Ishan Kishan
-
చాంపియన్స్ ట్రోఫీ: ‘భారత తుదిజట్టులో ఇషాన్, చహల్’!
క్రికెట్ అభిమానులకు వినోదం పంచేందుకు చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) రూపంలో మెగా ఈవెంట్ సిద్ధమైంది. పాకిస్తాన్(Pakistan) వేదికగా ఫిబ్రవరి 19న ఈ ఐసీసీ టోర్నమెంట్ మొదలుకానుండగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్లను దుబాయ్లో ఆడనుంది. ఇక ఈ టోర్నీలో ఆతిథ్య పాకిస్తాన్తో పాటు భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పాల్గొనున్నాయి.గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్... అదే విధంగా గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎనిమిది దేశాల బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. బీసీసీఐ కూడా పదిహేను మంది సభ్యులతో కూడిన వివరాలు వెల్లడించింది.అయితే, టీమిండియాలో ప్రతిభ గల ఆటగాళ్లకు కొదవలేదు. కానీ కొన్ని సందర్భాల్లో తుదిజట్టు కూర్పు, పిచ్ స్వభావం, టోర్నీకి ముందు ప్రదర్శన.. తదితర అంశాల ఆధారంగా చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపికకాని స్టార్లు చాలా మందే ఉన్నారు. మరి వారితో కూడిన భారత జట్టు, ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో చూద్దామా?..ఓపెనర్లుగా ఆ ఇద్దరురుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)లను ఓపెనర్లుగా ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. రుతు లిస్ట్- ‘ఎ’ క్రికెట్లో 56.15 సగటు కలిగి ఉండి.. ఫార్మాట్ చరిత్రలోనే అత్యధిక యావరేజ్ కలిగిన ఐదో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.మరోవైపు జైస్వాల్ బ్యాటింగ్ సగటు కూడా ఇందులో 52.62గా ఉంది. 33 మ్యాచ్లు ఆడిన అతడి ఖాతాలో ఐదు శతకాలు, ఒక డబుల్ సెంచరీ కూడా ఉన్నాయి ఇక వీరిద్దరికి అభిషేక్ శర్మను బ్యాకప్ ప్లేయర్గా జట్టులోకి తీసుకోవచ్చు.వికెట్ కీపర్గా ఇషాన్మరో ఓపెనింగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ను వికెట్ కీపర్ కోటాలో ఎంపిక చేయవచ్చు. వన్డేల్లో అతడి ఖాతాలో ఏకంగా ద్విశతకం ఉంది. అంతేకాదు.. వన్డే ప్రపంచకప్-2023లోనూ ఆడిన అనుభవం కూడా పనికి వస్తుంది.శతకాల ధీరుడు లేకుంటే ఎలా?ఇటీవలి కాలంలో సూపర్ ఫామ్లో ఉన్న బ్యాటర్ ఎవరైనా ఉన్నారా అంటే.. కరుణ్ నాయరే. దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో అతడు పరుగుల వరద పారించాడు. తాజా సీజన్లో ఏకంగా ఐదు శతకాలు బాది 750కి పైగా పరుగులు చేశాడు. కానీ అతడిని టీమిండియా సెలక్టర్లు పట్టించుకోలేదు.ఏదేమైనా మిడిలార్డర్లో తిలక్ వర్మతో కలిసి కరుణ్ నాయర్ ఉంటే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. ఇక ఆల్రౌండర్లుగా శివం దూబే, రియాన్ పరాగ్లను ఎంపిక చేసుకోవచ్చు. వీరిద్దరు గతేడాది శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడారు.బౌలర్ల దళంచాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్లకు దుబాయ్ వేదికగా కాబట్టి పరాగ్తో పాటు ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లను తుదిజట్టులోకి తీసుకుంటే బెటర్. యుజువేంద్ర చహల్తో పాటు ఆర్. సాయికిషోర్ ఇక్కడ మన ఛాయిస్. ఈ ముగ్గురు మూడు రకాల స్పిన్నర్లు.పరాగ్ రైట్, కిషోర్ లెఫ్టార్మ్ స్పిన్నర్లు అయితే.. చహల్ మణికట్టు స్పిన్నర్.. వీరికి బ్యాకప్గా రవి బిష్ణోయి ఉంటే సానుకూలంగా ఉంటుంది.ఇక పేసర్ల విషయానికొస్తే.. ముగ్గురు జట్టులో ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది. మహ్మద్ సిరాజ్తో పాటు ప్రసిద్ కృష్ణ.. వీరికి బ్యాకప్గా ఆవేశ్ ఖాన్. ఇదిలా ఉంటే.. ఇషాన్ కిషన్కు బ్యాకప్గా ధ్రువ్ జురెల్ను రెండో వికెట్ కీపర్గా ఎంపిక చేసుకోవచ్చు. ఇక యశస్వి జైస్వాల్తో పాటు శివం దూబే చాంపియన్స్ ట్రోఫీ నాన్- ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్ల లిస్టులో ఉన్న విషయం తెలిసిందే.చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపిక కాని, అత్యుత్తమ భారత తుదిజట్టురుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్*, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, కరుణ్ నాయర్, శివమ్ దూబే*, రియాన్ పరాగ్, ఆర్. సాయి కిషోర్, యుజువేంద్ర చహల్, మహమ్మద్ సిరాజ్*, ప్రసిద్ కృష్ణ.బెంచ్: అభిషేక్ శర్మ, ఆవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, ధృవ్ జురెల్.చదవండి: CT 2025: సురేశ్ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్కప్ వీరులకు నో ఛాన్స్! -
‘అతడిని మర్చిపోయాం.. ఇప్పట్లో టీమిండియా రీఎంట్రీ కష్టమే!’
టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్(Ishan Kishan)ను ఉద్దేశించి భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెండు ప్రపంచకప్ టోర్నీలు ఆడిన అతడిని అందరూ త్వరగానే మర్చిపోయామన్నాడు. ఇప్పట్లో ఇషాన్ టీమిండియా తరఫున పునరాగమనం చేసే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డాడు.కాగా 2023లో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అకస్మాత్తుగా స్వదేశానికి తిరిగి వచ్చిన ఇషాన్ కిషన్.. మేనేజ్మెంట్ ఆగ్రహానికి గురయ్యాడు. తిరిగి జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆదేశాలను పెడచెవిన పెట్టాడు. నాటి హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచనలను కూడా లెక్కచేయక మొండిగా వ్యవహరించాడు.సెంట్రల్ కాంట్రాక్టు పాయె!ఈ క్రమంలో బీసీసీఐ ఇషాన్ కిషన్పై కఠిన చర్యలు తీసుకుంది. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి అతడిని తప్పించింది. దీంతో దిగొచ్చిన ఇషాన్ తన సొంతజట్టు జార్ఖండ్ తరఫున దేశీ క్రికెట్ బరిలో దిగాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది.వికెట్ కీపర్ల కోటాలో టీ20 ఫార్మాట్లో సంజూ శాంసన్(Sanju Samson) ముందుకు దూసుకురాగా.. టెస్టుల్లో రిషభ్ పంత్తో కలిసి ధ్రువ్ జురెల్ పాతుకుపోయాడు. ఇక వన్డేల్లో సీనియర్ కేఎల్ రాహుల్ ఉండనే ఉన్నాడు. ఈ క్రమంలో రీఎంట్రీ కోసం ప్రయత్నించిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్కు వరుసగా ఎదురుదెబ్బలే తగిలాయి.ప్రపంచకప్లో ఆడినా..వన్డే ప్రపంచకప్-2023 జట్టులో కేఎల్ రాహుల్తో పాటు ఇషాన్ను ఎంపిక చేసినా.. అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 టీమ్లో మాత్రం రిషభ్ పంత్, సంజూ శాంసన్లకు బీసీసీఐ మొదటి ప్రాధాన్యం ఇచ్చింది. ఇక తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు సంజూ- జురెల్లను ఎంపిక చేసిన బోర్డు.. వన్డేలకు రాహుల్- పంత్లను ఎంచుకుంది.అదే విధంగా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టులోనూ కేఎల్ రాహుల్, రిషభ్ పంత్లకే వికెట్ కీపర్ కోటాలో చోటిచ్చింది. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్కు మద్దతుగా ఉండే కొంతమంది నెటిజన్లు.. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడిని ఎందుకు ఆడించడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఈ విషయమై ఆకాశ్ చోప్రాను స్పందించాల్సిందిగా కోరారు. డబుల్ సెంచరీ కూడా చేశాడు.. కానీఇందుకు బదులిస్తూ.. ‘‘ఇషాన్ కిషన్.. అతడిని మనం ఇంతత్వరగా మర్చిపోవడం ఆసక్తికరమే!.. మళ్లీ అతడిని గుర్తు కూడా చేసుకోవడం లేదు. అతడు టీమిండియా తరఫున రెండు ప్రపంచకప్ టోర్నీలు ఆడాడు. దుబాయ్లో టీ20 ప్రపంచకప్.. సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్ ఆడాడు. వన్డేల్లో అతడి పేరిట డబుల్ సెంచరీ కూడా ఉంది.కాకపోతే అతడు చేసిన తప్పు ఇప్పటికీ వెంటాడుతోంది. ఫస్ల్ క్లాస్ క్రికెట్ ఆడటం ఇష్టం లేదనే సందేశం ఇచ్చాడు. అయితే, సెలక్టర్లకు ఇది నచ్చలేదు. అందుకే బీసీసీఐ అతడి ప్రాధాన్యం తగ్గించింది. ఇప్పట్లో సెలక్టర్లు మళ్లీ అతడిని కనికరించకపోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్లో గనుక సత్తా చాటితే ఏదేమైనా ప్రస్తుతం ధ్రువ్ జురెల్తో పోటీలో ఇషాన్ కిషన్ వెనుకబడి పోయాడన్న ఆకాశ్ చోప్రా.. జట్టులో చోటు కోసం మరికొంత కాలం ఓపికగా ఎదురుచూడక తప్పదని పేర్కొన్నాడు. సెలక్టర్లు అతడి గత ప్రదర్శనలు పరిగణనలోకి తీసుకోవడం లేదని.. ఈసారి ఐపీఎల్లో గనుక సత్తా చాటితే పరిస్థితి మారవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ. 11.25 కోట్లకు ఇషాన్ కిషన్ను కొనుగోలు చేసింది.చదవండి: CT 2025: బుమ్రా, కోహ్లి కాదు!.. టీమిండియా ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అతడే: డివిలియర్స్ -
ఇషాన్ కిషన్ విధ్వంసకర సెంచరీ.. 16 ఫోర్లు, 6 సిక్సర్లతో
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ దేశీవాళీ క్రికెట్లో తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టిన కిషన్.. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో కూడా అదే జోరును కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో జార్ఖండ్కు సారథ్యం వహిస్తున్న కిషన్.. సోమవారం మణిపూర్తో జరిగిన మ్యాచ్లో విధ్వంసకర సెంచరీతో మెరిశాడు.255 పరుగుల లక్ష్య చేధనలో కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ది బౌలర్లను ఈ జార్ఖండ్ డైనమెట్ ఊచకోత కోశాడు. కేవలం 78 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్లతో 134 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా జార్ఖండ్ లక్ష్యాన్ని కేవలం 2 వికెట్ల మాత్రమే కోల్పోయి 28.3 ఓవర్లలో చేధించింది. కిషన్తో పాటు మరో ఓపెనర్ ఉత్కర్ష్ సింగ్(68) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన మణిపూర్ 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. మణిపూర్ బ్యాటర్లలో ప్రియోజిత్ సింగ్(43), జాన్సెన్ సింగ్(69) పరుగులతో రాణించారు. జార్ఖండ్ బౌలర్లలో అనుకుల్ రాయ్, ఉత్కర్ష్ సింగ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. వికాస్ సింగ్,సుప్రీయో చక్రవర్తి తలా వికెట్ సాధించారు.కాగా ఇషాన్ కిషన్ గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తమ ఆదేశాలను ధిక్కరించినందుకు బీసీసీఐ అతడిపై వేటు వేసింది. ఇప్పుడు దేశీవాళీ క్రికెట్లో రాణిస్తూ రీఎంట్రీ దిశగా ఇషాన్ అడుగులు వేస్తున్నాడు. -
ఇషాన్ కిషన్ ఊచకోత.. 5 ఫోర్లు, 9 సిక్స్లతో తుపాన్ ఇన్నింగ్స్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, జార్ఖండ్ స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం వాంఖడే వేదికగా అరుణాచాల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో జార్ఖండ్ తరపున కిషన్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అరుణాచాల్ బౌలర్లను ఉతికారేశాడు. 23 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్లతో 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా 94 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 4.3 ఓవర్లలోనే జార్ఖండ్ వికెట్ నష్టపోకుండా ఊదిపడేసింది. అతడితో పాటు మరో ఓపెనర్ ఉత్కర్ష్ సింగ్(13) ఆజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్లో తొలుత బౌలింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌటైంది. జార్ఖండ్ బౌలర్లలో స్పిన్నర్ అనుకుల్ రాయ్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. రవి కుమార్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు.ఎస్ఆర్హెచ్లోకి ఎంట్రీ..కాగా ఇటీవలే జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలో కిషన్ భారీ ధర దక్కింది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ను సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 11.25 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్ వరకు అతడు ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించాడు.కానీ ఈసారి అతడిని ముంబై రిటైన్ చేసుకోలేదు. కాగా దేశీవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించడంతో కిషాన్ సెంట్రాల్ కాంట్రాక్ట్ను కోల్పోయాడు. దాదాపు ఏడాది నుంచి జాతీయ జట్టుకు కూడా దూరంగా ఉన్నాడు. -
ఇషాన్ కిషన్కు కళ్లు చెదిరే ధర.. రూ. 14.5 కోట్లకు వారి సొంతం!
టీమిండియాకు దూరమైన ఇషాన్ కిషన్కు ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనూ ఈ ఏడాది కలిసి రాలేదు. ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్-2024లో ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. పద్నాలుగు మ్యాచ్లలో కలిపి 320 పరుగులు చేయగలిగాడు. అయితే, మెగా వేలానికి ముందు ముంబై ఫ్రాంఛైజీ మాత్రం అతడిని వదిలేసింది.జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలతో పాటు యువ క్రికెటర్ తిలక్ వర్మను రీటైన్ చేసుకున్న ముంబై.. ఇషాన్ పేరును మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. నిజానికి 2018లో ముంబై తరఫునే క్యాచ్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. ఆరంభం నుంచే మెరుగ్గా రాణించిన ఇషాన్ కిషన్ కోసం ఐపీఎల్-2022లో ముంబై భారీ మొత్తం వెచ్చించింది.నాడు రూ. 15.25 కోట్ల ధరకు ముంబై సొంతంనాటి మెగా వేలంలో అతడిని ఏకంగా రూ. 15.25 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. కానీ.. అప్పటి నుంచి నేటి దాకా ఇషాన్ కిషన్ అందుకు తగ్గ పైసా వసూల్ ప్రదర్శన మాత్రం ఇవ్వలేకపోయాడు. అంతేకాదు.. దేశవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించి సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయి.. జాతీయ జట్టుకూ దూరమయ్యాడు.అయితే, ఇటీవలే రంజీల్లో సెంచరీలు చేయడంతో రీ ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్.. భారత్-‘ఎ’ జట్టుకు సెలక్ట్ అయ్యాడు. కానీ.. ఆస్ట్రేలియా గడ్డపై కంగారూ జట్టుతో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్లో పూర్తిగా విఫలమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఇషాన్ కిషన్ ఐపీఎల్-2025 మెగా వేలంలోకి రాబోతున్నాడు.వికెట్ కీపర్ కోటాలో కళ్లు చెదిరే మొత్తంఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిర్వహించిన ‘మాక్ వేలం’లో మాత్రం ఇషాన్ కిషన్ భారీ ధర పలకడం విశేషం. మెగా వేలంలో ఇషాన్ రూ. 2 కోట్ల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్నాడు. అయితే, అశ్విన్ మాత్రం తన వేలంలో.. వికెట్ కీపర్ కోటాలో ఇషాన్ కోసం బిడ్ వేసే ఫ్రాంఛైజీలు రూ. 5 కోట్ల నుంచి మొదలుపెట్టాలని సూచించాడు.ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ. 5 కోట్లకు బిడ్ వేయగా.. క్రమక్రమంగా ఇషాన్ ధర రూ. 10 కోట్లకు పెంచింది. దీంతో పంజాబ్ కింగ్స్ రేసు నుంచి తప్పుకోగా.. లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం వికెట్ కీపర్ కోసం ఏకంగా రూ. 14.5 కోట్లు వెచ్చించి దక్కించుకుంది.ఏకంగా రూ. 21 కోట్ల మొత్తానికి అతడు ఉన్నా కూడాఅయితే, అశ్విన్ నిర్వహించిన ఈ మాక్వేలంలో ఇషాన్ కిషన్కు కళ్లు చెదిరే మొత్తం దక్కడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్లో లేని ఇషాన్ కోసం.. మెగా వేలంలో ఏ ఫ్రాంఛైజీ అంతగా ఆసక్తి చూపదని.. మహా అయితే, అతడికి రూ. ఐదు కోట్లు దక్కవచ్చని క్రికెట్ ప్రేమికులు అంటున్నారు.అంతేకాదు.. లక్నో ఇప్పటికే వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ను ఏకంగా రూ. 21 కోట్ల మొత్తానికి అట్టిపెట్టుకుంది. అలాంటిది.. ఇషాన్ను ఆ ఫ్రాంఛైజీ కొనుక్కోవడం ఏమిటంటూ అశూ మాక్ వేలంలో లక్నో తరఫున పాల్గొన్న అభిమానులను ట్రోల్ చేస్తున్నారు. కాగా సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా నవంబరు 24, 25 తేదీల్లో మెగా వేలం జరుగనుంది.చదవండి: BGT 2024: టీమిండియాకు గుడ్న్యూస్ -
IPL 2025: ఇషాన్ కాదు.. వాళ్లిద్దరికోసం ముంబై పోటీ.. వాషీ కూడా రేసులోనే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025 మెగా వేలానికి ముహూర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో నవంబరు 24, 25 తేదీల్లో వేలంపాట నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అందరి కళ్లు టీమిండియా స్టార్లపైనే ఉన్నాయి.రేసులో భారత స్టార్లురిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ సహా రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్ తదితర సీనియర్ ప్లేయర్లు కూడా రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి ముంబై ఇండియన్స్ భారత స్పిన్నర్లను దక్కించుకునేందుకు ఇతర ఫ్రాంఛైజీలతో కచ్చితంగా పోటీపడుతుందని అభిప్రాయపడ్డాడు.పాలసీ పరిపూర్ణంగా ఉపయోగించుకునికాగా ఈసారి రిటెన్షన్ విధానాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకున్న జట్టు ముంబై ఇండియన్స్ అని చెప్పవచ్చు. నిబంధనలకు అనుగుణంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లను అట్టిపెట్టుకుంది. జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మలను కొనసాగించాలని నిర్ణయించుకుంది.ఇక వీళ్లందరికి ఖర్చు పెట్టింది పోనూ.. ముంబై పర్సులో ఇంకా రూ. 45 కోట్లు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘ముంబై బ్యాటింగ్ ఆర్డర్ మరోసారి పటిష్టంగానే కనిపిస్తోంది. అయితే, వాళ్ల రిటెన్షన్ లిస్టులో బుమ్రా రూపంలో ఒకే ఒక స్పెషలిస్టు బౌలర్ ఉన్నాడు.కాబట్టి వారికి ఇప్పుడు బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నిజానికి ముంబై 225- 250 పరుగులు స్కోరు చేయగల సామర్థ్యం కలిగిన జట్టు. అయితే, అదే స్థాయిలో పరుగులు కూడా సమర్పించుకున్న సందర్భాలు ఉన్నాయి.బ్యాటింగ్ పైనే ఎక్కువగా ఏదేమైనా వాళ్లు బ్యాటింగ్ పైనే ఎక్కువగా ఆధారపడతారన్నది వాస్తవం. కానీ ప్రతిసారీ ఇదే టెక్నిక్ పనికిరాదు. వాళ్ల జట్టులో ఉంటే ఇండియన్ బ్యాటింగ్ లైనప్.. విదేశీ బౌలింగ్ లైనప్ ఉంటుంది. ఇప్పుడు వారికి ఇద్దరు స్పిన్నర్ల అవసరం కూడా ఉంది. అందుకే కచ్చితంగా వాళ్లు యుజీ చహల్ వెనుకపడటం ఖాయం.ఇషాన్ కాదుఒకవేళ అతడిని దక్కించుకోలేకపోతే.. ముంబై ఇండియన్స్ వాషింగ్టన్ సుందర్నైనా సొంతం చేసుకుంటుంది’’ అని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ఇషాన్ కిషన్ పేరును కూడా ప్రస్తావించిన ఆకాశ్ చోప్రా.. అతడిని ముంబై కొనుగోలు చేసే అవకాశం లేదని అభిప్రాయపడ్డాడు. వికెట్ కీపర్ కోటాలో ఇషాన్ను పరిగణించినా.. క్వింటన్ డికాక్ లేదంటే జితేశ్ శర్మ వైపు మొగ్గు చూపుతుందని అంచనా వేశాడు. చదవండి: Aus vs Pak: ఆసీస్కు కొత్త కెప్టెన్ -
Aus A vs Ind A: రుతు, నితీశ్ డకౌట్.. అభిమన్యు, ఇషాన్ విఫలం
ఆస్ట్రేలియా-‘ఎ’తో అనధికారిక తొలి టెస్టులో భారత-‘ఎ’ జట్టు ఆటగాళ్లు పూర్తిగా నిరాశపరిచారు. రంజీల్లో పరుగుల వరద పారించిన ఓపెనింగ్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ 7 పరుగులకే పెవిలియన్ చేరగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ డకౌట్గా వెనుదిరిగాడు.వన్డౌన్లో వచ్చిన సాయి సుదర్శన్(35 బంతుల్లో 21), నాలుగో నంబర్ బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్(77 బంతుల్లో 36) ఫర్వాలేదనిపించగా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన వాళ్లలో పేసర్ నవదీప్ సైనీ(23) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగాడు.బాబా అపరాజిత్(9)తో పాటు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(4) విఫలం కాగా.. నితీశ్ కుమార్ రెడ్డి డకౌట్ అయ్యాడు. మానవ్ సుతార్ (1), ప్రసిద్ కృష్ణ(0) కూడా చేతులెత్తేశారు. ఆఖర్లో వచ్చిన ముకేశ్ కుమార్ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇలా ఆసీస్ బౌలర్ల ధాటికి బ్యాటర్లంతా పెవిలియన్కు క్యూ కట్టడంతో 47.4 ఓవర్లలో 107 పరుగులకే భారత్ ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో పేసర్ బ్రెండన్ డాగెట్ ఆరు వికెట్లతో చెలరేగగా.. మరో పేసర్ ఫెర్గూస్ ఒ నీల్, స్పిన్నర్ టాడ్ మర్ఫీ ఒక వికెట్ పడగొట్టాడు. మూకుమ్మడిగా విఫలంకాగా ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్లో భారత తుది జట్టులో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా భారత యువ ఆటగాళ్లు అనధికారిక టెస్టులపై దృష్టి పెట్టారు. ఈ రెండు మ్యాచ్ల సిరీస్లో సత్తా చాటి టీమ్ మేనేజ్మెంట్ను ఇంప్రెస్ చేయాలని పట్టుదలగా ఉన్నారు. ఈ క్రమంలో ఆసీస్-ఎతో గురువారం నుంచి భారత్-ఎ తొలి అనధికారిక టెస్టు మొదలైంది. అయితే, తొలి ఇన్నింగ్స్లోనే అందరూ మూకుమ్మడిగా విఫలం కావడం గమనార్హం. ముఖ్యంగా సీనియర్ టీమ్కు ఎంపికైన అభిమన్యు ఈశ్వరన్, నితీశ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్లో నిరాశపరచగా.. ప్రసిద్ కృష్ణ వికెట్లు తీస్తేనే సెలక్టర్ల దృష్టిని ఆకర్షించగలడు.దేశవాళీల్లో సత్తా చాటి... 11 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఈశ్వరన్ భారీగా పరుగులు సాధించినా దురదృష్టవశాత్తూ ఇప్పటి వరకు జాతీయ జట్టుకు ఆడే అవకాశం రాలేదు. 99 మ్యాచ్లలో అతను 7638 పరుగులు సాధించగా, ఇందులో 27 సెంచరీలు ఉన్నాయి. ఇక ఆసీస్-ఎతో జరుగుతున్న తాజా మ్యాచ్ అతడికి 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ .ఇంతటి అపార అనుభవం ఉన్న ఈశ్వరన్ పేరు పెర్త్లో జరిగే తొలి టెస్టు కోసం ఇప్పటికే పరిశీలనలో ఉంది. వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరం అయ్యే అవకాశం ఉండటంతో రెగ్యులర్ ఓపెనర్గా ఈశ్వరన్కే తొలి ప్రాధాన్యత ఉంది. గాయాల నుంచి కోలుకునిఇక గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేసిన తర్వాత దులీప్ ట్రోఫీ, ఇరానీ, రంజీలలో పేసర్ ప్రసిధ్ కృష్ణ ఆడాడు. వీటిలో ప్రదర్శన గొప్పగా లేకపోయినా... అతని బౌలింగ్ శైలికి ఆసీస్ పిచ్లు సరిగ్గా సరిపోతాయి. ఇదే కారణంతో అతను సీనియర్ టీమ్లోకి ఎంపికయ్యాడు. ఐదు టెస్టుల సిరీస్కు ముందు తన ఫామ్ను అందుకోవడంతో పాటు ఫిట్నెస్ నిరూపించుకునేందుకు కూడా ప్రసిద్కు ఇది సరైన వేదిక కానుంది. ఐపీఎల్లో మెరుపు బ్యాటింగ్తోఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి పరిస్థితి వీరితో పోలిస్తే భిన్నం. ఐపీఎల్లో మెరుపు బ్యాటింగ్తో పాటు ఇటీవల బంగ్లాదేశ్పై టి20లో చెలరేగిన నితీశ్ ఫస్ట్ క్లాస్ రికార్డు అద్భుతంగా ఏమీ లేదు. ఇటీవల దులీప్ ట్రోఫీలో కూడా ఐదు ఇన్నింగ్స్లలో రెండు సార్లు డకౌట్ అయిన అతను... 48 ఓవర్లు బౌలింగ్ చేసి రెండే వికెట్లు తీశాడు.అయినా సరే శార్దుల్ ఠాకూర్లాంటి ఆల్రౌండర్ను కాదని నితీశ్ను సెలక్టర్ల టెస్టు టీమ్కు ఎంపిక చేశారు. గత ఏడాది రంజీ సీజన్లో 25 వికెట్లు తీసిన నితీశ్ ప్రదర్శన కూడా ఒక కారణం కాగా... వికెట్కు ఇరు వైపులా బంతిని చక్కగా స్వింగ్ చేసే అతని నైపుణ్యం ఆసీస్ పిచ్లపై పనికొస్తుందని వారు భావించారు. ఈ నేపథ్యంలో తానేంటో నిరూపించుకోవాల్సిన బాధ్యత నితీశ్పైనే ఉంది. టెస్టు క్రికెటర్లు కూడా... భారత్ తరఫున ఇంకా టెస్టులు ఆడని రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో భారత ‘ఎ’ జట్టు బరిలోకి దిగింది. ఇప్పటికే భారత్కు ఆడిన ఇషాన్ కిషన్, నవదీప్ సైనీ, దేవదత్ పడిక్కల్, ముకేశ్ కుమార్లాంటి ప్లేయర్లు మరోసారి ఎరుపు బంతితో తమ ఆటను నిరూపించుకోవాల్సి ఉంది.ఆసీస్ క్రికెటర్లకూ పరీక్షఇక రంజీ, దులీప్ ట్రోఫీలో రాణించి ఈ టీమ్కు ఎంపికైన బాబా ఇంద్రజిత్, రికీ భుయ్, ఖలీల్, తనుశ్ కొటియాన్, సాయిసుదర్శన్ రాణించడం వారి భవిష్యత్తుకు కీలకం. మరోవైపు ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టులో కూడా పలువురు టెస్టు క్రికెటర్లు ఉన్నారు. మైకేల్ నెసర్, మార్కస్ హారిస్, స్కాట్ బోలండ్, కామెరాన్ బాన్క్రాఫ్ట్, టాడ్ మర్ఫీ ఆసీస్ ప్రధాన జట్టులోకి పునరాగమనం చేసే ప్రయత్నంలో తమ అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటున్నారు.ఇక పరిమిత ఓవర్ల పోటీల్లో సత్తా చాటిన జోష్ ఫిలిప్ కూడా ఇక్కడ రాణించి టెస్టు అరంగేట్రాన్ని ఆశిస్తున్నాడు. అందరికంటే ఎక్కువగా న్యూసౌత్వేల్స్కు చెందిన 19 ఏళ్ల ఓపెనర్ స్యామ్ కొన్స్టాస్పై ఆస్ట్రేలియా సెలక్టర్లు ఎక్కువగా దృష్టి పెట్టారు.‘జూనియర్ రికీ పాంటింగ్’గా అందరూ పిలుస్తున్న ఈ బ్యాటర్ 6 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో 2 సెంచరీలు సహా 45.70 సగటుతో పరుగులు సాధించాడు. ఇక్కడ బాగా ఆడితే భారత్తో టెస్టుకు అతడు కొత్త ఓపెనర్గా బరిలోకి దిగే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ‘ఎ’ జట్ల పోరు కూడా ఆసక్తికరంగా సాగడం ఖాయం. చదవండి: IPL 2025: రిషభ్ పంత్ను వదులుకున్న ఢిల్లీ క్యాపిటల్స్Waking up early just to see Ruturaj score a golden duck. Bro not doing justice to his fans now pic.twitter.com/KDfzJmXXZ2— Div🦁 (@div_yumm) October 31, 2024 -
జేడీయూలో చేరిన క్రికెటర్ ఇషాన్ కిషన్ తండ్రి
టీమిండియా క్రికెటర్ ఇషాన్ కిషన్ తండ్రి ప్రణవ్ కుమార్ పాండే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బీహార్కు చెందిన ప్రణవ్ స్థానిక అధికార పార్టీ అయిన జనతాదల్ యునైటెడ్లో (జేడీయూ) చేరారు. జేడీయూ చీఫ్గా నితీశ్కుమార్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. చున్నూగానూ పిలువబడే ప్రణవ్ను జేడీయూ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాజ్యసభ సభ్యుడు సంజయ్ ఝా పార్టీలోకి ఆహ్వానించారు. పట్నాలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ప్రణవ్ జేడీయూ తీర్థం పుచ్చుకున్నారు. ప్రణవ్ పాండేకు ఇషాన్ కిషన్ తండ్రిగానే కాకుండా స్థానికంగా ప్రముఖ బిల్డర్గా మంచి పేరుంది. బిల్డర్గా ఉంటూనే ప్రణవ్ మెడికల్ స్టోర్ వ్యాపారంలోనూ ఉన్నారు. జేడీయూలో చేరిక సందర్భంగా ప్రణవ్ ఇలా అన్నారు. పార్టీ కోసం నమ్మకమైన సైనికుడిగా పని చేస్తానని తెలిపాడు. ఇదే సందర్భంగా జేడీయూ ఎంపీ సంజయ్ ఝా మాట్లాడుతూ.. సీఎం నితీశ్కుమార్ చేస్తున్న అభివృద్దిని చూసి ప్రణవ్ పార్టీలో చేరారన్నారు. ప్రణవ్ చేరిక మగద్ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేస్తుందని తెలిపారు.కాగా, ఇషాన్ కిషన్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత-ఏ జట్టులో సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇషాన్ ఇటీవలికాలంలో సూపర్ ఫామ్లో ఉన్నాడు. దేశవాలీ టోర్నీల్లో ఇషాన్ పరుగుల వరద పారించాడు. తిరిగి జాతీయ జట్టులో చోటే లక్ష్యంగా ఇషాన్ ముందుకు కదులుతున్నాడు. -
ఆసీస్ టూర్కు భారత జట్టు ప్రకటన.. ఆంధ్ర ప్లేయర్లకు చోటు
ఆస్ట్రేలియా గడ్డపై జరిగే రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో పాల్గొనే భారత ‘ఎ’ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. 15 మంది సభ్యుల ఈ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఇద్దరు ఆంధ్ర ఆటగాళ్లు నితీశ్ కుమార్ రెడ్డి, రికీ భుయ్లకు ఇందులో చోటు లభించింది.భారత సీనియర్ టీమ్లో స్థానం కోల్పోయిన ఇషాన్ కిషన్కు ఈ జట్టులో అవకాశం దక్కడం విశేషం. ఈ టూర్లో భాగంగా ఆ్రస్టేలియా ‘ఎ’తో మెకే, మెల్బోర్న్లలో భారత్ ‘ఎ’ నాలుగు రోజుల మ్యాచ్లు రెండు ఆడుతుంది. ఆ తర్వాత టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతున్న భారత సీనియర్ టీమ్తో పెర్త్లో మూడు రోజుల మ్యాచ్లో కూడా తలపడుతుంది. ‘ఎ’ జట్టు ప్రదర్శన ద్వారా కూడా బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కోసం కూడా ఒకరిద్దరు ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం ఉంది. భారత ‘ఎ’ జట్టు వివరాలు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్ (వైస్ కెప్టెన్), సాయిసుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి, దేవ్దత్ పడిక్కల్, రికీ భుయ్, బాబా ఇంద్రజిత్, ఇషాన్ కిషన్, అభిషేక్ పొరేల్, ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్, యశ్ దయాళ్, నవదీప్ సైనీ, మానవ్ సుథార్, తనుశ్ కొటియాన్.చదవండి: అభిషేక్ శర్మ ఊచకోత.. యూఏఈపై టీమిండియా ఘన విజయం -
ఆసీస్ టూర్కు భారత జట్టు ఇదే.. కెప్టెన్గా రుతురాజ్! తెలుగోడికి చోటు?
ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్-ఎ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆసీస్-ఎ జట్టుతో భారత్ రెండు అనాధికారిక టెస్టు మ్యాచ్లు ఆడనుంది. ఈ రెండు మ్యాచ్ల సిరీస్ ఆక్టోబర్ 31 నుంచి ప్రారంభం కానుంది.ఈ క్రమంలో భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే ఆస్ట్రేలియాకు పంపే జట్టును సెలక్టర్లు ఖారారు చేసినట్లు తెలుస్తోంది. ఈ పర్యటన భారత్-ఎ జట్టుకు స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహించనున్నట్లు సమాచారం. రుతురాజ్ ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ క్రికెట్లో తను ఏంటో నిరూపించుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మహారాష్ట్రకు గైక్వాడ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి భారత-ఎ జట్టు పగ్గాలు అప్పగించనున్నట్లు వినికిడి.కిషన్కు చోటు?అదేవిధంగా ఆసీస్ టూర్కు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ను ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత సీనియర్ జట్టులో చోటు కోల్పోయిన కిషన్.. ప్రస్తుతం రంజీల్లో జార్ఖండ్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో కిషన్ పర్వాలేదన్పిస్తున్నాడు. అంతకముందు దులీప్ ట్రోఫీలో కూడా ఇషాన్ సత్తాచాటాడు. ఈ క్రమంలో అతడిని ఆస్ట్రేలియాకు పంపనున్నట్లు సమాచారం. ఇక ఆస్ట్రేలియాకు వెళ్లే జట్టులో ఆంధ్రా ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రికీ భుయ్ కూడా చోటు సంపాదించుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఆసీస్ టూర్కు భారత్- ఎ జట్టు(అంచనా)రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్,సాయి సుదర్శన్, బి ఇంద్రజిత్, అభిషేక్ పోరెల్, ఇషాన్ కిషన్, ముఖేష్ కుమార్, రికీ భుయ్, నితీష్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, నవ్దీప్ సైనీ, ఖాలీల్ అహ్మద్, తనుష్ కోటియన్, యశ్ దయాళ్చదవండి: ‘కాస్తైనా సిగ్గుండాలి నీకు!: మండిపడ్డ టీమిండియా ఫ్యాన్స్ -
రోహిత్, కిషన్కు నో ఛాన్స్.. ముంబై రిటెన్షన్ లిస్ట్ ఇదే!
ఐపీఎల్-2025 మెగా వేలానికి సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ రూల్స్ను బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి మొత్తం ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అవకాశం ఇచ్చింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ఆప్షన్ ఉంది. అదేవిధంగా ప్రతీ ఫ్రాంచైజీ పర్స్ వాల్యూను రూ.120 కోట్లకు పెంచారు. గతంలో ఈ పర్స్ విలువ రూ.90 కోట్లు ఉండేది. ఇక అట్టిపెట్టుకున్న అయిదుగురి కోసం ఓ ఫ్రాంఛైజీ రూ.75 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అట్టిపెట్టుకున్న మొదటి ఆటగాడికి రూ.18 కోట్లు, రెండో ఆటగాడికి రూ.14 కోట్లు, మూడో ఆటగాడికి రూ.11 కోట్లు ఫ్రాంఛైజీ చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రెండు రిటెన్షన్లకు తిరిగి వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు వెచ్చించాలి. ఇక రిటెన్షన్కు సంబంధించి విధి విధానాలు ఖారారు కావడంతో ఆయా ఫ్రాంచైజీలు తమ అంటిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సిద్దం చేసే పనిలో పడ్డాయి.రోహిత్, కిషన్కు నో ఛాన్స్!ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ ప్లేయర్ల రిటెన్షన్ లిస్ట్ను ఫైనలైజ్ చేసినట్లు చేసినట్లు తెలుస్తోంది. ఆ జట్టు స్టార్ ప్లేయర్, కెప్టెన్గా 5 ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను వదులుకోవడానికి ముంబై ఇండియన్స్ సిద్దమైనట్లు తెలుస్తోంది.ఈ ఏడాది సీజన్కు ముందు హిట్మ్యాన్ను తమ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు ముంబై యాజమాన్యం బాధ్యతలు అప్పగించింది. అప్పటినుంచే ముంబైతో రోహిత్ తెగిపోయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రోహిత్ కూడా ఆ ఫ్రాంచైజీని నుంచి బయటకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడంట. అతడితో పాటు స్టార్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ను కూడా విడిచిపెట్టాలని ముంబై నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత రెండు సీజన్ల నుంచి కిషన్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ క్రమంలోనే అతడిని వేలంలోకి విడిచిపెట్టన్నట్లు వినికిడి.రిటెన్షన్ ఆటగాళ్లు వీరే? కెప్టెన్ హార్దిక్ పాండ్యా(రూ.18 కోట్లు), స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(రూ.14 కోట్లు), యువ ఆటగాడు తిలక్ వర్మ(రూ.11 కోట్లు)లను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకోవాలని భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. వీరితో పాటు ఆన్క్యాప్డ్ ప్లేయర్లగా నమాన్ ధీర్(రూ. 4 కోట్లు), ఆకాశ్ మధ్వాల్(రూ. 4కోట్లు) అంటిపెట్టుకోవాలని ముంబై యోచిస్తున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ ఏడాది డిసెంబర్లో మెగా వేలం జరిగే అవకాశముంది.చదవండి: అశ్విన్ వారసుడు దొరికినట్లేనా? -
Team India: ఇషాన్ కిషన్ కల చెదిరిపోయినట్లే!
ఇరానీ కప్-2024 మ్యాచ్లో టీమిండియా యువ క్రికెటర్ ధ్రువ్ జురెల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముంబైతో జరుగుతున్న ఈ ఐదు రోజుల మ్యాచ్లో సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి మొత్తంగా 121 బంతులు ఎదుర్కొని 93 పరుగులతో దుమ్ములేపాడు.'శతకం చేజారినాసెంచరీకి ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయినా.. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్(191)తో కలిసి రెస్ట్ ఆఫ్ ఇండియాకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఇక ఇదే మ్యాచ్లో తన వికెట్ కీపింగ్ నైపుణ్యాలతోనూ ధ్రువ్ జురెల్ అదరగొడుతున్నాడు. ముంబై తొలి ఇన్నింగ్స్లో అతడు మూడు క్యాచ్లతో మెరిశాడు.ముకేశ్ కుమార్ బౌలింగ్లో ఆయుశ్ మాత్రే(19), హార్దిక్ తామోర్(0), యశ్ దయాల్ బౌలింగ్లో కెప్టెన్ అజింక్య రహానే(97) ఇచ్చిన క్యాచ్లు పట్టి.. వారిని పెవిలియన్కు పంపడంలో తోడ్పడ్డాడు. తద్వారా టీమిండియా సెలక్టర్ల దృష్టి తనపై నుంచి మరలకుండా చేసుకోగలిగాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్.ఇషాన్ కిషన్ విఫలంమరోవైపు.. ఇరానీ కప్-2024 మ్యాచ్లో ధ్రువ్ జురెల్తో పాటు రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకే ఆడుతున్న మరో టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ మాత్రం నిరాశపరిచాడు. ఐదో స్థానంలోబ్యాటింగ్కు దిగిన ఈ లెఫ్టాండర్ 60 బంతులు ఎదుర్కొని 38 పరుగులకే పరిమితమయ్యాడు. కాగా ఇషాన్ కిషన్ గత కొన్నాళ్లుగా టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే.టీమిండియా సెలక్టర్ల దృష్టి మరలకుండాముఖ్యంగా టెస్టుల్లో స్థానం పొందాలన్న ఇషాన్ కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. ఇప్పటికే క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడి సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన ఈ జార్ఖండ్ బ్యాటర్కు ధ్రువ్ జురెల్ చెక్ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.రోడ్డు ప్రమాదం కారణంగా జట్టుకు దూరమైన రిషభ్ పంత్ స్థానంలో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ధ్రువ్.. తన తొలి మ్యాచ్లోనే మెరుగ్గా రాణించాడు. ఈ ఏడాది ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టులో 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. తాజాగా దులిప్ ట్రోఫీ-2024లోనూ వికెట్ కీపర్గా రాణించిన ధ్రువ్ జురెల్.. బంగ్లాదేశ్తో సిరీస్లో పంత్ బ్యాకప్గా ఉన్నాడు.ఇషాన్ రంజీల్లో రాణిస్తేనేతాజాగా రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున అద్బుత ఇన్నింగ్స్తో అలరించాడు. స్వదేశంలో టీమిండియా తదుపరి న్యూజిలాండ్తో ఆడే సిరీస్కు ముందు సెలక్టర్ల ముందు సత్తా నిరూపించుకున్నాడు. దీంతో సెలక్టర్లు.. టెస్టుల్లో ఇషాన్ కిషన్ను వికెట్ కీపర్ రేసు నుంచి తప్పించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ ఏడాది రంజీల్లో గనుక ఇషాన్ రాణిస్తే తన రాత మారే అవకాశం ఉంటుంది. భారీ ఆధిక్యం దిశగా ముంబైకాగా రంజీ చాంపియన్- రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య ఇరానీ కప్ టైటిల్ కోసం పోటీ జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈసారి రంజీ ట్రోఫీ గెలిచిన ముంబై.. ఇరానీ కప్ కూడా గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. లక్నోలో అక్టోబరు 1న మొదలైన ఈ ఐదు రోజుల మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 537 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇందుకు రెస్ట్ ఆఫ్ ఇండియా 416 పరుగులతో బదులిచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి ముంబై రెండో ఇన్నింగ్స్లో 40 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.చదవండి: IPL 2025: ‘ఆర్సీబీ రోహిత్ శర్మను కొని.. కెప్టెన్ చేయాలి’ -
Ind vs Ban: అతడికి రెస్ట్.. టీమిండియాలోకి ఇషాన్ ఎంట్రీ!
యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ టీమిండియాలో పునరాగమనం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ సందర్భంగా అతడు రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే, రెస్టాఫ్ ఇండియా టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయంపైనే ఈ విషయం ఆధారపడి ఉంది. గతేడాది దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన ఇషాన్ కిషన్.. ఇప్పటి వరకు జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు.రెడ్బాల్ క్రికెట్లో రీఎంట్రీరంజీల్లో ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను బేఖాతరకు చేయడం వల్ల.. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాడంటూ బోర్డు ఇషాన్కు గట్టి షాకిచ్చింది. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి అతడిని తప్పించింది. ఈ క్రమంలో దిద్దుబాటు చర్యలకు దిగిన ఇషాన్ ఇటీవలే బుచ్చిబాబు టోర్నీ ద్వారా రెడ్బాల్ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. సెంచరీతో ఆకట్టుకుని.. దులిప్ ట్రోఫీ-2024లో చోటు దక్కించుకున్నాడు.రెస్టాఫ్ ఇండియా టీమ్కు ఎంపికబీసీసీఐ ఆధ్వర్యంలోని ఈ దేశీ రెడ్బాల్ టోర్నీలోనూ ఇషాన్ కిషన్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. ఇండియా-‘సి’ జట్టు తరఫున శతకంతో అలరించాడు. ఈ క్రమంలో ఇరానీ కప్-2024 మ్యాచ్లో రెస్టాఫ్ ఇండియా టీమ్కు ఎంపికయ్యాడు.రిషభ్ పంత్కు విశ్రాంతిరంజీ చాంపియన్ ముంబైతో అక్టోబరు 1- 5 వరకు జరుగనున్న మ్యాచ్లో రెస్టాఫ్ ఇండియా తలపడనుంది. ఆ వెంటనే అంటే.. అక్టోబరు 6- 12 వరకు టీమిండియా స్వదేశంలో బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్లు స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్కు విశ్రాంతినివ్వనున్నట్లు తెలుస్తోంది.బంగ్లా సిరీస్ తర్వాత.. న్యూజిలాండ్తో టెస్టుల నేపథ్యంలో ఈ యోచన చేస్తున్నట్లు సమాచారం. కాబట్టి పంత్ స్థానంలో ఇషాన్ను బంగ్లాదేశ్తో టీ20సిరీస్కు ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రధాన వికెట్ కీపర్గా సంజూ శాంసన్కు ఛాన్స్ ఇవ్వనున్న సెలక్టర్లు.. అతడికి బ్యాకప్గా ఇషాన్కు జట్టులోస్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది. రెస్టాఫ్ ఇండియా నుంచి రిలీజ్ చేస్తేనేఅయితే, అదే సమయంలో.. ఇరానీ కప్ మ్యాచ్ ఉన్నందున రెస్టాఫ్ ఇండియా నుంచి ఇషాన్ను రిలీజ్ చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఏదేమైనా.. ఒకప్పుడు జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న ఈ లెఫ్టాండర్.. స్వీయ తప్పిదాల వల్ల ఇప్పుడు జట్టులో అదనపు ప్లేయర్గానైనా చోటు దక్కించుకోవడం గగనమైపోయింది.చదవండి: రంజీ ‘జట్టు’లో విరాట్ కోహ్లి, మరో టీమిండియా స్టార్ కూడా.. డీడీసీఏ ప్రకటన -
అభిమన్యు ఈశ్వరన్ సెంచరీ.. నిరాశపరిచిన స్కై, రుతు, ఇషాన్
దులీప్ ట్రోఫీ 2024లో ఇండియా-బి కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ వరుసగా రెండో సెంచరీ చేశాడు. అనంతపురం వేదికగా ఇండియా-డితో జరుగుతున్న మ్యాచ్లో ఈశ్వరన్ 116 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-బి తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (39), రాహుల్ చాహర్ (0) క్రీజ్లో ఉన్నారు. ఇండియా-డి బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, ఆధిత్య థాకరే 2, సౌరభ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు. ఇండియా-బి ఇండియా-డి తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 139 పరుగులు వెనుకపడి ఉంది.సూర్యకుమార్ యాదవ్ విఫలంఇండియా-బి ఇన్నింగ్స్లో ఈశ్వరన్ మినహా ఎవ్వరూ రాణించలేదు. గాయం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐదు పరుగులు మాత్రమే చేసి అర్షదీప్ సింగ్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఎన్ జగదీషన్ (13), సుయాశ్ ప్రభుదేశాయ్ (16), ముషీర్ ఖాన్ (5), నితీశ్ రెడ్డి (0) కూడా విఫలమయ్యారు.సంజూ మెరుపు సెంచరీసంజూ శాంసన్ మెరుపు సెంచరీతో (106) చెలరేగడంతో ఇండియా-డి తొలి ఇన్నింగ్స్లో 349 పరుగులకు ఆలౌటైంది. దేవ్దత్ పడిక్కల్ (50), శ్రీకర్ భరత్ (52), రికీ భుయ్ (56) అర్ద సెంచరీలతో రాణించారు. ఇండియా-బి బౌలర్లలో నవ్దీప్ సైనీ ఐదు వికెట్లు తీయగా.. రాహుల్ చాహర్ 3, ముకేశ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు.నిరాశపరిచిన రుతురాజ్, ఇషాన్ కిషన్అనంతపురంలోనే జరుగుతున్న మరో మ్యాచ్లో (ఇండియా-ఏతో) ఇండియా-సి ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్ (17), సాయి సుదర్శన్ (17), రజత్ పాటిదార్ (0), ఇషాన్ కిషన్ (5) నిరాశపరిచారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-సి తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది.రాణించిన అభిషేక్ పోరెల్ఇండియా-సి ఇన్నింగ్స్లో అభిషేక్ పోరెల్ (82) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. పుల్కిత్ నారంగ్ (35 నాటౌట్), విజయ్ కుమార్ వైశాఖ్ (14 నాటౌట్) క్రీజ్లో ఉన్నారు. ఇండియా-ఏ చేసిన తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇండియా-సి ఇంకా 81 పరుగులు వెనుకపడి ఉంది. ఇండియా-ఏ బౌలర్లలో ఆకిబ్ ఖాన్ 3, షమ్స్ ములానీ 2, ఆవేశ్ ఖాన్, తనుశ్ కోటియన్ తలో వికెట్ పడగొట్టారు.శాశ్వత్ రావత్ సెంచరీ.. హాఫ్ సెంచరీ చేసిన ఆవేశ్ ఖాన్శాశ్వత్ రావత్ సెంచరీతో (124) కదంతొక్కడంతో ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్లో 297 పరుగులు చేసింది. ఆవేశ్ ఖాన్ (51 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు. టెయిలెండర్లు షమ్స్ ములానీ (44), ప్రసిద్ద్ కృష్ణ (34) పర్వాలేదనిపించారు. ఇండియా-సి బౌలర్లలో విజయ్కుమార్ 4, అన్షుల్ కంబోజ్ 3, గౌరవ్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. చదవండి: IND VS BAN 1st Test: మరో అరుదైన మైలురాయిని అధిగమించిన విరాట్ -
ఇషాన్ కిషన్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా ఇండియా-సి టీమ్
సాక్షి, అనంతపురం: యువ ఆటగాడు ఇషాన్ కిషన్ (126 బంతుల్లో 111; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా అనంతపురంలో భారత్ ‘బి’ జట్టుతో గురువారం మొదలైన దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్లో భారత్ ‘సి’ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ ‘సి’ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 79 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఫస్ట్క్లాస్ క్రికెట్ పునరాగమనంలో ఆడిన తొలి మ్యాచ్లోనే ఇషాన్ కిషన్ శతక్కొట్టగా... మిగతా బ్యాటర్లు కూడా విలువైన పరుగులు చేయడంతో భారత్ ‘సి’ జట్టు మెరుగైన స్కోరు చేయగలిగింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (50 బంతుల్లో 46 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సాయి సుదర్శన్ (75 బంతుల్లో 43; 8 ఫోర్లు), రజత్ పాటిదార్ (67 బంతుల్లో 40; 8 ఫోర్లు), బాబా ఇంద్రజిత్ (136 బంతుల్లో 78; 9 ఫోర్లు) రాణించారు. మ్యాచ్ ఆరంభంలో రెండు బంతులు ఎదుర్కోగానే మడమ నొప్పితో మైదానాన్ని వీడిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్... కోలుకొని తిరిగి క్రీజులో అడుగు పెట్టి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు మానవ్ సుతార్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. గాయం కారణంగా దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్కు అందుబాటులో లేకుండా పోయిన ఇషాన్ కిషన్... రెండో రౌండ్ మ్యాచ్లో చక్కటి ఆటతీరు కనబర్చాడు. ఇంద్రజిత్తో కలిసి మూడో వికెట్కు 189 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. ఇటీవల బుచ్చిబాబు టోర్నమెంట్లో జార్ఖండ్ తరఫున సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్... ఇక్కడే అదే జోరు కొనసాగించాడు. భారత్ ‘బి’ బౌలర్లలో ముఖేశ్ కుమార్ 3 వికెట్లు పడగొట్టగా... నవ్దీప్ సైనీ, రాహుల్ చహర్ చెరో వికెట్ తీశారు. స్కోరు వివరాలు భారత్ ‘సి’ తొలి ఇన్నింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (బ్యాటింగ్) 46; సాయి సుదర్శన్ (సి) నవ్దీప్ సైనీ (బి) ముకేశ్ కుమార్ 43; రజత్ పాటిదార్ (బి) నవ్దీప్ సైనీ 40; ఇషాన్ కిషన్ (బి) ముకేశ్ కుమార్ 111; బాబా ఇంద్రజిత్ (బి) రాహుల్ చాహర్ 78; అభిషేక్ పొరేల్ (ఎల్బీడబ్ల్యూ) ముకేశ్ కుమార్ 12; మానవ్ సుతార్ (బ్యాటింగ్) 8; ఎక్స్ట్రాలు 19; మొత్తం (79 ఓవర్లలో 5 వికెట్లకు) 357. వికెట్ల పతనం: 1–96, 2–97, 3–286, 4–311, 5–345. బౌలింగ్: ముకేశ్ కుమార్ 21–3–76–3; నవ్దీప్ సైనీ 17–2–78–1; వాషింగ్టన్ సుందర్ 10–0–55–0; నితీశ్ కుమార్ రెడ్డి 14–2–58–0; సాయికిశోర్ 12–0–46–0; రాహుల్ చహర్ 5–0–35–1. -
సెంచరీతో కదం తొక్కిన ఇషాన్ కిషన్
ఇవాళ (సెప్టెంబర్ 12) మొదలైన దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్లో ఇండియా-సి ఆటగాడు ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీతో కదంతొక్కాడు.అనంతపురం వేదికగా ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్లో ఇషాన్ ఈ ఫీట్ను సాధించాడు. ఇషాన్ 121 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. Ishan Kishan century moment in the Duleep Trophy! 🌟- A class return by Kishan. 👏pic.twitter.com/xRMbxt36jU— Mufaddal Vohra (@mufaddal_vohra) September 12, 2024గాయం కారణంగా ఇషాన్ తొలి రౌండ్ మ్యాచ్ ఆడలేదు. తొలి రౌండ్ మ్యాచ్కు ముందు బుచ్చిబాబు టోర్నీలోనూ ఇషాన్ సెంచరీతో మెరిశాడు. ఇషాన్ సూపర్ ఫామ్లో ఉండటం భారత సెలెక్టర్లకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే భారత జట్టులో వికెట్కీపర్ బ్యాటర్లుగా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్ ఉన్నారు. బంగ్లాదేశ్తో సిరీస్కు భారత జట్టు ఎంపిక ఇదివరకే పూర్తైన నేపథ్యంలో ఇషాన్ టీమిండియా నుంచి పిలుపు కోసం మరికొంత కాలం పాటు వేచి ఉండాల్సిందే.మ్యాచ్ విషయానికొస్తే... ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇండియా-సి.. 63 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (103), బాబా ఇంద్రజిత్ (62) క్రీజ్లో ఉన్నారు. ఇండియా-సి ఇన్నింగ్స్లో సాయి సుదర్శన్ 43, రజత్ పాటిదార్ 40 పరుగులు చేసి ఔట్ కాగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 4 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఇండియా-బి బౌలర్లలో ముకేశ్ కుమార్, నవ్దీప్ సైనీలకు తలో వికెట్ దక్కింది.ఇదిలా ఉంటే, ఇవాళే మొదలైన మరో మ్యాచ్లో ఇండియా-ఏ, ఇండియా-డి జట్లు తలపడుతున్నాయి. అనంతపురం వేదికగానే జరుగుతున్న ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇండియా-ఏ 70 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ప్రథమ్ సింగ్ (7), మయాంక్ అగర్వాల్ (7), తిలక్ వర్మ (10), రియాన్ పరాగ్ (37), షాశ్వత్ రావత్ (15), కుమార్ కుషాగ్రా (28), తనుశ్ కోటియన్ (53) ఔట్ కాగా.. షమ్స్ ములానీ (64), ప్రసిద్ధ్ కృష్ణ (2) క్రీజ్లో ఉన్నారు. ఇండియా-డి బౌలర్లలో విధ్వత్ కావేరప్ప, అర్ష్దీప్ సింగ్ చెరో 2, హర్షిత రాణా, సరాన్ష్ జైన్, సౌరభ్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: హాఫ్ సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్.. -
హాఫ్ సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్..
దులీప్ ట్రోఫీ-2024ను భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఘనంగా ఆరంభించాడు. ఈ టోర్నీలో ఇండియా-సికి ప్రాతినిథ్యం వహిస్తున్న కిషన్.. అనంతపూర్ వేదకగా ఇండియా-బితో మ్యాచ్లో అదరగొడుతున్నాడు. ఈ మ్యాచ్లో అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కిషన్ 40 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. రజిత్ పాటిదార్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కిషన్.. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కిషన్ ప్రస్తుతం 52 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. కాగా బీసీసీఐ ఆదేశాలను దిక్కరించి వేటుకు గురైన కిషన్ మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ ఏడాది జరగనున్న దేశీవాళీ టోర్నీ మొత్తానికి అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే తమిళనాడు వేదికగా జరిగిన బుచ్చిబాబు టోర్నీలో సత్తాచాటిన కిషన్.. ఇప్పుడు మరో దేశీవాళీ టోర్నీలో దులీప్ ట్రోఫీలో కూడా తన మార్క్ను చూపిస్తున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 41 ఓవర్లకు ఇండియా-సి జట్టు 2 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.చదవండి: Vinesh Phogat: వినేశ్ ఫొగట్ ఆస్తి వివరాలు వెల్లడి.. ఎన్ని కోట్లంటే? -
టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ బర్త్డే: ఆ ముగ్గురు హైలైట్ (ఫొటోలు)
-
పాపం సంజూ.. ఇక్కడ కూడా అవకాశం దక్కలే..!
దులీప్ ట్రోఫీ మ్యాచ్లు ఇవాల్టి (సెప్టెంబర్) నుంచి ప్రారంభమయ్యాయి. ఇండియా-ఏ, ఇండియా-బి మధ్య తొలి మ్యాచ్ బెంగళూరు వేదికగా జరుగుతుండగా.. ఇండియా-సి, ఇండియా-డి మధ్య రెండో మ్యాచ్ అనంతపురంలో జరుగుతుంది.తొలి మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇండియా-బి మూడో సెషన్ సమయానికి తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి గౌరవప్రదమైన స్కోర్ కోసం ప్రాకులాడుతుంది. ముషీర్ ఖాన్ (77), నవ్దీప్ సైనీ (7) ఇండియా-బిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియా-బి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 30, అభిమన్యు ఈశ్వరన్ 13, సర్ఫరాజ్ ఖాన్ 9, రిషబ్ పంత్ 7, నితీశ్ రెడ్డి 0, వాషింగ్టన్ సుందర్ 0, సాయికిషోర్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఇండియా-ఏ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ఆకాశ్దీప్, ఆవేశ్ ఖాన్ తలో రెండు వికెట్లు తీశారు.రెండో మ్యాచ్ విషయానికొస్తే.. ఇండియా-డి తొలి ఇన్నింగ్స్లో 164 పరుగులకే ఆలౌటైంది. అక్షర్ పటేల్ 86 పరుగులు చేసి ఇండియా-డిని ఆదుకున్నాడు. 76 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో అక్షర్.. అర్ష్దీప్ సింగ్తో (13) కలిసి తొమ్మిదో వికెట్కు 84 పరుగులు జోడించాడు.అక్షర్ మినహా ఇండియా-డిలో ఎవ్వరూ రాణించలేదు. అథర్వ తైడే 4, యశ్ దూబే 10, శ్రేయస్ అయ్యర్ 9, దేవ్దత్ పడిక్కల్ 0, రికీ భుయ్ 4, శ్రీకర్ భరత్ 13,సరాన్ష్ జైన్ 13, హర్షిత్ రాణా 0, అర్ష్దీప్ సింగ్ 13 పరుగులు చేశారు. ఇండియా-సి బౌలర్లలో విజయ్కుమార్ వైశాఖ్ 3, అన్షుల్ కంబోజ్, హిమాన్షు చౌహన్ చెరో 2, మానవ్ సుతార్, హృతిక్ షొకీన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-సి 17 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (5), సాయి సుదర్శన్ (7), ఆర్యన్ జుయెల్ (12) ఔట్ కాగా.. రజత్ పాటిదార్ (13), బాబా ఇంద్రజిత్ (2) క్రీజ్లో ఉన్నారు.పాపం సంజూ.. ఇక్కడ కూడా అవకాశం దక్కలే..!రెండో మ్యాచ్కు ముందు ఇండియా-డి ఆటగాడు ఇషాన్ కిషన్ గాయపడటంతో సంజూ శాంసన్ జట్టులోకి వచ్చాడు. సంజూ తుది జట్టులో ఉండటం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే మేనేజ్మెంట్ అనూహ్యంగా సంజూను పక్కన పెట్టి శ్రీకర్ భరత్కు తుది జట్టులోకి తీసుకుంది. ఇండియా-సితో మ్యాచ్లో సంజూ బెంచ్కే పరిమితమయ్యాడు. ఈ మ్యాచ్లో అవకాశం వస్తే తనను తాను నిరూపించుకుని టెస్ట్ జట్టులో చోటు కొట్టేయాలని సంజూ భావించాడు. చివరికి అతని ఆశలు అడియాశలుగా మిగిలిపోయాయి. -
సంజూ శాంసన్కు లక్కీ ఛాన్స్!
టీమిండియా స్టార్ క్రికెటర్ ఇషాన్ కిషన్ దులిప్ ట్రోఫీ-2024 ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా అతడు ఇండియా-డి జట్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. అతడి స్థానంలో మరో భారత వికెట్ కీపర్ బ్యాటర్ టీమ్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.సెంచరీతో కదం తొక్కికాగా గతేడాది దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధంతరంగా స్వదేశానికి వచ్చిన ఇషాన్ కిషన్.. ఆ తర్వాత టీమిండియాలో మళ్లీ చోటు దక్కించుకోలేకపోయాడు. రంజీ ట్రోఫీలో ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించి సెంట్రల్ కాంట్రాక్టు కూడా కోల్పోయాడు. ఈ క్రమంలో దిద్దుబాటు చర్యలకు దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఇటీవల బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీ బరిలో దిగాడు.తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని ఈ రెడ్బాల్ టోర్నమెంట్లో జార్ఖండ్ కెప్టెన్గా వ్యవహరించిన ఇషాన్ సెంచరీతో అలరించాడు. అయితే, తన జట్టును మాత్రం సెమీస్ రేసులో నిలపలేకపోయాడు. ఇదిలా ఉంటే.. ఈ టోర్నీ సందర్భంగానే ఇషాన్కు గాయమైనట్లు క్రిక్బజ్ వెల్లడించింది. ఫలితంగా.. సెప్టెంబరు 5న ఆరంభమయ్యే దులిప్ ట్రోఫీకి అతడు అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొంది.సంజూ శాంసన్కు చోటు?ఇషాన్ కిషన్ స్థానంలో కేరళ క్రికెటర్ సంజూ శాంసన్ ఇండియా-డి జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కాగా సెప్టెంబరు 19 నుంచి టీమిండియా స్వదేశంలో బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్లకు సన్నాహకంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తదితర టీమిండియా స్టార్లు దులిప్ ట్రోఫీ బరిలో దిగనున్నారు.ఇషాన్కు తప్పని కష్టాలుఈ టోర్నీలో సత్తా చాటి బంగ్లాతో సిరీస్కు ఎంపికకావాలని కొందరు.. జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలని మరికొందరు పట్టుదలగా ఉన్నారు. అయితే, తీవ్రమైన పోటీనెలకొన్న తరుణంలో ఇషాన్ కిషన్ ఇప్పట్లో రీఎంట్రీ ఇవ్వకపోయినా.. కనీసం సెలక్టర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉండేది. కానీ గాయం తీవ్రతరమైతే అతడు ఈ ఎడిషన్ మొత్తానికి దూరమైతే.. మళ్లీ రంజీ దాకా వేచిచూడాల్సిందే!! ఏదేమైనా ఇషాన్కు ఇప్పట్లో కెరీర్ కష్టాల నుంచి విముక్తి లభించేలా కనిపించడం లేదు!!దులిప్ ట్రోఫీ: బీసీసీఐ ప్రకటించిన ఇండియా-డి జట్టుశ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రికీ భుయ్, శరణ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, ఆదిత్య థాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్పాండే, ఆకాశ్ సేన్గుప్తా, కేఎస్ భరత్(వికెట్ కీపర్), సౌరభ్ కుమార్.చదవండి: Duleep Trophy 2024: అనంతపూర్ చేరుకున్న క్రికెటర్లు -
మొన్న పంత్.. ఇప్పుడు ఇషాన్ కిషన్! బౌలింగ్ వీడియో వైరల్
భారత వికెట్ కీపర్ బ్యాటర్, జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ సరికొత్త అవతారమెత్తాడు. బుచ్చిబాబు టోర్నమెంట్లో భాగంగా హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో కిషన్ స్పిన్ బౌలింగ్ చేసి అందరని ఆశ్చర్యపరిచాడు.చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో బ్యాట్తో విఫలమైన కిషన్.. బంతితో మాత్రం ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ బ్యాటర్ టి రవితేజకు కిషన్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేశాడు. రెండు ఓవర్లు వేసిన కిషన్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవతున్నాయి. కాగా ఇటీవల తన సహచర వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా స్పిన్ బౌలింగ్ చేసి అందరిని షాక్ గురిచేశాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో పంత్ స్పిన్నర్గా మారాడు. ఇప్పుడు కిషన్ కూడా తన బౌలింగ్ స్కిల్స్ను ప్రదర్శించాడు.ఇక మధ్యప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లో వరుసగా 114, 41 (నాటౌట్) పరుగులతో ఇషాన్ అలరించాడు. అయితే రెండో మ్యాచ్లో మాత్రం కిషన్ తన మార్క్ను చూపించలేకపోయాడు. కాగా దేశవాళీ క్రికెట్లో ఆడాలన్న తమ ఆదేశాలను దిక్కరించడంతో కిషన్పై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. కిషన్ చివరగా భారత్ తరపున గతేడాది వన్డే ప్రపంచకప్లో ఆడాడు. The Bowler Ishan Kishan in the town you all 😎🔥@ishankishan51 #IshanKishan #BuchiBabuTournament pic.twitter.com/AvgkAfDibE— Ishan's💙🧘♀️ (@IshanWK32) August 22, 2024 -
ఫామ్లో ఉన్నా.. ఇషాన్కు టీమిండియాలో ఇప్పట్లో నో ఛాన్స్!
భారత క్రికెట్ జట్టులో పునరాగమనమే లక్ష్యంగా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ముందుకు సాగుతున్నాడు. స్వీయ తప్పిదాల వల్ల జట్టులో చోటు కోల్పోయిన అతడు.. వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగానే బుచ్చిబాబు టోర్నమెంట్ ద్వారా దేశవాళీ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చిన ఈ జార్ఖండ్ చోటా డైనమైట్.. సెంచరీతో చెలరేగాడు.తదుపరి దులిప్ ట్రోఫీలోమధ్యప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లో వరుసగా 114, 41 (నాటౌట్) పరుగులతో ఇషాన్ అలరించాడు. ఈ టోర్నీలో జార్ఖండ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఇషాన్ కిషన్ తదుపరి దులిప్ ట్రోఫీలోనూ ఆడనున్నాడు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమ్-డిలో వికెట్ కీపర్గా సేవలు అందించనున్నాడు.ఈ రెడ్బాల్ టోర్నీలోనూ నిరూపించుకుంటే ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇవ్వడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ మాత్రం ఆ అవకాశం లేదంటున్నాడు. ఇప్పట్లో ఇషాన్కు టీమిండియా సెలక్టర్ల పిలుపురాదని.. జాతీయ జట్టులో చోటుపై ఆశలు పెట్టుకోవడం మాని.. ఐపీఎల్పై దృష్టి సారించాలని అతడికి హితవు పలికాడు.అప్పటిదాకా నో ఛాన్స్.. ఐపీఎల్పై ఫోకస్ పెడితే మంచిదిచాంపియన్స్ ట్రోఫీ-2025 వరకు ఇషాన్ కిషన్ పేరును బీసీసీఐ సెలక్టర్లు పరిశీలించకపోవచ్చునని అభిప్రాయపడ్డాడు. ‘‘ఆస్ట్రేలియా సిరీస్ దాకా ఇషాన్ కిషన్ వేచి చూడాల్సిందే. అయితే, అంతకంటే ఎక్కువగా అతడు ఐపీఎల్పైన ఫోకస్ పెడితే మంచిది. నాకు తెలిసి చాంపియన్స్ ట్రోఫీ వరకు కూడా ఇషాన్ రీఎంట్రీ కుదరకపోవచ్చు’’ అని పాక్ మాజీ బ్యాటర్ బసిత్ అలీ యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.పంత్ రాకతో ఇషాన్కు చిక్కులుకాగా గతేడాది జట్టుతో పాటు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఇషాన్ కిషన్ అర్ధంతరంగా స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. మానసిక ఆందోళన కారణం చూపి సెలవు తీసుకున్న ఇషాన్.. తిరిగి జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేశాడు. ఫలితంగా సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించే క్రమంలో డొమెస్టిక్ క్రికెట్పై దృష్టి సారించాడు. అయితే, బంగ్లాదేశ్తో సెప్టెంబరు 19 నుంచి టెస్టు సిరీస్ ఆరంభం నేపథ్యంలో స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ (పునరాగమనం), ధ్రువ్ జురెల్ రూపంలో కీపర్ కోటాలో ఇషాన్కు గట్టి పోటీ ఎదురుకానుంది. మరోవైపు కేఎస్ భరత్ కూడా రేసులో ఉండే అవకాశం ఉంది.చదవండి: బుమ్రా ఓకే.. రోహిత్, కోహ్లికి రెస్ట్ అవసరమా?: టీమిండియా దిగ్గజం -
భారత సెలెక్టర్లకు తలనొప్పిగా మారిన ఇషాన్ కిషన్
టీమిండియా యువ వికెట్కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్ పర్యటనకు ముందు భారత సెలెక్టర్లకు సరికొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాడు. బుచ్చి బాబు టోర్నీలో వరుసగా సెంచరీ (114), మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ (41 నాటౌట్) ఆడిన ఇషాన్.. బ్యాట్తో సెలెక్టర్లకు సవాలు విసిరాడు. బంగ్లాదేశ్ పర్యటన నేపథ్యంలో భారత బ్యాటింగ్ లైనప్ ఇప్పటికే ఖాళీ లేకుండా ఉంది. ఇప్పుడు ఇషాన్ కొత్తగా రేసులోకి వచ్చి సీనియర్ల స్థానాలను ప్రశ్నార్థకంగా మార్చాడు. భారత సెలెక్టర్లు బంగ్లాదేశ్ పర్యటనకు ఇషాన్ను ఎంపిక చేస్తారో లేదో వేచి చూడాలి.Ishan Kishan - the hero of Jharkhand !!!- Jharkhand needed 12 with 2 wickets in hands, captain smashed 6,0,6 to seal the game. pic.twitter.com/3uTqFF1KI2— Mufaddal Vohra (@mufaddal_vohra) August 18, 2024బుచ్చి బాబు టోర్నీలో భాగంగా జార్ఖండ్, మధ్య ప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ను జార్ఖండ్ కెప్టెన్ అయిన ఇషాన్ కిషన్ స్టయిల్గా ముగించాడు. తన జట్టు గెలుపుకు 12 పరుగులు అవసరం కాగా.. ఇషాన్ రెండు సిక్సర్లతో మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ఇషాన్ విన్నింగ్ షాట్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. -
జడ్డూనే ముందుగా అడిగా.. నా నిర్ణయాల వల్లే ఇలా: జై షా
తమ కఠిన వైఖరి కారణంగానే టీమిండియా స్టార్లలో మార్పు వచ్చిందని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కార్యదర్శి జై షా అన్నాడు. యువ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ దేశవాళీ టోర్నీల్లో ఆడటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు. కేవలం వీరిద్దరిని దృష్టిలో పెట్టుకుని నిబంధనలు ప్రవేశపెట్టలేదని.. అందరి కంటే ముందుగా రవీంద్ర జడేజా విషయంలో తాను ఈ వైఖరి అవలంబించినట్లు తెలిపాడు.బోర్డు ఆదేశాలను లెక్కచేయలేదుసెంట్రల్ కాంట్రాక్టు ఉన్న భారత క్రికెటర్లు ఫిట్గా ఉండి, జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సమయంలో కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ నిబంధనలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ బోర్డు ఆదేశాలను లెక్కచేయలేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరిని సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారన్న కారణంగా ఈ మేరకు కఠిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పొరపాటు సరిచేసుకున్న శ్రేయస్ ఇప్పటికే రంజీల్లో ఆడి శ్రీలంకతో వన్డే సిరీస్ జట్టులో చోటు దక్కించుకోగా.. ఇషాన్ సైతం దులిప్ ట్రోఫీ-2024 బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం గురించి జై షా స్పందిస్తూ... ‘‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మినహా మిగతా వాళ్లంతా దులిప్ ట్రోఫీ ఆడబోతున్నారు.నా కఠిన నిర్ణయాల వల్లే ఇలానేను కఠినమైన నిర్ణయాలు తీసుకున్నందు వల్లే ఇది సాధ్యమైంది. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కూడా ఈ టోర్నీలో భాగమయ్యారు. మేము స్ట్రిక్ట్గా ఉండాలనే నిర్ణయించుకున్నాం. నిజానికి రవీంద్ర జడేజా గాయం కారణంగా జట్టుకు దూరమైనపుడు.. నేను తనకి కాల్ చేశాను.కోలుకున్న తర్వాత ముందుగా దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించాను. జడేజా అందుకు తగ్గట్లుగా ముందుగా రంజీ మ్యాచ్ ఆడి ఆ తర్వాత టీమిండియాలోకి వచ్చాడు. ఆటగాళ్లు గాయపడటం సహజం. అయితే, గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆటగాళ్లు తిరిగి ఫిట్నెస్ సాధించడంతో పాటు డొమెస్టిక్ క్రికెట్ ఆడితేనే జాతీయ జట్టుకు ఎంపిక చేస్తామని చెప్పాం’’ అని జై షా టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. సెప్టెంబరు 5 నుంచిఅయితే, కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మాత్రం ఇందుకు మినహాయింపు అని జై షా స్పష్టం చేశాడు. కాగా సెప్టెంబరు 5 నుంచి దేశవాళీ రెడ్బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ ఆరంభం కానుంది. స్వదేశంలో బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ముందుకు టీమిండియా స్టార్లు ఈ టోర్నమెంట్ బరిలో దిగనున్నారు. చదవండి: Ind vs Ban: టీమిండియాలో చోటు దక్కదని తెలుసు.. అయినా! -
సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్.. 86 బంతుల్లోనే!
టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ రెడ్బాల్ క్రికెట్ పునరాగమనం అదిరిపోయింది. ఆకాశమే హద్దుగా 86 బంతుల్లోనే శతక్కొట్టాడు ఈ జార్ఖండ్ డైనమైట్. భారత జట్టులో చోటే లక్ష్యంగా కఠినంగా శ్రమిస్తున్నానని సెలక్టర్లకు తన సెంచరీతో సందేశం పంపించాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో తనను ఉద్దేశపూర్వకంగా బెంచ్కే పరిమితం చేశారని ఇషాన్ కిషన్ మధ్యలోనే నిష్క్రమించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.రంజీల్లో ఆడనందుకు వేటు మానసిక ఇబ్బందులు అని చెప్పి ఆ టూర్ మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. తదుపరి కుటుంబంతో ట్రిప్నకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో ఇషాన్పై కన్నెర్ర చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి.. దేశవాళీ క్రికెట్ ఆడిన తర్వాతే టీమిండియాలో మళ్లీ చోటు దక్కుతుందని అతడికి స్పష్టం చేసింది. అయినప్పటికీ.. స్వరాష్ట్రానికి చెందిన జార్ఖండ్ తరఫున రంజీల్లో ఆడటానికి అతడు నిరాకరించాడు.ఫలితంగా సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పిస్తూ బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఐపీఎల్-2024లో ఇషాన్ కిషన్ ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో కెరీర్పై దృష్టి సారించిన ఈ జార్ఖండ్ బ్యాటర్... బుచ్చిబాబు టోర్నమెంట్ ద్వారా తిరిగి రెడ్బాల్ క్రికెట్లో అడుగుపెట్టాడు. జార్ఖండ్కు కెప్టెన్గా బరిలోకి దిగిన ఈ డైనమైట్.. మధ్యప్రదేశ్తో తమ తొలి మ్యాచ్లో శతకంతో కదం తొక్కాడు.సిక్సర్తో సెంచరీ పూర్తిసిక్సర్తో సెంచరీ మార్కు అందుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అంతకుముందు.. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ సమయంలో మూడు అద్భుత క్యాచ్లతో మెరిసి వికెట్ కీపర్గానూ తనను తాను నిరూపించుకున్నాడు 26 ఏళ్ల ఇషాన్ కిషన్. కాగా జార్ఖండ్తో మ్యాచ్లో మధ్యప్రదేశ్ 225 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు ఆటలో భాగంగా ఇషాన్ సెంచరీ కారణంగా జార్ఖండ్ 69.1 ఓవర్లోనే 233 పరుగుల మార్కు అందుకుంది. ఇక టీమిండియా తరఫున ఈ జార్ఖండ్ కెప్టెన్ చివరగా 2023 నవంబరులో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో భాగమయ్యాడు.చదవండి: తప్పంతా ఆమెదేనా?.. ఇంకా మగాడు మగాడే అంటారా?: సిరాజ్ పోస్ట్ వైరల్ISHAN KISHAN YOU’RE SO ICONIC!!!Ishan Kishan 100 in 86 balls!!#IshanKishan pic.twitter.com/I37dgcnciS— shrey (@slidinjun) August 16, 2024 -
రీ ఎంట్రీ అదుర్స్: అద్భుత క్యాచ్తో మెరిసిన ఇషాన్ కిషన్
టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్ బాటపట్టాడు. జాతీయ జట్టులో పునరాగమనం చేయాలని పట్టుదలగా ఉన్న ఈ డాషింగ్ క్రికెటర్ తాజాగా బుచ్చిబాబు టోర్నమెంట్ బరిలో దిగాడు. ఈ రెడ్బాల్ టోర్నీలో సొంత రాష్ట్రం జార్ఖండ్ జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన ఇషాన్ కిషన్.. తొలిరోజు శుభారంభం అందుకున్నాడు.బుచ్చిబాబు టోర్నీలో భాగంగా గ్రూప్-ఏలో ఉన్న మధ్యప్రదేశ్తో జార్ఖండ్ తొలి మ్యాచ్ ఆడుతోంది. గురువారం మొదలైన ఈ మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసే సరికి జార్ఖండ్ మధ్యప్రదేశ్ జట్టును 224-8కు కట్టడి చేసింది. ప్రత్యర్థిని నామమాత్రపు స్కోరుకు కట్టడి చేయడంలో కెప్టెన్ ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు.సూపర్ క్యాచ్ అందుకున్న ఇషాన్ అద్భుతమైన వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకుని మూడు వికెట్లు పడగొట్టడంలో భాగం పంచుకున్నాడు. ముఖ్యంగా క్రీజులో నిలదొక్కుకుని.. జార్ఖండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన మధ్యప్రదేశ్ లెఫ్టాండర్ బ్యాటర్ శుభం కువాష్ ఇచ్చిన క్యాచ్ తనదైన స్టైల్లో ఒడిసిపట్టి వారెవ్వా అనిపించాడు. 74వ ఓవర్లో ఆఫ్ స్పిన్నర్ ఆదిత్య సింగ్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన శుభం(84).. షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.బ్యాట్ ఎడ్జ్ని తాకిన బాల్ తన వైపునకు రాగానే ఇషాన్ కిషన్ ఏమాత్రం పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకున్నాడు. మిస్ అవుతుందనుకున్న బంతిని ఒడిసిపట్టి శుభంను డిస్మిస్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా మధ్యప్రదేశ్తో మ్యాచ్లో శుభంతో పాటు చంచల్ రాథోడ్, రామ్వీర్ గుర్జార్ వికెట్లు పడగొట్టడంలోనూ ఇషాన్ కిషన్ కీపర్గా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాడు. కాగా గతేడాది దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలోనే టీమిండియాను వీడిన ఇషాన్ కిషన్.. రంజీలు ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేశాడు. ఈ క్రమంలో సెంట్రల్ కాంట్రా క్టు కోల్పోయాడు. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన ఇషాన్.. తొలుత బుచ్చిబాబు టోర్నీతో దేశవాళీ క్రికెట్ మొదలు పెట్టాడు. బుచ్చిబాబు టోర్నమెంట్- ఏగ్రూపులో ఏ జట్లు?తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుచ్చిబాబు టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల మ్యాచ్ల ఈ రెడ్బాల్ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో డిఫెండింగ్ చాంపియన్ మధ్యప్రదేశ్తో పాటు జార్ఖండ్, హైదరాబాద్.. గ్రూప్-బిలో రైల్వేస్, గుజరాత్, తమిళనాడు ప్రెసిడెంట్స్ ఎలెవన్, గ్రూప్-సిలో ముంబై, హర్యానా, తమిళనాడు ప్రెసింగ్ ఎలెవన్ 2, గ్రూప్-డిలో జమ్మూ కశ్మీర్, బరోడా, ఛత్తీస్గఢ్ జట్లు ఉన్నాయి. ప్రతి గ్రూప్లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఆగష్టు 15- సెప్టెంబరు 5 వరకు ఈ టోర్నీ జరుగనుంది. Ishan Kishan in good rhythm. 💥- Great piece of wicketkeeping!pic.twitter.com/sjnsGZTaQF— Mufaddal Vohra (@mufaddal_vohra) August 15, 2024 -
ఇషాన్ కిషన్ రీఎంట్రీ.. ఆ జట్టు కెప్టెన్గా ఎంపిక?
టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. బుచ్చి బాబు టోర్నమెంట్లో జార్ఖండ్ జట్టుకు కిషన్ సారథ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ధ్రువీకరించినట్లు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ ఫో తమ కథనంలో పేర్కొంది. ఈ బుచ్చిబాబు టోర్నీ చెన్నై వేదికగా ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం జార్ఖండ్ జట్టు ఇప్పటికే చెన్నైకు చేరుకుంది. కాగా తొలుత కిషన్ ఈ టోర్నీకి దూరంగా ఉండాలని భావించాండంట. ఈ క్రమంలోనే మొదట ప్రకటించిన జార్ఖండ్ జట్టులో కిషన్కు జెఎస్సీఎ సెలక్టర్లు చోటివ్వలేదు.అయితే తర్వాత ఇషాన్ తన నిర్ణయాన్ని మార్చకుని, ఈ బుచ్చిబాబు టోర్నీకి అందుబాటులో ఉంటానని జెఎస్సీఎకు తెలియజేశాడు. ఈ నేపథ్యంలోనే తమ జట్టు పగ్గాలను అతడికి జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అప్పగించింది. కిషన్ బుధవారం(ఆగస్టు 14) చెన్నైలో ఉన్న తన జట్టుతో కలవనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ టోర్నీలో కిషన్ అద్భుతంగా రాణిస్తే భారత క్రికెట్లో తిరిగి పునరాగమనం చేసే అవకాశముంటుంది. కాగా దేశవాళీ క్రికెట్లో ఆడాలన్న తమ ఆదేశాలను దిక్కరించడంతో కిషన్పై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. జాతీయ జట్టులో చోటుతో పాటు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ను ఈ జార్ఖండ్ డైనమెట్ కోల్పోయాడు.అసలేంటి ఈ బుచ్చి బాబు టోర్నీ..?దక్షిణాది భారత క్రికెట్ పితామహుడు ఎం. బుచ్చి బాబు నాయుడు(మోతవరపు వెంకట మహిపతి నాయుడు) పేరు మీద ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ టోర్నీ జరగనుంది. చివరగా 2017లో జరిగింది. ఈ ఏడాది టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గోనున్నాయి. వాటిని రెండు గ్రూపులుగా విభిజించారు. తమిళనాడులోని తిరునెల్వేలి, కోయంబత్తూరు, సేలం, నాథమ్ వేదికగా మ్యాచ్లు జరగనున్నాయిజట్లు ఇవేగ్రూప్ ఎ: మధ్యప్రదేశ్(డిఫెండింగ్ ఛాంపియన్ ), జార్ఖండ్, హైదరాబాద్గ్రూప్ బి: రైల్వేస్, గుజరాత్, TNCA ప్రెసిడెంట్స్ XIగ్రూప్ సి: ముంబై, హర్యానా, TNCA XIగ్రూప్ డి: జమ్మూ & కాశ్మీర్, బరోడా, ఛత్తీస్గఢ్ -
వెనక్కి తగ్గిన ఇషాన్ కిషన్.. రంజీల్లో ఆడనున్న జార్ఖండ్ డైనమేట్
బీసీసీఐ అగ్రహానికి గురైన టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. క్రిక్బజ్ రిపోర్ట్ ప్రకారం.. ఇషాన్ కిషన్ రాబోయే దేశీవాళీ క్రికెట్ సీజన్లో జార్ఖండ్ తరపున ఆడనున్నట్లు సమాచారం. రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో జార్ఖండ్ కెప్టెన్గా కిషన్ వ్యవహరించే అవకాశముందని క్రిక్బజ్ తెలిపింది. వచ్చే రంజీ ట్రోఫీ సీజన్కు సంబంధించి 25 మంది సభ్యులతో కూడిన జార్ఖండ్ జట్టులో కిషన్ పేరును ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ చేర్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా గతేడాది డిసెంబర్లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఇషాన్ కిషన్.. వ్యక్తిత కారణాలతో సిరీస్ మధ్యలోనే స్వదేశానికి వచ్చేశాడు. అయితే జనవరిలో భారత జట్టు ఇంగ్లండ్తో ఆడిన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ముందు సెలక్టర్లు ఇషాన్ పేరును పరిగణనలోకి తీసుకోవాలంటే దేశవాళీలు ఆడాలని కోరారు.కానీ సెలక్టర్ల ఆదేశాలను కిషన్ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో అతడి స్ధానంలో ఆసీస్ సిరీస్కు ధ్రువ్ జురెల్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఆ తర్వాత కూడా కిషన్ దేశీవాళీ క్రికెట్ ఆడలేదు. దేశీ వాళీ క్రికెట్ కాకుండా ఐపీఎల్-2024 కోసం ప్రాక్టీస్ చేసుకోవడం వంటి ఆంశాలు బీసీసీఐ అగ్రహాం తెప్పించాయి. దీంతో అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తప్పించింది. అప్పటి నుంచి జాతీయ జట్టు ఎంపికలో కిషన్ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. కిషన్ చివరగా భారత్ తరపున 2023 వన్డే ప్రపంచకప్లో ఆడాడు. ఇప్పుడు మళ్లీ భారత తరపున రీ ఎంట్రీ ఇవ్వాలంటే దేశీవాళీ క్రికెట్లో ఆడటమే కిషన్ ముందున్న ఏకైక ఆప్షన్. ఈ క్రమంలోనే కిషన్ రంజీల్లో ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే దులీప్ ట్రోఫీకి మాత్రం కిషన్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడంట. -
శ్రేయస్ వచ్చేశాడు.. మరి డబుల్ సెంచరీ వీరుడి సంగతేంటి?
టీమిండియా స్టార్ ప్లేయర్, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దాదాపు 8 నెలల తర్వాత జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. శ్రీలంకతో వన్డే సిరీస్కు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ అయ్యర్ను ఎంపిక చేసింది. కాగా దేశీవాళీ క్రికెట్లో ఆడాలన్న తమ ఆదేశాలను ధిక్కరించినందు అయ్యర్పై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.అదేవిధంగా అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి సైతం బీసీసీఐ తప్పించింది. అయితే తన తప్పు తెలుసుకున్న అయ్యర్ గత రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై జట్టుకు ఆడాడు. అంతేకాకుండా జాతీయ జట్టు తరపున రీ ఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమించాడు. అయితే ఇప్పుడు భారత కొత్త హెడ్ కోచ్గా గౌతం గంభీర్ బాధ్యతలు చేపట్టడంతో అయ్యర్కు మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చేందుకు తలుపులు తెరుచుకున్నాయి. గంభీర్కు అయ్యర్కు మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్-2024 విజేతగా నిలిచిన కేకేఆర్ జట్టుకు అయ్యర్ కెప్టెన్ కాగా.. గంభీర్ మెంటార్గా పనిచేశాడు. గంభీర్ సూచనలతోనే అయ్యర్ను మళ్లీ సెలక్టర్లు పిలుపినిచ్చినట్లు తెలుస్తోంది. అయ్యర్ కాంట్రాక్ట్పై కూడా బీసీసీఐ పునారాలోచనచేయనున్నట్లు సమాచారం. ఇక అయ్యర్తో పాటు బీసీసీఐ అగ్రహానికి గురైన మరో క్రికెటర్ ఇషాన్ కిషన్ పరిస్థితి ఏంటి అని క్రీడా వర్గాల్లో తెగ చర్చనడుస్తోంది.కిషన్ రీ ఎంట్రీ ఎప్పుడు?కాగా గతేడాది డిసెంబర్లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఇషాన్ కిషన్.. వ్యక్తిత కారణాలతో సిరీస్ మధ్యలోనే స్వదేశానికి వచ్చేశాడు. అయితే జనవరిలో భారత జట్టు ఇంగ్లండ్తో ఆడిన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ముందు సెలక్టర్లు ఇషాన్ పేరును పరిగణనలోకి తీసుకోవాలంటే దేశవాళీలు ఆడాలని కోరారు. కానీ సెలక్టర్ల ఆదేశాలను కిషన్ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో అతడి స్ధానంలో ఆసీస్ సిరీస్కు ధ్రువ్ జురెల్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఆ తర్వాత కూడా కిషన్ దేశీవాళీ క్రికెట్ ఆడలేదు. దేశీ వాళీ క్రికెట్ కాకుండా ఐపీఎల్-2024 కోసం ప్రాక్టీస్ చేసుకోవడం వంటి ఆంశాలు బీసీసీఐ అగ్రహాం తెప్పించాయి.దీంతో అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తప్పించింది. అప్పటి నుంచి జాతీయ జట్టు ఎంపికలో కిషన్ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. అయితే ఇషాన్ కిషన్ తిరిగి జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలంటే కచ్చితంగా దేశవాళీ క్రికెట్ సీజన్ మొత్తం ఆడాల్సిందే అని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా వన్డేల్లో అయ్యర్కు డబుల్ సెంచరీ ఉన్న సంగతి తెలిసిందే.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. -
‘సంజూకు వయసు మీద పడింది.. జట్టులో చోటు కష్టమే’
సంజూ శాంసన్.. ఈ టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్కు అంతర్జాతీయ క్రికెట్లో తగినన్ని అవకాశాలు రావడం లేదనేది అతడి అభిమానుల వాదన. ప్రతిభ ఉన్నా ఈ కేరళ ఆటగాడి పట్ల సెలక్టర్లు వివక్ష చూపుతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బీసీసీఐని ట్రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయి.అందుకు తగ్గట్లుగానే వన్డే ప్రపంచకప్-2023 సమయంలో మెరుగైన గణాంకాలున్న సంజూను కాదని.. టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్కు జట్టులో చోటు ఇచ్చారు. అందుకు తగ్గ మూల్యం కూడా చెల్లించారు. ఈ టోర్నీలో సూర్య పూర్తిగా తేలిపోవడంతో జట్టు యాజమాన్యం విమర్శలపాలైంది. ఈ క్రమంలో ఐపీఎల్-2024 రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్గా, వికెట్ కీపర్ బ్యాటర్గా సత్తా చాటిన సంజూ ఎట్టకేలకు.. టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటు దక్కించుకోగలిగాడు.అయితే, రిషభ్ పంత్ రూపంలో గట్టి పోటీ ఎదురుకావడంతో అతడు బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది. అనంతరం జింబాబ్వే పర్యటనలో టీ20 సిరీస్లో అదరగొట్టిన సంజూకు.. తదుపరి శ్రీలంక టూర్కు వెళ్లబోయే జట్టులో చోటు దక్కుతుందో లేదోనన్నది ఆసక్తికరంగా మారింది. వయసు మీద పడింది.. జట్టులో చోటు కష్టమేఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా సంజూ శాంసన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. శుభంకర్ మిశ్రా యూట్యూబ్ పాడ్కాస్ట్లో అమిత్ మిశ్రా టీ20 ప్రపంచకప్-2026 జట్టులో సంజూకు చోటు దక్కకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ‘‘అతడు మరో వరల్డ్కప్ ఆడతాడని నేను అనుకోవడం లేదు. ఇప్పటికే అతడికి వయసు మీద పడింది. టీ20 జట్టులో యువ ఆటగాళ్లకే పెద్ద పీట వేస్తామనే సంప్రదాయాన్ని విరాట్ కోహ్లి ప్రవేశపెట్టాడు.వాళ్లే బాగా ఆడతారని అతడి నమ్మకం. అయితే, తనకు 35 ఏళ్లు వచ్చినా కోహ్లి ఆడాడనుకోండి. అది వేరే విషయం. ఒకవేళ శాంసన్ గనుక టీ20 జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకోవాలంటే అత్యద్భుతంగా ఆడాలి.వారి నుంచి తీవ్రమైన పోటీఅలా అయితే, రెండేళ్ల తర్వాత జరిగే ప్రపంచకప్ జట్టులో అతడికి చోటు దక్కుతుంది. లేదంటే కష్టమే. నిజానికి ఇషాన్ కిషన్ అత్యంత ప్రతిభ ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్.కానీ అతడిని టీ20ల నుంచి పక్కనపెట్టేశారు. ఇక రిషభ్ పంత్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? అతడొక అత్యుత్తమ ప్లేయర్. ధ్రువ్ జురెల్, జితేశ్ శర్మ.. ఇలా వికెట్ కీపర్ల లిస్టు పెద్దగానే ఉంది. కాబట్టి సంజూ శ్రమించక తప్పదు’’ అని అమిత్ మిశ్రా పేర్కొన్నాడు.కాగా 29 ఏళ్ల సంజూ శాంసన్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 16 వన్డేలు ఆడి 510 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 28 అంతర్జాతీయ టీ20లలో సంజూ 444 రన్స్ సాధించాడు. చదవండి: హార్దిక్ పాండ్యాకు షాక్!.. టీమిండియా టీ20 కెప్టెన్గా అతడే! -
నాన్సెన్స్.. నేనెందుకు రంజీల్లో ఆడాలి: ఇషాన్ కిషన్
చేతులారా తన కెరీర్ను తానే నాశనం చేసుకుంటున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్. భారత జట్టు ఓపెనర్గా తనదైన శైలిలో రాణిస్తూ ప్రతిభ నిరూపించుకున్న ఈ జార్ఖండ్ వికెట్ కీపర్.. కొంత కాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు.గతేడాది నవంబరులో సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే వ్యక్తిగత కారణాలు చెప్పి స్వదేశానికి తిరిగి వచ్చిన ఇషాన్ కిషన్ పట్ల బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. మానసిక ఒత్తిడితో బాధపడుతున్నానని జట్టు నుంచి నిష్క్రమించిన ఈ యంగ్ ఓపెనర్.. కుటుంబంతో కలిసి సరదాగా గడిపిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.ఈ నేపథ్యంలో.. తుదిజట్టులో ఆడే అవకాశం రానందు వల్లే ఇషాన్ ఇంటిబాట పట్టాడని.. ఈ క్రమంలో బోర్డుతో విభేదాలు తారస్థాయికి చేరాయనే వార్తలు వినిపించాయి. అందుకు తగ్గట్లుగానే.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం.. ఇషాన్ దేశవాళీ క్రికెట్(రంజీ)లో ఆడితేనే మళ్లీ జాతీయ జట్టులో అడుగుపెట్టగలడని స్పష్టం చేశాడు.అయితే, ఇషాన్ కిషన్ మాత్రం ఈ ఆదేశాలను బేఖాతరు చేశాడు. జార్ఖండ్ తరఫున అతడు రంజీ బరిలో దిగుతాడని స్థానిక బోర్డు ఆశించినా.. అతడి నుంచి స్పందన కరువైంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలు తీసుకున్న బీసీసీఐ.. ఇషాన్ కిషన్ను సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించింది.ఈ విషయంపై తాజాగా ఇషాన్ కిషన్ స్పందించాడు. తాను రంజీలు ఆడకపోవడానికి గల కారణం వెల్లడించాడు. ‘‘ఒక ఆటగాడు చాలా కాలం తర్వాత పునరాగమనం చేయాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలనే నిబంధన ఉంది.అయితే, నన్ను కూడా ఇలా ఆడమనడంలో అర్థం లేదనిపించించింది. ఎందుకంటే నేను కాస్త విరామం తీసుకున్నా. అది సాధారణ సెలవు మాత్రమే.అలాంటపుడు నేనెందుకు రంజీలు ఆడాలి. ఆడే ఓపిక లేదనే కదా అంతర్జాతీయ క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్నా. అయినా.. జాతీయ జట్టుకు ఆడకుండా విరామం తీసుకుంటే.. రంజీలు ఆడమంటూ ఆదేశించడం ఏమిటో అర్థం కాలేదు.నేను బాగుంటే గనుక ఇంటర్నేషనల్ క్రికెట్ కంటిన్యూ చేసేవాడిని కదా. అప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నాను. ఈ రోజు కూడా అంతా బాగుందని చెప్పే పరిస్థితిలో లేను.క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నా. అయినా నా విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతోందనే ప్రశ్న పదే పదే నా మదిని తొలుస్తోంది.నేను బాగా ఆడుతున్నా.. కేవలం బ్రేక్ తీసుకున్నాననే కారణంగా ఇలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదు’’ అని ఇషాన్ కిషన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ ఈ మేరకు తన మనసులోని భావాలు పంచుకున్నాడు.కాగా రంజీలు ఆడకుండా ఎగ్గొట్టిన ఇషాన్ కిషన్.. ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగడం గమనార్హం. ఈ సీజన్లో అతడు 14 ఇన్నింగ్స్లో కలిపి కేవలం 320 పరుగులు చేయగలిగాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 జట్టు ఎంపిక సమయంలో బీసీసీఐ అతడిని పరిగణనలోకి కూడా తీసుకోలేదు.ఇక వికెట్ కీపర్ల కోటాలో రిషభ్ పంత్, సంజూ శాంసన్ చోటు దక్కించుకున్నారు. ఇక ఈ మెగా టోర్నీ ఆద్యంతం అదరగొట్టిన టీమిండియా చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. -
అనంత్- రాధిక సంగీత్: జంటగా మెరిసిన క్రికెటర్లు.. హార్దిక్ మాత్రం ఒంటరిగా! (ఫోటోలు)
-
శ్రేయస్, ఇషాన్ల వేటు పడటానికి కారణం అతడే: జై షా
టీమిండియా స్టార్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్టులు కోల్పోవడానికి తాను కారణం కాదన్నాడు భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా. సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం మాత్రమే తన విధి అని తెలిపాడు.కాగా దక్షిణాఫ్రికా పర్యటన నుంచి మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్.. రంజీల్లో ఆడమని బోర్డు ఆదేశించినా లెక్కచేయలేదు. ఆ తర్వాత వెంటనే ఐపీఎల్-2024 కోసం ముంబై ఇండియన్స్ క్యాంపులో చేరాడు.మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ సైతం రంజీల్లో ముంబై తరఫున బరిలోకి దిగకుండా ఫిట్నెస్ కారణాలు సాకుగా చూపాడు. అయితే, ఎన్సీఏ అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది. ఈ క్రమంలో తాజా సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ఈ ఇద్దరి పేర్లు గల్లంతయ్యాయి.ఆ తర్వాత అయ్యర్ ముంబై తరఫున రంజీ బరిలో దిగినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో వీరిద్దరికి టీ20 వరల్డ్కప్-2024 జట్టులోనూ చోటు దక్కలేదు.అతడి నిర్ణయం ప్రకారమేఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్టులు కోల్పోయిన అంశంపై జై షా తాజాగా స్పందించాడు. ‘‘బీసీసీఐ రాజ్యాంగాన్ని గమనించండి.సెలక్షన్ మీటింగ్లో చర్చించిన విషయాల గురించి మీడియాకు తెలియజేసే కన్వీనర్ను మాత్రమే నేను.ఆ ఇద్దరిని దేశవాళీ క్రికెట్ ఆడాలని నిర్ణయించిందీ.. అదే విధంగా వారు చెప్పినట్లు వినలేదని సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తప్పించిందీ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.అతడు తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడమే నా పని. వాళ్లిద్దరు వెళ్లినా సంజూ శాంసన్ లాంటి వాళ్ల రూపంలో కొత్త ఆటగాళ్లకు చోటు దక్కింది కదా!’’ అని జై షా జాతీయ మీడియాతో వ్యాఖ్యానించాడు.అయ్యర్ అదుర్స్... ఇషాన్ ఫెయిల్కాగా ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నారు. ముంబై ఇండియన్స్ తరఫున ఓపెనర్గా వస్తున్న ఇషాన్ ఇప్పటి వరకు 12 ఇన్నింగ్స్లో కలిపి 266 పరుగులు మాత్రమే చేశాడు.మరోవైపు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం 11 ఇన్నింగ్స్లో 280 పరుగులు చేయడంతో పాటు.. ఈ సీజన్లో జట్టును ప్లే ఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా నిలిపే పనిలో ఉన్నాడు. చదవండి: ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్ -
స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. హార్డ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ తప్ప మిగిలిన వాళ్లలో ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.ముఖ్యంగా టాపార్డర్ దారుణంగా విఫలమైంది. ఓపెనర్లు ఇషాన్ కిషన్(13)- రోహిత్ శర్మ(11) పూర్తిగా నిరాశపరచగా.. వన్డౌన్ బ్యాటర్ నమన్ ధిర్(11) కూడా చేతులెత్తేశాడు.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాలుగో నంబర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 56) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన బ్యాటర్లు తిలక్ వర్మ(4), నేహాల్ వధేరా(6), హార్దిక్ పాండ్యా(1) పెవిలియన్కు క్యూ కట్టారు.సూర్య ఒంటరి పోరాటం వృథాసూర్య ఈ క్రమంలో ఒంటరి పోరాటం చేస్తున్న సూర్యకు తోడైన టిమ్ డేవిడ్(20 బంతుల్లో 24) నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇక టెయిలెండర్లు గెరాల్డ్ కోయెట్జీ(8), పీయూశ్ చావ్లా(0), జస్ప్రీత్ బుమ్రా(1 నాటౌట్) కూడా చేతులెత్తేయడంతో 145 పరుగులకే ముంబై కథ ముగిసిపోయింది.ఫలితంగా కేకేఆర్ విధించిన 170 పరుగుల లక్ష్య ఛేదనలో విఫలమైన ముంబై వాంఖడేలో పన్నెండేళ్ల తర్వాత తొలిసారి కోల్కతా చేతిలో 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.ఈ పరాజయం ముంబై ఫ్యాన్స్ హృదయాలను ముక్కలు చేస్తే.. పందొమ్మిదో ఓవర్లో మూడు వికెట్లు తీసి పాండ్యా సేన పతనాన్ని శాసించిన మిచెల్ స్టార్క్ను చూసి కేకేఆర్ అభిమానులు మురిసిపోయారు.అద్భుత రీతిలో బౌల్డ్ చేసిముంబైతో మ్యాచ్లో 3.5 ఓవర్లు బౌల్ చేసిన స్టార్క్ 33 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్ను అద్భుత రీతిలో బౌల్డ్ చేయడం హైలైట్గా నిలిచింది. గంటకు 142.3 కిలో మీటర్ల వేగంతో స్టార్క్ విసిరిన బంతి లెగ్ స్టంప్ను ఎగురగొట్టింది.అయినప్పటికీ స్టార్క్ పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు. అయితే.. ఇషాన్ అవుట్ కాగానే ముంబై ఇండియన్స్ కోచ్ మార్క్ బౌచర్తో పాటు చీర్ గర్ల్స్.. ముఖ్యంగా రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ వైరల్గా మారాయి. ఇక ఇషాన్తో పాటు టిమ్ డేవిడ్, కోయెట్జీ, పీయూశ్ చావ్లా వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు స్టార్క్. చదవండి: అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యాStumps dismantled, in vintage Starc style 🔥🫡 #TATAIPL #MIvKKR #IPLonJioCinema #IPLinBhojpuri pic.twitter.com/RcERxhgJps— JioCinema (@JioCinema) May 3, 2024 -
T20 WC: సంజూ బాగా ఆడుతున్నాడు.. అయినా పంత్కే చోటివ్వాలి!
టీ20 ప్రపంచకప్-2024 భారత జట్టులో రిషభ్ పంత్కు చోటు ఇవ్వాలని ఆస్ట్రేలియా దిగ్గజం, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ అన్నాడు. మెగా టోర్నీ ఆడే అర్హత పంత్కు ఉందని.. తన దృష్టిలో అతడే టీమిండియాకు మొదటి వికెట్ కీపర్ ఆప్షన్ అని పేర్కొన్నాడు. ఐపీఎల్-2024లో సత్తా చాటి కచ్చితంగా వరల్డ్కప్ ఆడే జట్టులో పంత్ చోటు దక్కించుకుంటాడని రిక్కీ పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా 2022, డిసెంబరులో కారు ప్రమాదానికి గురై.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ పంత్ కోలుకోవడానికి దాదాపు ఏడాదిన్నర కాలం పట్టింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో సుదీర్ఘకాలం పాటు పునరావాసం పొందిన పంత్.. క్రమక్రమంగా కోలుకుని మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. ఈ క్రమంలో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా తిరిగి పగ్గాలు చేపట్టిన పంత్.. వికెట్ కీపర్ బ్యాటర్గానూ సేవలు అందిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్ ఆడి 194 పరుగులు చేసిన పంత్ ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే.. కెప్టెన్గా మాత్రం పంత్ విఫలమవుతూనే ఉన్నాడు. అతడి సారథ్యంలో ఢిల్లీ ఇప్పటిదాకా ఆరు మ్యాచ్లు ఆడి కేవలం రెండే గెలిచింది. ఇదిలా ఉంటే.. మే 27న ఐపీఎల్-2024 ముగియనుండగా.. జూన్ 1 నుంచి వెస్టిండీస్- అమెరికా వేదికగా పొట్టి ప్రపంచకప్ సమరం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు వికెట్ కీపర్ ఎంపిక గురించి రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంజూ బాగా ఆడుతున్నాడు.. అయినా పంత్కే చోటివ్వాలి! ‘‘వరల్డ్కప్ జట్టులో రిషభ్ పంత్కు చోటు ఇవ్వాలా? అంటే కచ్చితంగా ఇవ్వాలనే చెబుతా. ఐపీఎల్ ముగిసేలోపు అతడు అందుకు అర్హత సాధిస్తాడు. గత ఆరు సీజన్లలో పంత్ మెరుగ్గా ఆడాడు. టీమిండియా తరఫున కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు. భారత జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదని తెలుసు. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ బాగా ఆడుతున్నారు. చాలా ఆప్షన్లు కనిపిస్తున్నాయి. అయితే.. నేను గనుక జట్టును ఎంపిక చేయాల్సి వస్తే రిషభ్ పంత్కే మొదటి ప్రాధాన్యం ఇస్తాను. నన్నెపుడు ఈ ప్రశ్న అడిగినా ఇదే సమాధానం ఇస్తాను’’ అని రిక్కీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్కప్-2024 టీమిండియా వికెట్ కీపర్ల రేసులో ప్రస్తుతం సంజూ శాంసన్ ముందుకు దూసుకుపోతున్నాడు. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న అతడు ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్లో కలిపి 264 పరుగులు సాధించాడు. చదవండి: #Pat Cummins: శెభాష్.. ఇది సరైన నిర్ణయం! కమిన్స్ అన్నతో అట్లుంటది మరి.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024 MI VS RCB: సెంచరీ పూర్తి చేసిన ఇషాన్ కిషన్
ఐపీఎల్ 2024లో భాగంగా ఆర్సీబీతో నిన్న (ఏప్రిల్ 11) జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్లో 5 సిక్సర్లు బాదిన ఇషాన్ ఐపీఎల్లో సిక్సర్ల సెంచరీని పూర్తి చేశాడు. తద్వారా ముంబై ఇండియన్స్ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. ఇషాన్కు ముందు రోహిత్ శర్మ, కీరన్ పోలార్డ్, హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ తరఫున 100 సిక్సర్ల మార్కును తాకారు. ఇషాన్ ఖాతాలో ప్రస్తుతం 102 సిక్సర్లు (80 మ్యాచ్లు) ఉన్నాయి. కాగా, ఆర్సీబీతో మ్యాచ్లో ఇషాన్తో పాటు రోహిత్ శర్మ (24 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడటంతో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. డుప్లెసిస్ (40 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రజత్ పాటిదార్ (26 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (53 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శనతో (4-0-21-5) చెలరేగాడు. అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. 15.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
RCB Vs MI Highlights Photos: ఇషాన్, సూర్యకుమార్ల విధ్వంసం ముంబై ఘనవిజయం (ఫొటోలు)
-
RCB Vs MI: ముంబై ఫటాఫట్...
ముంబై: ముంబై ఇండియన్స్ ముందున్న కొండంత లక్ష్యాన్ని ఇద్దరే ఇద్దరి విధ్వంసం మంచు ముక్కలా కరిగించేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్స్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్స్లు) సిక్సర్ల సునామీతో ముంబై 197 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.3 ఓవర్లలోనే ఛేదించింది. దాంతో హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై ఘనవిజయం సాధించింది. అంతకుముందు తొలుత ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. డుప్లెసిస్ (40 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించగా, రజత్ పటిదార్ (26 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్స్లు), దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్లు) మెరిపించారు. ముంబై బౌలర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బుమ్రా 21 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. కోహ్లి విఫలం సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి (3) విఫలమవగా, విల్ జాక్స్ (8) నిరాశపరిచాడు. ఈ దశలో బెంగళూరును కెప్టెన్ డుప్లెసిస్ అండతో పటిదార్ ధాటిగా నడిపించాడు. 12వ ఓవర్లో కోయెట్జి బౌలింగ్లో రెండు వరుస సిక్స్లు బాదిన పటిదార్ 25 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకొని తర్వాతి బంతికే వెనుదిరిగాడు. మ్యాక్స్వెల్ (0) ఈ సీజన్లో మూడోసారి డకౌటయ్యాడు. అడపాదడపా షాట్లతో డుప్లెసిస్ 33 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అయితే బుమ్రా వరుస ఓవర్లలో రెండేసి వికెట్లను పడగొట్టాడు. డుప్లెసిస్, హిట్టర్ లామ్రోర్ (0)లతో పాటు, సౌరవ్ (9), వైశాక్ (0)లను బుమ్రా అవుట్ చేసినా... దినేశ్ కార్తీక్ ధనాధన్ ఆటతో బెంగళూరు మంచి స్కోరు చేసింది. ఇషాన్, సూర్యల తుఫాన్తో... భారీ లక్ష్య ఛేదనలో ముంబై బ్యాటర్లు మెరుపు షాట్లతో హోరెత్తించారు. ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ముంబై పవర్ప్లేలోనే 72/0 స్కోరు చేసింది. ఇషాన్ 23 బంతుల్లో అర్ధసెంచరీని సాధించగా, రోహిత్ నింపాదిగా ఆడాడు. కేవలం 8.3 ఓవర్లలోనే జట్టు స్కోరు 100 చేరింది. అదే ఓవర్లో ఇషాన్ దూకుడు ముగిసింది. అనంతరం సూర్యకుమార్ విధ్వంసం సృష్టించి 17 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్, సూర్యలు అవుటయ్యాక హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్స్లు), తిలక్ వర్మ (10 బంతుల్లో 16 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడి ముంబైను విజయతీరాలకు చేర్చారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) ఇషాన్ (బి) బుమ్రా 3; డుప్లెసిస్ (సి) డేవిడ్ (బి) బుమ్రా 61; జాక్స్ (సి) డేవిడ్ (బి) మధ్వాల్ 8; పటిదార్ (సి) ఇషాన్ (బి) కోయెట్జీ 50; మ్యాక్స్వెల్ (ఎల్బీడబ్ల్యూ) గోపాల్ 0; దినేశ్ కార్తీక్ (నాటౌట్) 53; లామ్రోర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 0; సౌరవ్ (సి) ఆకాశ్ (బి) బుమ్రా 9; వైశాక్ (సి) నబి (బి) బుమ్రా 0; ఆకాశ్దీప్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–14, 2–23, 3–105, 4–108, 5–153, 6–153, 7–170, 8–170. బౌలింగ్: నబీ 1–0–7–0, కోయెట్జీ 4–0–42–1, బుమ్రా 4–0–21–5, ఆకాశ్ 4–0–57–1, శ్రేయస్ గోపాల్ 4–0–32–1, షెఫర్డ్ 2–0–22–0, హార్దిక్ 1–0–13–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) కోహ్లి (బి) ఆకాశ్దీప్ 69; రోహిత్ (సి) టాప్లీ (బి) జాక్స్ 38; సూర్యకుమార్ (సి) మహిపాల్ (బి) వైశాక్ 52; హార్దిక్ (నాటౌట్) 21; తిలక్ వర్మ (నాటౌట్) 16; ఎక్స్ట్రాలు 3; మొత్తం (15.3 ఓవర్లలో 3 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–101, 2–139, 3–176. బౌలింగ్: టాప్లీ 3–0–34–0, సిరాజ్ 3–0–37–0, ఆకాశ్దీప్ 3.3–0–55–1, మ్యాక్స్వెల్ 1–0–17–0, వైశాక్ 3–0–32–1, 2–0–24–1. ఐపీఎల్లో నేడు లక్నో X ఢిల్లీ వేదిక: లక్నో రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
Viral Video: అభిమాని దెబ్బకు ఉలిక్కిపడిన రోహిత్ శర్మ
ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో నిన్న జరిగిన మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని రాజస్థాన్ ఛేజ్ చేస్తుండగా.. ఓ వ్యక్తి సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలో చొరబడి స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మవైపు దూసుకొచ్చాడు. ఊహించని ఈ పరిణామంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ రోహిత్.. ఆతర్వాత ఆ వ్యక్తిని కౌగిలించుకుని గ్రౌండ్లో నుంచి బయటికి వెళ్లాలని సూచించాడు. రోహిత్ను కౌగించుకున్న అనంతరం ఆ వ్యక్తి పక్కనే ఉన్న ఇషాన్ కిషన్తో సైతం కరచాలనం చేసి కౌగిలించుకున్నాడు. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తికి పట్టుకుని బయటకు లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. A fan invaded the pitch and met Rohit Sharma and Ishan Kishan.pic.twitter.com/NusKCxHVJP — CricTracker (@Cricketracker) April 1, 2024 ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్లో ముంబై రాజస్థాన్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ప్రస్తుత సీజన్లో ముంబైకు ఇది వరుసగా మూడో ఓటమి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై చెత్త ప్రదర్శన చేసి నిర్ణీత ఓవర్లలో కేవలం 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై ఇన్నింగ్స్లో రోహిత్ సహా ముగ్గురు (నమన్ ధీర్, డెవాల్డ్ బ్రెవిస్) గోల్డెన్ డకౌట్లయ్యారు. తిలక్ వర్మ (32), హార్దిక్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ముంబై ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. బౌల్ట్ (4-0-22-3), చహల్ (4-0-11-3), బర్గర్ (4-0-32-2), ఆవేశ్ ఖాన్ (4-0-30-1) అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబైని వణికించారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్.. 15.3 ఓవర్లలో ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. రియాన్ పరాగ్ (54 నాటౌట్) మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడి రాజస్థాన్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. యశస్వి (10), బట్లర్ (13) మరోసారి నిరాశపరిచారు. సంజూ శాంసన్ 12, అశ్విన్ 16 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ 3 వికెట్లు పడగొట్టగా.. మఫాక తన మొట్టమొదటి ఐపీఎల్ వికెట్ దక్కించుకున్నాడు. -
ఇషాన్, శ్రేయస్ల కాంట్రాక్ట్ రద్దు: సచిన్ రియాక్షన్ వైరల్
దేశవాళీ క్రికెట్ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి తీసుకున్న నిర్ణయంపై దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ హర్షం వ్యక్తం చేశాడు. అగ్రశ్రేణి ఆటగాళ్లు ఫస్ల్క్లాస్ క్రికెట్ బరిలో దిగడం ద్వారా డొమెస్టిక్ టోర్నీలకు మరింత ఆదరణ పెరుగుతుందన్నాడు. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా ముంబై తరఫున ఆడేందుకు ఎంతో ఆతురతగా ఎదురుచూసే వాడినని సచిన్ టెండుల్కర్ గుర్తు చేసుకున్నాడు. కాగా జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు సెంట్రల్ కాంట్రాక్ట్ క్రికెటర్లు కచ్చితంగా రెడ్ బాల్ క్రికెట్(ఫస్ట్క్లాస్) ఆడాల్సిందేనని బీసీసీఐ ఇటీవల నిబంధన విధించిన విషయం తెలిసిందే. ఫిట్నెస్ కారణాల దృష్ట్యా ఇబ్బందిపడే వారు మినహా ప్రతి ఒక్కరు.. ముఖ్యంగా యువ ఆటగాళ్లు రంజీ బరిలో దిగాల్సిందేనని బోర్డు ఆటగాళ్లకు ఆదేశాలిచ్చింది. హెడ్కోచ్, కెప్టెన్, సెలక్టర్లు చెప్పినపుడు ఏ ఆటగాడైనా సరే దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో 2023-24 ఏడాదికిగానూ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టులలో ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, జార్ఖండ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్లకు మొండిచేయి చూపింది. రంజీ బరిలో దిగాలన్న కోచ్ ఆదేశాలను పెడచెవిన పెట్టారనే కారణంతో వారిద్దరిపై వేటు పడినట్లు తెలిసింది. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్ ఎక్స్ వేదికగా రంజీ ట్రోఫీ ప్రాధాన్యం గురించి వివరిస్తూ.. ‘‘తాజా రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముంబై జట్టు పడిలేచిన కెరటంలా ఫైనల్కు దూసుకువచ్చింది. మరో సెమీస్ మ్యాచ్లో చివరి రోజు వరకు ఆట కొనసాగుతున్న వైనం ముచ్చటగా ఉంది. ఈ మ్యాచ్లో మధ్యప్రదేశ్ విజయానికి 90కి పైగా పరుగులు, విదర్భకు నాలుగు వికెట్లు కావాలి. నిజానికి నా కెరీర్ ఆసాంతం ఎప్పుడు ముంబైకి ఆడే అవకాశం వచ్చినా కచ్చితంగా బరిలో దిగే వాడిని. అక్కడి డ్రెస్సింగ్ రూంలో దాదాపు 7-8 మంది టీమిండియా ఆటగాళ్లు ఉండేవారు. వారితో కలిసి అక్కడ రూం షేర్ చేసుకోవడం మరింత సరదాగా ఉండేది. టీమిండియా తరఫున టాప్ ప్లేయర్లుగా ఉన్నవాళ్లు దేశవాళీ క్రికెట్లో వారి వారి జట్లకు ఆడితే ఆదరణ పెరుగుతుంది. యువ ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అంతేకాదు ఫామ్లేమితో ఇబ్బంది పడేవాళ్లు తిరిగి బేసిక్స్ నుంచి మొదలుపెట్టి పొరపాట్లను సరిచేసుకునే అవకాశం దొరుకుతుంది. స్టార్ క్రికెటర్లు డొమెస్టిక్ టోర్నీల్లో ఆడితే క్రమక్రమంగా అభిమానులు కూడా దేశవాళీ జట్లకు మద్దతుగా నిలుస్తారు. నిజంగా దేశవాళీ క్రికెట్కు కూడా బీసీసీఐ సమాన ప్రాధాన్యం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది’’ అని సుదీర్ఘ నోట్ షేర్ చేశాడు. కాగా సచిన్ టెండుల్కర్ మంగళవారం ఈ మేరకు పోస్ట్ చేయగా.. బుధవారం నాటి ఆటలో భాగంగా రంజీ సెమీస్లో మధ్యప్రదేశ్పై విదర్భ 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. The Ranji Trophy semi-finals have been riveting! @MumbaiCricAssoc’s march into the finals was aided by a brilliant batting recovery, while the other semi-final hangs in the balance going into the last day - Madhya Pradesh need 90+ runs to win, Vidarbha need 4 wickets.… — Sachin Tendulkar (@sachin_rt) March 5, 2024 -
ఇషాన్ కిషన్కు బీసీసీఐ బంపరాఫర్.. కానీ 'నో' చెప్పేశాడుగా!?
భారత ఆటగాళ్లకు సంబంధించిన 2023-24 సెంట్రల్ కాంట్రాక్ట్లను బీసీసీఐ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కకపోవడం అందరని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఇదే విషయం భారత క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. రంజీల్లో ఆడేందుకు విముఖత చూపడంతో వీరిద్దరిపై బీసీసీఐ వేటు వేసింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్ట్ నుంచి తప్పించేముందు బీసీసీఐ పెద్దలు వారిద్దరితో మాట్లాడి వుంటే బాగుండేదని పలువరు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇంగ్లండ్తో ఆఖరి మూడు టెస్టులకు జట్టును ప్రకటించేముందు ఇషాన్ కిషన్ను బీసీసీఐ సెలక్టర్లు సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైజాగ్ టెస్టు తర్వాత జట్టుతో కలవాలని సెలక్టర్లు ఇషాన్ను ఆదేశించినట్లు సమాచారం. కానీ కిషన్ మాత్రం తన ఇంకా సిద్దంగా లేనని, మరి కొంత సమయం తనకు కావాలని సెలక్టర్లకు చెప్పినట్లు ప్రముఖ క్రీడా వెబ్సైట్ పేర్కొంది. అతడు నో చెప్పడంతోనే ధ్రువ్ జురెల్ను మిగిలిన మూడు టెస్టులకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కొనసాగించినట్లు వినికిడి. అయితే బీసీసీఐ నో చెప్పిన కిషన్.. ఐపీఎల్ ప్రాక్టీస్ కోసం మాత్రం బరోడాకు వెళ్లినట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ అతడిపై వేటు వేసినట్లు తెలుస్తోంది. కాగా వన్డే వరల్డ్ కప్ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన కిషన్.. మానసికంగా అలిసిపోయానని సిరీస్ మధ్యలోనే స్వదేశానికి వచ్చేసిన విషయం విధితమే, చదవండి: IPL 2024: సన్ రైజర్స్ సంచలన నిర్ణయం.. మార్క్రమ్కు బిగ్ షాక్! కొత్త కెప్టెన్ అతడే? -
అతడు తప్పు చేయలేదు.. అలాంటపుడు శిక్ష ఎందుకు?
స్టార్ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లను వార్షిక కాంట్రాక్టు జాబితా నుంచి తొలగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో బీసీసీఐని కొంతమంది సమర్థిస్తుంటే.. మరికొంత మంది మాజీ క్రికెటర్లు మాత్రం తప్పుబడుతున్నారు. కాగా సెంట్రల్ కాంట్రాక్టు కలిగి ఉన్న క్రికెటర్లందరూ బోర్డు ఆదేశాలకు అనుగుణంగా తప్పక దేశవాళీ క్రికెట్లో ఆడాలని బీసీసీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే. కోచ్, కెప్టెన్, సెలక్టర్ల సూచనల మేరకు ఎవరైతే దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందో నిర్ణయిస్తామని తెలిపింది. ముఖ్యంగా ఫిట్గా ఉన్న యువ ఆటగాళ్లు బోర్డు సూచించినపుడు తప్పక డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని ఆటగాళ్లను ఆదేశించింది. అయితే, అయ్యర్, ఇషాన్ ఈ నిబంధనలు ఉల్లంఘించారనే వార్తల నడుమ.. వారిద్దరి సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేయడం ఇందుకు బలాన్నిచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లకు అండగా నిలబడ్డాడు. వారికి మద్దతుగా నిలుస్తూ.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వంటి వాళ్లకు మాత్రం ఈ నిబంధనల నుంచి ఎలా మినహాయింపు ఇస్తారని ప్రశ్నించాడు. ఈ క్రమంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘హార్దిక్ పాండ్యా విషయాన్ని సంక్లిష్టం చేయాల్సిన అవసరం లేదు. అతడు ఎన్నో ఏళ్లుగా రెడ్ బాల్ క్రికెట్కు దూరంగా ఉన్నాడు. కాబట్టి ఈ నిబంధన విషయంలో అతడి గురించిన ప్రస్తావనే అనవసరం. అతడు టెస్టు సిరీస్లకు అందుబాటులోనే ఉండటం లేదు. అలాంటపుడు అతడిని ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడమని చెప్పడంలో అర్థమే లేదు. నాలుగు రోజుల మ్యాచ్కు ఓ ఆటగాడి శరీరం సహకరించనపుడు. గాయాల బారిన పడే ప్రమాదం ఉందనీ తెలిసినపుడు అలాంటి వ్యక్తిని ఎవరూ కూడా ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడమని ఆదేశించరు. ఒకవేళ తను టెస్టు ఆడేందుకు పూర్తి ఫిట్గా ఉంటే.. తను టీమిండియాకు ఆడటం మానేసి.. ప్రమోషన్ షూట్లలో పాల్గొంటే అప్పుడు తనది తప్పని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం అతడు ఇలాంటి తప్పులేమీ చేయలేదు. కాబట్టి బీసీసీఐకి అతడిని శిక్షించాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నాడు. చదవండి: Shreyas Iyer: సెమీస్ తుదిజట్టులో అయ్యర్.. రహానే కీలక వ్యాఖ్యలు -
హార్దిక్కు రూల్స్ వర్తించవా.. పాపం ఇషాన్, శ్రేయస్: మండిపడ్డ ఇర్ఫాన్
వార్షిక క్రాంటాక్టుల విషయంలో భారత క్రికెట్ నియంత్రణ అనుసరించిన తీరుపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విస్మయం వ్యక్తం చేశాడు. ఏ నిబంధనైనా టీమిండియా ఆటగాళ్లందరికీ ఒకేలా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. భారత జట్టు అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు ఇలాంటి పోకడలు నష్టం చేకూరుస్తాయని పఠాన్ ఘాటు విమర్శలు చేశాడు. కాగా 2023-24 ఏడాదికి గానూ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల విషయంలో టీమిండియా మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ పేర్లు గల్లంతైన విషయం తెలిసిందే. రంజీ టోర్నీలో ఆడాలన్న బోర్డు ఆదేశాలు బేఖాతరు చేశారన్న కారణంగానే వీళ్లిద్దరికి మొండిచేయి చూపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ బీసీసీఐ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ‘‘శ్రేయస్, ఇషాన్ ఇద్దరూ ప్రతిభావంతులైన క్రికెటర్లే. తిరిగి పుంజుకుని రెట్టించిన ఉత్సాహంతో వాళ్లిద్దరు కమ్బ్యాక్ ఇస్తారనే అనుకుంటున్నా. హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాళ్లు టెస్టు క్రికెట్ ఆడకూడదు అనుకున్నపుడు.. కనీసం దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్లోనైనా వాళ్లను ఆడించాలి కదా? జాతీయ జట్టుకు దూరమైనపుడు వాళ్లు కూడా దేశవాళీ బరిలో దిగాలి కదా? ఒకవేళ ఈ నిబంధన అందరికీ వర్తింపజేయకుంటే.. భారత క్రికెట్ అనుకున్న లక్ష్యాలను ఎన్నటికీ సాధించలేదు’’ అని ఎక్స్ వేదికగా ఇర్ఫాన్ పఠాన్ మండిపడ్డాడు. కాగా గతేడాది వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా గాయపడ్డ పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. మళ్లీ టీమిండియా తరఫున ఇంతవరకు రీఎంట్రీ ఇవ్వలేదు. అయితే, ఐపీఎల్-2024 బరిలో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బరిలోకి దిగేందుకు జిమ్లో చెమటోడుస్తున్నాడు. మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ రంజీ సెమీస్లో ముంబై తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడుతో ముంబై ఆడబోయే ఈ మ్యాచ్కు ఎంపిక చేసిన జట్టులో అతడికి చోటు దక్కింది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: BCCI Annual Players Contract List: పూర్తి వివరాలు.. విశేషాలు They are talented cricketers, both Shreyas and Ishan. Hoping they bounce back and come back stronger. If players like Hardik don’t want to play red ball cricket, should he and others like him participate in white-ball domestic cricket when they aren’t on national duty? If this… — Irfan Pathan (@IrfanPathan) February 29, 2024 -
అదేనా అయ్యర్ చేసిన తప్పు? శ్రేయస్ మళ్లీ ఎంట్రీ ఇస్తాడా?
శ్రేయస్ అయ్యర్.. గత కొంత కాలంగా టీమిండియా మిడిలార్డర్లో నిలకడకు పెట్టింది పేరు. మూడు ఫార్మాట్లలో మిడిలార్డర్లో విరాట్ కోహ్లి తర్వాత అంతటి సత్తా ఉన్న ఆటగాడిగా అయ్యర్ పేరొందాడు. వన్డే ప్రపంచకప్లో ఫైనల్కు చేరడంలో అయ్యర్ ది కీలక పాత్ర. వరల్డ్కప్ హిస్టరీలోనే సింగిల్ ఎడిషన్లో 500పైగా పరుగులు చేసిన ఏకైక భారత ఆటగాడు అయ్యరే. 2022 నుంచి మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా ఈ ముంబైకర్ కొనసాగుతున్నాడు. అటువంటి అయ్యర్ ఇప్పుడు ఏకంగా ఎందుకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోవాల్సి వచ్చింది? భారత క్రికెట్ బోర్డు సరైన నిర్ణయం తీసుకుందా? అన్న ప్రశ్నలు సగటు అభిమానిలో రేకెత్తుతున్నాయి. అదేనా అయ్యర్ చేసిన తప్పు? స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో శ్రేయస్ అయ్యర్ భాగమయ్యాడు. అయితే తొలి రెండు టెస్టుల్లోనూ ఈ ముంబైకర్ పెద్దగా అకట్టుకోలేకపోయాడు. అనంతరం ఆఖరి మూడు టెస్టులకు ప్రకటించిన భారత జట్టులో అనూహ్యంగా శ్రేయస్కు చోటు దక్కలేదు. అయితే అతడి వెన్ను గాయం తిరగబెట్టిందని అందుకే సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారని తొలుత వార్తలు వినిపించాయి. అయ్యర్ కూడా వైజాగ్ టెస్టు అనంతరం నేరుగా బెంగళూరులోని ఏన్సీఏకు వెళ్లిపోయాడు. కానీ ఫామ్ లేమి కారణంగానే అయ్యర్ను పక్కన పెట్టారని తర్వాత బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే సరిగ్గా ఇదే సమయంలో సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లందరూ టీండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వాలంటే కచ్చితంగా రంజీలు ఆడాల్సిందేనని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రంజీ ట్రోఫీ 2023-24 క్వార్టర్స్లో ఆడాలని ముంబై క్రికెట్ ఆసోషియేషన్ అతడిని కోరింది. కానీ కానీ అయ్యర్ మాత్రం తన వెన్ను నొప్పితో బాధపడుతున్నాని, అందుబాటులో ఉండనని తేల్చిచేప్పేశాడు. అయితే తన ప్రకటనకు ఒక్క రోజే ముందే అయ్యర్ ఫిట్నెస్గా ఉన్నట్లు ఏన్సీఏ సర్టిఫికెట్ ఇవ్వడం గమనార్హం. దీంతో అయ్యర్ కావాలనే రంజీలు ఆడకుండా తప్పించుకున్నాడని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో బీసీసీఐ అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించేందుకు సిద్దమైందని పలు రిపోర్ట్లు వెల్లడించాయి. ఈ వార్తలు ప్రచారంలో ఉన్న సమయంలోనే అయ్యర్పై బీసీసీఐ వేటు వేయడం గమనార్హం. బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుందా? అయితే బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రేడ్-బిలో ఉన్న ఆటగాడిని ఒక్కసారిగా తప్పించాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దేశవాళీ క్రికెట్ ఆడనంత మాత్రానా గతేడాదిగా భారత జట్టుతో ఉంటూ.. ఎన్నో అద్భుత విజయాలు అందించిన ఆటగాడి పట్ల బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అతడికి పన్మిషెంట్ ఇవ్వాలనకుంటే గ్రేడ్-సి డిమోషన్ చేయవలసిందని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. భారత జట్టు తరపున అయ్యర్ ఆడిన ఇన్నింగ్స్ల వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ సపోర్ట్గా నిలుస్తున్నారు. మరి కొంత మంది అయ్యర్ 100 శాతం ఫిట్నెస్గా లేడని అందుకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని పోస్ట్లు చేస్తున్నారు. కాగా అయ్యర్తో పాటు మరో యువ ఆటగాడు ఇషాన్ కిషన్ కూడా బీసీసీఐ కాంట్రాక్ట్ను కోల్పోయాడు. చదవండి: Babar Azam AFG Captain Photo Viral: అఫ్గానిస్తాన్ కెప్టెన్గా బాబర్ ఆజం..!? -
సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురెల్లకు జాక్పాట్
టీమిండియా బ్యాటింగ్ సంచలనాలు సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురెల్లకు జాక్పాట్ కొట్టే ఛాన్స్ వచ్చింది. ఇంగ్లండ్తో జరుగబోయే తదుపరి టెస్ట్లో ఈ ఇద్దరు తుది జట్టులో ఉంటే, వీరికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లు దక్కనున్నాయి. బీసీసీఐ కాంట్రాక్ట్ దక్కాలంటే ఆటగాళ్లు టీమిండియా తరఫున కనీసం 3 టెస్టులు లేదా ఎనిమిది వన్డేలు లేదా పది టీ20లు ఆడాల్సి ఉంటుంది. అయితే వీరిద్దరు ఇప్పటివరకు రెండు టెస్ట్ మ్యాచ్లే ఆడారు. ఈ రెండు మ్యాచ్ల్లో వీరిద్దరి ప్రదర్శనను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ.. మూడు మ్యాచ్ల అనంతరం వీరికి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఇద్దరు ఆటగాళ్ల తాజా ఫామ్ను బట్టి చూస్తే వీరు ఐదో టెస్ట్కు తుది జట్టులో ఉండటం దాదాపుగా ఖాయమేనని చెప్పాలి. దీంతో వీరికి గ్రేడ్ సి కింద బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కడం దాదాపుగా ఖరారైందనే చెప్పాలి. కాగా, 2023-24 సంవత్సరానికి గాను సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ఇవాళ (ఫిబ్రవరి 28) ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 30 మంది ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఏ ప్లస్ కేటగిరిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.. ఏ కేటగిరిలో అశ్విన్, షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా.. బి కేటగిరిలో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్.. సి కేటగిరిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ద్ కృష్ణ, అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్ చోటు దక్కించుకున్నారు. రంజీల్లో ఆడాల్సిందేనన్న బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేసిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్లను కోల్పోగా.. రింకూ సింగ్ (సి), తిలక్ వర్మ (సి), ప్రసిద్ద్ కృష్ణ (సి), అవేశ్ ఖాన్ (సి), రజత్ పాటిదార్ (సి), జితేశ్ శర్మ (సి), ముకేశ్ కుమార్ (సి), రవి బిష్ణోయ్కు (సి) కొత్తగా కాంట్రాక్ట్ లభించింది. శ్రేయస్ (బి), ఇషాన్లతో (సి) పాటు యుజ్వేంద్ర చహల్ (సి), చతేశ్వర్ పుజారా (బి), దీపక్ హుడా (సి), ఉమేశ్ యాదవ్ (సి), శిఖర్ ధవన్ (సి) బీసీసీఐ కాంట్రాక్ట్లు కోల్పోయారు. కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, సిరాజ్లకు బి నుంచి ఏ కేటగిరికి ప్రమోషన్ లభించగా.. అక్షర్ పటేల్, రిషబ్ పంత్లకు ఏ నుంచి బి కేటగిరికి డిమోషన్ వచ్చింది. గతేడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో లేని యశస్వి జైస్వాల్.. ప్రస్తుత ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్లో అత్యుత్తమంగా (వరుస డబుల్ సెంచరీలు) రాణించడంతో అతనికి నేరుగా బి గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కింది. ఏ ప్లస్ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద యేటా రూ. 7 కోట్లు దక్కనున్నాయి. ‘ఏ’ కేటగిరీలోని క్రికెటర్లకు రూ. 5 కోట్లు..‘బి’ కేటగిరిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు.. ‘సి’ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం లభించనుంది. -
అనుకున్నదే అయ్యింది.. బీసీసీఐ కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్, శ్రేయస్
భారత క్రికెట్ అభిమానులు ఊహించిందే నిజమైంది. రంజీల్లో ఆడమని ఎంత చెప్పినా వినకుండా విర్రవీగిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయారు. తాజాగా ప్రకటించిన బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో వీరిద్దరి పేర్లు గల్లంతయ్యాయి. ప్రస్తుతం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లభించిన ఆటగాళ్లలో రోహిత్, కోహ్లి, బుమ్రా, జడేజా ఏ ప్లస్ స్థానాలను నిలుపుకోగా.. బి కేటగిరి నుంచి శ్రేయస్, సి కేటగిరి నుంచి ఇషాన్ తొలగించబడ్డారు. గతకొంతకాలంగా జట్టులో లేనప్పటికీ హార్దిక్ పాండ్యా ఏ గ్రేడ్ కాంట్రాక్ట్ను నిలుపుకోగా.. కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, సిరాజ్లకు ప్రమోషన్ (బి నుంచి ఏ కేటగిరి) దక్కింది. యశస్వికి జాక్పాట్.. గతేడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో లేని యశస్వి జైస్వాల్.. ప్రస్తుత ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్లో అత్యుత్తమంగా (వరుస డబుల్ సెంచరీలు) రాణించడంతో అతనికి నేరుగా బి గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కింది. కాంట్రాక్ట్ కోల్పోయిన వారు వీరే.. బీసీసీఐ తాజాగా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో చాలా మంది పేర్లు కనపడలేదు. యుజ్వేంద్ర చహల్ (సి), చతేశ్వర్ పుజారా (బి), దీపక్ హుడా (సి), ఉమేశ్ యాదవ్ (సి), శిఖర్ ధవన్ (సి) బీసీసీఐ కాంట్రాక్ట్లు కోల్పోయారు. అక్షర్, పంత్లకు డిమోషన్ (ఏ నుంచి బి) కొత్తగా కాంట్రాక్ట్ దక్కించుకున్న తిలక్ వర్మ, రింకూ సింగ్ కేటగిరి వారీగా ఆటగాళ్లకు దక్కనున్న మొత్తం.. ఏ ప్లస్ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద యేటా రూ. 7 కోట్లు దక్కనున్నాయి. ‘ఏ’ కేటగిరీలోని క్రికెటర్లకు రూ. 5 కోట్లు..‘బి’ కేటగిరిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు.. ‘సి’ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం లభించనుంది. 2023-24 బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న ఆటగాళ్ల వివరాలు.. ఏ ప్లస్ కేటగిరి: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఏ కేటగిరి: అశ్విన్, షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా బి కేటగిరి: సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్ సి కేటగిరి: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ద్ కృష్ణ, అవేష్ ఖాన్, రజత్ పాటిదార్ చదవండి: రంజీల్లో ఆడాల్సిందే.... ఆటగాళ్లకు బీసీసీఐ స్ట్రిక్ట్ వార్నింగ్ -
వారికి జట్టులో చోటు లేదు.. ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎట్లా?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నానని భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అన్నాడు. రోహిత్ చెప్పినట్టు సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లు భారత క్రికెట్ పట్ల కాస్తైనా విశ్వసనీయత ప్రదర్శించాలన్నాడు. కాగా టెస్టు జట్టులోకి తిరిగి రావాలంటే భారత ఆటగాళ్లు కచ్చితంగా రంజీల్లో ఆడాలని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు రంజీ క్రికెట్ ఆడటం పట్ల విముఖంగా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో ఈ మేరకు బోర్డు ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో నాలుగో టెస్టు విజయానంతరం కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రశ్న ఎదురైంది. బదలుగా.. ‘‘టెస్టు క్రికెట్ ఆడాలన్న తపన, కసి ఉన్నవారికి మాత్రమే జట్టులో చోటు ఇస్తాం’’ అని రోహిత్ శర్మ ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడాల్సిన ఆవశ్యకతను నొక్కి వక్కాణించాడు. ఈ విషయంపై స్పందించిన సునిల్ గావస్కర్.. ‘‘రోహిత్ చెప్పిన మాటలు సరైనవే. టెస్టు క్రికెట్పై ఇష్టం ఉన్న వాళ్లకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలి. ఎన్నో ఏళ్లుగా నేను ఇదే విషయం చెబుతున్నా. దేశవాళీ క్రికెట్లో రాణించడం వల్లే చాలా మంది ఉన్నత స్థాయికి చేరుకున్నారు. కనీసం వాళ్లైనా డొమెస్టిక్ క్రికెట్ పట్ల విశ్వాసం ప్రదర్శించాలి కదా’’ అంటూ రంజీల్లో ఆడేందుకు ఇష్టపడని టీమిండియా క్రికెటర్లకు చురకలు అంటించాడు. ఒకవేళ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లు ఎవరైనా టెస్టులు ఆడొద్దని నిర్ణయించుకుంటే.. వారిని నిర్మొహమాటంగా పక్కనపెట్టేయాలంటూ పరక్షంగా బోర్డుకు విజ్ఞప్తి చేశాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్ను ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా కైవసం చేసుకుంది. సీనియర్ల గైర్హాజరీలో దేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్ ఈ సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. రజత్ మినహా మిగతా ముగ్గురు సత్తా చాటి తమ ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నారు. చదవండి: #Dhruv Jurel: ఈ కుర్రాడిని నమ్మినందుకు ధన్యవాదాలు.. -
రీఎంట్రీలో పేలని పాకెట్ డైనమైట్
దాదాపు మూడు నెలల విరామానంతరం కాంపిటేటివ్ క్రికెట్లోకి అడుగుపెట్టిన టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్.. రీఎంట్రీలో తుస్సుమనిపించాడు. ముంబై వేదికగా జరుగుతున్న డీవై పాటిల్ టీ20 టోర్నీలో ఊహించినంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ టోర్నీలో ఆర్బీఐ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇషాన్.. రూట్ మొబైల్ లిమిటెడ్ జట్టుతో ఇవాళ (ఫిబ్రవరి 27) జరిగిన మ్యాచ్లో తేలిపోయాడు. ఈ మ్యాచ్లో ఇషాన్కు మెరుపు అరంభమే లభించినప్పటికీ.. ఆతర్వాత నిలదొక్కుకోలేకపోయాడు. 12 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 19 పరుగులు చేసిన అతను.. మ్యాక్స్వెల్ స్వామినాథన్ బౌలింగ్లో ఔటయ్యాడు. బ్యాటింగ్లో ఆశించిన స్థాయి ప్రదర్శన చేయలేకపోయిన ఇషాన్.. వికెట్కీపింగ్లో పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్లో అతను ఇద్దరిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు. సుమిత్ క్యాచ్ పట్టిన ఇషాన్.. సయన్ మొండల్ను స్టంపౌట్ చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రూట్ మొబైల్ లిమిటెడ్.. నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 193 పరుగల లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఇషాన్ జట్టు ఆర్బీఐ 16.3 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే, ఇషాన్... టీమిండియా తరఫున తన చివరి టీ20ని 2023 నవంబర్లో ఆస్ట్రేలియాపై ఆడాడు. అనంతరం సౌతాఫ్రికా పర్యటనకు ఎంపికైనప్పటికీ వ్యక్తిగత కారణాలను సాకుగా చూపి సిరీస్ మధ్యలోనే ఇంటికి తిరిగొచ్చేశాడు. ఆతర్వాత రంజీల్లో ఆడి ఫామ్ను నిరూపించుకోవాలని బీసీసీఐతో పాటు చాలా మంది మాజీలు సూచించినా పెడచెవిన పెట్టిన ఇషాన్.. తాజాగా బీసీసీఐ కన్నెర్ర చేయడంతో దిగొచ్చి స్థానిక డీవై పాటిల్ టీ20 టోర్నీలో ఆడుతున్నాడు. ఇషాన్ తీరుతో గుర్రుగా ఉన్న బీసీసీఐ అతని కాంట్రాక్ట్ రద్దు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. -
దిగొచ్చిన శ్రేయస్ అయ్యర్..!
వెన్ను నొప్పిని సాకుగా చూపుతూ రంజీల్లో ఆడకుండా (ఐపీఎల్ కోసం) తప్పించుకు తిరుగుతున్న టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ కాంట్రాక్ట్ రద్దు ప్రచారం నేపథ్యంలో అలర్ట్ అయ్యాడు. బీసీసీఐ అల్టిమేటం జారీ చేసిన విధంగా రంజీల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. మార్చి 2 నుంచి ప్రారంభమయ్యే సెమీఫైనల్లో ముంబై తరఫున బరిలోకి దిగేందుకు సంసిద్దత వ్యక్తం చేశాడు. తన విషయంలో బీసీసీఐ పెద్దలు సీరియస్గా ఉన్నారని గ్రహించిన అయ్యర్ ఈ మేరకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా, రంజీల్లో ఆడకుండా తప్పించుకునేందుకు అయ్యర్.. ముంబై క్రికెట్ ఆసోసియేషన్కు తప్పుడు సమాచారం అందించిన విషయం తెలిసిందే. బరోడాతో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్కు ముందు అయ్యర్ వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు ఎంసీఏకి నివేదించాడు. అయితే ఇదంతా వట్టిదేనని ఎన్సీఏ (జాతీయ క్రికెట్ అకాడమీ) కొట్టిపారేయడంతో అయ్యర్ డ్రామా బయటపడింది. తప్పుడు నివేదిక నేపథ్యంలో బీసీసీఐ సీరియస్ కావడంతో అయ్యర్ దిగొచ్చినట్లు తెలుస్తుంది. రంజీ సెమీఫైనల్లో ఆడేందుకు అంగీకరించాడని సమాచారం. ఇదిలా ఉంటే, రంజీల్లో ఆడే విషయంలో శ్రేయస్ అయ్యర్తో పాటు ఇషాన్ కిషన్ కూడా బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేశాడు. అయ్యర్ విషయంలో ఆచితూచి వ్యవహరించిన బీసీసీఐ.. ఇషాన్పై చర్యలు తీసుకునేందుకు సిద్దమైందని సమాచారం. బీసీసీఐ పెద్దలు సహా టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఇషాన్పై గుర్రుగా ఉన్నాడని తెలుస్తుంది. జాతీయ జట్టుకు దూరమైన ఆటగాళ్లు తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాలంటే కచ్చితంగా రంజీల్లో ఆడాల్సిందేనని బీసీసీఐ గత కొద్ది రోజులుగా ఆటగాళ్లను హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. -
శ్రేయస్ అయ్యర్పై బీసీసీఐ సీరియస్.. కాంట్రాక్ట్ రద్దు!?
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ చిక్కుల్లో పడ్డాడు. ఇంగ్లండ్తో ఆఖరి మూడు టెస్టులకు అయ్యర్ దూరమైన సంగతి తెలిసిందే. వెన్నునొప్పి కారణంగా అతడికి విశ్రాంతి ఇచ్చారని తొలుత వార్తలు వినిపించాయి. కానీ ఆ తర్వాత అతడి ఫామ్ లేమి కారణంగానే జట్టు నుంచి తప్పించారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే వైజాగ్ టెస్టు అనంతరం తన గాయం తిరగబెట్టిందని, వెన్నునొప్పి సాకుతో అయ్యర్ ఏన్సీఏలో చేరాడు. కాగా ఇటీవలే బీసీసీఐ కాంట్రాక్ట్ పొందిన క్రికెటర్లు అందరూ దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని బీసీసీఐ సెక్రటరీ జై షా ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో రంజీ ట్రోఫీ క్వార్టర్స్లో ఆడాలని ముంబై క్రికెట్ ఆసోషియేషన్ అతడిని కోరింది. కానీ కానీ అయ్యర్ మాత్రం తన వెన్ను నొప్పితో బాధపడుతున్నాని, అందుబాటులో ఉండనని తేల్చిచేప్పేశాడు. అయితే తన ప్రకటనకు ఒక్క రోజే ముందే అయ్యర్ ఫిట్నెస్గా ఉన్నట్లు ఏన్సీఏ సర్టిఫికెట్ ఇవ్వడం గమనార్హం. దీంతో అయ్యర్ కావాలనే రంజీలు ఆడకుండా తప్పించుకున్నాడని ప్రచారం జరుగుతోంది. బీసీసీఐ సీరియస్.. ఈ క్రమంలో బోర్డు అదేశాలను బేఖాతరు చేసిన ఆటగాళ్లపై బీసీసీఐ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. మరో యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ సైతం దేశీవాళీ క్రికెట్ ఆడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. రంజీలు ఆడితానే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఉంటుందని భారత హెడ్కోచ్ హెచ్చిరించినా కిషన్ మాత్రం పెడచెవిన పెట్టాడు. ఈ క్రమంలో అయ్యర్, కిషన్పై చర్యలకు బోర్డు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2024-25 ఏడాదిగాను బీసీసీఐ ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను త్వరలోనే ప్రకటించనుంది. ఈ క్రమంలో వీరిద్దరూ కాంట్రాక్ట్ను రద్దు చేయాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు సమచారం. ప్రస్తుతం గ్రేడ్ 'బి'లో ఉన్న అయ్యర్, గ్రేడ్ 'సి' లో ఉన్న కిషన్ కాంట్రాక్ట్లను పునరుద్దరించే ఆలోచనలో బీసీసీఐ లేనట్లు వినికిడి. "అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ 2023-24 సీజన్కు కూడా సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను దాదాపు ఖరారు చేసింది. ఈ జాబితాను బీసీసీఐ త్వరలోనే ప్రకటించనుంది. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను కాంట్రాక్ట్ను తప్పించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించి దేశవాళీ క్రికెట్ ఆడడం లేదని" బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా 2022-23లో బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో తొలిసారి కిషన్ దక్కించుకోగా.. అయ్యర్ బి గ్రేడ్కు ప్రమోషన్ పొందాడు. -
Virat Kohli: కోహ్లి సెలవులు.. స్పందించిన జై షా! కీలక వ్యాఖ్యలు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా అండగా నిలిచాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా సెలవు తీసుకోవడం అతడి హక్కు అంటూ కోహ్లి నిర్ణయాన్ని సమర్థించాడు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు కోహ్లి దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన బ్యాటర్ లేకుండానే బరిలోకి దిగిన టీమిండియా తొలి మ్యాచ్లో ఓడినా.. రెండో టెస్టులో గెలిచింది. తిరిగి పుంజుకుని సిరీస్ను ప్రస్తుతం 1-1తో సమం చేసి.. రాజ్కోట్లో మూడో టెస్టులో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లి ఈ కీలక సిరీస్కు దూరం కావడానికి గల కారణం ఇంత వరకు వెల్లడి కాలేదు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. కోహ్లి భార్య అనుష్క శర్మ గర్భవతి అని, ప్రెగ్నెన్సీ సమయంలో తలెత్తిన ఇబ్బందుల కారణంగానే విదేశాల్లో చికిత్స తీసుకునేందుకు వెళ్లారని ప్రచారం జరుగుతోంది. అయితే, బీసీసీఐ మాత్రం ఇంగ్లండ్తో ఆఖరి మూడు టెస్టులకు కోహ్లి అందుబాటులో లేడని ప్రకటించిన సమయంలో.. అతడి నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని పేర్కొంది. తాజాగా ఈ విషయం గురించి బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించాడు. రాజ్కోట్ టెస్టు ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన క్రమంలో ఎదురైన ప్రశ్నలకు బదులిస్తూ.. ‘‘ఒక వ్యక్తి.. తన పదిహేనేళ్ల కెరీర్లో వ్యక్తిగత కారణాలు చూపి సెలవు అడగటం అతడి హక్కు. విరాట్ కారణం లేకుండా సెలవు అడిగే వ్యక్తి కాదు. మా ఆటగాడిపై మాకు నమ్మకం ఉంది. మేము కచ్చితంగా అతడికి అండగా ఉంటాం’’ అని జై షా స్పష్టం చేశాడు. అదే విధంగా.. టీ20 ప్రపంచకప్-2024లో విరాట్ కోహ్లి ఆడతాడా లేదా అన్న అంశం గురించి ప్రస్తావన రాగా.. ఈ విషయం గురించి తర్వాత మాట్లాడదాం అంటూ సమాధానం దాటవేశాడు. అయితే, ఈ ప్రపంచకప్ టోర్నీలో రోహిత్ శర్మనే కెప్టెన్గా వ్యవహరిస్తాడని జై షా స్పష్టం చేశాడు. కాగా ఇషాన్ కిషన్ మానసికంగా అలసిపోయానంటూ సెలవు తీసుకుని.. విదేశాల్లో పర్యటించడం.. కోచ్ రంజీల్లో ఆడమని చెప్పినా ఆడకపోవడం వంటి అంశాలపై బీసీసీఐ పెద్దలు గుర్రుగా ఉన్నారన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. జై షా.. కోహ్లి సెలవుల గురించి ఇలా కామెంట్ చేయడం గమనార్హం. అంతేకాదు.. ఇషాన్ పేరెత్తకుండానే చీఫ్ సెలక్టర్, కోచ్, కెప్టెన్ చెప్పిన మాట వినకపోతే వేటు తప్పదని హెచ్చరికలు జారీ చేశాడు జై షా! చదవండి: BCCI: సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లకు జై షా వార్నింగ్.. ఇకపై -
BCCI: టీమిండియా క్రికెటర్లకు జై షా వార్నింగ్.. ఇకపై
Jay Shah’s Stern Message to Central Contract Players: టీమిండియా సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగి ఉన్న క్రికెటర్లను ఉద్దేశించి బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రధాన ఆటగాళ్లు కచ్చితంగా రంజీల్లో ఆడాల్సిందేనని స్పష్టం చేశాడు. లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. కాగా భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్- బీసీసీఐకి మధ్య విభేదాలంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తనకు విశ్రాంతి కావాలంటూ సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన ఈ జార్ఖండ్ బ్యాటర్ను దేశవాళీ క్రికెట్లో ఆడాల్సిందిగా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆదేశించాడు. అయితే, మేనేజ్మెంట్ ఆదేశాలను బేఖాతరు చేసిన ఇషాన్ కిషన్ ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ సెషన్తో బిజీ అయ్యాడు. ఫలితంగా బోర్డు పెద్దల ఆగ్రహానికి గురైన అతడు.. సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోనున్నాడనే ఊహాగానాలు వినిపించాయి. అంతేగాకుండా.. ఇకపై సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లు కనీసం 3-4 రంజీ మ్యాచ్లు ఆడితేనే బీసీసీఐ.. ఐపీఎల్లో ఆడే అవకాశం ఇస్తుందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ అంశాలపై స్పందించాడు. ‘‘తాము దేశవాళీ క్రికెట్కు అందుబాటులో ఉండటం లేదని కొంతమంది ఫోన్ కాల్ ద్వారా సమాచారం ఇచ్చారు. అయితే, అందుకు బదులుగా నేను వారికి లేఖ రూపంలో జవాబు ఇవ్వదలచుకున్నాను. కచ్చితంగా రెడ్ బాల్ క్రికెట్ ఆడాల్సిందే ఒకవేళ సెలక్షన్ కమిటీ చైర్మన్, కోచ్, కెప్టెన్ చెబితే మాత్రం కచ్చితంగా రెడ్ బాల్ క్రికెట్ ఆడాల్సిందే అని చెప్తాను. ఎవరైనా ఆటగాడు ఫిట్గా ఉన్నాడా లేదా? అతడు పరిమిత ఓవర్లు, టెస్టు క్రికెట్ రెండూ ఆడగలడా లేదా అన్న విషయాల గురించి ఎన్సీఏ నుంచి సలహాలు తీసుకుంటాం. అందరికీ వర్తిస్తుంది అందుకు అనుగుణంగానే మా నిర్ణయాలు ఉంటాయి. అయితే, ఫిట్గా ఉన్న ఆటగాళ్లు.. ముఖ్యంగా యువ క్రికెటర్లకు ఎలాంటి మినహాయింపులు ఉండవు. కచ్చితంగా దేశవాళీ రెడ్ బాల్ క్రికెట్ ఆడాల్సిందే. సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగి ఉన్న అందరు భారత క్రికెటర్లకూ ఇది వర్తిస్తుంది’’ అని జై షా కుండబద్దలు కొట్టాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు ఆరంభానికి ముందు సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియం పేరు మార్చారు. సౌరాష్ట్ర క్రికెట్ పాలనా విభాగంలో సేవలు అందించిన నిరంజన్ షా స్టేడియంగా నామకరణం చేశారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన జై షా ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. చదవండి: #Sarfaraz Khan: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. తండ్రి, భార్య కన్నీటి పర్యంతం -
కొంపముంచిన ఇషాన్ కిషన్.. బీసీసీఐ కీలక నిర్ణయం?
టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ తీరుపై బీసీసీఐ గుర్రుగా ఉందన్న వార్తల నేపథ్యంలో.. ఆసక్తికర అంశాలు తెరమీదకు వచ్చాయి. ఇషాన్ మాదిరి బోర్డు ఆదేశాలు ధిక్కరించే ఆటగాళ్లకు కొత్త నిబంధనలు విధించేందుకు యాజమాన్యం సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా మానసికంగా అలసిపోయానంటూ సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన ఇషాన్ కిషన్.. విశ్రాంతి తీసుకున్న తర్వాత దేశవాళీ క్రికెట్లో ఆడాలని బీసీసీఐ ఆదేశించినట్లు వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో రంజీల్లో ఆడాల్సిందిగా తన సొంతజట్టు జార్ఖండ్ నుంచి ఇషాన్కు ఆహ్వానం కూడా అందింది. అదే విధంగా.. టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం.. ఇషాన్ దేశవాళీ క్రికెట్లో ఆడిన తర్వాతే పునరాగమనం చేయగలడని గట్టిగానే హెచ్చరించాడు. అయినా.. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఇవేమీ పట్టించుకోలేదు. రంజీల్లో ఆడకుండా.. ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ నెట్ సెషన్లో పాల్గొనేందుకు వెళ్లాడు. ముంబై కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి ఇషాన్ బరోడాలో ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తమ ఆదేశాలను బేఖాతరు చేసిన ఈ యువ ఆటగాడి తీరుపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అతడి పేరును తప్పించేందుకు కూడా సిద్ధమైనట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఓ బీసీసీఐ అధికారి పీటీఐతో మాట్లాడుతూ.. ప్రస్తుతానికి తాము సెంట్రల్ క్రాంటాక్టుల విషయం చర్చించలేదని స్పష్టం చేశారు. అయితే, ఇకపై యువ ఆటగాళ్లు కచ్చితంగా రంజీల్లో ఆడేలా బోర్డు చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉందని చూచాయగా చెప్పారు. ఈ మేరకు.. ‘‘కొంతమంది ఆటగాళ్లు రెడ్ బాల్(టెస్టు) క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా లేరని బీసీసీఐ పెద్దలకు తెలిసింది. అలాంటి వాళ్లు టీమిండియాలో చోటు దక్కించుకోలేనపుడు కనీసం ముస్తాక్ అలీ వంటి దేశవాళీ టీ20 ట్రోఫీలోనైనా ఆడాలి. అందుకూ సిద్ధపడని వాళ్లు.. కేవలం ఫ్రాంఛైజీ క్రికెట్కే ప్రాధాన్యం ఇచ్చే వాళ్లకు ముకుతాడు వేయాలని బోర్డు యోచిస్తోంది. తప్పనిసరిగా 3- 4 రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడిన వాళ్లకు మాత్రమే ఐపీఎల్ ఆడేందుకు అనుమతినివ్వాలని భావిస్తోంది. రంజీల్లో ఆడేందుకు నిరాకరిస్తే.. ఐపీఎల్ వేలానికి ముందు రిలీజ్ అయిన వాళ్లకు మళ్లీ వేలంలో పాల్గొనే అవకాశం ఇవ్వకూడదనే నిబంధన తెచ్చే యోచనలో ఉంది. కొంతమంది రంజీ ట్రోఫీ ఆడటాన్ని తక్కువ చేసి చూడటం బోర్డు దృష్టికి వచ్చింది. అయితే, హార్దిక్ పాండ్యా వంటి ప్రధాన ఆటగాళ్లకు ఫిట్నెస్ కారణాల దృష్ట్యా ఇలాంటి నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని భావిస్తున్నారు’’ అని సదరు అధికారి పేర్కొనడం విశేషం. చదవండి: Virat Kohli-Anushka Sharma: ఓ బ్యాడ్ న్యూస్.. ఓ ‘గుడ్’ న్యూస్! -
బీసీసీఐ వార్నింగ్.. దిగొచ్చిన ఇషాన్ కిషన్..!
సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ఆటగాళ్లు జాతీయ జట్టులోకి తిరిగి రావాలంటే దేశవాలీ టోర్నీల్లో తప్పక ఆడాలని బీసీసీఐ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ దిగొచ్చినట్లు కనిపిస్తుంది. వ్యక్తిగత సమస్యల కారణంగా దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలోనే స్వదేశానికి వచ్చేసిన ఇషాన్ ఆతర్వాత ఏ దేశవాలీ టోర్నీలోనూ ఆడకుండా మిన్నకుండిపోయాడు. టెస్ట్ల్లో టీమిండియాను రెగ్యులర్ వికెట్కీపర్ సమస్య వేధిస్తున్న నేపథ్యంలో చాలామంది ఇషాన్ను జట్టులోకి తీసుకోవాలని సూచించారు. అయితే రెండు నెలలకు పైగా ఎలాంటి క్రికెట్ ఆడని వ్యక్తిని నేరుగా తుది జట్టులో ఎలా తీసుకుంటామని బీసీసీఐ వాదిస్తుంది. ఈ విషయాన్ని టీమిండియా కోచ్ సైతం ఇషాన్ను ఉద్దేశిస్తూ చెప్పకనే చెప్పాడు. అయితే ద్రవిడ్ మాటలను సైతం పెడచెవిన పెట్టిన ఇషాన్.. దేశవాలీ టోర్నీలను కాదని ఐపీఎల్ సన్నాహకాల్లో నిమగ్నమైపోయాడు. ఇషాన్ ప్రవర్తన చూసి చిర్రెతిపోయిన బీసీసీఐ పెద్దలు తాజాగా ఓ అల్టిమేటం జారీ చేశారు. బీసీసీఐతో సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ఆటగాళ్లు జాతీయ జట్టులోకి తిరిగి రావాలంటే దేశవాలీ టోర్నీల్లో పాల్గొనాలని రూల్ పాస్ చేశారు. జాతీయ జట్టు సభ్యులకు, ఎన్సీఏలో ఉన్న ఆటగాళ్లకు ఇందుకు మినహాయింపు ఉంటుందని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన పరోక్షంగా తనను ఉద్దేశించే అని గ్రహించిన ఇషాన్ ఎట్టకేలకు దిగొచ్చాడు. ఐపీఎల్ ప్రాక్టీస్ను పక్కన పెట్టి త్వరలో ప్రారంభంకానున్న డీవై పాటిల్ టోర్నీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ఇషాన్ స్వయంగా చెప్పనప్పటికీ, అతని సన్నిహితులు లోకల్మీడియాతో చెప్పినట్లు సమాచారం. ఐపీఎల్కు ముందు దేశవాలీ టోర్నీల్లో పాల్గొనకుంటే సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దవుతుందని సోషల్మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టడంతో ఇషాన్ కాస్త తగ్గినట్లు కనిపిస్తుంది. కాగా, వ్యక్తిగత కారణాలను సాకుగా చూపిన ఇషాన్.. కోచ్ ద్రవిడ్ చెప్పినా పట్టించుకోకుండా ఐపీఎల్ సన్నాహకాల్లో పాల్గొనడంపై బీసీసీఐ చాలా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. ఇషాన్ విషయంలో త్వరలోనే బ్యాడ్న్యూస్ వస్తుందన్న ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఇషాన్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో 'గ్రేడ్-సీ'లో ఉన్నాడు. ఏడాదికి అతనికి కోటి రూపాయల వేతనం లభిస్తుంది. -
బీసీసీఐ సీరియస్.. ఇషాన్ కిషన్కు ఊహించని షాక్!?
ఇషాన్ కిషన్.. గత కొన్ని రోజులగా భారత క్రికెట్ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. గతేడాది నవంబర్ నుంచి ఇషాన్ కిషన్ భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఇషాన్ మధ్యలోనే ఉన్నపళంగా స్వదేశానికి వచ్చాడు. అప్పటి నుంచి బీసీసీఐతో కానీ, భారత జట్టు మేనెజ్మెంట్తో కానీ టచ్లో లేడు. అయితే దక్షిణాఫ్రికా టూర్ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు కిషన్ అందుబాటులో ఉంటాడని భావించారు. కానీ తొలి రెండు టెస్టు ప్రకటించిన జట్టులో కిషన్ పేరు కన్పించలేదు. రెండో టెస్టు అనంతరం భారత హెడ్ కోచ్ రాహుల్ మాట్లాడుతూ.. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్కు ఎంపిక కావాలంటే కిషన్ కచ్చితంగా రంజీ ట్రోఫీలో ఆడాల్సిందే అని స్పష్టం చేశాడు. కానీ కిషన్ రాహుల్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోలేదు. రంజీ ట్రోఫీ ఆడకుండా బరోడా వెళ్లి పాండ్యా బ్రదర్స్ తో ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. జార్ఖండ్ తరఫున రంజీ ట్రోఫీ బరిలో దిగే అవకాశం ఉన్నా..కిషన్ విముఖత చూపించాడు. తాజాగా ఇదే విషయంపై బీసీసీఐ కూడా పరోక్షంగా స్పందించినట్లు సమాచారం. సీనియర్ ఆటగాళ్లు రంజీల్లో ఆడకుండా ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తుండటంపై బోర్డు అగ్రహం వ్యక్తం చేసినట్లు పలురిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కిషన్పై వేటు.. అయితే మరోక నివేదిక ప్రకారం.. కిషన్ వ్యవహరంపై బీసీసీఐ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. అతడిపై చర్యలకు బోర్డు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2024-25 ఏడాదిగాను బీసీసీఐ ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను త్వరలోనే ప్రకటించనుంది. ఈ క్రమంలో ఇషాన్ కాంట్రాక్ట్ను రద్దు చేయాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు సమచారం. ప్రస్తుతం గ్రేడ్ 'సి'లో ఉన్న ఇషాన్ కాంట్రాక్ట్ను పునరుద్దరించే ఆలోచనలో బీసీసీఐ లేనట్లు వినికిడి. కాగా 2022-23లో బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో తొలిసారి కిషన్ దక్కించుకున్నాడు. బీసీసీఐ నుంచి రూ. కోటి రూపాయలు వార్షిక వేతనాన్ని అందుకుంటున్నాడు. -
రంజీల్లో ఆడాల్సిందే.... ఆటగాళ్లకు బీసీసీఐ స్ట్రిక్ట్ వార్నింగ్
దేశవాళీ క్రికెట్ను కాదని ఐపీఎల్ సన్నాహకాల్లో నిమగ్నమై ఉన్న ఆటగాళ్లకు బీసీసీఐ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. రంజీల్లో ఆడకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. జాతీయ జట్టు సభ్యులు, గాయాల బారిన ఆటగాళ్లు మినహా అందరూ రంజీల్లో పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఇషాన్ కిషన్ ఎపిసోడ్ నేపథ్యంలో బీసీసీఐ సీరియస్గా ఉందని తెలుస్తుంది. బీసీసీఐ పిలుపును ఖాతరు చేయని వాళ్లకు త్వరలో నోటీసులు అందుతాయని సమాచారం. నోటీసులు అందుకున్న ఆటగాళ్లపై తీవ్ర చర్యలు ఉంటాయని తెలుస్తుంది. కాగా, గత కొద్దికాలంగా జాతీయ జట్టులో లేని ఇషాన్ కిషన్.. దేశవాలీ టీమ్కు అందుబాటులో ఉండకుండా ఐపీఎల్ 2024 సన్నాహకాల్లో బిజీగా ఉన్నాడు. బరోడాలో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంప్లో ఇషాన్.. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాలీ క్రికెట్ ఆడాలని కోచ్ రాహుల్ ద్రవిడ్ చేసిన సూచనలను సైతం ఇషాన్ లెక్క చేయకుండా ఐపీఎల్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఇషాన్ చర్యల పట్ల బోర్డు చాలా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా బీసీసీఐ-ఇషాన్ కిషన్ మధ్య పరోక్ష యుద్దం నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. జితేశ్ శర్మను జాతీయ జట్టులోకి ఎంపిక చేసినప్పటి నుంచి ఇషాన్-బీసీసీఐ మధ్య వార్ జరుగుతుందని సమాచారం. -
భరత్కే పెద్దపీట.. అంతేగానీ అతడిని ఇప్పట్లో ఆడించరు!
టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ పునరాగమనంపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో వికెట్ కీపర్గా ప్రస్తుతం కేఎస్ భరత్కే మేనేజ్మెంట్ పెద్దపీట వేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఒకవేళ ఏదేని కారణాల చేత భరత్ జట్టుకు దూరమైతే.. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ లేదంటే జగదీశన్ వంటి వాళ్లకు ఛాన్స్ ఇస్తారని అభిప్రాయపడ్డాడు. అంతేగానీ.. ఇషాన్ కిషన్కు మాత్రం రీఎంట్రీ అంత సులువుకాదని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. బ్రేక్ తీసుకున్న ఇషాన్ కాగా మానసికంగా అలసిపోయానంటూ సౌతాఫ్రికా పర్యటన నుంచి ఇషాన్ కిషన్ మధ్యలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబంతో సమయం గడుపుతూనే.. వర్కౌట్లతో బిజీ అయ్యాడు. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్తో ఇషాన్ కిషన్కు విభేదాలు తలెత్తాయన్న వార్తల నడుమ.. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. దేశవాళీ క్రికెట్ ఆడిన తర్వాతే ఇషాన్ తిరిగి జట్టులోకి వస్తాడని పేర్కొన్నాడు. అయితే, రంజీ ట్రోఫీ-2024 రూపంలో అవకాశం ఉన్నా.. ఇషాన్ మాత్రం దానిని పక్కనపెట్టాడు. భరత్కు అవకాశం జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్వాగతం పలికినా జట్టుతో చేరలేదు. ఇదిలా ఉంటే.. ఇషాన్ తిరిగి వచ్చిన తర్వాత సౌతాఫ్రికాతో టెస్టుల్లో అతడి స్థానాన్ని భర్తీ చేసిన ఆంధ్ర క్రికెటర్ కోన శ్రీకర్ భరత్.. స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టుల్లోనూ ఆడుతున్నాడు. అయితే, వికెట్ కీపింగ్ పరంగా అతడికి మంచి మార్కులే పడుతున్నా.. బ్యాటర్గా ఆకట్టుకోలేకపోతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇషాన్ కిషన్ మేనేజ్మెంట్ను అడిగి మరీ విరామం తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంపిటేటివ్ క్రికెట్ ఆడలేదు. తన బ్రేక్ను పొడిగిస్తూనే ఉన్నాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లోనూ కనిపించడం లేదు. మానసికంగా అలసిపోయానంటూ అతడు సెలవు తీసుకున్నాడు. తను బాగుండాలని కోరుకుంటున్నా. అయితే, ఇప్పట్లో అతడు నేరుగా టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చే అవకాశం లేదు. కేఎస్ భరత్ వికెట్ కీపర్గా జట్టులో ఉన్నాడు. అతడి గైర్హాజరీలో ధ్రువ్ జురెల్ లేదంటే.. జగదీశన్ కూడా జట్టులోకి వస్తారేమో కూడా తెలియదు. కానీ.. ఇషాన్ కిషన్కు మాత్రం పిలుపునివ్వరు. అతడు దేశవాళీ క్రికెట్ ఆడిన తర్వాతే మళ్లీ జాతీయ జట్టుకు సెలక్ట్ చేస్తారు’’ అని ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఆ విషయంలో కోహ్లితో పోల్చవద్దు ఈ సందర్భంగా.. ‘‘విరాట్ కోహ్లి కూడా కాంపిటేటివ్ క్రికెట్ ఆడటం లేదు కదా అంటూ ప్రశ్నలు వేయద్దు. ఎందుకంటే.. కోహ్లి, ఇషాన్ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి.. దయచేసి ఇద్దరినీ పోల్చే ప్రయత్నం చేయొద్దు’’ అంటూ ట్రోల్ చేసే వాళ్లకు చురకలు అంటించాడు ఆకాశ్ చోప్రా. చదవండి: Virat Kohli: అంతా అబద్ధం.. కోహ్లి విషయంలో మాట మార్చిన డివిలియర్స్ -
ఇషాన్ తిరిగి రావాలంటే తనను తాను నిరూపించుకోవాలి: రాహుల్ ద్రవిడ్
టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ గతకొద్ది రోజులుగా ఎక్కడా కనిపించడం లేదు. వ్యక్తిగత కారణాల చేత గతేడాది దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధంతరంగా స్వదేశానికి వచ్చేసిన ఇషాన్.. అప్పటి నుంచి క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. గ్యాప్ కావడంతో జాతీయ సెలెక్టర్లు సైతం ఇషాన్ను ఏ ఫార్మాట్కు పరిగణలోకి తీసుకోవడం లేదు. దీంతో అలకబూనాడో ఏమో తెలీదు కానీ.. అతను కనీసం దేశవాలీ టోర్నీల్లో కూడా ఆడకుండా బీష్మించుకు కూర్చున్నాడు. తాజాగా విశాఖ టెస్ట్ అనంతరం విలేకరులు ఇషాన్ గురించి టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వద్ద ఆరా తీశారు. అసలు ఇషాన్కు ఏమైంది.. అతను ఇంతకాలంగా జట్టుకు ఎందుకు దూరంగా ఉంటున్నాడంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు ద్రవిడ్ స్పందిస్తూ.. ఇషాన్ను జాతీయ సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోవాలంటే, అతను తొలుత క్రికెట్ ఆడటం మొదలుపెట్టాలి. ఏ తరహా గేమ్లోనైనా సరే తనను తాను నిరూపించుకోవాలి. ఇషాన్ అభ్యర్ధన మేరకే బ్రేక్ లభించింది. తిరిగి జట్టులోకి రావాలంటే తప్పనిసరిగా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇషాన్తో టచ్లోనే ఉన్నామని ద్రవిడ్ వివరణ ఇచ్చాడు. బీసీసీఐలోని ఓ వర్గం ఇషాన్ రీఎంట్రీని అడ్డుకుంటుందన్న ప్రచారం జరుగుతున్న వేల ద్రవిడ్ ఇచ్చిన వివరణ ఆసక్తికరంగా మారింది. ఇషాన్ కూడా కోహ్లిలా బీసీసీఐ పెద్దలతో ఏదైనా గొడవ పడ్డాడా అని జనాలు ఆరా తీయడం మొదలుపెట్టారు. అప్పటివరకు మూడు ఫార్మాట్లలో సభ్యుడిగా ఉన్న ఇషాన్ ఒక్కసారిగా కనుమరుగైపోవడం ఏంటని చర్చించుకుంటున్నారు. ద్రవిడ్ ఇచ్చిన వివరణ చూస్తుంటే, ఇషాన్ రీఎంట్రీని అడ్డుకునే ప్రణాళికగా ఉందంటూ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుత టెస్ట్ వికెట్కీపర్ కేఎస్ భరత్ వరుసగా విఫలమవుతున్నా.. అతనితోనే నెట్టుకొస్తున్నారు కానీ, ఇషాన్ను అస్సలు పరిగణలోకి తీసుకోవడం లేదంటూ అనుమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్ట్లో బుమ్రా (9/91), యశస్వి జైస్వాల్ (209), శుభ్మన్ గిల్ (104) అద్భుత ప్రదర్శనలతో చెలరేగడంతో టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమానంగా నిలిచింది. -
ఇషాన్ కిషన్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్.. 442 రన్స్ ఆధిక్యం
సాక్షి, హైదరాబాద్- Ranji Trophy 2023-24- Hyderabad vs Arunachal Pradesh: దేశవాళీ క్రికెట్లో అనామక అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లపై హైదరాబాద్ ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (160 బంతుల్లో 323 బ్యాటింగ్, 33 ఫోర్లు, 21 సిక్స్లు), కెప్టెన్ రాహుల్ సింగ్ గహ్లోత్ (105 బంతుల్లో 185; 26 ఫోర్లు, 3 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్లో భాగంగా సొంతగడ్డపై జరుతున్న నాలుగు రోజుల లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ తొలిరోజు ‘సూపర్ఫాస్ట్’ ప్రదర్శన కనబరిచింది. ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 48 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 529 పరుగులు సాధించింది. ప్రస్తుతం హైదరాబాద్ 357 పరుగుల ఆధిక్యంలో ఉంది. ముందుగా అరుణాచల్ ఇన్నింగ్స్ను కూల్చడం మొదలు, హైదరాబాద్ బ్యాటింగ్ అంతా మెరుపు వేగంతో సాగిపోయింది. హైదరాబాద్ బౌలర్ల విజృంభణతో తూంకుంటలోని నెక్స్జెన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన అరుణాచల్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 39.4 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ తెచీ డోరియా (127 బంతుల్లో 97 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. హైదరాబాద్ బౌలర్లు సీవీ మిలింద్ (3/36), కార్తికేయ (3/28), తనయ్ త్యాగరాజన్ (2/53) అరుణాచల్ జట్టును కట్టడి చేశారు. తొలి వికెట్కు 449 పరుగుల భాగస్వామ్యం అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన హైదరాబాద్ ఓపెనర్లు తన్మయ్, రాహుల్ అరుణాచల్ బౌలర్లపై విధ్వంసరచన చేశారు. ఇద్దరూ చెలరేగిన తీరుతో ప్రతీ ఓవర్ హైలైట్స్ను తలపించింది. తొలుత ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ తన్మయ్తో రాహుల్ తొలి వికెట్కు 40.2 ఓవర్లలో 449 పరుగుల భాగస్వామ్యం జోడించాక అవుటయ్యాడు. రాహుల్ అవుటయ్యాక కూడా తన్మయ్ తన జోరు కొనసాగించాడు. ఈ క్రమంలో రంజీ ట్రోఫీలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన భారత క్రికెటర్గా తన్మయ్ నిలిచాడు. తన్మయ్ 119 బంతుల్లో డబుల్ సెంచరీ చేయగా... 1985లో బరోడా జట్టుపై రవిశాస్త్రి (ముంబై) 123 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. డబుల్ సెంచరీ పూర్తయ్యాక కూడా తన్మయ్ విధ్వంసం కొనసాగింది. ఫాస్టెస్ట్ ‘ట్రిపుల్ .. ఇషాన్ సిక్సర్ల రికార్డు బద్దలు ఈ క్రమంలో తన్మయ్ ఫస్ట్క్లాస్ ఫాస్టెస్ట్ ట్రిపుసెంచరీ’ సాధించిన బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. తన్మయ్ 147 బంతుల్లో ‘ట్రిపుల్ సెంచరీ’ సాధించి ... 2017లో దక్షిణాఫ్రికా దేశవాళీ క్రికెట్లో 191 బంతుల్లో ‘ట్రిపుల్ సెంచరీ’ చేసిన మార్కో మరైస్ రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాకుండా రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గా నిలిచాడు. శుక్రవారం నాటి మొదటిరోజు ఆట ముగిసేసరికి తన్మయ్ 21 సిక్స్లు కొట్టగా... జార్ఖండ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ (2016లో ఢిల్లీపై 14 సిక్స్లు), హిమాచల్ప్రదేశ్ ఆటగాడు శక్తి సింగ్ (1990లో హరియాణాపై 14 సిక్స్లు) పేరిట ఉన్న రికార్డు తెరమరుగైంది. Day 2- 366 పరుగులు చేసి అవుట్ తన్మయ్ అగర్వాల్ వీరవిహారానికి అరుణాచల్ ప్రదేశ్ బౌలర్ నబం టెంపోల్ బ్రేక్ వేశాడు. శనివారం నాటి రెండో రోజు ఆటలో 366 పరుగుల వ్యక్తిగత స్కోరు(34 ఫోర్లు, 26 సిక్సర్లు) వద్ద తన్మయ్ క్యాచ్ అవుట్గా పెవిలియన్ చేరాడు. దీంతో రెండో వికెట్ కోల్పోయిన హైదరాబాద్.. అభిరథ్ రెడ్డి(37), నితేశ్ రెడ్డి(12) రూపంలో మరో రెండు వికెట్లు కోల్పోయింది. మొత్తంగా 59 ఓవర్లు ముగిసే సరికి 614-4 స్కోరు చేసిన హైదరాబాద్ ప్రస్తుతం 442 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: Ranji Trophy: హనుమ విహారి, రికీ భుయ్ సెంచరీలు -
అందుకే ఇషాన్పై వేటు?.. వస్తే నేరుగా తుదిజట్టులోకే!
Ind vs Eng 5 Match Test Series 2024: ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్ నేపథ్యంలో తొలి రెండు మ్యాచ్లలో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ శుక్రవారం రాత్రి ప్రకటించింది. సొంతగడ్డపై దాదాపు నెలన్నర పాటు జరుగనున్న ఈ సిరీస్ సందర్భంగా ఓ కొత్త ఆటగాడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్కు చెందిన యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్కు తొలిసారి జాతీయ జట్టులో చోటు కల్పించారు. కేఎల్ రాహుల్, కోన శ్రీకర్ భరత్లతో పాటు మూడో వికెట్ కీపర్ ఆప్షన్గా అతడికి అవకాశం ఇచ్చారు. నిజానికి స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సెలక్షన్కు అందుబాటులో ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. మధ్యలోనే తిరిగి వచ్చాడు గత కొన్నాళ్లుగా ఈ జార్ఖండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జట్టుతో ప్రయాణిస్తున్నా తుదిజట్టులో ఆడే అవకాశం రావడం లేదు. దీంతో సౌతాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. మానసికంగా అలసిపోయానంటూ బీసీసీఐ దగ్గర సెలవు తీసుకుని ఆటకు విరామం ప్రకటించాడు. అయితే, ఇషాన్ కిషన్ వ్యవహారశైలి నచ్చని బీసీసీఐ పెద్దలు క్రమశిక్షణ చర్యల కింద అతడిని కొన్నాళ్లపాటు దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అందుకే ఈ లెఫ్టాండ్ బ్యాటర్ను అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్కు కూడా ఎంపిక చేయలేదనే విమర్శలు వచ్చాయి. అలాంటిదేమీ లేదన్న ద్రవిడ్ ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ స్వయంగా స్పందించాడు. ఇషాన్పై అలాంటి చర్యలేమీ తీసుకోలేదని.. అతడు సెలక్షన్కు అందుబాటులో లేడు కాబట్టే ఎంపిక చేయలేదని తెలిపాడు. అయితే, మళ్లీ టీమిండియాలో ఎంట్రీ ఇవ్వాలంటే దేశవాళీ క్రికెట్లో నిరూపించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు. రంజీలో నేరుగా తుదిజట్టులో ఆడిస్తామన్న జార్ఖండ్ మేనేజ్మెంట్ ఈ క్రమంలో జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి దేబాశిష్ చక్రవర్తి ఇషాన్ కిషన్కు తాము స్వాగతం పలుకుతున్నట్లు ప్రకటించాడు. అయితే, ఇంత వరకు ఇషాన్ తమను సంప్రదించలేదని.. ఒకవేళ అతడు రంజీ ట్రోఫీ-2024 సీజన్లో జార్ఖండ్ జట్టుకు ఆడాలనుకుంటే.. నేరుగా తుదిజట్టులో ఆడిస్తామని స్పష్టం చేశాడు. అయినప్పటికీ ఇంత వరకు ఇషాన్ కిషన్ జార్ఖండ్ జట్టుతో చేరలేదని తెలుస్తోంది. ఒకవేళ రంజీలకు దూరంగా ఉండాలని ఇషాన్ నిర్ణయించుకుంటే ఇక ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో అతడికి చోటు దక్కకపోవచ్చు. తొలి టెస్టు హైదరాబాద్లో ఇప్పటికే తొలి రెండు టెస్టులకు దూరమైన ఇషాన్.. మిగతా మూడు మ్యాచ్లు కూడా మర్చిపోవాల్సి ఉంటుంది. మేనేజ్మెంట్ చెప్పిన మాటలు పెడచెవిన పెడితే రీఎంట్రీ అసాధ్యమవుతుంది. చూడాలి మరి ఈ యంగ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఏం చేస్తాడో!! ఇదిలా ఉంటే.. ఇషాన్ స్థానంలో జట్టులోకి వచ్చిన 22 ఏళ్ల ధ్రువ్ భారత అండర్–19 జట్టుకు ఆడాడు. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు ఈనెల 25 నుంచి 29 వరకు హైదరాబాద్లో... రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు విశాఖపట్నంలో జరుగుతాయి. ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), బుమ్రా (వైస్ కెప్టెన్), శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్. చదవండి: Ind vs Eng ఎవరీ ధ్రువ్ జురెల్? తండ్రి కార్గిల్ యుద్ధంలో.. తల్లి త్యాగం! -
Ind vs Eng: తండ్రి కార్గిల్ యుద్ధంలో.. తల్లి త్యాగం! టీమిండియాలో ఎంట్రీ..
Dhruv Jurel Story Mother sold gold chain for cricket kit: తన 23వ పుట్టినరోజు(జనవరి 21)కు సరిగ్గా పది రోజుల ముందు ధ్రువ్ జురెల్ జీవితంలో అద్భుతం చోటుచేసుకుంది. టీమిండియాకు ఆడాలన్న తన కల నెరవేరేందుకు పునాది పడింది. అవును.. పటిష్ట ఇంగ్లండ్తో సొంతగడ్డపై తలపడే భారత జట్టులో తొలిసారిగా అతడికి చోటు దక్కింది. సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే టెస్టు జట్టును వీడిన ఇషాన్ కిషన్పై వేటు వేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. ఈ ఉత్తరప్రదేశ్ కుర్రాడికి జట్టులో స్థానం ఇచ్చింది. కేఎల్ రాహుల్, కేఎస్ భరత్తో పాటు తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో వికెట్ కీపర్గా చోటిచ్చింది. రాహుల్ గాయం, కేఎస్ భరత్ నిలకడలేమి ప్రదర్శన నేపథ్యంలో మూడో టెస్టు ద్వారా ధ్రువ్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తండ్రి కార్గిల్ యుద్ధంలో.. ఉత్తరప్రదేశ్కు చెందిన ధ్రువ్ జురేల్ తండ్రి నీమ్ సింగ్ జురేల్ కార్గిల్ యుద్ధంలో పోరాడారు. తనలాగే కొడుకు కూడా ఆర్మీలో చేరాలి.. అలా కుదరకపోతే.. ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి తీరాలని ఆయన బలంగా కోరుకున్నారు. అంతేతప్ప స్పోర్ట్స్ను కెరీర్గా ఎంచుకోవాలని ఏనాడూ ఆశించలేదు. అందుకు తగ్గ ప్రయత్నాలు చేయమని కుమారుడికి చెప్పనూలేదు. కానీ.. ధ్రువ్ మనసంతా క్రికెట్ మీదే ఉంది. ఇంట్లో నుంచి పారిపోతా అయితే, ఆ మాటను పెదవి దాటించి తండ్రితో చెప్పాలంటే భయం. అయినా.. ఓరోజు ఎలాగోలా ధైర్యం చేసి.. ‘నాకు క్రికెట్ బ్యాట్ కొనివ్వు నాన్నా’’ అని నోరు తెరిచి అడిగాడు. అప్పటికే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే.. పైగా ఆర్మీ కాకుండా ఆటగాడిని అవుతానంటూ కొడుకు చెప్పడం నీమ్ సింగ్కు ఎంతమాత్రం నచ్చలేదు. అందుకే వెంటనే నో చెప్పేశారు. ధ్రువ్కు మాత్రం క్రికెటర్ కావాలనే కోరిక బలంగా నాటుకుపోయింది. ఇంట్లో పరిస్థితులు చూశాక.. నాన్న మాటలు విన్న తర్వాత ఇంట్లో నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. క్రికెట్ ఆడనివ్వకపోతే దూరంగా వెళ్లిపోతా అని తల్లితో చెప్పాడు. బంగారు గొలుసు అమ్మి క్రికెట్ కిట్ కొని ‘‘అయ్యో.. వీడు అన్నంత పని చేస్తాడేమో’’నన్న భయం ఆ తల్లిని వెంటాడింది. కొడుకును కాపాడుకోవడం.. అతడి కలలను నిజం చేయడం కోసం శ్రమించడం కంటే ఇంకే విషయంలో తనకు సంతోషం దొరుకుతుందని భావించిన ఆమె.. తన బంగారు గొలుసు అమ్మేసి ధ్రువ్ కోసం ఆ డబ్బుతో క్రికెట్ కిట్ కొనిచ్చింది. అమ్మ తన కోసం త్యాగాలు చేయడం చూసిన ఆ చిన్నారి కొడుకు.. ఆట పట్ల మరింత అంకితభావం, నిబద్ధతతో వ్యవహరించడం మొదలుపెట్టాడు. జూనియర్ క్రికెట్లో ఆగ్రా, ఉత్తరప్రదేశ్ జట్లకు ఆడిన ధ్రువ్ జురెల్.. మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునేందుకు నోయిడా వెళ్లాడు. కొడుకుతో పాటే తానూ మెరుగైన శిక్షణ కోసం నోయిడాకు పయనమయ్యాడు. కానీ ఆగ్రా నుంచి నోయిడా వరకు తరచూ ప్రయాణం చేయడం మానసికంగానూ, శారీరకంగానూ ఇబ్బందికరంగా మారింది. మళ్లీ తానున్నానంటూ ధ్రువ్ తల్లి రంగంలోకి దిగింది. కొడుకు కెరీర్లో ముందుకు వెళ్లేందుకు వీలుగా అతడితో నోయిడాలో నివసించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. అలా అలా అంచెలంచెలుగా ఎదిగిన ధ్రువ్ జురెల్ ఇండియ అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. తన అద్భుత ప్రదర్శనలతో 2020 అండర్-19 వరల్డ్కప్ వైస్ కెప్టెన్గానూ నియమితుడయ్యాడు. ఆ టోర్నీలో భారత యువ జట్టు రన్నరప్గా నిలిచింది. తండ్రి మనసు కరిగింది ధ్రువ్ పట్టుదల, అంకితభావం చూసి అతడి తండ్రి మనసు కూడా కరిగింది. కొడుకు అనుకున్న లక్ష్యం చేరుకునేందుకు తన వంతు బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు త్యాగాలు చేసేందుకు కూడా సిద్ధపడ్డారు. అండర్ 19కు ఆడుతున్న సమయంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీలు నిర్వహించే క్యాంపులకు స్వయంగా కొడుకును తీసువెళ్లేవారు. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఎంట్రీ అప్పటికే తన తోటి ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయి, ప్రియం గార్గ్ లాంటి వాళ్లు క్యాష్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇవ్వడం.. తనకు మాత్రం ఇంకా అవకాశం రాకపోవడంతో డీలా పడ్డ ధ్రువ్కు నైతిక మద్దతునిచ్చారు. ఎట్టకేలకు 2022లో రాజస్తాన్ రాయల్స్ ధ్రువ్ జురెల్ను కనీస ధర రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే, రియాన్ పరాగ్కు వరుస అవకాశాలు ఇచ్చే క్రమంలో ధ్రువ్ జురెల్ బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే, రియాన్ పూర్తిగా విఫలం కావడం.. ఆ ఏడాది ఫైనల్లో ఓడిపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో.. వచ్చే సీజన్లో ధ్రువ్ను ఆడించాలని ఆర్ఆర్ మేనేజ్మెంట్ నిర్ణయించుకుంది. అరంగేట్రంలోనే పరుగుల విధ్వంసం బ్యాటింగ్ ఆర్డర్లో ఆరు లేదంటే ఏడో స్థానంలో ఆడిస్తామనే హామీ ఇచ్చింది. ఐపీఎల్-2023లో వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ద్వారా రాజస్తాన్ రాయల్స్ తరఫున ఎంట్రీ ఇచ్చాడు ధ్రువ్ జురెల్. అరంగేట్రంలోనే సునామీ ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో 15 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 32 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఆ మ్యాచ్లో రాజస్తాన్ ఓడినప్పటికీ తన ప్రదర్శనతో ధ్రువ్ జురెల్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత వరుస మ్యాచ్లు ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు మొత్తంగా 13 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన ధ్రువ్ 11 ఇన్నింగ్స్లలో 152 పరుగులు సాధించాడు. భారత్-ఏ జట్టు తరఫున కూడా ప్రాతినిథ్య వహించిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఇలా తొలిసారి ప్రధాన జట్టుకు ఎంపికయ్యాడు. నీ గోల్డ్చైన్కు రీపే చేశాడు ఇక రాజస్తాన్కు ఆడే సమయంలో జైపూర్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన ధ్రువ్ జురెల్ తండ్రి భార్యను ఉద్దేశించి.. ‘‘నీ బంగారు గొలుసు అమ్మినందుకు నీ కొడుకు మూల్యం చెల్లించేశాడోయ్’’ అని పుత్రోత్సాహంతో పొంగిపోయారట!! మరి ఇప్పుడు టీమిండియాకు సెలక్ట్ అయిన తర్వాత ఇంకెంతగా మురిసిపోతున్నారో!! - సాక్షి స్పోర్ట్స్, వెబ్ ప్రత్యేకం (ఇన్పుట్స్: హిందుస్తాన్ టైమ్స్) చదవండి: షమీ తమ్ముడి దెబ్బ.. 60 పరుగులకే యూపీ ఆలౌట్! భువీ కూడా తగ్గేదేలే.. 5 వికెట్లు కూల్చి -
వెళ్లడం వరకే నీ ఇష్టం!.. ద్రవిడ్ ‘వార్నింగ్’ తర్వాత ఇషాన్ ఫస్ట్ రియాక్షన్
Rahul Dravid- Ishan Kishan: టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ భవితవ్యంపై గత కొన్ని రోజులుగా క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన ఇషాన్ ఇంకా సెలవులోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో.. అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్కు అతడు అందుబాటులోకి వస్తాడని భావించినా.. అలా జరుగలేదని టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ స్వయంగా వెల్లడించాడు. అంతేకాదు.. ఇషాన్ మళ్లీ భారత జట్టుతో చేరాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో.. మానసికంగా అలసిపోయానని తనకు తాను తప్పుకొన్న ఇషాన్ కిషన్.. పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుండటం బీసీసీఐ పెద్దలకు ఆగ్రహం తెప్పించిందనే వార్తలు వినిపించాయి. వెళ్లడం వరకే మీ ఇష్టం.. తిరిగి రావాలంటే ఈ నేపథ్యంలోనే .. ‘‘జట్టును వీడి వెళ్లాలా వద్దా అనేది మాత్రమే ఆటగాళ్ల ఇష్టం.. వాళ్లను తిరిగి తీసుకోవాలా వద్దా అనేది మాత్రం మా ఇష్టమే’’ అన్న అర్థం ద్రవిడ్ మాటల్లో ధ్వనించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీలైనప్పుడల్లా అవకాశాలు ఇస్తున్నా.. తనను కావాలనే పక్కనపెడుతున్నారని ఇషాన్ ఇగోకు పోయి తన కెరీర్ను తానే నాశనం చేసుకుంటున్నాడనే మాటలూ వినిపిస్తున్నాయి. రంజీల్లో ఆడతాడో లేదో చెప్పలేదు.. వస్తే మాత్రం మరోవైపు.. ద్రవిడ్ చెప్పిన తర్వాత ఇషాన్ కిషన్ రంజీ ట్రోఫీ-2024 సీజన్లో కచ్చితంగా ఆడతాడని అంతా భావించారు. ఇంగ్లండ్తో స్వదేశంలో టెస్టు సిరీస్కు ముందు ఇషాన్.. దేశవాళీ క్రికెట్లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న జార్ఖండ్ తరఫున బరిలోకి దిగుతాడని ఊహించారు. కానీ.. ఇందుకు సంబంధించి తమకు ఇషాన్ నుంచి ఎలాంటి సమాచారం లేదని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి దేబాశిష్ చక్రవర్తి వార్తా సంస్థ పీటీఐకి తెలిపాడు. ఒకవేళ ఇషాన్ రంజీల్లో ఆడాలనుకుంటే నేరుగా తుదిజట్టులో చేర్చుకుంటామని స్పష్టం చేశాడు. అయినప్పటికీ ఈ పరిణామాలపై ఇషాన్ కిషన్ ఇంత వరకు నేరుగా స్పందించకపోవడం గమనార్హం. అయితే, తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ వీడియోతో ప్రత్యక్షమయ్యాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. యోగా చేస్తూ, మైదానంలో పరుగులు తీస్తూ ఇందులో... యోగా చేస్తూ, మైదానంలో పరుగులు తీస్తూ కనిపించాడు. దీనిని బట్టి త్వరలోనే రీఎంట్రీ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఇషాన్ చెప్పకనే చెప్పినట్లయింది. అయితే, ఇప్పటికే శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్లతో పాటు రుతురాజ్ గైక్వాడ్ నుంచి ఓపెనింగ్ స్థానానికి ఇషాన్ గట్టి పోటీని ఎదుర్కొంటున్నాడు. మరోవైపు... కేఎల్ రాహుల్- శ్రీకర్ భరత్(టెస్టు), సంజూ శాంసన్- జితేశ్ శర్మ(వన్డే, టీ20లలో) రూపంలో వికెట్ కీపర్ స్థానానికి తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్ విషయంలో మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: NZ vs Pak: చరిత్ర సృష్టించిన కివీస్ పేసర్: ప్రపంచంలోనే ఏకైక బౌలర్గా రికార్డు 🏃♂️ pic.twitter.com/XjUfL18Ydc — Ishan Kishan (@ishankishan51) January 12, 2024 -
Dravid: అప్పటి వరకు ఇషాన్కు టీమిండియాలో స్థానం లేదు
Ishan Kishan Return?: టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్పై బీసీసీఐ గుర్రుగా ఉందన్న వార్తల నేపథ్యంలో హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. దేశవాళీ క్రికెట్లో నిరూపించుకున్న తర్వాతే ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మళ్లీ సెలక్షన్కు అందుబాటులోకి వస్తాడని తెలిపాడు. అంతవరకు ఇషాన్ కిషన్కు టీమిండియాలో స్థానం దక్కదని ద్రవిడ్ సంకేతాలు ఇచ్చాడు. కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టులకు ఎంపికైన ఇషాన్ సిరీస్ ఆరంభానికి ముందే స్వదేశానికి తిరిగి వచ్చాడు. మానసికంగా అలసిపోయానని.. కుటుంబంతో గడిపేందుకు తనకు సెలవు మంజూరు చేయాలని అతడు విజ్ఞప్తి చేయగా.. మేనేజ్మెంట్ అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. నమ్మకాన్ని వమ్ము చేశాడంటూ వదంతులు అయితే, బీసీసీఐ పెద్దల నమ్మకాన్ని వమ్ము చేసేలా ఇషాన్ వ్యవహరించాడన్న కారణంతోనే అతడిని అఫ్గనిస్తాన్తో సిరీస్కు పక్కనపెట్టినట్లు వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో.. తొలి టీ20 ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన రాహుల్ ద్రవిడ్కు ఇషాన్ గురించి ప్రశ్న ఎదురైంది. అప్పుడే మళ్లీ టీమిండియాలోకి ఇషాన్ ఎంట్రీ.. తేల్చేసిన ద్రవిడ్ ఇందుకు బదులిస్తూ.. ‘‘అలాంటిదేమీ లేదు. సెలక్షన్కు అతడు అందుబాటులో లేడు. నిజానికి సౌతాఫ్రికా టూర్లో ఉన్నపుడే తనకు బ్రేక్ కావాలని ఇషాన్ అడిగాడు. మేము కూడా అందుకు అంగీకరించాం. అన్ని విధాలా మద్దతుగా నిలబడ్డాం. సమస్యకు తగిన పరిష్కారం వెదకాలని సూచించాం. ఆ తర్వాత అతడు ఇంత వరకు సెలక్షన్కు అందుబాటులోకి రాలేదు. ఒకవేళ తను మళ్లీ మైదానంలో దిగాలనుకుంటే.. దేశవాళీ క్రికెట్ ఆడి.. అప్పుడు సెలక్షన్కు అవైలబుల్గా ఉంటాడు’’ అని ద్రవిడ్ స్పష్టం చేశాడు. సంజూ, జితేశ్లకు లక్కీ ఛాన్స్ కాగా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్కు ఇషాన్ కిషన్ స్థానంలో సంజూ శాంసన్, జితేశ్ శర్మ వికెట్ కీపర్లుగా చోటు దక్కించుకున్నారు. ఇక టీ20 ప్రపంచకప్-2024కు ముందు టీమిండియా ఆడే ఆఖరి సిరీస్ ఇదే కావడం గమనార్హం. మళ్లీ ఐపీఎల్-2024లో ప్రదర్శనను బట్టే ఇషాన్ వరల్డ్కప్ నాటికి తిరిగి వస్తాడా లేదా అన్నది తేలనుంది. అయితే, అంతకంటే ముందు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ఆడే జట్టులో చోటు దక్కించుకోవాలంటే జార్ఖండ్ తరఫున ఇషాన్ రంజీల్లో ఆడటం తప్ప మరోమార్గం లేదు. అక్కడ తనను తాను నిరూపించుకున్నా.. కేఎల్ రాహుల్ రూపంలో వికెట్ కీపర్ స్థానానికి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. చదవండి: Ind vs Afg: అఫ్గన్ బ్యాటింగ్ సంచలనం.. 22 ఏళ్ల కెప్టెన్! రోహిత్ సేనతో ఢీ అంటే ఢీ! ఎవరితడు? -
బీసీసీఐతో ఇషాన్కు విభేదాలా? అందుకే సెలక్ట్ చేయలేదా?!
యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి వ్యవహరిస్తున్న తీరుపై అతడి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లి వంటి సీనియర్లకు, కిషన్ లాంటి యువ ఆటగాళ్లకు వేర్వేరు నిబంధనలు ఉంటాయా అని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు కారణం ఏమిటంటే?!.. జట్టుతోనే ఉన్నా నో ఛాన్స్ గతేడాది కాలంగా జట్టులో పాటే ప్రయాణిస్తున్నా ఇషాన్ కిషన్కు తుదిజట్టులో చోటు కరువైంది. మూడు ఫార్మాట్లలో ఓపెనింగ్ బ్యాటర్ స్థానంలో శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ నుంచి.. వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ నుంచి ఈ జార్ఖండ్ ప్లేయర్ తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో అడపాదడపా మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే స్వదేశానికి ఇషాన్ ఈ క్రమంలో సౌతాఫ్రికా పర్యటన నుంచి ఇషాన్ అకస్మాత్తుగా తిరిగి రావడం ప్రాధాన్యం సంతరించింది. మానసికంగా అలసిపోయానని.. అందుకే కొంతకాలం బ్రేక్ తీసుకోవాలని అతడు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. నిజానికి.. జట్టుతో పాటు ప్రయాణిస్తున్నా తగినంత ప్రాధాన్యం దక్కడం లేదనే ఆవేదనతో ఇషాన్ ఆటకు విరామం ఇవ్వాలని భావించినట్లు సమాచారం. అప్పటి నుంచే బీసీసీఐతో విభేదాలు? స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ నుంచే తనకు సెలవులు కావాలని ఇషాన్ అడిగినా.. మేనేజ్మెంట్ సానుకూలంగా స్పందించలేదని జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఎట్టకేలకు అతడి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని రిలీవ్ చేస్తే.. విశ్రాంతి తీసుకోకుండా దుబాయ్లో ట్రిప్ ఎంజాయ్ చేయడం ఏమిటని కొందరు బీసీసీఐ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వదంతులు వచ్చాయి. అందుకే సెలక్ట్ చేయలేదా? ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్ ఫ్యాన్స్- నెటిజన్లకు మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. వరల్డ్కప్-2024కు ముందు కీలకమైన అఫ్గనిస్తాన్తో సిరీస్కు ఇషాన్ కావాలనే అందుబాటులో ఉండకపోవడం అతడి పొగరుబోతుతనానికి సూచిక అని కొంతమంది తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి ఆటిట్యూడ్ ఉన్న ఆటగాడిని ప్రపంచకప్ టోర్నీలో ఆడించాలనే ఆలోచన ఉంటే మానుకోవాలని సూచిస్తున్నారు. ఇచ్చిన సెలవు ఎలా వాడుకుంటే వాళ్లకెందుకు?! అయితే, ఇషాన్ కిషన్ అభిమానులు ఇందుకు ఘాటుగానే బదులిస్తున్నారు. ‘‘విరాట్ కోహ్లి తాను మానసికంగా అలసిపోయానని సుదీర్ఘకాలం విశ్రాంతి తీసుకుంటూ.. విదేశాలకు వెళితే తప్పు లేదు.. కానీ ఇషాన్ లాంటి వాళ్లు సెలవు అడిగి ట్రిప్నకు వెళ్తే నేరమా? కావాలనే అఫ్గనిస్తాన్ సిరీస్ నుంచి తప్పించి.. పైగా అతడిపైనే నిందలు మోపడం సరికాదు. ఇచ్చిన సెలవును ఎలా వాడుకుంటే వాళ్లకెందుకు?’’ అని కౌంటర్ వేస్తున్నారు. దీంతో ఇషాన్ కిషన్ పేరు ఎక్స్ వేదికగా ట్రెండింగ్లోకి వచ్చింది. అందుకే దుబాయ్కి వెళ్లిన ఇషాన్ కాగా తన సోదరుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు ఇషాన్ దుబాయ్కు వెళ్లడం గమనార్హం. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్తో జనవరి 11 నుంచి టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఈ సిరీస్తో రీఎంట్రీ ఇస్తున్నారు. చదవండి: Ind Vs Afg: అఫ్గన్తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం! ఆటకు దూరం.. కారణం?
Ishan Kishan- Mental Fatigue: టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మానసికంగా అలసిపోయానంటూ 25 ఏళ్ల ఈ లెఫ్టాండ్ బ్యాటర్ కొన్నాళ్ల పాటు క్రికెట్కు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు సమాచారం. కాగా 2021లో టీ20ల ద్వారా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ జార్ఖండ్ బ్యాటర్.. అదే ఏడాది వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓపెనర్గా పలు అవకాశాలు దక్కించుకున్న ఇషాన్ ఖాతాలో ఇప్పటి వరకు ఓ సెంచరీ, ఓ డబుల్ సెంచరీ ఉంది. ఆరంభంలో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకున్నప్పటికీ సహచర ఆటగాడు, తన స్నేహితుడు శుబ్మన్ గిల్ నుంచి ఎదురైన పోటీలో ఇషాన్ వెనుకబడిపోయాడు. కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా ఓపెనర్గా గిల్ తన స్థానం సుస్థిరం చేసుకోగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్కు మాత్రం అవకాశాలు సన్నగిల్లాయి. గిల్ సూపర్స్టార్గా ఎదుగుతున్నాడు.. ఇషాన్ మాత్రం కేఎల్ రాహుల్ రూపంలో మరో వికెట్ కీపర్ అందుబాటులో ఉండటంతో అతడికి ప్రాధాన్యం తగ్గింది. ఈ క్రమంలో సీనియర్ల గైర్హాజరీలో మిడిలార్డర్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఇషాన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మరోవైపు.. గిల్ మూడు ఫార్మాట్లలో సూపర్స్టార్గా ఎదుగుతుండగా.. ఇషాన్కు ఇంత వరకు టెస్టుల్లో తనను తాను నిరూపించుకునే అవకాశం రాలేదు. యశస్వి జైశ్వాల్ నుంచి గట్టిపోటీ కూడా ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో గతేడాది కాలంగా జట్టుతో పాటే ప్రయాణిస్తున్నా.. తుదిజట్టులో పెద్దగా ఛాన్సులు కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్కు ఎంపికైనప్పటికీ ఇషాన్ కిషన్ వ్యక్తిగత కారణాల దృష్ట్యా స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోతున్నా రెండు మ్యాచ్ల సిరీస్ నుంచి విరామం తీసుకున్నాడు. దీంతో అతడి స్థానంలో ఆంధ్ర క్రికెటర్, వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ టీమిండియాతో కలవనున్నాడు. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్కు సంబంధించిన కీలక వార్త తెరమీదకు వచ్చింది. మానసిక ఒత్తిడి తట్టుకోలేకనే అతడు స్వదేశానికి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ‘‘మానసికంగా అలసిపోయానని.. తనకు క్రికెట్ నుంచి కొన్నాళ్ల పాటు విరామం కావాలంటూ ఇషాన్ కిషన్ యాజమాన్యంతో చెప్పాడు. మేనేజ్మెంట్ కూడా ఇందుకు అంగీకరించింది’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. గతేడాది కాలంగా విరామం లేకుండా జట్టుతో ప్రయాణించిన ఇషాన్ ప్రస్తుతం విశ్రాంతి కోరుకుంటున్నట్లు తెలిపింది. వన్డేల్లో దుమ్ములేపినా.. ఇక ఈ ఏడాది ఇషాన్ కిషన్ రెండు టెస్టులు, 17 వన్డేలు, 11 టీ20లు ఆడాడు. వెస్టిండీస్ పర్యటన సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఇషాన్ 52 పరగులు చేయగా.. 17 వన్డేల్లో కలిపి 456 పరుగులు సాధించాడు. టీ20లలో ఈ ఏడాది 207 రన్స్ తీశాడు. కాగా గతంలోనూ గ్లెన్ మాక్స్వెల్ వంటి చాలా మంది క్రికెటర్లు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ఆటకు విరామిచ్చిన విషయం తెలిసిందే. ఇషాన్ కూడా అలాగే కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకుని రెట్టించిన ఉత్సాహంతో తిరిగి రావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: Sanju Samson: వాళ్ల గురించి ఫిర్యాదు చేయను.. అనేక ఒత్తిళ్ల నడుమ: సంజూ -
SA Tour: ఉన్న పళంగా స్వదేశానికి బయల్దేరిన ఇషాన్ కిషన్
దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియా యంగ్ వికెట్కీపింగ్ బ్యాటర్, పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ ఉన్న పలంగా స్వదేశానికి బయల్దేరాడు. వ్యక్తిగత కారణాల చేత ఇషాన్ ఇండియాకు బయల్దేరాడని బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. భారత టెస్ట్ జట్టులో ఇషాన్ స్థానాన్ని కేఎస్ భరత్ భర్తీ చేస్తాడని బీసీసీఐ ప్రకటించింది. ప్రస్తుతం సౌతాఫ్రికాలోనే ఉన్న భరత్.. భారత టెస్ట్ జట్టుతో త్వరలోనే కలుస్తాడని పేర్కొంది. కాగా, సౌతాఫ్రికా పర్యటనలో టీ20, టెస్ట్ సిరీస్ల కోసం భారత సెలెక్టర్లు ఇషాన్ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. టీ20ల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కని ఇషాన్.. టెస్ట్ సిరీస్పై ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఉన్నట్లుండి అతను ఇంటి వెళ్లిపోవడంతో అనూహ్యంగా కేఎస్ భరత్కు సెలెక్టర్ల నుంచి పిలుపు అందింది. భరత్.. కేఎల్ రాహుల్ తర్వాత రెండో వికెట్కీపర్ ఛాయిస్గా టీమిండియాలో చేరతాడు. సౌతాఫ్రికాతో రెండు టెస్టుల కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వికెట్కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ, కేఎస్ భరత్ (వికెట్కీపర్) భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్ సెంచూరియన్ వేదికగా డిసెంబర్ 26-30 మధ్యలో జరుగనుండగా.. రెండో టెస్ట్ కేప్టౌన్ వేదికగా వచ్చే ఏడాది జనవరి 3-7 మధ్యలో జరుగుతుంది. -
టీ20 వరల్డ్కప్కు కోహ్లి దూరం.. విధ్వంసకర ఆటగాడికి ఛాన్స్!?
టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి భాగమయ్యే సూచనలు కన్పించడం లేదు. గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత ఇప్పటివరకు ఒక టీ20 మ్యాచ్ కూడా ఆడని కోహ్లి.. ఇకపై పొట్టి క్రికెట్లో భారత జెర్సీని ధరించేది అనుమానమే. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్కు విరాట్ను పరిగణలోకి తీసుకోకూడదని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ముంబైలో జరిగిన సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ టీ20 వరల్డ్కప్ సిద్దం చేసినట్లు సమాచారం. కాగా టీ20 వరల్డ్కప్లో భారత జట్టు కెప్టెన్గా కొనసాగించాల్సిందిగా రోహిత్ శర్మను బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది. అందుకు హిట్మ్యాన్ కూడా అంగీకరించినట్లు సమాచారం. అతడితో పాటు బుమ్రా కూడా టీ20 ప్రపంచకప్లో భాగమయ్యేందుకు ఆసక్తి చూపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సమావేశంలో విరాట్ టీ20 భవితవ్యంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. టీ20ల్లో అతడి స్ధానంలో ఇషాన్ కిషన్కు ఛాన్స్ నిర్ణయించినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. "మూడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి పత్యర్ధి బౌలర్లను ఎటాక్ చేసే ఆటగాడు కోసం సెలక్టర్లు వెతుకుతున్నారు. విరాట్ కోహ్లి స్ధానాన్ని వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్తో భర్తీ చేసే ఛాన్స్ ఉంది. అయితే ఐపీఎల్-2024 సీజన్లో కోహ్లి ప్రదర్శనను కూడా పరిగణలోకి సెలక్టర్లు తీసుకుంటారు అని బీసీసీఐ అధికారి ఒకరు దైనిక్ జాగరణ్తో పేర్కొన్నారు. చదవండి: IND vs SA: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా.. షెడ్యూల్, జట్లు.. ఎక్కడ చూడొచ్చంటే? -
కెప్టెన్సీని డ్రెస్సింగ్ రూమ్లోనే వదిలేశాను.. రింకూ కోసమే అనిపించింది: సూర్యకుమార్
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో నిన్న (నవంబర్ 23) జరిగిన తొలి టీ20లో టీమిండియా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. జోష్ ఇంగ్లిస్ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్గా వచ్చిన స్టీవ్ స్మిత్ (52) అర్ధసెంచరీతో రాణించాడు. ఇంగ్లిస్ విధ్వంసం ధాటికి ముకేశ్ కుమార్ (4-0-29-0), అక్షర్ పటేల్ (4-0-32-0) మినహా భారత బౌలర్లంతా కుదేలయ్యారు. ప్రసిద్ద్, రవి బిష్ణోయ్కు తలో వికెట్ దక్కింది. అనంతరం 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. మరో బంతి మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. సూర్యకుమార్ యాదవ్ (42 బంతుల్లో 80; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి టీమిండియా గెలుపుకు బాటలు వేశాడు. ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. స్కై ఔటయ్యాక ఆఖర్లో టీమిండియా 3 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయి ఓటమిపాలయ్యేలా కనినపించింది. అయితే రింకూ సింగ్ చివరి బంతికి సిక్సర్ బాది టీమిండియాను గెలిపించాడు. భారత్ గెలుపుకు చివరి బంతికి సింగిల్ అవసరం కాగా సీన్ అబాట్ నో బాల్ వేసి భారత గెలుపును లాంఛనం చేశాడు. దీంతో రింకూ సిక్సర్తో సంబంధం లేకుండానే టీమిండియా విజయం సాధించింది. రింకూ సిక్సర్ గణాంకాల్లో కూడా కలవలేదు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ అనంతరం స్కై మాట్లాడుతూ.. ఈ రోజు మా ఆటతీరు అద్భుతంగా ఉంది. ఓ దశలో ఒత్తిడికి గురయ్యాము. కానీ మా ఆటగాళ్లు దాన్ని అధిగమించి సత్తా చాటారు. టీమిండియా కెప్టెన్గా ఇది నాకు గర్వించదగ్గ క్షణం. మ్యాచ్ సమయంలో మంచు కురుస్తుందని భావించాము. కానీ అలా జరగలేదు. మైదానం చిన్నది కావడంతో ఛేదనలో బ్యాటింగ్ సులభం అవుతుందని తెలుసు. వారు 230-235 సాధించవచ్చని భావించాం. కానీ ఆఖర్లో మా బౌలర్లు వారిని అద్భుతంగా కట్టడి చేశారు. బ్యాటింగ్ను ఎంజాయ్ చేయమని ఇషాన్కు చెప్పాను. అందుకే అతను ఫ్రీగా షాట్లు ఆడగలిగాడు. కెప్టెన్సీ లగేజీని డ్రెస్సింగ్ రూమ్లో వదిలేసి బరిలోకి దిగాను. అందుకే బ్యాటింగ్ను ఆస్వాదించగలిగాను. ఆఖరి బంతికి రింకూ సిక్సర్ కొట్టడంపై స్పందిస్తూ.. అతడి కొరకే ఇలాంటి పరిస్థితులు వస్తాయన్నట్లుగా అనిపించింది. అతను ప్రశాంతంగా ఉండటమే కాకుండా నన్ను కూడా శాంతింపజేశాడు. ఇక్కడి (విశాఖ) వాతావరణం అద్భుతంగా ఉంది. ప్రేక్షకులకు ధన్యవాదాలు అని అన్నాడు. -
భారత్vsఆస్ట్రేలియా T20 ఉత్కంఠపోరులో భారత్ విజయం (ఫొటోలు)
-
టీమిండియాకు వరుస షాక్లు.. మరో స్టార్ ఆటగాడికి గాయం!
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా టీమిండియా ఆక్టోబర్ 22న ధర్మశాల వేదికగా న్యూజిలాండ్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు భారత జట్టుకు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే గాయం కారణంగా హార్దిక్ పాండ్యా కివీస్తో మ్యాచ్కు దూరంగా.. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ కూడా గాయపడ్డారు. ధర్మశాలలోని హెచ్పీసీఎ స్టేడియంలో ప్రాక్టీసీ చేస్తుండగా ఇషాన్ కిషన్కు తేనెటీగ కుట్టింది. నొప్పితో విల్లవిల్లాడిన కిషన్కు బీసీసీఐ వైద్య బృందం చికిత్స అందించింది. మరోవైపు నెట్ ప్రాక్టీస్లో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మణికట్టుకు గాయమైంది. ప్రాక్టీస్ చేస్తుండగా బంతి సూర్య కుడి చేతికి మణికట్టుకు బలంగా తాకినట్లు సమాచారం. వెంటనే మెడికల్ స్టాప్ ఐస్ ప్యాక్ను పెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కివీస్తో మ్యాచ్కు హార్దిక్ స్ధానంలో సూర్యకుమార్ యాదవ్ రానున్నట్లు వార్తలు వినిపించాయి. అంతలోనే సూర్యకు గాయం కావడం భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాలి. అదేవిధంగా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే జడ్డూ గాయంపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. దీంతో టీమిండియా అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక హార్దిక్ స్ధానాన్ని ఎవరితో భర్తీ చేస్తారో మరో 24 గంటలు వేచి చూడాల్సిందే. So Ishan Kishan got bit by a honeybee during the nets today. Went off immediately after being attended by a couple of support staff. #INDvNZ #CWC23 @RevSportz — Subhayan Chakraborty (@CricSubhayan) October 21, 2023 -
పాకిస్తాన్తో మ్యాచ్.. గుడ్న్యూస్ చెప్పిన రోహిత్ శర్మ! ఇషాన్ అవుట్.. కానీ!
Rohit Sharma shares crucial update on Shubman Gill: వన్డే వరల్డ్కప్-2023లో మెగా ఫైట్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త చెప్పాడు. స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్ తిరిగి జట్టుతో చేరనున్నట్లు తెలిపాడు. అయితే, అదే సమయంలో ఓ మెలిక కూడా పెట్టి ఫ్యాన్స్ను సందిగ్దంలోకి నెట్టేశాడు. కాగా అక్టోబరు 14న దాయాదులు భారత్- పాకిస్తాన్ ప్రపంచకప్ ఈవెంట్లో తలపడేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్లు పోటీకి దిగనున్నాయి. క్రికెట్ ప్రపంచంలో భారీ క్రేజ్ ఉన్న మ్యాచ్గా చరిత్రకెక్కిన చిరకాల ప్రత్యర్థుల పోరుకు లక్ష సీట్ల సామర్థ్యం గల మోదీ స్టేడియం కిక్కిరిసిపోవడం లాంఛనమే! డెంగ్యూ బారిన పడి.. రెండు మ్యాచ్లకు దూరమై ఇదిలా ఉంటే.. వన్డే ప్రపంచకప్ టోర్నీకి ముందు సూపర్ ఫామ్లో ఉన్న టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్.. డెంగ్యూ బారిన పడిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్తో మ్యాచ్లకు అతడు దూరం కాగా ఇషాన్ కిషన్ ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. గిల్ మ్యాచ్ ఆడేందుకు ఫిట్గా ఉన్నాడు అయితే, గిల్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ ధ్రువీకరించాడు. శుబ్మన్ గిల్ మ్యాచ్ ఆడేందుకు ఫిట్గా ఉన్నాడని మీడియాకు తెలిపాడు. కానీ.. అతడిని పాక్తో మ్యాచ్లో ఆడించాలా లేదా అన్నది శనివారమే నిర్ణయిస్తామని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘శుబ్మన్ గిల్ 99 శాతం మ్యాచ్కు అందుబాటులోనే ఉంటాడు. అయితే, ఈ విషయం గురించి రేపటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాం’’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ఇషాన్ను తప్పించక తప్పదా? ఇక నరేంద్ర మోదీ స్టేడియంలో అభిమానుల మద్దతు తమకు దండిగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని హిట్మ్యాన్ హర్షం వ్యక్తం చేశాడు. కాగా గిల్ ప్రస్తుతం అహ్మదాబాద్లోనే ఉన్నాడు. జట్టుతో కలిసి బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా చేసినట్లు సమాచారం. ఇక గిల్ రాకతో ఇషాన్పై వేటు పడటం ఖాయమే అనిపిస్తోంది. అహ్మదాబాద్లో అద్భుతమైన రికార్డు ఉన్న గిల్ను ఆడిస్తారా లేదంటే ఆసియా వన్డే కప్-2023లో పాకిస్తాన్పై 82 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కిషాన్ వైపు మొగ్గు చూపుతారా శనివారం తేలనుంది. చదవండి: ‘శార్దూల్ ఎందుకు? సిరాజ్ను ఎందుకు ఆడిస్తున్నారు?.. అసలేంటి ఇదంతా?’ -
CWC 2023 IND Vs AFG Highlights Pics: ఆఫ్గానిస్తాన్ను చిత్తు చేసిన టీమిండియా (ఫోటోలు)
-
WC: గిల్ లేకున్నా నష్టమేమీ లేదు.. బోలెడు ఆప్షన్లు: భారత మాజీ క్రికెటర్
Shubman Gill Getting Ruled Out of IND vs AFG WC Clash: ‘‘జట్టుకు పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. అతడికే ఇది గడ్డుకాలం. ఎందుకంటే మేనేజ్మెంట్కు కావాల్సినన్ని ఆప్షన్లు ఉన్నాయి. మొదటి మ్యాచ్లో ఏం జరిగిందో చూశాం కదా! నిజానికి టీమిండియా పటిష్టంగానే ఉంది. శుబ్మన్ గిల్ లేకున్నా ప్రత్యర్థి జట్లను ఓడించగల సత్తా భారత జట్టుకు ఉంది. కాబట్టి ఇలా జట్టుకు దూరం కావడం గిల్ను తీవ్ర నిరాశకు గురిచేసి ఉంటుంది’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. డెంగ్యూ బారిన పడిన గిల్.. కాగా సూపర్ ఫామ్లో ఉన్న ఓపెనింగ్ బ్యాటర్ శుబ్మన్ గిల్.. వన్డే వరల్డ్కప్-2023లో ఆస్ట్రేలియాతో మ్యాచ్కు దూరమైన విషయం తెలిసిందే. డెంగ్యూ బారిన పడిన గిల్.. ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఢిల్లీలో అఫ్గనిస్తాన్తో తదుపరి మ్యాచ్కు కూడా అతడు అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ ప్రకటించింది. ఈ విషయంపై స్పందించిన కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్.. గిల్ దూరం కావడం టీమిండియాకు ఎదురుదెబ్బేనని పేర్కొన్నాడు. అయితే, అతడు లేకున్నా మేనేజ్మెంట్ ఎవరో ఒకరితో ఆ స్థానాన్ని భర్తీ చేస్తుందన్న మంజ్రేకర్.. మెగా టోర్నీ ఆరంభ మ్యాచ్ ఆడలేకపోవడం గిల్కు లోటుగా మిగిలిపోతుందన్నాడు. బ్యాడ్టైమ్.. ఫ్యాన్స్కు కూడా నచ్చదు.. కానీ ‘‘శుబ్మన్ గిల్ ఉంటే జట్టు మరింత పటిష్టమవుతుంది. ప్రస్తుతం అతడు అద్భుత ఫామ్లో ఉన్నాడు. కానీ.. పాపం.. పరిస్థితులు తనకు అనుకూలంగా లేవు. ఇంతకంటే బ్యాడ్టైమ్ ఇంకోటి ఉండదు’’ అంటూ స్టార్ స్పోర్ట్స్ షోలో సంజయ్ మంజ్రేకర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. గిల్ లేని మ్యాచ్ చూడటం అభిమానులకు కూడా ఏమాత్రం నచ్చదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. గోల్డెన్ డక్గా ఇషాన్ కాగా సొంతగడ్డపై ఐసీసీ ఈవెంట్ ఆరంభ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో శుబ్మన్ గిల్ స్థానంలో ఇషాన్ కిషన్ రోహిత్ శర్మకు జోడీగా ఓపెనర్గా వచ్చాడు. కానీ గోల్డెన్ డక్గా వెనుదిరిగి ఘోర పరాభవం మూటగట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. గిల్కు బ్యాకప్ ఓపెనర్గా రుతురాజ్ గైక్వాడ్ లేదంటే యశస్వి జైశ్వాల్లలో ఒకరికి మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. చదవండి: Ind vs Pak: టీమిండియాతో మ్యాచ్కు కూడా లేనట్లే! కెరీర్కు ఎండ్ కార్డ్ అంటూ.. -
ఇంకా చెన్నైలోనే.. అఫ్గన్తో మ్యాచ్కు అతడు దూరం: బీసీసీఐ ప్రకటన
WC 2023- Ind vs Afg- BCCI Update On Shubman Gill Availability: టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్ ఆరోగ్యంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక అప్డేట్ అందించింది. అతడు చెన్నైలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడని పేర్కొంది. భారత జట్టుతో కలిసి ఢిల్లీకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. కాగా డెంగ్యూ జ్వరం బారిన పడ్డ యువ బ్యాటర్ శుబ్మన్ గిల్ వన్డే వరల్డ్కప్-2023లో టీమిండియా ఆరంభ మ్యాచ్కు దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో మరో యువ ఆటగాడు ఇషాన్ కిషన్ కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా ఆస్ట్రేలియాతో పోరులో ఓపెనర్గా బరిలోకి దిగాడు. ఇంకా చెన్నైలోనే ఉన్నాడు ఇక చెన్నైలో చెపాక్ మైదానంలో ఆసీస్ను 6 వికెట్ల తేడాతో ఓడించిన రోహిత్ సేన తదుపరి ఢిల్లీలో అఫ్గనిస్తాన్తో తలపడనుంది. అరుణ్జైట్లీ మైదానంలో అక్టోబరు 11న ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో గిల్ జట్టుతో పాటు దేశ రాజధానికి పయనం కానున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే, ఇంకా పూర్తిగా కోలుకోని కారణంగా శుబ్మన్ గిల్ జట్టుతో పాటు వెళ్లడం లేదని బీసీసీఐ సోమవారం క్లారిటీ ఇచ్చింది. అఫ్గన్తో మ్యాచ్కు కూడా గిల్ దూరం ఈ మేరకు.. ‘‘టీమిండియా బ్యాటర్ శుబ్మన్ గిల్ జట్టుతో పాటు ఢిల్లీకి వెళ్లడం లేదు. ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్కప్-2023లో ఆస్ట్రేలియాతో మ్యాచ్కు దూరమైన అతడు.. ఢిల్లీలో అఫ్గనిస్తాన్తో మ్యాచ్కు కూడా అందుబాటులో ఉండటం లేదు. అక్టోబరు 11 నాటి మ్యాచ్ ఆడే పరిస్థితి లేదు. వైద్య బృందం పర్యవేక్షణలో గిల్ ప్రస్తుతం చెన్నైలోనే ఉన్నాడు’’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటన విడుదల చేశారు. చదవండి: వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇదే మొదటిసారి.. భారత తొలి బౌలర్గా బుమ్రా రికార్డు -
WC 2023: తడబడి.. నిలబడిన టీమిండియాకు బిగ్ షాక్!
ICC Cricket World Cup 2023: వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ ఆరంభంలోనే టీమిండియాకు గట్టి సవాల్ ఎదురైంది. చెన్నైలో ఆదివారం నాటి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపడిన రోహిత్ సేన.. లక్ష్య ఛేదనలో తడబడినా.. చివరాఖరికి గెలవగలిగింది. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా విజయంతో మ్యాచ్ను ముగించగలిగింది. శుబ్మన్ గిల్ స్థానంలో రోహిత్ శర్మకు జోడీగా వచ్చిన ఇషాన్ కిషన్ గోల్డెన్ డక్గా వెనుదిరగగా.. హిట్మ్యాన్ సైతం పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా వచ్చీగా రాగానే డకౌట్ అయి పెవిలియన్కు తిరిగి వెళ్లాడు. కోహ్లి ఇచ్చిన ఆ క్యాచ్ పట్టి ఉంటే.. వామ్మో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కోహ్లి 85, రాహుల్ 97* పటిష్ట భాగస్వామ్యంతో జట్టును విజయతీరాలకు చేర్చారు. నిజానికి.. మిచెల్ మార్ష్ గనుక హాజిల్వుడ్ బౌలింగ్లో కోహ్లి ఇచ్చిన క్యాచ్ పట్టి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. అప్పటికి కోహ్లి స్కోరు 12 మాత్రమే. అలాంటి స్థితిలో మార్ష్ మిస్ చేసిన క్యాచ్.. టీమిండియా మ్యాచ్ గెలవడానికి పునాదిగా నిలిచింది. ఇలా మొదటి మ్యాచ్లోనే తడబడ్డ రోహిత్ సేన.. అక్టోబరు 11న అఫ్గనిస్తాన్తో మ్యాచ్కు సన్నద్ధమవుతోంది. ఢిల్లీలోని అరుణ్జైట్లీ మైదానం ఇందుకు వేదిక. అయితే, అఫ్గన్తో మ్యాచ్కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్ రెండో మ్యాచ్కు కూడా దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డెంగ్యూ బారిన పడిన గిల్ ఇంకా పూర్తిగా కోలుకోనట్లు సమాచారం. ఇంకా కోలుకోని గిల్! ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘శుబ్మన్ గిల్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. జట్టుతో పాటు అతడు ఢిల్లీకి ప్రయాణమవుతాడు. అయితే, ఛండీగడ్లోని తమ ఇంటికి వెళ్లాలని గిల్ అనుకోవడం లేదు. పాక్తో మ్యాచ్ నాటికి? టీమ్తో పాటే బస చేయాలనుకుంటున్నాడు. పాకిస్తాన్తో మ్యాచ్ నాటికి అతడు అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నాం. అఫ్గనిస్తాన్తో బుధవారం మ్యాచ్ ఆడతాడా లేదా అన్నది తదుపరి మెడికల్ రిపోర్టు మీద ఆధారపడి ఉంటుంది’’ అని పేర్కొన్నాయి. View this post on Instagram A post shared by ICC (@icc) కాగా రెగ్యులర్ ఓపెనర్గా, సూపర్ ఫామ్లో ఉన్న గిల్ జట్టుతో లేకపోవడం పెద్ద ఎదురుదెబ్బ అని విశ్లేషకులు అంటున్నారు. ఇషాన్ టీమ్లో ఉన్నప్పటికీ.. కొన్నాళ్లుగా మిడిలార్డర్లో ఆడుతున్న అతడు ఆసీస్తో మ్యాచ్లో ఓపెనర్గా వచ్చి విఫలమైన తీరు మేనేజ్మెంట్ను కలవరపరుస్తోంది. చదవండి: CWC 2023 IND VS AUS: విరాట్ టెస్ట్ క్రికెట్లా ఆడమన్నాడు: కేఎల్ రాహుల్ View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: ఆనందం కాసేపే! నువ్వేం కెప్టెన్? గోల్డెన్ డక్ బాయ్.. నీకెందుకు?
ICC Cricket World Cup 2023- India vs Australia: వన్డే వరల్డ్కప్-2023లో ఆస్ట్రేలియాతో ఆరంభ మ్యాచ్లో ఆదిలోనే టీమిండియాకు భారీ షాకులు తగిలాయి. ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ డకౌట్ అయ్యారు. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్ ఎటాక్ ఆరంభించగా.. నాలుగో బంతికే ఇషాన్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. తన మొదటి వన్డే ప్రపంచకప్ టోర్నీ ఆరంభంలోనే చెత్త రికార్డు నమోదు చేశాడు. ఇషాన్.. నీకు గోల్డెన్ ఛాన్స్ వచ్చినందుకు అనారోగ్యం కారణంగా శుబ్మన్ గిల్ జట్టుకు దూరం కావడంతో.. ఓపెనర్గా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. గోల్డెన్ డక్ బాయ్ అంటూ మీమర్స్ ఇషాన్ను ట్రోల్ చేస్తున్నారు. ఏంటిది కెప్టెన్! ఆనందం కాసేపేనా? ఇషాన్ కిషన్ సంగతి ఇలా ఉంటే.. రోహిత్ శర్మ సైతం డకౌట్(సిక్స్ బాల్)గా వెనుదిరగడం టీమిండియా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. 199 పరుగులకే ఆసీస్ను ఆలౌట్ చేశామన్న ఆనందం కాసేపు కూడా నిలవనీయకుండా చేశావు కదా కెప్టెన్ అంటూ హిట్మ్యాన్ ఆట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యర్.. నువ్వేం చేశావు? అనుభవజ్ఞుడైన నువ్వు కూడా ఇలా ఆడితే ఎలా అంటూ విమర్శలు సంధిస్తున్నారు. కాగా రెండో ఓవర్ మూడో బంతికి హాజిల్వుడ్ బౌలింగ్లో రోహిత్ లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు. ఓపెనర్ల కథ ఇలా ఉంటే.. నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకోవడంతో అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. 199 పరుగులకు ఆలౌట్ కాస్త జాగ్రత్తగా ఆడాల్సిందంటూ అయ్యర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇషాన్, రోహిత్, అయ్యర్(హాజిల్వుడ్ బౌలింగ్లో వార్నర్కు క్యాచ్ ఇచ్చి) డకౌట్లుగా వెనుదిరగడంతో 2 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. కాగా చెన్నై వేదికగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను.. టీమిండియా 199 పరుగులకే కట్టడి చేసింది. రవీంద్ర జడేజా మూడు, బుమ్రా రెండు, కుల్దీప్ రెండు, సిరాజ్, హార్దిక్ పాండ్యా, అశ్విన్ ఒక్కో వికెట్ తీశారు. చదవండి: WC 2023: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన వార్నర్.. ప్రపంచకప్ చరిత్రలో తొలి బ్యాటర్గా View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: ఆసీస్తో మ్యాచ్కు గిల్ దూరం.. రోహిత్కు జోడీగా ఇషాన్ ఫిక్స్!
ICC Cricket World Cup 2023- Ind Vs Aus: వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా ఆరంభ మ్యాచ్కు శుబ్మన్ గిల్ అందుబాటులో ఉండే అవకాశం లేదని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ మాటలను బట్టి ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇప్పటికే జట్టుకు దూరమయ్యాడని అర్ధం చేసుకోవచ్చన్నాడు. కాగా సొంతగడ్డపై పుష్కరకాలం తర్వాత భారత జట్టు ఐసీసీ ఈవెంట్కు సిద్ధమైన విషయం తెలిసిందే. చెన్నై వేదికగా అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో మ్యాచ్తో వరల్డ్కప్ జర్నీ మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్ డెంగ్యూ బారిన పడటం ఆందోళనకరంగా మారింది. రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే! ఆసీస్తో మ్యాచ్ నాటికి అతడు కోలుకుంటాడో లేదోనన్న సందేహాల నడుమ రాహుల్ ద్రవిడ్ శుక్రవారం అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. వైద్యబృందం పర్యవేక్షణలో ఉన్న గిల్ ఇప్పుడే జట్టుకు దూరమయ్యాడని చెప్పలేమని పేర్కొన్నాడు. ఈ విషయంపై స్పందించిన కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. ‘‘శుబ్మన్ గిల్ ఆరోగ్యం ప్రస్తుతం బాగాలేదు. ప్రెస్కాన్ఫరెన్స్లో రాహుల్ ద్రవిడ్ మాత్రం.. గిల్ పరిస్థితి మరీ అంత అధ్వానంగా లేదని.. అతడు జట్టుతో చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పాడు. రోహిత్కు జోడీగా ఇషాన్ ఫిక్స్ నిజానికి రాహుల్ ద్రవిడ్ ఎప్పుడైతే ఇలా చెప్తాడో.. అలాంటి సందర్భాల్లో సదరు ఆటగాళ్లు దూరమవడం దాదాపు ఖాయమైపోయినట్లే లెక్క! నాకు తెలిసి రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు’’ అని అభిప్రాయపడ్డాడు. చేదువార్తే కదా! ఏదేమైనా రోహిత్తో కలిసి అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పగల గిల్ దూరం కావడం భారత జట్టుకు బ్యాడ్ న్యూసే అవుతుందని ఈ మాజీ ఓపెనర్ విచారం వ్యక్తం చేశాడు. వరల్డ్కప్ వంటి మెగా ఈవెంట్లో అటాకింగ్ మోడ్లో ఉన్న గిల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తే ఆది నుంచే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టే అవకాశం ఉండేదని ఆకాశ్ పేర్కొన్నాడు. కాగా ప్రపంచకప్నకు ముందు ఆసీస్తో వన్డే సిరీస్లో శుబ్ మన్ గిల్ వరుసగా 74, 104 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. చదవండి: అతడు అద్భుతం.. కాస్త ఏమరపాటుగా ఉన్నా అంతే! నాకు అనుభవం: ఏబీడీ -
WC 2023: టీమిండియా ఫ్యాన్స్కు ద్రవిడ్ గుడ్న్యూస్! అతడు వచ్చేస్తున్నాడు!
ICC Cricket World Cup 2023- Ind Vs Aus- Update On Shubman Gill: టీమిండియా వన్డే వరల్డ్కప్-2023 ప్రయాణ ఆరంభానికి కౌంట్డౌన్ మొదలైంది. చెన్నైలోని చెపాక్ వేదికగా భారత జట్టు తమ ఆరంభ మ్యాచ్ ఆడనుంది. ఆస్ట్రేలియాతో అక్టోబరు 8న తలపడేందుకు రోహిత్ సేన సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్ గురించి హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం గిల్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని.. ఆదివారం నాటి మ్యాచ్కు అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటూ అభిమానులకు శుభవార్త అందించాడు. గిల్ బాగానే ఉన్నాడు కాగా సూపర్ ఫామ్లో ఉన్న ఓపెనింగ్ బ్యాటర్ గిల్ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో టీమిండియా ప్రాక్టీస్ సెషన్కు కూడా రాలేకపోయాడు. దీంతో ఆసీస్తో మ్యాచ్కు అతడు దూరం కానున్నాడనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు గిల్ కాస్త బెటర్గా ఫీల్ అవుతున్నాడు. వైద్య బృందం నిరంతరం అతడిని పర్యవేక్షిస్తోంది. అప్పుడే క్లారిటీ వస్తుంది ఇంకా 36 గంటల సమయం ఉంది. ఆ తర్వాతే మేము ఏదైనా నిర్ణయం తీసుకోగలం. ఈరోజైతే తను బాగానే ఉన్నాడు. ఇప్పటివరకైతే మెడికల్ టీమ్ అతడు ఆదివారం నాటికి అందుబాటులోకి వస్తాడనే నమ్మకంతోనే ఉంది. రేపటిలాగే ఈ విషయంపై పూర్తి స్పష్టత వస్తుంది’’ అని శుక్రవారం పేర్కొన్నాడు. అలా అయితే ఇషాన్కు ఛాన్స్ కాగా ఒకవేళ ఫీవర్ తగ్గక శుబ్మన్ గిల్ ఆసీస్తో మ్యాచ్కు దూరమైతే అతడి స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్కు ఓపెనర్గా బంపరాఫర్ దక్కే అవకాశం ఉంది. ఇక సొంతగడ్డపై ఐసీసీ ఈవెంట్లో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్న రోహిత్ సేన.. ఆసీస్తో మ్యాచ్లో శుభారంభం అందుకోవాలని భావిస్తోంది. మెగా టోర్నీకి ముందు కంగారూలను 2-1తో చిత్తు చేసిన జోష్లో ఉన్న భారత్.. ఆరంభ మ్యాచ్లో ఎలాంటి అస్త్రశస్త్రాలతో బరిలోకి దిగనుందో చూడాలి! చదవండి: WC: అప్పుడు తండ్రి టీమిండియాపై.. కొడుకు ఇప్పుడు పాకిస్తాన్పై! వన్డే ప్రపంచకప్ చరిత్రలో.. చరిత్ర సృష్టించిన రిజ్వాన్, సౌద్ షకీల్.. ప్రపంచకప్ హిస్టరీలో..! -
WC: ఎవరిని తప్పిస్తారో తెలియదు.. అతడు మాత్రం ప్రతి మ్యాచ్ ఆడాల్సిందే!
ICC ODI World Cup 2023: వన్డేలకు పనికిరాడు.. అసలు ప్రపంచకప్-2023 జట్టుకు అతడిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు? టీ20 ఫార్మాట్లో నెంబర్ 1 అయినంత మాత్రాన జట్టులో చోటిస్తారా? అంటూ అన్ని వైపుల నుంచి విమర్శలు.. అయినప్పటికీ వరుస అవకాశాలు దక్కించుకుంటున్నాడు టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం.. తాము కచ్చితంగా సూర్యకు మద్దతునిస్తాం.. అండగా నిలుస్తాం.. వరల్డ్కప్ జట్టుకు అతడిని ఎంపిక చేయడం వెనుక మా ప్లాన్లు మాకున్నాయి అని స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే. తీవ్ర ఒత్తిడిలో ఆసీస్తో సిరీస్ బరిలో దీంతో విమర్శలు రెట్టింపయ్యాయి. ఈ ముంబై బ్యాటర్ కోసం వన్డేల్లో మెరుగైన రికార్డు ఉన్న సంజూ శాంసన్ వంటి ప్రతిభ గల క్రికెటర్లను పక్కనపెడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి తరుణంలో తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ బరిలో దిగాడు సూర్య. వరుస హాఫ్ సెంచరీలు తొలి మ్యాచ్లో 49 బంతుల్లో 50 పరుగులు సాధించిన అతడు.. రెండో వన్డేలో మాత్రం విశ్వరూపం ప్రదర్శించాడు. 24 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. పటిష్ట ఆసీస్తో మ్యాచ్లో వరుసగా నాలుగు సిక్సర్లతో చెలరేగి తన ఆట స్థాయి ఏమిటో చూపించాడు. ఇండోర్లో ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి మొత్తంగా 37 బంతులు ఎదుర్కొన్న అతడు 6 ఫోర్లు, 6 సిక్స్ల సాయంతో 72 పరుగులతో అజేయంగా నిలిచాడు. తనదైన రోజు ఫార్మాట్లకు అతీతంగా అద్భుతంగా రాణించగలనని నిరూపించుకున్నాడు. తుదిజట్టులో మొదటి పేరు తనదే ఉండాలి ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సూర్యకుమార్ యాదవ్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ వేదికగా జరుగనున్న వన్డే వరల్డ్కప్-2023లో టీమిండియా ప్రతీ మ్యాచ్లోనూ అతడిని ఆడించాలని మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశాడు. ‘‘సూర్యకుమార్ యాదవ్ ప్రతీ మ్యాచ్ ఆడాల్సిందే. అయితే, అతడిని ఎవరి స్థానంలో ఆడిస్తారో నాకు తెలియదు. తుదిజట్టులో మొదటి పేరు మాత్రం తనదే అయి ఉండాలి. ఆ తర్వాతే మిగతా ఆటగాళ్ల సెలక్షన్ గురించి ఆలోచించాలి. ఐదో నంబర్లో సూర్యనే ఆడాలి మ్యాచ్ స్వరూపానే మార్చగల ఇన్నింగ్స్ ఆడగల సత్తా అతడి సొంతం. తను మెరుగ్గా ఆడిన రోజు మ్యాచ్ ఏకపక్షంగా మారిపోతుంది. అలాంటి సమయంలో తనకంటే మెరుగైన స్ట్రైక్రేటు నమోదు చేయగల బ్యాటర్ మరొకరు ఉండరు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలను మనం ఫినిషర్లుగా చూస్తాం. నా దృష్టిలో మాత్రం సూర్యకుమార్ యాదవ్ ఐదో నంబర్లో బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. సూర్య కంటే బెటర్ ప్లేయర్ ఏ జట్టులోనూ లేడు’’ అని భజ్జీ.. సూర్యపై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ మిడిలార్డర్లో కీలకంగా మారిన వేళ సూర్యను ఉద్దేశించి హర్భజన్ సింగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: వరల్డ్కప్కు జట్టును ప్రకటించిన శ్రీలంక.. స్టార్ ఆటగాడు రీ ఎంట్రీ 6⃣6⃣6⃣6⃣ The crowd here in Indore has been treated with Signature SKY brilliance! 💥💥#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank | @surya_14kumar pic.twitter.com/EpjsXzYrZN — BCCI (@BCCI) September 24, 2023 -
Ind vs Aus: కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా? కెప్టెన్ కావాల్సినోడు..
Asian Games 2023: చైనాలో జరుగనున్న ఆసియా క్రీడలు-2023కి ఈసారి భారత క్రికెట్ నియంత్రణ మండలి మహిళా, పురుష జట్లను పంపుతున్న విషయం విదితమే. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో వుమెన్స్ టీమ్.. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో ద్వితీయ శ్రేణి జట్టు హోంగ్జూకు వెళ్లనున్నాయి. అయితే, అంతకంటే ముందు స్వదేశంలో సెప్టెంబరు 22న ఆరంభం కానున్న ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో రుతురాజ్ ఆడేందుకు రంగం సిద్ధమైంది. ఆసీస్తో తొలి మ్యాచ్లో అతడు తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. రెంటికీ చెడ్డ రేవడి ఇదిలా ఉంటే.. ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టులో తిలక్ వర్మ, రింకూ సింగ్ సహా పలువురు యువ స్టార్లు చోటు దక్కించుకున్నారు. మరోవైపు.. కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. సంజూ శాంసన్ ఆసియా కప్లో అలా.. వరల్డ్కప్జట్టులో ఇలా కేఎల్ రాహుల్ ఆగమనంతో ఆసియా కప్-2023లో వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్తో పోటీలో ఓడిన సంజూ.. రిజర్వ్ ప్లేయర్గా ఎంపికయ్యాడు. ఇక బ్యాటర్గా సూర్యకుమార్ యాదవ్ కంటే మెరుగైన స్థితిలోనే ఉన్నా ఈ వన్డే ఈవెంట్లో అతడిని దురదృష్టం వెక్కిరించింది. కెప్టెన్ కావాల్సినోడు.. మరీ ఇంత అన్యాయమా? ప్రపంచకప్-2023 జట్టులోనూ సూర్య వైపే మొగ్గు చూపిన సెలక్టర్లు సంజూను పక్కనపెట్టేశారు. ఆస్ట్రేలియాతో సిరీస్లోనూ అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీరును తప్పుబట్టాడు. ‘‘ఆసియా క్రీడల జట్టులో సంజూ శాంసన్ పేరు లేకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఆసియా కప్లో రిజర్వ్గా ఉన్నాడు.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో చోటు దక్కలేదు. ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసే అవకాశం లేదు. రుతురాజ్ గైక్వాడ్తో కలిసి శుబ్మన్ గిల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. ఇషాన్కు వరుస అవకాశాలు ఇషాన్ మిడిలార్డర్లో నిలదొక్కుకునేందుకు ఇప్పటికే మేనేజ్మెంట్ కావాల్సినన్ని అవకాశాలు ఇచ్చింది. సంజూ శాంసన్ ఆసియా క్రీడల జట్టులో ఉంటేనైనా బాగుండేది. వరల్డ్కప్ టీమ్లో ఎలాగూ చోటివ్వలేదు.. కనీసం ఆసియా క్రీడల్లో ఆడేందుకు కూడా పనికిరాడా? ఇది సరైన పద్ధతి కాదు.. ప్రపంచకప్ జట్టులో ఆఖరి నిమిషం వరకు పోటీ పడ్డ వ్యక్తి కచ్చితంగా ఈ టీమ్లోనైనా ఉండాల్సింది కదా. కేవలం సభ్యుడిగా కాదు.. నిజానికి కెప్టెన్ అవ్వాల్సింది’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. చదవండి: అంబానీ ఇంట పూజకు భార్య అతియాతో రాహుల్.. వీడియో వైరల్