంటున్నారు. ప్రధానోపాధ్యాయులు వాటిని గుర్తించి, తిరస్కరిస్తే కాంట్రాక్టర్లు ఎదురుదాడికి దిగుతున్నారని చెబుతున్నారు. ప్రతి కాంట్రాక్టర్ ఏదో ఒక రాజకీయ నాయకుడికి అనుచరుడు కావడం, ఆ నేతల పేర్లు చెప్పి బెదిరిస్తుండటంతో ఏమీ చేయలేకపోతున్నామని వాపోతున్నారు. వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా తమను బలి చేస్తే ఆహార నాణ్యత ఎలా పెరుగుతుందని ప్రశి్నస్తున్నారు. విద్యాసంస్థలకు పౌర సరఫరాల శాఖ సరఫరా చేస్తున్న బియ్యంలోనూ పురుగులు ఉంటున్నాయని చెబుతున్నారు.పరిశీలనలో వెలుగు చూసిన వాస్తవాలెన్నో ⇒ ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం పంగిడి మాదర వసతి గృహంలో చిన్నారులకు చెంచాలతో పాలు పోస్తున్న తీరు తనిఖీల్లో బయటపడింది. ఇక్కడ పాలలో రాగిమాల్ట్, బెల్లం వంటివేవీ కలిపి ఇవ్వడం లేదు. ⇒ కెరమెరి మండలం గిరిజన ఆశ్రమ పాఠశాలలో గడువు తీరిన ఉప్పు ప్యాకెట్ను కలెక్టర్ గుర్తించారు. అలాగే గడువు తీరిన ఉప్పు ప్యాకెట్లు ఆసిఫాబాద్ జీసీసీ గోదాంలో 12 క్వింటాళ్లు, చిక్కీలు 12 క్వింటాళ్లు ఉన్నట్టు తేలింది. ⇒ విద్యార్థులకు వారంలో నాలుగుసార్లు గుడ్డు ఇవ్వాలి. అది కనీసం 50 గ్రాముల కన్నా ఎక్కువ బరువు ఉండాలి. కానీ 40 గ్రాముల కన్నా తక్కువ ఉండే చిన్న గుడ్లు ఇస్తున్నారని, అందులోనూ పలుచోట్ల కుళ్లిపోయిన గుడ్లు వస్తున్నాయని అధికారుల పరిశీలనలో తేలింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. కాంట్రాక్టర్లను నోటిమాటగానే హెచ్చరిస్తున్నారని, ఎలాంటి చర్య తీసుకోవడం లేదని పలువురు ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. ⇒ మహబూబ్నగర్ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం అమలును అధికారులు తనిఖీ చేశారు. చాలా చోట్ల 3, 4 రోజులకోసారి కూరగాయలు తీసుకొస్తున్నారు. వండే సమయానికి అవి చెడిపోతున్నాయని, పురుగులు, దోమలు వాలుతున్నట్టు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ⇒ ధన్వాడలోని కేజీబీవీని నారాయణపేట కలెక్టర్ రాత్రివేళ తనిఖీ చేశారు. అక్కడ నిల్వ ఉంచిన వంకాయలు మెత్తబడిపోయి ఉన్నట్టు గుర్తించారు. మరికల్ తహసీల్దార్ సాంఘిక సంక్షేమ గురుకులాన్ని సందర్శించారు. నేలపై కూరగాయలు కుప్పలుగా పోసి నిల్వచేసి ఉన్నాయి. దీనితో కలుషి తమై, అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉందని సిబ్బందిపై తహసీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ⇒ మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివనూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో వంట చేసే ఆవరణ అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు. విద్యార్థులు చేతులు, కంచాలు కడిగే చోట దుర్వాసన వస్తోంది. వెల్దుర్తి మండలం కుకునూరు ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ లేకపోవడంతో.. భోజనం సమయంలో కుక్కలు, పందులు వస్తున్నాయి. -
కాంట్రాక్టర్లకు మళ్లీ మొబిలైజేషన్ అడ్వాన్స్లు
సాక్షి, అమరావతి: కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చే విధానాన్ని మళ్లీ పునరుద్ధరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విధానాన్ని తిరిగి తీసుకొస్తేనే పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకొస్తారనే అభిప్రాయం వ్యక్తమవడంతో దాన్ని మళ్లీ తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిసింది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆ నిర్ణయాలను ప్రభుత్వం బయటకు వెల్లడించే అవకాశంలేకపోవడంతో వాటిని అధికారికంగా విడుదల చేయలేదు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలిలా ఉన్నాయి..» రాష్ట్రంలో నేరాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వాటిని తగ్గించేందుకు పీడీ చట్టాన్ని పటిష్టం చేసేలా చట్టాన్ని సవరించాలని తీర్మానించారు. » లోకాయుక్త చట్టాన్ని సవరించే నిర్ణయానికి ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. లోకాయుక్తను నియమించే సమయంలో ప్రతిపక్ష నేత ఉండాల్సి ఉన్నందున.. ప్రస్తుతం ప్రతిపక్ష నేత లేని పరిస్థితిలో ఏం చేయాలనే దానిపై మంత్రులు చర్చించారు. పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షం లేకుండానే ఇలాంటి వ్యవహారాల్లో ఎలా వ్యవహరించారో ఇక్కడ కూడా అలాగే వ్యవహరించాలని నిర్ణయించారు. » ఎస్ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డు) సమావేశంలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. » దేవాలయ కమిటీల్లో అదనంగా ఇద్దరు సభ్యులకు చోటు కల్పించేలా చట్టాన్ని సవరించాలన్న నిర్ణయానికి అంగీకారం తెలిపారు. » కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఆమోదం.. » యాంటీ నార్కోటిక్స్ విభాగం ఏర్పాటుకు ఆమోదం తెలిపి దానికి ఈగల్ అని పేరు పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. » ఏపీ టవర్ కార్పొరేషన్ను ఫైబర్ గ్రిడ్లో విలీనం చేయడానికి ఆమోదం తెలిపారు. » అమరావతిలో నిర్మాణ పనులకు మళ్లీ కొత్తగా టెండర్లు పిలవడానికి ఆమోదం తెలిపింది. ఇందుకోసం సాంకేతిక కమిటీ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. » నూతన క్రీడలు, పర్యాటక విధానాలకు ఆమోదం తెలిపారు. అధికారులు చెప్పింది చెప్పినట్లుగా బయటకు చెప్పొద్దు..ఇక మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలిసింది. పర్యాటక, స్పోర్ట్స్ పాలసీల్లో స్థానికంగా ప్రతిభ చూపించే విద్యార్థులను ప్రోత్సహించాలని ఉపముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ సూచించారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే క్రమంలో అది సురక్షితంగా ఉండేలా చూడాలని, లేకపోతే ఇబ్బందులు వస్తాయనే అంశంపై చర్చ జరిగింది. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని పవన్ అభిప్రాయపడ్డారు. మంత్రులు సీరియస్గా ఉండాలని అధికారులు చెప్పే విషయాలను సరిచూసుకోవాలని వారు చెప్పింది చెప్పినట్లు బయటకు చెప్పకూడదని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా మంత్రులకు చెప్పినట్లు తెలిసింది. -
పనులన్నీ వదిలేసి వెళ్లిపోండి!
‘మీరు చేస్తున్న పనులు ఉన్నది ఉన్నట్టుగా వదిలేసి వెళ్లిపొండి..! లేదంటే కేసులు ఎదుర్కోవడానికి సిద్ధపడండి..! మీ కంపెనీ తరఫున మేం పనులు చేస్తాం.. బిల్లులు కూడా మేమే తీసుకుంటాం..!’ – తస్మదీయ కాంట్రాక్టర్లకు టీడీపీ ముఖ్యనేతల అల్టిమేటం.‘అలాగైతే.. మీరు చేసే అక్రమాలకు మేం బాధ్యత వహించాల్సి వస్తుంది..! మాకు ఇవ్వాల్సిన బిల్లులు ఇచ్చేసి.. ఏపీడీఎస్ఎస్ (ఆంధ్రప్రదేశ్ డీటెయిల్డ్ స్టాండర్డ్ స్ఫెసిఫికేషన్స్) 60 సీ నిబంధన కింద కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేయండి! కావాలంటే ఈ వ్యవహారంపై మేం కోర్టులో సవాల్ చేయబోమని హామీ కూడా ఇస్తాం!’ – కాంట్రాక్టర్ల ప్రతిపాదన.సాక్షి, అమరావతి: గతంలో అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన మాదిరిగానే 2014–19 తరహాలోనే 60 సీ నిబంధన కింద పనుల ఒప్పందాలను రద్దు చేసి.. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి.. అస్మదీయులకు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకునేందుకు టీడీపీ ముఖ్యనేతలు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నుంచి రహదారుల వరకు వివిధ శాఖల పరి«ధిలో చేపట్టిన నిర్మాణ పనులపై కన్నేసి అస్మదీయ కాంట్రాక్టర్లను పనులు చేసుకునేందుకు అనుమతిస్తున్న టీడీపీ నేతలు.. తస్మదీయ కాంట్రాక్టర్లను మాత్రం అడ్డుకుంటున్నారు.ఉన్నఫళంగా పనులు వదిలేసి వెళ్లిపోవాలంటూ హుంకరిస్తున్నారు. తమకే పనులు అప్పగించాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. మీ కంపెనీ తరఫున పనులు చేస్తాం.. బిల్లులు మేం తీసుకుంటామని ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనకు కాంట్రాక్టు సంస్థలు ఒప్పుకోవడం లేదు. చేసిన పనుల్లో ఏవైనా లోపాలు తలెత్తితే వాటికి తాము బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి తనకు రూ.2 వేల కోట్ల మేర బిల్లులు రావాలని.. వాటిని ఇప్పించి, తాను చేస్తున్న పనుల కాంట్రాక్టు ఒప్పందాలన్నీ రద్దు చేసుకోవాలని ఓ బడా కాంట్రాక్టు సంస్థ అధినేత టీడీపీ ముఖ్యనేతలకు సూచించారు. పాత విధానంలో దూకుడుగాకాంట్రాక్టర్లు తమ ఒత్తిళ్లకు లొంగకపోవడంతో 2014–19లో అమలు చేసిన విధానానికే టీడీపీ నేతలు మరింత పదును పెట్టారు. సాగునీటి ప్రాజెక్టుల నుంచి రహదారుల పనుల వరకూ తస్మదీయ కాంట్రాక్టు సంస్థలు చేస్తున్న పనులను 60 సీ కింద రద్దు చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఆ తర్వాత మిగిలిన పనులకు 2024–25 ఎస్ఎస్ఆర్(స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్) ప్రకారం అంచనాలను రూపొందించి.. ఎక్కువ కమీషన్ ఇచ్చే కాంట్రాక్టర్లకు వాటిని కట్టబెట్టడానికి సిద్ధమయ్యారు. -
ఉరవకొండలో పచ్చమూకల ఉరుములు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండలో అరాచకాలకు హద్దులేకుండా పోతోంది. కాంట్రాక్టర్లు మొదలుకుని అధికారుల వరకూ అందరినీ టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. తమకు తలవంచకపోతే ఇక్కడ పనిచేసుకోలేరని నేరుగా హెచ్చరిస్తున్నారు. ఇలా కూటమి సర్కారు కొలువుదీరిన నాటినుంచి ఉరవకొండలో చోటామోటా నాయకులు, మండల స్థాయి లీడర్లు చెలరేగిపోతున్నారు. మాట వినకపోతే దౌర్జన్యాలకూ తెగబడుతున్నారు. తాజాగా.. ఓ సెక్యూరిటీ ఏజెన్సీకి వస్తున్న బెదిరింపులు ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశమవుతోంది. సెక్యూరిటీ ఏజెన్సీకి బెదిరింపులు గతంలో ఉరవకొండ నియోజకవర్గంలో అత్యధికంగా గాలిమరలు (విండ్మిల్స్) ఏర్పాటుచేశారు. వీటి భద్రతను ఎస్ఐఎస్ సెక్యూరిటీ ఏజెన్సీ 100 మంది సిబ్బందితో పర్యవేక్షిస్తోంది. కానీ, ఈ సెక్యూరిటీ సిబ్బందిని తొలగించి తమ మనుషులను పెట్టుకోవాలని.. మాట వినకపోతే ఇక్కడ ఉండలేరంటూ ఉరవకొండకే చెందిన మంత్రి పయ్యావుల కేశవ్ మనుషులు ఏజెన్సీని బెదిరిస్తున్నారు. కొన్నిచోట్ల వీరు బరితెగించి సెక్యూరిటీ సిబ్బందిని బలవంతంగా బయటకు లాగి యూనిఫాం వేసుకుని విధుల్లో చేరారు. వీరి ఆగడాలు చూసి ఏమీచేయలేక అక్కడున్న కంపెనీ ఇంజనీర్లు నోరెత్తడంలేదు. ఈ క్రమంలోనే తాజాగా కొందరు టీడీపీ నేతలు ఉరవకొండకు సమీపంలోని నింబగల్లు విండ్మిల్ సబ్స్టేషన్లో గొడవకు దిగి కార్యాలయానికి తాళాలు వేసినట్లు తెలిసింది. ఆ తర్వాత వివాదం సద్దుమణగడంతో మళ్లీ తెరిచారు. ప్రస్తుతానికి అక్కడున్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులను తొలగించి కొత్తవారిని పెట్టారు. మరోవైపు.. ఎస్ఐఎస్ సంస్థకు 2026 వరకూ కాంట్రాక్టు ఉంది. కానీ, తక్షణమే కాంట్రాక్టు వదిలివెళ్లాలని పచ్చమూకలు బెదిరిస్తున్నాయి. ముఖ్యమంత్రికి ఫిర్యాదు.. ఈ దౌర్జన్యాలు, బెదిరింపులపై సెక్యూరిటీ సంస్థ యాజమాన్యం ముఖ్యమంత్రి కార్యాలయానికి, విద్యాశాఖా మంత్రి లోకేశ్కూ ఫిర్యాదు చేసింది. తమ విధులకు ఆటంకాలు కల్పిస్తూ స్థానిక నాయకులు బెదిరిస్తున్నారని.. నిజానికి.. తాము స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించామని, అయినా సరే వెళ్లిపోవాలని తమను ఒత్తిడి చేస్తున్నట్లు అందులో పేర్కొంది. కానీ, వీరి నుంచి ఎలాంటి స్పందన లేకపోగా టీడీపీ నేతల బెదిరింపులూ కొనసాగుతున్నాయి. మంత్రి ఇలాకాలో తమ్ముళ్ల ఆగడాలు..» విడపనకల్లు మండలం గాజుల మల్లాపురం గ్రామంలో నాగరాజు అనే వ్యక్తి ఎనిమిదెకరాలు మొక్కజొన్న పంట వేయగా టీడీపీ నేతలు ఆ భూమి మాదంటూ పంటను ధ్వంసం చేశారు.» ఇదే మండలం చీకలగురికి గ్రామంలో ఓబులేసు, చౌడమ్మ దంపతులు రెండున్నర ఎకరాల్లో కందిపంట వేశారు. ఈ భూమి కూడా తమదేనంటూ పంటను ధ్వంసం చేసి భూమిని ఆక్రమించుకున్నారు.»మంత్రి పయ్యావుల కేశవ్ స్వగ్రామం కౌకుంట్లకు సమీపంలో టీడీపీ మండల స్థాయి లీడర్ జూదం నిర్వహిస్తున్నా పోలీసులు చూసీచూడకుండా వదిలేశారు.» ఉరవకొండలో చౌకబియ్యం అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతోంది. డీలర్ల సహకారంతో టీడీపీ లీడర్లు దందా సాగిస్తున్నారు. -
‘కాళేశ్వరం’లో 50 మందికిపైగా సబ్ కాంట్రాక్టర్లు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల నిర్మాణంలో 50 మందికి పైగా సబ్కాంట్రాక్టర్లు పాలుపంచుకున్నారని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గుర్తించింది. బరాజ్ల నిర్మాణంలో సాంకేతి క లోపాలపై విచారణ తుది అంకానికి చేరుకుంది. దీంతో ఆర్థికపరమైన అవకతవకలపై కమిషన్ దృష్టి సారించింది. బ రాజ్ల నిర్మాణంలో అవకతవకలపై విచారణకు జస్టిస్ పినా కి చంద్రఘోష్ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బరాజ్ల పనులు దక్కించుకున్న నిర్మా ణ సంస్థలు చాలా పనులను నిబంధనలకు విరుద్ధంగా సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించినట్టు కమిషన్ నిర్థారణకు వచ్చింది. గత ప్రభుత్వంలోని ఓ ముఖ్యనేత సమీప బంధువులకు చెందిన కంపెనీలు సైతం సబ్ కాంట్రాక్టులు పొందాయని గుర్తించినట్టు తెలిసింది. తొలుత జారీచేసిన పరిపాలనాపర అను మతుల ప్రకారం బరాజ్ల నిర్మాణానికి అంచనా వ్యయం ఎంత? ఆ తర్వాత ఎన్నిసార్లు పెంచారు? ఎంత పెంచారు? గడువులోగానే పనులు పూర్తి చేసినప్పుడు అంచనా వ్యయం పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సబ్ కాంట్రాక్టర్లకు ఏ పనులు కట్టబెట్టారు? వారికి ఎంత చెల్లించారు? ఈ వ్యవహారంలో అవకతవకలు ఏమైన జరిగాయా? వంటి అంశాలపై ఆరా తీస్తోంది. బరాజ్ల ఆర్థిక వ్యవహారాలపై మరింత లోతుగా విచారణ నిర్వహించడానికి ఒక చార్టర్డ్ అకౌంటెంట్ను కమిషన్ కార్యాలయంలో నియమించాలని ప్రభుత్వా న్ని కోరింది. సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్లో కమిషన్కు సహకరించడానికి తెలంగాణ(కాళేశ్వరం ప్రాజెక్టు), పశ్చిమబెంగాల్(జస్టిస్ ఘోష్ సొంత రాష్ట్రం)తో సంబంధం లేని సీనియర్ న్యాయవాదిని సైతం నియమించాలని కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 పంప్హౌజ్ల పనులను నిర్వహించిన ఓ నిర్మాణ సంస్థకు సంబంధించిన వైస్ప్రెసిడెంట్తో సహా మరో ఇద్దరు ఉన్నత అధికారులను జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ గురువారం తన కార్యాలయంలో విచారించింది.పంప్హౌజ్ల నిర్మాణ స్థలం ఎంపిక, డిజైన్లు తదితర అంశాలపై కమిషన్ వారిని ప్రశ్నించగా, ప్రభుత్వం ఎంపిక చేసిన స్థలం, అందించిన డిజైన్ల ప్రకారమే వాటిని నిర్మించినట్టు ఆ కంపె నీ ప్రతినిధులు బదులిచ్చినట్టు తెలిసింది. ప్రాజెక్టుకు సంబంధించిన బిల్లుల జారీతో సంబంధం ఉన్న వర్క్ అండ్ అకౌంట్స్ విభాగం డైరెక్టర్ ఫణిభూషణ్ శర్మను సైతం కమిషన్ విచారించింది. విద్యుత్రంగ నిపుణుడు కె.రఘు ఈ నెల 15న, కేంద్ర జలశక్తిశాఖ మంత్రి మాజీ సలహాదారుడు వెదిరె శ్రీరాం ఈ నెల 16న కమిషన్ ముందు హాజరై కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తమ వద్ద ఉన్న సమాచారాన్ని అందించనున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి వీరు అనుమతి కోరగా, కమిషన్ అందుకు ఏర్పాట్లు చేస్తోంది. నేడు కమిషన్ ఎదుట రహస్య సాక్షి బరాజ్ల నిర్మాణంలో లోపాలను వ్యతిరేకిస్తూ తన ఉద్యోగాన్ని వదులుకున్న ఓ నిర్మాణ సంస్థలోని కీలక ఉద్యోగి శుక్రవారం కమిషన్ ముందు హాజరై తన వాదనలు వినిపించనున్నారు. తన వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్కు అందించనున్నారు. ఆయన వివరాలను కమిషన్వర్గాలు గోప్యంగా ఉంచాయి. -
బరాజ్లు కట్టిన సబ్ కాంట్రాక్టర్లు ఎవరు?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లను కాంట్రాక్టులు దక్కించుకున్న నిర్మాణ సంస్థలే నిర్మించాయా? లేక కాంట్రాక్టు నిబంధనలను విరుద్ధంగా సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాయా? అనే అంశంపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఆరా తీస్తోంది. మూడు బరాజ్ల నిర్మాణ పనుల్లో కనీసం 15 మంది సబ్ కాంట్రాక్టర్లు పాల్గొన్నట్టు కమిషన్కు కొందరు ఆధారాలు సమర్పించినట్టు సమాచారం. గత ప్రభుత్వంలో ముఖ్యమైన పదవిలో ఉన్న ఓ నేత దగ్గరి బంధువుకి సంబంధించిన ఓ కంపెనీ సైతం బరాజ్ల పనులను సబ్ కాంట్రాక్టుగా తీసుకుని నిర్వహించినట్టు తెలిసింది. దీంతో సబ్ కాంట్రాక్టర్ల వివరాలను సమర్పించాలని బ్యారేజీల నిర్మాణ సంస్థలను కమిషన్ ఆదేశించింది. సబ్ కాంట్రాక్టర్ల వివరాలను నిర్మాణ సంస్థలు సమర్పించకుంటే.. గత పదేళ్ల ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను సమర్పించాలని నిర్మాణ సంస్థలను కమిషన్ ఆదేశించనుంది. నిర్మాణ సంస్థలు అనుమానిత సబ్ కాంట్రాక్టర్లకు డబ్బులను చెల్లించినట్టు ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలో ఉండే అవకాశముంది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను సైతం నిర్మాణ సంస్థలు సమర్పించని పక్షంలో కేంద్ర పరిశ్రమల శాఖ నుంచి ఆ వివరాలను తెప్పించుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. మేడిగడ్డ నిర్ణయం కేసీఆర్దే..తుమ్మిడిహెట్టికి బదులు మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించాలనే నిర్ణయం నాటి సీఎం కేసీఆర్దేనని జస్టిస్ చంద్రఘో‹Ùకి రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ తెలిపింది. గోదావరిపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులపై అధ్యయనం కోసం రిటైర్డ్ సీఈలు బి.అనంతరాములు, వెంకటరామారావు, ఎస్.చంద్రమౌళి, రిటైర్డ్ ఎస్ఈలు జి.దామోదర్ రెడ్డి, ఎం.శ్యామ్ప్రసాద్ రెడ్డితో 2015లో నాటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీని శనివారం జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ బీఆర్కేఆర్ భవన్లోని తన కార్యాలయంలో విచారించింది. శ్యామ్ప్రసాద్ రెడ్డి మినహా మిగిలిన ఇంజనీర్లు కమిషన్ ముందు హాజరై తమ అభిప్రాయాలను తెలియజేశారు. మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తాము నివేదిక సమర్పించగా.. దానిని నాటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు తిరస్కరించారని, వాటిపై సంతకాలు సైతం చేయలేదని వివరించారు. కేసీఆర్ సూచనల మేరకే మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించినట్టు తెలిపారు. మహారాష్ట్రను ఒప్పించి తుమ్మిడిహెట్టి వద్ద 150–151 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించాలని సిఫారసు చేస్తూ అప్పట్లో సమర్పించిన ఈ నివేదిక ప్రతిని కమిషన్కు అందజేశారు. 27 తర్వాత కేసీఆర్, హరీశ్ను పిలిచే అవకాశం బరాజ్ల నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ నిర్వహిస్తున్న విచారణ తుది అంకానికి చేరింది. బరాజ్ల నిర్మాణంతో సంబంధం ఉన్న ఈఎన్సీ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు అధికారులందరినీ ఆయన పిలిపించి ప్రశ్నించారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఇతర రిటైర్డ్ ఇంజనీర్లను సైతం ప్రశ్నించారు. విచారణలో పేర్కొన్న అంశాలను ఈ నెల 27లోగా అఫిడవిట్ రూపంలో సమర్పించాలని వారందరినీ ఆదేశించారు. అఫిడవిట్ల పరిశీలన పూర్తైన తర్వాత తదుపరిగా ఎవరెవరెని విచారించాలన్న అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీశ్రావుతో పాటు బ్యారేజీల డీపీఆర్లను ఆమోదించిన కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఇంజనీర్లు, ఇతర అధికారులను సైతం పిలిపించి విచారించే అవకాశముంది. తదుపరి దశలో బహిరంగ విచారణ నిర్వహించి.. అఫిడవిట్లలో వివిధ వ్యక్తులు సమర్పించిన సమాచారం ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. -
హైవేల నిర్వహణ పదేళ్లు కాంట్రాక్టర్లదే
సాక్షి, అమరావతి: దేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారుల నిర్వహణ, మరమ్మతులకు సంబంధించి కాంట్రాక్టర్ల బాధ్యత కాలాన్ని రెట్టింపు చేసింది. అందుకోసం జాతీయ రహదారుల డ్యామేజీ లయబిలిటీని ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెంచింది. ఈమేరకు కాంట్రాక్టర్లకు విధి విధానాలను నిర్దేశించింది. దేశంలో భారీగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు జాతీయ రహదారుల నిర్వహణ లోపం కూడా ఓ ప్రధాన కారణమని నిపుణుల కమిటీ ఇటీవల నివేదించింది. 2022లో దేశంలో సంభవించిన 4.61 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.68 లక్షల మంది దుర్మరణం చెందారు. వాటిలో అత్యధికంగా 33 శాతం ప్రమాదాలు జాతీయ రహదారులపైన జరిగినవే. మొత్తం ప్రమాద మృతులు 1.68 లక్షల మందిలో జాతీయ రహదారులపై ప్రమాదాల్లోనే 24 శాతం మంది అంటే 41 వేల మంది దుర్మరణం చెందారు. 2021లో కంటే 2022లో జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు 12 శాతం పెరిగాయి. మృతుల సంఖ్య 9శాతం పెరిగింది. జాతీయ రహదారుల నిర్మాణంలో నాణ్యత లోపాలు, నిర్వహణ లోపం రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. దీంతో హైవేల నిర్వహణ విధానాన్ని మరింత పకడ్బందీగా రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జాతీయ రహదారులను నిర్మిస్తున్న కాంట్రాక్టు సంస్థలు ఐదేళ్ల పాటు వాటి నిర్వహణ చేపడుతున్నాయి. ఆ ఐదేళ్లలో రోడ్ల నిర్వహణ, గుంతలు పూడ్చడం, ఇతరత్రా మరమ్మతులు చేస్తాయి. ఆ తర్వాత ఆ బాధ్యతను ఎన్హెచ్ఏఐకి అప్పగిస్తున్నాయి. కానీ పలు కాంట్రాక్టు సంస్థలు కేవలం ఐదేళ్లే నాణ్యతతో ఉండేలా హైవేలను నిర్మిస్తున్నాయని ఎన్హెచ్ఏఐ ఆడిటింగ్ నివేదిక వెల్లడించింది. ఐదేళ్ల తర్వాత ఆ రోడ్లు దెబ్బతింటున్నాయి. వాటి నిర్వహణ భారం ఎన్హెచ్ఏఐపై పడుతోంది. దీనికి పరిష్కారంగానే నిర్వహణ బాధ్యతను పదేళ్లకు పెంచాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. ఈపీసీ, యాన్యుటీ, బీవోటీ పద్దతుల్లో నిర్మించే జాతీయ రహదారులకు ఈ నిబంధన వర్తిస్తుంది. తక్షణం అమలులోకి ఎన్హెచ్ఏఐ నూతన విధానాన్ని తక్షణం అమల్లోకి తెచ్చింది. ఇప్పటికే ఆమోదించిన జాతీయ రహదారుల నిర్మాణాలకు కొత్త విధానాన్ని వర్తింపజేసింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ చేపట్టినవాటికి, త్వరలో చేపట్టబోయే వాటికి కూడా ఈ విధానం వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా రూ.7.81 లక్షల కోట్లతో 25,713 కిలోమీటర్ల హైవేల నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ ఆమోదించింది. వాటిలో ఈపీసీ విధానంలో 56 శాతం, 42శాతం యాన్యుటీ విధానంలో, 2 శాతం బీవోటీ విధానంలో నిర్మించనుంది. వీటి నిర్మాణాన్ని చేపట్టే కాంట్రాక్టు సంస్థలు పదేళ్లపాటు వాటి నిర్వహణ, మరమ్మతుల బాధ్యతను చేపట్టాలి. తాజా నిర్ణయం వల్ల జాతీయ రహదారుల నిర్మాణంలో నాణ్యత పెరుగుతుందని, నిర్వహణ కూడా సక్రమంగా ఉంటుందని ఎన్హెచ్ఏఐ అధికారవర్గాలు తెలిపాయి. -
రూ. లక్ష పెంచితేనే ‘డబుల్ బెడ్రూం’ ఇళ్ల పనులు!
సాక్షి, హైదరాబాద్: నిర్వహణ లోపాలతో ఇప్పటికే అస్తవ్యస్తంగా మారిన రెండు పడక గదుల ఇళ్ల విషయంలో కొత్త సమస్య తలెత్తింది. ప్రాజెక్టు యూనిట్ కాస్ట్ను భారీగా పెంచాలని కాంట్రాక్టర్లు గృహనిర్మాణ సంస్థకు తేల్చి చెప్పారు. ఒక్కో ఇంటిపై రూ.లక్ష చొప్పున యూనిట్ కాస్ట్ను సవరించాలని, లేని పక్షంలో పనులు కొనసాగించలేమని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇప్పుడు అధికారులు ఇదే విషయాన్ని కొత్త ప్రభుత్వం ముందు ప్రతిపాదించనున్నారు. అసలే ఖజానాకు తీవ్ర భారంగా మారిన ఈ ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టి గృహలక్ష్మి పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. పనులు ప్రారంభించిన ఇళ్లను మాత్రం పూర్తి చేసి, టెండర్లు పిలవాల్సిన వాటిని ప్రారంభించకపోవటమే మంచిదన్న అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. ఇప్పుడు కాంట్రాక్టర్ల కొత్త డిమాండ్తో, అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయటం కొత్త సవాల్గా మారబోతోంది. ఎందుకు పెంచుతున్నారంటే.. ఇల్లు లేని పేదలకు ఏకంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఉచితంగా అందించాలని అప్పట్లో బీఆర్ఎస్ సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కావటంతో ఒక్కో ఇంటికి ప్రాంతాల వారీగా రూ.5.10 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. కానీ, ఆ మొత్తం కూడా సరిపోదని, యూనిట్ కాస్ట్ను పెంచాలని పథకాన్ని ప్రారంభించిన కొత్తలోనే కాంట్రాక్టర్లు కోరారు. దీంతో చాలా ప్రాంతాల్లో టెండర్లకు స్పందన కూడా లేకుండా పోయింది. కాంట్రాక్టర్లతో పలువురు మంత్రులు స్వయంగా భేటీ అవుతూ, ఇతర ప్రాజెక్టుల్లో పనులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొనటంతో కొన్ని ప్రాంతాల్లో టెండర్లకు స్పందన వచ్చింది. ఆ క్రమంలో పనులు మొదలైనా, ఆ యూనిట్ కాస్ట్తో ప్రాజెక్టులు పూర్తి చేయటం కష్టమంటూ చాలా మంది పనులను నెమ్మదిగా చేస్తూ వచ్చారు. తాజాగా ఇప్పుడు యూనిట్ కాస్ట్ను పెంచకుంటే పనులు చేయలేమని, ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందని, రూ.లక్ష మేర పెంచాలంటూ ఇటీవల వారు ప్రతిపాదించినట్టు తెలిసింది. ఈ ఇళ్లను పూర్తి చేసేందుకు రూ.4500 కోట్లు అవసరం రాష్ట్రవ్యాప్తంగా 2.93 లక్షల ఇళ్లను నిర్మించేందుకు పరిపాలన అనుమతులు ఇవ్వగా, 2.29 లక్షల ఇళ్లకు టెండర్లు పూర్తయ్యాయి. వీటిల్లో ఇప్పటి వరకు 1.55 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. ఇంకా 74 వేల ఇళ్లు పూర్తి చేయాల్సి ఉంది. వీటిల్లో 45 వేలు తుది దశలో ఉన్నాయి. వీటిని కచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్లు ముందుకు రాని పక్షంలో యూనిట్ కాస్ట్ పెంచాల్సిందే. ఈ మేరకు ఈ ఇళ్లను పూర్తి చేసేందుకు రూ.4500 కోట్లు అవసరం. కాగా, లబ్ధిదారుల జాబితా రూపొందించకుండానే పనులు జరుపుతున్న తీరును తప్పుపడుతూ కేంద్రప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాసయోజన నిధులు ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో నిధుల కోసం తీవ్ర ఇబ్బందులు ఉన్న తరుణంలో, అదనంగా భారం పడటం పథకానికి శరాఘాతంగా మారనుంది. -
పోలవరంపై బాబువి కాకి లెక్కలు
బి.కొత్తకోట : గత టీడీపీ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కాకిలెక్కలు చెబుతున్నారని జలవనరులశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) సీ నారాయణరెడ్డి విమర్శించారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్పై శనివారం ఆయన హంద్రీనీవా ప్రాజెక్టు రెండో దశ పనులపై మదనపల్లె ఎస్ఈ సీఆర్ రాజగోపాల్తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ ప్రాజెక్టులపై మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. గత ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల పోలవరం ప్రాజెక్టుకు రూ.2వేల కోట్ల నష్టం వాటిల్లింది. అప్పట్లో కాంట్రాక్టర్లు లాభదాయకమైన పనులు మాత్రమే చేసి సొమ్ము చేసుకున్నారు. నిజానికి.. పోలవరం పనుల పరిశీలనకు వచ్చిన చంద్రబాబు అక్కడ ఆరు కిలోమీటర్ల మేర గోదావరి ప్రవాహాన్ని మళ్లించి చేపట్టిన పనులను చూసి ఆశ్చర్యపోవడమే కాక ఏమి మాట్లాడలేకపోయారు. అలాగే.. కుప్పంకు అక్టోబర్లో శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను తరలిస్తాం. కుప్పం ఉపకాలువ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయిస్తున్నాం. ఇక్కడ రూ.535 కోట్లతో రెండు రిజర్వాయర్లు ప్రతిపాదించాం. అవుకు రెండో సొరంగం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇక్కడినుంచి ఒక టీఎంసీ నీటిని గండికోట ప్రాజెక్టుకు తరలిస్తాం. గత ప్రభుత్వం ఈ పనులను వదిలేసింది. డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లోని 68 చెరువులకు హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను తరలించి నింపుతాం. ఈ కార్యక్రమం సీఎం చేతుల మీదుగా ప్రారంభమవుతుంది. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు గురించి తప్పుదోవ పట్టిస్తున్న చంద్రబాబు తన ప్రభుత్వంలో నిర్వహణకు కేవలం రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఇందులో రూ.కోటిన్నర పార్కు కోసం ఖర్చుచేసి.. మిగతా రూ.3.5 కోట్లను భోంచేశారు. వెలిగొండ మొదటి సొరంగం పనులు పూర్తిచేశాం. రెండో సొరంగం పనులు అక్టోబర్లోగా పూర్తికి చర్యలు తీసుకుంటున్నాం. ఇక కర్ణాటక చేపట్టిన అప్పర్ తుంగభద్ర ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో కేసు వేశాం. ఆ పనులు ముందుకు సాగే పరిస్థితుల్లేవు. శ్రీశైలం జలాశయంలో 66 శాతం జలాలు ఏపీ వాటాకు వస్తాయి. ఇరు రాష్ట్రాల నీటి పంపకాలు జరగలేదని తెలంగాణ వాదించడం సరికాదు. దీనిపై తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశాం. ఉత్తరాంధ్రకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులను రూ.2వేల కోట్ల వ్యయంతో పూర్తిచేయనున్నాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం మొదటి దశ ఒక టీఎంసీ సామర్థ్యంతో తాగునీటి సంబంధిత పనులు ప్రారంభమయ్యాయి. -
దాల్ మే కుచ్ కాలా హై!
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కందిపప్పు టెండర్ దాఖలు ప్రక్రియలో కాంట్రాక్టర్ల కుమ్మక్కు తతంగం వెలుగుచూసింది. బహిరంగ మార్కెట్ ధర కంటే దాదాపు 50 శాతం అధికంగా ధరను సూచించి కాంట్రాక్టును దక్కించుకొనేందుకు ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆ టెండర్ ప్రక్రియనే రద్దు చేసింది. మళ్లీ టెండర్ పిలవాలని యోచిస్తోంది. 54% పెంచేశారు...: రాష్ట్రంలోని 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వాటిలోగర్భిణులు, బాలింతలు 4,57,643 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 6,67,783 మంది నయోదయ్యారు. వారికి ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం కింద సంపూర్ణ పోషకాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్నారు. గర్భిణి/బాలింతకు రోజుకు 30 గ్రాములు, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు రోజుకు 15 గ్రాముల చొప్పున కందిపప్పును ఆహారంలో కలిపి వడ్డిస్తున్నారు. ఈ లెక్కన నెలకు సగటున 500 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం. పప్పు సరఫరాకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ టెండర్ పద్ధతిలో కాంట్రాక్టర్ను ఎంపిక చేస్తుంది. ఒకసారి ఎంపికైన కాంట్రాక్టర్ ఆరు నెలలపాటు కందిపప్పును సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ప్రస్తుత వార్షిక సంవత్సరం తొలి 6 నెలల కోసం గత నెల అధికారులు టెండర్ పిలవగా 8 మంది పాల్గొన్నారు. అయితే వారంతా కిలో కందిపప్పు ధరను రూ. 176కు కాస్త అటుఇటుగా పేర్కొన్నారు. గత టెండర్ ప్రక్రియలో కాంట్రాక్టర్ కోట్ చేసిన కనిష్ట ధర రూ. 114 కాగా... ఇప్పుడు ఆ ధర రూ.176కు పెరిగింది. అంటే ఏకంగా 54 శాతం అధికంగా ధర కోట్ అయింది. మరోవైపు బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు ధర రూ. 120లోపే ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు టెండర్ ప్రక్రియను రద్దు చేశారు. భవిష్యత్తులో పెరుగుతుందనే అంచనాతో... టెండర్లో పాల్గొన్న 8 మందిని వ్యక్తిగతంగా అధికారులు పిలిచి మాట్లాడగా మార్కెట్లో ప్రస్తుతం కందిపప్పు ధర తక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో పెరుగుతుందనే ఆలోచనతో ఈ రకంగా ధర కోట్ చేశామని వారు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే గత రెండేళ్లలో కందిపప్పు ధర ఈ స్థాయిలో లేకపోవడం, త్వరలో పంట ఉత్పత్తులు సైతం చేతికి అందే సమయం ఉన్నప్పడు ఇంత ఎక్కువ ధరను కోట్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు ఆ టెండర్ను రద్దు చేశారు. అలాగే ఈసారి కాంట్రాక్టర్ల మార్పుపైనా దృష్టి సారించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా ‘జెమ్’(గవర్నమెంట్ ఈ–మార్కెట్ప్లేస్) నేషనల్ పోర్టల్ ద్వారా టెండర్లు పిలిచే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని... అప్పటివరకు పాత కాంట్రాక్టర్కే తాత్కాలికంగా సరఫరా బాధ్యత అప్పగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. -
రోడ్ కాంట్రాక్టర్లకు భారీ ఊరట! కేంద్ర మంత్రి గడ్కరీ ఆఫర్
న్యూఢిల్లీ: మౌలిక రంగానికి నిధుల లభ్యతను పెంచే క్రమంలో దేశీయంగా తొలిసారి ష్యూరిటీ బాండ్ల బీమా పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. డిసెంబర్ 19న దీన్ని ఆవిష్కరించనున్నట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఈ పథకంతో కాంట్రాక్టర్లకు భారీగా ఊరట లభించగలదన్నారు. ప్రాజెక్టు కాంట్రాక్టు ఇచ్చిన సంస్థకు .. కాంట్రాక్టరు తరఫున బీమా కంపెనీ ఈ ష్యూరిటీ బాండును జారీ చేస్తుంది. ఇదీ చదవండి: సరికొత్త అవతార్లో, టాటా నానో ఈవీ వచ్చేస్తోంది..? ప్రాజెక్టు పనితీరుకు లేదా సకాలంలో పూర్తి చేయడానికి సంబంధించి ఇది హామీగా పని చేస్తుంది. ఒకవేళ కాంట్రాక్టరు గానీ హామీ నిలబెట్టుకోలేకపోతే ప్రాజెక్టు ఇచ్చిన సంస్థ ఈ బాండు ద్వారా పరిహారాన్ని రాబట్టుకోవడానికి వీలవుతుంది. ఫైనాన్షియల్ గ్యారంటీలో ఆర్థికపరమైన అంశాలు ఇమిడి ఉండగా.. ష్యూరిటీ బాండ్లలో పనితీరు సంబంధిత అంశాలు ఉంటాయి. ప్రస్తుతం కాంట్రాక్టర్లు భారీ మొత్తాలను ఫైనాన్షియల్ గ్యారంటీ చూపించేందుకు కేటాయించాల్సి వస్తోందని, ష్యూరిటీ బాండ్లను ప్రవేశపెడితే వారికి ఆయా నిధులు అందుబాటులోకి రాగలవని గడ్కరీ చెప్పారు. ఈ నిధులను వారు వ్యాపార వృద్ధికి ఉపయోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. తద్వారా మౌలిక రంగంలో నిధుల లభ్యతను పెంచుకునేందుకు కూడా ఇవి ఉపయోగపడగలవని మంత్రి చెప్పారు. (రోడ్ కాంట్రాక్టర్లకు భారీ ఊరట! కేంద్ర మంత్రి గడ్కరీ ఆఫర్) ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (ఇన్విట్స్)లో పెట్టుబడి పెట్టడం ద్వారా దేశ మౌలిక సదుపాయాల నిర్మాణంలో రిటైల్ ఇన్వెస్టర్లు పాలుపంచుకో వచ్చని గడ్కరీ తెలిపారు. ఇన్విట్స్ ద్వారా దాదాపు ఎనిమిది శాతం రాబడులు కూడా అందుకోవచ్చన్నారు. నాణ్యత విషయంలో రాజీపడకుండా పూర్తి స్వదేశీ, చౌక నిర్మాణ విధానాలను ఆవిష్కరించాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. (రూపాయిల్లో వాణిజ్యంపై బ్యాంకుల అవగాహన కార్యక్రమాలు) -
బిల్లుల చెల్లింపుల్లో జాప్యానికి వడ్డీ ఎలా కోరతారు?
సాక్షి, అమరావతి: ఆయా ప్రభుత్వ శాఖల పనులు చేసినందుకు చెల్లించాల్సిన బిల్లుల చెల్లింపుల్లో ప్రభుత్వ జాప్యానికి వడ్డీ చెల్లించాలని కాంట్రాక్టర్లు కోరుతుండటంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. కాంట్రాక్టు ఒప్పందంలో వడ్డీ చెల్లింపు నిబంధన ఉంటే తప్ప, బిల్లుల చెల్లింపుల్లో జరిగిన జాప్యానికి వడ్డీ కోరలేరని కాంట్రాక్టర్లకు తేల్చిచెప్పింది. ఒప్పందంలో ఎలాంటి నిబంధన లేనప్పుడు, అధికరణ 226 కింద వడ్డీ చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును కోరడానికి వీల్లేదంది. ఈ విషయంలో తగిన ఉత్తర్వులినిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వడ్డీ చెల్లింపు ఆదేశాలపై అప్పీళ్లు.. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట పరిధిలో వై.బాబూరావు అనే కాంట్రాక్టర్ వ్యవసాయ శాఖ పనులు చేశారు. తనకు చెల్లించాల్సిన రూ.23.21 లక్షల బకాయిలను వడ్డీతో సహా చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ పిటిషనర్కు చెల్లించాల్సిన రూ.23.21 లక్షలను 12 శాతం వార్షిక వడ్డీతో కలిపి నాలుగు వారాల్లో చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. దీంతో ప్రభుత్వం బాబూరావుకు రూ.23.21 లక్షలు చెల్లించింది. అయితే వడ్డీ చెల్లించాలన్న సింగిల్ జడ్జి ఆదేశాలతోపాటు ఇలాంటివే మరికొన్నింటిపైనా ధర్మాసనం ముందు ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీళ్లన్నింటిపై సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. గత ప్రభుత్వ పాపాలకు మేం మూల్యం చెల్లించుకుంటున్నాం.. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ‘రోజుకు 320 నుంచి 350 వరకు హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతుంటే, అందులో 220–250 వరకు రిట్ పిటిషన్లే ఉంటున్నాయి. ఇందులో 200 కేసుల వరకు పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ బిల్లుల చెల్లింపుల కోసం దాఖలవుతున్నవే ఉన్నాయి. ఆ బిల్లులు చెల్లించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై దాఖలవుతున్న కోర్టు ధిక్కార వ్యాజ్యాలు ఈ సంఖ్యకు అదనం. ఇవన్నీ కూడా కోర్టుపై అదనపు భారాన్ని పెంచుతున్నాయి. ఈ సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉంది’ అని స్పష్టం చేసింది. ప్రభుత్వ న్యాయవాది (ఆర్ అండ్ బీ) కోనపల్లి నర్సిరెడ్డి స్పందిస్తూ.. తాము సింగిల్ జడ్జి ఇచ్చిన వడ్డీ చెల్లింపు ఉత్తర్వులను మాత్రమే సవాల్ చేశామన్నారు. అనంతరం అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ జోక్యం చేసుకుంటూ.. ఈ బిల్లుల వ్యవహారమంతా గత ప్రభుత్వ పాపమేనన్నారు. ఆ పాపాలకు తమ ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో రూ.2,800 కోట్ల మేర చెల్లింపులు చేశామన్నారు. గత ప్రభుత్వ హయాంలో చాలా పనులు చేయకుండానే బిల్లులు సమర్పించారని, దీనిపై పరిశీలన కూడా చేస్తున్నామని తెలిపారు. అందువల్లే బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందన్నారు. వడ్డీ చెల్లింపు ఆదేశాలు ఇవ్వడానికి మాది సివిల్ కోర్టు కాదు.. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. వడ్డీ చెల్లించాలని కాంట్రాక్ట్ ఒప్పందంలో ఉందా? అని పిటిషనర్ను ప్రశ్నించింది. ఒప్పందంలో వడ్డీ చెల్లింపు నిబంధన లేనప్పుడు వడ్డీ చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కుదరదని స్పష్టం చేసింది. వడ్డీ కావాలనుకుంటే అందుకు సివిల్ కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది. వడ్డీ చెల్లింపునకు ఆదేశాలు ఇవ్వడానికి తమది సివిల్ కోర్టు కాదని స్పష్టం చేసింది. వడ్డీ చెల్లిం పు విషయంలో సుప్రీంకోర్టు తీర్పులను తమ ముందుంచాలని అటు ప్రభుత్వ న్యాయవాది నర్సిరెడ్డికి, ఇటు పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీకాంత్కు ధర్మాసనం స్పష్టం చేసింది. -
GHMC సమావేశంలో బీజేపీ నిరసనలు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ్టి(మంగళవారం) సమావేశంలో.. బీజేపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. సుమారు 43 మంది బీజేపీ కార్పొరేటర్లు నల్లబ్యాడ్జీలతో సమావేశానికి వచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను విడుదల చేయాలంటూ.. ప్లకార్డులతో కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు వాళ్లంతా. ఇదిలా ఉంటే.. కాంట్రాక్టర్ల జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. రూ. 800 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని వాళ్లంతా నిరసనలకు దిగారు. ఈ క్రమంలో.. పోలీసులకు, కాంట్రాక్టర్లకు మధ్య తీవ్రవాగ్వాదం నెలకొనగా, ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరోవైపు కాంట్రాక్టర్లకు మద్దతుగా బీజేపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. ఇదీ చదవండి: కేసీఆర్కు అంబేడ్కర్తో పోలికా? -
రెండేళ్లుగా అడ్డగోలు చెత్త బంధం..!!
సాక్షి, విశాఖపట్నం: దాసుడి తప్పు దండంతోనే సరి.. అన్నట్టుగా అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడిన అసలు సూత్రధారులను దర్జాగా వదిలేసి.. పాత్రధారులపై కొరడా ఝుళిపించారు జీవీఎంసీ ఉన్నతాధికారులు. నిబంధనలు మీరి రైల్వే స్టేషన్లలో చెత్త తరలింపునకు కార్పొరేషన్ వాహనాలు వినియోగించిన వైనం బట్టబయలైంది. అయితే దొరికేంత వరకూ దొరలే అన్నచందంగా.. కేవలం ఆ ఒక్క రోజు మాత్రమే జరిగిందన్నట్లుగా.. అధికారుల కళ్లుగప్పేశారు. కానీ.. ఈ ‘చెత్త’ బంధం సుమారు రెండేళ్ల నుంచి సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీవీఎంసీ ఖజానాకు కన్నం పెట్టి.. రైల్వే కాంట్రాక్టర్ కాసులకు కక్కుర్తిపడిన పెద్ద చేపల్ని వదిలేసి.. కేవలం ఒక డ్రైవర్ సస్పెన్షన్తోనే మమా అనిపించెయ్యడం గమనార్హం. మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో పరిధిలో పోగవుతున్న చెత్తను తీసేందుకు తీరిక లేని పారిశుధ్య కాంట్రాక్టర్లకు.. తమ పరిధి కాని ప్రాంతాల్లో మాత్రం శ్రద్ధగా పనులు కానిచ్చేస్తున్నారు. ఇటీవల రైల్వే స్టేషన్లో జరిగిన అక్రమ చెత్త నిర్వహణ అంశం బయటపడిన విషయం విదితమే. అసలేం జరిగిందంటే... రైల్వేస్టేషన్ పరిధిలో ఉన్న చెత్త నిర్వహణ బాధ్యతను రైల్వే శాఖ ప్రత్యేకంగా మూడేళ్ల కాలపరిమితితో కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఆ పరిధిలో జీవీఎంసీ పారిశుధ్య కార్మికులకు గానీ, వాహనాలకు గానీ పని లేదు. కేవలం రైల్వే స్టేషన్ మాత్రమే కాదు.. ఏ పబ్లిక్ సెక్టార్ పరిధిలోనైనా చెత్త నిర్వహణ బాధ్యత ఆయా సంస్థలు మాత్రమే నిర్వహించుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో జీవీఎంసీ కమిషనర్కు లేఖ రాసి.. ఆయన అనుమతితోనే ఇక్కడ సిబ్బందిని చెత్త నిర్వహణ పనులకు వినియోగించుకుంటారు. కానీ రైల్వే స్టేషన్లో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా పారిశుధ్య పనులకు జీవీఎంసీ వాహనాలను వినియోగిస్తున్న విషయం బట్టబయలైంది. కొందరు స్థానికులు జీవీఎంసీ ఉన్నతాధికారులకు ఇక్కడ జరుగుతున్న తీరుపై ఫిర్యాదు చేయడంతో అధికారులు అవాక్కయ్యారు. రెండేళ్లుగా.. జీవీఎంసీ జోన్–4లో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది, కాంట్రాక్టర్ తో కలిసి అక్రమార్జన కోసం రైల్వే కాంట్రాక్టర్తో అడ్డగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. జీవీఎంసీ పరిధిలో పారిశుధ్య నిర్వహణ పనులు చేస్తున్నట్లుగా చెప్పి ఒక టిప్పర్, బాబ్ కార్ట్ ని రైల్వే స్టేషన్ ఆవరణలో పారిశుధ్య నిర్వహణ పనులు గుట్టుగా కానిచ్చేస్తున్నారు. దీనికి అవసరమైన ఇంధనాన్ని కూడా జీవీఎంసీకి చెందినదే కావడం గమనార్హం. ఈ అక్రమ వ్యవహారం బట్టబయలవ్వడంతో.. ఆ ఒక్క రోజు మాత్రమే ఇలా జరిగిందంటూ అధికారులకు తప్పుడు సమాచారం అందించారు. ఇలా రైల్వే స్టేషన్లో చెత్త సేకరణకు సుమారు రెండేళ్ల కాలం నుంచి వాహనాల్ని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజూ చెత్త సేకరణ సమయం పూర్తయిన వెంటనే రైల్వే స్టేషన్కు వెళ్లి.. అక్కడి చెత్తని తాటిచెట్లపాలెంలోని మినీ సూయిజ్ ఫాం(ఎంఎస్ఎఫ్)కు తరలించినట్లు సమాచారం. రైల్వే కాంట్రాక్టర్తో జీవీఎంసీ జోన్–5 పరిధిలో ఉన్న ఒక కాంట్రాక్టర్, ముఖ్య అధికారి చేతులు కలిపి ఈ పనులకు వాహనాల్ని పంపించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం జీవీఎంసీకి చెందిన రూ.లక్షలాది రూపాయిల ఇంధనాన్నే వినియోగించినట్లు తెలుస్తోంది. అసలువారిని వదిలేసి.. ఈ అక్రమ నిర్వహణ వ్యవహారం వెలుగులోకి రావడంతో జోన్–5 అధికారులు, సిబ్బంది, ఎంఎస్ఎఫ్ కాంట్రాక్టర్ ఉలిక్కిపడ్డారు. తప్పు తమవైపు రాకుండా ఉండేందుకు ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక అందించినట్లు సమాచారం. ఖాళీగా ఉన్న సమయంలో ఎంఎస్ఎఫ్కు వస్తున్నప్పుడు అక్కడి రైల్వే కాంట్రాక్టర్ రూ.1000 ఇస్తే.. ఆ ఒక్క రోజు మాత్రమే చెత్తని తీసేందుకు వెళ్లారని అధికారులకు చెప్పారు. ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్ అధికారులను ఆదేశించగా.. జోన్–5 అధికారులు టిప్పర్ డ్రైవర్ను బలిపశువులా సస్పెండ్ చేశారు. కాంట్రాక్టర్ పరిధిలో ఉన్న బాబ్కార్డ్ అవుట్సోర్సింగ్ డ్రైవర్ని మరో చోటికి పంపించేసి చేతులు దులిపేసుకున్నారు. కానీ జీవీఎంసీకి నష్టం తీసుకొచ్చిన కాంట్రాక్టర్పైనా, అధికారులపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం. అధికారుల ఒత్తిడి లేకుండా దిగువస్థాయి సాధారణ సిబ్బంది ఈ తరహా పనులకు వెళ్లే అవకాశం లేదు. దీనిపై కమిషనర్ లక్ష్మీశను వివరణ కోరగా.. సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. (చదవండి: ఏపీ సర్కార్ని చూస్తే అసూయగా ఉంది) -
కాబోయే భర్తనే అరెస్టు చేసిన లేడీ సింగంపై అవినీతి మరక
గౌహతి: అస్సాంలోని నాగావ్ జిల్లాలో సబ్-ఇన్స్పెక్టర్ రభాను అవినీతి ఆరోపణలతో అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె మజులీ జిల్లాలోని కోర్టు ఆమెను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు. రభా గత నెలలో తన కాబోయే భర్తను అరెస్టు చేసి లేడీ సింగంగా పేరుతెచ్చుకున్న ఆమె ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇద్దరు కాంట్రాక్టర్లు రభా తన కాబోయే భర్త రాణా పోగాగ్తో కలిసి ఓఎన్జీలో ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ ఆర్థిక ఒప్పందాలు కుదుర్చుకుని మోసం చేశారంటూ పిర్యాదు చేశారని పోలీసుల తెలిపారు. ఆమె కాబోయే భర్త పోగాగ్ రభా తరుపున డబ్బులు వసూలు చేసేరనే ఆరోపణలు కూడా రావడంతో ఆమెను విచారణకు ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాది అక్టోబర్లో ఆమెకు పోగాగ్తో నిశ్చితార్థం కాగా ఈ ఏడాది నవంబర్లో వివాహం జరగాల్సి ఉంది. ఐతే ఈ ఏడాది జనవరిలో బిహ్పురియా ఎమ్మెల్యే అమియా కుమార్ భుయాన్తో ఆమె జరిపిన ఫోన్ సంభాషణ లీక్ కావడంతో రభా ఈ వివాదంలో చిక్కుకుంది. లీక్ అయిన ఆ ఆడియో టేప్ తీవ్ర దుమారానికి తెరలేపింది. పైగా ఆయన తన నియోజక వర్గ ప్రజలను వేధింపులకు గురి చేస్తున్నారంటూ రభా పై ఆరోపణలు గుప్పించారు. (చదవండి: చిచ్చురేపిన భూ వివాదం...దంపతులపై ట్రాక్టర్ ఎక్కించి..) -
బ్లాక్ లిస్టులో పెట్టినా.. బాద్షాలా!
టెండర్లు దక్కించుకొని.. పనులు పూర్తి చేయడంలో జాప్యం వహించడం.. అడ్డగోలుగా వ్యవహరించడం వంటి కార్యకలాపాలకు పాల్పడిన కాంట్రాక్టర్లను జీవీఎంసీ బ్లాక్ లిస్టులో పెట్టింది. అంటే కార్పొరేషన్ పరిధిలో ఏ పనులకు సంబంధించిన టెండర్లలో అయినా వారు పాల్గొనే అవకాశం ఉండదు. కానీ కొందరు ఇంజినీరింగ్ సిబ్బంది మాత్రం నిషేధిత కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తున్నారు. కొత్త టెండర్లలో వారికి చోటు కల్పించి పనులు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: వివిధ కారణాలతో గ్రేటర్ విశాఖ పరిధిలో పనులు నిర్వహిస్తున్న 26 మంది కాంట్రాక్టర్లను అప్పటి జీవీఎంసీ కమిషనర్ బ్లాక్ లిస్టులో పెట్టారు. చిన్నచిన్న తప్పులు చేసిన 21 కాంట్రాక్టు సంస్థల్ని ఏడాది పాటు.. విభిన్న రకాల వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడిన ఐదుగురు కాంట్రాక్టర్లపై ఐదేళ్ల పాటు నిషేధం విధించారు. ఏడాది నిషేధం ఉన్న కాంట్రాక్టర్లలో చాలా మంది వరకూ ఈ ఏడాది జూలై వరకూ, ఐదేళ్ల నిషేధం ఉన్న కాంట్రాక్టర్లు 2025 డిసెంబర్ వరకూ ఏ విధమైన టెండర్లలో పాల్గొన కూడదు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. కొందరు బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్లు మాత్రం నిషేధంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జీవీఎంసీ పిలుస్తున్న టెండర్లలో తమ అర్హతకు సరిపోయే పనుల్ని దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇంజినీర్ల సహకారంతోనే.. బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్ ఏదైనా ఈ–టెండర్లో పాల్గొనేందుకు ప్రయత్నించిన వెంటనే రిజెక్ట్ లిస్టులో చేరే వ్యవస్థ జీవీఎంసీలో ఉంది. సదరు కాంట్రాక్టర్ ఫర్మ్ పేరు మార్చి పాన్ కార్డు, లేదా ఆధార్, జీఎస్టీ నంబర్.. ఇలా ఏదైనా ఎంటర్ చేసినా టెండర్ తిరస్కరించాలి. అదే విధంగా ఈఎండీ(ఎర్నెస్ట్ మనీ డిపాజిట్)ని తిరిగి సదరు బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్కు చెల్లించాల్సిన అవసరం లేదు. పదేపదే రిజెక్ట్ చేసినా టెండర్లలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తే సదరు కాంట్రాక్టర్ నిషేధాన్ని మరికొద్ది రోజులు పొడిగించే అధికారాలు జీవీఎంసీ అధికారులకు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి నిషేధిత కాంట్రాక్టర్లకు కొమ్ముకాసే పనిలో ఇంజినీరింగ్ సిబ్బంది తలమునకలవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్లాక్ లిస్టులో ఉన్నా వారికి ఎలాగైనా కాంట్రాక్టు దక్కించుకునేలా కుయుక్తులు పన్నుతున్నారు. ఉదాహరణకు ఇటీవలే యూపీహెచ్సీ టెండర్ల వ్యవహారంలోనూ ఇదే పద్ధతి అవలంబించారు. రూ.కోట్ల విలువ చేసే పనులని దక్కించుకునేందుకు ఐదేళ్ల బ్లాక్ లిస్టులో ఉన్న ఓ కాంట్రాక్టర్ ఆ టెండర్లలో పాల్గొన్నారు. దాదాపు అన్ని టెండర్లలోనూ టెక్నికల్ బిడ్ వరకూ ఆ కాంట్రాక్టర్ను ఇంజినీరింగ్ సిబ్బంది తీసుకెళ్లిపోయారు. వాస్తవానికి ఆ కాంట్రాక్టర్ను టెండర్ ప్రారంభ దశలోనే రిజెక్ట్ చేయాల్సి ఉంది. కానీ.. కొందరు ఇంజినీరింగ్ అధికారులు సిబ్బంది కలిసి.. చూసీ చూడనట్లుగా వ్యవహరించారు. టెండర్లు ఫైనలైజ్ చేసే సమయంలో ఉన్నతాధికారులు విషయాన్ని గుర్తించి.. నిషేధిత కాంట్రాక్టర్ను పక్కన పెట్టారు. పదే పదే.. అదే శైలి.. ఈ ఒక్క కాంట్రాక్టర్ మాత్రమే కాదు బ్లాక్ లిస్టులో ఉన్న కొందరు కాంట్రాక్టర్లు తమ ఫర్మ్ పేరు మార్చి.. పాత పాన్, ఆధార్ నంబర్తో టెండర్లలో పాల్గొంటున్నారు. ఈ విషయం ఇంజినీరింగ్ సిబ్బందికి తెలిసినా.. ఏమీ తెలీనట్లుగా వారికి టెండర్లు అప్పగించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు కూడా తమకేం పట్టనట్లుగా ఉంటున్నారు. ఇప్పటికైనా బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్లపై నిశిత దృష్టితో వ్యవహరించకపోతే జీవీఎంసీ పనుల వ్యవహారంలో మళ్లీ అవకతవకలు జరిగే ప్రమాదం ఉందని కార్పొరేషన్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. (చదవండి: కరాటే క్వీన్స్: చదువులో సరస్వతీ పుత్రిక.. కరాటేలో వండర్ కిడ్) -
వీడు మాయలోడు.. కలెక్టర్ పీఏ నంటూ
కర్నూలు: ఎదుటి వ్యక్తుల అవసరాలే ఈ మోసగాడికి పెట్టుబడి. మాయ మాటలతో బురిడీ కొట్టిస్తాడు. ఇల్లు, ఇళ్ల స్థలాలు, పట్టాదారు పాసుపుస్తకాలు, సంక్షేమ పథకాలు ఇలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరార్థులను చేర దీసి రూ.లక్షల్లో గుంజేశాడు. ఇలా పలువురిని మోసగించి పోలీసులకు చిక్కి జైలుకెళ్లొచ్చాడు. అయినా తీరు మార్చుకోక కలెక్టర్ పీఏనంటూ కొంతమంది కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు డిమాండ్ చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎట్టకేలకు మళ్లీ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. అతని నేర చరిత్రను కర్నూలు డీఎస్పీ కెవి.మహేష్, మూడవ పట్టణ సీఐ తబ్రేజ్తో కలిసి ఆదివారం తన కార్యాలయంలో వివరించారు. చదవండి: భార్య కువైట్లో.. ఎంత పనిచేశావ్ బంగార్రాజు.. బండి ఆత్మకూరు మండలం చిన్నదేవళాపురం గ్రామానికి చెందిన తాటికొండ పెద్దమౌలాలి చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. అనతి కాలంలోనే డబ్బు సంపాదించాలన్న ఆశతో వక్రమార్గం పట్టాడు. ప్రభుత్వం నుంచి బిల్లులు పాసైన కాంట్రాక్టర్ల ఫోన్ నంబర్లు సేకరించి వారికి ఫోన్ చేసి తాను కలెక్టర్ పీఏనంటూ పరిచయం చేసుకునేవాడు. పెండింగ్లో ఉన్న బిల్లులు పాస్ చేయమని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయని, అవి క్లియర్ చేయడానికి ఐదు శాతం కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేసేవాడు. ఇదే తరహాలోనే ఈ నెల 12వ తేదీన తుగ్గలి ప్రాంతానికి చెందిన ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ నవీన్కుమార్రెడ్డికి ఫోన్ చేసి తాను కలెక్టర్ పీఏనని పరిచయం చేసుకున్నాడు. పెండింగ్ బిల్లులను పాస్ చేయడానికి రూ.లక్ష తన అకౌంట్లో వేయాలని డిమాండ్ చేశాడు. కాంట్రాక్టర్ స్పందించకపోవడంతో పదేపదే ఫోన్ చేసి బెదిరించడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. కలెక్టర్ కార్యాలయం సిబ్బందితో పాటు మరికొంతమంది కాంట్రాక్టర్లు కూడా 3వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా శనివారం రాత్రి కర్నూలు శివారులో నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు డీఎస్పీ మహేష్ వెల్లడించారు. నిందితుడి నేరాల చిట్ట.. ►నంద్యాల ప్రాంతానికి చెందిన పేదలకు ఇళ్లు ఇప్పిస్తానని రూ. 22 లక్షలు వసూలు చేశాడు. మున్సిపాలిటీకి సంబంధించి నకిలీ రసీదులు ఫోర్జరీ సంతకా లతో పట్టాలిచ్చి మోసం చేశాడు. ఈ మేరకు నంద్యాల తాలూకా పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయగా అతనిపై కేసు నమోదు చేసి రిమాండుకు పంపారు. ►గడివేముల ప్రాంతానికి చెందిన కొంతమంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని చెప్పి సుమారు రూ. 6 లక్షలు వసూలు చేసి మోసం చేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అతనిపై చీటింగ్ కేసు నమోదు చేసి కటకటాలకు పంపారు. ►ఆత్మకూరు ప్రాంతంలో కొంతమంది రైతుల వద్ద డబ్బులు వసూలు చేసుకుని తహసీల్దార్, ఆర్డీఓ, సబ్–రిజి్రస్టార్ సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు తయారుచేసిచ్చాడన్న ఫిర్యాదు మేరకు 2018లో బండిఆత్మకూరు పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండుకు పంపారు. ►తుగ్గలి మండలం రాతన గ్రామానికి చెందిన ఉమా మహేశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
టీడీపీ నేత దేవినేనిని నమ్మి మోసపోయాం
సాక్షి, అమరావతి: టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మాటలు నమ్మి మోసపోయామని ట్రాన్స్ట్రాయ్ కంపెనీ కింద సబ్ కాంట్రాక్టులు చేసిన కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఈ మేరకు సబ్ కాంట్రాక్టర్లు తాడేపల్లిలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.20 కోట్లుపైనే ఖర్చు చేసినా ఇంతవరకు బిల్లులు మంజూరు చేయలేదన్నారు. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ తమను మోసం చేశారని తెలిపారు. తమ సమస్యలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు. -
ఐటీ దాడుల్లో రూ.750 కోట్ల అక్రమాస్తులు బహిర్గతం
సాక్షి, బనశంకరి: బెంగళూరులో నాలుగురోజుల కిందట కాంట్రాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్, తదితరుల ఇళ్లపై జరిగిన సోదాల వివరాలను ఐటీ అధికారులు మీడియాకు వెల్లడించారు. ముగ్గురు ప్రముఖ కాంట్రాక్టర్లు, 40 మంది సబ్ కాంట్రాక్టర్ల పేర్లతో నీటి ప్రాజెక్టుల పనుల్లో అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. ఈ సోదాల్లో రూ.750 కోట్ల విలువైన అక్రమాస్తుల వివరాలు వెల్లడయ్యాయి. ఈ మొత్తంలో రూ.487 కోట్లకు సరైన ఆధారాలు లేవని తేల్చారు. పలువురి ఇళ్లలో రూ.8.67 కోట్ల విలువైన బంగారం, రూ.29.83 కోట్ల విలువైన వెండిని సీజ్చేశారు. దాడి సమయంలో మొత్తం రూ.4.69 కోట్ల నగదు సీజ్ చేశారు. -
రూ.2,346 కోట్ల అదనపు చెల్లింపులు
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లకు గత టీడీపీ ప్రభుత్వం రూ.2,346 కోట్ల మేర అదనంగా చెల్లించినట్లు జల శక్తి శాఖ సహాయ మంత్రి రతన్లాల్ కటారియా వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా జవాబిస్తూ మంత్రి ఈ విషయం చెప్పారు. అదనపు చెల్లింపుల వ్యవహారంపై నియమించిన నిపుణుల సంఘం దీనిపై విచారణ జరిపి ఈ ఏడాది జూలైలో నివేదికను కేంద్ర జల సంఘానికి తెలిపినట్లు చెప్పారు. ‘ఈ నివేదిక ప్రకారం 2015–16లో ప్రాజెక్ట్కు సంబంధించిన వివిధ పనుల నిమిత్తం కాంట్రాక్టర్లతో కుదిరిన ఒప్పందాల పునఃపరిశీలన జరిపి కాంట్రాక్టర్లకు అదనంగా రూ.1,331 కోట్లు చెల్లించింది. మొబిలైజేషన్ అడ్వాన్స్లపై వడ్డీ కింద రూ.84.43 కోట్లు, అడ్వాన్స్ కింద రూ.144.22 కోట్లు, జల విద్యుత్ కేంద్రం ప్రాజెక్ట్ పనులు అప్పగించడానికి ముందుగానే సంబంధిత కాంట్రాక్టర్కు అడ్వాన్స్ కింద రూ.787 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది..’ అని మంత్రి తెలిపారు. అయితే అదనపు చెల్లింపులపై నిపుణుల సంఘం వ్యక్తం చేసిన అభిప్రాయాలు ప్రాథమికమైనవని నవంబర్ 13న రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖలో స్పష్టం చేసినట్లు చెప్పారు. పైన తెలిపిన నిర్ణయాల్లో ప్రక్రియాపరమైన అతిక్రమణలు లేవని, అధీకృత ఆమోదం పొందిన తర్వాతే అదనపు చెల్లింపులు జరిగినట్లుగా లేఖలో పేర్కొన్నట్లు మంత్రి తెలిపారు. ఈ అదనపు చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ నివేదిక అందిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. బ్లూ ఫ్లాగ్ బీచ్ల జాబితాలో రిషికొండ దేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం ఎంపిక చేసిన 13 పైలట్ బీచ్ల జాబితాలో విశాఖలోని రిషికొండ కూడా ఉన్నట్లు పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో వెల్లడించారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. అంతర్జాతీయ ఏజెన్సీ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అత్యంత కఠినమైన అంశాల ప్రాతిపదికన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను జారీ చేస్తుందని చెప్పారు. బీచ్లో స్నానానికి వినియోగించే నీళ్ల నాణ్యత, బీచ్లో పర్యావరణ యాజమాన్యం, రక్షణ కోసం చేపట్టే చర్యల వంటివి ప్రధానమైన అంశాలని చెప్పారు. మానవాళిని పీడిస్తున్న అన్నింటినీ నిషేధించాలి ఈ–సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, మద్యం, జూదం వంటి మానవాళిని పీడిస్తున్న అన్నింటినీ నిషేధించాలన్నదే తమ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆలోచన అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ నాయకులు వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ–సిగరెట్ల నిషేధ బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. నికోటిన్ గుండెజబ్బు, క్యాన్సర్సహా అనేక వ్యాధులకు కారణమవుతున్నందున ఈ–సిగరెట్లను నిషేధించడం పూర్తి సమర్థనీయమని పేర్కొన్నారు. ఏపీలో 13 రోడ్డు ప్రాజెక్టులకు ఆమోదం భారత్ మాల ప్రాజెక్టు కింద ఏపీలో రూ.12,766 కోట్ల వ్యయమయ్యే 13 రోడ్డు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్టు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా 506 కి.మీ. పొడవునా రహదారులు నిర్మించనున్నట్టు తెలిపారు. కడప స్టీల్కు ఐరన్ఓర్ సరఫరాకు అంగీకారమే వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంటుకు నిరంతరాయంగా ఐరన్ ఓర్ సరఫరా చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. సోమవారం ఆయన లోక్సభలో వైఎస్సార్సీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో బాలశౌరి మాట్లాడుతూ ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం వైఎస్సార్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సాయంతో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ స్టీలు ప్లాంటుకు అతి దగ్గరలోనే బళ్లారి ఐరన్ ఓర్ లభ్యత ఉంది. అలాగే కృష్ణపట్నం పోర్టు, ఎన్నోర్ పోర్ట్ల ద్వారా ముడిసరుకు లామ్ కోక్ను దిగుమతి చేసుకోవచ్చు. దీనిని కేంద్ర మంత్రి పరిశీలిస్తారా?’ అని ప్రశ్నించారు. ధర్మేంద్ర ప్రధాన్ బదులిస్తూ ‘‘నేను ఇటీవల ఏపీకి వెళ్లినప్పుడు మిత్రుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ అంశాన్ని నా దృష్టికి తెచ్చారు. అంతకుముందు ఈ అంశాన్ని ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. వారికి దీర్ఘకాలంపాటు ఎన్ఎండీసీ నుంచి ఐరన్ ఓర్ సరఫరా కావాలి. ఈ ప్రతిపాదనకు కేంద్రం వంద శాతం అంగీకరిస్తోంది. మేం నిరంతరాయంగా సరఫరా చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడపలో భారీ స్టీల్ ప్లాంటు నిర్మాణానికి తగిన పెట్టుబడిదారుడిని వెతుకుతుంది. అలాగే మేం కూడా వైజాగ్ ఆర్ఐఎన్ఎల్ ద్వారా ఒక కొత్త స్టీల్ ప్లాంటు నిర్మాణం చేపట్టనున్నాం..’అని మంత్రి పేర్కొన్నారు. ఆదాయ పన్ను రూ.20 లక్షల వరకు మినహాయించాలి ట్యాక్సేషన్ (సవరణ) బిల్లుకు వైఎస్సార్సీపీ తరఫున మద్దతు పలుకుతున్నట్టు ఆ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. సోమవారం లోక్సభలో ఈ బిల్లుపై చర్చలో ఆయన మాట్లాడారు. ‘కొత్తగా ఏర్పాటు చేయబోయే కంపెనీలకు 15 శాతం మాత్రమే ఆదాయ పన్ను వర్తింపజేస్తున్న ఈ బిల్లును మా ముఖ్యమంత్రి కూడా స్వాగతించారు. దీని వల్ల కొత్త కంపెనీలు వచ్చే అవకాశం ఉంది. రూ.400 కోట్ల టర్నోవర్ పైబడి ఉన్న కంపెనీలకు కూడా.. ముఖ్యంగా భాగస్వామ్య కంపెనీలు, ఎంఎస్ఎంఈ కంపెనీలను కూడా తక్కువ పన్ను రేటు ఉండేలా చూడాలని ఆర్థిక మంత్రిని కోరుతున్నా..’ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడంలో జాప్యం చోటు చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఆదాయ పన్ను రూ.20 లక్షల వరకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఆర్థికవృద్ధి నెమ్మదిస్తున్న ఈ తరుణంలో వ్యక్తిగత ఆదాయ పన్ను కూడా మినహాయించాలని కోరారు. -
అడ్డగోలు తవ్వకాలు
సాక్షి, ప్రకాశం : అక్రమార్కుల ఆగడాలకు ఏ ఒక్కటీ మినహాయింపు కాదు అన్నట్లు తయారైంది. కాంట్రాక్టర్లు అనుమతులకు మించి మట్టి తవ్వకాలు సాగిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీకి గండికొడుతున్నారు. నాగులుప్పలపాడు మండల పరిధిలో 3వ రైల్వే లైన్ నిర్మాణ పనుల అంచనాల్లో మట్టి, ఇసుక, ఎర్ర గ్రావెల్ తరలించేందుకు మైనింగ్ శాఖకు రాయల్టీ చెల్లించి సంబంధిత అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అయితే అనుమతి గోరంత, తవ్వుకునేది కొండంత అన్నట్లు ఉంది కాంట్రాక్టర్ల వాలకం. మైనింగ్ శాఖ నుంచి అమ్మనబ్రోలు రెవెన్యూ పరిధిలో అనుమతులు తీసుకొన్న కాంట్రాక్టర్ రాపర్ల రెవెన్యూ పరిధిలోని చవటపాలెం, రాపర్ల గ్రామాల్లో చాలా మేరకు అనధికారికంగా ఈ తవ్వకాలు చేపట్టారు. రైల్వే పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ గుట్టు చప్పుడు కాకుండా రాత్రి సమయాల్లో పొక్లెయిన్ల సాయంతో మట్టి, ఎర్ర గ్రావెల్ను అక్రమంగా తరలిస్తూ, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండికొడుతున్నాడు. ఈ తంతు కొన్ని రోజులుగా జరుగుతున్నా అధికారులెవ్వరూ ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. అక్రమ తవ్వకాల విషయం కలెక్టర్ దృష్టికి రావడంతో సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికీ ఎవ్వరూ స్పందించకపోవడం, అధికారులు మామూళ్లు పుచ్చుకొనే ఆ వైపు వెళ్లడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇదీ వాస్తవం.. గ్రామ సరిహద్దులోని ప్రాంతాల్లో అయితే 3 క్యూబిక్ మీటర్ల లోతుకి మించి తవ్వకాలు చేపట్టడానికి వీలులేదు. అయితే అనుకున్నదే తడవుగా సదరు కాంట్రాక్టర్ సుమారు 8 క్యూబిక్ మీటర్ల లోతున తవ్వకాలు చేపట్టారు. దీంతో మట్టి తీసిన చెరువులో భూగర్భ జలాలు కూడా బయట పడ్డాయి. భవిష్యత్లో ఈ కుంటల వలన చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. దీంతో పాటు మట్టి తవ్వకం చేపట్టిన పొలాలకు దగ్గర్లోని రైతులు తమ పొలాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాసుల కోసమే కక్కుర్తి.. గుంటూరు నుంచి నెల్లూరు జిల్లా వరకు రైల్వే 3వ లైన్ పనులు జిల్లాలో వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులకు కొంత మేరకు అనుమతులు తీసుకొని రాపర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 112, 114 లో కూడా ప్రభుత్వానికి సీనరేజి చెల్లించకుండా కాంట్రాక్టర్ రాత్రి సమయంలో గ్రావెల్, మట్టిని తరలిస్తున్నారు. మండలంలోని అమ్మనబ్రోలు, చవటపాలెం గ్రామాల్లో అక్రమ తవ్వకాలు జరుపుతుండటంతో అక్కడ నివశిస్తున్న గృహ యజమానులు, పశు పోషకులు ఆందోళన చెందుతున్నారు. అధికారికంగా తవ్వకాలు జరిపితే మైనింగ్ శాఖకు చెల్లించే రాయల్టీలో కొంత గ్రామ పంచాయతీకి జమ చేస్తారు. ఈ అక్రమ తవ్వకాలకు అనుమతులు లేకుండా జరుగుతుంటే ఆ ప్రాంత ప్రజా ప్రతిని«ధులు, అధికారులు కన్నెత్తి చూడకపోవడం విశేషం. ఈ విషయంపై మైనింగ్ అధికారులను వివరణ కోరగా రైల్వే కాంట్రాక్టర్ కొద్ది మేర అనుమతులు తీసుకొని స్థాయి దాటి తవ్వకాలు చేస్తుంటే విజిలెన్స్ అధికారులతో విచారణ చేసి గట్టి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. -
ఆపిల్ నుంచి ఆ కాంట్రాక్టర్ల తొలగింపు
శాన్ఫ్రాన్సిస్కొ: ప్రముఖ మొబైల్ తయారీదారు ఆపిల్కు ‘సిరి’ కాంట్రాక్టర్లు కొత్త తలనొప్పులు తీసుకొచ్చారు. దీంతో ఆపిల్ కంపెనీ ఐర్లాండ్లోని తమ సంస్థలో పని చేస్తున్న దాదాపు 300 కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. తమ వినియోగదారులకు చెందిన సున్నితమైన విషయాలను 'సిరి' పోగ్రామ్ కాంట్రాక్టర్లు రహస్యంగా విని, ఆపిల్ సేవలను దుర్వినియోగ పరచిన కారణంగా వారిని తొలగించడంతో యూరప్ వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశయైంది. ఆపిల్తో ఒప్పందం కుదుర్చుకున్న కాంట్రాక్టర్లు, వినియోగదారులు - సిరితో చేసిన సంభాషణలు విని అది ఇచ్చే రెస్పాన్స్లో అవసరమైన మార్పులు చేయాలి. కానీ వారు వినియోగదారులు మాట్లాడుకునే వ్యక్తిగత శృంగార సంభాషణలు, డ్రగ్స్, బిజినేస్ డీల్స్ను కాంట్రాక్టర్లు పదేపదే విన్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై దుమారం రేగడంతో ఆపిల్ కంపెనీ వెంటనే సిరి గ్రేడింగ్ ప్రోగ్రామ్ను నిలిపివేసి కాంట్రాక్టర్లపై కొరడా ఝళిపించింది. తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో తీసుకొచ్చిన ‘సిరి’ సేవలను కాంట్రాక్టర్లు దుర్వినియోగం చేశారని, వాటిలో రికార్డైన సంభాషణలను రహస్యంగా వింటున్నారని ఓ ప్రజావేగు(విజిల్ బ్లోయర్) గార్డియన్ పత్రిక ద్వారా తెలపడంతో వినియోగదారులు షాక్కు గురయ్యారు. దీనిపై ఆపిల్ వివరణ ఇస్తూ ‘తమ కంపెనీ ప్రధానంగా వినియోగదారుని భద్రతకి ప్రాధాన్యం ఇస్తుందని, ఈ ఘటనపై వినియోగదారులను క్షమాపణలు కోరుతున్నామని’ తెలిపింది. అంతేకాక సదరు కాంట్రాక్టర్లతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని వివరణ ఇచ్చింది. -
ఐటీడీఏలో ఉద్యోగులే కాంట్రాక్టర్లు
సాక్షి, ఆదిలాబాద్ : ఐటీడీఏలో ఉద్యోగులే కాంట్రాక్టర్ల అవతారమెత్తుతున్నారు. ఇష్టార్యాజంగా వ్యవహరిస్తూ అదే శాఖ పరిధిలోని కార్యాలయాలు, స్కూళ్లు, గెస్ట్ హౌజ్ల పనులు టెండర్లు పిలవకుండానే పనులు చేపడుతున్నారని విమర్శలు గుప్పుమంటున్నాయి. దీని వెనుక ఓ అధికారి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఐటీడీఏ శాఖలోని ఉద్యోగులతో పనులు చేయించి బిల్లులు తీసుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. టెండర్లు లేవు.. ఆ శాఖ పరిధిలోని కార్యాలయాలు, స్కూళ్లు, ఇతర భవనాలు శిథిలావస్థకు చేరితే వాటిని మరమ్మతు చేయించడం మంచి పనే. కానీ దానికి ఓ పద్ధతి ఉంటుంది. ఆయా పనులకు ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ పనులను తక్కువ ధరకు చేయించేలా రూపకల్పన చేస్తారు. దాని ప్రకారం టెండర్లను ఆహ్వానిస్తారు. టెండర్లకు హాజరైన కాంట్రాక్టర్లలో ఎవరు తక్కువ ధరకు పనులు చేస్తారో వారికి పనులు అప్పగిస్తారు. పైగా పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఐటీడీఏ పరిధిలో పని చేసే ఇంజనీర్లు పర్యవేక్షిస్తారు. పద్ధతి ప్రకారం వారు రికార్డు చేస్తేనే కాంట్రాక్టర్కు బిల్లులు వస్తాయి. కానీ ఐటీడీఏ పరిధిలో జరుగుతున్న కొన్ని పనులకు టెండర్లు పిలువకుండానే వివిధ పనులను చేపట్టారని తెలుస్తోంది. ఉద్యోగులకు పనులు.. సర్వ సాధారణంగా ఏవైనా పనులు చేపట్టాలంటే సంబంధిత శాఖకు చెందని వారికి అప్పజెప్పాల్సి ఉంటుంది. కానీ ఐటీడీఏలో మాత్రం అలా జరగడం లేదని ఆరోపణలు లేకపోలేదు. సంబంధిత శాఖ ఉద్యోగులే కాం ట్రాక్టర్ల అవతారం ఎత్తినట్లు తెలుస్తోంది. లక్షల విలువైన పనులన్ని ఉద్యోగుల పేరిటే జరుగుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ఐటీడీఏ క్యాంపు కార్యాలయంతో పాటు గెస్ట్ హౌజ్, మరమ్మతులకు లక్షల రూపాయల ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంతే కా కుండా వివిధ ఆశ్రమ పాఠశాలల్లో వైరింగ్, పే యింటింగ్, తదితర పనుల పేరిట అదే శాఖలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులకు పనులు అ ప్పజెప్పినట్లు తెలుస్తోంది. అయితే వీరికి ఓ అ« దికారి అండదండలు ఉన్నట్లు గుసగుసలు వి నిపిస్తున్నాయి. ఎన్నికల కంటే ముందు.. ఎన్నికల కోడ్ కంటే ముందు వివిధ సంఘాల నాయకులు ఐటీడీఏ గెస్ట్ హౌజ్కు మరమ్మతులు చేయాలని పలుమార్లు విన్నవించినా ఆ శా ఖ అధికారులు పట్టించుకోలేదని విమర్శలు న్నాయి. ఎన్నికల అధికారుల కోసం విశ్రాంతి భవనాలకు మరమ్మతులు చేస్తున్నామని అ ధి కారులు చెప్తున్నారు. ఎన్నికల కోడ్ అ మల్లోకి రాకముందు పట్టించుకోని అధికారులు కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పనులు చేపట్టడంలో ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
రాజధానిలో రాబందులు
రాజధానిలో అర్ధరాత్రి వేళ రాబందులు తిరుగుతున్నాయి. ఇసుక, మట్టిని అక్రమంగా తవ్వుకుని తరలించుకుపోతున్నాయి. అడ్డుకట్ట వేయాల్సిన అధికారుల కళ్లను మామూళ్లు కమ్మేశాయి. రయ్యిమంటూ దూసుకుపోతున్న లారీలు, ట్రాక్టర్ల దెబ్బకు స్థానికుల గుండెలు అదురుతున్నాయి. కాంట్రాక్టర్లే ఇసుక మాఫియాతో కుమ్మక్కవడంతో ఈ అవినీతి కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. బయటకు తరలుతున్న ఇసుక లారీలు ఒక్కొక్కటి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పలుకుతున్నాయి. మొత్తంగా రాజధాని ప్రాంతంలో ఇసుక, మట్టి దోపిడీ వ్యవహారాలు చిమ్మచీకట్లో కలిసిపోతున్నాయి. తాడేపల్లిరూరల్: రాజధాని ప్రాంతంలో అర్థరాత్రి ఇసుక రాబందులు తిరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను, మట్టిని బయటకు పంపించి, ప్రతిరోజూ లక్షల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం కాంట్రాక్టర్లే మాఫియాతో చేతులు కలిపి ఇలాంటి దోపిడీకి పాల్పడుతున్నారని రాజధానిలో నివాసం ఉండే పలువురు ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. కృష్ణాయపాలెంలో కొండవీటివాగు పూడికతీత పనులు నిర్వహిస్తున్నారు. ఈ మట్టిని వాస్తవంగా వాగుకు ఇరువైపులా కట్ట ఏర్పాటుచేసి, దానిని పటిష్ఠ పరచాల్సి ఉంది. అలా చేయకుండా ఇష్టారాజ్యంగా రాత్రి సమయాల్లో వేలాది ట్రాక్టర్ల మట్టిని అమ్ముకుంటూ జేబులు నింపుకొంటున్నారు. వివిధ ప్రాంతాల్లో నిర్మాణం చేపట్టిన పనుల నిమిత్తం గతంలోనే ఇసుక తోలుకుని డంపింగ్ చేసుకున్నారు. సదరు కాంట్రాక్టర్లు, మాఫియా కుమ్మక్కై ఒక్కొక్క లారీ ఇసుక రూ.10 వేల నుంచి రూ.15వేల వరకు అమ్ముతూ రాజధాని ప్రాంతంలో రాత్రిపూట రయ్... రయ్...మని లారీలు నడుపుతూ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నారు. మందడం, కృష్ణాయపాలెం మధ్య కేఎంఆర్ ప్రాజెక్ట్ వారు కాలువ తవ్వకాలను నిర్వహిస్తున్నారు. ఏకంగా వీరు కాలువ తవ్వాల్సిన దానికన్నా ఎక్కువ తవ్వి, మట్టి కింద భాగంలో ఉండే ఇసుకను తోడుతూ పర్యావరణానికి సైతం హాని కలిగిస్తున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా నియంత్రించే అధికారే ఇక్కడ లేకపోవడం గమనార్హం. సోమవారం తెల్లవారుజామున ఇదే ప్రాంతంలో ఓ లారీ ఇసుక లోడు చేసుకుంటుండగా స్థానికులు అక్కడి నిర్వాహకుల్ని ప్రశ్నించారు. వారు తాము కేఎంఆర్ ప్రాజెక్ట్ స్టాక్యార్డ్కు ఇసుక తరలిస్తున్నామని చెప్పారు. స్టాక్యార్డ్ ఎక్కడ ఉందని ప్రశ్నించగా, మందడంలో ఉందని సమాధానమిచ్చారు. కానీ అక్కడ లోడ్ అవుతున్న లారీతో పాటు అప్పటికే లోడై ఉన్న మరో లారీ రెండూ కలిసి మంగళగిరి వైపు వెళ్లాయి. మంగళగిరి మండలం యర్రబాలెం వద్ద స్థానికులు ఆపి ప్రశ్నించగా కాజ దగ్గర కేఎంఆర్ ప్రాజెక్ట్ డంపింగ్యార్డ్ ఉందని, అక్కడకు వెళ్తున్నామని చెప్పారు. దీనిపై మంగళగిరి రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా, పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి రెండు లారీలను సీజ్ చేశారు. రాజధానిలో కనిపించని నిఘా... రాజధానిలో వివిధ పనులను నిర్వహించేందుకు వందలాది కంపెనీలు టెండర్ల ద్వారా పనులు దక్కించుకొని కాంట్రాక్ట్ వర్క్స్ను నిర్వహిస్తున్నారు. పనులు నిర్వహించే దగ్గర ఎటువంటి సెక్యూరిటీని నియమించలేదు. దాంతో సూపర్వైజర్గా వ్యవహరించేవారు అక్రమాలకు పాల్పడుతూ రాజధానిలోని సంపదను దోపిడీ చేస్తూ జేబులు నింపుకొంటున్నారు. ఉదాహరణకు కొండవీటి వాగు మట్టి తవ్వకాల్లో వచ్చిన మట్టిని రాజధాని ప్రయోజనాల కోసం వినియోగించకుండా వివిధ ప్రాంతాలకు ట్రాక్టర్ల ద్వారా, లారీల ద్వారా తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సీఆర్డీఏ వారు కానీ, రెవెన్యూ శాఖ కానీ, గ్రామంలో ఉన్న మిగతా సిబ్బంది కానీ పట్టించుకోకుండా వారిచ్చిన పావలా, బేడా జేబులో వేసుకుంటూ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు నీళ్లు రాజధాని ప్రాంతంలో నిర్వహించే పనుల్లో కాంట్రాక్టర్లు నిబంధనలకు నీళ్లొదిలి, తమ లాభార్జన కోసం పనిచేస్తూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. దీనికి నిదర్శనం మందడం నుంచి కృష్ణాయపాలెం మీదుగా కృష్ణానదిలో కలిసే వాగు పూడికతీత పనులే. నిబంధనలకు విరుద్ధంగా తవ్వాల్సిన దానికన్నా ఎక్కువ తవ్వి భూమిలోపల ఉన్న ఇసుకను బయటకు తీసి అమ్ముకుంటూ జేబులు నింపుకొంటున్నారు. ఇలాంటి పనులు నిర్వహించేటప్పుడు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పర్యావరణానికి సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా కాలువలు తవ్వడం వల్ల భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
బోధన్లో మున్సిపల్ కాంట్రాక్టర్ల ఆందోళన
-
ఖజానాలో డేంజర్ ‘బిల్స్’
సాక్షి, అమరావతి: దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకునే పనిలో పెదబాబు, చినబాబు నిమగ్నమయ్యారు. అధికారాంతమున ఖజానాను దోచేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలింగ్ ముందు వరకూ తనకు కావాల్సిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించుకున్నాడు. ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా అస్మదీయ కాంట్రాక్టర్లకు బిల్లులన్నీ చెల్లించాల్సిందేనంటూ ఆర్థిక శాఖపై ఒత్తిడి తెస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో(సీఎంవో) సాగునీటి వ్యవహారాలను పర్యవేక్షించే సాయిప్రసాద్ ద్వారా ఆర్థిక శాఖపై ఒత్తిడి పెంచుతున్నారు. పోలింగ్ ముందు రోజు దాకా ప్రభుత్వ నిధులను రాజకీయ అవసరాలు, స్వీయ లబ్ధి కోసం యథేచ్ఛగా వాడుకున్న చంద్రబాబుకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం రావడంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యింది. పోలింగ్ ముందు వరకూ ఉద్యోగుల వేతనాలు, వివిధ సంక్షేమ రంగాలకు ఇవ్వాల్సిన బిల్లులను చెల్లించకుండా పెండింగ్ పెట్టారు. చంద్రబాబు చెప్పిన బిల్లులకే నిధులను చెల్లించారు. ఉద్యోగుల వేతనాలు, గ్రామీణ మంచినీటి సరఫరా, కుటుంబ సంక్షేమం తదితర రంగాలకు చెందిన బిల్లులు పెద్ద ఎత్తున పెడింగ్లోనే ఉండిపోయాయి. ఈ బిల్లుల కోసం లబ్ధిదారులు ఆర్థిక శాఖ చుట్టూ తిరుగుతున్నారు. ప్రాధాన్యతా రంగాల వారీగా చెల్లించాలి వేతనాలు చెల్లింపులు జరగలేదనే విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకెళ్లారు. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్) ద్వారా బిల్లుల చెల్లింపులు ప్రాధాన్యతా క్రమంలో జరగడం లేదని, ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వారికే చెల్లింపులు చేస్తున్నారనే ఫిర్యాదులు సీఎస్కు అందాయి. దీంతో సీఎస్ పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు తక్షణమే అందజేయాలని, ప్రాధాన్యతా రంగాల ప్రకారం బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపును ఆఖరి ప్రాధాన్యతగా సీఎస్ నిర్ధారించారు. ఇక్కడే చంద్రబాబు అహం దెబ్బతింది. అందుకే సీఎస్ తీరుపై ఆయన గుర్రుగా ఉన్నారు. బిల్లుల చెల్లింపులో చంద్రబాబు ప్రాధాన్యతలకు, ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రాధాన్యతలకు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. కమీషన్లు ముట్టజెప్పిన వారికే బిల్లులు ఎన్నికల ముందు కమీషన్లు కొట్టేయడానికి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖపై ఒత్తిడి తెచ్చి నీరు–చెట్టు కింద రూ.2,104 కోట్ల బిల్లులు చెల్లింపజేశారు. ఆ నిధులన్నీ అధికార టీడీపీ నేతల జేబుల్లోకే వెళ్లాయి. అలాగే ఎన్నికల ముందు హడావిడిగా గోదావరి–పెన్నా ప్రాజెక్టుకు టెండర్లను ఆహ్వానించి మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద కాంట్రాక్టర్కు రూ.491 కోట్లు ఇప్పించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్, హంద్రీ–నీవా, గాలేరు–నగరి పనులకు సంబంధించి కాంట్రాక్టర్, టీడీపీ ఎంపీ సీఎం రమేశ్కు రూ.419 కోట్లు ఇప్పించారు. నీరు–చెట్టుతో పాటు వివిధ ప్రాజెక్టుల్లో మిగిలిపోయిన రూ.వేల కోట్ల బిల్లులను చెల్లించి, కమీషన్లు కాజేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు తగినట్లుగా మార్చి నెలాఖరుతో ముగిసిన గత ఆర్థిక సంవత్సరానికి చెందిన నీరు–చెట్టుతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులకు చెందిన రూ.9,804.27 కోట్ల బిల్లులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోకి సీఎఫ్ఎంఎస్ పరిధిలోకి తెచ్చారు. మిగతా రంగాలకు చెందిన బిల్లులను ఆర్థిక సంవత్సరం మారిందని తిరస్కరించినప్పటికీ అస్మదీయ కాంట్రాక్టర్లకు చెందిన బిల్లులను మాత్రం కొత్త ఆర్థిక సంవత్సరంలోకి పెండింగ్ బిల్లులుగా తీసుకొచ్చారు. పెదబాబుతో చినబాబు పోటీ కమీషన్లు కాజేసే విషయంలో చంద్రబాబుతో ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్ పోటీపడుతున్నారు. పంచాయతీల్లో ఎల్ఈడీ బల్బుల బిల్లులను వెంటనే చెల్లించాలంటూ పంచాయతీరాజ్ శాఖపై ఒత్తిడి పెంచేశారు. గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ వీధి లైట్ల ఏర్పాటును ఈఈఎస్ఎల్, ఎన్ఆర్ఈడీసీఏపీ అనే ఏజెన్సీలకు అప్పగించారు. ఆ ఏజెన్సీల నుంచి లోకేశ్ మనుషులు సబ్ కాంట్రాక్టులు తీసుకున్నారు. సంబంధిత బిల్లులను వచ్చే నెల 5వ తేదీలోగా చెల్లించేయాలని పంచాయతీరాజ్ శాఖను లోకేశ్ ఆదేశించారు. అయితే, నిధుల్లేక పంచాయతీలు ఇప్పటికే సతమతం అవుతున్నాయి. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి చెందిన రూ.768 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వేసవిలో మంచినీటి ఎద్దడి ఉన్నప్పటికీ గ్రామీణ మంచినీటి సరఫరాకు చెందిన రూ.206.97 కోట్ల బిల్లులను ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. మహిళా సంక్షేమానికి చెందిన రూ.132.93 కోట్లు, సాంఘిక సంక్షేమానికి చెందిన రూ.260.90 కోట్లు, గిరిజన సంక్షేమానికి చెందిన రూ.161 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. -
పనులెందుకు జరుగుతలేవ్?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ ధర్మారం: కింది స్థాయిలో కొత్తగా చేరిన ఇంజనీర్కు బడితె పూజ చేస్తే తప్ప అప్పగించిన పనులు పూర్తి కావనుకున్నాడో ఏమో ఆ అధికారి. ఇచ్చిన గడువులోగా పనులు పూర్తి చేయకపోతే చండశాసనుడైన అధికారి ఎవరినీ ఉపేక్షించడు అనే సందేశాన్ని ఇతర అధికారులకు కూడా పంపించాలనుకున్నాడు ఆ సారు. ఇంకేముంది కర్రతో వాతలు పెట్టే పని మొదలుపెట్టి.. ఆ ఘన కార్యాన్ని వీడియో సైతం తీయించారు! అది కాస్తా వైరల్ అవడంతో ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఆదివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంబంధిత శాఖ సిబ్బంది కథనం ప్రకారం.. మండలంలోని మేడారం, ధర్మారం, బొమ్మారెడ్డిపల్లి గ్రామాల్లో మిషన్ భగీరథ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయడం లేదని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఈఈ తిరుపతిరావు నందిమేడారం గ్రామంలో కొనసాగుతున్న పనుల పరిశీలనకు వెళ్లారు. నందిమేడారంలోని ఆలయం వద్ద పైప్లైన్కు, ట్యాంకు మధ్య ఇంటిగోడ ఉండటంతో పైప్లైన్ లింకేజీ పని పూర్తి కాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఈఈ.. కాంట్రాక్టర్ను పిలిపించి ఆయన సమక్షంలోనే పైప్లైన్ లింక్ ఎందుకు పూర్తి చేయలేదని ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ను కర్ర తీసుకురావాలని ఆదేశించారు. విధుల్లో ఉన్న మహిళా వర్క్ ఇన్స్పెక్టర్ని పిలిచి సెల్ఫోన్లో వీడియో చిత్రీకరణ చేయాలని అన్నారు. ఆమె వీడియోలో చిత్రీకరిస్తుండగా, ఎందుకు పనులు చేయించడం లేదని కర్రతో తొడలు, మోకాళ్లపై కర్రతో గట్టిగా కొట్టారు. దీంతో భయాందోళనకు గురైన ఏఈ విలాస్ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అక్కడే ఉన్న డీఈఈ రాజ్కుమార్పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్కు డబ్బులు చెల్లిస్తున్నా పనులు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. సమాధానాలు చెబుతున్నా వినిపించుకోకుండా చేతిలో కర్రను ఊపుతూ ఈఈ చేస్తున్న హంగామాను డీఈ సైతం ఆశ్చర్యంగా చూడటం గమనార్హం. అక్కడ నుంచి ధర్మారంలోని మసీద్ వద్దకు వచ్చి పైప్లైన్ లింక్ ఎందుకు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేయగా.. లింక్ చేసే అనుభవమున్న మెకానిక్లు దొరకటం లేదని సమాధానం చెప్పినప్పటికీ వినకుండా తిట్ల వర్షం కురిపించినట్లు సమాచారం. ధర్మారం నుంచి బొమ్మారెడ్డిపల్లి గ్రామానికి కిందిస్థాయి అధికారిని కారులోనే తీసుకువెళ్లి అక్కడ కూడా పనుల జాప్యంపై ఆగ్రహించారు. కాగా ఆయా గ్రామాల్లోని కాంట్రాక్టర్లకు ఎన్ని సార్లు చెప్పినప్పటికి స్థానికంగా నెలకొన్న వివిధ సమస్యలతో పనులు ముందుకు సాగటం లేదని ఏఈ చెప్పినా వినిపించుకోకుండా మందలించినట్లు సమాచారం. అక్కడి నుంచి తిరిగి వారిని పెద్దపల్లికి తీసుకువచ్చినట్లు ఏఈ తెలిపారు. కొత్తగా ఏఈగా ఉద్యోగంలో చేరిన విలాస్ తనకు జరిగిన అవమానానికి మనస్తాపానికి గురై అదే రాత్రి యూనియన్ నాయకులకు సమాచారం అందించారు. మంగళవారం యూనియన్ నాయకులతో కరీంనగర్లో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని కలసి ఈఈ చేసిన నిర్వాకాన్ని, తన తొడలపై వచ్చిన వాతలను చూపించి ధర్నా నిర్వహించారు. ఈఈ చేసిన బడితెపూజపై అధికార యంత్రాంగంలో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఎన్నికల దాహం!
మరికొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుందనే సమాచారంతో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో అధికార పార్టీ నేతల ధన దాహం పెరిగిపోయింది. రూ.50 లక్షలు దాటిన చెల్లింపులు కౌన్సిల్ సాధారణ సమావేశంలో పెట్టడం ఇష్టం లేక బిల్లులను విభజించి స్టాండింగ్ కమిటీలో ఉంచి ఆమోదింపజేసుకున్నారు. కాంట్రాక్టర్లు కూడబలుక్కుని రూ.కోట్ల విలువ చేసే పనులను నిర్ణీత ధరల కంటే 4.97 శాతం అధిక మొత్తానికి దక్కించుకున్నారు. రూ.1.57 కోట్ల విలువైన పనులకు సింగిల్ దరఖాస్తుతో టెండర్లు చేజిక్కించుకున్నారు. చిత్తూరు అర్బన్: ప్రభుత్వం మారిపోతే ఏమీ చేయలేమని, ఉన్నదంతా ఉన్నఫళంగా ఊడ్చేయాలన్నట్లుంది చిత్తూరు అధికార పార్టీ నేతల తీరు. చిత్తూరు మున్సిపల్ స్టాండింగ్ కమిటీ అజెండా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సమావేశం మేయర్ హేమలత అధ్యక్షతన శుక్రవారం ఉదయం నిర్వహించారు. కమిటీలో మేయర్ కాకుండా ఐదుగురు కార్పొరేటర్లు సభ్యులుగా ఉన్నప్పటికీ శ్రీకాంత్, నవీన్ అనే వ్యక్తులు ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా వీరు సమావేశానికి గైర్హాజరయ్యారు. మిగిలిన ముగ్గురిలో నళిని, లోకనాథం ప్రేక్షకపాత్ర వహించగా గుణశేఖర్నాయుడు కీలకంగా వ్యవహరించారు. మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, డెప్యూటీ మేయర్ సుబ్రమణ్యం తదితరులు సమావేశంలో పాల్గొని కమిటీ ఆమోదించిన వాటిని పుస్తకాల్లో రాసుకున్నారు. వీటికి ఆమోదం.. ♦ నగరంలో అద్దెనీటి ట్యాంకర్లకు గతేడాది జూలై నుంచి డిసెంబరు వరకు రూ.80 లక్షల బకాయిలున్నాయి. వీటిని కరవు నిధుల్లోంచి చెల్లించాలి. కానీ కరువు నిధులు వచ్చేలోపు ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలి యదు. అందుకే మున్సిపల్ సాధారణ పద్దుల నుంచి ఈ మొత్తాన్ని చెల్లించేలా ప్రణాళిక వేశారు. రూ.80 లక్షలు ఒక్కసారిగా చెల్లించా లంటే కౌన్సిల్ సమావేశంలో ఉంచాలి. ఇప్పటికిప్పుడు అంత సమయం లేదు. స్టాండింగ్ కమిటీకి రూ.50 లక్షల్లోపు బిల్లులను ఆమోదించే అవకాశం ఉండటంతో ఈ మొత్తాన్ని రూ.44.29 లక్షలుగా, రూ.34.94 లక్షలుగా విభజించి కాంట్రాక్టర్లు మునిరత్నంనాయుడు, రాజశేఖర్నాయుడుకు సాధారణ పద్దుల నుంచి చెల్లించేలా ఆమోదింపజేసుకున్నారు. ♦ మేయర్కు చెందిన 33వ డివిజన్లోని గంగనపల్లెలో శ్మశాన వాటిక అభివృద్ధి, ప్రహరీగోడ, అంతర్గత రోడ్ల నిర్మాణానికి 4.97 శాతం అధిక ధరతో రూ.34.97 లక్షలకు టెండర్, సబ్ ప్లాన్ నిధుల నుంచి బాలంబట్టు హరిజనవాడలో మురుగునీటి కాలువను నిర్మించడానికి 4.97 శాతం అధిక ధరతో రూ.35.21 లక్షలతో వేసిన టెండర్లను మునిరత్నంనాయుడు అనే వ్యక్తికి అప్పగిస్తూ తీర్మానించారు. ♦ కరువు నిధుల నుంచి నగరంలో నీటి బోర్ల డీపినింగ్, ఫ్లషింగ్ (అదనపు పైపులు వేయడం) కోసం 4.97 శాతం అధిక ధరతో రూ.17.79 లక్షల టెండర్ రాజశేఖర్నాయుడుకు కేటాయిస్తూ ఆమోదించారు. ♦ నీటి బోర్లకు మోటార్లు బిగించడం కోసం 4.97 శాతం అధిక ధరతో దాఖలు చేసిన రెండు టెండర్లను (రూ.37.80 లక్షలు) మనిదీప్ ట్రేడర్స్కు అప్పగించారు. ♦ గత రెండేళ్లలో రూ.84 లక్షలు, రూ.90 లక్షలు పలికిన చిత్తూరు కూరగాయల మార్కెట్లో గేటు వసూళ్ల టెండరును ఈ సారి వేలం పాటలో రూ.47 లక్షలకే వేలం దక్కించుకున్న లోకనాథనాయుడు అనే వ్యక్తికి గుత్తాధిపత్యం అప్పగిస్తూ తీర్మానం. ∙నగరంలోని 11 ప్రాంతాల్లో రూ.44.22 లక్షల విలువ చేసే పనులకు ఎలాంటి టెండర్లూ లేకుండా నామినేటెడ్ పద్ధతిలో వార్డ్ లెవల్ కమిటీల పేరిట టీడీపీ కార్యకర్తలకు అప్పగిస్తూ కమిటీ ఆమోదం తెలిపింది. వీటి అంచనాలను రూ.5 లక్షల్లోపు కుదించి తెలివిగా నామినేటెడ్లో చూపించారు. ∙తిమ్మసముద్రం, సీజీ పల్లె, ప్రశాంత్నగర్, పోతంబట్టు, గంగనపల్లె ప్రాంతాల్లో నీటి నిల్వ చేసే ఓవర్హెడ్ ట్యాంకర్ల నిర్మాణానికి 4.95 శాతం ఎక్కువ ధరకు సింగిల్ టెండరు దాఖలు చేసిన మునేశ్వర కన్స్ట్రక్షన్స్కు రూ.1.57 కోట్ల విలువైన పనులు అప్పగిస్తూ తీర్మానం చేశారు. -
అ‘ధన’పు మెలిక!
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ (జలాశయం) నుంచి కుడి కాలువను అనుసంధానం చేసే కనెక్టివిటీస్ పనులకు బ్రేకులు పడ్డాయి. పనుల పరిమాణం పెరిగినందున రూ.113కోట్ల అదనపు చెల్లింపులు చేయాలంటూ మూడు ప్యాకేజీలకు సంబంధించిన కాంట్రాక్టర్లు చేస్తున్న డిమాండ్లకు ఉన్నతాధికారులు తలొగ్గకపోవడంతో వారు పనులు నిలిపివేశారు. దీంతో స్వయాన సీఎం జోక్యం చేసుకుని వారికి దన్నుగా నిలిచినట్లు.. వారం రోజుల్లో కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉత్తర్వులు కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ కుడి వైపు అనుసంధానం పనుల్లో 62వ ప్యాకేజీ (హెడ్ రెగ్యులేటర్, ఆఫ్ టేక్ రెగ్యులేటర్.. ఈ, ఎఫ్ సాడిల్ డ్యామ్లు, వాటికి డిప్లీషన్ స్లూయిజ్ల నిర్మాణం) పనులను రూ.91.16 కోట్లకు హిందూస్థాన్–రత్నా (జేవీ) సంస్థ దక్కించుకుని ఇప్పటివరకూ రూ.60.86 కోట్ల విలువైన పనులు పూర్తిచేసింది. 63వ ప్యాకేజీ (736 మీటర్ల పొడవుతో జంట సొరంగాల తవ్వకం, మట్టికట్ట–1, మట్టికట్ట–2, మట్టికట్ట–1కు డిప్లీషన్ స్లూయిజ్ నిర్మాణం) పనులను ఎస్ఎంఎస్సైఎల్–యూఏఎన్మ్యాక్స్ (జేవీ) సంస్థ రూ.72.81 కోట్లకు దక్కించుకుని.. రూ.39.70 కోట్ల విలువైన పనులు పూర్తిచేసింది. 64వ ప్యాకేజీ (జంట సొరంగాలకు నీటిని సరఫరా చేసే ఛానల్.. సొరంగాల నుంచి కాలువలకు నీటిని తీసుకెళ్లే ఛానల్ తవ్వకం) పనులను యూఏఎన్ మ్యాక్స్ ఇన్ఫ్రా సంస్థ రూ.73.90 కోట్లకు దక్కించుకుని.. ఇప్పటివరకూ రూ.51.77 కోట్ల విలువైన పనులు పూర్తిచేసింది. పనులు ఆపేసిన కాంట్రాక్టర్లు ఇదిలా ఉంటే.. అదనపు బిల్లులు ఇచ్చేవరకూ పనులు చేయబోమని ఆయా కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. దీంతో గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేయాలంటే కాంట్రాక్టర్ల డిమాండ్లు పరిష్కరించాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆ వెంటనే అదనపు బిల్లుల కోసం మూడు ప్యాకేజీల కాంట్రాక్టర్లు జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపారు. వాటిని స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ)కి జలవనరుల శాఖ సిఫార్సు చేసింది. పనుల పరిమాణంలో ఏమాత్రం పెరుగుదలలేదని.. కాంట్రాక్టర్ల ప్రతిపాదనలు సహేతుకంగా లేవని ప్రాథమికంగా ఎస్ఎల్ఎస్సీ నిర్ధారించింది. ఈ విషయాన్ని కాంట్రాక్టర్లు సీఎం చంద్రబాబుకు తెలియజేయడంతో ఆయన జోక్యం చేసుకున్నారు. కాంట్రాక్టర్ల డిమాండ్ పరిష్కరించి.. పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ఎస్ఎల్ఎస్సీకి దిశానిర్దేశం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ ఎస్ఎల్ఎస్సీ ఆ ప్రతిపాదనలను తిరస్కరిస్తే.. చీఫ్ ఇంజనీర్స్ కమిటీతో వాటిపై ఆమోదముద్ర వేయించి.. కేబినెట్లో తీర్మానించడం ద్వారా కాంట్రాక్టర్లకు అదనపు బిల్లులు ఇచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు పావులు కదుపుతున్నారు. ఈ పరిణామాలను పరిశీలిస్తున్న అధికారులు.. కాంట్రాక్టర్లకు అదనపు బిల్లులు చెల్లించేలా వారం రోజుల్లో ఉత్తర్వులు రావడం ఖాయమని చెబుతున్నారు. అదనపు బిల్లులు చెల్లిస్తేనే.. ఈ నేపథ్యంలో.. కుడి వైపు అనుసంధానాల పనుల్లో 62వ ప్యాకేజీలో 88,150 క్యూబిక్ మీటర్ల మట్టి, 2,36,430 క్యూబిక్ మీటర్ల ఎంబాక్మెంట్ (గట్లు), 10,984 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 477 చదరపు మీటర్ల గేట్ల పనులు ఇంకా చేయాల్సి ఉంది. 63వ ప్యాకేజీ పనులు పూర్తికావాలంటే ఇంకా 2,18,500 మట్టి, 65,500 క్యూబిక్మీటర్ల కాంక్రీట్, 2,61,170 క్యూబిక్ మీటర్ల ఎంబాక్మెంట్ పనులు చేయాలి. ఇక 64వ ప్యాకేజీ పనులు పూర్తి కావాలంటే 25,213 క్యూబిక్ మీటర్ల మట్టి, 61,352 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయాలి. ఈ పనులు పూర్తిచేయడానికి కాంట్రాక్టర్లు కొత్త మెలిక పెడుతున్నారు.ఇప్పటివరకూ చేసిన పనులకు రూ.44 కోట్ల అదనపు బిల్లులు ఇవ్వాలని 62వ ప్యాకేజీ కాంట్రాక్టర్, రూ.48 కోట్ల అదనపు బిల్లుల కోసం 63వ ప్యాకేజీ కాంట్రాక్టర్.. రూ.21 కోట్ల అదనపు నిధులు ఇవ్వాల్సిందేనని 64వ ప్యాకేజీ కాంట్రాక్టర్.. గత నెల 26న నిర్వహించిన వర్చువల్ రివ్యూలో సీఎం చంద్రబాబుకు వివరించారు. పనుల పరిమాణం భారీగా పెరిగిందని.. మొత్తం రూ.113కోట్లు అదనపు బిల్లులు ఇస్తేనే మిగిలిన పనులు చేస్తామని వారు స్పష్టంచేశారు. కానీ, పనుల్లో పరిమాణం ఏమాత్రం పెరగలేదని.. అదనపు బిల్లులు ఇవ్వాల్సిన అవసరంలేదని సమీక్షలో పాల్గొన్న జలవనరుల అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. కానీ.. అధికారుల వాదనను తోసిపుచ్చిన ముఖ్యమంత్రి కాంట్రాక్టర్లకే వంతపాడారని అధికార వర్గాలు చెబుతున్నాయి. గిట్టుబాటు కాకపోతే కొట్టినా కాంట్రాక్టర్లు పనులుచేయరని ఆయనన్నట్లు ఓ కీలక అధికారి చెప్పారు. ముందే కుదిరిన ఒప్పందం మేరకే కాంట్రాక్టర్లకు సీఎం చంద్రబాబు దన్నుగా నిలుస్తునట్లు అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
భార్యలు సర్పంచ్లు.. భర్తలు కాంట్రాక్టర్లు!
సాక్షి, హైదరాబాద్: మహిళా సాధికారితలో భాగంగా పంచాయతీ సర్పంచ్లుగా మహిళలను నియమిస్తే, వారి భర్తలు అధికారం చెలాయిస్తున్నారంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. స్వచ్ఛ భారత్ కింద పంచాయతీలకు వస్తున్న నిధులను మహిళా సర్పంచ్ల భర్తలు తమ జేబుల్లో వేసుకుంటున్నారని ఆక్షేపించింది. భార్యలు సర్పంచ్లుగా పని చేస్తుంటే, భర్తలు కాంట్రాక్టర్లుగా, బినామీ పేర్లతో పనులు చేస్తూ నిధులను స్వాహా చేస్తున్నారని పేర్కొంది. ఇటువంటి వాటిని యుద్ధ ప్రాతిపదికన కఠినంగా అణిచివేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీల పరిధిలో స్వచ్ఛ భారత్ కింద చేపడుతున్న మరుగుదొడ్ల నిర్మాణాల్లో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరుగుతోందని తేల్చిన హైకోర్టు, దీనిపై లోతుగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ (ఏసీబీ డీజీ)ని ఆదేశించింది. ఏవైనా మూడు నాలుగు పంచాయతీలను ఎంపిక చేసుకుని స్వచ్ఛ భారత్ కింద ఎంత మేర నిధులు వచ్చాయి.. ఎంత మేర పనులు జరిగాయి.. ఎంత దుర్వినియోగం జరిగింది తదితర వివరాలను తమ ముందుంచాలని చెప్పింది. అలాగే స్వచ్ఛ భారత్ కింద విడుదల చేసిన నిధులు, వాటి సద్వినియోగం తదితర వివరాలను తమ ముందుంచాలని స్వచ్ఛ భారత్ డైరెక్టర్ను ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 3కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృ ష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సొంత ఖాతాల్లోకి నిధులు... మెదక్ జిల్లా, నార్సింగి గ్రామ పంచాయతీ పరిధిలో స్వచ్ఛ భారత్ కింద చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణంలో రూ.40 లక్షల మేర నిధులు దుర్వినియోగం అయ్యాయని, ఈ నిధులను సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్లు తమ సొంత ఖాతాలకు మళ్లించుకున్నారని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఆ గ్రామానికి చెందిన ఎం.శేఖర్రెడ్డి హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. గత వారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం, నిధుల దుర్వినియోగంపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. అలాగే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నుంచి ధర్మాసనం నివేదిక కోరింది. తాజాగా మంగళవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, ఏసీబీ తరఫు న్యాయవాది తమ నివేదికను కోర్టు ముందుంచారు. అలాగే న్యాయసేవాధికార సంస్థ తరఫు న్యాయవాది జె.అనిల్కుమార్ తమ నివేదికను కోర్టుకు సమర్పించారు. కఠిన చర్యలు తీసుకోవాలి... ‘స్వచ్ఛ భారత్లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు ఇస్తోంది. ఇందులో అక్రమాలకు పాల్పడే వారిపై యుద్ధ ప్రతిపాదికన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏవైనా నాలుగు పంచాయతీలను ఎంపిక చేసుకుని, అందులో నిధుల దుర్వినియోగంపై నివేదిక సమర్పించాలి’అని ఏసీబీ అధికారులను ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో స్వచ్ఛ భారత్ డైరెక్టర్ను సుమోటోగా ప్రతివాదిగా చేర్చింది. మరుగుదొడ్ల నిర్మాణానికి చేసిన కేటాయింపులపై నివేదిక ఇవ్వాలని ఆ డైరెక్టర్ను ఆదేశిస్తూ తదుపరి విచారణను జనవరి 3కి వాయిదా వేసింది. పోస్టుమార్టం ఎందుకు? ఈ నివేదికలను పరిశీలించిన ధర్మాసనం, తీవ్రస్థాయిలో స్పందించింది. ఇది కేవలం ఓ గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధుల దుర్వి నియోగం మాత్రమేనని, ఇటువంటి ఘటనలు అనేక పంచాయతీల్లో జరిగి ఉంటాయంది. ఈ సమయంలో ప్రభుత్వ న్యాయవాది జ్యోతికిరణ్ స్పందిస్తూ, సర్పంచ్పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని చెప్పారు. దర్మాసనం స్పందిస్తూ, ఘటన జరిగిన తరువాత పోస్టుమార్టం చేసే కన్నా, ఇటువంటి ఘటనలు జరగడానికి ముందే చర్యలు తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని తెలిపింది. ఏసీబీ, న్యాయసేవాధికార సంస్థల నివేదికలు పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం, మోసం జరిగిన ట్లు చెబుతున్నాయని ధర్మాసనం పేర్కొంది. -
పండుగ జేస్కోవాలంటే పైసలేవీ!
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు తెలంగాణ అంతటా పండుగ వాతావరణం.. మరోవైపు ఇంటికొచ్చిన ఆడబిడ్డలను ఆదరించేదెట్లా అనే ఆందోళన. కొత్త బట్టల సంగతేమోగాని పండుగపూట కనీస మర్యాదలు కూడా చేయలేని పరిస్థితి. ఇదీ వైద్య, ఆరోగ్య శాఖలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల దుస్థితి. కాంట్రాక్ట్ దక్కించుకున్న ఔట్సోర్సింగ్ ఏజెన్సీ యాజమాన్యం మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. కీలకమైన ఓపీ సమయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులంతా విధులు బహిష్కరించి ధర్నాకు దిగుతుండటంతో ఓపీ సేవలే కాకుండా పలు సర్జరీలు సైతం వాయిదా పడుతున్నాయి. ఇంటి అద్దెలు.. కిరాణాషాపుల్లో బకాయిలు ప్రతిష్టాత్మక గాంధీ జనరల్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సులు, పారామెడికల్ స్టాఫ్, ఫోర్త్క్లాస్ ఎంప్లాయీస్ 470 మంది పని చేస్తున్నారు. నీలోఫర్ చిన్న పిల్లల ఆస్పత్రిలో 120 మంది నర్సులు, పారామెడికల్ స్టాఫ్, ఫోర్త్క్లాస్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. వీరంతా ఇప్పటికే మూడు నెలల నుంచి వేతనాలు లేక ఇంటి అద్దెలు, కిరాణా షాపుల్లో పెట్టిన బాకీలు భారీగా పెరిగిపోయాయని, పాత బాకీ చెల్లిస్తే కానీ వారు కూడా కిరాణం ఇవ్వడం లేదంటున్నారు. ప్రభుత్వం ఇచ్చినా.. ఇవ్వకపోయినా... నిబంధనల ప్రకారం ప్రభుత్వం బడ్జెట్ మంజూరు చేసినా.. చేయకపోయినా కాంట్రాక్ట్ దక్కించుకున్న ఏజెన్సీ నిర్వాహకులే ప్రతినెలా విధిగా ఆయా సిబ్బంది వేతనాలు చెల్లించాలి. కానీ, ఏజెన్సీ నిర్వాహకులు మూడునెలలుగా వేతనాలివ్వడం లేదు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ కింద పని చేస్తున్న ఉద్యోగులందరికీ వేతనాలు చెల్లించాలంటే నెలకు కనీసం రూ.70లక్షలపైనే అవుతుంది. ఇంత పెద్ద మొత్తాన్ని తాము మాత్రం ఎక్కడి నుంచి తీసుకురాగలమని ఏజెన్సీల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలతో డీఎంఈ చర్చలు ఔట్ సోర్సింగ్ వైద్య సిబ్బంది ఆందోళనలను విరమింపజేసేందుకు ప్రభుత్వం ఇటీవల ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలతో చర్చలు జరిపింది. ఏజెన్సీలకు బకాయి పడిన దాంట్లో కొంత మొత్తాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించడమే కాకుండా రూ.4 కోట్లకు సంబంధించిన రిలీజింగ్ ఆర్డర్ కూడా ఇచ్చిందని, దసరా పండగ లోపే ఆయా కార్మికులందరికీ వేతనాలు అందజేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డి చెప్పారు. -
సింగిల్ టెండర్ల జాతర జీవోలకు పాతర
‘‘కాంట్రాక్టర్లందరికీ సమాన అవకాశాలు కల్పించేలా ఏకీకృత నిబంధనలు రూపొందించి టెండర్లు నిర్వహించాలి. అప్పుడే ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడతారు. అంచనా వ్యయం కంటే తక్కువ ధరలకే పనులు చేసేందుకు ముందుకొస్తారు. దీనివల్ల ఖజానాకు పెద్ద ఎత్తున డబ్బు ఆదా అవుతుంది. సింగిల్ షెడ్యూలు దాఖలైతే ఆ టెండర్లను రద్దు చేయాలి’’ – టెండర్లపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) మార్గదర్శకాలు ఇవి. సాక్షి, అమరావతి: కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను తుంగలో తొక్కారు. జీవో 94, 174లను వక్రీకరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక శాఖ అభ్యంతరాలను బుట్టదాఖలు చేశారు. సింగిల్ షెడ్యూల్ దాఖలైన టెండర్లను ఆమోదించాలంటూ కమిషనరేట్ ఆఫ్ టెండర్స్(సీవోటీ)పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నారు. రూ.944.29 కోట్ల విలువైన మూడు పనులకు నిర్వహించిన టెండర్లను ఖరారు చేసి..అస్మదీయ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని హుకుం జారీ చేశారు. ఈ మూడు పనుల్లో సింగిల్ షెడ్యూళ్లపై ఆమోదముద్ర వేస్తే ఖజానాకు భారీగా నష్టం తప్పదు. మూడు టెండర్లు.. టెండర్లలో ఒకే సంస్థ షెడ్యూల్ దాఖలు చేస్తే.. టెక్నికల్(సాంకేతిక) బిడ్ స్థాయిలోనే వాటిని రద్దు చేసి, కొత్తగా టెండర్లు నిర్వహించాలని జీవో 94, 174లు తేల్చిచెబుతున్నాయి. కానీ, వాటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ♦ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం తొలి దశలో రెండో ప్యాకేజీలో పెదపూడి రిజర్వాయర్ నిర్మాణం, కాలువ తవ్వకం, 1.10 లక్షల ఎకరాలకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల(పిల్ల కాలువ) పనులకు రూ.603.87 కోట్ల అంచనా వ్యయంతో ఇటీవల టెండర్లు పిలిచారు. హెచ్ఈఎస్(జాయింట్ వెంచర్) సంస్థ ఒక్కటే 4.57 శాతం ఎక్సెస్ కోట్ చేస్తూ షెడ్యూల్ దాఖలు చేసింది. ♦ కర్నూలు జిల్లాలో పశ్చిమ మండలాలకు నీళ్లందించే ఎత్తిపోతల పథకానికి రూ.177.93 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం ఇటీవల టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లలో కోయా ఇన్ఫ్రా సంస్థ ఒక్కటే 4.52 శాతం ఎక్సెస్ కోట్ చేస్తూ షెడ్యూల్ దాఖలు చేసింది. ♦ తోటపల్లి పాత రెగ్యులేటర్ నుంచి నాగావళి కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణకు రూ.162.49 కోట్లతో ఇటీవల సర్కార్ టెండర్లు నిర్వహించింది. సాయిలక్ష్మి ఇన్ఫ్రా సంస్థ ఒక్కటే 4.29 శాతం అధిక ధరలు కోట్ చేస్తూ షెడ్యూల్ దాఖలు చేసింది. నిబంధనల ప్రకారం ఈ మూడు టెండర్లను టెక్నికల్ బిడ్ స్థాయిలోనే రద్దు చేయాలి. పైనాన్స్(ఆర్థిక) బిడ్ తెరవకూడదు. కానీ, ఉన్నతస్థాయి ఒత్తిళ్లకు తలొగ్గిన ఆయా ప్రాజెక్టుల అధికారులు వాటి ఫైనాన్స్ బిడ్ సైతం తెరిచి, ఆ సంస్థలకే పనులు అప్పగించేందుకు అనుమతి కోరుతూ సీవోటీకి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేసి, అస్మదీయ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలంటూ సీవోటీపై ముఖ్యనేత ఒత్తిడి తెస్తున్నారు. ఈ టెండర్లను రద్దు చేసి.. మళ్లీ పారదర్శకంగా టెండర్లు నిర్వహిస్తే కనీసం 5 శాతం తక్కువ ధరలకే పనులు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకొస్తారు. దీనివల్ల ఖజానాకు కోట్లాది రూపాయల సొమ్ము ఆదా అవుతుంది. కానీ, ముఖ్యనేత మాత్రం తన ప్రయోజనాలే పరమావధిగా భావిస్తున్నారు. ఖజానాకు నష్టం వాటిల్లినా సరే తన జేబులు నిండితే చాలనుకుంటున్నారు. ముఖ్యనేత కమీషన్ల కక్కుర్తి సాగునీటి ప్రాజెక్టు పనుల ప్రతిపాదన దశలోనే కాంట్రాక్టర్లతో కుమ్మక్కవడం.. ఆయా పనులు వారికే దక్కేలా నిబంధనలు రూపొందించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం.. సగటున 4.95 శాతం అదనపు ధరలకు(ఎక్సెస్) వారికే పనులు కట్టబెట్టి భారీ ఎత్తున కమీషన్లు దండుకోవడం ‘ముఖ్య’నేతకు పరిపాటిగా మారింది. కమీషన్లకు కక్కుర్తి పడి టెండర్ల విధానాన్ని అపహాస్యం చేస్తున్నారు. టెండర్లను పారదర్శకంగా నిర్వహించడంపై మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనల మేరకు 2003 జూలై 1న ప్రభుత్వం జీవో 94ను జారీ చేసింది. ఆ జీవో మేరకే టెండర్లు నిర్వహించి.. కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలి. ఇంజనీరింగ్–ప్రొక్యూర్మెంట్–కన్స్ట్రక్షన్(ఈపీసీ) విధానంలో నిర్వహించే టెండర్లను ఖరారు చేసే బాధ్యతను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నేతృత్వంలోని హైపవర్ కమిటీ(హెచ్పీసీ)కి ప్రభుత్వం కట్టబెట్టింది. కాంట్రాక్టర్లు కుమ్మక్కై అదనపు ధరలకు షెడ్యూళ్లను కోట్ చేస్తే వాటిని హెచ్పీసీ గుర్తించి, చర్య తీసుకుంటుంది. కానీ, గత నాలుగేళ్లుగా జీవో 94ను టీడీపీ సర్కార్ లెక్కచేయడం లేదు. పైగా మంత్రివర్గ ఉపసంఘాన్ని సంప్రదించకుండానే గతేడాది నవంబర్ 16న హెచ్పీసీని రద్దు చేస్తూ ముఖ్యనేత ఉత్తర్వులు జారీ చేయించారు. కాంట్రాక్టర్ మనోడైతే చాలు అస్మదీయ కాంట్రాక్టర్లకు పనులు దక్కే అవకాశం ఉన్నప్పుడు ఒకలా.. దక్కే అవకాశం లేనప్పుడు మరోలా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తుండడం చూసి జలవనరుల శాఖ అధికార వర్గాలు నివ్వెరపోతున్నాయి. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో భాగమైన జీడిపల్లి రిజర్వాయర్ నుంచి అప్పర్ పెన్నార్ రిజర్వాయర్కు నీటిని తరలించే పథకానికి రూ.565.28 కోట్ల అంచనా వ్యయంతో ఇటీవల ప్రభుత్వం టెండర్లు నిర్వహించింది. చంద్రబాబుకు బాగా కావాల్సిన ప్రముఖ కాంట్రాక్టు సంస్థ ఒక్కటే 4.65 శాతం ఎక్సెస్ కోట్ చేస్తూ షెడ్యూల్ దాఖలు చేసింది. ఎంపిక చేసిన కాంట్రాక్టర్కే ఆ పనులు దక్కడంతో సింగిల్ షెడ్యూల్ను ఆమోదించేలా సీవోటీపై ఒత్తిడి తెచ్చారు. ఆ సంస్థకు పనులు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. వెలిగొండ ప్రాజెక్టులో రెండో టన్నెల్లో మిగిలిపోయిన పనులకు రూ.570.58 కోట్ల అంచనా వ్యయంతో మార్చిలో టెండర్ నోటిఫికేషన్ చేశారు. ఈ పనులను టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్కు చెందిన రిత్విక్ సంస్థకు అప్పగించాలని సీఎం చంద్రబాబు ముందుగానే నిర్ణయించారు. కానీ, ఆ పనులు సీఎం రమేష్కు దక్కే అవకాశం లేకపోవడంతో సింగిల్ షెడ్యూల్ దాఖలైందనే సాకు చూపి.. జీవో 94, 174లను ప్రస్తావిస్తూ ఆ టెండర్లను రద్దు చేయించారు. ఆ పనులకు మళ్లీ టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించి.. 4.65 శాతం ఎక్సెస్కు సీఎం రమేష్ సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు. -
పోలవరం పనుల్లో లోపాలు బట్టబయలు
-
కమీషన్ల కక్కుర్తి..నాణ్యత నట్టేట్లోకి!
సాక్షి, అమరావతి: ముఖ్యనేత కమీషన్ల యావ పోలవరం ప్రాజెక్టు పనుల నాణ్యతపై ప్రభావం చూపుతోందా? సిమెంట్, స్టీల్ను సరఫరా చేసే సంస్థల నుంచి ముక్కుపిండి మరీ ముడుపులు వసూలు చేస్తున్నారా? అందువల్లే ఆయా సంస్థలు నాసిరకం సిమెంట్, స్టీల్ను అంటగడుతున్నాయా? పనుల పర్యవేక్షణకు, వాటి నాణ్యతను పరీక్షిం చడానికి కాంట్రాక్టర్ సూచించిన అధికారినే నియ మించారా? అందువల్లే కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమా ధానం చెబుతున్నాయి జలవనరుల శాఖ అధికార వర్గాలు. పోలవరం హెడ్వర్క్స్ (జలాశయం)లో నాణ్యతా లోపాలను బయటపెట్టిన ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావును ఆ పనుల బాధ్యతల నుంచి తప్పించడాన్ని అధికార వర్గాలు గుర్తుచేస్తున్నాయి. స్పిల్ వే పనులపై ఇంత నిర్లక్ష్యమా? పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్లో నాణ్యతా లోపాలను గురువారం కేంద్ర నిపుణుల కమిటీ బహిర్గతం చేయడం తీవ్ర కలకలం రేపింది. కాంక్రీట్ పనుల్లో నాసిరకం స్టీల్, సిమెంట్ను వినియోగి స్తున్నారని నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. కాంట్రా క్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేయడం వల్లే స్పిల్ వేలో చీలికలు ఏర్పడ్డాయని, వాటిని సరిదిద్దాలని ఆదేశించామని కేంద్ర నిపుణుల కమిటీ ఛైర్మన్ వైకే శర్మ స్పష్టం చేశారు. ఇకపై తామే సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్(సీఎస్ఎంఆర్ఎస్) నిపుణులతో ఎప్పటికప్పుడు పనుల నాణ్యతపై తనిఖీలు చేయిస్తామని ప్రకటించడం చర్చనీయాం శంగా మారింది. గోదావరి నదిలో 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సమర్థవంతంగా దిగువకు విడుదల చేసేలా స్పిల్ వేను నిర్మిస్తున్నారు. స్పిల్ వే పనుల్లో ఏమాత్రం నాణ్యత లోపించినా వరదల ఉధృతికి తట్టుకోలేదని సాంకేతిక నిపుణులు అంటున్నారు. స్పిల్ వే పనుల్లో నాణ్యతపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. హెడ్వర్క్స్ నుంచి ఈఎన్సీని తప్పిస్తూ సర్కారు జారీ చేసిన ఉత్తర్వులు వద్దన్న సంస్థే ముద్దొచ్చింది పోలవరం జలాశయం పనులను 2013లో రూ.4,054 కోట్లకు అప్పటి కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ సంస్థ దక్కించుకుంది. అర్హత లేని సంస్థకు పనులు ఎలా అప్పగిస్తారంటూ నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాద్ధాంతం చేశారు. కానీ, 2014 ఎన్నికల ముందు రాయపాటి తెలుగుదేశం పార్టీలో చేరారు. దాంతో ట్రాన్స్ట్రాయ్ సంస్థ చంద్రబాబుకు ముద్దయింది. విభజన చట్టంలో హామీ ఇచ్చిన మేరకు పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలి. కేంద్రమే ప్రాజెక్టు పనులు చేపడితే సత్తా లేని ట్రాన్స్ట్రాయ్పై వేటు పడటం ఖాయమని భావించి, నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలంటూ చంద్రబాబు పట్టుబట్టారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడంతో 2016 సెప్టెంబరు 7న పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అప్పగించింది. ఆ మరుసటి రోజే ప్రాజెక్టు హెడ్వర్క్స్ అంచనా వ్యయాన్ని రూ.5,535.41 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచేసింది. అనంతరం ట్రాన్స్ట్రాయ్ను అడ్డం పెట్టుకుని పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ ముఖ్యనేత భారీ ఎత్తున కమీషన్లు వసూలు చేసుకుంటున్నారు. కాంట్రాక్టర్లకు ప్రేమతో... రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పోలవరం హెడ్ వర్క్స్ కాంట్రాక్టర్లకు సిమెంట్, స్టీల్ను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి సరఫరా చేస్తోంది. తమ నుంచి ముఖ్యనేత ముడుపులు వసూలు చేస్తుండడంతో సరఫరా సంస్థలు 53 గ్రేడ్ స్థానంలో 43 గ్రేడ్ సిమెంట్ను, నాసిరకం స్టీల్ను అందజేస్తున్నాయి. అదే స్టీల్, సిమెంట్ను ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అంటగడుతోంది. హెడ్ వర్క్స్లో భాగమైన స్పిల్ వేలో సెంట్రింగ్ పనుల దగ్గర నుంచి సిమెంట్, కంకర, ఇసుక కలిపి కాంక్రీట్ మిశ్రమం తయారు చేయడం దాకా అత్యాధునిక సాంకేతిక విధానాలను పాటించాలి. ఎం–20 గ్రేడ్ కాంక్రీట్ మిశ్రమాన్ని చల్లబరచడానికి ప్రత్యేకంగా చిల్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ప్రతి క్యూబిక్ మీటర్ కాంక్రీట్ పని నాణ్యతను క్వాలిటీ కంట్రోల్ విభాగం చీఫ్ ఇంజనీర్ ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. నాణ్యతను ధ్రువీకరించిన తర్వాతే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి. పనుల్లో నాణ్యత లేదని క్వాలిటీ కంట్రోల్ విభాగం తేల్చితే.. నాసిరకంగా ఉన్న పనులను తొలగించి, వాటి స్థానంలో మళ్లీ కొత్తగా పనులు చేయాలి. కానీ, కమీషన్ల కోసం కాంట్రాక్టర్లతో లాలూచీ పడిన ముఖ్యనేత పనుల పర్యవేక్షణకు, నాణ్యత పరిశీలనకూ ఒకే అధికారిని నియమించే తప్పుడు సాంప్రదాయానికి తెర తీశారు. కాంట్రాక్టర్ సూచించిన అధికారినే పనుల పర్యవేక్షణకు నియమించి.. ఆ అధికారికే క్వాలిటీ కంట్రోల్(నాణ్యత నియంత్రణ) విభాగం బాధ్యతలను అదనంగా అప్పగించారు. 2016 నుంచి 2018 మే 16వ తేదీ వరకూ పోలవరం హెడ్ వర్క్స్ ఎస్ఈ, క్వాలిటీ కంట్రోల్ విభాగం ఎస్ఈ పదవుల్లో రమేష్ బాబును నియమించారు. అనంతరం ఆ రెండు పదవుల్లోనూ చీఫ్ ఇంజనీర్ శ్రీధర్ను నియమించారు. దీనివల్ల కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారు. పనుల్లో నాణ్యతపై ప్రశ్నించే వారే లేకుండా పోయారు. నాణ్యతపై ప్రశ్నించే వారేరి? పోలవరం ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఇంజనీర్–ఇన్–చీఫ్(ఈఎన్సీ)ని నియమించాలంటూ కేంద్రం 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ క్రమంలో గతేడాది జూలై 11న నాటి కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్జీత్ సింగ్ పోలవరానికి ప్రత్యేకంగా ఈఎన్సీని నియమించాలని లేఖ రాశారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్సీతోపాటు.. పోలవరం ఈఎన్సీ బాధ్యతలను ఎం.వెంకటేశ్వరరావు నిర్వర్తిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్లో పనుల నాణ్యతపై జనవరి నుంచి మే వరకూ పలు సందర్భాల్లో ఆయన కాంట్రాక్టర్లను నిలదీసినట్లు సమాచారం. ఎం.వెంకటేశ్వరావును తప్పించాలంటూ ముఖ్యనేతపై కాంట్రాక్టర్లు ఒత్తిడి తెచ్చారు. దాంతో హెడ్ వర్క్స్ బాధ్యతల నుంచి ఆయనను తప్పించేలా ముఖ్యనేత చక్రం తిప్పారు. హెడ్ వర్క్స్ సీఈగా వి.శ్రీధర్ను నియమిస్తూ మే 16న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈఎన్సీ వెంకటేశ్వరరావును సాంకేతిక పరమైన అంశాలకు మాత్రమే పరిమితం చేసింది. అంతటితో ఆగకుండా పోలవరం ప్రాజెక్టు పనుల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించే ధవళేశ్వరం క్వాలిటీ కంట్రోల్ విభాగం సీఈగా వి.శ్రీధర్కే అదే రోజు అదనపు బాధ్యతలను అప్పగించడం గమనార్హం. పనుల పర్యవేక్షణ, నాణ్యత పరిశీలన బాధ్యతలను ఒకే అధికారి నిర్వర్తిస్తుండటం వల్ల కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలను ఏమాత్రం పాటించడం లేదు. -
పచ్చ 'ధన్'దా..!
ప్రజా ప్రతినిధులే కమీషన్కింగ్లుగా మారారు. పచ్చనోట్ల దందాకు దిగుతున్నారు. కాంట్రాక్టర్ ముందుగా కమీషన్ చెల్లిస్తేనే బిల్లులు మంజూరవుతున్నాయి. లేకపోతే ఏదో విధంగా వేధించడం, అవసరమైతే కేసుల వరకూ వెళ్లడం ప్రజాప్రతినిధులకు పరిపాటిగా మారింది. దీనికి శనివారం పాలకొల్లులో జరిగిన ఘటనే నిదర్శనం. సాక్షి ప్రతినిధి,పశ్చిమగోదావరి , ఏలూరు: డెల్టా ఆధునికీకరణ పనులకు మూడు నాలుగుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడానికి ముడుపుల కోసం ప్రజాప్రతినిధులు చేస్తున్న వేధింపులే కారణమన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నా యి. ఒకసారి జెడ్పీ చైర్మన్ బాపిరాజు కూడా ‘కొందరు ప్రజాప్రతినిధుల్లా చేసే ప్రతిపనికీ కమీషన్లు తీసుకోను’ అంటూ ఎమ్మెల్యేలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్కో పనికి 8 నుంచి 20 శాతం వరకూ కమీషన్లు ఇవ్వాల్సిందేనని జిల్లాలోని మెజారిటీ ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లను డిమాండ్ చేస్తున్నారు. కొంత మంది అయితే ఒక అడుగు ముందుకేసి అసలు టెండర్లు ఎవరు వేయాలో కూడా నిర్ణయిస్తున్నారు. ఇదేమి‘రామా’! పాలకొల్లులో డెల్టా ఆధునికీకరణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్పై పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు కేసు పెట్టించి అరెస్టు చేయించడం వివాదాస్పదంగా మారింది. విజయవాడకు చెందిన పీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్ పాకనాటి పృథ్వీరాజ్ పాలకొల్లు పట్టణంలోని దమ్మయ్యపత్తి మురుగుకోడు పనులు చేపట్టారు. అందులో భాగంగా టెండర్ వేసి గత ఏడాది నవంబర్లో పనులు ప్రారంభించారు. మొత్తం 210 మీటర్ల పనికి రూ.1.46 కోట్లకు టెండర్ వేశారు. ఇందులో 95 మీటర్ల పని పూర్తి కాగా రూ.60 లక్షల కోసం బిల్లులు పెట్టారు. అయితే బిల్లులు ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యేను కలిశాడు. ఎమ్మెల్యే తనకు 20శాతం కమీషన్ ఇస్తేనే బిల్లులువస్తాయని చెప్పారని కాంట్రాక్టర్ ఆరోపిస్తున్నారు. తాను ఐదు శాతం కన్నా ఎక్కువ ఇవ్వలేనని, అది కూడా బిల్లు ఇస్తేనే ఇస్తానని చెప్పడంతో ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి పోలీసు స్టేషన్లో కాంట్రాక్టర్పై ఫిర్యాదు చేయించారు. ఒక్క రామానాయుడే కాదు.. జిల్లాలోని చాలామంది ఎమ్మెల్యేలూ ఇలాగే వ్యవహరిస్తున్నారు. తమవారికే కాంట్రాక్టులు దక్కేలా చేస్తున్నారు. ఒక వేళ బయట వారికి వెళ్లినా కమీషన్లు దండుకుంటున్నారు. ఇవిగో ఉదాహరణలు ♦ డెల్టాలోని ఓ ఎమ్మెల్యే అన్ని పనులూ తన వారికే ఇప్పిస్తుంటారు. ఆ నియోజకవర్గంలో బయటవారు పని చేసే అవకాశం ఉండదు. వేసిన రోడ్లు ఏడాదికే పాడైపోయాయి. కమీషన్లు తీసుకుని నాసిరకం పనులు చేయడంతో అధ్వానంగా తయారయ్యాయి. ♦ జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉండే మరో ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఎవరైనా తనని కలిసి ముడుపులు చెల్లించిన తర్వాతే టెండర్లు వేయాల్సి ఉంటుంది. అక్కడ అన్ని టెండర్లూ ఎక్సెస్కు వేయాల్సిందే. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో లెస్ టెండర్లు పడితే ఇక్కడ ఒక్కచోట మాత్రం ఎక్సెస్కి వేస్తారు. అదీ ఎమ్మెల్యే చెప్పిన వారే వేయాలి. ♦ ఏలూరు కార్పొరేషన్లో కూడా ఇదే తంతు కొనసాగుతోంది. ఇక్కడ కూడా రూ.30 కోట్లతో అభివృద్ది పనులకు టెండర్లు పిలిస్తే ఏ టెండరు ఎవరు వేయాలో ముందుగానే నిర్ణయించేశారు. దీనిపై ‘సాక్షి’లో కథనాలు రావడంతో సింగిల్ టెండర్ల బదులు కొన్నింటికి డమ్మీ టెండర్లు వేయించారు. సింగిల్ టెండర్లు వచ్చినప్పుడు మరోసారి టెండర్ పిలవాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలను పక్కన పెట్టి సుమారు వందకు పైగా సింగిల్ టెండర్లను అనుమతించేశారు. డమ్మి టెండర్లు కూడా ఒక సొసైటీ పేరు మీద వేయించారు. వడ్డెర సొసైటీకి రూ.20 లక్షల వరకూ డిపాజిట్ (ఈఎండీ) లేకుండా టెండర్ వేసే అవకాశం ఉంటుంది. అంతకు మించి అయితే వారు కూడా డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది. అయితే ఇదే సంస్థ పేరుతో సుమారు నాలుగు కోట్ల రూపాయల వరకూ డిపాజిట్లు లేకుండానే డమ్మీ టెండర్లు వేసేశారు. టెండర్లు కేటాయించకుండానే ఇప్పటికే చాలా పనులు పూర్తికాగా, మరికొన్ని పనులు 50 శాతం వరకూ అయిపోయాయి. నగరంలోని నూకాలమ్మ గుడి నుంచి సుబ్బమ్మదేవి స్కూల్ వరకూ రోడ్డు వేసి ఏడాది కూడా కాలేదు. ఈ రోడ్డును మనుషులతో తవ్వించాల్సి ఉండగా, మిషన్లు ఉపయోగించడంతో ఈ రోడ్డు గడువు పూర్తి కాకుండానే పాడైపోయింది. -
రాజధాని కాంట్రాక్టర్లకు డబ్బే.. డబ్బు!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ‘ముఖ్య’ నేత కమీషన్లకు పోలవరం ప్రాజెక్టు తరువాత రాజధాని అమరావతి కల్పతరవుగా మారింది. ఇందులో భాగంగా అటు పోలవరం ప్రాజెక్టులోనూ, ఇటు రాజధాని ప్రాజెక్టుల్లోని కాంట్రాక్టర్లను ‘ముఖ్య’ నేత ప్రత్యేకంగా చూస్తున్నారు. నాలుగేళ్లయినా రాజధానిలో ఒక్క శాశ్వత నిర్మాణం కూడా చేపట్టని విషయం విదితమే. అయితే ఎన్నికలకు ముందు చంద్రబాబు సర్కార్ ఇప్పుడు వేల కోట్ల రూపాయల పనులకు టెండర్లను ఆహ్వానిస్తోంది. ఎవ్వరికీ లేని విధంగా రాజధాని కాంట్రాక్టర్లకు ఏకంగా 15 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తప్పు అని న్యాయ, ఆర్థిక శాఖలు చెప్పినప్పటికీ కూడా ఆయన పట్టించుకోలేదు. తొలి దశలో భాగంగా మొత్తం రూ. 48,115 కోట్ల విలువవైన ప్రాజెక్టులకు టెండర్లను ఆహ్వానించాలని నిర్ణయించారు. టెండర్ల నిబంధనల్లో పది శాతమే మొబిలైజేషన్ అడ్వాన్స్గా చెల్లించాలని ఉన్నా.. ఆ నిబంధనలు తుంగలోతొక్కి 15 శాతానికి పెంచేశారు. ఈ లెక్కన రాజధాని కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద రూ. 7,217.25 కోట్లను చెల్లించనున్నారు. ఇప్పటికే టెండర్ల ఖరారైన ప్రాజెక్టులతో పాటు భవిష్యత్లో చేపట్టే ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు కూడా 15 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్లు చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా అమరావతి బాండ్లతో పాటు రైతుల నుంచి తీసుకున్న వేల ఎకరాలను బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి సీఆర్డీఏ ద్వారా రూ. 10 వేల కోట్లు అప్పు చేయాలని కూడా నిర్ణయించారు. ఈ అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వనుంది. ఈ విధంగా అప్పులు చేసి తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ కింద చెల్లించనున్నారు. దుండుకోవడానికే పెంపు.. పెంచిన మొబిలైజేషన్ అడ్వాన్స్ల నుంచి పెద్ద మొత్తంలో ‘ముఖ్య’ నేత కమీషన్లను దండుకోనున్నారని ఉన్నతస్థాయి అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అందుకే పది శాతం ఉన్న మొబిలైజేషన్ అడ్వాన్స్లను ప్రత్యేకంగా రాజధాని కాంట్రాక్టర్ల కోసం పదిహేను శాతానికి పెంచారని, విలువైన మెటీరియల్ వంక పెడుతున్నారని ఆ వర్గాలు విమర్శిస్తున్నాయి. సీఎం చంద్రబాబు ఏమి చేసిన సింగపూర్ కంపెనీల ప్రయోజనాలకేనని, అడ్వాన్స్లు పెంచి చివరకు సింగపూర్ కంపెనీలకే రాజధానిని కట్టబెడతారని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అసలే రాష్ట్రం రెవెన్యూ లోటుతో పాటు అప్పుల భారంతో సతమతం అవుతుంటే.. మళ్లీ అప్పులు తెచ్చి దోచుకునేందుకు అడ్వాన్స్లు పెంచడం దారుణం అని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రెవెన్యూ లోటులో ఉన్న ఏ రాష్ట్రం కూడా తాత్కాలిక నిర్మాణాల పేరుతో వేల కోట్ల రూపాయలు వృథా చేయదని, ఇలా మన రాష్ట్రంలోనే జరుగుతోందని ఆయన చెప్పారు. రాజధాని రహదారులు, ఇతర పనులను భారీ అంచనాలతో రూపొందించారని, దీని వల్ల కాంట్రాక్టర్లతో పాటు ‘ముఖ్య’ నేత భారీగా ఖజానా నుంచే ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారని, ఇలాంటి దోపిడీ ఎక్కడా చూడలేదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాజధానికి సంబంధించి ఏ ప్రాజెక్టు చేపట్టినా తొలుతే అంచనాలను ఎక్కువగా రూపొందిస్తున్నారని సీఆర్డీఏలో పనిచేస్తున్న సాంకేతిక అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇప్పటికే ఖరారైన టెండర్లతో పాటు కొత్తగా ఆహ్వానించే టెండర్లు దక్కించుకునే కాంట్రాక్టర్లకు కూడా పది హేను శాతం మొబిలైజేషన్ చెల్లించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. సీఆర్డీఏ అప్పులు ప్రణాళిక ఇలా ఉంది – ఆంధ్రా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, విజయ బ్యాంకు నుంచి రూ. 2,060 కోట్లు అప్పునకు సీఆర్డీఏ దరఖాస్తు చేసింది. ఈ రుణాల మంజూరుకు న్యాయశాఖ ఆమోదం రావాల్సి ఉంది. – హడ్కో నుంచి రూ.1,275 కోట్లను అప్పు చేశారు. ఇందులో ఇప్పటికి రూ. 900 కోట్లు వ్యయం చేశారు. హడ్కో నుంచి మరో రూ. 6,225 కోట్ల అప్పునకు దరఖాస్తు చేశారు. హడ్కో పరిశీలనలో ఉంది. – రూ. 3,306 కోట్ల అప్పునకు ప్రపంచ బ్యాంకుకు దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తు పరిశీలనలో ఉంది. రాజధాని రైతుల ఫిర్యాదు మేరకు స్వతంత్ర కన్సల్టెంట్ ద్వారా ప్రపంచ బ్యాంకు అధ్యయనం చేయిస్తోంది. – ప్రభుత్వ గ్యారెంటీతో రూ. 10,000 కోట్లు అప్పు చేసేందుకు వివిధ బ్యాంకులకు ప్రతిపాదనలను పంపించారు. – అమరావతి బాండ్ల ద్వారా రూ.2,000 కోట్లు అప్పు చేస్తున్నారు. -
ఆలస్యం చేస్తే కాంట్రాక్టులు రద్దు
సాక్షి, హైదరాబాద్ : మిషన్ భగీరథ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రజలకు సురక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో సవాల్గా తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయని వర్క్ ఏజెన్సీల కాంట్రాక్టు రద్దు చేసేందుకు ప్రభుత్వం వెనుకాడదని హెచ్చరించారు. పనుల జాప్యాన్ని, నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టంచేశారు. గ్రామాలకు నీటి సరఫరా చేసే పనులతోపాటు గ్రామాల్లో అంతర్గతంగా సరఫరా చేసే పనులను సమాంతరంగా చేయాలని చెప్పారు. కొన్నిచోట్ల ఓహెచ్ఎస్ఆర్(ట్యాంకుల) పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓహెచ్ఎస్ఆర్ల నిర్మాణం కాలేదన్న నెపంతో గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణం ఆపాల్సిన అవసరం లేదని, వాటి పనులను కొనసాగించాలని సూచించారు. పైపులు, నల్లాలు, ఇతర సామగ్రిని నిర్మాణ ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. రేయింబవళ్లు కష్టపడుతూ, శరవేగంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకుని మిషన్ భగీరథలోనూ వేగం పెంచాలన్నారు. మిషన్ భగీరథపై ముఖ్యమంత్రి శనివారం ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, కార్యదర్శి స్మితా సభర్వాల్, ఎంపీ బాల్క సుమన్, టీఎస్ఐఐడీసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్ రెడ్డి, సీఈలు, ఎస్ఈలు, ఈఈలు ఇందులో పాల్గొన్నారు. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా పనుల పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. పనుల నాణ్యతలో రాజీ వద్దు వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలోని దాదాపు 25 వేల ఆవాస ప్రాంతాలకు ప్రతిరోజు సురక్షిత మంచినీటిని సరఫరా చేసేలా మిషన్ భగీరథ పథకం చేపడుతున్నామని అసెంబ్లీలో మాటిచ్చినట్లు సీఎం ఈ సందర్భగా గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం పనులు వేగంగా జరగాలన్నారు. ‘‘ఇప్పటికే 12 వేలకు పైగా గ్రామాలకు మంచినీటి సరఫరా జరుగుతోంది. మిగతా గ్రామాలకు ఆగస్టు చివరినాటికి పూర్తి కావాలి. అంతర్గత పనులనూ త్వరితగతిన పూర్తి చేయాలి. అవసరమైతే టీంలను పెంచుకొని మూడు షిఫ్టులు పనిచేయాలి. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఇంజనీరింగ్ అద్భుతం. ఈ ప్రాజెక్టును బాగా నిర్మిస్తే వర్క్ ఏజెన్సీలకు కూడా మంచి పేరు వస్తుంది. ఇది ఆ కంపెనీలకు దేశంలో మరిన్ని మెగా ప్రాజెక్టులు చేపట్టడానికి అనుభవంగా, అర్హతగా మారుతుంది. అతిపెద్ద ప్రాజెక్టు కాబట్టి మొదట్లో కొన్ని తప్పులు దొర్లడం సహజం. ఆ తప్పులను వెంటవెంటనే సవరించుకుంటూ పోవాలి. మిషన్ భగీరథ తెలంగాణ భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ప్రాజెక్టు. కొద్దికాలం పాటు కాంట్రాక్టర్లు పనులు నిర్వహించినా, ప్రభుత్వ అధికారులు, ఇంజనీర్లే దీన్ని పర్యవేక్షించాల్సి ఉంటుంది. కాబట్టి అధికారులు మొదటి నుంచీ దీనిపై శ్రద్ధ పెట్టాలి. పనుల నాణ్యత విషయంలో రాజీపడొద్దు. పకడ్బందీగా పనులు చేయించాలి. విద్యుత్ సరఫరాలో జరిగే హెచ్చు తగ్గులను సమీక్షించేందుకు మిషన్ భగీరథ కోసం ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్ల వద్ద అవసరమైన సిబ్బందిని నియమించాలి’’అని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నీటి పారుదల ప్రాజెక్టుల రిజర్వాయర్లలో మినిమమ్ డ్రాయింగ్ డౌన్ లెవల్ (ఎండీడీఎల్) నిర్వహించాలని, తాగునీటికి అవసరమయ్యే నీటిని రిజర్వ్ చేసిన తర్వాత సాగునీటికి విడుదల చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం ఆదేశించారు. అగ్రిమెంట్లో పేర్కొన్న దాని కన్నా అదనంగా పడే జీఎస్టీని ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. -
విధి నిర్ణయం
ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నా ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ రాసుకున్న ఉత్తరాన్ని మడిచి కనిపించేలాగా బల్లపైన పెట్టా. వాకిలి తలుపులను మూసేసి గడియ పెట్టా. తాడు తీసుకుని స్టూలు పైనెక్కి దాని ఒక కొస పైనున్న దూలానికి కట్టా. తాడు రెండో చివర జారుముడి వేసి నా మెడకు బిగించుకున్నా. ఇక స్టూల్ పైనుంచి కిందికి దూకేస్తే సరిపోతుంది. నా పాతికేళ్ళ జీవితానికి ఫుల్స్టాప్ పడిపోతుంది. చివరిసారిగా అమ్మని, చెల్లెలినీ మనస్సులో తలచుకున్నాను. ఇవాళే నా పుట్టినరోజు కూడాను. నాపేరు మీద దేవుడికి అర్చన చేయించటానికని వాళ్ళిద్దరూ గుడికెళ్ళారు. ఉన్నట్టుండి నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. వాళ్ళిద్దరికీ నేనంటే ప్రాణం. నన్ను ఎప్పుడూ పల్లెత్తుమాట కూడా అనని మా అమ్మ నా జీవితంలో మొట్టమొదటిసారి వారం రోజుల కిందట నేను బరువు, బాధ్యతలని పట్టించుకోకుండా వ్యవహరించటం గురించి గట్టిగా చీవాట్లు పెట్టింది. ఆ రోజు చెల్లాయికి పెళ్లిచూపులు. అబ్బాయి తరపు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జరిగిందా సంఘటన. వాళ్ళతో గేటుదాకా వెళ్లి సాగనంపి తిరిగివచ్చిన పెళ్ళిళ్ళ బ్రోకరు అసలు విషయం చల్లగా చెప్పాడు ‘‘చాలా మంచి సంబంధం. అబ్బాయి బాగా సంపాయిస్తున్నాడు. మన అదృష్టం. కట్నం కింద వాళ్ళు పది సవరల బంగారం మాత్రమే అడిగారు’’. ‘‘పది సవరలా? ..అంత బంగారం పెట్టడం మావల్ల కాదు’’ అన్నాను.‘‘బాగుందండీ. ఇకముందు సంబంధాలను వెతకమని నాతో అనబాకండి. కనీసం పది సవర్లు కూడా ఇవ్వకండా పెళ్ళికి ఎవరూ ముందుకు రారు.’’ అన్నాడు. అతడు విసురుగా వెళ్లిపోయింతరువాత అమ్మ అవమానభారంతో ఏడుస్తూ అన్నది ‘‘నీకున్నది ఒక్కగానొక్క తోడబుట్టిన చెల్లెలు. కనీసం దాని పెళ్ళిచేసి ఒక అయ్య చేతిలో పెట్టడానికి కూడా నీకు చేతకాకుండా పోతున్నదేరా నాయనా?! అంతా నా ఖర్మ.’’అమ్మ అన్న మాటల్లో సత్యం లేకపోలేదు. అందుకే మారుమాట్లాడలేక నాలో నేను కుమిలిపోయా. ఎవరికీ పనికిరాని నా ఈ జీవితం పట్ల విరక్తి పుట్టింది. నాకు ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదు. నేనూ, అమ్మ, చెల్లాయి ముగ్గురమే ఇమిడిన పొదరిల్లు లాంటి చిన్న కుటుంబం మాది. నా చిన్నతనంలోనే నాన్న చనిపోయాడు. ఉన్న ఊళ్లోనే ఒక స్కూల్లో వంటమనిషిగా పనిచేస్తున్న అమ్మ సంపాదన మీదనే ఆధారపడి బతుకుతోంది మా కుటుంబం. డిగ్రీ పరీక్షల్లో తప్పిన తరువాత జనాలకు ఇళ్ళు కట్టి ఇచ్చే ఒక ప్రైవేటు రియల్ ఎస్టేట్ కాంట్రాక్టరు దగ్గర కొంతకాలం పనిచేశా. సరిగ్గా నా దురదృష్టం కొద్ది నేను ఉద్యోగంలో చేరిన కొన్నాళ్ళకే బీహార్, బెంగాల్, రాష్ట్రాలనుంచి నిరుద్యోగులైన యువకులు పనికోసం కేరళకు వందల సంఖ్యలో రావటం మొదలైంది. దాంతో ప్రతిదానికీ రూల్సు మాట్లాడే స్థానికులను పనికి పిలవటం మానేశారు కాంట్రాక్టర్లు. దాంతో నాలుగయిదేళ్ళు ఎండపొడ తగలకుండా, చెమట చుక్క రాల్చకుండా రోజులు గడపటం మినహా ఏమాత్రం సంపాదన లేదు. నేను స్టూల్ మీదనుంచి దూకటానికి సిద్ధమయ్యానో లేదో వీధి తలుపు తడుతూ ఎవరో పిలవటం వినిపించింది. ‘ప్రశాంతంగా చావనీయట్లేదు కదరా’ తిట్టుకుంటూ తాడులోంచి తలని బయటకు ఊడదీసి స్టూలు పైనుంచి దిగాను. మెల్లిగా వెళ్లి తలుపు తీసి చూస్తే... బయట పేపరబ్బాయి నుంచుని ఉన్నాడు.‘‘పేపరు పడేసి వెళ్లిపోవచ్చుగా?’’ విసుక్కుంటూ అడిగా వాణ్ని.‘‘ఈ నెల డబ్బులు ఇంకా ఇవ్వలేదు..’’ బుర్ర గోక్కుంటూ నసిగాడు వాడు. ‘‘రేపొచ్చి తీసికెళ్ళు.’’ అన్నాను. సరేనంటూ వెళ్ళిపోయాడు పేపరబ్బాయి. పేపరును టేబుల్ పైన పడేసి తలుపులు మూసేసి మళ్ళీ స్టూలుకేసి వెళ్తున్న వాణ్నల్లా పేపరు పైన నా దృష్టి పడేసరికి ఒక్కక్షణం ఆగిపోయా. ‘....ఎట్లాగూ చావటానికి డిసైడయ్యాం. పేపరు చదివేసి చస్తే పోలా?’ పేపరందుకుని తిరగేస్తున్న నా కళ్ళు ఒక ప్రకటన దగ్గర ఆగిపోయాయి. ‘కిడ్నీ కావలెను’ అన్న ఆ ప్రకటన నా దృష్టిని ఆకర్షించింది. ‘‘మూత్రపిండాల ఆపరేషను జరిగిపోతున్న పేషంటుకు బీ పాజిటివ్ గ్రూపు కిడ్నీ అర్జంటుగా కావలెను. సహృదయులు, మానవతావాదులైన ఉదారస్వభావం కలిగిన దాతలు దయచేసి సంప్రదించండి.’’ ఇదీ ఆ ప్రకటన. చివరన కాంటాక్ట్ చెయ్యటానికి ఒక ఫోన్ నెంబరు ఉంది. ప్రకటన చదవగానే నా బ్లడ్ గ్రూపు కూడా బీ పాజిటివ్ అన్న విషయం గుర్తుకొచ్చింది. పట్టరాని ఆనందంతో ‘యురేకా’ అని గొంతెత్తి గట్టిగా అరుద్దామనిపించినా, ఆ ప్రయత్నాన్ని అతికష్టం మీద అణచుకున్నాను. అనుకోకుండా ఎదురైన బంగారం లాంటి ఈ అవకాశాన్ని గనక సద్వినియోగం చేసుకోగలిగితే చెల్లెలి పెళ్లి అంగరంగవైభవంగా జరిపించగలను. బతుకుపైన కొత్తగా చిగురించిన ఆసక్తితో ఆ ప్రకటనలోని నెంబరుకు డయల్ చేసి కొన్ని వివరాలు తెలుసుకున్నా. ∙∙ ఏది ఏమైనా ఇంకేమాత్రమూ కాలయాపన చేయరాదనే నిర్ణయానికి వచ్చాను. మరునిమిషం డ్రెస్సు మార్చుకుని తయారై బయలుదేరా.కిడ్నీకి ఎంత ధర చెప్పాలి? బస్సులో కూర్చుని బాగా ఆలోచించా. ఇటీవల కిడ్నీలని అమ్ముకున్న ఎవడి అడ్రస్సన్నా వెతికిపట్టుకుని వెళ్లి కలిసి మాట్లాడి వుంటే వివరాలన్నీ తెలిసేవి. కిడ్నీ ప్రస్తుతం పలుకుతున్న ధర తెలుసుకోవటానికి అంతకన్నా వేరే మార్గమే లేదు. పేపర్లో మార్కెట్ ధరవరలు కాలమ్లో ఎండుకొబ్బరి, రబ్బరు, మిరియాలు వగైరాల ధరలు మాత్రమే కనిపిస్తాయి. మనిషికి బతకటానికి అత్యవసరమైన కిడ్నీ మార్కెట్ ధర ఏరోజుకారోజు పేపర్లో ఇవ్వకపోవటం మరీ దారుణం! ఛీ...!చెల్లాయి పెళ్ళికి అన్నీ కలిపితే ఎంత లేదన్నా కనీసం నాలుగు లక్షల ఖర్చన్నా వస్తుంది. ఆ మొత్తానికి ఇంకో ఆరు లక్షలు కలిపి కిడ్నీకి పదిలక్షలు అడగాలి. వాళ్ళు బేరమాడితే.. ఒక లక్ష తగ్గించి తొమ్మిది లక్షల రూపాయలకు డీల్ కుదుర్చుకోవాలి. పెళ్లిఖర్చులన్నీ పోను మిగిలిన అయిదు లక్షల రూపాయలని ఏదన్నా బ్యాంకులో ఫిక్సెడ్ డిపాజిట్ చేసుకుంటే దానిమీద వచ్చే వడ్డీతో జీవితాంతం కాలుమీద కాలేసుకుని కూర్చుని హాయిగా బతకొచ్చు. అప్పుడే అనుకోకుండా నా గతకాలపు ప్రియురాలి రూపం నా స్మృతిపథంలో మెరిసింది. నన్ను తప్ప వేరే ఎవర్నీ పెళ్లిచేసుకోనని నా కళ్ళలోకి చూస్తూ వెయ్యి ప్రమాణాలు చేసిన అమ్మాయి, నా తియ్యటి కలలను కల్లలు చేస్తూ హఠాత్తుగా ఒకరోజున ఇంటికొచ్చి తన పెళ్లిపత్రిక నా చేతిలో పెట్టి ‘‘నా పెళ్లి కుదిరింది. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. గల్ఫ్లో ఉద్యోగం.’’ ఏమాత్రం తత్తరపాటు లేకుండా, మెరుస్తున్న కళ్ళతో చెప్పింది. వెడ్డింగ్ కార్డ్ని అందుకుని చదువుతూ అప్రయత్నంగానే దీర్ఘంగా నిట్టూర్చాను. ‘‘ప్లీజ్, నన్ను అపార్థం చేసుకోకు. మనం అనుకున్నట్టుగా అన్నీ జరగవు. గతాన్ని కలలా మరిచిపో. ఇప్పటినుంచి నన్ను నీ సోదరిగా భావించుకో.’’ చెయ్యాల్సిందంతా చేసేసి నాకు ఒక ఉచిత సలహా పడేసింది. ‘వెళ్ళొస్తా’నంటూ వెనుతిరిగి బయటకు నడిచింది. కోజికోడ్ బస్టాండులో బస్ దిగి ఆసుపత్రికి వెళ్ళటానికి ఆటో ఎక్కాను. ఆటో బయల్దేరగానే పొద్దున్న నేను మాట్లాడిన నంబరుకు మళ్ళీ కాల్ చేశా. ఆటోలోంచి బయటకు చూశాను. ఆటో మెయిన్ రోడ్లోంచి దిగిపోయి సందుగొందుల్లోంచి తిరిగి ఆస్పత్రికి చేరింది. ఆస్పత్రికి చేరుకొని ఆరో బ్లాక్లో పద్దెనిమిదో నెంబరు రూము కనుక్కోవటానికి పెద్దగా కష్టపడాల్సి రాలేదు. కాలింగ్ బెల్లు నొక్కితే వచ్చి తలుపు తెరిచింది ఆ అమ్మాయి. నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. ఆ అమ్మాయి.. నన్ను దోచుకున్న... వన్నెల దొరసాని..! నా గతకాలపు ప్రేయసి..!ఆరోజు తన పెళ్ళిపత్రిక ఇవ్వటానికి మా ఇంటికి వచ్చిన రోజే మేము చివరిసారిగా కలుసుకున్నది. మళ్ళీ ఇప్పుడే కలవటం. ‘‘నువ్వు...ఇక్కడ..?’’ అప్రయత్నంగా అడిగాను. ‘‘కిడ్నీ పేషంటు నా భర్త,’’ అన్నది చూపులు మరల్చుకుని.‘‘ఫోన్లో మాట్లాడినప్పుడు నీ గొంతు గుర్తుపట్టలేకపోయాను..’’ అన్నాను.‘‘మొదటిసారి మీరు ఫోన్లో మాట్లాడినప్పుడే గుర్తుపట్టాను. ఎంత మందిలోనైనా, ఎంతటి గందరగోళంలోనైనా మీ స్వరాన్ని ఇట్టే గుర్తుపట్టేయగలను.’’ఆ మాటలు విని నాకు గుండెల్లో కలుక్కుమంది. ‘‘మరి నాకు అప్పుడే చెప్పొచ్చు కదా?’’‘‘మీకు తెలిసిపోతే మీరు రారేమోననిపించింది. ఈ రెండేళ్లలో నేను ఎన్నిసార్లు తహతహలాడానో మిమ్మల్ని వూరికేనన్నా కనీసం ఒకసారి చూడగలిగితే బాగుండునని.’’‘‘..దేనికి..?’’‘‘చెప్పానుగా.. ఊరికే..’’‘‘మీవారికి ఎంతకాలమైంది ఇలా?’’ ‘‘పెళ్ళైన కొత్తలోనే వ్యాధి లక్షణాలు కనిపించసాగాయి. రెండేళ్ళ కిందట వ్యాధి నిర్ధారణ అయింది.’’ నాకది వినగానే ఒక పైశాచికానందం కలిగింది. దుబాయిలో పనిచేస్తున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు భర్తగా రాబోతున్నాడనగానే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నన్ను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించిన స్త్రీ. నాకు చేసిన అన్యాయానికి ఇంతకన్నా పెద్ద శిక్ష కావాల్సిందే. నా మనస్సు కసిగా నవ్వింది. ‘‘వైద్యానికి బోలడంత ఖర్చు. కదా?’’ సానుభూతి నటిస్తూ అడిగా.‘‘ఉన్న ఇల్లు, పొలంతో సహా ఆస్తంతా అమ్మితే వచ్చిన డబ్బు పూర్తిగా వైద్యానికే ఖర్చయ్యింది. ఇప్పుడిక మా పరిస్థితి పైన ఆకాశం, కింద భూమి.. ఇవే దిక్కు అన్నట్టుగా తయారయ్యింది’’.ఆమె దీనావస్థను వింటూ ఉంటే తెలిసినవాణ్ని గనక కిడ్నీని తక్కువ ధరలో ఇవ్వమని అడుగుతుందేమోననే అనుమానం కలుగసాగింది. ఇంకా ఆమెతోమంచీచెడు మాట్లాడి చనువు పెంచుకొనే బదులు అసలు విషయం అడిగటానికి సిద్ధమయ్యా. ‘‘ఇంతకీ కిడ్నీకి మీరు ఎంత ఇద్దామనుకుంటున్నారు?’’ అడిగేశా. ‘‘ముందు అసలు మీ కిడ్నీ నా భర్తకు సరిపోతుందా లేదా అనేది తేలనీయండి. ఆ తరువాత కదా డబ్బు సంగతి?’’‘‘నా బ్లడ్ గ్రూపు బీ పాజిటివ్. మీ ఆయనదీ అదే. ఇంకేముంది?’’‘‘గ్రూపొక్కటే సరిపోదు. బోలెడు టెస్టులు చెయ్యాల్సి ఉంటుంది.’’ఆమె మాటలు విన్నాక నన్ను నేను తిట్టుకున్నాను. బోల్డంత డబ్బు లభిస్తుందనే ఆశలో ఇలాంటి సమస్యల గురించి అసలే ఆలోచించలేదు. చివరికి నేను కన్న కలలన్నీ కల్లలై పోతాయేమోనన్న భయం కలగసాగింది. అయితే ఆసుపత్రి వాళ్ళు చేసిన అన్ని టెస్టుల ఫలితాలు నాకు అనుకూలంగానే వచ్చాయి. ‘‘కిడ్నీకి మీరివ్వబోయే డబ్బు గురించి...’’ నసిగాను నేను ఆమెతో.‘‘అంతా దేవుడి దయ.’’ రెండు చేతులనూ పైకెత్తి అన్నది. ఆమె చేష్టలు, మాటలతో నాకు మతిపోయింది.‘‘విషయం క్లియర్గా చెప్పు. తమాషాలకు సమయం కాదిది.’’ కోపాన్ని అతిప్రయత్నం మీద అణచుకొంటూ సీరియస్గా అన్నాను.‘‘ఇందులో తమాషా ఏముంది? మా ఇప్పటి పరిస్థితి మీకు ఇంతకుముందే చెప్పాను కదా?’’‘‘అంటే? డబ్బులు అసలు లేవనేగా? అలాం టప్పుడు పత్రికలో ప్రకటించటంలో నీ ఉద్దేశ్యం?’’‘‘ప్రకటనలో ‘సహృదయులు, మానవతావాదులైన ఉదారస్వభావం కలిగిన దాతలు సంప్రదించగలరు’ అని స్పష్టంగా ఉన్నది. మీరు గమనించలేదేమో? అలాంటి స్వభావం ఉన్న వాళ్ళు ప్రతిఫలంగా డబ్బును ఆశించరనే విశ్వాసం నాకున్నది.’’ ‘‘నువ్వనేది నేను నా కిడ్నీని ఇస్తే నువ్వు నాకు ప్రేమ, వాత్సల్యాలను పంచుతావు. అంతేగా?’’‘‘మీరు కిడ్నీ ఇవ్వకపోయినా సరే, మీరంటే నాకు ప్రేమే.’’ ‘‘నీ ప్రేమ గురించి నాకు తెలియదా?’’‘‘నాకు ప్రేమ లేదనా మీరనేది..?’’‘‘ప్రేమ. నిజంగా నువ్వు నన్ను ప్రేమించి ఉంటే నన్నట్లా మోసం చేసి....’’‘‘పావలా సంపాదన లేక, ఉద్యోగమూ, సద్యోగమూ లేకుండా లేనిపోని గొప్పలు చెప్పుకొంటూ తిరిగేవాడిని ఏం చూసి ఏ తల్లిదండ్రులైనా తమ అమ్మాయికి భర్తగా ఒప్పుకుంటారు? ఇంకో విషయం చెప్పనా? ప్రేమ లేనిది నాకు కాదు. మీకు. మీకు నామీద ఏమాత్రమూప్రేమ లేదు. నిజంగా ప్రేమే ఉండి ఉంటే నేను వేరే ఎవర్నో పెళ్లిచేసుకున్నాననే కారణం చేత నాపట్ల ద్వేషాన్ని పెంచుకుని నన్ను అసహ్యించుకోరు.’’ ఆమె వ్యవహారం దొంగోడు పోలీసుని గద్దించినట్టుగా ఉన్నది. కిడ్నీ అమ్ముకుని వచ్చిన డబ్బులతో చెల్లి పెళ్లి చేద్దామని నేను కన్న కలలన్నీ పేకమేడల్లాగా కూలిపోబోతున్నాయని అర్థం అయ్యే కొద్దీ నాకు కోపంతో పాటు భరించలేని దుఃఖం కూడా ముంచుకొచ్చింది. ‘‘ఇంతకీ మీ నిర్ణయమేమిటి?’’ అడిగింది ఆత్రుతగా. ‘‘నా చెల్లెలి పెళ్ళికి నాకు డబ్బు చాలా అవసరం. నేను కిడ్నీని అమ్మటానికి తయారైందీ దానికోసం మాత్రమే.’’ అన్నాను.‘‘సరే.. అయితే! మీ అవసరానికి తగినంత డబ్బునిచ్చి కిడ్నీ కొనుక్కోగల తాహత్తున్న వాళ్ళు మీకు దొరకాలని నేను ప్రభువును ప్రార్థిస్తాను.’’ అన్నది. ‘‘డబ్బులేవీ అడక్కుండా కిడ్నీదానం చేసే ఒక సహృదయతగల దాత కూడా నీకు లభించాలని నేనూ కోరుకుంటున్నాను.’’ ఆమెకు మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ఆసుపత్రి నుంచి బయటకొచ్చాను. కిడ్నీ అమ్మాలనే నా ప్రయత్నం నెరవేరనందుకు బాధ కలిగింది. అయితేనేం ఎప్పుడైనా డబ్బులని సంపాయించిపెట్టే లక్షల ఆస్తికి సొంతదారుడినన్న ఒక ధీమాతో మావూరి బస్సెక్కాను. బస్సు దిగి వీధిమలుపులోకి అడుగుపెట్టగానే బిగ్గరగా ఏడుపులు వినబడ్డాయి. అది అమ్మ ఏడుపే. మా ఇంటిముందర, పెరట్లో జనం గుంపులుగా గుమిగూడి ఉన్నారు. గాబరాగా విషయం ఏమిటో తెలుసుకుందామని గబగబా ఇంట్లోకి పరిగెత్తుకెళ్ళా. ఆత్మహత్య చేసుకుందామని నేను ఇంటి దూలానికి కట్టి వేలాడదీసిన తాడుకు నా ముద్దుల చెల్లెలి మృతశరీరం వేలాడుతోంది. బల్ల పైన నేను రాసిపెట్టిన ఉత్తరం గాలికి రెపరెపలాడుతోంది. నేను రాసిన రాతంతా పెన్నుతో అడ్డదిడ్డంగా కొట్టేసి ఉంది. ఆ కాగితపు రెండోపక్కన ఏదో ఉత్తరం రాసి ఉంది. తీసుకుని చదివా.‘‘ప్రియమైన అన్నయ్యకు,నా వల్ల నీకు ఎన్ని కష్టాలు? నా కారణంగా నువ్వు చావటానికి నిర్ణయించుకున్నట్టు నీ ఈ ఉత్తరం చదివి నాకు అర్థమైంది. ఈ రోజే కాదు, ఎప్పుడైనా అలా జరగటం నేను భరించలేను. నువ్వు కట్టుకున్న ఈ తాడును నేను వాడుకొంటున్నాను. నన్ను మన్నించు.ప్రేమతో నీ ప్రియాతి ప్రియమైన చెల్లి.’’ఎంత ఘోరం జరిగిపోయింది నా తొందరపాటు చర్య వల్ల?విపరీతంగా ఏడ్చా. నా ఏడుపు నాకే విచిత్రంగా కృతకంగా అనిపించింది. నా మనస్సు ఆ రాత్రంతా చెప్పలేని చిత్రవధననుభవించింది. మరుసటిరోజు చెల్లెలి శవసంస్కారం జరిగింది. వచ్చినవాళ్ళంతా వెళ్ళిపోయారు. అమ్మ జీవచ్ఛవంలాగా పడుంది. అంతర్గతంగా నాలో విపరీతమైన సంఘర్షణ! నేనిక ఆగలేకపోయాను. ఒక నిశ్చయానికొచ్చాను. నిద్రలో నడుస్తున్నవాడిలాగా ఇంట్లోంచి బయటకొచ్చా. కోజికోడ్ వెళ్ళే బస్సెక్కి కూర్చున్నా. ఏదో భయంకరమైన తుఫాను మధ్యలో చిక్కుకున్న పడవ లాగా మనస్సు తల్లడిల్లుతోంది. బస్సు దిగి ఆటోలో ఆసుపత్రికి చేరుకున్నా. గదిలో స్టూలుపైన అటుతిరిగి కూర్చుని ఉంది ఆమె. బెడ్డు పైన స్పృహ లేకుండా పడి ఉన్న ఆమె భర్త. నా పిలుపుకు వెనుతిరిగి చూసిందామె. ‘‘మీరు... మళ్ళీ ఇక్కడికి..?’’ ధారగా కారుతున్న కన్నీటిని కొంగుతో తుడుచుకుంటూ అడిగింది. ‘‘కిడ్నీ అమ్ముకుని డబ్బు సంపాయించుకుని నేను సాధించగలిగేది ఏమీ లేకుండా పోయింది.’’ అన్నాను. అర్థం గాక అయోమయంగా నాకేసి చూసింది. నా చెల్లెలు ఆత్మహత్య చేసుకున్న విషయం చెప్పగానే నోటమాటరాకుండా నిశ్చేష్టురాలైంది. ‘‘నాకు ఒక్క దుఖమే మిగిలింది. చనిపోయే ముందు కూడా నా చెల్లి దేవుడిని నా గురించి ప్రార్థించింది. బదులుగా దానికోసం నేనేమీ చెయ్యలేకపోయాను. నేను దూలానికి కట్టిన తాడుకు వేలాడి నా చెల్లెలు చచ్చిపోయింది. ఇరవై అయిదేళ్ళ సహజీవనంలో నేను దానికి ఇచ్చిన ఒకే ఒక బహుమతి ఆ ఉరితాడు మాత్రమే.’’నా గొంతులో దుఃఖం నిండుకుని మాట్లాడలేని స్థితికి జారుకున్నాను. గుండె పగిలి ఏడ్చాను. ఆ అలికిడికి బెడ్డుపైన అంతవరకు అచేతనంగా పడుకుని ఉన్న ఆమె భర్త ఆయాసపడుతూ మెల్లిగా లేచి కూర్చున్నాడు. దుఃఖాన్ని అతికష్టం మీద ఆపుకుంటూ అన్నాను, ‘‘నిష్కలంకంగా ప్రార్థిస్తే ప్రభువు దారిచూపిస్తాడనే నీ అచంచలమైన దైవవిశ్వాసం సాకారమైందన్నట్టుగా ఇదిగో నేను నీ భర్తకు ఇవ్వాల్సిన కిడ్నీతో తిరిగివచ్చాను’’. - మలయాళ మూలం : పి.ఎన్. కిశోర్ కుమార్ - అనువాదం: వి.ఆర్. గణపతి -
కర్ణాటక కాంట్రాక్టర్ల ఇళ్లపై ఐటీ దాడులు
బెంగళూరు/న్యూఢిల్లీ: త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ఆదాయ పన్ను (ఐటీ) శాఖ కొరడా ఝళిపించింది. పన్ను ఎగవేత కేసుల దర్యాప్తులో భాగంగా మైసూరు, బెంగళూరు నగరాల్లోని 11 మంది కాంట్రాక్టర్ల ఇళ్లలో సోదాలు చేపట్టింది. ఈ కాంట్రాక్టర్లు ప్రభుత్వ టెండర్లలో పాల్గొని వివిధ ప్రజోపయోగ పనులను చేయిస్తుంటారని ఐటీ అధికారులు తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో వీరి చెల్లింపులను అంతకుముందు ఏడాది చెల్లింపులు, బ్యాంకు లావాదేవీల్లో తీవ్రమైన వ్యత్యాసాలున్నాయని చెప్పారు. ఇటీవల రాష్ట్రానికి చెందిన ఓ కాంట్రాక్టర్ ఒక వ్యక్తికి రూ.55 లక్షల నగదును ఆన్లైన్ ద్వారా బదిలీ చేయటం, సదరు వ్యక్తి ఆ డబ్బును విత్డ్రా చేసుకోవటం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆ డబ్బును సీజ్ చేసి, సంబంధిత కాంట్రాక్టర్ను విచారించగా మరో రూ.16 కోట్ల నగదును దాచి పెట్టినట్లు ఒప్పుకున్నాడన్నారు. మంత్రి నివాసంపై ఐటీ దాడులు? సాక్షి, బెంగళూరు/ మైసూరు: సీఎం సిద్ధరామయ్యకు సన్నిహితుడు, ప్రజాపనుల మంత్రి మహదేవప్ప నివాసం, కార్యాలయంపై ఐటీ దాడులు జరిగాయి. బెంగళూరుతో పాటు మైసూరులోని విజయనగర, టి.నరసీపురలోనున్న ఇళ్లలో సోదాలు జరిగాయని వార్తలు వచ్చాయి. ఎన్నికల్లో పంచడానికి భారీగా నగదు దాచి ఉంచినట్లు ఫిర్యాదులు రావడంతో మంత్రి మహదేవప్ప నివాసంతోపాటు ఆయనకు పరిచయస్తులైన 25 మంది కాంట్రాక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. అయితే తన ఇంటిపై ఐటీ దాడులేవీ జరగలేదని, కొందరు కాంట్రాక్టర్ల ఇళ్లలో సోదాలు జరిపినట్లు తెలిసిందని మంత్రి చెప్పారు. ఐటీ దాడులు ప్రధాని మోదీ దురుద్దేశంతో చేయిస్తున్నారని సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. -
రైళ్లలో పరిశుభ్రతపై ప్రయాణికుల రేటింగ్
న్యూఢిల్లీ: రైళ్లు, స్టేషన్లలో పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు రైల్వే శాఖ చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించి ఓ ఒప్పందాన్ని రూపొందించింది. దీని ప్రకారం రైళ్లలో పరిశుభ్రతపై ప్రయాణికులు రేటింగ్ ఇవ్వవచ్చు. ఈ రేటింగ్ ఆధారంగా కాంట్రాక్టర్లకు ఇచ్చే నెలవారీ ప్రోత్సాహకాల్లో 30 శాతం వెయిటేజ్ ఇస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. అలాగే రైల్వేలో ప్రతి విభాగం కాంట్రాక్టర్లపై ఇచ్చిన అభిప్రాయాల ఆధారంగా వారికి జరిమానాలు, బోనస్లు అందిస్తామని వెల్లడించింది. రైల్వే సూపర్వైజర్ కాంట్రాక్టర్ల హాజరుపై నివేదించిన వివరాల ఆధారంగా 25 శాతం, పరిశుభ్రత ఆధారంగా 15 శాతం, రైల్వే అధికారుల ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైన వివరాల ఆధారంగా మరో 10 శాతం వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపింది. పరిశుభ్రతపై ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించడం వల్ల వ్యవస్థలోని లోపాలను క్షేత్రస్థాయిలో గుర్తించే అవకాశం ఉంటుందని రైల్వే మంత్రిత్వ శాఖలో సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రయాణికుల నుంచి సేకరించిన సమాచారాన్ని జీపీఎస్ ఆధారిత వ్యవస్థలో రికార్డు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆన్బోర్డు హౌస్ కీపింగ్ స్టాఫ్(ఓబీహెచ్ఎస్) 1,700కి పైగా రైళ్లలో క్లీనింగ్ సర్వీస్ను అందిస్తోంది. -
పేరు ఒకరది.. ఇల్లు మరొకరికి
జలదంకి: పేదల కోసం ప్రభుత్వం మంజూరుచేసే గృహాల నిర్మాణంలో కాంట్రాక్టర్లు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జలదంకి అరుంధతీయ కాలనీకి చెందిన సూరిపోగు అంజయ్య కుమారుడు మాల్యాద్రికి అధికారులు ఇల్లు మంజూరు చేశారు. కాలనీలో నిర్మాణాలను టీడీపీ నాయకుడు కాంట్రాక్టర్గా మారి చేపట్టాడు. ఇల్లు మంజూరైన మాల్యాద్రికి నిర్మించకుండా కాలనీలో అదే పేరుతో ఉన్న మరొక వ్యక్తికి నిర్మించారు. మంజూరైన వ్యక్తి అకౌంట్లో రెండు దఫాలుగా రూ.1.20 లక్షలు జమచేశారు. దీంతో అధికారులు, కాంట్రాక్టర్ మాల్యాద్రిని రూ.70 వేలు పెద్దమనుషుల వద్ద పెట్టి న్యాయం చేస్తామని చెప్పడంతో నగదు ఇచ్చాడు. తిరిగి మరో బిల్లు రూ.50 వేలు అకౌంట్లో పడటంతో ఆ నగదును కూడా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే మరో మాల్యాద్రి మాత్రం తనకు ఇల్లు మంజూరైనట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. ఇప్పుడు నగదును మొత్తం మీరు తీసుకుంటే తనకు ఎప్పటికీ ఇల్లు వచ్చే అవకాశంలేదని, నేను పూరి గుడిసెలో ఉన్నానని రూ.50 వేలు ఇవ్వనని చెప్పాడు. దీంతో అతనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో మాల్యాద్రి పోలీసుల వద్ద విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం అడుగుతానని తెలిపాడు. జలదంకి మండలంలో హౌసింగ్ నిర్మాణంలో భారీ అవినీతి జరుగుతోందని, 7, 8 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న ఇళ్లకు కూడా బిల్లులు మంజూరు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది. -
నిమ్మకూరులో పైసా వసూల్
ఇక్కడ పనులు చేయాలంటేనే కాంట్రాక్టర్లు భయపడుతున్నారు. చేసే పని చిన్నదైనా అక్కడి నేతకు పైసలు సమర్పించుకోవాల్సిందే. ఇదేమిటంటే చినబాబు పేరు చెప్పి భయభ్రాంతులకు గురిచేస్తుండడంతో కాంట్రాక్టర్లు గుర్రుగా ఉన్నారు. అన్ని పనులకు పర్సంటేజీలు ఇస్తే తమకు ఏమి మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పామర్రు నియోజకవర్గంలో దందాకు తెరతీసిన నేత అక్రమ వసూళ్లపై కథనం. సాక్షి,అమరావతిబ్యూరో: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను బాగా వంటబట్టించుకున్నారు అధికార పార్టీనేతలు.. ప్రతి పనిలో పర్శంటేజీలు బహిరంగంగా వసూలు చేస్తున్నారు. తాజాగా పామర్రు నియోజకవర్గంలోని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో చినబాబు ముఖ్య అనుచరుడు చేస్తున్న దందాలు వివాదస్పదంగా మారాయి. ఆ గ్రామాన్ని ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ దత్తత తీసుకొని గ్రామాభివృద్ధి కోసం కేటాయించిన పనుల్లో కాంట్రాక్టర్ల వద్ద పర్సంటేజీల వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ చెరువులో నీరు..చెట్టు పనుల్లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. దందాలు ఇలా.. నిమ్మకూరును ఆయన మనవడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేçష్ 2015 డిసెంబర్లో దత్తత తీసుకున్నాడు. గ్రామాభివృద్ధి కోసం ఇప్పటికే దాదాపు రూ.28 కోట్ల నిధులు మంజూరు చేశారు. గ్రామంలో ఆయా నిధులతో పనులు జరుగుతున్నాయి.ఆ పనులను టెండర్ల ప్రక్రియలో దక్కించుకున్న కాంట్రాక్టర్లు వద్ద చినబాబు కీలక అనుచరుడు దందాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలున్నాయి. 30 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ వద్ద భారీగానే వసూళ్లు చేసినట్టు ఆరోపణలున్నాయి. ఆస్పత్రి శంకుస్థాపన సమయంలోనే వసూళ్లు వ్యవహారం వెలుగులోకి రావడంతో స్వయంగా అప్పటి మంత్రి కామినేని శ్రీనివాస్ పర్సంటేజీలు ఇవ్వాల్సిన అవసరం లేదని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అలాగే రూ.3 కోట్ల వ్యయంతో ఉండరపూడి నుంచి నిమ్మకూరు మీదగా వెళ్లే రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఆ పనులు చేపట్టే కాంట్రాక్టర్ వద్ద కూడా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి.. ఇలా ప్రతి పనిలో చినబాబు పేరుతో చేస్తున్న దందాల వ్యవహారంపై సదరు కాంట్రాక్టర్లు లబోదిబోమంటూ ఆ పార్టీ నేతలకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. గత రెండేళ్ల కాలంలో దందాల పేరుతో సదరు చోటానేత భారిగానే ఆస్తులు కూడబెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. నీరు–చెట్టు పేరుతో మట్టి అమ్మకాలు నిమ్మకూరు చెరువులో పూడిక తీత కోసం నీరు–చెట్టు పథకం ద్వారా ప్రభుత్వం రూ.8.5 లక్షలు మంజూరు చేసింది. ఆయా పనులను చేజిక్కించుకున్న చిన బాబు అనుచరుడు పూడిక తీత పేరుతో మట్టి విక్రయించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సహజంగా చెరువులో తీసిన మట్టిని రైతులకు, లేదా ప్రభుత్వ స్థలాల్లో ఉచితంగా తోలాలి..కానీ సదరునేత భారీ యంత్రాలతో చెరువును తోడేస్తూ ఆ మట్టిని వ్యాపార కలాపాలకు, ఇతరత్రా అవసరాలను విక్రయించాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో భారీగానే చేతులు మారినట్లు సమాచారం. చెరువు పూడిక తీతలో కూడా కేవలం 3 మీటర్లు మాత్రమే మట్టిని తీయాల్సి ఉన్నా 15 నుంచి 20 అడుగుల మేర నిబంధనలు ఉల్లంఘించి తవ్వకాలు చేస్తున్నారు. ఇప్పటికే మట్టి విక్రయాలతో లక్షలాది రూపాయలు సంపాదించాడన్న ఆరోపణలున్నాయి. చినబాబు పేరు చెప్పడంతో నిబంధనలు ఉల్లంఘించి మట్టి విక్రయాలు చేస్తున్నా అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో చినబాబు ప్రధాన అనుచరుడు చేస్తున్న దందాలు తీవ్ర రూపం దాల్చాయి. ఆ గ్రామంలో అభివృద్ధి పనుల కోసం రూ.28 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటికే పనులు సాగుతున్నాయి. టెం డర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లను చినబాబు అనుచరుడు బెదిరించి పర్సంటేజీలు వసూలుచేస్తున్నారనే ఆరోపణలువెల్లువెత్తాయి. నిమ్మకూరు చెరువుతో యంత్రంతో మట్టి తవ్వకాలు -
దోపిడీకి ప్లాన్
పాలకొల్లుటౌన్ : ఎస్సీ సబ్ప్లాన్ నిధులు తెలుగుదేశం నాయకులకు కల్పతరువుగా మారాయి. కాంట్రాక్టర్లు, అధికారులకు కాసులవర్షం కురిపిస్తున్నాయి. ఇది పాలకొల్లు మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతికి అద్దం పడుతోంది. పాలకొల్లు మున్సిపాలిటీకి ప్రభుత్వం ఎస్సీ సబ్ప్లాన్ ద్వారా రూ.18 కోట్లు మంజూరు చేసింది. 2017–18లో ఈ నిధులు ఖర్చు చేయాలి. అయితే మున్సిపల్ అధికారులు పనులకు టెండర్లు ఖరారు చేసి ఏడాది పూర్తవుతున్నా ఇప్పటివరకు ఆ పనులను పూర్తి చేయలేదు. మార్చి నెలాఖరు సమీపిస్తుండడంతో నిధులు తిరిగి వెనక్కు మళ్లుతాయనే భయంతో హడావుడిగా టీడీపీ నాయకులు పనులను వేగవంతం చేశారు. సబ్ప్లాన్ చట్టాన్ని కూడా అతిక్రమించి నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిచ్చి భారీ అవినీతికి పాల్పడుతున్నారు. పాలకొల్లు బెత్లహాంపేటలో ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో నాణ్యత లేకుండా నిర్మిస్తున్న సీసీ డ్రెయిన్ 7 ఎస్సీ వార్డులు పాలకొల్లులో మొత్తం 31 వార్డులు ఉన్నాయి. వీటిలో ఏడు ఎస్సీ వార్డులు. ఈ వార్డుల్లో ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో డ్రెయినేజీ, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిం చాల్సిన బాధ్యత మున్సిపాలిటీపై ఉంది. జనాభాలో 40శాతం ఎస్సీలు ఉన్న ప్రాంతాల్లో ఈ నిధులు వాడాలి. టీడీపీ నేతల కోసం రోడ్డు అయితే ఎస్సీలు 10శాతం కూడా లేని ప్రాంతాల్లో పనులు చేపడుతున్నారు. వాస్తవానికి 17, 18 వార్డుల్లో ఎస్సీలు పదిశాతం కూడా ఉండరు. ఇలాంటిచోట పలువురు టీడీపీ నాయకులు వారి పొలాలను రియల్ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకోవడానికి రూ.50లక్షల సబ్ప్లాన్ నిధులతో నిబంధనలకు విరుద్ధంగా బీటీ రోడ్డు నిర్మించారు. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు నిర్మాణంతో ఇప్పటికే ఈ ప్రాంతంలో అనేక పొలాలు, కొబ్బరితోటలు తొలగించి చకాచకా లేఅవుట్లకు సిద్ధం చేస్తున్నారు. నాసిరకంగా పనులు ఇదిలా ఉంటే 18వ వార్డు బెత్లహాంపేట, 16వ వార్డులో ఎస్సీ సబ్ప్లాన్, మున్సిపల్ జనరల్ ఫండ్ దాదాపు రూ.4కోట్లతో నిర్మితమవుతున్న రోడ్లు, సీసీ డ్రెయిన్ నిర్మాణ పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. దీనిలో భారీ అవినీతి జరుగుతున్నట్టు సమాచారం. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కైనట్టు తెలుస్తోంది. నాసిరకం సిమెంటు వినియోగిస్తున్నట్టు సమాచారం. ఇసుకపాళ్లు ఎక్కువ వేసి తూతూమంత్రంగా పనులు చేపట్టినట్టు స్థానికులు విమర్శిస్తున్నారు. ఫలితంగా వేసిన 2రోజులకే రోడ్డు, డ్రెయిన్లు బీటలు తీశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని ఎస్సీవార్డుల్లో డ్రెయినేజీ నిర్మాణం లేకుండా హడావుడిగా రోడ్డు నిర్మాణాలు చేపట్టారని స్థానికులు చెబుతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులు రూ.కోటి వ్యయంతో 16వ వార్డులో నిర్మిస్తున్న డ్రెయిన్ దృశ్యం టీడీపీ నేతల కనుసన్నల్లోనే పట్టణంలో ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో చేపట్టిన పనులన్నీ టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు సమాచారం. నాసిరకంగా పనులు చేపట్టడంపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. అయినా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. పనులు జరుగుతున్న ఎస్సీ వార్డుల్లో ఆ ప్రాంతాలకు చెందిన కొంతమంది టీడీపీ వార్డు కౌన్సిలర్లు నాయకులు కాంట్రాక్టర్లు తమను ప్రసన్నం చేసుకోకపోతే బిల్లులు నిలిపేస్తామని బెదిరింపులకు దిగుతున్నట్టు సమాచారం. కొంతమంది టీడీపీ నేతలు డబ్బులు చేతిలో పడితేగానీ పనులు సాగనీయడం లేదని ™ లుస్తోంది. వీటిపై మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో ప్రతిపక్ష నేత యడ్ల తాతాజీ అనేకసార్లు మున్సిపల్ చైర్మన్ వల్లభు నారాయణమూర్తి, కొందరు టీడీపీ నేతలపై ధ్వజమెత్తారు. వారు రియల్ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి రూ.50లక్షలు సబ్ప్లాన్ నిధులతో రోడ్డు నిర్మించారని విమర్శించారు. దీనిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పోరాడినా ఫలితం లేదు. 7 వార్డుల్లో 86 పనులు పాలకొల్లు మున్సిపాలిటీలో 7వార్డుల్లో 86 పనులను చేపట్టారు. ప్రస్తుతం 48పనులు నూరుశాతం పూర్తికాగా మరో 38 పనులు 75శాతం పూర్తయ్యాయని మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. మార్చి 15లోపు మిగిలిన పనులు పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 10, 11, 15, 21, 31 వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతాప్రమాణాలకు కాంట్రాక్టర్లు తిలోదకాలిచ్చినా అధికారులు పట్టించుకోని దుస్థితి నెలకొంది. రెండు రోజులకే బీటలు బెత్లహాంపేటలో డ్రెయిన్ నిర్మాణం చేపట్టారు. అయితే 2రోజులకే ఎక్కడికక్కడ కాంక్రీటు రాలిపోయింది. ప్లాస్టరింగ్ కూడా చేయలేదు. డ్రెయిన్ మార్జిన్ పూడ్చమని అడిగితే ఎవరింటిముందు వాళ్లే పూడ్చుకోవాలని చెబుతున్నారు. ఇది చాలా దారుణం. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి. – షేక్ మీరాఉద్దీన్, బెత్లహాంపేట, డ్రెయిన్ లేకుండానే రోడ్డు మా వార్డులో అధికారులు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే డ్రెయినేజీ లేకుండా రోడ్డు ఎలా నిర్మిస్తారని అడిగితే రోడ్డు పూర్తయ్యాక డ్రెయిన్ నిర్మిస్తామని అధికారులు చెబుతున్నారు. డ్రెయిన్ నిర్మాణం లేకుండా రోడ్డువేస్తే కుంగిపోతుంది. డ్రెయినేజీ లేకపోవడం వల్ల ఎక్కడి మురుగు అక్కడే ఉంటుంది. పందులు, దోమలు పెరిగి అనారోగ్యం పాలవుతున్నాం. ఇది చాలా దారుణం. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. – నగరపు సత్తెమ్మ, రాజీవ్నగర్ కాలనీ, పర్యవేక్షిస్తున్నారు పాలకొల్లు మున్సిపాలిటీలో ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం జరుగుతోంది. ఈ పనుల్లో నాణ్యతాప్రమాణాలను ఎప్పటికప్పుడు ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పనుల్లో ఎక్కడైనే నాణ్యత లోపించినట్లు గుర్తిస్తే ఆ పనులకు బిల్లులు నిలిపివేస్తాం. క్వాలిటీ కంట్రోల్, థర్డ్ పార్టీతో నాణ్యత ప్రమాణాల పరిశీలన అనంతరమే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తాం. నాణ్యత ప్రమాణాలు లోపించిన చోట ప్రజలు గమనించి తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం. – ఎ.రామ్మోహనరావు, మున్సిపల్ కమీషనర్, పాలకొల్లు -
‘డబుల్’.. అదే ట్రబుల్..!
సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల పథకం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సవాల్గా నిలుస్తోంది. ఎంత పరిగెత్తిద్దామని ప్రయత్నిస్తున్నా కాంట్రాక్టర్ల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో ఇళ్ల నిర్మాణంలో వేగం పెరగటం లేదు. ఈ ఏడాది చివరికి వాటిని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నా పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది. యూనిట్ కాస్ట్–ఇళ్ల నమూనాలకు మధ్య ఏమాత్రం పొంతన కుదరకపోవడంతో నిర్మాణ సంస్థలు టెండర్లలో పాల్గొనేందుకు ఆసక్తి చూపటం లేదు. ఇతర పథకాల్లో పనులు అప్పగించేందుకు ప్రాధాన్యమిస్తామంటూ కొందరు మంత్రులు నిర్మాణదారులకు అనధికార హామీలిస్తుండటం, అనుకున్నట్టుగా పనులు లభిస్తుం డటంతో కొన్ని నియోజకవర్గాల్లో కాస్త వేగం కనిపిస్తోంది. మిగతా చోట్ల ఎంత ప్రయత్నించినా తీరు మారటం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తవు తున్నా, ఈ కీలక ప్రాజెక్టులో వేగం లేకపోవటం ఇప్పుడు ఆ పార్టీకే పెద్ద ఇబ్బందిగా మారింది. ఎన్నికలకు సన్న ద్ధమవుతున్న తరుణంలో ప్రజల నుంచి ఎమ్మెల్యేలకు ఈ పథకంపై ప్రశ్నల వర్షం ఎదురవుతుండటంతో ప్రభుత్వం పథకంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల మంత్రి కె.తారక రామారావు రంగంలోకి దిగి గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో కలసి స్టీలు తయారీదారులతో సమావేశమై ప్రత్యేకంగా చర్చించారు. సామాజిక బాధ్యతగా భావించి ఈ పథకానికి తక్కువ ధరకే స్టీల్ను సరఫరా చేయాలని కోరారు. రెండుసార్లు జరిగిన సమావేశాల అనంతరం కంపెనీలు మార్కెట్ ధర కంటే మెట్రిక్ టన్నుపై రూ.9 వేలు తక్కువ ధరకు స్టీల్ను సరఫరా చేసేందుకు అంగీకరించాయి. దీంతో పనుల్లో కాస్త వేగం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. జూన్ నాటికి పూర్తయ్యేనా? రాష్ట్రవ్యాప్తంగా 2.38 లక్షల ఇళ్లను నిర్మించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు అతి కష్టమ్మీద 8 వేల ఇళ్లను మాత్రం పూర్తి చేయగలిగారు. పరిపాలన అనుమతులు జారీ చేసిన మొత్తం ఇళ్లను సిద్ధం చేయటమంటే జాప్యం జరిగే అవకాశం ఉంది. దీంతో కనీసం 60 వేల ఇళ్లను సిద్ధం చేసి డబుల్ బెడ్రూం పథకం వేగం పుంజుకుందని చూపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు జూన్ నాటికి 60 వేల ఇళ్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు లక్ష్యం విధించింది. దీంతో గతంలో టెండర్లకు స్పందన లేని ఇళ్లకు తాజాగా కొత్త టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. కొన్నింటికి నాలుగైదు సార్లు టెండర్లు పిలిచినా ఎవరూ పాల్గొనకపోవటంతో అవి రద్దయ్యాయి. మరోవైపు ఇళ్ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని గుర్తించి అధికారులు ముందు జాగ్రత్త చర్యగా లబ్ధిదారుల ఎంపికలో వ్యూహాత్మకంగా ఆలస్యం చేస్తున్నారు. ఎంపికలు పూర్తయితే ఇళ్ల కోసం ఒత్తిడి పెరుగుతుందన్న ఉద్దేశంతో పెండింగులో పెడుతూ వస్తున్నారు. ఇప్పటికీ 17 జిల్లాల్లో ఒక్కరంటే ఒక్క లబ్ధిదారుడిని కూడా గుర్తించకపోవటమే ఇందుకు నిదర్శనం. మిగతా జిల్లాల్లో 12,758 మందిని మాత్రమే గుర్తించారు. సిద్దిపేట ముందు.. పనుల్లో ప్రస్తుతానికి సిద్దిపేట జిల్లా ముందుంది. ఇక్కడ 10,900 ఇళ్లకు టెండర్లు ఖరారు కాగా 10,600 ఇళ్ల నిర్మాణం మొదలైంది. 2 వేల ఇళ్లు సిద్ధమయ్యాయి. యూనిట్ కాస్ట్ ఎక్కువగా ఉన్న జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇళ్లకుగాను 92 వేల ఇళ్ల నిర్మాణం మొదలైంది. మహబూబ్నగర్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, వరంగల్ అర్బన్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కాస్త కదలిక కనిపిస్తోంది. జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూలు, వనపర్తి, సంగారెడ్డి, ఆదిలాబాద్, కుమ్రంభీమ్, నిర్మల్, పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్ రూరల్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో స్తబ్ధత నెలకొంది. -
అధికారిక దోపిడీ
సాక్షి, రాజమహేంద్రవరం: కంచె చేను మేసిన చందంగా ప్రభుత్వ పెద్దలో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. పెట్టుబడిలేని ఆదాయ వనరుగా ఇసుకను మార్చుకున్న ప్రభుత్వ పెద్దలు తమ స్థాయికి తగ్గట్లు ఇసుక దందా చేస్తున్నారు. ఉచిత ఇసుక, అక్రమాలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించబోమని బీరాలు పలికే పాలకులే ఇసుక దందా చేస్తూ అనుచరులు, స్థానిక నేతలకు దారిచూపిస్తున్నారు. జిల్లాలో గోదావరి, కోనసీమలోని గోదావరి పాయలు, ఏలేరు కాలువ, తాండవ నదిలో అడ్డగోలుగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం వెనుక పెద్దల హస్తం ఉందని స్పష్టమవుతోంది. ఎవరైనా మండల స్థాయిలో రెవెన్యూ, పోలీసు అధికారులు లారీలను పట్టుకున్నా, జరిమానా వేసినా అధికారపార్టీ నేతలు హెచ్చరికలు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా ప్రభుత్వ పెద్దలే ఇసుక దందా చేస్తుంటే వారి అనుచరులు మరింత రెచ్చిపోతున్నారు. ‘పెద్దల’ దందా ఇలా... సీతానగరం మండలం కాటవరం పంపింగ్ స్కీము ఇసుక మేటల వల్ల నిర్వహణలో లేదు. దాన్ని పునరుద్ధరించేందుకు మూడేళ్ల కిత్రం ఇసుక ర్యాంపునుకు అనుమతి మంజూరు చేశారు. తిలక్ అనే వ్యక్తి మేట వేసిన ఇసుక తీయడానికి సరిహద్దులు గీసినా వాటిని వదలి పక్కన నాణ్యమైన ఇసుకను విశాఖకు తరలించుకుపోయారు. ఇలా రెండేళ్లలో దాదాపు రూ.50 కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తరలించుకుపోయినా పంపింగ్ స్కీము పునరుద్ధరణ జరగలేదు. ఈ ఏడాది రూటు మార్చిన ప్రభుత్వ పెద్దలు ఆదే వ్యక్తికి చెందిన కంపెనీకి పోలవరం ఎడమ కాలవ ఐదో ప్యాకేజీ పనుల కోసం ఇసుక తరలించేందుకంటూ ప్రత్యేకంగా అనుమతులు జారీ చేశారు. ఎంతమేర తవ్వకాలు ఎక్కడ జరగాలన్నది స్థానిక రెవెన్యూ అధికారులు సరిహద్దులు ఏర్పాటు చేశారు. అయినా వాటిని విస్మరించి ఇష్టానుసారం తవ్వకాలు జరిపారు. నాగార్జున కనస్ట్రక్షన్ కంపెనీకి (ఎన్సీసీ) మయూరి, పీఎస్కేఎస్ కంపెనీల గత ఏడాది నవంబర్ నుంచి ఇసుక తవ్వకాలు చేపడుతున్నాయి. నదిలోని ఇసుకను ట్రాక్టర్ల ద్వారా గట్టున పోసి అక్కడ నుంచి ఐదు యూనిట్లమేర లారీల్లో నింపి తరలించాయి. ఇప్పటి వరకు దాదాపు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తరలించుకుపోయాయి. తుని వద్ద పోలవరం ఎడమ కాలువ పనులకు కావాల్సిన ఇసుక నవంబర్ నాటికే అవసరానికి మించి ఉంది. కానీ ఆ పనుల పేరుతో పెద్దలు అధికారులతో తిలక్ అనే వ్యక్తికి అనుమతులు ఇప్పించారు. ఆ పనుల పేరుతో సదరు వ్యక్తి విశాఖకు ఇసుకను తరలిస్తున్నారు. రూ.150 కోట్లు కొల్లగొట్టారు రాష్ట్రంలోనే గోదావరి తీర ప్రాంతంలో సీతానగరం మండలంలో నాణ్యమైన ఇసుక లభిస్తుంది. అందుకే ఇక్కడ ఇసుకకు భలే గిరాకి ఉంటోంది. యూనిట్ ఇసుక ర్యాంపులోనే రూ.రెండు వేలు పలుకుతోంది. ఒకటిన్నర క్యూబిక్ మీటర్ ఇసుక ఒక యూనిట్తో సమానం. ఇలా లెక్కన దాదాపు 1.50 లక్షల యూనిట్ల ఇసుక కాటవరం నుంచి తరలించుకుపోయారు. ర్యాంపులోనే ఈ ఇసుక విలువ యూనిట్ రెండు వేలు చొప్పున తరలించుకుపోయిన ఇసుక విలువ రూ.30 కోట్లు ఉంది. విశాఖలో డిమాండ్ను బట్టి రెట్టింపు ధర, రవాణా ఛార్జీలు కలిపి ఐదు యూనిట్ల ఇసుక లారీ రూ.40 వేల చొప్పున విక్రయాలు జరుగుతున్నాయి. ఇలా దాదాపు రూ.150 కోట్లు సీతానగరం కాటవరం ర్యాంపు నుంచి పోలవరం ఎడమ కాలవు పనుల పేరుతో ఇసుక తరలించి జేబులు నింపుకున్నారు. స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధికి ఇందులో చిల్లరే వస్తుందని, అసలు అంతా పెద్దల కనుసన్నల్లో నడుస్తోందని ఆ పార్టీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. కాటవరంలోలా జిల్లాలో మరో ర్యాంపు నుంచి పోలవరం పనుల పేరుతో ఇసుక తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. -
డబుల్
సాక్షి, మెదక్: జిల్లాలో డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణాల ప్రక్రియ ముందకు సాగడం లేదు. నిర్మాణానికి కాంట్రాక్టర్లు మందుకు రాకపోవడం ఒక కారణమైతే, కావల్సిన మెటీరియల్ ధరలు అమాంతంగా పెరగడం మరో కారణం. దీంతో ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పలు చోట్ల ఇంకా టెండర్ల ప్రక్రియ సైతం పూర్తి కాలేదు. జిల్లాలోని లబ్ధిదారులు ఇళ్ల కోసం మరింత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అర్హులైన పేదలకు వారి సొంతింటి కల నెరవేర్చాలని భావిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులకు అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. జిల్లాలో నేటికీ ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తి కాలేదు. ప్రభుత్వం జిల్లాకు 4,929 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో అధికారులు 4,589 ఇళ్ల నిర్మాణం పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో 950, గ్రామీణ ప్రాంతాల్లో 3,639 ఇళ్ల నిర్మాణం పనులను పంచాయతీరాజ్ శాఖకు అప్పగించారు. 1,854 ఇళ్ల నిర్మాణం పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు మందుకు వచ్చారు. మిగితా 2,735 ఇళ్ల నిర్మాణాలకు ఇంకా టెండర్లు ఖరారు కాలేదు. ఎన్నికలు సమీపిస్తున్నా.. జిల్లాలో 1,854 ఇళ్ల నిర్మాణాలకు టెండర్లు ఫైనల్ అయ్యాయి.వీటిలో 1,704 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. మెదక్ మండలం పల్లికొటాల, చేగుంట, బోనాలకొండాపూర్, తూప్రాన్ మండలం కోనాయిపల్లి, నర్సాపూర్, శివ్వంపేట మండలంలోని దంతాన్పల్లి, వెల్దుర్తిలో పనులు ప్రారంభమయ్యాయి. వీటిలో 1,430 ఇళ్ల నిర్మాణం పనులు ఇంకా పునాది దశలోనే ఉన్నాయి. 85 ఇళ్ల నిర్మాణం పనులు పిల్లర్ల దశలో ఉండగా.. 100 వరకు రూఫ్ లెవల్కు చేరుకున్నాయి. 63 ఇళ్ల గోడలు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాయి. 26 ఇళ్ల గోడలు పూర్తి అయ్యాయి. ఆయా ఇళ్ల నిర్మాణానికిగాను ఇప్పటి వరకు రూ.1.44 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటి వరకు ఒక్కచోటా కూడా ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు. దీనికి తోడు ఇంకా 2,735 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. ఓవైపు ఎన్నికల సమయం సమీపిస్తున్నా ఇంకా డబుల్ పనులు పూర్తికాక పోవడంతో ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ముందుకు రావడం లేదు.. ప్రభుత్వం సూచించిన రూ.5.30 లక్షల వ్యయంతో డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యే అవకాశం లేదు. ఈ కారణంగానే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. హైదరాబాద్లో స్క్వయర్ ఫీట్కు రూ.1,350 చెల్లిస్తుండగా.. జిల్లాలో మాత్రం రూ.900 చెల్లిస్తోంది. దీంతో కాంట్రాక్టర్లు నిర్మాణం పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. స్టీల్ ధర గణనీయంగా పెరగడంతో మరింత భయపడుతున్నారు. ప్రసుత్తం నిర్మాణం పనులు చేపడితే ఆర్థికంగా నష్టపోతామన్న భావన కాంట్రాక్టర్లలో నెలకొంది. దీంతో ఇళ్ల నిర్మాణం పనులు సకాలంలో పూర్తికాని పరిస్థితి ఉంది. -
మిషన్లలో ప్రాణాలు హరీ
యంత్రాలు (మిషన్) ఉత్పత్తికే కాదు మానవుల ప్రాణాలు తీయడానికి కూడా ఉపయోగపడుతున్నాయి. కార్మికుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. పని ప్రదేశాల్లో సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో కార్మికులకు భద్రతా కరువైంది. కార్మిక శాఖ నిబంధనలు ఉన్నా బేఖాతరు చేస్తూ కార్మికులతో ప్రమాదకర పనులు చేయిస్తున్నారు వ్యాపారులు. దీంతో కార్మికుల ప్రాణాలు గాలిలో దీపాలయ్యాయి.గాలిలో దీపంలా కార్మికుల ప్రాణాలు అసంఘటితరంగ కార్మికులకు రక్షణ శూన్యం తరచు ప్రమాదాల బారిన కష్టజీవులు పట్టించుకోని కార్మిక శాఖ అధికారులు, పోలీసులు మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న వైనం పరిగి : ప్రభుత్వం చేపడుతున్న మిషన్ భగీరథ పనులు కార్మికుల జీవితాలను కాటేస్తున్నాయి. అసంఘటిత కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఒక్క పరిగి మండలంలోనే భగీరథకు సంబంధించి పనుల్లో ఇప్పటివరకు 4 సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు ఉత్తరాది రాష్ట్రాల కార్మికులు మృతిచెందగా, మరో ఇద్దరు జిల్లావాసులు బలయ్యారు. పని ప్రదేశంలో హక్కులు కానరావు. కార్మికుల రోదనలు అరణ్యరోదనలే. స్టీల్ కంపెనీలు, మిషన్ భగీరథ పనులు, పౌల్ట్రీ ఫాంలు, రోడ్డు నిర్మాణ పనులు, ఇటుక తయారీ బట్టీలు ఇలా పని చేసే చోటేదైనా.. కాంట్రాక్టర్లు, యాజమాన్యాలు కార్మికుల హక్కులు కాలరాస్తూనే ఉన్నాయి కార్మికులు తరచూ మత్యువాత పడుతున్నా.. వారికి ఇవ్వాల్సిన కూలీ డబ్బులు ఇవ్వకున్నా.. పనిప్రదేశంలో వేధింపులకు గురిచేసినా.. పట్టించుకునే వారు లేరు. తరచూ కార్మికుల మృతితో అసంఘటిత కార్మికుల్లో కలకలం రేపుతోంది. కార్మిక అధికారులు, పోలీసులు పని ప్రదేశాల్లో మత్యువాత పడుతున్న అసంఘటిత కార్మికుల్లో అక్కడక్కడ స్థానికులు ఉంటున్నప్పటికీ.. ఎక్కువ శాతం ఉత్తారాది రాష్ట్రాల వారే ఉంటున్నారు. స్థానికంగా పరిచయాలు లేకపోవడంతో.. అధికారులు పట్టించుకోకపోవడంతో పని ప్రదేశంలో ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. ప్రమాదాలు చోటుచేసుకుంటే గుట్టుచప్పడు కాకుండా మృతదేహాలను తరలించి యాజమాన్యాలు, కంపెనీలు చేతులు దులుపేసుకుంటున్నాయి. కార్మికులు, వారి కుటుంబాలకు మద్దతుగా నిలవాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. పని ప్రదేశంలో కార్మికులు మత్యువాతపడినా.. వైకల్యం పొందినా.. వారికి పనికి తగ్గ వేతనాలు ఇవ్వకపోయినా.. కూలీ డబ్బులు ఎగ్గొట్టినా.. కార్మిక శాఖ పర్యవేక్షణ లేదు. పోలీసులు ప్రమాదాలు జరిగినప్పుడు కేసులు నమోదు చేసేందుకు కూడా వెనకాడుతున్నారు. అధికార యంత్రాంగం కాంట్రాక్టర్లకు, కంపెనీ యాజమాన్యాలకే వంత పాడుతున్నారు. నాలుగు ఘటనలు పని ప్రదేశంలో మృత్యువాత పడడం.. వికలత్వం రావడం తరచు జరుగుతున్నాయి. చాలా కేసులు ఉంటున్నా వీటిల్లో చాలా తక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఒక్క మిషన్ భగీరథ పనుల్లోనే ఇటీవల నాలుగు ఘటనలు చోటుచేసుకున్నాయి. గత అక్టోబర్లో కాళ్లాపూర్ సమీపంలో మిషన్ భగీరథ పనుల్లో ఉత్తరప్రదేశ్కు చెందిన కార్మికుడు దిలీప్సింగ్ మృతిచెందాడు. తాజాగా గత బుధవారం జాపర్పల్లిలో కార్మికుడు జిగార్ అలీ మృతిచెందాడు. వీరిద్దరు రాత్రి సమయంలోనే పనులు చేస్తూ మృతి చెందారు. తొండపల్లి సమీపంలో ఒకరు, సయ్యద్ మల్కాపూర్ సమీపంలో ఒకరు మిషన్ భగీరథ పనుల్లో వినియోగించే క్రేన్ తగలడంతో మృత్యువాత పడ్డారు. పరిగి, పూడూరు మండలాల పరిధిలో ఉన్న స్టీల్ కంపెనీల్లోనూ తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. పని ప్రదేశంలో కార్మికులకు రక్షణ చర్యలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిపై కార్మిక శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. -
‘డబుల్’ జాప్యం
సాక్షి, ఆదిలాబాద్ : పేదలకు డబుల్ బెడ్రూం ఆశ చూపిన ప్రభుత్వం ఇప్పటి వరకైతే జిల్లాలో నమూనా మాత్రం చూపించింది. ఈ పథకం ప్రారంభమైన రెండేళ్లలో ఇప్పటివరకు జిల్లాలో ఒకే ఒక ఇంటి నిర్మాణం పూర్తయింది. మొదటి దశలో మంజూరైన లక్ష్యంలో ఇప్పటివరకు సగం ఇళ్ల నిర్మాణం ప్రారంభానికి నోచుకోలేదంటే చోద్యమే. ఇక రెండో దశ కింద భారీగా 2బీహెచ్కేలు మంజూరైనా వాటికి ఇప్పటికీ అతీగతి లేదు. టెండర్ దశకు కూడా నోచుకోకపోవడంతో ఇక ఆ దశ ఇళ్ల నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. అయినప్పటికీ ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలోనే డబుల్ బెడ్ రూమ్ల నిర్మాణం ఆశాజనకంగా ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో నిర్మాణం పరంగా 18వ స్థానంలో ఉన్నట్లు పేర్కొంటున్నారు. డబుల్ బెడ్ రూమ్ల నిర్మాణానికి నిధుల కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొదటి దశకే మోక్షం లేదు.. జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ నిర్మాణాలకు సంబంధించి మొదటి దశకే ఇంకా పూర్తి స్థాయిలో మోక్షం లభించలేదు. 2015–16లో జిల్లాకు లక్ష్యం కేటాయించినప్పటికీ వాటి ప్రారంభానికి ఆలస్యమైంది. యూనిట్ వ్యయం కింద అర్బన్ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.04 లక్షలతో డబుల్ బెడ్ రూమ్ హాల్, కిచెన్ నిర్మించాలి. మొదటి దశలో యూనిట్ వ్యయంతోపాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి కింద ఒక్కో 2బీహెచ్కేకు అదనంగా గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.25 లక్షలు, అర్బన్ ప్రాంతాల్లో రూ.75 వేలు కేటాయించారు. ఈ నిధులతో డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేపట్టలేమని మొదట్లో కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో వీటి ప్రారంభానికి ఆటంకాలు ఎదురయ్యాయి. పలుమార్లు టెండర్లు జరిగినా కాంట్రాక్టర్లు ఈ నిర్మాణంలో భారం పడుతుందని విముఖత చూపారు. ఐరన్, సిమెంట్, ఇసుక ధరలు అధికంగా ఉండడంతో ఈ నిర్మాణం చేపట్టలేమని ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యానికి జాప్యం జరిగింది. ఆ తర్వాత సిమెంట్ సబ్సిడీపై అందజేస్తామని, ఇసుక విషయంలో స్థానిక రీచ్ల నుంచి తెచ్చుకునే విషయంలో ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహరించడం, సీనరేజ్ చార్జీల మినహాయింపు ఇవ్వడంతో కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. ఆలా మొదటి దశకు అంకురార్పణ జరిగినప్పటికీ మధ్య మధ్యలో అనేక సమస్యలను ఎదుర్కొంది. పలు చోట్ల స్థలం ఎంపికలో ఆలస్యం జరగగా, కొన్ని చోట్ల ప్రభుత్వ స్థలాలే లేకపోవడం సమస్యకు కారణమైంది. ఆ తర్వాత ఆయా శాఖలు సిమెంట్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నప్పటికీ మధ్యలో సిమెంట్ పంపిణీలో జాప్యం జరగడం వంటి సంఘటనలు కూడా నిర్మాణం ఆలస్యానికి కారణమయ్యాయి. తాజాగా జీఎస్టీ విషయంలోనూ కాంట్రాక్టర్లలో అయోమయం ఉంది. మినహాయింపును ఇస్తేనే ఈ నిర్మాణాలు సాధ్యమని చెబుతున్నారు. ప్రస్తుతం అన్ని సమస్యలను అధిగమించి నిధులు పుష్కలంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికైనా ఇళ్ల నిర్మాణం వేగిరంగా జరుగుతుందా అనేది వేచి చూడాల్సిందే.. అర్బన్లో జీ+1.. రోడ్డు భవనాల శాఖ(ఆర్అండ్బీ) అర్బన్ ప్రాంతాల్లో, పంచాయతీ రాజ్ శాఖ గ్రామీణ ప్రాంతాల్లో, ఏజేన్సీ ప్రాంతాల్లో ఐటీడీఏ డబుల్ బెడ్ రూమ్ల ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షిస్తోంది. 2బీహెచ్కే జిల్లా నోడల్ అధికారిగా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సి.బసవేశ్వర్ వ్యవహరిస్తున్నారు. నోడల్ అధికారి కేవలం పరిపాలనమైన వ్యవహారాల్లోనే అనుసంధాన కర్తగా వ్యవహరిస్తారు. క్షేత్రస్థాయిలో నిర్మాణాల బాధ్యతను సంబంధిత శాఖలపైనే ఉంటుంది. జిల్లా కలెక్టర్ పరిశీలనలో ఇవన్నీ కొనసాగుతాయి. కాగా డబుల్ బెడ్ రూమ్లకు సంబంధించి మొదటి దశలో ఇప్పటి వరకు నిర్మాణాలు ప్రారంభమైన ఇళ్లలో అర్బన్ ప్రాంతాల్లో నిర్మిస్తున్నవి జీ+1 నమూనాలో చేపట్టారు. కొన్ని చోట్ల జీ+2 నమూనాలను కూడా నిర్మిస్తున్నారు. ఆదిలాబాద్ శివారు మావలలో జీ+2 నమూనాలో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మావలలో సుమారు 250 పై చిలుకు డబుల్ బెడ్ రూమ్ల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత డబుల్ బెడ్ రూమ్ల నిర్మాణాలు చేపట్టారు. ఇక రెండో దశ కింద రెండు నెలల కింద 2016–17కు సంబంధించి భారీగా డబుల్ బీహెచ్కే ఇళ్లు మంజూరు అయ్యాయి. వాటికి ప్రధానంగా స్థలభావం సమస్యగా మారింది. రెండో దశతోపాటు మొదటి దశలో ఇంకా ప్రారంభానికి నోచుకోని ఇళ్ల విషయంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ జీ+1 నమూనాలను నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. తద్వారా స్థల సమస్య తీరుతుందని చెబుతున్నారు. జూన్లోగా పూర్తి చేయాలి.. మొదటి దశలో నిర్మాణం ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను జూన్లోగా పూర్తి చేయాలని సంబంధిత శాఖలకు కలెక్టర్ ఆదేశించారు. మొదటి దశలో ఇంకా ప్రారంభం కాని ఇళ్ల నిర్మాణాలను త్వరలో ప్రారంభిస్తాం. నిధులు పుష్కలంగా ఉన్నాయి. సిమెంటుకు సంబంధించి ఇటీవలే పూర్తి స్థాయిలో పేమెంట్ చేశాం. లబ్ధిదారుల ఎంపిక ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. రెవెన్యూ అధికారులు ఎంపిక చేస్తారు. కలెక్టర్ ఆమోదంతోనే లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు అవుతాయి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో జీఎస్టీ భారం పడుతుందని కాంట్రాక్టర్లు అనవసరంగా అయోమయం చెందుతున్నారు. జీఎస్టీకి సంబంధించి పూర్తి బిల్లులు అందజేసిన పక్షంలో ప్రభుత్వం ఆ వ్యయాన్ని తిరిగి ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తుంది. – సి.బసవేశ్వర్, జిల్లా నోడల్ అధికారి, గృహ నిర్మాణ శాఖ పీడీ -
డీడీ ఎక్కడండి.. ఎక్కడో పోయిందండి!
సాక్షి, హైదరాబాద్: పురావస్తు శాఖలో పెద్ద సంఖ్యలో డిమాండ్ డ్రాఫ్టులు గల్లంతయ్యాయి. అవి ఏ పని కోసం సంబంధించినవో వివరించే కొన్ని ఫైళ్లు కూడా మాయమయ్యాయి. అందులో కాంట్రాక్టర్లకు తిరిగి చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన కాంట్రాక్టర్లు వారి డీడీల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కేంద్రం 12వ ఆర్థిక సంఘం, 13వ ఆర్థిక సంఘం నుంచి పురావస్తు శాఖకు భారీ మొత్తాన్ని కేటాయించింది. ఆ శాఖ పరిధిలోని చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీటిని ఖర్చు చేయాలి. దాదాపు రూ.70 కోట్ల వరకు ఈ రూపంలో, కొన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పనులు చేపట్టారు. పనుల టెండర్లు పిలిచినప్పుడు కాంట్రాక్టర్లు ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) దాఖలు చేయాల్సి ఉంటుంది. దీన్ని డీడీ, చెక్కులు, బ్యాంకు గ్యారంటీ రూపంలో చెల్లిస్తారు. ఆ పని విలువలో రెండున్నరశాతం వరకు ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్కు మాత్రం నిర్ధారిత కాలం తర్వాత తిరిగి చెల్లిస్తారు. ఇలా 12, 13వ ఆర్థిక సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులకు సంబంధించిన టెండర్లతో పాటు కాంట్రాక్టర్లు ఈఎండీని డీడీల రూపంలో చెల్లించారు. ఇదంతా రాష్ట్ర విభజనకు ముందు జరిగింది. బ్యాంకులో వేయక ఏం చేసినట్లు.. సాధారణంగా ఈఎండీ తాలూకు మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఆ మొత్తం, దానిపై వచ్చే వడ్డీని కూడా ఆయా శాఖలు ఖర్చు చేసుకుంటాయి. అవసరం వచ్చినప్పుడు కాంట్రాక్టర్లకు నిర్ధారిత మొత్తాన్ని తిరిగి చెల్లిస్తాయి. కానీ పురావస్తు శాఖలో మాత్రం ఆ ఈఎండీ మొత్తాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయలేదని తెలుస్తోంది. ఆ డీడీలను అలాగే ఫైళ్లలో ఉంచేశారని, ఇప్పుడు ఆ ఫైళ్లతో పాటు అవి కనిపించటం లేదని తెలుస్తోంది. పనులు పూర్తి కావటంతో కాంట్రాక్టర్లు ఈఎండీ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోరడంతో అసలు విషయం బయటపడింది. అప్పుడు కాని గల్లంతైన సంగతిని గుర్తించలేదు. ఈ డీడీల విలువ ఎంతో కూడా తెలియకుండా అధికారులు గుట్టుగా ఉంచుతున్నారు. ఈ మొత్తం తిరిగి చెల్లించాలని తెలంగాణ, ఆంధ్ర పురావస్తు కార్యాలయాల చుట్టూ కాంట్రాక్టర్లు తిరుగుతున్నారు. కాంట్రాక్టర్ల ఒత్తిడి పెరుగుతుండటంతో ఏపీ అధికారులు.. తెలంగాణ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ‘ఈ ఫైళ్లను మాకు ఇవ్వలేదు, అవి తెలంగాణ కార్యాలయంలోనే ఉన్నాయి. ఇవ్వాలని కోరినా ఇప్పటి వరకు ఇవ్వలేదు’అని ఏపీకి చెందిన ఓ అధికారి ‘సాక్షి’తో చెప్పారు. -
తీరని దాహం
పర్సెంటేజీ తమ ఇంటికొస్తే చాలనుకునే నేతలు... ప్రాజెక్టు లేటైతే అంచనాలు పెంచేద్దామనుకునే కాంట్రాక్టర్లు... నాలుగు కాసులిస్తే సర్దుకుపోయే అధికారులు.. అంతిమంగా 120 గ్రామల దాహార్తి తీర్చేందుకు రూ. కోట్ల నిధులు పారించినా... జనం గొంతు మాత్రం తడవడం లేదు. ముదిగుబ్బ మండలంలో పైలెట్ మంచినీటి ప్రాజెక్ట్ పనులు ఐదున్నరేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. ధర్మవరం : సరిగ్గా ఐదేళ్ల క్రితం 2013 జూలై 30న ముదిగుబ్బ మండల కేంద్రానికి సమీపంలో రూ. 21.40 కోట్లతో బృహత్తర పైలెట్ మంచినీటి ప్రాజెక్ట్ పనులకు అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. ముదిగుబ్బ, తనకల్లు మండలాల్లోని 120 గ్రామాలకు 2014 నవంబరు నాటికి మంచినీటిని అందివ్వాలన్నది దీని లక్ష్యం. దీని కోసం జాతీయ గ్రామీణ మంచినీటి అభివృద్ధి పథకం (ఎన్ఆర్డబ్ల్యూపీ) కింద రూ. 21.40 కోట్ల కేంద్రం నిధులు మంజూరయ్యాయి. తొలివిడతగా రూ. 7 కోట్లు, మలివిడతగా మరో రూ. 14 కోట్లు ఇచ్చేలా టెండరు ఖరారు చేశారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి సత్యసాయివాటర్ సప్లై స్కీంద్వారా ఈ ప్లాంటకు వచ్చిన నీటిని శుద్ధిచేసి, రోజుకు 30 మిలియన్ లీటర్ల శుద్ధ జలాలను ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన రక్షిత మంచిననీటి పథకాలకు తాగునీటిని అందించేందుకు వీలుగా ఈ ప్రాజెక్ట్ను రూపకల్పన చేశారు. తొలి విడత పనులు 2014 జనవరి నాటికే పూర్తయ్యాయి. ఆ తర్వాత రెండో విడత పనులను రూ.14.40 కోట్లతో ప్రస్తుత ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ 2014 సెప్టెంబర్ 7న భూమి పూజ చేశారు. అయితే ఆ పనులు ఇప్పటి వరకు పూర్తికాకపోవడంతో 120 గ్రామాలకు నేటికీ చుక్కనీటిని కూడా ఇవ్వలేకపోయారు. దీంతో ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గడువు ముగిసినా కదలికేదీ? : వాస్తవానికి 2015 సెప్టెంబర్ నాటికే కాంట్రాక్టర్ ఈ పనులను పూర్తి చేయాల్సి ఉంది. సాంకేతిక కారణాలతో పనుల్లో జాప్యం జరగటంతో కాలపరిమితిని పెంచారు. ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా మొదటి విడతలో ప్లాంట్, రెండో విడత కింద గ్రామాల్లో ట్యాంకులు, పైపులైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ముదిగుబ్బ, తలుపుల మండలాల్లోని 120 గ్రామాల్లోని రక్షిత మంచినీటి పథకాలకు అను«సంధానం చేయాల్సి ఉంది. తొలిదశలో పనులు పూర్తయి రెండేళ్లు కావస్తున్నా... మలిదశ పనుల్లో తీవ్ర జాప్యం జరగుతోంది. వివిధ సాంకేతిక కారణాలను చూపుతూ పనులు చేయడం లేదు. 2014 సెప్టెంబర్ 7న రెండో దశ పనులు ప్రారంభమయితే ఇంకా చిన్నా చితకా పనులు సాగుతూనే ఉన్నాయి. కనీసం వచ్చే వేసవికైనా గ్రామీణులకు తాగునీరు అందుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. పట్టించుకునేవారేరీ? ఏళ్లుగా ప్రాజెక్టు పనులు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేరు. కంట్రాక్టర్కు రూ.కోట్లు చెల్లిస్తున్నా పనులెందుకు పూర్తి కావడంలేదన్న ప్రశ్నకు సమాధానమిచ్చేవారులేరు. ప్రజలేమో గుక్కెడు తాగునీటికి పడరాని పాట్లు పడుతూనే ఉన్నారు. రూ. కోట్లు ఖర్చుచేసినా.. పొలాల గట్లపైన ఇబ్బందులు పడుతూ నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి మాత్రం మారలేదు. ప్రాజెక్ట్ పేరు : సమగ్ర మంచినీటి పథకం (ముదిగుబ్బ మండలం) లక్ష్యం : ముదిగుబ్బ, తలుపుల మండలాల్లోని 120 గ్రామాలకు తాగునీటి సరఫరా లబ్ధి : సుమారు 90,000 మందికి పొలాల వద్దనుంచి తాగునీటిని తెచ్చుకుంటున్న నాగారెడ్డిపల్లి గ్రామస్తులు -
తన్నుకున్న కాంట్రాక్టర్లు..
జగిత్యాల క్రైం: జగిత్యాలలో కాంట్రాక్టర్లు తన్నుకున్నారు. సిండికేట్ అయ్యేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావటంతో ఎవరికి వారు టెండర్లు వేసేందుకు వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీల ద్వారా రైస్మిల్లులకు తరలించేందుకు లారీ యజమానుల నుంచి జిల్లా పౌరసరఫరాల శాఖ టెండర్లు పిలిచింది. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు గడువు విధించడంతో కరీంనగర్, సిరిసిల్ల, జమ్మికుంట, జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల తదితర ప్రాంతాలకు చెందిన 18 మంది కాంట్రాక్టర్లు దరఖాస్తులు తీసుకున్నారు. అయితే, శనివారం ఉదయం 11 గంటల నుంచే కాంట్రాక్టర్లు సిండికేట్ అయ్యేందుకు మంతనాలు జరిపారు. మధ్యాహ్నం 1.30 వరకు చర్చలు జరిగినా.. అవి విఫలం కావడంతో ఎవరికి వారు టెండర్లు దాఖలు చేసేందుకు పోటీ పడ్డారు. ఈ క్రమంలో మెట్పల్లి ప్రాంతానికి చెందిన ఓ బృందం టెండర్లు వేసేందుకు వెళ్తున్న కాంట్రాక్టర్లను అడ్డుకొని.. బయటకు నెట్టివేసింది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. కాంట్రాక్టర్లు తమ అనుచరులతో కార్యాలయంలోనికి చొరబడగా.. రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఈ క్రమంలో కార్యాలయంలోని కంప్యూటర్లు, ఇతర సామగ్రి కిందపడి ధ్వంసమయ్యాయి. టెండర్ బాక్స్ సైతం కిందపడి దరఖాస్తులు చిందరవందరగా పడ్డాయి. భయంతో ఉద్యోగులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. 2 గంటల వరకు ఏడు టెండర్లు మాత్రమే దాఖలు కాగా, దాడుల భయంతో కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయలేకపోయారు. పౌరసరఫరాల శాఖ డీఎం జితేంద్రప్రసాద్ పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ కృపాకర్ వచ్చి ఓ ఆందోళనకారుడిని అదుపులోకి తీసుకున్నారు. -
హరితహారానికి.. ‘బొగ్గు బట్టీ’ల పొగ
సాక్షి, యాదాద్రి : రాష్ట్రాన్ని ఆకుపచ్చగా మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారాన్ని చేపట్టింది. కోట్ల కొద్దీ మొక్కలు నాటిస్తూ వాటిని పరిరక్షించేందుకు చర్యలు చేపడుతోంది. కానీ మరోవైపు అక్రమార్కుల కక్కుర్తి రాష్ట్రాన్ని ‘నల్ల’బరుస్తోంది. బాగా ఎదిగిన వేలాది చెట్లు ‘బొగ్గు’పాలవుతున్నాయి. పొలాలు, రహదారుల వెంట ఉన్న పెద్ద పెద్ద చెట్లను కొట్టేస్తూ.. వాటి కలపను బొగ్గుగా మార్చి అమ్ముకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధి నుంచే ఏకంగా నెలనెలా వెయ్యి లారీలకుపైగా బొగ్గు ఇతర రాష్ట్రాలు, ప్రాం తాలకు రవాణా అవుతోంది. నల్లగొండ జిల్లా పరిధిలోనే పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తం గా ఎన్ని వేల చెట్లను నరికేస్తున్నారనే ఆందో ళన నెలకొంది. దీంతో పర్యావరణానికి విఘాతం కలగడంతోపాటు.. కలపను కాల్చే బొగ్గు బట్టీల కారణంగా వెలువడే పొగ, విష వాయువులతో భారీగా కాలుష్యం తలెత్తుతోంది. ఆకుపచ్చని అభివృద్ధికి విఘాతం! రాష్ట్రంలో అడవుల విస్తీర్ణాన్ని 24 శాతం నుంచి 33 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘తెలంగాణకు హరితహారం’కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రంలో ఈసారి 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారీ సంఖ్యలో నాటడంతోపాటు వారి సంరక్షణకూ చర్యలు చేపట్టింది. కానీ ఈ స్ఫూ ర్తికి విఘాతం కలిగించేలా పలు జిల్లాల పరిధిలో చెట్ల నరికివేత విచ్చలవిడిగా సాగు తోంది. బొగ్గుబట్టీల కాంట్రాక్టర్లు వాటి కలపను కాల్చి, బొగ్గుగా మార్చేసి అమ్ముకుంటున్నారు. వందల ఏళ్ల వయసున్న చెట్లు కూడా కర్రబొగ్గు కోసం కాంట్రాక్టర్ల గొడ్డలి వేటుకు నేలకూలుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్, మెదక్ జిల్లాల పరిధిలోని.. అటవీ భూములు, పొలాలు, రహదారుల వెంట ఉన్న చెట్లను విచ్చలవిడిగా నరికేస్తున్నారు. వాటి కలపను బొగ్గుబట్టీల్లో కాల్చి బొగ్గుగా మార్చుతున్నారు. అధికారుల కమిటీలు ఎక్కడ? సహజ వనరులను సంరక్షించేందుకు గతంలో రెవెన్యూ, అటవీ, పోలీసు శాఖలు, గ్రామ కమిటీలతో ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. వాల్టా చట్టానికి అనుగుణంగా సహజ వనరులను కాపాడాల్సిన బాధ్యతను ఆయా కమిటీలకు అప్పగించారు. కానీ ఈ కమిటీలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పట్టపగలే పెద్ద సంఖ్యలో చెట్లను నరికివేస్తున్నారు. చాలా గ్రామాల్లో బొగ్గు బట్టీలు పలు జిల్లాల్లోని చాలా గ్రామాల్లో బొగ్గు బట్టీలు నడుస్తున్నాయి. సర్కార్ తుమ్మ చెట్లను నరికి.. వాటితో బొగ్గు తయారుచేసుకునేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ సర్కారు తుమ్మతోపాటు చింత, వేప, మర్రి, రాగి, తుమ్మ చెట్ల కలపను కూడా బొగ్గుబట్టీల్లో వాడుతున్నారు. ఇలా విచ్చలవిడిగా నరికేస్తుండడంతో పచ్చదనం మాయమైపోతోంది. గనుల్లోంచి తవ్వి తీసే నేలబొగ్గు (రైల్వే బొగ్గు) కంటే తక్కువ ధరకు, సులువుగా లభిస్తుండడంతో కర్ర బొగ్గుకు భారీగా డిమాండ్ ఉంది. చెట్ల కలపను కాల్చి బొగ్గుగా మార్చాక.. సంచుల్లో నింపి హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, నెల్లూరు తదితర ప్రాంతాలకు లారీల్లో తరలిస్తున్నారు. నెలకు వెయ్యి లారీలు! ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బొగ్గు తరలింపు కోసం నెల నెలా సగటున వెయ్యి లారీలకు అటవీ శాఖ అధికారులు అనుమతి ఇస్తున్నారు. ఒక్కో లారీలో 135 క్యూబిక్ మీటర్ల బొగ్గును తరలిస్తారు. అంటే జిల్లా పరిధి నుంచే ప్రతినెలా ఏకంగా 1,35,000 క్యూబిక్ మీటర్ల బొగ్గును తరలిస్తున్నారు. ఇందుకోసం వందలాది చెట్లు నరికి కాల్చి బొగ్గుగా మార్చుతున్నారు. ఒక్కో బస్తాలో 40 కిలోల బొగ్గు చొప్పున సుమారు 200 బస్తాలను లారీల్లో నింపి ఒడిశాకు తరలిస్తున్నారు. ఒక పర్మిట్ తీసుకుని దానిపై పదుల సంఖ్యలో లారీల్లో బొగ్గు రవాణా చేస్తున్నారు. ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలో బొగ్గు తరలిస్తున్న లారీని స్థానిక అ«టవీ శాఖ అధికారులు పట్టుకుని విచారించగా.. నల్లగొండ జిల్లా అటవీ శాఖ అధికారులు ఇచ్చిన పర్మిట్ ఉంది. జిల్లాల విభజన జరిగి ఏడాది కావస్తున్నా ఇలా ఇంకా అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. -
చాపకింద ’నీరు’లా..
’నీరుచెట్టు’లో అవినీతి పర్వం నిధులు మట్టిపాలు పురోగతి లేని పనులు నాణ్యత దేవుడికెరుక అధికారుల చోద్యం నీరుచెట్టు పథకంలో అవినీతి చాపకింద నీరులా ప్రవహిచింది. రూ.కోట్లు పక్కదారి పట్టాయి. చేసినవి కొద్ది పనులే అయినా నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. ఇదంతా అధికార పార్టీ నేతల ప్రోద్బలంతోనే జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అధికారులు ఏమీ చేయలేని దుస్థితి నెలకొంది. ఆకివీడు : ఎప్పట్లానే ఈ ఏడాదీ నీరుచెట్టు పథకం నిధులు నీటిపాలయ్యాయి. చాపకింద నీరులా అవినీతి పరవళ్లు తొక్కింది. జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ ఎన్నిసార్లు హెచ్చరించినా నీటి సంఘాలు ఖాతరు చేయలేదు. ఇరిగేషన్ అధికారుల తీరు మారలేదు. జిల్లాలో కాలువలు, డ్రెయిన్లులో మట్టి తొలగింపు, పూడిక తీత, గట్లు పటిష్ట పరిచే పనులను నీరుచెట్టు పథకంలో చేపట్టారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.160 కోట్లు ఏప్రిల్ నెలాఖరున విడుదల చేసింది. వీటితో వివిధ ప్రాంతాల్లో 666 పనలు చేపట్టాలని నీటి పారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ పనులను చేపట్టేందుకు నీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీల ప్రతినిధులు ముందుకు వచ్చారు. పనులను తమకంటే తమకే ఇవ్వాలని నియోజకవర్గ ఎమ్మెల్యేలు, జిల్లాకు చెందిన మంత్రులతో ఒత్తిడి చేయించి మరీ తీసుకున్నారు. అయితే వాటిని సకాలంలో మొదలు పెట్టలేదు. మే నెల 15కి గానీ పనులు ప్రారంభించలేదు. చాలాప్రాంతాల్లో ఇప్పటికీ పనులు చేపట్టలేదు. జిల్లావ్యాప్తంగా కేవలం 150 పనులను మాత్రమే తూతూమత్రంగా చేసి చేతులు దులుపుకున్నారు. రూ.70కోట్లు బిల్లులు డ్రా చేసుకున్నారు. పత్తాలేని క్వాలిటీ కంట్రోల్ చేసిన 150 పనుల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. క్వాలిటీ కంట్రోల్ అధికారుల తనిఖీ లేకపోవడంతో రూ.70కోట్లు నీటిపాలయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలకు చేసిన అవినీతి పనులు కొట్టుకుపోయాయి. పలు చోట్ల గట్లు అండలుగా జారిపోయాయి. పంట కాలువల్లో పూడిక తీశామని చెబుతున్నా.. నీటి ప్రవాహం చూస్తే అసలు పనులు చేసినట్టే అనిపించడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల నిధులే ఇవ్వలేదు ఇదిలా ఉంటే కొన్ని ప్రాంతాల్లో కాలువల్లో పూడిక పేరుకుపోయినా పూడిక తీయించలేదు. కర్రనాచు పేరుకుపోయి నీటి ప్రవాహానికి తీవ్ర అవరోధం ఏర్పడుతోందని రైతులు మొత్తుకున్నా.. అధికారులు నిధులు కేటాయించలేదు. ఇప్పటికైనా మిగిలిన నిధుల నుంచి తమ ప్రాంతాల్లో పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. జారిపోయింది వెంకయ్యవయ్యేరులో కర్రనాచు మొలకెత్తకుండా బెడ్ కాంక్రీట్ నిర్మించారు. అయితే బెరమ్స్ నిర్మాణం చేపట్టకపోవడంతో మళ్లీ యథాస్థితికి చేరింది. నీరుచెట్టులో రూ.18 లక్షలతో పూడిక తీసి మట్టిని గట్టుపైకి చేర్చి వదిలేశారు. మళ్లీ ఆ మట్టి కాలువలోకి జారిపోయింది. ఈ పనుల వల్ల ఉపయోగమేముంది? గ్లాడ్సన్, యువ రైతు, చెరుకుమిల్లి. 150 పనులు పూర్తి జిల్లాలో నీరుచెట్టు పథకం 150 పనుల పూర్తయ్యాయి. రూ.70కోట్లు ఖర్చయ్యాయి. చెరువుల్లోనూ, కాలువల్లో పూడిక తీత, మట్టి పనులు జరిగాయి. మిగిలిన పనులు వానలు తెరిపించిన తర్వాత చేపట్టేందుకు చర్యలు చేపడతాం. శ్రీనివాస్, సూపరింటెండెంట్ ఇంజినీర్, నీటిపారుదల శాఖ, ఏలూరు. -
‘మురుగు స్కామ్’లో 12 మంది కాంట్రాక్టర్ల అరెస్టు
- వీరిలో ఆరుగురు గతంలో వేరే కేసులో కటకటాల్లోకి - అభియోగపత్రాలు దాఖలుకు సన్నాహాలు చేస్తున్న సీసీఎస్ సాక్షి, హైదరాబాద్: నాలాల పూడికతీత ముసుగులో జీహెచ్ఎంసీలో చోటు చేసుకున్న భారీ స్కామ్ కేసుల్లో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి సోమవారం మరో 12 మంది కాంట్రాక్టర్లను అరెస్టు చేశారు. ఈ కేసుల దర్యాప్తు చేపట్టిన నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు మే, జూన్ నెలల్లో 18 మంది కాంట్రాక్టర్లు, 19 మంది ఏఈలను అరెస్టు చేశారు. తాజాగా అరెస్టయిన వారిలో ఆరుగురు గతంలో వేరే కేసులో అరెస్టు అయి జైలుకు వెళ్లివచ్చినవారు కాగా... మరో ఆరుగురు తొలిసారిగా కటాకటాల్లోకి చేరారు. దీంతో అరెస్టు అయిన కాంట్రాక్టర్ల సంఖ్య 24కు చేరింది. తాజాగా అరెస్టయిన కాంట్రాక్టర్లలో వరికుప్పల శ్రీనివాస్, సామ శ్రీనివాస్రెడ్డి, తాడూర్ రామ్చంద్రారెడ్డి, తూముకుంట వసంత్రెడ్డి, నాగిళ్ళ రాజశేఖర్రెడ్డి, వరికుప్పల కృష్ణ, ఇ.వేణుగోపాల్, గండికోట జనార్థన్, ఎక్కల విజయ్కుమార్, అనకర్ల యశ్వంత్, గండికోట రమేష్, గండికోట లక్ష్మణ్లు ఉన్నారు. వీరంతా స్థానికంగా వివిధ పార్టీలకు చెందిన వారని తెలుస్తోంది. మరోపక్క ఈ స్కామ్ కేసుల్లో నిందితులపై చార్జిషీట్లు దాఖలు చేయడానికి సీసీఎస్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా అరెస్టు అయిన ఏఈలకు సంబంధించి ప్రాసిక్యూషన్ అనుమతి కోరాలని నిర్ణయించారు. -
పనుల పందేరం
ఒంగోలు: కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనకుండా బెదిరించి ఎస్టిమెంట్ రేట్లకే పనులు దక్కించుకొని అందినకాడికి దండుకునేందుకు కార్పొరేషన్ అధికారులు, అధికార పార్టీ నేతలు మరోమారు సిద్ధమయ్యారు. తద్వారా పెద్ద ఎత్తున ప్రజాధనానికి గండి కొట్టనున్నారు. ఈ మేరకు అధికార పార్టీ నేతలు, అధికారులు గురువారం ఒంగోలు కార్పొరేషన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇటీవల టెండర్లు నిర్వహించిన 60 పనులతో పాటు మరో 40 పనులను జత చేసి దాదాపు11 కోట్ల రూపాయల పనులను సొంతం చేసుకునేందుకు వ్యూహం పన్నారు. పోటీకి వేరేవ్వరూ కాంట్రాక్టర్లు రాకుండా కార్పొరేషన్ అధికారులు చూసుకోవాలని అధికార పార్టీ నేతలు అల్టిమేటం జారీ చేశారు. ఇందుకు ప్రతిఫలంగా ముఖ్యనేతతో పాటు అధికారులకు 12 శాతం కమీషన్ ముట్టజెప్పేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా 11 కోట్ల పనులకు మొక్కుబడి టెండర్లు నిర్వహించనున్నారు. డివిజన్కు రెండు పనులు.. అభివృద్ధి పనులకు పోటీ టెండర్లు జరిగితే 15 శాతం 20 లెస్లకు పనులు కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. పోటీ లేకపోవడం వల్ల ఆదాయానికి గండి పడుతోంది. ఇక సిమెంట్ రోడ్ల విషయానికి వస్తే ఎస్టిమెంట్ రేట్లకు పనులు వస్తే 25 శాతం పర్సంటేజీ ఇచ్చేందుకు కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నారు. అదే జరిగితే 25 శాతం నిధులు మిగిలినట్లే. అధికారులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై కాంట్రాక్టర్లను బెదిరిస్తుండటంతో టెండర్లు వేసేందుకు మిగిలిన వారు ముందుకు రావడం లేదు. ఇదే సాకుతో ఎస్టిమెంట్ రేట్లకు అధికార పార్టీ నేతలు పనులు దక్కించుకుంటున్నారు. తాజాగా గతంలో కేటాయించిన 60 పనులతో పాటు మరో 40 పనులను జత చేసి 50 డివిజన్ల పరిధిలో డివిజన్కు రెండు పనుల చొప్పున కేటాయించేందుకు ఇటు అధికార పార్టీ నేతలు, అధికారుల మధ్య గురువారం ఒప్పందం కుదిరింది. ఇక పనుల కేటాయింపే తరువాయి. ఇప్పటికే పేరుకు టెండర్లు నిర్వహించిన దాదాపు రూ.10 కోట్ల పనులు కాంట్రాక్టర్లు మొదలుపెట్టలేదు. ఇటీవల మరో 26 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. ఇవి మొదలు కాలేదు. ప్రస్తుతం మరో రూ.11 కోట్ల పనులకు టెండర్లు పిలిచేందుకు అధికారులు సిద్ధమవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేటాయించిన పనులను కాంట్రాక్టర్లు చేపట్టకపోయినా అధికారులు పట్టించుకోవటం లేదు. అడిగిన వారికి పనులు అప్పగించి తమ వాటా కమీషన్ పొందేందుకే అధికారులు ప్రాధాన్యతనిస్తున్న విమర్శలున్నాయి. ఇందులో భాగంగా మరోమారు నగరంలో పనుల కేటాయింపుకు అధికార పార్టీ నేతలు, అధికారులు సిద్ధమయ్యారు. ప్రత్యేకాధికారికి పట్టదా..? నగరపాలక సంస్థ అభివృద్ధి పనులను అక్రమ పద్ధతిలో పద్ధతి ఎస్టిమెంట్ రేట్లకే అప్పగిస్తున్న కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. టెండర్లు నిర్వహిస్తే దాదాపు 20 నుంచి 25 శాతం నిధులు ఆదా అయ్యేవి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని అభివృద్ధి పనులను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగిస్తే మరింత ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉండే అవకాశం ఉంది. -
మిషన్ స్లో
► ముందుకు సాగని భగీరథ ఇంట్రావిలేజ్ పనులు ► ఓహెచ్ఎస్సార్ ట్యాంకుల నిర్మాణాలకు స్పందన సగమే ► 756లో 389 ప్యాకేజీలకు మాత్రమే టెండర్లు ఫైనల్ ► మిగిలిన 50 శాతం ప్యాకేజీ పనులపై అధికారుల కుస్తీ ► మూడు మాసాల నుంచి కాంట్రాక్టర్ల కోసం గాలింపు ► బతిమిలాడి మరీ పనులకు ఒప్పిస్తున్న వైనం ► పైపులైన్ పనులకు ఇప్పుడి ప్పుడే సిద్ధమైన యంత్రాంగం నల్లగొండ : భగీరథుడు శ్రమిస్తే కానీ దివి నుంచి గంగమ్మ భువకి రాలేదు.. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మిషన్ భగీరథ కార్యక్రమం శరవేగంగా సాగాలంటే భగీరథుడి రూపంలో ఏదైనా శక్తి రావాల్సిందేనా.. అంటే అధికారుల నుంచి మాత్రం అవుననే సమాధానమే వస్తోంది. మిషన్ భగీరథలో భాగంగా చేపట్టిన ప్రధాన పైపులైన్ పనులు వేగంగానే సాగుతున్నట్లు కనిపిస్తున్నా.. వాటికి అనుసంధానంగా గ్రామాల్లో చేయాల్సిన అంతర్గత పైపులైన్ పనులు మాత్రం ఆశించిన స్థాయిలో ముందుకు కదలడం లేదు. మూడు మాసాలు కావొస్తున్నా.. అంతర్గత పనులకు సంబంధించిన కసరత్తు ప్రారంభించి మూడు మాసాలు కావొ స్తున్నా టెండర్ల ప్రక్రియ దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు. అదేమంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అంతర్గత పనులు మొదలు పెట్టడంతో కాంట్రాక్టర్లు కరువయ్యారని అధికారులు చెబుతున్నారు. ప్రధాన పైపులైన్ ని ర్మాణాల ధరలకు, అంతర్గత పైపులైన్ నిర్మాణాల ధరలకు మధ్య భారీ వ్యత్యాసం ఉండడమే అందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. దీంతో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో 50 శాతం పనులకు మాత్రమే కాంట్రాక్టర్ల నుంచి స్పందన వచ్చింది. మిగతా 50 శాతం పనులకు కాంట్రాక్టర్లు దొరక్కపోవడంతో వారి కోసం పొరుగు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. ఇప్పటికే 20 మంది కాంట్రాక్టర్లను పొరుగు రాష్ట్రం నుంచి రప్పించిన అధికారులు మిగతా 50 శాతం పనులకు ఎక్కడి నుంచి రప్పించాలో తెలియక అయోమయంలో పడ్డారు. ఇదీ పరిస్థితి.... మూడు జిల్లాల్లో అంతర్గత పనుల్లో భాగంగా ముందుగా గ్రామాల్లో ఓహెచ్ఎఎస్ఆర్ ట్యాంకులు నిర్మించేందుకు టెండర్లు పిలిచారు. మూడు జిల్లాల్లోని 2,702 ఆవాస ప్రాంతాల్లో 2,424 ట్యాంకులు నిర్మించాల్సి ఉంది. ఈ మొత్తం పనులను 756 ప్యాకేజీలుగా ఏప్రిల్లో టెండర్లు పిలిచారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 800 మంది కాంట్రాక్టర్లు దరఖాస్తు చేశారు. కానీ, టెండర్ల దశకు వచ్చేనాటికి 389 మంది కాంట్రాక్టర్లు మాత్రమే పోటీలో నిలిచారు. దీంతో 389 ప్యాకేజీలకు టెండర్లు పూర్తి చేశారు. టెండర్లు ఖరారైన ప్యాకేజీల్లో నిర్మించాల్సిన ట్యాంకులు 1,263. కాగా మిగతా 367 ప్యాకేజీలకుగాను నిర్మించాల్సిన 1,161 ట్యాంకుల పైన సందిగ్ధత నెలకొంది. ప్రతి వారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తున్నప్పటికీ కాంట్రాక్టర్లు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో అధికారులకు సైతం ఏంచేయాలో పాలుపోవడం లేదు. పొరుగు రాష్ట్రాల నుంచి కాంట్రాక్టర్లను రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా సఫలం కావడం లేదు. ట్యాంకుల నిర్మాణాలకు వినియోగించే స్టీలు, ఇసుక అతి తక్కువ ధరలకే ఇప్పిస్తామని అధికారులు ప్రకటించారు కూడా. అయితే మిషన్ భగీరథ మెయిన్ పైపులైన్ ధరలకు అంతర్గత పనుల్లో లీటరు రేటు ప్రకారం ఖరారు చేసిన ట్యాంకుల ధరలకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు తెలిసింది. ఈ కారణంగానే కాంట్రాక్టర్లు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆ రెండు నియోజకవర్గాల్లోనే పోటీ.. టెండర్లు పూర్తయిన 389 ప్యాకేజీల్లో పనుల కోసం ఎక్కువ మంది పోటీ పడిన కాంట్రాక్టర్లు మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల నుంచే ఉన్నారు. అధికార పార్టీలో గ్రూపులు కూడా అందుకు ఒక కారణమని తెలుస్తోంది. నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాల్లో ట్యాంకులు నిర్మించేందుకు కాంట్రాక్టర్లు అంత తేలిగ్గా ముందుకు రావడం లేదు. దీంతో అధికారులే పూనుకుని ఆయా నియోజకవర్గాల్లోని కాంట్రాక్టర్లను బతిమాలడి మరీ పనులకు ఒప్పిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు లేని ప్రాంతాల్లో టెండర్లు ప్రక్రియ సాఫీగానే సాగుతోందని, కొన్ని చోట్ల మాత్రమే రాజకీయపరమైన ఒత్తిళ్లుతీవ్రంగా ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు. గడువు ఆరు మాసాలే.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి భగీరథ పనులన్నీ పూర్తిచేసి ఇంటింటికీ తాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అం దుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. అధికారిక వర్గాల నుంచి వస్తున్న సమాచారం మే రకు పరిస్థితులు ఇదేవిధంగా కొనసాగితే డిసెంబర్ నాటికి 25 శాతం పనులు మాత్రమే పూర్తవుతాయని అంటున్నారు. ఈ మేరకు జిల్లాలో మిషన్ భగీరథ లక్ష్యం ఎప్పటికి పూర్తవుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పైపులైన్ పనులకు సన్నద్ధం.. ట్యాంకుల సమస్య పరిష్కారం కాకముందే పైపులైన్ పనులకు యంత్రాగం సన్నద్ధమవుతోంది. మూడు జిల్లాల్లోని 2,702 ఆవాస ప్రాంతాల్లో 4,217 కి.మీ మేర పైపులైన్లు నిర్మించాల్సి ఉంది. నల్లగొండ జిల్లాలో 2,700 కి.మీ మేర పైప్లైన్లు నిర్మించి 3.26 లక్షల నల్లా కనెక్షన్లు ఇవ్వాలి. అలాగే సూర్యాపేట జిల్లాలో 1,150 కి.మీ పైపులైన్ వేసి లక్షా 26 వేల నల్లా కనెక్షన్లు ఇవ్వాలి. యాదాద్రి జిల్లాలో 367 కి.మీ పైపులైన్ వేయడంతో పాటు లక్షా 14 వేల నల్లాలు ఏర్పాటు చేయాలి. వారం, పది రోజుల్లో పైపులు వస్తాయని అధికారులు అంటున్నా రు. అదే జరిగితే గ్రామాల్లో పైపులైన్లు వేసేందుకు తవ్వకం పనులు ప్రారంభిస్తారు. దీని కంటే ముందు పైప్లైన్ పనులను కూడా ప్యాకేజీలు మార్చి టెండర్లు పిలవాల్సి ఉంటుంది. అయితే రూ.5 లక్షల లోపు పనులను నామినేషన్ పద్ధతిలో స్థానిక గ్రామ పంచాయతీకి చెందిన వారికే అప్పగిస్తారు. ఇదంతా జరిగేందుకు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. త్వరలో టెండర్లు పిలుస్తాం డిసెంబర్ నాటికి ఇంట్రావిలేజ్ పనులు పూర్తవుతాయి. 50 శాతం ప్యాకేజీల పనులకు కాంట్రాక్టర్లను రప్పించే ప్రయత్నం చేస్తున్నాం. టెండర్ల దాఖలుకు ప్రతి వారం నోటిఫికేషన్ జారీ చేస్తున్నాం. ఏదేని సమస్య ఎదురైనట్లయితే ఇప్పుడున్న కాంట్రాక్టర్లతోనే మిగితా 50 శాతం పనులు కూడా చేపడతాం. పైపులకు ఆర్డర్ ఇచ్చాం. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం. – పాపారావు, ఆర్డబ్ల్యూఎస్ ఇన్చార్జి ఎస్ఈ -
జీహెచ్ఎంసీలో భారీ స్కాం
-
జీహెచ్ఎంసీలో భారీ స్కాం
హైదరాబాద్: జీహెచ్ఎంసీ నాలాల్లో మురుగు మాదిరిగా కాంట్రాక్టర్లలోఅవినీతి పెరిగిపోయింది. చేయని పనులకు నకిలీ బిల్లులతో కోట్లల్లో దిగమింగుతున్నారు. తాజాగా నాలాల్లో పూడికతీత పేరుతో కోటి రూపాయలకుపైగా పక్కదారి పట్టించిన వైనం వెలుగులోకి వచ్చింది. మురుగుకాల్వల్లో తొలగించిన పూడికను టూ వీలర్స్..4 వీలర్స్ లో తరలించినట్టు కాంట్రాక్టర్లు కోటి పద్దెనిమిది లక్షల రూపాయల మేర నకిలీ బిల్లులు సృష్టించారు. అనుమానం వచ్చిన అధికారులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. ఇందులో జీహెచ్ఎంసీ ఏఈల హస్తం ఉన్నట్లు అధికారులు తేల్చారు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో సంబంధం ఉన్న 12మంది ఏఈలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
మేమింతే..!
► కదలని కాంట్రాక్టర్లు ► ముందుకు సాగని వెలిగొండ పనులు ► కాంట్రాక్టర్లకు సెవెన్ డేస్ నోటీసులు ► అయినా మారని తీరు ► హెడ్ రెగ్యులేటర్, టన్నెల్ పనులను కొత్త కాంట్రాక్టర్లకు అప్పగింత ► వచ్చే ఏడాదికి ఫేజ్–1 పనులు పూర్తి కావడం ప్రశ్నార్థకమే... సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కాంట్రాక్టర్ల తీరు మారకపోవడంతో వెలిగొండ ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. పనులు నత్తనడకన సాగుతుండటంతో అధికారులు హెచ్చరికగా కాంట్రాక్టర్లకు సెవెన్ డేస్ నోటీసులు జారీ చేశారు. నోటీసులిచ్చి 15 రోజులు దాటుతున్నా.. వారి తీరు మారలేదు. పనుల్లో పురోగతి లేదు. దీంతో కొల్లంవాగు హెడ్ రెగ్యులేటర్ పనులతో పాటు టన్నెల్–1, 2 పనులలో కొంత భాగాన్ని కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు పనులకు సంబంధించి అంచనాలను రూపొందించే పనిలో పడ్డారు. ఇప్పటికే దాదాపు రూ.120 కోట్ల అంచనాలతో రూపకల్పన చేసి కొల్లంవాగు హెడ్ రెగ్యులేటర్ పనులకు మరో వారంలో టెండర్లు పిలవనున్నారు. తొలుత రెండు హెడ్ రెగ్యులేటర్లో మొదటి హెడ్ రెగ్యులేటర్ పూర్తి చేసేందుకే ప్రాధాన్యతనిస్తున్నారు. అనుకున్న రీతిలో కొత్త కాంట్రాక్టర్ పనులు వేగవంతం చేస్తే ఆరు నెలల్లో ఒక హెడ్ రెగ్యులేటర్ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అదే సమయంలో టన్నెల్–1, 2 పనులను హెడ్ రెగ్యులేటర్ వైపు నుంచి చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు అంచనాలను సిద్ధం చేస్తున్నారు. ఈ పనులను సైతం టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. 2018 మార్చి నాటికి ఫేజ్–1 పనుల్లో భాగంగా టన్నెల్–1, హెడ్ రెగ్యులేటర్ పనులను పూర్తి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముందుకు సాగని టన్నెల్ పనులు.. టన్నెల్–1 18.820 కి.మీ. ఉంది. రూ.624.6 కోట్లతో ఒప్పందం మేరకు పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.484.44 కోట్లు వెచ్చించి 13.927 కి.మీ. పనులు మాత్రమే పూర్తి చేశారు. ఇక టన్నెల్–2కు సంబంధించి 18.838 కి.మీ. ఉండగా రూ.735.21 కోట్లతో పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.464.8 కోట్లు ఖర్చు చేసి 10.425 కి.మీ. మేర మాత్రమే పనులు పూర్తి చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు వేగవంతం చేస్తున్నట్లు పలుమార్లు ప్రకటించింది. తొలుత 2016 నాటికే నీళ్లిస్తామన్నారు. ఆ తర్వాత మాట మార్చి 2017కు అన్నారు. కాంట్రాక్టర్లు ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కై ప్రాజెక్టు అంచనాలను రూ.2,330 కోట్లకు పెంచుకోవడం తప్ప పనుల కోసం వెచ్చించిన నిధులు నామమాత్రమే. తాజా బడ్జెట్లో కేవలం వెలిగొండకు రూ.200 కోట్లు మాత్రమే కేటాయించడం చూస్తే వెలిగొండపై బాబు ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో తెలుస్తోంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి 2018 నాటికి వెలిగొండ ద్వారా నీరిస్తామంటూ మరోమారు ప్రకటించారు. దీంతో ఇటీవల అధికారులపై ఒత్తిడి పెరిగింది. వారు ఎంత చెప్పిన కాంట్రాక్టర్లు వినే పరిస్థితి లేదు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలే వెలిగొండ కాంట్రాక్టర్ల అవతారమెత్తడంతో వారు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. దీంతో ఇటీవల వారికి సెవెన్ డేస్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ప్రభుత్వం చేసిన పనులకే బిల్లులు చెల్లించటం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. నెలవారీ ఖర్చుల బిల్లులు తప్ప పెండింగ్లో ఉన్న రూ.60 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్లులివ్వకుండా పనులు చేయమంటే ఎలా చేస్తారన్నది కాంట్రాక్టర్ల వాదన. బిల్లులివ్వలేదంటూ ఇటీవల పలు దఫాలుగా పనులను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్న కాంట్రాక్టర్లను కాదని వెలిగొండ పనులు వేరొక కాంట్రాక్టర్కు అప్పగించడం అంతా ఆషామాషీ వ్యవహారం కాదు. అధికారులు ఉన్న కాంట్రాక్టర్లతోనే పనులు వేగవంతం చేయిస్తారా.. లేక మిగిలిన పనులను కొత్త కాంట్రాక్టర్లకు అప్పగిస్తారా.. అన్నది రాబోయే కాలంలో గానీ తెలియదు. మూడు జిల్లాల రైతుల ఎదురుచూపులు.. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు వెలిగొండ ప్రాణాధారం. ప్రకాశం జిల్లాలో 3.36,100 ఎకరాలు, నెల్లూరు జిల్లా పరిధిలో 84 వేల ఎకరాలు, కడప జిల్లా పరిధిలో 27,200 ఎకరాలు ప్రాజెక్టు ద్వారా సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం మూడు జిల్లాల ప్రజానీకం వేయికళ్లతో ఎదురు చూస్తోంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా ఫ్లోరైడ్, కిడ్నీ వ్యాధి బారి నుంచి వేలాది ప్రజలను కాపాడాలంటే వెలిగొండే శరణ్యం. అయినా సరే బాబు సర్కారు మాటలతో సరిపెట్టడం మినహా ప్రాజెక్ట్ను చిత్తశుద్ధితో పూర్తిచేసే ప్రయత్నం చేయడం లేదు. -
భారీగా పెరిగిన సిమెంట్ ధరలు
గుంటూరు : రాష్ట్రంలో సిమెంట్ ధరలు భారీగా పెరిగాయి. వారం రోజుల్లోనే కంపెనీలు బస్తాకు 100 రూపాయలు మేర పెంచేశాయి. కంపెనీలు వ్యవహరిస్తున్న తీరుపై రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(క్రెడాయ్) మండిపడుతోంది. ఉద్దేశ్యపూర్వకంగానే కంపెనీలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయని పేర్కొంటోంది. కంపెనీలు గనుక ధరల పెంపులో దిగిరాకపోతే, నిర్మాణాలు ఆపివేస్తామని క్రెడాయ్ హెచ్చరించింది. ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎలాగైనా ధరలు తగ్గించేలా చూడాలని కోరుతోంది. ధరలను కంపెనీలు తగ్గించని పక్షంలో ఇతర దేశాల నుంచి సిమెంట్ ను దిగుమతి చేసుకుంటామని క్రెడాయ్ తెలిపింది. ధరల పెంపుతో నిర్మాణరంగం తీవ్రంగా దెబ్బతింటుందని బిల్డర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తంచేసింది. సిమెంట్ కంపెనీలు ఈ మేర ధరలు ఒక్కసారిగా పెంచడం ఇదేమీ మొదటిసారి కాదని, అంతకమునుపు కూడా ఇలానే చేశాయని బిల్డర్స్, కాంట్రాక్టర్లు వాపోయారు. ఈ వ్యవహారంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మేజర్ సిమెంట్ కంపెనీలకు భారీ జరిమానాలు కూడా విధించినట్టు గుర్తుచేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గనుక పరిగణలోకి తీసుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుమతామని బిల్డర్స్, కాంట్రాక్టర్లు చెప్పారు. -
కాంట్రాక్టర్లుగా ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ ఇంజనీర్స్
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ ఇంజనీరింగ్ పట్టభద్రులను కాంట్రాక్టర్లుగా మార్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సొంతంగా కాంట్రాక్టు పనులు చేపట్టేలా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) ఆధ్వర్యంలో శిక్షణ ప్రారంభించింది. కనీసం 200 మందిని కాంట్రాక్టర్లుగా మార్చే ఈ కార్య క్రమంలో భాగంగా 80 మందికి తొలి విడత శిక్షణను అంబేడ్కర్ జయంతి రోజైన శుక్రవారం పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మూడు నెలల పాటు శిక్షణ పూర్తయ్యే లోపు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పరంగా ఒక్కో పనికి వర్క్ ఆర్డర్ ఇప్పిచ్చేలా ఏర్పా ట్లు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అయితే అభ్యర్థులు ప్రభు త్వ పనుల కోసమే ఎదురుచూ డకుండా నిర్మాణరంగానికి సంబం ధించిన ప్రైవేటు పనులు కూడా పొందాలని సూచించారు. 80 మందితో తొలిబ్యాచ్.. ఈ శిక్షణ కోసం దాదాపు 220 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 180 మందిని ఇంటర్వూ్య చేసి 80 మందిని తీసుకున్నారు. న్యాక్ ప్రాంగణంలో రెండు నెలల శిక్షణ అనంతరం 15 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన, మరో 15 రోజులు వివిధ ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల్లో కాంట్రాక్టు పనులపై తర్ఫీదు ఇస్తారు. కార్యక్రమంలో ఎంపీలు విశ్వేశ్వర్రెడ్డి, బాల్క సుమన్, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్కే జోషి, జయేశ్రంజన్, డిక్కి ప్రతినిధులు రవికుమార్, రాహుల్, టీఐఐ ప్రతినిధి రాజన్న, న్యాక్ డైరెక్టర్ జనరల్ భిక్షపతి, న్యాక్ ప్లేస్మెంట్ డైరెక్టర్ శాంతిశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
వసూళ్ల ‘రాజ్’
- పంచాయతీరాజ్లో పర్సెంటేజీల పర్వం - అంగన్వాడీ భవన నిర్మాణ కాంట్రాక్టర్ల నుంచి వసూలు - లబోదిబోమంటున్న కాంట్రాక్టర్లు - పనుల నాణ్యతకు తిలోదకాలు అనంతపురం సిటీ : పంచాయతీ రాజ్ శాఖలో ‘వసూళ్ల రాజాలు’ హల్చల్ చేస్తున్నారు. ప్రతి పనికీ ‘రేటు’ కడుతున్నారు. అడిగినంత ఇవ్వకపోతే బిల్లులు పెండింగ్ పెడుతున్నారు. రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. అధికారులు మొదలుకుని అటెండర్ల వరకు ప్రతిఒక్కరికీ వారి ‘స్థాయి’ని బట్టి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. వసూళ్ల రాజాలను సంతృప్తి పరిచే క్రమంలో పనుల నాణ్యతకు తిలోదకాలిచ్చేస్తున్నారు. ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ పరిధిలో గ్రామీణరోడ్లు, కోల్డ్స్టోరేజీలు, అంగన్వాడీ, హాస్టల్ భవన నిర్మాణాలు తదితర పనులు చేపడుతున్నారు. ప్రతి పనిలోనూ అధికారులు ముక్కుపిండి పర్సెంటేజీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 851 అంగన్వాడీ భవనాలు నిర్మిస్తున్నారు. వీటిని 29 అడుగుల పొడవు, 22 అడుగుల వెడల్పుతో నిర్మించాలి. ఒక్కో భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.7 లక్షలు కేటాయించింది. భవనం పైకప్పు వరకు నిర్మాణానికి రూ.5 లక్షలు , పైపనులకు రూ.2 లక్షల ఖర్చవుతుందని ప్రభుత్వ అంచనా. ఈ మొత్తంతో నిబంధనల మేరకు పనులు చేపడితే భవనాలను దృఢంగా నిర్మించవచ్చు. అయితే.. వసూళ్ల రాజాలు ఇందులోనూ కక్కుర్తి పడుతున్నారు. పనుల నాణ్యత దేవుడెరుగు..తమ వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. లేదంటే బిల్లు చేయడం లేదు. ఒక్కో భవన నిర్మాణంపై ఏకంగా రూ.లక్ష దాకా చేతులు తడపాల్సి వస్తోందని అనంతపురం సబ్డివిజన్ పరిధిలోని ఓ గ్రామంలో భవన నిర్మాణం చేపట్టిన ఓ కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. సదరు కాంట్రాక్టర్కు భవన నిర్మాణ అనుమతులు వచ్చి ఐదు నెలలు అవుతోంది. టాప్ లెవల్ వరకు పనులు చేశారు. ఇప్పటిదాకా రూ.5 లక్షలకు పైగా ఖర్చు చేశారు. మరో రూ.2.50 లక్షలు అయ్యే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు. ఐదు నెలలుగా ఈ పని కోసం తిరిగినందుకు రూ.లక్ష దాకా అయ్యిందని చెప్పారు. కేవలం ఫైలు కదిలించేందుకే రూ.78 వేలు మామూళ్లు ఇచ్చుకోవాల్సి వచ్చిందని వాపోయారు. ‘ఎంతో కొంత మిగులుతుందనే ఆశతో ఈ కాంట్రాక్ట్ తీసుకున్నా. తీరా చూస్తే చేతి నుంచి పెట్టుకోవాల్సి వస్తోంది. బుద్ధుంటే పంచాయతీరాజ్ పనులు చేయకూడదు. ఏదో తెలీక పని తీసుకుని నష్టపోయా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీన్నిబట్టే పంచాయతీరాజ్ శాఖలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారుల పర్సెంటేజీల కారణంగా పనుల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. మరీముఖ్యంగా అంగన్వాడీ భవనాలను పలుచోట్ల నాసిరకంగా నిర్మిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. చిన్నారుల జీవితాలతో ముడిపడిన ఈ భవన నిర్మాణాల నాణ్యతపై కలెక్టర్ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
రాజుకుంటున్న రగడ
తుళ్లూరు రూరల్ : రాజధాని ప్రాంతంలో ఇసుక రగడ రోజురోజుకూ రాజుకుంటోంది. శనివారం రాజధాని నిర్మాణాల పేరుతో లింగాయపాలెం క్వారీ నుంచి కొందరు యంత్రాల ద్వారా ఇసుకను తరలించే ప్రయత్నాలు చేయడంతో క్వారీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామస్తులు తిరగబడడంతో అంతా తారుమారైంది. దీంతో పోలీసు బలగాల మధ్య తరలింపు కొనసాగించారు. యంత్రాలతో తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని, కేవలం మనుషుల ద్వారానే తవ్వకాలు జరపాలని గ్రీన్ ట్రిబ్యున్ గత నెలలో ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు కాంట్రాక్టర్లు యంత్రాలతో తవ్వకాలు నిలిపివేశారు. కూలీలు ఇసుక క్వారీలో పనులు ప్రారంభించిన రోజు నుంచి ఎవరో ఒకరు తాము జిల్లా అధికారులమంటూ క్వారీలలోకి వచ్చి.. పనులు ఆపాలంటూ అజమాయిషీ చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ స్థాయి అధికారి క్వారీలోకి రావడం, కూలీలపై విరుచుకుపడడంతో కూలీలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కూలీలను భయపెట్టేందుకు రాజధాని ప్రాంతంలో ప్రజా సంఘాల నాయకులను గృహ నిర్బంధాలు, అరెస్ట్లు చేశారు. శనివారం క్వారీలో ఇసుకను ఐనవోలులో నిర్మిస్తున్న విట్ విశ్వవిద్యాలయం నిర్మాణం పేరుతో తరలింపునకు సిద్ధం చేశారు. భారీ యంత్రాలను క్వారీలోకి తీసుకువెళ్లడం గమనించిన గ్రామస్తులు, కూలీలు పెద్ద ఎత్తున క్వారీ వద్దకు చేరుకున్నారు. ఇసుక తరలించేందుకు వీలులేదని అడ్డుకోవడంతో నిర్వాహకులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. పోలీసులు దగ్గరుండి ఇసుక తరలించారు. -
మళ్లీ ఖాళీ..
⇒ ప్రభుత్వ ఖాతాలు మరోసారి ఫ్రీజ్ ⇒ ట్రెజరీలో అన్నిరకాల చెల్లింపులు నిలిపివేత ⇒ గురువారం రాత్రి నుంచి ఫ్రీజ్లో ఖాతాలు ⇒ చెక్కులు తీసుకున్నా బ్యాంకుల్లో నగదు ఇవ్వని వైనం ⇒ నెల రోజుల్లో రెండోసారి ఈ పరిస్థితి ⇒ ప్రభుత్వ తీరుతో బిక్కముఖం వేస్తున్న కాంట్రాక్టర్లు, ఉద్యోగులు గుడివాడ : ప్రభుత్వ ఖజానా మరోసారి నిండుకుంది. నెలలో రెండో సారి, అదీ లక్షా యాభై ఏడువేల కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన మరుసటి రోజే ప్రభుత్వ ఖజానా ఖాళీగా మారింది. దీంతో ట్రెజరీ అధికారులు అన్ని రకాల చెల్లింపులను నిలుపుదల చేసి చేతులెత్తేశారు. గురువారం రాత్రి నుంచి అన్ని రకాల పద్దుల చెల్లింపులు ఫ్రీజింగ్లో ఉంచారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఖజానా చెక్కులు తీసుకుని బ్యాంకుకు వెళ్లిన వారు తెల్లముఖం వేసి వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. నెలలో ఇది రెండోసారి ఖాతాలను ఫ్రీజింగ్ చేయడం గమనార్హం. ఫలితంగా ప్రభుత్వ అభివృద్ధి పనులు చేసినవారు బిల్లులను నగదుగా మార్చుకోలేక ఆందోళన చెందుతున్నారు. అన్ని ఖాతాలదీ అదే పరిస్థితి.. ప్రభుత్వ శాఖలకు సంబంధించి మున్సిపాల్టీ, ఇతర ప్రభుత్వ శాఖలు, 13, 14వ ఆర్థిక సంఘాల నిధులు, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు ఉన్న అన్ని ఖాతాలు నిలుపుదల చేశారు. కనీసం సమాచారం లేకుండా ఒక్కసారిగా ఆన్లైన్ ద్వారా ఫ్రీజింగ్లో ఉంచటంతో అధికారులు అవాక్కయ్యారు. గత నెల 8న ఫ్రీజింగ్లో ఉంచిన ప్రభుత్వం దాదాపు నెలరోజులపాటు తీయలేదు. ఈ నెలలో ప్రారంభమైన శాసన సభ బడ్జెట్ సమావేశాల ముందు ఫ్రీజింగ్ ఎత్తి వేశారు. బడ్జెట్ ముగిసిన వెంటనే మళ్లీ అన్ని ఖాతాలు ఫ్రీజింగ్లోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం అనేక కార్యాలయాలు ఈ గవర్నెన్స్ విధానంలో పనిచేయడంతో బిల్లులు, జీతాలు చెల్లింపులు చెక్కులు ఇచ్చే సమయంలో సంబంధిత బ్యాంకు ఖాతాలకు ఆన్లైన్ ద్వారా కంప్యూటర్లో నమోదు చేస్తేనే బ్యాంకుకు వెళ్లాలి. ఖాతాలు ఫ్రీజింగ్ అవ్వటంతో చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి. వారం రోజులే చెల్లింపులు చేసింది... ఫిబ్రవరి 8న ప్రభుత్వ ఖాతాలు ఫ్రీజింగ్లో ఉంచిన ప్రభుత్వం మార్చి 8వ తేదీ వరకు ఎటువంటి చెల్లింపులు జరపలేదు. మార్చి 16 వరకు మాత్రమే చెల్లింపులు జరిపారు. ఇంకా అనేక చెక్కులకు చెల్లింపులు జరపాల్సి ఉన్నా ఇవ్వలేదు. బ్యాంకు కు చెక్కులు తీసుకుని వెళ్తే గురువారం రాత్రి నుంచి ఫ్రీజింగ్ చేశారని బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. చిరుద్యోగుల ఇక్కట్లు.. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే చిరుద్యోగులు, వీఆర్ఏలు, అంగన్వాడీలు, కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు, వివిధ అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లు ప్రభుత్వ ఖాతాల ఫ్రీజ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతినెలా మొదటి వారంలో వేతనాలు పొందే వీఆర్ఏలు, ఇతర శాఖల కాంట్రాక్టు సిబ్బందికి ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తాయి. కాంట్రాక్టర్లు అయితే చెల్లింపులు లేవనే సరికి పనులు ఎలా చేయాలని తలలు పట్టుకుంటున్నారు. ఆర్భాటంగా బడ్జెట్ను ప్రవేశ పెట్టిన ప్రభుత్వం ఒక్కరోజు గడవక ముందే ఇలా చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. -
‘రాతి’ భారం భరించలేం!
‘పాలమూరు’లో రాతి ఇసుకకు మరింత ధర కోరుతున్న కాంట్రాక్టర్లు సాక్షి,హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనుల్లో రాతి ఇసుక (రాక్శాండ్)కు ప్రభుత్వం నిర్ణయించిన ధరను మరింత పెంచాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభు త్వం నిర్ణయించిన ధర తమకేమాత్రం గిట్టుబాటు కాదని వారు తెగేసి చెబుతున్నారు. రాతి ఇసుకను ప్రభుత్వం చెబుతున్న సైజులో తయారు చేయాలంటే భారీ మెషినరీ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం సహకరిస్తేనే ముందుకు వెళతా మన్నట్టుగా వారు స్పందిస్తున్నారు. భారీ వ్యయంతో చేపట్టిన పాలమూరు ప్రాజెక్టులో ఐదు రిజర్వాయర్లు నార్లాపూర్–8.61టీఎంసీ, ఏదుల 6.5, వట్టెం 16.6, కరివెన 19.15, ఉద్దండాపూర్ 9.2టీఎంసీల సామర్థ్యాల తో నిర్మించాలని నిర్ణయించారు. వీటితో పాటు ఓపెన్ చానల్, టన్నెళ్లు, పంప్హౌస్ల నిర్మాణానికి భారీగా ఇసుక, మట్టి అవసరమవుతాయని అధికారులు గుర్తించా రు. రిజర్వాయర్లలో లీకేజీలు లేకుండా నీటిని తరలించేం దుకు కోటి క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమని లెక్కించారు. క్యూబిక్ మీటర్కు రూ.400... అయితే నదుల్లో ఆ స్థాయిలో ఇసుక లభ్యత లేక జాప్యం జరుగుతున్న దృష్ట్యా... మెట్రో పనుల్లో వాడుతున్న మాదిరే రాతి ఇసుకను వాడాలని ఇంజనీర్లు నిర్ణయించారు. ప్రస్తు తం ప్రాజెక్టులోని 15 ప్యాకేజీల్లో దీన్ని వాడాలని కాంట్రాక్టర్లకు సూచించారు. దీనిపై ఇటీవల కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించగా... ప్రభుత్వం క్యూబిక్ మీటర్ రాతి ఇసుకకు రూ.392 ధర నిర్ణయించిం దని, అయితే చాలా ప్యాకేజీల్లో తాము తక్కువకు టెండర్లు వేశామని వారు తెలిపారు. అయితే ఆ ధరకు రాతి ఇసుకను తెచ్చుకోవడం సాధ్యమయ్యేది కాదని వారంతా చెప్పినట్లుగా తెలిసింది. ఈ ధరను క్యూబిక్ మీటర్కు రూ.400కు పైగా పెంచాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. ఇక రాతి ఇసుక తయారీకి సైతం మిషనరీని సమకూర్చుకోవాల్సి ఉంటుందని, ఇది చాలా వ్యయంతో కూడకున్నదైనందున దానికి ప్రభుత్వ సహకారం అందించాలని విన్నవించారు. -
‘డబుల్’లో భాగస్వాములు కండి!
కాంట్రాక్టర్లకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కావాలని నిర్మాణ రంగ కంపెనీలకు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. తక్కువ ధరకే సిమెంట్ విక్రయించేందుకు సిమెంట్ కంపెనీలు సైతం ముందుకు వచ్చాయని, ఇసుక సైతం ఉచితం గా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమానికి హడ్కో నిధులు మంజూరయ్యాయని, బిల్లుల చెల్లింపుల్లో ఇబ్బందులు ఉండవన్నారు. నగర శివారులో 600 ఎకరాలను ఇళ్ల నిర్మాణం కోసం గుర్తించామన్నారు. ఒకేచోట భారీ సంఖ్యలో ఇళ్లను నిర్మించే ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ఇతర పట్టణాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై పురపాలక శాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో బుధవారం ఇక్కడ మంత్రి సమావే శమయ్యారు. దేశానికే ఆదర్శంగా ఉండే విధంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని అమలు చేస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో స్కైవేలు నగరంలో మౌలిక సదుపాయాల వృద్ధికి అనేక ప్రణాళి కలు రూపొందించామని, వచ్చే రెండేళ్లలోనే స్కైవేలు పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ విధానాల ఫలితంగా నగరంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇళ్ల నిర్మాణం కోసం పిలిచిన టెండర్ల గడువును మరో 5 రోజులు పొడిగించాలని కాంట్రాక్టర్లు కోరగా, గడువు పొడిగింపునకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు. -
యంత్రాలతో తవ్వుకోనివ్వండి!
⇒ నిబంధనలు సడలించండి.. కాంట్రాక్టర్లకు అనుమతివ్వండి ⇒ అలా అయితేనే డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో ఊపు ⇒ ఇసుక తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వంపై ఎమ్మెల్యేల ఒత్తిడి సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం కోసం నదుల్లో కూడా ఇసుకను తవ్వుకునేందుకు నిర్మాణ సంస్థలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, యంత్రాలతో తోడి టిప్పర్లతో తరలించుకునేందుకు కూడా అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఆ మేరకు నిబంధనలు సడలించాలంటూ ఎమ్మెల్యేల నుంచి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. పార్టీలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేలు ఈమేరకు మూకుమ్మడి డిమాండ్ చేస్తుండటంతో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం వరకు... యంత్రాలతో ఇసుక తోడద్దనే నిబంధనను సడలిస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని పరిశీలిస్తోంది. అసలే... కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతుం డటంతో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతున్న తరుణంలో, ఈ నిబంధన అడ్డుగా ఉండి మరింత జాప్యం జరగటానికి కారణమవుతోందని ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. డబుల్ బెడ్రూంఇళ్లను చేపట్టేందుకు వీలుగా కాంట్రాక్టర్లు ముందుకు వచ్చేందుకు వారికి ఇసుకను ఉచితంగా అందించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. అయినా పెద్దగా స్పందన లేకపోవటంతో... వాగులు.. వంకలతోపాటు నదుల్లో కూడా ఇసుకను ఉచితంగా తోడుకునేందుకు ఇటీవలే వెసులుబాటు ఇచ్చింది. కానీ.. కేవలం ట్రాక్టర్లతో ఇసుకను తెచ్చుకునేందుకు మాత్రమే అనుమతి ఉండటంతో... భారీ ప్రాజెక్టులుగా రూపుదాల్చే రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ఇది ఇబ్బందిగా మారుతోందని ఇప్పుడు ఎమ్మెల్యేలు అంటున్నారు. భారీ ఎత్తున ఇసుక అవసరమవుతున్నందున కాంట్రాక్టర్లు పొక్లెయిన్ల ద్వారా ఇసుకను తోడి టిప్పర్లతో తరలించుకుపోయేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఎక్కడి పనులు అక్కడే పడకేసి ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందని హెచ్చరిస్తున్నారు. రెండు రోజుల క్రితం నిజామాబాద్లో జరిగిన సమీక్షలో ఇసుక విషయంపై కలెక్టర్ యోగితారాణా తీరును తప్పుపడుతూ ఎమ్మెల్యేలు గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి ఫిర్యాదు చేశారు. నిబంధనలు కచ్చితంగా అమలుచేస్తున్న కలెక్టర్పై వారు విరుచుకుపడ్డారు. అంతకుముందే పలు జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు ఇదే తీరులో ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసి ఉండటంతో.. ప్రభుత్వం ఇప్పుడు ఆ అంశాన్ని పరిశీలిస్తోంది. అక్రమాలకు అవకాశం ఇచ్చినట్టే... యంత్రాలతో ఇసుకను తోడేందుకు వెసులుబాటు ఇస్తే అక్రమాలకు అవకాశం కల్పించినట్టే అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రతిచోటా నిఘా వేయటం సాధ్యం కానందున, రెండు పడక గదుల ఇంటి పథకం పేరుతో భారీమొత్తంలో ఇసుకను అక్రమంగా తరలించుకుపోయే ప్రమాదం ఉంటుందని వారు అంటున్నారు. యంత్రాలతో నేరుగా కాంట్రాక్టర్లే ఇసుక తరలించేలా కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని సూచిస్తున్నారు. ట్రాక్టర్లతో కొంచెం కొంచెంగా ఇసుకను తరలిస్తే కాంట్రాక్టర్లు వేగంగా పనులు చేసే అవకాశం లేనందున, ప్రభుత్వమే ఇసుకను భారీమొత్తంలో తరలించి వారికి అందుబాటులో ఉంచితే అక్రమాలకు అవకాశం ఉండదని కొందరు ఎమ్మెల్యేలు సూచిస్తున్నారు. ఎక్కువ మంది మాత్రం నేరుగా కాంట్రాక్టర్లే యంత్రాలతో ఇసుకతోడే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తుండటం విశేషం. -
ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు
చెరువులు ధ్వంసం మాముళ్ల మత్తులో ఇరిగేషన్ శాఖ అధికారులు ఓజిలి : స్వర్ణముఖినది పొర్లుకట్ట పేరుతో చెరువులను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. చెరువుల్లో అధికంగా మట్టిని ఎక్కడపడితే అక్కడ తీస్తుండటంతో భారీగా గోతులు ఏర్పడుతున్నాయి. చెరువులు నుంచి పొర్లుకట్టలకు మట్టిని భారీగా తరలించి రూ.లక్షలు జేబులు నింపుకుంటున్నారు. ఈ మట్టి మాఫియాకు అధికార పార్టీ నాయకులు, ఇరిగేషన్ అధికారులు అండదండలు పుష్కలంగా ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇరిగేషన్ అధికారులు అలసత్వంతో జోరుగా వ్యాపారం సాగుతోంది. నాయుడుపేట, ఓజిలి మండలాల పరిధిలోని సుమారుగా 6 కిలోమీటర్లు పొర్లుకట్టలకు అధికారులు టెండర్లు నిర్వహించారు. నెల్లూరు నగరానికి చెందిన కాంట్రాక్టర్లు పనులను దక్కించుకున్నారు. జోష్యులవారి కండ్రిగ, తిమ్మాజికండ్రిగ గ్రామాల పరిదిలో మూడు కిలోమీటర్లు, కొత్తపేట, పున్నేపల్లి గ్రామాల పరిదిలో 1.50 కిలోమీటర్లు పొర్లుకట్టలను నిర్మించాల్సి ఉంది. అయితే తిమ్మాజికండ్రిగ, జోష్యులవారికండిగ పొర్లు కట్టలకు జోష్యులవారికండిగ చెరువు నుంచి 3లక్షల క్యూబిక్ మీటర్లు మట్టిని తరలించారు. అలాగే పున్నేపల్లి, కొత్తపేట వద్ద పొర్లుకట్టల పనులను నెల్లూరుకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ నుంచి మల్లాం గ్రామానికి చెందిన మరో నాయకుడు సబ్కాంట్రాక్ట్ తీసుకుని పనులు చేస్తున్నారు. ఈ పనుల్లో ఒకటన్నర కిలోమీటరుకు ఇప్పటి వరకు 50 వేల క్యూబిక్ మీటర్లు మట్టిని తవ్వేశారు. దీంతో చెరువులో భారీగా గోతులు ఏర్పడ్డాయి. చెరువుల్లో సుమారుగా మూడు అడుగులు లోతు మాత్రమే మట్టిని తీయాలని అధికారులు నిబంధనలు ఉన్నా, కాంట్రాక్టర్లు మాత్రం ఇష్టారాజ్యంగా ఆరు అడుగుల లోతు వరకు మట్టిని తరలిస్తున్నారు. ఇటీవల చిన్నపాటి వర్షంకు ఈ గోతులు నిండిపోయి ప్రమాదకరంగా మారాయి. ఈ నీటి గుంతల్లో పశువులు, చిన్న పిల్లలు ఈతకు వెళ్లి ప్రమాదాలు భారిన పడే అవకాశం ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. -
20రోజులుగా ఖాళీ
ఖజానా ఖాళీతో చెల్లని చెక్కులు పనులు చేయలేమంటున్న కాంట్రాక్టర్లు మట్టి ఖర్చుల పద్దులు ఫ్రీజింగ్ పెళ్లిళ్ల సీజన్తో అల్లాడుతున్న ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పటికి విడుదల చేస్తారో తెలియదంటున్న అధికారులు గుడివాడ: ప్రభుత్వ ఖాతాల కార్యాకలాపాలు నిలుపుదల చేసి సోమవారం నాటికి 20 రోజులు పూర్తి అవుతుంది. నాటి నుంచి ప్రభుత్వ శాఖల ఆర్థిక లావాదేవీలన్నీ స్తంభించిపోయాయి. కోటాను కోట్లు ఖర్చుతో మహిళా సాధికారిత సదస్సులు పెట్టి మా కడుపులు మాడుస్తున్నారని ఉద్యోగులు, కాంట్రాక్టర్లు ఆవేదనతో రగిలి పోతునారు. ట్రెజరీ చెక్కులు తీసుకున్న వారు బ్యాంకుల వద్దకు వెళ్లి బిక్కముఖంతో వెనుతిరుగుతున్నారు. మూడు పద్దులు మాత్రమే వదిలారు... ఈనెల 8న ప్రభుత్వ అకౌంట్లు ప్రీజింగ్ చేసిన నాటినుంచి మూడు రోజుల కిందట కోర్టు చెక్కుల చెల్లింపుకు 2014 పద్దును మాత్రమే వదిలారు. కాంట్రాక్టు ఉద్యోగులు, వీఆర్ఏల జీతాలకు సంబంధించిన పద్దుల బిల్లులు చెల్లింపులకు అవకాశం కల్పిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలు, జీపిఎఫ్ ఖాతాల్లో రుణాల విషయంలో ఇంతవరకు వదలలేదు. దీనికి తోడు మున్సిపాల్టీలకు సంబంధించిన సొంత ఖాతాల్లో కూడా ఫ్రీజింగ్ పెట్టారు. ఫలితంగా పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లింపులు లేక నానా తంటాలు పడుతున్నారు. శుభకార్యాలు చేసుకుందామని జీపీఎఫ్ రుణాలు కోసం దరఖాస్తుచేసినా ఫలితం లేకుండా పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉద్యోగులు ఉన్నారు. ఒక్క గుడివాడ సబ్ ట్రెజరీ కార్యాలయంలోనే దాదాపుగా 500కు పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు చెబుతున్నారు. నిలిచిపోయిన అభివృద్ది పనులు.. మున్సిపాల్టీ, గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు నిలిచి పోయాయి. పాత పనుల బిల్లులు చెల్లించకపోవడంతో కొత్త పనులు చేయలేమని కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. మరోవైపు పంచాయతీల్లో కరెంటు బిల్లులు, రోజువారీ ఖర్చులకు చెల్లింపులు చేయలేక సర్పంచ్లు తంటాలు పడుతున్నారు. మార్చినెల ముగింపు నేపథ్యంలో కొన్ని పనులు పూర్తి చేయకపోతే నిధులు మురిగిపోయే ప్రమాదం ఉంది. పంచాయతీ సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేదు... ట్రెజరీలో ఒక్క బిల్లు కూడా మారటం లేదు. పంచాయతీ పాలన కుంటుపడింది. కనీసం సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. జీతాల కోసం సొంత డబ్బులు ఇస్తున్నాం. వీధిలైట్లు, బ్లీచింగ్, వర్కర్స్ జీతాలు ప్రభుత్వం ఇస్తే కొంత వరకు ఇబ్బందులు తొలుగుతాయి. బిల్లులు నిలుపుదల చేస్తే పంచాయతీ పాలన ఎలా చేయాలి. –సదుర్తిసాయిబాబు –దండిగానపూడి, సర్పంచ్ ఒక్క బిల్లు రాలేదు.. ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహించిన జన్మభూమి–మాఊరు గ్రామసభలకు సొంత డబ్బులు ఖర్చు పెట్టాం. ఇంత వరకూ బిల్లు మంజూరు చేయలే దు. అత్యవసర బిల్లులు సైతం నిలుపుదలచేశారు. రోజు ట్రెజరీ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుంది. బిల్లులు మాత్రం పాస్ కావటం లేదు. అడిగితే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెబుతున్నారు. చంద్రబాబు ఏ ఖర్చు మానేస్తున్నారు . –నీలం ఉదయ్కుమార్, సర్పంచ్, వెన్ననపూడి నిలిచిన ఉపాధి పనులు... జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్వహిస్తున్న రోడ్ల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రెజరీల్లో ఫ్రీజింగ్ కారణంగా సిమెంట్కు రాసిచ్చినా నిధులు విడుదల కావడం లేదు. ఈ విధానం మార్చి నెల వరకు కనబడుతుంది. కాని జిల్లా కలెక్టరు మాత్రం మార్చిలోగా పనుల్ని పూర్తి చేయాలని అంటున్నారు. ఎలా సాధ్యం. – పి. బాలయ్య,వడ్లమన్నాడు సర్పంచ్ -
నాణ్యత లోపం
మిషన్ కాకతీయలో నాసిరకం పనులు నాణ్యతకు తిలోదకాలిచ్చిన కాంట్రాక్టర్లు చిన్నపాటి వర్షాలకే కోతకు గురవుతున్న కట్టలు పలు చెరువులకు గండ్లు బిల్లులు మాత్రం వేగంగా చెల్లింపు నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో మిషన్ కాకతీయ పనులు నత్తనడకన సాగుతున్నాయి. తెలంగాణ సర్కారు గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులకు జలకళను సంతరింపజేయడం కోసం చేపట్టిన పథకం పనులు నాసిరకంగా ఉంటున్నాయి. మొదటి, రెండో విడతల్లో చేపట్టిన చెరువు కట్టలు చిన్నపాటి వర్షాలకే కోతకు గురవుతున్నాయి. భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు రెండో దశ పనులు మార్చి 31, 2017 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో మిషన్ పనులను కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సిమెంట్ కాంక్రీట్ పనుల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించకపోవడంతో పనులు నాసిరకంగా తయారయ్యాయి. చాలా చోట్ల రివిట్మెంట్ పనులు జరగక సెప్టెంబర్లో కురిసిన వర్షాలకు కట్టలపై పగుళ్లు ఏర్పడ్డాయి. నూతన తూముల నుంచి లీకేజీలు ఏర్పడ్డాయి. నీటి పారుదల శాఖ అధికారులు చూసీచూడనట్లు వదిలేయడంతో పనులు నాసిరకంగా సాగుతున్నాయి. చెరువుల పనుల తీరు.. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 3,251 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో మొదటి విడత కింద 671 చెరువులు ఎంపిక చేయగా.. 657 చెరువుల్లో మాత్రమే అగ్రిమెంట్ జరిపి పనులు ప్రారంభించారు. ఇప్పటివరకు 649 చెరువులు పూర్తయ్యాయి. ఇంకా ఎనిమిది చెరువుల పనులు పూర్తికాలేదు. 657 చెరువులకు రూ.233.64 కోట్లు మంజూరు కాగా.. పనులు పూర్తయిన 649 చెరువులకు రూ.1.50 కోట్లు మాత్రమే చెల్లించారు. మిగతా బిల్లులు పనుల పరిశీలన తర్వాత చెల్లించనున్నారు. ఇక రెండో విడతలో 646 చెరువులు ఎంపిక చేశారు. వీటి మరమ్మతుకు రూ.227.59 కోట్లు మంజూరయ్యాయి. పనులు వివిధ దశల్లో ఉన్నాయి. నాసిరకం పనులు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల మూడు డివిజన్ల పరిధిలోని మిషన్ కాకతీయ మొదటి, రెండో విడతల్లో చేపట్టిన చెరువు పనులు నాసిరకంగా ఉన్నాయి. సెప్టెంబర్లో కురిసిన వర్షాలకు దాదాపుగా పది చెరువులకు గండ్లు పడ్డాయి. రెండు చెరువుల కట్టలు పూర్తిగా తెగాయి. కట్టల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడంతో రెండు విడతల్లో చేపట్టిన 70 శాతం చెరువు కట్టలకు భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. కొన్నిచోట్ల చెరువు మట్టిని కట్టబలోపేతం కోసం వాడారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఉపాధిహామీ పథకం కింద ఉపాధి కూలీలు తీసిన మట్టిగుంతలను అధికారులకు చూపి పూడికతీత పేరిట బిల్లులు లేపారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. అలాగే తూముల నిర్మాణం చేపట్టిన చాలా చెరువుల్లో షట్టర్లు బిగించక వర్షాకాలంలో నీరు వృథాగా పోయింది. షట్టర్లు బిగించిన చోట నీరు ఇప్పటికీ లీకేజీ అవుతోంది. మొరం తవ్వకాలతో చాలా చెరువుల్లో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రజలకు ప్రాణసంకటంగా మా రింది. అలాగే చాలా చెరువుల్లో హద్దులు నిర్ణయించి క బ్జాలు బయటకు తీయకపోవడం వల్ల ఉమ్మడి జిల్లాల్లో 1,500 ఎకరాల శిఖం భూమి పరుల అధీనంలో ఉంది. రివిట్మెంట్మెంట్ పనులు ఈ చెరువుల్లో ఇప్పటివరకు ప్రారంభించకపోవడంలో కట్టలు పగుళ్లు పడ్డాయి. నాసిరకం పనులకు నిదర్శనం.. జక్రాన్పల్లి మండలం కొలిప్యాకలోని మిషన్ కాకతీయ రెండో విడతలో కేటాయించిన దాదాలాయికుంట పనులు సగం పూర్తయిన తరువాత సెప్టెంబర్ కురిసిన భారీ వర్షానికి గండి పడి వరద నీరంతా వెళ్లిపోయింది.మిషన్ కాకతీయ పనుల్లో డొల్లతనం వల్ల పిట్లం మండలం రాంపూర్ రామసముద్రానికి గండిపడింది.కామారెడ్డి డివిజన్లో పెద్ద చెరువుగా పేరున్న బీబీపేట చెరువులో మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత లోపం వల్ల తూముల నుంచి నీరు లీకేజీ అవుతోంది. సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు మోర్తాడ్ మండలం తడపకాల్ చెరువు కోతకు గురైంది. బాన్సువాడ మండలం హన్మాజీపేట పాత చెరువుకు మిషన్ కాకతీయ కింద రూ.36 లక్షలతో పనులు చేసిన కట్టబలోపేతంలో నాణ్యత లేకపోవడం వల్ల కోతకు గురైనది.భీమ్గల్ మండలం పిప్రి గ్రామంలోని దొడ్డి చెరువు తూముకు గండిపడింది. -
నలుగురి ఇళ్లల్లో 152 కోట్ల ఆస్తులు
-
నలుగురి ఇళ్లల్లో 152 కోట్ల ఆస్తులు
కర్ణాటకలో దడ పుట్టించిన ఐటీ దాడులు సాక్షి, బెంగళూరు: నలుగురి ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడుల్లో రూ.152 కోట్ల విలువైన సంపద బయటపడింది. బెంగళూరు లో నవంబర్ 30 నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు దాడులు నిర్వ హించినట్లు ఐటీ అధికారులు ప్రకట నలో వెల్లడించారు. ఇద్దరు ప్రభుత్వ ఇంజనీర్లు, ఇద్దరు కాంట్రాక్టర్ల ఇళ్లు, కార్యాలయాలతో పాటు వారి బంధు వులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు జరిపామన్నారు. రూ.6 కోట్లకు పైగా బయట పడిన నగదులో రూ.5.7 కోట్ల విలువ చేసే కొత్త రూ.2 వేల నోట్లు ఉన్నాయి. దాదాపు 7 కిలోల బంగారం, వెండి బిస్కెట్లు, 9 కిలోల ఆభరణాలు సోదాల్లో వెలుగు చూశాయి. వందల కోట్ల విలువ చేసే స్థిర, చరాస్తులు, విలాసవం తమైన కార్లు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించి కావేరి నిరావరి నిగమ మేనేజింగ్ డెరైక్టర్ చిక్కరాయప్ప, ప్రజాపనుల శాఖలో చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ జయచంద్రను సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి పరమేశ్వర్ విధానపరిషత్లో వెల్లడించారు. మరో ఇద్దరు కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేశారు. -
అవినీతి టెండర్లే
ఇస్కా రోడ్ల పనులపై నిజమైన ‘సాక్షి’ కథనం రింగై పనులు పంచుకున్న కాంట్రాక్టర్లు వ్యూహాత్మకంగా ఎక్సెస్ టెండర్లు దాఖలు చేసిన వైనం కాంట్రాక్టర్లతో కుమ్మకై ్కన ఆర్ అండ్ బీ అధికారి పనుల పంపకాల్లో ఈయనే కీలకం రోడ్ల టెండర్లలో అవినీతి ఏరులై పారింది. ప్రజాధనాన్ని ఆరగించేందుకు కాంట్రాక్టర్లు, అధికారులు సిద్ధమయ్యారు. దీనిపై ‘సాక్షి’ ప్రచురించిన కథనం నిజమని స్పష్టమైంది. రోడ్ల పనులకు దాఖలైన బిడ్లు తెరవక ముందే తమకు అనుకూలురైన కాంట్రాక్టర్లకు పంపకాలు చేశారు. ఇందులోకీలకంగా ఉన్న ఆర్అండ్ బీ అధికారి కనుసన్నల్లోనే లక్షల రూపాయలు చేతులు మారినట్టు తెలుస్తోంది. సుమారు రూ.2 కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగమయ్యే పరిస్థితులు నెలకొన్నారుు. తిరుపతి : ఎస్వీ యూనివర్సిటీలో జనవరి 3 నుంచి ఇండియన్ సైన్స కాంగ్రెస్ సభలు జరగనున్నారుు. రోడ్లు, భవనాల రిపేర్లు, మంచినీరు, విద్యుత్ సదుపాయాలతో పాటు ఇతరత్రా అవసరాల కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రూ.100 కోట్లు కేటారుుంచారుు. దేశ విదేశాల నుంచి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యే వీలున్నందున నగరంలోని పలు కీలక రోడ్లను బాగు చేరుుంచాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. రూ.9 కోట్ల అంచనా వ్యయంతో 5 కీలక రోడ్లకు రిపేర్లు చేరుుంచాలని ఆర్ అండ్ బీ అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. అక్టోబరు 14న ఈ-ప్రొక్యూర్మెంట్ విధానంలో టెండర్లు కూడా పిలిచారు. టెండర్ల దాఖలుకు చివరి తేదీగా అక్టోబరు 27ను నిర్ణరుుంచారు. అరుుతే అధికార పార్టీకి దగ్గరగా ఉండే కొందరు కాంట్రాక్టర్లు ముందుగానే పనుల కోసం పథకం పన్నారు. తిరుపతి ఆర్ అండ్ బీలోని ఓ కీలక అధికారి వీరికి సహకరించారు. పనుల పంపకాల్లో ప్రధాన భూమిక పోషించారు. ఎవరెవరికి ఏఏ పనులు ఇవ్వాలో ముందే తేల్చేశారు. టెండర్లు తెరవక ముందే ఈ తంతు ముగిసింది. ఎస్వీ యూనివర్సిటీలో రూ.3.74 కోట్లతో పూర్తి చేయాల్సిన అంతర్గత రోడ్ల పనుల టెండరును దక్కించుకున్న ఓ కాంట్రాక్టర్ టెండర్లు ఓపెన్ కాక ముందే పనులు మొదలు పెట్టారు, కాంట్రాక్టర్ల సిండికేట్ వ్యవహారాలతో పాటు పనులు పంచుకున్న వైనాన్ని ఎండగడుతూ అక్టోబరు 27న ’అవినీతి దారులివి’ శీర్షికన సాక్షి కథనం ప్రచురించింది. తమ పన్నాగం బయట పడిందని భావించిన ఆర్ అండ్ బీ అధికారులు టెండర్లు తెరవడంలో కొంత జాప్యం చేశారు. ఆ తరువాత అగ్రిమెంట్లోనూ ఆలస్యం జరిగింది. వారం కిందటనే టెండర్లను ఖరారు చేసి పనులు అప్పగించారు. ముందుగానే అనుకున్నట్లు ఎవరెవరికి ఏఏ పనులు అప్పగించాలో ఆ పనులను వారికే దక్కేలా చేశారు. దీంతో టెండర్ల ప్రక్రియ అపహాస్యం పాలైంది. అన్నీ ఎక్సెస్ టెండర్లే... దాఖలైన టెండర్లన్నీ ఎక్సెస్వే. అంచనా వ్యయంపై 4.5 శాతం అధికంగా కోట్ చేశారు. ముందుగానే అవగాహనకు వచ్చిన కారణంగా లెస్ టెండర్లు పడలేదు. జిల్లాలో ఆర్ అండ్ బీ చేపట్టే పనులు చాలా చోట్ల 10 నుంచి 20 శాతం లెస్కు దాఖలవుతుంటారుు. అరుుతే ఇక్కడ మాత్రం అన్నీ ఎక్సెస్ టెండర్లే కావడం విశేషం. -
‘మిషన్ కాకతీయ’తో కాంట్రాక్టర్లకు ఉపాధి’
-
‘మిషన్ కాకతీయ’తో కాంట్రాక్టర్లకు ఉపాధి’
హైదరాబాద్: మిషన్ కాకతీయ పనులతో ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఉపాధి కల్పించిందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రాష్ట్రంలోని 48వేల చెరువులకు గాను కేవలం పదివేల చెరువుల్లోనే పనులు ప్రారంభించారని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన పనులను కూడా తన ఖాతాలో వేసుకుంటూ మిషన్ కాకతీయ వందశాతం విజయవంతమైనట్లు ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. ఈ పథకం అమలు తీరుపై ప్రభుత్వం శ్వేతపత్రం వెలువరించాలని డిమాండ్ చేశారు. దీనిపై బహిరంగ చర్చకు మంత్రి హరీష్రావు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి, గవర్నర్ తరచూ ఎందుకు భేటీ అవుతున్నారో ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ మంత్రులతో గవర్నర్ కాళ్లు మొక్కించటం అత్యంత దురదృష్టకరమని పొన్నం వ్యాఖ్యానించారు. -
‘కాంట్రాక్ట్’కు మించిన దోపిడీ లేదు
టీ జేఏసీ చైర్మన్ కోదండరాం సాక్షి, హైదరాబాద్: ‘‘కాంట్రాక్టర్ల వ్యవస్థ అన్యాయమైనది. ఇది ఓ వ్యక్తిని పోషించే వ్యవస్థ. ఏ పనీ చేయని మధ్య దళారి.. కార్మికుల జీతాల్లో కొంత భాగాన్ని ఎగరేసుకుపోతున్నాడు. అతనెవరో కార్మికులకూ తెలియదు.. పని చేసే వారిని కాదని ఏ పనీ చేయని కాంట్రాక్టర్లకు జీతాలు ఇవ్వడం సరికాదు..ఇంతకు మించిన అన్యాయమైన దోపిడీ వ్యవస్థ మరొకటి ఉండదు.’’ అని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల యాత్ర పోస్టర్ను సోమాజీగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఆవిష్కరించారు. విద్యుత్ జేఏసీ సమన్వయకర్త, జేఏసీ అధికార ప్రతినిధి కె.రఘు నేతృత్వంలో కాంట్రాక్టు కార్మిక వ్యవస్థపై సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని కోదండరాం ప్రకటించారు. ఔట్ సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించమని ప్రభుత్వం చెప్పడంలో అర్థం లేదన్నారు. విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకాల్లో అవినీతి జరుగుతోందనీ, భవిష్యత్తులో క్రమబద్ధీకరిస్తారన్న ఆశతో నిరుద్యోగులు రూ.5లక్షల వరకు ముడుపులు చెల్లించి ఉద్యోగాల్లో చేరుతున్నారని విద్యుత్ జేఏసీ సమన్వయకర్త కె.రఘు ఆరోపించారు. విద్యుత్ కార్మికుల హక్కుల సాధన కోసం 31వ తేదీ నుంచి 90 రోజుల పాటు రాష్ట్రంలోని 31 జిల్లాల్లో యాత్రను నిర్వహిస్తామని, అన్ని శాఖల్లోని కాంట్రాక్టు కార్మికులను ఏకం చేస్తామని యూనియన్ అధ్యక్షుడు జి.నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు పిట్టల రవీందర్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టర్లు ఏం పాపం చేశారు
విజయవాడ సెంట్రల్: ఏం పాపం చేశారని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని నగరపాలక సంస్థ వైఎస్ఆర్ సీపీ ఫ్లోర్ లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల ప్రశ్నించారు. బకాయిల కోసం ఆందోళన చేస్తున్న కాంట్రాక్టర్లకు గురువారం పార్టీ కార్పొరేటర్లతో కల్సి ఆమె సంఘీభావం తెలిపారు. ఆమె మాట్లాడుతూ 2009 నుంచి బకాయిలు పెండింగ్ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారన్నారు. ఉద్యోగుల జీతాలను క్లియర్ చేసిన తరహాలోనే కాంట్రాక్టర్ల బిల్లుల్ని చెల్లించాలన్నారు. పాలకులు కాంట్రాక్టర్ల న్యాయమైన డిమాండ్ను ఎందుకు పరిష్కరించడం లేదని నిలదీశారు. సమ్మె చేస్తే అభివృద్ధికి ఆటంకం 26వ తేదీ నుంచి సమ్మె జరిగితే నగరాభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంటుందని పుణ్యశీల అన్నారు. ఇప్పటికే డివిజన్లలో అసంపూర్తిగా పనులు నిల్చిపోయాయన్నారు. కృష్ణా పుష్కరాల నిర్వహణకు సంబంధించి రూ.230 కోట్లు మంజూరయ్యాయని ఇందులో ఎవరెవరికి ఎంతమేర బిల్లులు చెల్లించారో అధికారులు బహిర్గతం చేయాలన్నారు. బడా కాంట్రాక్టర్ల కొమ్ము కాస్తున్న టీడీపీ చిన్న కాంట్రాక్టర్ల ఉసురు తీస్తోందన్నారు. ఏళ్ళ తరబడి బిల్లులు రాక ఆర్థికంగా ఛిద్రమైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే కార్పొరేషన్లో పనులు చేసేందుకు ఏ కాంట్రాక్టర్ ముందుకు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. ఇప్పటికైనా మేయర్, కమిషనర్ చొరవ చూసి సమస్యను పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేశారు. యూనియన్ నాయకులు ఆదిబాబు మాట్లాడుతూ తమ పోరాటానికి మొట్టమొదటిగా మద్దతు తెలిపింది వైఎస్ఆర్సీపీ పార్టీయేనన్నారు. పార్టీ కార్పొరేటర్లు షేక్బీజాన్బీ, జమల పూర్ణమ్మ, పాల ఝాన్సీలక్ష్మి, కె.దామోదర్ తదితరులు పాల్గొన్నారు. మూడవరోజూ కాంట్రాక్టర్ల ఆందోళన అధికారులు, పాలకుల తీరును నిరసిస్తూ కాంట్రాక్టర్లు చెవిలో పూలతో మూడురోజు ఆందోళనను కొనసాగించారు. నగరపాలక సంస్థ కార్యాలయం చుట్టూ తిరుగుతూ అధికారుల తీరుకు నిరసనగా ఆందోళన, ధర్నా నిర్వహించారు. యూనియన్ నాయకులు వీరబాబు, అంకేశ్వరరావు మాట్లాడుతూ కమిషనర్ మొండి వైఖరి విడనాడాలన్నారు. జెఎన్ఎన్యూఆర్ఎం పథకం పూర్తి కావొస్తున్నా బిల్లులు చెల్లించబోమనడం సరికాదన్నారు. 26 నుంచి నగరంలో ఎక్కడా అభివృద్ధి పనుల్ని జరగనీయమన్నారు. కార్పొరేషన్లో డబ్బులు లేవని చెప్పడం తమ చెవిలో పూలు పెట్టడమే అన్నారు. డబ్బుల్లేకుండా రూ.32 కోట్లతో కొత్త భవనం ఎలా కడుతున్నారని ప్రశ్నించారు.యూనియన్ నాయకులు రాఘవేంద్రరావు, సీహెచ్. వెంకటేశ్వరరావు, పి.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
భవన నిర్మాణానికి సహకరించండి
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో రూ.32 కోట్లతో నూతనంగా చేపట్టిన భవన నిర్మాణ పనులకు కాంట్రాక్టర్లు సహకరించాలని మేయర్ కోనేరు శ్రీధర్ కోరారు. ఆయన బుధవారం భవన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరలో నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులకు పాక్షింకగా అడ్డంగా ఉన్న భవనానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా అత్యాధునిక పరికరాలతో తొలగించాల్సిందిగా సూచించారు. చీఫ్ ఇంజినీర్ ఎంఏ షుకూర్, ఈఈ బి.ఉదయ్కుమార్, డీఈ ఏఎస్ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ కాంప్లెక్స్ నిర్మాణ పనుల్లో పేచీ ఎన్టీఆర్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు అంతరాయం ఏర్పడింది. మొదటి, రెండో అంతస్తు నిర్మాణానికి సంబంధించి ఇటుకలు, ఇసుక, ఐరన్, సెంట్రింగ్ సామాన్లను కింద వేసేందుకు వీల్లేదంటూ పార్కింగ్ కాంట్రాక్టర్ అడ్డు చెప్పడంతో నిర్మాణ పనులకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో భవన నిర్మాణ కాంట్రాక్టర్ జనార్దన్ బుధవారం మేయర్ కోనేరు శ్రీధర్ను కలిసి సమస్య వివరించారు. మెటీరియల్ డంప్ చేసుకునేందుకు వీలుగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన మేయర్ ఎస్టేట్స్ అధికారి కృష్ణమూర్తితో ఫోన్లో మాట్లాడారు. పార్కింగ్ కాంట్రాక్టర్ వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డంప్ చేసిన మెటీరియల్ను ఎప్పటికప్పుడు పైకి తరలించుకోవాలని కాంట్రాక్టర్కు సూచించారు. పర్యవేక్షణ బాధ్యతలను ఈఈ ధనుంజయకు అప్పగించారు. -
టాస్క్ఫోర్స్ గుబులు
‘మిషన్ కాకతీయ’ పనులు పరిశీలించిన ప్రత్యేక బృందాలు పలు అక్రమాలను గుర్తించిన వైనం.. అక్రమార్కులపై చర్యలకు రంగం సిద్ధం నర్సంపేట : టెండర్లు వేసింది ఒకరు... పనులు చేసింది మరొకరు... ఇంకేం నాణ్యత పడకేసింది... ఇక్కడ పర్యవేక్షించాల్సిన ఇంజనీరింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం సమస్య తీవ్రతకు కారణమైంది.. ఈ ఉపోద్ఘాతమంతా ఇదంతా మిషన్ కాకతీయ పథకంలో బయటపడుతున్న లోపాలు, చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించినది. అయితే, ఎలాగోలా పనులు చేశాం.. బిల్లులు తీసేసుకున్నాం.. అని చేతులెత్తేస్తున్న కాంట్రాక్టర్లు, మన వాటా ముట్టింది కదా అని అధికారులు నిశ్చింతగా ఉన్న తరుణంలో.. వారి గుండెల్లో గుబులు పుట్టించే సంగతి తెలిసింది. పలు చెరువుల పనుల్లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందగా.. టాస్క్ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయి. ఈ సందర్భంగా పనుల్లో లోపాలు ఉన్నాయని తేల్చిన వారు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తరుణంలో అక్రమార్కులపై చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 27 చెరువులపై ఫిర్యాదు అవిభాజ్య వరంగల్ జిల్లాలో 1,059 చెరువులను మిషన్ కాకతీయ మొదటి దశలో అభివృద్ధి చేయగా రూ.190 కోట్ల బిల్లులు చెల్లించారు. ఇందులో 27 చెరువుల పనులకు సంబంధించి అక్రమాలు జరిగినట్లు తెలుసుకున్న రాష్ట్ర ఉన్నతాధికారులు తనిఖీలకు ఆదేశించారు. ఫిర్యాదులు అందిన చెరువుల్లో పరకాల నియోజకవర్గంలో అత్యధికంగా 14 ఉండగా, నర్సంపేట నియోజకవర్గంలో ఐదు, ములుగు నియోజకవర్గంలో ఐదు, వర్థన్నపేట నియోజకవర్గంలో రెండు, హసన్పర్తిలో ఒక చెరువు ఉంది. దీంతో ఆయా చెరువులను క్వాలిటీ కంట్రోల్ బృందాలు(టాస్క్ఫోర్స్) తనిఖీ చేయగా.. అక్రమాలు నిజమేనని తేలడంతో ప్రభుత్వానికి నివేదికలు అందించారు. పలితంగా అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లు, చూసీచూడనట్లుగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. జిల్లాలు విభజించక ముందు ములుగు నియోజకవర్గంలో ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసిన విషయం విదితమే. ప్రస్తుతం మరికొందరిపై వేటు వేయనున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో కాంట్రాక్టర్లు, ఇంజనీర్లలో ఆందోళన మొదలైనట్లు సమాచారం. ఇవీ అక్రమాలు.. మిషన్ కాకతీయ కింద చేపట్టిన చెరువు మరమ్మతుల పనుల్లో అనేక లోపాలను టాస్క్ఫోర్స్తో పాటు ప్రత్యేక బృందం అధికారులు గుర్తించారు. 90 శాతం చెరువులకు టెండర్లు వేసిన లైసెన్స్డ్ కాంట్రాక్టర్లు.. ఆ తర్వాత ద్వితీయ శ్రేణి నాయకులకు పనులు అప్పగించడంతోనే అక్రమాలు చోటు చేసుకున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైనట్లు సమాచారం. పనుల్లో భాగంగా చెరువుల్లోని ఒండ్రు మట్టిని తొలగించడంతో పాటు కట్టకు బలాన్నిచ్చే మొరం మట్టి వేసి రోలింగ్ చేయాల్సి ఉండగా దీనికి తిలోదకాలిచ్చారు. ఇక కొందరు రాజుల కాలం నాటి తూములు, అలుగులను పెకిలించి వాటికి ఉపయోగించిన రాళ్లను అమ్ముకోవడంతో పాటు పునర్నిర్మాణంలో నాణ్యత పాటించలేదని చెబుతున్నారు. అలాగే, పంట కాల్వలు నామమాత్రంగా నిర్మించడంతో పాటు కాల్వల జోలికి వెళ్లలేదని సమాచారం. అయితే, ఇంత జరుగుతున్నా ఇంజనీరింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం పనుల్లో నాణ్యత లోపించడానికి ప్రధాన కారణంగా టాస్క్ఫోర్స్ బృందాలు గుర్తించినట్లు తెలుస్తోంది. -
‘మహా’ ఇసుకపై మనోళ్ల కన్ను
పది రీచ్లకు టెండర్లు పిలిచిన గడ్చిరోలి అధికారులు తెలంగాణలో టీఎస్ఎండీసీ ద్వారా ఇసుక తవ్వకాలతో వీరి దందాకు చెక్ ఇక్కడ దందాకు వీలు లేక మహారాష్ట్ర రీచ్లపై ఆసక్తి సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మన ఇసుక కాంట్రాక్టర్ల కన్ను ఇప్పుడు మహారాష్ట్ర ఇసుక రీచ్లపై పడింది. రాష్ట్రంలో టీఎస్ఎండీసీ ద్వారా ఇసుక తవ్వకాలు జరుగుతుండటంతో ఇక్కడి ఇసుక కాంట్రాక్టర్ల ఆటలు దాదాపు సాగడం లేదు. దీంతో ఇసుక నుంచి కాసులు పిండుకోవడానికి అలవాటు పడిన ఈ కాంట్రాక్టర్లు ఇప్పుడు మహారాష్ట్ర ఇసుక రీచ్లను దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. గోదావరి అవతల వైపు ఉన్న రీచ్లకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల టెండర్లు పిలిచింది. గడ్చిరోలి జిల్లా సిర్వంచా తాలుకాలోని సుమారు పది ఇసుక రీచ్లకు అక్కడి కలెక్టర్ కార్యాలయం టెండర్లు ఆహ్వానించింది. సుమారు 12 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వుకునేందుకు రూ.44 కోట్లుతో టెండర్లను ఆహ్వానించింది. దీంతో ఆదిలాబాద్ తూర్పు ప్రాంతానికి చెందిన ఇసుక కాంట్రాక్టర్లు ఈ రీచ్లను దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నెల 26 వరకు ఈ టెండర్లకు గడువుండటంతో ఈ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు గోదావరి నీటి ప్రవాహం ప్రస్తుతం పెరిగింది. అయినప్పటికీ చాలా చోట్ల నీటి ప్రవాహం అంతగా లేదు. ఇలా నీటి ప్రవాహం లేనిచోట్ల ఈ తవ్వకాలకు అక్కడి ప్రభుత్వం తెర లేపింది. ప్రస్తుతం జిల్లాలో ఇసుక తవ్వకాలు అంతగా లేవు. రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ (టీఎస్ఎండీసీ) ద్వారానే రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. పట్టా భూముల్లో అక్కడక్కడ ఇసుక తవ్వకాలకు అనుమతులున్నప్పటికీ, ప్రస్తుతానికి ఈ క్వారీల్లో కూడా తవ్వకాలు నామమాత్రంగా సాగుతున్నాయి. దీంతో ఇసుకాసురులు తమకు ఇక్కడ ప్రయోజనం లేదని భావించారు. సిర్వాంచ నుంచి కాళేశ్వరం ప్రాంతం మీదుగా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి పట్టణాలకు ఇసుక తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన వారి పేరుతో ఈ రీచ్లను దక్కించుకుని ఇసుక మాత్రం రాష్ట్రంలో విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో ప్రభుత్వం బహిరంగ వేలం ద్వారా ఇసుక రీచ్లను కేటాయిస్తుంది. ఇందులో భాగంగానే సిర్వాంచ తాలూకా పరిధిలోని నగరం వంటి ప్రాంతాల్లో మొత్తం పది రీచ్లకు బహిరంగ వేలం నిర్వహిస్తోంది. -
మంత్రి ఇలాఖాలోనూ ‘డబుల్’ ట్రబుల్
ఎమ్మెల్యేలకు ‘డబుల్ బెడ్రూం’ల బాధ్యత: మంత్రి ఇంద్రకరణ్ సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రెండు పడకల ఇళ్ల విషయంలో అడుగు ముందుకు పడటమే గగనంగా మారింది. గృహనిర్మాణ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్రెడ్డి సొంత నియోజకవర్గమైన నిర్మల్లో కూడా వాటికి పునాదులు పడలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించడానికి ప్రభుత్వం మూడుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో రెండు గ్రామాలు(ఎర్రవల్లి, నరసన్నపేట) మినహా మరెక్కడా ఇళ్లు ఓ రూపు సంతరించుకోలేదు. అతికష్టం మీద వరంగల్ నగరంలో పనులు మొదలయ్యాయి. ఈ పథకానికి ప్రభుత్వం ఖరారు చేసిన యూనిట్ కాస్ట్లో ఇళ్ల నిర్మాణం అసాధ్యమంటున్న కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనేందుకు ఆసక్తి చూపటం లేదు. చివరకు ఇసుకను ఉచితం గా, స్టీలు, సిమెంటులను తక్కువ ధరకు ఇస్తామని తాయిలాలు ప్రకటిస్తే కొన్నిచోట్ల స్పందించారు. గ్రామీణ ప్రాంతాల్లో యూనిట్ కాస్ట్ మరింత తక్కువగా ఉండటంతో అక్కడ పనులు చేపట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేయటంలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్క ఇంటికి రూ.5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలు యూనిట్ ధరగా ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల తమకు గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్లు ఈ టెండర్ల వైపు చూడటం లేదు. కాంట్రాక్టర్లు ఆసక్తి చూపించకపోవడంతో ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన నెలకొంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తిచేయడానికి అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషిస్తోంది. నియోజకవర్గంలో ఇళ్లను పూర్తి చేసే బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించాలని భావిస్తున్నట్టు మంత్రి చెప్పారు. కాంట్రాక్టర్లు ముందుకు రాక ఇళ్ల నిర్మాణం పనులు ప్రభుత్వ అంచనాలకనుగుణంగా ముందుకు పోవడం లేదన్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 1000 ఇళ్లు కేటాయిస్తున్నామని, వీటిని స్థానికంగానే ఉన్న వనరులతో పూర్తిచేయడానికి ఎమ్మెల్యేలు చొరవ తీసుకునే విధంగా బాధ్యతలను అప్పగించనున్నట్లు ఇంద్రకరణ్రెడ్డి వెల్లడించారు. -
మంజీరలో ‘మహా’ అక్రమాలు
బోధన్: మంజీర నదిలో మహారాష్ట్ర మళ్లీ అతిక్రమణలకు పాల్పడుతోంది. మన సరిహద్దులోకి వచ్చి ఇసుక తవ్వకాలు చేపడుతోంది. హద్దు రాళ్లను తొలగించి మరీ కాంట్రాక్టర్లు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. తాజాగా మన భూభాగంలో ఇసుక తవ్వుతుండగా రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. ప్రొక్లెయిన్, టిప్పర్ సీజ్ చేశారు. బోధన్ మండలంలోని సాలూర గ్రామ శివారులోని అంతరాష్ట్ర చెక్పోస్టుకు సమీపంలో మంజీర నది తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దుల మధ్య ప్రవహిస్తోంది. నదిలో సరిహద్దు సమస్య దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఏటా ఇది వివాదాస్పదమవుతూనే ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతి పేరుతో కాంట్రాక్టర్లు హద్దు దాటి మన భూబాగంలోని మంజీర నదిలో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. మంజీరకు అవతలి వైపు నాందేడ్ జిల్లా బిలోలి, దెగ్లూర్, ధర్మాబాద్ తాలూకా పరిధిలో భూభాగం ఉంది. బిలోలి తాలూకా పరిధిలోని ఎస్గీ, గంజ్గం, బోలేగాం క్వారీల్లో ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. బోలేగాం క్వారీ కాంట్రాక్టర్లు బోధన్ మండలంలోని మందర్న శివారులోని మన రాష్ట్ర సరిహద్దు రాళ్లను తొలగించి, మన భూభాగంలో ఇసుక తవ్వకాలు చేపట్టారు. సమాచారమందుకున్న బోధన్ రెవెన్యూ అధికారులు సోమవారం మందర్న శివారులో పర్యటించారు. ఇసుక తవ్వకాలను అడ్డుకొని, ప్రొక్లెయిన్, టిప్పరు స్వాధీనం చేసుకున్నారు. ‘మహా’ ప్రభుత్వం ఇసుక క్వారీలకు అనుమతి ఇస్తున్న నేపథ్యంలో బోధన్ తహసీల్దార్ వినోద్కుమార్, సిబ్బంది మంజీర నది తీరంలో పర్యటించి మన రాష్ట్ర సరిహద్దులను గుర్తించి హద్దు రాళ్లను అమర్చారు. హద్దు దాటి వస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అక్కడి కాంట్రాక్టర్లను హెచ్చరించారు. కానీ బరితెగించిన కాంట్రాక్టర్లు హద్దు రాళ్లను తొలగించి మన భూభాగంలో ఇసుక తవ్వుతున్నారు. నదిలో సరిహద్దు వివాదాన్ని ఆసరా చేసుకుని మితిమీరుతున్నారు. వారికి ‘మహా’ సర్కారు అండగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. సరిహద్దులో ఇసుక జాతర.. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న బోధన్ మండలంలోని సాలూర అంతరాష్ట్ర చెక్పోస్టు సమీపంలో ఇసుక లారీలు బారులు తీరుతున్నాయి. వందల సంఖ్యలో లారీల రాకపోకలతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోజుకు 200 పైగా ఇసుక లారీలు, టిప్పర్ల ద్వారా ఇసు రవాణా సాగుతోంది. సాలూర చెక్పోస్టు నుంచి బోధన్ వరకు రోడ్డు గుంతలు పడి ప్రమాదకరంగా మారింది. మహారాష్ట్ర ఇసుక క్వారీలతో అక్కడి ప్రభుత్వం, కాంట్రాక్టర్లు రూ.కోట్ల ఆదాయం దండుకుంటున్నారు. నకిలీ వేబిల్లుతో ఇసుక తరలిపోతోందని ఆరోపణలు వచ్చినా తనిఖీలు మాత్రం ‘మామూలు’గా కొనసాగుతున్నాయి. క్రిమినల్ కేసులు పెడతాం.. మహారాష్ట్రలోని బోలేగాం ఇసుక క్వారీ నిర్వాహకులు మన భూభాగంలో చొచ్చుకు వచ్చి హద్దు రాళ్లను తొలగించి ఇసుక తవ్వకాలు చేపట్టారు. తవ్వకాలను అడ్డుకొని ప్రొక్లెయిన్, టిప్పర్ను స్వాధీనం చేసుకున్నాం. ఈ సమాచారాన్ని కలెక్టర్కు అందించాం. మంజీర నదిలో హద్దులు దాటి ఇసుక తవ్వకాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. – వినోద్కుమార్, తహసీల్దార్ -
చేసిన పనులకే మళ్లీ టెండర్
ఒకే చెరువుకు రెండేసి ప్రతిపాదనలు ఉపాధి హామీలో పనులు చేసిన చెరువులకు మళ్లీ మరమ్మతులు కొత్తగూడ కేంద్రంగా అక్రమాల ‘మిషన్’ రెండు డివిజన్లతో పర్యవేక్షణలో లోపాలు ఈ ఫొటోలో ఉన్నది కొత్తగూడ మండలం ఎర్రవారం గ్రామంలోని ఎర్రకుంట. దీని మరమ్మతు పనులు మిషన్ కాకతీయ రెండో విడతలో చేపట్టారు. అయితే కాంట్రాక్టర్ అగ్రిమెంట్ జాప్యం చేశాడంటూ అధికారులు బ్లాక్లిస్టులో పెట్టి మళ్లీ టెండర్ పిలిచారు. ఈ పనులకు కాంట్రాక్టర్లు పోటీ పడ్డారు. గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్ టెండర్ వేసినప్పటికీ అతని పోటీగా అదే మండలానికి చెందిన మరో కాంట్రాక్టర్ 35.10శాతం లెస్కు టెండర్ దక్కించుకున్నాడు. ఎలాగూ పనులు గతంలో 50శాతం వరకు పూర్తయినట్లు ప్రచారం కావడంతో ఇంత తక్కువకు టెండర్ వేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చెరువు పనులు ఉపాధి హామీ పథకంలో కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. మరి.. అధికారులు ఈ చెరువు పనులు చేయిస్తారో లేక గతంలో చేసిన పనులే కదా అని ఏకంగా బిల్లులు చేస్తారో చూడాలి. వరంగల్ : ఏజెన్సీ ప్రాంతంలో మిషన్ కాకతీయ కింద చేపడుతున్న చెరువుల మరమ్మతు పనులు కాంట్రాక్టర్లకు సిరులు కురిపిస్తున్నాయి. మిషన్ కాకతీయకు ముందు త్రిబుల్ ఆర్ పథకం(రీస్టోర్, రిపేర్, రినోవేషన్), ఉపాధి హామీ పథకాల్లో చేపట్టిన పనులను మళ్లీ చేపట్టడంతో ఆ పనులు దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు పోటీ పడుతున్నారు. 2014లో ఉపాధి హామీ పథకంలో చేపట్టిన చెరువు పనులను మళ్లీ మిషన్ కాకతీయ రెండో విడతలో చేపట్టారు. ఏటూరునాగారం మండలంలోని కంతనపల్లి కుంట, శంకరాజుపల్లి పైడి చెరువు, ఆకులవారి ఘనపురంలోని దయ్యాలకుంట, రాళ్లకుంట, పెద్ద వెంకటాపూర్లోని ఊరకుంట, చిన్నబోయినపల్లిలోని ఊరకుంటలకు మళ్లీ మరమ్మతులు చేపట్టారు. ఇదే విధంగా పలు మండలాల్లో చెరువులకు మళ్లీ టెండర్లు పిలవడంతో అక్రమాలు పెరిగిపోయాయి. కొత్తగూడలో అక్రమాలు కోకొల్లలు... అటవీ ప్రాంతమైన ఒక్క కొత్తగూడ మండలంలోనే సుమారు 1800కు పైగా చెరువులున్నాయి. ఏటూరునాగారం ఐటీడీఏలోని స్పెషల్ మైనర్ ఇరిగేషన్ డివిజన్లో 1,004కు పైగా చెరువులు ఉన్నాయి. ములుగు మైనర్ ఇరిగేషన్ (ఎంఐ) డివిజన్లో మరో 800కు పైగా చెరువులున్నాయి. ఈ మండలాన్ని కేంద్రంగా చేసుకొని కాంట్రాక్టర్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చెరువుల మరమ్మతుల పనులు ములుగు ఎంఐ డివిజన్తో పాటు స్పెషల్ ఎంఐ డివిజన్లు చేపట్టాయి. రెండు డివిజన్ల మధ్య సమన్వయం లేకపోవడంతో ఒక డివిజన్లో టెండర్ పిలిచిన చెరువుకు మరో డివిజన్లో టెండర్లు నిర్వహించడంతో టెండర్లు వేసిన ఇద్దరు కాంట్రాక్టర్లు పరస్పర దాడులకు దిగారు. అధికార నేత అండ ఉన్న కాంట్రాక్టర్ను వదలి మరో కాంట్రాక్టర్ను జైలుకు పంపించారు. దీనిపై శాఖలో కలకలం రేపడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఇరు వర్గాల మధ్య అవగాహన కుదిర్చారు. ఈ వివాదం ఆలస్యంగా వెలుగు చూసింది. చేసిన వాటికే మళ్లీ... కొత్తగూడ మండలం ఎర్రవారం గ్రామంలోని ఎర్రకుంట చెరువు మరమ్మతు చేసేందుకు ప్రభుత్వం ఫిబ్రవరిలో మిషన్–2లో నిధులు మంజూరు చేసింది. ఈ పనులను 30శాతానికి పైగా లెస్తో పొందిన కాంట్రాక్టర్ అగ్రిమెంటు చేసుకోలేదు. కాంట్రాక్టర్ అగ్రిమెంటు చేసుకోకుండానే కొంత మేరకు పనులు పూర్తి చేశారు. రాజకీయ ఒత్తిళ్లతో అగ్రిమెంటు జాప్యం చేశాడంటూ సదరు కాంట్రాక్టర్ను అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టారు. బ్లాక్ లిస్టులో పెట్టడం వల్ల బిల్లులు చేయలేమని ఇంజనీర్లు చెప్పారు. దీంతో ఈ చెరువు పనులకు జులై 19వ తేదీన ఈప్రొక్యూర్మెంట్ టెండర్ నిర్వహించేందుకు అన్లైన్లో పెట్టారు. కేవలం గంట వ్యవధిలోనే టెండర్ ప్రక్రియ పూర్తయ్యే విధంగా ఆ డివిజన్ అధికారులు తమ వంతు పాత్ర పోషించారు. ఇది కాస్తా బయటకు పొక్కడంతో రద్దు చేసి మళ్లీ టెండర్ నిర్వహించారు. పనులు చేసినట్లు ఉంటే రద్దు చేస్తాం.... కొత్తగూడ మండలం ఎర్రకుంట పనులు చేసినట్లు విచారణలో తేలితే టెండర్ పెట్టినప్పటికీ రద్దు చేస్తామని స్పెషల్ ఎంఐ ఈఈ రాంప్రసాద్ తెలిపారు. ఈ చెరువు పనులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. -
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే ఆయకట్టు రైతులకు శాపమైంది
డీసీసీ అధ్యక్షుడు ఎలేటి మహేశ్వర్రెడ్డి సారంగాపూర్ : స్వర్ణ ప్రాజెక్టు గేట్లు, కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఈ ఖరీఫ్లో రైతులకు శాపంగా మారిందని నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు ఎలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని స్వర్ణ ప్రాజెక్టును ఆదివారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు గేట్ల మరమ్మతులకు రెండుకోట్ల రూపాయల నిధులు మంజూరు వచ్చినా ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు చేపట్టిన కాంట్రాక్టరు వాటికి పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టకపోవడంతో గేట్లు మొరాయింపు మొదలు పెట్టాయన్నారు. ఇటీవల వరదగేటును ఎత్తి దింపే క్రమంలో అది సక్రమంగా కూర్చోక విలువైన సేద్యపు నీరు వథా అయ్యిందన్నారు. దీంతో పాటు గేట్ల లీకేజీలు సైతం యథాతథంగా ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే సోమవారం వరకు ప్రాజెక్టు గేట్లకు, కాలువలకు మరమ్మతులు చేపట్టి నీరు విడుదల చేయని పక్షంలో వచ్చే సోమవారం 10వేలమంది రైతులతో కలిసి స్వర్ణ ప్రాజెక్టునుంచి పాదయాత్ర చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వంగ లింగారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు దశరథరాజేశ్వర్, స్వర్ణ ప్రాజెక్టు ఆయకట్టు మాజీ అధ్యక్షుడు ఓలాత్రి నారాయణరెడ్డి, నాయకులు బడిపోతన్న, తోట భోజన్న, నక్క రాజన్న, తదితరులు ఉన్నారు. -
అవినీతి కొండ..వెలిగొండ
– ప్రభుత్వ పెద్దలు, కాంట్రాక్టర్లు కుమ్మక్కు – రూ.2,634 కోట్లకు పెరిగిన అంచనాలు – పనులు చేయకుండానే బిల్లులు – నత్తనడన అరకొర పనులు – పూర్తికాని భూసేకరణ – పునరావాసం గాలికి వెలిగొండ ప్రాజెక్టు..మూడు జిల్లాల రైతాంగం కడగండ్లు తీర్చే వరప్రదాయిని. ఇప్పుడు అదే ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు, ప్రభుత్వ పెద్దలకు కల్పతరువుగా మారింది. ప్రాజెక్టు అంచనాలను ఉన్నపళంగా వేల కోట్లు పెంచేసి భారీ దోపిడీకి తెరలేపారు. పనులు చేయకుండానే బిల్లులు చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. కోట్ల రూపాయలు కరిగిపోతున్నా..ప్రాజెక్టు నిర్మాణం, పునరావాస పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. వెలిగొండలో పెంచుకున్న అంచనాలు ఇవీ.. పనులు గతంలో అంచనాలు తాజా పెరిగింది కోట్ల రూపాయల్లో పా్యకేజీ 1లోని (టన్నెల్–1) రూ.624 రూ.934 రూ.306.39 పా్యకేజీ 2లో ఫీడర్ కెనాల్, తీగలేరు కెనాల్ రూ.254.50 రూ.688 రూ.434 పా్యకేజీ 3లో గొట్టిపడియ రూ.380 రూ.480 రూ.100 పా్యకేజీ 4లో కాకర్ల డ్యామ్ రూ.206 రూ.855 రూ.649 టన్నెల్–2లో ప్యాకేజీ నెం.5 రూ.735 రూ.1,031 రూ.296 పా్యకేజీ నెం.6లో తూర్పుప్రధాన కాలువ రూ.1135 రూ.1348 రూ.213 పా్యకేజీ నెం.7లో పశ్చిమ ఉపకాలువ రూ.757 రూ.975 రూ.218 మెుత్తం మీద పెరిగిన వ్యయం రూ.2,634 సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రభుత్వ అధినేత, కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారు. కోట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇబ్బడిముబ్బడిగా అంచనాలు పెంచి కోట్లు దోచుకుంటున్నారు. పనులు చేయకుండానే బిల్లులు చేసుకుంటున్నారు. కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. మూడు జిల్లాల రైతాంగం ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు తాజా పరిస్థితి ఇది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు ముగుస్తోంది. వెలిగొండ ద్వారా నీళ్లిస్తామంటూ ఏడాది నుంచి బాబు మాటలతో మభ్యపెడుతూనే ఉన్నారు. కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. అంచనాలను మాత్రం భారీగా పెంచుకున్నారు. తొలుత నిన్న, మొన్నటి వరకు రూ.5,150 కోట్ల అంచనాలతో ఉన్న వెలిగొండ ప్రాజెక్టు వ్యయం తాజాగా రూ.7,784 కోట్లకు చేరింది. ఈ లెక్కన రూ.2,634 కోట్లు పెంచుకున్నారు. బాబు సర్కారు పెంచిన వెలిగొండ అంచనాలను చూసి సీనియర్ ఇంజినీరింగ్ ప్రముఖులే నివ్వెరపోతున్నారు. ఇదేం దోపిడీ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. నత్తనడకన భూసేకరణ ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాలో విస్తరించిన ఉన్న వెలిగొండ ప్రాజెక్టు కింద డ్యామ్లు, రహదారులు, కాలువలు పరిధిలో మొత్తం 41,480 ఎకరాల భూములను సేకరించాల్సి ఉంది. భూసేకరణ కోసం గతంలో ప్రభుత్వం కేవలం రూ.508 కోట్లు మాత్రమే కేటాయింపులు చేయగా, చంద్రబాబు సర్కారు దీనిని రూ.970 కోట్లకు పెంచింది. గతంతో పోలిస్తే అదనంగా రూ.462 కోట్లు పెంచుకున్నారు. పోనీ భూసేకరణ అయినా వేగవంతంగా చేస్తున్నారంటే అది లేదు. బాబు రెండేళ్ల పాలనలో పట్టుమని 100 ఎకరాలు కూడా సేకరించలేదు. పునరావాసం దోపిడీ వెలిగొండ ప్రాజెక్టు కింద మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు ప్రాంతాల్లో సుంకేశుల, కలనూతల, గుండంచెర్ల, గొట్టిపడియ, అక్కచెరువు, సాయినగర్, కృష్ణానగర్, లక్ష్మిపురం, మెట్టుగొంది, చింతలపూడి, కాటంరాజుతండా తదితర గ్రామాలు ముంపునకు గురి కానున్నాయి. ఈ గ్రామాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. గతంలో ఇందుకోసం రూ.58 కోట్లు కేటాయించగా, తాజాగా ఆ మొత్తాన్ని రూ.489 కోట్లకు పెంచడం గమనార్హం. మొత్తంగా అంచనాలను పెంపు పేరుతో బాబు ప్రభుత్వం కోట్లు కొల్లగొట్టడంపై పెట్టిన శ్రద్ధ వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడంలో చూపించటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఆర్అండ్ఛీ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రహదారులు భవనాల శాఖ (ఆర్అండ్బీ) రహదారులంటే వాహనదారులకు వణుకు పుడుతోంది. జిల్లాలో పలుచోట్ల ఈ రోడ్లలో నిర్మాణ పనులు దీర్ఘకాలికంగా సాగుతుండడమే ఇందుకు కారణం. సాధారణంగా ఒక రోడ్డు పని మొదలు పెడితే ఆరు నెలల్లో పూర్తవుతుందని అంచనా ఉంటుంది. కానీ ఆర్అండ్బీ జిల్లా శాఖ తలపెట్టిన గ్రామీణ రోడ్ల నిర్మాణాలు ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో రోజువారీ ప్రయాణికుల బాధలు అంతా ఇంతా కావు. రోడ్డు వెడల్పు, డబుల్రోడ్డు నిర్మాణం, వంతెనలు.. ఇలా పలు రకాలుగా ఆ శాఖ పనులు నిర్వహిస్తోంది. నిర్మాణ పనుల్లో భాగంగా రోడ్ల తవ్వకాలు చేపట్టిన కాంట్రాక్టర్లు వాటిని పూర్తిచేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఫలితంగా ఆ మార్గం నుంచే వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో ఆర్అండ్బీ విభాగం ఆరు గ్రామీణ నియోజకవర్గాల పరిధిలో 29 పనులకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు నిర్మాణ పనులు అప్పగించింది. ఈ పనులకు సంబంధించి వ్యయం రూ. 557.61కోట్లు. ఇంతటి భారీ మొత్తంలో చేపట్టిన పనులు ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 24 ప నులు మొదలుపెట్టగా.. అందులో కేవలం మూడు మాత్రమే పూర్తయ్యాయి. మరో 5 పనులు ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోలేదు. పూర్తిచేసినట్లు చూపిన మూడు రోడ్ల పనులు అత్యంత తక్కువ వ్యయానికి సంబంధించినవి కావడం గమనార్హం, అంతటా నిర్లక్ష్యమే...! ఆర్అండ్బీ చేపట్టిన పనుల్లో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఒకవైపు నిర్మాణ పనుల్లో జాప్యం చేస్తుండగా.. మరోవైపు పనులు జరిగే చోట కనీస జాగ్రత్తలు పాటించకపోవంతో ప్రయాణికుల యాతన పడుతున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి మంచాల వరకు నిర్మిస్తున్న రోడ్డు పనుల్లో కనీసం సూచిక బోర్డులు సైతం ఏర్పాటు చేయడం లేదు. గండిపేట నుంచి శంకర్పల్లి రోడ్డు 0/0 కిలోమీటర్ల నుంచి 23/05 వరకు రూ. 75కోట్లతో నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటివరకు చేపట్టిన పనుల్లో అత్యధిక నిధులు ఈ ప్రాజెక్టుకే కేటాయించగా.. ఇప్పటికీ నిర్మాణ పనులు పూర్తికాలేదు. ఇబ్రహీంపట్నం నుంచి సాగర్ వైపు రోడ్డు నిర్మాణ పనులు రెండు దశల్లో చేపట్టారు. ఇందుకు రూ. 42కోట్లు కేటాయించారు. కృష్ణా పుష్కరాలు వచ్చేలోపు ఈ పనులు పూర్తిచేయాల్సి ఉంది. గడువు సమీపిస్తున్నప్పటికీ పనులు మందకొడిగా సాగుతున్నాయి. మరోవైపు వర్షాలు కురుస్తుండడంతో అనుకున్న సమయంలోగా పనులు పూర్తవడంపై సందేహం నెలకొంది. దేవరంపల్లి-శంకర్పల్లి రోడ్డులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఈ రోడ్డుకు రూ.13 కోట్లు మంజూరైనప్పటికీ.. యంత్రాంగం ఉదాసీనతతో పనులు ఇప్పటికీ ప్రారంభించలేదు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 7 రోడ్ల పనులకు ప్రభుత్వం రూ. 140కోట్లు కేటాయించగా.. ఇప్పటివరకు ఒక్క నిర్మాణమూ పూర్తికాలేదు. అదేవిధంగా చేవెళ్ల నియోజకవర్గానికి 6 పనుల నిమిత్తం రూ. 173.5కోట్లు మంజూరు చేయగా.. ఇక్కడ కూడా ఒక్క నిర్మాణమూ పూర్తికాలేదు. హైదరాబాద్నుంచి ఎక్కువగా రద్దీ ఉండే ఈ నియోజకవర్గాల్లోని రోడ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతుండడం వాహనదారులకు నరకం చూపిస్తోంది. -
అక్రమాల నీడ
భక్తులకు నీడనిచ్చే షెడ్ల నిర్మాణంలో చేతివాటం కాంట్రాక్టర్లకు అనుకూలంగా అధికారులు గడువు దాటినా పూర్తి కాని పనులు లక్షలాది రూపాయల అదనపు బిల్లులు పర్యవేక్షణతో సరిపెడుతున్న ఉన్నతాధికారులు అభివృద్ధి ముసుగులో అక్రమార్కుల పంట పండుతోంది. కాంట్రాక్టర్లు ఇష్టారీతిన పనులు చేపట్టడం.. అధికారులు కూడా వంత పాడుతుండటం.. ఉన్నతాధికారులు తనిఖీలు చేసినా చర్యలు లేకపోవడంతో కోట్లాది రూపాయలకు రెక్కలొస్తున్నాయి. వాస్తవంగా చేపట్టాల్సిన పనులకు.. క్షేత్ర స్థాయిలో కొనసాగుతున్న పనులకు పొంతన లేకపోవడం వెనుక ‘మాస్టర్ ప్లాన్’ కనిపిస్తోంది. కర్నూలు: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో రూ.642 కోట్ల అంచనా వ్యయంతో మాస్టర్ ప్లాన్ అమలవుతోంది. ఇందులో భాగంగా చేపడుతున్న తొలి దశ పనుల్లో నాణ్యత కొరవడుతోంది. దేవాదాయ శాఖ నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం కాకుండా మాస్టర్ ప్లాన్ ఎప్పటికప్పుడు మారుతూ పోవడం విమర్శలకు తావిస్తోంది. మల్లన్న దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం శ్రీశైలంలో మూడు చోట్ల తొమ్మిది షెడ్ల నిర్మాణానికి రూ.14.97 కోట్లు కేటాయించారు. టెండర్లో ఈ పనులను హైదరాబాద్కు చెందిన అభిరామ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.12.28 కోట్లకు దక్కించుకుంది. 18 నెలల వ్యవధిలో పూర్తి చేయాల్సిన షెడ్లను 1,12,561.43 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. అయితే పనులు మొదలుపెట్టే సరికి వసతి షెడ్లు కాస్తా ఒకటి కల్యాణ మండపంగా.. మరొకటి కల్యాణ కట్టగా.. ఇంకొకటి క్లాక్రూమ్గా.. తక్కినవి స్నానాల గదులు, మరుగుదొడ్లు, క్యూలైన్ కాంప్లెక్స్గా మారిపోయాయి. పాతాళగంగకు వెళ్లే మార్గంలో కాటేజీ నెం.111 ఎదురుగా రెండు షెడ్లను మాత్రమే భక్తుల కోసం నిర్మించగా.. వీటికి ఎదురుగా భారీ వైశాల్యంలో ఆడిటోరియం నిర్మాణానికి శ్రీకారం చుట్టడం గమనార్హం. వాస్తవానికి తొలుత వీటన్నింటినీ 2.60 లక్షల చదరపు అడుగుల వైశ్యాలంలో నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే కాంట్రాక్టర్ సమయానికి పూర్తి చేయలేకపోయారు. 2015 ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేసేలా అదనపు సమయం తీసుకున్నా.. ఇప్పటికీ ఆడిటోరియం పనులు బేస్మెంట్ స్థాయిలోనే నిలిచిపోయాయి. టెండర్లకే టెండర్ పిలిగ్రిం షెడ్ల ప్లాన్ సవరిస్తూ గత ఏడాది శివరాత్రి సందర్భంగా క్యూలెన్ కాంప్లెక్స్ వద్ద ఓ కొత్త క్యూలైన్ షెడ్డును నిర్మించారు. అయితే మాస్టర్ ప్లాన్లో క్యూలెన్ కాంప్లెక్స్ వద్ద వసతి షెడ్డుకు బదులుగా క్యూలెన్ షెడ్డును నిర్మించేందుకు ప్రతిపాదించారు. ఈ పనిని రూ.10లక్షలు చొప్పున మూడు భాగాలుగా విభజిస్తూ రూ.30 లక్షలకు టెండర్ పిలిచారు. భీమ్లానాయక్ అనే కాంట్రాక్టర్ ఈ షెడ్డు నిర్మాణ పనులను దక్కించుకున్నట్లు తెలిసింది. శరవేగంగా పనులు చేపట్టి పూర్తి చేశారు. నిర్మాణానంతరం ఈ పనులకు సంబంధించిన బిల్లులు మాత్రం పిలిగ్రిం షెడ్డు పనులను దక్కించుకున్న అభిరామ్ ఇన్ఫ్రా సంస్థ నుంచి చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత టెండర్కు సంబంధించి కేటాయించిన అసలైన నిధులను అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై దోచుకున్నట్లు సమాచారం. విచారణ జరిపితే అక్రమాలు వెలుగులోకి.. పిలిగ్రిం షెడ్ల నిర్మాణ పనుల్లో చోటు చేసుకున్నాయంటున్న అక్రమాలపై విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఆడిటోరియం పనుల తీరును పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ పనులను నిలిపేయాలని కూడా ఆదేశించారు. అవినీతికి అడ్డుకట్ట వేయాలంటే పనుల తీరుతెన్నులపై ఆర్అండ్బీ లేదా ఇరిగేషన్ అధికారులతో విచారణ చేపడితే ఫలితం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంట్రాక్టర్కు లబ్ధి చేకూరేలా.. నిధులను కొల్లగొట్టడంలో సిద్ధహస్తులైన ఇంజినీర్లు దేవాదాయశాఖ నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం షెడ్ల పనులను చేపట్టలేదు. మూడేళ్ల నుంచి చేపట్టిన ఈ పనులకు ఇప్పటి వరకు రూ.11.35 కోట్లు ఖర్చు చేశారు. కాటేజీ నెంబర్.111 ఎదురుగా ఆడిటోరియం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీనికి అభిముఖంగా వెనుక భాగాన రెండు వసతి షెడ్లు నిర్మించారు. అయితే ఆడిటోరియం నిర్మాణ ప్రాంతంలో ఉన్న బండరాళ్లను తొలగించడానికి నిధులు ఖర్చు చేశారు. కానీ.. తొలగించిన బండరాళ్ల కంటే అధిక ఎత్తులో ఆడిటోరియం పునాదులు తీయడంతో చేసిన ఖర్చు వృథాగా మారింది. ఈ అంశాలేవీ పట్టని ఇంజినీరింగ్ అధికారులు మళ్లీ ఆ పునాదులను బేస్మెంట్స్థాయి వరకు మట్టితో నింపేందుకు రూ.42 లక్షలు మంజూరు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వాస్తవానికి అక్కడ ఆ స్థాయిలో పునాదుల ఎత్తు పెంచాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కాంట్రాక్టర్ను సంతృప్తి పరిచేలా వ్యవహరించినట్లు తెలుస్తోంది. -
అభివృద్ధి మాటున అవినీతి..!
నల్లగొండ జిల్లా నీలగిరి మున్సిపాలిటీలో అభివృద్ధి మాటున అవినీతి రాజ్యమేలుతోంది. కొందరు అధికారులు, నిర్మాణ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అందిన కాడికి దోచుకుంటన్నారు. అయినప్పటికీ చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగం సైతం నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. ఫలితంగా కోట్లాది రూపాయల మున్సిపాలిటీ సొమ్ము పక్కదారి పడుతోంది. నల్లగొండ: నీలగిరి మున్సిపాలిటీలో చేసిన పాత పనులకే కొత్త బిల్లులు సృష్టించి మున్సిపాలిటీని కొల్లగొడుతున్నారు. కాంట్రాక్టర్లకు, అధికారులకు బేరం కుదిరితే చాలు.. ఎక్కడా ఏదీ ఎలా బిల్లు చేయాలో చకచకా చేసేస్తారు. పట్టణంలో అభివృద్ధి మాటున అవినీతి కొత్త పుంతలు తొక్కుతుందనడానికి ఇక్కడ వీరు చేసిన పనులే ప్రత్యక్ష సాక్ష్యం. ప్రతిఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు మున్సిపల్ పట్టణాల్లో అభివృద్ధి పనుల కోసం కోట్లాది రూపాయలు నిధులు విడుదల చేస్తున్నారుు. ఈ నిధులు అక్రమార్కులకు వరంగా మారాయి. పట్టణంలో అభివృద్ధి ఎంత చేస్తున్నారో తెలియదు గానీ అవినీతిలో ముందంజలో ఉన్నారు. నీలగి రి మున్సిపాలిటీ అవినీతి అక్రమాలు, కుంభకోణాలలో రాష్ట్రంలోనే టాప్గేర్ స్పీడ్లో దూసుకుపోతుంది. ఈ మున్సిపాలిటీపై రాష్ట్ర ఉన్నతాధికారుల పర్యవేక్షణ, ఆకస్మిక తనిఖీలు లేకపోవడంతో ఇక్కడి అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా పనులు చేయిస్తున్నారు. ప్రభుత్వ చట్టాలను తమ చుట్టాలుగా మలుచుకొని తమకు అనుకూలురైన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి రూ.కోట్ల అక్రమాలకు పాల్పడుతున్నా రు. మున్సిపాలిటీలోని ఇంజనీరింగ్ విభాగంలో ఔట్ సోర్సిగ్ ఉద్యోగి నుంచి అధికా రి వరకు తాము చేసిందే చట్టం అనే స్థాయికి ఎదిగిపోయారంటే వారు ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. విజిలెన్స్కు ఫిర్యాదులు.. పట్టణంలోని ప్రకాశం బజారులో ఓ కాంట్రాక్టర్ పాత పనులకే బిల్లులు తయారు చేయించాడు. ఇక్కడ దాదాపు రూ.4 లక్షల వరకు బిల్లులు చేశారు. ఉన్న డ్రెయినేజీ కాల్వకే కొత్తగా సిమెంట్ వేసి బిల్లులు కాజేశారు. స్థానికులు విజిలెన్స్ అధికారులకు, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు బిల్లు కూడా పూర్తి చేసి డబ్బులు కూడా మంజూరు చేశారు. ఫిర్యాదు తీవ్ర రూపం దాల్చడంతో ఆదే గుత్తేదారు 36వ వార్డులో చేసిన డ్రెయినేజీ పనులలో రీకవరీ చేశారు. అక్కడ రూ.2 లక్షల పనిచేయగా రూ.3 లక్షల విలువైన డ్రెయినేజీ పనులు పూర్తి చేసినట్లు రికార్డుల్లో చూపించినట్లు తెలసి ంది. అధికారులకు అవినీతి భాగోతం తెలిసినా వారిమీద గానీ, కాంట్రాక్టర్ మీద గానీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారిని వెనకేసుకు రావడం కొసమెరుపు. రోడ్డు తక్కువ.. బిల్లులు ఎక్కువ పట్టణంలో పలు కాలనీల్లో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణంలో కూడా అవినీతికి తెరలేపారు. వన్టౌన్ పరిధిలోని ఓ వార్డులో వేసిన సీసీ రోడ్డు కన్నా 60 మీటర్ల దూరం ఎక్కువగా చూపించి బిల్లులు చేశారు. ఇలా ఒక్క వార్డులోనే కాదు అత్యధిక వార్డుల్లో తప్పుడు కొలతలు వేసి మున్సిపాలిటీ నిధులు బుక్కేస్తున్నారు. ఈ విషయాలన్ని అధికారులకు తెలసినా వారు చేతులు కాలాకా ఆకులు పట్టుకునే విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. పట్టణంలోని మున్సిపాలిటీలో జరిగిన అవినీతిలో ఇవి మచ్చుకు మాత్రమే. ప్రత్యేక దోపిడీ.. నాలుగేళ్ల పాటు మున్సిపాలిటీకి పాలకమండళ్లు లేకపోవడంతో ప్రత్యేకధికారి పాలన సాగింది. అప్పట్లో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ప్రస్తుత పాలక పక్షం చెబుతుంది. డ్రెయినేజీ, సీసీ రోడ్ల నిర్మాణంలో అప్పటి అధికారి ద్విపాత్రాభినయంలో అందినకాడికి పక్కదారి పట్టించారు. తనకు నచ్చిన వారిని ఆయా విభాగాలలో పెట్టుకోని మంత్రాంగం నడిపించి కోట్ల రూపాయలు వెనకేసున్నట్లు తెలుస్తుంది. వారు చేస్తే దండించేది పోయి వారికి రక్షణగా నిలవడంతో అవినీతి హద్దే లేకుండా కొనసాగిపోతోంది. యూజీడీలో.. పట్టణంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరుపాలని అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డికి ఫిర్యాదులు వెళ్లడంతో ఆయన విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. కానీ దీనిపై నేటికీ నివేదిక రాలేదు. ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. రూ.కోట్లు కొల్లగొడుతున్నారు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అభివృద్ధి పనులను టెండర్ల ద్వారానే చేపట్టాలి. ప్రభుత్వ మార్గద ర్శకాలలోని చిన్న చిన్న లొసుగులను ఆసరాగా చేసుకోని అవినీతి పంట పండిస్తున్నారు. లక్ష రూపాయల లోపు పనులుగా విభజించి పనులు చేపడుతూ కొటేషన్ల ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఉదాహరణకు రూ.10 లక్షల పనులను పది పనులుగా విభజించి ఎవరికి అనుమానం రాకుండా ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్ల ద్వారా పనులు చేయిస్తున్నారు. ఇలా చేయడం వల్ల అవినీతి అక్రమాల భారీ స్థాయిలో జరుగుతాయని ఒకరిద్దరు అధికారులు అభ్యంతరం జెప్పినా పై స్థాయి అధికారులు పెడచెవిన పెటట్డంతో అవినీతి అక్రమాలకు అంతే లేకుండా పోయిందనేది బహిరంగ రహస్యమే. -
టెండర్ల రద్దుకే మొగ్గు..?
► 66 పనుల్లో 46 టెండర్లు ఎక్సెస్కే...! ► పగిడీలతో పనుల పంపకాలే కారణం ► పోటీదారుణ్ని తప్పించిన కాంట్రాక్టర్లు సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో 14వ ఆర్థిక సంఘం నిధుల టెండర్లు రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రూ.6.95 కోట్ల నిధులతో చేపట్టనున్న 66 పనుల్లో 46 పనులకు సింగిల్ షెడ్యూళ్లు దాఖలు కావడం, కాంట్రాక్టర్లు వేలంపాటలు నిర్వహించి పనులు, పగిడీల పంచుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్గా స్పందించడంతో బల్దియూ అధికారులు తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. టెండర్లకు సంబంధించి గురువారమే ప్రైస్బిట్ తెరవాల్సి ఉండగా, కమిషనర్ గత రెండు రోజులుగా కార్యాలయ పనులపై హైదరాబాద్కు వెళ్లడంతో అది సాధ్యపడలేదు. గురువారం సాయంత్రమే టెండర్ల ఫైల్ కమిషనర్ టేబుల్పైకి వెళ్లినట్లు తెలిసింది. వివాదాస్పదంగా మారిన ఈ టెండర్లపై కమిషనర్ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. ఇన్నాళ్లు కాంట్రాక్టర్ల హవా కొనసాగిన నేపథ్యంలో ప్రస్తుత టెండర్లలో కూడా కాంట్రాక్టర్లు తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. సింగిల్ టెండర్లు ఎక్సెస్ రేట్లకు వేస్తే మాత్రం వాటిని రద్దు చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. షెడ్యూల్ దాఖలు చేయడానికి ముందే అసోసియేషన్కు డబ్బులు చెల్లించడం, సింగిల్ టెండర్లే కదా అని ఎక్సెస్ రేట్లకు వేసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే టెండర్లు రద్దు పరచడం ఖాయంగా కనిపిస్తోంది. పోటీదారున్ని తప్పించిన కాంట్రాక్టర్లు..! టెండర్లలో కొన్ని పనులకు పోటీపడ్డ ఓ స్థానికేతర కాంట్రాక్టర్ పోటీనుంచి తప్పుకునే విధంగా స్థానిక కాంట్రాక్టర్లు ఒత్తిడి తేవడంతో తాను పనులు చేయలేనని, ప్రైస్బిట్లో తమ షెడ్యూల్ను తెరవవద్దని లేఖ రాసి ఇచ్చినట్లు సమాచారం. అలాగే పోటీలో ఉన్న మరో ఇద్దరిని కూడా తప్పించి అన్ని పనులకు సింగిల్ షెడ్యూళ్ల ద్వారా స్థానిక కాంట్రాక్టర్లు పనులు దక్కించుకునే అవకాశం చిక్కినట్లే. నిబంధనల ప్రకారమే... - కృష్ణభాస్కర్, కమిషనర్ 14వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన టెండర్లకు సంబంధించిన ఫైల్ను పరిశీలిస్తున్నాం. ఎక్కువ మొత్తంలో సింగిల్ టెండర్లు పడితే మున్సిపల్ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. -
కాంట్రాక్టర్ల కోసమా?
► అలాంటి తెలంగాణ వద్దు: కోదండరాం ► జయశంకర్ బాటలో పోరాడతాం ► సార్ను తెలంగాణ జాతిపితగా ప్రకటించాలి ► అందరి అభివృద్ధే లక్ష్యంగా ప్రజల్లోకి జేఏసీ ►నాకు రాజకీయ ఆకాంక్షలేవీ లేవు ► జయశంకర్ వర్ధంతి సభల్లో వ్యాఖ్యలు సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునే వాళ్లకు లబ్ధి చేకూర్చడానికే పరిమితమయ్యే తెలంగాణ వద్దని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం వ్యాఖ్యానించారు. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు తదితర వర్గాలతో పాటు సబ్బండ వర్ణాల అభివృద్ధి కోసం రాజకీయ జేఏసీ మళ్లీ క్రీయాశీలక పాత్ర పోషిస్తూ భావి కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్తుందని ప్రకటించారు. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ ఐదో వర్ధంతి సందర్భంగా మంగళవారం తెలంగాణ జేఏసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జయశంకర్ సార్ తెలంగాణ సాధనకు తన జీవితాన్ని త్యాగం చేశారంటూ కొనియాడారు. రాష్ట్రం వచ్చాక అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందించాలని కాంక్షించిన ఆయన లేకపోవడం తెలంగాణ సమాజానికి తీరని లోటన్నారు. మలి దశ ఉద్యమంలో ఎంతోమందిని తెలంగాణ వైపు మళ్లించిన ఘనత సార్దేనని చెప్పారు. ‘‘మనుషులు శాశ్వతం కాదు. వారి ఆలోచనా విధానాలు, భావాలు శాశ్వతం. తెలంగాణ సాధించడం ఒక ఎత్తై, అభివృద్ధి చేసుకోవడం మరో ఎత్తని జయశంకర్ సార్ భావించేవారు. ప్రజలందరూ అభివృద్ధి చెందాలని, తెలంగాణ రాష్ట్ర సాధన ఫలాలు అట్టడుగు వర్గాలకు చెందాలనేది ఆయన ఆశయం. తెలంగాణ అభివృద్ధి కోసం మరింత సంఘటితంగా ప్రయత్నించాలని చెప్పిన సార్ బాటలోనే అభివృద్ధి కోసం సంఘటిత పోరాటాలు చేస్తాం. వివిధ అంశాలపై తొందరపడి ఏ విషయమూ మాట్లాడబోం. సమగ్రంగా అధ్యయనం చేసి, లోతుగా పరిశీలించాకే మాట్లాడతాం’’ అని కోదండరాం స్పష్టం చేశారు. ట్యాంక్బండ్ విగ్రహాల కూల్చివేతలను సమర్థించారు జయశంకర్ను తెలంగాణ జాతి పితగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఆగస్టు 6న ఆయన జయంతి వేడుకల నాటికి దీనిపై అధికారికంగా ప్రకటన చేయాలన్నారు. ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి జేఏసీ నాయకులు ప్రతిపాదించిన తీర్మానాన్ని కోదండరాం ఆమోదించారు. ఈ తీర్మానాన్ని ఊరూరా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం ఓయూ విద్యార్థి జేఏసీ, టీఎస్ జాక్ ఆధ్వర్యంలో ఓయూ లైబ్రరీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. మిలియన్ మార్చ్ కార్యక్రమంలో భాగంలో ట్యాంక్బండ్పై విగ్రహాలను కూల్చివేయడాన్ని జయశంకర్ సమర్థించారని చెప్పారు. ‘‘మార్చ్లో ఆయన పాల్గొనలేదు. అదెలా జరిగిందో చెబుదామని సాయంత్రం వాళ్లింటికి వెళ్లాను. ట్యాంక్బండ్ విగ్రహాల ధ్వంసం గురించి ఆయనతో మాట్లాడేందుకు భయపడ్డాం. అయితే, మిలియన్ మార్చ్ బాగా జరిగిందని ఆయనన్నారు. తానూ వద్దామని బయల్దేరినా అక్కడి పరిస్థితుల దృష్ట్యా వద్దనడంతో ఆగిపోయానన్నారు. ట్యాంక్బండ్పై విగ్రహాలొద్దని అప్పటి సీఎం ఎన్టీఆర్కు వినతిపత్రం సమర్పించినా విన్లేదని, వాటిని ధ్వంసం చేయడం మంచిదేనని అన్నారు’’ అని వివరించారు. రాష్ట్ర సాధనకు ఎంత కష్టపడుతున్నామో ఆ తర్వాత ఈ ప్రాంత, ప్రజల అభివృద్ధికి కూడా అంతకంటే ఎక్కువ కృషి చేయాలని సార్ అనేవారన్నారు. తనకు ప్రత్యేక రాజకీయ ఆకాంక్షలేవీ లేవని కోదండరాం పునరుద్ఘాటించారు. ‘‘నావి ఎవరో అనిపిస్తే అంటున్న మాటలు కాదు. తెలంగాణ సమాజమే నా మాటాలకు కారణం. రాష్ట్రంలో కోటి మంది నిరుద్యోగులున్నారు. డిగ్రీ, పీజీ పూర్తి చేసిన 18-35 ఏళ్ల యువకులు 20 లక్షల మంది ఉన్నారు. ఇక పది, ఇంటర్ అయినవారు 80 లక్షల దాకా ఉంటారు. వీరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే’’ అన్నారు. డీఎస్సీ, గ్రూప్-2 ఉద్యోగాలను త్వరగా భర్తీ చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఊరురా దొరల పాలన తెచ్చేందుకే గడీలను మరమ్మతులు చేస్తున్నారని తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ డాక్టర్ చెరుకు సుధాకర్ ఆరోపించారు. గడీల్లో దొరల పాలనను సాగనివ్వబోమని హెచ్చరించారు. అభివృద్ధిపై తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతూ కేసీఆర్ పాలన కొనసాగుతుందని జస్టిస్ చంద్రకుమార్ తప్పుబట్టారు. కార్యక్రమాల్లో ఓయూ అధ్యాపకులు ప్రొఫెసర్లు విశ్వేశ్వర్రావు, ఇటిక్యాల పురుషోత్తం, జేఏసీ నేతలు పిట్టల రవీందర్, ప్రహ్లాదరావు, విద్యార్థి జేఏసీ నేతలు తదితరులు పాల్గొన్నారు. -
సీఎం చెంతకు దళారులు, దోపిడీదారులు
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క వైరా: సీఎం కేసీఆర్ చేసే దోపిడీలో మాకు భాగం కావాలని దళారులు, దోపిడీదారులు, కాంట్రాక్టర్లు పార్టీలు మారి ఆయన వెంట వెళ్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరాలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ముసుగులో.. బంగారు తెలంగాణ పేరుతో దోపిడీ జరుగుతోందని, రాష్ట్రంలో జరిగే దోపిడీని అరికట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, తానే స్వయంగా కండువాలు వేసి రాజ్యాంగ సంక్షోభానికి తెర తీశారన్నారు. సాక్షాత్తూ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తే.. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారని అనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వంలోనే కుట్రలు జరుగుతున్నందున ఇష్టారాజ్యాంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్కు అధికారం కొత్తేమీ కాదని, ప్రభుత్వాన్ని కూల్చే దుష్ట సంస్కృతి తమకు లేదన్నారు. భూసేకరణలో రైతులు, ప్రజలకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ నిర్వాసితుల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఐతం సత్యం, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు తాజుద్దీన్, పార్టీ అధికార ప్రతినిధి పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మండల అధ్యక్షుడు పసుపులేటి మోహన్రావు, నాయకులు శీలం వెంకటనర్సిరెడ్డి, ఏదునూరి సీతారాములు పాల్గొన్నారు. -
రాజధానిలో ‘కష్ట’జీవి
కూలికి పిలిచి పనివ్వకుండా తిప్పిపంపేస్తున్న వైనం రోజుకు 12 గంటలు పని తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల్లో ఇదీ తీరు సాక్షి, అమరావతి: 8 గంటలు పని విధానం.. ఎన్నో పోరాటాలు చేసి కష్టజీవులు సాధించుకున్న హక్కు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని తరలింపు హడావిడితో కష్టజీవి హక్కులు హరించుకుపోతున్నాయి. తక్కువ కూలితోనే 12 గంటలు పనిచేయిస్తూ కాంట్రాక్టర్లు కష్టజీవికి చుక్కలు చూపిస్తున్నారు. వెలగపూడి వద్ద నూతన రాజధాని నిర్మాణ పనులతో ఉపాధి దొరుకుతుందని సుదూర ప్రాంతాలనుంచి వలస వచ్చిన వేలాది మంది పేదలు బెంబేలెత్తే పరిస్థితి. మామూలు ఇచ్చే కూలి మొత్తంతోనే 12 గంటలు పనిచేయిస్తున్నారు. ఫలితంగా కూలీలకు సరైన విశ్రాంతి, నిద్ర దొరక్క ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది. అందుకు ఇటీవల చోటుచేసుకుంటున్న సంఘటనలే నిదర్శనం. గత నెల 10న ఉత్తరప్రదేశ్కు చెందిన దేవేంద్ర, అంతకుముందు పశ్చిమబెంగాల్కు చెందిన మరో కూలీ మరణించిన సంఘటనలు కూలీలను కలవరపెడుతున్నాయి. దీంతో ఒడిస్సా, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చిన అనేకమంది కూలీలు పనులు మానేసి వెళ్లిపోయారు. ఫలితంగా కూలీల కొరత ఏర్పడింది. ప్రస్తుతం మున్సిపల్ కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కూలీలను రప్పిస్తున్నారు. విజయవాడ, గుంటూరు నగరాల నుంచి రోజు కూలీలను బలవంతంగా సచివాలయ నిర్మాణ పనులకోసం తీసుకెళ్తున్నారు. అక్కడ పరిస్థితులు తెలుసుకున్న కూలీలు సచివాలయ పనులకు రాలేమని చేతులెత్తేస్తున్నారు. ఈ స్థితిలో వెలగపూడి వద్ద చేపట్టిన తాత్కాలిక సచివాలయ పనులు మందకొడిగా సాగుతున్నాయి. అగ్రిమెంట్ రాసివ్వాలట! తాత్కాలిక సచివాలయ పనులు పూర్తయ్యే వరకు కూలీలు వెళ్లకుండా ఉండేందుకు వారి నుంచి వందరూపాయల బాండ్పై అగ్రిమెంట్ రాయించుకుంటున్నట్లు కూలీలు వెల్లడించారు. ఆ పత్రాలు కాంట్రాక్టర్ల వద్దే ఉంచుకుని కూలీలను బెదిరిస్తున్నట్లు శ్రీకాకుళానికి చెందిన అప్పలరాజు అనే వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రిమెంట్ నిబంధనలు తెలుసుకున్న కొందరు కూలీలు సచివాలయ నిర్మాణ పనుల్లో భాగస్వామ్యం కావడానికి ఇష్టం లేక వెనుదిరిగి వెళ్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో కొందరు కాంట్రాక్టర్ల నిబంధనలకు అంగీకరించి సంతకాలు చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం సుమారు 2వేల మంది కూలీలు పనులు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందినవారితో పాటు ఎక్కువగా నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, ఒంగోలు, ఏలూరు, విజయవాడ, గుంటూరు, కర్నూలు ప్రాంతాల కూలీలు ఉన్నారు. పనులిస్తామని చెప్పి సాయంత్రానికి తిప్పి పంపారు రెండు రోజుల క్రితం పని ఉందని చెప్పి 10 మందిని బెంజిసర్కిల్లో బస్సెక్కించారు. రాజధాని పనులు చేస్తున్నచోట దిగబెట్టారు. పనులు చెప్పకుండా సాయంత్రం వరకు కూర్చోబెట్టారు. మధ్యాహ్నం భోజనం కూడా పెట్టకుండా సాయంత్రం ఒట్టిచేతుల్తో తిప్పిపంపారు. - చిన్న, విజయవాడ కూలిడబ్బుల కోసం అర్ధరాత్రి వరకు... శనివారం పని ఇస్తామని తీసుకెళ్లారు. సాయంత్రం 5.30వరకు పనిచేయించుకున్నారు. డబ్బులివ్వమంటే అక్కడికెళ్లి తీసుకో.. అంటూ తిప్పారు. రాత్రి 11గంటలకు డబ్బులిచ్చారు. అది కూడా ఒక్కొక్కరికి రూ.400లే. అదే మేం బయట చేసుకుంటే రోజుకు రూ.600 వస్తుంది. అందుకే మరుసటిరోజు నుంచి వెళ్లటం మానేశాం. -సంతోష్, విజయవాడ అక్కడ పనిచేయలేం రాజధాని కట్టేచోట పనిచేయలేం సార్. 12గంటలు పనిచేయాలంట. పనిచేయాలన్నా అగ్రిమెంట్ రాసివ్వాలంట. కూలి మాత్రం రోజుకు రూ.400లేనట. ఇలా అయితే ఎలా పనిచేయగలం. షిఫ్ట్ల ప్రకారం పెట్టి పనిచేయాలని చెప్పాలి. కూలి గిట్టుబాటు కావాలి కదా? -బాలస్వామి, విజయవాడ -
పని చేయకుంటే ‘బ్లాక్ లిస్టే’
ఖమ్మం : నిర్ణీత కాల వ్యవధిలో పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లకు జరిమానా విధించడంతోపాటు పేర్లు బ్లాక్ లిస్టులో పెడతామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. ఖమ్మం నగరంలోని టీటీడీసీ భవనంలో జిల్లా అభివృద్ధి పనులపై ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్, జిల్లా పరిషత్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్లతో కలిసి మంత్రి తుమ్మల సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల ద్వారా జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. కాకతీయ మిషన్ పనుల్లో చెరువు పూడిక పనులకంటే ముందు సిమెంటు పనులు పూర్తిచేయాలన్నారు. మొదటి దశలో 851 పనులకు.. 801 పనులు పూర్తయ్యాయని, రెండో దశలో 927 పనులు మంజూరు చేయగా.. 41 పనులు పూర్తయ్యాయని, మిగిలిన 865 పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. జూన్ 15 నాటికి ఆ పనులన్నీ పూర్తి చేయాలన్నారు. జిల్లాలో మిషన్ కాకతీయ ద్వారా 4,517 చెరువుల పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రానున్న రెండేళ్లలో చెరువుల పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. కిన్నెరసాని ప్రాజెక్టు ద్వారా ఖరీఫ్లో పదివేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నారు. పాలెం వాగు పనులను త్వరితగతిన పూర్తి చేయలన్నారు. దీనిద్వారా 12,500 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. చెక్డ్యామ్ పనులను వేగవంతం చేయాలని, పదిహేను రోజుల్లో సేఫ్ లెవల్ వంతెన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. భగీరథ పనులతో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రానీయవద్దన్నారు. 740 గ్రామాలకు డిసెంబర్ నాటికి తాగునీరు అందిస్తామన్నారు. పంచాయతీ రాజ్ శాఖ పనితీరు సరిగా లేదంటూ మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ లోకేష్కుమార్ మాట్లాడుతూ మిషన్ భగీరథలో పర్ణశాల, పూసూరు, కూసుమంచి ఇన్టేక్, వాటర్ టెస్టింగ్ ప్లాంటును సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తామన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టు భూసేకరణ పనులను జూన్ 15 నాటికి పూర్తి చేస్తామన్నారు. -
తప్పుకుంటే సరి.. లేదంటే అంతే..
కాంట్రాక్టర్లకు పీఏలతో ఫోన్లు చేయించిన ప్రజాప్రతినిధులు! టెండర్ను తమ వారికి వదిలేయాలంటూ బెదిరింపులు లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు ఏలూరు : ‘నేను ఫలానా ప్రజాప్రతి నిధికి పీఏను. ఆ పనికి మీరు టెండర్ వేశారంటగా. వెంటనే టెండర్ షెడ్యూల్ వెనక్కి తీసుకోండి. లేకపోతే.. మీ సంగతి చూస్తాం’ అంటూ ఇరిగేషన్ పనులకు టెండర్లు వేసిన కాంట్రాక్టర్లను హెచ్చరించిన ఘటనలు జిల్లాలో గురువారం చోటుచేసుకున్నాయి. కొందరు కాంట్రాక్టర్లు అడ్డం తిరగడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలోని నల్లసముద్రం చెరువును ఆధునికీకరించేందుకు రూ.49.4 లక్షలను కేటాయించారు. పనులు చేపట్టే కాంట్రాక్టర్ ఎంపిక కోసం ఈ-టెండర్ పిలిచారు. టెండర్ షెడ్యూళ్లను దాఖలు చేసేం దుకు గురువారం చివరి తేదీ కాగా, సుమారు 20 మంది టెండర్లు వేశారు. ఇందులో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఉన్నారు. పోటీ ఎక్కువ ఉండటంతో కనీసం 27 నుంచి 30 శాతం వరకూ తక్కువ ధరకు టెండర్లు కోట్ చేసినట్టు సమాచారం. అయితే ఒక ముఖ్య ప్రజాప్రతినిధికి, ఒక ప్రజా ప్రతినిధికి అనుకూల మైన కాంట్రాక్టర్ ఈ టెండర్ దక్కించుకునేందుకు రంగంలోకి దిగారు. ఆయన 0.5 శాతం తక్కువకు టెండర్ వేశారు. మిగిలిన కాంట్రాక్టర్లను టెండర్లు వెనక్కి తీసుకోవాలంటూ బెదిరింపులకు గురిచేశారు. ఒక ముఖ్యప్రజాప్రతినిధి దగ్గర పనిచేసే పర్సనల్ అసిస్టెంట్ (పీఏ)తోపాటు జిల్లాలో దుందుడుకుగా వ్యవహరించే ప్రజాప్రతినిధి సన్నిహితుడు ఒకరు రంగంలోకి దిగారు. కాంట్రాక్టర్లందరికీ ఫోన్లుచేసి ‘మీరు పోటీ నుంచి తప్పుకుంటే మంచిది. కాకుంటే మా బాస్ల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మధ్యాహ్నం మూడు గంటలలోపు టెండర్లు వెనక్కి తీసుకోకపోతే మీ పని అంతే’నంటూ హెచ్చరికలు జారీ చేశారు. అధికార పార్టీతో ఢీకొట్టడానికి భయపడిన కొందరు కాంట్రాక్టర్లు టెండర్లు వెనక్కి తీసుకున్నట్టు సమాచారం. అయితే కొందరు కాంట్రాక్టర్లు ఈ విషయాన్ని ముఖ్యప్రజాప్రతినిధి వద్దే తేల్చుకుంటామని అడ్డం తిరగడంతో టెండర్ దక్కించుకోవాలనుకున్న నేత ప్రయత్నాలు ఫలించలేదు. ఇదిలా వుండగా, కాంట్రాక్టర్లను బెదిరింపులకు గురిచేయడం టీడీపీ వర్గాల్లో చర్చకు దారితీసింది. సొంత పార్టీ వారిని కూడా బెదిరించడంపై వారు అధిష్టానం వద్ద పంచాయితీ పెట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం. -
లెస్ కోట్.. ఇదో వ్యాపారం
కాంట్రాక్టర్ల కొత్త ఆలోచనలు 35 శాతం లెస్తోనూ పనులు నాణ్యత ఉండేనా మరి! ఒక్క దేవరకొండలోనే రూ.450 కోట్ల పనులు దేవరకొండ : సాధారణంగా ఏదైనా అభివృద్ధి పని చేయాలంటే అధికారులు క్షేత్ర పర్యటన చేసి.. నాణ్యత పక్కాగా చూసుకుని.. ఆ పనికి అయ్యే ఖర్చు అంచనా వేసి.. ప్రతిపాదనలు తయారు చేస్తారు. దానికి కాంట్రాక్టర్ లాభాన్ని కలిపి ఆ పనికి విలువ తయారు చేసి టెండర్లు పిలుస్తారు. మరి టెండర్లలో కాంట్రాక్టర్లు 35 శాతం లెస్కు కూడా కోట్ చేసి ఆ పనిని దక్కించుకుంటున్నారు. అంటే కోటి రూపాయల విలువతో ఒక పనిని చేయొచ్చని అధికారులు అంచనా వేస్తే కాంట్రాక్టర్లు మాత్రం కేవలం ఆ పనిని రూ.60 నుంచి రూ.70 లక్షలలోపే పని చేస్తామని లెస్ కోట్ చేసి పనిని దక్కించుకుంటున్నారు. అయితే ఇందులో కాంట్రాక్టర్ నష్టపోతాడా..? లేక ఆ పనిలో నాణ్యత ప్రశ్నార్థకంగా మారుతుందా..? అనేది అంతుచిక్కని ప్రశ్నే.. నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం కోట్ల రూపాయల విలువైన మిషన్ కాకతీయ పనులు, ఇతర అభివృద్ధి పనులు, కృష్ణా పుష్కరాల పనులు జరుగుతుండగా ఒక్క దేవరకొండ నియోజకవర్గంలోనే ప్రస్తుతం రూ. 450 కోట్ల పనులు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇదే సమయంలో కృష్ణా పుష్కరాలు రానున్న ఆగస్టు నెలలో జరుగుతుండగా మరో 4 నెలల్లో చేయాల్సిన ఈ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పుష్కర పనులు, అభివృద్ధి పనులు కోట్ల రూపాయల్లో జరుగుతుండగా రూ.10 లక్షలు విలువ చేసే పనులను ఆన్లైన్లో టెండర్లు పిలుస్తున్నారు. అయితే దేవరకొండలో ఫస్ట్ ఫేజ్ మిషన్ కాకతీయ పనులు రూ. 9 కోట్ల విలువ కాగా సెకండ్ ఫేజ్ మిషన్ కాకతీయ పనులను రూ.35.33 కోట్లతో చేపడుతున్నారు. అంతేకాక దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట, పీఏపల్లి మండలాల పరిధిలో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేస్తుండగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రావడానికి అణువుగా పలు చోట్ల రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. అంతేకాక దేవరకొండలోనూ పట్టణాభివృద్ధి కోసం రూ.కోటి 40 లక్షల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. చాలా పనులు లెస్లోనే... చేపడుతున్న అభివృద్ధి పనుల్లో చాలా వరకు కాంట్రాక్టర్లు అంచనాల విలువ కంటే లెస్లోనే కోట్ చేసి ఆ పనులు దక్కించుకుంటున్నారు. దేవరకొండలోని ఒక పనిలో ఏకంగా ఓ కాంట్రాక్టర్ 35 శాతం లెస్కు కోట్ చేసి దక్కించుకున్నారు. ఇదొక్క పనే కాదు మిషన్ కాకతీయలో చాలా పనులు 14 నుంచి 35 శాతం వరకు లెస్కే కోట్ చేసి దక్కించుకున్నారు. వాస్తవంగా అధికారులు ఒక పని విలువ నిర్ణయించడానికి క్షేత్ర పర్యటన చేసి ప్రతిపాదన తయారు చేసి కాంట్రాక్టర్ లాభాన్ని జత చేసి ఆ పని విలువతో టెండర్లు పిలుస్తారు. అయితే కాంట్రాక్టర్లు మాత్రం ఎక్సెస్ వేయాల్సిన ధరను లెస్కు కూడా చేయడానికి ముందుకొస్తున్నారు. నాణ్యత ప్రశ్నార్థకమే...? అధికారులు చేయాల్సిన పనికి ఒక ధరను నిర్ణయించినప్పుడు ఆ ధర కంటే లోపే ఆ పని చేయాలంటే ఒకటి కాంట్రాక్టరైనా నష్టపోవాలి. లేదంటే ఆ పనిలో నాణ్యతైనా తగ్గాలి. వాస్తవంగా ప్రభుత్వ టెండర్లలో ఆ పని విలువలో మొదటగా పనిని తగ్గించుకోవాలంటే 2.5 శాతాన్ని ఈఎండీగా ముందే ధరావత్గా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక శాతాన్ని అగ్రిమెంట్ కోసం చెల్లించాలి. దీనికి తోడు కొన్ని చోట్ల అధికారులకు ఇవ్వాల్సిన ఆమ్యామ్యాలు కూడా అందరికీ తెలిసినవే. అయితే టెండర్లలో లెస్ కోట్లతో జరిగే పనుల వల్ల నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లెస్ కోట్లతో చేసే పనులు పెద్దపెద్ద కాంట్రాక్టర్లకు మినహా సాధారణ కాంట్రాక్టర్లకు సాధ్యమయ్యే పని కాదు. కానీ ఇలాంటి పనులు దేవరకొండలోనూ చాలా వరకు జరుగుతున్నాయి. పనుల ఎగవేతే... చాలా పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ల పరిస్థితి దయనీయంగా మారుతోంది. పనులు దక్కించుకునే క్రమంలో లెస్లకు కోట్ చేయడం, పని దక్కించుకోవడం కంటే ముందుగానే మూడున్నర శాతం ఈఎండీ, అగ్రిమెంట్ల రూపంలో ప్రభుత్వం దగ్గర ఉంచి అప్పులు తెచ్చి పనులు ప్రారంభిస్తున్నారు. చివరకు పనులు పూర్తి కాక తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక నానా తంటాలు పడుతున్నారు. దీని వల్ల అటు అనుకున్న సమయానికి పనులు పూర్తి కాకపోవడం, కాంట్రాక్టర్ నష్టపోతున్న క్రమంలో కొంత మంది అధికారులతో లాలూచీ పడటం వల్ల పనులు లోపభూయిష్టంగా జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
'నాణ్యత లేకపోతే క్రిమినల్ కేసులు'
పుల్కల్: మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత పాటించని కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎమ్మెల్యే బాబూ మోహన్ హెచ్చరించారు. మంగళవారం మెదక్ జిల్లా పుల్కల్ మండలం చక్రియాల్లో మిషన్ కాకతీయ పనులను అయన ప్రారంభించారు. కామని చెరువుకు రూ.27 లక్షలు, నల్లకుంటకు రూ.23 లక్షలతో పూడికతీత పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు లాభాల కోసం కాకుండా సేవాభావంతో పనులు చేయాలని సూచించారు. -
మళ్లీ పెరిగిన అంచనాలు
విజయనగరం కంటోన్మెంట్: తారక రామ తీర్ధ సాగర్ పనులకు మరో అవరోధం ఎదురయ్యింది. ఎప్పటికప్పుడు వాయిదాలు, గడువులతోనే సా....గుతున్న పనులకు మరో ఆటంకం ఎదురయింది. ప్రాజెక్టుకు అటవీ అనుమతులు రాకపోయినా అంచనాలు మాత్రం పెరిగిపోతున్నాయి. ప్రాజెక్టు పరిధిలోని రామతీర్థం కొండ లోంచి తవ్వాల్సిన సుమారు కిలోమీటరు పైగా సొరంగం పనులకు సంబంధించి 2008లో రూ.11 కోట్లు మంజూరయ్యాయి. వాటితో అప్పట్లో పనులు చేస్తే సకాలంలో పూర్తయ్యేది. కానీ అటవీ అనుమతులు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవ్వడంతో పనులు సాగడం లేదు. ఇప్పుడు ఈ సొరంగం పనులు చేపట్టేందుకు అవసరమైన అధునాతన మెషీన్లు కొనుగోలు చేయడానికి అప్పటి నిధులు చాలవని కాంట్రాక్టర్లు తేల్చేశారు. ఇప్పుడు ఈ టన్నెల్ తవ్వాలంటే సుమారు రూ. 40 కోట్లు ఖర్చవుతుందని అధికారులు, కాంట్రాక్టర్లు అంచనాలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. టన్నెల్ బోరింగ్ మెషీన్లు ఇక్కడే తయారు చేసి పనులు చేయాలి. ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఏళ్ల తరబడి అటవీ అనుమతులపేరుతో కాలయాపన చేస్తుండటంవల్ల టన్నెల్ పనులు అలానే నిలిచిపోయాయి. పెరిగిన ధరలిస్తే తప్ప పనులు చేపట్టలేమని కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేయడంతో ప్రాజక్టుకు మరో ఆటంకం ఎదురయినట్టయింది. -
సబ్స్టేషన్ ఆపరేటర్లకు అందని జీతాలు
నిజామాబాద్ నాగారం : వారు ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న విద్యుత్ సబ్స్టేషన్ల ఆపరేటర్లు. సకాలంలో వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆర్మూర్, కామారెడ్డి డివిజన్లలో పనిచేస్తున్న ఆపరేటర్లకు కాంట్రాక్టర్లు సరిగ్గా వేతనాలు ఇవ్వడం లేదన్న ఆరోపణలున్నాయి. ఆర్మూర్, కామారెడ్డిల్లోనే.. జిల్లాలో విద్యుత్శాఖలో నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బాన్సువాడ డివిజన్లు ఉన్నాయి. ఇందులో నిజామాబాద్, బాన్సువాడ డివిజన్లలో ఆపరేటర్లకు వేతనాలు అందుతున్నా.. ఆర్మూర్, కామారెడ్డి డివిజన్లలో మాత్రం సమస్య ఉంది. ఈ రెండు డివిజన్లలో పనిచేస్తున్న సబ్స్టేషన్ల ఆపరేటర్లకు తొమ్మిది నెలలుగా వేతనాలు అందడం లేదు. ఆర్మూర్ డివిజన్లో 64 సబ్స్టేషన్లున్నాయి. ఆయా సబ్ స్టేషన్ల పరిధిలో పనిచేస్తున్న ఆపరేటర్లకు నెలకు రూ. 10,771 వేతనం ఇవ్వాలి. కానీ చాలా సబ్స్టేషన్లలో కాంట్రాక్టర్లు రూ. 8 వేలకు మించి వేతనం ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఫత్తేపూర్, మగ్గిడి, ఆర్మూర్ టౌన్, ఇస్సాపల్లి, పడకల్, మునిపల్లి తదితర సబ్స్టేషన్లలో పనిచేస్తున్న ఆపరేటర్లకైతే తొమ్మిది నెలలుగా వేతనాలు అందడం లేదని తెలిసింది. కామారెడ్డి డివిజన్లో 71 సబ్స్టేషన్లున్నాయి. ఇందులో జంగంపల్లి, తిప్పాపూర్, తలమడ్లలలోని ఆ పరేటర్లకు నాలుగు నెలలనుంచి వేతనాలు రావడంలే దు. సోమార్పేట్, ఫరీద్పేట్, లచ్చంపేట్ తదితర సబ్స్టేషన్లలో ఆరు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా అందని కరువు భత్యం కామారెడ్డి, ఆర్మూర్ డివిజన్లలోని సబ్స్టేషన్ల ఆపరేటర్లకు 2014 నుంచి కరువు భత్యం చెల్లించడం లేదు. ఒక్కో ఆపరేటర్కు రూ. 30 వేలకుపైగా రావా ల్సి ఉంది. ఈ మొత్తం కోసం ఆపరేటర్లు రెండేళ్లుగా నిరీక్షిస్తున్నారు. ఈ విషయమై కాంట్రాక్టర్లకు ఎన్నిసార్లు విన్నవించినా.. సమస్యను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సైతం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం సబ్స్టేషన్ ఆపరేటర్లు పనులు చేసేది విద్యుత్ శాఖ అధికారుల కనుసన్నల్లోనే. అయితే వీరికి జీతాలు మాత్రం కాంట్రాక్టర్లు ఇస్తారు. ప్రతి నెల ఆపరేటర్లకు వచ్చే జీతాల నుంచి అధికారులకు పర్సేంటీజీలు ఇస్తున్నామని కాంట్రాక్టర్లు బహిరంగంగానే చెబుతున్నారు. కొన్ని సబ్స్టేషన్లలోనైతే అసలు వేతనాలే ఇవ్వడం లేదు. ఈ విషయమై డీఈఈలకు ఫి ర్యాదు చేసినా స్పందించడం లేదని ఆపరేటర్లు పే ర్కొంటున్నారు. ‘‘ఇష్టం ఉంటే పనిచేయండి లేకపోతే మానేయండి’’ అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు ఇప్పించాలని కోరుతున్నారు. -
వేలంలో కొట్టుకున్నకాంట్రాక్టర్లు
ఇద్దరికి గాయాలు అమలాపురంలో బెడిసికొట్టిన రింగ్ అమలాపురం టౌన్ : తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కాంట్రాక్టర్ల మధ్య తలెత్తిన ఘర్షణతో కొట్లాటకు దిగారు. కుర్చీలు విసురుకుని... పిడిగుద్దులతో బాహాబాహీకి దిగడంతో కార్యాలయ ఆవరణ మంగళవారం సాయంత్రం ఉద్రిక్తంగా మారింది. పాత ఇనుము వేలం పాట సందర్భంగా రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన కాంట్రాక్టర్ల సమక్షంలో కొందరు కాంట్రాక్టర్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఎదురుగా ఉన్న పట్టణ పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. ఈ కొట్లాటలో ఇద్దరు కాంట్రాక్టర్లు గాయపడి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పూర్తిగా పాడై మూలన పడ్డ తొట్టె ఆటో, ట్రాక్టరు, వాటర్ ట్యాంకర్, ఇతర పాత ఇనప సామగ్రికి వేలం పాట నిర్వహిస్తున్నట్టు మున్సిపల్ అధికారులు పత్రికల్లో నోటిఫికేషన్ ప్రచురించారు. మున్సిపాలిటీలో దాదాపు 20 టన్నులకు పైగా ఉన్న ఆ పాత ఇనుప సామగ్రికి ఇంజనీరింగ్ అధికారులు మంగళవారం సాయంత్రం కార్యాలయ ఆవరణలో వేలంపాట నిర్వహించారు. ఈ పాటలకు గుంటూరు జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి దాదాపు 70 మంది కాంట్రాక్టర్లు హాజరయ్యారు. మున్సిపాలిటీ కిలో పాత ఇనుము ధర రూ.13 కనీస ధరగా ప్రకటించి వేలం మొదలు పెట్టింది. అప్పటికే కొందరు కాంట్రాక్టర్లు రింగై కిలో ఇనుము ధర రూ. 6 నుంచి మొదలు పెట్టాలని పట్టుపట్టారు. దానికి అధికారులు ససేమిరా అన్నారు. దీంతో వేలం పాటలో సిండికేట్ కావడం ద్వారా మొత్తం ఇనుమును తక్కువ ధరకే దక్కించుకునేలా పథకం పన్నారు. ఇంతలో ఒక కాంట్రాక్టరు కిలో ఇనుము రూ.11కే పాట పాడేందుకు ముందుకు వచ్చారు. ఈ పరిణామం అప్పటికే రింగైన కాంట్రాక్టర్లకు చిర్రెత్తింది. రింగ్ను కాదని ఒప్పందంలో లేని ధరతో పాట పాడటాన్ని రింగ్దారులు జీర్జించుకోలేక ఘర్షణకు దిగారు. అక్కడే కుర్చీని విసిరడంతో అమలాపురానికి చెందిన ఓ కాంట్రాక్టరు చేతికి గాయమైంది. పిడిగుద్దులు, తోపులాటతో కొట్టాటకు దిగటంతో ఘర్షణ వాతారణం చోటుచేసుకుంది. మరో కాంట్రాక్టర్కు వీపునకు గాయమైంది. ఇంతలో అమలాపురానికి చెందిన కొందరు కాంట్రాక్టర్లు మా ఊరు వచ్చి...మా మున్సిపాలిటీకి వచ్చి మాపైనే దాడులకు దిగుతారంటూ వారూ వీరంగం చేశారు. రాజమహేంద్రవరానికి చెందిన ఇద్దరు కాంట్రాక్టరు మద్యం సేవించి తమపై దాడి చేశారని... ఇద్దరు గాయపడ్డారని అమలాపురానికి చెందిన కాంట్రాక్టర్ల తరపున కాంట్రాక్టర్ అల్లాడి రమణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే రాజమహేంద్రవరానికి చెందిన కాంట్రాక్టర్లు తమపై అమలాపురం కాంట్రాక్టర్లు దాడి చేశారంటూ వారూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ మున్సిపల్ కార్యాలయ ఆవరణను సందర్శించి కాంట్రాక్టర్లను విచారించారు. కమిషనర్ సీహెచ్.శ్రీనివాస్, డీఈఈ ప్రసాద్తో కాంట్రాక్టర్ల వివాదం గురించి ఆరా తీశారు. మున్సిపల్ డీఈఈ ప్రసాద్ మాట్లాడుతూ కార్యాలయ ఆవరణలో కాంట్రాక్టర్లు గొడవ పడ్డారని. .. అది తమ కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. -
‘కాంట్రాక్టర్ల పనులకు అధికారులే బాధ్యులు’
మిషన్ కాకతీయ తొలివిడతలో చాలా చోట్ల పనులు పూర్తి కాలేదని, దీనికి అధికారులే సమాధానం చెప్పాలని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హెచ్చరించారు. గురువారం ఆయన స్థానికంగా మాట్లాడుతూ మొదటి విడతలో చెరువుల మరమ్మతు కాంట్రాక్టు దక్కించుకుని పనులు పూర్తిచేయని కాంట్రాక్టర్ లకు రెండోవిడత పనులను అప్పగించొద్దని, వారి పేర్లను బ్లాక్లిస్టులో పెట్టాలన్నారు. దౌల్తాబాద్ మండలం గాజులపల్లి కనకచెర్వు, టెంకంపేట అల్లీ చెర్వు, ముబారస్పూర్, బేగంపేట పనులను నాసిరకంగా చేశారని ఆరోపణలున్నాయని తెలిపారు. మొదటి విడత పనుల్లో జరిగిన లోటుపాట్లను గ్రహించి అధికారులు రెండోవిడత పనుల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, లేకుంటే చర్యలు తప్పవన్నారు. -
రహస్య సమావేశం ఎందుకు..?
సివిల్ వర్కుల్లో అధికార పార్టీ నేతల ఆగడాలు ప్రజా ధనానికి గండి కొట్టే ప్రయత్నం రూ.2 కోట్ల మేర నగర పాలకానికి నష్టం..? ఇంజినీరింగ్ అధికారులు, ఫైవ్మెన్ కమిటీ తెరవెనుక డెరైక్షన్ రంగంలోకి అధికార పార్టీ కాంట్రాక్టర్లు ఒంగోలు అర్బన్: ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆదివారం రాత్రి కాంట్రాక్టర్లు రహస్యంగా సమావేశమయ్యారు. ఈ నెల 17వ తేదీ 170 పనులకి సంబంధించి రూ.11 కోట్ల టెండర్లు జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు సమావేశం కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నారు. గతంలో కూడా ఇదే మొత్తానికి టెండర్లు నిర్వహించి భారీఎత్తున పర్సంటేజిలు ముందుగానే తీసుకొని ప్రజాధనాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేసిన అధికార పార్టీ నేతలు, ఫైవ్మెన్ కమిటీ ప్రయత్నాలను ‘సాక్షి’ బహిర్గతం చేయడంతో ఈ ఏడాది జనవరి 1వ తేదీన హడావుడిగా రాత్రికిరాత్రే సాంకేతిక కారణాల పేరుతో టెండర్లు రద్దుచేసిన విషయం తెలిసిందే. అయితే ఫైవ్మెన్ కమిటీ ప్రజాధనంపై పెట్టుకున్న ఆశలు మాత్రం చావలేదు. దీంతో ఎన్నో రకాలుగా తమ కాంట్రాక్టర్లకు లెస్లు లేకుండా పనులు అప్పగించి కోట్లాది రూపాయలు స్వాహా చేసేందుకు ప్రయత్నాలు చే స్తూనే ఉన్నారు. దీనికి ఓఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు తోడ్పాటు ఉండటంతో ఏదో విధంగా తమవారికే పనులు కేటాయించుకోవాలని అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు ‘సాక్షి’ వారి ఆగడాలను వెలుగులోకి తెస్తూనే ఉంది. కార్పొరేషన్ ప్రత్యేక అధికారి అయిన కలెక్టర్ కూడా టెండర్ల విషయంపై దృష్టి సారించకపోవడంతో అధికార పార్టీ ఆగడాలకు అంతులేకుండా పోతోంది. అధికార పార్టీ వారిని కాదని ఎవరైనా ఇతర కాంట్రాక్టర్లు పోటీకి దిగితే వారికి ఇప్పటి వరకు రావాల్సిన బిల్లులను నిలుపుదల చేస్తామని ఇంజినీరింగ్ విభాగం అధికారులు హెచ్చరించడం పరిపాటి అయింది. ఇప్పటికే ఇంజినీరింగ్ విభాగం అడ్డగోలుగా వారికి ఇష్టమొచ్చిన వారికే పనులు ముందుగా కేటాయిస్తూ తర్వాత టెండర్లకు పిలవడం కూడా పలు మార్లు జరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఇంజినీరింగ్ విభాగం అధికారులు, ఫైవ్మెన్ కమిటీ సభ్యులు సీన్లోకి రాకుండా తెరవెనుక ఉండి డెరైక్షన్ చేయడంతో వారికి సంబంధించిన కాంట్రాక్టర్లు రహస్యంగా సమావేశమై పనుల కేటాయింపుపై తర్జనభర్జనలు పడ్డారు. రూ.11 కోట్లకి సంబంధించి 170 పనులను డివిజన్ల వారీగా 5 పనుల లెక్కన ప్యాకేజిలుగా విడగొట్టారు. ఒక్కో ప్యాకేజిలో 3 డ్రైన్లు, 2 రోడ్లుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. వాటిలో కూడా ఏదైనా డివిజన్లో ఎక్కువ మిగిలే పనులు ఉంటే వాటిని డ్రా పద్ధతిలో కేటాయించేలా చర్చలు జరిపారు. దీనికి సంబంధించి అధికార పార్టీ కమిటీకి డ్రైన్కు 5శాతం, రోడ్డుకి 6 శాతం లెక్కన పర్సటేంజ్లు ఇచ్చేలా నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ మామూళ్లను టెండర్లు వేసేటపుడు ముందుగానే కమిటీ సభ్యులకి ముట్టచెప్పాలని అధికార పార్టీ మనుషులు కాంట్రాక్టర్లకు హుకుం జారీ చేశారు. అయితే సదరు కాంట్రాక్టర్లు గత అనుభవం దృష్ట్యా ముందుగా డబ్బు ఇవ్వమని వర్క్ ఆర్డర్ చేతికి వచ్చాక మాత్రమే ఇస్తామని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఇవే పనులను జరగాల్సిన ప్రక్రియ ప్రకారం టెండర్లు వేస్తే దాదాపుగా 20 నుంచి 25 శాతం వరకు లెస్సుల రూపంలో నగర పాలకానికి రూ.2 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అలా కాకుండా అధికార పార్టీకి తలొగ్గి 5,6 శాతం మామూళ్ల కోసం ఒక శాతం లోపు లెస్సులకి టెండర్లు వేయడం ద్వారా ప్రజాధనం దాదాపుగా రూ.1.50 కోట్లు అధికార పార్టీ కమిటీ సభ్యులు, వారి నాయకుడు, ఇంజినీరింగ్ విభాగం అధికారుల జేబుల్లోకి పోతుంది. ఈ నేపథ్యంలో ప్రజాధనం వృథా కాకుండా చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి. ఇప్పటికైనా కార్పొరేషన్ ప్రత్యేక అధికారి కలెక్టర్ టెండర్ల వ్యవహారంపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
‘పచ్చ’ నోట్ల పరవళ్లు!
ప్రతిపక్ష ప్రజాప్రతినిధులపై ప్రలోభాల వల * వెర్రి తలలేస్తున్న అధికార పార్టీ ఆఫర్లు * రూ. 20 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు నగదు * పదవులు.. చర, స్థిరాస్తులు.. కాంట్రాక్టులు * కేసులు ఎత్తివేస్తాం.. ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని హామీ * అవినీతి సంపాదనతో బరితెగించిన టీడీపీ నాయకత్వం * పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుయుక్తులు * రాష్ట్రంలో పార్టీని బతికించుకొనేందుకు పచ్చ కుట్రలు సాక్షి, ప్రత్యేక ప్రతినిధి ‘‘మా పార్టీలో చేరిపో.. నీకు ఎంత కావాలి? చరాస్తా... స్థిరస్తా? నగదా... విలువైన ప్రాంతాల్లో స్థలాలా, పొలాలా? కాంట్రాక్టులా, గనులా? ఏ పదవైతే సరే అంటావు? పోనీ నూతన రాజధానిలో వ్యాపారాలు ఏమైనా చేసుకుంటావా? మీపై ఏవైనా కేసులుంటే ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాం’’ - రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు అత్యంత ఖరీదైన ఈ ఆఫర్లు ఇస్తున్నది ఎవరో కాదు, సాక్షాత్తూ టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన అనుచర బృందం. అధికారం ఉందనే అహంకారంతో, అవినీతి సొమ్ముతో టీడీపీ నాయకత్వం రెచ్చిపోతోంది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై సిగ్గూ ఎగ్గూ లేకుండా ప్రలోభ వల విసురుతోంది. ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తోంది. ప్రారంభ ధరే రూ.20 కోట్లు. సంతలో బేరంలా, వేలం పాటలో పెంపులా ధరను పెంచుకుంటూ పోతోంది. ప్రజాప్రతినిధులకు కొనేయడానికి అధికార పక్షానికి రూ.వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రతిపక్ష సభ్యులను తమవైపునకు తిప్పుకోవడానికి కారణమేంటి? ప్రస్తుతం రాష్ట్ర ప్రజల మదిని తొలస్తున్న ప్రశ్నలివే. పబ్బం గడుపుకునేందుకే ఫిరాయింపులు అనతి కాలంలోనే ప్రజాదరణను కోల్పోయిన టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులను చేర్చుకునే కుట్రలకు తెరతీసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ ఫిరాయింపుల పర్వం బేరసారాలతో మొదలై బెదిరింపుల వరకూ వెళుతోంది. అంతటితో ఆగకుండా దగ్గరి బంధువులు, ఆయా సామాజిక వర్గాలు, ప్రాంతాలు, మతాలను కూడా తమ సంత బేరసారాల్లో భాగస్వాములను చేస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలనే ఆతృతతో ఇష్టానుసారంగా హామీలన్నీ గుప్పించిన తెలుగు దేశాధినేత వాటిని అమలు చేయడంలో పూర్తిగా చతికిలపడ్డారు. అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అన్ని పనుల్లో అవినీతి రాజ్యమేలుతోంది. పదేళ్ల తర్వాత అధికారం దక్కడంతో తెలుగు తమ్ముళ్లు జేబులు నింపుకొనే పనిలో పడ్డారు. పైస్థాయి నుంచి కింది దాకా ఇదే పరిస్థితి. ప్రజాదరణను పూర్తిగా కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న చంద్రబాబు ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు భారీ ఆఫర్లు ఇచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారు. తద్వారా తన చేతగానితనాన్ని, పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటున్నారు. తన అవినీతి, అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే కుహకాలకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకే కళంకం తెస్తున్నారు. పబ్బం గడుపుకునేందుకు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. జాతీయ పార్టీగా ప్రకటించుకున్న టీడీపీ తెలంగాణలో ఇప్పటికే చాపచుట్టేసింది. ఆంధ్రప్రదేశ్లోనైనా పార్టీని బతికించుకోవడానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రక్రయకు శ్రీకారం చుట్టారు. భారీగానే ప్యాకేజీల బరువు ♦ ఉత్తరాంధ్రలోని ఓ ప్రతిపక్ష ఎమ్మెల్యేపై వల విసురుతున్నారు. రూ.20 కోట్లకుపైగా నగదు, రాజధాని ప్రాంతం వద్ద రెండెకరాల భూమిని నజరానాగా ఇస్తామని కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి బేరసారాలను సాగిస్తున్నారు. ♦ ఉత్తరాంధ్రలోని మరో జిల్లా ఎమ్మెల్యేకు మంత్రి పదవిని ఆఫర్గా ఇస్తున్నారు. ఆయనతోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలను తీసుకురావాలనే షరతు పెడుతున్నారు. అదే ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యేకుకార్పొరేషన్ పదవితోపాటు రూ.20 కోట్లకు పైగా ముట్టచెబుతామని ఆ ప్రాంత మంత్రి ఊరిస్తున్నారు. మరో ఎమ్మెల్యేకు కూడా పెద్ద మొత్తంలో క్యాష్ ఆఫర్ ప్రకటించారు. ♦ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధికి మంత్రి పదవితోపాటు మరెన్నో ప్రయోజనాలను ఎర వేస్తున్నారు. ఆయనతో టీడీపీ సీనియర్ నేత, మరో ఎంపీ టచ్లో ఉన్నారు. తనతోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా తీసుకురావాలనే అధికార పార్టీ ఒత్తిళ్లకు ఆ ప్రజాప్రతినిధి లొంగడం లేదు. ♦ ముఖ్యమంత్రి తిష్టవేసి వ్యవహారాలు నడుపుతున్న జిల్లాలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ముగ్గులోకి దింపే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మీవారిపై కేసులు ఎత్తివేస్తాం, ఎన్నో విధాలుగా ఆదుకుంటాం అని ఓ కేంద్ర మంత్రి ద్వారా రాయబేరాలు నడుపుతున్నా.. తమ పార్టీని వీడబోమంటూ ఆ ఎమ్మెల్యేలు తేల్చిచెబుతున్నారు. + నూతన రాజధాని వస్తున్న జిల్లాలోని ఓ ఎమ్మెల్యేకు కార్పొరేషన్ చైర్మన్ పదవితోపాటు భారీ ప్యాకేజీని ఆఫర్ చేసినా ఆ ప్రజాప్రతినిధి లొంగడం లేదు. పార్టీ ఫిరాయింపు ద్వారా మచ్చ తెచ్చుకునేందుకు ఆ ఎమ్మెల్యే సిద్ధపడడం లేదు. ♦ వ్యాపార పరమైన సమస్యలు, ఇతర ఇబ్బందులను ప్రస్తావిస్తూ పార్టీ మారాలని మరో ఇద్దరు ఎమ్మెల్యేలపై ఓ మంత్రి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ♦ రాజధానిలో ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్న ఓ మంత్రి తన జిల్లాలోని ఇద్దరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కోరినంత డబ్బు ఇస్తానని అంటున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్పించాలనే లక్ష్యాన్ని ముఖ్యమంత్రి తనకు నిర్దేశించారని ఆ మంత్రి చెబుతున్నారు. ♦ ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించడానికి చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. చంద్రబాబు గురించి అన్నీ తెలిసిన తాము పప్పులో కాలేయబోమని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తేల్చి చెప్పినట్లు సమాచారం. ♦ టీడీపీకి దిక్కూమొక్కూ లేని జిల్లా నుంచి సీనియర్ నేతలను చేర్చుకునేందుకు ఎంత మొత్తమైనా, ఏ పదవినైనా ఇవ్వడానికి ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఓ ఎమ్మెల్యేకు భారీ మొత్తంలో నగదు, కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఆఫర్ చేశారు. ♦ మరో జిల్లాలో ఓ ఎమ్మెల్యేని చేర్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను అక్కడి టీడీపీ ఇన్చార్జి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ చేర్చుకుంటే తరువాత జరగబోయే పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని టీడీపీ నాయకత్వానికి సంకేతాలు పంపారు. ♦ కర్నూలు జిల్లా నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలను తీసుకొస్తేనే మంత్రి పదవి ఇస్తామని ఇటీవలే టీడీపీలో చేరిన ఈ జిల్లా ఎమ్మెల్యేకు టీడీపీ అధిష్టానం షరతు విధించినట్లు సమాచారం. ఇంతలోనే అంత డబ్బా? అధికార పార్టీ ఇస్తున్న ఆఫర్లను చూస్తే కళ్లు తిరగడం ఖాయం. రెండేళ్ల క్రితమే అధికారం చేపట్టిన పార్టీకి ఇంతలోనే అంత డబ్బెక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యపోవడం ప్రజల వంతవుతోంది. ఈ ఆఫర్లు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని నిత్యం వాపోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కోటరీ అంతూపొంతూ లేని బేరసారాలకు దిగుతున్నారంటే అవినీతి, అక్రమాలకు ఎంతగా బరితెగించి ఉంటారో అంచనాలకు అందడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీలో చేరిన వారికి మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు రూ.20 నుంచి రూ.40 కోట్ల వరకు అందజేస్తామని హామీ ఇస్తుండడం గమనార్హం. ఇసుక విక్రయాలు, పట్టిసీమ ఎత్తిపోతల పథకం, పోలవరం మొదలు గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులు, విద్యుత్తు ఒప్పందాలు, ప్రైవేట్ సంస్థలకు రాయితీలు.. ఇలా అన్నింటిలో చంద్రబాబు, ఆయన తనయుడు, అనుచర గణం రూ.వేల కోట్లు పిండుకుంటున్నారు. ఒక్క చెమట చుక్కయినా చిందించకుండా సంపాదించిన ఈ అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటున్నారు. -
ఆ కాంట్రాక్టర్లను తొలగించండి
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ తొలి విడతలో మంజూరైన పనులను ప్రారంభించని కాంట్రాక్టర్లను తొలగించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు ఆదేశించారు. పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే కాంట్రాక్టర్లను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మిషన్ కాకతీయ పథకం తొలి, రెండో దశ పనులపై గురువారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా వివిధ జిల్లాల నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మిషన్ కాకతీయలో భాగంగా తొలి విడతలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, రెండో దశలో అనుమతి లభించిన పనులకు తక్షణమే టెండర్లు పిలవాలని ఆదేశించారు. రెండో దశలో చేపడుతున్న పనుల అంచనాల తయారీలో ఆయకట్టు పరిధిలోని రైతుల సూచనలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ట్రిపుల్ ఆర్ పథకం, ప్రపంచ బ్యాంకు, నాబార్డు, జైకా ఆర్థిక సాయంతో చేపట్టిన పనుల పురోగతిపైనా మంత్రి సమీక్ష జరిపారు. నిజామాబాద్ జిల్లా గట్టుపొడిచిన వాగు పనుల పురోగతిపై ఆరా తీశారు. మిషన్ కాకతీయ పథకం కింద చేపట్టిన పనుల చెల్లింపుల్లో ఎక్కడా జాప్యం జరగడం లేదని హరీశ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్రావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎస్కే జోషి, సీఈలు విజయ్ప్రకాశ్, నాగేందర్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సలహాదారుతో భేటీ సాగునీటి రంగ కేంద్ర ప్రభుత్వ సలహాదారు, కృష్ణా నది మేనేజ్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తాతో మంత్రి హరీశ్ గురువారం సచివాలయంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు.. మిషన్ కాకతీయ పథకం ద్వారా సాధించిన ఫలితాలను ఆయనకు వివరిం చారు. రాష్ట్రంలోని కొత్త, పాత సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. -
ధాన్యం రాష్ట్రాంలో కోన్నట్టు నకిలి రికార్డుల స్రుష్టి
-
‘మేడిగడ్డ’ బ్యారేజీల నిర్మాణం ఏ రేట్లతో?
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైనింగ్లో భాగంగా నిర్మించే కొత్త బ్యారేజీలకు ఏ ధరలను నిర్ణయించాలన్న దానిపై సందిగ్ధత నెలకొంది. కాళేశ్వరం దిగువన ఉన్న మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించే మార్గంలో బ్యారేజీలకు కొత్త స్టాండర్డ్ షెడ్యూల్ రేట్ల (ఎస్ఎస్ఆర్) ప్రకారం.. ఇప్పటికే పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తే ప్రభుత్వంపై 1,500 కోట్ల భారం పడుతుంది. దీంతో ప్రభుత్వం అయోమయంలో పడింది. ఈ నేపథ్యంలో ప్రాణహిత ప్యాకేజీ-3 పనులను చేస్తున్న కాంట్రాక్టర్లతో నీటిపారుదల శాఖ బుధవారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది. పాత ధరల ప్రకారం పనులు చేస్తామంటే నేరుగా కాంట్రాక్టు అప్పగిస్తామని, లేనిపక్షంలో కొత్తగా టెండర్లు పిలుస్తామని స్పష్టం చేసింది. నిర్ణయం తెలిపేందుకు రెండు రోజుల గడువు విధించింది. ‘ప్రాణహిత’ ప్యాకేజీలకు సీఈలు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో విభజించిన ప్యాకేజీ పనులకు జిల్లాల వారీగా చీఫ్ ఇంజనీర్ (సీఈ)లకే బాధ్యత కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 5 జిల్లాల పరిధిలోని సీఈలు వారివారి జిల్లాలోని ప్యాకేజీ పనులను పర్యవేక్షిస్తారు. ఆదిలాబాద్ జిల్లా సీఈ ప్రాణహితలోని ఒకటినుంచి 5 ప్యాకేజీలు, కాళేశ్వరం ప్రాజెక్టు సీఈ 6 నుంచి 9 ప్యాకేజీలు, ఎస్సారెస్పీ సీఈ 27, 28 ప్యాకేజీలు, గోదావరి బేసిన్ సీఈ 20, 21 ప్యాకేజీ పనుల పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. మిగిలిన అన్ని ప్యాకేజీ పనులకు ప్రాణహిత ప్రాజెక్టు సీఈకి బాధ్యత కట్టబెట్టారు. -
కొత్త కార్డులపై ‘రూపాయి’ ఎఫెక్ట్!
* ఆహార భద్రతా కార్డుల జారీలో మరింత జాప్యం * ప్రభుత్వ ధరకన్నా రూపాయి అధికంగా టెండర్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లు * తగ్గించాలని నెల రోజులుగా కాంట్రాక్టర్లతో ప్రభుత్వం మంతనాలు * సఫలీకృతం కాక ఆగిన ప్రక్రియ, జనవరికి కొత్తకార్డులు డౌటే సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా జారీ చేయదలిచిన గులాబీ రంగు రేషన్ కార్డుల జారీపై ‘రూపాయి’ ఎఫెక్ట్ పడింది. ఒక్కో కార్డుపై ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా కాంట్రాక్టర్లు రూపాయి అధికంగా టెండర్లు దాఖలు చేయడంతో ప్రక్రియలో సందిగ్ధం నెలకొంది. రూపాయి తగ్గించి కార్డుల జారీ ప్రక్రియకు పూనుకోవాలని కాంట్రాక్టర్లతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నా అవి సఫలీకృతం కాకపోవడంతో జారీ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటికే ఆలస్యమైన కార్డులను వచ్చే జనవరి నుంచైనా లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినా టెండర్ల ప్రక్రియలో జరుగుతున్న జాప్యంతో అది సాధ్యపడేలా లేదు. ప్రభుత్వ రేటు రూ. 5, కాంట్రాక్టర్ల రేటు రూ. 6 రాష్ట్రంలో రేషన్ కార్డులతో ఆధార్ సీడింగ్ ప్రక్రియ, బోగస్ కార్డుల ఏరివేత తర్వాత మొత్తంగా 2.82 కోట్ల మంది ఆహార భద్రతా కార్డులకు అర్హులని ప్రభుత్వం తేల్చింది. సుమారు 98 లక్షల కుటుంబాలు ఆహార భద్రత చట్టం కిందకు వస్తాయని గుర్తించింది. వీరందరికీ గతంలో మాదిరి లామినేషన్ చేసిన కార్డును కాకుండా యూవిక్ పేపర్తో కూడిన కార్డును లబ్ధిదారులకు అందజేయాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. లామినేషన్ కార్డుతో పోలీస్తే దీని ఖర్చు చాలా తక్కువగా ఉంటుం దని, వినియోగం సైతం సులభమని శాఖ చెబుతోంది. యూవిక్ పేపర్ చించినా చిరగదు. కాల్చినా తగలబడదు. నీటిలోనూ తడవదు. దీనిపై ఉన్న వివరాల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలన్నా సులభంగా చేసుకోవచ్చు. పాత కార్డుల తయారీకి ఒక్కింటికీ రూ.14 మేర ఖర్చవగా, ప్రస్తుత కార్డు తయారీకి రూ.4 నుంచి రూ.5 కి మించ కుండా జాగ్రత్తలు తీసుకుంది. ఈ కార్డుల జారీకి గత నెలలోనే టెండర్లకు పిలవగా ఆరుగురు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. ఇందులో ఇద్దరే బరిలో నిలిచారు. ఆ ఇద్దరు సైతం ప్రభుత్వం అనుకున్న ధరకన్నా రూపాయి ఎక్కువగా రూ. 6కు టెండర్ దాఖలు చేశారు. 98 లక్షల కుటుంబాలకు కార్డులు జారీ చేయాలంటే ప్రభుత్వం నిర్ణయించిన ధరకన్నా మరో రూ.కోటి వరకు అదనంగా పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కార్డుల ధర తగ్గించుకోవాలని రూ. 5కే కార్డుల టెండర్ తీసుకోవాలని నెల రోజులుగా కాంట్రాక్టర్లతో చర్చలు జరుపుతున్నా అది సఫలీకృతం కాలేదు. ఈ నేపథ్యంలో జనవరి నుంచి కొత్త కార్డుల జారీ అసాధ్యమని, మార్చిలోనే ఈ ప్రక్రియ ఉండనుందని అధికార వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. ప్రతి నెలా పేదలపై రూ. 10 భారం ఆహార భద్రతా కార్డులు జారీ చేయకపోవడంతో పేదలపై ప్రతి నెలా రూ. 10ల చొప్పున అదనపు భారం పడుతోంది. తెలంగాణ ప్రభుత్వం పాత కార్డులు రద్దు చేసి ఆహార భద్రతా పథకం కింద కొత్త కార్డులను మంజూరు చేసి ఆన్లైన్ వెబ్సైట్లో డేటా వివరాలను పొందుపరిచి చేతులు దులుపుకొంది. ప్రతినెలా ఆన్లైన్ ద్వారా డేటా స్లిప్ తీసుకొని సమర్పిస్తే తప్ప రేషన్ సరుకులు అందని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఏడాదిగా ఆన్లైన్ కేంద్రాలకు వెళ్లి డేటా స్లిప్ కోసం రూ. 10 చెల్లిస్తూనే ఉన్నారు. -
‘మైనర్’కూ అదనపు చెల్లింపు?
* జీవో 146ను అమలు చేయాలని ప్రభుత్వానికి * ఇరిగేషన్ కాంట్రాక్టర్ల విన్నపం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న భారీ, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులు చేస్తున్న విధానాన్నే చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టు(మైనర్ ఇరిగేషన్) పనులకూ వర్తింప జేయాలన్న డిమాండ్ వస్తోంది. ఈ విధానాన్ని తమకూ వర్తింప జేయాలని కోరుతూ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ల కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రభుత్వానికి విన్నవించుకుంది. దీనిపై పరిశీలన చేసి ఓ నిర్ణయానికి రావాలని ప్రభుత్వం... రాష్ట్ర నీటి పారుదల శాఖకు సూచించింది. రాష్ట్రంలోని భారీ, మధ్య తరహా ప్రాజెక్టులకు పెరిగిన ధరలకు అనుగుణంగా అదనపు చెల్లించేందుకు వీలుగా ప్రభుత్వం జీవో-146ను 25 రోజుల కిందట జారీ చేసింది. ఇదే విధానం ఇప్పుడు మైనర్ ఇరిగేషన్కు వర్తింప జేయాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. -
కౌన్సిల్లో తెలుగు తమ్ముళ్ల వాగ్వాదం
బొబ్బిలి: నాలుగు గోడల మధ్య జరగాల్సిన చర్చకు కౌన్సిల్ సమావేశాన్ని వేదికగా చేసుకున్నారు.మున్సిపాలిటీలో ఇంజినీరింగు, కాంట్రాక్టర్ల మధ్య అంతర్గతంగా జరుగుతున్న యుద్ధం అధికార పార్టీలో చిచ్చు రేపింది. తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు బాణాలు విసురుకుంటూ వారి మధ్య ఉండే అంతరాలను మ రింత దూరం పెంచారు. ఈ నెలలో మున్సిపల్ డీఈతో కాంట్రాక్టరు దిబ్బ గోపీ వాగ్వాదానికి దిగారు. చేసిన పనులకు ఇంజినీరింగు అధికారులు చెల్లింపులు చేయడం లేదని, కొంత మంది కాంట్రాక్టర్లకు పెద్దపీట వేసి వెంటనే బిల్లుల చెల్లింపులు చేస్తున్నారంటూ వాదనకు దిగారు. దీంతో ఈ వివాదాన్ని చల్లార్చడానికి అధికార పార్టీ నాయకులు, పాలకులు రంగంలోకి దిగారు. అయితే దీనికి శాశ్వత పరిష్కారం కోసం కౌన్సిల్ సభ్యులు వారి అభిప్రాయాలను చెప్పాలని, ఇప్పటివరకూ జరిగిన విషయాలను డీఈ రమేష బెహ రా వివరిస్తారని కౌన్సిల్లో చర్చకు మున్సిపల్ చైర్పర్సన్ తూముల అచ్యుతవల్లి జీరో అవ ర్లో అవకాశం ఇచ్చారు. దాంతో డీఈ ఇటీవల జరిగిన పరిణామాలను వివరించారు. డీఈ కాంట్రాక్టర్ల కోటరీని నిర్వహించడం వల్ల మిగిలిన వారికి అవకాశాలు దొరకడం లేదని, దానివల్లనే వారంతా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని, ప్రజలు, ప్రజాప్రతి నిధులు, కాంట్రాక్టర్లకు వేర్వేరుగా సమయాలను కేటాయించాలని 7వ వార్డు కౌన్సిలరు రాంబార్కి శరత్ అన్నారు. దాంతో వైస్ చైర్మన్ చోడిగంజి రమేష్నాయుడు సుదీర్ఘంగా మాట్లాడారు. డీఈకి జరిగిన అన్యాయాన్ని సభలో ఉంచారు, కాంట్రాక్టర్ల వివరణ కూడా వినాలని, ఎవరికి ఏది జరిగినా కౌన్సిల్ను సంప్రదిస్తే బాగుంటుందనడంతో ఆ సమయంలో 26వ వార్డు కౌన్సిలరు పువ్వల శ్రీనివాసరావు కలుగ జేసుకోవడంతో ఒకరితో ఒకరు వాదోపవాదాలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. అసలు ఈ విషయాన్ని కౌన్సిల్లోనే చర్చించకూడదని పువ్వల అన్నారు. అధికార పార్టీ కౌన్సిలర్లు కూడా అధికారుల తప్పులను ఎత్తి చూపుతూ ప్రతిపక్ష పా త్ర పోషించారు. కాంట్రాక్టర్ల వ్యవహార శైలి వల్ల చివరకు ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారని చైర్పర్సన్ అనడంతో ఒకేసారి మిగిలిన వారంతా దానిని ఖండించారు. ఉద్యోగులకు ఆ ఆలోచన రావడం నేరమని కౌన్సిల్ అభిప్రాయపడింది. ఒకవైపు అధికార పార్టీ చైర్పర్సన్, మరో వైపు అదే పార్టీకి చెందిన ఇద్దర కౌన్సిలర్లు కాంట్రాక్టర్లు, అధికారుల వ్యవహారశైలిపై చర్చించుకోవడంతో మిగిలిన సభ్యులు ఆసక్తిగా గమనించారు. పనులను ఏ ప్రాతిపదికన కేటాయిస్తున్నారు? బొబ్బిలి పురపాలక సంఘంలో అభివృద్ధి పనుల ఎంపికను ఏ ప్రాతిపదికన నిర్ణయించారని, కౌన్సిలర్లు ఆయా వార్డుల్లో చేయమని ఇచ్చిన వినతులు ఎందుకు పరిగణనలోనికి తీసుకోలేదని వైఎస్సార్సీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడరు రౌతు రామ్మూర్తినాయుడు ప్రశ్నించారు. బుధవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ, అత్యవసర సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకు చెందిన వార్డుల్లో పనులను ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. 14, 24, 25, 27 వార్డుల్లో పనులు చేయాలని కౌన్సిలర్లు వినతులు ఇచ్చినా వాటిని ఎందుకు పరిగణలోనికి తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం అజెం డాలో ఆన్ లైన్ టెండర్లు అన్నీ తక్కువ శాతానికి, బాక్సు టెండరు పనులన్నీ ఎక్కువ మొత్తానికి దాఖలు చేయడంపై అనుమానాలున్నాయని, పనులన్నీ కాంట్రాక్టర్లు సర్దుకున్నారా అని 7వ వార్డు కౌన్సిలరు రాంబార్కి శరత్ ప్రశ్నించారు. -
మేజర్ల ఆధునికీకరణ మమ!
పనుల్లో బయటపడుతున్న డొల్లతనం సగం పైగా బిల్లులు డ్రా చేసుకున్న కాంట్రాక్టర్లు గ్రావెల్కు బదులు నల్లమట్టి.. చిట్టడవిని తలపిస్తున్న కరకట్టలు ఆందోళనలో రైతులు పల్నాడులోని ఎనిమిది మేజర్ కాల్వల ఆధునికీకరణ పనులు అధ్వానంగా ఉన్నాయి. గ్రావెల్ పోసి రోలర్ తిప్పి చదును చేయాల్సినచోట కాల్వలో తీసిన మట్టిని పోశారు. కొలతల ప్రకారం వెడల్పు చేయలేదు. లోతు తీయడంలో నిబంధనలు పాటించడంలేదు. పర్యవేక్షించాల్సిన అధికారులు పర్సంటేజీలు తీసుకుని మిన్నకుండి పోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కారంపూడి: కారంపూడి ఓఅండ్ఎం సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఎనిమిది మేజర్ల ఆధునికీకరణకు రూ.22 కోట్లు కేటాయించారు. డీసీ-3 పరిధిలోని రామాపురం, మిరియాల, చర్లగుడిపాడు మేజర్ల ఆధునికీకరణకు రూ.13 కోట్లు, కేసానుపల్లి, పెదకొదమగుండ్ల, జానపాడు, గుత్తికొండ, కోటనెమలిపురి మేజర్లకు రూ.తొమ్మిది కోట్లతో రెండేళ్ల క్రితం పనులు ప్రారంభయ్యాయి. మొదటి దశలో కరకట్టలపై కంప తొలగించడం, కాల్వ లోతు తీయడం, కరకట్టలను పట్టిష్టం చేసి వెడల్పు పెంచడం లాంటి పనులు పూర్తయ్యాయనిపించారు. దాదాపు రూ.12 కోట్ల వరకు బిల్లులు డ్రా చేశారు. నిబంధనలకు నీళ్లు.. అయితే ఈ పనులు అధ్వానంగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జేసీబీలతో కాల్వల లోపల, కరకట్టలు గీరుకుంటూ వెళ్లారు. కాల్వలో తీసిన మట్టిని కట్టపై పోశారు. కాల్వ పక్కన లభ్యమైన నల్ల మట్టినే కట్టలపై పోసి సరిచేశారు. వాస్తవంగా గ్రావెల్ పోసి రోలర్ తిప్పి చదును చేయాలి. గ్రావెల్ తెచ్చి పోయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఎక్కడ మట్టి అక్కడే సరి చేశారు. కరక ట్టలను ఆరు, మూడు మీటర్లు చొప్పున వెడల్పు చేయాల్సి వుండగా అది చాలా చోట్ల జరగలేదు. కాల్వ లోతు తీయడంలోనూ నిబంధనలు పాటించలేదు. పర్యవేక్షించాల్సిన అధికారులు పర్సంటేజీలకు ఆశపడడంతో పనులపై పర్యవేక్షణ కొరవడిందని అంతా ఆరోపిస్తున్నారు. అసలు కాంట్రాక్టర్లకు లాభం ఇచ్చి పలువురు సబ్ కాంట్రాక్టులకు తీసుకోవడం నాణ్యతా లోపాలకు మరో కారణం. క్వాలిటీ కంట్రోల్ అధికారుల పనితీరు కూడా ఇక్కడ ప్రశ్నార్ధకం అవుతోంది. బయట పడుతున్న డొల్లతనం... ఆ పనుల మొత్తాన్ని పరిశీలిస్తే.. పెదకొదమగుండ్ల మేజర్ కాల్వ కట్టలపై కంపచెట్లు అడవిని తలపిస్తున్నాయి. కొద్దిపాటి వానకే కర కట్టలు బురదమయం అవుతున్నాయి. రామాపురం మేజర్ కాల్వ పరిస్థితి మరీ దారుణంగా వుంది. మిగతా మేజర్లది దాదాపు ఇదే పరిస్థితి. ఇటీవల మెయిన్ కెనాల్కు తాగునీరు వదిలినప్పుడు కొదమగుండ్ల మేజర్కు షట్టర్ లేక కాల్వకు నీరు వచ్చింది. ఆ నీరు అర కిలోమీటరు లోపే లీకుల ద్వారా బయటకు పోయింది. గతేడాది పూర్తి స్థాయిలో నీరు వదిలితే ఒక్క పీకేజీ మేజర్కే మెయిన్ కెనాల్ నుంచి ఎన్ఎస్పీ కాలనీ వరకు నాలుగుసార్లు గండ్లు పడ్డాయి. నీరు సరిగా ముందుకు పారక నీరు కరకట్టలపై పారాయి. కాల్వల లోపల కూడా చెట్లు పెరిగాయి. ఇలా అయితే మేజర్ల పరిధి లో పెరిగిన ఆయకట్టుకు నీరు అందడం అసాధ్యం. ఎంతోకాలంగా నీరందక ఇబ్బంది పడుతున్న చివరి భూముల రైతుల సమస్యలు తీరేలా లేవు. నూతన సాగు నీటి సంఘాలు పనులు సక్రమంగా జరిగేలా శ్రర్ధ చూపాల్సిన అవసరం వుంది. ఐదేళ్ల వరకు కాంట్రాక్టర్దే బాధ్యత.. కాల్వలకు గండ్లు పడినా, ఇతర నాణ్యతా లోపాలకు కాంట్రాక్టర్లే బాధ్యత వహించాలి. ఐదు సంవత్సరాల వరకు కాల్వల మరమ్మత్తులు వారే చేయాలి. కాల్వ కట్టలపై జంగిల్ క్లియరెన్స్ చేయిస్తాం. - నాగేశ్వరావు, ఏఈ, ఎన్ఎస్పీ -
మార్చి నాటికి పాలమూరు ప్రాజెక్టుల పూర్తి
సాక్షి, హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లాలోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయల్సాగర్ ప్రాజెక్టులను వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తిచేయాలని మంత్రి హరీశ్రావు కాంట్రాక్టర్లను ఆదేశించారు. వచ్చే జూన్ నాటికి భీమా కింద 2 లక్షల ఎకరాలకు, కల్వకుర్తి కింద 3.04 లక్షలు, నె ట్టెంపాడు కింద 2 లక్షలు, కోయల్సాగర్ కింద 60 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలన్నారు. శుక్రవారం ప్రాజెక్టుల అధికారులు, కాంట్రాక్టర్లు, భూసేకరణ అధికారులు, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్రెడ్డి తదితరులతో ఆయకట్టు అభివృద్ధి సంస్థ కార్యాలయంలో హరీశ్రావు సమావేశమయ్యారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయాలనే ఉద్దేశంతోనే 146, 123 జీవోలను ప్రభుత్వం తెచ్చిందని, వాటిని వినియోగించుకొని పనులు వేగిరం చేయాలని సూచించారు. ప్రాజెక్టు పనుల్లో కాంట్రాక్టర్లు, ఇంజనీర్లలో ఎవరు అలసత్వం వహించినా సహించేది లేదని హెచ్చరించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి కావాల్సిన ఇసుకపైనా సమావేశంలో చర్చించారు. జిల్లాలో గుర్తించిన 22 ఇసుక పట్టా భూములను ప్రభుత్వ వినియోగానికి మాత్రమే వాడాలని ఆదేశించారు. వేగం పెరిగేనా?: భూసేకరణ, పరిహారం, ఎస్కలే షన్ చెల్లింపులు వంటి సమస్యల పరిష్కారంపై స్పష్టత వచ్చిన తరుణంలోనైనా పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు పట్టిన గ్రహణం వీడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. 2016-17 ఏడాది ఖరీఫ్ సీజన్ నాటికి పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టుల్లో పాలమూరు జిల్లా ప్రాజెక్టులే ముందు వరుసలో ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఎస్కలేషన్ డిమాండ్ చేస్తూ ఏడాదిన్నరగా పనులు నిలిపివేశారు. దీంతో లక్ష్యం మేరకు ఆయకట్టు అందుబాటులోకి రాలేదు. కాంట్రాక్టర్ల డిమాండ్ మేరకు ఎస్కలేషన్కు ప్రభుత్వం అంగీకరించింది. నాలుగు ప్రాజెక్టుల్లోని 36 ప్యాకేజీలకు సుమారు రూ.500కోట్ల మేర అదనంగా చెల్లించనుంది. ఇక జీవో 123తో భూసేకరణను కూడా ప్రభుత్వం వేగిరం చేసింది. ఈ నేపథ్యంలోనే పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లను హరీశ్రావు ఆదేశించారు. -
అక్రమార్కులకు రూ.లక్షలు సమర్పయామీ..!
దండుకున్నోళ్లకు దండుకున్నంత.. దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. దాచుకున్నోళ్లకు దాచుకున్నంత.. దిగమింగేవాళ్లకు దిగమింగినంత.. ఆగండి.. ఆగండి.. ఈ అవకాశం ఎక్కడనుకుంటున్నారా..? అదే నండీ..! చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వంలో! పల్లె..పట్టణం..నగరం.. ఎక్కడైనా మీరు యథేచ్చగా దోచుకోవచ్చు. అర్హత మీరు తెలుగు తమ్ముళ్లు కావడమే! - కాంట్రాక్టర్లు, అటవీ అధికారుల కుమ్మక్కు - కుంటలు, కందకాలు తీసిన జేసీబీలు - ఉపాధి కూలీల నోట్లో మట్టి - రూ.30 లక్షలు హాంఫట్ గుడ్లూరు : అటవీ అధికారులు.. కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారు. పనులు జేసీబీతో చేయించి ఉపాధి కూలీల నోట్లో మట్టికొట్టారు. అందరూ కలిసి రూ.30 లక్షలు దిగమింగేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గుడ్లూరు మండలం మోచర్ల, పోట్లూరు, నరసాపురం, అడవిరాజుపాలెం, గుడ్లూరు గ్రామాల్లో అటవీశాఖకు భూములున్నాయి. వాటిల్లో కుంటలు, కందకాలు తీసేందుకు ఎన్ఆర్ఈజీఎస్ (ఉపాధి పథకం) కింద రూ.30 లక్షలు అటవీశాఖకు మంజూరయ్యాయి. పంచాయతీల్లో తీర్మానాలు చేయించి ఆయా గ్రామాల్లో ఉన్న ఉపాధి కూలీలతో పనులు చేయించాలి. జేసీబీలను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించ కూడదు. ఇది ప్రభుత్వ నిబంధన. అటవీ అధికారులు ఎవరికీ తెలియకుండా పనులను కందుకూరుకు చెందిన కాంట్రాక్టర్ (తెలుగు తమ్ముడు)కు అప్పగించి ఉపాధి కూలీల నోట్లో మట్టి కొట్టారు. ఈ వ్యవహారానికి సంబంధించి అటవీశాఖలో కిందిస్థాయి అధికారి నుంచి ఉన్నతాధికారుల వరకూ అందరికీ చేతులు తడిసినట్లు సమాచారం. అన్నీ అక్రమాలే అటవీ అధికారుల సహకారంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఒక్క చోట కూడా కూలీలతో పనులు చేయించకుండా జేసీబీల ద్వారే కుంటలు, కందకాలు తీయించారు. ఐదు గ్రామాల్లో ఐదు రోజుల్లోనే పనులు ముగించారు. నిధులు నేరుగా డ్రా చేసుకునేందుకు అధికారులు, కాంట్రాక్టర్లకు వీల్లేదు. ఉపాధి కూలీల పేరుతో ఉన్న జాబ్కార్డుల ఆధారంగా పోస్టాఫీసుల్లో నగదు తీసుకోవాలి. నరసాపురంలో 4 కుంటలు, కందకానికి సంబంధించి మొదటి విడత రూ.4 లక్షలు గుడ్లూరు పోస్టాఫీసులో జమయ్యాయి. ప్రశ్నించిన కూలీలు తమ అకౌంట్లలో ఉన్న నగదును మీరు ఎలా తీసుకుంటారని కూలీలు మధ్యవర్తిని ప్రశ్నించారు. నగదు తమకు ఇచ్చినట్లు పేస్లిప్పులు ఇవ్వడం ఏమటని నిలదీశారు. ఫొటోకు ఫోజు ఇవ్వగానే డబ్బులు వస్తాయా.. అని కూలీలను మధ్యవర్తి ఎద్దేవా చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. తమకు తెలియకుండానే 18 రోజులు పని చేసినట్లు తెల్ల పేపర్లుపై సంతకాలు పెట్టించుకొని మోసం చేశారని పలువురు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుంటలు పరిశీలిస్తాం : మందారావు, డీఆర్వో కుంటలు, కందకాలను కూలీలతోనే తీయించాలని చెప్పాం. జేసీబీలతో పనులు చేయించిన సంగతి నాకు తెలియదు. కొన్ని గ్రామాల్లో నగదు ఇంకా పోస్టాఫీసుల్లో జమ కాలేదు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. తిమ్మిని బమ్మిని చేసి.. పోస్టాఫీసులో నగదు డ్రా చేసేందుకు కాంట్రాక్టర్లు రంగంలోకి దిగారు. 15 రోజుల క్రితం గుడ్లూరులోని 6 గ్రూపులకు చెందిన ఉపాధి కూలీలను ట్రాక్టర్లో నరసాపురం అడవికి తీసుకెళ్లి ఆ కుంటల వద్ద వారు పనులు చేసినట్లు ఫొటోలు తీయించారు. 60 మంది కూలీల అకౌంట్లలో పోస్టాఫీసులో నగదు జమ చేయించారు. ఒక్కో కూలీ 18 రోజులు పని చేసినట్లు చూపి రూ.2 వేలు నుంచి రూ.6 వేలు చొప్పున కూలీల అకౌంట్లలో నగదు జమ చేయించారు. కాంట్రాక్టరు పెట్టుకొన్న మధ్యవర్తి నాలుగు రోజుల నుంచి కూలీలను పోస్టాఫీసు వద్దకు తీసుకెళ్లి వారితో వేలిముద్రలు వేయించుకొని నగదు తీసుకున్నట్లు పేస్లిప్పులు ఇవ్వడంతో కూలీలు అవాక్కయ్యారు. ఇక్కడా.. అంతే గుడ్లూరులోనే కాకుండా మోచర్లలో కూడా కందుకూరు మండలానికి చెందిన కూలీలను తీసుకొచ్చి ఫొటోలు తీసినట్లు తెలుస్తోంది. పోట్లూరులో 2, మోచర్లలో 4, నరసాపురంలో 4, అడవిరాజుపాలెంలో 2, గుడ్లూరులో 2 కుంటలు జేసీబీతో తవ్వించారు. ఒక్కో కుంటకు రూ.1.50 లక్షలు లెక్కన 14 కుంటలకు రూ. 21 లక్షలు, కందకాలకు రూ.9 లక్షలు చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఇవి తవ్వినందుకు జేసీబీలకు రూ.5 నుంచి రూ.10 లక్షలకు మించి ఖర్చు కాదని అంచనా. -
కుదిరితే రాజీ .. లేదంటే టెండర్ రద్దు
- బల్దియాలో అధికారులు, కాంట్రాక్టర్ల కుమ్మక్కు - 50 రోజులుగా తెరవని రూ.4.5 లక్షల విలువైన టెండర్లు - కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకేనని ఆరోపణలు కోల్సిటీ : రామగుండం నగరపాలక సంస్థలో కాంట్రాక్టర్ల పెత్తనమే నడుస్తోంది. అధికారులు సైతం ప్రభుత్వ నిబంధనలను గాలికి వదిలి వారికే వంతపాడుతున్నారు. కాంట్రాక్టరకు లబ్ధిచేకూర్చడానికి టెండర్లు ఖరారు కాకుండా జాప్యం చేస్తున్నారు. ‘కుదిరితే సిండికేట్.. కుదరకపోతే టెండర్ల రద్దు’ చేయడం పరిపాటిగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. రూ.4.5 కోట్లతో పిలిచిన టెండర్లు 50 రోజు లు గడుస్తున్నా తెరవక పోవడం ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పవచ్చు. రామగుండం కార్పొరేషన్ అధికారులు నగరాన్ని అభివృద్ధి చేస్తామని ఇటీవల పిలిచిన రూ.4.5 కోట్ల టెండర్లను 50 రోజులు దాటినా ఖారారు చేయలేదు. జూన్ 16న టెం డర్లు తెరవాల్సి ఉండగా ఇప్పటికీ ఆ ఊసేలేదు. ఈ టెండర్ల లో పనులు దక్కించుకోవడానికి కొందరు కాంట్రాక్టర్లు రాజీకి వచ్చారు. వీరి నుంచి కమీషన్ల రూపంలో రూ.36 లక్షల వరకు వసూలు చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే వీటి పంపకాల్లో వివాదం తలెత్తడంతో టెండర్లను తాత్కాలికంగా జాప్యం చేయాలని అధికారులపై కాంట్రాక్ట ర్లు ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. రూ.35 లక్షల టెండర్ల పరిస్థితి అయోమయం ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా ఇటీవల రూ.35లక్షల విలువై న పనులకు పిలిచిన టెండర్ల పరిస్థితి సైతం అయోమయానికి దారితీస్తోంది. ఈ టెండర్లకు గురువారం షెడ్యూళ్ల దాఖాలకు చివరి తేదీ.. నేడు ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికే గతంలో పిలిచిన రూ.4.5 కోట్ల టెండర్లను ఖరారు చేయని అధికారులు, కొత్తగా పిలిచిన రూ.35 లక్షల టెండర్లను వాయిదా వేస్తారనే ప్రచారం జరుగుతోంది. నోరుమెదపని అధికారులు బల్దియాలోని అనేక టెండర్లపై ఆరోపణలు వస్తున్నా వాటి పై అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కనీసం నోరుకూడా మెదపడంలేదు. పారిశుధ్య కార్మికులకు పిలిచి న టెండర్లను తెరవడానికి మూడు నెలలపాటు ఆలస్యం చేసి చివరికి ఖరారు చేశారు. వీటికి బల్దియా పాలకవర్గం అనుమతి తీసుకోకుండానే పెండింగ్ అప్రోవల్తో జీతాలు చెల్లిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వీటితోపాటు రూ.4.5 కోట్ల టెండర్లలోనూ అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, వీటిని రద్దు చేయాలంటూ అధికారి పార్టీ టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు పోటీపడి ఆరోపణలు చేశారు. ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు ఇచ్చారు. వీటిపై స్పందించి విచారణ జరిపిన నాథుడు లేడు. కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం టెండర్లను తెరవాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ గందరోగళంపై పాలకవర్గం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. -
ఎందుకో.. ఇవెందుకో
- పుష్కరాల పేరిట రూ.కోట్లు వృథా - అక్కరకు రాని నిర్మాణాలు - యాత్రికులకు ఉపయోగపడని విశ్రాంతి షెడ్లు - తమ్ముళ్ల జేబుల్లోకి పుష్కర నిధులు సాక్షి ప్రతినిధి, ఏలూరు : కొవ్వూరు పట్టణానికి పుష్కర యాత్రికులు లక్షలాదిగా పోటెత్తి వస్తున్నారు. కనీస వసతి సౌకర్యాలు లేక రోడ్లు, పేవ్మెంట్లపై నిద్రిస్తున్నారు. అలాగని వారికోసం ఏర్పాట్లేమీ చేయలేదనుకుంటే తప్పులో కాలేసినట్టే. యాత్రికుల కోసం షెడ్లు వంటివి నిర్మించినా అవి వారికి అక్కరకు రావడం లేదు. వందలాది కోట్ల రూపాయల పుష్కర నిధులను కాంట్రాక్టర్ల ముసుగులో అంది నంత దోచుకున్న తెలుగుతమ్ముళ్లు కనీసం ఆ నిర్మాణాలను యాత్రికులకు ఉపయోగపడే విధంగా చేపట్టలేదు. పుష్కరాలు మరో ఐదు రోజుల్లో ముగియనున్నా ఇప్పటికీ కొన్ని నిర్మాణాలు, ప్రాజెక్టులు ఎందుకూ కొరగాకుండా ఉన్నాయి. కేవలం కాంట్రాక్టుల పేరిట సొమ్ము చేసుకునేందుకే ఆ పనులు చేపట్టడం వల్ల కనీసమాత్రం కూడా పుష్కర భక్తులకు ఉపయోగం లేకుండా పోయాయి. కొవ్వూరు మునిసిపాలిటీ రూ.1.10 కోట్ల వ్యయంతో నిర్మించిన షెడ్లు నేటికీ నిరుపయోగంగా ఉన్నాయంటే.. అవి ఎంతదూరంలో ఏర్పాటు చేశారో, అక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తగిన చోట్ల విశ్రాంతి షెడ్లు నిర్మించకపోవడం ప్రధాన సమస్య కాగా, అక్కడ అరకొర వసతులు కల్పించి చేతులు దులుపుకోవడంతో ప్రజాధనం వృథా అయింది. ఘాట్లకు, పట్టణానికి సమీపంలోని ప్రదేశాలను విస్మరించి అక్కరకు రాని స్థలాల్లో షెడ్లు నిర్మాణం చేయడం వల్ల గడచిన వారం రోజుల్లో కేవలం పదుల సం ఖ్యలో భక్తులు మాత్రమే వాటిని వినియోగిస్తున్నారు. కొవ్వూరు పట్టణంలోని పాత బైపాస్ రోడ్డు, పుష్కరనగర్, ఆంధ్రా షుగర్స్ కర్మాగారాల మధ్య మొత్తం మూడు ప్రదేశాల్లో ప్రయాణికుల విశ్రాంతి షెడ్లు నిర్మించారు. ప్రయాణికులు బస చేసేందుకు అనువుగా షెడ్లలో ఫ్యాన్లు, లైట్లతోపాటు వ్యక్తిగత మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం, సామాన్లు భద్రపరుచుకునే లాకర్లు, జనరేటర్ సదుపాయం వంటివి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ ఏ ఒక్కచోట పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించకపోవడంతో ఆ షెడ్లు యాత్రికులకు అక్కరకు రావడం లేదు. కానీ.. ఈ నిర్మాణాల పేరిట కాంట్రాక్టర్ల ముసుగులో టీడీపీ నేతల జేబులు మాత్రం నిండిపోయాయి. ఎవరి కోసం ఆ కార్యక్రమాలు కొవ్వూరు పట్టణంలో శివారు ప్రాంతమైన హేవలాక్ బ్రిడ్జి పక్కన రైల్వే స్థలంలో సమాచార పౌర సంబంధాల శాఖ భారీఎత్తున ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ఎవరి కోసం.. ఎందుకోసం అన్న ప్రశ్నలకు అధికారుల వద్ద కూడా సమాధానం లేదు. మొత్తం సీఎం చంద్రబాబునాయుడు ఫొటోలు, ప్రభుత్వ పథకాల ప్రచార చిత్రాలతో ఓ ఇంటి మాదిరిగా నిర్మించిన స్టాల్ పేరిట రూ.లక్షలు ఖర్చు చేశారు. స్టాల్ నిర్మాణం కోసం స్థలాన్ని చదును ఖర్చులకే పెద్దమొత్తంలో ఖర్చయ్యింది. జనాలు రానిచోట ఆ స్టాల్ ఎందుకు ఏర్పాటు చేశారన్న దానిపై అధికారులు నోరు మెదపడం లేదు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఇదే స్థలంలో ఏర్పాటు చేసిన ధార్మిక కార్యక్రమాలు కనీసం పట్టుమని పదిమంది వీక్షకులు కూడా లేక వెలవెలబోతున్నాయి. అక్కడ స్థలంలో తుప్పలు తొలగించి, మెయిన్ రోడ్డు నుంచి కళావేదికకు అప్రోచ్ రోడ్డు వేసేందుకు టీటీడీకి రూ.మూడు లక్షలు, మునిసిపాలిటీకి మరో రూ.3 లక్షలు ఖర్చయ్యాయి. నిత్య కార్యక్రమాల నిర్వహణ, ఇతరత్రా ఏర్పాట్లకు చాలా వ్యయమవుతోంది. కానీ అక్కడ ధార్మిక వ్రవచనాలు, భజనలు, భక్తి సంగీతాలు, హరికథలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నట్టు ఎవరికీ తెలియదు. ‘ఇక్కడ కళాకారులం మేమే.. ప్రేక్షకులం కూడా మేమే..’ అని టీటీడీకి చెందిన ఓ కళాకారుడు వ్యాఖ్యానించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కోట్లాది రూపాయల పుష్కర నిధులను అడ్డగోలుగా ఖర్చు చేశారనేందుకు విశ్రాంతి షెడ్లు, సమాచార పౌర సంబంధాల శాఖ స్టాల్, టీటీడీ కళావేదికలు కళ్ల ముందు కనపడుతున్న ఉదాహరణలు. -
జీవో 22 పరిధి మరింత విస్తరణ!
* కాంట్రాక్టర్లకు మరింత అదనంగా చెల్లించడానికి వీలుగా ప్రతిపాదనలు * మరో జీవో తెచ్చేందుకు రంగం సిద్ధం * రేపు కేబినెట్ ఆమోదించే అవకాశం * కమీషన్లు దండుకోవడానికేనని నీటిపారుదలశాఖలో చర్చ సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులు చేయడానికి అవకాశం కల్పిస్తున్న జీవో-22ను మరింతగా విస్తరించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ జీవో పరిధిలోకి రాని కాంట్రాక్టర్లకు కూడా అదనపు చెల్లింపులు చేయడానికి, జీవో-22 అమలు చేసినా తమకు గిట్టుబాటు కావట్లేదంటూ ప్రభుత్వాన్ని ఆశ్రయించిన అధికారపార్టీ కాంట్రాక్టర్లకు అడిగినంత సొమ్ము దోచిపెట్టడానికి వీలుగా మరో జీవో తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. మరింత అదనంగా చెల్లింపులు చేసి అందుకు అనుగుణంగా కమీషన్లు దండుకోవడానికి ప్రభుత్వ పెద్దలు సమాయత్తమవుతున్నారని నీటిపారుదలశాఖలో చర్చ జరుగుతోంది. జీవో-22 విస్తరణపై బుధవారం రాజమండ్రిలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశముంది. కేబినెట్లో చర్చించడానికి వీలుగా నీటిపారుదలశాఖ ప్రతిపాదనను సిద్ధం చేసింది. మంత్రివర్గ ఎజెండాలో చేర్చాలంటే.. ఆర్థికశాఖ ఆమోదం తీసుకోవాలనే నిబంధన ఉంది.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదం కూడా అవసరం. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్తోపాటు, సీఎస్ ఐవైఆర్ కృష్ణారావులిద్దరూ ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నారు. దీంతో అక్కడే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయించే అవకాశాలను నీటిపారుదలశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ఎజెండాలో చోటుదక్కితే మంత్రివర్గం ఆమోదిస్తుందని అధికారవర్గాల సమాచారం. -
పనులు పూర్తి చేయకుంటే చర్యలు
కర్నూలు సిటీ: శ్రీశైలం కుడి గట్టు కాల్వ పెండింగ్ ప్యాకేజీల పనులు సకాలంలో పూర్తి చేయకుంటే సంబంధిత ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని జల వనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ చిట్టిబాబు కాంట్రాక్టర్లను హెచ్చరించారు. శుక్రవారం సీఈ కార్యాలయంలో పెండింగ్లో ఉన్న ప్యాకేజీల పురోగతి, ఈ ఏడాది ఎంత మేరకు నీరు ఇస్తారు అనే అంశాలపై ఈఈలు, ఏజెన్సీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ ఈ ఏడాది గాలేరు నగరి సుజల స్రవంతి పథకం ద్వారా గండికోటకు నీరు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. 24వ ప్యాకేజీ పనులు పూర్తి చేసి ఈ ఏడాది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 44 వేల క్యుసెక్కుల నీరును తరలించేలా ఉండే అడ్డంకులను తొలగించాలన్నారు. పనులు పూర్తవుతున్నాయని, 44 వేల క్యూసెక్కుల నీరు తీసుకునేలా హెడ్ రెగ్యులేటర్ గేట్లు, వాటి నియంత్రణ పనులు పూర్తికావోచ్చాయని అధికారులు సీఈకి తెలిపారు. 25వ ప్యాకేజీలో 60 కి.మీ దగ్గర నిర్మించాల్సి బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. 26 ప్యాకేజీలో సైడ్ వాల్స్కు పడ్డ రంధ్రాలను పూడ్చి వేసేందుకు కాంట్రాక్టర్లు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, పనికి తగ్గ యంత్రాలను ఏర్పాటు చేసుకోని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 27 ప్యాకేజీలో కాంక్రిట్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఒక్కొ సబ్ డివిజన్లో 16 మంది జేఈలకుగానీ ఇద్దరు, ముగ్గురుకి మించి లేరని, ఏఈలు, డీఏఓలు, సూపరింటెండెంట్ల కొరత తీవ్రంగా ఉందని, సిబ్బందిని నియమిస్తేనే పనుల్లో పురోగతి వేగవంతం అవుతుందని అధికారులు వివరించారు. సమావేశంలో ఎస్ఆర్బీసీ ఎస్ఈ శ్రీనివాసరావు, తెలుగుగంగా ఎస్ఈ రామచంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు. -
పైసల యావ.. కమీషన్ల హవా..!
విద్యుత్ కేబుళ్ల యూజీ, ఏబీ పనుల్లో కమీషన్ల దందా కొనసాగుతోంది. నాసిరకం కేబుళ్లతో పాటు వాటిని తక్కువ లోతులో అమర్చుతూ కాంట్రాక్టర్లు అందినకాడికి పైసలు దండుకుంటున్నారు. అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారు. వెరసీ నాసిరకం కేబుళ్లతో విద్యుత్ సరఫరాలో తరచు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 220 కేవీ సబ్స్టేషన్లు పది ఉండగా, 33/11కేవీ సబ్స్టేషన్లు 300పైగా ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు రెండు వేల ఫీడర్లు, 90 వేల కిలోమీటర్ల పరిధిలో 11 కేవీ డిస్ట్రిబ్యూషన్ లైన్లు ఉన్నాయి. సబ్స్టేషన్ల నుంచి గృహాలకు విద్యుత్ సరఫరాకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ లైన్లన్నీ నేటికీ ఓవర్హెడ్ లైన్లే. నిజాం కాలం నాటి వైర్లు కావడంతో ఎండ తీవ్రతకు సాగుతూ, గాలివానకు తెగి పడుతున్నాయి. కోర్ సిటీలో చాలా వరకు చెట్ల కొమ్మల మధ్యలో ఉండిపోయాయి. దీంతో తరచు షార్ట్సర్క్యూట్స్ ఏర్పడి ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిస్కం భావించింది. చెట్ల కొమ్మలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎయిర్బంచ్డ్ (ఏబీ) కేబుళ్లు, హైటెన్షన్ ఓవర్హెడ్ లైన్స్ స్థానంలో అండర్ గ్రౌండ్ (యూజీ) కేబుల్ వేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 306 కిలో మీటర్ల యూజీ కేబుల్ అమర్చగా, మరో 300 కిలో మీటర్లు ఏవీ కేబుల్స్ వేశారు. కేబుల్తో పాటు నాసిరకం పనుల వల్ల వేసిన కొద్ది రోజులకే ఒత్తిడిని తట్టుకోలేక కాలిపోతున్నాయి. ట్రాన్స్కో, మాస్టర్ ప్లాన్ మధ్య సమన్వయలోపం.. అండర్ గ్రౌండ్ కేబుల్స్ తవ్వకాల విషయంలో ట్రాన్స్కో, మాస్టర్ప్లాన్ విభాగాల మధ్య సమన్వయం లేదు. 11 కేవీ, 33 కేవీ పనులు మాస్టర్ ప్లాన్ పర్యవేక్షిస్తుంది. 130 కేవీ, 220 కేవీ, 400 కేవీ సబ్స్టేషన్ల పనులను ట్రాన్స్కో చూస్తుంది. కొత్తగా నిర్మించిన 33/11 కేవీ సబ్స్టేషన్లకు 130 కేవీ సబ్స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఇందు కోసం వీటి మధ్య యూజీ కేబుల్ అమర్చుతున్నారు. ఒకే శాఖలోని ఈ రెండు విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఒకరు తవ్విన కొద్ది రోజులకే మరొకరు తవ్వి ఒకరు వేసిన లైన్పైనే మరో లైన్ వేస్తున్నారు. ఈ క్రమంలో ఒక కాంట్రాక్టర్ వాడిన ఇసుక, బండలనే మరో గుత్తేదారు వాడుతూ ఆర్థికంగా లబ్ధిపొందుతున్నాడు. ఇలా ఒకే చోట రెండు మూడు సార్లు తవ్వకాలు జరపడం, నాసిరకం పనుల వల్ల కేబుళ్లు ధ్వంసం అవుతున్నాయి. ఇటీవలే పూర్తై పాటిగడ్డ సబ్స్టేషన్కు హుస్సేన్సాగర్ సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంది. ఇందు కోసం రెండు త్రీ కోర్ 33 కేవీ కేబుళ్లు వేస్తున్నారు. దీనికి 1.2 మీటర్లు లోతు తవ్వాల్సి ఉండగా, ఆ కాంట్రాక్టర్ ఐమాక్స్ నుంచి మింట్కంపౌండ్ వెళ్లే దారిలో అర మీటరు కూడా తవ్వలేదు. నిత్యం డిస్కం ఉన్నతాధికారులు సంచరించే ఈ ప్రాంతంలోనే పనులు ఇలా ఉంటే శివారు ప్రాంతాల్లో ఎంత నాసిరకంగా ఉంటున్నాయో ఇట్టే ఊహించవచ్చు. నాణ్యతను పరీక్షించకుండానే బిల్లులు.. రోడ్డు కటింగ్కు కోర్సిటీ పరిధిలో మీటరుకు గరిష్టంగా రూ.6 వేలు జీహెచ్ఎంసీకి చెల్లిస్తుంది. గుత్తేదారు తవ్వకం పనికి రూ.6 వేలపైగా అందిస్తారు. కాంట్రాక్టర్ చేసిన పనుల్లో నాణ్యతను పరిశీలించాల్సిన క్వాలిటీ కంట్రోల్ సెల్ అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడి పనులను పర్యవేక్షించకుండానే గుడ్డిగా బిల్లు చెల్లిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవ ల హబ్సీగూడ ఎన్జీఆర్ఐ వద్ద కేబుల్లో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల ఆయా ప్రాంతాల్లో ఎనిమిది గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కిమ్స్, హుస్సేన్సాగర్ మక్తా, బోయిన్పల్లి, జేబీఎస్, హస్మత్పేట్, పాపిరెడ్డి కాలనీ, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, కాచిగూడ, తాళ్లగడ్డ, ఉస్మానియా, జూబ్లిహిల్స్లోసమస్యలు తలెత్తాయి. తాజాగా చిలకలగూడ నుంచి బన్సీలాల్పేట సబ్స్టేషన్ వరకు వేసిన యూజీ కేబుల్ భోలక్పూర్ ప్రధాన రహదారిలో భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో స్థానికులంతా భయంతో పరుగులు తీశారు. -
అధికారుల నిర్వాకం వల్లే..!
- ‘ఫోర్జరీ’ కేసులో కొత్తకోణం - వెలుగులోకి జోనల్ కార్యాలయ అధికారుల చేతివాటం? కుత్బుల్లాపూర్: ఫోర్జరీ పనుల కేసులో రోజుకో కొత్తకోణం వెలుగులోకి వస్తోంది. చేయని పనులకు సంబంధిత కాంట్రాక్టర్లు బిల్లులు డ్రా చేసే విషయంలో సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలోని ఆడిట్, ఎగ్జామినర్, ఫైనాన్స్ అడ్వైజరీ (ఎఫ్ఏ) విభాగాల్లో పనిచేసే అధికారులు సహకరించారని విచారణలో వెలుగు చూసింది. జగద్గిరిగుట్టకు చెందిన కాంట్రాక్టర్ లక్ష్మణ్రాజు ఈ తతంగానికి తెర లేపారు. వీరికి ఔట్సోర్సింగ్ సిబ్బందిగా ఉన్న ఉపేందర్రెడ్డి సహకరించినట్లు విచారణలో తేలింది. మూడు బృందాలుగా సీఐ చంద్రశేఖర్, ఎస్సై లింగ్యానాయక్లు చేపట్టిన విచారణలో కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో పనిచేసే అధికారుల నిర్వాకం వల్లే ఈ ఫోర్జరీ పనుల బాగోతం చోటుచేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాంట్రాక్టర్లకు 60 (రూ.24 లక్షలు) శాతం, అధికారులకు 40(రూ.16 లక్షలు) శాతం సొమ్ము ఇచ్చేవిధంగా ఒప్పందం కుదుర్చుకున్నారని, వీరికి మధ్యవర్తిగా ఔట్సోర్సింగ్ సిబ్బంది వ్యవహరించారని తెలుస్తోంది. తెలియక తప్పు చేశాం.. డబ్బులు వెనక్కి ఇస్తాం ఫోర్జరీ బాగోతంపై అధికారులు ఆరుగురు కాంట్రాక్టర్లను బ్లాక్లిస్ట్ (నిషేధిత జాబితా)లో చేర్చడంతో పాటు డ్రా చేసిన మొత్తాన్ని వెంటనే వాపస్ చేయాలని ఈ నెల 6 న నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన నలుగురు కాంట్రాక్టర్లు తాము చేసింది తప్పేనంటూ, డబ్బులు వాపస్ ఇస్తామని తాజాగా శనివారం ఇన్వార్డు సెక్షన్లో లిఖిత పూర్వకంగా లేఖలు అందజేశారు. మరో ఇద్దరు కాంట్రాక్టర్లు మాత్రం తాము ఎటువంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు. ఫోర్జరీ సృష్టికర్త లక్ష్మణ్రాజు 2012-14 సంవత్సరాల్లో చేసిన పనుల్లో కూడా అవకతవకలకు పాల్పడినట్లు అధికారుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. కాగా కాంట్రాక్టర్లు పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతూ ముందస్తు బెయిల్ కోసం కోర్టుచుట్టూ చక్కర్లు కొడుతున్నారని తెలుస్తోంది. వర్క్ఇన్స్పెక్టర్ల బదిలీ ఫోర్జరీ పనుల బాగోతంపై స్పందించిన జోనల్ కమిషనర్ హరిచందన..ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లను సికింద్రాబాద్, అల్వాల్, మల్కాజ్గిరి ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే 14 మంది కంప్యూటర్ ఆపరేటర్లను అల్వాల్, మల్కాజ్గిరి లకు బదిలీ చేయగా తాజాగా 16 మంది వర్క్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేశారు. -
'సింగూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తాం'
మెదక్ (పుల్కల్): సింగూరు ఎత్తి పోతల పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభిస్తామని భారీ నీటిపారుదల మంత్రి హరీశ్ రావు మంగళవారం పేర్కొన్నారు. ప్రాజెక్టుతో పుల్కల్, ఆందోల్ మండలాల్లో పదివేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సింగూరు ప్రాజెక్టు నిర్మాణంలో అలసత్వం ప్రదర్శిస్తే కాంట్రాక్టర్ల బ్లాక్ లిస్టులో పెడతామని మంత్రి హెచ్చరించారు. అదే విధంగా అధికారులకు కూడా మంత్రి పలు సూచనలు చేశారు. -
‘మిషన్’ గుట్టు రట్టు
చిత్రంలో.. తాడ్వాయి మండలం కామారం గ్రామంలోని కుమ్మరికుంట చెరువు. ఈ చెరువు మత్తడి, తూములు మంచిగా ఉన్నా మిషన్ కాకతీయలో రూ.95 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో కొత్త మత్తడి నిర్మించేందుకు ఉన్న పాత మత్తడిని తొలగించారు. ఇటీవల కురిసిన వర్షాలకు నిర్మించిన మట్టితోపాటు మత్తడి కోతకు గురైంది. తాడ్వాయి మండలంలో పలు చెరువుల కట్టలు వెడల్పు కోసం మట్టిని పోసి సరైన రోలింగ్ చేయకపోవడం వల్ల వర్షాలకు పగుళ్లు వచ్చాయి. మరో వర్షం పడితే ఉన్న మట్టికాస్తా కొట్టుకుపోరుు కట్టలు తెగిపోయే ప్రమాదం ఉంది. - బయటపడుతున్న నిర్మాణాల గుట్టు - ఇలా అయితే చెరువుల్లో నీటినిల్వ ప్రశ్నార్థకమే.. - అధికారుల పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణం - రూ.కోట్ల నిధులు నీటిపాలు - ‘మిషన్’ లోపాల పుట్ట - నాణ్యత లేక కోతకు గురవుతున్న మత్తళ్లు - పగుళ్లు చూపుతున్న చెరువు కట్టలు వరంగల్ : తొలకరి వర్షాలకే ‘మిషన్ కాకతీయ’ పనుల గుట్టు రట్టయింది. జిల్లాలో చేపట్టిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో మరమ్మతులు చేయూల్సి వస్తోంది. తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం లోపభురుుష్టంగా ఉండటంతో ఈ పరిస్థితి దాపురించింది. జిల్లాలో 5,836 చెరువులు ఉండగా.. అందులో 20 శాతం మొదటి ఏడాదిలో చేపట్టేందుకు 1,173 చెరువులు ఎంపిక చేశారు. ఇందులో ఇప్పటివరకు ప్రభుత్వం పలు విడతలుగా 1,061 చెరువుకు నిధులు కేటాయిస్తూ పరిపాలన మంజూరు ఇచ్చింది. టెండర్లలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నేతలు గ్రీన్సిగ్నల్ ఇస్తే తప్పా ప్రారంభించలేక పోయారు. ఏజెన్సీలో అటవీశాఖ అధికారులు అడ్డుగా నిలవడంతో వారిని ప్రసన్నం చేసుకుకోవడంతో పుణ్యకాలం గడిచింది. వర్షాలు వస్తాయని అధికారులు ముందస్తు హెచ్చరికలు చేయడంతో పనులు తొందరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో తూ.తూ. మంత్రంగా పూర్తి చేశారనే ఆరోపణలు ఉన్నారుు. పాటించని నిబంధనలు చెరువులు పనులు సక్రమంగా చేయకపోవడంతో మొదటి ఏడాదే తెగుతున్నారుు. చెరువు కట్టలను పటిష్టపర్చేందుకు పోసే మట్టి ఇతర ప్రాంతాల నుంచి తేవాలి. కానీ, కాంట్రాక్టర్లు చెరువులోని చౌడు మట్టిని కట్టపై పోయడం, రోలింగ్ చేయకపోవడంతో కట్టలు మొదటి వర్షానికే పగుళ్లు బారుతున్నాయి. మట్టి పోసిన సమయంలో 9 నుంచి 12 అంగళాల మట్టి పోసి రోలింగ్ చేసిన తర్వాతే నీళ్లు చల్లుకుంటూ రోలింగ్ చేయాలి. అలా చేయక ట్రాక్టర్లతో తొక్కించడం వల్ల కట్టలు బలహీనంగా మారుతున్నారుు. అరుునా అధికారులు ఏమి చేయలేకపోతున్నారు. గండ్లతో కడగండ్లు ‘మిషన్ కాకతీయ’లో చెరువులకు అవసరం లేకున్నా.. రూ.లక్షలు వెచ్చించి పటిష్టంగా ఉన్న తూములు తొలగించి కొత్తవి నిర్మిస్తున్నారు. వర్షాలతో కాకుండా కాంట్రాక్టర్లు పెట్టిన గండ్లతో రైతులు ఈ ఏడాది ఇబ్బందులు తప్పెటట్లు లేదు. మంగపేట మండలం రామచంద్రునిపేట సమీపంలోని సంఘంపల్లి చెరువుకు రూ.45.50 లక్షలు కేటాయించారు. పూడికతీతకు రూ.9.67 లక్షలు, కట్టకు రూ.2.79 లక్షలు, తూము, మత్తళ్ల నిర్మాణానికి రూ.16.58 లక్షలు కేటాయించారు. నిధులు ఎక్కువగా ఉండడంతో తూముల నిర్మిస్తున్నారు. తూములు తొలగించే సమయంలో రింగ్బండ్లు వేసి కొత్తవి నిర్మించాల్సి ఉంటుంది. వర్షాలు ఆలస్యంగా వస్తాయని భావించిన కాంట్రాక్టర్లు జిల్లాలోని పలు చెరువుల తూములను తీసి వేయడంతో ఇటీవల పడిన వర్షపు నీరు నిల్వ ఉండడం లేదు. చెరువులో నీటి అపుకునేందుకు రైతులు రింగ్బండ్లు వేస్తున్నా లాభం లేని పరిస్థితులు నెలకొన్నాయి. తూముల నిర్మాణానికి వాడుతున్న కాంక్రిట్లో నిర్ధేశించిన మేరకు సిమెంటు మిక్స్ చేయకపోవడంతో వర్షాలకు సిమెంటు పోయి కంకర కనిపిస్తోంది. గుట్టు రట్టు.. చెరువుల మరమ్మతుల్లో అక్రమాలు జరుగుతున్నా చూసీచూడనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తూ.తూ. మంత్రంగా పూడికతీతలు తీసినా బిల్లులు చేయాలని ఒత్తిడి తెస్తున్న కాంట్రాక్టర్లకు వర్షాలు పడడం జీర్ణించుకోలేక పోతున్నారు. నీరు చేరవడం వల్ల ఎంత మేరకు పూడిక తీసారన్న కొలతలు తీయడం కష్టంగా మారనుంది. అందువల్ల పనులు చేపట్టక ముందు రిమోట్ సెన్సింగ్తో తీసిన కొలతలతో ఇప్పటి కొలతలు పరిగణలోకి తీసుకుని బిల్లు చేస్తారని అధికారులు అంటున్నారు. అందువల్ల లేని కొలతలతో బిల్లులు చేస్తే చర్యలు తప్పవన్న భయం ఇంజనీరింగ్ అధికారులను వెంటాడుతోంది. వర్షాలు ఇప్పట్లో పడకుంటే పూడికతీతలు మళ్లీ దర్శనం ఇచ్చే అవకాశాలున్నాయి. -
ఖజానాకు టెండర్
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందంగా కాంట్రాక్టర్లు, ఏలూరు నగరపాలక సంస్థ అధికారులు, కార్పొరేటర్లు కుమ్మక్కయ్యారు. అందిన కాడికి దోచుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఇంతకుముందు 20 శాతం తక్కువకు కోట్ చేసిన పనులకు ముడిసరుకుల ధరలు పెరిగాయంటూ అంచనా వ్యయం భారీగా పెంచారు. ఆ మొత్తంపై 5 శాతం సొమ్మును ఎక్కువ చెల్లించేలా టెండర్లు వేయించారు. నగరపాలక సంస్థ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా పోటీ లేకుండా ఎక్కడికక్కడ కుమ్మక్కై సింగిల్ టెండర్లతో కోట్లాది రూపాయల పనులు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎక్కడైనా పనులు చేపట్టాలంటే ముందుగా టెండర్లు ఆహ్వానిస్తారు. ఆన్లైన్లోనే బిడ్ వేస్తారు. ఎవరు తక్కువ ధర కోట్చేస్తే వారిని ఎంపిక చేసి పనుల కాంట్రాక్టుల్ని అప్పగిస్తారు. కానీ.. ఘనత వహించిన ఏలూరు నగరపాలక సంస్థ అధికారులు మాత్రం కాంట్రాకర్లు పోటీపడకుండా ముందస్తుగానే పంచాయితీ చేశారు. ఎవరి స్థాయిలో వారికి పనులు పంచేశారు. కార్పొరేటర్లు సహా అందరికీ సొమ్ములు మిగిలేలా మాట్లాడుకున్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులతోపాటు నగరపాలక సంస్థ నిధులతో చేపట్టనున్న రూ.10 కోట్ల విలువైన పనులను ఇష్టారాజ్యంగా పంచేశారు. పంపకాల్లో కొన్ని ఇలా.. నగరంలో నివాసముంటున్న చింతల పూడికి చెందిన ఓ కాంట్రాక్టర్కు రూ.80 లక్షల విలువైన పనులను కట్టబెట్టారు. ఏలూరుకు చెందిన మరో సీని యర్ కాంట్రాక్టర్కు రూ.కోటి విలువైన పనులను, టీడీపీ కో-ఆప్టెడ్ సభ్యుడి బినామీకి రూ.40 లక్షల విలువైన పనులను అప్పగించారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ టెండర్ దాఖలు చేసిన 4 పనులు మినహా దాదాపు 50 పనులను సింగిల్ టెండర్లు వేయించి.. ముందుగా ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకే కట్టబెట్టినట్టు తెలుస్తోంది. ఐదు శాతం ఎక్సెస్ ఎందుకు వాస్తవానికి ఇప్పుడు నిర్ధేశించిన పను లు చేసేందుకు మూడేళ్ల కిందటే టెండర్లను ఆహ్వానించారు. అప్పట్లో అంచ నా వ్యయంపై 20నుంచి 25శాతం తక్కువకే కోట్ చేసి కాంట్రాక్టర్లు ఆయా పనులను దక్కించుకున్నారు. కానీ.. అప్పట్లో 13వ ఆర్థిక సంఘం నిధులు సకాలంలో విడుదలకాక కాంట్రాక్టర్లు పనులు మొదలుపెట్టలేదు. 2011 నుం చి 2014 వరకు పాలకవర్గం లేకపోవడం.. సమైక్యాంధ్ర ఉద్యమాలతో ఆటంకాలు.. ఆ తర్వాత వరుస ఎన్నికల నేపథ్యంతో పనులు అటకెక్కాయి. ఇటీవల ఆర్థిక సంఘం నిధులు విడుదల కాగా, నగరపాలక సంస్థ సాధారణ నిధులను కలిపి మొత్తం రూ.10 కోట్ల పనులు చేపట్టాలని అధికారులు ప్రతిపాదించారు. ఎప్పుడు పనులు మొదలవుతాయా.. ఎప్పుడు కాసులొ స్తాయా అని చూస్తున్న అధికార పార్టీ కార్పొరేటర్లు తమ అనుచరగణానికి పనులు కట్టబెట్టి కాసులు దండుకునేం దుకు తెరలేపారు. గతంలో ఖరారైన టెండర్లను పక్కనపెట్టి అస్మదీయులకు పనులు కట్టబెట్టేలా చర్యలు తీసుకున్నారు. రెండు, మూడేళ్ల కిందట కాం ట్రాక్టర్లు 20శాతం కంటే తక్కువకు కోట్ చేయగా.. ఇప్పుడు అవే పనులకు ముడి సరుకుల ధరలు పెరిగాయంటూ అంచనా వ్యయాలను పెంచారు. దీంతోపాటు ఐదు శాతం ఎక్కువ చెల్లించేలా టెండర్లు రూపొం దించడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నెల 18, 19వ తేదీల్లో దాఖలైన టెండర్లకు రేపోమాపో ఆమోదముద్ర వేయనున్నట్టు తెలుస్తోంది. దోపిడీకి ఉదాహరణలివిగో =ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఎన్ఆర్ పేట మీదుగా జీఎన్టీ రోడ్ వరకు అవుట్ఫాల్ డ్రెయిన్ నిర్మాణానికి గతంలో రూ.20.10 లక్షల ధర నిర్ణయించగా, ఓ కాంట్రాక్టర్ 20శాతం తక్కువకే టెండర్ వేశారు. సుమారు రూ.16.67లక్షలకే ఆ కాంట్రాక్టు పూర్తి చేసేందుకు ముందుకొచ్చారు. ఇప్పుడు అదే పనిని మరో కాంట్రాక్టర్కు రూ.31 లక్షలకు ఇచ్చేలా టెండర్ ఖరారు చేశారు. అంటే దాదాపు రెట్టిం పు ధరకు అన్నమాట. =టీటీటీ కల్యాణ మంటపం రోడ్డుకు ఇరువైపులా డ్రెయిన్ల నిర్మాణ పనులను మూడేళ్ల కిందట రూ.34.40 లక్షలకు చేపట్టేందుకు ఓ కాంట్రాక్టర్ టెండర్ వేశారు. ఈయన కూడా 20 శాతం తక్కువకే కోట్ చేస్తూ రూ.29.44 లక్షలకే నిర్మాణం పూర్తి చేసేందుకు ముం దుకొచ్చారు. ఇప్పుడు అదే పనిని మరో కాంట్రాక్టర్కు రూ.40 లక్షలకు టెండర్ ఖరారు చేశారు. =19వ డివిజన్లోని క్రీస్తు విగ్రహం నుంచి వంగాయగూడెం ఎస్సీ కాలనీ వరకు సీసీ డ్రెయిన్ల నిర్మాణాన్ని గతంలో రూ.23.11 లక్షలతో చేపట్టేలా ఒప్పందం కుదిరింది. అదే పనిని ఇప్పుడు రూ.30 లక్షలకు టెండర్ ఖరారు చేశారు. =అశోక్ నగర్ మెయిన్ రోడ్లోని అశోకా పిల్లర్ జంక్షన్ నుంచి అమీనాపేట ఎస్ఆర్ జంక్షన్ వరకు డ్రెయిన్ల నిర్మాణ పనులు చేపట్టేందుకు గతంలో రూ.32 లక్షలకు టెండర్ ఖరారు కాగా, ఇప్పుడు ఇదే పనిని రూ.46 లక్షలకు కోట్ చేసిన కాంట్రాక్టర్కు అప్పగించారు. -
నామినేషన్దే డామినేషన్
ఇదీ నిబంధన.. కరువు.. తుపాను.. సునామీల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల్సిన పనులను మాత్రమే నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు అప్పగించాలి. అదీ రూ.ఐదు లక్షల్లోపు విలువైన పనులను మాత్రమే. ఉల్లంఘన ఇలా.. ఈ నిబంధనను రాష్ట్రప్రభుత్వం ఉల్లంఘించింది. ప్రకృతి వైపరీత్యాలతో సంబంధం లేకుండా నామినేషన్పై పనులు కట్టబెట్టడానికి మరోసారి సిద్ధమైంది. ఇప్పటికే రూ.ఐదు లక్షల్లోపు విలువైన పనులను నామినేషన్పై కాంట్రాక్టర్లకు అప్పగించాలని నీటిపారుదల, పంచాయతీరాజ్, పురపాలక శాఖల అధికారులను 15 రోజులక్రితం ఆదేశించిన ప్రభుత్వం తాజాగా రహదారులు, భవనాల శాఖలోనూ అదేవిధానాన్ని వర్తింపజేయాలని మంగళవారం ఉత్తర్వులిచ్చింది. నామినేషన్ పనుల పరిధిని రూ.పది లక్షల వరకూ పెంచింది. దోచిపెట్టడానికే.. తెలుగుతమ్ముళ్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టడానికే నామినేషన్ దందాకు ప్రభుత్వం తెరతీసినట్టు అధికారవర్గాలే అంగీకరిస్తున్నాయి. నీటిపారుదల శాఖలో రూ.300 కోట్లు, పురపాలకశాఖలో రూ.75 కోట్లు, పంచాయతీరాజ్ శాఖలో రూ.120 కోట్ల పనులను కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పుడు రహదారులు, భవనాలశాఖలో మరో రూ.95 కోట్ల పనులను టీడీపీ నేతలకు సంతర్పణ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నలిచ్చింది. సాక్షి, హైదరాబాద్: తెలుగుతమ్ముళ్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టేందుకు రాష్ట్రప్రభుత్వం నామినేషన్ దందాకు తెరతీసింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల్సిన పనులను మాత్రమే నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు అప్పగించాల్సి ఉండగా.. వాటితో నిమిత్తం లేకుండా నిబంధనలను తుంగలో తొక్కి భారీ ఎత్తున పనులను టీడీపీ నేతలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ పాలనలో యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన రూ.లక్ష లోపు విలువైన పనులను మాత్రమే నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశాక రూ.5 లక్షల్లోపు విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టేలా వెసులుబాటు కల్పించారు. రోడ్లు,భవనాల శాఖసహా పలు శాఖల్లో గతేడాది ఈ విధానం అమలైంది. తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ అదేబాటన నడుస్తూ.. నీటిపారుదలశాఖ, పంచాయతీరాజ్, పురపాలక శాఖల్లో రూ.5 లక్షల్లోపు విలువైన పనులను నామినేషన్పై అప్పగించడానికి ప్రభుత్వం ఇటీవల అనుమతిచ్చింది. తాజాగా రహదారులు, భవనాల శాఖలోనూ అదే విధానాన్ని వర్తింపజేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాదు.. నామినేషన్పై కట్టబెట్టే పనుల విలువను రూ.ఐదు లక్షల నుంచి రూ.పది లక్షలకు పెంచుకునే వెసులుబాటును కల్పించింది. ఈ ఉత్తర్వులు రెండు నెలలపాటూ అంటే జూలై 26 వరకూ అమల్లో ఉంటాయని పేర్కొంది. నీటిపారుదలశాఖలో కాలువలు, గట్లు, తూములు, స్లూయిజ్ల వంటి మరమ్మతు పనులు, పంచాయతీరాజ్, పురపాలక శాఖల్లో సిమెంటు రోడ్లు, గ్రామీణ రహదారులు, మురుగునీటి కాలువలు వంటి పనులు, రహదారులు, భవనాలశాఖలో రోడ్లు, భవనాల మరమ్మతు పనులను నామినేషన్పై కట్టబెట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టీకరించింది. ప్రజాధనం దుర్వినియోగం.. ఏదైనా పనికి టెండర్ నిర్వహిస్తే.. కాంట్రాక్టర్లు పోటీపడి తక్కువ ధరకు కోట్ చేసే వీలుంటుంది. అప్పుడు ప్రభుత్వానికి భారీ ఎత్తున నిధులు ఆదా అయ్యే అవకాశముంటుంది. కానీ నామినేషన్పై పనులు కట్టబెట్టడం వల్ల ప్రభుత్వానికి ఒనగూడేదేమీ ఉండదు. ప్రభుత్వ ఉత్తర్వులను పరిశీలిస్తే.. నామినేషన్పై కట్టబెట్టే పనులన్నీ టీడీపీ నేతలకే దక్కనున్నాయి. కాంట్రాక్టర్లకైతే అనుభవం ఉండటం వల్ల పనుల్లో నాణ్యతుండే వీలుంటుంది. టెండర్ ద్వారా పనులప్పగిస్తే.. పనులు నాసిరకంగా ఉంటే సదరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకునేందుకు ఆస్కారముంటుంది. చేసిన పనులు తొందరగా మరమ్మతులకు గురైతే.. టెండర్ దశలో కాంట్రాక్టర్ చెల్లించిన ఈఎండీ(ఎర్నెస్ట్ మనీ డిపాజిట్)ని మినహాయించుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుంది. కానీ నామినేషన్పై పనులను టీడీపీ నేతలకు కట్టబెడితే.. వారికి అనుభవం లేనందున ఇష్టారాజ్యంగా చేస్తారు. సాక్ష్యమిదిగో.. గతేడాది ఒక్క రహదారులు, భవనాలశాఖ పరిధిలోనే రూ.80 కోట్ల విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో టీడీపీ నేతలకు కట్టబెట్టి పూర్తి చేయించారు. అప్పట్లో రూ.లక్ష నుంచి రూ.5 లక్షల్లోపు పనులను నామినేషన్పై కట్టబెట్టింది. పనులు దక్కించుకున్న టీడీపీ నేతలు నాసిరకంగా చేశారు. అనంతపురం, గుంటూరు జిల్లాల్లో చేపట్టిన పనుల్లో భారీఎత్తున నిధులు దుర్వినియోగమైనట్లు విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదికివ్వడమే ఇందుకు నిదర్శనం. అయినా పట్టించుకోని ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ నామినేషన్ పద్ధతిలోనే కట్టబెట్టేందుకు సిద్ధమైంది. దీంతో గతేడాది పరిణామాలే ఈ ఏడాది పునరావృతమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయని రహదారులు, భవనాలశాఖ అధికారవర్గాలు అంటున్నాయి. -
అవినీతి సొరంగం!
⇒ అవుకులో రూ.50 కోట్ల నుంచి ⇒ రూ.60 కోట్లు కొట్టేసే వ్యూహం ⇒ కాంట్రాక్టర్తో సర్కారు పెద్దలు కుమ్మక్కు! సాక్షి, హైదరాబాద్: గాలేరు నగరి సుజల స్రవంతి(జీఎన్ఎస్ఎస్) ప్యాకేజ్-30లో భాగంగా చేపట్టిన అవుకు సొరంగ మార్గంలో అవినీతి ప్రవాహానికి మార్గం సుగమమైంది!. సొరంగంలోని లోపాలను సరిచేయడానికిగాను వెచ్చించే సొమ్ములో రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వంలోని పెద్దలే.. కాంట్రాక్టర్తో కుమ్మక్కయినట్టు తెలిసింది. సదరు పనుల కోసం రాకరాక అనుమతులు రావడంతో.. అడిగిన మొత్తాన్ని సమర్పిం చుకునేందుకు కాంట్రాక్టర్ సిద్ధమైనట్టు సమాచారం. వివరాలు.. 2007 నాటి ఒప్పందం మేరకు రూ.401.12 కోట్ల విలువైన సొరంగం పనులను అప్పటి ప్రభుత్వం ఎన్సీసీ మైటాస్-జెడ్వీఎస్(జేవీ) సంస్థకి అప్పగించింది. అయితే, జేవీ సంస్థ ఈ పనులను జీవీఆర్కు సబ్ కాంట్రాక్టుకు ఇచ్చింది. పనులు జరుగుతున్న క్రమంలో సొరంగంలో రాళ్లు ఊడిపడుతున్నందున 50 వేల అడుగుల మేర.. సిమెంట్ పూత స్థానంలో స్టీల్ ఫైబర్ లైనింగ్ చేయాలని, దీనికి అనుమతించాలని కాంట్రాక్టర్ గత మూడేళ్లుగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. దీనికిగాను అదనంగా నిధులు ఇవ్వాలని కోరుతున్నారు. ఒప్పందం ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. సదరు కాంట్రాక్టరే సొరంగాన్ని పూర్తి చేసి ఇవ్వాలి. మధ్యలో చెప్పే కారణాలతోకానీ, అదనపు నిధులు మంజూరు చేయడ ంగానీ ప్రభుత్వానికి సంబంధం లేదు. దీంతో గత ప్రభుత్వం కాంట్రాక్టర్ వినతిని పట్టించుకోలేదు. అయితే, అనూహ్యంగా చంద్రబాబు సర్కారు మాత్రం కాంట్రాక్టర్కు అనుకూలంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయం వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు సమాచారం. దీంతో.. కాంట్రాక్టర్ తొలుత పూత వేయాల్సిన ప్రాంతం 50 వేల అడుగులని చెప్పి.. తాజాగా దానిని 1.5 లక్షల అడుగులకు పెంచేశారు. అంతేకాదు, దీనికిగాను రూ.100 కోట్లు అదనంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఈ మొత్తాన్ని ఇచ్చేలా ఉన్నతాధికారులు సిఫార్సు చేసేశారు. ఉన్నతాధికారుల సిఫార్సు మేరకు ప్రభుత్వ రూ.100 కోట్లు మంజూరు చేసినా.. 1.5 లక్షల అడుగుల వైశాల్యానికి స్టీల్ ఫైబర్ పూత వేసేందుకు అయ్యే వ్యయం రూ.40 కోట్లుగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక, మిగిలిన రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల సొమ్ము పక్కదారి పట్టడం ఖాయమని తెలుస్తోంది. అంకెల్లో.. 2007: ఒప్పందం కుదిరిన ఏడాది. 401.12: రూ.కోట్లు సొరంగం పనుల అంచనా వ్యయం. 50: వేల అడుగులు.. సొరంగంలో పూతవేయాలంటూ కాంట్రాక్టర్ మొదట చెప్పింది. 1.5: లక్షల అడుగులు.. సొరంగంలో పూతవేయాలంటూ కాంట్రాక్టర్ ఇప్పుడు చెబుతున్న కథ. 100: రూ.కోట్లు అదనంగా ఇవ్వాలని కాంట్రాక్టర్ అడిగింది. 40: రూ.కోట్లు ఆయా పనులకు నిజంగా అయ్యే వ్యయం! 50-60: రూ.కోట్లు కాంట్రాక్టరు, పెద్దలు కుమ్మక్కై పంచుకునే సొమ్ము! విషయం: అవుకు సొరంగంలో రాళ్లు ఊడిపడకుండా స్టీల్ ఫైబర్ పూతకు అనుమతించాలంటూ సర్కారుకి కాంట్రాక్టర్ వినతి. ఒప్పందంలో ఉందా?: లేదు. 2007 నాటి ఒప్పందం మేరకు ఎలాంటి పూత వేయాలన్నా కాంట్రాక్టర్దే బాధ్యత. సర్కారు ఏమంది?: గత ప్రభుత్వం ఒప్పుకోలేదు. చంద్రబాబు సర్కారు ‘సై’ అంటోంది. ఎవరికి లాభం?: కాంట్రాక్టర్కు.. ఆయనకు సహకరిస్తున్న సర్కారు పెద్దలకు. భారం: ప్రజాధనం రూ.100 కోట్లు. అవినీతి: రూ.50 కోట్లు-రూ.60 కోట్లు? మూరెడు.. బారెడైంది.. ఎందుకు? సొరంగంలో స్టీల్ ఫైబర్ లైనింగ్ చేయాల్సిన వైశాల్యం 50 వేల అడుగులని ఆరేడు నెలల క్రితం కాంట్రాక్టర్ స్పష్టంగా పేర్కొన్నారు. దీనికి సంబంధించి అంగీకారం కోరుతూ.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ.. ఇటీవల సమర్పించిన ప్రతిపాదనల్లో.. ఈ విస్తీర్ణాన్ని ఏకంగా 1.5 లక్షల అడుగులకు పెంచారు. ఇంత భారీస్థాయిలో విస్తీర్ణం ఏవిధంగా పెరిగిందో కనీసం వివరించే పనికూడా చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వారు కోరారు.. వీరు తలూపేశారు!! కాంట్రాక్టర్ చెబుతున్న విధంగా సొరంగంలో రాళ్లు ఊడిపడే వైశాల్యం వాస్తవంగా ఎంత ఉందనే విషయాన్ని అధికారులు కనీస పరిశీలన కూడా చేయలేదు. కాంట్రాక్టర్ ఇచ్చిన ప్రతిపాదనను యథావిధిగా సబంధిత సీఈ ప్రభుత్వానికి సమర్పించారు. దీనికి ఉన్నతాధికారులూ తలూపేశారు. కాంట్రాక్టర్ అడిగినంత ఇవ్వాలని, ప్రతిపాదనలకు యథావిధిగా ఆమోదం తెలపాలని రాష్ట్రస్థాయి స్టాం డింగ్ కమిటీకి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి సూచించడం గమనార్హం. కొసమెరుపు!: ప్రతిపాదనను యథావిధిగా ఆమోదించాలని అధికారులు రాసేస్తే, రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ ఉండడం ఎందుకని కమిటీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. -
ఆగని రవాణా
- దర్జాగా ఇసుక తరలింపు - ప్రభుత్వ పనుల పేరిట అనుమతి - ప్రరువేటు పనులకు సరఫరా - ఇసుక మాఫియా కొత్త దారి - అధికారుల తీరు ‘మామూలే’ బాన్సువాడ : ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలమవుతోంది. మంజీరా తీర ప్రాంతాల నుంచి రోజూ పదుల సంఖ్య లో లారీలు, టిప్పర్లలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూనే ఉన్నారు. మూడు నెలల క్రితం వరకు పట్టాభూముల నుంచి ఇసుక రవాణా సాగింది. ఈ విషయమై దుమారం రేగడంతో ఇసుక తరలింపును నిలిపివేసిన విషయం విదితమే. దీంతో ఇసుక తరలింపునకు కాంట్రాక్టర్లు కొత్త వ్యూహం పన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువల ఆధునీకరణ కు ఇసుక కావాలని అనుమతి తీసుకుని హైదరాబాద్కుతరలిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ వాహనాలు,టిప్పర్లపై ‘ఆన్ గవర్నమెంట్ డ్యూటీ’ అనే ఫ్లె క్సీ లు, కరపత్రాలు పెట్టుకొని ఇసుకను తరలి స్తున్నారు. బీర్కూర్ మండలం కిష్టాపూర్ సమీపంలో ఉన్న మంజీరా నదీ తీరం నుంచి ఇసుకను జేసీబీల ద్వారా తోడుతున్నారు. నిజానికి నిజాంసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణకు దశలవారీగా ఇసుకను తరలిస్తున్నారు. గతంలో వెయ్యి లారీల ఇసుకను తరలించిన కాంట్రాక్టర్, ప్రస్తు తం వారంలో మూడుసార్లు తహశీల్దార్ ద్వారా వేబిల్లు పొంది, యథేచ్ఛగా ప్రరుువేటు పనుల కు తరలిస్తున్నారు. ఆయూ గ్రామాలలో వీఆర్ఓ లు ఇసుక ట్రిప్పులను నమోదు చేయాల్సి ఉండగా, వారు అమ్యామ్యాలకు లొంగి, కాందార్ల ను క్వారీ పాయింట్ల వద్ద ఉంచి, వారి చేత లారీల నంబర్లను నమోదు చేరుుస్తున్నారనే ఆ రోపణలు వినిపిస్తున్నారుు. వారు కొన్ని లారీల నంబర్లు నమోదు చేసి, మరి కొన్నింటిని వదిలేస్తున్నారని తెలుస్తోంది. ఇలాంటి లారీలను బా న్సువాడ శివారు వరకు తీసుకెళ్లి, లారీకు ఉన్న ఫ్లెక్సీని తొలగించి నేరుగా హైదరాబాద్కు పం పుతున్నట్టు సమాచారం. కొన్ని రహస్య ప్రాం తాలలోనూ ఇసుకను డంప్ చేసి, టిప్పర్ల ద్వారా భవన నిర్మాణదారులకు విచ్చలవిడిగా విక్రయించుకొంటున్నారు. కొత్త విధానంతోనూ ప్రయోజనం శూన్యం అక్రమార్కులపై కేసులు పెట్టినా, జరిమానాలు విధిస్తున్నా అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. ఇసుక రవాణాలో నెల రోజుల క్రితం ప్రవేశపెట్టిన కొత్త విధానం ద్వారా సైతం ఎ లాంటి ప్రయోజనం చేకూరడం లేదు. మంజీరా తీర ప్రాంతాలైన బాన్సువాడ మండలం చింతల్నాగారం, బీర్కూర్ మండలం దామరంచ, కిష్టా పూర్, బీర్కూర్, బరంగేడ్గి, కోటగిరి మం డలం హంగర్గ, పొతంగల్, బిచ్కుంద మం డలం బండరెంజల్, గుండెనెమ్లి, వాజీద్నగర్, పుల్కల్, హస్గుల్, ఖద్గాం, శెట్లూర్, పిట్లం మండలం మద్దెల్ చెరువు గ్రామాలకు ఆనుకొని ఉన్న మంజీరా నుంచి రోజూ వందల సంఖ్యలో ట్రాక్టర్లలకు ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క కోటగిరి మండలం పొతంగల్ నుంచే కొందరు అక్రమార్కులు వందల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇసుకను తరలిస్తూ, వర్నీలో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి నిజామాబాద్, బోధన్, కామారెడ్డి ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రాక్టర్కు రూ. 2500, టిప్పర్కు రూ. 8వేల వరకు వసూలు చేస్తున్నా రు. ప్రభుత్వ అధికారులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మండల స్థాయి అధికారులకు నెలనెలా మామూళ్లు ముట్టజెప్పుతూ అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల అధికారుల అండదండలతోనే ఈ అక్రమ రవాణా సాగుతోంది. -
ప్రాజెక్టుల ఎస్కలేషన్కు ఓకే..!
సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులకు మార్గం సుగమం జీవో 13కు కొద్దిపాటి మార్పులతో ధరలు పెంచేందుకు కమిటీ సానుకూలం సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులకు పెరిగిన ధరలకు అనుగుణంగా ధరలు పెంచనున్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఎస్కలేషన్ అమలు చేస్తున్న దృష్ట్యా తెలంగాణలోనూ దీన్ని అమలు చేయాలని కాంట్రాక్టర్ల నుంచి వస్తున్న వినతుల నేపథ్యంలో ఎస్కలేషన్ కమిటీ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కిరణ్కుమార్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 13కు చిన్నపాటి సవరణలు చేసి అమలు చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఎస్కలేషన్ కమిటీ మూడు నాలుగు రోజుల్లో మరోమారు సమావేశమై తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ప్రభుత్వం ఆమోదించిన మరుక్షణం కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులు మొదలవుతాయి. 25 ప్రాజెక్టులకు వర్తింపు... రాష్ట్రంలో జలయజ్ఞం కింద మొత్తంగా 33 సాగునీటి ప్రాజెక్టులు కొనసాగుతుండగా, వాటితో 47.75 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మొత్తం ప్రాజెక్టులకు రూ.1,11,240 కోట్ల పరిపాలనా అనుమతులు లభించగా, కాంట్రాక్టర్లతో రూ.88,168 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి. ఇందులో 2013-14 ఆర్ధిక ఏడాది ముగిసే నాటికి రూ. 37,935.23 కోట్ల మేర పనులు జరగగా, 2014-15 ఆర్ధిక ఏడాదిలో ఖర్చు చేసిన రూ.4,662.78 కోట్లను కలుపుకొని ఇప్పటివరకు రూ. 42,598.01 కోట్లు ఖర్చయినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో 8 ప్రాజెక్టుల పనులు దాదాపు పూర్తికాగా మిగతా 25 ప్రాజెక్టులకు ఎస్కలేషన్ వర్తించే అవకాశం ఉంది. 2014 ఫిబ్రవరి 2న అప్పటి ప్రభుత్వం జారీచేసిన జీవో 13 ప్రకారం 2013 ఏప్రిల్ నుంచి జరిగిన పనులన్నింటికి కొత్త ధరల ప్రకారం బిల్లుల్ని చెల్లించాల్సి ఉంటుంది. భారం గరిష్టంగా రూ.6 వేల కోట్లు.. రిటైర్డ్ ఇంజనీర్ అనంతరాములు నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే దీనిపై కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తీసుకోగా, మంగళవారం మరోమారు కమిటీ భేటీయై వారి డిమాండ్లపై చర్చించింది. ప్రస్తుత పరిస్థితులు, పక్క రాష్ట్రంలో జీవో 13 అమలు, ప్రాజెక్టులు వేగంగా పూర్తి కావాలంటే ఎస్కలేషన్ వర్తింపు అవసరం తదితరాలపై క్షుణ్ణంగా చర్చించింది. సమావేశంలో దాదాపు జీవో 13ను అమలు చేయాలని, అదనపు నిర్మాణాలు చేసిన చోట సైతం చెల్లింపులు చేయడం సమంజసమేనని కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నెల 15న మరోమారు సమావేశమై తుది నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయించింది. 25 ప్రాజెక్టుల పరిధిలో ఏప్రిల్ 2013 నుంచి కనుక ఎస్కలేషన్ను వర్తింపచేయడం, అదనపు నిర్మాణాలకు చెల్లింపులు చేస్తే ప్రభుత్వంపై కనిష్టంగా రూ.3 వేల కోట్ల నుంచి గరిష్టంగా రూ.6వేల కోట్ల భారం పడుతుందని తేల్చినట్లుగా సమాచారం. -
గందరగోళం.. టెండర్ల వ్యవహారం
- వ్యవసాయ మార్కెట్కు ఖరారుకాని టెండర్లు - నచ్చిన వారికి కట్టబెడుతున్న అధికారులు - సైకిల్ స్టాండ్ టెండర్కు ‘పెద్ద’లతో ఒత్తిడి వరంగల్ సిటీ : వ్యవసాయ మార్కెట్లలో టెండర్ల వ్యవహారం గందరగోళంగా మారింది. వరంగల్ వ్యవసాయ మార్కెట్, దాని అనుబంధ మార్కెట్లలో మార్చి 31వ తేదీతో టెండర్లకు గడువు తీరింది. దీంతో అధికారులు 2015-16 మార్చి వరకు టెండర్ల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఇచ్చిన గడువు ప్రకారం టెండర్ దాఖలు చేసిన కాంట్రాక్టర్ల సమక్షంలోనే షెడ్యూల్డ్ ఫారాలను తెరిచారు. అరుతే మార్కెట్ నిబంధనల ప్రకారం కాకుండా.. తమకు నచ్చిన వారికే అధికారులు టెండర్లు కట్టబెట్టారని టెండర్ దాఖలు చేసిన పలువురు కాంట్రాక్టర్లు ఆరోపించారు. తేలని సైకిల్ స్టాండ్, మూడు క్యాంటీన్ల వ్యవహారం ఇప్పటివరకు లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ సైకిల్ స్టాండ్, పత్తి, మిర్చి, పల్లి యూర్డులలోని మూడు క్యాంటీన్ల భవితవ్యం తేలడం లేదు. వీటిని కూడా ఎక్కువ డబ్బులు ఎవరు ఇస్తే వారికి కట్టబెట్టే యత్నాలు జోరుగా సాగుతున్నట్లు టెండర్దారులు ఆరోపిస్తున్నారు. సైకిల్ స్టాండ్ విషయమై ఇప్పటికే రెండుసార్లు ‘సాక్షి’ దినపత్రికలో కథనాలు ప్రచురితమైన విషయం విదితమే. దీంతో అధికారులు తమకు నచ్చిన వారికి టెండర్ కట్టబెట్టడానికి సంకోచిస్తున్నారు.పైగా సైకిల్ స్టాండ్ కోసం టెండర్ వేసిన కాంట్రాక్టర్ డిప్యూటీ సీఎం వద్ద నుంచి రెకమండ్ లెటర్ తేవడంతోపాటు మరో ఇద్దరు ప్రజాప్రతినిధులతో తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పెద్ద మార్కెట్లోని ఓ క్యాంటీన్ టెండర్దారుడు కోర్టుకు వెళ్లారని, అందుకే దాని టెండర్ నిలిపివేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా.. అదంతా నిజం కాదని తెలుస్తోంది. కాగా, తమకు నచ్చిన కొన్ని క్యాంటీన్లు, పారిశుధ్య పనులను నచ్చిన వారికి ఇవ్వడానికి మార్కెట్లోని ఓ ఉన్నతాధికారి మొద టి నుంచి పైరవీలు చేస్తూ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు మార్కెట్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికైనా మిగిలిపోయిన పనులను టెండర్దారులకు అప్పగించి.. గందరగోళం, మాయాజాలానికి స్వస్తి పలకాలని రైతులు, కార్మికులు, వ్యాపారులు కోరుతున్నారు. -
మరమ్మతు పనుల్లో మాయాజాలం
- పనులు చేయకుండానే నిధుల విడుదల - విచారణ చేపట్టాలని కలెక్టర్కు టీఆర్ఎస్ జెడ్పీ ఫ్లోర్లీడర్ సకినాల శోభన్ ఫిర్యాదు - దుమారం రేపుతున్న చెరువుల మరమ్మతు పనులు ములుగు : అధికార పార్టీ అండదండలతో కొందరు కాంట్రాక్టర్లు అందినకాడికి దోచుకున్నారు. చెరువుల మరమ్మతు పనులు చేపట్టకుండానే అక్రమాలకు పాల్పడి పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులను కాజేశారు. కాగా, నాసిరకంగా చేపట్టిన పనులపై ఇటీవల టీఆర్ఎస్ జెడ్పీ ఫ్లోర్లీడర్ సకినాల శోభన్ కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. 2012-13లో కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గంలోని చెరువుల తూములు, కట్టలు కొట్టుకపోయాయని ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మరమ్మతు పనులకు నిధులు మంజూరు చేసింది. నిబంధనల ప్రకారం చెరువు పనులు ఆయకట్టు రైతులకు మాత్రమే దక్కాల్సి ఉంది. కానీ.. కొంత మంది కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి తప్పుడు సమాచారం అందించి టెండర్లు దక్కించుకున్నట్లు తెలుస్తుంది. కాగా, 2012-13లో చేపట్టిన చెరువుల మరమ్మతు పనుల్లో కాంట్రాక్టర్లు పనులు చేయకుండానే లక్షలాది రూపాయల నిధులు కాజేశారని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులు పక్కదారి పట్టేందుకు అప్పటి ఐబీ ఏఈలు, డీఈ, ఈఈలు కూడా కాంట్రాక్టర్లకు సహకరించారనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా, చెరువుల మరమ్మతు పనుల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, అవినీతి సొమ్మును ఆర్ఆర్యాక్టు ద్వారా వెంటనే ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యే విధంగా చూడాలని.. ప్రస్తుత టీఆర్ఎస్ జెడ్పీ ఫ్లోర్లీడర్ సకినాల శోభన్ కలెక్టర్కు ఫిర్యాదు చేయడం చర్చంశనీయంగా మారింది. కాగా, దీనిపై ‘సాక్షి’ వివరాలు సేకరించగా.. పలు గ్రామాల ప్రజలు చెరువు కట్టల పనుల్లో అవినీతి జరిగిందని, కొన్ని చోట్ల తూతూ మంత్రంగా పనులు చేసి పూర్తి నిధులు కాజేశారని బహిరంగంగా తెలిపారు. విడుదలైన నిధులు ఇవే... గోవిందరావుపేట మండలంలోని రంగాపురం చెరువుకు రూ.2.78 లక్షలు, చల్వాయి కోటకు రూ.1.50 లక్షలు, నర్సింహులు చెరువుకు రూ.2లక్షలు, తాడ్వాయి మండలంలోని మేడా రం శివరాంకుంటకు రూ.4.38 లక్షలు, కొత్తగూడ మండలంలోని వేలుబెల్లి మేడికుంటకు రూ.4.69 లక్షలు, ములుగు మండలంలోని లోకం చెరువుకు రూ.4.47 లక్షలు, పత్తిపల్లి ఎదుళ్ల చెరువుకు రూ.57, 474లు, ఊరచెరువుకు రూ.75,350, ఇంచర్ల పెద్దదామెర చెరువుకు రూ.18,594, ఏటూరునాగారం మండలంలోని హన్మంతుకుంటకు రూ.1.26 లక్షలు, ఇప్పకుంటకు రూ.93,560, ఇంచర్ల చిన్నదామెర చెరువుకు రూ.37,081, ఏటూరునాగారం మాటు కుంటకు రూ.98,800, పెద్దచెరువుకుంటకు రూ.1.41లక్షలు, తీగలకుంటకు రూ.1.17లక్షలు, సారలమ్మ కుంటకు రూ.1.13లక్షలు, సాకలికుంటకు రూ.1.03 లక్షలు, పాలకుంటకు రూ.93,560, చిన్నబోయినపల్లిలోని అలుగుబెల్లిచెరువుకు రూ. 1.31 లక్షలు, రాధమ్మకుంటకు రూ. 1.22 లక్షలు, ఈదులకుంటకు రూ.93,726, పగిడిచెరువుకు రూ.1.22లక్షలు, నర్సయ్యకుంటకు రూ.1.22 లక్షలు, లింగాలగండి చెరువుకు రూ.1.31లక్షలు, ఊరకుంటకు రూ.1.59లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. కాగా, ఈ నిధులు మార్చి నెలాఖరులో పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల ఖాతాలో జమ అయ్యాయి. విషయం తెలుసుకున్న ప్రజలు ఆందోళన చేయడంతో మరమ్మతు పనుల విషయం బయటికి వచ్చింది. ఇదిలా ఉండగా, ఈ విషయమై గత నెలలో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించేందుకు వచ్చిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్కు ములుగు మండలంలోని బండారుపల్లి గ్రామ రైతులు ఫిర్యాదు చేశారు. కాగా, కలెక్టర్ ప్రత్యేక చొరవచూపి చెరువు కట్టల మరమ్మతు పనుల్లో చోటుచేసుకున్న అవినీతిపై విచారణ జరపాలని రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, లక్షలాది రూపాయలతో మరమ్మతులు చేపట్టిన చెరువులనే టీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి మిషన్ కాకతీయ పథకం కింద ఎంపిక చేసి మళ్లీ నిధులు మంజూరు చేయడం పలు విమర్శలకు తావిస్తుంది. -
‘కంతనపల్లి’కి గ్రహణం
- కేసీఆర్.. నిర్వాసితులను అనుగ్రహించకపోవడమే కారణం - అడుగడుగునా పనులు అడ్డుకుంటున్న స్థానికులు - నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ - నెల రోజులుగా నిలిచిన భూసార పరీక్షలు ఏటూరునాగారం : కంతనపల్లి ప్రాజెక్టు గ్రహణం పట్టుకుంది. మార్చి 29న సీఎం కేసీఆర్ వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆగ్రహించిన భూ నిర్వాసితులు భూసార పరీక్షలను అడ్డుకున్నారు. ఇటీవల బ్యారేజీ నిర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇసుక తీస్తుండగా గ్రామస్తులు అడ్డుకుని ఆందోళనకు దిగారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టు ప్రాంతానికి వచ్చి వెళ్లినప్పటి నుంచి తట్టెడు మట్టిని కూడా తీయనివ్వడం లేదు. ముఖ్యమంత్రి పర్యటన తర్వాత పనులు ఊపందుకుంటాయని భావించగా ఇక్కడ సీన్ రివర్స అయ్యింది. దీనికంతటికి కారణం నిర్వాసితులకు నమ్మకం కలిగేలా సరైన హామీ ఇవ్వకపోవడమే. ఆదుకుంటారని ఆశతో ఎదురు చూసిన కంతనపల్లి ముంపు బాధితులకు సీఎం నిరాశే మిగిల్చారు. దీంతో ఆగ్రహించిన బాధితులు ఒక్క పనికూడా సాగనివ్వమని, ప్రభుత్వం నుంచి స్పష్టమైన, సముచితమైన హామీ వచ్చే వరకు పనులు కొనసాగించేది లేదని ఆ రోజే ప్రకటించిన విషయం తెలిసిందే. కంతనపల్లి వద్ద గోదావరి నదిపై మొదటి దశలో రూ.1609 కోట్లతో నిర్మించతలపెట్టిన బ్యారేజ్ నిర్మాణం పనుల కోసం సేకరించిన భూమికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు. గోదావరి నదిపై 3.5 కిలోమీటర్ల పొడవు, 172 గేట్ల నిర్మాణంతో చేపట్టనున్న పనుల కోసం యంత్రాలను ఏర్పాటు చేసుకునేందుకు ఏజెన్సీ రిత్విక్, ఎస్ఈడబ్ల్యూ కంపెనీలు కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. యంత్రాలు, ఇతర సామగ్రిని నిల్వ చేసుకునేందుకు తీసుకున్న భూములకు ఎలాంటి లీజు(కిరాయి) కానీ, నష్టపరిహారం ఇవ్వలేదు. వ్యవసాయం చేసుకునే భూముల్లో కంపెనీ వారు యంత్రాలు ఏర్పాటు చేసుకున్నారేగానీ ఇంత వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని భూ నిర్వాసితులు వాపోయారు. కాగా కంతనపల్లి గ్రామంలోని 1400 ఎకరాల భూములు బ్యాక్ వాటర్లో కలిసిపోతాయని అంచనా. కానీ అక్కడ ఉన్న రైతులకు కేవలం 777 ఎకరాల అసైన్డ భూమిలో కేవలం 335 ఎకరాలకు మాత్రమే రైతుల పేర పట్టాలు ఉన్నాయి. పట్టాలు ఉన్న వారికి పరిహారం ఇప్పిస్తామని చెప్పడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి పట్టాలు లేని రైతులు పట్టాలు ఇప్పించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. -
‘మిషన్’లో మాయ
- ‘ఉపాధి’ చెరువులకు మిషన్ కింద నిధులు - కాంట్రాక్టర్లు-అధికారుల కుమ్మక్కు - గతేడాది చెరువులకే మళ్లీ టెండర్లు వరంగల్ : మిషన్ కాకతీయ పనుల మర్మం అర్థం కావడం లేదు. ఎవరి ప్రయోజనాల కోసం పథకం పెట్టారో తెలియకుండా ఉంది. చెరువులను పునరుద్ధరిస్తున్నామని చెప్పి అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నారుు. ఆయకట్టు లేని చెరువులకు నిధులు కేటారుుంచడం, అనుకూలమైన వారికి టెండర్లు దక్కకపోతే మళ్లీ టెండర్లు నిర్వహించడం, గతంలో నాబార్డ్, ఎన్ఆర్ఈజీఎస్, ట్రిబుల్ఆర్, ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన చెరువులను మళ్లీ మిషన్ కాకతీయ కింద ఎంపిక చేయడం చూస్తే నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే విషయం అర్థం అవుతోంది. అప్పడు చేసిన పనులకు మళ్లీ బిల్లులు చేసేందుకు పక్కా ప్రణాళికలు అధికారులు, కాంట్రాక్టర్లు కలసి రూపొందించుకున్నారు. ముందుగా అధికారులతో అవగాహనకు వచ్చి కాంట్రాక్టు పనులు దక్కించుకున్నారు. తూతూ మంత్రంగా పనులు చేసి గతంలో చేసిన అభివృద్ధి పనులకు మళ్లీ బిల్లులు పొందేందుకు అధికార నేతలు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. కాగా, ఏజెన్సీలోని చెరువుల్లో పూడికతీతలు మొక్కుబడిగా ప్రతిపాదించారు. మైదాన ప్రాంతాల్లో మంజూరైన నిధుల్లో సగానికి పైగా పూడికతీతలకు కేటాయించగా ఏజెన్సీలోని చెరువులకు కేటాయించిన నిధుల్లో 20 శాతం మించిన దాఖలాలు లేవు. కేవలం గతంలో చేసిన పనులను దృష్టిలో పెట్టుకొని మళ్లీ అవే పనులను మిషన్ కాకతీయలో ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఏజెన్సీలో చెరువుల పునరుద్ధరణ ఏ విధంగా జరుగుతుందో అధికారులు చెప్పకపోవడమే ఇందుకు నిదర్శనం. ఏ చెరువులు చేపట్టారో గోప్యంగా ఉంచుతున్నారు. -
ఇరిగేషన్లో టెండర్ నిబంధనల సవరణ
తెలంగాణ కాంట్రాక్టర్లకు ప్రోత్సాహం హైదరాబాద్: నీటి పారుదల శాఖ టెండరు నింబంధనల్లో ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేపట్టింది. తెలంగాణ కాంట్రాక్టర్లను ప్రోత్సహించేలా ఈ సవరణలున్నాయి. గత అనుభవానికి సంబంధించి పనుల మొత్తం విలువను కుదించింది. సివిల్ పనుల్లో గడిచిన ఐదేళ్లలో ఏ ఏడాదైనా చేసిన పవి విలువను సగానికి తగ్గిస్తూ నిర్ణయించిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఫీజులను మాత్రం మూడింతలు చేసింది. ఈ మేరకు సోమవారం నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్ పనుల్లో గ్రూప్ వర్క్ చేసేందుకు స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ రూ.5 కోట్ల వరకు, క్లాస్-1 కాంట్రాక్టర్ రూ.కోటి, క్లాస్-2 రూ.40 లక్షలు, క్లాస్-3 రూ.20 లక్షలు, క్లాస్-4 రూ.8 లక్షలు విలువైన పనులు చే సి ఉండాలని నిబంధన ఉండగా ఇప్పుడు దాన్ని సవరిస్తూ అన్ని కేటగిరీల్లోనూ సగానికి తగ్గించారు. ఇదే సివిల్ పనుల్లో సింగిల్గా చేసే పనులకు మాత్రం గతంలో ఉన్న మాదిరే స్పెషల్ క్లాస్ రూ.2.50 కోట్లు, క్లాస్-1 రూ.50 లక్షలు, క్లాస్-2 20 లక్షలు, క్లాస్-3 రూ.10 లక్షలు, క్లాస్-4 రూ.4 లక్షలు ఉండగా దాన్ని యథావిధిగా కొనసాగించారు. పనుల గరిష్ట విలువలోనూ మార్పులు చేసిన ప్రభుత్వం క్లాస్-5 రూ.50 లక్షలు, క్లాస్-4 రూ.కోటి, క్లాస్-3 రూ.4 కోట్లు, క్లాస్-2 రూ.10 కోట్లు, క్లాస్-1 రూ.30 కోట్ల వరకు పరిమితి పెట్టగా స్పెషల్ క్లాస్కు మాత్రం రూ.30 కోట్లకుపైనా ఎంతవరకైనా ఉండొచ్చని వెల్లడించారు. కాంట్రాక్టర్ల ఫీజు రిజిస్ట్రేషన్ విలువను స్పెషల్ క్లాస్కు రూ.10 వేల నుంచి రూ.30 వేలకు, క్లాస్-1కు రూ.6 వేల నుంచి రూ. 20 వేలకు, క్లాస్-2కు రూ.3 వేల నుంచి రూ.10 వేలకు, క్లాస్-3కి రూ.2 వేల నుంచి రూ.6 వేలకు, క్లాస్-4,5లకు రూ.వెయ్యి నుంచి రూ. 5 వేలకు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
నీరు.. చోరీ
- నగరంలో ట్యాంకర్ల మాయూజాలం - ఆరు ట్రిప్పులకు మూడే సరఫరా - పేదల కాలనీల్లో తీరని దాహార్తి - కార్పొరేషన్ నీరు హోటళ్లకు విక్రయం - స్వచ్ఛంద సంస్థల వ్యాపారం - రూ.వందకు కొని.. రూ.వెయ్యికి అమ్మకం - చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు సాక్షి, ఖమ్మం: ఖమ్మం నగరంలో యథేచ్ఛగా మంచి నీటి దోపిడీ జరుగుతోంది. వేసవిలో తీవ్ర నీటిఎద్దడిని ఆసరాగా చేసుకొని ప్రజలకు జేబుకు చిల్లు పెడుతున్నారు. ఈ పర్వం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కాంట్రాక్టర్లతో పాటు, స్వచ్ఛంద సేవా సంస్థల ముసుగులో సాగుతోంది. కార్పొరేషన్ నీటిని ట్యాంకర్ల ద్వారా ఉచితంగా సరఫరా చేయాల్సిన కాంట్రాక్టర్లు అమ్ముకుంటున్నారు. అలాగే స్వచ్ఛంద సంస్థల పేరిట కొందరు కార్పొరేషన్ ట్యాంకుల నుంచి నీటిని రూ.100 చెల్లించి తీసుకుని ప్రైవేటు వ్యక్తులకు రూ.600 నుంచి రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. నీటి వ్యాపారంలో ఆరితేరుతున్నారు. కార్పొరేషన్ పరిధిలో నగర నడిబొడ్డున ఉన్న ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని పూర్తి స్థాయిలో సరఫరా చేస్తున్నట్లు కార్పొరేషన్ అధికారులు పేర్కొంటున్నా.. క్షేత్రస్థారుులో ఇందుకు విరుద్ధంగా ఉంది. నీటి సరఫరా కాగితాలపై అంకెల గారడీ సృష్టిస్తున్నారు. మంచినీటి సరఫరా చేసేందుకు కార్పొరేషన్కు సొంతంగా ఒక ట్యాంకర్ మాత్రమే ఉంది. అయితే వేసవిలో మంచినీటిని సరఫరా చేసేందుకు ఈ ఏడాది 12 ట్యాంకర్ల కోసం టెండర్లు నిర్వహించారు. ఈ టెండర్లను ఐదుగురు కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. ఏప్రిల్, మే, జూన్ వరకు నీటిని సరఫరా చేయాలి. ఒక్క ట్యాంకర్కు ఒక్క ట్రిప్పుకు రూ.325 చెల్లిస్తున్నారు. ప్రతిరోజూ ఒక్క ట్యాం కర్ ద్వారా ఆరు ట్రిప్పులు సరఫరా చేయాలని టెండర్ నిబంధన పెట్టారు. ట్యాంకర్ల కాంట్రాక్టర్లు కార్పొరేషన్లోని ఇంజనీరింగ్ అధికారులు సూచించిన ప్రకారం నగరంలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం మంచి నీటిని సరఫరా చేయాలి. అరుుతే ఇక్కడ అధికారుల పర్యవేక్షణ లోపంతో మూడు, నాలుగు ట్రిప్పులు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారని పలు కాలనీల వాసులు పేర్కొంటున్నారు. కాంట్రాక్టర్లు మాత్రం ఆరు ట్రిప్పులు సరఫరా చేసినట్లు రిజస్టర్లలో రాసుకుంటున్నారని, అనుకూలంగా ఉన్న స్థానికులతో సంతకాలు చేయించుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా సంబంధిత అధికారులు ఆయా ప్రాంతాల్లో మంచినీటి ట్యాంకు అడ్డాలను ఏర్పాటు చేసి స్థానికులకు సమాచారం ఇవ్వాలి. కానీ ఈ నిబంధనలు ఏమీ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ట్యాంకర్ల నీటిని కాంట్రాక్టర్లు వాణిజ్య అవసరాలకు అమ్ముకుంటున్నారు. కార్పొరేషన ఖజానాకు గండి.. ఏటా ఈ ట్యాంకర్ల మంచినీటి సరఫరాలో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై భారీ ఎత్తున కార్పొరేషన్ ఖజానాకు గండికొడుతున్నారు. త క్కువ ట్రిప్పులు సరఫరా చేసి ఎక్కువ ట్రిప్పు లు సరఫరా చేసినట్లు లెక్కలు రాసుకుంటున్నారు. ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేసిన తర్వాత నెల వారీగా బిల్లులు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ మూడు, నాలుగు నెలల తర్వాత మంచినీటి సరఫరా బిల్లులు తీసుకుంటున్నారు. అప్పటికి ఈ లెక్కలు ఎవ్వరూ చూడరన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లు కొన్నేళ్లుగా ఇలా చేస్తున్నారు. ఇందులో ఓ కాంట్రాక్టర్కు రెండు ట్యాంకర్లు మాత్రమే ఉన్నప్పటికీ తన వద్ద ఐదు ట్యాంకర్లు ఉన్నట్లు టెండర్ దక్కించుకోవడం గమనార్హం. నీటిని నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో మూడు, నాలుగు ట్రిప్పులు సరఫరా చేసి మిగతావి ఆపార్ట్మెంట్లు, హోటళ్లకు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. పేరుకు మాత్రం లైన్మన్లతో పర్యవేక్షణ చేస్తున్నట్లు ఏఈలు చెబుతున్నప్పటికీ నగరంలో రూ.10 కోట్ల విలువైన అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. వీటిని పర్యవేక్షించుందుకే ఏఈలకు తీరకలేదు. వీరికే ట్యాంకర్ల సరఫరా పర్యవేక్షణ బాధ్యతలు అప్పటించడంతో కాంట్రాక్టర్లకు కలిసివచ్చింది. కింది స్థాయి ఉద్యోగుల చేతులు తడిపి నాలుగు ట్రిప్పులకు ఆరు ట్రిప్పులు సరఫరా చేస్తున్నట్లు రిజిస్టర్లలో రాయించుకుంటున్నారు. వాస్తవంగా ఏ ట్యాంకర్..? రోజు ఎన్ని ట్రిప్పులు..? ఏ ప్రాంతాల్లో సరఫరా చేశారన్న విషయాలు కమిషనర్ లేక ఎంఈకి నివేదిక రూ పంలో సంబంధిత విభాగం అధికారులు ఇవ్వాలి. కానీ ఇక్కడ డీఈలు సైతం దీనిపై దృష్టి పెట్టడడం లేదు. దీంతో నగరంలో ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. ‘స్వచ్ఛంద’.. వ్యాపారం.. నగరంలో కొన్ని సేవా సంస్థలు స్వచ్ఛంద సేవా ముసుగులో కార్పొరేషన్ నీటిని అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ప్రభుత్వ గుర్తింపు ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలకు మాత్రమే కార్పొరేషన్ నిబంధనల ప్రకారం నీటిని ఉచితంగా ఇవ్వాలి. అయితే ప్రస్తుతం ఈ విధానంలో కొన్ని మార్పులు చేశారు. గతంలో దీన్ని ఆసరా చేసుకున్న కొంత మంది వ్యక్తులు కార్పొరేషన్ నుంచి ఉచితంగా నీటిని తీసుకొని నగరంలో హోటళ్లు, ఫంక్షన్ హాల్స్, అపార్ట్మెంట్లకు రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేసి నీటి విక్రయించారు. అయితే ప్రస్తుతం గుర్తింపు ఉన్నా లేకున్నా సొంత ట్యాంకర్ ఉంటే రూ.100 చెల్లించి ట్యాంకర్ నీటిని కార్పొరేషన్ పరిధిలోని ట్యాంకుల నుంచి తీసుకోవచ్చు. అయితే గుర్తింపు ఉన్నా, లేకున్నా పదుల సంఖ్యలో స్వచ్ఛంద సంస్థలు, కొంత మంది వ్యక్తులు కార్పొరేసన్ ట్యాంకుల నుంచి రూ.100 చెల్లించి నీటిని తీసుకొని ఇదే ట్యాంక్ను నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో రూ.వెయ్యి వరకు విక్రయిస్తున్నారు. తనిఖీలు చేయని అధికారులు.. మంచినీటి కోసం ప్రతిరోజు నగరంలో ఏదో ఒక చోట నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. నగరంలో ఎక్కడ సమస్య ఉందో చెబితే అక్కడి ట్యాంకర్ పంపిస్తామని చెప్పిన కార్పొరేషన్ అధికారులు ప్రస్తుతం ట్యాంకర్లతో మంచినీటి సరఫరాపై నిఘా పెట్టడం లేదు. -
‘ఆ కాంట్రాక్టర్లు’ బ్లాక్లిస్టులో: తుమ్మల
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రహదారుల నిర్మాణ పనుల్లో నాణ్యతపై నిర్లక్ష్యం ప్రదర్శించే కాంట్రాక్టర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడమే గాక వారి పేర్లను బ్లాక్లిస్టులో చేరుస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. రోడ్డు పనులపై మంగళవారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.10,800 కోట్లతో చేపడుతున్న మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు, రెండు లేన్లుగా సింగిల్ రోడ్ల విస్తరణ తదితర పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎర్రమంజిల్లో నిర్మిస్తున్న ఆర్ అండ్ బీ కొత్త భవనాన్ని అనంతరం మంత్రి సందర్శించారు. -
శరణం ‘కన్సల్టెన్సీ’
సాక్షి, హైదరాబాద్: తనకు ఎదురయ్యే ఎలాంటి ఇబ్బందుల నుంచి అయినా గట్టెక్కడానికి ప్రభుత్వం వద్ద ఉన్న మంత్రం.. ‘కన్సల్టెన్సీ’.కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని కన్సల్టెంట్లకు సమర్పిస్తున్న ప్రభుత్వం.. తాజాగా పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ను రక్షించడానికీ అదే మార్గాన్ని అనుసరించింది. నత్తతో పోటీ పడుతూ సాగుతున్న పోలవరం పనుల ప్రగతి పట్ల ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖ రాయడంతో పాటు సోమవారం సీఎస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలోనూ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేయటం తెలిసిందే. ఇదేవిధంగా పనులు జరిగితే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి ఎంత కాలం పడుతుందో కూడా చెప్పలేమని పేర్కొంది. షెడ్యూలు ప్రకారం పనులు చేయకుంటే కాంట్రాక్టును రద్దు చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికీ వెనకాడబోమని పీపీఏ సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్ను రక్షించడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. అథారిటీ హెచ్చరికను నేరుగా కాంట్రాక్టర్కు తెలియచేసి పనులు చేయకుంటే కాంట్రాక్టు రద్దు చేస్తామని హెచ్చరించాలన్న అధికారుల ప్రతిపాదనను ప్రభుత్వ పెద్దలు తిరస్కరించారు. ప్రభుత్వం ఎదుర్కొంటున్న సకల సమస్యలకు ‘కన్సల్టెంట్లు’ పరిష్కారం చూపిస్తారని బలంగా నమ్ముతున్న సర్కారు పెద్దలు.. పోలవరం విషయంలోనూ ఇదే మంత్రం జపించారు. పోలవరం పనులు వేగవంతం చేయడానికి అనుసరించాల్సిన విధానాన్ని సూచించాలంటూ ‘కేపీఎంజీ’ అనే కన్సల్టెంటుకు బాధ్యతలు అప్పగించారు. ప్రాజెక్టు అథారిటీ సూచించినంత వేగంగా పనులు చేసే సామర్థ్యం కాంట్రాక్టర్కు లేదని, ‘సామర్థ్యం పెంపు’నకు అనుసరించాల్సిన మార్గాలనూ చెప్పాలని ‘కేపీఎంజీ’ కన్సల్టెన్సీని ప్రభుత్వం కోరింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లను కన్సల్టెన్సీలకు అప్పగించింది. నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని కన్సల్టెన్సీకి ప్రభుత్వం గడువు ఇచ్చింది. కన్సల్టెన్సీ నివేదిక ఆధారంగా ముందుకెళ్లాలని, అథారిటీని చల్లబరిచి కాంట్రాక్టర్కు ఇబ్బందులు రాకుండా రక్షించాలనే యోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్ల సూచనలు, సలహాలు పాటించడానికి ససేమిరా అంటున్న ప్రభుత్వం.. కన్సల్టెన్సీలకు రూ. కోట్లు ఖర్చు పెట్టడాన్ని అధికారులు విమర్శిస్తున్నారు. -
రాష్ట్రాన్ని కాంట్రాక్టర్లకు అమ్మేస్తారా?
కాంట్రాక్టర్లకు దోచిపెట్టి కమిషన్లు దండుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం దారుణమైన జీవో 22ను జారీ చేసిందని ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి విమర్శించారు. కాంట్రాక్టులోని లేబర్, మెషినరీ, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, కంట్రోల్ బ్లాస్టింగ్.. తదితర అంశాల్లో ధరల పెంపునకు ఈపీసీ విధానం అనుమతించకపోయినా.. చంద్రబాబు ప్రభుత్వం వాటి ధరల పెంపునకు అవకాశం కల్పిస్తూ జీవో 22 జారీ చేసిందని తప్పుపట్టారు. గతంతో గవర్నర్ పక్కన (అబయన్స్లో) పెట్టిన జీవో 13పై.. అబయన్స్ను తొలగించి మరీ.. అంతకంటే దారుణమైన జీవో 22ను తీసుకురావడం చంద్రబాబుకే చెల్లిందని నిప్పులు చెరిగారు. ‘‘ప్రభుత్వం ఇటీవల జీవో 22ను జారీ చేసింది. రాష్ట్రాన్ని అమ్మేసే జీవో అది. కిరణ్ సర్కారు.. అది చంద్రబాబునాయుడు రక్షించిన సర్కారు.. అందుకే దాన్ని ‘తెలుగు కాంగ్రెస్’ సర్కారు అనాలి. కిరణ్ సర్కారు ఎన్నికలకు ముందు ఎస్కలేషన్ కింద కాంట్రాక్టర్లకు భారీ ఎత్తున లబ్ధి చేకూర్చేందుకు 2014 ఫిబ్రవరి 7న జీవో 13ను జారీచేసింది. ఈ జీవోను అప్పట్లో కొందరు కిరణ్ మంత్రులే వ్యతిరేకించడంతో.. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ జీవోను పక్కన పెట్టారు. ఈలోగా రాష్ట్రపతి పాలన రావడంతో గవర్నర్ ఆ జీవోను అబయన్స్లో పెట్టారు. గవర్నర్ అబయన్స్లో పెట్టిన ఆ జీవోను చంద్రబాబు ప్రభుత్వం.. అబయన్స్ విత్ డ్రా చేసుకుని మరీ 2015 మార్చి 22న జీవో 22ను జారీచేసింది. ఓ వైపు రాష్ట్రం దివాలాలో ఉందని చంద్రబాబు అంటారు. మరోవైపు గవర్నర్ అబయన్స్లో పెట్టిన జీవోను విత్ డ్రా చేసుకుని.. లేబర్, మెషినరీ, ఇతర ధరల తేడా (ప్రైస్ వేరియేషన్) మేరకు కాంట్రాక్టర్లకు ఎస్కలేషన్ కింద అదనంగా బిల్లులు చెల్లించేందుకు ఆమోదం తెలుపుతూ జీవో 22ను జారీచేశారు. ఈపీసీ అంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్.. మొత్తం కాంట్రాక్టర్దే బాధ్యత. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సాగునీటి ప్రాజెక్టులను చేపట్టిన సందర్భంలో ఈపీసీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ పనులను దక్కించుకున్న కాంట్రాక్టరే డిజైన్లు దగ్గర నుంచి పనులు పూర్తిచేసే వరకూ అన్ని తానే చూసుకోవాలి. ప్రభుత్వ అధికారులు పనులను సక్రమంగా జరుగుతున్నాయా లేదా అన్నది పర్యవేక్షిస్తారు. సిమెంటు, స్టీలు, పెట్రోలు, డీజిల్ ధరలు ఐదు శాతం కన్నా ఎక్కువ పెరిగితే ఎస్కలేషన్ నిబంధన కింద అదనంగా చెల్లింపులు అడగవచ్చని ఈపీసీ విధానంలో స్పష్టంగా ఉంది. కానీ.. లేబర్, మెషినరీ, ఇతరాలు (60 శాతం పనులు)కు ఎస్కలేషన్ నిబంధన వర్తింపజేయాలన్నది ఈపీసీలో లేదు. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం పనుల్లో 60 శాతం ఉండే లేబర్, మెషినరీ, ఇతరాలకు ఎస్కలేషన్ నిబంధనను వర్తింపజేస్తూ జీవో 22 జారీ చేయడమంటే రాష్ట్రాన్ని అమ్మేయడమే. అంతేకాదు.. డిస్ట్రిబ్యూటరీ పనుల్లోనూ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించింది. ఈపీసీలో తొలుత టెండర్లు పిలిచిన ప్రకారం ఎకరానికి నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీలను ఏర్పాటు చేస్తే కాంట్రాక్టర్కు రూ. 4,700 ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ.. ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీ పనులు చేస్తే ఎకరానికి రూ. 10,500 ఇస్తామని ఆ జీవోలో ప్రభుత్వం పేర్కొంది. ఒకవేళ కాంట్రాక్టర్ డిస్ట్రిబ్యూటరీ పనులు చేయలేమని చెబితే.. వాటిని రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలుస్తారు. 2015-16 ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం కొత్త ధరలు నిర్ణయిస్తారు. ఐదు సంవత్సరాలకు ఏటా కనీసం 6 శాతం ద్రవ్యోల్బణం ఉందని లెక్కగట్టి.. ఎకరాకు డిస్ట్రిబ్యూటరీలు తవ్వడానికి.. రూ. 13,650 ధరను ఐబీఎం (ఇంటర్నరల్ బెంచ్ మార్క్)గా నిర్ణయిస్తారు. ఎక్కడ రూ. 4,700? ఎక్కడ రూ. 13,650? అంటే.. అప్పటికీ ఇప్పటికీ 190 శాతం తేడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అవసరమైన ప్రాంతాల్లో అదనపు నిర్మాణాలు చేపడితే.. అదనంగా చెల్లించాలన్న నిబంధన ఈపీసీలో ఎక్కడా లేదు. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అదనపు నిర్మాణాలకు అదనపు బిల్లులు చెల్లిస్తామని జీవో 22లో పేర్కొంది. ఈపీసీ నిబంధనలను చూపించయినా, గవర్నర్ అబయన్స్లో పెట్టిన విషయాన్ని అయినా చూపించి ప్రభుత్వం తప్పించుకునే వెసులుబాటు ఉన్నా.. కాంట్రాక్టర్లకు మేలు చేయడం కోసం రాష్ట్రాన్ని అమ్మేసేందుకు సిద్ధపడింది. -
ఒకటోస్సారి.. రెండోస్సారి..ఉహూ!
పుష్కర పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీరు.. ‘మాటలు కోటలు దాటి.. చేతలు పీటను దాటని’ బాపతుగా ఉంది. జిల్లాలో ఘాట్ల అభివృద్ధి నుంచి రోడ్ల విస్తరణ వరకూ ఆర్భాటంగా గుప్పించిన ప్రకటనలు కార్యాచరణకు వచ్చేసరికి.. తుస్సుమంటున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆదేశించిన పని విషయంలోనే ఇలాంటి తాత్సారం తప్పకపోవడం గమనార్హం. సాక్షి, రాజమండ్రి :రాజమండ్రి నుంచి మధురపూడి విమానాశ్రయం రోడ్డును నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసే పనికి సంబంధించి రెండోదశకు ఆర్అండ్బీ శాఖ రెండుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఫలితంగా అధికారులు సందిగ్ధంలో పడ్డారు. ఈ రోడ్డు విస్తరణను ఎట్టి పరిస్థితుల్లోనూ పుష్కరాల నాటికి చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆదేశించారు. కానీ ఈ పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రాని దుస్థితి నెలకొంది. ఇప్పటికే ఈ పనికి ఆర్అండ్బీ అధికారులు రెండుసార్లు టెండర్లు పిలిచారు. ప్రస్తుతం మూడోసారి టెండర్లు పిలిచి ఈ నెల 19న మరోసారి తెరవనున్నారు. ఈసారి కూడా ఎవరూ ముందుకు రాకపోతే పుష్కరాల నాటికి ఈ పని పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఆర్ అండ్ బి పుష్కర పనుల్లో ఇదే తలమానికం విమానాశ్రయం రోడ్డు విస్తరణ పని అంచనా విలువ రూ.33 కోట్లు. ఈ పనిని రెండు దశలలో చేపడుతున్నారు. మొద టి దశలో ఐదు కిలోమీటర్ల స్తరణకు రూ.ఐదు కోట్లు కేటాయించగా, రెండో దశలో రూ.28 కోట్లతో మరో ఏడు కిలోమీటర్లు విస్తరిస్తున్నారు. రెండో దశ పనులకు ఇటీవల టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. పుష్కరాల సందర్భంగా ఆర్అండ్బీ చేపడుతున్న మొత్తం పనుల్లో ఈ పనే పెద్దది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించాలని స్వయంగా ఆదేశించారు. జీఓలతో సంబంధం లేకుండా నిధులు విడుదల చేస్తున్నట్టు అధికారులకు చెప్పారు. కాగా అవే పనులు ఇప్పుడు జరుగుతాయా లేదా అనే సందిగ్ధంలో పడ్డాయి. ఆర్అండ్బీ శాఖకు ముందుగా ప్రభుత్వం రూ.87.50 కోట్ల విలువైన పనులు మంజూరు చేసింది. ఆ తర్వాత సీఎం మరి కొన్ని పనులు సూచించారు. వీటితో కలిపి పనుల విలువ రూ.333 కోట్లకు చేరింది. ఈ నిధులతో సుమారు 42 పనులను ఆర్అండ్బీ అధికారులు చేపడుతున్నారు. కాంట్రాక్టర్ల వ్యూహం ఫలితమే..! విమానాశ్రయం రోడ్డు విస్తరణ రెండో దశ పనులకు టెండర్లు దాఖలు కాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు కాంట్రాక్టర్లు ఉద్దేశపూర్వకంగానే టెండర్లలో ఎవరూ పాల్గొనకుండా వ్యూహం పన్నారన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ టెండర్లు వేయకపోతే ముఖ్యమంత్రి సూచించిన పని కాబట్టి నామినేటెడ్ ప్రాతిపదికన అత్యవసర పని కింద దక్కించుకుని అదనంగా ఆర్థిక ప్రయోజనం పొందవచ్చన్న ఎత్తుగడ కూడా లేకపోలేదని విమర్శలు వినవస్తున్నాయి. -
వాటా ఇవ్వాల్సిందే..
నెల్లూరు, సిటీ: నగర పాలక సంస్థ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల్లో 20 శాతం వాటా ముట్టజెప్పాల్సిందేనని కొందరు కార్పొరేటర్లు, మహిళా కార్పొరేటర్ల భర్తలు కాంట్రాక్టర్లకు హుకుం జారీ చేశారు. ఏ డివిజన్లో పనిచేసినా వాటా అందాల్సిందేనని వారు స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం ఒక ప్రైవేటు అతిథిగృహంలో మున్సిపల్ కాంట్రాక్టర్లతో ఈ కార్పొరేటర్లు సమావేశమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఆ కార్పొరేటర్లందరూ కార్పొరేషన్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఒక నేత అనుచరులుగా ముద్ర ఉంది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్లో ఏపని జరగాలన్నా తమ కనుసన్నల్లోనే జరుగుతాయని వారంతా కాంట్రాక్టర్లను నమ్మించే ప్రయత్నం చేశారు. ఇటీవల చెల్లించిన బకాయిలు కూడా తమ ఒత్తిడి మేరకే చెల్లించారని వారు పేర్కొన్నట్లు తెలిసింది. లక్షలు కుమ్మరించి ఎన్నికైన తాము ఆ మాత్రం వాటా తీసుకోకపోతే రాజకీయం కూడా చేయలేమని అన్నట్టు చెబుతున్నారు. పని ప్రారంభించే మొదలు బిల్లులు చెల్లించేవరకు అన్నీ తామై చూసుకుంటామని కాంట్రాక్టర్లకు వారు భరోసా ఇచ్చారు. మీరు చేపట్టే పనుల్లో నాణ్యతను పరిశీలించే సమయంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కాంట్రాక్టర్లుకు వారు హామీ ఇచ్చారు. ఆందోళనలో అధికారులు ఈ సమావేశం వివరాలు బయటకు పొక్కడంతో కార్పొరేషన్ అధికారులతో పాటు ఇతర కార్పొరేటర్లు ఆందోళన చెందుతున్నారు. తమ వార్డుల్లో జరిగే పనులకు కూడా వారే వాటాలు తీసుకుంటే తమ పరిస్థితి ఏమిటని మిగిలిన వారు వాపోతున్నారు. మరోవైపు అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బందిలోనూ ఈ వ్యవహారం గందరగోళానికి దారితీస్తోంది. నాణ్యత లేకుండా జరిగే పనులకు అంతిమంగా తామే బాధ్యత వహించాల్సి ఉంటుందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహస్య సమావేశంలో జరిగిన విధంగానే అభివృద్ధి పనుల కేటాయింపులు, కమిషన్లు ఇచ్చినట్లయితే ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదని కిందిస్థాయి సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. కార్పొరేటర్లు, పైస్థాయి అధికారులు ఒక్కటైతే నిత్యం పనులు పర్యవేక్షించాల్సిన కిందిస్థాయి సిబ్బంది బలిపశువులు కాకతప్పదని ఆవేదనకు గురవుతున్నారు. చెప్పేదొకటి.. చేసేదొకటి... అధికార పార్టీ నాయకులు, నగర మేయర్, కార్పొరేటర్లు నిత్యం పత్రికల్లో అభివృద్ధికి టీడీపీ ముందుంటుందని డప్పు కొట్టుకునే విషయం తెలిసిందే. అయితే ఈ విధంగా కార్పొరేటర్లే దిగజారి వాటాలకు కక్కుర్తి పడటం పట్ల కాంట్రాక్టర్లు ఇదేమి చోద్యమని ఆశ్చర్యానికి గురవుతున్నారు. నగరాన్ని సుందరవనంగా తీర్చుదిద్దుతామని, అభివృద్ధికి బాటలు వేస్తామని రోజూ ఏదో ఒక కార్యక్రమంలో వారు చెబుతూనే ఉంటారు. అయితే దానికి భిన్నంగా వ్యవహరించడంపై కాంట్రాక్టర్లే అసహనం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ కమిషనర్గా ఐఏఎస్ చక్రధర్బాబు రావడంతో కార్పొరేషన్ దారిలో పడుతుందని నగర ప్రజలందరూ అనుకున్నారు. అయితే అధికారి పార్టీ కార్పొరేటర్ల తీరు చూస్తుంటే అభివృద్ధి ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి కనపడుతుంది. ఈ విషయంపై కమిషనర్ దృష్టిసారించాల్సి ఉంది. -
అడ్డుకట్ట వేయలేరా..?
అడ్డూఅదుపులేని రేషన్బియ్యం అక్రమాలు సన్నబియ్యం సరఫరాలో దొడ్డుబియ్యం, కొత్తరకాలు కలిపినా కళ్లప్పగించి చూస్తున్న వైనం రేషన్ దుకాణాలనుంచి నెలవారీ మామూళ్లు తనిఖీలకు వెళ్లరు, లారీల వెంట ఎస్కార్ట్లను పెట్టరు గోదాంల నుంచే పక్కదారి పడుతున్న బియ్యం చౌటుప్పల్ : రేషన్డీలర్లు తామంతట తామే ముందుకు వచ్చి ఇదిగో అవినీతి చేశామని చెబితే తప్ప జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకునేట్టు లేదు. రేషన్డీలర్లు, బియ్యం సరఫరా కాంట్రాక్టర్లు, ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్చార్జ్లు కలిసి, నెలనెలా లారీల కొద్దీ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నా పట్టడం లేదు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సరఫరా చేసే సన్నబియ్యంలోనూ రీసైక్లింగ్ బియ్యం, సన్నరకాలు కలిపి సరఫరా చేసినా, బాబోయ్ ఈ అన్నం తినలేమంటూ విద్యార్థులు గగ్గోలు పెడుతున్నా కాలు కదపడం లేదు. అధికార యంత్రాంగం అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా, చేష్టలుడిగి చూస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అప్పుడే సిన్నబోయిన సన్న భోజనం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు సన్నబియ్యం(సూపర్ ఫైన్ బియ్యం)తో పెడుతున్న భోజనం అప్పుడే సిన్నబోయింది. సన్నబియ్యంలో రీసైక్లింగ్ దొడ్డు బియ్యం, సన్నబియ్యం రకాలను కలిపి సరఫరా చేయడమే దీనికి కారణం. ఈ యేడాది జనవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టళ్లలో సన్నబియ్యంతో కూడిన భోజనం పథకాన్ని ప్రారంభించింది. అంతకుముందు దొడ్డు బియ్యంతో పెట్టేవారు. రేషన్ దుకాణాలకు సరఫరా చేసే బియ్యాన్నే పాఠశాలలకు, హాస్టళ్లకు డీలర్ల ద్వారా సరఫరా చేసేవారు. సన్నబియ్యం సరఫరాలో అక్రమాలు జరగనీయొద్దని ఈ నెల నుంచి నేరుగా ఎంఎల్ఎస్ (మండల్ లెవల్ స్టాక్) పాయింట్ల నుంచి పాఠశాలలకు, హాస్టళ్లకు సరఫరా చేస్తున్నారు. అవసరమైన సన్నబియ్యం సేకరణను కూడా రైస్మిల్లర్ల నుంచే సివిల్ సప్లయ్ కార్పొరేషన్ ద్వారా చేస్తున్నారు. జనవరి మాసంలో సన్నబియ్యాన్ని సక్రమంగా సరఫరా చేసిన మిల్లర్లు, రెండో నెలలోనే అక్రమాలకు తెరలేపారు. రేషన్ దుకాణాలకు అవసరమైన బియ్యాన్ని సివిల్సప్లయ్, ఎఫ్సీఐల ద్వారా సరఫరా చేస్తున్న రైస్మిల్లర్లు, మధ్యాహ్న భోజన సన్నబియ్యాన్ని కూడా వారే సరఫరా చేస్తున్నారు. రేషన్ డీలర్లు, బియ్యం సరఫరా కాంట్రాక్టర్లు, ఎంఎల్ఎస్ గోదాంల ఇన్చార్జ్లు అంతా కుమ్మక్కై, నెలనెలా లారీల కొద్దీ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ లారీల కొద్దీ బియ్యాన్ని తీసుకెళ్లి, మిల్లులో మళ్లీ నూర్పిడి చేసి, మళ్లీ సివిల్సప్లయ్కే సరఫరా చేయడం ఒక ఎత్తయితే, సన్నగా మరపట్టి, సూపర్ఫైన్ బియ్యంలో కలిపి అమ్మడం మరొక ఎత్తు. మిక్సింగ్ బియ్యంతో వండిన అన్నం ముద్దగా, చితికినట్లు అవుతుండడంతో, విద్యార్థులు తినలేం బాబోయ్ అంటున్నారు. గత నెల 14వ తేదీన ఎస్సీఈఆర్టీ డెరైక్టర్ జగన్నాథరెడ్డి కొయ్యలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తనిఖీకి వచ్చారు. మధ్యాహ్న భోజనానికి సరఫరా చేసిన సన్నబియ్యంలో దొడ్డు బియ్యం కలిసి ఉండడం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించనున్నట్టు తెలిపినా, ఇంత వరకు అతీగతీ లేదు. జిల్లా అధికారుల్లోనూ చలనం లేదు. లారీల కొద్దీ బియ్యం పక్కదారి.. గతంలో రేషన్ దుకాణాలనుంచి రాత్రి పూట వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలించేవారు. ఈ క్రమంలో పట్టుబడుతుండేవారు. కానీ, కొంతకాలంగా నేరుగా గోదాంల నుంచే బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. గత ఏడాది నవంబర్ 10వ తేదీన చౌటుప్పల్ మండలం తంగడపల్లి వద్ద రేషన్ బియ్యం సరఫరా చేసే లారీని ఆపి, ఈ తంతును ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో, అప్పటి చౌటుప్పల్ గోదాం ఇన్చార్జ్ని సస్పెండ్ చేసి జిల్లా అధికారులు చేతులు దులుపుకున్నారు. ఈ దందాకు అడ్డుకట్ట వేయాలనే ఆలోచనే రాకపోవడంతో, ప్రస్తుతం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. రేషన్ దుకాణాల నుంచి నెలవారీ మామూళ్లు..? రేషన్ దుకాణాల నుంచి నెలనెలా సివిల్సప్లయ్, రెవెన్యూ అధికారులు మామూళ్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో ప్రాంతానికో రేటును పెట్టి మామూళ్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయకట్టు మండలాల్లో రేషన్ దుకాణానికి సరఫరా అయ్యే బియ్యానికి క్వింటాల్కు రూ.10చొప్పున, నాన్ఆయకట్టు మండలాల్లో క్వింటాల్కు రూ.14చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం. అధికారులే గోధుమలను అమ్మేశారు.. రేషన్ బియ్యంలాగే గోధుమలు కూడా నెలనెలా లారీల కొద్దీ పక్కదారి పడుతున్నాయి. కొన్నిచోట్ల డీలర్లే అమ్ముకుంటుంటే, మరికొన్ని చోట్ల డీలర్లతో నిమిత్తం లేకుండా అధికారులే డీలర్ల పేర డీడీలు కట్టి, కాంట్రాక్టర్లు, గోదాం ఇన్చార్జలతో కుమ్మక్కై గోదాంకు తేకుండానే బ్లాక్మార్కెట్కు తరలిస్తున్నారు. సాక్షి దినపత్రికలో అక్టోబర్ మాసంలో ‘గోధుమలది అదే దారి’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనిపై అప్పటి జిల్లా కలెక్టర్ చిరంజీవులు విచారించి, రిపోర్టులు పంపమని తహసీల్దార్లను ఆదేశించారు. ఆయన నామమాత్రంగానే తనిఖీ చేశారు. ఆ కొద్ది కాలంలోనే కలెక్టర్ బదిలీ కావడంతో, విషయం మరుగున పడిపోయింది. -
కాంట్రక్టర్ల మధ్య ఘర్షణ
కరీంనగర్(జ్యోతి నగర్): రామగుండం ఎన్టీపీసీలో టెండర్ల విషయంలో సోమవారంకాంట్రక్ట్టర్ల మధ్య ఘర్షణ జరిగింది. రూ.62 లక్షల పనులకు టెండర్లు వేసే విషయంలో కాంట్రక్టర్ల మధ్య వైరం ఏర్పడింది. దీంతో అధికారుల సమక్షంలోనే టెండర్ డాక్యుమెంటులు చించివేసుకుని తోపులాటకు దిగారు. ఈ విషయమై యాజమాన్యానికి ఇరువర్గాలు ఫిర్యాదు చేశాయి. దీంతో అధికారులు టెండర్ ప్రక్రీయను వాయిదా వేశారు. -
నీరుపయోగం
ముందుకు సాగని తాగునీటి పథకాల పనులు రూ.కోట్లు ఖర్చు చేసినా.. చుక్క నీరందని పరిస్థితి జిల్లాలో సీపీడబ్ల్యూఎస్ తాగునీటి పథకాల దుస్థితి తీరిదీ..! చెన్నూర్తో పాటు, 14 పరిసర గ్రామాల ప్రజల గొంతు తడిపేందుకు రూ.4.50 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకం ఇది. ఇప్పటికే ఈ పనులు పూర్తయి.. 2015 మార్చిలో దీని పరిధిలో ఉన్న నివాసిత ప్రాంతాలకు తాగు నీరందించాలి. కానీ ఇప్పటివరకు కనీసం 40 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. ఈ వేసవే కాదు, వచ్చే వేసవిలోనూ పథకం పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఆదిలాబాద్ : వేసవి ముంచుకొచ్చినా.. తాగునీటి పథకాల పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. జిల్లాలో రూ.వందల కో ట్లతో చేపట్టిన సమగ్ర సురక్షిత తాగునీటి పథకాల పనుల ప్రగతి అధ్వానంగా తయారైంది. ఏళ్లు గడుస్తున్నా ఈ పనులు ముందుకు సాగడం లేదు. రూ.కోట్లలో నిధులు ఖర్చవుతున్నా.. ప్రజలకు గుక్కెడు తాగునీరు అందడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు సకాలంలో పనులు పూర్తి చేయకుండా చేతులెత్తేయడంతో ప్రజల గొంతులు తడపడం లేదు. ఎప్పటి కప్పుడు పనులను పూర్తి చేయించడంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పరిధిలో లేని సీపీడబ్ల్యూఎస్ (మల్టీవిలేజ్) పథకాల ప్రగతిని పరిశీలిస్తే.. జిల్లాలో 1,111 నివాసిత ప్రాంతాల కు తాగునీటిని సరఫరా చేసేందుకు సుమారు రూ.457 కోట్లుతో 22తాగునీటి పథకాల నిర్మాణం చేపట్టారు. ఇందులో ఏడు తాగునీటి పథకాలను వాటర్గ్రిడ్ పరిధిలో చేర్చారు. మిగిలిన 15 సీపీడబ్ల్యూఎస్ పథకాల్లో ఏడు తాగునీటి పథకాల పనుల ప్రగతి అధ్వానంగా తయారైంది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు వీలైనంత మేరకు బిల్లులు డ్రా చేసుకున్నారు. మిగిలిన పనులు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ పనులు పూర్తి చేసేందుకు గడువు కొ న్నింటికి దగ్గర పడినప్పటికీ పనులు బాలారిష్టాలను దాటడం లేదు. కొన్నింటికి గడువు ముగిసినప్పటికీ పనులు ఇంకా కొలిక్కి రావడం లేదు. ఈ పథకాల పనుల తీరును పరిశీలిస్తే.. ఉట్నూర్తోపాటు, 42 నివాసిత ప్రాంతాల ప్రజల గొంతులు తడిపేందుకు రూ.10 కోట్లతో సీపీడబ్ల్యూఎస్ పథకం పనులు చేపట్టారు. కాంట్రాక్టర్కు రూ. 5.54 కోట్ల మేరకు బిల్లులు చెల్లించారు. కానీ ప్రజల గొంతు మాత్రం తడవ డం లేదు. మూడేళ్లుగా పైప్లైన్ పనులు కొనసా..గుతూనే ఉన్నాయి. ఉట్నూర్ ఐటీడీఏ వద్ద వాటర్ ట్యాంక్ నిర్మించారు. గ్రామాలకు డిస్ట్రిబ్యూషన్ పనులు జరుగుతున్నాయి. మరో రెండేళ్లయినా ఈ పనులు కొలిక్కి వచ్చేలా లేవు. చెన్నూర్ మండలం సోమన్పల్లి, మరో 17 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు రూ.9 కోట్లతో తాగునీటి పథకాన్ని చేపట్టారు. ఇప్పటికే ఈ పనులు దాదాపు పూర్తి కావాలి. జూన్ వరకు తాగునీటిని సరఫరా చేయాలి. కానీ 2.5 కిలోమీటర్ల మేరకు నిర్మించాల్సిన పైప్లైన్ పనులు ఇంకా ప్రారంభానికే నోచుకోలేదు. విద్యుత్ సౌకర్యం లేక రూ.1.52 కోట్లతో చేపట్టిన భీమారం తాగునీటి పథకం పనులు అసంపూర్తిగా నిలిచాయి. విద్యుత్ కనెక్షన్ పూర్తయితే కానీ, ఐదు గ్రామాల ప్రజల గొంతు తడవదు. ఏజెన్సీ ఏరియాలోని 187 ఆదివాసీ, గిరిజన గూడాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు రూ.68 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకం పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఒక్క కెరమెరి మండలంలోని 47 నివాసిత ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసుతన్నారు. లక్సెట్టిపేట, మరో నివాసిత ప్రాంతానికి ఫేస్ 2లో భాగంగా రూ.కోటి 41 లక్షలతో తాగునీటి పథకం నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటివరకు రూ.44 లక్షలు ఖర్చు చేశారు. కానీ.. ప్రజల గొంతు మాత్రం తడవలేదు. మహారాష్ట్ర సరిహద్దుల్లోని కోటపల్లి మండలం వెంచపల్లితోపాటు పది ఆవాస ప్రాంతాలకు రూ.7.75 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకం పరిస్థితి కూడా అలాగే ఉంది. రూ.23 లక్షలు ఖర్చయినా పనులు మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. -
ఇప్పుడేం చేద్దాం?
కామారెడ్డి : పనులు పంచుకుందామనుకున్న కాంట్రాక్టర్లు కంగు తిన్నారు. మంగళవారం ‘సాక్షి’లో ‘గుత్తేదార్లు రింగయ్యారు’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనం స్థానికంగా కలకలం రేపింది. కామారెడ్డి నియోజకవర్గంలో అధికార,ప్రతిపక్ష పార్టీలకు దగ్గరగా ఉండే కాంట్రాక్టర్లు కొందరు ‘మిషన్ కాకతీ య’ టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగానే ముం దస్తుగా సమావేశమై పనులను పంచుకున్నారు. ఈ వ్యవహారం ‘సాక్షి’లో ప్రచురితం కావడంతో వా రంతా ఉలిక్కిపడ్డారు. తరువాత ఏం చేయూలనే వి షయంపై అందరూ కలిసి చర్చించుకున్నారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమాన్ని చేపట్టింది. కాంట్రాక్టర్లు మాత్రం సిండికేట్గా మారుతూ సర్కారు ఆశయూనికి తూట్లు పొడుస్తున్నారు. పనులు నాణ్యతతో జరగాలని ప్రజాప్రతినిధిలు కోరుకుంటుండగా, కాంట్రాక్టర్లు అధిక లాభాలు గడించేం దుకు అడ్డదారులు తొక్కుతుండడం విస్మయం కలిగిస్తోంది. ఇందుకు తమ పేర్లు వాడుకుంటున్నారని తెలి సిన కొందరు ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పోటీపడి తక్కువ ధరకు టెండర్లు దాఖలు చేయడం, లేదం టే కుమ్ముక్కై అధిక ధరలను కోట్ చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టడం ఎంతవరకు సమంజసమని మండిపడినట్టు తెలుస్తోంది. ‘మిషన్ కాకతీయ’ పనులలో ఎలాంటి అక్రమాలు జరుగకూడదన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఆన్లైన్లోనే టెండర్లు పిలిచింది.గు త్తేదార్లు దానిని కూడా ఓవర్ టేక్ చేసి, ప్రభుత్వాదాయూనికి గండి కొట్టాలనే ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తమైంది. ఇంటెలిజెన్స్ ఆరా టెండర్లను దక్కించుకునేందుకు ముందస్తుగానే రింగయిన విషయం ‘సాక్షి’లో రావడంతో ఇంటెలిజెన్స్ విభాగం రంగంలోకి దిగింది. ఎవరెవరు ఎన్నెన్ని పనులు పం చుకున్నారు అనే వివరాలను అధికారులు ఆరా తీశారు. పనులను పంచుకోవడానికి కాంట్రాక్టర్లు అసోసియేషన్గా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ అసోసియేషన్లో ఇరు పార్టీలకు చెందినవారు పదవులు కూడా సమానంగా పంచుకున్నట్టు సమాచారం. దీనిపై కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీశాయి. -
నాసంగతేంటి?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆయన ఓ అధికారపార్టీ నేత. ఆయన పేరు చెబితే జిల్లా పశ్చిమ ప్రాంతంలో వ్యాపారులు, కాంట్రాక్టర్లు వణికిపోతున్నారు. అంతలా తనదైన శైలిలో వరుస దందాలతో హల్చల్ చేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లు.. బంగారు వ్యాపారులు తదితరుల నుంచి మామూళ్లు చాలదన్నట్లు.. తాజాగా కాంట్రాక్టర్ల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇవ్వకపోతే హెచ్చరికలు చేయటం.. అధికార బలం ఉపయోగించి ఏదోరకంగా వారిని ఇబ్బందులు పెడుతున్నట్లు తెలిసింది. తాజాగా ఓ రోడ్డు కాంట్రాక్టర్ను రూ.10 కోట్లదాకా డిమాండ్ చేశారట. అడిగినంత ఇవ్వకపోతే రోడ్డు పనులు సజావుగా జరగనివ్వనని తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేసినట్లు తెలిసింది. టీడీపీ నేత బెదిరింపులకు కాంట్రాక్టర్ బెంబేలెత్తిపోతున్నాడు. ఆ నేత అడిగినంత ఇస్తే నష్టం వస్తుందని ఆందోళన చెందుతున్నారని ఆయన సన్నిహితులు వాపోతున్నారు. వివరాల్లో కెళితే... ఏర్పేడు-రాపూరు పెంచలకోన వరకు 84 కి.మీ మేర నాలుగులైన్ల రోడ్డు నిర్మాణం పనులకు కొద్దిరోజుల క్రితం టెండర్లు జరిగాయి. ఈ రోడ్డు నిర్మాణానికి రూ.290 కోట్ల అంచనా వ్యయం. రోడ్డు పనులకు సంబంధించి ఓ కాంట్రాక్టర్ 25 శాతం తక్కువతో టెండర్ దక్కించుకున్నారు. ప్రస్తుతం వెంకటగిరి- రాపూరు మార్గంలో పనులు జరుగుతున్నాయి. రోడ్డు పనులు జరుగుతున్న విషయం తెలుసుకున్న అధికార పార్టీకి చెందిన ఓ నేత కొద్దిరోజులక్రితం కాంట్రాక్టర్కు సమాచారం పంపారు. అనుచరులతో రూ.10 కోట్లు పంపమని హుకుం జారీ చేసినట్లు సమాచారం. అయితే తన వద్ద లేవని, పార్టనర్స్తో మాట్లాడి చెబుతామని చెప్పిపంపినట్లు తెలిసింది. రోజులు గడుస్తున్నా కాంట్రాక్టర్ నుంచి ఎటువంటి సమాచారం రాకపోవటంతో కాంట్రాక్టర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పనులు నాసిరకంగా చేస్తున్నారంటూ మండిపడ్డారు. రోడ్డు పనులపై త్వరలో విజిలెన్స్ అధికారులతో తనిఖీలు చేయిస్తానని హెచ్చరించినట్లు సమాచారం. టీడీపీ నేత హెచ్చరికలతో ఆ కాంట్రాక్టర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ అధినేతకు సైతం ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. డక్కిలి మండలంలో 6 కిలోమీటర్ల మే ర చేపట్టిన పనులను జరగనివ్వకుండా తమ్ముళ్లతో నిలిపివేయించారు. రోడ్డుకు అవసరమైన మట్టి తరలింపును అడ్డుకోవడంతో పనులు నిలిచిపోయాయి. -
వాటాల కిరికిరి
పంచాయతీ రోడ్లకు గ్రహణం - ముందుకురాని కాంట్రాక్టర్లు - కమీషన్ల కోసం ప్రజాప్రతినిధుల ఒత్తిడి - మట్టి రోడ్లను బీటీగా మార్చేందుకు.. - రూ. 27.73 కోట్లతో 34 ప్యాకేజీల పనులు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని మట్టి రోడ్లను బీటీ (బ్లాక్టాప్) చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. మూడు నెలల వ్యవధిలో రూ.27.73 కోట్ల విలువ చేసే 36 ప్యాకేజీల కింద 378 పనులకు మూడు సార్లు టెండర్లు పిలవగా రెండు పనులకే కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. ఆ రెండు పనులను కమీషనర్ ఆఫ్ టెండర్స్ (సీవోటీ) ఆమోదించి నెల రోజులు గడుస్తున్నా.. కాంట్రాక్టర్లు పనుల అగ్రిమెంట్ చేయించుకోవడం లేదు. దీంతో మట్టిరోడ్లను బీటీ చేయాలన్న పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ వ్యవహారంపై ఆరా తీస్తే.. అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల నుంచి కొందరు ప్రజాప్రతినిధులు వాటా లు డిమాండ్ చేస్తుండటమే ప్రధాన కారణమని తెలుస్తోంది. బీటీ రోడ్ల నిర్మాణాలకు కొందరు ప్రజాప్రతిని ధుల పర్సంటేజీల పర్వం అడ్డంకిగా మారింది. దీంతో జిల్లాలోని మట్టిరోడ్లను బీటీ చేసే ప్రక్రియకు మోక్షం లభించడం లేదు. మూడు నెలలుగా రోడ్ల నిర్మాణానికి సంబంధించి టెండర్లను పిలువగా ఏ ఒక్క టెండర్దారుడు ముందుకు రావడం లేదు. జిల్లాలో ఎంఆర్ఆర్ స్కీం కింద 36 ప్యాకేజీల కింద ఆయా మండలాల్లో బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టడానికి అనుమతి లభించింది. పంచాయతీరాజ్ అధికారులు రోడ్ల నిర్మాణానికి సంబంధించి పూనుకున్నారు. ఇందులో భాగంగా 2014, నవంబర్ 19న 36 మండలాల్లో ఈ రోడ్ల నిర్మాణ పనులకు టెండర్లను పిలిచారు. ఇందులో కేవలం ఇద్దరు మాత్రమే పాల్గొన్నారు. భీమ్గల్, జక్రాన్పల్లి ప్యాకేజీల అగ్రిమెంట్కు సీవోటీ నుంచి గ్రీన్సిగ్నల్ వచ్చినా.. ఇంకా అగ్రిమెంట్ కాలేదు. ప్రజాప్రతినిధులు పర్సెంటేజీల కోసం బెదిరిస్తుండటంతో కాంట్రాక్టర్లు టెండర్లయినా అగ్రిమెంట్కు ముందుకు రావడం లేదన్న ప్రచారం ఉంది. అధికారులు 2014 డిసెంబర్-20న మరోసారి టెండర్లను పిలిచారు. ఇందులో 13 మంది మాత్రమే పాల్గొన్నారు. ఆయా పనులకు టెండర్లు వేసేందుకు రాగా కొందరు ప్రజాప్రతినిధులు పర్సంటేజీలు ఇవ్వాలని నిర్మొహమాటంగా డిమాండ్ చేస్తుండటంతో కాంట్రాక్టర్లు ఆ పనులకు సంబంధించి ఒప్పందాలు చేసుకోవడం లేదు. ముచ్చటగా మూడో దఫా జనవరి 19న టెండర్లు పిలవగా ఏ ఒక్క కాంట్రాక్టర్ ముందుకు రాలేదు. ప్రస్తుతం ఈ పనుల్లో ప్రజాప్రతినిధులు భారీగా పర్సంటేజీలు డిమాండ్ చేయడంతో ఉన్నఫలంగా కాంట్రాక్టర్లు వెనక్కి తగ్గారంటున్నారు. నాలుగోసారి స్పందిస్తారా.. మిషన్కాకతీయ, ఆర్అండ్బీ పనుల్లో సైతం కొందరు ప్రజాప్రతినిధులు పర్సెంటేజీల కోసం కాంట్ట్రాక్టర్లు, అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు ప్రభుత్వానికి ఇదివరకే ఇంటలిజెన్స్ నివేదికలు వెళ్లాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పంచాయతీరాజ్ మట్టిరోడ్లను బీటీ చేసేందుకు ప్రభుత్వం సదుద్దేశంతో రూ.27.73 కోట్లు మంజూరు చేస్తే.. ఆ పనులు సకాలంలో పూర్తి చేసుకోవాల్సి ఉండగా మూడు నెలలుగా ‘పర్సెంటేజీ’ల పేరిట కాలయాపన జరుగుతుండటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఓ డివిజన్లో ప్రజాప్రతినిధి టెండర్ వేసే ముందు నన్ను కలువాలంటున్నారని కాంట్రాక్టర్లు బహిరంగంగానే చెప్తుండటం గమనార్హం. మరో ప్రజాప్రతినిధి అడుగు ముందుకేసి సంబంధిత పనులకు టెండర్ వేసేకంటే ముందుగానే పర్సంటేజీలు ముట్టజెప్పాలని హుకుం జారీ చేయడం చర్చనీయాంశం అవుతోంది. ఇంకో ప్రజాప్రతినిధి అయితే తనతో సత్సంబంధాలున్న కాంట్రాక్టర్లను టెండర్ల కోసం ఆహ్వానిస్తుండటంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని’ అన్నట్లు ప్రభుత్వం నిధులు విడుదల చేసినా పనులు చేపట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇదిలా వుండగా... రూ.27.73 కోట్ల విలువ చేసే 378 పనులకు నాలుగోసారి టెండర్లు పిలిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సారైనా ఆ పనులకు టెండర్లు ఖరారవుతాయా? అన్న చర్చ జరుగుతోంది. -
నిధులకే ‘టెండర్’!
►పంచాయతీరాజ్ ఇంజినీర్ల మరో బాగోతం ►కాంట్రాక్టర్లను ఎంపిక చేయాల్సింది పోయి.. నిధులివ్వాలంటూ మెలిక ►ఫలితంగా నిలిచిపోయిన నిర్మాణ పనులు ►అధికారుల తీరుపై అనేక అనుమానాలు రంగారెడ్డి జిల్లా : గ్రామ పంచాయతీల నిర్మాణ పనులకు టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లను ఎంపిక చేయండంటూ జిల్లా పంచాయతీశాఖ.. పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని కోరింది. కానీ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఏం చేసిందో తెలుసా.. కాంట్రాక్టర్ల ఎంపికను అటుంచి, భవన నిర్మాణాల కోసం వచ్చిన నిధులకే టెండర్ పెట్టింది. ఆ కథేంటో చూడండి మరి. జిల్లాలో 13 మండలాల్లోని 28 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం రాజీవ్ గాంధీ పంచాయత్ స్వశక్తికరణ్ అభియాన్ (ఆర్జీపీఎస్ఏ) కింద నూతన భవనాలు మంజూరు చేసింది. ఇందుకు ఒక్కో భవనానికి రూ.12లక్షల చొప్పున మొత్తం రూ. 3.36కోట్లు కేటాయించింది. తొలివిడత రూ.1.68కోట్లు జిల్లా పంచాయతీ శాఖ (డీపీఓ) ఖాతాకు బదలాయించింది. పనులు చేపట్టిన తర్వాత మలివిడతలో మిగతా నిధులు ఇస్తామని సూచించింది. దీంతో జిల్లా పంచాయతీ శాఖ అధికారులు కొత్త భవనాల నిర్మాణాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లను గుర్తించాలంటూ జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని కోరుతూ గతేడాది డిసెంబర్ 24న లేఖ రాసింది. కాంట్రాక్టర్లు ఓకే.. నిధులివ్వండి డీపీఓ లేఖకు స్పందించిన పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజినీరు.. కాంట్రాక్టర్లను గుర్తించామంటూ తిరుగులేఖ రాశారు.‘కాంట్రాక్టర్లు పనులు ప్రారంభిస్తారు. వెంటనే మీ ఖాతాలో ఉన్న నిధులను మాకివ్వండి’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. వాస్తవానికి కాంట్రాక్టర్లను మాత్రమే ఎంపిక చేయాల్సిన పీఆర్ ఇంజినీరింగ్ అధికారులు.. కొత్తగా నిధులు బదలాయించమంటూ లేఖ పంపింది. దీంతో పంచాయతీ అధికారులు అవాక్కయ్యారు. ఈక్రమంలో తిరుగులేఖకు స్పందిస్తూ.. జిల్లా పంచాయతీ శాఖ జనవరి 12న మరోలేఖ రాసింది. నిధులు సరే.. వివరణ ఇవ్వండి పంచాయతీరాాజ్ ఎస్ఈ లేఖకు స్పం దిస్తూ పంచాయతీశాఖ మరో లేఖ పం పింది. ‘భవననిర్మాణాలకు కాంట్రాక్ట ర్లు ఎంపిక చేశారు. దీంతో ఆయా పం చాయతీ కార్యాలయఅధికారుల్ని కొం దరు కాంట్రాక్టర్లు సంప్రదిస్తున్నారు. కానీ నిధులు ఎలా ఇవ్వాలో వివరణ ఇవ్వాలి’ అంటూ మరోలేఖ సమర్పిం చింది. కానీ ఈ లేఖకు ఆ శాఖ బదులివ్వకపోవడంతో పనులు ప్రారంభానికి నోచుకోలేదు. పనుల నిర్మాణాలకు సంబంధించి వచ్చిన నిధులు డీపీఓ నేరుగా పంచాయతీ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ ఉమ్మడి ఖాతాలో జమచేయాలి. కానీ పనులు ప్రారంభించకముందే నిధులివ్వాలంటూ ఇంజినీరిం గ్ అధికారులు లేఖరాయడంలో అంతర్యమేమిటోనని పంచాయతీ అధికారు లు అనువనాలు వ్యక్తం చేస్తున్నారు. -
వరంగల్ జిల్లాలో కాంట్రాక్టర్లు కిడ్నాప్
వరంగల్: వరంగల్ జిల్లాలో ఇద్దరు కాంట్రాక్టర్లు కిడ్నాప్ అయ్యారు. జిల్లాలోని ఖానాపూర్ మండలం మనుబోతులగడ్డ వద్ద రహదారి పనులు పర్యవేక్షిస్తుండగా కాంట్రాక్టర్లు వెంకటేశ్వరరెడ్డి, శిరీష్రెడ్డిలను ఆగంతకులు తమ కారులో ఎక్కించుకుని వెళ్లారు. దాంతో అక్కడే ఉన్న కార్మికులు కాంట్రాక్టర్ల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... రహదారి వద్ద పనులు నిర్వహిస్తున్న కార్మికులను విచారిస్తున్నారు. న్యూడెమోక్రసీ కార్యకర్తలే ఈ కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఇక పచ్చపాలికలు!
పాలకొండ : పచ్చ కాంట్రాక్టర్లకు పనుల పందేరానికి ప్రభుత్వం గేట్లు తెరవడంతో జిల్లాలో టీడీపీ నేతలు, సీనియర్ కార్యకర్తలు పనులు దక్కించుకొని కాసులు దండుకునేందుకు ఉబలాటపడుతున్నారు. పురపాలక సంఘాల్లో రూ.5 లక్షల వరకు పనులను టెండర్లతో పని లేకుండా నామినేషన్ పద్ధతిలో కేటాయించే వెసులుబాటు కల్పిస్తూ మూడు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పనిలో పనిగా ఈ పనులను కేటాయించే అధికారాన్ని టీడీపీ నేతలకు కల్పించింది. ఫలితంగా మున్సిపాలిటీల్లో చేపట్టే అభివృద్ధి పనులపై ‘పచ్చ’ ముద్ర స్పష్టంగా కనిపించనుంది. ఈ నిర్ణయాన్ని సొమ్ము చేసుకునేందుకు అప్పుడే నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లాలో శ్రీకాకుళం, పలాస, ఆమదాలవలస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలతోపాటు రాజాం, పాలకొండ నగర పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటివరకు వీటి పరిధిలో అభివృద్ధి పనులు, నిర్మాణాలు చేపట్టడానికి ఈ-టెండర్ ప్రక్రియ నిర్వహించేవారు. గ్రేడ్-1 కాంట్రాక్టర్లు మాత్రమే ఇందులో పాల్గొని పోటీ పడి టెండర్లు దక్కించుకోవాల్సి వచ్చేది. దీంతో అధికార పార్టీ నేతలు, వారి అనుయాయులు పనులు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. బినామీలను కాంట్రాక్టర్లుగా రంగంలోకి దించినా నిధులు వెనకేసుకొనేందుకు పెద్దగా అవకాశం దొరికేది కాదు. దీంతో పలుమార్లు మున్సిపాలిటీల్లో పనులు పొందేందుకు ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు తేవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా పార్టీ ప్రయోజనాల పేరిట తమ పార్టీ నేతలకు మార్గం సుగమం చేసింది. దీనిలో భాగంగానే మూడు రోజుల కిందట రూ.5 లక్షల వరకు పనులను నామినేషన్ పద్ధతిలో కేటాయించుకొనే అవకాశాన్ని మున్సిపాలిటీలకు కల్పించించింది. అక్కడితో ఆగకుండా పనులను కేటాయించే అవకాశాన్ని తెలుగు తమ్ముళ్ల చేతికి అప్పగించింది. జీవో జారీ కావడమే ఆలస్యం.. జిల్లాలో నాయకుల హడావుడి మొదలైంది. చేపట్టాల్సిన పనులు ఏం ఉన్నాయి.. వాటిని ఎలా దక్కించుకోవాలి.. పోటీ ఎక్కువగా ఉన్న చోట పనులు ఎలా పంచుకోవాలన్న దానిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాగా తాజా ఉత్తర్వుల వల్ల పనుల్లో పర్యవేక్షణ, నాణ్యత దెబ్బతింటాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో పనులు పారదర్శకంగా జరిగేవని, కొత్త విధానంతో అవినీతి పెరుగుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కార్యకర్తల లబ్ధికోసమే ఈ విధానాన్ని ప్రకటించినా మున్సిపాలిటీల స్థాయిలో వర్గపోరు మొదలవుతుందని పలువురు టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ధాన్యం రైతు దైన్యం
⇒80 కేజీలకు రూ.900 దక్కడమే గగనం ⇒మిల్లర్లకే వంతపాడుతున్న కొనుగోలు కేంద్రాలు ⇒ఛీఛీ.. ఇవేం ధాన్యం మాకొద్దంటున్న మిల్లర్లు ⇒బతిమాలించుకొని తక్కువ ధరకు కొనుగోలు ⇒ మనస్తాపానికి గురవుతున్న అన్నదాత ⇒భయపెడుతున్న అప్పులు, పండుగ ఖర్చులు ⇒ధర వచ్చే వరకు నిరీక్షించలేని దుస్థితి పాలకొండ: భూమినే నమ్ముకొని బతుకుతున్న భూమిపుత్రుడు పండిన ఫలాన్ని అమ్ముకుందామన్నా వీలుకావడం లేదు. ఇటు కొనుగోలు కేంద్రాలు, అటు వ్యాపారులు నానారకాల సాకులు, సవాలక్ష నిబంధనలతో ధర విషయంలో రైతన్నను దోపిడీ గురిచేస్తూనే.. ఛీత్కారాలు, చీదరింపులతో మనస్తాపానికి గురి చేస్తున్నారు. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని చేతికొచ్చిన కొద్దిపాటి ధాన్యాన్నే అమ్ముకోలేక అన్నదాత అవస్థల పాలవుతున్నాడు. చివరికి ఎంతో కొంత ధరకు ధాన్యాన్ని అమ్ముకోక తప్పని దైన్యాన్ని ఎదర్కొంటున్నాడు. జిల్లాలో ఈ ఏడాది తుపాను కారణంగా ధాన్యంలో కొంతమేర పటుత్వం తగ్గిన మాట వాస్తవమే. ఇదే అవకాశాన్ని ఇటు మిల్లర్లు, దళారులు వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నిబంధనలు వీరికి అనుకూలంగా మారాయి. అప్పులు, పండుగ ఖర్చుల కారణంగా నూర్పు చేసిన పంటను దాచుకునే పరిస్థితుల్లో లేని అన్నదాతల యథేచ్ఛగా దోచుకుంటున్నారు. మిల్లర్లందరూ సిండికేట్గా మారి 80 కేజీల ధాన్యానికి రూ. 850 నుంచి రూ.900 లోపే ధర నిర్ణయించారు. నాణ్యత సాకుతో అంతకుమించి ధర ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ధాన్యం పట్టుకొని మిల్లు వద్దకు వెళ్లిన రైతులకు ‘ఛీఛీ.. ఈ పంట మాకొద్దు...పూర్తిగా విరిగిపోతున్నాయి.. మేము కొనలేం’ అని ఛీత్కరిస్తున్నారు. దీంతో దిక్కుతోచని రైతులు మిల్లర్లు చెప్పిన ధరకే అమ్మాల్సి వస్తోంది. మిల్లర్ల మాటకే సై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు రైతులకు విచిత్ర పరిస్థితిని కల్పిస్తున్నాయి. పరీక్షలకు శ్యాంపిల్గా ధాన్యం తీసుకెళితే నాణ్యత లేవని సమాధానం చెబుతున్నారు. కేంద్రాల్లో ఉన్న సిబ్బందికి దీనిపై అవగాహన లేకపోవడంతో తప్పించుకొనే ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. మిల్లర్లు చెప్పిన నిబంధనలనే అమలు చేస్తున్నారు. మిల్లర్లు సరే అంటేనే ధాన్యం తీసుకొనే పరిస్థితిలో కొనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయి. తగ్గిన డిమాండ్ ఈ ఏడాది ధాన్యానికి డిమాండ్ పూర్తిగా తగ్గింది. గతంలో ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేయడంతో మిల్లర్లు కొంతమేర భయపడే వారు. లెవీకి కూడా ధాన్యం సేకరించలేమన్న ఉద్దేశంతో ధర పెంచేవారు. అయితే ఇటీవల అక్రమంగా ధాన్యం తరలిపోతున్నాయంటూ అధికారులు హడావుడి చేయడంతో ఇతర ప్రాంతాల వ్యాపారులు జిల్లాకు రావడం రాలేదు. పొరపాటున అక్కడక్కడ కొనుగోలు చేసినా అధికారులు వాహనాలను అడ్డుకొని తనిఖీల పేరుతో రెండు మూడు రోజుల పాటు పోలీస్ స్టేషన్ల వద్దే నిలిపివేస్తుండటంతో ఎందుకీ తలనొప్పి అన్న ఉద్దేశంతో బయటి వ్యాపారులు రావడం మానుకున్నారు. స్థానిక వ్యాపారులు దీన్ని తమకు అనుకూలంగా మార్చుకొని రైతులను నిలువునా దోచుకుంటున్నారు. రవాణా చార్జీల్లో మతలబు రైతులకు రవాణా చార్జీల్లోనూ ప్రభుత్వం కోత విధించింది. గత ఏడాది వరకు ఒక క్వింటాకు రూ.28 చొప్పున రైతుకు నేరుగా రవాణా చార్జీలు ఇచ్చేవారు. ఈ ఏడాది రైతుకు చెల్లించడం నిలిపివేశారు. ఇందుకోసం జిల్లాలో మూడు డివిజన్లను ముగ్గురు కాంట్రాక్టర్లకు అప్పగించారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తే అక్కడి నుంచి మిల్లుకు తరలించే బాధ్యత వీరికి అప్పగించారు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాలనే మరిచిపోయే పరిస్థితి కల్పించారు. ఈ విధానంపై రైతు సంఘాలు, వ్యవసాయ సంఘాలు ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. -
రబీలో క్రాప్హాలిడే
గద్వాల: కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, ప్రభుత్వాల పట్టింపులేనితనం.. వెరసి ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్స్కీం) చివరి ఆయకట్టు రైతాంగానికి ఏటా అన్యాయమే జరుగుతోంది. ఆరేళ్లుగా చక్కనీరు విడుదల కాకపోవడంతో సిరులు పండించే చివరి ఆయకట్టు భూముల్లో ఏటా రబీలో క్రాప్హాలిడే ప్రకటిస్తున్నారు. అదేదారిలో ఈ ఏడాది కూడా చివరి భూములకు సాగునీరు సాధ్యం కాదని, ఆరుతడి పంటలే వేసుకోవాలని జిల్లా సాగునీటి సలహా కమిటీ ప్రకటించింది. జూరాల కుడి ప్రధానకాల్వ లింక్ ద్వారా ఆర్డీఎస్ చివరి ఆయకట్టు భూములు 20వేల ఎకరాలు ఉండగా, కేవలం ఎనిమిదివేల ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇవ్వనున్నట్లు బుధవారం జరి గిన ఐడీబీ సమావేశంలో జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ పరంపరలో 2008 నుంచి రెండోపంటకు దూరమైన ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు ఈ ఏడాది రబీ పంటకు నీళ్లందని పరిస్థితి కొనసాగింపుగా మారింది. ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు పూర్తిచేయకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని అన్నదాతలు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధునికీకరణలో భాగమైన ఒకటో ప్యాకేజీ పనులు మిగిలి ఉన్నాయి. గత జూన్ నెలలో పనులు ప్రారంభించగా కర్నూలు జిల్లా రైతులు అడ్డుకున్నారు. నదికి వరద రావడంతో ప్రభుత్వం అధికారులు ఆ సమస్య పరిష్కారాన్ని పక్కనపెట్టేశారు. మళ్లీ నదిలో నీళ్లు తగిన ఏప్రిల్ నెలలో పనులు చేసేందుకు యత్నిస్తే మళ్లీ అడ్డంకులు ఎదురయ్యాయి. ఇలా పనులు పూర్తికాకపోవడంతో ఎన్నేళ్లు ఆర్డీఎస్ రైతు లు రెండోపంటను కోల్పోవాలో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇవే చివరి భూములు జూరాల కుడి ప్రధాన కాల్వ ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు నీళ్లు అందించేలా మానవపాడు మండలం జల్లాపురం స్టేజీ సమీపంలో జూరాల లింకును కలిపారు. జూరాల కుడి కాల్వ ద్వారా వచ్చే నీటిని ఈ లింకు కాల్వద్వారా 25వేల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉంది. జూరాల రిజర్వాయర్లోనూ నీటిమట్టం ఆయకట్టుకు పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఆర్డీఎస్ లింకు ద్వారా కేవలం ఎనిమిదివేల ఎకరాల్లో రబీసాగులో అరుతడి పంటకు నీటిని అందించాలని నిర్ణయించారు. జల్లాపురం, బొరవెల్లి, మానవపాడు గ్రామాల పరిధిలోని ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు సాగునీరు అందనుంది. నిధులిచ్చినా నిర్లక్ష్యమే..! నిధులున్నా పట్టించుకోకపోవడం, కాం ట్రాక్టర్ల ఇష్టానికే వదలేయడం, సమీక్షలు నిర్వహించే శ్రద్ధ చూపకపోవడం, కర్ణాటకతో మన ప్రభుత్వం సంప్రదించకపోవడం.. ఇలా రోశయ్య, కిరణ్ సర్కారుల నిర్లక్ష్యంతో ఆర్డీఎస్ ఆయకట్టులో ఆరేళ్లుగా రైతులు రెండోపంటను కోల్పోతున్నారు. ఈ ఏడాది కూడా పనులు పూర్తవుతాయనే నమ్మకం లేదు. ఆర్డీఎస్ సమస్యపై గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయకట్టు పూర్తిగా కుదించికుపోయింది. రెండు ప్రాంతాల రైతుల మధ్య ఘర్షణకు కారణమైంది. ఇదిలాఉండగా, ఆర్డీఎస్ సమస్యకు శాశ్వతపరిష్కారం చూపేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో అధికారంలోకి రాగానే నిపుణుల కమిటీని నియమించా రు. ఆధునికీకరణ కోసం రూ.92కోట్లు మంజూరు చేశారు. పనులు నిర్వహించేం దుకు నిర్వహించేందుకు కర్ణాటకలో నాలుగు ప్యాకేజీలు, మన రాష్ట్రంలో నాలుగు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. ఈ పరంపరలో కర్ణాటకలోని 1,2 ప్యాకేజీల్లో పనులను ప్రారంభించి వదిలేశారు. ఇలా పనులు ఏటా వాయిదా పడుతుండడంతో ఆర్డీఎస్ రైతులు రెండోపంటను కోల్పోతున్నారు. వేసవిలో పనులు పూర్తిచేస్తాం ఆర్డీఎస్లో ప్రస్తుతం ఉన్న స్టాడింగ్ పంటలకు ఫిబ్రవరి వరకు నీటిని విడుదల చేస్తాం. అనంతరం ఆర్డీఎస్లో మిగిలిఉన్న ఆధునికీకరణ పనుల పూర్తికి ప్రాధాన్యమిస్తాం. జూరాల కుడి ప్రధానకాల్వ ద్వారా లింక్ నుంచి వచ్చేనీటిని రబీ సీజ న్లో ఆర్డీఎస్ చివరి భూముల్లో ఎని మిది వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తాం. - ఖగేందర్, ఎస్ఈ -
పారిశుధ్య కార్మికుల బతుకులు మాత్రం..
సాక్షి, ఖమ్మం: పట్టణాల్లో కంపునంతా ఎత్తిపారేస్తున్నా పారిశుధ్య కార్మికుల బతుకులు మాత్రం మారడం లేదు. అత్తెసరు వేతనం..అందులోనూ కోత. నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన గ్లౌజులు, సబ్బులు, నూనె, చెప్పులు ఎప్పుడోకాని ఇవ్వరు. కనీసం చీపుర్లు కూడా సరిగా ఉండవు. చలికి వణుకుతూ విధులు నిర్వహించక తప్పని పరిస్థితి. ఖమ్మం కార్పొరేషన్తో పాటు మిగతా మున్సిపాలిటీల్లోనూ కాంట్రాక్టు కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై కార్మికులను దండుకుంటున్నారు. మంగళవారం తెల్లవారుజామున మున్సిపాలిటీ ప్రాంతాల్లో ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైన కార్మికుల దుర్భర స్థితిగతులు... జిల్లాలో ఖమ్మం కార్పొరేషన్తో పాటు కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీలున్నాయి. వీటి పరిధిలో రెగ్యులర్ పారిశుధ్య కార్మికులను మినహాయిస్తే కాంట్రాక్టు కార్మికులు 1,152 మంది పని చేస్తున్నారు. మున్సిపాలిటీ టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు కార్మికులను పారిశుధ్య పనుల కు పంపిస్తారు. మున్సిపల్శాఖ నిబంధనల ప్రకారం కార్మికులకు కాంట్రాక్టర్లే వేతనాలు చెల్లించాలి. కానీ కాంట్రాక్టు నిబంధనలు వీరు బేఖాతర్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున 5 గంటలకు, మరికొన్నిచోట్ల రాత్రి వేళ్లల్లో కార్మికులు పట్టణ వీధుల్లో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు. ట్రాక్టర్లలోకి ఎత్తి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. పలు మున్సిపాలిటీల్లో కొన్నేళ్లుగా కార్మికులకు యూనిఫాం, గ్లౌజులు, నూనె, సబ్బులు, ఇవ్వడం లేదు. కనీసం చీపుర్లు కూడా సక్రమంగా ఉండటం లేదు. చలితో వణుకుతున్నా కాంట్రాక్టర్లు కార్మికుల గోడు పట్టించుకోవడం లేదు. చెత్తను తీయకుంటే అధికారులు, కాంట్రాక్టర్లు ఇబ్బంది పెడుతున్నారని.. తమ సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం మున్సిపాలిటీ కార్పొరేషన్ స్థాయి లభించినా కార్మికులకు మాత్రం ఆస్థాయిలో సౌకర్యాలు కల్పించడం లేదు. కార్పొరేషన్లో మొత్తం 569 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. వీరికి ఈ ఏడాది యూనిఫాం అందజేయలేదు. చలికి వణుకుతూనే తెల్లవారుజామున నగరాన్ని శుభ్రపరుస్తున్నారు. కార్పొరేషన్ స్థాయిలో ఇంకా ఖమ్మం నగరాన్ని శుభ్రం చేయాలంటే సుమారు 300 మంది కార్మికుల అవసరం. కానీ భారం అంతా ఉన్న కార్మికుల పైనే పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న రెగ్యులర్ కార్మికులూ సమస్యలతోనే సావాసం చేస్తున్నారు. వీరికి యూనిఫాం అందలేదు. కొంతమంది అధికారుల ఇళ్లలోనూ వీరితో పనిచేయించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టర్ల హవా మున్సిపాలిటీల్లో పారిశుధ్య టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారుల చేయి తడుపుతూ కార్మికులకు శ్రమ, సౌకర్యాలను దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. నెల వేతనాలు ఎప్పుడో ఒకసారి ఇస్తుండడం.. అందులోనూ ప్రతి నెల వేతనంలో ఎంతోకొంత కోత పెడుతున్నారు. ఇదేమని కార్మికులు ప్రశ్నిస్తే తొలగిస్తామంటూ కాంట్రాక్టర్లు బెదిరిస్తూ మరీ పొట్ట కొడుతున్నారు. పెద్ద డ్రైనేజీల్లో మురుగు నీరు నిల్వకుండా చేయడం కార్మికులకు ఇబ్బందిగా మారింది. దీన్ని తొలగించడానికి కావాల్సిన పరికరాలను మున్సిపాలిటీలు కూడా సమకూర్చకపోవడంతో చేతులతోనే తీసివేస్తూ అనారోగ్యం పాలవుతున్నారు. కాంట్రాక్టు కార్మికులకు చెల్లించాల్సిన ఈఎస్ఐ, పీఎఫ్ల విషయంలోనూ అక్రమాలు చోటుచేసుకుంటున్నా అధికారులు నోరు మెదపడం లేదు. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై వీటిని మింగేస్తున్నట్లు సమాచారం. పీఎఫ్ను కార్మికులకు నెల మొత్తం చెల్లించాల్సి ఉన్న కేవలం 15 రోజులు మాత్రమే చెల్లిస్తూ మిగిలింది స్వాహా చేస్తున్నారని తెలిసింది. స్థాయితో పాటు సమస్యలూ పెరిగాయి... ఖమ్మం కార్పొరేషన్ స్థాయికి చేరిన కాంట్రాక్టు కార్మికుల వేతలు మాత్రం తొలగటం లేదు. కాంట్రాక్టు కార్మికులకు సౌకర్యాల కల్పన అటుంచితే కార్పొరేషన్ అధికారులు కనీసం వారికి చీపుర్లు కూడా ఇవ్వడం లేదు. అరిగిపోయిన చీపుర్లతో చెత్త ఉడుస్తుండటంతో నడుం నొప్పిపెడుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొమ్మిది విలీన గ్రామాలను కలుపుకొని కార్పొరేషన్గా మారి రెండేళ్లు గడిచినా ఇప్పటికీ కార్మికుల సంఖ్యలో ఎలాంటి మార్పులేదు. కొత్తగూడెం మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి. ఈ మున్సిపాలిటీలో నాలుగేళ్లుగా కార్మికులకు యూనిఫాం ఇవ్వడం లేదు. మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీల హోదా పెరిగినా ఇక్కడ కూడా గతంలో ఉన్న కార్మికులే పారిశుధ్య పనులు చేస్తున్నారు. మధిరలో రెండు నెలలుగా కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడంతో సంక్రాంతి వరకైనా చెల్లిస్తారో.. లేదోనని ఆందోళన చెందుతున్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీలోనూ మూడు నెలలుగా కార్మికులు వేతనాలు ఇవ్వడం లేదు. బ్యాంక్ ఖాతాల్లో వేతనాలు పడగానే ఇచ్చే విధంగా ముందుగానే ఏటీఎం కార్డులను కిరాణాషాపుల్లో తాకట్టు పెట్టి మరీ సరుకులు తెచ్చుకుంటున్నామని కార్మికులు వాపోతున్నారు. -
పాదరసంలా నిబంధనలు
సాక్షి, విజయవాడ : శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో అధికారులు విధిస్తున్న నిబంధనలు దేవస్థాన ఆదాయానికి గండి కొట్టేవిగా ఉన్నాయి. పదేపదే తప్పులు చోటుచేసుకుంటున్నా కొందరు అధికారులు కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొండపై దీర్ఘకాలంగా తిష్టవేసిన నలుగురైదుగురు కాంట్రాక్టర్లు దేవస్థానంలోని లీజెస్ విభాగంలో సిబ్బందికి లంచాలు ఇచ్చి నిబంధనలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నట్లు సమాచారం. ఆరునెలల్లో మూడుసార్లు నిబంధన మార్పు ఏడాది పాటు భక్తులు అమ్మవారికి సమర్పించే చీరలు, రవికలు పోగు చేసుకునేందుకు గత జూన్ 30న టెండర్ పిలిచారు. ఇందులో 2012-13 సంవత్సరానికి రెండు కోట్లు టర్నోవర్ చేసిన వారు టెండర్ దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ టెండర్ను రద్దుచేసి అక్టోబర్ 28న మళ్లీ పిలిచారు. ఈ టెండర్లో గత రెండేళ్లకు రూ.2 కోట్లు టర్నోవర్ చేయాలంటూ నిబంధన మార్పు చేశారు. దీన్ని దేవాదాయశాఖ కమిషనర్ ఇటీవల రద్దు చేశారు. సోమవారం తిరిగి టెండర్ పిలిచారు. 2011-12, 2012-13 సంవత్సరాల్లో ఒకొక్క ఏడాది రూ.2 కోట్లు టర్నోవర్ చేసిన అనుభవం ఉండాలంటూ నిబంధన సడలించారు. ఇవి ఇటీవల వరకు పనిచేసిన కాంట్రాక్టర్కు అనుకూలంగా ఉన్నాయనే విమర్శలున్నాయి. కాంట్రాక్టర్ న్యాయస్థానాలకు వెళ్లి దేవస్థానం పరువు తీస్తున్నా అతనికే ఎందుకు తిరిగి టెండర్ దక్కేలా అధికారులు ప్రయత్నిస్తుండడంలో మరమ్మమేటో. అనుభవం ఎందుకు... భక్తులు సమర్పించిన చీరలు, రవికలు సేకరించే కాంట్రాక్టర్కు ఏడాదికి రెండు కోట్ల రూపాయల చొప్పున రెండేళ్లు వ్యాపారం చేసిన అనుభవం కావాలంటూ దేవస్థానం అధికారులు నిబంధన విధించడం విచిత్రంగా ఉంది. కాంట్రాక్టర్ తాను కోట్ చేసిన సొమ్ము ఎగ్గొట్టి పారిపోతాడని అధికారులు భావిస్తే.. మొత్తం సొమ్ముంతా ఒకేసారి కట్టాలనే నిబంధన విధించవచ్చు. లేదా వాయిదాలు ఇస్తే, ఆ గడువు రాకముందే కాంట్రాక్టర్కు నోటీసులు ఇచ్చి సొమ్ము రాబట్టడం, లేకుంటే టెండర్ను రద్దుచేయడం చేయవచ్చు. దేవస్థానంలోని సూపరింటెండెంట్తో పాటు కింద స్థాయి సిబ్బంది కాంట్రాక్టర్తో కుమ్మక్కై వాయిదా గడువు మీరినా ఆ సొమ్ము వసూలు చేయడం లేదు. దీంతో కాంట్రాక్టర్ టెండర్ గడువు ముగిసే నాటికి దేవస్థానానికి సొమ్ము ఎగవేసి జారుకుంటున్నారు. సొమ్ము వసూలు చేయని ఉద్యోగులపై అధికారులు చర్యలు తీసుకోకుండా కేవలం టెండర్ నిబంధనలు మార్చడంపై విమర్శలు వస్తున్నాయి. కొత్త వారికి అవకాశం లేదు.... టెండర్ నిబంధనలు కఠినతరం చేయడం వల్ల కొత్త కాంట్రాక్టర్లకు అవకాశం లభించడం లేదు. దేవస్థానం విధించిన నిబంధనలు చూసి బెంబేలెత్తుతున్నారు. కొత్త వారికి అవకాశం ఇస్తే ఎక్కువ ధరకు టెండర్ వేసే అవకాశముంది. దీనివల్ల దేవస్థానం ఆదాయం పెరుగుతుంది. కొత్తవారు వస్తే తమ ఉనికి దెబ్బతింటుందని భయపడిన కాంట్రాక్టర్లు అధికారుల అండతో ని‘బంధనాలు’ బిగిస్తున్నారు. దీనిపై నూతన ఈవో పూర్తిస్థాయిలో దృష్టి సారించాల్సి ఉంది. -
రోడ్ల బాధ్యత కాంట్రాక్టర్లదే
కొత్త నిబంధన ప్రవేశపెట్టనున్న టీ సర్కారు ఐదేళ్ల పాటు వారే నిర్వహించాలి.. పీఎంజీఎస్వై తరహాలో అమలు రహదారుల నాణ్యతకు పెద్దపీటవేసేందుకే త్వరలో రూ.10 వేల కోట్ల పనులకు శ్రీకారం సాక్షి, హైదరాబాద్: మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు లేన్ల రోడ్లు.. అన్ని నియోజకవర్గాల కేంద్రాల మీదుగా డబుల్ రోడ్లు.. 10 వేల కిలోమీటర్ల రోడ్లకు మరమ్మతులు.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా ఒకేసారి ఏకంగా రూ.10,664 కోట్లతో పనులు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం కొత్త అధ్యాయానికి తెరదీసింది. రోడ్ల నిర్మాణంలో ప్రయోగాత్మకంగా కొత్త నిబంధనను అమలులోకి తెస్తోంది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన(పీఎంజీఎస్వై)లో అనుసరిస్తున్నట్టుగా... ఐదేళ్ల పాటు రోడ్ల నిర్వహణ బాధ్యతను కాంట్రాక్టర్లకే అప్పగించాలని నిర్ణయించింది. ఫలితంగా రోడ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలను అనుసరించకతప్పని పరిస్థితి కల్పించింది. సాధారణంగా రోడ్ల నిర్మాణం అనగానే కాంట్రాక్టర్లకు పండగే అనుకోవటం సహజం. రోడ్లు వేయటం, అనతి కాలంలోనే అవి దెబ్బతినటం, మళ్లీ మరమ్మతులు, ఆ తర్వాత ప్యాచ్వర్క్లు.. మళ్లీ కొత్త రోడ్ల నిర్మాణం.. ఇది కాంట్రాక్టర్లకు కాసులు కురిపిస్తుంటుంది. ఈ పరిస్థితిని నివారించేందుకే రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత ఐదేళ్ల పాటు వాటి నిర్వహణ (మెయింటెనెన్స్)ను సంబంధిత కాంట్రాక్టర్లే పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రభుత్వం నామమాత్రంగా నిధులు కేటాయిస్తుంది. ఇప్పటి వరకు నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే పర్యవేక్షిస్తూ వస్తోంది. రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత ‘డిఫెక్ట్ లైబిలిటీ పీరియడ్’ పేరుతో రెండేళ్లు మాత్రమే వాటి నిర్వహణ బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. ఈ సమయంలో రోడ్లు దెబ్బతింటే కాంట్రాక్టర్లు వాటిని పునరుద్ధరించాల్సి ఉంటుంది. దీన్ని యథావిధిగా కొనసాగిస్తూ... అదనంగా మూడేళ్లపాటు పాటు నిర్వహణ పనులను కాంట్రాక్టర్లే పర్యవేక్షించే నిబంధనను అమలు చే యనున్నారు. నాణ్యతను గాలికొదిలేస్తే అంతే.. రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను అనుసరించినా.. వాతావరణ మార్పులు, వాహనాల ఒత్తిడి వల్ల దెబ్బతినటం సహజం. కానీ చాలాచోట్ల రెండేళ్ల తర్వాత రోడ్లు ఉన్నట్టుండి పాడయిపోతున్నాయి. చిన్నపాటి వానకే పూర్తిగా దెబ్బతింటున్నాయి. దీంతో అత్యవసరంగా మరమ్మతు పనులు చేపట్టాల్సి వస్తోంది. ఇందుకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇప్పుడు రూ.10 వేల కోట్లకుపైగా వ్యయంతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నందున వాటికి ఈ పరిస్థితి ఎదురుకావొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త నిబంధనకు శ్రీకారం చుట్టింది. నిర్వహణ పనుల కోసం కాంట్రాక్టర్లకు నామమాత్రంగానే నిధులు కేటాయిస్తారు. ప్రమాణాలను పాటించి రోడ్లను నిర్మిస్తేనే ఈ మొత్తం సరిపోతుంది. నాణ్యతను గాలికొదిలేస్తే... ప్రభుత్వం ఇచ్చే నిర్వహణ నిధులు సరిపోక కాంట్రాక్టర్ జేబుకు చిల్లు పడడం ఖాయం. ఈ భయంతో వారు నిబంధన ప్రకారం నాణ్యతతో రోడ్లను నిర్మిస్తారనేది ప్రభుత్వ ఆలోచన. వ్యయం ఇలా... - ప్రస్తుతం రాష్ట్ర రహదారులల్లో ఒక కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి (డబుల్ రోడ్డు) రూ.85 లక్షల నుంచి రూ.1.10 కోట్ల వరకు ఖర్చవుతోంది. - సింగిల్ రోడ్డుకు రూ.35 -రూ.45 ల క్షల వరకు ఖర్చవుతోంది. - ప్రభుత్వ తాజా ప్రణాళికలో.. దాదాపు 4,700 కిలోమీటర్ల మేర సింగిల్ రోడ్లను రెండు లేన్ల రోడ్లుగా మార్చాల్సి ఉంది. ఇందులో నాణ్యత గల్లంతయితే ప్రభుత్వంపై నిర్వహణ భారం విపరీతంగా పడుతుంది. - కొత్త నిబంధన ప్రకారం.. రోడ్ల నిర్వహణ కోసం ఐదేళ్ల కాలానికి కిలోమీటరుకు రూ.80 వేల చొప్పున మాత్రమే కాంట్రాక్టర్లకు చె ల్లించాలని యోచిస్తున్నారు. రోడ్లు బాగా దెబ్బతింటే ఈ మొత్తం సరిపోదు. అప్పుడు నష్టపోయేది కాంట్రాక్టరే. అందుకే రోడ్డు నిర్మాణం సమయంలో కాంట్రాక్టరు నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.