division of the state
-
20 నుంచి ఆర్ఎస్వైఎఫ్ జీపు జాతా
కడప వైఎస్సార్ సర్కిల్: రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఈ నెల 20 నుంచి జీపుజాతా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆర్ఎస్వైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు పేర్కొన్నారు. శనివారం ఆర్సీపీ కార్యాలయంలో రాయలసీమ విద్యార్థి, యువజన సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం విద్యార్థి, యువత సమస్యలపై పోరాడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రాయలసీమ ప్రాంతానికి 35 శాతం నిధులు కేటాయించి ఈ ప్రాంత అభివృద్దికి పాటుపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్వైఎఫ్ నాయకులు శంకర్, నరసింహా, భరత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వలసదారులు అనడానికి వీల్లేదు
- ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నవారు ‘వలసదారులు’ కారు - ఏపీలో స్థానికత ఉండి.. తిరిగొచ్చినవారు వలసదారులు కారు - ఆ పేరుతో వారి కుల ధ్రువీకరణలను తిరస్కరించరాదు: హైకోర్టు సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో స్థానికత ఉన్న వారు రాష్ట్ర విభజన తరువాత ఏదో ఒక రాష్ట్రంలో స్థానికుడిగా ఉండేందుకు నిర్ణయించుకోవచ్చునని, అలాంటి వారిని స్థానికులుగానే పరిగణించి, వారికి సామాజిక రిజర్వేషన్లను సైతం వర్తింపచేయాలని ఎన్టీఆర్ వైద్య వర్సిటీని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఉమ్మడి రాష్ట్రంలో కలిసున్న వారు రాష్ట్ర విభజన తరువాత ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళితే దానిని ‘వలస’ అని, అలా వెళ్లిన వారిని ‘వలసదారులు’ అని అనడానికి వీల్లేదని స్పష్టంచేసింది. ఒక రాష్ట్రం ఒక వ్యక్తిని ఎస్సీ, ఎస్టీ, బీసీగా గుర్తించినంత మాత్రాన మరో రాష్ట్రం కూడా ఆ వ్యక్తిని అదే వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తించాల్సిన అవసరం లేదంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ అనిస్లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. నేను స్థానికేతరురాలినా? ఏపీకి చెందిన తన తండ్రి ఉద్యోగరీత్యా తెలంగాణకు వచ్చారని, తరువాత బదిలీపై తిరిగి ఏపీకి వెళ్లారని, ఈ నేపథ్యంలో ఎంసెట్ ప్రవేశాల సందర్భంగా తనను స్థానికేతరురాలిగా పరిగణిస్తూ, బీసీ-ఏ కింద రిజర్వేషన్లు కల్పించేందుకు నిరాకరిస్తున్నారంటూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన బొడ్డేపల్లి జోత్స్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అభ్యర్థనలతో మిరియాల ప్రియదర్శిని, మరికొంత మందీ వేర్వేరుగా పిటిషన్లు చేశారు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం తరఫు న్యాయవాది తడ్డి నాగేశ్వరరావు తన వాదనలు వినిపించారు. వలసదారుడు అనడానికి వీల్లేదు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరిస్తూ... ఏపీ, తెలం గాణలు రెండుగా విడిపోయిన సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో స్థానికుడిగా ఉన్న వ్యక్తి ఈ రెండు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రాన్ని స్థానికుడిగా ఉండేందుకు ఎంచుకోవచ్చనీ, ఆ వ్యక్తిని ఒక రాష్ట్రం నుంచి ‘వలస’ వచ్చారని గానీ, ‘వలసదారుడు’ అని గానీ చెప్పడానికి ఎంత మాత్రం వీల్లేదంది. ఇక రెండో క్లిష్టమైన అంశానికి వస్తే... ఈ వ్యాజ్యాల్లో కొందరు పిటిషనర్లు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో జన్మించారు. వారికి అక్కడి అధికారులే కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. వారు ఇప్పుడు తిరిగి వారి సొంత ప్రాంతాలకే వెళుతున్నారు. ఇలా ఒక ప్రాంతంలో స్థానికత ఉండి.. మరో ప్రాంతంలో పెరిగి.. తిరిగి స్థానికత ఉన్న ప్రాంతానికి వెళుతుంటే అటువంటి వారిని వలసదారులుగా పేర్కొంటూ వారికి గతంలో ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రాలను తిరస్కరించడానికి వీల్లేదని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. పిటిషనర్లను స్థానికులుగానే పరిగణిస్తూ వారికి ఆ మేర రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశించింది. -
నేడు నవ నిర్మాణ దీక్ష
► విజయవాడ బెంజి సర్కిల్లో ఏర్పాట్లు ► ఉదయం 11 గంటలకు ప్రజలతో చంద్రబాబు ప్రతిజ్ఞ సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బెంజి సర్కిల్ వద్ద ‘నవ నిర్మాణ దీక్ష’ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 13 జిల్లాల నుంచి ప్రజలను సమీకరించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి 12 వరకు నవ నిర్మాణ దీక్ష జరుగుతుంది. ప్రజలతో ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ నవ్యాంధ్ర నిర్మాణంలో మేమంతా భాగస్తులమవుతామంటూ రాష్ట్ర ప్రజలతో ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ చేయిస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ప్రజల కోసం తగిన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చేస్తోంది. వేదికకు చేరుకునేది ఇలా.. హైదరాబాద్ వైపు నుంచి స్వరాజ్యమైదానం మీదగా వేదిక వద్దకు వచ్చే వాహనాలను డీవీ మేనర్ వరకు, మచిలీపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలను ఎన్టీఆర్ విగ్రహం వరకు, చెన్నై, గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలను పకీరుగూడెం జంక్షన్ వరకు, ఏలూరు, గన్నవరం నుంచి వచ్చే వాహనాలను నిర్మలా కాన్వెంట్ వరకు అనుమతిస్తారు. అక్కడ నుంచి సభాస్థలికి ప్రజలు నడిచి రావాల్సి ఉంటుంది. ఆయా ప్రదేశాలకు దగ్గరలోనే వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించారు. మిట్టమధ్యాహ్నం.. మండుటెండలో.. గత ఏడాది జూన్ 2న జరిగిన నవ నిర్మాణ దీక్షను తలుచుకుని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఒక వైపు నిప్పులు చెరిగే ఎండ.. మరో వైపు మిట్టమధ్యాహ్నం దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు విలవిలలాడారు. మంచినీటి కోసం తహతహలాడారు. ఈ ఏడాది కూడా అందుకు భిన్నంగా జరగకపోవచ్చని అధికారులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. తెల్లవారుజాము 4 నుంచి 12 గంటల వరకు ట్రాఫిక్ను నగరంలోకి రానీయకుండా అడ్డుకుంటారు. నవ నిర్మాణ దీక్ష వారోత్సవాలు.. జూన్ 2 నుంచి 8వ తేదీ వరకు నవ నిర్మాణ దీక్ష వారోత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రచార పాటలతో వారం రోజు ల పాటు రాష్ట్రాన్ని హోరెత్తించనున్నారు. జూన్ 3 నుంచి 7వ తేదీ వరకు నియోజకవర్గ కేంద్రా ల్లో వివిధ అంశాలపై సదస్సులు నిర్వహిస్తారు. -
లక్షన్నర పోస్టులు మాయం
భర్తీ చేసేది 20,244.. సీఎం ఆమోదానికి ఆర్థిక శాఖ ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: ప్రతీ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని, లేదంటే ఉద్యోగం ఇచ్చే వరకు నెలకు రూ.రెండు వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికలముందు ఊదర గొట్టిన చంద్రబాబునాయుడు ఇప్పుడు నిరుద్యోగుల ఆశలపై కత్తి దూశారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో 1.42 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్థిక శాఖ తేల్చింది. ఇంతే కాకుండా జూన్ 2వ తేదీ నాటికి 30 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. ఈ పోస్టులతో కలిపితే మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 1.72 లక్షల పోస్టులు ఖాళీగా ఉంటాయి. అయితే ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేయరాదని, కేవలం 20,244 పోస్టుల భర్తీతో ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే 1.52 లక్షల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పలికింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం భర్తీ చేయకపోగా ఖాళీల సంఖ్యను కుదించడంపైనే కసరత్తు చేయించారు. ఆ మేరకు 20,244 పోస్టులను మాత్రమే భర్తీ చేయాలని నిర్ణయించారు. నాలుగో తరగతి ఉద్యోగాల భర్తీ లేదు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నాలుగో తరగతి ఉద్యోగాలను భర్తీ చేయరాదని నిర్ణయించారు. అంటే పెద్ద చదువులు చదవలేని ఆర్థిక స్థోమత లేని కింద తరగతి, మధ్యతరగతి నిరుద్యోగులకు ఇక సర్కారు కొలువులు ఎండమావేనని తేలిపోయింది. పదవ తరగతి, ఇంటర్మీడియెట్ మాత్రమే చదివిన నిరుద్యోగులు అటెండర్ లేదా డ్రైవర్, రికార్డు అసిస్టెంట్ వంటి పోస్టులు వస్తాయని భావించేవారు. రాష్ట్రప్రభుత్వం ఈ ఖాళీలను భర్తీ చేయరాదని నిర్ణయించడంతో లక్షలాది మంది నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. నాలుగో తరగతి ఉద్యోగాలను అవసరాలకు అనుగుణంగా కేవలం ఔట్సోర్సింగ్లో భర్తీ చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం వివిధ శాఖల్లో 20,244 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలను ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి ఆమోదానికి పంపించింది. ఇందులో పోలీసు పోస్టుల భర్తీ మినహాయించి మిగతా అన్ని పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలని సిఫార్సు చేసింది. ఇందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపితే ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి ఆదేశాలు జారీ చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలని నిర్ణయించిన పోస్టుల్లో గ్రూప్-1 కేవలం 94 మాత్రమే ఉన్నాయి. అత్యధికంగా పోలీసు శాఖలో 9000 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ పోస్టుల్లో కానిస్టేబుళ్లతో పాటు ఎస్ఐ, సీఐ పోస్టులు కూడా ఉన్నాయి. గ్రూప్-2 పోస్టులు 1100, గ్రూప్-3 పోస్టులు 1500 భర్తీ చేయాలని ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. ఇతర రంగాల్లో 6,500 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ప్రతిపాదనలు పంపింది. ఈ రంగాల్లో 550 లెక్చరర్, 500 హాస్టల్ వార్డెన్, 750 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, 600 వ్యవసాయ విస్తరణాధికారులు, 200 గణాంక సహాయ ఆఫీసర్లు, 300 గిరిజన సంక్షేమ శాఖ, మత్స్య, పశుసంవర్థక తదితర రంగాల్లో పోస్టులున్నాయని ఉన్నతాధికారి వివరించారు. -
ఆదాయం వస్తున్నా బీద అరుపులేల
► ఇందిరమ్మ’ లబ్ధిదారులగోడు పట్టదా ► ప్రభుత్వంపై పీసీసీ ఉపాధ్యక్షుడు ► నాదెండ్ల మనోహర్ ధ్వజం తెనాలి : రాష్ట్ర విభజనతో ఏర్పడిన రూ.16 వేల కోట్ల రెవెన్యూ లోటును అధిగమించి, ఆదాయం పెరుగుతున్నా రాష్ట్రప్రభుత్వం, ప్రజల అవసరాలపై నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని పీసీసీ ఉపాధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ విమర్శించారు. దాయం పెరిగినా సంక్షేమానికి ప్రభుత్వం అరకొర కేటాయింపులు ఏమిటని ప్రశ్నించారు. తెనాలిలోని స్వగృహంలో గురువారం విలేకర్లతో మనోహర్ మాట్లాడారు. సేల్స్టాక్సు రూపేణా రూ.31,120 కోట్లు, వివిధ పన్నుల రూపంలో రూ.44, 423 కోట్లు ఆదాయం వచ్చిందని చెప్పారు. తెలంగాణకు రూ.40 వేల కోట్ల పన్ను ఆదాయం వస్తే, ఆంధ్రప్రదేశ్కు అదనంగా మరో 4,423 కోట్లు వచ్చిందన్నారు. 14వ ఆర్థిక సంఘ నిధులు మరో 21,200 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.5,300 కోట్లు సమకూరాయని, రెవెన్యూ లోటు రూ.16 వేల కోట్లు భర్తీ అయి రూ.1573 కోట్లు అదనంగా వచ్చినట్టు వివరించారు. ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులకు బిల్లుల బకాయిలు ఎందుకు చెల్లించటం లేదని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద పదేళ్లలో 64 లక్షల గృహాలను నిర్మించినట్టు గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే అవకతవకలంటూ విచారణకు ఆదేశించి బిల్లులు నిలుపుదల చేసిందన్నారు. మరోవైపు కొత్తగా రూ.16,300 కోట్లతో ఆరు లక్షల గృహాలను నిర్మిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్లో ఇప్పటివరకు కేటాయించింది కేవలం రూ.1132 కోట్లు మాత్రమేనని గుర్తుచేశారు. భారీ ప్రాజెక్టును అరకొర నిధులతో ఎలా పూర్తిచేస్తారన్నారు. వైఎస్ హయాంలో పార్టీల కతీతంగా అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాల లబ్ధిని అందిస్తే, ఇప్పుడు ఇల్లు ఇవ్వాలంటే జన్మభూమి కార్యకర్తల సిఫార్సు చేయాలనే నిబంధనలు బాధ కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. -
రిజిస్ట్రేషన్ శాఖకు కాసుల వర్షం
► గడువుకు ముందే లక్ష్య సాధన ► ఫిబ్రవరి నాటికే రూ.162.12 కోట్ల ఆదాయం ► 1,05,415 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ అనంతపురం టౌన్: రిజిస్ట్రేషన్ శాఖ లక్ష్యానికి మించిన ఆదాయంతో దూసుకెళ్తోంది. అనంతపురం రిజిస్ట్రేషన్ జిల్లా పరిధిలో 12, హిందూపురం రిజిస్ట్రేషన్ జిల్లా పరిధిలో 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. 2015-16 సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి నెలాఖరుకు ఈ రెండు రిజిస్ట్రేషన్ జిల్లాల పరిధిలో రూ.153.99 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా ఏకంగా 162.12 కోట్ల ఆదాయ లభించింది. అనంతపురం పరిధిలో రూ.93.28 కోట్లకు రూ.103.69 కోట్లు రాగా, హిందూపురం పరిధిలో రూ.60.71 కోట్లకు రూ.58.43 కోట్లు వచ్చింది. సాధారణంగా లక్ష్యాలను మార్చి 31 నాటికి ఇస్తారు. ఈ శాఖ లక్ష్యాలను మందుగానే సాధించింది. రాష్ట్ర విభజన, రియల్ వ్యాపారం పెరగడం, ఎక్కువ మంది స్థిరాస్తి పైన పెట్టుబడులకు ఆకర్షితులు కావడంతో క్రయ విక్రయాలు జోరందుకున్నాయి. ఈ ఆర్థిక ఏడాదిలో రిజిస్ట్రేషన్ శాఖ తొలి నుంచి లక్ష్యాలను మించి ఆదాయం ఆర్జించడం విశేషం. కాగా 2014-15 ఆర్థిక సంవత్సరంలో రెండు రిజిస్ట్రేషన్ జిల్లాల పరిధిలో రూ.173.46 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నా రూ.137.03 కోట్లు మాత్రమే ఆదాయం లభించింది. అయితే ఈ సారి మాత్రం లక్ష్యాలను మించి ఆదాయం సమకూరింది. ఫిబ్రవరి నాటికి అనంతపురం పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 58,042 డాక్యుమెంట్లు, హిందూపురం పరిధిలో 47,373 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా ఫిబ్రవరి నాటికి సాధించిన లక్ష్యాలను పరిశీలిస్తే ప్రథమ స్థానంలో అనంతపురం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నిలిచింది. ద్వితీయ స్థానంలో హిందూపురం, తృతీయ స్థానంలో అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉన్నాయి. లక్ష్య సాధనలో ముందున్నాం అనంతపురం, హిందూపురం రిజిస్ట్రేషన్ జిల్లాల పరిధిలో ఆదాయం బాగా సమకూరుతోంది. గత ఆర్థిక సంవత్సరం కన్నా ఈ సారి లక్ష్యసాధనలో ముందున్నాం. ఫిబ్రవరి వరకు చూస్తే సుమారు రూ.9 కోట్ల వరకు లక్ష్యానికి మించి ఆదాయం వచ్చింది. మార్చి నెలాఖరుకు మరింత ఆదాయం వస్తుంది. - ఎ.గిరికుమార్, డీఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ -
బదిలీ చేయండి.. వెళ్లిపోతాం...
- సొంత ప్రాంతానికి బదిలీ కోరుతున్న 148 మంది ఏపీ టీచర్లు - ఇప్పటికే పలుమార్లు మంత్రులను కలిసి వినతుల సమర్పణ - స్పష్టత ఇవ్వని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు - మాటలతో సరిపెడుతున్న వైనం.. చేతలు శూన్యం సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘మా రాష్ట్రానికి బదిలీ చేయండి.. వెంటనే వెళ్లిపోతాం’.. అంటూ తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రా ప్రాంత టీచర్లు వేడుకుంటున్నా.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాయి. రాష్ట్ర విభజన జరగడంతో.. అప్పట్లో ఉన్న విద్యాశాఖ నిబంధనల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో అంతర్ జిల్లా బదిలీల ప్రక్రియతో సొంత జిల్లాకు వెళ్లే అవకాశం ఉండేది. ప్రస్తుతం రాష్ట్రం విడిపోవడంతో.. ఓపెన్ కేటగిరీలో జిల్లాలో నియమితులైన పలువురు టీచర్లు ఇక్కడే పనిచేస్తున్న వారు సొంత రాష్ట్రానికి బదిలీ అయ్యే అవకాశం లేదు. ‘స్థానిక’ అవకాశాలకు విఘాతం.. హైదరాబాద్ చుట్టూ జిల్లా విస్తరించి ఉండటం, మరోవైపు హైదరాబాద్లో స్థానిక సంస్థల పాఠశాలలు లేకపోవడంతో అంతర్ జిల్లా బదిలీల కింద వచ్చే వారంతా జిల్లానే ఎంచుకున్నారు. దాదాపు పదిహేనేళ్లుగా అంతర్ జిల్లా బదిలీల పరంపర కొనసాగింది. దీంతో జిల్లాలో స్థానికేతర టీచర్ల సంఖ్య భారీగా పెరిగింది. మరోవైపు ఓపెన్ కేటగిరీ నియామకాల్లోనూ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే అధికంగా ఉన్నారు. దీంతో జిల్లాలో స్థానిక, స్థానికేతర నిష్పత్తిలో వ్యత్యాసం అధికమైంది. ఈ క్రమంలో జిల్లాకు చెందిన నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయంటూ అటు విద్యార్థిసంఘాలు, ఇటు ఉపాధ్యాయ, రాజకీయ వర్గాలు ఆందోళన కార్యక్రమాలు సైతం చేపట్టాయి. అంతర్ జిల్లా బదిలీల నిలుపుదలతో పాటు నియామకాలన్నీ స్థానికులతోనే భర్తీ చేయాలనే డిమాండ్ తెరపైకి తెచ్చాయి. అయితే ఇవన్నీ ఆచరణసాధ్యం కాలేదు. తాజాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన టీచర్లు స్వచ్ఛందంగా బదిలీ అయ్యేందుకు సిద్ధపడుతున్నారు. ఇలా జిల్లాలో 148 మంది టీచర్లు సొంత ప్రాంతానికి బదిలీకి సుముఖత వ్యక్తం చేశారు. వీరంతా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారే. గత వారం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని రెండు దఫాలుగా కలిసి వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు అప్పటి విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్రెడ్డిని కూడా కలిసి పరిస్థితిని వివరించారు. బదిలీలపై స్పష్టత కరువు.. సొంత ప్రాంతాలకు స్వచ్ఛంద బదిలీ కోరుతూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ఉపాధ్యాయులకు అక్కడినుంచి ఇప్పటివరకు స్పష్టత రాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపితేనే పరిస్థితి కొలిక్కి వస్తుంది. అందుకు ప్రభుత్వ స్థాయిలో చర్చలు నిర్వహించాలి. కానీ ఈ అంశంపై ఇరు ప్రభుత్వాలు కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవడం. దాదాపు ఆర్నెల్లుగా ఆయా టీచర్లు ఈ విషయంపై స్పష్టత రాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం స్వచ్ఛంద బదిలీలను ప్రభుత్వం ఆమోదిస్తే జిల్లాలో 148 టీచర్పోస్టులు ఖాళీ కానున్నాయి. వీటి భర్తీలో స్థానిక నిరుద్యోగులకే ఎక్కువ అవకాశం కలగనుంది. -
దూషణలే సమాధానాలు
విపక్షం అడగడమే తరువాయి అధికారపక్షం నుంచి తిట్ల దండకం ఇదీ బడ్జెట్ సమావేశాల తీరు ముగిసిన 15 రోజుల సమావేశాలు సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన పూర్తిస్థాయి తొలి బడ్జెట్ సమావేశాలు అర్థవంతంగా జరగలేదు. సభలో ఏకైక ప్రతిపక్షం లేవనెత్తిన అనేకాంశాలపై ఎదురుదాడి, దూషణలే సమాధానంగా అధికార తెలుగుదేశం ఒరవడి కొనసాగింది. అధికారపక్షం నుంచి యథేచ్ఛగా సాగిన దూషణలకు నిరసనగా విపక్షం పోడియం వైపు వెళ్లని సందర్భమంటూ లేకుండా సమావేశాలు నడిచాయి. అధికారపక్ష దూషణలు నిత్యకృత్యం కావడంతో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకదశలో సభాపతిపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం వరకు వెళ్లింది. సభలో తమకు మాట్లాడే అవకాశమిచ్చే విషయంలో తదనంతర కాలంలో తగిన న్యాయం చేస్తారన్న నమ్మకంతో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్టు ఆ పార్టీ సభ చివరిరోజున ప్రకటించింది. ఈ నెల 7న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగంతో మొదలైన సమావేశాలు 15 రోజులపాటు కొనసాగిన అనంతరం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లో ఏ ఒక్క ప్రజాసమస్యపైనా ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంతో ఈ సమావేశాలు వృథా ప్రయాసగానే సాగాయి. ఏదేని అంశంపై ప్రతిపక్షం అడగ్గానే అధికారపక్షం నుంచి నలుగురైదుగురు సభ్యులు లేచి విపక్ష నేత జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు చేయడానికే సమయాన్నంతా వినియోగించారు. సభానాయకుడు (చంద్రబాబు) సైతం సహనం కోల్పోయి మీ అంతు చూస్తా అంటూ సభా వేదికగా హెచ్చరించడం, దీనికితోడు మీరంతా 420లు.. ఏంట్రా ఏంట్రోయ్... పాతరేస్తా అంటూ అధికారపక్ష సభ్యులు విపక్ష సభ్యులపై దూషణలకు దిగడం వంటివి సమావేశాల్లో చోటుచేసుకున్నాయి. కుదించుకుపోయిన బడ్జెట్ సమావేశాలు: సాధారణంగా బడ్జెట్ సమావేశాలు సెలవులతో కలుపుకుని ఎప్పుడూ 40 రోజుల వరకు కొనసాగేవి. ఈసారి వాటిని 15 రోజులకే పరిమితం చేశారు. శాసనసభా వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ)లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ దీనిపై అభ్యంతరం వ్యక్తంచేసింది. మరో 15 రోజుల పాటు కొనసాగించాలంది. ఇందుకు ప్రభుత్వం తిరస్కరించింది. అవసరమైతే సాయంత్రం సమావేశాలు నిర్వహిస్తామన్నా.. అదేం జరగలేదు. ప్రతిపక్షం ఒక్కటే ఉన్నందున మాట్లా డేందుకు వైఎస్సార్సీపీకి ఎక్కువ సమయమివ్వాలన్న జగన్ విన్నపాన్ని ప్రభుత్వం అంగీకరించలేదు. ప్రతిపక్షం లేకుండానే మూడురోజులు: పోలవరానికి చంద్రగ్రహణం పేరిట ‘సాక్షి’ దినపత్రిక ఇచ్చిన కథనం అసెంబ్లీలో కలకలం రేపింది. దీనిపై చంద్రబాబుసహా మంత్రులు సాక్షిపై కారాలు మిరియాలు నూరారు. అయితే సభలో తన మాటల ద్వారా పోలవరం వ్యవహారంలో తెరవెనుక సాగుతున్న తతంగాన్ని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. ఇక పట్టిసీమ పథకం వెనుక అక్రమాలపై సభలో ప్రతిపక్షం నిలదీయగా అధికారపక్షం సమాధానం చెప్పుకోలేకపోయింది. ఈ సందర్భంగా అసహనానికి లోనైన సీఎం తీవ్రస్థాయిలో విపక్ష సభ్యులపై శివాలెత్తారు. ‘‘పిచ్చిపిచ్చిగా చేస్తే మీ కథేంటో తేలుస్తా... వదిలి పెట్టను మిమ్మల్ని... పిచ్చి ఆటలు ఆడొద్దు... తమాషాలు ఆడుతున్నారు. మర్యాదగా చెబుతున్నాం.. మీకు పిచ్చి పట్టింది. సిగ్గులేదు. మీరు మనుషులు కాదు’’ అంటూ దూషణల పర్వాన్ని అందుకున్నారు. ఆ మరుసటిరోజే టీడీపీ సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు వైఎస్సార్సీపీ సభ్యులనుద్దేశించి ‘ఏంట్రా.. ఒరేయ్ ఏంట్రా... పాతేస్తా... నా...కొ..’ అంటూ తీవ్ర పదజాలాన్ని వినియోగించారు. రైతుల సమస్యలపై శాసనసభలో ప్రతిపక్షనేత జగన్ ప్రసంగిస్తున్న సమయంలో తీవ్ర ఆటంకాలు ఎదురవ్వడం, మైక్ కట్ అవ్వడం యథేచ్ఛగా సాగింది. దీనిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మాట్లాడే అవకాశమివ్వాలంటూ పోడియంలోకి వెళ్లి నిరసన తెలిపిన సందర్భంలో జరిగిన ఘటనలతో 8 మంది ఎమ్మెల్యేలను సభనుంచి 3 రోజులపాటు సస్పెండ్ చేశారు. ఈ పరిణామంతో విపక్షం మొత్తం సభను బహిష్కరించి బయటకు వచ్చేసింది. చివరకు ప్రతిపక్షం లేకుండానే సభ 3 రోజులపాటు నడిచింది. శాసనసభ చరిత్రలోప్రతిపక్షం లేకుండా సభ జరిగిన సందర్భం గతంలో ఎప్పుడూ లేదు. ఇష్టానుసారంగా అధికారపక్ష సభ్యు లు మాట్లాడటానికి ఎందుకు ఆస్కారం ఇస్తున్నారంటూ స్పీకర్ పోడియం వద్ద ఆవేశం ప్రదర్శించిన ప్రతిపక్షంపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వ డం జరిగింది. దానిపై సంబంధిత సభ్యులతోపాటు ప్రతిపక్ష నేత కూడా వారి తరఫున క్షమాపణలు చెప్పడంతో ఈ వ్యవహారానికి తెరపడింది. ప్రజాసమస్యలపై సర్కారు స్పందన లేమి వైఎస్సార్సీపీ 22 అంశాలపై చర్చ కోరుతూ బీఏసీలో ప్రతిపాదించింది. పలు సమస్యలపై చర్చకోసం జాబితాను సమర్పించింది. దేనిపైనా అధికారపార్టీ చర్చకు ముందుకురాలేదు. రాజధాని, భూసమీకరణలో రైతుల అవస్థలపై చర్చకు విపక్షం వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చినా.. 344వ నిబంధన కింద నోటీసిచ్చినా చర్చకు ప్రభుత్వం ముందుకు రాలేదు. రెండు బడ్జెట్లు: వచ్చే ఆర్థిక సంవత్సరానికి 1.13 లక్షల కోట్ల బడ్జెట్ను ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు 12వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మరోవైపు 13న రూ.14,184 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశపెట్టారు. రైతు రుణ మాఫీ అంశాన్ని కేవలం ప్రస్తావించి వదిలేశారు. పోలవరం, పట్టిసీమలపై దాటవేత పోలవరాన్ని పక్కన పెట్టేలా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీశారు. నాలుగేళ్లలో పోలవరం పూర్తి చేస్తామన్నప్పుడు పట్టిసీమ చేపట్టడంలోని మతలబేంటని ప్రశ్నించారు. అలాగే పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీరిస్తామన్న అంశాన్ని ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పెట్టకుండా ఎందుకు మోసం చేస్తున్నారని నిలదీశారు. ఈ అంశంపై చర్చకు సమయమివ్వాలని కోరినా ఫలితం లేకపోయింది. చివరకు 344వ నిబంధన కింద స్వల్పకాలిక చర్చను చేపట్టినా ప్రతిపక్ష నేత ప్రసంగానికి అధికారపక్షం అడుగడుగునా అడ్డుతగిలింది. ఇదిలా ఉండగా విద్యుత్చార్జీల పెంపును నిరసిస్తూ విపక్షం సభలో ప్రభుత్వాన్ని నిలదీసింది. రూ.941 కోట్ల మేరకు ప్రజలపై భారాన్ని వేయడం సరికాదని, తక్షణమే దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. శాసనమండలిలో ఖాళీ అవుతున్న ఐదు స్థానాలకు ఈ సమావేశాల సందర్భంగా ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. -
పోస్టుల పంపిణీ దాదాపు పూర్తి!
రాష్ట్ర స్థాయి కేడర్లోని 76 శాఖల్లోనూ కొలిక్కి ఆంధ్రాకు 22,728 పోస్టులు, తెలంగాణకు 15,922 పోస్టులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో కీలకమైన రాష్ట్ర స్థాయి ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసే అంశం కొలిక్కి వచ్చింది. మెజారిటీ శాఖలకు చెందిన పోస్టులను కమలనాథన్ కమిటీ ఇప్పటికే ఇరు రాష్ట్రాలకూ పంపిణీని పూర్తి చేసింది. మొత్తం 89 శాఖలకు చెందిన రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల్లో ఇప్పటి వరకు సచి వాలయంతో సహా 76 శాఖలకు చెందిన పోస్టులను జనాభా నిష్ప త్తి ఆధారంగా ఇటు తెలంగాణ, అటు ఏపీలకు పంపిణీ చేశారు. ఈ పోస్టుల పంపిణీలో ఖాళీలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఖాళీలను కూడా కలపి ఇరు రాష్ట్రాలకు పంపిణీ పూర్తి చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అంతే కాకుండా పోస్టుల పంపిణీ పూర్తి చేసిన 76 శాఖలకుగాను ఇప్పటికే 51 శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆప్షన్లను కూడా ఇచ్చారు. మరో 25 శాఖలకు చెందిన ఆప్షన్లకు చెందిన ఫైళ్లు సర్కులేషన్లో ఉన్నాయి. ఈ నెల చివరి వారానికి ఇరు రాష్ట్రాల మధ్య పోస్టుల పంపిణీ పూర్తి అవుతుందని.. ఆప్షన్లు ఇచ్చిన శాఖల్లో ఉద్యోగుల పంపిణీ ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని కమలనాథన్ కమిటీ పేర్కొంది. తగ్గిన ఉద్యోగులు.. ఇప్పటి వరకు సచివాలయంతో సహా 76 శాఖలకు చెందిన 38,650 రాష్ట్ర స్థాయి కేడర్ పోసులను ఏపీ, తెలంగాణలకు పంపిణీ చేశా రు. అయితే ఈ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు మాత్రం పోస్టుల కన్నా తక్కువగా ఉన్నారు. పంపిణీ చేసిన పోస్టులతో చూస్తే ఉద్యోగుల సంఖ్య మాత్రం 14,379 మంది తక్కువగా ఉన్నట్లు తేలింది. 76 శాఖల్లో 24,271 మంది ఉద్యోగులున్నట్లు కమలనాథన్ కమిటీ తేల్చింది. ఈ ఉద్యోగులనే ఇరు రాష్ట్రాల మధ్య నిబంధనల ఆధారంగా పంపిణీ చేశారు. సచివాలయంలోని నాలుగో తరగతి ఉద్యోగులందరినీ తామే తీసుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘానికి హామీ ఇచ్చారు. తాజా పరిణామాల నేపథ్యం లో తాము తీసుకోబోమంటూ ఏపీ ప్రభుత్వానికి టీ సర్కార్ వెల్లడించింది. అదే కారణమా? ఏపీ విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో ఉన్న సంస్థల ఉద్యోగులను స్థానికత ఆధారంగా పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. అయితే, ఈ ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. జనాభా నిష్పత్తి ప్రకారమే ఉద్యోగుల పంపిణీ జరగాలని ఏపీ కోరుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం నాలుగో తరగతి ఉద్యోగుల విషయంలో మాట మార్చిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
మళ్లీ అపార్ట్మెంట్ల జోరు
‘స్మార్ట్’గా పరుగులు బహుళ అంతస్తుల పై నగర ప్రజల మోజు స్మార్ట్ సిటీ ప్రకటన తో ఊపందుకున్న లావాదేవీలు విశాఖపట్నం : రాష్ట్ర విభజనతో విశాఖలో మందగించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం స్మార్ట్సిటీ ప్రకటనతో మళ్లీ జోరందుకుంది. అమెరికా సాయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామన్న ప్రభుత్వ ప్రకటనతో ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకోవాలన్న కోరిక పెరిగింది. దీంతో అందరూ ఫ్లాట్లు కొనాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో వ్యక్తిగత ఇళ్లన్నీ అపార్ట్మెంట్ రూపంలోకి దూసుకుపోతున్నాయి. ఈ వరసలో నగర శివారు మధురవాడ, ఎండాడ, విశాలాక్షినగర్, గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి తదితర ప్రాంతాలు ముందున్నాయి. మధురవాడ, ఎండాడ ప్రాంతాల్లో వ్యక్తిగత ఇళ్లకంటే అపార్ట్మెంట్ల నిర్మాణాలే అధికంగా కన్పిస్తున్నాయి. ఇక్కడ అపార్ట్మెంట్ సంస్కృతి కొంతకాలం నుంచి అనూహ్యరీతిలో అభివృద్ధి సాధిస్తోంది. పూర్వం మొత్తం వందలోపే అపార్ట్మెంట్లు ఉండేవి. ప్రస్తుతం నగరం విస్తరించడంతో ఆ సంఖ్య 20 వేలు దాటింది. మరో పది వేలకుపైగా నిర్మాణంలో ఉన్నాయి. పిండి కొద్దీ రొట్టె అన్న చందంగా అతి సాధారణ స్థాయి నుంచి ఆధునిక సదుపాయాలతో కూడిన ఫ్లాట్లు నిర్మించి ఖాతాదారుల అభిరుచి మేరకు అందిస్తున్నారు. ఇదీ కారణం... నగరం ‘స్మార్ట్’గా పరుగులు పెడుతోంది. ఐటీ సిగ్నేచర్ టవర్లు, నిరంతర వైఫై సౌకర్యం.. ఇలా అత్యాధునికమైన సమాచార వ్యవస్థ అందుబాటులోకి వస్తోంది. కన్వెన్షన్ సెంటర్, హైదరాబాద్ హైటెక్ సిటీని తలదన్నే రీతిలో నిర్మాణాలు ఊపందుకోనున్నాయి. ప్రస్తుతం ఏమూల చూసినా చదరపు గజం రూ.25 వేలకు తక్కువ లేదు. వంద గజాలు కొని ఇల్లు నిర్మించుకోవాలంటే కనీసం రూ.40 లక్షల మంచి రూ.50 లక్షలకు తక్కువ ఖర్చుకావడం లేదు. అంతేకాకుండా కార్మికుల కొరత, భవన నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగాయి. ప్లాన్, మంచినీటి కనెక్షన్, విద్యుత్తు ఇలా అనేక సమస్యలతోపాటు సమయం కూడా ఆదా అవడంతో ప్రజలు ఫ్లాట్ల వైపు మక్కువ చూపుతున్నారు. మరో ముఖ్యమైన కారణమేమిటంటే భద్రత. పట్టపగలే నగరంలో చోరీలు అధికమవడం, నేరస్తులు ఎంతటి దారుణాలకైనా తెగబడడంతో ఫ్లాట్లు అన్ని విధాలా మేలనే భావన పెరగడంతో వీటికి డిమాండ్ అధికమైంది. దీంతోపాటు బిల్డర్లే బ్యాంకు రుణాలు ఏర్పాటు చేయడంతో కొనుగోలుకు మరింత సౌలభ్యం ఏర్పడుతోంది. ఆధునిక వసతులు నిర్మాణ రంగంలో ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఒకప్పడు కేవలం స్థానికంగా లభించే మెటీరియల్స్తోనే అపార్ట్మెంట్లు నిర్మించేవారు. ఇప్పుడు విదేశీ సామగ్రి, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగిస్తున్నారు. అపార్ట్మెంట్ భద్రత కోసం విద్యుత్ ఫెన్సింగ్, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ, జిమ్, స్టీమ్ ఫంక్షన్ హాలు, వాకింగ్ ట్రాక్, మహిళలకు లేడీ క్లబ్లు... ఇలా ఎన్నో ఆధునిక సదుపాయాలతో ఫ్లాట్స్ అందుబాటులో లభిస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో గ్రూప్ హౌసెస్, విల్లాలు నిర్మిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిర్మాణంలో కొందరు బిల్లర్లు ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు. ఖాతాదారుడికి ఏం చెబుతారో అదే చేయుడంతో ఇటువంటి వారు కట్టే అపార్ట్మెంట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. వ్యాపారమంటేనే నమ్మకం, దాన్ని పోగొట్టుకుంటే దేనికి పనికిరామనే నినాదంతో నడుస్తున్న బిల్లర్లను మనం చూడొచ్చు. కొనేటప్పుడు జాగ్రత్తలు... ఎంతో కష్టపడితేగాని చాలామంది జీవితకాలంలో సొంత గృహాన్ని సొంతం చేసుకోలేరు. మరి ఫ్లాట్ కొనేటపుపడు కొన్ని జాగ్రత్తలు తప్పవు. స్థలం యజమానికి, బిల్డర్కు మధ్య ఒప్పంద పత్రాలను చూసుకోవాలి. ఎన్కంబరెంట్ సర్టిఫికేట్ (ఈసీ) తీసుకోవాలి. క్లియర్ టైటిల్, దానికి సంబంధించిన లింక్ దస్తావేజులు చూసుకోవాలి. తెలీకపోతే న్యాయవాదిని, అనుభవజ్ఞుడైన దస్తావేజు లేఖరిని సంప్రదించాలి. మనం కొనే ఫ్లాట్ నిర్మాణంలో ఉంటే నెలకొకసారైనా వెళ్లి చూసుకోవాలి. దీంతోపాటు ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్మాణాల్లో అన్నీ సదుపాయాలు ఉన్నాయా లేదా.. అనేది పరిశీలించాలి. భూగర్భ నీటి నిల్వ పైపు కనెక్షన్, ఫైరింజన్, నియంత్రణ పరికరాలు, ఫైర్పంపులు, హోజ్రీలు, తదితర అంశాలు ఏర్పాటు చేశారా లేదా..? అనేది పర్యవేక్షించాలి. మరో ముఖ్యమైన విషయం... బిల్డర్ నుంచి ఏమి కోరుకుంటున్నామో అవి రాతపూర్వకంగా ఉండాలి. అప్పుడే ఆ ఇల్లు స్వర్గసీమగా మారుతుంది. -
తప్పు సరిదిద్దుకుందాం
కాంగ్రెస్ మేధోమథనంలో దిగ్విజయ్ కోటి సంతకాలను ముమ్మరం చేయాలి తొలి రోజు నాలుగు గ్రూపుల చర్చ నేడు కూడా కొనసాగనున్న సదస్సు విజయవాడ సెంట్రల్ : రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ తొలి మేధోమథన సదస్సు నగరం కేంద్రంగా జరిగింది. శుక్రవారం హనుమాన్పేటలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సదస్సును ఎపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సదస్సు మధ్యాహ్నం 2 గంటల వరకు సాగింది. అనంతరం ఒక గంట బ్రేక్ ఇచ్చారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ మాట్లాడుతూ అన్ని పార్టీలు కోరిన తర్వాతే కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసిందని చెప్పారు. మిగిలిన పార్టీలు విభజన వల్ల రాజకీయ లబ్ధిపొందితే, కాంగ్రెస్ చేయని తప్పుకు నింద మోస్తోందన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని నాయకులకు సూచించారు. పార్టీ విధి విధానాలు, భవిష్యత్ వ్యూహం తదితర అంశాలపై ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు వివరించారు. సదస్సుకు హాజరైన ప్రతినిధులను ఆరు గ్రూపులుగా చేశారు. మొదటి నాలుగు కమిటీలు తొలిరోజు చర్చలు సాగించాయి. మిగిలిన రెండు కమిటీలు శనివారం చర్చలు సాగించనున్నాయి. ముమ్మరంగా కోటి సంతకాలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం రాజకీయాలకు అతీతంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించినట్లు శాసనమండలి ఫ్లోర్లీడర్ సి.రామచంద్రయ్య వెల్లడించారు. సాయంతం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ సదస్సు వివరాలను తెలిపారు. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నామని చెబుతున్న సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజాప్రతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ పార్టీకి దూరమైన వర్గాలను ఆకట్టుకొనేందుకు కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. కోటి సంతకాలకు మద్దతు తెలుపుదామనుకొనే వారు 7842434121 నంబర్కు మిస్డ్కాల్ ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ రాష్ట్ర పరిశీలకుడు తిరువనక్కరసు, కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, కనుమూరి బాపిరాజు, కొండ్రు మురళీ, పీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ, సిటీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాది విష్ణు, బుచ్చిబాబు, నేతలు కొలనుకొండ శివాజీ, ఆకుల శ్రీనివాస్కుమార్, అవినాష్, మీసాల రాజేశ్వరరావు పాల్గొన్నారు. -
300 మందికి 8 అంతస్తులా?
*ఎర్రమంజిల్లోని ఆర్అండ్బీ భవనంపై ఆ శాఖ కార్యదర్శి విస్మయం *'సాక్షి' కథనంతో అత్యవసర భేటీ నిర్వహించిన సునీల్శర్మ * రాష్ట్ర విభజనకు ముందు తీసుకున్న నిర్ణయాలపై ఆరా * పూర్తి వివరాలు, పత్రాలు అందజేయాలని అధికారులకు ఆదేశం * దీనిపై సీఎంకు నివేదిక అందించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: అక్కడ పనిచేసే విభాగాధిపతులు ఆరుగురు... వారి ఆధీనంలో పనిచేసే సిబ్బంది మూడొందలు.. కానీ వారికోసం లక్ష చదరపు అడుగులకు మించిన విస్తీర్ణంతో ఎనిమిది అంతస్తుల భవనం సిద్ధమవుతోంది. రూ. 67 కోట్లతో నిర్మిస్తున్న ‘అంత పెద్ద భవనంలో మేమేం చేస్తాం..’ అని స్వయంగా ఆ విభాగం అధికారులే ప్రశ్నించే పరిస్థితి. రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ విభాగం కోసం హైదరాబాద్లోని ఎర్రమంజిల్లో నిర్మిస్తున్న భవనం వ్యవహారం ఇది. ఈ భవనం నిర్మాణంలో అధికారుల ఇష్టారాజ్యం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ‘20 కోట్లతో మొదలై 67 కోట్లకు..’ శీర్షికతో ‘సాక్షి’లో గురువారం కథనం ప్రచురితం కావటంతో రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి సునీల్శర్మ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కేవలం 300 మంది సిబ్బంది ఉండే చోట ఇంత పెద్ద భవనం నిర్మించాల్సిన పరిస్థితి, తొలుత ఐదంతస్తులుగా తలపెట్టి తర్వాత ఎనిమిది అంతస్తులకు పెంచుతూ నిర్ణయం తీసుకోవటానికి దారితీసిన పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు, పత్రాలను తనకు అందజేయాల్సిందిగా ఆయన ఆర్అండ్బీ బిల్డింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. దీనిపై ముఖ్యమంత్రికి నివేదిక అందజేయనున్నట్టు తెలిసింది. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే... ఈ భవనం పనులు పూర్తయ్యేలోపు దాని అంచనాను మరోసారి సవరించే అవకాశం ఉందని తెలిసింది. ప్రస్తుతమున్న అంచనా రూ. 67 కోట్లకు పెంచాలనే ప్రతిపాదన 2014లో చేసింది. కానీ ఇప్పుడు పనులు పూర్తి కావటానికి మరికొన్ని నెలలు పడుతుంది. ఈలోపు నిర్మాణ సామగ్రి ధరలో మార్పులు వస్తాయి. దీంతో అంచనాను మరోసారి సవరించాల్సి ఉంటుందనే తీరులో అధికారులు చెబుతుండడం గమనార్హం. విభజన ముంగిట నిర్ణయం.. రాష్ట్రం ఉమ్మడిగా ఉండగా ఆర్అండ్బీ భవనంలో దాదాపు ఏడు వందల మందికి పైగా సిబ్బంది పనిచేశారు. విభజనతో తెలంగాణ వాటా మూడొందలకు తగ్గిపోయింది. 2009లో ఈ భవనం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఐదంతస్తులుగా ప్రణాళిక రూపొందించారు. దానిని 2012లో ఎనిమిది అంతస్తులకు మార్చి... అంచనా వ్యయాన్ని రూ. 20 కోట్ల నుంచి రూ. 39 కోట్లకు పెంచారు. అప్పటికే రాష్ట్ర విభజన అంశం కొలిక్కివచ్చే తరుణంలో ఉంది. తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం స్పష్టమైన సంకేతాలిచ్చింది. రాష్ట్రం విడిపోతే తొలుత నిర్ణయించినట్టుగా ఐదంతస్తుల భవనం కూడా ఎక్కువే. అలాంటిది ఆగమేఘాల మీద అంచనా వ్యయాన్ని పెంచి ఎనిమిది అంతస్తులుగా నిర్మించాలని నిర్ణయించటం పట్ల ఇప్పుడు ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ఆ తర్వాత అదనపు పనుల పేరుతో అంచనా వ్యయాన్ని రూ. 67 కోట్లకు పెంచేశారు. ఇతర అవసరాలకు వినియోగిస్తే.. ఇంత భారీ భవనం ఆర్అండ్బీకి అనవసరమనే భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ భవనంలోనే ఆర్అండ్బీ కార్యదర్శి కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని అప్పట్లో భావించారు. కానీ ఛాతీ ఆసుపత్రి స్థలంలో కొత్తగా సచివాలయం ఏర్పాటుచేసే యోచనలో ఉన్నందున... ఆర్అండ్బీ మంత్రి కార్యాలయం వద్దే కార్యదర్శి కార్యాలయం కూడా ఏర్పటవుతుంది. అదే జరిగితే ఈ కొత్త భవనంలో దాని అవసరం ఉండదు. అలాంటప్పుడు దీన్ని రోడ్లు, భవనాల శాఖకు కాకుండా ఇతర అవసరాలకు వాడితే బాగుంటుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. టీహైకోర్టు కోసం ఈ భవనాన్ని విని యోగిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. -
ఇదేమిటి.. రామయ్య!
రాజంపేట: రాష్ట్ర విభజన కాకముందు రెండవ భద్రాద్రిగా వెలుగొందిన ఒంటిమిట్ట కోదండరామాలయూన్ని విభజన తర్వాత మొదటి భద్రాద్రిగా గుర్తించి అధికారిక నవమి ఉత్సవాలు చేపడతారనుకుంటే నిరాశే మిగులుతోంది. ఈ ఉత్సవాలు ఇతర ప్రాంతాలకు తరలిపోయేందుకు రంగం సిద్ధమవుతోంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో శ్రీరామనవమి మహోత్సవాలు భద్రాచలంలో నిర్వహించేవారు. భద్రాచలం ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలోకి వెళ్లింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక పురాతన గొప్ప రామాలయం ఒంటిమిట్టలోదే. భారతదేశంలోని గొప్ప కట్టడాల్లో ఒంటిమిట్ట రామాలయం కూడా ఒకటని విదేశీ యాత్రికుడు తావర్నియర్ ప్రశంసించారు. ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరపాలని అందరూ కోరుకుంటున్నారు. మరో రామాలయూనికి అధికారిక గుర్తింపునకు ప్రయత్నాలు.. ఆంధ్రా భద్రాద్రిగా ఒంటిమిట్ట కోదండరామాలయూనికి అధికారిక గుర్తింపు లభించే సమయంలో కేంద్ర మంత్రి అశోక్గజపతిరాజు తమ ప్రాంతంలోని రామాలయూనికి ఆ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు విజయనగరం జిల్లా మెలిమర్ల మండలం రామతీర్థం రామాలయంలో చేపట్టాలని కేంద్ర మంత్రి అశోక్గజపతిరాజు కృషి చేస్తున్నారని తెలియడంతో జిల్లాలోని రామభక్తుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఒంటిమిట్ట రామాలయంలో బ్రహ్మోత్సవాలు ప్రభుత్వపరంగా జరిపించడానికి అన్ని పార్టీల ప్రజాప్రతినిధులను కోరడానికి ఒంటిమిట్టలో శ్రీ కోదండరామ దేవస్థాన పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు అయింది. ఈ కమిటీ స్థానిక నాయకులను, ప్రజాప్రతినిధులను కలిసి అధికార బ్రహ్మోత్సవాలు ఒంటిమిట్ట కోదండరామాలయంలో నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరనున్నారు. ఆలయ విశిష్టతలోకి వెళితే.. ఒంటిమిట్ట కోదండరామాలయం దేశంలో రెండవ అయోధ్యగా, రాష్ట్రంలో రెండవ భద్రాద్రిగా గుర్తెరిగినది. ఈ రామాలయంలోని మూలవిరాట్లను త్రేతాయుగంలో ప్రతిష్టించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ రామాలయంలోని సీతారామలక్ష్మణులు విడివిడిగా కనిపించినా ఒకే రాతిలో ఉండటంతో ఏక శిలానగరంగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని ఏ రామాలయంలోనైనా ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది. ఈ రామాలయంలో ఆంజనేయస్వామి విగ్రహం ఉండదు. ఎందుకంటే శ్రీరామహనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో ఈ విగ్రహ ప్రతిష్టాపన జరిగిందనేది కథనం. ఒంటిమిట్ట రామాలయానికి ఉన్నంత పవిత్రత, ప్రాసత్యం, శిల్పకళాసంపద మరే రామాలయంలోనూ లేదు. ఒంటిమిట్ట రామాలయంలోని మధ్య మంటపంలో 31స్తంభాలు ఉన్నాయి. చూపరులను ఆకట్టుకునే శిల్పసంపద, విశాలమైన ప్రాంగణం ఈ రామాలయంలోనే ఉంది. సహజ పండితుడైన పోతనామాత్యుడు శ్రీమదాంద్ర భాగవతం ఇక్కడే రచయించి శ్రీరామునికే అంకితం ఇచ్చారు. ఒంటిమిట్ట కోదండరామాలయంలో పోతన భాగవత తాంబూల సంప్రదాయం బ్రిటీషు కాలం నుంచి ఉంది. దండకారణ్యంలో ఉన్నప్పుడు సీతారామలక్ష్మణులు ఇటుగా వెళుతున్న సమయంలో సీతమ్మకు ఒంటిమిట్టలో దాహం వేయగా ఆమె దాహం తీర్చేందుకు రామలక్ష్మణులు బాణాలు సంధించగా ఏర్పడిన నీటి బుగ్గలే శ్రీరామలక్ష్మణుల తీర్థాలుగా ఇప్పటికీ ఉన్నాయి. కడప నవాబు ఈ రామాలయ ఆవరణంలో ఒకబావిని తవ్వించారు. రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా పని చేస్తూ తన ఉద్యోగానికి రాజీనామా చేసి జీవితాన్ని రామాలయ అభివృద్ధి కోసం అంకితం చేసిన వావిలకొలను సుబ్బారావు ఊరూరాా భిక్షమెత్తి ఒంటిమిట్ట రామాలయానికి కొన్ని కోట్లరూపాయల విలువ చేసే ఆభరణాలు, భూములు, భవనాలు సమకూర్చారు. ఇంతటి చరిత్ర ఉన్న ఒంటిమిట్ట కోదండరామాలయూన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అధికారిక బ్రహోత్సవాలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. -
ఆర్టీసీ ఇంకా ఉమ్మడిగానేనా!
విస్మయం వ్యక్తం చేసిన కేంద్ర ఉపరితల రవాణాశాఖ పరస్పర సంప్రదింపులతో కొలిక్కి తేవాలని సీఎస్లకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగి ఏడు నెలలు దాటిపోయినా ఆర్టీసీ ఇంకా ఉమ్మడిగా ఉండడం పట్ల కేంద్ర ఉపరితల రవాణా శాఖ విస్మయం వ్యక్తం చేసింది. ఆర్టీసీని రెండు కార్పొరేషన్లుగా విభజించే అవకాశమున్నా.. ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించింది. వెంటనే ఇరు రాష్ట్రాల అధికారులు పరస్పరం చర్చించుకొని ప్రత్యేక రవాణా సంస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచించింది. తెలంగాణ, ఏపీల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావు, ఆర్టీసీ ఉన్నతాధికారులు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీసీలో పరిణామాలు, ఆస్తులు, అప్పుల విభజన కసరత్తు, ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలు తదితర అంశాలపై సీఎస్లు తమ నివేదికలను సమర్పించారు. చట్టం ప్రకారమే.. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణలో ఉన్న ఆస్తులన్నీ తెలంగాణ రాష్ట్రానికే చెందుతాయని స్పష్టంగా ఉందని సీఎస్ రాజీవ్ శర్మ పేర్కొన్నారు. ఆ విధంగానే విభజన జరగాలని తాము కోరుతున్నట్టు నివేదికలో వివరించారు. ఉద్యోగుల విభజనను కమలనాథన్ కమిటీతో సంబంధం లేకుండా పూర్తి చేయాలన్నారు. ఏపీ మాత్రం తమ నివేదికలో హైదరాబాద్లోని ఆస్తులను కూడా జనాభా ప్రాతిపదికన పంచాలని కోరింది. అయితే ఆర్టీసీ విభజన వ్యవహారంలో కేంద్ర రవాణా కార్యదర్శి ఘాటుగానే స్పందించారు. ఆస్తులు, అప్పుల పంపకాలపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందాక తదుపరి చర్యలు చేపడతామని... కానీ అప్పటివరకు ఆర్టీసీని విభజించకుండా ఉంచడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఆస్తులు, అప్పుల పంపిణీ, ఉద్యోగుల కేటాయింపు తదితర అంశాలన్నీ మార్గదర్శకాల ప్రకారం వాటంతట అవే జరుగుతాయని... పాలనాపరంగా గందరగోళం లేకుండా ఆర్టీసీని విభజించుకోవచ్చని పేర్కొన్నారు. వెంటనే ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించుకొని మార్గదర్శకాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత మరోదఫా సమావేశమై ఇతర అంశాలపై చర్చించుకోవచ్చన్నారు. కాగా.. మరో మూడు నాలుగు నెలల్లో ఆర్టీసీ విభజన పూర్తికావచ్చని సీఎస్ రాజీవ్శర్మ భేటీ అనంతరం విలేకరులతో చెప్పారు. ఎప్పుడో జరగాల్సింది.. ఆర్టీసీ ఎండీగా ఏపీకి చెందిన అధికారి ఉన్నందున కేంద్రం సూచించిన ప్రకారం తెలంగాణకు ప్రత్యేకంగా జేఎండీ పోస్టును గత మే నెలలో ఏర్పాటు చేశారు. ఆర్టీసీని రెండుగా విభజించి ఎండీ ఆధ్వర్యంలో ఏపీఎస్ ఆర్టీసీ... జేఎండీ ఆధ్వర్యంలో టీఎస్ఆర్టీసీ విధులు నిర్వహించాలనేది దీని ఉద్దేశం. ఈ మేరకు తెలంగాణకు చెందిన రమణారావును జేఎండీగా నియమించినా... టీఎస్ఆర్టీసీని ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ఈ తరుణంలో తాజాగా కేంద్రం వేసిన మొట్టికాయతో ఆ తంతును పూర్తి చేయక తప్పని పరిస్థితి నెలకొంది. -
‘రీయింబర్స్మెంట్’పై స్పష్టత ఎప్పుడో
ఇంకా తేలని స్థానికత వివాదం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగి ఆరు నెలలు దాటినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఇంకా స్పష్టత ఇవ్వకపోవడంతో లక్ష మందికిపైగా విద్యార్థులు ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నారు. తెలంగాణలో చదువుతున్న దాదాపు 80 వేల మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులతోపాటు ఆంధ్రా ప్రాంతంలో చదువుతున్న సుమారు 40 వేల మంది తెలంగాణ విద్యార్థులు కూడా తమకు ఈ పథకం వర్తిస్తుందా లేదా అన్నది తేలక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. స్థానికత అంశం ముడిపడి ఉన్న ఫీజులు, స్కాలర్షిప్లపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు దాగుడుమూతలు ఆడుతుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో నివసిస్తున్న ఏపీ విద్యార్థులకు ఇది పెద్దసమస్యగానే ఉంది. ఓవైపు వార్షిక పరీక్షలు ముంచుకొస్తున్నా ఇంకా ఈ విషయంలో స్పష్టత రాకపోవడం మరోవైపు ఫీజులు చెల్లించాలంటూ యాజమాన్యాల ఒత్తిడితో విద్యార్థులు వేదన చెందుతున్నారు. జటిలంగా మారిన సమస్య: తెలంగాణలో చదువుతున్న విద్యార్థులందరికీ (స్థానికతతో సంబంధం లేకుండా) రీయింబర్స్మెంట్ చేసిన పక్షంలో తెలంగాణ ప్రభుత్వానికి కొన్ని వందల కోట్ల భారం పడనుంది. అదే సమయంలో ఏపీలో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు ఆ ప్రభుత్వం కొన్ని పదుల కోట్ల మేర చెల్లించాలి. ఆర్థికభారం పెరుగుతుందన్న కారణంతో రెండు ప్రభుత్వాలు ముందుగా ఎవరు నిర్ణయం తీసుకుంటారోనని వేచి చూస్తూ విద్యార్థులతో దోబూచులాడుతున్నాయి. తెలంగాణకే చెందిన వారిగా (స్థానికులుగా) ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకునే విద్యార్థులకు ‘ఫాస్ట్’ను వర్తింపజేస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించగా హైదరాబాద్, రంగారెడ్డి పరిసర జిల్లాల్లో ఉంటున్న ఏపీ విద్యార్థులకు ఈ సర్టిఫికెట్లను ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరిస్తున్నారు. ఎమ్మార్వోలు నేటివిటీ సర్టిఫికెట్లకు బదులు ఫలానా ఇంట్లో నివసిస్తున్నారని మాత్రమే పత్రాలు ఇస్తున్నారు. -
తెలంగాణకు కలెక్టర్ రఘునందన్రావు
రేపు లేదా ఎల్లుండి రిలీవ్ అయ్యే అవకాశం మచిలీపట్నం : కలెక్టర్ ఎం.రఘునందన్రావు తెలంగాణ రాష్ట్రానికి బదిలీ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. తెలంగాణ ప్రాంతానికి కేటాయించిన ఐఏఎస్ అధికారుల జాబితాలో ఆయన ఉన్నారు. దీంతో కలెక్టర్ బదిలీ అనివార్యమైంది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆయన తెలంగాణ ప్రాంతానికి బదిలీ అవుతారనే ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ నెల 4 లేదా 5వ తేదీల్లో కలెక్టర్ బదిలీకి సంబంధించిన ఉత్తర్వులు వస్తాయని, వెంటనే రిలీవ్ అవుతారని సమాచారం. రఘునందన్రావు జిల్లా కలెక్టర్గా 2013, అక్టోబరు 14వ బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే నంబరు నెలలో వరుసగా సంభవించిన హెలెన్, లెహర్ తుపానుల సందర్భంగా అధికారులను అప్రమత్తం చేసి సమర్థంగా పనిచేశారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా ఆయన వారంలో మూడు రోజులు జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో, విజయవాడ క్యాంపు కార్యాలయంలో నాలుగు రోజులపాటు విధులు నిర్వర్తిస్తున్నారు. గత ఏడాది జరిగిన స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలను సమర్థంగా నిర్వహించారు. సమైక్యాంద్ర ఉద్యమ సమయంలోనూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గవర్నర్ పాలన సమయంలోనూ పారదర్శకంగా వ్యవహరించారు. ప్రజలతో మమేకమై ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా అచ్చ తెలుగులోనే మాట్లాడే కలెక్టర్గా రఘునందన్రావు పేరు తెచ్చుకున్నారు.కలెక్టర్ రఘునందన్రావు బదిలీ అనివార్యం కావడంతో నూతన కలెక్టర్గా ఎవరు వస్తారనే అంశం చర్చనీయాంశంగా మారింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేసిన ప్రద్యుమ్న కలెక్టర్గా వచ్చే అవకాశం అధికంగా ఉందని అధికారులు చెబుతున్నారు. -
తొలి ప్రారంభం ఆనందం
విపత్తుల నిర్వహణ, అగ్నిమాపక శాఖ డీజీ కార్యాలయం ప్రారంభం రాజధాని ప్రాంతంలో మరిన్ని ఆధునిక కట్టడాలు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి విజయవాడ సిటీ : రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన నూతన ఆంధ్రప్రదేశ్కు నూతన రాజధానిలో తొలి రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం రాత్రి పోలీసు కంట్రోల్ రూమ్ సమీపంలో రూ.3 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన రాష్ట్ర విపత్తుల నిర్వహణ, అగ్నిమాపక శాఖ డెరైక్టర్ జనరల్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో ఇంకా అనేక ఆధునిక కట్టడాలు వస్తాయన్నారు. అనతి కాలంలోనే మంచి నాణ్యతా ప్రమాణాలతో అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయం భవనాన్ని పూర్తిచేసిన అదనపు డీజీ నండూరి సాంబశివరావు, ఆ శాఖ అధికారులను ఆయన అభినందించారు. రాజధాని కావడంతో ప్రపంచమే ఇక్కడకు వస్తున్నందున శాంతి భద్రతలు ముఖ్యమని, ఇదే సమయంలో పౌరుల క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యమని చెప్పారు. తనకు తెలిసినంత వరకు కృష్ణా, గోదావరి జిల్లాల ప్రజలు క్రమశిక్షణకు మారుపేరన్నారు. పోలీసులు ఆధునిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలి... పోలీసులు ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. తక్కువ పోలీసులతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సమర్థవంతంగా వ్యవహరించాలన్నారు. అయితే పోలీసు శాఖలో ఇందుకు విరుద్ధంగా ఉందని చెప్పారు. ఎక్కువ సిబ్బంది, తక్కువ సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నారని, ఇది మారాల్సిన అవసరం ఉందని సూచించారు. రాష్ట్రంలో విపత్తుల నివారణ విభాగం, అగ్నిమాపక శాఖలను బలోపేతం చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. ప్రతి జిల్లాలోని అగ్నిమాపక శాఖకు ఆధునిక పరికరాలు అందజేసి ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధం చేయనున్నట్లు తెలిపారు. రెండు గంటలు ఆలస్యంగా కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత విపత్తు నివారణ బృందం నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం భవనాన్ని ప్రారంభించి అన్ని అంతస్తుల్లోని వివిధ కార్యాలయాలను పరిశీలించారు. ఆ తర్వాత పక్కనే ఉన్న బందరు కాల్వలో విపత్తు నివారణ బృందం నిర్వహించిన రక్షణ విన్యాసాలను తిలకించారు. అగ్నిమాపక శాఖ అదనపు డీజీ నండూరి సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, పార్లమెంటు సభ్యుడు మాగంటి బాబు, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, వల్లభనేని వంశీ, బోడే ప్రసాద్, కాగిత వెంకట్రావు, గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీలు ఐలాపురం వెంకయ్య, నన్నపనేని రాజకుమారి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనురాధ, మేయర్ కోనేరు శ్రీధర్, అగ్నిమాపక శాఖ డెరైక్టర్లు జయరాం నాయక్, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రజాలం
ఈ ఆరునెలల్లో సీఎం చేసింది శూన్యం ప్రమాణస్వీకారం చేసిన గుంటూరును సైతం విస్మరించిన వైనం రుణ మాఫీ పేరుతో అన్నదాతలకు శఠగోపం జిల్లాకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదు వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఊసే లేదు పల్నాడులో సిమెంటు ఫ్యాక్టరీల ప్రస్తావనే మరిచారు వాటర్ గ్రిడ్డూ లేదు..మెట్టకు నీళ్లూ లేవు. రాజధాని భూసమీకరణపై రైతుల్లో వ్యతిరేకత గుంటూరు: రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి సోమవారం నాటికి ఆరు నెలల కాలం పూర్తయింది. గుంటూరు-విజయవాడ రహదారి పక్కన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఏర్పాటు చేసిన వేదికపై జూన్ 8న ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అదే వేదికపై నుంచి గుప్పించిన హామీలు, అంతకముందు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయారు. అన్నింటా ఘోరంగా విఫలమయ్యారు. చివరకు ప్రమాణస్వీకారానికి వేదికైన గుంటూరు జిల్లాను సైతం మోసం చేశారు. జిల్లాకు ఇచ్చిన హామీల అమలులో ఒక్క అడుగు సైతం ముందుకు వేయలేకపోయారు. అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేయడం మినహా ఆయన పాలన అంతా డాంబికాన్ని తలపిస్తోంది. ప్రజల ఆశలన్నీ ఆవిరయ్యాయి. రుణమాఫీ చేస్తామని మాట మార్చారు. రకరకాల నిబంధనలు విధించడంతో ఎక్కువ మంది రైతులు నష్టపోయారు. 11,78,383 బ్యాంకు ఖాతాలకు దాదాపు 3 లక్షల లోపు మాత్రమే అర్హమైనవిగా గుర్తించారు. చంద్రబాబును నమ్మి దాదాపు 8 లక్షల మందికి పైగా అన్నదాతలు నట్టేట మునిగారు. అన్నింటికీ ఆధార్ లింక్ అంటూ ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. జిల్లాలోని తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో దాదాపు 30 వేల ఎకరాల్లో రాజధాని నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వాస్తు పిచ్చితో బాబు మూడు పంటలు పండే సారవంతమైన భూములు లాక్కొనే యత్నం చేస్తున్నారని కొంత మంది రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బాబు వస్తాడు జాబు ఇస్తాడని యువతను ఎన్నికల సమయంలో మభ్య పెట్టారు. ఆయన అధికారంలోకి రాగానే కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెట్టారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్న హామీని మరిచారు. జిల్లాలో 2,257 మంది ఆదర్శ రైతులను తొలగించారు. గృహ నిర్మాణ శాఖలో 100 మందికి పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి పంపించారు. ఇలా ఒక్క హామీ కూడా నేరవేర్చలేదు. విఫలం.. ఇలా వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి నాగార్జునసాగర్ కాలువ ద్వారా మాచర్ల, పిడుగురాళ్లతో పాటు మెట్ట రైతులకు సాగునీరు ఇస్తానని ప్రకటించారు. ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. జిల్లాలో రైతుల పంటలకు గిట్టు బాటు ధర కల్పించేందుకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పిన మాటలు ఆచరణకు నోచలేదు. పల్నాడు ప్రాంతంలో సిమెంటు పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అర్హులైన పేదలకు మూడు సెంట్ల స్థలంలో రూ. 1.50 లక్షల రూపాయలతో పక్కా గృహాలు నిర్మిస్తామని చెప్పిన మాటలు నెరవేరకపోగా, నిర్మాణాల్లో ఉన్న 23,521 ఇళ్లకు ప్రభుత్వం బిల్లులు నిలిపి వేసింది. జిల్లాలో 3,49,400 పింఛన్లు ఉండగా, గ్రామ కమిటీలు, సామాజిక కార్యకర్తల పేరుతో అర్హులైన వారి పింఛన్లలో కోత విధించారు. చివరకు 21,795 పింఛన్లు తొలగించారు. జిల్లాలో 13,91,783 రేషన్ కార్డులుండగా ఆధార్ అనుసంధానంతో 1,19,393 కార్డులకు రేషన్ నిలిపి వేశారు. ఎన్టీఆర్ సుజల పేరిట జిల్లాలో మొదటి దశలో 300 గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రకటించినా, కేవలం 24 ప్లాంట్లు మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. మద్యం బెల్ట్ షాపులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినా అవి నేటికీ కనిపిస్తూనే ఉన్నాయి. అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. వీటి రద్దుకు గ్రామ,మండల స్థాయిలో ఏర్పాటైన కమిటీల జాడ కూడా లేదు. -
‘డాబుసరి’ పాలన
చంద్రబాబు సీఎంగా పగ్గాలు చేపట్టి నేటికి 6 నెలలు మే 20 తేదీ నుంచే అజమాయిషీ రాజధానిపై ఆత్రం.. ఏకపక్ష నిర్ణయం ఎన్నికల హామీల అమలులో వైఫల్యం {పజా సమస్యల పరిష్కారంలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు సమీక్షలు, హైటెక్ మాటలతో సరి శ్వేత పత్రాలు విడుదల, కన్సల్టెంట్ల నియామకంలో ముందుకు విభజన హామీలపై కేంద్రానికి ప్రతిపాదనలతో సరి.. నిధులు తేవటంలో విఫలం విలాసాలకే పెద్ద పీట.. సీఎం, సీఎస్ కార్యాలయాలకు రూ. 45 కోట్లు ఖర్చు హైదరాబాద్: రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు పగ్గాలు చేపట్టి సోమవారం తో ఆరు నెలలు పూర్తవుతుంది. సాంకేతికంగా చంద్రబాబు జూన్ 8వ తేదీ నుంచి అధికార పగ్గాలు చేపట్టారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 15న వెలువడినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనకు అపాయింటెడ్ డేగా జూన్ 2ని నిర్ణయించడంతో అప్పటివరకు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయలేదు. అయితే, అధికార పార్టీ అధినేతగా, కాబోయే ముఖ్యమంత్రిగా మే 20వ తేదీ నుంచే ఆయన ఆజమాయిషీ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత మంచి ముహూర్తం చూసుకొని జూన్ 8న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు చంద్రబాబు ఒక్క అంశంలోనూ స్పష్టమైన వైఖరిని కనబరచలేదు. అత్యంత ప్రధానమైన రాజధాని విషయంలో ఆత్రం ప్రదర్శించారు. ఎన్నికల హామీల అమలులో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. రాజధాని, విదేశీ పర్యటనలు, కార్యాలయాలను సుందరంగా తీర్చిదిద్దుకోవడం, ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొట్టడంలో అత్యుత్సాహం చూపుతున్నారు. మిషన్లు, కన్సల్టెంట్లు, సలహాదారుల నియామకం, సమీక్షల మీద సమీక్షలు, హైటెక్ మాటల్లో ముందున్నారు. మొత్తంగా చూస్తే ‘డాబుసరి’ పాలనే తప్ప.. ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టలేదన్న విషయం సుస్పష్టంగా కనిపిస్తోంది. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారమే అట్టహాసంగా జరిగింది. ప్రమాణ స్వీకారం సందర్భంగా తొలి 5 సంతకాలంటూ ఆర్భాటం చేశారు. వీటిలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు మినహా మరేదీ అమలులోకి రాలేదు. రుణ మాఫీ విషయంలో గత 6 నెల లుగా చంద్రబాబు సర్కారు రైతులు, డ్వాక్రా మహిళలను వంచిస్తున్న తీరు కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. చివరికి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళనలు చేపట్టడంతో దిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీపై ఈ నెల 4న విధివిధానాలు ప్రకటించింది. నూతన రాష్ట్రానికి అత్యంత ప్రధానమైన రాజధాని ప్రాంతం ఎంపిక విషయంలో నిపుణులు, ప్రజాప్రతినిధులను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలను మూటగట్టుకున్నారు. సారవంతమైన, ఏడాదికి మూడు పంటలిచ్చే భూములను రాజధానికి ఎంపిక చేయడంపై అనేక వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. నూతన రాజధాని నిర్మాణానికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ ఏర్పాటుకు ముసాయిదా బిల్లును కూడా మంత్రివర్గం ఆమోదించింది. రాజధాని నిర్మాణంలో సహకారాన్ని కోరేందుకు, పెట్టుబడులను ఆహ్వానించడానికి చంద్రబాబు, ఆయన బృందం సింగపూర్, జపాన్లలో పర్యటించి వచ్చింది. హుద్హుద్ తుఫాను సమయంలో చంద్రబాబు విశాఖపట్టణంలోనే మకాం వేసి అంతా వన్మేన్ షో నడిపించారు. అయితే కేవలం విశాఖపట్టణంలోని బాధితులకే సకాలంలో సహాయం సకాలంలో అందించారు తప్ప శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల బాధితులను పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలపై ప్రతిపాదనలను బాబు సర్కారు ఢిల్లీకి పంపినప్పటికీ, వాటికి సంబంధించిన నిధులను రాబట్టడంలో మాత్రం విఫలమైంది. పేదల కోసమం టూ పెద్ద పెద్ద మాటలు చెప్పిన చంద్రబాబు.. ఈ ఆరు నెలల్లో పేదలకు కొత్తగా ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయకపోగా, గత ప్రభుత్వం మంజూరు చేసిందనే పేరుతో 7.95 లక్షల గృహాలను మాత్రం రద్దు చేశారు. ఏడు రంగాలకు చెందిన మిషన్ల పేరుతో ఏకంగా 30 మంది కన్సల్టెంట్లను, పలువురు సలహాదారులను నియమించి, లక్షల్లో వేతనాలు చెల్లిస్తున్నారు. వీటి ఫలితమేమిటన్నది ఇప్పటికీ తేలలేదు. గత ప్రభుత్వాన్ని తప్పుపట్టే ఉద్దేశంతో రంగాలవారీగా శ్వేతపత్రాలను ప్రకటించారు. సమీక్షలతోనే సరి.. ఆరు నెలల చంద్రబాబు పాలన చూస్తే సమీక్షలతోనే సాగదీస్తున్నారన్న విమర్శలు అధికారవర్గాల్లోనే ఉన్నాయి. బాబు ప్రతి వారం గంటల తరబడి సమీక్షలు చేస్తున్నారు. వారం తిరగకుండానే మళ్లీ అవే అంశాలపై సమీక్షలు చేస్తూ చెప్పిందే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. దీంతో ఉన్నతాధికారులందరూ విసుగెత్తిపోతున్నారు. తమ సమయమంతా సమీక్షలకే సరిపోతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సమీక్షలు పత్రికల్లో వార్తలకు, ఏదో చేస్తున్నామన్న భావన కల్పించడానికే పనికొస్తున్నాయి తప్ప, ఒక్కటీ ఫలితమివ్వలేదని ఉన్నతాధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. అంతా అనుత్పాదక వ్యయమే..! ప్రభుత్వ ధనాన్ని ఉత్పాదకతకు వెచ్చించాల్సి ఉండగా.. అందుకు పూర్తి విరుద్ధంగా విలాసాల కోసమే పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఒక పక్క ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి డబ్బుల్లేవంటూ ప్రజల నుంచి చందాలు వసూలు చేస్తోంది. మరోపక్క భారీ రెవెన్యూ లోటు ఉందని కేంద్రాన్ని నిధులడుగుతోంది. విలాసాల కోసం మాత్రం భారీమొత్తంలో ఖర్చు చేస్తోంది. సచివాలయంలో ముఖ్యమంత్రి ఆఫీసు, క్యాంపు కార్యాలయాలను సుందరంగా తీర్చిదిద్దడానికే ఏకంగా రూ.45 కోట్లు నీళ్లలా ఖర్చు చేసేశారు. తొలుత సచివాలయంలోని సౌత్ హెచ్ బ్లాకులో సీఎం కార్యాలయం కోసం రూ. 10 కోట్లు ఖర్చు చేశారు. తర్వాత అక్కడ వాస్తు బాగోలేదన్న కారణంతో సీఎం కార్యాలయాన్ని ఎల్ బ్లాకుకు మార్చారు. ఇందులో రెండు అంతస్తుల్లో సీఎం, సీఎస్ కార్యాలయాలను సుందరంగా తీర్చిదిద్దడానికి రూ.15 కోట్లు ఖర్చు చేశారు. సీఎం కార్యాలయంలో ఫర్నీచర్ కోసం మరో రూ.10 కోట్లు వెచ్చించారు. ప్రధాన మంత్రి కార్యాలయం కూడా చంద్రబాబు కార్యాలయం ముందు తీసిపోయేలా ఉందని ఉన్నతాధికారులువ్యాఖ్యానిస్తున్నారు. ఇంతేకాకుండా సీఎం సొంత గృహానికి, లేక్వ్యూ అతిథి గృహంలో క్యాంపు కార్యాలయానికి మరో రూ. 10 కోట్లు ఖర్చు చేశారు. మరో పక్క రాష్ట్రంలో జిల్లాలకు, బెంగుళూరు, ఢిల్లీ వెళ్లినా ఆఖరికి సింగపూర్ వెళ్లినా చంద్రబాబు రెగ్యులర్ విమానాల్లో అడుగుపెట్టడానికి ఇష్టపడటంలేదు. ప్రత్యేక విమానాల్లోనే ప్రయాణం చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లా లు, ఢీల్లీ, బెంగూళూరులకే ఈ 6 నెలల్లో చంద్రబాబు 40 సార్లు ప్రత్యేక విమానంలో వెళ్లారు. ఎక్కువగా కృష్ణపట్నం పోర్టుకు చెందిన లగ్జరీ విమానంలోనే ప్రయాణిస్తున్నారు. ఈ విమానానికి గంటకు రూ.4 లక్షలు ఖర్చవుతుంది. ఇలా అనుత్పాదక రంగాలపై నిధులు ఖర్చు చేయడాన్ని అధికారులు తప్పుపడుతోంది. కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితేమిటి? అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరిస్తామని బాబు హామీ ఇచ్చారు. గద్దెనెక్కాక ఈ విషయాన్నే పట్టించుకోవడంలేదు. వీరికి ఈ నెల 31 వరకు మాత్రం సర్వీసును పొడిగించింది. ఆ తర్వాత పరిస్థితేమిటన్నది అగమ్యగోచరంగా మారింది. హామీల అమలు ఖర్చు ఆరు నెలల్లో రూ.433 కోట్లే ఎన్నికల ముందు తనకు తోచిన విధంగా ప్రజలకు హామీలు గుప్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఆరు నెలల కాలంలో వాటి అమలుకు ఖర్చు పెట్టిందెంతో తెలుసా? కేవలం రూ.433 కోట్లు. ఇదే తీరు కొనసాగితే బాబు ఇచ్చిన హామీలు పూర్తయ్యేందుకు దాదాపు 1,000 ఏళ్లు పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు 52 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రతి పేజీలో పదికి తక్కువ కాకుండా హామీలు గుప్పించారు. అలా ఆ పార్టీ ఇచ్చిన హామీలను ఇచ్చినట్టే అమలు చేయాలంటే కేవలం రైతు, డ్వాక్రా రుణాల మాఫీకే లక్ష కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణానికి కనీసం మరో రెండు లక్షల కోట్లు అవసరం. హైదరాబాద్ లాంటి రాజధానిని కొత్తగా నిర్మించుకోవాలంటే ఐదు లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని గతంలో చంద్రబాబే చెప్పారు. మిగతా హామీలకు మరో లక్ష కోట్లకు పైబడే అవసరం అవుతాయని అంచనా. ఇలా బాబు తానిచ్చిన హామీలన్నిటినీ అమలు చేయాలంటే మొత్తం నాలుగు లక్షల కోట్లకు పైగానే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటి రాష్ట్ర మొత్తం బడ్జెట్ను బట్టి చూస్తే నాలుగేళ్ల పూర్తి బడ్జెట్ను ఇందుకోసమే వినియోగించాలన్న మాట. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం చేస్తున్న మొత్తం ఖర్చులో ఒక్కటిన్నర శాతం కూడా హామీల అమలుకు వినియోగించడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ ఏడవ తేదీ నాటికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ అంశాల కింద మొత్తం రూ.34,034 కోట్లను ఖర్చు పెట్టింది. అయితే పింఛన్ల పథకానికి తప్ప ప్రభుత్వం మరే హామీ అమలుకు ఖజానా నుంచి రూపాయి ఖర్చు పెట్టడానికి ముందుకు రాలేదు. పింఛన్ల పథకానికీ గత ప్రభుత్వాలు చెల్లించిన మొత్తాలకు అదనంగా చంద్రబాబు సర్కార్ అదనంగా చెల్లించింది కేవలం రూ.433 కోట్లు మాత్రమే. బాబు వచ్చారు.. జాబులే లేవు బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అందరికీ ఉద్యోగా లు ఇచ్చే సంగతి అటుంచితే.. సాధారణంగా ఏటా ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలూ ఆపేయాలంటూ ప్రభుత్వం లేఖ రాసింది. లక్షల సంఖ్యలో ఖాళీల భర్తీ కోసం ఎదురు చూస్తు న్న నిరుద్యోగులకు ప్రభుత్వ ఆదేశాలు అశనిపాతమే అయ్యాయి. గ్రూప్-1, 2, 4 ఉగ్యోగాల భర్తీ ఎప్పుడు చేపట్టేదీ ప్రకటిం చాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులకూ మొండిచేయే..! అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు పదో పీఆర్సీ సిఫార్సులను యధాతథంగా అమలు చేస్తానని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా, వేతన సవరణ గురిం చి పట్టించుకోలేదు. మండుతున్న ధరలను తట్టుకోలేక అల్లాడుతున్న సగటు ఉద్యోగికి ఊరట కలిగించే చర్యలను చేపట్టలేదు. కొత్త వేతనాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో, ఏ తేదీ నుంచి ఆర్థిక లబ్ధి చేకూరస్తారనే విషయాన్నయినా స్పష్టంగా చెప్పాలన్న ఉద్యోగుల వినతినీ పట్టించుకోలేదు. వారానికి 5 రోజుల పని విధానం ప్రవేశపెడతానన్న ఎన్నికల హామీనీ చంద్రబాబు పట్టించుకోలేదు. ఉద్యోగులు, పెన్షనర్లకు పేరుకైతే హెల్త్కార్డులు ఇచ్చారు కానీ.. వైద్యం అందించడానికి చర్యలు తీసుకోలేదు. -
కేంద్ర సాయం కోసం పంపిన వివరాలు ఇవ్వండి
ఆదాయాన్ని అక్కడే ఖర్చు చేయాలి అంచనాల కమిటీ సభ్యులు చెవిరెడ్డి డిమాండ్ తిరుపతి: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ అభివృద్ధి, రాజధాని ఇతరత్ర నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం కోసం పంపిన వివరాలను ఇవ్వాలని చంద్రగిరి ఎమ్మెల్యే, అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యులు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కోరారు. హైదరాబాద్లోని ఏపీ అసెంబ్లీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ అంచనాల కమిటీ ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో మంగళవారం రివ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మాట్లాడుతూ కేంద్రం సహాయం కోసం నివేదికలు పంపామని ప్రభుత్వం నిత్యం చెబుతోందన్నారు. ఏయే శాఖల, ప్రాజెక్ట్ల కోసం ఎంత నిధులు అవసరమని కేంద్రానికి పంపారో ఆ నివేదిక కాపీలను అందజేయాలని ఆర్థిక శాఖను కోరారు. రాష్ట్రం విడిపోవడం వల్ల ప్రభుత్వం అప్పుల్లో ఉందని , ఆదాయం లేదని చెబుతున్నారే తప్ప వాటిని గణాంకాలలో చూపాలని చెప్పారు. అయితే ఏపీ నుంచి వచ్చే ఆదాయం గురించి ఎక్కడా మాట్లాడక పోవడంపై ఆయన ప్రశ్నించారు. రెవెన్యూ నుంచి ఎంత ఆదాయం వస్తుందో అంచనా వేశారా? అని నిలదీశారు. ఇలా అన్ని శాఖల నుంచి ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం గురించి గణాంకాలు లెక్క వేసి వివరాలు ఇవ్వాలని కోరారు. విభజనకు ముందు ఆర్థిక పరిస్థితులు, నూతన రాష్ర్ట స్థితిగతులపై ఆయన గణాంకాలతో సహా నివేదిస్తూ వివరణ కోరారు. దీనిపై సీనియర్ ఐఏఎస్లైన ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్కల్లం, సెక్రటరీ ప్రేమ్చంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ గణాంకాల వివరాలను అందజేస్తామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో కేంద్రం రూ.14,500 కోట్ల సాయం ఇస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఆర్టీఏ వసూలు చేసే ఆదాయాల్లో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తుందన్నారు. ఈ నిధులను గ్రామీణ ప్రాంతాల్లో వినియోగించకుండా పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఆదాయాన్ని అక్కడ అభివృద్ధికి ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అనేక గ్రామాలకు సక్రమమైన రోడ్లు, మరుగుదొడ్లు, శ్మశాన వాటికలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం పల్లెల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. హైదరాబాద్ నుంచి విడిపోయాక ఏపీలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ టక్కర్ నళిని, ఇతర కమిటీ సభ్యులు, అనేక మంది ఐఏఎస్ అధికారులు, ఆడిట్, అకౌంట్ అధికారులు పాల్గొన్నారు. -
ఆత్మహత్యలను తొక్కిపెడుతున్న టీడీపీ
మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ‘పచ్చ’ పత్రికల తీరు దారుణం అనంతపురం జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్షా సమావేశం సాక్షి, హైదరాబాద్: అనంతపురం జిల్లాలో 60 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడితే బయటి ప్రపంచానికి తెలియకుండా టీడీపీ ప్రభుత్వం, దాని అనుకూల పత్రికలు తొక్కి పెడుతున్నాయని మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజన తరువాత కనీవినీ ఎరుగని రీతిలో కరువు సంభవించినందున అనంత జిల్లాలో గ్రామాలకు గ్రామాలు ఖాళీ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ నేతలతో అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం హైదరాబాద్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అనంత టీడీపీ ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. సమస్యలతో సతమతమవుతున్న రైతులు బలవన్మరణాలకు పాల్పడు తుంటే జిల్లా మంత్రి ఆత్మహత్యలు లేనేలేవని ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ సమక్షంలో జరిగిన జిల్లా సమీక్షలో పార్టీ నిర్మాణం గురించి ప్రధానంగా చర్చించామని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం. శంకరనారాయణ తెలిపారు. కదిరి ఎమ్మెల్యే అత్తారు చాంద్బాష, మాజీ ఎమ్మెల్యేలు బి.గురునాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఇతర నేతలు బోయ తిప్పేస్వామి, తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, నవీన్ నిశ్చల్, ఏ.సాంబశివారెడ్డి, సోమశేఖర్రెడ్డి, శ్రీధర్రెడ్డి, వి.ఆర్.రామిరెడ్డి, రమేష్రెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. తెలుగు మహిళ నేత చేరిక తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉషారాణి సోమవారం జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్లో చేరారు. ఆమెకు జగన్ పార్టీ కండువా వేసి ఆహ్వానం పలికారు. -
చట్టాన్ని పట్టించుకోని చంద్రబాబు
రెండేళ్లలో మిగులు విద్యుత్ సాధిస్తాం: హరీశ్రావు నంగునూరు: రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తుంగలో తొక్కినా తాము అమలు చేస్తున్నామని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. దీన్ని సవాలుగా తీసుకుని వచ్చే రెండేళ్లలో మిగులు విద్యుత్ సాధిస్తామని ఆయన పేర్కొన్నారు. మెదక్ జిల్లా పాలమాకులలో సోమవారం 132 కేవీ సబ్స్టేషన్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పునర్ వ్యవస్థీకరణ చట్టానికి అనుగుణంగా ఆంధ్రప్రాంత ప్రజలు ఇక్కడ సుఖంగా ఉంటున్నారన్నారు. చంద్రబాబుకు గెస్ట్హౌస్తో పాటు సెక్రటేరియట్ను తామిచ్చినా కేంద్ర ప్రభుత్వం సూచిన విధంగా 54 శాతం విద్యుత్ను తెలంగాణకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కరెంటు సమస్యలు తీర్చేందుకు వెయ్యి వాట్ల విద్యుత్ను ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరిందని..రామగుండం, మణుగూరు ప్లాంట్ల ద్వారా వెయ్యి మెగావాట్లు, సౌర, పవన, జల విద్యుత్తును మరో 15 వేల మెగావాట్ల మేర ఉత్పత్తి చేస్తామన్నారు. తమ విజన్ మేరకు కళకళలాడే చెరువులు, తళతళలాడే రోడ్లు నిర్మించి, ఇంటింటికీ మంచినీరు సరఫరా చేస్తామన్నారు. పింఛన్లను తొలగిస్తామంటూ కొన్ని పత్రికలు, పార్టీలు దుష్ర్పచారం చేస్తున్నాయని బడ్జెట్లో రూ. 3.6 వేల కోట్లు కేటాయించిన విషయాన్ని విస్మరించొద్దని హరీశ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ చీఫ్ ఇంజనీర్ శ్రీరాములు, జెడ్పీ వైస్ చైర్మన్ ఆర్.సారయ్య, ఎంపీపీ శ్రీకాంత్రెడ్డి, సర్పంచ్ రవీందర్రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు శివశంకర్ పాల్గొన్నారు. -
విభజన హామీలపై బాబు విఫలం
వైఎస్సార్సీపీ త్రిసభ్య కమిటీ సభ్యుడు విజయసాయిరెడ్డి ధ్వజం కేంద్రంపై ఒత్తిడి తేవటంలో ముఖ్యమంత్రి ఘోరంగా విఫలం సీఎంకు ప్రచారం మీదున్న ధ్యాస ప్రజలపై ఏమాత్రం లేదు ఇతరుల హయాంలో జరిగిన పనులను తన ఘనతగా చెప్పుకుంటున్నారు ఆయన తీరు చూస్తుంటే విఠలాచార్య సినిమాలు గుర్తుకొస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై 5న కలెక్టరేట్లు ముట్టడించనున్న వైఎస్సార్సీపీ విశాఖ కలెక్టరేట్ వద్ద ధర్నా చేయనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి విడిపోవటానికి కారకుడైన చంద్రబాబు ప్రత్యేక హోదా లాంటి హామీలను అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవటంలో ఘోరంగా విఫలమయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి విమర్శించారు. విభజన హామీలను కేంద్రం నెరవేర్చేలా ప్రయత్నించే చిత్తశుద్ధి చంద్రబాబుకు ఏ కోశానా లేదన్నారు. ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటు, సేల్స్టాక్స్, ఇతర పన్నులపై రాయితీలు కల్పిస్తామని, రెవెన్యూ లోటు భర్తీ చేస్తామని కేంద్రం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ప్రజలను మోసగిస్తోందని ధ్వజమెత్తారు. ఆదివారం కాకినాడలో తూర్పు గోదావరి జిల్లా వైఎస్సార్ సీపీ విస్తృతస్థాయి సమావేశంలో, అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి ప్రసాదరాజు, మరో ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావుతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయ సాయిరెడ్డి ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే.. ‘సీఎం చంద్రబాబుకు ప్రచారం మీదున్న ధ్యాస హామీలు అమలు చేయటం, ప్రజలకు సేవ చేయటంపై ఏ కోశానా లేదు. ఇతరులు చేసిన అభివృద్ధి పనులను తానే చేసినట్లు బాబు చెప్పుకుంటున్నారు. 2013లోచిత్తూరులో శ్రీసిటీని అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి ప్రారంభించారు. చంద్రబాబు ఇప్పుడు జపాన్ వెళ్లి తానే అక్కడి కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఎక్కడకు వెళ్లినా స్మార్ట్ సిటీలంటూ అది చేస్తాం, ఇది చేస్తామని చెబుతున్నారు. చంద్రబాబు తీరు చూస్తుంటే నాకు చిన్నతనంలో చూసిన విఠలాచార్య సినిమాలు గుర్తుకు వస్తున్నాయి. ఆ సిని మాలో మాంత్రికుడు చేతిలో మంత్రదండం సాయంతో ఒక్క క్షణంలో నగరాన్ని సృష్టించేసేవాడు. ఇప్పుడు చంద్రబాబు మాటలు అలాగే ఉన్నాయన్నారు. దివంగత వైఎస్ఆర్ హయాం లో చేపట్టి, అనంతరం మధ్యలో నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తిచేసే ఉద్దేశం బాబుకు లేదు. అందుకే 2019లో వైఎస్సార్సీపీని అధికారంలోకి తేవాలని కోరుతున్నా. అలాగే మంత్రుల కనుసన్నల్లో టీడీపీ నాయకులు ఇసుకను బ్లాక్మార్కెట్కు తరలించి రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. పంట అమ్మబోతే కొనేవారు లేరు చంద్రబాబు పాలనలో వరికి కనీస మద్దతు ధర కరువై రైతులు దిక్కుతోచక ఉన్నారు. మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామంటున్న ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర కల్పించలేకపోతోంది. ప్రజా పోరాటాలతో బలోపేతం: ధర్మాన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పాలకపక్షానికి, ప్రతిపక్షానికి సమాన బాధ్యతలుంటాయన్నారు. పాలకపక్షం విధివిధానాలను, చట్టాలను రూపొందిస్తే వాటిలో లోపాలను, లొసుగులను నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదేనన్నారు. సైనికుడిలా పని చేయాలి : జ్యోతుల సమావేశానికి అధ్యక్షత వహించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పోరాటాలతోనే చంద్రబాబు సర్కారు మెడలు వంచాలన్నారు. ప్రతి కార్యకర్తా సైనికుడిలా పని చేసేం దుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు ఎంవీఎస్ నాగి రెడ్డి, గౌతమ్రెడ్డి, మేరుగ నాగార్జున, ధర్మాన కృష్ణదాస్, సుధాకర్, సలామ్బాబు, ఐటీ సెల్ కార్యదర్శి మధుసూదన్ తమ ప్రసంగాల్లో చం ద్రబాబు ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ సీజీసీ, సీఈసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, కుడుపూడి చిట్టబ్బాయి, జక్కంపూడి విజయలక్ష్మి, పినిపే విశ్వరూప్, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చం ద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, పార్టీ రాష్ట్ర కా ర్యదర్శులు జక్కంపూడి రాజా, కొల్లి నిర్మలకు మారి, జీవీ రమణ, సంగిశెట్టి అశోక్, సంయుక్త కార్యదర్శి కర్రి నారాయణ పాల్గొన్నారు. జనవరిలో రెండు రోజులు జగన్ నిరశన దీక్ష బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వ చ్చిన టీడీపీ అన్ని వర్గాల ప్రజలను వంచిం చిందని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. తమ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందన్నా రు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జనవరి మొదటి వారంలో ఉభ యగోదావరి జిల్లాల్లో రెండు రోజుల పాటు జగన్ నిరశన దీక్ష చేయనున్నారని చెప్పారు. ఫిబ్రవరి, మార్చిల్లో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టి పార్టీని సంస్థాగతంగా అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆంధ్రా దేవాలయాల బకాయిలు రూ. వెయ్యి కోట్లు
‘టెంపుల్ ప్రొటెక్షన్ మూవ్మెంట్’ కన్వీనర్ సౌందరరాజన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానాలతోపాటు ఏపీలోని ఇతర దేవాలయాల నుంచి దేవాదాయ శాఖకు రావాల్సిన రూ.వెయ్యి కోట్ల బకాయిలను వసూలు చేయాలని ‘టెంపుల్ ప్రొటెక్షన్ మూవ్మెంట్’ కన్వీనర్ సౌందరరాజన్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆయన మంత్రి హరీశ్రావును కలసి ఈ అంశాన్ని వివరించారు. మంత్రి సూచన మేరకు ప్రభుత్వ సలహాదారు రమణాచారిని కలసి వినతిపత్రాన్ని అందజేశారు. దేవాదాయ నిర్వహణ నిధి (ఈఏపీ), సర్వశ్రేయోనిధి (సీజీఎఫ్) తదితరాలు కలిపి ఉమ్మడి రాష్ట్రంలో టీటీడీతోపాటు ఏపీలో దేవాలయాలు రూ.2,500 కోట్లకుపైగా బకాయి పడ్డాయని, జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణకు అందులో రూ.వెయ్యి కోట్లు రావాల్సి ఉందన్నారు. -
‘హుద్హుద్’పై చర్చకు పట్టుబడతాం!
వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి ‘విభజన’ హామీలను పార్లమెంటులో ప్రస్తావిస్తాం అఖిలపక్ష భేటీలో పార్టీ తరఫున హాజరు సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాంధ్రను కుదిపేసిన హుదుహుద్ తుపానుపై పార్లమెంట్లో చర్చించాలని తమ పార్టీ తరఫున పట్టుబడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్రెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలూ నెరవేర్చాలన్న అంశంపైనా చర్చిస్తామన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల నిర్వహణపై ఆదివారం సాయంత్రం జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్సీపీ తర ఫున మేకపాటి పాల్గొన్నారు. అనంతరం విజయ్చౌక్లో మీడియాతో మాట్లాడారు. ఆదర్శ గ్రామాల అభివృద్ధికి ఎంపీ లాడ్స్ నిధుల పెంపు, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా తదితర అంశాలను కూడా సభలో లేవనెత్తుతామని చెప్పారు. ‘హుద్హుద్ తుపాను విశాఖ, విజయనగరం, శ్రీశాకుళం జిల్లాలను చిన్నాభిన్నం చేసింది. పంటలు, తోటలు నాశనమయ్యాయి. తుపాను బాధితులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి ప్రకటించిన రూ. 1,000 కోట్లలో రూ. 400 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో మేమంతా ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీని, హోంమంత్రి రాజ్నాథ్సింగ్ని కలిసి అక్కడ జరిగిన నష్టాన్ని వివరిస్తూ వినతిపత్రాన్ని ఇచ్చాం. శుక్రవారం స్పీకర్ అధ్యక్షత జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా తుపాను సాయం విషయాన్ని ప్రస్తావించాం’ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలపై నిలదీస్తామన్నారు. ‘రాజధాని లేదు. అసెంబ్లీ భవనం, గవర్నర్ బంగళా, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధుల నివాసాలెక్కడో తెలియదు. విభజన సమయంలో రాష్ట్రానికి కేంద్రం పలు హామీలిచ్చింది. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. రాష్ట్రానికి రూ. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంది. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని, లోటు బడ్జెట్ పూడ్చడంతోపాటు ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా ఆదుకోవాలని కోరతాం’ అని తెలిపారు. తెలంగాణకు సంబంధించి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, వీలైనంత తర్వగా చేపట్టాలని కోరతామన్నారు. ఏపీలో పెండింగ్లోని రైల్వే ప్రాజెక్టులనూ సభ దృష్టికి తెస్తామన్నారు. -
ఏపీకి 211 మంది ఐఏఎస్లు
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఐఏఎస్ల కేడర్ సంఖ్యను నోటిఫై చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్కు ఐఏఎస్ల కేడర్ సంఖ్యను 211గా, తెలంగాణకు 163గా నోటిఫై చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్కు డెరైక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టులు 147 కాగా పదోన్నతుల ద్వారా భర్తీ చేసేవి 64గా నిర్ణయించారు. తెలంగాణకు డెరైక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 114, పదోన్నతుల ద్వారా 49 పోస్టులను కేటాయించారు. -
పాచిక పారనట్టే..!
మేర్లపాక సమీపంలో భూములు కొన్న మంత్రి, టీడీపీ ఎంపీ అక్కడ ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ ఏర్పాటు చేయాలని ఒత్తిడి అనుకూలం కాదని తేల్చిన కేంద్ర బృందం తిరుపతి పరిసర ప్రాంతాల్లో కేటాయించాలని లేఖ సాక్షి ప్రతినిధి, తిరుపతి: రియల్ భూమ్ సృష్టించి ప్రజాధనాన్ని కొల్లగొట్టాలన్న ఓ మంత్రి, టీడీపీ ఎంపీ ఎత్తును కేంద్ర మానవ వనరుల శాఖ అధికార బృందం చిత్తు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాంతంలో ఐఐటీ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ), ఐఐఎస్ఈఆర్(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) కేంద్రాలను ఏర్పాటు చేయలేమని స్పష్టీకరించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో 11 జాతీయ స్థాయి విద్యా సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. అందులో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్లను తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ సంస్థల బూచి చూపి తమ భూములను అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకోవడానికి ఓ మంత్రి, మరో టీడీపీ ఎంపీ ఎత్తు వేశారు. ఏర్పేడు మండలం మేర్లపాక పరిసర ప్రాంతాల్లో ఆ మంత్రి, ఎంపీలు బినామీ పేర్లతో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారు. అక్కడే ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ను ఏర్పాటు చేయాలంటూ జిల్లా అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన జిల్లా అధికారులు ఐఐటీ ఏర్పాటుకు మేర్లపాకలో 440 ఎకరాలు, ఐఐఎస్ఈఆర్ ఏర్పాటుకు పంగూరులో 398 ఎకరాలు గుర్తించి కేంద్రానికి నివేదిక పంపారు. కేంద్ర మానవవనరుల శాఖ బృందం ఆ భూములను పరిశీ లించి, అటవీ ప్రాంతంలో జాతీయ విద్యా సంస్థలను ఏర్పాటు చేయలేమని నివేదిక ఇచ్చినట్లు రెవెన్యూ కీలక అధికారి వెల్లడించారు. మౌలిక సదుపాయాలు అంతం త మాత్రంగానే ఉన్నందున ఆ ప్రాంతం జాతీయ విద్యాసంస్థల ఏర్పాటుకు అనువు కాదని పేర్కొన్నట్లు రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. రేణిగుంట విమానాశ్రయానికి ఐదారు కి.మీల దూరంలో తిరుపతి పరిసర ప్రాంతాల్లోనే భూమిని కేటాయిస్తే విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మానవవనరుల శాఖ లేఖ రాసినట్లు రెవెన్యూ అధికారి‘సాక్షి’కి వెల్లడించారు. దీంతో మంత్రి, టీడీపీ ఎంపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తాము ప్రతిపాదించిన స్థలంలోనే ఆ సంస్థలను ఏర్పాటు చేయాలని పట్టుపడుతుండటం గమనార్హం. -
స్థానికత సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోండి
రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగులకు రెండు రాష్ర్ట ప్రభుత్వాల ఆదేశం హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి కీలకమైన స్థానిక నిరూపణ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాల్సిందిగా రెండు రాష్ట్రాల్లోని రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగులకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సూచిం చాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు చెందిన ప్ర భుత్వ శాఖలన్నింటికీ తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ, ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఐ.వై.ఆర్. కృష్ణారావు సంయుక్తంగా ఇటీవల సర్క్యులర్ జారీ చేశారు. ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతు లు తమ పరిధిలో పనిచేస్తున్న రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగులందరికీ స్థానికత నిరూపణ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచించాలని ఆ సర్క్యులర్లో స్పష్టం చే శారు. ఇప్పటినుంచే ఆ సర్టిఫికెట్లను సిద్ధం గా ఉంచుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలకు ఈ నెల 17 లేదా 18వ తేదీల్లో కేంద్రం ఆమోదం లభించే అవకావం ఉన్నం దున ఇప్పుడే అన్ని శాఖల నుంచి పోస్టులు, ఖాళీలు, ఉద్యోగుల వివరాలను సేకరించాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే రాష్ట్రస్థాయి శాఖలు, విభాగాలు, ప్రాజెక్టుల్లోని పోస్టులు, ఖాళీలు, ఉద్యోగుల వివరాలను పంపించాలని స్పష్టం చేశారు. ఏదైనా ఒక ప్రాంతానికి చెందిన ప్రాజెక్టుకు తీసుకున్న ఉద్యోగులను ప్రాజెక్టు పూర్తయిన తరువాత ఇతర సంస్థల్లోకి తీసుకుంటే ఆ వివరాలను పేర్కొనాలని సూచించారు. అయితే ప్రాజెక్టు పూర్తయినందున ఆ ప్రాజెక్టు పోస్టులను ఖాళీగా చూపించరాదని సూచించారు. జూన్ 1వ తేదీ వరకు ఉన్న పోస్టులు, ఖాళీలు, ఉద్యోగుల వివరాలన్నింటినీ సంబంధిత కార్యదర్శి లేదా విభాగాధిపతి ధ్రువీకరిస్తూ సమాచారాన్ని అందజేయాలని పేర్కొన్నారు. ఆయా ఉద్యోగులపై నియంత్రణ ఉండి ఆర్థిక అంశాలను పర్యవేక్షించే అధికారం ఉన్నవాటినే విభాగాధిపతులుగా గుర్తించాలని తెలిపారు. రెండు రాష్ట్రాల శాఖలు ఈ రంగంలో అనుభవం ఉన్న అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించాలని సూచించారు. -
కొత్త కార్డులు రానున్నాయ్..
సాక్షి, మంచిర్యాల : త్వరలోనే కొత్త రేషన్కార్డులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చేసిన ప్రకటన అర్హుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. దాదాపు పది నెలలుగా కొత్త రేషన్కార్డుల కోసం కళ్లు కాయలు కాసేలా చూస్తున్న ఆశావహులు కేసీఆర్ వ్యాఖ్యలు తొందరగా ఆచరణ రూపంలోకి రావాలని ఆశిస్తున్నారు. ఉమ్మడి రాష్ర్టంలో గతేడాది డిసెంబరులో రచ్చబండ 3 నిర్వహించారు. ఇందులో పెద్ద ఎత్తున రేషన్కార్డుల కోసం అర్హులు దరఖాస్తులు అందజేశారు. అయితే.. రాష్ట్ర విభజన, ఆ తర్వాత ఎన్నికలు రావడం, కొత్తగా ఏర్పడిన సర్కారు అవకతవకలను సరిదిద్దిన తర్వాతే కొత్త కార్డులు మంజూరు చేస్తామనే ప్రకటనతో అర్హులకు కార్డులు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. తెలంగాణ సర్కారు పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత నిర్వహించిన ‘మన ఊరు-మన ప్రణాళిక’, ‘మనవార్డు-మన ప్రణాళిక’లో సైతం కార్డుల కోసం విన్నవించుకున్న వారి సంఖ్య భారీగానే ఉంది. ప్రజల క్షేత్రస్థాయి అవసరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా చిన్న కుటుంబాలు ఎక్కువయ్యాయని, వారిలో అర్హులు కార్డుల కోసం ఎదురుచూస్తున్నారని వివరాలు తేటతెల్లం చేశాయి. తాజాగా హైదరాబాద్లో జరిగిన ఒక సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ కొత్త రేషన్కార్డులు అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన పెద్ద ఎత్తున ఉన్న అర్హులకు ఊరట కలిగించింది. లెక్క తేలుస్తున్నారు.. జిల్లాలో అన్నిరకాల కార్డులు కలిపి ప్రస్తుతం 6,35,895 రేషన్కార్డులున్నాయి. బోగస్ కార్డుల తొలగింపునకు ముందు రేషన్కార్డుల సంఖ్య 7,05,073. ఆధార్ అనుసంధానం, బోగస్ల ఏరివేతతో 69,178 కార్డులు తొలగించారు. అయితే.. ఆధార్కార్డులు సమర్పించడంతో తొలిగించిన వాటిలోని 18,000 కార్డులకు తిరిగి మోక్షం కలిగించారు. ఇదిలా ఉంటే సమగ్ర కుటుంబ సర్వేలో లెక్కతేల్చిన ప్రకారం జిల్లాలో 7,72,679 కుటుంబాలు ఉన్నాయి. సభ్యుల సంఖ్య 25,94,757గా నమోదయ్యింది. ఈ లెక్కన పెద్ద ఎత్తున కార్డుల జారీ అవసరం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా అందుబాటులో ఉన్న డాటా, సమగ్రసర్వేలో తేలిన వివరాల ఆధారంగా కొత్త కార్డుల జారీ, ప్రస్తుత కార్డుల కొనసాగింపు కసరత్తును అధికారులు చేపడుతున్నారు. -
‘ఔటర్’పై రయ్.. రయ్
రోజుకు 35 వేల వాహనాల రాకపోకలు కనిపించని ‘విభజన’ ప్రభావం సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర విభజన ప్రభావం పలు రంగాలపై పడినా.. ఔటర్ రింగ్ రోడ్డు ట్రాఫిక్పై మాత్రం కనిపించట్లేదు. ఈ ఎక్స్ప్రెస్ వేలో ప్రయాణించే వాహనాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఔటర్పై ట్రాఫిక్ తగ్గవచ్చని అధికార వర్గాలు అంచనా వేశాయి. కొంతమేర టోల్ ఆదాయం పడిపోయే ప్రమాదం ఉందని భావించాయి. అయితే, విభజన జరిగి నాలుగు నెలలైనా వాహనాల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం 158 కి .మీ.కుగాను ప్రస్తుతం పెద్ద అంబర్పేట నుంచి శంషాబాద్ మీదుగా శామీర్పేట వరకు 120 కి.మీ. అందుబాటులోకి వచ్చింది. మొదట్లో పటాన్చెరు నుంచి పెద్ద అంబర్పేట వరకు 85కి.మీ మార్గంలో టోల్ వసూలు చేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించి, ఆ బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించాలని భావించారు. ఆ మేరకు 2011 మార్చిలో ఔటర్ ట్రాఫిక్పై సర్వే చేసి రోజుకు సుమారు 20 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్టు లెక్క తేల్చారు. దీని ఆధారంగా అప్సెట్ ప్రైస్ (కనీస మొత్తాన్ని) నిర్ణయించి టెండర్ పిలిచారు. ఆ తర్వాత పటాన్చెరు- శామీర్పేట మార్గం 33కి.మీ. అందుబాటులోకి రావడంతో 2012 డిసెంబర్లో మరోసారి ట్రాఫిక్ సర్వే చేశారు. అప్పట్లో రోజుకు 25 వేల వరకు వాహనాల తిరుగుతున్నట్టు గుర్తించారు. దీంతో ఆ 33కి.మీ. మార్గానికి టోల్ వసూలుకు టెండర్ పిలవగా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఈ మార్గన్ని కూడా పాత ఏజెన్సీకే అప్పగించారు. తొమ్మిది నెలల తర్వాత టోల్ వసూలు ఒప్పందం గడువు ముగియడంతో 120కి.మీ. మార్గానికి టెండర్ పిలిచేందుకు 2014 జనవరిలో ట్రాఫిక్ సర్వే చేశారు. ఈ మార్గంలో రోజుకు 33వేల నుంచి 35 వేల వాహనాలు నడుస్తున్నట్టు గుర్తించారు. సర్వే ఫలితాల ఆధారంగా అప్సెట్ ప్రైస్ను నిర్ణయించి హెచ్ఎండీఏ టెండర్ పిలించింది. నెలకు రూ.3.92 కోట్లు చెల్లించేందుకు సిద్ధపడ్డ ఓ సంస్థకు టోల్ వసూలు బాధ్యతను అప్పగించారు. దీన్నిబట్టి హెచ్ఎండీఏ ఆదాయానికి ఢోకా లేదని స్పష్టమవుతోంది. -
మళ్లీ కాసుల గలగలలు
ప్రభుత్వ ఖజానాకు మళ్లీ పెరిగిన ఆదాయం పుంజుకున్న వాణిజ్య పన్నుల రాబడి ఆగస్టులో లక్ష్యాన్ని మించిన ఆదాయం రాష్ట్ర విభజన తరువాత గాడిలో పడిన పరిస్థితి సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర విభజనతో తగ్గిన మహానగర వాణిజ్యపన్నుల శాఖ ఆదాయం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఆగస్టు నెలలో వివిధ పన్నుల ద్వారా లక్ష్యానికి మించి ఆదాయం సమకూరింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రంగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తోన్న సంస్థలు పన్నుల చెల్లింపుపై ఆసక్తి కనబర్చక పోవడంతో సగానికిపైగా ఆదాయం పడిపోయింది. కొత్త రాష్ట్రం ఏర్పడినా వ్యాపార లావాదేవీలపై పెద్దగా ప్రభావం లేకపోవడంతో మొదట్లో వెనుకడుగు వేసిన సంస్థలు పన్నుల చెల్లింపులకు సిద్దమయ్యాయి. దీంతో తాజాగా పన్నుల చెల్లింపులు మళ్లీ పెరిగాయి. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం అత్యధికంగా వాణిజ్య పన్నుల శాఖ నుంచే సమకూరుతోంది. వాణిజ్య పన్నుల శాఖకు సమకూరే ఆదాయంలో హైదరాబాద్ నగర రాబడి అత్యంత కీలకం. ఉమ్మడి రాష్ట్ర రాబడిలో సైతం 74 శాతం వరకు నగరం నుంచే జమ అయ్యేది. ప్రస్తుతం కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ శాఖ వసూలు చేసే పన్నుల్లో వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) ప్రధానమైనది. ఇదేకాకుండా వృత్తి, వినోద తదితర పన్నుల ద్వారా కూడా కొంతవరకు రాబడి లభిస్తోంది. మొత్తం మీద వ్యాట్ ద్వారానే సుమారు 85 శాతానికిపైగా, 15 శాతం మిగితా పన్నుల ద్వారా ఆదాయం సమకూరుతోంది. నగర రాబడి ఇలా.. తెలంగాణ రాష్ర్ట ఖజానాకు మహానగరం వాణిజ్య పన్నుల శాఖలు కల్పతరువనే చెప్పాలి. నగరంలోని డివిజన్ల నుంచే అత్యధిక రాబడి వస్తోంది. రాష్ట్రం మొత్తంలో 12 డివిజన్లు ఉండగా అందులో ఏడు డివిజన్లు నగర పరిధిలోనే ఉన్నాయి. మొత్తం డివిజన్లకు కలిపి వివిధ పన్నుల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ నుంచి ఆగస్టు) వరకు లభించిన ఆదాయం రూ.3,000.74 కోట్లు కాగా, అందులో నగరంలోని డివిజన్లు నుంచి లభించిన రాబడి మొత్తం రూ.2,493.68 కోట్లకుపైనే. అందులో పంజగుట్ట డివిజన్ నుంచి రూ.500.68 కోట్లు, బేగంపేట నుంచి రూ. 444.02 కోట్లు, అబిడ్స్ నుంచి రూ.421.84 కోట్ల వరకు రాబడి వసూలైనట్టు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, లిక్కర్, సిమెంట్, ఐరన్, గోల్డ్, హోటల్ ఇండస్ట్రీ, షాపింగ్ మాల్స్ తదితర సంస్థల నుంచి భారీగా పన్నులు వసూలవుతాయి. -
రెండు రోజుల ముందే ఏర్పాట్లు పూర్తి
దసరా ఉత్సవాలపై సబ్ కలెక్టర్, పోలీసు కమిషనర్ సమీక్ష భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని ప్రకటన సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన తరువాత ఇంద్రకీలాద్రిపై తొలిసారిగా జరుగుతున్న దసరా ఉత్సవాలకు అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలకు రెండు రోజులు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేసి, భక్తులకు ఏ విధమైన ఇబ్బందీ రాకుండా చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ నాగలక్ష్మి, పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు, ఈవో త్రినాథరావు ప్రకటించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో వారు దసరా ఉత్సవ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సీపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 23వ తేదీ సాయంత్రానికి ఏర్పాట్లు పూర్తవుతాయని, 24 ఉదయం నుంచి పోలీసులు దసరా ఉత్సవ ఏర్పాట్లలో పాల్గొంటారని తెలిపారు. ఏటా రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది, ఈసారి మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తారని వివరించారు. నగర పోలీసులను కేవలం పర్యవేక్షణకు మాత్రమే ఉపయోగిస్తామని, నగరంలో శాంతి భద్రతల విధులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఉత్సవాల భద్రత కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వీఐపీలకు పూర్తి స్థాయిలో భద్రత ఉంటుందని చెప్పారు. భక్తుల రద్దీ తక్కువగా ఉన్నప్పుడు పోలీసు నిబంధనలు సడలిస్తామని తెలిపారు. భక్తులకు అర్థమయ్యే విధంగా రూట్మ్యాప్లు ఏర్పాటు చేయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇబ్బందుల్లేకుండా చూస్తాం : సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు ఎదురవకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బస్స్టాండ్, రైల్వే స్టేషన్లో ప్రత్యేక ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేస్తామని, స్థానఘాట్లలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు. మూలా నక్షత్రం, విజయదశమి రోజులలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులు క్యూలైన్లలో ఎక్కువ సేపు నిలబడకుండా అమ్మవారి దర్శనం త్వరగా అయ్యేలా చూస్తామని చెప్పారు. విద్యుత్, ఇరిగేషన్ సమస్యలు లేకుండా ఆయా శాఖల అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఆలయ ఈవో త్రినాథరావు మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి వేల మంది భక్తులు తరలి వస్తున్నందున, వారికి కావాల్సిన ప్రసాదాలు, దర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావును ఆహ్వానించామన్నారు. దుర్గాష్టమి, మహార్ణవమి ఒకే రోజు వచ్చినందున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ప్రతి ప్రాంతంలో దేవస్థానం సిబ్బంది అందుబాటులో ఉంటారని, వారిని అడిగి భక్తులు కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చని సూచించారు. పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, దేవాదాయ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఎంసెట్ అభ్యర్థులకు సుప్రీం షాక్
సాక్షి, ఖమ్మం: ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ కోసం ఎదురుచూసిన అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. ఈ కౌన్సెలింగ్కు సప్రీంకోర్టు అనుమతి నిరాకరించడంతో జిల్లాలోని దాదాపు రెండువేల మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలోని 14 కళాశాలలకు అనుమతి రాలేదు. వాటిపై ఆశలు పెట్టుకున్న విద్యార్థులు చివరకు డిగ్రీలో చేరదామనుకున్నా.. సమయం మించి పోవడంతో ఆ ఆశలూ గల్లంతయ్యాయి. ఇక చివరి ఆశగా ఆయా కళాశాలల యాజమాన్యాలు కౌన్సెలింగ్కు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఎంసెట్ అర్హత పరీక్ష పూర్తయ్యాక రాష్ట్ర విభజన ప్రక్రియతో అడ్మిషన్లలో గందరగోళం తలెత్తింది. సుప్రీంకోర్టు జోక్యంతో ఉన్నత విద్యామండలి గత నెల 14 నుంచి 23వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేయించింది. సీట్ల కేటాయింపు 31 వరకు పూర్తయింది. ఎంసెట్లో జిల్లాలో 7,500 మంది అర్హత సాధించారు. జిల్లాలోని 23 ఇంజనీరింగ్ కళాశాలల్లో 8,200 సీట్లు ఉన్నాయి. వసతులు సరిగా లేవన్న కారణంతో జేఎన్టీయూ 174 కళాశాలల్లో కౌన్సెలింగ్ నిర్వహణకు అనుమతి నిరాకరించింది. వీటిలో జిల్లాకు చెందిన14 కళాశాలలు ఉన్నాయి. వెబ్ కౌన్సెలింగ్లో ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం కేంద్రాల్లో 5,600 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేయించుకున్నారు. వీరిలో జిల్లాలో కౌన్సెలింగ్కు అనుమతి ఇచ్చిన తొమ్మిది కాలేజీల్లో 2,500 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్తో సీట్లు పొందారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన మిగతా మూడువేల మంది విద్యార్థుల్లో సుమారు వెయ్యి మంది హైదరాబాద్లోని కళాశాలల్లో వెబ్ఆప్షన్ ఇచ్చారు. ఇక రెండు వేల మంది జిల్లాలోని కళాశాలల్లో కన్వీనర్ కోటాలో వెబ్ ఆప్షన్ ఇచ్చినా వారు ఆశించిన కోర్సుల్లో సీట్లు లేవు. వారంతా రెండో విడత కౌన్సెలింగ్పై ఆశలు పెట్టుకున్నారు. సుప్రీం తీర్పుతో ఏమి చేయాలో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మార్చుకుందామనుకొని.. అనుమతి లేని వాటిలో తమకు నచ్చిన కళాశాలలు కూడా ఉండటంతో కొందరు విద్యార్థులు రెండో దశ కౌన్సెలింగ్లో సీటు మార్చుకుందామనే ఉద్దేశంతో ఏదో కళాశాలను మొదటి విడతలో ఆప్షన్గా ఎంచుకున్నారు. విద్యార్థులు ఎంచుకున్న కళాశాలల్లో రిపోర్టు చేసేందుకు అధికారులు ఈనెల 5వ తేదీ తుది గడువు పెట్టారు. ఈలోపు రాష్ట్రవ్యాప్తంగా 174 కళాశాలలు హైకోర్టును ఆశ్రయించి షరతులతో కూడిన అనుమతి తెచ్చుకున్నాయి. ఇందులో జిల్లాకు చెందిన మిగతా కళాశాలలు ఉన్నాయి. వెంటనే ఆయా కళాశాలలు తమ కాలేజీల్లో అడ్మిషన్లు పొందవచ్చంటూ.. రెండో కౌన్సెలింగ్లో అవకాశం ఉంటుందంటూ జోరుగా ప్రచారం చేశాయి. జిల్లాలో సుమారు 200 మంది విద్యార్థులు మొదటి కౌన్సెలింగ్లో ఎంచుకున్న కళాశాలల్లో రిపోర్టు చేయలేదు. వీరితోపాటు మరో రెండువేల మంది విద్యార్థులు రెండోదశ కౌన్సెలింగ్పై ఆశలు పెట్టుకున్నారు. సుప్రీంకోర్టు రెండో విడత కౌన్సెలింగ్కు అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. నూతన ప్రవేశాలకు అవకాశం ఇవ్వకున్నా కనీసం కళాశాలల మార్పిడికైనా అనుమతించాలని కోరుతున్నారు. కొందరు విద్యార్థులు స్పష్టత కోసం కౌన్సెలింగ్ కేంద్రాల వద్దకు పరుగులు తీస్తున్నా...అక్కడ ఎలాంటి సమాచారం చెప్పేవారు లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. డిగ్రీలో చేరే అవకాశం లేక.. కాలేజీలకు అనుమతి వస్తుందని భావించిన విద్యార్థులు చివరకు డిగ్రీలో చేరుదామనుకున్నా సమయం దాటి పోయింది. ఇప్పటికే డిగ్రీ బీఎస్సీ కోర్సులో సీట్లు భర్తీ అయ్యాయి. తొలి విడతలో జిల్లాలోని కాలేజీల్లో ఆప్షన్ ఇచ్చుకొని సీటు రాక, రెండో విడత కౌన్సెలింగ్ కోసం ఎదురుచూసిన విద్యార్థులు ఇప్పుడు డిగ్రీ కళాశాలల చుట్టూ సీటు కోసం తిరుగుతున్నారు. డిమాండ్ ఉన్న కోర్సులు భర్తీ కావడం.. సిలబస్ 25 శాతం వరకు పూర్తి కావడంతో ఏం చేయాలో తెలియక త లపట్టుకుంటున్నారు. ఏ డిగ్రీ కాలేజీలోనైనా సీట్లు ఉన్నా ప్రాధాన్యత లేని కోర్సులే ఉన్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చివరి ఆశ కోసం కౌన్సెలింగ్కు అనుమతికి ముస్లిం మైనారిటీ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఒకవేళ కౌన్సెలింగ్కు అనుమతి వచ్చినా జరగాల్సిన నష్టం జరిగిందని యాజమన్యాలు అభిప్రాయపడుతున్నాయి. -
ఆధ్యాత్మిక కేంద్రంలో.. చారిత్రక ఘట్టం!
14వ ఆర్థిక సంఘం సమావేశానికి వేదికైన తిరుపతి సాధారణంగా రాజధానిలోనే ఆర్థిక సంఘం సమావేశం విజయవాడలో కోడ్ అమల్లో ఉండటంతో వేదిక మారిన వైనం చారిత్రక ఘట్టానికి ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి వేదికైంది. విభజన తర్వాత రాష్ట్రంలో ప్రధానమైన 14వ ఆర్థిక సంఘం సమావేశానికి తిరుపతి వేదికగా మారింది. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు తిరుపతికి చేరుకున్న 14 ఆర్థిక సంఘం.. శుక్రవారం మొత్తం పలు అంశాలపై రాష్ర్ట ప్రతినిధులతో చర్చించింది. శనివారం ఉదయం పది గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లనుంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి : పన్నుల ద్వారా కేంద్రానికి వచ్చే ఆదా యం రాష్ట్రానికి పంపిణీచేసే ప్రక్రియను ఆర్థిక సంఘం పర్యవేక్షిస్తుంది. రాజ్యాంగంలో 280 వ అధికరణ ద్వారా ఆర్థిక సంఘానికి ప్రత్యేకమైన విధులు, అధికారాలు కల్పించారు. తద్వారా ఆ సంస్థకు రాజ్యాంగ హోదా కల్పిం చారు. 2014-15 నుంచి 2019-20 వరకూ 14వ ఆర్థిక సంఘంచేసే ప్రతిపాదనలు అమ ల్లో ఉంటాయి. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే వైవీ.రెడ్డి అధ్యక్షతన 14వ ఆర్థిక సంఘాన్ని కేంద్రం ఏర్పాటుచేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర నిధుల పంపిణీపై సమావేశాలు నిర్వహించాలని రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ఆర్థిక సంఘాన్ని ఆదేశించారు. ఆ మేరకు 14వ ఆర్థిక సంఘం పర్యటన ఖరారైంది. రాష్ట్రంలో సెప్టెంబర్ 11 నుంచి 13 వరకూ పర్యటించాలని ఆర్థిక సంఘం నిర్ణయిం చింది. ఆర్థిక సంఘం సమావేశాలను హైదరాబాద్లో నిర్వహించడం సమంజసం కాదని భావించిన ప్రభుత్వం.. తొలుత విజయవాడను వేదికగా ఎంపిక చేసింది. కానీ.. కృష్ణాజిల్లాలోని నంది గామ నియోజకవర్గానికి ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు. దాంతో.. అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో 14వ ఆర్థిక సంఘం సమావేశాలకు తిరుపతి వేదికగా మారింది. ఢిల్లీ నుంచి గురువారం సాయంత్రం నాలుగు గంటలకు తిరుపతికి చేరుకున్న 14వ ఆర్థిక సంఘం జిల్లా అధికారయంత్రాంగంతో సమావేశమైంది. గురువారం రాత్రి తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంది. శుక్రవారం ఉద యం పది గంటలకు 14వ ఆర్థిక సంఘంతో సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి యనమల, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్.కృష్ణారావు, ఆర్థికశాఖ కార్యదర్శి పీవీ.రమేష్ తదితరులు సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ఆర్థిక సంఘం ముందు ఏకరవు పెట్టారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల వరకూ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులతో సమావేశమైన ఆర్థిక సంఘం.. వారి ప్రతిపాదనలను స్వీకరించింది. మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశమైన ఆర్థిక సంఘం.. నిధుల కేటాయింపులో అభిప్రాయాలను సేకరించింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి 5.30 గంటల వరకూ రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశమైంది. నిధుల కేటాయింపు.. పంపిణీలో రాజకీయపార్టీల అభిప్రాయాలనూ.. సూచనలను సేకరించింది. వీటిని క్రోడీకరించి కేంద్రానికి అక్టోబర్లో నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదిక ఆధారంగా కేంద్రం మన రాష్ట్రానికి నిధులను కేటాయించనుంది. శుక్రవారం సమావేశాలు ముగిశాక 14వ ఆర్థిక సంఘం సభ్యులు తిరుపతిలో ఓ ప్రైవేటు హోటల్లో బస చేసి శనివారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. -
ఆర్థిక సంఘం సమావేశానికి విస్తృత ఏర్పాట్లు
తిరుపతి/చిత్తూరు సెంట్రల్/రేణిగుంట: తిరుపతిలో శుక్రవారం నిర్వహించనున్న 14వ ఆర్థిక సంఘ సమావేశానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటి సారిగా తిరుపతిలో జరుగుతున్న ఈ సమావేశాన్ని జిల్లా అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా భావించింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులు పాల్గొంటారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడి స్వాగతోపన్యాసంతో సమావేశం ప్రారంభమవుతుంది. 10.35 గంటలకు ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం 11 గంటల నుంచి రాష్ట్ర ఆర్ధిక ప్రగతికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చిస్తారు. ఈ సందర్భంగా తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్జట్టి ఆధ్వర్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన ఇలా.. తిరుపతిలో శుక్రవారం జరగనున్న 14వ ఆర్థిక సంఘం సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక విమానంలో బయలుదేరి వస్తారని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్జైన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 9.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని 9.30 గంటలకు అక్కడినుంచి బయలుదేరుతారు. 9.50 గంటలకు తిరుచానూరు రోడ్డులోని గ్రాండ్ రిడ్జ్ హోటల్కు చేరుకుంటారు. 10.00 నుంచి 10.30 గంటల వరకు ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులతో ముఖాముఖిలో పాల్గొంటారు. 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాంకేతిక అంశాలపై జరగనున్న కార్యక్రమంలో ఆర్థిక సంఘం సభ్యులతో పాటు పాల్గొంటారు. ఆర్థిక సంఘానికి స్వాగతం డాక్టర్ వైవీ రెడ్డి చైర్మన్గా ఏర్పాటైన 14 వ ఆర్థిక సంఘం గురువారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో రేణిగుంట చేరుకుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జట్టి, ఆర్డీవో రంగయ్య, ఇతర శాఖల అధికారులు స్వాగతం పలికారు. వైవీరెడ్డితో పాటు 12 మంది సభ్యులు విమానాశ్రయం నుంచి ప్రత్యేక వాహనాల్లో తిరుపతికి వెళ్లారు. కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం ఆర్థిక సంఘ సమావేశంలో పాల్గొని ప్రసంగించేందుకు తిరుపతికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిలో పనిగా టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆర్థిక సంఘ సమావేశంలో ప్రసంగించిన అనంతరం ఒంటి గంటకు సమీపంలోనే ఉన్న ఎస్ఎస్బి కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
పోలీస్ బండి.. ఎక్కడండీ..?
ఏపీలో.. సగం పోలీస్ స్టేషన్లకు వాహనాలు కరువు గస్తీ నిర్వహించే కానిస్టేబుళ్లకు ద్విచక్ర వాహనాలు ఇతర రాష్ట్రాల్లో వాహనాల వినియోగంపై అధ్యయనం హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్ర విభజనానంతరం.. ఆంధ్రప్రదేశ్లో దాదాపు సగానికి పైగా పోలీస్ స్టేషన్లకు వాహనాలు లేవని తేలింది. వీటికి ఇన్చార్జ్లుగా వ్యవహరించే స్టేషన్ హౌస్ ఆఫీసర్లు సైతం సొంత వాహనాల పైనే తిరుగుతున్నారని సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగిన పంపకాల్లో భాగంగా ఏపీకి రావాల్సిన వాహనాల కంటే 1060 వరకు తక్కువ రావడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం 13 జిల్లాల ఎస్పీ, మరో మూడు అర్బన్ జిల్లా, రెండు కమిషనరేట్లు, 4 రేంజ్, 3 జోన్ కార్యాలయాలతో పాటు 195 సర్కిళ్లు, 854 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటికి తోడు సీఐడీ, ఏఆర్ తదితర స్పెషల్ యూనిట్లు సైతం పనిచేస్తున్నాయి. వీటిలో 471 స్టేషన్లతో పాటు దాదాపు సగం మంది అధికారులకు ప్రభుత్వం సమకూర్చిన వాహనాలు లేవు. ఫలితంగా పెట్రోలింగ్తో పాటు ఇతర కార్యకలాపాలు మందకొడిగా సాగుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకున్న డీజీపీ కార్యాలయం ఈ బడ్జెట్లో కేటాయించిన రూ.100 కోట్లను వెచ్చించి విడతల వారీగా అధికారులకు తేలికపాటి వాహనాలు, గస్తీ నిర్వహించే బీటు కానిస్టేబుళ్లకు ద్విచక్ర వాహనాలు సమకూర్చాలని నిర్ణయించింది. ► అయితే, టెండర్ల ప్రక్రియ ద్వారా వాహనాలను కొనుగోలు చేసేందుకు సమయం పడుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వ అధీనంలోని డెరైక్టర్ జనరల్ ఆఫ్ సేల్స్ అండ్ ప్రపోజల్స్(డీజీఎస్పీ) నిర్దేశిత రేట్ల ప్రకారం ఆయా వాహనాలను కొనుగోలు చేసే అవకాశముంది. ► దీంతో డీజీఎస్పీ జాబితాలో ఉన్న కంపెనీల వివరాలు సేకరించిన డీజీపీ కార్యాలయం వాటిలో రాష్ట్రంలోని పరిస్థితులు, అధికారులకు అనుకూలంగా ఉండే వాహనాలను కొనాలని నిర్ణయించింది. ఇప్పటికే దక్షిణాదిలో ఉన్న పొరుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలో ఉన్న ప్రధాన నగరాల్లోనూ ఆయా పోలీసు విభాగాలు ఏస్థాయి అధికారులకు ఏ వాహనాలు వినియోగిస్తున్నారనే అంశంపై అధ్యయనం చేసింది. ► ఎస్పీ కంటే కిందిస్థాయి వారు సుమోలు వాడుతుండగా.. ఎస్పీ ఆ పైస్థాయి అధికారులు బొలేరో, స్కార్పియో, ఇన్నోవా, స్విఫ్ట్ డిజైర్ వంటివి వినియోగిస్తున్నారని గుర్తించారు. ► స్కార్పియో వాహనం డీజీఎస్పీ జాబితాలో లేకపోవడంతో పాటు దీని వినియోగంలోనూ అనేక ఇబ్బందులు ఉంటాయని డీజీపీ కార్యాలయ అధికారులు చెబుతున్నారు. ఈ వాహనం ఎక్కడానికి కొంత ఇబ్బంది ఉండడంతో పాటు లోపల ఖాళీ కూడా తక్కువగా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ► ఈ నేపథ్యంలోనే సుమో, ఇన్నోవాలనే కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విభాగాలతో పాటు ఉన్నతాధికారులు వినియోగించేందుకు డిజైర్ తరహావీ సమకూర్చుకోవాలని భావిస్తున్నారు. ఊరూ.100 కోట్లు వెచ్చించి ఒకేసారి వాహనాలు కొనుగోలు చేస్తే వాటి వల్ల ఇబ్బందులు తలెత్తితే మార్పిడి సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే ప్రాథమికంగా తొలి విడతలో కేవలం 150 తేలికపాటి వాహనాలు కొనాలని నిర్ణయించారు. ► వివిధ కంపెనీల ప్రతినిధులు పోలీసు ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్(పీటీఓ)లో తమ వాహనాలను ఉన్నతాధికారులకు చూపించారు. పోలీసు విభాగం సరఫరాకు ఆర్డర్ ఇస్తే వాటిలో చేయనున్న మార్పు చేర్పుల్నీ డీజీపీ నేతృత్వంలోని పర్చేజింగ్ కమిటీకి వివరించారు. -
పురా‘వస్తు’ పంపకమెలా?
హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లోని పురావస్తు ప్రదర్శనశాలలో వెలకట్టలేని ప్రాచీన సంపద ఆ పంపిణీకి జనాభా ప్రాతిపదికా? సంపద లభ్యత ప్రాదిపదికా? అధికారవర్గాల్లో ఆసక్తికర చర్చ విలువైన సంపదకు నెలవైన మ్యూజియం హైదరాబాద్: రాష్ట్ర విభజనలో భాగంగా హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో ఉన్న పురావస్తు శాలలోని వెల కట్టలేని పురాతన సంపదను ఎలా పంపిణీ చేయాలన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పునర్వ్యవస్థీకరణ చట్టం తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల విభజనపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య సయోధ్య కుదరడం లేదు. ఈ పరిస్థితుల్లో వెల కట్టలేని ప్రాచీన సంపదను ఇరు రాష్ట్రాలు ఎలా పంపిణీ చేసుకుంటాయి. ఇందుకు ఏ ప్రాతిపదికను అనుసరిస్తాయన్నది ఉన్నతాధికార వర్గా ల్లో చర్చనీయాశంగా ఉంది. ఇతర సంస్థల విభజనలా పురావస్తు శాల విభజన సాధ్యం కాదు. ఇది పురావస్తు శాఖ కింద ఉండటంతో రాష్ట్ర విభజన చట్టంలోని ఏ షెడ్యూల్లోనూ దీనిని చేర్చలేదు. పురావస్తు శాలలో ఉన్న ప్రాచీన సంపదను జనాభా ప్రాతిపదికన పంపిణీ చేస్తారా? లేక ఏ ప్రాంతంలో సంపద లభ్యమైందో అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా పంపిణీ చేస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. తెలంగాణ ప్రభుత్వం గాని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని ఈ సంపద పంపిణీపై ఇంకా దృష్టి సారించలేదు. అత్యంత విలువైన ఆ సంపద పంపిణీ జరగాలంటే ఆ రంగంలో నిష్ణాతులైన వారితో కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఉన్నతాధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ పురావస్తుశాలలో బుద్ధుని అవశేషాలు దగ్గర నుంచి నాటి యుద్ధాల్లో రాజులు వినియోగించిన పరికరాలు, ఎంతో విలువైన ఒరిజనల్ పెయిం టింగ్స్, బంగారు, వెండి, రాగి నాణేలు, వెలకట్టలేని బంగారు ఆభరణాలు ఉన్నాయి. సంపద లభించిన ప్రాంతం, ఆ సంపదకు విలువ కట్ట డం అంత సులభతరం కాదని అధికారులు అం టున్నారు. అధికార వర్గాలు ప్రాథమిక అంచనా మేరకు పబ్లిక్ గార్డెన్స్ పురావస్తుశాలలో ఉన్న ప్రాచీన సంపద ఈ విధంగా ఉంది. నాలుగు వేల బంగారు, 14 వేల వెండి, 30 వేల రాగి మూల నాణేలు, అలాగే ఉమ్మడి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో లభ్యమైన ఎంతో విలువైన పలు బంగారు ఆభరణాలున్నాయి. నాటి మహారాజులకు చెందిన ప్రాచీన కాలంనాటి 2,500 ఒరిజినల్ పెయింటింగ్స్తో పాటు బుద్ధుడి ఎముక ముక్క ఉంది. ఆ ఎముక ముక్క కోసం గతంలో చైనా రూ. 57 కోట్లు చెల్లించడానికి ముందుకొచ్చింది. దశాబ్దాల నుంచి భద్రపరిచిన మమ్మీ కూడా అందులో ఉంది. ప్రాచీన కాల యుద్ధాల్లో వాడిన కవచాలు, కిరీ టాలు, బల్లేలు,ఇతర యుద్ధ పరికరాలున్నాయి. -
66 మంది ఐఏఎస్ల కొరత
పలు శాఖల్లో పోస్టుల తగ్గింపునకు కసరత్తు 211 ఐఏఎస్ పోస్టుల కేటాయింపు 165 మంది మాత్రమే పంపిణీ హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 66 మంది ఐఏఎస్ల కొరత ఏర్పడింది. ఈ సమస్యను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు కసరత్తు చేస్తున్నారు. అరుుతే పలుశాఖల్లో ఐఏఎస్ల పోస్టులను తగ్గించడమే తప్ప మరో ఇప్పటికిప్పుడు మార్గం లేదని ఉన్నతాధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక, రెవెన్యూ, సాగునీటి, వవసాయ శాఖల్లో ముగ్గురు చొప్పున ఐఏఎస్లుండగా.. ఒక్కో పోస్టు చొప్పున తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. పరిశ్రమల శాఖలో కూడా భారీ పరిశ్రమలు, గనులు, పెట్టుబడులు మౌలిక వసతుల కల్పనకు వేర్వేరుగా ముగ్గురు ఐఏఎస్లుండగా.. రెండు పోస్టులకు కుదించనున్నారు. మున్సిపల్ శాఖలో రెండు ఐఏఎస్ పోస్టులుండగా ఇప్పుడు ఒక పోస్టుకే పరిమితం చేయనున్నారు. ఇలా పలు శాఖల్లో ఐఏఎస్ పోస్టులను తగ్గించినా ఇంకా కొరత ఉంటుందని, దీన్ని అధిగమించడానికి కేంద్ర సర్వీసులో ఉన్న అధికారులను వెనక్కు రప్పించుకోవడంతో పాటు ప్రస్తుతం డిప్యుటేషన్పై ఉన్న అధికారులను కొనసాగించుకోవాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 211 ఐఏఎస్ పోస్టులను కేటాయించినా.. పంపిణీలో 165 మంది మాత్రమే రాష్ట్రానికి వచ్చారు. అరుుతే ఇందులోనూ 20 మంది కేంద్ర సర్వీసులో పనిచేస్తున్నారు. దీంతో అందుబాటులో ఉన్న ఐఏఎస్లు 145 మందికే పరిమితం అయ్యూరు. ఈ విధంగా మొత్తం 66 మంది ఐఏఎస్ల కొరత ఏర్పడింది. రాష్ట్రంలోని 13 జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల పోస్టులు, మున్సిపాలిటీలకు కలిపి 40 మంది ఐఏఏస్లు అవసరం. అలాగే సచివాలయ స్థాయి శాఖలకు 40 మంది, డెరైక్టరేట్లకు 70 మంది, వివిధ ప్రాజెక్టుల డెరైక్టర్లుగా 15 మంది ఐఏఎస్లు ప్రధానంగా అవసరం ఉంటుంది. ప్రత్యూష్ సిన్హా కమిటీ తుది పంపిణీ జాబితాకు ప్రధానమంత్రి మోడీ ఆమోదం లభించిన వెంటనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కేడర్కు చెందిన ఐఏఎస్ల పేర్లతో గెజిట్ నోటిఫికేషన్ జారీ కానుంది. వెనువెంటనే ఏపీ ప్రభుత్వం పోస్టుల కుదింపుతో పాటు ఐఏఎస్ల బదిలీలపై దృష్టి సారించనుందని అధికార వర్గాలు తెలిపాయి. -
జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలి
జెడ్పీ తొలి సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు మచిలీపట్నం : రాష్ట్ర విభజన అనతరం తలెత్తిన ఇబ్బందుల నేపథ్యంలో కృష్ణా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరు పాటుపడాలని పలువురు ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. నవ్యాంధ్రప్రదేశ్లో జిల్లాకు ప్రత్యేక స్థానం లభించనుందని, అందుకు తగిన విధంగా అభివృద్ధి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. మచిలీపట్నంలోని జెడ్పీ కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా పరిషత్ తొలి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు జిల్లా అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. సమావేశాలు అర్థవంతంగా సాగాలి జెడ్పీ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు జిల్లా అభివృద్ధిపై ప్రభావం చూపుతాయి. సమావేశాలు అర్థవంతంగా జరిగేలా నూతనంగా ఎన్నికైన సభ్యులు సహకరించాలి. ప్రజా సమస్యలపై చర్చించి, పరిష్కరించేందుకు జిల్లా పరిషత్ సమావేశమే వేదికగా మారాలి. అనవసర విషయాలను ప్రస్తావించి విలువైన సమయాన్ని వృథా చేయవద్దు. - కొనకళ్ల నారాయణరావు, బందరు ఎంపీ యూపీ పాఠశాలలు రద్దు కావు యూపీ పాఠశాలల్లో 6, 7 తరగతుల్లో 20 మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉంటే ఆ పాఠశాలను రద్దు చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ పాఠశాలలను రద్దు చేయకుండా పాఠశాల విద్యా కమిషనర్ ఉషారాణితో మాట్లాడాము. ఉపాధ్యాయులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు యూపీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలి. సిబ్బందిని నియమించాలి. - కేఎస్ లక్ష్మణరావు, ఎమ్మెల్సీ పాత భవనాలు తొలగించాలి ప్రభుత్వ పాఠశాలల్లో సర్వశిక్షా అభియాన్ ద్వారా నూతన భవనాలు నిర్మిస్తున్నారు. వాటిని ప్రారంభించటం లేదు. శిథిలమైన పాఠశాల భవనాలను తొలగించటం లేదు. పాత భవనాలను తొలగించకపోవటంతో వాటిలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ అంశంపై అధికారులు దృష్టిసారించాలి. - ఉప్పులేటి కల్పన, పామర్రు ఎమ్మెల్యే ఇసుక క్వారీలు తెరిపించాలి ఇసుక క్వారీలు చాలా కాలంగా మూతపడి ఉండటంతో నూజివీడు నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి వచ్చే ఇసుకను అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. జిల్లాలోని క్వారీలను తెరిస్తే తక్కువ ధరకే ఇసుక లభించే అవకాశం ఉంది. పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు ఇసుక అందుబాటులో ఉంటే కొంతమేర ఖర్చు తగ్గుతుంది. - మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, నూజివీడు ఎమ్మెల్యే పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలి జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలి. బందరు పోర్టు నిర్మాణం పూర్తయితే అనుబంధ పరిశ్రమలు స్థాపించడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం రెండు రోజుల పాటు ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసే దిశగా చర్చలు జరిపారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు మా వంతు కృషి చేస్తాం. - కేశినేని శ్రీనివాస్(నాని), విజయవాడ ఎంపీ స్థానిక సంస్థలకు అధికారాలివ్వాలి స్థానిక సంస్థలు బలోపేతం కావాలంటే 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం 29 అంశాలను రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు బదలాయించాలి. పురపాలక సంఘాలకు 18 అంశాలను బదలాయించాల్సిన అవసరం ఉంది. మండలాల్లో ఉన్న ఆసుపత్రుల్లో సరైన వైద్యసేవలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీటిపై జిల్లా పరిషత్ సభ్యులు దృష్టిసారించాలి. - బొడ్డు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ చెరువులు అభివృద్ధి చేయండి తూర్పు కృష్ణా వారికే అధిక పదవులు దక్కుతున్నాయి. ఈ సారి కూడా జెడ్పీ చైర్పర్సన్ విషయంలో అదే జరిగింది. పశ్చిమ కృష్ణా ప్రాంతానికి ప్రతి సారీ అన్యాయం జరుగుతోంది. తిరువూరు నియోజకవర్గంలో 300 చెరువులు ఉన్నాయి. వీటిని బాగు చేస్తే నియోజకవర్గంలో వ్యవసాయానికి నీటి కరువు ఉండదు. జిల్లా పరిషత్, ప్రభుత్వం ద్వారా అయినా ఈ చెరువులను అభివృద్ధి చేయాలి. - కంచి రామారావు, డీసీఎంఎస్ చైర్మన్ కీలక నిర్ణయాలు తీసుకోవాలి జిల్లాలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై జెడ్పీ సమావేశాల్లో పూర్తిస్థాయిలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి. నూతనంగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాలనపై పట్టు సాధించాలి. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. - కొక్కిలిగడ్డ రక్షణ నిధి, తిరువూరు ఎమ్మెల్యే ప్రతిపక్షానికి ప్రాధాన్యత ఇవ్వాలి జిల్లా పరిషత్ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష పాత్రను వైఎస్సార్ సీపీ పోషిస్తుంది. సంప్రదాయానికి విరుద్ధంగా స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. జెడ్పీ చైర్పర్సన్ చదివిన జాబితా ఒకటి, సభ్యులకు ఇచ్చిన జాబితా మరోలా ఉంది. పారదర్శక పాలన అందిస్తామని చెబుతున్న పాలకపక్షం ప్రతిపక్షానికి సమప్రాధాన్యం కల్పించాలి. అప్పుడే ప్రజాసమస్యలపై సముచిత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. - తాతినేని పద్మావతి, జెడ్పీ ప్రతిపక్ష నాయకురాలు నీటిపారుదలపై దృష్టిసారించాలి నీటి పారుదల, డ్రెయినేజీ వ్యవస్థలపై పాలకులు, అధికారులు దృష్టిసారించాలి. జిల్లా అభివృద్ధికి నిధులు తీసుకువచ్చేందుకు మంత్రులు కృషి చేయాలి. ప్రజాసమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలి. విద్య, ఆరోగ్యం తదితర అంశాలపైనా దృష్టిసారించాలి. - కాగిత వెంకట్రావు, పెడన ఎమ్మెల్యే -
సమన్వయంతో పనిచేద్దాం
వాడీవేడిగా జెడ్పీ తొలి సమావేశం జిల్లా అభివృద్ధికి కలిసి ముందుకు సాగుదాం ప్రజాప్రతినిధుల పిలుపు స్టాండింగ్ కమిటీల ఏర్పాటుపై దుమారం పిన్నమనేని, కేఎన్నార్, తంగిరాలలకు నివాళి మచిలీపట్నం : రాష్ట్ర విభజన వల్ల నవ్యాంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం జరిగిందని, నూతన రాష్ట్రంలో కృష్ణా జిల్లా కీలకంగా మారనుందని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు అభిప్రాయపడ్డారు. జిల్లా అభివృద్ధికి పార్టీలకు అతీతంగా సమన్వయంతో కృషిచేయాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. జిల్లా పరిషత్ తొలి సర్వసభ్య ఆదివారం జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ అధ్యక్షతన జరిగింది. జెడ్పీ హాలులో జరిగిన ఈ సమావేశం సాదాసీదాగానే ప్రారంభమైనప్పటికీ స్టాండింగ్ కమిటీల ప్రకటన అనంతరం వేడెక్కింది. నందిగామ ఉప ఎన్నిక కారణంగా కోడ్ అమల్లో ఉండటంతో ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, అధికారుల పరిచయ కార్యక్రమం, స్టాండింగ్ కమిటీల ఏర్పాటుతోనే ఈ సమావేశం ముగిసింది. ఉదయం 11గంటలకు ప్రారంభమైన సమావేశంలో జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొని రాష్ట్ర విభజన అనంతరం జిల్లా అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ ఏడు స్టాండింగ్ కమిటీల జాబితాలను ప్రకటించారు. స్టాండింగ్ కమిటీల ఎంపిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని, పార్టీ పరంగా ఏర్పాటు చేశారని వైఎస్సార్ సీపీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. స్టాండింగ్ కమిటీల నియామకాన్ని పునఃసమీక్షించాలని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కోరడంతో సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ, వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యుల మధ్య స్టాండింగ్ కమిటీల నియామకంపై కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. రాష్ట్ర విభజనతో అన్యాయం జరిగింది రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జెడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలుపెరగని కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పేదరికంపై గెలుపు, పొలం పిలుస్తోంది, నీరు-చెట్టు, బడి పిలుస్తోంది, ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు తదితర పథకాలను ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అక్టోబరు రెండో తేదీ నుంచి నిరంతరాయంగా గృహ అవసరాలకు 24 గంటలు, వ్యవసాయానికి 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలను వేగంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ప్రణాళిక రూపొందించారని పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండటంతో సాగునీటి కష్టాలు తీరుతాయన్నారు. పులిచింతల, పోలవరం పూర్తి చేస్తామని, ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందిస్తామని ప్రకటించారు. బందరు పోర్టు అభివృద్ధితోపాటు జిల్లాలో జరిగే పారిశ్రామిక అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తామని చెప్పారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన అంశాలపై జెడ్పీ సమావేశంలో చర్చించి తమకు నివేదిక అందజేస్తే ప్రధానమంత్రితో మాట్లాడి నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తామని మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) హామీ ఇచ్చారు. జెడ్పీ ఆదాయం వృద్ధికి కృషి : అనూరాధ జిల్లా పరిషత్ ఆదాయాన్ని పెంచి, ఆస్తులను పరిరక్షించుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను చేపడదామని జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా సమావేశంలో ప్రజాసమస్యలపై సమీక్ష నిర్వహించలేకపోతున్నామని, మరో నెల రోజుల్లో పూర్తిస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పారు. జిల్లా వ్యాప్తంగా జెడ్పీకి ఆస్తులు ఉన్నాయని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులపై ఉందన్నారు. జెడ్పీ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, వాటిని పరిరక్షించేందుకు ప్రత్యేక కమిటీని నియమిస్తామని తెలిపారు. ఇసుక సీనరేజ్, జెడ్పీ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయంతో జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. జిల్లా పరిషత్కు చెందిన దుకాణ సముదాయాల అద్దెలు పెంచి పది సంవత్సరాలు గడిచిందని, వీటి పెంపునకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పాలనలో అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తామన్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో జిల్లా పరిషత్ పాఠశాలల్లో నైట్వాచ్మెన్ పోస్టులను భర్తీ చేస్తామని ఆమె తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తామన్నారు. అనంతరం నూతనంగా ఎంపికైన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలకు జిల్లా స్థాయి అధికారుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. వివిధ శాఖల ద్వారా చేపట్టే పనులు, ఆదాయ వనరులు తదితర అంశాలపై అధికారులు వివరించారు. ఈ సమావేశంలో పెడన, నూజివీడు, తిరువూరు ఎమ్మెల్యేలు కాగిత వెంకట్రావు, మేకా ప్రతాప్ అప్పారావు, కె.రక్షణనిధి, ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, బొడ్డు నాగేశ్వరరావు, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ కంచి రామారావు, జెడ్పీ సీఈవో డి.సుదర్శనం, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు. మంత్రులు ఉమ, కామినేని గైర్హాజరు జిల్లాకు చెందిన మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. మంత్రి కొల్లు రవీంద్ర ఒక్కరే హాజరయ్యారు. తొలుత ఇటీవల మరణించిన నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు పిన్నమనేని కోటేశ్వరరావు, కుక్కల నాగేశ్వరరావుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు విడతలుగా మౌనం పాటించారు. -
నేరాలపై ఉక్కుపాదం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ముప్పై మూడు రోజుల క్రితం జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రవికృష్ణ శాంతిభద్రతలపై దృష్టిపెట్టారు. నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం కర్నూలులో మొదటిసారి నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలు సజావుగా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. మంగళవారం ఎస్పీ రవికృష్ణ ‘సాక్షి’తో కాసేపు ముచ్చటించారు. ఆ వివరాలిలా.. సాక్షి: జిల్లా అంతటా పర్యటించినట్లున్నారు? ఎస్పీ: ఇంకా కొన్ని గ్రామాల్లో పర్యటించాల్సి ఉంది. సాక్షి: జిల్లాలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయి? ఎస్పీ: ప్రస్తుతం శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయి. సాక్షి: ఫ్యాక్షన్ గ్రామాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్పీ: గతంలో 81 గ్రామాల్లో ఫ్యాక్షన్ ఉండేది. ప్రస్తుతం లేదు. అయినా గ్రామస్తులకు అవగాహన కల్పించే చర్యలు చేపట్టాం. పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. అదే విధంగా సీసీఎస్ను పటిష్టపరిచి నేరాలు, అసాంఘిక కార్యక్రమాలను అణచివేస్తాం. సాక్షి: బహిరంగ ప్రదేశాల్లో కొందరు విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ.. చుట్టుపక్కల ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు? ఎస్పీ: ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేస్తున్నాం. స్థానికులు స్పందించి నా దృష్టికి తీసుకొస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అసాంఘిక కార్యక్రమాలు జరక్కుండా సీసీఎస్ను అలర్ట్ చేశాం. సాక్షి: కర్నూలు నగరంలో ట్రాఫిక్ ఎక్కువైంది. ట్రాఫిక్ నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్పీ: ఇప్పటికే ట్రాఫిక్ నియంత్రణపై చర్యలు చేపట్టాం. వాహనదారులు, ఆటోవాలాలకు ట్రాఫిక్పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయంచాం. సాక్షి: మావోల కదలికలు ఎలా ఉన్నాయి? ఎస్పీ: జిల్లాలో మావోల కదలికలు లేవు. అయినా ప్రత్యేక నిఘా పెట్టాం. సాక్షి: సాయిఈశ్వరుడి హత్య కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చింది? ఎస్పీ: ప్రత్యేక టీ మ్ను ఏర్పాటు చేశాం. త్వరలో సాయి ఈశ్వరుడిని హత్య కేసులో నిందితులను పట్టుకుంటాం. సాక్షి: మీపై ఏవైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? ఎస్పీ: అలాంటివేమీ లేవు. -
కొల్లేరుకు కొత్త అందాలు!
రాష్ట్ర విభజనతో కొల్లేరుకు పెరిగిన ప్రాధాన్యం పర్యాటక రంగ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం ఆటపాక పక్షుల కేంద్రానికి ఆధునిక హంగులు కైకలూరు : ప్రకృతి రమణీయతకు మారుపేరైన కొల్లేరు తీరం సరికొత్త అందాలను సంతరించుకోనుంది. విదేశీ పక్షుల సందడితో పర్యాటకులకు కనువిందు చేసే ఆటపాకలో ఆధునిక వసతులు కొలువుదీరనున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొల్లేరు ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మరోవైపు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల మీదుగా పర్యాటక రూట్ మ్యాప్కు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. కొల్లేరు మత్స్య సంపద ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇందుకోసమైనా కొల్లేరు ప్రాంతంలో వసతులు మెరుగుపరిచే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్లో అటవీ, పర్యావరణ అభివృద్ధికి ప్రభుత్వం రూ.418 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లో కొంత అయినా ఖర్చు చేసి కొల్లేరు ఆభయారణ్యంలో వసతులు కల్పించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కొల్లేరు తీరం ఇలా... కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో 77,125 ఎకరాల్లో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉన్నట్లు నిర్ధారించారు. కైకలూరు, మండవల్లి మండలాల్లో 14 గ్రామాలు కొల్లేరు పరిధిలో ఉన్నాయి. అరుదైన పక్షులను తిలకించేందుకు పశ్చిమగోదావరి జిల్లాలో గుడివాకలంక, మొండికోడు, కృష్ణా జిల్లాలో ఆటపాక, మణుగునూరులంక గ్రామాల్లో ప్రదేశాలు ఉన్నాయి. విదేశీ పక్షులను దగ్గర నుంచి చూసే అవకాశం మాత్రం కైకలూరు మండలం ఆటపాక పక్షుల విహార కేంద్రంలోనే ఉంది. ఈ కేంద్రం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రతిపాదనలకే పరిమితం.. కొల్లేరు ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చర్యలు చేపట్టారు. ఆయన కృషి మేరకు కొల్లేరు అభివృద్ధి, యాత్రికులకు సదుపాయాల కోసం రూ.950 కోట్లు అవసరమని 2009లో విస్సా అనే ప్రయివేటు సంస్థ నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్కు అందజేసింది. ఈ నిధులతో రహదారులు, రిసార్ట్లు, పక్షుల సంరక్షణ కేంద్రాల నిర్మాణం వంటివి ఏర్పాటు చేయాలని సూచించారు. వైఎస్ మరణానంతరం ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. మళ్లీ 2013లో కోస్తా ప్రాంత పర్యాటక అభివృద్ధికి రూ.500 కోట్లతో ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అప్పటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ప్రకటించారు. కొండపల్లి హెరిటేజ్ పేరుతో విజయవాడలోని భవానీ ద్వీపం, గాంధీహిల్, కూచిపూడి, మొవ్వ, హంసలదీవి, పెడన కలంకారీ, కొల్లేరులో పర్యాటక అభివృధికి రూ.50 కోట్లును కేటాయిస్తున్నట్లు చిరంజీవి చెప్పారు. కొల్లేరుకు వచ్చే పర్యాటకులు విశ్రాంతి తీసుకోడానికి ఆలపాడు ఉప్పుటేరు వద్ద కాటేజీలు నిర్మించాలని భావించారు. కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం రేవు వద్ద నుంచి ఉప్పుటేరు మీదుగా కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వరకు బోటు యాత్ర, ఆటపాక పక్షుల కేంద్రం నుంచి కొల్లేటి పెద్దింట్లమ్మ దేవస్థానం వరకు బోటు యాత్రకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఉప్పుటేరు వద్ద కాటేజీలు నిర్మిస్తే కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల యాత్రికులకు అనుకూలంగా ఉంటుందని ప్రణాళికలు రూపొందించినా, పనులు పూర్తికాలేదు. పుణ్యక్షేత్రాలకు అనుసంధానం : బాపూజీ కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రాలను అనుసంధానం చేస్తూ కొల్లేరు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలని భావిస్తున్నట్లు టూరిజం డీఎం బాపూజీ చెప్పారు. అదే విధంగా కొల్లేరులో బోటు షికారు, కాటేజీల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని తెలిపారు. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా ఆగడాలలంక వద్ద కొల్లేరు సందర్శకుల కోసం రిసార్ట్లు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. అటవీ పర్యావరణాన్ని అభివృద్ధి చేస్తాం : శ్రీదర్ ఆటపాక పక్షుల కేంద్రం మాదిరిగా మరిన్ని విహార కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉందని అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు శ్రీధర్ చెప్పారు. విదేశీ పక్షులు విడిది కేంద్రంగా కొల్లేరు నిలిచిందని పేర్కొన్నారు. ఆటపాక పక్షుల కేంద్రంలో ఇప్పటికే పక్షుల ఆవాసల కోసం కృత్రిమ స్టాండ్లను ఏర్పాటు చేశామన్నారు. మణుగునూరులంక వద్ద మరో విహార కేంద్రాన్ని అభివృద్ధి చేశామన్నారు. రానున్న రోజుల్లో పక్షుల సంరక్షణ కేంద్రాలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామని ఆయన తెలిపారు. -
9 వేల పోలీసు పోస్టులు మాయం
విభజన నేపథ్యంలో కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ లోటు పూడ్చటంపై అధికారుల మల్లగుల్లాలు హైదరాబాద్: రాష్ట్ర విభజన పంపకాల అంశంలో నిబంధనలు పట్టించుకోకపోవడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి భారీ నష్టం ఏర్పడింది. ఇప్పటికే వాహనాల పంపకంలో ఏపీ 1,060 కోల్పోయినట్లు వెలుగులోకి రాగా.. ఇప్పుడు మరో అన్యాయం బయటపడింది. రాష్ట్రానికి రావాల్సిన పోలీసు పోస్టుల్లో తొమ్మిది వేలకు పైగా నష్టపోయినట్లు వెల్లడైంది. రాష్ట్ర పోలీసు విభాగంపై తీవ్ర ప్రభావం చూపే ఈ లోటును ఎలా పూడ్చాలనే అంశంపై ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆస్తులతో పాటు పోస్టులు తదితరాలను సైతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు 58.32 : 41.68 నిష్పత్తిలో పంచాల్సి ఉంది. పోలీసు విభాగానికి సంబంధించి వాహనాలు, పోస్టుల పంపకంలో ఈ విషయాన్ని విభజన కమిటీ పట్టించుకోలేదు. 2012 డిసెంబర్ నాటికి మంజూరైన పోస్టుల లెక్క ప్రకారం రాష్ట్ర పోలీస్లోని 17 విభాగాల్లో మొత్తం 1,38,823 పోస్టులు ఉన్నాయి. వీటిని విభజన చట్టం ప్రకారం పంచితే ఏపీకి 80,962 పోస్టులు, తెలంగాణకు 57,861 పోస్టులు రావాలి. అయితే వాటికన్నా తెలంగాణకు ఎక్కువ రాగా.. ఆంధ్రప్రదేశ్ మాత్రం దాదాపు తొమ్మిది వేలకు పైగా పోస్టుల్ని కోల్పోయింది. కేవలం సాధారణ పోలీసు పోస్టుల విషయంలోనే కాదు.. చివరకు ఏపీఎస్పీ, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ల్లోనూ ఇదే రీతిలో పంపకాలు జరిగాయి. సాధారణంగా పోలీసు విభాగంలో రాష్ట్ర, జోనల్ వంటి క్యాడర్ పోస్టులు ఉంటాయి. విభజన చట్టం రాష్ట్ర స్థాయి పోస్టుల పంపకానికి మాత్రమే వర్తిస్తుంది. 1975 నాటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఓ జీవోను జారీ చేసింది. దీని ప్రకారం ఏపీఎస్పీలో మినిస్టీరియల్ సిబ్బంది మినహా ప్రతీ పోస్టూ రాష్ట్ర స్థాయికి చెందినదే. అయితే ఏపీఎస్పీని విభజిస్తున్న సందర్భంలో కమిటీ ఎక్కడి యూనిట్లు అక్కడే అన్న నిర్ణయం తీసుకుంది. ఫలితంగా 58.32 శాతం వాటా రావాల్సిన ఏపీకి ఎనిమిది బెటాలియన్లు.. 41.68 శాతం రావాల్సిన తెలంగాణకు తొమ్మిది బెటాలియన్లు వచ్చాయి. -
ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వరూపమిది
దేశవ్యాప్తంగా జనాభాలో పదో స్థానంలో ఆంధ్రప్రదేశ్ కిక్కిరిసిన తూర్పు గోదావరి... విజయనగరంలో అతి తక్కువ 46 మండలాల్లో ప్రమాదం అంచున భూగర్భ జలాలు.. ప్రణాళికా విభాగం సామాజిక ఆర్ధిక సర్వేలో వెల్లడి విద్యావకాశాలు.. ► ఆంధ్రప్రదేశ్లో 146 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 141 ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలలున్నాయి. వీటిలో 2.24 లక్షల మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. ► సాంకేతిక విద్యకొస్తే 1,357 మంది డిప్లొమో, డిగ్రీ స్థాయి వృత్తి విద్య కళాశాలల్లో 3,44,551 మంది విద్యార్ధులు అభ్యసిస్తున్నారు. హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వరూపాన్ని ప్రణాళికా విభాగం తాజాగా విడుదల చేసిన ఆర్థిక సర్వేలో ఆవిష్కరించింది. 2013-14 సామాజిక ఆర్ధిక సర్వే ఆధారంగా ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు, సామాజిక ఆర్ధిక స్థితిగతులు, జనాభా, పంటల ఉత్పత్తి, విద్యావకాశాలు తదితర అంశాలను పొందుపరిచారు. అయితే భౌగోళికంగా రాష్ట్రానికి సరిహద్దుగా మహారాష్ట్ర ఉందని ఆర్థిక సర్వేలో పేర్కొనడం గమనార్హం. భౌగోళిక స్థితిగతులు ► ఉత్తరాన చత్తీస్గఢ్, తెలంగాణాతోపాటు ఒడిశా రాష్ట్రాలు. తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన తమిళనాడు, పడమర కర్ణాటక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు సరిహద్దుగా ఉన్నాయి. రెండు పెద్ద నదులైన కృష్ణా, గోదావరి రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి. జనాభా.. జన సాంద్రత ► ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా 4.94 కోట్లు. పురుషుల సంఖ్య 2.47 కోట్లు(50.1 శాతం) కాగా మహిళల సంఖ్య 2.46 కోట్లు (49.9 శాతం). దేశంలో జనాభా విషయంలో ఏపీ పదో స్థానంలో నిలిచింది. దేశ జనాభాలో రాష్ట్ర జనాభా 4.08 శాతంగా ఉంది. ► 2011 జనాభా లెక్కలతో పోలిస్తే రాష్ట్రంలో జనాభా పెరుగుదల శాతం తగ్గింది. 2011లో పెరుగుదల 9.21 శాతం ఉంటే 2001లో 11.89 శాతంగా ఉంది. అంటే జనాభా పెరుగుదల శాతం పదేళ్లలో 2.68 శాతం తగ్గిందన్న మాట. ఇక తూర్పు గోదావరిలో అత్యధికంగా 51.54 లక్షల జనాభా ఉంది. విజయనగరం జిల్లాలో అతి తక్కువగా 23.44 లక్షల జనాభా ఉన్నారు. జనసాంద్రత విషయానికొ స్తే 2011 లెక్కల ప్రకారం రాష్ట్రంలో చదరపు కిలోమీటర్కు 308 మంది చొప్పున ఉంటే, దేశంలో 382 మంది ఉన్నారు. కృష్ణా జిల్లాలో చ.కి.మీకి అత్యధికంగా 518 మంది జనాభా ఉండగా కడపలో అత్యల్పంగా 118 మంది ఉన్నారు. ఆహార ధాన్యాల దిగుబడి.. ► రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 48.25 శాతం (78,388.6 చదరపు కిలోమీటర్లు) భూమి సాగులో ఉంది. అటవీ శాఖ రికార్డుల ప్రకారం 34,572 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఉంది. భౌగోళిక విస్తీర్ణంలో 796.8 చదరపు కి.మీ. భూమిని పరిశ్రమలకు వినియోగిస్తున్నారు. ఆక్వా కల్చర్కు 1,801.2 చదరపు కి.మీ. వినియోగిస్తున్నారు. 2012-13 లెక్కల ప్రకారం ఆహార ధాన్యాలు 41.56 లక్షల హెక్టార్లలో సాగు చేయగా 104.96 లక్షల టన్నుల దిగుబడి నమోదైంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి 83.21 శాతం కాగా అపరాల ఉత్పత్తి 10.79 శాతంగా ఉంది. భూగర్భ జలాల స్థితి రాష్ట్రంలో 46 మండలాల్లో భూగర్భ జలాలు ప్రమాదం అంచున ఉన్నాయి. 12మండలాల్లో నీటిమట్టం ప్రమాదక రంగా ఉంది. వాతావరణం విషయానికొస్తే సగటున అధికంగా 39, కనిష్టంగా 15.70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏటా సగటున 911 మి.మీ. వర్షపాతం కురుస్తోంది. 2013-14లో నైరుతి రుతుపవనాల సీజన్లో 514 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 554 మి.మి.గా ఉంది. -
మార్గదర్శకాలకు ఆమోదం
ఇద్దరు సీఎంల సయోధ్య అధికారులకు చేరింది ఇక ఏ ప్రాంతం ఉద్యోగులు ఆ ప్రాంతంలోనే పనిచేస్తారు ఇరు రాష్ట్రాల సీఎస్లు సంతకాలు 22న అఖిల భారత సర్వీసు అధికారుల తాత్కాలిక జాబితా సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలపై ఉత్కంఠకు తెరపడింది. ఇటీవల గవర్నర్ నర్సింహన్ సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కుదిరిన సయోధ్యలో భాగంగా బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కమలనాథన్ కమిటీ రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి సంబంధించి రూపొందించిన మార్గదర్శకాలకు రెండు రాష్ట్రాల సీఎస్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీని ద్వారా స్థానికత ఆధారంగా ఏ రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు ఆ రాష్ట్రంలో పనిచేయడానికి వీలుకలుగుతుంది. ఏ రాష్ట్రంలోనైనా సూపర్ న్యూమరరీ పోస్టులు ఏర్పాటు చేసుకోవడానికి ఇరు రాష్ట్రాలు అంగీకరించినట్లైంది. దీంతో ప్రధానమైన రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి మార్గం సుగమం అయింది. ఇక మార్గదర్శకాలను ఢిల్లీకి పంపించి కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందడమే మిగిలింది. కేంద్రం ఆమోదించగానే అందుకు అనుగుణంగా ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇలా ఉండగా ఈ నెల 22వ తేదీన అఖిల భారత సర్వీసుల ఉద్యోగుల పంపిణీ తాత్కాలిక జాబితా కూడా ప్రకటించేందుకు ప్రత్యూష్సిన్హా కమిటీ రంగం సిద్ధం చేసింది. 22వ తేదీన ప్రత్యూష్సిన్హా కమిటీ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు హాజరు కానున్నారు. ఇలా ఉండగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కాళింగులను బీసీల జాబితా నుంచి ఓసీల జాబితాలోకి తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కోరిక మేరకు తిరిగి బీసీల జాబితాలోకి కాళింగులను చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అంగీకరించారు. -
అందరి చూపూ మాఫీ పైనే..
విభజన తరువాత ఏపీ తొలి బడ్జెట్ నేడే ఎన్నికలకు ముందిచ్చిన హామీలకే భారీ మొత్తాలు కావాలి.. వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీ కోసమే 1.01 లక్ష కోట్లు కావాలి రాష్ట్ర మొత్తం బడ్జెట్ రూ.1.11 లక్ష కోట్లుగా ఉండే అవకాశం దీన్లో మాఫీకి కేవలం 5 శాతం నిధులు కేటాయించొచ్చంటున్న నిపుణులు హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెడుతున్న బడ్జెట్లో రుణాల మాఫీకి ఎంత కేటాయిస్తారోనని లక్షలాది రైతులు, డ్వాక్రా మహిళలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. రైతులు, డ్వాక్రా సంఘాల రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక ప్రకారం రైతులు తీసుకున్న అన్ని రకాల వ్యవసాయ రుణాలు 87,612 కోట్ల రూపాయలు. డ్వాక్రా సంఘాల రుణాలు రూ. 14,204 కోట్లు. ఈ రుణాల మాఫీ కోసం ప్రభుత్వం బడ్జెట్లో ఎన్ని వేల కోట్లు కేటాయిస్తుందనే అంశంపై రైతులు, మహిళలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందిచ్చిన హామీలపై నామమాత్రపు కేటాయింపులతో సరిపుచ్చాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. రుణాల మాఫీకి ప్రణాళిక పద్దులో రూ. 4 వేల కోట్లు, ప్రణాళికేతర పద్దులో రూ. 1,000 కోట్ల నామమాత్రపు కేటాయింపుతో రాష్ట్ర ప్రభుత్వం సరిపుచ్చవచ్చని సమాచారం. ఏదో కేటాయించామని చెప్పుకోవడానికి కేటాయింపులు చేస్తారే తప్ప, రుణ మాఫీని ఇప్పటికిప్పుడు అమలు చేయడానికి కాదని అధికారవర్గాలే చెబుతున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తొలిసారి బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఆర్థిక మంత్రిగా యనమల రామకృష్ణుడుకు దక్కింది. బుధవారం ఉదయం 11 గంటలకు ఆయన 2014-15 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ను శాసన సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇదే సమయానికి శాసన మండలిలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతారు. అంతకుముందు ఉదయం 8 గంటలకే రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలుపుతుంది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు, కేంద్రం నుంచి నిధులు అధిక మొత్తంలో రాబట్టేందుకు వీలుగా అభివృద్ధికి, ఆస్తుల కల్పనకు ఆయువుపట్టు అయిన ప్రణాళిక వ్యయాన్ని ప్రభుత్వం ఈసారి భారీగా తగ్గించింది. ప్రణాళికేతర వ్యయాన్ని మాత్రం భారీగా పెంచింది. ఆస్తుల కల్పన వ్యయం కేవలం రూ. 7,000 కోట్లుగా పేర్కొంది. ఈసారి రూ. 1.11 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ను రూపొందించారు. ఇందులో ప్రణాళిక వ్యయం (కేంద్ర పథకాల నిధులతో కలిపి) రూ. 26 వేల కోట్లకు పైగా ఉండగా ప్రణాళికేతర వ్యయం రూ. 85 వేల కోట్లకు పైగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే ఆదాయం రూ. 92 వేల కోట్లుగా అంచనా వేశారు. ఇందులో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం రూ. 38 వేల కోట్లుగా, కేంద్రం నుంచి పన్నుల వాటాతో పాటు ఇతర అన్ని రకాలుగా రూ. 54 వేల కోట్లు వస్తాయని అంచనా వేశారు. రెవెన్యూ వ్యయం రూ. 98 వేల కోట్లుగా చూపబోతున్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగతా పది నెలలకు రెవెన్యూ లోటు రూ. 15,691 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అయితే బడ్జెట్లో రెవెన్యూ లోటు రూ. 6,000 కోట్లుగా పేర్కొన్నారు. ద్రవ్య లోటు రూ. 12,000 కోట్లుగా ఉండనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక గ్రాంటుగా రూ. 8 వేల కోట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రూ. 9 వేల కోట్లు వస్తాయని అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 18 వేల కోట్ల రూపాయలు అప్పు చేయనున్నారు. స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లను ప్రణాళికేతర వ్యయంలోకి తీసుకు వచ్చారు. నీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపును భారీగా తగ్గించేశారు. ఈ రంగానికి కేవలం రూ. 3,100 కోట్లు కేటాయించారు. అక్టోబర్ నుంచి వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పింఛన్లను పెంచుతున్నందున కేటాయింపులు పెంచారు. బడ్జెట్లో కాపుల సంక్షేమానికి రూ. 50 కోట్లు, బ్రాహ్మణుల సంక్షేమానికి రూ. 25 కోట్లు కేటాయించారు. ఆరోగ్యశ్రీ పథకానికి రూ. 500 కోట్లు కేటాయించారు. అన్న క్యాంటీన్లు, ఎన్టీఆర్ సుజల స్రవంతికి నామమాత్రంగా కేటాయించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతికి రూ. 5 కోట్లు మాత్రమే కేటాయించారు. -
మనవాళ్లెక్కడికి!
సాక్షి, కర్నూలు: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐఏఎస్, ఐపీఎస్లు ఎక్కడ పని చేయాలనే విషయంలో స్పష్టత కొరవడటం అధికారులను గందరగోళానికి గురిచేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యూష్ సిన్హా కమిటీ శనివారం లాటరీ తీయడంతో అఖిల భారత సర్వీసుల్లోని అధికారుల విభజన వ్యవహారం ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తోంది. రోస్టర్ ప్రక్రియ ప్రారంభం కావడంతో జిల్లాలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారులు కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్, జేసీ కె.కన్నబాబు, ఐపీఎస్ అధికారి ఎస్పీ ఆకే రవికృష్ణలు ఎక్కడ సేవలందిస్తారనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ల విభజనకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యూష్ సిన్హా కమిటీ ఏర్పాటు చేయగా.. మార్గదర్శకాలకు సంబంధించిన ఫైల్పై ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతకం చేయడం తెలిసిందే. గత శనివారం కమిటీ ఢిల్లీలో సమావేశం కాగా ఇరు రాష్ట్రాల సీఎస్లు రాజీవ్శర్మ, ఐవైఆర్ కృష్ణారావులు హాజరయ్యారు. వీరి సమక్షంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కేటగిరీలకు తీసిన లాటరీల్లో తొలి అవకాశం తెలంగాణకే లభించింది. ప్రత్యక్ష నియామకాలపై ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన(అవుట్ సైడర్) అధికారుల కేటాయింపులను రోస్టర్ విధానంలో తెలంగాణ రాష్ట్రం నుంచే చేపట్టనున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను విడివిడిగా రోస్టర్ విధానంలో.. నేరుగా నియమితులైన(ఆంధ్ర కేడర్), పదోన్నతి పొందిన రాష్ట్ర అధికారులను స్థిర నివాస ప్రాంతం ఆధారంగా కేటాయించనున్నారు. అయితే రెండు రాష్ట్రాల్లో అధికారుల కొరత ఆధారంగా కూడా కేటాయింపులు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్గా ఈ ఏడాది జూలై 14న బాధ్యతలు చేపట్టిన సీహెచ్ విజయమోహన్ పదోన్నతుల కేటగిరీలో ఐఏఎస్ అధికారి అయ్యారు. గతంలో కరీంనగర్, చిత్తూరు జిల్లాల్లో సంయుక్త కలెక్టర్గా పని చేశారు. ఏపీ ఫుడ్ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతల అనంతరం కలెక్టర్గా పోస్టింగ్ దక్కింది. కలెక్టర్గా తొలి పోస్టింగ్ అయినప్పటికీ రాష్ట్ర విభజన అనంతరం కర్నూలులో నిర్వహించిన తొలి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా అందరి ప్రశంసలు అందుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఈయనను ఏ రాష్ట్రానికి కేటాయిస్తారనేది వేచి చూడాలి. ఇటీవల జిల్లాకు బదిలీపై వచ్చిన ఎస్పీ ఆకే రవికృష్ణ 2006 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. ఈయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో ఉన్నారు. జిల్లాకు కొత్తే అయినా రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించడంలో కీలకభూమిక పోషించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన రవికృష్ణ భవిష్యత్ ఏమిటనేది కూడా కేటాయింపుల్లో తేలనుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రి వట్టి వసంతకుమార్ ఓఎస్డీగా పని చేస్తూ దాదాపు 22 నెలల క్రితం జిల్లాకు బదిలీపై వచ్చిన జేసీ కె.కన్నబాబు కూడా పదోన్నతుల ప్రక్రియలోనే ఐఏఎస్ హోదా పొందారు. జేసీగా తొలి పోస్టింగ్ అయినప్పటికీ విధి నిర్వహణలో తన ముద్రను కనబర్చారు. ఈయన కూడా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారే. మరి ఈయన సేవలను ఏ రాష్ట్రంలో ఉపయోగించుకుంటారో స్పష్టం కావాల్సి ఉంది. -
వైభవంగా స్వాతంత్య్ర వేడుకలు
సాక్షి, కర్నూలు/అర్బన్: రాష్ట్ర విభజనానంతరం తొలిసారి నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలతో కర్నూలు నగరం మురిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రముఖుల రాకతో ఉత్సవం ప్రత్యేక శోభను సంతరించుకుంది. అధికారుల ముందస్తు ప్రణాళిక.. సమష్టి సహకారంతో సంబరం అంబరాన్నంటింది. పోలీసుల పక్కా వ్యూహం ఫలించగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కార్యక్రమం సాఫీగా సాగిపోయింది. రాష్ట్ర స్థాయి వేడుకలకు నగరం వేదిక కాగా.. తిలకించేందుకు ప్రతి ఒక్క హృదయం తపించింది. భద్రతా కారణాల దృష్ట్యా అందరికీ అవకాశం దక్కకపోవడం ఒకింత నిరుత్సాహానికి గురి చేసినా.. ఎనిమిది ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లపై జెండా పండుగ వీక్షించడం ప్రజలకు సరికొత్త అనుభూతికి లోనుచేసింది. ఉదయం 7 గంటల నుంచే స్థానికులు స్క్రీన్ల వద్దకు చేరుకోవడం కనిపించింది. అయితే చంద్రబాబు తన ప్రసంగంలో కర్నూలును రాజధానిగా ప్రకటిస్తారని ఆశించిన జిల్లావాసులకు నిరాశే మిగిలింది. కరువు రక్కసి కోరలు చాస్తున్న వేళ.. ‘అభివృద్ధి’ మాటతో.. రాజకీయ చతురతతో బాబు వరాల వర్షం కురిపించే ప్రయత్నం చేసినా పెద్దగా ఫలితం లేకపోయింది. భారీ పోలీసు బందోబస్తు నడుమ ఉదయం 8.45 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయ్ బయలు దేరింది. ఫైవ్రోడ్డు జంక్షన్, ఆనంద్ థియేటర్ సర్కిల్, కొత్త బస్టాండు మీదుగా కాన్వాయ్ పెరెడ్ మైదానానికి చేరుకుంది. రెండో బెటాలియన్ ప్రధాన ద్వారం వద్దకు చేరుకోగానే పోలీసులు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. నవ్యాంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న తొలి వేడుక కావడంతో పోలీసు శాఖ ఒళ్లంతా కళ్లు చేసుకుంది. ఏపీఎస్పీ మైదానం, చుట్టుపక్క ప్రాంతాలతో పాటు నగరంలోని ప్రధాన రహదారులు.. ప్రభుత్వ కార్యాలయాలు తదితర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించారు. పెరేడ్ మైదానం చుట్టూ ఉన్న కాలనీలు.. బహుళ అంతస్తుల భవనాలపైనా నిఘా ఉంచడంతో అడుగడుగునా పోలీసులే కన్పించారు. ఏపీఎస్పీ మైదానంలోకి అధికారులు, ప్రజాప్రతినిధులు సహా సామాన్యులను, విద్యార్థులను ఒకటికి రెండు సార్లు తనిఖీ నిర్వహించి అనుమతించారు. ఐదు ప్రధాన ద్వారాల వద్ద డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, ఎస్పీఎఫ్ బలగాలను మోహరించారు. మొత్తం వేడుక ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. -
రాజధానికి కర్నూలు అనుకూలం
సాక్షి, కర్నూలు : రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని ఎంపిక ప్రక్రియ మొదలైంది. అనువైన నగరాన్ని గుర్తించేందుకు శివరామకృష్ణన్ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తోంది. ఇటీవలే సీమ ముఖద్వారమైన కర్నూలులోనూ పర్యటించింది. నగరంలో విద్య, వైద్యం, రవాణా, నీటి వసతి, పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని ఇక్కడి ప్రజలు ఆ కమిటీకి నివేదించారు. 1956కు ముందు ఆంధ్రరాష్ట్రానికి తొలి రాజధానిగా కర్నూలు కొనసాగింది. మూడేళ్లపాటు ఆ వైభవాన్ని అనుభవించి పెద్ద మనసుతో రాజధానిని త్యాగం చేసింది. ఈ గత చరిత్రతో పాటు ప్రస్తుతం జిల్లాలో లభిస్తున వనరులను పరిశీలిస్తే నిస్సంకోచంగా తిరిగి కర్నూలునే రాజధానిగా ప్రకటించాలని నిపుణలు డిమాండ్ చేస్తున్నారు. మెరుగైన రవాణ మార్గం రాయలసీమకు ముఖద్వారం కావడంతో రోడ్డు, రైలు మార్గాలు మెరుగ్గా ఉన్నాయి. వీటిని మరింతగా అభివృద్ధి చేసుకునేందుకు అవకాశాలూ ఉన్నాయి. కర్నూలుకు 20 కిలోమీటర్ల దూరంలోని ఓర్వకల్లులో విమానాశ్రయం ఏర్పాటుకు అనువుగా స్థలం ఉన్నట్లు ఎయిర్పోర్టు అథారిటీ గుర్తించింది. కర్నూలు నగరం నుంచి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు గంటల్లో చేరుకోవచ్చు. హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారి పక్కనే డోన్ రైల్వేజంక్షన్ ఉంది. ఇక్కడినుంచి కర్ణాటక, హైదరాబాద్కు రైళ్లు నడుస్తున్నాయి. కర్నూలు నగరం నుంచి సైతం పలు రైళ్లు వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయి. సరకు రవాణా ద్వారా గణనీయంగా ఆదాయం అర్జిస్తున్న డివిజన్ ఇది. కర్నూలు-నందికొట్కూరు, ఆత్మకూరు మీదుగా ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చేరుకునేందుకు బస్సు మార్గం ఉంది. దీని ద్వారా కోస్తాను అనుసంధానించవచ్చు. సాఫ్ట్వేర్ రంగానికి అనువైన ప్రాంతం.. జిల్లాలో సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధికి అనువైన ప్రదేశం. ఇక్కడ 40కిపైగా ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. ఈ తరుణంలో సాఫ్ట్వేర్ రంగాన్ని ప్రోత్సహిస్తే పెద్ద కంపెనీలు ఇక్కడే కార్యకలాపాలు సాగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యవసాయానికి నెలవు .. ఇక్కడ అన్ని రకాల పంటలు పండిస్తారు. ధాన్యాగారంగా, అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన జిల్లాల్లో మన జిల్లా ఒకటి. ఏటా ఐదు లక్షల ఎకరాలకుపైగా వరి సాగు చేస్తున్నారు. కర్నూలు సోనాకు ఓ ప్రత్యేకత ఉంది. -
అరాచక శక్తులపై ఉక్కుపాదం
విజయవాడ నూతన సీపీ బాధ్యతల స్వీకరణ మావోల కదలికలపై సరిహద్దుల్లో నిఘా కొత్త డీఐజీ హరికుమార్ సాక్షి, ఏలూరు : అరాచక శక్తులను రూపుమాపేందుకు చర్యలు చేపడతామని ఏలూరు రేంజ్ డీఐజీ పి.హరికుమార్ తెలిపారు. సోమవారం డీఐజీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏలూరు రేంజ్ పరిధిలోని పశ్చిమ, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల ఎస్పీల నుంచి మూడు జిల్లాల్లో పరిస్థితులను తెలుసుకుంటానని, అన్ని సమస్యలను పరిష్కరిస్తాని చెప్పారు. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, బదిలీల విషయాలపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. మావోల కదలికలపై సరిహద్దు ప్రాంతాలలో గట్టి నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఏలూరు రేంజ్ పరిధిలోకి ఖమ్మం జిల్లా నుంచి కొత్తగా వచ్చిన ఏడు మండలాల్లో పోలీస్ వ్యవస్థను పటిష్ట పరుస్తామని వివరించారు. పోలీస్ సిబ్బంది ఎటువంటి సమస్య వచ్చినా తనను నేరుగా కలుసుకోవచ్చని, ఆ సమస్యనను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని డీఐజీ తెలిపారు. డీఐజీని మూడు జిల్లాల పోలీస్ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విజయవాడ సిటీ : విజయవాడ నగర పోలీసు కమిషనర్గా సోమవారం మధ్యాహ్నం 1.28 గంటలకు ఏబీ వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ప్రస్తుత సీపీ బి.శ్రీనివాసులు బాధ్యతలు అప్పగించారు. అనంతరం డీసీపీలు తఫ్సీర్ ఇక్బాల్(శాంతిభద్రతలు), జీవీజీ అకోశ్కుమార్(పరిపాలన)లతో కలిసి ఏబీ వెంకటేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. పోలీస్ కమిషనరేట్కు పెద్ద సేవకుడిగా, కాపలాదారుగా వ్యవహరిస్తానని సీపీ చెప్పారు. విభజనానంతర ప్రత్యేక పరిస్థితుల్లో రెండోసారి తాను నగర కమిషనర్గా రావాల్సి వచ్చిందని, ఈ అవకాశాన్ని సవాల్గా తీసుకొని పని చేస్తానని తెలిపారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ప్రజలు పూర్తిగా సహకరిస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రజా రక్షణలో పోలీసు బాధ్యత, పాత్రపై తగిన అవగాహన చేసుకొని పని చేస్తామన్నారు. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా ఇక్కడి మీడియా ఎదగి పూర్వవైభవం పొందాలని ఆకాంక్షించారు. -
బల్బు మార్చాల్సిందే !
సాక్షి, చిత్తూరు: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మిగులు విద్యుత్తు ఉంది. దీంతో గృహావసర వినియోగ విద్యుత్తును 24 గంటలూ సరఫరాచేసే యోచనలో ఎస్పీడీసీఎల్(సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్)ఉంది. ఎస్పీడీసీఎల్ పరిధిలోని జిల్లాల్లో తొలుత చిత్తూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా 24 గంటల విద్యుత్ సరఫరాను అమలు చేయనున్నారు. ఈ దిశగా ఇప్పటికే కసరత్తు జరుగుతోంది. ఈ ప్రక్రియ కంటే ముందుగా ఇళ్లలోని బల్బుల మార్పిడికి రాష్ట్ర ప్రభుత్వం పట్టుబడుతోంది. ఇళ్లలోని బల్బులు మార్చాల్సిందే! గతంలో 100...ఆపై 60 వాట్ బల్బులను వినియోగించేవారు. కేవలం పది రూపాయలకే ఈ బల్బులు లభిస్తాయి. అయితే విద్యుత్తు బిల్లుల నేపథ్యంలో దాదాపు అందరూ ట్యూబ్లైట్లు, సీఎఫ్సీఎల్ లైట్లను వినియోగిస్తున్నారు. పల్లెల్లో ఇప్పటికీ 60 వాట్స్ బల్బులు వాడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ట్యూబ్లైటు ధర 40 -50, సీఎఫ్సీఎల్ 70 రూపాయలకు లభిస్తున్నాయి. వీటి వినియోగంతో 20-35వాట్స్ విద్యుత్తు మాత్రమే ఖర్చవుతుంది. అయితే ప్రస్తుతం వీటిని తొలగించి ఆ స్థానంలో కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఎల్ఈడీ బల్బులను వినియోగించాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకుంది. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో ఎల్ఈడీ బల్బుధర 450 రూపాయలు ఉంది. ప్రతి ఇంట్లో 5 బల్బులకు తక్కువ లేకుండా ఉంటాయి. ఈ లెక్కన 2వేల రూపాయలు ఖర్చుచేసి బల్బులు మార్చుకోవాల్సిందే! బల్బు కాలిపోయిన ప్రతిసారి 450 రూపాయలు భరించాల్సిందే ! ప్రస్తుతం ఈ బల్బులను ఎస్పీడీసీఎల్ అధికారుల వద్ద కొనుగోలు చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. లైటింగ్ సమస్యతో కంటిచూపు తగ్గిపోయే ప్రమాదం ట్యూబులైట్ వెలుతురుతో పోల్చితే సీఎఫ్సీఎల్ లైటింగ్ తక్కువ. ఈ లైట్ల వెలుతురులో చదువుతున్న పిల్లలకు కంటిచూపు తగ్గుతోంది. ఎల్ఈడీ బల్బులు సీఎఫ్సీఎల్ వెలుతురు కంటే చాలా తక్కువ. ఇలాంటి లైట్ల వెలుతురుతో చదివితే అక్షరాలు చూసేందుకు కళ్లపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. కంటి నరాలపై ఒత్తిడి పెరిగి చిన్నపిల్లలకే తక్కువ వయస్సులో కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ఖర్చు పెరిగినా ఫర్వాలేదని, వెలుతురు తక్కువగా ఉంటే పిల్లల పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
అంతర్జాతీయ ప్రమాణాలతో గన్నవరం ఎయిర్పోర్ట్
గన్నవరం : రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎయిర్పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అలోక్సిన్హా చెప్పారు. న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఆయనతోపాటు హెచ్ఎంసీఏ పీయస్ జె. కృష్ణకిషోర్, ఎయిర్పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియా ప్లానింగ్ విభాగం సభ్యులు సుధీర్హ్రేజా, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కల్పనశెత్తి, టీఎస్ చంద్రమౌళి, ఐఎఫ్ఎస్ ప్రత్యేక భద్రతాధికారి పెర్జిన్తో కూడిన కమిటీ గురువారం గన్నవరం విమానాశ్రయాన్ని సందర్శించింది. తొలుత విమానాశ్రయ రన్వేను పరిశీలించిన కమిటీ అనంతరం విస్తరణపై చర్చించారు. రన్వే విస్తరణకు ఎంత భూమి కావాలి, భూసేకరణ సాధ్యసాధ్యాలను నూజివీడు సబ్కలెక్టర్ చక్రధరరావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం టెర్మినల్ బిల్డింగ్ను సందర్శించిన అధికారుల ప్రయాణికులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సదుపాయలను పరిశీలించారు. అనంతరం విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో విమానాశ్రయ అభివృద్ధిపై జరిగిన సమావేశంలో స్థానిక ఎయిర్పోర్టు అధికారులతో చర్చించారు. ప్లానింగ్ అధికారుల పవర్ పాయింట్ ప్రజంటేషన్ను వీక్షించారు. రానున్న ఆరేళ్లపాటు వినియోగించే విధంగా ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడంతోపాటు భవిష్యత్తులో ప్రత్యామ్నయంగా గ్రీన్ఫిల్డ్ ఎయిర్పోర్టును నిర్మించాలని ఆలోచించినట్లు సమాచారం. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం సాయంత్రం తిరిగి న్యూఢిల్లీ వెళ్ళేందుకు ఎయిర్పోర్టుకు చేరుకున్న అలోక్సిన్హా మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ సమాచారం మేరకు విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయనుండడంతో భవిష్యత్లో ఇక్కడి నుంచి ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా పెరగనుందన్నారు. దీనికి అనుగుణంగా 500 మంది డోమిస్టిక్ ప్రయాణికులు, 200 మంది ఇంటర్నేషనల్ ప్రయాణికులు కూర్చునేందుకు వీలుగా కొత్తగా ఇంటిగ్రేడెట్ టెర్మినల్ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందులో ఇంటర్నేషనల్ టెర్మినల్ బిల్డింగ్లో ఉండే సదుపాయలకన్నా మెరుగైన వసతులను ప్రయాణికులకు కల్పించనున్నట్లు చెప్పారు. అదే విధంగా భూసేకరణ పూర్తయితే భారీ విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రస్తుతం 7,500 అడుగులు ఉన్న రన్వేను 10,500 అడుగులకు విస్తరించనున్నట్లు సిన్హా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ విభజన యాక్టులోనే ఈ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని పేర్కొన్నట్లు కృష్ణకిషోర్ తెలిపారు. దీనిలో భాగంగా గన్నవరం విమానాశ్రయాన్ని అత్యాధునిక హంగులతో వరల్డ్ బెస్ట్ టెర్మినల్గా తీర్చితిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్వరలో ఇక్కడి నుంచి విమాన సర్వీస్లను పెంచడంతో భారీ విమానాలు దిగే విధంగా అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని ఆయన వివరించారు. -
పోలీసు శాఖకు జవసత్వాలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా పోలీస్శాఖ మరింత శక్తివంతం కానుంది. ఇన్నాళ్లూ సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాల లేమితో ఇబ్బంది పడిన ఈ శాఖకు అదనపు విభాగాలతోపాటు, అధికారులు రానున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుతం మిగిలిన 13 జిల్లాల్లో పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టపరిచే దిశగా ప్రభుత్వస్థాయిలో కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగా జిల్లాలోని పలు పోలీస్ విభాగాలకు అధికారులు రానున్నారు. ఇంటెలిజెన్స్, ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్ విభాగాల్లో కొన్ని శ్రీకాకుళం కేంద్రంగా పని చేస్తుండగా.. మరికొన్ని విభాగాలు పొరుగు జిల్లాలు కేంద్రంగా పని చేస్తుండటంతో పాలనాపరమైన ఇబ్బందులెదురువుతున్నాయి. ఈ ఇబ్బందులు తొలగించే క్రమంలో జిల్లాకు కొత్తగా కనీసం ఐదుగురు డీఎస్పీలను ప్రభుత్వం కేటాయిస్తుందని విశ్వసనీయ సమాచారం. ఇటీవలే డీపీసీ (డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ) నిర్ణయించిన మేరకు రాజధాని నుంచి కొత్త డీఎస్పీలు రానున్నట్టు తెలిసింది. అదే విధంగా ఏపీపీఎస్సీ ద్వారా డీఎస్పీలైన కొంతమంది, సీఐలుగా పనిచేసి ఉద్యోగోన్నతి సాధించిన మరికొందరు జిల్లాకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిసింది. ఏసీబీకి డీఎస్పీ అవినీతి నిరోధక శాఖ జిల్లా విభాగం ప్రస్తుతం విజయనగరం డీఎస్పీ పరి ధిలో పని చేస్తోంది. ఈ విభాగం శ్రీకాకుళం కార్యాలయంలో సీఐ, ఇతర సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. దీనివల్ల కేసుల నమోదు, దాడులు, ఆకస్మిక తనిఖీల విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. వీటి పరిష్కారానికి త్వరలో శ్రీకాకుళం కేంద్రంగా ఏసీబీ డీఎస్పీ పోస్టు మంజూరు కానుందని అధికారులు చెబుతున్నారు. విశాఖలో పనిచేస్తున్న ఓ ఏసీపీ డీ ఎస్పీగా ఇక్కడ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం. రెండుగా విజిలెన్స్?: విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కలిపి శ్రీకాకుళం పట్టణంలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం ఉంది. ఓ ఎస్పీ, ఇద్దరు సీఐలు, మరికొంతమంది ఎస్ఐలు పని చేస్తున్నారు. రెండు జిల్లాల పరిధిలో ఆకస్మిక తనిఖీలు, కేసుల నమోదు వ్యవహారాలన్నీ ఈ కార్యాలయమే చూస్తోంది. రెండు జిల్లాల్లోనూ అక్రమాలు, కేసులు పెరిగినందున సిబ్బందికి పనిభారం పెరిగింది. అధికారులు ఇక్కడ నుంచి విజయనగరం జిల్లాకు వెళ్లి తనిఖీలు చేయడం కష్టమవుతోంది. సమయం కూడా వృథా అవుతోంది. విజిలెన్స్ విభాగాన్ని విడదీసి మరో డీఎస్పీ పోస్టు మంజూరు కోసం అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. కొత్తగా సీఐడీ విభాగం: ఇప్పటివరకు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలకు కలిపి విశాఖపట్నం కేంద్రంగా సీఐడీ విభాగం పనిచేస్తోంది. పోలీస్శాఖలో నమోదయ్యే భారీ కేసుల ఛేదనకు, ప్రభుత్వం ఆదేశించే మరికొన్ని ప్రత్యేక కేసుల దర్యాప్తును చేపడుతున్న ఈ విభాగానికి మూడు జిల్లాల పరిధిలో పనిచేయాల్సి రావడం ఇబ్బందిగా మారింది. పెద్ద పెద్ద కేసుల పరిష్కారానికి విశాఖ నుంచి అధికారులు, సిబ్బంది తరచూ రావడం ఖర్చు, శ్రమతో కూడుకున్న పని అని అధికారులు గుర్తించారు. దీంతో ఇకపై జిల్లా యూనిట్గా సీఐడీ విభాగం ఉండాలన్న ప్రతి పాదనలు వెళ్లాయి. భవిష్యత్తులో ఓ డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐడీ విభాగం జిల్లా కేంద్రంలో ఏర్పాటవుతుందని అధికారవర్గాలసమాచారం. ఎస్బీకి మరో డీఎస్పీ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇప్పటి వరకూ ఇద్దరు స్పెషల్బ్రాంచ్ (ఎస్బీ) ఇన్స్పెక్టర్లు విధులు నిర్వహిస్తుండేవారు. పని విభజనలో భాగంగా మరో పైస్థాయి అధికారి అవసరం ఏర్పడింది. దీంతో వారం క్రితమే డీఎస్పీని నియమించారు. విశాఖలో పలు విభాగాల్లో పనిచేసిన టేకి మోహనరావు అనే అధికారి ఇటీవలే ఇక్కడ బాధ్యతలు చేపట్టారు. పలాస (కాశీబుగ్గ), పాలకొండ, శ్రీకాకుళం డివిజన్లకు వేర్వేరుగా శాంతిభద్రతల డీఎస్పీలున్నారు. వీరిలో శ్రీకాకుళం డీఎస్పీకి ఇటీవల రివర్షన్ ఉత్తర్వులు రావడం, తరువాత ఉన్నతాధికారి వద్దకు వెళ్లడంతో ఆయనకు మళ్లీ పోస్టింగ్ వేసే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. అయితే విశాఖలో పనిచేస్తున్న మరో డీఎస్పీ ఇక్కడి శాంతిభద్రతల విభాగానికి రానున్నట్టు తెలిసింది. అదేవిధంగా పాలనాపరమైన విధులు నిర్వహించేందుకు ఓఎస్డీ (ప్రత్యేకాధికారి) ఒకరు, నేరవిభాగ అధికారిగా మరో ఓఎస్డీ ఇక్కడ ఉన్నారు. జిల్లా కేంద్రంగా ఆర్మ్డ్ రిజర్వు అధికారిగా ఏఆర్డీఎస్పీ, జిల్లా పోలీస్ శిక్షణ కేంద్ర అధికారిగా (డీపీటీసీ) మరో డీఎస్పీ, ఇంటెలిజెన్స్ విభాగానికి శ్రీకాకుళం కేంద్రంగా మరో డీఎస్పీ విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడున్న సిబ్బంది సంఖ్యను పెంచేందుకు, పోలీస్శాఖను మరింత బలోపేతం చేసేందుకు కొత్తగా మరికొందరు డీఎస్పీలు రానున్నట్టు పోలీస్వర్గాల భోగట్టా. -
నట్టేట ముంచిన చంద్రబాబు
రుణమాఫీ పేరుతో వంచన అధికారం కోసమే దొంగ హామీలు అమలు చేయాల్సిందే జెడ్పీ ఫ్లోర్ లీడర్ పద్మావతి తోట్లవల్లూరు : రుణమాఫీ పేరుతో సీఎం నారా చంద్రబాబునాయుడు రైతులను, మహిళలను నట్టేట ముంచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యురాలు, జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి విమర్శించారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రుణమాఫీ ఓ పెద్దడ్రామాలా కనబడుతుందన్నారు. రిజర్వుబ్యాంకు రీషెడ్యూల్కు కూడా ససేమిరా అంటుంటే టీడీపీ నేతలు మాత్రం రీషెడ్యూల్ అని ఒకరోజు, మాఫీ చేస్తామంటూ మరొక రోజు అస్పష్టమైన ప్రకటనలు చేస్తూ రైతులను అయోమయంలోకి నెట్టేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన అనివార్యమని, కొత్త రాష్ట్రం లోటు బడ్జెట్తో ఉంటుందని తెలిసి కూడా అధికారమే పరమావధిగా బాబు ఎన్నికల్లో రుణమాఫీ హామీలను ఇచ్చారన్నారు. మోడీతో నిధులు రాబట్టుకుందామనుకున్న బాబుకు అక్కడా నిరాశ తప్పడం లేదన్నారు. వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఏకంగా రైతులను రుణాలే చెల్లించేయమని ఉచిత సలహాలు ఇస్తున్నారని, అమలు చేయలేని హామీలు ఎందుకిచ్చారో వారిని ప్రజలు నిలదీయాలని సూచించారు. రైతులు రుణాలు చెల్లించే పరిస్థితి ఉంటే రుణమాఫీ కోసం ఎందుకు ఎదురుచూస్తారని పద్మావతి మంత్రిని ప్రశ్నించారు. రుణమాఫీ సాధ్యం కాదనే ద్దేశంతోనే జననేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి రుణమాఫీ హామీ ఇవ్వలేదని గుర్తు చేశారు. సకాలంలో రుణాలు చెల్లిస్తే 7 శాతం వడ్డీతో సరిపోయేదని, ఇప్పుడు బ్యాంకులు 13 శాతం వడ్డీని వసూలు చేసే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారో చెప్పాలని ఆమె చంద్రబాబును నిలదీశారు. త్వరలోనే రైతులు, డ్వాక్రా మహిళల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను చంద్రబాబు చవిచూడాల్సి వస్తుందని పద్మావతి చెప్పారు. రుణమాఫీని వెంటనే అమలుచేసి రైతుల్ని, మహిళల్ని రుణవిముక్తుల్ని చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి, వైస్ ఎంపీపీ పిఎస్.కోటేశ్వరావు, సోలే నాగరాజు పాల్గొన్నారు. -
భూముల విలువ పెంపుపై పునరాలోచిస్తున్న సర్కారు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూముల విలువల పెంపుపై ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. స్థిరాస్తిరంగం ఒడిదొడుకులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచాలనే నిర్ణయంపై వెనక్కి తగ్గుతోంది. రాష్ట్ర విభజన అనంతరం జిల్లా లో భూముల క్రయవిక్రయాలు మందగించాయి. ముఖ్యంగా నగర శివార్లలో దీని ప్రభావం గణ నీయంగా ఉంది. కేవలం ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు మాత్రమే నమోదవుతున్నాయి. దీంతో గత ఏడాదితో పోలిస్తే ఈ సారి రిజిస్ట్రేషన్ల సంఖ్య బాగా పడిపోయింది. 2013 జనవరి -ఏప్రిల్ వరకు 1,02,714 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా.. రూ.698.31 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది ఇదే కాలానికి 62,106 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా.. రూ.425.05 కోట్ల రాబడి మాత్రమే వచ్చింది. తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర వేయడంతో దాని ప్రభావం రిజిస్ట్రేషన్లపై కనిపించింది. అయితే, సాధారణంగా ప్రతి ఆగస్టులో భూముల ధరలను ప్రభుత్వం సవరిస్తోంది. ఈ నే పథ్యంలోనే ఈసారి కూడా ఈ కసరత్తును పూర్తి చేసింది. కాస్తో కూస్తో రియల్ బూమ్ ఉన్న ప్రాంతాల్లో 15 నుంచి 20శాతం మేర విలువలను హెచ్చింపు చేసేలా జిల్లా రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. మారుమూల ప్రదేశాల్లో ధరలు పెంపు జోలికి వెళ్లకుండా ఆదిబట్ల, ఘట్కేసర్, మంచిరేవుల, నార్సింగి, శంషాబాద్, మహేశ్వరం ప్రాంతాల్లో కనిష్టంగా విలువను పెంచాలనే నిర్ణయానికి వచ్చింది. స్థలాలు ముఖ్యంగా ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు ఎక్కువగా రిజిస్టర్ అవుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో కొంత మేర ధరలను సవరించాలని జిల్లా యంత్రాంగం భావించింది. ఈ మేరకు ఇటీవల జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీ దాదాపుగా నిర్ణయం కూడా తీసుకుంది. అయితే, రాష్ట్ర విభజన అనంతరం రియల్రంగంలో ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో భూముల విలువలు పెంచడం సరికాదనే భావనకు సర్కారు వచ్చినట్లు తెలుస్తోంది. మార్కెట్ కుదుటపడేవరకు రిజిస్ట్రేషన్ చార్జీల హెచ్చింపు జోలికి వెళ్లకపోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చింది. ఇదే అంశాన్ని రిజిస్ట్రేషన్ల శాఖకు స్పష్టం చేసింది. దీంతో ఈసారి భూముల విలువ వడ్డింపు ఉండకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. -
రామా.. కానరావా..?
వేలేరుపాడు: భద్రాద్రి పేరుచెబితే అఖిలాండ భక్తకోటి మదిలో మెదిలేది శ్రీ సీతారామచంద్రస్వామివారి కల్యాణ వైభోగమే. రామయ్య కల్యాణోత్సవానికి శ్రీకారం చుట్టేది మాత్రం మారుమూల శ్రీరామగిరి కొండకోనల్లోని పుట్టుస్వామి రాములోరి సమక్షంలోనే. పుట్టుస్వామికి తలంబ్రాల ప్రక్రియ ముగిస్తే గానీ భద్రాచలం రాములోరి పెళ్లి తంతు ప్రారంభం కాదు. అలాంటిది రాష్ట్ర విభజన జరిగాక చోటుచేసుకున్న పరిణామాల్లో ఈ ఇద్దరు స్వాములు చెరో దిక్కయ్యారు. భద్రాద్రి రాములోరు తెలంగాణ పరమైతే, శ్రీరామగిరి స్వామి వారు ఆంధ్ర వశమయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ పుణ్యాన పుట్టుస్వాముల వారి పుట్టిమునిగే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవంపై భక్తుల మదిలో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఈసారి జరగబోయే శ్రీరామనవమి పెళ్లి తంతు ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుందో? అంతుపట్టకుండా పోయింది. పురాణగాథ.. జిల్లాలో పుణ్యక్షేత్రాలుగా భద్రాద్రి రామాలయంతో పాటు వీఆర్పురం మండలంలోని శ్రీరామగిరి ఆలయం పేరొందాయి. ఈ రెండింటికీ ఎంతో ప్రాధాన్యం ఉంది. భద్రాచలానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరామగిరిలో శ్రీ సీతారామాలయం ఉంది. సీతాన్వేషణలో భాగంగా ఈ ప్రాంతంలో శ్రీరాముడు ఏకశిల మీద తపస్సు చేశాడట. అందుకే ఇక్కడి స్వామిని యోగ రాముడని పిలుస్తుంటారు. ఇక్కడ గుడి వద్ద నిల్చుని చూస్తే, ఒక వైపు వాలి పర్వతం, మరో వైపు సుగ్రీవుని పర్వతం కన్పిస్తుంటాయి. ఇక్కడే వాలి, సుగ్రీవులకు యుద్ధాలు జరిగాయని, ఇక్కడే సుగ్రీవునికి, రామునికి మైత్రి కుదిరిందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడు జటాయువుకు దహనసంస్కారాలు చేసి, గోదావరి తీరాన పిండ ప్రదానం చేసే సమయంలో గోదావరి ఒడ్డునే ఉన్న పరుపు బండలపై ఉన్న పాదాలు, మోకాలి ముద్రల ఆనవాళ్లు ఇప్పటికీ భక్తులతో పూజలందుకుంటున్నాయి. రామలక్ష్మణుల టేకువృక్షాలూ కనుమరుగు.. రామలక్ష్మణులు అరణ్యవాసం చేసిన సమయంలో వారి స్వహస్తాలతో నాటిన రెండు టేకు వృక్షాలు శ్రీరామగిరికి 25 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతం దారపల్లి సమీపంలో ఉన్నాయి. వీటిని రామలక్ష్మణుల టేకు వృక్షాలుగా భక్తులు కొలుస్తున్నారు. భారీ కైవారంతో ఎత్తుగా ఉన్న ఈ వృక్షాలను నరకడానికి ఎవరూ సాహసిం చరు. ఎందుకంటే వీటిని తాకితే రక్తం కక్కుకొని చస్తారని అంటుంటారు. అందువల్లనే ఈ వృక్షాలను తాకేందుకు కూడా ప్రయత్నించరు. కొంతమంది శాస్త్రవేత్తలు ఈ భారీ వృక్షాలపై పరిశోధనలు చేశారు. వేల సంవత్సరాల కాలంనాటి వృక్షాలుగా నిర్ధారించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేద్దామని ఆలోచనలు చేస్తున్న దశలోనే ఈ వృక్షాలు, ఈ చారిత్రక ప్రదేశం పోలవరం నీటిలో కనుమరుగుకానున్నా యి. శ్రీరామగిరిని నీట ముంచితే పాపం మూటగట్టుకోవాల్సి వస్తుందని జనం ఆందోళన చెందుతున్నారు. -
శరవేగంగా స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లు
సాక్షి, కర్నూలు: రాష్ట్ర విభజన తరువాత కర్నూలులో నిర్వహిస్తున్న మొదటి స్వాతంత్య్ర వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేయాలని జిల్లా అధికారులకు రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యాంబాబు ఆదేశించారు. బుధవారం ఎస్ఏపీ క్యాంపు సమావేశ భవనంలో ఆయన అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకు ముందు అధికారులు ఎస్ఏపీ క్యాంపు మైదానాన్ని పరిశీలించి ఏర్పాట్లను పర్యవే క్షించారు. ఈ సందర్భంగా శ్యాంబాబు మాట్లాడుతూ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ కన్నా ఎస్ఏపీ క్యాంపస్ చిన్నదిగా ఉందని దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రౌండ్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కర్నూలు మున్సిపల్ కమిషనర్ మూర్తిని ఆదేశించారు. వీవీఐపీలకు టాయిలెట్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సదుపాయాలన్నీ ఈ నెల 31 లోపు పూర్తి చేయాలన్నారు. స్వాతంత్య్ర వేడుకలకు విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని ట్రాన్స్కో ఎస్ఈ బసవయ్యను ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఆర్ఎంకు, పెరేడ్ గ్రౌండ్లో అంబులెన్స్ ఉండాలని జిల్లా వైద్యాశాఖ అధికారికి ఆదేశించారు. వీవీఐపీలకు సంబంధించిన బ్లడ్గ్రూపులను అందజేస్తామని, అందుకనుగుణంగా సిద్ధంగా ఉండాలని సూచించారు. కర్నూలు నగరాన్ని సుందరంగా తీర్చుదిద్దుతున్నామని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ రవాణాశాఖ ముఖ్యకార్యదర్శికి వివరించారు. ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నామని, వీవీఐపీలకు ప్రభుత్వ, ఎస్ఏపీ క్యాంపు అతిథి గృహాలు, సస్య, ఎస్వీ రెసిడెన్సీ, డీవీఆర్ హోటళ్లలో విడిది కల్పించనున్నట్లు తెలిపారు. వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ద్వారా జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులకు వివరించారు. సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనరు దానకిషోర్ మాట్లాడుతూ గ్రౌండ్ను బట్టి శకటాలను ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి చదివే ప్రసంగ పాఠాన్ని తయారు చేస్తామని చెప్పారు. సమావేశంలో జీఏడీ ముఖ్యకార్యదర్శి రాజేశ్వరి తివారీ, డీఐజీ మురళీకృష్ణ, ఎస్పీ రఘురామిరెడ్డి, కమాండెంట్ విజయకుమార్, జేసీ కన్నబాబు, ఏజేసీ అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మొక్కకూ దిక్కులేదు
తాడేపల్లిగూడెం : సీమాంధ్రను సింగపూర్ చేస్తాం.. మోడల్ రాజధాని నిర్మిస్తామంటూ ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్న సర్కారు కనీసం మొక్కలు నాటేందుకైనా చర్యలు తీసుకోవడం లేదు. సామాజిక వన నర్సరీలకు పైసా కూడా విదల్చకపోవడంతో రోడ్ల పక్కన కనీసం మొక్కలైనా నాటే దిక్కులేకుండాపోరుుంది. రోడ్ల వెంబడి నీడనిచ్చే మొక్కలను నాటాల్సిన తరుణం ఇది. ఇలా నాటడానికి సామాజిక వన నర్సరీలలో మొక్కలు లేవు. అదేమంటే.. వాటిని పెంచడానికి రూకలు లేవు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇదే పరిస్థితి. రాష్ట్ర విభజనను సాకుగా చూపుతూ జిల్లాలోని మూడు అటవీ డివిజన్లకు బడ్జెట్ కేటాయించలేదు. అప్పటినుంచి అధికారులు, సిబ్బంది సొంత సొమ్ము వెచ్చించి ముందుకు సాగుతున్నారు. మరోవైపు సామాజిక వన విభాగంలో ఔషధ మొక్కల పెంపకం నిలిచిపోరుుంది. వర్షాకాలానికి ముందే ఉపాధి హామీ పథకంలో కూలీలను కేటారుుంచి లక్షలాదిగా మొక్కలను నాటించి పెంచేవారు. ఆ మొక్కల పెంపకాన్ని తామే చేపడతామని డ్వామా అధికారులు ముందుకొచ్చారు. దీంతో సామాజిక వన నర్సరీలలో మొక్కలు పెంచే అవకాశం లేకుండాపోయింది. డ్వామా అధికారులు చేపట్టిన మొక్కల పెంపకం పథకం మాడిపోయింది. ఏ మొక్క బతికి బట్టకట్టలేదు. మరోపక్క సామాజిక వన నర్సరీలలో మొక్కలు లేవు. దీంతో ఈ సీజన్లో జిల్లాలో రోడ్ల వెంబడి మొక్కలు నాటే పరిస్థితి లేదు. ఉపాధి లేదు.. పర్యావరణ పరిరక్షణా లేదు ఏటా ఉపాధి హామీ పథకంలో లక్ష వరకు మొక్కలను సామాజిక వన నర్సరీలలో పెంచేవారు. ఇందు కోసం ప్రతి నర్సరీకి 50 మంది కూలీలను కేటాయించే వారు. వీరంతా తుంగ, మోదుగ, జావల్లి, వెలగ, కానుగ, తుమ్మ, వేప, టేకు వంటి సుమారు 112 రకాల మొక్కలను పెంచేవారు. ఇవికాకుండా రోడ్ల వెంబడి నీడ, అందమైన పూలు ఇచ్చే అగ్నిపూలు చెట్లు పెంచేవారు. నర్సరీలలో బ్యాగ్ నర్సరీ, బెడ్ నర్సరీలుగా విభజించి మొక్కలను పెంచేవారు. వీటిని తహసిల్దార్ కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాలు, స్వచ్ఛంద సంఘాల ద్వారా నాటడానికి వివిధ ప్రాంతాలకు పంపేవారు. చాలాకాలంగా ఇదే మాదిరి సాగుతోంది. గత ఏడాది బ్యాగ్ నర్సరీల నిర్వహణను తామే చేపడతామని డ్వామా అధికారులు ముందుకు వచ్చారు. దీంతో సామాజిక వన నర్సరీలు టేకు మొక్కలు పెంచే బెడ్ నర్సరీలుగా మారిపోయాయి. దీంతో జిల్లాలోని నరసాపురం, ఏలూరు, జంగారెడ్డిగూడెం అటవీ రేంజ్ల పరిధిలోని సామాజిక వన నర్సరీలు బోసిపోయాయి. ఒకప్పుడు ఔషధ మొక్కల పెంపకానికి చిరునామాగా మారిన తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంలోని నర్సరీ పిచ్చిమొక్కలకు నిలయంగా మారింది. అందమైన మొక్కలు లేవు. క్లోనింగ్ యూకలిప్టస్ మొక్కల కోసం వేచిన షేడ్ నెట్లు పిచ్చిమొక్కల నిలయాలుగా మారాయి. అందులోని రహదారులు పాముల పుట్టలతో దర్శనమిస్తున్నారుు. వర్షాలు రాగానే జిల్లాలో సుమారు 80 కిలోమీటర్ల మేర రోడ్లకు ఇరువైపులా నీడనిచ్చే మొ క్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టేవారు. రాష్ట్రం విడిపోరుుందని, దీనివల్ల నిధులు లేవనే సాకుతో లక్ష్యా న్ని 20 కిలో మీటర్లకు కుదించారు. దానికి కూడా నిధులు కేటాయించలేదు. -
క్రీడాశ్వాస
నేషనల్ గేమ్స్పై అభిమానుల ఆశ రాష్ర్ట విభజన పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు. విజయవాడ నగరంలో జాతీయ క్రీడలు నిర్వహిస్తే.. అపార నైపుణ్యం నిబిడీ కృతమై ఉన్న యువత తమ శక్తిసామర్థ్యాలను నిరూపించుకునేందుకు మంచి అవకాశం వస్తుందని భావిస్తున్నారు. పతకాలే కాదు.. పురస్కారాలు కూడా సొంతం చేసుకుంటామన్న కొండంత ఆశతో ఉన్నారు. నగరాన్ని క్రీడలకు వేదికగా మలచుకుంటే హైదరాబాద్ను తలదన్నే రీతిలో తయారవుతుందని క్రీడా నిపుణులూ విశ్లేషిస్తున్నారు. విజయవాడ స్పోర్ట్స్ : రాష్ట్ర విభజనకు ముందు జాతీయ క్రీడలు, ఆఫ్రో ఆసియా వంటి క్రీడలు ఒక్క హైదరాబాద్లోనే నిర్వహించేవారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అధునాతన స్టేడియాలు, సింథటిక్ ట్రాక్లు, ఆస్ట్రోటర్ఫ్ మైదానాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం దండిగా నిధులిచ్చింది. ఇప్పుడు రాష్ట్రం రెండుగా విడిపోయింది. వెనక్కితిరిగి చూస్తే.. సీమాంధ్రకు మిగిలింది శూన్యమనే చెప్పాలి. మనకున్న వనరులు, సౌలభ్యాలను సద్వినియోగం చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో విజయవాడను మరో హైదరాబాద్గా తీర్చిదిద్ది క్రీడాపతాకాన్ని రెపరెపలాడించవచ్చు. 2017 జాతీయ క్రీడలు ఇక్కడే.. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో 2017లో జరగాల్సిన జాతీయ క్రీడల్ని నగరంలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా మాత్రమే క్రీడా మౌలిక సదుపాయాలు సాధించుకోవచ్చని క్రీడాసంఘాలు, నిపుణులు చెబుతున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు కోరింది. కేంద్రం కరుణించి జాతీయ క్రీడలు కేటాయించి ప్రత్యేక నిధులిస్తే విజయవాడతో పాటు విశాఖపట్నం, తిరుపతి, కాకినాడల్లోనూ అంతర్జాతీయ స్టేడియాలు, క్రీడా మౌలిక సదుపాయాలు ఏర్పాటవుతాయి. గతంలో హైదరాబాద్లో జాతీయ క్రీడలు నిర్వహించినప్పుడు కంటితుడుపు చర్యగా విశాఖపట్నంలో మాత్రమే ఒకట్రెండు ఆటలు నిర్వ హించారు. 2017 జాతీయ క్రీడలు విజయవాడను బేస్ చేసుకుని తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ, కర్నూలుల్లో కూడా నిర్వహించాలని నిర్ణయించారు. నగర స్వరూపమే మారిపోతుంది జాతీయ క్రీడల కోసం కనీసం రూ.2వేల కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. 39వ జాతీయ క్రీడలు విజయవాడకు కేటాయిస్తే నగర స్వరూపమే మారిపోతుందనడంలో సందేహం లేదు. సింథటిక్ ట్రాక్లు, ఆస్ట్రోటర్ఫ్ మైదానాలు, స్విమింగ్ పూల్స్, డైవింగ్ పూల్స్, కృష్ణానదిలో వాటర్ స్పోర్ట్స్తోపాటు మంచి రోడ్లు, నగర సుందరీకరణ జరుగుతుంది. విజయవాడ కేంద్రంగా 32 క్రీడాంశాల్లో ఆతిథ్యం ఇవ్వొచ్చు. భవానీపురంలో దాదాపు 10 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థకు అప్పగించారు. అక్కడ స్టేడియం నిర్మిస్తే అంతర్జాతీయ స్థాయి సింథటిక్ రన్నింగ్ ట్రాక్, మల్టీపర్పస్ ఇండోర్ స్డేడియం రూపుదిద్దుకుంటాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అథ్లెటిక్ ట్రాక్ వేసుకోవచ్చు. అజిత్సింగ్నగర్లోని ఎంబీపీ మున్సిపల్ స్టేడియంలో హాకీ కోసం ఆస్ట్రోటర్ఫ్ హాకీ ఫీల్డ్ ఏర్పాటుచేసుకోవచ్చు. మైలవరంలో అవుట్డోర్ స్టేడియంలో ఫుట్బాల్, ఇండోర్ స్టేడియంలో తైక్వాండో, వెయిట్లిఫ్టింగ్ వంటి పోటీలు నిర్వహించవచ్చు. మచిలీపట్నంలో బీచ్ వాలీబాల్, యాచింగ్, సెయిలింగ్ వంటివి నిర్వహించుకోవచ్చు. పొరుగునే ఉన్న గుంటూరు జిల్లాలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కూడా జాతీయ క్రీడలు నిర్వహించుకోగలిగిన మైదానం ఉంది. కృష్ణా నదిలో వాటర్ స్పోర్ట్స్ నిర్వహిస్తే విజయవాడ క్రీడా, పర్యాటక రంగంగా మారిపోతుంది. క్రీడావిలేజ్ నిర్మాణంతో నిధులే నిధులు.. జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు, అధికారులు, టెక్నికల్ స్టాఫ్ వసతి కోసం కోట్లాది రూపాయిలతో క్రీడా విలేజ్ నిర్మించాల్సి ఉంటుంది. గచ్చిబౌలీలో మాదిరిగా అధునాతన అపార్టుమెంట్లు కడతారు. పోటీలు ముగిసిన తరువాత వాటిని వేలం ద్వారా ప్రభుత్వం అమ్మకానికి పెడుతుంది. దీంతో భారీగా నిధులు సమకూరతాయి. ఆగిరిపల్లి -గన్నవరం మధ్య ఈ క్రీడా విలేజ్ నిర్మించేందుకు అవకాశం ఉందని క్రీడానిపుణలు చెబుతున్నారు. ఆభివృద్ధి చెందాలంటే జాతీయ క్రీడలే మార్గం జాతీయ క్రీడలు నిర్వహించడం ద్వారా స్థానిక వర్థమాన క్రీడాకారుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. కొత్త రాష్ట్రం పేరు ప్రఖ్యాతులు ఇప్పటికిప్పుడు దేశానికి, ప్రపంచానికి చాటి చెప్పాలన్నా అది కేవలం క్రీడారంగంతోనే సాధ్యం. నగరానికి కొత్త రూపు వస్తుంది. -
నేటికీ అందని ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలు
కర్నూలు(అర్బన్) : చదువుపైనే దృష్టి పెట్టాల్సిన విద్యార్థులు.. దురదృష్ణవశాత్తు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది. బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఇబ్బందిపడే పరిస్థితి నెలకొంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెలన్నర గడుస్తున్నా విద్యార్థుల ప్రధాన సమస్య అయిన ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరం. గత ఏడాదికి సంబంధించిన ఫీజులు, ఉపకార వేతనాలను ప్రభుత్వం నేటికీ విడుదల చేయకపోవడంతో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులు అందోళనకు గురవుతున్నారు. విద్యా సంవత్సరం పూర్తి అయి కళాశాలలు పునః ప్రారంభమైనా, నేటికీ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన సుమారు 44 వేల మంది విద్యార్థులకు ప్రభుత్వం రూ.93 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలను బకాయి పడింది. ఫీజు విడుదలకు సంబంధించి రాష్ట్ర అర్థిక పరిస్థితిని పాలకవర్గాలు సాకుగా చూపిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటా జరుగుతున్నట్లే ఈ సారి కూడా ఫీజుల చెల్లింపు ప్రహసనంగా మారింది. ఇప్పటికే ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, మెడికల్, ఇంజనీరింగ్ తదితర ఉన్నత చదువులతో పాటు ఐటీఐ, పాలిటెక్నిక్, నర్సింగ్, బీఈడీ తదితర వృత్తి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు కూడా ఉపకార వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. రెన్యూవల్ విద్యార్థులతో పాటు గత ఏడాది వివిధ కోర్సుల్లో చేరిన కొత్త విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ అందలేదు. అయితే జిల్లాలోని పలు కళాశాలలకు చెందిన ప్రిన్సిపాళ్లు కూడా విద్యార్థులకు సంబంధించిన హార్డ్కాపీలను పంపించడంలో చేస్తున్న జాప్యం వల్ల కూడా అర్హులైన విద్యార్థులకు ఫీజులు, ఉపకార వేతనాలు అందనట్లు తెలుస్తోంది. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, బడ్జెట్ విడుదల తదితర విషయాల్లో అధికార యంత్రాంగం చూపుతున్న నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారుతోంది. ఫీజు విడుదలలో జరుగుతున్న జాప్యం వల్ల ఆయా కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారికి సర్టిఫికెట్లను అందించడంలో పలు కళాశాలలకు చెందిన యాజమాన్యాలు ఫీజులను చెల్లించాలని ఒత్తిడి తీసుకువస్తున్నట్లు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మరికొన్ని యాజమాన్యాలు రెన్యూవల్ విద్యార్థులను ఫీజులు చెల్లించాలని, ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మళ్లీ వెనక్కు ఇస్తామని చెబుతున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. -
టేకోవర్లపై ఇండియన్ బ్యాంక్ దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టేకోవర్ల ముప్పు నుంచి తప్పించుకోవడంతోపాటు ఇతర బ్యాంకులను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వరంగ ఇండియన్ బ్యాంక్ రంగం సిద్ధమయ్యింది. మూడు గ్రామీణ బ్యాంకులను ప్రధాన బ్యాంక్లో విలీనం చేయడం ద్వారా పెద్ద బ్యాంకుగా ఎదగడమే కాకుండా, వేరే బ్యాంక్ను కొనుగోలు చేసే స్థాయికి చేరతామంటున్నారు ఇండియన్ బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ టి.ఎస్.భాసిన్. హైదరాబాద్లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించడానికి వచ్చిన భాసిన్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు.. విలీనాలు, కలయికలపై.. దేశీయ బ్యాంకింగ్ రంగంలో విలీనాలు, కలయికలు తప్పనిసరి. కానీ ఈ విషయం ఇంకా చర్చల దశలోనే ఉంది. బ్యాంకుల బోర్డులు, ఉద్యోగ సంఘాలు, ఖాతాదారుల మధ్య అనేక చర్చలు జరిగి, దానికి తగిన వాతావరణం ఏర్పడిన తర్వాత విలీనాలు, కలయికలు ప్రారంభమవుతాయి. దీనికి ఇంకా సమయం ఉన్నా మేము మాత్రం టేకోవర్ ముప్పు నుంచి తప్పించుకోవడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం. అందులో భాగంగా మా బ్యాంక్కు చెందిన మూడు గ్రామీణ బ్యాంకులను విలీనం చేసుకోవాలనుకుంటున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ఉన్నతాధికారులతో చర్చలు జరుగుతున్నాయి. ఇదే జరిగితే ఇండియన్ బ్యాంక్ శాఖల సంఖ్య ప్రస్తుతమున్న 2,260 నుంచి 3,500కి పెరగడమే కాకుండా, తగినంత మూలధనం సమకూరుతుంది. దీంతో వేరే బ్యాంకులను కోనుగోలు చేసే శక్తి వస్తుంది. అవకాశం వస్తే ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులను కొనుగోలు చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాం. నిధుల సేకరణ గురించి.. గత పదేళ్ళుగా కేంద్రం నుంచి ఎటువంటి నిధుల సహాయం లేకుండా సొంత లాభాలతోనే వ్యాపారాన్ని విస్తరిస్తున్నాం. గడచిన ఏడాది రూ.1,159 కోట్ల నికర లాభం రావడంతో రూ10,000 కోట్ల వరకు అదనపు రుణాలను ఇవ్వగలం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి కానీ, వాటాలను విక్రయించడం ద్వారా కానీ నిధులు సేకరించే ఆలోచన లేదు. బాసెల్-3 నిబంధనల ప్రకారం క్యాపిటల్ అడిక్వసీ రేషియో 13.1 శాతంగా, అదే బాసిల్-2 నిబంధనల ప్రకారం అయితే 12.48 శాతంతో పటిష్టంగా ఉంది. వ్యాపార విస్తరణ.. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం రావడంతో పాటు, వృద్ధిరేటు పెరుగుతుండటంతో రుణాలకు డిమాండ్ పెరుగుతుందని ఆశిస్తున్నాం. ఈ ఏడాది రుణాల్లో 18 నుంచి 20%, డిపాజిట్లలో 15.5% వృద్ధిని అంచనా వేస్తున్నాం. గడచిన ఏడాది 16% వృద్ధితో వ్యాపార పరిమాణం రూ.2.80 లక్షల కోట్లుగా ఉంది. ఎన్పీఏల విక్రయం గురించి ఎన్పీఏల రికవరీపై పూర్తి దృష్టి పెట్టడమే కాకుండా కొన్ని నిరర్థక ఆస్తులను విక్రయించాలని నిర్ణయించాం. 18 అకౌంట్లకు చెందిన రూ.562 కోట్ల విలువైన ఎన్పీఏలను అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి విక్రయించడానికి సంబంధించి చర్చలు జరుపుతున్నాం. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. నికర నిరర్థక ఆస్తులు 2.26 శాతంగా ఉన్నాయి. పెద్దగా ఆందోళన చెందనవసరం లేదు. వడ్డీరేట్ల గురించి... ప్రభుత్వం ద్రవ్యోల్బణం తగ్గించడానికి పలు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఆహార సరఫరా వైపు పలు చర్యలు తీసుకుంటుండటంతో రుతుపవనాలు నెమ్మదించినా ధరల పెరుగుదలపై అంతగా ప్రభావం ఉండదనుకుంటున్నాం. రానున్న కాలంలో వడ్డీరేట్లు తగ్గడానికే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన ప్రభావం.. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో అపారమైన వ్యాపార అవకాశాలు ఏర్పడ్డాయి. వీటిని అందిపుచ్చుకోవడానికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సీఎంను కలిశాం. త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా కలుస్తున్నాం. ఆంధ్రాలో రేవులు, సెజ్లు, పరిశ్రమల అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలకు అనుగుణంగా వచ్చే రెండేళ్లలో రూ.10,000 కోట్లు రుణాలను ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఇందులో రేవుల కోసం రూ.5,000 కోట్లు, సెజ్లు, ఇతర రంగాల కోసం మరో రూ.5,000 కోట్ల కేటాయించాం. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కలిపి 301 శాఖలు ఉంటే ఈ ఏడాది చివరి నాటికి 350కి పెంచనున్నాం. అలాగే రెండు రాష్ట్రాల్లో కలిపి రూ.25,000 కోట్లుగా ఉన్న వ్యాపారాన్ని ఈ ఏడాది చివరి నాటికి రూ.35,000 కోట్లకు, 2016 మార్చికి రూ.50,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. -
ఇక పల్లె ప్రణాళిక
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : వరుస ఎన్నికలు.. రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో ఇన్నాళ్లూ కార్యాలయాలకే పరిమితమైన అధికారగణం ఇక పల్లెబాట పట్టనుంది. గ్రామాల్లో అవసరాలను, ప్రాధామ్యాలను మదింపు చేయనుంది. ప్రజలతో మమేకమై పల్లె సర్వోతముఖాభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు రూపొందించేందుకు సిద్ధమవుతోంది. ‘మన ఊరు-మన ప్రణాళిక’ పేరున సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈనెల 17వ తేదీలోపు గ్రామాల ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించింది. సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్ఆర్డీ)లో జిల్లా కలెక్టర్లు, కీలకశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన కలెక్టర్ ఎన్.శ్రీధర్ సమావేశ వివరాలను ‘సాక్షి’కి వివరించారు. ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకూ గ్రామాలవారీగా పర్యటించి ప్లాన్లు తయారుచేస్తామని చెప్పారు. 22వ తేదీలోపు మండల స్థాయి, 27వ తేదీలోపు జిల్లాస్థాయి ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించాలని సర్కారు ఆదేశించినట్లు తెలిపారు. త్వరలో రాష్ట్ర స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తామని, దీనిపై ఆగస్టులో జరిగే శాసనసభ బడ్జెట్ సమావేశంలో చర్చించి నిధులు కేటాయించనున్నట్లు సీఎం స్పష్టం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామాల అవసరాలను ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారయంత్రాంగం చర్చించి ఐదేళ్ల కార్యాచరణ రూపొందించాలని సూచించినట్లు తెలిపారు. గతంలో నిధుల కేటాయింపునకు అనుగుణంగా ప్రణాళికలు తయారు చేసేవారమని, ఇకపై ప్రణాళికబద్ధంగా నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు శ్రీధర్ వివరిం చారు. జిల్లాలో ఆయా సంస్థలకు కేటాయించిన భూముల్లో 10,900 ఎకరాలు నిరుపయోగంగా ఉన్నట్లు గుర్తించామని, అలాగే మరో 8వేల ఎకరాల భూమి కూడా పరిశ్రమలకు తక్షణ కేటాయింపులకు వీలుగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలిపినట్లు శ్రీధర్ స్పష్టం చేశారు. -
ఇక సం‘క్షేమ’మా..?!
ఖమ్మం హవేలి: రాష్ట్ర విభజనకు ముందు అప్పటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను చట్టబద్ధం చేసినా సాంఘిక సంక్షేమ వసతిగృహాలకు ఒక్క పైసా విదల్చకపోవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఉపప్రణాళిక నిధులు సాంఘిక సంక్షేమశాఖకు వస్తాయనే ఆశలు ప్రతి ఒక్కరిలో చిగురిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉపప్రణాళిక నిధులకు బదులు జనరల్ ఫండ్స్ మాత్రమే వస్తుండడంతో జిల్లా సాంఘిక సంక్షేమశాఖ నిర్దేశిత లక్ష్యాన్ని చేరలేకపోతోంది. సగానికిపైగా సీట్లు ఖాళీయే.. మూడు నుంచి 10 తరగతులు చదివే విద్యార్థుల కోసం సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో జిల్లాలో 77 వసతిగృహాలు ఉన్నాయి. ఇందులో 52 బాలుర, 25 బాలికల కు సంబంధించినవి. వీటితోపాటు అనాథ పిల్లల కోసం ఖమ్మంలో బాలికలు, భద్రాచలంలో బాలుర వసతిగృహాలు ఉన్నాయి. సత్తుపల్లిలో ఒక ఇంటిగ్రేటెడ్ వసతిగృహం, ఖమ్మంలో ఒక చైల్డ్ బెగ్గర్ హోమ్ నిర్వహిస్తున్నారు. వీటన్నింటిలో కలిపి జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎనిమిదివేల సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. ఈ విద్యా సంవత్సరం నాటికి 3,847 సీట్లు మాత్రమే భర్తీ చేశారు. ఇంకా 4,153 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎస్సీ సంక్షేమ వసతి గృహాలన్నీ సొంత భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. వేంసూరు బాలుర, మధిర బాలి కల, ఖమ్మం ‘సి’ బాలుర, భద్రాచలం బాలుర అనంద నిలయం, ఎర్రుపాలెం బాలుర, పెనుబల్లి బాలుర వసతిగృహాలు శిథిలావస్థకు చేరడంతో వాటి స్థానంలో కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. నిర్మాణం పూర్తి అయ్యే వరకు తాత్కాలికంగా వీటిని అద్దె భవనాల్లోనే కొనసాగిస్తున్నారు. మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో చేరే విద్యార్థుల సంఖ్య రెండేళ్లుగా తగ్గిపోతోంది. ఉపప్రణాళిక నిధులు వస్తే సౌకర్యాలు మరింతగా మెరుగుపడి విద్యార్థుల చేరిక పెరిగే అవకాశం ఉంది. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా గత ఆర్థిక సంవత్సరం 17,800 మంది విద్యార్థులకు రూ.10,15,91,430 ఉపకార వేతనాలు, రూ.36,23,57,043 ఫీజు రీయింబర్స్మెంట్, రాజీవ్ విద్యాదీవెన ద్వారా 9, 10 తరగతుల విద్యార్థులకు రూ.76,18,300 ప్రీమెట్రిక్ స్కాలర్షిప్స్, ఎస్సీ న్యాయవాదుల శిక్షణ కోసం రూ.3,50,000, బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద రూ.1,03,10,000, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్ పథకం ద్వారా రూ.5,00,000, విద్యార్థుల ప్రతిభ పురస్కారాలు రూ.1,95,000, కులాంతర వివాహాలకు రూ.7,20,000 ఖర్చు చేశారు. ఉపప్రణాళిక ద్వారా జిల్లాలో ఎస్సీ కాలనీల్లో విద్యుత్చార్జీలు (50 యూనిట్ల లోపు) 22,322 సర్వీసులకు రూ.2,25,57,000 వెచ్చించారు. ఈ ఒక్క విభాగంలో మాత్రమే ఉప ప్రణాళిక నుంచి నిధులు మంజూరు కావడం గమనార్హం. ఎస్టీ సంక్షేమ హాస్టళ్లకు ఎల్డబ్ల్యూఈఏ ద్వారా రూ.206కోట్లు జిల్లాలో గిరిజన సంక్షేమ పాఠశాలలు 365, గిరిజన ఆశ్రమ పాఠశాలలు 75, వసతిగృహాలు 45 ఉన్నాయి. ఇందులో విద్యార్థుల ప్రవేశాల లక్ష్యం నాలుగేళ్లుగా నెరవేరుతోంది. ఎస్టీ ఉపప్రణాళిక ద్వారా గత సంవత్సరం రూ.50 కోట్లు మంజూరు కాగా తీవ్రవాద ప్రభావిత ప్రాంతా ల నిధులు (ఎల్డబ్ల్యూఈఏ) ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.206 కోట్లు వచ్చాయి. 67 బీసీ సంక్షేమ వసతిగృహాల్లో 30 అద్దె భవనాల్లోనే.. బీసీ సంక్షేమశాఖ కింద జిల్లాలో మొత్తం 67 వసతిగృహాలు ఉన్నాయి. వీటిలో 47 హాస్టళ్లు ప్రీమెట్రిక్, 20 వసతి గృహాలు కళాశాలలకు సంబంధించినవి ఉన్నాయి. వీటిలో 30 వసతిగృహాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అద్దె భవనాల్లో కొనసాగేవాటిలో కల్లూరు, వి.వెంకటాపురం, అశ్వాపురం బాలుర, నేలకొండపల్లి బాలికల వసతిగృహాల భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. మిగిలిన 26 హాస్టళ్లకు ఇప్పటివరకు స్థలం కేటాయించ లేదు. వీటిలో మొత్తం 5,020 సీట్లు ఉండగా నాలుగేళ్లుగా పూర్తిస్థాయిలోనే భర్తీ అవుతున్నాయి. గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో జిల్లా సగటు 89.78 శాతం కాగా బీసీ వసతిగృహాల్లో ఉండి చదువుకున్న విద్యార్థుల్లో 705 మందికి 672మంది (95.2శాతం) ఉత్తీర్ణులు అయ్యారు. బీసీ సంక్షేమ శాఖకు నిధులు మంజూరు చేసి అద్దె భవనాల్లో కొనసాగుతున్నవాటికి సొంత భవనాలు నిర్మిస్తే విద్యార్థులకు మరింత మేలు కలిగే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాశిక ద్వారా ఆయా శాఖల సంక్షేమ వసతిగృహాలకు నిధులు మంజూరు చేయడంతో పాటు బీసీ సంక్షేమ వసతిగృహాలకు నిధులు మరింతగా పెంచి వాటికి సొంత భవనాలు నిర్మిస్తే విద్యార్థుల సంక్షేమం ప్రగతిపథంలో దూసుకెళ్లే అవకాశం ఉంది. -
పారిశ్రామికాభివృద్ధికి బాటలు
కర్నూలు(కలెక్టరేట్): రాష్ట్ర విభజన నేపథ్యంలో పారిశ్రామికాభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేస్తోంది. ఇందుకు అనువైన ప్రభుత్వ భూములు ఉండటంతో జిల్లాపై అందరి దృష్టి కేంద్రీకృతమవుతోంది. తగిన నీటి వసతి.. వివిధ రాష్ట్రాలను కలుపుతూ జాతీయ రహదారులు ఉండటం.. రైల్వే మార్గాలు ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా అనుకూలమనే భావన వ్యక్తమవుతోంది. ఎలాంటి పరిశ్రమలు స్థాపించవచ్చనే వివరాలను కూడా ఇప్పటికే జిల్లా పరిశ్రమల శాఖ సిద్ధం చేసింది. సిమెంట్ పరిశ్రమలు.. కాటన్ జిన్నింగ్ మిల్లులు.. గ్లాస్ ఇండస్ట్రీస్.. స్పాంజ్, ఐరన్ ప్లాంట్లు.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు.. టెక్స్టైల్స్ పరిశ్రమలు.. ప్లాస్టిక్ ఇండస్ట్రీస్.. కోల్డ్ స్టోరేజీలు తదితరాల ఏర్పాటుకు జిల్లా అనువైన ప్రాంతంగా భావిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఏపీఐఐసీ ద్వారా ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ఓర్వకల్లు మండలం శకునాలలో ఇండస్ట్రియల్ పార్కును 2వేల ఎకరాల్లో నెలకొల్పేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆ మేరకు శుక్రవారం ఏపీఐఐసీకి శుకునాలలో భూ కేటాయింపునకు కలెక్టర్ ఆధ్వర్యంలోని ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ ఆమోదం తెలిపింది. ఇందులో ఏపీఐఐసీ అధికారులు రోడ్డు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించి పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారికి అవసరమైన భూమిని విక్రయించనున్నారు. ప్రస్తుతం జిల్లాలో కర్నూలు, డోన్, ఆదోనిల్లో ఒక్కొక్కటి, నంద్యాలలో రెండు ప్రకారం ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి. ఇకపోతే కల్లూరులో 103 ఎకరాలు, ఓర్వకల్లు మండలం నన్నూరులో 1,223 ఎకరాలు, ఓర్వకల్లులో 78 ఎకరాలు, కర్నూలు మండలం పంచలింగాలలో 38 ఎకరాలు, కల్లూరు మండలంలో లక్ష్మీపురంలో 127 ఎకరాలు, ఓర్వకల్లులో మరో చోట 356 ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. నంద్యాలకు చెందిన శాంతిరాం గ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో సోలార్ పవర్ప్లాంట్ నెలకొల్పేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. వెయ్యి మెగా వాట్ల సోలార్ విద్యుదుత్పత్తికి 5వేల ఎకరాల భూములు కేటాయించాలని ప్రభుత్వానికి ఈ సంస్థ దరఖాస్తు చేసుకుంది. జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఉత్పత్తి సంస్థ తమ ఫ్యాక్టరీకి రైల్వే లైన్ కోసం 349 ఎకరాల భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. సిమెంట్ను వ్యాగన్ల ద్వారా ఎగుమతి చేసేందుకు రైల్వే ట్రాక్ ఏర్పాటుపై దృష్టి జేఎస్డబ్ల్యూ దృష్టి సారించింది. కౌలూరు, కొండజూటూరు, కొరటమద్ది, చిలకలగూడూరు, గడిగరేవుల, దుర్వేసి, పెసరవాయి, బూజనూరు, తిరుపాడు గ్రామాల మీదుగా రైల్వే ట్రాక్కు అవసరమైన భూములు కేటాయించాలని ఆ సంస్థ యాజమాన్యం కోరినట్లు అధికారులు తెలిపారు. -
పలాస జీడిపప్పుకు విభజన సెగ..!
సాక్షి, పలాస: జీడిపప్పు ఉత్పత్తిలో జాతీయస్థాయి గుర్తింపు పొందిన శ్రీకాకుళం జిల్లా పలాస మార్కెట్కు రాష్ట్ర విభజన దెబ్బ తగిలింది. పలాస నుంచి హైదరాబాద్కు జీడిపప్పు ఎగుమతులు నిలిచిపోతున్నాయి. గతంలో ఒక శాతం టీఓటీ(టర్నోవర్ ట్యాక్స్)తో పలాస నుంచి ఎటువంటి ఆంక్షలు లేకుండా నేరుగా హైదరాబాద్కు రవాణా చేసేవారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడే జీడిపప్పు వినియోగదారులు ఎక్కువగా ఉండేవారు. రోజూ పలాస నుంచి బస్సులు, రైళ్లు, ఇతర వాహనాల ద్వారా జీడిపప్పు రావాణా అయ్యేది. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు మారాయి. ఇప్పుడు హైదరాబాద్కు జీడిపప్పు రవాణా చేయాలంటే ఒక శాతం టీఓటీ పన్నుకు బదులు 5 శాతం వ్యాట్ చెల్లించాల్సి వస్తోంది. దీనికి తోడు విజయవాడ తరువాత హైదరాబాద్ వరకు పలుచోట్ల చెక్పోస్టులు పెట్టడంతో వాటి చార్జీల భారం కూడా పడుతోంది. దీనికి తోడు ఈ నెల 25 నుంచి రైల్వే రవాణా చార్జీలు కూడా పెరుగుతున్నాయి. పలాస నుంచి హైదరాబాద్కు ప్రతిరోజు సుమారు 27 టన్నుల జీడిపప్పు ఎగుమతి చేస్తుంటారు. టన్ను విలువ రూ.35 లక్షలు. ఈ లెక్కన మొత్తం సరుకు విలువ రూ.9.45 కోట్లు అవుతుంది. దీనిపై ఉమ్మడి రాష్ట్రంలో ఒక శాతం టీఓటీ అంటే రూ.9.45 లక్షలు చెల్లిస్తే.. ఇప్పుడు వ్యాట్ రూపంలో దానికి ఐదు రెట్లు.. అంటే రూ.47.25 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. మారిన పరిస్థితులు, ముడిసరుకు కొరత తదితర కారణాలతో పలాస జీడిపరిశ్రమ నేడు కష్టాల్లో చిక్కుకుంది. విదేశీ పిక్కలపైనే ఆధారం... స్వదేశీ పిక్కలు ఇక్కడి పరిశ్రమల అవసరాలకు సరిపోవడం లేదు. ఉద్దానం ప్రాంతంలో సుమారు లక్ష ఎకరాల్లో జీడి పంట సాగవుతుంది. సగటున 5 లక్షల క్వింటాళ్ల జీడిగింజలు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే గత ఏడాది ప్రకృతి విపత్తుల కారణంగా సుమారు 3 లక్షలు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. పలాస పరిసరాల్లో సుమారు 300 జీడి పరిశ్రమలు ఉండగా, జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో మరో 300 పరిశ్రమలు ఉన్నాయి. వీటన్నింటికి ముడిసరుకు ఉద్దానం ప్రాంతంతో పాటు జిల్లాలోని సీతంపేట, పాలకొండ తదితర ప్రాంతాల నుంచి సరఫరా అవుతుంది. దాంతో పలాస జీడిపరిశ్రమదా రులు ఉద్దానం ప్రాంత పిక్కలతో పాటు విదేశీ పిక్కలపై ఆధారపడుతున్నారు. ఆఫ్రికా దేశాలతోపాటు ఇండోనేషియా వంటి దేశాల నుంచి సుమారు 5 లక్షల క్వింటాళ్ల జీడి పిక్కలు దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం దేశవాళీ పిక్కల ధర బస్తా రూ.6,400 పలుకుతుండగా విదేశీ పిక్కలు రూ.5,600కే లభిస్తున్నాయని పలాస కాష్యూ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(పీసీఎంఎ) కోశాధికారి కేవి శివక్రిష్ణ చెప్పారు. కేరళకు చెందిన పలు కంపెనీలు పలాస మార్కెట్కు జీడిపిక్కలను విదేశాల నుంచి దిగుమతి చేస్తున్నాయని, వారి నుంచి ఇక్కడ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారన్నారు. మరోవైపు ప్రస్తుత జీడిపిక్కల ధరకు తగ్గట్టు మార్కెట్లో జీడిపప్పు ధరలు లేవు. గత నెల కిలో జీడిపప్పు రూ.480 ఉండగా నేడు 460 రూపాయలకు తగ్గింది. నంబర్ వన్ రకాలు ప్రస్తుతం మార్కెట్లో లభించడం లేదు. ఇదిలా ఉండగా జీడి పప్పు విషయంలో దేశంలో ఒకే పన్ను విధానం లేదు. పొరుగు రాష్ట్రాల్లో పన్ను వెసులుబాటు ఉండటంతో అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్కు జీడి పప్పు ఎగుమతి అవుతోందని పలాస వ్యాపారులు చెబుతున్నారు. ఏకరూప పన్ను విధానం అమలుచేస్తే పలాస జీడి పప్పుకు మంచి గిరాకీ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
క్రీడలకు ‘విభజన’ శాపం
- నిధుల మంజూరులో జాప్యం - విడుదల కాని రూ.50.05 కోట్లు - ప్రశ్నార్థకంగా 10 స్టేడియాల ఆధునికీకరణ - కొత్త ప్రభుత్వం కరుణ కోసం నిరీక్షణ నెల్లూరు(బృందావనం): జిల్లాలో క్రీడా ప్రగతికి రాష్ట్ర విభజన శాపంగా మారింది. కొత్త స్టేడియాల నిర్మాణం, పాత స్టేడియాల ఆధునికీకరణకు గ్రహణం పట్టింది. బాలారిష్టాలెన్నింటినో దాటుకుని పనుల దశకు వచ్చిన సమయంలో విభజన జరిగి, నిధులు మంజూరు నిలిచిపోయింది. మరోవైపు గత ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులకు కాలం చెల్లింది. దీంతో క్రీడారంగ అభివృద్ధి ప్రశ్నార్థకమవుతోందని క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో జిల్లాకు రూ.50.05 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో కొత్త స్టేడియాల నిర్మాణం, పాత స్టేడియాలను ఆధునికీక రిస్తామని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ప్రకటించింది. ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్సు కాంప్లెక్స్ ఆధునికీకరణకు రూ.14 కోట్లు, మాగుంటలే అవుట్లో టెన్నిస్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ. 6.95 కోట్లు, వెంకటగిరిలోని తారకరామ క్రీడాప్రాంగణం అభివృద్ధికి రూ.2.70 కోట్లు, గూ డూరు, ఉదయగిరిల్లో మినీస్టేడియాలకు ఫెన్సింగ్ నిర్మాణానికి రూ.55 లక్షలు మంజూరు చేశారు. ఇక కొత్తగా మినీస్టేడియాల నిర్మాణానికి సంబంధించి అల్లీపురానికి రూ.3.60 కోట్లు, ఆత్మకూరుకు రూ.7.15 కోట్లు, పొదలకూరుకు రూ.2.60 కోట్లు, కోవూరుకు రూ.5.05 కోట్లు, కావలికి రూ.4.70 కోట్లు, సూళ్లూరుపేటకు రూ.2.75 కోట్లు కేటాయించారు. ఈ క్రమంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం ప్రాంగణంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆధునికీకరణ, మాగుంట లేఅవుట్లో నూతన టెన్నిస్ కాంప్లెక్స్, అల్లీపురంలో మినీస్టేడియం నిర్మాణానికి మార్చి 2న అప్పటి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు. వెంటనే పనులు ప్రారంభించి 18 నెలల్లో పూర్తి చేయాలని అప్పట్లో ఆయన సభాముఖంగా అధికారులకు సూచించారు. విభజనతో నిధులకు గ్రహణం రాష్ట్ర విభజన నేపథ్యంలో పరిపాలన పరంగా తలెత్తిన సమస్యలతో గత ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు అమలుకు నోచుకోలేదు. దీంతో రూ.50.05 కోట్ల నిధుల విడుదలకు ఆటంకం ఏర్పడింది. నిధుల విడుదల కాక, ఆధునికీకరణ పనులు జరగక జిల్లాలో ప్రస్తుతం ఉన్న క్రీడాప్రాంగణాలు కళతప్పుతున్నాయి.కొత్త ప్రభుత్వమైనా స్పందించి గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను విడుదల చేసి క్రీడాభివృద్ధికి సహకరించాలని క్రీడాకారులు, క్రీడాభిమానులు కోరుతున్నారు. త్వరలో నిధులు విడుదల: ఆర్.కె.ఎతిరాజ్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి నిధుల మంజూరుకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోంది. త్వరలో విడుదల అవుతాయి. ఇప్పటికే జిల్లా క్రీడాప్రాధికార సంస్థ చైర్మన్, కలెక్టర్ శ్రీకాంత్ ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. సమీక్ష సమావేశం కూడా నిర్వహిం చారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు పరిస్థితి నివేదించాం. మరో పదిహేను రోజుల్లో నిధుల విడుదల జరిగి పనులు అప్పగించిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ సొసైటీ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ) టెండర్ ఫ్లోట్ చేయనుంది. మరో 15 రోజు ల్లోగా సమగ్ర సమాచారం అందుతుంది. -
‘ప్రోత్సాహకం’ ఏమైంది?
చేవెళ్ల: గ్రామ సర్పంచ్ ఏకగ్రీవమైతే నిధులొస్తాయని, గ్రామం అభివృద్ధి చెందుతుందని భావించిన ప్రజలకు నిరాశే మిగిలింది. ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహక నిధులు(ఇన్సెంటివ్స్) విడుదల చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఎన్నికల్లో రిజర్వేషన్లకు అనుగుణంగా పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రభుత్వం గతంలో రూ.ఐదు లక్షలు ఇచ్చేది. 2013 జూలైలో జరిగిన ఎన్నికలకు ముందు ఈ నిధులను రూ.ఏడు లక్షలకు పెంచారు. అయితే ఆ డబ్బుల విడుదల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం పురపాలక, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికలు వరుసగా జరగడం.. రాష్ట్ర విభజన నేపథ్యంలో పలు గ్రాంట్లనుంచి నిధులు విడుదలకాక ఏ మాత్రం అభివృద్ధి చేయలేకపోయామని ఏకగ్రీవ సర్పంచులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 688 గ్రామపంచాయతీలున్నాయి. గత సంవత్సరం జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో జిల్లాలో 31 పంచాయతీల పాలక మండళ్లు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో కేవలం చేవెళ్ల రెవిన్యూ డివిజన్ పరిధిలోనే 15 పంచాయతీలు ఉన్నాయి. చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లి, షాబాద్ మండలం అంతారం గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు నంబర్లందరినీ గ్రామప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చేవెళ్ల మండలం ఎనికెపల్లి పంచాయతీకి సర్పంచ్ పదవి ఏకగ్రీవంకాగా, పలు వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవ పంచాయతీలకు త్వరగా నిధులు మంజూరయ్యేలా చూడాలని ఆయా గ్రామాల సర్పంచ్లు, ప్రజలు నూతన కలెక్టర్ ఎన్ .శ్రీధర్ను కోరుతున్నారు. ఎకగ్రీవమైతే రూ.ఏడు లక్షలు వస్తాయని, గ్రామం అభివృద్ధి చెందుతుందని భావించి ప్రజలు మంచి నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లుతోందని చేవెళ్ల నియోజకవర్గంలోని ఏకగ్రీవ సర్పంచులు ఎన్ను జంగారెడ్డి (ఇబ్రహీంపల్లి), దర్శనాల జంగమ్మ (అంతారం), వన ం లతామహేందర్రెడ్డి (ఎనికెపల్లి) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందని, సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు ఏర్పాటు చేయాల్సి ఉందని వారంతా వాపోతున్నారు. సర్పంచ్ ఏకగ్రీవం.. మాకూ ఇవ్వాలి మా గ్రామస్తులంతా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనివార్య కారణాలవల్ల కొన్ని వార్డులకు మాత్రం ఎన్నికలు జరిగాయి. సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైనందున తమ పంచాయతీకీ ప్రోత్సాహక నిధులను కేటాయించాలి. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేసుకునే వీలు కలుగుతుంది. - వనం లతామహేందర్రెడ్డి, సర్పంచ్, ఎనికెపల్లి, చేవెళ్ల మండలం వెంటనే నిధులు విడుదల చేయాలి ఎన్నికల సమయంలో ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలకు ప్రోత్సాహకంగా నిధులను ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పాలకవర్గం ఏర్పడి ఏడాదైంది. ఇప్పటికీ పైసా ఇవ్వలే. ఇదే విషయాన్ని పలుమార్లు మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కల్పించుకుని వెంటనే నిధులను మంజూరు చేయించాలి. - దర్శనాల జంగమ్మ, సర్పంచ్, అంతారం, షాబాద్ మండలం -
ఐఐటికీ.. నూజివీడే అనుకూలం...
అందుబాటులో అనువైన స్థలం ప్రముఖుల రాకపోకలకు అనుకూలం నూజివీడు : సంయుక్త ఆంధ్రప్రదేశ్లో ట్రిపుల్ ఐటీని సొంత చేసుకుని గుర్తింపు తెచ్చుకున్న నూజివీడు ప్రాంతం నూతన నవ్యాంధ్రప్రదేశ్లో ఏర్పాటు కానున్న ఐఐటీకీ అనుకూలమని ప్రముఖులు పేర్కొంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్లో 11జాతీయ విద్యాసంస్థలను నెలకొల్పుతామని కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నూజివీడు ప్రాంతంలో వేలాది ఎకరాల భూములు అందుబాటులో ఉన్నందున ఐఐటీ ఏర్పాటుకు నూజివీడు ప్రాంతం అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. విభజన అనంతరం రాష్ట్రంలో నూతన రాజధాని ఏర్పాటు కోసం, జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో నూజివీడులోనే ఐఐటీని ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే ఇక్కడ ట్రిపుల్ఐటీ నిర్వహిస్తుండటంతో పాటు నూజివీడు ప్రాంతంలో వేలాది ఎకరాల అటవీభూములు, దేవాదాయ భూములు అందుబాటులో ఉన్నాయి. ఐఐటీ ఏర్పాటు చేయాలంటే కనీసం 3వందల ఎకరాల భూమి కావాలి. ఇంత భూమి జిల్లాలో నూజివీడు ప్రాంతంలోనే ఉండటంతో పాటు ఒక్కరైతును కూడా ఇబ్బంది పెట్టకుండా భూములను సేకరించడానికి ఇక్కడ అవకాశముంది. ఐఐటీ ఏర్పాటు చేసినట్లయితే నిత్యం దేశ వ్యాప్తంగానే కాకుండా, విదేశాల నుంచి సైతం ప్రపంచస్థాయి విద్యావేత్తలు, సైంటిస్టులు రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. నూజివీడు నుంచి గన్నవరం విమానాశ్రయం కేవలం 30కిలోమీటర్ల దూరంలోనే ఉంది. గతంలో 2007లో రాష్ట్రానికి ఐఐటీ మంజూరైనపుడు బాసరలో ఏర్పాటు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి కేంద్రానికి నివేదిక పంపారు. దీంతో కేంద్రం నుంచి వచ్చిన హైపవర్ కమిటీ బాసర పరిసర ప్రాంతాలను సందర్శించి అక్కడి స్థానిక పరిస్థితులను అధ్యయనం చేసి విమానాశ్రయం లేదని, అదే హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేస్తే ఐఐటీలకు వచ్చిపోయే విద్యావేత్తలకు, సైంటిస్టులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నివేదికను ఇవ్వడంతో చివరకు ఐఐటీని మెదక్ జిల్లా సంగారెడ్డి సమీపంలోని కంది వద్ద 576ఎకరాల్లో నెలకొల్పారు. విభజనానంతరం ఆంధ్రప్రదేశ్లోనూ ఐఐటీని ఏర్పాటు చేయనున్నందున 30కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయం ఉండటం, 20కిలోమీటర్ల దూరంలో చెన్నై-కోల్కతా జాతీయ రహదారి ఉండటం , విజయవాడ-గుంటూరు రాజధాని అయితే రాజధానికి కేవలం 40కిలోమీటర్ల దూరంలోరనే ఉండటం కూడా కలిసొచ్చే అంశమేనని ఈ ప్రాంత మేధావులు, రాజకీయ పక్షాల నాయకులు, ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. పారిశ్రామిక అభివృద్ధికి టెక్నాలజీని అనుసంధానం చేసుకోవడానికి ఐఐటీలు ఎంతో అవసరమైన నేపథ్యంలో నూజివీడులో ఐఐటీ ఏర్పాటు మంచిదేనే అభిప్రాయాన్ని సర్వత్రా వ్యక్తం చేస్తున్నారు. -
ప్రభుత్వ భూములపై మాస్టర్ప్లాన్
ప్రాజెక్టుల కోసం భూముల పరిశీలన జిల్లాలో విస్తృతంగా సర్వే నివేదికలు సిద్ధం చేస్తున్న అధికారులు విశాఖ రూరల్: రాష్ట్ర విభజన తర్వాత అందరి దృష్టి విశాఖపైనే పడింది. విశాఖను మెగా సిటీగా తీర్చిదిద్దుతామని కేంద్రం ప్రకటించడంతో హాట్ ఫేవరెట్గా మారిపోయింది. ఉన్నత విద్యా సంస్థలు, శంషాబాద్ తరహాలో కొత్తగా గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం.. ఇలా రోజుకో ప్రతిపాదన తెరపైకి వస్తోంది. ఇప్పటి వరకు విశాఖకు ఎటువంటి ప్రాజెక్టులు వస్తాయన్న విషయంపై స్పష్టత లేకపోయినా .. అనేక ఊహాగానాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమవుతోంది. ఎప్పుడు ఎటువంటి ప్రాజెక్టు జిల్లాకు కేటాయించినా వెంటనే వాటి ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. ప్రధానంగా ప్రాజెక్టులకు అవసరమైన భూములను గుర్తించే పనిలో నిమగ్నమైంది. జిల్లాలో విశాఖ, అనకాపల్లి, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ భూముల గుర్తింపు కార్యక్రమాన్ని చేపట్టి పూర్తి వివరాలతో ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని నిర్ణయించింది. ముందుగా విశాఖ రెవెన్యూ డివిజన్ పరిధి మండలాల్లో కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్కుమార్లు స్వయంగా ప్రభుత్వ భూములను పరిశీలిస్తున్నారు. 5 కేటగిరీల కింద సర్వే ఈ భూముల సర్వేను అయిదు కేటగిరీల కింద చేపడుతున్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు, అక్రమణలకు గురైన ప్రభుత్వ భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న ప్రభుత్వ భూములు, ఇతర శాఖలకు కేటాయించిన భూములతో పాటు కొంత మంది వ్యక్తులు, ప్రయివేట్ సంస్థలకు కేటాయించిన అసైన్డ్ భూముల వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఏదైన ప్రాజెక్టు కోసం అసైన్డ్ భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకొనే అవకాశం ఉండడంతో వాటిపై కూడా సర్వే చేస్తున్నారు. ఆక్రమిత భూములను వెనక్కు తీసుకోవడంతో పాటు కోర్టు వివాదాల్లో ఉన్న భూ సమస్యలు త్వరితగతిన పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఆరు ప్రాజెక్టులకు స్థలాల గుర్తింపు జిల్లాలో ట్రిపుల్ ఐటీకి 100 ఎకరాలు, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్లకు ఒక్కో దానికి 200 ఎకరాలు, ఐఐటీ, ఎన్ఐటీ ఒక్కోదానికి 300 ఎకరాలు చొప్పున స్థలాలను గుర్తించాలని ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్లేయిన్ ఏరియాలో అంత విస్తీర్ణంలో ప్రభుత్వ భూములు లేకపోవడంతో భీమిలి, పెందుర్తి, పద్మనాభం, ఆనందపురం, విశాఖ రూరల్, సబ్బవరం, పరవాడ ప్రాంతాల్లో కొండ పోరంబోకు స్థలాలను గుర్తించారు. కొండ స్థలాలు కావడంతో నిర్దేశించిన విస్తీర్ణం కంటే 100 నుంచి 200 ఎకరాలు అధికంగానే ప్రతిపాదనలు రూపొందించారు. వీటితో పాటు మరికొన్ని స్థలాలను కూడా గుర్తించి ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులు భావిస్తున్నారు. జిల్లాకు ఎప్పుడు ఈ ప్రాజెక్టు కోసం భమూలు అడిగినా వెంటనే ఆ మాస్టర్ప్లాన్ ప్రకారం వివరాలను ప్రభుత్వానికి సమర్పించే విధంగా నివేదికలు సిద్ధం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో విశాఖ రెవెన్యూ డివిజన్లో ప్రభుత్వ భూముల సర్వే పూర్తవుతుందని జాయింట్ కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఆ తర్వాత అనకాపల్లి, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధుల్లో కూడా సర్వే చేపడతామని పేర్కొన్నారు. అయిదు కేటగిరీల్లో పరిశీలించిన భూముల వివరాలతో పూర్తిస్థాయి మాస్టర్ప్లాన్ తయారు చేస్తామని చెబుతున్నారు. -
‘త్రిశంకు’లో బందరు పోర్టు
ఆరు నెలల్లో నిర్మిస్తామంటూ టీడీపీ నేతల హామీ భూసేకరణకే ఎనిమిది నెలల సమయం మరో నాలుగు శాఖల అనుమతులు రావాలి ఫైనాన్షియల్ క్లోజర్కు వెళ్లని కాంట్రాక్టు కంపెనీ మచిలీపట్నం : రాష్ట్ర విభజన నేపథ్యంలో బందరు పోర్టు అభివృద్ధి అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్రం కలిసి ఉన్న సమయంలో బందరు పోర్టు అభివృద్ధి అంశాన్ని పాలకులు పక్కనపెట్టేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2008 ఏప్రిల్ 23వ తేదీన బందరు పోర్టు పనులకు శంఖుస్థాపన చేశారు. వైఎస్సార్ మరణంతో బందరు పోర్టును పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన పాలకులు ఆరు నెలల్లో పోర్టు పనులను ప్రారంభిస్తామని చెబుతున్నారని,అయితే పోర్టు పనులు ప్రారంభించాలంటే అనేక ఆటంకాలున్నాయని పోర్టు సాధన కమిటీ అధ్యక్షుడు నిడుమోలు వెంకటేశ్వరప్రసాద్ చెబుతున్నారు. మచిలీపట్నం పోర్టు లిమిటెడ్ నవయుగ సంస్థకు, ప్రభుత్వానికి మధ్య 2010 జూన్ 7వ తేదీన ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఒప్పందం కుదిరిన 12 నెలల్లోగా నిర్మాణ సంస్థ ఫైనాన్షియల్ క్లోజర్కు వెళ్లాల్సి ఉందని అన్నారు. రూ. 1590 కోట్లతో బందరు పోర్టును అభివృద్ధి చేయాల్సి ఉందని, పోర్టు అభివృద్ధిపై ప్రభుత్వానికి, నిర్మాణ సంస్థకు ఒప్పందం కుదిరి నాలుగేళ్లు గడచినా ఇంత వరకు ఆ సంస్థ ఫైనాన్షియల్ క్లోజర్కు వెళ్లలేదని గుర్తుచేశారు. పోర్టు నిర్మాణానికి భారత ప్రభుత్వం పర్యావరణ అనుమతిచ్చిందన్నారు. పోర్టుకు డీజిల్ స్టోరేజీ నిమిత్తం చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ శాఖ, అగ్నిమాపకశాఖ, విమానయానశాఖ, అటవీశాఖ, వన్యమృగసంరక్షణశాఖ అనుమతులు ఇవ్వాలని తెలిపారు. దీంతో పాటు పోర్టు నిర్మాణ సంస్థ రూపొందించిన రివైజ్డ్ డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (ఆర్డీపీఆర్) మాస్టర్ ప్లాన్ ప్రకారం 4,800 ఎకరాలను నిర్మాణసంస్థకు అప్పగించాల్సి ఉంద ని తెలిపారు. ఇప్పటివరకు కేవలం 412 ఎకరాలను మాత్రమే సేకరించించారని చెప్పారు. పోర్టుకు కేటాయించాల్సిన భూమి సంస్థకు అప్పగించలేదని, ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉందన్నారు. ఇదిలాఉండగా భూసేకరణ నోటిఫికేషన్ జారీ, నష్టపరిహారం చెల్లింపులు, రైతుల అభిప్రాయ సేకరణ తదితర అంశాలన్నీ పూర్తికావాలంటే అన్నిశాఖలు సమష్టిగా పనిచేస్తే కనీసం ఎనిమిది నెలల సమయం పడుతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. 2008లో పోర్టు పనుల శంఖుస్థాపన జరిగిన అనంతరం భూసేకరణకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. పోర్టు నిర్మాణానికి భూసేకరణే కీలక అంశంగా మారింది. ప్రభుత్వం భూసేకరణ చేసి నిర్మాణ సంస్థకు అప్పగిస్తే ఆ భూమిని చూపి ఆ సంస్థ వివిధ బ్యాంకుల నుంచి రుణం తెచ్చుకుని పనులు ప్రారంభించాల్సి ఉంది. ఈ ప్రక్రియకు చాలా సమయం పడుతుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో బందరు పోర్టు అభివృద్ధి అనివార్యంగా మారింది. పాలకులు, అధికారులు పోర్టు అభివృద్ధి కోసం సత్వర నిర్ణయాలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. -
తొలగని ఆంక్షలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఖజానా విభాగంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో గత నెల 25వ తేదీ నుంచి ఖజానా విభాగం ద్వారా చేపట్టే చెల్లింపుల ప్రక్రియ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. జూన్ 2న అపాయింటెడ్ డే నుంచి తిరిగి చెల్లింపులు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే అపాయింటెడ్ డే పూర్తయినప్పటికీ అంతర్గతంగా విభజన ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో ఖజానా విభాగంలో బిల్లుల చెల్లింపుల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వ ఉద్యోగుల వేతన చెల్లింపులతోపాటు కార్యాలయ నిర్వహణ, పెన్షన్లు, ప్రభుత్వ పనులు, ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, పాఠశాలల గ్రాంటులకు సంబంధించిన చెల్లింపులన్నీ ఖజానా విభాగం ద్వారానే పూర్తవుతాయి. ఇందుకు సంబంధించి ఆయా శాఖలు రూపొందించిన బిల్లుల ఆధారంగా నిధులను విడుదల చేస్తారు. జూన్ రెండో తేదీ వరకు చెల్లింపులు నిలిచిపోయే అవకాశం ఉండడంతో జూన్ ఒకటో తేదీ వరకు అన్నిరకాల చెల్లింపులు పూర్తి చేశారు. అయితే కొన్ని కార్యాలయాలు సమర్పించిన బిల్లుల్లో తప్పులు దొర్లడం, మరికొందరు జాప్యం చేయడంతో వారికి సంబంధించిన చెల్లింపులు నిలిచిపోయాయి. రెండో తేదీ తర్వాత వీటిని క్లియర్ చేసుకోవచ్చని భావించిన పలు విభాగాల అధికారులకు తాజాగా ఇబ్బందులు వచ్చిపడ్డాయి. విభజన క్రమంలో భాగంగా సర్వర్ల బదలాయింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున ఖజానా శాఖ వెబ్సైట్ నిలిచిపోయింది. వారంపాటు ఇంతే! ఖజానా చెల్లింపుల పునరుద్ధరణకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఒకవైపు సర్వర్ల విభజన పూర్తికావడానికి నాలుగైదు రోజులు పడుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. విభజనలో భాగంగా డీడీఓల ఖాతాలన్నీ జీరో బ్యాలెన్స్ అయ్యాయి. మరోవైపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఏప్రిల్, మే నెలలకే సరిపోవడంతో.. జూన్లో కొత్త బడ్జెట్ వస్తేనే చెల్లింపులు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం అసెంబ్లీ భేటీ తర్వాత ఈ సమస్య పరిష్కారమవుతుంది. అప్పటివరకు చెల్లింపుల సంగతి ఇంతేనని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. కొత్త చెక్కులతోనే.. కొత్త రాష్ట్రం ఆవిర్భావంతో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు పంచాయతీలు, మండల పరిషత్లు అవసరమైన నిధులను ఖజానా శాఖ ఇచ్చిన ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్)ద్వారా విడుదల చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర విభజన పూర్తయిన నేపథ్యంలో అవన్నీ రద్దయ్యాయి. తిరిగి కొత్త ఎల్ఓసీల ద్వారా నిధుల విడుదల చేయాలని ఖజానా శాఖ ఇప్పటికే క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా నిధులు డ్రా చేసే అన్ని కార్యాలయాలకు ఇప్పటికే ఖజానా శాఖ కొత్త చెక్ పుస్తకాలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కొత్త చెక్కుల ద్వారానే చెల్లింపులు చేపడతామని, పాత చెక్కులు చెల్లవని జిల్లా ఖజానా శాఖ అధికారి ఏ.నాగరాజు ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
ఆర్టీసీ సర్వీసులకు బ్రేక్!
కర్నూలు(రాజ్విహార్), న్యూస్లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో కర్నూలుతో తెలంగాణ ప్రాంత గ్రామాలకు ఉన్న బస్సు బంధ తెగనుంది. ముఖ్యంగా జిల్లా కేంద్రం కర్నూలుకు ఆనుకొని ఉన్న పల్లెలకు రవాణా వ్యవస్థ మందగించనుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో రాబోవు రోజుల్లో ఆర్టీసీ కూడా రెండు ముక్కలు కానుంది. ఈనేపథ్యంలో ఆప్రాంత గ్రామాలకు సర్వీసులు తిప్పలేమని స్థానిక అధికారులు ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. ఒక వేళ బస్సులు తిప్పాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ట్యాక్స్, పర్మిట్లకు డబ్బు చెల్లించాల్సి వస్తుందని, ఇది సంస్థకు భారం కానుందని మొరపెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టు ఆ ప్రభుత్వమే తమ బస్సులు నడుపుకోవచ్చని సూచించారు. అమలుచేస్తే తెలంగాణ ప్రాంతంలోని గ్రామాలకు తిరిగే 51 బస్సుల వరకు ఆగిపోనున్నాయి. ప్రస్తుతం తిరుగుతున్న సర్వీసులు: తెలంగాణ అంచున ఉన్న కర్నూలు జిల్లాకు ఆప్రాంతం గ్రామాలతో మంచి అనుబంధం ఉంది. రోజూ వేలాది మంది కర్నూలు రీజియన్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. రాజధాని హైదరాబాద్తోపాటు కొల్లాపూరు, అయిజా, రాజోలి మీదుగా రాయచూరు తదితర ప్రాంతాలకు రోజూ 131 బస్సులు తిరుగుతున్నాయి. ఇందులో కేవలం హైదరాబాదుకే 100 సర్వీసులు కాగా కొల్లాపూరుకు 7, అలంపూరు, భీమవరం, పల్లెపాడు, మారమునగాల, చెన్నుపాడు, మానపాడు, శింగవరం, గొందిమల్ల గ్రామాలకు 14 బస్సులు, అయిజ, మినిపాడు, రాజోళి తదితర గ్రామాలకు మరో 6 బస్సులు తిరుగుతున్నాయి. రద్దుకు ప్రతిపాదించిన సర్వీసులు: రాష్ట్ర విభజన నేపథ్యంలో మొదటి విడతగా 51 సర్వీసులను రద్దు చేసేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. అనుమతులు వస్తే హైదరాబాద్కు తిరిగే 20 బస్సులను రద్దు చేసి విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు తదితర రూట్లలో తిప్పనున్నారు. కర్నూలు-1 డిపో నుంచి తిరిగే 20 సర్వీసులను రద్దు చేసి గడివేముల, వెల్దూర్తి, బేతంచెర్ల, పత్తికొండ, ఎమ్మిగనూరు (గూడూరు మీదుగా) తిప్పనున్నారు. ఇందులో కాలం చెల్లిన పాత బస్సులను స్క్రాప్ యార్డుకు పంపనున్నారు. ఆత్మకూరు డిపోకు చెందిన 11 బస్సులు మహబూబ్ నగర్ జిల్లా కోల్లాపూరుకు తిరుగుతున్నాయి. వీటన్నింటినీ రద్దు చేయనున్నారు. ఇందులోని 6 అద్దె బస్సులను కర్నూలు, ఆత్మకూరు మధ్య తిప్పి మిగిలిన సర్వీసులను ఎమ్మిగనూరు నుంచి బళ్లారి, కర్నూలు నుంచి సుంకేసుల మీదుగా మంత్రాలయంకు , డోన్ నుంచి బేతంచెర్ల మీదుగా నంద్యాలకు, ఆళ్లగడ్డ- ప్రొద్దుటూరు, నంద్యాల - రుద్రవరం, నందికొట్కూరు నుంచి గడివేముల మీదుగా నంద్యాలకు, బనగానపల్లె - నంద్యాల మధ్య నడపనున్నారు. విద్యార్థులకు తప్పని కష్టాలు: తెలంగాణ ప్రాంత పల్లెల నుంచి ప్రతిరోజూ వేలాది మంది విద్యార్థులు ఇక్కడి విద్యాసంస్థల్లో చదువుకునేందుకు వచ్చిపోతుంటారు. వీరంతా ప్రభుత్వం ఇచ్చిన రాయితీ బస్సు పాసులు తీసుకొని రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో 1000 మందికి పైగా ఉచిత పాసులు, 1500 మందికి పైగా రాయితీ పాసులు పొందిన వారున్నారు. ఈ విద్యార్థులంతా ప్రస్తుతం కొత్త బస్టాండ్లోని కర్నూలు-1డిపోలో పాసులు పొందుతున్నారు. ఒక వేళ సర్వీసుల రద్దయితే తెలంగాణ డిపోల బస్సులు తిప్పుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం కర్నూలుకు చేరువలో ఉన్న గద్వాల, వనపర్తి డిపోలకు వెళ్లి పాసులు పొందాలి. దీంతో విద్యార్థులకు ప్రయాణ కష్టాలు మొదలైతాయి. -
‘ముంపు’ బడి
ఖమ్మం, న్యూస్లైన్: పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపే ప్రక్రియ అక్కడి విద్యార్థులకు శాపంగా మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలోని ఏడు మండలాల పరిధిలోని 136 హ్యాబిటేషన్లను సీమాంధ్రలో కలిపారు. జిల్లాతో అనుబంధం ఉన్న ప్రజలను విడదీశారు. అక్కడ ఉన్న పాఠశాలలు, ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు, విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈనెల 12వ తేదీన విద్యాసంవత్సరం ప్రారంభమవుతుంది. గత విద్యాసంవత్సరం పాఠశాలల ముగింపు రోజు ఒక రాష్ట్రంలో..పాఠశాలలు తెరిచేలోపు మరో రాష్ట్రంలో ముంపు ప్రాంత విద్యార్థులు ఉండాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు సీమాంధ్రలోని తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు వెళ్లాల్సి ఉంటుంది. వీరికి వేతనాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఇవ్వాలి. అక్కడి ప్రభుత్వం వేతనాలు ఇస్తుందే సరే ఎవరి అజమాయిషీలో పనిచేయాలనే సందిగ్ధత ఆ ప్రాంత ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిలో నెలకొంది. తాము ఏ ట్రెజరీ పరిధిలోకి వస్తామో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉద్యోగులు ఉన్నారు. విద్యార్థులకు ప్రభుత్వ పరంగా అందించే ఉచిత పుస్తకాలు, మధ్యాహ్నభోజన పథకం అమలు, ఉపాధ్యాయులకు శిక్షణ, వారిపై పర్యవేక్షణ, బోధించే పాఠ్యాంశాలు, ఏ రాష్ట్ర సిలబస్ బోధించాలో అర్థంకాని పరిస్థితి ఉంది. అసలు ఉపాధ్యాయులు సీమాంధ్రుకు వెళ్లేందుకు ఒప్పుకుంటారా?, ఒప్పుకుంటే వారిని ఎక్కడ సర్దుబాటు చేయాలి? గత సంవత్సరం మేలో జరిగిన ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్లో ఇతర మండలాలకు బదిలీ అయిన ఉపాధ్యాయులు రిలీవర్ లేక ఇప్పటి వరకు ఆయా పాఠశాలల్లోనే పనిచేస్తున్నారు. ఇప్పుడు వారు ఎక్కడ పనిచేయాలి? వారికి వేతనాలు ఎవరు ఇవ్వాలి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఉపాధ్యాయుల వేతనాల చెల్లింపుపై చిక్కులు జూన్ 2తేదీ తర్వాత ఏ ప్రభుత్వం పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు ఆ ప్రభుత్వం ఖజానా నుంచే వేతనాలు చెల్లించాలి. జిల్లాలోని ఏడు మండలాలకు చెందిన 230 ప్రాథమిక పాఠశాలలు, 12 ఉన్నత పాఠశాలలు సీమాంధ్రలో కలుస్తున్నాయి. వీటితోపాటు ఆయా పాఠశాలల్లో పనిచేసే 569 మంది ఉపాధ్యాయులు, ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, వాటిలో పనిచేసే సుమారు 110 మంది బోధన, బోధనేతర ఉద్యోగులు సీమాంధ్రలోకి వెళ్లే అవకాశం ఉంది. అంటే జూన్ 2వ తేదీ నుండి వారి వేతనాలు సీమాంధ్ర ప్రభుత్వం ఖజనా నుంచి చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఇప్పటి వరకు ఆయా పాఠశాలలు, కళాశాలల విభజన, వాటి కేటాయింపుపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని అధికారులు చెబుతున్నారు. సీమాంధ్ర ప్రభుత్వం వేతనాలు చెల్లించేటట్టయితే..ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షణ చేస్తే ఉభయ గోదావరి జిల్లాల అధికారులు ఏలా బిల్లులు చేస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. బూర్గంపాడు, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు ట్రెజరీ బూర్గంపాడులో ఉంది. భద్రాచలం, చింతూరు, వీఆర్పురం, కూనవరం మండలాల ట్రెజరీ భద్రాచలంలో ఉంది. ఈ ట్రెజరీలు తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో ట్రెజరీలు ఉన్నప్పుడు ఏపీలో ఎలా వేతనాలు చెల్లిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాంతాలు, ఉద్యోగుల సర్దుబాట్లు, పాఠశాలలు తదితర అంశాలన్నీ ఎప్పుడు కొలిక్కి వస్తాయి..? అప్పటి వరకు వేతనాలు ఆగుతాయా? అనే ప్రశ్నలు ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. విద్యార్థుల లోకల్ ఏరియాపై సందిగ్ధత ఇప్పటి వరకు తెలంగాణలో చదివిన ముంపు ప్రాంత విద్యార్థులు, నిరుద్యోగులు ఇప్పుడు సీమాంధ్రలో కలవడంతో వారి లోకల్ ఏరియా ఏ ప్రాంతానికి వస్తుందో.. అనే సందిగ్ధత నెలకొంది. జూన్ 2 తర్వాత ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో సముచిత స్థానం కల్పిస్తారో? లేదోనన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అక్కడి ప్రభుత్వం వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వ సిలబస్ బోధించాలా? ఆంధ్ర ప్రభుత్వందా? అనే విషయంలోనూ ఇప్పటి వరకు స్పష్టత లేదు. జూన్ మొదటివారంలో చేపట్టే బడిబాట కార్యక్రమం కూడా ముంపు ప్రాంతాల్లో ఇంకా ప్రారంభంకాలేదు. ఇవన్నీ సమస్యలు ఎప్పుడు కొలిక్కి వస్తాయోనని ముంపు ప్రాంత విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. -
పైరవీల జోరు!
సాక్షి, కర్నూలు: సార్వత్రిక ఎన్నికల బదిలీల్లో ఇతర జిల్లాలకు వెళ్లిన తహశీల్దార్లు, ఎంపీడీఓలు తిరిగొచ్చారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జిల్లాలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారులను ఇతర జిల్లాలకు పంపడం తెలిసిందే. వీరిని తిరిగి సొంత జిల్లాలకు పంపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు 43 మంది తహశీల్దార్లు, 37 మంది ఎంపీడీఓలు జిల్లాకు చేరుకున్నారు. అయితే బదిలీపై వచ్చిన వీరిలో కొందరు సోమవారం నుంచే పోస్టింగ్ల కోసం పైరవీలకు తెరతీశారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో తలమునకలవుతున్నారు. నేతల అనుయాయులతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. కొందరు మీ సామాజిక వర్గానికి చెందిన వాడినని.. చెప్పినట్లు నడుచుకుంటానని నమ్మబలుకుతున్నారు. వారి సిఫారసు లేఖలతో జిల్లా ఉన్నతాధికారులను కలిసేందుకు యత్నిస్తున్నారు. దీంతో బదిలీల వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్నడూ లేనంతగా పరిపాలన శూన్యత చోటు చేసుకుంది. ఎన్నికల ఫలితాలు వెలువడి పక్షం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాని పరిస్థితి. మరో ఐదు రోజులు గడిస్తే కానీ పాలకులు కొలువుదీరే అవకాశం లేకపోవడంతో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు బదిలీలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో తహశీల్దార్లకు స్థానాల కేటాయింపు పారదర్శకంగా చేపట్టడం ప్రశ్నార్థకమవుతోంది. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేలు ఇంకా ప్రమాణస్వీకారం చేయనందున వీరి సిఫార్సులను ఏ మేరకు అధికారులు పాటిస్తారనేది వేచిచూడాలి. ప్రధానంగా తహశీల్దార్ల బదిలీల్లో ప్రతిసారీ రాజకీయ జోక్యం మితిమీరుతోంది. ఈ విషయంలో ఉన్నతాధికారుల స్వేచ్ఛను నేతలు కాలరాస్తున్నారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో పాలన కూడా సక్రమంగా సాగడం లేదనే విమర్శలు తరచూ వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తహశీల్దార్ల బదిలీలు ఎలాంటి కోణాలను ఆవిష్కరిస్తాయోననే చర్చ జరుగుతోంది. కర్నూలుపై మక్కువ కొందరు తహశీల్దార్లకు కర్నూలు డివిజన్ అంటే మక్కువ. అత్యధిక కాలం ఇక్కడ పనిచేసిన అధికారులు ఎన్నికల వేళ జిల్లాను వీడక తప్పని పరిస్థితి నెలకొంది. తాజాగా జిల్లాకు చేరిన వీరు తిరిగి పూర్వ స్థానాలను కైవసం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆదోని డివిజన్లోనూ పైరవీలకు తెరలేచింది. ఇక్కడ సామాజిక కోణం ఆధారంగా పలువురు తహశీల్దార్లు ఒకే చోట తిష్ట వేశారు. ఇకపోతే ఆదాయ వనరులు.. ఇసుక.. మైనింగ్ తదితరాలను దృష్టిలో ఉంచుకొని కూడా కొందరు అధికారులు ఆయా ప్రాంతాల నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండటం గమనార్హం. -
వెళ్లొస్తా మిత్రమా..!
* బంధం వీడింది.....స్నేహం ఓడింది * రాష్ట్ర విభజనతో ఉద్యోగుల మధ్య దూరం * జూన్ 2 నుంచి విద్యుత్ ఉద్యోగుల స్థానచలనం * దుఃఖ సాగరంలో ఉద్యోగుల కుటుంబాలు సీలేరు,న్యూస్లైన్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన 20-30 ఏళ్ళ బంధాన్ని వీడిపోయేలా చేసింది. వారి మధ్య ఉన్న స్నేహాన్ని ఓడించి కంట తడి పెట్టేలా చేసింది. దశాబ్దాల నుంచి కలిసిమెలసి ఉన్న వారు ఇప్పుడు సొంత రాష్ట్రమైన తెలంగాణకు పయనమయ్యే రోజు వచ్చింది. దీంతో సీలేరు పవర్ ప్రాజెక్టు కాంప్లెక్స్లో అందరి మనసుల్లోనే ఒకటే బాధ....మళ్లీ కలుస్తామో లేదోనన్న ఆవేదన...అందరి హృదయాలూ బరువెక్కగా అసంకల్పితంగా కళ్లు వర్షించాయి. చిరకాల మిత్రుడికి వీడ్కోలు పలికాయి. జూన్ 2వ తేదీ తర్వాత అక్కడి వారు ఇక్కడకి.. ఇక్కడివారు అక్కడకు వెళ్ళిపోవాలన్న నిబంధనతో రాష్ట్రంలో ప్రముఖ జలవిద్యుత్ కేంద్రాలుగా పేరుపొందిన విశాఖ జిల్లా సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న ఉద్యోగులు సైతం ఈ మేరకు సిద్ధమవుతున్నారు. మాచ్ఖండ్, సీలేరు, డొంకరాయి, మోతుగూడెం వంటి జలవిద్యుత్ కేంద్రాలలో వివిధ విభాగాలలో పని చేస్తున్న తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల వివరాల సేకరణ ఇప్పటికే పూర్తయింది. ఈ 4 కేంద్రాల్లో వంద మందికి పైగా తెలంగాణ ఉద్యోగులు ఉన్నారు. వీరు గత 20 ఏళ్ళుగా ఇక్కడే ఉద్యోగం చేస్తూ ఇక్కడి సంసృ ్కతి, సంప్రదాయాలతో మమేకమయ్యారు. అంతేకాకుండా కొందరైతే ఇక్కడివారితో పెళ్లి సంబంధాలూ కలుపుకున్నారు. స్వస్థలాల్లోని సొంత బంధువుల కన్నా ఇక్కడివారితోనే అనుబంధం పెంచుకున్నారు. అలాంటిది ఇప్పుడు రాష్ట్రం విడిపోవడంతో తమ ప్రాంతాలకు వెళ్ళిపోవాలని అనడంతో ప్రస్తుతం ఈ జలవిద్యుత్ కేంద్ర ఉద్యోగులు భారంగానే అటువైపు అడుగులు వేస్తున్నారు. విద్యార్థుల్లో కలవరం రాష్ట్రం విడిపోవడంతో ఆఖరికి చదువుకునే విద్యార్థుల మధ్య కూడా కలవరం రేగింది. చిన్నప్పట్నుంచీ కలసిమెలసి తిరిగి ఆడుకుని చదువుకున్న విద్యార్థుల మధ్య అమలిన స్నేహం కుదిరింది. అయితే ఇప్పుడు వారు సైతం వెళ్లిపోనుండడంతో చిన్నారుల మనసుల్లోనూ ఏదో తెలియని ఆవేదన అలముకుంది. వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాలలు మారిపోవడంతో చిన్ననాటి స్నేహితులకు దూరమైపోతున్నామని కుమిలిపోతున్నారు. మోతుగూడెం కేంద్రంలో ఎక్కువ తెలంగాణ ఉద్యోగులే... తెలంగాణ, సీమాంధ్ర సరిహద్దు చింతూరు సమీప మోతుగూడెం జలవిద్యుత్ కేంద్రంలో 60 మందికి పైగా తెలంగాణ ఉద్యోగులే ఉన్నారు. వీరంతా గత 20 ఏళ్ళుగా ఇక్కడే స్థిరంగా ఉండి ఉద్యోగం చేసుకోవడంతోపాటు వారి బంధువులు కూడా వ్యాపారాలు వంటివి చేసుకొని స్థిరనివాసం ఉన్నారు. అలాంటిది ఇప్పుడు వారంతా వెళ్ళిపోతుండటంతో బాధగా ఉందని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. విడిపోవడం బాధాకరం గత 30 ఏళ్లుగా కలసిమెలసి అన్నదమ్ముల్లా ఉద్యోగం చేసుకున్న మాకు విడిపోవడం బాధాకరంగా ఉంది. అలాంటిది ఇప్పుడు ఎవరికివారు దూరమైపోవడంతో ఎందుకిలా జరిగిందంటూ బాధపడుతున్నాం. - ఆనంద్, జెన్కో ఉద్యోగి, సీలేరు. ఇక్కడి వారితో కలిసిపోయాం.. మేం పుట్టి పెరిగింది తెలంగాణ, ఉద్యోగం నిమిత్తం గత 15 ఏళ్ళుగా సీలేరులోనే ఉంటున్నాం. ఇక్కడ వారితో, తోటి ఉద్యోగులతోనే ఎక్కువగా స్నేహంగా ఉంటాం. అలాంటిది రాష్ట్రం విడిపోయి నేను తెలంగాణ వెళ్ళిపోవడం చాలాబాధగా ఉంది. - ఆలీ, తెలంగాణ ఉద్యోగి. స్నేహం దూరమవుతుంది ఎన్నో ఏళ్ళుగా కలసిమెలసి చదువుకుంటూ ఆడుకుంటున్న మా పిల్లల మధ్య స్నేహం కూడా రాష్ట్ర విభజన వల్ల దూరమైపోయింది. ఇది చాలా బాధాకరమైన విషయం. - దారరాజు, జెన్కో ఉద్యోగి. విడిపోయినా కలిసి ఉంటాం.. రాష్ట్రం విడిపోయినా ఎప్పటిలాగే కుటుంబ సభ్యులలాగే కలసి ఉంటాం. రాష్ట్రం విడిపోయినంత మాత్రాన స్నేహాన్ని, కుటుంబాలను దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు. - యాసిన్బాబా, జెన్కో ఉద్యోగి. -
మద్యం సరఫరాకు బ్రేక్
ఖమ్మం క్రైం, న్యూస్లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో మద్యం సరఫరా నిలిచిపోయింది. విభజన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లిక్కర్ బేవరేజెస్ను విభజించి ఆదాయ వ్యయాలు, అప్పులు, ఇతర లెక్కలను చూసేందుకు మే 27వ తేదీ నుంచి 2వ తేదీ వరకు బేవరేజెస్ అధికారికంగా సెలవులు ప్రకటించారు. కానీ ఈ సెలవులు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సెలవుల నేపథ్యంలో జిల్లాలో మద్యం కొరత తలెత్తకుండా ఎక్సైజ్ శాఖ, బేవరేజెస్ అధికారులు వైన్షాపులు, బార్లకు వారి నెలవారీ లెసైన్స్ల స్థాయిని బట్టి ముందే కేటాయించారు. ఈ కారణంగా జిల్లాలో మే నెల చివరిలో మద్యం విక్రయాలు భారీగా జరిగినట్లు తెలుస్తోంది. మూడు నెలలుగా అంతంతమాత్రంగా విక్రయాలు... జిల్లాలో 156 వైన్స్ షాపులు , 44 బార్లు, మూడు క్లబ్లు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు రూ.45 నుంచి రూ. 55 కోట్ల వరకు విక్రయాలు జరుగుతాయి. కానీ గడచిన మూడు నెలలుగా మాత్రం వ్యాపారం మాత్రం ఆశించిన రీతిలో జరుగలేదు. ఎన్నికల కోడ్ కారణంగా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు, దాడులు నిర్వహించారు. దీంతో వ్యాపారులు భారీగా నిల్వలు చేసుకోకపోవడంతో ఆశించిన మే వ్యాపారం జరుగలేదు. కానీ మే నెలలో మాత్రం రూ.84.73 కోట్ల మేరకు విక్రయాలు జరిగాయి. సెలవులతో ఇబ్బంది... వేసవి సెలవులు కావడంతో మద్యం విక్రయాలు బాగుంటాయని ఆశించిన వ్యాపారులకు బేవరేజెస్ సెలవులు కొంత ఇబ్బందిగా మారాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ రకాల మద్యం కంపెనీల నుంచి వచ్చే మద్యానికి ఏపీ బేవరేజెస్ స్టిక్కర్ల ద్వారా విక్రయాలు జరిపేవారు. జాన్ 2న అపాయింటెడ్ డే కావటంతో రెండు రాష్ట్రాలు ఏర్పడనున్నాయి. దీంతో రాష్ట్రం విభజనకు ముందే బేవరేజెస్ను రెండు రాష్ట్రాలకు సమపద్ధతిలో కేటాయించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఈ ప్రక్రియ మొత్తం మే 28 నుంచి జూన్ 7వ తేదీ వరకు పూర్తి చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే బేవరేజెస్కు కొద్ది రోజుల పాటు మూసి వేయాలని నిర్ణయించి నిల్వ ఉన్న మద్యాన్ని పూర్తిస్థాయిలో విక్రయించారు. పది రోజుల పాటు జిల్లాలో మద్యం సరఫరా లేకపోవడంతో వైన్స్, బారుల్లో అనివార్యంగా కొరత ఏర్పడే అవకాశం ఉంది. జిల్లాలో రోజుకు సగటున పదివేల కేసుల మద్యాన్ని విక్రయిస్తుంటారు. నెలాఖరు కావడం, లెసైన్స్ కాలపరిమితి ముగియనుండడంతో వైన్ షాపుల్లో 30 శాతానికి తక్కువగానే మద్యం నిల్వలు ఉన్నాయి. అలాగే ఈ పదిరోజుల్లో విక్రయాలకు గాను జిల్లాలో లక్ష కేసులు మద్యం అవసరం ఉంది. మద్యం డిపోల బంద్ ఇంకొన్ని రోజులు పెరిగే అవకాశం..? డిపోలకు ఈ నెల 2 తేదీన మద్యం వస్తుందని అధికారులు చెబుతున్నప్పటికీ ఇంకా పది రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం బాటిళ్లపై వేసే సీల్, లేబుళ్లు, తెలంగాణ ప్రభుత్వ నూతన సీఎం సంతకం చేసిన తర్వాత బాటిల్కు వేయాల్సిన సీల్ మద్యం డిపోలకు వస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి కనీసం 10 రోజుల సమయం పడుతుందని వైన్ షాపుల యజమానులు పేర్కొంటున్నారు. ఇదంతా జరిగితే జూన్ 15 వరకు మద్యం సరఫరాకు బ్రేక్ పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
వైద్య విధాన పరిషత్లకు విభజన సెగ
కోవెలకుంట్ల, న్యూస్లైన్: కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఏపీ వైద్య విధాన పరిషత్లుగా స్థాయి పెంచేందుకు రాష్ట్ర విభజన సెగ అడ్డంకిగా మారింది. దీంతో ప్రజలకు గతంలో మాదిరిగానే సాధారణ వైద్య సేవలు మాత్రమే అందుతున్నాయి. జిల్లాలో 16 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఏపీ వైద్య విధాన పరిషత్లుగా మార్చాల్సి ఉంది. కోవెలకుంట్లలోని 30 పడకల ఆసుపత్రిలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వైద్య విధాన పరిషత్ ద్వారా వైద్య సేవలు అందాల్సి ఉండగా రాష్ట్రాల విభజన, సార్వత్రిక ఎన్నికల ఎఫెక్ట్ కారణంగా ఈ ఫైల్ ముందుకు కదలడం లేదు. గత జనవరి 22న ఏపీ వైద్య విధాన పరిషత్ జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ రామకృష్ణరావుతో కూడిన బృందం జిల్లాలోని డోన్, కోడుమూరు, కోవెలకుంట్ల, మిడుతూరు, నందికొట్కూరు, పాణ్యం, ఓర్వకల్లు, పత్తికొండ, సున్నిపెంట, వెల్దుర్తి, వెలుగోడు, యాళ్లూరు, అవుకు కమ్యూనిటీ ఆసుపత్రులను పరిశీలించి ఆయా కమ్యూనిటీ హెల్త్సెంటర్లలో ఉన్న సౌకర్యాలపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. భవనాల సముదాయాలు, వసతులు ఉన్న ఆసుపత్రులలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వైద్యవిధాన పరిషత్లతో రోగులకు వైద్య సేవలు అందుతాయని పరిశీలన అధికారులు అప్పట్లో పేర్కొన్నారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో ఏపీ వైద్య విధాన పరిషత్ల మార్పు ఫైల్ను పక్కనపెట్టినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. స్థాయిని పెంచడం వల్ల 24 గంటల వైద్యసేవలు, గైనకాలజిస్టులు, అన్ని రకాల సర్జన్లకు సంబంధించి డాక్టర్లతో పాటు 31 మంది వైద్య సిబ్బంది, గర్భిణులు, చిన్న పిల్లలకు అన్ని రకాల రోగాలకు సంబంధించి వైద్య విధాన పరిషత్ల్లో వైద్యసేవలు అందుబాటులో ఉంటాయని జిల్లా ప్రజలు ఊరట చెందారు. అయితే తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన, ఉద్యోగులు, రాష్ట్రస్థాయి ఆఫీసుల పంపకాలు, తదితర వాటిపై గందరగోళం నెలకొనడం ఆరోగ్య శాఖకు సంబంధించి వివాదం కొనసాగుతుండటంతో వైద్య విధాన పరిషత్ మార్పు జాప్యం జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేస్తే జిల్లా ప్రజలకు వైద్య విధాన పరిషత్ల కల నెరవేరుతుంది. -
తెలుగు జాతిరెండు ముక్కలు
విభజన పూర్తి ఆంధ్రప్రదేశ్ నుంచి విడివడిన తెలంగాణ 8న రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రాజధాని కోసం ఎదురుచూపులు అక్షరక్రమంలోనే కాదు.. అన్నింటా ముందువరుసలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.. దేశంలోని ముఖ్య రాష్ట్రాల్లో ఒకటి.. దేశ రాజకీయాలను శాసించే సత్తాగల రాష్ట్రమిది.. ఆర్థికంగా, సామాజికంగా నంబర్ వన్ స్థానంలో ఉన్న రాష్ట్రాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్.. ఇలా ఇప్పటి వరకు గొప్పగా.. గర్వంగా చెప్పుకొన్న మాటలు ఇకమీదట చెప్పుకోలేం. ఇప్పుడు రాష్ట్రం రెండు ముక్కలైంది. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో దేశంలోనే తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ నిలువునా చీలిపోయింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది. కొన్నాళ్లుగా ఈ పరిణామాలను నిశ్శబ్దంగానే గమనిస్తూ వచ్చిన జిల్లావాసులు మాత్రం స్తబ్దుగానే ఉన్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ : రాష్ట్ర విభజన ఘట్టం ముగిసింది. తెలుగు జాతి అధికారికంగా రెండు ముక్కలు అయ్యింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడిన తెలంగాణ 29వ కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. రెండు రాష్ట్రాలకు రెండు ప్రభుత్వాలు ఏర్పడనున్నాయి. తెలంగాణ అంతటా సోమవారం ఆవిర్భావ దినోత్సవం జరుపుకొంటుంటే, ఆంధ్రప్రదేశ్లో స్తబ్దత నెలకొంది. ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఈ నెల ఎనిమిదిన విజయవాడ - గుంటూరు మధ్య నాగార్జునా యూనివర్సిటీ వద్ద ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. అప్పటి వరకు ఈ ప్రాంతంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. మూల్యం చెల్లించుకున్న కాంగ్రెస్... తెలంగాణలో 17 పార్లమెంట్ సీట్ల కోసం ఎనిమిది కోట్ల తెలుగువారిని కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలు చేసింది. తెలుగుజాతికి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని మంటగలిపింది. భావోద్వేగాల కోసం రాష్ట్రాలు ఏర్పాటు చేయకూడదన్న ఇందిరా గాంధీని మాటలను కూడా గంగలో కలిపింది. ‘రాష్ట్రం విడిపోదు.. మాకు స్టార్ బ్యాట్స్మెన్ ఉన్నాడు’ అన్న పార్లమెంట్ సభ్యుడు రాజగోపాల్ ధీమాకు గండి కొట్టింది. దీంతో ఆయన తాను ముందుగా చెప్పిన ప్రకారం రాజకీయ సన్యాసం స్వీకరించక తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ కుటిల యత్నాలకు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలు వంత పాడాయి. తెలుగుజాతిని రెండుగా చీల్చడానికి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు ప్రధాన భూమిక పోషించాయి. సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం మాత్రమే నిబద్ధతతో పోరాడాయి. నిన్నటి వరకు సీమాంధ్రకు న్యాయం చేయాలంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పిన బీజేపీ నేతలు... నేడు తెలంగాణ ఇవ్వడంలో తమ వాటానే ఎక్కువని నిస్సిగ్గుగా చెప్పుకొంటూ సీమాంధ్ర ప్రజల్ని రోడ్డున పడేశారు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకుండా చేశారు సీమాంధ్ర ప్రజలు. రాష్ట్ర విభజన జరిగిపోయిన నేపథ్యంలో ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. హామీల అమలుపైనే ఆశలు... విభజన ప్రక్రియ అనంతరం రాష్ట్రానికి కేంద్రం ఇస్తానన్న హామీల అమలుపైనే జిల్లా వాసులు ఆశ పెట్టుకున్నారు. రాష్ట్రంలో జాతీయస్థాయి ప్రాధాన్యమున్న ఐఐటీ, నిట్, ఐఐఎం, ఐఐఎస్ఐఆర్, సెంట్రల్ యూనివర్సిటీ వంటివి జిల్లాకు వచ్చే విధంగా స్థానిక నేతలు కృషిచేయాలని డిమాండ్ పెరుగుతోంది. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ వంటి బోధనా సంస్థలను తీసుకురావాలనే డిమాండ్ పెరుగుతోంది. గన్నవరం విమానాశ్రయం స్థాయిని పెంచేందుకు కృషిచేయాలనేది స్థానికుల ఆకాంక్ష. కొత్త రైల్వే జోన్తో పాటు మెట్రో రైలు వ్యవస్థ ఏర్పాట్లను నెరవేరిస్తే.. రాష్ట్ర విభజనతో దెబ్బతిన్న జిల్లా వాసుల మనోభావాలు కొంత కుదుటపడే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మౌనంగా బెజవాడ... దేశవ్యాప్తంగా ఏ సంఘటన జరిగినా స్పందించే విజయవాడ నగరం అన్యాయంగా జరిగిన విభజనను చూస్తూ మౌనంగా ఉండిపోయింది. జూన్ రెండో తేదీ అపాయింటెడ్ డే ప్రకటన జారీ అయినప్పటినుంచి విభజన ప్రక్రియ అంశాలను జిల్లా వాసులు నిశ్శబ్దంగా పరిశీలిస్తున్నారు. ఒకపక్క రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు పదవీ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తుండగా, మరోవైపు ఈ ప్రక్రియ ఏవిధంగా జరుగుతోంది.. ఎవరి పర్యవేక్షణలో జరుగుతోందనే అంశాలను పరిశీలిస్తున్నారు. విభజనలో ముఖ్య ఘట్టాలు... 2009 డిసెంబర్ తొమ్మిదిన అప్పటి హోంమంత్రి చిదంబరం రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలైందంటూ ప్రకటన చేశారు. దీనిని తీవ్రంగా నిరసిస్తూ పదో తేదీ నుంచి సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసింది. 2010 జనవరి 12న రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనం కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వాన కమిటీని వేసింది. 2010 మార్చి నాలుగు నుంచి ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించింది. 2010 డిసెంబర్ 30న శ్రీకృష్ణ కమిటీ తన నివేదిక సమర్పించింది. 2012 డిసెంబర్ 5న అఖిలపక్షం వేస్తున్నట్లు హోంమంత్రి సుశీల్కుమార్ షిండే ప్రకటించారు. 2012 డిసెంబర్ 28న అఖిలపక్ష సమావేశం జరిగింది. 2013 జూలై 30న యూపీఏ సమన్వయ కమిటీ. సీడబ్ల్యూసీ విడివిడిగా సమావేశమై తెలంగాణ ఆవిర్భావానికి ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. 2013 ఆగస్టు 12 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, మున్సిపల్, ఆర్టీసీ, ఇతర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సమ్మె 66 రోజులు కొనసాగింది. 2013 అక్టోబర్ 3న తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2013 డిసెంబర్ 6న బిల్లు రాష్ట్రపతి వద్దకు చేరింది. 2013 డిసెంబర్ 16న శాసనసభ, శాసనమండలిలో ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టారు. 2014 ఫిబ్రవరి ఒకటిన మూజువాణి ఓటుతో రాష్ట్ర శాసనసభ, శాసనమండలి బిల్లును వ్యతిరేకించాయి. 2014 ఫిబ్రవరి 18న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2013కు లోక్సభ, 20న రాజ్యసభ ఆమోదం తెలిపాయి. 2014 ఫిబ్రవరి 28న రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయించారు. 2014 జూన్ 2న అపాయింటెడ్ డేతో రాష్ట్ర విభజన పూర్తయింది. -
వంటింటి సంక్షోభం
కర్నూలు, న్యూస్లైన్ : చౌకడిపోల ద్వారా పేదలకు అందించే పామోలిన్ సరఫరా నిలిచిపోయింది. సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్లో వంటింటి ఘుమఘుమలకు గడ్డుకాలం తలెత్తింది. గత ప్రభుత్వం మూడు నెలలకు సంబంధించి డబ్బు బకాయి పడటంతో పామాయిల్ పారిశ్రామికవేత్తలు సరఫరా చేయలేమంటూ చేతులెత్తేయడమే ఇందుకు కారణమైంది. రెండు నెలల క్రితమే సరఫరా నిలిచిపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. జూన్ నెలలోనూ పామాయిల్ సరఫరా లేదనే చేదు వార్త పౌరసరఫరాల శాఖ నుంచి జిల్లా యంత్రాంగానికి చేరింది. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ కన్నబాబు ద్వారా ఆర్డీఓలు, అక్కడి నుంచి తహశీల్దార్లకు సమాచారం అందింది. తెల్లకార్డుదారులకు రాయితీ ధరపై పంపిణీ చేస్తున్న పామోలిన్ ఆయిల్ జూన్ తర్వాతనైనా వచ్చే అవకాశాలపై జిల్లా అధికారులు స్పష్టత ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. మే నెలలోనూ సరఫరా చేపట్టలేదు. అంతకుముందు నెలకు సంబంధించి క్లోజింగ్ బ్యాలెన్స్ కింద గోదాముల్లోని మిగులును మాత్రం కొన్ని గ్రామీణ ప్రాంతాల చౌకడిపోలకు చేరవేశారు. బహిరంగ మార్కెట్లో వేరుశనగ నూనె ధర రూ.85 కాగా.. సామాన్య, మధ్య తరగతి ప్రజలు వినియోగించే పామోలిన్ ధర రూ.65 పలుకుతోంది. నిత్యావసర సరుకుల దుకాణాల్లో రేషన్కార్డులకు లీటర్ పామోలిన్ వంటింటి సంక్షోభం రూ.40లకు లభ్యమవుతోంది. మలేషియా నుంచి నిలిచిన దిగుమతి పామోలిన్ ఆయిల్ మలేషియా నుంచి దిగుమతి అవుతుంది. అక్కడి నుంచి కాకినాడ సీపోర్టుకు చేరుతుంది. అక్కడే ప్యాకింగ్ చేసి అన్ని జిల్లాలకు సరఫరా చేస్తారు. దిగుమతి చేసుకునే సమయంలో సబ్సిడీ ధరను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా మూడు నెలల నుంచి జమ చేయడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో పామోలిన్ దిగుమతి నిలిచిపోయింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత వరుస ఎన్నికలు జరిగాయి. దీంతో పామోలిన్ సబ్సిడీ ధర చెల్లింపుపై సందిగ్ధం నెలకొంది. ఈ కారణంగా పామోలిన్ సరఫరా నిలిచిపోయింది. కార్డుదారులపై అదనపు భారం పేదలు అధికంగా వినియోగించే వంట నూనె పామోలిన్ సరఫరాపై ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కార్డుదారులపై అదనపు భారం పడుతోంది. జిల్లాలో 11.40 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కార్డుకు లీటరు చొప్పున(ప్యాకెట్) 2,374 చౌక డిపోల ద్వారా పేదలందరికీ ప్రతి నెలా 11.40 లక్షల లీటర్ల పామోలిన్ సరఫరా చేసేవారు. అది నిలిచిపోవడంతో బహిరంగ మార్కెట్లో వంట నూనెను అధిక ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ లెక్కన ప్రతి నెలా కార్డు వినియోగదారులపై రూ.2.85 కోట్ల అదనపు భారం పడుతోంది. జూన్ నెలలో పామోలిన్ ఇవ్వాలనుకుంటే 8వ తేదీన వచ్చే కొత్త ప్రభుత్వం ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అమ్మహస్తం.. అస్తవ్యస్తం అమ్మహస్తం కింద తొమ్మిది రకాల సరుకులతో కార్డుదారులకు పంపిణీ చేసే సరుకుల సంచి నెమ్మదిగా చిక్కిపోతుంది. తొమ్మిది సరుకుల స్థానంలో ప్రస్తుతం బియ్యం, పంచదారా, కందిపప్పు, గోధుమ పిండితో సరిపెడుతున్నారు. పసుపు, కారంపొడి నాసిరకం కావడం.. గోధుమ పిండి పురుగు పట్టి మగ్గిన వాసన వస్తుండటంతో కొనుగోలుదారులు సుముఖత చూపడం లేదు. దీంతో ఈ సరుకుల పంపిణీ అంతంత మాత్రంగానే కొనసాగుతుంది. తాజాగా పామోలిన్ సరఫరా కూడా నిలిపివేశారు. ప్రస్తుతం రాయితీ ధరపై కేవలం నాలుగు రకాల సరుకులు మాత్రమే కార్డుదారులకు అందుతున్నాయి. కిరోసిన్ సరఫరాపైనా రాష్ట్ర విభజన ప్రభావం రాష్ట్ర విభజన ప్రభావం కిరోసిన్ సరఫరాపైనా చూపుతోంది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తున్న కిరోసిన్ దిగుమతి ఈ నెల 24వ తేదీ నుంచి నిలిచిపోయింది. 24వ తేదీ వరకు మాత్రమే హోల్సేల్ డీలర్లకు కిరోసిన్ సరఫరా చేశారు. కర్నూలు కార్పొరేషన్లోని కార్డుదారులకు నెలకు 4 లీటర్లు.. మునిసిపాలిటీలు, మండలాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కార్డుదారులకు ప్రతి నెలా 2 లీటర్ల చొప్పున కిరోసిన్ సరఫరా చేయాల్సి ఉంది. ఈ లెక్కన ప్రతి నెలా 20.76 లక్షల లీటర్లు కిరోసిన్ అవసరం కాగా, ఇప్పటి వరకు 1.50 లక్షల లీటర్లు కూడా హోల్సేల్ డీలర్ల వద్దకు చేరకపోవడం గమనార్హం. జిల్లా యంత్రాంగం ప్రతి నెలా 22, 23 తేదీల్లో సబ్సిడీ సరుకులు.. 2, 3 తేదీల్లో కిరోసిన్ కేటాయింపులు చేపట్టేది. కేంద్రం, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారడం.. రాష్ట్ర విభజన తదితర ఘటనలతో రెండు రాష్ట్రాలకు సమాన కోటా కేటాయింపుల విషయంపై సందిగ్ధం నెలకొనడంతో జిల్లాకు కేటాయించిన కిరోసిన్ కోటా కూడా నిలిచిపోయింది. -
సర్వీస్ రికార్డులను దిద్దారు...
ఖమ్మం అర్బన్, న్యూస్లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒక పక్క ఉద్యోగుల విభజన జరుగుతుండగా ఇక్కడి నుంచి వెళ్లడం ఇష్టం లేని ఉద్యోగులు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. వారి సర్వీస్ రికార్డుల్లో జన్మస్థలం ఉన్న ప్రాంతంలో వైట్ ఫ్లుయిడ్తో దిద్దుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన కారణంగా వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులను సర్వీస్ రికార్డుల ప్రకారం వారి స్వసస్థలాలకు పంపిస్తున్నారు. స్వస్థలాలకు వెళ్లడం ఇష్టం లేని ఎన్నెస్పీలోని సీమాంధ్ర ఉద్యోగులు కొందరు వారి సర్వీస్ రిజిస్టర్లో జన్మస్థలం అని ఉన్న ప్రాంతంలో వైట్ ఫ్లూయిడ్తో దిద్దారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత మంది ఉద్యోగ సంఘాల నాయకులు ఈ విషయాన్ని ఎన్నెస్పీ ఎస్ఈ అప్పలనాయుడిని కలిసి వివరించినట్లు తెలిసింది. సీమాంధ్ర జిల్లాలకు చెందిన వర్క్ చార్జ్డ్ ఉద్యోగులు ( లష్కర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు) గత అనేక సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. రాష్ర్ట విభజన నేపథ్యంలో ఉద్యోగుల బదలాయింపుల్లో భాగంగా వర్క్ చార్జ్డ్ ఉద్యోగులను వారి స్వస్థలాలకు పంపాలనే నిబంధన ఉంది. కానీ కొందరు తమ సర్వీస్ రికార్డులో జన్మస్థలం దగ్గర సీమాంధ్ర జిల్లాల వివరాలు ఉంటే దాన్ని వైట్ ప్లూయిడ్తో దిద్ది దానిపై ఖమ్మం జిల్లాలో జన్మించినట్లు నమోదు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తతంగం మొత్తం కొంత మంది ఈ శాఖ ఉద్యోగుల ఆమోదంతోనే జరిగిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సుమారు 15 మంది వరకు ఇలా దిద్దినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు ఎస్ఈని కలిసి ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఎస్ఈ ఆరోపణలు వచ్చిన వర్క్ చార్జ్డ్ ఉద్యోగుల సర్వీస్ రికార్డులను తెప్పించుకుని చూసి కొంత మందిని పిలిచి చీవాట్లు పెట్టినట్లు తెలిసింది. ఈ విషయంపై ఎస్ఈ అప్పలనాయుడిని ‘న్యూస్లైన్’ వివరణ కోరగా ఇద్దరు, ముగ్గురికి సంబంధించిన విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయం అసోసియేషన్ నాయకులు చెప్పారని, వారికి సంబంధించిన అన్ని రకాలు రికార్డులు తీసుకుని రావాలని చెప్పానన్నారు. ఆ రికార్డులను పరిశీలించి అసలు ఎలా ఉంటే అలాగే పంపుతామని అన్నారు. ఇలా అనేక విభాగాల్లో ఉద్యోగుల బదలాయింపుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిల్లో కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయని, చాలా వరకు వెలుగులోకి రావడం లేదనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి వాటిపై సమగ్రమైన పరిశీలన చేస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంటుంది. -
జీఎంఆర్పీకి గ్రీన్సిగ్నల్ లేనట్లే!
నూనెపల్లె, న్యూస్లైన్: ఎస్సీ విద్యార్థులకు ఉచితంగా సాంకేతిక విద్య అందించాలనే లక్ష్యం నెరవేరే పరిస్థితి లేకుండా పోతోంది. నంద్యాలలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతంలో జీఎంఆర్పీ (గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్) కళాశాల ఏర్పాటు చేసేందుకు పంపిన ప్రతిపాదనలు అమలుకు నోచుకోవడం లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కళాశాల ఏర్పాటుపై ఇంత వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జిల్లాలో ఆరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. ఇందులో ఎస్టీలకు, ముస్లింలతో పాటు ఇతర కులాల వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రత్యేక కాలేజీలున్నాయి. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్లో భాగంగా నంద్యాలలో ఎస్సీలకు మాత్రమే మోడల్ స్థాయిలో కళాశాల ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు కోరారు. రాష్ట్ర కమిషనర్ ఆఫ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ద్వారా న్యూ ఢిల్లీలోని ఏఐసీటీఈ (ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్)కి ఈ మేరకు అవసరమైన ప్రతిపాదనలు పంపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తలెత్తే ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కళాశాలకు అనుమతులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. విద్యార్థులకుండే బెనిఫిట్స్ ఇవే: జీఎంఆర్పీ కళాశాలకు గ్రీన్సిగ్నల్ వచ్చి కాలేజీలో విద్యార్థులకు సీటు వస్తే మూడేళ్ల పాటు పాలిటెక్నిక్ విద్య ఉచితంగా అందుతుంది. ప్రత్యేక హాస్టల్ వసతి, రుచికరమైన భోజనం, పుస్తకాలు, దుస్తులతో పాటు కాస్మొటిక్ చార్జీలు, ప్రత్యేక మెనూ ఇలా ఎన్నో సౌకర్యాలు, సదుపాయాలుంటాయి. కళాశాలలో వివిధ బ్రాంచ్ల్లో 120మందికి చేరేందుకు అవకాశం ఉంటుంది. -
సర్వర్ డౌన్
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్లైన్: రాష్ట్ర విభజన జూన్ 2వ తేదీ నుంచి అమల్లోకి రానుండటంతో ఉమ్మడి రాష్ట్ర సర్వర్లు శుక్రవారం మధ్యాహ్నం నుంచే డౌన్ అయ్యాయి. ఫలితంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు స్తంభించాయి. సోమవారం సాయంత్రానికి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సర్వర్ పనిచేసే అవకాశం ఉంది. అయితే మంగళవారం నాటికి పూర్తి స్థాయిలో సర్వర్ అందుబాటులోకి రావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా ట్రెజరీలో ఈనెల 31వ తేదీ వరకు స్కాలర్షిప్లు, స్టైఫండ్, ఎన్నికల బిల్లులు, పెన్షన్ల బిల్లులు మినహా అన్ని రకాల బిల్లుల మంజూరు నిలిపేశారు. ఆ తర్వాత ఇక్కడ కూడా అన్ని రకాల సేవలను కొత్త సర్వర్తోనే పునరుద్ధరించనున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో సర్వర్ డౌన్ కావడంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచే రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. కొత్త సర్వర్ అందుబాటులోకి వచ్చే వరకు ఇదే పరిస్థితి నెలకొననుంది. జిల్లా మొత్తం రోజుకు 600 నుంచి 700 రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా.. సర్వర్ డౌన్ కావడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడనుంది. సర్వర్ కారణంగా మీసేవలు కూడా నిలిచిపోయాయి. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో చోటు చేసుకున్న అంతరాయం కారణంగా విద్యార్థులు, రైతులు, వివిధ వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజుకు కనీసం 3వేల నుంచి 4వేల సర్టిఫికెట్లు ఆన్లైన్లో జారీ అవుతుండగా.. నాలుగు రోజుల పాటు సేవలు స్తంభించనున్నాయి. వాణిజ్య పన్నులు, రవాణా శాఖల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. -
నేను మళ్లీ ఖమ్మం జిల్లాకే వస్తా
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కాంగ్రెస్ ఫైర్బ్రాండ్, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సేవలు ఇక నుంచి జిల్లాకు అందే అవకాశం లేకుండా పోయింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రాజ్యసభ సభ్యుల పంపకానికి సంబంధించి తీసిన లాటరీలో రేణుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లిపోయారు. ఈమెతో పాటు తెలంగాణకు చెందిన మరో ముగ్గురు ఎంపీలు కూడా ఆ రాష్ట్రానికి కేటాయించబడ్డారు. దీంతో రేణుక తన పదవీకాలం ముగిసేంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకే సేవలందించాల్సి ఉంటుంది. ఎంపీగా ఆమె ఖర్చు చేసే నిధులు కూడా అక్కడి ప్రజల అవసరాలను తీర్చేందుకే కేటాయించాల్సి ఉంటుంది. మళ్లీ 2018 తర్వాత ఆమెకు రాజ్యసభకు అవకాశం వస్తే... అది కూడా తెలంగాణ నుంచి అధిష్టానం ఎంపిక చేస్తే ఆమె ఇక్కడకు వచ్చే అవకాలున్నాయి. కాగా, జిల్లా నుంచి ప్రస్తుతానికి పంపకాలు జరిగిన రాజ్యసభ సభ్యుల మధ్య పరస్పర అవగాహన కుదిరితే నిధుల కేటాయింపునకు సంబంధించి భారత ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వుల మేరకు ఇక్కడ అభివృద్ధికి కూడా నిధులు కేటాయించవచ్చని అధికార వర్గాలు చెపుతున్నా అది కూడా కష్టమేననే వాదన వినిపిస్తోంది. రేణుక ఏమంటున్నారంటే.... ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు కేటాయించబడిన నేపథ్యంలో రేణుకాచౌదరిని ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా... ఆమె ఎప్పటిలాగే తనదైన శైలిలో మాట్లాడారు. ప్రదేశ్ మారినా తాను మారేది లేదని, ఖమ్మం జిల్లాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వదిలిపెట్టబోనని, ఏ ప్రభుత్వం వచ్చినా తనలో మార్పు ఏమీ ఉండదని ఆమె చెప్పారు. ‘చూస్తూ ఉండండి... ఏం జరుగుతుందో... నేను మళ్లీ ఖమ్మం జిల్లాకే వస్తా’ అని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం. పోలవరం ముంపు ప్రాంత ప్రజల పక్షాన అటు పార్లమెంటులో, ఇటు బయట పోరాడింది తానేనని, సీఎం హోదాలో ఉండి కేసీఆర్ బంద్కు పిలుపునివ్వడం హాస్యాస్పదమని అన్నారు. అప్పుడు నోరుమెదపని నేతలు ఇప్పుడు డ్రామాలు ఎందుకు ఆడుతున్నారని ఆమె ప్రశ్నించారు. జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర... ఫైర్బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్న రేణుక జిల్లా రాజకీయాల్లో హల్చల్ సృష్టించారు. అతి తక్కువ కాలంలోనే జిల్లా రాజకీయాలను ఒక కుదుపు కుదిపారు. ఖమ్మం పార్లమెంటు సభ్యురాలిగా పనిచేసిన ఆమె జిల్లా కాంగ్రెస్ రాజకీయాలను ఒకరకంగా శాసించారనే చెప్పాలి. జిల్లా వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని కాంగ్రెస్ మహామహులను ఎదుర్కొని నిలబడ్డారు. జిల్లా కాంగ్రెస్ వర్గ రాజకీయాలు ముదురుపాకాన పడ్డప్పుడు కూడా ఆమె ఎక్కడా వెనక్కు తగ్గలేదు. అయితే, ఇప్పుడు రేణుకను ఆంధ్రప్రదేశ్కు కేటాయించడంతో జిల్లా కాంగ్రెస్లో రేణుకాచౌదరి వర్గంగా గుర్తింపు పొందిన నేతలు నైరాశ్యంలో మునిగిపోయారు. ఖచ్చితంగా మేడమ్ ఇక్కడే ఉంటారనుకున్న రేణుక వర్గం ఆమె ఆంధ్రప్రదేశ్కు వెళ్లిపోవడంతో తమ భవిష్యత్తు ఏమిటనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. -
షట్డౌన్
కలెక్టరేట్/మంచిర్యాల, న్యూస్లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలోని పలు శాఖల్లో సాంకేతికపరంగా సేవలు నిలిచిపోనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటు నేపథ్యంలో రెండు రోజులపాటు మీసేవ, స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్, ఖజానా, రవాఖ శాఖల్లో కార్యకలాపాలు స్తంభించనున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి జూన్ ఒకటో తేదీ అర్ధరాత్రి వరకు అంటే సరిగ్గా 48 గంటలు సేవలు ఆగిపోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ప్రక్రియతో జిల్లాలో పాలనపై ప్రభావం పడే అవకాశాలున్నాయి. ఏర్పాట్లే కారణం ఉమ్మడి రాష్ట్రంలో ఒకే ‘సర్వర్’ కింద ఆయా విభాగాలు సేవలు అందించాయి. తెలంగాణ అపాయింటెడ్ డే(జూన్ 2) నుంచి శాఖలు రెండు రాష్ట్రాలకు వేర్వేరు కానున్నాయి. దీంతో తెలంగాణకు సంబంధించిన సర్వర్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సర్వర్లను అ క్కడి సర్కారు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. సాంకేతి క పరమైన ఏర్పాట్లలో భాగంగా దాదాపు 48 గంటలపా టు సేవలు నిలిపివేయడం తప్పనిసరి అయింది. ఈ నిర్ణయంతో మీ సేవ కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాలు, విద్యు త్ బిల్లులు చెల్లించేవారికి తిప్పలు తప్పేలా లేవు. మరోవై పు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలోనూ భూక్రయ విక్రయాలు నిలిచిపోనున్నాయి. ఉద్యోగుల వేతన భత్యాలు, వారికి అందాల్సిన సొమ్ముల విషయమై కార్యకలాపాల న్ని జరగే ఖజానా శాఖలో సేవల నిలిపివేత వల్ల ఇబ్బంది తలెత్తే అవకాశాలున్నాయి. ఇప్పటికే దాదాపు ఉద్యోగులకు ఖజానా శాఖ వేతనాల చెల్లింపు అనుమతుల ప్రక్రి య పూర్తిచేసింది. సేవలకు విరామం రిజిస్ట్రేషన్, రవాణా, మీసేవ, ఖజానా ప్రభుత్వ శాఖలకు రూ.కోట్లు గండిపడే అవకాశం ఉంది. జిల్లా రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన సర్వర్లు శుక్రవారం సాయంత్రం ఆగిపోయాయి.రిజిస్ట్రేషన్కు సంబంధించి అకౌంట్లు, డా క్యూమెంట్లు సాయంత్రమే పూర్తి చేసుకోవాలని సబ్ రిజి స్ట్రార్లకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. రోజుకు సుమారు 250వరకు డాక్యూమెంట్లు రిజిస్టర్ అ య్యేవి. ఒక్క రోజులో రూ. 50 లక్షల వరకు ప్రభుత్వాదా యం వచ్చేది. సర్వర్ల డౌన్తో మూడు రోజుల రిజిస్ట్రేష న్లు సుమారు రూ.1.50కోట్ల వరకు ఆదాయం ఆగిపోనుంది. మీ సేవ ద్వారా అందిస్తున్న సుమారు 323రకాల సేవలు నిలిచిపోయాయి. జిల్లాలో సుమారు 1,000 నుంచి 1,200 వరకు ధ్రువీ కరణ పత్రాలు జారీకి సుమారు రూ. 6 నుంచి 8 లక్షల వరకు ఆదాయానికి గండిపడింది. -
దేవేందర్ ఎంపీ @ ఏపీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాజ్యసభ సభ్యుడు టి.దేవేందర్గౌడ్ ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజ్యసభ సభ్యులను కూడా ఇరు రాష్ట్రాలకు కేటాయించారు. లాటరీ ప్రాతిపదికన రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ఈ కేటాయింపులను జరిపారు. దీంతో మన జిల్లాకు చెందిన దేవేందర్ ఆంధ్ర కోటాలో చేరిపోయారు. అలాగే జిల్లాను ఎంపిక చేసుకున్న వై సుజనా చౌదరిని కూడా ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. తెలంగాణకు చెందిన వీరిరువురేగాకుండా మరికొందరు కూడా ఆంధ్రకు, అక్కడివారిలో కొందరు తెలంగాణకు లాట రీలో ఎంపికయ్యారు. అయితే, వేర్వేరు రాష్ట్రాలకు వీరిని కేటాయించినా.. నిధుల కేటాయింపు, నోడల్ జిల్లా ఎంపికలో వీరికి పూర్తి స్వేచ్ఛనివ్వడం ఊరట కలిగించే అంశం. -
ముంపు ప్రాంతాల కోసం మరో సమరం
భద్రాచలం, న్యూస్లైన్: పోలవరం ముంపు ప్రాంతాల అగ్గి మరోసారి రాజుకుంది. ముంపు పేరుతో జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో విలీనం చేసే ఆర్డినెన్స్కు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారన్న వార్తలు గుప్పుమనడంతో రాజకీయ వేడి రగులుకుంది. మరో మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తెలంగాణవాదులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ముంపుప్రాంతం మాత్రమే పోతుందని ఇప్పటి వరకూ భావించిన జిల్లా వాసులను తాజా వార్తలు తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. ఈపరిణామాలపై స్పందించిన రాజకీయ పక్షాలు ఓ వైపు తెలంగాణ బంద్కు, మరోవైపు జిల్లా బంద్కు వేర్వేరుగా పిలుపునిచ్చాయి. ఈ పిలుపునకు అన్ని పక్షాలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయి. అప్పుడు అలా... ఇప్పుడు ఇలా రాష్ట్ర విభజన చేసిన సమయంలో ముంపు పరిధిలోకి వచ్చే జిల్లాలోని 136 రెవెన్యూ గ్రామాలను(211 హేబిటేషన్లు) అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని గత కేంద్ర ప్రభుత్వం బిల్లులో పొందుపరిచి చట్టం చేసింది. కానీ భద్రాచలం డివిజన్లోని చింతూరు, కూనవరం, వీఆర్పురం, భద్రాచలం(భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా), పాల్వంచ డివిజన్లోని కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు (పాల్వంచ నుంచి భద్రాచలానికి వచ్చే మోరంపల్లిం బంజర్, మణుగూరు క్రాస్ రోడ్, సారపాక రూట్లో 12 గ్రామాలు మినహా ) మండలాలను పూర్తిగా సీమాంధ్రలో కలిపేందుకని అప్పుడే ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పటకీ దానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయలేదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు ఆమోదముద్ర వేస్తూ దీన్ని చట్టం రూపంలో తీసుకొచ్చేందుకు గాను రాష్ట్రపతికి పంపించినట్లుగా, దానిని రాష్ట్రపతి ఆమోదించినట్లుగా వార్తలొచ్చాయి. దీని ప్రకారం ఏడు మండలాల్లోని 92 పంచాయతీలు, 326 రెవెన్యూ గ్రామాలు అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలవనున్నాయి. 2లక్షలకు పైగా జనాభా మునిగిపోనుందా? ముంపు మండలాలను పూర్తిగా విలీనం చేస్తే భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని 326 రెవెన్యూ గ్రామాలు అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళతాయి. భద్రాచలం మండలంలో 70 రెవెన్యూ గ్రామాలు 20 పంచాయతీలు, కూనవరంలో 56 రెవెన్యూ గ్రామాలు 16 పంచాయతీలు, వీఆర్పురంలో 62 రెవెన్యూ గ్రామాలు 11 పంచాయతీలు, చింతూరులో 89 రెవెన్యూ గ్రామాలు 15 పంచాయతీలు, బూర్గంపాడులో 8 రెవెన్యూ గ్రామాలు 5 పంచాయతీలు, కుక్కునూరులో 20 రెవెన్యూ గ్రామాలు 11 పంచాయతీలు, వేలేరుపాడులో 21 రెవెన్యూ గ్రామాలు 9 పంచాయతీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం కాబోతున్నాయి. అదే విధంగా రెండు డివిజన్లలో గల ఏడు మండలాల్లో 2,02,369 మందిని జిల్లా నుంచి విడదీసి ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలో కలపనున్నారు. ముంపు గ్రామాలనే కలిపినట్లైతే 136 రెవెన్యూ గ్రామాలు, 211 హ్యాబిటేషన్లు, 1,16,796 మంది జనాభా జిల్లా నుంచి వేరు అయ్యేవారు. ఆర్డినెన్స్లో పేర్కొన్న ప్రకారం ఏడు మండలాలు సీమాంధ్రలో కలవనుండగా, ఆ మండలాల ప్రజలకు పునరావాసం అక్కడే కల్పించనున్నారు. మండిపడుతున్న జిల్లా వాసులు ఈ ప్రాంత ప్రజానీకం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం ఏకపక్షంగా ముంపు మండలాల ఆర్డినెన్స్ను తీసుకురావటం పట్ల జిల్లా వాసులు తీవ్రంగా మండిపడుతున్నారు. రెండు రాాష్ట్రాలుగా విడిపోతున్న సందర్భంలో త్వరలోనే కొత్తగా ప్రభుత్వాలు ఏర్పాటు కానుండగా, ఇంతలోనే హడావిడిగా ఆర్డినెన్స్కు ఆమోదముద్ర వేయించేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అత్సుత్సాహం చూపిస్తుండటంపై తెలంగాణ వాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా గురువారం తెలంగాణ బంద్కు టీఆర్ఎస్ అధినేత, కాబోయే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. దీనికి మద్దతుగా జిల్లాలో కూడా సంపూర్ణంగా బంద్ పాటించేందుకు తెలంగాణజాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. అన్ని ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలు సంఘీభావం ప్రకటిస్తూ బంద్లో పాల్గొంటున్నట్లు ప్రకటించాయి. సీపీఐ, సీపీఎం, న్యూడెమొక్రసీ పార్టీలు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. నేడు భద్రాచలం ఎమ్మెల్యే ఆమరణ దీక్ష ముంపు ప్రాంతాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య గురువారం నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నారు. ముంపు ప్రాంతాలను తిరిగి తెలంగాణలోనే కొనసాగిస్తామని కేంద్రం స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకూ దీక్షను కొనసాగిస్తానని రాజయ్య ప్రకటించారు. భద్రాచలం డివిజన్లోని ముంపు మండలాల్లో గల సీపీఎం సర్పంచ్లు, ఎంపీటీసీలు కూడా ఆయనతో పాటు నిరాహార దీక్షల్లో కూర్చొంటారని ఆ పార్టీ డివిజన్నాయకులు తెలిపారు. పోరుబాటలో ఆదివాసీలు పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో విలీనం చేయటం పట్ల ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. గిరిజన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో జూన్ 2న వీఆర్పురంలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా అఖిల పక్షం ఆధ్వర్యంలో ఈనెల 30న ముంపు మండలాల బంద్ చేయటంతో పాటు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున సరిహద్దు ప్రాంతాలను దిగ్బంధించేందుకు ఇప్పటికే కార్యాచరణ ప్రకటించారు. -
ఆరోగ్యశ్రీ సేవలకు ఇబ్బందుల్లేవు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్లైన్: రాష్ట్రం విడిపోయినా ఆరోగ్యశ్రీ సేవలకు ఎలాంటి ఇబ్బంది లేదని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్రెడ్డి తెలిపారు. బుధవారం ఆరోగ్యశ్రీ ప్రతినిధులతో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మరో ఏడాది వరకు ఆరోగ్యశ్రీ సేవలకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఆర్టికల్ 10 ప్రకారం గతంలో పని చేసిన విధంగానే సంవత్సరం పాటు రోగులకు వైద్య సేవలు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్రం విడిపోయిన రోజు నుంచి ఏడాది వరకు సీమాంధ్ర రోగులు తెలంగాణలో.. తెలంగాణ రోగులు సీమాంధ్రలో ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు పొందవచ్చన్నారు. ఆ మేరకు ఒప్పందం కుదిరిందన్నారు. రాష్ట్రం విడిపోతే ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం ఏర్పడుతుందనే ఆందోళన అవసరం లేదని, ఏడాది వరకు యథావిధిగా వైద్య సేవలు అందుతాయన్నారు. వైద్య సేవల అనంతరం సంబంధిత బిల్లు క్లయిమ్లను ఆయా రాష్ట్రాలకు పంపాల్సి ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి బడ్జెట్ మొత్తాలను రెండు రాష్ట్రాల కేటాయిస్తారన్నారు. ఈ విషయంలో రోగులకు అవగాహన కల్పించి వైద్యం అందించాలన్నారు. మహబూబ్నగర్ జిల్లావాసులు యథావిధిగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆరోగ్యశ్రీ కింద సేవలు పొందవచ్చని తెలిపారు. జిల్లావాసులు కూడా హైదరాబాద్లో వైద్యం చేయించుకోవచ్చన్నారు. ఇందుకు అనుగుణంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆన్లైన్లో తగిన ఏర్పాట్లు చేశారన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ నరసింహులు, పెద్దాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉమామహేశ్వర్, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ పుల్లన్న, ఆరోగ్యశ్రీ గుర్తింపు పొందిన 16 ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్లు బంద్
సాక్షి, కర్నూలు: రాష్ట్ర విభజన నేపథ్యంలో రిజిస్ట్రేషన్లకు స్వల్ప బ్రేక్ పడనుంది. జిల్లాలో ఈ నెల 30న సాయంత్రం 6 నుంచి.. జూన్ 2వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ సేవలకు ఆటంకం కలగనుంది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సెంట్రల్ సర్వర్ను విభజించాల్సి ఉండటంతో సేవలను నిలుపుదల చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. జిల్లాలో 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా.. రెండు రోజుల పాటు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోనుంది. మీసేవ కేంద్రాల ద్వారా ఈసీలు, నకళ్ల జారీ సైతం స్తంభించనుంది. రిజిస్ట్రేషన్ శాఖలో సీసీఏ(కార్డ్ సెంట్రలైజ్డ్ అప్లికేషన్) విధానం అమలు చేస్తున్నందున ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చేపట్టిన లావాదేవీల వివరాలు హైదరాబాద్లోని సెంట్రల్ సర్వర్లో నమోదవుతుంది. సాధారణంగా ప్రతిరోజూ జిల్లా వ్యాప్తంగా 500 పైబడి రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. ఈసీలు 800 వరకు జారీ చేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రోజుల పాటు ఈ సేవలన్నీ నిలిచిపోనున్నాయి. ఇదిలా ఉండగా రిజిస్ట్రేషన్ల శాఖ స్టాంపు ఫీజు, రిజిస్ట్రేషన్ల ఫీజు తగ్గించడంతో ఆదాయం భారీగా తగ్గినట్టు అధికారులు చెబుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో గత ఏడాదిలో లక్ష్యాన్ని కూడా చేరుకోలేని పరిస్థితి నెలకొంది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు కేటాయించిన లక్ష్యంలో 65 శాతం మాత్రమే సాధించడం గమనార్హం. ఇక రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం లక్ష్యాలను ఇప్పటికీ నిర్దేశించకపోయినా.. ఆ ప్రభావం శాఖ కార్యకలాపాలతో పాటు ఆదాయంపై చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కొత్త రాష్ట్రం.. కొత్త సిరీస్!
ఖమ్మం మయూరిసెంటర్, న్యూస్లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో వాహనాల రిజిస్ట్రేషన్ల సిరీస్ కూడా మారనుంది. ఇప్పటివరకు ఏపీ 20 సిరీస్తో ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్లు ఇకనుంచి టీజీ 08 పేరున జరుగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర అపాయింటెడ్ డే అయిన జూన్ 2 నుంచి ఈ సిరీస్ అమలవుతుందని ఆర్టీఏ అధికారులు చెపుతుండగా, తెలంగాణ ప్రభుత్వ అధికారిక లోగో ఆలస్యమయితే మరికొన్ని రోజులు వాయిదా పడే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అయితే, కొత్త సిరీస్ అమల్లోకి వచ్చిన తర్వాత అవిభక్త ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాహనాలకు మాత్రం పాత నంబర్లే కొనసాగనున్నాయి. (వాహనదారుల ఇష్టం మేరకు మార్చుకోవాలనుకుంటే మళ్లీ రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది) కాగా, ఈ కసరత్తు కోసం అన్ని జిల్లాల ఆర్టీఓలతో సోమవారం రవాణా శాఖ కమిషనర్ హైదరాబాద్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా నుంచి ఆర్టీఏ మోహిమీన్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఎన్ని వాహనాలు ఉన్నాయి. వాటిలో పర్మిట్లు ఉన్న వాహనాలు ఎన్ని...లేని వాటికి ఎంత సమయం పడుతుంది? అనే విషయాలపై సమావేశంలో చర్చ జరిగినట్టు తెలిసింది. లోగో ఆలస్యం అయితే... అయితే, జిల్లాలకు ఇంకా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన లేబుళ్లు, రాష్ట్రం లోగో, ఆర్సీ బుక్లు, సీ బుక్లు, అన్ని లెసైన్స్లకు కావలసిన లోగోలు ఇంకా పూర్తి స్థాయిలో రాలేదని, దీంతో కొత్త రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని సమాచారం. అప్పటి వరకు పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తారు. టీజీ 08 వచ్చే వరకు జిల్లాల్లో టీజీ అనే బ్లాంక్తో రిజిస్ట్రేషన్లు చేస్తారు. పూర్తి స్థాయిలో నంబర్ వచ్చిన తరువాత వాహనాలకు కేటాయిస్తారు. జిల్లాలోని ఆశ్వారావుపేట, కల్లూరుల్లో కొత్తగా చెక్పోస్టుల ఏర్పాటుకు ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అయితే, అధికారికంగా ఇంకా ఉత్తర్వులు రావాల్సి ఉంది. జిల్లాలో రవాణా శాఖ కింద ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు. ఏఏ ప్రాంతం చెందినవారు ఎంత మంది? అనే వివరాలతో పాటు వాహనాల రిజిస్ట్రేషన్ వివరాలు, శాఖకు ఉన్న ఆస్తులు, ఆదాయం ఇతర వివరాలను ఆ శాఖ అధికారులు 15 రోజుల క్రితమే ప్రభుత్వానికి అందజేశారు. -
లిక్కర్ డిపోల మూసివేత
మంచిర్యాల రూరల్, న్యూస్లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో మద్యం డిపోలు పది రోజులపాటు మూతపడనున్నాయి. ఈ నెల 24వ తేదీ వరకు మద్యం కోసం చలానాలు కట్టిన వారికి మాత్రమే 27వ తేదీ సాయంత్రం వరకు మద్యం సరఫరా చేయనున్నారు. ప్రభుత్వ పరమైన లావాదేవీలకు ఎలాంటి చలానైనా బ్యాంకులో చెల్లించడంను ఈ నెల 24వ తేదీ నుంచి నిలిపేశారు. దీంతో 24వ తేదీ తరువాత చలానా కట్టేందుకు మద్యం వ్యాపారులకు వీలు లేకుండా పోయింది. మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు జూన్ 2వ తేదీన అధికారికంగా విడిపోనున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ జూన్ 2 నుండే అధికారిక కార్యకలాపాలు సాగించనున్నారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఎక్సైజ్ శాఖలో ఆదాయం, అప్పులు, స్థిర చరాస్తుల పంపకాలు పూర్తి చేయాల్సి ఉంది. దీనికి కనీసం పది రోజుల సమయమైన పట్టేఅవకాశం ఉంది. దీంతో జూన్ 6వ తేదీనే మద్యం డిపోలు తెరుచుకోనున్నాయి. మూతపడే పది రోజులకు గానూ స్టాక్ను ముందస్తుగా కొనుగోలు చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం వ్యాపారులకు సూచించడంతో, రోజుకు రూ.2 కోట్లకు పైగా మద్యం పంపిణీ జరుగుతుంతోంది. ఇక గత ఐదు రోజులుగా మద్యం డిపో వద్ద మద్యం వ్యాపారులు బారులు తీరడంతో రోజుకు ఆదాయం రూ.5 కోట్లకు పైగానే ఎక్సైజ్ శాఖకు లభించింది. మద్యం కొరతకు దుకాణదారుల మొగ్గు జిల్లాలో మంచిర్యాల, ఊట్నూరులో మద్యం డిపోలు ఉన్నా యి. మంచిర్యాల మండలం గుడిపేటలో గల మద్యం డిపో పరిధిలో 65 దుకాణాలు, 8 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నా యి. ఉట్నూరు మద్యం డిపో పరిధిలో 88 దుకాణాలు, 16 బార్లు ఉన్నాయి. గత నాలుగైదు రోజులుగా మద్యం డిపోలు, మద్యం వ్యాపారస్తులతో కిటకిటలాడుతున్నాయి. జూన్ 6వ తేదీ తరువాతే మద్యం డిపోలు తెరుచుకోనుండడంతో, పది రోజులకు సరిపడా మద్యంను వ్యాపారస్తులు ఇదివరకే తరలించారు. మరోవైపు జూన్ 2వ తేదీన కొత్త ప్రభుత్వం ప్ర మాణ స్వీకారం అనంతరం ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబరాల కోసం మద్యం అవసరం ఉంటుంది. అసలే మ ద్యం కొరత ఉండడంతో, మద్యం వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి మద్యంను అధిక ధరలకు అమ్మేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల ద్వారా గె లుపొందిన కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లను ఎ న్నుకోనుండగా, ఎంపీటీసీలు ఎంపీపీలను, జెడ్పీటీసీలు జె డ్పీ చైర్పర్సన్ను ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికలు జరిగే తేదీ లను ఇంత వరకు ప్రకటించక పోవడంతో ఎన్నికలయ్యే వర కు వారు చేజారకుండా ఉండేందుకు క్యాంపులు ఏర్పాటు చే స్తున్నారు. దీంతో మద్యంకు డిమాండ్ బాగా ఏర్పడనుంది. దీన్ని ఆసరా చేసుకుని మద్యం దుకాణాల్లో స్టాకు లేదంటూ, కృత్రిమ కొరత సృష్టించేందుకు మద్యం వ్యాపారులు సిద్ధమవుతున్నారు. మద్యం స్టాకు లేదని, రెట్టింపు ధరలకు మద్యం ను అమ్మేందుకు మద్యం వ్యాపారులు సిద్ధమవుతుండగా, మద్యం ప్రియులకు పది రోజులపాటు జేబులకు చిల్లు పడడం ఖాయంగా కన్పిస్తుంది. దుకాణాల్లో ఉన్న స్టాకును ఎమ్మార్పీ ధరలకు అమ్మేలా ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటే, పది రోజుల వరకు మద్యం ప్రియులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదంటే గత నెలలో జరిగిన ఎన్నికల పుణ్యమా అని మద్యం దొరక్క పడ్డ ఇబ్బందులు, మళ్లీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. -
ఇందిరమ్మకు విభజన సెగ
కర్నూలు(అర్బన్), న్యూస్లైన్: రాష్ట్ర విభజన సెగ ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకానికి తాకింది. ఎన్నికల కోడ్, రాష్ట్ర విభజన ప్రక్రియ కారణంగా మార్చి15 నుంచి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో బిల్లుల చెల్లింపు నిలిచిపోయింది. దీంతో నిర్మాణాలను పూర్తి చేసుకోలేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరమ్మ మూడో విడత కింద జిల్లాకు మంజూరైన 71,032 గృహాల నిర్మాణాలను ఈ ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. వీటిలో సుమారు 10 వేల ఇళ్ల నిర్మాణాలు చివరి దశలో, మిగతావి వివిధ దశల్లో కొనసాగుతున్న తరుణంలో మార్చిలో సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడం, రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభం కావడంతో బిల్లుల చెల్లింపు ఆగిపోయింది. ఫలితంగా సుమారు రూ. 5 కోట్లకుపైగా బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. కోడ్ ముగిసినా.. ఎన్నికలు ముగియడంతో మార్చి 15 వరకు పురోగతిలో ఉన్న నిర్మాణాలకు బిల్లులు మంజూరు చేసేందుకు అధికారులు ఉపక్రమించగా ఖజానా శాఖలో శనివారం నుంచి ఆన్లైన్ లావాదేవీలు నిలిచిపోవడంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది. రెండు రాష్ట్రాల విభజన నేపథ్యంలో ఇటు సీమాంధ్ర, అటు తెలంగాణ జిల్లాల వారీగా లెక్కలు, బిల్లుల చెల్లింపు తదితర వాటిని వేర్వేరుగా వెబ్సైట్లలో అందుబాటులో ఉంచాల్సి రావడంతో ఆటంకాలు తప్పలేదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక తీసుకునే నిర్ణయాన్ని బట్టి బిల్లుల చెల్లింపు జరగవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇందులో కూడా నిర్మాణాలు చివరిదశలో ఉన్న వాటికే బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే వేసవిలో ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకునేందుకు అప్పుసప్పో చేసి సిద్ధమైన లబ్ధిదారులు కొత్త ప్రభుత్వ నిర ్ణయం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. -
రెవెన్యూ శాఖకు షాక్
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్లైన్: రాష్ట్ర విభజన ప్రభావం రెవెన్యూ శాఖపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఏర్పాటైన భూసేకరణ యూనిట్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం ఆ శాఖలో అలజడి రేపుతోంది. ఇందుకు సంబంధించి జారీ అయిన జీవో ఎంఎస్ నెం.67 కారణంగా జిల్లాలో నాలుగు భూసేకరణ యూనిట్లు రద్దు కానున్నాయి. కలెక్టరేట్లోని శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ కార్యాలయ పరిధిలో జిల్లాలో ఐదు, అనంతపురం జిల్లాలో ఒక యూనిట్ ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో 23, తెలంగాణలో 5 యూనిట్లు రద్దు కానున్నాయి. జిల్లాకు సంబంధంచి 5 యూనిట్లుండగా నంద్యాలలోని తెలుగుగంగ భూసేకరణ యూనిట్, హంద్రీనీవా సుజల స్రవంతి 3-4 యూనిట్లు, కలెక్టరేట్లోని భూసేకరణ, పునరావాసం(ఎల్ఏ అండ్ రీహాబిటేషన్) యూనిట్లు రద్దు కానున్నాయి. వీటిని నంద్యాలలోని ఎస్సార్బీసీ భూసేకరణ యూనిట్లో కలపనున్నారు. ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత.. భూసేకరణ యూనిట్ల రద్దుకు సంబంధించిన జీవో నెంబర్ 67ను రెవెన్యూ యంత్రాంగం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. భూసేకరణ యూనిట్లలో పనిచేస్తున్న వారందరూ రెవెన్యూ శాఖకు చెందినవారే కావడంతో వీటి రద్దు కారణంగా వారంతా తిరిగి మాతృశాఖకు రానున్నారు. ఈ యూనిట్లలో పని చేస్తున్న దాదాపు 20 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఇంటికి వెళ్లాల్సి వస్తోంది. జిల్లాకు సంబంధించి నలుగురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, 14 మంది డిప్యూటీ తహశీల్దార్లు, 20 మంది సీనియర్ అసిస్టెంట్లు, ఐదుగురు టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్లు తిరిగి రెవెన్యూ శాఖకు రానున్నారు. పలు పోస్టులు రద్దు కానున్నాయి. వీరందరూ రెవెన్యూ శాఖకు రావడం వల్ల సర్దుబాటు చేయాల్సి ఉంది. దీంతో పదోన్నతులు రాకపోగా చివరిగా ప్రమోషన్లు పొందినవారికి రివర్షన్లు తప్పేలా లేవు. దీంతో జిల్లా కలెక్టర్, శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్లు మాత్రం కర్నూలులో ఒక భూసేకరణ యూనిట్ను కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాశారు. స్పెషల్ కలెక్టర్ కంట్రోల్లో అనంతపురం జిల్లాలో ఉన్న భూసేకరణ యూనిట్ను అదే జిల్లాలో కలిపివేయాలని సూచించారు. రద్దు నిర్ణయంపై వ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో ప్రభుత్వం పునరాలోచనలో పడిందని రెవెన్యూ యంత్రాంగం చెబుతోంది. జీవో అమలును నిలుపుదల చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మద్యం వ్యాపారుల ముందు చూపు!
కామారెడ్డి, న్యూస్లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో మద్యం సరఫరా నిలిపివేయడానికి ప్రభుత్వం నిర్ణయించడంతో వ్యాపారులు ముందుచూపుతో వ్యవహరించారు. విభజన విరామ సమయంలో మద్యం కొరత లేకుండా చూసుకోవడానికి గాను రెగ్యులర్ కన్నా రెట్టింపు డీడీలు చెల్లించి మద్యం తెప్పించుకుంటున్నారు. ఈ నెల 24 లోపు డీడీలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించడంతో వ్యాపారులు ఇండెంట్ భారీగా ఇచ్చినట్టు సమాచారం. జూన్ 2న కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాతనే మద్యం సరఫరా చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 27 వరకే మద్యం సరఫరా అవుతుంది. దీంతో మద్యం వ్యాపారులు తమకు కావలసిన ఇండెంట్ ఇచ్చేసుకుని స్టాక్ కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చిన స్టాక్ను తమకు అనుకూలమైన ప్రాంతాల్లో భద్రపరచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల తరువాతనే మద్యం వచ్చే అవకాశం ఉండడంతో అప్పటి వరకు కొరత లేకుండా చూసుకోవాలని వ్యాపారులు ఈ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మద్యం కొరత ఉంటే ఎక్కువ ధరలకు అమ్ముకోవచ్చన్న భావనతో ఉన్న కొందరు వ్యాపారులు ముందుచూపుతో స్టాక్ తెప్పించుకుని నిల్వ చేస్తున్నారు. వరుసగా వచ్చిన ఎన్నికల సమయంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. చాలా చోట్ల మద్యం దొరక్క దుకాణాలు మూసి ఉంచాల్సి వచ్చింది. ఈ సమయంలో కొందరు వ్యాపారులు అడ్డగోలు ధరలకు మద్యం అమ్మి సొమ్ముచేసుకున్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితిని ఊహించుకుంటున్నారు. తెలంగాణ రాష్ర్టం అధికారికంగా ఏర్పడిన సమయంలో ప్రజలు పండుగ చేసుకోవడానికి సన్నద్ధమవుతుండడంతో దీన్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికి మద్యం వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. జూన్ ఒకటి అర్ధరాత్రి నుంచి తెలంగాణ సంబరాలు జరుపుకోవడానికి ఉద్యమకారులు, తెలంగాణ వాదులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆరు దశాబ్దాల ఆకాంక్షకు అధికారిక గుర్తింపు వచ్చిన రోజును ఎప్పటికీ గుర్తుండేలా సంబరాలు చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. దీన్ని గుర్తించిన మద్యం వ్యాపారులు పెద్ద ఎత్తున మద్యం నిల్వలు చేస్తున్నట్టు సమాచారం. మద్యం నిల్వల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోవడంతో వ్యాపారులు భారీ ఎత్తున సొమ్ము చేసుకోనున్నారు. నకిలీ మద్యం వచ్చే అవకాశం... మద్యం సరఫరాకు విరామం ప్రకటించిన నేపథ్యంలో వ్యాపారులు ఒకవైపు నిల్వలు చేసుకుంటూనే మరోవైపు నకిలీ మద్యంను రంగంలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున నాన్ డ్యూటీ పెయిడ్ మద్యంను తీసుకురావడానికి ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల సమయంలో కూడా కొందరు వ్యాపారులు నకిలీ మద్యం, నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని తీసుకువచ్చి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించారు. ఇప్పుడు అదే రకంగా ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. నకిలీ మద్యంపై ఆబ్కారీ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
పీఆర్సీ కోసం... కేటీపీఎస్ ఉద్యోగుల సమ్మె
పాల్వంచ, న్యూస్లైన్ : విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటనలో జాప్యాన్ని నిరసిస్తూ కేటీపీఎస్ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. గత 21నే పీఆర్సీకి సంబంధించిన జీవో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఆలస్యం అవుతోంది. అయితే గతంలోనే విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధం కాగా.. రాష్ట్ర విభజనతో నిమిత్తం లేకుండా మే 21న జీవో విడుదల చేస్తామని ఏపీ జెన్కో ఎండీ హామీ ఇవ్వడంతో వారి నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు ఆ హామీ నెరవేరేలా లేకపోవడంతో సమ్మెబాట పట్టారు. పలు సంఘాల నాయకులు ఏకమై కేటీపీఎస్ పరిధిలోని ఓఅండ్ఎం 5, 6 దశల కర్మాగారాల ఎదుట ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల నుంచే ఆందోళనకు దిగారు.మొదటి షిఫ్ట్ కార్మికులు విధులకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో మధ్యాహ్నం చీఫ్ ఇంజనీర్ సిద్దయ్య ధర్నా వద్దకు వచ్చి సమ్మెతో విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడుతుందని, తక్షణం విధుల్లోకి రావాలని, మిగితా కార్మికులను లోనికి అనుమతించాలని నాయకులను కోరారు. అయితే వారు దానికి అంగీకరించకుండా పీఆర్సీ వెంటనే ప్రకటించాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, ఈపీఎఫ్ను జీపీఎఫ్గా మార్చాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఎస్పీఎఫ్ కమాండెంట్జమీల్పాషా ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని గేట్లు తెరవడంతో పాటు అక్కడ ఆందోళన చేయవద్దని, పక్కకు వెళ్లాలని చెప్పడంతో ఉద్యోగులకు - పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సీఈ గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సిద్దయ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఉద్యోగ సంఘాల మధ్య ఘర్షణ... సమ్మె విరమించి విధులకు రావాలని ఎస్ఈలు ఆనందం, బిచ్చన్న కోరడంతో ఆందోళనకు దూరంగా ఉన్న తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు టి.ప్రవీణ్ కుమార్, వెంకటేషం, కట్టా మల్లికార్జున్ త దితరులు విధులకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో వారిని జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. ఈ సమయంలో వారి మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. రాత్రి షిఫ్ట్ సిబ్బందితోనే యూనిట్ల నిర్వహణ శనివారం రాత్రి విధులకు వెళ్లిన ఉద్యోగులు, కార్మికులు ఉదయం డ్యూటీ దిగాల్సి ఉండగా అధికారులు ఆదివారం కూడా వారితోనే పనులు చేయించారు. సిబ్బందికి అవసరమైన టిఫిన్, భోజనం, ఇతర సౌకర్యాలను అక్కడే కల్పించారు. కొన్ని మార్గాల ద్వారా కొంత మేరకు కార్మికులను లోనికి తీసుకెళ్లి యూనిట్లు పడిపోకుండా చర్య తీసుకోగలిగారు. సీఈలు, ఎస్ఈలు కర్మాగారాల్లోనే ఉండి విద్యుదుత్పత్తిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. సమ్మెకు 1104 యూనియన్ నాయకులు కె.కోటేశ్వరరావు, సునీల్ రెడ్డి, 327 నాయకులు పి.వి.కోటేశ్వరరావు, 1535 నాయకులు లీవెన్, అంబాల శ్రీను, హెచ్ 67 నాయకులు ఎం.రమేష్, తెలంగాణ విద్యుత్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి భాస్కర్, ఏఈస్ అసోసియేషన్ నాయకులు అన్వర్బాషా తదితరులు నాయకత్వం వహించారు. విద్యుదుత్పత్తికి భారీగా గండి.. పాల్వంచ : రాష్ట్రానికి వెలుగులు పంచే కేటీపీఎస్ కాంప్లెక్స్లో ఉద్యోగుల మెరుపు సమ్మె కారణంగా భారీగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. కేటీపీఎస్ ఓఅండ్ఎం, 5, 6 దశల్లోని మొత్తం 11 యూనిట్లలో 1,720 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుండగా ఆదివారం రాత్రికి సమ్మె కారణంగా 515 మెగావాట్లకు పడిపోయింది. ఇది ఇలానే కొనసాగితే మరో 24 గంటల్లో పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి నిలిచి పోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కర్మాగారంలో పనిచేసే సిబ్బంది లేక విద్యుదుత్పత్తి క్రమేణా పడిపోతోంది. 6వ దశలోని 500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 11వ యూనిట్ తొలుత ట్రిప్ కావడంతో విద్యుదుత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. 5వ దశలో 9వ యూనిట్లో 250 మెగావాట్లకు గాను 95 మెగావాట్లు, 10వ యూనిట్లో 250 మెగావా ట్లకు గాను 120 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి వస్తోంది. ఓఅండ్ఎం పరిధిలో మొత్తం 720 మెగావాట్ల సామర్థ్యం ఉండగా అందులో గత శనివారం 8వ యూనిట్లోని 120 మెగావాట్లను వార్షిక మరమ్మతుల కోసం షట్డౌన్ చేశారు. దీంతో ప్రస్తుతం 600 మెగావాట్లు ఉత్పత్తి అవుతుండగా సమ్మె కారణంగా ఇక్కడ బొగ్గు లెవల్ పడిపోవడంతో 375 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే అవుతున్నట్లు అధికారులు తెలి పారు. అయితే సమ్మె ఇలానే కొనసాగితే పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
జీతాలు, పింఛను బిల్లుల చెల్లింపు
చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలోని ఉద్యోగులు ఈ నెల 21వ తేదీలోపు సమర్పించిన బిల్లులను పాస్ చేశారని, ఇంకా ఏమైనా బిల్లులు ఉంటే సోమవారం సాయంత్రానికి పాస్ చేయనున్నట్టు జిల్లా ఖజానాధికారి పాలేశ్వరరావు తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఖజానాశాఖ సంచాలకులు శనివారం ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ప్రధానంగా ఉద్యోగులు, పెన్షన్దారులకు రావాల్సిన డీఏ బకాయిలు (జనవరి నుంచి ఏప్రిల్ వరకు), మే నెల జీతం, పెన్షన్, ఉద్యోగులకు జూన్ 1వ తేదీ జీతం బిల్లులను విడివిడిగా పాస్ చేసినట్టు ఆయన తెలిపారు. శనివారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జూన్ 2వ తేదీ నుంచి ఉద్యోగులు, పెన్షన్దారులు కొత్త రాష్ట్రం పరిధిలోకి వస్తున్నందున గవర్నర్ ఆదేశాల మేరకు 24వ తేదీ నాటికి చెల్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి ఖజానాలతో సంబంధం ఉన్న బ్యాంకులు శనివారం సాయంత్రం వరకు పనిచేశాయన్నారు. జిల్లా వ్యాప్తంగా చిత్తూరు, తిరుపతి, మదనపల్లెతో కలుపుకుని 18 ఖజానా కార్యాలయాల్లో 20 వేలకు పైగా బిల్లులను పాస్ చేసినట్టు పేర్కొన్నారు. రిటైర్మెంట్ క్లెయిమ్లను 31లోపు సమర్పించాలి జిల్లాలో పనిచేస్తూ గత నెలలో, ఈ నెల 31వ తేదీలోపు ఉద్యోగ విరమణ చేయనున్న ఉద్యోగులు వారికి రావాల్సిన సంపాదిత సెలవులు, గ్రాట్యుటీ, పీఎఫ్, సీపీఎస్ తదితర బిల్లులన్నింటినీ ఈ నెల 31వ తేదీ నాటికి సమర్పించాలని జిల్లా ఖజానాధికారి, డీడీ(ఉపసంచాలకులు) కోరారు. ఆ తరువాత సమర్పిస్తే అంగీకరించేది లేదన్నారు. లాంగ్ పెండింగ్ ఏసీ బిల్లు సబ్మిట్ చేసి డీసీ బిల్లు ఇవ్వని సంబంధిత డీడీవోలకు జీతాలు నిలిపివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. జీవో నం.94 ప్రకారం ఆర్థికశాఖ కేటాయించిన సొమ్ము పీడీ అకౌంట్లో ఉన్నందున దానిని తిరిగి ప్రభుత్వ ఖాతాకు బదిలీ చేయాలన్నారు. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు ఇచ్చే చెక్కులు 31వతేదీ లోపు మాత్రమే చెల్లుబాటు అవుతాయని ఆయన పేర్కొన్నారు. -
ఫీజు బకాయి.. ఎవరు కడ్తరు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర విభజన అంశం జిల్లాలోని పోస్టుమెట్రిక్ విద్యార్థులకు కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టింది. శనివారం నాటితో సమైఖ్య రాష్ట్రానికి ఉన్న ఉమ్మడి ఖజానా ఖాతాకు గడువు ముగుస్తుంది. దీంతో ఈ పథకం అమలుతీరు విద్యార్థుల్లో వణుకు పుట్టిస్తోంది. 2013-14 విద్యాసంవత్సరానికి సంబంధించి జిల్లాలో ఫీజు రీయింబర్స్మెంటు, ఉపకారవేతనాలకు సంబంధించి కోట్ల రూపాయిలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఉమ్మడి ఖజానా ఖాతాకు కాలం చెల్లనున్న నేపథ్యంలో ఈ బకాయిల చెల్లింపు ప్రక్రియ ఎలా ఉంటుందనే అంశం విద్యార్థులను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. జిల్లాలో 1,046 ఇంటర్మీడియట్, వృత్తివిద్యా కళాశాలలున్నాయి. వీటి పరిధిలో దాదాపు మూడులక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రాజధానికి చుట్టూ జిల్లా విస్తరించి ఉండడం, నగర శివారు ప్రాంతాల్లో అత్యధికంగా వృత్తి విద్యా కళాశాలలుండడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల విద్యార్థులంతా జిల్లాలో విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో 40 శాతం విద్యార్థులు 2013-14 విద్యా సంవత్సరంలో కోర్సు పూర్తి చేయగా, మిగతా విద్యార్థులు కోర్సు మధ్య దశలో ఉన్నారు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాలు పెద్దఎత్తున బకాయి పడ్డాయి. తాజాగా రాష్ట్ర విభజన ప్రక్రియతో ఉపకారవేతనాలు ఎలా అందుతాయనే అంశం విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. బకాయిలు రూ.300 కోట్లకు పైమాటే..! 2013-14 విద్యాసంవత్సరానికి సంబంధించి జిల్లాలోని సంక్షేమశాఖలకు పూర్తిస్థాయి నిధులు అందలేదు. ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ ఎన్నికలు, ఇతర రాజకీయ పరిణామాలు నిధుల విడుదలకు ఆటంకంగా మారాయి. రాష్ట్ర విభజన ప్రక్రియ వేగవంతంగా సాగినప్పటికీ.. విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలపై మాత్రం ఒకింత నిర్లక్ష్యం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గడిచిన విద్యాసంవత్సరంలో కోట్ల రూపాయలు బకాయిపడింది. జిల్లా బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 2.02లక్షల మంది విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయిం బర్స్మెంట్ నిధులు విడుదల చేయాల్సి ఉండగా.. ఇందు లో సగం మందికి మాత్రమే ఇప్పటివరకు నిధులు విడుదలయ్యాయి. దీంతో బీసీ కేటగిరీలో రూ.169 కోట్ల రీయిం బర్స్మెంట్ నిధులు, రూ.39కోట్ల ఉపకారవేతనాలు బకాయిపడ్డాయి. ఈబీసీ కేటగిరీలో రూ.72 కోట్ల రీయింబర్స్మెంట్ బకాయి పడ్డాయి. ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖలకు సంబంధించి మరో రూ.20కోట్లు బకాయిలున్నాయి. అధికారుల్లో అయోమయం.. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతన నిధులపై అధికార వర్గాల్లోనూ అయోమయం నెలకొంది. ఈ రెండు పథకాల్లో భాగంగా రాష్ట్రంలోనే అత్యధిక నిధులు జిల్లాకు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్న నేపథ్యంలో నిధులు ఎక్కువగా కేటాయించాల్సి వస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర విభజన ప్రక్రియ దాదాపు పూర్తికావడంతో బకాయిల అంశంపై అధికారుల్లో స్పష్టత కొరవడింది. మిగులు నిధులు జూన్ చివరికల్లా వస్తాయని అధికారులు చెబుతున్నారు. శనివారంతో ఉమ్మడి ఖాతా మూసివేస్తుండడంతో కొత్త రాష్ట్రంలో ఏర్పాటయ్యే ఖాతా ద్వారా నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. అయితే తెలంగాణ ప్రాంత విద్యార్థులకే నిధులు విడుదల చేస్తారా.. సీమాంధ్ర ప్రాంత విద్యార్థుల ఫీజులకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేస్తారా.. లేక విద్యార్థులందరికీ లబ్ధి చేకూరుస్తారా అనే ప్రశ్నకు అధికారవర్గాల నుంచి సరైన సమాధానం రాకపోవడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. -
తిరువూరు ఆర్టీసీ డిపో ఎత్తివేత!
కార్మికుల్లో ఆందోళన శాటిలైట్ డిపోగా నిర్వహించేందుకు యత్నం తమకు తెలియదంటున్న డిపో అధికారులు తిరువూరు, న్యూస్లైన్ : రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్లో 30 ఆర్టీసీ డిపోలను ఎత్తివేయాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లోని తిరువూరు డిపోను మూసివేయనున్నారని తెలుస్తోంది. ఈ సమాచారం తెలిసిన కార్మికవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. 1965లో ఏడు బస్సులతో ఫ్యాక్టరీ సెంటర్లో తిరువూరు డిపోను ప్రారంభించారు. 1969లో రాజుపేట ఊరచెరువులో గ్యారేజీ నిర్మించి 69 బస్సులతో డిపోను నిర్వహించారు. 1985లో బస్స్టేషన్ ను అప్పటి సీఎం ఎన్టీ రామారావు ప్రారంభిం చారు. ఈ డిపో కృష్ణా, ఖమ్మం జిల్లాల్లోని 10 మండలాల ప్రయాణికులకు సేవలందిస్తూ స్వర్ణోత్సవాలకు చేరువవుతోంది. రోజుకు 10 వేల మందికి పైగా ప్రయాణికులు తిరువూరు డిపో బస్సుల్లో తమ గమ్యస్థానాలకు చేరుతున్నారు. జిల్లాలో మారుమూల ఉన్న తిరువూరులో ఆర్టీసీ డిపో అందిస్తున్న సేవలను విద్యార్థులు, గ్రామీణ ప్రజలు వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం తిరువూరు డిపోలో 380 మంది కార్మికులు పనిచేస్తున్నారు. దీర్ఘ కాలంగా ఉన్న ఈ డిపోను వేరొకచోటికి తరలిస్తే ప్రయాణికులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మైలవరానికి తరలింపు తిరువూరు, ఇబ్రహీంపట్నం డిపోలను విలీనం చేసి మైలవరంలో కొత్త డిపో ఏర్పాటు చేయడానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న తిరువూరు డిపో నుంచి అత్యధికంగా ఖమ్మం జిల్లాకు సర్వీసులు నడుస్తున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం ఈ సర్వీసులను కుదించాల్సి వస్తుంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న డిపో మరింత వెనుకబడకుండా మైలవరానికి తరలించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. తిరువూరు డిపోను నూజివీడు డిపోకు అనుసంధానంచేసి శాటిలైట్ డిపోగా నిర్వహించాలనే మరో ప్రతిపాదన కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పొదుపు చర్యల పేరుతో తిరువూరు డిపోను మూసివేయాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తున్నట్లు వస్తున్న వార్తలు ప్రయాణికులను సైతం కలవర పరుస్తున్నాయి. జిల్లాలో మారుమూల ఉన్న తమకు ఆర్టీసీ బస్సులే ఆధారమని, డిపో ఎత్తివేస్తే ప్రయివేటు వాహనాలపై ఆధారపడవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు తెలియదు తిరువూరు ఆర్టీసీ డిపో తరలింపు ప్రతిపాదనలు మాకు తెలియదు. ఇంతవరకు యాజమాన్యం నుంచి ఎటువంటి సమాచారమూ మాకు అందలేదు. - ప్రవీణ్కుమార్, తిరువూరు డిపో మేనేజర్ -
సేవలు నిల్
విభజన బిజీలో ప్రభుత్వ శాఖల అధికారులు నివేదికల తయారీలో నిమగ్నం వచ్చే నెల 2 వరకు ఇదే పరిస్థితి పనులు జరగక జనం అవస్థలు జిల్లాలో దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో సామాన్యులకు సేవలందడం కష్టమైపోతోంది. ఏ శాఖకు వెళ్లినా వచ్చే నెల 2 తర్వాతే పనులు జరుగుతాయంటూ జనాన్ని తిప్పి పంపేస్తున్నారు. విభజన కారణంగా రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వ శాఖలను వేరు చేస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ శాఖల అప్పులు, బకాయిల నివేదికల తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. అన్ని శాఖల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా బిల్లుల గోలే కనిపిస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులంతా రాష్ట్రస్థాయి అధికారులే. వీరిలో తెలంగాణ ప్రాంత అధికారులు ఇక్కడ ఉన్నారు. విభజన నేపథ్యంలో ఇప్పుడు ఏయే శాఖల అధికారులు ఏ ప్రాంతానికి చెంది న వారు?, వారి సర్వీసు వివరాలను ప్రభుత్వం సేకరించింది. దీని ఆధారంగా ఉద్యోగుల పంపకాలు చేపట్టడంతో ఇప్పుడు జిల్లాలోని మార్కెటింగ్, గనులశాఖ, వైద్య, విద్య, ఉన్నత విద్య, తూనికలు కొలతలు, రహదారులు భవనాలశాఖ, ఆర్డబ్ల్యూఎస్, గ్రామీణ నీటిసరఫరా, ఆడిటింగ్, వాణిజ్య పన్నులు, పౌరసరఫరాల శాఖ.. ఇలా అన్ని విభాగాల్లోనూ అధికారులు ఉద్యోగుల పంపకాలపైనే చర్చించుకుంటున్నా రు. జోనల్, రాష్ట్రస్థాయి అధికారులు తాము ఎక్కడికెళ్లాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. వాస్తవానికి వచ్చే నెల 2 నుంచి కొత్త రాష్ట్రం ఏర్పడుతుండడంతో ఈలోగా అన్ని శాఖల్లోనూ ఉద్యోగుల పంపకాలు, పాత బకాయిలు తదితర అంశాలన్నీ తేలిపోవాల్సి ఉంది. అన్ని విభాగాల్లో అధికారులు తమకు రావలసిన నిధులకు సంబంధించి పైస్థాయి అధికారులతో సంప్రదింపుల్లో తల మునకలై ఉన్నారు. దీంతో ఏ శాఖలోనూ పనులు ముందుకు కదలడంలేదు. వ్యవసాయ శాఖలో ఇప్పటికీ ఖరీఫ్ ప్రణాళికను సైతం తయారు చేయలేదు. దీంతో ఎన్నికల కోడ్ ముగిసినా ఏ పనులు ముందుకు కదలక ప్రజలు ఉసూరుమంటున్నారు. -
జిల్లాకు రెండు బోర్డర్ చెక్పోస్టులు
విజయవాడ సిటీ, న్యూస్లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో రవాణా శాఖ కొత్తగా బోర్డర్ చెక్పోస్టులు ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ఆ శాఖ ఇప్పటికే పంపిన ప్రతిపాదనలకు విభజన కమిటీ ఆమోదం తెలిపింది. జిల్లాకు సంబంధించి రెండు బోర్డర్ చెక్పోస్టులు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం గరికపాడు వద్ద ఉన్న ఇంటర్నల్ చెక్పోస్టును బోర్డర్ చెక్పోస్టుగా మార్చనున్నారు. నల్గొండ జిల్లాకు సరిహద్దుగా కోదాడకు వెళ్లే వాహనాల తనిఖీకి గరికపాడు వద్ద బోర్డర్ చెక్పోస్టును ప్రతిపాదించారు. తిరువూరు శివార్లలో ఖమ్మం జిల్లా సరిహద్దున మరో బోర్డర్ చెక్ పోస్టు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో ఈ రెండు చెక్పోస్టుల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి మన జిల్లాలోకి వచ్చే వాహనాలు ఈ రెండు చెక్పోస్టుల వద్ద ట్యాక్స్ చెల్లించి లోపలకు ప్రవేశించాల్సి ఉంటుందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్ర ప్రాంతంలో వాహనాల నంబర్లకు సంబంధించి ఎటువంటి కొత్త సిరీస్ ప్రారంభించేది లేదని జిల్లా డెప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ సీహెచ్ శివలింగయ్య ‘న్యూస్లైన్’కు చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో మాత్రమే కొత్త సిరీస్లో నంబర్లు ఉంటాయని ఆయన తెలిపారు. ఆంధ్రా ప్రాంతానికి సంబంధించి, మన జిల్లాకు కొత్తగా నంబర్ల సిరీస్ జారీచేసే ఉత్తర్వులు రాలేదని, అటువంటి ప్రతిపాదన కూడా లేదని వివరించారు. -
ముంచుకొస్తున్న గడువు...!
కొత్త పరిపాలనకు రోజులు దగ్గర పడ్డాయి. జూన్ 2న తెలంగాణ అపాయింటెడ్ డే అమలు అవుతుంది. అయితే ఈ నెల 26వ తేదీ నుంచే రెండు ప్రాంతాల్లో వేర్వేరు పరిపాలన సాగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగుల విభజన పూర్తయింది. పాలనాపరమైన అంశాలైన ఉద్యోగుల వేతనాలు, పదవీ విరమణ, ఇతర బిల్లుల చెల్లింపు తదితర అంశాలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఇన్నాళ్లూ ఎన్నికల విధుల్లో బిజీబిజీగా గడిపిన అధికారులు ఇప్పుడు విభజన హడావుడిలోనూ బిజీగా ఉన్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల్లోనూ పాలన స్తంభించింది. సాక్షి, కడప: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఖజానా లావాదేవీల హడావుడి మొదలైంది. జూన్ రెండున రాష్ట్రం వేరుపడనున్న నేపథ్యంలో ఓటాన్ బడ్జెట్తోనే మొదటి త్రైమాసిక ఖాతాలోకి నిధులు వచ్చేశాయి. బడ్జెట్తో సంబంధం లేకుండా వచ్చిన నిధులను ఆయా శాఖలు ఖర్చు చేసుకోవాలంటూ జీవో 86ను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఆగమేఘాలపై బిల్లులు వచ్చి పడుతున్నాయి. అయితే ఎన్నికల విధులతో బిజీబిజీ ఉన్న కొందరు అధికారులు బిల్లులు సమర్పించలేదు. ఈ నెల 24నే వేతనాలు చెల్లించేందుకు ప్రణాళికలు: జిల్లాలో ఖజానాశాఖ పరిధిలో 26వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా రూ. 80కోట్ల వేతనాలు ఇవ్వాలి. వీరితో పాటు పింఛనుదారులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో నెలాఖరున కొందరు పదవీవిరమణ చేయబోతున్నారు. వీరందరి...అన్ని రకాల ఖర్చులకు ఈ నెల 24వ తేదీ గడువు విధించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో మొదటి త్రైమాసికం బడ్జెట్తో సంబంధం లేకుండానే ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. మే నెల ఉద్యోగుల వేతనాల బిల్లును సమర్పించేందుకు ఈ నెల 15వ తేదీ ఆఖరి గడువుగా విధించారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో 19 వరకూ గడువు పెంచారు. రాష్ట్ర విభజన జూన్ 2న జరుగుతున్నందున జూన్ ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు సంబంధించిన బిల్లులను కూడా ఉద్యోగులు ఇప్పటికే చెల్లించినా...ఇంకా కొంతమంది చెల్లించలేదు.. అయితే గడువు విషయం ఇప్పటి వరకూ చాలామందికి తెలీదు. ఎన్నికల విధినిర్వహణలో బిజీబిజీగా ఉండి చాలామంది బిల్లులు కూడా సిద్ధం చేసుకోలేదు. జీతాలు మినహా బిల్లులు చెల్లించడానికి 2 రోజుల గడువు పొడిగించారు. విభజన హడావుడి: అపాయింటెడ్ డేను జూన్2వ తేదీగా ప్రభుత్వం ప్రకటించినా...ఈ నెల 26వ తేదీ నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేరుగా పరిపాలన సాగనుంది. దీంతో ఉద్యోగుల విభజన నుంచి అన్ని రకాల ప్రక్రియలు 25లోపే పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఉద్యోగుల జీపీఎఫ్, పండుగ అడ్వాన్సుల బిల్లులను, కంటింజెంట్ బిల్లులను ఇప్పటికే చెల్లించేశారు. ఈ నెలాఖరున పదవీవిరమణ చేసే వారు కూడా ఈ నెల 24లోపే బిల్లులు సమర్పించాలి. గ్రాట్యూటీ, పదవీవిరమణ లబ్ధి నెలాఖరునే సంబంధిత లబ్ధిదారులకు అందజేస్తారు. ఎన్నికల వ్యయానికి సంబంధించి బిల్లులను కూడా ఈ నెల 24వ తేదీలోగా సమర్పించాలి. ఓటాన్ బడ్జెట్లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రెండు నెలలకు సరిపడా నిధులను ఖజానాకు ప్రభుత్వం విడుదల చేసింది. స్త్రీ శిశుసంక్షేమ శాఖలోని అన్ని రకాల బిల్లులను ఒకే ఖాతా కింద చెల్లింపునకు ప్రత్యేక అనుమతి లభించింది. ఐసీడీఎస్ పరిధిలోని పథకాలు, ఇతర బిల్లులకు చెల్లింపు ఎక్కడా ఆపకుండా ఇవ్వమని ఆదేశాలు ఉన్నాయి. ప్రణాళికా బిల్లులను కూడా ఒకే పద్దు కిందకు తెచ్చి వాటి చెల్లింపునకు కూడా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. స్థానిక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, సార్వత్రిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఆయా ఎన్నికల బిల్లులను కూడా ఈ నెల 24లోగా తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంది. ఆ తర్వాత బిల్లులు వస్తాయో...రావో తెలీని పరిస్థితి ఉందని ఖజానా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గడువు పెంపుపై ఆదేశాలు రాలేదు - రంగప్ప, ట్రెజరీ డీడీ, కడప సోమవారం(19)తో బిల్లుల చెల్లింపునకు గడువు ముగిసింది. గడువు పెంపుపై ఇప్పటి వరకూ డెరైక్టర్ కార్యాలయం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ నెల 24నే వేతనాలు అందుతాయి. విభజన నేపథ్యంలో ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం. -
కత్తిమీద సాము
రాష్ట్ర విభజన కారణంగా తలెత్తే పరిణామాలు తీవ్రంగానే ఉండబోతున్నారుు. ఖర్చులు పెరగనున్నారుు. అందుకు తగ్గట్టుగా ఆదాయం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే జనమంతా కష్టాల్లో ఉన్నారు. వ్యవసాయం సహా ఉత్పత్తి రంగాలన్నీ నష్టాల ఊబిలో చిక్కుకున్నారుు. సంక్షేమ పథకాలు పడకేశారుు. పాలన గాడి తప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగారుు. కొత్త పాలకులొచ్చారు. త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దాల్సిన బాధ్యత వారి భుజస్కంధాలపైనే ఉంది. వాళ్లేంచేస్తారు. ఈ సవాళ్లను అధిగమించగలుగుతారా. చేతులెత్తేసి ప్రజలను కష్టాల ఊబిలోకి నెట్టేస్తారా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. సాక్షి, ఏలూరు : ఎన్నికల్లో గెలిచి కొత్తగా పదవులు చేపడుతున్న ప్రజాప్రతినిధులకు పాలన కత్తిమీద సాము కానుంది. ఎన్నో ఏళ్లుగా గ్రామ స్థాయినుంచి జిల్లాస్థాయి వరకూ పరిపాలన కుంటుపడింది. మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల అమలుతోపాటు ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాల్సిఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాబడిపై కూడా ప్రతికూలత ఏర్పడుతుంది. కేంద్రం ఇచ్చే రాయితీలు, నిధులు ఎప్పుడు అందుతాయనే దానిపై స్పష్టత లేదు. ఈ పరిస్థితుల్లో స్థానిక నిధులతోనే సౌకర్యాలు మెరుగుపర్చుకోవాలి. అవసరాలు తీర్చుకోవాలి. ఇదంతా కొత్త పాల కుల పనితీరుపైనే ఆధారపడి ఉంది. సర్పంచ్ నుంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్, కౌన్సిలర్, ఎమ్మెల్యే, ఎంపీ వరకూ ప్రతీ నాయకుడు ప్రజా సమస్యలను సవాళ్లుగా స్వీకరించక తప్పదు. ఆర్థిక వ్యవస్థ తిరోగమనం జిల్లాలో పాలన పడకేయడంతో ఆర్థిక వ్యవస్థ తిరోగమనం బాటపట్టింది. ప్రభుత్వ విభాగాల ఆదాయాలు గణనీయంగా తగ్గాయి. చాలావరకూ బిల్లులు పెండింగ్లో ఉండిపోయాయి. ఆర్టీసీ, గనులు, విద్యుత్, పురపాలక, ఎక్సైజ్, వ్యవసాయ శాఖలు భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 884 పంచాయతీల నుంచి రూ.100 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా.. కేవలం రూ.60 కోట్లకే పరి మితమైంది. ఏలూరు నగరం, ఎనిమిది మునిసిపాలిటీలు భారీగా ఆర్థిక లోటులో కూరుకుపోయూరుు. వీటికి రావాల్సిన రూ.60కోట్ల ఆదాయానికి గండిపడింది. జిల్లాలో దాదాపు 80 శాతం జనాభా సేద్యంపైనే ఆధారపడి బతుకుతున్నారు. రైతులు నాలుగేళ్లు నుంచి వరుసగా పంటల్ని నష్టపోతున్నారు. ఇప్పటివరకూ దాదాపు రూ.1,500 కోట్ల విలువైన పంటలు కోల్పోయారు. వ్యవసాయానికి రోజుకు 7గంటలు ఉచిత విద్యుత్ ఇప్పటికీ అందడం లేదు. భారం ఇంతింత కాదయూ... జిల్లాలో ద్విచక్ర వాహనాలు సుమారు 5లక్షల వరకు ఉన్నాయి. ట్రక్లు, ఆటోల సంఖ్య 12వేల 415. వీటికితోడు 20వేల కార్లు ఉన్నాయి. లారీలు, బస్సుల సంగతి సరేసరి వీటి అవసరాలకు రోజుకు 5లక్షల లీటర్ల వరకూ పెట్రోల్ వినియోగం అవుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి నెలా పెరుగుతూనే ఉన్నారుు. ఇది ప్రత్యక్షంగా వాహనదారులకు భారంగా పరిణమించగా.. రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు ఇదో కారణమైంది. బియ్యం, కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గతంతో పోలిస్తే బియ్యం ధర బస్తాకు దాదాపు రూ.200 పెరిగింది. జిల్లాలో 48 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో దాదాపు రూ.7.4 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సిలిండర్ ధర రూ.425కు పెరిగింది. బ్లాక్ మార్కెట్లో రూ.850 నుంచి రూ.1,050 వరకూ విక్రయిస్తున్నారు. పండగ వేళ రూ.1,200 నుంచి రూ.1,500 పెట్టనిదే గ్యాస్ దొరకదు. ధరల్ని తగ్గించడంతో పాటు బ్లాక్మార్కెట్ను నిరోధించాల్సింది. జిల్లాలో 11, 81,672 మంది విద్యుత్ వినియోగదారులపై ఏటా చార్టీల భారం పెరుగుతోంది. భరోసా ఇవ్వగలరా! జిల్లా ప్రజలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా 100 రోజులకుపైగా ఉద్యమం చేశారు. పిల్లల చదువులకు, ఉద్యోగాలకు దారేదని కన్నీరు పెట్టుకున్నారు. వారికి భరోసా ఇచ్చేలా కొత్త రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి కల్పన ఉండాలి. జిల్లాలోని పేదలకు గూడు లేదు. ఇళ్లు పొందిన కొందరికి వాటిపై హక్కులేదు. ఇళ్లకు పక్కా డాక్యుమెంట్లు ఇవ్వడంతోపాటు వాటిపై పావలా వడ్డీకే రుణాలు కూడా ఇవ్వాలని పేదలు కోరుతున్నారు. పేదలు కార్పొరేట్ ఆస్పత్రుల మెట్టు ఎక్కేలా చేసిన ఆరోగ్యశ్రీ పథకం అమలు జరుగుతుందా లేదా అనే భయం ప్రజల్లో ఏర్పడింది. వారికి ధైర్యాన్నివ్వాలి. అన్నిటికంటే ముఖ్యంగా అవినీతి లేని పారదర్శక పాలనను ప్రజలు కోరుకుంటున్నారు. కొత్త పాలకులు వీటిపై దృష్టిసారించి ప్రాధాన్యతా రంగాలను గాడిన పెడితే తప్ప ప్రజలు కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. -
ఓ పనైపోయింది..బాబు
కలెక్టరేట్,న్యూస్లైన్ : గత రెండు నెలలుగా తీరికలేకుండా ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులకు కాస్త ఊరట లభించింది. గతంలో ఎన్నడు లేని విధంగా వరుసగా మున్సిపల్, స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఒకేసారి ప్రాణం మీదికొచ్చినట్లయింది. అసలే రాష్ట్ర విభజన నేఫథ్యంలో రెగ్యులర్ విధులతో సమయం పెరిగిన ఉద్యోగులకు, ఎన్నికల విధులు మరింత సమయాన్ని వెచ్చించాల్సి వచ్చింది. ఎన్నికల నేపథ్యంలో దాదాపు మున్సిపాల్ ఎన్నికల్లో 16 వేల మంది ఉద్యోగులు,స్థానిక సంస్థల ఎన్నికల్లో 30 వేల మంది,సార్వత్రిక ఎన్నికల్లో 20 వేల మంది ఉద్యోగులు ఉదయం నుంచి అర్ధరాత్రి పొద్దుపోయే వరకు పనిచేశారు. దీంతో చాలా మంది ఉద్యోగులు అనారోగ్యం పాలయ్యారు. అయినా కొందరు విధులు నిర్వర్తించారు. మరికొంత మంది ప్రాణం మీదకు తెచ్చుకున్నారు. ఎన్నికల నిర్వహణలో ఇరిగేషన్ ఈఈ ప్రశాంత్ రెడ్డి, బోధన్ తహశీల్ధార్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ సాల్మన్రాజ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఏజేసీకి ఆనారోగ్యం అదే విధంగా అదనపు జేసీ శేషాద్రి ఎన్నికల విధుల్లో నిమగ్నమై పని ఒత్తిడిలో భా గంగా ఆయన అనారోగ్యపాలైన విషయం తెలిసిందే. మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ఉపయోగం,స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను వినియోగించడంతో ఉద్యోగులకు ఒక్కసారి పనిభారం పెరిగినట్లయింది.బ్యాలెట్ బాక్సులు తరలించడం,ఓటర్ల జాబితా,వాటిని పోలింగ్ కేంద్రాల వారీగా తయారు చేయటం,ఓటరు స్లిప్పులు పంచడం,శిక్షణ,సిబ్బంది నియామకం,పోలింగ్ కేంద్రాల ఏర్పాటు,వాటికి అవసరమైన సామాగ్రి,కేంద్రంలో మౌలిక వసతులు, ఈవీఎంలను తరలించడం, బ్యాలెట్ బాక్సులకోసం స్ట్రాంగ్ రూం ఏర్పాటు, వాటి భద్రతా ఏర్పాట్లు, కౌటింగ్ కేంద్రాల నిర్వహణ, పోలింగ్ లెక్కించడం తదితర పనులలో రెండు నెలలుగా నిమగ్నమయ్యారు. సార్వత్రిక సమరం శుక్రవారం ముగియడంతో ఉద్యోగులు ఇప్పడు ఇప్పుడ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.శుక్రవారం అర్ధరాత్రి వరకు పనిచేసిన ఉద్యోగులు శనివారం ఉదయం కార్యాలయాలకు కాస్త ఆలస్యంగా వచ్చారు.అందరి ముఖాల్లో ఓ పనైపోయిందిరా బాబు అన్నట్లు ఉద్యోగులు ఒకరితో ఒకరు చర్చించుకున్న దృశ్యాలు చాలా శాఖల్లో కనపడ్డాయి. -
‘హస్త’విధీ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంపై కాంగ్రెస్ నేతలు అంతర్గత సమీక్షలు జరుపుతున్నారు. జిల్లాలో పార్టీ దారుణంగా దెబ్బతినడానికి కారణాలను విశ్లేషించే పనిలో పడ్డారు. మునుపెన్నడూ లేని విధంగా అనూహ్య రీతిలో ఎందుకు నష్టపోయామా అనేది వారికి ఒక పట్టాన అంతుచిక్కడం లేదు. తెలంగాణ సెంటిమెంట్ గాలి వీచినా కొత్త రాష్ట్రం ఇచ్చిన సానుభూతి తమకెందుకు దక్కలేదనేది సీనియర్ల మెదళ్లను తొలుస్తోంది. పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఘోర పరాభవం ఎదురవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది తామేనని విస్తృత ప్రచారం చేసినా ఓటర్లు విశ్వసించకుండా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడానికి గల కారణాలపై సీనియర్ నేతలు మేధోమధనం చేస్తున్నారు. జిల్లాలో కనీసం ఐదారు సీట్లన్నా గెలుస్తామని పార్టీ భావిస్తూ వచ్చింది. రాజధాని చుట్టూ విస్తరించిన జిల్లాలో తెలంగాణ సెంటిమెంట్ అంతగా ప్రభావం చూపబోదని, ఒకవేళ సెంటిమెంట్ పనిచేసినా తెలంగాణ ఇచ్చింది తామేనని ప్రచారం చేయడం తమకు అనుకూలిస్తుందని హస్తం నేతలు ఆశించారు. కానీ వారి అంచనాలు తారుమార య్యాయి. తెలంగాణ ఛాంపియన్గా టీఎర్ఎస్ పార్టీనే గుర్తించిన ఓటర్లు కాంగ్రెస్ కోలుకోలేని షాక్ ఇచ్చారు. 14 స్థానాల్లో రెండంటే రెండే చోట్ల ఆ పార్టీని గెలిపించారు. ఆ రెండు స్థానాల్లోనూ బొటాబొటీ మెజార్టీతో బయటపడడం గమనార్హం. కచ్చితంగా గెలుస్తామని భావించిన సిట్టింగ్లు, తెలంగాణ సెంటిమెంట్ ఏ మాత్రం లేదని అంచనా వేసిన నగర శివారు స్థానాల్లో సైతం హస్త రేఖలు చెదిరిపోయాయి. ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఎంతగా వీచినా.. పార్టీ నిర్మాణం బలంగా ఉన్న మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్, శేరిలింగంపల్లి, వికారాబాద్ స్థానాల్లోనైనా బయటపడతామనే పార్టీ నేతల అంచనాలు తారుమారయ్యాయి. అభ్యర్థులు తమ ఓటమికి టీపీసీసీ అధ్యక్షుడినే దోషిగా చూపిస్తున్నారు. సోనియాగాంధీని ఒప్పించి తెలంగాణ తెచ్చామన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతే ముంచింది.. తమ ఓటమికి ప్రభుత్వ వ్యతిరేకతే ప్రధాన కారణమని కొందరు నేతలు అంగీకరిస్తున్నారు. తెలంగాణ ఇచ్చామన్న సానుభూతిని ప్రభుత్వ వ్యతిరేకత అధిగమించినందునే తమను ఓటర్లు ఆదరించలేదని చెబుతున్నారు. తెలంగాణలోని ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడ సెంటిమెంట్ అంతగా లేదనేది విశ్లేషకుల భావన. రాష్ట్ర విభజన అంశంలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంబించిన టీడీపీ అధిక స్థానాలు కైవసం చేసుకోవడం ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. మరోవైపు టీఆర్ఎస్కు క్షేత్ర స్థాయిలో బలమైన క్యాడర్ కూడా లేదు. కొన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ప్రాథమిక నిర్మాణం కూడా లేకపోయినా అనూహ్య ఫలితాలు సాధించింది. పదేళ్లుగా తీవ్ర స్థాయిలో గూడుకట్టుకున్న ప్రభుత్వ వ్యతిరేకత టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలకు లాభించిందని పార్టీ నేతలు అంటున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ క్యాడరే తమ స్టార్ క్యాంపెయినర్లని, తమకు మరే ఇతర ప్రచారకులు అవసరం లేదని గొప్పలు పోయిన అభ్యర్థులు స్థానికంగా పెల్లుబికిన వ్యతిరేకతను గుర్తించలేకపోయారు. తెలంగాణ ఇచ్చామన్న సానుకూలతతో ఎలాగైనా గెలుస్తామని అతిగా భావించడం వల్లే ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయంటున్నారు. -
సీమాంధ్ర ఉద్యోగుల రెండో సమ్మె కాలం క్రమబద్ధీకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఉద్యోగులు ఈ ఏడాది ఫిబ్రవరిలో 14 రోజుల పాటు చేసిన సమ్మె కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యోగులు ఈ ఏడాది ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు రెండోసారి సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. ఉద్యోగులు ఆర్జిత సెలవును సమ్మె కాలానికి సర్దుబాటు చేయనున్నారు. ఆర్జిత సెలవు లేని ఉద్యోగులకు భవిష్యత్లో సంపాదించనున్న ఆర్జిత సెలవును సర్దుబాటు చేసుకోవడానికి వీలు కల్పించారు. వచ్చే ఏడాది పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు ఆర్జిత సెలవులు లేని పక్షంలో ఇతర సెలవును సర్దుబాటు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బోధనేతర సిబ్బంది సమ్మెకాలం కూడా: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బోధనేతర సిబ్బంది చేసిన సమ్మె కాలాన్ని కూడా ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. బోధనేతర సిబ్బంది 2013 ఆగస్టు 13 నుంచి అక్టోబర్ 17 వరకు.. 66 రోజులు సమ్మె చేశారు. బోధన సిబ్బంది 2013 ఆగస్టు 22 నుంచి అక్టోబర్ 10 వరకు 49 రోజుల పాటు సమ్మెలో ఉన్నారు. బోధనేతర సిబ్బంది 17 రోజులు ఎక్కువ సమ్మెలో ఉన్నారు. ఆ కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
భవనాలు కేటాయిస్తూ జీవోలు జారీ
* కొద్దిసేపటికే నిలిపివేసిన సీఎస్ మహంతి * ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నిర్ణయం! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సచివాలయంతో పాటు రాజధానిలోని పలు ప్రభుత్వ కార్యాలయాల భవనాలను కొత్తగా ఏర్పడనున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం 18 జీవోలను జారీ చేసింది. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఆ ఉత్తర్వులను నిలుపుదల చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో అధికారులు ఆ జీవోలను చూసేందుకు వీల్లేకుండా గోప్యం గా ఉంచారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాల వెల్లడి నేపథ్యంలోనే జీవోలను నిలుపుదల చేయాల్సిందిగా సీఎస్ ఆదేశించినట్లు అధికార వర్గాల సమాచారం. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుండటం, ఇక్కడ కూడా రెండు కొత్త ప్రభుత్వాలు ఏర్పాటవుతున్నందున సీఎస్ ఆ విధంగా నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. సచివాలయంలోని ఏ,బీ,సీ,డీ బ్లాకులను గతంలో పేర్కొన్న విధంగానే తెలంగాణ ప్రభుత్వానికి, సౌత్ హెచ్, నార్త్ హెచ్, జె, కె, ఎల్ బ్లాకులను సీమాంధ్ర ప్రభుత్వానికి కేటాయించడంతో పాటు ఏ అంతస్తులను ఏ శాఖలకు కేటాయించిందీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అలాగే రాజధానిలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సగం అంతస్తులను తెలంగాణ ప్రభుత్వానికి, మిగతా సగం అంతస్తులను సీమాంధ్ర ప్రభుత్వానికి కేటాయించారు. -
రెండు రాష్ట్రాల మధ్య 9 అంతర్రాష్ర్ట చెక్పోస్టులు
పన్ను వసూలు చేయాలా వద్దా అనేది ఇద్దరు సీఎంల నిర్ణయానికే.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో తొమ్మిది సమీకృత అంతర్రాష్ట్ర చెక్పోస్టుల ఏర్పాటునకు అధికారులు ప్రతిపాదించారు. జూన్ 2వ తేదీ నుంచి రెండు రాష్ట్రాలుగా విడిపోతున్నందున ఆ రోజు నుంచి ఈ తొమ్మిది అంతర్రాష్ట్ర చెక్పోస్టులలో రవాణా, వ్యాట్, ఎక్సైజ్ శాఖల పన్నులను వసూలు చేయనున్నారు. అయితే వెంటనే పన్నులు వసూలు చేయాలా లేక ఆరు నెలలు లేదా ఏడాదిపాటు ఇరు రాష్ట్రాలు పన్నులు వసూలు చేయకుండా ఉండాలా అనే దానిపై ఇప్పుడు నిర్ణయం ఎవరు తీసుకోవాలనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. గవర్నర్ నర్సింహన్ నిర్ణయం తీసుకోని పక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయానికి వదిలేయాలని అధికారులు భావిస్తున్నారు. లేదంటే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని, కేంద్ర నిర్ణయం మేరకు నడుచుకోవాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. జూన్ 20 వరకు వచ్చే వ్యాట్ ఆదాయం ఇరు రాష్ట్రాలకు పంపిణీ ప్రస్తుత మే నెలకు సంబంధించి వ్యాట్ ఆదాయం జూన్ 20వ తేదీ వరకు వ్యాపారస్తులు చెల్లించనున్నారు. జూన్ 2వ తేదీ రాష్ట్రం రెండుగా విడిపోతున్నందున ఉమ్మడి రాష్ట్రంలో మే నెలలో వచ్చిన వ్యాట్ ఆదాయాన్ని రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ బాధ్యతలను అకౌంటెంట్ జనరల్కు అప్పగించాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. జూన్ 20వ తేదీ వరకు వచ్చిన ఉమ్మడి రాష్ట్రం వ్యాట్ ఆదాయాన్ని జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణకు 42 శాతం, సీమాంధ్రకు 52 శాతం అకౌంటెంట్ జనరల్ పంపిణీ చేయనున్నారు. -
మార్గదర్శకాలు ఇస్తేనే ప్రాధాన్యాలు చెప్తాం
ఐఏఎస్ల సంఘం తీర్మానం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐఏఎస్ల పంపిణీకి మార్గదర్శకాలు ఇవ్వకుండా ఏ రాష్ట్రానికి వెళతారని ప్రాధాన్యతలు అడగటం సమంజసం కాదని రాష్ట్ర ఐఏఎస్ల సంఘం అభిప్రాయపడింది. ఈ మేరకు గురువారం ఇక్కడ జరిగిన ఐఏఎస్ల సంఘం సమావేశం తీర్మానించింది. ఇదే విషయాన్ని శుక్రవారం గవర్నర్ నరసింహన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతిని కలిసి సంఘం ప్రతినిధులు స్పష్టం చేయనున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి గురువారం సచివాలయంలో విభజనపై అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఎక్కువ సమయం ఐఏఎస్ అధికారుల పంపిణీపైనే ఆయన మాట్లాడారు. ఆప్షన్స్ చెప్పిన తరువాత రోస్టర్ విధానంలో లాటరీ పద్ధతిలో ఐఏఎస్ అధికారుల పంపిణీ జరుగుతుందని వివరించారు. అయితే మెజారిటీ ఐఏఎస్లు ఏ ప్రాంతం వారిని ఆ ప్రాంతానికి కేటాయించకుండా ఆప్షన్స్లో రోస్టర్ విధానం అవలంబించటాన్ని వ్యతిరేకించారు. -
అటా...ఇటా...?
భద్రాచలం, న్యూస్లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో....పోలవరం ముంపు ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎటువైపు అనే విషయమై ఇంకా స్పష్టత లేకున్నప్పటికీ ఉద్యోగుల పంపకాల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో ముంపు పరిధిలోకి వచ్చే 211 గ్రామాల పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలు సిద్ధమవుతున్నాయి. వీరికి సంబంధించిన మొత్తం నివేదికలను అందజేయాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అదేశించడంతోఆయా శాఖల అధికారులు నివేదికల తయారీలో నిమగ్నమయ్యారు. ముంపు పరిధిలోకి వచ్చే గ్రామాలను జూన్ 2 తరువాత జిల్లా నుంచి వేరుచేసి అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేస్తారు. అప్పటి నుంచి అయా గ్రామాల్లో పాలన, ఇతర వ్యవహారాలు, ప్రభుత్వ పరంగా అందే సేవలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అందుతాయి. విలీనం తరువాత ఆయాగ్రామాలను కలిపే మండలాల నుంచే పరిపాలన మొత్తం సాగుతుంది. కానీ ముంపు ప్రాంతాలలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రజానీకంతో పాటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్తారా..? లేకుంటే తెలంగాణ రాష్ట్రంలోకి వస్తారా..? అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఉద్యోగ సంఘాలకు కూడా ఈ విషయమై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవటంతో క్షేత్ర స్థాయిలో పనిచేసే ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగుల పంపకాలపై మార్గదర్శకాలు ప్రభుత్వం నుంచి వస్తేనే కానీ దీనిపై స్పష్టత వచ్చే పరిస్థితి లేదని ఐటీడీఏలోని ఓ ఉన్నతాధికారి ‘న్యూస్లైన్’కు తెలిపారు. ఇదిలా ఉండగా ఉద్యోగుల పంపకాలపై మార్గదర్శకాలు ఎలా ఉన్నప్పటికీ ముంపు పరిధిలో ఎంత మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు... అక్కడి ప్రభుత్వ ఆస్తులేంటి అనే దానిపై ఆయా శాఖల ఆధ్వర్యంలో సమగ్ర నివేదికలు సిద్ధమవుతున్నాయి. వైద్యశాఖ నుంచి 520 పోస్టులు ఆంధ్రలోకి.... ముంపు పరిధిలోకి వచ్చే 211 గ్రామాల్లో వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలో ఉన్న ఆస్పత్రుల్లో, క్షేత్ర స్థాయిలో పనిచేసే అన్ని కేడర్లు కలుపుకొని మొత్తం 520 పోస్టులు అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్లనున్నాయి. అంటే ఈ పోస్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా అదే ప్రాంతంలో పనిచేయాల్సి ఉంటుంది. గౌరిదేవిపేట, కూటూరు, రేఖపల్లి, జీడిగుప్ప, కుక్కునూరు, అమరవరం, వేలేరుపాడు, కొయిదా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు..., అదే విధంగా చింతూరు, కూనవరం, బూర్గంపాడు క మ్యూనిటీ న్యూట్రిషన్ సెంటర్లు..., చింతూరు, కూనవరం, బూర్గంపాడు సివిల్ ఆస్పత్రులను జిల్లా నుంచి వేరు చేసి అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపనున్నారు. 23 మంది వైద్యులు, 45 మంది ఏఎన్ఎమ్లు, 204 మంది ఆశకార్యకర్తలు ఇలా అన్ని కేడర్లలో గల ఉద్యోగులు 520 మంది జూన్ 2 తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పనిచేయాల్సి ఉంటుంది. విద్యాశాఖ నుంచి 714 మంది ఉద్యోగులు... ముంపు ప్రాంతాల్లో వివిధ యాజమాన్యాల కింద(గిరిజన సంక్షేమం, జిల్లా మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలలు) ఉన్న పాఠశాలల్లో అటెండర్ నుంచి హెచ్ఎం, ఎంఈవోలతో సహా మొత్తం 714 మంది ఉద్యోగులు వేరు కానున్నారు. వీరిలో మండల, జిల్లా పరిషత్ నుంచి 185 పాఠశాలలకు చెందిన 489 మంది, గిరిజన సంక్షేమశాఖ పరిధిలో ఉన్న 51 విద్యా సంస్థల నుంచి 225 మంది ఉన్నారు. ఇలా ముంపు పరిధిలో ఉన్న దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వేరు చేయబోయే ఉద్యోగుల జాబితా సిద్ధమవుతోంది. ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనను నివృత్తి చేయకుండానే ముంపు ప్రాంతాల్లో పనిచేస్తున్న తమను వేరు చేస్తున్నట్లుగా నివేదికలను తయారు చేయటం పట్ల ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలకు సిద్ధం.... ముంపు పరిధిలో పనిచేసే అన్ని కేడర్ల ఉద్యోగులకు ఆప్షన్ సౌకర్యం కల్పించి వారు ఇష్టమొచ్చిన రాష్ట్రంలో పనిచేసేలా అవకాశం ఇవ్వాలని ఈ ప్రాంత ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై జిల్లా కలెక్టర్కు వివిధ సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రాలను అందజేశారు. ముంపు పరిధిలో పనిచేసే వారంతా దాదాపు గిరిజన ఉద్యోగులే అయినందున వారికి ఆప్షన్లు ఇచ్చి తీరాలని, లేకుంటే న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని గిరిజన ఉద్యోగులు ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. -
కొత్త రాష్ర్టంలో విద్యుత్ లోటు
శ్రీరాంపూర్, న్యూస్లైన్ : జూన్ 2న అవతరిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి సింగరే ణి జీవగర్ర కానుంది. కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తరువాత తెలంగాణ ఎదుర్కొనే మొదటి సమస్య విద్యుత్. తెలంగాణలోని విద్యుత్ సంస్థల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ రాష్ర్ట అవ సరాలకు సరిపోవడం లేదు. 4 వేల మెగావాట్ల విద్యుత్ లోటు ఏర్పడుతుందని రాష్ట్ర విభజన సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ లోటు తీర్చాల్సిన బాధ్యత సింగరేణిపై పడింది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పెంచడానికి ముడిసరుకైన బొగ్గు ఉత్పత్తి పెంచాలని సింగరేణిపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం సూచనప్రాయంగా సింగరేణికి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఏర్పడ్డ తరువాత ఏర్పడే 4 వేల మెగావాట్ల లోటు తీరాలంటే సింగరేణి అదనంగా ఏడాదికి సుమారు మరో 18 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ బొగ్గు కొత్త విద్యుత్ సంస్థలతోపాటు, కెపాసిటీ పెంచే పాత సంస్థలకు అవసరం పడుతుంది. ఇదిలాఉంటే గడిచిన 2013-14 ఆర్థిక సంవత్సరంలో సంస్థ 54.3 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్ధేశించుకున్న అందులో కేవలం 50.4 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేసింది. ఏటా వార్షిక బొగ్గు ఉత్పత్తిలో 60 శాతం బొగ్గు విద్యుత్ సంస్థలకే సరఫరా చేయడం జరుగుతున్నది. కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన సింగరేణిలో 35 భూగర్భ గనులు, 15 ఓసీపీలు ఉన్నాయి. 65 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. సాలీనా 50 మిలియన్ టన్నుల పైబడి బొగ్గు ఉత్పత్తి అవుతున్నది. 2012-13లో 53.4 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది. తరువాత సంవత్సరం తగ్గింది. కారణం గనులు పాతపడటంతో బొగ్గు నిక్షేపాలు లోతుల్లోకి వెళ్లి ఉత్పత్తికి ప్రతికూలంగా మారుతున్నాయి. అంతేకాకుండా కొత్త భూగర్భ, ఓసీపీలకు అనుమతుల్లో జాప్యం జరుగడం వల్ల బొగ్గు ప్రాజెక్టులు మొదలు కాక ఉత్పత్తి క్రమేపి తగ్గుతూ వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం 55 మిలియన్ టన్నుల లక్ష్యం ఉంది. కొత్త రాష్ట్రంలో 18 మిలియన్ టన్నుల బొగ్గును అధనంగా సరఫరా చేయడం తప్పని సరైంది. ఇంత భారీ మొత్తం ఉత్పత్తి చేయాలంటే కొత్త గనులు తవ్వాల్సిందే. దీని కోసం యాజమాన్యం ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. విద్యుత్ సమస్య వాకిట్లో ఉన్న దృష్ట్యా త్వరితగతిన బొగ్గు ఉత్పత్తి పెంచాలంటే ఓసీపీలకే ప్రాధాన్యత ఇవాల్సి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. కనీసం 6 నుంచి 8 కొత్త ఓసీపీలు ఏర్పాటు చేయడానికి రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే ప్రతిపాదనలో ఉన్న ఓసీపీలు.. తాడిచెర్ల, భూపాలపల్లి ఓసీపీ-2, శ్రావణ్పల్లి, మహేదేవ్పూర్, ఆర్జీ ఓసీపీ 3 ఫేజ్ 2, జీవీఆర్ ఓసీపీ 2 వంటి పలు ప్రాజెక్టులను వేగవంతం చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. మరి కొన్ని భూగర్భ గనులు ఇదిలా ఉంటే దీనితోపాటు మరి కొన్ని భూగర్భ గనులు కూడా అవసరం ఉంది. శాంతిఖని, మందమర్రి షాఫ్ట్బ్లాక్, ఆర్కేపీ షాఫ్ట్బ్లాక్, కేకే 5 విస్తరణ, కాసిపేట 2 ఇంక్లైన్, గుండాల వంటి గనులు వేగవంతంగా తవ్వాలని భావిస్తున్నారు. కొత్తగా మొదలైన అడ్రియాల ప్రాజెక్టు నుంచి కూడా బొగ్గు ఉత్పత్తిని ఘననీయంగా పెంచుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడింది. భవిష్యత్లో సింగరేణి మరిన్ని ప్లాంట్లు కొత్త రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు విద్యుత్ సమస్యలు తీరాలంటే సింగరేణి కూడా రాబోయే రోజుల్లో మరికొన్ని పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీనికి కొత్త ప్రభుత్వం నుంచి బడ్జెట్ సపోర్టు తప్పని సరి అని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. సింగరేణి సొంతంగా జైపూర్లో 1,200 మెగావాట్ల విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నది. ఇకపై దీని సామర్థ్యం పెంచుకోవాల్సి ఉందని యాజమాన్యం భావిస్తుంది. అదే విధంగా రామగుండం బీ పవర్హౌజ్నుంచి 60 మెగావాట్ల విద్యుత్ వస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతానికి ఉన్న ప్రాజెక్టులకు కెపాసిటి పెంచుతూ అదనపు యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని విద్యుత్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. వీటితోపాటు ప్రభుత్వానికి చెందిన రామగుండం ఎన్టీపీసీ, భూపాలపల్లి, పాల్వంచ ఇంకా ఇతర జెన్కో పరిధిలోని ప్లాంట్లను విస్తరించుకోవాల్సిన అవసరం ఉందని విద్యుత్ రంగ నిపుణులు భావిస్తున్నారు. విద్యుత్ అవసరాల కోసం కొత్త ప్రాజెక్టులు తప్పని సరి తెలంగాణలో 4 వేల మెగావాట్ల లోటు ఉంది. ఈ లోటు తీరాలంటే ఉన్న విద్యుత్ కంపెనీలకు, కొత్త వాటికి డిమాండ్కు తగ్గట్లు బొగ్గు ఉత్పత్తిని పెంచాలి. ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తి కంటే మరో 18 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అధనంగా చేయాలి. దీనికి 6 నుంచి 8 ఓసీపీలు త్వరితగతిన మొదలు పెట్టాలి. మరికొన్ని భూగర్భ గనులు తవ్వాల్సి ఉంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టితేనే డిమాండ్కు తగ్గ బొగ్గు ఉత్పత్తి చేయగలుగుతాము. -
రాష్ట్ర విభజన నేపథ్యం గందరగోళం
భద్రాచలం, న్యూస్లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో.... జూన్ 2 తరువాత భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని 211 గ్రామాలను జిల్లా నుంచి వేరు చేసి అవశేష ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. కానీ ముంపు మండలాల్లో సరిహద్దుల ఏర్పాటు విషయంలో తలెత్తే సమస్యలపై అధికారుల నుంచి సరైన స్పష్టత లేకపోవటం తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. ముంపు గ్రామాలను జిల్లా నుంచి వేరుచేయటమే తమ పని అన్నట్లుగా అధికారులు నివేదికల తయారీలో నిమగ్నమయ్యారు. అయితే ముంపు ప్రాంత ప్రజానీకం, ఉద్యోగుల్లో తలెత్తే అనుమానాలను నివృత్తి చేసేవారు లేకపోవటంతో అంతటా అయోమయం నెలకొంది. కొత్త చిక్కులు.... ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేసే క్రమంలో కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. ముంపు పరిధిలో ఉన్న గ్రామాలనే పరిగణలోకి తీసుకొని అధికారులు విభజన నివేదికలు తయారు చేస్తున్నారు. ఈ కారణంగా మధ్యలో మిగిలిపోతున్న గ్రామాలు తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వస్తున్నాయి. అంటే చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామాలు ఉంటే మధ్యలో మాత్రం తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలు ఉంటాయి. ముంపు పరిధిలోకి వచ్చే ఏడు మండలాల్లో వీఆర్పురం, కూనవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్లిపోతున్నట్లుగానే అందరూ భావించారు. కానీ వాస్తవంగా ఈ మండలాల్లో కూడా కొన్ని గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటాయి. కూనవరం మండలాన్నే పరిశీలిస్తే... వాస్తవంగా ఇక్కడ 56 రెవెన్యూ గ్రామాలు ఉండగా, ఇందులో 39 గ్రామాలు ముంపు పరిధిలోకి వస్తున్నాయి. ఈ మండలంలో 26,597 మంది జనాభా ఉంటే, ఇందులో 22,795 మందిని ఇక్కడ నుంచి వేరుచేస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ ప్రకటించిన జాబితాలో పేర్కొన్నారు. అంటే మరో 3,802 మంది తెలంగాణ రాష్ట్రంలోనే ఉండిపోతారు. ఇలా మిగిలిపోయిన జనాభా ఉన్న గ్రామాల చుట్టూ ఆంధ్ర ప్రదేశ్రాష్ట్రంలోకి వెళ్లే గ్రామాలు ఉంటాయి. వీరంతా గ్రామం నుంచి భద్రాచలం, జిల్లా కేంద్రమైన ఖమ్మం ప్రాంతాలకు రావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామాల మీదుగా ప్రయాణించాల్సిందే. ముంపు పరిధిలో గల దాదాపు ఏడు మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. గుట్ట దిగితే ఆంధ్ర...ఎక్కితే తెలంగాణ..! ముంపు మండలాల్లో ఉన్న కొండరెడ్డి గ్రామాల పరిస్థితి మరింత గందరగోళంగా ఉంది. కూనవరం, వీఆర్పురం, వేలేరుపాడు మండలాల్లో గుట్టలపై ఉన్న కొండరెడ్డి గ్రామాలు ముంపు పరిధిలో రాకపోవటంతో ఈ గ్రామాలు తెలంగాణలోనే ఉంటాయి. ఇలా కూనవరం మండలంలో 10 గ్రామాలు, వేలేరుపాడులో ఒకటి, వీఆర్పురం మండ లంలో ఒక గ్రామం ఉంది. వీరు నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలన్నా గుట్టలు దిగి రావాల్సిందే. ఉదాహరణకు కూనవరం మండలంలో గుట్టలపై ఉన్న గ్రామాల వారు కూటూరు వద్ద గుట్ట దిగుతారు. కానీ ప్రస్తుతం కూటూరు ముంపులో ఉన్నందున ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం అవుతుంది.దీంతో తెలంగాణలో ఉన్న గుట్టలపై నుంచి కింద ఉన్న ఆంధ్రప్రదే శ్ రాష్ట్రంలోని గ్రామాలకు రావాల్సిందే. ఈ కారణంగా అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. శరవేగంగా విభజన ఏర్పాట్లు జూన్ 2 తరువాత ముంపు గ్రామాలకు అన్ని రకాల సేవలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే అందుతాయని ఉన్నతాధికారులు నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ముంపు గ్రామాల్లోని ప్రభుత్వ ఆస్తులు, స్థిర, చరాస్తులను ఆయా శాఖల ఆధ్వర్యంలో లెక్క గట్టి నివేదికలు సిద్ధం చేస్తున్నారు. అదే విధంగా ముంపు పరిధిలోకి ఎంత మంది సిబ్బంది వస్తున్నారనే దానిపై కూడా నివేదికలు రెడీ అవుతున్నాయి. మొత్తంగా... ప్రజానీకంలో నెలకొన్న అయోమయంపై సరైన స్పష్టత ఇవ్వకుండానే ముంపు గ్రామాలను విలీనం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తుండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. -
విభజన లెక్క తేలింది..!
భద్రాచలం, న్యూస్లైన్ : రాష్ట్ర విభజనకు ఏర్పాట్లు శరవేగంగా జరిగిపోతున్నాయి. అందులో భాగంగా జూన్ 2 తరువాత జిల్లా నుంచి 211 గ్రామాలు(హేబిటేషన్లు) వేరుకానున్నాయి. సీమాంధ్రలో విలీనం అయ్యే ఈ గ్రామాల జాబితాను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. దీంతో ఇప్పటి వరకూ తెలంగాణలో అంతర్భాగంగా ఉన్న జిల్లాలోని 7 మండలాల్లో గల 211 హేబిటేషన్లకు చెందిన ప్రజానీకానికి మరో 22 రోజుల తరువాత ఈ ప్రాంతంతో అనుబంధాలు తెగిపోనున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దులను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఊహించని రీతిలో జరిగిన ఈ పరిణామాలతో పోలవరం ముంపు ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంతో, ఇక్కడి వారితో అనుబంధం పెంచుకున్న వీరంతా ఒక్కసారిగా వేరే జిల్లా, అందులోనూ వేరే రాష్ట్రంలోకి వెళ్లిపోతున్నామనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లా నుంచి వేరు కానున్న 1,16,796 మంది భద్రాచలం, పాల్వంచ డివిజన్లలో 136 రెవెన్యూ గ్రామాలకు(211హేబిటేషన్లు)కు చెందిన మొత్తం 1,16,796 మందిని జిల్లా నుంచి వేరుచే సేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. భద్రాచలం డివిజన్లోని భద్రాచలం మండలంలో 10 రెవెన్యూ గ్రామాల పరిధిలో గల 13 హేబిటేషన్లకు చెందిన 6637 మంది, కూనవరంలోని 39 రెవెన్యూ గ్రామాల పరిధిలో గల 22,795 మందిని జిల్లా నుంచి వేరు చేసి తూర్పు గోదావరి జిల్లాలో కలపనున్నారు. అదే విధంగా చింతూరు మండలంలోని 14 రెవెన్యూ గ్రామాల పరిధిలో గల 17 హేబిటేషన్లకు చెందిన 14,085 మంది, వీఆర్పురం మండలంలోని 35 రెవెన్యూగ్రామాల పరిధిలోని 45 హేబిటేషన్లకు చెందిన 19,983 మందిని వేరు చే యనున్నారు. భద్రాచలం డివిజన్లో మొత్తం 98 రెవెన్యూ గ్రామాల పరిధిలోని 123 హేబిటేషన్లకు చెందిన 63,500 మందిని జిల్లా నుంచి వేరు చేసి తూర్పుగోదావరి జిల్లాలో కలపనున్నారు. పాల్వంచ డివిజన్లో : బూర్గంపాడు మండలంలోని 7 రెవెన్యూ గ్రామాల పరిధిలో గల 15 హేబిటేషన్లకు చెందిన 16,943 మంది, వేలేరుపాడులోని 15 రెవెన్యూ గ్రామాల పరిధిలో గల 39 హేబిటేషన్లకు చెందిన 15,205 మంది, కుక్కునూరు మండలంలోని 16 రెవెన్యూ గ్రామాల పరిధిలో గల 34 హేబిటేషన్లకు చెందిన 21,148 మందిని జిల్లా నుంచి వేరు చేసి పశ్చిమ గోదావరి జిల్లాలో కలిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్రలో కలవనున్న గ్రామాలు ఇవే భద్రాచలం మండలం : గోగుబాక, గొమ్ముకోయగూడెం, కాపవరం, గొమ్ముకొత్తగూడెం, సీతాపురం, త్రిపురపెంటవీడు, గొల్లగూడెం, రాచగొంపెల్లి, గౌరిదేవిపేట, నందిగామ, నందిగామపాడు, మురుమూరు. కూనవరం మండలం : అభిచర్ల, చూచిరేవుల గూడెం, అయ్యవారి గూడెం, పల్లూరు, కొండవాయిగూడెం, పెదార్కూర్, బండారుగూడెం, ముసూరుగూడెం, రేపాక, పండ్రాజుపల్లి, జిన్నెలగూడెం, వెంకటాయపాలెం, వెంకన్నగూడెం, రేగులపాడు, బొజ్రాయిగూడెం, మర్రిగూడెం, గొమ్ముగూడెం, చూచిరేవుల, కుమారస్వామి గూడెం, వెంకటాయపాలెం, నర్సింగపేట, చిన నర్సింగపేట, దూగుట్ట, కరకగూడెం, కూళ్లపాడు, గొమ్ము అయ్యవారిగూడెం, పొట్లవాయి, పోచవరం, పోచవరం కాలనీ, గునువారిగూడెం, పెద పోలిపాక, చినపోలిపాక, జగ్గవరం, జగ్గవరం కాలనీ, కాచవరం, లింగాపురం, కోడేరు, తాళ్లగూడెం, రాయిగూడెం, కొండ్రాజుపేట, శబరి కొత్తగూడెం, పూసుగూడెం, ఊల్పర్పేట, కూనవరం, టేకులబోరు, కూటూరు, మల్లూరు, టేకుబాక. చింతూరు మండలం : బండారుగూడెం, చిడుమూరు, కొమ్మూరు, మామిళ్లగూడెం, చట్టి, వీరాపురం, గొర్లెగూడెం, మల్లెతోట, వేలుమూరు, అగ్రహారపు కోడేరు, తిమ్మిరిగూడెం, నర్సింగపేట, ముకునూరు, చిట్టూరు, చింతూరు, కొయిగూరు, కల్లేరు. వీఆర్పురం మండలం : పత్తిపాక, తుష్టివారి గూడెం, సున్నంవారిగూడెం, కన్నాయిగూడెం, గుండుగూడెం, చింతరేగుపల్లి, శబరి రాజుగూడెం, అడవివెంకన్నగూడెం, కోపెల్లె, సోములగూడెం, రామవరం, రామవరపుపాడు, చొప్పెల్లె, ముల్కపల్లె, ముత్యాలమ్మ గండి, జల్లివారిగూడెం, గుర్రంపేట, నూతిగూడెం, ముత్తుగూడెం, ఉమ్మడివరం, అన్నవరం,రేఖపల్లి, రాజుపేట కాలనీ, వడ్డిగూడెం, డీటీగూడెం, తోటపల్లి, వీఆర్పురం, రాజుపేట, సీతంపేట, శ్రీరామగిరి, చొప్పనాపల్లి, కొత్తూరు,కల్తునూరు, జీడిగుప్ప, కొటారిగొమ్ము, ఇస్సునూరు, రాయిగూడెం, బీమవరం, ఇప్పూరు, పోచవరం, తుమ్మిలేరు, కొండేపల్లి, కొల్లూరు, బోరిగూడెం, గొందూరు. బూర్గంపాడు మండలం : సీతారామనగరం, శ్రీధర, వేలేరు, గుంపెనపల్లి, గణపవరం, ఇబ్రహీంపేట, రాయిగూడెం, అల్లిగూడెం, వెంకటాపురం, భువనగిరి, బూర్గంపాడు, టేకులచెరువు, సంజీవరెడ్డిపాలెం, కొతనకిరిపేట, లక్ష్మీపురం. వేలేరుపాడు మండలం : రేపాకగొమ్ము, పుచిరాల కాలనీ, పుచిరాల, మద్దికట్ల, వేలేరుపాడు, నడిమిగొంపు, రుద్రంకోట, తాటుకురుగొమ్ము, నాగులగూడెం, భూదేవిపేట, శ్రీరామపురం, జగన్నాథపురం, సాగరపల్లి, కొర్రాజుగూడెం, బుర్రతోగు, తిరుమలపాలెం, కన్నవాయిగుట్ట, నారాయివారెం, నారాయివారెం కాలనీ, తూర్పుమెట్ట, పడమటిమెట్ట, కొత్తూరు, చిగురుమామిడి, బొల్లెపల్లె, యాదవ పల్లె, చిత్తమరెడ్డిపాలెం, చింతపాలపాడు, బూరెడ్డగూడెం, సిద్దారం, కట్కూరు, టేకూరు, కొయిదా, తాళ్లగొంది, పూసుగొంది, కాచవరం, టేకపల్లి, కాకిసునూర్, పేరాంటాలపల్లి. కుక్కునూరు మండలం : తొండిపాక, మిట్టగూడెం, బంజరగూడెం, కొమటాయిగూడెం, అమరవరం, ఉప్పేరు, రెడ్డిగూడెం, దామరచెర్ల, యల్లపుగూడెం, చీరవల్లి, కొత్తూరు, మర్రిపాడు, మాదారం, కౌండిన్యముక్తి, వింజరం, ముత్యలంపాడు, కొండపల్లి, కొయగూడెం, మారేడుబాక, కివ్వాక, కమ్మరిగూడెం, కుక్కునూరు, రామసింగారం, కిష్టారం, కోరాయికుంట, లంక లపల్లి, ఇసుకపాడు, దాచారం,బెస్తగూడెం, రామచంద్రాపురం, కొత్తూరు, గొమ్ముగూడెం, లచ్చిగూడెం, ఉప్పర మద్దిగట్ల. -
గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్లైన్ : గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ.. ప్రభుత్వ శాఖల్లోని వెబ్సైట్లో జూన్ 2 నుంచి ఇదే సర్వర్ కనబడనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనెల 24 వరకు దర్శనమివ్వనుండగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్థిక వ్యవస్థలో విభజనకు కసరత్తు ముమ్మరమైంది. అపాయింటెడ్ డే కు సర్వం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈనెల 24నే ఉద్యోగులకు మే నెల వేతనం అందనుంది. ఉమ్మడి రాష్ట్రంలో లెక్కల విభజన ఈనెల 24తో ముగియనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ పరిధిలోఉన్న చెల్లింపులు 24వ తేదీతో పూర్తికానున్నాయి. ప్రభుత్వశాఖల పరిధిలోని అన్ని శాఖల ఉద్యోగులకు, పింఛన్దారులకు ఇతరత్రా అన్ని చెల్లింపులు అదేరోజు జరగనున్నాయి. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానుండడంతో వచ్చే నెల నుంచి బడ్జెట్ విధానం ప్రత్యేక రాష్ట్ర పరిధిలోకి రానుంది. ఇక వేటికవే.. మే 24 తర్వాత నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లెక్కలు వేటికవేనంటూ జిల్లా ట్రెజరీ శాఖకు ముందస్తుగా ఉత్తర్వులు అందాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, పింఛన్దారులకు నిర్ణీత సమయానికి వేతనాలు, పింఛన్లు ఇచ్చేందుకు కసరత్తు వేగవంతం చేస్తున్నారు. జూన్ 2 నుంచి తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించనుండడంతో 24వ తేదీనే తీసుకునే వేతనం ఆంధ్రప్రదేశ్ చివరిది కానుంది. జిల్లాలో సుమారు 32 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 12,080 వేల మంది పింఛన్దారులు ఉన్నారు. ప్రభుత్వ వేతనం కింద ఉద్యోగులకు సుమారు రూ.150 కోట్లు, పింఛన్దారులకు సుమారు రూ.18.63 కోట్లు చెల్లించాలి. ఈ మేరకు జీవో విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఖాత నుంచి తెలంగాణలోని ఉద్యోగులకు వేతనం చెల్లించనున్నట్లు పేర్కొంది. ఈ ఉత్తర్వులు అందుకున్న ట్రెజరీశాఖ ఉద్యోగుల జాబితా, బ్యాంకు ఖాతాలను సిద్ధం చేస్తోంది. నిధులు సర్ధుబాటయ్యేనా? ప్రభుత్వ పథకాల అమలుకు వివిధ శాఖలకు ఖజానా శాఖ ద్వారా నిధులు విడుదలవుతాయి. ఉద్యోగుల జీతాల మాదిరిగానే నిధుల ఖర్చు కూడా ఈనెల 24నే తుదిగడువుగా నిర్ణయించారు. ఆ లోగా వెచ్చించని మొత్తాన్ని అప్పజెప్పాలంటూ ఆదేశాలు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల హడావుడిలో ఉన్న అధికారులు నిధుల వినియోగం ఎలా? అని తలలు పట్టుకుంటున్నారు. 13వ ఆర్థిక సంఘం నిధుల గత ఆర్థిక సంవత్సరం చివరి సమయంలో మంజూరయ్యాయి. జిల్లాలోని 866 గ్రామ పంచాయతీలకు రూ.18 కోట్లు మంజూరు కాగా అన్నింటికీ కేటాయింపులు జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఇప్పటి వరకు పనులకు గ్రహణం ఏర్పడింది. ఈ ప్రక్రియ పూర్తికాకపోతే నిధుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎస్సీ విద్యార్థులకు సంబంధించి స్కాలర్షిప్ రూ.1.17 కోట్లు, ఫీజు రియింబర్స్మెంట్ కింద రూ.1.94 కోట్లు, బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ రూ.3.34 కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్ రూ.2.89 కోట్లు, ఈబీసీలకు సంబంధించి విద్యార్థులకు రూ.33.26 లక్షలు కేటాయింపులు జరిగాయి. వీటికి సంబంధించి కూడా ఈ 24 తేదీలోగానే చెల్లింపులు జరగాలి. ఇటీవల ట్రెజరీలో నిధులు విడుదలపై ఆంక్షలు విధించడంతో జిల్లాలోని వివిధ శాఖలకు సంబంధించి రూ.17 లక్షల నిధులు ల్యాప్స్కు గురయ్యాయి. అందులో జిల్లా పరిషత్కు సంబంధించి రూ.4 లక్షలు, వివిధ శాఖలకు సంబంధించి మిగతా నిధులు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా తిరిగి బిల్లులు పొందుపర్చాల్సిన అవసరం ఉంది. -
వచ్చే నెల 2న పోలవరం వ్యతిరేక సభ
భద్రాచలం, న్యూస్లైన్: రాష్ట్ర విభజన జరిగే జూన్ 2వ తేదీన వీఆర్ పురంలో పోలవరం వ్యతిరేక సభ నిర్వహించనున్నట్టు గిరిజన సంక్షేమ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు సొందె వీరయ్య తెలిపారు. ఆయన శనివారం ఇక్కడ పరిషత్ సమావేశంలో మాట్లాడుతూ.. ఆదివాసీలను జల సమాధి చేసే పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రజానీకమంతా సిద్ధం కావాలన్నారు. జాతీయ స్థాయిలో ఇందుకు మద్దతు కూడగట్టేందుకు విస్తృత ప్రచారం చేస్తామన్నారు. ఇందులో భాగంగా నిర్వహించే బహిరంగ సభలో మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో నాయకులు పాయం సత్యనారాయణ, ముర్రం వీరభద్రం, సోడె చలపతి, పూనెం సాయి, కన్నారావు, లీలాప్రసాద్, నాగరాజు, కిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ లేకపోతే చిత్ర పరిశ్రమ చెన్నైకి చెక్కేసేది!
సినీ నిర్మాత సురేష్ అరకులో షూటింగులకు అనుకూలం లొకేషన్లకు కొదవలేదు.. వనరులకూ ఢోకా లేదు వెంకటేష్ చిత్రం చిత్రీకరణ అరకు రూరల్, న్యూస్లైన్: రాష్ట్ర విభజన తర్వాత చిత్ర పరిశ్రమ విశాఖ వైపు చూస్తోందని, 90 శాతం యూనిట్ విశాఖ తరలి వస్తోందని సినీ నిర్మాత సురేష్ చెప్పారు. విశాఖ లేకపోతే చిత్ర పరిశ్రమ మళ్లీ చెన్నై చెక్కేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. అరకు పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్లు చేసేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారని తెలిపారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై కెమెరామన్ బి.గోపాల్రెడ్డి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మీనా, నదియా ప్రధానపాత్రల్లో ‘దృశ్యం’ అనే చిత్రాన్ని అరకులోయలో తెరకెక్కిస్తున్నారు. విశాఖ-అరకు ప్రధాన రహదారి కొత్తభల్లుగుడ, అరకులోయ రహదారికిరువైపులా సిల్వర్ఓక్ చెట్ల మధ్య రెండు రోజులుగా కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా సురేష్ విలేకరులతో మాట్లాడారు. మళయాళంలో విజయం సాధించిన ‘దృశ్యం’ సినిమాను తెలుగులో నిర్మిస్తున్నామని చెప్పారు. కథ కొత్తగా ఉందని, ఈ చిత్రంలో రెండు పాటలుంటాయని, ఫైట్స్ ఉండవన్నారు. విశాఖ, విజయనగరంలో కూడా పలు సన్నివేశాలను చిత్రీకరిస్తామని వివరించారు. ఈ నెలాఖరు నాటికి షూటింగ్ పూర్తి చేసి ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. అరకులోయ పరిసరాల్లో చెట్లు విపరీతంగా ఉండేవని, ప్రస్తుతం చెట్లు కొట్టేయడంతో బోడి కొండలు దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ మొక్కలు నాటాలని, చెట్లను రక్షించాలని కోరారు. ఈ చిత్రంలో నరేష్, చలపతిరావు, రవికాల్, సప్తగిరి, అన్నపూర్ణ తదితరులు నటిస్తున్నారన్నారు. విశాఖకు చెందిన బిల్డర్ అప్పారావు బాయ్స్ (బౌన్సర్లు) షూటింగ్లో పాల్గొన్నారు. -
పోరు రసవత్తరం
భద్రాచలం, న్యూస్లైన్: భద్రాచలం నియోజకవర్గంలో ఈసారి రసవత్తర పోరు సాగనుంది. నాలుగు ప్రధాన పార్టీలు తొలిసారిగా పోటీలో నిలుస్తుండటంతో భద్రాద్రిపై పాగా ఎవరిదనే చర్చ సాగుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్నికల ఫలితాల తరువాత భద్రాచలం నియోజకవర్గం రెండుగా చీలిపోనుంది. పోలవరం ముంపు ప్రాంతాలైన కూనవరం, వీఆర్పురం, చింతూరు, భద్రాచలం మండలాల్లోని 87 గ్రామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుస్తాయి. ముంపు ప్రాంత ఓటర్లు ఎవరిపై మొగ్గుచూపితే ఆ పార్టీ అభ్యర్థే గెలిచే అవకాశం ఉంది. అయితే ముంపు ప్రాంత మండలాల్లో వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది. చింతూరు మండలంలో ఆ పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించింది. కూనవరం, వీఆర్పురం మండలాల్లోనూ వైఎస్ఆర్సీపీకే ప్రజాదరణ ఉందని ఇటీవలి పంచాయతీ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. సీపీఎంకు కూడా ఆయా మండలాల్లో మంచి పట్టు ఉంది. దీంతో ఈ రెండు పార్టీలను ఢీ కొనడటం కాంగ్రెస్,టీడీపీలకు సాధ్యమయ్యే పనికాదని పరిశీలకులు అంటున్నారు. నివురుగప్పిన నిప్పులా వర్గపోరు... కాంగ్రెస్, టీడీపీలలో వర్గపోరు నివురుగప్పిన నిప్పులా దాగి ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కుంజా సత్యవతిపై కాంగ్రెస్ నాయకుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. పలువురు నాయకులు ఆమెపై ఇటీవల కాలంలో బాహాటంగానే విమర్శనాస్త్రాలు సంధించారు. గెలిచిన ఐదేళ్లలో ఏ ఒక్కరినీ ఆమె నమ్మలేదని గుర్రుగా ఉన్న నాయకులు, అధిష్టానం ఆదేశాలతో పనిచేస్తున్నట్లు నటిస్తున్నప్పటికీ ఆమెకు గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అన్ని వర్గాల్లోనూ తీవ్రమైన వ్యతిరేకత కూడగట్టుకున్న సత్యవతి ఈ సారి గెలవటం అంత సులభం కాదని పరిశీలకులు అంటున్నారు. ఇక బలమైన కేడర్ ఉన్న టీడీపీ ఒక్కసారైనా భద్రాచలంపై పాగా వేయాలని తపన పడుతున్నప్పటకీ ఆ పార్టీలోని వర్గపోరు విజయం దరి చేరనివ్వటం లేదు. టీడీపీ నుంచి ఈసారి తమకే సీటు వస్తుందని ఆశించిన బోదెబోయిన బుచ్చయ్య, ఇర్పా శాంత, సోడె రామయ్య వంటి నేతలు పూర్తిస్థాయిలో సహకరిస్తానేది అనుమానమే. నియోజకవర్గంపై మంచి పట్టు ఉన్న బాలసాని లక్ష్మీనారాయణకు అధిష్టానం టికెట్ కేటాయించకపోవటంతో ఈ ఎన్నికల ప్రచారానికి ఆయన దూరంగా ఉండే అవకాశం ఉంది. దీంతో ఈసారి కూడా టీడీపీ ఆశలు అడియాశలుగానే మిగలవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక తొలిసారి బరిలో నిలిచిన టీఆర్ఎస్ ఈ నియోజకవర్గంలో అంత ప్రభావం చూపలేదని విశ్లేషకుల వాదన. మొత్తం మీద భద్రాద్రి బరిలో తొలిసారి నాలుగు ప్రధాన పార్టీలు పోటీలో నిలవడంతో ఈ ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అన్ని పార్టీలూ ప్రచారంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశం ఉంది. -
కాంగ్రెస్కు సిపాయి గుడ్బై
రెండు రోజుల్లో కొత్తపార్టీ తీర్థం రాష్ట్ర విభజనలో కాంగ్రెస్-బీజేపీ సమాన భాగస్వాములు బీజేపీతో పొత్తున్న పార్టీలకు భంగపాటు తప్పదు స్పష్టం చేసిన అనుచరులు శ్రీకాళహస్తి, న్యూస్లైన్: రాష్ట్ర విభజనకు దోహదపడిన కాంగ్రెస్ పార్టీకి డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం గుడ్బై చెప్పనున్నారు. మరో రెండురోజుల్లో కొత్త పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. సోమవారం ఆయన పట్టణంలోని పొన్నాలమ్మగుడి ఆవరణలో తమ అనుచరులతో రెండు గంటల పాటు చర్చించారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్, బీజేపీ సమాన భాగస్వాములని ఆయన అనుచరులు స్పష్టం చేశారు. దీంతో బీజేపీకి గానీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు గానీ ప్రజలు ఈ ఎన్నికల్లో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. అలాంటి పార్టీలు అవసరం లేదన్నారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించే బడుగు బలహీన వర్గాల పార్టీలో చేరితేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని స్పష్టం చేశారు. టీడీపీతో భవిష్యత్ ఉండదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే బంగారు భవిష్యత్ ఉంటుందని పరోక్షంగా పేర్కొన్నారు. దీంతో సిపాయి సుబ్రమణ్యం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోసారి చర్చలు జరిపి నిర్ణయం వెల్లడించనున్నారు. తిరుపతిలో ప్రముఖ డాక్టర్గా పేరొందిన రష్ ఆస్పత్రి అధినేత సిపాయి సుబ్రమణ్యం 2009 ఎన్నికల్లో తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చారు. సినీనటుడు చిరంజీవితో సన్నిహిత సంబంధాలు ఉండడంతో శ్రీకాళహస్తి నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. 25 వేలకు పైగా ఓట్లు సంపాదించారు. ఆ తర్వాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో ఇష్టం లేకున్నా సిపాయి కూడా అదే పార్టీలో కొనసాగారు. పట్టణంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు దగ్గరయ్యారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఇటీవల శ్రీకాళహస్తిలో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో చుర్గుగా పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే భవిష్యత్ ఉండదని గ్రహించిన ఆయన సోమవారం తన అనుచరులతో చర్చలు జరిపారు. సీమాంధ్ర ప్రాంతంలో వైఎస్సార్ సీపీ తప్పక అధికారంలోకి వస్తుందని, ఆ పార్టీలోకి వెళితేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని ఆయనకు అనుచరులు సూచించారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో కాంగ్రెస్తో పాటు బీజేపీ ప్రధానపాత్ర పోషించిందని, అలాంటి పార్టీతో పొత్తుపెట్టుకున్న టీడీపీలోకి వెళితే రాజకీయ ఇబ్బందులు తప్పవని వివరించారు. దీంతో మంగళ, బుధవారాలు తన అనుచరులతో మరోసారి చర్చలు నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు. విభజనతో సీమాంధ్రకు నష్టం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడాన్ని ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. స్వార్థం కోసం రాష్ట్రాన్ని విభజించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాను. రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తాను. -డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం -
కొత్త రైల్వే జోన్ అవకాశం బెజవాడకే
రైల్వే శాఖ సన్నాహాలు మరో జోన్ కావాలని ఎప్పటినుంచో డిమాండ్ ఆదాయం బాగున్నా కేటాయింపుల్లో విదిలింపులే రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి కావస్తుండడంతో కొత్త జోన్ ఏర్పాటుకు రైల్వే శాఖ సన్నాహాలు మొదలుపెట్టింది. సీమాంధ్రకు కొత్త రైల్వే జోన్ ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రైల్వే జోన్ కోసం విజయవాడ, విశాఖపట్నం మధ్య పోటీ నెలకొంది. విజయవాడ కేంద్రంగానే ఈ జోన్ ఏర్పాటవుతుందని అధికారులు చెబుతున్నారు. దక్షిణమధ్య రైల్వే చాలా పెద్ద జోన్ కావడంతో పరిపాలనాపరంగా కూడా మరో జోన్ కావాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. సాక్షి, విజయవాడ : దక్షిణ మధ్య రైల్వేలోనే అత్యధిక ఆదాయం సాధించే డివిజన్గా బెజవాడకు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో ఏళ్లుగా అధిక ఆదాయం వస్తున్నా కేటారుుంపుల్లో మాత్రం చిన్నచూపే చూస్తున్నారు. ఏడు జిల్లాల పరిధిలో విస్తరించిన విజయవాడ డివిజన్ ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని కలిపే కీలక జంక్షన్. దీంతోపాటు కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల ద్వారా సరకు రవాణాపై ఆదాయం సమకూరుతోంది. కొన్నేళ్లుగా విజయవాడ డివిజన్ ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా ఏర్పాటుచేసిన ప్రత్యేక రైళ్లు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. సరకు రవాణాపై కూడా ఏటా ఆదాయం పెరుగుతూ వస్తోంది. ఎరువులు, సిమెంట్, బొగ్గు తదితరాల రవాణాకు విజయవాడ డివిజన్ కీలకంగా మారింది. మచిలీపట్నం పోర్టు కూడా కార్యరూపం దాలిస్తే డివిజన్ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడ జోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం తూర్పు రైల్వేలో ఉన్న విశాఖపట్నాన్ని కూడా కొత్తగా ఏర్పాటు చేసే జోన్లో కలపాల్సిఉంటుంది. పెండింగ్ ప్రాజెక్టుల్లో కదలిక.. కొత్త జోన్ ఏర్పాటైతే నిధులు రావడం ద్వారా దశాబ్దాలుగా పెండింగ్లో ఉండిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసుకోవచ్చన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇటీవలి కాలంలో రైల్వే బడ్జెట్లో విజయవాడ డివిజన్కు మొండిచెయ్యే మిగులుతోంది. కొన్ని ప్రాజెక్టులు మంజూరు చేసినా వాటికి నిధులు మంజూరు కాకపోవడంతో ముందుకు కదలడం లేదు. 15 ఏళ్ల క్రితం మంజూరైన కాకినాడ-కోటిపల్లి-నర్సాపూర్ లైన్ ఇప్పటికీ పూర్తికాలేదు. కాకినాడ నుంచి కోటిపల్లి వరకు లైన్ పూర్తికాగా, కోటిపల్లి నుంచి నర్సాపూర్ లైన్ పెండింగ్లోనే ఉంది. కోటిపల్లి-నర్సాపూర్ మధ్య 57 కిలోమీటర్ల రైలుమార్గానికి రూ.695 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇప్పటికి రూ.10 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. కాకినాడ-పిఠాపురం మధ్య 21 కిలోమీటర్ల లైన్కు రూ.85.51 కోట్లు బడ్జెట్ కాగా, ఇప్పటివరకు లక్షల్లోనే కేటాయింపులు జరిగాయి. ఓబులాపురం-కృష్ణపట్నం మధ్య 113 కిలోమీటర్ల రైలుమార్గానికి రూ.732.81 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇప్పటికి సగం ఖర్చు కూడా కాలేదు. రాయనపాడు వర్క్షాపు ఆధునికీకరణ కోసం రూ.12.61 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. నిధులు లేకపోవడంతో పనులు సాగడం లేదు. విజయవాడ ఎలక్ట్రికల్ లోకో షెడ్ సామర్థ్యాన్ని 120 ఇంజిన్ల నుంచి 175 ఇంజిన్లకు పెంచడానికి రూ.12.50 కోట్లు మంజూరై ఐదేళ్లు దాటినా నిధులు మాత్రం రావడం లేదు. గద్వాల్-రాయచోటి లైను నిర్మాణం, గుంతకల్-బెంగళూరు, సికిందరాబాద్-ముంబై మధ్య విద్యుదీకరణ పనులు కూడా ముందుకు సాగడం లేదు. కొవ్వూరు-భద్రాచలం, కృష్ణపట్నం-కడప రూట్లలో కొత్త రైలుమార్గం ఏర్పాటు గత బడ్జెట్లకే పరిమితమైంది. విజయవాడ డివిజన్కు పీరియాడికల్ ఓవర్హాలింగ్ సెంటర్ వస్తుందని భావించారు. అదీ రాకపోవడం కొంత నిరాశకు గురిచేసింది. గుంటూరు-తెనాలి-విజయవాడ మధ్య, విశాఖపట్నానికి మెట్రో రైళ్లు వేస్తామన్న హామీలు కూడా నెరవేరతాయన్న ఆశ ఈ ప్రాంతంలో కనపడుతోంది. -
కాంగ్రెస్ కీలక నేతల్లో...ఊగిసలాట
*ప్రత్యామ్నాయం వైపు చూపు *ఉనికి కోసం తహతహ *సీటు హామీ కోసం ముమ్మర యత్నాలు *వైఎస్సార్సీపీలో చేరికకు విఫలయత్నం *టీడీపీలోకి బుద్ధప్రసాద్, పిన్నమనేని! *బాడిగ, వ్యాస్, సారథి ఎటు? కాంగ్రెస్ నేతల పార్టీ ఫిరాయింపులపై పూటకో ప్రచారం.. రోజుకో పుకారు షికార్లు చేస్తున్నాయి. ఆయా నేతలు మాత్రం ఎటూ తేల్చుకోలేని గందరగోళ స్థితిలో ఉన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లిపోవడంతో అందులో నుంచి వీలైనంత త్వరగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. సాక్షి, మచిలీపట్నం : రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్కు నూకలు చెల్లిపోయాయని తేలిపోయింది. దీంతో కాంగ్రెస్లో ఉండి ఉనికి కోల్పోవడం కంటే పార్టీ ఫిరాయించి పదవుల కోసం అదృష్ట పరీక్షకు సిద్ధమవుతున్నారు. జిల్లా కాంగ్రెస్లో ఒక వెలుగు వెలిగిన నేతల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారడంతో వాళ్లు కచ్చితంగా పొరుగు పార్టీలకు వెళతారన్న ప్రచారం ఊపందుకుంది. దాదాపు రెండు నెలల కాలంగా వాళ్లు ఫలానా పార్టీలో చేరుతున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయినా కీలక నేతలు మాత్రం పార్టీ మారేందుకు డీల్ కుదరలేదో.. స్పష్టమైన హామీ దక్కలేదో.. ముహూర్తం కుదరలేదో మరి. కారణం ఏదైనా జిల్లాలో కాంగ్రెస్ మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ, అధికార భాషా సంఘం మాజీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు వంటి కీలక నేతలు సీటు హామీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు వినికిడి. జిల్లాలో రాజకీయ అయోమయం... ఇప్పటికే వైఎస్సార్సీపీలో చేరేందుకు విఫలయత్నం చేసిన జిల్లాలోని కాంగ్రెస్ నేతలు పలువురు మరో పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో అనేక పుకార్లు వ్యాపించడంతో జిల్లాలో రాజకీయ అయోమయం నెలకొంది. మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ బందరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఇటీవల ప్రకటించారు. ఆయన ఏ పార్టీలో చేరుతున్నదీ మాత్రం ప్రకటించలేదు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఇష్టంలేని బాడిగ ఎంపీ టిక్కెట్ హామీ ఇచ్చిన పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. బూరగడ్డ వేదవ్యాస్ సైతం పెడన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుతానికి రాజకీయ సమీకరణలు చేసుకుంటున్నారు. వ్యాస్ ఆ పార్టీలో చేరుతున్నారని.. కాదు ఈ పార్టీలో చేరుతున్నారంటూ ప్రచారం మాత్రం జరుగుతోంది. మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ఉయ్యూరు మున్సిపల్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అభ్యర్థులను నిలపలేదు. సారథి తనదైన శైలిలో అక్కడ 20 వార్డుల్లోనూ సొంత ప్యానల్ను పెట్టడం చర్చనీయాంశమైంది. దీంతో ఆయన కాంగ్రెస్లో ఉండే అవకాశం లేదని, పార్టీ మారతారనే ప్రచారానికి ఊతమిచ్చినట్టు అయ్యింది. బుద్ధప్రసాద్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం? కాంగ్రెస్ వాదిగా ముద్రపడిన బుద్ధప్రసాద్కు ముసుగు తొలగిపోనుంది. రాజకీయ ఉనికి కోసం అనేక ప్రయత్నాలు చేసిన మండలి బుద్ధప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది. గతం నుంచి బుద్ధప్రసాద్ వెంట నడిచిన అభిమానులు, కార్యకర్తలు ఆయన నిర్ణయంపై పెదవి విరుస్తున్నారు. దీంతో కార్యకర్తలకు సర్దిచెప్పేందుకు ఆయన ఈ నెల 26న అవనిగడ్డ నియోజకవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఈ నెల 27న అవనిగడ్డ నుంచి ర్యాలీగా విజయవాడ వెళ్లి అక్కడ జరిగే మహిళా గర్జన సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలోని మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు కూడా టీడీపీలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కేడీసీపీ బ్యాంక్ చైర్మన్ అయిన తొలినాళ్లలోనే ఆప్కాబ్ చైర్మన్ పదవి దక్కకపోవడంతో పిన్నమనేని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. కొద్దిరోజుల క్రితం రాజమండ్రిలో జరిగిన జై సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటు సభకు పిన్నమనేని వెళతారని.. అక్కడ మాజీ సీఎం కిరణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరతారనే ప్రచారం సాగింది. ఆ పార్టీకి దూరంగానే ఉన్న పిన్నమనేని కూడా టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. -
లేనిది ఉన్నట్టు..టీడీపీ కనికట్టు
సాక్షి, ఏలూరు: కాంగ్రెస్ పార్టీ చేతిలో కత్తిలా మారి రాష్ట్ర విభజనకు కారణమైన తెలుగుదేశం పార్టీ తన పాపాన్ని కప్పిపుచ్చుకునేందు కు.. ప్రజల్ని మభ్యపెట్టేందుకు కొత్త ఎత్తులు వేస్తోంది. ఇందుకోసం ఆదినుంచీ అలవాటైన గోబెల్స్ ప్రచారాన్ని మరోమారు నిస్సిగ్గుగా ప్రయోగి స్తోంది. ప్రజల విశ్వాసం కోల్పోవడంతో ఎన్నికల్లో ఓట్లు అడిగే ధైర్యం చేయలేకపోతున్న టీడీపీ నేతలు తమ పార్టీకి లేని బలాన్ని ఉన్నట్టుగా అబద్ధపు ప్రచారాలు మొదలుపెట్టారు. తొలినుంచీ కాంగ్రెస్ పార్టీ నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న టీడీపీ నేతలు తమ పార్టీలోకి వస్తున్న కొందరు కాంగ్రెస్ నేతలను చూపించి అన్ని పార్టీల నాయకులు తమ పార్టీలో చేరిపోతున్నారంటూ మౌఖిక ప్రచారం చేరుుస్తున్నారు. ఆ పార్టీ వైపు కన్నెత్తి చూడని వారిని సైతం రేపోమాపో టీడీపీలో చేరిపోతున్నారంటూ తప్పుడు ప్రచారం చేరుుస్తున్నారు. గోబెల్స్ ప్రచారాన్ని పునాదులుగా చేసుకుని టక్కు టమార గారడీ విద్యలను ప్రదర్శించడం ద్వారా ప్రజలను మోసగించడం అలవాటు చేసుకున్న పార్టీ అధినేత అలాంటి ప్రచారాన్ని ముమ్మరం చేయూలని జిల్లా నేతలకు ఆదేశాలిచ్చారు. దీంతో స్థానిక నేతలు తమకు నియోజకవర్గాల్లో ఏ మాత్రం ఓటింగ్ లేకపోయినప్పటికీ టీడీపీకి ‘బావుందంట కదా’ అనే ప్రచారం చేయిస్తున్నారు. నిజానికి ప్రజల్లో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది, దానిని బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడేందుకు ఆ పార్టీ నేతలు కుతంత్రాలు పన్నుతున్నారు. తిమ్మిని బమ్మిని చేస్తూ... సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఓ నాయకుడు పొరుగు జిల్లాలోని ఓ లాడ్జిలో సభ్యసమాజం తలదించుకునే పనిచేస్తూ పోలీసులకు దొరికిపోరుు పరువు పోగొట్టుకున్నాడు. కొన్నిరోజుల అనంతరం ఆ వ్యక్తిని ఓ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీకి దింపుతున్నట్టు నాయకులు ప్రకటించారు. ఆ వ్యక్తికి పార్టీ అభ్యర్థిత్వం కట్టబెడుతున్నందువల్ల ఆ నియోజకవర్గంలో టీడీపీ బాగా బలం పుంజుకుందంటూ ప్రచారం చేరుుస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకించి కొందరు వ్యక్తులను నియమించినట్టు సమాచారం. ఓ పార్లమెంటరీ నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి కుటుంబంపైనా కొంతకాలం క్రితం ఆరోపణలు వచ్చా రుు. ఆయన కుమారుడు ఓ మహిళను వేధిం చారంటూ కేసు నమోదైంది. దీనిపై పెద్ద రగడ చోటుచేసుకుంది. మరోవైపు పదవులు అనుభవించడం తప్ప ప్రజలకు సేవచేయ డం తెలియని ఆ పెద్దాయనకు చెక్పెట్టి సమైక్యాంధ్ర ద్రోహిగా ముద్ర వేయించుకున్న మరో పెద్దాయనను బరిలో దించాలని టీడీపీ భావిస్తోంది. జనం కోసం ఎప్పుడూ ఏమీ చేయని ఆ ఇద్దరు పెద్దమనుషులు ఇప్పుడు పదవి కోసం తిట్టుకుంటున్నారు. వీరిపై క్షేత్ర స్థాయిలో ఉన్న వ్యతిరేకతను గోబెల్స్ ప్రచారంతో తొక్కిపెట్టాలని తమ్ముళ్లు చూస్తున్నప్పటికీ కుదరడం లేదు. మరో అసెంబ్లీ నియోజకవర్గంలో జూదరులకు, సెటిల్మెంట్లు చేసేవారికి అండగా నిల వటం.. కోడిపందాల్లో పాల్గొనడమే కాకుం డా అధికారులపై చేరుు చేసుకోవడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తిని సైతం చాలా గొప్పవాడంటూ ప్రచారం చేరుుస్తున్నారు. ఆయన ఎవరు పిలిచినా వెళతాడని, ప్రతి ఒక్కరి సమస్యల్నీ పట్టించుకుంటారంటూ రంగులు అద్దుతున్నారు. అలాంటి వ్యక్తికి మళ్లీ పదవి వస్తే తమలాం టి వాళ్లు నియోజకవర్గంలో తిరగలేని పరి స్థితి దాపురిస్తుందని సామాన్య ప్రజలు భయపడుతుంటే.. అధికారులు విధులు నిర్వర్తించలేమంటూ గగ్గోలు పెడుతున్నారు. వీలు దొరికినప్పుడల్లా పార్టీ అధినేతకు పాదపూజ చేసే మరో నాయకుడు తాను చాలా గొప్ప వ్యక్తిని అన్నట్టుగా నటిస్తున్నారు. విద్యాసంస్థలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే అపకీర్తిని మూటగట్టుకున్న ఆయన సమైక్యాంధ్ర కోసం తీవ్రంగా పోరాడుతున్నట్టుగా ఫోజులిచ్చారు. ఇప్పుడు ఆ వ్యక్తి చాలా గొప్పవాడంటూ పనిగట్టుకుని ప్రచారం చేరుుస్తున్నారు. పదవిలో ఉన్నంత కాలం ప్రజలను పట్టించుకోని ఓ నాయకుడు తనను మించిన ప్రజాసేవకుడు లేడం టూ ఆ పొరుగు నియోజకవర్గానికి చెందిన నేత ప్రచారం చేరుుంచుకుంటున్నారు. విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీపై ప్రజలు నిప్పులు చెరుగుతుంటే ఆయన మాత్రం కాంగ్రెస్ నేతల విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు. అభివృద్ధిని పక్కనపెట్టేసి అడపాదడపా అగ్ని ప్రమాద బాధితులను పలకరించి అదే చాలా ఎక్కువ అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. వేరేవాళ్లూ వచ్చేస్తున్నారట.. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఈలి నాని, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ టీడీపీలోకి రావడాన్ని ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతి రేకిస్తున్నారుు. వారు రాకతో పార్టీ మూడు ముక్కలైంది. ఈ వాస్తవాల్ని కప్పిపుచ్చుతన్న ఆ పార్టీ జిల్లా నాయకులు అదే తరహాలో చాలామంది నాయకులు తమ పార్టీలో చేరిపోతున్నారనే ప్రచారానికి తెరలేపారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ తమ పార్టీలో చేరబోతున్నారంటూ రెండురోజుల క్రితం టీడీపీ నేతలు కొత్త ప్రచారానికి తెరలేపారు. ఇం దుకోసం కొన్ని బృందాలను నియమించి మరీ ఊరూరా ప్రచారాన్ని ఊదరగొట్టిం చారు. తద్వారా ప్రజల్ని అయోమయూనికి గురి చేశారు. ఈ విషయం తెలిసి గ్రంధి శ్రీనివాస్ తాను వేరే ఏ పార్టీలోకి వెళ్లేది లేదని, తన ప్రాణం ఉన్నంత వరకూ వైఎస్ జగన్మోహన్రెడ్డిని వీడేది లేదని స్పష్టం చేశారు. అరుునప్పటికీ టీడీపీ నేతలు విష ప్రచారాన్ని మానలేదు. ఇలా ప్రతిచోట టీడీపీ నాయకులపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను, రాష్ట్ర విభజన విషయంలో తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీలోకి వలసలు ఎక్కువయ్యూయంటూ ప్రచారం చేరుుస్తున్నారు. అయితే ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఆల్ ఫ్రీ మంత్రం జపించినా ప్రజలు విశ్వసించకపోవడం టీడీపీ నాయకుల్లో గుబులు రేపుతోంది. -
విభజన ద్రోహులు కాంగ్రెస్, చంద్రబాబే : కిరణ్
పెనుగంచిప్రోలు/ వత్సవాయి : రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్తో పాటు తెలంగాణాకు అనుకూలమని లేఖ ఇచ్చి చివరలో నాటకాలాడిన చంద్రబాబు రాష్ట్ర విభజనకు కారణమని జైసమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి దుయ్యబట్టారు. శుక్రవారం నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలు, వత్సవాయి గ్రామాల్లో ఆయన రోడ్షో నిర్వహించారు. విభజన వలన వచ్చే నష్టాలను కాకుండా ఓట్లు, సీట్ల కోసమే మిగిలిన రాజకీయ పార్టీలు ఆలోచించాయన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాటిబండ్ల వెంకట్రావు, డా.గంగాధర్, కంచేటి రమేష్, కట్టా సత్యనారాయణ, బత్తుల రామారావు, తదితరులు పాల్గొన్నారు. రోడ్షోకు స్పందన నిల్.. మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి రోడ్షోకు ప్రజల నుంచి ఏమాత్రం స్పందన లభించలేదు. రాష్ట్ర విభజనలో కిరణ్ కూడా పాత్ర పోషించాడనే అభిప్రాయం ప్రజల్లో ఉండటంతో స్పందన కరువైంది. ఆయన రోడ్షోకు నేతలు పూర్తిగా దూరంగా ఉన్నారు. 20కి పైగా వాహనాలతో భారీ కాన్వాయ్ ఉన్నప్పటికీ కేవలం వందల సంఖ్య లోపే ప్రజలు ఉండటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. భోజనాల కోసం ఆందోళన.... కిరణ్ రోడ్షోకు జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలకు అన్నం కరువై ఆందోళనకు దిగిన సంఘటన పెనుగంచిప్రోలులో శుక్రవారం చోటు చేసుకుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు భోజనానికి ఆపి తమకు అన్నం పెట్టలేదని, అలాంటప్పుడు తమను ఎందుకు తీసుకొచ్చారని నిర్వాహకులను నిలదీసిన కార్యకర్తలు బల్లలను పడవేశారు. -
కొత్త రాజధాని బెజవాడే బెస్ట్
ఆరు దశాబ్దాల క్రితమే చెప్పిన వాంఛూ కమిటీ మళ్లీ చర్చనీయాంశమైన ఆ నివేదిక అన్ని విధాలా అనువైన ప్రాంతంగా తేల్చిన వాంఛూ ఆనాటి కుటిల రాజకీయాలే మళ్లీ పునరావృతమవుతాయా? సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన ఘట్టం ముగియడంతో సీమాంధ్ర ప్రాంతంలో కొత్త రాజధాని ఎక్కడ అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఐదారు ప్రాంతాల వారు తమ జిల్లాల్లోనే రాజధాని ఏర్పాటుచేయాలనే డిమాండు ముందుకు తెస్తున్నారు. ఈ నేపథ్యంలో చర్రిత పుటల్లోకి తొంగిచూస్తే 1952, 53ల్లో నెలకొన్న పరిస్థితులు మళ్లీ ఇప్పుడు పునరావృతమైనట్లు అనిపిస్తుంది. మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగువారు విడిపోయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన రోజులవి. ఇప్పటి మాదిరిగానే అప్పుడు రాజధాని ఎక్కడ అనే చర్చ సాగింది. చాలామంది వాల్తేరు-విశాఖపట్నంలో ఏర్పాటుచేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఆహ్లాదకరమైన వాతావరణం, రాజధానికి కావలసిన హంగులు, వివిధ కార్యాలయాలు నెలకొల్పుకోవడానికి సిద్ధంగా ఉన్న భవనాలే ఆ అభిప్రాయం వ్యక్తం కావడానికి కారణం. ఇందుకు భిన్నంగా వాంఛూ కమిటీ తన నివేదిక అందజేసింది. ఇప్పుడు ఆ కమిటీ నివేదికను జనం మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. నూతన ఆంధ్ర రాష్ట్రం- ఆర్థిక, ఇతర అంశాలపై వాంఛూ కమిటీ కేంద్రానికి సమగ్ర నివేదిక ఇచ్చింది. అలహాబాద్ చీఫ్ జస్టిస్ కైలాస్నాథ్ వాంఛూ నేతృత్వంలో నలుగురు సభ్యులతో ఈ కమిటీని 1952 డిసెంబరు19న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ సభ్యులు రాయలసీమ, కోస్తాంధ్రలో రెండు నెలలపాటు విస్తృతంగా పర్యటించి పరిస్థితులను అధ్యయనం చేసి 1953 ఫిబ్రవరిలో కేంద్రానికి నివేదిక ఇచ్చింది. కమిటీ ఏం చెప్పిందంటే.. ఆరు దశాబ్దాల క్రితమే ఈ కమిటీ.. ఆంధ్ర రాష్ట్ర రాజధాని విజయవాడ- గుంటూరు మధ్య ఏర్పాటుచేయాలని సూచించింది. ఇది అన్ని విధాలా హేతుబద్ధమైనదని, శాస్త్రీయమైనదని కూడా స్పష్టంచేసింది. భౌగోళికంగా, ఇతర వసతులు పరంగా ఈ ప్రాంతం అనువైనదని పేర్కొంది. కొత్త రాష్ట్రం మధ్య భాగంలో విజయవాడ-గుంటూరు ప్రాంతం ఉందని, రైల్వే జంక్షన్, వివిధ ప్రాంతాలతో రోడ్డు మార్గాల అనుసంధానం కలిగి ఉందని వెల్లడించింది. కృష్ణానది జలాల లభ్యతను కూడా ఈ కమిటీ పరిగణనలోకి తీసుకుంది. భూగర్భ, నదీ జలాలు పుష్కలంగా అందుబాటులో ఉండడంతో కొత్త రాష్ట్ర రాజధానిగా ఈ ప్రాంతం ఎంపిక సశాస్త్రీయమని తేల్చింది. ఇదే ప్రాతిపదికలు నేడు కూడా వర్తిస్తాయనడంలో సందేహంలేదు. సీమాంధ్రలోని 13 జిల్లాలకు అన్ని విధాలా మధ్యస్థ ప్రాంతంగా బెజవాడ ఉంది. రైలు, రోడ్డు మార్గాలు అభివృద్ధి చెందాయి. గన్నవరం ఎయిర్పోర్టు అందుబాటులో ఉంది. దాన్ని విస్తరించుకోవడం సులువైన పని. అంతేకాదు, సచివాలయం, ఇతర కార్యాలయాల ఏర్పాటుకు అనువైన భవనాలు ఇప్పటికిప్పుడు సిద్ధంగా ఉన్నాయి. నాగార్జున యూనివర్సిటీని ఖాళీ చేయిస్తే సచివాలయం, ఇతర ప్రభుత్వ శాఖలకు కావాల్సిన వసతి ఏర్పాటుచేసుకోవచ్చు. ఇలా ఏ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నా రాష్ట్ర రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలు బెజవాడకు ఉన్నాయి. కుటిల రాజకీయాలు ఆనాడు విజయవాడ కమ్యూనిస్టుల కంచుకోటగా ఉండడం, రాయలసీమ ప్రాంతవాసులు తమకే రాజధాని కావాలని డిమాండు చేయడంతో కర్నూలు రాజధానిగా ఏర్పాటుచేశారు. అయితే అక్కడ కనీస వసతులు లేక గుడారాలు వేసి కార్యాలయాలు పెట్టి నానా అవస్థలు పడిన చరిత్ర మరవలేనిది. ఆనాడు విజయవాడకు రాజధానిగా అవకాశం లేకుండా చేయడంలో నీలం సంజీవరెడ్డి, జవహర్లాల్ నెహ్రూ కీలకపాత్ర పోషించారనే వాదనలు ఉన్నాయి. రాజధానిగా కర్నూలు ఉండాలా.. విజయవాడ ఉండాలా అనే అంశంపై మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలోని ఈ ప్రాంత శాసనసభ్యుల మధ్య ఓటింగ్ జరిగింది. కేవలం ఒక ఓటు తేడాతో కర్నూలు ఎన్నుకునానరు. కర్నూలుకు అనుకూలంగా 80, విజయవాడకు 79 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కూడా తొంటి రాజకీయమే జరిగింది. మద్రాసు రాష్ట్రానికి చెందిన ఐదుగురు సభ్యులు ఓటింగ్లో పాల్గొనడంతోపాటు ప్రకాశం పంతులు, ఎన్జీరంగా నేతృత్వంలో గుంటూరు ప్రాంతానికి చెందిన ఏడుగురు సభ్యులు కర్నూలుకు అనుకూలంగా ఓటు చేశారు. ఇలా విజయవాడకు చరిత్రలో తీరని అన్యాయం జరిగింది. అదే విజయవాడే రాజధాని అయి ఉంటే.. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా రాజధాని మారకుండా ఉండేదని, నేడు రాష్ట్ర విభజనకు ఆస్కారమే ఉండేది కాదనే వాదనలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అటువంటి రాజకీయాలే చోటుచేసుకుంటున్నాయి. కొందరు విశాఖపట్నం, మరికొందరు కర్నూలు లేదా ఒంగోలు జిల్లాలో రాజధాని ఉండాలనే వాదనలు తీసుకువస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొనైనా ఈసారి మరో పొరపాటు చేయకూడదని పలువురు మేధావులు పేర్కొంటున్నారు. ఇప్పటికే వాణిజ్య, రవాణా రాజధానిగా ఉన్న విజయవాడను కొత్త రాష్ట్ర రాజధానిగా ఎంపికచేస్తే అన్ని విధాలా అభివృద్ధి ఊతంగా నిలుస్తుందని వారు చెబుతున్నారు. -
బిల్లు తెచ్చిన తంటాభవితపై బెంగ
ఎన్నికలపై అయోమయం తెలంగాణ బిల్లు ఆమోద ఫలితం కాంగ్రెస్లో రాజీనామాల పర్వం టీడీపీ శ్రేణుల్లో అయోమయం వైఎస్సార్సీపీకి ‘సమైక్య’ బలం కేంద్రంలోని యూపీఏ సర్కార్ అనుకున్నంత పనిచేసింది.. తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా నిలువునా చీల్చింది.. ఈ చర్యపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది.. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల ముందుకు వెళ్లడం ఎలా? రానున్న ఎన్నికలను ఎదుర్కోవడం ఎలా? అనే సంశయం కాంగ్రెస్, టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. సాక్షి, మచిలీపట్నం : రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో ఆమోదించడంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలను ఎదుర్కొనేందుకు జిల్లాలోని కాంగ్రెస్, టీడీపీ నేతలు సిద్ధంగా లేరు. రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పూర్తిచేసే మిషతో మరో ఆరు నెలలపాటు అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలన్న ప్రతిపాదనను అధికార పార్టీ తెరపైకి తెచ్చింది. అదే జరిగితే షెడ్యుల్ ప్రకారం లోక్సభ ఎన్నికలను నిర్వహించి, అసెంబ్లీ ఎన్నికలకు మరికొంత గడువు ఇచ్చే అవకాశం ఉందని జిల్లాలోని అధికార కాంగ్రెస్, టీడీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజాభిమానం తమకు అండగా ఉంటుందన్న ధీమా వ్యక్తం చేస్తోంది. అధికారులు సిద్ధం! ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధమేనా? అనే ప్రశ్న ఎన్నికల కమిషన్, రాజకీయ పార్టీలు, ప్రజలను వెంటాడుతోంది. అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుపుతామని ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తున్నప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరిగే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. మరోపక్క ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్రావు, ఎస్పీ జె.ప్రభాకరరావు ఇతర ముఖ్య అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ పలు పర్యాయాలు వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించి ఎన్నికలు సజావుగా నిర్వహించేలా సూచనలు చేశారు. కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల తుది జాబితా ఖరారు, ఎన్నికల బదిలీల ప్రక్రియను పూర్తి చేశారు. మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెబుతున్నారు. ‘రిక్త హస్త’మేనా..! తొలి నుంచి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజనకు అత్యుత్సాహం చూపడంతో జిల్లాలో ఆ పార్టీకి నూకలు చెల్లినట్టేనని నేతలు కలవరపడుతున్నారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ సమైక్యవాదిగా వేసిన ఎత్తులు అనుకూలించలేదు. లోక్సభలో పెప్పర్ స్ప్రే చేసిన లగడపాటి తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. తనకు పరిస్థితి అనుకూలించకపోవడంతో రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టు ప్రకటించిన లగడపాటి ఎంతవరకు మాటపై నిలబడతారో వేచి చూడాల్సిందే. జిల్లాలో ఏకైక మంత్రి కొలుసు పార్థసారధి తాను సమైక్యవాదినేని చెబుతూనే పదవిని పట్టుకుని వేలాడుతూ వచ్చారు. ప్రస్తుత పరిస్థితిలో ఆయన సీఎం కిరణ్తో కలిసి తన పదవికి రాజీనామా చేసి రాజకీయ భవిష్యత్ కోసం వ్యూహాలు రచించే పనిలో పడ్డారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి పార్టీ సభ్యత్వానికి రాజీనామా ప్రకటించి మరో పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అధికార భాషా సంఘం చైర్మన్ మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ, గన్నవరం మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వారి రాజీనామాలు ఆమోదించాల్సి ఉంది. జిల్లాలో మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, డీవై దాసు తమ రాజకీయ భవితపై మేధోమథనం చేస్తున్నారు. పలువురు కీలక నేతలు సైతం ఇదే పార్టీలో ఉంటే తమ రాజకీయ భవితవ్యం ఇక ముగిసిపోయినట్టేననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేశారన్న అపవాదును మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో దాదాపు నూకలు చెల్లిపోయినట్టేనని, ఇటువంటి తరుణంలో ఎన్నికలను ఎదుర్కోవడం పార్టీకి ఇబ్బందేనని ఆ పార్టీ వర్గాలే ఆందోళన చెందుతున్నాయి. పారని ఎత్తులు.. పొడవని పొత్తులు రెండు కళ్ల సిద్ధాంతంతో రెండు ప్రాంతాల్లోను వేగం పుంజుకుంటుందనుకున్న సైకిల్ రెండు చక్రాలకు గాలిపోయే పరిస్థితి వచ్చిందని టీడీపీ శ్రేణులు కలవరపడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీకి కూడా ఇప్పుడు ఎన్నికల భయం వెంటాడుతోంది. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి తెలంగాణలో ఒకమాట, సీమాంధ్రలో మరోమాట చెబుతూ వచ్చిన చంద్రబాబు ఎత్తులు ఈసారి ఎన్నికల్లో బెడిసికొట్టే ప్రమాదం ఉందని ఆ పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మోడీ ఇమేజ్ను చూసి బీజేపీతో పొత్తు పెట్టుకుని లబ్ధి పొందుదామనుకున్న టీడీపీకి పొత్తుల పొద్దు బెడిసికొట్టేలా ఉంది. బీజేపీతో పొత్తు వల్ల ముస్లిం మైనార్టీల ఓట్లు పోగొట్టుకోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్న తరుణంలో విభజనకు కాంగ్రెస్తో కుమ్మక్కైన బీజేపీతో చెలిమి మరింత ముంచుతుందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. టీడీపీ మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు లోక్సభలో గుండెపోటుకు గురికావడం, ముంబైలోని ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ చేయడంతో ఆయన వాణి జిల్లాలో వినిపించడానికి మరికొద్ది రోజులు పడుతుంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావును ఇప్పటికే వర్గవిభేదాలు చుట్టుముట్టాయి. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు తన పదవికి రాజీనామా ప్రకటించారు. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు అంబటి శ్రీహరిప్రసాద్ (అవనిగడ్డ), శ్రీరాం తాతయ్య (జగ్గయ్యపేట), జయమంగళ వెంకటరమణ (కైకలూరు) తమ రాజకీయ భవిష్యత్పై మల్లగుల్లాలు పడుతున్నారు. పట్టు పెంచిన వైఎస్సార్సీపీ తొలి నుంచి తమ నినాదం సమైక్యమేనని తేటతెల్లం చేస్తూ వచ్చిన వైఎస్సార్సీపీ జిల్లాలో మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఓట్లు, సీట్లు గురించి ఆలోచించకుండా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమైక్య చాంపియన్గా నిలిచారు. జగన్మోహన్రెడ్డి పిలుపుతో ఎప్పటికప్పుడు సమైక్య ఉద్యమాన్ని నడపడంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు వైఎస్ కుటుంబానికి అండగా ఉండేందుకు గతంలోనే టీడీపీ నుంచి కొడాలి నాని, కాంగ్రెస్ నుంచి పేర్ని నాని, జోగి రమేష్లు వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికలు ఎప్పుడు జరిగినా అన్ని నియోజకవర్గాల్లోను సత్తా చాటుతామని వైఎస్సార్సీపీ శ్రేణులు ఉత్సాహంగా కదులుతున్నాయి. -
ఎమ్మెల్యేలను కిరణ్, బొత్స మోసగించారు
విభజన సమాచారం వారికి ముందే తెలుసు కాంగ్రెస్ను సీమాంధ్ర ప్రజలు క్షమించరు పార్టీకి రాజీనామా చేస్తా... ఎమ్మెల్యేగా కొనసాగుతా.. తిరువూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే పద్మజ్యోతి తిరువూరు, న్యూస్లైన్ : ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు రాష్ట్ర విభజనపై ముందుగానే స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలకు తెలియజేయకుండా మోసగించారని తిరువూరు ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి అన్నారు. రాష్ట్ర విభజనను కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా చేసిందని ఆమె విమర్శించారు. గురువారం కృష్ణా జిల్లా తిరువూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సీమాంధ్ర ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని సీమాంధ్ర ప్రజలు క్షమించరని చెప్పారు. విభజన తీరుకు నిరసనగా పార్టీ సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి రాజీనామా చేసినప్పటికీ తాను మాత్రం చివరివరకు ఎమ్మెల్యేగా కొనసాగుతానని స్పష్టం చేశారు. గతంలో సీడబ్ల్యూసీలో రాష్ట్ర విభజనకు ఆమోదం తెలిపినప్పుడే రాజీనామా చేద్దామని తనతో సహా పలువురు ఎమ్మెల్యేలు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిని, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కోరినప్పటికీ వారు ఉదాసీనంగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, కాంగ్రెస్ను వీడిన తదుపరి రాజకీయాల్లో కొనసాగాలా, వద్దా, ఏ పార్టీలో చేరాలనే విషయాలను నిర్ణయించుకుంటానని ఆమె వివరించారు. -
‘గిరి’గీసుకున్నారా..
సమైక్య ఘోష పట్టని గిరిజన మంత్రులు ఒకరిది వి‘భజన’వాదం మరొకరిది మౌనవేదం ఇద్దరూ...ఇద్దరే...! ఒకరిది విభజనవాదం...మరొకరిది పలాయనవాదం. విభజనపై రాష్ట్రం మండుతుంటే....ఒకరు పార్టీ జపం చేస్తున్నారు...మరొకరు మౌనంగా చోద్యం చూస్తున్నారు. జిల్లాలో ‘హస్త’రేఖలు గల్లంతవుతుంటే ఈ ఇద్దరు మాత్రం ‘గిరి’గీసుకు కూర్చుకున్నారు. జనం ఘోష వినబోమంటూ ఒట్టు పెట్టుకున్నారు... సమైక్యవాదుల ఆగ్రహానికి కేంద్రబిందువులవుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత కూడా జిల్లాకు చెందిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు వైఖరిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ఓటేసి గెలిపించిన నియోజక వర్గ ప్రజల కంటే రాష్ట్రాన్ని నిలువునా చీల్చిన కాంగ్రెస్ అధిష్టానమే ముఖ్యమన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. అడ్డగోలు విభజన పట్ల జిల్లావ్యాప్తంగా నిరసనలు వ్యక్తమౌతుండగా బాలరాజు మాత్రం కనీస విచారం కూడా వ్యక్తం చేయకుండా పార్టీ అధిష్టానం నిర్ణయం శిరోధార్యమని ప్రకటిస్తూ సమైక్యవాదుల ఆగ్రహానికి గురౌతున్నారు. బాలరాజు వైఖరిని నిరసిస్తూ అరకుతో పాటు పలుచోట్ల సమైక్యవాదులు బుధవారం నాడు ఆయన దిష్టిబొమ్మలు, ఫ్లెక్సీలను దహనం చేశారు. జిల్లాకు చెందిన కేంద్రమంత్రి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు లోక్ సభలో విభజన బిల్లు ఆమోదం పొందిన వెంటనే మంగళవారం నాడే రాజీనామాలు సమర్పించగా బాలరాజు ఆ దిశగా ఆలోచనే చేయలేదు. బుధవా రం ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో బాలరాజు మాజీ అయిపోయారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉండగా విశాఖ మన్యం అభివృద్ధి, నియోజక వర్గ ప్రగతి గురించి ఏనాడూ పట్టించుకొన్న పాపానే పోలేదనే విమర్శలనెదుర్కొన్న బాలరాజు రెండు రోజుల క్రితం మాత్రం హడావుడిగా కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు చేయడం వివాదాస్పదమైంది. శంకుస్థాపనలు చేసిన పలు పథకాలకు నిధులు మంజూరు కాలేదని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. మౌనం వహించిన కిశోర్ అరకు లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ విభజన వ్యవహారంలో మౌనంగా ఉండడం గిరిజనుల్లో ఆగ్రహాన్ని రగిల్చింది. మిగిలిన కేంద్ర మంత్రులు కనీసం లోక్సభలో విభజన ప్రక్రియకు వ్యతిరేకంగా నిరసన తెలుపగా కిశోర్ అటువంటి ప్రయత్నమే చేయలేదు. విభజన బిల్లు ఆమోదం తరువాత ఎక్కడా కనీసం నోరు కూడా విప్పలేదు. మౌనమే శ్రీరామరక్షగా మిన్నకున్నారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ తమకు ప్రాతినిధ్యం వహిస్తూ కూడా తమ గోడు పట్టించుకోని వీరి పట్ల మండిపడుతున్న గిరిజనులు బుధవారం అరకులో బాలరాజు, కిశోర్ ఫ్లెక్సీలను దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. -
టీ మంటలు
జిల్లా వ్యాప్తంగా కొనసాగిన ఆందోళనలు, నిరసనలు వైఎస్సార్ సీపీ బంద్ విజయవంతం మూతపడ్డ వాణిజ్య సంస్థలు, పాఠశాలలు ‘ఛీ’లికపై కేంద్ర ఏలికల తీరుకు నిరసన వెల్లువెత్తింది. పాలుపొంగు తెలుగు గడ్డను పగులగొట్టిన కాంగ్రెస్ ఓట్లు,సీట్ల రాజకీయాలకు చరమ గీతం పాడాలంటూ జనకోటి నినదించింది. లోక్సభలో పరిణామాలకు నిరసనగా వైఎస్సార్ సీపీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నిర్వహించిన బంద్లో అన్ని వర్గాల ప్రజలూ స్వచ్ఛందంగా పాల్గొనటంతో జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్తంభిం చింది. ‘సో..నయా’ వంచనకు గురైన సీమాంధ్రుల ఆగ్రహానికి పాల కులు గరికాక తప్పదంటూ పలుచోట్ల సమైక్యాంధ్ర ద్రోహుల దిష్టి బొమ్మల్ని దహనం చేశారు. రాస్తారోకోలు, మానవహారాలు, నిరసన ప్రదర్శనలతో జిల్లా అంతటా అట్టుడికింది. ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవటంతో ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు. సాక్షి,విశాఖపట్నం : రాష్ట్ర విభజనకు నిరసనగా చెలరేగిన ఆందోళనలు బుధవారం రెండో రో జూ కొనసాగాయి. ఎక్కడికక్కడ వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పక్షాలు రోడ్లపైకి వచ్చి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. పాఠశాలలు, వాణిజ్య దుకాణాలు, వాహనాలు, సినిమాహాళ్లు స్వచ్చందంగా బంద్ పాటించాయి. వెఎస్సార్సీపీ నేతలతోపాటు జిల్లాలో అన్ని చోట్లా విద్యార్థి, ఉద్యోగ, రాజకీయ పక్షాలు నిరసన ర్యాలీలు, రాస్తారోకోలతో హోరెత్తించాయి. విభజనకు పూనుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దిష్టిబొమ్మలను, ఫెక్సీలను ఆందోళనకారులు దహనం చేశారు. సోనియాను ఇండియా నుంచి ఇటలీకి తరిమికొడితేనే దేశానికి భద్రత ఉంటుందంటూ మండిపడ్డాయి. ఏజెన్సీలో సంపూర్ణ బంద్ జరిగింది. అరకు,పాడేరు,చింతపల్లి తదితర ప్రాంతాలనుంచి ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. సీమాంధ్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా తెలంగాణ బిల్లును యూపీఏ ప్రభుత్వం లోక్సభలో ఆమోదించడాన్ని నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా ఆందోళనకారులు పాఠశాలలను మూయించారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు. నర్సీపట్నం...ఉద్రిక్తం నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర గణేష్ ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర వాహనాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు 16 మందిని బలవంతంగా అరెస్టు చేశారు. నియంతలా వ్యవహరించిన హిట్లర్ను సోనియాగాంధీ మించిపోయారని త్వరలో ఇటలీ పారిపోవడం ఖాయమని మాడుగుల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యులు బూడి ముత్యాలునాయుడు విమర్శించారు. ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఘాట్రోడ్ జంక్షన్లో బిల్లు ఆమోదానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ఓట్లు, సీట్లు కోసమే రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ రెండుముక్కలు చేసిందని వైఎస్సార్ సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. యలమంచిలిలో మూతబడ్డ పాఠశాలలు బుధవారం యలమంచిలి నియోజకవర్గంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కార్యాలయాల ను మూయించారు. మెయిన్రోడ్డుపై ర్యాలీ ని ర్వహించారు. సోనియాగాంధీ దిష్టిబొమ్మను ద హనం చేశారు. అనకాపల్లిలో బంద్ విజయవంతమైంది. అనకాపల్లి పూడిమాడక రోడ్ జాతీ య రహదారిపై వైఎస్సార్ సీపీ నేతలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో భారీ స్థాయిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. పాడేరులో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ పక్షాలు చేపట్టిన బంద్ ఏజెన్సీలో విజయవంతమైంది. పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించా రు. మైదానానికి వెళ్లే వాహనాలను రోడ్డుకు అడ్డంగా బైఠాయించి వాహనాలను అడ్డుకున్నా రు. టీడీపీ కూడా బంద్ నిర్వహించింది. డుం బ్రిగుడ మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ, టీడీపీ పక్షాలు బంద్కు తోడ్పాటు అందించాయి. బాలరాజు ఫ్లెక్సీల దహనం అరకు-పాడేరు ప్రధాన రహదారిలో మంత్రి బాలరాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేసి ప్లెక్సీలను తగులబెట్టారు. నక్కపల్లిలో జరిగిన బంద్,ఆందోళన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే,వైసీపీ నేత చెంగల వెంకటరావు పాల్గొని విభజనపట్ల నిరసన వ్యక్తంచేశారు. పాయకరావుపేటలో బంద్ ప్రశాంతంగా జరిగింది. దుకాణాలు,థియేటర్లు ,ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడ్డాయి. జాతీయ రహదారిపై చెంగల వెంకట్రావు ఆధ్వర్యర లో రాస్తారోకో నిర్వహించారు. -
శ్రీబాగ్ ఒప్పందాన్ని ఆమోదించాలి
సీమ హక్కులను నిర్లక్ష్యం చేస్తే తిరుగుబాటే బాస్ రౌండ్టేబుల్ సమావేశంలో నేతల స్పష్టీకరణ మదనపల్లెక్రైం, న్యూస్లైన్: రాష్ట్ర విభజన ఊపందుకున్న వేళ రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం సీమ నేత లు స్వరం పెంచుతున్నారు. రాయలసీమను సౌభాగ్య సీమగా మార్చగల ‘శ్రీబాగ్ ఒప్పందం’ అమలు కోసం భారతీయ అంబేద్కర్ సేన (బాస్) కొనసాగిస్తున్న ఉద్యమంలో భాగంగా శనివారం పట్టణంలోని బేబి వెల్కమ్ హోమ్లో పార్టీలకు అతీతంగా, ప్రజాసంఘా లు, వివిధ రాజకీయ పార్టీలతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ‘రాయలసీమ సమస్యలు-పరిష్కార మార్గాలు’ అన్న అంశంపై బాస్ వ్యవస్థాపక అధ్యక్షులు పీటీఎం శివప్రసా ద్ అధ్యక్షతన రౌండ్టేబుల్ సమావేశం జరిగిం ది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మార్కెట్ కమిటీ చైర్మన్ చినబాబు, టీడీపీ మాజీ ఎమెల్యే దొమ్మలపాటి రమేష్, వల్లిగట్ల రెడ్డెప్ప, సీపీఐ నాయకులు కృష్ణప్ప, సమాజ్వాదీ పార్టీకి చెంది న తుర్ల ఆనంద్యాదవ్తో పాటు పలు స్వ చ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాలు, కుల సం ఘాల నాయకులు పాల్గొని సీమ సమస్యలను వివరించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్(జీవోఎం)బిల్లులో శ్రీబాగ్ ఒప్పందంపై చర్చించక పోవడాన్ని పలువురు నేతలు తీవ్రం గా ఖండించారు. ఇప్పటికైనా సీమ హక్కులపై స్పందించి లోక్సభ, రాజ్యసభల్లో చర్చించి, శ్రీబాగ్ అమలును ఆమోదించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. లేకుంటే సీమ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా తిరుగుబాటు తప్పదని నాయకులు హెచ్చరించారు. ఈ సమావేశంలో బాస్ జిల్లా అధ్యక్షుడు బందెల గౌతమ్కుమార్, వైఎస్సార్ సీపీ నాయకులు జింకా వెంకటాచలపతి, పోర్డు లలితమ్మ, కృషి సుధాకర్, డీఎస్ఎస్ నాయకుడు చిన్నప్ప, బీసీ నాయకులు పులిశ్రీనివాసులు, డీవీ.రమణ, రాయల్బాబు, కొమరం భీమ్ అధ్యక్షులు దివాకర్, బాస్ నాయకులు శ్రీచందు, కేవీ.రమణ, నాషీ, మను, లారా, లక్ష్మి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మండలిలో చర్చిస్తాం ఏళ్ల తరబడి రాయలసీమ కరువు కోరల్లో విలవిల్లాడుతోం ది. ఇక్కడి ప్రజల నీటి కష్టాలు వర్ణనాతీతం. వ్యవసాయం, ఉద్యోగ, ఉపాధి, పారిశ్రామిక రంగం, అభివృద్ధి సూచిల్లో తెలంగాణ కంటే సీమ వెనుకబడింది. శ్రీబాగ్ ఒప్పంద అమలు ద్వారా సీమ కష్టాలు తీరుతాయి. దీనిపై శాసనమండలిలో చర్చిస్తా. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పార్టీ పొలిట్బ్యూరోలో మాట్లాడుతా. - ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి (వైఎస్సార్సీపీ) మ్యానిఫెస్టోలో పెట్టేవిధంగా ఒత్తిడి తెద్దాం శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేస్తామని రానున్న ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ మ్యానిఫెస్టోలో పెట్టే విధంగా సీమ నేతలు ఒత్తిడి తేవాలి. రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. ఈ ప్రమాదం నుంచి సీమను కాపాడుకోవాలంటే శ్రీబాగ్ ఒప్పందం అమలు జరగాల్సిందే. - దొమ్మలపాటి రమేష్, మాజీ ఎమ్మెల్యే(టీడీపీ) నదీ జలాలు సీమకే కేటాయించాలి కృష్ణ, తుంగభద్ర, పెన్నా నదుల నీటిపై శ్రీబాగ్ ఒప్పందం ద్వారా సంపూర్ణ హక్కులు లభించినా, దాన్ని కాలరాసి కోస్తాంధ్ర, తెలంగాణాలకు నదీజలాలను తరలించుకుపోతున్నారు. 40 అడుగుల్లో భూగర్భ జలాలున్న కోస్తాంధ్రకు నదీజలాలు ఇస్తున్నారు. వెయ్యి అడుగుల బోర్లు వేసినా నీళ్లు పడని సీమకు నదీ జలాలు ఇవ్వకుండా ఎడారిగా మార్చారు. సీమాంధ్ర నేతలు శ్రీబాగ్ ఒప్పందం అమలుకు కృషి చేయాలి. - జింకా చలపతి వైఎస్సార్సీపీ సీమను సింగ్పూర్లా మార్చుకుందాం 30 ఏళ్లలో సింగపూర్ ఎంతో అభివృద్ధి సాధించి అమెరికా వంటి దేశాలతో పోటీపడుతోంది. సీమలో అపారమైన ఖనిజ, అటవీ సంపద ఉన్నాయి. నదీజలాలు, విద్యుత్ మిగులు ఉంది. కష్టజీవులున్నారు. ఈ వనరులన్నీ వినియోగంలోకి తెస్తే రాయలసీమ రానున్న 20 ఏళ్లలో సింగపూర్ ను మించిపోతుంది. శ్రీబాగ్ ఒప్పందం అమలుకు రాజకీ య పార్టీలు ఉద్యమించాలి. - పీటీఎం. శివప్రసాద్, బాస్ వ్యవస్థాపక అధ్యక్షులు -
జిల్లాకు రిక్త హస్తం
బడ్జెట్ కేటాయింపులు అరకొర ఆశలు గల్లంతు విమ్స్కు రూ.10 కోట్లు కేజీహెచ్ను విస్మరించారు రాష్ట్ర విభజన అంశం.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణం.. ఇటువంటి పరిస్థితుల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లాకు వరాల వర్షం కురుస్తుందని అందరూ భావించారు. చివరి బడ్జెట్లో ప్రభుత్వం జిల్లాకు రిక్తహస్తాన్నే చూపించింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్న సీఎం.. సీమాంధ్రకు చెందిన ఆర్థిక శాఖా మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి ఈ బడ్జెట్లో జిల్లాకు పెద్ద పీట వేస్తారన్న ఆశలు నెలకొన్నాయి. అందుకు భిన్నంగా అరకొర నిధులతో చేతులు దులుపుకున్నారు. విశాఖ రూరల్, న్యూస్లైన్: రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత ప్రధాన నగరమైన విశాఖ అభివృద్ధిని గాలికొదిలేశారు. పురోగతి సాధించని నీటి పారుదల శాఖకు కూడా నిర్వహణలకు అంచనా వ్యయాన్ని చూపించారు తప్పా.. పూర్తి స్థాయిలో అవసరమైన కేటాయింపులు చేయలేదు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లక్షా 83 వేల 129 వేల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో జిల్లాకు సంబంధించి వివిధ ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి కేవలం రూ.30 కోట్లు వరకు మాత్రమే కేటాయించింది. ప్రతిపాదిత ప్రాజెక్టులకు కానీ, ప్రస్తుతం కొనసా..గుతున్న వాటికి కానీ ఎటువంటి నిధులను మంజూరు చేయకపోవడం గమనార్హం. నీటి పారుదలకు అరకొర నిధులు జిల్లాలో నీరుపారుదల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రతీ ఏటా బడ్జెట్లో అన్యా యం జరుగుతూనే ఉంది. కనీసం రిజర్వాయర్ల నిర్వహణకు కూడా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించడం లేదు. ప్రతీ ఏటా వ రదలు కారణంగా రిజర్వాయర్లు దెబ్బతింటు న్నా.. వాటి మరమ్మతులకు పైసా కూడా ఇవ్వ డం లేదు. అధికారులు పంపించిన ప్రతిపాదనలను కూడా కనీసం పరిశీలించలేనట్లు తెలుస్తోంది. ఎన్నికల బడ్జెట్గా ప్రవేశపెట్టిన ఇందు లో కూడా జిల్లా నీటి పారుదల శాఖకు అరకొరగానే నిధులు కేటాయింపులు జరిగాయి. ఆరోగ్యాన్ని మరిచారు.. : జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులకు ఈసారి కూడా మొండి చెయ్యి చూపించారు. విమ్స్కు మాత్రం రూ.10 కోట్లు కేటాయించారు. వాస్తవానికి విమ్స్కు రూ.60 కోట్లు అవసరమని రెండేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపినప్పటికీ ఇప్పటి వరకు దశల వారీగా విడుదల చేస్తూ వస్తున్నారు. దీంతో నిర్మాణ, అవసరాల ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజలకు వైద్య సేవలందిస్తున్న కేజీహెచ్లో అదనపు బ్లాక్ల నిర్మాణం, నిర్వహణలకు ఈసారి బడ్జెట్లో నిధులు వస్తాయని భావించినప్పటికీ ఆ విషయాన్ని విస్మరించారు. అదే విధంగా విక్టోరియా ఆస్పత్రి, ప్రభుత్వ ఈఎన్టీ, ఇతర ఆస్పత్రులకు కూడా ఎటువంటి నిధులివ్వలేదు. విమానాశ్రయానికి కేవలం రూ.కోటి మాత్రమే ఇచ్చారు. -
ప్రజాప్రతి‘నిధుల’
ఎన్నికల కాలం.. ఓట్ల కోసం నేతల పాట్లు పనుల వరద.. కమీషన్ల దందా సాక్షి, సిటీబ్యూరో: ఓ వైపు.. రాష్ట్ర విభజన.. తెలంగాణ ఏర్పాటు అంశం. మరో వైపు.. త్వరలో లోక్సభ (ఎంపీ) ఎన్నికలకు నోటిఫికేషన్. బహుశా.. అసెంబ్లీ ఎన్నికలకు కూడా త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం. ...ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధుల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటివరకూ తీరిగ్గా సొంతపనుల్లో మునిగి తేలిన నేతలంతా ఇప్పుడు మరోమారు ఓట్లు పొందేందుకు పాట్లు పడుతున్నారు. పనులు చేయకుండా ప్రజల ముందుకెళ్లేందుకు మొహం చెల్లక.. చివరిక్షణంలో ఆదరాబాదరాగా పనులు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వీలైనన్ని రూపాల్లో నిధులు సేకరిస్తున్నారు. నియోజకవర్గాల్లో పనులు చేయాల్సిందిగా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఏదోవిధంగా ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తూనే.. కమీషన్లు సైతం రాబట్టే విధంగా ద్విముఖ వ్యూహంతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీలో అధికార కూటమిగా ఉన్న కాంగ్రెస్-ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎంపీలు త్వరితంగా పనులు చేయాల్సిందిగా హుకుం జారీ చేస్తున్నారు. ఇందుకోసం నిధులు మంజూరుకు పట్టుబడుతున్నారు. ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేల నిధులు, ఎంపీలకు ఎంపీల్యాడ్స్ నిధులు ఉన్నప్పటికీ.. జీహెచ్ఎంసీ నుంచి సైతం నిధులు మంజూరు చేయించుకుంటున్నారు. కారణం.. ఎన్నికల కోడ్ వస్తే కొత్త పనులు చేపట్టేందుకు వీలుండదు. అందుకే ఇటీవల శ్రద్ధ చూపి మరీ ఆయా పనులకు రూ.కోట్లు మంజూరు చేయించుకున్నారు. ఇంకా చేయించుకుంటున్నారు. ఇంతకాలం పనులు చేసినా.. చేయకపోయినా గడచిపోయింది. కానీ.. ప్రజల ముందు మళ్లీ నిలబడాలంటే కాసిన్ని పనులైనా చేయక తప్పదని భావిస్తున్నారు. ఇలా జీహెచ్ఎంసీ నుంచి పనులు మంజూరు చేయించుకున్న వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సనత్నగర్, ఎల్బీనగర్, ఉప్పల్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు శశిధర్రెడ్డి, సుధీర్రెడ్డి, రాజిరెడ్డి, మల్కాజిగిరి ఎంపీ సర్వే సత్యనారాయణ ఉన్నారు. వీరు రోడ్లు, వరదనీటి కాలువలు, కమ్యూనిటీ హాళ్లు తదితర పనుల కోసం రూ.17.50 కోట్లు మంజూరు చేయించుకున్నారు. మరో ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ (మల్కాజిగిరి) పనుల ప్రతిపాదనలు అందజేశారు. ఎంఐఎం నుంచి ఎమ్మెల్యేలు బలాలా, మోజంఖాన్ ప్రతిపాదనలు అందజేశారు. వారి పనులకు నిధులు మంజూరు కావాల్సి ఉంది. సొంతలాభమూ... పుణ్యం.. పురుషార్థం.. అన్నట్లు ఓవైపు పనులు చేశామని చెప్పి.. ప్రజల ఓట్లడిగేందుకు సిద్దమవుతూనే.. ఎక్కువ పనుల మంజూరు ద్వారా సొంతలాభం కూడా చూసుకోవచ్చుననే యోచనలో కొందరు ప్రజాప్రతినిధులున్నారు. పనులు చేపట్టే ఆయా కాంట్రాక్టు సంస్థల నుంచి నజరానాలు, కమీషన్లు ముట్టడం పరిపాటే కావడంతో దాన్నీ వినియోగించుకోవాలని భావిస్తున్నారు. మేయర్ సైతం.. ఇక రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయగలరని భావిస్తున్న.. జీహెచ్ఎంసీ ప్రస్తుత మేయర్ మాజిద్ హుస్సేన్ సైతం తన కార్పొరేటర్ ఫండ్ నుంచే కాక, జీహెచ్ఎంసీ సాధారణ నిధుల నుంచి సైతం వీలైనన్ని నిధులు మంజూరు చేయించుకుంటున్నారు. అంతేకాదు.. తమ ఎంఐఎం పార్టీ.. దాని వ్యవస్థాపకుడు సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ పేరును వీలైనన్ని పథకాలకు పెట్టే పనిలో ఉన్నారు. ఇప్పటికే టోలిచౌకి ఫ్లై ఓవర్, తాగునీటి ఆర్ఓ ప్లాంట్లకు ఒవైసీ పేరు పెట్టేందుకు సిద్ధమయ్యారు. తద్వారా ఎంఐఎం పార్టీకి ప్రజల మద్దతు లభించగలదని భావిస్తున్నారు. -
కొనసాగుతున్న సమ్మె
సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు చేస్తున్న సమ్మె శుక్రవారం రెండోరోజుకు చేరింది. రెండోరోజుకు సమ్మెలో పాల్గొనే వారి సంఖ్య మరింత పెరిగింది. విజయవాడలో మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు విధులను బహిష్కరించి భారీ ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు రిక్షా తొక్కి నిరసన తెలిపారు. సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో కోర్టుల నుంచి ఈ కార్యక్రమం జరిగింది. మహిళా న్యాయవాదులు కూడా రిక్షా తొక్కి తమ నిరసన తెలియజేశారు. పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మూయించిన ఎన్జీఓ నాయకులు అనంతరం అక్కడ ధర్నా చేశారు. ఎపీఎన్జీవో పశ్చిమకృష్ణా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడితే తమ ఉద్యమం మరింత తీవ్రం అవుతుందని హెచ్చరించారు. కైకలూరులో జేఏసీ ఆధ్వర్యంలో తాలూకా సెంటర్లో ఉద్యోగులు రిలే దీక్షలు చేపట్టారు. అనంతరం జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. రాష్ట్ర విభజనకు నిరసనగా కలిదిండి సెంటరులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దిష్టిబొమ్మను శుక్రవారం జేఏసీ నాయకులు దహనం చేశారు. నూజివీడులో సమైక్య ఆంధ్రప్రదేశ్కు మద్దతుగా కోర్టు సెంటరులో చేపట్టిన రిలేదీక్షలు శుక్రవారం నాటికి రెండోరోజుకు చేరాయి. ఈ దీక్షలలో న్యాయవాదులు పుట్టా లక్ష్మణరావు, అక్కినేని రమాకుమారి, న్యాయవాద గుమాస్తా కొత్తపల్లి వెంకటేశ్వరరావు కూర్చున్నారు. ముత్తంశెట్టి ట్రస్టు ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా చిన్నగాంధీబొమ్మ సెంటరులో నిర్వహిస్తున్న రిలేదీక్షలు శుక్రవారం నాటికి రెండో రోజుకు చేరాయి. ఈ దీక్షలను ప్రారంభించిన మున్సిపల్ మాజీ చైర్మన్ కణతుల శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుజాతిని ఒక్కటిగా ఉంచాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా స్థానిక చిన్నగాంధీబొమ్మ సెంటర్లో సెయింట్ఆన్స్ హైస్కూల్ విద్యార్థులు శుక్రవారం మానవహారం నిర్వహించారు. అనంతరం రాస్తారోకో జరిపారు. కంచికచర్లలో స్థానిక సబ్ట్రెజరీ కార్యాలయం వద్ద ఎన్జీవోలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పామర్రు జెడ్పీ పాఠశాల విద్యార్థులు సమైక్యాంధ్ర కావాలి, విభజన వద్దు అంటూ నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలికి చేరుకుని మానవహారంగా ఏర్పడి ట్రాఫిక్ను స్తంభింపజేసి తమ నిరసన తెలిపారు. ఈ నెల 9న విజయవాడలో పీడబ్ల్యూడీ గ్రౌండ్ నుంచి ప్రారంభం కానున్న సమైక్య రన్కు మద్దతుగా శుక్రవారం కంచికచర్ల శ్రీరాజ్యలక్ష్మీ గ్యాస్ కంపెనీ వద్ద నుంచి 65వ నంబరు జాతీయ రహదారి గుండా నెహ్రూ సెంటర్ వరకు కాంగ్రెస్ నాయకులు, వివిధ ప్రైవేటు విద్యాసంస్థల అధినేతలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సమైక్య రన్ నిర్వహించారు. కొండపల్లి గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టారు. దీనిలో భాగంగా కొండపల్లి ప్రధాన కూడళ్లలోని మార్కెట్ సెంటర్, బ్యాంక్ సెంటర్, రైల్వే స్టేషన్ సెంటర్, బీ కాలనీలలో ప్రజలను, ప్రయాణికులను కలుసుకుని రాష్ట్ర విభజన వలన జరిగే నష్టాలు వివరిస్తూ వారితోనే కార్డులు రాయించి రాష్ట్రపతికి పంపారు. -
ఉవ్వెత్తున ఎగసిన ఉద్యోగ గళం
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎన్జీవోల నినాదాలు ప్రభుత్వ కార్యాలయాల్లో స్తంభించిన కార్యకలాపాలు బోసిపోయిన కలెక్టరేట్ విశాఖ రూరల్, న్యూస్లైన్: మళ్లీ సమ్మె సైరన్ మోగింది. సమైక్యాంధ్ర పరిరక్షణ ధ్యేయంగా ఉద్యోగుల గళం గర్జించింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో మళ్లీ పని స్తంభించిపోయింది. ఉద్యోగ సంఘాల నాయకుల పిలుపు మేరకు సమ్మె మళ్లీ మొదలైంది. ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు గురువారం ఉదయం విధులను బహిష్కరించి రోడ్ల మీదకు వచ్చి విభజనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారి ఆందోళనతో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. గ్రామ కార్యాలయాల నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు అన్నీ మూతపడ్డాయి. ఉద్యోగులు లేక ఆఫీసులు బోసి పోయాయి. పాడేరులో ఐటీడీఏ, సబ్కలెక్టర్ కార్యాలయాలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నేతలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. పీవో వి.వినయ్చంద్ను కలిసి సమైక్యాంధ్రకు మద్దతుగా తాము చేపడుతున్న సమ్మెకు సహకరించాలని కోరారు. ఎన్జీవో నేతలు, పలు శాఖల ఉద్యోగులు పాడేరు వీధుల్లో ర్యాలీ చేపట్టారు. ఐటీడీఏ ఎదుట ధర్నా నిర్వహించారు. పాతబస్టాండ్లో రాస్తారోకో చేపట్టి రాష్ట్ర విభజన చర్యలను నిరసించారు. కాగా ఎన్జీవోల సమ్మెతోఅంగన్వాడీ లింక్ వర్కర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు ఇబ్బంది పడ్డారు. ట్రైకార్ పథకంలో రుణాలు కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చినవారు నిరాశతో వెనుతిరిగారు. రెవెన్యూ డివిజన్ కేంద్రం నర్సీపట్నంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. రెవెన్యూ అధికారులు పెన్ డౌన్ చేయగా సిబ్బంది పూర్తిస్థాయిలో విధులను బహిష్కరించారు. అనకాపల్లిలోనూ ఇదే పరిస్థితి చోటుచేసుకుంది. కార్యాలయాలకు తాళాలు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు ఎపీఎన్జీవోలు, ఏపీఆర్ఎస్ఏ, పంచాయతీ రాజ్ ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి విధులను బహిష్కరించారు. ఉన్నతాధికారులు మినహా తహశీల్దార్ నుంచి కింది స్థాయి వరకు ప్రతీ ఒక్కరూ సమ్మెలో పాల్గొన్నారు. ఎప్పటిలాగే ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చినా విధులకు హాజరుకాకుండా రోడ్లపైకి వచ్చి సమైక్య నినాదాలు చేశారు. తహశీల్దార్ కార్యాలయాలే కాకుండా జిల్లా కలెక్టరేట్లో సెక్షన్లకు తాళాలు వేశారు. నిత్యం జనాలతో కిటకిటలాడే కలెక్టర్ కార్యాలయం గురువారం బోసి పోయింది. రెవెన్యూ అసోసియేషన్ నాయకులు కలెక్టరేట్లోనే టెంట్ వేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్.నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఇతర నాయకులు, తహశీల్దార్లు జాయింట్ కలెక్టర్ ప్రవీణ్కుమార్ను కలిసి సమ్మెలోకి వెళుతున్నట్లు చెప్పారు. కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ను శుక్రవారం కలిసి సమ్మె విషయాన్ని చెప్పనున్నారు. బలవంతంగా మూసివేత ఉద్యోగ సంఘాల నాయకులు గురువారం ఉదయం నగరంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ తిరిగారు. డీఈఓ, కమర్షియల్ ట్యాక్ ఆఫీస్లలో విధులు నిర్వర్తిస్తున్న కొంత మంది ఉద్యోగులను బలవంతంగా బయటకు తీసుకువచ్చారు. కార్యాలయాలను మూసివేశారు. అలాగే ఇతర శాఖలకు కూడా వెళ్లి కార్యాలయాలన్నింటినీ మూయించారు. గ్రామీణ జిల్లాలో గ్రామ కార్యాలయాల నుంచి మండల తహశీల్దార్ ఆఫీస్ల వరకు మొత్తం మూత పడడంతో పాలన స్తంభించిపోయింది. పార్లమెంట్ సమావేశాలు ముగిసేంత వరకు విధులను బహిష్కరించాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. మున్ముందు మరిన్ని శాఖల ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటారని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నాయకులు చెబుతున్నారు. ఆ నలుగురికీ మినహాయింపు విశాఖ రూరల్, న్యూస్లైన్ : విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు చేపట్టిన సమ్మె బాట నుంచి నలుగురు తహశీల్దార్లకు వినహాయిం పు ఇచ్చారు. ఈ నలుగురూ జూలైలో పదవీ విరమణ చేయనున్నారు. రిటైర్మెంట్ ప్రయోజనాలు పోకుండా ఉండేందుకు రెవెన్యూ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. గాజువాక తహశీల్దార్ వి.సింహాద్రిరావు, ఆనందపురం తహశీల్దార్ నెహ్రూబాబు, ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ తహశీల్దార్ వై.పి.ఎస్.రాణి, కలెక్టరేట్లో ఉన్న రెవెన్యూ డివిజన్ ఆఫీస్ స్పెషల్ తహశీల్దార్ ఎన్.వి.సూర్యనారాయణలు గురువారం విధులు నిర్వర్తించారు. గత ఏడాది ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు జరిగిన సమ్మెలో వీరు పాల్గొన్నారు. -
సమ్మె షురూ!
మచిలీపట్నం, న్యూస్లైన్/సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన మలివిడత సమ్మె గురువారం జిల్లాలోనూ ప్రారంభమైంది. మున్సిపల్ ఉద్యోగులు జిల్లా వ్యాప్తంగా పెన్డౌన్ చేసి విధులను బహిష్కరించారు. మొత్తం 80 శాతం మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారని అంచనా. బందరులోని పలు ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. కలెక్టరేట్ ప్రాంగణంలోని వివిధ సంక్షేమ కార్యాలయాలు, గ్రామీణాభివృద్ధి శాఖ, ఖజానాశాఖ, పంచాయతీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయంలోని అన్ని సెక్షన్లు, డీఎస్వో, విద్యాశాఖ కార్యాలయాలు తెరుచుకోలేదు. ఏపీ ఎన్జీవో నాయకులు సమ్మెలో పాల్గొనాలని కార్యాలయాలు తిరుగుతూ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. జేఏసీ తూర్పు కృష్ణా చైర్మన్ రొండి కృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విభజించేందుకే కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పార్టీలకతీతంగా వ్యతిరేకించాలని, అందుకు సహకరించని ప్రజాప్రతినిధులను రాబోయే ఎన్నికల్లో ఓడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రావి శ్రీనివాసరావు, ఎల్.వి.సూర్యకుమార్, పి.సాయికుమార్, బి.సీతారామయ్య, ఆకూరి శ్రీనివాసరావు, హుస్సేన్, తస్లీంబేగ్, శ్రీమన్నారాయణ, రాజేంద్రప్రసాద్, వి.సత్యనారాయణసింగ్, శివశంకర్, శోభన్బాబు తదితరులు పాల్గొన్నారు. చల్లపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు రాస్తారోకో చేశారు. జగ్గయ్యపేట పట్టణంలో రంగుల మహోత్సవానికి తరలివచ్చిన శ్రీ తిరుపతమ్మ ఉత్సవమూర్తులకు రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం సభ్యులు వినతిపత్రం సమర్పించారు. జగ్గయ్యపేటలో మున్సిపల్ కూడలిలో ధర్నా చేసి మానవహారం చేపట్టారు. నూజివీడు పట్టణంలోని చిన్నగాంధీబొమ్మ సెంటరులో ముత్తంశెట్టి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అఖిలపక్ష జేఏసీ రిలేదీక్షలను ప్రారంభించింది. నూజివీడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు సెంటరులో రిలేనిరాహార దీక్షలను ప్రారంభించారు. సెయింట్ థామస్ హైస్కూల్ విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి చిన్నగాంధీబొమ్మ సెంటరులో మానవహారం నిర్వహించారు. నందిగామ పట్టణంలోని గాంధీ సెంటర్లో సమైక్యాంధ్రకు మద్దతుగా వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. కంకిపాడు సినిమాహాలు సెంటరులో సమైక్యవాదులు రాస్తారోకో చేపట్టారు. బెజవాడలో.. విజయవాడలో ఎన్జీవో నేతలు ఉదయం 10 గంటలకు ఇరిగేషన్ కార్యాలయానికి వెళ్లి సమ్మెలో పాల్గొనాలని ఉద్యోగులను కోరారు. అక్కడి నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లారు. జేఏసీ కన్వీనర్ ఎ.విద్యాసాగర్ నేతృత్వంలో ఉద్యోగ సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో ఈ ఆందోళనలో పాల్గొన్నారు. సబ్కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి సిబ్బందిని బయటకు పంపించి వేశారు. సబ్కలెక్టర్ హరిచందనను కలిసి సమ్మెకు సహకరించాలని కోరారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాలకు ఎన్జీవో నేతలు తాళాలు వేశారు. న్యాయవాదులు ఎడ్లబండ్లతో ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
విభజనను సుప్రీంకోర్టులో సవాల్చేస్తాం
సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ మట్టా జయకర్ విజయవాడ లీగల్, న్యూస్లైన్ : రాష్ట్ర విభజనలో రాజకీయాలు జరిగితే సుప్రీం కోర్టులో సవాల్చేస్తామని న్యాయవాదుల సీమాంధ్ర జేఏసీకన్వీనర్, బీబీఏ అధ్యక్షుడు మట్టా జయకర్ స్పష్టంచేశారు. స్థానిక ఎ.ఎస్.రామారావు హాలులో సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగానే తాము ఉద్యమం చేపట్టామన్నారు. సీమాంధ్ర జేఏసీ కోకన్వీనర్, ఏపీ బార్కౌన్సిల్ సభ్యుడు ముప్పాల సుబ్బారావు మాట్లాడుతూ మూడేళ్ల క్రితమే విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని తీర్మానించినా విస్మరించి, ఆంధ్రప్రదేశ్ విభజనకు పూనుకోవడం దారుణమన్నారు. బీబీఏ మాజీ అధ్యక్షుడు గోగుశెట్టి వెంకటేశ్వరరావు, ఏపీ బార్ కౌన్సిల్ బాధ్యుడు సుంకర రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఉద్యమాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందన్నారు. సమైక్యరాష్ట్రం కోసం న్యాయవాదుల విధుల బహిష్కరణను ఫిబ్రవరం మూడో తేదీ వరకూ పొడిగిస్తూ తీర్మానం చేశారు. ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు ఎస్.కృష్ణ మోహన్, వి.బ్రహ్మారెడ్డి, వివిధ బార్ అసోసియేషన్ల ప్రతినిధులు జవహర్లలీ, కె.రామకృష్ణ, వి.రమణారావు, శ్రీనివాసరావు, నరహరిశెట్టి శ్రీహరి, కె.ఎస్,సుధాకర రాజు పాల్గొన్నారు. సమైక్యాంద్ర కోసం న్యాయవాదులే ఎందుకు ఉద్యమం చేయాలంటూ కొంత మంది న్యాయవాదులు కరపత్రాలు పంచారు. -
కాంగ్రెస్, టీడీపీలదే విభజన పాపం
నగరి, న్యూస్లైన్: రాష్ట్రం విడిపోతే ఆ పాపం కాంగ్రెస్, టీడీపీలకే చెందుతుందని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు రోజా పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అంశంలో కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరి స్తున్న తీరుపై ఆమె మండిపడ్డారు. నగరిలోని టవర్క్లాక్ సెంటర్ వద్ద స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి సోమవారం మానవహారం నిర్వహించారు. ఒకే భాష, ఒకే రా ష్ట్రం అంటూ నినాదాలు హోరెత్తించా రు. రోజా మాట్లాడుతూ స్వార్థ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని విభజించేందుకు కాంగ్రెస్ కంకణం కట్టుకుందని విమర్శించారు. విభజన జరిగితే ప్రజలు నష్టపోతారని వైఎస్ఆర్సీపీ చెబుతున్నా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. పార్టీని కాపాడుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయు డు రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని తెలిపారు. సమైక్య రాష్ర్టం కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కేజేకుమార్, పార్టీ రూరల్ మండల కన్వీనర్ భాస్కర్రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కేజేసురేష్, టీకే హరిప్రసాద్, జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి రహీం, మైనారిటీ కన్వీనర్ ఎన్.ఎం.బాషా, స్థానిక నాయకులు బీఆర్వీ అయ్యప్పన్, కన్నాయిరం, గోవర్దన్, నాగరత్నం, ధనపాల్రెడ్డి, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
సమైక్య బంద్ సంపూర్ణం
=ఆగిన ఆర్టీసీ బస్సులు = వాయిదాపడిన పరీక్షలు సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పిలుపుమేరకు శుక్రవారం జిల్లావ్యాప్తంగా బంద్ జరిగింది. అనేకచోట్ల జనజీవనం స్తంభించింది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, తెలుగుదేశం పార్టీలు కూడా బంద్ నిర్వహించాయి. సమైక్యవాదులు బస్ డిపోల ముందు బైఠాయించడంతో ఎక్కడి బస్సులు అక్కడ నిలిచిపోయాయి. జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. జిల్లాలోని విద్యాసంస్థలు, బ్యాంకులు, వర్తక, వాణిజ్య దుకాణాలు, హోటళ్లు, పెట్రోల్ బంక్లు, గ్యాస్ కంపెనీలు, మునిసిపల్ కార్యాలయాలు పూర్తిగా మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు సాయంత్రం వరకు తిరగకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ‘బంద్ కారణంగా ఈరోజు పాఠశాలకు సెలవు’ అని బోర్డులు పెట్టి మరీ సహకరించాయి. విజయవాడలో ఎన్జీవోలు తెల్లవారుజాము నుంచే బస్టాండ్ ఎదుట బైఠాయించి బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. తెలుగు ప్రజలను ఏ ప్రాతిపదికన విభజిస్తున్నారో చెప్పకుండా అడ్డగోలుగా నిర్ణయం తీసుకోవడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ జలీల్ఖాన్ విమర్శించారు. తెలుగుజాతి ముక్కలు కాకుండా చూడటానికి చిత్తశుద్ధితో పని చేస్తున్న ఏకైక నేత వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని చెప్పారు. బంటుమిల్లి చౌరస్తాలో వ ంటావార్పు నిర్వహించారు. పెడనలో 216 జాతీయ రహదారిపై బైఠాయించారు. కంచికచర్లలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. టీడీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కలిదిండి సెంటరులో వైఎస్సార్సీపీ నాయకులు టైర్లు అంటించి నిరసన తెలియజేశారు. జగ్గయ్యపేటలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు, సమైక్యవాదులు తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి కార్యాలయాన్ని మూసివేయించి అక్కడే ధర్నా చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ, విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ విధానం రద్దు కోరుతూ హనుమాన్జంక్షన్లో శుక్రవారం ఆందోళన చేశారు. బంద్ వల్ల ఆర్టీసీకి రూ.90 లక్షల మేర నష్టం ఏర్పడిందని అధికారులు తెలిపారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో... పెనమలూరు మండలంలో సమన్వయకర్తలు తాతినేని పద్మావతి, పడమట సురేష్బాబు, పామర్రులో ఉప్పులేటి కల్పన, తిరువూరు నియోజకవర్గంలో బండ్రపల్లి వల్లభాయ్, నూజివీడులో మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, నందిగామలో డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, కైకలూరులో దూలం నాగేశ్వరరావు, మైలవరంలో జోగి రమేష్, యువ నేత జ్యేష్ఠ శ్రీనాధ్, అవనిగడ్డలో సింహాద్రి రమేష్బాబుల ఆధ్వర్యంలో రాస్తారోకోలు, బంద్ కార్యక్రమాలు నిర్వహించారు. జగ్గయ్యపేటలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తన్నీరు నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు షేక్ మదార్సాహెబ్ ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. -
ఆర్టీసీ దైన్యం (2013 రౌండప్)
కాలగర్భంలో మరో వత్సరం కరిగి పోనుంది. గడిచిపోతున్న ఈ ఏడాది కొన్ని ఆనంద క్షణాలనే మిగిల్చినా.. సంవత్సరం మొత్తాన్ని పరికించి చూస్తే చేదు జ్ఞాపకాలే ఎక్కువగా కళ్ల ముందు మెదులుతారుు. ఇందులో ప్రధానంగా రాష్ట్ర విభజన నిర్ణయమే కంటనీరు తెప్పిస్తుంది. మన కలల పసిడి మేడను నిలువునా కూల్చేస్తూ యుపీఏ ప్రభుత్వం ఎంత తొందరగా నిర్ణయం తీసుకుందో.. అంతే తొందరగా జిల్లాలో సమైక్య ఉద్యమం బలపడింది. జిల్లా పౌరుషం.. చైతన్యం.. దేశభక్తి.. ఉద్యమ స్ఫూర్తి.. వెరసి తెలుగు జాతి ఉత్తేజితమైంది. బస్సు చక్రాలు తిరగలేదు. ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయలేదు. బడులు తెరుచుకోలేదు. హోటళ్లు, షాపింగ్ మాల్స్, వాణిజ్య సంస్థలు మూతపడ్డారుు. ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, స్వచ్ఛంద సంస్థలు రోడ్డెక్కి సమైక్య వాణి వినిపించారు. ఆర్టీసీ కార్మికులంతా ఉద్యమ బావుటా ఎగురవేయడంతో ఆ సంస్థకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో 2013 సంవత్సరంలో మన జిల్లాలో ఉద్యమ నేపథ్యం, ఆర్టీసీ నష్టాల పయనాన్ని ఒకసారి పరికిస్తే.. విజయవాడ డిపో లాభం హుష్కాకి ఆర్టీసీ కృష్ణా రీజియన్ గత ఏడాది కాలంలో కనివినీ ఎరుగని రీతిలో నష్టాలు చవిచూసింది. గతంలో వచ్చిన నష్టాల శాతాన్ని తగ్గించుకుని లాభాలవైపు దూసుకుపోవాలనే ఉద్దేశంతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఆర్టీసీకి సమైక్య సెగ కోలుకోలేని దెబ్బతీసింది. ఆర్టీసీ సిబ్బంది అంతా ఒకేసారి సమ్మె చేసిన దాఖాలలు అరుదు. సమైక్యాంధ్ర ఉద్యమానికి అన్ని యూనియన్లు భాగస్వామ్యం తీసుకోవడంతో జిల్లాలో సుమారు 60 రోజులు ఒక్క బస్సు కూడా రోడ్డుపైకి రాలేదు. ఆగస్టు 13 నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు ఆర్టీసీ కార్మికులంతా సమైక్యాంధ్ర ఉద్యమంలోనే పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా రీజియన్లో సంస్థకు రోజుకు కోటి30 లక్షల రూపాయల చొప్పున 78 కోట్ల ఆదాయం రాలేదు. సమైక్యాంధ్ర ఉద్యమం లేని ఏప్రిల్-జులైలో రూ.3కోట్ల80 లక్షల లాభం వచ్చింది. ఏటా కృష్ణా రీజియన్కు వన్నె తీసుకొచ్చే విజయవాడ డిపో నష్టాలతో సహవాసం చేస్తోంది. గత ఏడాదితో పోల్చి చూస్తే ఈసారి మే, జూన్లో మన రీజియన్ రాష్ర్టవ్యాప్తంగా గుర్తింపు సాధించింది. జూన్ నుంచి పరిశీలించి చూస్తే అత్యున్నతస్థాయిలో ఉన్న డిపో ఆదాయం అమాంతంగా పడిపోయింది. సమైక్యాంధ్ర సెగతో ఆదాయం తగ్గి డిపో నష్టాల్లో లేకపోయినా లాభాల ఆర్జన తగ్గింది. గత యేడాది జూన్లో రూ.కోటి 59లక్షలు, జులైలో రూ.రెండుకోట్లు లాభం రాగా, 2013 జూన్లో రూ.36 లక్షలు, జులైలో రూ.కోటి 62లక్షలు మాత్రమే ఆదాయం వచ్చింది. గత ఏడాది నవంబర్లో రూ.61లక్షల లాభం రాగా, ఈసారి రూ.4.76లక్షలు మాత్రమే వచ్చింది. 150 కొత్త బస్సులు వచ్చాయ్.. ఈ ఏడాది కృష్ణా రీజియన్కు సుమారు 150 బస్సులు కొత్తగా వచ్చాయి. గత ఏడాది డిసెంబర్లో ప్రారంభమైన జగదల్పూర్ సర్వీసులను ఈ ఏడాది మార్పులు చేర్పులు చేసి ప్రయూణికులకు సౌకర్యవంతంగా నడిపారు. ఫిబ్రవరి నుంచి విజయవాడ-చెన్నైకు వెన్నెల సర్వీసులు నడపడం ప్రారంభించారు. విజయవాడ-శ్రీకాకుళం మధ్య కూడా నడిపేందుకు ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు. జూన్లో నగరంలోని వైఎస్సార్ కాలనీ, ఐదో నంబర్ రూట్, ఆటోనగర్, వాంబేకాలనీ తదితర ప్రాంతాలను కలుపుతూ పలు సర్వీసులు ఏర్పాటుచేశారు. అదే నెలలో మహిళలకు ప్రత్యేక సర్వీసులు సిద్ధం చేశారు. అధికారుల రాకపోక ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సూర్యప్రకాశ్రావు మే 31వ తేదీ పదవీ విరమణ చేయగా, ఆయన స్థానంలో నాగేశ్వరరావు వ చ్చారు. ఆర్టీసీ కృష్ణా రీజియన్ మేనేజర్గా ప్రమోషన్పై వచ్చిన గోపీనాథ్రెడ్డి మే 31న బదిలీ కాగా, ఆయన స్థానంలో సుదేష్కుమార్ వచ్చారు. జూన్లో ఆర్టీసీ రీజియన్లో గ్రీవెన్స్ సెల్ను రద్దుచేసి కాల్సెంటర్ (8019999999)ను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కానున్నదా!? ఆసియా ఖండంలోనే అతిపెద్ద ట్రాన్స్పోర్టు కార్పొరేషన్గా గుర్తింపుపొందిన ఏపీఎస్ఆర్టీసీ రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో వీలినం కానున్నది. దీనికి 2013 ఏడాదే అంకురార్పణ జరిగింది. జిల్లాపై రోజుకు రూ.10లక్షల భారం ఈ ఏడాది ఆర్టీసీ ప్రయాణికుల నడ్డి విరిచిందనే చెప్పాలి. సమైక్యాంధ్ర సమ్మె ఉద్యమంతో కోట్ల రూపాయలు నష్టపోయిన ఆర్టీసీని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పుకుని నవంబరు 4వ తేదీన ప్రజలపై చార్జీల మోత మోగించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో జిల్లావాసులపై రోజుకు రూ.10లక్షల భారం పడింది. అన్ని టికెట్ రేట్లతో పాటు విద్యార్థుల బస్పాస్ల రేట్లు కూడా పెంచారు. సిటీ సర్వీసుల్లో మినహా రూరల్, ఇతరత్రా ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో జూలై ఒకటి నుంచి సెస్ చార్జీల పేరిట రూపాయిని అదనంగా వసూల్ చేయడం మొదలు పెట్టారు. -
సోనియా డెరైక్షన్లో కిరణ్ డ్రామా !
=కొనసాగుతున్న సమైక్య నిరసనలు =ముఖ్యమంత్రి తీరుపై మండిపాటు తిరుపతి, న్యూస్లైన్: తెలంగాణ బిల్లు అంశంలో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ డెరైక్షన్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి డ్రామాలాడుతున్నారని సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య ముసుగులో ముఖ్యమంత్రి విభజన నాటకాన్ని తెలివిగా రక్తికట్టిస్తున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీలో కాకుండా మండలిలో టి.బిల్లుపై చర్చకు సమ్మతమేనన్న సంకేతాలు ఇవ్వడం ఎంతవరకు సబబని మండిపడ్డారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ గురువారం జిల్లాలో పలు చోట్ల నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. పుంగనూరులో ఉద్యోగ జేఏసీ వరదారెడ్డి ఆధ్వర్యంలో సమైక్యవాదులు స్థానిక గోకుల్ సర్కిల్లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు శాసనసభ సమావేశాలు జరుగుతున్న తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి విభజనకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి బయట సమైక్యరాగం ఆలపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని వారు ఆరోపించారు. మదనపల్లెలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్జీవో జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక గిరిరావ్ థియోసాఫికల్ హైస్కూల్ విద్యార్థులు సమైక్య నినాదాలతో పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి మల్లికార్జున సర్కిల్లో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ప్రసంగిస్తూ కాంగ్రెస్కు సీమాంధ్ర ప్రజలు ఉసురు తగిలే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. పలమనేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్ రిలే దీక్షలు కొనసాగారుు. -
చేతగాని సీఎం రాజీనామా చేయాలి
=టీ బిల్లు ప్రతుల చించివేత =జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదుల నిరసన తిరుపతి, న్యూస్లైన్: రాష్ట్ర విభజనను అడ్డుకునే ప్రయత్నం చేయని సీఎం కిర ణ్కుమార్రెడ్డి తక్షణం పదవికి రాజీనామా చేయాలని సమైక్యవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఇన్నాళ్లు ప్రగల్భాలు పలికి తీరా తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చే సరికి ఆయన మొహం చాటేయడంపై మండిపడుతున్నారు. రాష్ట్ర విభజనపై టీడీపీ అధినేత చంద్రబాబుతో కలసి సీఎం కిరణ్కుమార్రెడ్డి పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. విభజనను వ్యతిరేకిస్తూ సోమవారం జిల్లాలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ మదనపల్లెలో ఎన్జీవో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కేశవరెడ్డి స్కూల్ విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ సర్కిల్లో తెలంగాణ బిల్లు నమూనా ప్రతులను చింపి నిరసన తెలిపారు. పుంగనూరులో సమైక్యవాదులు కేంద్రమంత్రి పనబాక లక్ష్మి దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ బిల్లు ప్రతులను తగులబెట్టి నిరసన తెలిపారు. జేఏసీ చైర్మన్ వరదారెడ్డి, బీసీ నాయకుడు అద్దాల నాగరాజు ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీలో తెలంగాణ బిల్లును అడ్డుకోకపోతే సిగ్గులేని సీమాంధ్ర ప్రజాప్రతినిధులను వీధుల్లో తిరగనిచ్చేది లేదని హెచ్చరించారు. చేతగాని సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పీలేరులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వివిధ కళాశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపై మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. పలమనేరులో వైఎస్ఆర్ సీపీ, కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తల రిలే దీక్షలు కొనసాగాయి. -
నిరసనల హోరు
=వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు =జిల్లా అంతటా రోడ్ల దిగ్బంధం.. అక్కడే భోజనాలు =సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యం రాష్ట్ర విభజన అంశంపై మొండిగా ముందుకెళ్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును వైఎస్సార్సీపీ వరుస ఆందోళనలతో నిరసిస్తోంది. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం జిల్లా అంతటా నాయకులు, కార్యకర్తలు రహదారులు దిగ్బంధించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా, కేంద్ర ప్రభుత్వ తీరును ఖండిస్తూ నినాదాలతో హోరెత్తించారు. రోడ్లపై వంటావార్పులతో నిరసన తెలిపారు. సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన యత్నాలకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు రహదారుల దిగ్బంధం, వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించాయి. అనంతరం నేతలు, కార్యకర్తలు, మద్దతుగా పాల్గొన్న ప్రజలు రోడ్లపైనే భోజనాలు చేసి తమ నిరసన తెలిపారు. ఆందోళనల్లో పాల్గొన్న కార్యకర్తలు, నేతలను పలుచోట్ల పోలీసులు అరెస్టు చేశారు. పామర్రు మండలంలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో మండల పరిధిలోని అడ్డాడలో రహదారుల దిగ్బంధం కార్యక్రమం నిర్వహించారు. మైలవరంలో నియోజకవర్గ సమన్వయకర్తలు జ్యేష్ఠ రమేష్బాబు స్థానిక మార్కెట్ యార్డు వద్ద, జోగి రమేష్ స్థానిక ఇంజినీరింగ్ కళాశాల వద్ద రోడ్లు దిగ్బంధించారు. వంటావార్పు చేసి అక్కడే భోజనాలు చేశారు. ఇబ్రహీంపట్నం వద్ద జాతీయ రహదారిపై జోగి రమేష్ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి రహదారి దిగ్బంధం కార్యక్రమం చేపట్టారు. దీంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. తిరువూరులో నియోజకవర్గ సమన్వయకర్త బండ్రపల్లి వల్లభాయ్ ఆధ్వర్యంలో, గూడూరు మండలంలో మచిలీపట్నం - విజయవాడ రోడ్డుపై పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో, కంచికచర్ల మండలం పరిటాల జాతీయ రహదారిపై నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో రోడ్ల దిగ్బంధం చేశారు. వంటావార్పు నిర్వహించారు. చల్లపల్లి 214 జాతీయ రహదారిని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్బాబు ఆధ్వర్యంలో దిగ్బంధించారు. దీంతో మచిలీపట్నం, విజయవాడ, అవనిగడ్డ రహదారుల్లో రాకపోకలు స్తంభించాయి. అనంతరం రహదారిపై వంటావార్పు కార్యక్రమం చేపట్టి అక్కడే నాయకులు భోజనాలు చేశారు. కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పామర్రు- కత్తిపూడి 165 జాతీయ రహదారిపై రాకపోకలను అడ్డుకున్నారు. అక్కడే వంటావార్పు చేశారు. పెనమలూరు మండలంలోని గంగూరు వద్ద నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్బాబు ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నూజివీడు, గుడివాడ, గుడ్లవల్లేరులలో పార్టీ నేతల ఆధ్వర్యంలో రహదారులను దిగ్బంధించారు. విజయవాడలో నేతల అరెస్ట్... పార్టీ విజయవాడ నగర కన్వీనర్ జలీల్ఖాన్ ఆధ్వర్యంలో కుమ్మరపాలెం సెంటర్లో జాతీయరహదారిపై వంటావార్పు చేపట్టి, రాస్తారోకో చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డగించారు. దీంతో జలీల్ఖాన్తో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి వన్టౌన్ పోలీస్స్టేషన్కు త రలించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆ పార్టీ కార్యకర్తలు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద రాస్తారోకో నిర్వహించారు. వాహనాల రాకపోకలను అడ్డగించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలిచ్చారు. -
ఆగ్రహ జ్వాలలు
=రెండో రోజూ పలుచోట్ల బంద్ =జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర విభజన బిల్లును కేంద్ర కేబినేట్ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా శనివారం కూడా ఆందోళనలు కొనసాగాయి. పలు ప్రాంతాల్లో బంద్ పాటించారు. వైఎస్సార్సీపీతోపాటు టీడీపీ,ఏపీ ఎన్జీవోలు, విద్యార్థి సం ఘాలు రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టాయి. ప్ర భుత్వ కార్యాలయాలు స్తంభించాయి. విద్యా సంస్థ లు, దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ధర్నా లు, రాస్తారోకోలు, రోడ్ల దిగ్బంధం, బైటాయింపు వంటి కార్యక్రమాలతో గ్రామీణ జిల్లా హోరెత్తింది. అరకులోయలో వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు కుంబా రవిబాబు, కిడారి సర్వేశ్వరరావు, సియ్యారి దొన్నుదొరలతోపాటు ఎమ్మెల్యే సివిరి సోమ ఆధ్వర్యంలో బంద్ పాటించారు. అరకులోయలో రోడ్లన్నీ దిగ్బంధించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు వంజంగి కాంతమ్మ, గిడ్డి ఈశ్వరిల ఆధ్వర్యంలో పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు వద్ద బైఠాయించారు. ఈమేరకు పోలీసులు, వైఎస్సార్సీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీడీపీ నేతలు మత్స్యరాస మణికుమారి, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షులు బొర్రా నాగరాజు ఆధ్వర్యంలో కూడా రాస్తారోకో, ర్యాలీ తదితర నిరసన కార్యక్రమాలు జరిగాయి. నర్సీపట్నంలో టీడీపీ నేతలు రావాడ నాయుడు, రుత్తల బాబ్జీ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. వైఎస్సార్సీపీ పిలుపు మేరకు కేడీ పేటలో రెండో రోజూ బంద్ జరిగింది. వైఎస్సార్సీపీ నేతలు చిటికెల భాస్కరనాయుడు, లగుడు మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీస్స్టేషన్కు సమీపంలో రోడ్డుకు అడ్డంగా కంచె ఏర్పాటుచేసి నిరసన తెలిపారు. మాడుగులలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. చోడవరం నియోజకవర్గ పరిధిలో బుచ్చయ్యపేటలో పలువురు యువకులు బంద్ నిర్వహించారు.అనకాపల్లిలో టీడీపీ నేత బుద్ద నాగజగధీశ్వరరావు ఆధ్వర్యాన బంద్ జరిగింది. యలమంచిలిలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జాతీయరహదారి దిగ్బంధం చేపట్టారు. ఇందులో పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు పాల్గొన్నారు. కొక్కిరాపల్లి జంక్షన్వద్ద జాతీయరహదారిపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద రాస్తారోకో నిర్వహించారు. యలమంచిలి నియోజకవర్గ నాయకుడు బోదెపు గోవింద్ ఆధ్వర్యంలో యలమంచిలి మెయిన్రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ హాజరయ్యారు. టీడీపీ ఆధ్వర్యంలోనూ మునగపాక, రాంబిల్లిలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. పాయకరావుపేటలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన కమిటీ సభ్యులు చిక్కాల రామారావు ఆధ్వర్యంలో వైజంక్షన్ వద్ద జాతీయ రహ దారి దిగ్బంధించారు. మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. నక్కపల్లిలోడీసీసీబీ మాజీ డైరక్టర్ వీసం రామకృష్ణ అధ్వర్యంలో కళాశాల విద్యార్దులు, పార్టీకార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. పాయకరావుపేట, కోటవురట్లలో టీడీపీ ఆధ్వర్యంలో కూడా రాస్తారోకోలు, ధర్నాలు జరిగాయి. -
రెండోరోజూ బంద్ ప్రశాంతం
=సోనియా దిష్టిబొమ్మతో శవయాత్ర =నిలిచిన బస్సులు = స్వచ్ఛందంగా మద్దతిచ్చిన వ్యాపారులు, ఉద్యోగులు సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు సమైక్యవాదులు శనివారం నిర్వహించిన రెండోరోజు బంద్ విజయవంతమైంది. ఉదయం ఆరుగంటల నుంచే వైఎస్సార్ సీపీ శ్రేణులు, సమైక్యవాదులు, టీడీపీ నాయకులు రోడ్లపైకి వచ్చి బంద్కు సిద్ధమయ్యారు. సమైక్యవాదులు విజయవాడ పండిట్ నెహ్రూ బస్స్టేషన్ వద్ద బైఠాయించడంతో బస్సులు బయటకు రాలేదు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మాత్రమే బస్సులు తిరిగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ జెండాలను చేతపట్టుకుని బైక్లపై తిరుగుతూ దుకాణాలు మూయించారు. నగరంలో సోనియా దిష్టిబొమ్మతో శవయాత్ర చేశారు. జిల్లాలోనూ.... సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో బంద్ ప్రశాంతంగా, సంపూర్ణంగా జరిగింది. వైఎస్సార్ సీపీ నేతలు, సమైక్యవాదులు రోడ్లపైకి వచ్చి దుకాణాలను మూయించి, ధర్నా, రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసేశారు. ఉద్యోగులు బంద్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గుడివాడలో ఏరియా ఆస్పత్రి సిబ్బంది విధులు పక్కన పెట్టి కొద్దిసేపు ఆందోళనలు చేపట్టారు. జగ్గయ్యపేటలో వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో సమైక్యవాదులు కళ్లకు గంతలు కట్టుకొని గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో శనివారం రాత్రి కాగడాల ర్యాలీ నిర్వహించారు. మైలవరంలో నియోజకవర్గ సమన్వయకర్తలు జోగి రమేష్, జ్యేష్ఠ రమేష్బాబుల ఆధ్వర్యంలో బంద్ జరిగింది. ఇబ్రహీంపట్నంలో రాష్ట్ర విభజనకు నిరసనగా వైఎస్సార్సీపీ, టీడీపీ విడివిడిగా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించి, రహదారిపై నాయకులు, కార్యకర్తలు భోజనాలు చేశారు. తిరువూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్కు నియోజకవర్గ కోఆర్డినేటర్ వల్లభాయ్ నాయకత్వం వహించారు. నూజివీడులో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మేకా ప్రతాప్ అప్పారావు నేతృత్వంలో గంటసేపు ధర్నా చేశారు. కైకలూరులో వైఎస్సార్సీపీ, టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. చల్లపల్లిలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తెలంగాణను కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. -
ముగిసిన ‘మూడో విడత’
సాక్షి, విశాఖపట్నం : ప్రజల నిరసనలు, ఆందోళనల నడుమ మూడో విడత రచ్చబండ ముగిసింది. భీమిలిలో నవంబర్ 11న ప్రారంభమైన ఈ కార్యక్రమం శనివారం వరకు మొక్కుబడిగానే సాగింది. ప్రజలకు ప్రయోజనమివ్వని కార్యక్రమంగా మిగిలి పోయింది. సమైక్యాంధ్ర ఉద్యమంతో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేతలు ప్రజల మధ్యకు వచ్చేందుకు వేదికయింది. విస్తృత బందోబస్తు, విపరీత ఆంక్షల నడుమ ఈ సభలను అధికారులు, అధికారపార్టీవారు మమ అనిపించారు. సమస్యలపై ప్రశ్నించే వారిని అడ్డుకున్నారు. అన్ని మండల కేంద్రాల్లోనూ ఈ సభలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా రేషన్కార్డుల కోసం 62,059 , పింఛన్ల కోసం 28,482, ఇళ్ల కోసం 59,989 దరఖాస్తులొచ్చాయి. రేషన్కార్డులలో వయస్సు మార్పు కోసం మరో 1198 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీని నిర్వహణకు మండలానికి రూ.70వేలు చొప్పున ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇంతవరకు పైసా విదల్చలేదు. నవంబర్ 15న చోడవరంలో జరిగిన సభలో సీఎం కిరణ్కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు పసుపులేటి బాలరాజు, గంటా శ్రీనివాసరావులకు సభల్లో నిరసనలు ఎదురయ్యాయి. పాడేరు సభలో పెంచిన పరీక్ష ఫీజులను రద్దు చేయాలని విద్యార్థులు, బకాయి వేతనాలు చెల్లించాలని పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున మంత్రి బాలరాజు ఎదుట నిరసన తెలిపారు. సభలోకి చొచ్చుకెళ్ళేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఎస్టీ జాబితాలో చేర్చాలని కొండకుమ్మర్లు మంత్రిని నిలదీశారు. అనకాపల్లి సభలో మంత్రి గంటా శ్రీనివాసరావుకూ నిరసనలు తప్పలేదు. ఇక్కడ సమస్యల్ని ప్రస్తావించేందుకు ప్రయత్నించిన 54మంది టీడీపీ నాయకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబుకు చేదు అనుభవం ఎదురయింది. యలమంచిలి మండలం పీఎన్ఆర్పేట కార్యక్రమంలో ఇందిరమ్మ బిల్లు అందలేదంటూ మొగ్గా అప్పారావు అనే లబ్ధిదారుడు ప్రస్తావించగా ఎమ్మెల్యే కన్నబాబు సహనం కోల్పోయి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరబుపాలెం సభలో వేదికపైకి ఎందుకు తనను ఆహ్వనించలేదని గ్రామ సర్పంచ్ లంబా అప్పారావు ప్రశ్నించగా.. ‘ఇది అధికారుల సభ అని,పిలవాల్సిన అవసరం లేదని, ఇదే నా స్టయిల్ ’ అని దురుసుగా మాట్లాడారు. క్రషర్ డీడీ చార్జీలను విపరీతంగా పెంచడంపై తిమ్మరాజుపేటలో పలువురు రైతులు ఎమ్మెల్యే కన్నబాబును నిలదీశారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. అరకులోయలో జరిగిన రచ్చబండలో ఎమ్మెల్యే సోమ ప్రసంగాన్ని ఏపీ గిరిజన సంఘం సభ్యులు అడ్డుకున్నారు. గత రచ్చబండలో ఇచ్చిన వినతులను ఇప్పటికీ ఎందుకు పరిష్కరించలేదని నిలదీసిన గిరిజన సంఘం ప్రతినిధులు, విద్యార్థులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారు. కశింకోట సభకు మంత్రి గంటా హాజరు కాకపోవడంతో స్థానికులు అధికారుల్ని నిలదీశారు. -
ఉద్యమం.. ఉరకలు
సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో ఉరకలు వేస్తోంది. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వ ప్రకటనలు రెచ్చగొట్టేలా ఉండటంతో సమైక్యవాదులు నిరసనల హోరు ఉధృతం చేశారు. జిల్లాలో 54వ రోజు ఉద్యమం సమరస్ఫూర్తితో సాగింది. ఉద్యమంలో భాగంగా సోమవారం నుంచి ఈ నెల 30 వరకు విద్యాసంస్థలు మూతపడనున్నాయి. సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు అశోక్బాబు ఇచ్చిన పిలుపు మేరకు బంద్ పాటిస్తున్నట్లు సీమాంధ్ర విద్యాసంస్థల జేఏసీ ప్రకటించింది. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగుల జేఏసీ ఈ నెల 26 నుంచి వచ్చేనెల మొదటి తేదీ వరకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. మరోవైపు ట్రెజరీ ఉద్యోగులు తమపై వస్తున్న ఒత్తిళ్లకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఎటువంటి ఒత్తిళ్లు తీసుకొచ్చినా బిల్లులు చేయబోమని ట్రెజరీ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. మార్మోగిన సమైక్య రైతు శంఖారావం.. ముదినేపల్లి మండలంలోని బొమ్మినంపాడులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సమైక్య రైతు శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లపై భారీగా తరలివచ్చారు. విభజన వల్ల రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ మండల కన్వీనర్ నిమ్మగడ్డ భిక్షాలు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు పాల్గొన్నారు. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు 47వ రోజుకు చేరాయి. ఉపాధ్యాయులు రోడ్డు ఆటలు ఆడి నిరశనలు తెలిపారు. అవనిడగడ్డలో అశ్వరావుపాలెం రైతులు దీక్ష చే శారు. మైలవరం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షల శిబిరం వద్ద మహిళలు ఆంధ్రప్రదేశ్ చిత్రపటాన్ని వేసి ముగ్గులతో అలంకరించారు. కురుమద్దాలి ఎస్వీఎస్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు రహదారిపై రాస్తారోకో చేశారు. నూజివీడు పట్టణంలోని జంక్షన్ రోడ్డులో దీక్షలు 27వ రోజుకు చేరాయి. నందిగామలో ఉద్యోగులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనాసాగరం వద్ద సుమారు 40 నిమిషాల పాటు రాస్తారోకో చేశారు. జాతీయ రహదారిపై వరి నాట్లు వేస్తూ నిరసన తెలిపారు. పట్టణానికి చెందిన ముస్లిం యువకుడు షేక్ ఖాజా ఆధ్వర్యంలో గాంధీ సెంటర్లో శునకానికి వినతిపత్రం ఇస్తూ నిరసన తెలిపారు. మచిలీపట్నం కోనేరుసెంటర్లో కొనసాగుతున్న రిలేదీక్షలో ఎల్ఐసీ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు పాల్గొన్నారు. ఐస్గడ్డపై గంటసేపు నిరసన.. న్యాయశాఖ జేఏసీ నాయకుడు పీవీ ఫణికుమార్ మచిలీపట్నంలోని జిల్లా కోర్టు ప్రధాన గేటు ఎదుట ఐస్బ్లాక్పై గంటసేపు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు ఆధ్వర్యంలో హనుమాన్జంక్షన్లో చేపట్టిన రిలేదీక్షలు 30వ రోజుకు చేరాయి. విద్యార్థులు రహదారిపై మానవహారం ఏర్పాటుచేశారు. తిరువూరులో జేఏసీ ఆధ్వర్యంలో ఎన్జీవోలు, ఉపాధ్యాయులు తిరువూరు జెడ్పీ బాలికోన్నత పాఠశాల ఆవరణలోని జాతిపిత మహాత్మాగాంధీ, అమరజీవి పొట్టిశ్రీరాములు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాలకు సమైక్యాంధ్ర కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు. పెడనలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు 35వ రోజుకు చేరాయి. కైకలూరులో జేఏసీ నాయకులు జాతీయ రహదారిపై చెస్, క్యారమ్స్ ఆటలు ఆడి నిరశన వ్యక్తం చేశారు. పెనుగంచిప్రోలులో వ్యవసాయ మహిళా కూలీలు స్థానిక పాత సినిమా హాల్ సెంటర్లో కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు. గుడ్లవల్లేరులో వైఎస్సార్ సీపీ నేత, ఉలవలపూడి గ్రామ సర్పంచి నందమూరి ధనలక్ష్మి నాయకత్వాన పలువురు రిలే దీక్షలకు కూర్చున్నారు. పెడన పట్టణ రజకులు జాతీయ రహదారిపై చాకిరేవు మీద బట్టలు ఉతుకుతూ, వాటిని రోడ్డుపైనే ఆరవేస్తూ నిరసన తెలిపారు. నూజివీడు లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీలతో ర్యాలీ నిర్వహించారు. ఉయ్యూరులో క్రైస్తవులు విభజన ఆపాలంటూ ప్రత్యేక పార్ధనలు జరిపారు. జగ్గయ్యపేటలో నారాయణ ఈ టెక్నో స్కూల్విద్యార్థులు 105 మీటర్ల పొడవు ఉన్న జాతీయ జెండాతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. గుడివాడ పట్టణంలో మునిసిపల్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు రోడ్డుపై పండ్లు అమ్మి నిరసన తెలిపారు. విజయవాడ ఆటోనగర్లో ఎంపీ లగడపాటి రాజగోపాల్ అనుచరులు సమైక్యవాదులపై జరిపిన దాడిని ఖండిస్తూ బంద్ కార్యక్రమం జరిగింది. సబ్-కలెక్టర్ కార్యాలయం వద్ద టీచర్ల జేఏసీ ఆధ్వర్యంలో మోకాళ్లపై నడిచి నిరశన తెలిపారు. -
‘చే’జారుతున్నారు!
సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన జరగదంటూ మొన్నటివరకు బీరాలు పలికిన మంత్రి పార్థసారథి, ఎంపీ లగడపాటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయంతో కంగుతిన్నారు. ప్రజలకు ఏం చెప్పాలో పాలుపోక ఇన్నాళ్లూ మొహం చాటేస్తూ వచ్చారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లావ్యాప్తంగా ప్రారంభమైన జనోద్యమం ఇప్పుడు మహోద్యమంగా రూపుదాల్చడంతో పరిస్థితి ‘చెయ్యి’ దాటిపోతుందేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఈ క్రమంలో పార్టీని చక్కదిద్దుకునే చర్యలకు శనివారం శ్రీకారం చుట్టారు. ఈడ్పుగల్లులో జిల్లా, నగర కాంగ్రెస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. కార్యకర్తల వలసలపై భయం.. ప్రస్తుతం సీమాంధ్ర ప్రాంతంలో వైఎస్సార్ సీపీ హవా నడుస్తోంది. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గుంటూరులో దీక్ష చేయడం, ఆ తర్వాత పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జైలులోనే దీక్షబూనడం, ఇప్పుడు షర్మిల బస్సుయాత్ర చేస్తుండడంతో సమైక్యవాదులు ఆ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల గెలుపు నల్లేరుపై నడక అవుతుందని భావిస్తున్న నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి సారథి, ఎంపీ లగడపాటి రాజగోపాల్ రంగంలోకి దిగి కేడర్ ‘చే’జారిపోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని, అందుకే సమావేశం నిర్వహించారని ఆ పార్టీలో చర్చ నడుస్తోంది. రాజీనామాలు చేయకుండానే.. ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని ఏపీఎన్జీవోలు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఎంపీ రాజగోపాల్, మంత్రి కేపీ సారథి రాజీనామాలు చేయలేదు. ఎమ్మెల్యేలు మాత్రం మొక్కుబడిగా రాజీనామా లేఖలు సీఎంకు పంపి చేతులు దులుపుకొన్నారు. తాము ఉద్యోగాల్ని వదిలి ఉద్యమం చేస్తుంటే.. మరో ఆరు నెలల్లో ఊడిపోయే పదవుల్ని పట్టుకుని వేలాడుతున్న ప్రజాప్రతినిధులపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు ఎవరూ తమ పదవుల్ని త్యాగం చేసి ఉద్యమంలో పాల్గొంటామని ప్రకటించకపోవడం గమనార్హం. సోనియాను విమర్శిస్తే ఎదురుదాడే.. రాష్ట్ర విభజన పాపమంతా కాంగ్రెస్కే అంటగట్టడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ, వైఎస్సార్ సీపీ, బీజేపీల బాధ్యత కూడా ఉందంటూ గొంతు చించుకుని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల తమ పార్టీ నష్టపోయి, ఇతర పార్టీలు లబ్ధిపొందడాన్ని కాంగ్రెస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా సోనియాగాంధీపై ఎవరైనా కామెంట్ చేస్తే వారి పీక నొక్కేందుకు కూడా వెనుకాడబోమంటూ మంత్రి సారథి స్వయంగా ప్రకటించడం గమనార్హం. అసలు రాష్ట్ర విభజన నిర్ణయంలో సోనియా, సీడబ్ల్యూసీలోని సభ్యులే కీలకపాత్ర పోషించారనే విషయాన్ని వారు మరిచిపోతున్నారు. తెలుగువారి ఆత్మగౌరవ యాత్రలో కాంగ్రెస్ పార్టీని, సోనియా, రాహుల్గాంధీలను తీవ్రంగా ఆక్షే పించిన చంద్రబాబునాయుడుపై ఈ వేదిక ద్వారా ఎదురు దాడి చేయడంలో నేతలు కొంతమేర విజయం సాధించారు. ముఖ్యంగా రాహుల్గాంధీని మొద్దబాయ్ అంటూ చంద్రబాబు అవహేళన చేయగా, మరి లోకేష్ సంగతి ఏంటో చెప్పాలంటూ పలువురు సీనియర్ నేతలు ప్రశ్నించారు. మంత్రి సారథి మరో అడుగు ముందుకేసి రాహుల్, లోకేష్లను బెంజిసర్కిల్లో నిలబెడితే ఎవరు మొద్దబ్బాయో తేలిపోతుందంటూ సవాల్ విసిరారు. కార్యకర్తల నుంచి స్పందన నిల్! చాలా రోజుల తర్వాత జరిగిన జిల్లా, నగర కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశానికి కార్యకర్తల నుంచి స్పందన కరవైంది. వారి హాజరు తక్కువగా ఉండటంతో సమావేశం ఆలస్యంగా ప్రారంభమైంది. గంటసేపు కూడా జరగకముందే కార్యకర్తలు వెళ్లిపోసాగారు. చివరికి తమ ప్రసంగాలు పూర్తికాగానే మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ, బూరగడ్డ వేదవ్యాస్, ఎమ్మెల్యేలు యలమంచిలి రవి వెళ్లిపోయేందుకు వేదిక దిగారు. మంత్రి సారథి జోక్యం చేసుకుని.. నేతలే వెళ్లిపోతుంటే కార్యకర్తలు మాత్రం ఎందుకు ఉంటారని, నాయకులు సమావేశం అయ్యే వరకు ఉండాలని కోరారు. ఆయన సూచనను నాయకులు పెడచెవిన పెట్టి కొద్దిసేపు ఉండి వెళ్లిపోవడం గమనార్హం. -
రాహుల్ కోసమే రాష్ట్ర విభజన
సాక్షి, తిరుపతి: రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి సోనియా తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. తిరుపతి అన్నమయ్య సర్కిల్ వద్ద సోమవా రం భారీ ఎత్తున నిరసన సభ నిర్వహించా రు. వేలాది మంది పాల్గొన్న ఈ సభలో కరుణాకర రెడ్డి మాట్లాడుతూ రామాయణంలో శూర్పణఖలా రెండుప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిన సోనియా యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పి చోద్యం చూస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి సీమాంధ్రలో ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేక, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో కలసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సీమాంధ్రకు అన్యాయం జరగకూడదని, తన భర్త వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను సాధించేందుకు ఆమరణ దీక్షకు ఉద్యుక్తులయ్యారని పేర్కొన్నారు. సీమాంధ్ర కోసం మనందరి ప్రతినిధిగా ఆమె దీక్ష చేపడుతున్నారని తెలిపారు. తెలంగాణ విడిపోతే, గొంతు తడుపుకునేందుకు కూడా మనకు నీళ్లు దొరకవని అన్నారు. చిత్తూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు, 8 లక్షల ఎకరాలకు నీళ్లు తెప్పించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రకటించిన గాలేరి-నగరి, హంద్రీ-నీవా పథకాలు పాతాళానికి వెళ్లిపోతాయని అభిప్రాయపడ్డారు. అన్నపూర్ణగా ఖ్యాతి చెందిన ఉభయ గోదావరి జిల్లా ల్లో ఉలవలు పండించుకోవాల్సి ఉంటుందన్నారు. సీమాంధ్రులు రాగి గంజితో సరిపెట్టుకోవాల్సి ఉంటుందని తెలిపారు. 60 ఏళ్ల నుంచి అధునాతన నగరంగా తీర్చిదిద్దిన హైదరాబాద్ను లాక్కొనేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. విభజన జరిగేంత వరకు మౌనం వహించిన చంద్రబాబు, కిరణ్కుమార్రెడ్డి ప్రజాగ్రహా న్ని చూసిన తరువాత, సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. వీరిద్దరూ తమ పార్టీలకు, పదవులకు రాజీనామా చేసి, ప్రజా ఉద్యమంలో పాల్గొంటే గానీ, ప్రజలు వీరిని క్షమించరని పేర్కొన్నారు. ఢిల్లీ కోటలోని సోనియా చెవులు చిల్లులు పడేలా సీమాంధ్రులు గర్జించాలని పిలుపునిచ్చారు. టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు ఓవీ.రమణ మాట్లాడుతూ విభజన జరిగితే నీళ్లతో పాటు, విద్యుదుత్పత్తి కూడా ఆగిపోతుందని చెప్పారు. హైదరాబాద్ను అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు, ఆ నగరాన్ని మరొకరు తీసుకుని వెళుతుంటే మాట్లాడక పోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రాష్ట్రానికి సోనియా శిఖండి అయితే, చంద్రబాబు శకుని అని అభివర్ణించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నగర కన్వీనర్ పాలగిరి ప్రతాపరెడ్డి, పార్టీ నాయకులు ఎస్కె.బాబు, ఉమాపతి, రంగాయాదవ్, ముద్రనారాయణ, మోహన్ యాదవ్, నాగయ్య, జ్యోతమ్మ, తిరుమలయ్య ప్రసంగించారు. రాయలసీమ ఆనందరెడ్డి, పార్టీ మహిళా కన్వీనరు కుసుమ, చెంచయ్య యాదవ్, ఆదికేశవ రెడ్డి, నూరుల్లా తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ సెల్ కన్వీనర్ రాజేంద్ర వందన సమర్పణ చేశారు.