Debt waiver
-
Delhi Chalo: ఢిల్లీలో ‘మహా పంచాయత్’కు రైతుల పిలుపు
న్యూఢిల్లీ: పంటలకు మద్దతుధర కోసం రైతులు చేపట్టిన నిరసన మార్చ్ ఢిల్లీ ఛలో బుధవారం(మార్చ్ 6) ఉదయం మళ్లీ మొదలైంది. పలు రాష్ట్రాల నుంచి ర్యాలీగా వచ్చిన రైతులు ఢిల్లీలో కలుసుకోవడానికి రైతు సంఘాలు ప్లాన్ చేశాయి. అయితే తమ డిమాండ్లపై మార్చ్ 14న ఢిల్లీలో మహా పంచాయత్ కార్యక్రమం చేపట్టనున్నట్లు రైతుసంఘాలు ప్రకటించాయి. పంటలకు కనీస మద్దతు ధర, రైతులకు పెన్షన్, రుణమాఫీ, కరెంటు ఛార్జీలు యథాతథంగా కొనసాగించడం లాంటి డిమాండ్లతో రైతులు ఢిల్లీ ఛలో నిరసన మార్చ్ను ఫిబ్రవరిలోనే ప్రారంభించారు. అయితే కేంద్ర ప్రభుత్వంతో చర్చల కోసం తొలి విడత విరామం ప్రకటించారు. చర్చలు విఫలమవడంతో రెండో విడత మార్చ్ కూడా ఫిబ్రవరిలోనే నిర్వహించారు. అనంతరం మూడవ విడత నిరసన మార్చ్ను బుధవారం నుంచి పునరుద్ధరించారు. రైతుల తాజా ఢిల్లీ ఛలో పిలుపుతో ఢిల్లీ చుట్టుపక్కల ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి వచ్చే టిక్రీ,సింగు, ఘాజీపూర్ సరిహద్దుల వద్ద పోలీసులు భద్రత పెంచారు. VIDEO | Farmers' protest: Security remains tightened at Delhi's Ghazipur border. Earlier this week, the farmers had called to march towards Delhi from March 6 to press the government to fulfill their demands.#FarmersProtest pic.twitter.com/qkperoHULm — Press Trust of India (@PTI_News) March 6, 2024 ఈ సరిహద్దుల వద్ద రైతులు ఫిబ్రవరి 13 నుంచి క్యాంపులు వేసుకుని నిరసన తెలుపుతున్నారు. ఫిబ్రవరి 18న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు సంవత్సరాల పాటు కనీస మద్దతు ధర ఆఫర్ను రైతుసంఘాలు తిరస్కరించడంతో ప్రభుత్వంతో రైతుల చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఢిల్లీ ఛలో మార్చ్ను రైతు సంఘాలు మళ్లీ పునరుద్ధరించాయి. ఇదీ చదవండి.. రాహుల్ గాంధీకి ఊహించని అనుభవం -
రుణమాఫీ బిల్లులకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ సొమ్ము విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. గతేడాది మాఫీ చేయాల్సిన సొమ్ములో కొంత మేరకు ఆర్థిక శాఖ నిలిపేయడమే ఇందుకు కారణం. మార్చి 31 నాటికే రూ. 50 వేలలోపు రైతుల పంట రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ. 37 వేలలోపు ఉన్న పంట రుణాలనే ప్రభుత్వం మాఫీ చేసింది. రూ. 37 వేల నుంచి రూ. 50 వేల వరకు ఉన్న రుణాల మాఫీ కోసం మరో రూ. 857 కోట్లు అవసరం ఉంది. ఈ సొమ్ము విడుదలకు సంబంధించి ఆర్థిక శాఖకు బిల్లులు సమర్పించగా నిధుల కొరత వల్ల ఫైల్ నిలిచిపోయిందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. దీంతో ప్రభుత్వం రెండోదశ రుణమాఫీ కూడా ఇప్పటివరకు పూర్తి చేయలేకపోయింది. మరోవైపు తమకు మాఫీ సొమ్ము బ్యాంకు ఖాతాల్లో రాలేదంటూ అనేక మంది రైతులు వ్యవసాయశాఖ చుట్టూ తిరుగుతున్నారు. మాఫీ అయింది రూ.1,144.38 కోట్లే... 2018 ఎన్నికల సమయంలో రూ. లక్ష వరకు ఉన్న రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. దీని ప్రకారం మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రూ. 19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ నాలుగేళ్లలో రుణమాఫీ కోసం రూ. 20,164.20 కోట్లు కేటాయించినా అందులో కేవలం రూ. 1,144.38 కోట్లనే విడుదల చేసింది. వాటితో 5.66 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేయగా మరో 31 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. 2020లో రూ. 25 వేలలోపు రుణాల కోసం రూ. 408.38 కోట్లు రుణమాఫీకి బదిలీ చేసింది. 2021 ఆగస్టులో రూ. 25 వేల నుంచి రూ. 50 వేల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం రూ. 1,790 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు రూ. 25 వేల నుంచి రూ. 37 వేల లోపు రైతులకు చెందిన రూ. 763 కోట్ల రుణాలనే మాఫీ చేసింది. ఇంకా రూ. 1,027 కోట్ల నిధులు అందించి రైతులకు మాఫీ చేయాల్సి ఉంది. అందులో రూ. 857 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉండగా మిగిలిన వాటికి బిల్లులు ఇవ్వాల్సి ఉంది. -
మూడు దశాబ్దాల నిరీక్షణకు మోక్షం.. మాఫీ.. రాష్ట్ర వ్యాప్తంగా..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నిరుపేదలైన ఎస్సీల మూడు దశాబ్దాల నిరీక్షణకు మోక్షం లభించింది. భూమి కొనుగోలు పథకం ద్వారా లబ్ధిపొందిన ఎస్సీలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రుణ విముక్తులను చేయనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 17,189 మంది ఎస్సీ లబ్ధిదారులకు సంబంధించిన 18,235.37 ఎకరాల వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్న తనఖా నుంచి విముక్తి కానున్నాయి. ప్రకాశం జిల్లాలో అమలైన ఈ రుణమాఫీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రత్యేకంగా తీసుకున్న చొరవే ఈ పథకం వేగంగా అమలు కావటానికి దోహదపడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకం అమలులో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లకు, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు ఉత్తర్వులు జారీచేసింది. తొలుత ప్రకాశం జిల్లాలో లబ్ధిదారుల గుర్తింపు రాష్ట్ర విద్యుత్, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ రుణమాఫీ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. డాక్టర్ వైఎస్సార్ ఇచ్చిన జీవోను అమలు చేస్తే భూమి కొనుగోలు పథకంలో లబ్ధిపొందిన ఎస్సీలకు ప్రయోజనం కలుగుతుందని సీఎంకు వివరించారు. ఈ అంశంపై వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హర్షవర్దన్ను సీఎం ఆదేశించారు. దీంతో జిల్లాల వారీగా లబ్ధిదారులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మొదటగా ప్రకాశం జిల్లాలో లబ్ధిదారులను ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తూతిక శ్రీనివాసవిశ్వనాథ్ గుర్తించారు. భూములకు తనఖా నుంచి విముక్తి కలిగించేందుకు రిజిస్ట్రేషన్శాఖ అధికారులతో సంప్రదిస్తున్నారు. 1988–89 నుంచి లబ్ధిదారులకు ఊరట రాష్ట్రంలోని ఎన్ఎస్ఎఫ్డీసీ పథకంలో 1988–89 నుంచి భూములు కొనుగోలు చేసిన లబ్ధిదారులకు రుణమాఫీ ద్వారా ఊరట కలుగనుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పథకం లబ్ధిదారులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు భూమి కొనుగోలు పథకంలో రూ.లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీచేస్తూ 2009 జూలై 7వ తేదీన జీవోఆర్టీ నంబరు–492 విడుదల చేశారు. ఆ మహానేత అకాల మరణంతో తరువాత ఆ జీవోను కాంగ్రెస్, టీడీపీ పాలకులు అటకెక్కించారు. ఆ మహానేత ఇచ్చిన జీవోకు మోక్షం కల్పిస్తున్న ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఎస్సీ లబ్ధిదారులకు జిల్లాల్లోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో తాకట్టులో ఉన్న భూములకు విముక్తి కలిగించనున్నారు. ఎస్సీ లబ్ధిదారులకు రుణమాఫీ ఎస్సీ కార్పొరేషన్ కింద భూమి కొనుగోలు పథకంలో లబ్ధి పొంది.. 2008లోపు రూ.లక్ష లోపు రుణం ఉన్నవారందరికీ రుణమాఫీ చేసేలా చర్యలు చేపట్టనున్నామని ఎస్సీ కార్పొరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. అంతేకాకుండా ఆ భూములపై లబ్ధిదారులకు సంపూర్ణ హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీల భూమి కొనుగోలు పథకంలో రుణమాఫీకి సంబంధించి రాష్ట్రస్థాయి తొలి సమీక్ష సమావేశం ఆదివారం ఒంగోలులోని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్ చైర్మన్లు.. కొమ్మూరి కనకారావు మాదిగ, పెదపాటి అమ్మాజీ, వడ్డాది మధుసూదనరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ (ఆసరా–సంక్షేమం) జి.కృష్ణవేణి, జిల్లా సోషల్ వెల్ఫేర్ డీడీ ఎన్.లక్ష్మానాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 17 వేలకుపైగా ఎస్సీ లబ్ధిదారులున్నారని, వారందరికీ రుణమాఫీ చేసేలా చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. అయితే 2009లో నాటి సీఎం వైఎస్సార్ ఇచ్చిన జీవో ప్రకారం రుణమాఫీ 2008లోపు ఉన్న లబ్ధిదారులకు మాత్రమేనని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 2008 తర్వాత రుణాలు తీసుకొని.. తిరిగి చెల్లించని వారి వివరాలను కూడా బయటకు తీస్తున్నామన్నారు. వారికి కూడా రుణమాఫీ అయ్యేలా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. ప్రకాశం జిల్లాలో ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా రుణమాఫీ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ మాట్లాడుతూ.. 2009 జూలైలో ఎస్సీ లబ్ధిదారులకు రుణమాఫీ చేస్తానని వైఎస్సార్ జీవో ఇచ్చారని.. ఆ తర్వాత రెండు నెలలకే ఆయన మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి ఆ జీవోను తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు వైఎస్సార్ తనయుడు సీఎం వైఎస్ జగన్ ఆ జీవోను అమలు చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. -
లోటులో రాష్ట్రం.. కావాలి ఊతం
సాక్షి, అమరావతి: ఓ వైపు రాష్ట్ర విభజన సమస్యలతో పాటు మరో వైపు గత ప్రభుత్వం విచక్షణ లేని అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను 15వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేయడమే కాకుండా కొత్తగా అప్పులు చేసే వెసులు బాటు లేని స్థితిలోకి నెట్టిన వైనాన్ని, రూ.39,423 కోట్ల విలువైన 2,72,266 బిల్లులను పెండింగ్లో పెట్టి వెళ్లిపోవడం వల్ల ప్రస్తుత ఆర్థిక ఏడాది బడ్జెట్పై తీవ్ర ప్రభావం పడిందని వివరించనుంది. ఈ కారణాలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ, సామాజిక కార్యక్రమాల అమలు తీరును వివరించి సాయం కోరడంతో పాటు కేంద్రానికి రాష్ట్రం చెల్లించాల్సిన అప్పులను మాఫీ చేయాలని విజ్ఞప్తి చేయనుంది. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ లోటు భర్తీ గ్రాంటును కొనసాగించాలని, ఆంధ్రప్రదేశ్ను జనరల్ కేటగిరీగా కాకుండా ప్రత్యేకంగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం విన్నవించనుంది. రాష్ట్ర ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు.. నవరత్నాల ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును వివరించి ప్రత్యేక నిధులు కోరనుంది. ఈ నెల 18, 19, 20వ తేదీల్లో 15వ ఆర్థిక సంఘం రాష్ట్ర పర్యటనకు రానుంది. ఈ మూడు రోజుల్లో ఒక రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం విన్నవించనున్న అంశాలు ► గ్రామ, పట్టణాల మధ్య పేదరికం, నిరుద్యోగం, అభివృద్ధిలో ఉన్న తారతమ్యాలు, వ్యత్యాసాలను తొలగించేందుకు కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఆదాయ, వ్యయాల మధ్య భారీ వ్యత్యాసం ఉన్నందున 15వ ఆర్థిక సంఘం కాల వ్యవధిలో గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.28,382 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.27,820 కోట్ల గ్రాంటును సిఫార్సు చేయాలి. ►73, 74 రాజ్యాంగ సవరణలకు లోబడి గ్రామ, పట్టణ స్థానిక సంస్థలను బలోపేతం చేయడం, అధికార వికేంద్రీకరణలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు. ఈ వ్యవస్థ కోసం ప్రత్యేకంగా రూ.5,950 కోట్ల కేంద్ర సాయం అందేలా సిఫార్సు చేయాలి. ►మద్య నియంత్రణలో భాగంగా మద్యం దుకాణాలు, బార్లను తగ్గించినందున రాష్ట్రం ఆదాయాన్ని కోల్పోతోంది. సామాజిక బాధ్యతగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దశల వారీ మద్య నిషేధం అమలు చేస్తున్నందున ఆ మేరకు ఆదుకునేలా సిఫార్సులు చేయాలి. ఈ విషయంలో రాష్ట్రాన్ని ప్రత్యేకంగా గుర్తించడంతో పాటు ఇందుకు తగిన బహుమతి కూడా ఇవ్వాలి. ►రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆదాయ, వ్యయాల్లో భారీ వ్యత్యాసం నెలకొందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ►అస్తవ్యస్థంగా ఉన్న భూ రికార్డుల ప్రక్షాళనకు సర్వే చేసేందుకు చట్టం తీసుకొచ్చామని, ఈ కార్యక్రమానికి రూ.1,667 కోట్ల కేంద్ర సాయం అందేలా సిఫార్సు చేయాలి. ►గతంలో పంజాబ్ రాష్ట్రానికి చేసిన తరహాలో రాష్ట్రాన్ని ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని తీవ్ర ఆర్థిక ఇక్కట్లలో ఉన్నందున రూ.11,039 కోట్ల (వచ్చే ఏడాది మార్చి 31 నాటికి) కేంద్ర రుణాలు మాఫీ చేస్తూ సిఫారసు చేయాలి. (తద్వారా కొత్త అప్పులకు అవకాశం ఉంటుంది) ►విద్య, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నందున పని తీరు ప్రోత్సాహకాలుగా ఆర్థిక సాయాన్ని సిఫార్సు చేయాలి. ►కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రాలకు బదిలీ చేసే మొత్తాన్ని ప్రస్తుతం ఉన్న 42 శాతం నుంచి 50 శాతానికి పెంచాలి. -
త్వరలో రుణమాఫీ అమలు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీని త్వరలో అమలు చేస్తామని శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. మండలిలో శుక్రవారం మున్సిపల్ చట్ట సవరణ బిల్లు సహా పలు బిల్లులను సభలో ఆయన ప్రవేశపెట్టారు. సభ్యులు వివిధ అంశాలను లేవనెత్తారు. రుణ మాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రుణ విముక్తి కమిషన్ను ఏర్పాటు చేసిందని మంత్రి సమాధానం ఇచ్చారు. చైర్మన్గా హైకోర్టు రిటైర్డ్ జడ్డితో పాటు నలుగురు సభ్యులు ఉంటారని చెప్పారు. మున్సిపల్ చట్ట సవరణ బిల్లు వార్డుల పునర్విభజనకు సంబంధించిందని పేర్కొన్నారు. వడ్డీ రాయితీ సొమ్ము ఇవ్వకపోవడంతో రుణాలు 10 శాతం కూడా బ్యాంకులు రైతులకు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ పూచీకత్తుతో రుణాలు ఇప్పించాలన్నారు. ప్రైవేటు ఈడబ్ల్యూఎస్ లేదు.. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో అగ్రవర్ణ పేదల (ఈడ బ్ల్యూఎస్) రిజర్వేషన్ల అమలుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) అనుమతి ఇవ్వలేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. మండలిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అధ్యాపక సిబ్బంది విరమణ వయసు పెంపునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ సవరణ బిల్లును ఆయన ప్రవేశపెట్టారు. కాగా, మండలికి కొత్తగా ఎన్నికైన సభ్యులను మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్రావు సభకు పరిచయం చేశారు. -
చంద్రబాబే మాకు బాకీ
డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలన్నింటినీ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తాం. మహిళా సంఘాలకు లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం – 2014 ఎన్నికల మేనిఫెస్టోలో బాబు హామీ ‘‘డ్వాక్రా మహిళలందరికీ చెబుతున్నా.. మీ అప్పులన్నీ నేను మాఫీ చేస్తాను. బ్యాంకులకు వాయిదాలు కట్టొద్దు. మీరిక నిశ్చింతగా ఉండొచ్చు’’. 2014 ఎన్నికలప్పుడు చంద్రబాబు ఊరూరా తిరిగి ఇలా నమ్మబలికారు. ఎన్నికలు ముగిశాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవిలో కూర్చున్నారు. ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అనడం చంద్రబాబు సహజ నైజం. అందుకే నాలుగున్నరేళ్లలో ఒక్కరోజు కూడా డ్వాక్రా అక్కచెల్లెమ్మలు గుర్తుకురాలేదు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని ఎప్పుడూ ఆలోచించలేదు. మరోవైపు వడ్డీతో సహా కట్టాల్సిందేనంటూ బ్యాంకులు నోటీసులు ఇవ్వడంతోపాటు అవమానిస్తుండటంతో..అప్పోసప్పోచేసి, తినోతినకో రుణాలు చెల్లిస్తున్నారు మహిళలు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చేశాయి. అకస్మాత్తుగా చంద్రబాబుకు డ్వాక్రా మహిళలు గుర్తుకొచ్చారు. ఏదో ఒక మాయ చేయాలి. అంతే.. పసుపు–కుంకుమ పల్లవి అందుకున్నారు. రుణమాఫీ చేస్తానని నాలుగున్నరేళ్లు మాయ చేసి.. ఇప్పుడు ఎన్నికల ముందు పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ పేరిట మళ్లీ అప్పులు ఇస్తున్నారని డ్వాక్రా మహిళలు వాపోతున్నారు. పసుపు కుంకుమ కింద ఇస్తానంటున్న పదివేలు పోగా.. ఇంకా చంద్రబాబే తమకు బాకీ ఉన్నాడని అక్కచెల్లెమ్మలు కుండబద్దలు కొడుతున్నారు. లంకిరెడ్డి విద్యాధర్రెడ్డి సాక్షి, అమరావతి: ‘డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తాను.. బ్యాంకులకు వాయిదాలు కట్టొద్దు అంటూ.. 2014 ఎన్నికలప్పుడు చంద్రబాబు చెబితే నమ్మామని.. నాలుగున్నరేళ్లు రుణాల మాఫీ ఊసే ఎత్తలేదని డ్వాక్రా మహిళలు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల ముందు ‘పసుపు కుంకుమ’ అంటూ కొత్త పథకం ప్రకటించి.. అప్పు ఇస్తూ పసుపు కుంకుమ పవిత్రతను దెబ్బతీస్తున్నారని అక్కచెల్లెమ్మలు చెబుతున్నారు. ఇది ముమ్మాటికీ మహిళలను మోసం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి వెలుగు అధికారులు జారీ చేసిన అంతర్గత సర్క్యులర్లో.. ‘కేవలం సంఘాల పొదుపు ఖాతాలో మాత్రమే సభ్యులు అప్పులు తీసుకొను నిమిత్తం జమ చేస్తారు’ అని పేర్కొన్నారు. దీన్ని బట్టి పసుపు కుంకుమ పథకంతో డ్వాక్రా సంఘాలకు మళ్లీ అప్పులు మిగిల్చే పరిస్థితి ఎదురుకానుందని మహిళా సంఘాల నేతలు వాపోతున్నారు. మహిళలకు ఉచితంగా పదివేలు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ.. చంద్రబాబు మళ్లీ వారిని మోసం చేస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే.. డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోవడం వల్ల వడ్డీ పెరిగిపోయి..రాష్ట్రంలో డ్వాక్రా మహిళల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. డ్వాక్రా రుణాలు మాఫీ అని ఎన్నికలప్పుడు మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని.. ఇప్పుడు మళీ ఎన్నికలు రాగానే పసుపు కుంకుమ పేరుతో ముష్టేస్తున్నారని మరికొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాగా రుణమాఫీ చేయలేదని సాక్షాత్తు మంత్రి పరిటాల సునీత అసెంబ్లీ సాక్షిగా రాత పూర్వకంగా చెప్పిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. పొదుపు సంఘాలకు పసుపు–కుంకుమ నగదును అప్పుగానే ఇస్తున్నట్లు ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ చెల్లని చెక్కులిచ్చి మరోవైపు చెక్కులు బ్యాంకుల్లో మార్చుకునేందుకు మహిళలు నానాపాట్లు పడుతున్నారు. బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతూ.. చెక్కులు మార్చేకునేందుకు వెళితే కొన్నిచోట్ల చెల్లడం లేదని డ్వాక్రా సంఘాల ఫిర్యాదులు గత వారం రోజులు నుంచి అధికమయ్యాయి. రాష్ట్రంలో 95 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.9వేల కోట్లను తానే ఇచ్చినట్లు సీఎం చంద్రబాబు సభల్లో ప్రకటించడాన్ని మహిళా సంఘాల నేతలు తప్పుపడుతున్నారు. టీడీపీ నాయకుల పెత్తనం పసుపు–కుంకుమ చెక్కులను ఆయా గ్రామాల్లో స్ధానిక టీడీపీ నేతల చేతుల మీదుగా పంపిణీ చేస్తున్నారు. చెక్కులు ఇచ్చేటప్పుడు టీడీపీ నాయకులు తమ అభ్యర్ధుల తరఫున ప్రచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని డ్వాక్రా మహిళలు పేర్కొంటున్నారు. ఆర్ధిక సాయం అందించామని తమపై టీడీపీ నేతలు పెత్తనం చెలాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ప్రచారానికి పిలిచినా రావాలంటూ.. ఆదేశాలు జారీ చేస్తున్నారని డ్వాక్రా సంఘాలు వాపోతున్నాయి. టీడీపీ నేతల ఒత్తిళ్లు ఓ వైపు కొనసాగుతుండగా.. మరోవైపు వెలుగు అధికారులు సీఎం సభలకు వెళ్లాలని.. పోలవరం యాత్రలకు పోవాలంటూ బలవంతంగా పంపుతున్నారని డ్వాక్రా మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పైసా కూడా డ్వాక్రా రుణమాఫీ చేయలేదని అసెంబ్లీలో మంత్రి పరిటాల సునీత ప్రకటనకు సంబంధించిన వార్త క్లిప్పింగ్ రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు- 9,53,571 డ్వాక్రా సభ్యుల సంఖ్య- 95,69,080 బాబు హామీ ఇచ్చినప్పుడు డ్వాక్రా రుణాలు- రూ. 14,204 కోట్లు రుణాలు మాఫీ కాక వడ్డీలు పెరిగిపోయి ప్రస్తుతం- రూ. 25,424 కోట్లు చంద్రబాబే నాకు రూ.15వేలు బాకీ నా పేరు టి.కృపామణి. ప్రకాశం జిల్లా పర్చూరు. ఎన్నో ఏళ్లుగా స్వయం సహాయక సంఘంలో పొదుపు చేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నా. మా గ్రూపు చేస్తున్న పొదుపు కారణంగా గతంలో బ్యాంకు నుంచి రూ.2లక్షలు రుణంగా ఇచ్చారు. ఒక్కొక్కరికి రూ.20వేల వంతున రుణం దక్కింది. చంద్రబాబు 2014లో ఎన్నికలప్పుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చేయలేదు. దాంతో నేను తీసుకున్న రుణానికి వడ్డీ రూ.15వేలు అయింది. అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.35వేల వరకు చెల్లించా. ఇప్పుడు పసుపు–కుంకుమ కింద ఇస్తానన్న రూ.10వేలు, గతంలో ఇచ్చిన రూ.10వేలు కలుపుకున్నా..చంద్రబాబే నాకు ఇంకా రూ.15వేల వరకు బాకీ ఉన్నాడు. చంద్రబాబు ఇస్తున్న రూ.పదివేలతోనే మాకు ఏదో అద్భుతం జరుగుతుందని, కష్టాలన్నీ గట్టెక్కుతాయని చెబుతున్నారు. ఆయన డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని ఇచ్చిన హామీ గురించి మాట్లాడటం లేదు. ఇచ్చిన ఈ డబ్బు కూడా అప్పుగా ఇచ్చారా అనే అనుమానం కలుగుతోంది. మాఫీ అని మాయ చేసి.. ఎన్నికల ముందు ముష్టి నా పేరు.. కట్టా సుజ్ఞానమ్మ. మాది గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడు. గతంలో పావలా వడ్డీ పథకం కింద మేలు జరిగింది. ఇప్పుడు నేను తీసుకున్న రుణానికి రూపాయి వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. డ్వాక్రా రుణాలు మాఫీ అని ఎన్నికలప్పుడు మాయ చేసి..ఇప్పుడు మళ్లీ ఎన్నికల ముందు ముష్టేస్తున్నారు. ఇన్నాళ్లూ గుర్తుకు రాని పసుపు–కుంకుమ పథకం బాబుగారికి ఎన్నికల ముందు జ్ఞాపకం వచ్చింది. ఆయన జేబులో నుంచి మాకు ఈ డబ్బులు ఇవ్వడం లేదు కదా. చంద్రబాబు ఏ సభ పెట్టినా.. మమ్మల్ని ఒత్తిడి చేసి సభలకు తరలించారు. ఎన్ని పనులున్నా..చేసేదేమీ లేక సభలకు వెళ్లాం. పసుపు–కుంకుమ కింద రూ.పదివేలిచ్చి అదేదో తమ సొంత డబ్బు ఇచ్చినట్లు టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. వైఎస్సార్ ఆసరా నిలబెడుతుంది నా పేరు దండిప్రోలు లక్ష్మి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం 21వ వార్డు. నా భర్త అనారోగ్యంతో ఏపనీ చేయలేడు. కుమారుడు, కుమార్తె వివాహాలు కావడంతో వారి పిల్లలతో కుటుంబాలను పోషించుకుంటూ తంటాలు పడుతున్నారు. నేను ఇంటి వద్ద లేసు అల్లికలు చేస్తూ, చీపుర్లూ అల్లుతూ ఎంతోకొంత సంపాదించుకుంటున్నా. 2007 నుంచి డ్వాక్రా గ్రూపులో ఉన్నా. 2014 ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తాననే చంద్రబాబు హామీతో వాయిదాలు కట్టలేదు. నిక్షేపంగా నెలనెలా అప్పులు కడుతూ.. మళ్లీ రుణాలు తీసుకునే వాళ్లం. చంద్రబాబు రుణమాఫీ చేస్తామంటే.. అప్పులు కట్టడం మానేశాం. తరువాత బ్యాంకులు ఒత్తిడి చేయడంతో వడ్డీతో సహా కట్టాం. ఇప్పుడు ఇస్తున్న పసుపు కుంకుమ మాకు అప్పులకు కూడా సరిపోదు. అది అప్పేనని సాక్షాత్తు ప్రభుత్వ సర్క్యులర్లోనే పేర్కొంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి 40–60 సంవత్సరాలోపు మాలాంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఏడాదికి కొంత చొప్పున రూ.75వేలు ఇస్తామంటున్నారు. వైఎస్సాఆర్ ఆసరా ద్వారా డ్వాక్రా రుణాల మొత్తం మహిళ చేతికే ఇస్తామని, వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందని, సున్నా వడ్డీలకే రుణాలు ఇప్పిస్తామని జగన్ చెబుతున్నారు. అలా చేస్తే మా బతుకులు మారతాయని నమ్ముతున్నాం. రుణ మాఫీ కాక.. అప్పుచేసి బాకీ తీర్చాం నా పేరు పెదశింగు రామలక్ష్మి. మాది పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం, పీచుపాలెం ప్రాంతం. నేను మత్స్యకార మహిళను. భర్త కోటేశ్వరరావు, పెయింటింగ్ పనిచేస్తాడు. నాకు ఇద్దరు పిల్లలు. 1999 నుంచి సంగీత పేరుతో ఏర్పడిన డ్వాక్రా గ్రూపులో సభ్యురాలిగా ఉన్నా. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని 2014 ఎన్నికలకు ముందు నమ్మిస్తే.. రుణాలు కట్టలేదు. దాంతో ఆ రుణాలకు వడ్డీలు రూ.12వేలుపైనే కట్టాం. 2014 ఎన్నికల నాటికి మా గ్రూపునకు రూ.4.80లక్షలు అప్పు ఉంది. అధికారంలోకి వస్తే మొత్తం రుణమాఫీ చేస్తామంటే.. అప్పుకట్టలేదు. 2016 నాటికి వడ్డీ రూ 1.20లక్షలు దాటింది. బ్యాంకువారు నోటీసులు పంపితే అప్పులు చేసి బాకీలు తీర్చాం. మా గ్రూపులో ఒక్కొక్కరూ రూ.12వేలు పైనే వడ్డీకట్టారు. మేం కట్టిన వడ్డీలు అన్నీ కలుపుకుంటే రూ.20వేలు వరకూ లెక్క వస్తుంది. మాకు పసుపు కుంకుమ అని మొన్న రూ.10వేలు చెక్కులు ఇచ్చారు. ఇందులో ఒక చెక్కు మారింది. ఇక మాకు పసుపు కుంకుమ ఎక్కడ ఇచ్చినట్టు? ఇప్పుడిస్తున్న రూ.10వేలు పసుపు కుంకుమ డబ్బు మేం కట్టిందే. మా డబ్బులు మాకిచ్చి.. హంగామా చేయడం ఏమిటి? మమ్మల్ని దారుణంగా మోసం చేస్తున్నారు చంద్రబాబు. పసుపు కుంకుమ పేరుతో అప్పా? మా డ్వాక్రా గ్రూపు బ్యాంకు నుంచి రూ.2లక్షలు రుణం తీసుకొని పొదుపు చేసుకుంటూ... ఆర్ధిక పరిపుష్టి సాధించాం. 2014 ఎన్నికల్లో చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెబితే.. రుణం చెల్లించలేదు. కాని చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు. దాంతో బ్యాంకు నుంచి తీసుకున్న రుణానికి వడ్డీ పెరిగిపోయింది. చేసేదేమీ లేక వన్టైం సెటిల్మెంట్ కింద బ్యాంకుకు రుణం చెల్లించాం. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు రుణ మాఫీ చేయకుండా... పసుపు కుంకుమ పేరుతో మా దగ్గర నుంచి తీసుకున్న వడ్డీ డబ్బులే మాకు ఇవ్వడం ఏమిటి? చంద్రబాబు మాఫీ చేయకపోవడంతో వడ్డీలు పెరిగి అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితిలో అప్పో,సప్పో చేసి బ్యాంకులకు రుణాలు కట్టాం. పసుపు కుంకుమ పేరిట చంద్రబాబు మోసం చేస్తున్నారు. – బాబు తీరుపై మండిపడుతున్న గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెంకు చెందిన డ్వాక్రా గ్రూపు సభ్యులు శాంతారా, ఎస్కే జాన్బీ, రమీజా, మోతి, అషిరిన్ -
ఏడాది గడచినా ఏ సాయమూ లేదు
వ్యవసాయాన్ని నమ్ముకొని జీవించే రైతు కురువ నారాయణ పంటలు పండక అప్పులపాలయ్యాడు. చంద్రబాబు హామీ ప్రకారం పూర్తిగా రుణ మాఫీ జరగలేదు. పేరుకుపోయిన అప్పుల భయంతో సొంత పొలంలోనే 2018 జనవరి 2న పురుగుల మందు తాగి ప్రాణం తీసుకున్నాడు. ఆయన స్వగ్రామం కర్నూలు జిల్లా డోన్ రూరల్ మండల పరిధిలోని తాడూరు. నారాయణ ఆత్మహత్య చేసుకొని ఏడాది గడచినా ప్రభుత్వం నుంచి అతని కుటుంబానికి ఎక్స్గ్రేషియా అందలేదు.నారాయణకు భార్య లక్ష్మీదేవితో పాటు కుమారుడు మల్లికార్జున, కుమార్తె సుజాతమ్మ ఉన్నారు. అయితే, నారాయణ భార్య ఐదేళ్ల క్రితం అనారోగ్యం వల్ల చనిపోగా, కూతురు కుటుంబ కలహాల వల్ల అల్లుడి చేతిలో హతమైంది. కుమారుడు మల్లికార్జునకు పెళ్లయింది. వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. నారాయణకు రెండు ఎకరాల భూమి ఉంది. దీనికి తోడు మరో నాలుగెకరాలు గుత్తకు తీసుకొని కంది, వేరుశనగ పంటలను వేసేవారు. పంటనే నమ్ముకున్న ఆయన తీవ్రంగా నష్టపోయారు. కొన్ని సీజన్లుగా పంటలు సరిగ్గా పండకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. ఆంధ్రా బ్యాంకులో రూ. లక్ష పంట రుణంతో పాటు బయటి వ్యక్తుల దగ్గర మరో రూ.4.80 లక్షలు అప్పులు మిగిలాయి. తొలి విడతలో రూ. 36 వేల వరకు మాత్రమే రుణ మాఫీ జరిగింది. పంటలు సరిగ్గా పండక, ప్రభుత్వం పట్టించుకోక, అప్పులు తీర్చే మార్గం లేక నారాయణ తీవ్ర మనస్తాపం చెందారు. పంట పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత గ్రామానికి వచ్చి విచారణ చేసిన ఆర్డీఓ ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటామని కుటుంబానికి హామీ ఇచ్చారు. అయినా, నేటి వరకు నయాపైసా సహాయం అందలేదని, దిక్కుతోచడం లేదని నారాయణ కుమారుడు మల్లికార్జున ఆవేదన చెందుతున్నారు. రామాంజినేయులు, సాక్షి, డోన్ రూరల్, కర్నూలు జిల్లా. -
రైతులు, యువత ఫ్రంట్ఫుట్ ఆడాలి
జైపూర్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్రికెట్ పరిభాషను రాజకీయాలకు అనువర్తింపజేశారు. ‘రైతులు, యువత ఏ మాత్రం భయం లేకుండా ఫ్రంట్ఫుట్ బ్యాటింగ్ చేయాలి’ అని అన్నారు. ‘మనం ఆడితే ఫ్రంట్ఫుట్ ఆడతాం, సిక్స్’ కొడతాం అని పేర్కొన్నారు. ఆయన బుధవారం రాజస్తాన్లో ప్రసంగిస్తూ ‘దేశంలోని రైతులు, యువత ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. పిచ్పై ఫ్రంట్ఫుట్ వచ్చి ఆడాలి. ఐదేళ్లుగా ప్రధాని మోదీ బ్యాక్ఫుట్ వేసి ఆడుతున్నారు’ అని పేర్కొన్నారు. గత నాలుగున్నరేళ్లలో మోదీ ప్రభుత్వం రైతు రుణాలను మాఫీ చేయలేక పోయిందన్నారు. ‘రైతులకు సాయం చేస్తాననీ, యువతకు ఉద్యోగాలిస్తాననీ మోదీ మాట ఇస్తారు. కానీ ఆయనెప్పడు బ్యాక్ఫుటే ఆడతారు (వెనకడుగు వేస్తారు)’ అని రాహుల్ అన్నారు. -
రాజస్తాన్లో రూ.18వేలకోట్ల రుణమాఫీ
జైపూర్: సహకార బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న స్వల్పకాలిక రుణాలను మాఫీ చేస్తున్నట్లు రాజస్తాన్ నూతన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ బుధవారం ప్రకటించారు. సీఎంగా ప్రమాణం చేశాక తొలిసారిగా కార్యాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో చర్చల తర్వాత గెహ్లోత్ మీడియాతో మాట్లాడారు. ఇతర బ్యాంకుల్లో తీసుకున్న రూ.2లక్షల లోపు రుణాలనూ మాఫీ చేయనున్నారు. దీంతో రాజస్తాన్లో మొత్తంగా రూ.18,000 కోట్ల మేర రైతు రుణాలు మాఫీకానున్నాయి. నవంబర్ 30లోపు తీసుకున్న రుణాలనే మాఫీ చేస్తారు. -
మూడేళ్లయినా ఎక్స్గ్రేషియాకు దిక్కులేదు
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలోని అయ్యపురాజుపాలెం గ్రామానికి చెందిన యువ కౌలు రైతు అప్పుల బాధ తాళలేక గంగవరపు హరిబాబు (30) 2015 జూలై 12న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గంగవరపు నర్సింగరావు ఇద్దరి కుమారుల్లో పెద్ద కుమారుడు హరిబాబు కుటుంబ భారాన్ని తనపై వేసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఉన్న నాలుగు ఎకరాలు భూమితోపాటూ మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకొని, 10 ఎకరాల్లో పొగాకు, రెండెకరాలలో కంది సాగు చేశాడు. రూ. 5 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాడు. పొగాకుకు రూ. లక్ష రుణం పొందాడు, బంగారం తాకట్టు పెట్టి రూ.45 అప్పు తెచ్చాడు. మరో రూ. 4 లక్షలు నెలకు వందకు రూ. రెండు వడ్డీకి ప్రైవేటుగా అప్పుతెచ్చాడు. పరిస్ధితి అనుకూలించకపోవటంతో 25 క్వింటాళ్ల పొగాకు మాత్రమే దిగుబడి వచ్చింది. గిట్టుబాటు ధర రాక చివరికి రూ. మూడున్నర లక్షల అప్పు మిగిలింది. అప్పులిచ్చిన వారి ఒత్తిళ్లకు తట్టుకోలేక మనస్తాపం చెందిన హరిబాబు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. హరిబాబు కుటుంబానికి ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఎక్స్గ్రేషియా అందలేదు. రుణ మాఫీ కాలేదు.. రుణమాఫీ కోసం అధికారుల వద్దకు 20 సార్లు తిరిగాం. సమాధానం చెప్పేవారే కరువయ్యారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్నాం. మాకు న్యాయం జరగలేదు. అధికారులు పట్టించుకోలేదు. రూ.120తో పార్టీ సభ్యత్వం తీసుకున్నాం. సభ్యత్వం ఉంటే సహాయ సహకారాలు అందుతాయని చెప్పారు. దీని వల్లా ఎలాంటి ఉపయోగం లేదని తేలిపోయింది. ఉపయోగం లేనçప్పుడు పార్టీ ఎందుకు? సభ్యత్వం ఎందుకు? – కిరణ్, మృతుని సోదరుడు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు పొగాకు పచ్చాకు ముఠాకు కూలి డబ్బుల బకాయిలను వడ్డీకి తెచ్చి చెల్లించాం. తెచ్చిన డబ్బుకు వడ్డీ కట్టలేక ఇంకా అప్పులపాలయ్యాం. ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సహాయం అందలేదు. – మృతుడి తండ్రి నర్శింగరావు -
రాజకీయాల్లో నైతిక విలువల్లేవు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల ప్రభుత్వమని, రాజకీయాల్లో జవాబుదారీతనం, నైతిక విలువలు నశిస్తున్నాయని జేఎన్యూ మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ అన్నారు. మంగళవారం ఇక్కడి బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో కాసేపు ముచ్చటించారు. ‘ఈ రోజు గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీల జయంతి. వీరిద్దరూ దేశంలో తమదైన ముద్ర వేశారు. రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రైల్వేమంత్రి పదవికి రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి శాస్త్రి. నేటి రాజకీయాల్లో అలాంటి నైతికతను మనం ఆశించలేకపోతున్నాం’ అని అన్నారు. రైతు రుణాల వసూలులో కఠినంగా ఉన్నవారు, డిఫాల్టర్లపై ఎందుకు కనికరం చూపుతున్నారని ప్రశ్నించారు. దాదాపు 4 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలను మాఫీ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. వాస్తవాలను వెలికి తీయాల్సిన మీడియా ఇప్పుడు కార్పొరేట్ చేతిలో బందీగా మారిందని, పాలకులు మీడియా గొంతు నొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాస్తే అడ్వర్టయిజ్మెంట్లు నిలిపివేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను నీరుగారుస్తోందని, బీఎస్ఎన్ఎల్ను కాదని జియోకు ప్రచారం కల్పించడం వెనక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. సమానత్వంతోనే అవినీతి అంతం సమాజంలో సమానత్వం వచ్చినప్పుడే అవినీతి నశి స్తుందని కన్నయ్య చెప్పారు. అవినీతిని రూపుమాపేందుకు సమాజంలోని అన్ని వర్గాలు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరముందన్నారు. కేంద్ర విధానాల్ని ఎదురించడానికి సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ ఒక్కటవ్వడాన్ని ఆయన సమర్థించారు. నీల్, లాల్ కలసి పోరాడాలి నీల్– లాల్ కలిసి పోరాడటాన్ని కన్నయ్య సమర్థిం చారు. మహారాష్ట్రలో పారిశుద్ధ్య కార్మికుల కోసం తాను– జిగ్నేశ్ మేవానీ కలసి పోరాడటాన్ని ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. దేశంలోని 90 శాతం సహజ వనరులను కేవలం 2 కంపెనీలు దోచుకుం టున్నాయని ఆరోపించారు. అన్యాయాన్ని ఎదురించి న వారిపై దేశద్రోహులు, నక్సలైట్లు, ఉగ్రవాదులు, పాకిస్తాన్ అనుకూలురు అంటూ ముద్రవేస్తున్నారని ఆరోపించారు. తనపై పెట్టిన దేశభక్తి కేసు కూడా అలాంటిదేనన్నారు. ఆ కేసులో ఇప్పటివరకూ ఎలాం టి చార్జిషీటు దాఖలు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. గుర్తుతెలియని వ్యక్తులపై దేశద్రోహం పెట్టిన తొలి కేసుగా ఇది చరిత్రలో నిలిచిపోతుంద న్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్టు లు దేవులపల్లి అమర్, శ్రీనివాసరెడ్డి, విరాహత్ అలీ తెలంగాణలో ఇటీవలి కాలంలో మరణించిన 220 మంది జర్నలిస్టులకు న్యాయం చేకూరేలా సాగుతు న్న పోరాటంలో మద్దతివాలని కన్నయ్యను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. -
‘బద్ధవ్యతిరేకులతో స్నేహమా?’
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ద్రోహి అయిన టీడీపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడాన్ని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతి నిధి వేణుగోపాల చారి తప్పుబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు వ్యతిరేకంగా కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్న టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే యావత్తు తెలంగాణ జాతి క్షమించదన్నారు. నాలుగేళ్లుగా ఎన్నికలకు పోదామంటూ సవాళ్లు విసిరిన కాంగ్రెస్, టీజేఎస్, బీజేపీలు ఇప్పుడు ఓటర్ల జాబితా తప్పులతడక అంటూ ఎందుకు వెనకాడుతున్నాయని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, సీపీఎస్ రద్దు అంటూ హామీలిస్తున్న కాంగ్రెస్, బీజేపీ ముందు ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ హామీలను అమలు చేసి చూపాలని సవాల్ విసిరారు. అధికార దాహంతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి ఉత్తరకుమారుడి ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. -
అధ్యయనం చేశాకే హామీలు
సాక్షి, హైదరాబాద్: తాము అసాధ్యపు హామీలను ఇవ్వడం లేదని, అన్ని వివరాలను అధ్యయనం చేసిన తర్వాతే ఎన్నికల హామీలు ఇస్తున్నామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ చెపుతున్నట్టు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అసాధ్యమేమీ కాదని, నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.300 కోట్లు కేటాయించడం కష్టమేమీ కాదని వ్యాఖ్యానించారు. బుధవారం గాంధీభవన్లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, సీఎల్పీ నేత జానారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి మహ్మద్సలీం, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్తో కలసి ఆయన మాట్లాడారు. నిరుద్యోగ భృతి విషయంలో సీఎం కేసీఆర్ వ్యక్తం చేసిన అనుమానాలు సరైనవి కావన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న 10 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.3వేల చొప్పున భృతి ఇవ్వడానికి కేవలం రూ.300 కోట్లు అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు నికరంగా రూ.10,500 కోట్ల ఆదాయం వస్తోందని సీఎం స్వయంగా చెప్పారని, అలాంటప్పుడు నిరుద్యోగులకు రూ.300 కోట్లు కేటాయించలేమా అని ప్రశ్నించారు. ఉపాధి కల్పన కార్యాలయాల్లో నమోదు చేసుకున్న నిరుద్యోగులకు భృతి ఇచ్చి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలకు మేం రెడీ.. ఎన్నికలు ముందస్తు జరిగినా, షెడ్యూల్ ప్రకారం జరిగినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఉత్తమ్ చెప్పారు. సెప్టెంబర్లో తాము కూడా అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. భావసారూప్య పార్టీలతో ఎన్నికల పొత్తు కుదుర్చుకునే విషయాన్ని పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. రాహుల్నుద్దేశించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చిల్లర మాటలని పీసీసీ చీఫ్ అన్నారు. కేటీఆర్ రాజకీయ అవగాహన లేని చిన్న పిల్లాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్లు దిగజారి మాట్లాడుతున్నారని, సూర్యుని మీద ఉమ్మి వేస్తే వారి మీదే పడుతుందన్న విషయాన్ని వారు గ్రహించాలని హితవు పలికారు. టీఆర్ఎస్ కంటే భారీ సభ... అనంతరం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. తాము అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించాకే ప్రజలకు హామీలిస్తున్నామని ఉత్తమ్ చెప్పారు. సెప్టెంబర్లో టీఆర్ఎస్ నిర్వహించే సభ కన్నా భారీ సభను తామూ నిర్వహిస్తామన్నారు. త్వరలో బస్సుయాత్ర ప్రారంభిస్తామని, సెప్టెంబర్లో కూడా రాహుల్ రాష్ట్రానికి వస్తారని చెప్పారు. అభ్యర్థుల ప్రకటన కోసం త్వరలోనే ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు వేస్తామన్నారు. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాల పట్ల రాహుల్ చాలా సంతృప్తిగా ఉన్నారని, ఈ విషయా న్ని ఆయనే స్వయంగా చెప్పారని వెల్లడించారు. రాహుల్ టూర్ సక్సెస్ రాహుల్గాంధీ రెండు రోజుల రాష్ట్ర పర్యటన అద్భుతంగా సాగిందని, ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. సరూర్నగర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభకు ఊహించిన దాని కన్నా ఎక్కు వ మంది వచ్చారని, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ముఖ్యంగా విద్యార్థులు, యువతలో ఉన్న ఆగ్రహానికి ప్రతీకగా ఈ సభ నిలుస్తుందని చెప్పారు. రాహుల్ టూర్తో కేసీఆర్కు దడ పుట్టిందని, అందుకే మహిళా సంఘాలకు ఉన్న బకాయిల్లో రూ.960 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చారని తెలిపారు. మహిళా సంఘాలకు ఇచ్చిన ప్రతి హామీకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. పోలింగ్ బూత్ స్థాయిలోని కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ పట్ల రాహుల్ సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. సెటిలర్లకు ఇచ్చిన హామీలను కూడా చిత్తశుద్ధితో నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. -
నేతన్నకు రుణమాఫీ
సాక్షి, వరంగల్ రూరల్ : చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రూ.లక్షలోపు వ్యక్తిగత రుణాలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ త్వరలో నెరవేరనుంది. ఆ హామీని అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. జిల్లా స్థాయిలో లబ్ధిదారుల గుర్తిం పుతోపాటు రుణమాఫీ అమలు చేస్తే వర్తించే బ్యాంకులు, లబ్ధిదారుల స్టేటస్ తదితర సమగ్ర వివరాలతో జిల్లా కమిటీ నివేదికలు రూపొందించింది. ఈ నివేదికను కలెక్టర్ ఆమోదంతో చేనేత జౌళిశాఖ రాష్ట్ర శాఖకు నివేదికను అందించారు. రుణమాఫీ చేస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2,167 మంది చేనేత కార్మికులకు రూ.7.27 కోట్ల లబ్ధి చేకూరనుంది. రెండు విధాలుగా రుణ మాఫీ.. 1 ఏప్రిల్, 2010 నుంచి 31 మార్చి 2017 వరకు చేనేత కార్మికులు పొందిన రుణాల్లో లక్ష రూపాయల్లోపు రుణాలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మూల రుణ మొత్తాన్ని చేనేత జౌళి శాఖ భరిస్తే, వడ్డీ మొత్తాన్ని బ్యాంకులు భరిస్తాయి. ఈ మేరకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కాల పరిమితిలో రుణం పొంది అప్పులు తిరిగి చెల్లించిన వారికి రూ.లక్ష రీయింబర్స్మెంట్ చేయనున్నారు. ఈ పథకం కింద బ్యాంకుల్లో రుణాలు పొందిన చేనేత కార్మికులకు రూ.లక్ష ప్రయోజనం కలుగుతుండడం గమనార్హం. జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులతో రుణాలు పొందిన వారికి ఈ పథకం వర్తిస్తుంది. లబ్ధిదారుల ఖరారు.. ఈ పథకం అమలు కమిటీకి చైర్మన్గా కలెక్టర్, సభ్యులుగా లీడ్ బ్యాంక్ మేనేజర్, చేనేత జౌళి శాఖ అధికారి, నాబార్డ్ ఏజీఎం, డీసీసీబీ సీఈఓ, పరిశ్రమల శాఖ జీఎం, జిల్లా సహకార శాఖ ఆడిట్ అధికారి వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీ జిల్లాలోని జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకుల నుంచి చేనేత రుణాలు పొందిన వారి వివరాలు సేకరించి ఇటీవల నేతన్నకు రుణమాఫీఆయా జిల్లాల స్థాయిలో సమావేశాలు నిర్వహించి లబ్ధిదారుల గుర్తించారు. అన్ని జిల్లాల నుంచి నివేదికలు వచ్చిన తర్వాత ఈ నెల 30న రాష్ట్ర స్థాయిలో సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేసే ప్రక్రియ మొదలవుతుంది. ప్రభుత్వానికి నివేదికలు పంపాం చేనేత కార్మికుల రుణమాఫీకి సంబంధించిన వివరాలతో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించాం. త్వరలో రాష్ట్ర స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకుని అమలు చేయనున్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు ఈ రుణమాఫీ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. లక్ష రూపాయలలోపు రుణాలు తీసుకున్న వారందరివి ప్రభుత్వం రుణమాఫీ చేసేందుకు త్వరలో నిర్ణయం తీసుకోనుంది. –రమేష్, చేనేత జౌళి శాఖ ఏడీ, వరంగల్ రూరల్ -
అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ
శంకరపట్నం(మానకొండూర్) : తెలంగాణలో మేం అధికారంలోకి వస్తే రైతులకు రూ.2లక్షల రుణ మాఫీ చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్రెడ్డి అన్నారు. శంకరపట్నం మండలం కేశవపట్నం వ్యవసాయ సబ్ మార్కెట్లో ఆదివారం బీజేపీ బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. మార్కెట్ ఆవరణలో నిర్వహించే సభాప్రాంగణాన్ని పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం పేదల ఒ క్కో ఇంటి నిర్మాణం కోసం రూ.1,55,000 రాష్ట్రానికి అందిస్తే.. ఒక్క డబుల్ బెడ్రూం నిర్మించలేదని ఆరోపించారు. వేల కోట్ల నిధులను తెలం గాణ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్నారు. ఫసల్బీమా రాష్ట్ర ప్రభుత్వం వైఖరితో ఎక్కువ సంఖ్యలో చేయలేదని మండిపడ్డారు, తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఈనెల 4న శంకరపట్నం మండలకేంద్రంలో నిర్వహించే బహిరంగ సభలో ఎండగడతామన్నా రు. సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, శాననసభాపక్ష నేత కిషన్రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ, సీనియర్ నాయకులు హాజరవుతారని చెప్పారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు అలివేలి సమ్మిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఇనకొండ నాగేశ్వర్రెడ్డి, గణపతి, ఉపాధ్యక్షుడు గుర్రాల వెంకటరెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ చదువు రాజేందర్రెడ్డి, కార్యదర్శి వెంకట్రెడ్డి, నాయకులు సూదగోని శ్రీనివాస్, కోరెం శ్రీనివాస్రెడ్డి, దండు కొంరయ్య, పుట్టపాక సమ్మయ్య, చల్ల ఐలయ్య, నరేందర్, జైపాల్, భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. -
రైతుల సంక్షేమానికి పెద్దపీట
సాక్షి, బెంగళూరు: కర్ణాటక విధానసభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో అక్కడి రైతులు, విద్యార్థులు, పేద మహిళలపై బీజేపీ హామీల వర్షం కురిపించింది. జాతీయ, సహకార బ్యాంకుల్లో లక్ష వరకు పంట రుణమాఫీ, సాగు నీటి ప్రాజెక్టులకు లక్షల కోట్ల వ్యయం, విద్యార్థులకు ఫ్రీ ల్యాప్టాప్లు, పేద మహిళలకు ఉచిత స్మార్ట్ఫోన్లు వంటి హామీలతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. రూ. 5 వేల కోట్లతో ‘రైతు బంధు మార్కెట్ మధ్యంతర నిధి’ని ఏర్పాటు చేసి పంట ధరల్లో వ్యత్యాసాలు వచ్చినప్పుడు ఆ ప్రభావం రైతులపై పడకుండా చూస్తామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప చెప్పారు. వ్యవసాయంలో అత్యుత్తమ పద్ధతులను అధ్యయనం చేసేందుకు రైతులను ఇజ్రాయెల్, చైనా వంటి దేశాలకు పంపిస్తామన్నారు. వ్యవసాయ బోర్లకు 10 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ మేనిఫెస్టోలోని ఇతర హామీలు ► దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు చెందిన యువతుల పెళ్లి సమయంలో ప్రభుత్వ కానుకగా ‘వివాహ మంగళ’ పథకం కింద రూ.25 వేల నగదు, 3 గ్రాముల బంగారం. ► బీపీఎల్ కుటుంబాల్లోని మహిళల కోసం ‘స్త్రీ సువిధ’ పథకం కింద ఒక్క రూపాయికే శానిటరీ న్యాప్కిన్ ► పేదలకు అందుబాటు ధరల్లో ఆహారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 300 ‘ముఖ్య మంత్రి అన్నపూర్ణ క్యాంటీన్ల’ ఏర్పాటు ► లోకాయుక్తను కాంగ్రెస్ అవినీతి నిరోధక విభాగంలో ఉపవిభాగం చేయగా, దానికి మళ్లీ పూర్వస్థితి కల్పిస్తామని హామీ. ► అవినీతిపై ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు సీఎం కార్యాలయంలోనే హెల్ప్లైన్. ► అవినీతిని బయటపెట్టే సామాజిక కార్యక ర్తలకు రక్షణ కల్పించేలా కొత్త చట్టం. ► కళాశాలల్లో చేరే ప్రతి విద్యార్థికీ ‘ముఖ్యమంత్రి ల్యాప్టాప్ యోజనే’ కింద ఉచిత ల్యాప్టాప్. ► ‘ముఖ్యమంత్రి స్మార్ట్ఫోన్ యోజనే’ కింద పేద మహిళలకు ఉచిత స్మార్ట్ఫోన్. ► ఉద్యాన నగరి బెంగళూరును చెత్త రహిత నగరంగా మారుస్తామని హామీ. ► ఆవుల సంరక్షణ కోసం గతంలో బీజేపీ తీసుకురాగా కాంగ్రెస్ రద్దు చేసిన ‘గౌ సేవా ఆయోగ్’ పునరుద్ధరణ. -
ఆ రైతులకు రుణమాఫీ ఏమైంది: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పంట రుణాలను రీషెడ్యూల్ చేయించుకున్న రైతులకు రుణమాఫీ అమలు కాలేదని బీజేపీ శాసన సభాపక్ష నేత జి.కిషన్రెడ్డి అన్నారు. తీవ్రమైన కరువు ప్రకటించిన కారణంగా రైతులు రుణాలను రీషెడ్యూల్ చేయించుకున్నారని, అయితే వారికి రుణమాఫీ జరగలేదని వెల్లడించారు. రుణమాఫీ నోటీసులు వచ్చిన వారికి కూడా ఇప్పటికీ రుణమాఫీ జరగలేదని అన్నారు. రైతులు తీసుకున్న రుణాలకు వడ్డీకి చక్రవడ్డీ కలిపి లక్షా యాబై వేలు కూడా దాటిందని చెప్పారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
త్వరలో చేనేత రుణ మాఫీ
సాక్షి, హైదరాబాద్: చేనేత కార్మికుల రుణ మాఫీ ప్రక్రియను సత్వరమే చేపట్టాలని రాష్ట్ర పరిశ్రమలు, చేనేత శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. చేనేత కార్మికుల రుణ మాఫీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.10.5 కోట్ల నిధులు విడుదల చేసిందని, 2,500 మంది కార్మికులు రుణ మాఫీ ద్వారా లబ్ధిపొందనున్నారని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీమేరకు ప్రతి కార్మికుడు రూ.లక్ష వరకు రుణ మాఫీకి అర్హుడని వెల్లడించారు. చేనేత, జౌళి శాఖ పథకాలు, కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రుణమాఫీకి అర్హులైన చేనేత కార్మికుల జాబితా రూపకల్పన సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. చేనేతతోపాటు పవర్లూం కార్మికులకు ఉమ్మడిగా రుణాలు మాఫీ చేసే కార్యక్రమాన్ని తొలిసారిగా రాష్ట్రంలో అమలు చేయబోతున్నామన్నారు. యార్న్, రసాయనాలు, డైల కొనుగోళ్లకోసం చేనేత కార్మికులకు రాయితీల చెల్లింపులో పురోగతిని సైతం మంత్రి సమీక్షించారు. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేశామని అధికారులు మంత్రికి తెలియజేశారు. నవంబర్ తొలివారం నుంచి ఈ రాయితీల పంపకాలను ప్రారంభించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. చేనేత, జౌళి రంగానికి ప్రకటించిన రాయితీలు నేరుగా కార్మికులకు అందాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకుంటున్నారని మంత్రి తెలిపారు. చేనేత కార్మికులకు 40 శాతం, పవర్లూం కార్మికులకు 10 శాతం వరకు రాయితీలను పెంచామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు త్వరలో రాష్ట్రంలో చేనేత కార్పొరేషన్, పవర్ లూం కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ రెండు కార్పొరేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, చేనేత విభాగం డైరెక్టర్ శైలజా రామయ్యర్లను ఆదేశించారు. ఈ కార్పొరేషన్లకు ప్రభుత్వం కార్పస్ ఫండ్ కేటాయిస్తుందన్నారు. గద్వాల్లో నిర్మించతలపెట్టిన చేనేత పారిశ్రామికవాడపై సైతం మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఆధునిక లూమ్ ఉత్పత్తిదారులు, పవర్లూం కార్మికులతో సిరిసిల్లలో నవంబర్ 18న మెగా పవర్లూం అప్గ్రెడేషన్ క్యాంప్ను నిర్వహిస్తున్నామన్నారు. మార్చి 2018లోగా లూమ్ అప్గ్రెడేషన్ పూర్తి కానుందని తెలిపారు. -
రుణమాఫీతో రైతులకు ఒరిగింది శూన్యం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రైతులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల రుణాలను ఒకే దఫాలో మాఫీ చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నాలుగు విడతలుగా చేసిన రుణమాఫీతో రైతులకు ఒరిగిందేమీ లేదని అన్నారు. బుధవారం గాంధీభవన్లో జరిగిన కిసాన్ ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న అనంతరం పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, కిసాన్ సెల్ చైర్మన్ కోదండరెడ్డి, ఎస్సీ సెల్ చైర్మన్ ఆరేపల్లి మోహన్తో కలసి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరికి రూ.2 వేలకు తగ్గకుండా మద్దతు ధర ఇస్తామని, మొక్క జొన్నకు కేంద్రం ఇచ్చే ధరకు అదనంగా రూ.2 వేలకు తగ్గకుండా, పత్తికి రూ.5 వేలకు తగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పంటల బీమా ప్రీమియంను ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతు రుణమాఫీ వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తాను చెప్పిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేకపోయారో చెప్పాలని నిలదీశారు. అసెంబ్లీలో సీఎం ఇచ్చిన వాగ్దానాలకే దిక్కులేకుండా పోయిం దని, టీఆర్ఎస్ కార్యకర్తలకు ట్రాక్టర్లు ఇవ్వ డమే ‘వ్యవసాయ యాంత్రీకరణ’అని ఎద్దేవా చేశారు. ప్రకృతి వైపరీత్యాలకు ఒక్క పైసా నష్ట పరిహారం ఇవ్వని ఘనత కేసీఆర్ ప్రభుత్వాని దేనని ధ్వజమెత్తారు. ఎంత పంట నష్టం జరిగిందో అంచనా వేయలేని దుస్థితిలో ప్రభుత్వముందని మండిపడ్డారు. అకాల వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులకు రూ.25 వేలు, వరి రైతులకు రూ.15 వేల నష్ట పరి హారం చెల్లించాలని కోరారు. రైతు ఆత్మహత్య లకు గత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమనడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణలో 3 వేల 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని కూడా సీఎం కేసీఆర్ పరామర్శించలేదని విమర్శించారు. రైతుల పట్ల కేసీఆర్ సర్కార్ అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 27న చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. చలో అసెంబ్లీపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న మంత్రి హరీశ్రావు సీఎం హామీలను ఎందుకు నెరవేర్చడం లేదో చెప్పాలన్నారు. -
రుణమాఫీకి రూ.19.22 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: చివరి విడత రుణమాఫీకి విడుదల చేసిన నిధులు సరిపోకపోవడంతో మరో రూ. 19.22 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడో విడత రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం రూ. 4,025 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా, రూ. 4 వేల కోట్లే విడుదల చేసింది. ఈ సొమ్ము సరిపోదని జిల్లా వ్యవసాయాధికారులు విన్నవించడంతో ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది. ఈ మేరకు పరిపాలనా అనుమతినిస్తూ వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు. -
రుణమాఫీ చేయాలని ఆందోళన
► అర్ధనగ్నంగా రైతుల నిరసన టీనగర్: తమ డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని కోరుతూ చెన్నైలో రైతులు శుక్రవారం ఆందోళన జరిపారు. రాష్ట్రంలో కరువు నెలకొన్నందున రైతుల రుణాలను మాఫీ చేయాలని తదితర డిమాండ్లతో జాతీయ దక్షిణాది నదుల అనుసంధానం రైతుల సంఘం సమన్వయకర్త అయ్యాకన్ను ఇదివరకే ఢిల్లీలో ఆందోళన జరిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలో రెండో విడతగా నిరవధిక ఆందోళన శుక్రవారం ప్రారంభించారు. చేపాక్కం అతిథిగృహం సమీపంలో జరిపిన ఆందోళనలో రైతులు కట్ డ్రాయర్లు, కౌపీనాలు ధరించి అర్ధనగ్నంగా పాల్గొన్నారు. అయ్యాకన్ను మాట్లాడుతూ రైతుల రుణాలు మాఫీ చేయాలని కోరుతూ అనేక దఫాలుగా ధర్నాలు జరుపుతున్నామని, కోర్టు ఉత్తర్వులిచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం రైతుల రుణాలు మాఫీ చేయలేదని తెలిపారు. ప్రభుత్వం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాలని డిమాండ్ చేశా రు. 60 ఏళ్లు దాటిన రైతులకు పింఛన్ అందజేయాలని పదే పదే కోరుతున్నామని, దీనికి ఇంతవరకు సరైన సమాధానం లభించలేదని వాపోయారు. జాతీయ బ్యాంకుల్లో తీసుకున్న రుణా ల కోసం నగలను వేలం వేసేందుకు బ్యాంకులు చర్యలు తీసుకుంటున్నాయని, ఈ వేలాన్ని ప్రభుత్వం అడ్డుకునేందుకు ముందుకు రావాలని కోరారు. చెరుకు రైతులకు అందజేయాల్సిన బకాయిలను ఇంకా చెల్లించలేదని, వెంటనే చెల్లించే ఏర్పాట్లు చేయాలని కోరారు. తమ డిమాండ్లు పరిష్కారం కానందున మళ్లీ ఆందోళనకు దిగామని, 32 జిల్లాల రైతులు ఆందోళనలో పాల్గొన్నట్లు తెలిపారు. జూలై నెల 10 తేదీ వరకు 32 రోజులపాటు నిరవధికంగా ఆందోళన జరిపేందుకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇందులో అనేక రాజకీయ పార్టీల నిర్వాహకులు పాల్గొని రైతులకు మద్దతుగా ప్రసంగించి వెళ్లారు. -
‘మాఫీ’పై మళ్లీ ఆశలు
♦ అర్హులైన రైతులకు అందే అవకాశం ♦ ప్రభుత్వానికి ప్రతిపాదించిన వ్యవసాయ శాఖ ♦ రైతులు 20,848.. మాఫీ కావాల్సింది రూ.107.98కోట్లు అర్హత ఉన్నా రుణమాఫీ కాని పరిస్థితి.. అధికారుల నిర్లక్ష్యమో.. ప్రభుత్వ తప్పిదమో.. అటువంటి రైతులకు న్యాయం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది.. అర్హత కలిగిన రైతుల జాబితాను రూపొందించింది.. ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లింది.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 20,848 మంది రుణమాఫీకి నోచుకోని రైతులు ఉండగా.. వీరికి రూ.107.98కోట్లు రుణమాఫీ కావాల్సి ఉంది. ప్రభుత్వం ప్రకటించిన నాలుగు విడతల రుణమాఫీ ప్రక్రియ ఈ ఏడాదితో పూర్తికాగా.. అర్హులై ఉండి.. రుణమాఫీ పొందని రైతుల విషయం మళ్లీ తెరపైకి రావడంతో వారిలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. – ఖమ్మంవ్యవసాయం ఖమ్మంవ్యవసాయ: రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ జాబితా తయారీ బాధ్యతను వ్యవసాయ, రెవెన్యూ, బ్యాంకర్లకు అప్పగించింది. ఆయా శాఖలు రూపొందించిన జాబితా ఆధారంగా ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను చేపట్టింది. ఇందులో ప్రభుత్వ శాఖలు తగిన జాబితా రూపొందించకపోవటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేలాది మంది రైతులు రుణమాఫీకి నోచుకోలేదు. రెండు జిల్లాలకు రుణమాఫీ నిధులు రూ.1711కోట్లు అవసరం ఉంటాయని ప్రాథమికంగా గుర్తించిన జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. దీని ఆధారంగా రెండు జిల్లాల్లోని 3.80 లక్షల మంది రైతులకు తొలి విడతలో రూ.427.80కోట్లు విడుదల చేసింది. ఆ తర్వాత వివిధ స్థాయిల్లో జాబితాలను వడబోసి.. నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. ఇందులో 3.59 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించారు. వీరికి మొత్తం రూ.1637కోట్లు అవసరం ఉంటాయని పేర్కొంటూ ప్రభుత్వానికి జిల్లా అధికార యంత్రాంగం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా తొలి విడతలో రెండు జిల్లాలకు రూ.409కోట్లు సరిపోతాయి. అయితే ప్రభుత్వం తొలి విడత కోసం రూ.427.80కోట్లు పంపింది. అయితే ఆ నిధులు అదనంగా ఉండటంతో వాటిని వెనకకు పంపించాలని ఆదేశించింది. దీంతో ఉమ్మడి జిల్లా నుంచి రూ.18కోట్లను వెనకకు పంపారు. ఈ క్రమంలో రూపొందించిన జాబితాలో అర్హత ఉన్న రైతులు రుణమాఫీకి నోచుకోకపోవటంతో రెవెన్యూ, బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరిగారు. మండలస్థాయిలో సమస్య పరిష్కారం కాకపోవటంతో ఆందోళనలు చేశారు. జిల్లా వ్యవసాయ శాఖ, కలెక్టర్, నోడల్, లీడ్ బ్యాంక్ చుట్టూ కూడా రైతులు తిరిగారు. అయితే సమస్యను గుర్తించిన జిల్లా అధికార యంత్రాంగం అర్హత ఉండి.. రుణమాఫీకి నోచుకోని రైతుల జాబితా తయారు చేసింది. ఇందులో ఉన్న రైతులు తమకు రుణమాఫీ వర్తిస్తుందని నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. అర్హులని అప్పుడే గుర్తింపు.. రెండు జిల్లాల్లో మరో 20,848 మంది రైతులు రుణమాఫీకి అర్హులని ప్రభుత్వ శాఖలు అప్పుడే గుర్తించాయి. వీరికి సంబంధించి రూ.107.98కోట్లు విడుదల చేయాలని కలెక్టర్ లోకేష్కుమార్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీని ప్రకారం వివిధ బ్యాంకుల నుంచి భూముల పహాణీలను తాకట్టు పెట్టి.. పంట రుణాలు తీసుకున్న రైతులు(మిస్సైన వారు) 17,642 మంది వివిధ బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందారు. వీరికి సంబంధించి రూ.84.43కోట్ల రుణాలు మాఫీలో చేర్చాల్సి ఉందని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. అంతేకాక అర్బన్ బ్యాంకుల్లో తీసుకున్న గోల్డ్ లోన్ల వ్యవహారం కూడా ఉంది. రెండు జిల్లాల్లో 3,206 మంది రైతులు తమ పంట భూముల ఆధారంగా బంగారాన్ని అర్బన్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. వీటిని కూడా తొలుత రుణమాఫీలో చేర్చలేదు. ఆయా రైతులకు చెందిన రూ.23.55కోట్లు రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో చేర్చాలి. మొత్తంగా 20,848 మంది రైతులను అర్హులుగా గుర్తించి, వారికి సంబంధించి రూ.107.98కోట్లు విడుదల చేయాలని కలెక్టర్ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా 15వేల మంది రుణమాఫీకి అర్హత కలిగిన రైతులు ఉన్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ గుర్తించి, వీరికి సంబంధించి రూ.140కోట్ల మంజూరుకు ప్రతిపాదించిందనే సమాచారం ఉంది. దీంతో రెండు జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ దక్కుతుందా? వీరిలో కూడా కొందరికే దక్కుతుందా? అనేది బాధిత రైతుల్లో చర్చనీయాంశంగా ఉంది. -
రుణమాఫీతో అంత ప్రమాదమా?
విశ్లేషణ దేశీయ పేదరైతులకు ఆర్థిక ప్రయోజనాలు కలిగించే ఏ ప్రయత్నాన్ని అయినా భారతీయ ఆర్థిక విధాన పండితులు శోకన్నాలు పెడుతూ అడ్డుకుంటారు. అదే సమయంలో పరిశ్రమలకు ప్రభుత్వం కల్పించే భారీ ప్రయోజనాల పట్ల వీరు కిమ్మనకుండా ఉంటారు. అమెరికన్ అంతర్యుద్ధం 1865లో ముగిసిపోయినప్పుడు, అమెరికా పత్తి ఉత్పత్తి పునరుద్ధరణ జరిగి భారతీయ పత్తికి డిమాండ్ పడిపోయింది. బాంబే ప్రెసిడెన్సీలో రైతులు పత్తి పండించడం తగ్గిపోయింది. రైతులకు రుణం ఇవ్వడానికి వడ్డీ వ్యాపారులు తిరస్కరించేవారు లేదా అధిక వడ్డీరేట్లను విధించేవారు. దీంతో సెటిల్మెంట్ డిమాండ్లు పెరిగిపోయాయి. దీని ఫలితంగా పుణే సమీపంలోని సుపా గ్రామంలో 1875లో దక్కన్ తిరుగుబాటు జరిగింది. దాని ప్రేరణగా దీంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఆగ్రహోదగ్రులైన రైతులు, వడ్డీవ్యాపారులపై దాడులు చేసి వారి ఇళ్లు తగులబెట్టారు. ఈ తిరుగుబాటు 30 గ్రామాలను ప్రభావితం చేసింది. గ్రామాల్లోని పోలీసు గస్తీ కేంద్రాలు త్వరలోనే రైతులను లొంగదీసుకున్నాయి కానీ గ్రామీణ ప్రాంతంలో నెలల తరబడి తిరుగుబాటు కొనసాగింది. దీంతో బాంబే ప్రెసిడెన్సీ 1878లో దక్కన్ రయట్స్ కమిషన్ని నెలకొల్పింది. ప్రభుత్వం అంచనా ప్రకారం ఆహారం కోసం, విత్తనాలు, ఎద్దులు వంటి ఇతర అవసరాలకోసం రైతులు కొద్ది మొత్తంలో తీసుకునే రుణాలు ఎప్పుడో ఒకసారి చేసే వెళ్లి ఖర్చుల కంటే ఎక్కువగా వారిని అధిక రుణగ్రస్తులను చేస్తున్నాయని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. రైతుల రుణ భారాన్ని తగ్గించాలంటే, రుణాలు చెల్లించనివారిపై నిర్బం ధాన్ని నిషేధించాలని, రుణ బకాయి వసూలు కోసం రైతుల నివాస గృహాలను అమ్మకానికి పెట్టడం నుంచి మినహాయించాలని, రుణగ్రస్తుల నుంచి భారీ మొత్తాలను లాగేందుకు న్యాయస్థానాల్లో జరుగుతున్న విచారణ ప్రక్రియలను నిలిపివేయాలని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. భారత్లో రైతు దురవస్థ ఇప్పటికీ మారలేదనిపిస్తోంది. స్వాతంత్య్రానంతర భారతదేశంలో, రైతు అనుకూల విధానాలు కొత్తవేమీ కావు. 1989లో జనతాదళ్ ప్రభుత్వం ఒక్కో రైతుకు పదివేల రూపాయల వరకు రుణాల రద్దుకు అవకాశమిస్తూ వ్యవసాయ రుణాల మాఫీ పథకం ప్రవేశపెట్టింది. 1992లో ఇది 4.4 కోట్లమంది రైతులకు 6 వేల కోట్ల మేరకు రుణ మాఫీ చేసింది. 2008లో వ్యవసాయ రుణ మాఫీ, రుణ ఉపశమన పథకం ప్రవేశపెట్టగా 5 కోట్ల 97 లక్షల మంది పెద్ద రైతులతోపాటు 3 కోట్ల 69 లక్షలమంది సన్నకారు రైతులు 71,600 కోట్ల రూపాయల మేరకు ప్రయోజనం పొందారు. రాష్ట్ర స్థాయిల్లో కూడా ఇదేవిధమైన చర్యలు చేపట్టారు. ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం సన్నకారు, చిన్నకారు రైతులకు రుణమాఫీ చేసింది. ఉత్తరప్రదేశ్లో ఈమధ్యే దిగిపోయిన ప్రభుత్వం రాష్ట్ర సహకార బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న 50 వేల కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసింది. తరువాత అవసరమైన రైతులకు మాత్రమే రుణాలను మాఫీ చేయాలని యూపీ నూతన ప్రభుత్వం నిర్ణయించడం స్వాగతించాలి. అయితే ఇది సరిపోదు. ఇలాంటి రుణమాఫీలను దేశవ్యాప్తంగా సన్నకారు, చిన్నకారు రైతులందరికీ వర్తింపచేయాల్సి ఉంది. భారత్లోని 12.1 కోట్ల వ్యవసాయ భూముల్లో 9.9 కోట్ల భూములు సన్నకారు రైతులవే అయి ఉంటున్నాయి. బహుళ పంటల విధానం ద్వారా ఇలాంటి రైతులు దేశంలో పండే కూరగాయల్లో 70 శాతం, తృణధాన్యాల్లో 52 శాతం పండిస్తున్నారు. నాణ్యమైన విత్తనాల అవసరం పెరగడంతో రైతులు విత్తన ధరల పెరుగుదల భారాన్ని మోయవలసివస్తోంది. అన్ని విత్తనాల ధరలు భారీగా పెరిగిపోయాయి. పాతకాలంలో మాదిరిగా రైతులు విత్తనాలను కులధనం లాగా తమ కుమారులకు వారసత్వంగా ఇచ్చే పరిస్థితి పోయింది. దీనికి తోడు ఎరువుల ధరలూ పెరిగాయి. వ్యవసాయ మెషినరీకి ప్రత్యామ్నాయంగా ఉండే కూలీలకయ్యే ఖర్చు కూడా తదనుగుణంగా పెరిగింది. పశువుల వాడకం ఖర్చు కూడా బాగా పెరిగింది. ఇక పురుగుమందుల ద్వారా పంట రక్షణ ఖర్చు చుక్కలనంటింది. మన రైతులు తమ పంటలకు మార్కెట్ విలువను గుర్తించడంలో విఫలమవుతున్నారు. 1972లో కలకత్తాలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ఒక కమలాపండును మార్కెట్లో వినియోగదారు కొనుగోలు చేసే ధరలో కేవలం 2 శాతం మాత్రమే దాన్ని పండించిన రైతుకు అందుతోందని తెలిసింది. పంటవిలువలో అధిక భాగాన్ని మండీలు, మార్కెట్లే మింగేస్తున్నాయి. మోదీ ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా, ఇంతవరకు దిగుమతి చేసుకుంటున్న వ్యవసాయ సామగ్రి, పరికరాలను దేశంలోనే తయారు చేయడంపై దృష్టి పెట్టింది కాబట్టి భారత వ్యవసాయ సామగ్రి విధానాన్ని కూడా పూర్తిగా మార్చవలసి ఉంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి మన వ్యవసాయ సామగ్రి, పరికరాలను ప్రామాణీకరించాల్సి ఉంది. మన వ్యవసాయ పాలసీ తెగుళ్లను, పురుగులను ఎదుర్కోవడానికి జీవ, రసాయన, యాంత్రిక, భౌతిక విధానాలను మిళితం చేయడంపై దృష్టి సారించాలి. పురుగుమందుల వాడకాన్ని తొలగిం చడం లేక గణనీయంగా తగ్గించడంపై దీర్ఘకాలిక దృష్టితో వ్యవహరించి తగు చర్యలు తీసుకోవాలి. భారతీయ ఆర్థిక విధాన పండితులు దేశీయ పేదరైతులకు ఆర్థిక ప్రయోజనాలు కలిగించే ఏ ప్రయత్నాన్నయినా శోకన్నాలు పెడుతూ అడ్డుకుంటారు. అదే పరిశ్రమలకు ప్రభుత్వం కల్పించే ప్రయోజనాల పట్ల వీరు కిమ్మనకుండా మౌనంగా ఉంటారు. వాస్తవాలను పరిశీలి ద్దాం. ఆర్బీఐ ప్రకారం 2000– 2013 కాలంలో దేశంలో లక్షకోట్ల రూపాయల విలువైన కార్పొరేట్ సంస్థల రుణాలను మాఫీ చేశారు. వీటిలో 95 శాతం రుణాలు బడా సంస్థల రుణాలే మరి. దీంతో పోలిస్తే ఎస్బీఐ ఇటీవల ట్రాక్టర్, వ్యవసాయ సామగ్రిపై రుణాలమీద 40 శాతం తగ్గింపుతో ఒక సెటిల్మెంట్ స్కీమ్ను తీసుకొచ్చింది. 25 లక్షలవరకు రుణం తీసుకున్నవారికి 6 వేల కోట్ల రూపాయల వరకు లబ్ధి చేకూరుస్తూ రుణాలను తగ్గించారు. రైతులలో రుణ చెల్లింపు సంస్కృతి లేక పోవడం వల్ల భారత్లో మొండిబకాయిలు పేరుకోవడం లేదు. మొండి బకాయిల్లో 50 శాతం వరకు మధ్య, భారీ పరిశ్రమలకు ఇచ్చినవే. పిండదశలోని రుణ చెల్లింపు సంస్కృతిని ధ్వంసం చేస్తున్నారని ఆరోపించే ముందు విమర్శకులు వ్యవసాయ రుణాల చరిత్రను గుర్తిస్తే బాగుంటుంది. దేశంలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు, ఉబ్బిన కడుపులు, అనాధ పిల్లల రూపంలో దోపిడీ పరిణామాలు నాలో చాలా కాలం క్రితమే బలమైన ముద్రవేశాయి. దిద్దుబాటు చర్యలు లేకుంటే మన రైతుల విధి అనిశ్చితంగానే ఉంటుంది. వరుణ్ గాంధీ వ్యాసకర్త, బీజేపీ పార్లమెంటు సభ్యులు ఈ–మెయిల్ : fvg001@gmail.com -
రుణ మాఫీ కాలేదంటూ జన్మభూమిలో నిరసన
వడ్డేశ్వరం గ్రామ సభలో ఎంపీ గల్లా జయదేవ్ను నిలదీసిన స్థానికులు వడ్డేశ్వరం (తాడేపల్లి) : అర్హులకు రుణమాఫీ కాలేదంటూ గ్రామస్తులు అధికారులను, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ను నిలదీశారు. స్థానిక పంచాయతీ కార్యాలయ ఆవరణలో గురువారం ‘జన్మభూమి - మా ఊరు’ గ్రామ సభ నిర్వహించారు. కార్యక్రమానికి మండల ప్రత్యేకాధికారి తిరుమలదేవి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా గుంటూరు పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అమలు చేయటమే తమ ప్రభుత్వ ధేయమని చెప్పారు. ఈ గ్రామం రాజధాని ప్రాంతంలో ఉన్న దృష్ట్యా అనేక పరిశ్రమలు వస్తాయని, వాటిలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం ఎంపీపీ కత్తిక రాజ్యలక్ష్మి మాట్లాడుతూ తమ గ్రామంలో మంచినీటి సమస్య అధికంగా ఉందని చెప్పారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎంపీని కోరారు. ఈ సందర్భంగా రమేష్బాబు అనే రైతు కల్పించుకుని తమ గ్రామంలో అర్హులైన వారికి నేటికీ రుణమాఫీ కాలేదని ఫిర్యాదు చేశాడు. తాను టీడీపీ కార్యకర్తనేనంటూ సమస్యను ఎంపీకి విన్నవిస్తుండగానే అతనిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివర్లో అతను ఎంపీ కారు వద్దకు కూడా వెళ్లి తమ సమస్యలు పరిష్కరించరా అంటూ కేకలేశాడు. అతనిని బయటకు పంపండంటూ టీడీపీ నేతలకు ఎంపీ హుకుం జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ దండమూడి శైలజారాణి, గ్రామ సర్పంచ్ కత్తిక మల్లేశ్వరి, ఎంపీడీవో పి.రోశయ్య, తహశీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంఈవో సుబ్బారావు, గ్రామ కార్యదర్శి గల్లా అమరేష్, జన్మభూమి కమిటీ సభ్యుడు మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రొటోకాల్ ఉల్లంఘన.. కాగా, సభలో అడుగడుగునా ప్రొటోకాల్ ఉల్లంఘన చోటు చేసుకుంది. కార్యక్రమం టీడీపీ సభలా మారిపోయింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ గల్లా జయదేవ్ తనతో పాటు వచ్చిన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి గంజి చిరంజీవి, పలువురు టీడీపీ నేతలను వేదికపై కూర్చోబెట్టుకున్నారు. దీంతో స్థలం లేక అధికారులు వెనుక వరుసలో కూర్చోవాల్సి వచ్చింది. ఇది ప్రభుత్వ కార్యక్రమమా, టీడీపీ సభా అని వచ్చిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. ఇవేమీ పట్టని టీడీపీ నేతలు మాత్రం వేదికపై ఆశీసులై తమ దర్పాన్ని ప్రదర్శించారు. సీపీఐ వినూత్న నిరసన వడ్డేశ్వరం జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి కంచర్ల కాశయ్య వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రభుత్వం భూములను లీజు పేరుతో విదేశీయులకు కట్టబెట్టడంపై మౌనంగా తన నిరసన వ్యక్తం చేశారు. -
పోరు భూమి
నేటి నుంచి మూడో విడత జన్మభూమి సమస్యలు, హామీలపై నిలదీతకు ప్రజలు, విపక్షాల సన్నద్ధం పింఛన్లు, ఇళ్లు, కమిటీల పెత్తనం, రుణ మాఫీ తదితర సమస్యలపై ప్రశ్నించే అవకాశం విశాఖపట్నం : ‘జన్మభూమి మావూరు’ శుక్రవారం నుంచి మళ్లీ మొదలవుతోంది. తొలి రెండు విడతలు మొక్కుబడి తంతు గానే సాగగా.. ఈసారి మాత్రం తమపై వత్తిడి ఉం టుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. హుద్హుద్ ప్రభావంతో తొలివిడత, స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావంతో మలివిడత మొక్కుబడిగా సాగగా.. మూడో విడత మాత్రం ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటనలు.. విపక్షాల నుంచి నిరసనలు వెల్లువెత్తే అవకాశాలు కన్పిస్తున్నాయి. అర్జీల చిట్టా కాకిలెక్కలే! టీడీపీ సర్కారు గద్దనెక్కిన తర్వాత 2014 అక్టోబర్లో తొలి జన్మభూమి తలపెట్టారు. హుద్హుద్ దెబ్బకు ఈ కార్యక్రమానికి ఆదిలోనే బ్రేకులుపడ్డాయి. ఆ తర్వాత నవంబర్లో కొనసాగించగా, తుపాను ప్రభావంతో అర్జీలు వెల్లువెత్తాయి. ఏకంగా 3.54 లక్షల అర్జీలు రాగా, వాటిలో అర్హమైనవంటూ లక్షా 92 వేల 202 అర్జీలను మాత్రమే అప్లోడ్ చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీతో 2015 జూన్లో మొక్కుబడిగా జరిగిన రెండోవిడత జన్మభూమిలో 20 వేల అర్జీలు మాత్రమే వచ్చాయి. రెండు విడతల్లో 3.74లక్షల అర్జీలు రాగా, 2.02,390 అర్జీలను అప్లోడ్ చేశారు. వీటిలో 1.81లక్షల అర్జీలను పరిష్కరించగా, ఇంకా 20,883 అర్జీలు పరిష్కరించాల్సి ఉందని లెక్కతేల్చారు. ఈ లెక్కలన్నీ కాకిలెక్కలుగానే కన్పిస్తున్నాయనే విమర్శలున్నాయి. కొత్త కార్డులు జారీ చేసినా.. టీడీపీ పగ్గాలు చేపట్టక ముందు జిల్లాలో 12.25 లక్షలకుపైగా బీపీఎల్ కార్డులుండేవి. ప్రస్తుతంవాటి సంఖ్య 10,28,800కు చేరింది. అంటే రెండు లక్షలకు పైగా కార్డులు వివిధ రూపాల్లో తొలగించేశారు. కొత్తకార్డుల కోసం 1.75 లక్షల మంది దరఖాస్తు చేస్తే 1.15 లక్షల కార్డులు మాత్రమే మంజూరు చేశారు. కాగా ఇప్పటివరకు ముద్రించిన కార్డులు కేవలం 70 వేల లోపే. కొత్తకార్డులను జన్మభూమి పంపిణీ చేయనుండగా మంజూరైన కార్డులందని వారు, కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు, కార్డులు కోల్పోయిన వారు సైతం సభల్లో నిలదీసే అవకాశాలు కన్పిస్తున్నాయి. పింఛన్దారుల పాట్లు.. ఈ ప్రభుత్వం వచ్చేనాటికి జిల్లాలో 3.26 లక్షల పింఛన్లుండగా.. వడపోతల పేరిట పాతిక వేలకు పైగా పింఛన్లను తొలగించారు. ఆ తర్వాత కాల్బ్యాక్, కొత్తగా మంజూరు చేసిన పింఛన్లు కలుపుకొని జిల్లాలో పింఛన్ల సంఖ్య 3,24,585కు చేరితే గత మూడునెలల్లో ఆధార్ మిస్మ్యాచ్ పేరిట 28,287 పింఛన్లను నిలిపేశారు.మరో పక్క వరుసగా మూడునెలల పాటు పింఛన్ తీసుకోలేదనే సాకుతో జిల్లాలో సుమారు 5వేలకు పైగా పింఛన్లు రద్దుచేశారు. వీరంతా సభల్లో తమ గోడు వినిపించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల జరిగిన జెడ్పీ మీటింగ్లో పింఛన్ల విషయమై అధికార, విపక్ష ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హౌసింగ్ పైనే దృష్టంతా.. హౌసింగ్ ఫర్ ఆల్ అంటూ జీవీఎంసీ పరిధిలో 20.030 ఇళ్లు మంజూరు చేస్తే ఏకంగా 1.84 లక్షల మంది దరఖాస్తుచేసుకున్నారు. గ్రామీణజిల్లాకు 12,500 ఇళ్లు మంజూరు చేస్తే ఇప్పటికే 46,053 మంది అర్హులుగా లెక్కతేల్చి అప్లోడ్ చేశారు. కానీ ఈ జాబితాలను జన్మభూమి కమిటీలకు అప్పగించారు. ఈ జాబితాల్లో టీడీపీ కార్యకర్తలెవరో లెక్కతేల్చి వారికి మాత్రమే ఆమోదముద్ర వేయనుండడంతో అర్హులైన మిగిలిన బాధితులు సభలను వేదికగా చేసుకుని నిలదీసే అవకాశం ఉంది. ‘కొను’గోల్మాల్ ఇక జిల్లాలో ఖరీఫ్ కోతలు నూరుశాతం పూర్తయ్యాయి. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. కానీ నేటివరకు ఎక్కడా కొనుగోలు ప్రారంభం కాలేదు. దళారీల చేతిలో అన్నదాతలు నిలువునా మోసపోతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అధికారుల వైఫల్యాన్ని ఎండగట్టే అవకాశాలున్నాయి. రూ.3 వేల పెట్టుబడి నిధి చాలామంది డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమకాలేదు.మరో పక్క 2015-16లో జమకావాల్సిన రెండో విడత రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల పెట్టుబడి నిధి ఇంకా విడుదల చేయలేదు. హుద్హుద్ బాధిత రైతుల్లో చాలా మందికి ఇంకా పరిహారం జమకాని పరిస్థితి నెలకొంది. ఇంకా జిల్లా, క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలతో పాటు ప్రతీ పథకం లోనూ జన్మభూమి కమిటీల పెత్తనం.. వసూళ్ల దందా, ఎన్నికల హామీల అమలులో సర్కార్ వైఫల్యాలపై జన్మభూమి సభలను వేదికగా చేసుకుని యుద్ధభేరి మోగించేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సన్నద్ధమవుతుండడం అధికారులకు చమటలు పట్టిస్తోంది. -
అవినీతికి అడ్డాలుగా పీఏసీఎస్లు!
ఇబ్రహీంపట్నం: ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు అండగా నిలవాల్సిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అవినీతి కూపంలో కూరుకుపోతున్నాయి. పాలకవర్గాలు, అధికారులు కుమ్మక్కై డబ్బు కొల్లగొడుతున్నారు. చేయని తప్పులకు రైతులను బాధ్యులను చేస్తున్నాయి. రుణాలు చెల్లించినా చెల్లించలేదని రికార్డుల్లో ఉండడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. మండల పరిధిలోని రాచకొండ దండుమైలారం కో- ఆపరేటివ్ బ్యాంకులో రూ. 26 లక్షల అక్రమాలు జరిగినట్లు శనివారం వెలుగుచూసింది. ఈ బ్యాంకులో మొత్తం 1247 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. అక్రమార్కులు తొలి విడత రుణ మాఫీ నిధుల్లో 50 శాతం సొమ్ము, బ్యాంకు నిర్వహణ ఖర్చుల కింద రూ. 4 లక్షల నిధులు కాజేశారు. రైతులకు తెలియకుండానే వారి పేర్లపై బంగారం, దీర్ఘ, స్వల్ప కాలిక పంట రుణాలు తీసుకున్నట్లుగా రికార్డుల్లో ఉంది. ఫోర్జరీ సంతకాలు, బినామీ పేర్లు, నకిలీ పాసుపుస్తకాలతో ఈ తతంగం సాగింది. బ్యాంకులో ఇప్పటి వరకు సుమారు రూ. 26 లక్షల అక్రమాలు వెలుగు చూశాయని విచారణ అధికారి నర్సింహారెడ్డి చెప్పారు. బ్యాంకు సీఈఓ సయ్యద్ మక్బుల్ మరికొందరితో కలిసి అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఏవిధమైన చర్యలు తీసుకుంటారోనని సర్వత్రా చర్చనీయాంశమైంది. -
తాకట్టు.. కనికట్టు
రుణమాఫీ మాయ రద్దుకాని బంగారం రుణాలు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు వేలం ప్రకటనతో రుణాలు రెన్యువల్ చేయించుకున్న రైతులు బందరు మండలం మేకవాని పాలేనికి చెందిన నండూరి మురళీధర్కు రెండున్నర ఎకరాల పొలం ఉంది. రెండేళ్ల క్రితం బందరు ఇండియన్ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రూ.82 వేల రుణం తీసుకున్నారు. అదే సంవత్సరం స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొదటి విడతగా బంగారం కుదవ పెట్టి రూ.33వేలు, రెండో విడతగా రూ.43 వేలు అప్పు తీసుకున్నారు. రుణమాఫీ మొదటి, రెండు, మూడోవిడత జాబితాల్లో మురళీధర్ పేరు లేదు. రుణమాఫీ జరగలేదని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. బందరు మండలం సీతారామపురానికి చెందిన బెజవాడ రవికుమార్ తన భార్య నగలను కుదువపెట్టి మచిలీపట్నం ఇండియన్ బ్యాంకు లో రూ.లక్ష రుణం తీసుకున్నారు. టీడీపీ నాయకుల హామీతో రుణమాఫీ జరుగుతుందనే ఆశతో బకాయి చెల్లించలేదు. రుణమాఫీ జాబితాలో పేరు ఉన్నప్పటికీ పొలానికి సంబంధించిన సర్వే నంబరు తప్పుగా నమోదు చేశారు. ఈ కారణంతో రవికుమార్ బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణం మాఫీ కాలేదు. సర్వే నంబరు సరి చేయాలని బ్యాంకు, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితంలేదు. మచిలీపట్నం : ముఖ్యమంత్రి చంద్రబాబు అమలుచేస్తున్న రుణమాఫీలో న్యాయం జరగక రైతులు ఆందోళన చెందుతున్నారు. రుణాల మాఫీకోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితంలేకుండా పోయింది. జిల్లాలో 2,60,737 మంది రైతులుబంగారం తాకట్టు పెట్టి రూ.3,276 కోట్ల పంట రుణాలు తీసుకున్నట్లుగా అధికారులు లెక్క తేల్చారు. ప్రభుత్వం మూడు విడతల్లో రుణమాఫీ జాబితాలను ప్రకటించింది. మొదటి విడతలో 2.84 లక్షల మంది రైతులకు రూ.997 కోట్లు రుణమాఫీ జరిగినట్లు చూపి రూ.324.95 కోట్లను విడుదల చేశారు. రెండో విడతలో 1.84 లక్షల మంది రైతులకు రూ.531.96 కోట్లు రుణమాఫీ జరిగినట్లు చూపి రూ. 227.13 కోట్లు విడుదల చేశారు. మూడో విడతలో రూ.78.25 కోట్లు జరిగినట్లు చూపి రూ.36.33 కోట్లను విడుదల చేసినట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. బంగారం తాకట్టుపెట్టి రూ.50వేలు లోపు పంట రుణం తీసుకుంటే ఆ తరహా రైతులకు రుణమాఫీ జరిగిందని బ్యాంకు అధికారులు వివరిస్తున్నారు. వ్యవసాయ అవసరాల కోసం ఇంట్లోని భార్య, పిల్లల గాజులు, పుస్తెల తాళ్లు తదితరాలను తాకట్టుపెట్టి పంట రుణాలు తీసుకున్నారు. ఎన్నికల ముందు టీడీపీ నాయకులు ఇచ్చిన హామీ మేరకు బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలు చెల్లించకపోవటంతో వడ్డీ పెరిగిపోయింది. గడువు మీరిన రుణాలను వసూలు చేసుకునేందుకు బ్యాంకు అధికారులు బంగారు నగలు వేలం వేస్తామని ప్రకటనలు ఇచ్చారు. దీంతో రైతుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. ఇంత వ్యవసాయం చేసి భార్య, పిల్లల నగలు విడిపించుకోలేకపోయామని ఆవేదన చెందుతున్నారు. బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు నగలు వేలానికి వెళ్లకుండా బయట అప్పులు చేసి వడ్డీ, బకాయిలు చెల్లించారు. బందరు మండలం చిన్నాపురం కెడీసీసీ బ్యాంకులో బంగారం తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్న వారి జాబితాలను సకాలంలో పంపకపోవటంతో ఆ బ్యాంకు పరిధిలో రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ అమలు కాలేదు. ఎన్నికల ముందు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ నాయకులు అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యాన పంటలపై తీసుకున్న రుణాలను రద్దు చేసేది లేదని వాటిని పక్కన పెట్టించారు. ప్రస్తుతం ఉద్యాన పంటల కోసం రైతులు తీసుకున్న రుణాల జాబితాను తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఈ జాబితాలను ఎప్పటికి తయారు చేస్తారు. ఎప్పటికి అమలు చేస్తారనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. -
మైక్రో ఉచ్చులో విలవిల
డ్వాక్రా మహిళలకు చుక్కలు చూపిస్తున్న బ్యాంకర్లు ఇవ్వాల్సిన రుణం రూ.1139కోట్లు ఐదు నెలల్లో ఇచ్చింది రూ.175కోట్లు పాత బకాయిల పేరుతో ముఖం చాటేస్తున్న వైనం రుణమాఫీ పాపం డ్వాక్రా సంఘాలకు శాపమై వెంటాడుతోంది. రుణాలు దొరక్క నిరుపేద మహిళలు మైక్రో ఉచ్చులో పడివిలవిల్లాడుతున్నారు. మాఫీకి మంగళం పాడేసి..ఆర్థిక వెసులుబాటు పేరిట సంఘానికి రూ.30వేల చొప్పున జమ చేసినా బ్యాంకర్లు మాత్రం ముఖం చాటేస్తున్నారు. పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలంటూ సంఘాల పాలిట సైంధవుల్లా వ్యవహరిస్తున్నారు. విశాఖపట్నం: ఏరు దాటే వరకు ఓడ మల్లన్న..దాటాక బోడి మల్లన్న చందంగా గద్దెనెక్కే వరకు మాఫీ జపం పాటించిన టీడీపీ పాలకులు పగ్గాలు చేపట్టిన తర్వాత రుణమాఫీని మాఫీ చేశారు. ఏడాది పాటు ఊరించి ఊరించి చివరకు ఒక్కొక్కరికి రూ.3వేల చొప్పున సంఘానికి రూ.30వేలుగా జమ చేశారు. ఈ మొత్తంతో పదిరెట్లు రుణం ఇప్పిస్తాం..దాంతో సంఘాలన్నీ బలోపేతమైపోతాయని ఊహలపల్లకిలో ఊరేగించారు. తీరా ఆచరణలో మాత్రం బ్యాంకర్లు వీరికి చుక్కలు చూపిస్తున్నారు. మార్చిలో ప్రకటించిన రుణప్రణాళిక ప్రకారం ఈ ఏడాది జిల్లాలోని డ్వాక్రా సంఘాలకు రూ.1139 కోట్లు రుణాలు ఇవ్వాల్సి ఉంది. ఈ రుణాలను 24,392 మందికి ఇవ్వను న్నట్టుగా ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై అప్పుడే ఐదు నెలలు గడిచిపోయింది. కేవలం రూ.175కోట్లు మాత్రమే రుణాలివ్వగలిగారు. అది కూడా పాతబకాయిలు చెల్లించినవారికే. ఈ విధంగా రుణాలు పొందిన వారు జిల్లాలో నాలుగువేలకు మించి లేరని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆర్థికసంవత్సరం ముగియడానికి మిగిలింది ఏడు నెలలే. ఇవ్వాల్సిన రుణ లక్ష్యం సుమారు వెయ్యికోట్ల వరకు ఉంది. ఆర్థిక వెసులుబాటుతో సర్కార్ సమకూర్చిన పెట్టుబడి నిధిపై చిత్తశుద్ధి ఉంటే రుణాలు ఇవ్వొచ్చు. కానీ బ్యాంకర్లు మాత్రం రుణమాఫీ వర్తించని రైతుల మాదిరిగానే వడ్డీతో కొండలా బకాయిలున్న సంఘాల వైపు కన్నెత్తయినా చూడడంలేదు. దీంతో ఎక్కే గుమ్మం..దిగే గుమ్మం అన్నట్టుగా డ్వాక్రా సంఘాల మహిళలు రుణాల కోసం బ్యాంకర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లా అధికారులు చెప్పేది ఒకటైతే..క్షేత్రస్థాయిలో జరిగేది మరొకటిగా ఉంది. దీంతో రుణాలు వీరికి అందని ద్రాక్షగా మారుతున్నాయి. గతేడాది రుణమాఫీ పుణ్యమాని రూ.755 కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా అతికష్టంమీద రూ.200కోట్లకు మించి ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా అదే సీను రిపీట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉచ్చు బిగిస్తున్న మైక్రో సంఘాలు ఇన్నాళ్లు బ్యాంకర్లు ఇబ్బడి ముబ్బడిగా రుణాలు మంజూరు చేసేవి. దీంతో మైక్రో సంఘాలు, ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు కాళ్లావేళ్లాపడినా వీరి వడ్డీబాదుడుకు జడిసి ఎవరూ వీరి వద్ద రుణాలు తీసుకునేందుకు ఆసక్తి చూపేవారు కాదు. కానీ ప్రస్తుతం వ్యాపార, కుటుంబ అవసరాలు నిమిత్తం మళ్లీ మైక్రో సంఘాల దారి పట్టాల్సి వస్తోంది. ఐదురూపాయలు..పది రూపాయల వడ్డీలు వసూలుచేస్తున్నా తమ అవసరాల కోసం వీర్ని ఆశ్రయించకతప్పని దుస్థితి. -
దారుణం
లక్ష్యం మేరకు అప్పులు అనుమానమే పాస్బుక్పై అన్నదాతకు ఒకే పంటరుణం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మేరకే వర్తింపు వరికి ఎకరాకు రూ.24 వేలు చెరకుకు రూ.35వేలలోపే.. రుణమాఫీ పరోక్షంగా రైతులకు శాపమవుతోంది. ఇప్పటికే ఉన్న రుణాలు పూర్తిగా మాఫీకాక ఉక్కిరిబిక్కిరి అవుతున్న అన్నదాతలకు బ్యాంకుల్లో మళ్లీ అప్పు పుట్టే పరిస్థితులు కనిపించడం లేదు. ఒక పాస్బుక్పై వ్యవసాయ రుణం లేదా బంగారం తాకట్టు రుణం ఇలా ఏదో ఒకటే ఇస్తారు. పైగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే రుణం మంజూరు చేయాలని ఆర్బీఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆపై కావాలంటే ఇప్పుడున్న ఏడు శాతానికి బదులు 12 శాతం వడ్డీ భరించాల్సిందే. విశాఖపట్నం : జిల్లాలో ఖరీఫీలో 2,08,988 హెక్టార్లలో సాగు చేపట్టాలన్నది లక్ష్యం. ఈ మేరకు 2015-16 ఆర్థిక సంవత్సరంలో 2,93,447 మంది రైతులకు షార్ట్టర్మ్(పంట) రుణాలుగా రూ.1200 కోట్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. గతేడాది కేవలం 60 శాతమే రుణాలిచ్చారు. ఈఏడాది ఏదిఏమైనా లక్ష్యాన్ని అధిగమించాలని జిల్లా యంత్రాంగం పట్టుదలతో ఉంది. గతేడాది 32 మంది కౌలురైతులకు రూ.8లక్షలు మాత్రమే రుణంగా ఇచ్చారు. ఈ ఏడాది 40వేల మందికి కౌలుఅర్హత కార్డుల జారీకి ఏర్పాట్లుతో ఆ మేరకు కార్డులు జారీ అయిన ప్రతీఒక్కరికి రుణాలివ్వాలని యోచిస్తున్నారు. కానీ వీరి ప్రయత్నాలకు ఆర్బీఐ నిబంధనలు గండి కొట్టేలా కనిపిస్తున్నాయి. విరివిగా రుణాలిచ్చేవారు... : గతంలో భూమి దస్తావేజులు, పాస్బుక్, టైటిల్ డీడ్లను తనఖా పెట్టుకుని రైతులకు పంట రుణాలిచ్చేవారు. పంట రుణమే కాదు..ఈ పాస్పుస్తకం జెరాక్స్ కాపీలిస్తే బంగారు ఆభరణాలపై 7శాతం వడ్డీకే వ్యవసాయ రుణాలు కూడా మంజూరు చేసేవారు. వ్యవసాయ యంత్రాలు, పాడి, ఆక్వా తదితర వ్యవసాయానుబంధరంగాలకు అవసరాలకు తగ్గట్టుగా రుణాలిచ్చేవారు. వ్యవసాయ రుణాలకు మాత్రం తొలిలక్ష రుణానికి జీరో పర్సంట్ వడ్డీ రాయితీ కింద... ఆ తర్వాత రెండు లక్షలకు పావలా వడ్డీ రాయితీని పరిగణనలోకి తీసుకునే వారు. మిగిలిన రుణాన్ని మాత్రం ఏడు శాతం వడ్డీతోనే రైతు చెల్లించే వాడు. ఇప్పుడు మాత్రం రైతుకు భూమి విస్తీర్ణాన్ని బట్టీ ఆ భూమిపై వేసే పంటకు సంబంధించి స్కేల్ఫైనాన్స్కు తగ్గట్టుగా రుణమివ్వాలని ఆర్బీఐ స్పష్టంగా ఆదేశించింది. ఇలా అయితే లక్ష్యం కష్టమే.. వరికైతే ఎకరాకు రూ.24వేలు, చెరకుకు రూ.35వేల వరకు మాత్రమే రుణమిస్తారు. పైగా ఒక దస్తావేజు లేదా పట్టాదార్ పాస్పుస్తకంపై ఒక రుణాన్ని మాత్రమే పంట రుణంగా పరిగణించాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఆ తర్వాత బంగారు ఆభరణాలు కుదువపెట్టి భూమి డాక్యు మెంట్లపై తీసుకునే రుణాలతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల కోసం ఎంత రుణం కావాలన్నా ఇస్తారు..కానీ ఆ రుణంపై మాత్రం 12శాతం వడ్డింపు భరించాల్సిందే. దీంతో గతంలో మాదిరి ఎవరికి పడితే వారికి పంటరుణాలు, వ్యవసాయ రుణాలు ఇచ్చే అధికారం బ్యాంకర్లకు లేదు. అధికారులు సిఫారసు చేసినంత మాత్రాన కౌలురైతులకు రుణాలిచ్చే అవకాశం లేదు. భూమి యజమాని అంగీకార పత్రం కచ్చితంగా ఉండాలి. దీంతో రుణ అర్హత కార్డులు అలంకారప్రాయం కానున్నాయి. -
ఇదేం ఖర్మ బాబూ..
- రెండుమార్లు వివరాలు అందజేసినా అందని రుణ మాఫీ సొమ్ము - మరోమారు అధికారులకు పత్రాలు సమర్పించేందుకు వస్తున్న రైతులు - ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి సాక్షి, కడప : రుణ మాఫీ దక్కని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్ వద్ద రైతులు పలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రుణ మాఫీ కాని రైతులు దరఖాస్తు చేసుకునేందుకు అనువుగా ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసినప్పటికీ టోకన్ల కోసం వారు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. వివరాలు సమర్పించడానికి ఉదయం ఒకసారి మాత్రమే టోకన్లు ఇస్తుండటంతో ఆ తర్వాత వచ్చిన రైతులు గంటలకొద్దీ ఎదురు చూడాల్సి వస్తోంది. వృద్ధులైన పలువురు రైతులు ఇదేం ఖర్మ అనుకుంటూ వేదనతో వెనుదిరుగుతున్నారు. ఎన్నిమార్లు పత్రాలు సమర్పించినా ఏదో ఒక కొర్రీ వేస్తూ రైతులను సతాయిస్తున్నారు. జిల్లాలో 4,95,008 మంది రైతులు వివిధ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నారు. తొలి విడతలో 2,78,070 మందికి వర్తించజేయగా, రెండవ విడతలో 1,33,048 మందికి వర్తింపజేశారు. ఇందుకు రూ.450 కోట్లు కేటాయించారు. అయితే చాలా మంది రైతులు బ్యాంకులకు వెళ్లి రుణమాఫీ అయిన సొమ్ము ఇవ్వాలని అడగడం లేదు. ఎందుకంటే ఇప్పటికే వడ్డీ భారం బాగా పెరిగిపోయింది. గత ఏడాది, ఈ ఏడాది కలుపుకుని లక్షకు దాదాపు రూ. 25 వేల పైచిలుకు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం సర్కార్ మాత్రం రుణమాఫీ పేరుతో రూ. లక్ష ఉన్న రైతుకు రూ. 20 వేలు మాత్రమే ప్రస్తుతానికి మాఫీ చేసింది. రైతు బ్యాంకుకు వెళ్లి మాఫీ సొమ్ము అడిగితే రెన్యూవల్ చేయాలని అధికారులు అడుగుతున్నారు. రెన్యూవల్ చేసుకోవాలంటే అదనంగా రైతు కొంత మొత్తాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మాఫీ అయిన సొమ్మును తెచ్చుకోలేక కొంతమంది రైతులు ఇబ్బంది పడుతుంటే మరో పక్క మాఫీ కాక మరి కొంతమంది అవస్థలు పడుతున్నారు. మాఫీ కాని రైతులు దాదాపు 83 వేల మంది ఉన్నట్లు అంచనా. ఇటీవలే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రుణమాఫీ సెల్కు రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పత్రాలు సమర్పిస్తున్నారు. ఇక్కడ ఆధార్, రేషన్ కార్డును పరిశీలించి పొరపాట్లు సరిచేస్తున్నారు. -
రుణ మాఫీ ఫిర్యాదులపై మెలికలు
బ్యాంకు ధ్రువపత్రాలుంటేనే ఫిర్యాదుల స్వీకరణ హైదరాబాద్: ఇప్పటికే రుణ మాఫీ విముక్తి పేరుతో రాష్ట్రస్థాయిలో పలు రకాల ఆంక్షలతో సగానికి పైగా రైతుల ఖాతాలను విముక్తి నుంచి ఏరివేసి రుణ ఊబిలోకి నెట్టివేసిన ప్రభుత్వం.. తాజాగా జిల్లా కేంద్రాల్లో రుణ విముక్తి ఫిర్యాదుల స్వీకరణలోను పలు మెలికలు, ఆంక్షలు విధించింది. బ్యాంకులు, సర్కారు చేసిన తప్పిదాలకు రైతులను బలి చేస్తోంది. జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో గత నెల 27 నుంచి ఫిర్యాదుల స్వీకరణ విభాగాలను ఏర్పాటు చేశారు. వీటిపై జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. ఇలా ఉంటే ఫిర్యాదులు స్వీకరించరు ఏ పంట, ఎంత విస్తీర్ణం అనే విషయంలో తప్పులు దొర్లితే.రుణ విముక్తి పత్రంలో భూ విస్తీర్ణం తప్పుగా నమోదైనట్టు చేసే ఫిర్యాదులు.కౌలు దారు, భూమి యజమాని ఒకే విస్తీర్ణంపై ఒకే సీజన్లో రుణం తీసుకుంటే. రుణం తీసుకున్న రైతు పేరు పలు రేషన్ కార్డుల్లో ఉంటే.. ఆ రైతును రుణ విముక్తి నుంచి తొలగించారు. దీంతో ఈ రైతు చేసే ఫిర్యాదులు. సరైన రేషన్ కార్డు, ఓటరు కార్డు ఉంటేనే ఇలాంటి వారి నుంచి ఫిర్యాదు తీసుకుంటారు. లేని వారి నుంచి స్వీకరించరు. సర్వే నంబరు, పట్టాదారు పాసుపుస్తకం నంబరు తప్పుగా నమోదైన రైతుల నుంచి స్వీకరించరు.ఒకవేళ.. ఇలాంటి వారు.. ఎమార్వో నుంచి అండగల్ ప్రతులు సమర్పిస్తే.. స్వీకరిస్తారు. భూ విస్తీర్ణం 50 ఎకరాలకు మించి ఉన్నా లేదా విస్తీర్ణం తప్పుగా నమోదైనా బ్యాంకు ధ్రువపత్రాలు ఇస్తేనే ఫిర్యాదు స్వీకరణ. రుణ బకాయి రూ.10 లక్షలకు పైనున్నా, రుణం మొత్తం విముక్తి పత్రంలో తప్పుగా నమోదైనా ఫిర్యాదు స్వీకరణకు షరతులు. ప్రక్రియ ముందుకు సాగేనా?! రుణమాఫీపై రైతుల నుంచి జిల్లాల్లో ఫిర్యాదులు తీసుకోడానికి ముందు రాజధాని హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని పరిశీలించలేదు. ఏదో ఒక నెపం జూపి రైతుల నుంచి ఫిర్యాదులను తిరస్కరిస్తున్న పరిస్థితే కనిపిస్తోంది. దీంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. -
ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి త్వరలో గుణపాఠం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రోలుగుంట: ప్రజల సంక్షేమం పట్టించుకోని రాష్ర్ట ప్రభుత్వానికి త్వరలో గుణపాఠం తప్పదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. మండలంలోని కుసుర్లపూడి గ్రామంలో శ్రీదేవి పెద్దింటమ్మ ఉత్సవం సందర్భంగా గురువారం రాత్రి వచ్చిన ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. గ్రామాల వారీగా పార్టీ అభివృద్ధి, ప్రజల సమస్యలపై అయన చర్చించారు. ప్రతి కార్యకర్త కష్టాల్లోను తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రాష్ర్టంలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు. తూతూ మంత్రంగా రుణమాఫీ అమలు చేసి చేతులు దులుపుకున్నారని, దీని వల్ల రైతులకు ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. తుపాను బాధితులకు పూర్తి స్థాయిలో నేటికీ సాయం అందలేదన్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. పెట్రోలు, డీజీల్ ధరలు పెంచడం దారుణమన్నారు. సామాన్య ప్రజల నడ్డి విరచడమే థ్యేయంగా టీడీపీ, బీజే పీ ప్రభుత్వాలు పని చేస్తున్నాయని ఆక్షేపిం చారు. మడ్డు అప్పలనాయుడు గృహంలో జరి గిన ఈ సమావేశంలో పార్టీ నాయకులు టి.వి.రమణ, గొర్లె చెల్లమ్మనాయుడు, బంటు సూర్యసన్యాసి దేముళ్లు, మలసాల భాస్కర్రావు, తమటపు సత్యంనాయుడు, అడ్వకేట్ చలపతి, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు. -
చంద్రబాబు నిలువునా ముంచేశారు
రుణమాఫీ పేరుతో మోసం చేశారు రైతు సాధికార సదస్సుల్లో అధికారులను అడ్డుకున్న రైతులు సమాధానం దాటవేసిన అధికారులు కుప్పం: ‘కరువు పరిస్థితుల్లో బ్యాంకుల్లో తీసుకున్న రుణం మాఫీ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఇప్పుడు రుణం మాఫీ చేయకుండా కనీసం దాని వడ్డీకి సరిపడా డబ్బు కూడా ఇవ్వకుండా పత్రాలు తెచ్చి చేతిలో పెడుతున్నారు. అవి మాకు అవసరం లేదు మీ దగ్గరే పెట్టుకోండి’ అంటూ కుప్పం వుండల పరిధిలోని రైతులు అధికారులపై మండిపడ్డారు. చెక్కునత్తం, వుంకలదొడ్డి, ిపీబీనత్తం, అనిమిగానిపల్లి, వెండుగంపల్లి, గోనుగూరు గ్రామ పంచాయతీల్లో శనివారం నిర్వహించిన రైతు సాధికార సదస్సుల్లో ఈ మేరకు అధికారులను నిలదీశారు. అనిమిగానిపల్లి గ్రామ సభలో సర్పంచ్ శ్రీనివాసులు మాట్లాడుతూ బ్యాంకుల్లో ఉన్న రుణాలు చెల్లించొద్దని చెప్పారు. ఇప్పుడు వడ్డీతో కలిపి తడిసిమోపెడైంది. ప్రభుత్వం భిక్షమేసినట్టు రూ.500, రూ.1000 బ్యాంకులో వేస్తున్నారు. ఇది ఏ మూలకూ సరిపోదు. ఇదేనా రుణమాఫీ అంటే అని అధికారులను నిలదీశారు. రెండో విడతలో న్యాయం చేస్తామని ఎంపీడీవో వివరణ ఇస్తున్నా వారు పట్టించుకోలేదు. రుణం మాఫీ చేయని, సమాధానం చెప్పని ఇలాంటి సదస్సులు వద్దని రైతులు వెళ్లిపోయారు. -
రుణమాఫీ సగం మందికే
గొర్రె ఏడుపు తోడేలుకు ఎందుకు అన్న చందంగా బాబు రుణమాఫీ వ్యవహారం తయారైంది. ఇటు రుణమాఫీ కాక..అటు బ్యాంకుల్లో అప్పు పుట్టక ఇబ్బందులు పడుతున్నా రోజుకో మాట మారుస్తున్న బాబు వైఖరిపై జిల్లా రైతులు మండిపడుతున్నారు. కొండను తవ్వి ఎలుక ను పట్టినట్లు రుణమాఫీ తయారైందని గురువారం చంద్రబాబు చేసిన ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు వైఖరిపై విపక్షాలూ దుమ్మెత్తిపోస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, ఒంగోలు, ఒంగోలు టూటౌన్ : కొండను తవ్వి ఎలుకను పట్టుకున్న చందంగా తయారైంది సీఎం చంద్రబాబు రుణమాఫీ ప్రకటన. గద్దెనెక్కడానికి ఓట్ల కోసం అడ్డంగా రుణమాఫీ చేస్తానంటూ అబద్ధాలు పలికిన బాబు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రమాణ స్వీకారం రోజున రుణాలన్నీ మాఫీ చేస్తున్నట్టు ఫైలుపై సంతకం చేసిన ఆరు నెలల తర్వాత బాబు చేసిన ప్రకటనపై రైతన్నలు పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటికిపైగా రైతు ఖాతాలుంటే కేవలం 40 లక్షల ఖాతాలకే రుణమాఫీ వర్తిస్తుందని చంద్రబాబు చేసిన ప్రకటనతో జిల్లాలో ఎంతమందికి ఈ రుణమాఫీ వర్తిస్తుందనే అంశంపై చర్చ మొదలైంది. జిల్లాలో ఏడు లక్షల రైతు ఖాతాలున్నాయి. అందులో ఆధార్, పట్టాదార్ పాసుపుస్తకం, రేషన్ కార్డు, కుటుంబ సభ్యులు ఖాతాలు సరిపోల్చడం అంటూ చేసిన గందరగోళంతో సగానికి పైగా రైతులకు ఈ రుణమాఫీ వర్తించే అవకాశాలు కనపడటం లేదు. జిల్లాలోనే రుణమాఫీకి అర్హమైన మొత్తం ఐదు వేల కోట్ల రూపాయలుండగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదువేల కోట్లే బడ్జెట్లో కేటాయించిన సంగతి తెలిసిందే. 50 వేలలోపు రుణం ఉన్నవారికి ఒకేసారి, మిగిలిన వారికి 20 శాతం రుణమాఫీ చేయాలన్నాఒక్క జిల్లాకే వెయ్యి కోట్ల రూపాయలకుపైగా అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో అసలు ఎంతమందికి మాఫీ అవుతుందో చెప్పలేమని బ్యాంకర్లు చెబుతున్నారు. పూర్తిగా రుణమాఫీ చేయకుండా తొలి విడత, మలివిడత అంటూ నాలుగు విడతల్లో రుణమాఫీ చేస్తానంటూ మాయమాటలతో కాలయాపన చేయడంపై అటు రైతులు, ఇటు రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వ్యవసాయ రుణాలు చెల్లించొద్దు మొత్తం రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 20 శాతానికి పరిమితం చేయడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. రుణమాఫీ ప్రకటనపై జిల్లాలోని రైతు సంఘాల నాయకులు,రాజకీయపార్టీల నాయకుల అభిప్రాయాలు.. జగన్ ప్రకటించిన ధర్నాలకు భయపడే రుణమాఫీ ముత్తుమల అశోక్ రెడ్డి , వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎన్నికల సమయంలో వ్యవసాయ రుణాలు చెల్లించొద్దు, అన్ని రుణాలు రద్ధు చేస్తామని ప్రకటించిన చంద్రబాబు వైఫల్యాలను నిలదీసేందుకు వైఎస్సార్ సీపీ సిద్ధమయ్యే సరికి 20 శాతం రుణమాఫీ అంటూ కొత్త ఎత్తుగడకు దిగారు. ఆంక్షలు లేని రుణమాఫీ చేయకుండా కేవలం విడతల వారీగా రుణమాఫీ చేస్తాననడం రైతులను మరోమారు మోసం చేయడమే. రుణమాఫీపై తొలిసంతకం చేస్తానని .. కమిటీ వేసిన రోజే బాబు ప్రజల విశ్వాసం కోల్పోయారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్తు ఇస్తానని ఎన్నికలలో హామీ ఇచ్చి గెలిచిన వెంటనే తొలి సంతకం ఉచిత విద్యుత్తు ఫైల్పై పెట్టి నిజమైన రైతు నాయకుడు అనిపించుకున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆంక్షలు లేని రుణమాఫీ చేయాలి. జాప్యం చేయడానికి మరో ఎత్తుగడ ఉగ్ర నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైన టీడీపీ ప్రభుత్వం జాప్య చేయడానికి మరో ఎత్తుగడ ఇది. ఆధార్ సంఖ్య సరిగాలేదని, రేషన్ కార్డు నెంబర్ కనపడటంలేదనో బ్యాంకుల వద్దకు వెళ్లి చాలామంది రైతులు వెనక్కు వస్తున్నారు. స్పష్టత లేకుండా ప్రతిపక్షాలకు భయపడి అరకొర రుణమాఫీ చేయడం సరికాదు. మా కనిగిరి నియోజకవర్గంలోనే దాదాపు 60 నుంచి 70 కోట్ల వరకు రుణమాఫీ బాకీలున్నాయి. ఎన్నికలలో వ్యవసాయ రుణాలు కట్టొద్దు, అధికారంలోకి వచ్చిన వెంటనే రద్ధు చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ఆలోచించి హామీలివ్వాలి కె అరుణ, సీపీఐ జిల్లా కార్యదర్శి తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న వ్యక్తి ఆలోచించి హామీలివ్వాలి. ఆచరణ సాధ్యం కాని హామీలిస్తే ఇలానే ఉంటుంది. 50 వేలలోపు ఉంటే ఒకేసారి చేస్తామనడం, వాయిదాల ప్రకారం రుణమాఫీ చేస్తామనడం, మిగతవాటికి బాండ్లు ఇస్తామనడం బాగాలేదు. ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలి. ముఖ్యంగా కౌలు రైతుల రుణాలు, మహిళలు తీసుకున్న రుణాలను రద్ధు చేయాల్సిందే. రుణ విముక్తులను కాదు రుణ ఊబిలోకి... - సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాగబోయిన రంగారావు రుణమాఫీ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను రుణ విముక్తులను చేయకుండా మరింత రుణ ఊబిలోకి నెట్టేశారు. రుణమాఫీ చేస్తానని ప్రకటించడంతో రైతులు వాటిని కట్టకపోవడంతో ఆరునెలలకు కలిపిన వడ్డీని బ్యాంకర్లు అసలు కింద జమ చేస్తున్నారు. రుణాలు చెల్లించాలంటూ నోటీసులు వచ్చిన ప్రతిసారీ రూ. 400 రైతు ఖాతాకు అదనపు అప్పు కింద జమ చేస్తున్నారు. రుణమాఫీ ప్రస్తావన లేకుంటే సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు వడ్డీ మినహాయింపు ఉంది. లక్ష రూపాయల్లోపున్న వాటికి వడ్డీ మినహాయింపు, మూడు లక్షల్లోపున్నవారికి పావలా వడ్డీ ఉండేది. రుణమాఫీ అమలు కాకపోవడంతో బ్యాంకర్లు రైతుల నుంచి 13శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు రాకపోవడంతో వడ్డీ వ్యాపారుల నుంచి 3- 5 రూపాయలకు వడ్డీలకు తీసుకువచ్చి పంటలు సాగు చేశారు. చంద్రబాబు ఇదే మాదిరిగా మోసగిస్తూ పోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు. రైతులకు ఉపయోగకరం.. బీజేపీ రాష్ట్ర నాయకులు బత్తిన నరశింహారావు కోటయ్య కమిటీ లక్ష వరకే రుణమాఫీ అని సూచించినా చంద్రబాబు రూ1.50లక్షలన్నారు. దానికి కట్టుబడే నేడు తొలివిడతగా రూ50వేలలోపు రైతుల రుణాలను తీరుస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ఏదైనప్పటికి ప్రకటించిన హామీకి కట్టుబడి రుణం మాఫీచేసేందుకు చంద్రబాబు ముందుకు రావడం శుభపరిణామమే. ఇది రైతులకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. జగన్ తీసుకున్న నిర్ణయానికి భయపడి.. మారెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీై రెతు విభాగం జిల్లా అధ్యక్షుడు రుణమాఫీ చేస్తానని ఎన్నికలలో ఇచ్చిన హామీపై ధర్నాలకు వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపుతో భయపడి 20 శాతం రుణమాఫీతో మళ్ళీ రైతులను మభ్య పెడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన హామీకి కట్టుబడి తొలిసంతకం ఉచిత విద్యుత్తుపై చేస్తే.. బాబు మాత్రం రుణమాఫీపై పెట్టకుండా కమిటీ ఏర్పాటుకు సంతకం చేసిన రోజునే మోసపోయమని రైతులు భావించారు. ఏడు నెలలుగా కాలయాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్సార్ పార్టీ ధర్నాలు అనగానే భయపడి ముందురోజే అరకొరగా రుణమాఫీ చేస్తూ నిర్ణయం తీసుకోవడం సిగ్గుమాలిన పని. ఇదేం రుణమాఫీ దుగ్గినేని గోపినాధ్ , ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రుణమాఫీ పూర్తిగాచేయకుండా తొలివిడత, మలివిడత అంటూ విడతల వారీగా రుణమాఫీ చేస్తే రైతులకు ఏం లాభం. పూర్తిగా రుణమాఫీ జరిగితేనే బ్యాంకులు మళ్ళీ రైతులకు రుణాలు ఇచ్చేది. ఇప్పటికే ఖరీఫ్, రబీ సీజన్లలో బ్యాంకు రుణాలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయారు. బయట అప్పులు తెచ్చుకోని సేద్యం చేస్తున్నారు. 20 శాతంరుణమాఫీ చేసి మిగిలిన దానికి బాండ్లు జారీ చేస్తామనడం విడ్డురంగా ఉంది. రైతులకు జారీ బాండ్లను బ్యాంకులకే జారీ చేసి పూర్తి రుణమాఫీ చేయాలి. ఇట్లాంటి రుణమాఫీలు రైతులకు అవసరం లేదు. -
రుణమాఫీకి డబ్బెక్కడుంది
కోడుమూరు: రుణమాఫీ అంటూ రైతులను మోసం చేయడమే తప్ప అందుకు డబ్బెక్కడి నుంచి తెస్తారో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉందని ఎమ్మెల్యే మణిగాంధీ అన్నారు. స్థానిక మండలపరిషత్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు చెప్పే మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ‘‘ప్రజలకు నువ్వు కట్టే సింగపూర్ అవసరంలేదు. సక్రమంగా రోడ్లు వేసి మరుగుదొడ్లు కట్టించి, తాగునీళ్ల సమస్య లేకుండా చేసి, సాగునీటి వనరులు పెంచేదిశగా పనులను చేస్తే చాలు’’. అని కోరారు. వైఎస్సార్సీపీ సెంట్రల్ గవర్నింగ్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ కౌన్సెలింగ్ పేరుతో ప్రభుత్వం ఉద్యోగుల నుంచి లక్షలాది రూపాయల డబ్బులు వసూల్ చేసి బదిలీలు చేస్తుందని ఆరోపించారు. కర్నూలు నుంచి రోజుకు 150లారీల ఇసుక అక్రమంగా హైదరాబాద్కు తరలిపోతున్న అడ్డుకునే అధికారేలేరని ఆరోపించారు. బీసీ సెల్ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు లాయర్ప్రభాకర్, వైఎస్సార్సీపీ నేతలు కృష్ణారెడ్డి, రామకృష్ణ, పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమపథం దిశగా...
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రుణ మాఫీ హామీ ఉత్తుత్తి మాఫీగానే మిగిలిపోతోంది... డ్వాక్రా రుణాల మాఫీ అటకెక్కింది... హుద్హుద్ తుపాను బాధితుల వేదన అరణ్య రోదనే అయ్యింది. వెరసి ప్రభుత్వ మోసపూరిత విధానాలపై అన్నివర్గాల ప్రజలు మండిపడుతున్నారు. అందుకే ప్రజల తరపున వైఎస్సార్ కాంగ్రెస్ సమర శంఖం పూరిస్తోంది. ఎన్నికల హామీల అమలులో వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సన్నద్ధమవుతోంది. డిసెంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద భారీ ధర్నాలు చేయాలని నిర్ణయించింది. జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ఈ భారీ ధర్నాకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హాజరుకానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. దాంతో డిసెంబర్ 5న ధర్నాను విజయవంతం చేయడం ద్వారా ప్రజాగ్రహాన్ని బలంగా వినిపించడానికి పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. సమన్వయంతో సన్నద్ధత డిసెంబర్ 5న కలెక్టరేట్ వద్ద ధర్నాను విజయవంతం చేయడానికి జిల్లా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్లో పార్టీ అధినేత వై.ఎస్.జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ ధర్నా నిర్వహణ గురించి కూడా ప్రధానంగా చర్చించారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు, బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు, ఇతర ముఖ్య నేతలు జిల్లాలో నేతలు, కార్యకర్తలతో సమావేశమై ధర్నా ఏర్పాట్లను సమీక్షించారు. జిల్లాలో రైతులు, డ్వాక్రా మహిళలు, తుపాను బాధితులు తదితరులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్న అంశాన్ని నేతలు ప్రస్తావించారు. అన్ని వర్గాల ప్రజలను కూడగట్టుకుని ధర్నాను విజయవంతం చేయడానికి కార్యాచరణ ప్రణాళిక చేపట్టారు. నియోజకవర్గాలవారీగా సన్నద్ధత డిసెంబర్ 5న ధర్నాపై రాష్ట్ర పార్టీ కూడా ప్రత్యేక దృష్టిసారించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి( కార్యక్రమాల కో ఆర్డినేటర్) తలశిల రఘురాం బుధ, గురువారాలు జిల్లాలో పర్యటించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నేతలతో చర్చించారు. జీవీఎంసీ, రూరల్ జిల్లా, ఏజెన్సీ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు ధర్నాలో పాల్గొనేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో ప్రభుత్వ మోసపూరిత వైఖరిని ప్రజల్లోకి విసృ్తతంగా తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. అందుకోసం నియోజకవర్గాల్లో గ్రామాలు, డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. తద్వారా మహాధర్నాకు ప్రజలను సంసిద్ధులను చేయడానికి పార్టీశ్రేణులు రంగంలోకి దిగాయి. రూరల్ జిల్లాలో నియోజకవర్గాలవారీగా సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభించారు. జీవీఎంసీ పరిధిలో డివిజన్లవారీగా కార్యకర్తల సమావేశాలు గురువారం నుంచి నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరవుతుండటంతో పార్టీలో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. -
రుణమాఫీ కాదు...వాగ్దానాల మాఫీ
చిత్తూరు (టౌన్) : రాష్ట్రప్రభుత్వం తీరు చూస్తుంటే రుణమాఫీ కథ దేవుడెరుగు కానీ.. వాగ్దానాల మాఫీ అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి విమర్శించారు. గురువారం ఆయన జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన వాగ్దానాల్లో కొన్నిం టిని కూడా నెరవేర్చలేదన్నారు. రైతుల వ్యవసాయరుణాల మాఫీతో పాటు డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని అధికారంలోకొచ్చిన చంద్రబాబు వాటిని నెరవేర్చలేదని విమర్శించారు. పింఛన్లను ఏవేవో కుంటిసాకులతో అర్హులకు అందకుండా చేయడం దారుణమన్నారు. జన్మభూమి కార్యక్రమంలో పింఛన్ల పంపిణీ తప్ప ఇంకేమీ చేయలేదన్నారు. జన్మభూమి కార్యక్రమం జరిగే తేదీల్లో కార్యాలయూలన్నీ అధికారులు లేకుండా బోసిపోయాయన్నారు. దీనిపై తాము తమ నాయకునితో కలిసి అసెంబ్లీలో తీవ్రస్థాయిలో చర్చించనున్నామని వివరించారు. గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులొద్దంటూ కక్షసాధింపు ధోరణిని అవలంబిస్తున్నారని విమర్శించారు. డీలర్లపై కక్షసాధింపెందుకు ? రేషన్ షాపు డీలర్లపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిని అవలంబిస్తోందని, దీనిపై అసెంబ్లీలో ప్రస్తావించనున్నామని నారాయణ స్వామి చెప్పా రు. డీలర్లు ప్రభుత్వమిచ్చే కొద్దిపాటి కమిషన్తో ప్రజలకు నిత్యావసరాలను పంపిణీచేసే వారు మాత్రమేనన్నారు. అయితే ప్రభుత్వం డీలర్లపై కక్షగట్టి వారి డీలర్షాపులను రద్దుచేస్తోందన్నారు. మాజీ ఎమ్మెల్యే కుతూహలమ్మ కొంతమందిపై పనిగట్టుకుని అవినీతికి పాల్పడుతున్నారనే నెపంతో 15 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని తొలగించారని విమర్శించారు. ఆమెతోపాటు వీరు కూడా పార్టీ మారివుంటే మంచివాళ్లు, మారకపోతే అవినీతిపరులా అని ఎద్దేవా చేశారు. కార్వేటినగరం మండలంలోని రెండు డీలరు షాపుల రద్దు చెల్లదని హైకోర్టు ఆదేశించినా ఆ ఆదేశాలను అమలు చేయలేని స్థితిలో అధికారులున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ప్రగతి కరుణాకర్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీ దేవి పాల్గొన్నారు. -
రుణమాఫీకి ప్రభుత్వం కొర్రీలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రుణమాఫీకి ప్రభుత్వం కొర్రీలు వేస్తోంది. రోజుకో కొత్త నిర్ణయాన్ని ప్రకటించి లబ్ధిదారుల జాబితాను వడబోయడానికి కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే జిల్లాలో లక్షన్నర మంది రైతుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. మళ్లీ ఈ జాబితాలను వడపోసేందుకు జన్మభూమి కమిటీల ముందుకు తీసుకువెళ్లాలన్న నిర్ణయం పట్ల అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ పొందే లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడంతోపాటు వారికి సకాలంలో అందకుండా చేయడం కోసం రోజుకో ప్రక్రియతో ప్రభుత్వం ముందుకు వస్తోంది. కొత్తగా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు రెండూ ఉన్న వారికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. తరువాత ఉద్యానవన పంటలకు రుణమాఫీ వర్తించదని పేర్కొంది. దీంతో ఎంతమందికి రుణమాఫీ వర్తిస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇందులో ఎక్కువగా రేషన్ కార్డు ఉండి, ఆధార్ లేనివారు. ఆధార్ ఉండీ రేషన్ కార్డు లేనివారు ఉన్నారు. పేరులో, ఆధార్ కార్డులో ఒక్క అక్షరం తప్పుంటేచాలు తిరస్కరించిన వాటిలోకి చేర్చేశారు. ఇప్పటి వరకూ జిల్లాలో లక్షన్నర వరకూ ఖాతాలు రుణమాఫీకి అర్హత లేదని తేల్చారు. జిల్లాలో ఆధార్ కార్డును జతచేయకపోవడంతో 15631 ఖాతాలను తొలగించారు. ఇవి మినహాయిస్తే రుణమాఫీకి అర్హత పొందిన ఖాతాల సంఖ్య 7,00,295కి చేరింది. ఆ తర్వాత ఆధార్ కార్డు మాత్రమే కాకుండా రేషన్ కార్డు లింకుతో ఈ సంఖ్య ఐదున్నర లక్షలకు పడిపోయింది.. రేషన్ కార్డు రైతుల వద్ద ఉన్నా పౌరసరఫరాలశాఖ తమ రికార్డుల నుంచి తొలగించడంతో చాలా మందికి రుణమాఫీ జాబితాలో పేరు లేకుండా పోయింది. రుణమాఫీ కుటుంబంలో ఒక్కరికే వర్తిస్తుందని చెప్పడంతో తాజాగా ప్రభుత్వం కుటుంబ సభ్యుల వివరాలను రెవెన్యూ సిబ్బంది ద్వారా సేకరిస్తోంది. బ్యాంకర్లు తమ వద్ద అప్పు తీసుకున్న రైతుల సమాచారం ఇవ్వగా, వారి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు నెంబర్లు, ఆస్తుల వివరాలు అడుగుతుండటంతో ప్రభుత్వం ఎలాంటి మెలిక పెడుతుందోనన్న భయం రైతుల్లో వ్యక్తమవువుతోంది. తిరస్కరణకు గురైన జాబితాలు కూడా బ్యాంకులకు అందలేదు. ముందు రెవెన్యూ విభాగం పరిశీలిస్తుంది. తాజాగా జాబితాలను వీఆర్ఓలకు ఇచ్చి పరిశీలింపజేయిస్తున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి 16వ తేదీలోగా లబ్ధిదారుల వడపోత కార్యక్రమం పూర్తి కావాల్సి ఉంది. -
అస్తవ్యస్తం..గందరగోళం
గుడివాడ : ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ జాబితాలో రైతుల పేర్లు గల్లంతవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జాబితా విడుదలే అస్తవ్యస్తంగా ఉందని, ఫలితంగా తమపేరు ఎక్కడ ఉందో తెలుసుకోవటానికి నానా తంటాలు పడాల్సి వస్తోందని అంటున్నారు. ప్రస్తుతం విడుదల చేసిన జాబితాలో తమ పేర్లు లేవని తెలిసిన రైతులు భయాందోళనకు గురువుతున్నారు. నాలుగు నెలలుగా రుణమాఫీపై ఆశలు పెట్టుకుంటే తీరా పేరులేదని తెలిసిన రైతాంగం ఏంచేయాలో తెలియని స్థితిలో ఉంది. జిల్లా వ్యాప్తంగా 6.2 లక్షల మంది రైతులు రుణమాఫీ పరిధిలో ఉన్నారు. వీరిలో అనేకమంది పేర్లు జాబితాలో లేవని రైతులు పేర్కొంటున్నారు. రుణమాఫీ చేసి వడ్డీలు కూడా కడతామని చెబుతున్న ప్రభుత్వం తొలిదశలోనే పేర్లు లేకుండా చేయటంపై రైతులు మండిపడుతున్నారు. జాబితాలో తికమకలు.. ప్రభుత్వం రుణమాఫీ జాబితాలో రైతుల వివరాలు ఇంకా సేకరించాల్సి ఉన్నందున వారి వివరాలను ఈ నెల ఎనిమిదిన విడుదల చేసింది. ఈ జాబితా సోమవారం సాయంత్రానికి తహశీల్దార్ కార్యాలయాల నుంచి వీఆర్వోలకు చేరింది. జాబితాలోని రైతుల పేర్లు చూసి ఆయా రైతులు ఇంకా ఇవ్వాల్సిన వివరాలు పూర్తిచేసి పంపాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఇది రెండు రోజుల్లో పూర్తిచేసి ఇవ్వాలని చెప్పారు. రుణమాఫీ జాబితాలు అస్తవ్యస్తంగా ఉండటంతో రెండు రోజుల్లో వివరాలు పూర్తిచేసి పంపటం కష్టమని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. రుణమాఫీ జాబితాలో కొన్ని బ్యాంకుల వారీగా ఇవ్వగా మరికొన్ని ఎక్కడ భూమి ఉందో ఆప్రాంతంలో ఉన్న జాబితాలోకి వెళ్లాయి. గుడివాడకు చెందిన సుబ్బారావుకు ఉయ్యూరులో భూమి ఉంది. దీనిపై గుడివాడ ఎస్బీఐలో ఆయన రుణం పొందాడు. జాబితాలో మాత్రం భూమి ఉన్న ఉయ్యూరులోనే ఉంటుందని అధికారులు వివరణ ఇస్తున్నారు. మరికొన్నిచోట్ల బ్యాంకు ఆధారంగా జాబితా ఇవ్వటం గమనార్హం. ఏమేమి సేకరిస్తున్నారంటే... ప్రతి రైతూ తన ఆధార్, రేషన్ కార్డు నంబర్లు ఇవ్వాల్సి ఉంది. ఇవి లేకపోతే వాటిని రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు. ఇవిగాక ఆ కుటుంబంలో ఉన్న భార్య, పిల్లల ఆధార్ నంబర్లు, ఓటు గుర్తింపు కార్డు నంబర్లు తీసుకుంటున్నారు. ఇవన్నీ ఉంటేనే రుణమాఫీ జాబితాకు సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో ఉన్న కొద్దిపాటి మంది వీఆర్వోలు ఈ జాబితా సరిచేయటానికి ఇబ్బంది పడుతున్నారు. ఇంటింటా వివరాల సేకరణకు చాలా సమయం పడుతుందని వారంటున్నారు. కౌలు రైతులకు చోటులేదు... గుడివాడ పట్టణంలో విడుదలైన జాబితాలో కౌలు రైతుల పేర్లు లేవని చెబుతున్నారు. రుణాలు తీసుకున్నా బ్యాంకర్లు కౌలు రైతుల పేర్లు ఇవ్వని కారణంగా ఈ పరిస్థితి దాపురించినట్లు సమాచారం. బ్యాంకులకు ఇచ్చిన ఆన్లైన్ సాఫ్ట్వేర్లో కౌలు రైతు ఆప్షన్ లేకపోవటమే ఇందుకు కారణమని కొన్ని బ్యాంకుల వారు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ప్రతి రైతూ పైసా కట్టాల్సిన పనిలేదని చెప్పిన చంద్రబాబు రుణాలు రద్దుకు ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. -
రుణం చెల్లించాల్సిందే
సాక్షి, చిత్తూరు: రుణమాఫీ సంగతి దేవుడెరుగు. డ్వాక్రా రుణాలు తక్షణం వసూలు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సీఎం సొంత జిల్లాలో అటు వెలుగు అధికారులు ఇటు బ్యాంకర్లు వేర్వేరుగా డ్వాక్రా రుణాలను బల వంతంగా వసూలు చేస్తున్నారు. కాదూ కూడదంటే రుణం చెల్లించిన వారికే రుణమాఫీ అమలు చేస్తారని భయపెడుతున్నారు. పాతబకాయి తిరిగి చెల్లించకుంటే అధిక వడ్డీ వసూలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. రుణమాఫీ ఏమైందని ప్రశ్నిస్తే దాంతో మాకు సంబంధం లేదంటూ అధికారులు తప్పించుకుంటున్నారు. పాత బకాయి చెల్లిస్తేనే... పాత బకాయిలు చెల్లిం చకపోతే కొత్త రుణానికి జీరో వడ్డీ వర్తించదంటూ వెలుగు అధికారులు సంఘాల ను భయపెడుతున్నారు. సకాలంలో తిరిగి చెల్లిం చకపోతే ఐదు లక్షలకు నెలకు 5వేల వడ్డీ తప్పనిసరిగా చెల్లించాల్సిందేనంటూ అధికారులు తేల్చి చెబుతున్నారు. పాతబకాయిలు చెల్లించిన వారికే రుణమాఫీ వర్తిస్తుందని కొందరు వెలుగు అధికారులు అటు బ్యాంకు అధికారులు ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. రుణమాఫీలో భాగంగా ప్రభుత్వం ఇస్తామన్న లక్షపై మాత్రం అధికారులు నోరుమెదపడంలేదు. ప్రశ్నిస్తే దాని విషయం మాకు తెలియదు ప్రభుత్వం ఇచ్చినపుడు తీసుకోమంటూ, సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు. బాబువి మాయమాటలేనా? మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రంపైకి అక్కాచెల్లెళ్లు రుణాలు చెల్లించాల్సిన అవసరం లేదంటూ మాయమాటలు వల్లిస్తున్నారు. అన్నీ తానే కడతానంటూ మాటలతో మభ్యపెడుతుండడంతో డ్వాక్రా మహిళలు రుణాలు తిరిగి చెల్లించాలా వద్దా అనే మీమాంసలో పడ్డారు. సీఎం పైకి ఎన్ని మాటలు చెప్పినా రుణ వసూళ్లు పూర్తిచేయాలంటూ తమకు ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయంటూ వెలుగు అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి సొంతజిల్లాలో అధికంగా వసూళ్లుచేసి మెప్పు పొందేందుకు డ్వాక్రా రుణాల వసూళ్లలో అధికారులు కొంత కఠినంగా వ్యవహరిస్తూ బలవంత పు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 65 వేల వరకూ డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. దాదాపు 7 లక్షల 80 వేలమంది సభ్యులున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలోనే జిల్లాలో 230 కోట్ల రుణాలు ఇచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇవి కాకుండా 2013-14కు సంబంధించి 1387 కోట్లు రుణాలు ఇచ్చారు. ఇప్పటికే గ్రూపులు చెల్లించక పోవడంతో 154 కోట్ల బకాయిలు పెండింగ్లోపడ్డాయి. గడువు లోపు చెల్లించక నిలిచి పోయిన బకాయిలు మరో 55 కోట్లు ఉంది. మొత్తంగా ఈ ఏడాది ఇచ్చిన 230 కోట్లు కాక 1,596 కోట్ల బకాయిలు ఉన్నాయి. వీటిని తక్షణం వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లాలో బ్యాంకర్లు, వెలుగు అధికారులు డ్వాక్రా సంఘాలపై ఒత్తిడి పెంచి బలవంతంగా వసూళ్లకు దిగారు. ఇప్పటికే 60 శాతం బకాయిలు వసూలు చేశామంటూ అధికారులు హడావుడి చేస్తున్నారు. రూ.పది వేలు ఎప్పుడు ఇస్తారో మరోవైపు అక్కచెల్లెళ్లకు ఖర్చులకోసం ఒక్కో సభ్యురాలికి 10 వేలు ఉచితంగా ఇస్తానని ముఖ్యమంత్రి ఆర్భాటంగా ప్రకటించారు. ఈ విషయం జన్మభూమి సభల్లో పదేపదే చెబుతున్నారు. ఆ మొత్తాన్ని ఎప్పుడు ఇస్తారో మాత్రం చెప్పడంలేదు. జిల్లాలో 7లక్షల 80 వేలమంది సభ్యులకు ఒక్కొక్కరికీ 10 వేల వంతున మొత్తం 780 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. సీఎం మాటలు చెప్పడం తప్ప పైసా విదల్చలేదు. ఇది కూడా రుణమాఫీ మాదిరే ప్రచారార్భాటం తప్ప మరొకటి కాదని సంబంధిత అధికారులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తుండడం విశేషం. -
రుణ మాఫీ.. కుచ్చుటోపీ
నాడు... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో పాలనా పగ్గాలు చేపట్టగానే ఎటువంటి నిబంధనలు లేకుండా బ్యాంకులు తీసుకున్న రుణాలన్నీ, మెట్ట రైతులకు విద్యుత్ బకాయిలతో సహా ఒక్క సంతకంతో మాఫీ చేశారు. రాష్ట్రంలోని అందరి రైతుల్లానే సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు రెవెన్యూ గ్రామ పరిధిలోని రైతుల రుణాలు మాఫీ అయ్యాయి. అప్పుల ఊబి నుంచి బయటపడి అన్నదాతలు ఊపిరి పీల్చుకున్నారు. నేడు... ఎన్నికల వేళ రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీలు గుప్పించి అందలమెక్కిన చంద్రబాబు..రుణ మాఫీ చేస్తామంటూనే రోజుకో నిబంధనతో రైతులకు కుచ్చుటోపీ పెడుతున్నారు. ఆధార్కార్టు, రేషన్కార్డు, సర్వేనంబర్ల ఆన్లైన్, పట్టాదారు పుస్తకాల ఆన్లైన్ అంటూ ఆంక్షల వలయంలో రైతన్నను బంధించి రుణమాఫీకి దూరం చేశారు. ఫలితంగా కొమ్మాలపాడు రెవెన్యూ పరిధిలో 2,900 మంది రైతులు రూ.23 కోట్ల రుణమాఫీ కోల్పోయారు. సంతమాగులూరు: రోజుకో కొత్త నిబంధనతో సాధ్యమైనంత ఎక్కువ మందిని రుణమాఫీకి దూరం చేయాలన్న సర్కారు పన్నాగానికి వేలాది మంది రైతులు నష్టపోతున్నారు. కొమ్మాలపాడు రెవెన్యూ గ్రామ పరిధిలోని అగ్రహారం భూములు సాగు చేసుకుంటున్న రైతులే దీనికి నిదర్శనం. రైతుల సాగుభూములు వారిపేర్లతో ఆన్లైన్ చేయని కారణంతో ఆ రెవెన్యూ పరిధిలోని కొమ్మాలపాడు, మక్కెనవారిపాలెం, సజ్జాపురం, బల్లికురవ మండలం చెన్నుపల్లి గ్రామాలకు చెందిన 2,900 మంది రైతులు రూ.23 కోట్ల మేర రుణమాఫీ సదుపాయాన్ని కోల్పోతున్నారు. రుణమాఫీపై ఆంక్షలు ఎత్తివేసి బ్యాంకులు పంట రుణాలు అందజేసిన అందరికీ మాఫీ వర్తింపజేయాలని రైతు సంఘాల నాయకులు, వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కొమ్మాలపాడు కథ ఇదీ... స్వాతంత్య్రానికి పూర్వం కొమ్మాలపాడు గుంటూరు జిల్లా పరిధిలో ఉండేది. అప్పట్లో ఈ ప్రాంతం జాగర్లమూడి కుప్పుస్వామి జమీందారిలో సర్వే నంబరు 1 నుంచి 230 వరకు 4,874 ఎకరాలు ఉండేది. స్వాతంత్య్రానంతరం జమీన్దారులకు ఏటా కప్పం కడుతూ సాగు చేసుకుంటున్న భూములు రైతుల ఆధీనమయ్యాయి. అయితే భూములు సాగు చేసుకుంటున్న వారి పేర్లు రికార్డుల్లో నమోదు కాలేదు. 1972లో ప్రకాశం జిల్లా ఆవిర్భావంతో సంతమాగులూరు సమితి ప్రాంతం గుంటూరు జిల్లా నుంచి విడిపోయి ప్రకాశంలోకి వచ్చింది. మండలాల ఏర్పాటుకు పూర్వమే కొమ్మాలపాడు రెవెన్యూ గ్రామ పరిధిలోని భూముల్లో సాగులో ఉన్న రైతులు తమ భూములు రీ సర్వే జరిపి యాజమాన్య హక్కులు కల్పించాలని అనేకమార్లు అధికారులకు మొరపెట్టుకున్నారు. అయినా ఫలితం శూన్యం. అయితే రైతువారీగా పంటల వివరాలను, అడంగల్లో అనుభవదారులైన రైతుల పేర్లు ఏటా నమోదు చేస్తున్నారు. బ్యాంకులు కూడా రెవెన్యూ అధికారులు జారీ చేసే అడంగల్ ఆధారంగా ఆయా రైతులకు పంటరుణాలు మంజూరు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి చేసిన రుణమాఫీలో కొమ్మాలపాడు రెవెన్యూ పరిధిలోని రైతులందరికీ రుణాలు పూర్తిగా మాఫీ అయి రుణవిముక్తులయ్యారు. తాజాగా రుణమాఫీకి అర్థ రహితమైన నిబంధనలు పెట్టడంతో వీరంతా రుణమాఫీ జాబితాలోకి రావడం లేదు. ఈ భూములన్నీ అగ్రహారం భూములని రెవెన్యూ రికార్డుల్లో ఉండటం, రైతు ఖాతాలు ప్రారంభించకపోవడం, ఖాతాలు లేనిదే కంప్యూటర్ అడంగల్ నమోదు కాకపోవడం, అడంగల్కు ఆధార్కు రుణమాఫీకి లింకు పెట్టడంతో వీరంతా రుణమాఫీ ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు. ఈ విషయమై ఇటీవల జరిగిన సంతమాగులూరు మండల పరిషత్ సమావేశంలో సభ్యులు తమ ఆవేదనను వ్యక్తపరచారు. తక్షణమే నిబంధనలు సడలించి కొమ్మాలపాడు రెవెన్యూ పరిధిలోని రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
రుణమాఫీ పేరిట రైతులకు ఉరితాడు: గుత్తా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రుణమాఫీ పేరిట రైతుల మెడకు ఉరితాళ్లు వేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీని శనివారం ఆయన కలిశారు. అనంతరం గుత్తా మీడియాతో మాట్లాడుతూ రోజూ కేసీఆర్, చంద్రబాబు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు.. ఇద్దరూ సమస్యల పరిష్కారానికి కృషిచేయకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని చెప్పారు. వీరిద్దరి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని వారికి తగిన బుద్ధిచెబుతారన్నారు. -
ముందు హామీలు అమలు చేయండి!
రైతులను మళ్లీమళ్లీ మోసపుచ్చకండి: సీఎంకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి హైదరాబాద్: రైతుల ప్రయోజనాల కోసమంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటిదాకా ఇచ్చిన ఏ హామీ అమలు చేసి చూపించారని కొత్తగా ‘హరిత’ పథకం ప్రకటిస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. సీఎం చంద్రబాబు దయచేసి ఆత్మవంచన చేసుకోకుండా ఆత్మవిమర్శ చేసుకొని పథకాల ప్రకటన చేయాలని పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి హితవు పలికారు. శుక్రవారం పార్టీ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఇప్పటికే ఎన్నికల ముందిచ్చిన రైతు రుణాల మాఫీ హామీ అమలు పక్కకు పోయింది.. మేనిఫెస్టోలో ప్రకటించినట్టు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలుకు నోచుకోలేదు.. ఐదు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు ఊసే లేదు.. ఎప్పటికప్పుడు ప్రజలను, రైతులను మోసం చేసే కార్యక్రమాలతో సీఎం ముందుకు సాగుతున్నారు’’ అని దుయ్యబట్టారు. రైతుల్ని అప్పులపాలుచేశారు.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతుల రుణాలు రద్దు కాకపోగా, వారు అప్పు కోసం ప్రైవేట్ వ్యాపారుల బారిన పడేలా చేశారని, మొన్నటి వరకు జీరో శాతంతో వడ్డీ రుణాలు పొందిన రైతు నెత్తిన ఇప్పుడు 14 శాతం వడ్డీ భారం పెట్టారని నాగిరెడ్డి దుయ్యబట్టారు. కొత్త రాజధాని ఏర్పాటు కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కావాల్సినంత అటవీ భూమి అందుబాటులో ఉన్నప్పటికీ సన్న, చిన్నకారు రైతులకు చెందిన 30 వేల ఎకరాలు రాజధాని కోసమని బలవంతంగా లాక్కొంటున్నారని విమర్శించారు. తనను చూస్తేనే కరువు పారిపోతుందని బాబు చెప్పుకుంటుంటే ఆయన అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రలో మూడు జిల్లాల్లో పంట తుపానుకు కొట్టుకుపోయిందని, మిగిలిన జిల్లాల్లో కరువు విలయతాండవం చేస్తోందని దుయ్యబట్టారు. -
ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన
గండేపల్లి : రుణమాఫీని తప్పక చేస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీ తోట నరసింహం ప్రకటించారు. శుక్రవారం మండలంలోని మురారి జెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల్లో ఉందని అయినా డ్వాక్రా, రైతు రుణాల మాఫీని ప్రభుత్వం చేస్తుందన్నారు. గత యూపీఏ ప్రభుత్వంలో రూ. 60 వేల కోట్ల రుణమాఫీ చేయగా, రాష్ట్రంలో 13 జిల్లాలకు కలిపి రూ.40 వేల కోట్లు రుణమాఫీ చేస్తున్నట్టు తెలిపారు. రూ.లక్షా 50వేల కోట్ల రుణమాఫీకి ముందుగా 20 శాతం ఇచ్చి, మిగిలిన 80 శాతానికి సర్టిఫికెట్లు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. అనంతరం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విఫ్ చైతన్యరాజు, ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, బీసీ సెల్ అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే పి.చిట్టిబాబు, ఎంపీపీ డి.సుశీల, వైస్ ఎంపీపీ పోతుల మోహనరావు, జెడ్పీటీసీ ఎర్రంశెట్టి వెంకటలక్ష్మి, సర్పంచ్ బులి వీరమ్మ, కందుల కొండయ్యదొర, గోదావరి డైయిరీ చైర్మన్ కొడాలి చంటిబాబు, జ్యోతుల చంటిబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, ఆర్డీఓ వి. విశ్వేశ్వరరావు, ఎంపీడీఓ కె. రమేష్, తహశీల్దార్ రామారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో 36 కొత్త పింఛన్లు అందజేశారు. బ్యాంకు సేవలను సద్వినియోగపర్చుకోవాలి బ్యాంకు సేవలను సద్వినియోగపరచుకోవాలని గండేపల్లి కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ కొక్కిరి మహాలక్ష్మి జన్మభూమి కార్యక్రమంలో గ్రామస్తులకు తెలిపారు. జన్ధన్ బ్యాంకు ఖాతాలను ప్రారంభించారు. పింఛను లబ్ధిదారుల ఇబ్బందులు ఉదయం పదిగంటలకు ప్రారంభం కావాల్సిన ఈ కార్యక్రమానికి మంత్రులు, అధికారులు ఆలస్యంగా వచ్చారు. దీంతో లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. -
ఇదేమి మెలిక?
మోర్తాడ్: ఇప్పటి వరకు తీసుకున్న పంట రుణం పై 30 శాతం రుణం హెచ్చింపు చేసి కొత్త రుణం ఇవ్వాలని ప్రభుత్వం సహకార సంఘాలు, బ్యాంకులను ఆదేశించింది. దీంతో రైతు కు ఉన్న రుణంపై 30 శాతం ఎక్కువ రుణం ఇవ్వాల్సి ఉంది. అంటే మాఫీ అయిన 25 శాతం సొమ్ముతోపాటు అదనం గా మంజూరు అయ్యే రుణం రైతుకు అందాలి. అయితే సింగిల్ విండోల అధికారులు గతంలో లేని నిబంధనలను ఇప్పుడు ఉన్నట్లు చూపుతూ రైతులకు మొండి చెయ్యి చూపుతున్నారు. రిజర్వు బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పంట రుణాలకు టైటిల్ డీడ్ను కాని, పట్టాదారు పాసు పుస్తకాన్ని తనఖా ఉంచుకోకూడదు. అయిన్పటికీ టైటిల్ డీడ్లను తనఖా ఉంచాలని స ంఘాల ఉద్యోగులు పట్టుబడుతున్నారు. గతంలో ఏం జరిగింది? గతంలో సహకార సంఘాలలో రైతులు రుణాలు తీసుకున్నప్పుడు టైటిల్ డీడ్లను తనఖా ఉంచుకోలేదు. తక్కువ మొత్తంలోనే రుణం లభిస్తుండటంతో పహాణి అందించి, మరొక రైతు జామీనుతో రుణం పొందారు. రైతుకు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నా సహకార సంఘాలు రూ. 60 వేలకు మించి రుణం ఇవ్వలేదు. వాణిజ్య బ్యాంకులలో ఎకరానికి రూ. 50 వేల చొప్పున పంట రుణం ఇచ్చారు. ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న రైతులు సహకార సంఘాల్లో పహాణిలను ఇచ్చి పంట రుణం తీసుకున్నారు. వాణిజ్య బ్యాంకులలో టైటిల్ డీడ్ తనఖా ఉంచి ఎక్కువ పంట రుణం తీసుకున్నారు. సహకార సంఘాలలో ఎంత రుణం ఉన్నా తమ భూమిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో సింపుల్ మార్టిగేజ్ చేసి ఇచ్చారు. పంట రుణాలకు సంబంధించి సహకార సంఘాలు, బ్యాంకులు సిం పుల్ మార్టిగేజ్ చేసుకోవాలని టైటిల్ డీడ్ తనఖా పెట్టుకోరాదని రిజర్వు బ్యాంకు గతంలో జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొంది. బ్యాం కర్లు మాత్రం రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలను కాదని టైటిల్ డీడ్ తనఖాకు మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడేం చేస్తున్నారు జిల్లాలో 142 సహకార సంఘాలు ఉన్నాయి. దాదాపు రెండు లక్షల మంది రైతులకు రూ.320 కోట్ల రుణం మాఫీ లభించింది. సర్కారు తొలి విడతగా 25 శాతం నిధు లను విడుదల చేయడంతో సహకార సంఘాలకు రూ. 80 కోట్ల మాఫీ సొమ్ము జమ అయ్యింది. అక్కడ రైతులు ఎప్పటికప్పుడు వడ్డీ చెల్లించి రుణాలను రెన్యూవల్ చే సుకున్నారు. దీంతో రైతులకు మాఫీ సొమ్ము చేరాల్సి ఉంది. ఎక్కువ మంది రైతులు టైటిల్ డీడ్లను తనఖా ఉంచడం లేదనే కారణంతో మాఫీ సొమ్ము రైతుల చేతికి అందకుండా రుణంలోనే మినహాయిస్తున్నారు. గతంలో లేని నిబంధనలను ఇప్పుడు సాకుగా చూపుతూ కొత్త రుణాలను ఇవ్వక పోవడంతో రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ భూమి ఎక్కువ ఉన్నా సహకార సంఘాలలో తక్కువ పంట రుణం లభించడంతోనే తాము మళ్లీ వాణిజ్య బ్యాంకులపై ఆధారపడాల్సి వస్తోందని పలువురు రైతులు పేర్కొంటున్నారు. సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకులలో ఎంత రుణం ఉన్నా ఒక రైతు కుటుంబానికి ప్రభుత్వం రూ. లక్ష పంట రుణం మాత్రమే మాఫీ చేస్తుంది. సహకార సంఘాలు రుణాలను రెన్యూవల్ చేయకపోవడంతో చిన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువగా వ్యవసాయం ఉన్న రైతుకు ఎలాంటి ఇబ్బంది లేదు. చిన్న, సన్నకా రు రైతులకు మాత్రం కొత్త నిబంధనలు ఇబ్బంది పెడుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి సహకార సంఘాలలో సభ్యు లైన రైతులకు కొత్త రుణాలు ఇప్పించడానికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
ఆర్భాటం ఫుల్.. ప్రాధాన్యత నిల్
ప్రారంభానికే పరిమితమైన రైతు సాధికార సంస్థ ఖరారు కాని విధివిధానాలు అధికారులనూ నియమించలేదు రుణమాఫీ గురించి తెలియదంటున్న డిప్యుటేషన్ అధికారులు విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన రైతు సాధికార సంస్థకు తగిన ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. గత నెల 21న గన్నవరంలో ఈ సంస్థను ఏర్పాటుచేయగా, ఇప్పటివరకు కార్యకలాపాలు కూడా ప్రారంభం కాలేదు. ఈ సంస్థను రుణమాఫీ కోసమే కాదు.. రైతు ఎంపవర్మెంట్ కోసం కూడా వినియోగిస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు ఇక్కడ పర్మినెంట్ అధికారులు, ఉద్యోగులను కూడా నియమించలేదు. మౌలిక సదుపాయాలు కల్పించలేదు సరికదా విధివిధానాలు కూడా ఖరారు చేయలేదు. దీంతో రుణమాఫీపై సందేహాలు తీర్చుకునేందుకు వివిధ జిల్లాల నుంచి నిత్యం వస్తున్న రైతులకు సమాచారం ఇచ్చే నాథుడే కరువయ్యాడు. రైతుసాధికార సంస్థకు సంబంధం లేకుండానే రుణమాఫీ లబ్ధిదారుల జాబితాలను బ్యాంకర్లు సిద్ధం చేశారు. దీంతో ఈ సంస్థను ఎందుకు ఏర్పాటుచేశారని పలువురు రైతు నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. లక్ష్యాలు ఇవీ... రైతులకు ప్రభుత్వం అందించే సాయాన్ని రైతుసాధికార సంస్థ ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించారు. తొలిగా రుణమాఫీని ఈ సంస్థ ద్వారానే అమలుచేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. తొలి విడత రుణమాఫీ కోసం రూ.5 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ మేరకు జీవో కూడా విడుదల చేశారు. కానీ, ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. రుణమాఫీ సొమ్మును ఈ నెల 15 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు రైతుసాధికార సంస్థకు ఒక్క రూపాయి కూడా అందకుండా తమ ఖాతాల్లో డబ్బు ఎలా జమచేస్తారని రైతులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. చెప్పిందొకటి.. జరుగుతున్నది మరొకటి.. రాష్ట్రంలోని రైతులకు సంబంధించిన ప్రతి అంశం రైతుసాధికార సంస్థ ద్వారానే నెరవేరుస్తామని పాలకులు ప్రకటించారు. రుణమాఫీని ఈ సంస్థ ద్వారానే ప్రతిష్టాత్మకంగా చేపడతామని చెప్పారు. ఆచరణలో మాత్రం ఈ సంస్థను అసలు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. రుణమాఫీకి అర్హులైన వారి జాబితాలను రూపొందించాలని ప్రభుత్వం కొన్ని నిబంధనలను బ్యాంకులకు పంపాయి. ఈ మేరకు బ్యాంకర్లు నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి పంపారు. మళ్లీ కొన్ని మార్పులు చేశారు. ఎట్టకేలకు తుది జాబితాను సిద్ధమైంది. దీంతో రైతుసాధికార సంస్థకు ఎటువంటి ప్రాధాన్యతా ఇవ్వలేదని, బ్యాంకర్లకు నచ్చినట్టే జాబితాలు రూపొందించారని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. క్లారిటీ లేదు... ఇటీవల ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి ఓ రైతు గన్నవరంలోని రైతు సాధికార సంస్థకు వచ్చారు. తాను రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో తెలంగాణ జిల్లాలో బ్యాంకు నుంచి వ్యవసాయ రుణం పొందానని తెలిపారు. ఇప్పుడు రుణం చెల్లించాలని ఆ బ్యాంకు మేనేజర్ ఒత్తిడి చేస్తున్నారని, రుణమాఫీతో తమకు సంబంధం లేదని స్పష్టంగా చెబుతున్నారని, తన రుణం మాఫీ అవుతుందో లేదో చెప్పాలని ఆయన రైతు సాధికార సంస్థ అధికారులను కోరారు. వాస్తవానికి రైతు సాధికార సంస్థ విధివిధానాలు ఖరారు కాలేదని, రుణమాఫీ విషయంలో తమకు కూడా క్లారిటీ లేదని అధికారులు బదులిచ్చారు. అంతటితో ఆగక.. ‘గతం వేరు. ఇప్పుడు వేరు. ఇప్పటి లెక్కప్రకారం మీరు వేరే రాష్ట్రంలో అప్పు తీసుకున్నట్టే. కాబట్టి రుణమాఫీ అయ్యే అవకాశం లేదు’ అని చెప్పడంతో సదరు రైతు కంగుతిన్నాడు. ఇలా నిత్యం ఇక్కడికి వచ్చే రైతులకు సరైన సమాధానం లభించక అసంతృప్తితో తిరిగి వెళుతున్నారు. అంతా డిప్యుటేషన్ పైనే.. ప్రస్తుతం వ్యవసాయ శాఖ నుంచి జేడీ, ఏడీ స్థాయి అధికారులు తొమ్మిది మంది డిప్యుటేషన్పై రైతుసాధికార సంస్థకు వచ్చారు. వ్యవసాయ శాఖ డెప్యూటీ డెరైక్టర్ హోదా కలిగిన అధికారిని ఇన్చార్జిగా నియమించారు. వీరంతా రాష్ట్రంలోని 13 జిల్లాల వ్యవసాయ శాఖ, ఇతర అనుబంధ కార్యాలయాల నుంచి సమాచారం సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వ్యవసాయశాఖ జేడీ, పశుసంవర్థక శాఖ జేడీ, ఆత్మ ప్రాజెక్ట్ పీడీ, ఉద్యానవన శాఖ, మార్కెటింగ్, సహకార శాఖ జిల్లా కార్యాలయాల అధికారుల ఈ-మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. వారి వద్ద ఉన్న సమచారాన్ని తమకు పపాలని కోరుతున్నారు. తమ వద్ద ఉన్న వివరాలను జిల్లా కార్యాలయాలకు పంపిస్తున్నారు. వాస్తవానికి రైతుసాధికార సంస్థను రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసినందు వల్ల పర్యవేక్షణ కోసం ఐఏఎస్ అధికారిని నియమించాల్సి ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. జాబితాలు బ్యాంకుల్లో.. ఫిర్యాదులు తహశీల్దార్ కార్యాలయాల్లో..! ఈ నేపథ్యంలో రుణమాఫీకి అర్హుల జాబితాలను బ్యాంకుల్లో పెడతారు. వాటిపై అభ్యంతరాలు, ఫిర్యాదులను తహశీల్దార్ కార్యాలయాల్లో అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అయితే రుణం ఎందుకు మాఫీ కాలేదనే విషయం బ్యాంకర్లకు తెలుస్తుందని, కాని తహశీల్దార్ కార్యాలయ సిబ్బందికి ఎలా తెలుస్తుందని, గందరగోళానికి గురిచేసేందుకే ప్రభుత్వం ఇటువటి నిర్ణయాలు తీసుకుంటోందని రైతులు మండిపడుతున్నారు. -
రుణమాఫీ జాబితాలు విడుదల
తహశీల్దార్ల వెబ్సైట్లకు పంపిన ప్రభుత్వం 7,600 పేజీలతో జాబితా నేడు పంచాయతీ కార్యాలయాలకు మచిలీపట్నం : పంట రుణమాఫీకి సంబంధించిన జాబితాలను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. వాటిని అన్ని మండల తహశీల్దార్ల వెబ్సైట్లకూ పంపింది. రుణమాఫీకి సంబంధించి అర్హుల జాబితాను తయారుచేసిన ప్రభుత్వం దాని వివరాలను తహశీల్దార్ కార్యాలయ వెబ్సైట్కు పంపి, అక్కడి పాస్వర్డ్తోనే ఓపెన్ అయ్యేలా ఏర్పాటు చేసింది. ఈ జాబితా 7,600 పేజీల్లో ఉందని పలువురు తహశీల్దార్లు తెలిపారు. రుణమాఫీకి సంబంధించిన మండలం.. అందులోని రెవె న్యూ గ్రామాల వారీగా ప్రకటించినట్లు పేర్కొన్నారు. రుణం తీసుకున్న రైతు పేరు, ఏ బ్యాంకులో తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, రైతు పేరున ఉన్న భూమి వివరాలు ఈ జాబితాలో ఉన్నాయని తహశీల్దార్లు వివరించారు. ఈ జాబితాను శనివారం ఆయా గ్రామాలకు పంపుతామని.. పంచాయతీ కార్యాలయాల్లో వీటిని ప్రదర్శించనున్నామని వారు వివరించారు. 20 శాతమే నగదు జమ... ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించిన జాబితాను ప్రకటించటంతో అందులో ఎంతమంది పేర్లు ఉన్నాయి. ఎవరెవరి పేరున ఎంత రుణమాఫీ జరిగింది అనే అంశంపై రైతుల్లో ఉత్కంఠ నెలకొంది. పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక కుటుంబానికి రూ.1.50 లక్షలు మాత్రమే రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఈ జాబితాలో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయా లేదా అనే అంశంపైనా పలువురు చర్చించుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వం రుణమాఫీ కింద మంజూరు చేయనున్నట్లు ప్రకటించిన రూ.5 వేల కోట్ల నగదును ఒక్కొక్క రైతు పేరున ఉన్న బకాయిలో 20 శాతం మేర జమ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంతా మాయేనా... ఎన్నికల ప్రచారంలో వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదవీ స్వీకారం రోజున వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేస్తామని ప్రకటించారు. దీంతో పాటు రుణమాఫీ ఫైలు పైనే తొలి సంతకం చేస్తామని ఈ ప్రకటనల్లో వివరించారు. ప్రమాణస్వీకారం చేసే సమయంలో రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసేందుకు కోటయ్య కమిటీని నియమిస్తున్నట్లు సంతకం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వ్యవసాయ రుణాలు రైతులెవ్వరూ కట్టవద్దని, బంగారం తాకట్టు పెట్టిన రుణాలు తీసుకుంటే ఆ రుణాలు చెల్లించి మీ బంగారం మీ ఇంటికే తీసుకువచ్చి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ కాలక్రమేణా అరటి, పసుపు, మిర్చి, కూరగాయలు, పూలతోటలు తదితర ఉద్యానవన పంటలకు రైతులు తీసుకున్న రుణాలను రుణమాఫీ జాబితాను తొలగించారు. మహిళల పేరుతో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలే రద్దవుతాయంటూ మెలిక పెట్టారు. పట్టాదారు పాస్పుస్తకం ఉండాలని, ఆధార్ కార్డు, అడంగల్ కాపీలు ఈ వివరాలు ఉండాలని ఆంక్షలు విధించారు. ఖరీఫ్ సీజన్ పూర్తయ్యే దశలో ఉన్నా ఇంతవరకు రైతులకు రుణాలు ఇప్పించటంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం నిర్లక్ష్యానికి తోడు వరుణుడు కరుణించకపోవటంతో రైతులు పంటలు ఎండిపోయి దిగుబడులు ఆశించిన మేర రావని ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రుణాలు సకాలంలో చెల్లించకపోవటంతో వడ్డీ లేని పంట రుణాలు తీసుకున్న రైతులు నేడు 14 శాతం వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. సకాలంలో వడ్డీ చెల్లిస్తే రైతులు చెల్లించిన వడ్డీలో మూడు శాతం ఇన్సెంటివ్గా కేంద్ర ప్రభుత్వం భరించే అవకాశం ఉండేది. దీనిని రైతులు కోల్పోయారు. బ్యాంకుల ద్వారా పంట రుణాలు అందకపోవడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు చేసి మరీ పంటలు సాగు చేశారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకోకపోవటంతో పంట బీమా సొమ్ము చెల్లించని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవటం, రైతులు తీసుకున్న రుణాలు మార్చి 31లోపు చెల్లించకపోవటంతో రుణాలు తీసుకున్న రైతులంతా డిఫాల్టర్లుగా మారారు. ఇలాంటి స్థితిలో ప్రస్తుతం రుణమాఫీకి సంబంధించిన జాబితాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జాబితాల్లోని వివరాలు బయటపడితే ప్రభుత్వం రుణమాఫీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలిసే అవకాశం ఉంది. బ్యాంక్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విజయవాడ సిటీ : నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని కొత్తపేట, సూర్యారావుపేట, నున్న, పటమట పోలీసు స్టేషన్ల పరిధిలో భారతీయ స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రొబేషనరీ ఆఫీసర్స్ (పీఓ) పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ నగర పోలీసు కమిషనర్, మెట్రోపాలిటన్ ప్రాంత అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఎ.బి.వెంకటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 9, 15, 23, 29, 30 తేదీల్లో ఈ ఉత్తర్వులు ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. పరీక్షలు అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఉత్తర్వులు జారీ చేసినట్టు కమిషనరేట్ అధికారులు తెలిపారు. సెక్షన్ 144 అమలులో ఉన్నందున పరీక్షలు జరిగే రోజుల్లో.. పరీక్షా కేంద్రాలకు 250 మీటర్ల పరిధిలో ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడరాదని, కర్రలు, రాళ్లు సహా మారణాయుధాలు కలిగి ఉండరాదని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు తెరిచి ఉంచరాదని వివరించారు. -
వంచక పాలనపై కన్నెర్ర
జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కదంతొక్కారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు అన్నదాతలు, డ్వాక్రా మహిళలకు ఎలాంటి షరతులూ లేకుండా రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించారు. అన్నదాతలకు బాసటగా నిలిచి రైతులకు రుణమాఫీ చేసేవరకు పోరుబాట సాగించాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులు కదనోత్సాహంతో ఉద్యమబాట పట్టారు. విజయవాడ నగరంతో పాటు జిల్లాలోని 13 నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు ధర్నాలకు నేతృత్వం వహించారు. * రుణమాఫీలో మోసాలపై మండిపాటు * అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ * అన్నదాతలు, డ్వాక్రా మహిళలకు బాసట * వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు * పాల్గొన్న పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు * ధర్నాలకు వెల్లువెత్తిన ప్రజాస్పందన సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో బుధవారం ర్వహించిన ధర్నాలకు ప్రజాస్పందన వెల్లువెత్తింది. గ్రామీణ ప్రాంతాల్లో అన్నదాతలు స్వచ్ఛందంగా తరలివచ్చి ధర్నాలను విజయవంతం చేశారు. రైతులు, రైతు కూలీలు, డ్వాక్రా మహిళలు ధర్నాకు తరలివచ్చి ప్రస్తుత ప్రభుత్వంలో తమకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పారు. ఎన్నికల ముందు రుణాలన్నీ రద్దు చేస్తామని ఒకటికి పదిసార్లు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికలయ్యాక రుణమాఫీ నుంచి పూర్తిగా తప్పుకొంటున్నారని పార్టీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబునాయుడు రుణమాఫీ హామీ అమలు చేయకుండా కమిటీల పేరుతో కాలక్షేపం చేస్తూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని వారు విమర్శించారు. ప్రభుత్వం మెడలు వంచైనా సరే రుణమాఫీ అమలు చేసేలా ఉద్యమం కొనసాగిస్తామని నేతలు స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల విషయంలో అనుసరిస్తున్న తీరుపై నేతలు నిప్పులు చెరిగారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించి, శాంతియుతంగా నిరసన తెలిపి మండల కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. విజయవాడ నగరంలో... స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) మాట్లాడుతూ నయవంచనకు, నమ్మకద్రోహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యాయపదం అని విమర్శించారు. అధికారం కోసం చంద్రబాబు అడ్డదారులు తొక్కి.. ఏ గడ్డిఅయినా కరుస్తారని రుణమాఫీ ద్వారా మరోసారి రుజువైందన్నారు. ఎన్నికల ముందు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని ధ్వజమెత్తారు. రైతులకు లక్ష కోట్ల రుణమాపీ చేస్తామని చెప్పి కేవలం ఐదు వేల కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించారని విమర్శించారు. అదేమంటే రాష్ట్రం ఇబ్బందికర పరిస్థితిలో ఉందని చెపుతున్నారన్నారు. చంద్రబాబు తన కిడ్నీలు అమ్మి అయినా రైతులకు రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్ఖాన్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, ట్రేడ్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు గౌతమ్రెడ్డి మాట్లాడుతూ అధికారం కోసం చంద్రబాబు గత ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసగించారన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మాట్లాడారు. జిల్లా అంతటా సమరశంఖం... * పామర్రులో నియోజకవర్గ ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్లీడర్ ఉప్పులేటి కల్పన నేతృత్వంలో పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి ఎన్నికల హామీలను విస్మరిస్తే ప్రజలు క్షమించరని కల్పన హెచ్చరించారు. నియోజకవర్గంలోని మొవ్వ, తోట్లవల్లూరు, పమిడిముక్కల, పెదపారుపూడి మండలాల్లో ధర్నాలు నిర్వహించారు. * నూజివీడులో సబ్కలెక్టర్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తీరుపై ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలోని ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు మండలాల్లో పార్టీ శ్రేణులు ధర్నాలు నిర్వహించాయి. * తిరువూరు నియోజకవర్గంలో తిరువూరు, విస్సన్నపేట, ఎ.కొండూరు, గంపలగూడెం తదితర మండలాల్లో జరిగిన ధర్నాల్లో ఎమ్మెల్యే రక్షణనిధి పాల్గొన్నారు. ఎన్నికల హామీల విషయంలో ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. * జగ్గయ్యపేట నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త సామినేని ఉదయభాను నేతృత్వంలో పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. వత్సవాయి మండలంలో జరిగిన ధర్నాలోనూ ఉదయభాను పాల్గొన్నారు. పెనుగంచిప్రోలు ధర్నాలో వైఎస్సార్ సీపీ విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, భాను పాల్గొన్నారు. * మచిలీపట్నంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని నాని నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు తీరును పేర్ని నాని ఖండించారు. * మైలవరంలో నియోజకవర్గ సమనయ్వకర్త జోగి రమేష్ నేతృత్వంలో ధర్నాలు నిర్వహించారు. జోగి రమేష్ మైలవరం, జి.కొండూరు మండలాల్లో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం, రెడ్డిగూడెం మండలాల్లో పార్టీ నేతల ఆధ్వర్యంలో ధర్నాలు జరిగాయి. * అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్బాబు నేతృత్వంలో ఘంటసాల, చల్లపల్లి మండలాల్లో ధర్నాలు జరిగాయి. అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక, కోడూరు మండలాల్లో పార్టీ నేతలు ధర్నాలు నిర్వహించారు. * కైకలూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్తలు ఉప్పాల రాంప్రసాద్, దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నాలు జరిగాయి. ముదినేపల్లిలో ఉప్పాల రాంప్రసాద్, కైకలూరులో దూలం నాగేశ్వరరావు పాల్గొన్నారు. కలిదిండిలో నేతలు ధర్నా నిర్వహించారు. * నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు నేతృత్వంలో పార్టీ కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేశారు. కంచికచర్ల మండలంలో పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. * పెడనలో నిర్వహించిన ధర్నాలో పార్టీ సమన్వయకర్తలు బూరగడ్డ వేదవ్యాస్, ఉప్పాల రాంప్రసాద్ పాల్గొన్నారు. బంటుమిల్లి, గూడూరు, కృతివెన్ను మండలాల్లో ధర్నాలు జరిగాయి. * గుడివాడ నియోజకవర్గంలో ఆర్డీవో కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో నేతలు ధర్నాలు చేపట్టారు. * గన్నవరం నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు నేతృత్వంలో బాపులపాడులో ధర్నా నిర్వహించారు. ఉంగుటూరు, గన్నవరం, విజయవాడ రూరల్ మండలాల్లో నేతలు ధర్నాలు జరిపారు. రుణమాఫీ పేరుతో దగా చేశారు : సారథి పెనమలూరు : నియోజకవర్గంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి నేతృత్వంలో మూడు మండలాల్లో ధర్నాలు నిర్వహించారు. ఆయా ధర్నాల్లో సారథి, పార్టీ జెడ్పీ ఫ్లోర్లీడర్ తాతినేని పద్మావతి పాల్గొని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సారథి మాట్లాడుతూ ఎన్నికల చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీ నేటివరకు అమలు చేయక వారిని దగా చేశారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలకు జగన్మోహన్రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని కోరిక ఉన్నా.. చంద్రబాబునాయుడు రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించటంతో టీడీపీకి ఓట్లు వేశారన్నారు. తాను గెలిచిన తరువాత మొదటి సంతకం రుణాలమాఫీపై అని చంద్రబాబు చేసిన ప్రకటనలు ప్రజలు నమ్మారని వివరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు నిజస్వరూపం బయటపడిందన్నారు. 87 వేల కోట్ల రుణమాఫీ కావాల్సి ఉండగా.. రోజుకో మాట చెబుతూ రైతు సాధికార సంస్థ ఏర్పాటుచేసి కేవలం రూ.5 వేల కోట్లు కేటాయించారన్నారు. ఆ నిధులు కూడా రైతులకు అందజేయడానికి రోజుకో నిబంధన పెడుతూ కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిధులతో రైతుల వడ్డీలు కూడా తీరవన్నారు. డ్వాక్రా మహిళలు కూడా చంద్రబాబు మాటలు నమ్మి రుణాలు చెల్లించలేదని చెప్పారు. నేటివరకు వారి రుణాలపై ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. రైతులు, డ్వాక్రా మహిళలు రుణ విముక్తి అయ్యేవరకు జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. -
చంద్రబాబు వంచక పాలనపై నేడే ఉద్యమ శంఖం
మూడు దశల్లో నిర్వహిస్తాం: వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు విషయంలో ఎప్పటికప్పుడు ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బుధవారం నుంచి మూడు నెలల పాటు మూడు దశల్లో ఆందోళనలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ, పింఛన్లలో కోత, హుద్హుద్ తుపాను బాధితుల సమస్యలే ఎజెండాగా ఈ ఆందోళనలు సాగుతాయని తెలి పారు. బుధవారం రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేస్తామన్నారు. వచ్చే నెల 5వ తేదీన అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేస్తామని చెప్పారు. జనవరి 6, 7 తేదీల్లో రెండు రోజులపాటు స్వయంగా తానే గోదావరి జిల్లాల్లో ఏదో ఒక చోట నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు. రైతులు, డ్వాక్రా మహిళలు, ప్రజలందరూ ఆందోళనలను జయప్రదం చేయాలని జగన్ పిలుపునిచ్చారు. పార్టీ నేతలు ఎంవీ మైసూరారెడ్డి, సోమయాజులు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి జగన్మోహన్రెడ్డి మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు మాటలు నమ్మి బ్యాంకు రుణాలు చెల్లించని రైతులకు ఇప్పుడు అపరాధ వడ్డీ రూపేణా 28 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిం దని, డ్వాక్రా మహిళలు దాచుకున్న పొదుపు సొ మ్ము నుంచి వడ్డీ చెల్లించుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికలప్పుడు పింఛనుదారులందరికీ వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల పింఛన్లకు కోత పెట్టారని ధ్వజమెత్తారు. బాబు వల్లే రైతులకు పంటల బీమా రాలేదు ‘‘హుద్హుద్ తుపానులో అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారమే 3.03 లక్షల హెక్టార్లలో పంటకు పూర్తిగా నష్టం జరిగింది. మరో 3.09 లక్షల హెక్టార్లలో 50 శాతానికి పైగా పంట నష్టం జరిగింది. చంద్రబాబు రుణ మాఫీ హామీని నిల బెట్టుకోని కారణంగా ఈ రైతులందరికీ పంటల బీమా కూడా రాని దారుణమైన పరిస్థితి ఏర్పడింది’’ అని జగన్మోహన్రెడ్డి చెప్పారు. ‘‘ఎన్నికలకు ముందు తనకు అన్నీ పూర్తిగా తెలుసం టూ చంద్రబాబు హామీలు ఇచ్చుకుంటూ పో యారు. ►రైతు, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానన్నారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలోనే 87,612 కోట్ల వ్యవసాయ రుణా లు, 14,204 కోట్ల రూపాయల డ్వాక్రా రుణాలు ఉన్నాయని లెక్కలు తేల్చారు. రెండు రకాల రుణాలు కలిపితే 1.01 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. చంద్రబాబు చెల్లించవద్దన్నందుకు రుణాలు కట్టని కారణంగా ఆయన పుణ్యామా అని వారందరిపై పోయిన ఏడాదికే 14 వేల కోట్ల రూపాయలు అపరాధ వడ్డీగా భారం పడింది. రుణ మాఫీకి ఈ ఏడాది బడ్జెట్లో నిధులు కేటాయించని కారణంగా ఈ సంవత్సరానికి మరో 14 వేల కోట్ల రూపాయల భారం పడుతోంది. ►రెండేళ్లకు కలిపి రుణాలపై వడ్డీనే 28 వేల కోట్లు రూపాయలు అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు మాత్రం రుణమాఫీకి ఐదు వేల కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంటున్నారు. అసలు సంగతి దేవుడికి ఎరుక. వడ్డీనే 28 వేల కోట్లు ఉన్నప్పుడు 5 వేల కోట్లతో 20 శాతం రుణ మాఫీ చేస్తున్నానని ఆయన చెప్పుకుంటున్న మాటలనుబట్టే చంద్రబాబు ఎంతగా రైతులను మోసం చేస్తున్నారో తెలిసిపోతుంది. ►చంద్రబాబు రుణాలు మాఫీ చేయని కారణంగా ఈ ఏడాది రైతుల రుణాలు తిరిగి రెన్యువల్ కాలేదు. పంటలకు బీమా రావడంలేదు. డ్వాక్రా మహిళలదీ ఇదే పరిస్థితి. బాబు మాటలు నమ్మి రుణాలు చెల్లించని డ్వాక్రా మహిళలు దాచుకున్న పొదుపు డబ్బు నుంచి బ్యాంకు వడ్డీని జమ చేసుకుంటున్నాయి’’ అని వివరించారు. ఈ సందర్భంగా బాబు అధ్యక్షతన జరిగిన బ్యాంకర్ల సమావేశానికి సంబంధించిన పుస్తకాన్ని జగన్ విలేకరులకు చూపించారు. ఇంకెన్ని పింఛన్లకు కోత పెడతారో? ‘‘చంద్రబాబు అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రం లో 43,11,686 వరకు పింఛన్లు ఉన్నాయి. వాటి లో దాదాపు 10 లక్షల పింఛన్లకు ఇప్పటికే కోత పెట్టారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అందరికీ వెయ్యి రూపాయల పింఛను చెల్లిస్తే ఏడాదికి దాదాపు 3,650 కోట్ల రూపాయ లు అవసరమవుతాయి. అయితే, బడ్జెట్లో మా త్రం 1,338 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. పింఛన్లకు కోతపెట్టాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు బడ్జెట్లో అవసరమైనదాని కంటే తక్కువ నిధులు కేటాయించారు. పింఛన్ల ఖర్చు రూ. 1,338 కోట్లకు పరిమితం చేసేలా మరికొన్ని పింఛన్లకు ప్రభుత్వం కోతపెట్టే అవకాశం ఉంది’’ అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై విలేకరులు ప్రశ్నించగా.. దీనిపై వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్కు వినతిపత్రం కూడా అందజేశారని జగన్ వివరించారు. మున్సిపల్ సమావేశాల్లో హత్యలా? ‘‘ఆంధ్రప్రదేశ్లో ఆటవిక పాలన సాగుతోంది. మున్సిపల్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ఒకరిపై ఒకరు గొడవ పడినా హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారు. మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్లు ప్రజా సమస్యలపై పడిన గొడవకే ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, రౌడీషీటు తెరవడమే రాష్ట్రంలో ఆటవిక పాలనకు నిదర్శనం’’ అని జగన్ విరచుకుపడ్డారు. ‘‘మున్సిపల్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గొడవ పడతారే గానీ.. ఎవరైనా, ఎక్కడైనా ఆ సమావేశాల్లో హత్యలు చేస్తారా? హత్య చేయడానికి పూనుకుంటారా’’ అని ప్రశ్నించారు. ‘‘ఎవరిపైనయినా రౌడీషీట్ తెరవాలంటే అతనిపై కనీసం మూడు కేసులు ఉండాలని చట్టం చెబుతోంది. భూమా నాగిరెడ్డిపై ఇంతకుముందు ఒక్క కేసు కూడా లేదు. మున్సిపల్ సమావేశంలో సంఘటన ఆధారంగానే ఆయనపై టపటపా మూడు కేసులు కట్టేసి రౌడీషీటు తెరిచే పరిస్థితి ఏర్పడిందంటే చంద్రబాబూ ఒక మనిషేనా అన్నది ఆయన గుండెల మీదే చెయ్యి వేసుకొని ఆలోచించుకోవాలి. చివరకు ఇప్పటివరకు ఒక్క కేసు కూడా లేని కౌన్సిలర్లపైనా ఒక్క సంఘటన ఆధారంగానే మూడు కేసులు కట్టి వారిపై రౌడీషీట్లు తెరిచారు’’ అని ధ్వజమెత్తారు. ఈ ఘటనలపై భూమా నాగిరెడ్డి కుమార్తె, ఎమ్మెల్యే అఖిల బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడతారని తెలిపారు. ప్రభుత్వ భూముల్లో రాజధాని నిర్మించమంటే బాబు వినలేదు ‘‘ప్రభుత్వ, అటవీ భూములున్న చోటే రాష్ట్ర రాజధానిని నిర్మించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన సూచనను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు పెద్ద సమస్యలు వస్తున్నాయి. రాజధాని విషయంలోబాబుకు అసెంబ్లీలోనే మా వైఖరి స్పష్టంగా చెప్పాం. ఎక్కడైనా 30 వేల ఎకరాల ప్రభు త్వ భూమి ఉన్న చోట రాజధాని నిర్మించాలని సూచించాం. పునర్విభజన చట్టంలో అటవీ భూములు ఢీనోటిఫై చేయడానికి అవకాశం ఇచ్చినందున, అవి ఉన్న చోటైనా నిర్మించమని చెప్పాం. ప్రభుత్వ భూములున్న చోట రాజధాని నిర్మిస్తే సామాన్యులు, ఉద్యోగులు కూడా అక్కడ సరసమైన ధరలకు ఇళ్ల స్థలాలు కొనుక్కొనే అవకాశముంటుందని కూడా చెప్పాం. ఇవేమీ చంద్రబాబు చెవికి ఎక్కించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ అని మొదలుపెట్టింది. చివరకు ల్యాండ్ పూలింగ్ కాస్తా ల్యాండ్ ఫూలింగ్ (రైతులను ఫూల్స్ చేసేలా) చేసే కార్యక్రమంగా తయారైంది. అందుకే రైతులు గట్టిగా నిరసన తెలుపుతున్నారు. రైతులకు అన్యాయం జరిగే ఏ పరిస్థితినైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది’’ అని చెప్పారు. బాబుకు చిత్తశుద్ధే ఉంటే శ్రీశైలం సమస్య వచ్చేదే కాదు రాయలసీమ నీటి అవసరాలపై చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే శ్రీశైలం నీటి సమస్య ఇంత దూరం వచ్చేదే కాదని జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉన్నప్పుడు చంద్రబాబు రాయలసీమ నీటి అవసరాల గురించి ఏమాత్రం ఆలోచించలేదు. ప్రాజెక్టుకు ఎడమ వైపు కేసీఆర్ ప్రభుత్వం, కుడి వైపు నుంచి బాబు ప్రభుత్వం శ్రీశైలం నీటిని ఎడాపెడా తోడేసి విద్యుత్ కోసం వాడటంతో 15 రోజుల్లోనే ప్రాజెక్టులో నీరు 858 అడుగులకు పడిపోయింది. శ్రీశైలంలో కనీస నీటి మట్టం 854 అడుగులు ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీతో రాయలసీమకు నీరందుతుంది. నీటి మట్టం 858 అడుగులకు చేరాక బాబుకు సీమ అవసరాలు గుర్తుకు వచ్చాయి. అప్పుడు ఏపీ ప్రభుత్వం తమ వైపు విద్యుత్ ఉత్పతిని నిలిపివేసి కేసీఆర్ను తిట్టడం మొదలుపెట్టారు’’ అని అన్నారు. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటన్నది తాను ప్రధానమంత్రి మోదీకి రాసిన లేఖలోనే స్పష్టంగా చెప్పానని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టాన్ని 834 అడుగులకు తగ్గించారని, దానిని తిరిగి 854 అడుగులకు సవరిస్తూ వైఎస్ రాజశేఖరరెడ్డి 107 జీవో తీసుకొచ్చారని మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. తెలంగాణ విద్యుత్ సమస్య తీర్చవచ్చిలా.. ‘‘తెలంగాణకు విద్యుత్ కొరత ఉన్న మాట నిజమే. అయితే కేసీఆర్ కొంత మానవత్వంతో, వినూత్నంగా ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఛత్తీస్గఢ్ నుంచి కేసీఆర్ వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నప్పటికీ, రెండు రాష్ట్రాల మధ్య సరఫరా లైన్లు లేవు. లైన్ల నిర్మాణానికి రెండేళ్లు పడుతుంది. అప్పటివరకు ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ అందదు. తెలంగాణలో ఎన్టీపీసీ ఆధర్యంలోని 2,600 మెగావాట్ల రామగుండం విద్యుత్ ప్రాజెక్టు ఉంది. అందులో ఎన్టీపీసీకి వాటాగా దక్కే 75 శాతం విద్యుత్ను ఆ సంస్థ ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటుంది. కేసీఆర్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో కొనే వెయ్యి మెగావాట్ల విద్యుత్ను అక్కడ ఎన్టీపీసీకి అప్పగించి, రామగుండం ప్లాంట్లో ఎన్టీపీసీ వాటా నుంచి తెలంగాణకు విద్యుత్ను తీసుకునే వెసులుబాటు ఉంది. ఇలా చేస్తే విద్యుత్ లైన్లు వేసేవరకు ఆగాల్సిన అవసరం ఉండదు. దీనికి తోడు 1,000 మెగావాట్ల సామర్థ్యం గల విశాఖపట్నం సింహాద్రి ప్లాంట్ ఫేజ్-2లో 60 శాతం విద్యుత్ ఎన్టీపీసీ వాటాగా ఉంది. తెలంగాణ ఇక్కడి నుంచి ఎన్టీపీసీ నుంచి విద్యుత్ తీసుకోవచ్చు. దీనికి బదులుగా ఛత్తీస్గఢ్లో కొనుగోలు చేసే విద్యుత్ను ఆ సంస్థకు ఇవ్వవచ్చు. ఇలాంటి విషయాల్లో కేసీఆర్ కొంత చొరవ చూపితే ఈ సమస్యకు సులభంగా పరిష్కారం దొరుకుతుందని’’జగన్ తెలిపారు. -
మాఫీపై వారానికో జీవో.. ఒరిగింది జీరో
-
ఐదువేల కోట్లు ఎలా సరిపోతాయి?
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి విజయవాడ: రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీకి రూ.1.2 లక్షల కోట్లు అవసరంకాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతు సాధికార సంస్థ పేరుతో ఐదువేల కోట్లు ఇస్తే ఎలా సరిపోతాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. రూ. 1.2 లక్షల కోట్ల అప్పుపై రూ. 25 వేల కోట్లు వడ్డీ ఉందని.. కనీసం చంద్రబాబు ఇచ్చిన రూ. 5 వేల కోట్లు వడ్డీకి కూడా సరిపోదని ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలు గెలిపిస్తే రుణమాఫీ హామీ నుంచి పూర్తిగా తప్పుకునే ప్రయత్నం చేస్తూ ఆరు నెలలు కాలక్షేపం చేశారని విమర్శించారు. విజయవాడలో శనివారం వైఎస్సార్సీపీ త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వి.విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి ప్రసాదరాజులు రాగా సమీక్షకు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, నియోజకవర్గ సమన్వయ కర్తలు హాజరయ్యారు. సమీక్ష అనంతరం పార్థసారథి విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబుపై మండిపడ్డారు. గమనిక ‘నేటి నుంచి జిల్లాల్లో వైసీపీ నేతల పర్యటన’ శీర్షికతో శనివారం నాడు ప్రచురితమైన వార్తలో పొరపాటున సాగి ప్రసాదరాజు ఫొటో బదులుగా వేరే ఫొటో ప్రచురితమైంది. గమనించగలరు. -
బలిపీఠంపై రైతన్నలు
14 మంది రైతుల ఆత్మహత్య నెట్వర్క్: కాడి పట్టుకోవాల్సిన రైతు కాటికి వెళ్తున్నాడు. బ్యాంకు రుణం మాఫీ చేయాలని కలెక్టర్కు, బ్యాంకు అధికారులకు లేఖ రాసుకొని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లాలో నలుగురు, మహబూబ్నగర్ జిల్లాలో ముగ్గురు, నల్లగొండలో ఇద్దరు, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో ఒకరు చొప్పున, కరీంనగర్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం శాభాష్పల్లికి చెందిన చంద్రగిరి ఉరఫ్ దార్కార్ రాజయ్య(49) ట్రాక్టర్ లోన్కు సంబంధించి రూ.5.40 లక్షల అప్పు ఉంది. పత్తి సాగుకు పెట్టుబడిగా రూ.లక్ష అప్పు తీసుకువచ్చాడు. అప్పులు తీరే మార్గం కానరాక రాజయ్య మనస్తాపంతో ఉరేసుకున్నాడు. కోనరావుపేట మం డలం పల్లిమక్తకు చెందిన రైతు ఎగంటి దేవయ్య(40) రూ.4 లక్షల అప్పు తీర్చే మార్గం కానరాక మనస్తాపానికి గురై గుండెపోటుతో మరణించాడు. నల్లగొండ జిల్లా మునుగోడుకు చెందిన రైతు కొమ్ము లింగయ్య(48) తనకున్న 8 ఎకరాలకు తోడు మరో ఏడు ఎకరాలు కౌలు తీసుకొని పత్తి సాగు చేశా డు. రూ. మూడు లక్షలు అప్పు చేశాడు. దిగుబడి వచ్చే అవకాశం లేక శుక్ర వారం ఆత్మహత్య చేసుకున్నాడు. చందంపేట మండలం నేరడుగొమ్ము పరిధి చర్ల తండాకు చెందిన రైతు నేనావత్ చందు(40) పత్తి వేసి నష్ట పోవ డంతో గురువారం రాత్రి క్రిమిసంహారక మందు తాగాడు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం మందపల్లి గ్రామానికి చెందిన రైతు బొజ్జ భీమలింగం (43) ఎనిమిది ఎకరాల్లో సాగు చేశాడు. సాగుకు రూ.లక్ష వరకు, బంగారంపై బ్యాంకులో అప్పు, పంట రుణాలు, మరో రూ.2 లక్షలు ప్రైవేటు అప్పులు ఉన్నాయి. బుధవారంరాత్రి క్రిమిసంహారక మందు తాగి చనిపోయాడు. మహబూబ్నగర్ జిల్లా తిమ్మాజీపేట మండలం పుల్లగిరికి చెందిన రైతు పెద్ద ఆంజనేయులు(60) మొక్కజొన్న, పత్తి పంట చేతికందకపోవడంతో గురువారం క్రిమిసంహారక మందు తాగాడు. వడ్దేపల్లి మండలం రాజోలికి చెందిన గళ్ల మద్దిలేటి(35) పంటలు దెబ్బ తినడంతో గురువారం పురుగుల మందు తాగాడు. తిమ్మాజీపేట మండలం పుల్లగిరికి చెందిన పెద్ద ఆంజనేయులు(60) పంట చేతికి వచ్చే పరిస్థితి లేక ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కుమ్మరి గూడకు చెందిన కుమ్మరి సత్తయ్య(38) పత్తి సాగు చేస్తున్నాడు. రూ. 50 వేలు అప్పు చేశాడు. పంట ఎండిపోవడంతో మనస్తాపం చెంది గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. పరిగి మండలం సయ్యద్ పల్లికి చెందిన మల్లిగారి రామ స్వామి(40) ఆరు ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. ఏడీబీ బ్యాంకు నుంచి రూ. 4 లక్షలు, ప్రైవేటుగా రూ. లక్ష అప్పు చేశాడు. గురువారం పురుగుల మందుతా గాడు. వికారాబాద్ మండలం ధన్నారం గ్రామానికి చెందిన ఆలూరి బాలయ్య(40) రెండు ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న సాగు చేశాడు. రెండేళ్లుగా రూ.1.50 లక్షలు అప్పు చేశాడు. పంటలు పోవడంతో శుక్రవారం ఉరి వేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పులుసుమామిడికి చెందిన ఎండీ బురాన్(45) తనకున్న మూడెకరాల్లో మొక్కజొన్న, మరో పది ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, క్యారెట్, టమోటా, క్యాబేజీ సాగు చేస్తున్నాడు. పంటలు ఎండుముఖం పట్టడంతో మనోవేదనకు గురైన బురాన్ మంచంపట్టాడు. వికారాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా గుండెపోటుకు గురై మృతి చెందాడు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం యూసుఫ్పేటకు చెందిన రైతు మన్నె నరసింహులు(45), ఖమ్మం జిల్లా పెదబండిరేవు గ్రామ రైతు పాయం సూరయ్య(87) తనకున్న కొద్దిపాటి భూమిలో పత్తి, వరి సాగు చేశా డు. పంట గురువారం ఇంట్లోనే గుళికలు మింగాడు. -
మోసపోయాం!
సాధికార సంస్థ ఏర్పాటైనా పైసా మాఫీ కాని తీరు ఇన్నాళ్లూ ఎదురుచూసి మోసపోయామని వాపోతున్న రైతులు హైదరాబాద్: రైతు సాధికార సంస్థ ఏర్పాటుతో రైతులంతా రుణ విముక్తులవుతారని, రైతాంగం సమస్యలన్నిటికీ అదే పరిష్కారమని ఊరిస్తూ వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చివరకు దాన్ని ఏర్పాటు చేస్తూ రూ.5వేల కోట్లు మాత్రమే కేటాయించటంతో రాష్ట్ర రైతాంగం ఆశలు ఆవిరయ్యాయి. ఈ కేటాయింపులతో ప్రస్తుతం ఒక్క పైసా రుణం కూడా మాఫీ అయ్యే అవకాశం లేకపోవటంతో పాటు ఇప్పటికే చెల్లించాల్సిన వడ్డీ చెల్లించకపోవటంతో అది మరో ఏడెనిమిది నెలల్లో రెట్టింపు కాబోతోంది. ఇవన్నీ తలచుకుంటే రైతు గుండె గుభేలుమంటోంది. మంగళవారంనాడు విజయవాడలో రైతు సాధికార సంస్థ ఏర్పాటైనట్టు ప్రకటించిన సీఎం చంద్రబాబు.. రుణాల మాఫీ సంగతి ప్రస్తావించనే లేదు. రైతాంగం... ఆందోళనల దిశగా కదులుతోంది. తొలినుంచీ ఆంక్షలు, కుంటిసాకులే.. రుణ మాఫీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తొలినుంచీ కుంటి సాకులే చెబుతోంది. కమిటీల పేరుతో రకరకాల ఆంక్షలు, పరిమితులు విధిస్తూ కసరత్తు కొనసాగించింది. చివరకు రైతు సాధికార సంస్థను తెరపైకి తెచ్చింది. రుణాలను సకాలంలో చెల్లించని కారణంగా దాదాపు ఈ ఏడాది జూన్ నాటికే రూ.14 వేల కోట్ల వడ్డీ భారం పడినప్పటికీ.. మొత్తంగా రుణాలు మాఫీ అవుతాయనే ఆశతో రైతులు ఐదు నెలలుగా ఎదురుచూశారు. అక్టోబర్ 21న రైతు సాధికార సంస్థ ఏర్పాటు చేస్తామని, ఆలోగా రైతుల ఖాతాల వివరాలన్నీ సేకరించి రుణాలన్నింటినీ మాఫీ చేస్తామంటూ ఇటీవల కొంతకాలంగా ప్రభుత్వం నమ్మబలుకుతూ వచ్చింది. తీరా సాధికార సంస్థ ఏర్పాటైనా ప్రభుత్వం మాట నిలుపుకోకపోవడం, రుణాలు మాఫీ కాకపోవడంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడిపోరుుంది. లక్షల్లో చేసిన అప్పులు తీరకపోవడం, ప్రైవేటుగా అప్పులు చేసి వేసిన పంటలను కరువు, తుపాను కబళించడంతో తీవ్ర నిరాశా నిస్పృహలకు గురవుతున్నారు. రుణం, వడ్డీ కలిసి తడిసిమోపెడైన భారాన్ని తలుచుకుని అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన చందంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. రూ.5 వేల కోట్లు వడ్డీకే చాలవు.. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ తర్వాత రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి నివేదించిన వివరాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు, రూ.14,204 కోట్ల డ్వాక్రా రుణాలున్నాయి. రుణాలను సకాలంలో తిరిగి బ్యాంకులకు చెల్లించని కారణంగా రైతులపై ఒక్క ఏడాదికే రూ.14 వేల కోట్లకు పైగా అపరాధ వడ్డీ భారం పడింది. ఎన్నికల్లో, ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ప్రభుత్వం ఈ రుణాలన్నిటినీ ఎలాంటి ఆంక్షలు లేకుండా మాఫీ చేయూలి. కానీ సుదీర్ఘ కాలయూపన తర్వాత రుణమాఫీ కోసం అంటూ ఏర్పాటు చేసిన సాధికార సంస్థకు కేవలం రూ.5 వేల కోట్లు కేటాయించి చేతులు దులుపుకొంది. ఈ రూ.5 వేల కోట్లను బ్యాంకులు వడ్డీ కిందే జమ చేసుకుంటాయని, మెుత్తం వడ్డీయే తీరనప్పుడు, తమ రుణాలన్నీ ఎలా మాఫీ అవుతాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. బాబుదే బాధ్యత: చంద్రబాబు హామీని నమ్మ డం వల్ల రైతులు అన్ని విధాలా నష్టపోయూరు. ఈ ఖరీఫ్లో 11 జిల్లాల్లో కరువు పరిస్థితులు నెల కొన్నాయి. రాష్ట్రంలోని మొత్తం 664 మండలాలకు గాను 568 మండలాల్లో వర్షాభావ పరిస్థితు లు ఉన్నట్లు రాష్ట్ర అర్ధగణాంక శాఖ నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. రైతులు గత ఏడాది తీసుకున్న రుణాలు చెల్లించి ఈ ఏడాది రెన్యువల్ చేసుకుని ఉంటే ఈ ఖరీఫ్లో వేసిన పంటలకు బీమా వర్తించేది. కరువు వల్ల పంటలు ఎండిపోయిన రైతులకు బీమా రూపంలో పరిహారం వచ్చేది. రుణాలు రెన్యువల్ చేయించుకుని ఉం టే హుదూద్ తుపానువల్ల లక్షలాది ఎకరాల్లో పంటలు కోల్పోయిన రైతులకు కూడా ఇప్పుడు పంటల బీమా వచ్చేది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఉత్తర్వుల ప్రకారం లక్షలోపు రుణాలకు వడ్డీ కూడా వర్తించేది. కానీ రుణమాఫీపై ఇచ్చిన హామీని చంద్రబాబు అమలు చేయకుండా కసరత్తు పేరిట కాలయూపన చేయడంవల్ల రైతులు అన్నివిధాలా తీవ్రంగా నష్టపోయారు. అసలే అప్పుల్లో ఉన్న వారికి అధిక వడ్డీ పెను భారంగా మారింది. పంటల బీమా ఆశ లేకుండా పోయింది. ఇందుకు పూర్తిగా చంద్రబాబే బాధ్యులంటూ రైతులు మండిపడుతున్నారు. 5 నుంచి ఉద్యమమే: వైఎస్ జగన్ మాఫీ విషయంలో బాబు సర్కారు నాన్చు డు ధోరణిని ఎండగడుతూ నవంబర్ 5 నుంచి రైతుల తరఫున ఉద్య మం చేపడుతున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం కాకి నాడ పర్యటనలో ప్రకటించారు. ‘‘రుణమాఫీపై జరుగుతున్న అన్యాయాన్ని రైతులు నిశితంగా పరిశీలిస్తున్నారు. బాబు మాట లకు, చేతలకు పొంతన లేదు. ఎన్నికలప్పు డు ఒకమాట, తీరా గెలిచాకా ఒక మాట మాట్లాడుతున్నాడు’’అంటూ ధ్వజమెత్తారు. నగలు వేలం వేస్తామని నోటీసు మాకు కౌండిన్య నది పక్కన మూడెకరాల పొలం ఉంది. పంటల సాగు కోసం బంగా రం తాకట్టు పెట్టి పలమనేరులోని బ్యాంకులో రూ. 2.5 లక్షలు అప్పు తీసుకున్నాం. బోరు ఎండిపోవడంతో పంట చేతికందలేదు. ప్రభుత్వమే అప్పు తీర్చేస్తుందని అదే పదివేలని ఆశించాం. ఇప్పుడు బ్యాంకు వాళ్లు అప్పు తీర్చాలని లేని పక్షంలో నగలు వేలం వేస్తామని నోటీసులు పంపారు. చంద్రబాబును నమ్మి ఆశపడినందుకు నగలమీద ఆశ వదలాల్సి వచ్చేలా ఉంది. ఇద్దరు ఆడబిడ్డలున్న మేం నగలు కూడా లేకపోతే ఏమి చేయాలో తెలియక కుమిలిపోతున్నాం. - మునిరత్నమ్మ, కొంగోళ్లపల్లె, గంగవరం మండలం, చిత్తూరు జిల్లా రైతు సాధికార సంస్థ ఓ నాటకం ఎవరూ రుణాలు చెల్లించవద్దని, అధికారంలోకి రాగానే మొత్తం రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు బ్యాంకులకు డబ్బు చెల్లించకుండా మాకు నోటీసులు వచ్చేలా చేస్తున్నారు. ఇప్పుడు రైతు సాధికార సంస్థ అని మరో నాటకం మొదలుపెట్టారు. ఖరీఫ్ పూర్తయి రబీ వచ్చినా రుణాలు రెన్యువల్ చేసుకోనందున మాకు కొత్త రుణాలు రాలేదు.బ్యాంకులకు డబ్బు చెల్లించి రుణ విముక్తులను చేయకుండా ఇప్పుడు రైతులకు బాండ్లు జారీ చేస్తామంటూ మభ్యపెడుతున్నారు. - టి. లక్ష్మీ కోటేశ్వరరావు, గుంటూరు జిల్లా -
15లోగా ఖాతాల్లోకి మాఫీ సొమ్ము
అప్పటివరకూ ఏ రైతూ రుణాల మీద వడ్డీ కట్టొద్దు రైతు సాధికార సంస్థ ప్రారంభ సభలో ఏపీ సీఎం వెల్లడి విజయవాడ నుంచే వ్యవసాయ మిషన్ పనిచేస్తుంది ‘ఈ-కామర్స్’ ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ట్రేడింగ్ విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ సభ ఇంటివద్దకే ఎఫ్ఐఆర్, రాష్ట్ర కంట్రోల్ రూం ప్రారంభం విజయవాడ బ్యూరో: నవంబర్15వ తేదీ లోగా రాష్ట్రంలోని రైతుల ఖాతాలకు రుణ మాఫీ సొమ్ము అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అప్పటి వరకూ ఏ రైతు కూడా వడ్డీలు చెల్లించాల్సిన పనిలేదని.. ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. గన్నవరం పశు వైద్య కళాశాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు సాధికార సంస్థ కార్యాలయాన్ని సీఎం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన రైతులనుద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను దశల వారీగా తీర్చే దిశగా టీడీపీ ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. తనపై నమ్మకంతో పట్టం కట్టిన రైతు సోదరుల కోసం రుణాలను మాఫీ చేస్తామన్న ప్రభుత్వం రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేసి, తొలి విడతగా రూ. 5,000 కోట్లను నిధులను విడుదల చేసి, 20 శాతం మందికి రుణ విముక్తి కలిగించేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని పేర్కొన్నారు. వచ్చే నెల 15 లోగా తొలి దశలోని రైతులకు ఆయా నగదు ఖాతాలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతు సాధికార సంస్థ ద్వారా రైతులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పించడం, సమస్యలను పరిష్కరించడం, రుణ పరపతి పెరిగేలా చూడటం, ఆధునిక వ్యవసాయాన్ని పరిచయం వంటివన్నీ చేస్తామని చెప్పారు. ఇసుక వేలం పాటలను డ్వాక్రా మహిళలకే కట్టబెట్టి వచ్చే ఆదాయంలో 25 శాతాన్ని డ్వాక్రామహిళలకు, 75 శాతాన్ని రైతు సాధికార సంస్థకు అందేలా చూస్తామని తెలిపారు. ఎవరెన్ని చెప్పినా నమ్మొద్దనీ, రైతు రుణం తీర్చుకుంటానని ఉద్ఘాటించారు. త్వరలో ఈ-కామర్స్ పోర్టల్ను ప్రభుత్వం ప్రారంభించబోతోందని.. దీంతో ై ఆన్లైన్లోనే ఉత్పత్తులను అమ్ముకునే వీలుంటుందని చంద్రబాబు అన్నారు. తుపాను బాధితుల కోసం విరాళాలు... ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులు హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం తమ విరాళాలను ముఖ్యమంత్రికి అందజేశారు. ఏపీ విద్యుత్ ఉద్యోగులు రూ. 5.07 కోట్లు, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు రూ. 1 కోటి, కేసీపీ షుగర్స్ రూ. 25 లక్షలు, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్బాబు రూ. 20 లక్షలు, కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రూ. 10 లక్షలు, విజయవాడ ఆటోనగర్ ఐలా వారు రూ. 5 లక్షలు, గుంటూరు కాటన్ జిన్నర్స్ అసోసియేషన్ రూ. 5 లక్షలు, సుచిత్రా రూపకుమార్ రూ. 1 లక్ష, గౌతం స్కూల్ (కైకలూరు) రూ. 50 వేలు విరాళాలను స్వయంగా సీఎంకు అందజేశారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు కామినేని శ్రీనివాస్, ఉమా, పుల్లారావు, రవీంద్ర, మాణిక్యాలరావు, ఎంపీలు పాల్గొన్నారు. -
పంట ఎండింది.. గుండె పగిలింది
కరెంట్ కోతలతో కళ్ల ముందటే పంట ఎండిపోవట్టే.. వేసిన బోర్ల అప్పులు ఎక్కువయ్యే. బ్యాంకుల రుణమేమో మాఫీ కాలే. భవిష్యత్తు అంతా అంధకారమే కనిపించే. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువరైతు బతుకు మీద ఆశ వదులుకున్నాడు. చేనులోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబాన్ని అనాధను చేశాడు. భార్య, పిల్లలను వదిలి కానరాని లోకాలకు పయనమయ్యాడు. * పాల్వంచలో యువరైతు ఆత్మహత్య * అప్పులు ఎక్కువ కావడం * రుణం మాఫీ కాకపోవడంతో మనస్తాపం * పంట చేనులోనే ఉరికి వేలాడిన అన్నదాత మాచారెడ్డి: ఆరుగాలం శ్రమించిన పంట ఎండిపోయింది. బోర్లు తవ్వించిన అప్పు వేధించసాగింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సం ఘటన సోమవారం మాచారెడ్డి మండలం పా ల్వంచ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాకలి నర్సింహులు (35) అనే రైతు తన సొంత చెరుకు తోట లో చెట్టుకు ఉరివేసుకుని తనువు చాలించాడు. మండల కేంద్రంలో ని స్టేట్ బ్యాంక్లో నర్సింహులకు రూ.45 వేల పంట రుణం ఉంది. సోమవారం బ్యాంకుకు వెళ్లిన ఆయన తన రుణం మాఫీ అయ్యిందా అని బ్యాంకు అధికారులను అడిగాడు. కాలేదని వారు సమాధానం చెప్పారు.దీంతో అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.‘అప్పులైన యి.బ్యాంక్ల రుణంమాఫీకాలేదు.. కొత్త రుణం రాలేదు.. పంట ఎండిపోవట్టే.. పిల్లలు చిన్నగున్నరు ఏం చేద్దాం’ అంటూ తీవ్ర ఆందోళనకు గురయ్యాడని భార్య లక్ష్మి రోధిస్తూ చె ప్పింది. నర్సింహులు ఆయన సోదరుడు బాల్రాజు కలిసి నాలుగు ఎకరాల భూమిలో ఓ బోరు తవ్వించారు. ఆ బోరు నీరు తక్కువగా పోయడంతో నర్సింహులు మరో మూడుబోర్లు అదనంగా వేయించాడు. అవి వట్టిపోయాయి. రూ.లక్ష వరకు అప్పు అయ్యింది. ఎకరం చెరుకు, మరో ఎకరం వరి సాగుచేశాడు. కరెంట్ కోతలతో చెరుకుతోట సగం వరకు ఎండిపోయింది. సాగుచేసిన వరిపంట సైతం ఎండిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో రైతు నర్సిం హులుకు ఉరి తాడే దిక్కయ్యింది. చనిపోతున్నానని చెప్పి... నర్సింహులు చనిపోవడానికి ముందు సమగ్ర సర్వేలో భాగంగా వచ్చిన తప్పు ఒప్పులను సరి దిద్దుకోవడానికి గ్రామపంచాయతీ వద్ద ఉన్న గ్రామస్తుడు పరశురాములుకు చూయించాడు. ఇదేమి సర్వేనో ఏమోనని మదనపడి, ఓ దిక్కు అప్పులు పెరిగిపోతున్నయి. రుణమాఫీ కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు పరశురాము లు తెలిపారు. గ్రామపంచాయతీ నుంచి నేరు గా గ్రామ శివారులో ఉన్న తన పొలం వద్దకు వెళ్లాడు. వెళ్లిన మరుక్షణమే గ్రామానికి చెందిన గ్రామసేవకుడు మశ్చందర్కు ఫోన్ చేశాడు. ‘‘కాకా నాకు బతకాల నిపిస్తలేదు చనిపోతు న్నా. రుణమాఫీ కాలేదు.. పంట ఎండిపోతుం ది. కరెంట్ ఎద్దెం మద్దెంగా ఉంది, నేను ఉరి వేసుకుని చచ్చిపోతున్నా. నా భార్య, పిల్లలు పయిలం’’ అంటూ నర్సింహు లు చెప్పడంతో మశ్చందర్ వద్దని వారించాడు. ‘ఎందుకు సచ్చిపోతావ్ బిడ్డా, అందరం బతక లేమా నువ్వుకూడా గట్లనే బతుకు, చిన్న చిన్న పిల్లలున్నరు అద్దు బిడ్డా’ అని బదులివ్వడంతో నర్సింహులు ఫోన్ కట్ చేశాడు. ఆందోళన చెం దిన ఆయన గ్రామస్తులు, కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. వారు అక్కడికి చేరుకునేలోగానే నర్సింహులు టేకు చెట్టుకు విగత జీవై కనిపిం చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న భార్య లక్ష్మి ‘‘చేనుకాడికి పోయివస్తానని శవమయ్యా వా’’ అంటూ బోరున విలపించింది. లోకం పోకడ తెలియని చిన్నారులు.. ‘‘నాయిన చెట్టు ఎక్కాడా అమ్మా’’ అంటూ అమాయకంగా అడగడంతో అక్కడ ఉన్న హృదయా లు కలచివేశాయి. నర్సింహులుకు భార్య లక్ష్మి, కూతురు అశ్విని(09), కుమారుడు నితిన్(06) ఉన్నారు. మాచారెడ్డి ఎస్ఐ ప్రసాద్రావు, ఏఎస్ఐ ముజీ బ్, హెడ్కానిస్టేబుల్ మురళి శవ పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహంతో రైతుల ఆందోళన నర్సింహులు మృతదేహంతో శనివారం సాయంత్రం పాల్వంచ గ్రామం వద్ద కా మారెడ్డి-సిరిసిల్ల రహదారిపై రైతులు రా స్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్య తిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్లే నర్సింహులు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. రుణమాఫీ కాకపోవడం, కరెంట్ కొరత కారణంగా పంటలు ఎండిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని వాపోయారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి రుణమాఫీ, విద్యుత్ సమస్య లు తీర్చాలని, లేకపోతే సామూహిక ఆత్మహత్యలకు పాల్పడతామని రైతులు హెచ్చరించారు. పాల్వంచ ఎంపీటీసీ సభ్యుడు గ్యార చంద్రయ్య, ఉపసర్పంచ్ అంజియాదవ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు నారాగౌడ్ రైతులకు సంఘీభావం తెలిపారు. చనిపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
రుణమాఫీ చేస్తామంటే మీకేం ఇబ్బంది?
హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్: రైతులకు రుణమాఫీని వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై హైకోర్టు ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతూ మందలించింది. ‘రైతులకు రుణం మంజూరు చేసేది బ్యాంకులు. ఆ రుణాన్ని ప్రభుత్వం చెల్లిస్తానంటే అందుకు అంగీకరించాలో వద్దో అన్నది బ్యాంకులు నిర్ణయించుకుంటాయి. మధ్యలో మీకొచ్చిన ఇబ్బందేమిటి?’ అంటూ రుణమాఫీని వ్యతిరేకిస్తూ పిల్ దాఖలు చేసిన లోక్సేవా సంస్థ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డిని న్యాయస్థానం ప్రశ్నించింది. సమాజ అవసరాలను తీర్చే రైతులు రుణభారంతో దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారికి అండగా నిలిచేందుకు సమాజం ముందుకు రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. రుణ మాఫీలో భాగంగా వ్యవసాయ, డ్వాక్రా రుణాలకు సంబంధించి మార్గదర్శకాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 14న జారీ చేసిన జీవో ఎమ్మెస్ 174ను సవాలు చేస్తూ శ్రీనివాస్రెడ్డి గతవారం పిల్ దాఖలు చేయటం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్జ్యోతిసేన్గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్కుమార్లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. వ్యాజ్యాన్ని ఉపసంహరించుకునేందుకు పిటిషనర్కు అనుమతినిస్తూ, పూర్తిస్థాయి వివరాలతో తిరిగి దాఖలు చేసుకోవచ్చునంటూ ఉత్తర్వులిచ్చింది. -
వడ్డీకే చాలని నిధులతో 20 శాతం మాఫీయా?
ఇంతకన్నా నమ్మకద్రోహం ఉండదంటున్న ఏపీ రైతాంగం విజయవాడ బ్యూరో: తొలి సంతకం రుణ మాఫీపైనే అంటూ ఆర్భాటాలు పలికిన తెలుగుదేశం సర్కారు దీనిపై ఆది నుంచీ పిల్లిమొగ్గలు వేస్తూనే ఉంది. మాఫీకి నోచుకోక, కొత్త రుణాలు రాక ఖరీఫ్ సీజన్ను నష్టపోయిన రైతాంగం రబీ సీజన్నూ కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళల 14వేల కోట్లు మినహాయించగా రైతాంగం తీసుకున్న పంట రుణాల విలువే 87వేల కోట్లు. ఇది రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) అధికారికంగా తేల్చిన లెక్క. దీనిలో ఇప్పటిదాకా పైసా కూడా బ్యాంకులకు చెల్లించకుండా వచ్చిన చంద్రబాబు నాయుడి ప్రభుత్వం... రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేస్తున్నామని, దానికి నిధులు కేటాయించి దానిద్వారా మాఫీ చేస్తామని ప్రకటించింది. మంగళవారం నుంచి విజయవాడ కేంద్రంగా పని ప్రారంభించనున్న ఈ సంస్థకు తొలివిడతగా రూ.5వేల కోట్లు కేటాయించారు. వీటిద్వారా 20 శాతం రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 87 వేల కోట్లలో 20 శాతమంటే 17,400 కోట్లు కాదా! మరి 5వేల కోట్లు కేటాయించి 20 శాతం రుణాల్ని మాఫీ చేస్తున్నామంటే ఏమనుకోవాలి? పెపైచ్చు ఏడాదిలో రుణాలు తిరిగి చెల్లించలేదు కాబట్టి ఆ 87 వేల కోట్లపై 14 శాతం వడ్డీ చెల్లించాలి. అంటే వడ్డీ రూపేణాయే రూ.12,180 కోట్లు బ్యాంకులకు చెల్లించాలి. అలాంటిది వడ్డీలో సగం కూడా లేకుండా రూ.5వేల కోట్లు కేటాయించి 20 శాతం రుణాల్ని తొలి ఏడాది మాఫీ చేసేస్తున్నామని, మిగిలిన రుణాల్ని తరవాత మాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటలు రైతులెలా నమ్ముతారు? ఇంతకంటే నమ్మకద్రోహం ఉంటుందా? రానురాను ఈ వడ్డీ పెరిగి రైతులకు పెనుభారం కాదా? నేడు సాధికార సంస్థ ప్రారంభం విజయవాడలోని గన్నవరం ఎన్టీఆర్ పశువైద్య కళాశాల ఆవరణలోని లైవ్స్టాక్ భవనంలో ఏర్పాటు చేస్తున్న రైతు సాధికార సంస్థ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 11.50కి ప్రారంభిస్తారు. తర్వాత కళాశాల ఆవరణలో జరిగే రైతు సదస్సులో పాల్గొంటారు. -
22 లక్షల మందికి మొండిచెయ్యి!
14 లక్షల మంది రైతులకే కొత్త రుణాలిచ్చిన బ్యాంకులు రుణ మాఫీ కింద రూ. 4,250 కోట్లతో 36 లక్షల రైతులకు లబ్ధి బ్యాంకులు ఇచ్చిన కొత్త రుణాలు సుమారు రూ. ఆరువేల కోట్లే.. హైదరాబాద్: తెలంగాణలో రుణమాఫీ పొందిన రైతుల్లో సగానికిపైగా మందికి బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేయలేదు. ప్రభుత్వం ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసినా.. 25 శాతం రుణమొత్తాన్ని విడుదల చేసినా.. మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చినా.. రైతులు కాళ్లరిగేలా తిరిగినా.. క్షేత్రస్థాయిలో బ్యాంకులు ఏమాత్రం సహకరించలేదు.. రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయలేదు.. అసలు ‘రుణ మాఫీ’పై ప్రభుత్వం చేసిన తీవ్ర జాప్యం కారణంగానే బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు అందించేలేకపోయాయనే అభిప్రాయం కూడా వస్తోంది. మరోవైపు ఖరీఫ్ సీజన్ ముగిసినందున రైతులే రుణాలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదన్న కొత్త వాదనను ప్రభుత్వ అధికారవర్గాలు ముందుకు తీసుకుని వస్తుండడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కింద 36 లక్షల మంది రైతులను లబ్ధిదారులుగా గుర్తించి, తొలి విడతగా రూ. 4,250 కోట్లను విడుదల చేయగా.. బ్యాంకులు కొత్తగా రుణాలు ఇచ్చింది కేవలం 14 లక్షల మంది రైతులకు మాత్రమే. అంటే దాదాపు 22 లక్షల మంది రైతులకు ఈసారి ఖరీఫ్ సీజన్లో బ్యాంకులు రుణాలు ఇవ్వలేదన్నది స్పష్టమవుతోంది. రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు సహకరించలేదు. దీంతోపాటు రుణ మాఫీపై ప్రభుత్వం త్వరగా తేల్చకుండా జాప్యం చేయడంతో పాటు... మొత్తం నిధులు జమచేయని కారణంగా బ్యాంకులు ఆశించిన స్థాయిలో రుణాలు మంజూరు చేయలేదు. సగం కన్నా తక్కువ... రుణమాఫీ కింద తొలివిడతగా ప్రభుత్వం చెల్లించిన రూ. 4,250 కోట్లకు తోడుగా మరో రూ. 1,800 కోట్ల కొత్త రుణాలను మాత్రమే బ్యాంకులు మంజూరు చేసినట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. అయితే ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం.. విడుదల చేసిన మొత్తానికి కనీసం రెట్టింపు రుణాలైనా రైతులకు అందజేయాల్సి ఉంది. కానీ శనివారం నాటికి అధికారులకు అందిన సమాచారం మేరకు.. రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల మంది రైతులకు కేవలం రూ. ఆరు వేల కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చారు. అయితే రుణాలు ఇవ్వడాన్ని నిరంతర ప్రక్రియగా అధికారులు అభివర్ణిస్తున్నారు. మొన్నటివరకు రైతులకు పంటల బీమా అమలు చేయడానికి గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించాలని కోరిన యంత్రాంగం.. బీమా సంస్థల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తెలంగాణ రైతులు పంటల బీమాకు మొగ్గు చూపడం లేదని పేర్కొంటుండడం గమనార్హం. రబీకైనా అందేనా? ఖరీఫ్ సీజన్ ముగిసిపోయినందున.. కనీసం రబీ సీజన్కు అయినా రైతులకు సక్రమంగా రుణాలు అందుతాయా.. లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రబీలో రైతులకు రుణాల మంజూరు అంశంపై వచ్చే నెలలో ఎస్ఎల్బీసీ సమావేశం జరిగే అవకాశం ఉంది. రైతులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు సహకరించడం లేదంటూ సీఎం కేసీఆర్ ఇటీవల రిజర్వ్బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో అయినా వచ్చే సీజన్లో రైతులకు రుణాలు సరిగా అందుతాయేమోన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. -
‘పరిశీలన’ నిబంధనలకు విరుద్ధం
* బంగారం కుదువ పెట్టి అప్పుతీసుకున్న ఖాతాదారులు లేకుండానే.. * అభ్యంతరం చెబుతున్న బ్యాంకు మేనేజర్లు * రుణ మాఫీలో భాగం అంటున్న కోఆర్డినేషన్ కమిటీ మోర్తాడ్: పంట రుణాల మాఫీలో భాగంగా బ్యాంకుల కోఆర్డినేషన్ కమిటీ నియమించిన ఆడిటర్లు వ్యవహరిస్తున్న తీరు నిబంధనలకు విరుద్ధంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పంట రుణాల మాఫీకి సంబంధించి వాణిజ్య, సహకార బ్యాంకులు జిల్లా స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాయి. గుర్తింపు పొందిన చార్టెడ్ అకౌంటెంట్ల వద్ద శిక్షణ పొందుతున్న అకౌంటెంట్(కాలిబర్)లను ఆడిటర్లుగా కో ఆర్డినేషన్ కమిటీ నియమించింది. బ్యాంకులకు ఆడిటర్లు వెళ్లి పంట రుణం మాఫీకి అర్హులైన రైతులకు సంబంధించిన పహాణి, టైటిల్ డీడ్లను పరిశీలించాలి. అలాగే పంట రుణం పొందడానికి బంగారం కుదువ పెట్టినట్లు అయితే తనఖా ఉన్న బంగారాన్ని పరిశీలించాలి. టైటిల్ డీడ్, పహాణిల పరిశీలన సమయంలో ఖాతాదారులు అందుబాటులో ఉండాల్సిన అవసరం లేదు. కుదువ ఉన్న బంగారాన్ని పరిశీలించే సమయంలో మాత్రం సంబంధిత ఖాతాదారు తప్పనిసరిగా ఉండాలి. బంగారాన్ని కుదువపెట్టే సమయంలో నగలు తయారు చేసే వృత్తిదారుడు పరిశీలించి బ్యాంకు అధికారులకు తన ఆమోదాన్ని తెలుపుతాడు. రుణం తీసుకునే ముందు ఖాతాదారు సమక్షంలోనే బంగారాన్ని ఒక పాలిథిన్ కవర్లో ఉంచి సీల్ చేస్తారు. రుణం చెల్లించి బంగారాన్ని ఖాతాదారు తీసుకునే సమయంలో ఖాతాదారు సమక్షంలోనే మళ్లి సీల్ విప్పి బంగారాన్ని ఖాతాదారుకు అందచేస్తారు. ఇప్పుడు ఆడిటింగ్ పేర ఆడిటర్లు బంగారం కుదువ పెట్టిన ఖాతాదారుడు లేక పోయినా సీల్ వేసిన కవర్లను విప్పి పరిశీలిస్తున్నారు. ఖాతాదారులకు సమాచారం ఇవ్వండి జిల్లాలోని ధర్పల్లి మండలం రామడుగు ఎస్బీఐ శాఖతో పాటు పలు గ్రామాలలో ఉన్న బ్యాంకుల శాఖలలోను బంగారు రుణాలకు సంబంధించి బ్యాంకులో కుదువపెట్టిన బంగారాన్ని ఆడిటర్లు పరిశీలించారు. పరిశీలన సమయంలో బంగారం కుదువపెట్టిన ఖాతాదారులు అందుబాటులో లేక పోయినా ఆడిటర్లు కవర్ల సీల్ విప్పి పరిశీలించారు. దీనిపై బ్యాంకు మేనేజర్లు అభ్యంతరం వ్యక్తం చేసినా ఉన్నతాధికారులు నోర్లు మూయించినట్లు తెలిసింది. కుదువ పెట్టిన బంగారాన్ని పరిశీలించడానికి మోర్తాడ్, జక్రాన్పల్లిలోని జిల్లా సహకార బ్యాంకు శాఖలకు ఆడిటర్లు రాగా ఖాతాదారులకు సమాచారం ఇచ్చిన తరువాతనే ఆడిటింగ్ చేయాలని మేనేజర్లు స్పష్టం చేశారు. దీంతో ఆడిటర్లు వెనుదిరిగి వెళ్లారు. ఖాతాదారులకు సంబంధించిన డాక్యుమెంట్లను మాత్రం ఎప్పుడైనా పరిశీలించవచ్చని, కుదువ పెట్టిన బంగారాన్ని మాత్రం ఖాతాదారు సమక్షంలో పరిశీలించాలని కొందరు మేనేజర్లు ఆడిటర్లకు సూచిస్తున్నారు. అయితే రుణ మాఫీ ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో బ్యాంకుల కోఆర్డినేషన్ కమిటీ, ఆడిటర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బంగారం కుదువ పెట్టిన సంబంధిత వ్యక్తులు లేకుండా బంగారాన్ని పరిశీలిస్తే అందులో ఏదైనా పొరపాట్లు జరిగితే మేనేజర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఖాతాదారుల నమ్మకాన్ని కోల్పోతే బ్యాంకుల వ్యవస్థపైనే విశ్వాసం ఉండదని పలువురు మేనేజర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్యాంకుల కోఆర్డినేషన్ కమిటీ, ఉన్నతాధికారులు స్పందించి కుదువ పెట్టిన బంగారం పరిశీలన విషయంలో ఆడిటర్లు నిబంధనలు పాటించేలా చూడాలని పలువురు కోరుతున్నారు. -
డీసీసీబీ తీరిది
* జీరో బ్యాలెన్స్ అకౌంట్లకు మంగళం * నిబంధనలకు విరుద్ధంగా రైతుల నుంచి ఖాతాకు రూ.200 చొప్పున వసూలు * రూ.3.46 కోట్లు సేకరణ * డిపాజిట్లు లేకపోవడం వల్లే అలా చేశారట ఏలూరు (టూ టౌన్) : రైతులకు అండగా నిలవాల్సిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) నిబంధనలను తోసిరాజని వారిపైనే భారం మోపుతోంది. రుణమాఫీ కోసం డీసీసీబీ శాఖల్లో ప్రతి రైతుకు జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరవాలని ఆదేశాలు అందాయి. ఇదే సందర్భంలో 34 కాలమ్స్లో పేర్కొన్న వివరాలు సేకరించాలని ఉత్తర్వులు వచ్చాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీసీసీబీలు రైతులకు జీరో బ్యాలెన్స్ ఖాతాలు ఇచ్చారుు. మన జిల్లాలో మాత్రం డీసీసీబీ అధికారులు ప్రతి అకౌంట్కు రూ.200 చొప్పున కట్టి తీరాలనే నిబంధన పెట్టారు. జిల్లాలోని 258 సహకార సంఘాల్లో 1.99 లక్షల మంది రైతులు రుణాలు తీసుకోగా, ఇప్పటివరకూ 1.73 లక్షల మంది రైతులకు సంబంధించిన ఖాతాలను ఆధార్తో అనుసంధానించి, ఆన్లైన్లో పొందుపరిచారు. ఈ సందర్భంలో ఖాతాలు తెరిచిన ఒక్కొక్క రైతు నుంచి రూ.200 చొప్పున రూ.3.46 కోట్లను డీసీసీబీ సేకరించింది. సహకార సంఘాల ఖర్చులూ రైతుల నెత్తినే రుణ మాఫీ అమలు కావాలంటే ఖాతాలన్నిటికీ ఆధార్ అనుసంధానించి, ఆన్లైన్ చేయూలనే నిబంధన విధించడంతో సహకార సంఘాలపైనా మోయలేని భారం పడుతోంది. రైతులకు సంబంధించిన డేటా ఎంట్రీ చేయించడంతోపాటు స్టేషనరీ, టీఏ, డీఏ తదితర ఖర్చులు తడిసి మోపుడవుతున్నారుు. ప్రతి సంఘంపై రూ.25 వేల నుంచి 30 వేల వరకూ ఖర్చువుతోంది. సహకార సంఘాలు ఈ ఖర్చులను కూడా రైతుల నెత్తినే వేసేందుకు సిద్ధమవుతున్నారుు. రుణమాఫీకి సంబంధించి తొలుత 31 కాలమ్స్తో వివరాలు నమోదు చేయూలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ తరువాత రైతు ఇంటి పేరును పూర్తిగా రాయూలని మరో కాలం, తదనంతరం రైతుకు పొలం ఎంత ఉంది. ఆ పొలంలో ఏ పంట వేశారనే వివరాలు అడగడంతో డేటా ఎంట్రీని మూడుసార్లు మార్చాల్సి వచ్చింది. దీనివల్ల సహకార సంఘాలపై అదనపు భారం పడింది. రుణమాఫీ అవుతుందో లేదో తెలియదు గాని, రైతులకు మాత్రం అదనపు ఖర్చు అవుతోంది. -
రైతుల ఇంటికే అధికారులు
రుణమాఫీ విషయంలో ఇబ్బందులుండవు మాట వినని బ్యాంకుల విషయం ప్రభుత్వం దృష్టికి.. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు : కలెక్టర్ కిషన్ హన్మకొండ అర్బన్ : రైతులకు బ్యాంకుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటివద్దనే రుణమాఫీ, రెన్యూవల్కు సంబంధించి దరఖాస్తులపై వ్యవసాయ అధికారులు సంతకాలు తీసుకుం టారని కలెక్టర్ జి.కిషన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో రుణమాఫీ, ప్రభుత్వ పథకాల మంజూరు తదితర విషయాలను విలేకరుల సమావేశంలో వివరించారు. రుణమాఫీలో ప్రభుత్వం తొలివిడతగా 25శాతం జిల్లాకు రూ.472కోట్లు విడుదల చేసిందని, ఆ మొత్తా న్ని రైతుల వ్యక్తిగత ఖాతాల్లో జమచేయాలని బ్యాంకర్లను ఆదేశించినట్లు చెప్పారు. అయితే కొన్ని బ్యాంకులు రుణాల రెన్యూవల్ విషయంలో నిబంధనల పేరుతో రైతులను ఇబ్బం దులకు గురిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిం దని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. ప్రస్తుతం రబీ సీజన్ ప్రారంభంలో ఉన్నందున బ్యాంకులకు తిరగడం ఇబ్బందిగా ఉంటుందని భావించి వ్యవసాయ అధికారులు నేరుగా రైతుల ఇంటికి వెళ్లి రుణా ల రెన్యూవల్ దరఖాస్తులపై సంతకాలు తీసుకుని పనులు పూర్తి చేస్తారని తెలిపారు. జిల్లా లో ఇప్పటివరకు 97వేల బ్యాంకు అకౌంట్లు మాత్రమే రైతులవి అందుబాటులో ఉన్నం దున వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నార ని, ఇంకా 22వేల ఖాతాల వివరాలు అందాల్సి ఉందని పేర్కొన్నారు. మితగావారు కూడా జన్ధన్ ఖాతాలు తెరిచి అధికారులకు వివరా లు ఇవ్వాలని కోరారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు ప్రస్తుతం ఆహార భద్రత కార్డులకోసం 9.65లక్షలు, పింఛన్లకోసం 5.81లక్షల దరఖాస్తులు అధికారులకు అందాయని కలెక్టర్ తెలిపారు. వాటి పరిశీలనకు ప్రత్యేక బృందాలను ఏర్పా టు చేశామన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని, ప్రజ లు ఆందోళన చెందవద్దని సూచించారు. 20వ తేదీ గడువు అయినప్పటికీ తరువాత కూడా మండల కార్యాలయాల్లో దర ఖాస్తులు స్వీకరి స్తారని చెప్పారు. దరఖాస్తుల పరిశీలనకు అధికారులు ఎప్పుడు వచ్చేది వార్డుల వారీగా తేదీలు ముందే ప్రకటిస్తారని, ఇంటివద్ద అం దుబాటులో ఉండి తగిన సమాచారం ఇవ్వాల ని కోరారు. సమగ్ర సర్వే సమయంలో పూర్తి వివరాలు ఇవ్వని వారు.. అసంపూర్తి సమాచా రం ఇచ్చిన వారు ప్రస్తుతం మార్చుకునే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా రశీదు ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. ఫాస్ట్ పథకానికి సంబంధించి కులం, నివాసం విషయంలో విధివిధానాలు వచ్చినప్పటికీ ఆదాయం విషయంలో ప్రభుత్వం నుంచి కొంత స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. అయితే ముందుగా దరఖాస్తులు తెల్ల కాగితాలపై ఇస్తే సరిపోతుందని తరువాత అధికారులే విచారణ జరిపి ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారని చెప్పారు. ఈవిషయంలో అధికారులకు మరోసారి స్పష్టమైన ఉత్తర్వులు ఇస్తామన్నారు. ఓటర్ల నమోదు.. జిల్లాలో నవంబర్ ఒకటిన ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ ఉంటుందని, దానిని పరిశీలించి అభ్యంతరాలుంటే నవంబర్ 25వ తేదీలోగా సంబంధిత అధికారులకు దరఖాస్తు లు చేసుకోవాలని చెప్పారు. నవంబర్ 9, 16 తేదీల్లో బూత్లవారీగా జాబితాల ప్రదర్శన ఉంటుందని, డిసెంబర్ 25నాటికి డాటాఎంట్రీ పూర్తి చేసి జనవరి 5న తుదిజాబితా ప్రచురిస్తామని పేర్కొన్నారు. 18 సంవత్సరా లు నిండిన ప్రతి ఒక్కరూ జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని కోరారు. సమావేశంలో డీఆర్వో సురేంద్రకరణ్, జేడీఏ రామారావు, డీఆర్డీఏ పీడీ శంకరయ్యతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
బలిపీఠంపై బక్కరైతు
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : పచ్చని పంట పొలాలతో అలలాడుతూ సిరులొలికించాల్సిన జిల్లాను కరువు మేఘం కాటేసింది. వరుణుడు పగపట్టడం.. కాలం కాలిసిరాకపోవడం.. రుణాలు ఇచ్చే వారు లేకపోవడం.. సమయానికి భరోసా కల్పించే వారు కానరాకపోవడం కుభేరుడిగా ఉండాల్సిన రైతు కుచేలుడిగా మారుతున్నాడు. గత ఖరీఫ్ను అతివృష్టి ముంచితే.. ఈ ఖరీఫ్లో అనావృష్టి కన్నీరు పెట్టించింది. రెండు.. మూడు సార్లు విత్తనాలు విత్తినా భూమిలోనే కుళ్లిపోవడం.. కాత వచ్చే సమయంలో విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోవడం.. వెరసి రైతన్న ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. అనుకున్న దిగుబడి రాక.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక.. మట్టిలోనే కలిసిపోతున్నాడు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన వంద రోజుల్లో 31 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తగ్గిన సాగు.. తప్పని కరెంటు కష్టాలు.. జిల్లాలో ఈ ఏడాది 6.50 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అ ధికారులు అంచనా వేశారు. కానీ.. సకాలంలో వర్షా లు లేక అంచనాలు తగ్గాయి. 5.43 లక్షల హెక్టార్లు మాత్రమే సాగైంది. జూన్, జూలైలో కురవాల్సిన వర్షాలు ఆలస్యంగా ఆగస్టు చివరలో కురియడంతో ఆ మాత్రం పంటలు సాగు చేశారు. ప్రస్తుతం పూత, కాత దశలో ఉన్న పంటలకు నీటితడి అవసరం ఉంది. నెలన్నరగా వరుణుడు మొఖం చాటేయడంతో పంటలు ఆశించిన స్థాయిలో ఎదగలేదు. దీనికితోడు నీటి సౌకర్యం ఉన్న రైతులు స్ప్రింక్లర్ల ద్వారా నీరందించాలనుకుంటున్నా కరెంటు సహకరించడంలేదు. అధికారికంగానే మూడు గంటల త్రీఫేజ్ సరఫరా చేస్తామని ప్రకటిస్తే ఇక అనధికారికంగా ఎంత కరెం టిస్తారో అర్థం చేసుకోవచ్చు. అనధికారికంగా కోతలు తీవ్రం కావడంతో గంట కూడా కరెంటు ఉండని పరిస్థితి నెలకొంది. అందని రుణాలు.. రుణ మాఫీ విషయంలో ప్రభుత్వం కాలయాపన చే స్తుండడంతో అన్నదాతలకు భరోసా లేకుండా పో యింది. ఆ తర్వాత విడతల వారీగా రుణ మాఫీ చేస్తామని ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందారు. కేవలం 25 శాతం రైతులకు మాత్రమే రుణాలు మాఫీ చేయడంతో అన్నదాత అయోమయంలో పడ్డాడు. పూర్తిస్థాయిలో రుణ మాఫీ అవుతుందని ఆశ పెట్టుకున్న వారికి ప్రభుత్వం నిరాశకు గురిచేసింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.2,228 కోట్లు, 3.50 లక్షల మందికి ఇవ్వాలని నిర్ణయించారు. గతేడాది కంటే రూ.600 కోట్లు పెంచినా, ఖరీఫ్ కాలం ముగుస్తున్నా బ్యాంకర్లు మాత్రం సగం కూడా పూర్తి కాలేదు. కేవలం ఇప్పటి వరకు 1,32,311 మంది రైతులకు రూ.602 కోట్లు రుణాలు అందజేశారు. ఇప్పటివరకు రుణ మాఫీ కాని రైతులు దిగాలు చెందుతున్నారు. ప్రతిసారీ బ్యాంకర్లు ఖరీఫ్ ప్రారంభంలో పంట రుణాలు అందిస్తారు. కానీ.. ఈసారి ఖరీఫ్ ముగుస్తున్నా రుణాలు పూర్తిస్థాయిలో ఇవ్వని పరిస్థితి. ఈసారి వర్షాలు లేక రెండు మూడుసార్లు విత్తనాలు విత్తి రైతులు సుమారు లక్ష 80 వేల ఎకరాల్లో విత్తనాలు మొలకెత్తక నష్టపోయారు. ఎకరానికి సుమారు 4 వేల నుంచి రూ.6 వేల వరకు నష్టం వాటిల్లింది. అన్నిరకాల పంటలు కలిపి విత్తన దశలోనే జిల్లాలో సుమారుగా రూ.2 కోట్ల పంట నష్టం జరిగిం ది. దీంతో నష్ట పరిహారం అందక.. పంటలు మొలకెత్తక, మొలకెత్తిన పంటలు కరెంట్ కోతలతో ఎండిపోవడంతో రైతులు అత్మహత్యకు పాల్పడుతున్నారు. తగ్గిన వర్ష పాతం.. ఈ ఏడాది సాధారణ స్థాయి వర్షపాతం కంటే తక్కువగా కురిసింది. జిల్లాలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 1037.7 మిల్లీమీటర్లు కురవాల్సి ఉంది. కానీ.. 717.0 మిల్లీమీటర్లు పడింది. 31 లోటుగా ఉంది. గతేడాది ఈ సమయానికి 1326.9 మిల్లీమీటర్లు అధికంగా వర్షపాతం కురిసింది. జిల్లాలో అధికంగా 80 శాతం వర్షాధారంగానే పంటలు సాగు చేస్తున్నారు. 52 మండలాలకు గాను సిర్పూర్(టి)లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. వరి సాగు సగానికి తగ్గింది. ఈ ఖరీఫ్లో ఇప్పటి వరకు అత్మహత్యలు.. జిల్లాలో వంద రోజుల్లో 31 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. జూలైలో పది మంది, ఆగస్టులో 15 మంది, సెప్టెంబర్లో 11 మంది, ఈనెలలో ఇప్పటి వరకు నలుగురు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. పంట సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక తనువు చాలించారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పుల భారం పెరిగిపోయి.. వాటిని తీర్చలేక ప్రాణాలు కోల్పోయారు. -
నమ్మి మోసపోయారు: జానారెడ్డి
‘‘కేసీఆర్ వల్లే రుణమాఫీ అవుతుందని నమ్మి ఓటేసిన రైతులంతా మోసపోయినట్లే. రుణ మాఫీ అవుతుందని రెండేళ్లుగా బ్యాంకు రుణాలు చెల్లించకపోవడంతో ఒక్కో రైతుపై రూ. 25 వేల వడ్డీ భారం పడింది. ప్రభుత్వం ఇచ్చిన రూ. 25 వేలు వడ్డీకే సరిపోతాయి. అసలు అప్పు యథాతథంగా రైతు పేరుమీదనే ఉంది. కేసీఆర్ నిర్వాకం వల్ల ఇటు రైతులకు, అటు ప్రభుత్వ ఖజానాకు నష్టం ఏర్పడింది. మూడేళ్ల దాకా కరెంటు రాకపోతే రైతులు ఉన్న ఆస్తులు అమ్ముకుని ఆత్మహత్యలు చేసుకోవాలా?’’ -
కేసీఆర్ ఆటలు సాగనీయం: పొన్నాల
‘‘పండుగ చేసుకోవాల్సిన కొత్త రాష్ట్రంలో చావు డప్పులు మోగుతున్నాయి. నాలుగు నెలల్లో 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా.. కనికరం లేని ప్రభుత్వమిది. రైతు, పేదల వ్యతిరేకి కేసీఆర్ రాక్షస పాలన కొనసాగిస్తుండు. రుణ మాఫీ సహా ఏది అడిగినా వాయిదాలతోనే సరిపెడుతుండు. చివరకు అసెంబ్లీ సమావేశాలను, సొంత పార్టీ ప్లీనరీలను కూడా వాయిదాలపై వాయిదా వేస్తున్నాడంటే కేసీఆర్ది ‘వాయిదాల పాలన’ కాక మరేంది? కరెంట్ అడిగిన పాపానికి రైతులను గొడ్డును బాదినట్లు బాదిన చరిత్ర ఆనాడు చంద్రబాబుదైతే.. ఈనాడు కేసీఆర్దే. విద్యుత్ ఇవ్వడం చేతగాని కేసీఆర్ సీఎం సీట్లో కూర్చోవడమెందుకు? బిడ్డా కేసీఆర్.. ఇక నీ ఆటలు సాగనీయం. ఏడు గంటల విద్యుత్, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకునే వరకు మా పోరాటం కొనసాగుతుంది.’’ -
రోజుకో మాట పూటకో నిబంధన
అందరిలో అయోమయం జాబితా రూపకల్పనలో బ్యాంకర్లకు తలనొప్పులు కౌలురైతుల పరిస్థితి అగమ్యగోచరం పాస్పుస్తకం ఉంటేనే రుణమాఫీ రుణమాఫీ విషయంలో పూటకోమాట మారుస్తున్న ప్రభుత్వ వ్యవహారశైలితో రైతులు, డ్వాక్రా గ్రూపు సభ్యులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. మాటమాటకు మారుతున్న నిబంధనలు రైతుల పాలిట శాపంగా పరిణమిస్తుండగా.. కౌలు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. తిరువూరు : రుణమాఫీ అమలులో జరుగుతున్న జాప్యం రైతులకు, డ్వాక్రా గ్రూపు సభ్యులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సాధ్యమైనంత తక్కువమంది రైతులకు, డ్వాక్రా మహిళలకు మాత్రమే మాఫీ ద్వారా ప్రయోజనం కలిగేలా నిబంధనలను రోజురోజుకు కఠినతరం చేస్తున్న ప్రభుత్వవైఖరిని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. రుణమాఫీ వర్తింపజేసే ప్రక్రియ బ్యాంకర్లకు సైతం తలనొప్పిగా మారింది. తిరువూరు నియోజకవర్గంలోని జాతీయ, గ్రామీణ, సహకార బ్యాంకుల్లో గత 2 నెలలుగా రుణమాఫీ కోసం జాబితాలు సిద్ధం చేయడంలోనే అధికారులు తలమునకలవుతున్నారు. రాత్రింబవళ్ల కష్టపడి రూపొందిస్తున్న జాబితాలను హఠాత్తుగా విడుదలవుతున్న కొత్త నిబంధనల నేపథ్యంలో పదేపదే మార్పు చేయాల్సి రావడంతో పని మళ్లీ మొదటికొస్తోంది. కఠినతరమవుతున్న నిబంధనలతో కనీసం 20శాతం మంది కూడా లబ్ధిపొందే సూచనలు కనిపించడం లేదని రైతుసంఘాల నాయకులు చెబుతున్నారు. పాస్ పుస్తకం ఉంటేనే మాఫీ... రైతులకు సైతం పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉంటేనే మాఫీ వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలియడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. గతంలో భూమి దస్తావేజులపై సైతం రుణాలు పొందిన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల జారీలో రెవెన్యూ శాఖ జాప్యం చేస్తుండడంతో సగానికి పైగా రుణమాఫీ భారం ప్రభుత్వానికి తగ్గుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రైతులను నట్టేట ముంచేలా ఉందని వివిధ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. మాఫీ వర్తించని కౌలురైతు గ్రూపులు... గతంలో గ్రూపులుగా ఏర్పడి రుణాలు పొందిన కౌలు రైతులకు మాఫీ వర్తింపజేసే అవకాశం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. కౌలురైతు రుణ అర్హతా కార్డులు కలిగి, బ్యాంకుల్లో పంట రుణాలు పొందిన కౌలుదార్లకు మాత్రమే రుణమాఫీ వర్తించే అవకాశం ఉండటంతో కౌలుదారులు ఆందోళన బాట పడుతున్నారు. గత 3 సంవత్సరాల్లో తిరువూరు నియోజకవర్గంలో 6వేల మంది కౌలుదార్లను గుర్తించిన ప్రభుత్వం కేవలం 2వేల మందికి మాత్రమే రుణ అర్హతా కార్డులు అందజేసింది. వీరిలో 800 మంది మాత్రమే రుణమాఫీకి అర్హులయ్యే అవకాశం ఉంది. కాలయాపనకే కమిషన్ రుణమాఫీ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తూ రైతుల్ని మోసగిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు తెలుగుదేశం ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు లేని రుణమాఫీ వర్తింపజేయాలి. - శీలం నాగనర్సిరెడ్డి, వైఎస్సార్సీపీ తిరువూరు మండల కన్వీనర్ కంటితుడుపు చర్య రకరకాల ప్రకటనలతో రుణమాఫీ ప్రక్రియను రాష్ట్రప్రభుత్వం నీరుగారుస్తోంది. బ్యా ంకర్లకు సైతం అర్థంకాని రీతిలో నిబంధనలను రూపొందిస్తూ రైతులకు కంటితుడుపు చర్యగా రుణమాఫీ వర్తింపజేయాలని ప్రయత్నిస్తోంది. - సానికొమ్ము నాగేశ్వరరెడ్డి, రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు, తిరువూరు -
బీమా ధీమా కూడా లేదాయె!
తుపానుతో 4 జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంటలకు నష్టం రైతుకు బీమా వర్తించకుండా పోయిన వైనం రుణమాఫీ హామీతో కొత్తగా రుణాలు ఇవ్వని బ్యాంకులు అప్పులిచ్చినట్టైతే బ్యాంకులు అప్పుడే బీమా ప్రీమియం తీసుకునేవి రుణాలు రాకపోవడంతో పునరుద్ధరణ కాని పంటల బీమా దిక్కుతోచని స్థితిలో రైతాంగం హైదరాబాద్: రుణ మాఫీ చేస్తామన్న ప్రభుత్వ హామీ తుపానులో పంటలు కోల్పోయి న రైతుల పాలిట శాపంగా మారింది. రుణాలన్నీ మాఫీ అవుతాయని ఎదురుచూస్తున్న రైతులు తమ రుణాలను రెన్యువల్ చేయించుకోకపోవడమే కాకుండా పంటల బీమాను కూడా పునరుద్ధరించుకోలేదు. దీంతో హుదూద్ తుపాను కారణంగా భారీఎత్తున పంటలు నష్టపోయిన రైతులకు బీమా సౌకర్యం లేకుండా పోయింది. హు దూద్ బీభత్సంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో లక్షలాది ఎకరాలలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నారుు. ప్రకృతి బీభత్సాలతో నష్టపోయే రైతుల్ని ఆదుకునేందుకు గ్రామం యూనిట్గా వర్షాధారిత పం టల బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పంట వేసింది మొదలు కోసిన తర్వాత పంట కల్లాల్లో ఉన్నప్పుడూ 14 రోజుల వరకు బీమా సౌకర్యం వర్తిస్తుంది. మామూలుగా రైతు లు ఖరీఫ్ సీజన్లో (ఏప్రిల్ నుంచి జూలై మధ్య) బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. అప్పు ఇచ్చే సమయంలోనే బ్యాంకులు రైతులు వేసే పంటలకు అనుగుణంగా బీమా ప్రీమియా న్ని మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని రైతులకు ఇస్తుంటాయి. అయితే రుణ మాఫీ హామీ నేపథ్యంలో ఏ రైతుకూ బ్యాంకులు ఇప్పటివరకు కొత్త రుణాలు ఇవ్వలేదు. పాత రుణాలు చెల్లిస్తేనే కొత్తవి ఇస్తామని స్పష్టం చేయడంతో పం టల బీమాను ఎవరూ పట్టించుకోలేదు. ఈ పథకం గడువు గత నెలాఖరుతో ముగిసింది. గడువు ముగిసిన రెండు వారాల్లోపే తుపాను వచ్చి రైతులకు అపార నష్టం మిగిల్చి వెళ్లింది. రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదారతపై ఆధారపడాల్సిందే తప్ప.. ఓ హక్కుగా బీమాను పొందే వీలును కోల్పోయారు. ఈనెల 22 తర్వా త తొలి విడతగా బ్యాంకులకు చెల్లింపులు చేస్తామన్న ప్రభుత్వ హామీ అమలయ్యే లోపే నష్టం జరిగింది. ఈ జిల్లాల్లో వరి, చెరకు, కంది, పత్తి, సజ్జ, మొక్కజొన్న, ఆముదం, మిరప, వేరుశన గ, జీడిమామిడి పంటలకు భారీ నష్టం వాటిల్లిం ది.రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ప్రైవేటు బీమా కంపెనీలతో మాట్లాడతానన్నారే గానీ వ్యవసాయ బీమా గురించి మాట్లాడకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వ్యవసా య బీమా అంతా ప్రభుత్వ ఆధ్వర్యంలోని సం స్థలే చూస్తుంటాయి. ప్రభుత్వం నిర్దిష్టంగా ఉత్తర్వులు ఇస్తే తప్ప నిబంధనలు మార్చడానికి బీ మా సంస్థలు అంగీకరించవు. నీలం, పైలిన్ తుపాన్ల నష్టపరిహారమే ఇప్పటివరకు అందలేదు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో బీమా వస్తుందనుకోవడం అత్యాశే అవుతుందని అంటున్నారు. ప్రభుత్వం చేస్తామన్న రుణమాఫీకే నిధులకు కటకటలాడుతున్న పరిస్థితుల్లో చంద్రబాబు రైతులకు పెట్టుబడి రాయితీని ప్రకటించారు. అరుుతే ఇది నిర్దిష్ట గడువులోపు అందితే తప్ప రైతులు కోలుకునే స్థితి లేదు. పంటల బీమాపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలని, పరిహారం ఇవ్వదల్చుకుంటే ఎప్పటిలోగా ఇస్తారో ప్రకటించాలని అంటున్నారు. బీమా ఉంటే ఎకరాకు రూ. 23 వేల వరకు వచ్చేవి.. ఎవరూ పంట రుణాలు చెల్లించొద్దని చంద్రబాబు చెప్పడం వల్ల 90 శాతం మంది రైతులు రుణాలను రెన్యువల్ చేసుకోలేదు. దీంతో రైతులందరూ ఖరీఫ్లో బీమా అర్హత కోల్పోయారు. ప్రభుత్వం లేదా రైతులు సకాలంలో రుణాలు చెల్లించి రెన్యువల్ జరిగి ఉంటే తుపాను ప్రభావం వల్ల పంట పోయిన రైతులకు ఒక్కో ఎకరాకు రూ.23 వేల వరకు బీమా అందేది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే తీవ్ర సంక్షోభం ఎదుర్కోక తప్పదు. ఆర్బీఐ నిబంధనల మే రకు తీసుకున్న రుణ మొత్తం ఒకేసారి చెల్లిస్తే రెన్యువల్ చేసేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఏడాదికి 20శాతం మే ర చెల్లిస్తామంటే రైతులకు తిరిగి రుణం ఇచ్చే పరిస్థితి లేదు. పైగా వాటిని రాని బకాయిలు గా చూపి రైతులకు సంబంధించిన ఆస్తులను బ్యాంకులు జప్తు చేస్తాయి. పంట రుణాల రద్దు విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తే రైతులకు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. - రాంబాబు, కార్యదర్శి, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ పరిహారం ఇవ్వకపోతే ఆత్మహత్యలే.. రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యం. తుపాను కారణంగా చెరకు, అరటి ఇతర పంటలన్నీ నేల కొరిగాయి. ఒక్కో ఎకరాకు లక్ష రూపాయల వరకు నష్టం సంభవించింది. తిరిగి పంట వేయాలన్నా ప్రభుత్వ తీరు కారణంగా బ్యాంక ర్లు రుణం ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది.ప్రభుత్వం, బ్యాంకర్లు స్పం దించకుంటే మున్ముందు పంటలు వేసుకోలేం. - సత్యనారాయణ, రైతు,సిరివాడ, తూ.గో.జిల్లా ఎకరాకు రూ. 10 వేలు ఇవ్వాలి రైతులను ఆదుకునేందుకు ప్రజాప్రతినిధులు హామీ ఇవ్వాలి. దెబ్బతిన్న పంట పొలాలను సందర్శిస్తున్నా సహాయంపై ఇప్పటివరకు ఎవరూ మా ట్లాడటంలేదు. సర్వే చేయిస్తామని చెబుతున్నా ఎక్కడా చేయించలేదు. ప్రభుత్వం స్పందించి పెట్టుబడి కోసం ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలి. - కె.రామచంద్రరావు,సిరివాడ,తూ.గో.జిల్లా రైతులకు రెండు విధాలా నష్టం రైతులకు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు రుణ మాఫీ చేయకపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. రుణాలు రెన్యువల్ కాకపోవడంతో ఇన్సూరెన్స్ వర్తించని పరిస్థితి ఏర్పడింది. తుపానుతో పంట కోల్పోయిన రైతులు రుణమాఫీ అందక, బీమా రాక అప్పుల ఊబిలో మరింత మునిగిపోయూరు. - దడాల సుబ్బారావు, కౌలు రైతుల సంఘం గౌరవ అధ్యక్షుడు, తూర్పు గోదావరి జిల్లా -
నల్లధనం మిథ్య! స్విస్ ఖాతాలు మిథ్య!
విదేశాల్లోని నల్లధనాన్ని తిరిగి తెస్తామంటూ మోదీ గత ఎన్నికల్లో చేసిన వాగ్దానం దాదాపుగా చంద్రబాబు రుణమాఫీ నినాదమంత ప్రభావాన్ని చూపింది. కాబట్టే బీజేపీని ఇరకాటంలో పెట్టి మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి పొందాలని సోనియా ‘నల్లధనం మాటేమిటి?’ అని నిలదీస్తున్నారు. ‘నల్లధనం మాటేమి టి?’ మహారాష్ట్ర ఎన్నికల సమరంలో సోనియా గాంధీ సంధించిన తాజా అస్త్రం ఇది. ‘విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కు రప్పించడమే నా ప్రధాన లక్ష్యం’ అంటూ నేటి ప్రధా ని నరేంద్ర మోదీ గత ఎన్నికల్లో చేసిన వాగ్దానమే ఆయన గెలుపునకు కారణం కావచ్చు. కానీ అది చం ద్రబాబు రుణమాఫీ నినాదం అంత ప్రభావాన్ని చూపింది. కాబట్టే బీజేపీని, మోదీని ఇరకాటంలో పెట్టి లబ్ధి పొందవచ్చని సోనియా తాపత్రయం. యూపీఏ ప్రభుత్వంపైకి ఎల్కే ఆద్వానీ, మోదీలు సంధించిన అస్త్రాన్నే ఆమె కూడా అందుకున్నారు. ఏ ఎన్నికల్లోనైనా అన్ని పార్టీలు చేయక తప్పని జపం ఇది. చిత్తశుద్ధికి వస్తే అన్నీ ఒక తానులోని ముక్కలే. మోదీ ప్రభుత్వం నల్లధనం గుట్టు రాబట్టడానికి ‘సిట్’ను ఏర్పాటు చేసిందని ఘనంగా చెప్పుకోన వసరం లేదు. దానికి సుప్రీం కోర్టు విధించిన గడువే కారణం. ‘విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెన క్కు తెప్పించాల’ని కోరుతూ 2009లో రామ్జెఠ్మ లానీ తదితరులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశా రు. ‘ప్రభుత్వం కళ్లుగప్పి విదేశీ బ్యాంకుల్లో డబ్బును అక్రమంగా దాచుకున్న వారి పేర్లను వెల్లడించండి’ అంటూ 2011 జనవరిలో సుప్రీం మధ్యంతర ఉత్త ర్యులను జారీ చేసింది. ప్రభుత్వం తాత్సారం చేస్తుం డటంతో 2011 జూలై 4న కోర్టే ‘సిట్’ను (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దానికి మాజీ న్యాయమూర్తి జీవన్రెడ్డి నేతృ త్వం వహించాలని నిర్దేశించింది. ‘సిట్’కేవలం జీవ న్రెడ్డికి మాత్రమే దర్యాప్తు సమాచారాన్ని వెల్లడించాలని జస్టిస్ బీ సుదర్శన్రెడ్డి, ఎస్ఎస్ నిజ్జార్లు సూచించారు. (సుప్రీం సూచించే ఇలాంటి నైతిక సూత్రాలను హోంశాఖ కింద పనిచేసే ఏ దర్యాప్తు సంస్థ లేదా బృందం పాటించడం అరుదు). ‘ఇలాంటి నేరాలను అదుపు చేయలేకపోవడం ప్రభుత్వ అసమర్థతగా భావిస్తున్నాం’ అని కోర్టు నిష్కర్షగా పేర్కొంది. ప్రభుత్వం దాన్ని అవమానంగా భావిం చి ‘ఇది ప్రభుత్వ అసమర్థత కిందికి రాదు’ అంటూ అప్పీలుకు వెళ్లింది. ఈలోగా జస్టిస్ సుదర్శన్రెడ్డి పదవీ విర మణ చేయగా ఆయన స్థానంలో జస్టిస్ అల్తమస్ కబీర్ నియమితులయ్యారు. నిజ్జార్కు భిన్నంగా ఆయన ప్రభుత్వ వాదనతో ఏకీభవించ డంతో ‘మూడవ అభిప్రాయం’ కోసం అది పైకి వెళ్లి అక్కడే ఉండిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కిం చుకునే ఆశల్లేని సోనియా యూపీఏ ప్రభుత్వం 2014 ఏప్రిల్లో స్విట్జర్లాండ్లోని ‘లిచ్ టెనిష్టియన్ బ్యాంక్’ ఇచ్చిన 26 మంది పేర్లను సుప్రీం కోర్టుకు అందజేసింది. ఇది రాబోయే ప్రభుత్వాన్ని ఇరకా టంలో పెట్టడానికి వేసిన ఎత్తుగడే. ప్రపంచ అక్రమార్జనాపరుల స్వర్గసీమ స్విట్టర్లాండ్లో 312 బ్యాంకులున్నాయి, వాటికి 3,120 శాఖలున్నాయి. వివిధ దేశాల నుండి పెరుగుతున్న ఒత్తిడి కారణంగా ప్రభుత్వాలు, న్యాయస్థానాలు కోరితే సంబంధిత ఖాతాదారుల వివరాలను వెల్లడించాలనే నిబంధన ఇటీవలి కాలంలో అక్కడ అమల్లోకి వచ్చింది. విదే శాల్లో నల్లధనాన్ని దాచేవారు సాధారణంగా బినా మీల పేర్లతోనే ఖాతాలు తెరుస్తారు. నల్లధనాన్ని వెలికి తీసే ప్రయత్నాలు వేగంగా జరగాల్సి ఉంటుం ది. పూనెకు చెందిన హసన్ ఆలీ ఖాన్ అనే పందెపు గుర్రాల వ్యాపారి పేరు రచ్చకెక్కేటప్పటికే అతగాడు దాచిన డబ్బు అక్కడి నుండి రెక్కలు కట్టుకుని ఎగిరి పోయింది. ఇటీవలి కాలంలో స్విట్జర్లాండ్ను తల దన్నేలా సింగపూర్లాంటి నల్లధనం కోటలు చాలా నే పుట్టుకొచ్చాయి. నల్లధనం వెలికితీతపై ‘సిట్’ ఏర్పాటుకు సుప్రీం తుది గడువు 2014 మే 29. దీంతో మోదీ మే 28 మంత్రివర్గ సమావేశంలో రిటైర్డ్ న్యాయమూర్తి ఎమ్బీ షా నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేశారు. దానికి చైర్మన్ జస్టిస్ జీవన్రెడ్డి. బీజేపీకి చెందిన రామ్జెఠ్మలానీ పిటీషన్ వేసి ఐదేళ్లు నిండాయి. ‘సిట్’ని నియమించాలని సుప్రీం ఆదేశించి మూడేళ్ల యింది. హడావుడిగా ‘సిట్’ను నియమించి ఐదు నెల్లు గడుస్తున్నా దాని అతీ గతీ మోదీకి పట్టలేదు. ఇప్పుడు సోనియాలాగే ఆయనకు కూడా మహా రాష్ట్ర ఎన్నికల జ్వరం పట్టుకున్నట్టుంది. ఏదో చేస్తు న్నామనిపించుకోవడానికి రెవెన్యూ శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి ప్రతి నిధి బృందాన్ని స్విట్జర్లాండ్కు పంపుతున్నట్టు తాజా గా ప్రభుత్వం ప్రకటించింది. చట్ట విరుద్ద మార్గాల ద్వారా సేకరించిన అక్రమార్జనాపరుల జాబితాలను పరిగణనలోకి తీసుకునేదే లేదని, ఖాతాదారుల వివరాలను వెల్లడించే ప్రసక్తే లేదని ఫిబ్రవరిలో వచ్చిన సమాధానమే వస్తుంది గామోసు. సుప్రీం కోర్టు నల్లధనంపై కొరడా విసరడానికి ముందు స్విట్టర్లాండ్లోని మన నల్లధనం 5 లక్షల కోట్ల డాల ర్లు కాగా, ప్రస్తుతం అది 5 వేల కోట్ల డాలర్లకు చిక్కి పోయిందని అంచనా! మిగిలిన ఆ నాలుగు రాళ్లూ ‘సిట్’ దర్యాప్తు చేసి స్వయంగా ఖాతాదార్ల పేర్లు కనిపెట్టేసరికి మిగలవు. నల్లధనం మన ఎన్నికల వ్యవస్థకు ఊపిరిగా ఉన్నంత కాలం దానిపై పోరు ఎన్నికల నినాదంగానే మిగలక తప్పదు. - నన్నూరి వేణుగోపాల్ -
24 గంటలే గడువు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఇప్పటి వరకు రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేయని బ్యాంకులకు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు 24 గంటల గడువు ఇచ్చారు. 24 గంటల్లో రైతు రుణమాఫీలో ప్రగతి చూపించకపోతే ఆయా బ్యాంకుల్లో నిర్వహిస్తున్న ప్రభుత్వ ఖాతాలను ఉపసంహరించుకుంటామని ఆయన హెచ్చరించారు. ఐసీఐసీఐ, యాక్సిస్, ఇండియన్ ఓవర్సీస్, కరూర్ వైశ్యా, ఐఎన్జీ వైశ్యా, లక్ష్మి, పంజాబ్, విజయాబ్యాంకులు ఇప్పటివరకు ఒక్క రైతురుణం మాఫీ చేయకపోవడంపై మంత్రి మండిపడ్డారు. ఈనెల 12 ‘సాక్షి’లో ‘అప్పు తీర్తదో.. లేదో? అందోళనలో అన్నదాతలు ’ అన్న శీర్షికన ప్రచురితమైన కథనానికి మంత్రి హరీష్రావు స్పందించి, మంగళవారం బ్యాంకర్లు, జిల్లా అధికారులతో రైతు రుణమాఫీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా అధ్యక్షత వహించిన ఈ సమీక్షకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు కిష్టారెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి. బాబూమోహన్, చింతా ప్రభాకర్తో పాటు వివిధ బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా రెవిన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు హాజరయ్యారు. ఆంధ్రాబ్యాంకు, ఏపీజీవీబీ అధికారులు రైతులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారని, రుణాల కోసం ఆ బ్యాంకులకు వెళ్తున్న రైతులకు అన్ని జాతీయ బ్యాంకుల నుంచి ఎన్ఓసీ తీసుకురావాలంటూ నిబంధన విధిస్తున్నాయని రెవిన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ.. రైతు రుణాల రీషెడ్యూల్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.499 కోట్లు బ్యాంకర్లు జమ చేసుకొని, రైతులకు తిరిగి కొత్త రుణాలు అందించినపుడే రైతు రుణాలు మాఫీ అయినట్లుగా భావిస్తామన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన 25 శాతం రీ షెడ్యూల్ డబ్బును తమ ఖాతాల్లో జమ చేసుకున్న బ్యాంకులు, రైతులకు తిరిగి రుణాలు ఇవ్వడంతో తాత్సారం చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులకు రూ.50 వేలకు తగ్గకుండా, రూ.70 వేలకు మించకుండా రుణాలు మాఫీ చేయాలని ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకు అత్యున్నత స్థాయి అధికారులతో ఒప్పదం కుదిరిందని, అప్పుడే విధి విధానాలు కూడా రూపొందించామన్నారు. వాటిని అమలు చేయకుండా బ్యాంకు బీఎంలు ఇష్టం వచ్చినట్లుగా నిబంధనలను అమలు చేస్తూ రైతులను ఇబ్బంది పెట్టడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. మరో 10-15 రోజుల్లో బ్యాంకు అధికారులతో మరోసారి సమీక్షిస్తామని, అప్పటి కూడా బ్యాంకర్ల ప్రవర్తనలో మార్పులు రాకపోతే ఆర్బీఐకి ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రతిరోజు రైతు రుణాల ప్రగతిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. అవసరమైతే తాను కూడా బ్యాంకులను సందర్శించి రుణాలమాఫీ ప్రగతిని సమీక్షిస్తానన్నారు. రుణాల మాఫీ విషయంలో బ్యాంకర్లకు రెవిన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సహకరిస్తారని, ఈ రెండు శాఖల అధికారులు 15 రోజుల పాటు స్థానికంగా ఉంటూ రైతులకు రుణాలందేలా కృషి చేయాలన్నారు. అమర వీరుల పట్ల మానవతా దృక్పథం చూపండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని మంత్రి జిల్లా అధికారులను ఆదేశించారు. రుణమాఫీ సమావేశంలోనే రెవెన్యూ అధికారులతో మాట్లాడిన హరీష్రావు అమరవీరుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా 2000 సంవత్సరం నుంచి 2009 వరకు ఒక్క ఆత్మహత్య కూడా నమోదు కాలేదని, 2009 నుంచి 2014 వరకు 52 మంది తెలంగాణ సాధనలో అమరులైనట్లు డీఆర్ఓ ప్రకటించారు. దీనిపై మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. చాలా మంది అమరవీరుల పేర్లు గల్లంతయ్యాయని, పునఃపరిశీలన చేసి మరో ఫైల్ సిద్ధం చేయాలని మంత్రి వారిని ఆదేశించారు. ఉద్యమ సమయంలో పోరాటం చేసిన 105 మంది యువకులపై కేసులు ఉన్నట్లు ఎస్పీ శెముషీ బాజ్పాయ్ నివేదించగా, మరోసారి పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
హత్నూర: రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ పధకాన్ని పకడ్బందీగా అమలు చేస్తోందని, ఈ విషయంలో రైతులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు రాజమణి, ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రమైన హత్నూర సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ సర్టిఫికెట్లను లబ్ధిదారులకు పంపిణీ చశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎమ్మెల్యే మదన్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు రుణమాఫీ కింద మొదటి విడతగా రూ.4వేల కోట్లను మంజూరు చేశారన్నారు. రుణమాఫీ పొందిన రైతులకు 25శాతం రుణాన్ని తిరిగి ఇస్తారన్నారు. రాష్ట్రం మొత్తంలో రూ.18వేల కోట్లను నాలుగు విడతలుగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయంపై ఉన్న మక్కువతో రైతు రుణమాఫీతో పాటు రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలున్నప్పటికీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఆంధ్రలో ఉండడం వల్ల ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ సమస్య ఏర్పడిందన్నారు. మంజీరా నదిపై చెక్డ్యాంలు ఏర్పాటు చేసి ఎత్తిపోతల ద్వారా చెరువులను నింపి పంటలకు నీరందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా వారు రైతు రుణమాఫీ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పల్లె జయశ్రీ శ్రావణ్కుమార్, సొసైటీ చైర్మన్లు దుర్గారెడ్డి, లింగారెడ్డి, బ్యాంకు మేనేజర్ రమేష్, నాయకులు మురళిధర్యాదవ్, జనార్దన్రెడ్డి, శివశంకర్రావు, దేవేందర్రావు, దుర్గంగౌడ్, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతు నెత్తిన మరో పిడుగు
రుణాలపై వడ్డీ రేటు పెంపు ఆప్కాబ్ నిర్వాకం పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనలో రైతాంగం నూజివీడు : ప్రభుత్వం రుణమాఫీ అమలు చేయకుండా కాలం గడుపుతున్న నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురవుతున్న రైతుల నెత్తిన రాష్ట్ర ప్రభుత్వం మరో పిడుగు వేసింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి గడువు మీరిన రుణాలపై 2శాతం వడ్డీరేటును పెంచుతూ డీసీసీబీతో పాటు జిల్లాలోని అన్ని పీఏసీఎస్లకు ఆప్కాబ్ నుంచి ఉత్తర్వులు అందాయి. ఈ ఉత్తర్వులను ఎంతో గోప్యంగా పంపడం గమనార్హం. రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులకు మూలిగేనక్కపై తాటికాయ పడిన చందంగా వడ్డీ రేటును పెంచి ప్రభుత్వం తన సవతి ప్రేమను చూపించింది. పీఏసీఎస్లో తీసుకున్న రుణాలను ఏడాదిలోగా చెల్లించకపోతే, గడువు తీరిన తరువాత నుంచి 11శాతం వడ్డీరేటును విధిస్తుండగా, తాజా ఉత్తర్వుల ప్రకారం అది కాస్తా 13శాతానికి పెంచారు. దీంతో రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారు కానుంది. నాబార్డు పెంచిందని సాకు... రిజర్వుబ్యాంకు నుంచి నాబార్డుకు, నాబార్డు నుంచి ఆప్కాబ్కు, ఆప్కాబ్ నుంచి డీసీసీబీలకు నిధులు సమకూరుతాయి. అయితే నాబార్డు వడ్డీరేటు పెంచిందని చెప్పి ఆప్కాబ్ కూడా డీసీసీబీలకు ఇచ్చే నిధులపై వడ్డీరేటును పెంచింది. దీంతో డీసీసీబీలు కూడా సొసైటీల్లో రుణాలు తీసుకున్న రైతుల నెత్తిన పెరిగిన వడ్డీరేటును మోపింది. వడ్డీరేటు తగ్గించిన వైఎస్... 2004లో దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యేనాటికి పీఏసీఎస్లలో తీసుకున్న స్వల్పకాలిక పంటరుణాలపై 12శాతం ఉండే వడ్డీరేటును తొలుత 11శాతానికి, క్రమేణా 7శాతానికి తగ్గించుకుంటూ వచ్చారు. అలాగే దీర్ఘకాలిక రుణాలకు ఉన్న 18శాతం వడ్డీరేటును తగ్గించారు. అంతేగాకుండా కేంద్రప్రభత్వం ఇచ్చే రాయితీని కూడా రైతులకు వర్తింపచేసి కేవలం పావలా వడ్డీకే రుణాలను ఇచ్చిన రైతు బాంధవుడు వైఎస్. 2004లో కేంద్రప్రభుత్వం నియమించిన వైధ్యనాథన్ కమిటీ సహకార సంఘాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సమర్పిస్తే, ఆ నివేదికలో ఉన్న సిఫార్సులను అమలు చేసిన ఘనత కూడా వైఎస్కే దక్కుతుంది. అంతేగాకుండా నష్టాల్లో ఉన్న పీఏసీఎస్లన్నింటికి ఆర్థికపరిపుష్టి కల్పించారని రైతులే చెబుతున్నారు. రుణాలు మాఫీ చేసినా భారమే... ప్రభుత్వం రుణమాఫీని వర్తింపచేసినప్పటికీ రైతులకు రుణభారం నుంచి విముక్తి లభించే పరిస్థితులు కనిపించడం లేదు. డిసెంబర్ 31వరకు ఉన్న రుణాలు, బకాయిలను మాత్రమే మాఫీ చేస్తామని పేర్కొన్న నేపథ్యంలో జనవరి నుంచి రుణమాఫీ చేసేవరకు అయ్యే వడ్డీని రైతులు బ్యాంకులకు చెల్లించాల్సిందే. దీనికి తోడు గడువు దీరిపోయిన రుణాలకు సంబంధించి సెప్టెంబర్ నుంచి 2శాతం వడ్డీరేటు అదనంగా తోడవ్వనుంది. దీంతో రుణాలను మాఫీ చేసినా రైతులకు రుణమాఫీ భారం తప్పే పరిస్థితులు కనిపించడం లేదు. వడ్డీరేటు 2శాతం పెరిగింది : కేడీసీసీబీ సీఈవో తోట వీరబాబు గడువు దీరిన రుణాలపై వడ్డీరేటును 11శాతం నుంచి 13 శాతానికి పెంచిన ఉత్తర్వులు వచ్చాయి. ఈ పెంపు సెప్టెంబరు ఒకటోతేదీ నుంచే అమలులోకి వచ్చింది. గడువు తీరకముందు వరకు 7శాతం, గడువుతీరిన తరువాత 13శాతం చొప్పున వడ్డీని లెక్కగట్టడం జరుగుతుంది. -
ధీమా కరువు!
రుణ‘మాయ’ ఎఫెక్ట్ పంటల బీమా అర్హత కోల్పోయిన సగానికి పైగా రైతులు వణికిస్తున్న ప్రకృతి విపత్తులు ‘హుదూద్’ గండం తప్పినా అన్నదాతలను వీడని ఆందోళన సాక్షి ప్రతినిధి, విజయవాడ : సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నమ్మిన జిల్లాలోని రైతుల పరిస్థితి రెంటికీ చెడిన రేవడిలా మారింది. ఆయన చెప్పినట్లు రుణమాఫీ జరగలేదు. కనీసం బ్యాంకుల నుంచి రైతులు ఖరీఫ్ సాగు కోసం రుణాలను సైతం పొందలేకపోయారు. ఇప్పుడు అష్టకష్టాలు పడి సాగు చేస్తున్న పంటలకు కూడా బీమా భరోసా కరువైంది. హుదూద్ తుపాను నేపథ్యంలో పంటల బీమాకు అర్హత కోల్పోయినవారు ఆందోళనకు గురవుతున్నారు. ప్రతి సంవత్సరం సాగు కోసం రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకునేవారు. ఈ మొత్తంలో కొంత నగదును పంటల బీమా కింద జమ చేసేవారు. కానీ, చంద్రబాబు మాటలు నమ్మిన ఎక్కువ మంది రైతులు రుణాలు మాఫీ అవుతాయని భావించి బ్యాంకులకు రుణాలు చెల్లించలేదు. దీంతో వారందరూ ఈ ఏడాది పంటల బీమాకు అర్హత కోల్పోయినట్టే. నిర్ణీత సమయంలో బకాయిలు చెల్లించి తిరిగి రుణాలు తీసుకున్న కొందరికి మాత్రం బ్యాంకులు బీమాపై భరోసా ఇస్తున్నాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు బ్యాంకుల ద్వారా ఎంత మొత్తం రుణాలు ఇచ్చారనే విషయాన్ని చెప్పేందుకు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ నిరాకరించారు. కానీ, కొన్ని బ్యాంకుల మేనేజర్లు మాత్రం పాత బకాయిలు చెల్లించే వరకు కొత్త రుణాలు ఇచ్చే అవకాశం లేదని, దీంతో బీమా సదుపాయం కూడా ఉండదని స్పష్టంగా చెబుతున్నారు. మరోవైపు రుణమాఫీని దశలవారీగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించడంతో రైతులు మండిపడుతున్నారు. 2,20,120 మందికే అవకాశం.. జిల్లాలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో 4.50 లక్షల మంది రైతులకు రూ.3049.39 కోట్లు పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, రూ.3106.20 కోట్లను అందజేసి లక్ష్యాన్ని అధిగమించారు. పంట రుణాలు తీసుకున్న రైతుల నుంచి పంటల బీమా కోసం 5 శాతం చొప్పున మొత్తం రూ.155.31 కోట్లను బ్యాంకు అధికారులే మినహాయించుకుని ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించాయి. కానీ, 2014-15 ఆర్థిక సంవత్సరంలో వివిధ బ్యాంకుల ద్వారా రైతులకు రూ.3659.27 కోట్లను రుణాలుగా అందజేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 2,20,120 మంది రైతులకు కేవలం రూ.1,206 కోట్లను మాత్రమే పంట రుణాలుగా ఇచ్చారు. వారికి ఇచ్చిన రుణాల్లో పంటల బీమా కోసం రూ.60.3 కోట్లు మినహాయించి ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించారు. దీంతో సగానికిపైగా రైతులు పంటల బీమాను కోల్పోయారు. ప్రస్తుతానికి హుదూత్ తుపాను ముప్పు తప్పినా, నవంబరు వరకు విపత్తులు సంభవించే ప్రమాదం ఉంది. భారీ వర్షాలు కురిసి మంటలు దెబ్బతింటే తమ పరిస్థితి ఏమిటని బీమాకు అర్హత కోల్పోయిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక వడ్డీలకు డబ్బు తెచ్చి సాగు.. ఈ ఏడాది బ్యాంకుల ద్వారా సక్రమంగా రుణాలు అందకపోవడంతో రైతులు గ్రామాల్లోని ధాన్యం వ్యాపారుల వద్ద నూటికి రూ.5 నుంచి 10 రూపాయల వడ్డీకి అప్పు తీసుకుని వ్యవసాయం ప్రారంభించారు. ఈ ఖరీఫ్లో జిల్లాలోని 6.30 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. సాగునీరు సక్రమంగా రాకపోవడంతో ఆయిల్ ఇంజిన్లను అద్దెకు తెచ్చుకుని గంటకు రూ.250లు చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. దీనికి డీజిల్ ఖర్చు అదనం. ఒకవైపు ఖర్చులు రెట్టింపు కావడం, మరోవైపు బీమా భరోసా కూడా లేకపోవడం రైతులకు ఈ ఖరీఫ్ సీజన్ కలవరపెడుతోంది. -
ప్రజా సమస్యలొదిలి ఇదేం రాద్ధాంతం?
ఏది న్యాయం? ► రుణమాఫీ, పింఛన్లపై నిరసనలు పట్టని టీడీపీ ►భూములు అమ్మేసిన రైతుల్ని రెచ్చగొట్టి ఆందోళనలు ►హెరిటేజ్, ‘రామోజీ’ భూముల్ని వెనక్కిచ్చేస్తారా? ►విపక్ష నేతనే టార్గెట్ చేసుకుని కదులుతున్న తీరు (సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఒకవైపు కోస్తా జిల్లాల్ని తుపాను భయపెడుతోంది. మరోవైపు నాలుగు నెలలు గడిచినా అతీగతీ లేని రుణమాఫీ కోసం రైతులు, డ్వాక్రా మహిళలు రోడ్డెక్కుతున్నారు. గతనెల వరకూ అందించిన పింఛన్లు ఉన్నట్టుండి ఆగిపోవటంతో వితంతువులు, వృద్ధులు గ్రామసభల్లో నిలదీస్తున్నారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలుండగా వీటన్నిటి నుంచీ జనాన్ని పక్కదోవ పట్టించడానికి తెలుగుదేశం పార్టీ కొత్త డ్రామాలు మొదలెట్టింది. ప్రజా సమస్యలపై నిలదీస్తున్న ప్రతిపక్ష నేతను లక్ష్యంగా చేసుకుని ఆయన కుటుంబీకులకు చెందిన ‘సరస్వతీ సిమెంట్స్’ను వేధిస్తోంది. ఆరేడేళ్ల కిందట ఈ సిమెంట్స్కు భూములు విక్రయించిన రైతుల్ని రెచ్చగొట్టి, సంస్థ ఇప్పటిదాకా ప్లాంటు పెట్టలేదు కాబట్టి ఆ భూముల్ని తిరిగి రైతులకిచ్చేయాలంటూ ఆందోళనలు చేయిస్తోంది. సంస్థకు 2009లో ఇచ్చిన సున్నపురాయి గనుల లీజును కూడా రద్దు చేసింది. అసలు ప్లాంటు పెట్టాలంటే అనుమతులుండాలి కదా? వాటి కోసం ఐదేళ్ల కిందట చేసిన దరఖాస్తుల్ని ఇప్పటికీ పరిష్కరించకుండా, నీటి వసతి కోసం పెట్టిన దరఖాస్తును నేరుగా సీఎం కార్యాలయంలోనే అట్టిపెట్టుకుని... మరోవైపు ప్లాంటు పెట్టలేదు కాబట్టి లీజు రద్దు చేశామనటాన్ని ఏమనుకోవాలి? ప్లాంటు రాలేదు కనుక కొనుగోలు చేసిన భూముల్ని రైతులకిచ్చేయాలని చేస్తున్న డిమాండ్లను ఏమనుకోవాలి? ఫిలిం సిటీ కోసం రామోజీరావు ఎకరాకు లక్షకు మించి ఎక్కడా వెచ్చించలేదు. మరిపుడు ఆయన భవనాలు నిర్మించిన ఐదారు ఎకరాల్ని వదిలేసి మిగిలిన 1900 పైచిలుకు ఎకరాలనూ తిరిగి రైతులకిచ్చేయాలని చంద్రబాబు ఎందుకు డిమాండ్ చేయటం లేదు? తన హెరిటేజ్ సంస్థ కోసం కొనుగోలు చేసిన వేల ఎకరాల భూముల్ని తిరిగి రైతులకు ఎందుకు అప్పగించటం లేదు? సిమెంట్ కంపెనీ కోసమని కొనుగోలు చేసి నిరుపయోగంగా వదిలిపెట్టిన టీడీపీ నేత జేసీ దివాకరరెడ్డి భూములపై ఎందుకు రాద్ధాంతం చేయటం లేదు?సరస్వతీ సిమెంట్స్ సమీపంలోనే సంఘీ సంస్థ సేకరించిన 2000 పైచిలుకు ఎకరాల్లో గానీ, గుజరాత్ అంబుజా, ఆంధ్రా సిమెంట్స్ సంస్థలు సేకరించిన భూముల్లో ఇప్పటిదాకా పనులు మొదలుపెట్టలేదే! వాటిని వెనక్కి ఇచ్చేయాలని ఎందుకు ధర్నాలు చేయించటం లేదు? లీజుల్ని ఎందుకు రద్దు చేయలేదు? మరీ ఇంత దిగజారుడు వ్యవహారమా? ఒకవైపు రుణమాఫీ చేయనందుకు రైతులకు మొహం చూపించలేని పరిస్థితుల్లో ఉన్న బాబు... రైతులకు న్యాయం చేస్తామంటూ తమ వర్గానికి చెందిన కొందరిని జగన్మోహన్రెడ్డిపైకి రెచ్చగొడుతుండటాన్ని ఏమనుకోవాలి? కొనుగోలు చేసిందీ అధిక ధరకే... నిజానికి 2008. 2009లో సరస్వతీ సిమెంట్స్ రైతుల నుంచి భూములు కొన్నపుడు గుంటూరు జిల్లా తంగెడ, వేమవరం, చెన్నాయపాలెం గ్రామాల్లో ధర ఎకరాకు రకాన్ని బట్టి రూ.1-3 లక్షల మధ్య ఉంది. రైతులకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో సరస్వతీ సంస్థ ఎకరాకు కనిష్టంగా రూ.3 లక్షల నుంచి గరిష్టంగా రూ.8.5 ల క్షలు చెల్లించింది. అందుకేఒక్క రైతు కూడా తనకు అన్యాయం జరిగిందనలేదు. ఇపుడు టీడీపీకి చెందిన వారిని రెచ్చగొట్టి ఆ భూముల్లో ఘర్షణలకు దిగుతూ... అడ్డుకున్న సరస్వతీ సంస్థ సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు సైతం ప్రభుత్వ పెద్దలే పెట్టిస్తున్నారంటే ఏమనుకోవాలి? ఎందుకీ దిగజారుడు రాజకీయాలు? -
సహకార బ్యాంకుల్లో రూ.184కోట్ల రుణాలు మాఫీ
గజ్వేల్: జిల్లాలోని సహకార బ్యాంకు ల ద్వారా రైతులకు రూ.184 కోట్ల రుణమాఫీ వర్తిస్తుందని, ఇందులో ఇప్పటివరకు పావువంతు రూ.44 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయినట్లు డీసీసీబీ చైర్మన్ జైపాల్రెడ్డి తెలి పారు. శనివారం గజ్వేల్లోని సహకార బ్యాంకులో ఇద్దరు రైతులకు రుణమాఫీ చెక్కులు అందజేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని సహకార బ్యాంకుల్లో 56951 మంది రైతులు రుణాలు పొం దారని వారందరికీ రుణమాఫీ వర్తిస్తుందని చెప్పారు. ఈనెల 15లోగా రైతులు తమ రుణాలను రెన్యువల్ చేసుకొని ‘జీరో’ వడ్డీని పొందాలని సూచిం చారు. గజ్వేల్ నియోజకవర్గంలో 5149మంది రైతు లు రుణాల పొందారని చెప్పారు. వీరికి రూ.13.7కోట్ల రుణమాఫీ వర్తిస్తుందన్నారు. జాతీయ బ్యాంకులకు దీటు గా తమ బ్యాంకు సేవలందిస్తుందని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ దేవేందర్రెడ్డి, జనరల్ మేనేజర్ శివకోటేశ్వర్రావు, గజ్వేల్ మండల సహకార సంఘం చైర్మన్ వెంకట్నర్సింహారెడ్డి, స్థానిక బ్రాంచ్ మేనేజర్ కొండల్రెడ్డి పాల్గొన్నారు. కొండపాక: కొండపాక పీఏసీఎస్లో రుణాలు తీసుకున్న 826 మంది రైతులకు 2కోట్ల 56లక్షల రూపాయల రుణమాఫీ వచ్చిందని దేవేందర్రెడ్డి చెప్పారు. దీంట్లో 25 శాతం కింద రూ.61 లక్షలు పీఏసీఎస్కు చేరాయన్నారు. రైతులు ఈ నెల 15 వరకు తమ రుణాలను రెన్యూవల్ చేయించుకోవాలని సూచించారు. లేనిపక్షంలో రెండో విడత విడుదలయ్యే మాఫీ డబ్బులకు ఇబ్బందులెదురవుతాయన్నారు. రెన్యువల్ చేసుకుంటే జీరో శాతం వడ్డీ లేదంటే రైతులకు 13 శాతం వడ్డీ పడుతుందన్నారు. -
పంట రుణాలివ్వడంలో వెనుకంజ
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలోని వివిధ బ్యాంకులు రైతులకు పంట రు ణాలు మంజూరు చేయడంలో ఇతర జిల్లాల కంటే వెనుకంజలో ఉన్నాయని కలెక్టర్ ఎం.జగన్మోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాం కర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు పంట రుణాలు అందించాలని ప్రభుత్వం పదేపదే చెబుతోందని, రుణ మాఫీ కూడా చేసిందని పేర్కొన్నారు. అయినా కొత్త పంట రుణాల మంజూరులో మన జిల్లా వెనుకబడి ఉందని తెలిపారు. జిల్లాలో భూములు లేని వారు కూడా బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్నట్లయితే తమకు రిపోర్టు చేయాలని కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశించారు. ఈ నెల 15వ తేదీలోగా పంట రుణాలు ఇవ్వాలని సూ చించారు. ప్రతీ రోజు ఐదు గంటలకు ఏయే బ్యాంకులు ఎం త మంది రైతులకు రుణాలు ఇచ్చారో తనకు నివేదికల రూపంలో పంపాలని అన్నారు. సంబంధిత మండల తహశీల్దార్లు, ఆర్డీవోలు ఆయా పరిధిలోని బ్యాంకుల్లో కొద్ది సమ యం కేటాయించాలని, బ్యాంకు అధికారుల సమన్వయం తో పంట రుణాల మంజూరులో సహకరించాలని కోరారు. మండలాల ఏవోలు, ఎడీలు, కూడా బ్యాంకులకు వెళ్లి రుణా ల విషయంలో సరి చూడాలని ఆదేశించారు. పరిహారంను రైతు పాత బకాయి కింద జమ చేస్తే ఆ బ్యాంకుల వివరాలను తనకు పంపాలని ఎల్డీఎంకు సూచించారు. ఓ జిల్లా కలెక్టర్ బ్యాంకర్లపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు కంప్లయింట్ చేస్తే బాగుంటుందా.. అని ప్రశ్నించారు. అనంతరం వివిధ బ్యాంకుల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, యువజన సర్వీసుల శాఖలు వివిధ పథకాల కింద బ్యాంకుల ద్వారా కల్పిస్తున్న రుణ సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. జన్ధన్ యోజన పథకం కింద ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా ఉండాలని, ఇందుకు జీరో ఖాతా తెరవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్, ఎల్డీఎం శర్మ, జేడీఏ రోజ్లీల, ఆర్డీవోలు, వివిధ బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. -
అప్పు తీర్తదో..లేదో?
ఆందోళనలో రైతన్నలు ‘పోతిని... బేంకిల దస్కతి పెడితిని.. ఇయ్యాలగాకున్నా రేపైనా బేంకోడు నా ఇంటికే ఒచ్చి తట్టాసెంబులు గుంజుకపోడా?.. గింతకు గంతయి మొయ్యలేని బరువైనంక నా భూమిని బేంకోడు ఏలం బెట్టడా?’ నరసన్నపేట గ్రామానికి చెందిన రైతు రామచంద్రారెడ్డి, ఇటిక్యాల రైతు మల్లయ్య, రాంనగర్కు చెందిన చెందిన ఎర్రబోయిన నారాయణ అనే రైతులు అనుమానం ఇది. ప్రభుత్వం రుణమాఫీ అమలు చేస్తున్నా, రైతులు వాస్తవానికి బ్యాంకుకు వెళ్లి రుణాలు రీషెడ్యూల్ లేదా రెన్యూవల్ చేయించుకోవాలి. అందుకు బ్యాంకులో సంతకాలు చేయాలి. కానీ సంతకాలు చేస్తే బ్యాంకర్లు తమ వద్దే అప్పు వసూలు చేస్తారని భయపడుతున్నారు రైతులు. వాస్తవ పరిస్థితిని రైతులకు వివరించాల్సిన యంత్రాగం ఆ పని చేయకపోవడంతో జిల్లాలో చాలామంది రైతులు బ్యాంకు వైపు కన్నెత్తి చూడడం లేదు. సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.500 కోట్లు బ్యాంకుల్లో జమ చేసింది. అయినా రైతుల్లో ఇంకా ఏదో ఆందోళన. స్పష్టమైన విధివిధానాలు రూపొందించి కచ్చితమైన హామీ ఇచ్చినా, రుణమాఫీ అవుతోందో? కాదో అన్న భయం వెంటాడుతోంది. ఖరీఫ్ ఎలాగు ముగిసిపోయింది, కనీసం రబీకైనా కొత్త రుణాలు దక్కుతాయే లేదో అని అన్నదాతలు దిగులు పడుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఇంకా ఐదురోజులు మాత్రమే ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు కేవలం 3,404 మంది రైతులు మాత్రమే రీషెడ్యూల్ చేయించుకున్నారు. దీనిపై వాస్తవ పరిస్థితులు అంచనా వేసేందుకు ‘సాక్షి’ పల్లెల్లో తిరిగింది. రైతులు ఏముకుంటున్నారో..వారి ఆందోళన ఏమిటో తెలుసుకునేప్రయత్నం చేసింది. రుణమాఫీ, రీషెడ్యూల్పై అన్నదాతలకు అవగాహన కల్పించడంపై అధికారులు పూర్తిగా విఫలమాయ్యారని ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. దీనికి తోడు ప్రతిపక్ష నేతలు ఎవరికి తోచిన విధంగా వారు రుణమాఫీపై స్టేట్మెంట్లు ఇస్తూ రైతులను భయపెట్టారు. దీంతో రైతన్నలు రుణమాఫీపై ఆందోళన చెందుతున్నారు. బ్యాంకు గడపతొక్కని రైతు జిల్లాలో 4,04,095 మంది రైతులు లక్షలోపు రుణాల మాఫీకి అర్హత ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో 1,12,104 మంది రైతు లు రుణాల రీషెడ్యూల్కు, 2,91,991 మంది రైతులు రుణాల రెన్యూవల్కు అర్హులుగా నిర్ధారించింది. ఇప్పటి వరకు కేవలం 3,404 మంది రైతుల రుణాలే రీషెడ్యూల్ కాగా 44,807 మంది రైతుల రుణాలను మాత్రమే బ్యాంకర్లు రెన్యూవల్ చేయగలిగారు. ఇంకా 2.47 లక్షల మంది రైతుల రుణాలు రెన్యూవల్ చేయాల్సి ఉంది. లక్ష మందికిపైగా రైతుల రుణాలు రీషెడ్యూల్ చేయాల్సి ఉంది. రీషెడ్యూల్ అంటే... బ్యాంకులో రుణం అలాగే ఉంటుంది. నిర్ధారించిన రూ. లక్ష వరకు అసలు, దానికైన వడ్డీని కలిపి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ చెల్లింపులు వచ్చే ఏడాది చెల్లించవచ్చు... లేదంటే మరో రెండు మూడేళ్ల తర్వాతైనా చెల్లించవచ్చు. ఎప్పుడు చెల్లిం చినా అసలు వడ్డీని కలిపి రైతుతో సంబంధం లేకుం డా రాష్ట్ర ప్రభుత్వమే రైతుల రుణాలను తీర్చేస్తుంది. భారతీయ రిజర్వుబ్యాంక్తోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విధంగా ఒప్పందం చేసుకుని వచ్చారు. దీన్నే రీషెడ్యూల్ అంటారు. అయితే ఇక్కడ రైతు పే రు మీద కొత్త ఖాతా తెరిచి ఈ ఖాతాలోనే పాత అప్పును జమ చేస్తారు. ఈ పద్ధతిలో రైతులు బ్యాం కులకు వెళ్లి బ్యాంకు రికార్డుల మీద సంతకం చే యాల్సి ఉంటుంది. ఇక్కడే రైతులు జంకుతున్నారు. సంతకం పెడితే అసలుకు వడ్డీలు కలిపి తమ వద్దే వసూలు చేస్తారోమోనని భయపడుతున్నారు. రెన్యూవల్ అంటే... ఇక రుణాలు రెన్యూవల్ అంటే ప్రభుత్వం రైతు రుణాలను దశల వారీగా బ్యాంకుకు చెల్లిస్తుంది. 2013 ఖరీఫ్ సీజన్ కంటే ముందు తీసుకున్న పంట రుణాలు, బంగారం రుణాలను కూడా ప్రభుత్వమే విడతల వారీగా చెల్లిస్తుంది. సర్కార్ మొదటి విడత కింద 25 శాతం డబ్బును చెల్లిస్తుంది. మిగిలిన డబ్బును కూడా వాయిదాల్లో జమ చేస్తుంది. దీనికి కూడా రైతు బ్యాంకు రికార్డుల్లో సంతకం చేయాల్సి ఉంటుంది. తొలి విడత నిధులు బ్యాంకులో జమ కాగానే రైతులు కొత్త రుణాలకు అర్హులు అవుతారు. పెరిగిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, చెల్లించిన 25 శాతం సొమ్మును కలుపుకుని రూ.55 వేల వరకు రైతులకు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం బ్యాంకర్లకు సూచించింది. పై రెండు పద్ధతుల్లో కూడా రైతులు రుణాలు కట్టాల్సిన పని లేదు. ప్రభుత్వమే రుణాలు చెల్లిస్తుంది. కానీ రెవిన్యూ, వ్యవసాయ, సమాచార, ప్రజా సంబంధాల శాఖల అధికారులు రైతులకు బ్యాంకు లావాదేవీల గురించి విడమరిచి చెప్పడంలో విఫలమయ్యారు. దీంతో అన్నదాతలు పాత రుణాలు మాఫీ చేయించుకోలేక, కొత్త రుణాలు తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఖరీఫ్ రుణాల మంజూరు, రుణాల మాఫీ మీద లీడ్బ్యాంకు మేనేజర్ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
‘బాబు’ మాయ
⇒ అన్నదాతకు కోలుకోలేని దెబ్బ ⇒ బ్యాంకుల నుంచి అందని రుణాలు ⇒ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు ⇒ ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.3,797 కోట్లు ⇒ బ్యాంకులు ఇచ్చింది కేవలం రూ. 227 కోట్లు సాక్షి, గుంటూరు : అన్నదాతలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. రుణ మాఫీ పేరుతో రైతులను ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసింది. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లతో కనీసం పెట్టుబడులు కూడా రాక కుదేలవుతున్న అన్నదాతకు రుణమాఫీ రూపంలో కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. బ్యాంకుల్లో ఉన్న రుణాలు రద్దుకాక, కొత్త అప్పు పుట్టక అవస్థలు పడుతున్నారు. ► బ్యాంకుల నుంచి రుణాలు అందకపోవడంతో పెట్టుబడుల కోసం రైతులు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించక తప్పడం లేదు. ఈ అవకాశాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకొంటున్నారు. అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు. ► ఈ ఏడాది ఖరీఫ్ రుణం లక్ష్యం రూ. 3797.14 కోట్లు కాగా, ఇప్పటి వరకు కేవలం రూ. 227.80 కోట్ల రూపాయల రుణాలను మాత్రమే బ్యాంకులు మంజూరు చేశాయి. దీంతో రైతులంతా వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు. ► ప్రభుత్వ నిర్వాకంతో రెండు రకాల భారం అన్నదాత నెత్తిన పడింది. బ్యాంకుల్లో ఉన్న రుణాలు రద్దుకాకపోవడంతో 14 శాతం వడ్డీ రైతుకు భారంగా మారింది. మరో వైపు పెట్టుబడులకు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించడంతో వందకు మూడు రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారు. ► ఇప్పటికీ రుణమాఫీకి సంబంధించి స్పష్టమైన విధి విధానాలు రాక పోవడంతో అన్నదాతలకు దిక్కు తోచడం లేదు. ► ఖరీఫ్ సీజన్ ముగియడంతో రబీ సాగు కోసం రైతులు సన్నాహాలు చేసుకొంటు న్నారు. చేతిలో రూపాయికూడా లేకపోవడంతో సాగు ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ► జిల్లాలో 12,21,965 మంది రైతులకు రుణ మాఫీ ద్వారా రూ.9,749 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరాల్సివుంది. రుణమాఫీ కాకపోగా, రుణాలను రెన్యూవల్ చేయలేదు. ► ప్రస్తుత ఖరీఫ్ సీజన్ పూర్తయ్యే నాటికి రైతులకు రూ.6,328 కోట్ల రూపాయల రు ణాలను ఇవ్వాలని జిల్లా అధికారులు ప్రణాళికలు వేసినా ఆచరణలో కార్యరూపం దాల్చ లేదు. రబీ సాగుకు సన్నాహాలు... ► జిల్లాలో అన్నదాతలు రబీ సాగుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. పెట్టుబడులు కోసం మళ్లీ వడ్డీ వ్యాపారస్తుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ► రబీలో ముఖ్యంగా జొన్నతో పాటు, రెండో పంట కింద వరి సాగు చేస్తారు. ► ప్రభుత్వం రూ. 2,531.43 కోట్ల రూపాయలను రబీ రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు ఎవ్వరికి ఇవ్వలేదు. ► జిల్లాలో 3,684 మంది రైతు మిత్ర గ్రూపులకు రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా, కేవలం 136 గ్రూపులకు మాత్రమే రుణాలు ఇచ్చారు. ► కౌలు రైతులకు సంబంధించి 27,562 మందికి రుణ అర్హత కార్డులు మంజూరు చేసినా ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. ► జిల్లాలో 7,945 రైతు సంఘాలు ఉండగా 38 గ్రూపులకు మాత్రమే రుణాలు ఇచ్చారు. మొత్తం మీద రైతులకు పంట రుణాలు అందని ద్రాక్షగా మారాయి. -
16న ధర్నాలు
రుణమాఫీ అమలులో ప్రభుత్వ తీరుకు నిరసనగా.. పార్టీలకు అతీతంగా రైతులు, డ్వాక్రా మహిళలు పాల్గొనాలి వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు పార్థసారథి పిలుపు కంకిపాడు : రుణమాఫీ అమలు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఈ నెల 16వ తేదీన అన్ని మండల కేంద్రాల్లోనూ ధర్నాలు నిర్వహించాలని వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కంకిపాడులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీపై ఆశతో టీడీపీకి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరూ 16న అన్ని మండల కేంద్రాల్లో జరిగే ధర్నాల్లో పాల్గొని తమ నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా రైతులు, మహిళలు ధర్నాల్లో పాల్గొని పాలకుల కళ్లు తెరిపించాలని కోరారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన చంద్ర బాబుకు ప్రజల ఇబ్బందులు పట్టడంలేదని విమర్శించారు. -
డ్వాక్రా మహిళల మెడపై కేసుల కత్తి
యలమంచిలి కోర్టులో 19 మందిపై వ్యాజ్యాలు మరో 37 మందిపై దాఖలుకు చర్యలు నిర్ధారించిన ఎస్బీఐ బ్రాంచి మేనేజర్ యలమంచిలి : రుణమాఫీ విషయంలో టీడీపీ ప్రభుత్వం తాత్సారంతో బ్యాంకర్లు తమపని తాము చేసుకుంటూ పోతున్నాయి. కాలపరిమితి తీరిన రుణాలపై నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి కోర్టుల్లో కేసులు దాఖలు చేస్తున్నారు. ఎన్నికలప్పుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు కూడా బ్యాంకులకు చెల్లించొద్దంటూ పదే పదే సభల్లో ప్రకటిస్తున్నారు. ప్రభుత్వమే అప్పులు తీరుస్తుందంటున్నారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలయినా రుణమాఫీ అమలు కాలేదు. డ్వాక్రా మహిళలూ రుణమాఫీ ఆశతో బ్యాంకులకు అప్పులు చెల్లించలేదు. ఈ క్రమంలో కాలపరిమితి తీరిన మొండి బకాయిల విషయంలో యలమంచిలి స్టేట్ బ్యాంక్ అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. యల మంచిలి మున్సిపాలిటీ పరిధి కొక్కిరాపల్లికి చెందిన 19 మంది డ్వాక్రా మహిళలపై యల మంచిలి సబ్కోర్టులో దావాలు వేశారు. కొక్కిరాపల్లిలోని 40 స్వయం సహాయక సంఘాలకు రూ.2కోట్లకుపైగా ఆరేళ్లక్రితం యలమంచిలి ఎస్బీఐ అప్పులిచ్చింది. దాదాపు 400 మంది మహిళలు రుణాలు పొందారు. వీరు తీసుకున్న రుణం వడ్డీతో కలిపి రూ.3.50కోట్లకు చేరుకుందని ఎస్బీఐ బ్రాంచి మేనేజర్ పి.ఎస్.శ్రీనివాసమూర్తి గురువారం విలేకరులకు చెప్పారు. తొలి దశలో 19 మంది మహిళలపై కేసులు వేశామన్నారు. మరో 37 మందిపై న్యాయస్థానంలో కేసులు వేసేందుకు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కాలపరిమితి తీరిన రుణాలపై నిబంధనల ప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం రుణమాఫీని వెంటనే అమలు చేసి తమను ఆదుకోవాలని డ్వాక్రా మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్క ఎస్బీఐ నుంచే కాకుండా మిగతా బ్యాంకర్లు కూడా కోర్టుల్లో వ్యాజ్యాలు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఈ పరిణామం యలమంచిలిలో సంచలమైంది. డ్వాక్రా మహిళలు ఆందోళన చెందుతున్నారు. -
అర్హులను గుర్తించేందుకే సమగ్ర గణన
కలెక్టర్ రాహుల్ బొజ్జా సంగారెడ్డి అర్బన్: కేంద్ర ప్రభుత్వ ఆదేశాను సారమే కుటుంబంలోని వ్యక్తులు, వారి సాంఘిక, ఆర్థిక పరిస్థితులు, కులం, విద్యార్హతలు తదితర వివరాలను 2011 నుంచి సేకరించామని కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. ఈ వివరాలను వివిధ ప్రభుత్వ ప్రణాళికల్లో భాగంగా పథకాల అమలులో వినియోగిస్తామన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 10 న గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, గ్రామైక్య సంఘాల్లో, తహశీల్దార్ కార్యాలయాల్లో, పురపాలక సంఘాల్లో వెబ్సైట్ల ద్వారా ముసాయిదా జాబితాను అందుబాటులో ఉంచుతామన్నారు. గతంలో నిర్వహించిన సర్వే సమయంలో అందుబాటులో లేని వారు, విద్యార్హతలు ఇతర సమాచారాన్ని సరిచేయించుకోవాలనుకునే వారు ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 19న గ్రామ సభలు నిర్వహిస్తామని, నవంబర్ 8 వ తేదీన ఆక్షేపణలను స్వీకరిస్తామన్నారు. నవంబర్ 30లోపు ఆక్షేపణలను పరిష్కరించి ముసాయిదా జాబితాను డిసెంబర్ 30 లోపు ప్రచురిస్తామన్నారు. ప్రజలంద రూ ముసాయిదా జాబితాలో కుటుంబ వివరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి కుటుంబంలోని వ్యక్తుల పేర్లు లేనట్లయితే, జాబితాలోని సమాచారాన్ని సవరణ చేయడానికి , ఇతరుల సమాచారంపై ఆక్షేపణలు చేయడానికి, తొలగించడానికి వినతులను సంబంధిత అధికారులకు అందించాలన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందేలా చూడటం ఈ జాబితా ఉద్దేశమన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా మాత్రమే దరఖాస్తును నేరుగా అధికారులకు అందజేయాల్సి ఉంటుందన్నారు. రుణాలు రీషెడ్యూల్ చేసుకోవాలి నెల రోజులుగా రుణమాఫీ కోసం చర్యలు తీసుకుంటున్నామని, రూ.లక్షలోపున్న రైతుల రుణాలు మాఫీ చేయడంతో పాటు రీషెడ్యూల్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2013 ఖరీఫ్ లోన్ మూడు సంవత్సరాలకు రీషెడ్యూల్డ్ అవుతుంద న్నారు. మొదటి సంవత్సరం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వమే రెండు, మూడు సంవత్సరాలలో రూ.లక్ష చెల్లిస్తుందన్నారు. రైతులు బ్యాంకుల వద్దకు వెళ్లి రీషెడ్యూల్ మాత్ర మే చేయించుకోవాలన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆహార భధ్రత కార్డులను మంజూరు చేయనున్నట్లు సమాచారం అందిందని కలెక్టర్ తెలిపారు. ఈ దరఖాస్తులను వీఆర్వో కార్యాలయంలో స్వీకరించనున్నట్లు తెలిపారు. తెల్లకాగితంపై సాధారణ వివరాలు పొందుపరుస్తూ, ఆధార్కార్డు వివరాలు అందించినట్లయితే సమగ్ర కుటుంబ సర్వేలో పొందుపర్చిన వివరాల ఆధారంగా కార్డులు అందజేస్తామన్నారు. ఈ నెల 15 తర్వాత షెడ్యూల్డ్ ప్రకటిస్తామన్నారు. వీటితో పాటు ఫాస్ట్ పథకం, పెన్షన్ల ప్రక్రియ అక్టోబర్ లోపు ఈ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా పూర్తిచేస్తామన్నారు. కల్యాణ లక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు అన్లైన్ ద్వారా మీ-సేవా కేంద్రంలో http://epass.cgg.gov.in సంప్రదించగలరన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.ఎ.శరత్, డీఆర్డీఏ పీడి రాజేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
15లోగా రుణమాఫీ ప్రక్రియ పూర్తిచేయాలి
హైదరాబాద్: రుణమాఫీ ప్రక్రియను ఈ నెల 15వ తేదీలోగా పూర్తిచేయాలని, రైతులందరికీ కొత్త రుణాలు అందేట్లు చూడాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ బి.జనార్దన్రెడ్డి కలెక్టర్లను కోరారు. బుధవారం సచివాలయం నుంచి వారు జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్లో వూట్లాడారు. జిల్లాల్లో కలెక్టర్లతోపాటు జిల్లా వ్యవసాయధికారి, లీడ్ బ్యాంకు మేనేజర్లు ఇందులో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 15 వరకు రోజూ కలెక్టర్లతో సమీక్ష చేస్తామని జనార్దన్రెడ్డి చెప్పారు. రైతులకు కొత్త రుణాలు తక్షణంగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నందున యుద్ధప్రాతిపదికన రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేయాలని కలెక్టర్లను ఆదేశించారు. -
రైతులూ.. రుణాలు చెల్లించొద్దు!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణమాఫీపై నాదీ భరోసా.. అప్పులన్నీ నేనే చెల్లిస్తా ఏ బ్యాంకరూ మీ ఇంటి వద్దకు రాకుండా, ఆస్తులు జప్తు చేయకుండా చూసే బాధ్యత నాది మాఫీకి కేంద్రం, ఆర్బీఐ మోకాలడ్డుతున్నాయి వర్షాకాలానికల్లా హంద్రీ-నీవా పూర్తి చే సి సీమ జిల్లాలకు నీరందిస్తాం పింఛన్ నిబంధనల్లో ‘అనంత’కు సడలింపు కాంగ్రెస్ నేతలు చెల్లని కాసుల్లాంటి వాళ్లు అనంతపురం: రాష్ట్రంలో రైతులు రుణాలు చెల్లించవద్దని సీఎం నారా చంద్రబాబునాయుడు చెప్పారు. రుణ మాఫీ విషయంలో పూర్తి భరోసా తనదేనన్నారు. రైతుల భారాన్ని భుజస్కంధాలపై మోస్తానని, అప్పులన్నీ చెల్లిస్తానన్నారు. ఏ బ్యాంకరూ రైతుల ఇంటి వద్దకు రాకుండా, ఆస్తులు జప్తు చేయకుండా చూసే బాధ్యత తనదేనని తెలిపారు. సోమవారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గరుడాపురంలో జరిగిన ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే లక్ష్యంతో ఏర్పాటైన ‘ప్రాథమిక రంగ వ్యవసాయ మిషన్’ను మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంతో కలసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతపురంలో ప్రారంభించనున్న నూనె గింజల పరిశోధన కేంద్రం, కనగానపల్లి మండలంలో ఏర్పాటు చేసే గోరుచిక్కుడు, జిగురు పరిశ్రమలు, నంబులపూలకుంటలో ఏర్పాటు చేసే వేరుశనగ విత్తన ఉత్పత్తి, పరిశోధన కేంద్రాల శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి వాట ర్ ప్లాంటునూ ప్రారంభించారు. ఈ సందర్భంగా గరుడాపురంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అధ్యక్షతన జరిగిన సభలో బాబు ప్రసంగించారు. ‘గత ఏడా ది నేను చేసిన పాదయాత్రంలో జిల్లాలోని చిప్పగిరి రైతుల కష్టాలను చూసి చలించిపోయి రుణమాఫీ హామీ ఇచ్చా. తర్వాత రాష్ట్రం విడిపోవడంతో రూ.15 వేల కోట్ల ఆర్థిక లోటు ఏర్పడింది. రుణ మాఫీకి కేంద్రం, ఆర్బీఐల నుంచి సహకారం లేదు. అయినా వెన క్కు తగ్గేది లేదు. ఈ నెల 22లోగా రైతు రుణాల్లో 20 శాతం బ్యాం కులకు జమ చేస్తాను. రుణాలు రీషెడ్యూల్ చేసి, ఫిబ్రవరి నాటికి కొత్త రుణాలు ఇప్పిస్తాను. మిగిలిన రుణాలను నాలుగేళ్లలో నాలుగు విడతల్లో సాధికార సంస్థ ద్వారా చెల్లిస్తాం. ఇందుకోసం అప్పులు తీసుకొస్తాం’’ అని చెప్పారు. మహిళా రుణాలను రద్దు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ప్రతి మహిళకు రూ.10 వేల సహా యాన్ని అందిస్తున్నట్టు చెప్పారు. ఎవరైనా బ్యాం కులకు వడ్డీ చెల్లించివుంటే వెనక్కి తిరిగి ఇచ్చేలా చూస్తామని చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రాథమిక రంగ వ్యవసాయమిషన్ను ప్రారంభించానన్నారు. రాష్ట్రంలో బిందు, తుంపర్ల సేద్యాలను ప్రోత్సహిస్తామని చెప్పారు. అనంతపురం జిల్లాలో గతంలో ఐదు ఎకరాలకు మాత్రమే బిందు, తుంపర్ల సేద్య పరికరాలకు సబ్సిడీ ఇచ్చేవాళ్లని, ఇప్పుడు పదెకరాల వరకు ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, మిగిలిన రైతులకు 90 శాతం సబ్సిడీ ఇస్తామని చెప్పారు. ఇతర జిల్లాల రైతులకు 50 శాతం సబ్సిడీతో పరికరాలు అందిస్తామన్నారు. ఎన్ని కోట్లు ఖర్చయినా వచ్చే వర్షాకాలంనాటికి హంద్రీ-నీవా ప్రాజెక్టును పూర్తి చేసి సీమ జిల్లా ప్రజలకు సాగు, తాగు నీరు అందిస్తామని చెప్పారు. కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి హెచ్ఎల్సీ కాలువను వెడల్పు చేసి 32.5టీఎంసీల తుంగభద్ర నీటినీ రాష్ట్రానికి రప్పిస్తామని చెప్పారు. అనంతపురం జిల్లాలో వాటర్ గ్రిడ్ అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు కాలువలను అనుసంధానం చేయడానికి అనంతపురం జిల్లా నుంచే వాటర్ గ్రిడ్ను ఏర్పాటు చేయనున్నట్లు బాబు ప్రకటించారు. ఈ గ్రిడ్కు రూ.1,500 కోట్లు ఖర్చు చేసైనా జిల్లాలోని ప్రతి ఇంటికీ నీటిని అందిస్తానన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం విద్యుత్ సంక్షోభంలోకి వెళ్లిపోయిందని విమర్శించారు.అయిదెకరాల పొలం ఉన్న వారికి పింఛను ఇవ్వకూడదన్న నిబంధనను అనంతపురం జిల్లావాసులకు సడలించి, పదెకరాలకు పెంచుతున్నామని చెప్పా రు. రాగి సంగటి, జొన్న రొట్టెలకు మరింత ప్రాచుర్యం కల్పిస్తామన్నారు. దేశానికి ఎంతో ఖ్యాతిని తెచ్చిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ నేతలు చెల్లని కాసులవంటి వారని, మేఘమథనంలో డబ్బులు దోచుకున్న వారు సైతం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మం త్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ, పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మిషన్లుంటే సరిపోదు.. రైతుకు ఫలితం అందాలి: కలాం మిషన్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని, వాటి ఫలాలు రైతులకు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చెప్పారు. వ్యవసాయం లాభసాటిగా మారాలంటే విప్లవాత్మక మార్పులు తేవాలని సూచించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గరుడాపురంలో సోమవారం నిర్వహించిన ‘జన్మభూమి - మా ఊరు’ కార్యక్రమంలో ఆయన ప్రాథమిక రంగ వ్యవసాయ మిషన్ను ప్రారంభించారు. ఇక్రిశాట్ డెరైక్టర్ విలియమ్స్ డార్ రూపొందించిన ‘నిరుపేద కంచంలో నిండైన భోజనం’ అనే పుస్తకాన్ని కలాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. అనంతపురం జిల్లాలో సాగు విధానంలోనూ ఎంతో వైవిధ్యం ఉందని చెప్పారు. ‘నాకు రెక్కలు ఉన్నాయి.. ఎగురగలను..’ అని అనంత ప్రజలు భావిస్తే.. ప్రగతి సాధిస్తారన్నారు. ఐదేళ్ల తరువాత జిల్లాలోని ప్రతి గ్రామం అద్భుత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. ‘అందరం వ్యవసాయాన్ని ప్రేమిస్తాం’ అని సభకు హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించారు. -
నత్తనడకన‘మాఫీ’
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : జిల్లాలో రైతు రుణమాఫీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. తొలి విడతలో 25 శాతం మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమచేసేందుకు నిధులు వచ్చి వారం గడుస్తున్నా ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 1000 మంది రైతులకు కూడా జమ కాలేదు. మొత్తం 3.8 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులని తేలగా, వారికి పూర్తిస్థాయిలో 25 శాతం నిధులు జమ కావాలంటే కనీసం మరో రెండు వారాలు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇందుకు జిల్లా అధికారులు విధిస్తున్న నిబంధనలు, అనుకోకుండా బ్యాంకులకు వచ్చిన సెలవులు కారణమవుతున్నాయి. రికార్డులన్నీ తనిఖీ చేసి క్షేత్రస్థాయి పరిశీలన తర్వాతే రైతుల ఖాతాలో జమ చేస్తామని రెవెన్యూ అధికారులు చెపుతుండడంతో ఆ ప్రక్రియకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. కాగా, మంగళవారం తర్వాతే బ్యాంకులు పనిచేస్తాయని, ఆ రోజు నుంచే రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేస్తామని బ్యాంకర్లు చెపుతున్నారు. నిధులొచ్చాక మొదలు... వాస్తవానికి, అన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అర్హులైన రైతులకు రుణమాఫీ అమలు చేయాల్సి ఉంది. కానీ, ఈ పరిశీలన ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసి ఉంటే బాగుండేదని, పంటలు వేసి నెల రోజులు దాటిన తర్వాత కూడా రుణం కోసం ఎదురుచూడాల్సి రావడం ఆందోళన కలిగిస్తోందని రైతులు, రైతుసంఘాల నేతలు అంటున్నారు. వాస్తవానికి రుణమాఫీ ప్రక్రియను ఖచ్చితంగా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెపుతున్న నేపథ్యంలో ప్రాథమికంగా జిల్లా స్థాయిలో చేయాల్సిన కసరత్తును పూర్తి చేసి ఉంటే, నిధులు రాగానే పంపిణీ చేపట్టేవారని, నిధులు వచ్చిన తర్వాత ఈ పరిశీలన ప్రక్రియ ప్రారంభం కావడంతో జాప్యం జరుగుతోందని వారి వాదన. అయితే, రెవెన్యూ వర్గాలు మాత్రం తాము నిర్లక్ష్యం లేకుండానే పనిచేస్తున్నామని అంటున్నారు. రుణమాఫీ ప్రక్రియలో ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలను ఎప్పటికప్పుడు తెలుసుకుని అందుకు అనుగుణంగా లబ్ధిదారుల జాబితా తయారు చేశామని, ఇప్పుడు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నామని చెపుతున్నారు. అయితే, రుణం తీసుకున్నానని తాము, ఇచ్చామని బ్యాంకర్లు చెపుతున్నప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి ఆ భూమిని పరిశీలించాల్సిన అవసరం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆధార్ ఉన్న వారికే రుణమాఫీ వర్తింపజేస్తామని చెప్పడం కూడా కొంత గందరగోళానికి తావిస్తోంది. వాస్తవానికి ఇటీవల జరిపిన సమగ్ర కుటుంబ సర్వేలో జిల్లాలో 26 లక్షల మందికి గాను 20 లక్షల మందికే ఆధార్కార్డులున్నాయని తేలింది. మిగిలిన ఆరు లక్షల మందిలో కూడా చాలా మందికి ఉన్నాయని, అయినా, కావాలనే సదరు కార్డుదారులు ఆధార్ వివరాలు ఇవ్వలేదని అధికారులు చెపుతున్నారు. ఇప్పుడు రుణమాఫీకి ఆధార్ తప్పనిసరి అనే నిబంధన పెడితే సర్వే సమయంలో వివరాలు ఇవ్వని రైతులు ఈ జాబితాలో అర్హులయి ఉంటే... వారి దగ్గర నిజంగా ఆధార్ వివరాలు ఉన్నా చెపుతారా అన్నది ప్రశ్న. ఒకవేళ ఏదో కారణంతో ఆధార్ లేకపోతే అలాంటి రైతు పరిస్థితి ఏంటనేది అర్థం కావడం లేదు. మరోవైపు బ్యాంకుల్లో రికార్డులను స్వయంగా రెవె న్యూ అధికారులు ప్రతి బ్యాంకుకు వెళ్లి పరిశీలిస్తున్నారు. ఒక ఆర్ఐతో పాటు మరో ప్రభుత్వ ఉద్యోగి కూడా వెళ్లి రైతుల వారీగా వివరాలు చూస్తున్నారు. దీంతో ప్రక్రియలో కొంత గందరగోళం తలెత్తుతోంది. కాగా, వరుస సెలవులు రావడంతో బ్యాంకులు కూడా రుణమాఫీపై దృష్టి సారించలేకపోతున్నాయి. మంగళవారం నుంచి బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్న నేపథ్యంలో రెవెన్యూ, బ్యాంకు వర్గాలు ఆరోజు నుంచయినా రుణమాఫీ కార్యక్రమానికి ప్రాధాన్యమిచ్చి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. పంటల బీమా గోవిందా... నిబంధనలు ఎలా ఉన్నా... ఈసారి మాత్రం జిల్లా రైతులు పంటల బీమా పథకానికి అర్హత సాధించలేకపోయారు. వాస్తవానికి సెప్టెంబర్ 30లోపు కొత్త రుణాలు తీసుకున్న వారికి మాత్రమే ఈ బీమా పథకం వర్తిస్తుంది. (అంటే రుణం ఇచ్చేటప్పుడే ప్రీమియంను మినహాయిం చుకుని బీమాను వర్తింపజేస్తారు.) వరి, పత్తి, మొక్కజొన్న, చెరకు, వేరుశనగ, కంది, పెసర పంటలకు వర్తించే ఈ బీమా ఉంటే అకాల వర్షాలు, కరువు, ప్రకృతి విపత్తులతో పంట నష్టపోతే కొంత మేర బీమా వస్తుంది. కానీ, ఇప్పుడు జిల్లాలో ఒక్క ఎకరం పంటకు కూడా బీమా దక్కే పరిస్థితి లేదు. కేంద్రం విధించిన గడువు లోపు జిల్లాలో ఒక్క రైతు కూడా కొత్త పంట రుణం తీసుకోలేదు. కాబట్టి ఈ బీమా వర్తించదని అధికారులు చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటు కొత్త రుణం రాక, పంటలకు బీమా లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. జీవోకు విరుద్ధంగా కేబినెట్ నోట్ తెచ్చారు రుణమాఫీపై ప్రభుత్వం ఇచ్చిన జీవో 69కి భిన్నంగా కేబినెట్ నోట్ పేరుతో కొన్ని నిబంధనలు పెట్టి గందరగోళం సృష్టించారు. జిల్లాలోని 46 మండలాల్లో 2011లో కరువు రావడంతో అన్నింటిని కరువు మండలాలుగా గుర్తించారు. అప్పుడు రైతు రుణాలు రీషెడ్యూల్ అయ్యాయి. ఇప్పుడు అలా రీషెడ్యూల్ చేసుకున్న రైతులు రుణమాఫీ కిందకు రారని చెప్పడంతో చాలా మంది అర్హులు నష్టపోతున్నారు. ప్రస్తుతం మాఫీ కింద 25 శాతం నిధులిస్తామని, ఇందుకు పాసు పుస్తకం తప్పనిసరని అంటున్నారు. చాలా మందికి పాసుపుస్తకాలు లేవు. భూములు పంచుకున్నప్పుడు పాసు పుస్తకాలు తీసుకోకపోయినా పహణీలపై రుణాలిచ్చారు. పలువురు రైతులు పాసుపుస్తకాలు, రేషన్కార్డులు ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారుల వద్ద పెట్టి రుణం తెచ్చుకున్నారు. వీటికి తోడు జిల్లా అధికారులు పెడుతున్న నిబంధనల కారణంగా రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన 69 జీవోను యథాతథంగా వీలున్నంత త్వరగా అమలుచేయాలి. -నున్నా నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం -
రుణమాఫీ మాటే మరిచారు?
- మంత్రి ప్రత్తిపాటి వివరాలు ప్రకటిస్తారని సభకు తీసుకువచ్చారు - చివరకు మంత్రే గైర్హాజరయ్యారు - స్వయం సహాయక సంఘాల మహిళల ఆగ్రహం చిలకలూరిపేట టౌన్: ‘అంతా మోసం.. రుణమాఫీ చేస్తామన్నారు.. మంత్రి వచ్చి రుణమాఫీ వివరాలు ప్రకటిస్తారని చెప్పి సభకు తీసుకువచ్చారు.. ర్యాలీ నిర్వహించి సభ పెట్టి స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ అంటూ చేయించారు.. మా ఇళ్లు శుభ్రంగా ఉంచుకోవడం మాకు తెలియదా.. మాఫీ సంగతి చెప్పరేంటి..’ అంటూ స్వయం సహాయక సంఘాల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలో జన్మభూమి -మా ఊరు కార్యక్రమాన్ని పురస్కరించుకొని పురపాలకసంఘం ఆధ్వర్యంలో గురువారం పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఎన్ఆర్టీ సెంటర్లో సభ ఏర్పాటుచేశారు. సభలో మున్సిపల్ చైర్పర్సన్ గంజి చెంచుకుమారి, వైస్చైర్మన్ రాచుమల్లు బదిరీనారాయణమూర్తి, పలువురు కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. సభలో జన్మభూమి, ప్రభుత్వ కార్యక్రమాలపై వివరించి పరిశుభ్రతకు సంబంధించి స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ప్రతిజ్ఞ అనంతరం సభ ముగిసిందంటూ ప్రకటించి చైర్పర్సన్తోపాటు అధికారులు మరో కార్యక్రమానికి తరలివెళ్లారు. అప్పటివరకు స్వయం సహాయక సంఘాల రుణమాఫీపై హామీ లభిస్తుందని ఎదురుచూసిన మహిళలకు నిరాశ ఎదురైంది. రుణమాఫీ ఊసే ఎత్తకుండా సభ ముగించడంతో మహిళలు అసహనానికి, ఆగ్రహానికి గురయ్యారు. రుణమాఫీ చేయని ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. అదిగో.. ఇదిగో అనడం తప్పించి ఒరగబెట్టింది ఏమిలేదంటూ విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఏర్పడగానే రుణమాఫీ చేస్తామని చెప్పడంతో ఆశ పడి ఓట్లు వేశామని, ప్రస్తుతం బ్యాంకులోళ్లు రుణాలు వడ్డీతో సహా చెల్లించాలని వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హాజరవుతారని, రుణమాఫీపై స్పష్టత ఇస్తారని చెప్పి తమను సభకు తీసుకువచ్చారని వాపోయారు. తీరా రుణమాఫీపై ప్రశ్నిద్దామని వస్తే కార్యక్రమానికి మంత్రి హాజరుకాలేదని, మిగిలినవారు ఈ విషయమై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని పనులు మానుకొని బిడ్డలను ఇళ్లకాడ వదిలివస్తే ప్రవర్తించే తీరిదా అంటూ సభ నుంచి వెళ్తున్న మున్సిపల్ వైస్చైర్మన్ రాచుమల్లు బదిరీనారాయణమూర్తితోపాటు మెప్మా సిబ్బందిని నిలదీశారు. త్వరలోనే అన్ని సమస్యలను ప్రభుత్వం తీరుస్తుందని చెప్పి వైస్చైర్మన్ అక్కడినుంచి తప్పుకున్నారు. సమాధానం చెప్పేవారు లేకపోవడంతో చేసేదిఏమీ లేక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. -
ఐదేళ్లలో రుణ విముక్తులను చేస్తాం
రైతులు, డ్వాక్రా రుణాలపై చంద్రబాబు వెల్లడి ఏడాదికి 20 శాతం చొప్పున బ్యాంకులకు బకాయిలు చెల్లిస్తాం * అదే తరహాలో డ్వాక్రా మహిళలకు రూ. 10 వేలు చొప్పున మాఫీ * రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. లాభసాటి సాగు చేయాలి * విజయవాడలో పలు పథకాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి * కేంద్రం నుంచి రాష్ట్రానికి సంపూర్ణ సహకారం: నిర్మలాసీతారామన్ సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలోని రైతులు, డ్వాక్రా మహిళలకు ఏడాదికి 20 శాతం చొప్పున ఐదేళ్లలో అందరినీ రుణ విముక్తులను చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా రైతు సాధికార సంస్థకు 20 శాతం నిధులు విడుదల చేస్తామన్నారు. రైతు కుటుంబానికి లక్షన్నర రుణ మాఫీ చేయడానికి రిజర్వు బ్యాంకు అంగీకరించలేదని.. కేంద్ర ప్రభుత్వానికి సానుకూల అభిప్రాయం ఉన్నా ఇతర రాష్ట్రాల నుంచి ఇదే డిమాండ్ వస్తుందనే భావనతో ఏమీ చేయలేకపోతోందని చెప్పారు. రాష్ట్రంలో పింఛన్లు తీసుకుంటున్న లబ్ధిదారులకు సెల్ఫోన్లు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుందని ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలుపుకుంటున్నందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జన్మభూమి - మా ఊరు, ఎన్టీఆర్ భరోసా, స్వచ్ఛాంద్రప్రదేశ్, ఎన్టీఆర్ సుజల, రూ. 10కే ఎల్ఈడీ బల్పుల పంపిణీ కార్యక్రమాలను చంద్రబాబు గురువారం విజయవాడలో ప్రారంభించారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో కలసి నగరంలోని సింగ్నగర్లో రోడ్లు, మురుగునీటి కాల్వను శుభ్రం చేసిన ఆయన.. సుమారు రెండు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. నీరు - చెట్టు కార్యక్రమంలో భాగంగా మొక్క నాటారు. డాబా కొట్టు సెంటర్లో ఎన్టీఆర్ సుజల పథకం ప్రారంభించారు. అనంతరం ఎంబీపీ స్టేడియంలో జన్మభూమి - మా ఊరు, పింఛన్ల పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. ఒక్కో మహిళకు రూ. 10 వేలు మాఫీ చేస్తాం రాష్ట్రంలో 7 లక్షల డ్వాక్రా సంఘాలు ఉండగా అందులో 76 లక్షల మంది సభ్యులు ఉన్నారని.. ఒక్కో సభ్యురాలికి రూ. 10 వేల వంతున రూ. 7,600 కోట్లు రుణ మాఫీ చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇందుకోసం డ్వాక్రా సాధికార సంస్థను ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వం ఇచ్చే మొత్తాన్ని పదేళ్లలో రూ. లక్ష కోట్లకు పెంచుకుని పేదరికం మీద గెలుపు సాధించాలని మహిళలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇసుక రీచ్లన్నీ డ్వాక్రా సంఘాలకు ఇచ్చి ఇసుక తవ్వకాలకు అయ్యే ఖర్చును అందిస్తామని చెప్పారు. ఆ తర్వాత వచ్చే లాభాల్లో 25 శాతం డ్వాక్రా సంఘాలకు, 75 శాతం నిధులు రైతు ప్రాధికార సంస్థకు జమ చేస్తామని ప్రకటించారు. డబ్బులుండి పింఛన్లు ఇవ్వడంలేదు... ప్రభుత్వం దగ్గర డబ్బులుండి వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు పెంచిన పింఛన్లు ఇవ్వడం లేదని.. పేదలను ఆదుకుని అండగా నిలవాలనే ఉద్దేశంతో పింఛన్ల ద్వారా వారికి భరోసా కల్పిస్తున్నామని సీఎం చెప్పారు. పేదల్లో నిరుపేదలందరికీ పింఛన్లు ఇస్తామనీ, అనర్హులెవరికీ స్థానం ఉండదన్నారు. శుక్రవారం నుంచి లబ్ధిదారుల జాబితాలు ఆన్లైన్లో ఉంచుతామని, అర్హులైన వారెవరైనా జాబితాలో లేకపోతే వారి పేర్లు చేర్చుతామని తెలిపారు. అనర్హులెవరైనా జాబితాలో ఉంటే ప్రజలు అధికారులకు ఈ విషయం తెలియచేయాలన్నారు. మరుగుదొడ్డి వాడని వారు మనుషులు కాదు.. జన్మభూమి కార్యక్రమం ప్రజా ఉద్యమంగా సాగాలని.. తాను కూడా అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రజలను చైతన్యవంతులను చేస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. రోడ్ల మీద చెత్త, మిగిలిపోయిన ఆహార పదార్ధాలు వేయడం, మురుగునీటిని రోడ్ల మీదకు వదిలేయడం, కాలకృత్యాలు కూడా తీర్చుకోవడం లాంటి చర్యల వల్లే అపరిశుభ్రత పెరిగి,సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. మరుగుదొడ్లు వాడని వారు మనుషులే కాదంటూ.. ఈ విషయంలో ప్రజలు చైతన్యవంతులు కావాలని కోరారు. ఈ సందర్భంగా సభకు హాజరైన వారితో పాటు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రానికి సంపూర్ణ సహకారం: నిర్మలాసీతారామన్ కేంద్రం నుంచి రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందిస్తామని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు. ఐదేళ్లలో టీడీపీ, బీజేపీ నేతృత్వంలో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తామని.. రాష్ట్రం నుంచి అందే ప్రతి ప్రతిపాదనను నెరవేర్చడానికి తాను కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు, మంత్రులు దేవినే ని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్, ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, సుజనాచౌదరిలతో పా టు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇదీ రైతు రుణ విముక్తి పథకం... ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు కుటుంబానికి లక్షన్నర రుణ మాఫీ చేయడానికి ప్రయత్నించామని, ఇందుకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఒప్పుకోలేదని పేర్కొన్నారు. ప్రతి పైసా కూడబెట్టి రైతులకు న్యాయం చేయాలనే ఆలోచనతో రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేశామన్నారు. రైతు రుణాలు రీషెడ్యూల్ చేసి 20 శాతం కంటే ఎక్కువగానే రుణాలు ఇవ్వాలని బ్యాంకులను కోరతామన్నారు. ఏడాదికి 20 శాతం చొప్పున 10 శాతం వడ్డీతో బ్యాంకులకు రైతు బకాయిలు చెల్లించి ఐదేళ్లలో రుణ విముక్తులను చేస్తామన్నారు. ఇది రుణ మాఫీ కాదని రైతు రుణ విముక్తి పథకమని సీఎం చెప్పారు. రైతులె వరూ అధైర్యపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దనీ, ఈ ఐదేళ్లు బ్యాంకులు బలవంతపు వసూళ్లు చేయకుండా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని మేళవించి లాభసాటిగా వ్యవసాయం చేయాలని సూచించారు. విజయవాడ రాష్ట్ర రాజధానిగా ఉంటుందని, నూతన రాజధాని నిర్మాణం విషయంలో అటు రైతులు, ఇటు ప్రభుత్వానికి లాభసాటిగా ఉండేలా వ్యవహరిస్తామని సీఎం చెప్పారు. -
చేవెళ్ల ఎస్బీహెచ్ ఎదుట రైతుల ఆందోళన
చేవెళ్లరూరల్: రుణమాఫీ అంటూ రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల్లో ‘నో డ్యూ’ సర్టిఫికెట్ ఇవ్వాలంటే కూడా డబ్బులు చెల్లించాలనే బ్యాంకు నిబంధనలతో అవాక్కయిన రైతులు బుధవారం చేవెళ్ల ఎస్బీహెచ్ ఎదుట ఆందోళన చేశారు. చేవెళ్లలోని ఎస్బీహెచ్ వద్దకు షాబాద్ మండలంలోని పలు గ్రామాల రైతులు ‘నో డ్యూ’ సర్టిఫికెట్ కోసం వచ్చారు. ప్రభుత్వం రుణమాఫీ, రీషెడ్యూల్ అమలు చేస్తుండటంతో మళ్లీ రుణాలు తీసుకునే రైతులకు ఇతర బ్యాంకుల్లో రుణాలు తీసుకోలేదని నోడ్యూ సర్టిఫికెట్ తీసుకు రావాలని రుణాలు ఇచ్చే బ్యాంకులు ఆదేశిస్తున్నాయి. కాగా షాబాద్ మండలంలోని బ్యాంకులు, చేవెళ్ల బ్యాంకుల్లో కూడా ఈ నోడ్యూ సర్టిఫికెట్ తీసుకురావాలని చెప్పారు. రైతులు రుణాలు త్వరగా వస్తాయనే ఆశతో చేవెళ్ల మండల కేంద్రంలోని బ్యాంకుల వద్దకు వచ్చారు. ఇక్కడ అన్ని బ్యాంకుల వారు రైతుల వివారాలను తెలుసుకొని వారికి సంతకాలు చేసి పంపించారు. సంతకం చేయాలంటే బ్యాంకు నిబంధనల ప్రకారం రూ.110 చెల్లిస్తే ఇస్తామని బ్యాంకు మేనేజర్ కిరణ్మయి చెప్పారు. కొంతమంది రైతులు చెల్లించారు. మరికొంత మంది రైతులు ఇదేంటని నిలదీశారు. ఇప్పటివరకు అన్ని బ్యాంకులకు తిరిగినా ఏ బ్యాంకు అధికారులూ డబ్బులు అడగలేదని, మీరు ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. దానికి నిబంధనల ప్రకారమే డబ్బులు అడుగుతున్నామని మేనేజర్ చెప్పారు. దీంతో రైతులు ఆగ్రహించి రుణమాఫీ పేరుతో ఇలా రైతులకు బ్యాంకుల చుట్టూ తిప్పి ఇబ్బందులకు గురిచేయటం బాగాలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
రుణమాఫీపై ఆశలు
సాక్షి, ఒంగోలు: పండగ రోజుల్లో పల్లెల్లో దైన్యం నెలకొంది. పంట రుణాల మాఫీపై రైతులు గంపెడాశతో ఉన్నారు. పీక ల్లోతు అప్పుల్లో కూరుకున్న వారు పాతరుణాలు మాఫీ అయితే.. కొత్త రుణాలొస్తాయని ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం మాత్రం పథకం అమల్లో పట్టీపట్టనట్టు వ్యవహరించడంతో.. క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు కూడా రైతులకు సాయం చేసేందుకు ముందుకు రావడం లేదు. రుణమాఫీ అమలు విధివిధానాల మేరకు ప్రభుత్వం సూచించిన వివరాల కంప్యూటరీకరణపై బ్యాంకులు నిర్లక్ష్యం చూపుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు మండలాల నుంచి బాధిత రైతులు సోమవారం ఒంగోలులో ప్రజావాణి కార్యక్రమానికి హాజరై కలెక్టర్కు బ్యాంకర్లపై ఫిర్యాదులిచ్చారు. రైతుల రుణాలకు సంబంధించి సమగ్ర వివరాలను ‘ఆన్లైన్’లో పొందుపరచడంపై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందినా.. బ్యాంకర్ల తీరులో మార్పుకనిపించడం లేదు. రాష్ట్రంలో ప్రతీ ఒక్క రైతు కుటుంబానికి రూ.1.50 లక్షల వరకు పంటరుణం మాఫీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 7.5 లక్షల రైతుల రుణాల ఖాతాలుండగా, వాటిల్లో సుమారు రూ.3,600 కోట్ల రుణాలు మాఫీ అవుతాయని అధికారుల అంచనా. రైతుల పేరుతో కొంతమంది బినామీలు తీసుకున్న రుణాల్ని గుర్తించేందుకు విధాన నిర్ణయాలు తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఆమేరకు సమగ్ర వివరాలను అందించాలని రైతులను కోరింది. ఇందుకు జిల్లాలోని బ్యాంకర్ల నుంచి పూర్తిస్థాయి సహకారం అందడం లేదు. వివరాలను పొందుపర్చడంలో తీవ్రజాప్యం జరుగుతోంది. వీటిని పర్యవేక్షించాల్సిన లీడ్బ్యాంక్ అధికారుల ఆదేశాలను కొన్ని బ్యాంకులు పట్టించుకోవడం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 53.50 శాతం మాత్రమే వివరాలను పొందుపరిచారు. లీడ్బ్యాంకు గణాంకాల ప్రకారం జిల్లాలో 7,5,524 మంది రైతుల పంటరుణాల ఖాతాలన్నాయి. ఇవన్నీ రుణమాఫీకి అర్హమైనవిగా గుర్తించారు. సుమారు రూ.3,600 కోట్లు వరకు రుణమాఫీ చేయాల్సి ఉంది. ఎక్కువ రుణం తీసుకున్న రైతులకు రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తోందని ప్రభుత్వం ఇప్పటికే తేల్చిచెప్పింది. రుణాలు ఇప్పటికే చెల్లించిన వారికి తిరిగి చెల్లింపులు జరుపుతారని అధికారపార్టీ నేతలు ప్రచారం చేస్తున్నా.. వాటిల్లో స్పష్టత లేదు. మార్గదర్శకాల పేరుతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. తొలుత సమగ్ర వివరాల కంప్యూటరీకరణకు గడువు సెప్టెంబర్ 25తో ఆఖరు అని ప్రకటించినా... బ్యాంకుల జాప్యంతో వచ్చేనెల 1వ తేదీ వరకు పొడిగించారు. అయినప్పటికీ గడువులోగా కంప్యూటరీకరణ చేయడంలో బ్యాంకులెంతగా సఫలీకృతులవుతారో తెలియాల్సి ఉంది. పాతసమాచారాన్నే.. కొత్తగా పొందుపరుస్తూ.. రైతులు పంటరుణం తీసుకునే సమయంలో పట్టాదారు పాసుపుస్తకాలు తనఖా పెడతారు. టైటిల్డీడ్నూ బ్యాంకులు తీసుకుంటున్నాయి. బంగారం పెట్టినప్పుడు సేద్యం భూముల వివరాలను సమగ్రంగా పరిశీలించి రికార్డుల్లో నమోదు చేస్తారు. సర్వే నంబర్తో సహా పొలం విస్తీర్ణం కూడా నమోదు చేసుకుంటూనే ఉన్నారు. రుణ అర్హతకు ఏఏ పంటలు వర్తిస్తాయనేది పరిశీలించి మరీ.. ఆయా పంటలు పండించే రైతులకే రుణాలిస్తారు. నిబంధనల ప్రకారం రైతులకు ఎలాంటి తనఖా (కుదువ) లేకుండా రూ.లక్ష వరకు రుణం మంజూరు చేసే అవకాశం ఉంటుంది. అయితే, బ్యాంకులు దీన్ని పాటించడం లేదు. కౌలు రైతులకు రుణాలు తీసుకునే సమయంలో ఎల్ఈసీ (రైతురుణ అర్హత గుర్తింపు) కార్డు ఉండాలి. పొలం సర్వేనంబర్ తప్పనిసరిగా అవసరం. అయితే, ఈ రెండింటిని మాత్రమే పరిగణలోకి తీసుకుని రుణమిచ్చిన బ్యాంకులే లేకపోవడం గమనార్హం. కంప్యూటరీకరిస్తోన్న సమగ్ర వివరాలివే.. రుణాలు తీసుకున్న రైతులు బ్యాంకుల్లో రేషన్కార్డు, ఆధార్కార్డు ఇవ్వాలి. తాజాగా పట్టాదారు పాసుపుస్తకం కూడా బ్యాంకర్లకు అందజేయాలని కొత్త నిబంధన పెట్టారు. ఎంత విస్తీర్ణంలో ఏయే పంటలు సాగుచేస్తున్నారో కూడా వివరాలను అందజేయాల్సి ఉంటుంది. ఆయా భూముల సర్వే నంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలంటున్నారు. గతంలో పట్టాదారు పాసుపుస్తకాలు లేని రైతులు వీఆర్వోల నుంచి ధ్రువీకరణలు తీసుకుని వాటిద్వారా రుణాలు తీసుకున్నారు. ‘మీ సేవ’ కేంద్రాల ద్వారా తీసుకున్న పొలం అడంగల్ కాపీలు బ్యాంకర్లకు అందజేయాలి. అయితే, ప్రస్తుతం పాసుపుస్తకాలు లేని రైతులు నానాకష్టాలు పడుతున్నారు. వివాదాలు, డాట్ భూములకు సంబంధించిన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీకావడంలో జిల్లా అధికారుల వద్ద వందల్లో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీరికి రుణమాఫీ వర్తించడం సందిగ్ధమేనని తెలుస్తోంది. ఒకే సర్వే నంబర్పై పలు బ్యాంకుల్లో బంగారం తనఖా పెట్టి వ్యవసాయ రుణాలు తీసుకున్న లబ్ధిదారులు అనేకమంది ఉన్నారు. ప్రస్తుతం వీటన్నింటినీ క్రోడీకరించి వీటిల్లో ఒక బ్యాంకు రుణాల్నే మాఫీచేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యాంకుల్లో సిబ్బంది కొరత వల్ల ఈ పనులను తాము చేయలేకపోతున్నామని బ్యాంకర్లు వివరణ ఇస్తున్నారు. అదేవిధంగా ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా అకౌంట్ల సమగ్ర జాబితా తయారు చేసుకోవడం.. తాజాగా జన్ధన్ యోజన కింద కొత్త బ్యాంకు అకౌంట్లు తెరవడం తదితర కారణాలతో సిబ్బంది బిజీగా మారారంటూ బ్యాంకర్లు వివరణ ఇస్తున్నాయి. -
బీ(ధీ)మా ప్రశ్నార్థకం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రుణమాఫీపై సర్కారు సాగదీత ధోరణి, కమిటీలు, సమీక్షలు, గణాంకాల పేరిట కాలయాపన చేయడంతో అన్నదాతల పంటలకు బీమా వర్తించకుండా పోయింది. పంటల బీమా పథకానికి గడువు మంగళవారం(సెప్టెంబర్ 30)తో ముగిసింది. ఈలోపు పంట రుణాలు పొందిన రైతులు మాత్రమే అర్హులు. కానీ రుణమాఫీకి సంబంధించిన కసరత్తు ఈ గడువు దగ్గర పడే వరకు పూర్తి కాకపోవడంతో జిల్లాలో 90 శాతం మంది రైతులకు పంట రుణాలు అందలేదు. దీంతో ఈ ఖరీఫ్ పంటలకు బీమా ప్రశ్నార్థకంగా తయారైంది. కసరత్తు పేరుతో కాలయాపన ఖరీఫ్ పంట కాలం ముంచుకొచ్చినా ప్రభుత్వం రుణమాఫీ కసరత్తు పేరుతో కాలయాపన చేస్తూ వచ్చింది. సెప్టెంబర్ మూడో వారంలో ఈ కొలిక్కి రాగా, జిల్లాలో 3.13 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.1,477.45 కోట్ల పంట రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మాఫీ అయ్యే ఈ మొత్తంలో మొదటి విడతలో 25 శాతం నిధులు రూ.377.73 కోట్లను ఇటీవలే విడుదల చేసిన సర్కారు నెలాఖరులోపు పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశించింది. కానీ ఈ నిధులు తమ శాఖకు అందలేదని బ్యాంకర్లు రుణాలు మంజూరు ప్రక్రియను ప్రారంభించలేదు. తీరా బీమా పథకానికి గడువు దగ్గర పడటంతో ఈనెల 28 నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించారు. మధ్యలో సెలవు రోజు రావడంతో ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. డీజీబీ వంటి బ్యాంకులు ఆదివారం పనిచేయకపోగా సోమవారం ఈ నిధులు ఆయా శాఖలకు చేరాయి. దీంతో రెండు, మూడు రోజులే గడువుండటంతో రైతులు పెద్ద సంఖ్యలో బ్యాంకుల వద్దకు పరుగులు తీశారు. కానీ అక్కడ రుణ మంజూరు జాప్యం జరుగడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ఆందోళనకు దిగారు. ఈ ఖరీఫ్ సీజనులో రూ.1,693 కోట్ల మేరకు పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు మీద నిర్దేశిత లక్ష్యంలో కనీసం 15 శాతం మంది రైతులకు కూడా రుణాలు దక్కకపోవడంతో మిగిలిన సుమారు 85 శాతం రైతులకు ఈ బీమా పథకం వర్తించే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో బీమా పథకానికి గడువు అక్టోబర్ 15 వరకు పొడిగించాలని జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిం చేసింది. పరిహారం ప్రశ్నార్థకం ఈ ఖరీఫ్ సీజనులో వర్షాలు ఆలస్యంగా కురిసాయి. జూన్ మొదటి వారంలో రావాల్సిన రుతుపవనాల జాడ రెండు నెలలుగా లేకపోవడంతో పంటలు ఎండిపోయి దాదాపు కరువు పరిస్థితులు నెలకొన్నాయి. భూమిలో తేమ లేక విత్తనాలు మొలకెత్తకపోవడంతో అనేక చోట్ల రైతులు రెండుసార్లు విత్తుకోవాల్సి వచ్చింది. ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని పెరిగిన పంటలను ఆగస్టు చివరి వారంలో కురిసిన భారీ వర్షాలు నిండా ముంచాయి. ఈ భారీ వర్షాలకు పత్తి, సోయా వంటి ప్రధాన పంటలు తెగుళ్ల బారిన పడ్డాయి. దీంతో ఈసారి పంటల దిగుబడి సగానిక సగం పడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో పంటల బీమా వర్తించకపోవడంతో అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. నష్టపోయిన పంటలకు పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. జిల్లాలో ఈ ఏడాది వరి, జొన్న, మొక్కజొన్న, మినుములు, పెసర, కందులు, సోయా, మిరప(వర్షాధారం), పసుపు పంటలకు బీమా పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. రైతులు అత్యధికంగా పండించే సోయాకు గ్రామ యూనిట్గా తీసుకుని పంట నష్ట పరిహారం చెల్లించనుండగా, మిగితా పంటలకు మండలాన్ని యూనిట్గా తీసుకోనున్నారు. -
మీ రుణానికి మాది ‘హామీ’
మాఫీపై రైతులకు రుణ హామీ పత్రాలు తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయం {పభుత్వం తరఫున పత్రాలపై మండల తహశీల్దారు సంతకం ఈ పత్రం బ్యాంకులకు చూపిస్తే.. కొత్త రుణాలు మంజూరు సమస్యలుంటే మండల, జిల్లా గ్రీవెన్స్ సెల్కు ఫిర్యాదు చేయాలని సూచన హైదరాబాద్: రైతులకు రుణ మాఫీ కింద ఇప్పటికే 25 శాతం నిధులు విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. వారిలో మరింత ఆత్మవిశ్వాసం నింపడానికి వీలుగా రుణ హామీ పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. రుణమాఫీ వల్ల లబ్ధి పొందే ప్రతీ రైతుకు ఈ మేరకు హామీ పత్రాలు ఇవ్వనుంది. తద్వారా రైతులకు ప్రభుత్వంపై భరోసా కల్పించడమేకాక రుణ మాఫీ అమలు అవుతున్న విషయానికి విస్తృతంగా ప్రచారం కల్పించవచ్చని సర్కారు భావిస్తోంది. బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న రుణాల్లో 25 శాతం మొత్తాన్ని వారి పేరుతో బ్యాంకుల్లో జమ చేశామని, మిగిలిన 75 శాతం రుణాన్ని కూడా ప్రభుత్వమే వడ్డీ సహా బ్యాంకులకు చెల్లిస్తుందని, దీనిపై అధైర్యపడవద్దని పేర్కొంటూ ఈ హామీ పత్రం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ హామీ పత్రాలను బ్యాంకులకు చూపించి రుణాలు పొందాలని, బ్యాంకులు రుణాలు ఇవ్వడంలో ఏవైనా ఇబ్బందులు సృష్టిస్తే.. మండల, జిల్లా గ్రీవెన్స్ సెల్స్కు ఫిర్యాదు చేయాలని కూడా అందులో పేర్కొననున్నారు. ఒక్కో మండలంలో దాదాపు ఆరేడువేల మంది రైతులకు ఈ విధమైన హామీ పత్రాలపై మండల తహశీల్దార్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతకాలు చేసి ఇస్తారని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ హామీ పత్రాలు ఇవ్వడం వల్ల తమ రుణాల్లో కొంతమొత్తాన్ని ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించిందన్న విషయం రైతుల దృష్టికి వెళ్తుందని, ఇదివరకు ఉన్న రుణాలను రెన్యూవల్ చేసుకోవడానికి, కొత్త రుణాలు తీసుకోవడానికి వారు ముందుకు వస్తారని సర్కారు ఆశిస్తోంది. ప్రత్యేకంగా సమావేశాలను ఏర్పాటు చేసి.. ప్రజాప్రతినిధులతో వీటిని రైతులకు అందించడం వల్ల రుణమాఫీపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్న విషయం కూడా విస్తృతంగా రైతుల్లోకి వెళ్లుందని భావిస్తోంది. బ్యాంకులకు చేరిన రుణ మాఫీ నిధులు.. రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ. 4,250 కోట్లు బ్యాంకులకు చేరినట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారి వివరించారు. ఈ మొత్తంతో బ్యాంకులు రైతుల రుణాల్లో 25 శాతాన్ని మాఫీ చేస్తాయని ఆ అధికారి వివరించారు. కలెక్టర్ నియమించిన మండల నోడల్ ఆఫీసర్ దీన్ని పర్యవేక్షిస్తున్నారు. అక్షర క్రమంలో రోజుకు కొన్ని గ్రామాల చొప్పున రుణమాఫీకి అర్హులైన రైతులను ఆయా బ్యాంకులకు పిలిపిస్తారు. వారి రుణాన్ని మరోసారి పరిశీలించి... కొత్త రుణాలను అప్పటికప్పుడే ఇచ్చేస్తారు. ఈ ప్రక్రియ ఇప్పటికే కొన్ని చోట్ల ప్రారంభమైందని అధికారులు చె బుతున్నారు. రైతులకు గతంలో వచ్చిన మాదిరిగా పూర్తిస్థాయి రుణం వచ్చే అవకాశాలు లేవని, ప్రభుత్వం చెల్లించిన రుణానికి సంబంధించిన మొత్తంతోపాటు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద ఐదు నుంచి పదిశాతం అదనంగా, అలాగే వినియోగ రుణం కింద 20 నుంచి 30 శాతం అదనంగా రుణం లభించే అవకాశం ఉందని సదరు అధికారి వ్యాఖ్యానించారు. ‘అర్బన్’ బంగారు రుణాలకు మాఫీ లేనట్టే! పట్టణ, మెట్రో నగరాల్లో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలకు ప్రస్తుతానికి రుణమాఫీ వర్తింప చేయబోమని బ్యాంకు వర్గాలు తెలిపాయి. అర్బన్ బ్యాంకుల్లో తీసుకున్న రుణాల్లో చాలామటుకు పంట కోసం కాకుండా ఇతరత్రా వ్యక్తిగత అవసరాల కోసమే తీసుకుని ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిపై మరింత పరిశీలన చేశాకే రుణామాఫీని వర్తింప చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెబుతున్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వం విడుదల చేసిన పావు వంతు రుణమాఫీ సొమ్ము అర్బన్, మెట్రో నగరాల్లో బంగారంపై రుణం తీసుకున్న రైతుల ఖాతాలోకి వెళ్లే అవకాశం లేదు. ‘అర్బన్, మెట్రో నగరాల్లో కొన్ని ప్రైవేటు, చిన్న బ్యాంకులు ఒక ఎకరా ఉన్న రైతుకు కూడా బంగారంపై ఐదారు లక్షల రూపాయల రుణాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అంతంత రుణాలు ఇవ్వడంలో ఔచిత్యం ఏంటో బోధపడడంలేదు. ఇలాంటి రుణాలపై మరింత విచారణ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ రుణాలను మాఫీ చేయడంలేదు’ అని బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. లక్ష జనాభా దాటిన పట్టణాలను అర్బన్లుగా రిజర్వుబ్యాంకు నిర్వచించింది. ఆ ప్రకారం తెలంగాణలో ఉన్న అర్బన్ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో తీసుకున్న బంగారు రుణాలకు మాఫీ వర్తించే అవకాశం ప్రస్తుతానికి లేనట్టే. -
ఎంత కష్టమైనా ఇచ్చిన హామీలు నెరవేర్చుతాం
సీఎం సిద్దరామయ్య బళ్లారి టౌన్ : ఎంత కష్టమనిపించినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. సోమవారం మున్సిపల్ గ్రౌండ్లో కార్మిక శాఖ ఏర్పాటు చేసిన జాతీయ స్వాస్థ బీమా పథకం, వివిధ శాఖల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన 95 హామీలలో 65 హామీలను నెరవేర్చామన్నారు. అన్నభాగ్య, క్షీరభా గ్య, రుణాల మాఫీ, మైత్రి, విద్యాశ్రీ, తక్కువ వడ్డీతో రైతులకు రుణాలు వంటి పథకాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కల్పించేందుకు ఎప్పుడూ కట్టుబడి ఉందన్నారు. గత ఉప ఎన్నికల్లో బళ్లారి జిల్లాలో ఇచ్చిన ఎ న్నికల హామీ ప్రకారం మూడేళ్లలో రూ.850 కోట్లతో వివిధ పథకాలకు నివేదిక తయారు చేశామన్నారు. ఇందులో పీడబ్ల్యూడీ రోడ్లు, గ్రామీణ రోడ్లు, తాగునీ రు, మరుగుదొడ్లు, విద్యుత్, డ్రెయినేజీ వంటి వివిధ పథకాలు ఉన్నట్లు చెప్పారు. ఈ ఏడాది రూ.304 కోట్లతో ఈ పనులను అభివృద్ధి చేస్తామన్నారు. బీజేపీ మతం పేరుతో విభజన రాజకీయాలు చేస్తోందన్నారు. 1.15 కోట్ల మంది జాతీయ స్వాస్థ బీమా పథకంలో స్మార్ట్కార్డులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ పథకాన్ని గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని దాన్ని రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.30 వేలు ఆస్పత్రి ఖర్చులను బీమా కంపెనీలు భరిస్తాయన్నారు. ఈ పథకానికి రూ.131 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని గుర్తు చేశారు. అంతకుముందు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ నాయక్ మాట్లాడుతూ మంగళ గ్రహం అంతరిక్షంలోకి పంపాలనే పథకాన్ని ప్రారంభించింది మాజీ ప్రధాని మన్మోహన్సింగేనని, దాన్ని ఇప్పుడు బీజేపీ తమ ఘనతగా చెప్పుకుంటోందన్నారు. ఇంధన శాఖ మంత్రి డీకే.శివకుమార్ మాట్లాడుతూ చరిత్రలోనే పవిత్రమైన రోజు ఈ రోజని, ఇంతపెద్ద స్థాయిలో మంత్రులు వచ్చి వరాలు గుప్పించడం శ్లాఘనీయమని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి పీటీ పరమేశ్వరనాయక్, వివిధ శాఖల మంత్రులు హెచ్కే.పాటిల్, కమరుల్ ఇస్లాం, శివరాజ్ తంగడగి, రోషన్బేగ్, ఉమాశ్రీ, అంబరేష్, ఎమ్మెల్యేలు చంద్రణ్ణ, అనిల్లాడ్, ఎంపీ రవీంద్ర, ఎన్వై గోపాలకృష్ణ, నాడగౌడ అప్పాజీ, తుకారాం, వీరణ్ణ మత్తికట్టి, వెంకటేశ్, బోసురాజ్, స్థానిక నేతలు కేసీ కొండయ్య, అల్లం వీరభద్రప్ప, సూర్యనారాయణరెడ్డి, మేయర్ రమేష్ పాల్గొన్నారు. -
సమస్యల గళం
సాక్షి, ఖమ్మం: సుమారుగా మూడున్నరేళ్ల తర్వాత కొలువుదీరిన జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. జిల్లాలోని పలు సమస్యలపై సభ్యులు జెడ్పీ వేదికగా గళం విప్పారు. మారిన రాజకీయ సమీకరణలతో స్థాయి సంఘాల కమిటీల ఎన్నిక ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. ప్రధానంగా జిల్లాను వణికిస్తున్న విషజ్వరాలు, వైద్యల నిర్లక్ష్యంపై సమావేశంలో సభ్యులందరూ ముక్తకంఠంతో ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా మొదలై..మిన్నంటిన నిరసనలు... షెడ్యూల్ ప్రకారం సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం కావల్సి ఉండగా ఏజెన్సీ మండలాల సభ్యులు ఆలస్యంగా వచ్చారు. 10.50 గంటలకు అధ్యక్షత స్థానంలో ఉన్న చైర్పర్సన్ గడిపల్లి కవిత సమావేశాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతుండగానే ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు జోక్యం చేసుకున్నారు. ‘సైకిల్ గుర్తుపై గెలిచి, నైతిక విలువలను తుంగలో తొక్కి పార్టీ మారారని.. రాజీనామా చేసి మారిన పార్టీ గుర్తుపై మళ్లీ పోటీ చేయాలి’ అని ప్రస్తావించడంతో సమావేశంలో ఒక్కసారిగా టీఆర్ఎస్, టీడీపీ సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇది రాజకీయాలకు వేదిక కాదని చైర్పర్సన్ చెప్పుకొచ్చారు. సమావేశం ప్రారంభానికి ముందు తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరులకు నివాళి ఆర్పించాలని సభ్యులను కోరడంతో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆ తర్వాత పోట్ల మాట్లాడిన తీరుపై ఎమ్మెల్సీ బాలసాని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక దశలో ఇరువురు మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది. ఆ తర్వాత ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ మాట్లాడారు. కాంగ్రెస్ను వీడి వెళ్లిన తమ పార్టీ సభ్యులూ రాజీనామా చేయాలన్నారు. ఈ క్రమంలోనే స్థాయి సంఘాలకు ఎన్నిక నిర్వహిస్తున్నట్లు చైర్పర్సన్ ప్రకటించడంతో మళ్లీ సమావేశంలో ప్రశాంతత నెలకొంది. స్థాయీ సంఘాల కమిటీపై నిరసన.. ఏడు స్థాయీ సంఘాలకు సభ్యులను ఎన్నుకుంటున్నట్లు చైర్పర్సన్ ప్రకటించగానే.. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్ల అభిప్రాయాన్ని తీసుకోవాలి, అన్ని పార్టీలకూ ప్రాతినిధ్యం కల్పించాలని ప్రజాప్రతినిధులు, పార్టీల సభ్యులు పట్టుబ ట్టారు. ఈ సూచనలతో తన చాంబర్లో పార్టీ ఫ్లోర్లీడర్లతో చైర్పర్సన్ సమావేశమయ్యారు. ఆ తర్వాత ఏకాభిప్రాయానికి వచ్చి కమిటీల ఎన్నికకు అన్ని పార్టీలూ అంగీకరించా యి. చైర్పర్సన్ సమావేశానికి వచ్చి ఒక్కో కమిటీలో సభ్యుల పేర్లు చదివి వినిపిస్తుండగా.. వారిని ఆయా పా ర్టీల సభ్యులు ప్రతిపాదించడంతో పాటు బలపరిచారు. అయితే అత్యంత ప్రాధాన్యత ఉన్న ఆర్థిక, ప్రణాళిక కమిటీ లో ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, టీడీపీలకు చోటు క ల్పించరా..? అని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్తోపాటు ఎ మ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావులు సమావేశంలో నిరసన తె లిపారు. అప్రాధాన్య కమిటీలో తమ పార్టీల సభ్యులను వేస్తారా..? అంటూ ఆందోళన తెలపడంతో ఉద్రిక్తతకు నెల కొంది. పువ్వాడ, పోట్లలు.. ఎమ్మెల్సీ బాలసానితో వాగ్వాదానికి దిగారు. ‘అంతా మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటే మేమెందుకు?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం ఎజెండా అంశాలపై చర్చ సాగుతుండగా కూడా ఇదే విషయమై మళ్లీ సమావేశంలో తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగింది. వైద్యం రంగంపై గంటకు పైగా చర్చ.. జిల్లాలో వైద్యరంగం అధ్వానంగా ఉందని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పువ్వాడ అజయ్కుమార్లు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. జిల్లాలో ఈ రంగాన్ని మెరుగు పరచకుంటే ఏజెన్సీ గిరిజనుల ప్రాణాలు పిట్టల్లా రాలుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని పీహెచ్సీల్లో వైద్య సేవలు మెరుగు పరిచేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సీజన్లో యూరియా కొరత తీవ్రంగా ఉందని, బ్లాక్లో అమ్ముతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని పలువురు సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు. ఏజెండాలో పొందుపరిచిన అంశాల్లో గంటకు పైగా వైద్య రంగంపైనే చర్చ జరిగింది. కాంగ్రెస్కు తోడుగా టీడీపీ.. గత జెడ్పీ సమావేశంలో శత్రువుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీ నేతలు.. ఇప్పుడు జెడ్పీ వేదికగా మిత్రులయ్యారు. కొంతమంది టీడీపీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు టీఆర్ఎస్లో చేరడంతో ఉన్న కొద్దిమంది టీడీపీ జెడ్పీటీసీలు.. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చేసే నిరసనకు సమావేశంలో మద్దతు తెలిపారు. సమావేశంలో స్థాయి సంఘాల ఎన్నిక విషయంలో పువ్వాడ, పోట్ల లు ఇద్దరూ.. ఎమ్మెల్సీ బాలసానితో వాగ్వాదానికి దిగారు. ఆయా పార్టీల సభ్యులు కూడా ఇదే రీతిలో పోడియం ముందుకు వచ్చి టీఆర్ఎస్ సభ్యులపై విమర్శలు చేశారు. అయితే టీఆర్ఎస్ సభ్యుల సంఖ్యా బలం ఎక్కువగా ఉండటంతో కొంతమంది టీడీపీ సభ్యులు మాత్రం మాకెందుకులే అన్నట్లు ఉన్నారు. కరువుపై తీర్మానం.. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైన సర్వ సభ్య సమావేశం రాత్రి 9 గంటలకు వరకు కొనసాగింది. వైద్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్యుత్, తాగునీరు అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలో కరువు నెలకొందని, జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, వ్యవసాయానికి 7 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, రైతుల రుణమాఫీ ఒకేసారి లక్ష వరకు వర్తింపజేయాలని సభ్యులందరూ ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ విషయమై చైర్పర్సన్ స్పందిస్తూ ఈ మూడు అంశాలను తీర్మానం చేస్తున్నట్లు సమావేశంలో ప్రకటించారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈ తీర్మానాల నివేదికను పంపనున్నట్లు చెప్పారు. -
రేషన్ కార్డులు తొలగిస్తే ఉద్యమిస్తాం
ఇబ్రహీంపట్నం: సర్వేల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేదల రేషన్కార్డులను తొలగిస్తే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ హెచ్చరించా రు. సోమవారం ఆయన ఇబ్రహీంపట్నం ఎంపీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీల్లో ఇప్ప టి వరకు ఒక్కటికూడా నెరవేర్చకపోవడం దారుణమన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఓ వైపు రైతు లు ఇబ్బందులు పడుతుంటే.. రుణమాఫీ పై ఇంకా స్పష్టత ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఫీజు రీ యింబర్స్మెంట్పై ప్రభుత్వం దోబూచులాడుతోందని విమర్శించారు. పారిశ్రామిక విధానంపై రోజుకో ప్రకటన చేస్తోందని.. కార్యాచరణ మాత్రం ఎక్కడా కనిపిం చడంలేదన్నారు. సకాలంలో వర్షాలు కురవక జిల్లా తూర్పు డివిజన్లో అన్నదాతలు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, పెట్టుబడులు సైతం చేతికందని పరిస్థితి తలెత్తిందన్నారు. పశువులకు గ్రాసంకూడా అందక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులను ఆదుకోవాలని కోరారు. ఎంపీపీ డోకూరి వెంకట్రాం రెడ్డి, బ్లాక్కాంగ్రెస్ అధ్యక్షుడు పండాల శంకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మిడి శ్రీనివాస్రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు జహంగీర్ఖాన్, చర్లపటేల్గూడ ఎంపీటీసీ సభ్యుడు లక్ష్మయ్యయాదవ్, ఆనంద్ పాల్గొన్నారు. -
ఆందోళన వద్దు
సాక్షి, మహబూబ్నగర్: రుణమాఫీకి సంబంధించి రై తులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని భరోసాఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం 25శాతం కింద రూ.682 కోట్లు మంజూ రు చేసిందని, త్వరలో మిగతా 75శాతం రు ణం మంజూరవుతుందని స్పష్టంచేశారు. ఆదివారం రాత్రి తన కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత రుణమాఫీ కేవలం పంటల బీమాను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కేవలం 25శాతం నిధులు మాత్రమే మంజూరుచేసిందని వివరించారు. ప్రభుత్వం మంజూరుచేసిన రూ.682 కోట్లలో ఇప్పటికే దాదాపు 80శాతం బ్యాంకులకు అందజేశామని, మిగతా బ్యాంకులు ఖాతాలు తెరవగానే అందజేస్తామని వెల్లడించారు. కావునా పాత రుణాలను మరిచి కొత్తలోన్లు ఎంత అవకాశముంటే దానిప్రకారం బ్యాంకులు చెల్లిస్తాయని తెలిపారు. చెల్లింపు విధానం ఇలా.. ప్రస్తుత రుణంలో 25శాతం ప్రభుత్వం మాఫీచేసింది. పాతరుణం 75శాతం ఉంటుంది. మాఫీ అయిన 25శాతం రుణానికి కిసాన్ క్రెడిట్కార్డు(కెసీసీ)నామ్స్ ప్రకారం అదనంగా రుణం ఇస్తారు. ఈ ప్రకారంగా కొత్తగా 55శాతం రుణం పొందే అవకాశముందని కలెక్టర్ వివరించారు. ఉదాహరణకు ఒక రైతు రూ.10వేల రుణం తీసుకుంటే ప్రస్తుతం ప్రభుత్వం రూ.2,500 మాఫీ చేసింది. కేసీసీ నామ్స్ ప్రకారం అదనంగా 30శాతం లోన్ కలుపుకుని కొత్తగా రూ.5,500రుణం పొందవచ్చు. అయితే భూమి విస్తీర్ణం, స్కేల్ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఏ పంట ఎంతమేరకు ఇవ్వొచ్చనే దానిపై రుణం అందుతుందని స్పష్టంచేశారు. రుణమాఫీ కోసం అర్హత సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. భూమి ఎంత ఉందనే విషయాన్ని పేర్కొంటూ రెవెన్యూ అధికారి, ఏ పంట ఎంతమేర సాగుచేశారనే విషయాన్ని మండల వ్యవసాయాధికారి గుర్తిస్తారని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు 30వేల డాక్యుమెంటేషన్లు పూర్తయ్యాయని వెల్లడించారు. కొత్తరుణం తీసుకోకపోవడమే ఉత్తమం ప్రస్తుతం బ్యాంకులు కొత్తగా ఇచ్చేరుణాలను రైతులు తీసుకోకపోవడమే ఉత్తమమని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత రుణాలు కేవలం పంటబీమాను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నట్లు తెలిపారు. ఏదైనాఅనుకోని కరువు, వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు లబ్ధిచేకూరే ఉద్ధేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. సెప్టెంబర్ 30వ తేదీలోగా చెల్లిస్తేనే పంటలబీమా వర్తిస్తుందనే ఆలోచనతోనే ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టిందని వివరించారు. -
ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తింపజేస్తాం
ఎర్రచందనం స్మగ్లర్లందరినీ ఏరేస్తాం పింఛన్ల విషయంలో రాద్ధాంతం తగదు మాట వినని అధికారులను మార్చేస్తాం టీడీపీ సమావేశంలో మంత్రి బొజ్జల చిత్తూరు(సిటీ): రాష్ట్రంలోని అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తింపజేస్తామని రాష్ట్ర అటవీ, సహకారశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చెప్పారు. గురువారం ఇక్కడి టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ సర్వసభ్య సమావేశం సీనియర్ నాయకుడు ముద్దుకృష్ణమనాయుడి అధ్యక్షతన నిర్వహించారు. రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని, అంతా మేలు జరుగుతుందని మంత్రి చెప్పారు. డ్వాక్రా రుణాలకు సంబంధించి గ్రూపునకు వర్తింపజేయాలా, సభ్యులవారీగా వర్తింపజేయాలా అనే అంశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. పింఛన్ల విషయంలో కొంతమంది రాజకీయం చేస్తున్నారని, అలా చేయడం తగదని చెప్పారు. భర్తలు ఉన్నవారు, వృద్ధులు కాని వారు పింఛన్లు తీసుకుంటున్నారని, అలాంటి వాటిని రద్దు చేసేందుకే సర్వే చేస్తున్నారని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లర్లందరినీ ఏరిపారేస్తామన్నారు. గత 100 రోజుల పాలనలో ఏమీ చేయలేదనే అపోహలో అందరూ ఉన్నారని, అలాంటివేమి పెట్టుకోవద్దని చెప్పారు. ఇకపై అంతా మంచే జరుగుతుందని, పార్టీ నాయకులు, కార్యకర్తల మాటలను ఖాతరు చేయని అధికారులను తప్పక బదిలీ చేస్తామని స్పష్టం చేశారు. మద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ మెజారిటీ వచ్చే గ్రామాల్లోనే పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. చిత్తూరు ఎమ్మేల్యే డీఏ సత్యప్రభ మాట్లాడుతూ సీఎం సహకారంతో చిత్తూరు నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బీఎన్ రాజసింహులు మాట్లాడుతూ వచ్చే నెల 15 తరువాత పార్టీకి కొత్త అడహాక్ కమిటీలను ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు చేస్తామని వెల్లడించారు. జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, నగర మేయర్ కఠారి అనురాధ తదితరులు ప్రసంగించారు. ఉద్యానపంటలకూ రుణమాఫీ చేయాల్సిందే - తంబళ్లపల్లె నియోజకవ ర్గ తమ్ముళ్లు ఉద్యానపంటలకూ రుణమాఫీ చేయాల్సిందేనని తంబళ్లపల్లె నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లు సమావేశంలో పట్టుబట్టారు. 100 రోజులుగా రుణమాఫీపై కాలయాపన చేస్తున్నందున కార్యకర్తలతో పాటు, రైతులు మనోవేదనకు గురవుతున్నారని మండిపడ్డారు. మంత్రి కలగజేసుకుని అధికార పార్టీలో ఉంటూ సీఎం ప్రకటనలకు మద్దతు పలకకుండా, వ్యతిరేకంగా మాట్లాడటం తగదని వారిని వారించారు. మంత్రి ఎంత చెప్పినా వినకుండా రుణమాఫీ, పింఛన్ల విషయంపై కార్యకర్తలు నిలదీస్తుండటంతో సమావేశ మందిరం వద్ద గందరగోళం నెలకొంది. దీంతో చేసేదిలేక సమావేశాన్ని అర్ధంతరంగా ముగించారు. -
ఇదేం రుణమాఫీ?: సీఎల్పీ
75 శాతం అప్పును రైతులపై రుద్దే కుట్ర సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రుణమాఫీ మొత్తంలో నాలుగోవంతు నిధులను మాత్రమే ప్రభుత్వం విడుదల చేయడం వెనుక పెద్దకుట్ర దాగిఉందని కాంగ్రెస్ శాసనసభాపక్షం ఆరోపించింది. మిగిలిన 75 శాతం రుణాలను రైతులపై భారం మోపడమే ప్రభుత్వలక్ష్యంగా కన్పిస్తోందని అనుమానం వ్యక్తం చేసింది. గురువారం సీఎల్పీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు టి.జీవన్రెడ్డి, పి.కిష్టారెడ్డి, వంశీచంద్రెడ్డి మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ భారాన్ని తగ్గించుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటినుంచీ పిల్లిమొగ్గలు వేస్తోందని, రూ. 19 వేల కోట్ల రుణాలను 17 వేల కోట్ల రూపాయలకు కుదించడమే ఇందుకు నిదర్శనమని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే మిగిలిన మొత్తానికి ప్రభుత్వమే బ్యాంకులకు పూచీకత్తు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
రుణమాఫీకి రైతుల గుర్తింపు
జిల్లాలో 4.03 లక్షల మంది నెలాఖరుకల్లా తుది నివేదిక కలెక్టర్ జి.కిషన్ వెల్లడి హన్మకొండ అర్బన్ : రుణమాఫీకి జిల్లాలో ఇప్పటి వరకు 4.03 లక్షల మంది రైతులను గుర్తించినట్లు కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రాజీవ్శర్మ నిర్వహిం చిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ వేగంగా సాగుతోం దని, రెవెన్యూ రికార్డులు పరిశీలించి ఈనెలాఖరు కల్లా తుది నివేదిక సిద్ధం చేస్తామని చెప్పారు. అనంతరం జిల్లా అధికారులు బ్యాంకర్లతో కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రుణమాఫీకి సంబంధించి మండల స్థాయిలో రెవెన్యూ, బ్యాంకు అధికారులతో బ్రాంచీ ల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి రైతులకు సంబంధించిన రుణ పత్రాలను పరిశీలిస్తామన్నారు. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో బోగస్ పేర్లు గుర్తించి ఏరివేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన రైతులకు రూ.లక్షలోపు రుణాలు పూర్తిగా మూడేళ్లలో చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున తొలివిడతగా 25శాతం ఆయా బ్యాంకుల బ్రాంచీలకు చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నా రు. అరులైన రైతులకు త్వరితగతిన వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని సూచిం చారు. సమావేశంలో ఏజేసీ కృష్ణారెడ్డి, ఐటీడీఏ పీఓ సుధాకర్రావు, వ్యవసాయశాఖ జేడీఏ రామారావు, డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, ఎల్డీఎం, ఆర్డీఓ మాధవరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
విండో సిబ్బందిపై చర్యలు తీసుకోండి
లింగంపేట : గతంలో రుణమాఫీ అయినట్లు పత్రాలు చూపిన సింగిల్ విండో సిబ్బంది.. ఇప్పుడు మాఫీ కాలేదని, అప్పు ఉందని పేర్కొంటున్నారని రైతులు ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. ముందుగా రైతులు నల్లమడుగు విండో కార్యాలయానికి చేరుకుని విండో చైర్మన్ మధుసూదన్రెడ్డితో, కార్యాలయ సిబ్బందితో ఘర్షణ పడ్డారు. నల్లమడుగు సింగిల్ విండో చైర్మన్ మధుసూదన్రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రుణ మాఫీ పథకాన్ని అమలు చేశారు. నల్లమడుగు సింగిల్ విండో పరిధిలో 540 మంది రైతులకు రుణమాఫీ కాగా సకాలంలో రుణాలను చెల్లిస్తూ వచ్చిన 1,042 మందికి రూ. 5 వేల చొప్పున ప్రోత్సాహకాన్ని అందించారు. కాగా డబ్బులకు కక్కుర్తి పడ్డ విండో సిబ్బంది కొందరు.. రైతులకు రుణమాఫీ అయినట్లు ధ్రువీకరణ పత్రాలను జారీ చేశారు. తిరిగి రుణాలు ఇచ్చినట్లుగా పత్రాలను తయారు చేసి పాత రుణాన్నీ అందులో కలిపారు. ఈ విషయాన్ని రైతులకు చెప్పలేదు. రుణాలు చెల్లించిన వారికి ఇచ్చిన ప్రోత్సాహకాన్నీ నొక్కేశారు. తెలంగాణ సర్కార్ రుణమాఫీపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అధికారులు గ్రామాల్లో సభలు నిర్వహించి రుణాలు ఉన్న రైతుల పేర్లు చదివారు. దీంతో అసలు విషయం బయటపడింది. గతంలో రుణ మాఫీ అయ్యిందని చెప్పిన 170 మంది రైతుల పేర్లు ఆ జాబితాలో ఉండడంతో వారు ఆందోళన చెందారు. ఇటీవల లింగంపేటకు వచ్చిన కలెక్టర్ రొనాల్డ్ రోస్ను కలిసి సమస్యను వివరించారు. సింగిల్విండో పరిధిలోని బానాపూర్, కొర్పోల్, మోతె గ్రామాలకు చెందిన యాభై మంది రైతులు బుధవారం పోలీసు స్టేషన్కు వచ్చి ఆందోళన చేశారు. రుణమాఫీ చేయకుండానే, రుణం చెల్లించి తిరిగి రుణం పొందినట్లుగా పత్రాలు సృష్టించి, ప్రోత్సాహకాన్ని నొక్కేశారని ఆరోపించారు. ఎస్సై పల్లె రాకేశ్ కామారెడ్డి డీఎల్సీఓ గంగాధర్తో మాట్లాడారు. విచారణ జరిపి ఫిర్యాదు చేస్తామని ఆయన ఎస్సైతో పేర్కొన్నారు. రైతులు అనంతరం ఎల్లారెడ్డి సీఐ వద్దకు వెళ్లారు. కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ నల్లమడుగు సింగిల్ విండోలో రుణమాఫీ అయినట్లుగా పత్రాలు అందించిన విండో సిబ్బంది ప్రస్తుతం మాఫీ కాలేదంటూ రికార్డులు చూపుతున్నారని, మాకు న్యాయం చేయాలని ఇటీవల లింగంపేటకు వచ్చిన కలెక్టర్ రొనాల్డ్ రోస్కు రైతులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ తహశీల్దార్ అలెగ్జాండర్ను ఆదేశించారు. కానీ 15 రోజులు గడిచినా ఎలాంటి పురోగతి లేదని రైతులు పేర్కొంటున్నారు. కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని, అక్రమాలకు పాల్పడిన విండో సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆందోళనలో విండో వైస్ చైర్మన్ రాయిని సాయిలు, బానాపూర్కు చెందిన విఠల్రెడ్డి, సుభాష్, లింగాగౌడ్, బండి నర్సింలు, ఈశ్వర్, రాము వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
రుణమాఫీ విందు..ఎవరికో ముందు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రుణమాఫీ గురించి ప్రభుత్వం ఎ ట్టకేలకు చేసిన ప్రకటన ఇందూరు రైతుల కు ఊరట కలిగించింది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రధాన అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఒకేసారి కాకుండా నాలుగు విడతలలో రుణమాఫీ చేసేందు కు సుముఖత వ్యక్తం చేయడంతోపాటు, మొదటి విడతగా 25 శాతం నిధులను విడుదల చేసింది. దీంతో జిల్లాకు చెందిన 4,33,132 మంది రైతులకు తీపి కబురందినట్లయ్యింది. జిల్లాలో రూ.1863.65 కోట్ల రుణమాఫీ కావాల్సి ఉండగా, తొలి విడతలో రూ. 465.91 కోట్లు మాఫీ కా నున్నాయి. అయితే, ఈ జాబితాలో ఎవరెవరికీ అవకాశం ఉంటుందన్న చర్చ రైతులలో సాగుతోంది. ఎవరికో ముందు ఎడతెగని కసరత్తు రుణమాఫీ కోసం అర్హులైన రైతుల జాబితాను రూపొందించడానికి అధికారులు ఎడతెగని కసరత్తు చేశారు. ఎ, బి, సి, డి, ఇ దశలుగా విభజించి వివరాలు సేకరించా రు. ప్రభుత్వ ఉత్తర్వులు, రిజర్వుబ్యాంకు మార్గదర్శకాలు పరస్పరం విరుద్ధంగా ఉండటంతో అధికారులు, బ్యాంకర్లు ఓ నిర్ణయానికి రావడానికి చాలా కాలం పట్టింది. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఒక కుటుంబానికి రూ. లక్ష వరకు రుణమాఫీ వర్తింప చేయాల్సి ఉంది. ఇందుకోసం రైతు కుటుంబంలోని సభ్యులు, వారి పేర్లతో ఉన్న ఖాతాలు, బంగారంపై తీసుకున్న రుణాల మొత్తాలను లెక్కగట్టాల్సి వచ్చింది. ఇలా చేస్తే ఎంతమందికి ఈ పథకం వర్తిస్తుంది? ఎన్ని కోట్ల రూపాయలు మాఫీ అవుతాయి? అన్న అంశాలు కీలకంగా మారాయి. సుమారు మూడు మాసాల నెలల వ్యవధిలో వివిధ దశలు, ప్రక్రియల ద్వారా అర్హులైన జాబితాను రూపొందించారు. 4,33, 132 మంది రైతులకు రూ.1863.65 కోట్ల పంట రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని తేల్చారు. రుణాలు ఇచ్చింది ఇలా ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో జిల్లాలోని 4,33,132 మంది రైతులకు రూ. 1,863.65 కోట్ల రుణాలు నాలుగు విడతలలో మాఫీ కానున్నాయి. మొదటి విడతగా రూ. 465.91 కోట్ల రుణాలు మాఫీ కానున్నాయి. 2013-14లో రూ.1,921.00 కోట్లు లక్ష్యం కాగా రూ.1,810.01 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. ఇందులో ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.1,152.6 కోట్లు కాగా, రూ.1,075.24 కోట్లు ఇచ్చారు. రబీలో రూ.768.4 కోట్లకుగాను రూ.734.77 కోట్లు పంపిణీ చేశారు. అదే విధంగా జిల్లాలోని 142 సహకార సంఘాలతో పాటు వివిధ బ్యాంకులలో రైతులు బంగారం తాకట్టు పెట్టి రూ.53.64 కోట్లు పంట రుణాలు తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా రైతులు తీసుకున్న మొత్తం రుణాలు రూ.1863.65 కోట్లు కాగా, ఇవన్నీ కూడ రుణమాఫీ కిందకు వస్తాయని అధికారులు నెలరోజుల కిందటే ప్రకటించారు. మొదటి విడతతోపాటు మిగతా రుణాలు మా ఫీ చేసేందుకు అవకాశం ఉందని చెబుతున్న అధికారులు రీ-షెడ్యూల్ తేదీలను ఖరారు చేయడం చర్చనీయాంశంగా మారింది. -
ముంపు రైతుకు ముప్పేనా?
భద్రాచలం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించిన ముంపు మండలాల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటీవల గోదావరి వరదలతో తీవ్రంగా నష్టపోయిన ముంపు రైతులకు ఏపీ ప్రభుత్వమే పంట నష్టపరిహారం ఇస్తుందని స్పష్టత వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన అధికారులు చేస్తున్న సర్వేను ఏపీ ప్రభుత్వం ఏ మేరకు ప్రాతిపదికగా తీసుకుంటుందన్న దానిపై రైతుల్లో కొంత అనుమానం నెలకొంది. ముంపు మండలాల విలీనంపై ఫైనల్ గెజిట్ ఇచ్చినా..పాలనా వ్యవహారాలపై ఉభయ గోదావరి జిల్లాల అధికారులు పెద్దగా దృష్టి సారించలేదు. వరద నష్టంపై ప్రస్తుతం రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నా వీరిపై తగిన అజమాయిషీ చేసే అధికారులు లేకపోవటంతో ముంపు మండలాల్లో ఇది అస్తవ్యస్తంగా సాగుతోంది. రేపోమాపో తెలంగాణ రాష్ట్రానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న రెవెన్యూ అధికారులు పంట నష్టం అంచనాలపై కొంత అలసత్వం ప్రదర్శిస్తున్నారని రైతులు బాహటంగానే అంటున్నారు. పంటలు నష్టపోయిన తమకు తగిన పరిహారం అందుతుందో లేదోననే ఆందోళన రైతుల్లో నెలకొంది. గోదావరి పరీవాహక ప్రాంతంలోని 14 మండలాల్లో 8,967 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లుగా జిల్లా అధికారులు లెక్క తేల్చారు. ఇందులో భద్రాచలం డివిజన్లోని భద్రాచలం రూరల్, కూనవరం, చింతూరు, వీఆర్పురం, పాల్వంచ డివిజన్ బూర్గంపాడులోని ఆరు రెవెన్యూ గ్రామాలతో పాటు కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు ఏపీలో విలీనం అయ్యాయి. ఏపీలో విలీనం అయిన ఏడు మండలాల్లో 5,308 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనికి నష్ట పరిహారం ఏపీ అధికారులే ఇవ్వాల్సి ఉంటుంది. పంట నష్టం ఎంత చెల్లించాలనే దానిపై ప్రస్తుతం రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. గతే డాది నష్ట పరిహారం ఇచ్చేదెవరు? గతేడాది గోదావరి వరదలతో ఇప్పటికంటే ఎక్కువే పంట నష్టం జరిగింది. కానీ నష్టపోయిన రైతులు, ఇళ్లు కూలిపోయిన బాధితులకు ఇప్పటి వరకు నయాపైసా సాయం అందలేదు. రెండు రాష్ట్రాలు విడిపోయిన నేపథ్యంలో ఏడు మండలాల్లోని బాధిత రైతులకు గతేడాది నష్ట పరిహారం ఎవరు ఇస్తారనే దానిపై స్పష్టత లేదు. ఇరు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు పంట రుణాల మాఫీకి హామీ ఇచ్చాయి. ఇప్పటికే తెలంగాణలో రుణమాఫీ ప్రక్రియ మొదలైంది. కానీ జిల్లాలో రుణం ఆ ఏడు మండలాలకు చెందిన రైతులు, ప్రస్తుతం ఏపీలోకి వెళ్తున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం నుంచి ముంపు రైతులకు ఎటువంటి భరోసా రాలేదు. పోలవరం ముంపు భూములకు పరిహారం లేనట్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పునరావాస ప్యాకేజీ చెల్లించిన భూముల్లోని పంటలకు నష్ట పరిహారం ఇచ్చేది లేదని అధికారులు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసమని ఏపీ విలీనమైన ఏడు మండలాల్లో 74,751.96 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు ఇప్పటికే 45,756.90 ఎకరాలుకు పునరావాస ప్యాకేజీ పంపిణీ చేశారు. కానీ ఈ భూముల్లోని పంటలకే ఎక్కువ నష్టం జరిగింది. పునరావాస ప్యాకేజీ తీసుకున్నా ఇంకా భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకపోవటంతో వేలాది రూపాయలను పెట్టుబడిగా పెట్టి రైతులు పంటలు సాగుచేస్తున్నారు. కానీ ఈ భూములకు నష్ట పరిహారం ఇచ్చేది లేదని ఏపీ ప్రభుత్వం చెబుతుండటంతో రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. -
రైతులకు వెంటనే కొత్త రుణాలు
హైదరాబాద్: రిజర్వ్ బ్యాంక్ ఆమోదం మేరకు రుణాలు రీ షెడ్యూల్ కానున్న 3 జిల్లాలతో సహా తెలంగాణ రాష్ర్టవ్యాప్తంగా రైతులందరికీ రుణ మాఫీని అమలు చేస్తున్నట్లు టీ సర్కారు స్పష్టం చేసింది. తొలివిడతగా విడుదల చేసిన 25 శాతం నిధులను అన్ని బ్యాంకులకూ వాటి రుణ వితరణ ఆధారంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. కొత్తరుణాల మంజూరుకు బ్యాంకులు చర్యలు తీసుకుంటాయని వెల్లడించింది. తొలి విడతలో రూ. 4,250 కోట్ల విడుదలకు వ్యవసాయ శాఖ పరిపాలనాపరమైన ఆమో దం తెలపడంతో బుధవారం నిధులను రాష్ర్ట స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ)కి అందజేయనున్నట్లు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం మీడియాకు వివరించారు. అక్కడి నుంచి ఆయా బ్యాంకులకు సర్దుబాటు జరుగుతుందని మంత్రులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం బ్యాంకర్లతో సమావేశం అనం తరం వారితో కలసి మంత్రులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఒకేసారి భారీ మొత్తంలో నిధులు విడుదల చేసినందున, బ్యాంకర్లు కూడా ప్రస్తుతం చెల్లించిన 25 శాతం నిధులతోపాటు, అదనంగా మరో 30 నుంచి 35 శాతం మేర నిధులను కలిపి రైతులకు కొత్త రుణాలను ఇస్తారని తెలిపారు. దీంతో తక్షణమే రైతులకు రుణాలందుతాయన్నారు. మిగిలిన బకాయిల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దని బ్యాంకర్లను కోరామని, అందుకు వారు అంగీకరించారని ఎస్బీహెచ్, ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంకు, ఆప్కాబ్, దక్కన్ గ్రామీణ బ్యాంకుల ఉన్నతాధికారుల సమక్షంలో మంత్రులు వెల్లడించారు. గురువారం నుంచి బ్యాంకులకు రుణాల చెల్లింపులు ప్రారంభమవుతాయన్నారు. రైతులు వెంటనే బ్యాంకులకు వెళ్లి రుణాలను రెన్యువల్ చేసుకొని ప్రభుత్వంతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
అర్హులందరికీ పంట రుణాలు
రేగోడ్: రుణమాఫీ పొందిన అర్హులైన రైతులందరికీ పంట రుణాలు రీషెడ్యూల్ చేస్తామని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ (జేడీఏ) హుక్యానాయక్ తెలిపారు. మండలంలోని మేడికుంద గ్రామ శివారులో రైతులు సాగు చేసిన పత్తి పంటలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జేడీఏ మాట్లాడుతూ.. వరిలో కాండం తొలుచు పురుగు నివారణకు కార్బోఫ్యురాన్ త్రీజీ గుళికలను ఎకరాకు పది కిలోల చొప్పున పొలంలో చల్లుకోవాలని సూచిం చారు. పత్తిలో రసంపీల్చే పురుగు నివారణకు లీటరు నీటిలో 1.5 గ్రాముల ఎసిపేట్ మ ందును పిచికారీ చేయాలని తె లిపారు. పత్తి గూడ రాలకుండా ఉండేందుకు మల్టీ కే మం దును స్ప్రే చేసుకోవాలని తెలిపారు. పచ్చ పురుగు నివారణకు లీటరు నీటిలో 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ ముందును పిచి కారీ చేయాలని చెప్పారు. కందిలో ఆకుముడత పురుగు నివారణకు లీటరు నీటిలో ఒక గ్రాము ఎసిపేట్ మందును లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్ మందును కలుపుకుని పిచికారీ చేయాలని తెలిపారు. పంటల సాగులో క్రమం తప్పకుండా వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రుణాలను రీషెడ్యూల్లో రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని బ్యాంకర్లకు సూచించారు. వట్పల్లిలోని బ్యాంక్ అధికారులు తమకు రుణాలు మంజూరు చేయడంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆయనతో తెలిపారు. అధికారులతో మాట్లాడి రుణాలు మంజూరు చేయించేం దుకు చర్యలు తీసుకుంటానని జేడీఏ చెప్పారు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నదాతలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డాట్ సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్, ఏడీఏ శ్రీనివాస్ ప్రసాద్, ఏఈఓ ఇంద్రయ్య, ఎంపీటీసీ అప్పారావ్, నాయకులు టి.శంకరప్ప, రైతులు ఉన్నారు. -
డబ్బుల్ ధమాకా
నకిలీ పాస్ పుస్తకాల ఏరివేత మరో అక్రమానికి తెరలేపింది. వడబోత కార్యక్రమం.. దొంగ చేతికే తాళాలు ఇచ్చిన చందంగా తయారైందనే ప్రచారం వినవస్తోంది. నకిలీ పాస్పుస్తకాల తయారీలో ప్రత్యక్షంగా.. పరోక్షంగా సంబంధాలున్న రెవెన్యూ అధికారులకే నకిలీలను గుర్తించే బాధ్యత అప్పగించడంతో వారి పంట పండుతోంది. అందినకాడికి వసూళ్లకు పాల్పడుతూ అన్నీ సక్రమమేననే నివేదికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. మంథని : రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అర్హుల గుర్తింపుకోసం పలు చర్యలు చేపట్టింది. అధికారుల విచారణలో... జిల్లాలో పలువురు నకిలీ పాస్పుస్తకాలు తనఖా పెట్టి పంట రుణా లు పొందినట్లు వెల్లడైంది. కమాన్పూర్ మండలంలో సింగరేణి భూములకు నకిలీ పాస్పుస్తకాలు సృష్టించి బ్యాంకుల్లో తనఖా పెట్టినట్లు తేలింది. కాటారం, మహదేవపూర్, మంథనితోపాటు డివిజన్లోని ఇతర బ్యాంకుల్లో రూ.5 కోట్ల మేర ఇలా నకిలీలు రుణాలు పొందినట్లు విశ్వసనీయ సమాచారం. ఒక్కో వ్యక్తి ఇలా రెండు, మూడు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న సంఘటనలూ వెలుగుచూస్తున్నాయి. నకిలీ పాస్పుస్తకాలతోపాటు కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్, కిందిస్థాయి సిబ్బంది, కార్యాలయాల స్టాంపులను తయారు చేసే ముఠాను కాటారం మండలం జాదూరావుపేటలో సుమారు ఏడాది క్రితం పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు కాటారం బ్యాంకులో 82 నకిలీ పాసుపుస్తకాలు ఉన్నట్లు కూడా గుర్తించారు. ఈ ముఠా వెనక పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, అధికారుల పాత్ర ఉన్నట్లు విచారణలో తేలింది. కానీ, నామమాత్రపు చర్యలు తీసుకుని ఆ వ్యవహారాన్ని వదిలేశారు. దీంతో డివిజన్లో కోట్ల రూపాయల్లో బ్యాంకులకు నకిలీలు కుచ్చుటోపీ పెట్టారు. ఫిఫ్టీ.. ఫిఫ్టీ రుణమాఫీ లబ్ధిదారుల జాబితాలో నకిలీలు ఉన్నట్లు తెలియడంతో వారి ఏరివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఏ గ్రామ వీఆర్వో, రెవెన్యూ సిబ్బంది ఆ గ్రామంలో నకిలీలను గుర్తించాలని ఆదేశించింది. అయితే నకిలీ పాస్పుస్తకాల తయారీలో సూత్రధారులుగా ఉన్న పలువురు రెవెన్యూ సిబ్బంది ఇప్పటికీ అదే గ్రామాల్లో పనిచేస్తుండగా... కొందరు మాత్రం క్లస్టర్ మారినా అదే మండలంలో పనిచేస్తున్నారు. దీంతో ఎవరెవరి వద్ద నకిలీ పాస్పుస్తకాలున్నాయనే సమాచారం వారి వద్ద పక్కాగా ఉంది. ఈ అవకాశాన్ని అదునుగా తీసుకున్న సదరు రెవెన్యూ సిబ్బంది నకిలీల నుంచి అంది నంత దోచుకుంటున్నట్లు సమాచారం. నకిలీగా గుర్తిస్తే ప్రభుత్వం నుంచి వచ్చే మాఫీ దక్కకుం డా పోతుందని, పైగా అనవసరంగా కేసులు... ఇబ్బందులు వస్తాయని భయపెడుతూ తమకు కొంత సొమ్ము ఇస్తే అంతా సజావుగా వ్యవహా రం నడిపిస్తామని బేరం కుదుర్చుకుంటున్నట్లు సమాచారం. ఇలా ఒక్కొక్కరి వద్ద మాఫీ అయ్యే రుణమొత్తాన్ని బట్టి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు దండుకుంటున్నట్లు తెలిసింది. కొందరి వద్ద ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నట్లుగా కూడా బేరం కుదుర్చుకుంటున్నారని సమాచారం. ఖజానాకు గండి మంథని డివిజన్లోని ఏడు మండలాల్లో 40 వేల మంది రైతులకు గాను రూ.150 కోట్ల పైచిలుకు రుణమాఫీ జరిగే అవకాశం ఉంది. మహదేవ్పూర్ మండలం రాపెల్లికోట, సూరారం, బెగ్లూర్, బొమ్మాపూర్, అన్నారం, మహదేవ్పూర్, కాళేశ్వరంతోపాటు ఇతర గ్రామాల్లోని రైతులు రూ.కోటికి పైగా రుణాలు పొందారు. ఈ మండలంలో 1500 మందిని రుణమాఫీ కింద ఎంపిక చేశారు. వీటిలో సగానికిపైగా నకిలీ పాస్పుస్తకాలు ఉన్నట్లు తెలిసింది. కాటారం, మంథనిలో 1000కి పైగా నకిలీ పాసుపుస్తకాలు పెట్టి రుణాలు పొందినట్లు సమాచారం. నకిలీల సూత్రధారులే విచారణ అధికారులవుతుండడంతో వారి డబుల్ ధమాకా లభిస్తుండగా... అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోవడంతోపాటు ప్రభుత్వ ఖజానాకు గండి పడే అవకాశం ఉంది. స్థానిక అధికారులతో కాకుండా వేరే ప్రాంతం వారిని ఇక్కడ విచారణ అధికారులుగా నియమించి పారదర్శకంగా పరిశీలన జరిపిస్తే నకిలీ పాసుపుస్తకాలు పెట్టి రుణాలు తీసుకున్న గుట్టు రట్టు అయ్యే అవకాశం ఉంది. -
కదం తొక్కిన రైతులు
కాకినాడ సిటీ : రుణాలు మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు హామీలను నెలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు కదం తొక్కారు. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు సోమవారం వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ఇక్కడకు తరలివచ్చి కలెక్టరేట్ను ముట్టడించారు. ఎన్నికలకు ముందు ఓమాట, అధికారంలోకి వచ్చాక మరోమాట మార్చిన టీడీపీ.. హామీల అమలులో కాలయాపన చేస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటలపాటు ఆందోళన నిర్వహించిన రైతులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ దశలో కలెక్టరేట్ గేటును తోసి లోపలికి వెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా, పోలీసులు అత్యుత్సాహంతో లాఠీలతో గేట్లపై కొట్టారు. ఈ క్రమంలో సంఘ నాయకుడు కుమారస్వామికి చేతివేలికి గాయం కావడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం కలెక్టర్ నీతూ ప్రసాద్కు రైతు నాయకులు వినతిపత్రం అందజేసి, పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర కార్యదర్శి కుమారస్వామి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించాయన్నారు. రైతులు ఆగ్రహించి కోనసీమలో పంట విరామమే కాదు ఈల్డ్డౌన్ కూడా ప్రారంభించారని చెప్పారు. ఇది రాష్ట్రమంతా చాపకింద నీరులా ప్రవహిస్తూనే ఉందన్నారు. ఇప్పటికే కోనసీమలో 20 నుంచి 30 శాతం భూములు వరిపంటకు దూరమయ్యాయని ప్రభుత్వాలు గ్రహించాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులన్నింటికీ లాభసాటి ధర నిర్ణయించే వ్యవస్థను తీసుకురావాలని, ప్రత్యేక వ్యవసాయ పంటల బీమా చట్టం తేవాలన్నారు. గతేడాది బీమా క్లెయింలను వెంటనే రైతులకు చెల్లించాలని, ఈ సొమ్మును రుణమాఫీ పథకానికి మళ్లించరాదని డిమాండ్ చేశారు. కాజులూరు మండలం తణుకువాడలో కూడా రైతులు ఆందోళన చేశారు. ఆదర్శ రైతుల ఆందోళన ఆదర్శరైతు వ్యవస్థను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆదర్శ రైతులకు రాజకీయ కార్యకర్తలుగా ముద్రవేసి తొలగించడం ప్రభుత్వానికి తగదని, ఆ జీఓ రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆదర్శ రైతులను రోడ్డున పడేయడం దారుణమని ఆదర్శ రైతుల సంఘ రాష్ట్ర కార్యదర్శి పుచ్చకాయల ఏడుకొండలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆదర్శరైతు వ్యవస్థను సమీక్షిస్తానని చెప్పిన చంద్రబాబు వస్తే జాబు వస్తుందని నమ్మకాన్ని కలిగించి, ఇప్పడు ఆ వ్యవస్థనే రద్దు చేయడం సమంజసం కాదన్నారు. అవసరమైతే అనర్హులను, అవినీతి ఆరోపణలున్న వారిని తొలగించాలి మినహా రద్దు చేయడం తగదన్నారు. సంఘ జిల్లా అధ్యక్షుడు కర్రి వీరాంజనేయరెడ్డి, నాయకులు ఆదిత్యరెడ్డి పాల్గొన్నారు. -
పంటలు వేయునివారికి మాఫీ లేదు
మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు పోచారం, ఈటెల స్పష్టీకరణ హైదరాబాద్: పంట రుణాలు తీసుకుని పంటలు వేయని వారికి, భూమి లేని వారికి రుణ మాఫీ వర్తించదని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. కొందరు పంటలు వేయకుండా, భూమి లేకుండానే దొంగ పాస్పుస్తకాలతో పంట రుణాలు తీసుకున్నట్టు ప్రభుత్వ విచారణలో తేలిందన్నారు. అలాంటివారిని ఏరివేసిన తర్వాతే రుణ మాఫీ అమలు చేస్తామన్నారు. రుణ మాఫీపై అధ్యయనం కోసం పోచా రం నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం శనివారం మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో సవూవేశమై చర్చించిం ది. సమావేశం అనంతరం జోగు రామన్నతో కల సి పోచారం, ఈటెల విలేకరులతో మాట్లాడారు. ‘‘రుణ మాఫీపై ఇప్పటికే 99 శాతం స్పష్టత వచ్చింది. సీఎం కేసీఆర్ నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నాక 100 శాతం స్పష్టత వస్తుంది’’ అని పోచారం పేర్కొన్నారు. బంగారంపై తీసుకున్న రుణాల్లో 7 శాతం వడ్డీ గలవాటినే మాఫీ చేస్తామన్నారు. రాష్ట్రంలో 35 నుంచి 36 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 15 నుంచి 16 వేల కోట్ల పంట రుణాలున్నాయని వెల్లడిం చారు. కాగా రైతుల రుణమాఫీ అమలుకు సం బంధించి మంత్రివర్గ ఉపసంఘం ఆదివారం తన నివేదికను సీఎం కేసీఆర్కు ఇవ్వనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. బ్యాంకులకు నేరుగా సగం వరకు రైతుల రుణ బకాయిలు చెల్లించి వారికి కొత్త రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేయనుంది. -
మరో ని‘బంధనం’
రుణమాఫీకి భూమి సర్వే నంబర్ కావాలట జిల్లాలో 50శాతం మంది రైతులు దూరం విశాఖ రూరల్ : వరికుప్పంత హామీనిచ్చి.. వడ్ల గింజంత రుణమాఫీకి చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడలు వేస్తూనే ఉంది. వారానికో ఉత్తర్వులతో రైతుల్ని హతాశుల్ని చేస్తోం ది. విస్తరి వేసి వడ్డన ఎగ్గొట్టినట్లు.. ఆర్భాటంగా ఇచ్చిన రుణమాఫీ హామీ నుంచి తప్పించుకోవడానికి శతవిధా లా యత్నిస్తోంది. ఇప్పటికే కుటుంబంలో ఒక్కరే మాఫీకి అర్హులని, ఉద్యానవన రైతులకు వర్తించదని ప్రకటించారు. ఆధార్, రేషన్కార్డు, పట్టాదారు పాస్పుస్తకం వంటి నిబంధనలు విధించారు. తాజాగా.. అడ్డగోలుగా సర్వే నంబర్ అడ్డంకిని సృష్టించారు. దీంతో జిల్లా రైతుల్లో 50 శాతం మంది రుణమాఫీకి దూరం కానున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల తప్పిదాలు ప్రభుత్వానికి కలిసివస్తున్నాయి. భూమి క్రయవిక్రయాలు, వారసులకు రాసి చ్చిన తర్వాత అధికారులు రెవెన్యూ అడంగళ్లలో మార్పులు చేయకుండా, ఒకే సర్వే నంబర్ను నమోదుతో చాలా మంది రైతులు రుణమాఫీకి దూరం కానున్నారు. ఒక్కరే అర్హులు.. ఇప్పటికే ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మాఫీ అర్హతకు 31 అంశాలకు సంబంధించిన సమాచారం పొందుపర్చాలి. ఇందులో రైతులు పూర్తి చేయాల్సినవి కొన్ని కాగా, మిగిలినవి బ్యాంకులు నమోదు చేయాల్సినవి. ఇందుకు ప్రభుత్వం రూపొందించి, బ్యాంకులకు అందజేసిన సాఫ్ట్వేర్లో సర్వే నంబర్ కూడా చేర్చింది. ఒకే సర్వే నంబర్తో ఇద్దరు, అంతకన్నా ఎక్కువ మంది రైతులు మాఫీకి దరఖాస్తు చేసుకుంటే.. కేవలం ఒక్కరి రుణమే మాఫీ అవుతుంది. ఒకే సర్వే నంబర్పై వేర్వేరు బ్యాంకుల్లో రుణాలు పొందినా, ఒకరి కన్నా ఎక్కువ మంది ఒకే సర్వే నంబర్ ఇచ్చినా దానిని సాఫ్ట్వేర్ గుర్తిస్తుంది. అప్పుడు ప్రభుత్వం నియమించే టెక్నికల్ కమిటీ ఒకరిని మాత్రమే రుణమాఫీకి అర్హుడిగా ఎంపిక చేస్తుంది. మాయోపాయాలు.. చాలా చోట్ల ఒక సర్వే నంబర్పై భూమి క్రయవిక్రయాలు జరిగాయి. సాధారణంగా తండ్రి ఆస్తిని అదే సర్వే నంబర్పై వారసులకు పంపిణీ చేసి రిజిస్టర్ చేస్తుంటారు. దీని ఆధారంగానే రెవెన్యూ అధికారులు వారికి టైటిల్డీడ్, పట్టాదారుపాస్పుస్తకాలను మంజూరు చేస్తున్నారు తప్పా సర్వే నంబర్ల సబ్ డివిజన్ చేసి, అడంగళ్లలో నమోదు చేయడం లేదు. సర్వే నంబర్ల సబ్ డివిజన్కు అనుమతి ఇవ్వాల్సిన ప్రభుత్వం కూడా కొన్నేళ్లుగా పట్టించుకోవడం లేదు. సాధారణంగా బ్యాంకులు సర్వే నంబర్తో సంబంధం లేకుండా టైటిల్ డీడ్, పట్టాదారు పాస్పుస్తకాల ఆధారంగా రుణాలు మంజూరు చేస్తుంటాయి. పంట నష్టపోతే ప్రభుత్వం కూడా వీటి ఆధారంగానే పెట్టుబడి రాయితీ ఇస్తోంది. దీని వల్ల చాలా మంది రైతులు ఇప్పటి వరకు సర్వే నంబర్ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు రుణమాఫీకి సర్వే నంబర్ను కూడా నమోదు చేయాలని చెప్పడంతో లబోదిబోమంటున్నారు. -
రుణమాఫీ అవసరం రానప్పుడే నిజమైన స్వాతంత్య్రం
* రైతులకు ఇస్తున్న రుణాలపై వ్యవసాయ మంత్రి పోచారం వ్యాఖ్య * ‘సిగ్గుపోతుంది ఏం చెప్పుకోవాలో’ అని వ్యవసాయ వర్సిటీపై విమర్శ సాక్షి, హైదరాబాద్: ‘రైతులకు రుణమాఫీ అవసరం రావొద్దు.. అప్పుడే నిజమైన స్వాతంత్య్రం పొందినట్లు. రైతులకు ఇన్ని వేల కోట్లు.. అన్ని వేల కోట్లు ఇచ్చామని ప్రభుత్వాలు చెప్పుకుం టున్నాయి. అది గొప్పకాదు. రైతుకు అప్పు అవసరంలేకుండా చేయడమే గొప్ప. అప్పుడే రైతు ఎదిగినట్లు’ అని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. సీడ్స్మెన్ అసోసియేషన్ గురువారం నిర్వహించిన 19 వార్షిక సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం గురించి మాట్లాడుతూ ‘మాది మేం చెప్పుకుంటే సిగ్గుపోతుంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా కొత్త వం గడాలు బయటకు రావడం లేదు. అందులోనే ఉండిపోతున్నాయి’ అని విమర్శించారు. రైతు కు లాభసాటిగా ఉండే విత్తనాలను ఉత్పత్తి చే యాలని విత్తన కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. 23న మహారాష్ట్రకు పోచారం మహారాష్ట్రలో చెరకు, స్ట్రాబెర్రీ పంటల సాగును పరిశీలించేందుకు ఈ నెల 23 నుంచి రెండ్రోజులపాటు మహారాష్ట్రలో పర్యటిస్తామని మం త్రి పోచారం గురువారం విలేకరులకు చె ప్పారు. నిజామాబాద్ సహా అనేక ప్రాంతాల్లో ఎకరాకు 30 టన్నుల చెరకు పండిస్తుండగా పుణే, నాసిక్లలో 110 టన్నుల దిగుబడి వస్తుందన్నారు. మహారాష్ట్రలో సాగును అధ్యయనం చేసేందుకు 4 బస్సుల్లో రైతులను అక్కడకు తీసుకెళ్తున్నామన్నారు. అలాగే పుణే సమీపంలోని మహాబళేశ్వరం వద్ద స్ట్రాబెర్రి సాగు చేస్తున్నారని దాన్ని కూడా అధ్యయనం చేసి వస్తామన్నారు. కొత్త రుణాలిప్పించేందుకు కృషి ఖరీఫ్ సీజన్ ముగుస్తున్న నేపథ్యంలో రైతులకు కొత్త రుణాలు ఇప్పించేందుకు బ్యాంకులను ఒప్పించే యత్నం చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. తన ఆధ్వర్యంలో రుణమాఫీపై ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
డ్వాక్రాలకు బాబు టోకరా
కానరాని రుణమాఫీ రూ.లక్ష సంఘనిధి పేరిట తాజా ఉత్తర్వులు కొత్త అప్పులివ్వడానికి బ్యాంకులు వెనుకంజ ఆందోళనలో మహిళలు పాడేరు : ఎన్నడూ లేని విధంగా డ్వాక్రా సంఘాలు టీడీపీ పాలనలో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒక్కొక్క సంఘానికి రూ.లక్ష రుణమాఫీ లేదని, 2013-14 సంవత్సరానికి రుణాలు పొందిన సంఘాలకు మాత్రం రూ.లక్ష చొప్పున సంఘ నిధి పేరిట జమ చేస్తామని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో డ్వాక్రా మహిళల్లో మరింత ఆందోళన ఏర్పడుతోంది. ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తామని వెంటనే కొత్తరుణాలు కూడా పంపిణీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఆ పార్టీ నేతలంతా విస్తృత ప్రచారం చేశారు. కానీ అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబు డ్వాక్రా రుణాల రద్దుపై తాత్సారం చేస్తుండడంతో ఏజెన్సీ డ్వాక్రా మహిళల్లో ఆందోళన నెలకొంది. ఎన్నికలకు ముందే రుణమాఫీ ప్రచారం జరగడంతో డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి పొందిన రుణాలను గత ఏడాది డిసెంబరు నుంచి చెల్లించలేదు. దీంతో వడ్డీలు పెరిగిపోయాయి. తాత్సారంతో గందరగోళం ఏజెన్సీలోని11 మండలాల పరిధిలో 9,900 డ్వాక్రా సంఘాలు ఉండగా 5,200 సంఘాలకు చెందిన మహిళలు రుణబాధితుల్లో ఉన్నారు. నాలుగేళ్ల నుంచి మొండి బకాయిలు రూ. 28 కోట్లు ఉండగా 2013-14 సంవత్సరానికి రూ.19 కోట్ల బకాయిలు ఉన్నాయి. మొత్తం రూ.47 కోట్లను ప్రభుత్వం మాఫీ చేయాల్సి ఉంది. కానీ మొండి బకాయిలు రూ.28 కోట్లకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. కేవలం గత ఆర్థిక సంవత్సరంలో డ్వాక్రా సంఘాల రుణాలు పొందిన రూ.19 కోట్లకు సంబంధించి రుణమాఫీ చేయకపోగా సంఘ నిధి పేరిట వారి సంఘాలలో రూ. లక్ష జమ చేసేందుకు నిర్ణయించింది. ఈ నిబంధనలతో రుణమాఫీకి ఆటంకం ఏర్పడింది. అయితే ఐకేపీ అధికారులు సెర్ప్ సంస్థకు ఇటీవల ఒక నివేదికను సమర్పించారు. సంఘ నిధి పేరిట జమ చేసే రూ.లక్షను నాలుగేళ్ల నుంచి రుణాలు పొందిన మొత్తం 5,200 సంఘాలకు అమలు చేస్తే ప్రయోజనం ఉంటుందని, ఈ నగదును రుణ బకాయిలకు జమ చేయవచ్చని ఈ నివేదికలో పేర్కొన్నారు. అయితే ఇంతవరకు ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో డ్వాక్రా సంఘాల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం రుణమాఫీపై స్పష్టత ఇవ్వకపోవడం అధికారులను కూడా గందరగోళంలోకి నెట్టేసింది. కొత్త రుణాలకు బ్యాంకులు వెనుకంజ పాడేరు డివిజన్లో 800 కొత్త సంఘాలకు రూ.12 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేసేందుకు ఐకేపీ ఏర్పాట్లు చేసినా అన్ని బ్యాంకుల అధికారులు ముందుకు రాకపోవడంతో మహిళలు రుణాల కోసం ఆందోళన చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రుణమాఫీపై ప్రభుత్వ తాత్సారం చేయడంతో ఈ కొత్త సంఘాల మహిళలు బ్యాంకుల చుట్టు తిరుగుతున్నా అధికారులు వెనుకంజ వేస్తున్నారు. -
ఎంత రుణం ఇవ్వొచ్చో అంతకే మాఫీ
-
ఆధార్ అనుసంధానమైన రైతులకే రుణమాఫీ
ఒంగోలు టౌన్: పట్టాదారు పాస్ పుస్తకాలను ఆధార్తో అనుసంధానం చేయించుకున్న రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ వెల్లడించారు. రైతులు తమ పరిధిలోని తహశీల్దార్ కార్యాలయాల్లో ఆధార్ అనుసంధానం ప్రక్రియ త్వరితగతిన చేయించుకునేలా చూడాలన్నారు. స్థానిక సీపీవో కాన్ఫరెన్స్ హాలులో బుధవారం సాయంత్రం రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టాదారు పాస్ పుస్తకాలకు ఆధార్ అనుసంధానంలో జిల్లా వెనుకబడి ఉందని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కేవలం 50 శాతం మాత్రమే జరిగిందని, రెండు రోజుల్లో 70 శాతానికి పెంచాలని ఆదేశించారు. ఎన్నిసార్లు చెప్పించుకుంటారు: అభివృద్ధి కార్యక్రమాల అమలులో జిల్లా ముందు వరుసలో ఉన్నప్పటికీ రెవెన్యూ శాఖకు సంబంధించి వెనుకబడి ఉందని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ సేవ, ఆధార్ సీడింగ్ల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. ఎన్ని సమావేశాలు పెట్టినా, ఎన్నిసార్లు చెప్పినా తహశీల్దార్లలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే విషయాన్ని పదేపదే ఎందుకు చెప్పించుకుంటారని నిలదీశారు. ప్రభుత్వ ప్రాధాన్యతాంశంగా తీసుకున్న పనిని సకాలంలో చేయకపోతే ఇబ్బందుల్లో పడతారని కలెక్టర్ హెచ్చరించారు. డివిజనల్ అధికారులు ప్రతిరోజూ ఆధార్ సీడింగ్పై తహశీల్దార్లతో సమీక్షించాలని ఆదేశించారు. రేషన్ కార్డులతో ఆధార్ వందశాతం చేయాలి: రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానం గురువారం నాటికి వంద శాతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటి వరకు 96 శాతం అయిందని, మిగిలిన 4 శాతం కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు. ఆధార్ నంబర్ ఇవ్వడానికి సహకరించని రేషన్కార్డుదారులకు నిత్యావసర సరుకులు నిలిపివేయాలని ఆదేశించారు. మీ సేవ కేంద్రాల విషయంలో త్రిపురాంతకం, ఇంకొల్లు, యద్దనపూడి మండలాల్లో అధిక సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. కొత్తపట్నం మండలంలో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన భూములను ఇతర కులాలకు సంబంధించిన వ్యక్తులు ఆక్రమించినట్లు ఫిర్యాదులు వచ్చాయని, అలాంటివారి వివరాలను వెంటనే సబ్ డివిజనల్ పోలీసు అధికారికి అందించి నివేదిక పంపించాలని విజయకుమార్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాధర్గౌడ్, కందుకూరు సబ్ కలెక్టర్ ఏ మల్లికార్జున, ఒంగోలు ఆర్డీవో ఎంఎస్ మురళి తదితరులు పాల్గొన్నారు. -
ఎంత రుణం ఇవ్వొచ్చో అంతకే మాఫీ
బంగారం రుణాల మాఫీలో ఏపీ సర్కారు మరో మెలిక హైదరాబాద్: బంగారంపై పంట రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో షరతు విధించిం ది. మాఫీ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా రెండు రోజులకోసారి కొత్తగా ఆంక్షలు విధిస్తుండటం గమనార్హం. రాష్ట్రంలోని 13 జిల్లా ల్లో పంట రుణాలకన్నా బంగారం కుదవపెట్టి తీసుకున్న పంట రుణాలు అత్యధికంగా ఉండటంతో వీలైనంతగా ఆ రుణ మాఫీ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు మంగళవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో తాజాగా మరో నిబంధన విధించారు. ఈ నేపథ్యంలో బంగారం కుదవపెట్టి రుణం తీసుకున్న రైతులకు మాఫీ వెసులుబాటు అంతంత మా త్రంగానే దొరుకుతుందని, ప్రభుత్వంపై మాఫీ భారం తగ్గిపోతుందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నారుు. ఏ పంటకు ఎంత మేర రుణం ఇవ్వాలో (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) అనే అంశంపై బ్యాంకర్లకు స్పష్టమైన నిబంధనలున్నారుు. ఈ నిబంధనల మేరకు తీసుకున్న రుణ మెుత్తాలకే మాఫీ వర్తింపజేయనున్నారు. అంటే బంగారం కుదవ పెట్టి ఎకరం వరి పంటకు లక్ష రూపాయలు రుణం తీసుకున్నప్పటికీ.. నిబంధనల ప్రకారం ఎకరం వరి పంటకు ఎంతమేరకు రుణం ఇవ్వవచ్చో.. అంత మేరకే రుణ మాఫీ వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నమాట. ఒకవేళ ఎకరం వరి పంటకు రూ.25 వేలు మాత్రమే రుణం మంజూరు చేయాలనే నిబంధన ఉండి.. రైతు లక్ష రూపాయల రుణం తీసుకున్నాడనుకుంటే.. రూ.25 వేల రుణం మాత్రమే మాఫీ అవుతుంది. మిగతా రూ.75 వేలు రైతులే బ్యాంకులకు చెల్లించుకోవాల్సి ఉంటుం దని అధికార వర్గాలు వివరించాయి. ఇతర పంటల విషయంలోనూ ఇదే నిబంధన అమలవుతుంది. ఈ నేపథ్యంలో బంగారం కుదవపెట్టి ఎన్ని ఎకరాల్లో ఏ పంటపై రుణం తీసుకున్నారు, ఆ పంటకు ఎకరానికి ఎంత రుణం మంజూరు చేయాలి.. వివరాలను రుణమాఫీ నమూనా పత్రంలో నింపి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు సూచించింది. ఈ మేరకు నమూనా పత్రంలో భూ విస్తీర్ణం, సర్వే నంబరు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తదితర అంశాలను చేర్చారు. బ్యాంకులు ఈ నెల 25వ తేదీ వరకు వివరాలు ఇచ్చేందుకు వీలుగా గడువును పొడిగించారు. -
బాబు వంద రోజుల పాలన శూన్యం
పుంగనూరు: సీఎం చంద్రబాబునాయుడు వంద రోజుల పరిపాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదని, ఆయన ప్రమాణస్వీకారం చేసిన రోజున పెట్టిన ఐదు సంతకాలలో ఒక్కటీ అమలు కాలేదని పుంగనూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దుయ్యబట్టారు. మంగళవారం పుంగనూరులో ఆయన పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రజలతో సమావేశమయ్యారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ జిల్లాల అభివృద్ధికి చంద్రబాబు అడ్డంకిగా మారారన్నారు. సొంత జిల్లాలో ఆదరణ కోల్పోయిన బాబు రాజధానిని విజయవాడలో ఏర్పాటు చేసి, స్వార్థ ప్రయోజనాల కోసం అధికారాన్ని వినియోగించుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తానని ప్రకటి ంచి ప్రస్తుతం కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఓట్లకోసంహామీలు గుప్పించి, పదవిలోకి రాగానే వాటిని తుంగలో తొక్కి చరిత్రహీనుడిగా చంద్రబాబు మిగిలిపోయాడన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులు దాదాపుగా పూర్తికావచ్చాయని, 20 శాతం పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. అలాంటి ప్రాజెక్టుల పనులను నిలిపేయడంతో అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో రెండు లక్షల ఎకరాల భూమి బీడుగా మారుతోందన్నారు. రాయలసీమలో ఏనాడూ చంద్రబాబుకు అనుకూలంగా ఫలితాలు రాలేదని, అందుకే వివక్ష చూపుతున్నారని దుయ్యబట్టారు. విజయవాడ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే అన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారని తెలిపారు. రాజధాని ఏర్పాట్లలో రెఫరెండం చేపట్టాలని కోరారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అమలు చేయలేని హామీలను బడ్జెట్లో చూపెడుతూ నిధులు మాత్రం నామమాత్రంగా కేటాయించలేదా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 2004వ సంవత్సరానికి ముందు పరిస్థితులు మ ళ్లీ రాబోతున్నాయని తెలిపారు. రుణమాఫీ చేస్తే అభివృద్ధి ఆగిపోయినట్లేనని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించడం చూస్తుంటే వారి నుంచి ఎలాంటి సహకారమూ అందేలా లేదని అన్నారు. సీఎం చంద్రబాబు రోజుకొక ప్రకటన తో ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం మంత్రులను, ఎమ్మెల్యేలను, నేతలను ప్రజలు నిలదీసే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షమీమ్షరీఫ్, ఎంపీపీ నరసింహులు, జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్ పాల్గొన్నారు. -
తొలి విడతగా ఐదారు వేల కోట్లు
బ్యాంకర్లకు సూత్రప్రాయంగా వెల్లడించిన సీఎం కేసీఆర్ రుణ మాఫీ అమలుపై మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్గా పోచారం, సభ్యులుగా ఈటెల, హరీశ్రావు బ్యాంకులు సహకరించకుంటే రైతులకే బాండ్లు ఇచ్చే యోచన నాలుగైదు రోజుల్లో పూర్తి స్పష్టత వస్తుందన్న మంత్రులు హైదరాబాద్: రుణమాఫీ కింద రైతులకు విడతలవారీగా నిధులు సర్దుబాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కసరత్తు కూడా అందుకు అనుగుణంగానే జరుగుతోంది. ఈ పథకం అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటయ్యే ఈ కమిటీలో మంత్రులు ఈటెల రాజేం దర్, హరీశ్రావు సభ్యులుగా ఉంటారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం సచివాలయంలో బ్యాంకర్లతో సమావేశమయ్యారు. రైతులకు పూర్తిస్థాయిలో కొత్త రుణాలు ఇవ్వాలని, అలా చేస్తే బ్యాంకులకు తొలి విడతగా ఐదారు వేల కోట్లను చెలిస్తామని సీఎం స్పష్టం చేశారు. రిజర్వ్ బ్యాంకు నిబంధనల నేపథ్యంలో కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు సుముఖత వ్యక్తం చేయనట్లు తెలిసింది. దీంతో కేసీఆర్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మాది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం. ప్రజలకు మేలు చేయడానికి తప్ప వ్యతిరేకంగా ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యవహ రించం. ఎన్నికల హామీ మేరకు రైతులకు లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేస్తాం. ఈ విషయంలో బ్యాంకులు అనేక షరతులు పెడుతున్నాయి. దీనిపై రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్తో కూడా మాట్లాడాను. రుణ మాఫీకి సంబంధించి మా దగ్గర రెండు ప్రతిపాదనలు ఉన్నాయి. రుణ మాఫీ మొత్తాన్ని బ్యాంకులకు విడతలవారీగా చెల్లిస్తాం. బ్యాంకర్లు రైతులకు తక్షణమే కొత్త రుణాలు ఇవ్వాలి. అందుకు అంగీకరించకుంటే.. రైతులకు బాండ్లు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నాం. ఏ పద్ధతిలో రుణమాఫీ అమలు చేయాలన్నది తేలాల్సి ఉంది’ అని సీఎం వ్యాఖ్యానించారు. బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగ్గొట్టే కోటీశ్వరులను మాత్రం ఏమీ చేయలేరని, రైతుల రుణామాఫీకి మాత్రం ఇన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. రుణ మాఫీ కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంతో సమావేశం కావాలని బ్యాంకర్లను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కోరారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి ఢిల్లీలో ఉన్నందున హరీశ్రావుతో బుధవారం ఈ సమావేశం జరగనుంది. నాలుగైదు రోజుల్లో ఏ విధానంలో రుణమాఫీ అమలు చేయాలన్న దానిపై విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఈ సమావేశం తర్వాత మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్రావు మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ కోసం బడ్జెట్లో నిధు లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. అక్టోబర్లో మొదటి విడతగా కొంత మొత్తం నిధులు విడుదల చేస్తామని చెప్పారు. బ్యాంకర్లు తమ ప్రతిపాదనలకు అంగీకరించని పక్షంలో.. ప్రత్యామ్నాయ మార్గాల్లో రైతులకు రుణమాఫీ అమలు చేస్తామని స్పష్టం చేశారు. నాలుగైదు రోజుల్లో స్పష్టత వస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, లీడ్ బ్యాంక్ చైర్మ న్ శంతన్ముఖర్జీ, ఆంధ్రాబ్యాంకు సీఎండీ సీవీఆర్ రాజేంద్రన్, ఎస్బీఐ సీజీఎం శశికుమార్ పాల్గొన్నారు. -
‘రీషెడ్యూల్’ నిబంధనలతో శాపం
రుణమాఫీ జాబితా గందరగోళం లబోదిబోమంటున్న రైతాంగం సత్తుపల్లి : రుణమాఫీ నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.లక్ష రుణమాఫీ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మాట నీటిమూటైంది. రుణమాఫీ జాబితాల్లో అర్హులైన లబ్ధిదారుల పేర్లు లేకపోవటంతో ఆందోళన నెలకొంది. జిల్లావ్యాప్తంగా రుణమాఫీ లబ్ధిదారుల జాబితాలను సంబంధిత పంచాయతీ కార్యాలయంలోని నోటీస్బోర్డులో ప్రదర్శించారు. పలుచోట్ల అర్హులైన లబ్ధిదారుల పేర్లు లేకపోవటం రైతులను విస్మయానికి గురిచేసింది. పాస్పుస్తకం పెట్టి రుణం తీసుకున్నవారి పేర్లు కూడా జాబితాలో లేకపోవటంతో రైతులు బ్యాంకులకు పరుగులు తీశారు. అక్కడ బ్యాంకు అధికారులు చెప్పిన సమాధానంతో కంగుతినాల్సి వచ్చింది. ఇటీవల జరిగిన బ్యాంకర్లు, ఉన్నతాధికారుల సమావేశంలో రీషెడ్యూల్ రుణాలను రుణమాఫీ జాబితాలో చేర్చవద్దంటూ స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని ఓ బ్యాంకు అధికారి తెలిపారు. 01-02-2014 నుంచి 31-03-2014 వరకు జరిగిన రీషెడ్యూల్స్ మాత్రమే రుణమాఫీ జాబితాలో చేర్చాలని, జల్, నీలం, పైలిన్ తుపానులకు నష్టపోయిన వారిని రీషెడ్యూల్ జాబితాలో ఎట్టి పరిస్థితుల్లో చేర్చవద్దంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. జిల్లావ్యాప్తంగా కనీసం 20 నుంచి 30 శాతం మంది రైతులు ఈ నిబంధనలతో రుణమాఫీకి నోచుకోలేకపోతున్నారు. అగ్రికల్చరల్ టర్మ్లోన్లు.. వ్యవసాయ రుణాలను దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రాతిపదికన ఇస్తారు. వీటినే అగ్రికల్చరల్ టర్మ్లోన్లు (సీసీఏటీఎల్)గా పిలుస్తారు. బోర్లు, డ్రిప్ ఇరిగేషన్, ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్ర పరికరాలకు దీర్ఘకాలిక ప్రాతిపదికన బ్యాంకులు రుణాలు ఇస్తాయి. కనీసం ఐదు సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది. ప్రతి ఏడాది కొంతమొత్తం చెల్లించేలా ఒప్పందం చేసుకుంటారు. 2010లో జల్ తుపానుతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పటి ప్రభుత్వం బుక్ అడ్జస్టుమెంట్ పేరుతో రుణాలను రీషెడ్యూల్ చేసింది. దీంట్లో వ్యవసాయ పనిముట్లతో పాటు పంటరుణాలు కూడా ఉన్నాయి. లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల వరకు పంటరుణాలు రీషెడ్యూల్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం రీషెడ్యూల్ రుణాలను రుణమాఫీ జాబితాలో చేర్చవద్దంటూ బ్యాంకర్లను ఆదేశించడంతో అర్హులైన లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఆందోళనపథంలో.. రీషెడ్యూల్ రుణాలను రుణమాఫీ జాబితాలో చేర్చకపోవటంపై రైతాంగం ఆందోళన బాటపట్టింది. సోమవారం బ్యాంకులు, తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ రైతులు పరుగులు తీశారు. ప్రభుత్వం అర్హులను రుణమాఫీ జాబితాలో చేర్చకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగాల్సి వస్తుందని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. రుణమాఫీలో చోటులేదు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో 16-07-2010న రెండు ఎకరాల పాతిక సెంట్ల పొలం పాసుపుస్తకాన్ని తనఖా పెట్టి రూ.40వేలు రుణం తీసుకున్నాను. జల్, లై లా తుపానులతో ఆ ఏడాది పంట దెబ్బతింది. 2010లో రుణాన్ని బ్యాంకర్లు రీషెడ్యూల్ చేశారు. 2011లో వర్షాభావ పరిస్థితులతో పంట వేయలేదు. 2012లో నీలం తుపానుతో నష్టపోయాను. అప్పటి నుంచి బయట అప్పులు తీసుకొచ్చి పంట వేశాను. రూ.40వేల అప్పు, వడ్డీతో కలిపి రూ.65వేలు అయింది. పంటరుణాలు మాఫీ అవుతాయని కొండంత ఆశతో ఉంటే తీరా ఇప్పుడు రీషెడ్యూల్ జాబితాలో నాపేరు లేదు. ఏమి చేయాలో అర్థంకావట్లేదు. - సూరనేని పురుషోత్తం, రైతు, బుగ్గపాడు, సత్తుపల్లి -
ఒరిగిందేమీ లేదు 100 రోజులు పాలన
అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికల ముందు చెప్పారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన తర్వాత రుణ‘మాయ’ చేశారు. జాబు కావాలంటే.. బాబు రావాలని ఎన్నికల ముందు తెలుగు తమ్ముళ్లు డాబుసరిగా ప్రచారం చేశారు. కానీ, అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాలోని సుమారు 900 మంది ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపునకు రంగం సిద్ధంచేశారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీతాలు విడుదల చేయలేదు. పేదలకు అండగా ఉంటానని చెప్పారు. ఇందుకు విరుద్ధంగా ఆధార్ అనుసంధానం పేరుతో నిరుపేదలకు ఆసరాగా ఉన్న రేషన్కార్డులను తొలగిస్తున్నారు. ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఇప్పటికే మొదలుపెట్టిన ఇళ్లకు బిల్లులు నిలిపివేశారు. బందరుపోర్టు నిర్మాణం.. గన్నవరం ఎయిర్పోర్టు అభివృద్ధి.. ఇలా ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ ఆయన అధికారంలోకి వచ్చి వంద రోజులవుతున్నా అమలుకు నోచుకోలేదు. కనీసం ప్రతిపాదనలు కూడా సిద్ధం కాలేదు. దీంతో బాబు వంద రోజుల పాలనలో జిల్లాకు ఒరిగింది శూన్యమని ప్రజలు పెదవివిరుస్తున్నారు. రుణమాఫీ బూటకమే.. ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి రావడానికి ముఖ్యకారణమైన రుణమాఫీ ప్రహసనంగా మారింది. ఎప్పటికి రుణాలు రద్దవుతాయో తెలియని పరిస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. డ్వాక్రా సంఘాల పరిస్థితి కూడా అలాగే ఉంది. జిల్లాలో 6,29,086 మంది రైతులు రూ.9,137 కోట్ల మేర పంట రుణాలు బకాయి ఉన్నారు. చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీతో రైతులు ఎవ్వరూ రుణాలు చెల్లించలేదు. కొంతకాలం రుణాలు రీషెడ్యూల్ చేస్తామని, అనంతరం రుణమాఫీ చేస్తామని చెబుతూ వస్తున్నారు. జిల్లాలో 1,89,587 మంది రైతులు రూ.2,352 కోట్ల వివిధ రుణాలు, 2,60,737 మంది రైతులు రూ.3,276 కోట్ల పంట రుణాలు, 45,914 మంది రైతులు రూ.650 కోట్ల షార్ట్టర్మ్ రుణాలు, 1,30,534 మంది రైతులు రూ.277 కోట్ల మధ్యంతర రుణాలు, 2,314 మంది రైతులు రూ.86కోట్ల ఇతర రుణాలు తీసుకున్నారు. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం రూ.5వేల కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో జిల్లాకు చెందిన రైతులకు ఎంత మొత్తాన్ని రుణమాఫీ చేస్తారో తెలియని పరిస్థితి. రైతులకు ఒక్కో కుటుంబానికి రూ.1.50 లక్షలు, ఒక్కో డ్వాక్రా సంఘానికి లక్ష రూపాయల మేర రుణమాఫీ జరుగుతుందని చెబుతూ వస్తున్నారు. జిల్లాలో 56,808 డ్వాక్రా సంఘాలు ఉండగా, రూ.938 కోట్లుబకాయిలు ఉన్నాయి. ఒక్కో డ్వాక్రా సంఘానికి లక్ష రూపాయలు అందజేస్తామని చెబుతూ ఈ నగదు రివాల్వింగ్ ఫండ్గానే జమ అవుతుందని చెప్పటం గమనార్హం. ఖరీఫ్.. ఉఫ్.. జిల్లాలో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతోంది. జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగా, సెప్టెంబరు వరకు కాలువలకు సాగునీరు విడుదల చేయలేదు. ఎగువన సాగునీటి ప్రాజెక్టులు నిండినా ముందుచూపులేని ప్రభుత్వం కృష్ణాడెల్టా రైతులకు సాగునీటిని విడుదల చేయటంలో తీవ్ర జాప్యం చేసింది. కాలువ శివారున ఉన్న కోడూరు, నాగాయలంక, మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి తదితర మండలాల్లో సెప్టెంబరులోనూ నారుమడులు పోసుకునే పరిస్థితిని తీసుకొచ్చారు. సెప్టెంబరులో వరినాట్లు పూర్తిచేస్తే పంటచేతికి వచ్చే నాటికి వాతావరణ పరిస్థితులు అనుకూలించక దిగుబడులు తగ్గుతాని, రెండో పంట వేసుకునేందుకు సమయం చాలదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చినా ఆ దిశగా ప్రయత్నాలు జరగటం లేదు. 2002, 2003, 2004 వరుసగా సాగునీటి కొరతను ఎదుర్కొన్నామని, మళ్లీ అదే పరిస్థితి తలెత్తుతోందని రైతులు ఆందోళనలో ఉన్నారు. నత్తనడకన డెల్టా ఆధునికీకరణ కృష్ణాడెల్టాకు సాగునీరు సరఫరా చేసేందుకు 150 సంవత్సరాల క్రితం బ్రిటీష్ పాలకులు తవ్విన కాలువల ద్వారానే నేటికీ సాగునీరు సరఫరా జరుగుతోంది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనులను రూ.4,573 కోట్లతో ప్రారంభించారు. ఈ పనులను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందిస్తే వరికోతలు పూర్తయిన తరువాత పనులు ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పనులు ప్రారంభించాలి. రేషన్.. పరేషాన్.. జిల్లాలో 11,23,944 తెలుపురంగు రేషన్కార్డులు ఉన్నాయి. వీటిలో 37,10,501 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటివరకు 31,37,710 మందికి ఆధార్ కార్డుల సీడింగ్ పూర్తిచేసి 5,36,102మందిని అనర్హులుగా గుర్తించారు. ఈనెలాఖరుకు ఆధార్ సీడింగ్ ప్రక్రియ పూర్తయితే మరికొంతమందిని అనర్హులుగా గుర్తించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఖర్చు తగ్గించుకునేందుకు ఆధార్ సీడింగ్ పేరుతో రేషన్లో కోత విధిస్తోందనే వాదన ప్రజల నుంచి వినిపిస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బియ్యం, పంచదార, కిరోసిన్ను నామమాత్రంగా ఇస్తున్నారు. మూడు నెలల్లో పోర్టు పనయ్యేనా.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు నెలల్లో పోర్టు పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో బందరు ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పటికే వందరోజుల పాలన పూర్తయ్యింది. ఈ వ్యవధిలో బందరు పోర్టు నిర్మాణానికి కీలకమైన భూసేకరణ ప్రక్రియపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పోర్టు నిర్మాణానికి 5,324 ఎకరాలు అవసరమని గతంలోనే జీవో నంబరు 11 ద్వారా నిర్ధారించారు. రెండువేల ఎకరాలైనా కేటాయిస్తే పనులు ప్రారంభిస్తామని పోర్టు పనులు దక్కించుకున్న నవయుగ సంస్థ ప్రతినిధులు చెబుతుండగా, ఇంతవరకు ఆ సంస్థతో ప్రభుత్వం ఎలాంటి సంప్రదింపులు జరపకపోవటం గమనించదగ్గ అంశం. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆరు నెలల వ్యవధిలో మూడు నెలలు ఇప్పటికే పూర్తయ్యాయి. మరో మూడు నెలల వ్యవధిలోలప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా, సాగదీత ధోరణితో వ్యవహరిస్తుందా.. అన్నది వేచి చూడాల్సిందే. విల‘పింఛన్’లు.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడు నెలల్లో ఒకటో తేదీన పింఛన్లు ఇచ్చిన దాఖలాలు లేవు. అక్టోబరు 2 నుంచి నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామని ప్రకటించారు. వికలాంగులకు రూ.1,500కు పెంచుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే, 80 శాతం కన్నా మించి వైకల్యం ఉంటేనే నెలకు రూ.1,500 పెన్షన్కు అర్హులని మెలిక పెట్టారు. దీంతో ఎంతమంది వికలాంగులకు రూ.1,500 ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. పింఛనుదారులకు ఆధార్ సీడింగ్ పేరుతో కొన్ని పేర్లను తొలగిస్తున్నారు. అక్టోబరు నుంచి ఎంతమందికి పింఛన్లు నిలిచిపోతాయనే అంశం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో 3,32,836 మందికి వివిధ రకాల పింఛన్లు అందుతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ ఏమైంది..? జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా 8,609 మంది విద్యార్థులకు రూ.2.13 కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా 4,564 మంది విద్యార్థులకు రూ.11.34 కోట్లు, ఈబీసీ విద్యార్థులకు 6,559 మందికి రూ.19.42 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 31,029 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ల రూపంలో రూ.46.07 కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా రూ.37.70 కోట్లు గత ఏడాది ఖర్చు చేశారు. ఈ ఏడాది స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల జరుగుతుందా, లేదా అన్న అంశంపై అనేక అనుమానాలు ఉన్నాయి. వ్యవసాయానికి కరెంట్ షాక్ జిల్లావ్యాప్తంగా దాదాపు 70వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్ సరఫరాను సక్రమంగా చేస్తామని హామీ ఇచ్చినా అమలు జరగట్లేదు. 5 గంటలు కూడా వ్యవసాయ విద్యుత్ సరఫరా జరగట్లేదు. దీంతో అర్థరాత్రి, అపరాత్రి విద్యుత్ సరఫరా చేస్తుండటంతో జిల్లావ్యాప్తంగా 2.50 లక్షల ఎకరాలను విద్యుత్ మోటార్ల ద్వారా సాగు చేస్తూ రైతులు ఇక్కట్ల పాలవుతున్నారు. ఇటీవల వరకు గృహ విద్యుత్తో పాటు వ్యవసాయానికీ నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించిన పాలకులు ఈ హామీ నుంచి వ్యవసాయ విద్యుత్ను మినహాయించినట్లు ప్రకటించటం గమనార్హం. -
ఏం సాధించారని వంద రోజుల పండుగ?
ధ్వజమెత్తిన అంబటి రాంబాబు చంద్రబాబుది పచ్చి అబద్ధాల పాలన మనీ, మర్డర్స్, మ్యానిపులేషన్, మీడియా మేనేజ్మెంట్... ఇదే బాబు ఫిలాసఫీ తొలిరోజు చేసిన ఐదు సంతకాల్లో ఒక్కటైనా అమలైందా? రుణమాఫీ అమలు కాకుండానే అబద్ధాలెందుకు? వందరోజుల్లో దౌర్భాగ్యపు పాలన అందించారు హైదరాబాద్: రైతుల రుణమాఫీ మొదలు, ప్రజలకిచ్చిన అన్ని వాగ్దానాలనూ గాలికొదిలేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏం సాధించారని వంద రోజులు పండు గు జరుపుకుంటున్నారని వైఎస్సార్సీపీ రాజకీయవ్యవహారాల మండలి సభ్యుడు అంబటి రాంబాబు ప్రశ్నించారు. తాము అడుగుతున్న ఈ ప్రశ్నకు సమాధానం తమకు చెప్పకపోయినా రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాల యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంగళవారంతో చంద్రబాబు వంద రోజు ల పాలన పూర్తవుతోందని టీడీపీ వాళ్లు చెబుతున్నారని, కానీ తమ లెక్క ప్రకారం చంద్రబాబు ఎన్నికల్లో గెలిచి నాలుగు నెలలు పూర్తయిందని, ఆయనే ఆలస్యంగా ప్రమాణ స్వీకారం చేశారని చెప్పారు. సినిమా హిట్టయితే వంద రోజుల పండుగ జరుపుకోవడం సినిమా రంగంలో ఆనవాయితీ అని కానీ రాష్ట్రంలో చంద్రబాబు పాల న ‘ఫట్’ అయినా కూడా బాబు పాలన బ్రహ్మాం డం అని హోరెత్తిస్తుండటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రమాణస్వీకారానికి ముందే పోలవరం సాధించినట్లు ప్రకటనల్లో పేర్కొనడాన్ని అంబటి ప్రశ్నిస్తూ ‘పోలవరాన్ని చంద్రబాబు సాధించారా! హవ్వ... పోలవరం ఎవరు రూపకల్పన చేశారో... ఎవరు సాధించారో, దాని కోసం ఎవరు తాపత్రయపడ్డారో అనేది జగమెరిగిన సత్యం’. బాబు పాలన మొత్తం ‘మనీ’ మర్డర్లు, మేనిపులేషన్, మీడియా మేనేజ్మెంట్ చేయడమే ఫిలాసఫీగా మారిందని దుయ్యబట్టారు. ఇంకా ఆయనేమన్నారంటే... ►చంద్రబాబు ఈ వంద రోజుల్లో ఒక్క వాగ్దా నం కూడా నెరవేర్చకుండా అబద్ధాల పాలన సాగిస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టోలో 200 వాగ్దానాలు, పాదయాత్ర సందర్భంగా 300 మొత్తం 500 వాగ్దానాలు చేశారని వీటిలో ఏ ఒక్కటీ ఆయన నెరవేర్చలేకపోయారు. ►తొలి రోజే ఐదు కీలకమైన అంశాలపై చంద్రబాబు సంతకాలు చేశారని చెప్పుకుంటున్నారని, మరి సంతకాల ప్రకారం వాగ్దానాలు అమలు జరిగాయా? తాను అధికారంలోకి వస్తే రైతులు రుణాలు కట్టక్కర లేదన్నారు, మరి ఇపుడు రుణాలు రద్దయ్యాయా? ఆర్బీఐ ఒప్పుకోలేదని రుణమాఫీ ఎగ్గొట్టింది కాక పచ్చి అబద్ధాలు ఎందుకు చెబుతున్నారు? అని దుయ్యాబట్టారు. ►బాబు వచ్చాక విద్యుత్ వెలుగులు వచ్చాయ ని మరో అబద్ధం చెప్పారు. ఆర్టీపీపీ (220 మెగావాట్లు)తో సహా పలు థర్మల్ కేంద్రాలు బొగ్గు కొరతవల్ల మూత పడుతుంటే రాష్ట్రంలో విద్యుత్ వెలుగులున్నాయని చెప్పుకుంటారా? రాష్ట్రంలో 24 గంటల కరెంటు సరఫరా, 365 రోజుల పాటు కరెంటు ఇవ్వడం అనేది మోడీ ప్రభుత్వ నిర్ణయం వల్ల సాధ్యమైతే దానిని కూడా తన ఘనతగా బాబు చెప్పుకుంటున్నారు. ►పెంచుతానన్న వృద్ధాప్య పెన్షన్లు ఇప్పటికీ పంపిణీ చేయలేదు. ప్రభుత్వోద్యోగులకు మాత్ర మే 58 నుంచి 60 ఏళ్లకు వయో పరిమితి పెంపు వర్తింపజేసి విద్యుత్, ఆర్టీసీ వంటి 44 ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను గాలికి వదిలేశారు. ►బెల్ట్ షాపుల రద్దు పేరుతో చేసిన సంతకం అమలు కాలేదు. రాష్ట్రంలో నిజంగా బెల్ట్ షాపులు రద్దు అయితే మద్యం అమ్మకాలు ఇంకా ఎలా పెరుగుతాయి? బడ్జెట్లో ప్రణాళికా వ్యయం 35 శాతం వరకూ ఉండగా దానిని బాగా తగ్గించారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు తీరని ద్రోహం చేసినట్లే. ►రాజధాని ఎంపిక కోసం కేంద్ర కమిటీ పర్యటిస్తూ ఉండగానే ఫలానా చోట రాజధాని అని ప్రకటించేశారు. విజయవాడను రాజధానిగా ఎంపిక చేయడం మంచి నిర్ణయమే అయినప్పటికీ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలతో చర్చిం చి వారిని సంతృప్తిపర్చకుండా అహంకారంతో బాబు ప్రకటన చేయడాన్ని ప్రశ్నిస్తున్నాం. ►రాజధాని పెట్టే చోట చంద్రబాబు తాబేదార్లు, సుజనా చౌదరి, దేవినేని ఉమా మహేశ్వరరావు, సి.ఎం.రమేష్ పెద్ద ఎత్తున భూములు కొనేశారు. భవిష్యత్లో వారి పేర్లతోనే నారా నగర్, దేవినేని నగర్, సుజనా నగర్ వంటివి వెలియడానికి దోహదం చేస్తున్నారు. ►వంద రోజుల పాలనలో స్థానిక సంస్థల్లో నయాన, భయాన ఎంపీటీసీ, జడ్పీటీసీలను లొంగదీసుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. సాక్షాత్తూ స్పీకర్ నియోజకవర్గంలోనే దౌర్జన్యం చేసి ఎంపీటీసీలను లోబర్చుకున్నారు. అనేక చోట్ల వైఎస్సార్సీపీ కార్యకర్తలను, నాయకులను దారుణంగా హత్య చేశారు. -
రుణమాఫీపైనారీ భేరి
జిల్లా వ్యాప్తంగా మహిళల ఆందోళనలు ఎంపీడీఓ కార్యాలయాల ముట్టడి రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా మహిళలు పోరుబాట పట్టారు. ఐద్వా ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించి ఎంపీడీఓ కార్యాలయాలు ముట్టడించారు. మాఫీ చేసిన వెంటనే తిరిగి సబ్సిడీపై రుణాలివ్వాలని నినదించారు. దేవరాపల్లి: డ్వాక్రా రుణాల పూర్తి మాఫీ కోరుతూ మహిళలు కదం తొక్కారు. రుణమాఫీని అన్ని గ్రూపులకూ వర్తింపజేయాలని, అప్పు తీర్చిన వారికి సబ్సిడీ రుణాలివ్వాలని డిమాండ్ చేశారు. దేవరాపల్లిలో రైవాడ అతిథిగృహం నుంచి ఎంపీడీఓ కార్యాలయానికి ర్యాలీగా చేరుకొని ముట్టడించారు. అక్కడ ప్రజావాణి కార్యక్రమాన్ని స్తంభింపజేశారు. డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ హామీని ఎప్పుడు అమలు చేస్తారని అధికారులను ప్రశ్నించారు. రెండు గంటల పాటు కార్యాలయాన్ని ముట్టడించడంతో ఎస్ఐ వి. లక్ష్మణరావు సిబ్బందితో వచ్చి ఆందోళన విరమించడానికి ప్రయత్నించారు. మహిళలు పోలీసులపై తిరుగుబడడంతో వెనుదిరిగారు. అధికారులు, బ్యాంకు అధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకు కదిలేది లేదని ప్రజావాణి సమావేశ మంది రంలో బైఠాయించారు. దీంతో వివిధ బ్యాంకుల అధికారులు వచ్చి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే రుణాలను మాఫీ చేస్తామని చెప్పడంతో ఆందోళనను విరమించారు. అనంతరం ఎంపీడీఓ ఆర్.పూర్ణిమాదేవి, తహశీల్దార్ వై.ఎస్.వి.వి.ప్రసాదరావులకు వినతిపత్రాలిచ్చారు. అంతకుముందు రైవాడ అతిథిగృహం వద్ద జరిగిన సమావేశంలో డ్వాక్రా రుణమాఫీ జరిగే వరకు పోరాటం సాగిద్దామని ప్రతిన పూనారు. వీరికి సీఐటీయూ, ఐకెపీ యానిమేటర్లు, ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. -
చంద్రబాబు హామీ..అమాస నాటి వెన్నెలే
‘చేసిన బాసను విస్మరించిన మోసకారి చంద్రబాబు’ అని డ్వాక్రా మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు. తమ సంక్షేమం కోసం తపిస్తున్నట్టు.. ఎన్నికల ముందు ఆయన ఆడిందంతా నాటకమని నిందిస్తున్నారు. అధికారం దక్కాక.. ఎప్పటి లాగే నిజరూపం చూపారని, నయవంచనకు పాల్పడ్డారని నిప్పులు కక్కుతున్నారు. రుణమాఫీ విషయంలో చేసిన దగాయే అందుకు సాక్ష్యమని ఎలుగెత్తుతున్నారు. బేషరతుగా రుణమాఫీ చేయాలని నినదిస్తున్నారు. సాక్షి, కాకినాడ : రుణాలను మాఫీ చేసి, రైతులు, డ్వాక్రా మహిళల బతుకుల్లో కొత్తవెలుగు నింపుతానన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి వాగ్దానం.. ‘అమాస నాటి వెన్నెల’ బాపతేనని ఆ ఇరువర్గాలూ మండిపడుతున్నాయి. ఆయన గద్దెనెక్కి వంద రోజులు దాటిపోయినా ఏ రుణాల మాఫీకి సంబంధించీ ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోగా.. అమలుపై రోజురోజుకూ అయోమయం ముసురుకుంటోంది. బేషరతుగా రుణమాఫీ అమలు చేసి తీరాలంటూ ఒకపక్క రైతులు, మరొక పక్క డ్వాక్రా మహిళలు ఉద్యమిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి వందరోజులైన సందర్భంగా సోమవారం డ్వాక్రా మహిళలు జిల్లావ్యాప్తంగా పలుచోట్ల రోడ్డెక్కారు. మాట తప్పిన బాబుపై భగ్గుమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో జిల్లాలో 79,086 డ్వాక్రా సంఘాలకు ఉన్న రూ.1445 కోట్ల రుణాలు మాఫీ అవుతాయని 9.50 లక్షల మంది మహిళలు కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూశారు. అయితే ఆయన తొలిసంతకం నాటకంగా, రుణమాఫీ బూటకంగా మారిపోవడంతో వీరంతా రుణగ్రస్తులుగా మిగిలారు. కనీసం ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష మ్యాచింగ్ గ్రాంట్తోనైనా ఊరట చెందవచ్చని ఆశిస్తే.. ఆ మొత్తం ఎప్పుడు తమ ఖాతాల్లో జమవుతుందో చెప్పే దిక్కే లేకుండా పోయింది. దీంతో వడ్డీరాయితీ కోల్పోవడంతో పాటు పేరుకు పోయిన రుణబకాయిల్ని 14 శాతం వడ్డీతో చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గతనెల రోజులుగా అడపా దడపా ఆందోళనలు చేస్తున్న మహిళలు.. బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో సోమవారం వేలాదిమంది ఆందోళనబాట పట్టారు. బేషరతుగా రుణమాఫీ చేయాలని నినదించారు.ముట్టడులు, బైఠాయింపులు, ర్యాలీలు అమలాపురంలో వందలాది మంది డ్వాక్రా మహిళలు ఐద్వా జిల్లా అధ్యక్షురాలు రమణి ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలో ఆవరణలోకి చొరబడి పోర్టికో వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచార ని వాపోయారు. కాగా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వందలాదిమంది సీఐటీయూ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు రంపచోడవరంలో ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. సుమారు గంటపాటు బైఠాయించి ధర్నా చేసిన అనంతరం ఐటీడీఏ పీఓ గంధం చంద్రుడుకు వినతిపత్రం సమర్పించారు.రాజవొమ్మంగిలో స్థానిక డ్వాక్రా సంఘాల మహిళలు తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీ ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కిర్లంపూడిలో డ్వాక్రా మహిళలు ప్ర దాన రహదారిపై బైఠాయించారు. కరప ప్రధాన రహదారిపై డ్వాక్రా మహిళలు బైఠాయించి రుణమాఫీ అమలు చేయాలని నినదించారు. బాబు వాగ్దానా న్ని వందరోజులైనా అమలు చేయకపోవడంపై మండిపడ్డారు. గంటపాటు జరి గిన ఈ ఆందోళన వల్ల ట్రాఫిక్ స్తంభించింది. బేషరతుగా రుణ మాఫీ చేయాలన్న డిమాండ్తో పదిగ్రామాల నుంచి వచ్చిన వందలాదిమంది మహిళలు కొత్తపేట లో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వారికి మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. ఆత్రేయపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన మహిళలు తహశీల్దార్ సత్యవతికి వినతిపత్రం సమర్పించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట బైఠాయించి మేనేజర్ కోటేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. -
నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన బాబు
అమలాపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని బూ టకపు హామీ ఇచ్చి నమ్మించి.. నట్టేట ముంచారంటూ మహిళలు మండిపడ్డారు. అమలాపురం ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఐద్వా ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనకు కోనసీమవ్యాప్తంగా డ్వాక్రా మహిళలు తరలివచ్చారు. తొలుత ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇన్చార్జ్ ఆర్డీఓ కుమార్ తమ నిరసనపై కనీసం స్పందించడంలేదంటూ మహిళలు ఎదురుగా ఎన్టీఆర్ మార్గ్లో బైఠాయించి రాస్తారోకో చేశారు. ఒక దశలో ఆర్డీఓ కార్యాలయంలోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. చివరకు ఇన్చార్జ్ ఆర్డీఓ వచ్చి మహిళల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సీహెచ్.రమణి మాట్లాడుతూ రుణమాఫీ హామీతో సక్రమంగా కార్యకలాపాలు నడిచే డ్వాక్రా గ్రూపులను ఇబ్బందులపాలుచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మాఫీ హామీతో రుణాలు చెల్లించకుండా ఉండిపోయిన మహిళలకు ఇప్పుడు వడ్డీలు నడ్డివిరుస్తున్నాయని మండిపడ్డారు. రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం ఒక పక్క చెబుతూనే అస్పష్టమైన జీఓ ఇవ్వడం వల్ల బ్యాంకులు అప్పులకు వడ్డీలు కట్టమని ఒత్తిడి చేస్తున్నాయని వాపోయారు. నిర్ధిష్ట జీఓ వచ్చే వరకు ఐద్వా ఇలా పోరాటాలు చేస్తూనే ఉంటుందని హెచ్చరించారు. ఈనెల 26 నుంచి విజయవాడలో మూడు రోజులపాటు జరిగే ఐద్వా రాష్ట్ర మహాసభలో ప్రధానంగా చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు కె.రాఘవమ్మ మాట్లాడుతూ డ్వాక్రా రుణాల బకాయిలపై వడ్డీలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసం తప్పుడు హామీలు ఇచ్చిన ప్రభుత్వానికి బుద్ధిచెప్పేలా మహిళలంతా ఐక్యంగా ఉండి పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఐద్వా అమలాపురం పట్టణ కార్యదర్శి టీఎన్ వరలక్ష్మి, మండల అధ్యక్షురాలు కె.వెంకటలక్ష్మి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.రాజశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు మహిళల నిరసనకు మద్దతు తెలిపారు. ఐద్వా నాయకురాళ్లు జి.పద్మ, కె.బీబీకుమారి, డి.మీనాక్షీదేవి, జి.కుమారి తదితరులు పాల్గొన్నారు. -
100 దినాలు..1000 దిగుళ్లు
సాక్షి, కాకినాడ : అధికారంలోకి రావడమే లక్ష్యంగా చంద్రబాబు నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పారని, ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించారని ప్రజలు నిరసిస్తున్నారు. పగ్గాలు చేపట్టగానే మీ కష్టాలన్నీ తీరుస్తానంటూ నమ్మబలికి, పబ్బం గడిచాక మరిన్ని కష్టాల్లోకి నెట్టారని నిట్టూరుస్తున్నారు. రుణమాఫీపై ఆశలు పెంచుకున్న రైతులు, డ్వాక్రా మహిళలైతే.. బాబుపై కారాలుమిరియాలు నూరుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సోమవారంతో వందరోజులు పూర్తయ్యాయి. ఈ నూరురోజుల్లోనే ఆయన నిజస్వరూపం విశ్వరూపంలో వ్యక్తమైందని వివిధ వర్గాలు ఆక్రోశిస్తున్నాయి. ‘పెనం మీంచి పొయ్యి లోకి దూకినట్టు’ ఈ సర్కారును ఎందుకు ఎన్నుకున్నామా అని పదే పదే దిగులు పడుతున్నాయి. జిల్లాలో రూ.8,480 కోట్ల వరకు రుణాలు మాఫీ అవుతాయని నాలుగున్నర లక్షల మంది రైతులు ఆశించగా, రుణమాఫీని లక్షన్నరకే పరిమితం చేసి చంద్రబాబు తొలిదెబ్బ కొట్టారు. పోనీ, అలాగైనా రూ.3500 కోట్లమేర రుణాలు మాఫీ అవుతాయనుకున్నా.. ఇంతవరకూ ఒక్క రైతుకైనా, ఒక్క రూపాయైనా మాఫీ కాలేదు. ఇక జిల్లాలో 79,086 డ్వాక్రా సంఘాలకున్న రూ.1445 కోట్ల రుణాలు మాఫీ అవుతాయని ఆశించిన 9.50 లక్షల మంది మహిళలనూ చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా పరిహసించారు. మాఫీ కాదు..రూ.లక్ష మ్యాచింగ్ గ్రాంట్ మాత్రమే ఇస్తామని హతాశుల్ని చేశారు. కనీసం ఆ మొత్తమైనా ఎప్పుడు జమవుతుందో తెలియక వారంతా ఆందోళన బాటపట్టారు. జాడలేని తొమ్మిది గంటల విద్యుత్ అధికారంలోకి రాగానే రైతులకు తొమ్మిది గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ను అందిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ ఆచరణకు నోచుకోలేదు. జిల్లాలో 34,570 ఉచిత విద్యుత్ కనెక్షన్లున్నాయి. తొమ్మిది గంటల స్థానంలో ఏడుగంటలంటూ మాట మార్చిన బాబు అక్టోబర్ 2 నుంచి సరఫరా చేస్తామంటూ వాయిదా వేశారు. ప్రస్తుతం ఏడు గంటలు కాదు కదా కనీసం నాలుగు గంటలు కూడా ఉచిత విద్యుత్ అందించడం లేదు. ‘సుజల స్రవంతి’కి సొమ్ములు కరువు ప్రతి కుటుంబానికీ రూ.2 కే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తానని ఇచ్చిన హామీ కూడా ఇంకా అమలుకు నోచుకోలేదు. అక్టోబర్ 2 నుంచే ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’ పేరిట అమలుచేయ తలపెట్టిన ఈ పథకానికి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ‘సొమ్మొకడిది..సోకొకడిది’ అన్నచందంగా కార్పొరేట్ సంస్థలు, దాతల సహకారంతో ఈ పథకాన్ని అమలు చేయాలని చూస్తోంది. ఇంటికో ఉద్యోగం కాదు.. ఉద్యోగులే ఇంటికి అధికారంలోకి రాగానే ఇంటికోఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. దాని మాటెలా ఉన్నా ఉద్యోగాల్ని ఊడబీకే ఉద్యమం చేపట్టినట్టున్నారు. జిల్లాలో 10 వేలకుపైగా ఫీల్డ్ అసిస్టెంట్లను, వెయ్యిమందికి పైగా ఆదర్శ రైతులను, ఏడొందలమందికి పైగా గృహ నిర్మాణశాఖ అవుట్సోర్సింగ్ సిబ్బంది కొలువులను రద్దు చేసి, ఇంటికి సాగనంపారు. ఇక అర్హులైన నిరుద్యోగులకు రూ.2 వేల భృతి ఇస్తామన్న హామీ అటకెక్కింది. సర్వే పేరుతో పేదల గూటికి చేటు.. అధికారంలోకి రాగానే ప్రతి నిరుపేదకు లక్షన్నరతో, సెంటున్నర భూమిలో ఇల్లు కట్టి ఇంచి ఇస్తామని బాబు హామీ ఇచ్చారు. పగ్గాలు చేపట్టి మూడు నెలలైనా ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త ఇల్లు నిర్మించిన దాఖలా లేదు. పైగా ఇందిరమ్మ లబ్ధిదారులను లక్ష్యంగా పెట్టుకుని జిల్లాలో 10,448 ఇళ్లను రద్దు చేసేందుకు సర్వే చేయిస్తున్నారు. ఆధార లంకెతో పింఛన్లకు కోత.. వృద్ధులు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 చొప్పున పింఛన్లు పెంచుతామన్న బాబు ఆ హామీ అమలకు వాయిదా మంత్రం జపిస్తున్నారు. పగ్గాలు చేపట్టిన తర్వాత కొత్తగా ఒక్క పింఛన్ కూడా మంజూరు చేయని ఆయన సర్కార్ ఉన్న పింఛన్లకు ఆధార్ లంకె పెట్టి, కోత పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకపోయినా.. ఎన్నికల ముందు మాదిరిగానే బాబు తన మాయ మాటలతో ప్రజలను ఇంకా బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. స్మార్ట్సిటీలు, ఐటీ హబ్, పెట్రో కారి డార్లంటూ మాటలను కోటలు దాటిస్తున్నారు. నూరురోజుల ఏలుబడిలో..ఎన్నికల హామీలను అణుమాత్రం అమలు చేయని చంద్రబాబు ఇప్పటికీ అరచేతిలో వైకుంఠం చూపే తన గారడీని నమ్ముతారనుకోవడం భ్రమేనని జనం నిరసిస్తున్నారు. ఇకనైనా ‘కోతలు’ మాని, ఎన్నికల హామీల్ని చేతల్లో చూపాలని కోరుతున్నారు. -
రుణమాఫీపై రెండు ప్రభుత్వాల దొంగాట
వేలేరుపాడు, న్యూస్లైన్: రైతుల రుణమాఫీపై ఆంధ్రా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు దొంగాట ఆడుతున్నాయని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఆదివారం పోలవరం ముంపు ప్రాంతాలైన వేలేరుపాడు, కుక్కునూరు, కూనవరం, వీఆర్పురం, భద్రాచలం మండలాల్లో ఆయన పర్యటించారు. ఆయన వెంట అశ్వారావుపేట, పినపాక ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు కూడా ఉన్నారు. వేలేరుపాడు మండలంలోని రేపాకగొమ్ము, రుద్రమకోట గ్రామాల్లో పర్యటించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రుద్రమకోట వద్ద లాంచీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొంగులేటి మాట్లాడారు. ప్రభుత్వాలు ఏర్పడి వందరోజులవుతున్నా రుణమాఫీపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదన్నారు. తెలంగాణా రాష్ట్రంలో లక్ష వరకు మాఫీ అన్నారు...ఆంధ్రాలో లక్షన్నర అంటున్నారు...కానీ మాఫీ చేయడం లేదు...ఈ రెండు ప్రభుత్వాల తీరుతెన్నులు రైతులకు నష్టం తెచ్చిపెట్టేలా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రాల విభజన కాకముందు రైతులు ఆ ప్రాంత బ్యాంకుల్లో బంగారం పై వ్యవసాయ రుణాలు పొందారని, విభన జరిగాక బ్యాంకులు తెలంగాణలోకి వెళ్ళాయని, ఖమ్మం జిల్లాలో రుణాలు పొందిన రైతుల ప్రాంతమంతా పోలవరం ముంపు పేరుతో ఆంధ్రాలోకి కలిపారని, వీరందరికీ తెలంగాణ ప్రభుత్వమే మాఫీ చేయాలని డిమాండ్ చేసారు. ఇప్పటికైనా రుణమాఫీ విధివిధానాల పై స్పష్టత ఇచ్చి, రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ముంపు మండలాల వాసులకు ఎల్లవేళలా అండగా ఉంటా.... ‘మీరంతా ఓట్లువేసి నన్ను గెలిపించారు. మీకు ఎల్లవేళలా అండగా ఉంటా...ఆంధ్రలో కలిపినా మీరంతా తెలంగాణ బిడ్డలు...ముంపు ప్రాంతం నా సొంత కుటుంబం లాంటిది..ఏడు మండలాల ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటాను’ అని శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. గత ఏడాది వచ్చిన వరదలు, తుపానులకు రైతులు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం నేటివరకు పంటనష్టపరిహారం అందించకపోవడం దారుణ మన్నారు. ఇటీవల వచ్చిన గోదావరి వరదలకు నష్టపోయిన రైతులకు పత్తి, మిర్చి పంటలకు ఎకరాకు 30 వేలు, వరికి 25 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రైతుసమస్యలపై గవర్నర్ నర్సింహన్ను కలవనున్నట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముంపు ప్రాంతంలో రైతులకు మంచి ప్యాకేజీ అందేలా గవర్నర్కు నివేదిస్తామని పేర్కొన్నారు. ఎంపీ వెంట రేపాకగొమ్ము సర్పంచ్ కారం వెంకటరమణ, వేలేరుపాడు మండల పార్టీ కన్వీనర్ కేసగాని శ్రీనివాసగౌడ్, కామినేని వెంకటేశ్వర్లు, సత్తుపల్లి నాయకులు మట్టా దయానంద్ తదితరులు ఉన్నారు. -
సగం మందికే రుణమాఫి
► ఉద్యానవన రైతులు, మత్స్య, పౌల్ట్రీ, డెయిరీ, ఎరువుల లోన్లకు మాఫీ వర్తించదట ►పడమటి ప్రాంతాల్లో ఉద్యానవన పంటలే అధికం ►ప్రభుత్వ నిబంధనలతో లబోదిబోమంటున్న అన్నదాతలు పలమనేరు: చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ చట్రంలో ఇరుక్కుని రైతులు గిలగిలా కొట్టుకుంటున్నారు. ప్రభుత్వం రోజుకో జీవో విడుదల చేస్తూ రుణమాఫీలో షరతుల పేరిట మాఫీ భారాన్ని తగ్గించుకునే పనిలో పడింది. ఫలితంగా అర్హులైన రైతులు సైతం రుణమాఫీ పొందలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఉద్యానవన రైతులకు మాఫీ వర్తించదని నిబంధనలు చెబుతున్నాయి. తద్వారా తాము ఏమి పాపం చేశామంటూ ఆయూ పంటలు సాగుచేసిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉద్యానవన పంటలే అధికం పలమనేరు, కుప్పం, పుంగనూరు, మదనపల్లె ప్రాంతాల్లో ఉద్యానవన పంటల సాగు ఎక్కువగా ఉంది. ముఖ్యంగా టమాట ఎక్కువగా సాగవుతోంది. పలమనేరు, కుప్పం ప్రాంతాల్లో మాత్రం అన్ని కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. ఇక 20 శాతం వరకు రైతులు మామిడి తోటలు పెంచుతున్నారు. వీరందరూ హార్టికల్చర్ కిందకే వస్తారు. ఈ ప్రాంతంలో మత్స్య కార సహకార సంఘాలు సైతం 80కి పైగానే ఉన్నాయి. పలమనేరు, గంగవరం మండలాల్లో జిల్లాలోనే అధికంగా కోళ్ల రైతులున్నారు. మరోవైపు పాడిఆవుల పెంపకం ద్వారా జీవనోపాధి పొందే రైతులు ఇక్కడ 50 శాతం మంది ఉన్నారు. వీరందరూ వారి అవసరాల కోసం రుణాలు తీసుకున్నారు. వీరందరికీ రుణమాఫీ వర్తించదట టమాట సాగుచేసే రైతులు పంట రుణాలు పొందారు. మరికొందరు 10(1), అడంగల్లో టమాట సాగును చూపెట్టి బంగారు రుణాలు తీసుకున్నారు. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో పది రకాల కూరగాయల పంటల సాగు కోసం రైతులు వివిధ బ్యాం కుల్లో రుణాలు తీసుకున్నారు. పాడి రైతులు పలు బ్యాంకుల్లో మినీ డెయిరీ పేరిట(నాలుగు పాడి ఆవుల కొనుగోలుకు రుణం పొందవచ్చు)రుణాలు పొందారు. మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలోనూ సహకార సంఘాల్లో రు ణాలు తీసుకున్నారు. మరికొందరు సంబంధిత సింగిల్విండోల్లో ఎరువుల కొనుగోలు కోసం రుణాలు తీసుకున్నారు. జిల్లా మొత్తం మీద 8.7 లక్షల మంది రైతులు రూ.11,180.25 కోట్ల పంట రుణాలు పొందారు. ఒక్క మదనపల్లె డివిజన్లోనే ఉద్యానవన పంటల సాగు కోసం రైతులు బ్యాంకు నుం చి తీసుకున్న రుణం దాదాపు రూ.80 కోట్ల వరకు ఉన్నట్టు సమాచారం. ఇ వన్నీ మాఫీ పరిధిలోకి రానట్టే. లబోదిబోమంటున్న రైతులు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన గైడ్లైన్స్(జీవో ఎంఎస్ నం.174)లో ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపారు. ఫలితంగా ఈ ప్రాంతంలో ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టమాట రైతుల్లో అయోమయం నెలకొంది. రుణాలు మాఫీకాకపోతే వడ్డీ సహా తీర్చడం తలకుమించిన భారంలా మారడం ఖాయం. బా ధిత రైతులు ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంతకన్నా నమ్మక ద్రోహముందా రుణమాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినప్పుడు ఈ మాట చెప్పుంటే బాగుండు. అన్ని రుణాలు మాఫీ అని హా మీ ఇచ్చి ఇప్పుడు సవాలక్ష రూల్స్పెట్టి రైతుల నోర్లు కొట్ట డం మంచిది కాదు. ఇంతకన్నా నమ్మక ద్రోహం మరొకటి ఉంటుందా. -శేషేగౌడు, చీలంపల్లె, బెరైడ్డిపల్లె మండలం చెరుకు రైతులకే రుణమాఫీ వర్తిస్తుందంటే ఎట్టా ఈ ప్రాంతంలో చెరుకుసాగు పూర్తిగా తగ్గింది. సగానికి పై గా రైతులు టమాట, పలు కూరగాయలను సాగుచేస్తున్నా రు. వాటికోసమే బ్యాంకులో అప్పులు తీసుకున్నాం. ఇప్పు డు వాటికి రుణమాఫీ చేయడం కుదరదంటే ఎంతవరకు న్యాయం. -మోహన్రెడ్డి, మేకల నాగిరెడ్డిపల్లె, బెరైడ్డిపల్లె రుణమాఫీ ఓ ట్రాష్ ఎన్నికల్లో గెలవాలనే తలంపుతో రుణమాఫీని పెట్టినట్టు అందరికీ తెలిసిపోయింది. రూ.1.5 లక్షల రుణమాఫీలో లే నిపోని రూల్స్ పెట్టి ఇన్ని ఇబ్బందులు పెట్టేది అవసరమా. దీనికన్నా మావల్ల చేతకాదంటూ ఈ ప్రభుత్వం రుణమాఫీ ని వదిలేస్తే పోలా. -రవి, కూర్మాయి, పలమనేరు -
రుణ మాఫీకి కొత్త మెలికలు
రోజుకో నాటకం..పూటకో మెలికతో రుణ మాఫీకి సాధ్యమైనంత ఎక్కువ మంది రైతుల్ని దూరం చేసేందుకు సర్కారు పన్నాగం పన్నుతోంది. రేషన్కార్డు, ఆధార్కార్డు అంటూ రోజుకో కొత్త నిబంధన పెడుతూ రైతులను ఇక్కట్లకు గురిచేస్తోంది. తమ రుణాలు మాఫీ అవుతాయని గంపెడాశతో ఉన్న అన్నదాతలకు ప్రభుత్వ చర్యలు అశనిపాతంలా మారాయి. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక దాని అమలులో తాత్సారం చేస్తోంది. సాధ్యమైనంత మందిని రుణమాఫీకి అనర్హులను చేయడమే లక్ష్యంగా రోజుకో ఆదేశాలు వస్తున్నాయి. ఇప్పటి వరకూ ఆధార్ అనుసంధానం చేయాలని నిబంధన పెట్టిన ప్రభుత్వం కొత్తగా ఆధార్తోపాటు రేషన్ కార్డు కూడా ఉండాలని నిబంధన విధించింది. జిల్లాలోని రైతుల వద్ద ఆధార్ ఉంటే రేషన్ కార్డు లేనివారు, రేషన్ కార్డు ఉంటే ఆధార్లేని వారి సంఖ్య గణనీయంగా ఉందని రెవెన్యూ అధికారులే చెబుతున్నారు. ఈ రెండు ఉండాలన్న నిబంధన వల్ల మరికొంతమంది లబ్ధిదారులకు రుణమాఫీ అందకుండా చేసే ప్రయత్నం జరుగుతోంది. అర్హుల జాబితా తయారీలోనూ జాప్యం పంట రుణాల మాఫీకి అర్హత ఉన్న రైతుల జాబితా తయారు చేయడంలో బ్యాంకర్లు, అధికారులు మీనమేషాలు లెక్కపెడుతున్నారు. సెప్టెంబర్ 15లోగా తుదిజాబితా తయారు చేయాలని నిర్ణయించినా ఇప్పటి వరకూ ఈ జాబితాల తయారీ జరగలేదు. మరో రెండు రోజుల్లో పూర్తయ్యే అవకాశాలు ఏ మాత్రం లేవని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఈ జాబితాలు తయారు చేయడంలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని వారు చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఆంధ్రాబ్యాంకు, స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు మాత్రమే జాబితాల తయారీలో పురోగతి సాధించాయి. లబ్ధిదారుల పూర్తి వివరాలను డేటాబేస్లోకి మార్చే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో నెట్ బ్యాండ్విడ్త్ తక్కువగా ఉండటంతో సవరణలు కూడా అక్కడి నుంచి చేసే అవకాశం లేకుండా పోతోందని, దీని కోసం ఒంగోలు రావాల్సి వస్తోందని బ్యాంకర్లు చెబుతున్నారు. మిగిలిన బ్యాంకుల్లో ఈ ప్రక్రియ ఇంకా జరుగుతూనే ఉంది. ఎప్పటికి పూర్తవుతుందనే విషయాన్ని వారు చెప్పడం లేదు. అర్హులను తేల్చే ప్రక్రియ పూర్తికావడానికి మరో నెలరోజులు పట్టే అవకాశం ఉంది. -
క్షమాపణ చెప్పే రోజులొచ్చాయి
కేసీఆర్కు పొన్నాల హెచ్చరిక రైతులు, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నావ్ ఇంతకంటే పాపం ఏముంది? హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పాల నకు అప్పుడే రోజులు దగ్గరపడ్డాయని, రాష్ట్ర ప్ర జలంతా ఆయనపై భౌతికంగా తిరగబడే సమ యం వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రుణమాఫీ అమలుకాక, కొత్త గా అప్పులు పుట్టక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు, ఫీజు రీరుుంబర్స్మెంట్ దక్కక, కౌన్సెలింగ్ జాప్యం కారణంగా సీట్లు కోల్పోయిన వేలాది మంది విద్యార్థుల ఉసురు కేసీఆర్కు తగులుతుందని అన్నారు. తక్షణమే కేసీఆర్ ఆయా వర్గాలకు క్షమాపణ చెప్పాలని పొన్నాల డిమాండ్ చేశారు. శనివారం గాంధీభవన్లో ఆయున మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్పై విమర్శల పరంపరను కొనసాగించారు. వందరోజుల పాలనలో ఏ ఒక్క పని చేయని కేసీఆర్... చాలా మందికి చాలా డబ్బులివ్వడమే ప్రాధాన్యతగా పెట్టుకున్నారే తప్ప తెలంగాణ కోసం ప్రాణం ధారపోసినఅమరవీరుల కుటుం బాలను ఆదుకోవడం విస్మరించారు.కాంగ్రెస్ హయాంలో రైతుల ఆత్మహత్యలు పూర్తిగా తగ్గితే కేసీఆర్ వంద రోజుల పాలనలోనే 174 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అందులో మెదక్ జిల్లాలోనే ఎక్కువ ఆత్మహత్యలున్నాయి. రుణాలందక, పంట నష్టపోయిన రైతులను కేసీఆర్ ఆదుకోక పోవడం శోచనీయం. నిండు బహిరంగ సభలో దళిత ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలని హెచ్చరించిన కేసీఆర్కు అదే సూత్రం ఎందుకు వర్తించదు? రాష్ట్ర ప్రజలకు ఇబ్బడి ము బ్బడిగా హామీలిస్తూ ఏ ఒక్కటీ అమలు చేయకపోగా, వంద రోజుల పాలనలో అసలు ఏ ఒక్క పని చేయలేదని చెప్పుకోవడం సిగ్గుచేటు కాదా? తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా ఎన్ని శక్తులు ఎదురైనా లెక్కచేయకుండా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియాగాంధీని బతుకమ్మ ఉత్సవాలకు ఆహ్వానించకుండా బిల్లును అడ్డుకున్న మహిళా నేతలకు ఆహ్వానం పంపడం తెలంగాణ సమాజాన్ని అవమానించడం కాదా? ఉద్యోగులకు ఆప్షన్లు, గీప్షన్లు జాంతానై...అధికారంలోకి వస్తే చట్టాన్నే మారుస్తానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్కు ఇప్పుడు అవే ఆప్షన్లు కొనసాగుతుంటే నోరెందుకు పెగలడం లేదు? సరిగా పనిచేయని సర్పంచులను తొలగిస్తానంటున్న కేసీఆర్కు ఆ హక్కు ఎవరిచ్చారు? ఆకాశమే హద్దుగా హామీలివ్వడమే తప్ప ఏ ఒక్క పని చేయని నీకు ఆ సూత్రం వర్తించదా? కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులంతా ప్రజాస్వామ్య ముసుగులో ఉన్న నియంతల్లా వ్యవహరిస్తున్నారు. ఒకరేమో ‘తలతీస్తా, పాతరేస్తా’ అంటే ఇంకొకరేమో ‘తోలు తీస్తా’, మరొకరేమో ‘మీ అంతు చూస్తా’ అని భయపెడుతున్నారు. ప్రజాస్వామ్యయుతమైన పాలన అంటే ఇదేనా? కేసీఆర్ నిజస్వరూపం ప్రజలకు అర్థమవుతోంది. -
అంతం కాదిది.. ఆరంభమే...
ప్రభుత్వం దిగివచ్చేదాకా పోరాడతాం: పొన్నాల కేసీఆర్ వ్యాఖ్యలు అవివేకం ‘రుణం’పై కాంగ్రెస్ రణం హైదరాబాద్: రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ల వద్ద నిర్వహించిన ధర్నా ఆరంభం మాత్రమేనని.. అంతం కాదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రుణమాఫీ, కరెంటు కోతలతో సహా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే వరకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద టీపీసీసీ పిలుపు మేరకు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొని, అరెస్టు అయిన పొన్నాల లక్ష్మయ్యను పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అనంతరం గాంధీభవన్లో పొన్నాల మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చి వంద రోజులైనా.. ఏ ఒక్క పని మొదలుపెట్టలేదని చెప్పిన సీఎం.. కేసీఆర్ తప్ప ఈ ప్రపంచంలో మరొకరు ఉండరేమోనని ఎద్దేవా చేశారు. ‘రూ.1.18 లక్షల కోట్ల రుణమాఫీ యూపీఏ హయాంలోనే సాధ్యమైంది.. అందులో రాష్ర్ట రైతాంగానికి ఎక్కువ లబ్ధి జరిగింది. కేసీఆర్ తన ఫాంహౌస్లో ఉచిత విద్యుత్ వినియోగించుకుంటున్నారంటే అది నాటి కాంగ్రెస్ చలువే.. ఉచిత విద్యుత్ అమలు అసాధ్యమని మేధావులు, ప్రపంచబ్యాంకు చెప్పినా.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఐదు నిమిషాల్లోనే అమలు చేసి.. నిరూపించిన ఘనత నాటి కాంగ్రెస్ సీఎందే.. ప్రపంచంలో ఎవరూ చేయలేనని గొప్ప సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన తమ ప్రభుత్వంపై కేసీఆర్ వ్యాఖ్యలు సిగ్గుచేటు’ అనిమండిపడ్డారు. అంతకుముందు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాలో పొన్నాల మాట్లాడుతూ.. ‘ఎకరా భూమిలో కోటి రూపాయలు సంపాదిస్తాననే కేసీఆర్ రైతులను ఎందుకు పట్టించుకోవడం లేదు’ అని ప్రశ్నించారు. ధర్నాలో మాజీ మంత్రులు దానం నాగేందర్, ప్రసాద్కుమార్, ఎమ్మెల్యేలు యాదయ్య, రామ్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, భిక్షపతియాదవ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నెట్వర్క్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు శుక్రవారం తెలంగాణలోని అన్ని కలెక్టరేట్ల ఎదుట డీసీసీల ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. మహబూబ్నగర్, వరంగల్ జిల్లాల్లో ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. -
‘మాఫీ’ చేయకుంటే రణమే..
ఖమ్మంజడ్పీ సెంటర్ : జిల్లాలో అర్హులైన రైతులందరికీ వెంటనే రుణమాఫీ వర్తింపజేయాలని, వ్యవసాయానికి నిరంతరాయంగా ఏనిమిది గంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్లో మహాధర్నా నిర్వహించారు. తొలుత వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు ప్రదర్శనగా కలెక్టరేట్కు చేరుకున్నారు. ధర్నాచౌక్లో ఏర్పాటు చేసిన శిబిరంలో బైఠాయించి రుణమాఫీని వెంటనే అమలు చేయాలి, కొత్త రుణాలు అందించాలి, సోనియా రాహుల్ నాయకత్వం వర్దిల్లాలి, కాంగ్రెస్ జిందాబాద్, కిలాడి చంద్రశేఖర్రావు ఢాం ఢాం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పార్టీ జిల్లా కార్యాలయం ఇన్చార్జి అయితం సత్యం అధ్యక్షతన జరిగిన ధర్నాలో పలువురు నేతలు ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ పథకాన్ని వెంటనే అమలు చేసి కొత్తరుణాలు ఇవ్వాలని రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి డిమాండ్ చేశారు. రైతులకు ఎరువులు, విత్తనాలు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. కేసీఆర్ వందరోజుల పాలనలో 175 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రైతులు కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అక్రమార్కుల పాలిట హిట్లర్ అని కేసీఆర్ చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. సమగ్ర సర్వే పేరుతో ప్రజలందరినీ ఉరుకులు పరుగులు పెట్టించి, ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న వారిని కూడా రప్పించి, చివరకు సంక్షేమ పథకాలు అందకుండా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రెక్కలు ముక్కలు చేసుకొని వ్యవసాయం చేస్తున్న రైతులకు ఆలస్యం చేయకుండా రుణమాఫీ ఇవ్వాలన్నారు. వందరోజుల పాలనలో వెయ్యి అబద్దాలు చెప్పిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. దేశవ్యాప్తంగా రూ. 75వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కిందన్నారు. ఆ రుణమాఫీలో కేసీఆర్, కేటీఆర్, హరీష్రావులు కూడా మాఫీ పొందలేదా? అని ప్రశ్నించారు. 2001లో సోనియాగాంధీ నాయకత్వంలో వై.ఎస్. రాజశేఖరరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి రైతుల కష్టాలు తెలుసుకొని ఉచిత విద్యుత్ అమలు చేశారన్నారు. ప్రభుత్వం రుణమాఫీపై బ్యాంకర్లకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదని మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఆరోపించారు. వెంటనే రుణమాఫీ పై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకర్లు మాత్రం పాతరుణాలు చెల్లిస్తేనే మరలా కొత్తరుణాలు చెల్లిస్తామని చెబుతున్నారని తెలిపారు. రాష్ట్రం ఆత్మహత్యల తెలంగాణగా మారుతోందన్నారు. రైతులందరికీ రుణమాఫీని వర్తింపజేసి ఆదుకోవాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ కోరారు. బంగారం రుణాలు, పట్టణ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులను తికమక పెట్టకుండా స్పష్టమైన వైఖరిని తీసుకుని మాఫీని అమలు చేయాలని, వర్షాలు కురిసి వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున రైతులకు అవసరమైన అన్ని ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుకుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కిలాడి కేసీఆర్ రోజుకోమాట చెబుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి విమర్శించారు. వందరోజుల పాలనలో ఆయన చేసిన ఘనకార్యం ఏమీ లేదన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు కలెక్టరేట్లోకి వెళ్ళేందుకు ప్రయత్నించారు. అప్పటికే గేట్లు మూసి వేయడంతో పలువురు ముఖ్యనాయకులు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ ఇలంబరితికి అందచేశారు. ఈ మహాధర్నాలో నాయకులు ఎడవల్లి కృష్ణ, మానుకొండ రాధాకిషోర్, శీలంశెట్టి వీరభద్రం, నాగండ్ల దీపక్చౌదరి, పరుచూరి మురళి, పులిపాటి వెంకయ్య, వి.వి.అప్పారావు, వడ్డెబోయిన శంకర్, కొల్లు పద్మ, దేవబత్తిని కిషోర్, విజయ్కుమార్, కూల్హోం ప్రసాద్, వెంకట్, మగ్బూల్, నరేంద్రచౌదరి, మనోహర్నాయుడు పాల్గొన్నారు. -
‘కాంగ్రెస్’ వాకౌట్
- రుణమాఫీ, పంట పరిహారంపై రగడ కరీంనగర్ : జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశం పంటనష్ట పరిహారం, రుణమాఫీ అంశంపై అట్టుడికింది. ఓ దశలో తీవ్ర వాగ్వాదం జరిగి ఎమ్మెల్యే జీవన్రెడ్డితోపాటు కాంగ్రెస్ సభ్యులంతా వాకౌట్ చేసే వరకూ వెళ్లింది. సమావేశం ప్రారంభం కాగానే జగిత్యాల ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాట్లాడుతూ జిల్లా పంటనష్ట పరిహారం రూ.108 కోట్లు విడుదల కాగా, వ్యవసాయశాఖ అధికారులు కేవలం రూ.18 కోట్లు రైతులకు చెల్లించి చేతులు దులుపుకున్నారని, నిధులు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యమెందుకని మండిపడ్డారు. రుణమాఫీపై రోజుకో ప్రకటన చేస్తున్నారని, టైటిల్-1బీ అంటూ బ్యాంకులు అభ్యంతరాలు చెబుతున్నాయని, సభకు మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టమైన సమాధానం చెప్పాలని జీవన్రెడ్డి పదేపదే కోరారు. ఎమ్మెల్యే పుట్ట మధు జోక్యం చేసుకుని రైతుల పట్ల ప్రభుత్వం కృతనిశ్చయం తో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంథని ప్రాంతంలో నాయకులు దోచుకో... దాచుకో అన్న చందంగా ఖజానాను కొల్లగొట్టారని ఆరోపించారు. ఆదర్శరైతుల అవినీతికి అడ్డులేకుండా పోయిందని, ఎకరం భూమిపైనే నాలుగైదు పేర్లు రాసి ఆదర్శరైతులే డబ్బులు కాజేశారని, తన నియోజకవర్గంలోని గద్దలపల్లి ఆదర్శరైతు వ్యవహారంపై వివరించారు. జీవన్రెడ్డి జోక్యం చేసుకుని ప్రభుత్వం మీదే ఉందని, విచారణ చేయిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అనడంతో బెజ్జంకి జెడ్పీటీసీ తన్నీరు శరత్రావు, శంకరపట్నం జెడ్పీటీసీ పి.సంజీవరెడ్డి జోక్యం చేసుకున్నారు. బెజ్జంకి మండలంలో పరిహారం రూ.5 కోట్లు వస్తే రూ.3 కోట్లు కాంగ్రెస్ కార్యకర్తలకే వచ్చాయని విమర్శించారు. బెజ్జంకి వ్యవసాయాధికారిని సస్పెండ్ చేయాలని జేడీఏకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో చేసిన పనులను చక్కదిద్దేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంటే జీవన్రెడ్డి టీఆర్ఎస్ను విమర్శించడం ఏంటని మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్కు చెందిన కాటారం జెడ్పీటీసీ నారాయణరెడ్డి జోక్యం చేసుకుని సీనియర్ ఎమ్మెల్యే అయిన జీవన్రెడ్డిని అలా సంబోధించడం సరికాదని అనడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల పరస్పర విమర్శలు, అరుపులతో సభ దద్దరిల్లింది. గౌరవం లేని సభలో తాను ఉండబోనని జీవన్రెడ్డి పోడియం వద్దకు వచ్చి మంత్రి ఈటెల, చైర్పర్సన్ ఉమతో వాగ్వాదానికి దిగారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేలు పుట్ట మధు, గంగుల కమలాకర్ జీవన్రెడ్డిని సముదాయించి సీట్లో కూర్చోబెట్టారు. చైర్పర్సన్ సభను నడిపించే ప్రయత్నం చేస్తుండగానే జీవన్రెడ్డి మరోసారి జోక్యం చేసుకుని, కాంగ్రెస్ సభ్యులతో కలిసి వాకౌట్ చేసి ఎమ్మెల్సీ సంతోష్కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ సురేందర్రెడ్డి, జెడ్పీటీసీలతో కలిసి ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. జెడ్పీ భవనాన్ని టీఆర్ఎస్ కార్యాలయంగా మార్చుకుని అమర్యాదగా ప్రవర్తించారని, క్షమాపణ చెప్పే వరకు జెడ్పీలో అడుగుపెట్టేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. 20 నిమిషాల పాటు నిరసన తెలపగా ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు, సోమారపు సత్యనారాయణ, సతీశ్బాబు తదితరులు జీవన్రెడ్డితో మాట్లాడి సభలోకి రావాలని పదేపదే విజ్ఞప్తి చేయడంతో సభ్యులతో కలిసి ఆయన తిరిగివచ్చారు. ఎమ్మెల్యే జీవన్రెడ్డి మనసు బాధకలిగితే క్షమించాలని బెజ్జంకి జెడ్పీటీసీ శరత్రావు కోరడంతో గొడవ సద్దుమణిగింది. -
మాఫీలో దగా.. సేద్యానికి పొగ
- చంద్రబాబుపై రైతు నాయకుల ధ్వజం - భారం తగ్గాలనే కుయుక్తులని ఆరోపణ - సర్కారు ఖాతాలో బీమా పరిహారంపై ఆగ్రహం అమలాపురం/ అమలాపురం రూరల్ : ‘ప్రీమియం కట్టింది మేము. పంట నష్టపోతే పరిహారం అందుకోవాల్సింది మేము. మధ్యలో మీ పెత్తనం ఏమిటి? ఏ రైతు అడిగాడని రుణ మాఫీ ప్రకటించారు? ఇప్పుడు అమలు చేయడం కష్టంగా ఉందని ఆంక్షలు పెడుతున్నారు? మీ తరహా రుణమాఫీ పుణ్యమాని మాకు కొత్తగా రుణాలు రావడం లేదు. పాతరుణాలకు వడ్డీ చెల్లించమంటున్నారు. పెట్టుబడి రాయితీ, బీమా పరిహారాలు ఇవ్వడం లేదు. చక్కగా పనిచేస్తున్న సహకార సంఘాలు నిర్వీర్యమవుతున్నాయి. మాఫీకి అడ్డగోలు ఆంక్షలు, నిబంధనల పేరుతో వ్యవసాయాన్ని ముంచేయాలని చూస్తున్నారా?’ అని రైతు సంఘాల ప్రతినిధులు, సహకార సంఘాల అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ధ్వజమెత్తారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడి రాయితీ, బీమా పరిహారాలను చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) ఆధ్వర్యంలో శుక్రవారం అమలాపురం శివారు ఈదరపల్లి జనహిత కార్యాలయంలో ఉభయ గోదావరి జిల్లాల రైతులు, సహకార సంఘాల అధ్యక్షుల సమావేశం జరిగింది. పెట్టుబడి రాయితీ, పంటల బీమా పరిహారం తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. వాటిని చెల్లించాలని డిమాండ్ చేస్తూ దశలవారీ ఉద్యమం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించా. రుణమాఫీ భారాన్ని తగ్గించుకునే కుయుక్తితో ప్రభుత్వం బీమా పరిహారాన్ని జమ చేసుకోవడం అన్యాయమని సమావేశంలో ప్రసంగించిన వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగి రావాలంటే సహాయ నిరాకరణే శరణ్యం.. సభకు అధ్యక్షత వహించిన బీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల జమ్మి మాట్లాడుతూ బీమా ప్రీమియం చెల్లించిన రైతులకూ ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కోనసీమ రైతు పరిరక్షణ సమితి గౌరవాధ్యక్షుడు రంబాల బోసు మాట్లాడుతూ ప్రభుత్వం తీరు చూస్తుంటే రూ.86 వేల కోట్ల రుణమాఫీని రూ.10 వేల కోట్లకు కుదించేలా ఉందన్నారు. రుణమాఫీ తాత్సారంతో రైతులు సున్నా శాతం వడ్డీ రాయితీని కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. రూ.లక్షకు రూ.13 వేల వడ్డీ భారం పడిందని, ఈ పాపం ప్రభుత్వానిదేనని అన్నారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని చెప్పి తీరా ఇప్పుడు ఉద్యాన పంటలకు మాఫీ వర్తించదనడం భావ్యం కాదన్నారు. రైతులు సహాయ నిరాకరణ చేస్తేనేగాని ప్రభుత్వం దిగిరాదన్నారు. డీసీసీబీ డెరైక్టర్ గోదాశి నాగేశ్వరరావు మాట్లాడుతూ పదేళ్లు అధికారినికి దూరమైనా చంద్రబాబులో మార్పు రాలేదని, రైతులకు మేలు చేస్తానని ముంచేశారని విమర్శించారు. పదిమందికి మాఫీ చేసి 90 మందికి ఎగ్గొడతారని, ఇదేంటంటే రైతుల మధ్య తగువు పెడతారని వ్యాఖ్యానించారు. బీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి జలగం కుమారస్వామి మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన మాట తప్పడానికి రాజకీయ నాయకులు సిగ్గు పడడం లేదని ఆక్షేపించారు. ఉద్యమిస్తేనేగాని రైతులకు మనుగడ లేదని, ఇది ప్రతి ప్రభుత్వ హయాంలోనూ తేటతెల్లమవుతోందని అన్నారు. బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు దొంగ నాగేశ్వరరావు, కోనసీమ శాఖ అధ్యక్షుడు యాళ్ల వెంకటానందం, కోనసీమ రైతు పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, కార్యదర్శి వాసంశెట్టి సత్యం, ‘ఆత్మ’ చైర్మన్ బొక్కా ఆదినారాయణ, డీసీసీబీ డెరైక్టర్ యిళ్ల గోపాలకృష్ణ, మాజీ డెరైక్టర్ జున్నూరి బాబి, అమలాపురం డివిజన్ సహకార సంఘాల అధ్యక్షుల సమాఖ్య అధ్యక్షుడు గోకరకొండ విజయరామారావు, రైతు సంఘ నాయకులు అడ్డాల గోపాలకృష్ణ, రాయపురెడ్డి జానకీరామయ్య, ఉప్పుగంటి భాస్కరరావు, గణేశుల రాంబాబు, అప్పారి వెంకటరమణ, రమణాతి లక్ష్మణమూర్తి పాల్గొన్నారు. -
రుణమాఫీ రూ.1032.60 కోట్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎట్టకేలకు రుణమాఫీ ప్రక్రియ పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల 10 వేల 252 మందికి రూ.1032.62 కోట్ల మాఫీ కానున్నట్లు యంత్రాంగం నిర్ధారించింది. దాదాపు 20 రోజులపాటు రుణమాఫీ అంశం కుస్తీపట్టి లెక్కలు తేల్చగా, శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ)లో ఆమోదం లభించింది. కలెక్టర్ ఎన్.శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బ్యాంకుల వారీగా వచ్చిన వివరాలను క్రోడీకరించి తయారు చేసిన నివేదికను సమర్పించగా.. వాటిని కమిటీ సభ్యులు ఆమోదించారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన వివరాల ప్రకారం పంట రుణాలకు సంబంధించి 2,04,330 రైతులకు రూ.1130.33 కోట్లు, బంగారు ఆభరణాలపై రుణాలకు సంబంధించి 6,169 రైతులకు గాను రూ.101.39 కోట్లుగా గుర్తించారు. అయితే డీసీసీ మాత్రం 2,10,252 రైతులకుగాను రూ. 1032.60 కోట్లు మాత్రమే మాఫీకి ఆమోదించింది. సమావేశ అనంతరం రుణమాఫీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. రీషెడ్యూల్పై దృష్టి పెట్టండి: కలెక్టర్ శ్రీధర్ ప్రభుత్వ ఆదేశాలమేరకు రుణమాఫీ కసరత్తు పూర్తిచేసిన బ్యాంకర్లు ప్రస్తుతం రుణాల రీషెడ్యూల్పై దృష్టి సారించాలని కలెక్టర్ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం డీసీసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిజర్వ్బ్యాంకు ఇచ్చిన పంట రుణాల రీషెడ్యూల్ మార్గదర్శకాలను అన్ని బ్యాంకులకు అందజేయనున్నట్లు తెలిపారు. పదిరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్లో రూ.442 కోట్ల రుణ లక్ష్యానికి గాను కేవలం రూ.112 కోట్లు మాత్రమే మంజూరు చేశామని, రీషెడ్యూల్లో భాగంగా మిగతా రుణాలను రీషెడ్యూల్ చేసి వందశాతం లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ప్రతి బ్యాంకు శాఖ పరిధిలో ఉన్న గ్రామాలను గుర్తించి.. ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, ఒక్కో గ్రామ రైతులకు నిర్దేశిత సమయాన్ని కేటాయించి ఆరోజు ఆ గ్రామంలోని రైతుల రుణాలు రీషెడ్యూల్ చేయాలన్నారు. రైతులను బ్యాంకుకు తీసుకొచ్చే బాధ్యత సంబంధిత వ్యవసాయ, విస్తరణ అధికారులకు అప్పగించాలని జేడీఏ విజయ్కుమార్ను ఆదేశించారు. సోమవారం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ఉందని, ఈ కార్యక్రమంలో రుణమాఫీ అమలుకు సంబంధించి పూర్తిస్థాయి స్పష్టత వస్తుందన్నారు. ఈ సమావేశానికి బ్యాంకు ప్రతినిధులు హాజరుకావాలన్నారు. రుణమాఫీతో సంబంధం లేకుండా రైతుల రుణాలు రీషెడ్యూల్ చేయాలని కలెక్టర్ ఉద్ఘాటించారు. ఈ సమావేశంలో జేసీ ఎంవీరెడ్డి, డీఆర్వో సూర్యారావు, ఎల్డీఎం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
కౌలు రైతుకు హామీ మాఫీ
నట్టేట ముంచిన నిబంధన జీవో 174లో కౌలు రైతుకు దక్కని స్థానం కౌలు కార్డు లేకుంటే అంతే సంగతులు సర్కార్ మెలికపై మండిపాటు గుడివాడ : రుణమాఫీకి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలు కౌలు రైతు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికార పీఠమెక్కిన అనంతరం మడమ వెనక్కి తిప్పారు. వ్యవసాయానికి మాత్రమే తీసుకున్న బంగారు రుణాలు కుటుంబానికి రూ.1.50 లక్షల చొప్పున రద్దు చేస్తానని ఆర్భాటంగా ప్రకటించారు. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నమనుకున్న రైతులు అయిన కాడికన్నా తీసుకోవచ్చని బ్యాంకుల వద్ద బారులు తీరారు. తీరా బ్యాంకు అధికారుల వద్దకు వచ్చిన కౌలు రైతులకు ‘కౌలు కార్డు’ ఉంటేనే రుణమాఫీకి అర్హులవుతారని చావు కబురు చల్లగా చెబుతుండడంతో అక్కడే కూలబడిపోతున్నారు. అయితే రుణమాఫీపై ప్రభుత్వం వేసిన కోటయ్య కమిటీ చేసిన సిఫార్సుల్లో కూడా లేని నిబంధనలు పెట్టి రుణమాఫీని తప్పించుకునేందుకు ప్రభుత్వం అడ్డదారులు వెదుకుందనడానికి ఇదే నిదర్శనమని రైతుసంఘాల నేతలు విమర్శిస్తున్నారు. వడపోతతో భారం తగ్గించుకుంటున్నారు.. ‘మీరు తీసుకున్న పంట రుణాలన్నీ రద్దు అవుతాయి.. ఒక్కపైసా చెల్లించ వద్దు తమ్ముళ్లు’ అని చెప్పిన చంద్రబాబు మాటలతో ఆనందించిన చిన్న సన్నకారు, కౌలు రైతులు వాస్తవ పరిస్థితి చూసి నివ్వెరపోతున్నారు. రుణమాఫీపై విడుదల చేసిన జీవో నంబరు 174లో కౌలు రైతులు, జేఎల్జీ గ్రూపులు, రైతుమిత్ర గ్రూపుల ఊసులేకుండా చేశారు. జిల్లాలో దాదాపు లక్షమందికి పైగా కౌలు రైతులు ఉన్నారు. కౌలు కార్డులు తీసుకున్న వారు కేవలం 20శాతం మందే. వ్యవసాయరుణం, బంగారంపై వ్యవసాయ రుణం పొందిన రైతులు తమ ఆధార్కార్డు, రేషన్కార్డు, పట్టాదార్ పాస్పుస్తకం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కౌలు రైతు అయితే భూయజమాని పట్టాదార్ పాస్పుస్తకంతోపాటు, కౌలు కార్డు ఇవ్వాలని చెబుతున్నారు. పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్తోపాటు ఒరిజినల్ పుస్తకం చూపించాలని బ్యాంకు అధికారులు అంటున్నారు. దీనికి తోడు రుణమాఫీ జరిగితే సంబంధిత పట్టాదార్ పాస్పుస్తకంపై రుణమాఫీ జరిగినట్లు ముద్రవేస్తాం.. మీ రైతు ఒప్పుకుంటాడా? అని బ్యాంకు అధికారులు ప్రశ్నిస్తున్నారు. కౌలు రైతుకు పట్టాదార్ పాస్పుస్తకం ఒరిజినల్ ఇవ్వటానికి ఏ రైతు ఒప్పుకోని పరిస్థితి ఉంది. కేవలం కౌలు కార్డు ఉంటేనే కౌలు రైతుగా గుర్తిస్తామని లేదనంటే కుదరదని బ్యాంకు అధికారులు తెగేసి చెబుతున్నారు. కౌలు కార్డులు తీసుకోవడానికి నిరాసక్తి చూపిన వైనం... 2010లో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి వారికి నేరుగా బ్యాంకుల్లో పంట రుణాలు ఇవ్వాలని అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట్లో కౌలు రైతులు పెద్ద సంఖ్యలోనే కార్డులు పొందారు. అనంతర కాలంలో కౌలు రైతులకు అనేక బ్యాంకులు పంట రుణాలు ఇవ్వటానికి నిరాసక్తి చూపాయి. దీంతో కౌలు కార్డులు ఉన్నా ఉపయోగం లేదనే తీరుతో రానురాను కౌలు గుర్తింపు కార్డులు తీసుకోవటానికి కౌలు రైతులు ముందుకు రాలేదు. రుణానికి సరిపడా పొలం చూసితేనే.. రైతు తీసుకున్న రుణానికి సరిపడా పొలాన్ని చూపితేనే రుణమాఫీ ఉంటుందని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. ఉదాహరణకు ఒక రైతు ఎకరం పొలానికి మూడేళ్లుగా వరుసగా రూ.25వేలు చొప్పున రూ.75వేలు బంగారు రుణం తీసుకున్నా అది కేవలం రూ 25వేలకే పరిమితమవుతుందని అంటున్నారు. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. -
రైతులకే రీయింబర్స్ చేస్తాం
రుణ మాఫీపై బ్యాంకర్లకు స్పష్టం చేసిన ప్రభుత్వం రుణాలు రెన్యువల్ చేసి.. కొత్త రుణాలు ఇవ్వండి రెన్యువల్ కాకుంటే పంటల బీమా కోల్పోయే ప్రమాదం రేపటిలోగా బకాయిల విషయమై స్పష్టత ఇవ్వాలని సూచన రిజర్వుబ్యాంక్ అనుమతించిన వంద మండలాల్లో రీషెడ్యూల్ను వేగంగా పూర్తి చేయాలని విజ్ఞప్తి ఒక్కో బ్యాంకు అధికారులతో ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారుల భేటీలు హైదరాబాద్: రుణ మాఫీ కింద నిధులను నేరుగా రైతులకే రీయింబర్స్ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు స్పష్టం చేసిం ది. రుణమాఫీ కింద అందించే నిధులను బ్యాం కులకు ఇచ్చే అవకాశం లేదని పేర్కొంది. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఇవ్వాల్సిన రుణాల మంజూ రు వేగం పెంచాలని, మాఫీ వర్తించే రుణాలను రెన్యువల్ చేసి, రైతులకు కొత్త రుణాలు అందజేయాలని కోరింది. ఎస్బీహెచ్, ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకు తదితర ప్రధాన బ్యాంకుల అధికారులతో ఆర్థిక, వ్యవసాయశాఖ అధికారులు గురువారం వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఒక్కో బ్యాంకు అధికారులతో అరగంటకుపైగా జరిగిన ఈ భేటీల్లో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కమిషనర్ జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రుణ మాఫీ, ఖరీఫ్ రుణాల పంపిణీ అంశాలను వేర్వేరుగా పరిగణించాలని అధికారులు బ్యాంకర్లను కోరారు. ఖరీఫ్ సీజన్ లో దాదాపు సగం కాలం పూర్తవుతున్న తరుణంలో ఇంకా రుణాలు అందకపోతే.. రైతులు మరింతగా రుణాల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని వివరించారు. అయితే ఈ ఖరీఫ్లో రూ. 27 వేల కోట్లకుపైగా పంట రుణా లు ఇవ్వాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో నిర్ణయించినా... ఇప్పటివరకు పదిశాతం రుణాలు కూడా ఇవ్వలేదు. రుణ మాఫీ ఆశతో రైతులు బకాయిలు చెల్లించకపోవడంతో.. బ్యాం కులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. రైతులెవరైనా బకాయిలు చెల్లిస్తే... వారికి అదేరోజు లేదా మరుసటి రోజున కొత్త రుణాలు ఇస్తున్నామని బ్యాంకులు చెబుతున్నాయి. అయితే ఈ విషయంలో రైతులను మరింత జాగృతం చేయాలని.. రుణాలు రెన్యువల్ చేసుకునే విధంగా చూడాలని అధికారులు కోరారు. రుణాల రెన్యువల్లో వేగం పెంచితే తప్ప.. కొత్త రుణా లు ఇవ్వడం సాధ్యం కాదని అందుకే దీనిపై దృష్టి పెట్టాలని బ్యాంకర్లకు సూచించారు. అలాగే రిజర్వుబ్యాంక్ అనుమతించిన మేరకు మూడు జిల్లాల్లోని వంద మండలాల్లో పంట రుణాల రీషెడ్యూల్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి బ్యాంకర్ల ను కోరారు. రీషెడ్యూల్ అయ్యే రుణాల మొత్తం ఎంతనే వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలని కోరారు. అలాగే రైతులు రెన్యువల్ చేసుకుంటే తప్ప, వారికి పంటల బీమా వర్తించే అవకాశం లేనందున దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. రుణమాఫీకి సంబంధించి శనివారం వరకు మొత్తం బకాయిలు ఎంతనే విషయంలో స్పష్టత ఇవ్వాలని సూచించారు. కాగా.. శుక్రవారం కూడా మరికొన్ని బ్యాంకుల అధికారులతో ఆర్థిక శాఖ అధికారులు సమావేశం కానున్నారు. మాఫీపై వీడియో కాన్ఫరెన్స్.. రైతుల రుణ మాఫీకి సంబంధించి ప్రభుత్వ సీఎస్ రాజీవ్శర్మ సోమవారం జిల్లాల కలెక్టర్లు, బ్యాంకర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రుణ మాఫీ అమలుకు ఇదివరకు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రక్రియ ఎంత వరకు వచ్చిందన్న అంశంపై ఆయన సమీక్షించనున్నారు. -
ఎర్రచందనం వేలం వచ్చే నెల 6కు వాయిదా
ఆదాయంపై సర్కారు లెక్కలు తారుమారు కొనుగోలుకు ఆసక్తి చూపని అంతర్జాతీయ వ్యాపారులు ధరలపై చర్చించడానికి చైనాకు ప్రభుత్వ బృందం అవసరమైతే ధరలు తగ్గించి అమ్మాలని యోచన విజయవాడ బ్యూరో: ఎర్రచందనం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రుణ మాఫీకి ఉపయోగించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంచనాలు తారుమారయ్యాయి. మార్కెట్లో ఎర్రచందనానికి మంచి డిమాండ్ ఉందని, తొలి విడతగా 4,160 టన్నులను వేలం వేస్తే రూ. 500 కోట్లకు పైగా ఆదాయం వస్తుందన్న అంచనాతో అటవీశాఖ అధికారులు టెండర్లు పిలిచారు. టెండర్లకు ఈనెల 19 వరకు గడువుంది. అయితే, అంతర్జాతీయ వ్యాపారుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. దీంతో ఎర్రచందనం వేలాన్ని ప్రభుత్వం వచ్చేనెల 6వ తేదీకి వాయిదా వేసింది. ఈలోగా ఎర్రచందనం వ్యాపారులతో ధరలపై చర్చించడానికి చైనాకు ఓ బృందాన్ని పంపుతోంది. చైనాలోనూ అంత డిమాండ్ లేకపోతే ప్రభుత్వం నిర్ణయించిన ధరలను తగ్గించి కొనుగోలుదారులను ఆకర్షించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఎర్రచందనం ఎ-గ్రేడ్ ధర టన్నుకు రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షలు, బి-గ్రేడ్కు రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షలు, సి-గ్రేడ్కు రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షలు వస్తుందనే సమాచారం ఉందనీ.. కానీ టెండర్లలో ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోందని అటవీశాఖ అధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో వాస్తవంగా ఈ ధర ఉందా? లేక కొనుగోలుదారులు రింగ్ అయి ధర రాకుండా చేస్తున్నారా అనే విషయాలను కూడా చైనా పర్యటనలో తెలుసుకొంటామన్నారు. మొత్తం అమ్మితే రూ. 20 వేల కోట్ల ఆదాయం! కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని అటవీ శాఖ గోడౌన్లలో వివిధ గ్రేడ్లకు చెందిన సుమారు 10,500 టన్నుల ఎర్ర చందనం దుంగలు ఉన్నట్లు అధికారులు లెక్కేశారు. అంతర్జాతీయ మార్కెట్లో అమ్మితే సుమారు రూ. 20 వేల కోట్లు వస్తుందని అంచనా వేశారు. దీంతో యుద్ధప్రాతిపదికన ఎర్రచందనాన్ని అమ్మాలని అటవీశాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబానాయుడు ఆదేశించారు. విక్రయ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీఎస్ లిమిటెడ్కు అప్పగించారు. తొలివిడతగా 4,160 టన్నులు అంతర్జాతీయ టెండర్లలో విక్రయించడానికి ఏర్పాట్లు చేశారు. ఇందులో ఎ-గ్రేడ్ 39 టన్నులు, బి-గ్రేడ్ 400 టన్నులు, సి-గ్రేడ్ 3,721 టన్నులు ఉంది. ఎ-గ్రేడ్కు రూ. 12 లక్షలు, బి గ్రేడ్కు రూ. 10 లక్షలు, సి-గ్రేడ్కు రూ. 8 లక్షలు, నాన్ గ్రేడ్కు రూ. 7 లక్షల ప్రారంభ ధర నిర్ణయించారు. చైనా, హాంకాంగ్, సింగపూర్, జపాన్ దేశాలకు చెందిన పలువురు వ్యాపారులు, సంస్థల ప్రతినిధులు కడప, తిరుపతి, నెల్లూరు గోడౌన్లలో ఉన్న దుంగలను పరిశీలించారు. వీరి దృష్టంతా ఎ-గ్రేడ్ పైనే ఉన్నప్పటికీ, ఇదికూడా ఆశించినంత నాణ్యతతో లేదనే అభిప్రాయంతో చాలా మంది ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనడానికి ఉత్సాహం చూపలేదు. ఎ, బి గ్రేడ్ రకాల కొనుగోలుకు చైనా, హాంకాంగ్ దేశాలకు చెందిన కొందరు ఆన్లైన్లో టెండర్లు దాఖలు చేసినప్పటికీ వారి సంఖ్య కూడా చాలా తక్కువగానే ఉంది. భారీ మొత్తంలో ఉన్న సీ-గ్రేడ్పై ఎవరూ ఆసక్తి చూపడంలేదు. దీంతో ప్రభుత్వం టెండర్లను వాయిదా వేసి, చైనాకు ఓ బృందాన్ని పంపుతోంది. -
రుణమాఫీ వర్తించదు
ములుగు: రుణమాఫీపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాక అయోమయం చెందుతున్న రైతులకు బ్యాంకర్లు విడుగులాంటి వార్త చెవిన వేశారు. కేవలం పంట రుణాలు రెన్యువల్ చేసుకున్న రైతులకే రుణమాఫీ వర్తిస్తుందని చెప్పడంతో రైతులంతా బ్యాంకర్లతో వాగ్వాదానికి దిగారు. బుధవారం ములుగు మండల కేంద్రంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం ములుగు గ్రామ పంచాయతీ వద్ద స్థానిక భారతీయ స్టేట్ బ్యాంక్ మేనేజర్ వందన, నెట్ వర్క్-1 జనరల్ మేనేజర్ కన్సల్తో కలిసి రుణాలు తీసుకున్న రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కన్సల్ మాట్లాడుతూ, పంట రుణాలు తీసుకున్న రైతులు రెన్యువల్ చేసుకుంటేనే రుణ మాఫీ వర్తిస్తోందని పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా రైతులు ఆందోళన చెందారు. మాఫీ వర్తించదంటూ అధికారి చేసిన వ్యాఖ్యపై మండిపడ్డారు. రెన్యువల్ చేసిన తర్వాత రుణాలు ఎలా మాఫీ అవుతాయంటూ బ్యాంక్ అధికారితో వాగ్వాదానికి దిగారు. ఆయన్ను చుట్టుముట్టి నిరసనకు దిగారు. ఇంతలో విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నేతలు అంజిరెడ్డి తదితరులు అక్కడికి చేరుకుని గొడవకు దారితీసిన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పంట రుణాలు మాఫీ చేస్తున్నట్లు పేర్కొంటుండగా, రైతులు రుణాలు ఎందుకు రెన్యువల్ చేస్తారంటూ వారు బ్యాంకు జీఎంను ప్రశ్నించారు. రైతులు పంట రుణాలు రెన్యువల్ చేయబోరంటూ బ్యాంకు అధికారితో స్పష్టం చేశారు. దీంతో బ్యాంకు అధికారులు అక్కడినుంచి వెళ్లిపోయారు. రికవరీ క్యాంపును అడ్డుకున్న గ్రామస్తులు కౌడిపల్లి: రికవరీ క్యాంపుల ద్వారావ్యవసాయ రుణాలను వసూలు చేసేందుకు మండలంలోని వెల్మకన్న గ్రామానికి వెళ్లిన బ్యాంక్ అధికారులను గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. స్థానిక ఎస్బీఐ అసిస్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్ బాబు, బిజినెస్ కరస్పాండెంట్ విఠల్, ఆంజనేయులు బుధవారం వెల్మకన్నల్లో గ్రామస్తులు, రైతులతో సమావేశం ఏర్పాటు చేసి రికవరీ చేపట్టాలని భావించారు. అయితే విషయం తెలుసుకున్న గ్రామస్తులు బ్యాంకర్లు సమావేశం ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వం ఓవైపు రుణమాఫీ చేస్తుండగా, రికవరీ పేరుతో గ్రామాల్లోకి ఎందుకువచ్చారంటూ అధికారులను నిలదీశారు. దీంతో బ్యాంకు అధికారులు వెనుదిరిగి వెళ్లారు. -
రుణమాఫీ రూ.1,035 కోట్లు
జిల్లాలో పంట రుణాల మాఫీ లెక్కల అంశం కొలిక్కి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా రూ.1035 కోట్లు రుణాలు మాఫీ చేయాల్సిందిగా అధికారులు లెక్క తేల్చారు. మాఫీ ప్రక్రియతో జిల్లాలో 2.10లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ఇందులో బంగారంపై రుణాలకు సంబంధించి రూ.101.3కోట్లు మాఫీ కానుంది. రుణమాఫీకి సంబంధించి మండలాల వారీగా వచ్చిన వివరాల ఆధారంగా జిల్లా స్థాయిలో జాబితాను క్రోడీకరించారు. ఈ క్రమంలో రూ.1035 కోట్లుగా అధికారులు లెక్క తేల్చారు. అయితే జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ(డీసీసీ) ఆమోదం పొందిన అనంతరం ఈ వివరాలను ప్రభుత్వానికి పంపించాల్సి ఉంది. ఈ క్రమంలో శుక్రవారం డీసీసీ ఏర్పాటు చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. -
రుణమాఫీ జాబితాలో పేర్లు చేర్చండి
మానకొండూర్: రుణమాఫీ జాబితాలో తమ పేర్లు చేర్చాలని డిమాండ్ చేస్తూ మండలంలోని ఈదులగట్టెపల్లి, చెంజర్ల, పోచంపల్లి, ఊటూరు గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం మానకొండూర్ యూనియన్ బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులు కొన్నేళ్లుగా జిల్లా కేంద్రంలోని ఇండియన్ బ్యాంకు ద్వారా పంట రుణాలను తీసుకుంటున్నారు. ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించడంతో తమ రుణాలు మాఫీ అవుతాయని రైతులు భావించారు. అర్హులను ఎంపిక చేసే క్రమంలో అధికారులు ఇటీవల గ్రామాల్లో సామాజిక తనిఖీ చేపట్టారు. ఇండియన్ బ్యాంకులో రుణాలు పొందిన వారి పేర్లు లేకపోవడంతో రైతులు వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రుణమాఫీ గడువు ముగిసిందని, తమకేం తెలియదని మండల కమిటీ సభ్యులు చెప్పడంతో ఆందోళన చెందిన రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రుణమాఫీ జాబితాలో సదరు రైతుల పేర్లు చేర్చాలని ఉన్నతాధికారుల ద్వారా మండల కమిటీకి ఆదేశాలు అందాయి. జాబితాలో పేర్లు చేర్చడం లేదని, తమ గోడు పట్టించుకోవడం లేదంటూ స్థానిక బ్యాంకు ఎదుట రైతులు నిరసన వ్యక్తం చేశారు. తమ పేర్లను రుణ మాఫీ జాబితాలో చేర్చాలని రైతులు డిమాండ్ చేశారు. బ్యాంకు అధికారి లేక పోవడంతో వెనుదిరిగి పోయారు. -
ప్రభుత్వ తీరు.. అన్నదాత బేజారు..
కడప అగ్రికల్చర్ : రుణమాఫీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో అన్నదాత బేజారు చెందుతున్నాడు. దిక్కుతోచకని స్థితిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం పలు రకాల షరతులు విధించి జీఓ జారీ చేసింది. అయితే బంగారు రుణాలకు మాత్రం బంగారు తాకట్టుతో సంబంధం లేకుండా రుణం తీసుకున్న ఏడాదిలో జిల్లా కమిటీ నిర్ణయించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంటసాగు కోసం తీసుకునే రుణానికి మాత్రమే మాఫీ వర్తిస్తుందని జీఓ నంబరు 164 లోని 14 నుంచి 16 వరకు ఉన్న అంశాల ప్రకారం రుణమాఫీ ఉంటుందని పేర్కొన్నారు. దీంతో బంగారం తాకట్టుపెట్టి రుణం తీసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట రుణాలకు మాత్రం పట్టాదారు పాసుపుస్తకం బ్యాంకులో తాకట్టుపెట్టి రుణాలను రైతులు తీసుకున్నారు. అది కూడా 2013 మార్చి1 నుంచి, 2013 డిసెంబరు నెల 31వ తేదీ వరకు పంటల సాగుకు తీసుకున్న రుణాలకే రుణమాఫీ వర్తిస్తుందని, ఆ తర్వాత తీసుకున్న వారికి వర్తింపు ఉండదని పేర్కొన్నారు. ఉద్యాన పంటలకు తీసుకున్న రుణాలు మాఫీ చేసేది లేదని ప్రభుత్వం తెగేసి చెప్పింది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే...: ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో డీసీసీ బ్యాంకు చీఫ్ మేనేజరు, లీడ్బ్యాంకు మేనేజరు, అన్ని ప్రధాన బ్యాంకుల మేనేజర్లు, వ్యవసాయశాఖ జేడీ, ఉద్యానశాఖల ఏడీలు, మార్కెటింగ్శాఖ అధికారులు, ఒకరిద్దరు అభ్యుదయ రైతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఏఏ పంటకు ఎంతెంత పెట్టుబడి అవుతుందనే విషయమై చర్చిస్తారు. ముందుగా ఆయా శాఖల అధికారులు రూపొందించిన రుణ ప్రణాళికలను సమావేశం ముందుంచుతారు. అన్ని ప్రణాళికలపై చర్చ నిర్వహించి, అనంతరం ఒక కటాఫ్ పెట్టుబడి రుణాన్ని నిర్ణయించి రాష్ట్రస్థాయి కమిటీకి పంపుతారు. అక్కడ అటుఇటుగా ఒక మొత్తాన్ని నిర్ణయించి జిల్లాకు పంపిస్తారు. దాని ఆధారంగా బ్యాంకర్లు రుణాలను రైతులకు అందజేస్తారు. దీని ప్రకారం బ్యాంకర్లు రైతు బ్యాంకుకు సమర్పించే పాసుపుస్తకంలో ఉన్న భూమికి జిల్లా కమిటీ నిర్ణయించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాన్ని ఇస్తారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం 2013లో వరి పంటకు ఎకరాకు రూ. 18,000లు, జొన్నకు రూ. 8,000లు, కందికి 8,000లు, శనగకు రూ. 12,000, పొద్దుతిరుగుడుకు రూ. 10,000లు, వేరుశనగకు రూ. 11,000లు, పత్తి పంటకు నీటి ఆధారం, వర్షాధారం కింద రూ. 22 వేలు, ఆముదం పంటకు రూ. 8000లు ఇలా రుణాన్ని అన్ని పంటల సాగుకోసం రైతులకు అందజేశారు. ఉదాహరణకు రైతు ఒక ఎకరం పొలం ఉన్నప్పుడు ఆ ఎకరం పంటసాగుకు 5 తులాల బంగారాన్ని తాకట్టు పెట్టి రూ లక్ష రుణం తీసుకుంటే ఆ పంటకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్లో ఎంత రుణం ప్రకటించారో అంతే మొత్తం మాఫీ అవుతుందిగాని లక్ష రూపాయలు మాఫీ కాదని బ్యాంకర్లు చెబుతున్నారు. -
ఇదీ ‘బాబు’ మార్క్ సబ్సిడీ..!
సాక్షి, కడప: రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం.. సబ్సిడీలతో వ్యవసాయాన్ని పండుగలా చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చీ రాగానే పెద్ద రైతుల పేరుతో సబ్సిడీకి శఠగోపం పెట్టారు. రైతు రుణమాఫీ ప్రకటనతో ‘దేశం’ శ్రేణులు ఎన్నికల ప్రచారంలో అదరగొట్టినా.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా రుణమాఫీ కాకపోవడంతో రైతులలో టీడీపీ సర్కార్ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ స్తోంది. రుణమాఫీ, డ్వాక్రా రుణాల విషయంలో బాబు మాట తప్పారంటూ మహిళా సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేద రైతులతో పని లేకుండా పెద్ద రైతులకు మాత్రమే సబ్సిడీ కోత పెడుతున్నామని సర్కార్ చెబుతున్నా ప్రస్తుత పరిస్థితులలో రైతులందరూ కష్టాలలో ఉన్నారని చెప్పక తప్పుడు. కరువు పరిస్థితులు నెలకొని పంటలు సాగుకాక అల్లాడిపోతున్న అన్నదాతకు భారీ సబ్సిడీతో పరికరాలు అందించాల్సిన ప్రభుత్వం పెద్ద రైతుల పేరుతో సబ్సిడీకి కత్తెర పెట్టడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. వైఎస్ఆర్ హయాంలో భారీగా సబ్సిడీ దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో ఉద్యానవన పంటలు సాగు చేసిన రైతులకు తుంపర, బిందుసేద్యం పరికరాలను భారీ సబ్సిడీతో అందిస్తూ వచ్చారు. చిన్న, సన్న, కౌలు అనే తేడా లేకుండా అందరికి 90 శాతం సబ్సిడీతో స్ప్రింకర్లు, డ్రిప్పు పరికరాలను వైఎస్ఆర్ సర్కార్ అందిస్తూ వచ్చింది. జిల్లాలో 2004-09 మధ్య 50 వేల హెక్టార్ల వరకు బిందు, తుంపర సేద్యం పరికరాలను అందించడంలో వైఎస్ఆర్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారనే విషయం ఇట్టే అర్థమవుతోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగానే అందిస్తూ ప్రభుత్వమే సబ్సిడీని భరిస్తూ వచ్చింది. వైఎస్ఆర్ హయాంలో ఐదెకరాల కన్నా ఎక్కువ కలిగిన రైతులకు 75 శాతం వరకు సబ్సిడీ కల్పిస్తూ వచ్చారు. 2004-05 నుంచి ఇప్పటి వరకు దాదాపు 81,965 హెక్టార్లకు బిందు, తుంపర పరికరాలు అందించారు. పెద్ద రైతులకు సబ్సిడీలో కోత టీడీపీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయిందో లేదో అంతే.. రైతులపై ప్రయోగం మొదలు పెట్టారు. 5 ఎకరాలలోపు భూమి కలిగిన సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీ ఇస్తూనే మరో వైపు 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన రైతులకు సబ్సిడీలో కోత విధించారు. 5 ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్న రైతులకు కేవలం 50 శాతం సబ్సిడీ మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా ఎకరాకు డ్రిప్ పరికరాలకు సరాసరి రూ. 18 వేలు ఖర్చవుతుంద నుకుంటే పెద్ద రైతులకు దాదాపు 9 వేల వరకు ఖర్చు వస్తుంది. సూక్ష్మ సేద్యం పరికరాలు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈనెల 10న బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభించనున్నారు. 10,619 హెక్టార్లలో లక్ష్యం : జిల్లాలో 2014-15కు సంబంధించి 10,619 హెక్టార్ల లక్ష్యంగా నిర్ణయించినట్లు ఏపీ ఎంఐపీ పీడీ శ్రీనివాసులు తెలిపారు. చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీతో పరికరాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఐదెకరాల కన్నా ఎక్కువ భూమి కలిగిన రైతుల విషయంలో ప్రభుత్వ సబ్సిడీపై నిర్ణయం త్వరలోనే వెలువడుతుందన్నారు. - శ్రీనివాసులు, పీడీ -
రుణ మాఫీకి రూట్మ్యాప్ ఏది?
స్పష్టతలేని సర్కారు భారం తగ్గించుకోవడంపైనే దృష్టి షరతులతో కాలయూపన విపక్షాల నిరసనతో కొన్ని షరతులపై వెనక్కు పెద్దగా ఫలితమివ్వని రీషెడ్యూల్ యుత్నం రైతులందరికీ లక్ష రూపాయల రుణ మాఫీ.. ఇదీ తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల మేనిఫెస్టోలో విస్పష్టంగా పేర్కొన్న హామీ. కానీ అధికారంలోకి రాగానే రుణమాఫీపైనే దృష్టిపెట్టినా... వాస్తవ స్ఫూర్తితో అమలు దిశలోగాకుండా గరిష్టంగా ఎంత భారాన్ని తగ్గించుకోగలమనే దిశలోనే మల్లగుల్లాలు పడుతోంది. బేషరతుగా రైతులందరికీ మాఫీ వర్తింపచేయకుండా... రోజుకోరకం ఆలోచనతో ఖజానాకు ఎంత మిగులుతుందనే ఆలోచనలకే ప్రాధాన్యమిస్తోంది. మాఫీపై బ్యాంకర్లతో జూన్ నాలుగవ తేదీన జరిగిన తొలి సమావేశంలోనే గతేడాది తీసుకున్న పంటరుణాలకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం ఓ విధాన నిర్ణయం తీసుకుంది. తద్వారా 23 లక్షల మంది రైతులకు 12 వేల కోట్ల రూపాయుల రుణమాఫీ అవుతుందని ప్రకటించింది. కానీ ఆచరణకొచ్చేసరికి ప్రభుత్వ సలహాదారు ఒకరు రుణ మాఫీ రూ. 10 వేల కోట్లకు మించరాదంటూ బ్యాంకర్లకు సూచించారు. దీంతో బంగారం తాకట్టు రుణాలు, పాత బకాయిలకు మాఫీ వర్తించబోదనే విషయం బయటికొచ్చింది. దీనిపై రైతులు, రాజకీయ పార్టీల నుంచి తీవ్ర విమర్శలు, నిరసనలు వ్యక్తం కావడంతో... దానిని సవరించుకుని అందరికీ మాఫీ వర్తింప చేస్తామంటూ సీఎం కేసీఆర్ ఢిల్లీలో ప్రకటన చేయాల్సి వచ్చింది. ►తెలంగాణలో అన్ని రకాల రైతు రుణాలు రూ. 30,610 కోట్లు ఉండగా.. రూ. లక్ష లోపు రుణాలు రూ.26,490 కోట్లుగా బ్యాంకర్లు లెక్కలు తేల్చారు. రైతు రుణాలు తమ ముందస్తు అంచనాల కంటే అధికంగా ఉండడంతో ఇక ప్రభుత్వం రుణ భారం తగ్గించుకునే ప్రయత్నాలకు దిగింది. ►దీర్ఘకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలుగా మారిన పంటరుణాలు, పరోక్ష రుణాలకు మాఫీ ఉండదని తొలి దశలోనే ప్రభుత్వం స్పష్టీకరించింది. దీంతో ఈ మాఫీ భారం కాస్తా రూ.23,190 కోట్లకు తగ్గిపోయింది. ఇవి కేవలం అంచనాలుగా మాత్రమే పేర్కొంటూ, ప్రభుత్వానికి పక్కా సమాచారం ఇవ్వాల్సిందిగా బ్యాంకర్లను ఆదేశించింది. క్షేత్ర స్థాయి వివరాల సేకరణ తరువాత 31 మార్చి 2014 వరకు ఉన్న పంట, బంగారం తాకట్టు రుణాలను రూ. 17,337 కోట్లుగా తేల్చారు. తాత్కాలిక ఉపశవునం కోసం రీ షెడ్యూల్ యత్నం! రుణాలన్నీ మాఫీ చేస్తామన్న ప్రభుత్వానికి... ఆచరణకొచ్చేసరికి బ్యాంకులకు రుణమొత్తం ఒకేసారి చెల్లించడం సాధ్యం కాదని తెలిసొచ్చింది. తక్షణం కొంత ఉపశవునం పొందడం కోసం, కొంత టైమ్ కలిసొస్తుందనే భావనతో రీషెడ్యూల్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. కరువు, వరదలతో నష్టాలు వాటిల్లినందున 415 మండలాల్లో రీషెడ్యూల్ చేయాలని రిజర్వు బ్యాంకును కోరింది. కొంత కాలయాపన, మార్గదర్శకాల పేరిట అభ్యంతరాలు, తర్వాత ప్రభుత్వ సమాధానాల దశ దాటాక ఎట్టకేలకు రిజర్వు బ్యాంకు కేవలం 3 జిల్లాల్లోని 100 మండలాల్లో రీషెడ్యూల్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో రూ.1,500 కోట్ల వరకు కొంత వెసులుబాటు దొరికినట్లయింది. అరుునా రుణమాఫీకోసం బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తం రూ.15,837 కోట్ల మేర ఉంది. కుటుంబానికి లక్ష మాత్రమే! ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం రైతులంతా తమ రుణాలన్నీ లక్ష రూపాయల మేరకు మాఫీ అవుతాయని ఆశించారు. కానీ భారం తగ్గింపు సాకుతో ప్రభుత్వం ఎన్నిరకాల ఖాతాలు ఉన్నా కుటుంబంలో గరిష్టంగా ఒక లక్ష రూపాయలకే మాఫీ వర్తిస్తుందనే కొత్త మెలిక పెట్టింది. కుటుంబం అంటే... భర్త, భార్య, వారిపై ఆధారపడిన ఇద్దరు పిల్లలు అని నిర్వచించింది. ఆ తరువాత అర్హులైన లబ్ధిదారుల జాబితాలను పంచాయతీల్లో ప్రకటించి, సామాజిక తనిఖీ నిర్వహించాలని నిర్ణయించింది. నకిలీ పాస్పుస్తకాలతో రుణాలు తీసుకున్న వారిని గుర్తించసాగింది. పట్టణాలు, నగరాల్లోని బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంటరుణాలను మాఫీ చేయాల్సిన అవసరం లేదంటూ తాజాగా అధికారుల బృందం నిర్ణయించింది. తద్వారా అదనంగా వందలకోట్ల రూపాయల మేరకు భారం తగ్గుతుందన్న ఆలోచనలో ఉంది. ఇవన్నీ చేస్తున్నా ఏ రీతిలో బ్యాంకులకు ఈ మొత్తాన్ని చెల్లించాలనే విషయంలో ప్రభుత్వానికే ఇంకా స్పష్టత లేదు. రకరకాల వూర్గాలను ఆలోచించిందే తప్ప ఇప్పటికీ తను ఫలానా విధానంలో మాఫీ అమలు చేస్తానని చెప్పడం లేదు. ఆలోచించిన వూర్గాలు ఇవీ... ► రాష్ట్ర ప్రభుత్వమే అర్హులైన రైతులకు బాండ్లు జారీ చేసి, తరువాత నిర్ణీతకాలం తరువాత వడ్డీతో సహా చెల్లించడం. ► బాండ్లు ఇస్తే, అవీ రుణాల లెక్క కిందకే వస్తాయి కాబట్టి, రైతులకే హామీపత్రాలు (ప్రామిసరీ) ఇవ్వడం. ► రైతులు మొదట తమ రుణాలను తిరిగి చెల్లించేస్తే, కొంతశాతం సొమ్ము ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాల్లోకి వేసి, మిగతాది దశలవారీగా చెల్లించడం. -
రుణమాఫీలో లోతుగా పరిశీలన
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీ పథకంలో సూక్ష్మపరిశీలనకు నడుం బిగించింది. ఇప్పటికే వివిధ రకాలుగా అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు చర్యలు చేపట్టగా.. తాజాగా మరో అడుగు ముందుకేసింది. నకిలీ పాస్బుక్ల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా వెలుగు చూడడంతో బోగస్ లబ్ధిదారులను ఏరివేసేందుకు వడపోతకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు జాబితాను పరిశీలించిన ప్రభుత్వం రెవెన్యూ రికార్డులకు అనుసంధానం చేస్తూ రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ను జిల్లాకు పంపించింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రుణమాఫీకి నియమించిన మండల ప్రత్యేక కమిటీలు తిరిగి 1బీ రిజిస్టర్లోని భూముల వివరాలతో రుణాల లెక్కలను సరి చూసి అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. జిల్లాలో మార్చి 31, 2014 వరకు 4,76,717 మంది రైతులకు రూ.2,505.66 కోట్ల పంట రుణాలు మంజూరు చేశారు. ఇందులో రూ.2,221.2 కోట్ల పంటరుణాలు, రూ.234.63 కోట్ల బంగారం తాకట్టుతో రుణాలు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ మార్గదర్శకాల ప్రకారం ఒక కుటుంబానికి సంబంధించి గరిష్టంగా రూ.లక్ష వరకు మాత్రమే మాఫీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. మరోసారి పట్టణాల్లో బంగారు తాకట్టుపెట్టి పంటరుణాలు తీసుకున్న వారికి మాఫీ లేనట్లేనని ఉత్తర్వులు జారీ చే సింది. ఇందులో భాగంగా ఒక్కో రైతు రెండు, మూడు బ్యాంకు ల్లో తీసుకున్న రుణ వివరాలను సేకరిస్తూ వాటన్నింటినీ క్రోడీకరించి గరిష్టంగా రూ.లక్ష వరకు మాఫీ చేసేలా చర్యలు చేపట్టింది. రుణమాఫీ పథకం కింద జిల్లాలో 4 లక్షల మంది రూ.1,779 కోట్లు లబ్ధిపొందనున్నట్లు అధికారులు ప్రాథమిక నివేదిక రూపొందించారు. జిల్లాలో అన్ని మండలాల బ్యాంకర్ల సంయుక్త కమిటీలు విచారించి ఆమోదించారు. బ్యాంకుల వారీగా లబ్ధిదారుల వివరాలను పోల్చిచూస్తూ మండల స్థాయిలోని అన్ని బ్యాంకుల్లో వివరాలను సరిపోల్చిన అనంతరం జిల్లా స్థాయిలో ఈ వివరాలను క్రోడీకరించి తుదిజాబితా తయారు చేశారు. దీంతో జిల్లాలో రూ.1,683.14 కోట్లు రుణమాఫీకి 3,84,105 మంది రైతులను అర్హులుగా తుదిజాబితా రూపొందించారు. రైతులు తీసుకున్న రుణం, అధికారులు రూపొందించిన ప్రాథమిక నివేదికకు తుది జాబితాలో భారీ వ్యత్యాసం కనిపించింది. అక్రమాలతో మళ్లీ మొదటికి! పంట రుణాల మాఫీకి అర్హత కలిగిన రైతులను గుర్తించేందుకు గత నెలలో బ్యాంకర్ల సంయుక్త కమిటీ చేపట్టిన సామాజిక తనిఖీలో అనేక అక్రమాలు వెలుగుచూశాయి. అసలు పంటలు వేయకుండా రుణాలు తీసుకున్న వారు. రియల్వ్యాపారం కోసం కొనుగోలు చేసిన భూములకు రుణాలు తీసుకున్న వారు.. వ్యవసాయ యోగ్యత లేని భూములకు. నకిలీ పాస్ పుస్తకాలతో రుణాలు తీసుకున్న వైనం వెలుగు చూడడంతో బ్యాంకర్ల డొల్లతనం బయటపడింది. ఏ, బీ, సీ, డీ, ఈ పేరిట ఫార్మాట్లను రూపొందించి బ్యాంకర్లు ఇచ్చిన జాబితాను జల్లెడ పట్టి తుది జాబితాను ఖరారు చేశారు. అయితే వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జిల్లా తుది జాబితా పూర్తయినప్పటికీ బ్యాంకర్లు జిల్లాస్థాయిలో సిద్ధం చేయకపోవడంతో ప్రభుత్వానికి నివేదిక పంపలేదు. తాజాగా మరోసారి ప్రభుత్వం తహశీల్దార్ల వద్ద ఉన్న 1బీ రికార్డులతో అర్హులను సరిచూడాలని ఆదేశించడంతో మళ్లీ కసరత్తు మొదలైంది. ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్లో సర్వేనంబర్ల వారీగా పట్టాభూమి, అక్షరమాల ఆధారంగా లబ్ధిదారుల పేర్లు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. వీటి ఆధారంగా పంట రుణం తీసుకున్న లబ్ధిదారులను సరిపోల్చి అర్హుల తుది జాబితాను సిద్ధం చేసే పనిలో ఉన్నామని చెబుతున్నారు. కాగా నకిలీలను ఏరివేయడంతోపాటు ఆర్థికభారం తగ్గించుకునే దిశగా సర్కారు దశలవారీగా నిశిత పరిశీలనలంటూ ఫిల్టరింగ్ చేస్తూ ముందుకు పోతున్నట్లు తెలుస్తోంది. -
మహిళల్ని మోసం చేస్తారా?
అప్పు చెల్లించొద్దని ఒట్టేయించుకున్న బాబు నేడు చేతులెత్తేస్తే ఎలా... వడ్డీ, అప్పు ఎవరు చెల్లిస్తారు... రుణమాఫీ తీరిదేనా? వైఎస్సార్సీపీ డెప్యూటీ ఫ్లోర్లీడర్ ఉప్పులేటి కల్పన గుడివాడ : రుణమాఫీ పేరుతో డ్వాక్రా మహిళల్ని చంద్రబాబు నిలువునా ముంచేశారని శాసనసభలో వైఎస్సార్సీపీ డెప్యూటీ ఫ్లోర్లీడర్ ఉప్పులేటి కల్పన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో అప్పులు చెల్లించొద్దని చెప్పి ఒట్టేయించుకున్న చంద్రబాబు నేడు రుణమాఫీ భారం నుంచి తప్పించుకునేందుకు రకరకాల ఆంక్షలు పెడుతున్నారని విమర్శించారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. అలాగే రైతుల రుణమాఫీకి రూ.లక్షకోట్ల పైచిలుకు కావాల్సి ఉండగా బడ్జెట్లో మాత్రం కేవలం రూ.5వేలు కోట్లు విదిలించారని చెప్పారు. ఇది ఎవరిని మోసం చేయడానికని ప్రశ్నించారు. రుణమాఫీపై మాట మార్చిన చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఎన్నికల ముందు ఆయన మాటలు నమ్మి ఇప్పటి వరకు డ్వాక్రా మహిళలు రుణాలు చెల్లించలేదని, ఫలితంగా బ్యాంకుల్లో వేలాది రూపాయలు వడ్డీలు బకాయి పడ్డాయని వీటిని ఎవరు ఇస్తారని ప్రశ్నించారు. ప్రజలు అధికారం ఇచ్చింది వారికి మేలు చేయడానికే తప్ప... ప్రజలపై భారం మోపడానికి కాదన్నారు. ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకుండా... ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో అధికార టీడీపీ ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే వారి బండారం బయట పడుతుందని చెప్పి ఎవరినీ మాట్లాడనివ్వకుండా స్పీకర్ మైక్ కట్ చేయడం దారుణమన్నారు. కేటాయింపులకు బడ్జెట్ అంచనాలకు పొంతన లేదని ఎలా నిధులు తెస్తారని ప్రశ్నించినా సమాధానం దాట వేశారని చెప్పారు. అంటే రానున్న కాలంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై పన్నులు భారం మోపటానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టమైందని తెలిపారు. పదేళ్లపాటు పాలించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి ప్రజలపై పైసా పన్ను వేయకుండా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. ప్రజలపై భారాలు మోపితే తాము సహించేది లేదని హెచ్చరించారు. పెదపారుపూడి జెడ్పీటీసీ మూల్పూరి హరీష పాల్గొన్నారు. -
రుణమాఫీపై మాట తప్పుతారా..?
ఏపీ ప్రభుత్వంపై డ్వాక్రా మహిళల ఆగ్రహం గుత్తి/బుక్కపట్నం: షరతులు లేని రుణ మాఫీ కోసం డ్వాక్రా మహిళలు సోమవారం ‘అనంత’లో ఉద్యమించారు. ఊబిచెర్లలోని 28 స్వయం సహా యక సంఘాల (డ్వాక్రా) మహిళలు గుత్తిలోని సిండికేట్ బ్యాంకును ముట్టడించారు. అనంతరం గాంధీ సర్కిల్లో రాస్తారోకో చేశారు. అక్కడి నుంచి తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేశారు. రుణమాఫీ అమలు చేయకుండా అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు వైఖరిని నిరసిస్తూ జానకంపల్లి గ్రామానికి చెందిన వందలాది మంది డ్వాక్రా సంఘాల మహిళలు బుక్కపట్నం మండల కేంద్రంలో ర్యాలీ గా వెళ్లి ఐకేపీ, తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా చేశారు. మహిళలు మాట్లాడుతూ రుణమాఫీ అవుతుందన్న నమ్మకంతో ఐదారు నెలలుగా కంతులు చెల్లించలేదన్నారు. ఇప్పుడేమో బకాయిలు చెల్లించాలని బ్యాంకు, ఐకేపీ అధికారులు హుకుం జారీ చేస్తున్నారన్నారు. ఒత్తిడికి గురి చేస్తే తమకు ఆత్మహత్యలే శరణ్యమని, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎన్నికల హామీని నెరవేర్చాలి మామిడికుదురు: తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు, నగరం గ్రామాలకు చెందిన 40 డ్వాక్రా గ్రూపులకు చెందిన దాదాపు 300 మంది మహిళలు సోమవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద బైఠాయించారు. వీరిలో టీడీపీ వారు కూడా ఉండడం గమనార్హం. చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంపీడీఓ ధనలక్ష్మీదేవికి వినతిపత్రం ఇచ్చారు. టీడీపీకి చెందిన మహిళా నాయకురాలు మొల్లేటి పార్వతి, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు మొల్లేటి అలివేలు మంగతో పాటు కంచి విజయలక్ష్మి, గుబ్బల వరలక్ష్మి, జక్కంపూడి శాంతమ్మ, కంచి లక్ష్మీకుమారి తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఏజెన్సీలోని రాజవొమ్మంగిలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట కూడా మహిళలు రుణమాఫీ అమలు చేయాలని ధర్నా నిర్వహించారు. -
నమ్మించి మోసం చేస్తారా?
గుత్తి/గుత్తి రూరల్/ బుక్కపట్నం : రుణ మాఫీకి షరతులు విధించడంపై డ్వాక్రా మహిళలు కన్నెర్రజేశారు. మాట తప్పితే తమ ఉసురు కొట్టుకుని పోతారంటూ ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు. నమ్మించి నిండా ముంచారని సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గుత్తి, బుక్కపట్నం మండల కేంద్రాల్లో సోమవారం డ్వాక్రా మహిళలు రుణ మాఫీ కోసం ఉద్యమించారు. ఊబిచెర్లలోని 28 స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) మహిళలు దాదాపు 400 మంది గుత్తిలోని సిండికేట్ బ్యాంకును గంటన్నరపాటు ముట్టడించారు. బ్యాంకు సీనియర్ మేనేజర్ రెజితో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. అనంతరం బ్యాంకు వద్ద నుంచి ఎస్బీఐ, రాజీవ్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా ర్యాలీతో వెళ్లి గాంధీ సర్కిల్లో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు ఇచ్చిన ‘రుణ మాఫీ’ హామీని నమ్మి ఆయన్ను అందలం ఎక్కించడంతో పాటు బ్యాంకులకు కంతుల చెల్లింపు ఆపేశామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రుణ మాఫీ చేయకుండా సీఎం చంద్రబాబు మొహం చాటేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ ఆలస్యం కావడంతో తమ పొదుపు ఖాతాల్లోని సొమ్మును తమ ప్రమేయం లేకుండానే కంతులకు జమ చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. వాహన రాకపోకలకు ఇబ్బంది కలగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. సమస్యను ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పడంతో మహిళలు శాంతించి రాస్తారోకో విరమించారు. అనంతరం అక్కడి నుంచి తహశీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి అక్కడా కాసేపు ధర్నా చేశారు. పైసా కూడా తాము చెల్లించేది లేదని, రుణాలన్నీ షరతులు లేకుండా మాఫీ చేసే వరకు వదిలేది లేదని స్పష్టం చేశారు. రుణమాఫీ అమలు చేయకుండా అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు వైఖరిని నిరసిస్తూ జానకంపల్లి గ్రామానికి చెందిన వందలాది మంది డ్వాక్రా సంఘాల మహిళలు బుక్కపట్నం మండల కేంద్రంలో ఆందోళన నిర్వహించారు. తొలుత ఇందిరక్రాంతి పథం (ఐకేపీ), తహశీల్దార్ కార్యాలయాలను ముట్టడించి, అక్కడే కాసేపు ధర్నా చేశారు. రుణమాఫీ అవుతుందన్న నమ్మకంతో ఐదారు నెలలుగా కంతులు చెల్లించలేదని, ఇప్పుడు అపరాధపు వడ్డీతో సహా బకాయిలు చెల్లించాలని బ్యాంకు, ఐకేపీ అధికారులు హుకుం జారీ చేస్తున్నారన్నారు. రుణ మాఫీ చేయకుండా.. బకాయిలు చెల్లించాలంటూ ఒత్తిడికి గురి చేస్తే తమకు ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చరించారు. వీరి ఆందోళనకు సీపీఐ మండల కార్యదర్శి బ్యాళ్ల అంజి మద్దతు తెలిపారు. -
రుణమాఫీ ప్రకటనలపై ఆగ్రహించిన రైతులు
చింతకొమ్మదిన్నె : రుణమాఫీపై ప్రభుత్వం పలు రకాలుగా ప్రకటనలు చేస్తూ రైతులకు అన్యాయం చేస్తోందని భారతీయ కిసాన్ సంఘ్ ఆంధ్ర ప్రాంత అధ్యక్షుడు నర్రెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చింతకొమ్మదిన్నె ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ) ఎదుట భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో సోమవారం రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్రెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ ఏపీజీబీలో 2012లో రైతులు తమ బంగారుతోపాటు పట్టాదారు పాసు బుక్కు జిరాక్స్ ఇచ్చి పంట రుణం తీసుకున్నారన్నారు. మళ్లీ బ్యాంకు వారి సూచన మేరకు 2013లో వడ్డీలు చెల్లించి పంట రుణాలను రెన్యువల్ చేశారన్నారు. కానీ బ్యాంకు అధికారులు రైతుల అమాయకత్వాన్ని, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని ఈ రుణాలను పశువులకు, గొర్రెలకు, పెరటికోళ్ల వంటి మధ్యకాలిక రుణంగా మార్చారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోను గాలికి వదిలి రైతులబతుకులతో ఆడుకుంటోందని ఆగ్రహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రుణమాఫీకి కట్టుబడి ఉండకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పి.శివారెడ్డి, జిల్లా కార్యదర్శి సి.మాధవరెడ్డి, ప్రాంత కార్యదర్శి బొగ్గుల ఓబుల్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చందా వెంకటరెడ్డి, మండలశాఖ ప్రధాన కార్యదర్శి బుసిరెడ్డి మల్లారెడ్డి, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. -
ప్రతిపక్ష నేత జగన్ గొంతు నొక్కారు
నరసరావుపేట వెస్ట్: అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి గొంతు నొక్కి అధికాపక్షం ఏకపక్షంగా వ్యవహరించిందని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్టేట్మెంట్ ఇస్తారని ప్రకటించి రిజల్యూషన్ ప్రవేశపెట్టి ఆమోదించుకున్నారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి కావాలనే జగన్మోహనరెడ్డిని చర్చలో పాల్గొనకుండా చేశారని ఆరోపించారు. తాను మాట్లాడతానని జగన్మోహనరెడ్డి పదే పదే కోరినా అవకాశం ఇవ్వలేదన్నారు. రైతులకు ఓపిక నశించి రుణమాఫీ అడగలేని విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బంగారు, డ్వాక్రా రుణాలకు తిలోదకాలు ఇచ్చే విధంగా విధివిధానాలు రూపొందిస్తోందని తెలి పారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రతి జిల్లాకు చేసిన వాగ్దానాలు అమలు కావాలంటే రూ.20 లక్షల కోట్లు కావాలని తెలిపారు. లింగంగుంట్లకు చెందిన 1900 ఎకరాల భూములకు రైతులు రిజిస్ట్రేషన్లు, రుణాలు తీసుకోవటం, విక్రయాలు చేసుకునేందుకు ఎండోమెంట్, రెవెన్యూ మంత్రులను కలిశామని, వారు సానుకూలంగా స్పందించారని చెప్పారు. సమావేశంలో మండల కన్వీనర్ కె.శంకరయాదవ్, ఎస్సీసెల్ కన్వీనర్ కందుల ఎజ్రా, మండల కార్యదర్శి భవనం రమణారెడ్డి పాల్గొన్నారు. -
రుణమాఫీ చుట్టూ నీలినీడలు
బ్యాంకుల చుట్టూ రైతుల ప్రదక్షిణసాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలుగుదేశం పార్టీ బండారం బయటపడుతోంది. ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చిన ఆ పార్టీ అధినేత తీరు ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. రైతులు.. డ్వాక్రా మహిళలు.. ఇలా ఎంతోమందిని మోసగించేందుకు సిద్ధమవుతుండటంతో ఆయా వర్గాలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి. రుణ మాఫీపై తొలి సంతకం చేశారన్న మాటే తప్పిస్తే.. ఆ హామీ రోజుకో మలుపు తిరుగుతోంది. ఎలాగైనా ఆ భారం తగ్గించుకునేందుకు రోజుకో నిబంధన తెరపైకి తీసుకొస్తుండటం విమర్శలకు తావిస్తోంది. తొలుత ఆధార్, రేషన్కార్డుల్లో ఏదో ఒకటి ఇచ్చినా రుణమాఫీ వర్తిస్తుందని చెప్పినా.. ప్రస్తుతం రేషన్కార్డును తప్పనిసరి చేయడం రైతులను కలవరపరుస్తోంది. జిల్లాలో 42లక్షల మందికి పైగా జనాభా ఉన్నారు. ఇందులో ఇప్పటి వరకు 36,31,324 మంది మాత్రమే ఆధార్ కార్డులు పొందారు. లక్ష మందికి పైగా రేషన్ కార్డుల్లేవు. వీరంతా దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈ లెక్కన ఆధార్, రేషన్కార్డులు లేని రైతులకు రుణ మాఫీ వర్తించే పరిస్థితి లేదని తేలిపోయింది. ఆధార్ కార్డు లేకపోయినా ఒకటి రెండు రోజులు క్యూలో నిల్చొని కనీసం నెంబర్ తీసుకునే వీలుంది. అయితే రేషన్ కార్డు లేని రైతుల పరిస్థితి గందరగోళంగా మారుతోంది. కల్లూరు మండలంలోని ఉలిందకొండ కోఆపరేటివ్ బ్యాంకు పరిధిలో మొత్తం 740 మంది రైతులు రూ.1.60 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఇందులో 200 మంది రైతుల వివరాలను సేకరించగా.. 50 మంది రైతులకు ఆధార్, రేషన్కార్డులు లేవని గుర్తించారు. డోన్ ఆంధ్రా బ్యాంకు పరిధిలో 5,600 మంది రైతులు రుణాలు పొందగా.. 530 మందికి రేషన్ కార్డులు, 600 మందికి ఆధార్ కార్డులు లేవని వెల్లడైంది. ఆలూరు పరిధిలో 60వేల మంది రైతులు రుణాలు తీసుకోగా.. ఇప్పటి వరకు వివరాలు అందజేసిన రైతుల్లో 15వేల మందికి పైగా అనర్హులను గుర్తించినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 6లక్షల మందికి పైగా రైతులు రుణాలు తీసుకోగా.. 35 శాతం మందికి పైగా రైతులు రుణ మాఫీకి అనర్హులయ్యే పరిస్థితి నెలకొంది. వీరంతా తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా ఎన్నికలకు ముందు ఇంటింటికి తిరిగి రుణాలు చెల్లించక్కర్లేదని.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రుణాలన్నింటినీ మాఫీ చేస్తారని చెప్పిన టీడీపీ నేతలు ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తుండటం గమనార్హం. -
కార్పొరేట్ కౌగిలిలో చంద్రబాబు బందీ
సీమకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఏమైంది మూడు నెలల్లో 14 వేల మంది ఉద్యోగులను తొలగించారు రుణమాఫీపై స్పష్టత లేదు సీమ సమస్యలపై జాతా నిర్వహిస్తాం పీలేరు: సామాన్య ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా సీఎం చంద్రబాబు కార్పొరేట్ కౌగిలిలో బందీ అయ్యారని సీపీఎం జాతీయ కమిటీ సభ్యుడు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ.గఫూర్ అన్నారు. ఆదివారం ఆయన పీలేరులో విలేకరులతో మాట్లాడారు. రాయలసీమ వెనుకబాటుతనాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం గతంలో సీమకు బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిందని, చంద్రబాబు ఆ విషయమై ఇప్పటివరకు కేంద్రంతో చర్చించకపోవడం విచారకరమని పేర్కొన్నారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీపై స్పష్టమైన ప్రకటన చేయకుండానే కమిటీలతో కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టా రు. మూడు నెలలుగా ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప చంద్రబాబు నవ్యాంధ్ర సాధనకు చేసిందేమీ లేదన్నారు. ప్రభుత్వం మూడు నెలల్లోనే ప్రజా విశ్వా సం కోల్పోయే స్థాయికి చేరుకుందని అన్నారు. గత ప్రభుత్వం 27 వేల మంది డ్వాక్రా యానిమేటర్లకు నెలకు రూ.2 వేలు జీతం ఇస్తానని ప్రకటించిందని, ఈ ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోకపోవడంతో అర్ధాకలితో అలమటిస్తున్నారని చెప్పారు. బాబువస్తాడు..జాబు వస్తుందని అందరూ ఓట్లువేసి అధికారాన్ని కట్టబెట్టారని, అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 14 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను విధుల నుంచి తొలగించి బాబు తన నిజ స్వరూపాన్ని చాటుకున్నారని తెలిపారు. చంద్రబాబు మాటలకు, చేతలకు పొంతన ఉండదన్నారు. బాబు దొరబాబులను కలుస్తున్నారు తప్ప పేదల కష్టాల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. మంత్రులు డమ్మీలు కావడం వల్లే ప్రజాదరణ కోల్పోతున్నారని ఆరోపిం చారు. బాబు రాయలసీమకు ద్రోహం చేస్తే చరిత్ర క్షమించదన్నారు. సీమ సమస్యలపై త్వరలోనే ప్రజల తో జాతా నిర్వహిస్తామన్నారు. తాము మొదటి నుంచీ రాష్ర్ట విభజనకు వ్యతిరేకమేనని, అనివార్య కారణాలతో విభజన జరిగిందని అన్నారు. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతానికి పరిమితమైతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు కందారపు మురళి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి గంగరాజు, వెంకట్రమణ తదితరులు పాల్గొన్నారు. -
‘బాబు’ మాఫీ పాట.. బ్యాంకులు వేలం బాట
అడకత్తెరలో రైతులు ఈ నెల 17లోపు బాకీలు చెల్లించకుంటే బంగారు వేలం తనకల్లు స్టేట్బ్యాంక్ పత్రికా ప్రకటన ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న రుణగ్రస్తులు తనకల్లు: రుణాలు చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారు నగలను వేలం వేస్తామని బ్యాంకు అధికారులు ప్రకటన చేయడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయ, డ్వాక్రా, చేనేత రుణాలన్నీ మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇస్తూ గ్రామగ్రామానా ప్రచారం చేశారు. దీంతో ఆయా వర్గాలవారు ఆయనకు అధికారం కట్టబెట్టారు. అధికార పగ్గాలు చేపట్టి మూడు నెలలు కావస్తున్నా ముఖ్యమంత్రి రుణమాఫీపై అదిగో.. ఇదిగో అంటూ స్పష్టమైన ప్రకటన చేయకుండా కాలం వెళ్లదీస్తున్నారు. మరోవైపు గడువులోపు తీసుకున్న రుణాలు చెల్లించకపోతే బంగారు నగలు వేలం వేస్తామని బ్యాంకర్లు దండోరా, పత్రిక ప్రకటనలు చేస్తూ రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 17 లోగా అప్పులు చెల్లించకపోతే అదేరోజు నగలు వేలం వేస్తామని తన కల్లు స్టేట్ బ్యాంకు అధికారులు పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీంతో మండలంలోని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రుణం చెల్లిస్తే మాఫీ వర్తించదని, చెల్లించకుంటే బంగారు పోగొట్టుకోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తప్పక రుణమాఫీ చేస్తామని రోజూ ప్రకటిస్తున్నారు. కానీ బ్యాంకు అధికారులు ఇస్తున్న వేలం నోటీసులపై ఏమాత్రం స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు. కరువు పరిస్థితిలో రుణమాఫీతో ఉపశమనం లభిస్తుందని భావించామని, చివరకు బ్యాంకువారు వేలం నోటీసులు పంపుతున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాయమాటలతో మభ్యపెడ్తున్నారని అధికారపార్టీ ప్రజాప్రతినిధులపై దుమ్మెత్తిపోస్తున్నారు. రుణమాఫీపై సమాచారం లేదు రుణమాఫీపై ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకుని మూడేళ్లుగా చెల్లించని రైతులకు నోటీసులు ఇచ్చాం. వారి నుంచి స్పందన లేకపోవడంతో తమ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 17న నగలు వేలం వేస్తామని పత్రికా ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. -గురురాజ్, ఎస్బీఐ మేనేజర్, తనకల్లు ఆందోళనలు చేపడతాం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు రుణమాఫీపై పూటకోమాట మాట్లాడుతున్నారు. బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి బంగారు నగల వేలాన్ని ఆపాలి. రైతుల కష్టాలను తెలుసుకొని వెంటనే రుణమాఫీ అమలు చేయాలి. లేకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేపడతాం. -రమణ, ఏపీ రైతు సంఘం మండల కన్వీనర్ -
కీలకాంశాలపై స్పష్టత ఏదీ?
ప్రభుత్వంపై సీపీఐ ధ్వజం హైదరాబాద్: రుణమాఫీ సహా రాష్ట్రానికి సంబంధించిన కీలకాంశాలపై స్పష్టత ఇవ్వడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర సమితి విమర్శించింది. ఎన్నికల వాగ్దానాల అమలు, రాష్ట్ర బడ్జెట్, రాజధాని ఎంపిక పై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించి ప్రజలకు స్పష్టత ఇవ్వడానికి బదులు అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నారని ఆక్షేపించింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఓబులేసు ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. లక్షలాది మంది ఎదురుచూస్తున్న రుణమాఫీని ఎప్పటినుంచి అమలు చేస్తారో చెప్పడానికి బదులు హామీకి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం చెప్పడం అన్యాయమన్నారు. రాష్ట్రం ఆర్ధిక లోటుతో కొట్టుమిట్టాడుతోందని శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం.. రూ.1,11,824 కోట్లతో బడ్జెట్ను ఎలా ప్రవేశపెట్టిందని ప్రశ్నించారు. మాజీ శాసనసభ్యులకు నాలుగు నెలలుగా పింఛన్ ఇవ్వడానికి డబ్బుల్లేవన్న ప్రభుత్వం.. మంత్రుల ఇంటి అద్దెను లక్ష రూపాయలకు ఎలా పెంచిందని ప్రశ్నించారు. రాష్ట్ర రాజధానిపై అఖిల పక్షంతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తే బాగుండేదన్నారు. కౌలు రైతులకు కూడా రుణమాఫీ వర్తింపజేయాలని కోరారు. వారికి రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 17న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా చేయనున్నట్టు తెలిపారు. -
బాబూ.. ‘డ్వాక్రా’ ఛిన్నాభిన్నం
ఐద్వా రాష్ట్ర కార్యదర్శి కాట్రగడ్డ స్వరూపరాణి గన్నవరం : గ్రామాల్లో సజావుగా నడుస్తున్న డ్వాక్రా వ్యవస్థను రుణమాఫీ ఆశ చూపి చిన్నాభిన్నం చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకే దక్కుతుందని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి కాట్రగడ్డ స్వరూపరాణి విమర్శించారు. కేవలం అధికారం కోసం ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పిన బాబు.. ఇప్పుడు మాట తప్పడం మహిళలను మోసం చేసినట్లేనని ధ్వజమెత్తారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రెండు రోజులుగా జరుగుతున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా 18వ మహాసభల ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. స్వరూపరాణి మాట్లాడుతూ...ప్రభుత్వ అసమర్థత కారణంగా డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలు మాఫీ కాక, బ్యాంకులు రుణాలివ్వక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా పాలకులు ఎన్నికల హామీకి కట్టుబడి డ్వాక్రా రుణాలను పూర్తిగా రద్దుచేయాలని కోరారు. ముఖ్యంగా నవ్యాంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో మహిళలపై హింస విపరీతంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందులో మొట్టమొదటి స్థానంలో ఉన్న విజయవాడనే రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేసిన నేపథ్యంలో మహిళల సంరక్షణకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో విధి విధానాలతో స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజధాని ఏర్పాటు చుట్టూ తిరుగుతూ ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. సంక్షేమ పథకాలన్నీ కుంటుపడుతున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని సింగపూర్, మలేషియా, చికాగో చేస్తానంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అగ్రహాం వ్యక్తం చేశారు. వంట ఏజెన్సీలు, ఆశా వర్కర్లు తదితర అవుట్ సోర్సింగ్ పనుల్లో రాజకీయ జోక్యం పెరుగుతుందని, అధికార పార్టీ నాయకులు ప్రస్తుతం ఉన్నవారిని తొలగించి అనుచరులను పెట్టుకోవడం దారుణమన్నారు. బెల్టుషాపులు ఎత్తి వేస్తామని చెప్పి విచ్చలవిడిగా మద్యం షాపులను ఏర్పాటు చేసి సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు. పాలకులు ప్రజావ్యతిరేక విధానాలను విడనాడలని, లేకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మహిళలపై హింసను నియంత్రించాలని, చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, బెల్టుషాపులు ఎత్తివేయాలని తీర్మానాలు చేశారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె. సుబ్బరావమ్మ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె. శ్రీదేవి, పిన్నమనేని విజయ, ఉపాధ్యక్షురాలు వై. జోయ, జి. నాగమణి, మల్లంపల్లి జయమ్మ తదితరులు పాల్గొన్నారు. -
పెను విషాదం
రోడ్డు ప్రమాదంలో ఏడుగురి దుర్మరణం మృతులంతా గోదావరి జిల్లాల వాసులే వీరవల్లి వద్ద ఘటన తమ బంధువుల ఇంట్లో జరిగే కార్యక్రమానికి వెళ్తున్న వారు కొందరు.. రుణమాఫీకి ఆధార్ను అనుసంధానం చేసుకునేందుకు మరికొందరు.. ఇలా కారణాలు వేరైనా వారందరూ కూలి కోసం పొట్ట చేతపట్టుకుని వెళుతున్న వారే. మరికొన్ని గంటల్లో గమ్యస్థానం చేరాల్సి ఉండగా, గాఢనిద్రలోనే రోడ్డు ప్రమాదం రూపంలో దూసుకొచ్చిన మృత్యుఒడికి చేరుకున్నారు. కళ్ల ఎదుటే తమ కుటుంబ సభ్యులు మరణించడంతో గాయపడి చికిత్స పొందుతున్న బంధువుల రోదనలు మిన్నంటాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. విజయవాడ సిటీ/వీరవల్లి (హనుమాన్జంక్షన్రూరల్) : వేర్వేరు ప్రాంతాలకు చెందిన బంధువులు, పరసర గ్రామాలకు చెందిన మరి కొందరు బతుకుదెరువు కోసం హైదరాబాదు వెళ్లారు. ఇక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లి తిరిగొస్తూ మార్గమధ్యంలో రోడ్డుప్రమాదానికి గురై ఏడుగురు మృత్యువాత పడటం అందరినీ కలచివేసింది. శనివారం తెల్లవారుజామున హనుమాన్ జంక్షన్ మండలం వీరవల్లి వద్ద ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ఆరుగురు గాయపడ్డారు. బంధువుల ఇంట్లో కార్యక్రమానికి వస్తూ.. ఇటీవల మృతిచెందిన బంధువు పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెల్లిపల్లి శ్రీనివాసరావు, తన సోదరి, కుమార్తె, కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసరావు, అతని బావ కోనాల మరాఠీ, మేనల్లుడు మణికంఠ, మనవడు శ్రీకృష్ణ మృత్యువాతపడ్డారు. వీరంతా పశ్చిమ గోదారి జిల్లా తాళ్లపూడి, వీరవల్లి మండలాలకు చెందిన వారు. వీరిలో శ్రీనివాసరావు భార్య నాగమణి, సోదరి సీతామాలక్ష్మి, కుమార్తె సత్యవేణి, ఆమె కుమారుడు ఆదిత్య విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రుణమాఫీ కోసం వస్తూ.. ప్రభుత్వం రుణమాఫీ కోసం ఆధార్ను అనుసంధానం చేయించుకోవాలని చెప్పడంతో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం వేములపాలెం, పెద్దిపాలెం గ్రామాలకు చెందిన పుట్టా నాగభూషణం, బంధం లవరాజు కుటుంబ సభ్యులు కూడా శ్రీనివాసరావు బృందంతో కలిసి స్వస్థలానికి బయలుదేరారు. ఈ ప్రమాదంలో నాగభూషణం, అతని భార్య నాగమణి, బంధం లోవరాజు మృతిచెందారు. లోవరాజు భార్య కాసులమ్మ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం గురించి తెలిసిన బంధువులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మృతదేహాలను ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించినట్టు సమాచారం తెలసుకొని బోరున విలపిస్తూ అక్కడికి వెళ్లారు. డ్రైవరు అజాగ్రత్త వల్లే.. ఆర్గానిక్ కెమికల్స్ లోడుతో వస్తూ ప్రయాణికులను ఎక్కించుకోవడంతోపాటు అజాగ్రత్తగా వ్యాన్ను నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. నిద్రమత్తుకు లోనైన స్థితిలో డ్రైవరు ఆగి వున్న లారీని ఢీకొట్టినట్టు వివరించారు. ప్రమాద సమయంలో వ్యానులోని కెమికల్ పీపాలు పగిలి ఆవిర్లతో కూడిన పొగ దట్టంగా వ్యాపించింది. ప్రమాదాన్ని చూసిన స్థానికులు రక్షించేందుకు వెళ్లగా, కళ్లలో మంటలు రావడంతో భయభ్రాంతులకు గురై వెనుదిరిగారు. పోలీసులు, రెవెన్యూ, రవాణా శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకొని స్థానికులు రాకుండా చర్యలు తీసుకున్నారు. ఆస్పత్రిలో బాధితుల ఆర్తనాదాలు విజయవాడ : ‘అమ్మా.. ముఖం మంట పుడుతుంది...’ అంటూ నాలుగేళ్ల చిన్నారి ఆర్తనాదాలు.. ‘అమ్మా... కాలు నొప్పిగా ఉంది.. మంచినీళ్లు ఇవ్వమ్మా..’ అంటూ పన్నెండేళ్ల బాలుడి కేకలు. వారి ఆర్తనాదాలు వినిలేని స్థితిలో తల్లులు.. ప్రభుత్వాస్పత్రి అత్యవసర చికిత్స విభాగంలో శనివారం ఉదయం నెలకొన్న పరిస్థితి ఇదీ. గాయాల బాధ భరించలేక ఆర్తనాదాలు చేస్తూనే పన్నెండేళ్ల మణికంఠ మృతి చెందాడు. పిల్లలు, భర్తలను కోల్పోయి.. ప్రాణాపాయస్థితిలో ఉన్న మహిళలు తమను పట్టించుకునేందుకు అయినవారెవరూ లేక ఆస్పత్రిలో అల్లాడిపోయారు. పశ్చిమగోదారి జిల్లా వీరవల్లి మండలం, అనంతపల్లికి చెందిన తమ్మిశెట్టి సత్యవేణి(25)కి భర్త కొంతకాలంగా దూరంగా ఉంటున్నాడు. దీంతో ఆమె కుమారులు శ్రీకృష్ణ(6), ఆదిత్య(4)లను తీసుకుని తండ్రి వెల్లిపల్లి శ్రీనివాసరావుతో కలిసి హైదరాబాద్ దిల్షుక్నగర్లో ఉంటోంది. కూలిపనులు చేసి ఇద్దరు పిల్లలను పోషిస్తోంది. శనివారం నాటి ప్రమాదంలో శ్రీకృష్ణ మృతి చెందగా, ఆదిత్య ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నాడు. సత్యవేణి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఆమె తండ్రి శ్రీనివాసరావు కూడా ప్రమాదంలో మృతి చెందగా, తల్లి నాగమణి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. ఇలా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు, వారికి పరిచయస్తులైన ముగ్గురు ఈ ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబాలు, బంధువుల్లో తీవ్ర విషాదం నెలకొంది. -
కేసీఆర్ మాయల మరాఠీ
సంగారెడ్డి రూరల్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మాయమాటలతో పబ్బం గడుపుతున్నారని మాజీ డిప్యుటీ సీఎం దామోదర రాజనర్సింహ ఆరోపించారు. రైతు రుణమాఫీపైనే తొలి సంతకం పెడుతానన్న కేసీఆర్, హామీలు నెరవేర్చకుండా మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. మెదక్ లోక్సభ ఉప ఎన్నికల్లో భాగంగా శనివారం సంగారెడ్డి మండలంలోని కంది, కాశీపూర్, కలివేముల, చెర్లగూడెం, తోపుగొండ, జుల్కల్, ఇంద్రకరణ్, ఎద్దుమైలారం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జుల్కల్లో నిర్వహించిన బహిరంగ సభలో దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉచిత కరెంటు, రుణమాఫీపైనే తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కరెంటు అడిగిన రైతులపై లాఠీచార్జి చేయించారన్నారు. అందువల్ల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతాలకా్ష్మరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం సునీతాలకా్ష్మరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, తెల్ల రేషన్కార్డులు, బంగారుతల్లి పథకం, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ తదితర సంక్షేమ పథకాలను పేదల కోసం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అయితే హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కార్, సమగ్ర కుటుంబ సర్వే పేరుతో పేదలకు సంక్షేమ పథకాలు దూరం చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు. ఇంటికో ఉద్యోగం, ఎస్సీ కుటుంబానికి మూడెకరాల భూమి, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్, రుణమాఫీ తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తామని, మాయమాటలు చెబుతూ ఓటర్లను మభ్యపెడుతున్నారని విమర్శించారు. వంద రోజుల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట పొంతన లేకుండా మాట్లాడుతూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. అందుకోసం చేతి గుర్తుకు ఓటువేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జహీరాబాద్ మాజీ ఎంపీ సురేశ్షెట్కార్, ఎమ్మెల్యే రాంరెడ్డి, నాయకులు శ్రావణ్కుమార్రెడ్డి, సురేందర్గౌడ్, వెంకట్రెడ్డి, ప్రకాశ్, మహబూబ్పాషా, చంద్రయ్య, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘బీమా’కు రుణమాఫీ గండం!
- ప్రభుత్వ విధానాలతో రైతన్నకు నష్టం - మాఫీ కాని పాత రుణాలు - కొత్త రుణాలివ్వని బ్యాంకులు - రైతులు ప్రీమియం చెల్లిస్తేనే బీమా వర్తింపు - ముగియనున్న గడువు శ్రీకాకుళం అగ్రికల్చర్: తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రైతన్న పాలిట శాపంగా మారాయి. రుణమాఫీపై వ్యవహరిస్తున్న కప్పదాటు వైఖరి పంటల బీమాపై ధీమా లేకుండా చేస్తోంది. రైతులు తీసుకున్న పంట రుణాలు ఇంకా మాఫీ కాకపోవడం, బకాయిలను లబ్ధిదారులు చెల్లించకపోవడంతో బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. ఫలితంగా ఖరీఫ్ పంటలకు బీమా వర్తించే అవకాశం లేకుండా పోతోంది. పంట బీమా కావాలంటే రైతులే సొంతంగా ప్రీమియం చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి ఈ నెల 15వ తేదీ వరకే గడువు ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదీ సంగతి.. ప్రకృతి వైఫరీత్యాల కారణంగా పంట నష్టపోయే రైతులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకు రుణం తీసుకున్న వారికి ఈ పథకం దానంతట అదే వర్తిస్తోంది. రుణం తీసుకోని పక్షంలో రైతు సొంతంగా ప్రీమియం చెల్లించాలి. పంట సాగుకు ముందే ప్రీమియం చెల్లించాల్సి ఉండడంతో చాలామంది రైతులు ముందుకు రావడం లేదు. సాగు మదుపులకే అప్పులు చేస్తున్న తరుణంలో మళ్లీ వీటన్నింటికీ పెట్టుబడి పెట్టాలంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నదాత వాపోతున్నాడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పంట రుణాలు మాఫీ చేస్తున్నట్టు టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రైతులు బ్యాంకులకు బకాయిలు చెల్లించలేదు. రుణ మాఫీపై ఎలాంటి ఉత్తర్వులు అందకపోవడంతో బకాయిలున్న రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. ఫలితంగా పంటల బీమా పథకం వర్తించే అవకాశం లేకుండా పోతోంది. ప్రస్తుతం ఖరీఫ్ సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పంట పెట్టుబడుల కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారు. ఈ పరిస్థితిలో సొంతంగా బీమా ప్రీమియం చెల్లించడం వారికి భారంగా పరిణమిస్తోంది. అటు ప్రభుత్వ విధానాలు, ఇటు తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. వాస్తవానికి పంటల బీమా పథకం ప్రీమియం చెల్లింపునకు జూలై 30వ తేదీ వరకే గడువు. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా సమయూన్ని ఈ నెల 15వ తేదీ వరకూ పొడిగించారు. మరోసారి గడవు పొడిగించినా.. లేకపోరుునా రైతులు మాత్రలు జాగ్రత్త పడాలని, వెంటనే ప్రీమియం చెల్లించాలని వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కౌలు రైతులదీ అదే పరిస్థితి బీమా పథకం వర్తింపులో కౌలు రైతుల పరిస్థితి దయానీయంగా తయారైంది. రెవెన్యూ అధికారులు రుణ అర్హత కార్డులు ఇస్తేనే బీమా ప్రీమియం చెల్లించేందుకు వారికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇంతవరకు రుణ అర్హత కార్డులు మంజూరు చేయలేదు. ఫలితంగా కౌలు రైతులు సొంతంగా ప్రీమియం చెల్లించే పరిస్థితుల్లేవు.